breaking news
Mahabubnagar
-
వెల్డింగ్ చేస్తూ కరెంట్ షాక్.. యువకుడి మృతి
మహబూబ్నగర్ రూరల్: వెల్డిండ్ పనులు చేస్తుండగా విద్యుత్షాక్తో యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని ధర్మాపూర్లో సోమవారం జరిగింది. పూర్తి వివరాలు.. దేవరకద్ర మండలం అడవి హజిలాపురానికి చెంది న వడ్ల రాఘవేంద్రచారి (28) తన సోదరుడు నరేష్చారితో కలిసి గ్రామానికి చెందిన కొనగంటి నాగిరెడ్డి పొలంలో షెడ్డుకు వెల్డింగ్ పనులు చేస్తుండగా విద్యుత్షాక్ తగిలి మృతి చెందాడు. షెడ్డు పైనుంచి వెళ్లే 11 కేవీ, ఎల్టీఈ సింగిల్ ఫేజ్, త్రీఫేజ్ విద్యుత్ లైన్ల కారణంగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. మృతుడికి భార్య అమూల్య ప్రస్తుతం ఐదు నెలల గర్భిణిగా ఉంది. యజమాని, విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి, జిల్లా ఉపాధ్యక్షుడు వేణుగోపాల్ ఆరోపించారు. బాధిత కుటుంబానికి షెడ్డు యజమాని రూ. 20 లక్షలు, విద్యుత్ శాఖ రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ భూపాల్రెడ్డి, ఏఎస్సై దాసు సంఘటనా స్థలానికి చేరుకు ని పంచానామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతర కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
సర్వర్ మొరాయింపు.. రేషన్ పంపిణీకి అంతరాయం
● ఈ–పాస్ సాంకేతిక లోపంతో నిలిచిన లావాదేవీలు ● ఉదయం నుంచి వేచిచూసిన కార్డుదారులు ● పంపిణీ వివరాలపై స్పష్టత ఇవ్వని అధికారులు మహబూబ్నగర్ రూరల్: నిరుపేదలకు ప్రతి నెల చౌకధర దుకాణాల ద్వారా పంపిణీ చేసే ఉచిత బియ్యం పంపిణీకి సోమవారం సాంకేతిక సమస్యలు ఆటంకం కలిగించాయి. జిల్లాలోని రేషన్ దుకాణాల్లో ఉపయోగించే ఈ–పాస్యంత్రాల్లో సర్వర్ పనిచేయకపోవడంతో ఉదయం నుంచే పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో రేషన్ కోసం వచ్చిన కార్డుదారులు దుకాణాల వద్ద నిరీక్షించాల్సి వచ్చింది. మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం 506 చౌకధర దుకాణాలు ఉండగా, 2,78,386 రేషన్ కార్డులు, 9,50,934 యూనిట్లు ఉన్నాయి. వీరికి నెలకు 6,045.496 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం. ప్రతి నెల 1 నుంచి 15వ తేదీలోగా ప్రభుత్వం బియ్యం పంపిణీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే సర్వర్ సమస్యతో పలుచోట్ల పంపిణీకి అంతరాయం ఏర్పడింది. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి గంప శ్రీనివాసును ఈ విషయమై సంప్రదించగా.. శ్రీసర్వర్ అప్డౌన్ కావడం సర్వసాధారణమే. సాంకేతిక సమస్య కారణంగా కొంత ఇబ్బంది ఏర్పడింది’ అని తెలిపారు. జూలై నెలలో ఇప్పటివరకు ఎంతమంది కార్డుదారులకు బియ్యం పంపిణీ పూర్తయిందని అడుగగా.. ఇంకా అప్డేట్ కాలేదని ఆయన చెప్పారు. సాంకేతిక సమస్యలు తరచూ తలెత్తుతున్న నేపథ్యంలో రేషన్ పంపిణీ వ్యవస్థను మరింత పటిష్టంగా నిర్వహించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. -
‘మాదకద్రవ్యాలకు దూరంగా ఉందాం’
● విద్యార్థులకు యాంటీ డ్రగ్ సోల్జర్ సర్టిఫికెట్లతో సత్కారం వనపర్తి: మాదకద్రవ్యాలకు దూరంగా ఉండటం ప్రతి విద్యార్థి విజయానికి తొలి అడుగు అని, ప్రతి విద్యార్థి ‘యాంటీ డ్రగ్ సోల్జర్‘గా సమాజంలో చైతన్యం తీసుకురావాలని వనపర్తి డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీ నాయక్ అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో సోమవారం మాదకద్రవ్యాల నిర్మూలన విద్యార్థినుల భద్రత, మహిళల రక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీ నాయక్, ఎస్ఐ అంజాద్, కళాశాల ప్రిన్సిపాల్ నవీన, వైస్ ప్రిన్సిపాల్ సంయుక్తంగా ప్రశంసా పత్రాలు, పతకాలు, ‘యాంటీ డ్రగ్ సోల ్జర్‘ సర్టిఫికెట్లను అందజేశారు. అనతరం డీసీఆర్బీ డీఎస్పీ మాట్లాడుతూ మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును, కుటుంబాల ఆనందాన్ని, సమాజ ప్రశాంతతను దెబ్బతీసే మహమ్మారి వంటివన్నారు. ఒకసారి వాటికి బానిసైతే బంగారం లాంటి జీవితం నాశనమవుతుందన్నారు. యువత జీవిత లక్ష్యాలపై దృష్టి సారించి, వ్యసనాలకు పూర్తిగా దూ రంగా ఉండాలని సూచించారు. ‘యాంటీ డ్రగ్ సోల్జర్’ సర్టిఫికెట్ కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాదని, మాదకద్రవ్యాల నిర్మూలన కోసం సమాజంలో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యతకు ప్రతీ క అన్నారు. అనంతరం విద్యార్థినుల భద్రతపై అవగాహన కల్పిస్తూ 1908 టోల్ ఫ్రీ సేవలను అవసరమైన సమయంలో వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నవీన, వైస్ ప్రిన్సిపాల్, అధ్యాపకులు, పోలీసు అధికారులు, సిబ్బంది400 మంది విద్యార్థులు పాల్గొన్నారు. -
పాము కాటుతో మహిళ మృతి
చారకొండ: పాము కాటు కు గురై చికిత్స పొందుతూ మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని చంద్రాయన్పల్లిలో చోటు చే సుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రాయన్పల్లికి చెందిన డెరంగుల తిరుపతమ్మ (48) గత బుధవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా పాము కాటు వేసింది. కుటుంబసభ్యులు గమనించి చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో నాగర్కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తరలించగా సోమవారం మృతి చెందింది. తిరుపతమ్మ భర్త పదేళ్ల క్రితమే అనారోగ్యంతో మృతి చెందగా మృతురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. విద్యుదాఘాతంతో యువ రైతు మృతి ఉప్పునుంతల: పత్తి మొలకలకు నీరు పెట్టడానికి పొ లం వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో ఓ యువ రైతు మృతిచెందిన ఘటన సోమవారం ఉదయం మండలంలోని తిప్పాపూర్లో చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిప్పాపూర్కు చెందిన రైతు రాజపుత్ర వెంకటేశ్వర్ సింగ్ (37) తనకున్న పది ఎకరాల పొలంలో వరి పంట సాగుకు వేసిన నారుమడి, పత్తి, కీరదోస పంటను సాగుచేశాడు. రోజు మాదిరిగానే తెల్లవారుజామున పత్తి మొలకలకు స్పింక్లర్లతో నీరు పెట్టడానికి పొలం వద్దకు వెళ్లాడు. స్తంభం వద్ద నుంచి స్టార్టర్ వరకు కట్టెలపై వేలాడదీసిన సర్వీస్ వైరు తెగిపోవడంతో మోటారు నడవలేదు. దాంతో తెగిపోయిన సర్వీస్ వైరును సరిచేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడే పడిపోయాడు. పొలం గ్రామానికి సమీపంలోనే ఉండటంతో తండ్రి వెంట వెళ్లిన పదేళ్ల పెద్ద కొడుకు హర్షవర్ధన్సింగ్ ప్రమాదాన్ని గుర్తించి కుటుంబ సభ్యులు, గ్రామస్తులకు సమాచారం అందించాడు. దాంతో గ్రామస్థులు అక్కడి వెళ్లి చూసే లోపే వెంకటేశ్వర్సింగ్ చనిపోయాడు. మృతుడికి భార్య పూజాబాయి, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పుట్ట మహేష్గౌడ్ తెలిపారు. చోరీ చేసిన బైక్పై వెళ్తూ వ్యక్తి మృతి కల్వకుర్తి రూరల్/వంగూరు: బైక్ చోరీ చేసి తీసుకెళ్లే క్రమంలో జరిగిన ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు వంగూరులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. కల్వకుర్తి మండలం ముకురాల గ్రామానికి చెందిన చాకలి శ్రీను(34) హైదరాబాద్లోని పలు హోటళ్లలో వంట మనిషిగా పనిచేస్తుండేవాడు. త్వరగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో దొంగతనాలకు అలవాటుపడ్డాడు. అదే క్రమంలో కల్వకుర్తిలో చోరీ చేస్తూ పట్టుబడి జైలుకు వెళ్లాడు. జైలు నుంచి వచ్చాక తన ప్రవృత్తి ఏమాత్రం మార్చుకోలేదు. ఈ క్రమంలో సోమవారం వంగూరులో బైక్ చోరీ చేసి మార్గమధ్యలో మద్యం తాగి డిండి వైపు వెళ్తుండగా వంగూరు మండలంలోని వెలమల్లపల్లి గేటు సమీపంలో హైదరాబాద్ వెళ్తున్న కారు ఢీకొట్టింది. ప్రమాదంలో శ్రీను తీవ్రంగా గాయపడ్డాడు. 108 వాహనంలో కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు 108 పైలట్ శ్రీశైలం, ఈఎంటీ అఫ్జల్ వెల్లడించారు. మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఏఎస్ఐ ముజీబ్ తెలిపారు. పండ్ల దుకాణంలో అగ్నిప్రమాదం వనపర్తి రూరల్: జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ లో పండ్ల దుకాణంలో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. దుకాణంలో మంటలు ఒకేసారి మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పండ్లు, ఇతర సామాగ్రి దగ్ధమయ్యాయి. అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచా రం ఇవ్వడంతో వారు మంటలు అదుపులోకి తెచ్చా రు. ఆస్తినష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. ‘వైటీపీఎస్’ను కాపాడండి మన్ననూరు: దామరచర్లలో ఉన్న యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లోని యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ ప్రైవేటీకరణ టెండర్లను రద్దు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ‘వైటీపీఎస్ను కాపాడండి.. టీజీ జెన్కో’ను రక్షించండి అని సోమవారం భోజన విరామ సమయంలో ఈగలపెంటలో ఉన్న శ్రీ శక్తి సదన్ వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి పెద్ద ఎత్తున భూగర్భ కేంద్రం ఇంజినీర్లు, ఉద్యోగులు, ఆర్టిజన్లు నినాదాలు చేశారు. -
ఇల్లు పొమ్మంది.. ఊరు రమ్మంది
కులాంతర వివాహంతో కుటుంబానికి దూరమైన యువతి ● రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. భర్త బంధువుల వేధింపులు ● భర్త స్థాపించిన స్కూల్ కోసం అలుపెరగని పోరాటం ● గ్రామస్తుల అండతో దక్కిన ఫలితం రాజోళి: కులాంతర వివాహం చేసుకోవడం.. కన్న తల్లిదంద్రులే కూతురును కాదనుకున్నారు. ఆమెకు చెందిన సామాజికవర్గం కూడా దగ్గరకు రానివ్వలేదు. ఇద్దరు పిల్లలు పుట్టాక కూడా కరుణించలేదు. అయితేనేం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడు కంటికి రెప్పలా చూసుకుంటున్నాడని మురిసిపోయింది.. ఆ ఆశలు కానీ, ఇంతలోనే విధి వక్రీకరించింది. ప్రాణానికి ప్రాణమైన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటి నుంచి ఆ యువతి కష్టాలు మరింత తీవ్రమయ్యాయి. భర్త తరపు వారు కూడా వేధింపులకు గురిచేయడంతో ఆమె వేదన.. అరణ్యరోదనగా మారిపోయింది. 2017లో కులాంతర వివాహం.. వడ్డేపల్లి మండలంలోని రామాపురం గ్రామానికి చెందిన రేణుక, అదే గ్రామానికి చెందిన విజయ్ ప్రేమించుకొని.. 2017లో కులాంతర వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి యువతి అమ్మానాన్నలు ఆమెను కుటంబం నుంచి వెలివేశారు. కనీసం ఇంటి దగ్గరకు కూడా రానివ్వకపోగా.. ఫోన్లో సైతం మాట్లాడటం లేదు. అయితే అప్పటికే జీవితంలో స్థిరపడిన భర్త విజయ్ 2012లోనే రామాపురంలో విజ్ఞాన్ కాన్సె ప్ట్ స్కూల్ను స్థాపించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులతో పాఠశాల బాగా నడిచేది. అయితే అప్పటికే విజయ్ సోదరుడు, కుటుంబ సభ్యులకు ఆ స్కూల్పై కన్ను పడింది. ఈ క్రమంలోనే 2019 మే 11న గ్రామానికి చెందిన ఓ యువకుడి శుభకార్యానికి వెళ్లగా అప్పట్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయ్తో సహా 14 మంది మృత్యువాతపడ్డారు. ఈ ఘటనతో భర్త తరపున బంధువులు వేధింపులు మొదలయ్యాయి. విజయ్ మృతితో భార్య రేణుకకు రావాల్సిన పథకాలేవి భర్త ఇంటి సభ్యులు ఆమెకు దక్కనివ్వలేదు. భర్త స్థాపించిన స్కూల్ను సైతం లాక్కొని వివిధ రకాలుగా వేధింపులకు గురిచేశారు. పాఠశాల లైసెన్స్, రిజిస్ట్రేషన్ సైతం రేణుక పిల్లల పేరు మీదనే ఉన్నప్పటికీ ఆమెను దరిదాపుల్లోకి రానివ్వ లేదు. అయినప్పటికీ రేణుక తల్లిదండ్రులు ఆమెకు తోడుగా నిలవలేకపోయారు. ఆ అమ్మాయిని చూసే గ్రామంలో పిల్లల ను బడికి పంపాం. ఆమె భర్త విజయ్, అమ్మాయి రేణుక ఇద్దరూ చదువుకున్న వా ళ్లే. ఇతర గ్రామాలకు పంపి ఆలోచన చేసేంటే, తమ కళ్లెదురుగా పిల్లలు చదువుకుంటున్నారని ఆశపడ్డాం. విజయ్ చనిపోయాక అమ్మాయికి పాఠశాల రాకుండా ఎలాంటి అనుభవం లేని వ్యక్తి నడిపి పిల్లల భవిష్యత్ను నాశనం చేస్తున్నారు. అలాంటి వ్యక్తి నుంచి ఒంటరి యువతకి న్యాయం చేయాలని గ్రామస్తులం నిర్ణయించుకొని అండగా నిలబడ్డాం. – లక్ష్మీరెడ్డి, సింగిల్ విండో వైస్ ప్రెసిడెంట్,వడ్డేపల్లి -
కొలిక్కిరాని ‘గట్టు గుప్త నిధుల’ వ్యవహారం
గట్టు: మండల కేంద్రంలో పాడుబడిన ఇళ్ల గోడలను తొలగించే క్రమంలో కొందరు కూలీలకు బంగారం దొరికిందనే విషయంపై జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి. రెండు చోట్ల గుప్త నిధులు బయట పడ్డాయని, ఇందులో లభించిన బంగారం పంచుకునే విషయంలో విభేదాలు తలెత్తడంతో వి షయం కాస్త బయటకు పొక్కినట్లు ప్రచారం జరు గుతోంది. గుప్త నిధులను బయటకు తీసే క్రమంలో 1992 కాలం నాటికి వెండి నాణెం ఫొటో సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతోంది. గుప్తనిధులకు సంబంధించి 73 వెండి నాణ్యాలు లభించగా ఇందులో 33 నాణ్యాలు, రూ. లక్ష నగదు కూలీలు ఇంటి యజమానికి అప్పగించినట్లు సమాచారం. బంగారాన్ని మాత్రం మాయం చేసినట్లు తెలిసింది. గట్టులో సుమారు 50 ఏళ్ల క్రితం నేతాజీ సర్కిల్ వద్ద పెద్ద ఎత్తున గుప్త నిధులు బయటపడగా.. కొన్నింటిని స్థానికులు స్వాహా చేయగా మిగిలిన వాటిని అప్పట్లో ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నేటి సాలార్జంగ్ మ్యూజియంలో భద్రపరచినట్లు స్థానిక పెద్దలు చెబుతున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో తవ్వకాలను పురావస్తు శాఖ నిషేధించింది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో గట్టు ప్రాంతం సిరి సంపదలతో బంగారు గట్టుగా ప్రసిద్ధి చెందినట్లు చరిత్ర చెబుతోంది. గట్టు ప్రాంతం చుట్టూ దట్టమైన అడవులు, ఊరి చుట్టూ రక్షణ గోడ, చీకటి పడితే ఊళ్లోకి బయటి వ్యక్తులను రానిచ్చేవారు కాదని శతాధిక వృద్ధులు చెబుతున్నారు. తర్వాత కాలంలో దారి దోపిడి చేసే వాళ్లకు ఆవాసంగా మారి, ఈ దారి గుండా వెళ్లే వారిని దోచుకుని, దాచుకున్నట్లు చెబుతున్నారు. చాలా కాలంగా ఈ ప్రాంతంలోని ఆలయాలను కొందరు గుప్తనిధుల వేటగాళ్లు ధ్వంసం చేస్తునే ఉన్నారు. కొన్ని ఆలయాలను గ్రామస్తులు పునరుద్ధరించగా.. మరికొన్ని కాలగర్భంలో కలిసిపోగా, మరికొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి. గట్టులో బంగారం లభించిందన్న వ్యవహారం తన దృష్టికి వచ్చింది. ఇది వాస్తవమా కాదా అనేది తేలాల్సి ఉంది. ఇంటి యజమాని అందుబాటులో లేకపోవడంతో విచారణలో జాప్యం జరుగుతోంది. ఇంటి యజమానితో పాటుగా కూలీలను విచారించి, విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి, వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. – శేఖర్గౌడు, ఎస్ఐ -
ఎండ గుప్పిట్లో మెట్ట పంటలు
● పత్తి, ఆముదం రైతులను వేధిస్తోన్న బెట్ట పరిస్థితులు ● ప్రతికూల వాతావరణాన్ని తట్టుకునేలా సస్యరక్షణ చర్యలు చేపట్టాలి మదనాపురం: ప్రస్తుత ఖరీఫ్ సీజన్ మెట్ట రైతులకు పరీక్షా సమయంగా మారింది. రుతుపవనాల నిస్తేజం, ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో జిల్లా వ్యాప్తంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్ర వర్షాభావంతో ఆకులు వాడిపోవడం, ఎండిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో సాంప్రదాయ ఏక పంటల సాగు విధానం కంటే, బహుళ పంటల సూత్రాలు, శాసీ్త్రయ తేమ సంరక్షణ చర్యల ద్వారానే పంటలను కాపాడుకోగలమని జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు హెచ్చరిస్తున్నారు. వేర్వేరు స్థాయిల్లో వర్షాభావ ప్రభావం.. చల్కా,దుబ్బ నేలలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పంటలు త్వరగా దెబ్బతినే ప్రమాదం ఉంది. పాలీ పంట కరవు కాలంలో రైతుకు రక్షాకవచం. పరిశోధన ల ప్రకారం, తీవ్రమైన ఎండలు మరియు వర్షాభావ స మయాల్లో ఒకే పంటపై ఆధారపడటం వల్ల నష్టా లు తప్పవు. పాలీ పంట లేదా అంతర పంటల విధా నం ఈ విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. సూక్ష్మ వాతావరణం సష్టి: పత్తి లేదా ఆముదం వరుసల మధ్య పెసర, మినుము లేదా అలసందలు లాంటి తక్కువ కాలపరిమితి గల పప్పుధాన్యాల పంటలను వేయడం వల్ల అవి భూమిని త్వరగా కప్పి ఉంచుతాయి. ఇది నేలపై సూర్యరశ్మి నేరుగా పడకుండా నిరోధించి, నేల ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. ఫలితంగా భూమిలోని తేమ ఆవిరి కాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. వేర్ల సమర్థత: పత్తి, ఆముదం వేర్లు భూమి లోపలి పొరల నుంచి అంతర పంటల వేర్లు పైపొరల నుంచి నీటిని గ్రహిస్తాయి. దీనివల్ల నీటి పోటీ ఉండదు. ఒకవేళ తీవ్ర కరవు వల్ల పత్తి దెబ్బతిన్నా అంతర పంటగా ఉన్న పప్పుధాన్యాలు లేదా కందులు రైతును నష్టాల నుంచి గట్టెక్కిస్తాయి. పంటల వారీగా తక్షణ యాజమాన్య సూచనలు: పొలంలో గుంటుకలు లేదా దంతులు తోలడం ద్వారా భూమి పగుళ్లు పూడిపోతాయి. కలుపు తీసిన వ్యర్థాలను మొక్కల మొదళ్ల వద్ద పరచడం ద్వారా తేమను ఆదా చేయవచ్చు. బాహ్య పోషకాల పిచికారీ: వేర్లు నీరు లేక పోషకాలను తీసుకోలేవు కాబట్టి ఆకుల ద్వారా ఆహారం అందించాలి. లీటరు నీటికి 10 గ్రాముల యూరియా లేదా 13:0:45 (పొటాషియం నైట్రేట్) కలిపి ఎండ లేని సమయంలో పిచికారీ చేస్తే ఫలితం ఉంటుంది. రసం పీల్చే పురుగుల అదుపు: వాతావరణం పొడిగా ఉండటం వల్ల తెల్లదోమ, పచ్చదోమ ఆశిస్తాయి. నివారణకు ఎకరాకు 20 పసుపు, నీలి రంగు జిగురు అట్టలను తోటల్లో ఏర్పాటు చేయాలి. ఆముదం పంట సంరక్షణ చర్యలు: మొక్కల పల్చబరచడం గింజలు మొలిచిన 20 రోజుల్లోపు బలహీనమైన మొక్కలను పీకేసి, సిఫార్సు చేసిన సంఖ్యలోనే ఉంచాలి. దీనివల్ల తక్కువ నీరు ఉన్నా ఉన్న మొక్కలకే అందుతుంది. దాసరి పురుగు నివారణ: వేడి వాతావరణంలో ఆముదాన్ని ఆశించే దాసరి పురుగు గుడ్ల సముదాయాలను గమనించి ఏరివేయాలి. తీవ్రత ఎక్కువగా ఉంటే వేపనూనె (5 మి.లీ/లీటరు నీటికి) పిచికారీ చేయాలి. ఆత్రుతతో యూరియా చల్లొద్దు: వనపర్తి జిల్లాలోని 15 మండలాల రైతులు ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో అధైర్యపడకూడదు. ప్రస్తుతం నేలలో తగినంత తేమ లేదు. కాబట్టి రైతులు తొందరపడి నేరుగా భూమిలో యూరియా లేదా ఇతర కాంప్లెక్స్ ఎరువులను చల్లకూడదు. తేమ లేనప్పుడు ఎరువులు వేస్తే మొక్కలు మరింత త్వరగా ఎండిపోయే ప్రమాదం ఉంటుంది. డ్రిప్ లేదా మైక్రో–స్ప్రింక్లర్ల ద్వారా ప్రాణ రక్షణ తడులు ఇస్తే మంచి ఫలితం ఉంటుంది. పాడి–పంట -
ఏషియన్ హ్యాండ్బాల్ పోటీలకు సాయిచరణ్రెడ్డి
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాలోని మూసాపేట మండలం పొల్కంపల్లి గ్రామానికి చెందిన పుట్టమర్రి సా యిచరణ్రెడ్డి అంతర్జాతీయ స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. హ్యాండ్బాల్లో ప్రతిభ చూపడంతో చైనా దేశం చుగ్హౌలో ఈనెల 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరిగే 19వ ఏషియన్ పురుషుల జూనియర్ హ్యాండ్బాల్ చాంపియన్షిప్లో పాల్గొంటున్న భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇటీవల యూపీలోని లక్నో నగ రంలో జరిగిన నేషనల్ సెలక్షన్స్ ట్రయల్స్లో సత్తా చాటడంతో భారత జట్టుకు ఎంపికయ్యాడు. అలాగే ఈ ఏడాది జనవరిలో గుజరాత్ రాష్ట్రం సోమ్నాథ్లో జ రిగిన 69వ స్కూల్ గే మ్స్ ఫెడరేషన్ జాతీయస్థా యి హ్యాండ్బాల్ చాంపియ న్షిప్లోనూ పాల్గొన్నాడు. క్రీడాకారుడికి అభినందనలు చైనాలో జరిగే ఏషియన్ జూనియర్ హ్యాండ్బాల్ చాంపియన్షిప్కు సాయిచరణ్రెడ్డి ఎంపికకావడంపై అసోసియేషన్ ప్రతినిధులు రజనికాంత్రెడ్డి, ఎండి.జియావుద్దీన్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా క్రీడాకారుడు భారతజట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుండడం సంతోషంగా ఉందన్నారు.ఏషియన్ జూనియ ర్ హ్యాండ్బాల్ చాంపియన్షిప్లో ప్రతిభ చాటి జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. -
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన
వెల్దండ: మండలంలోని రాఘయపల్లిగేట్ సమీపంలో హైదరాబాద్, శ్రీశైలం జాతీయ రహదారిపై ఆదివా రం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం పోలీస్స్టేషన్ ఎదుట గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం సామయిపల్లితండాకు చెందిన గ్యానేష్ (28) కారు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందాడు. గ్యానేష్ మృతితో కుటుంబం రోడ్డున పడుతుందని, న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తూ.. హైదరాబాద్, శ్రీశైలం జాతీయ రహదారిపై బైఠాయించారు. వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో పోలీసులకు, బాధిత కుటుంబ సభ్యులకు వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు పోలీసులు నప్పజెప్పడంతో వారు ఆందోళన విరమించారు. కారు డ్రైవర్ కేసు నమోదు నారాయణపూర్గేట్ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ హనుమంతుపై సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యుగంధర్రెడ్డి తెలిపారు. మృతుడి భార్య దేవి ఫిర్యాదు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
నిర్లక్ష్యం వద్దు.. తక్షణం పరిష్కరించండి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ప్రజావాణిలో వ చ్చిన దరఖాస్తులను పరిశీలించి నిర్లక్ష్యం చేయకుండా సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా అధికారులకు ఆదేశించారు. సోమ వారం కలెక్టరేట్లో కలెక్టర్ ప్రజల నుంచి ఫిర్యా దులు స్వీకరించారు. అనవసరంగా పెండింగ్లో పెట్టవద్దని సూచించారు. మున్సిపల్, పంచాయతీరాజ్, వ్యవసాయం, పౌరసరఫరాల శాఖ, భూ సర్వే రికార్డులు, గృహ నిర్మాణం, రోడ్డు రవాణా, పోలీస్, గిరిజన అభివృద్ధి శాఖ, ప్రణాళిక శాఖ, విద్యుత్ శాఖ, విద్య, వైద్య ఆరోగ్యం, అటవీ, గ్రామీణ అభివృద్ధి తదితర శాఖలకు సంబంధించిన వినతులను అధికారులు స్వీకరించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు మధుసూదన్నాయక్, హరిప్రియ, భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రాంరెడ్డి, జెడ్పీసీఈఓ వెంటక్రెడ్డి, డీఆర్డీఓ నర్సింహులు పాల్గొన్నారు. ‘మా తండాను కబ్జా నుంచి కాపాడాలి’ తువ్వగడ్డ తండాను మాజీ సర్పంచ్ హరిచందర్ కబ్జా చేశారు. మా తండాకు చెందిన 16 ఎకరాల భూమిని ఆయన కబ్జా చేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఇళ్లు లేక ఇబ్బందులు పడుతున్నాం. ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి వెళ్తే ఆయన రానివ్వడం లేదు. నాలుగేళ్ల నుంచి తిరుగుతున్నా.. అధికారులు స్పందించడం లేదు. మాకు న్యాయం చేసేదాక పోరాటం చేస్తాం. – తువ్వగడ్డతండా, మునిమోక్షం, హన్వాడ మండలం ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలి ఇల్లు కట్టుకునేందుకు నాకు ప్లాటు ఉంది. ఇందిరమ్మ ఇంటికోసం అధికారుల వద్దకు పోతే ఇది వరకే ప్రభుత్వ లబ్ధి పొందావు. ప్రస్తుతం ఇందిరమ్మ ఇల్లు రాదని చెబుతున్నారు. కట్టని ఇల్లు మంజూరైందని.. బిల్లు కూడా అందిందని అధికారులు చెబుతున్నారు. నాకు ఎలాంటి ఇల్లు మంజూరు కాలేదు. అధికారులు స్పందించి నాకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలి. – దాసరి నర్సింహులు, సీసీకుంట మౌలిక వసతులు కల్పించాలి.. పాలకొండ శివారులోని శ్రీరామకాలనీ గోనెల నగర్లో కనీస వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మురుగు కాల్వలు లేక మురుగు నీళ్లు రోడ్లపై పారుతూ ప్రజలకు ఇబ్బంది కలుగుతోంది. సీసీరోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వానకాలంలో రోడ్లపై నీళ్లు కుంటగా మారి దోములు, ఈగలకు నెలవుగా మారుతుంది. వెంటనే సీసీరోడ్లు వేయడంతో పాటు డ్రెయినేజీలను నిర్మించాలి. –బీసీ సంక్షేమ సంఘం నాయకుడు వెంకట్రాములు, శ్రీరామకాలనీ -
సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: దివిటిపల్లి ఐటీ పార్కులోని అమరరాజా గిగా కారిడార్ పరిధిలో ఏర్పాటు చేసిన కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ (సీక్యూపీ) ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్రెడ్డి ఈనెల 15న రానున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ జరుగుతున్న ఏర్పాట్ల ను సోమవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, టీజీఐఐసీ వీసీ–ఎండీ కె.శశాంక, కలెక్టర్ ఖుష్బూగుప్తా వేర్వేరుగా క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా సీఎం హెలికాప్టర్ దిగే స్థలం, సభాస్థలి తదితర ప్రాంతాలను తనిఖీ చేసి అధికారులకు తగు సూచనలిచ్చారు. అలాగే కంపెనీ ప్రతినిధులతో చర్చించి ఏర్పాట్లపై తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే యెన్నం మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతంలో ఐటీ రంగం మరింత అభివృద్ధి చెందడంతో పాటు స్థానిక యువతకు విస్తృతంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ సాయిశివాని, ఆర్డీవో నవీన్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ కె.లక్ష్మణ్యాదవ్ పాల్గొన్నారు. ప్రతి కేసులో బాధితులకు సత్వర న్యాయం జరగాలి మహబూబ్నగర్ క్రైం: ప్రతి పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదులపై సదరు స్టేషన్ అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించాలని ఎస్పీ డి.జానకి అధికారులకు సూచించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమ వారం నిర్వహించిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి బాధితులు హాజరై పలు సమస్యలపై ఫిర్యాదులు అందించారు. ఒక్కో ఫిర్యాదును పరిశీలించిన ఎస్పీ ఆయా స్టేషన్ అధికారులతో మాట్లాడి కేసుల పురోగతిపై ఆరా తీశారు. ప్రతి కేసులో బాధితులకు సత్వ ర న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీస్శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. -
సురక్షితమైన రవాణా వ్యవస్థే లక్ష్యం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ/నారాయణపేట/మక్తల్: ప్రజలకు సురక్షితమైన, వేగవంతమైన రవాణా వ్యవస్థను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. సోమవారం నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాలో హ్యామ్ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంచిరోడ్లు ఉంటేనే పరిశ్రమలు వచ్చి యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.. అభివృద్ధికి నాణ్యమైన రహదారులే పునాదులని అన్నారు. గత ప్రభుత్వం రోడ్ల అభివృద్ధిని నిరక్ష్యం చేసిందని విమర్శించారు.పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి అవసరమైన భూ సేకరణలో ప్రజలు సహకరించాలని.. భూము లు ఇచ్చే వారికి ప్రభుత్వం న్యాయమైన పరిహారం చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. హ్యామ్ రోడ్ల నిర్మాణాలకు సంబంధించి ఒక్క ప్యాకేజీలోనే రూ. 547 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. మక్తల్ నియోజకవర్గంలో ప్రారంభించిన రోడ్ల నిర్మాణ పనులు చారిత్రాత్మకమైనవని అన్నారు. ప్రభుత్వం ప్రజల అవసరాలను ప్రాధాన్యంగా తీసుకొని భారీ ప్రాజెక్టులను మంజూరు చేసిందన్నారు. గత ప్రభుత్వం నాణ్యమైన రహదారుల నిర్మాణంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. మంత్రులకు స్వాగతం మహబూబ్నగర్జిల్లాకేంద్రంలోని క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జూపల్లి కృష్ణారావులకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి ఘనస్వాగతం పలికారు. జిల్లాలో మౌలిక వసతుల కల్పనతో పాటు పర్యాటకరంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మంత్రులు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ ఖుష్బూగుప్తా, ఎస్పీ డి.జానకి, ఎమ్మెల్యేలు అనిరుధ్రెడ్డి, వీర్లపల్లి శంకర్, నగర మేయర్ జి.మమత, ముడా చైర్మన్ కె.లక్ష్మణ్యాదవ్, తదితరులు పాల్గొన్నారు. -
ఎక్కడెక్కడ ఎలా..
