breaking news
Mahabubnagar
-
మామకు డబ్బులివ్వడానికి వెళ్తూ..
● బాల్య స్నేహితులకు రోడ్డు ప్రమాదం ● ఒకరు దుర్మరణం, మరొకరి పరిస్థితి విషమం భూత్పూర్/జడ్చర్ల: మామకు డబ్బులు ఇవ్వడానికి బైక్పై వెళ్తుండగా ముందు వెళ్తున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో వెనకనుంచి బలంగా ఢీకొట్టి అల్లుడు మృతిచెందిన ఘటన భూత్పూర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఎస్ఐ నాగన్న కథనం ప్రకారం.. జడ్చర్లలోని బాలాజీనగర్కు చెందిన బారాత్ జానీ(35), కావేరమ్మ పేట కు చెందిన మిత్రుడు సత్యంగౌడ్ ఇద్దరు కలిసి గద్వాలలోని జానీ మామకు డబ్బులు ఇవ్వడానికి బైక్పై వెళ్తుండగా.. భూత్పూర్ వద్ద జాతీయ రహ దారి బ్రిడ్జిపై ముందు వెళ్తున్న లారీ సడన్గా బ్రేక్వేయడంతో వెనకనుంచి బైక్తో బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో జానీ అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. సంత్యంగౌడ్కు తీవ్ర గాయాలు కాగా.. జిల్లా ఆస్పత్రికి తరలించారు. జానీ భార్య భవానీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. కావేరమ్మపేటలో విశాదం జానీ, సత్యం బాల్య స్నేహితులు. ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కుటుంబాలను వెళ్లదిస్తున్నవారే.. గురువారం కావేరమ్మపేటలోని తమ ఇళ్ల నుంచి ఒకే బైక్పై బయటకు వెళ్లి భూత్పూర్ వద్ద ఫ్లై చో టుచేసుకున్న ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా.. మరొకరు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదం విశయం తెలిసిన వెంటనే ఒక్కసారిగా కావేరమ్మపేటలో విశాదఛాయలు అ లుముకున్నాయి. మృతుడు జానీకి భార్య భవానీ, పిల్లలు సాయిచరణ్, హర్షవర్ధన్, ప్రణవి ఉన్నారు. సత్యంగౌడ్కు భార్య స్వాతి, ముగ్గురు పిల్లలున్నారు. -
ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంచాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆంగ్ల విద్య అందిస్తూ భాషా నైపుణ్యాలను పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆదేశించారు. గురువారం క్యాంపు కార్యాలయం నుంచి ‘వెబెక్స్’ ద్వారా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులతో ఆంగ్ల బోధనపై సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల స్థాయికి అనుగుణంగా నూతన బోధనా పద్ధతులు అవలంబించాలని, చదవడం, రాయడం, అర్థం చేసుకోవడంతో పాటు ఆంగ్లంలో ధారాళంగా మాట్లాడేలా తీర్చిదిద్దాలని సూచించారు. భయంలేకుండా ఆంగ్లంలో మాట్లాడే వాతావరణం కల్పించాలని, అభ్యసన ఫలితాలను నిరంతరం పరిశీలిస్తూ వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు ఉత్తమ బోధనా పద్ధతులను పరస్పరం పంచుకుంటూ విద్యార్థులను బోధనలో చురుగ్గా భాగస్వాములను చేయాలని సూచించారు. వెబెక్స్ సమావేశంలో డీఈఓ విజయకుమారి, పాల్గొన్నారు. పింఛన్ దరఖాస్తుల ఆన్లైన్ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: కార్పొరేషన్ పరిధిలో కొత్త పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి తమ దరఖాస్తుల పరిస్థితిపై స్పష్టత లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అధికారులు ఆఫ్లైన్లో దరఖాస్తులు స్వీకరించి నేరుగా ఆన్లైన్లో నమోదు చేస్తున్నప్పటికీ.. దరఖాస్తు స్వీకరించినట్లు రశీదు ఇవ్వకపోవడం, ఆన్లైన్ చేసినట్లు ఎస్ఎంఎస్ రాకపోవడంతో పలువురు అయోమయానికి గురవుతున్నారు. దీంతో కొందరు ఒకటికి రెండుసార్లు దరఖాస్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కార్పొరేషన్ పరిధిలో ఇప్పటి వరకు 1,177 దరఖాస్తులు అందగా.. వీటిలో వితంతు పెన్షన్కు 810, ఒంటరి మహిళ 19, దివ్యాంగు 339, చేనేత కార్మికులకు 2, కల్లుగీత కార్మికులకు 7 దరఖాస్తులు ఉన్నాయి. ఈ విషయంపై కమిషనర్ రామాంజులారెడ్డి మాట్లాడుతూ ప్రతి దరఖాస్తును రిజిస్టర్లో నమోదు చేయడంతో పాటు ఆన్లైన్లో పొందుపరుస్తున్నామని తెలిపారు. దరఖాస్తులను ఆన్లైన్ చేయకుండా నిర్లక్ష్యం చేసే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పీయూలో ప్రాంగణ ఎంపికలు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో దివీస్ ల్యాబొరేటరీస్ ఆధ్వర్యంలో క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొనగా.. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ ఓఎస్డీ మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ చదువు పూర్తికాగానే ఉద్యోగం పొందడం మంచి అవకాశమన్నారు. ప్రైవేట్ సంస్థల్లో మెరుగైన వేతనాలతో ఉద్యోగాలు పొందడం ద్వారా విద్యార్థులు భవిష్యత్లో స్థిరపడవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్లేస్మెంట్ అధికారి అర్జున్, ప్రిన్సిపాల్ ఈశ్వర్ పాల్గొన్నారు. ప్రభుత్వ విధానాలతో కార్మికులకు నష్టం మహబూబ్నగర్ మున్సిపాలిటీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక విధానాలు కార్మికుల సంక్షేమానికి దోహదపడటం లేదని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్ విమర్శించారు. గురువారం ఎంజీజీహెచ్ లో ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల సన్నాహక సమా వేశం నిర్వహించి వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. వచ్చే నెల 6 నుంచి 8 వరకు కరీంనగర్లో జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలకు అధిక సంఖ్యలో కార్మికులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
దసరాకి రణబాలి ఫిక్స్
విజయ దశమి సందర్భంగా థియేటర్స్లోకి రానున్నాడు రణబాలి. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. ఈ చిత్రంలో రణ బాలిగా విజయ్ దేవరకొండ, జయమ్మగా రష్మికా మందన్నా, సర్ థియోడర్ హెక్టర్ పాత్రలో ఆర్నాల్డ్ వోస్లూ నటిస్తున్నారు. 19వ శతాబ్దం నేపథ్యంలో రాయలసీమ ప్రాంతంలో 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన కొన్ని చారిత్రక వాస్తవ సంఘటనలతో రూపొందుతున్న ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. తొలుత ఈ సినిమాను సెప్టెంబరు 11న రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. తాజాగా ‘రణబాలి’ని విజయదశమి సందర్భంగా అక్టోబరు 16న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు. -
మొక్కలకు రాఖీ.. పర్యావరణానికి రక్ష!
భూత్పూర్: రక్షాబంధన్ సందర్భంగా భూత్పూర్ మండలం అన్నాసాగర్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు వినూత్నంగా మొక్కలకు రాఖీలు కట్టారు. వృక్షాలను సంరక్షిస్తే అవే మనకు రక్షణగా నిలుస్తాయని ప్రధానోపాధ్యాయులు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని బాధ్యతగా సంరక్షించాలని సూచించారు. భవిష్యత్ తరాలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలంటే విరివిగా మొక్కలు నాటి కాపాడాల్సిన అవసరం ఉందని విద్యార్థులకు అవగాహన కల్పించారు. బెంగళూర్ టు పాలమూరు జిల్లా కేంద్రానికి చెందిన గొండ్యాల రాఘవేంద్రశర్మ, గొండ్యాల గోపాలకృష్ణ శర్మ . వీరి సోదరి ప్రత్యూష బెంగుళూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. వృత్తిరీత్యా ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రత్యూష రాఖీ పండుగ కోసం తన అన్నలకు రాఖీలు కట్టడానికి బెంగళూర్ నుంచి పాలమూరు నగరానికి వచ్చారు. కొన్నేళ్ల నుంచి క్రమం తప్పకుండా రాఖీ పండుగ కోసం మమబూబ్నగర్కు వచ్చి అన్నలకు రాఖీ కట్టి పండుగను ఎంతో సంతోషంగా జరుపుకొని తిరిగి బెంగళూర్కు వెళుతున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘చిన్నప్పటి నుంచి రాఖీ పండుగ అంటే ఎంతో ఇష్టం. రాఖీ పండగ ఎప్పుడు వస్తుంది అన్నవాళ్లకు రాఖీలు ఎప్పుడు కట్టాలనుకునే కుతూహలం ఉండేది.ఈ సారి కూడా అన్నలకు రాఖీలు కట్టడానికి పాలమూరు వచ్చాను.’ అని తెలిపారు. -
నటుడు–నిర్మాత జీవీ నారాయణ రావు ఇక లేరు
● ‘అంతులేని కథ’ సినిమాలో..ప్రముఖ నటుడు, నిర్మాత జీవీ నారాయణ రావు(73) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం తుది శ్వాస విడిచారు. కృష్ణా జిల్లా కురుమద్దాలి గ్రామంలో జన్మించిన నారాయణరావు బాల్యం, విద్యాభ్యాసం గుంతకల్లులో సాగింది. చిన్నతనం నుంచే నాటకాలు, నటనంటే ఆయనకు మక్కువ.. గిడుగు విశాలాక్షి వద్ద భరతనాట్యం, నటరాజ రామకృష్ణ వద్ద కూచిపూడి నృత్యం, ఏఆర్ కృష్ణ వద్ద నటన నేర్చుకున్నారు. విద్యార్థి దశలోనే ‘మహమ్మద్ బీన్ తుగ్లక్, ప్రతాప రుద్రీయం, మంచుతెర’ వంటి పలు నాటకాలు వేసి, తనదైన నటనతో మెప్పించారాయన. కోట శ్రీనివాసరావు, నూతన ప్రసాద్, దేవదాస్ కనకాల వంటి పలువురితో కలిసి రంగస్థల వేదికను పంచుకున్నారాయన. వారి మధ్య మంచి స్నేహం కూడా ఉంది. ‘అంతులేని కథ’తో పరిచయం నటనపై ఆసక్తితో మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందారు నారాయణరావు. ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ తెరకెక్కించిన ‘అంతులేని కథ’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. రజనీకాంత్, జయప్రద, శ్రీప్రియ, ఫటాఫట్ జయలక్ష్మి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం 1976 ఫిబ్రవరి 27న విడుదలై, మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ‘వికటకవి గోపాల్’ పాత్రలో తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నారాయణ రావు. తొలి సినిమాకే ఉత్తమ సహాయ నటుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డు అందుకున్నారు. ప్రత్యేకించి ఈ సినిమాలో ‘తాళికట్టు శుభవేళ... మెడలో కళ్యాణ మాల...’ పాటలో ఆయన నటనకు ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత ‘ముత్యాల పల్లకి, ఒక ఊరి కథ, చిలకమ్మ చెప్పింది, ఆలు మగలు, గుప్పెడు మనసు, కుక్క కాటుకు చెప్పు దెబ్బ, బడాయి బసవయ్య, ఊరుకిచ్చిన మాట, చట్టానికి కళ్ళు లేవు, మంచు పల్లకి, ప్రళయ రుద్రుడు, బహుదూరపు బాటసారి, దేవాంతకుడు, ప్రేమాయణం, యముడికి మొగుడు, ముత్యమంత ముద్దు, రాజా విక్రమార్క, సీతారామయ్యగారి మనవరాలు, గ్యాంగ్ లీడర్, ప్రేమ చిత్రం పెళ్లి విచిత్రం, హిట్లర్, సాహసం, మహా భక్త సిరియాళ, రాజుగారి గది 2, తోలు బొమ్మలాట’ వంటి సుమారు 100కు పైగా చిత్రాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి, ప్రేక్షకులకు దగ్గరయ్యారు నారాయణ రావు. తెలుగులో ఆయన నటించిన చివరి చిత్రం ‘స్కైలాబ్’. 2021 డిసెంబరు 4న ఈ మూవీ విడుదలైంది. నిర్మాతగానూ... నటనతో పాటు నిర్మాణ రంగంలోనూ నారాయణరావుకి మంచి అనుభవం ఉంది. నిర్మాతగా ‘యముడికి మొగుడు, దేవాంతకుడు, ఇంటికో రుద్రమ్మ, పెళ్ళి నీకు శుభం నాకు’ వంటి సినిమాలను నిర్మించారు. మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందుతున్నప్పుడు ఆయనకు రజనీకాంత్తో మంచి స్నేహం కుదిరింది. రజనీకాంత్, చిరంజీవితో ఆయనకు సన్నిహిత స్నేహం ఉంది. చిరంజీవి హీరోగా ‘దేవాంతకుడు, యముడికి మొగుడు’ వంటి చిత్రాలు నిర్మించారు. ‘యముడికి మొగుడు’ సినిమాని తన మిత్రుడు రజనీకాంత్తో తమిళంలోనూ రీమేక్ చేశారు. బుల్లి తెరపైనా... ‘పసుపు కుంకుమ, సుందరకాండ, గిరిజా కళ్యాణం, గీతాంజలి’ వంటి సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులనూ అలరించారు నారాయణ రావు. ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో నటుడిగా, నిర్మాతగా చిత్ర పరిశ్రమతో అనుబంధాన్ని కొనసాగించారాయన. నారాయణరావుకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన మృతి పట్ల మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. నేడు ఆయన అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరగనున్నాయి. నా ఆత్మీయ మిత్రుడు జీవీ నారాయణరావుగారు ఇక లేరనే వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 1976లో ‘అంతులేని కథ’తో పరిచయమైన ఆయన ఎన్నో చిత్రాల్లోనూ, పలు టెలివిజన్ సీరియళ్లలోనూ తన విలక్షణమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. నారాయణరావుగారితో నాకెంతో సన్నిహితమైన అనుబంధం ఉంది. ‘దేవాంతకుడు, యముడికి మొగుడు’ వంటి చిత్రాలను నాతో నిర్మించిన నిర్మాతగా మా ప్రయాణంలో ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. – చిరంజీవి -
ట్రాన్స్ఫార్మర్ల చోరీ ముఠా గుట్టురట్టు
● ఐదుగురి అరెస్టు ● రూ.2లక్షల నగదు, వాహనాలు స్వాధీనం కొత్తకోట: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల చోరీకి పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం కొత్తకోట పోలీస్స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వనపర్తి డీఎస్పీ బాలాజీ వెల్లడించారు. ఐదుగురు నిందితులు ముఠాగా ఏర్పడి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలోని కాపర్ కాయిల్స్ చోరీ చేస్తున్నారు. ముందుగా రెక్కీ నిర్వహించి, జనసంచారం లేని ప్రాంతాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను గుర్తించేవారు. రాత్రివేళ విద్యుత్ సరఫరా నిలిపివేసి, ట్రాన్స్ఫార్మర్లను విడదీసీ కాపర్ కాయిల్స్ చోరీ చేస్తున్నారు. దొంగిలించిన ఒక్కో ట్రాన్స్ఫార్మర్లో సుమారు 40 నుంచి 45 కిలోల కాపర్ కాయిన్ ఉంటుందని.. కిలోకు రూ. 200 చొప్పున విక్రయించే వారని డీఎస్పీ తెలిపారు. వనపర్తి జిల్లాలో 9, మహబూబ్నగర్లో 5, గద్వాలలో 4, నారాయణపేటలో 3, మరో ప్రాంతంలో 2 ట్రాన్స్ఫార్మర్లను చోరీ చేసిన ట్లు పోలీసుల విచారణలో వెల్లడైందని పేర్కొన్నా రు. నిందితుల నుంచి మరిన్ని చోరీల వివరాలను రాబట్టేందుకు విచారణ కొనసాగిస్తున్నామన్నారు. చోరీకి ఉపయోగించిన రెండు ట్రాలీ ఆటోలు, రెండు ద్విచక్ర వాహనాలతో పాటు రూ. 2లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. సమావేశంలో సీఐ ఓడీ రమేష్, ఎస్ఐలు విక్రమ్, భాస్కర్ ఉన్నారు. -
పండుగ వేళ.. సరిపోని బస్సులు
● కిక్కిరిసి పోయిన బస్టాండ్లు ● కొన్ని గంటల పాటు వేచి ఉన్న ప్రయాణికులు ● విద్యార్థులతోపాటు వందలాది మంది రాకపోకలు ● 4 రోజుల పాటు 490 ప్రత్యేక బస్సుల ఏర్పాటు మహబూబ్నగర్ మున్సిపాలిటీ: రాఖీ పండుగ నేపథ్యంలో గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు మహబూబ్నగర్తో పాటు ఉమ్మడి జిల్లాలోని బస్టాండులు ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ఇక సాయంత్రం పాఠశాలలు, కళాశాలల తరగతులు ముగిసిన వెంటనే విద్యార్థులు స్వగ్రామాల బాట పట్టారు. దీంతో కొత్త బస్టాండుకు తరలిరాగా.. వందలాది మంది తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరి స్థితి నెలకొంది. ప్లాట్ఫాంల వద్దకు ఏ బస్సు వచ్చినా జనం ఎగబడి ఎక్కా రు. ఇక మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండటంతో చాలా మంది తోసుకుంటూ ముందుకు కదిలారు. ఒక్కసారిగా ప్రయాణికులు ఎగబడటంతో ఏ రూట్లోనూ బస్సులు సరిపోలేదు. ముఖ్యంగా హైదరాబాద్, వనపర్తి, నాగర్కర్నూల్, నారాయణపేట, గద్వాల జిల్లాలకు వెళ్లాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినా.. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు మహబూబ్నగర్ రీజియన్ పరిధిలో ఈనెల 27 నుంచి 31వ తేదీ వరకు మధ్యలో ఒక్కరోజు (ఈనెల 29) మినహా నాలుగు రోజుల పాటు మొత్తం 490 బస్సులను అదనంగా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా నెల 27న నాగర్కర్నూల్ డిపో నుంచి 12, మహబూబ్నగర్ నుంచి 10, గద్వాల నుంచి 11, వనపర్తి, అచ్చంపేట, షాద్నగర్ డిపోల నుంచి 9 చొప్పున కల్వకుర్తి, కోస్గి నుంచి 8 చొప్పున, కొల్లాపూర్ నుంచి 6, నారాయణపేట నుంచి 5 బస్సులను ఇలా మొత్తం 87 అదనంగా నడిపారు. ● ఈనెల 28న మహబూబ్నగర్ డిపో నుంచి 38, నాగర్కర్నూల్ నుంచి 30, షాద్నగర్ నుంచి 26, అచ్చంపేట నుంచి 22, కల్వకుర్తి, నారాయణపేట నుంచి 20 చొ ప్పున, గద్వాల నుంచి 14, కొల్లాపూర్ నుంచి 12, వనపర్తి నుంచి 10, కోస్గి నుంచి 8 చొప్పున మొత్తం 200 ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. ● ఈనెల 30న నాగర్కర్నూల్ డిపో నుంచి 21, షాద్నగర్ నుంచి 17, కల్వకుర్తి నుంచి 12, వనపర్తి నుంచి 10, నారాయణపేట, కోస్గి నుంచి 8 చొప్పున, మహబూబ్నగర్, అచ్చంపేట నుంచి 7 చొప్పున, కొల్లాపూర్ నుంచి 6, గద్వాల నుంచి 5 చొప్పున మొత్తం 101 ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. ● ఈనెల 31న నాగర్కర్నూల్ డిపో నుంచి 15, గద్వాల, వనపర్తి నుంచి 13 చొప్పున, మహబూబ్నగర్, షాద్నగర్ నుంచి 10 చొప్పున, కల్వకుర్తి, నారాయణపేట, అచ్చంపేట నుంచి 9 చొప్పున, కోస్గి నుంచి 8, కొల్లాపూర్ నుంచి 6 చొప్పున మొత్తం 102 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. అయినప్పటికీ ఇవి ఏమాత్రం సరిపోవని ప్రయాణికులు వాపోతున్నారు. -
నీట్ పీజీ ప్రవేశ పరీక్షకు పటిష్ట భద్రత
మహబూబ్నగర్ క్రైం: ఈనెల 30న జరిగే నీట్ పీజీ ప్రవేశ పరీక్షకు పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ డి.జానకి తెలిపారు. గురువారం జేపీఎన్సీఈ, ఫాతిమా విద్యాలయ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి అధికారులతో భద్రత ఏర్పాట్లపై సమీక్షించారు. పరీక్ష కేంద్రాల వద్ద బీఎన్ఎస్ 163 అమలు చేయాలని, 200 మీటర్ల పరిధిలో జిరాక్స్, ప్రింటింగ్, ఆన్లైన్, మీ–సేవా కేంద్రాలను మూసివేయించాలని ఆదేశించారు. అభ్యర్థులు, సిబ్బంది మినహా ఇతరులను అనుమతించరాదని, ఎలక్ట్రానిక్ పరికరాల నిషేధాన్ని పక్కాగా అమలు చేయాలని సూచించారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జైలు భద్రతపై ఎస్పీ తనిఖీ ఇటీవల ఖైదీ పరారీ నేపథ్యంలో జిల్లా జైలును ఎస్పీ డి.జానకి గురువారం తనిఖీ చేశారు. జైలు సూపరింటెండెంట్ కాళిదాస్తో కలిసి ప్రహరీ, ఇనుప కంచె, భద్రతా పాయింట్లను పరిశీలించారు. ఖైదీల భద్రతపై 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని, పోలీస్, జైలుశాఖలు సమన్వయంతో భద్రత ను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. -
డిసెంబరులో లెగసీ
● విశ్వక్ సేన్డిసెంబరులో విశ్వక్ సేన్ ‘లెగసీ’ థియేటర్స్కి రానుంది. విశ్వక్ సేన్ హీరోగా సాయి కిరణ్ దైదా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘లెగసీ’. ఏక్తా రాథోడ్ హీరోయిన్గా నటిస్త్తున్నారు. యశ్వంత్ దగ్గుమాటి, సాయికిరణ్ రెడ్డి దైదా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కొత్త షెడ్యూల్ మదనపల్లె పరిసర ప్రాంతాల్లో గురువారం ప్రారంభమైంది. విశ్వక్ సేన్ పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ‘‘మదనపల్లె, పరిసర ప్రాంతాల్లో నెల రోజుల షెడ్యూల్ ప్లాన్ చేశాం. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ పవర్ఫుల్ రోల్లో కనిపిస్తారు. అధికారం, కుటుంబం, ప్రేమ, ద్రోహం అంశాలతో సాగే ఈ కథలో ఒక వారసుడు ప్రమాదకరమైన ప్రపంచంలోకి అడుగుపెడతాడు. అతను తన తండ్రి గతానికి సంబంధించి దాగి ఉన్న నిజాలను ఎదుర్కొంటూ, శక్తివంతమైన ప్రత్యర్థులతో పోరాడుతూ తనపై పడిన వారసత్వపు భారాన్ని మోసే పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నదే ఈ సినిమా కథనం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: గోవింద్ వసంత. -
నేడు రక్షాబంధన్
సోదరసోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ వచ్చేసింది. అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమానురాగాలను చాటే ఈ పర్వదినం ప్రతి ఇంటా సందడి తీసుకొస్తోంది. సోదరుడి క్షేమాన్ని కోరుతూ సోదరి మణికట్టుకు రాఖీ కట్టడం.. ఆమెకు అండగా ఉంటానంటూ సోదరుడు భరోసా ఇవ్వడం.. ఈ పండుగ ప్రత్యేకత. ఆత్మీయుల మధ్య అనుబంధానికి, ఐకమత్యానికి, పరస్పర సహకారానికి చిహ్నంగా నిలస్తుంది రాఖీ. ఆధునిక కాలంలోనూ ఎక్కడ ఉన్నా తమ అన్నాతమ్ముళ్లకు రాఖీలు కట్టేందుకు.. అక్కాచెల్లెళ్లు తరలివస్తుంటారు. కాలం మారినా.. బంధం విలువను చాటే రక్షాబంధన్ సంప్రదాయం మాత్రం తరతరాలుగా కొనసాగుతూనే ఉంది. – స్టేషన్ మహబూబ్నగర్ సోదరసోదరీమణుల అనురాగానికి ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి వేడుకలకు జిల్లా సిద్ధమైంది. శ్రావణమాసంలో వచ్చే ఈ పర్వదినాన్ని శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఆనందోత్సాహాల మధ్య జరుపుకోనున్నారు. సోదరుడి క్షేమాన్ని కోరుతూ సోదరీమణులు రాఖీ కట్టడం, వారికి సోదరులు అండగా ఉంటామని భరోసా ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో నగరంలోని మార్కెట్లు రాఖీలతో సందడిగా మారాయి. కళకళలాడుతున్న మార్కెట్లు పండుగ నేపథ్యంలో మహబూబ్నగర్ నగరంలోని ప్రధాన వ్యాపార కూడళ్లు, రహదారుల వెంట రాఖీ స్టాళ్లు వెలిశాయి. గత రెండు రోజులుగా విక్రయాలు ఊపందుకున్నాయి. దూర ప్రాంతాల్లో ఉన్న సోదరులకు పోస్టు, కొరియర్ ద్వారా రాఖీలు పంపేందుకు సోదరీమణులు కొనుగోలు చేస్తున్నారు. సాయంత్రం వేళ విక్రయ కేంద్రాలు కొనుగోలుదారులతో సందడిగా కనిపిస్తున్నాయి. ● మార్కెట్లో ఆకట్టుకునే డిజైన్లలో రాఖీలు అందుబాటులో ఉన్నాయి. అన్నయ్య, తమ్ముడి పేర్లతో ప్రత్యేకంగా రూపొందించిన రాఖీలకు ఆదరణ కనిపిస్తోంది. చిన్నారుల కోసం స్పైడర్మ్యాన్ తదితర కార్టూన్ క్యారెక్టర్లతో కూడిన రాఖీలు ఉన్నాయి. మెటల్, కుందన్, ప్రింటెడ్, హ్యాండ్మేడ్, వుడెన్, ఫ్యాషన్ డిజైన్లతో పాటు లైట్వెయిట్, పెద్దసైజు రాఖీలు అందుబాటులో ఉన్నాయి. వెండి, బంగారు రాఖీలు సైతం మార్కెట్లో సందడి చేస్తున్నాయి. డిజైన్, రకాన్ని బట్టి రాఖీల ధరలు రూ.5 నుంచి రూ.600 వరకు ఉన్నాయి. బాధ్యతను గుర్తుచేసే రక్ష రక్షా బంధనం సోదరసోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయతలకు ప్రతీక. హైందవ సంప్రదాయంలో శుభకార్యాల సందర్భంగా మణికట్టుకు రక్షాసూత్రం కట్టడం ఆనవాయితీ. సోదరుడి విజయాన్ని, సంతోషాన్ని కాంక్షిస్తూ సోదరీమణులు రాఖీ కట్టడం ద్వారా ఆ బంధాన్ని మరింత బలపరుస్తారు. -
పెళ్లికి వెళ్లొస్తూ.. వాహనం ఢీకొని మృతి
కోస్గి రూరల్: పెళ్లికి వెళ్లి తిరుగొస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘ టన గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం మేరకు మండల పరిధిలో ని సర్జఖాన్పేట్కు చెందిన కామర్తి రాకేష్ (28) తన స్నేహితుడి అన్న పెళ్లి ఉండడంతో బుధవా రం రాత్రి కొత్తపల్లికి వెళ్లాడు. పెళ్లి వేడుక అనంతరం గురువారం తెల్లవారుజామున బైక్పై స్వ గ్రామానికి బయలుదేరాడు. చంద్రవంచ గేట్ సమీపంలోకి రాగానే గుర్తు తెలియని వాహనం బైక్ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో తల కు తీవ్రగాయాలై రోడ్డుపై విగతజీవిగా పడి ఉండగా అటుగా వెళ్తున్న కొందరు గమనించి 108లో కోస్గి ఆస్పత్రికి తరలించి అలాగే కు టుంబసభ్యులకు సమాచారం అందించారు. తీ వ్ర రక్తస్రావం కావడంతో జిల్లా ఆస్పత్రికి తరలించి అక్కడి నుంచి హైదరాబాద్లోని నిమ్స్ కు తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో గురువారం అర్ధరాత్రి యువకుడు మృతి చెందాడు. తండ్రి ప్రభు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్కూటీ అదుపుతప్పి: యువకుడు మృతి దేవరకద్ర రూరల్: రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని తప్పించబోయే క్రమంలో స్కూటీ అదుపు తప్పి బోల్తాపడడంతో యువకుడు మృతి చెందగా, మరో యువకుడు గాయపడిన ఘటన గురువారం దేవరకద్రలో చోటుచేసుకుంది. స్థానిక కథనం ప్రకారం.. మరికల్ మండలం అప్పంపల్లికి చెందిన శ్రీనివాస్రెడ్డి (28) సాయికుమార్ దేవరకద్రలోని వినాయక విగ్రహ తయారీ కేంద్రాలను పరిశీలించడానికి వచ్చారు. హెచ్పీ పెట్రోల్ బంకు సమీపంలో రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని తప్పించబోయి స్కూటీ ఆదుపు తప్పడంతో రోడ్డుపై పడిపోయారు. ఈ ప్రమాదంలో శ్రీనివాస్రెడ్డి తలకు బలమైన గాయమైది. కాగా, స్థానికులు క్షతగాత్రులిద్దరిని 108లో జిల్లా ఆస్పత్రికి తరలించగా, శ్రీనివాస్రెడ్డిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. సాయికుమార్ చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనతో అప్పంపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
విత్తన వ్యాపారంలోకి పీఏసీఎస్లు
● ఉత్పత్తి నుంచి ప్రాసెసింగ్, మార్కెటింగ్ వరకు సంఘాలదే బాధ్యత ● ఐదు జిల్లాల్లో 9 పీఏసీఎస్లతో పైలట్ ప్రాజెక్టు మహబూబ్నగర్ (వ్యవసాయం): రైతులకు రుణాలు, ఎరువులు, విత్తనాల పంపిణీకే పరిమితమైన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్) ఇక విత్తనోత్పత్తి వ్యాపారంలోకి అడుగుపెట్టనున్నాయి. నాణ్యమైన విత్తనాల ఉత్పత్తితో పాటు ప్రాసెసింగ్, నిల్వ, మార్కెటింగ్ చేపట్టి ఆదా యాన్ని పెంచుకోనున్నాయి. స్థానికంగానే నాణ్య మైన విత్తనాలు లభించడంతో రైతులకూ ప్రయోజనం చేకూరనుంది. ఈ నేపథ్యంలో పీజేటీఎస్ఏయూ ఆధ్వర్యంలో గురువారం మహబూబ్నగర్ డీసీసీబీలో అవగాహన సదస్సు నిర్వహించారు. మహబూబ్నగర్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాలకు చెందిన 9 పీఏసీఎస్ల ప్రతినిధులు, సీఈఓలతో 50 మంది రైతులు పాల్గొన్నారు. గ్వాలియర్ యూనివర్సిటీ మాజీ వీసీ ఎస్కే రావు మాట్లాడుతూ నాణ్యమైన విత్తనమే అధిక దిగుబడి, రైతుల ఆదాయానికి కీలకమన్నారు. పీఏసీఎస్లు విత్తనోత్పత్తిని లాభదాయక వ్యాపారంగా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. పీజేటీఎస్ఏయూ ప్రాజెక్టు ప్రధాన పరిశోధకులు డాక్టర్ ఎంవీ నాగేష్ మాట్లాడుతూ విత్తన ఎంపిక నుంచి సాగు, నాణ్యత నియంత్రణ, ప్రాసెసింగ్, నిల్వ, పంపిణీ వరకు ప్రతి దశలో ప్రమాణాలు పాటించాలని తెలిపారు. ప్రాజెక్టు మేనేజర్ డాక్టర్ విద్యాధర్ మాట్లాడుతూ పీజేటీఎస్ఏయూ, నాబా ర్డు, సహకార శాఖ, పీఏసీఎస్లు, రైతుల సమన్వయంతో ప్రాజెక్టును విజయవంతం చేయవచ్చన్నా రు. ఆర్ఏఆర్ఎస్ పాలెం ఏడీఆర్ డాక్టర్ ఎల్.కృష్ణ డీసీసీబీ సీఈఓ మహ్మద్ షఫీ ఉల్లా ఖాన్, నాబార్డు డీడీఎంలు షణ్ముఖచారి, మహేందర్, డీసీఓ కృష్ణ పాల్గొన్నారు. -
బలమైన భావోద్వేగాల సహా...
శివ కుమార్ కాసారం హీరోగా నిషాంత్ దోటి దర్శకత్వం వహించిన చిత్రం ‘సహ’ (లైఫ్ ఆఫ్ సంజు). శ్వేతా లక్ష్మణ్, వ్రజన పాండ్య హీరోయిన్లుగా నటించారు. తేజేశ్వర్ వేల్పుచర్ల నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 4న విడుదల కానుంది. గురువారం జరిగిన ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత ‘బన్నీ’ వాసు మాట్లాడుతూ–‘‘ఈ సినిమా చూశాను... చాలా బాగుంది. ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాని ప్రేక్షకులందరూ చూడాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు. నిర్మాత వంశీ నందిపాటి మాట్లాడుతూ–‘‘సహా–ది బిగ్గెస్ట్ స్మాల్ ఫిల్మ్ ఆఫ్ ది డికేడ్’ అని పోస్టర్ పెట్టారు. ఇలా పెట్టాలంటే ధైర్యం కావాలి. సినిమా ఆ అంచనాలను అందుకుంటుంది’’ అని చెప్పారు. ‘‘చిన్న సినిమా బ్లాక్బస్టర్ కొడితే ఎలా ఉంటుందో మా చిత్రంతో చూపిస్తాం’’ అన్నారు శివకుమార్. ‘‘మా సినిమా చూసిన ప్రేక్షకులు నిరుత్సాహపడితే అమీర్పేట్ సెంటర్లో నిలబడి గుండు గీయించుకుంటాను’’ అని శ్వేతా లక్ష్మణ్ పేర్కొన్నారు. ‘‘ఈ సినిమాలో బలమైన భావోద్వేగాలున్నాయి’’ అన్నారు నిశాంత్. ‘‘సహ’ గురించి ప్రేక్షకులు గొప్పగా మాట్లాడుకుంటారు’’ అన్నారు వ్రజన పాండ్య. -
కదిలిన విద్యాశాఖ!
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు పేరుతో జరిగిన డిప్యుటేషన్లపై విద్యాశాఖ స్పందించింది. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన డిప్యుటేషన్లను పునఃపరిశీలించడంతో పాటు బాధ్యులైన ఎంఈఓలపై చర్యలు తీసుకుంటామని డీఈఓ విజయకుమారి స్పష్టం చేశారు. ఈ మేరకు ‘సాక్షి’లో బుధవారం ‘అడ్డగోలుగా డిప్యుటేషన్లు’ శీర్షికన ప్రచురితమైన కథనంపై విద్యాశాఖ అధికారులు స్పందించారు. జిల్లాలో మొత్తం 197 డిప్యుటేషన్లు ఉండగా.. వీటిలో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన వాటిని పరిశీలిస్తామని డీఈఓ తెలిపారు. ముఖ్యంగా గండేడ్, మహమ్మదాబాద్, సీసీకుంట, హన్వాడ మండలాల్లో జరిగిన డిప్యుటేషన్లపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామన్నారు. ఉపాధ్యాయులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే డీఈఓ కార్యాలయంలో లిఖితపూర్వకంగా అందజేయాలని సూచించారు. వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి ఉద్దేశపూర్వకంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తేలితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని పేర్కొన్నారు. సంఘాల ఫిర్యాదులు.. ఇదిలా ఉండగా.. పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు గురువారం డీఈఓను కలిసి డిప్యుటేషన్లపై ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా చేసిన బదిలీలను పునఃసమీక్షించాలని, ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఎంఈఓలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గండేడ్, మహ్మదాబాద్, సీసీకుంట, హన్వాడ మండలాల్లో జరిగిన డిప్యుటేషన్లను మరోసారి పరిశీలించాలని కోరారు. చర్యలు తీసుకోకపోతే నిరసన కార్యక్రమాలు చేపడతామని టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రవికుమార్, వెంకటేష్ ఆధ్వర్యంలో డీఈఓకు నోటీసులు అందజేశారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మధన్మోహన్, సుధాకర్రెడ్డి, బుచ్చారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అడ్డగోలు డిప్యుటేషన్లపై అధికారుల స్పందన 197 డిప్యుటేషన్లలో నిబంధనల ఉల్లంఘనపై పునఃపరిశీలన బాధ్యులైన ఎంఈఓలపై చర్యలు: డీఈఓ -
స్టెప్ వేస్తే తెల్లార్లూ వేడుక..
● ప్రిషా సింగ్, రాశీ సింగ్, విష్ణుప్రియ‘అల్లరి’ నరేష్ హీరోగా నటించిన ఫ్యాంటసీ కామెడీ సినిమా ‘రంభ ఊర్వశి మేనక’. సురభి హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో రాశీ సింగ్, విష్ణు ప్రియ, ప్రిషా సింగ్ కీలక పాత్రల్లో నటించారు. చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 4న విడుదల కానుంది. గురువారం ఈ సినిమాలోని ‘రంభ ఊర్వశి మేనక... స్టెప్ వేస్తే తెల్లార్లూ వేడుక..’ అంటూ సాగే టైటిల్ సాంగ్ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘మా ఊరు స్వర్గమండి... అది ఆకాశం అంచున ఉంటదండి..., అరె... దిగి వచ్చాం... పండగే చేసుకోండి...’ అంటూ సాగే ఈ పాటకు సురేష్ బనిసెట్టి సాహిత్యం అందించగా, విజయ్ పోలాకి కొరియోగ్రఫీ వహించారు. ఈ చిత్రసంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్ స్వరకల్పనలో ధనుంజయ్ సీపాన, సాహితీ చాగంటి ఈ పాటను పాడారు. సాంగ్ లాంచ్ ఈవెంట్లో రాశీ సింగ్ మాట్లాడుతూ– ‘‘నా కెరీర్లో నేను చేసిన డిఫరెంట్ సినిమా ఇది. మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రం నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను’’ అని చెప్పారు ప్రిషా సింగ్. ‘‘రంభ ఊర్వశి మేనకల చుట్టూ తిరిగే కథ ఇది’’ అని తెలిపారు విష్ణుప్రియ. -
సర్కారుపై ఉద్యోగుల జంగ్ సైరన్
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఉద్యోగుల సంఘాల జేఏసీ సర్కారుపై సమరశంఖం పూరించింది. పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏల విడుదల, సీపీఎస్ రద్దు తదితర డిమాండ్లతో గురువారం కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించింది. జిల్లా అధికారుల నుంచి తహసీల్దార్ స్థాయి అధికారుల వరకు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ హరిప్రియకు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. జేఏసీ జిల్లా చైర్మన్ గవినోళ్ల రాజీవ్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావస్తున్నా రెండో పీఆర్సీని ప్రకటించకపోవడం దారుణమన్నారు. పెండింగ్లో ఉన్న ఆరు డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ మేరకు సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలన్నారు. ఉద్యోగుల ఆరోగ్య కార్డులు కార్పొరేట్ ఆస్పత్రుల్లో సక్రమంగా అమలు కావడం లేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లను పట్టించుకోకపోవడంతో ప్రజలు బీఆర్ఎస్ను ఇంటికి పంపారని.. ఇదే పరిస్థితి కొనసాగితే కాంగ్రెస్కు కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు. ఉపాధ్యాయ సమస్యలపై ఆగ్రహం జేఏసీ జిల్లా కన్వీనర్ విజయ్కుమార్ మాట్లాడుతూ విద్యాశాఖలో ఉపాధ్యాయులకు ప్రమోషన్లు కల్పించడంతో పాటు బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. జీవో 25 ద్వారా ఉపాధ్యాయులను సర్దుబాటు పేరుతో దూర మండలాలకు పంపడం వల్ల వారు మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా సెప్టెంబర్ 1న సీపీఎస్ రద్దు కోసం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని తెలిపారు. సెప్టెంబర్ 10న హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అధికారుల మద్దతు ధర్నాకు డీఈఓ విజయకుమారి, డీటీఓ శ్రీనివాస్, డీఎస్ఓ గంప శ్రీనివాస్, డీసీఓ టైటస్పాల్, తహసీల్దార్లు కిషన్ తదితరులు మద్దతు తెలిపారు. రైస్మిల్లర్ల సంఘం అధ్యక్షుడు అశోక్కుమార్, ఎలక్ట్రిసిటీ జేఏసీ నాయకులు రాఘవేందర్, స్వామి, పాండు తదితరులు పాల్గొన్నారు. జేఏసీ కోచైర్మన్లు రవికుమార్, మదన్మోహన్యాదవ్, చంద్రానాయక్, నర్సింలు, సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రకాంత్, కోకన్వీనర్లు బాలు యాదవ్, వెంకటేష్, శ్యాంబాబు, జుర్రు నారాయణ, డీటీలు దేవేందర్, శ్యాంసుందర్రెడ్డి తదితరులు హాజరయ్యారు. పీఆర్సీ.. డీఏల కోసం కలెక్టరేట్ ముట్టడించిన ఉద్యోగులు సీపీఎస్ రద్దు చేసి.. ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ సెప్టెంబర్ 10న చలో హైదరాబాద్కు పిలుపు -
స్టార్డమ్ కాదు... సరైన కథతోనే విజయం
● విజయ్ దేవరకొండటాలీవుడ్ స్టార్, జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ అరుదైన ఘనత సాధించారు. ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజీన్ ఫోర్బ్స్ ఇండియా తాజాగా విడుదల చేసిన ‘షోస్టాపర్స్ 2026’ స్పెషల్ మ్యాగజీన్ కవర్ పేజీపై అల్లు అర్జున్ కనిపించడం హాట్ టాపిక్ అయింది. కవర్ పేజీపై కనిపించడం మాత్రమే కాదు... ‘షోస్టాపర్స్ 2026’ టాప్ 100 జాబితాలోనూ అల్లు అర్జున్కి స్థానం లభించింది. ఈ జాబితాలో మరో తెలుగు హీరో రామ్చరణ్కు కూడా స్థానం లభించింది. ఈ లిస్ట్లో పేరు సంపాదించుకున్న తెలుగు హీరోలు ఈ ఇద్దరే కావడం విశేషం. 2025 జనవరి నుంచి 2026 మార్చి 31 వరకు వివిధ రంగాల్లో (సినిమా, ఓటీటీ, పుస్తకాలు, కళలు, ఫ్యాషన్ వంటివి) ప్రభావం చూపిన అత్యంత ప్రభావంతమైన టాప్ 100 సెలబ్రిటీల జాబితాను ‘షోస్టాపర్స్ 2026: ఇండియాస్ హండ్రెడ్ బిగ్గెస్ట్ సెలబ్రిటీస్’ పేరిట ఫోర్బ్స్ ఇండియా రిలీజ్ చేసింది. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, మోహన్ లాల్, ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్, ఏఆర్ రెహమాన్, మాధవన్, రణ్వీర్ సింగ్, రిషబ్ శెట్టి, కంగనా రనౌత్, కల్యాణీ ప్రియదర్శన్ వంటి సినీ ప్రముఖులకు ఈ జాబితాలో స్థానం లభించింది. ఈ జాబితాకు ఎటువంటి ర్యాంకింగ్ ఆర్డర్ లేదు. ప్రముఖుల పేర్లలోని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో జాబితాను విడుదల చేశారు. ఇక ఫోర్బ్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘‘సినిమాలో మంచి కంటెంట్ ఉంటే భాషతో సంబంధం లేకుండా ఆ సినిమా విజయం సాధిస్తుంది. ప్రేక్షకులకు కొత్త కథ అందించడమే అన్నింటికంటే ముఖ్యం. అలాగే ఒక సినిమాలోని నటీనటీనటుల స్టార్డమ్ కంటే కూడా ఆ చిత్రంలోని సరైన కథే ఆ సినిమా విజయాన్ని నిర్ణయిస్తుంది’’ అని అల్లు అర్జున్ పేర్కొన్నారు. ప్రస్తుతం ‘రాకా’ సినిమాతో అల్లు అర్జున్ బిజీగా ఉన్నారు. అట్లీ దర్శకత్వంలో కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027లో విడుదల కానుంది. -
కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలి
స్టేషన్ మహబూబ్నగర్: జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్తో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమై పలు అంశాలపై చర్చించారు. పార్టీ బలోపేతం, రాబోయే కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై సమీక్షించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కాగా, చిన్నచింతకుంట మండలం గూడూర్కు చెందిన పలువురు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్రెడ్డి, ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్రెడ్డి, అధికార ప్రతినిధి జహీర్ అఖ్తర్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, నాయకులు ఎన్పీ వెంకటేశ్, నాయకులు బెక్కరి మధుసూదన్రెడ్డి, ప్రవీణ్కుమార్, ఎన్పీ నేహశ్రీ పాల్గొన్నారు. -
ఉద్యోగుల సమరశంఖం!
● నేడు కలెక్టరేట్ వద్ద మహాధర్నా ● అన్ని ఉద్యోగ సంఘాలు ఒక్కతాటిపైకి.. ● పరిష్కారం అయ్యే వరకు పోరాటం జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం ఉద్యోగులు పోరుబాట పట్టారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద మహాధర్నా నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖలకు చెందిన 2 వేల మందికి పైగా ఉద్యోగులు పాల్గొనేలా జేఏసీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఆస్పత్రులు తదితర శాఖలను సందర్శించి ఉద్యోగులను సమీకరించారు. జిల్లాలో టీచర్లు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, కార్మికులు, పెన్షనర్లు, వివిధ శాఖల ఉద్యోగులు కలిపి సుమారు 20 వేల మంది ఉన్నారు. వీరంతా ఐక్యంగా ఉద్యమించాలని జేఏసీ పిలుపునిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఒకేసారి ధర్నాలు నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. ఇవీ ప్రధాన డిమాండ్లు సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించాలి. 51 శాతం ఫిట్మెంట్తో రెండో పీఆర్సీని 2026 సెప్టెంబర్ 30లోపు అమలు చేయాలి. పెండింగ్లో ఉన్న ఆరు డీఏ, డీఆర్లను ఏకకాలంలో విడుదల చేయాలి. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, రేషనలైజేషన్ సమస్యలను పరిష్కరించాలి. పెండింగ్ బిల్లుల కోసం నెలకు రూ.2 వేల కోట్ల నిధుల కేటాయింపును కొనసాగించాలి. జీఓ 317 బాధిత ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల 63 దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపాలి. మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 17 శాతం హెచ్ఆర్ఏ అమలు చేయాలి. -
అల్లాహు అక్బర్..
