breaking news
Mahabubnagar
-
పరిశుభ్రత పాటించాలి..
వాతావరణ మార్పులతో ఒక్కసారిగా చిన్నారుల్లో జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు పెరిగాయి. ఈ కాలంలో డిఫ్తీరియా వచ్చే అవకాశాలు ఎక్కువ. పరిసరాల పరిశుభ్రత పాటించాలి. ఆహారం వేడిగా ఉన్నప్పుడే తినాలి. ఆహార పదార్థాలపై ఈగలు, దోమలు వాలకుండా చూసుకోవాలి. ఇంటి చుట్టూ వర్షపు నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవాలి. జ్వరం, జలుబు వస్తే పిల్లలకు యాంటీబయోటిక్స్ ఇవ్వకూడదు. వైద్యుల సూచన మేరకే మందులు వేసుకోవాలి. – రాఘవేందర్, చిన్నపిల్లల వైద్యుడు జిల్లాలో సీజనల్ వ్యాధులను అరికట్టడానికి ప్రతి శుక్రవారం ఫ్రై డే– డ్రై డే నిర్వహిస్తున్నాం. కేసులు నమోదవుతున్న గ్రామాల్లో ఇంటింటికి తిరిగి సర్వే చేసి రక్త నమూనాలు సేకరిస్తున్నాం. అంగన్వాడీలు, ఆశలు, ఏఎన్ఎంల ద్వారా ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నాం. ప్రధానంగా గ్రామాలు, పట్టణాల్లో ఇళ్ల మధ్య నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవాలి. దీంతో ఇంట్లో ఉండే పరిసరాలు చాలా శుభ్రంగా పెట్టుకోవాలి. జ్వరం, దగ్గు, జలు బు ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్లు ప్రైవేట్కు కాకుండా ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలి. – శ్రీనివాసులు, డీఎంహెచ్ఓ ● -
కబడ్డీ.. కబడ్డీ..
మహబూబ్నగర్ క్రీడలు: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహించనున్నారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 8వ ఎడిషన్ క్రీడలను ఈ సారి తెలంగాణలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఇటీవల కాలంలో క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది. క్రీడాభివృద్ధి, క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం ప్రత్యేక క్రీడాపాలసీ రూపొందించింది. గత ఏడాది సీఎం కప్ క్రీడలను గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో ఎంతో విజయవంతంగా నిర్వహించారు. ఈ మేరకు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ను రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో ఏదైనా ఒక క్రీడను మహబూబ్నగర్లో నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారులు ఏపీ జితేందర్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఈ మేరకు మహబూబ్నగర్లో ఖేలో ఇండియా యూత్ కబడ్డీ చాంపియన్షిప్ జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరో రెండు లేదా మూడు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. మహబూబ్నగర్ నగరంలోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో కబడ్డీ పోటీలు జరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. వివిధ రాష్ట్రాలకు చెందిన బాలురు ఎనిమిది, బాలికలు ఎనిమిది జట్లతో కబడ్డీ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలు నవంబర్లో జరిగే అవకాశాలు ఉన్నాయి. విజయవంతంగా నిర్వహిస్తాం మహబూబ్నగర్లో ఖేలో ఇండియా కబడ్డీ పోటీలు జరిగే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారులు ఏపీ జితేందర్రెడ్డి కృషితో మహబూబ్నగర్లో ఖేలో ఇండియా కబడ్డీ పోటీలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి, ఏపీ జితేందర్రెడ్డి, రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరిలకు జిల్లా క్రీడారంగం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అన్ని క్రీడాసంఘాలు, సీనియర్ క్రీడాకారుల సహకారంతో ఖేలో ఇండియా కబడ్డీ పోటీలను విజయవంతంగా నిర్వహిస్తాం. – జె.రాజశేఖర్రెడ్డి, డీవైఎస్ఓ పాలమూరులో ఖేలో ఇండియా కబడ్డీ పోటీలు రెండు, మూడు రోజుల్లో రానున్న అధికారిక ప్రకటన ఎనిమిది రాష్ట్రాల బాల, బాలికల జట్లతో చాంపియన్షిప్ నవంబర్లో నిర్వహించే అవకాశం -
సాహిత్యంలో యశోదారెడ్డి తనదైన ముద్ర
స్టేషన్ మహబూబ్నగర్: సాహితీ రంగంలో తెలంగాణ సాహితీ దిగ్గజం పాకాల యశోదారెడ్డి తనదైన ముద్రవేశారని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు దేవారెడ్డి విజయలక్ష్మి అన్నారు. పాకాల యశోదారెడ్డి జయంతిని పురస్కరించుకొని నగరంలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో తెలంగాణ సాహిత్య అకాడమీ, మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ పాలమూరు ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సదస్సు ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. సదస్సుకు సంచాలకులుగా మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్షురాలు రావూరి వనజ, సహ సంచాలకులుగా ప్రధాన కార్యదర్శి శాంతారెడ్డి వ్యవహరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న దేవారెడ్డి విజయలక్ష్మి మాట్లాడుతూ పాకాల యశోదారెడ్డి సాహిత్యంలోని మాండలికమంతా తెలంగాణ, బిజినేపల్లి ప్రాంతానికి చెందినదే అన్నారు. యశోదారెడ్డి కుమార్తె పాకాల లక్ష్మీరెడ్డి మాట్లాడుతూ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ సేవలను కొనియాడారు. ఆచార్య చందోజీరావు మాట్లాడుతూ యశోదారెడ్డి స్ఫూర్తితో విద్యార్థులు వర్తమాన పరిశోధకులుగా, కథా రచయితలుగా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రారంభ సదస్సుకు రావూరి వనజ సభాధ్యక్షత వహించగా.. సదస్సులో పలువురు పరిశోధకులు పత్రసమర్పణ చేశారు. సమావేశంలోలో మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు రావూరి వనజ, జి.శాంతారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ జయప్రద, జి.శాంతారెడ్డి, డాక్టర్ భారతి, ప్రముఖ అవధాని చుక్కాయపల్లి శ్రీదేవి, మేకల అనురాధ, జయలక్ష్మమ్మ, డాక్టర్ ఇడికోజు శ్రీనివాసాచారి, గన్నోజు శ్రీనివాసాచారి, కె.వీణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మెయిన్ స్టేడియాన్ని పరిశీలించిన ఖేలో ఇండియా బృందం
ఇటీవల ఖేలో ఇండియా కేంద్రం, రాష్ట్ర బృందా లు మహబూబ్నగర్లోని మెయిన్ స్టేడియంతో పాటు ఇతర చోట్ల క్రీడా మౌలిక సదుపాయాలను సమగ్రంగా పరిశీలించింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ అమర్జ్యోతి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ డిప్యూటీ డైరెక్ట ర్లు డాక్టర్ రవితేజ, రవీందర్, ఎస్.శ్రీనివాస్లతో కూడిన బృందం ఇండోర్ స్టేడియం, క్రీడాకారుల వసతి సౌకర్యాలు, ప్రాక్టీస్ చేయడానికి మైదానా లు, జిల్లాకేంద్రంలోని హోటళ్లలో అందుబాటులో ఉన్న వసతి సదుపాయాలు, స్థానిక బోయపల్లి శివారులోని తెలంగాణ మైనార్టీ వెల్ఫేర్ రెసిడెన్షి యల్లో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. -
పుష్కలంగా తాగునీరు
మిషన్ భగీరథ పథకానికి తీరిన నీటి కష్టాలు ● ఇకపై కేఎల్ఐతోపాటు పాలమూరు ప్రాజెక్టు నుంచి పంపింగ్ ● ఏడాది పొడవునా తాగునీటికి బేఫికర్ ● శాశ్వతంగా తీరనున్న తిప్పలు గతంలో రెండు పర్యాయాలు వేసవిలో కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా మిషన్ భగీరథ స్కీంకు నీటి తరలింపునకు సమస్యలు ఎదురయ్యాయి. పాలమూరు ప్రాజెక్టు ప్రారంభం కావడం.. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి నూతనంగా నిర్మిస్తున్న చానల్ ద్వారా నీటిని తరలించే పనులు చివరి దశకు చేరడంతో మిషన్ భగీరథ స్కీంకు ఇకపై నీటి సమస్య ఉండదు. శాశ్వతంగా పరిష్కారం లభించిందని చెప్పవచ్చు. – అంజాద్ పాషా, డీఈఈ కొల్లాపూర్: మిషన్ భగీరథ పథకానికి నీటి కష్టాలు ఇకపై శాశ్వతంగా తీరనున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలకు తాగునీటిని అందించే పథకానికి ప్రతి ఏటా వేసవిలో పలు సమస్యలు ఎదురయ్యేవి. రోజువారీగా నీటి ఎత్తిపోతలు చేపట్టడంతో కేఎల్ఐ ప్రాజెక్టుపై తీవ్రమైన భారం పడేది. పాలమూరు ప్రాజెక్టు ద్వారా నీటి ఎత్తిపోతలు ప్రారంభం కావడంతో కేఎల్ఐపై భారం తగ్గడమే కాకుండా.. మిషన్ భగీరథ స్కీంకు రెండు ప్రాజెక్టుల ద్వారా నీటిని తరలించే వెసులుబాటు ఏర్పడింది. 84 మండలాలకు సరఫరా.. కేఎల్ఐ ప్రాజెక్టుకు అనుసంధానంగా కొల్లాపూర్ మండలం ఎల్లూరులో మిషన్ భగీరథ పంప్హౌజ్ నిర్మించారు. ఇక్కడి నుంచి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు, రంగారెడ్డి జిల్లాలోని 3 నియోజకవర్గాలతో కలిపి మొత్తం 84 మండలాల ప్రజలకు తాగునీరు అందించేందుకు పైప్లైన్లు, వాటర్ట్యాంకులు నిర్మించి నీటి సరఫరా చేస్తున్నారు. శాశ్వత పరిష్కారం దిశగా.. మిషన్ భగీరథ స్కీం ప్రారంభమయ్యాక 2018లో నీటి సరఫరాకు సమస్యలు ఎదురయ్యాయి. అప్పట్లో కృష్ణానది లోతట్టు ప్రాంతం నుంచి ప్రత్యేకంగా మోటార్లు ఏర్పాటుచేసి, కేఎల్ఐ ప్రాజెక్టు వరకు నీటిని తరలించే పనులను ప్రభుత్వం చేపట్టింది. ఇందుకోసం రూ. 6కోట్ల మేరకు వెచ్చించింది. ఆ సమయంలో వరదలు రావడంతో సమస్య పరిష్కారమైంది. మళ్లీ నాలుగేళ్ల క్రితం కూడా నీటి తరలింపు సమస్య ఏర్పడింది. రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని ఎత్తిపోసి, తాగునీటి సమస్యను తీర్చారు. దీనికి శాశ్వత పరిష్కారం కోసం అధికారులు చాలా రోజులుగా నిరీక్షిస్తున్నారు. తీరిన ఇక్కట్లు.. తాగునీటి అవసరాలకు ఇన్నాళ్లు కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోసే నీటిపైనే అధారపడిన అధికారులు.. ఇక నుంచి పాలమూరు ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోసే నీటిని కూడా వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఎల్లూరు రిజర్వాయర్ నీటినిల్వ సామర్థ్యం 0.36 టీఎంసీలు కాగా.. నార్లాపూర్ రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 6.40 టీఎంసీలు. వేసవికి ముందు నార్లాపూర్ రిజర్వాయర్ను నింపితే చాలు, మిషన్ భగీరథ స్కీంకు చాలినన్ని నీరు లభిస్తాయి. మిషన్ భగీరథ పథకానికి రోజూ 0.02 టీఎంసీలు అవసరం. ఏడాది మొత్తం 8.47 టీఎంసీల నీటిని ఈ పథకానికి వినియోగిస్తున్నారు. స్కీం ప్రారంభమైన నాటి నుంచి కేఎల్ఐ ప్రాజెక్టు పరిధిలోని ఎల్లూరు రిజర్వాయర్ నుంచే నీటిని సరఫరా చేస్తున్నారు. ఎల్లూరు రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 0.36 టీఎంసీలు. ఇక్కడి నుంచే కేఎల్ఐ ప్రాజెక్టు పరిధిలోని మిగతా రిజర్వాయర్లు, చెరువులకు కూడా నీటిని తరలిస్తారు. దీంతో ప్రతి సంవత్సరం వేసవిలో మిషన్ భగీరత పథకానికి నీటి తరలింపునకు సమస్యలు ఎదురయ్యేవి. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి మిషన్ భగీరథ స్కీంకు నీటిని మళ్లించేందుకు వీలుగా సున్నపుతండా సమీపంలో రూ. 10కోట్లతో డిస్ట్రిబ్యూటరీ చానల్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నిర్మాణాలు దాదాపుగా తుది దశకు చేరాయి. మరో నెలరోజుల్లో పనులు పూర్తయ్యే అవకాశాలున్నాయి. నార్లాపూర్ రిజర్వాయర్లో సాధారణ స్థాయిలో నీరున్నా.. ఇక్కడి నుంచి మిషన్ భగీరథ స్కీంకు నీటిని మళ్లించవచ్చు. ఈ చానల్ను త్వరితగతిన వినియోగంలోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అదే విధంగా నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఎల్లూరు రిజర్వాయర్లోకి నీటిని మళ్లించేందుకు కూడా మరో స్లూయీస్ను ఏర్పాటుచేశారు. ఎటొచ్చి మిషన్ భగీరథకు నీటి సమస్యలు రాకూడదనే ఉద్దేశంలో అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. -
వర్షపు నీటిని ఒడిసిపట్టాలి
జిల్లాలో ఈ ఏడాది వర్షపా తం సాధారణం కంటే తక్కువగా నమోదవుతోంది. ఎ క్కువ రోజులు తేలికపాటి వర్షాలే కురవడంతో భూమిలోకి నీరు ఇంకే అవకాశం తగ్గింది. అందుకే భూగర్భ జలమట్టంలో ఆశించిన పెరుగుదల కనిపించలేదు. ప్రస్తుతం చెరువులు, వాగులు నిండకపోవడంతో సహజ రీచార్జ్ కూడా జరగడం లేదు. ఆగస్టులో భారీ వర్షాలు కురిస్తేనే భూగర్భ జలాలు మెరుగుపడే అవకాశం ఉంటుంది. రైతులు బోర్ల నీటిని అవసరమైన మేరకే వినియోగిస్తూ, సూక్ష్మ నీటిపారుదల పద్ధతులను అనుసరించడం మంచిది. వర్షపు నీటిని భూమిలోకి ఇంకించే రీచార్జ్ పిట్లు, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం ద్వారా కూడా భూగర్భ జలాల సంరక్షణకు తోడ్పాటు లభిస్తుంది. – కె.శ్రీనివాసరావు, జిల్లా భూగర్భజల శాఖ అధికారి -
చిరుధాన్యాల రొట్టెలు.. ఆరోగ్యానికి బాటలు!
● మహిళా సంఘాల తయారీ ● మార్కెట్లో పెరిగిన డిమాండ్ ● ఉపాధితో పాటు ఆదాయం.. ● ఆదర్శంగా గండేడ్ మిల్లెట్ యూనిట్ యూనిట్లో తయారు చేస్తున్న రొట్టెలు చిరుధాన్యాలతో రూపొందుతున్నాయి. జొన్నలతో పాటు ఊదలు, కొర్రలు, అరకలు తదితర చిరుధాన్యాలను వినియోగిస్తున్నారు. రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేసేలా వీటిని తయారు చేస్తున్నారు. ఇంట్లో సాధారణంగా తయారు చేసుకునే రొట్టెలతో పోలిస్తే వీటికి ప్రత్యేకమైన రుచి ఉండటంతో వినియోగదారుల నుంచి ఆదరణ పెరుగుతోంది. డిమాండ్ పెరుగుతుండటంతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు ఇటీవల పెద్ద పెనం, పొయ్యిని కూడా కొనుగోలు చేశారు. గతంలో ఒకేసారి నాలుగు రొట్టెలు తయారు చేయగా.. ప్రస్తుతం ఎనిమిది రొట్టెలను ఒకేసారి తయారు చేస్తున్నారు. పిండిని మిషన్లో వేసి రొట్టెలను కట్ చేసి, అనంతరం పెనంపై కాల్చి ఆరబెట్టి ప్యాకింగ్ చేస్తున్నారు. ప్యాకింగ్ అనంతరం హోటళ్లు, దాబాలు, కిరాణా దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. గండేడ్: మారుతున్న కాలానికి అనుగుణంగా ఆలోచనకు పదును పెట్టిన మహిళలు.. చిరుధాన్యాలకు పెరుగుతున్న ఆదరణను తమకు ఉపాధి మార్గంగా మలుచుకుంటున్నారు. ఆరోగ్యంపై ప్రజల్లో పెరుగుతున్న అవగాహనను ఆసరాగా చేసుకుని చిరుధాన్యాలతో రొట్టెలు తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తూ ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందుకు గండేడ్ మండలకేంద్రంలోని చిరుధాన్యాల రొట్టెల తయారీ యూనిట్ నిదర్శనంగా నిలుస్తోంది. మహిళలు తయారు చేస్తున్న రొట్టెలకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతుండటంతో ఉత్పత్తిని కూడా క్రమంగా పెంచుతున్నారు. రూర్బన్ పథకం కింద నాలుగేళ్ల క్రితం గండేడ్ మండల కేంద్రంలో రూ.24.5 లక్షల వ్యయంతో మిల్లెట్ యూనిట్ను ఏర్పాటు చేశారు. ఇందులో తొమ్మిది రకాల యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. చిరుధాన్యాలతో వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేసి మార్కెట్లో విక్రయించడం ద్వారా మహిళలకు ఉపాధి కల్పించాలన్నది ఈ యూనిట్ ప్రధాన ఉద్దేశం. ఇందులో భాగంగా మండలంలోని పలు గ్రామాల మహిళలతో మహిళా ఉత్పత్తిదారుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. మండలంలోని 403 సంఘాల నుంచి ఒక్కో సంఘం రూ.500 చొప్పున మూలధనాన్ని సమీకరించి కేంద్ర ప్రభుత్వ వాటా కోసం వినియోగించారు. సమీకరించిన మూలధనానికి సమానంగా కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారు రూ.3.5 లక్షలు మంజూరయ్యాయి. మహిళా సమాఖ్య నుంచి కూడా కొంత మొత్తాన్ని సమకూర్చుకుని యూనిట్ నిర్వహణకు వినియోగించారు. -
సర్.. రెండు రోజులే!
జెడ్పీసెంటర్(మహబూబ్నగర)/అచ్చంపేట: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో దాదాపు పూర్తి కావొచ్చింది. దీనికి మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉండటంతో బీఎల్ఓలకు ఓటరు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేస్తేనే ఈ నెల 10 వరకు డిజిటలైజేషన్ పూర్తిచేస్తారు. అయితే ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 85.50 శాతం ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి కాగా.. మిగిలినవి 24.50 శాతం కూడా పూర్తిచేసేలా ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీచేశారు. దీంతో క్షేత్రస్థాయిలో బీఎల్ఓలు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది వేగం పెంచారు. అయితే శనివారం నుంచి సోమవారం వరకు వరుస సెలవులు ఉన్నప్పటికీ సర్ విధులు నిర్వరిస్తున్న వారు విధులకు హాజరు కావాల్సిందేనని ఆదేశించారు. బీఎల్ఓలు వివరాలు ధ్రువీకరించుకుని మరణించి వారు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, ఒకటి కన్నా ఎక్కువ చోట్ల ఓటుహక్కు కలిగి ఉన్నవారి వివరాలు గుర్తించి ఓటరు జాబితా నుంచి తొలగించేలా చర్యలు చేపడుతున్నారు. జోగుళాంబ ఫస్ట్.. నాగర్కర్నూల్ లాస్ట్ ఉమ్మడి పాలమూరులోని జిల్లాల వారీగా సర్ ప్రక్రియను పరిశీలిస్తే జోగుళాంబ గద్వాల జిల్లా 87.24 శాతంతో ముందంజలో ఉండగా.. నాగర్కర్నూల్ జిల్లా 84.43 శాతంతో చివరన ఉంది. ఇక ఐదు జిల్లాల్లో కలిపి మరణించిన, శాశ్వతంగా నివాసం మారిన, డబుల్ ఓటర్లు, గైర్హాజర్ జాబితాతోపాటు ఇతరులు కలిపి మొత్తం 3,96,927 మంది ఓటర్లు ఉన్నారని తేలింది. గైరాజర్ జాబితాలో ఉన్న ఓటర్ల తరపున ఎన్యూమరేషన్ ఫారాలు అందితే డిజిటలైజేషన్ పూర్తిచేస్తారు. మిగిలిన వారి ఓట్లు మాత్రం ఎస్ఐఆర్ పూర్తయ్యాక జాబితాలో ఉండవు. మరణించిన, శాశ్వతంగా నివాసం మారిన, రెండేసీ ఓట్లు ఉన్నవారు, గైర్జాజర్ జాబితాలో అత్యధికంగా మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాలు ఉన్నాయి. రేపటితో ముగియనున్న ఎస్ఐఆర్ ప్రక్రియ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 85.50 శాతం డిజిటలైజేషన్ వరుస సెలవులు ఉన్నప్పటికీ పూర్తిచేయాలని ఆదేశాలు -
పోలీస్ మానసికంగా బలంగా ఉండాలి
మహబూబ్నగర్ క్రైం: ప్రజల భద్రత కోసం నిరంతరం విధుల్లో ఉండే పోలీసులు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాల్సిన అవస రం ఉందని ఎస్పీ డి.జానకి అన్నారు. విధుల్లో ఎదురయ్యే ఒత్తిళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూనే అత్యవసర పరిస్థితుల్లో స్వీయ రక్షణ చేసుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. పోలీస్ సిబ్బంది శారీరక, మానసిక సామర్థ్యాలను మరింత మెరుగుపర్చే ఉద్దేశంతో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పరేడ్ మైదానంలో పోలీస్ సిబ్బందికి ఏర్పాటు చేసిన 45 రోజుల కరాటే శిక్షణ కార్యక్రమాన్ని శనివారం ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోలీస్ విధుల్లో స్వీయ రక్షణతో పాటు శారీరక, మానసిక దృఢత్వం ఎంతో ముఖ్యమన్నారు. కరాటే శిక్షణ కేవలం ఆత్మరక్షణకు మాత్రమే పరిమితం కాదని, మానసిక ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణను పెంపొందించడంలోనూ ఉపయోగపడుతుందని తెలిపారు. పోలీసులు విధి నిర్వహణలో ఉండే ఒత్తిళ్లను అధిగమించేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని సూచించారు. శారీరక దారుఢ్యం కోసం క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా వంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే ప్రజల భద్రత కోసం పోలీసులు కీలకపాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ఏఆర్ అదనపు ఎస్పీ సురేష్కుమార్, డీఎస్పీ రమణారెడ్డి, ఆర్ఐలు కృష్ణయ్య, నగేష్, వన్టౌన్ ఎస్ఐ వసంత పాల్గొన్నారు. ఉదండాపూర్కు పర్యాటక శోభ జడ్చర్ల: ఉదండాపూర్ రిజర్వాయర్ను పర్యాటక కేంద్రంగా గుర్తించేందుకు ప్రణాళికలను రూపొందించి అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి మార్చి 26న అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తర సమయంలో కోరారు. తాజాగా స్పందించిన ప్రభుత్వం సోమశిల–అలంపూర్ ప్రత్యేక పర్యాటక ప్రాంతం(ఎస్టీఏ)లో భాగంగా ఉదండాపూర్ను చేరుస్తూ పర్యాటక, సాంస్కృతిక శాఖ, ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వాణిప్రసాద్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించి సమగ్ర మాస్టర్ప్లాన్ తయారీకి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం తమ విజ్ఞప్తి మేరకు ఉత్తర్వులు జారీ చేయడంపై ఎమ్మెల్యే శనివారం ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. -
భారీగా నీటిమట్టం పడిపోయిన మండలాల్లో ఇలా (నీటిమట్టం మీటర్లలో)
జూలై 31 నాటికి జిల్లా సాధారణ వర్షపాతం (మిల్లీమీటర్లు) 231.2 నమోదైన వర్షపాతం (మిల్లీమీటర్లు) 191.8● గతేడాది జూలై ● ఈ ఏడాది జూలైమహబూబ్నగర్ రూరల్ 7.75 9.85మహమ్మదాబాద్ 4.49 6.41 -
అడవి మనుషులం సార్.. ఆదుకోండి!
జాతీయ సెమినార్ ముగింపులో పాలమూరు యూనివర్సిటీ సిబ్బంది అచ్చంపేట: చుట్టూ దట్టమైన అడవులు.. రాళ్లు, రప్పలతో నిండిన దారులు.. కారు చీకట్లో నెగడి కట్టెల మంటలే దీపపుకాంతులు.. బొడ్డుగుడిసెల్లో జీవనం.. పండ్లు, దుంపలే ఆహారం.. వాగుల నీరే శుద్ధజలం.. ఇదీ నల్లమలలో జీవిస్తున్న చెంచుల పరిస్థితి. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి.. 80 ఏళ్లు గడుస్తున్నా.. కూడు, గూడు, విద్య, వైద్యానికి నోచుకోక.. క్రూరమృగాలు, విషపు పురుగుల మధ్య సహవాసం చేస్తూ.. దయనీయ స్థితిలో దుర్భర జీవనం గడుపుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా.. ఎందరు అధికారులకు మొరపెట్టుకున్నా.. ఎంత మంది ప్రజాప్రతినిధులు హామీలిచ్చినా.. నేటికీ వీరి జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేకపోతోంది. పడిపోతున్న జీవన ప్రమాణాలు చెంచుల జీవన ప్రమాణాలు వేగంగా పడిపోతున్నా యి. సింహభాగం చెంచులు పౌష్టికాహారం లోపంతో బాధపడుతున్నారు. వ్యాధి నిరోధకశక్తి తక్కువగా ఉండి అనేక రకాల వ్యాధులకు గురువుతున్నారు. రక్తహీనత, టీబీ, మలేరియా, విషజ్వరాలు, క్యాన్సర్, కడుపులో బల్ల (గడ్డ) వ్యాధులు లేని కుటుంబం అంటూ లేదు. పోషకాహారం లోపంతో మహిళలు, చిన్నారులు మృత్యువాత పడుతున్నా రు. వీరి సగటు జీవితకాలం 40 ఏళ్లు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ కారణంగా చెంచుల జనాభా క్రమంగా తగ్గిపోతుంది. పెంటల్లో 14 ఏళ్లలోపే పెళ్లిళ్లు చేస్తుండగా.. 30 ఏళ్లు వచ్చే సరికి ఐదారుగురు పిల్లలకు జన్మనిస్తున్నారు. మహిళలు అనారోగ్యం పాలవడానికి ఇదే ప్రధాన కారణం. చెంచుల్లో ఎక్కువ మంది ఆహారం తీసుకో కుండా అడవుల్లో దొరికే పండ్లు తింటారు. మరికొందరు ఆహారం లేకుండా మద్యం తాగి.. అనారోగ్యాలను బారినపడుతున్నారు. తిండిలేకపోయినా రో జుల తరబడి ఉంటారు తప్ప సారా లేనిది ఒక్క రోజు కూడా ఉండలేకపోతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే చెంచుల మనుగడ ప్రశ్నార్థకంగా మార నుంది. జీవనశైలిపై అవగాహన కల్పించే వారు లేక పోవడం, పౌష్టికాహార లోపం, రకరకాల వ్యాధు లు, బాల్యవివాహాలు తదితర కారణాలతో అడవి బిడ్డల రోదన.. అరణ్యవేదనగా మిగిలిపోతోంది. అభివృద్ధికి దూరంగా.. అటవీ ఉత్పత్తుల సేకరణే వీరి ప్రధాన జీవనాధారం. వీటి ద్వారానే జీవనం సాగిస్తున్నారు. ఉమ్మడి ఏపీలో మినహాయిస్తే.. చెంచుల అభివృద్ధి, సంక్షేమం కోసం బడ్జెట్లో నిధుల కేటాయింపు లేవు. తెలంగాణ వచ్చాక కూడా ఐటీడీఏ కార్యకలాపాలు తగ్గిపోయాయి. ఈ క్రమంలో చెంచుల సమస్యల కోసం పాదయాత్రలు, ధర్నాలు, నిరాహార దీక్షలు చేసినా ఫలితం లేకపోయింది. అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల పరిధిలోని లోతట్టు అటవీ ప్రాంతం ఫర్హాబాద్, మల్లాపూర్, పుల్లాయిపల్లి, రాంపూర్, అప్పాపూర్, భౌరాపూర్, ఈర్లపెంట, మేడిమెల్కల, సంగడిగుండాలు, ధారవాగు, తాటిగుండాలు, పెద్దూటి, బట్టిచింతల, ఎంకలపెంట, ఎర్రపెంట, పాత ధారారం, కుండిచింతబైలు, కండ్లకుంట, గీచుగండి, ఆగర్లపెంట, పందిబొర్రె పెంటల్లో నివసించే వారి పరిస్థితి దుర్భరంగా మారింది. భౌరాపూర్లో చెంచుల బొడ్డు గుడిసెలు.. రాంపూర్ చెంచుపెంటలో చెంచుల పిల్లలు ఇలా..అందని వైద్యం.. చీకట్లో జీవనం అభయారణ్యంలోని చెంచుపెంటల్లో మౌలిక వసతులు కరువయ్యాయి. విద్య, వైద్యం, తాగునీరు, రవాణా, విద్యుత్, ఇళ్లు లేక చెంచులు అంధకారంలో బతుకుతున్నారు. కి.మీ.,ల దూరంలో ఉన్న బావులు, కుంటలు, బోర్లు, కాల్వల వద్దకు నడిచివెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. నల్లమల పెంటల్లో విద్యుత్ సౌకర్యం కూడా లేదు. పలుచోట్ల సోలార్ వ్యవస్థతో విద్యుత్ దీపాలు అమర్చినా సగానికి పైగా పనిచేయడం లేదు. అయితే ఈ చెంచు పెంటలన్నీ (అప్పాపూర్) ఒకే దగ్గరికి చేర్చి వారికి విద్యుత్ సదుపాయం కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం అటవీశాఖ నిబంధనలతో నీరుగారుతోంది. రాత్రివేళ బొడ్డు గుడిసెల్లో కట్టెల మంటలు పెట్టి కాలం వెల్లదీస్తున్నారు. చెంచులకు వైద్య సేవలు అందడం లేదు. మన్ననూర్ కేంద్రంగా పనిచేసిన సంచార వైద్యశాల మూలకుబడింది. అప్పాపూర్లో ఆరోగ్య ఉపకేంద్రం ఉన్నా తెరుచుకోవడం. ఫలితంగా చెంచులు అనారోగ్యం పాలైతే వైద్యం కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దయనీయంగా నల్లమలచెంచుల జీవన విధానం బొడ్డుగుడిసెల్లో సహవాసం.. పండ్లు, దుంపలే ఆహారం కనీస వసతులకు నోచుకోని పెంటలు నేడు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం -
ఇంతకు ముందెన్నడూ చూడలేదు..
గతంలో వేసవిలో బోర్లలో నీరు అడుగంటినా, వర్షాకాలం ప్రారంభమైన తర్వాత భూగర్భజలాలు క్రమంగా పైకి వచ్చేవి. కానీ ఈసారి రెండు నెలలుగా వర్షాకాలం కొనసాగుతున్నా నీటి మట్టం పెరగలేదు. బోర్లలో నీరు సరిగా రాకపోవడంతో పూర్తిస్థాయిలో సాగు చేయలేకపోతున్నాం. నీరు మధ్యలో అయిపోతుందేమోననే భయంతో సగం భూమిలోనే పంటలు వేశాం. ఇలాంటి పరిస్థితి కొనసాగితే పంటలతో పాటు రైతుల భవిష్యత్ కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. – పాండునాయక్, రైతు, అజిలాపూర్ గ్రామం, నవాబుపేట మండలం కొంత భూమిలోనే సాగు.. వర్షాకాలం వచ్చిందంటే రైతులకు ధైర్యం వచ్చేది. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. వర్షాలు పడుతున్నా బోర్లలో నీటి మట్టం పెరగడం లేదు. ఒకవైపు విద్యుత్ ఖర్చులు, మరోవైపు నీరు లేక పంటలు ఎండిపోతాయేమోనన్న ఆందోళన వెంటాడుతోంది. అందుకే పూర్తిస్థాయిలో సాగు చేయకుండా కొంత భూమినే సాగులోకి తెచ్చాం. భూగర్భజలాలు ఇలాగే తగ్గిపోతే రానున్న రోజుల్లో వ్యవసాయం చేయడం మరింత కష్టమవుతుంది. చెరువులు నింపడం, వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకించే చర్యలను ప్రభుత్వం అత్యవసరంగా చేపట్టాలి. – రాములు, రైతు గుడిమల్కాపూర్ గ్రామం, హన్వాడ మండలం -
ఇసుక మాఫియా బరితెగింపు
●వరిమడిని నాశనం చేశారు ఆరుగాలం కష్టించే రైతులు సాగుచేసుకున్న వరిసాగును సైతం ఇసుకాసురులు పాడుచేస్తున్నారు. వాగులోకి టిప్పర్లు మా పొలం పక్క నుంచే వెళ్తుంటాయి. మా పొలాన్ని పాడు చేయడంతో పాటు నిన్న రాత్రి ఓ టిప్పర్ కూరుకుపోవడంతో జేసీబీని తెచ్చి బయటకు లాగారు. దీంతో ఇటీవల వేసిన వరినాటు దెబ్బతింది. ఇసుక వ్యాపారులను నుంచి తమ పొలాలను కాపాడి న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటున్నాం. సమీప పొలంలో భూగర్భ జలాలు కూడా అడుగంటిపోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుకాసు రులపై చర్యలు తీసుకోవాలి. – దాచని విజయభాస్కర్రెడ్డి, మల్లేపల్లి ఫిర్యాదు చేస్తున్నా.. దుందుభీ వాగులో ఇసుక అసలే లేదు. ఉన్న మట్టిని తవ్వి కృత్రిమ ఇసుక తయారు చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినప్పుడే హడావుడి చేసి, తర్వాత ఇసుకాసురులను వదిలేస్తున్నారు. ఇసుక అక్రమ వ్యాపారులు అడ్డు అదుపు లేకుండా ప్రవర్తిస్తున్నారు. భూగర్భ జలాలు సైతం అడుగంటిపోయాయి. ఇలా కొనసాగితే సాగు సంగతి దేవుడెరుగు తాగడానికి కూడా నీళ్లు కూడ దొరకవు. – రామకృష్ణ, సర్పంచ్, రాజాపూర్ రాజాపూర్: అసలే ఇసుక అక్రమ దందా.. అడ్డొస్తే అంతు చూస్తామని బెదిరింపులు.. చివరికి రైతులు వేసుకున్న పంటలను సైతం ధ్వంసం చేస్తూ తమ వ్యాపారాన్ని మూడు ట్రాక్టర్లు, ఆరు టిప్పర్లు అన్న చందంగా మండలంలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. దుందుభీ వాగు ప్రాంతాలైన రాయపల్లి, ముదిరెడ్డిపల్లి, రాజాపూర్, చెన్నవెల్లి, మల్లేపల్లి, ఈద్గాన్పల్లి, నందిగామ, తిర్మలాపూర్ తదితర గ్రామాల శివారులో ఇసుకాసురులు పగలు, రాత్రి తేడాలేకుండా తమ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. దీనికి తోడు వాగు సమీపాల్లో ఉన్న పట్టా భూమి అయినా, ప్రభుత్వ భూమి అయినా సరే ఇటాచీలు, జేసీబీతో వాటిలోని మట్టిని తోడి కృత్రిమంగా ఫిల్టర్ ఇసుక తయారు చేస్తూ.. జడ్చర్ల, షాద్నగర్ తదితర పట్టణాలకు తరలిస్తూ తమ వ్యాపారాలను యథేచ్ఛగా సాగిస్తున్నారు. గ్రామాల్లో సైతం పాడవుతోన్న రోడ్లు... వాగు పరిసరాల్లో సామర్థ్యాన్ని మించి అధిక లోడ్తో ఇసుక నింపుకొని ట్రాక్టర్లు, టిప్పర్లు వెళ్తుండడంతో గ్రామాల్లో సీసీ రోడ్లు సైతం దెబ్బతింటున్నాయి. గ్రామాలకు ఉన్న బీటీ రోడ్లు సైతం గుంతలుగా మారుతున్నాయి. ముఖ్యంగా కొన్ని గ్రామాల్లో యువత ఏ పనులు చేసుకోకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు, టిప్పర్లనే లక్ష్యంగా చేసుకొని వారి నుంచి డబ్బులు వసూలు చేస్తూ చెడు వ్యసనాలకు లోనవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా.. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్లు, ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని అధికారులు అడపాదడపా కేసులు నమోదు చేస్తున్నా.. ఇసుక అక్రమ వ్యాపారానికి అలవాటు పడిన వారు అధికారులు వేసిన జరిమానాలు చెల్లిస్తూ మరుసటి రోజే తమ వ్యాపారాన్ని యథావిధిగా కొనసాగిస్తున్నారు. వరి నాట్లను సైతం ధ్వంసం చేసి ఇసుక అక్రమ తరలింపు దుందుభీ వాగు పొడవునాఫిల్టర్ ఇసుక తయారీ కేంద్రాలు అడపాదడప కేసులు నమోదవుతున్నా పట్టింపులేదుదాడులు చేస్తున్నాం.. ఇసుక అక్రమగా తరలిస్తున్నారనే సమాచారం వచ్చిందంటే దాడులు చేసి ట్రాక్టర్లు, టిప్పర్లను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తున్నాం. ముఖ్యంగా గ్రామాల్లో రైతులు, ప్రజలు చైతన్యం కావాలి. గ్రామాల పరిధిలో ఎక్కడైనా ఫిల్టర్ ఇసుక తయారు చేస్తుంటే సమాచారం అందించాలి. వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం. – రాజశేఖర్, ఎస్ఐ, రాజాపూర్ -
విద్యావ్యవస్థలో సమూల మార్పులకు కృషి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: రాష్ట్ర విద్యారంగంలో సమూల మార్పులు తీసుకురావడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్చైర్మన్ చిన్నారెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలను పెంచడంతో పాటు పోటీ ప్రపంచంలో వారు రాణించేలా అవసరమైన మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలను అందించాల్సిన అవసరం ఉందన్నారు. పాలమూరు యూనివర్సిటీ ఆధ్వర్యంలో కన్హాశాంతివనంలో నిర్వహించిన నేషనల్ సెమినార్ రెండో రోజు కార్యక్రమం శుక్రవారం ఉత్సాహంగా జరిగింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిన్నారెడ్డి మాట్లాడారు. గ్రామీణ స్థాయి నుంచే విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విద్యాశాఖను తన వద్దే ఉంచుకుని విద్యారంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని తెలిపారు. గతంలో కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు కనీసం ఇంగ్లిష్, గణితం వంటి సబ్జెక్టులను చదవలేని పరిస్థితి ఉండేదని, అలాంటి పరిస్థితులను మార్చేందుకు ప్రభుత్వం పలు సంస్కరణలు చేపడుతోందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందినప్పుడే పోటీ ప్రపంచంలో సమర్థంగా రాణించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. పాలమూరు ప్రాంత విద్యార్థులు ఉన్నత విద్యకోసం ఎదుర్కొంటున్న సమస్యలను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. పీయూను నల్లగొండకు కేటాయించి నాగార్జునసాగర్తో అనుసంధానం చేయాలనే ప్రతిపాదనలు వచ్చిన సమయంలో.. పాలమూరు ప్రాంతానికే యూనివర్సిటీ అవసరాన్ని వివరించి ఇక్కడే ఏర్పాటు చేసేందుకు తమవంతు కృషి చేశామన్నారు. ఉషా నిధులతో పీయూ అభివృది పీయూ అభివృద్ధికి ఉషా నిధులతో వేగం పుంజుకుందని వీసీ శ్రీనివాస్ తెలిపారు. విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ ఫెసిలిటీ భవనాలతో పాటు పలు హాస్టళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. గద్వాల, వనపర్తి, కొల్లాపూర్ పీజీ సెంటర్లలోనూ వివిధ భవనాల నిర్మాణాలు చేపడుతున్నట్లు వివరించారు. రీసెర్చ్, ఇన్నోవేషన్, ఎంప్లాయ్మెంట్ తదితర అంశాలకు ప్రాధాన్యమిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన అవకాశాలు కల్పించేందుకు యూనివర్సిటీ కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో పీయూ రిజిస్ట్రార్ రమేష్బాబు, సెమినార్ కన్వీనర్లు మధుసూదన్రెడ్డి, ప్రవీణ, చంద్రకిరణ్, నూర్జహాన్, కిషోర్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో అగ్రస్థానంలో నిలపాలి భారత్ను ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు యువత కృషి చేయాలని ఎంపీ డీకే అరుణ పిలుపునిచ్చారు. ఆవిష్కరణలు, సైన్స్, టెక్నాలజీ, నూతన వనరుల వినియోగంలో ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి భారత యువత ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల్లో పరిశోధనాత్మక ఆలోచనలు, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలని సూచించారు. పాలమూరు యూనివర్సిటీ పరిశోధనలు, స్టార్టప్లు, నూతన ఆవిష్కరణల్లో అగ్రగామిగా ఎదగాలని ఆకాంక్షించారు. విశ్వవిద్యాలయ స్థాయిలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. యూనివర్సిటీల అభివృద్ధి, మహిళల అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి సమాంతరంగా కొనసాగినప్పుడే ‘వికసిత్ భారత్–2047’ లక్ష్యం సాకారమవుతుందని పేర్కొన్నారు. గ్రామీణ స్థాయి నుంచేవిద్యా ప్రమాణాల పెంపు పోటీ ప్రపంచంలో రాణించాలంటేనాణ్యమైన విద్య తప్పనిసరి పీయూ నేషనల్ సెమినార్ ముగింపుకార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి హాజరైన ఎంపీ డీకే అరుణ, వీసీ శ్రీనివాస్, ప్రొఫెసర్లు -
ప్రభుత్వ బియ్యం మింగేశాడు!
● శ్రీరామ రైస్మిల్లులో అధికారులు, పోలీసుల తనిఖీలు ● 2,880 టన్నుల ధాన్యం మాయం.. రూ.10.75 కోట్ల బకాయిలు ● యజమానిపై కేసు.. గతంలోనే మిల్లును సీజ్ చేసిన అధికారులు మహమ్మదాబాద్: రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని మరపట్టించి తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని కొందరు మిల్లర్లు పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. ప్రభుత్వానికి బియ్యం ఇవ్వకుండా భారీగా బకాయిపడిన మిల్లులపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, పోలీసులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా మహమ్మదాబాద్ మండల పరిధిలోని గాధిర్యాల్ గేటు సమీపంలోని శ్రీరామ రైస్మిల్లులో శనివారం అధికారులు, పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మిల్లులో ధాన్యం, బియ్యం నిల్వలు ఏమీ లేకపోవడంతో అధికారులు రికార్డులను పరిశీలించి వివరాలు సేకరించారు. రూ.10.75 కోట్ల బకాయిలు శ్రీరామ రైస్మిల్లుకు ప్రభుత్వం నుంచి సుమారు 2,880 టన్నుల వరిధాన్యం అందినట్లు అధికారులు గుర్తించారు. ఆ ధాన్యాన్ని మరపట్టించి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని తిరిగి ఇవ్వకుండా విక్రయించినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దీని విలువ సుమారు రూ.10.75 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వానికి బియ్యం అందించకుండా ఇంత భారీ మొత్తంలో బకాయిపడినట్లు గుర్తించడంతో మిల్లర్పై చర్యలకు ఉపక్రమించారు. మిల్లులో ఖాళీ బస్తాలు.. ఎన్ఫోర్స్మెంట్ డీటీ ఆదిత్యగౌడ్ ఆధ్వర్యంలో రూరల్ సీఐ గాంధీనాయక్, మహమ్మదాబాద్ ఎస్ఐ శేఖర్రెడ్డి, ఇతర సిబ్బంది మిల్లులో తనిఖీలు నిర్వహించారు. మిల్లు ప్రాంగణంలో ఒక్క బస్తా బియ్యం గానీ, ధాన్యం గానీ కనిపించకపోవడంతో అధికారులు రికార్డులను పరిశీలించారు. మిల్లుకు వచ్చిన ధాన్యం, ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాల్సిన బియ్యం, ఇప్పటికే చెల్లించిన వివరాలు తదితర అంశాలపై ఆరా తీశారు. గతంలోనే సీజ్.. అయినా.. శ్రీరామ రైస్మిల్లుపై అధికారులు గతంలోనే తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. అప్పట్లో మిల్లును సీజ్ చేసి, ఉన్నతాధికారులైన డీఎస్ఓ, డీఎంలకు సమాచారం అందించడంతో పాటు నివేదికలు కూడా సమర్పించినట్లు పేర్కొన్నారు. తాజాగా మరోసారి తనిఖీలు చేపట్టి ప్రభుత్వానికి రావాల్సిన బియ్యం భారీగా బకాయి ఉన్నట్లు నిర్ధారించారు. -
అన్నింటినీ అందుబాటులోకి తెచ్చేలా చూస్తాం
మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సద్వినియోగం చేసుకుంటాం. ఈ యూనిట్ ద్వారా మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటు వారి ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తున్నాం. మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న మిగతా ఎనిమిది రకాల యంత్రాలను కూడా పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు చేపడతాం. రొట్టెల తయారీతో పాటు బిస్కెట్లు, ఆరికలు, ఊదలు, కొర్రలు తదితర చిరుధాన్యాల ఉత్పత్తుల తయారీకి సంబంధించిన యంత్రాలు పనిచేసేలా చూస్తాం. మిల్లెట్ యూనిట్ ఏర్పాటు చేసిన లక్ష్యాలు నెరవేరేలా అన్ని విభాగాలను పూర్తిస్థాయిలో నిర్వహించేందుకు కృషి చేస్తాం. గండేడ్ మిల్లెట్ యూనిట్ను మహిళల ఆర్థిక స్వావలంబనకు ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం. – రజిత, ఏపీఎం, గండేడ్ -
10 యూనిట్లలో విద్యుదుత్పత్తి
ఆత్మకూర్/గద్వాల: జూరాల ఎగువ, దిగువ జూరాల జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో 10 యూనిట్లలో విద్యుదుత్పత్తి చేపట్టారు. శనివారం ఎగువలో 6 యూనిట్ల ద్వారా 234 మెగావాట్లు, 38.507 ఎంయూ, దిగువలో 4 యూనిట్ల ద్వారా 160 మెగావాట్లు, 29.236 ఎంయూ విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటివరకు 67.743 మిలియన్యూనిట్ల విద్యుదుత్పత్తిని విజయవంతంగా చేపట్టామన్నారు. మరోవైపు జూరాలకు 1.73 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. 21 గేట్లు ఎత్తి దిగువనకు 1,38,495 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నెట్టెంపాడుకు 547 క్యూసెక్కులు, భీమా–1కు 1,300, భీమా–2కు 872 క్యూసెక్కులు, కోయిల్సాగర్కు 630 క్యూసెక్కులు, ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వకు 820, ప్రధాన కుడి కాల్వకు 600, సమాంతర కాల్వకు 400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 15 అడుగులకు చేరిన కేఎస్పీ నీటిమట్టం దేవరకద్ర: కోయిల్సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం శనివారం 15 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటిమట్టం 32.6 అడుగులుగా ఉంది. ప్రస్తుతం జూరాల వద్ద ఉన్న ఉంద్యాల–1 పంపుహౌస్ నుంచి రెండు పంపులను రన్ చేసి తీలేర్–2 పంపుహౌస్కు, అక్కడి నుంచి ప్రాజెక్టు 630క్యూసెక్కుల నీటిని చేరవేస్తున్నా రు. రెండు వారాల క్రితం ప్రాజెక్టులో కేవలం 9 అడుగులకు నీటి మట్టం ఉండగా ఎత్తిపోతల నీటితో 6 అడుగుల మేర పెరిగింది. -
మహిళలకు నిరంతర ఉపాధి
చిరుధాన్యాల రొట్టెల తయారీ ద్వారా నాతోపాటు మరో ఆరుగురు మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఒక్కొక్కరికి రోజుకు రూ.300 చొప్పున కూలి చెల్లిస్తున్నాం. సాధారణంగా మహిళలకు నిరంతర ఉపాధి లభించడం కష్టంగా ఉంటుంది. ఈ రొట్టెల యూనిట్ మాత్రం మాకు క్రమం తప్పకుండా పని, ఆదాయాన్ని అందిస్తోంది. మహిళల ఆర్థిక ప్రగతికి ఈ యూనిట్ ఎంతో దోహదపడుతోంది. రొట్టెలకు డిమాండ్ పెరిగే కొద్దీ ఆదాయం కూడా పెరుగుతుంది. ఉత్పత్తిని మరింత పెంచగలిగితే భవిష్యత్లో ఇంకొంతమంది మహిళలకు ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది. అధికారుల సహకారంతో ప్రస్తుతం యూనిట్ను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం. – వన్పలి రాఘవేంద్రమ్మ, మిల్లెట్ యూనిట్ నిర్వాహకురాలు ● -
రోజుకు 1,000 నుంచి 1,500 రొట్టెలు
గండేడ్లోని సమాఖ్య భవనంలో కొనసాగుతున్న రొట్టెల తయారీ యూనిట్లో ఉత్పత్తి క్రమంగా పెరుగుతోంది. తొలినాళ్లలో రోజుకు 100 నుంచి 500 రొట్టెల వరకు మా త్రమే తయారు చేసేవారు. ప్రస్తుతం వీటికి ఆదరణ పెరగడంతో రోజుకు 1,000 నుంచి 1,500 రొట్టెల వరకు తయారు చేస్తున్నారు. ఒక్కో రొట్టెను రూ.5 చొప్పున విక్రయిస్తున్నారు. సల్కర్పేట్, వెన్నాచేడ్, అంచన్పల్లి, గండేడ్ తదితర గ్రామాల్లోని హోటళ్లు, దాబాలు, కిరాణా దుకాణాలకు వీటిని సరఫరా చేస్తున్నారు. అంతేకాకుండా మహమ్మదాబాద్, కోస్గి, హన్వాడ మండలాలకు కూడా ఇక్కడి నుంచే రొట్టెలను పంపిస్తున్నారు. ఆరబెట్టిన రొట్టెలు -
నవాబుపేటలో డ్రగ్స్ కలకలం
నవాబుపేట: తమ పిల్లలు రాత్రిళ్లు అదోలా ఉంటున్నారు.. మద్యం తాగోస్తున్నారనుకున్నాం... కానీ తాజాగా పోలీసులు జాగిలాలతో డ్రగ్స్ కోసం సోదాలు చేస్తుంటే మండలంలో గంజాయి లాంటి మత్తు పదార్థాల వినియోగం జరుగుతుందెమోనని యువత తల్లిదండ్రులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలో తాజాగా పోలీసులు డ్రగ్స్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న తరుణంలో సోదాలు సైతం ప్రత్యేకంగా అనుమానాలకు తావిస్తున్నాయి. ఆదివారం సంతే టార్గెటా.. ఆదివారం మండల కేంద్రంలో జరిగే సంతకు వేలాది మంది ప్రజలు వస్తుంటారు. దీంతో సంతను టార్గెట్ చేసుకుని సందట్లో సడేమియా అన్నట్లు గంజాయి విక్రయాలు చేస్తున్నారా అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో మత్తు పదార్థాల అన్వేషణలో భాగంగా డాగ్స్కాడ్ ప్రత్యేక తనిఖీలు చేసింది. నిఘా విభాగం సమాచారం మేరకు తనిఖీలు జరిగినట్లు పలువురు చర్చించుకుంటున్నారు. పోలీసుల సోదాలతో మరింత ఆందోళన డ్రగ్స్ రహిత సమాజం కోసం.. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలి. డ్రగ్సను పట్టణాల నుంచి పల్లెలకు పాకకుండా వాటిని కట్టడి చేయాలన్నా ఉద్దేశంతో ప్రత్యేక డాగ్ స్కాడ్ తనిఖీలు చేపట్టాం. ఎస్పీ ఆదేశాలతో డ్రగ్స్ను పసిగట్టే రుద్రా అనే స్నిపర్ డాగ్ను రంగంలోకి దించామని ఇక సోదాలు నిరంతరం కొనసాగిస్తునే ఉంటాం. – నరేందర్, ఎస్ఐ, నవాబుపేట -
ఆది నుంచి అంతంతే...