ప్రతినిత్యం వేలాది వాహనాలు.. వందకుపైగా వేగంతో రయ్యుమంటూ దూసుకెళ్లే జాతీయ రహదారి–44పై బ్రిడ్జిల నిర్మాణ పనులు నత్తకు నడక నేర్పుతున్నాయి.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కొత్తూరు నుంచి అలంపూర్ వరకు సుమారు 180 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ రహదారిపై అక్కడక్కడ బ్రిడ్జిల నిర్మాణాలు చేపట్టారు.. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల అలసత్వంతో ఆయా పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. కొన్నిచోట్ల ఒకే దారిలో ఇరువైపులా వాహనాలు వస్తుండటంతో గంటల తరబడి ప్రయాణం చేయాల్సి వస్తుండటంతో.. అత్యవసర పరిస్థితుల్లో వెళ్లేవారు, అధికారిక విధుల్లో వెళ్లేవారు, ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు. – అడ్డాకుల/రాజాపూర్కొత్తూరుషాద్నగర్ క్రాస్రోడ్డురాయికల్ టోల్ఫ్లాజా ● బాలానగర్, రాజాపూర్ వద్ద ప్రతిరోజు అరగంట, గంటపాటు వాహనాలు నిలిచిపోతున్నాయి. ఇక్కడ అండర్ బ్రిడ్జిల పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ● మూసాపేట మండలం వేముల స్టేజీ వద్ద ఏడాదిన్నర కిందట పనులు మొదలైనా ఇప్పటికీ పూర్తి కాలేదు. దీనికితోడు ఇక్కడ సర్వీస్ రోడ్లను అరకొరగా చేపట్టడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక పోలీస్స్టేషన్ వైపు ఒక సర్వీస్ రోడ్డుపై కంకర వేసి వదిలేశారు. ఈ రోడ్డుపై వాహనాలు వెళ్తే దుమ్ముతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. అలాగే హనుమాన్ విగ్రహం వద్ద కూడా సర్వీస్ రోడ్డు అస్తవ్యస్తంగా మారింది. బాలానగర్బాలానగర్లో ఫ్లైఓవర్ నిర్మాణ పనుల వల్ల నిలిచిన వాహనాలు ఉమ్మడి జిల్లాలో ఎన్హెచ్–44పై ప్రయాణం సాఫీగా సాగడం లేదు. కొన్నాళ్ల నుంచి హైవేపై అండర్ బ్రిడ్జిల నిర్మాణ పనులు సాగుతుండటమే ఇందుకు కారణమవుతోంది. బ్రిడ్జి నిర్మాణం జరిగే చోట పనులను కాంట్రాక్టర్లు సకాలంలో పూర్తి చేయడం లేదు. దీంతో పనులు నెలల తరబడిగా సాగుతుండటంతో ప్రతిరోజు ట్రాఫిక్ కష్టాలు వాహనదారులకు చిరాకు తెప్పిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో కొత్తూరు నుంచి అలంపూర్ వరకు ఎన్హెచ్–44 సుమారు 180 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. అయితే జాతీయ రహదారిపై ప్రమాదాలు అధికంగా జరిగే చోట బ్లాక్ స్పాట్లుగా గుర్తించి అక్కడ అండర్ బ్రిడ్జిల నిర్మించడానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని బాలానగర్, రాజాపూర్, భూత్పూర్ మండలం శేర్పల్లి, మూసాపేట మండలం పోల్కంపల్లి స్టేజీ, జానంపేట, వేముల స్టేజీ, వనపర్తి జిల్లా పరిధిలోని పెద్దమందడి మండలం వెల్టూర్ స్టేజీ, కొత్తకోట మండలం కనిమెట్ట వద్ద అండర్ బ్రిడ్జిల పనులు చేపడుతున్నారు. ఇందులో బాలానగర్, రాజాపూర్, వేముల స్టేజీ వద్ద సుమారు ఏడాదిన్నర కిందట పనులు మొదలయ్యాయి. కాగా.. హైవేపై పనులు జరిగే చోట తీసుకోవాల్సిన కనీస రక్షణ చర్యలను కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదు. రోడ్డు పనులు జరిగే చోట అవసరమైన ప్రాంతాల్లో నిబంధనలు పాటించడం లేదు. పనులు జరిగే ప్రదేశాల్లో సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో సర్వీస్ రోడ్లు సక్రమంగా కనిపించడం లేదు. దీంతో వాహనాలు వరుస క్రమంలో ఢీకొంటున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీనికి తోడు నిత్యం ట్రాఫిక్ తంటాలతో ప్రయాణం నరకప్రాయంగా మారిందని వాహనదారులు, ప్రయాణికులు వాపోతున్నారు. ముద్దిరెడ్డిపల్లి క్రాస్రోడ్డుపోలేపల్లిజడ్చర్లదివిటిపల్లిభూత్పూర్వేముల స్టేజీఅడ్డాకుల టోల్ఫ్లాజా ● పోల్కంపల్లి స్టేజీ, వెల్టూరు స్టేజీల వద్ద సర్వీస్ రోడ్ల పనులే చేయిస్తున్నారు. ఇక్కడ వాహనాలు ప్రధాన రోడ్డుపైనే వెళ్తున్నాయి. వెల్టూర్ స్టేజీ వద్ద సర్వీస్ రోడ్ల పనులు నత్తనడకను తలపిస్తున్నాయి. ● కనిమెట్ట వద్ద సర్వీస్ రోడ్లు పూర్తి కాగా అండర్ బ్రిడ్జి పనులు సాగుతున్నాయి. వాహనాలు సర్వీస్ రోడ్లపైనే వెళ్తున్నాయి. భూత్పూర్ మండలం శేర్పల్లి(బీ) వద్ద కర్నూలు వైపు సర్వీస్ రోడ్డు పూర్తికాగా.. వాహనాలు దానిపైనే వెళ్తున్నాయి. హైదరాబాద్ వైపు వెళ్లే సర్వీస్ రోడ్డు పూర్తి కాలేదు. అండర్ బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతున్నాయి. కనిమెట్టపాలెం బాలానగర్, రాజాపూర్ వద్ద నిత్యం ట్రాఫిక్ కష్టాలు వేముల స్టేజీ వద్ద నెలల తరబడిగా సాగుతున్న పనులు హైదరాబాద్ నుంచి కర్నూలు వరకు నరకప్రాయంగా ప్రయాణం గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకొని వాహనదారుల అవస్థలు -
గడువులోగా ‘సర్’ ప్రక్రియ పూర్తిచేయాలి
మహబూబ్నగర్ రూరల్: ప్రత్యేక ఓటరు సవరణ (ఎస్ఐఆర్–2026) కార్యక్రమాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆర్డీఓ, ఎన్నికల నమోదు అధికారి నవీన్ అధికారులను ఆదేశించారు. ఆదివారం నగరంలోని పాత పాలమూరుతోపాటు పలు కాలనీల్లో ఆయన పర్యటించి ఇంటింటి ఎన్యుమరేషన్, ఫారాల పంపిణీ, సేకరణ, ధ్రువీకరణ ప్రక్రియలో బీఎల్ఓలు నిర్వహిస్తున్న తీరును తెలుసుకుని అక్కడికక్కడే సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ నవీన్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఓటరుకు ఎన్యుమరేషన్ ఫారం అందేలా చర్యలు తీసుకోవాలని, అందిన ఫారాలను వెంటనే ధ్రువీకరించి డిజిటైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఓటర్ల వివరాల నమోదు విషయంలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న పనులను రోజువారీగా సమీక్షిస్తూ గడువులోగా సర్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట డిప్యూటీ తహసీల్దార్లు దేవేందర్ కేసిరెడ్డి, సునీల్, శ్రీనివాసులు, గిర్దావర్లు నర్సింగ్, సుదర్శన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వెట్రన్కు అడుగులు
కొల్లాపూర్: పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి పంప్హౌజ్లో నీటి ఎత్తిపోతలకు అధికారులు ఎట్టకేలకు చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఆదివారం రాత్రి మొదటి పంప్హౌజ్ను పరిశీలించి సోమవారం వెట్రన్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. 2023 సెప్టెంబర్ 3న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీటిపారుదల శాఖ అధికారులు మొదటి పంపు డ్రైరన్ చేపట్టగా.. పంపు మోటార్ పరీక్ష విజయవంతం కావడంతో అదే నెల 16న అధికారికంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టును ప్రారంభించారు. దాదాపు నాలుగు గంటలపాటు మొదటి పంపు ద్వారా 250 క్యూసెక్కుల నీటిని నార్లాపూర్ రిజర్వాయర్లోకి ఎత్తిపోశారు. కొన్నిరోజుల తర్వాత మరోసారి ఎత్తిపోతలు చేపట్టి, మొత్తం 2 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. తర్వాత వేర్వేరు కారణాలతో నీటి ఎత్తిపోతలు ఆగిపోగా.. మళ్లీ ఇన్నాళ్లకు నీటి పంపింగ్కు చర్యలు మొదలయ్యాయి. ప్రాజెక్టులో మొదటి లిఫ్టు ఎల్లూరు పంపుహౌజ్లో మొదట 145 మెగావాట్ల సామర్థ్యం గల 9 పంపులను ఏర్పాటు చేయాలని నిర్ణయించి.. తర్వాత దాన్ని 8కి కుదించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండు మోటార్లు బిగించగా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 2 మోటార్లను బిగించింది. తర్వాత నార్లాపూర్ రిజర్వాయర్ సామర్థ్యం కుదింపు, పాలమూరు ప్రాజెక్టు ద్వారా సాగునీటి ఎత్తిపోతలకు కేఆర్ఎంబీ అనుమతి ఇవ్వకపోవడం వంటి కారణాలతో మిగిలిన మోటార్ల ఏర్పాటు పెండింగ్లో పడింది. దీంతో ఇప్పటికే ఏర్పాటు చేసిన నాలుగు మోటార్లతోనే ప్రాజెక్టును రన్ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రాజెక్టు ప్రారంభమైనప్పటికీ అసంపూర్తి పనుల కారణంగా నీటి ఎత్తిపోతలు జరగలేదు. ఎల్లూరు పంప్హౌజ్ అవసరాలకు సరిపడా విద్యుత్ సరఫరా పనులు సుదీర్ఘకాలం కొనసాగి.. ఇటీవలే పూర్తయ్యాయి. అలాగే నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఏదుల రిజర్వాయర్కు నీటిని తరలించే ప్రధాన కాల్వ తవ్వకాలు 2 కి.మీ., మేర కుడికిళ్ల, తిర్నాంపల్లి గ్రామాల సమీపంలో ఆగిపోయాయి. ఈ కాల్వ తవ్వకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్ల అదనపు నిధులు మంజూరు చేసినా.. పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. ఫలితంగా నార్లాపూర్ రిజర్వాయర్ను నింపినా ఏదులకు తరలించేందుకు మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు పంప్హౌజ్ ఒక్కో మోటార్ సామర్థ్యం 145 మెగావాట్లు పాలమూరు పంప్హౌజ్లో ఏర్పాటు చేయాల్సిన మోటారు 8ఒక మోటార్ ద్వారా రోజూ ఎత్తిపోసే నీళ్లు 3,000 క్యూసెక్కులు నార్లాపూర్ రిజర్వాయర్ నీటినిల్వ సామర్థ్యం 6.04 టీఎంసీలు సీఎం రేవంత్రెడ్డి ఆదేశానుసారం పాలమూరు ప్రాజెక్టు పనుల్లో అధికారులు వేగం పెంచారు. ఈ నెలలోనే కచ్చితంగా ఎల్లూరు పంపుహౌజ్లోని నాలుగు మోటార్ల ద్వారా ఎత్తిపోతలు చేపట్టాలనే పట్టుదలతో శ్రమిస్తున్నారు. సోమవారం చేపట్టే వెట్రన్ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగితే మొదటి పంపు ద్వారా నీటి ఎత్తిపోతలు జరుగుతాయి. మిగతా మూడు మోటార్లకు వెంటనే డ్రైరన్ పూర్తిచేసేలా అధికారులు కృషిచేస్తున్నారు. ప్రాజెక్టులోని మోటార్ల ద్వారా నీటి ఎత్తిపోతలు చేపట్టి నార్లాపూర్ రిజర్వాయర్ను నింపుతామని, కాల్వల తవ్వకాలు పూర్తయిన వెంటనే నీటిని ఏదులకు.. అక్కడి నుంచి వట్టెం, కర్వెన రిజర్వాయర్లకు తరలిస్తామని అధికారులు తెలిపారు. నేడు ఎల్లూరు పంపుహౌజ్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు నాలుగు మోటార్లతో నీటిని ఎత్తిపోసేందుకు చర్యలు తాజాగా సీఎం ఆదేశాలతో వేగం పుంజుకున్న పనులు మరోవైపు.. ఇంకా అసంపూర్తిగానే కాల్వలు గత మే, జూన్ నెలల్లో పాలమూరు ప్రాజెక్టు పనుల గురించి కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగింది. పాలమూరు ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపించింది. ఆ పార్టీకి చెందిన మాజీమంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యేలు పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. దీనికి కౌంటర్గా కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి ప్రాజెక్టును సందర్శించి.. బీఆర్ఎస్ వల్లే ప్రాజెక్టు అసంపూర్తిగా మిగిలిపోయిందని ప్రత్యారోపణలు చేశారు. బీఆర్ఎస్కు రాజకీయంగా ఎలాంటి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఏకంగా సీఎం రేవంత్రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. గత జూన్ 4, 5 తేదీలలో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రాజెక్టును సందర్శించారు. ఈ క్రమంలోనే వచ్చే డిసెంబర్ కల్లా ప్రాజెక్టును పూర్తి చేసి.. 90 టీఎంసీల నీటిని ఎత్తిపోసుకునేలా అనుమతులు తీసుకువస్తామని ప్రకటించారు. -
బాల్యాన్ని నులిపేస్తోంది!
● నివారణే లక్ష్యంగా 19 ఏళ్ల వారికి ఆల్బెండజోల్ మాత్రలు ● నేడు జిల్లావ్యాప్తంగా పంపిణీకి చర్యలు ● నివారణే లక్ష్యంగా 19 ఏళ్ల వారికి ఆల్బెండజోల్ మాత్రలు ● నేడు జిల్లావ్యాప్తంగా పంపిణీకి చర్యలు పాలమూరు: కడుపులో నులి పురుగులతో పిల్లలు అనేక అనారోగ్య సమస్యలతో సతమతమవుతుంటారు. రక్తహీనత, కడుపునొప్పి వాంతులు శారీరక, మానసిక ఎదుగుదల, ఇతర సమస్యలు ఎదురవుతాయి. వారి శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపుతోంది. పేగుల్లో ఉండే పరాన్నజీవి మనం తీసుకునే ఆహారాన్ని గ్రహించి రక్తహీనత, పోషకలేమి సమస్యలను సృష్టిస్తుంది. అపరిశుభ్రత కారణంగా చిన్నారుల్లో నులి పురుగులు వ్యాప్తి చెంది రోగాలబారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో నులిపురుగులను నివారించడమే లక్ష్యంగా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. సోమవారం నులిపురుగుల నివారణ దినం వారోత్సవాల సందర్భంగా జిల్లావ్యాప్తంగా 17 మండలాల పరిధిలోని 1నుంచి 19 ఏళ్లలోపు చిన్నారులు, యువతీ, యువకులకు ఆల్బెండజోల్ మాత్రలు వేయనున్నారు. మాప్ ఆఫ్ కింద ఈ నెల 20న కూడా మాత్రలు పంపిణీ చేయనున్నారు. సిబ్బందికి శిక్షణ.. నులి పురుగుల నివారణ మాత్రల పంపిణీకి ఇప్పటికే వైద్య, ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. జిల్లాకు వచ్చిన 2,57,800 ఆల్బెండజోల్ మాత్రలను 129 సబ్సెంటర్లు, 1,163 అంగన్వాడీ కేంద్రాలకు అందజేశారు. అయితే పిల్లలందరికీ నులిపురుగుల సంక్రమణ ఉందా.. అని పరీక్షించి గుర్తించడానికి చాలా శ్రమించాల్సి ఉంటుంది. 60 శాతం మంది ఇదే సమస్యతో ఉన్నందున సామూహికంగా ఈ వయసులోని వారందరికీ నులిపురుగుల నిర్మూలన కోసం ప్రత్యేకంగా ఆల్బెండజోల్ 400 మి.గ్రా., మాత్ర తయారు చేశారు. 1, 2 ఏళ్లలోపు పిల్లలకు 200 మి.గ్రా., మాత్ర, 6–19 ఏళ్లలోపు వారికి 400 మి.గ్రా., మాత్ర తినిపించాలి. మాత్రలతో ప్రయోజనాలు.. నులి పురుగులను నిర్మూలించడానికి ప్రత్యేకంగా మందులు తీసుకోవడం వల్ల వాటిని పూర్తిగా నాశనం చేస్తే రక్తహీనత సమస్య తీరుతుంది. రక్తహీనతను నియంత్రించి.. రక్తశాతం, నిరోధక శక్తి, పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతోంది. పోషకాహార లోపాన్ని నివారించి.. పోషక విలువలు పెరుగుతాయి. పిల్లలు తీసుకునే పోషక, ఆహార పదార్థాలు వారి శరీరానికి సరిగ్గా అందుతాయి. ఈ ప్రయోజనాలు సాధించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సోమవారం జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం నిర్వహించాలని నిర్ణయించింది. నులిపురుగుల నిర్మూలనకు ఒక్క ఆల్బెండజోల్ మాత్రను నోట్లో వేసుకొని చప్పరిస్తే చాలంటున్నారు వైద్యులు. చేతి, కాలి వేళ్ల గోళ్లను శుభ్రంగా, చిన్నవిగా కత్తిరించుకోవాలి. పరిశుభ్రమైన నీళ్లను తాగడం, చుట్టూ పక్కల పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. రోజువారిగా ఇంట్లో తీసుకునే ఆహారంపై ఎప్పుడూ మూతలు ఉంచాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు పరిసరాలతోపాటు ఇంటిని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోవడం, వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవడం ఎంతో అవసరం. పండ్లు, కాయకూరలను శుభ్రమైన నీళ్లలో బాగా కడిగి వాడుకోవాలి. భోజనం చేసే ముందు, మల విసర్జన తర్వాత చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. నులిపురుగులు ఉన్న పిల్లల్లో రక్తహీనత, అతిసారం, విరేచనాలు, పోషకాహార లోపం, బలహీనత, ఆందోళన, ఆకలి మందగించడం, ఎదుగుదల లోపం, మందబుద్ది, కడుపునొప్పి, వికారం, వాంతులు, బరువు తగ్గడం, మట్టి సున్నంబలపాలు తినే లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. -
పర్యావరణ పరిరక్షణ, విద్యాప్రగతికి కృషి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పర్యావరణ పరిరక్షణ, విద్యా ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఆదివారం ఎదిర శివారులోని ఊరచెరువు కట్టపై ఏర్పాటు చేసిన ‘ఐ లవ్ ఎదిర’ లోగోను ఆవిష్కరించి చుట్టుపక్కల మొక్కలు నాటారు. అనంతరం పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. చాలాచోట్ల వ్యవసాయ భూములు ప్లాట్లుగా మారుతున్నందున మొక్కలు విరివిగా నాటడం అత్యవసరమని పేర్కొన్నారు. నీటి సమస్యలను అధిగమించడానికి, భూగర్భజలాల సంరక్షణకు ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు. ముఖ్యంగా విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలు కల్పిస్తున్నామని, పాఠశాలల అభివృద్ధి, ఉపాధ్యాయులకు శిక్షణ, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎదిర ప్రాంతాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. అంతకుముందు లక్ష్మీనగర్కాలనీ వద్ద మెయిన్ రోడ్డు పక్కన నిర్మించిన శ్రీ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయ ఆర్చ్ను ప్రారంభించి.. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశా రు. ఆలయాలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, ధార్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయన్నారు. ఆయా కార్యక్రమాల్లో నగర మేయర్ మమత, ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, పాఠశాల హెచ్ఎం హేమచంద్రుడు తదితరులు పాల్గొన్నారు. -
కార్పొరేషన్ పరిధిలో ఎల్ఆర్ఎస్ కోసం వచ్చిన దరఖాస్తులు ఇలా..