● భక్తిశ్రద్ధలతో మిలాద్ ఉన్ నబీ వేడుకలు ● మహబూబ్నగర్లో ముస్లింల భారీ ఊరేగింపు స్టేషన్ మహబూబ్నగర్: మిలాద్ ఉన్ నబీ వేడుకలను పురస్కరించుకుని బుధవారం సాయంత్రం జిల్లాకేంద్రంలో ముస్లింలు భారీ ఊరేగింపు నిర్వహించారు. అసర్ నమాజు అనంతరం వివిధ కాలనీల నుంచి తరలివచ్చిన వారు క్లాక్టవర్ నుంచి ర్యాలీగా బయలుదేరి అశోక్టాకీస్ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా, ఆర్టీసీ బస్టాండ్, న్యూటౌన్ మీదుగా షాసాబ్గుట్ట దర్గా వరకు చేరుకున్నారు. అనంతరం దర్గా ఆవరణలో పీఠాధిపతి సయ్యద్ అబ్దుల్ రజాక్షా ఖాద్రీ అధ్యక్షతన ధార్మిక సభ నిర్వహించారు. ఉత్తరప్రదేశ్కు చెందిన అల్లమా సయ్యద్ అలంగీర్ అష్రఫ్ అష్రఫీ, జామియా నిజామియాకు చెందిన మౌలానా ముఫ్తి మహ్మద్ హుస్సేన్ ఖురేషి ధార్మిక సందేశాలు ఇచ్చారు. ఖౌమీ ఏక్తా కమిటీ స్వాగతం అంబేద్కర్ చౌరస్తాలో ఖౌమి ఏక్తా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్రెడ్డి, టీజీఎంఎఫ్సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, మాజీ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, మేయర్ గుమ్మాల మమత, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్చైర్పర్సన్ బెక్కరి అనిత, నాయకులు వినోద్కుమార్, చంద్రకుమార్గౌడ్, ఆనంద్కుమార్గౌడ్ ఊరేగింపునకు స్వాగ తం పలికారు. ఊరేగింపు ర్యాలీలో పలు సంస్థలవారు షర్బత్, నీళ్లు అందజేశారు. పలువురు నిర్వాహకులు, సంస్థల ప్రతినిధులు ర్యాలీలో పాల్గొన్న వారికి షర్బత్, నీటిని అందించారు. ఖౌమీ ఏక్తా కమిటీ కార్యదర్శి రఫీక్ పటేల్, మజహర్ షహీద్, అఫ్రోజ్షా, మోసీన్ఖాన్, సాదుల్లా, జహీర్ అక్తర్, సిరాజ్ఖాద్రీ, తదితరులు పాల్గొన్నారు. -
బందోబస్తును పర్యవేక్షించిన ఎస్పీ
● ట్రాఫిక్ మళ్లింపు.. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా మహబూబ్నగర్ క్రైం: మిలాద్ ఉన్ నబీ సందర్భంగా జిల్లా కేంద్రంలో నిర్వహించే ర్యాలీకి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం ఎస్పీ డి.జానకి నగరంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించి పోలీసు అధికారులతో సమీక్షించారు. మూడు పోలీస్స్టేషన్ల పరిధిలో ర్యాలీ మార్గాలు, మసీదుల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ర్యాలీ ప్రారంభం, కొనసాగుతున్న మార్గాలు, ముగింపు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఎస్పీ ఆదేశించారు. విధుల్లో ఉన్న పోలీసులు అప్రమత్తంగా ఉండి ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాలను మళ్లించేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ర్యాలీలో పాల్గొనే ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ పాటించాలని, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే నినాదాలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని ఎస్పీ సూచించారు. ఇతరులకు ఇబ్బంది కలగకుండా ర్యాలీ ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐలు ఇజాజుద్దీన్, అప్పయ్య తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపల్ కార్మికుల వేతనాలు తగ్గించొద్దు
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వివిధ కేటగిరీల కింద పనిచేసే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు తగ్గించాలని నిర్ణయించడం తగదని తెలంగాణ మున్సిపల్ అండ్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనంపల్లి జైపాల్రెడ్డి అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో పనిచేసే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, ఎన్ఎంఆర్ కార్మికులను పర్మినెంట్ చేయాలన్నారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లు, వితంతు, వృద్ధాప్య పింఛన్లు వర్తింపజేయాలన్నారు. మరణించిన కార్మికుడి దహన సంస్కార ఖర్చులు రూ.30వేలతో పాటు బీమా సౌకర్యం కల్పించాలన్నారు. డిమాండ్ల పరిష్కారం కోసం ఈనెల 27న హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద జరిగే ధర్నాకు మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పి.సురేష్, సంఘం నాయకులు యాదయ్య, కృష్ణ, సత్యనారాయణరెడ్డి, చాంద్బాషా పాల్గొన్నారు. -
గుడిసెల జాబితా సిద్ధం చేయండి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు సంబంధించి గుడిసెల్లో నివసిస్తున్న వారి జాబితాను నిర్ణీత వ్యవధిలోగా సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆదేశించారు. బుధవారం తన చాంబర్ నుంచి వెబ్ఎక్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు గుడిసెల జాబితా నివేదికలు సమర్పించని మండలాల అధికారుల తీరుపై అసంతప్తి వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న సమాచారాన్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా, తక్షణమే జిల్లా కార్యాలయానికి నివేదించాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుపై అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని.. విధుల్లో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సమావేశంలో గృహనిర్మాణశాఖ పీడీ ఉపేందర్రెడ్డి ఉన్నారు. సాగు, తాగునీటి సమస్య పట్టదా? రాజాపూర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో దశాబ్దాలుగా నెలకొన్న సాగు, తాగునీటి సమస్యను ప్రభుత్వాలు పరిష్కరించలేకపోతున్నాయని పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షుడు ప్రొ.హరగోపాల్ అన్నారు. బుధవారం రాజాపూర్లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నీరందుతున్న చోట మూడు పంటలతో ఆదాయం పొందుతుండగా.. ఉమ్మడి పాలమూరు జిల్లా రైతాంగం వర్షంపై ఆధారపడుతూ, ఒక పంట కూడా పొందలేకపోతున్నారని అన్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకే కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా సాధన కోసం ఉమ్మడి పాలమూరు జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏ సీని అధ్యయన వేదిక ఏర్పాటు చేసిందన్నారు. జిల్లా యువ రైతాంగం, ప్రజలు గ్రామగ్రామానా జలసాధన జేఏసీలను ఏర్పాటు చేయా లని ఆయన పిలుపునిచ్చారు. వచ్చే సెప్టెంబర్ 9న కాళోజీ జయంతి సందర్భంగా ఉమ్మడి జిల్లా జలసాధన దీక్షాదినంగా పాటించాలని కోరారు. సమావేశంలో అధ్యయన వేదిక జనరల్ సెక్రెటరీ వెంకటేశ్వర్లు, పీబీ స్వామి, రవీంద్రనాథ్, రాఘవాచారి ఉన్నారు. శ్రీశైలంలో 874.70 అడుగుల నీటిమట్టం అచ్చంపేట: శ్రీశైలం జలాశయంలో బుధవా రం 874.70 అడుగులు (162.0554 టీఎంసీలు)గా నమోదైంది. ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పాదన కొనసాగిస్తూ.. 14,359 క్యూసెక్యుల నీటిని శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. జలాశయంలో మంగళవారం 164.7532 టీఎంసీల నీటిమట్టం ఉండగా.. విద్యుత్ ఉత్పత్తి, సాగు, తాగునీటికి వినియోగించుకోవడంతో సుమారుగా 2 టీఎంసీల నీటిమట్టం తగ్గింది. ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 14.663 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. నాగార్జునసాగర్కు 35,315 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. 170.477 మి.యూ. విద్యుదుత్పత్తి ఆత్మకూర్: జూరాల దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతోంది. బుధవారం ఎగువన 2 యూనిట్ల నుంచి 78 మెగావాట్లు, 92.876 మి.యూ., దిగువన 2 యూనిట్ల నుంచి 80 మెగావాట్లు, 77.601 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఇప్పటి వరకు ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో 170.477 మిలియన్ యూనిట్ల ఉత్పత్తిని విజయవంతంగా పూర్తి చేసినట్లు వివరించారు. -
ఓపీలతో సరి.. సర్జరీలు ఏవీ
వరుస ఘటనలతో కలవరం ప్రధాన విభాగాల్లో శస్త్రచికిత్సలకు రోగుల నిరీక్షణ ● మధ్యాహ్నం తర్వాత కనిపించని సీనియర్లు.. రాత్రివేళ హౌజ్ సర్జన్లతోనే వైద్యం ● 340 వైద్య పోస్టుల్లో 212 ఖాళీలు.. ఆర్థోలో 15 పోస్టులు ఖాళీ ● జనరల్ ఆస్పత్రిలో కలవరపెడుతున్న వరుస ఘటనలు వాతావరణం ఆకాశం అప్పుడప్పుడు మేఘావృతమై ఉంటుంది. జల్లులు పడే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 33 డిగ్రీలు నమోదు కావచ్చు. సర్జరీ కోసం.. నెలల తరబడి నిరీక్షణ! అడ్డాకుల మండలం పొన్నకల్కు చెందిన జేసీబీ డ్రైవర్ ఆంజనేయులుకు ఎడమ చేయి విరిగింది. ప్రైవేట్ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ కింద సర్జరీ చేసి రాడ్ వేశారు. రెండేళ్ల తర్వాత రాడ్ తొలగించేందుకు వెళ్లగా రూ.50 వేల ఖర్చవుతుందని చెప్పడంతో గత ఏప్రిల్ నుంచి జిల్లా జనరల్ ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్నాడు. ఇప్పటివరకు నాలుగుసార్లు ఓపీ తీసుకుని వైద్యులను సంప్రదించినా.. 15 రోజులు, నెల రోజుల తర్వాత రావాలని తిప్పుతున్నారని వాపోయాడు. మరోసారి ఆస్పత్రికి వచ్చిన అతడి సమస్యను ‘సాక్షి’ వైద్యుల దృష్టికి తీసుకెళ్లగా.. శనివారం అడ్మిట్ చేసుకుని రాడ్ తొలగిస్తామని ఆర్థో విభాగం వైద్యులు తెలిపారు. జిల్లా జనరల్ ఆస్పత్రిలోని కొన్ని విభాగాల్లో తరచూ చోటుచేసుకుంటున్న ఘటనలు రోగులు, వారి బంధువుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. గైనిక్ విభాగంలో వైద్య సేవలపై గతంలో ఆరోపణలు రావడంతో పాటు.. ఇంజక్షన్ మార్పిడి ఘటనలో యువకుడు మృతి చెందిన ఉదంతం, తాజాగా నెల రోజుల శిశువు తొడలో సూది విరిగిన ఘటన చర్చనీయాంశంగా మారాయి. వార్డుల్లో సిబ్బంది ప్రవర్తనపైనా రోగుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైద్య సేవల నాణ్యత, సిబ్బంది పనితీరుపై పర్యవేక్షణను మరింత పెంచాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాలమూరు: పేదలు, సామాన్యులకు పెద్ద దిక్కుగా ఉండాల్సిన జిల్లా జనరల్ ఆస్పత్రిలో వైద్య సేవలు క్రమంగా క్షీణిస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓపీ సమయాల్లో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉన్నప్పటికీ.. అత్యవసర వైద్యం, శస్త్రచికిత్సల విషయంలో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులు రాత్రి వేళ ఆస్పత్రికి వస్తే సీనియర్ వైద్యుల అందుబాటులో లేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయని పలువురు చెబుతున్నారు. తీవ్ర గాయాలతో వచ్చిన వారిని హైదరాబాద్కు రెఫర్ చేస్తున్న పరిస్థితి ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో వైద్య సిబ్బంది కొరత కూడా ఆస్పత్రి సేవలపై ప్రభావం చూపుతోంది. 340 వైద్య పోస్టులు.. 212 ఖాళీలు జిల్లా జనరల్ ఆస్పత్రిలో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్లు, జూనియర్ రెసిడెంట్లు, ట్యూటర్లతో కలిపి మొత్తం 340 వైద్య పోస్టులు మంజూరయ్యాయి. వీటిలో 128 మంది మాత్రమే విధుల్లో ఉండగా.. 212 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పనిచేస్తున్న వారిలో 67 మంది రెగ్యులర్ వైద్యులు, 61 మంది కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. ఖాళీల్లో 153 రెగ్యులర్, 59 కాంట్రాక్టు పోస్టులు ఉన్నాయి. ఇక పరిపాలన, టెక్నికల్, నర్సింగ్, ఫార్మసిస్ట్ తదితర విభాగాల్లో 363 పోస్టులు మంజూరు కాగా 235 మంది పనిచేస్తున్నారు. 128 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఔట్సోర్సింగ్ కింద మంజూరైన 112 పోస్టుల్లో 95 మంది విధులు నిర్వహిస్తుండగా 17 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రోజుకు రెండు, మూడు సర్జరీలు చేసేలా చర్యలు.. ఆర్థో విభాగంలో గతంలో పరికరాల కొరత కారణంగా కొన్ని శస్త్రచికిత్సలు జరగలేదు. ప్రస్తుతం సీ–ఆర్మ్, ఆర్థో డ్రిల్ మిషన్లు అందుబాటులోకి వచ్చినందున అన్ని రకాల ఆర్థో శస్త్రచికిత్సలను పెంచుతాం. రోజుకు రెండు, మూడు సర్జరీలు చేసేలా చర్యలు తీసుకుంటాం. అన్ని విభాగాల్లో హెచ్ఓడీలు అందుబాటులో ఉండేలా పర్యవేక్షణ పెంచి సేవలను మెరుగుపరుస్తామని పేర్కొన్నారు. – డాక్టర్ రంగా ఆజ్మీరా, సూపరింటెండెంట్ -
పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఎల్నినో నేపథ్యంలో పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్జాజు అధికారులను ఆదే శించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి వీసీ నిర్వహించిన ఆయన.. పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ నెల 30న జరిగే నీట్–పీజీ ప్రవేశ పరీక్షకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని, పరీక్ష కేంద్రాల్లో విద్యుత్, తాగునీరు, భద్రత, రవాణా సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. వీసీలో డీఆర్ఓ నిర్మలతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి భూత్పూర్: పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఎస్పీ జానకి పోలీస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం భూత్పూర్ పోలీస్స్టేషన్ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లోని వివిధ విభాగాలు, రికార్డుల నిర్వహణ, కేసుల పురోగతి, సిబ్బంది పనితీరు, నేర నియంత్రణ చర్యలను సమీక్షించారు. ప్రతి ఫిర్యాదుపై వెంటనే స్పందించి, బాధితుల సమస్యలను పూర్తిగా విని చట్టపరమైన పరిష్కారం చూపాలని సూచించారు. పెండింగ్, గ్రేవ్ కేసులు, రౌడీషీట్లు, బైండోవర్ కేసులు, వారెంట్ల అమలు, బీట్ వ్యవస్థ, నేరస్థుల కదలికలపై ఆరా తీశారు. జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాత్రివేళ గస్తీ ముమ్మరం చేసి అనుమానిత వ్యక్తులు, వాహనాల కదలికలపై నిఘా పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ రామకృష్ణ, ఎస్ఐ నాగన్న, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. రెండో బ్యాచ్లో జపాన్కు ఐదుగురు టీచర్లు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపునకు చేపట్టిన ఎడ్యుకేషన్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమంలో భాగంగా రెండో బ్యాచ్లో ఉమ్మడి జిల్లాకు చెందిన ఐదుగురు ఉపాధ్యాయులు జపాన్ పర్యటనకు ఎంపికయ్యారు. దేవరకద్ర ఎంపీహెచ్ఎస్ నుంచి నఫీజ్ఉన్నిసా బేగం, రాజాపూర్ జెడ్పీహెచ్ఎస్ నుంచి అతెం ప్రసంగి మోసెస్, నార్లోనికుంట ఎంపీపీఎస్ నుంచి నోమేశ్వర్రెడ్డి, నాగర్కర్నూల్ జీడిపల్లి తండా ఎంపీపీఎస్ నుంచి రఘురాంరావు, గద్వాల తిప్పరాల యూపీఎస్ నుంచి రవీందర్బాబు ఉన్నారు. వీరు వచ్చేనెల 19 నుంచి 26 వరకు జపాన్లో పర్యటించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
మన్యంకొండకు ‘శ్రావణశోభ’
● స్వర్ణాభరణ అలంకరణలో వేంకటేశ్వరస్వామి దర్శనం ● కొనసాగుతున్న ప్రత్యేక హోమాలు.. మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శ్రావణమాస వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. స్వామివారిని స్వర్ణాభరణాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ నెల 13 నుంచి ప్రారంభమైన శ్రావణమాస పూజా కార్యక్రమాల్లో భాగంగా హనుమద్దాసుల మండపంలో ప్రతిరోజూ ప్రత్యేక హోమం నిర్వహిస్తున్నారు. శుక్రవారంతో పాటు బుధ, గురువారాల్లోనూ అభిషేకాలు చేస్తున్నారు. శ్రావణమాసం సందర్భంగా ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. కార్యక్రమాల్లో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, వేదపండితులు పాల్గొంటున్నారు. వీరభద్రస్వామికి అఖండ దీపారాధన దేవస్థాన ఆవరణలోని క్షేత్రపాలకుడు శ్రీ వీరభద్రస్వామికి శ్రావణమాసం రెండో సోమవారం అఖండ దీపారాధన ప్రారంభించారు. 41 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. అనంతరం సోమవారం స్వామివారికి అగ్నిగుండం ఏర్పాటు చేయనున్నారు. ప్రతిరోజూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. -
అడ్డగోలుగా డిప్యుటేషన్లు..!
అడ్డాకుల జెడ్పీహెచ్ఎస్ పీఎం శ్రీ పాఠశాలలో 6 తరగతులకు 11 సెక్షన్లు ఉండగా 404 మంది విద్యార్థులు చదువుతున్నారు. అక్కడ ముగ్గురు ఇంగ్లిష్ ఉపాధ్యాయులు పనిచేస్తుండగా.. వారిలో ఒకరిని డిప్యుటేషన్పై పంపారు. మరో ఉపాధ్యాయురాలు వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్నారు. దీంతో పాఠశాలలో ఇంగ్లిష్ బోధనకు ఒక్క ఉపాధ్యాయురాలే పూర్తి స్థాయిలో మిగిలే పరిస్థితి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాల్సింది పోయి.. ఉన్నవారినే ఇతర పాఠశాలలకు పంపడం వల్ల బోధనపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు పేరుతో చేపట్టిన డిప్యుటేషన్లు వివాదాస్పదంగా మారుతున్నాయి. జీఓ 25కు అనుగుణంగా విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ఆధారంగా డిప్యుటేషన్లు ఇచ్చినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం పలు పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లు లేకపోవడం, సీనియర్లను కాదని జూనియర్లకు అవకాశం ఇవ్వడం, మండల పరిధి దాటి ఇతర మండలాలకు పంపడం వంటి అంశాలు విమర్శలకు తావిస్తున్నాయి. మొత్తంగా 197 మందికి డిప్యూటేషన్లు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. సాధారణంగా మండల స్థాయిలో అవసరాలను బట్టి చేపట్టాల్సిన సర్దుబాట్లు.. కొందరు ఉపాధ్యాయులను ఏకంగా ఇతర మండలాలకు పంపేలా మారాయని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. గండేడ్ మండలంలోని ఓ జెడ్పీహెచ్ఎస్ నుంచి ఓ సంఘం మండల అధ్యక్షుడిగా ఉన్న ఉపాధ్యాయుడిని మిడ్జిల్ మండలానికి పంపడం ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. అలాగే మహమ్మదాబాద్ మండలానికి చెందిన మరో సంఘం మండల అధ్యక్షుడిని నవాబ్పేటకు డిప్యుటేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మహమ్మదాబాద్ మండలానికి చెందిన ఓ ఉపాధ్యాయురాలిని హన్వాడ మండలం దోర్రితాండకు పంపడంపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ సీనియర్లు ఉన్నప్పటికీ జూనియర్లను మినహాయించి సీనియర్కు డిప్యుటేషన్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మహమ్మదాబాద్, గండేడ్, జానంపేట, సీసీకుంట తదితర మండలాల్లోనూ ఇలాంటి వ్యవహారాలపై ఉపాధ్యాయ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. సంఘాల నేతలే టార్గెట్? డిప్యుటేషన్ల వ్యవహారంలో ఉపాధ్యాయ సంఘాల నేతలను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక సంఘానికి అనుకూలంగా వ్యవహరిస్తూ.. మరో సంఘానికి చెందిన నాయకులపై కక్షసాధింపు ధోరణితో డిప్యుటేషన్లు ఇచ్చారని కొందరు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఎంఈఓల స్థాయిలో చేసిన సర్దుబాట్లు మండల పరిధికే పరిమితం కావాల్సి ఉండగా.. జిల్లాస్థాయిలో కౌన్సెలింగ్ లేకుండా మండలాలు దాటి డిప్యుటేషన్లు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ● మండలాల వారీగా చూస్తే నవాబ్పేటలో అత్యధికంగా 22 మంది, కోయిల్కొండలో 18, మహబూబ్నగర్ అర్బన్లో 17, హన్వాడలో 15, భూత్పూర్లో 14 మందికి డిప్యుటేషన్లు ఇచ్చారు. అలాగే సీసీకుంటలో 12, దేవరకద్ర, మహబూబ్నగర్ రూరల్, రాజాపూర్లలో 11 చొప్పున, అడ్డాకుల, మహమ్మదాబాద్, మూసాపేటలో 10 చొప్పున, బాలానగర్, గండేడ్లో 9 చొప్పున, మిడ్జిల్లో 8, జడ్చర్లలో 7, కౌకుంట్లలో 3 మందికి డిప్యుటేషన్లు ఇచ్చారు. విద్యార్థులు ఎక్కువ.. టీచర్లు తక్కువ! 197 మంది ఉపాధ్యాయులకు సర్దుబాటు.. మండలాలు దాటి పంపడంపై విమర్శలు ఎంఈఓల ఇష్టారాజ్యంపై ఆరోపణలు.. సంఘాల నేతలకు కక్షసాధింపు అంటూ విమర్శలు -
కళలకు పెట్టింది పేరు పాలమూరు
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): పాలమూరు జిల్లా కళలకు పెట్టింది పేరని తెలుగు సినిమాటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పీజీ విందా అన్నారు. ఎంఎస్ఎంఈ ఆధ్వర్యంలో సినిమా క్రియేటర్స్ సహకారంతో మంగళవారం స్థానిక జెడ్ఎంఎస్లో ‘ఫ్రేమ్స్ ఆఫ్ ఫౌండర్స్’ క్రియేటివ్ వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా పీజీ విందా మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలోనూ ఎన్నో ప్రత్యేకమైన కథలు ఉన్నాయని, స్థానిక కథలను గుర్తించి ప్రపంచానికి పరిచయం చేయాలని సూచించారు. వర్క్షాప్ ద్వారా వెలుగులోకి వచ్చే ఉత్తమ కథలను ఎంపిక చేసి, సినిమాలుగా అభివృద్ధి చేసే దిశగా కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలకు చెందిన విద్యార్థులు, యువ క్రియేటర్లు, ఔత్సాహిక ఫిల్మ్మేకర్లు, వ్యవస్థాపకులు, మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. రాష్ట్ర అథ్లెటిక్స్లోపతకాలు సాధించాలి మహబూబ్నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి అంతర్జిల్లాల అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటి పతకాలు సాధించాలని జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్చంద్ర ఆకాంక్షించారు. హన్మకొండలో బుధ, గురువారాల్లో జరిగే అండర్–14, 16, 18, 20 విభాగా ల బాలబాలికల పోటీలకు జిల్లా క్రీడాకారులు మంగళవారం తరలివెళ్లారు. ఈ సందర్భంగా వారిని అభినందించిన శరత్చంద్ర.. పతకాలు సాధించి జిల్లాకు పేరు తీసుకురావాలని సూ చించారు. జిల్లా నుంచి వివిధ విభాగాల్లో 14 మంది బాలికలు, 20 మంది బాలురు పోటీల్లో పాల్గొంటున్నారు. అండర్–14లో ట్రయథ్లాన్, అండర్–16లో 60మీ, 600మీ, షాట్పుట్, లాంగ్జంప్, హైజంప్, జావెలిన్ విభాగాల్లో, అండర్–18, 20లో పరుగు, రేస్వాక్, డిస్కస్, షాట్పుట్, జావెలిన్, హర్డిల్స్, హెపథ్లాన్, స్టీపుల్చేజ్ వంటి అంశాల్లో క్రీడాకారులు బరిలో దిగనున్నారు. కార్యక్రమంలో ఆనంద్, సునీల్కుమార్, సి.శ్రీనివాసులు, కె.రమేష్బాబు, పి.శ్రీనివాస్, సుగుణ పాల్గొన్నారు. అనుమానాస్పదంగా ఒకరు మృతి గద్వాల క్రైం: అనుమానాస్పదంగా ఒకరు మృతి చెందిన ఘటన మంగళవారం గద్వాల మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాకు చెందిన అశోక్(45) కొన్ని సంవత్సరాలుగా అనంతపురంలో ఇంటి నిర్మాణ పనులు చేస్తు జీవనం సాగిస్తున్నాడు. అయితే గ్రామ శివారులో శవమై కన్పించాడు. అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి చూడగా శరీరంపై గాయాలు ఉండడంతో రూరల్ పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుని సోదరుడు కొండన్నకు సమాచారం ఇచ్చారు. సాధారణ మృతి లేక ఎవరైన దాడి చేసి గాయపర్చరా అనే కోణంలో విచారణ చేపడుతామని పోలీసులు తెలిపారు. విష పురుగు కరిచి బిహార్ వాసి మృతి మక్తల్: విష పురుగు కరిచి బిహార్ వాసి మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం బిహార్ రాష్ట్రం బాగల్పూర్ జిల్లా, మధురాపూర్ మండలం కరికోడ్ గ్రామానికి చెందిన షేక్ ముర్తాజ్(45) హైదరాబాద్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నెల రోజుల క్రితం మక్తల్లో బిహర్కు చెందిన ఎల్ఎస్ మేసీ్త్ర దగ్గర ఆయనతో పాటు 10 మంది కలిసి పని చేసేందుకు వచ్చారు. 24న రాత్రి ఓ గదిలో నిద్రిస్తున్న సమయంలో విషపురుగు కాటు వేసింది. ఈ విషయాన్ని పక్కన ఉన్న షేక్ అన్సారీకి తెలపగా చికిత్స నిమిత్తం మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడ నుంచి నారాయణపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి మహబూబ్నగర్ ఆస్పత్రికి రిఫర్ చేయగా అక్కడి తీసుకొస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి కుమారుడు షేక్ తస్లిమ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యప్తు చేస్తునట్లు ఎస్ఐ రాజు తెలిపారు. -
‘వన్యప్రాణులకు ఉన్న విలువ లేదు’
మన్ననూర్: ప్రజాస్వామ్య దేశంలో వన్యప్రాణులకు ఇచ్చిన ప్రాధాన్యత కూడా ఆదివాసీ చెంచులకు ఇవ్వకపోవడం దౌర్భాగ్యమని పీబీటీజీ, 9 తెగల జేఏసీ రాష్ట్ర చైర్మన్ చెంచు రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం రాష్ట్ర ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివాసీ చెంచుల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్తో అదిలాబాద్, భద్రాచలం, నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్, మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన చెంచులు, తొట్టి, కొలాం, కొండరెడ్డిల ఐక్యవేదిక ప్రతినిధులతో ఐటీడీఏ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి నిమ్మల శ్రీనివాసులు, పలువురు వక్తలతో కలిసి మాట్లాడారు. దశాబ్దాల కాలంగా నల్లమల పరీవాహక ప్రాంతంలో అడవినే ఆధారంగా చేసుకొని జీవనం చేస్తున్న చెంచులను వన్యప్రాణుల కన్నా తక్కువ చేయడంతో పాటూ వేధింపులకు గురిచేయడం దురదృష్టకరమన్నారు. ప్రస్తుత పాలకులు నిజాం నిరుంకుష పాలనను తలపిస్తున్నారని మండిపడ్డారు. చెంచులను దైవ పూజారులని అలాంటి చెంచుల అభివృద్ధి, సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఐటీడీఏలో రెగ్యులర్ పీఓ, సిబ్బంది లేక చెంచుల అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య బద్ధంగా సమస్యలు తెలియజేసుకునేందుకు కూడా కనీస స్వేచ్ఛలేక పోగా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించుకోకుండా పోలీసుల నిర్భందం బాధకరమన్నారు. అడవికి మూలవాసులైన చెంచుల కనీస సమస్యలు పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పందించాలని విజ్ఞప్తి చేశారు. చెంచుల సమస్యల పరిష్కరించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని లేని పక్షంలో ఐటీడీఏ మొదలుకొని అసెంబ్లీ వరకు దశలవారీగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఐటీడీఏ ఏఓ జాఫర్ హుసేన్కు అందజేశారు. కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ముర్ల రమేష్రెడ్డి, తిరుపతి, కురిసెంగ వేణు, నైజాం రమేష్, మహేష్, బాలగురువయ్య, మంజుల, బయ్యమ్మ, మల్లయ్య, మాసయ్య, మురళీధర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
గిరిజనేతరులు సై.. చెంచులు నై!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పులుల సంరక్షణ, వాటి సహజ ఆవాసాలను విస్తరించాలనే లక్ష్యంతో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్) కోర్ ప్రాంతంలోని చెంచు పెంటలు, గ్రామాలను మైదాన ప్రాంతాలకు తరలించే ప్రక్రియ వేగం పుంజుకుంది. ప్రభుత్వ నిర్ణయం, పునరావాస ప్యాకేజీలతో తరలిపోయేందుకు గిరిజనేతర కుటుంబాల నుంచి సానుకూలత కనిపిస్తుండగా.. చెంచుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఫలితంగా నల్లమలలో పులుల సంరక్షణ, చెంచుల హక్కులు, జీవన విధానం మధ్య సమతుల్యత సాధన మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. తొలి దశలో 4 గ్రామాలు.. నాగర్కర్నూల్, నల్లగొండ జిల్లాల పరిధిలో విస్తరించిన అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ దేశంలో రెండో అతిపెద్ద పులుల అభయారణ్యం. 2,611.39 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ రిజర్వ్ కోర్ ఏరియాలో ఆదివాసీ చెంచులు బొడ్డు గుడిసెల్లో ఉంటూ అటవీ ఉత్పత్తుల సేకరణ, చిన్నపాటి వ్యవసాయం ఆధారంగా జీవిస్తున్నారు. కొన్ని చోట్ల గిరిజనేతరులు (బీసీ, ఎస్టీ, ఓసీ) స్థిరపడ్డారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) అనుమతితో తొలి దశలో సార్లపల్లి, కుడిచింతలబైలు, తాటిగుండాల, కొల్లంపెంటకు చెందిన కుటుంబాలను తరలిస్తున్నారు. రెండో దశలో వట్వర్లపల్లిని తరలించనున్నారు. వెళ్లేది లేదు.. వెళ్లడమే సరైన మార్గం.. గ్రామసభల అంగీకారం లేకుండానే రీలొకేషన్ ప్రక్రియ ముందుకు సాగుతోందని చెంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ ఉత్పత్తులే తమ జీవనోపాధి అని, జంతువులను దేవుళ్లుగా భావించే తమకు వాటితో ఎలాంటి ఘర్షణ లేదని, అడవిని విడిచి వెళ్లడమంటే తమ ఉనికిని కోల్పోవడమేనని, ఏజెన్సీ హక్కులకు దూరమవుతామని వాపోతున్నారు. బలవంతంగా తరలిస్తే ప్రతిఘటిస్తామని హెచ్చరిస్తున్నారు. మరో వైపు అడవిలో భూములకు హక్కు పత్రాలు లేక రుణాలు పొందలేకపోతున్నామని, పిల్లలకు మెరుగైన విద్య, వైద్యం, ఉపాధి కోసం మైదాన ప్రాంతాలకు వెళ్లడమే సరైన మార్గమని గిరిజనేతరులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నల్లమలలో అడవిబిడ్డల ‘అరణ్య’ రోదన మైదాన ప్రాంతాలకు తరలింపుపై మిశ్రమ స్పందన ఉనికినే కోల్పోతామని ససేమిరా అంటున్న చెంచులు అడవితల్లి నుంచి విడదీస్తే బతకలేమని ఆవేదన -
అంబేడ్కర్ కూడలిలో నిరసన
గ్రామసభను బహిష్కరించిన రైతులు అంబేడ్కర్ కూడలి వద్ద ఆందోళన చేపట్టారు. తమ సమస్యలను అధికారులు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ శిరీష, ఉపసర్పంచ్ సీతారాంరెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్, సంబంధిత అధికారులకు వినతిపత్రం అందజేశారు. రిజర్వాయర్ నిర్మాణంతో భూములు కోల్పోయే రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని కోరారు. భూములు ముంపునకు గురికాకుండా రిజర్వాయర్ను మరో ప్రాంతంలో నిర్మించాలని రైతులు డిమాండ్ చేశారు. ప్రత్యామ్నాయ ప్రాంతాలను పరిశీలించి ప్రాజెక్టు నిర్మాణం చేపడితే రైతులకు నష్టం ఉండదని పేర్కొన్నారు. భూ సేకరణకు ముందు రైతుల అభ్యంతరాలను పూర్తిస్థాయిలో పరిశీలించాలని కోరారు. -
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి
● ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ.. తెలంగాణ చౌరస్తా వద్ద నిరసన మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిరసన చేపట్టారు. మెట్టుగడ్డ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు సుమారు 5 వేల మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జీవన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది విద్యార్థులు స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్పై ఆధారపడి చదువుతున్నారని తెలిపారు. ప్రభుత్వం దాదాపు రూ.12 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. బకాయిల కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, 4 లక్షల మందికిపైగా విద్యార్థులకు కళాశాలల నుంచి సర్టిఫికెట్లు అందలేదని ఆరోపించారు. బకాయిలతో కళాశాలలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, అధ్యాపకులు ఉపాధి కోల్పోతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే బకాయిలు విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పాలమూరు విభాగ్ కన్వీనర్ అర్జున్, జిల్లా కన్వీనర్ సౌమ్య, శాంతన్, నరేష్, కార్తిక్, నవీన్, మణి, బండి, గణేష్, శివసాయి, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు. -
పాలమూరు ప్రాజెక్టుకు నిధులెన్ని కావాలో అడగండి
● ముందు డీపీఆర్ రివైజ్ చేయాలి.. కేంద్రం సహకరిస్తుంది ● కాంగ్రెస్ది డైవర్షన్ పాలిటిక్స్.. సీఎం హంగామా తప్పా చేసిందేమీ లేదు ● రైతు బీమా వెంటనే రెన్యువల్ చేసి ప్రీమియం చెల్లించాలి: డీకే అరుణ పాలమూరు: ప్రజలను కాంగ్రెస్ హామీల నుంచి పక్కదారి పట్టించేందుకే సీఎం రేవంత్రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. మూడు నెలలకోసారి పాలమూరు జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులపై హంగామా చేయడం తప్ప.. పనులు ముందుకు సాగడం లేదన్నారు. మంగళవారం జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు మొదట డీపీఆర్ను రివైజ్ చేయాలని, ప్రాజెక్టుకు ఎంత నిధులు అవసరమో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అడిగితే సహకరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ప్రాజెక్టులకు ‘జాతీయ హోదా’ అనే పదమే లేదని స్పష్టం చేశారు. గట్టు లిఫ్ట్ 1.5 టీఎంసీల పనులే పూర్తికాలేదని, ఇప్పుడు 3 టీఎంసీలు అంటున్నారని విమర్శించారు. గుడ్డెందొడ్డి 15 టీఎంసీలు, గట్టు 3 టీఎంసీలు, ర్యాలంపాడును 4 టీఎంసీల సామర్థ్యం పెంపుపై ప్రభుత్వం ప్రకటనలు చేస్తోందన్నారు. రాష్ట్ర కాంగ్రెస్లో అంతర్గత సంక్షోభం తీవ్రంగా ఉందని, ఆ సమస్యలను కప్పిపుచ్చుకునేందుకే సీఎం సహా ఆ పార్టీ నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అరుణ ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రిజర్వాయర్లు పూర్తి చేశారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల సామర్థ్యం పెంపు పేరుతో కమిషన్ల కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో ప్రభుత్వం విఫలమైందని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, రైతు బీమాను వెంటనే రెన్యువల్ చేసి ప్రీమియం చెల్లించాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, పద్మజారెడ్డి, అంజయ్య, జనార్ధన్రెడ్డి, రాజేశ్వర్, కృష్ణవర్ధన్రెడ్డి, కార్పొరేటర్లు రమేష్, మర్రి జ్యోతి, యాదయ్య, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
అంగీకారం తెలపని 166 కుటుంబాలు..
నల్లమల కోర్ ఏరియా నుంచి తరలిపోయే వారికి పెద్దకొత్తపల్లి మండలం బాచారం వద్ద ఎన్హెచ్–167కే పక్కన పునరావాస కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయం, గృహాలు, రోడ్లకు మొత్తం రూ.187.95 కోట్లు కానుండగా.. మొదటి విడతలో 417 కుటుంబాలకు రెండు ఆప్షన్లు కలిపి రూ.62.55 కోట్లు ఖర్చుచేస్తున్నారు. 257 ఇళ్లకు ప్లాట్లు చేసి రాళ్లు పాతారు. ఈ నెల 18న డిప్ ద్వారా రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు 256 మందికి ఇంటి స్థలాల పట్టాలు అందజేశారు. తొలిదశలో ఇంకా 166 కుటుంబాలు తరలిపోవడానికి అంగీకారం తెలపలేదు. ఇందులో 85 వరకు చెంచు, మిగిలినవి గిరిజనేతర కుటుంబాలు ఉన్నట్లు సమాచారం. -
కృష్ణా జలాల్లో పాలమూరు వాటా తేల్చాలి
● పెండింగ్ ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేయాలి ● కరువును పారదోలేలా ప్రాజెక్టుల రూపకల్పన ఉండాలి ● ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): కృష్ణా నదిలో పాలమూరు జిల్లాకు న్యాయంగా దక్కాల్సిన నీటి వాటాను తేల్చాలని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. ఉమ్మడి జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన సమితి జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాకేంద్రంలోని ధర్నాచౌక్లో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. 1989 నుంచి పాలమూరు పరిస్థితులను చూస్తున్నానని, అప్పట్లో ఆకలి చావులను చూసి చలించిపోయానన్నారు. జిల్లా కరువు, వలసలు, ఆకలి సమస్యలకు శాశ్వత పరిష్కారం కృష్ణా జలాల వినియోగమేనని, అందుకు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరారు. తెలంగాణ ఏర్పాటుకు నీళ్ల సాధన కూడా ప్రధాన కారణమన్నారు. కృష్ణా నదిలో పాలమూరు ప్రజలకు హక్కుగా రావాల్సిన నీటిని దక్కేలా చర్యలు తీసుకోవాలని, కరువును పారదోలేలా ప్రాజెక్టులను రూపొందించాలని సూచించారు. గత ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టులపై నిర్లక్ష్యం చేసిందని ఆరోపించిన ఆయన.. కొద్దిపాటి నిధులతో పూర్తయ్యే పనులను కూడా పెండింగ్లో పెట్టారని విమర్శించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేసి సాగు, తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. నల్లగొండకు కూడా నీరు అవసరమేనని, అయితే రెండు జిల్లాల మధ్య విభేదాలు సృష్టించేలా ప్రాజెక్టుల రూపకల్పన ఉండకూడదన్నారు. జేఏసీ చైర్మన్ రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని, పాలకుల నిర్లక్ష్యానికి జిల్లా రైతులు, ప్రజలు ఇంకెంతకాలం బలికావాలని ప్రశ్నించారు. పాలమూరును ఎండబెట్టి డిండి ఎత్తిపోతల ద్వారా నీటిని తరలించే విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ రాఘవాచారి, జేఏసీ కోకన్వీనర్ బెక్కం జనార్దన్, వీరబ్రహ్మచారి, చెన్న కిష్టన్న, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
క్రీడలతో మానసిక, శారీరక దృఢత్వం
● పీయూలో జాతీయ క్రీడా దినోత్సవం ● మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి: వీసీ శ్రీనివాస్ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థులకు వివిధ క్రీడల్లో పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. క్రీడల్లో ప్రతిభ కనబరచడంతో మానసిక, శారీరక దృఢత్వం సాధ్యమవుతుందన్నారు. ● బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమంలోనూ వీసీ పాల్గొన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, చెడు అలవాట్లకు లోనుకాకుండా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. భవిష్యత్తుపై లక్ష్యంతో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. ● అనంతరం పీజీ బాలుర హాస్టల్ను వీసీ తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. నాణ్యమైన ఆహారం అందించాలని, హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని వార్డెన్లు, కేర్టేకర్లను ఆదేశించారు. కార్యక్రమాల్లో రిజిస్ట్రార్ రమేష్బాబు, ఓఎస్డీ మధుసూదన్రెడ్డి, పీడీ శ్రీనివాస్, శారద, మన్యం, నూర్జహాన్, రాజ్కుమార్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. -
మొక్కల పెంపకంతో ప్రయోజనాలెన్నో
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: వన మహోత్సవంలో భాగంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయిలో మొక్కలు నాటడంతో పాటు నీటి, మట్టి సంరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని జోగుళాంబ, యాదాద్రి సర్కిల్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శివాల రాంబాబు అన్నారు. మంగళవారం స్థానిక అప్పన్నపల్లిలోని టీబీ ఆస్పత్రి మార్గంలో, జిల్లా అటవీ శాఖ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ వర్షపునీటిని ఒడిసిపట్టి భూగర్భజలాలను పెంపొందించడమే గాక నేల కోతను అరికట్టేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల సమష్టి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. మంగళవారం ఒక్కరోజే జిల్లాలో సుమారు 70 వేల మొక్కలు, జోగుళాంబ గద్వాలలో 32 వేలు, వనపర్తిలో 15 వేలు, నారాయణపేటలో 7 వేలకు పైగా నాటినట్లు వివరించారు. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఎం.డి.జకీరుద్దీన్, డీపీఆర్ఓ పి.శ్రీనివాస్, డీఈఈ ఇస్రానాయక్ తదితరులు పాల్గొన్నారు. -
పెంటల్లోనే ఉపాధి కల్పించాలి..
నల్లమలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తూ.. అడవినే నమ్ముకుని జీవిస్తున్న మమ్మల్ని తల్లి ఒడి నుంచి విడదీయడం సమంజసం కాదు. మేము ఇక్కడే ఉంటాం. ప్రభుత్వం మాకు అండగా ఉంటూ పెంటల్లోనే జీవనోపాధి కల్పించాలని ఆశిస్తున్నాం. – చిగుర్ల లింగేష్, డిగ్రీ విద్యార్థి, సార్లపల్లి పూర్తి పరిహారం అందాకే నిర్ణయం.. మాకు చెప్పినట్లుగా పూర్తి పరిహారం ఇవ్వా లి. బాచారం దగ్గర స్థలం చూపించారు. ఇళ్లు, భూమి, పునరావాస కేంద్రంలో అన్ని వసతులు, ఉపాధి కల్పించిన తర్వాతే బయటకు వెళ్తాం. కొంతమందికి పరిహార చెక్కులు అందాయి. అందరికీ అందిన వెంటనే నిర్ణ యం తీసుకుంటాం. – కంపల్లి అంజనేయులు, గిరిజనేతరుడు, సార్లపల్లి కొందరు ఇబ్బంది పెడుతున్నారు సార్లపల్లి నుంచి 5 చెంచు కుటుంబాలే వెళ్తున్నాయి. 80 కుటుంబాలు ఇక్కడే ఉంటున్నాయి. అందరు వెళ్తే మీరెలా ఉంటారని కొందరు ఇబ్బంది పెడుతున్నారు. దశాబ్దాలుగా వేదన అనుభవిస్తూ పోరాడుతున్నాం. గిరిజనుల పేరిట చెంచులను ఇబ్బంది పెడితే ఊరుకోం. – జల్లా గురవమ్మ, అటవీ హక్కుల కమిటీ అధ్యక్షురాలు, సార్లపల్లి చెంచుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు అమ్రాబాద్ ఫారెస్ట్లో పులుల సంఖ్య ఏటా పెరుగుతోంది. భవిష్యత్లో మానవ, వన్యప్రాణుల మధ్య ఘర్షణ పెరిగే అవకాశముంటుంది. పెంటలు, గ్రామాల తరలింపు స్వచ్ఛంద పునరావాస కార్యక్రమం. అంగీకరించే కుటుంబాలకు మెరుగైన వసతులు, స్థిరమైన జీవనోపాధి కల్పిస్తాం. – రేవంత్ చంద్ర, డీఎఫ్ఓ, నాగర్కర్నూల్ బలవంతం లేదు.. హైదరాబాద్లోని కాలనీల తరహాలో బాచారం పునరావాస కేంద్రంలో అడవి బిడ్డలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం. ఎలాంటి ఇబ్బందులు రాకుండా వసతులు కల్పిస్తాం. చెంచులను ఇబ్బంది పెట్టేది లేదు. బలవంతం లేదు.. స్వచ్ఛందంగా వచ్చిన వారికి పునరావాసం కల్పిస్తాం. – జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి -
మొక్క నాటితే కాదు.. కాపాడితేనే ఫలితం
మహబూబ్నగర్ రూరల్: మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించి వృక్షాలుగా తీర్చిదిద్దినప్పుడే వనమహోత్సవానికి సార్థకత చేకూరుతుందని ఎంపీ డీకే అరుణ అన్నారు. మంగళవారం మెట్టుగడ్డలోని మహిళా, శిశు సంక్షేమ శాఖ స్టేట్హోమ్ ఆవరణలో వనమహోత్సవం నిర్వహించారు. ఎంపీతో పాటు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, డీడబ్ల్యూఓ జరీనాబేగం తదితరులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. పట్టణాల్లో కాలుష్యాన్ని తగ్గించేందుకు విస్తృతంగా మొక్కలు నాటి పచ్చదనం పెంచాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కకు నీరు పోయడం, పశువుల నుంచి రక్షించడం, ఎండాకాలంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ద్వారా వాటిని సంరక్షించాలన్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో పర్యావరణ సమతుల్యతకు చెట్లు కీలకమన్నారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వ కార్యక్రమానికే పరిమితం కాకుండా ప్రజా ఉద్యమంగా మారాలని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ రోజా, సీడీపీఓలు శైలాశ్రీ, రూప, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఏం జరుగుతుందో..?!