ఖరీఫ్ ప్రారంభం నుంచే వర్షాలు నిరాశపరుస్తున్నాయి. జూన్లో సాధారణ వర్షపాతం నమోదైనా విస్తృతంగా ఉపయోగపడే భారీ వర్షాలు లేవు. జూలైలోనూ చిరుజల్లులు, మోస్తరు వానలకే పరిమితమైంది. భూమి పూర్తిగా తడిసేలా, చెరువులు నిండేలా ఒక్క భారీ వర్షం కూడా కురవలేదు. దీంతో వ్యవసాయ పనులు సాగుతున్నప్పటికీ భూగర్భ జలాల పరిస్థితిలో ఎలాంటి మెరుగుదల కనిపించలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే సాగుతోపాటు తాగునీటి సమస్య కూడా తీవ్రమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జూలై 31 నాటికి బాలానగర్, మహమ్మదాబాద్ మండలాల్లో మాత్రమే అధిక వర్షపాతం నమోదైంది. గండేడ్, దేవరకద్ర, నవాబుపేట, రాజాపూర్, జడ్చర్ల, మిడ్జిల్ మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. అయితే చిన్నచింతకుంట, కోయిలకొండ, హన్వాడ, మహబూబ్నగర్ రూరల్, అడ్డాకుల, మూసాపేట, భూత్పూర్, మహబూబ్నగర్ అర్బన్, కౌకుంట్ల మండలాల్లో లోటు వర్షపాతం ఉంది. -
మా గురించి ఎవరికీ పట్టదు
అడవిలో అటవీ ఉత్పత్తులు తగ్గిపోయి బతకడం కష్టంగా మారింది. మా గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. ఐటీడీఏ అధికారులు మా వైపే చూడటం లేదు. వైద్యం అందక రోగాల బారిన పడుతున్నాం. అప్పుడప్పుడు దాతలు వచ్చి దుస్తులు, దుప్పట్లు, సరుకులు ఇస్తున్నారు. చెంచులకు గతంలో మాదిరిగా ప్రత్యేక ఉపాధి కల్పించి ఆదుకోవాలి. – లింగేష్, సార్లపల్లి పథకాలు అందేలా చూస్తాం.. చెంచు, గిరిజనులకు ప్ర భుత్వ సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందేలా చూస్తాం. చెంచుల కు టుంబాల పరిస్థితులు, విద్య, ఆరోగ్యం, పోషకా హారం, కేంద్ర ప్రభుత్వ జన్ ధన్ వంటి పథకాల అమలు చేయడం వంటి అంశాలను పరిశీలిస్తాం. ప్రభుత్వ ఫలాలు అందాలంటే ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్ నమోదు ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేస్తాం. – యాదిగిరి, ఆర్డీఓ, ఐటీడీఏ ఇన్చార్జి పీఓ -
శాంతినగర్లో పీడీఎస్ బియ్యం పట్టివేత
రాజోళి: శాంతినగర్ పోలీస్ స్టేషన్ పరిదిలో 14 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ నాగశేఖర్రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం పట్టణంలోని బృందావన కాలనీలో గల గోగినేని సత్యనారాయణ ఇంటి ఎదుట గల రేకుల షెడ్లో బియ్యం అక్రమంగా నిల్వ ఉంచారని సమాచారం అందడంతో దాడి చేసి, ఎలాంటి అనుమతులు లేని 14 క్వింటాళ్ల బియ్యం గుర్తించామన్నారు. విచారణ చేయగా.. తెలుగు భాస్కర్, వడ్డె గోపిచంద్ వడ్డేపల్లి, చుట్టు పక్కల గ్రామాల్లో తక్కువ ధరకు రేషన్ బియ్యం కొనుగోలు చేసి, వాటిని కర్ణాటకలోని రాయిచూర్, ఇతర పట్టణాల్లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు తెలిసిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 15 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత అచ్చంపేట రూరల్: మండలంలోని పలకపల్లి నుంచి అక్రమంగా తరలిస్తున్న 15 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అచ్చంపేట పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం రాత్రి పట్టుకున్నారు. రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పల్కపల్లి నుంచి అచ్చంపేట ప్రధాన రహదారిలో కాపు కాచారు. ఓ బొలెరో వాహనం అనుమానస్పదంగా కనిపించడంతో వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. అందులో 32 ప్లాస్టిక్ బ్యాగుల్లో 15 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. ఆ వాహన డ్రైవర్, ఓనర్ తిక్కల శ్రీకాంత్ను అదుపులోకి తీసుకుని వాహనాన్ని పోలీస్స్టేషన్కు తరలించారు. ఎన్ఫోర్స్మెంట్ డీటీ హేమ్లా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ నరేష్ తెలిపారు. -
జైలు స్నేహితులు.. సీరియల్ దొంగలు
● వరుస చోరీలు చేస్తూ రోడ్లపై జీవనం ● ముఠాను అరెస్టు చేసిన కోయిలకొండ పోలీసులు మహబూబ్నగర్ క్రైం: ఓ ఇంట్లో చోరీ చేసిన ముగ్గుర్తిఓ కూడిన కరుడుగట్టిన సీరియల్ దొంగల ము ఠాను కోయిలకొండ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కోయిలకొండ పోలీస్స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్ఐ నాగరాజు వివరాలు వెల్లడించారు. పోలీస్స్టేషన్ పరిధిలోని దామయాపల్లికి చెందిన వెంకటేశ్వరమ్మ ఇంట్లో జూలై 23న ఇంటి తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న రూ.15వేల నగదు, 25తులాల వెండి చోరీ చేసినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తులో భా గంగా శుక్రవారం ఉదయం రాంపూర్ గేట్ వద్ద ము గ్గురు అనుమానాస్పదంగా ఉన్నారని సమాచారం వస్తే ఘటన స్థలానికి చేరుకొని అక్కడి నుంచి స్టేషన్కు తీసుకువెళ్లి విచారణ చేయగా దొంగతనం చేసినట్లు తేలిందన్నారు. పట్టుబడిన దొంగలలో ఏ–1 మనికొండకు చెందిన ఈర్ల రాములు, ఏ–2 నాగర్కర్నూల్కు చెందిన ఉంద్యాల రవీందర్రెడ్డి, ఏ–3 మరికల్ మండలం తీలేరుకు చెందిన చాకలి చంద్రయ్యగా గుర్తించినట్లు పేర్కొన్నారు. వీరినుంచి 25తులాల వెండి, రెండు మాసాల బంగారం చెవి కమ్మలు రికవరీ చేసినట్లు తెలిపారు. ముగ్గురిని రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. జైలులో స్నేహితులు అయ్యారు అయితే వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఈ ముగ్గురు దొంగతనం కేసులో జిల్లా జైలుకు వెళ్లిన క్రమంలో అక్కడ పరిచయయ్యారు. ఆ తర్వాత ముగ్గురు స్నేి హతులయ్యారు. బయటకు వచ్చి ముగ్గురు కలిసి మళ్లీ దొంగతనాలు చేయడం ప్రారంభించారు. ఇటీ వల కర్ణాటకలో ఒక బైక్ చోరీ చేసి అదే బైక్పై తిరుగుతున్నారు. ఇటీవల కొత్తకోట వద్ద ఒక ఆలయంలో రూ.70వేలు ఎత్తుకెళ్లారు. ఈ ముఠాపై రేవల్లి, షాద్నగర్, గద్వాల పోలీస్స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. దీంట్లో రవీందర్రెడ్డికి తల్లిదండ్రులు లేకపోవడంతో ఒంటరిగా పెరిగాడు. కనీసం ఆధార్కార్డు కూడా లేదు. దీనికితోడు ఈ ముగ్గురు కనీసం సెల్ఫోన్ కూడా వాడరు. వెళ్లిన చోట దొంగ తనాలు చేస్తారు..వచ్చిన డబ్బులు సమానంగా పంచుకొని జల్సాలు చేస్తారు. రోడ్లపై పడుకుంటూ.. పలు గ్రామాలు, పట్టణాలు సంచారం చేస్తుంటారు. -
కోయిల్సాగర్కు భారీ వరద
దేవరకద్ర: కోయిల్సాగర్ నీటిమట్టం శరవేగంగా పెరుగుతుంది. జూరాల నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా ఉంద్యాల పంపుహౌజ్ నుంచి రెండు పంపులను రన్ చేసి 630 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టుకు తరలిస్తున్నారు. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం రోజురోజుకు పెరుగుతుంది. పది రోజుల క్రితం వరకు 9 అడుగులకు పడిపోయిన నీటిమట్టం శుక్రవారం సాయంత్రం వరకు 14.6 అడుగులకు చేరుకుంది. మరో 5.6 అడుగుల నీరు చేరితే ప్రాజెక్టు నీటిని వదిలే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి వస్తున్న నీటితో ముందుగానే నీటిని వదిలే అవకాశం ఉంది. దీంతో ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఆగస్టు రెండు, మూడో వారం వరకు వరినాట్లు వేసుకునే అవకాశం ఉండడంతో రైతులు వ్యవసాయ పనుల్లో మునిగి పోయారు. ఇప్పటికే బోరు బావుల కింద వరినాట్లు వేసుకున్న రైతులు ఆయకట్టుకు నీరు వదిలితే పూర్తిస్థాయిలో పంటలు సాగు చేసుకోవచ్చని భావిస్తున్నారు. -
‘పాలమూరు’ పంపులను ప్రారంభించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): శ్రీశైలం జలాశయం 162 టీఎంసీలకు చేరినా.. కేఎల్ఐ రిజర్వాయర్ల నుంచి సాగునీరు విడుదల చే యకుండా కాంగ్రెస్ ప్రభు త్వం మొద్దునిద్రపోతోందని మాజీ మంత్రి శ్రీని వాస్గౌడ్ శుక్రవారం ప్రకటనలో మండిపడ్డారు. తక్షణమే కేఎల్ఐ మోటార్లు, పాలమూరు ప్రాజె క్టు నార్లాపూర్ పంపులను ఆన్ చేసి, నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్ల కింద ఉన్న ఆయకట్టు కు సా గునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు అందుబాటులో ఉన్న నీటిని విని యోగించుకోకుండా ఏపీకి తెలంగాణ నీళ్లను ధా రాదత్తం చేయడమే అవుతుందని విమర్శించా రు. చంద్రబాబు కింద పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ను సలహాదారుగా ని యమించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాల విషయంలో మాత్రం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఈనెల 11వరకు డెడ్లైన్ విధిస్తున్నామని అప్పటిలోగా ప్రారంభించకుంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కలిసి లక్షలాది మంది రైతులతో నార్లాపూర్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. బైక్ను ఢీకొన్న బొలెరో ● కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మృతి మాగనూర్: వెనకనుంచి బైక్ను బొలెరో ఢీకొన్న ఘ టనలో శుక్రవారం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు న ర్సింహరెడ్డి(60) మృతి చెందాడు.నర్సింహరెడ్డి బైక్పై తహసీల్దార్ కార్యాలయం వై పు నుంచి వస్తుండగా వెనకనుంచి బొలెరో బైక్ ను బలంగా ఢీకొన్నది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బొలెరోను అక్కడ వదిలేసి డ్రైవర్ పారిపోయాడు. మృతిదేహాన్ని మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బొలెరోను స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు తెలిపారు. తరగతి గదిలోకి పాము మక్తల్: నారాయణపేట మండలం ఏక్లాస్పూర్లోని ప్రాథమిక పాఠశాలలో పాము కాటుతో ఓ విద్యార్థి మృతి చెంది 24 గంటలు కూడా గడవకముందే శుక్రవారం మక్తల్ మండలం కాట్రెవ్పల్లిలోని ప్రాథమిక పాఠశాలలో పాము కనిపించడం కలకలం రేపింది. తరగతి గదిలో పాము కనిపించడంతో విద్యార్థులు భయాందోళనకు గురై బయటికి పరుగులు తీశారు. అనంతరం ఉపాధ్యాయులకు సమాచారం అందించా రు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే పాఠశాలకు చేరుకోగా ఓ యువకుడు పామును కర్రతో కొట్టి చంపేశాడు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు. తరగతి గదుల్లో వరుసగా పాములు ప్రత్యక్ష మవుతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులు పాఠశాలల్లోకి పాములు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా: రైతు దుర్మరణం
భూత్పూర్: ట్రాక్టర్ అదు పుతప్పి బోల్తా పడి రైతు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం కొత్త మొల్గర గ్రామానికి చెందిన సిద్ధాపురం మల్లయ్య(45) తన వ్యవసాయ పొ లాన్ని ట్రాక్టర్తో చదును చేసుకొని తిరిగి వెళ్తున్న క్రమంలో ట్రాక్టర్ అదుపు తప్పి కల్వర్టును ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో మల్లయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. సర్పంచ్ వెంకటేష్ ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. సమాచారం అందుకున్న భూత్పూర్ పోలీసు లు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా జనరల్ ఆస్పతికి తరలించారు. బాధిత కుటుంబసభ్యుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ దివ్య తెలిపారు. ఎదురెదురుగా ఢీ.. వాహనదారుడి మృతి అచ్చంపేట రూరల్: రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అంకిరోనిపల్లికి చెందిన రవీందర్ (43) గురువారం రాత్రి ద్విచక్రవాహనంపై అచ్చంపేట నుంచి స్వగ్రామానికి బయలుదేరాడు. అదే సమయంలో హాజీపూర్ నుంచి అచ్చంపేట వైపు బైక్పై వస్తున్న నరేష్ ఎదురుగా వస్తున్న రవీందర్ ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టాడు. ప్రమాదంలో రవీందర్కు తీవ్ర గాయాలు కాగా అచ్చంపేట ప్రభుత్వాస్పత్రికి అక్కడి నుంచి హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. అలాగే తీవ్ర గాయాలైన రవీందర్ను అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రి నుంచి హైదరాబాద్కు ప్రైవేట్ అంబులెన్సులో తరలిస్తుండగా అంబులెన్సును అడ్డుకున్న వారిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు మహబూబ్నగర్ క్రైం: హత్య చేసిన కేసులో ముగ్గురికి జీవిత ఖైదు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. పూర్తి వివరాలు.. మహబూబ్నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2024 జనవరి 29న కోటకదిర గ్రామానికి చెందిన మేకల నాగమ్మ అనే మ హిళ చేతబడి చేస్తుందనే నెపంతో అదే గ్రామానికి చెందిన సత్తయ్య, చంద్రమ్మ, నర్సమ్మ కర్రలతో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం విచారణకు రాగా జిల్లా సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత నేరస్తులకు జీవిత ఖైదుతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. కేసులో శిక్ష పడేలా కృషి చేసిన రూరల్ పోలీసులను ఎస్పీ జానకి అభినందించారు. విద్యుదాఘాతంతో రైతు మృతి కోస్గి రూరల్: విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన శుక్రవారం మండల పరధిలోని కడంపల్లిలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. గ్రామానికి నాగని బుగ్గప్ప(50) పొలంలో ఏర్పాటు చేసుకున్న ఇంటికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో దగ్గరే ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్ద సరిచేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి షాక్కు గురై అక్కడే పడిపోయాడు. స్థానికులు గమనించి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి ముగ్గురు కుమార్తెలు, కూమారుడు ఉన్నారు. పరిసరాలు శుభ్రతతో సీజనల్ వ్యాధుల కట్టడి పాలమూరు: సీజనల్ వ్యాధులు కట్టడి చేయాలంటే ప్రతి ఇళ్లు పరిశుభ్రంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉందని డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాసులు అన్నారు. ఫ్రైడే–డ్రైడే సందర్భంగా శుక్రవారం నగరంలోని దొడ్డలోనిపల్లి, కోయనగర్లో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని డీఎంహెచ్ఓ తనిఖీ చేశారు. గ్రామాల్లో పలు రకాల ఇళ్లను పరిశీలించి నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆ తర్వాత తల్లి పాల వారోత్సవాల కార్యక్రమంలో డీఎంహెచ్వో బాలింతలు, గర్భిణీలకు అవగాహన కల్పించారు. నవజాత శిశువు ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు తల్లిపాలే సంపూర్ణ పోషకాహారం అని తెలిపారు. డాక్టర్ నరేష్ చంద్ర, సిబ్బంది సుభాష్ చంద్ర, అశోక్రాజు, చక్రపాణి పాల్గొన్నారు. ● జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో శుక్రవారం మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట డీఎంహెచ్ఓతో పాటు ప్రోగ్రామ్ అధికారులకు, మాస్ మీడియా అధికారులకు క్లినికల్ స్థాపన యాక్ట్ పూర్తి ఆన్లైన్ ద్వారా అమ లు చేసే విధానంపై ఒకరోజు శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి క్లినికల్ స్థాపన యాక్ట్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రమణ హాజరై శిక్షణ ఇచ్చారు.కార్యక్రమంలో డీఎంహెచ్ఓలు డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ కృష్ణ, డాక్టర్ జయ చంద్రమోహన్, ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ శివ కాంత్, రాజగోపాలచారి, సునీల్ పాల్గొన్నారు. -
అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు కృషి
స్టేషన్ మహబూబ్నగర్: ధూప, దీప నైవేద్య అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించేదిశగా కృషి చేస్తామ ని అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ అన్నారు. జిల్లా కేంద్రం ద్వారకామయి బాబా మందిరం హాల్లో శుక్రవారం జిల్లా ధూప, దీప నైవేద్య అర్చక సంక్షేమ సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉపేంద్రశర్మ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ అర్చకుల సంక్షేమమే ధ్యే యంగా సీఎం రేవంత్రెడ్డి, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ పనిచేస్తున్నారన్నారు. ధూప, దీప నైవేద్య దేవాలయాలను గ్రూప్ ఆఫ్ టెంపుల్స్గా ప్రకటించి అర్చకులను ఉద్యోగులుగా ప్రకటించే వి ధంగా అందరూ ఐక్యంగా ఉండాలని కోరారు. తె లంగాణ ధూప, దీప నైవేద్య అ ర్చక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్శర్మ మాట్లాడుతూ ధూప, దీప నైవేద్య అర్చకుల ఉద్యోగ భద్రతే లక్ష్యంగా సంక్షేమ సంఘం ఆవిర్భవించిందన్నారు. సంక్షేమ సంఘా న్ని జిల్లాలో బలోపేతం చేయాలని కోరారు. ధూప, దీప నైవేద్య అర్చకులకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా అండగా ఉంటామన్నారు. అనంతరం ధూప, దీప నైవేద్య అర్చక సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులుగా కె. రాజుకుమార్, ఉపాధ్యక్షులుగా రవిశంకర్, రాధా కాంత్, ప్రధాన కార్యదర్శిగా ఎం.వంశీతేజ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా రాధాకృష్ణలను ఎన్నుకొని ని యామకపత్రాలు అందజేశారు.సమావేశంలో తెలంగాణ ధూప, దీప నైవేద్య అర్చక సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంతోష్శాస్త్రి, రాష్ట్ర కోశాధికారి గాండ్ల రవికుమార్, కార్యనిర్వాహక అధ్యక్షులు తిరునగరి వెంటాద్రిస్వామి పాల్గొన్నారు. -
అడిగేదెవరు?
అడ్డంగా వాడేయి.. సీసీబీ నిర్మాణానికి ఏరియా ఆస్పత్రి కరెంట్ భవన నిర్మాణానికి కరెంట్ వినియోగించినా సబ్మీటర్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పాం. నాలుగు నెలల కిందటే నేను చార్జ్ తీసుకున్నప్పుడే కాంట్రాక్టర్ను పిలిచి చెప్పా. అయినా అలాగే కరెంట్ వినియోగించారు. నిర్మాణం ప్రారంభించాక ప్రతి నెలా రూ.60 వేల నుంచి రూ.లక్ష బిల్లు ఎక్కువగా వచ్చింది వాస్తవమే. వచ్చిన బిల్లు ప్రతినెలా వైద్య విధాన పరిషత్కు పంపిస్తాం. మొత్తం రూ.70 లక్షలకు పైగా బిల్లు పెండింగ్లో ఉంది. నిర్మాణం కోసం వాడిన బిల్లును కడతామని కాంట్రాక్టర్ చెబుతున్నారు. – హర్షదుల్లా, సూపరింటెండెంట్, ఏరియా ఆస్పత్రి, జడ్చర్ల జడ్చర్ల టౌన్: పట్టణ శివా రులోని ఏరియా ఆస్ప త్రి వద్ద క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణం కో సం 19 నెలలుగా ఆ స్పత్రి కరెంట్ వినియోగిస్తున్నారు. ప్రతి నెలా దా దాపు రూ. లక్ష అదనపు బి ల్లు వస్తున్నావి ద్యుత్ శాఖ అధికారులు, ఆస్పత్రి అధికారులు పట్టించుకోకపోవ డం లేదు. కరెంట్తో పాటు బోరు, మోటర్ సైతం వాడుతూ నీళ్లు ఆస్పత్రివే దర్జాగా వాడుతున్నా కాంట్రాక్టర్ను అడిగే వారెవరే లేరు. ఇదే విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ వివరణ కోరేందుకు విలేకర్లు వెళ్లగా నిర్మాణ పనులు ఆపేస్తానని కాంట్రాక్టర్ బెదిరించే యత్నం చేయగా, సాయి.. అనే నకిలీ డాక్టర్ మీకెందుకు బిల్లు మాఫీ అవుతుందిలే అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం గమనార్హం. పూర్తి వివరాలిలా ఉన్నాయి. కరెంట్, నీళ్లు అన్ని ఆస్పత్రివే.. కాంట్రాక్ట్ దక్కించుకున్న కాంట్రాక్టర్ భవన నిర్మాణం కోసం విద్యుత్ శాఖ ద్వారా కరెంట్ మీటరు పొందాల్సి ఉంది. నీటి సౌకర్యం ఏర్పాటు చేసుకోవా ల్సి ఉంటుంది. అయితే మీటరుకు దర ఖాస్తు చేసుకోకపోగా ఏరి యా ఆస్పత్రి మీటర్ నుంచి దర్జాగా కరెంట్ వినియోగిస్తున్నాడు. ఆస్పత్రి బోరు నుంచి నీటిని సైతం వినియోగిస్తుండటంతో ఆస్పత్రిలో తరచూ నీటి సమస్య ఏర్పడుతుంది. భవన నిర్మాణ పనులు ప్రారంభం కాకముందు అంటే 2025 జనవరి 25 వరకు ప్రతి నెలా రూ.1.30 లక్ష ల నుంచి రూ.1.70 లక్షల దాకా బిల్లు వచ్చేది. నిర్మా ణ పనులు ప్రారంభం అయ్యాక అదనంగా రూ. లక్ష బిల్లు పెరిగింది. సుమారు గా రూ.2.60 లక్షల నుంచి రూ. 2.80 లక్షల వరకు బిల్లు వస్తుంది. ఇలా 18 నెలలుగా కరెంట్ బిల్లు నెలకు రూ. లక్ష చొప్పున రూ.17 లక్షల బిల్లు పెరిగిపోయింది. 2023లో ఆస్పత్రి వినియోగంలోకి రాగా అప్పటి నుంచి కరెంట్ బిల్లు మంజూరు కాలేదు. దీంతో ఆ గస్టు వరకు రూ.70 లక్షలకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. ప్రతి నెలా వచ్చే బిల్లును వైద్య విధా న పరిషత్కు పంపిస్తున్నారు. అక్కడి నుంచి నిధులు విడుదలైతేనే బిల్లు చెల్లించటానికి ఆస్కారం ఉంది. అయితే ప్రతినెలా బిల్లు చెల్లించకపోవటంతో రుసు ము రూపంలోనూ విద్యుత్శాఖ బాదుతుంది. ఒకవై పు భవన నిర్మాణం కాంట్రాక్టర్ అక్రమంగా విని యోగిస్తున్న కరెంట్ బిల్లుతోపాటు రుసుముల పేరు తో బాదే బాదుడు వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని ప్రజలు పేర్కొంటున్నారు. నాలుగు నెలల క్రితం సూపరింటెండెంట్గా ఉండి సస్పెన్షన్కు గురైన డా.చంద్రకళతో పాటు ప్రస్తుత ఇన్చార్జి సూపరింటెండెంట్గా ఉన్న డా.హర్షదుల్లాలు చర్యలు తీసుకోకపోవటం పైనా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరెంట్ బిల్లు, నిర్మాణానికి వినియోగిస్తున్న విషయమై ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ను వివరణ కోరేందుకు శుక్రవారం కొందరు విలేకర్లు ఆస్పత్రికి వెళ్లారు. అదే సమయంలో అక్కడే ఉన్న కాంట్రాక్టర్ కరుణాకర్రెడ్డి ఇప్పుడేమైంది కరెంట్ వినియోగం చేసింది వాస్తవమేనని అంగీకరిస్తూనే, ఇలా అయితే తాను ని ర్మాణమే ఆపివేస్తానని బెదిరింపులకు పాల్పడ్డా డు. అతనితో పాటే ఉన్న మరోవ్యక్తి తాను డాక్ట ర్ సాయినని, నెల రోజుల కిందటే ఆస్పత్రిలో చేరానని చెబుతూ బిల్లు ప్రభుత్వం మాఫీ చేస్తుందిలే అంటూ చెప్పుకొచ్చారు. తాము సూ పరింటెండెంట్ వివరణ కోసం వచ్చామని విలేకర్లు చెపుతూ వీడియో రికార్డింగ్ చేసేందుకు యత్నిస్తుండగా కాంట్రాక్టర్, నకిలీ డాక్టర్ లేచి వెళ్లిపోయారు.ఈ తతంగం కొనసాగుతున్న సమయంలో సూపరింటెండెంట్ మౌనంగా ఉ న్నారు. అయితే డాక్టర్ సాయి అనే వ్యక్తి ఎవరూ ఆస్పత్రిలో పనిచేయడం లేదన్న విషయం కొసమెరుపు. బోరు, మోటర్ సైతం ప్రతి నెలా రూ.లక్ష అదనపు బిల్లు భారం 2025 జనవరి నుంచి కొనసాగుతున్న వైనం పట్టించుకోని అధికారులు మాఫీ అవుతుందిలే అంటున్న నకిలీ డాక్టర్ రూ.వేలల్లో బిల్లు వస్తే కనెక్షన్ కట్ చేసే విద్యుత్శాఖ అధికారులు 19 నెలలుగా ప్రభు త్వ ఆస్పత్రి కరెంట్ను కాంట్రాక్టర్ విని యోగిస్తున్నా నిర్లక్ష్యం వహించటం చర్చనీయాంశంగా మారింది. భవన నిర్మాణం కో సం ప్రత్యేక మీటర్ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ సంబంధించిన లైన్మన్, ఏఈలు పర్యవేక్షించకపోవటం పలు సందేహాలకు తావిస్తోంది. -
24గంటల్లో చోరీ కేసు ఛేదన
● బంగారు ఆభరణాలు స్వాధీనం ● ఒకరు అరెస్టు.. మరోకరు పరార్ ● వివరాలు వెల్లడించిన సీఐ శ్రీను గద్వాల క్రైం: నిద్రిస్తున్న మహిళల మెడలో బంగారు ఆభరణాలను అపహరించిన నిందితులను 24గంటలోనే పోలీసులు గుర్తించి వారి నుంచి సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు గద్వాల సీఐ శ్రీను వెల్లడించారు. శుక్రవారం ఉదయం రూరల్ పోలీసు స్టేషన్లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. గద్వాల పట్టణంలోని జమ్మిచేడ్ కాలనీలో ఎలుక బుచ్చ, పారిజాతమ్మ ఈనెల 5వ తేదీన రాత్రి భోజనం అనంతరం ఇంటి ఆరుబయట నిద్రకు ఉపక్రమించారు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని ఉప్రా, చంద్రాపురం గ్రామాలకు చెందిన ఏ–1 రితిక్ షిండే, ఏ–2 సోయొం గద్వాల జిల్లా కేంద్రంలో ప్లాస్టిక్ సామగ్రి విక్రయాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే 6వ తేదీన గురువారం తెల్లవారుజామున ఇద్దరు నిందితులు జమ్మిచేడ్ కాలనీలోని దొంగతనం చేసేందుకు వెళ్లారు. ఆరుబయట నిద్రిస్తున్న ఇద్దరు మహిళల మెడలోని బంగారు ఆభరణాలను పదునైన కత్తితో కత్తిరించి తస్కరించారు. ఉదయం లేచి చూడగా మెడలోని బంగారు ఆభరణాలు కన్పించకపోవడంతో దొంగతనం జరిగినట్లు గుర్తించి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని సాంకేతిక, సీసీ కెమెరాల సహాయంతో పరిశీలించగా.. ఇద్దరు నిందితులు దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించామన్నారు. శుక్రవారం ఉదయం జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ రోడ్డుమార్గంలో వాహనాల తనిఖీలు చేస్తుండగా.. ఓ యువకుడు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. సిబ్బంది క్షణాల్లో తేరుకుని యువకుడిని వెంబడించి అదుపులోకి తీసుకుని విచారణ చేయగా నేరం అంగీకరించినట్లు తెలిపారు. నిందితుడి నుంచి 5గ్రాముల బంగారు ఆభరణాలు, రెండున్నర తులాల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడిని గద్వాల కోర్టులో హాజరుపరచి రిమాండ్కు తరలిస్తున్నట్లు వివరించారు. పరారీలో ఉన్న మరో నిందితుడిని త్వరలో అదుపులోకి తీసుకుంటామన్నారు. స్వాధీనం చేసుకున్న ఆభరణాలను బాధితులకు అందజేస్తామన్నారు. కేసు ఛేదనలోని సిబ్బందికి క్యాష్ రివార్డులను అందజేస్తామన్నారు. సమావేశంలో ఎస్ఐ శ్రీకాంత్, సిబ్బంది తదితరులు ఉన్నారు. -
రమణీయం.. చంద్రమౌలీశ్వరుడి రథోత్సవం
మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ సమీపంలోని కోటకదిరలో శుక్రవారం సద్గురు చంద్రమౌలీశ్వర పురుషోత్తమానంద సరస్వతి స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివా రి సప్తాహ ఆరాధన మహోత్సవాల్లో భాగంగా పవిత్ర కార్యక్రమాన్ని కనులపండువగా నిర్వహించారు. రకరకాల పూలతో రథాన్ని శోభయమానంగా అలంకరించారు. స్వామివారి రథాన్ని లాగ డానికి భక్తులు పోటీపడ్డారు. రథానికి అడుగడుగునా భక్తులు పూజలు చేసి స్వాగతం పలికారు. రథంపై స్వామివారు ఊరేగుతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. రథోత్సవ అనంతరం స్వామివారి పల్లకీసేవను నిర్వహించారు. స్వామివారిని ముడా చైర్మ న్ లక్ష్మణ్యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూ టీ మేయర్ సురేందర్రెడ్డి ఆలయ ధర్మకర్త శ్రీధర్శర్మ, పలువురు నాయకులు స్వామివారిని దర్శించుకుని తరించారు. -
చేనేత ఉత్పత్తులకు ప్రోత్సాహం: కలెక్టర్
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: చేనేత రంగ అభివృద్ధికి, నేత కార్మికులకు జిల్లా యంత్రాంగం అన్ని విధాలా సహకారం అందిస్తుందని కలెక్టర్ ఖుష్బూగుప్తా అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. చేనేత వస్త్రం తయారీలో నేత కార్మికుల శ్రమ, నైపుణ్యం, అంకితభావం దాగి ఉంటాయన్నారు. చేతితో నేసిన ప్రతి వస్త్రాని కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందన్నారు. గద్వాల, నారాయణపేట చేనేత ఉత్పత్తులు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా నేత కార్మికులకు గరిష్ట ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. మహబూబ్నగర్ మినీ శిల్పారామంలో స్థానిక చేనేత ఉత్పత్తుల విక్రయ స్టాళ్ల ఏర్పాటుకు ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. ఆసక్తి కలిగిన చేనే త కార్మికులు జిల్లా హ్యాండ్లూమ్ అధికారుల వద్ద పేర్లు నమోదు చేసుకోవా లని సూచించారు. ప్రభు త్వ కార్యక్రమాల్లో చేనేత ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాల కోసం ఉచితంగా స్టాళ్లు ఏర్పాటు చేయిస్తామన్నారు. జిల్లాకు వచ్చే విశిష్ట అతిథులకు అందించే బహుమతులు, శాలువాలు స్థానిక చేనేత కార్మికుల నుంచే కొనుగోలు చేయాలని నిర్ణయించామన్నారు. చేనేతల సమస్య లు, సూచనలు తెలుసుకునేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామన్నారు. అవసరమైతే గ్రామాల్లో పర్యటించి వారితో ప్రత్యక్షంగా మాట్లాడతామన్నారు. అనంతరం కలెక్టరేట్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాల స్టాళ్లను ఆమె పరిశీలించారు. అలాగే పదోతరగతి విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రతిభ చూపిన వారికి బహుమతులు, సర్టిఫికెట్లు అందించారు. అంతకుముందు మెయిన్ గేట్ నుంచి లోపలి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఉత్తమ చేత కార్మికులను సన్మానించారు. శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ సాయి శివాని, డీఆర్ఓ నిర్మల, జిల్లా హ్యాండ్లూమ్ అభివృద్ధి అధికారి రాజేష్ పాల్గొన్నారు. -
9, 10 తేదీల్లో రాష్ట్రస్థాయి సదస్సు
స్టేషన్ మహబూబ్నగర్: తెలంగాణ సాహితీ దిగ్గజం ఆచార్య పాకాల యశోదారెడ్డి జయంతి సందర్భంగా జిల్లాకేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ పాలమూరు ఆధ్వర్యంలో ఈనెల 9, 10 తేదీల్లో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు రావూరి వనజ, జి.శాంతారెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆచార్య పాకాల యశోదారెడ్డి సమగ్ర సాహిత్యం సమాలోచనం రెండురోజులపాటు రాష్ట్రస్థాయి సదస్సు ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామోజు బాలాచారి, విశ్రాంత ఆచార్యులు దేవారెడ్డి విజయలక్ష్మి, పాకాల లక్ష్మీరెడ్డి, ఓయూ తెలుగుశాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య మసన చెన్నప్ప, ఆచార్య పిల్లలమర్రి రాములు, ఆచార్య పులికొండ సుబ్బాచారి, నాళేశ్వరం శంకరం, ఇతర సాహితీవేత్తలు హాజరుకానున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులు నిరంతర విద్యార్థి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: హెచ్ఎంలు, ఉపాధ్యాయులకు జిల్లా కేంద్రంలోని మాడల్ బేసిక్ పాఠశాలలో నిర్వహిస్తున్న శిక్షణ కేంద్రాన్ని ఆర్జేడీ సోమిరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యా యులు నిరంతర విద్యార్థిగా ఉంటూ కొత్త విషయాలను తెలుసుకుని విద్యార్థులకు బోధించాలని సూచించారు. శిక్షణలో తెలుసుకున్న అంశాలను తప్పకుండా తరగతి గదిలో అమలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎంఓ దుంకుడు శ్రీనివాస్, పాల్గొన్నారు. ఎన్ఎంఎంఎస్ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్కు 8వ తరగతి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని డీఈఓ విజయకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 24వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని, నవంబర్ 11న అర్హత పరీక్ష ఉంటుదని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం పాఠశాలల హెచ్ఎంలను సంప్రదించాలని సూచించారు. -
ఆవిష్కరణలే అభివృద్ధికి మూలం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: దేశం అభివృద్ధి చెందాలంటే విద్య, యువత చేసే ఆవిష్కరణలే మూలం అవుతాయని రాష్ట్ర పర్యాటక, ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం పీయూ ఆధ్వర్యంలో కన్హా శాంతివనంలో నిర్వహించిన విజన్–2047 ‘ఇంటిగ్రేషన్ సైన్స్, ఇన్నోవేషన్, అండ్ యూత్ ఎంపవర్మెంట్’ అనే అంశంపై నిర్వహించిన జాతీయ సెమినార్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విజన్–2047 లక్ష్యాలు చేరుకోవాలంటే ముఖ్యంగా దేశంలో శాసీ్త్రయ పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణలు, కృత్రి మేధస్సు, డేటాసైన్స్, బయోటెక్నాలజీ, సెమీ కండక్టర్లు, పునరుత్పదాక ఇంధన, అంతరిక్ష రంగంలో స్వయం సమృద్ధి సాధించనప్పుడే అనుకున్న లక్ష్యాలను నెరవేరుతాయన్నారు. ముఖ్యంగా వ్యవసాయ ప్రగతి, ప్రాంతీయ సమతుల్యత, సామాజిక సమగ్రత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతోందని వెల్లడించారు. ముఖ్యగా సమాజంలో కార్పొరేట్ వైపు ప్రజలు మెగ్గు చూపడం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని, విద్య, వైద్యం కోసం రూ.లక్షలు వెచ్చిస్తున్నారని, దీని వల్ల రాష్ట్రంలో నూటికి 95 శాతం మంది అప్పుల్లో కూరుకుపోయారన్నారు. పరువు, హంగు ఆర్బాటాల కోసం పెద్దఎత్తున వేడుకలు చేస్తుండటం వల్ల మరిన్ని అప్పులు పెరుగుతున్నాయన్నారు. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి కళాకారుల ఆధ్వర్యంలో సోషల్ మీడియా తదితర మాధ్యమాల ద్వారా ప్రజలను చైతన్యం చేసేందుకు చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. అభివృద్ధి పథంలో నడిపిస్తాం.. పీయూ వీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ యూనివర్సిటీని అభివృద్ధి పథంలో నడిపించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. పీయూలో ఐదు క్యాంపస్ కళాశాలలు, ఐదు హాస్టళ్లు ఉన్నాయని, వీటిలో వివిధ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యంగా ఉమ్మడి జిల్లా విద్యార్థులకు సాంకేతిక విద్య అందించేందుకు లా, ఇంజినీరింగ్ కళాశాలలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అలాగే అధునాతన ల్యాబ్లు, లైబ్రరీలు, ఆడిటోరియం వంటి సదుపాయాలు కల్పించామన్నారు. 170 ఎకరాల విస్తీర్ణంలోని క్యాంపస్లో పచ్చని చెట్లతో విద్యార్థులకు ఆహ్లాదకర వాతారణం అందుతుందని చెప్పారు. అలాగే గద్వాల, వనపర్తి, కొల్లాపూర్ పీజీ సెంటర్లలోనూ విద్యార్థులకు పలు కోర్సుల్లో విద్య అందిస్తున్నామని, వారికి తరగతి గదులు, బాల, బాలికలకు ప్రత్యేక హాస్టల్ సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. పలు సెషన్స్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ సైంటిస్టులు, ప్రొఫెసర్లు తమ ప్రసంగాలను వినిపించారు. సాంస్కృతిక, స్టాళ్ల ప్రదర్శనలు జాతీయ సెమినార్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక నృత్యాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. అలాగే వివిధ కంపెనీలు, స్టార్టప్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్ల ప్రదర్శన కార్యక్రమానికి హైలెట్గా నిలవగా మంత్రి జూపల్లి స్టాళ్లు సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ అల్తాఫ్ హుస్సేన్, వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ వీసీ సూర్య ధనంజయ, గుల్బర్గా యూనివర్సిటీ వీసీ శశికాంత్ ఉడేకార్, పీయూ రిజిస్ట్రార్ రమేష్బాబు, కన్వీనర్లు మధుసూదన్రెడ్డి, ప్రవీణ, కుమరస్వామి తదితరులు పాల్గొన్నారు. పీయూ ఆధ్వర్యంలో కన్హా శాంతివనంలో ఉత్సాహంగా జాతీయ సెమినార్ ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావు, పలు యూనివర్సిటీల వీసీలు సామాజిక మార్పుతోనే విజన్–2047 సాధ్యమన్న మంత్రి పీయూను అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి: వీసీ శ్రీనివాస్ ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు, అభివృద్ధి పథకాల స్టాళ్లు -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
మరికల్: ద్విచక్రవాహనా లు ఒకదానికొకటి ఢీకొనడంతో ఒకరు మృతి చెంది న ఘటన బుధవారం అర్ధ రాత్రి మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని తీలేర్కు చెందిన బొ డి ఆశప్ప (46) బైక్పై దేవరకద్ర నుంచి తీలేర్కు వస్తున్న క్రమంలో ముందు వెళ్తున్న బైక్ను వేగంగా ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అటుగా వెళ్లేవారు గమనించి చికిత్స నిమిత్తం అంబులైన్స్లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండడంతో పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రమాదంపై మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్చార్జి ఎస్ఐ గాయిత్రి తెలిపారు. సిలిండర్ లీకేజీ మహిళకు తీవ్ర గాయాలు పాన్గల్: ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ లీక్ అయ్యి మహిళకు తీవ్ర గాయాలైన ఘటన గురువారం మండలంలోని చిక్కేపల్లిలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన వార్డు స భ్యురాలు రేణుక ఉదయం ఇంట్లో వంట చేసేందుకు స్టవ్ ఆన్ చేయగా ఒక్కసారిగా సిలిండర్ రెగ్యూలేటర్ నుంచి మంటలు చెలరేగి చీరకు అంటుకుంది. దీంతో మహిళ ముఖం, చేతులు, శరీరానికి తీవ్రగాయాలయ్యాయి. పక్క గదిలో ఉన్న కుటుంబ సభ్యులు వెంటనే గమనించి 108 అంబులెన్స్కు సమాచారం అందించి అంబులెన్స్లో జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించా రు. ప్రమాదంలో ఇంట్లో ఉన్న సామాగ్రి, బీరు వా కాలిపోగా, ఇంటి గోడలు నెర్రలు ఇచ్చా యి. విషయం తెలుసుకున్న తహసీల్దార్ కార్తీక్ రావు, ఎస్ఐ కుర్మయ్య గ్రామానికి చేరుకొని ప్రమాదంపై ఆరా తీశారు. కుటుంబసభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు. బైక్ అదుపుతప్పి.. జేసీబీ ఆపరేటర్ మృతి గోపాల్పేట:పని ముగించుకుని ఇంటికి వస్తుండగా వరాహం అడ్డువచ్చి ద్విచక్రవాహనం అదుపుతప్పి జేసీబీ ఆపరేటర్ మృతి చెందిన ఘటన జ యన్న తిర్మలాపూర్ గ్రా మ సమీపంలో బుధ వారం రాత్రి చోటు చేసుకున్నది. ఎస్సై శశిధర్ తెలిపిన వివరాల మేరకు.. తిర్మలాపూర్ గ్రామానికి చెందిన మండ్ల ఆంజనేయులు వనపర్తిలో జేసీబీ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి తన ద్విచక్రవాహనంపై తొమ్మిదిన్నర ప్రాంతంలో సొంతగ్రామానికి వెళ్తున్నాడు. తిర్మలాపూర్ సమీపంలోని సబ్స్టేషన్ వద్ద వరాహం అడ్డుగా రావడంతో ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడిపోయి తీవ్ర గాయాలపాలయ్యాడు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. మృతుడి భార్య యాదమ్మ గురువారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శశిధర్ తెలిపారు. మద్యం మత్తులో పర్యాటకుల దాష్టీకం ● టూరిజం సిబ్బందిపై దాడి కొల్లాపూర్ రూరల్: మండలంలోని సోమశి ల సందర్శనకు వచ్చిన పలువురు పర్యాటకులు టూరిజం సిబ్బందిపై అకారణంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఎస్ఐ ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం.. షాద్నగర్, ఆమనగల్, వనపర్తి ప్రాంతాలకు చెందిన అశోక్, సందీప్, అక్షయ, సంధ్యతో పాటు ఓ మైనర్ ఒకే కారులో మంగళవారం అర్ధరాత్రి సోమశిల సందర్శనకు వచ్చారు. ఈ క్రమంలో వీఐపీ ఘాట్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతూ మద్యం తాగారు. అక్కడ సెక్యూరిటీగా ఉన్న బాలస్వామి, శివకుమార్, దేవరాజు వారిని ఇక్కడ మద్యం తాగొద్దని మందలించారు. దీంతో తాగిన మైకంలో ఐదుగురు పర్యాటకులు దేవరాజుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. మిగతా సిబ్బంది గమనించి బాధితుడిని కొల్లాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం నాగర్కర్నూల్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. సిబ్బంది బాలస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై జిల్లా పర్యాటక శాఖ అధికారి నరసింహ్మ స్పందించారు. పర్యాటక శాఖ ఉద్యోగులపై టూరిస్టులు భౌతికంగా దాడులు చేస్తే సంహించమన్నారు. సోమశిలలో సిబ్బందిపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. -
భళా.. వగ్గు శ్రీరామ్..
● నేతన్నకు వెన్నెముకగా.. ● మగ్గం పనిలో కొత్త పరికరం తయారు ● జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన ఐఐహెచ్టీ విద్యార్థి ఆవిష్కరణ నేత పనిలో తన తల్లిదండ్రులు పడుతున్న కష్టం వగ్గు శ్రీరామ్ను నూతన ఆవిష్కరణ వైపు అడుగులు వేయించింది. మగ్గం కార్మికులకు వెన్నునొప్పి దూరం చేసేందుకు తయారు చేసిన పరికరం నేడు దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. దేశవ్యాప్తంగా 2,500 పైచిలుకు ఆవిష్కరణలు పోటీకి రాగా.. అమరచింత కుర్రాడు చేసిన యంత్రం మొదటి స్థానంలో నిలిచింది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని వగ్గు శ్రీరామ్పై ప్రత్యేక కథనం.. అమరచింత: పట్టణానికి చెందిన వగ్గు శ్రీరామ్ పుట్టి పెరిగింది చేనేత కుటుంబంలోనే. తన చిన్నతనం నుంచి తల్లిదండ్రులు మగ్గంపై కూర్చొని బాధలు ప డుతూ చీరలు తయారు చేస్తున్న పరిస్థితులను కళ్లారా చూశాడు. పదో తరగతి అనంతరం హైదరాబాద్లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యండ్లూ మ్ టెక్నాలజీలో డిప్లామా కోర్సులో చేరాడు. అక్క డే తన గైడ్తో పాటు సొంత తమ్ముడిలా ఆదరించిన పల్లె సృజన ఆర్గనైజర్ నూకల అఖిల ప్రోత్సాహంతో నేతన్నకు వెన్నులో నొప్పి కలగకుండా సులువుగా పని చేసుకునే విధంగా పరికరాన్ని రూపొందించాడు. వీటిని తన ఇనిస్టిట్యూట్ ద్వారా ఈ నెల 1న ఢిల్లీలో జరిగిన సెమినార్లో ప్రదర్శించాడు. అన్ని రాష్ట్రాల నుంచి 2,500 పైగా ఆవిష్కరణలు రాగా.. శ్రీరాం రూపొందించిన ఆవిష్కరణ అందరిని ఆకట్టుకుంది. ఎంపికై న 100 ఆవిష్కరణలో శ్రీరాం ఆవిష్కరణకు మొదటి బహుమతి లభించింది. దీంతో ఈ నెల 7న జరిగే జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ఢిల్లీలో అవార్డును అందుకోనున్నారు. తమ ఇనిస్టిట్యూట్కు చెందిన ఫైనల్ ఇయర్ విద్యార్థి వగ్గు శ్రీరామ్ దేశస్థాయిలో ప్రతిభ చూపడంపై అధ్యాపక బృందం హర్షం వ్యక్తం చేశారు. అమరచింత బిడ్డకు అరుదైన పురస్కారం.. వనపర్తి జిల్లా అమరచింత పట్టణానికి చెందిన వగ్గు రవి, సంధ్య దంపతులకు వగ్గు శ్రీరామ్ రెండో కుమారుడు. పదో తరగతి వరకు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్న శ్రీరామ్ హ్యండ్లూమ్లో డిప్లామా కోర్సు చేయాడానికి హైదరాబాద్లోని ఇనిస్టిట్యూట్లో చేరాడు. చేనేత రంగంలో కార్మికులకు ఉపయోగపడే విధంగా ఒక కొత్త ఆవిష్కరణతో ముందుకు రావాలనే తపనతో ఉన్న శ్రీరామ్కు అఖిల గైడ్గా వ్యవహరిస్తూ ప్రోత్సహించడంతో అనుకున్నది సాధించగలిగాడు. దీంతో పుట్టిన అమరచింతకు జాతీయ స్థాయిలో పేరును తీసుకురాగలిగాడు. -
చెడుగుడు ఆడేస్తున్నారు..!