● ఎల్–1 స్థాయిలో భారీగా పెండింగ్.. పట్టించుకోని ఉన్నతాధికారులు ● నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిరుగుతున్న దరఖాస్తుదారులు ● సరైన డాక్యుమెంట్లు లేక నిలిచిపోయినవి వెయ్యికిపైనే.. ● చేతులు తడిపితేనే పనులు జరుగుతాయన్న ఆరోపణలు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలకు సేవలు అందించడంలో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో పలు పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండడం లేదని, దీంతో ఆయా పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆరేళ్ల క్రితం అనధికార లే అవుట్లలో ఉన్న ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు దరఖాస్తు చేసుకుంటే.. వాటికి ప్రొసీడింగ్ కాపీలను దరఖాస్తుదారులకు ఇవ్వడంలోనూ అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో దరఖాస్తుదారులు కార్పొరేషన్ చుట్టూ ప్రదక్షిణలు చేసినా పెద్దగా ఫలితం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్పొరేషన్ అధికారులు క్షేత్రస్థాయి ఉద్యోగుల మధ్య సమన్వయం లోపం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నట్లు తెలుస్తుంది. ఎల్ఆర్ఎల్ దరఖాస్తుల ప్రక్రియ 2020లో జరిగితే సుమారు ఆరేళ్లుగా వందల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వేల సంఖ్యలో వచ్చిన దరఖాస్తుల నుంచి ప్రభుత్వానికి రూ.కోట్లలో ఆదాయం సమకూరినా.. వాటిని సకాలంలో పరిష్కరించకపోవడంతో అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విలీన గ్రామాలవే ఎక్కువ.. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల వల్ల ప్రభుత్వానికి రూ.కోట్లలో ఆదాయం సమకూరినప్పటికీ వాటిని పట్టించుకునే పరిస్థితి లేదు. దరఖాస్తుల్లో కార్పొరేషన్లో విలీనమైన గ్రామాలవే ఎక్కువ సంఖ్యలో పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. జైనల్లీపూర్, దివిటిపల్లి వంటి వాటిలో కొన్ని సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు వస్తున్నట్లు సెక్షన్ అధికారులు పేర్కొంటున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్, టౌన్ప్లానింగ్ అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తేనే ఈ సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది. కానీ, అధికారులు ఒకరిపై ఒకరు తోసుకుంటూ కాలక్షేపం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కార్పొరేషన్ పరిధిలోని లే అవుట్లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం (ఎల్ఆర్ఎస్) లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం తీసుకొచ్చింది. అనధికార లే అవుట్లను క్రబద్ధీకరించాలంటే ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించి.. కార్పొరేషన్కు దరఖాస్తు చేస్తే వాటిని పరిశీలించి అధికారులు ప్రొసీడింగ్స్ జారీ చేయాలి. కానీ, అధికారులు వాటిని పట్టించుకోకపోవడంతో వందల సంఖ్యలో దరఖాస్తులు అలాగే పెండింగ్లో ఉండిపోయాయి. కార్పొరేషన్ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన పేరుతో ఎక్కువ సమయం బయట ఉంటున్నప్పటికీ ఈ ప్రక్రియ మాత్రం ముందుకు సాగడం లేదు. ఎక్కువ దరఖాస్తులు ఎల్–1 స్థాయిలో పెండింగ్లో ఉన్నాయని.. అక్కడ క్లియర్ చేస్తే మిగతా దశలు త్వరగానే పూర్తవుతాయని ఒక డిపార్ట్మెంట్పై ఒకరు నెట్టివేయడం తప్పా.. పెద్దగా పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. మహబూబ్నగర్ కార్పోరేషన్ పరిధిలో కొన్నినెలలుగా ఎల్ఆర్ఎస్ కోసం మొత్తం 31,513 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఫీజు చెల్లించినవి 7,966 కాగా.. వీటిలో అప్రూవల్ పొందినవి 5,818 ఉన్నాయి. అలాగే ఎల్–1 వద్దే పెద్ద సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్లో ఉండగా.. మరో 1,136 దరఖాస్తులు కేవలం డాక్యుమెంట్లు లేని కారణంగా ప్రక్రియ నిలిచిపోయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో పలు దరఖాస్తులకు ఫీజు చెల్లించినా ఇప్పటికీ పరిశీలించేందుకు కూడా రాలేదన్న విషయం స్పష్టమవుతుంది. -
ఇసుక టిప్పర్ పట్టివేత
కల్వకుర్తి రూరల్: దుందుభి నది పరివాహక ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ కురుమూర్తి హెచ్చరించారు. ఎలాంటి అనుమతులు లేకుండా తెలకపల్లి మండలంలోని దాసర్లపల్లి నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్ను మండలంలోని రఘుపతిపేట పంచాయతీ పరిధిలోని రామగిరి వద్ద పట్టుకొని స్టేషన్కు తరలించినట్లు ఎస్ఐ వెల్లడించారు. టిప్పర్ యజమాని, డ్రైవర్పై కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. రెండు ఇసుక ట్రాక్టర్లు.. ఉప్పునుంతల: మండల సరిహద్దులోని దుందుభి వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు శనివారం రాత్రి పట్టబడినట్లు ఎస్ఐ పుట్ట మహేష్ తెలిపారు. సదరు ట్రాక్టర్లను సీజ్ చేయడంతో పాటు ట్రాక్టర్ల యజమానులు వంగూరు మండలంలోని ఉల్పర గ్రామానికి చెందిన జిల్లెల వాసు, ముద్దమల్ల నాగేష్పై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. చిన్నారిపై కుక్క దాడి మన్ననూర్: స్థానికంగా వివి ధ కాలనీల్లో వీధి కుక్కల బెడద అధికమై ప్రజలను కరిచి గాయపరుస్తున్నాయ ని శ్రీలింగమయ్య కాలనీకి చెందిన అయోధ్య గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆదివారం ఫిర్యాదు చేశాడు. తన కుమారుడు గ్రామంలోని వీధిలో ఆడుకుంటుండగా కుక్క కరిచి తీవ్రంగా గాయపరిచిందన్నారు. గతంలో కూడా వీధి కుక్కల బారిన పడి పలువురికి రక్త గాయాలైనట్లు తెలిపారు. గ్రామ పంచాయతీ అధికారులు, సిబ్బంది వీధి కుక్కల బెడద నుంచి గ్రామ ప్రజలకు రక్షణ కల్పించాలని వినతి పత్రంలో కోరారు. -
కోయిల్సాగర్కు పూడికతీతే శ్రీరామరక్ష
సీఎం దృష్టికి తీసుకెళ్లాం.. కోయిల్సాగర్ పూడికతీతతో పాటు జలాశయ సామర్థ్యాన్ని మరో టీఎంసీ వరకు పెంచే అవకాశంపై ముఖ్యమంత్రితో చర్చించడం జరిగింది. సీఎం సానుకూలంగా స్పందించి ఈ అంశాలపై సమగ్ర నివేదిక తయారు చేయాలని సూచించారు. కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా భవిష్యత్లో నీటి తరలింపు అవకాశాలను కూడా పరిశీలిస్తున్నాం. – మదుసూధన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాం 2011లో కోయిల్సాగర్ జలాశయంలో బాతిమెట్రిక్ సర్వే నిర్వహించినప్పుడు కొన్ని ప్రాంతాల్లో దాదాపు రెండు మీటర్ల మేర పూడిక ఉన్నట్లు గుర్తించాం. ప్రస్తుతం అంచనా వేయాలంటే మరోసారి సర్వే అవసరం. నిల్వ సామర్థ్య పెంపు కోసం సర్వే, పూడికతీత అంశాలను ప్రభుత్వ పరిశీలిస్తోంది. ఆదేశాలు వచ్చిన వెంటనే సాంకేతిక ప్రక్రియలు ప్రారంభిస్తాం. – ప్రతాప్సింగ్, ఈఈ కేఎస్పీ కరువులోనూ డ్యాం నీరుతో బతికాం నా చిన్నతనంలో డ్యాంను నిర్మించారు. మా వ్యవసాయానికి అదేనీరు ఆధారం. మధ్యలో తీవ్ర కరువు వచ్చిననప్పుడు ఉన్న కొంతమేర నీటిని ఆయిల్ ఇంజన్లో సహాయంతో తీసుకొని డ్యాం అడుగునే పంటలు వేసుకొని బతికినం.. వర్షాలు బాగా పడి పైనుంచి వరద నీరు ఉధృతంగా వచ్చినప్పుడు మట్టి కూడా వచ్చేది. డ్యాంలో పూడిక తీయడం ఇంతవరకు చూడలేదు. – పెద్దబాలప్ప, రైతు, కోయిల్సాగర్ దేవరకద్ర రూరల్: పాలమూరు రైతంగానికి జీవనాడిగా నిలిచిన కోయిల్సాగర్ జలశాయంలో 70ఏళ్లలో ఒక్కసారి కూడా సమగ్ర పూడికతీత చేపట్టలేదు. నీటి పారుదల శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 2011లో నిర్వహించిన బాతిమెట్రిక్ సర్వేలో జలాశయంలోని కొన్ని ప్రాంతాల్లో దాదాపు రెండు మీటర్ల మేర పూడిక పేరుకపోయినట్లు గుర్తించినప్పటికీ ఇప్పటివరకు పూడికతీత పనులు చేపట్టలేదు. ఒకప్పుడు 12వేల ఎకరాల ఆయకట్టుకు నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం 50వేల ఎకరాల ఆయకట్టుకు అధారంగా మారింది. సీజన్లో నీటి లభ్యతను బట్టి దాదాపు 35వేల ఎకరాలకు సాగునీరు అందించడంతోపాటు తాగునీటి అవసరాలకు ప్రధాన ఆధారంగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో జలాశయ నిల్వ సామర్థ్యాన్ని పెంచే చర్యలపై కసరత్తులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే మదుసూధన్రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి చర్చించినట్లు సమాచారం. దీంతో కోయిల్సాగర్ పూడికతీత అంశంపై రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. కరువు నేలపై ఆవిర్భావం కేవలం వర్షపునీటిని ఒడిసిపట్టి పాలమూరు ప్రాంతంలో కరువు పరిస్థితులను అధిగమించి వర్షాధార వ్యవసాయానికి ఊతమివ్వాలనే లక్ష్యంతో నిజాం పాలనలో 1945లో రూ.85లక్షల అంచనావ్యయంతో కోయిల్సాగర్ ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టారు. స్వాతంత్య్రం అనంతరం నిర్మాణం పూర్తయి నీటిని నిల్వ చేయడం ప్రారంభించినా.. ఈ జలాశయం తొలినాళ్లలో కేవలం 12వేల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే సాగునీరందించే వర్షాధార ప్రాజెక్ట్గా ఉండేది. అనంతరం ప్రభుత్వాలు వారీగా ప్రాజెక్ట్కు నిధులు కేటాయింపులు జరపడంతో కాల్వల విస్తరణ, పంపిణీ వ్యవస్థ అభివృద్ధి, ఆధునీకరణ పనులతో ఆయకట్టు లక్ష్యం మారడంతో కోయిల్సాగర్ కేవలం సాగునీటి వనరుగా కాకుండా ఉమ్మడి పాల మూరు జిల్లాలో జలభద్రతకు కీలకంగా మారింది. 2011లోనే సర్వేలో బయటపడిన వాస్తవాలు 70ఏళ్లుగా పూడికతీతకు నోచుకోని జలాశయం పెరిగిన బాధ్యతలు..తగ్గుతున్న నిల్వ సామర్థ్యం -
హత్య కేసులో నిందితుడి అరెస్టు
గద్వాల క్రైం: వృద్ధురాలిని దారుణంగా కత్తితో పొడిచి హత్య చేసిన కేసులో నిందితుడుని ఆదివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ శ్రీను తెలిపారు. పూర్తి వివరాలు.. గద్వాల పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన తెలుగు శంకరమ్మ(65)ను అదే కాలనీకి చెందిన తెలుగు ఆంజనేయులు(అంజి) డీసీఎం డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. అయితే కొన్ని నెలల కిందట మృతురాలు దూషించిందని ద్వేషం పెంచుకున్నాడు. ఈ క్రమంలో శనివారం వృద్ధురాలు ఇంట్లో ఒక్కరే ఉండడం చూసి కత్తితో విచక్షణా రహితంగా దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుమార్తె జయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుడు ఆదివారం ఉదయం బస్టాండ్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు సీఐ తెలిపారు. నిందితుడి నుంచి హత్యకు వినియోగించిన కత్తి, బైక్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. గద్వాల కోర్టులో హజరుపరచి రిమాండ్కు తరలించారు. కేసు చేధనలో పట్టణ ఎస్ఐ కల్యాణ్కుమార్, సాంకేతిక విభాగ సిబ్బంది చంద్రయ్య, కిరణ్ కీలకంగా వ్యవహరించినట్లు పేర్కొన్నారు నిందితుడి ఇంటి వద్ద నిరసన.. శంకరమ్మను హత్య చేసిన ఆంజనేయులు ఇంటి వద్ద ఆదివారం మధ్యాహ్నం మృతదేహాంతో కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు అక్కడికి చేరుకుని వారిని శాంతిపజేశారు. నిందితుడిని అరెస్టు చేశామని చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించడంతో నిరసన విరమించారు. రిమాండ్కు తరలింపు -
రసం పీల్చు పురుగుల నివారణ
కొత్తకోట రూరల్: వర్షాకాలంలో బత్తాయి, నిమ్మతోటల్లో రసం పీల్చు పురుగులైన తెల్లదోమ, తామర పురుగులు, ఎగిరేపేను, తెల్లపొలుసు పురుగులు, నల్లదోమ, నల్లిపురుగుల ఉధృతి అధికంగా ఉండి పంట దిగుబడిని 20– 30శాతం వరకు తగ్గిస్తున్నాయి. రసం పీల్చు పురుగుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మదనాపురం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజేందర్రెడ్డి సూచనలు సలహాలు. చీనిలో తామర పురుగులు:ఆకు కణజాలాన్ని తిన డం వల్ల పండుతొడిమ భాగంలో మచ్చలాగా ఏర్ప డి, కాయపై చారలుగా ఏర్పడటం వల్ల మార్కెట్లో కాయకు ధర తగ్గుతుంది. తెల్లదోమ ఉష్ణోగ్రతలు పెరిగి గాలిలో తేమ అధికంగా ఉంటే ఆకులు, పూత, పిందెలపై ఆశించి నష్టాన్ని కలుగజేస్తాయి. ఎగిరే పేను: ఆకులు, పూతపై ఆశించి రసాన్ని పీలుస్తాయి. ఈ పురుగు ‘శంకు తెలుగు’ను వ్యాప్తి చేస్తుంది. నల్లదోమ: పిల్ల పురుగులు ఆకుల నుంచి రసాన్ని పీల్చి తేనే లాంటి పదార్థాన్ని విసర్జించడం వల్ల ‘నల్లటి బూజు’ ఏర్పడి కిరణజన్య సంయోగక్రియ జరగక మొక్క క్షీణిస్తుంది. నల్లిలో ముఖ్యంగా ఆకుపచ్చ నల్లి, మంగునల్లి ముఖ్యమైనవి. ఇవి ఆకులపై రసాన్ని పీల్చడం వల్ల తెల్లని మచ్చలు ఏర్పడుతాయి. మంగునల్లి కాయలపై రసాన్ని పీల్చడం వల్ల ముదురు గోదుమరంగు లేదా ఊదారంగు మచ్చలు ఏర్పడి కాయ అంతటా మంగు ఏర్పడుతుంది. రసం పీల్చు పురుగుల నివారణకు: థైమిథేమేట్ 2 మి.లీ. లేదా ఇమిడాక్లోఫ్రిడ్ 0.5 మి.లీ. లేదా థమోమితాక్సామ్ 0.4 గ్రా. లేదా ఎసిటామిఫిడ్ 0.4గ్రా. లేదా డైఫెన్థియొరాన్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి ఆకు కింద భాగాలు, చెట్టు కొమ్మలు బాగా తడిచేటట్లు పిచికారీ చేయాలి. తెల్లనల్లి, మంగునల్లి నివారణకు: ప్రొపార్జైట్ 1.5 మి.లీ. లేదా ఇథియాన్ 1.5 మి.లీ. లేదా స్పైరోమెసిఫిన్ 1 మి.లీ. లేదా ఫెన్జాక్వీన్ 1 మి.లీ. లీటరు నీటిలో కలిపి గోళికాయ దశలో ఒకసారి, 20 రోజుల తర్వాత రెండోసారి పిచికారీ చేయాలి. పాడి–పంట -
పీయూ సెమినార్కు కేంద్రమంత్రికి ఆహ్వానం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూ జాతీయ సెమినార్ను వచ్చే నెల 7, 8 తేదీల్లో హైదరాబాద్ సమీపంలోని కన్హా శాంతి వనంలో నిర్వహించనున్నారు. కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ పీయూ అధికారులు కేంద్రమంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావుకు హైదరాబాద్లో ఆహ్వానపత్రాన్ని అందజేశారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు అధికారులు, విద్యావేత్తలు, పరిశోధకులు, నూతన ఆవిష్కర్తలు కూడా పాల్గొనున్నట్లు వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, ఓఎస్డీ మధూసూదన్రెడ్డి పాల్గొన్నారు. బోటు ప్రమాదం నుంచి బయటపడ్డ పాలమూరువాసి మహబూబ్నగర్ క్రైం: వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదం నుంచి నగరవాసి త్రుటిలో తప్పించుకున్నాడు. నగరంలోని మెట్టుగడ్డ దగ్గర మొబైల్ దుకాణ నిర్వాహకుడు, లావా మొబైల్ ఫోన్ డిస్ట్రిబ్యూటర్ అయిన మహ్మద్ మక్తధీర్ కంపెనీ టూర్లో భాగంగా మూడు రోజుల కిందట వియత్నాం వెళ్లాడు. అందరికీ ఒకే దగ్గర బస కల్పించడంతో శనివారం ఉదయం ఆయనతోపాటు ఉన్న మిగతా టూరిస్టులు బోటులో సముద్రం లోపలికి వెళ్లారు. మొదటి నుంచి మక్తధీర్కు చెరువు, సముద్రం అంటే భయం ఉండటం వల్ల అతను బోటులో సముద్రంలోకి వెళ్లకుండా హోటల్ దగ్గరే ఉండిపోయాడు. నీళ్లు అంటే ఉన్న భయంతో లోపలికి వెళ్లకపోవడంతో బోటు ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లయింది. ఈ ప్రమాదంలో తాను క్షేమంగా ఉన్నానని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. రెండు బైక్లు చోరీ.. వనపర్తి రూరల్: పట్టణంలో రెండుబైక్లు చోరీ జరిగిన సంఘటన మండలంలో చోటు చేసుకున్నది. రూరల్ ఎస్ఐ హృశికేష్ తెలిపిన వివరాల ప్రకారం.. గో పాల్పేట మండలం, పొలికెపాడుకు చెందిన దాసరి మహేష్ వ నపర్తిలో బబ్లూ మద్యం షాపువద్ద మార్చి నెల లో చోరీకి గురైందని, అలాగే అదేరోజు శ్రీనివాసపురం చెందిన బో గినిపవన్ మరికుంట లోని నారాయణ గ్రానైట్స్షాపు ఎదుట మరో బైక్చోరీకి గురైందని తెలిపారు. వీరిద్దరు బాధితులు ఆదివారం రూరల్పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్ఐ తెలిపారు. -
25న కురుమూర్తిస్వామికి లక్ష పుష్పార్చన
తొలి ఏకాదశి పురస్కరించుకొని ప్రత్యేక పూజలు కురుమూర్తిస్వామి ప్రధాన ఆలయం చిన్నచింతకుంట: భక్తుల ఆరాధ్య దైవం అమ్మాపు రం కురుమూర్తి స్వామి ఆలయంలో ఈ నెల 25న శయనేకాదశి (తొలి ఏకాదశి) పురస్కరించుకోని స్వామివారికి లక్ష పుష్పార్చన చేయనున్నట్లు ఆల య అర్చకులు, సిబ్బంది పేర్కొన్నారు. స్వామివారి ప్రధాన ఆలయ ప్రాంగణంలో వివిధ రకాల పూలమాలలతో మండపానికి అలంకరిస్తారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు పట్టు వస్త్రాలు ధ రింపచేసి మండపంలో ఉంచుతారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నిర్వహించే కార్యక్రమాలు.. తొలి ఏకాదశిని పురస్కరించుకొని కురుమూర్తి స్వామి ఆలయంలో ఈ నెల25, 26 తేదీల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 25న ఉదయం 6 గంటలకు సుప్రభాతసేవ, 6:30 కి స్వామి, అమ్మవార్లకు పంచామృత అభిషేకం, 9 గంటలకు విశ్వక్సేన పూజ పుణ్యావచనం, 10 గంటలకు స్వామివారికి లక్ష పుష్పార్చన, రాత్రి 7 గంటలకు అమ్మవారికి కుంకుమార్చన, 8 గంటలకు ప్రదోషకాలం పూజ, 9 గంటలకు తీర్థ ప్రసాద వితరణ, 10 గంటలకు అఖండ భజన, 26న ఉదయం 7 గంటలకు సహస్ర నామార్చన, 9 గంటలకు మహానివేదన, 9:30 కు తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. పేర్లు నమోదు చేసుకోవాలి తొలి ఏకాదశి పురస్కరించుకొని కురుమూర్తి స్వామి కి సహస్ర పుష్పార్చన జరిపించాలనుకునే భక్తులు ఆలయ కార్యనిర్వహణ అధికారి కార్యాలయంలో రూ.151 చెల్లించి తమ పేర్లు నమోదు చేసుకోవాలని ఆలయ ఈఓ మదనేశ్వరెడ్డి, చైర్మన్ బత్తుల బాల్రాజు కోరారు. అఽధికసంఖ్యలో హాజరుకానున్న భక్తులు -
కిడ్నాప్ ముఠాగా భావించి పట్టుకున్న స్థానికులు
● ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేసిన పోలీసులు మహబూబ్నగర్ క్రైం: ఒక ముగ్గురు మహిళలు స్థానిక కాలనీ రోడ్లపై అనుమానాస్పదంగా తిరుగుతూ కన్పించడంతో స్థానికులు వారిని పట్టుకున్నారు. నగరంలోని హబీబ్నగర్ ఏరియాలో ఆదివారం మధ్యాహ్నం సమయంలో ముగ్గురు మహిళలు చేతుల్లో చాక్లెట్లు పట్టుకొని అనుమానాస్పదంగా తిరుగుతుంటే స్థానికులు పట్టుకున్నారు. చాక్లెట్లు ఇచ్చి పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాగా భావించి కాలనీవాసులు వారిని చుట్టుముట్టారు. ఈ విషయం వన్టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వన్టౌన్ ఎస్ఐ శీనయ్య ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఢిల్లీ, హర్యానకు చెందిన నాలుగు కుటుంబాలుగా గుర్తించి ఆధార్ కార్డులు ఇతర వివరాలు పరిశీలించారు. ఈ కుటుంబాలు ప్రతి ఏడాది జీవనోపాధిలో భాగంగా పాఠశాలలకు తిరుగుతూ పేపర్లతో మ్యాజిక్ చేస్తూ జీవనం గడుపుతున్నట్లు గుర్తించామని ఎస్ఐ తెలిపారు. ఈ నాలుగు కుటుంబాల్లో ఎవరూ కూడా కిడ్నాప్ చేసే గ్యాంగ్ కాదని ఎస్ఐ వెల్లడించారు. -
మందు.. మాకొద్దు బాబోయ్
నవాబుపేట: గ్రామంలో మద్యం తాగి నిత్యం కుటుంబ సభ్యులను ఇబ్బందులు పెడుతున్న ఘటలు పెరుగుతూ వచ్చాయి. దీంతో మద్యం మానేసేలా ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకున్న మండలంలోని యన్మన్గండ్ల గ్రామం ఏకంగా పంచాయతీలోనే తీర్మానం పెట్టింది. తమ గ్రామంలో ఇక నుంచి మద్యం విక్రయించరాదని, నిబంధనలు అతిక్రమిస్తే జైలుకు పంపిస్తామంటూ హెచ్చరిక జారీ చేసింది పంచాయతీ పాలకవర్గం. గ్రామంలో ఎవరైనా అక్రమంగా మద్యం విక్రయిస్తే ఆ సమాచారం చెప్పిన వారికి రూ.2 వేల నగదు బహుమతి అందిస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై సంబంధిత శాఖ అధికారులతో అవగాహన కల్పించారు. గ్రామంలో ఇప్పటి వరకు మద్యం విక్రయించిన బెల్టు దుకాణాల యజమానులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మద్యం విక్రయించం అంటూ లిఖితపూర్వకంగా రాసి ఇవ్వడంతో వారిని పంచాయతీ ద్వారా సన్మానించి, అభినందించారు. యన్మన్గండ్ల గ్రామంలో తీసుకున్న ఈ నిర్ణయం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలవాలని అధికారులు సూచిస్తున్నారు. గ్రామం: యన్మన్గండ్ల ఓటర్లు: 2,895 జనాభా: 6,862 యన్మన్గండ్లలో మద్యపాన నిషేధానికి తీర్మానం తీర్మానం అతిక్రమిస్తే కఠిన చర్యలు మద్యం ఆచూకీ చెప్పిన వారికి రూ.2 వేల నగదు -
అనుమానాస్పదంగా యువకుడు మృతి
గద్వాల క్రైం: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతిచెందిన ఘటన గద్వాల జిల్లాకేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. పట్టణంలోని సుంకులమ్మమెట్ కాలనీకి చెందిన నరేందర్ (23), మరో నలుగురు యువకులు కాలనీ సమీపంలోని నవరంగ్ థియేటర్ పై అంతస్తులో మద్యంతో పాటు (నిషేధిత మత్తు పదార్థం) తాగారు. ఈ క్రమంలో నరేందర్ మూత్ర విసర్జన చేసేందుకు వెళ్లిన క్రమంలో పై అంతస్తు నుంచి కింద పడిపోయాడు. గమనించిన స్నేహితులు చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. కాగా, తన కుమారుడిని స్నేహితులు అందరూ కలిసి పథకం ప్రకారమే హత్యచేసి ఉంటారని తల్లి సువర్ణ అరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పట్టణ ఎస్ఐ కల్యాణ్కుమార్ తెలిపారు. భార్యాపిల్లలు దూరమయ్యారని వ్వక్తి ఆత్మహత్య మిడ్జిల్: కుటుంబ కలహాలతో భార్యాపిల్లలు తనను విడిచి వెళ్లడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మిడ్జిల్ మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల మేరకు.. వంగూరుకు చెందిన ప్రసాద్ (40) 20ఏళ్ల నుంచి మిడ్జిల్లో నివాసం ఉంటున్నాడు. ఇటీవల కొత్త ఇంటిని నిర్మించుకున్నాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా.. కుటుంబ కలహాలతో కొన్నేళ్లుగా దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో మానసికంగా కుంగిపోయిన ప్రసాద్.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తికి దేహశుద్ధి మానవపాడు: రాత్రివేళ అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన ఘటన మానవపాడు మండలం చంద్రశేఖర్నగర్లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. ఝార్ఖండ్కు చెందిన రతీయా ఒమరు శనివారం తెల్లవారుజామున చంద్రశేఖర్నగర్ గ్రామంలోని శ్రీనగర్లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా.. స్థానికులు పట్టుకుని నిలదీశారు. ఆ పక్కనే గొర్రెల మంద ఉండటం.. అతడు సరైన సమాధానం చెప్పకపోవడంతో దొంగతనం చేసేందుకే వచ్చాడని అనుమానిస్తూ దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చి అప్పగించారు. కాగా, అతడికి మతిస్థిమితం సరిగ్గా లేదని తెలిసింది. పూర్తిస్థాయిలో విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. బైక్ ఢీ.. వ్యక్తి మృతి మహబూబ్నగర్ క్రైం: రోడ్డు దాటుతున్న వ్యక్తిని ద్విచక్ర వాహనదారుడు వేగంగా ఢీకొట్టడంతో మృతి చెందాడు. రూరల్ ఎస్ఐ విజయ్కుమార్ కథనం ప్రకారం..నారాయణపేట పట్టణంలోని శివాజీ నగర్కు చెందిన నారాయణ(49) శుక్రవారం రాత్రి మహబూబ్నగర్ మండల పరిధిలోని ధర్మపూర్ దగ్గర రోడ్డు దాటుతున్న క్రమంలో ఏపీ 22 జీ6378 నంబర్ కలిగిన బైక్ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో నారాయణకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన అతనిని చికిత్స కోసం జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
వృద్ధురాలిపై కత్తితో దాడి
● అక్కడికక్కడే మృతి ● గొంతు, ఛాతి, పొట్టలో పొడిచిన వైనం ● పరారీలో నిందితుడు గద్వాల క్రైం: వృద్ధురాలిపై విచక్షణా రహితంగా కత్తితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన గద్వాల పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. బీసీ కాలనీలో నివాసం ఉంటున్న తెలుగు శంకరమ్మ(65)తో గుర్తు తెలియని దుండగుడు శనివారం మధ్యాహ్నం ఇంట్లోకి చొరబడి ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా కత్తితో గొంతు కోశాడు. అక్కడితో ఆగకుండా ఛాతి, పొట్టలో పలుమార్లు పొడవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం నిందితుడు పరారయ్యాడు. డీసీఎం డ్రైవర్పై అనుమానం.. వృద్ధురాలిపై దాడి చేసింది ఆమెకు వరుసకు కుమారుడైన డీసీఎం డ్రైవర్గా పనిచేస్తున్న వ్యక్తిగా కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏడాది క్రితం ఆమెతో సదరు వ్యక్తి ఘర్షణ పడ్డాడని, కుటుంబ సభ్యులు తీవ్రంగా మందలించి పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. అప్పటి నుంచి మనసులో పెట్టుకుని హత్యకు పాల్పడి ఉంటాడని ఆరోపిస్తున్నారు. మృతురాలి భర్త మెకల కృష్ణ రెండేళ్ల క్రితం మృతి చెందాడు. వీరికి అయిదుగురు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం చిన్న కూతురు మృతురాలి యోగక్షేమాలు చూసుకుంటుంది. పట్టపగలే హత్య జరగడంతో కాలనీవాసులు భయదోళనకు గురయ్యారు. గాలింపు చర్యలు.. స్థానికుల సమాచారంతో సీఐ శ్రీను, ఎస్ఐ కల్యాణ్కుమార్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతురాలి కుమార్తె జయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని హత్యకు గల కారణాలు వెల్లడిస్తామన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
పంటలకు ముఖ్య పోషకం నత్రజని
అలంపూర్: మనిషికి ఆహారం ఎలానో మొక్కలు కూడా ఆహారాన్ని ధాతువుల రూపంలో తీసుకుంటాయని వీటిని పోషకాలు అంటారని మండల వ్యవసాయ శాఖ అధికారి నాగార్జునరెడ్డి అన్నారు. మొక్క ఆరోగ్యంగా పెరగడానికి, ప్రత్యుత్పత్తికి 18 రకాల పోషకాలు అవసరమని పేర్కొన్నారు. పంటకు అందించాల్సిన పోషకాలపై పలు సూచనలు సలహాలు అందజేశారు. గాలి నుంచి మొక్కలకు సహజంగా లభించే పోషకాలు : కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్ ఈ మూడింటిని ప్రత్యేకంగా మొక్కలకు అందిచాల్సిన అవసరం లేదు. ముఖ్య పోషకాలు: నత్రజని, భాస్వరం, పొటాష్ ఉప పోషకాలు: కాల్షియం, మెగ్నీషియం, గంధకం సూక్ష్మ పోషకాలు: జింక్, రాగి, ఇనుము, మాంగనీస్, బోరాన్, మాలిబ్డినం, క్లోరిన్, సోడియం, కోబాల్ట్. మొక్కల జీవన ప్రక్రియలో ప్రతి పోషకం ఒక ప్రత్యేక పని నిర్వర్తిస్తుంది. అది లోపించినప్పుడు ఆ పని కుంటుపడుతుంది. దీని ప్రభావం వలన దిగుబడి తగ్గుతుంది. ఒక పోషకం చేసే పని మరొక పోషకం చేయలేదు. ముఖ్య పోషకం.. నత్రజని ఇది మొక్కకు కావాల్సిన ముఖ్య పోషకాల్లో మొదటిది. పైరుకు దీని అవసరం మొదటి నుంచి చివరి వరకు ఉంటుంది. పత్ర హరితం జీవ పదార్థం కేంద్రక ఆమ్లాల్లో నత్రజని ఒక భాగం. నత్రజనిని మొక్కలు అమ్మోనియం నైట్రేట్ రూపంలో తీసుకుంటాయి. నత్రజని ప్రభావం పైరు పెరుగుదల మీద దుబ్బు చేయడం, కొమ్మలు తొడగడంలోను ఉంటుంది. పైరు మీద దీని ప్రభావం స్పష్టంగాను త్వరితంగాను కనిపిస్తోంది. నత్రజని వాడకం వలన మాంసకృతుల శాతం పెరుగుతుంది. మొక్క నిర్మాణానికి మూలమైన జీవ కణమైతే జీవకణాల నిర్మాణానికి నత్రజని మూలధారం. నత్రజని అధికంగా వాడితే : ముఖ్యమైన నత్రజనిని అవసరం మేరకే వాడాలి. అధికంగా వేస్తే అనర్థాలకు దారి తీస్తుంది. ఎక్కువగా వాడితే పైర్లు విపరితంగా పెరిగి పడిపోవడం, పూతకు ఆలస్యంగా రావడం, పంట కాలం పొడగించడం, తాలు గింజల శాతం పెరగడం, చీడ పీడలకు సులభంగా గురికావడం, దిగుబడి తగ్గిపోతుంది. నత్రజని లోపిస్తే : పెరుగుదల నెమ్మదిగా, మొక్కలు పొట్టిగా ఉండిపోవడం, ఆకులు వాలిపోయి పసుపు రంగుకు మారడం, ఫలసాయంతో మాంసకృత్తుల శాతం తగ్గిపోవడం జరుగుతుంది. లోపం తీవ్రంగా ఉన్నప్పుడు ఆకుల మొనల నుంచి మధ్య వరకు క్రమంగా మాడిపోవడం, ముదురు ఆకులు ముందుగానే పసుపు రంగుకు మారి ఎండిపోయి రాలిపోతాయి. నత్రజని అందించే ఎరువులు: నత్రజని అందించడానికి యూరియా, అమ్మోనియం సల్ఫేట్, కాల్షియం, అమ్మోనియం క్లోరైడ్ ఎరువులు వాడాలి. నత్రజని సులభంగా కొట్టుకపోయే స్వభావం కలది. ఈ ఎరువుల వినియోగ ఫలితం 30– 45 శాతం మాత్రమే. కాబట్టి ఈ ఎరువులు వేసే విధానంలో జాగ్రత్తలు పాటించాలి. పాడి–పంట -
మానవత్వం మరిచి.. దొంగతనానికి పాల్పడి
తిమ్మాజిపేట: కుటుంబాన్ని పోషించేవాడు అకాల మరణం చెంది దుఃఖంలో ఉన్న ఆ ఇంటిలో మానవత్వం మరిచిన ఓ అగంతకుడు దొంగతనానికి పాల్పడిన ఘటన శనివారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన గువ్వల కల్పన భర్త కృష్ణయ్య ఇటీవల మృతి చెందాడు. ఈ క్రమంలో ఽశుక్రవారం గంగాపూర్లోని చెన్నకేశవస్వామి ఆలయానికి దర్శనం నిమిత్తం వెళ్లారు. శనివారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ఇంటికి రాగా తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న రూ.50 వేల నగదు అపహరించారు. బాగా తెలిసిన వారే చోరీకి పాల్పడినట్లు బాధితులు అనుమానిస్తున్నారు. కల్పన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య వనపర్తి రూరల్: మనస్తాపంతో ఫ్యాన్ ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్ఐ హరిప్రసాద్ తెలిపిన వివరాలు.. పట్టణంలోని పీర్లగుట్టకు చెందిన రాజశేఖర్ (31) కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శుక్రవారం భార్య సంధ్యతో ఘర్షణ పడటంతో ఆమె పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్తాపానికి గురైన రాజశేఖర్ శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకొని మృతి చెందాడు. మృతుడి తల్లి రామచంద్రమ్మ ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. యువకుడిపై కేసు నమోదు బల్మూర్: పెళ్లి పేరుతో ఓ యువతిని మోసం చేసిన యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజేందర్ శనివారం తెలిపారు. తెలకపల్లి మండలం గట్టురవిపాకలకు చెందిన గౌని శేఖర్ సోషల్ మీడియాలో మండలానికి చెందిన ఓ యువతిని పరిచయం చేసుకొని పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడని పేర్కొన్నారు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు జిల్లా క్రీడాకారులు
మహబూబ్నగర్ క్రీడలు: హైదరాబాద్లోని కొల్లూర్లో ఆదివారం జరగనున్న రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల(అండర్–10, అండర్–12, అండర్–14 ) అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారులు శనివారం తరలివెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో క్రీడాకారులను జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి.శరత్చంద్ర అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో మెరుగైన ప్రతిభ కనబరిచి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, సీనియర్ పీడీలు తదితరులు పాల్గొన్నారు. అథ్లెటిక్స్ క్రీడాకారులు: సహస్ర (స్టాండింగ్ లాంగ్జంప్), నక్షత్ర (60మీ, 200మీ. పరుగు), ఎం.వేద (200మీ., 60మీ.పరుగు), వి.భవిష్య (60మీ, 200మీ. పరుగు), రియా తనాజ్ (లాంగ్జంప్, 200మీ. పరుగు), మహా శేరిపల్లి (లాంగ్జంప్), వ్రిందయాదవ్ (300మీ., 60మీ. పరుగు), సాయిషన్వి (60మీ, 300మీ. పరుగు), వి.రిత్విక (ట్రైథలాన్), సమన్వి క్రిష్ణ (ట్రైథలాన్, కిడ్స్ జావెలిన్), వి.నిహాల్కుమార్ (స్టాండింగ్ లాంగ్జంప్), సిద్ధార్థ అనుపటి (200మీటర్ల పరుగు), అయాన్ ముద్దని (200మీ., 60మీ. పరుగు), మనోజ్ కుమార్ యాదవ్ (60మీ., 200 మీ. పరుగు), మణి అర్జున్ (లాంగ్జంప్, 200 మీ.పరుగు), శ్రీవర్షిత్ యాదవ్ (60మీ., 200మీ. పరుగు) -
సీసీ కెమెరాల ఏర్పాటు అత్యవసరం
మహబూబ్నగర్ క్రైం: నగరంలో ఉండే ప్రతి కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో నేరాల నియంత్రణతోపాటు నేరస్థులను త్వరగా గుర్తించడానికి ఉపయోగపడుతుందని డీఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజయ్నగర్లో శనివారం ఉదయం కమ్యూనిటీ కాంటాక్టు నిర్వహించారు. మొదట పోలీస్ బృందాలు ఇంటింటి తిరిగి స్థానికంగా ఉంటున్న వారి ధ్రువీకరణ పత్రాలు పరిశీలించారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేకుండా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించిన 29 బైకులు, నాలుగు ఆటోలను గుర్తించారు. అనంతరం చౌరస్తాలో స్థానికులకు డీఎస్పీ పలు అంశాలపై అవగాహన కల్పించారు. తనిఖీల్లో డీసీఆర్బీ డీఎస్పీ రమణారెడ్డి, వన్టౌన్ సీఐ అప్పయ్య, టూటౌన్ ఎస్ఐ విజయ్ భాస్కర్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
గ్రామస్తుల సహకారంతో..