వనపర్తి: జిల్లా కాంగ్రెస్ పార్టీలో కొన్ని రోజులుగా సాగుతున్న మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఇటీవల పార్టీ, తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే మేఘారెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు క్రమశిక్షణ కమిటీ చర్యలకు సిఫార్సు చేయడం కలకలం సృష్టించింది. ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్కు, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని ఈ మేరకు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురవి ఆధ్వర్యంలో రూపొందించిన నివేదికను పార్టీ అధిష్టానానికి సమర్పించినట్లు తెలిసింది. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించినందుకు గాను చిన్నారెడ్డిని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పిస్తూ.. చర్యలు తీసుకోవాలని నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో వనపర్తి కాంగ్రెస్లో నెలకొన్న అంతర్గత విభేదాల వ్యవహారం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. పార్టీకి నష్టం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, చిన్నారెడ్డి గతంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా పనిచేసిన నేపథ్యంలో మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని మల్లురవి అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత విభేదాలను పార్టీ వేదికలపైకి తీసుకురావొద్దని హితవు పలికారు. మరి చిన్నారెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని.. కాంగ్రెస్ పార్టీలో అసలేం జరుగుతుందోనని స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ● చిన్నారెడ్డిపై చర్యలకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సు -
సురవరం జీవితం.. స్ఫూర్తిదాయక చిత్రం
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): తెలంగాణ వైతాళికుడు, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధు డు, సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డి జీవితంపై రూపొందించిన చలనచిత్రం స్ఫూర్తిదాయకంగా ఉందని మాజీ మంత్రి వి. శ్రీనివాస్గౌడ్ అన్నారు. సురవరం ప్రతాపరెడ్డి సాహితి వైజయంతి ట్రస్ట్ నిర్మించిన ‘సురవరం’ బయోపిక్ ప్రివ్యూను మంగళవారం హైదరాబాద్లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. సురవరం సేవలను గౌరవిస్తూ ప్రభుత్వాలు పలు కార్యక్రమాలు చేపట్టినప్పటికీ, ఆయన జీవితచరిత్రను చలనచిత్రంగా తెరకెక్కించడం అభినందనీయమన్నారు. నిజాం నిరంకుశ పాలనలో తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న దారిద్య్రం, దైన్యం, ప్రాథమిక హక్కుల లేమి వంటి పరిస్థితులను సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారని పేర్కొన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి సురవరం చేసిన కృషిని ఈ చిత్రం ద్వారా నేటి తరానికి పరిచయం చేయడం గొప్ప విషయమన్నారు. తెలంగాణ ప్రజలంతా ఈ చిత్రాన్ని వీక్షించి చరిత్రను తెలుసుకోవాలని కోరారు. రాష్ట్ర ఉద్యోగులకు క్రీడా ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: ఆలిండియా సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్ 2026 –27 కోసం రాష్ట్ర ప్రభు త్వ ఉద్యోగులకు క్రీడా ఎంపికలు నిర్వహించనున్నట్లు డీవైఎస్ఓ జె.రాజశేఖర్రెడ్డి తెలిపారు. జిల్లాస్థాయి ఎంపికలు వచ్చే నెల 3న డీఎస్ఏ మెయిన్ స్టేడియంలో, రాష్ట్రస్థాయి ఎంపికలు హైదరాబాద్లో 8, 9 తేదీల్లో జరుగుతాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే అర్హులని తెలిపారు. అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్స్, హాకీ, కబడ్డీ, లాన్టెన్నిస్, పవర్లిఫ్టింగ్, స్విమ్మింగ్, టేబుల్టెన్నిస్, వాలీబాల్, వెయిట్లిఫ్టింగ్ తదితర క్రీడాంశాల్లో ఎంపికలు ఉంటాయి. పురుషులకు క్రికెట్, ఫుట్బాల్, రెజ్లింగ్, బెస్ట్ఫిజిక్, యోగా, ఖోఖోలోనూ ఎంపికలు నిర్వహిస్తారు. అర్హులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీవైఎస్ఓ కోరారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి మానవపాడు: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని పెద్దపోతులపాడులో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఏఎస్ఐ జమీరుద్దీన్ వివరాల ప్రకారం బోయ మహేశ్బాబు(34) అలంపూర్ చౌరస్తాలోని ఓ చికెన్ దుకాణంలో పని చేస్తున్నాడు. ఈ నెల 20న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యయత్నం చేయగా కుటుంబ సభ్యులు అలంపూర్ చౌరస్తాలోని ఆస్పత్రికి, అనంతరం కర్నూలుకు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఏఎస్ఐ తెలిపాడు. మృతుడి భార్య రాధిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ● జిల్లాస్థాయిలో 3న.. రాష్ట్రస్థాయిలో 8, 9న ఎంపికలు -
మా నోట్లో మట్టి కొడుతున్నారు
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఎస్ఐఆర్లో కులగణనకు సంబంధించి బీసీల వివరాల నమోదు కోసం ప్రత్యేక కాలమ్ లేకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. దేశ జనాభాలో 60 శాతం వరకు ఓబీసీలు ఉన్నప్పటికీ వారి వివరాలను నమోదు చేయడంలో నిర్లక్ష్యం తగదన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎస్ఐఆర్లో ఎస్సీ, ఎస్టీ, ఇతరులు అనే కాలమ్లతో సరిపెట్టారని, బీసీలకు ప్రత్యేక కాలమ్ ఎందుకు లేదని ప్రశ్నించారు. బీసీల రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. బీపీ మండల్ కమిటీ సిఫారసుల మేరకు 27 శాతం రిజర్వేషన్ అమలవుతున్నా.. పూర్తి స్థాయిలో న్యాయం జరగడం లేదన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. అయోధ్య రామాలయంలో హుండీతో పాటు బంగారం లెక్కలను పారదర్శకంగా వెల్లడించాలని హనుమంతరావు డిమాండ్ చేశారు. టీచర్స్కాలనీలోని రామాలయంలో ప్రత్యేక పూజల అనంతరం డీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఆలయ నిర్వహణలో అవకతవకలపై సీబీఐ లేదా స్వతంత్ర కమిటీతో విచారణ జరిపించాలని కోరారు. దేవుడి పేరు చెప్పి రాజకీయ లబ్ధి పొందుతున్నారని బీజేపీపై విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని ఆరోపించారు. నీట్ పేపర్ లీకేజీలపై ఆందోళన వ్యక్తం చేస్తూ విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు కాంగ్రెస్ చేపడుతున్న నిరసనలకు మద్దతివ్వాలని కోరారు. కార్యక్రమానికి ముందు పది నిమిషాల పాటు మౌనం పాటించారు. ఆయా కార్యక్రమాలలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్యాదవ్, అధికార ప్రతినిధి జహీర్ అక్తర్, డీసీసీ అధ్యక్షుడు ఎ.సంజీవ్ముదిరాజ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, పార్టీ నాయకులు సత్తూర్ చంద్రకుమార్గౌడ్, వినోద్కుమార్, షబ్బీర్ అహ్మద్, బెక్కరి మధుసూదన్రెడ్డి, రాములుయాదవ్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్లో బీసీలకుప్రత్యేక కాలమ్ ఏది? బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాలి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ వీహెచ్ -
ప్రాజెక్టు వద్దు.. మహాప్రభో
● ఉమామహేశ్వర రిజర్వాయర్పై నిర్వాసితుల డిమాండ్ ● గ్రామసభ బహిష్కరించి అంబేడ్కర్ కూడలిలో రైతుల నిరసన ● ప్రత్యామ్నాయ ప్రాంతంలో నిర్మించాలని భూసేకరణ డిప్యూటీ కలెక్టర్కు వినతి బల్మూర్: ఉమామహేశ్వర రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణపై ప్రకటించిన జాబితా అభ్యంతారాలపై మంగళవారం రైతుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు జీపీ వద్ద నిర్వహించిన గ్రామసభ బహిష్కరణకు దారి తీసింది. భూములు ముంపునకు గురై జీవనోపాధి కోల్పోయే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసిన రైతులు స్థానిక జీపీ వద్ద నిర్వహించిన అభిప్రాయ సేకరణ గ్రామసభను బహిష్కరించారు. అనంతరం అంబేడ్కర్ కూడలి వద్ద నిరసన చేపట్టారు. తమకు రిజర్వాయర్ అవసరంలేదని స్పష్టం చేశారు. గ్రామసభకు దూరంగా రైతులు భూ నిర్వాసితుల అభిప్రాయ సేకరణలో భాగంగా అధికారులు గ్రామసభ నిర్వహించారు. భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అరుణారెడ్డి, తహసీల్దార్ తదితర అధికారులు రైతులతో మాట్లాడారు. రిజర్వాయర్ నిర్మాణంతో భూములు కోల్పోయే రైతులు తమ అభిప్రాయాలను గ్రామసభలో వెల్లడించాలని సూచించారు. అయితే తమ అభ్యంతరాలను ఇప్పటికే అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, ప్రాజెక్టు కారణంగా తమకు నష్టం జరుగుతుందని పేర్కొంటూ పలువురు రైతులు సభను బహిష్కరించారు. రిజర్వాయర్ నిర్మాణంతో తమ వ్యవసాయ భూములు ముంపునకు గురవుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాలుగా సాగుచేసుకుంటున్న భూములను కోల్పోతే తమ కుటుంబాల జీవనోపాధి దెబ్బతింటుందని పేర్కొన్నారు. రిజర్వాయర్ నిర్మాణంతో ప్రయోజనం కంటే తమకు నష్టమే ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అందువల్ల ప్రాజెక్టు నిర్మాణ ప్రతిపాదనను పునఃపరిశీలించాలని కోరారు. గ్రామసభలో మాట్లాడుతున్న భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ అరుణారెడ్డి -
వర్షంతో రైతుల్లో చిగురించిన ఆశలు
● పత్తి, కంది, మొక్కజొన్న, జొన్న పంటలకు జీవం ● జిల్లాలో సగటున 37.1 మి.మీ వర్షపాతం కౌకుంట్ల మండలం దాసరిపల్లిలో సాగు చేసిన పత్తిపంట మహబూబ్నగర్ (వ్యవసాయం): వర్షం కోసం ఎదురుచూస్తున్న అన్నదాతకు అల్పపీడన ప్రభావంతో కురిసిన వాన ఊరటనిచ్చింది. జిల్లావ్యాప్తంగా కురిసిన వర్షాలతో వాడుముఖం పట్టిన పత్తి, కంది, మొక్కజొన్న, జొన్న పంటలకు తేమ అందింది. పూత, కాత దశలో ఉన్న పత్తికి ఈ వర్షం కీలకంగా మారింది. సోమవారం ఉదయం వరకు జిల్లాలో సగటున 37.1 మి.మీ వర్షపాతం నమోదైంది. పంటలకు ఊపిరి 20 రోజులుగా సరైన వర్షం లేక భూమిలో తేమ తగ్గడంతో పలు ప్రాంతాల్లో పంటలు వాడుముఖం పట్టాయి. తాజాగా కురిసిన వానతో పొలాల్లో తేమ పెరిగి పంటలు పచ్చబడుతున్నాయి. ఎరువులు వేసేందుకు, అవసరమైన సస్యరక్షణ చర్యలు చేపట్టేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఖరీఫ్లో 4.05 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం కాగా ఇప్పటివరకు 2.92 లక్షల ఎకరాల్లో సాగైంది. చెరువులకు చేరని నీరు భారీ వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండలే దు. వర్షాధార రైతులు ఇబ్బందులు పడుతుండగా.. బోర్లు, ఇతర సాగునీటి వనరులున్న రైతు లు పంటలను కొనసాగిస్తున్నారు. మరో రెండు రోజులపాటు అక్కడక్కడా మోస్తరు వర్షాలు కు రిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మిడ్జిల్లో అత్యధికం ఆదివారం రాత్రి 7 గంటల నుంచి సోమవారం ఉదయం 10 గంటల వరకు జిల్లాలో సగటున 37.1 మి.మీ వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా.. మిడ్జిల్ 54.4, నవాబుపేట 54.2, అడ్డాకుల 48.4, రాజాపూర్ 48.4, బాలానగర్ 47.8, జడ్చర్ల 46.7, హన్వాడ 41.9, కౌకుంట్ల 41.6, దేవరకద్ర 40.6, కోయిలకొండ 37.1, గండీడ్ 32.9, మహబూబ్నగర్ అర్బన్ 28.8, మూసాపేట 25.6, చిన్నచింతకుంట 23.6, మహబూబ్నగర్ రూరల్ 22.1, భూత్పూర్ 19.4, మహ్మదాబాద్ 18 మి.మీ వర్షపాతం నమోదైంది. ముసురు వానలతో వరి, ఆరుతడి పంటలకు ప్రయోజనం చేకూరనుంది. -
అధిక కేసుల పరిష్కారానికి చొరవ చూపాలి
● లోక్ అదాలత్లో డ్రంకన్డ్రైవ్, ఈ–పెట్టీ, ట్రాఫిక్ చలాన్ కేసులపై ప్రత్యేక దృష్టి ● న్యాయమూర్తి ఈశ్వరయ్య సూచన పాలమూరు: సెప్టెంబర్ 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్లో అధిక సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేలా పోలీస్ శాఖ చొరవ చూపాలని ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ న్యాయమూర్తి ఈశ్వరయ్య సూచించారు. సోమవారం జిల్లా మొదటి అదనపు సెషన్స్ కోర్టులో న్యాయమూర్తులు, ఎస్పీ డి.జానకి, డీఎస్పీ వెంకటేశ్వర్లు, నగర సీఐలతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. పోలీస్ స్టేషన్ల పరిధిలోని రాజీకి అవకాశం ఉన్న క్రిమినల్ కేసులతో పాటు డ్రంకన్డ్రైవ్, ఈ–పెట్టీ, ట్రాఫిక్ చలాన్ కేసులను గుర్తించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. కక్షిదారులను గుర్తించి నోటీసులు జారీ చేసి లోక్ అదాలత్కు హాజరయ్యేలా కోర్టు డ్యూటీ సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవడం వల్ల ఇరుపక్షాలకు సమయం, ఖర్చు ఆదా అవుతుందని తెలిపారు. న్యాయమూర్తులు మమతరెడ్డి, మహ్మద్ మునవర్ హుస్సేన్, రవిశంకర్, అనిత, అదనపు ఎస్పీ ఎన్బీ రత్నం, సీఐలు పాల్గొన్నారు. -
కర్నెతండా లిఫ్టుతో 4,235 ఎకరాలకు సాగునీరు
● ప్రతి ఎకరాకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తాం ● ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన మంత్రులు కోమటిరెడ్డి, జూపల్లి వనపర్తి/ఖిల్లాఘనపురం: పాలమూరులోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తా మని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పర్యాటక శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలంలోని కర్నెతండా ఎత్తిపోతల పథకాన్ని ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, రాజేష్రెడ్డితో కలిసి మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. రూ.87.53 కోట్లతో ఏర్పాటు చేసిన కర్నెతండా లిఫ్టు ద్వారా నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని గిరిజన తండాల్లో 851 ఎకరాలకు, వనపర్తి జిల్లా లోని ఖిల్లాఘనపురం, పెద్దమందడి, వనపర్తి మండలాల్లోని గ్రామాలు, గిరిజన తండాల్లోని 3,384 ఎకరాలకు సాగునీరు అందించే వెసులుబాటు ఉంటుందన్నా రు. గిరిజనుల ఆకాంక్ష మేరకు ఈ లిఫ్టు కు శ్రీసంత్ సేవాలాల్ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టుగా పేరు మార్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా మౌలిక వసతులను మెరుగుపర్చుతామని పేర్కొన్నారు. 3.35 కోట్ల మందికి సన్న బియ్యం, 7లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, 70 వేల ఉద్యోగాలు, ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తండాలో నెట్వర్క్ సమస్యను అధిగమించేందుకు కర్నెతండా ప్రాంతంలో సెల్టవర్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గత పాలకులు అనేక ప్రాజెక్టులను పూర్తి చేశామని ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసుకుంటూ ప్రజలకు సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. -
పాలకుల నిర్లక్ష్యానికి ప్రాజెక్టులు బలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఉమ్మడి జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని పెండింగ్ ప్రాజెక్టుల సాధన సమితి జేఏసీ చైర్మన్ రాజేందర్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం టీఎన్జీఓ భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలకుల నిర్లక్ష్యం, పక్షపాతంతో ప్రాజెక్టులు ఏళ్లుగా పెండింగ్లో ఉండటంతో రైతులు, ప్రజలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేసి సాగు, తాగునీరు అందించాలని కోరారు. పాలమూ రు ప్రయోజనాలను దెబ్బతీసే డిండి ఎత్తిపోత ల పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ ప్రాజెక్టులపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు మంగళవారం జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం హాజరవుతారని చెప్పారు. ఉమ్మడి జిల్లా నుంచి రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. రేపు మిలాద్ జులూస్ స్టేషన్ మహబూబ్నగర్: మిలాదున్నబీ వేడుకల్లో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలో మిలాద్ జులూస్ ర్యాలీ నిర్వహించనున్నట్లు మజ్లిస్ అహ్లె సున్నత్వల్ జమాత్ మిలాద్ జులూస్ జల్సా కమిటీ ప్రతినిధులు తెలిపారు. సోమవారం షాసాబ్గుట్ట దర్గా ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అసర్ నమాజ్ అనంతరం సాయంత్రం మక్కామసీద్ నుంచి జులూస్ ప్రారంభమై క్లాక్టవర్, మున్సిపల్ కార్యాలయం, అశోక్టాకీస్, అంబేద్కర్ చౌరస్తా, న్యూటౌన్ మీదుగా షాసాబ్గుట్టలోని హజ్రత్ మర్దాన్ అలీషా దర్గా ఆవరణకు చేరుకుంటుందని తెలిపారు. పోలీసుల సూచనల మేరకు డీజేలు, ఇతర సౌండ్ సిస్టమ్లు వినియోగించవద్దని కోరారు. అనంతరం దర్గా ఆవరణలో ధార్మిక సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఉత్తరప్రదేశ్కు చెందిన అల్లమా సయ్యద్ అలంగీర్ అష్రఫ్ అష్రఫీ, జామియా నిజామియాకు చెందిన మౌలానా ముఫ్తి మహ్మద్ హుస్సేన్ ఖురేషి సందేశాలు ఇస్తారని తెలిపారు. తగ్గిన విద్యుదుత్పత్తి ఆత్మకూర్: ఎగువ నుంచి జూరాలకు వరద ప్రవాహం నిలిచిపోవడంతో సోమవారం కేవలం 2 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువ, దిగువలో ఒక్కొక్క యూనిట్ ద్వారా విద్యుదుత్పత్తి చేపడుతూ 7,134 క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. -
ప్రజావాణికి మించిన పని లేదు..
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆదేశించారు. ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరైన ఏడుగురు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చే యాలని ఆదేశించారు. క్రమశిక్షణ చర్యలతో పాటు సర్వీస్ బుక్లో నమోదు చేస్తామని హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో భూ, రెవెన్యూ, పింఛన్లు, సంక్షేమ పథకాలు, ఉపాధి, రహదారులు, తాగునీరు, గృహ నిర్మాణం తదితర సమస్యలపై 89 ఫిర్యాదులను స్వీకరించారు. అధికారులంతా ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. నేడు భారీగా మొక్కలు నాటాలి వన మహోత్సవంలో భాగంగా మంగళవారం జిల్లావ్యాప్తంగా భారీగా సామూహిక మొక్కలు నాటాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అనుకూల వాతావరణాన్ని సద్వినియోగం చేసుకుని పెద్దఎత్తున మొక్కలు నాటాలని సూచించారు. ప్రతి మండలం, గ్రామం, పట్టణానికి లక్ష్యాలు నిర్దేశించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అంగన్వాడీ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల మహిళలు, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ విద్యార్థులు, యువత, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు. 27న గ్రామ, వార్డు సభలు ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 27న జిల్లాలో గ్రామ, వార్డు సభలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఖుష్బూగుప్తా తెలిపారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ అనామలీస్, మ్యాపింగ్ కాని ఓటర్లకు నోటీసుల జారీ ప్రక్రియ పూర్తయిందన్నారు. ఈ వారంలో సంబంధిత ఓటర్లకు నోటీసులు అందజేయాలని అధికారులను ఆదేశించారు. సభల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు మధుసూదన్నాయక్, హరిప్రియ, భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాంరెడ్డి, ఆర్డీఓ నవీన్, జెడ్పీసీఈఓ వెంకట్రెడ్డి, డీఏఓ గోవింద్నాయక్, అటవీశాఖ డిప్యూటీ రేంజ్ అధికారి వెంకట్రాములు, తదితరులు పాల్గొన్నారు. ప్రతి జిల్లా అధికారి తప్పనిసరిగా హాజరుకావాల్సిందే: కలెక్టర్ గైర్హాజరైన ఏడుగురు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ ఈ వారం గ్రీవెన్స్కు 89 ఫిర్యాదులు -
నేడు సామూహిక వనమహోత్సవం
పాలమూరు: జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పచ్చదనం పెంపునకు మంగళవారం సామూహిక వనమహోత్సవం నిర్వహించనున్నారు. ప్రభుత్వ శాఖలు, గ్రామ పంచాయతీలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో జిల్లావ్యాప్తంగా మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేసి, వివరాలను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని అధికారులు ఆదేశించారు. 697 ప్రాంతాల్లో భారీగా నాట్లు ఈ ఏడాది జిల్లాలో 50.82 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించగా.. ఇప్పటివరకు 27.17 లక్షలు నాటారు. మంగళవారం జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో 697 ప్రాంతాల్లో ఒకేరోజు 1.10 లక్షల మొక్కలు నాటనున్నారు. ఇందులో 10 ప్రాంతాల్లో ప్రత్యేకంగా భారీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. నర్సరీల నుంచి ఇప్పటికే మొక్కలను సేకరించారు. ● మహబూబ్నగర్లోని అప్పన్నపల్లి సమీపంలోని క్షయ ఆస్పత్రి రోడ్డులో ప్రధాన వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ఎస్పీ డి.జానకి, మేయర్, డిప్యూటీ మేయర్లు పాల్గొననున్నారు. ప్రభుత్వ శాఖల అధికారులు, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులు కోరారు. ఒకే రోజు 1.10 లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు క్షయ ఆస్పత్రి రోడ్డులో ప్రధాన కార్యక్రమం హాజరుకానున్న జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు -
సారుసారుకో కొత్త కారు..!
పాలమూరు యూనివర్సిటీలో లగ్జరీ పాలన ● వీసీలు మారిన ప్రతీసారి నూతన వాహనం కొనుగోలు ● సరిపోను వసతి లేక సీట్లు రద్దు చేసుకుని వెళ్తున్న విద్యార్థులు ● ఇవేమీ పట్టకుండా యథేచ్ఛగా నిధుల దుర్వినియోగం ● అధికారులపై భగ్గుమంటున్న విద్యార్థి సంఘాలు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పాలమూరు యూనివర్సిటీ (పీయూ)లో విద్యార్థుల భవిష్యత్ను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. దశాబ్దాలు గడిచినా నిధుల లేమితో అల్లాడుతున్న ఈ విశ్వవిద్యాలయం.. ఇప్పుడిప్పుడే వనరులు సమకూర్చుకుంటూ ఎదిగే ప్రయత్నం చేస్తోంది. అయితే నిధులు లేవనే సాకుతో విద్యార్థులకు మెరుగైన విద్యా బోధనతోపాటు కనీస వసతులు కల్పించకుండా పక్కనబెడుతున్న యూనివర్సిటీ పాలకులు.. తమ సొంత లగ్జరీ సౌకర్యాలకు మాత్రం నిధులను నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. యూనివర్సిటీలో పలు కోర్సుల్లో సీటు వచ్చినా.. వసతి గృహాలు, మౌలిక సదుపాయాలు లేక వందలాది మంది విద్యార్థులు రద్దు చేసుకుని వెళ్లిపోతుంటే.. ఇవేమీ పట్టని పాలనా యంత్రాంగం రూ.లక్షలు వెచ్చించి కొత్త లగ్జరీ కార్లు కొనుగోలు చేయడం వివాదాస్పదంగా మారింది. వీసీ మారినప్పుడల్లా.. యూనివర్సిటీ నిబంధనల ప్రకారం వైస్ చాన్స్లర్ మూడేళ్లు, రిజిస్ట్రార్లు రెండేళ్ల పదవీ కాలానికి నియమితులవుతారు. పాలమూరు యూనివర్సిటీలో వీసీలు మారిన ప్రతిసారి కొత్త లగ్జరీ కారు కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారింది. 2019కి ముందు వీసీ భాగ్యనారాయణకు ఇన్నోవా వాహనం ఉండేది. ఆ తర్వాత వీసీగా వచ్చిన రాజారత్నం ఈ వాహనాన్ని రిజిస్ట్రార్కు కేటాయించి.. సుమారు రూ.30 లక్షల వ్యయంతో ఇన్నోవా హై 2.5జెడ్ కొనుగోలు చేశారు. ఈ కారు ఉండగానే.. 2023లో వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్ రూ.20 లక్షల వ్యయంతో కొత్తగా మహీంద్రా ఎక్స్యూవీ 400 ఈవీ వాహనం కొనుగోలు చేశారు. ఈ రెండు వాహనాలను వినియోగించుకునే అవకాశం ఉన్నా.. తాజాగా వీసీ శ్రీనివాస్ ఇటీవల సుమారు రూ.32 లక్షల వ్యయంతో మహీంద్రా ఈవీ (లేటెస్ట్ మోడల్) కొనుగోలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఇద్దరు ఉన్నతాధికారులు వినియోగించుకునేందుకు వర్సిటీలో ఏకంగా నాలుగు కార్లు అందుబాటులో ఉండడం గమనార్హం. ఒకటి రోడ్డెక్కితే.. మరొకటి షెడ్డుకే పరిమితం ప్రస్తుతం వీసీ శ్రీనివాస్ ఇన్నోవా హై 2.5జెడ్, మహీంద్రా ఈవీ కారును వాడుతుండగా, రిజిస్ట్రార్ రమేష్బాబు పాత ఇన్నోవాను పక్కనబెట్టి లక్ష్మీకాంత్ రాథోడ్ కొనుగోలు చేసిన మహీంద్రా ఎక్స్యూవీ 400 ఈవీని వినియోగిస్తున్నారు. కేవలం ఇద్దరు అధికారులు తిరిగేందుకు నాలుగు వాహనాలు ఉండగా.. ఒకటి రోడ్డెక్కితే ఇంకోటి షెడ్డుకే పరిమితమయ్యే పరిస్థితి ఉంది. విద్యార్థి సంఘాల ఆగ్రహం.. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పేద విద్యార్థులకు యూనివర్సిటీలో సరిపడా హాస్టల్ గదులు లేవని.. తాగడానికి మంచి నీరు, చదువుకోవడానికి లైబ్రరీలో ఆధునిక పుస్తకాలు, ల్యాబ్ సౌకర్యాలు లేవని.. విద్యార్థుల కష్టాలు పట్టని అధికారులకు ఈ లగ్జరీ కార్ల మోజు ఎందుకని విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇది కచ్చితంగా ప్రభుత్వ నిధుల దుర్వినియోగమేనని.. సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలని.. లేకుంటే యూనివర్సిటీ ముట్టడికి పిలుపునిస్తామని హెచ్చరిస్తున్నారు. వసతి మరిచి.. లగ్జరీ మోజు ఎలా.. పీయూలో లా, ఇంజినీరింగ్ వంటి కోర్సుల్లో వసతి లేదనే కారణంతో ఏకంగా 159 సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి. ఎంబీఏ, ఎమ్మెస్సీ, లా కోర్సుల్లో పీయూ కౌన్సెలింగ్లో సీట్లు పొందిన 140 మందికి 97 మంది చేరితే.. ఇందులో 43 మంది సీట్లు రద్దు చేసుకున్నారు. దీనికి ప్రధాన కారణం యూనివర్సిటీలో హాస్టల్ వసతి లేకపోవడమే. అంతేకాదు.. బాలికల హాస్టల్ సామర్థ్యం 680 మంది కాగా.. అంతకు మించి 870 మంది ఉంటున్నారు. ఒక గదిలో నలుగురు ఉండాల్సిన చోట ఆరు నుంచి ఎనిమిది మంది వరకు సర్దుకుంటున్నారు. ప్రత్యామ్నాయంగా సమీపంలోని ప్రభుత్వ భవనాలను హాస్టళ్లుగా మార్చాలని విజ్ఞప్తులు చేస్తున్నా.. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇవేమీ పట్టకుండా.. పీయూ ఉన్నతాధికారులు రూ.లక్షలు వెచ్చించి అవసరానికి మించి లగ్జరీ కార్లు కొనుగోలు చేయడం పట్ల విద్యార్థి సంఘాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడేళ్లు, ఆరేళ్లకే మరమ్మతులట..! విద్యార్థులకు వసతులు కల్పించకుండా, అవసరానికి మించి లగ్జరీ కార్లు కొనుగోలు చేయడంపై పీయూ రిజిస్ట్రార్ రమేష్బాబును ‘సాక్షి’ సంప్రదించగా.. ‘గతంలో కొనుగోలు చేసిన పాత కార్లు తరచుగా మరమ్మతుకు రావడంతో కొత్త కారు కొన్నాం. ప్రతి నెలా పెట్రోల్ కార్లు వినియోగించడం వల్ల ఎక్కువ మొత్తంలో ఖర్చవుతోంది. దీంతో ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేశాం. వీటి వల్ల ఇంధన ఖర్చులు తగ్గి దీర్ఘకాలంలో యూనివర్సిటీకి నిధులు ఆదా అవుతాయి.’ అని సమాధానం ఇచ్చారు. మూడేళ్లకు, ఆరేళ్ల్లకే మరమ్మతులు రావడం ఏమిటని ప్రశ్నిస్తే సమాధానం కరువైంది. నిబంధనలకు నీళ్లు..పీయూ ఉన్నతాధికారులు లగ్జరీ సౌకర్యాల మోజులో పడి ప్రభుత్వ జీఓకు నీళ్లు వదిలినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఆర్థికశాఖ జారీ చేసిన సర్క్యులర్.మెమో.నం.826/29/ఏ2/డీసీఎం/2017 ప్రకారం ప్రభుత్వ శాఖల్లో, యూనివర్సిటీల్లో కొత్త వాహనాల కొనుగోలుపై నిషేధం ఉంది. జిల్లాల్లో ప్రభుత్వ అధికారులు తిరిగేందుకు నెలకు (2,500 కి.మీ) గరిష్టంగా రూ.33,000 అద్దె ప్రాతిపదికన మాత్రమే ప్రైవేట్ వాహనాలను వాడాలనే ఆదేశాలు ఉన్నాయి. కానీ పీయూ అధికారులు ఈ నిబంధనలను తుంగలో తొక్కి డెవలప్మెంట్ ఫండ్ నుంచి వాహనాలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. -
నెల రోజుల చిన్నారి తొడలో సూది!
పాలమూరు: నెలరోజుల చిన్నారి తొడలో సూది (నీడిల్) దిగిన ఘటన మహబూబ్నగర్లో వెలుగుచూసింది. సుమారు 20 రోజులుగా పాప నొప్పితో బాధపడుతుండగా.. ప్రైవేట్ ఆస్పత్రిలో ఎక్స్రే చేయించడంతో తొడలో సూది ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటన ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో జరిగిందా? లేక టీకా వేసే సమయంలో చోటుచేసుకుందా? అన్నది తేలాల్సి ఉంది. నారాయణపేట జిల్లా గుండుమాల్ మండల కేంద్రానికి చెందిన వెంకట్రాములు భార్య అక్షిత జూలై 19న ప్రసవం కోసం మహబూబ్నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రిలో చేరింది.మరుసటి రోజు సాధారణ ప్రసవంలో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. పాప పసిరికలతో అస్వస్థతకు గురికావడంతో ఎస్ఎన్సీయూలో పది రోజులపాటు చికిత్స అందించారు. అనంతరం డిశ్చార్జ్ చేసే సమయంలో పాప తొడ భాగంలో వాపు కనిపించింది. దీనిపై తల్లి ఆస్పత్రి సిబ్బందిని ప్రశ్నించగా.. ఇంజక్షన్లు ఇవ్వడం వల్ల వాపు వచ్చిందని, రెండు, మూడు రోజుల్లో తగ్గిపోతుందని చెప్పి పంపించారు. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత కూడా వాపు తగ్గకపోవడంతో కోస్గిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించారు. అక్కడ ఎక్స్రే తీయగా.. పాప తొడలో సూది ఉన్నట్లు గుర్తించారు.దీంతో తల్లిదండ్రులు పాపను తిరిగి మహబూబ్నగర్కు తీసుకొచ్చి జనరల్ ఆస్పత్రి ఎస్ఎన్సీయూలో చేర్పించారు. ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ రంగా అజ్మీరాను వివరణ కోరగా.. పాప తొడలోకి సూది ఎలా వెళ్లిందనే అంశంపై ప్రస్తుతం స్పష్టత లేదని, సోమవారం పాపను పరీక్షించి శస్త్రచికిత్స ద్వారా సూదిని తొలగిస్తామని తెలిపారు. పాపకు యాంటీబయాటిక్స్ ఇచ్చే క్రమంలో ఈ ఘటన జరిగిందా? లేక బయట టీకా వేసిన సమయంలో చోటుచేసుకుందా? అన్నది పరిశీలిస్తామని సూపరింటెండెంట్ తెలిపారు. -
రైతులకు నష్టమే..
ఇప్పటికే విత్తనాలు, కూలీలు, పురుగు మందులు, డీజిల్ ఖర్చులు పెరిగిపోయాయి. ఇప్పుడు కాంప్లెక్స్ ఎరువుల ధరలు కూడా పెరగడంతో ఎకరాకు పెట్టుబడి మరింత పెరుగుతోంది. పంట దిగుబడికి తగిన ధర రాకపోతే రైతుకు మిగిలేది నష్టమే. అప్పులు తెచ్చి పంటలు సాగు చేస్తున్నాం. రవాణా చార్జీలు మోపడం అన్యాయం. ప్రభుత్వం ఎరువుల ధరల పెంపును నియంత్రించాలి. – భీమయ్య, రైతు, మాచన్పల్లి గ్రామం, మహబూబ్నగర్ రూరల్ సరైన నిర్ణయం కాదు.. పంటల సాగులో ఎరువుల వినియోగమే ఎక్కువ. ఒక్కో బస్తాపై రూ.వందల్లో పెరిగితే నాలుగైదు బస్తాలకు కలిపి రూ.వేలు అవుతుంది. రైతులపై ఈ అదనపు భారం పడకుండా ఎరువులను పాత ధరలకే అందించాలి. అలాగే ట్రాన్స్పోర్ట్ చార్జీలను రైతుల నుంచి వసూలు చేయడం కూడా సరైన నిర్ణయం కాదు. – చంద్రయ్య, రైతు, పర్దీపూర్ గ్రామం, చిన్నచింతకుంట మండలం రద్దు చేశారు.. ఎరువుల బస్తాల రవాణా చార్జీలను గతంలో ప్రభుత్వమే చెల్లించేది. జూలై 15 కన్నా ముందు రవాణా ఖర్చులు మార్క్ఫెడ్ శాఖ భరించేది. కాగా ఇటీవల ప్రభుత్వం రవాణా సౌకర్యాన్ని రద్దు చేసినట్లు జీఓ విడుదల చేసింది. ఇక నుంచి దూరాన్ని బట్టి చార్జీలు అమలవుతాయి. – గోవింద్నాయక్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి ● -
రైతుకు వాత!
మహబూబ్నగర్ఎరువుల మోత.. సోమవారం శ్రీ 24 శ్రీ ఆగస్టు శ్రీ 2026మహబూబ్నగర్ (వ్యవసాయం): మహబూబ్నగర్ (వ్యవసాయం): ఆలస్యమైనా వానాకాలం సాగు ఊపందుకుంది. వర్షాలు కురుస్తుండటంతో రైతులు పంటల సాగులో నిమగ్నమయ్యారు. అయితే ఎల్నినో ప్రభావంతో వర్షాల తీరు, ఉష్ణోగ్రతల్లో మార్పులు సాగుపై ప్రభావం చూపుతుండగా.. మరోవైపు పెరిగిన ఎరువుల ధరలు రైతులకు అదనపు భారంగా మారాయి. కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరగడంతోపాటు యూరియా రవాణా చార్జీలను కూడా రైతులపైనే మోపడంతో ఎకరా సాగు పెట్టుబడి పెరుగుతోంది. జిల్లాలో ఈ వానాకాలంలో 4,05,236 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇప్పటివరకు 2,39,794 ఎకరాల్లో సాగు ప్రారంభమైంది. ప్రధానంగా వరి, పత్తి సాగు ఎక్కువగా ఉంది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 2.40 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 1,13,119 ఎకరాల్లో నాట్లు పూర్తయ్యాయి. పత్తి లక్ష్యం 95 వేల ఎకరాలు కాగా 88,500 ఎకరాల్లో సాగైంది. కంది మాత్రం అంచనాను మించి 13,923 ఎకరాల్లో సాగైంది. యూరియా రవాణా చార్జీలు రైతులపైనే బస్తాపై రూ.50 వరకు అదనపు భారం కాంప్లెక్స్ ఎరువుల బస్తాపై ఏకంగా రూ.700 పెంపు జిల్లాకు 1.25 లక్షల టన్నుల ఎరువులు అవసరం ఎల్నినో ప్రభావంతో ఆలస్యంగా మొదలైన వరి నాట్లు ఎల్నినో ప్రభావంతో వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోతే వరి సాగుపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే నాట్లు వేసిన పొలాల్లో అవసరానికి మించి నీరు వినియోగించకుండా క్రమబద్ధీకరించాలి. వర్షపు నీటిని పొలాల్లో నిల్వ చేసుకోవడం, తేమను సంరక్షించడం, ప్రత్యామ్నాయ నీటి వనరులను సిద్ధంగా ఉంచుకోవడం ద్వారా పంటలను కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. -
కేంద్రంలో నిరంకుశ పాలన: సీపీఎం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: దేశంలో నరేంద్రమోడీ ప్రభుత్వం నిరంకుశ పాలన సాగిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు టి.సాగర్ విమర్శించారు. జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న రాజకీయ శిక్షణ తరగతుల్లో ఆదివారం ఆయన మాట్లాడారు. అయోధ్యలో రాంమందిర్ పేరుతో రూ.కోట్లలో స్కామ్ జరిగినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎస్ఐఆర్ పేరుతో ప్రతిపక్షాల ఓట్లను తొలగించేందుకు యత్నిస్తోందన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక యువతను మోసం చేసిందన్నారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.రాములు మాట్లాడుతూ గ్రామస్థాయిలో వచ్చిన ప్రజా సమస్యల పరిష్కారానికి తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో నల్లవెల్లి కురుమూర్తి, చంద్రకాంత్, దీప్లానాయక్, వేణు, పద్మ, రాజ్కుమార్, ప్రశాంత్ పాల్గొన్నారు. -
చదువుతోనే ఉన్నత శిఖరాలు
● విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: బాసర ట్రిపుల్ ఐటీ వీసీ గోవర్ధన్ ● కష్టపడి చదివితే అద్భుత భవిష్యత్.. స్మార్ట్ఫోన్కు దూరంగా ఉండాలని సూచన మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులను నాణ్యమైన విద్యతో పాటు క్రమశిక్షణ, నైపుణ్యాలతో ఉన్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని బాసర ట్రిపుల్ఐటీ వైస్ చాన్స్లర్ గోవర్ధన్ అన్నారు. కష్టపడి చదివి, తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుంచుకుని క్రమశిక్షణతో ముందుకు సాగితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని సూచించారు. మహబూబ్నగర్ బీకేరెడ్డి కాలనీలోని ట్రిపుల్ఐటీ కొత్త క్యాంపస్లో మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం నిర్వహించిన పేరెంట్స్–స్టూడెంట్స్ ఇంటరాక్షన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల చదువుపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వారి నడవడికను ఎప్పటికప్పుడు గమనించాలని వీసీ సూచించారు. ముఖ్యంగా స్మార్ట్ఫోన్ వినియోగంతో విలువైన సమయం వృథా కాకుండా జాగ్రత్తపడాలని చెప్పారు. అవసరమైతే విద్యార్థులకు స్మార్ట్ఫోన్లకు బదులుగా కీప్యాడ్ ఫోన్లు ఇవ్వడం ద్వారా వారి యోగక్షేమాలను తెలుసుకోవచ్చన్నారు. దేశంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో బాసర ట్రిపుల్ఐటీ ఒకటని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహంతో మరో ఐదు ప్రాంతాల్లో బ్రాంచ్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మహబూబ్నగర్ క్యాంపస్లో గతేడాది 200 మంది విద్యార్థులతో బోధన ప్రారంభించగా.. ఈ ఏడాది మరో 200 మంది విద్యార్థులకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. ట్రిపుల్ ఐటీలో ప్రవేశం కోసం 33 వేల మంది విద్యార్థులు పోటీ పడగా.. కేవలం 1,800 మందికి మాత్రమే అవకాశం లభించిందని తెలిపారు. దీనిని బట్టి సంస్థకు ఉన్న ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చన్నారు. విద్యార్థులకు అందిస్తున్న వసతి, భోజనం, విద్యాబోధన విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి అపోహలకు గురికావాల్సిన అవసరం లేదని, అన్ని అంశాల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులు తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి బాధ్యతగా మెలగాలని, క్రమశిక్షణతో చదువుపై దృష్టి సారించాలని సూచించారు. ట్రిపుల్ఐటీ పరిపాలన అధికారి మురళీదర్శన్ మాట్లాడుతూ.. పోటీ ప్రపంచంలో రాణించాలంటే విద్యార్థులు చురుకుగా ఆలోచించే సామర్థ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. స్పష్టమైన లక్ష్యంతో, ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రవణ్కుమార్, విశిష్ట అతిథి విఠట్, సైకాలజిస్టు శ్రీనివాస్, అధ్యాపకులు పసునూరి రవీందర్, తదితరులు పాల్గొన్నారు. -
‘సోలార్’తో ఆర్టీసీకి ఆదా
మహబూబ్నగర్ రీజియన్ పరిధిలో 8 చోట్ల ప్లాంట్లు రీజియన్ పరిధిలో ఒకప్పుడు విద్యుత్ బిల్లుల చెల్లింపునకు ఎక్కువగా వెచ్చించాల్సి వచ్చేది. దీనిని అధిగమించడానికి రాష్ట్ర ఉన్నతాధికారులు ఏడేళ్ల క్రితమే ఆయా బస్టాండ్లు, డిపోలలో సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయించారు. ట్రాన్స్కో కంటే సోలార్కు తక్కువ విద్యుత్ చార్జీలు ఉండటమే గాక నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. అప్పటి నుంచి ఆర్టీసీ సంస్థకు బాగానే కలిసొచ్చింది. – సంతోష్కుమార్, ఆర్ఎం, టీజీఎస్ఆర్టీసీ, మహబూబ్నగర్ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: సోలార్ పవర్ ప్లాంట్లతో టీజీఎస్ఆర్టీసీ మహబూబ్నగర్ రీజియన్ ఏడేళ్లుగా ఎంతో ఆదా పొందుతోంది. ట్రాన్స్కో కంటే సోలార్ విద్యుత్ చార్జీలు తక్కువగా ఉండటంతో ప్రతినెలా సంస్థకు భారం తగ్గింది. 2019 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఎస్ రెడ్కో) ఆధ్వరంలో ఎనిమిది చోట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. గద్వాల డిపో, బస్టాండులో 44 కిలోవాట్లు, నారాయణపేటలో 40 (25+15) కిలోవాట్లు, కొల్లాపూర్లో 30 (20+10), మహబూబ్నగర్లో 30 (20+10), వనపర్తిలో 25 (15+10) కిలోవాట్లు, నాగర్కర్నూల్లో 20 , షాద్నగర్లో 20 (10+10), కల్వకుర్తిలో 15 కిలోవాట్లు సామర్థ్యం కలిగినవి ఉన్నాయి. ఎక్కడికక్కడ సూర్యరశ్మి బాగానే పడేందుకు వీలుగా ఆయా బస్టాండ్లు, అలాగే డిపో గ్యారేజీలపైన పలకలను ఏర్పాటు చేశారు. అనంతరం ఉత్పత్తి అయ్యే విద్యుత్ను మెయిన్ గ్రిడ్కు అనుసంధానం చేశారు. ఏ రోజుకారోజు ఎన్ని యూనిట్లు ఉత్పత్తి అవుతుందో.. ఎంత వాడుకుంటున్నారనేది తెలియడానికి టు వే మీటర్లను ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ బాధ్యతలను కార్వీ సంస్థకు అప్పగించారు. ఈ ప్లాంట్లు 25 ఏళ్ల పాటు కొనసాగేందుకు అప్పట్లోనే ఆర్టీసీ అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక మహబూబ్నగర్ బస్టాండు పైన ఉన్న సోలార్ పవర్ ప్లాంటు ద్వారా ప్రతి రోజూ 50 నుంచి 80 యూనిట్ల వరకు విద్యుదుత్పత్తి అవుతోంది. అలాగే డిపో గ్యారేజీపైన ఉన్న ప్లాంటు ద్వారా 80 నుంచి 150 యూనిట్ల వరకు విద్యుదుత్పత్తి అవుతోంది. 10 నుంచి 44 కిలోవాట్ల వరకు సామర్థ్యం 2019లోనే కేంద్ర ప్రభుత్వం, రెడ్కో సౌజన్యంతో ఏర్పాటు అప్పట్లోనే విద్యుదుత్పత్తి గ్రిడ్కు అనుసంధానం ప్రతినెలా సంస్థకు విద్యుత్ బిల్లులలో రాయితీ వస్తున్న వైనం -
గణేష్ ఉత్సవాలను వైభవంగా నిర్వహించుకుందాం
స్టేషన్ మహబూబ్నగర్: గణేష్ ఉత్సవాలను ఆధ్యాత్మికత ఉట్టిపడేలా వైభవంగా నిర్వహించుకుందామని గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు అన్నారు. జిల్లాకేంద్రంలోని గణేష్ భవన్లో ఆదివారం సమితి అధ్యక్షుడు మద్ది యాదిరెడ్డి ఆధ్వర్యంలో వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. వచ్చేనెల 14వ తేదీన వినాయక చవితి ప్రతిష్టాపన కార్యక్రమాల గురించి చర్చించారు. తొమ్మిది రోజుల పాటు వినాయక ఉత్సవాలు ఉంటాయన్నారు. నిమజ్జనం రోజు వినాయకుల ఊరేగింపుతో వచ్చే నెల 23వ తేదీన రాత్రి 8 గంటలకు గడియారం చౌరస్తా వరకు చేరుకోవాలని సూచించారు. దీంతో ప్రజలు శోభాయాత్రను తిలకించడానికి అవకాశం లభిస్తుందన్నారు. సమావేశంలో సమితి గౌరవాధ్యక్షుడు మనోహర్రెడ్డి, కార్యదర్శి బాలయ్య, సహాయ కార్యదర్శి లక్ష్మణ్, విశ్వహిందూ పరిషత్ నగర అధ్యక్షుడు రెబ్బ విఘ్నేష్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, రాములు, మాల్యాద్రిరెడ్డి, సురేందర్రెడ్డి, అంజయ్య, సుదర్శన్, హనుమంతు, శ్రీధర్, శ్రీశైలం, నిరంజన్ పాల్గొన్నారు. -
ప్రతిభ వెలికితీతకు.. రంగం సిద్ధం!