● కబడ్డీలో ‘పాలమూరు’ ప్రతిభ ● రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో రాణిస్తున్న క్రీడాకారులు ● భారత్ జట్టు తరఫున ఆడడమే లక్ష్యం నిరంతర ప్రాక్టీస్ జిల్లాలోని చిన్నచింత కుంట మండలం పర్దిపూర్కు చెం దిన కె.భవాని నాలుగేళ్ల నుంచి కబడ్డీ ఆడుతోంది. జట్టు లో ఆల్రౌండర్గా ప్రతిభ కనబరుస్తోంది. ఇప్పటివరకు ఆరు రాష్ట్రస్థాయి టోర్నీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించింది. 2025లో హిమాచల్ప్రదేశ్లో జరిగిన అండర్–19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో తెలంగాణ జట్టు తరఫున ఆడింది. కబడ్డీలో మెరుగైన ప్రదర్శన కనబరిచి భవిష్యత్లో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించమే తన లక్ష్యం అంటోంది భవాని. పది రాష్ట్రస్థాయి పోటీల్లో మౌనిక జిల్లాలోని రాజాపూర్కు చెందిన జె.మౌనిక మూడేళ్ల నుంచి కబడ్డీలో ప్రతిభ కనబరుస్తోంది. పది రాష్ట్రస్థాయి అంతర్జిల్లా కబడ్డీ పోటీల్లో జిల్లాకు ప్రాతినిధ్యం వహించింది. గత ఏడాది హిమాచల్ప్రదేశ్లో జరిగిన అండర్–19 ఎస్జీఎఫ్ జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణ జట్టు తరపున ఆడింది. ప్రతి రోజు కబడ్డీ ప్రాక్టిస్ చేస్తున్న, రానున్న రోజుల్లో జూనియర్, సీనియర్ నేషనల్ పోటీల్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తానంటోంది మౌనిక. -
కేంద్రంలో ప్రజానుకూల మార్పు రావాలి
ఉండవెల్లి: దేఽశంలో ప్రజలకు మేలు జరగాలంటే.. కేంద్రంలో ప్రజానుకూల మార్పు రావాల్సిన అవసరం ఉందని సీపీఐ జాతీయ నాయకురాలు సురవరం విజయలక్ష్మి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక, కార్పోరేట్ అనుకూల మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పాదయాత్రలో భాగంగా.. కంచుపాడులో జెండాఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిత్యావసర వస్తువులు రోజురోజుకు ఆకాశానంటుతుండడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ధరల పెరుగుదలను వెంటనే నియంత్రించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1న సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించే చల్లో ఢిల్లీ కార్యక్రమానికి కార్మిక, రైతు, ఉద్యోగ, నిరుద్యోగులు, ప్రజలు అధి కంగా హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సోషల్ మీడియా ఇన్చార్జి సురవరం కపిల్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, నాయకులు రవి, నాగార్జున, రంగన్న, ఆశన్న, భరత్, ప్రవీణ్ పాల్గొన్నారు. -
నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు
● రూ.68 వేల నకిలీ నోట్లు స్వాధీనం ● ఏడుగురు నిందితులు అరెస్టు, ఒకరు పరారీ ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాస్ కందనూలు: బిజినేపల్లి మండలంలో నకిలీ నోట్ల ముఠాను పోలీసులు గురువారం పట్టుకున్నారు. బిజినేపల్లి పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 1న మంగనూర్ గ్రామంలోని కనకదుర్గ వైన్స్లో ఒక వ్యక్తి మద్యం కొనడానికి వచ్చి రెండు రూ.500 నోట్లు ఇచ్చాడు. క్యాషియర్ ఆ నోట్లను మిషిన్లో వేసి కౌంటింగ్ చేస్తుండగా అవి నకిలీవని తేలాయి. వైన్స్ షాపు నిర్వాహకుడు రాగి స్వామి బిజినేపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా గురువారం సీఐ అశోక్రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది మంగనూరులో బొల్ల కురుమూర్తి ఇంట్లో దాడులు చేయగా.. ఏడుగురు వ్యక్తులు నకిలీ నోట్లు ము ద్రిస్తూ దొరికిపోయారు. ఏ1 కలిదిండి నాగరాజు (సిద్ధాపురం, పశ్చిమగోదావరి), ఏ2 శివవెంకటధర్మరాజు (కలువపూడి, పశ్చిమగోదావరి), ఏ3 అశోక్కుమార్ (సిద్ధాపురం, పశ్చిమగోదావరి), ఏ4 ఎల్.ఎన్ సతీష్కుమార్ (తడికలపూడి, ఏలూరు), ఏ5 వంగా నవీన్గౌడ్ (మంగనూర్, బిజినేపల్లి), ఏ6 బొల్ల కురుమూర్తి (మంగనూరు, బిజినేపల్లి), ఏ7 పృథ్వీరాజ్ (చింతలపూడి, ఏ లూరు), ఏ8 జయమంగళ సత్యనారా యణ (కై క లూరు, కృష్ణ జిల్లా), ఏ8 పరారీలో ఉన్నారు. నిందితులు 8 మంది కలిసి కలర్ జిరా క్స్ యంత్రాల ద్వారా రూ.2 లక్షల విలువైన నకి లీ నోట్లను ముద్రించారు. నకిలీ నోట్లను స్థానిక దాబాలు, పెట్రోల్ బంక్లు, కిరాణాషాపుల్లో చలామణి చే శారు. నిందితుల నుంచి రూ. 68 వేల విలువ గ ల నకిలీ రూ.500 నోట్లు, 7 మొబై ల్ ఫోన్లు, ఒక కలర్ జిరాక్స్ మిషన్, కౌంటింగ్ మిషన్, ప్రింట్ చేసిన నకిలీ పేపర్లు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ వెల్లడించారు. నకిలీ నో ట్ల తయారీ, చెలామణికి సంబంధించిన ఎలాంటి సమాచారం ఉ న్నా పోలీసులకు సమాచారం అందించాలని కో రారు. సమావేశంలో ఎస్ఐ ఎస్కే శంషోద్దీన్, సిబ్బంది భీముడు, ప్రవీణ్, రమేష్, శివ ఉన్నారు. -
ఎత్తిపోతల పథకాలకు కొనసాగుతున్న నీటి విడుదల
ధరూరు/ఆత్మకూర్: ఎగువన కురిసిన భారీ వర్షాల తో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండడంతో ఎత్తిపోతల పథకాలకు నీటి విడుదల కొనసాగుతుంది. ప్రాజెక్టులు 2.20 లక్షల క్యూ సెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. 28 గేట్లు ఎత్తి 1,88,606, విద్యుదుత్పత్తి ద్వారా 28,156 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ఇక కోయిల్ సాగర్కు 630 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 44 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 830 క్యూసెక్కులు, కుడి కాలువకు 600 క్యూసెక్కులు, సమాంతర కాలువకు 425 క్యూసెక్కులు,భీమా లిఫ్టు–1కు 1,300 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–2కు 872 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 2,21,558 క్యూసెక్కుల ఔట్ఫ్లో ఉంది. మరోవైపు ఎగువ జూరాలకేంద్రంలో మాత్రమే విద్యుదుత్పత్తి చేపట్టారు. ఆరు యూనిట్ల ద్వారా 234 మెగావాట్ల విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటివరకు 54.962 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని విజయవంతంగా చేపట్టామన్నారు. -
పాలమూరులో గంజాయి కలకలం
● యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మహబూబ్నగర్ క్రైం: పాలమూరులో గంజాయి కలకలం రేపింది. గంజాయికి బానిస అయిన యువకుడిని పోలీసులు పట్టుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. దీనికి సబంధించిన వివరాలను టూటౌన్ పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ ఇజాజుద్దీన్ వెల్లడించారు. టూటౌన్ ఎస్ఐ శివ నాగేశ్వర్ బృందం సివిల్ దుస్తుల్లో ఉదయం సంజన్నగర్ ఏరియాలో తనిఖీలు చేపట్టారు. దేవరకద్రకు చెందిన యువకుడు బోయ కరుణాకర్ గంజాయి తాగినట్లు గుర్తించారు. నిందితుడు బోయ కరుణాకర్ అలియాస్ రాజు ఆటో డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. ఆరు నెలల నుంచి హైదరాబాద్ దూల్పేట ఏరియాలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి గంజాయి కొనుగోలు చేసి మహబూబ్నగర్కు తీసుకువచ్చి తాగుతున్నట్లు తేలిందని వివరించారు. డ్రగ్ టెస్టింగ్ కిట్ ద్వారా పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చిందని పేర్కొన్నారు. ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో ఎస్ఐ, కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు. గంజాయి విక్రేత అరెస్ట్ కొత్తకోట రూరల్: మండలంలోని కానాయపల్లి గ్రా మ శివారులో భీమా ఫేజ్–2 కాల్వసమీపంలో గంజాయి విక్రయిస్తున్న వనపర్తి పట్టణానికి చెందిన బంగారు భరత్ కుమార్(39)ను, గంజాయి కొనుగోలు చేస్తున్న కానాయపల్లి గ్రామానికి చెందిన జనుంపల్లి పవన్ (25), ఇనుపునూరి గణేష్ (25)లను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం కొత్తకోట సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ రాంబాబు వివరాలు వెల్లడించారు. నిందితుల నుంచి సుమారు రూ.1,500 విలువ చేసే 7 గ్రాముల గంజాయి, రెండు ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకునట్లు తెలిపారు. వారిని న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, జ్యుడీషియల్ రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. ఎస్ఐ ఎం.విక్రమ్, ఏఎస్ఐ వెంకటేశ్వర్రెడ్డి, ఇతర పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
మక్తల్లో అక్రమ దుకాణాల తొలగింపు
మక్తల్: పట్టణంలోని జాతీయ రహదారికి సమీపంలో అక్రమంగా ఏర్పాటు చేసుకున్న దుకాణాలను అధికారులు గురువారం తొలగించారు. కొందరు తప్పుడు ధ్రువపత్రాలతో రూ. కోట్లు విలువ చేసే భూమిని ఆక్రమించుకొని దుకాణాలు వేసుకునేందుకు అద్దెకు ఇచ్చారు. ఈక్రమంలో తహసీల్దార్ సతీశ్కుమార్, మున్సిపల్ కమిషనర్ రాజయ్య, ఎస్ఐ రాజు ఆధ్వర్యంలో రోడ్డుకు ఇరువైపులా అక్రమంగా ఏర్పాటు చేసుకున్న డబ్బాలను జేసీబీతో తొలగించే చర్యలు చేపట్టారు. దీంతో కొందరు తాము పట్టా సర్టిఫికెట్లు తీసుకున్నట్లు చెప్పి వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొనడంతో ఎస్ఐ రాజు రంగప్రవేశం చేసి దుకాణాదారులను అక్కడి నుంచి పంపించి వేశారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకుంటే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ హెచ్చరించారు. -
పీయూ లా కళాశాలలో ప్రవేశాలు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఇటీవలి జరిగిన లా సెట్లో ర్యాంకులు పొందిన విద్యార్థులకు పీయూ లా కళాశాలలో చేరేందుకు అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు పలువురు విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ భూమయ్య మాట్లాడుతూ ప్రవేశాల కోసం వచ్చే విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో రావాలని, టీసీ, బోనోఫైడ్, కులం, ఆదాయం, ఆధార్, పాస్పోర్టు సైజ్ ఫొటోలతో రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆడిట్ సెల్ కోఆర్డినేటర్ రవికుమార్, సిద్దరామగౌడ్, సాయిప్రసాద్, కిరష్, జగదీష్ పాల్గొన్నారు. రాష్ట్ర సంఘంలో ఉమ్మడి జిల్లా అర్చకులకు చోటు స్టేషన్ మహబూబ్నగర్: తెలంగాణ రాష్ట్ర ధూ ప, దీప నైవేద్య వీరశైవ జంగమ అర్చక సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీలో ఉమ్మడి మహ బూబ్నగర్ జిల్లాకు చెందిన పలువురు అర్చకులకు చోటు లభించింది. భువనగిరి జిల్లా కొలనుపాకలో జరిగిన మహాసభలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా మడపతి బుచ్చిలింగం, రాష్ట్ర సహాయ కార్యదర్శిగా మల్లేష్స్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సురేష్కుమార్ శాసీ్త్ర ఎన్నికయ్యారు. అదే విధంగా కార్యవర్గ సభ్యులుగా బాలలింగయ్య, చక్రిస్వామి, శ్రీకాంత్, పరమేశ్వరయ్య, నాగరాజు స్వామి, సునీల్ స్వామి, విశ్వనాథ్ స్వామిలకు అవకాశం కల్పించారు. -
సత్తా చాటుతున్న హేమంత్
జడ్చర్ల మండలం నాగసాలకు చెందిన హేమంత్యాదవ్ కబడ్డీలో ప్రతిభ చాటుతున్నాడు. నాలుగుసార్లు రాష్ట్రస్థాయి అంతర్జిల్లా కబడ్డీ పోటీల్లో జిల్లా తరపున ఆడాడు. ఈ ఏడాది జనవరిలో విజయవాడలో జరిగిన జూనియర్ నేషనల్ కబడ్డీ పోటీల్లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించాడు. గత ఏడాది హైదరాబాద్లో జరిగిన యువ తెలంగాణ కబడ్డీ చాంపియన్షిప్లో పాల్గొని రజత పతకం సాధించాడు. పాలమూరు యూనివర్సిటీ తరపున ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ పోటీల్లో పాల్గొన్నాడు. భవిష్యత్తులో ప్రోకబడ్డీ లీగ్కు ఎంపిక కావడం కోసం నిరంతరం కబడ్డీ ప్రాక్టీస్ చేస్తున్నానని అంటున్నాడు హేమంత్ యాదవ్. -
రైస్మిల్లులో విజిలెన్స్ అధికారుల తనిఖీలు
నవాబుపేట: మండలంలోని తీగలపల్లి సమీప రైస్మిల్లులో గురువారం విజిలెన్స్, ఎన్పోర్సుమెంట్ బృందం తనిఖీలు చేపట్టింది. రైస్మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేసిన బృందం వడ్ల బస్తాల ధాన్యం నిల్వలపై ఆరాతీశారు. గతంలో మిల్లులో నిల్వ ఉంచిన బస్తాలపై ఆరాతీసి వివరాలు సేకరించారు. మూడేళ్ల క్రితం మిల్లులో వడ్ల బస్తాలు నిల్వ ఉంచారు. కాగా, వాటి నిర్వహణకు ప్రభుత్వం నెలకు డబ్బులు చెల్లించాల్సి ఉంది. వాటి విషయంలో ఎటూ తేల్చకపోవడంతో వడ్ల బస్తాలు ఎండా, వానకు బయటనే ఉంచాల్సి వచ్చింది. కాగా, నిల్వ ఉన్న బస్తాల విషయంలో మిల్లర్లకు ప్రభుత్వానికి మధ్య మెంటేనెన్స్ విషయంలో ఒప్పందం కుదరలేదు. దీంతో నిల్వ ఉంచిన వడ్ల బస్తాల విషయం వెలుగుచూసింది. వాటి నిర్వహణ కొలిక్కి రాకపోవడంతో కోట్ల రూపాయలు వృథాగా పోయే పరిస్థితి వచ్చింది. దీంతోనే విజిలెన్స్ బృందాలు తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. కాగా, మండలంలోని తీగలపల్లి మిల్లులో చేపట్టిన తనిఖీల సందర్భంగా బస్తాల తూకం విషయం సైతం వెలుగు చూసిందని, రైతులు ఇష్టానుసారంగా బస్తాలు తీసుకొచ్చినట్లు తేలింది. పైగా కొనుగోలు కేంద్రాల వారు తూకాలు సరిగ్గా చేయకుండానే రైతుల ధాన్యం మిల్లులకు పంపిన విషయం వెలుగు చూసింది. తనిఖీ సందర్భంగా రైతులతో తీసుకున్న ధాన్యం నిల్వలు సరిగ్గానే ఉన్నాయని, మూడేళ్ల కిందట తీసుకున్న ధాన్యం బస్తాల నిర్వహణలో ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే సమస్యలు వచ్చినట్లు మిల్లు యజమాని అభిప్రాయం వ్యక్తం చేశాడు. తనిఖీలో ఎన్ఫోర్స్మెంట్ డీఎస్ఓ శ్రీనివాసులు, రాజశేఖర్శర్మ, విజిలెన్స్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐ గణేష్, రవి, దీపిక, మమత, సురేష్ పాల్గొన్నారు. -
భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి
● లబ్ధిదారులకు పరిహారం వెంటనేచెల్లించాలి: కలెక్టర్ ఖుష్బూగుప్తా జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలో చేపడుతున్న భారత్మాల జాతీయ రహదారులు, రైల్వేలైన్ల డబ్లింగ్, టీజీఐఐసీ బ్రహ్మోస్ మిస్సైల్ పరిశ్రమ, ఎంజీకేఎల్ఐ, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలు తదితర ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. ఇప్పటిదాకా సేకరించిన భూమికి సంబంధించిన పరిహారం చెల్లింపులను లబ్ధిదారుల ఖాతాల్లో వేగవంతం చేయాలన్నారు. వివాదాస్పద భూములకు సంబంధించిన అంశాలను వెంటనే పరిష్కరించి చెల్లింపులు పూర్తిచేయాలని చెప్పారు. రైల్వేలైన్ డబ్లింగ్కు సంబంధించిన భూసేకరణలో అవార్డులు, విచారణలు, పెండింగ్ భూసేకరణకు సంబంధించిన ప్రక్రియలను నిర్ధిష్ట గడువులో పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రజల అభ్యంతరాలున్న ప్రాంతాల్లో స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసి సమావేశాలు నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని సూచించారు.ముందుగా ప్రభుత్వ భూమిని సర్వే చేసి, ఎలాంటి ఆక్రమణలు లేని సుమారు 63 ఎకరాలను అడ్వాన్స్ పొజీషన్ ద్వారా వెంటనే అప్పగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్ ఫైళ్ల పరిష్కారంలో జాప్యం వద్దు కలెక్టరేట్లో పెండింగ్లో ఉన్న ఫైళ్లు, ప్రజావాణి దరఖాస్తులు, ఆర్టీఐ దరఖాస్తులు, కోర్టు కేసుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం ఉండరాదని కలెక్టర్ ఖుష్బూగుప్తా ఆదేశించారు. కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, ఇతర కార్యాలయ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ప్రతి ఉద్యోగి తనకు అప్పగించిన బాధ్యతలను నిబంధనలకు అనుగుణంగా పూర్తి బాధ్యతతో నిర్వర్తించాలని సూచించారు. ఫైళ్లను పరిశీలించే సమయంలో సంబంధిత చట్టాలు, ఉత్తర్వులు, న్యాయస్థానాల తీర్పులు, నిబంధనలను పూర్తిగా అధ్యయనం చేసి స్పష్టమైన అభిప్రాయంతో ఫైల్ను సమర్పించాలన్నారు. ఉద్యోగులు కార్యాలయం పనివేళల్లో సమయపాలన పాటించాలని, బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని స్పష్టం చేశారు. పాత దరఖాస్తులు పెండింగ్లో ఉండగా కొత్త ఫైళ్లను ముందుగా పరిష్కరించడం సరికాదని, ముందుగా వచ్చినవాటికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న ఫైళ్లను స్వయంగా గుర్తించి పరిష్కారానికి చొరవ చూపే ఉద్యోగులను తాను గమనిస్తున్నానని తెలిపారు. కలెక్టరేట్కు ఉద్యోగులే వెన్నెముక అని, వారు సమర్థవంతంగా పనిచేస్తేనే కార్యాలయానికి మంచిపేరు వస్తుందని పేర్కొన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ హరిప్రియ, భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రామ్రెడ్డి, డీఆర్ఓ నిర్మల, ఆర్డీఓ నవీన్, తదితరులు పాల్గొన్నారు. -
సూది మందులు సైతం..
ఆస్పత్రిలో ఆడ్మిట్ అయిన రోగులకు అత్యవసరమైన ఇంజక్షన్లు ఉండటం లేదు. పాముకాటు విరుగుడు కంటే ముందు ఇచ్చే ఇంజక్షన్లతో పాటు ఫిట్స్ వచ్చిన సందర్భంలో ఇచ్చేవి, అలర్జీకి సంబంధించినవి ఇలా అతి ముఖ్యమైనవి కూడా ఉండకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఆస్పత్రి నిర్వహణలో అత్యంత కీలకమైన సిరంజీలు జనరల్ ఆస్పత్రిలో అందుబాటులో ఉండటం లేదు. కేవలం 10ఎంఎల్ సిరంజీలు తక్కువ స్టాక్తో సర్దుబాటు చేస్తున్నారు. రోగులకు 2 ఎంఎల్, 5 ఎంఎల్ సిరంజీలు కీలకం కాగా, కొన్ని రోజుల నుంచి సరఫరా కావడం లేదు. దీంతో పాటు ఒక ఎంఎల్ సిరంజీలు కూడా స్టాక్ లేవు. అత్యవసరమైన రోగులు మెడికల్ దుకాణాల్లో కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. -
ఏఐపీ హబ్గా వనపర్తి ఐటీఐ
● రూ.240 కోట్లతో నాలుగు ఐటీఐలు అనుసంధానం ● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం.. ప్రారంభమైన టెండర్ ప్రక్రియ వనపర్తి: సంస్థానాధీశుల కాలం నుంచే విద్యకు తొలి ప్రాధాన్యం ఇచ్చే వనపర్తికి విద్యాపర్తిగా పేరొచ్చింది. తాజాగా వనపర్తి ఐటీఐని ఏఐపీ (అడ్వాన్స్డ్ ఇండస్ట్రియల్ పార్ట్నర్) హబ్గా ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ(ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం) క్లస్టర్–8లో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా ఆమోదం లభించింది. రూ.240 కోట్లతో ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. 1953లోనే వనపర్తిలో పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుతో సాంకేతిక విద్య, ఉన్నత విద్యకు నిలయంగా మారింది. మరోసారి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చొరవతో వనపర్తి ఐటీఐకి గద్వాల, మహబూబ్నగర్ బాలికలు, డిండి, మన్ననూరు ఐటీఐలను అనుసంధానం చేస్తూ ఏఐపీ హబ్గా ఏర్పాటు చేసేందుకు డీపీఆర్ సిద్ధం చేసి కేంద్రానికి పంపించగా ఆమోదం లభించింది. త్వరలోనే టెండర్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో ఉన్నతవిద్యతో పాటు పారిశ్రామిక విద్యలోనూ రాష్ట్రంలోనే జిల్లా ముందు వరుసలో నిలవనుంది. రాష్ట్రంలోని ప్రముఖ నైపుణ్య శిక్షణకేంద్రాల్లో వనపర్తి ఒకటిగా మారనుంది. ఈ ప్రాజెక్టుతో వనపర్తి ఐటీఐలో అత్యాధునిక ల్యాబ్లు, ఆధునిక యంత్రాలు, డిజిటల్ తరగతి గదులు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రోబోటిక్స్, ఆటోమేషన్, ఎలక్ట్రానిక్స్, ఏఐ తదితర కోర్సులు, అధునాతన మిషన్ల తయారీ వంటి కొత్త కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఇక్కడి నుంచే ఉద్యోగ అవకాశాలు.. ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యంతో ఇక్కడ సాంకేతిక విద్యాబోధన అందిస్తారు. వారి అవసరాలకు అనుగుణంగా హబ్ పరిధిలోని విద్యార్థులను తీర్చిదిద్దుకొని కోర్సు పూర్తి చేయకముందే ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. క్యాంపస్ నియామకాలకు వనపర్తి వేదిక కానుంది. దీంతోపాటు పరిశ్రమలతో ప్రత్యక్ష అనుసంధానం ద్వారా విద్యార్థులకు అప్రెంటిస్షిప్లు, మెరుగైన ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఎంపికయ్యే పరిశ్రమ భాగస్వామి కంపెనీలు ప్రభుత్వం కలిసి ఐదేళ్లపాటు క్లస్టర్ను నిర్వహిస్తూ మౌలిక వసతులను అభివృద్ధి చేయడంతో పాటు శిక్షణ నాణ్యతను పెంచి పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యంతో కూడిన యువతను తీర్చిదిద్దనున్నారు. -
ఆదరణ తగ్గలేదు..
గద్వాల జరీ, పట్టు చీరలకు ఘనమైన చరిత్ర ఉంది. ఈ చీరలకు ఇప్పటికీ ఆదరణ తగ్గలేదు. జిల్లాలో వేలాది కుటుంబాలు చేనేత వృత్తిలో ఉన్నాయి. కాలానుగుణంగా ఇక్కడి కార్మికులు చీరలను వివిధ రకాల డిజైన్లలో నేస్తున్నారు. రంగుల ఎంపికల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వ్యాపారులు పవర్లూం చీరలకు బదులుగా హ్యండ్లూమ్ చీరలకు ప్రాధాన్యం ఇవ్వాలి. – మేడం రామకృష్ణ, తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇష్టంగా నేస్తాం గద్వాల చీరలకు ప్రత్యేకత ఉంది. అది ఎప్పటికీ పోరాదన్న ఉద్దేశంతో చాలా ఇష్టంగా చీరలు నేస్తాం. చూడగానే ఇది గద్వాల చీర అని చెప్పేలా ఇక్కడి చీరలు ఉంటాయి. ఇప్పటి మహిళలు నచ్చే, మెచ్చే విధంగా పలు డిజైన్లతో చీరలు రూపొందిస్తున్నాం. నిత్యం వివిధ ప్రాంతాల నుంచి చీరల కొనుగోలుకు వస్తుంటారు. – గోరంట్ల నాగలక్ష్మీ, చేనేత కార్మికురాలు, గద్వాల -
మహబూబ్నగర్
జిల్లా జనరల్ ఆస్పత్రిలో మందుల కొరత సంప్రదాయానికి నవ్యకళవాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. చెడుగుడు ఆడేస్తున్నారు..! గ్రామీణ క్రీడ కబడ్డీలో రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాలమూరు క్రీడాకారులు ప్రతిభ చాటుతున్నారు. శుక్రవారం శ్రీ 7 శ్రీ ఆగస్టు శ్రీ 2026–8లో uనేడు, రేపు పీయూ జాతీయ సదస్సు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూ ఆధ్వర్యంలో గురువారం షాద్నగర్ సమీపంలోని కన్హా శాంతివనంలో జాతీయసదస్సు ప్రారంభం కానుంది. ఈమేరకు శాంతివనంలో అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. రెండురోజులు నిర్వహించనున్న ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల నుంచి వీసీలు, రిజిస్ట్రార్లు, ఇతర ప్రముఖులు మొత్తం 600 మంది అతిథులుగా హాజరుకానున్నారు. మొదటి రోజు ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. దీనికి ముఖ్య అతిథిగా మంత్రి దామోదర రాజనరసింహ హాజరుకాన్నారు. ముగింపు వేడుకలకు కేంద్రమంత్రి కిషన్రెడ్డి రానున్నారు. కాగా.. రెండోరోజు ఉదయం 10 గంటలకు పీయూకు ఉషా, మేరు ప్రతినిధులు రానున్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించాలి మహబూబ్నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో క్రీడాకారులు ప్రతిభ కనబరిచి పతకాలు సాధించాలని అథ్లెటిక్స్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శరత్చంద్ర సూచించారు. హన్మకొండలో శుక్రవారం, శనివారాల్లో జరిగే తెలంగాణ రాష్ట్రస్థాయి అంతర్ జిల్లా అండర్–6, 8, 10, 12 ఏళ్ల బాలబాలికలు, కిడ్స్, జాతీయ జావెలిన్ డే సందర్భంగా అండర్–14, 16, 18, 20 బాలబాలికలు, పురుషుల, మహిళల జావెలిన్త్రో పోటీల్లో పాల్గొనే క్రీడాకారులను అభినందించారు. కోచ్లు ఆనంద్, సునీల్కుమార్, సభ్యులు శ్రీనివాసులు, దత్తాత్రేయ పాల్గొన్నారు. స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహిద్దాం మహబూబ్నగర్ క్రైం: స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించే జిల్లా పరేడ్ గ్రౌండ్ను గురువారం కలెక్టర్ ఖుష్బూగుప్తా, ఎస్పీ డి.జానకి పరిశీలించారు. పరేడ్ గ్రౌండ్లో వేయాల్సిన టెంట్లు, వీఐపీ సీట్టింగ్, ప్రధాన వేదిక, అధికారులు, ప్రజాప్రతినిధుల సీట్టింగ్ ఏర్పాట్లు, పరేడ్ నిర్వహణ విధానం, శకటాల ప్రదర్శన, స్టాల్స్ ఏర్పాటుపై చర్చించారు. ఈసారి మరింత మరింత మెరుగైన ఏర్పాట్లు చేయాలని, వర్షం నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి కలెక్టర్ సూచించారు. ఆర్డీఓ నవీన్, కమిషనర్ రామానుజులరెడ్డి పాల్గొన్నారు. ఉద్యోగుల పెండింగ్ సమస్యలు పరిష్కరిచాలి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఉద్యోగుల పెండింగ్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్ రాజీవ్రెడ్డి కోరారు. గురువారం కలెక్టర్ ఖుష్బూగుప్తాకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు వివిధస్థాయిలో ఉద్యోగుల ప్రమోషన్ల లెక్క తేల్చి వెంటనే అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వాలని కోరారు. కారుణ్య నియమకాల గు రించి చాలా మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని వెంటనే వాటిని పరిష్కరించాలన్నారు. మెడికల్ గ్రౌండ్ కింది స్వచ్ఛంద పదవి విరమణ తీసుకునే ఫైళ్లను వెంటనే క్లియర్ చేయాలని కోరారు. అన్ని సమస్యలను త్వరితగతిన పరిష్కరించే విధంగా కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. అడిషనల్ కలెక్టర్ హరిప్రియ, టీఎన్జీఓ జిల్లా కార్యదర్శి చంద్రనాయక్, అసోసియేట్ అధ్యక్షుడు శ్యాంసుందర్రెడ్డి, దేవేందర్, కృష్ణమోహన్ పాల్గొన్నారు. నేటి నుంచి రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ టోర్నీ వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలోని కేడీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో శుక్రవారం నుంచి రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు ఉమ్మడి మహబూబ్గర్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పి.మన్మోహన్రావు, వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఈ పోటీలు ఈ నెల 9 వరకు కొనసాగుతాయని.. ఈ పోటీల్లో ఇదివరకు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో పాల్గొన్న క్రీడాకారులు సైతం పాల్గొంటారని పేర్కొన్నారు. ఐదు రాస్తే.. జనరల్ మెడిసిన్ కేంద్రం వద్ద వేచి ఉన్న రోగులు రెండే ఇస్తారు!ఇక్కడ కనిపిస్తున్న అతడి పేరు రమేశ్. అతడు చర్మ సమస్యలతో జిల్లా జనరల్ ఆస్పత్రికి వచ్చారు. ఓపీ తీసుకుని వైద్యుడి దగ్గరికి వెళ్తే.. ఐదు రకాల మందులు, ఒక అయింట్మెంట్ రాయడం జరిగింది. వాటిలో రెండు రకాల మందులతో పాటు అయింట్మెంట్ లేదని చెప్పడంతో జనరిక్ దుకాణంలో అయిట్మెంట్, మిగతా మందులను బయట కొనుగోలు చేశారు. పాలమూరు: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు వికారాబాద్కు చెందిన పేదలకు పెద్ద దిక్కుగా ఉన్న ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. పేరుకు మాత్రం 650 పడకలతో సేవలు అందిస్తున్నారే తప్ప.. అరకొర వసతులతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా రోగులకు కావాల్సిన మందులు లేక నిత్యం అవస్థలు పడుతున్నారు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో ఆస్పత్రి రోగులతో కిటకిటలాడుతుంది. వాతావరణలో వస్తున్న మార్పుల కారణంగా జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యలతో నిత్యం ఆస్పత్రిలో 1500 నుంచి 1700 మంది వరకు వస్తున్నారు. అదేవిధంగా 150 నుంచి 200 మంది ఆడ్మిట్ అవుతున్నారు. అయితే వైద్యులు రాసే మందుల్లో కొన్ని రకాలు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. మిగతా వాటిని బయట తీసుకోవాలని సిబ్బంది సూచిస్తున్నారు. కొందరు చేసేదిలేక ప్రైవేటులో మందులను కొనుగోలు చేస్తుండగా.. నిరుపేదలు ఇచ్చిన అరకొర మందులు తీసుకొని వెళ్లిపోతున్నారు. వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన రాఘవేందర్ ముక్కులో కండ పెరగడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ సర్జరీ చేయాలని చెప్పడంతో రెండు వారాల నుంచి జిల్లా జనరల్ ఆస్పత్రికి తిరుగుతున్నాడు. ఈఎన్టీ విభాగంలో కేవలం మందులు రాసి పంపుతున్నారని.. అవి కూడా ఇక్కడ దొరకడం లేదని అతడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముక్కులో కొట్టుకోవడానికి అవసరమైన స్ప్రే, మందుల కోసం రూ.2 వేల వరకు ఖర్చవుతుందని వాపోతున్నారు. ఆస్పత్రిలో రోజువారి ఓపీలో 20 శాతం మంది గ్యాస్ట్రిక్ సమస్యతో వస్తున్నారు. సంబంధిత వైద్యుడు రాసిచ్చే మందుల కోసం కౌంటర్ వద్దకు వెళ్తే కనీసం ఒక్క రకం ట్యాబ్లెట్లు, సిరాప్లు కానీ అందుబాటులో ఉండటం లేదు. ఇక బీపీలో కేవలం రెండు రకాలు మాత్రమే ఉండగా.. అవి రోగులకు ఉపయోగకరంగా ఉండటం లేదు. బీపీ రోగుల పరిస్థితి మేరకు వైద్యులు కాంబినేషన్లో మందులు రాస్తుంటారు. అలాంటి మందులు కూడా ఆస్పత్రిలో ఉండటం లేదు. షుగర్కు సంబంధించి కేవలం రెండు రకాల ట్యాబ్లెట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇన్సూలిన్ అయితే ఇక అడుగొద్దని చెబుతున్నారు. ప్రధానంగా చర్మ వ్యాధులకు సంబంధించి ఎలాంటి ట్యాబ్లెట్లు కానీ, అయింట్మెంట్లుకానీ ఉండటం లేదు. మానసిక వైద్యానికి మందులు రాస్తే.. నేరుగా ప్రైవేటు మెడికల్ దుకాణాలకే వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కొరత లేకుండా చర్యలు.. జనరల్ ఆస్పత్రిలో కొన్ని రకాల మందులు ఉండటం లేదు. ఈ విషయంపై వారం క్రితం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో డీఎంఈ, ఇతర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. అవసరమైన మందుల కోసం ఇండెంట్ కూడా పెట్టాం. సర్జరీ సమయంలో, గర్భిణులకు ఇచ్చే వాటితో పాటు అత్యవసరమైన వాటిని బయట కొనుగోలు చేస్తున్నాం. రెగ్యులర్గా ఓపీలో ఇచ్చే ట్యాబ్లెట్స్, ఇతర డ్రగ్స్ను తీసుకోవడం లేదు. – డా.రంగా ఆజ్మీరా, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ గద్వాల చీరకు చెదరని ఆదరణ గద్వాల నేత చీరలు దేశ, విదేశి వనితల ఆదరణ పొందుతూ నేటికి ప్రత్యేకతను చాటుతుంది. రాష్ట్రంలోని ప్రధాన నగరాల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వివాహాది శుభకరార్యాల సందర్భంగా మహిళలు చీరలు కొనుగోలు చేసేందుకు ఇక్కడికే వస్తున్నారు. గద్వాల సంస్థానం ఏర్పడినప్పటి నుంచి నాలుగు శతాబ్దాలుగా కాలానుగుణంగా ప్రత్యేకత ఉండేలా ఆధునిక సాంకేతికతను జోడిస్తూ ఇక్కడి నేతన్నలు చీరలను సిద్ధం చేస్తున్నారు. కాటన్ చీరకు అంచు, కొంగు బార్డర్లో గద్వాల వారసత్వంగా వస్తున్న డిజైన్లను కొనసాగిస్తున్నారు. ఒక్కో చీర రూ.1,000 నుంచి రూ.2 లక్షల వరకు పలుకుతాయి. నడిగడ్డ ప్రాంతంలో దాదాపు 6 వేల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి బతుకుతున్నారు. గద్వాల జరీ చీరలకు 2008లోనే భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ పేటెంట్) లభించింది. ప్రతి ఏటా దసరా బ్రహ్మోత్సవాల్లో తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు గద్వాల నుంచే వెళతాయి. నాణ్యత, మన్నికకు కేరాఫ్ అమరచింత అమరచింతలో తయారుచేసిన చీరలను గద్వాల, హైదరాబాద్కు చెందిన మాస్టర్ వీవర్స్ కొనుగోలు చేసి.. వారివారి బ్రాండ్ పేర్లతో విక్రయిస్తున్నారు. నాణ్యతతో పాటు మన్నిక కూడా బాగుండడంతో వ్యాపారులు ప్రత్యేకంగా ఇక్కడ చీరలను తయారు చేయిస్తున్నారు. 2019లో 20 మందితో అమరచింత చేనేత ఉత్పత్తిదారుల సంఘం ప్రారంభమైంంది. దీంతో ఒక్కొక్కరుగా కార్మికులు ముందుకొచ్చి సంఘంలో సభ్యత్వం పొంది భాగస్వాములయ్యారు. ప్రస్తుతం సంఘంలో 550 మంది సభ్యులున్నారు. 2021లో 10 మగ్గాలతో ప్రారంభమైన సంఘం ప్రస్తుతం 130 మగ్గాలతో కొనసాగుతోంది. పట్టణంలోని ప్రతి కార్మికుడి ఇంటికి మగ్గం ఇవ్వడం.. వారు తయారు చేసిన చీరలు సేకరించి విక్రయించడం వంటి కార్యక్రమాలతో నిర్వహణ విజయవంతంగా కొనసాగుతోంది. మూడేళ్లలో సంఘం ద్వా రా చేనేత వస్త్రాల తయారీ, అమ్మకాలతో రూ.2.50 కోట్ల వ్యాపారం జరిగింది. ఆన్లైన్లో రాజోళి చీరలు సాధారణ నూలుతో పట్టుచీరలు నేసే చేనేత కార్మికులకు రాజోళి పుట్టినిల్లుగా ప్రసిద్ధి చెందింది. మీనా టర్నింగ్, కోటకొమ్మ, పైతాన్, కుట్టు, బ్రోకెచ్ లాంటి చీరు ఇక్కడ తయారు చేస్తారు. ముఖ్యంగా మీనా టర్నింగ్ చీర ఒక రంగులో ఉంటే.. దానిపై వచ్చే పక్షి బొమ్మలు మరో రంగులో ఉంటాయి. పక్షి కన్ను మరో రంగులో ఉండేలా డిజైన్ చేస్తారు. ఈ చీరలకు ఆన్లైన్లో మంచి గిరాకీ ఉంటుంది. ఖాళీగా 194 పోస్టులు.. జనరల్ ఆస్పత్రిలోని 22 విభాగాల్లో మొత్తం 340 పోస్టులకు గాను ప్రస్తుతం 138 మంది విధుల్లో ఉన్నారు. 194 పోస్టులు ఖాళీ ఉండటంతో రోగులకు మెరుగైన సేవలు అందడం లేదు. ఇటీవల 15 మంది బదిలీ కాగా.. 12 మంది మాత్రమే విధుల్లో చేరారు. ఇక టెక్నీకల్ విభాగంతో పాటు నర్సింగ్, ఫార్మసిస్ట్, రేడియోగ్రాఫర్ విభాగాల్లో ఖాళీల కొరత వేధిస్తోంది. దీనికి తోడు ఉన్న వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించకపోవడం, కొందరు నిత్యం హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించడం కూడా సమస్యగా మారింది. గ్యాస్ట్రిక్, బీపీ, షుగర్, చర్మ సమస్యలకు బయటి మందులే దిక్కు ఇంజక్షన్లు సైతం లేక రోగుల అవస్థలు ఇప్పటికే వైద్యుల కొరత..ఉన్నవారు సైతం సమయానికి రారు పర్యవేక్షణ కరువు.. పట్టించుకోని ఉన్నతాధికారులు కాలానుగుణంగా ప్రత్యేకత చాటుతున్న ‘చేనేత’ కార్మికులు సాధారణ నూలుతోనే అద్భుతమైన డిజైన్ల సృష్టి చూడగానే ఆకర్షించేలా విభిన్నమైన చీరలు నేయడంలో దిట్ట తిరుమల శ్రీనివాసుడికి ఎరువాడ పంచె అందిస్తున్న గద్వాల చేనేతలు సంప్రదాయానికి ఆధునికత జోడిస్తూ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ కసరత్తు
● ఇన్చార్జి మంత్రితో ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, నాయకుల సమావేశం స్టేషన్ మహబూబ్నగర్: వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్నగర్ పట్టభద్రులఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. ఈ స్థానాన్ని ౖహస్తగతం చేసుకునేలా ఆ పార్టీ సన్నద్ధమవుతోంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హై దరాబాద్లోని తన నివాసంలో బుధవారం ఉమ్మడి జిల్లా అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జీలు, డీసీసీ అధ్యక్షులతో సమావేశమయ్యారు. మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి (కల్వకుర్తి), డాక్టర్ వంశీకృష్ణ (అచ్చంపేట), వీర్లపల్లి శంకర్, (షాద్నగర్), ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్, డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ (మహబూబ్నగర్), రాజీవ్రెడ్డి (గద్వాల), ప్రశాంత్రెడ్డి (నారాయణే పట)లు సమావేశంలో పాల్గొ న్నారు. సమావేశంలో ప్రజా ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై, త్వరలో ఖాళీ అవుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థి ఎంపికపై, అలాగే కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికలపై అనుసరించాల్సిన వ్యూహా లపై విస్తృతంగా చర్చించారు. ఏఐసీసీ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను సేకరించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ కోరారు. ఉమ్మడి జిల్లాలోని ఆశావాహుల వివరాలు, ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన పేర్లను పీసీసీకి పంపించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. -
చెంచుల హక్కు
మౌలిక వసతులు పొందడం ● అధికారులు సమన్వయంతో పనిచేయాలి సమస్యలను సత్వరమే పరిష్కరించాలి ● రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ మన్ననూర్: సగటు మనిషి జీవించేందుకు అవసరమైన మౌలిక అవసరాలు ఆదివాసి చెంచు గిరిజనులకు సమకూర్చాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ షమీమ్ అక్తర్ అన్నారు. మానవ హక్కుల పరిరక్షణ చట్టం–1995 ప్రధాన లక్ష్యాలైన మానవ హక్కుల పరిరక్షణ, ప్రోత్సాహం, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ సేవలు సమర్థవంతంగా అందుతున్నాయో లేదో ప్రత్యక్షంగా పరిశీలించే ఉద్దేశంతో ఆయన బుధవారం నాగర్కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలో పర్యటించారు.శ్రీశైలం టీజీజెన్న్కో కృష్ణవేణి అతిథి గృహంలో ఆయనకు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఆర్.కోటాజీ ఇతర అధికారులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అమ్రాబాద్ ప్రాంతంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు, గిరిజనుల సంక్షేమం, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల గురించి ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అమ్రాబాద్లోని ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాల, శ్రీశైలం డ్యామ్, దోమలపెంట గ్రామాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. తదుపరి వటవర్లపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగులు, వైద్యులు, సిబ్బందితో మాట్లాడి వైద్యసేవల నాణ్యత, మందుల లభ్యత, మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. ● అనంతరం మన్ననూరు కుగ్రామం మల్లాపూర్ పెంట గిరిజన ప్రాంతాన్ని సందర్శించి గిరిజనులతో ప్రత్యక్షంగా మమేకమై వారి జీవన పరిస్థితులు, విద్య, ఆరోగ్యం, ఉపాధి, తాగునీరు, సంక్షేమ పథకాల అమలు, ఇతర మానవ హక్కుల సమస్యలను తెలుసుకున్నారు. గిరిజనుల హక్కుల పరిరక్షణతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా.. సత్వరమే పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ సందర్భంగా చెంచుపెంటలోని ప్రజలు, మహిళలతో ఇష్టాగోష్టిగా మాట్లాడి పెంటలో చెంచులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆరా తీశారు. చెంచు మహిళ మౌనిక మాట్లాడుతూ.. పెంటలో కనీస సౌకర్యాలు, తాగునీటి సమస్య వేధిస్తోందన్నారు. సారవంతమైన వ్యవసాయ భూములు ఉన్నప్పటికీ సేద్యం చేసుకునేందుకు ప్రోత్సాహం లేదన్నారు. గ్రామానికి మొత్తంగా కలుపుకొని ఒక ట్రాక్టర్తో పాటు ఒక్కో కుటుంబానికి రెండు ఎద్దులు ఇచ్చినట్లైతే వ్యవసాయం చేసుకొని జీవిస్తామని విజ్ఞప్తి చేశారు. పెంటకు వచ్చి పోయేందుకు సరైన రహదారి లేకపోవడంతో అత్యవసర సమయాల్లో 108 అంబులెన్స్ రావడం కూడా కష్టంగా ఉందని చెంచులు వాపోయారు. ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం హెల్త్ సెంటర్, అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని విన్నవించారు. చెంచుల సమస్యలు విన్న షమీమ్ అక్తర్ పరిష్కారం దిశగా నిర్ణయాలు తీసుకునేందుకు సంబంధిత అధికారులతో చర్చిస్తామన్నారు. పెంటలో సెర్ప్, అంబుల్బీ స్వచ్ఛంద సంస్థ వారు అందజేసిన తేనెటీగల పెంపకం (బాక్సులు) యూనిట్లను పరిశీలించారు. ఆయన వెంట డీఎస్పీ పల్లె శ్రీనివాస్, ఐటీడీఏ ఇన్చార్జి పీఓ, ఆర్డీఓ యాదగిరి, డీఈఓ రమేష్, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి కోటయ్య, వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.కృష్ణ, డీటీడీఓ కోటాజీ, ఏఓ జాఫర్ హుస్సేన్, అమ్రాబాద్ తహసీల్దార్ వెంకటేశ్వర్రెడ్డి, సీఐ చంద్రయ్య, ఎఫ్ఆర్ఓ సవిత, సర్పంచ్ మంజుల రాజారాం, ఉప సర్పంచ్ రమణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
రాయపల్లి శివారులో జార్ఖండ్ వాసి ఆత్మహత్య
రాజాపూర్: పనిచేసే చోటే వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం రాజాపూర్ మండల పరిధిలోని రంయపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే జార్ఖండ్ రాష్ట్రం చంద్రపురబుకారో జిల్లా ధావాతండ్ పరభాని గ్రామానికి చెందిన తులసి రాజ్వార్ (35) రాయపల్లి శివారులోగల అక్షయకల్ప అనే పరిశ్రమలో గల డ్రైవర్గా పనిచేసేవాడు. అయితే బుధవారం ఇంటి తలుపులు ఎంతకీ తెరవకపోవడంతో పాటు క్యాంటీన్లో టిఫిన్కు రాకపోవడంతో అనుమానం వచ్చిన తోటి కార్మికులు తలుపులు గట్టిగా తోయడంతో తెరుచుకున్నాయి. అప్పటికే పైకప్పు రాడ్కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఏఎస్ఐ లక్ష్మయ్య వివరాలు సేకరించి మృతదేహాన్ని కిందకు దించారు. అయితే రాజ్వార్ మంగళవారం రాత్రి మృతి చెందిన విషయాన్ని పరిశ్రమ యాజమాన్యం కప్పి పుచ్చడంతో పాటు గ్రామ సర్పంచ్ గాయిత్రి మల్లేష్గౌడ్, ఉపసర్పంచ్ ప్రవీన్గౌడ్తో పాటు గ్రామస్తులు పరిశ్రమ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత మృతదేహాన్ని పరిశ్రమ గేటుముందు ఉంచి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీసుల జోక్యంతో మృతదేహాన్ని జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని వారు వచ్చి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యప్తు జరుపుతామని ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. -
పెండింగ్లో 15 నెలల వేతనాలు
ఆపరేటర్ల ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఏటా మార్చి, ఏప్రిల్ నెలలో రెన్యువల్ చేసేవారు. అయితే ఈ ఏడాది అలా చేయలేదని ఆపరేటర్లు వాపోతున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లగా దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పైగా తమకు 15 నెలల నుంచి వేతనాలు సైతం ఇవ్వడం లేదని పేర్కొంటున్నారు. అన్యాయం చేయొద్దు ఏడేళ్లుగా పనిచేస్తున్న ఆపరేటర్లకు అన్యాయం చేయవద్దు. మా ఉద్యోగ భద్రత కల్పించాలి. అన్యాయంగా తొలిగించి కుటుంబాలను రోడ్డు పాలు చేయవద్దని ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. మొదట 300 మందిని తొలిగిస్తామని చెప్పి ఇప్పుడు అందరినీ తొలిగించే కుట్ర చేస్తుంది. వెంటనే తమకు పెండింగ్లో ఉన్న 15 నెలల వేతనాలు ఇవ్వాలి. – రాంబాబు, భూ భారతి ఆపరేటర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు, నాగర్కర్నూల్ ● -
పే స్కేల్ అమలు చేసేదాక పోరాటం
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): వీబీజీ రాంజీ (ఉపాధి హామీ) ఉద్యోగులకు పే స్కేల్ను అమలు చేసేదాక పోరాటం చేస్తామని వీబీ జీ రాంజీ, ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్ ఆవరణలో జేఏసీ ఆధ్వర్యంలో రాం జీ ఉద్యోగులు ప్లకార్డులు ప్రదర్శించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీబీ జీ రాంజీ ఉద్యోగులకు ఈ నెల 15లోగా పే స్కేల్ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీచేయాలని, రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని, పెండింగ్లో ఉన్న మూడు నెలల జీతాలు విడుదల చేయాలని, ఎస్ఆర్డీఎస్ బోర్డు సమావేశంలో ఆమోదించిన అన్ని నిర్ణయాలను తక్షణమే అమలు చేయాలని, సెలవు దినాల్లో పనిచేస్తున్న వారికి ప్రయోజనాలు కల్పించాలని, సీఆర్డీ కార్యాలయంలోని ఫైనాన్స్, హెచ్ఆర్ వింగ్ మధ్య సమన్వయ లోపాలను నివారించి వేతనా ల విడుదలలో జాప్యాన్ని శాశ్వతంగా పరిష్కరించాలని, క్యాడర్ స్ట్రెంత్ ఖరారు చేసి పదోన్న తులు, బదిలీలు, కెరీర్ అడ్వాన్స్మెంట్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండి వైఖరీ వీడకుంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డీఆర్డీఓ నర్సింహులుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జేఏసీ కోచైర్మన్ విజయ్భాస్కర్, జిల్లా జేఏసీ ప్రచార కార్యదర్శి అస్గర్ అలీ, లక్ష్మీనారాయణ, శాంతికుమార్, హరిచంద్రుడు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
సైబర్ చోరీలు రెట్టింపు
మహబూబ్నగర్ క్రైం: ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ఫోన్, బ్యాంకు ఖాతాలు ఉండటం వల్ల సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో ప్రజలను లక్ష్యంగా చేసుకొని నేరాలకు పాల్పడుతున్నారని ఎస్పీ జానకి అన్నారు. సైబర్ జాగృక్తా దివస్ కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఎస్వీఎస్ మెడికల్ కళాశాలలో వైద్య విద్యార్థులకు నిర్వహించిన సైబర్ అవగాహన కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో సాధారణ దొంగతనాల కంటే సైబర్ మోసాల వల్ల నష్టపోతున్న వారి సంఖ్య అధికంగా ఉందన్నారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులు, బంధువులకు అవగాహన కల్పించాలని చెప్పారు. సోషల్ మీడియా, స్టాక్ మార్కెట్, ట్రేడింగ్ యాప్, కొరియర్ ఫ్రాడ్, లోన్ యాప్, ఆన్లైన్ జాబ్ఫ్రాడ్, డిజిటల్ అరెస్టులు ఇలా అనేక రూపాల్లో జరిగే సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వాడాలన్నారు. అనంతరం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రూపొందించిన సైబర్ భద్రత అవగాహన వీడియోలను ప్రదర్శించి.. సైబర్ వాల్పోస్టర్లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో సైబర్ క్రైం డీఎస్పీ గిరికుమార్, ఎస్వీఎస్ ప్రిన్సిపల్ జోషి, సీఐలు గాంధీనాయక్, రాజేందర్రెడ్డి, కృష్ణ, ఎస్ఐలు విజయ్కుమార్, శ్రావణ్కుమార్, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. ప్రీ ప్రైమరీలో ఆటలు, కథలకు ప్రాధాన్యం: డీఈఓ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రీ ప్రైమరీలో బోధన కోసం ఆటలు, కథలకు ప్రాధాన్యం ఇవ్వాలని డీఈఓ విజయకుమారి అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని డైట్ కళాశాలలో ఇటీవల విధుల్లో చేరిన 113 మంది ప్రీ ప్రైమరీ టీచర్లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. చిన్నారులకు బాల్యదశలో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రీ ప్రైమరీ విద్యను ప్రారంభించిందని, ప్లే బేస్ లెర్నింగ్, యాక్టివిటీ బేస్ లెర్నింగ్ విధానాలను నేర్పించాలన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను కేవలం శిక్షణలోనే కాకుండా తరగతి గదిలో విద్యార్థులకు కూడా నేర్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. చదువుతో ఒత్తిడి లేకుండా తప్పకుండా కథలు, పాటలు, సంభాషన, చర్యలు, చిత్రాల వంటివి విద్యార్థులకు నేర్పించాలన్నారు. కార్యక్రమంలో ఏఎంఓ శ్రీనివాస్, డైట్ ప్రిన్సిపల్ మేరాజుల్లాఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
భూ భారతి ఆపరేటర్లకు మంగళం?