గ్రామస్తుల సహకారంతో గ్రామంలో మద్యపాన నిషేధానికి ఆడుగులు పడ్డాయి. యువకులు తాగి గ్రామంలో ఇతరులను ఇబ్బందులు పెట్టడంతో పాటు కుటుంబ సభ్యులకు సైతం తలనొప్పిగా మారాయి. దీంతో కొందరు తల్లిదండ్రులు వారి గోడును పట్టించుకోవాలని పలు సందర్భాల్లో విజ్ఞప్తి చేశారు. దీంతో గ్రామసభ ఏర్పాటు చేసి, అందరి అభిప్రాయం మేరకు మద్యపాన నిషేధంపై తీర్మానం చేశాం. దీనికి సంబంధించి ఎకై ్సజ్ శాఖ ద్వారా సంబంధిత అధికారులతో అవగాహన కల్పించాం. నిబంధనలు అతిక్రమిస్తే విధించే జరిమానా గురించి వివరించాం. ఇక ముందు కూడా ఇదే స్ఫూర్తితో ముందుకుసాగుతాం. – రంజిత్కుమార్ గౌడ్, సర్పంచ్, యన్మన్గండ్ల ● -
వరుణుడు కరుణించాలని జలదిగ్బంధం
అడ్డాకుల: వర్షాలు కురవక కరువు పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో వర్షాలు కురవాలని ప్రార్థిస్తూ మూసాపేట మండల కేంద్రంలో గ్రామస్తులు శివాంజనేయ స్వామి ఆలయంలో శనివారం జలదిగ్బంధం కార్యక్రమం నిర్వహించారు. హిందూ సంప్రదాయంలో శివుడిని అభిషేక ప్రియుడిగా భావించే క్రమంలో గ్రామస్తులు ప్రధాన ఆలయంలోని గర్భగుడిలోని శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. బీచుపల్లి ఆలయం వద్ద కృష్ణా జలాలను తీసుకొచ్చి, వాటిని కలిపిన నీళ్లను గ్రామస్తులు శివలింగం పూర్తిగా మునిగే వరకు నీళ్లుపోసి వర్షాలు కురిపించాలని వేడుకున్నారు. తర్వాత ఆలయం వద్ద మధ్యాహ్నం వేళ అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
గుట్టుగా గుప్తనిధుల తవ్వకాలు
●దుండగులను కఠినంగా శిక్షించాలి మా గ్రామంలో కొంతకాలంగా గుప్తనిధుల తవ్వకాలను జరుపుతున్నారు. మేనెలలో కృష్ణానదిలోని విగ్రహాలను ధ్వంసం చేశారు. ఇప్పుడు మళ్లీ వాటిని తవ్వడానికి దుండగులు ప్రయత్నించారు. పోలీస్ అధికారులు దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలి. – దేవేంద్రప్ప, మాజీ సర్పంచ్, గుర్జాల్ సహకరించిన వారిని కూడా.. దుండగులకు సహకరించిన వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకోవాలి. నదిలోని విగ్రహాలను తవ్వడానికి ఈ ప్రాంతంలోని వ్యక్తుల సహకారం లేనిదే వేరే గ్రామాల వాళ్లు ఎలా వస్తారు. దుండగులతోపాటు వారికి సహకరించిన వ్యక్తులపై కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలి. – శివరాజ్గౌడ్, గుర్జాల్ జిల్లా అధికారులకుఫిర్యాదు చేస్తాం మా గ్రామంలో చాలారోజుల నుంచి గుప్తనిధుల వేట కొనసాగుతున్నది. చారిత్రాత్మకమైన విగ్రహాలను ధ్వంసం చేస్తుండడం చాల బాధగా ఉంది. మేము ఈ విషయంపై జిల్లా అధికారులను కలిసి దుండగులను శిక్షించాలని కోరుతాం. – కీరప్పపాటీల్, గుర్జాల్ కృష్ణా: కృష్ణా మండలం ఉమ్మడి జిల్లాలోనే ఓ ఆధ్యాత్మిక ప్రాంతం.. ఇక్కడున్న జీవనదులు, ఆలయాలు, ఇలా ప్రతి అంశంలో కూడా పేరుప్రఖ్యాతలు. ఏమైందో ఏమో కొంతకాలంగా ఈ ప్రాంతంలో అక్రమాలు, దోపిడీలు, సమాజ హితం కాని ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వీటన్నింటికి కారణం అధికారుల అలసత్వమని ఈ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. శుక్రవారం రైల్వేపట్టాల పక్కన 10రోజుల పసికందును వదిలి వెళ్లిన ఘటన మరవక ముందే.. మళ్లీ గుప్తనిధుల తవ్వకాలు, మరోపక్క చోరీలు, పేకాట, అక్రమరవాణా, ఇలా చెప్పుకుంటుపోతే చాలానే ఉన్నాయి. వీటన్నింటిపై సమగ్ర విచారణ జరపాలని మండల ప్రజలు కోరుతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి సరిగ్గా 12గంటల సమయంలో కొందరు దుండగులు కృష్ణానదిలో ఆంజనేయ విగ్రహం కింద గుప్తనిధులు ఉన్నాయని జేసీబీతో తవ్వకాలు మొదలు పెట్టారు. ఇది మొదటిసారి కాదు.. ఇక్కడ ఇదే విగ్రహాన్ని తవ్వడం మూడోసారి. మేనెలలో నదిలోని శివలింగం, ఆంజనేయస్వామి విగ్రహాలను తవ్వి దాని కిందున్న నిధులను దోచుకున్నారని, ఆ తర్వాత తాము అష్టకష్టాలు పడి ఆ విగ్రహాలను పునర్ప్రతిష్టపన చేశామని గ్రామస్తులు పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ ఆ విగ్రహాలను తవ్వేందుకు రాత్రి ప్రయత్నిస్తుండుగా.. గ్రామస్తులు చాకచక్యంగా పట్టుకున్నారు. ప్రస్తుతం జేసీబీని, డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. కేవలం కాల్వ తవ్వకాలు ఉన్నాయని జేసీబీ తీసుకరమ్మంటే వచ్చానని, తీరా అక్కడికి వచ్చాక గుప్తనిధుల తవ్వకాలు ప్రారంభించారని డ్రైవర్ గ్రామస్తులకు తెలిపాడు. ఈ గుప్తనిధుల తవ్వకాల్లో ఓ శాఖ అధికారుల ప్రమేయం ఉందని, గతంలోనూ మండలంలోని కున్సీ, హిందుపూర్, ముడుమాల్లో కూడా ఇదేవిధంగా తవ్వకాలు జరిపారన్నారు. వాటిపై ఎక్కడా కేసులు నమోదు కాలేదని ఆరోపించారు. వీటి వెనుక వవరో బలమైన వ్యక్తులు, వ్యవస్థ ఉండడం వల్లే ఇంతపెద్ద ఎత్తున తవ్వకాలు జరుపుతున్నారని, లేకపోతే ఇంత ధైర్యంగా దుండగులు ప్రయత్నించరని గ్రామప్రజలు బహిరంగంగా వాఖ్యనిస్తున్నారు. దీనివెనుక ఎంతటివారు ఉన్న వారిని వదలమని, మేము వారిని పట్టుకునే వరకు పోరాడుతామంటున్నారు. ఈ విషయంపై ఎస్పీ, కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఏదీ ఏమైన ఈ గుప్తనిధుల తవ్వకాల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించి నిందితులను శిక్షించాలని కోరారు. ఈ విషయంపై ఎస్ఐ నవీద్ను వివరణ కోరగా ఈ ఘటనపై పూర్తిస్తాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. గుర్జాల్ గ్రామస్తులు వెంటపడటంతో పరారైన దుండగులు జేసీబీ, డ్రైవర్ను పట్టుకొని పోలీసులకు అప్పగింత గతంలో ఇదే మాదిరిగా తవ్విన దుండగులు కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్ -
20 లోగా ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేయాలి
అడ్డాకుల: ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్–20206)లో భాగంగా జరుగుతున్న ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్(ఆన్లైన్) ప్రక్రియను ఈనెల 20వ తేదీలోగా పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అధికారులను ఆదేశించారు. అడ్డాకుల మండలం కందూర్, మూసాపేట మండలం కొమిరెడ్డిపల్లి గ్రామాల్లో శనివారం ఆయన పర్యటించారు. ఆయా గ్రామాల్లో కొనసాగుతున్న ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ నమోదు ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఇప్పటి వరకు స్వీకరించిన అన్ని ఎన్యూమరేషన్ ఫారాలను గడువులోగా తప్పనిసరిగా ఎలాంటి జాప్యం లేకుండా ఆన్లైన్లో పొందుపర్చాలని సూచించారు. ఇప్పటి వరకు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించని ఓటర్లు వెంటనే తమ సంబంధిత బీఎల్ఓలను సంప్రదించాలని చెప్పారు. ఫారాలు సమర్పించని వారి పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగించే అవకాశం ఉందన్నారు. అందుకే అర్హత కలిగిన ప్రతి ఓటరు తప్పని సరిగా ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్ఓలకు సమర్పించాలని చెప్పారు. ఆయా గ్రామాల్లో అధికారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై ఓటర్లు నిర్లక్ష్యం వహించొద్దని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్లు శేఖర్, రాజునాయక్ తదితరులు ఉన్నారు. -
అగ్నివీరులు..!
దేశ రక్షణకు యువత ముందడుగు ● 2025– 26లో వనపర్తి జిల్లా నుంచి 17 మంది ఎంపిక ● యువతలో ఆసక్తిరేపుతున్న రిటైర్డ్ ఆర్మీ జవాన్ల ఉచిత శిక్షణ ● 2027 నోటిఫికేషన్ కోసం మరో 15 మందికి తర్ఫీదు ● ఆర్మీలో ఏఐపీటీగా పనిచేసిన అనుభవంతో మెరుగైన శిక్షణకు అవకాశం సుమారు 18 ఏళ్లు సైన్యంలో పనిచేసిన మాజీ సైనికుడు పి.మహేష్ తనవంతుగా దేశరక్షణ కోసం యువతను తయారు చేయాలని నిశ్చయించుకున్నాడు. ఇందుకోసం ‘జై జవాన్.. జై కిసాన్.. ఫ్రీ ఫిజికల్ ఎడ్యుకేషన్’ సెంటర్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి.. కలెక్టర్ ఆదర్శ్ సురభితో యువతకు ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు అనుమతి పొందారు. స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రధాన భవనం వెనక భాగంలో యువతకు ఫిజికల్ ఎడ్యుకేషన్పై ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఈయన ఆర్మీలో ఏఐపీటీగా నాలుగేళ్ల అనుభవం ఉండటంతో ఒక సైనికుడికి కావాల్సిన ఫిట్నెస్ యువతలో కలిగేలా శిక్షణ ఇస్తూ.. అగ్నివీర్ విభాగానికి ఎంపికయ్యేలా తీర్చిదిద్దుతున్నారు. గత బ్యాచ్లో తన శిష్యులు ఏడుగురు ఉద్యోగం సాధించగా.. మరో మాజీ సైనికుడు గబ్బర్సింగ్ వద్ద శిక్షణ తీసుకున్న మరో తొమ్మిది మందిని ఇప్పటికే అగ్నివీర్కు పంపించారు. ప్రస్తుతం వీరిద్దరు కలిసి మరో 15 మందికి ఫిజికల్ ఎడ్యుకేషన్పై శిక్షణ ఇస్తున్నారు. అప్పటి కలెక్టర్ స్ఫూర్తితో.. 2006లో నేను ఆర్మీలో చేరే ముందు అప్పటి ఉమ్మడి పాలమూరు కలెక్టర్ ఉషారాణి ఆర్మీ శిక్షణ కోసం ఉచిత వసతి కల్పించి ప్రోత్సహించారు. చాలామంది మాజీ సైనికులు మమ్మల్ని భారత సైన్యంలోకి పంపించేందుకు ఫిజికల్ ఎడ్యుకేషన్, రాత పరీక్షపై అవగాహన కల్పించారు. వారి స్ఫూర్తితో తాము జిల్లాలోని యువతను అగ్నివీర్ విభాగంలోకి పంపించేందుకు కృషిచేస్తున్నాం. తొలిసారే అనుకున్న మేరకు అగ్నివీరులను తయారు చేశాం. రెండో బ్యాచ్ను సిద్ధం చేసి ట్రైనింగ్ ఇస్తున్నాం. సాధ్యమైనంత కాలం ఈ ఉచిత ఫిజికల్ ఎడ్యుకేషన్ సెంటర్ కొనసాగిస్తాం. – మహేష్, మాజీ సైనికుడు, జై జవాన్, జై కిసాన్ ఫ్రీ ఫిజికల్ ఎడ్యుకేషన్ సెంటర్ నిర్వాహకులు, వనపర్తి సంస్థను ఏర్పాటు చేసి.. -
భూ రీసర్వేను ప్రాధాన్యతతో నిర్వహించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): భూ భారతి చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే రాష్ట్రవ్యాప్తంగా భూ రీ–సర్వే ప్రక్రియను అత్యంత ప్రాధాన్యతతో నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఖమ్మం నుంచి ఆయన వీసీ నిర్వహించారు. రైతుల భూములకు పూర్తి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. భూభారతి అమల్లోకి వచ్చి 15 నెలలు పూర్తయినా ప్రజల అంచనాలకు పూర్తిస్థాయిలో చేరలేకపోయామని తెలిపారు.ఽ కలెక్టర్లు భూ రీ–సర్వేను అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకుని అవసరమైన సిబ్బంది, పరికరాలు, మౌలిక వసతులు సమకూర్చాలని ఆదేశించారు. సాదాబైనామా దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిష్కరించి నోటీసులు త్వరితగతిన జారీ చేయాలని సూచించారు. రెండోవిడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను వెంటనే పూర్తి చేసి, గుడిసెల్లో నివసించే కుటుంబాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, మొదటి విడతలో మంజూరు కాని అర్హుల ఇళ్లను కూడా రెండవ విడతలో చేర్చి మంజూరు చేయాలని సూచించారు. -
తీవ్రమైన నేర విచారణలో నిర్లక్ష్యం ఉండొద్దు
మహబూబ్నగర్ క్రైం: కోర్టు కేసులలో సత్వర విచారణ జరగాలంటే పోలీసులు, కోర్టు సిబ్బంది సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని ఎస్పీ డి.జానకి అన్నారు. తీవ్రమైన నేరాలు, మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలు, పోక్సో, హత్యలు, అత్యాచారాలు, దోపిడీ కేసుల విచారణల్లో ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా చూడాలన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శనివారం కోర్టు డ్యూటీ అధికారులు, కోర్టు లైజన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కోర్టులో విచారణలో ఉన్న కేసులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సాక్షులను సకాలంలో కోర్టుకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి కేసులో కూడా నిందితులకు సరైన శిక్షలు పడటానికి పోలీసులు, ప్రభుత్వ అభియోగ న్యాయవాదుల మధ్య సమన్వయం మరింత పెంచుకోవాలన్నారు. పెండింగ్లో ఉన్న కోర్టు సమన్లు, వారెంట్లు, ప్రొక్లమేషన్ల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీసీఆర్బీ డీఎస్పీ రమణారెడ్డి, డీసీఆర్బీ సీఐ నర్సింహులు, ఐటీసెల్ ఎస్ఐ రవి, కోర్టు లైజన్ అధికారులు పాల్గొన్నారు. -
పట్టుదలతో చేరాను..
మా గ్రామం ఆర్మీ జవాన్లకు పుట్టినిల్లు లాంటిది. మండలంలోనే అతిచిన్నదైన మా గ్రామంలో సుమారు 38 మంది యువకులు భారత సైన్యంలో పని చేస్తున్నారు. అలాంటి దేశభక్తులు ఉన్న గ్రామంలో పుట్టిన నేను కూడా భారత సైన్యంలో చేరి దేశభక్తిని చాటుకోవాలనే పట్టుదలతో అగ్నివీర్లో స్థానం దక్కించుకున్నాను. – మొహిలా అలీ, కొన్నూరు గ్రామం, మదనాపురం శిక్షణ ఉపయోగపడింది.. గతంలో పలుమార్లు సైన్యంలోకి వెళ్లాలని నోటిఫికేషన్ వచ్చినప్పుడు దరఖాస్తు చేసు కుని వెళ్లాను. కానీ, ఫలితం దక్కలేదు. మాజీ సైనికులు ఉచిత శిక్షణ ఇస్తున్నారని తెలుసుకుని వారితో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత అగ్నివీర్లో చోటుదక్కింది. ఆర్మీలో ఫిజికల్ ట్రైనర్గా పనిచేసిన వారు కావడంతో వారిచ్చిన శిక్షణ ఎంతో ఉపయోగపడింది. – రాఘవేంద్ర, ద్వారకానగర్, మదనాపురం ● -
క్రీడలకు కేరాఫ్ పాలమూరు స్టేడియం
మహబూబ్నగర్ క్రీడలు: నగరంలోని మెయిన్ స్టేడియం ఉమ్మడి జిల్లాలోనే క్రీడలకు కేరాఫ్గా మారుతోంది. మొదటి నుంచి ఈ స్టేడియానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా టోర్నమెంట్ల నిర్వహణకు వేదికై ంది. అంతటి ప్రాముఖ్యం ఉన్న మైదానంలో క్రమంగా క్రీడాకారుల కోసం ఎన్నో వసతులు అందుబాటులోకి వస్తున్నాయి.ఇ ప్పటికే స్టేడియంలో అన్ని వసతులతో కూడిన మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం ఉండగా.. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో క్రీడాకారులు శిక్షణ తీసుకుంటున్నారు. ముఖ్యంగా బ్యాడ్మింటన్ క్రీడాకారులు నిత్యం ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్, కబడ్డీ టోర్నమెంట్లతో పాటు జాతీయ, రాష్ట్ర స్థాయి నెట్బాల్ పోటీలను విజయవంతంగా నిర్వహించారు. అలాగే మెయిన్ స్టేడియం ఆవరణలోనే రెండు క్రీడా అకాడమీలు అందుబాటులో ఉన్నాయి. రెండేళ్ల క్రితం స్టేడియంలో బాలబాలికల వాలీబాల్ అకాడమీ ఏర్పటైంది. ఇక్కడ శిక్షణ పొందిన క్రీడాకారులు జాతీయ, రాష్ట్రస్థాయి టోర్నీల్లో సత్తాచాటారు. ఇటీవలే బాలుర కబడ్డీ అకాడమీ మంజూరైంది. త్వరలో కబడ్డీ అకాడమీలో ప్రవేశాలకు సంబంధించి రాష్ట్రస్థాయి ఎంపికలు జరగనున్నాయి. ఎంపికల్లో ప్రతిభ కనబరిచే 20 మంది బాలురు ఇక్కడ శిక్షణ ఇస్తారు. రూ.10.70 కోట్లతో సింథటిక్ ట్రాక్.. మెయిన్ స్టేడియంలో ఎప్పుడుప్పుడా అని జిల్లా అథ్లెట్లు ఎదురుచూస్తున్న సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణాన్ని రూ.10.70 కోట్లతో అధునాతన హంగులతో ఏర్పాటు చేయనున్నారు. 400 మీటర్లు మేర 8 లైన్ల సింథటిక్ ట్రాక్ నిర్మించనున్నారు. ఈ ట్రాక్ పనులకు గత నెల 22న రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర క్రీడల సలహాదారులు ఏపీ జితేందర్రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి శంకుస్థాపన చేశారు. సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణం పూర్తయితే జిల్లాకు చెందిన అథ్లెట్లు నిత్యం ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. ఇటీవల సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ ఏర్పాటుకు శంకుస్థాపన వాలీబాల్, కబడ్డీ అకాడమీలతో పాటు అధునాతన ఇండోర్ స్టేడియం భవిష్యత్లో మరిన్ని వసతులు -
ఎదగని రేపటి పౌరులు
కాగితాలకే పరిమితమైన అంగన్వాడీ సంక్షేమ పథకాలు ● ప్రతి ముగ్గురిలో ఒకరికి ఎదుగుదల లోపం ● ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా దక్కని పౌష్టికాహారం ● తల్లిదండ్రుల అవగాహన రాహిత్యం, సిబ్బంది నిర్లక్ష్యమే శాపం జిల్లాలో చిన్నారుల ఆరోగ్య పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. మహిళా, శిశు సంక్షేమశాఖ తాజాగా నిర్వహించిన 0–5 ఏళ్ల చిన్నారుల పోషకాహార అంచనా సర్వేలో జిల్లాలో ప్రతి ముగ్గురు చిన్నారుల్లో ఒకరు ఎదుగుదల లోపంతో బాధపడుతున్నట్లు తేలింది. అలాగే ప్రతి ఏడుగురు చిన్నారుల్లో ఒకరు తక్కువ బరువుతో ఉన్నారు. జిల్లాలో మొత్తం 54,492 మంది ఐదేళ్లలోపు చిన్నారులు ఉండగా, వారిలో 54,082 మంది (99.25 శాతం) పిల్లలకు తూకం, ఎత్తు కొలిచి పోషకాహార స్థితిని అంచనా వేశారు. నేటి బాలలే రేపటి పౌరులు.. ఆరోగ్యవంతమైన సమాజానికి వారే మూలస్తంభాలు. కానీ, జిల్లాలో చిన్నారుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. రేపటి తరం ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో అంగన్వాడీ కేంద్రాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా, క్షేత్రస్థాయిలో ఫలితాలు శూన్యంగా కనిపిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం, సిబ్బంది నిర్లక్ష్యం, తల్లిదండ్రుల అవగాహనరాహిత్యం వెరసి పోషకాహార లోపం చిన్నారులను వెంటాడుతోంది. అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు ఎదుగుదల లోపంతో, తక్కువ బరువు, తక్కువ ఎత్తుతో నీరసించిపోతున్నారనే చేదు నిజం కలవరపెడుతోంది. – మహబూబ్నగర్ రూరల్ ● జిల్లాలో మొత్తం పరీక్షించిన పిల్లల్లో 19,070 మంది (35.26 శాతం) ఎదుగుదల లోపంతో ఉన్నారు. వీరిలో 11,846 మంది మధ్యస్థ, 7,224 మంది తీవ్ర ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారు. చిన్ననాటి పోషకాహార లోపం దీర్ఘకాలికంగా కొనసాగితే భవిష్యత్లో శారీరక సామర్థ్యం, మెదడు వికాసం, చదువులో ప్రతిభపై ప్రభావం పడే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. ● 7,736 మంది (14.30 శాతం) చిన్నారులు ఎత్తుతో పోలిస్తే తక్కువ బరువుతో ఉన్నారు. 6,421 మంది మధ్యస్థ, 1,315 మంది తీవ్ర తక్కువ బరువుతో ఉన్నట్లు తేలింది. ఈ పరిస్థితి రోగ నిరోధక శక్తిని తగ్గించి తరచూ అనారోగ్యానికి గురిచేసే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ● పోషకాహార లోపం పరంగా 2,561 మంది చిన్నారులు గుర్తించారు. ఇందులో 2,145 మంది మధ్యస్థ, 416 మంది తీవ్ర పోషకాహార లోపంతో ఉన్నారు. ఈ చిన్నారులకు ప్రత్యేక వైద్యసేవలు, అధిక పోషకాహారం, నిరంతర పర్యవేక్షణ అత్యవసరమని చెబుతున్నారు. దేవరకద్ర, జడ్చర్ల, మహబూబ్ననగర్ రూరల్ మండలాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ బరువు, ఎదుగుదల లోపం పట్టణ ప్రాంతంతో పోలిస్తే ఎక్కువగా నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం, గర్భిణులు, బాలింతల్లో రక్తహీనత, తల్లిపాల ప్రాధాన్యంపై అవగాహన లోపం, సమతుల్య ఆహారం అందకపోవడం, తరచూ అంటువ్యాధులు రావడం వంటి అంశాలు ఇందుకు కారణాలుగా కనిపిస్తున్నాయి. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా గుడ్లు, పాలు, వేడి భోజనం, బాలామృతం వంటి పౌష్టికాహారం అందిస్తున్నప్పటికీ ఆశించినస్థాయిలో ఫలితాలు కనిపించడం లేదు. గర్భిణుల నుంచే పోషకాహారంపై దృష్టి పెట్టడం, పుట్టిన తర్వాత తొలి ఆరు నెలలు పూర్తిగా తల్లి పాలు ఇవ్వడం, ఆ తర్వాత అనుబంధ ఆహారం సక్రమంగా అందించడం, తరచూ ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం ద్వారా మాత్రమే ఈ సమస్యను అధిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పోషకాహార లోపం ఉన్న వారుజిల్లాలోఅంగన్వాడీ కేంద్రాలు మొత్తం చిన్నారులు -
తక్కువ బరువుకు బాలామృతం
అంగన్వాడీ కేంద్రంలో ప్రతినెల చిన్నారుల బరువు, ఎత్తును నమోదు చేసి పోషకాహార స్థితిని పరిశీలిస్తున్నాం. తక్కువ బరువు ఉన్న చిన్నారులను గుర్తించి బాలామృతం ప్లస్ అందిస్తున్నాం. గుడ్లు, పాలు, ఇతర పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా ఇస్తున్నాం. అలాగే తల్లులకు పోషకాహారం, తల్లిపాల ప్రాధాన్యం, పిల్లలకు సమతుల్య ఆహారం అందించాల్సిన అవసరంపై అవగాహన కల్పిస్తున్నాం. – శ్రీదేవి, అంగన్వాడీ టీచర్, టీడీ గుట్ట, మహబూబ్నగర్ అవగాహన అవసరం తక్కువ బరువు, ఎదుగుదల లోపం, తీవ్రమైన పోషకాహార లోపం ఉన్న పిల్లలకు అదనపు పౌష్టికాహారం అందించడంతో పాటు వైద్య, ఆరోగ్యశాఖతో సమన్వయం చేసి చికిత్స, కౌన్సెలింగ్ కల్పిస్తున్నాం. గర్భిణులు, బాలింతలకు పోషకాహారంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. తల్లిదండ్రులు అవగాహన పెంచుకొని పిల్లలకు ఆహారం అందివ్వాలి. – జరీనాబేగం, జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారి ● -
సింహవాహనంపై వెంకన్న ఊరేగింపు
స్టేషన్ మహబూబ్నగర్: జిల్లా కేంద్రం పిల్లలమర్రి రోడ్డులోని కంచికామకోటి పీఠం పాలమూరుశాఖ శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో 34వ వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. శనివారం శివాలయంలో సుప్రభాతసేవ, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో సుప్రభాత సేవ, అర్చనలు, వేదపారాయణం, సుబ్రహ్మణ్య నవగ్రహ మూలమంత్ర అనుష్టానాలు నిర్వహించారు. సాయంత్రం తిరుపతికి చెందిన కళాకారులచే భరతనృత్యం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. సింహవాహనంపై స్వామివారిని ఊరేగింపు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో శ్రీవెంకటేశ్వర సేవా మండలి అధ్యక్షుడు తోటపల్లి శ్రీకాంత్శర్మ, ప్రధాన కార్యదర్శి గొండ్యాల రాఘవేంద్రశర్మ, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 17న టీసీఏ జిల్లా జట్ల ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రం శ్రీనివాసకాలనీలోని జీకే అనిల్ క్రికెట్ అకాడమీలో ఈనెల 17వ తేదీన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) జిల్లా జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి జీకే ప్రేమ్కుమార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. అండర్–16 బాలుర, అండర్–19 బాల, బాలికల జట్లను ఎంపిక చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. సంబంధిత జిల్లాకు చెందిన అర్హత ఉన్న ఆయా విభాగాల క్రీడాకారులు ఎంపికల్లో పాల్గొనాలని కోరారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు ఎంపికలు జరుగుతాయని, మిగతా వివరాల కోసం భాను, సాత్విక్ (96400 54446, 83092 19707) నంబర్లను సంప్రదించాలని కోరారు. కత్తులతో గుర్తు తెలియని వ్యక్తుల దాడి.. వృద్ధురాలి మృతి వరుణుడు కరుణించాలని జల దిగ్బంధం రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు జిల్లా క్రీడాకారులు – వివరాలు 8లో.. -
జనాభా కట్టడిలో అందరూ బాధ్యతగా ఉండాలి