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాలో 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) క్రీడా పోటీలకు రంగం సిద్ధమవుతోంది. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి అండర్–14, అండర్–17 బాల, బాలికల విభాగాల్లో మండల, జిల్లా, ఉమ్మడి జిల్లా స్థాయిల్లో పోటీలు నిర్వహించనున్నారు. మండలస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రతిభావంతులైన క్రీడాకారులను ఎంపిక చేయనున్నారు. వచ్చేనెల 10లోపు మండలాల్లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, క్రికెట్ తదితర క్రీడల్లో టోర్నీ కమ్ సెలక్షన్స్ నిర్వహించనున్నారు. ఈ నెల 20లోపు జిల్లాస్థాయి పోటీలు పూర్తి చేసి.. అనంతరం ఉమ్మడి జిల్లా (జోనల్) స్థాయి ఎంపికలు చేపట్టనున్నారు. ఉమ్మడి జిల్లా స్థాయిలో ఎంపికయ్యే క్రీడాకారులు రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ పోటీల్లో పాల్గొంటారు. జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ పోటీల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేలా కృషి చేయాలని డీఈఓ విజయకుమారి పీడీలు, పీఈటీలకు సూచించారు. శనివారం నగరంలోని ఇండోర్ స్టేడియంలో జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ, జెడ్పీ, కేజీబీవీ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. క్రీడాకారుల ఎంపికలను పారదర్శకంగా నిర్వహించాలని, విద్యార్థుల్లో క్రమశిక్షణ పెంపొందిస్తూ నాణ్యమైన శిక్షణ అందించాలని డీఈఓ సూచించారు. అనంతరం నూతన జిల్లా ఎస్జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమితులైన వేణుగోపాల్ను సన్మానించారు. సమావేశంలో డీవైఎస్ఓ రాజశేఖర్రెడ్డి, ఎంఈఓ లక్ష్మణ్నాయక్ తదితరులు పాల్గొన్నారు. వచ్చేనెల 10లోపు మండలస్థాయి టోర్నీ కమ్ సెలక్షన్స్ 20లోగాజిల్లాస్థాయి పోటీలు.. ఆపై ఉమ్మడి జిల్లా ఎంపికలు ఎస్జీఎఫ్లో జిల్లా అగ్రస్థానమే లక్ష్యం: డీఈఓ విజయకుమారి -
పనితీరు మార్చుకోవాల్సిందే..
పాలమూరు: ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అధికారులు పనితీరు మార్చుకోవాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూగుప్తా ఆదేశించారు. గతంలో జరిగిన హెచ్డీఎస్ సమావేశంలో తీర్మానించిన పనులు ఎందుకు పూర్తి చేయలేదని జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంగా ఆజ్మీరాతో పాటు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం జిల్లా జనరల్ ఆస్పత్రిలో నిర్వహించిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ (హెచ్డీఎస్) సమావేశంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి సమక్షంలో కలెక్టర్ సమీక్షించారు. రోగుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన 16 గదులను ఇప్పటివరకు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. నేటి నుంచే వాటిని రోగులకు కేటాయించి, వివరాలు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతిరోజూ గదుల కేటాయింపు వివరాలను ఫొటోలతో వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయాలని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్యుల సమయపాలనపై కలెక్టర్ ఆరా తీశారు. సాయంత్రం 5 గంటల వరకు వైద్యులు అందుబాటులో ఉంటారని సూపరింటెండెంట్ చెప్పగా.. ఆ తర్వాత అత్యవసర రోగులకు ఎలా వైద్యం అందిస్తారని ప్రశ్నించారు. ఎంసీహెచ్ భవనంలో ల్యాబ్ లేకపోవడంతో గర్భిణీలు శాంపిల్స్ తీసుకుని టీ–హాబ్ వరకు వెళ్లాల్సి వస్తోందని హెచ్డీఎస్ సభ్యులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎంసీహెచ్ భవనంలో 24 గంటలూ ల్యాబ్ సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆస్పత్రిలో ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో వైద్యులపై పని భారం పెరుగుతోందని డాక్టర్ సునీల్ తెలిపారు. ఖాళీల భర్తీ కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారా అని కలెక్టర్ సూపరింటెండెంట్ను ప్రశ్నించారు. ఆస్పత్రి అంతర్గత రోడ్ల మరమ్మతులు, ట్రాలీలు, వీల్చైర్లు, లేబర్ టేబుల్స్ తదితర సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ నిధులతో అవసరమైన పరికరాల జాబితా సిద్ధం చేసి రెండు రోజుల్లో ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఐసీయూకు కార్డియాక్ మానిటర్లు అవసరమని వైద్యులు తెలిపారు. సమావేశంలో ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాసులు, ఆర్ఎంఓ డాక్టర్ శిరీష, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు, వివిధ విభాగాల హెచ్ఓడీలు పాల్గొన్నారు. రూ.32 లక్షల పరికరాలు ప్రారంభం విర్చో పెట్రో కెమికల్స్ కంపెనీ ఫౌండేషన్ సహకారంతో ఎంసీహెచ్ భవనంలోని గైనిక్ విభాగానికి రూ.32 లక్షల విలువైన అల్ట్రాసౌండ్ స్కానర్, ఫొటోథెరపీ యూనిట్లు, ఆర్థో విభాగానికి సీ–ఆర్మ్ ఆర్థోపెడిక్ ఆపరేషన్ యంత్రం, సర్జికల్ డ్రిల్ తదితర ఏడు రకాల వైద్య పరికరాలను సమకూర్చారు. వీటిని శనివారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, కలెక్టర్ ఖుష్బూ గుప్తా ప్రారంభించారు. జనరల్ ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి హెచ్డీఎస్ సమావేశంలో కలెక్టర్ ఖుష్బూగుప్తా ఆదేశాలు 16 ప్రత్యేక గదులను నేటి నుంచే రోగులకు కేటాయించాలి ఎంసీహెచ్లో 24 గంటల ల్యాబ్ అందుబాటులో ఉండాలి హాజరైన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి -
ప్రతి ఇంట్లో ఇది భాగమే..
మా ఊరిలో జరిగే ప్రతి పెళ్లిలో ఈ చెట్టు పాత్ర ఉంటుంది. పందిరి వేసేందుకు ఆకులు మొదలుకొని ప్రత్యేక పూజలు చేసే వరకు ఈ చెట్టుపై ఆధారపడతాం. ఇది నా చిన్నతనం నుంచి మా గ్రామంలో అనాదిగా వస్తున్న ఆచారం. అలాంటి చెట్టు కింద మా జీవితమంతా గడిచింది. ఇంతటి ప్రాధాన్యత గల చెట్టును కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటే వినాశ కాలమే. – కుర్వ చిన్న రాముడు, పెద్దతాండ్రపాడు ఎవరికీ రాసివ్వలేదు.. చెట్టుకు సంబంధించి మా పెద్దలు ప్రస్తుతం కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వారికి పత్రం రాసిచ్చారని చెబుతున్నారు. అలాంటిదేమి జరగలేదు. చెట్టు పరిసర ప్రాంతాల్లో మా పెద్దలు ఉండేవారు. ప్రస్తుతం ఉంటున్న వారు మా పెద్దలు రాసిచ్చారని చెబుతూ కొంత ఆక్రమించగా.. మరికొంత ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే విషయం నేను గ్రామసభలో కూడా చెప్పాను. – మీసాల లక్ష్మన్న, పెద్దతాండ్రపాడు కేసులు నమోదు చేస్తాం.. ఎంతో చరిత్ర ఉన్న రావిచెట్టు గురించి మాకు గ్రామస్తుల వినతిపత్రాల ద్వారా తెలిసింది. దీని కోసం గ్రామంలో విచారణ చేపట్టాం. ప్రకృతిలో భాగమైన చెట్టును నాశనం చేస్తే సహించేది లేదు. ఈ విషయంలో నిబంధనలు అతిక్రమించి చెట్టును నరికినా.. కబ్జా చేసేందుకు ప్రయత్నించినా కేసులు నమోదు చేస్తాం. – పర్వేజ్ అహ్మద్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, జోగుళాంబ గద్వాల -
రూ.52 కోట్ల ధాన్యం మాయం
● రెండు రైస్మిల్లుల్లో 3.51 లక్షల బస్తాల వ్యత్యాసం ● బాయిలర్ మిల్లులో రూ.31 కోట్లు.. రా రైస్మిల్లులో రూ.21 కోట్లు ఖిల్లాఘనపురం: మండలంలోని హన్పాడ్ శివారులోని శ్రీలక్ష్మీ వేంకటేశ్వర బాయిలర్ రైస్మిల్, శ్రీలక్ష్మీ వేంకటేశ్వర రా రైస్మిల్లులో రూ.52 కోట్ల విలువైన ధాన్యం వ్యత్యాసం గుర్తించినట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ డీఎం ఆంజనేయులు తెలిపారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ బృందం, జిల్లా అధికారులు శుక్రవారం అర్ధరాత్రి వరకు తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వం వివిధ సీజన్లలో రెండు మిల్లులకు కేటాయించిన ధాన్యం పక్కదారి పట్టినట్లు సమాచారం అందడంతో తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. బాయిలర్ రైస్మిల్లులో 1,49,198 బస్తాలు, విలువ రూ.31 కోట్లు, రా రైస్మిల్లులో 2,01,985 బస్తాలు, విలువ రూ.21 కోట్ల మేర వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. రెండు మిల్లుల్లో కలిపి 3,51,183 బస్తాల ధాన్యం లెక్కల్లో తేడా ఉన్నట్లు తెలిపారు. మిల్లుల యజమానురాలు ఎస్.శ్రీదేవిపై శనివారం ఖిల్లాఘనపురం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ● వనపర్తి రూరల్ మండలం పెద్దగూడెం శివారు లోని భాగ్యలక్ష్మి ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్మిల్లులో 1,03,722 బస్తాల ధాన్యం తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీని విలువ రూ.14 కోట్లకుపైగా ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించారు. మిల్లు యజమానురాలు దీపికారెడ్డిపై వనపర్తి రూరల్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. -
50 ఏళ్ల వయసులో బైక్పై సాహస యాత్ర
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): మహబూబ్నగర్కు చెందిన డా.మంజుల (డా.కృష్ణ సతీమణి) 50 ఏళ్ల వయసులో బైక్పై అత్యంత సాహసోపేతమైన లేహ్–లడఖ్ యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో పాటు బంగీ జంప్ సాహసం చేసి అరుదైన ఘనత సాధించారు. తెలంగాణ, ఏపీలో ఈ మార్గంలో బైక్పై ప్రయాణించిన తొలి మహిళగా ఆమె ఘనత సాధించారు. చిన్ననాటి నుంచే బైక్పై లేహ్–లడఖ్కు వెళ్లాలనే కలను కలిగిన ఆమె పట్టుదలతో ఆ కలను సాకారం చేసుకున్నారు. ఈమె గద్వాల్లో పుట్టి, విద్యాభ్యాసమంతా అక్కడే సాగింది. ఉద్యోగ జీవితాన్ని జిల్లా కేంద్రంలో కొనసాగిస్తున్నారు. మంజుల చేపట్టిన యాత్రలో లేహ్ లోకల్ –మ్యాగ్నెటిక్ హిల్ – హాల్ ఆఫ్ ఫేమ్ – ఖర్దుంగ్ లా – నుబ్రా – తుర్తుక్ – థాంగ్ (భారత్లోని చివరి గ్రామం) – నుబ్రా – వారిలా – చాంగ్ లా – పాంగాంగ్ సరస్సు – లేహ్ వంటి అత్యంత క్లిష్టమైన ప్రాంతాలు ఉన్నాయి. ఎత్తైన పర్వత మార్గాలు, తీవ్రమైన చలి, కఠినమైన రహదారులు వంటి ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ సాహస యాత్రను పూర్తి చేశారు. రాయల్ ఎన్న్ఫీల్డ్ సంస్థ అధికారికంగా మంజుల సాధించిన ఈ ఘనతను ధృవీకరించి, ఈ మార్గంలో బైక్పై ప్రయాణించిన తొలి మహిళగా గుర్తింపు పొందినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంజుల మాట్లాడుతూ కుటుంబం అందించిన ప్రోత్సాహం, సహకారం వల్లే తన కలను నిజం చేసుకోగలిగానన్నారు. -
ట్రిపుల్ ఐటీకి.. భవనం కష్టాలు!
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలో గతేడాది ప్రారంభమైన బాసర ట్రిపుల్ ఐటీకి సొంత భవనం లేకపోవడంతో విద్యార్థులకు వసతి, తరగతుల నిర్వహణ కష్టంగా మారింది. గతేడాది బండమీదిపల్లిలోని రెడ్డి హాస్టల్లో తరగతులు, వసతి ఏర్పాటు చేయగా.. ఈ ఏడాది రెండో బ్యాచ్ విద్యార్థులు చేరడంతో వారికి బీకేరెడ్డి కాలనీలోని మరో భవనాన్ని కేటాయించారు. దీంతో ఏటా వేర్వేరు భవనాల్లో కళాశాల నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. ట్రిపుల్ ఐటీ శాశ్వత భవన నిర్మాణం కోసం జడ్చర్ల సమీపంలో 43 ఎకరాల స్థలాన్ని కేటాయించి గతేడాది శంకుస్థాపన చేశారు. తొలివిడతలో రూ.200 కోట్లు కేటాయించాల్సి ఉన్నా.. ఇప్పటివరకు నిధులు విడుదల కాకపోవడంతో నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. దీంతో రెండు బ్యాచ్ల విద్యార్థులకు వేర్వేరు భవనాలు, ల్యాబ్లు, హాస్టళ్లు, మెస్లు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం పీయూసీ–1లో 200 మంది, పీయూసీ–2లో 203 మంది విద్యార్థులు చదువుతున్నారు. రెండు బ్యాచ్లకు వేర్వేరుగా వసతులు కల్పించాల్సి రావడంతో యాజమాన్యంపై అదనపు భారం పడుతోంది. సొంత భవనం నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. కొత్త భవనంలోనే తరగతులు ఈ ఏడాది చేరిన పీయూసీ–1 విద్యార్థులకు బీకేరెడ్డి కాలనీలో ఏర్పాటు చేసిన కొత్త భవనంలో తరగతులు ప్రారంభం కానున్నాయని సీనియర్ అధ్యాపకులు శ్రవణ్కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా ఆదివారం నుంచి పేరెంట్స్–స్టూడెంట్స్ ఇంటరాక్షన్ ప్రోగ్రాం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బాసర ట్రిపుల్ఐటీ వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్తో పాటు అధికారులు పాల్గొంటారని తెలిపారు. ప్రస్తుతం కళాశాలలో రెండు మెస్లు, రెండు ల్యాబ్లతో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. సొంత భవనం లేక.. ఏటా కొత్త భవనాల్లో తరగతులు గతేడాది రెడ్డి హాస్టల్.. ఈసారి బీకేరెడ్డి కాలనీలో తరగతులు, వసతి నేటి నుంచి రెండో బ్యాచ్కు పేరెంట్స్–స్టూడెంట్స్ ఇంటరాక్షన్ ప్రోగ్రాం -
ప్రత్యేక లోక్ అదాలత్లో 14 కేసులు పరిష్కారం
పాలమూరు: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం కోర్టులో యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు సంబంధించిన కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించారు. ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఈశ్వరయ్య, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి, అదనపు అసిస్టెంట్ సెషన్స్ న్యాయమూర్తి శశిబాబు కలిసి ప్రత్యేక బెంచ్ ద్వారా లోక్ అదాలత్ నిర్వహించారు. దీంట్లో మొత్తం 225 కేసులు బెంచ్పైకి రాగా 14 కేసులు పరిష్కరించారు. ఈ కేసుల్లో రూ.2,03,830లను బాధితులకు అందించారు. రాజీమార్గంలో త్వరితగతిన కేసులు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉందని న్యాయమూర్తి చెప్పారు. ఇరుపక్షాలకు సమయం, డబ్బు రెండు పూర్తిగా ఆదా అవుతాయన్నారు. రేపటినుంచి ఆటోల బంద్ జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): తమ న్యాయమైన డిమాండ్లు సాధించుకునేందుకు సోమవారం నుంచి చేపట్టే ఆటోవాలాల నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలని జేఏసీ నా యకులు కోరారు. ఈ మేరకు శనివారం ఆటో సంఘాల జేఏసీ, సెంట్రల్ ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో నగరంలో ఆటోలతో ర్యాలీ తీసి.. తెలంగాణ చౌరస్తా వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు శ్రీనివాసులు, కురుమూర్తి, వెంకటేష్, సురేష్, బాబుమియ్యా మాట్లాడుతూ ఆటోలపై ఆధారపడి వేలాది మంది ఉపాధి పొందుతున్నారని చెప్పారు. కానీ, ఆటోవాలాల పొట్ట కొట్టేలా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ద్వారా ఈవీ ఆటోలను కొనుగోలు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించాలని, ఏడాదికి ఆటో డ్రైవర్లకు ఇస్తామన్న రూ.12 వేలు ఇవ్వాలని, ఓలా, ఉబర్ ర్యాపిడోలను ఉపసంహరించి.. ప్రభుత్వమే ఒక కొత్త యాప్ను ఏర్పాటు చేయాలని, ఆటోలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలుచేయాలని తదితర డిమాండ్లతో సోమవారం నుంచి నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు వివరించారు. బైలాస్ ప్రకారమే.. క్రీడా సంఘాల ఎన్నికలు మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాలో ఎన్నికలు నిర్వహించని క్రీడా సంఘాలు బైలాస్ ప్రకారం ఎన్నికలు పూర్తి చేసుకోవాలని ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్పీ వెంకటేశ్ సూచించారు. శనివారం ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 20 క్రీడా సంఘాలు ఉండగా.. ఐదారు మాత్రమే చురుగ్గా ఉన్నాయని తెలిపారు. ఎన్నికలు నిర్వహించని సంఘాలు వచ్చే నెల 25లోపు ఎన్నికలు పూర్తి చేసి, సంబంధిత పత్రాలను ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం, జిల్లా యువజన, క్రీడల శాఖకు అందజేయాలన్నారు. సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్తో పాటు రాష్ట్ర అసోసియేషన్ అఫిలియేషన్ పత్రాలు సమర్పించాలని సూచించారు. తెలంగాణ ఒలింపిక్ సంఘం అఫిలియేషన్ ఉన్న సంఘాలకే స్పోర్ట్స్ అథారిటీ నుంచి ఆర్థిక సహకారం, మైదానాల్లో క్రీడల నిర్వహణకు అనుమతులు లభిస్తాయని స్పష్టం చేశారు. సమావేశంలో ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్, కోశాధికారి ఉమామహేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. -
ఎన్హెచ్ఎం నిధులు విడుదల
పాలమూరు: జిల్లాలో ఆరేళ్లుగా నిలిచిపోయిన పనులకు ప్రస్తుతం మోక్షం కలిగింది. బడ్జెట్ లేమితో కాంట్రాక్టర్లు నిర్మాణ పనులు వదిలేయగా సబ్ సెంటర్ల భవనాలు నిరుపయోగంగా మారి.. వైద్యసేవలకు ఆటంకంగా మారింది. దీంతో పెండింగ్లో ఉ న్న సబ్ సెంటర్లను పూర్తి చేసి ప్రజలుకు అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభు త్వం ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా జిల్లాకు ఎన్హెచ్ఎం నిధులు రూ.2.40 కోట్లు మంజూరయ్యాయి. జిల్లా ఆరోగ్య శాఖ పరిధిలో మొత్తం 24 సబ్ సెంటర్లు అసంపూర్తిగా మిగిలిపోగా.. ప్రస్తు తం విడుదలైన నిధులతో ఆయా భవనాలు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనిపై డీఎంహెచ్ఓ శ్రీనివాసులును వివరణ కోరగా ప్రస్తుతం జిల్లాకు వచ్చిన బడ్జెట్తో పెండింగ్లో ఉన్న సబ్ సెంటర్ల పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ మేరకు జిల్లాలో అమిస్తాపూర్, తాటిపర్తి, అన్నాసాగర్ సబ్ సెంటర్లను శనివారం పరిశీలించామని పేర్కొన్నారు. -
పండుగలు శాంతియుతంగా జరుపుకోవాలి
మహబూబ్నగర్ క్రైం: రాబోయే అన్ని రకాల పండుగలను ప్రజలు ఐక్యంగా, సామరస్య పూర్వకంగా శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ జానకి అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. గతంలో అన్ని వర్గాలకు పోలీస్ శాఖకు అందించిన సహకారమే రాబోయే పండగల సమయంలోనూ అందించాలని కోరారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్, రెచ్చగొట్టే పోస్టులు వైరల్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పిల్లలను సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అన్నారు. పండుగలకు డీజే, అధిక శబ్దంతో కూడిన సౌండ్సిస్టంలను నిబంధనలకు విరుద్ధంగా వినియోగించకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. అధిక శబ్దం వల్ల గుండె సమస్య రోగులకు, చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. సమావేశంలో ఏఎస్పీ ఎన్బీ రత్నం, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, సీఐలు అప్పయ్య, ఇజాజుద్దీన్, కమలాకర్ ఆర్ఐ కృష్ణయ్య, వీహెచ్పీ అధ్యక్షుడు యాదిరెడ్డి, ఎంఐఎం అధ్యక్షుడు హాది తదితరులు పాల్గొన్నారు. -
ఆస్పత్రి సమస్యలు పరిష్కరించాలి
అలంపూర్: వంద పడకల ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణజ్యోతి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆస్పత్రిని ఆమె సందర్శించి చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు మాట్లాడుతూ.. ఆస్పత్రికి నియోజకవర్గంలోని నలుమూల నుంచి ప్రజలు వస్తున్నారని.. కానీ సరైన వైద్యం అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. జనరల్ ఫిజీషియన్, కంటి వైద్యులు, స్టాఫ్నర్స్ కొరత ఉందన్నారు. రోగులకు సరిపడా మందులు సైతం అందుబాటులో లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే వైద్యులు, సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి నర్మద మాట్లాడుతూ.. ఆస్పత్రుల్లో ప్రభుత్వ తనిఖీలు తరచుగా ఉండాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆస్పత్రులను సందర్శించి ఇబ్బందులు తెలుసుకోవాలన్నారు. ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఏమేలమ్మ, జిల్లా కమిటీ సభ్యులు మదనమ్మ, పద్మ, రాణి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. రోడ్డుప్రమాదంలో ముగ్గురికి గాయాలు ఖిల్లాఘనపురం: ఎదురెదురుగా వస్తున్న ఆటో, మోట ర్ సైకిల్ ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలైన ఘటన ఖిల్లాఘనపురం గ్రామశివారులో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. ఆగారం గ్రామానికి చెందిన ఎర్రప్ప, కర్రెన్న బైక్పై ఖిల్లాఘనపురం నుంచి గ్రామానికి వెళ్తున్నారు. అదే గ్రామానికి చెందిన సాయికృష్ణ, ధనుష్, కృష్ణయ్య, చిట్టెమ్మ ఆటోలో ఆగారం నుంచి ఖిల్లాఘనపురం వస్తున్నారు. ఖిల్లాఘనపురం శివారులోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ప్రమాదవశాత్తు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో మోట్సైకిల్పై వెళ్తున్న ఎర్రప్ప, కర్రెన్నకు కాళ్లువిరిగిపోగా.. ఆటోలో ఉన్న ధనుష్కు తీవ్రరక్తగాయాలయ్యాయి. గ్రామస్తులు గమనించి వెంటనే ఖిల్లాఘనపురం ఆస్పత్రికి తరలించారు. చికిత్సలు నిర్వహించిన డాక్టర్ సందీప్ మెరుగైన వైద్యం కోసం మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
ఎస్సార్నగర్లో కర్ణాటక మద్యం పట్టివేత
అమీర్పేట: ఎస్ఆర్నగర్లో రూ.1.50 లక్షలు విలువ చేసే కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రీమియం మద్యంను ఎకై ్సజ్ పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అమీర్పేట ఎకై ్సజ్ పోలీసులు ఎస్ఆర్నగర్ ఉమేష్ చంద్ర విగ్రహం చౌరస్తాలో అనుమానాస్పదంగా కనిపించిన కె.గోవర్ధన్రెడ్డి (46) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. తనిఖీ చేయగా అతడి వద్ద కర్ణాటకకు చెందిన 4 ప్రీమియం మద్యం బాటిళ్లు ఉన్న ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. విచారణ అనంతరం మీర్పేటలోని అతడి ఇంట్లో సోదాలు నిర్వహించి మరో 55 మద్యం బాటిళ్లు సీజ్ చేశారు. వివిధ రకాల బ్రాండ్ల కర్ణాటక ప్రీమియం మద్యంతో పాటు డిఫెన్స్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రం నుంచి డిఫెన్స్ మద్యం బాటిళ్లను తక్కువ ధరకు తెచ్చి రూ.300 నుంచి రూ.500 లాభానికి నగరంలో అమ్ముతున్నట్లు విచారణలో వెల్లడించాడు. గోవర్ధన్రెడ్డి స్వగ్రామం వనపర్తి కొల్లాపూర్కు చెందిన వాడని, కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ బానోత్ పటేల్ తెలిపారు. తనిఖీల్లో ఎకై ్సజ్ సిబ్బంది వాణి, రాధా, రవి, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
‘ప్రాణాలు’ దక్కేనా?
‘చిరుతలు’ చిక్కేనా..● గండేడ్ మండలంలో చిరుతల కలకలం ● తరుచూ మూగజీవాలపై దాడి ● బోను ఏర్పాటులో అధికారుల నిర్లక్ష్యం గండేడ్: అటు పొలం పనులు చేసుకోలేక.. ఇటు జీవాలను కాయలేక మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందున్నారు. మన్సూర్పల్లి బొందెగట్టు శివారు ప్రాంతాల్లో ఏడాది కాలంగా చిరుతల సంచారంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. మూగజీవాలతో పాటు తమపై ఎప్పడు దాడి చేస్తాయోనని బెంబేలెత్తిపోతున్నారు. అధికారుల అలసత్యం.. చిరుతల దాడులతో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని ఆవేదన చెందుతున్నారు. ● గత సోమవారం గండేడ్ మండల పరిధిలోని కొండాపూర్ గ్రామానికి చెందిన రైతు పకీరప్ప మేకలు మేపడానికి బొందెగట్టు ప్రాంతానికి వెళ్లాడు. మ ధ్యాహ్నం మేకలు దాహానికి కిందికి వచ్చాడు. తిరిగి పైకి వెళ్లేసరికి గుంపులో మూడు మేకలు కనిపించలేదు. వాటి కోసం వెతక గా కొద్ది దూరంలో చనిపోయి ఉన్నాయి. ఇదే సమయంలో చనిపోయిన మేకను అతని కళ్ల ముందే చి రుత లాక్కెళ్లింది. అటవీ అధికారులకు సమాచా రం అందించాడు. వారు వచ్చి పంచనామా నిర్వహించారు. కానీ చనిపోయిన మేకల కారణంగా అతని దాదాపు రూ. 30 వేలకు పైగా నష్టం వాటిల్లింది. ● కొండాపూర్ గ్రామానికి గొల్ల చిన్న వెంకటయ్య గ్రామ సమీపాన రాజగొండ వద్ద ఉన్న ఇతని పొలంలో పాలకోసం రెండు ఆవులు వ్యవసాయం కోసం రెండు ఎడ్లు పెట్టుకున్నాడు. ఎప్పటిలాగే 15 రోజుల క్రితం మేత మేపిన పశువులను సాయంత్రం పాకలో కట్టెసి ఇంటికి వెళ్లాడు. ఉదయం పొలానికి వెళ్లి చూడగా లేగదూడ కనిపించలేదు. చుట్టుపక్కల వెతకగా చనిపోయింది. చిరుతదాడి చేసి సగం శరీరాన్ని తిని వదిలేసింది. ● ఇలా ఒకటి కాదు రెండు కాదు తరుచు మూగజీవాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. మన్సూర్పల్లి బొందెగట్టు ప్రాంతంలో గత కొంతకాలంగా చిరుతలు తిరుగాడుతూ మూగజీవాలను కబళించడంతో పాటు జనాన్ని బెంబేలు ఎత్తిస్తున్నాయి. దాదాపు ఏడాదిగా ఇవి తిరుగాడుతూ ఉన్న అధికారుల్లో చలనం లేకుండా పోయింది. బోను ఏర్పాటులో నిర్లక్ష్యం? చిరుతలను పట్టుకునేందుకు బోను ఏర్పాటు చేయడంలో అధికారుల అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 23న బొందెగట్టుపై మూడు చిరుతలు కనిపించాయి. మన్సూర్పల్లికి చెందిన రైతు ఏదుల బాలయ్య ఈ విషయాన్ని గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో స్థానికులు వచ్చి వాటిని చూసారు. సెల్ఫోన్లలో సైతం చిత్రీకరించారు. ఫారెస్టు అధికారులకు సమాచారం అందడంతో వారు అదే రోజు సాయంత్రం చిరుత పులులను గమనించారు. స్పష్టంగా చిరుతలు ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచా రం అందించారు. దీంతో ఫారెస్టు డివిజన్ అధికారి గణేష్, ఫారెస్టు రేంజర్, అప్పటి డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రాఘవేందర్, బీట్ ఆఫీసర్ ఉదయేశ్వర్ మరుసటి రోజు చిరుతలు సంచరించే ప్రదేశాన్ని పరిశీలించి అది చిరుతలకు అనువైన ప్రదేశంగా గుర్తించారు. బోను ఏర్పాటుకు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. కానీ దాదాపు ఆరు నెలలు కావస్తున్న ఇప్పటి వరకు బోను ఏర్పాటు చేయడం లేదు. నిబంధనలు అనుమతుల పేర కాలయాపన చేస్తున్నారు. ఈ రోజు రేపంటూ దాటవేస్తున్నారు. గతంలో కూడా.. 2011 సంవత్సరంలో కూడా ఈ ప్రాంతంలో చిరుత సంచరించి పలువురిని భయభ్రాంతులకు గురిచేసుంది. అప్పట్లో పలు గ్రామాలకు చెందిన రైతుల పశువులను చంపితిన్నాయి. బొందెగట్టు ప్రాంతంలో ఏదుల బాలయ్య పొలం వద్ద పట్టెందుకు చిరుతను పట్టెందుకు అప్పటి రేంజర్ లక్ష్మణ్ బోను ఏర్పాటు చేయించారు. మూడు నెలల తరువాత చిరుత బోనుకు చిక్కడంతో దానిని తీసుకెళ్లి జూపార్కు అక్కడి నుంచి శ్రీశైలం రిజర్వ్ ఫారెస్టుకు తరలించారు. తర్వాత ఏడాది నుంచి వాటి సంచారం తిరిగి మొదలైంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి సకాలంలో బోను ఏర్పాటు చేసి చిరుతపులులను పట్టుకొని మూగజీవాలకు, తమకు తగిన రక్షణ కల్పించాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు. -
పెద్దవాగులో ఇసుకాసురులు
● వర్నె వద్ద ఇసుక అక్రమ రవాణా ● రాత్రిళ్లు ట్రాక్టర్లతో డంప్.. టిప్పర్లతో తరలింపు ● పొన్నకల్ వద్ద కూడా ఇదే దందా.. అడ్డాకుల: మండలంలో విస్తరించి ఉన్న పెద్దవాగును అక్రమార్కులు చెరబట్టారు. రాత్రయిందంటే చాలు ఇసుక అక్రమ తవ్వకాలకు తెర తీస్తున్నారు. ట్రాక్టర్ల ద్వారా వాగులోంచి ఇసుకను బయటకు తెచ్చి వాగు పరిసరాల్లోనే డంప్ చేస్తున్నారు. తర్వాత భారీ టిప్పర్లకు ఇసుకను నింపి సొమ్ము చేసుకుంటున్నారు. వర్నె వద్ద ఇటీవల అక్రమ ఇసుక తవ్వకాలు మొదలు పెట్టారు. కొందరు అఽధికార పార్టీ నేతలు రాత్రిపూట యంత్రాలను ఉపయోగించి ఇసుకను ట్రాక్టర్లతో తెచ్చి వాగు సమీసంలోనే నిల్వ చేస్తున్నారు. ఇక్కడ భారీ టిప్పర్లలో ఇసుకను లోడ్ చేస్తున్నారు. మూడురోజుల కిందట పెద్ద ఎత్తున ఇదేరీతిలో ఇసుక అక్రమ రవాణా జరిగింది. తాజాగా గురువారం రాత్రి మరోసారి ఇసుక అక్రమ రవాణాకు పాల్పడ్డారు. పెద్ద టిప్పర్లలో ఇసుకను తరలించినట్లు స్థానిక రైతులు తెలిపారు. డంప్ చేసిన వెంటనే ఇసుక నిల్వలు కనిపించకుండా అదేరాత్రి అక్కడి నుంచి ఇసుకను తరలిస్తుండటంతో దందా పగలు బయటకు కనిపించడంలేదు. ఇక్కడ తవ్వే ఇసుకను వనపర్తి, భూత్పూర్, మహబూబ్నగర్ వంటి ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నారు. ఇదిలా ఉంటే వర్నె, కన్మనూర్, ముత్యాలంపల్లి నుంచి రాత్రిపూట ట్రాక్లర్లతో ఇసుకను ఇతర ప్రాంతాలకు యథేశ్ఛగా తరలిస్తున్నారు. పొన్నకల్ వద్ద ఇదే..! పొన్నకల్ సమీపంలో ఉన్న ఇదేవాగులో ఇటీవల అక్రమార్కులు బరి తెగించారు. రాత్రివేళ ట్రాక్టర్లతో ఇసుకను డంపింగ్ చేయడం.. వెంటనే టిప్పర్లలో ఇసుక నింపి పంపడం చేస్తున్నారు. రాత్రికి వెలిసే డంపులు ఉదయం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇక్కడ రెండువర్గాలకు పొసగక ఇటీవల రెండు ట్రాక్టర్లను కొందరు గ్రామస్తులు పోలీసులకు పట్టించినట్లు తెలిసింది. డంపులు చేయడం.. రాత్రికి రాత్రే దాన్ని లేపేయడం ఇసుక మాఫియాకు ఈజీగా మారింది. ఒరరోజు అక్రమ రవాణాకు పాల్పడితే మరుసటి రోజు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా పెద్దవాగులో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని తెలిసినా అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదే ఆక్రమార్కులకు కూడా కలిసిస్తోంది. గురువారం రాత్రి వర్నె వద్ద వాగు పక్కనే ఇసుకను డంప్ చేసి తరలించింది ఇక్కడే.. -
చీడపీడల నివారణతో అధిక దిగుబడి
అలంపూర్ : పంట సాగులో చీడపీడలను సమర్థవంతంగా నివారిస్తే అధిక దిగుబడి సాధించవచ్చు. వరి సాగులో నారుమడి నుంచే సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే చీడపీడల నివారణకు అవకాశం ఉంటుందని మండల వ్యవసాయ అధికారి నాగార్జున రెడ్డి రైతులకు సూచించారు. వరిలో యాజమాన్య పద్ధతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. విత్తన శుద్ధి : నారుమడి పోసే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. కార్భండిజంను 1 గ్రాము పొడి విత్తన శుద్ధికి 3 గ్రాముల చొప్పున కిలో విత్తనానికి వాడుకోవాలి. తడి విత్తన శుద్ధిలో 1 కిలో విత్తనానికి 1 గ్రాము కార్భండిజంను లీటర్ నీటిలో కలిపి 24 గంటలు నానబెట్టి, 24 గంటలు మండే కట్టి మొలకలను దంపనారు మడిలో చల్లుకోవాలి. విత్తన మోతాదు ఎకరాకు 20 నుంచి 25 కేజీలు సరిపోతుంది. ఎరువుల యాజమాన్యం : ఎకరాకు సరిపడే నారును 5 సెంట్లలో 2 కిలోల నత్రజని (5 కిలోల యూరియా), ఒక కిలో భాస్వరం (6కిలోల ఎస్.ఎస్పీ), ఒక కిలో పొటాషియం (2కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్) ఇచ్చే ఎరువులను నారు వేసే ముందు చివర దమ్ములోనే వేసుకోవాలి. నత్రజని ఇచ్చే ఎరువులను తేలిక నేలల్లో అయితే రెండు సార్లు వేసుకోవచ్చు. ఒక కిలో నత్రజని విత్తనం చల్లే ముందు మరో కిలో విత్తిన 12 నుంచి 14 రోజులకు వేయాలి. 50 కిలోల యూరియాకి 10 కిలోల వేప పిండి లేక 250 కిలోల తేమ కలిగి న మత్తి కలిపి రెండు రోజులు నిల్వ ఉంచి పొలంలో వెదజల్లితే నత్రజని వినియోగం పెరుగుతుంది. పొటాష్ ఎరువులను రేగడి నేలల్లో ఆఖరి దమ్ములో పూర్తిగా ఒకే సారి వేయాలి. తేలిక భూముల్లో ఆఖరి దమ్ములో సగం,అంకురం ఏర్పడే దశలో మిగితా సగాన్ని వేయాలి. కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా దుబ్బులో కాకుండా దమ్ములోనే వేయడం మంచిది. జింకు లోపం లక్షణాలు పై నుంచి 3 లేక 4 ఆకుల్లో మధ్య ఈనే పాలిపోతుంది. నాటిన 2 నుంచి 4 వారాల్లో ముదురాకు చివర్లో, మధ్య ఈనెకు ఇరుపక్కల తుప్పు లేక ఇటుక రంగు మచ్చలు కనిపిస్తాయి. ఆకులు చిన్నవిగా పెలుసుగా ఉండి వంచగానే శబ్ధం చేస్తూ విరిగిపోతాయి. మొక్కలు గిడసబారి దుబ్బు చేయవు. నత్రజని ఎరువులు వేసినప్పటికీ పైరు పచ్చగానే ఉండదు. నివారణ : ప్రతి సీజన్లో ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేట్ వేయాలి. లేదా పైరుపై జింకు లోపం కనిపించగానే లీటరు నీటికి 2 గ్రాముల జింకు సల్ఫేట్ చొప్పున కలిపి 5 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయాలి. భాస్వరం ఎరువుతో జింకు సల్ఫేట్ కలిపి వేయరాదు. కనీసం 3 రోజుల వ్యవధి ఉండాలి. జింకు సల్ఫేట్ ద్రావణంలో పురుగు, తెగుళ్లు, మందులు కలిపి వాడరాదు. బోరు నీటిని వాడుతున్నట్లయితే ప్రతి రెండేళ్లకు ఒక సారి నీటి పరీక్ష చేయించాలి. ఒక వేళ నీటిలో ఉప్పు ఎక్కువగా ఉన్నట్లయితే క్లిష్టమైన దశలో ఈ నీటిని పంటకు ఇవ్వకుండా ఆపివేయాలి. దశ ఎరువు మోతాదు (ఎకరాకు) చివరి దమ్ము యూరియా 35 కిలోలు ఎస్.ఎస్.పీ 150 కిలోలు పొటాష్ 30 కిలోలు దుబ్బు చేసే దశలో యూరియా 35 కిలోలు అంకురం దశలో యూరియా 35 కిలోలు పాడి–పంట -
తాళం వేసిన ఇళ్లే టార్గెట్
● 25 తులాల బంగారం, 186 తులాల వెండి స్వాధీనం ● నిందితుడి అరెస్టు.. రిమాండ్కు తరలింపు కందనూలు: తాళం వేసిన ఇళ్లే టార్గెట్గా చేసుకొని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందుతుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ అశోక్రెడ్డి శుక్రవారం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశఽంలో తెలిపారు. పూర్తి వివరాలు.. బిజినేపల్లి మండలం శాయిన్పల్లికి చెందిన కాసరి శివకుమార్(23) కరెంటు, మేసీ్త్ర పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మూడేళ్లుగా దొంగతనాలకు పాల్పడుతూ వచ్చిన డబ్బులతో చెడు అలవాట్లకు బానిసయ్యాడు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్గా పెట్టుకొని ఇనుపరాడ్డు, గడ్డపారతో బీరువా, ఇంటి తాళాలు పగులగొట్టి దొంగతనాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో శాయిన్పల్లిలో ఐదు, మమ్మాయిపల్లి గ్రామంలో రెండు ఇళ్లలో చోరీలు చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని అతని వద్ద 25.1 తులాల బంగారం, 186 తులాల వెండి, మొబైల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ. 40 లక్షల వరకు ఉంటుందన్నారు. దొంగతనం చేసిన వెండిలో 32 తులాలు తన అవసరాలకు వాడుకున్నట్లు సీఐ పేర్కొన్నారు. కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ శంషోద్దిన్, పీసీ భీముడు, హోంగార్డులు రమేష్, శివను సీఐ అభినందించారు. -
మెట్ల పైనుంచి జారిపడి మహిళ మృతి
బల్మూర్: ప్రమాదవశా త్తు మెట్ల పై నుంచి జారి కిందపడి మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని కొండనాగుల లో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది.కుటుంబసభ్యు లు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన మూడవత్ పార్వతి (55) చిన్నపాటి హోట ల్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేది. ఈ క్రమంలో గ్రామంలోనే ఓ ఇంటిని అద్దె కు తీసుకొని భర్త బాలుతో పాటు తన ముగ్గు రు కుమార్తెలతో కలిసి నివాసం ఉంటుంది. గురువారం ఇంటి పై నుంచి కిందికి దిగుతున్న క్రమంలో కాలు జారి కిందపడటంతో తల, ముఖానికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకో వాలని గ్రామస్తులు కోరుతున్నారు. భార్యతో గొడవపడి.. చెరువులో దూకిన భర్త కందనూలు: నాగర్కర్నూల్ మున్సిపాలిటీలోని నాగనూల్ చెరువులో పడి ఓ యువకుడు మృతి చెందినట్లు ఎస్ఐ వెంకట్రెడ్డి శుక్రవారం తెలిపారు. ఆయన వివరాల మేరకు.. చంద్రకల్ గ్రామానికి చెందిన బంగారయ్య (43) బోనాల పండుగ కోసం తన అత్తగారి గ్రామమైన నాగనూల్కు వచ్చాడు. భార్యభర్తల మధ్య గొడవ చోటు చేసుకొని అతడు బయటకు వెళ్తున్నానని గురువారం ఇంటి నుంచి బయలుదేరాడు. అతడు చెరువులో దూకడానికి ప్రయత్నిస్తున్న సందర్బంలో గ్రామంలోని కొందరు యువకులు గమనించి.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు చెరువులో గాలింపు చేపట్టగా ఎక్కడ కనిపించలేదు. శుక్రవారం మృతదేహం చెరువు ఒడ్డుకు చేరుకుంది. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. బస్సు ఢీ: గుర్తు తెలియని మహిళ దుర్మరణం ఎర్రవల్లి: ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ గుర్తు తెలియని మహిళ మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. కోదండాపురం ఏఎస్ఐ శ్రీనివాసులు కథనం మేరకు.. 44వ జాతీయ రహదారిపై బోరవెళ్లి స్టేజీ సమీపంలో గురువారం రాత్రి ఓ గుర్తు తెలియని మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించింది. గమనించిన ప్రయాణికులు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వగా మృతదేహాన్ని అలంపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఈశ్వరయ్య గౌడ్పై కేసు నమోదు చేశారు. మృతురాలి వయస్సు 40–45 ఏళ్లు ఉండొచ్చని, ఒంటిపై నలుపు రంగు బురఖా, నలుపు–తెలుపు పూల డిజైన్ చీర, నీలం రంగు జాకెట్, మెడలో తాయత్తు ఉన్నట్లు తెలిపారు. మృతురాలి ఆచూకీ తెలిసిన వారు కోదండాపురం పీఎస్లో సంప్రదించాలని ఏఎస్ఐ సూచించారు. అనుమానాస్పద మృతి.. కేసు నమోదు అయిజ: మండలంలోని బింగుదొడ్డి శివారు భారతమాల వంతెన కింద మృతదేహాన్ని శుక్రవారం గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాలు.. భారత్మాల వంతెన కింద మృతదేహం ఉందన్న స్థానికుల సమాచారం మేరకు ఎస్ఐ గురుస్వామి సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఎస్ఐ సోషల్ మీడియాలో పోస్టు చేయగా మృతుడి బంధువులు పోలీసులను ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా నందవరం మండలం కనికవీడు గ్రామానికి చెందిన రాఘవరెడ్డి(46)గా గుర్తించారు. పంచనామా నిర్వహించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
ఎస్జీఎఫ్.. క్రీడల సందడి!