నాగర్కర్నూల్/ జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): తహసీల్దార్ కార్యాలయాల్లో భూ రిజిస్ట్రేషన్ ఆపరేటర్లుగా పనిచేస్తున్న వారికి ప్రభుత్వం ఉద్వాసన పలకనుందా.. వారి స్థానంలో జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ఉద్యోగులను నియమించనున్నారా.. అన్న అనుమానాలకు ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. అవుననే అనిపిస్తున్నాయి. బుధవారం ఏకంగా కలెక్టరేట్లలో జిల్లాలోని జూనియర్ అసిస్టెంట్లకు రిజిస్ట్రేషన్ విధానంపై ఒకరోజు శిక్షణ ఇచ్చారు. నాగర్కర్నూల్లో స్వయంగా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ పాల్గొని సూచనలు, సలహాలు ఇవ్వగా.. ఇతర అధికారులు రిజిస్ట్రేషన్ చేసే విధానంపై అవగాహన కల్పించారు. దీంతో ప్రస్తుతం పనిచేస్తున్న ఆపరేటర్ల స్థానంలో వీరిని నియమించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు స్పష్టమవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 632 మంది.. గత ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకువచ్చి తహసీల్దార్ కార్యాలయంలో భూముల రిజిస్ట్రేషన్ చేయాలని 2018లో నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ ఆపరేటర్లుగా ఔట్సోర్సింగ్ ద్వారా తీసుకోవాలని నిర్ణయించారు. ఈ–సెన్ట్రిక్ సంస్థ ద్వారా ఆపరేటర్లు 2018 మే 23న విధుల్లో చేరారు. రాష్ట్రవ్యాప్తంగా 632 మంది ఆపరేటర్లను చేర్చుకోగా.. వీరిని ప్రతి ఏటా మార్చి, ఏప్రిల్ మధ్యలో రెన్యువల్ చేసేవారు. ముందుగా రూ.11 వేల వేతనం ఇవ్వగా ఆ తర్వాత రూ.13 వేలకు పెంచారు. గత ప్రభుత్వంలో చివర్లో నెలవారి వేతనం రూ.21,500 పెంచుతామని హామీ ఇచ్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆపరేటర్లను టీజీటీఎస్ కింద తీసుకొని.. నెలకు రూ.21,500 వేతనం ఇస్తున్నారు. అయితే ఇది నెలవారిగా ఇవ్వకుండా మూ డు, ఆరునెలలకు ఒకసారి విడుదల చేస్తున్నారు. రెండు రోజులుగా ఆందోళన భూ భారతి ఆపరేటర్ల స్థానంలో జూనియర్ అసిస్టెంట్లను నియమిస్తున్నారని అనుమానంతో గత రెండు రోజుల నుంచి ఆపరేటర్లు ఆందోళన బాటపట్టారు. సోమవారం ఆర్డీఓ కార్యాలయాల ఎదుట నిరసన వ్యక్తం చేసి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. మంగళవారం రాష్ట్రంలోని ఆపరేటర్లందరూ హైదరాబాద్లోని గాంధీభవన్కు వెళ్లి నిరసన చేపట్టి తమగోడు వినిపించారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు వీహెచ్, జగ్గారెడ్డిని సైతం కలిసి తమకు న్యాయం చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్ వేతనాలు ఇవ్వాలని విన్నవించారు. వీరి స్థానంలో జూనియర్ అసిస్టెంట్ల నియామకం ఇప్పటికే కలెక్టర్ల పర్యవేక్షణలో ప్రత్యేక శిక్షణ ఆందోళనలో ఔట్సోర్సింగ్ ఆపరేటర్లు.. 15 నెలల వేతనాలు పెండింగ్ రెండు రోజులుగా నిరసన చేపడుతున్నా స్పందించని ప్రభుత్వం -
సెమినార్కు పకడ్బందీ ఏర్పాట్లు
కన్హాశాంతి వనంలో నిర్వహించే నేషనల్ సెమినార్కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రిజిస్ట్రార్ రమేష్బాబు అన్నారు. ఈ మేరకు బుధవారం పీయూలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొదటిరోజు శాంతివనంలో ప్రారంభోత్సవం జరుగుతుందని, అందుకు మహబూబ్నగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ వస్తున్నారని, ఆయనతోపాటు ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరవుతారన్నారు. రెండోరోజు పీయూలో నిర్వహించే పలు సెషన్స్లో యూనివర్సిటీల వీసీలు పాల్గొంటారని చెప్పారు. అదేరోజు ముగింపు కార్యక్రమానికి సాయంత్రం కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఎంపీలు హాజరవుతారన్నారు. సమావేశంలో కన్వీనర్లు మధుసూదన్రెడ్డి, ప్రవీణ, కుమారస్వామి, నూర్జహాన్ పాల్గొన్నారు. -
ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి
● గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి, ఎల్నినో జిల్లా ప్రత్యేకాధికారి వీపీ గౌతమ్ జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ఎల్నినో ప్రభావంతో జిల్లాలో రానున్న రోజుల్లో నీటి లభ్యత తగ్గే అవకాశం ఉన్నందున, వాతావరణ పరిస్థితులననుసరించి వర్షాధార ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలని గృహ నిర్మాణ శాఖ ఎండీ, జిల్లా ఎల్నినో ప్రత్యేకాధికారి వీపీ గౌతమ్ అన్నారు. బుధవారం కలెక్టర్ ఖుష్బూ గుప్తాతో కలిసి కలెక్టరేట్లోని వీసీ హాల్లో వ్యవసాయ, నీటిపారుదల, ఉద్యానవన, మిషన్ భగీరథ, ప్రణాళిక శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది సాధారణం కంటే 20.5 శాతం అధిక వర్షపాతం నమోదైందని, ఈసారి 11.4 శాతం స్వల్ప లోటు ఉన్నప్పటికీ సాధారణ వర్షపాత పరిస్థితులే ఉన్నాయన్నారు. కాబట్టి రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలంటే కేవలం సూచనలు సరిపోవని, విత్తనాల లభ్యత, సబ్సిడీ, మార్కెటింగ్, కొనుగోలు వంటి అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. కూరగాయల సాగు కోసం మల్చింగ్, డ్రిప్, ఇతర పథకాల కింద అందుబాటులో ఉన్న సబ్సిడీలను వివరించాలని ఆదేశించారు. పంటల వైవిధ్యీకరణను కేవలం ఉద్యాన శాఖ బాధ్యతగా కాకుండా వ్యవసాయ శాఖ ప్రధాన బాధ్యతగా భావించాలని స్పష్టం చేశారు. అలాగే వాటర్ యూజర్స్ అసోసియేషన్లు, గ్రామస్తులతో సమావేశాలు నిర్వహించి, ఈ సీజన్లో ఇరిగేషన్ నీటిని ఆశించకుండా తీర్మానాలు చేయించాలని సూచించారు. పారదర్శకత పాటించాలి డబుల్ బెడ్రూం, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో పూర్తి పారదర్శకత పాటించి నిజమైన అర్హులైన పేద కుటుంబాలకే ప్రాధాన్యం ఇవ్వాలని వీపీ గౌతమ్ అన్నారు. ఇప్పటికే పూర్తయిన డబుల్ బెడ్రూం ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు కేటాయించాలని, రెండు పథకాల లబ్ధిదారుల జాబితాలను కృత్రిమ మేధ సాయంతో సరిపోల్చి ఒకే వ్యక్తికి రెండు పథకాలు అందకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కేటాయించిన ఇళ్లలో నివశించని వారికి రద్దు చేసి.. అర్హులకు కేటాయించాలని చెప్పారు. అనంతరం ఏనుగొండలోని మౌలాలి గుట్టలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను వారు పరిశీలించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మధుసూదన్నాయక్, హరిప్రియ, డీఆర్ఓ నిర్మల, ఆర్డీఓ నవీన్, డీఏఓ గోవింద్నాయక్, ఉద్యాన వన శాఖాధికారి వేణుగోపాల్, గృహనిర్మాణ శాఖ పీడీ ఉపేందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామాంజులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చట్టం మారినా.. అవే తిప్పలు!
● హన్వాడ మండలం తిర్మలగిరి గ్రామానికి చెందిన తాటిపర్తి హన్మమ్మకు గ్రామశివారులోని సర్వే నంబర్ 541లో ఒక ఎకరా లావుణి పట్టా భూమికి పట్టా సర్టిఫికెట్ ఉంది. పట్టాదారు పాస్పుస్తకంలో నమోదు కాలేదు. సదరు భూమిలో కాస్తులోనూ ఉన్నారు. పట్టాదారు పాస్పుస్తకంలో నమోదు చేయాలని కోరుతూ ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకున్నారు. దరఖాస్తు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారు. ● హన్వాడ మండలం మాదారం గ్రామానికి చెందిన పాండు అనే రైతుకు రికార్డు ప్రకారం రెండెకరాల విస్తీర్ణం ఉండాలి. పట్టాదారు పాస్పుస్తకంలో మాత్రం ఎకరా 38 గుంటలు నమోదైంది. దీన్ని సరిచేయాలని కోరుతూ ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకున్నారు. పరిష్కారం కోసం మూడు నెలలుగా ఎదురుచూస్తున్నారు. మహబూబ్నగర్ న్యూటౌన్: భూ రికార్డులు, లావాదేవీల్లో సమూల మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం భూభారతి చట్టాన్ని అమలు చేస్తోంది. గతంలో ధరణి భూయాజమాన్య హక్కుల చట్టంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ చట్టాన్ని రూపొందించారు. భూమి యాజమాన్య హక్కుల పాస్పుస్తకాల్లో చోటు చేసుకున్న తప్పులను సరి చేసుకునేందుకు ప్రభుత్వం వివిధ స్థాయిల్లో అవకాశం కల్పించింది. కానీ భూభారతి పట్టాదారు పాస్పుస్తకాల్లో దొర్లిన తప్పులను సరిచేసుకునేందుకు భూ యజమానులు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ఒకవైపు ప్రభుత్వ భూముల విలువలు పెరగడం.. పెరిగిన విలువలకు అనుగుణంగా చలాన్లు కట్టి తప్పుల సవరణకు దరఖాస్తులు పెట్టుకొని అధికారుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి మరోవైపు. నెలలుగా పరిష్కారం కాని సమస్యలతో సతమతమవుతూ ఇచ్చిన ఫిర్యాదులే మళ్లీమళ్లీ ఇస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టరేట్.. ఇలా ఏ కార్యాలయమైనా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాల్లో స్వీకరించే ఫిర్యాదుల్లో అగ్రభాగం భూ సమస్యలపైనే ఉండటం గమనార్హం. కలెక్టర్, ఆర్డీఓ లాగిన్లో దరఖాస్తులు జిల్లావ్యాప్తంగా 17 మండలాల్లో 410 భూభారతి దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. పట్టాదారు పాస్బుక్ కరెక్షన్, పీఓబీ వంటి సమస్యలపై ఆన్లైన్లో భూ యజమానులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులన్నీ మూడునెలలుగా ఆర్డీఓ, కలెక్టర్ లాగిన్లో పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. సర్వే నంబర్, విస్తీర్ణం, మిస్సింగ్ సర్వే నంబర్, పేర్లలో తప్పులు, కులం తప్పుగా నమోదు కావడం, జెండర్ కరెక్షన్, ప్రొహిబిటెడ్ జాబితా నుంచి తొలగింపు వంటి అంశాలపై భూ యాజమానులు దరఖాస్తులు పెట్టుకున్నారు. ఈ దరఖాస్తులపై మండలస్థాయిలో విచారణలు పూర్తి చేసి ఇచ్చే నివేదిక ఆధారంగా ఆర్టీఓ స్థాయిలో, కలెక్టర్ స్థాయిలో పరిష్కరించాల్సి ఉంటుంది. మూడు నెలలుగా దరఖాస్తుల పరిష్కారం కాకపోవడంతో భూ యాజమానుల్లో ఆందోళన నెలకొంది. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిష్కరిస్తారా.. లేక తిరస్కరిస్తారా.. అన్నది ఉన్నతాధికారులే తేల్చాల్సి ఉంది.‘భూభారతి’లోనూ పెండింగ్ బాగోతం మూడు నెలలుగా పరిష్కారానికి నోచుకోని వైనం కలెక్టర్ లాగిన్లో దాదాపు 410 దరఖాస్తులు చలాన్లు కట్టినా చుక్కలే.. తప్పుల సవరణకు అష్టకష్టాలు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నభూ యాజమానులు -
చిన్నపిల్లల భద్రత ఎంతో ముఖ్యం
● జిల్లా న్యాయసేవాధికార సంస్థ జడ్జి ఇందిర మహబూబ్నగర్ మున్సిపాలిటీ: బాలబాలికల భద్రత, వారి ప్రాథమిక హక్కుల పరిరక్షణలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదని జిల్లా న్యాయసేవాధికార సంస్థ జడ్జి ఇందిర అన్నారు. స్థానిక ఎంబీహెచ్ఎస్ పాఠశాలలో కొనసాగుతున్న శ్రీఇంటిగ్రేటెడ్ ఇన్సర్వీస్ టీచర్స్ ట్రైనింగ్’ (ఉపాధ్యాయ శిక్షణ) కేంద్రాన్ని బుధవారం జిల్లా విద్యాశాఖాధికారి విజయకుమారితో కలిసి ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జడ్జి ఇందిర మాట్లాడుతూ ఉపాధ్యాయులు కేవలం పాఠ్యాంశాల బోధనకే పరిమితం కాకుండా, పిల్లల మానసిక, శారీరక భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పాఠశాల వాతావరణం ప్రతి విద్యార్థికి సురక్షితంగా ఉండాలని, బాలల హక్కుల పరిరక్షణ చట్టాలు, న్యాయపరమైన అంశాలపై ఉపాధ్యాయులకు పూర్తి అవగాహన ఉండాలని స్పష్టం చేశారు. విద్యార్థులలో ఎదురయ్యే శారీరక, మానసిక సమస్యలు లేదా వేధింపుల సంకేతాలను ఉపాధ్యాయులు ప్రారంభంలోనే గుర్తించి, వారికి తగిన ధైర్యాన్ని మరియు న్యాయపరమైన రక్షణను అందించడంలో ముందుండాలన్నారు. బాలలకు లేదా సమాజంలో అత్యంత వెనుకబడిన వర్గాలకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ద్వారా లభించే ఉచిత న్యాయ సహాయం మరియు సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఇందిర వివరించారు. డీఈఓ విజయకుమారి మాట్లాడుతూఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఉపాధ్యాయులలో బాధ్యతాయుతమైన దృక్పథాన్ని మరింత పెంపొందిస్తాయన్నారు. శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులందరూ ఈ విషయాలను పాఠశాలల్లోఅమలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఎంఓ దుంకుడు శ్రీనివాసులు, రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు. -
గొప్పతనం చాటుతాం..
పీయూ ఆధ్వర్యంలో జాతీయ సెమినార్ మొదటిరోజు కన్హా శాంతివనంలో ప్రారంభం కాగా.. రెండోరోజు పీయూలో పలు సెషన్లు నిర్వహించి.. అనంతరం సాయంత్రం ముగింపు కార్యక్రమం శాంతి వనంలోనే చేపడుతాం. పీయూకు ఈ అవకాశం రావడం గొప్ప విషయం. యూనివర్సిటీ గొప్పతనం చాటేలా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, వీసీలు హాజరుకానున్నారు. – రమేష్బాబు, రిజిస్ట్రార్, పీయూ అరుదైన అవకాశం.. పీయూకు దక్కిన అరుదైన అవకాశంతో యూనివర్సిటీ గొప్పతనం చాటేలా జాతీయ సెమినార్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. దీని ద్వారా యూనివర్సిటీకి అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. వచ్చిన అతిథులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. అందరి సహకారంతో శాంతివనం, పీయూలో నిర్వహించే కార్యక్రమాలను విజయవంతం చేస్తాం. – మధుసూదన్రెడ్డి, సెమినార్ కన్వీనర్ ● -
విద్యార్థులకు షూ పంపిణీ
● ఉమ్మడి జిల్లాలో 1.65 లక్షల మందికి ప్రయోజనం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రయోజనం కలిగే విధంగా ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి మరో కొత్త పథకం అమలుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు షూ పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీంతో షూ పంపిణీ కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఎంఈఓలు, పాఠశాలల హెచ్ఎంలు ప్రక్రియ చేపట్టాలని సూచించారు. ఇందులో భాగంగా పాఠశాలలో ఉన్న విద్యార్థులు, వారికి వచ్చే సైజులు తదితర వివరాలను సేకరించాలని చెప్పారు. ఈ పథకంతో ఉమ్మడి జిల్లాలోని 2,200 పాఠశాలల్లో 1.65 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. వీరితోపాటు 68 ఇంటర్ ప్రభుత్వ కళాశాలలు, 68 కేజీబీవీల్లో చదువుతున్న 12 వేల మంది విద్యార్థులకు మేలు జరగనుంది. జీవిత బీమా ఉద్యోగుల నిరసన స్టేషన్ మహబూబ్నగర్: జిల్లా కేంద్రంలోని ఎల్ఐసీ కార్యాలయం ఎదుట బుధవారం భోజన విరామ సమయంలో జీవిత బీమా ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ హైదరాబాద్ డివిజన్ ఉపాధ్యక్షుడు వి.రాజేశ్వర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీలో 6.5 శాతం పెట్టుబడుల ఉపసంహరణను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఎల్ఐసీలో ప్రభుత్వ వాటా 96.5శాతం కాగా ఈ ఉపసంహరణతో 90 శాతానికి పడిపోతుందన్నారు. ఉపసంహరణ ద్వారా పాలసీదారులకు, ఎల్ఐసీ సంస్థకు లేదా ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ఇలాంటి చర్యలు ప్రైవేటీకరణకు దారితీస్తాయన్నారు. ఎల్ఐసీ జాతీయికరణకు వ్యతిరేకమని, దేశాభివృద్ధికి విఘాతమన్నారు. ఈ నిరసనలో కరుణాకర్గౌడ్, సత్యనారాయణ, సాయిబాబా, నారాయణ నాయక్, ఆనందం, రాజేందర్, రోహిత్, ఇష్రాత్అలీ, నరేందర్, శ్రీనివాసులు, ఖదీర్, పర్విన్, ప్రియాన్షి తదితరులు పాల్గొన్నారు. -
సాగు సమస్యల పరిష్కారానికి ‘కాలిబాట’
అలంపూర్: వానకాలంలో వరినాట్లకు కాలిబాటతో బహుళ ప్రయోజనాలు కలుగుతాయి. విత్తనాలను వెదజల్లినా, డ్రమ్ సీడర్తో వెదపెట్టినా..! పొలంలో కాలిబాటలు తీయాలని మండల వ్యవసాయ శాఖ అధికారి నాగార్జునరెడ్డి రైతులకు సూచించారు. సాగులో ఎదురయ్యే జటిల సమస్యలకు పరిష్కారం చూపేందుకు కాలిబాట దోహదపడుతుందని పేర్కొన్నారు. కాలిబాటలు తీసే విధానం, వాటివల్ల కలిగే లాభాలను వివరించారు. కాలిబాటలో విత్తే పద్ధతి: వరినాట్లు వేసేటప్పుడు కాలిబాటలు వేయాలంటే ముందుగానే రెండు గట్ల మధ్య తాళ్లులాగి ఆ ప్రదేశాన్ని వదిలేసి మొక్కలు నాటుకోవాలి. పొలంలో విత్తనాలను వెదజల్లిన రైతులు కూడా కాలిబాటలు తీసుకోవచ్చు. విత్తనాలు చల్లి 15 నుంచి 20 రోజుల్లోగా పైరు ఎదుగుతున్న సమయంలో మొక్కలకు తొలగించి పక్కన నాటుకోవడం ద్వారా బాటలు తీయవచ్చు. ప్రతి 2 మీటర్లకు 20 సెంటీ మీటర్ల వెడల్పులో మొక్కలు తొలగించాలి. డ్రమ్ సీడర్తో విత్తనాలు వేసేటప్పుడు ఒక వరుస వేయటం పూర్తయిన తర్వాత 20 సెంటీ మీటర్ల స్థలాన్ని వదిలి మరో వరుసలో విత్తనాలు వేసుకుంటే బాటలు ఏర్పడతాయి. నాట్లు పూర్తయ్యాక: వరినాట్లు వేసిన తర్వాత పొలంలో ప్రతి రెండు మీటర్లకు 20 సెంటీ మీటర్ల వెడల్పున కాలిబాటలు వేయాలి. నాట్లు వేసిన 12 నుంచి 16 రోజుల్లో కాలిబాట తీయడం ఉత్తమం. మందపాటి తాడును చేనుకు అవతలి గట్టుకు ఒకరు, ఇవతలి గట్టుకు పట్టుకోని మరొకరు పట్టుకోని లాగాలి. ఆ తాడు చివర్లకు ఒక కట్టెను కట్టి గట్టు మీద గుచ్చాలి. ఆ తాడుకు 20 సెంటీ మీటర్ల దూరంలో సమాంతరంగా మరొక తాడును ఇదే పద్ధతిలో ఏర్పాటు చేయాలి. రెండు తాళ్ల మధ్య ఉన్న ప్రదేశంలో వచ్చిన మొక్కలను తొలగించి పైరు పలుచగా ఉన్నచోట ఆ మొక్కలను నాటుకోవచ్చు. చీడ పీడలకు చెక్: వరి దుబ్బలను ఆశించి పైరును నష్టం కలిగించే బూడిదరంగు దోమ, తెల్లదోమ, పచ్చదీపపు పురుగులను సకాలంలో గుర్తించి వెంటనే సంరక్షణ చర్యలు చేపట్టాలి. ఇందుకు ఈ బాటలు ఉపయోగకరంగా ఉంటాయి. కాలిబాటలు ఉంటే పొలం నుంచి ఎప్పటికప్పుడు మురుగును తొలగించడం సులువుగా ఉంటుంది. ఈ కారణంగా గొట్టాలపురుగు, నామపురుగు ఉధృతి తగ్గుముఖం పడుతుంది. కాలిబాటల చివర్ల పంగల కర్రలు కడితే పక్షులు వాటిపైకి చేరి హానికారక కీటకాలను తింటాయి. కాలిబాటల విధానం వలన వరిపైరుకు గాలి వెలుతురు పుష్కలంగా అందుతుంది. కిరణజన్య సంయోగక క్రియ బాగా జరుగుతుంది. మొక్కల్లో పత్ర హరితం అధికంగా ఉత్పత్తి అవుతుంది. పంటకు ఎంత నీరు అవసరమో అంత మేరకు ఎప్పటికప్పుడు బాటలు అందిస్తాయి. సాగునేలలోని సేంద్రియ పదార్థాలు త్వరగా కుళ్లడానికి కాలిబాటలు దోహదపడుతాయి. మొక్కలకు పోషకాలను అందిస్తాయి. మంచి దిగుబడులు పొందేందుకు ఇవి ముఖ్య భూమిక పోషిస్తాయి. పైరు ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. గాలి సమృద్ధిగా మొక్కకు సోకటంతో కావాల్సినంత ఆక్సిజన్ను పొందేందుకు మొక్కలకు పెద్దగా ఖర్చు కాదు. కాలిబాటల వలన కలుపు నివారణ పిచికారీలకు కూడా ఎంతో సులువు. ఎరువులను పొలమంతా సమానంగా వేయటం తేలికగా ఉంటుంది. పొలమంతా తిరిగి పైరు ఎదుగుదలను చూసుకోనే అవకాశం ఉంటుంది. -
6 యూనిట్లలో 234 మెగావాట్ల ఉత్పత్తి
శ్రీశైలం వైపు వరద నీరు గద్వాల/ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో విద్యుదుత్పత్తి తగ్గు ముఖం పట్టింది. బుధవారం ఎగువ విద్యుత్కేంద్రంలోని ఆరు యూనిట్ల ద్వారా 234 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. దిగువ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేపట్టలేదు. ఇప్పటి వరకు ఎగువలో 29.246 ఎంయూ, దిగువలో 25.716 మిలియన్ యూనిట్ల వి ద్యుదుత్పత్తిని చేశారు. ఇన్ఫ్లో రూపంలో 2,45, 000క్యూసెక్కుల వరదనీరు వచ్చిచేరుతుంది. 33 గేట్లు ఎత్తి స్పిల్వే ద్వారా 218790, విద్యుదుత్పత్తి ద్వారా 26,208 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు వదులుతున్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టుకు 750 క్యూసెక్కులు, భీమా–1కు 1300, భీమా–2కు 872 క్యూసెక్కులు, కోయిల్సాగర్కు 630 క్యూసెక్కులు, ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వకు 820 క్యూసెక్కులు, ప్రధాన కుడి కాల్వకు 675 క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 535 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. -
నెట్బాల్ హెడ్కోచ్గా పాలమూరు బిడ్డ
● క్రీడాకారుడిగా, కోచ్గా విక్రం ఆదిత్యరెడ్డి ప్రతిభ ● ఏషియన్ నెట్బాల్లో పాల్గొనే భారత మహిళా జట్టుకు కోచ్గా నియామకం మహబూబ్నగర్ క్రీడలు: తాను ఇష్టపడిన క్రీడ పట్ల ఆసక్తి కనబరుస్తూ ఒక క్రీడాకారుడిగా రాణించడంతో పాటు కోచ్గా సేవలు అందిస్తున్నారు జిల్లాలోని హన్వాడకు చెందిన విక్రమ్ ఆదిత్యరెడ్డి. ఈయన 2003లో నెట్బాల్ ప్రయాణాన్ని ప్రారంభించారు. 2004 హైదరాబాద్లో నిర్వహించిన సబ్ జూనియర్ జాతీయ చాంపియన్షిప్లో మొదటి జాతీయ టోర్నమెంట్లో పాల్గొన్నారు. అప్పటి నుంచి దాదాపు 35 జాతీయస్థాయి టోర్నమెంట్లలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించాడు. అలాగే భారత మహిళా జట్లకు పలుసార్లు అసిస్టెంట్ కోచ్గా సేవలు అందించడం విశేషం. కోచ్గా క్వాలిఫై కావడానికి సింగపూర్లో ఏషియన్ కోచింగ్ కోర్సును పూర్తి చేసి లెవల్–3 కోచ్ సర్టిఫికెట్ అందుకున్నారు. ఇప్పటివరకు నాలుగుసార్లు అంతర్జాతీయ నెట్బాల్ పోటీల్లో పాల్గొన్న భారత మహిళా జట్లకు కోచ్గా వ్యవహరించారు. 2022లో సింగపూర్లో జరిగిన ఏషియా మహిళల నెట్బాల్ చాంపియన్షిప్, 2024లో బెంగుళూర్లో జరిగిన ఆసియా నెట్బాల్ చాంపియన్షిప్లో భారత మహిళా జట్లకు కోచ్గా ఉన్నారు. అదేవిధంగా గత ఏడాది జూన్లో హాంకాంగ్లో నిర్వహించిన బౌహినియా కప్లో, దక్షిణా కొరియా జియెంజోలో జరిగిన ఏషియన్ నెట్బాల్ చాంపియన్షిప్లో కోచ్గా వ్యవహరించి జట్టును ముందుకు నడిపించారు. హాంకాంగ్లో టోర్నీలో ఇండియన్ మహిళా జట్టు మూడోస్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించింది. నెట్బాల్ క్రీడపై ఉన్న ఆసక్తితో, క్రీడను రాష్ట్రంలో క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలనే సంకల్పంతో విక్రమ్ ఆదిత్యరెడ్డి తెలంగాణ అమ్యెచూర్ నెట్బాల్ అసో సియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ● హంకాంగ్లో ఈనెల 8 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న 14వ ఏషియన్ నెట్బాల్ చాంపియన్షిప్లో పాల్గొనే భారత మహిళా జట్టుకు ఏకంగా హెడ్ కోచ్గా విక్రం ఆదిత్యరెడ్డి నియమితులయ్యా రు. భారత మహిళా జట్టుకు హెడ్ కోచ్గా ఆయన నియామకంపై అసోసియేషన్ సభ్యులు ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.విక్రం ఆదిత్యరెడ్డి నియామకం జిల్లాకు ఎంతో గర్వకారణమని, ఆయన నేతృత్వంలో భారత మహిళల జట్టు ఏషియన్ నెట్బాల్ చాంపియన్షిప్లో ప్రతిభ కనబరిచి దేశానికి పతకం తీసుకురావాలని ఆకాంక్షించారు. -
అంగన్వాడీలో డూప్లికేట్ టీచర్ లావణ్య..!
మహబూబ్ నగర్ జిల్లా: జడ్చర్ల మున్సిపాలిటీలోని నాగసాల అంగన్వాడీ కేంద్రంలో విధులు నిర్వహించాల్సిన టీచర్ స్థానంలో డూప్లికేట్ టీచర్ విధులు నిర్వహిస్తున్నారు. 9ఏళ్లుగా తంతు కొనసాగుతున్నా.. ఐసీడీఎస్ అధికారులు గుర్తించకపోగా.. సమర్ధించటం చర్చనీయాంశంగా మారింది. మంగళవారం విషయం వెలుగులోకి రావడంతో స్పందించిన సీడీపీఓ ఘటనపై విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా.. నాగసాల అంగన్వాడీ టీచర్గా జ్యోతిలక్ష్మి నియమితులైంది. తొలిరోజుల్లో విధులు పర్వాలేదనిపించినా 9ఏళ్లుగా లావణ్య అనే మరో మహిళతో విధులు చేయిస్తుంది. నెలకు రూ.6వేలు ఇచ్చి తనస్థానంలో మరో మహిళతో పనులు చేయిస్తుంది. మొదట్లో ఆయా లేదని సాకుగా.. చెబుతూ లావణ్యతో విధులు చేయించగా.. ఆయా నియమితులైన తరువాత కూడా ఒరిజినల్ టీచర్ విధులకు రాకుండా డూప్లికేట్తోనే కేంద్రం రన్ చేస్తుంది. తన స్థానంలో మరొకరిని నియమించి 20మంది చిన్నా రుల జీవితంపై చెలగాటమాడుతుంది. ఈ విష యంలో ఎవరైనా ప్రశ్నస్తే తాను పూర్తిగా తప్పుకుని లావణ్యను టీచర్గా పెట్టిస్తానంటూ సమాధానం దాటవేసేది. దీంతో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. అయితే 9ఏళ్లుగా డూప్లికేట్ టీచర్ విధులు నిర్వహిస్తున్నప్పటికీ ఐసీడీఎస్ అధికారులు, సీడీపీఓ, సూపర్వైజర్ గుర్తించకపోటం నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఇదే విషయమై ఇటీవల కొందరు సీడీపీఓకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ విచారణ చేయకపోవడం విస్మయం కలిగిస్తుంది. మంగళవారం విషయం మీడియాకు లీక్ కావడంతో సీడీపీఓ శోభారాణిని వివరణ కోరగా.. ఫిర్యాదు అందింది వాస్తవమేనని అంగీకరించారు. బుధవారం విచారణ చేస్తామని బదులిచ్చా రు. అప్పటికే సామాజిక మాధ్యమాల్లో విషయం వైరల్ కావడంతో వెంటనే నాగసాల అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి విచారణ చేపట్టారు. విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తుంది. గ్రామంలో గర్భిణులు, బాలింతలు లావణ్య విధులు నిర్వహిస్తున్న విషయాన్ని చెబుతూనే ఒరిజినల్ టీచర్ కూడా అప్పుడప్పుడు వస్తారని బదులిచ్చినట్లు తెలిసింది. అంగన్వాడీ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న లావణ్యను వివరణ కోరగా 9ఏళ్లుగా పనిచేస్తున్నానని, టీచర్ నెలకు రూ.6వేలు ఇస్తున్నారని వెల్లడించారు. ఒరిజినల్ టీచర్ జ్యోతిలక్ష్మిని వివరణ కోరగా.. ఇదేం పెద్ద తప్పని, తనకు నెలకు డబ్బులిస్తున్నానని బదులివ్వటం గమనార్హం. తాను సర్ ప్రక్రిలో బిజీగా ఉన్నానని చెప్పటం కొసమెరుపు. ఒక ప్రభుత్వ ఉద్యోగి తనస్థానంలో మరొకరిని పెట్టి విధులు చేయించిన ఘటనపై పూర్తి విచారణ చేసి ఒరిజినల్ టీచర్ను నియమించాలని గ్రామస్తులు కొందరు కోరుతున్నారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లానని చర్యలు తప్పవని సీడీపీఓ శోభారాణి తెలిపారు. -
ఎల్నినో ప్రభావం.. కంది పంట సాగే మేలు
అలంపూర్: వానకాలం పంట సాగులో కంది లాభసాటిగా ఉంటుంది. కంది జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో పంట సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కంది సాగు పెరగడానికి అవకాశం ఉంటుందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లో తట్టుకునే విధంగా ప్రభుత్వం సైతం కంది పంట సాగును ప్రోత్సహిస్తున్నారు. మిశ్రమ పంటగా.. వేరుశనగ, పెసర, సజ్జ, మొక్కజొన్న, పత్తి, అముదం పైర్లలో కంది పంటను మిశ్రమ పంటగా సాగు చేసుకోవచ్చు. ఇది రైతుకు ఎంతో అనుకూలం. ఏడాది పాటు కంది రైతుకు గిట్టుబాటు ధర లభించడానికి అవకాశం ఉంటుంది. పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువగా ఉంటుంది. విత్తన రకాలు: కందిలో మధ్య కాలిక, స్వల్పకాలిక రకాలు ఉన్నాయి. సీఓ–9, భీమా జీఆర్జీ –152, డబ్ల్యూఆర్జీఈ–93, డబ్ల్యూర్జీఈ–121 రకాలు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు టీడీఆర్జీ–59, ఎల్ఆర్జీ–133–33, డబ్లూఆర్జీ–255, ఎల్ఆర్జీ–52, పీఆర్జీ–176, ఆశ(ఐసీపీఎల్–87119) రకాలు అందుబాటులో ఉన్నాయి. నేలలు విత్తన మోతాదు.. అన్ని రకాల నేలలు అనుకూలం. చౌడు నేలలు నీరు పీల్చే పొలాలు అనుకూలం కాదు. పొలాన్ని భాగ రెండు లేదా మూడు సార్లు దున్ని మెత్తగా తయారుచేయాలి. మధ్య కాలిక రకాలు హెక్టారుకు 5 నుంచి 10 కిలోలు, స్వల్ప కాలిక రకాలు 15 నుంచి 18 కిలోలు అవసరం అవుతాయి. నాగలి సాళ్లలో కాని, గొర్రుతో గాని విత్తుకోవాలి. మధ్య కాలిక రకాలకు వరుసకు వరుసకు మధ్య దూరం 150 నుంచి 240 సెంటీమీటర్లు ఉండాలి. మొక్కకు మొక్కకు మధ్య దూరం 20 సెంటిమీటర్లు ఉండాలి. ఆగస్టు 15 వరకు ఖరీఫ్ సీజన్లో పంట సాగు చేసుకోవచ్చు. విత్తన శుద్ధి, కలుపు మందులు కిలో విత్తనానికి మూడు గ్రాముల మ్యాంకోజెట్ కలిపి విత్తన శుద్ధి చేయాలి. రైజోబియం కల్చర్ను కూడా పట్టించాలి. విత్తన శుద్ధి ద్వారా భూమి, విత్తనం ద్వార సంక్రమించే కొన్ని తెగుళ్లను నివారించుకోవచ్చు. విత్తనం వేసిన వెంటనే పెండి మిథలిన్ హెక్టారుకు 3.25 నుంచి 3.75 లీటర్ల వరకు పిచికారీ చేయాలి. 20 నుంచి 25 రోజుల తర్వాత ఇనుజాతాఫైర్ 750 ఎంఎల్ హెక్టారుక వాడాలి. 60 రోజుల వరకు పైరులో కలుపు సమస్య లేకుండా చూడాలి. ఎరువుల వాడకం.. హెక్టారుకు ఆఖరి దుక్కిలో 20 కిలోల నత్రజని, 50 కిలోల భాస్వరం నిచ్చే ఎరువులను వాడాలి. పైపాటుగా ఎరువులను వేయాల్సిన అవసరం లేదు. నీరు పెట్టడం.. పూత దశలో, కాయ ఏర్పడే దశలో కంది పంట నీటి ఎద్దడికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పూత, పిందె దశలోను తగిన స్థాయిలో నీరు పెట్టాలి. వ్యవసాయ శాఖ అధికారుల సూచన మేరకు కందిలో సస్యరక్షణ చేపట్టాలి. పాడి–పంట -
కేఎస్పీ గేట్ల దిగువన దెబ్బతిన్న కాంక్రీట్
దేవరకద్ర రూరల్: కోయిల్సాగర్ ప్రాజెక్ట్ డ్యాం గేట్ల దిగువ భాగంలో కాంక్రీట్ దెబ్బతిని భారీ గుంత ఏర్పడటం ఆందోళన కలిగిస్తోంది. గోడ దిగువ భాగంలో కాంక్రీట్ ఊడిపోవడంతో లోపలి రాళ్లు బయటకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్ట్లో సుమారు 11 అడుగుల మేర నీటి నిల్వ ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం పెరిగిన తర్వాత గేట్ల ద్వారా నీటిని విడుదలచేసే సమయంలో గేట్ల దిగువ భాగాన నీటి ఒత్తిడి పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఏర్పడిన గుంతకు వెంటనే మరమ్మతు చేయకపోతే.. అది మరింత విస్తరించి నిర్మాణానికి నష్టం కలిగించే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్యాం భద్రత దృష్ట్యా సంబంధిత అధికారులు వెంటనే దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించి.. అవసరమైన మరమ్మతు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. -
పెరిగిన వరద.. తగ్గిన విద్యుదుత్పత్తి
గద్వాల/ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద భారీగా చేరుతోంది. మంగళవారం 2,41,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. ప్రాజెక్టు 33 క్రస్టుగేట్లు ఎత్తి దిగువనకు 2,21,331 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నా రు. విద్యుదుత్పత్తికి 26,817 క్యూసెక్కులు వినియోగిస్తున్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టుకు 750, భీమా–1కు 1,300, భీమా–2కు 872, కోయిల్సాగర్కు 630, ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వకు 820, ప్రధాన కుడి కాల్వకు 675, సమాంతర కాల్వకు 535 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మొత్తంగా ప్రాజెక్టు నుంచి 2,53,102 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాగా, దిగువ, ఎగువ జూరాల జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి తగ్గుముఖం పట్టింది. సోమవారం కేవలం ఎగువలో 6 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 234 మెగావాట్లు, ఇప్పటివరకు 26.139 ఎం.యూ., దిగువలో 25.716 ఎం.యూ. విద్యుదుత్పత్తి చేసినట్లు వివరించారు. ఇప్పటివరకు 51.855 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని విజయవంతంగా చేపట్టామన్నారు. 6 యూనిట్లలో 234 మెగావాట్ల ఉత్పత్తి -
రవాణా చార్జీలకు మంగళం
ఎరువుల రవాణా భారాన్ని ఎత్తేసిన ప్రభుత్వం ● రైతులకు భారంగా మారనున్న ఎరువుల ధరలు ● ఇకపైన ప్రైవేట్ డీలర్ల చేతిలో రసాయన ఎరువులు కల్వకుర్తి టౌన్: గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులకు ఎరువుల ఇబ్బంది లేకుండా ఆయా మండల కేంద్రాల్లో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ఎరువులు అందేవి. రైతులకు వేరే ప్రాంతానికి వెళ్లి ఎరువులను తెచ్చుకునే అవసరం లేకుండా అక్కడే రసాయన ఎరువులు కొనుగోలు చేసేవారు. ఇందుకు సంబంధించి మార్క్ ఫెడ్ ద్వారా ఎరువులను ఆయా ప్రాథమిక సహకార సంఘాలకు ప్రభుత్వమే రవాణా ఛార్జీ భరించి సరఫరా చేసేది. ప్రస్తుతం ఈ రవాణా చార్జీలను ఎత్తివేసి, ఆ చార్జీలను సంబంధిత పీఏసీఎస్లు భరించుకోవాలని జీవో ఆర్టీ నెంబర్ 391ను విడుదల చేసింది. సహకార సంఘాలకు అందించే ఎరువుల రవాణా భారాన్ని ఎత్తివేశామని, ఇందుకు సంబంధించిన జీవోను అన్ని సహకార సంఘాలకు పంపించి వెంటనే దీనిని అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇకపై రవాణా భారం డబ్బులు కూడా రైతుపైనే పడనున్నాయి. ఇప్పటి నుంచి సహకార సంఘాలు బహిరంగ మార్కెట్లో అమ్మిన విధంగానే ఎరువులను అమ్మే అవకాశం ఉంది. ఈ విధంగా అయితే రైతుపై ఒక్కో బస్తాకు రూ.15 రవాణా చార్జీల భారం పడనుంది. రవాణాకు పాడిన మంగళం మార్క్ఫెడ్ నుంచి పీఏసీఎస్లకు ఎరువులను ఉచితంగా సరఫరా చేసే రవాణా ఖర్చులను ప్రభుత్వం తాజాగా ఉపసంహరించుకుంది. ఇకనుంచి ఆయా సహకార సంఘాలకు వచ్చే ఎరువుల లారీ రవాణా ఖర్చులను వారే భరించుకోవాల్సి ఉంటుంది. ఒక్క బస్తా యూరియా సహకార సంఘంలో రూ.266లకు లభిస్తే, ప్రైవేట్లో రూ.300 వరకు అమ్మేది. తాజాగా మార్క్ఫెడ్ ఏర్పాటు చేసిన ర్యాకుల వద్దకు లారీలను మాట్లాడుకుని, ఎరువులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. లారీల యజమానులు కిరాయిలు పెంచే అవకాశం ఉండటంతో ఎరువుల విక్రయాల నుంచి సహకార సంఘాలు తప్పుకునే ఆలోచనలు చేస్తున్నాయి. మార్క్ఫెడ్ ద్వారా ఉచిత రవాణా మార్క్ఫెడ్ ద్వారా జిల్లాలోని 17 సహకార సంఘాలకు రసాయన ఎరువులు అందేవి. రైల్వే వ్యాగన్లు లేకుంటే గోదాముల్లో నిల్వచేసిన ఎరువులను ఆయా సంఘాలకు రైతుల అవసరాన్ని బట్టి సరఫరా చేసేది. ఇదే సంస్థకు చెందిన లారీల్లో హమాలీలతో ఎరువుల బస్టాండ్ లోడ్ చేయించి పంపించేది. ఈ ప్రక్రియలో లారీలు, హమాలీల ఖర్చులను మార్క్ఫెడ్ భరించేది. దీంతో ఆయా సహకార సంఘాలు హమాలీల ఖర్చు, సంఘానికి కొద్దిపాటి లాభాన్ని చూసుకుని, బయట వ్యాపారుల కంటే తక్కువ రేటుకు రైతులకు ఎరువులు అందించేవారు. సహకార సంఘంలో రైతులకు అందించే ఒక్కో ఎరువు బస్తా అసలు ధర రూ.252 కాగా, హమాలీ ఖర్చు రూ.6.5, మామూలు కింద రూ.2, ఆయా సంఘాల లాభం కింద రూ.5 ఇలా బస్తాకు రూ.266–268 వరకు అమ్మేవారు. జిల్లాలో ప్రధానంగా ఉన్న సహకార సంఘాలకు, మండల కేంద్రానికి కొద్ది దూరంలో ఉండే సహకార సంఘాలకు రవాణా చార్జీల్లో వ్యత్యాసం వచ్చి బస్తా ధర మరింత ఎక్కువగా అవుతుంది. పీఏసీఎస్ల ద్వారా అందించే ఎరువులకు సంబంధించి ధరలు పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం రాయితీతో అందించే రవాణా చార్జీలను సంఘాలే భరించాలని చెప్పడంతో ఎరువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. సంఘాల్లోనూ ఇలా రేట్లు పెరిగితే ప్రైవేటు మార్కెట్లో ఎరువుల ధరలు మరింతగా పెరిగి రైతులకు భారం కానుంది. – దస్రునాయక్, రైతు, సారబండతండా, చారకొండ మండలం రసాయన ఎరువుల ధరను శుక్రవారం నుంచే బస్తాపై రూ.30 వరకు పెంచారు. ధరలు ఎందుకు పెంచారని అధికారులను అడిగితే, ట్రాన్స్పోర్టు చార్జీలు పెరిగాయని అందుకే ధరలు పెరిగాయని చెబుతున్నారు. ఒక్కో బ్యాగుపై ఇంతగా ధరలు పెరిగితే రైతులకు ఇబ్బందులు తప్పవు. – భీమయ్య గౌడ్, రైతు, చెర్కూర్, వెల్దండ మండలం అన్ని సహాకార సంఘాల్లో ఒకే రేటు ఉండేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్పోర్టు చార్జీలు లేకపోవటం వల్ల ఒక్కో దగ్గర ఒక్కో రేటకు ఎరువులను విక్రయిస్తున్నారు. రైతులు ఎక్కడ తక్కువగా దొరికితే అక్కడ కొనుగోలు చేసేవారు. ఇకపై రైతులకు ఇబ్బంది లేకుండా యూనిఫామ్ ధరకు ఎరువులు లభించేలా చూస్తున్నాము. – తహాసీన్, ఎండీ, మార్క్ఫెడ్ -
రైలు కింద పడి యువకుడి దుర్మరణం