పాలమూరు: తల్లిదండ్రులు ఒక సంతానం తర్వాత మరో బిడ్డ ప్రసవం కోసం కనీసం మూడేళ్లయినా విరామం తీసుకోవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాసులు అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శుక్రవారం పాత డీఎంహెచ్ఓ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన ర్యాలీని ప్రారంభించారు. అనంతరం బండ్లగేరి కూడలి దగ్గర భారీ మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనాభా కట్టడికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కుటుంబ నియంత్రణ కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈనెల 13న నిర్వహించే జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవంలో 1 నుంచి 19 ఏళ్ల బాలబాలికలకు తప్పకుండా అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ అధికారులు శంకర్, శివకాంత్, పులి విద్య, మెడికల్ ఆఫీసర్లు రాఘవేందర్, తస్లీమా ఫర్హాత్, మమత, ప్రియాంక, సిబ్బంది హన్మంతు, సుభాష్ పాల్గొన్నారు. ● మండల పరిధిలో ఉన్న మణికొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, కోయిలకొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను డీఎంహెచ్ఓ శ్రీనివాసులు తనిఖీ చేశారు. స్థానికంగా అందుతున్న వైద్యసేవలపై ఆరా తీసి, రోగులతో మాట్లాడి సమస్యలపై తెలుసుకున్నారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచడానికి వైద్యులు మరింత కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ శరత్బాబు, నాగరాజు, అర్చన, అరుణ్ పాల్గొన్నారు. -
బీఎల్ఓలకు పవర్ బ్యాంకులు
● ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ కోసం.. ● యాప్ స్కానింగ్ అంతరాయం లేకుండా చర్యలు జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఓటరు జాబితా ప్రత్యేకస మగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు బీఎల్ఓ (బూత్ లెవల్ ఆఫీసర్)లకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. ఓటర్లు నింపి ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్ఓలు యాప్ డిజిటైజ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు సెల్ఫోన్లో బ్యాటరీలో సమస్య తలెత్తకుండా వారికి పవర్ బ్యాంకులు ఇచ్చారు. అలాగే ప్రస్తుతం వర్షా కాలం కావడంతో రెయిన్ కోర్టులు, గొడుగులు కూడా పంపిణీ చేశారు. టోపీలు, టీషర్టులు, పెన్నులు, నోట్పుస్తకాలు ఇలా పలు రకాల వస్తువులతో కూడిన కిట్టు అందజేశారు. ఇళ్ల వద్దకు సుమారు మూడు నుంచి నాలుగు పర్యాయాలు తిరగాల్సి ఉంటుంది. కలర్ ఫొటో ఇవ్వకపోతే.. ఓటరు లైవ్ ఫొటో దించి యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియపై ఇటీవలే బీఎల్ఓలకు శిక్షణ సైతం ఇచ్చారు. ● ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీలో బీఎల్ఓలు కాస్త ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో బీఎల్ఓ సగటున 800 నుంచి వెయ్యి వరకు ఫారాలను పంపిణీ చేయాలి. ఒక్కో ఓటరుకు రెండేసి ఇస్తారు. ఈ లెక్కన సుమారు 1,600 నుంచి రెండు వేల ఫారాలను ఓటర్ల ఇంటికి చేర్చాల్సి ఉంటుంది. దీంతో వీటిని మోసేటప్పుడు బీఎల్ఓలు ఇబ్బంది పడుతున్నారు. ఇచ్చిన బ్యాగులు కూడా చాలా వరకు డ్యామేజీ అవుతున్నాయి. కాగా జిల్లాలో 7,32,488 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 3,61,863, మహిళలు 370600 మంది, 25 మంది ఇతరులు ఉన్నారు. -
పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి
● బాధితులకు సత్వర న్యాయం అందించాలి ● గంజాయి వినియోగంపై నిఘా పెంచాలి: ఎస్పీ డి.జానకి మహబూబ్నగర్ క్రైం: జిల్లాలో గంజాయితో పాటు ఇతర మాదకద్రవ్యాల సరఫరా, వినియోగం కట్టడికి ప్రత్యేక చర్యలు చేపడంతో పాటు నిఘా పెట్టాలని ఎస్పీ డి.జానకి పోలీస్ అధికారులను ఆదేశించారు. సీసీటీఎన్ఎస్ నిర్వహణలో ఏమాత్రం నిర్లక్ష్యం ఉండరాదని, రికార్డులు సకాలంలో అప్డేట్ చేయాలన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. దొంగతనాలు, నేరాలు కట్టడికి ప్రతి గ్రామం, మండల కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా అవగాహన పెంచి కెమెరాలు ఏర్పాటు చేయించాలన్నారు. ప్రతి స్టేషన్ పరిధిలో ఉండే పెండింగ్ కేసులను వేగంగా పూర్తి చేసి బాధితులకు సత్వర న్యాయం చేయాలన్నారు. ఎక్కువ కాలంగా పెండింగ్లో ఉన్న కేసులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ సకాలంలో పూర్తి చేయాలన్నారు. కేసుల దర్యాప్తులో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా నిరంతర పర్యవేక్షణలో ఉండాలన్నారు. ప్రధానంగా సీసీటీఎన్ఎస్ నిర్వహణలో భాగంగా రికార్డులను నిర్ణీత గడువులోగా ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఎన్డీపీఎస్ చట్టం కింద మాదకద్రవ్యాల విక్రయాలు, నిల్వ, రవాణా వాటిని గుర్తించి కఠిన చర్యలు చేపట్టాలన్నారు. రోడ్డు ప్రమాదాల కట్టడితో పాటు దొంగతనాల కేసుల్లో నిందితులను త్వరగా గుర్తించి, అరెస్టు చేసి రికవరీ పెంచాలన్నారు. సమావేశంలో డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, గిరికుమార్, సీఐలు అప్పయ్య, గాంధీనాయక్, కమలాకర్, మహేష్, నర్సింహులు, ఐటీ సెల్ ఎస్ఐ రవి ఇతర ఎస్ఐలు పాల్గొన్నారు. -
వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు
స్టేషన్ మహబూబ్నగర్: జిల్లాకేంద్రం పిల్లలమర్రి రోడ్డులోని కంచికామకోటి పీఠం పాలమూరు శాఖ శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో 34వ వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. రెండో రోజు శనివారం ఉదయం వేద పారాయణాలు, మూలమంత్ర అనుష్టానాలు, స్వామివారి మూలమూర్తికి విశేష అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. సాయంత్రం తిరుపతి నుంచి వచ్చిన కళాకారులు వాద్య సంగీత కచేరీ నిర్వహించారు. హంస వాహనంపై స్వామివారిని ఊరేగింపు నిర్వహించారు. గోవిందనామంతో ఆలయ ప్రాంగణం భక్తి పారవశ్యాన్ని చాటింది. బ్రహ్మోత్సవాల్లో శ్రీవెంకటేశ్వర సేవా మండలి అధ్యక్షులు తోటపల్లి శ్రీకాంత్శర్మ, ప్రధాన కార్యదర్శి గొండ్యాల రాఘవేంద్రశర్మ, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జీపీల సమగ్రాభివృద్ధికి పాటుపడాలి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు గ్రామ సమగ్రాభివృద్ధికి కలిసికట్టుగా పాటుపడాలని అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. కలెక్టరేట్లో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో శుక్రవారం రెండోరోజు ముగిసింది. అడ్డాకుల, రాజాపూర్, జడ్చర్ల, చిన్న చింతకుంట, దేవరకద్ర, కోయిలకొండ, గండీడ్, మహమ్మదాబాద్ 8 మండలాలకు సంబంధించిన సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓలు, ఎంపీఓలు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. జీపీల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మంజూరైన పనులు, నిధులు తదితర వివరాల సమాచారాన్ని ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు. ఇందుకు రూపొందించిన ప్రొఫార్మాలను పంచాయతీ కార్యదర్శులు పూర్తిచేసి వారం రోజుల్లోగా అందజేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వెంకట్రెడ్డి, డీఆర్డీఓ నర్సింహులు, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు. నేడు విద్యుత్ అంతరాయం జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లా కేంద్రంలోని 132 /33 కేవీ సబ్ స్టేషన్ అత్యవసర పరిస్థితి నిర్వహణ కారణంగా శనివారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతయారం ఉంటుందని పట్టణ ఏడీ తవుర్యా నాయక్ శుక్రవారం ఓ ప్రకనటలో తెలిపారు. ఉదయం 7 నుంచి 8 వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తామని, అలాగే 11 కేవీ వీరన్నపేట ఫీడర్, నవాబ్పేట్ రోడ్డు 11 కేవీ రోడ్ ఫీడర్ పై చెట్ల కత్తిరింపు కోసం ఉదయం 7 నుంచి 10 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని తెలిపారు. దీంతో నవాబ్పేట్ రోడ్, న్యూగంజ్, మోతీనగర్, బోయపల్లి గేట్ సంజయ్నగర్, వీరన్నపేట్, కోయిల్కొండ రెండు సడాకులు, పాలిటెక్నిక్ కళాశాల, డబుల్ బెడ్రూమ్, పూజారి తండా ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. విద్యా సంస్థల బంద్ ప్రశాంతం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పలు విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ విద్యార్థి సంఘాల ఆద్వర్యంలో జిల్లావ్యాప్తంగా బంద్ చేపట్టారు. ఈ సందర్బంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వాలని, ఎంఈఓ, డీఈఓ పోస్టులు భర్తీ చేయాలని, కళాశాలల్లో అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశా రు. ప్రభుత్వం ఏర్పడి ఏళ్లు గడుస్తున్న ఇంకా విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం విడ్డూరం అన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయకపోగా ప్రైవేటు సంస్థల ఫీజుల దోపిడీని అరికట్టడం లేదన్నారు. బడుల్లో తాగునీరు, మరుగుదొడ్లు వంటి సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం వెంటనే డిమాండ్లను నెరవేర్చలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా నిరసన చేపడతామన్నారు. రాజు, భరత్, లక్ష్మ ణ్, సీతారాం, రాజశేఖర్, మారుతి, శేఖర్, లింగం, ధర్మతేజ, విజయ్, సతీష్ పాల్గొన్నారు. -
జలకళ తప్పిన జూరాల
● వర్షాకాలం మొదలైనా కనిపించని వరద ● గతేడాది మే చివరి నాటికే ప్రాజెక్టులో జలకళ ● గడ్డు పరిస్థితుల్లో ఉమ్మడి జిల్లా సాగునీటి ప్రాజెక్టులు ●ఏం తోచడం లేదు.. నెట్టెంపాడు కాల్వ పరిధిలో నాకు రెండెకరాల పొలం ఉంది. ఈసారి వరిసాగు కోసం నారుమళ్లు వేసుకున్నా. వర్షా లు లేక డ్యాంకు నీరు రాలే దని అధికారులు ఆరుతడి పంటలు వేసుకోమంటున్నారు. మా పొలాలు ఆరుతడి పంటలకు అనుకూలంగా ఉండవు. ఏం చేయాలో తోచడం లేదు. – సాయన్న, రైతు, ధరూరు ఆరుతడి పంటలు వేసుకోవాలి.. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలు సాగుచేసుకోవాలి. వరిపంట వేసుకుని ఇబ్బందులు పడొద్దు. కాల నుగుణంగా పంటలు సాగుచేసుకుంటే రైతులు నష్టపోకుండా ఉంటారు. – వీరప్ప, డీఏఓ, సంజీవ్ప్రసాద్ ఇరిగేషన్శాఖ డీఈ గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయిని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు జలకళ తప్పింది. గతేడాది ఇదే సమయానికి కృష్ణమ్మ పరవళ్లతో కళకళలాడిన జూరాల.. నేడు అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులు నెలకొని వెలవెలబోతోంది. వర్షాకాలం మొదలై నెలరోజులు గడుస్తున్నా వరుణుడు కరుణించకపోవడంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మరికొన్ని రోజులు ఇదే విధంగా కొనసాగితే జూరాల జలాశయంలో నీటిమట్టం పూర్తిగా తగ్గి.. డెడ్ స్టోరేజీకి చేరుకునే ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇరిగేషన్, వ్యవసాయశాఖల అధికారులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని రైతులకు సూచిస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జూరాల ప్రాజెక్టుపై ఆధారపడి నిర్మించిన ఆయా ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టుదారులు ఆందోళన చెందుతున్నారు. 10లక్షల ఎకరాల ఆయకట్టు.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఆధారంగా నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్సాగర్ ప్రాజెక్టులు నిర్మించారు. మొత్తం 10లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా.. ప్రతి ఏటా వానాకాలంలో సుమారు 7లక్షల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. ఆందోళనలో ఆయకట్టుదారులు.. జూరాల ఎడమ, కుడి కాల్వల పరిధిలో మొత్తం 1.09 లక్షలు, నెట్టెంపాడు కింద 1.56 లక్షలు, భీమా, కల్వకుర్తి, కోయిల్సాగర్ పరిధిలో సుమారు 5లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నారు. ప్రస్తుతం జూరాలకు వరద వచ్చి చేరకపోవడంతో ఆయా ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టుదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఏటా వానాకాలంలో ఈ సమయానికి దాదాపు 50శాతం మేర వరినాట్లు పూర్తయ్యేవి. కాని ఇప్పుడు నారుమళ్లు ముదిరిపోతున్నాయి. కరిగెట్లు చేసుకుని సిద్ధం చేసుకున్న పొలాలు సైతం నీరులేక నెర్రలుబారుతున్నాయి. గడ్డు పరిస్థితి.. జూరాల ప్రాజెక్టుకు గతేడాది మే చివరినాటికే వరద వచ్చి చేరడంతో జూలై మొదటి వారంలో ప్రాజెక్టు 40 క్రస్టుగేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. అదే విధంగా ఎగువ, దిగువ విద్యుత్ హైడల్ ప్రాజెక్టుల ద్వారా విద్యుదుత్పత్తి నిరాటకంగా కొనసాగింది. కానీ నేడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఎగువనున్న కర్ణాటకలో ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు సైతం పూర్తిగా నిండలేదు. ఫలితంగా జూరాలకు వరద ఎప్పుడు వస్తుందో.. అసలు వస్తుందో.. లేదో కూడా తెలియని గడ్డు పరిస్థితి నెలకొంది. జలాశయంలో డెడ్స్టోరేజీజూరాల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుతం 316.290 మీటర్ల మేర ఉంది. 9.567 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న జలాశయంలో ప్రస్తుతం కేవలం 5.523 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. అందులో కూడా కేవలం 1.916 టీఎంసీల వరకు మాత్రమే వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. పైగా 30 ఏళ్లుగా జలాశయం పూడిక తీయకపోవడంతో సుమారు రెండున్నర టీఎంసీల బురద పేరుకుపోయింది. ఈ లెక్కన జలాశయంలో ఉన్న నీరు దాదాపుగా డెడ్ స్టోరేజీకి చేరిందని చెప్పవచ్చు. -
గోవిందుడికే తెలియాలి!
రద్దు చేసినా.. మళ్లీ డిప్యూటేషన్ సదరు ప్రభుత్వ ఉపాధ్యాయుడు 2019 నుంచి డిప్యూటేషన్పై డీఈఓ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తుండగా.. 2023–24 విద్యాసంవత్సరంలో అతడి వ్యవహారశైలి చూసి అప్పటి కలెక్టర్ డిప్యూటేషన్ రద్దు చేశారు. ఆ తర్వాత ఆ కలెక్టర్ బదిలీ కాగా.. కొన్ని రోజుల తర్వాత 2024–25 విద్యాసంవత్సరంలో తన పలుకుబడితో డీఈఓ కార్యాలయంలో డిప్యూటేషన్ వేయించుకున్నాడు. ప్రభుత్వ కొలువులో ఉండి వేతనం తీసుకుంటూనే యథావిధిగా జిల్లావ్యాప్తంగా ప్రైవేట్ విద్యాసంస్థల కార్యకలాపాలకు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ అన్నీ తానై చక్కబెడుతున్నట్లు తెలుస్తోంది. పైరవీలు (కేరాఫ్) డీఈఓ ఆఫీస్ డిప్యూటేషన్పై వచ్చిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి దందా కార్యాలయం నుంచే ‘ప్రైవేట్’ వ్యవహారాల దిద్దుబాటు పలు ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వహణలో కీలకపాత్ర గత కలెక్టర్ రద్దు చేసినా.. మళ్లీ అదే స్థానంలోకి.. నారాయణపేట జిల్లా విద్యాశాఖపై విమర్శలు -
ఒకే మండలంలో చేర్చాలి..
గతంలో విలీన గ్రామా ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న విషయంలోనే తిరిగి పాత జిల్లా పరిధిలో చేరాం. చేరిన నాటి నుంచి పాలన వ్యవహారాల్లో చిక్కులు వీడటం లేదు. అందుకే ప్రతి విషయంలో ఇబ్బందులు వస్తున్నాయి. ఏడాది ఒక శాఖ చొప్పున చేరుతూ వచ్చాయి. తాజాగా రెండు ప్రధాన శాఖలు ఇక్కడే మిగిలి పోవటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ విషంయలో అధికారులు అన్ని శాఖలను వెంటనే తమ మండలంలో చేర్చేలా చూడాల్సిన అవసరం ఉంది. కాగా ఈ విషయంలో ఇప్పటికే పరిగి ఎమ్మెల్యే రాంమ్మోహన్రెడ్డికి సమస్యను విన్నవించాం. – రాంమోహన్శర్మ, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్, మరికల్ ● -
పనుల నాణ్యతలో రాజీ లేదు: యెన్నం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నగరం అభివృద్ధిలో భాగంగా అమృత్–2 కింద అండర్గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ), ఎస్టీపీ (సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్)లు, తాగునీటి వ్యవస్థ పటిష్టానికి చేపడుతున్న పనుల నాణ్యతలో ఎలాంటి రాజీ లేదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. గురువారం క్యాంపు కార్యాలయంలో పబ్లిక్ హెల్త్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా యూడీజీ రూట్మ్యాప్, కార్పొరేషన్ పరిధి డిజైన్ను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికాబద్ధంగా మౌలిక వసతులను కల్పిస్తున్నామన్నారు. నగరంలో తాగునీటి, మురుగు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామన్నా రు. మూడు ఎస్టీపీలు ఏర్పాటు చేసి ఇళ్లు, పరిశ్రమల నుంచి వచ్చే మురుగు నీటిని శుద్ధిచేసి పర్యావరణానికి హాని కలగకుండా పునర్వినియోగం అయ్యేలా చూడాలన్నారు. అలాగే కార్పొరేషన్లో విలీనమైన గ్రామాలతో పాటు కొత్తగా ఏర్పడిన కాలనీలను సమగ్రంగా సర్వే చేయాలన్నారు.మేయర్ జి.మమత, డిప్యూటీ మేయర్ ఎం.సురేందర్రెడ్డి, ముడా చైర్మన్ కె.లక్ష్మణ్యాదవ్, కార్పొరేషన్ కమిషనర్ పి.రామాంజులరెడ్డి, పాల్గొన్నారు. ఆర్ఎన్ఆర్ @ రూ.2,730 జడ్చర్ల: బాదేపల్లి మార్కెట్యార్డులో గురువారం ధాన్యం ఆర్ఎన్ఆర్ రకానికి సంబంధించి క్వింటా గరిష్టంగా రూ.2,730, కనిష్టంగా రూ.2,505 ధరలు లభించాయి. అదేవిదంగా మొక్కజొన్న గరిష్టంగా రూ.2,406, కనిష్టంగా రూ.1,900, మినుములు రూ.6,600 ధరలు కేటాయించారు. గద్వాల మార్కెట్కు గురువారం 1,220 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా.. క్వింటా గరిష్టం రూ.7,599, కనిష్టంగా రూ.4,071, సరాసరిగా రూ.6,800 ధరలు లభించాయి. -
వీడని ‘విలీన’ చిక్కులు
శాఖల విభజనతో సమస్యలు ఉత్పన్నం ● పోలీసు, వైద్యం ఇక్కడ... ● రెవెన్యూ, రూరల్ డెవలప్మెంట్ అక్కడ.. ● రెండు జిల్లాల మధ్య కొనసాగుతున్న పాలన నవాబుపేట: గతంలో కొత్త మండలాలు ఏర్పాటు చేస్తున్న తరుణంలో జిల్లా కేంద్రం తమకు అందుబాటులో ఉంటుందని అప్పటి రంగారెడ్డి జిల్లా పరిధిలోని మరికల్, చాకలపల్లి, మల్కపూర్, కొత్తపల్లి, కల్మన్కల్వ, చిన్నమేగ్యనాయక్తండా, కొత్తపల్లితండా, పుర్సంపల్లి, లింగన్నపల్లి, కిష్టంపల్లి, బంగ్రంపల్లి గ్రామాలు పాలమూరు జిల్లా నవాబుపేట మండలంలో చేరాయి. కాగా చేరిన ఐదేళ్లకే రాజకీయ సమీకరణాలతో తమను తిరిగి పాత జిల్లాలో కలపాలని అక్కడి నేతలను పట్టుబట్టిన ప్రజలు తిరిగి పాత జిల్లాకు వెళ్లిపోయారు. కాగా నాటి నుంచి పాలన పరంగా విలీన గ్రామాలకు చిక్కులు వీడటం లేదు. శాఖల విభజనతో సమస్యలు.. మొదట్లో కేవలం పేరుకే విలీనంగా ఉండగా మూడే ళ్ల క్రితం విద్యాశాఖ అక్కడి ఆధీనంలోకి వెళ్లగా మిగతా శాఖలు పాలమూరు జిల్లాలోనే కొనసాగా యి. అనంతరం రెవెన్యూ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖలు గతేడాది అక్కడికి మారింది. కాగా నేటికి ప్ర ధానమైన రెండు శాఖలు ఇక్కడే ఉండటంతో అక్క డి ప్రజల బాధలు అన్నీ ఇన్నికావు. ప్రధానమైన పోలీసు, వైద్య శాఖలు నవాబుపేట మండలంలోనే కొనసాగుతుండగా ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రెవెన్యూకు సంబంధించిన భూముల వ్యవహారం వికారబాద్ జిల్లా పరిధిలో ఉండగా భూముల వ్యవహారంలో గొడవలు జరిగి తే పాలమూరు జిల్లా పరిధి పోలీసు శాఖ పరిధిలో ఉంది. అటు వైద్యానికి సైతం ఇబ్బందులు వస్తున్నా యని ప్రజలు వాపోతున్నారు. ఇబ్బందులు ఉన్నా యనే విలీనమైన ఐదేళ్లకు వెనక్కి వెళ్లినా కూడా విలీన చిక్కులు వీడటం లేవని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో వెంటనే అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. మరికల్ గ్రామం -
రైతులకు ఊరట...
హన్వాడ: వర్షాకాలం సాగు పను ల్లో బిజీగా ఉన్న రైతులకు రాష్ట్రప్రభుత్వం శుభవార్త అందించింది. యూరియా బుకింగ్లో భాగంగా రైతులు ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందులను తొలగించేందుకు వ్యవసాయ శాఖ వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇకపై జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని మీసేవా కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. గతంలో స్మార్ట్ఫోన్ యాప్ ద్వారానే యూరియా బుక్ చేసుకోవాలనే నిబంధనల వల్ల సాంకేతిక పరిజ్ఞానం లేని రైతులు, స్మార్ట్ఫోన్లు అందుబాటులో లేని వారు తీవ్ర ఇబ్బందులు పడే వారు. ఈ సమస్యను గుర్తించిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆధ్వర్యంలోని మీసేవ విభాగం, వ్యవసాయ శాఖతో కలిసి ఈ కొత్త అవకాశాన్ని కల్పించింది. దీంతో ఇకపై స్మార్ట్ఫోన్ లేకపోయినా, యాప్ వాడటం తెలియకపోయినా రైతులు సులభంగా మీసేవా కేంద్రాలకు వెళ్లి యూరియా బుక్ చేసుకోవచ్చు. బస్తాకు రూ.10ల నామమాత్రపు రుసుం రైతులు ఒక్క యూరియా బస్తాకు కేవలం రూ.10ల చొప్పున నామమాత్రపు సేవా రుసుము చెల్లించి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. మీసేవ ద్వారా పొందిన బుకింగ్ ఐడీ, బుకింగ్ తేదీని మినహాయించి 48గంటల పాటు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. గడువు ముగిసే లోపు డీలర్ను సంప్రదించి యూరియా కొనుగోలు చేయాలి. ఓటీపీ కోసం రైతులు తమ పట్టాదారు పాస్బుక్తో అనుసంధానమై ఉన్న మొబైల్ నంబర్ యాక్టివ్లో ఉంచుకోవాలి. ఎంటువంటి సందేహాలున్నా ఏఈఓ (విస్తరణ అధికారి), ఎంఏఓ (మండల వ్యవసాయాధికారి), లేదా సమీపంలోని మీసేవ కేంద్రాన్ని సంప్రదించవచ్చు. ప్రభుత్వం కల్పించిన ఈవెసులుబాటును రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేస్తోంది. ఇక మీసేవా కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్ బుకింగ్ ఐడీ 48గంటల చెల్లుబాటు యూరియా బస్తాకు మీసేవ రుసుము రూ.10 -
దొంగల ముఠా అరెస్టు
● తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు ● నిందితులను రిమాండ్కు తరలించిన పోలీసులు కందనూలు: పట్టపగలు ఎవరూలేని సమయంలో తాళం వేసిన ఇంట్లోకి చొరబడి చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసులు వివరాలు వెల్లడించారు. బొల్లెమోని అంజి అలియాస్ స్వామి, జల్గరి ముత్తు, జలగరి బాబు గతంలోనే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 20 నుంచి 25 దొంగతనాల కేసుల్లో నిందితులుగా ఉండి పలుమార్లు జైలుకు వెళ్లొచ్చారు. 2025 జూలైలో జలగరి బాబు అత్తగారి ఊరైన వనపట్లలో పట్టపగలు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి తాళం పగలగొట్టి బంగారు ఆభరణాలు దొంగిలించారు. దీంతోపాటు ముగ్గురు బైకుపై గ్రామాలు తిరుగుతూ.. తిమ్మాజిపేట మండలంలోని గొరిటలో రైతు జిల్లెల ధర్మారెడ్డి ఇంటి తాళాలు పగలగొట్టి 2025 అక్టోబర్ 27న పట్టపగలు చొరబడి బంగారు ఆభరణాలు దొంగిలించారు. ఇలా దొంగిలించిన డబ్బులు ముగ్గురు పంచుకునేవారు. 2026 మే 30న నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని సంతబజారులో బంగారు నగలు విక్రయించేందుకు వచ్చిన బాబు, ముత్తు ను పోలీసులు పట్టుకుని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. తిమ్మాజి పేట పోలీస్స్టేషన్లో క్రైం నంబర్ 157/2025 కేసులో పోయిన 14.5 తులాల బంగారంలో 13 తు లాలు రికవరీ చేయగా.. నాగర్కర్నూల్ పోలీస్ స్టేషన్లో క్రైం నంబర్ 238/2025 కేసులో 6 తులాల బంగారం, 20 తులాల వెండిని పూర్తిగా రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు తమ ఇళ్లకు సీసీ కెమోరాలు ఏర్పాటు చేసుకోవాలని, అనుమానస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ కేసును ఛేదించిన సీఐ అశోక్రెడ్డి, ఎస్ఐలు గోవర్ధన్, రమేష్, శ్రీనివాస్రావు, సిబ్బంది వెంకటేష్, భీముడు, రమేష్ ను ఎస్పీ అభినందించారు. -
మీసేవ కేంద్రాల్లోనూ..