మహబూబ్నగర్ క్రీడలు: పాఠశాల విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసి, వారికి రాష్ట్ర, జాతీ యస్థాయిలో అవకాశాలు కల్పించే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) పోటీలకు మహబూబ్నగర్ జిల్లా సిద్ధమవుతోంది. ఈ ఏడాది జిల్లాలో పలు రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ టోర్నీలతో పాటు అండర్–17 బాలికల జాతీయస్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. దీంతో జిల్లాలో మరో సారి ఎస్జీఎఫ్ క్రీడల సందడి నెలకొననుంది. ఆరు క్రీడాంశాలకు ప్రతిపాదనలు హైదరాబాద్లో గురువారం జరిగిన సమావేశంలో జిల్లాలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించేందుకు పలు క్రీడాంశాలను ప్రతిపాదించారు. అండర్–17 బాల, బాలికల కబడ్డీ, అండర్– 17, అండర్–19 బాల,బాలికల వాలీబాల్, క్రికె ట్, అండర్–14, అండర్–17, అండర్–19 బా ల, బాలికల హ్యాండ్బాల్, అండర్–19 బాల, బాలికల నెట్బాల్, అండర్–17 బాల, బాలికల ఖోఖో పోటీలను నిర్వహించేందుకు ప్రతిపాదనలు పంపారు. మండల స్థాయి నుంచి పోటీలు ప్రారంభమై జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలకు విద్యార్థులు ఎదిగేలా ఎస్జీఎఫ్ వేదికగా నిలుస్తోంది. జిల్లాకు చెందిన పలువు రు క్రీడాకారులు ఈ పోటీల ద్వారానే ప్రతిభను చాటుకుని ఉన్నతస్థాయికి చేరుకున్నారు. వందలాది మంది విద్యార్థులు జాతీయస్థాయిలో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించారు. ఏడేళ్లుగా జాతీయ టోర్నీలకు ఆతిథ్యం ఎస్జీఎఫ్ జాతీయస్థాయి పోటీల నిర్వహణలో మహబూబ్నగర్ ప్రత్యేక గుర్తింపు పొందింది. వరుసగా ఏడేళ్లుగా జిల్లాకేంద్రంలో జాతీయస్థాయి ఎస్జీఎఫ్ టోర్నీలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది ఏదో ఒక జాతీయస్థాయి పోటీని జిల్లాకు కేటాయించడం విశేషం. ఈ ఏడాది ఏప్రిల్ చివర్లో జడ్చర్ల, మహబూబ్నగర్ పట్టణాల్లో అండర్–17 బాలుర జాతీయస్థాయి క్రికెట్ టోర్నీ నిర్వహించారు. తాజాగా అండర్–17 బాలికల జాతీయస్థాయి క్రికెట్ టోర్నీని కూడా జిల్లాలో నిర్వహించేందుకు ప్రతిపాదనలు పంపారు. ప్రతిపాదన ఆమోదం పొందితే మరో జాతీయస్థాయి టోర్నీకి జిల్లా ఆతిథ్యమివ్వనుంది. రాష్ట్రస్థాయి టోర్నీలకు మహబూబ్నగర్ నుంచి ప్రతిపాదనలు అండర్–14, 17, 19 విభాగాల్లో పోటీలు అండర్–17 బాలికల జాతీయస్థాయి క్రికెట్ టోర్నీకి ప్రతిపాదన -
భూసేకరణ పరిహారం చెల్లింపులో వేగం పెంచాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): నీటిపారుదల ప్రాజెక్టుల పెండింగ్ భూ సేకరణ, పరిహారం చెల్లింపు, పునరావాసానికి సంబంధించిన ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేసే లా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా ఇంజినీరింగ్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడతు జిల్లాలోని ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ, నిర్వాసితులకు పరిహారం చెల్లింపు, పునరావాస ప్రక్రియలను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్ భూసేకరణకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే క్షేత్రస్థాయిలో పరిశీలించి, రైతులతో మాట్లాడి పరిష్కరించాలని చెప్పారు. అంతకుముందు వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ నీటిపారుదల ప్రాజెక్టుల పనులు సకాలంలో పూర్తయ్యేందుకు పెండింగ్ భూసేకరణను పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త ఆయకట్టు సృష్టి్ంచేందుకు వీలుగా పెండింగ్ భూసేకరణ, పునరావాస పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. భూసేకరణకు అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నందున ఎక్కడా జాప్యం లేకుండా ప్రక్రియను త్వరగా పూర్తి చేసి, ప్రాజెక్టుల పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జేఎల్బీ హరిప్రియ, భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రామ్రెడ్డి, డీఈ మనోహర్, డీటీ రాణి సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
వరాలిచ్చే.. వరలక్ష్మి
శ్రావణ మాసం రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతాలను భక్తి శ్రద్ధలతో ఆచరించారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలో పలు ఇళ్లలో వ్యక్తిగతంగానూ, ఆలయాల్లో సామూహికంగా వ్రతాలను నిర్వహించారు. మహిళలు అమ్మవార్లకు నైవేద్యాలు సమర్పించారు.బస్టాండ్ సమీపంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ, వీరన్నపేటలోని చౌడేశ్వరీ మాత, ద్వారకామాయి బాబా మందిరం, వేంకటేశ్వర కాలనీలోని రాజరాజేశ్వరి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు చేపట్టారు. బ్రాహ్మణవాడిలోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారు బంగారు చీరలో దర్శనమిచ్చారు. – స్టేషన్ మహబూబ్నగర్ బ్రాహ్మణవాడి వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాయంలో బంగారుచీరలో అమ్మవారు సామూహిక వరలక్ష్మి వ్రతంలో మహిళలు ద్వారకామాయి ఆలయంలో అమ్మవారికి హారతిస్తున్న మహిళలు -
సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్
పాలమూరు: జిల్లా కోర్టులో సెప్టెంబర్ 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్లో అన్ని రకాల కేసులు అధికంగా రాజీ అయ్యే విధంగా పోలీస్శాఖ, బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థలు దృష్టిసారించాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత సూచించారు. జిల్లా కోర్టులో శుక్రవారం అన్ని రకాల ఇన్సూరెన్స్ మేనేజర్లు, స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. రాజీ అయ్యే క్రిమినల్, ఎంవీఐ యాక్ట్, డీడీ, చెక్ బౌన్స్ కేసులు ఇలా ప్రతి కేసును రాజీ చేసుకోవాలన్నారు. ఆయా శాఖల పరిధిలో పెండింగ్లో ఉన్న కేసులను గుర్తించి కక్షిదారులకు నోటీసులు జారీ చేసి తప్పకుండా లోక్ అదాలత్కు హాజరయ్యే విధంగా చూడాలన్నారు. ఈసారి నిర్వహించనున్న లోక్ అదాలత్లో మోటార్ వాహన పెండింగ్ కేసులు అధికంగా పరిష్కారం జరిగే వి ధంగా చూడాలన్నారు. అదేవిధంగా కక్షిదారులు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులు రాజీ కావడానికి ఇరు వర్గాలు కోర్టు రావాలన్నారు. లోక్ అదాలత్లో ఒక్కసారి రాజీ అయి తే శాశ్వత పరిష్కారం ఉంటుందన్నారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఇన్చార్జి కార్యదర్శి ఈశ్వరయ్య పాల్గొన్నారు. కుట్టుమిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్’ పథకం కింద కుట్టుమిషన్ల పంపిణీకి బీసీ మహిళలు దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారి విష్ణునందన్ సూచించారు. ఆసక్తిగల మహిళ లు వచ్చే నెల 13 లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మహిళల ఆర్థిక సాధి కారతకు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సందేహాలుంటే బీసీ సంక్షేమశాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. జూరాలకు 70 వేల క్యూసెక్కుల వరద గద్వాల/ఆత్మకూర్: జూరాలకు ఎగువ నుంచి శుక్రవారం 70,495 క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. ప్రాజెక్టు నీటిమట్టం 318.06 మీటర్లు, నిల్వ 8.73 టీఎంసీలుగా ఉంది. హైడల్ కేంద్రానికి 42,401 క్యూసెక్కులు సహా వివిధ కాల్వలకు మొత్తం 76,803 క్యూసెక్కుల నీటి ని విడుదల చేస్తున్నారు. ఎగువ, దిగువ విద్యు త్ కేంద్రాల్లో 11 యూనిట్ల ద్వారా 434 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేపట్టారు. ఇప్పటివరకు 139.917 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. -
తప్పటడుగులకే జై!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: విద్యాశాఖలో స్వార్థ ప్రయోజనాల పర్వం నడుస్తోంది. పాఠశాలల్లో విద్యాబోధన, పర్యవేక్షణను పక్కనబెట్టిన కొందరు గురువులు తమ రూటే సెపరేటు అనేలా పైరవీలకు ప్రాధాన్యమిస్తున్నారు. భావిభారత పౌరులకు విలువలతో కూడిన విద్యనందించాల్సింది పోయి పక్కదారి పడుతున్నారు. నిబంధనలను కాలరాసేలా అడ్డూ అదుపు లేకుండా బేరసారాలకు దిగుతున్నారు. అలాంటి వారిని కట్టడి చేయడంతో పాటు మెరుగైన విద్యావ్యవస్థ కోసం కృషి చేయాల్సిన పెద్దలు సైతం తప్పుదారి పట్టిన వారికే జై కొడుతున్నారు. ప్రధానంగా మహబూబ్నగర్, నారాయణపేటకు సంబంధించి పలు వివాదాస్పద నిర్ణయాలు దుమారం రేపుతున్నాయి. ఆయా జిల్లాల్లో విద్యాశాఖ పారదర్శకత ప్రశ్నార్థకంగా మారగా.. ఉన్నతాధికారుల మౌనం అక్రమాలకు ఊతమిస్తున్నట్లు తెలుస్తోంది. తొలి నుంచీ వివాదమే.. 2024లో సీసీకుంట మండలం నుంచి మహబూబ్నగర్ రూరల్ మండల విద్యాశాఖ అధికారిగా ఒకరు బదిలీపై వచ్చారు. విధుల్లో చేరిన అనంతరం రెండోరోజు అర్బన్ మండల విద్యాశాఖ కార్యాలయానికి వచ్చి ఎంఈఓ కుర్చీలో కూర్చున్నారు. అక్కడ మహిళా ఎంఈఓ ఇదివరకే విధులు నిర్వర్తిస్తుండగా.. ఆమెను బేఖాతరు చేస్తూ అతడు పెత్తనం చెలాయించడం వివాదానికి దారితీసింది. ఆ తర్వాత ఆమె ఉద్యోగ విరమణ పొందగా.. ప్రస్తుతం ఆయనే అర్బన్ మండలానికి ఎంఈఓగా చెలామణి అవుతున్నాడు. అయితే రూరల్ మండలంలో పంచాయతీరాజ్శాఖ నుంచి వేతనం పొందుతుండడం, అర్బన్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంపై దుమారం కొనసాగుతోంది. ఆ తర్వాత సెల్ఫ్ డ్రాయింగ్ పేరిట.. సీటు లొల్లి సద్దుమణిగిన క్రమంలో తాను అర్బన్ మండల ఎంఈఓగా విధులు నిర్వర్తిస్తున్నానని, వేతనం ఇచ్చేందుకు అర్బన్లో ఎంపీడీఓ పోస్ట్ లేకపోవడంతో సెల్ఫ్డ్రాయింగ్ పేరిట సొంతంగా వేతనాలు పొందేలా ఆర్జేడీ కార్యాలయంలో చక్రం తిప్పాడు. ఈ మేరకు గతేడాది ఉత్తర్వులు వెలువడ్డాయి. వేతనాలు చేసేందుకు ఎంపీడీఓ లేని క్రమంలో మాత్రమే సెల్ఫ్డ్రాయింగ్ అధికారాలు వర్తిస్తాయని ఆ ఉత్తర్వులో స్పష్టంగా ఉంది. లెక్కప్రకారం అర్బన్లో ఎంఈఓ పోస్ట్ ఉండి.. ఎంపీడీఓ లేని పక్షంలో మాత్రమే ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. ఈ క్రమంలో అర్బన్లో లేని పోస్ట్కు సెల్ఫ్ డ్రాయింగ్ పవర్ ఇవ్వాలని తన పలుకుబడిని ప్రదర్శిస్తూ పంచాయతీరాజ్ అధికారులపై ఒత్తిడి చేసినట్లు సమాచారం. 1986 జీఓ ఏం చెబుతోంది.. 1986 ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఎంఈఓ పోస్టు మహబూబ్నగర్ మండల పరిషత్కే కేటాయించబడింది. కొత్త మండలాలు ఏర్పడిన తర్వాత, కార్పొరేషన్లో ప్రత్యేకంగా ఎంఈఓ పోస్టు మంజూరు కాలేదు. పంచాయతీరాజ్ పరిధిలోని పోస్టును రద్దు చేయాలన్నా, బదిలీ చేయాలన్నా అదే శాఖ నుంచి స్పష్టమైన ఉత్తర్వులు రావాలి. ఇది పట్టించుకోకుండా విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. స్పష్టత రావాల్సి ఉంది.. అర్బన్లో ఎంఈఓ పోస్టు ఉందని పంచాయితీరాజ్ శాఖ నుంచి జీఓ రాలేదు. ఎంఈఓ పోస్టును రూరల్ మండలం నుంచి అర్బన్ మండలంలోకి మార్చే ప్రక్రియపై సందిగ్ధం ఉంది. పోస్టు మార్పుపై జెడ్పీ సీఈఓ సంబంధిత శాఖకు లేఖరాశారు. అక్కడి నుంచి స్పష్టత రావాల్సి ఉంది. కానీ విద్యాశాఖ నుంచి ఎంఈఓ పోస్టును రూరల్ నుంచి అర్బన్ మార్చాలని ఆదేశాలు వచ్చాయి. విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. స్పష్టత వచ్చే వరకు ప్రక్రియ ముందుకు సాగదు. –విజయకుమారి, డీఈఓ, మహబూబ్నగర్ వివాదాల విద్యాశాఖ.. లేని పోస్ట్కు రాయ‘బేరాలు’? రూరల్ ఎంఈఓ పోస్ట్ను ఎత్తివేసి అర్బన్కు బదిలీ చేస్తూ, సెల్ఫ్ డ్రాయింగ్ పవర్ ఇచ్చినట్లు ఆర్జేడీతో పాటు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఆయన ఇటీవల మరోసారి ఉత్తర్వులు తీసుకురావడం విద్యాశాఖలో సంచలనంగా మారింది. దీన్ని అడ్డుపెట్టుకుని రూరల్ నుంచి అర్బన్కు ఎంఈఓ పోస్టు బదిలీ చేయాలంటూ జిల్లాస్థాయిలో పంచాయతీరాజ్ అధికారులపై ఒత్తిడి చేయడం పంచాయితీకి దారితీసింది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమని.. తాము చేయలేమంటూ ఆ శాఖ అధికారులు తేల్చిచెప్పడంతో ఈ లొల్లి జిల్లా ఉన్నతాధికారుల వద్దకు చేరినట్లు తెలుస్తోంది. కార్పొరేషన్ పరిధిలో లేని అర్బన్ పోస్టు కోసం రూరల్ మండల ఎంఈఓ కుర్చీని ఖాళీ చేసేలా సదరు అధికారి రాయబారాలతోపాటు భారీ స్థాయిలో బేరసారాలకు దిగినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మహబూబ్నగర్,నారాయణపేటలో ఇష్టారాజ్యం నిబంధనలకు తిలోదకాలిచ్చిఅనాలోచిత నిర్ణయాలు కార్పొరేషన్ పరిధిలో లేని అర్బన్ పోస్టుకు పైరవీల బేరం రూరల్ మండల ఎంఈఓ కుర్చీనిఖాళీ చేసే కుయుక్తులు పేటలో కాక రేపుతున్న ఓ పథకం ఇన్చార్జి వ్యవహారం అక్రమాలకు ఊతమిస్తున్న ఉన్నతాధికారుల మౌనం -
నగరంలో శాశ్వత తాగునీటి పరిష్కారం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నగరంలో శాశ్వత తాగునీటి పరిష్కారానికి రూ.220 కోట్లతో 18 మిలియన్ లీటర్ల నీటి నిల్వ సామ ర్థ్యం కలిగిన 14 ఓహెచ్ఎస్ఆర్లను ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి వివరించారు. మౌలాలిగుట్ట, మెట్టుగడ్డ, టీచర్స్కాలనీలలో నిర్మించనున్న ఓవర్హెడ్ సర్వీస్ రిజర్వాయర్ (ఓహెచ్ఎస్ఆర్)లకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం వీరన్నపేటలోని హజ్రత్ హతావుల్లా షరీఫ్ మున్సి దర్గా ప్రహరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం 20 మిలియన్ లీటర్ల నీటినిల్వ సామర్థ్యం ఉన్నప్పటికీ, పెరుగుతున్న అవసరాలకు సరిపోవడం లేదన్నారు. వాస్తవానికి పైపులైన్ లీకేజీలు, పంపింగ్ సామర్థ్యం తగ్గడం, నీటి సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయన్నారు. వీటిని అధిగమించేందుకు గాను ఇప్పటికే 8 ట్యాంకుల పనులు ప్రారంభమయ్యాయని, మిగిలిన వాటిని త్వరలోనే చేపడతామన్నారు. ఇవన్నీ పూర్తయితే తాగునీటి సమస్య ఉండదన్నారు. నగరంలో మైనారిటీల సంక్షేమానికి సుమారు రూ.45 కోట్లు కేటాయించామన్నారు. ప్రార్థన స్థలాల అభివృద్ధికి అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. ఆయా కార్యక్రమాలలో ముడా చైర్మన్ కె.లక్ష్మణ్యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మల్లు నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఎం.సురేందర్రెడ్డి, కాంగ్రెస్పార్టీ నాయకులు సిరాజ్ఖాద్రీ, రమేష్ యా దవ్, వర్ధ రవి, అశ్వాక్, అజ్మత్అలీ, అబ్దుల్హ క్, నసీర్, మైనొద్దీన్ రఫీ, శివ పాల్గొన్నారు. ● ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి -
పెంచిన పాలధరలు సద్వినియోగం చేసుకోవాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): విజయ డెయిరీ పెంచిన పాల కొనుగోలు ధరలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా సూచించారు. గురువారం కలెక్టరేట్లో విజయ డెయిరీ పెంచిన పాల ధరలకు సంబంధించిన కరపత్రాన్ని ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ డి.సత్యనారాయణ యాదవ్ మాట్లాడుతూ.. బర్రె పాల ధరను లీటరుకు రూ.6, ఆవు పాల ధరను రూ.2 చొప్పున పెంచినట్లు తెలిపారు. పెంచిన ధరలు ఈ నెల 16 నుంచి అమల్లోకి వచ్చాయని పేర్కొన్నారు. పాడి రైతులకు ప్రతి 15 రోజులకు పాల బిల్లుల చెల్లింపుతో పాటు పశువులకు బీమా, తక్కువ ధరకే నాణ్యమైన పశుదాణా, కాల్షియం, మినరల్ మిక్చర్, నట్టల నివారణ మందులు, గడ్డి విత్తనాలు అందిస్తున్నట్లు తెలిపారు. పాడి పశువుల కొనుగోలుకు యూనియన్ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ద్వారా రుణ సదు పాయం కల్పిస్తున్నామని చెప్పారు. మధ్య వర్తులను ఆశ్రయించకుండా విజయ డైయిరీ సేకరణ కేంద్రాల్లోనే పాలు విక్రయించి పెంచిన ధరతో పాటు ఇతర సదుపాయాలను రైతులు పొందాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ శివానందస్వామి, డీఆర్డీఓ నర్సింహులు, డెయిరీ మేనేజర్ యాకన్న తదితరులు పాల్గొన్నారు. -
సమాజ తలరాత మార్చేది యువతే
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): సమాజ తలరాత మార్చే శక్తి ఒక్క యువతకు మాత్రమే ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు ఎం.నరసింహ అన్నారు. అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా 13వ మహాసభలు గురువారం స్థానిక కార్యాలయంలో నిర్వహించారు. ముందుగా శాంతి అభ్యుదయం శాసీ్త్రయ సోషలిజం ఆశయాలు గల ఏఐవైఎఫ్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి బాలనరసింహా మాట్లాడుతూ యువత ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా వివక్ష ధోరణి ప్రదర్శిస్తూ యువతతో కయ్యం పెట్టుకున్న ఏ పాలక ప్రభుత్వాలకు, ఎంతటి వారినైనా కాలగర్భంలో కలిసిపోక తప్పదని హెచ్చరించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి యువతను ఉద్దేశించి పొద్దింకలతో పోలిస్తే బొద్దింకల పేరుతోనే పార్టీ ఏర్పాటు చేసి మార్పునకు చేసిన వీరోచిత పోరాటానికి మోదీ సర్కారు తలవంచక తప్పలేదని గుర్తు చేశారు. 80 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో నేటికి నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేదని ఏటా రెండు కోట్ల ఉద్యోగాలతో అధికారంలో వచ్చిన మోదీ ప్రభుత్వం ఉద్యోగాల కల్పన హామీని విస్మరించి ఫాసిస్ట్ విధానాలను అనుసరించడం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు కలంకమన్నారు. అనంతరం ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్. శ్రీకాంత్ మాట్లాడుతూ దేశంలో నేడు విద్య వైద్యం ఉపాధి అందని ద్రాక్షగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 8న యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభల సందర్భంగా యువజన కవాత్ నిర్వహిస్తున్నామని 9, 10 తేదీల్లో ప్రతినిధుల సభలు జరగతాయని యువత పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యదర్శి బృంగి బాలకిషన్, ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బిజ్జా శ్రీనివాస్, ఏఐవైఎఫ్ రాష్ట్ర మాజీ సహాయ కార్యదర్శి సురేష్, ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ రాము, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజు, ఏఐవైఎఫ్ జిల్లా కో కన్వీనర్ మహేష్ పాల్గొన్నారు. -
వేలానికి ముందే ఇసుక మాయం!
● సీజ్ చేసిన ఇసుకను రాత్రికి రాత్రే చదును చేసిన మాఫియా ● ప్రభుత్వానికి రూ.79.14 లక్షల నష్టం ● ఇద్దరిపై ఫిర్యాదు.. కేసు నమోదు మిడ్జిల్: వేలం వేయాల్సిన సీజ్ చేసిన ఇసుక డంప్ను రాత్రికి రాత్రే చదును చేసి మట్టితో కప్పివేయడం కలకలం రేపింది. మిడ్జిల్ మండలం కొత్తపల్లి సమీపంలోని దుందుభీ వాగు వద్ద పట్టా భూమిలో అనుమతులు లేకుండా డంప్ చేసిన 15,829 క్యూబిక్ మీటర్ల ఇసుకను అధికారులు గతంలో సీజ్ చేశారు. గురువారం దానిని వేలం వేసేందుకు 23 మంది పోటీదారులు సిద్ధమయ్యారు. అయితే మంగళవారం రాత్రి ఇసుక డంప్ను భూమి యజమానులు చంద్రశేఖర్, ఎం.బాలకృష్ణారెడ్డి చదును చేసి మట్టితో కప్పివేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతోపాటు మైనింగ్ అధికారులకు సమాచారం అందించారు. సీజ్ చేసిన ఇసుకను నిబంధనల ప్రకారం వేలం ద్వారా విక్రయించాల్సి ఉండగా డంప్ను మాయం చేయడంతో ప్రభుత్వానికి రూ.79.14 లక్షల నష్టం వాటిల్లినట్లు తహసీల్దార్ రాఘవేందర్రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఇద్దరిపై మిడ్జిల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తహసీల్దార్, మైనింగ్ అధికారుల పంచనామా ఆధారంగా ప్రభుత్వానికి నష్టం కలిగించిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. -
సర్పంచ్లు పోరాటానికి సిద్ధం కావాలి
● పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): హక్కుల సాధన కోసం సర్పంచ్లు పోరాటాలకు సిద్ధం కావాలని పంచాయతీ రాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఉమ్మడి జిల్లా సర్పంచ్ల చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ పంచాయతీ రాజ్ 2018 చట్టాన్ని, ఉప సర్పంచ్లకు చెక్ పవర్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీ విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1090 కో ట్లను విడుదల చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మ్యా చింగ్ గ్రాంట్లు రూ. 2979 కోట్లు పెండింగ్ బకాయిలు ఉంచిందని వెంటనే చెల్లించేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడిగా వెంకట్రాములుగౌడ్, నాగ ర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడిగా వార్ల వెంకటయ్య, వనపర్తి జిల్లా అధ్యక్షుడిగా శ్రీధర్లు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర ప్రతినిధి పురుషోత్తంరెడ్డి, సుప్రియ, రాజశేఖర్, శివశంకర్గౌడ్, వెంకట్ పాల్గొన్నారు. -
ముగిసిన మండల మహోత్సవ పూజలు
అలంపూర్: ఐదో శక్తిపీఠం జోగుళాంబ అమ్మ వారి ఆలయంలో మండల మహోత్సవ పూజ లు గురువారంతో ముగిశాయి. అమ్మవారి ఆలయంలో శ్రీచక్ర ప్రతిష్ఠాపనను పురస్కరించుకొని మూడు రోజులపాటు అవాహిత దేవత పూజలు, హోమాలు విశేషంగా నిర్వహించారు. చివరిరోజు యాగశాలలో అర్చకులు హోమా లు నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి సమర్పించారు. శ్రీచక్రానికి ప్రత్యేక పూజల అనంతరం భక్తులు తమ గోత్రనామాలతో పూజలు నిర్వహించుకోనే అవకాశం కలుగనున్నట్లు అర్చకస్వాములు తెలిపారు. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గంగాపురంలో పవిత్రోత్సవాలు జడ్చర్ల టౌన్: గంగాపురం లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో ఈనెల 26 నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈఓ దీప్తిరెడ్డి తెలిపారు. మొదటి రోజు రాత్రి అంకురార్పణ, వేదారంభం, నిత్యహోమం నిర్వహిస్తారు. రెండో రోజు మూర్తికుంభ స్థాపన, నిత్యహోమం, పవిత్ర ప్రతిష్ఠ కార్యక్రమాలు ఉంటాయి. మూడో రోజు శ్రావణ పౌర్ణమి సందర్భంగా స్వామి, అమ్మవార్లకు అష్టోత్తర శతకలశాభిషేకం, నిత్యహోమం, పూర్ణాహుతి, మూర్తికుంభ సంప్రోక్షణ, తీర్థప్రసాద వితరణ నిర్వహిస్తారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా శుక్రవారం సాయంత్రం 5 గంటలకు మహిళలతో సామూహిక లక్ష్మీపూజ నిర్వహించనున్నట్లు ఈఓ తెలిపారు. -
బీఫార్మసీ, ఎంఈడీ, బీపీఈడీ ఫలితాలు విడుదల
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూ పరిధిలో బీఫార్మసీ, ఎంఈడీ, బీపీఈడీ పరీక్ష ఫలితాలను వీ సీ శ్రీనివాస్ గురువారం విడుదల చేశారు. ఎంఈడీ మొదటి సెమిస్టర్లో 190 మందికి 140 మంది, మూడో సెమిస్టర్లో 91 మందికి 72 మంది, బీపీఈడీ మూడో సెమిస్టర్లో 145 మందికి 141 మంది, బీఫార్మసీ ఆరో సెమిస్టర్లో 196 మందికి 128 మంది ఉత్తీర్ణులయ్యారు. కార్యక్రమంలో కంట్రోలర్ ప్రవీణ, ఎంఈడీ ప్రిన్సిపాల్ కరుణాకర్రెడ్డి, రవికాంత్, ఈశ్వర్కుమార్, సురేష్ పాల్గొన్నారు. లా పరీక్షలను తనిఖీ చేసిన వీసీ పీయూలో కొనసాగుతున్న లా పరీక్షలను వీసీ శ్రీనివాస్ గురువారం తనిఖీ చేశారు. పరీక్షల్లో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు. పరీక్షకు 80 మంది హాజరు కావాల్సి ఉండగా 77 మంది హాజరయ్యారు. ముగ్గురు గైర్హాజరయ్యారు. ప్రిన్సిపాల్ భూమయ్య పరీక్షలను పర్యవేక్షించారు. -
డిండి లిఫ్టును వెంటనే రద్దుచేయాలి
● ఉమ్మడి పాలమూరు జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ భూత్పూర్: పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి లిఫ్టు ద్వారా నీటిని అక్రమంగా తరలించే డిండి లిఫ్టును వెంటనే రద్దు చేయాలని, 25న జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపం ఎదుట నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని ఉమ్మడి పాలమూరు జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ నాయకులు రాఘవాచారి, బెక్కం జనార్ధన్, చెన్న కిష్టన్న, వామన్కుమార్, హరిబాబు కోరారు. గురువారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. లిఫ్టులు, కాల్వలు, రిజర్వాయర్ నిర్మాణం, పొలాలకు నీరు ఇచ్చేందుకు తీసుకోవాల్సిన సిబ్బంది దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలన్నారు. గతంలో పాలమూరును సస్యశ్యామలం చేస్తామని పాలమూరుకు ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన మాజీ సీఎం కేసీఆర్ పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చి అధికారంలో ఉండికూడా పూర్తి చేయలేకపోవడం పాలమూర్ ప్రజల దౌర్భాగ్యమని మండిపడ్డారు. ప్రస్తుతం సీఎం రేవంత్రెడ్డి ప్రాజెక్టుల పర్యటనతో పాలమూరు ప్రజలు, రైతులు ఆశగా ఉన్నారని, పాలమూరు ప్రాజెక్టును పూర్తిచేసి సాగునీరందించాలన్నారు. ఆనాడు డిండి ప్రాజెక్టును అడ్డుకుంటామని చెప్పినా నాయకులు నేడు అధికారంలో ఉన్నారని.. పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి డిండి ప్రాజెక్టు లిఫ్టును రద్దు చేయించాలని డిమాండ్ చేశారు. ఎంపీ డీకే అరుణ కేంద్రంతో చర్చించి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించేలా కృషి చేయాలని కోరారు. అనంతరం మహాధర్న కరపత్రాలను చౌరస్తాలో పంపిణీ చేశారు. -
జూరాలపై యమడేంజర్!
అమరచింత: పర్యాటకులను ఆకర్షించే ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు.. ఇప్పుడు ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. ప్రాజెక్టు రహదారిపై ఏర్పాటు చేసిన భారీ స్పీడ్ బ్రేకర్లు వాహనదారులకు యమపాశాలుగా మారుతున్నాయి. వాటికి ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడం, తెలుపు–నలుపు చారలు లేదా రేడియం పెయింటింగ్ చేయకపోవడం, రాత్రివేళల్లో విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో వాహనదారులు వాటిని గుర్తించలేక ప్రమాదాలకు గురవుతున్నారు. ముఖ్యంగా బైక్లపై వచ్చే యువత వేగంగా వాహనాలు నడుపుతుండటంతో ప్రమాద తీవ్రత మరింత పెరుగుతోంది. రెండేళ్లలో జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోగా.. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. రెండేళ్లలో ముగ్గురు మృతి జూరాల అందాలను వీక్షించేందుకు ప్రతి వర్షాకాలంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తుంటారు. ముఖ్యంగా కర్ణాటకలోని రాయచూర్ జిల్లా నుంచి భారీగా సందర్శకులు వస్తుంటారు. ఈ క్రమంలో ప్రాజెక్టు రహదారిపై వాహనాల రద్దీ పెరుగుతుంది. గతేడాది జూలై 20న జూరాల అందాలను చూసేందుకు వచ్చిన యువకులు ప్రమాదానికి గురయ్యారు. ఎదురుగా వేగంగా వచ్చిన కారును తప్పించుకునే క్రమంలో వాహనం అదుపుతప్పి నదిలో పడటంతో మహేష్ అనే యువకుడు మృతి చెందాడు. ● తాజాగా బుధవారం మహబూబ్నగర్ జిల్లా బాలానగర్, రాజాపూర్ మండలాలకు చెందిన ముగ్గురు యువకులు బైక్పై జూరాల ప్రాజెక్టుకు వచ్చారు. వేగంగా వెళ్తున్న సమయంలో ముందున్న స్పీడ్ బ్రేకర్ను గమనించకపోవడంతో బైక్ అదుపుతప్పి ఎగిరి కిందపడింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందగా.. మరో యువకుడు తీవ్రంగా గాయపడి మహబూబ్నగర్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రూ.30 లక్షల దీపాలదీ ఇదే పరిస్థితి! పర్యాటకుల భద్రత కోసం ప్రాజెక్టుపై సుమారు రూ.30 లక్షల వ్యయంతో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసినప్పటికీ అవి సరిగా వెలగడం లేదని సందర్శకులు ఆరోపిస్తున్నారు. రాత్రివేళల్లో ప్రాజెక్టు రహదారి చీకటిమయంగా మారడంతో ప్రమాదాల ముప్పు మరింత పెరుగుతోంది. స్పీడ్ బ్రేకర్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, రేడియం పెయింటింగ్ వేయడం, రహదారిపై విద్యుత్ దీపాలు నిరంతరం పనిచేసేలా చూడటం వంటి కనీస భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. బాధ్యత ఎవరిది? స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు తమ పరిధిలో లేదని.. పవర్ ప్రాజెక్టు అధికారులే వాటిని పర్యవేక్షించాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు చెబుతున్నట్లు పర్యాటకులు పేర్కొంటున్నారు. అయితే ఎవరి పరిధిలో ఉన్నా.. పర్యాటకుల భద్రతకు సంబంధించిన అంశాలపై సమన్వయంతో చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని వారు అంటున్నారు. ప్రాజెక్టు నిర్వహణతో పాటు పర్యాటకుల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రమాదకర స్పీడ్ బ్రేకర్ల వద్ద వెంటనే హెచ్చరిక బోర్డులు, రేడియం మార్కింగ్ ఏర్పాటు చేయాలని, విద్యుత్ దీపాలను పునరుద్ధరించాలని పర్యాటకులు డిమాండ్ చేస్తున్నారు. మరో ప్రాణం పోయే వరకు అధికారులు ఎదురుచూడకుండా ఇప్పటికై నా భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. జూరాల ప్రాజెక్టుపై జలవిద్యుత్ ఉత్పత్తికి నీటిని సరఫరా చేసే ఆరు యూనిట్ల గేట్ల వద్ద బ్రిడ్జిపై ఏర్పాటు చేసిన పైపుల భద్రత కోసం భారీ స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశారు. రెండు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు. పగటిపూట సైతం వాహనదారులు అప్రమత్తంగా ఉంటేనే వాటిని గుర్తించే పరిస్థితి ఉందని పర్యాటకులు చెబుతున్నారు. ఇక రాత్రివేళ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోంది. రహదారిపై విద్యుత్ దీపాలు సరిగా వెలగకపోవడంతో చీకటిలో ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు స్పీడ్ బ్రేకర్లను గుర్తించలేక అదుపుతప్పుతున్నారు. కొందరు కిందపడి గాయాలపాలవుతున్నారు. మరికొందరు అతివేగంతో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. యమపాశంగా మారిన స్పీడ్ బ్రేకర్లు.. ర్యాష్ డ్రైవింగ్తో ఎగిరిపడుతున్న వాహనదారులు తాజాగా ఇద్దరు యువకులు మృతి.. మరొకరి పరిస్థితి విషమం సూచిక బోర్డులు, రేడియం పెయింటింగ్ లేక ప్రమాదాలు స్పీడ్ బ్రేకర్లు ఉన్న ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. జూరాల ప్రాజెక్టుపై అవి కనిపించడం లేదని పర్యాటకులు ఆరోపిస్తున్నారు. కనీసం స్పీడ్ బ్రేకర్లపై తెలుపు–నలుపు చారల పెయింటింగ్ లేదా రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేసినా రాత్రివేళల్లో వాహనదారులకు అవి కనిపించే అవకాశం ఉంటుంది. కానీ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో ప్రమాదాలు పునరావృతమవుతున్నాయని సందర్శకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిగా విష్ణునందన్
స్టేషన్ మహబూబ్నగర్: జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి పి.విష్ణునందన్ గురువారం జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి (ఎఫ్ఏసీ)గా బాధ్యతలు స్వీకరించారు. మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా అమలవుతున్న పథకాలను అర్హులకు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల సమస్యలు, ఫిర్యాదులను సత్వరం పరిష్కరించడంతో పాటు శాఖ కార్యక్రమాలను పారదర్శకంగా, నిబంధనల మేరకు అమలు చేస్తామన్నారు.బాధ్యతలు స్వీకరించిన అనంతరం కార్యాలయ సిబ్బందితో సమావేశమై శాఖ పరిధిలోని పథకాలు, విభాగాల పనితీరుపై వివరాలు తెలుసుకున్నారు. కార్యాలయ సూపరింటెండెంట్ విజయలక్ష్మి, ఉర్దూ అధికారి డాక్టర్ మునీబ్ అఫాఖ్, ఇతర సిబ్బంది విష్ణునందన్ను అభినందించారు. -
మద్యం విక్రయాలపై ఆరోపణలు
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ సమీపంలో చేప వంటకాలతో పాటు మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో కొందరు యువకులు స్నేహితులతో కలిసి అక్కడికి వచ్చి మద్యం సేవిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. మద్యం మత్తులో వాహనాలను అతివేగంగా నడపడంతో ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు ఉన్నాయని పేర్కొంటున్నారు. కుడి కాల్వ సమీపంలో చేప వంటకాలు అందుబాటులో ఉన్నా.. మద్యం విక్రయాలు లేకపోవడంతో యువత ప్రధానంగా ఎడమ కాల్వ వైపే వస్తున్నారని స్థానికులు అంటున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు, సంబంధిత అధికారులు కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పతకాలు సాధించాలి
మహబూబ్నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభచాటి పతకాలు సాధించాలని జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్చంద్ర అన్నారు. హనుమకొండలో ఈనెల 26, 27 తేదీల్లో జరిగే అండర్–14, అండర్–16, అండర్–18, అండర్–20 ఏళ్లలోపు రాష్ట్రస్థా యి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల ఎంపికలను గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించారు. శరత్చంద్ర జెండాఊపి ఎంపికలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ అథ్లెట్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఎంపికల్లో దాదాపు 150 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు తెలిపారు. అండర్–14 విభాగం వారికి ట్రయథ్లాన్ (ఏ గ్రూప్లో 60 మీ, లాంగ్జంప్, హైజంప్, బీ గ్రూప్లో 60 మీ, లాంగ్జంప్, షాట్ఫుట్, సీగ్రూప్లో 60మీ, లాంగ్జంప్, 600 మీటర్ల పరుగు) అండర్–16 విభాగం వారికి 60మీ, 600మీ, షాట్పుట్, లాంగ్జంప్, డిస్కస్త్రో, జావెలిన్, అండర్–18 వారికి 100మీ, 200మీ, 800మీ, 1500మీ, 3000మీ, 5000మీటర్ల, లాంగ్జప్, షాట్ఫుట్, జావెలిన్, డిస్కస్త్రో, అండర్–20 విభాగం వారికి 100మీ 200మీ, 800మీ, 1500మీ, 3000మీ, 5000మీటర్ల, లాంగ్జంప్, షాట్పుట్, జావెలిన్, డిస్కస్త్రో అంశాల్లో ఎంపికలు నిర్వహించినట్లు తెలిపారు. ఎంపికై న తుది జట్టును త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కోచ్లు ఆనంద్కుమార్, సునీల్కుమార్, శ్రీనివాస్, పీడీలు శ్రీనివాసులు, రాజు, పి.శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కార్పొరేషన్కు మహర్దశ రానుంది
కార్పొరేషన్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నాం. 14 వాటర్ ట్యాంకుల నిర్మాణానికి ప్రతిపాదనలు ఉండగా.. ఇప్పటికే తొమ్మిదింటికి శంకుస్థాపన చేశాం. మరో మూడింటికి శుక్రవారం శంకుస్థాపన చేస్తాం. మురుగు, వర్షపు నీటిని వేరు చేసి ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసేందుకు అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తున్నాం. మొత్తం రూ.వెయ్యి కోట్లకు పైగా పనులు జరుగుతున్నాయి. పది రోజుల్లో అండర్గ్రౌండ్ పనులు ప్రారంభిస్తాం. – యెన్నం శ్రీనివాస్రెడ్డి, ప్రభుత్వ విప్, మహబూబ్నగర్ ఎమ్మెల్యే పనులు వేగంగా సాగుతున్నాయి మురుగునీటి శుద్ధికి మూడు ఎస్టీపీలను నిర్మిస్తున్నాం. పాలకొండ వద్ద పనులు వేగంగా కొనసాగుతున్నాయి. వీటి ద్వారా మురుగునీటిని శుద్ధి చేసి వినియోగానికి అనుకూలంగా మార్చుతాం. తాగునీటి కోసం 14 ట్యాంకులు, వర్షపు నీటి సేకరణకు ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. ఇందుకోసం ప్రభుత్వం వేర్వేరుగా నిధులు మంజూరు చేసింది. – ప్రవీణ్రెడ్డి, డీఈఈ, పబ్లిక్హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ● -
కళాశాలలకు నిధుల జోష్
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 2026–27 విద్యాసంవత్సరానికి అవసరమైన నిర్వహణ, ల్యాబ్ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని 61 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా కాంపోజిట్ గ్రాంట్ కింద రూ.40 లక్షలు, ల్యాబ్ల నిర్వహణకు రూ.33.24 లక్షలు.. మొత్తం రూ.73.24 లక్షలు కేటాయించింది. ఈ మొత్తాన్ని ఇప్పటికే కళాశాలల ప్రిన్సిపాళ్ల ఖాతాల్లో జమ చేసింది. కాంపోజిట్ గ్రాంట్ను స్టేషనరీ, తరగతి గదులు, మరుగుదొడ్ల నిర్వహణ తదితర అవసరాలకు వినియోగించనున్నారు. ల్యాబ్ నిధులతో సైన్స్ ప్రాక్టికల్స్కు అవసరమైన పరికరాలు, రసాయనాలు, ఇతర సామగ్రిని సమకూర్చుకోనున్నారు. వచ్చే జనవరి, ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్ నిర్వహించే సమయంలో ఇబ్బందులు లేకుండా ముందుగానే నిధులు అందుబాటులోకి రావడం ప్రయోజనకరంగా ఉంటుందని కళాశాలల ప్రిన్సిపాళ్లు పేర్కొంటున్నారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న కళాశాలలకు ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించారు. బాలికల జూనియర్ కళాశాల, ఎంవీఎస్ జూనియర్ కళాశాలలకు ల్యాబ్ నిర్వహణకు రూ.లక్ష చొప్పున అందినట్లు అధికారులు తెలిపారు. 61 ప్రభుత్వ కళాశాలలకు కాంపోజిట్, ల్యాబ్ నిర్వహణ గ్రాంట్లు విద్యార్థుల సంఖ్య ఆధారంగా రూ.73.24 లక్షల కేటాయింపు విద్యాసంవత్సరం ప్రారంభంలోనే నిధులు విడుదల చేయడం ఇదే తొలిసారి -
మురుగుకు చెక్.. నీటికి పక్కా ప్లాన్!
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా విస్తరించిన మహబూబ్నగర్లో పెరుగుతున్న జనాభా, గృహసముదాయాలకు అనుగుణంగా మౌలిక వసతులపై ప్రభుత్వం దృష్టి సారించింది. మురుగునీరు, వర్షపు నీరు కలవకుండా ప్రత్యేక పైప్లైన్లు, మురుగునీటి శుద్ధికి మూడు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు (ఎస్టీపీ), తాగునీటి సరఫరాకు 14 వాటర్ ట్యాంకుల నిర్మాణం చేపడుతోంది. మూడు పథకాల కింద మొత్తం రూ.1,099 కోట్ల నిధులు కేటాయించారు. మూడు ఎస్టీపీలు.. 42 ఎంఎల్డీ సామర్థ్యం అమృత్ 2.0 కింద రూ.276 కోట్లతో మూడు ఎస్టీపీలను నిర్మిస్తున్నారు. పాలకొండ వద్ద 5 ఎంఎల్డీ సామర్థ్యంతో మొదటి ప్లాంట్ పనులు కొనసాగుతున్నాయి. పెద్దచెరువు వద్ద 15.5 ఎంఎల్డీ ప్లాంట్కు భూసేకరణ పూర్తయింది. అమిస్తాపూర్–సారికాటౌన్షిప్ వద్ద 21.5 ఎంఎల్డీ ప్లాంట్కు భూసేకరణ ప్రక్రియలో ఉంది. కాలనీల నుంచి మురుగునీటిని ఎస్టీపీలకు తరలించేందుకు 540 కిలోమీటర్ల సీవర్ పైప్లైన్, 12.5 కిలోమీటర్ల ప్రధాన పైప్లైన్ నిర్మించనున్నారు. శుద్ధి చేసిన నీటిని వ్యవసాయ, ఇతర అవసరాలకు వినియోగించే అవకాశం ఉంటుంది. తాగునీటికి 14 ట్యాంకులు కార్పొరేషన్ పరిధిలో తాగునీటి సేకరణ, పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు బైపాస్ చుట్టూ 14 వాటర్ ట్యాంకులు నిర్మిస్తున్నారు. యూఐడీఎఫ్ కింద రూ.220 కోట్లు కేటాయించారు. ఇప్పటికే తొమ్మిది ట్యాంకులకు పనులు ప్రారంభం కాగా.. మరో మూడు ట్యాంకులకు శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. నీటి పంపిణీ కోసం 209 కి.మీ. డిస్ట్రిబ్యూషన్, 39.78 కి.మీ. మెయిన్ఫీడర్ పైప్లైన్లు ఏర్పాటు చేయనున్నారు. వర్షపు నీటికి ప్రత్యేక వ్యవస్థ మురుగునీరు, వర్షపు నీరు కలవకుండా ప్రత్యేక అండర్గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థను రూ.603 కోట్లతో చేపడుతున్నారు. ఇందులో 540 కి.మీ. సీవర్ పైప్లైన్ నిర్మించనున్నారు. వర్షపు నీరు వేర్వేరుగా వెళ్లేలా వ్యవస్థ ఏర్పాటు చేయడంతో నీటి కాలుష్యాన్ని అరికట్టడంతో పాటు చెరువులు, కుంటలకు స్వచ్ఛమైన వర్షపు నీటిని చేరవేసే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. పాల్కొండ వద్ద నిర్మిస్తున్న ఎస్టీపీ నిర్మాణాన్ని పరిశీలిస్తున్న అధికారులు కార్పొరేషన్లో రూ.1,099 కోట్లతో మౌలిక వసతుల పనులు మురుగు, వర్షపు నీటికి వేర్వేరు పైప్లైన్లు.. మూడు ఎస్టీపీల నిర్మాణం తాగునీటి కోసం 14 వాటర్ ట్యాంకులు.. -
గడువు ముగిసింది.. బీమా లేదు!