జడ్చర్ల: రైలు కింద పడి గుర్తుతెలియని యువకుడు (45) మృతిచెందినట్లు రైల్వే ఎస్ఐ రాజు తెలిపారు. ఆయన వివరాల మేరకు.. జడ్చర్ల రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు వెళ్తున్న సమయంలో సదరు యువకుడు ఆకస్మికంగా పట్టాలపైకి వెళ్లడంతో ఢీకొట్టింది. ప్రమాదంలో అతడికి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే అతడు పట్టాలు దాటుతూ ప్రమాదానికి గురయ్యాడా.. లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడా అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడు బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్, రెడ్ టీషర్ట్ ధరించి ఉన్నాడని.. కుడి చేతిపై ఇంగ్లిష్లో పీఓడబ్ల్యూఈఆర్ (పవర్) అక్షరాలతో పాటు స్టార్ గుర్తు పచ్చబొట్టుగా వేసుకున్నాడన్నారు. ఎడమ చేతిపై హిందీలో జానీ అనే పచ్చబొట్టు ఉందన్నారు. మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించామని.. వివరాలు తెలిసిన వారు 87126 58597 నంబర్ను సంప్రదించాలని ఎస్ఐ సూచించారు. యాసిడ్ ట్యాంకర్ బోల్తా: తప్పిన ప్రమాదం కేటీదొడ్డి: ప్రమాదవశాత్తు యాసిడ్ ట్యాంకర్ బోల్తా పడిన ఘటన మండలంలోని నందిన్నె శివారులో రాయిచూర్ ప్రధాన రహదారిపై మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కర్నూల్ నుంచి ముంబై వైపు హైడ్రోక్లోరిక్ యాసిడ్తో వెళ్తున్న ట్యాంకర్ డ్రైవర్ నిద్రమత్తులో కారణంగా అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే ట్యాంకర్ నుంచి యాసిడ్ లీకై పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న ఎస్ఐ శ్రీనివాసులు, తహసీల్దార్ కర్ణాకర్ ప్రమాద స్థలానికి చేరుకుని యాసిడ్ పొగతో శ్వాసకోశ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉండటంతో వాహనదారులు, స్థానికులను అప్రమత్తం చేశారు. రాయిచూర్ రహదారిపై వాహనాల రాకపోకలు తాత్కాలికంగా నిలిపి వేసి వేరే మార్గంలోకి మళ్లించారు. ప్రమాదంలో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. ట్యాంకర్ కర్నూల్ లోని కెమికల్ కంపెనీకి చెందినదిగా గుర్తించా రు. కర్నూల్ నుంచి మరో ట్యాంకర్ను రప్పించి లీకవుతున్న యాసిడ్ను అందులోకి మార్చినట్లు అధికారులు పేర్కోన్నారు. ఈ ఘటనలో ఎలాంటి నష్టం జరుగకుండా ముందస్తుగా ఫైర్ ఇంజన్ అందుబాటులో ఉంచామన్నారు. చికిత్స పొందుతూ మేస్త్రీ మృతి రాజాపూర్: మండల కేంద్రంలోని సంతలో కూరగాయలు కొనుగోలు చేసేందుకు మోటార్సైకిల్పై వ చ్చిన వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో గాయాలపాలైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మంగళవారం రాజాపూర్ చోటు చేసు కుంది. వివరాల్లోకి వెళ్తే.. మల్లేపల్లి గ్రామానికి చెందిన బోయ లింగం (45) రోజు మాదిరిగా మేసీ్త్ర పని ముగించుకుని సోమవారం సాయంత్రం సంతలో కూరగాయలు తీసుకుని తన మోటర్సైకిల్పై యాదయ్యతో కలిసి ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో వీరి బైక్ను హైదరా బాద్ నుంచి జడ్చర్ల వైపు వెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సు ఓవర్టేక్ చేసి వెళ్తుండగా.. డ్రైవర్ సడన్బ్రేక్ వేయడంతో మోటార్ సైకిల్కు తగిలి లింగం కింద పడిపోయాడు. దీంతో తలకు, భుజానికి తీవ్రగాయాలు కావడంతో క్షతగాత్రుడని స్థానికులు 108 అంబులెన్స్లో జిల్లా కేంద్రంలో ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్సకో సం సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రి తీసుకెళ్లగా.. అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడి భార్య మంగమ్మ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. -
కనులపండువగా రాధాకృష్ణ శాంతి కల్యాణం
కల్వకుర్తి రూరల్: సమస్త మానవాళి సుఖ సంతోషాలతో జీవించాలని కోరుతూ పట్టణంలో 91వ విశ్వశాంతి మహాయాగంలో భాగంగా మంగళవారం రాధాకృష్ణ శాంతి కల్యాణ మహోత్సవం, ఉట్లు కొట్టే కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. శ్రీకృష్ణ కాలచక్రం, విష్ణు పంచాయతనం, ఆయుత చండీ అతిరుద్ర శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం, చిత్రవేదపూర్వక మహాగణపతి మహాసౌర సుదర్శన లకీ్ష్మ్నారాయణ సహిత శ్రీమద్ భాగవత యాగ మహోత్సవాలు కనులపండుగగా సాగాయి. అర్ధరాత్రి 12 గంటల వరకు నిర్వహించిన కల్యాణ మహోత్సవంలో వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు. కళ్యాణం సందర్భంగా పండితులు చేసిన నృత్యం భక్తులను ఆకర్షించింది. హరీశ్వర దాండియా బృందం ఆడిన దాండియాను చూసి భక్తులు తన్మయత్వంలో మునిగితేలారు. 16 రోజులపాటు నిర్వహించిన హోమాలు, కల్యాణ మహోత్సవాల సందర్భంగా తరలివచ్చిన భక్తులకు మూడు పూటల అన్నప్రసాదం పంపిణీ చేశారు. ప్రతినిత్యం 5 వేల మందికి పైగా భక్తులు ఉత్సవాలను తిలకించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, వంశీకృష్ణతో పాటు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి, సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తో పాటు పెద్ద సంఖ్యలో ప్రముఖులు విచ్చేసి శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ముగింపు కార్యక్రమంలో పూర్ణాహుతి కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో నిర్వాహకులు జూలూరు రమేష్ బాబు, బీచని బాలకృష్ణ, కొండూరు గోవర్ధన్, చిగుళ్లపల్లి సతీష్, పోలా సురేందర్, గుబ్బ వెంకటేష్, మాచిపెద్ది రామస్వామి, జూలూరు ప్రకాష్, కల్మిచర్ల గోపాల్, అశోక్, మురళి, జంగయ్య, పెద్దయ్య, వినయ్ రెడ్డి, గణేష్, సురేష్, మనోహర్, తదితరులు పాల్గొన్నారు. ఈ వృద్ధుడు.. మృత్యుంజయుడు -
ప్రాజెక్టు పనులు యుద్ధప్రాతిపాదికన చేపట్టాలి
భూత్పూర్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పను లు యుద్ధ ప్రాతిపాదిక పూర్తి చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారి శాంతికుమార్ అన్నా రు. మంగళవారం మండలంలోని కర్వెన ప్రాజెక్టు ను బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎగ్గని నర్సింహులుతో కలిసి దేవరకద్ర నియోజకవర్గంలోని భూత్పూర్, అడ్డాకుల మండలాలకు చెందిన బీజేపీ నాయకులు పరిశీలించారు. కర్వెన రిజర్వాయర్ వరకు మెయిన్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులను డిసెంబర్ 2026 నాటికి పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, ప్రస్తుతం ఏ దశలో పనులు చేపడుతున్నరో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని శాంతికుమార్ పేర్కొన్నారు. ప్రస్తుతం పనులు కొనసాగుతున్నట్లు కనిపించడం లేదని, గడువులు ప్రకటించడం కాదని, పనులు పూర్తి చేయాలని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టులో భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు పునారావాసం, పరిహారం, ఆర్అండ్ఆర్ పెండింగ్ పనులు ఫ్రభుత్వమే తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పడాకుల బాల్రాజు, అంజయ్య, నంబి రాజు, రవీందర్రెడ్డి, ప్రతాప్రెడ్డి, నిరంజన్, నాగరాజు, సుధీర్కుమార్, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
15, 16 తేదీల్లో ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలు
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఈనెల 15, 16 తేదీల్లో ఓపెన్ టు ఆల్ ఉమ్మడి జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ నిర్వహిస్తున్నట్లు మహబూనగర్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్యాంసుందర్గౌడ్, రవికుమార్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. డబుల్స్లో మాత్రమే పోటీలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 12వ తేదీ వరకు తమ పేర్లు నమోదు చేసుకోవాలని, 13న డ్రా తీయడం జరుగుతుందని తెలిపారు. మిగతా వివరాల కోసం 98480 85211 నంబర్ను సంప్రదించాలని కోరారు. -
కడుపునొప్పి భరించలేక యువకుడి బలవన్మరణం
మరికల్: కడుపునొప్పి భరించలేక చెట్టుకు ఉరేసుకొని యువకుడు బలవన్మరణానికి పాల్పడని ఘటన సోమవారం అప్పంపల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అప్పంపల్లికి చెందిన కె.రవికుమార్(22) కొంతకాలంగా కడుపు నొప్పితో బాధ పడుతున్నాడు. తల్లిదండ్రులు చికిత్స చేయించినా తగ్గకపోవడంతో తన పొలం వద్ద ఉన్న చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చుట్టు పక్కల రైతులు గమనించి విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. ఘటనా స్థలానికి వెళ్లిన కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఇన్చార్జీ ఎస్ఐ గాయత్రి తెలిపారు. ఉరేసుకుని తాపీమేసీ్త్ర బలవన్మరణం ● వేధింపులే కారణమా..? చారకొండ: మండల కేంద్రంలో ఓ ఇంట్లో తాపీమేసీ్త్ర ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన షేక్ కరిముల్లా(52) కొన్నేళ్లుగా మండల కేంద్రంలో తాపీమేసీ్త్రగా పనిచేసుకుంటూ అద్దెకు నివాసముంటున్నాడు. ఇటీవల నూతనంగా ఓ ఇంట్లో పనులు చేస్తున్నాడు. అక్కడ ఎవరూ లేని సమయంలో 3వ అంతస్తులోకి వెళ్లి సీలింగ్ ఫ్యాన్ కొండికి తాడుతో ఉరేసుకున్నాడు. కూలీగా పనిచేస్తున్న మరోవ్యక్తి అక్కకెళ్లి చూడగా విగతజీవిగా ఉండడంతో సమీప స్థానికులకు తెలుపగా పోలీసులకు ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని కల్వకుర్తి ఆస్పత్రికి తరలించారు. మృతుని వివరాలను తెలుసుకొని భార్య దిబిజాన్, కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో కుటుంబ సభ్యులు కల్వకుర్తి ఆస్పత్రికి చేరుకున్నారు. ఖరిముల్లా బాబాయి కరీంబాషాను చనిపోవడానికి గల కారణమైన వ్యక్తుల గురించి కాగితంలో రాసినట్లు తెలిపాడు. దీంతో మండలకేంద్రంలో ముగ్గురు వ్యక్తులు తమ తండ్రికి కారణమయ్యారని, వారు డబ్బులిచ్చి మేసీ్త్ర పనిచేయించుకొని ఇబ్బందులకు గురి చేశారని వేధించడంతో మనస్తాపంతో మృతిచెందాడని, కారకులైనవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు చారకొండ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వీరబాబు తెలిపారు. పరామర్శించేందుకు వెళ్తూ మృత్యుఒడికి.. ● రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి రాజాపూర్: వరుసకు కొడుకై న వ్యక్తి గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా పరామర్శించేందుకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన సోమవారం బాలానగర్ మండలం కేతిరెడ్డిపల్లి జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. బాలానగర్ ఎస్ఐ నరేందర్రెడ్డి తెలిపిన వివరాలు.. రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం చెల్కచిల్కమర్ర గ్రామానికి చెందిన మనీల(36) వరుసకు కొడుకై న శ్రీకాంత్ ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడన్నా విషయం తెలుసుకొని మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి బంధువులు రమేశ్, రాకేశ్లతో కలిసి బైక్పై వెళ్తుండగా వీరి వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో మనీల తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందగా, మిగతా ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. మృతురాలి భర్త చెనిగారి రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మొసలిని బంధించిన అధికారులు వనపర్తి రూరల్: మండలంలోని పెద్దగూడెం శివారు రొయ్యల రమేష్ వ్యవసాయ పొలంలోని బావిలో ఉన్న మొసలిని సోమవారం ఎస్ఐ హృశికేష్ ఆధ్వర్యంలో స్నేక్ సొసైటీ అధ్యక్షుడు కృష్ణసాగర్, వారి బృందం, ఫారెస్టు అధికారులు బంధించి బయటకు తెచ్చారు. అటవీ అధికారుల సమక్షంలో సొసైటీ సభ్యులు మొసలిని సురక్షితంగా జూరాల ప్రాజెక్టులో వదిలినట్లు తెలిపారు. ఇసుక టిప్పర్ పట్టివేత మానవపాడు: మండలంలోని రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టు వద్ద సోమవారం తెల్లవారుజామున అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ను పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ స్వాతి తెలిపిన వివరాలు.. బ్లూకోర్టు సిబ్బంది వాహనాల తనిఖీ చేస్తుండగా.. కర్నూలు వైపు నుంచి వస్తున్న టిప్పర్ను తనిఖీ చేయగా ఎలాంటి అనుమతులు లేకుండా నాగర్కర్నూల్ జిల్లా అమనగల్లుకు చెందిన టిప్పర్లో ఇసుక తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. టిప్పర్ యాజమాని, డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
బడి.. బహుదూరం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులు గొప్ప ప్రయోజకులు కావాలని జిల్లా కేంద్రంలోని పలు స్కూల్స్లో నాణ్యమైన విద్య అందుతుందన్న భావనతో తల్లిదండ్రులు ఇక్కడి పాఠశాలల్లో చేర్పించారు. వసతి కోసం ప్రభుత్వ హాస్టళ్లలో చేర్పిస్తే అక్కడ పూర్తి స్థాయిలో వసతులు లేకపోగా.. పాఠశాలలకు వెళ్లేందుకు అనేక ఇక్కట్ల పాలయ్యే పరిస్థితి నెలకొంది. విద్యార్థులు ఉదయం సాయంత్రం వేళ్లలో పాఠశాలకు సమయానికి వెళ్లాలన్న, హాస్టల్కు సకాలంలో చేరుకోవాలన్న ఎండ, వర్షం పట్టించుకోకుండా కాలినడకన ప్రయాణం సాగించాల్సి ఉంది. ఉదయం సాయంత్రం వేళ్లలో కలిపి సుమారు 5 కిలోమీటర్ల మేర నడక సాగించాల్సి వస్తుంది. 5, 6, 7 తరగతుల చిన్నరులు రోడ్లపై నడవాలంటే తీవ్ర ఇబ్బందిగా భావించే పరిస్థితి. అయిన ఇటూ హాస్టళ్ల వార్డెన్లు, జిల్లా సంక్షేమశాఖల అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దూరం ఎందుకు హాస్టళ్లు లక్ష్మీనగర్ కాలనీలో ఉన్న బాలుర హాస్టల్స్ రెండు కూడా ప్రభుత్వ భూమిలో పక్క భవనాలు నిర్మించారు. ఈ క్రమంలో అక్కడ ప్రభుత్వ పాఠశాలలు లేకపోవడంతో జిల్లాకేంద్రంలో ఉన్న పాఠశాలలకు రావాల్సిన పరిస్థితి ఉంది. వానగుట్ట దగ్గరున్న ఎస్టీ హాస్టల్ కూడా ప్రభుత్వ భవనం కావడంతో అక్కడ హాస్టల్ నిర్వహిస్తున్నారు. పాఠశాలలు సకాలంలో లేకపోడంతో జిల్లా కేంద్రానికి రావాల్సి ఉంది. అయితే గతవారం రోడ్డు దాటుతున్న ఓ బాలుడికి బైక్ తగిలి గాయాలైనట్లు తోటి విద్యార్థులు పేర్కొంటున్నారు. సదుపాయం ఏర్పాటు చేస్తాం లక్ష్మీనగర్ కాలనీలో ఉన్న ఎస్సీ బాలుర, ఆనంద నిలయం విద్యార్థులు పాఠశాలకు కాలినడకన వెళ్తున్నట్లు దృష్టిలో ఉంది. వారికోసం వాహనం ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ, ప్రైవేటు ఎన్జీఓల ద్వారా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. గతంలో ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఇబ్బంది లేకుండా చూస్తాం. – సునీత, ఎస్సీ సంక్షేమశాఖ అధికారిణి తక్కువ మంది విద్యార్థులున్నారు వానగుట్ట వద్ద ఉన్న ఎస్టీ హాస్టల్ విద్యార్థులు జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలలకు వెళ్తున్నట్లు తెలుస్తుంది. చాలా తక్కువ మంది విద్యార్థులు వెళ్తున్నారని ఇటీవల వార్డెన్ పేర్కొన్నారు. అక్కడ ఆర్టీసీ బస్సు ఆపేవిధంగా చర్యలు తీసుకుంటాం. – ఛత్రునాయక్, ఎస్టీ సంక్షేమశాఖ అధికారి అన్నీ తెలిసినా.. అధికారులు పట్టించుకోరు విద్యార్థులు కిలోమీటర్ల మేర నడిచి వెళ్తున్నారని అధికారులు, జిల్లా ఉన్నతాధికారులకు తెలిసినప్పటికీ పట్టించుకోవడంపై తీవ్ర విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. గతంలో సంబంధిత హాస్టళ్ల వార్డెన్లు సంక్షేమ శాఖ అధికారులకు సమస్యను చెప్పారు. ఈ విషయం గత కలెక్టర్ దృష్టికి వెళ్లినప్పటికీ విషయాన్ని పట్టించుకోలేదని తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న హాస్టళ్ల వార్డెన్లు విద్యార్థులను పూర్తిగా పట్టించుకోవడం లేదని తెలుస్తుంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్లో విద్యార్థులకు ప్రభుత్వం నుంచి షూ ఇవ్వాల్సి ఉంది. కానీ విద్యార్థులకు అందించలేదని తెలుస్తుంది. దీంతో విద్యార్థులు కాళ్లకు షూ, చెప్పులు లేకుండా ఉత్తి కాళ్లతో నడిచి వెళ్లడం విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. జిల్లా కేంద్రంలోని హాస్టల్ విద్యార్థులు బడికి వెళ్లేందుకు ఇక్కట్లు ఎండా, వర్షం వచ్చిన స్కూల్కు సమయానికి చేరుకోవాల్సిందే.. కాళ్లకు చెప్పుల్లేకుండా కిలోమీటర్ల మేరా నడిచి వెళ్తున్న వైనం -
భూతగాదాలే హత్యకు కారణం
● కేసు కోర్టు పరిధిలో ఉండగానే దారుణం ● నాగర్కర్నూల్ డీఎస్పీ శ్రీనివాస్ పెంట్లవెల్లి: మండల కేంద్రంలో మూడు రోజుల క్రితం జరిగిన ఆర్ఎంపీ మల్లయ్య హత్యకు భూవివాదమే కారణమని నాగర్కర్నూల్ డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం స్థానిక పోలీస్స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జూలై 31న రాత్రి 8 గంటల సమయంలో మల్లయ్య హత్యకు గురయ్యాడని, ఈ ఘటనపై దర్యాప్తు చేయగా క్లీనిక్ వద్ద ఉన్న సీసీ కెమెరాలో రికార్డయిన వివరాల ప్రకారం నిందితులు పెంట్లవెల్లికి చెందిన బింగి కృష్ణయ్య, బింగి ఎల్లమ్మ, బింగి నాగమ్మగా గుర్తించినట్లు పేర్కొన్నారు. వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా.. మృతుడితో తమకు మధ్య కొన్నేళ్లుగా భూవివాదం నడుస్తోందని తెలిపారు. 2016 నుంచి ఇప్పటి వరకు ఆ వివాదంపై 14 కేసులు పోలీస్స్టేషన్లో నమోదయ్యాయని, గతంలో కూడా గ్రామ పెద్దలతో పలుమార్లు కూర్చొని మాట్లాడారన్నారు. సివిల్ కేసులు వేసుకుని వీరు కోర్టు చుట్టూ తిరుగుతూ ఒకరిపై ఒక్కరు ధ్వేషం పెంచుకున్నారని తెలిపారు. అందులో భాగంగా జూలై 31న ఇరువర్గాలు కోర్టుకు వెళ్లగా.. అక్కడ జరిగిన వాగ్వాదాన్ని దృష్టిలో పెట్టుకుని అదే రోజు గ్రామానికి చేరుకొని, పథకం ప్రకారం మల్లయ్యపై దాడి చేసి హత్య చేసినట్లుగా వారు ఒప్పుకున్నారని వెల్లడించారు. నిందితలను ఆదివారం సాయంత్రం అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చి అదే రోజు రిమార్డుకు తరలించినట్లుగా ఆయన తెలిపారు. అదే విధంగా ఈ హత్యకు ప్రోత్సహించిన అదే గ్రామానికి చెందిన డిశ్ శేఖర్పై కూడా కేసు నమోదు చేశామని, అతడు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, త్వరలోనే పట్టుకొని కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ పేర్కొన్నారు. మల్లయ్య హత్య దారుణం పెంట్లవెల్లికి చెందిన ఆర్ఎంపీ మల్లయ్య హత్య దారుణమని తెలంగాణ బార్ అసోసియేషన్ కౌన్సిల్ సభ్యుడు ప్రశాంత్రెడ్డి అన్నారు. భూ వివాదానికి సంబంధించిన కేసు ప్రస్తుతం కోర్టు లో కొనసాగుతుండగా.. నిందితులు ఆవేశపడ్డారని అభిప్రాయపడ్డారు. దోషులను కఠినంగా శిక్షించాలని డీఎస్పీకి వినతిపత్రం ఇచ్చారు. అదే విధంగా నిందితులకు బెయిల్ రాకుండా న్యాయ వాదుల తరఫున పోరాడతామని వెల్లడించారు. -
గ్రామాభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు, మండల పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు, జిల్లా పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు నాణ్యతతో రూపొందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఆటోమేటిక్ స్కోరింగ్, గ్రేడింగ్ విధానంలో జిల్లాకు ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అన్ని శాఖల జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాల మేరకు పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్–2026ను సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి శాఖపై ఉందన్నారు. గ్రామాభివృద్ధి ప్రణాళికలు 16వ ఆర్థిక సంఘం నిధులు, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు, గ్రామ పంచాయతీల సొంత ఆదాయ వనరులు, అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ పథకాల సమన్వయంతో రూపొందించాలని తెలిపారు. ఈ ప్రణాళికల్లో ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు, స్వయం సహాయక సంఘాలు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు తదితర భాగస్వాములందరూ చురుకుగా పాల్గొనాలని కోరారు. సంబంధిత శాఖల అధికారులు గ్రామసభలు, మండలసభల్లో తప్పనిసరిగా పాల్గొని నాణ్యమైన ప్రణాళికల రూపకల్పనకు సహకరించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మధుసూదన్ నాయక్, హరిప్రియ, అసిస్టెంట్ ట్రెయినీ కలెక్టర్ సాయి శివాని, డీఆర్ఓ నిర్మల, భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రామ్రెడ్డి, జెడ్పీ సీఈఓ వెంకట్రెడ్డి, డీఆర్డీఓ నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు. తల్లిపాలు శిశువుకు ప్రకృతి ఆహారం తల్లిపాలు శిశువుకు ప్రకృతి ప్రసాదించిన సంపూర్ణ అహారమని కలెక్టర్ ఖుష్బూగుప్తా అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా కలెక్టరేట్లో తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ రూపొందించిన ప్రచార పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఏడాది ప్రపంచ తల్లిపాల వారోత్సవాల థీమ్ ‘‘తల్లిపాలకు ప్రాధాన్యత ఇద్దాం – సుస్థిరమైన సహాయ వ్యవస్థలను ఏర్పాటు చేద్దాం’’ సందేశాన్ని ప్రజల్లో విస్తృతంగా చేర్చేందుకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి శ్రీమతి జరీనా బేగం, తదితరులు పాల్గొన్నారు. -
లారీ బోల్తా: డ్రైవర్ మృతి
చారకొండ: పేపర్ లోడ్తో వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ చెందినట్లు ఎస్ఐ వీరబాబు తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం.. కర్ణాటక నుంచి కలకత్తాకు పేపర్ లోడ్తో లారీ వెళ్తోంది. మండలంలోని జడర్చర్ల–కోదాడ జాతీయ రహదారిపై సారంబండ తండా సమీపాన మూలమలుపున అతివేగంగా వచ్చి రోడ్డు పక్కన రేలీంగ్ను ఢీకొట్టి అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో ఏపీలోని బాపట్ల జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ కిశోర్బాబు(40) కుడిచేతి మణికట్టు వద్ద విరిగి తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితికి చేరుకన్నాడు. స్థానికులు అంబులెన్స్లో కల్వకుర్తి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ మృతిచెందాడు. -
తుది దశకు సర్
● 10తో ముగియనున్న ఎస్ఐఆర్మొదటి దశ ● జిల్లాలో గత ఓటరు జాబితా ప్రకారం 99,132 ఓట్ల తొలగింపు? మహబూబ్నగర్ న్యూటౌ: కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)–2026 ఎన్యూమరేషన్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. జూన్ 25న ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఎన్యూమరేషన్ ఫారాలను ఇంటింటికి అందజేసి.. పూర్తి చేసిన ఫారాలను ఓటర్ల నుంచి తీసుకొని మ్యాపింగ్ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ ప్రక్రియ ఈ నెల 10వ తేదీతో ముంగియనుండటంతో బూత్ లెవల్ అధికారులు జల్లెడ పడుతున్నారు. జిల్లాలో మూడు నియోజకవర్గాల పరిధిలో గతంలో మొత్తం 7,32,488 మంది ఓటర్లు ఉన్నారు. ఎస్ఐఆర్–2026లో భాగంగా వీరందరికీ ఎన్యూమరేషన్ ఫారాలను ఇంటింటికి బీఎల్ఓల ద్వారా అందజేశారు. బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి వాటిని తిరిగి సేకరించి మ్యాపింగ్ చేస్తున్నారు. బీఎల్ఓ యాప్ ద్వారా 6,29,846 మంది ఓటర్ల వివరాలను పరిశీలించి అనుమతించారు. చనిపోయిన వారి వివరాలు, డబుల్ ఓటర్ల వివరాలతో పాటు అడ్రస్ మారిన వారు, అందుబాటులో లేని ఓటర్ల వివరాలు బీఎల్ఓల దృష్టికి వచ్చాయి. వీటితో పాటు ఈ నెల 3వ తేదీ నాటికి గుర్తించలేని ఓటర్లు 804 మంది ఉన్నారు. ఈ నెల 10వ తేదీ వరకు అవకాశముండటంతో జల్లెడ పడుతూ ఓటర్ల వివరాలను సేకరించి మ్యాపింగ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. గత జాబితాలో నమోదై ఉన్న ఓటర్లలో 99,132 మందిని జాబితా నుంచి తొలగించే అవకాశాలున్నాయి. ఈ నెల 10న పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ చేపట్టిన అనంతరం 17న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. -
మా గోడు ఎవరికి చెప్పుకోవాలి..
గోగ్యతండాకు చెందిన సుక్రునాయక్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆయనకు భార్య దేవితో పాటుగా ముగ్గురు పిల్లలు శివాని, శివ, గోగ్య ఉన్నారు. కుమార్తె శివానికి గుండె సంబంధిత వ్యాధి ఉండగా.. ప్రభుత్వ పరంగా ఆపరేషన్ చేయిస్తామని నాయకులు హామీ ఇచ్చారు. పాపకు 15 ఏళ్ల లోపే ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం శివానికి 16 ఏళ్లు వచ్చాయి.. అయినా వారిని ఎవరూ పట్టించుకోవడం లేదు. ‘ఇంటి పెద్ద లేడు. మా గోడు ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదు.’ అని దేవి ఆవేదన వ్యక్తం చేస్తోంది. -
ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం
మహబూబ్నగర్ క్రైం: జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం చేయడంలో అన్ని శాఖల సమష్టి కృషి దాగి ఉందని అదనపు ఎస్పీ ఎన్బీ రత్నం అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం ఆపరేషన్ ముస్కాన్లో కీలక పాత్ర పోషించి ఉత్తమ విధులు నిర్వహించిన అన్ని రకాల శాఖ అధికారులు, సిబ్బందికి ఆయన ప్రశంసాపత్రాలు అందించారు. భవిష్యత్లో కూడా చిన్నారుల సంక్షేమం కోసం ఇదే సమన్వయంతో పని చేయాలన్నారు. జిల్లాలో బాల కార్మికులు, భిక్షాటన, బాల్య వివాహాలు, విద్యకు దూరమైన చిన్నారులను గుర్తించి రక్షించడంలో ప్రతి శాఖ బాధ్యతతో పని చేసిందన్నారు. కార్యక్రమంలో ఉమెన్ పీఎస్ సీఐ కృష్ణ, సీడబ్ల్యూసీ చైర్మన్ నయీముద్దీన్, డీసీపీఓ నర్మద, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ శశికాంత్, కార్మిక శాఖ అధికారి బాసిత్, ఎస్ఐ లెనిన్ పాల్గొన్నారు. -
మధ్యవర్తులు లేకుండా నిర్భయంగా స్టేషన్కు రండి
మహబూబ్నగర్ క్రైం: జిల్లావ్యాప్తంగా పోలీస్స్టేషన్లలో ఫిర్యాదుదారులు ఇచ్చే ఫిర్యాదులపై సంబంధిత అధికారులు సకాలంలో స్పందించాలని ఎస్పీ డి.జానకి అన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. ఒక్కో ఫిర్యాదును పరిశీలించి ఆయా స్టేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ కేసులపై ఆరా తీశారు. పెండింగ్లో పెడుతున్న ఫిర్యాదులపై సకాలంలో పరిష్కరించాలన్నారు. ఫిర్యాదుదారులు పైరవీలు చేయడం లేదా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నిర్భయంగా పోలీసులను సంప్రదించాలన్నారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఫిర్యాదులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి స్టేషన్ మహబూబ్నగర్: రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నట్లు జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు (పర్సన్ ఇన్చార్జి) గోనెల శ్రీనివాసులు అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2026–27 సంవత్సరానికి సంబంధించి మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.116 కోట్లు ఆర్థిక బడ్జెట్ కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. చేప పిల్లలు, ఉపాధి కోసం, స్కిల్డవెలప్మెంట్, మిగతా సంక్షేమ పథకాలకు సంబంధించి ఈ నిధులు కేటాయించి జీవో కూడా విడుదల చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి దోమ పరమేష్, బాలగోపి, బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. డీసీసీబీ సీఈఓగా షఫీ ఉల్లాఖాన్ జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నూతన ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా మహమ్మద్ షఫీ ఉల్లాఖాన్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన కలెక్టర్ ఖుష్బూగుప్తాను కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. కలెక్టర్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, జిల్లాలో సహకార బ్యాంకుసేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు అందించేలా కృషి చేయాలన్నారు. -
వర్షం అంతంతే.. ప్రత్యామ్నాయమే మేలు
మహబూబ్నగర్ (వ్యవసాయం): ఎల్నినో ప్రభావంతో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో రైతులు పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు విధానాన్ని మార్చుకోవాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సూచించారు. పత్తి, కంది, వరి, జొన్న, కూరగాయల పంటలను పరిశీలించిన అనంతరం చీడపీడల నివారణ, పోషక నిర్వహణతో పాటు ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు పలు సూచనలు చేశారు. జిల్లాలోని కౌకుంట్లతో పాటు రేకులంపల్లి, ఇస్రంపల్లి, అప్పంపల్లి గ్రామాల్లో సోమ వారం పీజేటీఎస్ఏయూ శాస్త్రవేత్తలు డాక్టర్ కె.కల్యాణి, డాక్టర్ వి.దివ్యవాణి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు, పంటల ఎదుగుదల, చీడపీడల ఉధృతిని పరిశీలించి రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు అందించారు. యాజమాన్య పద్ధతులు పత్తి పంటలో రసం పీల్చే పురుగుల ఉధృతి కనిపిస్తే ఎసిటామిప్రీడ్ను లీటరు నీటికి 0.25 గ్రాములు, పచ్చదోమ నివారణకు ఫ్లోనికామిడ్ను లీటరు నీటికి 0.3 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలని సూచించారు. దీంతో చీడపీడల ఉధృతిని సమర్థవంతంగా నియంత్రించవచ్చని తెలిపారు. కంది, పత్తి పంటల్లో వర్షాభావ పరిస్థితుల కారణంగా మొక్కల ఎదుగుదల దెబ్బతినకుండా ఉండేందుకు రెండు శాతం యూరియా ద్రావణం లేదా 19:19:19 ఎరువు ద్రావణం, అలాగే నానో డీఏపీ, నానో యూరియా పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. జొన్న పంటలో కాండం తొలిచే పురుగు నివారణకు క్లోరంట్రానిలిప్రోల్ను లీటరు నీటికి 0.3 మిల్లీమీటర్ల చొప్పున పిచికారీ చేయాలని, ప్రత్యామ్నాయంగా కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలను ఎకరానికి నాలుగు కిలోల చొప్పున వేయాలని సూచించారు. ఆగస్టు 15లోపు కంది, రాగి, కొర్ర, ఆముదం వంటి తక్కువ నీటితో సాగయ్యే పంటలను బోదెలు, సాళ్ల పద్ధతిలో సాగు చేయడం ఉత్తతమని సూచించారు. కార్యక్రమంలో ఏఓ శివ, ఏఈఓలు గాయత్రి, శివ పాల్గొన్నారు. -
ఉదండాపూర్ భూ రికార్డుల మాయంపై ఫిర్యాదు
జడ్చర్ల: మండలంలోని ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి చేపట్టిన భూ సేకరణ రికార్డులను మాయం చేసిన అధికారులపై సమగ్ర విచారణ జరిపాలని కోరురూ సోమవారం కలెక్టర్ ఖుష్బూగుప్తాకు భూనిర్వాసితులు ఫిర్యాదు చేశారు. 2017లో రిజర్వాయర్ పరిధిలోని వల్లూరు గ్రామానికి సంబంధించిన రైతుల నుంచి భూ సేకరణకు అంగీకారం తీసుకున్నారు. ఆ సమయంలో తమ వ్యవసాయ భూముల్లో గల బోర్లు, పైపులైన్లు, చెట్లు, పుశువుల కొట్టాలు తదితర నిర్మాణాలకు సంబంధించి పరిహారం అందజేస్తామని అధికారులు తెలిపారు. అందులో భాగంగానే తమ నుంచి అంగీకార పత్రాలపై సంతకాలు తీసుకున్నారన్నారు. తదుపరి పరిహారం అందించలేదని ఇందుకు సంబంధించిన రికార్డులను కూడా అప్పటి తహసీల్దార్ లక్ష్మీనారాయణ, గిర్దావర్ సుదర్శన్రెడ్డి మాయం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. తాము సమాచార హక్కు చట్టం కింద వివరాలు అడిగితే ప్రస్తుత అధికారులు ఆయా రికార్డులు తమ వద్ద లేవని చెబుతున్నారని పేర్కొన్నారు. ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. -
స్పందన లేదు..
ఉద్యోగం కోసం ఎన్నోసార్లు ప్రజావాణిలో దరఖాస్తు చేశాం.. అయినా ఇంతవరకు స్పందన లేదు. ఆ రోడ్డు ప్రమాదంలో మా నాన్న శివాజీ, అమ్మ చాందిని చనిపోయారు. నాకు ఇద్దరు అక్కలు అనుష, సరిత ఉన్నారు. వారి పెళ్లిళ్లు చేశాం. ప్రమాదంలో అమ్మానాన్న చనిపోయినప్పుడు మా అక్క డీఈడీ పూర్తి చేసింది. అప్పుడు మాకు ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. దానికోసం ఎన్నోసార్లు అధికారుల చుట్టూ, ప్రజావాణి చుట్టూ తిరిగినా ఫలితం లేదు. నేను ఇప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాను. – సంతోష్, గోగ్య తండా ● -
పూర్తి బాధ్యత అన్నారు.. పట్టించుకోలేదు
విద్యాబోధన పూర్తి బాధ్యత అన్నారు. ఇంతవరకు పట్టించుకోలేదు. మా నాన్న చెన్నయ్య గతంలోనే చనిపోగా, అమ్మ పార్వతమ్మ కూలీ పనులు చేస్తూ నన్ను, మా అక్క శ్రీలతను చదివించింది. ఆ రోడ్డు ప్రమాదంలో అమ్మ మృతి చెందడంతో బతుకు భారమైంది. అక్క శ్రీలత ఇంటర్ పూర్తి కాగానే బంధువులందరూ కలిసి పెళ్లి చేశారు. నేను కష్టపడి చదివి ఎం.ఫార్మసీ పూర్తి చేశాను. ప్రస్తుతం నాకు అమ్మమ్మ తోడుగా ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి నాడు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలి. – బొంకూరు శ్రీకాంత్, ఎం.ఫార్మసీ, కొత్తపల్లి ● -
ఈజీమనీకి అలవాటుపడి దొంగతనాలు
● వెంచర్లలో వరుసగా విద్యుత్ వైర్లు చోరీ చేస్తున్న దొంగల అరెస్టు ● నిందితుల నుంచి 750 కేజీల వైరు, నగదు స్వాధీనం వెల్దండ: ఈజీమనీకి అలవాటుపడి దొంగతనాలు చేస్తున్న ముఠాను సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్దండ సీఐ రఘువీర్రెడ్డి తెలిపారు. వివరాలిలా.. వెల్దండ స్టేషన్ పరిధిలోని వెంచర్లలో ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లు చోరీ అవుతున్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం గ్రామానికి చెందిన మునావత్ మోహన్, మునావత్ దినేష్ తండ్రీ కొడుకులు పాత ఇనుప దుకాణం నడిపిస్తున్నారు. వీరికి పరిచయం ఉన్న రాజు, దినేష్, రమేష్తో కలసి ఈజీమనీ సంపాదించాలని నిర్ణయించుకుని ముఠాగా ఏర్పడ్డారు. సోమవారం కొట్రచౌరస్తాలో ట్రాలీ ఆటోతో తండ్రీకొడుకులు అనుమానంగా కనిపించారు. దీంతో వారిని విచారించడంతో మే నెలలో వెల్దండ మండలం పెద్దాపూర్ శివారులో ఉన్న ఆర్ఆర్ఆర్ వెంచర్లో దినేష్, మోహన్, అదేవిధంగా యూపీకి చెందిన రాజు, హైదరాబాద్కు చెందిన దినేష్, రమేష్ ఐదుగురు కలిసి 60విద్యుత్ స్తంభాల వైర్ను చోరీ చేసినట్లు తెలిపారు. జూన్ మొదటివారంలో కల్వకుర్తి సమీపంలోని బాలాజీ టౌన్షీప్ వెంచర్లో 30స్తంభాల వైర్, జూలై 12వ తేదీన కొట్ర శివారులో ఉన్న మరో వెంచర్లో 70స్తంభాల విద్యుత్ వైర్ను చోరీ చేసినట్లు తెలిపారు. విద్యుత్ వైర్ను చిన్నచిన్న ముక్కలుగా చేసి పాత ఇనుప సామాను షాపులో విక్రయించినట్లు తెలిపారు. వారిపై మూడు కేసులను నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారినుంచి 750 కేజీల వైరు, రూ.75వేల నగదు, చోరీకి ఉపయోగించిన ట్రాలీఆటో, మహేంద్ర థార్, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న రాజు, దినేష్, రమేష్ కోసం గాలిస్తున్నట్లు ఎస్ఐ యుగంధర్రెడ్డి తెలిపారు. కేసును ఛేదించిన ఎస్ఐ, కానిస్టేబుల్ నజీర్, అంజి, నవీన్, కిషోర్కుమార్రెడ్డిని డీఎస్పీ అభినందించారు. -
‘దీపం’ మంటలు.. రోడ్డున పడిన బతుకులు
● ప్రమాదవశాత్తు పూరి గుడిసె దగ్ధం ● కాలిబూడిదైన రూ.3 లక్షల నగదు, బంగారు, వెండి ఆభరణాలు గద్వాల క్రైం: దేవుడికి పెట్టిన దీపం నుంచి వచ్చిన నిప్పురవ్వల కారణంగా నిరుపేద కుటుంబానికి చెందిన పూడి గుడిసె దగ్ధమైన ఘటన గద్వాల పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. పిల్లిగుండ్ల కాలనీకి చెందిన బుడగ జంగలగోపాల్ రియల్ వ్యాపారం, భార్య ప్లాస్టిక్ సామాగ్రి, సిల్వర్ గిన్నెల విక్రయాలు చేస్తున్నారు. ఉదయం వారు ఉంటున్న గుడిసెలో పూజ చేసి దీపం వెలిగించి తాళం వేసి బయటకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు దీపం నుంచి వెలువడిన నిప్పురవ్వలకు గుడిసెలో మంటలు వ్యాపించాయి. మంటలు పెద్ద ఎత్తున అలుముకోవడంతో గుడిసె పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు మంటలు అదుపులోకి తెచ్చారు. సర్వం కోల్పయిన వైనం... ప్రమాదంలో ఇంటి అవసరాల కోసం ఇటీవల అప్పుగా తీసుకొచ్చిన రూ.3 లక్షల నగదు, 3 తులాల బంగారం, 10 తులాల వెండి, ఇతర వంట సామగ్రి బూడిదయ్యాయి. సర్వం కోల్పోయి రోడ్డున పడ్డామని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. -
విశ్వశాంతి మహాయాగం పరిపూర్ణం
కల్వకుర్తి రూరల్: పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ మైదానంలో 16 రోజులుగా నిర్వహిస్తున్న 91వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం భక్తిశ్రద్ధల నడుమ అత్యంత వైభవోపేతంగా ముగిసింది. సోమవారం చివరి రోజు నిర్వహించిన కార్యక్రమాలతో త్యాగం పరిపూర్ణమైందని కృష్ణజ్యోతి స్వరూపానందస్వామిజీ అన్నారు. శాంతిహోమం, గోపూజ, మహాపూర్ణాహుతి, గురుపూజ, అవబదస్నానం ఆచరించారు. సాయంత్రం ఉత్సాహంగా ఉట్టికొట్టు కార్యక్రమం జరిపారు. రాత్రి రాధాకృష్ణ శాంతికల్యాణ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం రుత్వికులను ఘనంగా సత్కరించారు. ముగింపు సందర్భంగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హాజరై భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. సాంప్రదాయాలను గౌరవించి ధర్మబద్ధంగా జీవించాలన్నారు. అనంతరం యాగ నిర్వాహకులు స్వామిజీ ఎమ్మెల్యేకు ఖడ్గాన్ని బహూకరించారు. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్, రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డితో పాటు ప్రముఖులు యాగానికి విచ్చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు ముచ్చర్ల జనార్ధన్రెడ్డి రూ.5 లక్షలు, నాయకుడు జూలూరి బాలస్వామి రూ.51 వేలు విరాళం అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బృంగి రత్నమాల ఆనంద్కుమార్, జూలూరు రమేష్బాబు, కొండూరు గోవర్ధన్, బీచని బాలకృష్ణ, చిగుళ్లపల్లి సతీశ్, పోలాసురేందర్, మాచి పెద్దిరామస్వామి పాల్గొన్నారు. -
సమస్యల సవాళ్లు..!