కేటీదొడ్డి: రాష్ట్రంలోని రైతులకు సబ్సిడీ యూరి యా బుకింగ్ మరింత సులభంతరం చేసేందు కు ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుందని జోగుళాంబ గద్వాల జిల్లా ఈడీఎం శివకుమార్ పేర్కొన్నారు. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీసేవ కేంద్రాల్లో యూరియా బుకింగ్ సేవల ను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. ఫర్టిలైజర్ యాప్ ద్వారా బుక్ చేసుకోలేని రైతులు మీసేవ సెంటర్లో బుకింగ్ చేసుకోవాలని ఈ కొత్త విధానాన్ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పర్యవేక్షణలో మీసేవ, వ్యవసాయ శాఖతో కలిసి ప్రారంభించినట్లు తెలిపారు. – ఈడీఎం శివకుమార్ -
చదువు ఇష్టం లేక విద్యార్థి ఆత్మహత్యాయత్నం
భూత్పూర్: చదువుకునేందుకు ఇష్టం లేక బలవంతంగా పాఠశాలలో చేర్పించారని క్షణికావేశంలో పెట్రోల్ పోసుకొని 5వ తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మండలంలోని కర్వెన గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. బంధువుల కథనం మేరకు.. మండలంలోని చౌలతండాకు చెందిన శాంతి, హన్మంత్నాయక్ హైదరాబాద్లో అడ్డకూలీగా పనులు చేస్తున్నారు. వీరికి ఆకాశ్ అనే కుమారుడు ఉన్నా డు. బుధవారం ఆకాశ్ను గ్రామంలోని మథర్ థెరి స్సా ప్రాథమికోన్నత పాఠశాలలో 5వ తరగతిలో చేర్పించడంతో పాటు హాస్టల్లో చేర్చేందుకు యాజమాన్యంతో మాట్లాడి సాయంత్రం హైదరాబాద్ తిరిగి వెళ్లారు. ఈ క్రమంలో గురువారం ఆకాశ్ పాఠశాల నుంచి ఇంటర్వెల్ సమయంలో ఉపాధ్యాయులకు చెప్పకుండా బయటకు వెళ్లి ఓ కిరాణం దుకాణంలో పెట్రోల్ తీసుకొని ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. కేకలు వేయడంతో గుర్తించిన స్థానికులు మంటలు ఆర్పి చికిత్స నిమిత్తం మండల కేంద్రంలోని ప్రభు త్వ ఆస్పత్రికి తరలించారు. ఆకాశ్కు రెండు చేతులు 8 శాతం మేర కాలా యని ప్రథమ చికిత్స అనంతరం 108 అంబులెన్స్లో జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం తెలియడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. అనుమతి లేకుండానే హాస్టల్ నిర్వహణ కర్వెన మథర్ థెరిస్సా ప్రాథమికోన్నత పాఠశాల హాస్టల్కు అనుమతి లేదని, అనుమతి తీసుకో వాలని పాఠశాల యజమాన్యాన్ని ఆదేశించిన అనుమతి తీసుకోలేదని ఎంఈఓ ఉషారాణి తెలిపారు. విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపించామన్నారు. ఈ విషయమై పాఠశాల ప్రిన్సిపాల్ చందును వివరణ కోరగా గురువారం ఆకాశ్ను డేస్కాలర్గా పాఠశాలకు పంపించి వెళ్లారని తెలిపారు. ఆస్పత్రిలో వైద్యం చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. -
సేంద్రియ ఎరువులతో భూసారం
వర్మీ కంపోస్టు ఎరువుజీలుగ ఎరువు అలంపూర్: సేంద్రియ ఎరువులలో పోషకాలు మెండుగా ఉంటాయి. పంటలకు శక్తిని ఇస్తాయి. పంటల సాగులో సహజ ఎరువులను వాడటం వల్ల పంట దిగుబడి అధికంగా ఉంటుంది. నేల సారం పెరుగుతుంది. రైతులకు పెట్టుబడి తగ్గుతుంది. ప్రస్తుతం రైతులు పంటల సాగులో రసాయనిక ఎరువులు అధికంగా వినియోగిస్తున్నారు. దీంతో పంటలు దెబ్బతిని దిగుబడి తగ్గి నష్టపోతున్నారు. రసాయనిక ఎరువులతో కలిగే నష్టాలను ఏఓ నాగార్జున రెడ్డి రైతులకు అవగాహన కోసం పలు విషయాలను వెల్లడించారు. రసాయనిక ఎరువు లు తగ్గించి వాటి స్థానంలో పశువు లు, గొర్రెలు, మేకల, కోళ్ల ఎరువు లు, వేప కానుగలాంటి వృక్ష సంబంధిత ఎరువులు వర్మి, పచ్చి రొ ట్ట ఎరువులు వేయాలని సూచిస్తున్నారు. నేల సంరక్షణ కుసేంద్రియ పోషకాల అవసరం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. భూమిలో పోషకాల లభ్యతకు అనుగుణంగా ఎరువుల యాజమాన్యం చేప ట్టాలి.సేంద్రియ ఎరువుల్లో స్థూల పోషకాలైన నత్రజని, భాస్వరం, పోటాషియం శాతం ఎంత ఉంటుందో తెలిపారు. సేంద్రియ ఎరువులు నత్రజని భాస్వరం పోటాష్ శాతం శాతం శాతం పశువుల ఎరువు 1.5 0.9 1.9 కోళ్ల ఎరువులు 3.0 2.0 2.0 గొర్రెల/మేకల ఎరువులు 0.7 0.6 3.0 వర్మీ కంపోస్టు 3.0 2.2 1.7 చెరుకు మడ్డి 1.5 4.5 7.0 గోబర్ గ్యాస్ ప్లాంట్ ఎరువు 2.4 1.5 1.0 గ్రామీణ కంపోస్టు 1.0 0.8 1.2 పట్టణ కంపోస్టు 2.0 3.3 2.0 వేరుశనగ పిండి, చెక్క 7.5 1.3 1.5 వేప పిండి 5.6 1.1 1.5 ఆముదం పిండి 4.4 1.9 1.4 కానుగ పిండి 4.0 1.0 1.4 పత్తి గింజల పిండి 3.6 2.5 1.6 పంది ఎరువు 3.75 3.13 2.5 జీలుగ 0.62 0.15 0.46 జనుము 0.75 0.12 0.15 చేపల పొట్టు 4.1 3.1 0.3 అలసంద 0.71 0.15 0.58 పిల్లి పెసర 0.72 0.10 0.53 పెట్టుబడి స్వల్పం దిగుబడి అధికం నేల సంరక్షణతో పంటల ఆరోగ్యం పాడి–పంట -
రాష్ట్రస్థాయిలో జిల్లా పోలీసుల ప్రతిభ
మహబూబ్నగర్ క్రైం: హైదరాబాద్ మల్కాజ్గిరి కమిషనరేట్లో ఈనెల 7నుంచి 9వరకు జరిగిన రాష్ట్ర 5వ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో మహబూబ్నగర్ జిల్లా పోలీస్ సిబ్బంది వివిధ క్రీడ విభాగాల్లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. ఆర్మ్ రెజ్లింగ్, పవన్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ విభాగాల్లో అడ్డాకుల మహిళ కానిస్టేబుల్ రాధిక మూడు పతకాలు సాధించారు. బాడీ బిల్డింగ్ విభాగంలో ఏఆర్ హెడ్కానిస్టేబుల్ రజత పతకం సొంతం చేసుకున్నాడు. యోగా విభాగంలో భూ త్పూర్ కానిస్టేబుల్ రాము రజతం, బాక్సింగ్లో ట్రాఫిక్ పీఎస్ కానిస్టేబుల్ షోయబుద్దీన్ కాంస్య పతకం సాధించాడు. రాష్ట్ర స్థాయిలో క్రీడ పోటీల్లో ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ డి.జానకి అభినందించారు. తండ్రి మందలించాడని.. కొడుకు బలవన్మరణం మహబూబ్నగర్ క్రైం: స్నేహితులతో కలిసి గోవా టూర్ వెళ్లి న క్రమంలో కా రుకు జరిగిన రో డ్డు ప్రమాదంలో కారు దెబ్బతింది. దీంతో కారుకు మరమ్మతులు చేయడానికి తండ్రిని డబ్బులు అడగటంతో మందలించాడు. దీంతో మనస్తాపంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రూరల్ ఎస్ఐ విజయ్కుమార్ కథనం ప్రకారం.. మండల పరిధిలోని తెలుగు గూడెంకు చెందిన కర్ణ గణేష్(23) గురువారం జమిస్తాపూర్ సమీపంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి గణేష్ చౌదర్పల్లి సమీపంలో ఉన్న పెట్రోల్ బంకులో పని చేస్తున్నాడు. వారం క్రితం గ్రామానికి చెందిన స్నేహితులతో కలిసి గోవాకు కారులో టూర్ వెళ్లారు. గోవాకు వెళ్తున్న సమయంలో కర్ణాటకలో సిద్నాపూర్ దగ్గర రోడ్డు ప్రమాదానికి గురైంది. స్వల్ప గాయాలతో బయటపడిన వీరందరూ గ్రామానికి చేరుకున్నారు. దీంతో కారుకు మరమ్మతులు చేయడానికి డబ్బులు అవసరమై తండ్రికి చెప్పడంతో ఆయన మందలించాడు. దీంతో మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి తండ్రి రామచంద్రయ్య ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
యువకుడి దారుణ హత్య
మల్దకల్: వ్యవసాయ పొ లం వద్ద నిద్రిస్తున్న ఓ యువకుడిని గుర్తుతెలియ ని వ్యక్తులు దారుణంగా హతమార్చిన ఘటన మల్దకల్ మండలం ఉలిగేపల్లి సమీపంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. ఉలిగేపల్లికి చెందిన బోయ గోవిందు – పద్మమ్మకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడైన మహేశ్ (22) రోజులాగే బుధవారం రాత్రి తమ వ్యవసాయ పొలంలో నిద్రించేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున గుర్తుతెలి యని వ్యక్తులు దాడిచేసి హత్య చేశారు. సమాచారం అందుకున్న గద్వాల సీఐ టంగుటూరి శ్రీను, ఎస్ఐ శ్రీహరి ఘటనా స్థలాన్ని చేరుకొని వివరాలు సేకరించారు. పోలీసు జాగీలాలతో గాలింపు చర్యలు చేపట్టినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. కాగా, మహేశ్ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమై ఉండొచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చెక్డ్యాంలో దిగి వ్యక్తి గల్లంతు కోస్గి రూరల్: చెక్డ్యాంలో బోరు మరమ్మతుకు వెళ్లిన వ్యక్తి గల్లంతైన ఘటన మండల పరిధిలోని లోదిపూర్ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన చిన్న శ్యామలప్ప మరో నలుగురితో కలిసి తన చిన్నాన్న తిరుమలయ్యకు చెందిన బోరు మోటార్ మరమ్మతు నిమిత్తం చంద్రవంచ– లోదిపూర్ గ్రామాల మధ్యలో ఉన్నా చెక్డ్యాం నీటిలోకి దిగాడు. ఈ క్రమంలో నీటిలో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న వికారాబాద్ జిల్లా కొడంగల్ ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకోని గాలింపు చర్యలు చేపట్టారు. అదే విధంగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని రెస్క్యూ టీం చెక్డ్యాంలో రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. విద్యుదాఘాతంతో గొర్రె పొట్టేళ్లు మృతి వనపర్తి రూరల్: ప్రమాదవశాత్తు విద్యుత్షాక్తో 13 గొర్రె పొటేళ్లు మృతి చెందిన ఘటన శ్రీ రంగాపురం మండలంలో గురువారం చోటు చేసుకున్నది. స్థానికుల తెలిపిన వివరాలు ప్రకారం.. మండలంలోని నాగసానిపల్లికి చెందిన గొల్ల శివయ్యయాదవ్ గురువారం ఉదయం గొర్రెలను మేపి సాయంత్రం ఇంటిదగ్గర షెడ్డులో ఉంచాడు. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో 13 గొర్రె పొటేళ్లు మృతి చెందాయని తెలిపారు. దాదాపు రూ.3.25 లక్షలు నష్టం వాటిల్లిందని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని బాధితుడు అధికారులను కోరారు. -
ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఏబీవీపీ ఆద్వర్యంలో జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని గురువా రం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు జిల్లాకేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏబీవీపీ దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి శివకుమార్జీ హాజరై ప్రసంగించారు. విద్యార్థి సంక్షేమం, జాతీయ చైతన్యం, దేశ నిర్మాణం కోసం ఏబీవీపీ ఏర్పడిందని, 78ఏళ్లు విద్యారంగం సమస్యల కోసం ఎంతో కృషి చేస్తుందన్నారు. దేశంలో ఒకే రాజ్యాంగం, ఒకే జెండా, ఒకేపరిపాలన వ్యవస్థ ఉండాలని ఎన్నో ఉద్యమాలు చేసిందని, జాతీయ సమైక్యత కోసం విద్యార్థి సమాజాన్ని చైతన్యవంతం చేసిందన్నారు. కార్యక్రమంలో జిల్లా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు అనంతరెడ్డి, విభాగ సంఘటన కన్వీనర్ నవేంద్రజీ, లక్ష్మణ్, సాతర్ల అర్జున్, నాగుణుల వేణు, సౌమ్య పాల్గొన్నారు. -
రహదారుల ప్రగతి పరుగులు
మహబూబ్నగర్ సర్కిల్ రోడ్లు.. హ్యామ్ రోడ్లలో ఉమ్మడి పాలమూరుకు పెద్దపీట ● నాలుగు ప్యాకేజీల కింద 697.44 కి.మీ., మేర ఆధునికీకరణ ● రూ.1,610.44 కోట్లతో 44 కొత్త రహదారులనిర్మాణానికి ప్రణాళిక ● ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి.. త్వరలోనే పనులు ప్రారంభం ● మారనున్న గ్రామీణ ప్రాంత రహదారుల ముఖచిత్రం ● మహబూబ్నగర్– నవాబ్పేట 18.30 కి.మీ., జడ్చర్ల– మాచారం 20 కి.మీ., మరికల్– మినాస్పూర్ (ధన్వాడ, లింగంపల్లి మీదుగా) 37.68 కి.మీ., మక్తల్– నారాయణపేట (ఊట్కూర్ మీదుగా) 25.68 కి.మీ., రాజాపూర్– తిర్మలాపూర్ 10 కి.మీ., మహబూబ్నగర్– మంగనూర్, వేపూర్ జెడ్పీ రోడ్డు– కొమిరెడ్డిపల్లి (షేక్పల్లి, కురుమూర్తి టెంపుల్ రోడ్డు), గుడిబండ– తిర్మలాపూర్– అప్పంపల్లి రోడ్డు, కోడూరు– కోయిల్కొండ (మల్కాపూర్, మణికొండ మీదుగా), జడ్చర్ల రైల్వేస్టేషన్– కొత్త మొల్గర రోడ్లు అభివృద్ధి చేయనున్నారు. -
సమన్వయంతో పనిచేయాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): గ్రామాలు సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పని చేయాలని, గ్రామ ప్రజల అవసరాలకు అనుగుణంగా ఒక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు పోవాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా అన్నారు. గురువారం కలెక్టరేట్లో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యత అని అన్నారు. గ్రామానికి సంబంధించిన ప్రతి సంక్షేమ పథకం, అభివృద్ధి కార్యక్రమం, నిధులు, పనుల పురోగతి, ప్రభుత్వ మార్గదర్శకాలపై సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు పూర్తి అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తుందని తెలిపారు. గ్రామపంచాయతీల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మంజూరైన పనులు, అందిన నిధులు, పూర్తయిన పనులు, పెండింగ్ పనులు, చెల్లింపుల వివరాలు వంటి సమగ్ర సమాచారాన్ని ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను గ్రామసభలు, వార్డు సభల ద్వారా ప్రజలకు వివరించి సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. గ్రామాల పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్, ట్రెయినీ కలెక్టర్ సాయి శివాని, జెడ్పీ సీఈఓ వెంకట్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్కు రాజకీయ పార్టీలు సహకరించాలి జిల్లాలో చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను పారదర్శకంగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా కోరారు. కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. కొంతమంది బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లకుండా ఒకేచోట కూర్చొని ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తున్నారని, చాలా మంది ఓటర్లకు ఫారాలు ఎలా నింపాలో అవగాహన లేకపోవడంతో పాటు కొందరు బీఎల్ఓలకు కూడా పూర్తి అవగాహన లేదని పలువురు నాయకులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పార్టీల ప్రతినిధులు చేసిన సూచనలు, లేవనెత్తిన అంశాలను తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో బీఎల్ఓల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని గుర్తించామని, వారికి అవసరమైన సహకారం అందించేందుకు ఆర్పీలు, బీఎల్ఓ సూపర్వైజర్లు నిరంతరం పర్యవేక్షించేలా ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. -
రూ.కోట్లలో బకాయిలున్నా... అద్దె వసూలు చేయరా?
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: మహబూబ్నగర్ కార్పొరేషన్ రెండో కౌన్సిల్ సమావేశం బుధవారం వాడీవేడిగా సాగింది. ఎజెండాలోని అంశాలను అధికారులు చదివి వినిపిస్తుండగా కౌన్సిల్ సభ్యులు ప్రజాసమస్యలు, ఇబ్బందులపై మొదట చర్చించాలని, ఎజెండాలోని అంశాలు అందరికీ తెలుసని కోరడంతో మొదట ప్రజాసమస్యలపై చర్చ జరిగింది. గతంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు ఇప్పటికీ చెల్లించలేదని, ఇప్పటికే ఎజెండాలో కొత్త బిల్లులు పెట్టారని ప్రశ్నించారు. ఏఓ మున్సిపాలిటీ నుంచి వేతనాలు తీసుకుంటూ హైదరాబాద్లో విధులు నిర్వహిస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు కమిషనర్ స్పందిస్తూ సాధారణ బడ్జెట్ నుంచి గతంలో పనులకు బిల్లులు చెల్లిస్తూ కొత్త పనులు కూడా చేపడుతామని, ఇక్కడ వేతనం తీసుకుంటూ హైదరాబాద్లో పనిచేసే వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సమావేశంలో మేయర్ మమత, డిప్యూటీ మేయర్ సురేందర్రెడ్డి, కమిషనర్ రామాంజులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ● మున్సిపాలిటీ ఆవరణలో రూ.17 లక్షలతో మెడికల్ షెడ్ నిర్మాణం అవసరమా, ఆ నిధులను కళాభారతికి ఇవ్వాలని ప్రశ్నించగా కార్పొరేషన్ పరిధిలోని మహిళా సంఘాల సభ్యుల కోసం దీన్ని నిర్మిస్తున్నామని, నిధులు ముడా నుంచి వస్తున్నాయని, కళాభారతికి రూ.3.20 కోట్లను ప్రభుత్వం కేటాయించినట్లు తెలిపారు. 81 పాయింట్ల ఎజెండాతో కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారని, మూడు నెలల తర్వాత ఎందుకని.. నెలకోసారి సమావేశం నిర్వహించాలని కోరారు. ● కార్పొరేషన్ విస్తరిస్తున్న క్రమంలో ప్రస్తుతం ఉన్న డంపింగ్ యార్డులో ఓ ఏజెన్సీ ద్వారా సర్వే చేయిస్తే దాదాపు 7 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త ఉన్నట్లు తెలిపిందని, దీనివల్ల డంపింగ్ యార్డు చుట్ట పక్కల సుమారు 6, 8 వార్డులకు ఇబ్బందికర పరిస్థితి ఉందని డిప్యూటీ మేయర్ సురేందర్రెడ్డి పేర్కొన్నారు. దీన్ని అధిగమించేందుకు ఏకలవ్య కాలనీలో 45 ఎకరాల భూమిని కార్పొరేషన్ డంపింగ్ యార్డుకు కేటాయించుకునేలా సభ్యులు సహరించాలని కోరారు. దేశంలో జీరో చెత్త విధానం ఒక్క పుణె మున్సిపాలిటీలో ఉందని, అక్కడ వచ్చిన ప్రతి చెత్తను ప్రాసెస్ చేసి జీరో చెత్త చేస్తున్నారన్నారు. దీనిపై అధ్యయనానికి కమిషనర్ ఆధ్వర్యంలో 60 డివిజన్ల కార్పొరేటర్లు త్వరలో పుణెకు వెళ్లేందుకు సమయం ఇవ్వాలని కోరారు. దుకాణాల వేలంపై ప్రధాన చర్చ.. కార్పొరేషన్ పరిధిలోని పలు దుకాణాలకు గతంలో ఉన్న అద్దె బకాయిలను చెల్లించకుండా వాటికి కొత్తగా వేలం వేయడం ద్వారా భారీగా నష్టం వాటిల్లుతుందని బీజేపీ కార్పొరేటర్లు ప్రశ్నించారు. కార్పొరేషన్కు సుమారు రూ.70 కోట్లపైగా నష్టాల్లో ఉంటే ఇలా అద్దె వసూలు చేయకుండా వేలం వేస్తే బకాయిలు ఎవరు చెల్లిస్తారని ప్రశ్నించారు. కేవలం వ్యాపారాలు లేకుండా ఖాళీగా ఉన్న దుకాణాలకు మాత్రమే వేలం వేయాలని, వ్యాపా రాలు కొనసాగుతున్న వాటికి వేయవద్దని కోరారు. భగీరథకాలనీలో ప్రభుత్వ స్థలంలో బోర్డులు ఏర్పాటు చేస్తే తొలగిస్తున్నారని, సుభాష్నగర్ ప్రాంతంలో కుక్కులు ఎక్కువగా ఉన్నాయని, వాటి కట్టడికి చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరారు. విలీన గ్రామాలైన చిన్నదర్పల్లిలో తమకు తెలియకుండానే పనులు జరుగుతున్నాయని, ఇంటినంబర్లు లేని పాత ఇళ్లకు నంబర్లు కేటాయించాలని కోరారు. రాత్రి సమయాల్లో ఫంక్షన్హాల్స్, హోటల్స్ తమ చెత్తను బహిరంగ ప్రదేశాల్లో పడేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని, ఫుట్పాత్లను ఆక్రమిస్తున్నారని ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇళ్లలోకి వర్షం నీరురావడం, తాగునీరు, డ్రెయినేజీ, దోమలు, రోడ్లు తదితర సమస్యలపై సభ్యులు ప్రశ్నించారు. ఇప్పుడు వేలం వేస్తే.. పాత అద్దె రూ.70 కోట్లు ఎవరిస్తారు..? వివిధ సమస్యలపై నిలదీసిన కార్పొరేటర్లు వాడీవేడిగా కౌన్సిల్ సమావేశం -
అడుగంటిన కోయిల్సాగర్
దేవరకద్ర: వానాకాలం సీజన్ ప్రారంభమైన ఐదు వారాలు గడిచినా కోయిల్సాగర్ ప్రాజెక్టులోకి చుక్క నీరు చేరలేదు. వర్షాభావ పరిస్థితులతో రైతులు ఆకాశం వైపు వెర్రిచూపులు చూడాల్సి వస్తున్నది. ప్రస్తుతం వర్షం లేక భూములన్నీ బీళ్లుగా కనిపిస్తున్నాయి. కోయిల్సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 32.6 అడుగులు ఉండగా.. ప్రస్తుత నీటి మట్టం 9.3 అడుగులకు పడి పోయింది. పదేళ్లుగా ఇలాంటి పరిస్థితి ఎన్నడూ రాలేదు. వానాకాలంలో ప్రారంభంలోనే వర్షాలతో కానీ, జూరాల నుంచి ఎత్తిపోతల ద్వారా గానీ ప్రాజెక్టులోకి నీరు వచ్చేది. దీంతో ఆయకట్టు భూములకు నీటిని వదలడం వల్ల సమృద్ధిగా పంటల సాగు కొనసాగేది. ప్రస్తుతం ఉన్న నీటి మట్టానికి మరో 12 అడుగుల మేర నీరు చేరితేనే ఆయకట్టుకు నీటిని వదిలే అవకాశం ఉంది. వర్షాలు బాగా కురిస్తే తప్ప ప్రాజెక్టుకు నీరు అందే అవకాశం కనిపించడం లేదు. జూలైలోనే నీటి విడుదల.. మూడేళ్లుగా జూలైలోనే ఆయకట్టుకు నీటిని వదిలారు. 2023లో ప్రాజెక్టుకు జూరాల నుంచి ఎత్తిపోతల ద్వారా నీటిని అందించడంతో ప్రాజెక్టులో 24 అడుగుల మేర నీటి మట్టం చేరింది. వానాకాలంలో మూడు నెలల పాటు నీటిని వదలడంతో దాదాపు 35 వేల ఎకరాల మేర సాగు చేశారు. 2024లో వర్షాలు బాగా కురవడంతో జూలై నాలుగో వారం నుంచి నీటి విడుదల కొనసాగించారు. ఎత్తిపోతల లక్ష్యం మేరకు దాదాపు 36 వేల ఎకరాల మేర వరి పంటలు సాగు చేశారు. 2025లో సైతం భారీ వర్షాలు కురిసాయి. మే, జూన్, జూలైలో కురిసిన వర్షాలకు ప్రాజెక్టు పాత ఆలుగుస్థాయికి చేరింది. దీంతో జూలైలోనే నీటిని విడుదల చేసి పంటలకు అందించారు. గతేడాది పంటలకు వచ్చే నీరు ఎక్కువ కావడంతో కోయిల్సాగర్ నీటిని గొలుసుకట్టు చెరువులకు మళ్లించాల్సి వచ్చింది. పంటలు కూడా రికార్డుస్థాయిలో రైతులు పండించారు. కాగా.. వానాకాలం సాగుకు రైతులు అంతా సిద్ధం చేసుకున్నా వానదేవుడు కరుణించకపోవడంతో నిరాశలో మునిగిపోయారు. ఆగష్టు వరకు మరికొంత సమయం ఉండడం వల్ల నాట్లకు ముందు ఉండే వ్యవసాయ పనులను చేసుకుంటున్నారు. బోరుబావుల కింద ఇప్పటికే నారుమళ్లను వేసుకున్నారు. చేరని ఎత్తిపోతల లక్ష్యం.. కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకం ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు సాగు లక్ష్యం నెరవేరలేదు. ప్రాజెక్టు పరిధిలో దేవరకద్ర, ధన్వాడ, మరికల్, చిన్నచింతకుంట మండలాల పరిధిలో పాత ఆయకట్టు 12 వేల ఎకరాలుగా ఉండేది. ఎత్తిపోతల లక్ష్యం 38,250 ఎకరాలు కాగా.. పాత ఆయకట్టు కలుపుకుని పూర్తి సాగు 50,250 ఎకరాలకు చేరింది. ఎత్తిపోతల ప్రారంభమైన తర్వాత పూర్తిస్థాయి లక్ష్యం ఎప్పుడూ చేరలేదు. మూడేళ్లుగా వానాకాలంలో 35 వేల ఎకరాల వరకు సాగు అవుతుంది. ఇక యాసంగిలో 12 వేల ఎకరాల పాత ఆయకట్టుకే పరిమితమైంది. కాల్వల పొడిగింపు పనులు పెండింగ్లో ఉండడం, పిల్ల కాల్వలు సక్రమంగా లేకపోవడం వల్ల సాగు లక్ష్యం సాధ్యం కావడం లేదు. ఆశ, నిరాశల మధ్య రైతన్న! ప్రస్తుతం ప్రాజెక్టులో 9.3 అడుగుల వరకే నీరు పంపులు నడిచినా అందని నీరు.. ప్రారంభం కానీ ఆయకట్టు సాగు వర్షాలు పడితేనే సమస్యకు పరిష్కారం -
ఆయన దారెటు..?
గద్వాల: నడిగడ్డలో ఆ ఎమ్మెల్యే రూటే సెపరేటు అన్న చందంగా మారింది. ప్రతిపక్షంలో ఉన్నవారు సహజంగా అధికారంలో ఉన్నవారిని నిలదీస్తూ.. ప్రజాపక్షాన ప్రభుత్వాన్ని నిలదీయాలి. కానీ, అలంపూర్లో బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యే విజయుడు మాత్రం పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలిలా.. బుధవారం అధికార పార్టీకి చెందిన రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి జిల్లాలోని ధరూరు మండలం ర్యాలంపాడు ముంపు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే విజయుడు ఇద్దరు మంత్రులకు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. ప్రభుత్వ కార్యక్రమం అనుకుందామంటే గద్వాల నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమానికి ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే హాజరవడంతో అనుమానాలు రేకెత్తుతున్నాయి. మరోవైపు ఇదేరోజు బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులతోపాటు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సైతం కర్ణాటకలోని ఆర్డీఎస్ను సందర్శించారు. ఆర్డీఎస్కు జరుగుతున్న అన్యాయంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. బీఆర్ఎస్ నేతలు అధికార పార్టీపై విమర్శలు చేస్తుండగా.. మరోవైపు అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే విజయుడు అధికార పార్టీ మంత్రులకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇంతకు ఎమ్మెల్యే విజయుడు దారెటు అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మంత్రులను కలిసిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మరోవైపు ఆర్డీఎస్ను సందర్శించిన బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వంపై పోరాటం చేస్తుంటే.. ఎమ్మెల్యే మంత్రులకు స్వాగతం పలకడంపై చర్చ -
కర్ణాటక అక్రమ ప్రాజెక్ట్లతో పాలమూరు ఎడారే..
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘తుంగభద్ర నదిపై ఎగువన కర్ణాటకలో అక్రమంగా నిర్మిస్తున్న చిక్కలమర్రి, కురిడి, గుండ్రేవుల ప్రాజెక్ట్లతో నడిగడ్డ మాత్రమే కాదు.. పాలమూరు శాశ్వతంగా ఏడారిగా మారే ప్రమాదం ఉంది. ఆర్డీఎస్, కల్వకుర్తి, పీఆర్ఎల్ఐ ఇలా అన్నింటికీ నీటి కష్టాలు తప్పవు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు. పార్టీలకతీతంగా పాలమూరు ప్రజలను ఏకం చేస్తాం. పాలమూరును ఎడారిగా మార్చే కుట్రలను తిప్పికొడతాం.’ అని మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి హెచ్చరించారు. బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా మాన్వి తాలుకాలోని రాజోలి బండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్) ఆనకట్టను సందర్శించారు. తెలంగాణకు నీరు వచ్చే ఆర్డీఎస్ ఎడమ కాల్వ షెటర్లు, పేరుకుపోయిన పూడికతోపాటు సమీపంలో కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న కురిడి డ్రింకింగ్ వాటర్ స్కీంను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బచావత్ ట్రిబ్యునల్కు వ్యతిరేకంగా కర్ణాటక, ఏపీ ప్రభుత్వాలు తుంగభద్ర, కృష్ణా నదులపై అనేక అక్రమ ప్రాజెక్ట్లు, బ్యారేజీలు నిర్మిస్తున్నాయని.. దీనివల్ల కృష్ణా నదిపై ఆధారపడి ఉన్న ఉమ్మడి పాలమూరు, నల్లగొండ జిల్లాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. కాంగ్రెస్ నేతలు స్పందించకపోవడం శోచనీయం.. కర్ణాటకలో నూతనంగా నిర్మిస్తున్న ప్రాజెక్ట్లకు సీడబ్ల్యూసీ, కేఆర్ఎంబీ అనుమతులు లేవని.. ఇంత జరుగుతున్నా పాలమూరు బిడ్డ అని చెప్పుకునే సీఎం రేవంత్రెడ్డి, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలు స్పందించకపోడం శోచనీయమన్నారు. ఏపీ ఓ పక్క అడ్డగోలుగా నీరు తరలించుకుపోవడంతోపాటు కుడి కాల్వ పేరుతో ప్రాజెక్ట్ నిర్మిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీటి విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగితేనే స్వరాష్ట్ర ఉద్యమం జరిగిందన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదన్నారు. కాగా, కురుడి ఎత్తిపోతల సందర్శన క్రమంలో అక్కడికి కర్ణాటక ఇరిగేషన్ అధికారులు రాగా.. ఏ అనుమతులతో ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. కర్ణాటక ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు ఉన్నాయని వారు సమాధానమివ్వగా.. కేఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ, కేంద్ర జలశక్తి శాఖ అనుమతులు ఉండాలని.. ఉన్నతాధికారులతో మాట్లాడి పనులు నిలిపివేయాలని సూచించారు. ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామిరెడ్డి, నవీన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, జైపాల్యాదవ్, అంజయ్యయాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నాయకులు ఆంజనేయులు గౌడ్, విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ‘కురిడి’తో కొద్ది నీరు కూడా రాదు.. ఆర్డీఎస్ ప్రాజెక్ట్ను నిజాం కాలంలో తెలంగాణ ప్రజల సొమ్ముతో నిర్మించారని మాజీ మంత్రులు గుర్తు చేశారు. అయితే రాయచూర్ ప్రాంతం కర్ణా టకలో కలిసిందన్నారు. అప్పటి నుంచి ఇప్పటివ రకు తెలంగాణకు ట్రిబ్యూనల్ కేటాయించిన 15.9 టీఎంసీల వాటా దక్కడం లేదని.. కేవలం 1.2టీఎంసీల వాటా ఉన్న కర్ణాటకనే ఎక్కువ ప్ర యోజనం పొందుతోందన్నారు. ఇప్పటివరకు భారీగా భారీగా దోపిడీకి పాల్పడుతున్న కర్ణాటక.. తెలంగాణకు వచ్చే కొద్ది నీరు సైతం రాకుండా అడ్డుకునేందుకు కురిడి ఎత్తిపోతలను నిర్మిస్తోంద ని దుయ్యబట్టారు. తాగునీటి పేరుతో 2 టీఎంసీల సామర్థ్యంతో 100మీటర్ల దూరంలోనే లిఫ్ట్ను నిర్మిస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ఆర్డీఎస్ పరిరక్షణ కోసం తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం చేపట్టామని.. తాజాగా కర్ణాటక చేపడుతున్న కురిడి ఎత్తిపోతలతో ఆ కొద్ది నీరు కూడా నడిగడ్డకు అందే పరిస్థితి ఉండదన్నారు. మాజీ మంత్రులుశ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి కర్ణాటకలోని ఆర్డీఎస్ను సందర్శించిన బీఆర్ఎస్ బృందం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్ట్లను పరిశీలించిన నేతలు -
ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
మహబూబ్నగర్ క్రైం: నగరంలో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారించేందుకు జిల్లా పోలీస్శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఎస్పీ డి.జానకి పేర్కొన్నారు. నగరంలోని బైపాస్ రోడ్డు, ఏనుగొండ ఎదిర ఎక్స్రోడ్, నూతన కలెక్టరేట్ ఎదుట, భూత్పూర్ రోడ్డులో ఉన్న ప్రమాదకర మలు పులు, చించోళి బైపాస్ రోడ్డు, కోయిలకొండ ఎక్స్రోడ్లను బుధవారం ఎస్పీ తనిఖీ చేశారు. హెచ్చ రిక బోర్డులు, రోడ్డు భద్రత ఏర్పాట్లు, సిగ్నల్స్, డివైడర్లు, విద్యుత్ దీపాలు ఏర్పాటు తదితర అంశాలను పరిశీలించి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధింత అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. కలెక్టరేట్ దగ్గర మలుపు దగ్గర ఉన్న రంబుల్ స్ట్రిప్స్ను తొలగించి, ముందస్తు హెచ్చరిక కోసం సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల కట్టడి చేయడం, ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించాలన్నారు. ప్రతి వాహనదారుడు తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ రమణారెడ్డి, ట్రాఫిక్ సీఐ రాజేందర్రెడ్డి పాల్గొన్నారు. -
ఆత్మీయ మిత్రుడిని కలుసుకున్న దత్తాత్రేయ
జడ్చర్ల టౌన్: పట్టణంలోని వీహెచ్పీ నాయకులు మంచన గుండెరావును మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కలుసుకుని పరామర్శించారు. మంగళవారం ఏపీలోని కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్తూ మార్గమధ్యంలో ఆయన జడ్చర్లలో ఆగారు. ఎమర్జెన్సీ కాలం (1975)లో మీసాచట్టం కింద అరెస్టయి తనతోపాటు చంచల్గూడ జైలులో నిర్బంధ జీవితం గడిపిన రోజులను గుర్తుచేసుకున్నారు. ఎమర్జెన్సీ పోరాటం కలిపిందని, నాటినుంచి నేటికి స్నేహబంధం కొనసాగుతుందని దత్తాత్రేయ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గుండెరావును శాలువాతో సత్కరించారు. 83ఏళ్ల వయసులో ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనటాన్ని అభినందించారు. గుండెరావు ఇంటికి చేరుకున్న దత్తాత్రేయకు ఘనస్వాగతం లభించింది. ఆయనకు గుండెరావుతోపాటు బీజేపి నాయకులు కృష్ణయ్య, శ్రీనివాస్గౌడ్, సాహితి స్వాగతం పలికారు. -
ఓటెక్కడ ఉంచుకుందాం!