7,231 క్లెయిమ్లు.. 7,076 పరిష్కారం జిల్లాలో 2018 నుంచి 2025–26 వరకు రైతు బీమా కింద 7,231 క్లెయిమ్లు నమోదయ్యాయి. ఇందులో 7,076 క్లెయిమ్లను పరిష్కరించి ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.353.80 కోట్ల పరిహారం అందించారు. పంట నష్టం లేదా దిగుబడి తగ్గిన సందర్భంలో కాకుండా.. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న రైతును కోల్పోయిన సమయంలో ఈ మొత్తం ఆ కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచింది. గుంట భూమి ఉన్నా అర్హతే రైతు బీమాలో చేరేందుకు పెద్ద మొత్తంలో భూమి ఉండాల్సిన అవసరం లేదు. కనీసం గుంట (2.5 సెంట్లు) భూమి ఉన్న రైతులు అర్హులు. 10 నుంచి 59 ఏళ్లలోపు వయసు ఉండాలి. పట్టాదారు పాస్బుక్, ఆధార్, నామినీ వివరాలను వ్యవసాయ అధికారులు నమోదు చేసి రైతులను బీమా పరిధిలోకి తీసుకొస్తారు. 2025 ఆగస్టులో ఒక్కో రైతుకు జీఎస్టీతో కలిపి రూ.3,500 చొప్పున ప్రభుత్వం ప్రీమియం చెల్లించింది. ఆ పాలసీ గడువు 2026 ఆగస్టు 13తో ముగిసింది. సాధారణంగా కొత్త కాలానికి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈసారి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో రైతులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మహబూబ్నగర్ (వ్యవసాయం): ఆ కుటుంబానికి రైతే పెద్ద దిక్కు.. పొలం సాగు చేస్తూ పిల్లలను చదివిస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అనుకోని మరణంతో ఆ కుటుంబం ఆదాయాన్ని కోల్పోయినప్పుడు రైతు బీమా కొండంత అండగా నిలిచింది. రైతు ఏ కారణంతో మృతి చెందినా నామినీకి రూ.5 లక్షల పరిహారం అందడంతో ఎన్నో కుటుంబాలు కష్టకాలం నుంచి బయటపడ్డాయి. అయితే ఇన్నాళ్లూ భరోసాగా ఉన్న ఈ బీమా కవచానికి ఇప్పుడు గడువు ముగిసింది. గతేడాది ఆగస్టులో ఒక్కో రైతుకు రూ.3,500 చొప్పున ప్రభుత్వం ఎల్ఐసీకి చెల్లించిన ప్రీమియం కాలపరిమితి ఈ నెల 13తో ముగిసింది. వారం రోజులు గడిచినా కొత్త ప్రీమియం చెల్లింపుపై స్పష్టత లేకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. 2.18 లక్షల మంది అర్హులు గతేడాది జిల్లాలో 2.33 లక్షల మంది రైతులు ఉండగా.. వారిలో 2.18 లక్షల మంది రైతు బీమాకు అర్హులుగా ఉన్నారు. అంటే జిల్లాలో లక్షలాది కుటుంబాలకు ఈ పథకం భద్రత కల్పిస్తోంది. ఇంత పెద్ద సంఖ్యలో రైతులు ఆధారపడుతున్న పథకానికి ప్రభుత్వం ఏటా ప్రీమియం చెల్లిస్తూ వచ్చింది. బీమా పరిధిలో ఉన్న రైతు మృతి చెందినప్పుడు అవసరమైన ధ్రువపత్రాలను వ్యవసాయ అధికారులకు అందజేస్తే.. వివరాలను పోర్టల్లో నమోదు చేస్తారు. ప్రక్రియ పూర్తయిన అనంతరం బీమా సంస్థ పరిహారాన్ని నామినీ ఖాతాలో జమ చేస్తుంది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తగ్గింది. మార్గదర్శకాలు రాలేదు రైతు బీమా పథకానికి సంబంధించి పాత పాలసీల రెన్యువల్, కొత్తగా అర్హులైన రైతులను బీమా పరిధిలోకి చేర్చే అంశంపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మార్గదర్శకాలు అందలేదు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన వెంటనే వాటి ప్రకారం తదుపరి చర్యలు చేపడతాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రక్రియను అమలు చేస్తాం. – గోవింద్నాయక్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి కుటుంబానికి ఆర్థిక భరోసా రైతు అకాల మరణంతో కుటుంబ ఆదాయం ఒక్కసారిగా నిలిచిపోతుంది. పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, అప్పుల భారం అన్నీ కుటుంబంపై పడతాయి. అలాంటి సమయంలో ఒకేసారి అందే రూ.5 లక్షల పరిహారం తక్షణ ఆర్థిక ఊరట కల్పిస్తోంది. అందుకే రైతులు ఈ పథకాన్ని పంటకు సంబంధించిన బీమాగా కాకుండా.. కుటుంబానికి భరోసాగా భావిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికీ 125 క్లెయిమ్లు పరిష్కారం కావాల్సి ఉంది. మరో 32 క్లెయిమ్లు ఎల్ఐసీ వద్ద ప్రక్రియలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 2025–26లో 912 క్లెయిమ్లు నమోదు కాగా.. 783 పరిష్కరించారు. 29 క్లెయిమ్లు ప్రక్రియలో ఉండగా.. మరో 100 పరిష్కారం కావాల్సి ఉంది. ఆగస్టు 13తో ముగిసిన గడువు వారం రోజులు దాటినా కొత్త ప్రీమియంపై ప్రభుత్వం నుంచి స్పష్టత కరువు పథకం కొనసాగింపుపై రైతుల్లో ఆందోళన ఎనిమిదేళ్లలో 7,076 కుటుంబాలకు రూ.353.80 కోట్ల భరోసా -
వాతావరణం
ఆకాశం అప్పుడప్పుడు మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం ఎండగా ఉంటుంది. జల్లులు పడే అవకాశం ఉంది. ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు ● భూభారతి, మీ–సేవ దరఖాస్తులను పరిష్కరించాలి: కలెక్టర్ ఖుష్బూగుప్తా మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు కఠిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో తహసీల్దార్లతో నిర్వహించిన వీసీ లో అడ్డాకల్, భూత్పూర్, మూసాపేట, బాలా నగర్, జడ్చర్ల, చిన్నచింతకుంట, కౌకుంట్ల, గండేడ్ మండలాల్లో ఇసుక తవ్వకాలు, రవాణాపై సమీక్షించారు. ప్రభుత్వ రీచ్ల నుంచి ఇసుక తరలింపునకు నిర్దేశించిన సమయాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. వాహనాలను జీపీఎస్ ద్వారా పర్యవేక్షించడంతో పాటు వీడియో ఆధారాలను నమోదు చేయాలని సూచించారు. దరఖాస్తులు పెండింగ్లో ఉండొద్దు భూభారతి, మీ–సేవ పోర్టళ్లలో 60 రోజులకు పైగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు అవసరమైన ధ్రువపత్రాలు, రిజిస్ట్రేషన్లు సకాలంలో అందేలా అధికారులు శ్రద్ధ వహించాలన్నా రు. ‘ఇందిరమ్మ’ఇళ్ల నిర్మాణం, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. దరఖాస్తులకు ఎంపీడీఓల ద్వారా యూ నిక్ ఐడీలు కేటాయించి ఆన్లైన్లో కనిపించేలా చూడాలన్నారు. లబ్ధిదారుల వివరాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి ధ్రువీకరించాలన్నారు. 22ఏ సమస్యలపై దృష్టి భూ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన 22ఏ నిషేధిత జాబితా సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ప్రైవేట్ పట్టా, ప్రభుత్వ భూముల వివరాల్లోని వ్యత్యాసాలను క్షుణ్ణంగా పరిశీలించి నివేదించాలన్నారు. లైసెన్స్డ్ సర్వేయర్లతో చేపడుతున్న రీసర్వే పనులు ఆశించినస్థాయిలో ఎందుకు ముందు కు సాగడం లేదని అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రాజెక్టులు, ప్రజల భూ లావాదేవీలకు రెవెన్యూ ప్రక్రియ అడ్డంకిగా మారకుండా శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అదనపుకలెక్టర్ హరిప్రియ, శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ సాయిశివాని, భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రామిరెడ్డి, సర్వే, ల్యాండ్ రికార్డ్స్ అధికారి అశోక్ పాల్గొన్నారు. -
సమస్యలను వెంటనే పరిష్కరించాలి: ఎస్పీ
భూత్పూర్: పోలీస్స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారుల సమస్యలను సత్వరం పరిష్కరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ జానకి ఆదేశించారు. గురువారం భూత్పూర్ సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఆమె.. సర్కిల్ పరిధిలోని పోలీస్స్టేషన్ల పనితీరు, నేరాల పరిస్థితి, కేసుల దర్యాప్తు పురోగతిని సమీక్షించారు. ప్రజల్లో పోలీసులపై నమ్మకం మరింత పెరిగేలా బాధ్యతాయుతమైన, ప్రజానుకూల పోలీసింగ్ కొనసాగించాలని సూచించారు. నమోదవుతున్న నేరాలను విశ్లేషిస్తూ నేర నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. పాత నేరస్తులు, రౌడీషీ టర్లు, అనుమానితుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని సీఐ రామకృష్ణకు సూచించారు. భూత్పూర్, మూసాపేట, అడ్డాకుల, దేవరకద్ర, చిన్నచింతకుంట పరిధిలోని జాతీయ రహదారులపై నేరాలు, రోడ్డు ప్రమాదాల నియంత్రణతో పాటు ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఐ, ఎస్ఐలను ఆదేశించారు. ఎస్ఐలు నాగన్న, విద్యా, మురళీ, భాస్కర్రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్కు బలమైన పునాది వేయాలి మహమ్మదాబాద్: విద్యార్థుల అభ్యున్నతికి ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాల ని ఆర్జేడీ సోమిరెడ్డి సూచించారు. గురువారం మహమ్మదాబాద్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో మాట్లాడుతూ ప్రాథమిక స్థాయి నుంచే విద్యా ర్థుల కు బలమైన పునాది కల్పిస్తూ.. పాఠ్యాంశాలపై ఆసక్తి పెరిగేలా బోధనలో నూతన పద్ధతులు అవలంబించాలని సూచించారు. చదువుతోపాటు సంస్కారం, క్రమశిక్షణ అలవర్చాలన్నారు. విద్యార్థుల ప్రగతిని ఎప్పటికప్పు డు సమీక్షిస్తూ, తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. ప్రతి పాఠశాల ఉత్త మ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలోని దుకాణ సముదాయం అద్దెల ద్వారా వచ్చే ఆదాయాన్ని నిబంధనల ప్రకారం ఖర్చు చేయాలని సూచించారు. నిధుల దుర్వి నియోగంపై ఫిర్యాదులు రావడంతో పాఠశాలను సందర్శించిన ఆయన ఆదాయ, వ్యయ వివరాలను పరిశీలించారు. వచ్చిన ప్రతి రూపాయి, చేసిన ఖర్చుపై ఆడిట్ ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎంఈఓ రాజునాయక్ పాల్గొన్నారు. జిల్లాకు చేరిన యూనిఫాం క్లాత్ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేయనున్న యూ నిఫాం క్లాత్ జిల్లాకు చేరింది. రంగుల్లో మార్పు లు చేయడంతో పంపిణీ కొంత ఆలస్యమైనట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని 805 ప్రభు త్వ పాఠశాలల్లో చదువుతున్న 65,515 మంది విద్యార్థులకు ఒక్కో జత యూనిఫాం కోసం 3.55 లక్షల మీటర్ల క్లాత్ చేరింది. ఈ ఏడాది నుంచి విద్యార్థులకు షూలను కూడా అందించనున్నారు. మహబూబ్నగర్ అర్బన్ మండలానికి తొలిసారిగా షూలు చేరాయి. ఇందులో 12,624 బ్లాక్ షూలు, 5,959 వైట్ షూలు ఉన్నాయి. గురుకుల విద్యార్థుల కోసం 9,967 బ్యాగులు కూడా అర్బన్ ఎంఈఓ కార్యాలయానికి చేరాయి. మరోవైపు భూత్పూర్ ఎంఆర్సీకి చేరిన కొత్త యూనిఫాం క్లాత్ను సీఎంఓ సుధాకర్రెడ్డి పరిశీలించారు. 23న కబడ్డీ జట్టు ఎంపిక మహబూబ్నగర్ క్రీడలు: సూర్యాపేట జిల్లా కోదాడలో ఈనెల 11 నుంచి 13వరకు జరిగే రాష్ట్రస్థాయి సీనియ ర్ మహిళా కబడ్డీ టోర్నమెంట్లో పాల్గొనే జి ల్లా సీనియర్ మహిళా జట్టు ఎంపికను ఈనెల 23వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు బి.శాంతికుమార్, ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. క్రీడాకారిణులు ఆధార్కార్డుతో ఉదయం 9 గంటలకు మెయిన్ స్టేడియంలో రిపోర్టు చేయాలని వారు కోరారు. -
ఎస్సీ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ఎస్సీ వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అర్హులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్డీఎఫ్) ప్రగతిపై జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలపై సరైన సమాచారం లేక అర్హులు ప్రయోజనాలు కోల్పోకుండా విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. ఎస్సీ జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలకు, అర్హులైన లబ్ధిదారులకు పథకాల ప్రయోజనాలు అందేలా ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. విద్యాశాఖ ద్వారా స్కాలర్షిప్లు, ప్రీ–మెట్రిక్, పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్లు, ఉన్నత విద్యకు ఆర్థిక సాయం, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా పథకం, పోటీ పరీక్షల కోచింగ్ వంటి కార్యక్రమాల అమలుపై అధికారులు వివరించారు. వైద్య, సంక్షేమ, విద్య తదితర శాఖల ద్వారా ఎస్సీ వర్గాలకు అందుతున్న ప్రయోజనాలపై సమీక్షించారు. ఎస్డీఎఫ్ కేవలం ఒక శాఖకు పరిమితం కాదని, అన్ని శాఖలు తమ పరిధిలో ఎస్సీలకు కేటాయించిన నిధులు, వ్యయం, లబ్ధిదారుల వివరాలు, పెండింగ్ అంశాలపై స్పష్టమైన నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్డీఓ నరసింహులు, ఎస్సీ అభివృద్ధి సంస్థ అధికారి సునీత, సంక్షేమ శాఖ అధికారి జరీనా బేగం, డీఎంహెచ్ఓ శ్రీనివాసులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మనస్తాపంతో యువకుడి బలవన్మరణం
జడ్చర్ల: ప్రేమించిన యువతి ఉన్నత చదువుల కోసం వేరే ప్రాంతానికి వెళ్తుండడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. జడ్చర్ల పరిధిలోని నెక్కొండలో నివాసం ఉంటున్న శ్రావణ్కుమార్ (18) అదే గ్రామంలో ఉంటున్న తన బంధువుల అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. పై చదువుల కోసం సదరు యువతిని ఆమె తల్లిదండ్రులు మరో ప్రాంతానికి పంపించారు. దీంతో మనస్థాపం చెందిన యువకుడు మంగళవారం యువతికి వీడియో కాల్ చేసి తాను ఒంటరిగా ఇక్కడ ఉండలేకపోతున్నానని చెప్పి, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా అతడు గదిలో ఫ్యాన్కు ఉరి వేసుకున్న విషయాన్ని కుటుంబ సభ్యులు ఆలస్యంగా గుర్తించగా అప్పటికే మృతి చెందాడు. మృతుడి తల్లి వస్పుల అనురాధ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ కమలాకర్ తెలిపారు. చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి జడ్చర్ల: చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన జడ్చర్ల పరిధిలో చోటు చేసుకుంది. బా ధితు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని ఇంద్రనగర్కు చెందిన పంబాల రమేష్ (42) సోమవారం జడ్చర్ల సమీపంలోని కన్నరెడ్డి బావిలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ఆయన రెండు రోజులుగా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టు పక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. కాగా బుధవారం ఇంద్రనగర్ సమీపంలోని బావిలో ఆయన మృతదేహం నీటిపై తేలడంతో గమ నించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న వారు మృతదేహాన్ని బయటికి తీశారు. ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడ్డాడని, మృతుడి భార్య సంధ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ కమలాకర్ తెలిపారు. చెంచుగూడెంలో గిరిజన యువకుడి హత్య కొల్లాపూర్ రూరల్: మండలంలోని లచ్చనాయక్తండా పంచాయతీ పరిధిలోని చెంచుగూడెంలో మంగళవారం రాత్రి తిరుగుడు సన్నయ్య (40) హత్యకు గురయ్యాడు. గ్రామస్తులు వివరాలు.. తిరుగుడు సన్నయ్య తన పెద్దన్న భార్య సాలమ్మతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఆమె కుమారుడు తిరుగుడు ఎల్లయ్య రాత్రి 10 గంటలకు సన్నయ్య ఇంటికి వెళ్లి ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో మాటామాటా పెరిగడంతో ఎల్లయ్య కర్రెతో సన్నయ్య తలపై కొట్టగా.. తీవ్ర గాయమైంది. బుధవారం ఉదయం గ్రామస్తులు వెళ్లి చూడగా అప్పటికే సన్నయ్య మృతి చెందాడు. అనుమానంతో ఎల్లయ్యను గ్రామస్తులు ప్రశ్నించడంతో తానే కొట్టినట్లు నేరం అంగీకరించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించినట్లు పేర్కొన్నారు. మృతుడి తమ్ముడు వెంకటేష్ ఫిర్యాదు మేరకు ఎల్లయ్యపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ బండారు ఆనంద్ తెలిపారు. 11 యూనిట్లలో విద్యుదుత్పత్తి ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు దిగువ, ఎగువ జల విద్యుదుత్పత్తి కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతుంది. ఈ మేరకు బుధవారం 11 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 6 యూనిట్ల ద్వారా 234 మెగావాట్లు, దిగువలో 5 యూనిట్ల ద్వారా 200 మెగావాట్ల విద్యుదుత్పత్తిని చేపడుతున్నారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటి వరకు 123.558 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని విజయవంతంగా చేపట్టామన్నారు. విద్యుదుత్పత్తికి 40 వేల క్యూసెక్కుల నీటిని వినియోగించి శ్రీశైలానికి వదులుతున్నామని తెలిపారు. -
కార్గో సేవలు పునఃప్రారంభం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నగరంలోని ఆర్టీసీ కొత్త బస్టాండులో ఎట్టకేలకు కార్గో సేవలు పునఃప్రారంభమయ్యాయి. వాస్తవానికి ఈ నెల 1 నుంచి ఈ సేవలు నిలిచిపోవడంతో వ్యాపారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఓ ప్రైవేట్ సంస్థ అన్ని బస్టాండ్లలో కార్గో ద్వారా సరుకుల రవాణాకు ఈసారి టెండరు దక్కించుకుంది. అయితే పది రోజులైనా మహబూబ్నగర్లో ఏజెన్సీ నిర్వహణ బాధ్యతలు చేపట్టకపోవడంతో ఆర్టీసీ ద్వారా సరుకుల బుకింగ్కు ఆస్కారం లేకుండాపోయింది. ఇదే విషయమై ‘నిలిచిపోయిన కార్గో సేవలు’ శీర్షికన ఈ నెల 11న ‘సాక్షిశ్రీలో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీనికి ఉన్నతాధికారులు స్పందించి సంబంధిత ఏజెన్సీతో మాట్లాడి తిరిగి ఇప్పుడు కార్గో సేవలను అందుబాటులోకి తెచ్చారు. -
భక్తిశ్రద్ధలతో మండల పూజలు
అలంపూర్ క్షేత్రంలో వెలిసిన శ్రీ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం రెండో రోజు మండల పూజలు కొనసాగాయి. శ్రీజోగుళాంబ అమ్మవారి ఆలయంలో శ్రీచక్ర ప్రతిష్ఠాపన జరిగి 40 రోజులు కావడంతో మూడు రోజుల పాటు శృంగేరి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి స్వామివారి శిష్యులు అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని, స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని హోమ మండపంలో హోమ పూజలు నిర్వహించారు. అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేసి, ఆశీర్వచనం పలికారు. అలంపూర్ -
నదిలో దూకిన యువతి: కాపాడిన గజఈతగాడు
ఎర్రవల్లి: కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెందిన ఓ యువతి కృష్ణానదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేయగా ఓ గజఈతగాడు చాకచక్యంగా వ్యవహరించి నిండు ప్రాణాన్ని కాపాడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం మేరకు.. అయిజ మండలంలోని పులికల్ గ్రామానికి చెందిన ఓ యువతి తండ్రి నిత్యం మద్యం తాగి కుటుంబ సభ్యులతో గొడవపడుతూ ఉండేవాడు. ఈ సంఘటనపై పలుమార్లు అయిజ పీఎస్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో మనస్తాపానికి గురైన యువతి మంగళవారం సాయంత్రం బీచుపల్లి కృష్ణానది బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకింది. ఈ క్రమంలో జాతీయ రహదారిపై వెళ్తున్న ప్రయాణికులు గమనించి కేకలు వేయడంతో స్థానికుల సమాచారం మేరకు కొండపేటకు చెందిన గజఈతగాడు బాబు జోరువానలో పుట్టీ సహాయంతో ఆమె ప్రాణాలను కాపాడాడు. ఇటిక్యాల ఎస్ఐ రవిరాథోడ్ సంఘటనా స్థలానికి చేరుకొని యువతికి కౌన్సెలింగ్ చేసి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. జోరువానలో యువతి ప్రాణాలను కాపాడిన బాబును పలువురు అభినందించారు. -
అంగన్వాడీ కేంద్రంలో నాగుపాము కలకలం
గట్టు : మండల పరిధిలోని మాచర్ల అంగన్వాడీ కేంద్రంలో బుధవారం నాగుపాము కలకలం రేపింది. ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో మధ్యాహ్నం చిన్నారులు బయటకు వెళ్లిన సమయంలో కోడిగుడ్లు నిల్వ ఉంచిన చోట శుభ్రం చేస్తుండగా ఆయా నర్సమ్మకు నాగుపాము కన్పించింది. ఈ క్రమంలో ఆమె భయాందోళనకు గురైంది. అనంతరం సిబ్బంది ఆరగిద్దకు చెందిన స్నేక్ క్యాచర్ మహబూబ్కు సమాచారం ఇవ్వగా నాగుపామును చాకచక్యంగా పట్టుకొని సమీప అటవీ ప్రాంతంలో వదిలేశారు. క్వార్టర్స్లో.. వనపర్తి టౌన్: సమీకృత కలెక్టరేట్ వెనకాల ఉన్న క్వార్టర్స్లో బుధవారం పాము కలకలం రేపింది. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ అధికారి, సాగర్ స్నేక్ సొసైటీ అఽ ద్యక్షుడు చీర్ల కృష్ణసాగర్ అక్కడికి చేరుకొని రిఫ్రిజిరేట ర్ కింద ఉన్న పామును పట్టుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణసాగర్ మాట్లాడుతూ.. పాము జర్రిపోతు జా తికి చెందిందని, సుమారు 8 అడుగులు పొడుగు ఉందన్నారు. అనంతరం సమీప అటవీ ప్రాంతంలో పా మును సరక్షితంగా వదిలేశామన్నారు. కార్యక్రమంలో స్నేక్ సొసైటీ సభ్యుడు కుమార్, నాసిర్ పాల్గొన్నారు. -
గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం
రాజాపూర్: మండలంలోని రంగారెడ్డిగూడ వద్ద జాతీయ రహదారి పక్కన హెచ్పీ పెట్రోల్ పంపు సమీపంలో 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు గల గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించినట్లు బుధవారం రాజాపూర్ ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్పీ జానకి ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆధారాలపై పోలీసు అధికారులను ఆరా తీశారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేపట్టి మృతురాలు ఎవరనేది గుర్తించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మృతురాలిని ఎవరైనా గుర్తించినా, ఆమెకు సంబంధించిన వ్యక్తులు, ఇతర సమాచారం ఎవరికై నా తెలిస్తే వెంటనే రాజాపూర్ పోలీసులకు సెల్ నంబర్ 87126 59347, జడ్చర్ల రూరల్ సీఐ నంబర్ 87126 59315కు సమాచారం ఇవ్వాలని కోరారు. -
వన్డే లీగ్లో పాలమూరు శుభారంభం
● 22 పరుగుల తేడాతో విక్టరీ జట్టుపై విజయం మహబూబ్నగర్ క్రీడలు: హైదరాబాద్లో జరుగుతున్న సీ–డివిజన్ వన్డే లీగ్ చాంపియన్షిప్లో హెచ్సీఏ డిస్ట్రిక్ట్–4 (మహబూబ్నగర్) జట్టు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్లో జిల్లా జట్టు 22 పరుగుల తేడాతో విక్టరీ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన హెచ్సీఏ డిస్ట్రిక్ట్–4 జట్టు 39 ఓవర్లలో 7 వికెట్లకు 212 పరుగులు చేసింది. జట్టులో ఓపెనర్ పి.రామ్కుమార్చారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 102 బంతుల్లో 12 ఫోర్లతో 97 పరుగులు చేశాడు. విక్టరీ బౌలర్ సమిత్వర్మ నాలుగు వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన విక్టరీ జట్టు 35.1 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో ఓంకారేశ్వర్ 93 పరుగులు చేశాడు. జిల్లా బౌలర్లు అభినవ్ 3, శ్రీశాంత్, ఎండీ సోహైల్, వసికర్, ధనుష్ చెరో వికెట్ తీశారు. వన్డే లీగ్లో జిల్లా జట్టు విజయం సాధించడంపై ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. రానున్న మ్యాచుల్లో ఇదే స్ఫూర్తితో ఆడి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. -
బెండసాగుతో అధిక లాభాలు
మిడ్జిల్: తక్కువ నీరు.. తక్కువ పెట్టుబడితో 45 రోజుల్లో చేతికొచ్చే పంట బెండ. ఈ ఖరీఫ్ సీజన్లో వర్షాభావ పరిస్థితుల్లో బెండ గు రైతులకు ఎంతో అనువైందని మండల వ్యవసాయ అధికారి సిద్దార్థ అన్నారు. సరైన పద్ధతులు పాటించకపోయిన, పురుగు మందులు సకాలంలో పిచికారీ చేయని నేపథ్యంలో వైరస్ సోకి పంట దిగుబడి సగానికి పడిపోతుందని, రైతులు అధిక లాభాలు పొందేందుకు వ్యవసాయ అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొంటున్నారు. భూమి తయారీ : బెండకు నల్లరేగడి, ఎర్రచల్కలు, నీరు నిల్వ ఉండని పొలం అనువైంది. ఎకరాకు 10 టన్నుల పశు వుల ఎరువు, చివరి దుక్కిలో 40 కిలోల సూపర్ పాస్ఫేట్ 10 కిలోల పొటాష్ వేసుకోవాలి. పొలంలో 6 అడుగులకు అడుగు లోతు కాల్వ తీయాలి. విత్తనాల ఎంపిక : పర్బని క్రాంతి, ఆర్కఅనామిక, వరద సు ర్వి రకాలు మన వాతవరణానికి తట్టుకుంటాయి. విత్తే ముందు కిలోకు 2 గ్రాముల కార్బిండిజమ్ 2 గ్రాముల థైరంతో శుద్ధిచేసుకోవాలి. ఎకరానికి 3.5 కిలోల విత్తనం అవసరం ఉంటుంది. వరుసల మధ్య (సాళ్ల)60 సెం.మీటర్లు, మధ్య 30 సెం.మీటర్లు ఉండాలి. లోతు 2– 3 సెం.మీటర్లు ఉండాలి. గింజను ఎక్కువ లోతులో వేస్తే మొలకరాదు. వర్షం ముందు విత్తి నీరు నిలిచి గింజ కుళ్లిపోతుంది. నీటి యాజమాన్యం : బెండకు తక్కువ నీరు సరిపోతుంది. కానీ క్రమం తప్పకుండా తేమ ఉండాలి. విత్తనం విత్తిన వెంటనే ఒక తడి, తర్వాత 7– 8 రో జులకు, పూత, కాయదశలో 5–6 రోజులకు ఒక సా రి తడి ఇవ్వాలి.ఎక్కువ నీరు ఇస్తే పూత రాలిపో తుంది.కరువు వస్తే కాయలు చిన్నవిగా, గరుకుగావుతా యి. డ్రిప్ ఇరిగేషన్ ఉంటే 70 శాతం ఆదా అ వుతుంది. 20 శాతం పంట దిగుబడి పెరుగుతుంది. ఎరువుల యాజమాన్యం : బేసల్ డోస్ తర్వాత మొదటి కలుపు సమయంలో ఎకరాకు 30 కిలోల వేసుకోవాలి. పూత మొదలైనప్పుడు మరో 20 కిలోల యూరియా 10 కిలోల పొటాష్ వేసుకోవాలి. సూక్ష్మపోషకాలు: పూతదశలో ఎకరాకు 55 గ్రాముల చిలేటేడ్ జింక్, 500 గ్రాముల బోరాన్ను 200 లీటర్ల నీటీతో కలిపి పిచికారీ చేస్తే పూత రాలడం తగ్గి కాయలు ఎక్కువగా వస్తాయి. ఎక్కువ నత్రజని వేస్తే కాయకంటే ఆకు ఎక్కువగా వస్తుంది. కలుపు యాజమాన్యం: పంటలో మొదటి 30– 40 రోజులు కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తిన 20, 40 రోజులకు రెండుసార్లు కలుపు తీయాలి. ప్రత్యామ్నాయంగా విత్తిన మూడు రోజుల్లో ఎకరాకు 88 మి.లీటర్ల పెండిమిథలిన్ 200 లీటర్లతో కలిపి పిచికారీ చేస్తే కలుపు రాదు. పురుగులు, నివారణ: ● చెన్నపురుగు: ఆకులను అంచుల నుంచి తినేయడం. నివారణ: కిలోకు 5 కిలోల వేప గింజల కషాయం పిచికారీ చేయాలి. తీవ్రంగా ఉంటే 2 మి.లీ. ప్రొఫెనోఫాస్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ● ప్రూట్ బోరర్: కాయలో రంధ్రం చేసి గుజ్జును తినడం. నివారణకు దెబ్బతిన్న కాయలను కోసి పూడ్చివేయాలి, 2 మి.లీటర్లు క్లోరాంట్రానిలిప్రోల్ 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. కోతకు ఏడు రోజుల ముందు ఏ రసాయన మందు పిచికా రీ చేసిన మార్కెట్లో కాయలు నిల్వ ఉండవు. తెగుళ్లు, నివారణ: పసుపు నరాల మొజాయిక్ వైరస్: ఇది బెండలో అతిపెద్ద శుత్రువు. తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది. ఆకుల నరాలు పసుపుగా మారి మొక్క ఎదుగుల ఆగిపోతుంది. నివారణకు ఎల్లోవీన్ మోసాయిక్ వైరస్ నిరోధక రకాలు వేయాలి. విత్తిన 20 రోజుల నుంచి 10 రోజులకు ఒకసారి వేపనూనె కొట్టాలి. తెగులు వచ్చిన మొక్కలను వెంటనే పీకి పారేయాలి. ● బూడిద తెగులు: ఆకులపై తెల్లని పొడి ఉంటే నివారణకు 2 గ్రాముల సల్ఫర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. దిగుబడి: మంచి యాజమాన్య పద్ధతులు, వ్యవసాయాధికారుల సూచనలు పాటిస్తే ఎకరాకు 80 నుంచి 100 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. దీంతో అధిక లాభాలు పొందవచ్చు. పాడి–పంట -
కలగానే మినీ ట్యాంక్బండ్
దేవరకద్ర: పట్టణంలో మినీ ట్యాంక్బండ్ నిర్మాణం పూర్తయితే ఉదయం, సాయంత్రం వేళల్లో కాలక్షేపం చేయడంతో పాటు కుటుంబాలతో ఆహ్లాదకరంగా గడపొచ్చనే స్థానికుల ఆశలు ఇప్పట్లో నెరవెరేలా లేవు. దేవరకద్ర పెద్ద చెరువును మినీ ట్యాంక్బండ్గా మార్చడానికి 2017 మే 16న అప్పటి రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి, ఇప్పటి ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. రూ.5.56 కోట్లతో పరిపాలన అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభించారు. జిల్లా కేంద్రంతో పాటు ఇతర నియోజకవర్గాల్లో మినీ ట్యాంక్బండ్ పనులు పూర్తయినా నియోజకవర్గ కేంద్రంలో మాత్రం పనులు ముందుకు సాగడం లేదు. కేవలం 30 శాతం పనులే.. తొమ్మిదేళ్ల కాలంలో మినీ ట్యాంక్ బండ్ నిర్మాణంలో కేవలం 30 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. ప్రారంభంలో పనులు చేపట్టిన కాంట్రాక్టర్ కట్టను బలోపేతం చేసే పనులు కొంత వరకు చేశారు. రెండేళ్లు గడిచిన తర్వాత పనులు ముందుకు సాగకపోవడం, కాంట్రాక్టర్ చేతులెత్తయడంతో మొదటి కాంట్రాక్టు రద్దు చేసి రెండో కాంట్రాక్టర్కు పనులు అప్పగించారు. రెండో కాంట్రాక్టర్ ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో అఽధికార పార్టీ ఎమ్మెల్యే కావడం విశేషం. మంజూరైన నిధుల్లో రూ.1.80 కోట్ల మేరకు పనులు పూర్తి చేసినట్లు అధికారులు అంచనా వేశారు. రెండో కాంట్రాక్టర్ కూడా పనులు చేపట్టకుండా వదిలేయడంతో మినీ ట్యాంక్బండ్ నిర్మాణం 9 ఏళ్లు గడిచినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మిగిలింది. దేవరకద్ర మినీ ట్యాంక్బండ్ పనులు రద్దు కాలేదు. 2017లో పనులు ప్రారంభమైన సమయంలో మా సబ్ డివిజన్ కార్యాలయం లేదు. 2021లో సబ్ డివిజన్ ఏర్పాటు చేశారు. కొంత వరకు పనులు చేపట్టి కట్టను వెడల్పు చేసి బలోపేతం చేశారు. ఆ తర్వాత పనులు నిలిచిపోయాయి. గత ప్రభుత్వ హయాంలో మిషన్ కాకతీయ పథకం కింద చేపట్టిన పనులు, ఇప్పటికీ పెండింగ్లో ఉన్న వాటి వివరాలను ప్రభుత్వానికి అందజేశాం. వాటిపై ప్రభుత్వ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. త్వరలో పెండింగ్ పనులను తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది. –ప్రతాప్సింగ్, ఈఈ, సబ్ డివిజన్ దేవరకద్ర రూ.5.56 కోట్లతో 2017లో పనులు ప్రారంభం 9 ఏళ్లు గడిచినా పూర్తి కాని వైనం పెండింగ్ పనుల వివరాల సేకరణలో ప్రభుత్వం -
గుండుమాల్ మోడల్ స్కూల్లో విచారణ
కోస్గి రూరల్: గుండుమాల్ మోడల్ స్కూల్లో బోరు మోటార్ ఆన్ చేసే క్రమంలో విద్యార్థిని విద్యుదాఘాతానికి గురైన ఘటనపై తహసీల్దార్ భాస్కరస్వామి ఆదేశాల మేరకు బుధవారం పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టినట్లు డిప్యూటీ తహసీల్దార్ జ్యోత్స్న తెలిపారు. మోడల్ స్కూల్లో ద్వితీయ సంవత్సరం చదువుతున్న అంకిత విద్యుదాఘాతానికి గురి కావడంతో కుడి చేయికి తీవ్ర గాయం అయిందన్నారు. ఆ సమయంలో సమయంలో సిబ్బంది ఎవరూ అందుబాటులో లేరన్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలలో ప్రిన్సిపాల్, సిబ్బందిని వేర్వేరుగా విచారించామని, మోటార్ స్టార్టర్ పనితీరును పరిశీలించామని, సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్ఐ శ్రీకాంత్, వెంకట్రామలు, సీనియర్ అసిస్టెంట్ మధుసూదన్ తదితరులు ఉన్నారు. -
కోయిల్సాగర్ నీటి విడుదల
● చెరువులు నింపడానికే ప్రాధాన్యం ● కొత్తగా తుకాలు పోయవద్దని విజ్ఞప్తి ● ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి దేవరకద్ర/మరికల్: చెరువులను నింపడంతో పాటు భూగర్భ జలాల పెంపు కోసమే కోయిల్సాగర్ నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నామని ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి తెలిపారు. బుధవారం ఎడమ కాల్వకు ఎమ్మెల్యే జీఎమ్మార్, కుడి కాల్వకు నారాయణపేట మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డి కోయిల్సాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నీటి లభ్యత లేకున్నా.. రైతులకు సాగునీటిని అందించాలనే ప్రయత్నంలో భాగంగా వారం రోజుల పాటు నీటి విడుదల కొనసాగుతుందన్నారు. రైతులు కొత్తగా తుకాలు పోయొద్దని విజ్ఞప్తి చేశారు. సాధారణంగా రిజర్వాయర్లో కనీసం 1.5 టీఎంసీల నీరు ఉన్నప్పుడే సాగుకు నీటిని విడుదల చేయాల్సి ఉంటుందని, కానీ ప్రస్తుతం ప్రాజెక్టులో కేవలం 0.9 టీఎంసీల నీరు మాత్రమే ఉందని తెలిపారు. ఇందులో 0.6 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు నిల్వ ఉంచి మిగతా నీటిని వదలుతున్నట్లు పేర్కొన్నారు. ఉంద్యాల వద్ద రెండు పంపులను రన్ చేసి కోయిల్సాగర్కు నీటిని తరలిస్తున్నామన్నారు. వారం రోజుల తరువాత రిజర్వాయర్లో నీటి మట్టం ఎంతమేర పెరుగుతుందో పరిశీలించి అందుబాటులో ఉన్న నీటి ఆధారంగా సాధ్యమైనంత మేర రైతులకు సాగునీటిని అందించే ప్రయత్నం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఈఈ ప్రతాప్సింగ్, నాయకులు యుగంధర్రెడ్డి, వెంకటేశ్, మదన్, చందుగౌడ్, గోపాల్, భరత్, ప్రేమ్కుమార్, రాజుగౌడ్, పేట డీసీసీ ఉపాధ్యక్షుడు సూర్యమోహన్రెడ్డి, విండో అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, మండల అధ్యక్షుడు హర్షవర్ధన్రెడ్డి, సర్పంచ్ చెన్నయ్య, హరీష్, ఆంజనేయులు, వీరన్న, రఘు తదితరులు పాల్గొన్నారు. -
కౌన్సెలింగ్.. చికిత్స
గంజాయి బాధితులకు చికిత్స కోసం మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రిలో డీ–అడిక్షన్ సెంటర్ ప్రారంభించారు. ఇందులో 30 మంది గంజాయి పాజిటివ్ బాధితులకు కౌన్సెలింగ్ నిర్వహణ కొసాగుతుంది. వీరిలో 20 మందిని ఆస్పత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందించారు. పాజిటివ్ వచ్చిన వారికి ఆరు వారాలపాటు కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత 7 నుంచి 8 వారాల తర్వాత మరోసారి పరీక్ష చేసి నెగెటివ్ రిపోర్ట్ ఆధారంగా సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఇలా ఇప్పటి వరకు ఆస్పత్రి నుంచి 7 మందికి నాన్ గంజాయి అడిక్టర్స్ సర్టిఫికెట్స్ ఇచ్చారు. -
‘సర్’పై తదుపరి యాక్షన్ ప్లాన్
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): సర్– 2026లో భాగంగా రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితాపై నోటీసుల జారీ, తదుపరి చర్యలకు సంబంధించి యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డి వీసీ నిర్వహించారు. వీసీ అనంతరం కలెక్టర్ ఆగస్టు 17, 2026 నాటికి మహబూబ్నగర్, జడ్చర్ల, దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలను అధికారులు సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ జిల్లాలో ఎస్ఐఆర్–2026 కింద రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో మహబూబ్నగర్ నియోజకవర్గంలో 2,13,588 మంది, జడ్చర్లలో 1,99,354 మంది, దేవరకద్రలో 2,16,460 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం సాధారణ ఓటర్లలో 3,13,256 మంది పురుషులు, 3,16,107 మంది మహిళలు, 19 మంది ఇతరులు ఉండగా.. అదనంగా 20 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు నమోదయ్యారని చెప్పారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో 40,116 మంది ఓటర్ల నో మ్యాపింగ్ ఉండగా, 1,96,576 లాజికల్ డిస్క్రెపెన్సీలు గుర్తించారని, వీటిని త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. పెండింగ్లో ఉన్న మ్యాపింగ్, లాజికల్ డిస్క్రెపెన్సీలు, బీఎల్ఓల అప్డేషన్స్, సమావేశాల మినిట్స్ను త్వరితగతిన పూర్తి చేసి, తుది ఓటర్ల జాబితా ప్రక్రియను సజావుగా ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు. వీసీలో అదనపు కలెక్టర్లు మధుసూదన్నాయక్, హరిప్రియ, ఆర్డీఓ నవీన్, ఎలక్షన్ అధికారి జాఫర్, అర్బన్ తహసీల్దార్ ఘన్సీరాం తదితరులు పాల్గొన్నారు. టెండర్లు రద్దు చేయాలని వినతి స్టేషన్ మహబూబ్నగర్: చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్లోని కురుమూర్తిస్వామి ఆలయంలో లడ్డూ, పులిహోర, పూజా సామగ్రి, టెంకాయల టెండర్లు రద్దు చేయాలని కోరు తూ వీహెచ్పీ ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని దేవాదాయఽ ధర్మాదాయశాఖ కార్యాలయంలో అధికారికి వినతిపత్రం అందజేశారు. టెంకాయలు, లడ్డూ, పులిహోర విక్రయాలను దేవస్థానం ఆధ్వర్యంలోనే నిర్వహించాలని కో రారు. భక్తుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని, అన్ని వస్తువుల నిర్ణీత ధరల పట్టిక బహిరంగ బోర్డులు ఏర్పాటు చేయాలని, ప్రసాదాల నాణ్యత, పరిశుభ్రత, ఆహార భద్రతా ప్రమాణాలు పక్కాగా అమలు చేయాలని వినతిలో కోరారు. గతంలో మాదిరిగా చిరు వ్యాపారులు అమ్ముకోవడానికి అవకాశం కల్పించాలని విన్నవించారు. వినతిపత్రం అందజేసిన వారిలో వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు యాదిరెడ్డి, నాయకులు జనార్దన్, విఘ్నేష్, సుదర్శన్, విశ్వేశ్వర్ తదితరులున్నారు. ఆర్టీసీ అభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకం మహబూబ్నగర్ మున్సిపాలిటీ: తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల పాత్ర ఎంతో కీలకమని ఎన్ఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి అన్నారు. బుధవారం నగరంలోని తెలంగాణ చౌరస్తా వద్ద టీఎన్జీఓల భవనంలో నిర్వహించిన ఎన్ఎంయూ మహబూబ్నగర్ డిపో సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆర్టీసీ ఉద్యోగుల తలరాత రాసే పూర్తిస్థాయి ఉద్యోగ భద్రతతో కూడిన విలీన ప్రక్రియ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకున్నప్పుడే తాము అనుకున్నవి సాధించుకోగలుగుతామన్నారు. వచ్చే గుర్తింపు సంఘం ఎన్నికల్లో తమ సంఘాన్ని గెలుపు తీరాలకు చేర్చాల్సిన బాధ్యత కార్మికులందరిపై ఉందన్నారు. అంతకు ముందు డిపో కమిటీ అధ్యక్షుడిగా చంద్రశేఖర్, కార్యదర్శిగా భానుప్రకాష్రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నారాయణ, మధుసూదన్, శ్రీనివాసులు, నాయకులు చంద్రయ్య, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
హాస్టళ్లలో విద్యా ప్రమాణాలు మెరుగుపర్చాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): హాస్టల్ విద్యార్థుల సంక్షేమం, విద్యా ప్రమాణాల మెరుగుదలకు సమర్థవంతంగా పనిచేయాలని అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ అన్నారు. బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి సంక్షేమ హాస్టళ్ల అధికారులతో వీసీ నిర్వహించి మాట్లాడారు. విద్యార్థులకు సురక్షితమైన వసతి, నాణ్యమైన భోజనం, పరిశుభ్రమైన వాతావరణం, ఆరోగ్య సంరక్షణ, నాణ్యమైన విద్య అందేలా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. విద్యార్థులకు ప్రభుత్వం అందించే పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, దుస్తులు, బెడ్డింగ్, ట్రంక్ బాక్సులు, ప్లేట్లు, గ్లాసులు, ఇతర అవసరమైన సామగ్రి సకాలంలో పంపిణీ చేయాలని, రికార్డులను సక్రమంగా నిర్వహించాలని చెప్పారు. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ హాజరు, పరీక్షల ఫలితాలు, మార్కుల పురోగతిని పర్యవేక్షించాలన్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు హెల్త్ కార్డులు, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అందుబాటులో ఉంచాలని, అనారోగ్యానికి గురైన విద్యార్థులను సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య సేవలు అందించాలని సూచించారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకునేందుకు ప్రతి త్రైమాసికం తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించి, విద్యార్థుల చదువు, ఆరోగ్యం, ప్రవర్తన, సంక్షేమంపై తల్లిదండ్రులతో చర్చించాలని ఆదేశించారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం క్రీడలు, సాంస్కృతిక, ఇతర సహ పాఠ్య కార్యక్రమాలు ప్రోత్సహించాలని పేర్కొన్నారు. హాస్టళ్లను శుభ్రంగా ఉంచాలని, ఎక్కడా మురుగు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దోమలు, ఈగలు, ఇతర కీటకాలు పెరగకుండా అవసరమైన ఫాగింగ్, యాంటీ లార్వా ఇతర పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు. -
రేషన్ బియ్యం తూకంలో తేడా ఉండొద్దు
పాలమూరు: రేషన్ దుకాణాల్లో జరుగుతున్న బియ్యం తూకాల్లో తేడాలను, ఇతర అక్రమాలను జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారులు వెలుగులోకి తెచ్చారు. జిల్లా అధికారి రవీందర్ ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని షాసాబ్గుట్ట ఏరియాలో ఉన్న మూడు రేషన్ దుకాణాలు ఆకస్మికంగా తనిఖీ చేయగా.. రెండు దుకాణాల్లో స్టాక్ లేకపోవడంతో స్టాక్ ఉండి పంపిణీ చేస్తున్న 35వ దుకాణంలో తనిఖీలు చేశారు. ఈ దుకాణంలో ఒక రేషన్కార్డుదారుడికి ఇచ్చిన 50 కిలోల బియ్యం బస్తాను మళ్లీ అక్కడే తూకం వేయగా 48.670 కిలోలు వచ్చింది. దీంతో బస్తా బరువు 560 గ్రాములు తీసివేయగా మరో 1.800 కిలోల బియ్యం కార్డుదారుడికి తక్కువగా ఇచ్చినట్లు తేలింది. దీంతో సదరు దుకాణ డీలర్పై తూనికలు, కొలతల శాఖ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు అధికారి వెల్లడించారు. ఈ క్రమంలో గోదాం నుంచే తక్కువగా వస్తుందని పలువురు డీలర్లు అధికారి దృష్టికి తీసుకువెళ్లడంతో అక్కడి నుంచి నేరుగా వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉన్న గోదాం (స్టాక్ పాయింట్)లో తనిఖీ లు చేయగా అక్కడ సక్రమంగా ఉందని తేలింది. ప్రస్తుతం 3 నెలలకు సరిపడా బియ్య ం ప్రభుత్వం అందిస్తుండ గా కొందరు డీలర్లు తక్కు వ చేసి ఇస్తున్నట్లు తేలిందన్నారు. జి ల్లాలో డీలర్లు ఎవరైనా బియ్యం తక్కువ చేసి ఇస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండల స్థాయి స్టాక్ పాయింట్ నుంచి రేషన్ దుకాణాలకు సక్రమంగా స్టాక్ పంపిణీ చేయాలని సూచించారు. -
సింథటిక్ ట్రాక్ పనులకు ముందడుగు
మహబూబ్నగర్ క్రీడలు: ఉమ్మడి జిల్లాకే తలమానికమైన నగరంలోని మెయిన్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్కు ముందడుగు పడింది. రూ.10.70 కోట్ల నిధులతో మెయిన్ స్టేడియంలో ఎంతో అధునాతనమైన సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ ఏర్పాటు చేయనున్న పనులకు మోక్షం లభించింది. 400 మీటర్ల పొడవు 8 లైన్ల సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్ నిర్మాణ పనులు గత రెండో రోజుల నుంచి మెయిన్ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మట్టిని తీత, గడ్డి తొలిగించే పనులు కొనసాగుతున్నాయి. ట్రాక్ నిర్మాణం పూర్తయితే అథ్లెట్లకు మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తాయి. ట్రాక్లో అంతర్జాతీయ స్థాయిలో సౌకర్యాలు ఉంటాయి. సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్ ఏర్పాటు అయితే మెయిన్ స్టేడియంలో జాతీయ స్థాయి టోర్నీలు నిర్వహించే అవకాశం ఉంటుంది. జిల్లాకు చెందిన అథ్లెట్లు హైదరాబాద్లో కాకుండా ఇక్కడి సింథటిక్ ట్రాక్లో రెగ్యులర్గా ప్రాక్టిస్ చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. అథ్లెట్లకు రన్నింగ్లో టైమింగ్ను మెరుగుపరుచుకోవచ్చు. మెయిన్ స్టేడియంలో వర్షం వచ్చిన్నప్పుడల్లా స్టేడియంలో నీళ్లు చేరి అథ్లెట్లు ప్రాక్టిస్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడేది. సింథటిక్ ట్రాక్ ఏర్పాటుతో ఇలాంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకుంటారు. దీంతో వర్షపు నీళ్లు ట్రాక్లో నిలిచే అవకాశం ఉండదు. మెయిన్ స్టేడియంలో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ ఏర్పాటు కానుండడంతో జిల్లా అథ్లెట్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి అథ్లెటిక్స్ ట్రాక్ ఏర్పాటు కావాలని కోరుతున్నామని, ఇప్పుడు నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొంటున్నారు. త్వరగా పనులు పూర్తి చేసి.. అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మెయిన్ స్టేడియంలో రూ.10.70 కోట్లతో నిర్మాణం అథ్లెట్లకు అందుబాటులోకి మెరుగైన వసతులు ట్రాక్ పూర్తయితే జాతీయ పోటీలకు అవకాశం -
తల్లిదండ్రులు గమనించాలి..
తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై నిత్యం పర్యవేక్షణ చేస్తుండాలి. వారు ఎలాంటి స్నేహితులతో తిరుగుతున్నారు.. ఎలా చదువుతున్నారు అనేది చూడాలి. మత్తు పదార్థాలు అధికంగా వాడటం వల్ల నరాల వ్యవస్థలను దెబ్బతీస్తుందని, మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తుంది. ఎప్పుడైనా అందుబాటులో లేకపోతే ఒక్కోసారి మనిషి విచక్షణ కోల్పోయి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాడు. కొన్ని సందర్భాల్లో సైకోగా మారి ఇతరులకు నష్టం చేయడం కానీ లేదా తనకు తాను గాయపరుచుకోవడం లేదంటే ఆత్మహత్యకు పాల్పడుతుంటారు. – అనిల్ రాజ్, మానసిక వైద్యుడు, జనరల్ ఆస్పత్రి, మహబూబ్నగర్ విస్తృతంగా తనిఖీలు.. జిల్లాలో గంజాయి సరఫరా కట్టడికి పోలీస్ శాఖ విస్తృతంగా తనిఖీలు చేపడుతోంది. ప్రతి పోలీస్ స్టేషన్లో గంజాయి పరీక్ష కిట్లు అందుబాటులో ఉన్నాయి. అనుమానాస్పదంగా కనిపిస్తే తప్పక పరీక్షలు చేస్తున్నాం. పాజిటివ్ వస్తే వెంటనే జనరల్ ఆస్పత్రి డీ–అడిక్షన్ సెంటర్కు తరలించి కౌన్సెలింగ్, చికిత్స అందిస్తున్నాం. దీంతోపాటు కళాశాల, పాఠశాల, వైద్య కళాశాలల్లో మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. – వెంకటేశ్వర్లు, డీఎస్పీ, మహబూబ్నగర్ ప్రత్యేక దృష్టిపెట్టాం.. ఉమ్మడి జిల్లాలో ఎకై ్సజ్ శాఖ నుంచి ఎన్ఫోర్స్మెంట్ బృందాలు ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇటీవల జడ్చర్ల ఏరియాలోని పరిశ్రమలు ఉండే ప్రాంతంలో విస్తృతంగా సోదాలు చేశాం. గంజాయి వినియోగం జరుగుతుందనే సమాచారం వచ్చిన ఏరియాలపై ప్రత్యేక దృష్టిపెట్టి దాడులు చేస్తున్నాం. – శ్రీనివాసులు, ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్, ఉమ్మడి జిల్లా -
జోగుళాంబదేవికి విశేష పూజలు
అష్టాదశ శక్తిపీఠాల్లోని ఐదో పీఠం జోగుళాంబ అమ్మవారి ఆలయం, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లో మంగళవారం ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో శ్రీచక్ర ప్రతిష్ఠాపన జరిగి 40 రోజులు(మండలం) రోజులు అయిన నేపథ్యంలో విశేష పూజలు నిర్వహించినట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి దీప్తి తెలిపారు. ఈ సందర్భంగా జోగుళాంబ అమ్మవారిని పూలతో ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక హోమాలు చేశారు. బాలబ్రహ్మేశ్వర స్వామి, జోగుళాంబ అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం పలికారు. మండల పూజలు మూడు రోజులపాటు జరగనునున్నట్లు కార్యనిర్వాహణ అధికారి పేర్కొన్నారు. అలంపూర్ -
రైతులకు ఉచిత న్యాయ సాయం
దేవరకద్ర: రైతులు తమకు ఎదురయ్యే న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి జిల్లా న్యాయసేవ అధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని డీఎల్ఎస్ఏ కార్యదర్శి, జిల్లా జడ్జి ఇందిర తెలిపారు. మంగళవారం దేవరకద్ర రైతువేదికలో డీఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో రైతులకు న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ చట్టాలు, రైతుల హక్కులు, సంక్షేమ పథకాలు, వాటి ప్రయోజనాలు, అందుబాటులో ఉన్న న్యాయసేవలపై రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయానికి సంబంధించిన వివాదాలు, ఇతర న్యాయపరమైన సమస్యలు ఎదురైనప్పుడు న్యాయసేవ అధికార సంస్థను సంప్రదించాలని జడ్జి సూచించారు. రైతులకు అవసరమైన న్యాయ సహాయం అందించేందుకు సంస్థ అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఏఓ రాజేందర్ అగర్వాల్, శివకుమార్, హరీష్, ప్రణిత రైతులు, ప్రతినిధులు పాల్గొన్నారు. విద్యుదాఘాతంతో రైతు మృతి మల్దకల్: విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన సంఘటన మంగళవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కుమ్మరి తిమ్మప్ప(50) మంగళవారం పత్తి పంటకు నీరు పె ట్టేందుకు బోరు మోటార్ ఆన్ చేస్తున్న క్రమంలో అప్పటికే తెగి పడిన విద్యుత్ వైరు తగిలి విద్యుత్షాక్తో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య శంకరమ్మ కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. విషయం తెలుసుకున్న నాయకులు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య గోపాల్పేట: భార్యతో గొ డవ పడి క్షణికావేశంలో భ ర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. గ్రా మస్తులు తెలిపిన వివరాల మేరకు.. గోపాలపేటలోని హనుమాండ్లగడ్డ కాలనీకి చెందిన కొంకలి సుక్కన్న, కర్రె శాంతమ్మ దంపతుల చిన్న కుమారుడు శివుడు (33)కు భార్య యాదమ్మ తో 10 రోజుల క్రితం గొడవ జరగగా.. ఆమె పుట్టింటికి వెళ్లింది. ఆ తర్వాత మాట్లాడి సోమ వారం గోపాల్పేటకు తీసుకొచ్చారు. మంగళవారం మధ్యాహ్నం మరోసారి గొడవ జరగగా.. శివుడు ఉరేసుకుంటానని ఇంట్లోకి వెళ్లి త లుపులు గొళ్లెం పెట్టుకున్నాడు. గతంలో బెది రించినట్లుగానే ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాడని అందరూ బయట కూర్చొని ఉన్నారు. చాలాసేపటి వరకు తలుపు తీయకపోవడంతో కిటికీలో నుంచి చూడగా శివుడు ఉరేసుకుని కనిపించాడు. శివుడికి భార్యతో పాటు కుమార్తె ఉంది. శివుడు అన్న మల్లయ్య రెండేళ్ల క్రితం ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివాహిత బలవన్మరణం లింగాల: మండలంలోని కొత్తకుంటపల్లికి చెందిన సౌడమోని పద్మ(38)ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యు లు తెలిపిన వివరాలు.. మతిస్థిమితం లేని ఆమె కుటుంబసభ్యులతో గొడవపడి క్షణికావేశానికి గురై గ్రామ శివారులో ఓ చెట్టుకు ఉరి వేసుకుంది. మృతురాలు గతంలోనూ రెండు పర్యాయాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతురాలికి భర్త సౌడమోని సురేష్, నలుగురు సంతానం ఉన్నారు. భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ చంద్రకాంత్ తెలిపారు. -
వారసత్వ సంపద పరిరక్షణ మనందరి బాధ్యత
● బీఆర్ఆర్ కళాశాలతో వారసత్వ శాఖ ఎంఓయూ ● విద్యార్థులకు చారిత్రక కట్టడాలు, పురావస్తు ప్రదేశాలపై అవగాహన జడ్చర్ల టౌన్: ప్రాచీన కట్టడాలు, చారిత్రక వారసత్వ సంపదను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్య త అని ప్రభుత్వ వారసత్వ శాఖ డైరెక్టర్ కుతాడి అర్జున్రావు అన్నారు. మంగళవారం జడ్చర్లలోని డా.బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో వారసత్వ శాఖ అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఈ సందర్భంగా విద్యార్థులకు వారసత్వ పరిరక్షణపై అవగాహన కల్పించారు. రాష్ట్రంలోని చారిత్రక కట్టడాలు, పురావస్తు ప్రదేశాలు, సాంస్కృతిక వారసత్వంపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచడంతోపాటు పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఎంఓయూ చేసుకున్నట్లు అర్జున్రావు తెలిపారు. ఇందులో భాగంగా వారసత్వ ప్రదేశాల సందర్శనలు, ఫీల్డ్ స్టడీస్, పరిశోధనలు, వర్క్షాప్లు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొ న్నారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుకన్య, చరిత్ర శాఖ అధ్యాపకులు డా.రాఘవేందర్రెడ్డి మాట్లాడుతూ.. యువతలో వారసత్వ పరిరక్షణపై బాధ్యత పెంపొందించేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని తెలిపారు. రాష్ట్ర చారిత్రక, సాంస్కృతిక సంపదను భావితరాలకు అందించేందుకు విద్యార్థులు భాగస్వాములు కావాలని సూచించారు. అనంతరం వారసత్వ శాఖ డైరెక్టర్, కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుకన్య ఎంఓయూ పత్రాలపై సంతకాలు చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ రాములునాయక్, అసిస్టెంట్ డైరెక్టర్ మల్లునాయక్, ఓఎస్డీ రాజులు తదితరులు పాల్గొన్నారు. -
పాలిటెక్నిక్ల విలీనంపై నిరసన
● ‘శక్తి’ పరిధిలోకి తీసుకురావద్దని ఏబీవీపీ ఆందోళన మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి (యంగ్ ఇండియా స్కూల్ యూనివర్సిటీ) పరిధిలోకి తీసుకురావాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో నిరసన చేపట్టారు. పాలిటెక్నిక్ విద్యను శక్తి పరిధిలోకి తీసుకురావద్దని నాయకులు, విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ విద్య కేవలం నైపుణ్య శిక్షణకే పరిమితం కాదని, పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక నిపుణులను తీర్చిదిద్దే ప్రత్యేక విద్యావ్యవస్థ అని పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు తక్కువ ఖర్చుతో సాంకేతిక విద్యను అందిస్తున్న పాలిటెక్నిక్ కళాశాలల విలీన నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. నిరసన సందర్భంగా విద్యార్థులకు, పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. దీంతో పోలీసులు పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని అనంతరం విడుదల చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు నవీన్, మణిశంకర్, నరేష్, కార్తీక్, రఘు, చరణ్, భరత్, అనిల్ పాల్గొన్నారు. -
డబ్బు.. ఆస్తి కోసం రెండు హత్యలు
● ఒకరిని వాహనంతో ఢీకొట్టి.. మరొకరిని కత్తితో గొంతుకోసి.. ● వేర్వేరు హత్య కేసులను ఛేదించిన నాగర్కర్నూల్ పోలీసులు కందనూలు: ఆస్తిపై ఆశ.. డబ్బుల విషయంలో ఏర్పడిన వివాదం ఇద్దరు మహిళల ప్రాణాలను బలిగొంది. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురికాగా.. పోలీసులు రెండు కేసులను ఛేదించి నిందితులను అరెస్టు చేశారు. ఒక ఘటనలో ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగిన మహిళను బొలేరో వాహనంతో ఢీకొట్టి హత్య చేయగా.. మరో ఘటనలో తోడికోడలికి చెందిన భూమి, బంగారు, వెండి ఆభరణాలపై కన్నేసిన మహిళ ప థకం ప్రకారం ఆమెను హత్య చేసింది. ఈ రెండు కేసులకు సంబంధించిన వివరాలను నాగర్కర్నూల్ డీఎస్పీ బర్రి శ్రీనివాస్ మంగళవారం వెల్లడించారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగిందని.. తాడూరుకి చెందిన వెనుపోతుల భీమయ్య బొలేరో వాహనం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. వివిధ పనుల కోసం కూలీలను వాహనంలో తీసుకెళ్లేవాడు. ఈ క్రమంలో తెలకపల్లి మండలం రాకొండకు చెందిన బంగారమ్మ(40) 15 ఏళ్ల నుంచి భర్తకు దూరంగా 19ఏళ్ల కుమారుడితో కలిసి గ్రామంలోనే ఉంటుంది. సందర్భానుసారంగా వ్యవసాయ పనుల నిమిత్తం కూలీ పనికోసం భీమయ్య దగ్గరకు వస్తూ ఉండేది. ఆ పరిచయం ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. బంగారమ్మ తన అవసరాల నిమిత్తం అర ఎకరం భూమిని విక్రయించగా వచ్చిన డబ్బుల్లో కొంత మొత్తాన్ని భీమయ్యకు ఇచ్చింది. అంతేకాకుండా తన బంగారు ఆభరణాలను కుదవపెట్టి బ్యాంకులో తీసుకున్న డబ్బును కూడా అతడికి ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే భీమయ్య కొంతకాలంగా డబ్బులు తిరిగి ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈ నెల 15న బంగారమ్మ ఫోన్ చేసి తన డబ్బులు తిరిగి ఇవ్వాలని గట్టిగా కోరింది. దీంతో ఆమెను తాడూరులోని వ్యవసాయ పొలం వద్దకు రావాలని భీమయ్య చెప్పాడు. అక్కడికి చేరుకున్న అనంతరం ఇద్దరి మధ్య డబ్బుల విషయమై వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో భీమయ్య బొలేరోతో బంగారమ్మను ఢీకొట్టి హత్య చేసినట్లు డీఎస్పీ తెలిపారు. బంగారమ్మ కుమారుడి ఫిర్యాదు మేరకు తాడూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో నిందితుడిని గుర్తించి భీమయ్యను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. భూమి.. నగలపై కన్నేసి.. బిజినేపల్లి మండలం ఇప్పలతండా పంచాయతీలోని బొర్సుగడ్డతండాకు చెందిన కేతావత్ చిట్టెమ్మ(42) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేది. ఆమె భర్త జంపాలియా మూడేళ్ల క్రితం మృతిచెందాడు. చిట్టెమ్మకు నలుగురు తోడికోడళ్లు ఉండగా.. తన పొలాన్ని వారికి కౌలుకిచ్చింది. వారిలో పెద్ద యారాలు కేతావత్ హీరమ్మకు చిట్టెమ్మ భూమి, బంగారు, వెండి ఆభరణాలపై ఆశ ఏర్పడింది. చిట్టెమ్మను హత్య చేసేందుకు ముందుగానే పథకం రచించింది. ఈ నెల 15న రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించి సారాను తీసుకుని అక్కడికి వెళ్లింది. ఇద్దరూ కలిసి సారా తాగగా.. చిట్టెమ్మ మత్తులో పడిపోయింది. ఇదే అదనుగా భావించిన హీరమ్మ కత్తితో ఆమె గొంతుకోసి హత్య చేసింది. అనంతరం చిట్టెమ్మ కాళ్లకున్న వెండి కడియాలు, ఇతర ఆభరణాలను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. మరుసటి రోజు దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి అన్న కొడుకు ముడావత్ వినోద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తనకు హీరమ్మపై అనుమానం ఉందని వినోద్ పోలీసులకు చెప్పడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో హీరమ్మ తానే హత్య చేసినట్లు అంగీకరించినట్లు డీఎస్పీ తెలిపారు. దీంతో ఆమెను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సమావేశంలో సీఐ అశోక్రెడ్డి, తాడూరు ఎస్ఐ రాములు, బిజినేపల్లి ఎస్ఐ షంషోద్దీన్, కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన రాష్ట్రస్థాయి ఖేల్కూద్ పోటీలు
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా కేంద్రం బండమీదిపల్లిలోని శ్రీసరస్వతీ శిశు మందిరంలో శ్రీసరస్వతీ విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఖేల్కూద్ (క్రీడాపోటీలు) మంగళవారం ఘనంగా ముగిశాయి. ఈ క్రీడాపోటీల్లో ఆయా శిశుమందిరా ల నుంచి దాదాపు 1600కిపైగా విద్యార్థులు పాల్గొన్నారు. మూడు విభాగాల్లో పోటీలు జరిగాయి. కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్స్, యోగాసన, వాలీబాల్, అథ్లెటిక్స్ అంశాల్లో క్రీడాపోటీలు నిర్వహించారు. రాష్ట్రస్థాయి క్రీడాపోటీల ముగింపు కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి పాల్గొని గెలుపొందిన క్రీడాకారులకు మెడల్స్ అందజేశారు. ఆయన మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది విద్యార్థులు ఈ క్రీడాపోటీలకు హాజరుకావడం అభినందనీయమని అన్నారు. తన కుటుంబంలో కూడా అన్న సరస్వతి శిశుమందిరంలో చదువుకున్నారని, ఆ సంస్థలో నేర్పించే విలువలు, క్రమశిక్షణను తాను ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. సరస్వతి విద్యాపీఠంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పరిమిత వేతనాలు, సౌకర్యాలు ఉన్నప్పటికీ ఎంతో నిబద్దతతో పనిచేస్తున్నారని అభినందించారు. కార్యక్రమంలో మేయర్ గుమ్మా ల మమత, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, దక్షిణమద్య క్షేత్ర సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్రెడ్డి, సరస్వతి విద్యాపీఠం తెలంగాణ ప్రాంత సంఘటనా కార్యదర్శి శ్రీనివాసరావు, దేవేంద్రరాజు, అశోక్రెడ్డి, యుగేంధర్రెడ్డి, రాంరెడ్డి, గంగాధర్ యాదవ్ పాల్గొన్నారు. -
పీజీ పరీక్ష కేంద్రం తనిఖీ
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో ఎంఏ, ఎంకాం, ఎంఎస్డబ్ల్యూ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల సెమిస్టర్–1, 2 పరీక్షలు మంగళవారం కొనసాగాయి. ఈ సందర్భంగా పీయూ పీజీ కళాశాల పరీక్ష కేంద్రాన్ని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రవీణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించి, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. మాస్ కాపీయింగ్కు అవకాశం లేకుండా పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. పరీక్షకు మొత్తం 687 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. 683 మంది హాజరయ్యారు. నలుగురు గైర్హాజరయ్యారు. వైస్ ప్రిన్సిపాల్ కృష్ణయ్య, అబ్జర్వర్ కుమారస్వామి, మొయినొద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
విధులకు వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు
● బైక్, బస్సు ఢీ: యువకుడి దుర్మరణం ● వివాహమైన రెండు నెలలకే ఘటన ● శోకసంద్రంలో కుటుంబ సభ్యులు రాజాపూర్(బాలానగర్): విధులకు ఆలస్యమైందనో.. సమయానికి విధులకు హాజరు కావాలనో.. అతివేగంగా బైక్పై వెళ్తూ.. ఆర్టీసీ బస్సును ఢీకొని యువకుడు దుర్మరనం చెందాడు. వివాహమైన రెండునెలలకే అతని ఆయుష్సు మంగళవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో అనంతవాయువులో కలిసిపోయింది. వివరాలిలా.. బాలానగర్ మండలం వీరన్నపల్లికి చెందిన అరవింద్(25) బాలానగర్ మండలంలో మిషన్ భగీరథలో పంప్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం వీరన్నపల్లి నుంచి 1:45నిమిషాలకు బయలుదేరి బాలానగర్ శివారులోని పెద్దాయపల్లి వద్ద మధ్యాహ్నం 2గంటలకు విధుల్లో చేరాల్సి ఉంది. అయితే ఇంటినుంచి బైక్పై బయలుదేరిన 20నిమిషాల్లోనే ఉడిత్యాల శివారులో షాద్నగర్ నుంచి నవాపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొని తీవ్రగాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతుడికి రెండునెలల క్రితం నవాపేట మండలం ధరిపల్లికి చెందిన యువతితో వివాహమైందని గ్రామస్తులు తెలిపారు. ప్రాణాలు కాపాడని హెల్మెట్ బైక్పై వెళ్తున్న వారు హెల్మెట్ ధరించాలనే కచ్చితమైన నిబంధనలున్నా.. విధులకు వెళ్తూ.. విధిగా తలకు హెల్మెట్ ధరించినా.. అరవింద్ ప్రాణాలను కాపాడ లేకపోయింది. తండ్రి లేకపోయినా ఉమ్మడి కుటుంబంగా అన్నదమ్ములు కలిసి మెలిసి ఉన్న కుటుంబంలో ఇలా తన తమ్ముడు రోడ్డుప్రమాదంలో మృతిచెందాడన్న వార్త విన్న అన్న రాఘవేందర్, తల్లి, కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. విషయం తెలిసిన బాలానగర్ ఎస్ఐ నరేందర్రెడ్డి ప్రాథమిక విచారణ జరిపి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యం
స్టేషన్ మహబూబ్నగర్: జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడంపై జిల్లా పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) సమావేశంలో చర్చించారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశానికి ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి తదితరులు హాజరయ్యారు. పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం, నాయకులు–కార్యకర్తల మధ్య సమన్వయం పెంచడం, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడం వంటి అంశాలపై నేతలు చర్చించారు. ఐక్యత, సమన్వయంతో పనిచేస్తూ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని సూచించారు.ఐక్యత, సమన్వయం, ప్రజాసేవే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నారాయణపేట జిల్లా ఇన్చార్జి శివారెడ్డి, మేయర్ గుమ్మాల మమత, జిల్లా ఎస్సీసెల్ చైర్మన్ పసుల రాజు, జిల్లా మైనార్టీ విభాగం చైర్మన్ ఫయాజ్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అవేజ్ అహ్మద్, జిల్లా ఓబీసీ చైర్మన్ తిరుపతయ్య పాల్గొన్నారు. ● కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. పీఏసీ సమావేశానికి సంబంధించి ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలు, భవిష్యత్ కార్యాచరణపై ఏఐసీసీ కార్యదర్శి నాయకులకు దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు. సమావేశంలో ఎస్ఐఆర్పై చర్చ జరిగిందన్నారు. ప్రతినెల ఒక రోజు పీఏసీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, ఎంతవరకు అమలయ్యాయి, వాటి ఫలితాలు ఏమిటి అనే అంశాలపై తదుపరి సమావేశాల్లో సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. జిల్లా పీఏసీ సమావేశంలో సంస్థాగత వ్యవహారాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ పాల్గొన్న ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, మంత్రి శ్రీహరి, ఎమ్మెల్యేలు -
శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి
● పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి ● బాలానగర్ పోలీస్స్టేషన్ను తనిఖీ చేసిన ఎస్పీ జానకి రాజాపూర్ బాలానగర్): శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్పీ జానకి సూచించారు. మంగళవారం బాలానగర్ పోలీస్స్టేషన్ను తనిఖీ చేసిన ఆమె.. కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసులు, ఫిర్యాదుల స్వీకరణ, బీట్ వ్యవస్థ, రాత్రి గస్తీ తదితర అంశాలను పరిశీలించారు. ఎస్ఐ నరేందర్రెడ్డితో స్టేషన్ పరిధిలోని పరిస్థితులపై సమీక్షించిన ఎస్పీ.. ప్రజల ఫిర్యాదులపై సత్వరమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించడంతో పాటు కోర్టు కేసుల్లో సమర్థవంతమైన ఫాలోఅప్ కొనసాగించాలని సూచించారు. మండలకేంద్రంలో జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నందున వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో సిబ్బందిని ఏర్పాటు చేసి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించాలని సూచించారు. మైనర్ల డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, అధిక వేగం, ఇతర ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. జడ్చర్ల రూరల్ సీఐ మహేష్, తదితరులు పాల్గొన్నారు. -
సీటుంది.. వసతి లేదు!
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూలో సీటు సాధించాలన్న విద్యార్థుల కల.. హాస్టల్ వసతి లేక చెదిరిపోతోంది. ఎప్సెట్, లాసెట్ వంటి ప్రవేశ పరీక్షల్లో పోటీపడి సీట్లు సాధించినా.. వసతి సౌకర్యం లేదన్న కారణంతో పలువురు అడ్మిషన్లు రద్దు చేసుకుంటున్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి విద్యార్థులు ప్రైవేట్ హాస్టళ్లు, రూముల్లో ఉండేందుకు నెలకు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు వెచ్చించాల్సి వస్తుండటంతో వెనకడుగు వేస్తున్నారు. ఈ కారణంగానే లా, ఇంజినీరింగ్ కోర్సుల్లో రెండు సంవత్సరాలుగా 159 సీట్లు ఖాళీగా మిగిలినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే ఉన్న హాస్టళ్లలోనూ సామర్థ్యానికి మించి విద్యార్థులను ఉంచుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో కొత్త హాస్టళ్లు పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయ వసతి కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు. లా, ఇంజినీరింగ్లో సీట్లు ఖాళీ లా కళాశాలలో గతేడాది ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సులకు 140 సీట్లకు రెండు దశల్లో కౌన్సెలింగ్ నిర్వహించగా 97 మంది చేరారు. 43 మంది సీట్లను రద్దు చేసుకున్నారు. ఈ ఏడాది ఎల్ఎల్బీలో 120 సీట్లకు 67 మంది మాత్రమే చేరగా.. 53 మంది సీట్లు వదులుకున్నారు. ఖాళీ సీట్ల భర్తీకి ఈ నెల 19, 20 తేదీల్లో మరోసారి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇంజినీరింగ్లో ఈ ఏడాది పలు దశల్లో కౌన్సెలింగ్ నిర్వహించినా 180 సీట్లకు 125 మంది మాత్రమే చేరారు. 55 సీట్లు ఖాళీగా మిగిలాయి. ఇందులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్లో 23, డేటా సైన్స్లో 35, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్–మెషిన్ లెర్నింగ్లో 5 సీట్లు ఉన్నాయి. వీటిలో హాస్టల్ వసతి లేని కారణంగా, ముఖ్యంగా బాలికలు సీట్లు రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే స్పాట్ అడ్మిషన్లలో చేరే విద్యార్థులకు ప్రభుత్వ స్కాలర్షిప్ అందే అవకాశం ఉండదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా ఖర్చవుతోంది యూనివర్సిటీలో సీటు వచ్చిన తర్వాత ఇక్కడ హాస్టల్ లేకపోవడంతో బయట రూమ్ లేదా ప్రైవేట్ హాస్టల్లో ఉండాల్సి వస్తోంది. దీనికి నెలనెలా చాలా ఖర్చవుతోంది. యూనివర్సిటీకి వచ్చి వెళ్లేందుకు కూడా అదనపు వ్యయం అవుతోంది. హాస్టల్ సదుపాయం కల్పించాలని గతంలో వీసీతోపాటు పలువురు అధికారులకు పలుమార్లు విన్నవించినా స్పందన లేదు. – రాజ్కుమార్, జగిత్యాల వసతి కల్పించాలి లా, ఇంజినీరింగ్ విద్యార్థులకు వెంటనే హాస్టల్ సదుపాయం కల్పించాలి. బయట రూమ్లో ఉంటే అద్దె, భోజనం, రాకపోకల ఖర్చులు కలిపి నెలకు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు ఖర్చవుతోంది. హాస్టల్ సదుపాయం ఉంటే ఈ భారం తగ్గుతుంది. ఈ ఏడాదైనా ప్రత్యామ్నాయ వసతి కల్పిస్తే విద్యార్థులకు ఇబ్బందులు తప్పుతాయి. – చిరంజీవి, జగిత్యాల ప్రత్యామ్నాయానికి ప్రయత్నించాం పీయూ సమీపంలోని ప్రభుత్వ భవనాల్లో ప్రత్యామ్నాయంగా హాస్టల్ ఏర్పాటు చేసేందుకు గతంలో ప్రయత్నించాం. అయితే జిల్లా అధికారులు ఆ భవనాలను మరో ప్రభుత్వ పాఠశాలకు కేటాయించారు. ప్రస్తుతం ప్రత్యామ్నాయ హాస్టల్ ఏర్పాటు చేసే అవకాశం లేకపోవడంతో వసతి కల్పించలేకపోతున్నాం. యూనివర్సిటీలో కొత్త హాస్టళ్ల నిర్మాణం కొనసాగుతోంది. త్వరలోనే అవి పూర్తవుతాయి. ప్రస్తుతం మిగిలిన సీట్లను స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటాం. – రమేష్బాబు, పీయూ రిజిస్ట్రార్ప్రత్యామ్నాయం చూపరా? కొత్త హాస్టల్ భవనాల నిర్మాణం కొనసాగుతున్న నేపథ్యంలో అవి పూర్తయ్యే వరకు విద్యార్థులకు ప్రత్యామ్నాయ వసతి కల్పించాలని డిమాండ్ వినిపిస్తోంది. గతంలో హాస్టల్ భవనం అందుబాటులో లేని సమయంలో అప్పటి వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్ చొరవతో జిల్లా కలెక్టర్ అనుమతితో సమీపంలోని కస్తూర్బాగాంధీ పాఠశాలను హాస్టల్గా వినియోగించిన విషయాన్ని విద్యార్థులు గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం పీయూ గెస్టుహౌస్తోపాటు పరిసరాల్లోని కొన్ని ప్రభుత్వ భవనాలు ఖాళీగా ఉన్నప్పటికీ.. వాటిని ప్రత్యామ్నాయ వసతిగా వినియోగించే ప్రయత్నం జరగడం లేదని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పీయూలో చదువుకునేందుకు వచ్చే విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలని పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని లా కళాశాల విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ప్రతిరోజూ తరగతులకు హాజరు కావడం తప్పనిసరి అయినప్పుడు వసతి లేకుండా ఎలా చదువుకోవాలని ప్రశ్నిస్తున్నారు. ప్రైవేట్ హాస్టల్ లేదా రూములో ఉంటే నెలకు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు అదనపు భారం పడుతోందని పేర్కొంటున్నారు. 680 మంది సామర్థ్యం.. 870 మంది పీయూలోని బాలికల హాస్టల్ పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. 680 మంది విద్యార్థులకు వసతి కల్పించే సామర్థ్యం ఉండగా.. ప్రస్తుతం సుమారు 870 మంది ఉంటున్నట్లు సమాచారం. అంటే సామర్థ్యానికి మించి 190 మందికిపైగా అదనంగా ఉంటున్నారు. ఒక్కో గదిలో నలుగురు ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం ఆరు నుంచి ఏడుగురు వరకు ఉంటున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. దీంతో ఉన్న హాస్టళ్లపైనా ఒత్తిడి పెరుగుతోంది. పీయూలో హాస్టల్ సమస్యతో విద్యార్థుల వెనకడుగు లా, ఇంజినీరింగ్లో 159 సీట్లు ఖాళీ.. ఏటా ఇదే పరిస్థితి ప్రైవేట్ హాస్టళ్లు, రూములకు నెలకు రూ.6 వేల నుంచి రూ.8 వేల భారం బాలికల హాస్టల్లో సామర్థ్యానికి మించి 200 మందికిపైగా ప్రత్యామ్నాయాలపై అధికారుల చొరవ కరవు నిర్మాణంలో కొత్త హాస్టళ్లు.. అప్పటివరకు అవస్థలే! -
డీఈఓ కార్యాలయంలో సెల్ఫీ పాయింట్
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థుల్లో ప్రాథమిక అక్షర, సంఖ్యా పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఎఫ్ఎల్ఎన్ (ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ) కార్యక్రమంలో భాగంగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సెల్ఫీ పాయింట్ను ఏర్పాటు చేశారు. మంగళవారం డీఈఓ విజయకుమారి సెల్ఫీ పాయింట్ వద్ద ఫొటో దిగారు. ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో అవగాహన కల్పించేందుకు ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని డీఈఓ, ఎంఈఓ కార్యాలయాలతోపాటు కాంప్లెక్స్ పాఠశాలల్లోనూ సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రేపు అథ్లెటిక్స్ పోటీలకు క్రీడాకారుల ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: హన్మకొండలో ఈనెల 26, 27 తేదీల్లో జరిగే తెలంగాణ రాష్ట్రస్థాయి సౌత్జోన్ అంతర్జిల్లాల అథ్లెటిక్స్ పోటీలకు జిల్లా క్రీడాకారుల ఎంపికలను ఈనెల 20న నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్చంద్ర తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటలకు జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. అండర్–14, 16, 18, 20 బాలబాలికల విభాగాల్లో ఎంపికలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు ఒరిజినల్ ఎస్ఎస్సీ మెమో, జనన, కుల ధ్రువపత్రాలతో సి.శ్రీనివాస్కు రిపోర్టు చేయాలని సూచించారు. ఇతర వివరాలకు 9849706360, 9492177535 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు. మహిళా, శిశు సంక్షేమమే ముఖ్యం మహబూబ్నగర్ రూరల్: మహిళా, శిశు సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి సీడీపీఓలు, సూపర్వైజర్లతో వెబ్ఎక్స్ సమావేశం నిర్వహించి పలు అంశాలపై సమీక్షించారు. అంగన్వాడీ కేంద్రాల పనితీరు, లబ్ధిదారుల హాజరు, జీరో బెనిఫిషియరీ కేంద్రాల వివరాలను పరిశీలించారు. కేంద్రాలకు ఏ, బీ, సీ గ్రేడింగ్ ఇవ్వాలని సూచించారు. టీహెచ్ఆర్ పంపిణీ, ఎఫ్ఆర్ఎస్, సమ్మాన్ కార్యక్రమాల అమలుపై ఆరా తీశారు. అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. వీబీజీ రామ్ కింద చేపట్టిన నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించి పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అవసరమైన వసతులను గుర్తించి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యానికి తావులేకుండా క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. సమావేశంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ క్రిస్టియానా, డీడబ్ల్యూఓ జరీనాబేగం పాల్గొన్నారు. -
గాజులపేటలో కలెక్టర్ కొరడా!
మహబూబ్నగర్ రూరల్: గ్రామపంచాయతీ పాలనలో నిబంధనలను ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ ఖుష్బూగుప్తా స్పష్టం చేశారు. మంగళవారం గాజులపేట గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆమె.. పంచాయతీ తీర్మానాలు లేకుండానే నిధులు వినియోగించినట్లు గుర్తించారు. కార్యదర్శి చూపించిన కొన్ని తీర్మానాలు నకిలీవిగా ఉన్నట్లు తేలడంతో తీవ్రంగా స్పందించిన కలెక్టర్.. కార్యదర్శి చంద్రశేఖర్ను సస్పెండ్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నకిలీ తీర్మానాలపై ఆగ్రహం పంచాయతీ రికార్డులు, నిధుల వినియోగానికి సంబంధించిన పత్రాలను కలెక్టర్ పరిశీలించారు. నిబంధనల ప్రకారం తీర్మానాలు లేకుండానే నిధులు ఖర్చు చేసినట్లు గుర్తించారు. కొన్ని తీర్మానాలు అనుమానాస్పదంగా ఉండటంతో వాటిపై ఆరా తీశారు. రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యంపై అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వ నిధుల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. గ్రామంలో దోమల నివారణకు వినియోగించే ఫాగింగ్ మిషన్లపైనా వివరాలు తెలుసుకున్నారు. ఎన్ని మిషన్లు ఉన్నాయి, వాటి నిర్వహణ రిజిస్టర్లు, వినియోగించిన వివరాలను పరిశీలించారు. పంచాయతీ ఆస్తులు, నిధులు, రికార్డుల విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని హెచ్చరించారు. విద్యార్థులతో ముఖాముఖి గాజులపేట జెడ్పీహెచ్ఎస్ను సందర్శించిన కలెక్టర్ అక్షయపాత్ర ద్వారా అందుతున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పదో తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. ఏ పాఠం జరుగుతోందని అడిగి తెలుసుకున్నారు. పాఠాలు అర్థమవుతున్నాయా, ఉపాధ్యాయులు సక్రమంగా బోధిస్తున్నారా, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ప్రశ్నించారు. తరగతి గదుల్లో విద్యుత్, ఫ్యాన్లు, లైట్ల సౌకర్యంపై ఆరా తీశారు. ప్రతి గదిలో అవసరమైన వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు, సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా నాణ్యమైన విద్య అందేలా చూడాలని సూచించారు. పంచాయతీ నిధుల వినియోగంలోఅక్రమాలు.. నకిలీ తీర్మానాలపై ఆగ్రహం కార్యదర్శి సస్పెన్షన్కు ఆదేశం.. రికార్డులపై లోతుగా ఆరా జెడ్పీహెచ్ఎస్లో విద్యార్థులతో కలెక్టర్ ముఖాముఖి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక -
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కొనసాగించాలి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక తెలంగాణచౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ పథకాలను అమలు చేయొద్దనే ఉద్దేశంతోనే కోర్టు కేసు సాకుగా చూపిస్తున్నారని ఆరోపించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయపరంగా ముందుకు వెళ్లడంలో నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. మహిళలకు పెంచిన పింఛన్, విద్యార్థినులకు స్కూటీలు ఇవ్వాలని, ఫీజు రీయింబర్స్మెంట్ పాత బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసేంతవరకు పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు రాజేశ్వర్గౌడ్, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, బీఆర్ఎస్ నాయకులు శివరాజ్, దేవేందర్రెడ్డి, కరుణాకర్ గౌడ్, రెహమాన్, ఆంజనేయులు, నరేందర్, లక్ష్మయ్య, గణేష్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తేళ్లను తాకినా కుట్టవట..! కందుకూరులో తేళ్ల పంచమి వేడుకలు..