జిల్లాలో భూభారతి రీ సర్వేకు రివర్స్ పంచ్లు ● పాల్గొనని లైసెన్స్డ్ సర్వేయర్లు.. డిప్యూటేషన్లలో ప్రభుత్వ సర్వేయర్లు ● క్షేత్రస్థాయిలో అడ్డంకులు సృష్టిస్తున్న ఎఫ్లైన్ ఫిర్యాదులు ● ఇప్పటికీ ప్రామాణికంగా నిజాం కాలం నాటి మ్యాపులే ● జిల్లాలోని 6 గ్రామాల్లో సా..గుతున్న సర్వే పనులు –8లో u●జిల్లాలో భూ రీ సర్వేకు సర్వేయర్ల కొరత వేధిస్తుంది. లైసెన్స్డ్ సర్వేయర్లు వారికిస్తున్న పారితోషికం సరిపోవడం లేదని రావడం లేదు. ఒకవైపు ప్రాజెక్టుల భూసేకరణ పనులు, ఎఫ్లైన్ ఫిర్యాదుల పరిష్కారం వంటి వాటితోపాటు భూ రీ సర్వే పనులు చేపడుతున్నాం. ఇప్పటి వరకు 18 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాం. – ఎండీ మూసా, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే మహబూబ్నగర్ న్యూటౌన్: గుట్టకు ధారం కట్టాం.. వస్తే గుట్ట.. లేకుంటే ధారం అన్నట్లుగా ఉంది జిల్లాలో భూముల రీ సర్వే తీరు. భూముల రీసర్వే ద్వారానే భూ సమస్యలకు చెక్ పెట్టవచ్చనే ప్రభుత్వ ఆలోచన బాగున్నప్పటికీ ఆరు నెలలుగా ఆచరణలో కప్పదాట్లు వేస్తోంది. ఎదురవుతున్న అనేక సమస్యల కారణంగా రీ సర్వేకు రివర్స్ పంచ్ తగులుతోంది. లైసెన్స్డ్ సర్వేయర్లు రాకపోవడం, ఉన్న సర్వేయర్లలో డిప్యూటేషన్లపై వెళ్లడం, సిబ్బంది ఖాళీలు, ఎఫ్–లైన్ ఫిర్యాదుల పెండింగ్, భూ సేకరణ పనులు, ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారం వంటివి రీ సర్వేకు సవాళ్లు విసురుతున్నాయి. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం జిల్లాలో ఒకడుగు ముందుకు.. మూడడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతోంది. నిజాం కాలంలో జరిగిన సర్వేల ఆధారంగా తయారు చేసిన మ్యాపులు, హద్దులే ఇప్పటికీ ప్రామాణికంగా ఉండటం, భూముల విలువలు రోజురోజుకూ పెరుగుతుండటంతో హద్దుల గొడవలు, గెట్టు పంచాయితీలు, సర్వే నంబర్ల ఓవర్ ల్యాపింగ్, సబ్డివిజన్ సమస్యలతో భూ యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. భూ ప్రక్షాళనతో రికార్డుల ప్యూరిఫికేషన్ చేపట్టినప్పటికీ సమస్యలు తీరలేదు. ముందుగా పైలెట్ ప్రాజెక్టు గ్రామంలో.. జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద గండేడ్ మండలంలోని సాలార్నగర్ గ్రామంలో భూముల రీసర్వే చేపట్టారు. అక్కడ ఎదురైన అనుభవాలను అంచనా వేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది 2025 అక్టోబర్ 27న జిల్లాలో 17 గ్రామాలను ఎంపిక చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సరైన సిబ్బంది లేకపోతే సాధ్యం కాదని లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలను భూ రీసర్వేకు ఉపయోగించుకోవాలని వారికి శిక్షణ ఇచ్చి ధ్రువపత్రాలు జారీ చేసింది. భూ రీ సర్వేకు ఎంపిక చేసిన గ్రామాల్లో మండల సర్వేయర్ పర్యవేక్షణలో సర్వే నిర్వహణకు లైసెన్స్డ్ సర్వేయర్లను కేటాయించారు. ఈ ప్రక్రియ నడుస్తుండగానే జిల్లాలో మరో 70 గ్రామాలను ఎంపిక చేసి రీ సర్వేకు అనుమతించింది. అయితే ఆరు నెలల క్రితమే ఎంపిక చేసిన గ్రామాల్లో భూ రీసర్వేకు కార్యక్రమానికి శ్రీకారం చుట్టినా సిబ్బంది కొరత కారణంగా ముందుకు సాగలేదు. హన్వాడ మండలం చీకర్లపల్లి, కోయిలకొండ మండలం ఖాజీపూర్, మహబూబ్నగర్ రూరల్ మండలం జమిస్తాపూర్ రెవెన్యూ గ్రామాల్లో ముందుగా గ్రామసభలు నిర్వహించి ప్రజలకు అవగాహణ కల్పించిన అనంతరం రీసర్వే ప్రారంభించినా ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదు. జిల్లాలోని 17 మండలాల పరిధిలోని 87 గ్రామాల్లో భూ భారతిలో భాగంగా భూ రీ సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రీ సర్వేకు సిబ్బంది కొరత, నిర్వహణలో ఎదురవుతున్న సమస్యల సవాళ్లు ఒకవైపు ఉండగా.. మరోవైపు ఎఫ్–లైన్ ఫిర్యాదుల పరిష్కారం, ప్రాజెక్టుల భూసేకరణ వంటి అంశాలు సర్వేపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. జిల్లాలోని 17 మండలాలకు గాను 3 సర్వేయర్ పోస్టులు ఖాళీ ఉండగా 6 మంది సర్వేయర్లను నారాయణపేటకు డిప్యూటేషన్పై పంపారు. మిగతా వారిలో ఇద్దరికి ప్రమోషన్ రాగా ప్రస్తుతం జిల్లాలో ఆరుగురు పనిచేస్తున్నారు. ఈ ఆరుగురే భూ రీ సర్వేకు ప్రాతినిధ్యం వహిస్తూ ప్రాజెక్టుల భూసేకరణ పనులు, ఎఫ్లైన్తోపాటు ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలి. భూ రీసర్వే పనుల్లో నిమగ్నం కావడంతో ఎఫ్లైన్ ఫిర్యాదుల పరిష్కారం కాక ఆ సంఖ్య 1,415కు చేరింది. భూ రీ సర్వేలో లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలను వినియోగించుకునేందుకు ప్రభుత్వం వారికి గ్రామాలను కేటాయించగా సర్వేలో పాల్గొనడం లేదు. ప్రభుత్వం ఇచ్చే పారితోషికం తమకు సరిపోవడం లేదని సర్వే నిర్వహణకు హాజరు కాకపోవడంతో భూ రీసర్వే ముందుకు సాగడం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన పారితోషికం ఎకరాకు రూ.60 ఏమాత్రం సరిపోదని.. గౌరవంతో కూడిన వేతనం ఇస్తేనే తాము భూ రీసర్వే నిర్వహిస్తామనే డిమాండ్ను ముందుంచగా ఎటూ తేలడం లేదు. -
వైభవంగా తోట మైసమ్మ బోనాలు
స్టేషన్ మహబూబ్నగర్: నగరంలోని కుర్హినిశెట్టికాలనీ మైసమ్మ ఆలయంలో ఆషాఢ మాస ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం అమ్మవారికి అభిషేకం, పుష్పాలంకరణ జరిపి.. ప్రత్యేక పూజలు చేశారు. చుట్టుపక్కల నుంచి మహిళలు బోనాలతో ఊరేగింపుగా వచ్చి దేవాలయంలో అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని నగర మేయర్ మమత, కార్పొరేటర్లు దర్శించుకున్నారు.వేగంగా విద్యుదుత్పత్తి ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ కర్ణాటక నుంచి వరదనీరు భారీగా చేరుతుండడంతో దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతుంది. ఈ మేరకు ఆదివారం 11 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 6 యూనిట్ల ద్వారా 234 మెగావాట్లు, దిగువలో 5 యూనిట్ల ద్వారా 200 మెగావాట్లు చేపట్టారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటి వరకు 37.781 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి విజయవంతంగా చేపట్టామన్నారు. రామచంద్రాపూర్లో మద్య నిషేధం మహబూబ్నగర్ రూరల్: యువత మద్యానికి బానిసవడంతోపాటు కుటుంబాలకు భారంగా మారుతున్న పరిస్థితిని అరికట్టాలనే ఉద్దేశంతో రూరల్ మండలంలోని రామచంద్రాపూర్లో మద్య నిషేధం విధిస్తూ తీర్మానించారు. ఈ మేరకు ఆదివారం గ్రామ సర్పంచ్ నర్సింహులు అధ్యక్షతన జరిగిన గ్రామసభలో గ్రామస్తులు పాల్గొని బెల్ట్ షాపులపై కఠిన చర్యలకు మద్దతు తెలిపారు. ఇకపై గ్రామంలో ఎవరైనా అక్రమంగా మద్యం విక్రయిస్తే రూ.50 వేల జరిమానా విధించాలని, అలాంటి వారి సమాచారాన్ని అందించిన వారికి రూ.10 వేల నగదు బహుమతి ఇవ్వాలని తీర్మానించడం గమనార్హం. -
తల్లిపాలే అమృతం
మహబూబ్నగర్ రూరల్: తల్లీబిడ్డల మధ్య ఆత్మీయతను పెంచేవి తల్లిపాలు. బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాన్ని.. పోషక పదార్థాలను అందిస్తాయి. బిడ్డ పుట్టిన తల్లి ప్రతిరోజు లీటరు పాలు అదనంగా తాగితే నవజాత శిశువుకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించవచ్చు. కానీ, ఇటీవల పాల డబ్బాలు పిల్లల ఆరోగ్యాన్ని, తల్లి ఆప్యాయతను దూరం చేస్తున్నాయి. బిడ్డకు సుమారు రెండేళ్లపాటు పాలు ఇవ్వాల్సి ఉండగా.. ఎక్కువ మంది తల్లులు కేవలం ఏడాది మాత్రమే ఇస్తున్నారని వైద్య, ఆరోగ్యశాఖ అధ్యయనంలోనూ తేలింది. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు నెల మొదటి వారంలో తల్లిపాల విశిష్టతను తెలియజేసేలా.. 1 నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. తల్లిపాల సంస్కృతిని రక్షించడానికి తగిన ప్రోత్సాహం ఇవ్వడం కోసం ఏటా వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. అందు లో భాగంగా తల్లిపాల విశిష్టతను గర్భిణులు, బా లింతలకు వివరించేందుకు జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ అధికారులు శనివారం నుంచి వారం రోజులపాటు తల్లిపాల వారోత్సవాలకు శ్రీకారం చుట్టింది. పోతపాలు, పాల పౌడర్ కల్తీ అయ్యే అవకాశం ఉన్నందున పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కొందరు మహిళలు అందం, శరీర ఆకృతి చెదిరిపోతుందనే ఉద్దేశంతో బిడ్డకు పాలివ్వడం లేదు. వీరిలో ప్రధానంగా సంపన్న వర్గానికి చెందినవారే ఎక్కువ ఉన్న ట్లు అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మరికొందరు ఒక్కసారి బిడ్డకు ఇవ్వడానికి ప్రయత్నించి తర్వాత పాలు రావడం లేదని వదిలేస్తారు. వైద్యుల సలహా తీసుకుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మెడిసిన్ ద్వారా 30 శాతం మాత్రమే ఫలితం వచ్చే అవకాశం ఉంది. డబ్బాపాలు తాగిస్తే బిడ్డ కడుపు నిండుతుందే కానీ పోషకాలు అందవు. ముర్రుపాలు ఎంతో శ్రేష్టం.. ప్రసవించిన తర్వాత తల్లి బిడ్డకు ఇచ్చే ముర్రుపాలు అమృతం లాంటివి. బిడ్డకు ఆ పాలు యాంటీ బయోటిక్స్లా ఉపయోగపడతాయి. మూడు రోజులపాటు పసుపురంగులో వచ్చే ఈ పాలలో బిడ్డ ఎదుగుదలకు కావాల్సిన పోషకాలు ఉంటాయి. పుట్టిన ప్రతి బిడ్డకు వచ్చే కామెర్లు.. ఈ పాలు తాగిస్తే 90 శాతం తగ్గుతాయి. తల్లిపాలతో పిల్లల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీంతో మేధోసంపత్తి పెరిగే అవకాశం ఉంది. రెండేళ్ల వరకు అదనపు ఆహారంతోపాటు తల్లిపాలు పట్టాలి. తల్లిపాలతో బిడ్డ పేగులో నుంచి విసర్జకాలు తొలగిపోతాయి. ఎలర్జీలు రావు. దీర్ఘకాల వ్యాధులు ఉన్న తల్లులు వైద్యుల సలహా మేరకు శిశువులకు పాలివ్వాలి. డబ్బా పాలతో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం జిల్లాలో తల్లిపాల వారోత్సవాలకు శ్రీకారం గర్భిణులు, బాలింతలకు అవగాహన కార్యక్రమాలు -
సరదా.. ముప్పు
● జల పరవళ్లు చూసేందుకు తరలివస్తున్న జనం ● దిగువ నదిలో ప్రమాదకరంగా సెల్ఫీ ఫోజులు ● అదుపుతప్పితే ప్రవాహంలో గల్లంతయ్యే ప్రమాదం ● సూచిక బోర్డులు ఏర్పాటు చేయని ప్రాజెక్టు అధికారులు అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయానికి ఎగువ నుంచి వరద భారీగా వస్తుండటంతో క్రస్ట్గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఈ సమయంలో కృష్ణమ్మ పరవళ్లను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న పర్యాటకులతో ప్రాజెక్టు దిగువ భాగం కళకళలాడుతున్నా.. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనన్న భయాందోళనలు నెలకొంటున్నాయి. క్రస్ట్ గేట్ల నుంచి నురగలు కక్కుతూ దిగువకు పారుతున్న నీటి దృశ్యాలను చూసేందుకు, నది అంచునకు వెళ్లి సెల్ఫోన్లలో సెల్ఫీలు తీసుకోవడం, స్నానాలు చేస్తూ కేరింతలు కొడుతుండటంతో ప్రమాదం ఏ రూపంలో వస్తుందో ఉహించలేని పరిస్థితి నెలకొంది. నిత్యం పోలీసు పహార ఉండాల్సిన అవసరం ఉన్నా.. కేవలం నామమాత్రపు గస్తీ నిర్వహిస్తూ వెళ్తుండటంతో పర్యాటకులు నది అంచున వరకు వెళ్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు 32 గేట్లను ఎత్తి దిగువకు సుమారు 1.80 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలానికి వదులుతున్నారు. కృష్ణమ్మ ఉగ్రరూపంలో దిగువన ప్రవహిస్తుండటంతో పరీవాహక ప్రదేశాల్లోకి ఎవరూ వెళ్లకుండా నియంత్రించేందుకు ముళ్లకంచె ఏర్పాటు చేయాల్సిన అధికారులు.. ఇప్పటి వరకు అలాంటి చర్యలు చేపట్టకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం ప్రాజెక్టు పైభాగం నుంచే పర్యాటకులను తిలకించేలా పోలీసు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఎడమ కాల్వ వద్ద మరీ డెంజర్.. జూరాల ఎడమ కాల్వ వద్ద నీటి ప్రవాహం ఉధృతిని గుర్తించలేని యువత ఈతకు వెళ్లి గల్లంతైన ఘటనలు ఉన్నాయి. అలాగే ఇక్కడ దొరికే చేప ఫ్రైని తిని ఆస్వాదించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచేగాక కర్ణాటక రాయచూర్ నుంచి కూడా పర్యాటకులు భారీగా వస్తుంటారు. చేప వంటకాలతో పాటు మద్యం అమ్ముతుండటంతో తాగిన మైకంలో యువకులు కాల్వలో ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు. రెండేళ్ల కిందట మహబూబ్నగర్కు చెందిన ఐస్క్రీం విక్రయదారు జూరాల సందర్శనకు వచ్చి నదిలో స్నానం చేస్తూ గల్లంతై ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అదే ఏడాది మహబూబ్నగర్కు చెందిన ముస్లిం యువకుడు సైతం కుటుంబ సభ్యుల కళ్లముందే నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే రెవెన్యూ, పోలీసు అధికారులు స్పందిస్తున్నారే తప్ప వరద వస్తుందని తెలిసిన మరుక్షణమే దిగువ నదిలోకి పర్యాటకులు వెళ్లకుండా రక్షణ కంచె ఏర్పాటు చేయడం లేదు. -
20 ఏళ్ల వారికీ గుండెపోటు..
గత 20 ఏళ్ల కిందట గుండెపోటు చాలా తక్కువగా వచ్చేది. ఇందులో కూడా 50 ఏళ్లు దాటిన వారు మాత్రమే ఉండేది. కానీ, ప్రస్తుతం మారిన జీవన శైలి వల్ల 20 ఏళ్ల యువకుల దగ్గర నుంచి 70 ఏళ్ల వృద్ధుల వరకు గుండెపోటు వస్తోంది. వీరిలో 30 ఏళ్ల వయస్సు కలిగిన యువకులే అధికంగా ఉంటున్నారు. దీనికి ప్రధానంగా అధిక ఒత్తిడి, ధూమపానం, మద్యం, చిన్న వయస్సులో షుగర్ రావడం, బీపీ, పాస్ట్ఫుడ్, బరువు, చెడు కొలెస్ట్రాల్ పెరగడం వంటివి గుండెపోటుకు దారితీస్తున్నాయి. ఆస్పత్రికి వచ్చే 100 మంది రోగులలో 70 శాతం మంది గుండె సంబంధిత రోగాలతో బాధపడుతున్నారు. – మహేష్బాబు, కార్డియాలజిస్ట్ -
..ముంగిట పురుషులు
●పాలమూరు: పుట్టుకలో మహిళల కంటే ముందు వరుసలో కొనసాగుతున్న పురుషులు.. మరణాల్లో సైతం అదే బాటలో పయనిస్తున్నారు. పురిట్లో కొందరు మరణిస్తుంటే.. అధికంగా చెడు వ్యసనాలు, అనారోగ్య సమస్యలు.. రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నారు. జిల్లాలో ఇటీవల కాలంలో మరణాల లెక్కలను పరిశీలిస్తే.. నాలుగు పదుల వయసులోనే చాలామంది తనువు చాలిస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఆత్మహత్యలు, రోడ్డు ప్రమాదాలే అధిక శాతంగా ఉంటున్నాయి. దాదాపు అదే వయసులో ఉన్నవారు ప్రస్తుతం 37.23 శాతం రక్తపోటు, 28.36 శాతం మధుమేహంతో బాధపడుతున్నారు. గతేడాది కాలంలో జిల్లాలో 2,863 మంది మరణించగా.. ఇందులో 1,923 మంది పురుషులే ఉండటం గమనార్హం. వీటిలోనూ గ్రామాల్లో కంటే పట్టణాల్లోనే అధికంగా నమోదయ్యారు. జీవనశైలితోనే పెద్ద దెబ్బ గతంతో పోలిస్తే ప్రస్తుతం అన్నివర్గాల వ్యక్తులు విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఉదయం లేచింది మొదలు ఉరుకులు పరుగుల జీవనం తప్పడం లేదు. సరైన ప్రణాళిక లేక వృత్తి.. వ్యక్తిగత జీవితంలో ఒత్తిడితో సతమతమవుతున్నారు. కొన్ని రకాల ఉద్యోగాల్లో లక్ష్యాలు (టార్గెట్లు) అందుకోవడానికి పరుగులు పెట్టాల్సిందే. ఈ క్రమంలో చాలామంది వ్యక్తిగత జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తూ.. తీవ్ర అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకొంటున్నారు. ఫలితంగా చిన్న వయస్సులోనే హృద్రోగ ముప్పు తలెత్తుతోంది. విపరీతమైన ఒత్తిడి కారణంగా ఎక్కువ మంది గుండెకు సంబంధించిన రోగాలతో బాధపడుతున్నారు. ఇక భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులైతే ఇళ్లలో వండుకునే తీరిక.. ఓపిక లేక బయట తిళ్లకు అలవాటు పడుతున్నారు. ప్రసవాల్లో మొదలుకొని.. వివిధ రకాల కారణాలతో మృత్యువాత పల్లెల్లో కంటే పట్టణాల్లోనే మరణాల శాతం ఎక్కువ యుక్త వయసులో మద్యం, సిగరెట్ ఇతర చెడు అలవాట్లే కారణం ఆహారపు అలవాట్లతోపాటు జీవన విధానంతోనూ మరణశాసనం -
తాళం పగలగొట్టి ఇంట్లో చోరీ
● ఏడున్నర తులాల బంగారం, రూ.3.5లక్షల నగదు అపహరణ గట్టు: గుర్తుతెలియని వ్యక్తులు తాళం వేసిన ఇంటికి కన్నం వేసి ఏడున్నర తులాల బంగారం, రూ.3.5 లక్షలు ఎత్తుకెళ్లిన ఘటన ఆరగిద్ద గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు.. ఆరగిద్దకు చెందిన మునేశ్వరి ఉదయం ఇంటికి తాళం వేసి పిల్లలను పక్కింటిలో వదిలి, తాను వేరే గ్రామానికి పని నిమిత్తం వెళ్లింది. ఇంటి వద్ద ఎవరూ లేరని గుర్తించిన గుర్తు తెలియని వ్యక్తులు మధ్యాహ్నం సమయంలో ఇంటి తాళం విరగొట్టి ఏడున్నర తులాల బంగారం, రూ.3.5 లక్షల నగదు చోరీ చేశారు. ఇంటి తాళం తీసిన విషయాన్ని గుర్తించిన చుట్టుపక్కల వారు మునేశ్వరికి సమాచారం అందించారు. ఇంటికి వెళ్లి పరిశీలించగా.. బీరువా తెరచి, వస్తువులు చిందరవందరగా పడి ఉండడం చూసి, గట్టు పోలీసులకు సమాచారం అందించా రు. విషయం తెలుసుకున్న గద్వాల డీఎస్పీ మొగులయ్య, సీఐ శ్రీను, ఎస్ఐ శేఖర్గౌడు ఘటనా స్థలా న్ని పరిశీలించారు. మునేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శేఖర్గౌడు తెలిపారు. -
‘20 రోజుల్లో’ గ్యారంటీ!
● రెవెన్యూ సేవల్లో జాప్యానికి చెక్ ● కులం, ఆదాయం, నివాసం తదితర ధ్రువపత్రాల మంజూరుకు కాలపరిమితి ● జాప్యమైతే అప్పీలు చేసే హక్కు మహబూబ్నగర్ రూరల్: కులం, ఆదాయం, నివాసం వంటి ధ్రువపత్రాల కోసం వారాల తరబడి తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులకు ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. ప్రజాసేవల హక్కు (రైట్ టు పబ్లిక్ సర్వీసెస్) చట్టం కింద రెవెన్యూ శాఖలోని కీలక సేవలను చేర్చడంతో ఇకపై మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసే పలు ధ్రువపత్రాలను 20 రోజుల్లోగా జారీ చేయాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులో సేవ అందకపోతే ఉన్నతాధికారులను ఆశ్రయించే హక్కును కూడా ప్రజలకు కల్పించారు. దీంతో రెవెన్యూ సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసిన తర్వాత ఫైలు ఏ దశలో ఉందో తెలుసుకోవడం కష్టంగా ఉండేది. ఒక్కోసారి కార్యాలయాల చుట్టూ పలుమార్లు తిరగాల్సి వచ్చేది. ఇకపై దరఖాస్తు నమోదు నుంచి ధ్రువపత్రం జారీ వరకు ప్రతి దశ ఆన్లైన్లో నమోదవుతుండటంతో జాప్యానికి బాధ్యులెవరో గుర్తించడం సులభం కానుంది. జాప్యాలకు అడ్డుకట్టే లక్ష్యం ప్రతి ఏడాది విద్య, ఉద్యోగాలు, స్కాలర్షిప్లు, బ్యాంకు రుణాలు, సంక్షేమ పథకాల కోసం వేలాది మంది ధ్రువపత్రాలు పొందుతున్నారు. అయితే సిబ్బంది కొరత, ఫీల్డ్ విచారణల్లో ఆలస్యం, పెండింగ్ ఫైళ్ల కారణంగా అనేక సందర్భాల్లో గడువు దాటుతోంది. దీనివల్ల విద్యార్థులు అడ్మిషన్లు, ఉద్యోగార్థులు దరఖాస్తులు, రైతులు సబ్సిడీ అవకాశాలు కోల్పోయిన ఉదంతాలు ఉన్నాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా ప్రభుత్వం కాలపరిమితిని అమలు చేస్తోంది. గడువు దాటితే అప్పీల్ నిర్ణీత సమయంలో ధ్రువపత్రం రాకపోయినా, సరైన కారణం లేకుండా దరఖాస్తు తిరస్కరించినా ప్రజలు ఉన్నతాధికారులకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫిర్యాదును పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అమలుపైనే ఫలితం ప్రభుత్వం గడువు విధించినా క్షేత్రస్థాయిలో అమలు సమర్థంగా జరిగితేనే ఆశించిన ఫలితాలు కనిపిస్తాయి. కొన్ని మండలాల్లో సిబ్బంది కొరత, పెండింగ్ దరఖాస్తులు, సాంకేతిక సమస్యలు కొనసాగుతున్న నేపథ్యంలో వీటిని అధిగమించాల్సిన అవసరం ఉంది. గడువులో సేవలు అందితే ప్రజల విశ్వాసం మరింత పెరిగే అవకాశం ఉంది. -
ఎమ్మెల్యే యెన్నంకు కమ్యూనిటీ సర్వీస్ అవార్డు
స్టేషన్ మహబూబ్నగర్: అమెరికాలో నిర్వహించిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డికి అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ సర్వీస్ అవార్డు ప్రదానం చేశారు. సమాజ సేవ, విద్యారంగంలో ఆయన చూపిన అంకితభావానికి గుర్తింపుగా ఈ అవార్డు అందించడం విశేషం. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి తన నియోజకవర్గానికే పరిమితం కాకుండా తెలంగాణ వ్యాప్తంగా సుమారు 2 వేల పాఠశాలల్లో 2లక్షల మందికిపైగా విద్యార్థుల విద్యాభివృద్ధికి చేసిన కృషి గుర్తింపునిచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యత పెంపు, ఆధునిక సాంకేతిక వనరుల వినియోగం, విద్యార్థుల్లో పోటీ స్ఫూర్తి పెంపొందించడం, ఉపాధ్యాయులకు మార్గదర్శక కార్యక్రమాలు నిర్వహించడం వంటి అనేక కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేశారు. ప్రత్యేకంగా పేద, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న శతశాతం వంటి పథకాలు డిజిటల్ స్టడీ మెటీరియల్స్, విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే కార్యక్రమాలు విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీశాయి. ఎమ్మెల్యేకు అంతర్జాతీయ గౌరవం లభించడంపై మహబూబ్నగర్ నియోజకవర్గ ప్రజలు, విద్యావంతులు, మేథావులు, సామాజికవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
వాలీబాల్ చాంపియన్గా మరికల్ జట్టు
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామోత్సవం రూరల్ ప్రీమియర్ లీగ్ క్లస్టర్ స్థాయి పురుషుల వాలీబాల్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ పోటీల్లో 40 జట్లు పాల్గొన్నాయి. చాంపియన్గా మరికల్ జట్టు, రన్నరప్గా గాదిర్యాల జట్టు, మూడోస్థానంలో గొల్లపల్లి జట్టు, నాలుగో స్థానంలో నవాబ్పేట జట్టు నిలిచాయి. ఆయా జట్లకు ఏఎంఓ దుంకుడు శ్రీనివాస్, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి చెన్న వీరయ్య తదితరులు ట్రోఫీలు, సర్టిఫికెట్లు, నగదు బహుమతులు అందజేశారు. విన్నర్, రన్నరప్ జట్లు ఈనెల 16న హైదరాబాద్లో జరిగే డివిజన్ (రాష్ట్రస్థాయి) టోర్నమెంట్లో పాల్గొంటాయని ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో పీడీలు వేణుగోపాల్, రమేష్బాబు, నాగరాజు, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. మయూర విహారం.. -
గడువులోగా సేవలు అందిస్తాం
ప్రజలకు నిర్ణీత గడువులో సేవలు అందించడమే ప్ర భుత్వ లక్ష్యం. కులం, ఆ దాయం, నివాసం తదితర ధ్రు వపత్రాల దరఖాస్తుల ను ప్రాధాన్యంగా పరిశీలించి 20 రోజుల్లోగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. దరఖాస్తుల స్థితి ఆన్లైన్లో నమోదు కావడంతో పారదర్శకత పెరుగుతుంది. గడువు పాటించేలా అధికా రులు, సిబ్బందితో సమన్వయం చేసుకుని పనిచేస్తాం. ప్రజలు పూర్తి వివరాలు, అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేస్తే జాప్యం ఉండదు. – దేవేందర్ కేసిరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్, మహబూబ్నగర్ అర్బన్ ● -
స్థిరంగా కొనసాగుతున్న వరద
గద్వాల/ కొల్లాపూర్ రూరల్: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతుంది. ఆదివారం ఎగువ నుంచి 1.60 లక్షల క్యూసెక్కుల వరద రాగా.. స్థానికంగా ఎత్తిపోతల పథకాలకు నీటిని విడుదల చేశారు. ఈ క్రమంలో భీమా లిఫ్ట్–1కు 1,300 క్యూసెక్కులు, లిఫ్టు–2కు 872, నెట్టెంపాడుకు 750, కోయిల్సాగర్కు 630, ఎడమ ప్రధాన కాల్వకు 820, కుడి ప్రధాన కాల్వకు 700, సమాంతర కాల్వకు 400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. పుష్కరఘాట్ల సమీపంలోకి.. శ్రీశైలం బ్యాక్వాటర్లో క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. ఆదివారం రాత్రి వరకు సంగమేశ్వరాలయం సగానికి పైగా నీటిలో మునిగిపోగా.. సోమశిల సమీపంలో పుష్కరఘాట్ల వద్దకు నీళ్లు చేరుకున్నాయి. సమీపంలోనే ఉన్న మసీదు సైతం సగానికిపైగా నీటిలో మునిగిపోయింది. జటప్రోల్ సమీపంలోని పురాతన సురభి రాజుల కోట, మసీదు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. నదీ పరవళ్లను తిలకించేందుకు సోమశిల, అమరగిరి, మంచాలకట్ట ప్రాంతాలకు పర్యాటకులు తరలివస్తున్నారు. -
భక్తిభావాన్ని అలవర్చుకోవాలి
కల్వకుర్తి రూరల్ : శ్రీకృష్ణ కాలచక్రం 91వ విశ్వశాంతి మహాయాగంలో భాగంగా ఆదివారం అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, అనురాధ దంపతులు చండీ హోమంలో పాల్గొన్నారు. మొదట యాగశాల ప్రదక్షణ చేసి యాగం అనంతరం స్వామిజీ ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రపంచ మానవాళి సుఖశాంతులతో జీవించాలని సంకల్పంతో ఉద్దేశంతో నిర్వహించిన ఈ మహాయాగం సత్ఫలితాలు ఇస్తుందన్నారు. మానవసేవే మాధవసేవని.. మానవాళి మేలు కోసం చేస్తున్న యాగంలో తాము భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు. దైవకృప అందరికి లభించాలని, భక్తి భావాన్ని అలవర్చుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు ముచ్చర్ల జనార్దన్రెడ్డి మాట్లాడుతూ.. సర్వేజనా సుఖినోభవంతు అని భావించడం ఒక హైందవ ధర్మంలోనే ఉందన్నారు. పిల్లలకు సాంప్రదాయాలు, సంస్కృతిని, దైవ భావాన్ని పెంపొందించే కార్యక్రమాలను రూపొందించాలని, తాము ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఉదయం సూర్య, శ్రీరామ, శ్రీచండీ హోమం, శ్రీసుదర్శన లక్ష్మీనారాయణ రుద్రహోమం, సహస్ర కళాశాభిషేకం, సీతారామచంద్రస్వామికి పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. దాదాపు పదివేల మందికి అన్నప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్కుమార్, కాయతి విజయకుమార్రెడ్డి, మిరియాల శ్రీనివాస్రెడ్డి, జూలూరు రమేష్బాబు, బీచని బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
కలుపు నివారణతో దిగుబడి
అలంపూర్: వానకాలం పంట సీజన్లోని వివిధ పంటల సాగులో కలుపు సమస్య ప్రధానంగా ఉంటుంది. కలుపు వలన 30 నుంచి 70 శాతం పంట నష్టం జరిగే అవకాశం ఉంది. వివిధ పంటల్లో వచ్చే కలుపును నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ శాఖ ఏడీఏ సక్రియానాయక్ రైతులకు పలు సూచనలు, సలహాలు అందజేస్తున్నారు. ఊద నివారణకు.. వరిలో ఊద నిర్మూలనకు ఎకరా నారుమడికి విత్తిన 2 నుంచి 3 రోజుల్లో ప్రిటిలాక్లోర్ 50 శాతం ద్రావకం 400 మి.లీ. లేదా విత్తిన 14, 15 రోజుల సమయంలో సైహాల్పాప్ బ్యూటైట్ 10 శాతం ద్రావకం 400 మి.లీ 200 లీటర్ల నీటితో కలిపి పిచికారి చేయాలి. లేదా ఊద వెడల్పా కు కలుపు సమపాళ్లలో ఉంటే నారుమడి విత్తిన 15 రోజులకు ఎకరాకు మి.లీ. బిస్ పైరిబాక్ సోడియం(10)శాతం 200 లీటర్ల నీటిలో కలిపి చల్లాలి. మాగాణి వరిలో.. మాగాణి వరిలో ఊద వంటి ఏకవార్షిక గడ్డిజాతి మొక్కలు ఎక్కువగా ఉంటే నాటిన 3 లేదా 5 రోజుల్లో పొలంలో పలుచగా నీరుంచి ఎకరాకు 1–1.5 లీ. బుటాక్లోర్ (50 శాతం) లేదా 400 మి.లీ. చొప్పున అనిలోఫాస్ (30 శాతం) ప్రిటిలోక్లోర్ (50 శాతం)గాని 20 కిలో పొడి ఇసుకలో కలిపి చల్లాలి. గడ్డి, తుంగ వెడల్పాటి ఆకుజాతి మొక్కలు సమపాళ్లలో ఉంటే ఎకరాకు వరి నాటిన 3 లేక 5 రోజుల్లో 4కి బుటాక్లోర్ 5 శాతం గుళికలు+4కి2.4–డీ ఇథైల్ ఎస్టర్ 4 శాతం గుళికలను 20 కిలోల ఇసుకలో కలిపి చల్లాలి. నాటిన 20 నుంచి 30 రోజుల్లో వెడల్పాటి కలుపు ఎక్కువగా ఉంటే ఎకరాకు 400 గ్రాములు 2.4– డీ సోడియం సాల్ట్ (80 శాతం) లేదా ఇథాక్సి సల్ఫురాన్ 15 శాతం పొడిని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మొక్కజొన్న: మొక్కజొన్న విత్తిన వెంటనే లేదా 2– 3 రోజుల్లో ఎకరాకు 1–1.5 కిలోల అట్రాజీన్ పిచికారీ చేయాలి. తర్వాత 30– 35 రోజుల్లో గొర్రు గంటుకతో అంతర్కృషి చేయాలి. జొన్న : జొన్న విత్తిన వెంటనే లేదా 2– 3 రోజుల్లో 600 నుంచి 800 గ్రాముల అట్రాజిన్ను విత్తిన 20 రోజుల తర్వాత అయితే 400 గ్రాముల 2,4– డీ సోడియం సాల్ట్ 80 శాతం పొడిని 200 లీ. నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పత్తి : పత్తి విత్తిన వెంటనే లేదా 1 లేదా 2 రోజుల్లో ఎకరాకు 1– 1.3 లీ. పెండిమిథాలిన్ 45 శాతం లేదా 1.5–2 లీ. అలాక్లోర్ 50 శాతం వాడాలి. ఖరీఫ్లో వర్షాలు ఎక్కువ ఉండి అంతర్ కృషి కుదరనప్పుడు 400 మి.లీ. కై ్వజలాపాప్ ఇథైల్ +250 మి.లీ. పైరితయోటాక్ 10 శాతాన్ని పత్తిమీద పడకుండా సాళ్ల మధ్య కలుపు మీద పడేలా చల్లాలి. చెరకు : ముచ్చెలు నాటిన వెంటనే లేదా 2 మూడు రోజుల్లో ఎకరాకు 2 కిలోల అట్రడాజిన్ పిచికారీ చేసి కలుపు నివారించవచ్చు. వెడల్పాటి ఆకులు ఎక్కువగా ఉంటే తోటనాటిన తర్వాత 30, 60 రోజుల్లో ఎకరాకు అరకిలో 2,4– డీ సోడియం సాల్ట్ చల్లాలి లేదా దీనికి అరకిలో మెట్రబుజిన 70 శాతం కలిపి పైరుపై పడకుండా సాళ్ల మధ్య పిచికారీ చేయాలి. మిరప : నాటడానికి ఒకటి రెండు రోజుల ముందు ఎకరాకు 1.3– 1.6 లీ. పెండిమిథాలిన్ లేదా 200 మి.లీ. ఆక్సిప్లోరోఫిస్ (23.5 శాతం) పిచికారీ చేయాలి. నాటిన 25 నుంచి 30 రోజుల తర్వాత సాళ్ల మధ్య గొర్రు లేదా గుంటక తోలాలి. గడ్డిజాతి కలుపు నిర్మూలనకు 400 మి.లీ కై ్వజాలాపాప్ ఇథైల్ పిచికారీ చేయాలి. పండ్ల తోటల్లో : పండ్ల తోటల్లో వచ్చే వివిధ రకాల కలుపు నిర్మూలనకు లీటర్ నీటికి 10 మి.లీ గ్లైపాసేట్ 10 శాతం +10 గ్రాముల అమోనియం సల్ఫేట్ లేదా యురియా కలుపు పూత రాకముందే నేలలో తేమ ఉన్నప్పుడు నాజిల్కు డోమ్ పెట్టి పండ్ల మొక్కలపై పడకుండా కలుపుపై పిచికారీ చేయాలి. అవసరమైతే 1, 2 నెలల తర్వాత మరోసారి చల్లాలి. పాడి–పంట -
జూరాల ప్రాజెక్టుపై ట్రాఫిక్ జామ్
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన వాహనాలతో ప్రాజెక్టు రహదారిపై ట్రాఫిక్ జాం ఏర్పడి వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. ఓ పక్క ఆదివారం సెలవు కా వడం.. మరో పక్క కృష్ణానదికి మొదటిసారిగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు జిల్లా స్థానికులతో పాటు ఆయా జిల్లాల వారు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కృష్ణమ్మ పొంగులను తిలకించి తరలించి పో యారు. కుటుంబ సమేతంగా.. మరో పక్క స్నేహితుల దినోత్సవం కావడంతో యువత పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని సంతోషంగా గడిపారు. అనంతరం ప్రాజెక్టుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన చేపల వంటకాల వద్ద జన సందోహం కనిపించింది. ట్రాఫిక్ నియంత్రిచడంలో పోలీసులు విఫలమైనట్లుగా కనిపించింది. ట్రాఫిక్ జాంతో వాహనదారులు, ప్రజలు కళ్ల ముందు ఇబ్బందులు పడుతుంటే ఓ పోలీసు సిబ్బంది సెల్ఫోన్లో మాట్లాడుతూ కనిపించారు. అతడి తీరుపై వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. -
యాదవులు రాజకీయంగా ఎదగాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): యాదవులు రాజకీయంగా, సామాజికంగా ఎదుగాలని యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలు యాదవ్ కోరారు. జిల్లా అధ్యక్షుడు జుర్రు నారాయణ యాదవ్ అధ్యక్షతన ఆదివారం స్థానిక ఏనుగొండలోని రామదూత టౌన్షిప్లో సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాజికంగా, రాజకీయంగా ముందు వరుసలో ఉన్నటువంటి యాదవ బంధువులు హైదరాబాద్లో శ్రీకృష్ణ యాదవ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న హాస్టల్ భవనానికి ఆర్థిక సహకారం అందించి సహకరించాలని కోరారు. అనంతరం యాదవ హాస్టల్ భవనానికి సాయిబాబా యాదవ్ రూ.లక్ష నాగర్ కర్నూల్ జిల్లా బీజేపీ మహిళా అధ్యక్షురాలు పద్మాయాదవ్ రూ. 25వేలు, విష్ణువర్ధన్ యాదవ్ రూ.25 వేలు, వెంకట్రాములు రూ.11 వేలు, మద్దిలేటి యాదవ్ రూ.10 వేలు విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘానికి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై న బైకని బాలు యాదవ్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంజన్న యాదవ్, జిల్లా అధ్యక్షుడు జుర్రు నారాయణ యాదవ్, జిల్లా గౌరవ అధ్యక్షుడు భరత్ కుమార్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గోదా తిరుపతయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
బీచుపల్లిలో ప్రత్యేక పూజలు
ఎర్రవల్లి: మండలంలోని బీచుపల్లి పుణ్యక్షేత్రాన్ని ఆదివారం భారతీయ సినీ డైరెక్టర్ రాధాకృష్ణ సందర్శించారు. ఆయన జన్మదినం సందర్భంగా అభయాంజనేయస్వామిని దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది ఆయనకు శేషవస్త్రాలతో సత్కరించగా, అర్చకులు సందీప్చారి తీర్థ ప్రసాదాలను అందించి, ఆలయ చరిత్ర గురించి ఆయనకు వివరించారు. ఆయన వెంట సినీ ఆర్టిస్టులు, ఆలయ సిబ్బంది, తదితరులు ఉన్నారు. టైరు పేలి కారు బోల్తా.. తప్పిన పెను ప్రమాదం ఎర్రవల్లి: జాతీయ రహదారిపై టైరు పేలి కారు బోల్తాపడిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కర్నూల్కు చెందిన అబ్దుల్లా తమ తొమ్మిది మంది కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నుంచి కారులో స్వగ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై కొట్టం కాలేజీ సమీపంలోకి రాగానే టైరు పేలడంతో కారు ఒక్కసారిగా అదుపుతప్పి పల్టీలు కొడుతూ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అబ్దుల్లాతో పాటు భార్య ముంతాజీబేగం కు తీవ్రగాయాలు కాగా మిగిలిన ఎనిమిది మంది చిన్న గాయాలతో బయటపడ్డారు. గమనించిన స్థానికులు, వాహనదారులు హుటాహుటిన కారు వద్దకు చేరుకొని క్షతగాత్రులను బయటికి తీసి చికిత్స నిమిత్తం వారిని కర్నూల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో వాహనంలో ఒకే కుటుంబానికి చెందిన మొత్తం పది మంది (ఐదుగురు పెద్దలు, ఐదుగురు చిన్నారులు) ఉన్నా ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నట్లు తెలిపారు. పాముకాటుకు రైతు బలి అమరచింత: చెరుకు తోటలో బోరుమోటార్ సరిచేస్తున్న సమయంలో పాముకాటు వేయడంతో రైతు మృతి చెందిన ఘటన మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. మండలంలోని సింగంపేట గ్రామానికి చెందిన చిన్నఆంజనేయులు(50) తెల్లవారు జామున చెరుకు తోటలో బోరు మోటార్ వద్ద ఫీజులు సరిచేస్తుండగా పాముకాటుకు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు, స్నేహితులకు సమాచారం అందించగా ఆత్మకూర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య సువర్ణ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
వ్యక్తి మృతి: కేసు నమోదు
రాజాపూర్: బతుకుదెరువు కోసం వచ్చి ఫాంహౌస్లో పనిచేస్తూ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం బాలానగర్ మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్లోని యాకుత్పురాకు చెందిన మీర్జా సర్దార్బేగ్ (50) భార్య ఫర్హత్ ఉన్నిసాబేగం ముగ్గు రు పిల్లలతో కలిసి హైదరాబాద్కు చెందిన హుస్సేన్ ఫాంహౌస్లో మేకలు, గేదెలు మేపు కుంటూ జీవనం సాగించేవారు. శనివారం రాత్రి షెడ్లో మేకలను చూసేందుకు వెళ్లిన మీ ర్జాసర్దార్బేగ్ కళ్లు తిరిగి సిమెంట్ బెడ్పై పడిపోవడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేందర్రెడ్డి తెలిపారు. వ్యవసాయ బావిలో మొసలి వనపర్తి రూరల్: మండలంలోని పెద్దగూడెం గ్రామానికి చెందిన రొయ్యల రమేష్ వ్యవసాయ పొలంలో ఉన్న బావి కన్నంలో మొసలి ఉంటూ ఎవరూ లేని సమయంలో బయటికి వస్తుందని రైతు తెలిపారు. ఆదివారం ఉద యం తమ కుటుంబ సభ్యులు బావి సమీపంలోకి వెళ్లగా.. మొసలి కనబడంతో భయంతో పరుగులు తీశారని రైతు పేర్కొన్నాడు. పోలీసులకు ఫోనులో సమాచారం ఇచ్చామని తెలిపారు. అధికారులు స్పందించి మొసలిని పట్టుకొని తీసుకెళ్లాలని ఆయన కోరారు. తాళం వేసిన ఇంట్లో చోరీ బల్మూర్: కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లిన విశ్రాంత ఉపాధ్యాయుడి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన ఘటన మండలంలో జరిగింది. ఎస్ఐ రాజేందర్ తెలిపిన వివరాలు.. మండలంలోని మహదేవ్పూర్ గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు వెంకట్రెడ్డి భార్య విజయమ్మతో కలిసి జూలై 31న హైదరాబాద్లో ఉన్న తమ కుమార్తె, అల్లుడి ఇంటికి వెళ్లారు. ఆదివారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చేసరికి తలుపుల తాళం పగులగొట్టి బీరువాలోని సుమారు 2 తులాల బంగారు నెక్లెస్, తులం బంగారు కెంపుదండ, 2 బంగారు ఉంగరాలు, 4 బంగారు పుస్తలగుండ్లు, 40 తులాల వెండి వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమెదు చేసి క్లూస్ టీంతో ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మార్షల్ ఆర్ట్స్లో బంగారు పతకం మహబూబ్నగర్ క్రీడలు: ఇంటర్నేషనల్ కరాటే మార్షల్ ఆర్ట్స్ చాంపియన్షిప్లో శ్రీహనుమాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా విద్యార్థి మహ్మద్ ఫర్హాన్ అహ్మద్ బంగారు పతకం సాధించాడు. హైదరాబాద్లోని చంపాపేట్లో ఆదివారం జరిగిన పోటీల్లో సత్తా చాటి గోల్డ్ మెడల్ సాధించినట్లు కరాటే మాస్టర్ కె.వెంకటేశ్ తెలిపారు. అండర్–14 విభాగం కుమితేలో పతకం సాధించినట్లు పేర్కొన్నారు. పతకం సాధించిన విద్యార్థిని పలువురు అభినందించి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. -
గోల్మాల్..!
రూ.1,000 కోట్ల 2022–23 యాసంగి సీఎమ్మార్లో మాయాజాలం సీఎమ్మార్ చెల్లించని డీఫాల్టర్ల నుంచి క్రమక్రమంగా డబ్బుల వసూలుకు ఈ ఏడాది మే నెలలో శ్రీకారం చుట్టింది. నిర్దేశిత గడువు విధిస్తూ.. ఆ లోపు చెల్లించాలని సూచించింది. తొలి గడువు ఆగస్టు 5 సమీపిస్తున్నా.. మిల్లర్ల నుంచి స్పందన లేకపోవడంతో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జూలై చివరి వారంలో రాష్ట్రవ్యాప్తంగా మిల్లుల్లో సోదాలు నిర్వహించింది. ఒక్కో మిల్లులో కోట్లాది రూపాయల విలువైన ధాన్యం లేకపోవడంతో పాటు పలువురు మిల్లర్ల దందా వెలుగులోకి రాగా చర్చనీయాంశంగా మారింది. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఒకటి కాదు.. రెండు కాదు.. సుమారు రూ.వెయ్యి కోట్లకు పైగా గోల్మాల్ చోటుచేసుకుంది. 2022–23 యాసంగికి సంబంధించి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కస్టం మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్)లో అక్రమాలకు అంతే లేకుండా పోయింది. మిల్లర్ల మాయాజాలం, పౌర సరఫరాల శాఖ ఉదాసీనత, పలువురు సిబ్బంది ధనదాహం వెరసి ప్రభుత్వానికి పెట్టిన పెట్టుబడి సైతం అందకుండాపోయింది. ఎట్టకేలకు దృష్టి సారించిన సర్కార్.. విజిలెన్స్ తనిఖీలకు శ్రీకారం చుట్టడంతో మిల్లర్లలో వణుకు మొదలైంది. సోదాల్లో ఒక్కో మిల్లు బాగోతం వెలుగులోకి వస్తుండగా.. ఉమ్మడి జిల్లాలో ఈ అంశం హాట్టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో అసలు అప్పట్లో ఏం జరిగింది, ప్రస్తుత పరిణామాలపై ‘సాక్షి’ ఫోకస్.. యాసంగికి సంబంధించి మిల్లులకు కేటాయించిన సీఎమ్మార్ ధాన్యాన్ని ప్రజా అవసరాలను పరిగణనలోకి తీసుకుని అవసరమైతే మర ఆడించి బియ్యం ఇచ్చేలా.. లేదంటే టెండర్ ద్వారా ధాన్యం విక్రయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అయితే 2022–23 యాసంగిలో ఎక్సెస్ ధాన్యం రావడం, అంతగా నాణ్యత లేకపోవడం (తడిసిన ధాన్యం)తో మిల్లర్లు వద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు టెండర్ ద్వారా వేలం వేసినా.. పలు కారణాలతో రద్దయింది. కొన్ని మిల్లులు కొంత మేర సీఎమ్మార్ బియ్యం పెట్టడం, వేలంలో కొంత మేర విక్రయించింది పోనూ.. 90 శాతానికి పైగా ధాన్యం ఆయా మిల్లుల వద్దే ఉన్నాయి. జిల్లాలోని హన్వాడ మండలపరిధిలో ఉన్న ఎంఎస్ శ్రీలక్ష్మి బాలాజీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో జూలై 29న విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, హైదరాబాద్ సిటీ–2 యూనిట్ అధికారులు.. జిల్లా సివిల్ సప్లయ్ సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. 2022–23 యాసంగి సీజన్కు సంబంధించి రూ.11.34 కోట్ల విలువైన 1,26,772 ధాన్యం బస్తాలు లేవని నిర్ధారించారు. అంతేకాదు.. రూ.14.84 లక్షల విలువైన సీఎమ్మార్ ధాన్యాన్ని అనుమతి లేకుండా ఆంధ్రప్రదేశ్కు తరలిస్తున్న రెండు లారీలను మిల్లు సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల నేపథ్యంలో మిల్లర్లలో వణుకు మొదలైనట్లు తెలుస్తోంది. 2022–23 యాసంగి సీఎమ్మార్ బకాయిలను వసూలు చేస్తున్నాం. ఆ సీజన్కు సంబంధించి మహబూబ్నగర్ జిల్లాలో 71,060 మెట్రిక్ టన్నుల ధాన్యం బస్తాలు మిల్లుల్లో ఉన్నాయి. వీటి విలువ రూ.152 కోట్ల వరకు ఉంటుంది. ఇప్పటికే ఆయా మిల్లర్లకు నోటీసులు అందజేశాం. అందరూ నిర్దేశిత గడువులోగా కట్టాల్సిందే. లేకుంటే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలు తప్పవు. ఈ రెండు రోజుల్లో రూ.21 కోట్లు వసూలయ్యాయి. – రవినాయక్, సివిల్ సప్లయ్ డీఎం, మహబూబ్నగర్ ఎక్సెస్ పేరిట మిల్లర్ల అక్రమాల పర్వం టెండర్ రద్దుతో మిల్లుల వద్దే లక్షలాది మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వానికి బియ్యం అప్పగించకపోవడంతో పంచాయితీ సీరియస్గా తీసుకున్న సర్కార్.. డీఫాల్టర్లపై చర్యలకు ఆదేశాలు విజిలెన్స్ తనిఖీలతో మిల్లర్లలో వణుకు.. పౌర సరఫరాల శాఖలో సైతం.. 2022–23 రబీ సీఎమ్మార్ డబ్బులను త్వరగా చెల్లించేలా.. ధాన్యాన్ని నిబంధనల ప్రకారం అమ్ముకునేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. చాలామంది మిల్లర్లు ఇప్పటికే ధాన్యాన్ని విక్రయించినప్పటికీ డబ్బులు చెల్లించకపోవడం.. మిల్లుల్లో ధాన్యం, బియ్యం లేకపోవడాన్ని ప్రభుత్వం మరింత సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ ఉన్నతాధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. సదరు మిల్లర్లపై రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్) యాక్ట్ ప్రయోగించాలని సూచించినట్లు సమాచారం. అంతేకాదు.. డీఫాల్టు మిల్లులకు సీఎమ్మార్ కేటాయింపులు చేసిన వారిపై క్రిమినల్ కేసుల నమోదుకు విజిలెన్స్ ఉన్నతాధికారులు సమాయత్తమవుతుండడం జిల్లా పౌర సరఫరాల శాఖలో కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 2022–23 రబీ ధాన్యం పంచాయితీ మూడేళ్లుగా కొనసాగుతుండగా.. ఇటీవల సర్కారు సీరియస్గా దృష్టి సారించింది. మిల్లర్లు బకాయి పడిన సీఎమ్మార్ మొత్తం అందజేయాలని, లేకుంటే తీసుకున్న ధాన్యం తిరిగి ఇవ్వాలని.. లేదంటే క్వింటాల్కు రూ.2,260 చొప్పున డబ్బులు చెల్లించాలని తేల్చిచెప్పింది. ఈ మేరకు జిల్లాల వారీగా అధికారులు మిల్లర్లతో సమావేశం నిర్వహించగా.. మెజార్టీ సభ్యులు డబ్బులు కట్టేందుకే మొగ్గు చూపారు. దీంతో నిర్దేశిత గడువు (ఈనెల ఐదో తేదీ లోగా 50 శాతం, సెప్టెంబర్లో 25 శాతం, అక్టోబర్లో మిగిలిన 25 శాతం)లోపు చెల్లించేలా మిల్లర్లతో సంతకాలు తీసుకున్నారు. -
కాంగ్రెస్ వైఫల్యంతో పేదలకు చదువు దూరం
● ఇంజనీరింగ్ విద్యార్థులను సీఎం కించపరచడం సరికాదు ● ఫీజు రీయింబర్స్మెంట్పై బీజేవైఎం ధర్నా.. చెదరగొట్టిన పోలీసులు పాలమూరు: రాష్ట్ర విద్యార్థుల పట్ల సీఎం రేవంత్రెడ్డి చులకన భావంతో మాట్లాడిన అంశంపై నిరసన తెలుపుతుంటే లాఠీచార్జీ చేయించడం దుర్మర్గమని బీజేపీ నాయకులు మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై శనివారం బీజేవైఎం ఆధ్వర్యంలో నగరంలోని తెలంగాణ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా పేద విద్యార్థులకు ఫీజుల బకాయిలను చెల్లించకపోవడం వల్ల వారి చదువు లు ఇబ్బందుల్లో పడ్డాయన్నారు. సీఎం విద్యశాఖ తన దగ్గరే పెట్టుకొని రాష్ట్రంలోని పేద విద్యార్థులకు విద్య అందకుండా దూరం చేస్తున్నారని విమర్శించారు. వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించి విద్యార్థులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం ఆయన తప్పులును కప్పిపుచ్చుకోవడానికి ఇంజనీరింగ్ విద్యార్థులకు దరఖాస్తు రాయడానికి రాదని చెప్పి వారిని కించపరుస్తున్నారన్నారు. తెలంగాణ చౌరస్తాలో ధర్నా చేస్తున్న బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్యకర్తల మధ్య కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీకి చెందిన ముఖ్య నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత టూటౌన్ పోలీస్స్టేషన్కు తరలించి కొంత సమయం వ్యక్తిగత పూచీకతపై వదిలిపెట్టారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు శ్రీనాథ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్, నేతలు సుబ్రహ్మణ్యం, మహేష్, లక్ష్మీనారాయణ, సందీప్, యువ మోర్చా నాయకులు పాల్గొన్నారు. -
తల్లిపాలతో శిశువులకు సంపూర్ణ ఆరోగ్యం
పాలమూరు: తల్లిపాలే శిశువుకు సంపూర్ణ పోషకాహారం ఇస్తుందని, ఆరోగ్యవంతమైన జీవితానికి తొలి పునాది అవుతుందని కలెక్టర్ ఖుష్బూగుప్తా అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు–2026 సందర్భంగా శనివారం నుంచి ఈనెల 7వరకు నిర్వహించనున్న తల్లిపాల వారోత్సవాలను జనరల్ ఆస్పత్రిలోని మాతా శిశు విభాగంలో కలెక్టర్ ప్రారంభించారు. నవజాత శిశువు ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు తల్లిపాలు ఉపయోగపడుతుందన్నారు. శిశువు జన్మించిన తొలి గంటలోనే ముర్రపాలు పట్టించాలని, దీనితో వ్యాధి నిరోధక శక్తి పెంపొందిండంతో పాటు అనేక అంటు వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందన్నారు. పుట్టిన తొలి ఆరు నెలల వరకు శిశువుకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని బాలింతలు, గర్భిణులకు సూచించారు. అనంతరం తల్లిపాలపై ఏర్పాటు చేసిన ర్యాలీని ప్రారంభించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాసులు, సూపరిటెంటెండెంట్ డాక్టర్ రంగా ఆజ్మీరా, జిల్లా సంక్షేమ అధికారిని జరీనా పాల్గొన్నారు. సీపీఓగా బాధ్యతలు స్వీకరించిన నర్సింహులు జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి(సీపీఓ)గా నర్సింహులు బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి కె.రవీందర్ జూలై 31న పదవీ విరమణ చేయడంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేస్తూ, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయంలో గణాంక అధికారిగా విధులు నిర్వహిస్తున్న బి.నర్సింహులను సీపీఓగా నియమించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన కలెక్టర్ ఖుష్బూగుప్తాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రణాళిక, గణాంక విభాగాల పనితీరు మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. నర్సింహులకు జిల్లా అధికారులు, వివిధ శాఖల అధికారులు, గణాంక శాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలో ధార్మిక కార్యక్రమాలు స్టేషన్ మహబూబ్నగర్: తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెలలో ఆధ్యాత్మిక, ధార్మిక, ఉపన్యాస కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు టీటీడీ జిల్లా సమన్వయకర్త డాక్టర్ ఉత్తరపల్లి రామాచారి వెల్లడించారు. శనివారం జిల్లాకేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపంలో కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం పాతపల్లిలోని ఆంజనేయస్వామి దేవాలయంలో ఈనెల 4 నుంచి 8 వరకు, నర్వ మండలంలోని జక్కన్నపల్లిలోని ఆంజనేయస్వామి దేవాలయంలో ఈనెల 18 నుంచి 22వ తేదీ వరకు భజనలు, కుంకుమపూజ, ఉపన్యాసాలు, మహబూబ్నగర్ జిల్లాలోని ఇప్పలపల్లి శ్రీఆంజనేయస్వామి దేవాలయంలో ఈనెల 11 నుంచి 15వ తేదీ వరకు భజనలు, ఉపన్యాసాలు, కుంకుమార్చనలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల భజన మండళ్ల ప్రతినిధులు పాల్గొన్నారు. 14న వేలం పాటలు చిన్నచింతకుంట: ఈ ఏడాది కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా వివిధ రకాల వస్తువులు, సామగ్రి విక్రయించేందుకు ఈ నెల 14వ తేదీన ఆలయం వద్ద బహిరంగవేలం పాటలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ మధనేశ్వరెడ్డి తెలిపారు. లడ్డు, ప్రసాదం, కొబ్బరికాయలు, పూల దండలు, పూజ సామగ్రి, వాహన పూజ సామగ్రి, తలనీలాల సేకరణ, కొబ్బరి చిప్పల సేకరణ, దుకాణదారులకు విద్యుత్ లైటింగ్ వసతి కల్పించుట, రంగుల రాట్నం, ,ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకునేందుకు ఈ వేలం పాటలు నిర్వహించేలా దేవాదాయశాఖ నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఆసక్తి ఉండి ఈ వేలం పాటలలో పాల్గొన దలచినవారు కొబ్బరికాయలు, లడ్డు ప్రసాదం, తలనీలాలు, రంగు రాట్నం, ఎగ్జిబిషన్ ఏర్పాటు కోసం రూ.5లక్షల డీడీ, పూలు, పూలదండలు, టెంకాయల చిప్పల సేకరణ, విద్యుత్ లైటింగ్ వసతి కల్పించేందుకు రూ.2 లక్షల డీడీ తీసుకొని రావాలని ఈఓ తెలిపారు. -
పేస్కేల్ను అమలు చేయాలి..