● పల్లె, పట్టణాల్లో రెండు చోట్లా ఓట్లున్న వారు తర్జనభర్జన ● సర్ సర్వే ప్రక్రియతో ఓటర్లలో సందిగ్ధత ● వలస ఓటర్ల నమోదుకు నేతల ఆరాటం జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలో ఒక్క కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీలు, 16 మండలాలు.. ఎక్కడ చూసినా ఇప్పుడు ఒకటే చర్చ. ఈసారి ఓటు ఎక్కడ ఉంచుకుందాం? ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) సర్వే ఉమ్మడి కుటుంబాల్లో, ముఖ్యంగా వలస ఓటర్లలో తీవ్ర సందిగ్ధతను రేపుతోంది. ఒకే వ్యక్తికి రెండు చోట్ల (సొంత గ్రామం, ఉద్యోగ/వ్యాపార నిమిత్తం ఉంటున్న పట్టణంలో) ఓటుహక్కు ఉండటానికి వీల్లేదని ఎన్నికల సంఘం తేల్చేసింది. ఈ నిబంధన ఇప్పుడు తలనొప్పిగా మారింది. బీఎల్ఓలు దాదాపు 90శాతంపైగా సర్వే ఫారాల పంపిణీ పూర్తి చేశారు. ఓటర్లు మాత్రం ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్నారు. ప్రజాప్రతినిధులకు సైతం సమస్యగా మారింది. వలస ఓటర్ల నిర్ణయంపై నేతల్లో వణుకు.. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్, వార్డు మెంబర్, మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ ఎన్నికలైనా వలస ఓటర్ల ఓటింగే కీలకం. ఎన్నికల రోజు ఓటింగ్కు వచ్చే వలస ఓటర్లే గెలుపోటములను నిర్ణయిస్తున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారు 50వేల వరకు వలస ఓటర్లు ఉంటారు. గత ఎన్నికల్లో ఉపాధి నిమిత్తం హైదరాబాద్, ఇతర పట్టణాల్లో ఉంటూ సరిగ్గా పోలింగ్ రోజు సొంతూళ్లకు వచ్చి ఓట్లు వేసి గెలుపోటములను ప్రభావితం చేశారు. ఇప్పుడు డబుల్ ఓట్ల తొలగింపు ప్రక్రియ ముమ్మరం కావడంతో గ్రామీణ, పట్టణ రాజకీయ నాయకులు అలర్ట్ అయ్యారు. మా దగ్గరే ఓటు ఉంచుకోండి అంటూ ఇటు మున్సిపల్ నేతలు, అటు గ్రామీణ నేతలు ఓటర్లపై ఒత్తిడి పెంచుతున్నారు. చాలామంది ఎన్యుమరేషన్ ఫారం నింపి ఎక్కడ ఇవ్వాలో తేల్చుకోలేకపోతున్నారు. ఓటర్లు దొరకడం లేదు ఒకవైపు ఓటర్ల సందిగ్ధత ఇలా ఉంటే, క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్న బూత్ లెవెల్ అధికారులకు కొత్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సర్పంచ్, కౌన్సిలర్ ఎన్నికల్లో నమోదైన ఓటింగ్ శాతం ఆధారంగా ఫారాల పంపిణీ అయితే జరిగింది. కానీ, వాటిపై ఓటర్ల ఫోన్ నంబర్లు లేకపోవడం పెద్ద మైనస్గా మారింది. అధికారులు ఇళ్లకు వెళ్లేసరికి చాలామంది వలస ఓటర్లు అక్కడ ఉండడం లేదు. కొందరైతే ఇళ్లను అమ్ముకుని వేరే ప్రాంతాలకు వలస వెళ్లారు. దీంతో ఏం చేయాలో తెలియక బీఎల్ఓలు ఆ ఫారాలను తమ వద్దే ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎస్ఐఆర్ ఇప్పుడు ఇంటినుంచి రాజకీయ సమస్యగా మారింది. ఉన్న ఊరిలో ఓటు లేదంటే ఎట్లాగని ఇళ్లలో కుటుంబ సమస్యగా మారుతోంది. పట్టణాల్లో నివసిస్తున్న కుటుంబాల్లో ఈ సమస్యపై భార్య భర్తల నడుమ చర్చోపచర్చలు జరుగుతున్నాయి. భర్త తమ ఓటుహక్కును గ్రామంలోనే ఉండాలని కోరుకుంటుండగా, ప్రస్తుతం ఉంటున్న పట్టణం పరిధిలోనే ఉంచుకోవాలని భార్య గట్టిగా పట్టుబడుతోన్నట్టు సమాచారం. పిల్లల చదువులు, భవిష్యత్ స్థానికత, రేషన్ కార్డులు, ప్రభుత్వ ఆఫర్లు, ఇతర సంక్షేమ పథకాలకు ఇక్కడి ఓటే కీలకమని భార్యలు వాదిస్తున్నారు. భర్తలు మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. సొంత ఊర్లో అన్నదమ్ములు, నలుగురు స్నేహితులు ఉన్నారు. ఊర్లో ఓటు తీసేస్తే చుట్టరికం, పల్లెల్లో పరువుపోతుందని ఆందోళన చెందుతున్నారు. ఫలితంగా ప్రతి ఇంట్లోనూ పల్లె, పట్టణానికి మధ్య ఓటు యుద్ధం నడుస్తోంది. -
పాల దిగుబడికి పశువుల ఆరోగ్యరక్షణే కీలకం
జడ్చర్ల/జడ్చర్ల టౌన్: పాడి పరిశ్రమలో లాభదాయకత సాధించాలంటే పశువుల ఆరోగ్య సంరక్షణే కీలకమని పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ శివానందస్వామి పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని పెద్ద ఆదిరాలలో పాల ఉత్పత్తిదారుల సంఘం సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పశువులకు సమతల్యమైన పోషకాహారం, పరిశుభ్రమైన తాగునీరు, పశువుల కొట్టం, వ్యాధుల నివారణకు సకాలంలో వ్యాక్సిన్లు క్రమం తప్పకుండా నులిపురుగుల నివారణ మందులు వంటి జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచించారు. పాడిపశువులలో సాధారణంగా గాలికుంటు, గొంతువాపు తదితర అంటువ్యాధులు ఎక్కువగా ప్రభలుతాయన్నారు. ఆయా వ్యాధులబారిన పడితే గణనీయంగా పాలఉత్పత్తి పడిపోతుందని, కొన్నిసార్లు పశువులు కూడా మృత్యువాత పడే పరిస్థితి ఉంటుందన్నారు. పశువులలో జ్వరం, మేత మేయకపోవడం, నోటిలో పుండ్లు తదితర లక్షణాలు కనిపిస్తే వెంటనే సంబంధిత పశువుల డాక్టర్లను సంప్రదించాలని కోరారు. పాల దిగుబడి పెంచేందుకు దాణా, పచ్చిమేత తదితర అందించాలన్నారు. పాల సేకరణ డిప్యూటీ డైరెక్టర్ సత్యనారాయణ యాదవ్ మాట్లాడుతూ.. నాణ్యమైన పాలను సేకరణ కేంద్రాలకు తీసుకురావాలని, నాణ్యమైన పాలకు మంచి ధరలు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి 15రోజులకు బిల్లులు క్రమం తప్పకుండా చెల్లిస్తామన్నారు. కార్యక్రమంలో పాల ఉత్పత్తి దారుల సంఘం జిల్లా అధ్యక్షుడు రవీందర్రెడ్డి, బీఎంసీ అధ్యక్షుడు రాంలింగారెడ్డి, పెద్దఆదిరాల సర్పంచ్ శ్రీనివాస్గౌడ్, చిన్నఆదిరాల సర్పంచ్ శ్రీశైలం, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. -
పోక్సో కేసులో పదేళ్ల జైలుశిక్ష
రాజోళి: వడ్డేపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై జరిగిన లైంగికదాడి ఘటనలో నిందితుడికి పదేళ్ల జైలుశిక్ష ఖరారైనట్లు శాంతిగనర్ ఎస్ఐ నాగశేఖర్రెడ్డి తెలిపారు. వివరాలిలా.. 2021లో వడ్డేపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై గ్రామానికి చెందిన నడిపి తిమ్మప్ప లైంగికదాడికి పాల్పడినట్లు బాలిక తల్లి శాంతిగనర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. అప్పటి ఎస్ఐ శ్రీహరి కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ వెంకటేశ్వర్లు విచారణ చేపట్టి నిందితుడిని రిమాండ్కు పంపారు. కాగా, ఆ కేసుపై గద్వాల కోర్టులో వాదనలు జరిగాయి. జిల్లా పోలీసు అధికారులు సాక్షులను పకడ్బందీగా బ్రీఫింగ్ చేసి వారిని కోర్టులో నిజం చెప్పేలా చేశారు. బాలిపై జరిగిన ఘటనపై స్పెషల్ సెషన్స్ జడ్జి కం పోక్సో కోర్టు జడ్జి శ్రీనివాస్ నిందితుడు నడిపి తిమ్మప్పకు పదేళ్లు కఠిన కారాగార శిక్ష, రూ.10వేల జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. నీటి సంపులో పడి బాలుడి మృతి కల్వకుర్తి రూరల్: మండలంలోని తాండ్రలో ఇంటిముందున్న నీటి సంపులో పడి బాలుడు మృతిచెందిన ఘటన విషాదాన్ని నింపింది. గ్రామానికి చెందిన శివ, స్వాతి రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రెండురోజుల క్రితం ఓటు హక్కు నమోదు చేసుకోవడంతోపాటు, పిల్లలకు ఆధార్కార్డు తీసుకోవడానికి తమ సొంతూరుకు వచ్చారు. మంగళవారం తమ కుమారుడు విక్క(3)కి స్నానం చేయించిన అనంతరం తల్లి ఇంట్లో పనులు చేసుకుంటోంది. బాలుడు ఆడుకుంటూ వెళ్లి సంపులో పడి మృతిచెందాడు. వివాహిత ఆత్మహత్య మల్దకల్ : కుటుంబ కలహాలతో నిప్పంటించుకుని ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని ఉలిగేపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ఆంజనేయులు, భార్య సుజాత (30) పొలంలో పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకు నేవారు. సుజాతకు ముగ్గురు పిల్లలు పుట్టి చనిపోవడంతో ఆ వి షయంపై ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో సోమ వారం రాత్రి ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో మనస్థాపం చెందిన సుజాత నిప్పంటించుకుంది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరిక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతి చెందినట్లు ఏఎస్ఐ ఈశ్వరయ్య తెలిపారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. చికిత్స పొందుతూ వైద్య విద్యార్థిని మృతి ● వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ పాలమూరు: సర్జరీ తర్వా త దాదాపు మూడు రోజు ల పాటు ఆస్పత్రిలోని వెంటిలేటర్పై చికిత్స పొందుతూ యువ వైద్య విద్యార్థిని మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. కోదాడకు చెందిన ధరావత్ అమృత(23) జిల్లాకేంద్రంలోని ఎస్వీఎస్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి హౌజ్సర్జన్(ఇంటన్షిప్)గా పనిచేస్తోంది. అయితే కొన్ని రోజులుగా ఆమె థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడుతోంది. దీంతో ఆమెను ఈనెల 4న ఎస్వీఎస్ ఆస్పత్రిలో థైరాయిడ్కు సంబంధించిన సర్జరీ పూర్తి చేశారు. సర్జరీ అయిన తర్వాత మూడు రోజుల పాటు వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న విద్యార్థిని మంగళవారం మధ్యాహ్నం మృతి చెందింది. ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు రాలేదని రూరల్ ఎస్ఐ విజయ్కుమార్ తెలిపారు. -
వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి
వనపర్తి రూరల్: ప్రైవేట్ ఆస్పత్రి వైద్యల నిర్లక్షంతో బాలింత మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మదనాపురం మండలం కొన్నూరుకు చెందిన సాబేరా బేగం (35)తో పెబ్బేరు మండలంలోని వైశాఖాపూర్ గ్రామానికి చెందిన ఇమామ్కు 16 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. పైళ్లె ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టకపోవడంతో ఇటీవల సాబేరాబేగం కర్నూల్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చింది. ఈ క్రమంలో ప్రతి నెల పెబ్బేరు పట్టణంలోని జననీ ప్రైవేట్ ఆస్పత్రిలో హెల్త్ చెకప్ చేయించుకునేది. గత నెల 28న రాత్రి బ్లీడింగ్ కావడంతో జననీ ఆస్పత్రిలో చేర్పించారు. అదే రోజు డా.ప్రియాంకరెడ్డి ఆమెకు ఆపరేషన్ చేయగా పాప, బాబు కవల పిల్లలు జన్మించారు. పిల్లలకు శ్వాస సమస్య ఉండంతో వెంటనే మహబూబ్నగర్లోని సుశ్రుత ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అలాగే సాబేరాబేగంకు పొటాషియం నిల్వలు తగ్గగా ఈ నెల 3న మహబూబ్నగర్లోని నవోదయ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. అయితే పెబ్బేరులోని జననీ ఆస్పత్రి వైద్యులు మెరుగైన వైద్యం అందించకపోవడంతోనే తమ కుమార్తె చనిపోయిందని కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఆస్పత్రి ముందు మృత దేహంతో ఆందోళన చేపట్టారు. పెద్ద మనుషులు ఆస్పత్రి యాజమాన్యంతో చర్చలు జరిపి నష్టపరిహారం ఇప్పించడంతో బాధితులు ఆందోళన విరమించారు. ఈ ఘటనపై ఆస్పత్రి యజమాన్యం డాక్టర్ ప్రియాంక, జయచంద్రా రెడ్డిను వివరణ కోరగా సాబేరాబేగంకు కవలలు పుట్టడంతో బ్లీడింగ్ ఎక్కువై పోటాషియం తగ్గిందని, దానికి ఇక్కడ చికిత్స లేకపోవడంతో నిమ్స్కు రెఫర్ చేశామన్నారు. అయితే అక్కడ చేర్చుకోవడం ఆలస్యమవుతుందని మహబూబ్నగర్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందిందన్నారు. ఇందులో తమ తప్పు ఏమిలేదన్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన -
వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతి
ట్రాక్టర్ అదుపుతప్పి వ్యక్తి .. మద్దూర్(కోస్గి): ట్రాక్టర్ అదుపుతప్పి వ్యక్తి మృతి చెందిన ఘటన కోస్గి మండల పరిధిలో చోటు చేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన గట్టవోని వెంకటేష్ (40) సొంతంగా ట్రాక్టర్ నడుపుతుండేవాడు. ఈ క్రమలంలో మంగళవారం ఉదయం అదే గ్రామానికి చెందిన ఈడిగి నర్సిములుగౌడ్ వద్ద పత్తి పంటలో కలుపు రొప్పడానికి వెళ్లాడు. పనులు ముగించుకొని ట్రాక్టర్పై ఇద్దరు గ్రామానికి వస్తుండగా గ్రామ శివారు చంద్రవంచ– దౌల్తాబాద్ బీటీరోడ్డుపై ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో డ్రైవర్ వెంకటేష్ చేతులు విరిగి తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. పక్కనే ఉన్న నర్సిములుగౌడ్కు సైతం గాయాలయ్యాయి. మృతుడి భార్య అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్యతోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆటో ఢీకొని వ్యక్తి.. మరికల్: ఆటో ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన అర్ధరాత్రి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మహబూబ్నగర్కు చెందిన మహమ్మద్ సలీం(34) సోమవారం దేవరకద్రలో ఉన్న తన అ క్క దగ్గరకు వచ్చాడు. అక్కడి నుంచి రాత్రి మరికల్కు చేరుకొని అర్ధరాత్రి రాయచూర్ రో డ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆటో ఢీకొట్టింది. గాయపడిన సలీంను చికిత్స నిమిత్తం ఢీకొట్టిన ఆటోలోనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. అనంతరం ఆటో డ్రైవర్ మృతదేహాన్ని ఆత్మకూర్– కన్మనూర్ చౌరస్తా వద్ద ఉన్న కల్వర్టు వద్ద పడేసి పరారయ్యాడు. మంగళవా రం ఉదయం విషయం వెలుగులోకి రావడంతో ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బైక్ను బస్సు ఢీకొట్టిన ఘటనలో వృద్ధుడు .. అయిజ: మండలం సమీపంలోని కర్నూలు రోడ్డు పై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. మున్సిపాలిటీ పరిధిలోని పర్థిపురానికి చెందిన కిష్టన్న (53) సోమవారం ఆయన కుమార్తె కుమారుడు (మనవడు) ధర్మతేజతో బైక్పై వెళ్తుండ గా మండలంలోని వెంకటాపుర స్టేజి సమీపంలో వెనుక నుంచి కర్ణాటక బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో కిష్టన్న తీవ్రంగా గాయపడగా, ధర్మతేజకు స్వల్పగాయాలయ్యాయి. అనంత రం చికిత్స నిమిత్తం కర్నూలు ఆస్పత్రికి తరలించగా కిష్టన్న మృతిచెందాడు. మృతుడికి భార్య ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నా రు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ట్రాలీ ఆటోను ఢీకొట్టిన మినీ బస్సు.. వెల్దండ: మండల కేంద్ర సమీపంలో సోమవా రం రాత్రి ట్రాలీఆటోను మినీ బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన మహ్మద్ రహిమాన్(32) మృతి చెందినట్లు ఎస్ఐ యుగేంధర్రెడ్డి తెలిపారు. అచ్చంపేట నుంచి హైదరాబాద్ వెళ్తున్న ట్రాలీ ఆటోను యాదగిరిగుట్ట నుంచి శ్రీశైలం వైపు వెళ్తున్న మినీ బస్సు వెల్దండ సమీపంలో డీకొట్టింది. ప్రమాదంలో ట్రాలీ ఆటో డ్రైవర్ మహ్మద్ రహిమాన్ అక్కడికక్కడే మృతి చెందిగా మరో ఇద్దరు ఉ మార్ఖాన్, జహంగీర్ గాయపడ్డారు. క్షతగాత్రుల ను కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా మెరు గైన వైద్యం కోసం హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ట్రాలీ ఆటోలోని వారు హైదరాబాద్లోని ఫలక్నామకు చెందిన వారిగా ఎస్ఐ తెలిపారు. మృతుడి బావమరిది షకీల్ ఫిర్యాదు మంగళవారం మినీ బస్సు డ్రైవర్ హరినాథ్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య రేష్మబేగం, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బైక్ అదుపుతప్పి నేపాల్ యవకుడు.. కొత్తకోట రూరల్: బైక్ అదుపుతప్పి యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన పాలెం ఎన్హెచ్– 44పై సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. నేపాల్కు చెందిన తికారాం సేజ్వాల్(21) బెంగుళూర్ నుంచి బైక్పై హైదరాబాద్ వెళ్తుండగా మండలంలోని పాలెం సమీపంలో బైక్ అదపుతప్పి కిందపడటంతో తికారాం సేజ్వాల్ అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వనపర్తి మార్చూరీకి తరలించినట్లు ఎస్ఐ శివానందం గౌడ్ తెలిపారు. ఆటో బోల్తా.. ఐదుగురికి గాయాలు దేవరకద్ర: ఆటో బోల్తాపడిన ప్రమాదంలో ఐదుగురు గాయపడిన ఘటన మంగళవారం మండల కేంద్రంలో జరిగింది. దేవరకద్ర నుంచి కౌకుంట్ల వైపు వెళ్తున్న ఆటో డోకూర్ స్టేజీ సమీపంలో ఈదురుగాలులకు అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. ప్రమాదంలో శైనాజ్ బేగం, శివజ్యోతి, సరి తా, మహబూబ్బీ, కలీం గాయపడగా వారిని 108 అంబులెన్స్లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఉమ్మడి జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందిన ఘటన మంగళవారం జరిగింది. పూర్తి వివరాలు ఇలా.. మక్తల్: ఇసుక టిప్పర్ బోల్తా ప డి మృతి చెందిన ఘటన మండలంలోని మాద న్పల్లి శివారు లో మంగళవారం జరిగింది. పూర్తి వివరాలు.. నారాయణ పట మండంల శేర్నపల్లికి చెందిన ఇసుక టిప్పర్ డ్రైవర్ నరేశ్(25) దాసర్పల్లి వాగు నుంచి మాదన్పల్లికి టిప్పర్లో ఇసుక తరలిస్తుండగా అదుపు తప్పి బోల్తాపడటంతో డ్రైవర్ నరేశ్ టిప్పర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తల్లి శంకరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు. -
పరారైన ఖైదీ మళ్లీ జైలుకు..