తెలంగాణ: దేశమంతా సోమవారం నాగుల పంచమి జరుపుకొంటే నారాయణపేట జిల్లా సరిహద్దు కర్ణాటక రాష్ట్రంలోని యాద్గిర్ జిల్లా గురుమిట్కల్ మండలం కందుకూరులో మాత్రం తేళ్ల పంచమి ఘనంగా నిర్వహించారు. ఇక్కడ తేళ్లను దైవస్వరూపంగా భావిస్తూ ఏటా ప్రత్యేకంగా తేళ్ల జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.కందుకూరు గ్రామ సమీపంలోని కొండపై ఉన్న కొండమవ్వ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకొని, అక్కడే ఉన్న తేళ్ల విగ్రహాలకు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం కొండపై ఆలయ పరిసరాల్లోని ఏ చిన్న రాయిని తొలగించినా.. వాటి కింద తేళ్లు కనిపించాయి. తేళ్లను చేతితో తాకినా.. పట్టుకున్నా..అవి కుట్టకపోవడం అమ్మవారి దివ్యానుగ్రహమని భక్తులు విశ్వసిస్తారు.చిన్నారులు, యువత, మహి ళలు, పురుషులు అనే తేడా లేకుండా భక్తులు తేళ్లను చేతుల్లోకి తీసుకుని, చేతులు, పొట్ట, ముఖం తదితర శరీర భాగాలపై పెట్టుకుని జాతరలో సందడి చేశారు. గుట్టపై ఉండే వాతావరణ పరిస్థితులు, వన మూలికల కారణంగా తేళ్లు కుట్టలేకపోతున్నాయని కొందరు విద్యావంతులు చెబుతున్నారు. -
ఖైదీలకు ఉచిత న్యాయ సలహాలు
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లా జైలులో ఉన్న ఖైదీలకు అవసరమైన న్యాయ సహాయం, సలహాలు ఉచితంగా అందిస్తామని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) కార్యదర్శి డి.ఇందిరా తెలిపారు. సోమవారం జిల్లా జైలును సందర్శించిన ఆమె.. జైలులోని పరిస్థితులను పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడి వారి సమస్యలు, కేసుల వివరాలు, న్యాయపరమైన అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలకు అందుతున్న సౌకర్యాలు, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించిన ఆమె.. న్యాయ సహాయం అవసరమైన అర్హులకు ఉచిత న్యాయ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కేసులకు సంబంధించిన న్యాయపరమైన సందేహాలు, సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని ఖైదీలకు తెలిపారు. అవసరమైన వారికి న్యాయ సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జైలు సందర్శనలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సెల్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సెల్ తదితరులు పాల్గొన్నారు. నర్సింగ్లో సీటు రాలేదని విద్యార్థిని బలవన్మరణం లింగాల: నర్సింగ్ ప్రవేశ పరీక్షలో సీటు రాలేదని మ నస్తాపానికి గురై విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిని ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కు టుంబ సభ్యులు, పోలీసు లు తెలిపిన వివరాలు.. లింగాలకు చెందిన ఉప్పల శంకరయ్య రెండో కుమార్తె భువనేశ్వరి (18) ఇంటర్మీడియట్ పూర్తి చేసి బీఎస్సీ నర్సింగ్ చేసేందుకు ప్రవేశ పరీక్ష రాసినట్లు తెలిపారు. కానీ సీటు రాకపోవడంతో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ చంద్రకాంత్ తెలిపారు. మట్టికుప్పల్లో కూరుకుపోయి వలస కార్మికుడి మృతి హిందూపురం: మట్టికుప్పల్లో ఇరుక్కుపో యి వలస కార్మికుడు మృతి చెందిన ఘటన సత్యసాయి జిల్లా హిందూపురం మండలంలోని చెర్లోపల్లి వద్ద జరిగింది. వివరాలు.. చెర్లోపల్లి సమీపంలోని ఆదర్శ పాఠశాల వద్ద నూతన జాతీయ రహ దారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన అంజి (21) తన పెద్దమ్మ పెంటమ్మతో కలిసి ఇక్కడికి పనుల నిమిత్తం వచ్చాడు. ఆదివారం రాత్రి నుంచి అతను కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలోనే సోమవారం రహ దారి పనుల నిమిత్తం కుప్ప చేసిన మట్టిని జేసీబీతో లెవెల్ చేస్తుండగా, అంజి మృతదేహం బయటపడింది. మట్టిని కుప్పులు పోస్తున్న సమయంలో అందులో ఇరుక్కుపోయి మృతి చెంది ఉంటాడని తోటి కూలీలు తెలిపారు. అంజి మృతదేహం అతని పెద్దమ్మ పెంటమ్మ, తోటి కార్మికులు గుండెలవిసేలా రోదించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు హిందూపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు కాల్వలో పడి దుర్మరణం గద్వాల క్రైం: ప్రమాదవశాత్తు కాల్వలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన గద్వాల మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు... బీరోలు గ్రామానికి చెందిన నర్సింహులు (38) సోమవారం ఉదయం పొలం పనులకు వెళ్లాడు. సాయంత్రం ఇంటికి తిరిగొచ్చే సమ యంలో ముఖం కడుక్కునేందుకు అక్కడే ఉన్న కాల్వలోకి దిగాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాల్వలో పడిపోగా తల భాగం సిమెంట్ దిమ్మెకు తగిలింది. దీంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య పావని ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అప్పుల బాధతో రైతు బలవన్మరణం తెలకపల్లి: మండలంలోని గట్టురావిపాకులకు చెందిన రైతు అప్పుల బాధతో బలవన్మరణానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాలు.. గట్టురావిపాకుల గ్రామానికి చెందిన సుబ్బయ్య వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అప్పు చేసి తనకున్న పొలంతో పాటు ఇతరుల పొలాన్ని కౌలుకు తీసుకుని పంట సాగు చేశారు. ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో పంటలు పండే పరిస్థితి లేదని కొంతకాలంగా ఆందోళన చెందుతున్నాడు. అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో సోమవారం తెల్లవారుజామున తన వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరి వేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే సుబయ్య ఏరియా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. భార్య ఉత్తరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు. -
మహనీయుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకోవాలి
● విద్యుత్ భవన్లో ఫూలే, అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణ జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): మఽహనీయులైన మహాత్మ జ్యోతిబా పూలే, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవితాలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. తెలంగాణ విద్యుత్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక విద్యుత్ భవన్న్లో మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంతటి గొప్ప కార్యక్రమంలో భాగస్వామి కావడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వంటి మహానీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పూలే, అంబేడ్కర్ చూపించిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, ముఖ్యంగా విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, ఎస్ఈ బీమా నాయక్, ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాసరి శ్యాం మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రామిక్ పోస్టుల భర్తీలో అన్యాయం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఏడాది క్రితం ఆర్టీసీ శ్రామిక్ పోస్టుల భర్తీలో తమకు అన్యాయం జరిగిందంటూ సోమవారం ఆర్ఎం కార్యాలయం ఎదుట కొద్దిసేపు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన అప్రెంటిస్ చేసిన అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఏడాది సెప్టెంబర్ 17న ప్రకటించిన నోటిఫికేషన్ మేరకు తాము దరఖాస్తు చేసుకున్నామన్నారు. అయితే ఈ రిక్రూట్మెంట్లో తమకు వెయిటేజీ ఇవ్వకుండా ఆర్టీసీలో అప్రెంటిస్ చేయని వారితోపాటు ప్రైవేట్ సంస్థలకు చెందిన అభ్యర్థులతో భర్తీ చేయడం ఎంతవరకు సమంజసమని పేర్కొన్నారు. తాము రెండేళ్ల పాటు సంస్థలో అప్రెంటిస్ చేసినా ఎలాంటి ప్రయోజనం దక్కడం లేదన్నారు. -
సర్టిఫికెట్ వెరిఫికేషన్ను పరిశీలించిన ఎస్పీ
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా పరిధిలోని జిల్లాలకు చెందిన ఆర్టీసీ డ్రైవర్, శ్రామిక్ ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అందులో భాగంగా సోమవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో జరుగుతున్న ప్రక్రి యలో మహబూబ్నగర్ జిల్లా నుంచి 21 మంది, నాగర్కర్నూల్ జిల్లా నుంచి 21 మంది, వనపర్తి జి ల్లా నుంచి 14 మంది, గద్వాల జిల్లా నుంచి 14 మంది, నారాయణపేట జిల్లా నుంచి 14 మంది అభ్యర్థులు కలిపి మొత్తం 84 మంది అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరయ్యారు. ఈ ప్రక్రియను జిల్లా ఎస్పీ డి.జానకి పరిశీలించారు. అభ్య ర్థుల సర్టిఫికెట్ల పరిశీలన, ధ్రువీకరణ ప్రక్రియను పరిశీలించి ఎలాంటి తప్పులు జరగకుండా సజావుగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, ఏఓరుక్మిణీ భాయ్, ఆర్ఐలు కృష్ణయ్య, నగేష్, అశోక్ కుమార్, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
టీఎంయూ గెలుపుతోనే ఆర్టీసీకి మనుగడ
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: వచ్చే ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో తమ గెలుపుతోనే సంస్థ మనుగడ ఉంటుందని టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇ.అశ్వత్థామరెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో మహబూబ్నగర్ రీజియన్లోని పది డిపోల గ్యారేజీ కార్మికులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్యారేజీ కార్మికుల డిజిగ్నేషన్లను పెంచడానికి కృషి చేస్తామన్నారు. మారుతున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా సమస్యల పరిష్కారంలో గణనీయమైన మార్పులు తెస్తామన్నారు. శ్రామిక్ పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అన్ని కేటగిరీల కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని, చట్టవిరుద్ధ డ్యూటీలపై, అనవసరంగా అధికారులు వేధింపులకు గురిచేసినా ఉద్యమిస్తామన్నారు. ఆర్టీసీ సంస్థ అభివృద్ధితో పాటు కార్మిక హక్కుల పరిరక్షణే తమ ధ్యేయమన్నారు. సంస్థకు సుమారు రూ.లక్ష కోట్ల విలువజేసే ఆస్తులున్నాయని, అన్యాక్రాంతమైనవి అమ్మి రూ.4 వేల కోట్ల అప్పులను తీర్చాలని డిమాండ్ చేశారు. అంతకుముందు ఆర్టీసీ అమరవీరులకు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకర్, నాయ కులు నాగయ్య, వహీద్, రాజలింగం, అహ్మద్ఖాన్, నిరంజన్, రాజేందర్, గోవింద రావు, నారాయణ, చంద్రయ్య, మధుసూదన్, భానుప్రకాష్రెడ్డి, కె.రవీందర్రెడ్డి, బి.శ్రీనివాసులు పాల్గొన్నారు. -
తండాల్లో తీజ్ సంబురం
సంస్కృతి, సంప్రదాయబద్ధంగా జరుపుకొంటున్న గిరిజన యువతులు ● తొమ్మిది రోజులు భక్తిశ్రద్ధలతో గోధుమనారుకు పూజలు ● నియమ, నిష్టలు, ఆటాపాటలతో సందడి ● చివరిరోజు చెరువులు, కుంటల్లో నిమజ్జనంతీజ్ను గిరిజనులు తొమ్మిది రోజులపాటు ఆయా రోజుల్లో యువతులు రొట్టెలు, ఆకుకూరలు మాత్రమే ఆహారంగా తీసుకుంటారు. బుట్టలు ఎందరు ఉంచినా అందులో ఐదుగురు యువతులు మాత్రమే నిష్టతో పూజ చేస్తారు. చివరిరోజు యువతులు మొలకల బుట్టతను తలపై పెట్టుకొని చెరువు వద్దకు వెళ్తారు. అప్పటికే అక్కడ సంప్రదాయయపద్ధతిలో రూమాలాలు తలకు చుట్టుకొని పెద్దమనుషులు కూర్చుంటారు. యువతలు బుట్టల్లోని కొన్ని మొలకలను తలపాగాల్లో వేస్తారు. అనంతరం బుట్టలకు పూజలు చేసి చెరువులోకి వదులతారు. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత పెద్దమనుషుల కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకుంటారు. యువతలను కూడా పీటలపై కూర్చొబెట్టి పెద్దమనుషులు వారి కాళ్లు కడిగి ఆశీర్వదిస్తారు. అచ్చంపేట: లంబాడ గిరిజనుల(బంజారాలు) సంప్రదాయ మొలుకల పండుగను నల్లమలలో ఘనంగా నిర్వహిస్తున్నారు. కఠోర నియమాలు, డప్పుల మోతలు.. తండావాసుల కేరింతలు.. పెళ్లికాని ఆడబిడ్డల ఆటాపాటలు.. అన్నా చెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధాలు.. భక్తిభావం వీటి మేళవింపే తొమ్మిది రోజుల(నవ దాడేరి తీజ్) పండుగ. ఆషాఢం, శ్రావణమాసంలో బంజారాలు తీజ్ వేడుకలను తమ సంస్కృతిని ప్రతిభింబిచేలా జిల్లావ్యాప్తంగా ఈ పండుగను నిర్వహిస్తున్నారు. ఏజెన్సీ గ్రామాలు, తండాలు, పట్టణాల్లో తీజ్ సందడి నెలకొంది. శ్రీశ్రీశ్రీ సేవాలాల్ మాహరాజ్ (సేవాభాయి) శ్రీశ్రీశ్రీ దండి మేరమ్మ(అమ్మవారు) తల్లికి పూజలు చేసే క్రమంలో ఈ తీజ్ వేడుకలను నిర్వహిస్తారు. పెళ్లికాని యువతులు తమకు మంచి వరడు లభించాలని, తండావాసులు తమ పాడి పశువులు, పిల్లాపాపలు చల్లగా ఉండాలని వేడు కుంటూ తొమ్మది రోజులపాటు తీజ్ను జరుపుకొంటారు. ఒకప్పుడు తండాల్లో జరిగే ఈ వేడుకలు ఇప్పుడు పట్టాలకు విస్తరించాయి. ఇప్పటికే అచ్చంపేట మండలం ఐనోలు, లింగాల, కల్వకుర్తి మండలాల్లో తీజ్ వేడుకలు కొనసాగుతుండగా.. కొన్ని తండాల్లో ముగిశాయి. పెళ్లికాని యువతుల చేత.. పెళ్లికాని యువతులు రేగిచెట్టుకు ప్రత్యేక పూజలు చేసి తీజ్ను ప్రారంభిస్తారు. అంతకుముందే తండాల్లోని పెద్దలు ప్రతిఇంటి నుంచి గోధుమలు సేకరించి రోజంతా నీళ్లలో నానబెడుతారు. పెళ్లికాని యువతులు చిన్నచిన్న వెదురు బుట్టలో పుట్టమన్ను(మకొడధూడ్) గోవు పిడకల చూర్ణాన్ని కలిి ప నాయక్(పూజారి)ఇంటికి తీసుకురాగా నాయక్ భార్య ఆ బుట్టలో నానబెట్టిన గోధుమలు వేసి అలుకుతుంది. అనంతరం పూజలు చేసి బుట్టలను డాగ్డో(మంచె)పై ఉంచి తొమ్మిది రోజులపాటు ప్రత్యేక జలాలు చల్లుతూ ఉత్సవాలు నిర్వహిస్తారు. పులియోగెనో.. తీజ్లో ముఖ్యమైనది పులియోగెనోది. దీనిని బంజార మహిళలు స్వయంగా తయారు చేస్తారు. అద్దాలు, గవ్వలు, పూసలతో చూడముచ్చటగా తయారు చేయడానికి తమ స్థోమతను బట్టి రూ.2వేల వరకు ఖర్చు చేస్తారు. గోధుమలు మొలకెత్తడానికి పవిత్ర జలాలు పోసే సమయంలో తీజ్ నిర్వహించేటప్పుడు దీనిని వినియోగిస్తారు. యువతలు కలశాలతో జలాలు తీసుకొచ్చేటప్పుడు తలపై పెట్టుకునే దానిని గెనో అని రెండు కలశాలపై కప్పుకుని వచ్చే దానిని పులియా అన్ని వ్యవరిస్తారు. పెళ్లి సమయంలో దీనిని పెళ్లికూతురుకు తమ గుర్తుగా తల్లిదండ్రులు అందిస్తారు. గిరిజనుల సంప్రదాయం, సంస్కృతికి పులియోగెనో అతి ముఖ్యమైంది. పీడియా.. తీజ్ ముగింపు ఉత్సవాల్లో పాల్గొనే పెళ్లికాని యువతులు వచ్చే ఏడాది తాము తీజ్ అడుతామో లేదోననే ఆందోళన కనిపిస్తోంది. అంతకుముందు గ్రామంలో పెళ్లికాని గిరిజన యువకులు చేతుల్లో పట్టుకునే పీడీయాను ప్రయత్నాలు చేస్తూ విడిపిస్తారు. అయితే పీడీయా పట్టుకున్న వ్యక్తి ఇంటిపేరు, విడిపించే యువతుల ఇంటిపేర్లు ఒక్కటి కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. -
మహిళ దారుణహత్య
● ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఘాతుకం? ● ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన చిరుత దాడిలో మేకలు మృతి గండేడ్: పట్టపగలు చిరుత మేకలపై దాడి చేయడంతో మూడు మేకలు మృతి చెందాయి. వివరాల్లోకి వెళితే గండేడ్ మండల పరిధిలోని కొండాపూర్కు చెందిన చెన్నారం పక్కీరప్ప పొలం దగ్గరే ఉంటూ మేకలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజువారిలో భాగంగా సోమవారం మేకలను మేపడానికి వెళ్లాడు. రాయిని చెరువు సమీపంలోని బొందెగట్టులో మధ్యాహ్నం సమయంలో పక్కీరప్ప మేకలు మేస్తుండగా నీళ్లు తాగడానికి కిందికి వెళ్లాడు. ఈ క్రమంలో మేకలన్నీ ఒక్కసారిగా పరుగెత్తుకుంటూ వచ్చాయి. దీంతో వెంటనే వెళ్లి చూడగా మూడు మేకలు చిరుతదాడిలో మృతి చెంది ఉన్నాయి. అందులో చనిపోయిన ఒకమేకను తన కళ్లుదుటే చిరుతపులి లాక్కెళ్లిందని పక్కీరప్ప తెలిపాడు. అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతి చెందిన మేకల విలువ సుమారు రూ.30వేలు ఉంటుందని బాధితుడు వాపోయాడు. మళ్లీ చిరుత కలకలం రేగడంతో చుట్టుపక్కల రైతులు భయాందోళనకు గురువున్నారు. పాముకాటుతో చిన్నారి మృతి రాజోళి: పాముకాటుతో ఎనిమిదేళ్ల చిన్నారి మృతి చెందిన విషాద ఘటన మండలంలోని పెద్దతాండ్ర పాడు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కవిత, ప్రకాష్ దంపతుల కు మార్తె శ్రావ్య (8) కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో నిద్రిస్తుండగా.. ఆదివారం అర్ధరాత్రి సమయంలో పాము చిన్నారి వేలి కొరికింది. దీంతో చిన్నారి ఏడవడంతో మేల్కొన్న తండ్రి పామును గమనించి వేలు నుంచి దాన్ని విడదీసి, చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం కర్నూల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. పొలం వద్దకు వెళ్లిన రైతు.. రాజాపూర్: పొలం వద్దకు వెళ్లిన ఓ రైతు పాముకాటుకు గురై మృతి చెందిన ఘటన సోమవారం ఉడిత్యాలలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కమ్మరి చంద్రమౌలి (59) పత్తి పంటను పరిశీలిస్తుండగా.. చేనులో ఉన్న నాగుపాము అతడి పాదంపై కాటువేసింది. గ్రామానికి చెందిన శివకుమార్ మోటర్సైకిల్పై చంద్రమౌలిని ఎక్కించుకొని బాలానగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించిన అనంతరం 108 అంబులెన్స్లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. మృతుడి కుమారుడు ప్రవీణ్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్ఐ నరేందర్రెడ్డి తెలిపారు. కందనూలు: బిజినపల్లి మండలంలోని ఇప్పలతండాలో గిరిజన మహిళ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బోరుసుగడ్డ తండా గ్రామపంచాయతీ పరిధిలోని ఇప్పలతండాకు చెందిన కేతావత్ చిట్టెమ్మ (50) శనివారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో నిర్వహించిన స్మార్ట్ రేషన్కార్డుల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ కార్డు అందుకున్న అనంతరం సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చారు. రాత్రి ఇంట్లో నిద్రించిన ఆమె మరుసటి రోజు బయటకు రాకపోవడంతో స్థానికులు గమనించారు. దుర్వాసన రావడంతో.. ఆదివారం సాయంత్రం చిట్టెమ్మ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు అనుమానించి తలుపులు తెరిచి చూశా రు. ఇంట్లో ఆమె మృతదేహం కనిపించడంతో వెంటనే పోలీ సులకు సమాచారం అందించారు. బిజినపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా.. చిట్టెమ్మ కొంతకాలంగా లట్టుపల్లి గ్రామంలోని ఓ రైస్మిల్లులో కూలీగా పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఆమె భర్త మూడేళ్ల క్రితం మృతి చెందాడని చెప్పారు. ప్రస్తుతం ఆమె ఒంటరిగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె ఇంటికి ఎవరు వచ్చారు? ఏదైనా వ్యక్తిగత వివాదం ఉందా? దొంగతనం కోణం ఏమైనా ఉందా? అన్న అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు బిజినపల్లి ఎస్ఐ షంశుద్దీన్ తెలిపారు. పోస్టుమార్టం నివేదిక, దర్యాప్తులో లభించే ఆధారాల ఆధారంగా హత్యకు అసలు కారణం, నిందితుల వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఘటనతో ఇప్పలతండాలో విషాదం నెలకొంది. -
109.561 ఎంయూ విద్యుదుత్పత్తి
ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు దిగువ, ఎగువ జూరాల జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతుంది. ఈమేరకు సోమవారం 10 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 6 యూనిట్లద్వారా 234 మెగావాట్లు, 62.279 ఎంయూ, దిగువలో 4 యూనిట్ల ద్వారా 160 మెగావాట్లు, 47. 282 మిలియన్ యూనిట్ల విద్యుదు త్పత్తిని చేపడుతున్నారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటివరకు 109.561 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని విజయవంతంగా చేపట్టామన్నారు. ప్రస్తుతం 43 వేల క్యూసెక్కులను వినియోగించి దిగువ శ్రీశైలంకు వదులుతున్నామని తెలిపారు. -
ఏడుగురు దేవతలు
లంబడా తెగ గిరిజనులకు ఏడుగురు సీ్త్ర దేవతలు ఉన్నారు. మెరామ, హింగళ, తుల్జా, కేంకాళి, తీజ్, మత్రాళ్, సీత్త అనేవి దేవతల పేర్లు మీదుగా నిర్వహించే ప్రధాన పండుగలు. మెరామ దేవత తండాను రక్షిస్తే, తీజ్ దేవత పంటలను కాపాడుతుందని నమ్ముతారు. సీత్త దేవత పశు సంపదను వృద్ధి చేస్తుందని, మత్రాళ్ దేవత పిల్లలు అంటువ్యాధులబారిన పండకుండా రక్షిస్తుందని విశ్వసిస్తారు. వివిధ ప్రాంతాల్లో ఉండే బంధువులంతా పండుగల సందర్భంగా కలుసుకొని అత్మీయత, అనురాగాలను పంచుకుంటారు. యుక్త వయస్సున్న గిరిజన యువతులు విద్యా, ఉద్యోగ, సంసారిక జీవితంతోపాటు పుట్టినింటితోపాటు మొట్టినిల్లు కూడా అష్టైశ్వర్యాలు, సుఖశాంతులతో తులతూగాలని ప్రతిఏటా మొలకల పండుగను నిర్వహిస్తారు. తరతరాల నుంచి గిరిజన తండాల్లో గిరిజనులు జరుపుకొనే పండుగలలో ఇది ముఖ్యమైంది. పుట్టిన ప్రతి గిరిజన యువతికి పెళ్లి జరిగే నాటికి తీజ్ను ఆ కుటుంబ సభ్యులు నిర్వహించడం ఆనవాయితీ. -
చిరుత కళేబరానికి పోస్టుమార్టం
మన్ననూర్:శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన జాతీయ రహదారి 765లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిరుత పులి కూనకు ఎన్టీసీఏ మార్గదర్శకాల ప్రకారం శాసీ్త్రయ పద్ధతిలో సోమవారం పోస్టుమార్టం నిర్వహించినట్లు డీఎఫ్ఓ రేవంత్చంద్ర తెలిపారు. ఈ సందర్భంగా అమ్రాబాద్ పశు వైద్యాఽ దికారి రాజు నేతృత్వంలో పోస్టుమార్టం నిర్వ హించి ప్రమాదంలో తగిలిన గాయాలు, మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు అవయవాలను పరీక్షించారు. చిరుత గోర్లు, చర్మం, దంతాలు తది తర విడి భాగాలు ఆక్రమణకు గురి కాకుండా ఉండేందుకు మృతదేహాన్ని దహనం చేశామని అధికారులు పేర్కొన్నారు. చిరుత పులి మృతి ఘటనలో కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేస్తామన్నారు. రహదారిలో ప్రత్యేక నిఘా ఎన్టీసీఏ మార్గదర్శకాలను అనుసరిస్తూ ఇప్పటికే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. కొంతకాలంగా ఎన్హెచ్ 765పై వాహనాల రాకపోకలు పెరగడంతో మన్ననూర్ నుంచి బ్రహ్మగిరి పరిసర ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీన్ని దృష్టి ఉంచుకొని వాహనాల వేగాన్ని నియంత్రించడంతో పాటు వన్యప్రాణుల రక్షణకు అవసరమైన ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటామని డీఎఫ్ఓ తెలిపారు. కార్యక్రమంలో ఎఫ్డీఓ చంద్రప్రకాష్ సింగాల్, ఎఫ్ఆర్ఓలు సవిత, వీరేష్, ఎఫ్ఎస్ఓ సురేందర్, బీఎఫ్ఓ గోపాల్, ఎన్టీసీఏ ప్రతినిధి రవికాంత్, బాపిరెడ్డి, అఖిల్గౌడ్, రిస్క్యూ టీం, వాచర్లు పాల్గొన్నారు. -
జడ్చర్లలో చైన్ స్నాచింగ్
● టీ తాగేందుకు వచ్చి పుస్తెల తాడు అపహరణ ● మోటార్ బైక్పై దొంగల పరారీ జడ్చర్ల: పట్టణంలో టీ కొట్టు నిర్వహిస్తున్న మహిళ మెడలో పుస్తెలతాడును గుర్తుతెలియని వ్యక్తులు లాక్కెళ్లిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. బాధితురాలి కథనం మేరకు.. వేంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో ఉదయకళ టీకొట్టు నిర్వహిస్తోంది. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఇద్దరు యువకులు యమహా ఆర్ 15 బైక్పై టీకొట్టు వద్దకు వచ్చారు. ఒక యువకుడు బైక్పైనే ఉండగా.. మరో యువకుడు టీ కొట్టు దగ్గరకు వెళ్లి సిగరెట్ తీసుకున్నాడు. టీ కావాలంటూ అడుగగా సదరు మహిళ టీ తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో టీ ధర ఎంత అని అడిగాడు. టీ ధర రూ.10 అనగానే అమ్మో అంతనా అంటూ మహిళ మెడలో ఉన్న పుస్తెలతాడును తెంపుకొని బైక్పై కొత్త బస్టాండ్ వైపు పారిపోయారు. వెంటనే మహిళ కేకలు వేసినా ఫలితం లేకపోయింది. పుస్తెలతాడు 3 తులాలు ఉంటుందని బాధిత మహిళ వాపోయింది. విషయం తెలుకున్న ఎస్ఐ ఖాదర్ ఘటన స్థలానికి చేరుకుని విచారించారు. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. సీసీ కెమెరాల్లో వారు పారిపోతున్న దృశ్యాలు నమోదయ్యాయి. విచ్చలవిడిగా పోకిరీలు అయితే కొన్ని నెలలుగా జడ్చర్ల పట్టణంలో పోకిరీలు మోటార్ బైక్లపై స్టంట్లు చేస్తూ.. సైలెన్సర్ల మోత మోగిస్తున్నారు. బాంబులు పేలుతున్న శబ్దాలను చేస్తూ రోడ్లపై దూసుకుపోతున్నారు.గంజాయి, తదితర మద్యం మత్తులో పెట్రేగిపోతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా టీ కొట్లు వీరికి అడ్డాలుగా మారాయి.టీ షాప్ల్లో సిగరెట్ల చాటున గంజాయి తాగి రోడ్లపై ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. పోలీస్ పెట్రోలింగ్ మచ్చుకై నా కానరావడం లేదని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. -
ఖాకీల్లో అవినీతి చిచ్చు
● రోజురోజుకు తెరపైకి వస్తున్న కొత్త అంశాలు ● భూముల వ్యవహారం నుంచి అక్రమ వసూళ్ల వరకు.. ఆరోపణలపై చర్చ ● వాస్తవాలు తేలాలంటే సమగ్ర విచారణే మార్గం సదరు ఉన్నతాధికారికి సంబంధించిన పలు వ్యవహారాలను ఆ ఎస్ఐ పర్యవేక్షించేవారని పోలీస్వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో గద్వాల–కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో పేకాట స్థావరాలపై జరిగిన దాడుల సందర్భంగా భారీ మొత్తంలో నగదు పట్టుబడిన వ్యవహారంలోనూ ఇద్దరి పాత్రపై ఆరోపణలు వచ్చినట్లు సమాచారం. అలాగే నెలవారీ వసూళ్ల వ్యవహారంలోనూ మధ్యవర్తిగా వ్యవహరించేవారని ప్రచారం జరుగుతోంది. ఇదే ఎస్ఐ గతంలో అవినీతి ఆరోపణల కేసులో ఏసీబీకి పట్టుబడి.. అనంతరం కొంతకాలం వీఆర్లో ఉన్నారు. ఆ తర్వాత కొద్దికాలానికే కీలక పోస్టింగ్ దక్కిందనే ఆరోపణలున్నాయి. అనంతరం ఓ జిల్లాలో ఏడాది పాటు పనిచేసి, ఆరోపణల నేపథ్యంలో నారాయణపేట జిల్లాకు బదిలీ కాగా అక్కడ రెండు నెలలు పూర్తికాకముందే మరోసారి వనపర్తి జిల్లాకు బదిలీ అయినట్లు పోలీస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. మహబూబ్నగర్ క్రైం/గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లాలో పోలీస్ శాఖకు చెందిన కొందరు అధికారులపై వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా గతంలో ఉమ్మడి పాలమూరులో కీలక హోదాలో పనిచేసిన ఓ ఉన్నతాధికారిపై పలు ఆరోపణలు రావడం, వాటిపై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించినట్లు ప్రచారం జరుగుతుండటంతో శాఖలోని కొందరు అధికారుల్లో ఆందోళన మొదలైనట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణల్లో వాస్తవాలను విచారణలో తేల్చాల్సి ఉంది. గతంలో ఉమ్మడి జిల్లా పోలీస్ శాఖలో పనిచేసిన సదరు ఉన్నతాధికారి జాతీయ రహదారికి సమీపంలో సుమారు 20 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు శాఖలో చర్చ జరుగుతోంది. దీనికి అదనంగా నవాబ్పేట మండల పరిధిలోని రెండు గ్రామాల శివారులో సుమారు 14 ఎకరాల వ్యవసాయ భూమి వ్యవహారంలోనూ ఆయనతో పాటు గతంలో అక్కడ పనిచేసిన ఓ ఎస్ఐ కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ భూమికి సంబంధించిన లావాదేవీలను మరో వ్యక్తి పేరుతో రిజిస్ట్రేషన్ చేసినట్లు సమాచారం. అయితే వీటికి సంబంధించిన వాస్తవాలు అధికారిక రికార్డులు, విచారణ ద్వారానే నిర్ధారణ కావాల్సి ఉంది. -
త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు: ఎస్పీ
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ప్రజలు అందించే ఫిర్యాదులను నిష్పక్షపాతంగా పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఎస్పీ డి.జానకి పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆమె ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యల పరిష్కారానికి అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఫిర్యాదును చట్టబద్ధంగా పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీసుశాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. గంజాయి రహిత జిల్లాగా పాలమూరు ● ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ విజయభాస్కర్రెడ్డి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాను గంజాయి రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ విజయభాస్కర్రెడ్డి కోరారు. మహబూబ్నగర్ ఎకై ్సజ్ డివిజన్ పరిధిలోని వివిధ స్టేషన్లలో నమోదైన 25 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 15 కిలోల ఎండు గంజాయి, 400 గ్రాముల అల్ఫ్రాజోలంను సోమవారం ధ్వంసం చేశారు. డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా ఎదులపల్లి గ్రామంలోని జీజే మల్టీ ఎన్క్లేవ్ ఇండస్ట్రీ ఇన్సినరేటర్లో వీటిని ధ్వంసం చేసినట్లు డీసీ తెలిపారు. స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాల విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై కఠినచర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ బి.శ్రీనివాస్, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. లా, ఇంజనీరింగ్ పరీక్షలు ప్రారంభం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో లా, ఇంజనీరింగ్ రెండో సెమిస్టర్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పరీక్షల నియంత్రణాధికారి ప్రవీణ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించారు. లా రెండో సెమిస్టర్ పరీక్షకు 80 మందికి 78 మంది హాజరుకాగా, ఇద్దరు గైర్హాజరయ్యారు. ఇంజనీరింగ్ పరీక్షకు 182 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షల్లో కాపీయింగ్కు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ప్రవీణ సూచించారు. సూపరింటెండెంట్ భూమయ్య, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రకిరణ్ పాల్గొన్నారు. ఇంజనీరింగ్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో మిగిలిన సీట్ల భర్తీకి ఈనెల 19, 20 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ రమేష్బాబు ఒక ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో 23, డేటా సైన్స్లో 35, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్–మెషిన్ లెర్నింగ్లో 5 సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు నిర్ణీత తేదీల్లో పీయూ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించే స్పాట్ అడ్మిషన్లకు హాజరుకావాలని సూచించారు. రోస్టర్ నిబంధనల ప్రకారం ప్రవేశాలు కల్పిస్తామని, టీజీఎప్సెట్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. ఫీజులను ఎప్సెట్–2026 వెబ్సైట్లో ప్రకటించిన విధంగా చెల్లించాలని సూచించారు. -
6,29,402 మంది ఓటర్లు
● సర్ ముసాయిదా జాబితా విడుదల ● జిల్లాలో 1,03,086 ఓట్లు తగ్గినట్లు వెల్లడి ● అభ్యంతరాల స్వీకరణకు నెల రోజుల గడువు జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో భాగంగా అధికారులు విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం మహబూబ్నగర్ జిల్లాలో 6,29,402 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 3,13,275 మంది పురుషులు, 3,16,108 మంది మహిళలు, 19 మంది ఇతరులు కాగా.. 785 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. గత జాబితాతో పోలిస్తే 1,03,086 ఓట్లు తగ్గినట్లు అధికారులు వెల్లడించారు. మృతి చెందినవారు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, డూప్లికేట్ ఓట్లు తదితరాలను తొలగించినట్లు తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా జూన్ 25 నుంచి ఇంటింటి ఓటరు పరిశీలన చేపట్టారు. సోమవారం నియోజకవర్గాల వారీగా ముసాయిదా జాబితాలను ప్రకటించారు. జాబితాపై అభ్యంతరాలను సెప్టెంబరు 16 వరకు స్వీకరించి, సెప్టెంబరు 17 నుంచి నోటీసులు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అభ్యంతరాలను అక్టోబరు 10లోగా పరిష్కరించి, అక్టోబరు 19న తుది ఓటరు జాబితాను ప్రచురించనున్నారు. నియోజకవర్గాల వారీగా ముసాయిదా జాబితా ఇలా.. నియోజకవర్గం పోలింగ్ పురుషులు మహిళలు ఇతరులు సర్వీసు స్టేషన్లు మహబూబ్నగర్ 279 1,06,054 1,07,524 10 316 జడ్చర్ల 280 99,485 99,862 7 265 దేవరకద్ర 303 1,07,736 1,08,722 2 204 ఎస్ఐఆర్ ముసాయిదా జాబితాపై అభ్యంతరాలను నిర్ణీత గడువులోగా స్వీకరిస్తాం. పరిశీలన అనంతరం అక్టోబర్ 19న తుది ఓటరు జాబితాను ప్రచురిస్తాం. ముసాయిదా ప్రకారం జిల్లాలో 6,29,402 మంది ఓటర్లు ఉన్నారు. – ఖుష్బూ గుప్తా, కలెక్టర్ -
బడుల్లో ఉదయాన్నే టిఫిన్!
● జిల్లాలో మహబూబ్నగర్ రూరల్లో తొలిసారిగా ప్రారంభం ● 49 బడుల్లో ఇడ్లీ, దోశ, పూరి వడ్డన మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులకు ఉదయా న్నే అల్పాహారం అందించే ‘బడుల్లో టిఫిన్’ కార్యక్రమం జిల్లాలో తొలిసారిగా మహబూబ్నగర్ రూరల్ మండలంలో ప్రారంభమైంది. అక్షయపాత్ర ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ట్రయల్ కార్యక్రమంలో మండలంలోని 49 పాఠశాలల్లో విద్యార్థులకు ఇడ్లీ, దోశ, పూరి తదితర అల్పాహారాన్ని అందించారు. మొత్తం 1,650 మంది విద్యార్థులు టిఫిన్ తీసుకున్నారు. మంగళవారం నుంచి పూర్తి స్థాయిలో కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. టిఫిన్ తయారీ, పాఠశాలలకు తరలింపు, విద్యార్థులకు పంపిణీ తదితర అంశాలను పరిశీలించేందుకు సోమవారం ట్రయల్స్ నిర్వహించారు. అల్పాహారం నాణ్యత, పరిమాణం, పంపిణీ విధానం తదితర అంశాలను అధికారులు పరిశీలించారు. కార్యక్రమం సజావుగా కొనసాగేందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం అక్షయపాత్ర ద్వారా జిల్లాలోని ఏడు మండలాల్లో మధ్యాహ్న భోజనం అందుతోంది. మిగిలిన మండలాల్లో వంట ఏజెన్సీల ద్వారా మధ్యాహ్న భోజనం కొనసాగుతోంది. జిల్లాలోని అన్ని పాఠశాలలకు మధ్యాహ్న భోజనంతో పాటు టిఫిన్ అందించే లక్ష్యంతో నాలుగు ప్రాంతాల్లో అక్షయపాత్ర కిచెన్ షెడ్ల నిర్మాణానికి అధికారులు స్థల పరిశీలన చేసినట్లు సమాచారం. అవి అందుబాటులోకి వస్తే దశలవారీగా అన్ని మండలాల్లోనూ టిఫిన్ కార్యక్రమాన్ని విస్తరించే అవకాశం ఉంది. -
వ్యసన ముక్త్ భారత్కు పాటుపడుదాం
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): మద్యం, పొగాకు, మాదకద్రవ్యాల వంటి వ్యసనాలకు దూరంగా ఉంటూ వ్యసన ముక్త్ భారత్ సాధనకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్లో బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. దేశవ్యాప్తంగా 10 కోట్ల మందితో ప్రతిజ్ఞ చేయించాలనే లక్ష్యంతో ఆగస్టు 6 నుంచి 20 వరకు ప్రచారం నిర్వహిస్తున్నట్లు బ్రహ్మకుమారీల ప్రతినిధులు తెలిపారు. మద్యం, పొగాకుతో పాటు మొబైల్, స్క్రీన్ వినియోగం, ప్రతికూల ఆలోచనలు, పనులను వాయిదా వేయడం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. సెన్సస్ వివరాలు 20లోగా అందించాలి సెన్సస్ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ స్టేజ్–1 విజయవంతంగా పూర్తయిందని కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. తదుపరి దశలో జిల్లా సెన్సస్ హ్యాండ్బుక్ కోసం 31 సంబంధిత శాఖలు తమ పరిధిలోని వివరాలను నిర్దేశిత ఫార్మాట్లో ఈ నెల 20లోగా జిల్లా ప్రణాళిక శాఖకు అందించాలని ఆదేశించారు. సెన్సస్ రికార్డు లు, ఫైళ్లను భద్రంగా ఉంచాలని, ప్రక్రియను సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్లు హరిప్రియ, మధుసూదన్నాయక్, ట్రెయినీ కలెక్టర్ శివాని, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాంరెడ్డి, డీఆర్డీఓ నర్సింహులు, జిల్లా ప్రణాళిక శాఖ ఇన్చార్జి అధికారి బి.నర్సింహులు పాల్గొన్నారు. -
రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పోరాటం
● బీజేపీ పాలనలో కుల వివక్ష కొనసాగుతోంది ● నాగర్కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి స్టేషన్ మహబూబ్నగర్: దేశంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని నాగర్కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి అన్నారు. హల్ద్వాని ఘటనకు నిరసనగా సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ అధ్యక్షుడు పసులరాజు ఆధ్వర్యంలో ర్యాలీ, సత్యాగ్రహ కార్యక్రమం నిర్వహించి అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మల్లురవి మాట్లాడుతూ ఉత్తరాఖండ్లోని హల్ద్వానిలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఓ కార్యక్రమంలో ప్రసంగించిన తర్వాత ఆ ప్రదేశాన్ని బీజేపీ మద్దతుదారులు వచ్చి పరిశుభ్రం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఖర్గే పట్ల జరిగిన వివక్షను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లు అవుతున్నా దేశంలో ఇంకా కులవివక్ష కొనసాగుతుండటం బీజేపీ పాలనలో జరిగిన ఈ సంఘటన ఒక నిదర్శమని అన్నారు. డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ హల్ద్వాని ఘటనపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సామాజిక న్యాయం కోసం పోరాడుతుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్పర్సన్ బెక్కరి అనిత, కార్పొరేటర్ ప్రవీణ్కుమార్, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు పసుల రాజు, పట్టణ అధ్యక్షులు సురేష్, ఉపాధ్యక్షులు వినయ్కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
26న మిలాద్ జులూస్ ర్యాలీ
స్టేషన్ మహబూబ్నగర్: మిలాదున్నబీ వేడుకలను పురస్కరించుకుని ఈనెల 26న జిల్లా కేంద్రంలో మిలాద్ జులూస్ ర్యాలీ నిర్వహించనున్నట్లు మజ్లిస్ అహ్లె సున్నత్వల్ జమాత్ మిలాద్ జులూస్ జల్సా కమిటీ ప్రతినిధులు తెలిపారు. సోమవారం షాసాబ్గుట్ట దర్గా ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అసర్ నమాజ్ అనంతరం సాయంత్రం మక్కామసీద్ నుంచి జులూస్ ప్రారంభమై క్లాక్టవర్, మున్సిపల్ కార్యాలయం, అశోక్టాకీస్, అంబేద్కర్ చౌరస్తా, న్యూటౌన్ మీదుగా షాసాబ్గుట్ట దర్గా ఆవరణకు చేరుకుంటుందని తెలిపారు. అనంతరం దర్గా ఆవరణలో ధార్మిక సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిటీ ప్రతినిధులు కోరారు. సమావేశంలో కమిటీ చీఫ్ ప్యాట్రన్ సయ్యద్ అబ్దుల్ రజాక్షా ఖాద్రీ, అధ్యక్షుడు మజహర్ హుస్సేన్ షహీద్, కార్యదర్శి ఖాజ ఫయాజుద్దీన్ అన్వర్పాషా, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా ఎంసీసీ ఫ్రీడమ్ రైడ్
మహబూబ్నగర్ క్రీడలు: మహబూబ్నగర్ సైక్లింగ్ క్లబ్ (ఎంసీసీ) ఆధ్వర్యంలో ఆదివారం ఫ్రీడమ్ రైడ్ ఉత్సాహంగా జరిగింది. శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ సాయిశివాని ముఖ్య అతిథిగా హాజరై సైక్లింగ్ రైడ్ను జెండా ఊపి ప్రారంభించారు. మెట్టుగడ్డ నుంచి ప్రారంభమైన ఈ సైక్లింగ్ రైడ్ పద్మావతీకాలనీ మీదుగా పిస్తా హౌజ్ వరకు వెళ్లి.. తిరిగి అక్కడి నుంచి మెయిన్ స్టేడియం వరకు నిర్వహించారు. ఈ ఫ్రీడమ్ రైడ్లో దాదాపు వందమందికిపైగా పాల్గొన్నారు. నగరంలో సైక్లింగ్ను ప్రోత్సహించే దిశగా ఈ రైడ్ నిర్వహించినట్లు సభ్యులు తెలిపారు. -
సర్వేలతోనే సరి..!
అచ్చంపేట: ఉమ్మడి పాలమూరు జాతీయ రహదారుల అభివృద్ధి సర్వేలకే పరిమితమైంది. రోడ్ల నిర్వహణ సైతం సరిగా లేక ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. భారత్మాల ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలో జాతీయ రహదారులను అభివృద్ధి చేయడానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ, జాతీయ రహదారుల విభాగం ప్రణాళికలు రూపొందించింది. అయితే ఇందులో భూత్పూర్– మన్ననూర్ ప్రధాన రోడ్డుకు దశాబ్దకాలంగా జాతీయ రహదారి గుర్తింపు లభించడం లేదు. అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్న నాగర్కర్నూల్ జిల్లాకు ఈ రోడ్డు మార్గం ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో వాహనదారుల ఇక్కట్లు చూడలేక రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించాలని పలుమార్లు కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా.. దీనికి జాతీయ రహదారుల విభాగం, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలత వ్యక్తం చేసినా ముందడుగు మాత్రం పడలేదు. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు దృష్టి సారించకపోవడంతో ఈ రోడ్డు మార్గానికి అనుమతులు రావడం లేదనే విమర్శలు ఉన్నాయి. 2017 కేంద్ర బడ్జెట్లో.. భూత్పూర్– నాగర్కర్నూల్– మన్ననూర్ రోడ్డును అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జాబితా సిద్ధం చేసి కేంద్రానికి పంపించారు. కేంద్ర ప్రభుత్వం 2017 బడ్జెట్లో 88 కి.మీ., ఈ రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించింది. దీంతోపాటు ఉమ్మడి జిల్లాలోని జడ్చర్ల– వనపర్తి– పెబ్బేరు 74 కి.మీ., ఎర్రవల్లి– గద్వాల– రాయచూరు 55 కి.మీ., ప్రధాన రోడ్లను కూడా జాతీయ రహదారులుగా గుర్తించాలని అప్పటి ప్రభుత్వం కోరగా.. కేంద్రం సూత్రపాయంగా అంగీకరించింది. ఉపరితల రవాణా శాఖ మంత్రిత్వశాఖ ఆమోదం పొందిన ఈ రోడ్లు అప్పట్లో సర్వేలు కూడా పూర్తయ్యాయి. ఈ రోడ్లతో గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్, మహబూబ్నగర్, నారాయణపేట కొత్త జిల్లాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్రలకు రాకపోకలు మార్గం సుగమమవుతుంది. మారిన ప్రతిపాదనలతో.. మొదట ప్రతిపాదించిన భూత్పూర్– మన్ననూర్ రోడ్డును కాలక్రమేణా మద్దిమడుగు– గంగులకుంట (తెలంగాణ) మీదుగా సిరిగిరిపాడు (ఆంధ్రప్రదేశ్) వరకు 166 కి.మీ., రోడ్డుగా మారింది. మద్దిమడుగు వద్ద కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మించాల్సి ఉంటుంది. ఇదంతా జరగడానికి ఆలస్యమవుతుండంతో మాజీ ఎంపీ రాములు విడతల వారీగా జాతీయ రహదారి ఏర్పాటు కోసం మరోసారి మన్ననూర్ వరకు ప్రతిపాదనలు రూపొందించి జాతీయ రహదారుల విభాగం సెక్రెటరీ గిరిధర్కు పంపించగా పరిశీలించి దాదాపు ఆమోదం తెలిపారు. చివరి క్షణంలో దీని ప్రతిపాదనలను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏపీ వరకు పొడిగించడంతో మారిన ప్రతిపాదనలతో ఆమోదం లభించలేదు. 2022లో కల్వకుర్తి– నంద్యాల కొత్త జాతీయ రహదారి–167కె మంజూరు తర్వాత కేంద్రం ఇప్పటి వరకు మరో జాతీయ రహదారి మంజూరు చేయలేదు. దీంతో ప్రాధాన్యత క్రమంలో ఉన్న కొత్త రోడ్డు మార్గాలు మరుగున పడుతున్నాయి. భూత్పూర్– చించోలి రహదారితో.. బెంగళూరు– ముంబాయి మధ్య అనుసంధానంగా కొనసాగుతున్న భూత్పూర్– చించోలి జాతీయ రహదారి విస్తరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ రహదారి అనుసంధానంగా 88 కి.మీ., దూరంలో ఉన్న శ్రీశైలం జాతీయ రహదారి–765కే వరకు పొడిగించడం వల్ల ముంబాయి, బెంగళూరు, శ్రీశైలం మూడు జాతీయ రహదారుల మధ్య అనుసంధానం ఏర్పడుతుంది. వీటితోపాటు హైదరాబాద్– పనాజీ ఎకనామిక్ కారిడార్లో భాగంగా మహబూబ్నగర్– గుడేబల్లూరు జాతీయ రహదారి–167ని నాలుగు లైన్లుగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం 80.01 కి.మీ., పనులకు రూ.3,175 కోట్లు మంజూరు చేసింది. ఈ మార్గంలోని దేవరకద్ర, మరికల్, మాగనూర్, మక్తల్, నారాయణపేట ప్రాంతాల మధ్య రాకపోకల ఇబ్బందులు తీరుతాయి. ఉమ్మడి జిల్లాకు దక్కని జాతీయ రహదారులు ప్రతిపాదనలకే పరిమితమైన భూత్పూర్– మన్ననూర్ రోడ్డు చించోలి రోడ్డుకు లింకుతో నాలుగు హైవేల అనుసంధానం పాలమూరు ప్రజలకు తప్పని రవాణా కష్టాలు ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు దృష్టిసారించాలని వేడుకోలు -
మతలబు ఏమిటో?!
జడ్చర్ల: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్లో భాగంగా జడ్చర్ల మండలంలో నిర్మిస్తున్న ఉదండాపూర్ రిజర్వాయర్కు సేకరించిన భూము లు, పరిహారం పంపిణీ తదితర వివరాల రికార్డులు మాయమయ్యాయి. భూ సేకరణ సమయంలో విధులు నిర్వర్తించిన అధికారులు బదిలీ అయినప్పుడు రికార్డులు అప్పగించకుండా తమ వెంటే తీసుకెళ్లారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు తగ్గట్లుగానే భూ రికార్డులపై విచారించిన అధికారులు సైతం కార్యాలయంలో ఆయా రికార్డులు లేవని చెప్పడం ఇందుకు బలం చేకూరుస్తుంది. అయితే రికార్డుల మాయం వెనక మర్మం ఏమిటి.. తమ అక్రమాలు బహిర్గతం కాకూడదనే ఉద్దేశమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. 5.20 ఎకరాలు అదనంగా చూపి.. ఉదండాపూర్ రిజర్వాయర్లో ముంపునకు గురవుతున్న ఉదండాపూర్, వల్లూరు గ్రామాలతోపాటు తుమ్మలకుంటతండా, రాగడిపట్టతండా, చిన్నగుట్టతండా, ఒంటిగుడిసె తండాలు ముంపునకు గురవుతున్నాయి. ఇందుకు సంబంధించి నిర్వాసితులకు పునరావాసం కోసం పోలేపల్లి గ్రామ శివారులో 316 ఎకరాల భూమి కేటాయించారు. అయితే సర్వే నం.554లో 79.39 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించి.. దీనిని పునరావాసానికి కేటాయించే ప్రక్రియ ప్రారంభించారు. ఈ భూమిని అనుభవిస్తున్న రైతులకు ఎకరాకు రూ.12 లక్షలు పరిహారం ఇచ్చేందుకు నిర్ణయించారు. అయితే ఈ భూమిని సాగు చేసుకుంటున్న నిజమైన రైతులను గుర్తించి పరిహారం అందించే ప్రక్రియలో రెవెన్యూ అధికారులు అక్రమాలకు తెరలేపారు. మొత్తం 79.39 ఎకరాలలో అప్పటికే ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్కు 9.39 ఎకరాలు, రెసిడెన్సియల్ స్కూల్కు 2.20 ఎకరాలు, అష్టలక్ష్మి దేవాలయానికి 3 ఎకరాలు పోగా.. మిగిలిన 64.20 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. అయితే ఇక్కడ 64.20 ఎకరాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉండగా 70 ఎకరాలకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు. అంటే 5.20 ఎకరాలను అదనంగా పేర్కొని ఆ పరిహారాన్ని బినామీల పేరుతో రూ.66 లక్షలు స్వాహా చేశారు. అంతేగాక ధరణి రికార్డులలో ఉన్న పలువురు అర్హులైన రైతులను కాకుండా.. బినామీల పేర్లను నోటిఫికేషన్లో చేర్చడం గమనార్హం. కేటగిరి–1లో ఆర్ఓఆర్, గ్రామ రికార్డులు, ధరణిలో పేర్లు ఉన్న వారికి 23 ఎకరాలకు గాను రూ.276 లక్షలు పరిహారంగా చెల్లించారు. కేటగిరీ–2లో పూర్తి విచారణ లేకుండానే 11 ఎకరాలకు సంబంధించి రూ.132 లక్షలు చెల్లించారు. అలాగే కేటగిరీ–3లో మాజీ తహసీల్దార్ జారీ చేసిన ధ్రువీకరణల ఆధారంగా 31.28 ఎకరాలకు రూ.380.40 లక్షలు చెల్లించినా.. ఇందుకు సంబంధించిన ఫైళ్లు ఇతరత్రా వాటిని ధ్రువీకరించలేదు. యాప్తోనే ఎరువులు రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువులు అందించేందుకు కేంద్రం ఎఫ్ఎఫ్ఎస్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. –8లో uకలెక్టర్కు రైతుల ఫిర్యాదు పోలేపల్లి శివారులోని సర్వే నం.554లోని భూమిని గత కొన్నేళ్లుగా తాము సాగు చేసుకుంటున్న తమకు కాకుండా అనర్హులకు పరిహారం ఇచ్చారని అప్పట్లో కొందరు రైతులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై 2022లో విచారణ చేసిన ఆర్డీఓ తహసీల్దార్, గిర్దావర్లు విధులను సక్రమంగా నిర్వర్తించలేదని, అలాగే సంబంధిత రికార్డులను స్వాధీనం చేయకపోవడాన్ని గుర్తించి నివేదికను కలెక్టర్కు అందజేశారు. దీంతో సంబంధిత తహసీల్దార్, గిర్దావర్లకు నాలుగు సార్లు మెమోలు జారీచేసినా స్పందించకపోవడంతో అప్పటి కలెక్టర్ విజయేందిర క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ సీసీఏకు సిఫార్సు చేశారు. అయితే సీసీఐ అధికారులు మాత్రం కేవలం ఇంక్రిమెంట్లను నిలిపివేసి చర్యలను మమ అనిపించినట్లు సమాచారం.