ఉపాధి సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ప్రతినెల క్రమం తప్పకుండా వేతనాలివ్వాలి. గతేడాది సీఎం రేవంత్రెడ్డి పేస్కేల్ అమలు చేస్తామని చెప్పారు. కానీ నేటికీ అమలు చేయలేదు. ఇప్పటికై నా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. లేకపోతే సమ్మెబాట తప్పదు. – రాజశేఖర్రెడ్డి, వీబీజీ రాంజీ, ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ రెగ్యులర్ లేదా సెర్ప్ ఉద్యోగుల మాదిరిగా టైం స్కేల్ ఇస్తేనే మాకు న్యాయం జరుగుతుంది. ఒకే కేడర్లో చాలా ఏళ్లుగా పనిచేస్తున్నా.. అంతే జీతంతో పని చేయడం కష్టంగా ఉంది. కిందిస్థాయి కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వారి కుంటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. – విజయ్భాస్కర్, జేఏసీ కో చైర్మన్ 2024 ఫిబ్రవరి 2న ఈజీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇంద్రవెల్లిలో ఉపాధి హామీ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం ఇచ్చిన ఆ హామీని నిలబెట్టుకోవాలి. 3 నెలల నుంచి జీతాలు రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. సకాలంలో వేతనాలు చెల్లించాలి. మా డిమాండ్ పరిష్కరించాలి. –ఎం.శాంతికుమార్, జిల్లా జేఏసీ ప్రచార కార్యదర్శి ● -
ఉద్యమకారులను విస్మరిస్తే ఉద్యమిస్తాం
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): తెలంగాణ ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తే మరో ఉద్యమం తప్పదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డా.పిడమర్తి రవి హెచ్చరించారు. శుక్రవారం ఆర్అండ్బీ అతిథి గృహంలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వాలని.. కేకే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ ప్రక్రియను వేగవంతం చేసి, ఉద్యమకారులను గుర్తించాలన్నారు. మొదట్లో మూడు నెలల సమయం పెట్టి.. ఇప్పుడు కాలయాపన చేసేందుకు డిసెంబర్ వరకు కమిటీ టైం బాండ్ పెట్టడం ఉద్యమకారులను విస్మరించేందుకేనని అరోపించారు. ఉద్యమకారులుగా ఉన్న తమకు రావాల్సిన హక్కుల కోసం పోరాడుతామన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేదుకు సెప్టెంబర్ 16న హైదరాబాద్లోని ఓయూలో ఉద్యమకారుల అపూర్వ సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా నుంచి ఉద్యమకారులు పెద్దఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఉద్యమకారుల సంఘం జిల్లా కోకన్వీనర్ నాచ శ్రీనివాస్ యాదవ్, ఓయూ జేఏసీ అధ్యక్షుడు రహీం, బీసీ జేఏసీ నాయకులు మైత్రి యాదయ్య, అన్వర్, గోపాల్ మాదిగ, బుర్ర సురేశ్ ఉన్నారు. -
నల్లమలకు బుల్లెట్ రైల్
● శంషాబాద్, ఫ్యూచర్ సిటీ, సోమశిల, కర్నూలు నుంచి బెంగళూరుకు.. ● గతంలో ప్రతిపాదించిన మార్గంలో కీలక మార్పులు ● సవరించిన వాటిని ఖరారు చేయాలని కేంద్రానికి రాష్ట్రం వినతి ● సాకారమైతే పర్యాటకంగా.. అభివృద్ధి పరంగా కీలక ముందడుగు ●శంషాబాద్, ఫ్యూచర్ సిటీ, ఆమనగల్, మన్ననూర్, సోమశిల మీదుగా కర్నూలు, బెంగళూరు హైస్పీడ్ రైలు కారిడార్కు సంబంధించి సాధ్యాసాధ్యాల అధ్యయనం జరిగింది. పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చెందుతున్న నల్లమల గుండా రూట్ మ్యాప్ను ఖరారు చేసిన సీఎం రేవంత్రెడ్డి, కేంద్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. సీఎం ఆదేశాల మేరకు శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ ప్రారంభమయ్యే బ్రాహ్మణపల్లి వద్ద హైస్పీడ్ రైల్వే స్టేషన్కు స్థల పరిశీలన చేశాం. తుది అలైన్మెంట్ ఖరారు చేశారు. రావిర్యాల– ఆమనగల్ రతన్టాటా గ్రీన్ ఫీల్డ్ హైవే నుంచి ప్రతిపాదించడం వల్ల భూసేకరణ సమస్య కూడా లేదు. – వంశీకృష్ణ ఎమ్మెల్యే, అచ్చంపేట అచ్చంపేట: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన హైదరాబాద్– బెంగళూరు బుల్లెట్ రైల్ మార్గం నల్లమల మీదుగా ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరు మార్గంలో హైస్పీడ్ రైలులైన్ల అలైన్మెంట్లో కీలక మార్పులు చేస్తూ వాటినే ఖరారు చేయాలని కేంద్రానికి విన్నవించింది. మొదట కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసిన రూట్ మ్యాప్ ప్రకారం శంషాబాద్, మహబూబ్నగర్, కర్నూలు మీదుగా 218 కి.మీ., మార్గంలో 3 స్టేషన్లు ఏర్పాటు చేస్తూ ప్రతిపాదించారు. తాజాగా ఈ మార్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం శంషాబాద్, భారత్ ఫ్యూచర్ సిటీ, ఆమనగల్, మన్ననూర్, సోమశిల, కర్నూలు మీదుగా రైల్వే లైన్ అలైన్మెంట్ను నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్)కు కీలక సవరణలు చేస్తూ నివేదించినట్లు తెలిసింది. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలుపుతూ మార్పులు చేసిన అలైన్మెంట్ ఖరారు చేయాలని కోరింది. దీంతో హైదరాబాద్– బెంగుళూరు హైస్పీడ్ రైల్వే లైన్ అలైన్మెంట్ ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే నల్లమల ప్రాంతానికి మంచి రోజులు రాబోతున్నారు. మూడు హైస్పీడ్ రైలు కారిడార్లకు శంషాబాద్ ప్రాంతం హబ్గా మారనుండటంతో భారత్ ఫ్యూచర్ సిటీ, మన్ననూర్, సోమశిలలో నల్లమల హైస్పీడ్ రైలు స్టేషన్లుగా మార్చనున్నారు. పర్యాటకానికి ఊతమిచ్చేలా.. నల్లమలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు వీలుగా హైస్పీడ్ రైలు కారిడార్ ప్రణాళికలు ఉండాలన్న సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు ఈ అలైన్మెంట్ మార్పులు చేసినట్లు తెలిసింది. భూ సేకరణలో తలెత్తే సమస్యలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వంద మీటర్ల వెడల్పుతో రూ.4,030 కోట్లతో ప్రారంభమైన ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ రావిర్యాల– ఆమనగల్ (ఆకుతోటపల్లి) 41.5 కి.మీ., గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్డుకు సమాంతరంగా హైస్పీడ్ రైల్వేలైన్ నిర్మిస్తే కొత్త ప్రాంతాలకు రైలు కనెక్టివిటీ ఏర్పడుతుందని భావిస్తోంది. ఈ మార్గాన్ని ఆకుతోటపల్లి నుంచి మన్ననూర్– శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ అనుసంధానం కానుంది. ప్రాథమిక ప్రతిపాదనల ప్రకారం ఈ కారిడార్ శంషాబాద్, భారత్ ఫ్యూచర్ సిటీ, ఆమనగల్, మన్ననూర్, సోమశిల జాతీయ రహదారి–167కేలోని మల్లేశ్వరం– సిద్ధేశ్వరం ఐకానిక్ వంతెన మీదుగా కర్నూలు వెళ్లనుంది. ఏపీ ప్రభుత్వం కూడా ఈ రైల్వేలైన్ అలైన్మెంట్ను కర్నూలు నుంచి ధర్మవరం, పుట్టపర్తి మీదుగా ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిసింది. మహబూబ్నగర్ మున్సిపాలిటీ: బుల్లెట్ రైలు (హైస్పీడ్ ట్రెయిన్)కు సంబంధించి రూట్ అలైన్మెంట్ను ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా ఉండేలా మార్చాలని టీపీసీసీ అధికార ప్రతినిధి గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం సీఎం రేవంత్రెడ్డికి బహిరంగ లేఖను పంపించారు. రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన కొత్త రూట్ ప్రకారం శంషాబాద్ నుంచి బయలుదేరే ఈ రైలు మొదటగా ఫ్యూచర్ సిటీ – ఆమన్గల్ – మన్ననూరు – శ్రీశైలం – సోమశిల మీదుగా బెంగళూర్ వెళ్తుందన్నారు. వాస్తవానికి శంషాబాద్ – ఫ్యూచర్ సిటీ చాలా దగ్గరనే ఉంటాయన్నారు. ఇక ఆమన్గల్, మన్ననూరు చిన్న పట్టణాలు కాగా శ్రీశైలం మాత్రమే ప్రముఖ పుణ్యక్షేత్రమని, ఇప్పటికే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఒక హైవే రోడ్డు ఇంచుమించు ఇటువైపు నుండే వెళ్తుందన్నారు. ఈ రూట్కు బదులుగా శంషాబాద్ నుంచి షాద్నగర్ – జడ్చర్ల – మహబూబ్నగర్ – దేవరకద్ర – ఆత్మకూరు – శ్రీరాంనగర్ – మదనాపురం – గద్వాల – అలంపూర్ – కర్నూలు మీదుగా బెంగళూరు వెళ్తే ఉమ్మడి జిల్లావాసులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్– బెంగళూరు హైస్పీడ్ రైలు మార్గానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే డీపీఆర్ రూపకల్పనకు ప్రైవేట్ సంస్థకు అప్పగించినట్లు తెలుస్తోంది. హైస్పీడ్ రైలు మార్గాన్ని గ్రీన్ఫీల్డ్ హైవే మార్గంలోనే అధిక భాగం వచ్చేలా చేయడం వల్ల భూ సేకరణ, పర్యావరణ సమస్యలను అధిగమించేలా ఈ మార్గం ఉత్తమమైనదిగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ రైలు మార్గం నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్కు పంపించి.. అలైన్మెంట్, స్టేషన్ల స్థానాలను ఖరారు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. -
సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టండి
● జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో 3 గంటల పాటు కలెక్టర్ సుడిగాలి పర్యటన జడ్చర్ల: కలెక్టర్ ఖుష్బూగుప్తా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో మూడు గంటల పాటు సుడిగాలి పర్యటన చేశారు. తెలంగాణ గిరిజన మినీ గురుకులం, జడ్చర్ల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రులను తనిఖీ చేశారు. మొదటగా తెలంగాణ గిరిజన సంక్షేమ పాఠశాలకు చేరుకున్న కలెక్టర్ సిబ్బంది హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. తరగతి గదులకు వెళ్లి పరిస్థితిని స్వయంగా గమనించారు. ఈ సందర్భంగా 4వ తరగతి విద్యార్థులతో ఆమె మాట్లాడి విషయాలు అడిగి తెలుసుకున్నారు. అల్పాహారం, మధ్యాహ్న భోజనం నాణ్యత, మెనూ ప్రకారంగా ఆహారాన్ని అందిస్తున్నారా అనే విషయాలపై ఆరా తీశారు. దోమల సమస్య తీవ్రంగా ఉందని, కొన్ని తరగతి గదులలో ఫ్యాన్లు పనిచేయడం లేదని, కిటికీలకు తలుపులు లేవని పలువురు విద్యార్థులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన కలెక్టర్ సాయంత్రంలోగా ఫ్యాన్లు ఏర్పాటుచేయాలని, కిటికీలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఫాగింగ్ చేయించాలన్నారు. సీసీ కెమెరాల పనితీరుతో పాటు వంట గదులను తనిఖీ చేసి భోజనం, కూరగాయల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. అనంతరం జడ్చర్ల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేసి, ప్రధాన కారిడార్, వార్డులు, క్యాజువాలిటీ, లేబర్ రూమ్ విభాగాలను పరిశీలించారు. ఆస్పత్రి వెలుపల, లోపల ఎప్పటికప్పుడు పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్రసూతి వార్డులో బాలింతలతో మాట్లాడి వారికి అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలో సిగ్నల్గడ్డ–నేతాజీ చౌరస్తా రోడ్డుపై నిర్మాణంలో ఉన్న వరద కాల్వ నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రజలకు అసౌకర్యం కలుగకుండా వేగవంతంగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తహసీల్దార్ నర్సింగరావు, మున్సిపల్ కమిషనర్ గిరీష్కుమార్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహ్మద్ హర్షదుల్లా, తదితరులు పాల్గొన్నారు. -
‘భగీరథ’ లోపాలను సరిదిద్దాలి
మహమ్మదాబాద్: మిషన్ భగీరథ నీటిసరఫరాలో లోపాలను సరిదిద్దాలని అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ పేర్కొన్నారు. శుక్రవారం నంచర్లలో మిషన్ భగీరథ వ్యవస్థను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన నీటిశుద్ధి, పంపింగ్ వ్యవస్థ, నిల్వ ట్యాంకులు, పైప్లైన్ల పనితీరును పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పైప్లైన్ లీకేజీలు, సాంకేతికలోపాలు, మరమ్మతులపై ఆరా తీశారు. నీటిసరఫరాలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని సమస్యలను గుర్తించి వెంటనే సరిదిద్దాలని అధికారులకు సూచించారు. అనంతరం సిబ్బంది హాజరు, విధుల నిర్వహణను పరిశీలించారు. అలాగే నంచర్ల గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం, హాస్టల్ సౌకర్యాలు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి, విద్యాబోధనపై ఆరాతీశారు. పరిసరాలను పరిశీలించిన విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. వెంట మిషన్ భగీరథ డీఈ వెంకటేశ్వర్లు, ఏఈ అనిల్, ఎంపీడీఓ నరేందర్రెడ్డి, ప్రిన్సిపల్ రమా, సిబ్బంది పాల్గొన్నారు. -
దేశంలో సమగ్రమైన విద్యావిధానం ఉండాలి
స్టేషన్ మహబూబ్నగర్: విద్యార్థులందరికీ ఉపయోగపడేలా దేశంలో సమగ్రమైన విధ్యావిధానం ఉండాలని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ అన్నారు. జవహర్ బాల్ మంచ్ జిల్లా చైర్మన్ ఎన్.సుదర్శన్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాకేంద్రంలోని వాగ్దేవి జూనియర్ కళాశాలలో ఛాత్రోంకి గూంజ్ (విద్యార్థుల గళం) సంతకాల కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కొత్వాల్ మాట్లాడుతూ సమాజంలోని సమస్యలపై ప్రశ్నించేతత్వాన్ని విద్యార్థులు అలవర్చుకోవాలని సూచించారు. ప్రశ్నించకుండా ఉంటే సమస్యలు పరిష్కారం కావని అన్నారు. చదువుతో పాటు సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేయడం కూడా నేర్చుకోవాలన్నారు. మరో ముఖ్య అతిథి డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం వారి గొంతుకను ప్రభుత్వానికి వినిపించేందుకు ఈ సంతకాల సేకరణ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణలో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. జేబీఎం జిల్లా కన్వీనర్ సుదర్శన్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో జేబీఎం ఆధ్వర్యంలో ఛాత్రోంకి గూంజ్ సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర అక్తర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, నాయకులు చంద్రకుమార్గౌడ్, మధుసూదన్రెడ్డి, కార్పొరేటర్ ఉమర్ కొత్వాల్, వాగ్దేవి కళాశాల డైరెక్టర్ వెంకట్రెడ్డి, హెచ్ఓడీ షాకీర్, జేబీఎం కన్వీనర్లు ప్రసాద్, కిషోర్ కుమార్ పాల్గొన్నారు. టీజీఎంఎఫ్సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ -
తప్పుడు పోస్టులు పెడితే కఠినచర్యలు
మహబూబ్నగర్ క్రైం: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజా ప్రశాంతతను దృష్టిలో పెట్టుకొని శనివారం నుంచి ఆగస్టు 30వరకు జిల్లావ్యాప్తంగా 30–పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని ఎస్పీ డి.జానకి ఒక ప్రకటనలో తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, ఊరేగింపులు, బహిరంగ సభలు, నిర్వహించరాదని సూచించారు. సోషల్ మీడియా వేదిక ద్వారా తప్పుడు ప్రచారం, వందతులు, మత విద్వేషాలు, సామాజిక ఉద్రిక్తతలకు దారి తీసే పోస్టులు, వీడియోలు ప్రసారం చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. యూనివర్సిటీ అంతర్గత విషయాల్లో జోక్యం తగదు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: బయటి వ్యక్తులు యూనివర్సిటీ అంతర్గత విషయాల్లో జోక్యం తీసుకోవడం తరగదని ఏబీవీపీ నాయకులు పేర్కొన్నారు. పీయూలో వారు మాట్లాడుతూ బయటి వ్యక్తులు యూనివర్సిటీ అంతర్గత విషయాలపై జోక్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సెమినార్ నిర్వహించే అంశం పూర్తిగా యూనివర్సిటీకి సంబంధించిందని, వీసీ శ్రీనివాస్పై ఒత్తిడి చేయడం యూనివర్సిటీ స్వ యం ప్రతిపత్తిని దెబ్బతీయడమే అన్నారు. వీసీని ఇబ్బందికరంగా మాట్లాడిన వారు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నాయకులు కావలి కిషోర్, రవితేజ, మహేశ్వరి, హరికృష్ణ, సురేష్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఉత్సాహంగా గోగేమ్ క్రీడాకారుల ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మాస్టర్ మైండ్స్ స్కూల్లో శుక్రవారం తెలంగాణ రాష్ట్రస్థాయి గోగేమ్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి దాదాపు 60 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గులాం అఫ్రోజ్, సీనియర్ ఉపాధ్యక్షులు మహ్మద్ షకీల్ అహ్మద్ తెలిపారు. వీరికి సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో గోగేమ్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించినట్లు తెలిపారు. ఎంపికయ్యే క్రీడాకారులు మహారాష్ట్ర షిరిడీలో సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరిగే జాతీయస్థాయి గోగేమ్ టోర్నమెంట్లో పాల్గొంటారని తెలిపారు. -
లారీని ఢీకొట్టిన కారు.. యువకుడు సజీవ దహనం
మహబూబ్నగర్: కర్నూల్ జిల్లా గుత్తిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరికల్ మండలానికి చెందిన ఓ యువకుడు సజీవంగా దహనమైన ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మండలంలోని బూడెగానితండాకు చెందిన రవినాయక్ (35)తో పాటు గాజులయ్యతండాకు చెందిన దేఘావత్ జాడోనాయక్, రవినాయక్ కలిసి బుధవారం రాత్రి కారులో కర్నూల్ జిల్లా గుత్తికి వెళ్లారు. గురువారం తెల్లవారుజామున గుత్తి శివారులో జాతీయ రహదారిపై వెళ్తున్న లారీని వెనక నుంచి వీరి కారు ఢీకొట్టింది. కారులో డీజిల్ డబ్బాలు ఉండటంతో మంటల చెలరేగాయి. గాజులయ్యతండాకు చెందిన జాడోనాయక్, రవినాయక్ కారులో నుంచి బయటకు దూకేయగా.. డ్రైవింగ్ చేస్తున్న బూడెగానితండాకు చెందిన రవినాయక్ అందులో ఇరుక్కుపోయాడు. కారుకు మంటలు తీవ్రంగా వ్యాపించడంతో కారుతో పాటే సజీవంగా దహనమయ్యాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
వరి ధాన్యం బస్తాల వ్యత్యాసంపై విచారణ
మహబూబ్నగర్ రూరల్/ హన్వాడ: జిల్లాలోని హన్వాడ మండలం ఇబ్రహీంబాద్ సమీపంలోని శ్రీ లక్ష్మీ బాలాజీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో వరి ధాన్యం బస్తాల వ్యత్యాసం వ్యవహారం జిల్లాలో ప్రాధాన్యం సంతరించుకుంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో రికార్డులు, భౌతిక నిల్వల మధ్య రూ.11.34 కోట్ల విలువైన ధాన్యానికి సంబంధించిన వ్యత్యాసం గుర్తించిన నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ విచారణను వేగవంతం చేసింది. సాంకేతిక లోపమా, నిబంధనల ఉల్లంఘన జరిగిందా, లేక మరేదైనా కారణమా అన్న కోణాల్లో అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. 2022–23 ఖరీఫ్ సీజన్కు సంబంధించిన 5,070.88 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. మిల్లు యాజమాన్యం ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తంలో రూ. 5 కోట్లకు పైగా ఇప్పటికే చెల్లించినట్లు, ఆన్లైన్ చెల్లింపుల రికార్డులు, ఇన్సాయిస్లు అందుబాటులో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు సమాచారం. అయితే పౌర సరఫరాల శాఖ నుంచి తప్పనిసరిగా పొందాల్సిన రిలీజింగ్ ఆర్డర్ (ఆర్ఓ) తీసుకోకుండానే నిల్వలను తరలించినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. దీంతో రికార్డులు, భౌతిక నిల్వల మధ్య వ్యత్యాసం ఏర్పడినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ అంశంపై పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ ప్రసాద్లాల్ జిల్లాలో పర్యటించి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ, నిల్వలు, మిల్లుల నిర్వహణ, నిబంధనల అమలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి గంప శ్రీనివాస్ మాట్లాడుతూ విజిలెన్స్ తనిఖీలు ఇప్పటికే పూర్తయ్యాయని, జిల్లా మేనేజర్ నివేదిక, విజిలెన్స్ నివేదికలు అందిన తర్వాత శాఖాపరంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. విచారణలో భాగంగా ధాన్యం చెల్లింపులు, ఆర్ఓ జారీ ప్రక్రియ, నిల్వల కదలికలు, ప్రభుత్వ రికార్డులు, మిల్లు నిర్వహణకు సంబంధించిన అన్ని పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. తుది నివేదికలో తేలే అంశాల ఆధారంగా శాఖాపరమైన, చట్టపరమైన చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్ఓ అంటే ఏమిటి? రైస్ మిల్లులకు ప్రభుత్వం కేటాయించిన ఽధాన్యాన్ని మిల్లింగ్ పూర్తి చేసిన తర్వాత, సంబంధిత నిల్వలను తరలించేందుకు పౌర సరఫరాల శాఖ నుంచి రిలీజింగ్ ఆర్డర్ తప్పనిసరిగా జారీ కావాలి. ఈ ఉత్తర్వు వచ్చిన తర్వాతే ఽధాన్యం లేదా బియ్యాన్ని నిర్ణీత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంటుంది. ఆర్ఓ లేకుండా నిల్వలను తరలిస్తే అది నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారు. ప్రస్తుతం శ్రీ లక్ష్మీ బాలాజీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కేసులో కూడా ఇదే అంశం ప్రధానంగా విచారణలో ఉంది. ఇది కేవలం సాంకేతిక ఉల్లంఘన మాత్రమేనా? లేక మరేదైనా అక్రమం జరిగిందా ? అనే విషయాన్ని అధికారులు తేల్చనున్నారు. రూ. 11.34 కోట్ల విలువైన నిల్వల తేడాపై లోతైన పరిశీలన విజిలెన్స్, పౌర సరఫరాల శాఖ వేర్వేరుగా దర్యాప్తు నివేదికల తర్వాతే చర్యలు -
జోగుళాంబ క్షేత్రం పార్కింగ్ వేలం రూ. 79.25లక్షలు
అలంపూర్: జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి క్షేత్రంలో వాహనాల పార్కింగ్ రుసుం వసూలు, టెంకాయలు, పూజా సామగ్రి విక్రయానికి సంబంధించి గురువారం హైదరాబాద్లోని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ కమిషనర్ కార్యాలయంలో వేలం నిర్వహించారు. వాహనాల పార్కింగ్ రుసుం వసూలుకు సంబంధించి ఆరుగురు టెండర్లు దాఖలు చేయగా.. ఈఓ రంగారావు పర్యవేక్షణలో వేలం నిర్వహించినట్లు ఆలయ ఈఓ దీప్తి తెలిపారు. వేలంలో హైదరాబాద్కు చెందిన బి.సురేశ్కుమార్ అందరి కంటే ఎక్కువ కోడ్ చేసి రూ. 79.25లక్షలకు దక్కించుకున్నట్లు పేర్కొన్నారు. గతం కంటే రూ. 9.25 లక్షల ఆదాయం అదనంగా సమకూరినట్లు తెలిపారు. అదే విధంగా టెంకాయలు, పూజా సామగ్రి విక్రయం, చీరల నిర్వహణకు సంబంధించి గతం కంటే తక్కువగా టెండర్లు దాఖలు చేయడంతో వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. రెండు టెండర్లకు త్వరలోనే వేలం నిర్వహిస్తామన్నారు. కాగా, గతంలో అలంపూర్ ఆలయాల్లోనే వేలం నిర్వహించే వారు. అయితే గతం కంటే తక్కువగా టెండర్లు దాఖలు చేయడంతో 6 సార్లు వాయిదా పడ్డాయి. దీంతో నిబంధనల మేరకు దేవాదాయ, ధర్మాదాయశాఖ కమిషనర్ కార్యాల యంలో వేలం నిర్వహించినట్లు ఈఓ తెలిపారు. -
కృష్ణమ్మకు జలకళ
● జూరాల ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తివేత ● 11 యూనిట్లలో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి ● శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరవళ్లు జూరాల ప్రాజెక్టు ముందు సెల్ఫీ దిగుతున్న పర్యాటకులు జూరాల సమాంతర కాల్వకు జలకళ గద్వాల/ఆత్మకూరు/అమరచింత/ధరూర్/ఎర్రవల్లి/కొల్లాపూర్ రూరల్: ఎగువప్రాంతంలో భారీ వర్షాలు కురస్తుండడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ జూరాలకు వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ఎగువ నుంచి 90,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. 12 క్రస్టు గేట్లను ఎత్తి 39,190 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గురువారం 11 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 6 యూనిట్లలో 234 మెగావాట్లు, దిగువలో 5 యూనిట్ల ద్వారా 200 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేపట్టారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటివరకు 7.704 ఎంయూ విజయవంతంగా విద్యుదుత్పత్తిని చేపట్టారు. దిగువ జూరాలలోని ఒక యూనిట్లో సాంకేతిక సమస్య తలెత్తిందని వారంలోగా సమస్యను పరిష్కరించి పూర్తిస్తాయిలో ఉత్పత్తి చేపడుతామని అధికారులు వెల్లడించారు. విద్యుదుత్పత్తి కోసం 38,712 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. అలాగే నెట్టెంపాడు కాల్వకు 750 క్యూసెక్కులు, భీమా–1కు 1,300 క్యూసెక్కులు, భీమా–2కు 750 క్యూసెక్కులు కోయిల్సాగర్కు 315 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వకు 870 క్యూసెక్కులు, ప్రధాన కుడి కాల్వకు 500 క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 600 క్యూసెక్కులు వదులుతున్నారు. మొత్తంగా ప్రాజెక్టు నుంచి 89,487 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. – ప్రధాన కాల్వలకు నీటిని విడుదల చేస్తుండంతో జలకళను సంతరించుకుంది. ఈ సీజన్లో మొదటిసారి ప్రాజెక్టు గేట్లు తెరవడంతో పర్యాటకులు తరలివచ్చారు. కృష్ణమ్మ జల సవ్వడులను చూస్తూ ఆనందం వ్యక్తం చేశారు. సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. క్రస్టుగేట్లు, విద్యుదుత్పత్తి ద్వారా కలిపి దాదాపు 80వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతుండడంతో బీచుపల్లి, సోమశిల వద్ద కృష్ణానది పరుగులు పెడుతోంది. సోమశిలకు అవతలి ఒడ్డున ఉన్న సంగమేశ్వర ఆలయం సమీపానికి వరద నీరు వచ్చింది. వేపలింగం పరిసరాలు మునిగి పోయాయి. ప్రస్తుతం నదిలోకి ఎవరూ వెళ్లవద్దని బోటు యజమానులకు అధికారులు సూచించారు. సోమశిల దగ్గర కృష్ణానదికి వస్తున్న వరద నీటితో కళకళలాడుతున్న జూరాల ప్రధాన ఎడమ కాల్వ -
అందరి మేలు కాంక్షించడమే నిజమైన ధర్మం
కల్వకుర్తి రూరల్: సమాజంలోని అందరికీ మేలు జరగాలని కోరుకోవడమే నిజమైన ధర్మమని వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు సిద్దా సూర్యప్రకాశరావు అన్నారు. కల్వకుర్తి పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ గ్రౌండ్లో గురువారం నిర్వహించిన 91వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ మానవాళి సుఖ సంతోషాలతో జీవించాలనే సంకల్పంతో చేస్తున్న యాగంతో అందరికీ మేలు చేకూరుతుందన్నారు. ప్రస్తుతం సమాజంలో స్వార్థం పెరిగి, దైవభావం తగ్గిందన్నారు. దైవంపై భక్తి పెంచుకోవడంతో పాటు సమాజానికి.. లోక కల్యాణానికి పాటుపడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు హోమాలు, యాగాలు సంస్కృతిని కాపాడుతున్నాయని అన్నారు. కార్యదర్శి దర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సమాజ హితమే మతమని, ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించడం ఎంతో మంచి విషయమన్నారు. సామా జిక సేవలకు కేరాఫ్ అడ్రస్గా వాసవీ క్లబ్ తనవంతు పాత్ర పోషిస్తుందని చెప్పారు. వా సవీ క్లబ్ ఇంటర్నేషనల్ సెక్రెటరీ సర్వీసెస్ జూ లూరు రమేష్ బాబు మాట్లాడుతూ..16 రో జులపాటు నిర్వహిస్తు న్న విశ్వశాంతి మహాయాగంతో ప్రజలందరూ సుఖ సంతోషాల తో జీవించాలని ఆకాంక్షించారు. విశ్వశాంతి మహాయాగంతో ఆధ్యాత్మిక వైభవం ఏర్పడిందన్నారు. కాగా, శ్రీలక్ష్మీ హోమం, దేవసూక్త హోమం, శ్రీలక్ష్మీ నారాయణ సుదర్శన హోమంతో పాటు సామూహిక కుంకుమార్చనలను భక్తిశ్రద్ధలతో నిర్వ హించారు. మున్సిపల్ చైర్మన్ బృంగి రత్నమాల ఆనందకుమార్ దంపతులు హోమం చేశారు. భక్తులందరికీ శ్రీకృష్ణజ్యోతి స్వరూపానంద స్వామి ప్రవచనాలు చెప్పారు. క్లబ్ డిస్ట్రిక్ట్ వి 108 ఏ గవర్నర్ కల్మిచర్ల రమేశ్, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కల్వ హరికృష్ణ, సెక్రటరీ చంద్రశేఖర్, కోశాధికారి చిదిరే శ్రీనివాస్, డిప్యూటీ గవర్నర్ ప్రవీణ్, మాజీ గవర్నర్ మేడిశెట్టి రామకృష్ణ, గుగ్గిల శంకర్, కల్మిచర్ల గోపాల్, చిగుళ్లపల్లి శ్రీధర్, జూలూరు సత్యం, వాసవీ క్లబ్ కల్వకుర్తి అధ్యక్షుడు బాదం హరీష్, సాయిలక్ష్మి, కార్యదర్శులు గోవిందు సంతోష్, గోవిందు, మౌనిక, జూలూరు ప్రకాష్, పోల సురేందర్, వాసా శేఖర్, సతీష్, మురళి పాల్గొన్నారు. -
వేరుశనగ రైతుల ఆందోళన
అయిజ: తమకు నకిలీ వేరుశనగ విత్తనాలు కట్టబెట్టి వ్యాపారి నిలువునా మోసం చేశారని ఆరోపిస్తూ రైతులు గురువారం పట్టణంలోని దుకాణం ఎదుట పంట మొక్కలు పట్టుకొని నిరసన తెలిపారు. బాధిత రైతులు తెలిపిన వివరాలు.. మున్సిపాలిటీ పరిధిలోని పర్ధిపురం గ్రామానికి చెందిన తిమ్మప్పగౌడ్ అయిజ మున్సిపాలిటీ 1వ వార్డు కౌన్సిలర్ తిరుమలేష్ దుకాణంలో వేరుశనగ పంట సాగు చేసేందుకు 2 ఎకరాలకు సరిపడా విత్తనాలు కొనుగోలు చేశాడు. సుమారు రూ.1.30 లక్షలు పెట్టుబడి పెట్టామని, మొక్కలకు వేరుశనగ కాయలు తక్కువగా ఉండి దిగుబడి పడిపోయిందని వాపోయారు. ఎకరాకు 40 బస్తాలు దిగుబడి రావాల్సి ఉండగా.. కేవలం 5 బస్తాలే వచ్చిందన్నారు. వ్యాపారి నకిలీ విత్తనాలు విక్రయించడంతోనే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని రైతు కుంటుంబ సభ్యులు తిమ్మప్పగౌడ్, సువర్ణ, మహేంద్రగౌడ్ దుకాణం ఎదుట నిరసన వ్యక్తం చేస్తూ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై విత్తన విక్రయదారుడు తిరుమలేష్ను వివరణ కోరగా.. ఆ రైతుకు నేను విత్తనాలు విక్రయించలేదన్నారు. రైతులు, వేరుశనగ విక్రయదారుడు ఒకరిపై మరొకరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపిన అనంతరం చర్యలు తీసుకుంటామని ఏఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. -
మన్యంకొండలో హుండీ లెక్కింపు
మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో గురువారం హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారి హుండీ ద్వారా రూ. 50,22,837 ఆదాయం వచ్చినట్లు దేవస్థానం అధికారులు వెల్లడించా రు. హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. హుండీ పర్యవేక్షణ అధికారిగా నిత్యానందచారి వ్యవహరించారు. ఎస్బీఐ దేవరకద్ర శాఖ, మహబూబ్నగర్ సత్యసాయి సేవా సమితి సభ్యులు, దేవస్థానం సిబ్బంది పాల్గొని హుండీ నగదు లెక్కింపును పారదర్శకంగా పూర్తి చేశారు. భక్తులు సమర్పించిన కానుకలతో దేవస్థానానికి రూ.50.22 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. -
పాముకాటుకు విద్యార్థి బలి
అయిజ: పాముకాటుకు గురై విద్యార్థి మృతిచెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. గ్రామ స్తుల కథనం ప్రకారం.. మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన తిమ్మప్ప, జయలక్ష్మి దంపతుల కుమారుడు తిరుమలేష్ (14) శాంతినగర్లోని ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. బుధవారం రాత్రి ఇంట్లో పడుకున్నాడు. అర్ధరాత్రి నిద్రలో పాము కాటువేసింది. గుర్తించిన తల్లిదండ్రులు పామును చంపి, బాలుడిని తనగలకు తీసుకెళ్లి, నాటువైద్యం చేయించారు. పరిస్థితి మెరుగుపడక పోవడంతో అక్కడి నుంచి అయిజ పీహెచ్సీకి తీసుకెళ్లారు. పీహెచ్సీ సిబ్బంది ప్రథమ చికిత్స చేసి గద్వాలకు రెఫర్ చేశారు. వెంటనే గద్వాల ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించిందని, కర్నూలు ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యసిబ్బంది సూచించారు. అక్కడి నుంచి కర్నూలు ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ గురువారం తెల్లవారుజామున మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు. మృతదేహానికి కర్నూలు ఆస్పత్రిలో పోస్ట్మార్టం అనంతరం స్వగ్రామానికి తరలించి, అంత్యక్రియలు నిర్వహించారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు సజీవ దహనం మరికల్: కర్నూల్ జిల్లా గుత్తిలో జరిగిన రోడ్డు ప్ర మాదంలో మండలానికి చెందిన ఓ యువకుడు సజీవంగా దహనమైన ఘట న చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలి పిన వివరాలు.. మరికల్ మండలంలోని బూడెగానితండాకు చెందిన రవినాయక్ (35)తో పాటు గాజులయ్యతండాకు చెందిన దేఘావత్ జాడోనాయక్, రవినాయక్ కలిసి బుధవారం రాత్రి కారులో కర్నూల్ జిల్లా గుత్తికి వెళ్లారు. గురువారం తెల్లవారుజామున గుత్తి శివారులో జాతీయ రహదారిపై వెళ్తున్న లారీని వెనక నుంచి వీరి కారు ఢీకొట్టింది. కారులో డీజిల్ డబ్బాలు ఉండటంతో మంటల చెలరేగాయి. గాజులయ్యతండాకు చెందిన జాడోనాయక్, రవినాయక్ కారులో నుంచి బయటకు దూకేయగా.. డ్రైవింగ్ చేస్తున్న బూడెగానితండాకు చెందిన రవినాయక్ అందులో ఇరుక్కుపోయాడు. కారుకు మంటలు తీవ్రంగా వ్యాపించడంతో కారుతో పాటే సజీవంగా దహనమయ్యాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాలతో వివాహిత బలవన్మరణం అచ్చంపేట రూరల్: కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన అచ్చంపేట మండలం బొమ్మనపల్లిలో గురువారం చోటు చేసుకుంది. సిద్దాపూర్ ఎస్ఐ అంజయ్య వివరాల ప్రకారం... బొమ్మనపల్లికి చెందిన జల్లెల మహేశ్తో ఐదేళ్ల క్రితం పదర గ్రామానికి చెందిన మంజుల (25)కు వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. గురువారం ఉదయం తన అత్త లక్ష్మమ్మతో కుటుంబ విషయాలపై వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన మంజుల.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలి తల్లి పెద్దలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఆటలు నేర్పే గురువులు కావాలి!
● కోచ్లు కావాలని శాట్ను కోరిన డీఎస్ఏ ● మినీ స్టేడియాల్లో కోచ్ల నియామకంపై ప్రతిపాదనలు ● త్వరలోనే నియమించే అవకాశం? మహబూబ్నగర్ క్రీడలు: క్రీడాకారుల సౌకర్యార్థం కోసం, ఇండోర్ గేమ్లలో క్రీడాకారులు ప్రతిభ చాటాలనే ఉద్దేశంతో జిల్లాలో ఇండోర్ స్టేడియాలు నిర్మించారు. కోట్లాది నిధులతో మహబూబ్నగర్లో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో మూడు మినీ స్టేడియాలను ఏర్పాటు చేశారు. నగరంలోని మెయిన్ స్టేడియంలో దాదాపు రూ.7.79కోట్ల నిధులతో అధునాతనమైన క్రీడా సౌకర్యాలతో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేశారు. ఈ స్టేడియం ఉమ్మడి జిల్లాలోనే తలమానికంగా నిలుస్తోంది. ఇందులో రెండు ఫ్లోర్లలో ఇండోర్ గేమ్లు ఆడేలా హాళ్లతో పాటు స్టోర్ రూంలు, క్రీడాకారుల వసతి గదులు ఏర్పాటు చేశారు. అలాగే రెండు వైపుల గ్యాలరీలు, ఆరు బ్యాడ్మింటన్ కోర్టులను ఏర్పాటు చేశారు. జాతీయ, రాష్ట్రస్థాయి క్రీడాటోర్నీలు నిర్వహించేందుకు ఈ స్టేడియం అన్ని విధాలుగా బాగుంటుంది. ఇటీవల ఫాస్ట్–5 జాతీయస్థాయి సీనియర్ నేషనల్ నెట్బాల్, రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్తోపాటు సీఎం కప్ రాష్ట్రస్థాయి కబడ్డీ, నెట్బాల్ పోటీలు నిర్వహించారు. కాగా.. జిల్లాకేంద్రంలోని ఎంవీఎస్ కళాశాల మైదానంలో రూ.2కోట్ల 65లక్షలతో, చిన్నచింతకుంట మండలం అల్లీపూర్లో రూ.కోటి 59 లక్షలతో ఇండోర్ స్టేడియం, భూత్పూర్ మండలం పోతులమడుగు సమీపంలో రూ.2.65కోట్లతో మినీ స్టేడియం ఏర్పాటు చేశారు. ● జిల్లాలోని నాలుగు ఇండోర్ స్టేడియాల్లో కోచ్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో ప్రస్తుతం ఒక బ్యాడ్మింటన్ కోచ్గా ఉండగా బాక్సింగ్, జూడో, టేబుల్ టెన్నిస్ తదితర క్రీడలకు కోచ్లు లేరు. అల్లీపూర్లోని ఇండోర్ స్టేడియంలో కబడ్డీ, బ్యాడ్మింటన్ కోచ్లు ఉండగా ఎంవీఎస్ కళాశాలలోని ఇండోర్ స్టేడియంలో యోగా కోచ్ ఉండగా, పోతులమడుగు సమీపంలోని ఇండోర్ స్టేడియంలో కోచ్లు లేరు. మినీ స్టేడియంలతో పాటు జిల్లాలోని ఇతర చోట్ల కోచ్ల అవసరాన్ని గుర్తించి ఇటీవలజిల్లా యువజన, క్రీడాశాఖ నుంచి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకు ప్రతిపాదనలు పంపారు. కోచ్ల నియామకం అయితే ఔత్సాహిక క్రీడాకారులకు మెరుగైన క్రీడా శిక్షణ లభించనుంది. వెంటనే మినీ స్టేడియంతో పాటు ఇతర చోట్ల సరిపడా కోచ్ల నియామకం చేపట్టాలని సీనియర్ క్రీడాకారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. స్టేడియాలు లేకున్నా కొన్ని ప్రాంతాల్లో కోచ్లు కావాలని ప్రతిపాధనలు పంపారు. కోడ్గల్కు హ్యాండ్బాల్, వాలీబాల్, మిడ్జిల్కు ఫుట్బాల్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాలానగర్కు క్రికెట్, వాలీబాల్, కబడ్డీ లేదా ఖోఖో, రాజాపూర్కు వాలీబాల్, ఖోఖో క్రీడలకు సంబంధించి కోచ్ల ప్రతిపాదనలు పంపారు. మెయిన్ స్టేడియంలో సాఫ్ట్బాల్ ఆడుతున్న క్రీడాకారులు (ఫైల్) -
ఆగస్టు 6 నుంచి 14 వరకు పాదయాత్రలు
మహబూబ్నగర్ న్యూటౌన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను పాదయాత్రల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి బాలకిషన్ తెలిపారు. జిల్లాకేంద్రంలోని సురవరం వెంకటరామిరెడ్డి భవన్లో ఆగస్టు 6 నుంచి 14 వరకు జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్న పాదయాత్ర వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను వరుసగా ప్రైవేటీకరిస్తూ ప్రజల ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే విధానాన్ని కొనసాగిస్తోందని మండిపడ్డారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరకు హామీ ఇవ్వకుండా రైతాంగాన్ని మోసం చేస్తోందన్నారు. పాదయాత్రల ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం ప్రజలను సంఘటితం చేస్తామని, జిల్లా ప్రజలు, రైతులు, కార్మికులు, యువత, విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. జిల్లా కార్యవర్గ సభ్యులు డి.రాము, కె.పద్మావతి, జిల్లా కౌన్సిల్ సభ్యులు మహేష్, చాంద్ పాషా, కే రమేష్ నరసింహ, శ్రీలత , పూజిత, సంధ్య పాల్గొన్నారు. -
డ్రగ్స్ నిర్మూలనకు అందరి భాగస్వామ్యం అవసరం
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం, సరఫరాను పూర్తిగా అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్లో ఎస్పీ జానకితో కలిసి పాలమూరు యూనివర్సిటీ, ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీ ప్రతినిధులు వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, పోలీసు, ఎకై ్సజ్, విద్యాశాఖ తదితర అధికారులతో నిర్వహించిన నార్కోటిక్స్ అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు. డ్రగ్స్ సరఫరా, వినియోగానికి సంబంధించిన ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే తెలియజేయాలని, డ్రగ్స్ నిర్మూలనపై ప్రత్యేక కంట్రోల్ రూమ్ నంబర్ను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. డ్రగ్స్కు సంబంధించిన సమాచారం అందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు, హాస్టళ్లలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన పోస్టర్లను తప్పనిసరిగా ప్రదర్శించాలని కలెక్టర్ ఆదేశించారు. పోస్టర్ నమూనాను మూడు రోజుల్లో అందజేస్తామని, అన్ని విద్యాసంస్థలు దానికి అనుగుణంగా అమలు చేయాలని తెలిపారు. విద్యార్థుల్లో డ్రగ్స్ వినియోగానికి సంబంధించిన లక్షణాలను గుర్తించేలా అధ్యాపకులు, వార్డెన్లు, భద్రతా సిబ్బందికి అవగాహన ఉండాలని కలెక్టర్ సూచించారు. హాస్టళ్లలోకి విద్యార్థులు తీసుకువచ్చే బ్యాగులను అవసరమైతే తనిఖీ చేయాలని, రాత్రి వేళల్లో హాస్టల్ గదుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని చెప్పారు. ● డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు సమాచారం అందితే సంబంధిత వ్యక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైతే డీ–అడిక్షన్ కేంద్రాలకు పంపిస్తామని ఎస్పీ డి.జానకి తెలిపారు. ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందిస్తే యువతను మళ్లీ సాధారణ జీవితంలోకి తీసుకురావచ్చన్నారు. డ్రగ్స్ నియంత్రణ అనేది ఒక్క పోలీసు శాఖ బాధ్యత కాదని, ప్రతి పౌరుడు సమాచారం అందించడంలో భాగస్వామి కావాలని కోరారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి, జడ్జి డి.ఇందిర మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగించినట్లు గుర్తించిన విద్యార్థులపై వెంటనే శిక్షాత్మక చర్యలకే పరిమితం కాకుండా, ముందుగా కౌన్సెలింగ్, కుటుంబసభ్యులకు అవగాహన కల్పించడం, అవసరమైతే డీ–అడిక్షన్ కేంద్రాలకు తరలించడం వంటి పునరావాస చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. సమావేశంలో శిక్షణ కలెక్టర్ సాయిశివాని తదితరులు పాల్గొన్నారు. త్వరలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ నంబర్ ఏర్పాటు కలెక్టర్ ఖుష్బూ గుప్తా -
ఆర్టీసీ కార్మిక సమస్యలు పరిష్కరించాలి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని టీఎంయూ (థామస్రెడ్డి) రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జి.లక్ష్మణ్గౌడ్ కోరారు.గురువారం మహబూబ్నగర్ డిపో అసిస్టెంట్ మేనేజర్లు కవిత, జయరాంలను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ సంస్థ అభివృద్ధికి అన్నివిధాల కట్టుబడి ఉన్నామన్నారు. కొత్తగా ఎన్నికై న తమ యూనియన్ డిపో కమిటీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నాయకులు బీకే రెడ్డి, ముజీబ్, టీఆర్సీ శేఖర్రెడ్డి, తెల్కపల్లి రాములు, హబీబ్ హసన్, చంద్రమోహన్, నిజామాబాద్ శ్రీనివాస్, ప్రేమలత, అమరేశ్వరి, రాగిణి, శిరీష, శ్రీదేవి, పద్మ పాల్గొన్నారు. -
ఆరోగ్యవంతమైన జీవనం అలవాటు చేసుకోవాలి
మహబూబ్నగర్ క్రైం: యువత దేశ భవిష్యత్కు బలమైన శక్తిగా మారాలి తప్పామాదకద్రవ్యాలు లాంటి వాటికి బానిసలుగా కావ్వొద్దని ఎస్పీ డి.జానకి అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో గురువారం మేరా యువ భారత్– నషా ముక్త యువ ఫర్ వికసిత్ భారత్ పోస్టర్ను ఆవిష్కరించారు. యువత డ్రగ్స్కు బారినపడకుండా, మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో భాగంగా యువతకు 8 రకాల పోటీలు నిర్వహిస్తున్నామని, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రాష్ట్రస్థాయిలో అవకాశం కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా యువజన అధికారి తోటానాయక్, అనిల్కుమార్, రాజేందర్గౌడ్ పాల్గొన్నారు. -
భూగర్భ జలం.. ఇంకితేనే ప్రతిఫలం
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్)/నర్వ: ఎల్నినో ప్రభావంతో వానలు పడక.. పల్లెలు, పట్టణాలు ఆకాశం వైపు చూస్తున్నాయి. సమీప భవిష్యత్లో ఇలాంటి ముప్పును సమర్థంగా ఎదుర్కొనేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు మేల్కొన్నాయి. నీటి సంరక్షణతోపాటు భూగర్భజలాల పెంపునకు ప్రతి చుక్క– ప్రజల కోసం నినాదంతో ‘జలసిరిశ్రీకి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం వీబీ జీ రాంజీ పథకంలో ఇళ్ల వద్ద వ్యక్తిగత, గ్రామాల్లో సామూహిక ఇంకుడు గుంతలు, బోర్వెల్ రీచార్జి కుంట, ఓపెన్ వెల్, పొలాల్లో నీటికుంటల నిర్మాణానికి కార్యాచరణ రూపొందించింది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 3.9 లక్షల ఇంకుడు గుంతలు, 6,776 పాంపాండ్ల నిర్మాణం.. ఆగస్టు 14 వరకు పూర్తిచేసేలా అధికారులు లక్ష్యం నిర్దేశించారు. ఇంటికో ఇంకుడు గుంత.. పొలానికో పంట కుంట.. గ్రామానికి ఊటకుంట అనే నినాదంతో జలసిరి కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది. ఈ మేరకు అధికారులకు దిశానిర్దేశం చేసింది. నిర్మాణంలో పాటించాల్సినవి.. శాసీ్త్రయంగా ఇంటి పైకప్పు నుంచి 50 చదరపు అడుగుల వైశాల్యంలో వర్షపు నీరు పడి ఒక్క ఇంకుడు గుంత ద్వారా 25 వేల లీటర్ల నీటిని భూమిలో నిల్వ చేసుకోవచ్చు. ఇంకుడు గుంత ఏర్పాటును తమకు నచ్చినట్లుగా కాకుండా.. శాసీ్త్రయంగా నిర్మిస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంటి పైకప్పును బట్టి ఇంకుడు గుంత పొడవు, వెడల్పు నిర్ణయించుకోవాలని, ఇంటి వృథా నీరు ఇందులో చేరేలా ఏర్పాటు చేసుకోవాలి. ఇంకుడు గుంత 4 అడుగుల పొడవు, 6 అడుగుల లోతున ఉండాలి. మూడు అడుగుల కింద భాగాన్ని పెద్ద, పెద్ద రాళ్లతో నింపాలి. ఒక సిమెంట్ గొళ్లెం తీసుకొని పైభాగంలో సరిపడా రంద్రాలు ఏర్పాటు చేసి గుంత మధ్య భాగంలో అమర్చాలి. ఇక గుంతలో మిగిలిన ఖాళీ భాగాన్ని మూడు ఫీట్లు (45ఎంఎం) కంకర నింపాలి. వృథాగా పారే వర్షపు నీటిని పైపు ద్వారా గొళ్లెంలోకి వెళ్లేలా చూసుకోవాలి. సామూహిక ఇంకుడు గుంతలు గ్రామాల్లో ప్రతి ఇంటి ఆవరణలో వ్యక్తిగత ఇంకుడుగుంత నిర్మాణం చేపట్టాలి. ఈ నిర్మాణం వీలుకాని చోట సామూహిక ఇంకుడుగుంతల నిర్మాణం చేసుకోవచ్చు. వాటి నిర్మాణం కోసం ప్రభుత్వం నిర్దిష్ట కొలతలు రూపొందించింది. పరిమాణం 1.2 మీటర్ల పొడవు, 1.2 మీటర్ల వెడల్పుతో 1.8 మీటర్ల లోతు ఉండాలి. నిర్మాణ వ్యయంగా రూ.7,500 ప్రభుత్వం అందిస్తుంది. సామూహిక ఇంకుడుగుంత నిర్మాణం కోసం పొడవు, వెడల్పు 2.4 మీటర్లు, లోతు 2 మీటర్లు ఉండాలి. నిర్మాణం వ్యయం రూ.13 వేలుగా నిర్ణయించింది. గ్రామానికో ఊటకుంట ప్రతి గ్రామంలో ఒక ఊటకుంట తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. గ్రామ నీటి అవసరాల కోసం భూగర్భ జలాలను పెంపొందించడమే ప్రధాన ఉద్దేశం. ఊటకుంట నిర్మాణం కోసం రూ.5 లక్షల నిధులు ప్రభుత్వం కేటాయించనుంది. అలాగే వ్యవసాయ అవసరాలు బోరు బావుల రీచార్జి కోసం రూ.25 వేలు మంజూరు చేయనుంది. వ్యవసాయ అవసరాల కోసం బావులు తవ్వుకోవడానికి సైతం రూ.3.50 లక్షలు ప్రభుత్వం అందిస్తుంది. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేలా ప్రభుత్వం కార్యాచరణ ఇంటికో గుంత, పంటకో కుంట, గ్రామానికి ఊటకుంట నిర్మాణానికి చర్యలు ప్రజలు, రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు ఆగస్టు 14 నాటికి పూర్తి చేసేలా గడువు విధింపు -
కలెక్టరేట్లో కంట్రోల్ రూం
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా, ప్రజల సౌకర్యార్థం కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు కంట్రోల్ రూమ్ నంబరు 08542 241165ను సంప్రదించి సహాయం పొందవచ్చని తెలిపారు. మూడు షిఫ్ట్లలో 24 గంటల పాటు సిబ్బంది అందుబాటులో ఉండి, ప్రజల నుంచి వచ్చే కాల్స్ను స్వీకరిస్తారని వివరించారు. వర్షాలు, వరదల వల్ల ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే కంట్రోల్ రూమ్ నంబరుకు సంప్రదించి సహాయం పొందవచ్చని కలెక్టర్ సూచించారు. నేడు రాష్ట్రస్థాయి గోగేమ్ క్రీడాకారుల ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: తెలంగాణ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ గోగేమ్ క్రీడాకారుల ఎంపికలను శుక్రవారం ఉదయం 10.30 గంటలకు జిల్లాకేంద్రంలోని మాస్టర్ మైండ్స్ స్కూల్లో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గులాం అఫ్రోజ్, సీనియర్ ఉపాధ్యక్షులు మహ్మద్ షకీల్ అహ్మద్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు తమ ఆధార్కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, జిరాక్స్ కాపీలతోపాటు తల్లిదండ్రుల్లో ఒకరి ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకురావాలని కోరారు. మిగతా వివరాల కోసం 98857 04173, 98852 42848 నంబర్లను సంప్రదించాలని సూచించారు. మొక్కజొన్న అక్రమాలపై ముమ్మర దర్యాప్తు జడ్చర్ల: బాదేపల్లి సింగిల్ విండో ఆధ్వర్యంలో చేపట్టిన మార్క్ఫెడ్ మొక్కజొన్న కొనుగోళ్లలో జరిగిన అవకతవకలు, ఇతర అక్రమాల కు సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి సింగిల్విండో చైర్మన్ సుదర్శన్గౌడ్, సీఈఓ యాద గిరి, గోదాము సిబ్బంది సాధిక్లను విచారించినట్లు పేర్కొన్నారు. బాధిత రైతుల స్టేట్మెంట్లను కూడా రికార్డు చేశామన్నారు. అయితే మార్క్ఫెడ్ కొనుగోళ్ల వివరాలు, రైతులకు చేసిన చెల్లింపుల వివరాలను సేకరించాల్సి ఉందన్నారు. ఇందుకు సంబంధించి ఎస్పీ జానకి అనుమతి తో మార్క్ఫెడ్ అధికారులకు లేఖ రాస్తామని సీఐ కమలాకర్ వెల్లడించారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. గురువారం ఆయన హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, ఎస్పీలతో వీసీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్నిస్థాయిల అధికారులు కార్యస్థానాలు వదిలివద్దని, ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు పనిచేస్తున్న హెడ్క్వార్టర్స్లోనే ఉండాలని, ఎవరూ సెలవులపై వెళ్లవద్దని ఆదేశించారు. రిజర్వాయర్ల నుంచి వరద ప్రవహించే చుట్టూ ప్రక్కల ప్రాంతాల్లో, కోయిల్సాగర్ సమీప ప్రాంతాలలో ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండి తగు చర్యలు తీసుకోవాలన్నారు. పీహెచ్ిసీలు, సీహెచ్సీలలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలకు సేవలు అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. జెడ్పీ సీఈఓ వెంకటరెడ్డి, సీపీఓ రవీందర్, డీఏఓ గోవింద్ నాయక్, ఈఈ దేశ్యానాయక్, డీఎంహెచ్ఓ శ్రీనివాసులు పాల్గొన్నారు. 45 రోజులకోసారి సమావేశాలు తప్పనిసరి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశాలను ప్రతి 45 రోజులకు ఒకసారి నిర్వహించాలని జెడ్పీ సీఈఓ వెంకట్రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పంచాయతీరాజ్ చట్టం–2018 ప్రకారం ఈ సమావేశాలకు అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు, మండలస్థాయి అధికారులు, శాశ్వత ఆహ్వానితులు తప్పనిసరిగా హా జరు కావాలని పేర్కొన్నారు. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం నిర్వహించేలా ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలని, అజెండాలోని అన్ని అంశాల పై సమగ్రంగా చర్చ జరిగేలా చూడాలని, సమావేశాల్లో ఆమోదించిన తీర్మానాలపై తదు పరి చర్యలు చేపట్టేలా పర్యవేక్షించాలని సూ చించారు. అలాగే, సమావేశాల సమర్థవంతమై న నిర్వహణకు ఎంపీడీఓలకు అవసరమైన మార్గదర్శకాలు అందించనున్నట్లు తెలిపారు. -
సీఎంఆర్ డెలివరీలను వేగవంతం చేయాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): 2025–26కు సంబంధించిన వానాకాలం, యాసంగికి చెందిన సీఎంఆర్ డెలివరీలను వేగవంతం చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ శ్యాంప్రసాద్లాల్ మిల్లర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని వీసీహాల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన జిల్లా పౌర సరఫరాల అధికారులు (డీసీఎస్ఓలు), జిల్లా మేనేజర్లు (డీఎంలు), ఎఫ్సీఐ అధికారులు, ఎన్న్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. మిల్లింగ్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేసి భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ)కి బియ్యం సరఫరాను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తూ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేయాలని స్పష్టం చేశారు. పెండింగ్లో ఉన్న డెలివరీలను వెంటనే పూర్తి చేయాలని అధికారులకు, రైస్ మిల్లర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని, ఎప్పటికప్పుడు పురోగతిని పర్యవేక్షిస్తూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. మహబూబ్నగర్ డీఎస్ఓ గంప శ్రీనివాస్ పాల్గొన్నారు. -
వీధికుక్కల బీభత్సం.. ఏడుగురిపై దాడి
మక్తల్: పట్టణంలో వీధికుక్కలు ఏడుగురిపై దాడి చేసి బీభత్సం సృష్టించాయి. 16వ వార్డు అనంపల్లి వీధికి చెందిన పలువురిపై దాడి చేయడంతో వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిలో మహేశ్వరి అనే మహిళను మెరుగైన చికిత్స కోసం నారాయణపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఏడుగురిపై ఒకేసారి దాడికి పాల్పడటంతో పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెయిన్ బజార్లో కుక్కలు బెడద అధికంగా ఉందని, మున్సిపల్ అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
విద్యార్థి మృతికి లెక్చరరే కారణం
కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ రోడ్డుపై ధర్నా ● మద్దతు పలికిన విద్యార్థి సంఘాలు ● ఆర్డీఓ హామీతో విరమించిన వైనం గద్వాల క్రైం: గద్వాల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి తరుణ్ (17) మంగళవారం ఇంట్లో ఉరేసుకొని మృతి చెందిన సంఘటన విదితమే. అయితే బుధవారం ఉదయం జిల్లా ఆస్పత్రి వద్ద ఫ్లైఓవర్ రోడ్డుపై విద్యార్థి కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు బైఠాయించి ధర్నా చేపట్టారు. విద్యార్థి మృతికి కారణమైన ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలు శిరీషను విధుల నుంచి తొలగించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ముందు హేళనగా మాట్లాడటం, చెంపదెబ్బ కొట్టడం ద్వారా తరణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్జెక్ట్ లెక్చరర్ కాకున్నా ఆమె చేసిన నిర్వాకం కారణంగా అమయాక విద్యార్థి మరణానికి కారణమైందని, తక్షణమే సదరు అధ్యాపకురాలిని అరెస్టు చేసి చట్టపరమైన చర్య తీసుకోవాల్సిందిగా కోరారు. పోలీసులు శాంతింపజేసేంకు ప్రయత్నం చేయగా ఫలితం లేకపోయింది. ఆర్డీఓ శ్రీనివాస్రావు అక్కడికి చేరుకుని వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థి మృతిపై న్యాయ విచారణ చేపట్టి రూ. 50లక్షల ఎక్స్ గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉదోగ్యం ఇవ్వాల్సిందిగా విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. డిమాండ్లను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని ఆర్డీఓ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. నిందితురాలైన అధ్యాపకురాలు శిరీషపై మృతుడి సోదరుడు మోహన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. ప్రస్తుతం ఆమె పరారీలో ఉందని, త్వరలో అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతామన్నారు. అదే విధంగా విద్యార్థి మృతి విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని పేర్కొన్నారు. మహిళ లెక్చరర్ విధుల్లో చేరినప్పటి నుంచి విద్యార్థులతో ఆమె వ్యవహరించే తీరు సైతం విమర్శలు ఉన్నాయి. సంబంధం లేని విషయాలో జోక్యం చేసుకోవడం ఉంటుందని కొంతమంది విద్యార్థులు చెబుతున్నారు. మరోవైపు విద్యార్థి మృతికి కారకులైన అధ్యాపకురాలి ద్వారా రూ.8 లక్షలు చెల్లించేందుకు కొందరు డిమాండ్ చేస్తుండటం కొసమెరుపు. -
లక్ష్యం ఎంచుకుని ముందుకు సాగితే విజయం
● ఎంఎస్ఎన్ ఫార్మా అధినేత, యాదగిరిగుట్ట ట్రస్టు బోర్డు చైర్మన్ సత్యనారాయణరెడ్డి నవాబుపేట:లక్ష్యం ఎంచుకుని ముందుకు సాగాల ని అప్పుడే.. మన టార్గెట్ పూర్తవుందని.. లక్ష్యసాధనలో ఆలస్యం కావచ్చు.. ఇబ్బందులు రావచ్చు.. వాటిని అధిగమించి ముందుకు సాగితే లక్ష్యం తప్పక చేరుకుంటాం.. ఇది నేను పాటించి విజయం సాధించి నేడు మీ ముందు నిల్చుని మీరు పాటించి ఉన్న శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నానంటూ తన విజయ రహస్యం చెప్పుకొచ్చారు ఎంఎస్ఎన్ ఫార్మ అధినేత, యాదగిరిగుట్ట ట్రస్టుబోర్డు చైర్మన్ సత్యనారాయణరెడ్డి పేర్కొన్నారు. గురువారం తాను పుట్టిన గ్రామం, తాను చదివిన బడికి రూ.రెండున్నర కోట్లతో నిర్మించిన పాఠశాల అధునాతన భవనాన్ని విద్యార్థులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను డిగ్రీ వరకు ప్రభుత్వ బడుల్లోనే చదివినట్లు తెలిపారు. తాను కళాశాలలో లెక్షరర్గా పనిచేసి సొంతంగా ల్యాబ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం తాజాగా వందకు పైగా దేశాల్లో కంపెనీ మార్కెటింగ్, 26 ఫార్మ బ్రాంచులు ఉన్నట్లు తెలిపారు. అలాగే తన కంపెనీలలో దాదాపు 30వేల మంది ఉపాధి ిపొందుతుంటే దాదాపు పదివేల మంది పాలమూరు జిల్లా వారికి అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. అందుకే తాను చదివిన పాఠశాలను అధునాతన పద్ధతిలో కంపెనీ ద్వారా ఖర్చు చేసి అధ్యాపకులను సైతం నియమించినట్లు తెలిపారు. విద్యకు ఎలాంటి చేయూతనిచ్చేందుకు తాను ముందుంటానని వివరించారు. విద్యముందు ఆస్తులు ఒక లెక్కకాదని ఆస్తులుంటాయి.. పోతాయి.. విద్యాజనం తరిగిపోదన్నారు. ● ఇప్పటికే గ్రామంలో రూ.కోట్లాది రూపాయలతో రోడ్లు, అండర్ డ్రెయిన్, విద్యుత్లాంటివి ఏర్పాటు చేశామని, తాజా విద్యను కార్పోరేట్ స్థాయిలో అందరికీ అందిస్తున్నామన్నారు. త్వరలోనే వైద్యానికి సంబంధించి ప్రత్యేక కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీ శ్రీనివాస్రెడ్డి, సహకార సంఘం చైర్మన్ నర్సింహులు, సర్పంచ్ రవీందర్రెడ్డి, గురుకుంట మాజీ సర్పంచ్ ప్రతాప్రెడ్డి, ఎంఈఓ నాగ్యనాయక్, ఎంఎస్ఎన్ కంపెనీ అభివృద్ధి కమిటీ సభ్యులు ప్రతాప్, రవి, శ్రీనివాసులు, మాజీ ఎంపీపీ శ్రీనివాస్, ఉపసర్పంచ్ రాజశేఖర్, పురుషోత్తం తదితరులు ఉన్నారు. -
సైబర్ నేరాలు, రోడ్డుభద్రతపై అవగాహన కల్పించాలి
మహమ్మదాబాద్: నేటి సమాజంలో యువతలో ఎక్కువగా జరుగుతున్న సైబర్నేరాలు, రోడ్డుభద్రతపై పోలీసుల పరిధిలో అవగాహన కల్పించాలని జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్హెచ్ చౌహాన్ పేర్కొన్నారు. బుధవారం మహమ్మదాబాద్ పోలీస్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సైబర్నేరాలు, రోడ్డు ప్రమాదాలు పెచ్చుపెరిగిపోతున్న ఈ సమయంలో ముఖ్యంగా యువతకు తగిన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పోలీస్టేషన్కు వచ్చిన కేసులను ఎప్పటికప్పుడు పరిశీలించి ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడాలని సూచించారు. ప్రతిఫర్యాదును వెంటనే నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకో వాలని తెలిపారు. మహిళలకు చిన్నారుల కేసులకు ప్రాధాన్యతనివ్వాలని తెలిపారు. రాత్రివేళలో బీట్ వ్యవస్థను సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. అవినీతి నిర్లక్ష్యానికి తావులేదన్నారు. పోలీస్టేషన్కు వస్తే న్యాయం జరుగుతుందని ప్రజలు గ్రహించాలని అలాంటి సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. పోలీస్టేషన్ల పరిధిలో ఎక్కువగా ఎలాంటి నేరాలు జరుగుతున్నాయని ఎలాంటి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని రికార్డులను చూశారు. సివిల్ కేసుల్లో ఎక్కువగా తలదూర్చవద్దని అలాంటి కేసులు కోర్టుల పరిధిలో తేల్చుకుంటారని పేర్కొన్నారు. ఈయన వెంట రూరల్ సీఐ గాంధీనాయక్, మహమ్మదాబాద్ ఎస్ఐ శేఖర్రెడ్డి, పోలీస్టేషన్ సిబ్బంది ఉన్నారు. -
ఉరేసుకుని వలస కూలీ మృతి
గద్వాల క్రైం: జీవనోపాధి కోసం వచ్చిన ఓ వలస కూలీ ఉరేసుకుని మృతిచెందిన ఘటన గద్వాల మండలంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. బీహార్లోని ముజాఫార్పూర్కు చెందిన టూటాన్ రామ్ (34) నాలుగేళ్ల క్రితం జీవనోపాధి నిమిత్తం గద్వాలకు వలస వచ్చాడు. అయితే బసాపురం శివారులోని అబ్దుల్ అజీమ్ కోళ్ల షెడ్డులో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల తండ్రి, కుమారుడి ఆరోగ్యం క్షీణించింది. వారంరోజుల క్రితం కుటుంబ సభ్యులు ఇద్దరి ఆరోగ్య సమస్యలను తెలియజేశారు. ఈ విషయంపై మనస్తాపం చెంది తెల్లవారుజామున కోళ్ల షెడ్డులో ఉరేసుకుని మృతిచెందాడు. మృతుడి అక్క ప్రమీలాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పాముకాటుకు బలి నర్వ: పాముకాటుకు గురై వ్యక్తి మృతిచెందిన ఘటన ఉందేకోడ్లో చోటుచేసుకుంది. ఎస్ఐ పబ్బతి రమే ష్ కధనం ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున ఉదయం 3:30గంటల ప్రాంతంలో మొట్టె చిన్న న ర్సింహులు(48) తనకు ఏదో కరిచిందని కు టుంబ సభ్యులకు చెప్పాడు. భార్య, కొడుకు దుప్పటిని పరిశీలించి చూడగా.. నూనెకట్ల పా ముగా గుర్తించి చంపారు. అనంతరం 108 వాహనంలో మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.చికిత్స పొందుతూ..ఉదయం 9:30 గంటల ప్రాంతంలో మృతిచెందాడు. మృతుడికి భార్య లలిత, కుమారుడు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులతో వివాహిత ఆత్మహత్య ఉప్పునుంతల: మండలంలోని తాడూరుకు చెందిన గుండెమోని పార్వతమ్మ (43) గత ఆదివారం ఇంట్లో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం అచ్చంపేట ఆస్పత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం నాగర్కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందింది. ఆర్థిక ఇబ్బందులతోనే తన తల్లి ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి కుమార్తె శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పుట్ట మహేష్ తెలిపారు. ఇందిరమ్మ ఇంటికి క్యూరింగ్ చేస్తుండగా.. అయిజ: విద్యుత్ షార్ట్సర్క్యూట్తో వృద్ధుడు మృతిచెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. మృతుడి బంధువులు తెలిపిన వివరాలు.. చిన్న తాండ్రపాడు గ్రామానికి చెంది న ఏసన్న (60) బుధవారం నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇంటి పైకప్పుకు నీళ్లు పడుతూ ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం వైర్లను తాకాడు. దీంతో అక్కడ నుంచి కింద ఉన్న రాళ్ల కుప్పపై పడిపోయాడు. అది గమనించిన కు టుంబ సభ్యులు మండల కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఏసన్న మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అందించారు. మృతుడికి భార్య, కూతురు, ముగ్గురు కుమారులు ఉన్నారు. స్తంభం తలపై పడి రైతు మృతి మానవపాడు: పంటపొలంలో ట్రాక్టర్తో వ్యవసాయ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు స్తంభం తలపై పడి రైతు మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు, హెడ్కానిస్టేబుల్ శివకుమార్ తెలిపిన కథనం ప్రకారం.. మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన రైతు, మాజీ ఉపసర్పంచ్ గొల్ల పెద్ద నారాయణ (51) పొలం దున్నుతున్నాడు. ఈ క్రమంలో గెట్టు వద్ద ఉన్న స్తంభానికి బిగించిన స్టే వైర్ ట్రాక్టర్ పలుగుకి తగిలింది. ఈ క్రమంలో ట్రాక్టర్ అలాగే ముందుకు పోవడంతో స్తంభం విరిగి గొర్రుపై ఉన్న గొల్ల పెద్దనారాయణ తలపై పడడంతో తీవ్ర రక్తస్రావం అయింది. గుర్తిచించిన స్థానికులు క్షతగాత్రుడిని అంబులెన్స్లో కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ పెద్ద నారాయణ మృతి చెందాడు. మృతుడికి కుమార్తె, కొడుకు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని హెడ్కానిస్టేబుల్ శివకుమార్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో క్షుద్రపూజలు గద్వాల క్రైం: జి ల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో మంగళవా రం అర్ధరాత్రి క్షు ద్రపూజలు చేసిన ఘటన కలకలం రేపింది. పట్టణంలోని రాఘ వేంద్ర కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలోని ముగ్గులు, కుంకుమ, నిమ్మకాయలతో క్షుద్రపూజలు చేశారు. బుధవారం ఉదయం పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు, విద్యార్థులు చూసి భయాందోళన చెందారు. స్థానిక కౌన్సిలర్ రామలింగేశ్వర కాంళ్లే స్థానికుల సహాయంతో శుభ్రం చేయించారు. -
సమస్త మానవాళి సుఖశాంతులతో జీవించాలి
కల్వకుర్తి రూరల్: ప్రపంచంలోని సమస్త మానవాళి సుఖశాంతులతో జీవించాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రతిఒక్కరూ సంతోషంగా ఉండాలని సంకల్పంతో కల్వకుర్తి పట్టణంలో 91 విశ్వశాంతి మహాయాగం కనులపండువగా నిర్వహిస్తున్నారు. ఉద యం నుంచి రాత్రివరకు కార్యక్రమాలు నిర్వహించారు. వేదమంత్రోచ్ఛరణలు మారుమోగుతున్నా యి. హోమాలు, యాగాలు సర్వ మానవాళి మేలుకోసమే జరుగుతున్నాయి. 11రోజులుగా యాగం నిర్విఘ్నంగా సాగుతోంది. బుధవారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి దంపతులతోపా టు యాగ నిర్వాహకులు జూలూరు రమేష్బాబు కుటుంబ సభ్యులు, మున్సిపల్ చైర్మన్ బృంగి రత్న మాల ఆనంద్కుమార్ దంపతులతోపాటు ప్రముఖులు పాల్గొని చండీహోమం నిర్వహించారు. హో మానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వివిధ పాఠశాలల విద్యార్థులు యాగశాల ప్రదక్షిణ చేయడంతోపాటు హనుమాన్ చాలీసా పారాయణం, భక్తి పాటలు పాడడంతోపాటు స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. బుధవారం చండీహో మం, పాశుపత, శ్రీ సుదర్శన, లక్ష్మీనారాయణ హో మాలు, సరస్వతి పూజలు, శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. సాయంత్రం రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వా మి కల్యాణ మహోత్సవం కనులపండువగా సాగింది. సామూహిక కుంకుమార్చనలో దంపతులు పాల్గొని అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. కార్యక్రమంలో రామకష్ణ, బాలకృష్ణ, సురేందర్, రామస్వామి, ప్రకాష్, గోపాల్, సతీష్, రమకాంత్రెడ్డి, సంతుయాదవ్ పాల్గొన్నారు. -
తప్పుడు ప్రయోజనాలుంటే పదవికి రాజీనామా చేస్తా
● యూనివర్సిటీ ప్రయోజనాల కోసం కృషి : వీసీ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూ ప్రయోజనాలను నష్టం చేస్తే పదవి నుంచి తప్పుకుంటా నని పీయూ వీసీ శ్రీనివాస్ అన్నారు. బుధవారం పీయూ లైబ్రరీ ఆడిటోరియంలో టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బందితో పాటు పాలమూరు జిల్లా సంఘాల నాయకులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యారు. నేషనల్ సెమినార్ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యక్రమానికి వస్తున్న క్రమంలో ఇక్కడి వసతులు సరిపోవని, వారు వచ్చేందుకు హైదరాబా ద్ నుంచి దూరం అవుతుందన్నారు. వారు తప్పకుండా సెమినార్కు రావాలన్న ఉద్దేశంతో అక్కడ ఏర్పాటు చేశామని, ఇందులో ఎలాంటి ప్రయోజనాలు లేవని పేర్కొన్నారు. ఏవైనా తప్పుడు ప్రయోజనాలు ఉంటే తన పదవికి రాజీనామా చేస్తానని రాజీనామా లెటర్ను చూపించారు. కేవ లం యూనివర్సిటీకి మంచి పేరు కోసం కృషి చేస్తున్న తనపై తప్పుడు ప్రచారం చేయడం బాధాకరమన్నారు. సెమినార్ ప్రారంభం నుంచి విద్యార్థి సంఘాల కోరిక మేరకు ఒక్కరోజు ఇక్క డ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, కన్హాశాంతి వనంలో కార్యక్రమం ఏర్పాటు చేసే అంశాన్ని పూర్తిగా కమిటీకి అప్పగించామని, వారి నిర్ణయం మేరకు మాత్రమే అక్కడ నిర్వహించాల ని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో పాలమూరు పునఃనిర్మాణ ఫోరం అధ్యక్షుడు హర్షవర్ధన్రెడ్డి, జేపీఎన్సీ కళాశాల చైర్మన్ రవికుమార్, వామన్కుమార్ అధికారులతో మాట్లాడుతున్న క్రమంలో ఉద్దేశ పూర్వకంగా సెమినార్ను కన్హాశాంతి వనానికి మార్చారని, ఎటువంటి పరిస్థితి లో అక్కడ నిర్వహించవద్దని, నిర్వహించేందుకు డబ్బులు లేకపోతే తాము డబ్బులు ఇస్తామని హర్షవర్ధన్రెడ్డి పేర్కొనడం చర్చనీయాశంగా మారింది. -
600 కేజీల నల్లబెల్లం పట్టివేత
వెల్దండ: మండల కేంద్ర సమీపంలో కల్వకుర్తి ఎకై ్సజ్శాఖ అధికారులు బుధవారం వాహనాల తనిఖీ చేస్తుండగా.. 600 కేజీల నల్లబెల్లం, 120 కేజీల పటిక స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ వెంకట్రెడ్డి తెలిపారు. వివరాలు ఇలా.. హైదరాబాద్లోని బేగంబజార్ గంజ్ నుంచి స్కార్పియో వాహనంలో రంగారెడ్డి జిల్లా తలకొండ మండలంలోని మెగ్లితండాకు చెందిన ఇస్లావత్ రాజు అక్రమంగా నల్లబెల్లం, పటిక మన్ననూర్ గ్రామానికి తరలిస్తున్నాడని విశ్వసనీయ సమాచారం అందిందన్నారు. వాహనంలో తరలిస్తున్న 20 బస్తాలు (600 కేజీలు) నల్లబెల్లం, 120 కేజీల పటికను స్వాధీనం చేసుకుని, వాహనాన్ని సీజ్ చేసి రాజుపై కేసు నమోదు చేశామని సీఐ పేర్కొన్నారు. ఈ దాడుల్లో సిబ్బంది జనార్దన్రెడ్డి, సిదార్థ, చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈఎస్ఐసీ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డులు దురుసుగా ప్రవర్తన అమీర్పేట: సనత్నగర్ ఈఎస్ఐసీ ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చిన వారి పట్ల సెక్యూరిటీ గార్డులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని రోగులు ఆరోపించారు. మహిళా సెక్యూరిటీ గార్డు ఏకంగా చేయిచేసుకునేందుకు యత్నించిందని ఓ రోగి వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.వివరాల్లోకి వెళ్తే..జడ్చర్ల మున్సిపల్ కార్యాలయంలో ఎలక్ట్రిషియన్ విభాగంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఆకుల వెంకటేష్ చికిత్స నిమిత్తం ఈఎస్ఐ ఆస్పత్రికి వచ్చాడు. కన్ను, వెరికోవేన్స్ సమస్యతో బాధపడుతున్న అతడికి వైద్యులు పరీక్షలు చేసి కంటికి లెన్స్ వేయాలని, లెన్స్ వచ్చాక సమాచారం ఇస్తామని పంపించారు. గత శుక్రవారం ఫోన్ చేసి ఆసుపత్రికి రావాలని చెప్పడంతో వచ్చి ఆసుపత్రిలో చేరాడు.వెంకటేష్తో పాటు మరో 10 మంది ఓపీడీకి తీసుకెళ్తున్న సమయంలో మహిళా సెక్యూరిటీ గార్డు రోగులను అడ్డుకుని దురుసుగా ప్రవర్తించడమే కాకుండగా మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని దుర్భాషలాడుతూ చేతిలో ఉన్న పెన్నుతో చేయి చేసుకునేందుకు ప్రయత్నించిందని వెంకటేష్ తెలిపాడు. వైద్యులు రమ్మన్నారని చెప్పినా వినిపించుకోలేదని తెలిపారు. వైద్యులు, నర్సులు బాధ్యతాయుతంగా పనిచేస్తున్నా, ఇతర సి బ్బంది పనితీరు సరిగా లేదని వెంకటేష్ అన్నా రు. ఆస్పత్రిలో నీటి కొరత తీవ్రంగా ఉందని, రోగులకు ఇస్తున్న ఆహారంలో అస్సలు నాణ్య త ప్రమాణాలు పాటించకుండా నాసీరకం ఆహారం ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. -
ఉపాధి కోసం వచ్చి.. చోరీలు
● ముగ్గురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యుల రిమాండ్ షాద్నగర్: ఉపాధి పేరుతో వచ్చి.. చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను పోలీసులు రిమాండ్కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను రంగారెడ్డి జిల్లా షాద్నగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్జోషి వెల్లడించారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన సుఖ్దేవ్సింగ్, షమేర్ సింగ్, మన్ప్రీత్సింగ్ ఉపాధి కోసం కొంతకాలం క్రితం రాష్ట్రానికి వచ్చారు. హార్వెస్టర్ డ్రైవర్లు, కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సులువుగా డబ్బు సంపాదించేందుకు చైన్ స్నాచింగ్లకు, ద్విచక్రవాహనాల చోరీలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 25వ తేదీన కేశంపేట మండలం సంతాపూర్లో ఈ నలుగురు దుండగులు బైక్లపై వచ్చి ఓ వృద్ధురాలి మెడలోంచి నాలుగు తులాల బంగారు పుస్తెల తాడును లాక్కెళ్లారు. కడ్తాల్ ఠాణా పరిధిలో మరో మహిళను బెదిరించి ఆమె మెడలోంచి మూడు తులాల పుస్తెల తాడును అపహరించుకెళ్లినట్లు తెలిపారు. జూలై 24న మహబూబ్నగర్ రైల్వేస్టేషన్ సమీపంలోని ఏటీఎం వద్ద పార్కు చేసిన బైకును, జూన్లో వనపర్తి జిల్లా కొత్తకోటలో చోరీ చేసిన ద్విచక్రవాహనాలపై తిరుగుతూ చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నట్లు తెలిపారు. కాగా.. కేశంపేట చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న సుఖ్దేవ్సింగ్, షమేర్ సింగ్, మన్ప్రీత్సింగ్లను అదుపులోకి తీసుకుని విచారించగా కేశంపేట, కడ్తాల్, మహబూబ్నగర్, కొత్తపేట ఠాణాల పరిధిలో చేసిన చోరీలను ఒప్పుకొన్నారని తెలిపారు. వారి వద్ద నుంచి ఏడు తులాల బంగారు ఆభరణాలు, మూడు సెల్ఫోన్లు, ఓ ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
నాలా పైప్లైన్లో పడి వృద్ధుడి గల్లంతు
● కూతురి వద్దకు వెళ్తుండగా ఘటన ● వర్షాకాలంలో రైల్వే అండర్ బ్రిడ్జి పైప్లైన్ పనులు ● హైడ్రా, సీఎంసీ, పోలీస్ బృందాల గాలింపు చందానగర్: కూతురు దగ్గరకు వెళ్లి వస్తా అని చెప్పివెళ్లిన ఓ వృద్ధుడు నాలా పైప్లైన్లో పడి గల్లంతయ్యాడు. ఈ సంఘటన కొండాపూర్ డివిజన్ ప్రేమ్నగర్ బి బ్లాక్ వద్ద ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి కింద జరిగింది. బంధువులు, స్థానికులు తెలిపిన మేరకు.. మహబూబ్నగర్కు చెందిన బాలయ్య (70), భార్య పద్మ ఇద్దరు కుమారులు శ్రీను, బాలస్వామి, కూతురు మంజులతో కలిసి న్యూ హఫీజ్పేటలోని ప్రేమ్నగర్లో స్థిరపడ్డారు. బాలయ్యకు కంటిచూపు మందగించి రాత్రి సమయాలలో ఇంటి నుంచి బయటకు వెళ్లేవాడు కాదు. కూతురు మంజుల వైశాలీనగర్లో నివాసముంటోంది. మంగళవారం సాయంత్రం బాలయ్య కూతురు దగ్గరకు వెళ్లి వస్తానని చెప్పి వైశాలీనగర్ వైపు బయలుదేరాడు. రైల్వే అండర్ బ్రిడ్జి పైప్లైన్ పనులు నిర్వహిస్తున్న నేపథ్యంలో భారీ వర్షం కురుస్తున్న సందర్భంగా రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద బాలయ్య ఒక్కసారిగా పాత పైప్లైన్లోకి జారి పడిపోయాడు. అప్పటికే భారీ వరదతో ప్రవహిస్తున్న పైప్లైన్లో పడి గల్లంతయ్యాడు. స్థానికులు గమనించి 100కి ఫోన్ చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం హైడ్రా, సీఎంసీ అధికారులకు సమాచారం అందించారు. రాత్రి సమయం కావడం ఒకవైపు భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో పైప్లైన్లో పడ్డ వృద్ధుడి కోసం గాలింపునకు అంతరాయం ఏర్పడింది. బుధవారం ఉదయం నుంచి హైడ్రా, సీఎంసీ ఉన్నతాధికారులు పరిశీలించారు. సాయంత్రం వరకు రైల్వే అండర్ బ్రిడ్జి నుంచి ఈర్ల చెరువు వరకు వృద్ధుడి కోసం గాలించారు. -
నగరంలో భారీ వర్షం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నగరంలో బుధవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని లోతట్టుప్రాంతాలు రామయ్యబౌలి, బీకేరెడ్డి కాలనీ, శేషాద్రినగర్, నాగిరెడ్డి కాలనీ, బీఎన్రెడ్డి కాలనీ, గచ్చిబౌలి, రాయచూర్ రోడ్డు, గౌడ్స్కాలనీ, గణేష్నగర్, వన్టౌన్లోని మహిళా పోలీస్స్టేషన్ ప్రాంగణం, వల్లభ్నగర్, కిసాన్నగర్, కుర్విహినిశెట్టికాలనీ, లక్ష్మీనగర్కాలనీ, వేంకటేశ్వరకాలనీ తదితర ప్రాంతాలతో పాటు కొత్త బస్టాండు ప్రాంగణం జలమయంగా మారాయి. చాలా చోట్ల డ్రెయినేజీలు పొంగి రోడ్లపైకి వర్షపునీటితో పాటు మురుగు ఏరులై పారింది. బస్టాండులో ప్రయాణికులతో పాటు నగరంలోని ప్రధాన రహదారుల్లో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా, పలుసార్లు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఇక 12 విలీన గ్రామాల్లో మట్టిరోడ్లన్నీ బురదమయంగా తయారైంది. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అత్యధికంగా నగరంలో 41.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. పది మండలాల్లో పది మిల్లీమీటర్లకు పైగా వర్షం కురిసింది. కోయిలకొండ, గండేడ్, జడ్చర్ల, రాజాపూర్, నవాబుపేట, మహమ్మదాబాద్, బాలానగర్లో ముసురుతో కూడిన జల్లులకు పడ్డాయి. -
ఎక్కడెక్కడ ఎలా అంటే..
నడిగడ్డలోని గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలో 2లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సిన నెట్టెంపాడు ప్రాజెక్టు ద్వారా కేవలం 1.45లక్షల ఎకరాలకే నీరందుతోంది. రెండు దశాబ్దాల క్రితం ప్రారంభించిన ఈ ప్రాజెక్టుకు పదేళ్లుగా నిధులు లేకపోవడంతో పాటు 99, 100 ప్యాకేజీల పరిధిలో 541 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఎనిమిదేళ్ల క్రితం చేపట్టిన గట్టు ఎత్తిపోతల పథకం కుడి, ఎడమ కాల్వల పరిధిలో 249 ఎకరాలు, రిజర్వాయర్ నిర్మాణానికి మరో 283 ఎకరాలు అవసరం ఉండటంతో పనులు ముందుకు సాగడం లేదు. ఆర్డీఎస్ ద్వారా 87,500 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా.. అంతర్రాష్ట్ర జలవివాదం కారణంగా వానాకాలంలో గరిష్టంగా 50వేల ఎకరాలకు మించి సాగునీరు అందిన పరిస్థితి లేదు. దీంతో గత ప్రభుత్వం రాజోళి మండలంలో మలమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రిజర్వాయర్ నిర్మాణానికి 567 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా.. స్థానిక రైతులు అభ్యంతరం తెలుపుతుండటంతో పనులకు అడ్డంకిగా మారింది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు సైతం వివిధ దశల్లో పెండింగ్లోనే కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు కింద సివిల్, మెకానికల్ పనులతో పాటు, భూ సేకరణ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 4.50 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉండగా.. రెండు దశాబ్దాలుగా పనులు పెండింగ్లోనే కొనసాగుతున్నాయి. ఇక్కడ సుమారు 130 ఎకరాల వరకు భూమిని సేకరించి పనులను పూర్తిచేయాల్సి ఉంది. అసంపూర్తి పనులతో కేవలం 2.50లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. భీమా ఎత్తిపోతల పథకం కింద 4 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉండగా.. రెండు దశాబ్దాలుగా పనులు పెండింగ్లోనే కొనసాగుతున్నాయి. -
ఈ వానతో పత్తి గట్టెక్కింది
ఈసారి వర్షాలు లేక పత్తి పంట ఎండుముఖం పట్టింది. మొక్కల ఎదుగుదల కూడా మందగించింది. మరో వారం రోజులు వర్షం పడకపోతే పంట దెబ్బతింటుందనే ఆందోళనలో ఉన్నాం. ఇప్పుడు కురిసిన వర్షంతో పొలంలో తేమ పెరిగింది. పత్తి మళ్లీ కోలుకునే అవకాశం కనిపిస్తోంది. మరో రెండు, మూడు వర్షాలు కురిస్తే దిగుబడిపై మంచి ఆశలు ఉన్నాయి. ప్రస్తుతం కలుపు నివారణ, అంతర కృషి పనులు చేపట్టి పంటలను కాపాడుకుంటాం. – చంద్రయ్య, రైతు, ఫర్దీపూర్ గ్రామం, చిన్నచింతకుంట మండలం కురిసిన వర్షం పత్తి, మొక్కజొన్న, కంది, జొన్న వంటి ఆరుతడి పంటలకు ఎంతో మేలు చేస్తుంది. వర్షం తర్వాత పంటల్లో పురుగులు, శిలీంధ్ర వ్యాధులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. రైతులు తప్పనిసరిగా పొలాలను పరిశీలిస్తూ సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పత్తిలో రసం పీల్చే పురుగులు, ఆకుమచ్చ, తెగుళ్లను ఎప్పటికప్పుడు గమనించి, ఆర్థిక నష్ట పరిమితి దాటినప్పుడే వ్యవసాయ అధికారుల సూచనల మేరకు తగిన పురుగుమందులు పిచికారీ చేయాలి. మొక్కజొన్న, కంది పంటల్లో కూడా పురుగు, వ్యాధుల లక్షణాలు కనిపిస్తే వెంటనే ఏఈఓలను సంప్రదించాలి. నేలలో తేమ ఉన్న సమయంలో కలుపు నివారణ, అంతరకృషి, సమతుల్య ఎరువుల వినియోగంపై దృష్టి పెడితే పంట ఎదుగుదల మెరుగ్గా ఉంటుంది. రైతులు క్షేత్రస్థాయిలో పంటలను నిరంతరం పరిశీలిస్తూ శాసీ్త్రయ సస్యరక్షణ చర్యలు పాటిస్తే మెరుగైన దిగుబడులు సాధించవచ్చు. – గోవింద్నాయక్, జిల్లా వ్యవసాయశాఖ అఽధికారి -
భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి
జిల్లాకేంద్రంలోని ద్వారకామయి ఆలయంలో భక్తులు జిల్లావ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలను బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా నగరంలోని శ్రీద్వారకామయి సాయిమందిరంలో కాగడహారతి, మహాన్యాస పారాయణం, అష్టోతర శతక్షీర కుంభాభిషేకం, ప్రదోషకాలపూజ, ఆలయ ఆవరణలో సామూహిక సాయి వ్రతాలతో పాటు పల్లకీసేవ చేపట్టారు. వెంకటేశ్వర కాలనీ, లక్ష్మినగర్, జడ్చర్లలోని విజయనగరం కాలనీ ల్లోని సాయినాథుడి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయంలో గురుపౌర్ణమి ప్రత్యేక పూజలు చేశారు. – స్టేషన్ మహబూబ్నగర్ లక్ష్మీనగర్ కాలనీ బాబా గుడిలో భక్తులు -
ఉత్పాదకతను పెంచే పనులకు ప్రాధాన్యం ఇవ్వాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): వీబీజీ రాంజీ అధిక శ్రమ ఆధారిత, ఉత్పాదకతను పెంచే పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ సూచించారు. జిల్లాలో చేపడుతున్న వీబీజీ రాంజీ పనులపై బుధవారం కలెక్టరేట్లో వెబ్ఎక్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాలో కొనసాగుతున్న పనులు, కూలీల వినియోగం, పనుల పురోగతి, సకాలంలో పూర్తి చేయడం, నాణ్యతా ప్రమాణాల అమలు, రికార్డుల నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో గరిష్ట స్థాయిలో ఉపాధి కల్పించడంతో పాటు, ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూర్చే మన్నికై న సామాజిక ఆస్తుల సృష్టిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పనుల అమలులో నాణ్యతను కచ్చితం ్డగా పాటిస్తూ, ప్రతి పనిని నిర్దేశిత గడువు గా పూర్తి చేయాలని సూచించారు. స మావేశంలో జెడ్పీ సీఈఓ వెంకట్రెడ్డి, డీఆర్డీఓ నరసింహులు, హౌసింగ్ పీడీ ఉపేందర్రెడ్డి, ఎంపీడీఓ లు, ఎంపీఓలు, ఏపీఓలు, ఏపీఎంలు, పంచాయతీ కార్యదర్శులు, టీఏలు, ఈసీలు పాల్గొన్నారు. పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి మెట్టుగడ్డ: దేశంలో సగ భాగానికి పైగా ఉన్న బీసీల హక్కుల సాధన కోసం ఉద్యమాన్ని నిర్మిస్తామని, బీసీలను ఏకం చేసి ఉద్యమ జ్వాలను రగిలిస్తామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యానిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. ఆగస్టు 7న బెంగళూరులో జరిగే జాతీయ ఓబీసీ మహాసభ వాల్పోస్టర్ను బుధవారం జిల్లాకేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జాతి జనగణనలో బీసీ కులగణన చేపట్టాలని, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని, ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ రాజకీయ రిజర్వేషన్ల బిల్లును పెట్టాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఈ వర్షాకాల సమావేశాల్లోనే మహిళా బిల్లు, డీ లిమిటేషన్ బిల్లును ఆమోదించుకోవాలని చూస్తోందని, బీసీ బిల్లు లేకుండా ప్రవేశపెట్టే ఈ బిల్లులను అన్ని పార్టీలు అడ్డుకోవాలన్నారు. నాయకులు చంద్రశేఖర్, మహేష్యాదవ్, దోమ వెంకటేష్, జ్ఞానేశ్వర్, వేణుగౌడ్, మధు తదితరులు పాల్గొన్నారు.