24గంటలపాటు సాగిన హైడ్రామా ● ఖైదీని జైలుకు తీసుకెళ్లడంతో కథ సుఖాంతం ● నిర్లక్ష్యంగా ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెండ్ మహబూబ్నగర్ క్రైం: పోక్సో కేసులో రిమాండ్ ఖైదీగా ఉంటూ జిల్లా జైలు నుంచి పరారైన కిషోర్కుమార్రెడ్డిని వన్టౌన్ పోలీసులు మంగళవారం కోర్టులో హాజరుపర్చగా.. న్యాయమూర్తి 14రోజుల రిమాండ్ విధించారు. దీంతో మధ్యాహ్నం తర్వాత కిషోర్కుమార్రెడ్డిని వన్టౌన్ పోలీసులు జిల్లా జైలుకు తరలించారు. వనపర్తి ఆస్పత్రి నుంచి రాత్రి మెరుగైన వైద్యం కోసం మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రికి రాగా.. చికిత్స అందించారు. ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు నిర్ధారించిన తర్వాత పోలీసులు రిమాండ్కు తరలించారు. ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెండ్ పోక్సో కేసులో ఉన్న రిమాండ్ ఖైదీ కిషోర్కుమార్రెడ్డి జైలునుంచి పరారీ సమయంలో విధుల్లో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లను జైళ్లశాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జరిగిన ఘటనపై జైళ్ల శాఖ డీఐజీ శ్రీనివాస్ సుదీర్ఘంగా విచారణ చేసిన తర్వాత ఇద్దరు కానిస్టేబుళ్ల విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేల్చారు. దీంతో ఆ సమయంలో అప్రమత్తంగా లేని కారణంగా సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. అసలా గంట ఏం జరిగింది? జిల్లా జైలులో 24గంటలపాటు హైడ్రామా సాగింది. ఒక ఖైదీ జైలు నుంచి పరారయ్యాడనే విషయం బయటకు పొక్కడంతో భద్రతా లోపంపై అధికంగా విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో జైళ్ల శాఖ ఉన్నతాధికారులు సీరియస్ తీసుకొని విచారణ కోసం డీఐజీని పంపించారు. డీఐజీ వచ్చిన తర్వాత 24గంటలపాటు జైలులో పూర్తిగా హడావుడి సాగింది. ఖైదీలకు ప్రత్యేక ఆంక్షలు విధించి.. అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రత్యేక జాగ్రత్తలు పాటించారు. సాధారణంగా ప్రతి సోమవారం ఉదయం 8గంటలకు ఖైదీలకు టిఫెన్ చపాతీ పెడుతారు. ఈ క్రమంలోనే జైలులో ఉన్న దాదాపు 200మంది ఖైదీలకు చపాతీలు తయారు చేయడానికి సోమవారం తెల్లవారుజామున 4:30ప్రాంతంలో 8మంది ఖైదీలను కిచెన్లోకి అనుమతిచ్చారు. దీంతో చపాతీలు చేయడానికి వచ్చిన 8మంది ఖైదీలు అందరూ కిచెన్లో వారి పనుల్లో నిమగ్నం కాగా.. డ్యూటీలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు కొంత ఏమరపాటు ఉన్న సమయంలో కిషోర్ కుమార్రెడ్డి కిచెన్లో నుంచి బయటకు వచ్చి ఆ తర్వాత టవల్స్ సహాయంతో వెనుకవైపున్న గోడదూకి బయటకు వెళ్లిపోయాడు. జిల్లా జైలు చరిత్రలో ఖైదీలు తప్పించుకొని పోవడం ఇది రెండో ఘటన. గతంలో 2018లో దొంగతనం కేసులో జైలుకు వచ్చిన చాపల భాస్కర్ అనే ఖైదీని వైద్య పరీక్షల కోసం ఏఆర్ పోలీసులు ఎస్కాట్తో జనరల్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రి నుంచి ఏఆర్ పోలీసులను దృష్టి మళ్లీంచి ఖైదీ పరారయ్యాడు. మళ్లీ పోక్సో కేసులో జైలు నుంచి ఖైదీ తప్పించుకొని పోవడం స్థానికంగా కలకలం రేపింది. -
చిరుధాన్యాలు.. భలే లాభాలు
అలంపూర్: వ్యవసాయంలో చిరుధాన్యాల సాగుతో అధిక లాభాలు గడించే అవకాశం ఉంటుంది. చిరు ధాన్యపు పంటల్లో కొర్ర ముఖ్యమైంది. కొర్రలలో పోషకాలతో పాటుగా ఔషద గుణాలు ఉన్నాయి. వీటిలో పిండి పదార్థాలు తక్కవగా పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా ఊబకాయంతో బాధపడేవారికి మంచి ఆహారంగా గుర్తించారు. వీటిని ఆహారంగా తీసుకోవడం ద్వారా చక్కెర వ్యాధిని, గుండె జబ్బులను ఇతర రోగాలను అదు పులో ఉంచుకోవచ్చు. దీంతో ప్రస్తుతం తరుణంలో కొర్రకు మంచి డిమాండ్ ఉందని రైతులు చిరుధాన్యాల సాగుపై దృష్టి పెట్టాలని మండల వ్యవసాయ అధికారి నాగార్జున రెడ్డి సూచించారు. కొర్రసాగు ఇలా : కొర్ర పంటను వానాకాలం పంటగా జూన్–జులైలో వేసవి పంటగా జనవరిలోనూ విత్తుకోవచ్చు. రకాలు:కృష్ణదేవరాయ, నరసింహ్మారాయ, శ్రీలక్ష్మి, ఎస్ఐఏ 3085 రకాలు 80 నుంచి 85 రోజుల్లో కోతకు వస్తా యి. అలాగే ప్రసాద్, సూర్యనంది(ఎస్ఐఏ 3088) రకాలు 70 నుంచి 75 రోజుల్లో కోతకు రావడంతోపాటు అధిక దిగుబడి ఇస్తాయి. విత్తన మోతాదు : సాళ్లలో విత్తితే ఎకరాకు రెండు కిలోలు, వెదజల్లే పద్ధతిలో అయితే నాలుగు కిలోల విత్తనం సరిపో తుంది.కిలో విత్తనానికి రెండు గ్రాముల కార్బండిజ మ్తో విత్తన శుద్ధి చేయాలి. 25 సెం.మీ ఎడం ఉన్న సాళ్లలో మొక్కల మధ్య 10 సెం.మీ దూరం ఉండేలా విత్తుకోవాలి. అంతర్ పంటగా ప్రతి ఐదు సా ళ్లకు ఒక సాలు కంది వేయాలి. లేదా 2:1 నిష్పత్తిలో కొర్ర వేరుశనగ వేయవచ్చు. విత్తిన రెండు వారా ల్లోపు ఒత్తు మొలకలను తీసివేయాలి. 30 రోజుల వరకు పంట పొలంలో కలుపు మొక్క లు లేకుండా చూడాలి. విత్తిన 20 నుంచి 25 రోజుల తర్వాత సాళ్లల్లో అంతర్ కృషి చేసి కలుపు నివారించాలి. ఎరువులు : ఆఖరి దుక్కిలో నాలుగు టన్నుల పశు వుల ఎరువులను పొలంలో వేసి బాగా కలియ దున్నాలి. విత్తేటప్పుడు 20 కేజీల యూరియా, ఒక బస్తా(50 కేజీల) సింగిల్ సూపర్ ఫాస్పెట్ వేయాలి. విత్తిన నెల రోజులకు మరో 20 కేజీల యూరియాను పైపాటుగా వేయాలి. కొర్ర పంటను ఆశించే వాటిలో గులాబీ రంగు పురుగు, కాండం తొలిచే పురుగు, చెదలు, మిడతలు, లద్దె పురుగు ముఖ్యమైనవి. చెదల నివారణకు చివరి దుక్కిలో ఫాలిడాల్ రెండు శాతం పొడి మందును ఎకరాకు 10 నుంచి 12 కిలోల వంతున మట్టిలో బాగా కలిసేటట్లు వేయాలి. మిడతల నివారణకు కార్బరిల్ 5 శాతం పాడి మందును ఎకరాకు 10 నుంచి 12 కిలోల చొప్పున చల్లాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల కాప్టాన్/ థైరామ్, మందుతో విత్తన శుద్ధి చేయడం ద్వారా తుప్పు, అగ్గి, వెర్రికంకి తెగుళ్లను కొంతవరకు అరికట్టవచ్చు. పాడి–పంట -
ముగిసిన జోనల్ డ్యూటీ మీట్
మహబూబ్నగర్ క్రైం: రాష్ట్రస్థాయి పోలీస్ డ్యూటీ మీట్కు ఎంపికై న అధికారులు, సిబ్బంది అదే పట్టుదలతో ప్రతిభ కనబరిచి జోన్–7కు పేరు తీసుకురావాలని ఎస్పీ జానకి అన్నారు. జోనల్ లెవల్ పోలీస్ డ్యూటీ మీట్–2026, 27 ముగింపు కార్యక్రమం మంగళవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించారు. డ్యూటీ మీట్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన అధికారులు, సిబ్బందికి ఎస్పీ ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డ్యూటీ మీట్లలో సిబ్బంది తమ వృత్తి నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, దర్యాప్తు సామర్థ్యాలు మరింత మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. కార్యక్రమంలో ఏఎస్పీలు రత్నం, సురేష్కుమార్, ఆర్ఐలు కృష్ణయ్య, నగేష్, అశోక్, భూత్పూర్ సీఐ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ● జిల్లాలో ఈ నెల 31 వరకు నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్–12 కార్యక్రమం ద్వారా బాల కార్మికులను గుర్తించి తిరిగి పాఠశాలలో చేర్పించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎస్పీ జానకి ఆదేశించారు. ఎస్పీ కార్యాలయంలో ఆపరేషన్ ముస్కాన్ పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. 18 ఏళ్లులోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం చట్టవిరుద్ధమని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడైనా బాల కార్మికులు ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సైబర్ వారియర్స్కు శిక్షణ జిల్లాలో సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో నియంత్రణకు ప్రత్యేక దృష్టిసారించి, సైబర్ వారియ ర్స్ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు శిక్షణ దోహద పడుతుందని ఎస్పీ జానకి అన్నారు. ఎస్పీ కార్యాలయంలో సైబర్ వారియర్స్, అన్ని పోలీస్స్టేషన్ల సీఐలు, సిబ్బందికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సైబర్ నేరాల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలన్నారు. ఆన్లైన్ ఆర్థిక మోసాల్లో కోల్పోయిన నగదు వీలైనంత త్వరగా రికవరీ చేయడానికి అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. అనంతరం సైబర్ క్రైం డీఎస్పీ గిరికుమార్ సైబర్ నేరాల నివారణ, దర్యాప్తు, ఎన్సీఆర్పీ పెండింగ్ ఫిర్యాదులపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. -
నేడు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం
● మొత్తం 81 అంశాలతో ఎజెండా ● అభివృద్ధి పనులు, షాప్ల వేలం, ఇతర పనులకు నిధుల కేటాయింపు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సాధారణ సమావేశం బుధవారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నారు. సమావేశంలో కార్పొరేషన్ పరిధిలోని పలు అభివృద్ధి పనుల కోసం నిర్వహించే టెండర్లు, వివిధ రోడ్ల నిర్మాణాలు, డ్రెయినేజీలు, బ్రిడ్జిల మరమ్మతు వంటి పనులకు కౌన్సిల్ సభ్యుల ఆమోదం కోసం సమావేశం చేపడుతున్నారు. గత నెల 30నే కౌన్సిల్ సమావేశం నిర్వహించాల్సి ఉండగా వివిధ కారణాలతో వాయిదా పడింది. ఈ క్రమంలో సమావేశానికి పూర్తిస్థాయిలో సభ్యులు హాజరవుతారా.. లేదా.. అనేది కార్పొరేషన్లో చర్చనీయాంశంగా మారింది. అయితే మొత్తం 60 మంది కార్పొరేటర్లలో 50 శాతానికిపైగా సభ్యులు హాజరై.. అందులో మెజార్టీ సభ్యులు ఎజెండాలోని అంశాలకు ఆమోదం తెలిపితే సరిపోతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏజెండాలోని అంశాలు.. వీధిలైట్ల ఏర్పాటు కోసం రూ.49.50 లక్షలు, స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటుకు రూ.10 లక్షలు, మేయర్ చాంబర్ రెన్నోవేషన్ కోసం రూ.19 లక్షలు, కార్పొరేషన్ పరిధిలో మొత్తం 60 డివిజన్లు ఉండగా ఒక్కో డివిజన్కు ఒక్కో పని ఏజెండాలో పొందుపర్చారు. ఒక్క 11వ డివిజన్లో మాత్రమే రూ.2.50 లక్షలుగా ఉంది. మిగతా అన్ని డివిజన్లలోనూ రూ.5 లక్షల పనులు చూపించారు. వీటితోపాటు కార్పొరేషన్ పరిధిలోని పలు షాపుల వేలం, శిల్పారామంలో షాపుల కేటాయింపు, మున్సిపల్ సిబ్బంది ఆరోగ్య రక్షణ కోసం షూ, గ్లౌస్ ఇతర సామగ్రి కొనుగోలు, గత సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు కార్పొరేషన్ పరిధిలో 1,281 కుక్కలను పట్టారని, వీటికి ఒక్కో కుక్కకు రూ.1,400 చొప్పున మొత్తం రూ.17,93,400 చెల్లించేందుకు ఆమోదం తెలపనున్నారు. -
ఆయిల్పాం సాగు విస్తీర్ణం పెంచాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లాలో ఆయిల్పాం సాగు విస్తీర్ణం పెంచాలని డీఆర్ఓ నిర్మల అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో ఉద్యాన, వ్యవసాయ, సహకార శాఖల అధికారులు, మైక్రో ఇరిగేషన్, ప్రీ యూనిక్ ఆయిల్పాం కంపెనీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో జాతీయ వంట నూనెల మిషన్– ఆయిల్పాం పథకం కింద పామాయిల్ సాగు విస్తీర్ణం పెంపుపై దృష్టిసారించాలన్నారు. గతంలో సాంకేతిక బృందం, భారతీయ ఆయిల్పాం పరిశోధనా సంస్థ జిల్లాలో 5 వేల ఎకరాల్లో ఆయిల్పాం పంట వేయడానికి అవకాశం ఉందని గుర్తించగా.. ఇప్పటి వరకు 4,782 ఎకరాలు సాగులోకి వచ్చిందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ 1,500 ఎకరాల లక్ష్యం కాగా.. ఇప్పటి వరకు 792 ఎకరాలకు పరిపాలనా అనుమతులు లభించాయన్నారు. జిల్లా ఉద్యానవన అధికారి వేణుగోపాల్ మాట్లాడుతూ ఆయిల్పాం సాగుకు ప్రభుత్వం అందిస్తున్న భారీ సబ్సిడీలు, వివిధ రకాల రాయితీ పథకాలను వివరించారు. డీఏఓ గోవింద్నాయక్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో రైతులను చైతన్యపరచడంలో వ్యవసాయ శాఖ కీలక పాత్ర పోషించాలన్నారు. సహకార సంఘాల అనుసంధానంపై జిల్లా అధికారి కృష్ణ్ణ మాట్లాడుతూ పీఏసీఎస్ల ద్వారా రైతులకు అవసరమైన ఆర్థిక సాయం, ఎరువులు, పెట్టుబడి మద్దతు అందించే మార్గాలను వివరించారు. ఆయిల్పాం రైతులకు ప్యాక్స్ నెట్వర్క్ ఎంతగానో తోడ్పడుతుందని చెబుతూ, ప్యాక్స్ సీఈఓలకు సాగు నమోదుకు సంబంధించిన నిర్దేశిత బాధ్యతలను అప్పగించారు. యూరియా వివరాలు ఆన్లైన్లో నమోదు జడ్చర్ల: జిల్లాలో విత్తనాలు, యూరియా విక్రయాలకు సంబంధించి వివరాలను ఎప్పటికప్పడు ఆన్లైన్లో నమోదు చేయాలని డీఏఓ గోవింద్నాయక్ ఆదేశించారు. మంగళవారం మండలంలోని మల్లెబోయిన్పల్లి గ్రామ రైతువేదికలో సీడ్ సేల్స్ మేనేజ్మెంట్ డివిజన్ స్థాయి డీలర్లకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సూచించిన సన్న రకాల ధాన్యం విత్తనాలు, రైతులకు విక్రయించిన వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. అలాగే ప్రతినెలా 5లోగా ఫారం డీని ఆన్లైన్లో సమర్పించాలని, యూరియా బుకింగ్, అమ్మకాలను కూడా ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. యూరియా వచ్చిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ చేయాలని, ఈ పాస్ మిషన్ల ద్వారానే యూరియా విక్రయించాలని సూచించారు. డీలర్లు ప్రభుత్వ ఆదేశాలను తప్పనిసరి పాటించాలని, నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ఏడీఏ విజయనిర్మల, ఏఓ గోపినాథ్, ఏఓలు తదితరులు పాల్గొన్నారు. -
ప్రీ ప్రైమరీ టీచర్ పోస్టులకు పైరవీలు
● అధికారులపై ఒత్తిడి చేస్తున్న నాయకులు ● ప్రకటించిన మెరిట్ లిస్టును తొలగించిన హెచ్ఎంలు ● ఒత్తిడి తట్టుకోలేక మహబూబ్నగర్ రూరల్ ఎంఈఓ రిజైన్ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీపైమరీ బడులు ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఉపాధ్యాయులు, ఆయాల నియామకం కోసం చర్యలు చేపట్టింది. దీంతో అధికారులపై ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేయడం సర్వసాధారణంగా మారింది. ఈ క్రమంలో మహబూబ్నగర్ రూరల్ ఎంఈఓపై కూడా ఒత్తిడి తీసుకురావడంతో ఆయన తనను ఎంఈఓ పోస్టు నుంచి తప్పించాలని, తాను పనిచేయలేనని కోరుతూ డీఈఓ కార్యాలయంలో రిజైన్ లెటర్ పెట్టడం విద్యాశాఖ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. మహబూబ్నగర్ రూరల్ మండలంలోని చౌదర్పల్లి, బొక్కలోనిపల్లి, కోటకదిర, మాచన్పల్లి, ఫతేపూర్, ఇప్పలపల్లి, గాజులపేట గ్రామాలు ఉన్నాయి. అయితే పది రోజుల క్రితం అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వీటిలో మహబూబ్నగర్ రూరల్, అర్బన్ మండలాల మెరిట్ లిస్టు కలెక్టరేట్ నుంచి రావడంతో ఆయా, టీచర్ పోస్టుల్లో ఎంపికై న అభ్యర్థుల మెరిట్ లిస్టును పాఠశాల నోటీస్ బోర్డులో పెట్టడంతోపాటు ఫోన్లో కూడా ఫార్వర్డ్ చేశారు. ఈ క్రమంలో కొన్నిచోట్ల అభ్యర్థులు ఆయా పోస్టులలో సైతం చేరారు. అయితే మంగళవారం సదరు అభ్యర్థులు వెళ్లిపోవాలని, మరోసారి మెరిట్ లిస్టు వస్తుందని పాఠశాల హెచ్ఎంలు సూచించడంతో వారంతా అవాక్కయ్యారు. తాము సూచించిన పేరు పెట్టాలని.. మెరిట్ లిస్టులో తాము సూచించిన పేర్లు పెట్టాలని మహబూబ్నగర్ రూరల్ మండలానికి చెందిన కొందరు నాయకులు అధికారులపై ఒత్తిడి చేసినట్లు తెలుస్తుంది. నియోజకవర్గానికి చెందిన ఓ నాయకుడి పీఏ సైతం అధికారులకు ఫోన్ చేసి గతంలో ఇచ్చిన లిస్టును తొలగించాలని, మరో లిస్టు తయారు చేయాలని ఆదేశించినట్లు సమాచారం. దీంతో అధికారులు హెచ్ఎంల ద్వారా ఇప్పటికే ఎంపికై న అభ్యర్థులను తిప్పి పంపినట్లు తెలుస్తోంది. వాస్తవానికి మొదట వచ్చిన మెరిట్ జాబితా కలెక్టర్ అనుమతితో జిల్లా విద్యాశాఖ అధికారులు పంపించారు. ఇలాగే అర్బన్ ఎంఈఓ కార్యాలయంలో కూడా పలువురు ప్రజాప్రతినిధులు సూచించిన పేర్లను తాజాగా లిస్టులో చేర్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయమై డీఈఓ విజయకుమారిని వివరణ కోరగా ఏవైనా అభ్యంతరాలు ఉంటే మాత్రమే చెప్పుకొనేందుకు అవకాశం ఉంది. కానీ, మెరిట్ లిస్టులో మార్పులు చేసేందుకు అవకాశం లేదని చెప్పారు. ఎంఈఓ కృష్ణయ్యను వివరణ కోరగా తాను డీఈఓ కార్యాలయంలో తన ఎంఈఓ పోస్టుకు రిజైన్ లెటర్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. -
‘శిశువికాసన’ యాప్తో సులభంగా బోధన
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లాకేంద్రంలోని బోయపల్లి అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ ఖుష్బూ గుప్తా మంగళవారం సందర్శించారు. శిక్షణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమలు చేయబోతున్న ప్రీ లిటరసీ, ప్రీ న్యూమరసీ ఆధారిత బేసిక్ లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా శిక్షణ ఫౌండేషన్ ప్రతినిధులు కార్యక్రమం వివరాలను కలెక్టర్కు వివరించారు. జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా 50 అంగన్వాడీ కేంద్రాలను ఎంపిక చేసి, చిన్నారుల్లో ప్రీ లిటరసీ, ప్రీ న్యూమరసీ, మోటార్ స్కిల్స్ అభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా అంగన్వాడీలకు ట్యాబ్లు, బ్లూటూత్ స్పీకర్లు, టీచింగ్– లెర్నింగ్ మెటీరియల్, స్టేషనరీతోపాటు సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ప్రియదర్శిని’ పాఠ్యాంశాలకు అనుగుణంగా ‘శిశు వికాసన’ పేరుతో ప్రత్యేక మొబైల్ యాప్ను రూపొందించిందని, ఉపాధ్యాయులు ప్రతిరోజూ నిర్వహించాల్సిన బోధనా కార్యక్రమాలు ఇందులో ఉండటం వల్ల చిన్నారులకు సులభంగా బోధన చేయవచ్చన్నారు. పాఠశాలల్లో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ మెరుగుదలకు ప్రేరణ కార్యక్రమం అమలు చేస్తున్నామన్నారు. అలాగే విద్యార్థుల అభ్యాస పురోగతిని అంచనా వేసేందుకు పిక్టోరియల్ ప్రోగ్రెస్ కార్డులు, తెలుగు, ఇంగ్లిష్, గణితం సబ్జెక్టులకు సంబంధించిన ఫౌండేషనల్ లెర్నింగ్ పుస్తకాలను అందిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి జరీనాబేగం, ఎంఈఓ లక్మణ్సింగ్, శిక్షణ ఫౌండేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
మెడికల్ కళాశాల సీట్ల పెంపు
పాలమూరు: పాలమూరు మెడికల్ కళాశాలకు మరో 25 ఎంబీబీఎస్ సీట్లు కేటాయిస్తూ ఎన్ఎంసీ మంగళవారం అనుమతులు ఇచ్చింది. 2016– 17 విద్యా సంవత్సరంలో 150 ఎంబీబీఎస్ సీట్లతో కళాశాల ప్రారంభమైంది. ఆ తర్వాత ఎదిర శివారులో 50 ఎకరాల్లో రూ.150 కోట్లతో మెడికల్ కళాశాల శాశ్వత భవనం నిర్మించారు. 2019లో 150 సీట్ల నుంచి 175 సీట్లకు పెంచగా ప్రస్తుతం కళాశాలలో 825 మంది విద్యార్థులు మెడిసిన్ చదువుతున్నారు. తాజాగా ప్రస్తుత విద్యా సంవత్సరం 2026– 27 నుంచే పెరిగిన సీట్లు ఏర్పాటుకు అనుమతి కల్పించారు. దీంతో పాలమూరు మెడికల్ కళాశాలలో 200 ఎంబీబీఎస్ సీట్లు ఉండనున్నాయి. ● 2016 నుంచి 2026 వరకు ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆరు బ్యాచ్లు బయటకు వెళ్లాయి. అదేవిధంగా 34 పీజీ సీట్లు మంజూరు కాగా 34 మంది విద్యార్థులు ఉన్నారు. అలాగే బీఎస్సీ సైన్స్లో 70 సీట్లు, డీఎంఎల్టీలో 30 సీట్లు, డయాలసిస్లో 10 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మొట్టమొదటి కళాశాల.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొట్టమొదట ఏర్పాటైన పాలమూరు మెడికల్ కళాశాలలో ఒక్కో విభాగం అభివృద్ధి చెందుతూ వస్తోంది. మొదట జనరల్ ఆస్పత్రిలో వెనుక భాగంలో ఉన్న భవనంలో తాత్కాలికంగా కళాశాల నిర్వహణ సాగింది. గత 11 ఏళ్ల కాలంలో మెడికల్ కళాశాలలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. తద్వారా ఉస్మానియా, గాంధీ తర్వాత పాలమూరు కళాశాల మూడో స్థానంలో ఉండటం విశేషం. మెడికల్ కళాశాలకు అనుబంధంగా టీచింగ్ ఆస్పత్రి ఏర్పాటుతో మరింత మెరుగైన వైద్యం అందుబాటులోకి రానుంది. పాత కలెక్టరేట్ స్థానంలో గత ప్రభుత్వం వెయ్యి పడకల సామర్థ్యంతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి 2022 డిసెంబర్ 22న శంకుస్థాపన చేశారు. ఆస్పత్రి భవన నిర్మాణాలతోపాటు వసతుల కల్పన కోసం మొత్తం రూ.270 కోట్లు కేటాయించారు. ఇప్పటి వరకు నాలుగు బ్లాక్లు పూర్తి కాగా.. ఈ–బ్లాక్ పనులు కొనసాగుతున్నాయి. మరో నాలుగు నెలల్లో పనులు పూర్తి చేసి ప్రారంభం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
మానవత్వం చాటిన కొనగట్పల్లి సర్పంచ్
హన్వాడ: ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచి మానవత్వం చాటారు మండలంలోని కొనగట్పల్లి సర్పంచ్ కుర్మయ్య. గ్రామానికి చెందిన చిల్ల వెంకటయ్యకు కాలికి ప్రమాదవశాత్తు తీవ్ర గాయం కావడంతో అనారోగ్యానికి గురై సోమవారం మృతిచెందాడు. అయితే వెంకటయ్య పాడె మోసేందుకు కూడా ఎవరూ లేని పరిస్థితి నెలకొనడంతో సర్పంచ్ స్వయంగా పాడెమోసి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. అలాగే వెంకటయ్య కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు సర్పంచ్తోపాటు డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, మాజీ సర్పంచ్ భర్త రమణారెడ్డి తదితరులు కలిసి రూ.45 వేలు ఆర్థిక సహాయాన్ని అందజేయడంతో గ్రామస్తులు అభినందించారు. -
పగలు డ్రైవర్.. రాత్రి దొంగ!
నారాయణపేట: స్టీరింగ్ పట్టి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాల్సిన ఓ ప్రైవేట్ బస్సు డ్రైవర్.. అదే చేతులతో తాళాలు పగులగొట్టి ఇళ్లలోకి చొరబడుతున్నాడు. పగలు ఉద్యోగం, రాత్రి దొంగతనం.. ఇదే అతని జీవన విధానంగా మారింది. ఆర్థిక ఇబ్బందులు, పెరిగిన అప్పులు, చెడు అలవాట్లు కలిసి అతడిని నేరాల బాట పట్టించాయి. తాళాలు వేసిన ఇళ్లు కనిపిస్తే చాలు.. యజమానులు ఎక్కడికి వెళ్లారు? ఎప్పుడు తిరిగి వస్తారనే సమాచారాన్ని సేకరించి, సరైన సమయం చూసి చోరీలకు పాల్పడేవాడు. ఇలా నాలుగేళ్లుగా పలు జిల్లాల్లో పోలీసులకు సవాల్గా మారిన సీరియల్ చోర్ను సీని ఫక్కీలో సోమవారం కోస్గి పోలీసులు, నారాయణపేట సీసీఎస్ సంయుక్త బృందం అరెస్టు చేశారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఎస్పీ డాక్టర్ వినీత్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. గండీడ్ మండలం లింగయ్యపల్లికి చెందిన ఏదుల బాబు(42) ప్రైవేట్ బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయం కుటుంబ అవసరాలకు సరిపోకపోవడం, అప్పుల భారం పెరగడం, చెడు అలవాట్లకు బానిస కావడంతో సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. అందుకే తాళాలు వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్గా ఎంచుకున్నాడు. పగలే రెక్కీ... రాత్రికి ఆపరేషన్ డ్రైవర్గా తిరుగుతూ వివిధ గ్రామాలు, పట్టణాల్లో సంచరించే అవకాశం అతనికి కలిసొచ్చింది. ఏ ఇంటికి తాళం ఉంది.. ఎవరూ లేరు.. ఎప్పుడు వస్తారు.. అనే విషయాలను ముందుగానే గమనించేవాడు. తర్వాత రాత్రి లేదా ఎవరూ లేని సమయంలో ఇనుప రాడ్లు, ఇతర పరికరాలతో తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించేవాడు. నగదు, బంగారం, విలువైన వస్తువులను మాత్రమే ఎత్తుకెళ్లి ఆనవాళ్లు లేకుండా వెళ్లిపోయేవాడు. బంగారం తాకట్టు.. డబ్బు మాయం దొంగిలించిన బంగారు ఆభరణాలను నేరుగా అమ్మకుండా ఫైనాన్స్ కంపెనీల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకునేవాడు. ఆ డబ్బుతో అప్పులు తీర్చడం, కుటుంబ ఖర్చులకు వాడటం, చెడు అలవాట్లకు వెచ్చించడం చేసేవాడని విచారణలో వెల్లడైంది. దీంతో చోరీ చేసిన వస్తువుల జాడను గుర్తించడం కూడా పోలీసులకు కష్టంగా మారింది. 18కేసులు.. పది ఠాణాల పరిధిలో నేరాలు 2022 నుంచి ఇప్పటి వరకు కోస్గి, కుల్కచర్ల, మరికల్, మహమ్మదాబాద్, మద్దూర్, నారాయణపేట, వికారాబాద్, దోమా, మహబూబ్నగర్ రూరల్, హన్వాడ పోలీస్స్టేషన్ల పరిధిలో మొత్తం 18 ఆస్తి నేరాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. ఒకే తరహా మోడస్ ఆపరెండీతో వరుస చోరీలు చేస్తూ పోలీసులకు సవాల్గా మారాడు. కోస్గిలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా.. నిందితుడు వారిని చూసి అనుమానాస్పదంగా పారిపోవడానికి ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వెంటాడి అదుపులోకి తీసుకున్నారు. సాంకేతిక ఆధారాలు, విచారణలో సేకరించిన సమాచారంతో ప్రశ్నించగా.. నేరాలను అంగీకరించాడు. అనంతరం అతని ఇంట్లో సోదాలు నిర్వహించి రూ.6,88,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మొత్తం దొంగిలించిన నగదు రూ.10లక్షలుగా పోలీసులు గుర్తించారు. ‘ఇళ్లు, వ్యాపార సంస్థలకు నాణ్యమైన తాళాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్–100కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు. కేసును సమర్థవంతంగా ఛేదించిన కోస్గి సీఐ సైదులు, ఎస్ఐ పురుషోత్తం, సీసీఎస్ ఎస్ఐ విజయభాస్కర్తోపాటు కోస్గి, సీసీఎస్ పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సమావేశంలో డీఎస్పీలు లింగయ్య, మహేష్ పాల్గొన్నారు. తాళం కనిపిస్తే టార్గెట్ ఫిక్స్.. అప్పులు, చెడు అలవాట్లతోనే నేరాల బాట రూ.10లక్షల చోరీ రూ.6.88 లక్షల నగదు స్వాధీనం 2022 నుంచి 18 ఆస్తి నేరాల్లో ప్రమేయం పది స్టేషన్లకు చుక్కలు చూపిన సీరియల్ చోర్ అరెస్ట్ -
పేలిన కుక్కర్: చిన్నారులకు గాయాలు
కొల్లాపూర్: పట్టణంలోని వరిదేల యూపీఎస్ పాఠశాల ఆవరణలో సోమవారం అంగన్వాడీ కేంద్రంలో ప్రమాదవశాత్తు వంట కుక్కర్ పేలి చిన్నారులు గాయపడ్డారు. ఆయాగా పనిచేస్తున్న బాలమ్మ స్థానంలో ఆమె కూతురు చెన్నమ్మ కొంతకాలంగా విధులు నిర్వహిస్తోంది. ఎప్పటిలాగే చెన్నమ్మ వంట చేస్తుండగా కుక్కర్ మూత తీసే సమయంలో ఒక్కసారిగా ఎగిరిపడింది. దీంతో కుక్కర్లోని వేడినీళ్లు చిన్నారులు గణేష్, భాను, అక్షయ పడి గాయపడ్డారు. వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్సలు చేయించారు. గాయపడ్డ చిన్నారులను ఐసీడీఎస్ సీడీపీఓ మహేశ్వరి, కౌన్సిలర్ బోరెల్లి మహేష్లు పరామర్శించారు. మటన్ ముక్క ఇరుక్కొని కళాకారుడు మృతి పాన్గల్: గొంతులో మటన్ ముక్క ఇరుక్కొని కళాకారుడు మృతిచెందిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. బంధువులు, గ్రా మస్తుల కథనం ప్రకారం.. మండలంలోని జమ్మాపూర్కు చెందిన ఎర్రం ఎల్లయ్య(65) ఆదివా రం గ్రామంలో ఓ వివాహానికి వెళ్లి భోజనం చేస్తుండగా.. గొంతులో మటన్ ముక్క ఇరుక్కొని శ్వాస ఆడక కుప్పకూలిపడి చనిపోయాడు. ఎల్లయ్య వీరబ్రహ్మంగారి నాటకంలో ఆదాంబీ పాత్రతో మంచిపేరు తెచ్చుకున్నాడని గ్రామస్తులు పేర్కొన్నారు. ఎల్లయ్య అకాల మరణం బాధాకరమన్నారు. మృతుడి కుటుంబాన్ని ఒకేషనల్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రయ్య, మాజీ సర్పంచ్ భాస్కర్రెడ్డి పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపి బాధిత కుటుంబానికి రూ.5వేలు ఆర్థికసాయం అందజేశారు. మృతుడికి భార్య యశోదమ్మ, కుమారుడు, కూతురు ఉన్నారు. విద్యుదాఘాతంతో యువకుడి మృతి ఇటిక్యాల: విద్యుదాఘతంతో యువకుడు మృతిచెందిన ఘటన ఇటిక్యాల పీ ఎస్ పరిధిలో చోటు చేసు కుంది. ఎస్ఐ రవిరాథోడ్ కథనం ప్రకారం.. మండలంలోని షాబా ద్కు చెందిన అర్పన్(20) సోమవారం తమ వ్యవసా య పంటపోలంలో పత్తిపంటలో ఎద్దుల సహాయంతో పొలం పనులు చేస్తుండగా.. విద్యుత్ స్తంభం నుంచి కరెంటు మోటారుకు ఉన్న వైర్లు తగిలి అక్కడికక్కడే కప్పకులిపోయాడు. గమనించిన స్థానికులు గద్వాల ప్రభుత్వాసుపత్రికి తరలించంగా.. అక్కడున్న వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు తండ్రి కుసునూర్ రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. యువకుడి మృతితో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు ఆలుముకున్నాయి. తాళం వేసిన ఇంటికి కన్నం జడ్చర్ల: ఇంటికి తాళం వేసి సొంత ఊరుకు వెళ్లి వచ్చేలోగా తాళం విరగ్గొట్టి ఇంట్లో దొంగతనం జరిగిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. సీఐ కమలాకర్ కథనం మేరకు.. మండలంలో ని తుపుడగడ్డతండాకు చెందిన జర్పుల శ్రీధర్ స్థానిక వెంకటపతిరావు కాలనీలో నివాసంటున్నాడు. ఇంటికి తాళం వేసి సొంత ఊరుకు వెళ్లిన సంమయంలో ఇంటి తాళాలు విరగ్గొట్టి ఇంట్లో దాచిన 2తులాల బంగారు నల్లపూసల దండ, రూ.40వేల నగదు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
● మోపెడ్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు ● ఒకరికి గాయాలు, శాఖాపూర్ టోల్ప్లాజా వద్ద ఘటన అడ్డాకుల: 44వ నంబర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందగా.. మరొకరు గాయపడిన ఘనట సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ మురళి కథనం ప్రకారం.. కాటవరం గ్రామానికి చెందిన ఎరుకలి బాబు(35) మంజుల దంపతులు. కుటుంబ పోషణకు దంపతులిద్దరు టోల్ప్లాజా వద్ద బాబు టీ కొట్టు నడిపిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం తన ఎక్సెల్పై కర్ణాటకకు చెందిన విశాల్తో కలిసి టీకొట్టు నుంచి ఇంటికి వెళ్లడానికి బయలు దేరాడు. తిరిగి యూటర్న్ వద్ద టీకొట్టు వైపు వెళ్తుండగా వనపర్తి డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు హైదరాబాద్ వైపు వెళ్తూ ముందున్న ఎక్సెల్ను ఢీకొట్టింది. దీంతో ఎరుకలి బాబు తల పగిలి తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. విశాల్కు గాయాలు కావడంతో ఎల్అండ్టీ అంబులెన్స్లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి వెళ్లిపోయాడు. అతడు బెంగళూర్ నుంచి హైదరాబాద్ వెళ్లే ఓ ట్రావెల్స్ బస్సుకు చెందిన వాడుగా తెలిసింది. కాగా, టీకొట్టు నుంచి వచ్చిన మృతుడి భార్య మంజుల రోధనలు ఘటనా స్థలంలో అందరినీ కలచి వేశాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ మురళి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రెక్కాడితే డొక్కాడని కుటుంబం ఎరుకలి బాబు కుటుంబం కడు పేదరికంలో ఉంది. జీవనోపాధికి రోడ్డు పక్కన చిన్న టీకొట్టు పెట్టుకున్నాడు. ముగ్గురు పిల్లల్లో ఇద్దరు పిల్లలను మూసాపేట ప్రభుత్వ హాస్టల్లో చేర్పించాడు. చిన్న కుమార్తె కాటవరం ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది. కుటుంబ యాజమాని మృతితో ఆ కుటుంబం వీధినపడింది. ముగ్గురు చిన్నపిల్లలతో భార్య మంజుల టీకొట్టుతో జీవనం సాగించడం కష్టసాధ్యం కానుంది. భర్త మృతదేహం వద్ద ఆమె రోధనలు కంటతడి పెట్టించాయి. దాతలు సాయం చేసి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
భాస్వరం.. పొటాషియం కీలకం
అలంపూర్: వర్షాకాలంలో పంటల సాగులో రైతులు నిమగ్న మయ్యారు. అధికారులు రైతులు అవగాహన కల్పిస్తున్నారు. మొక్కల సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మొక్క పెరుగుదలలో నత్రజని, భాస్వరం, పొటాషియంలు కీలకమని పేర్కొంటున్నారు. పంటల పెరుగుదలలో భాస్వరం, పొటాషియం పాత్ర ప్రాముఖ్యతను మండల వ్యవసాయ శాఖ అధికారి నాగార్జున రెడ్డి రైతులకు వివరించారు. భాస్వరం ఈ పోషకాన్ని మొక్కలు భాస్వరికామ్ల లవణాల రూపంలో తీసుకుంటుంది. భాస్వరానికి నేలలో కొట్టుకపోయే స్వభావం లేదు. అయితే కొంత భాగం నేలలో బిగుసుకుపోతుంది. మట్టి రేణువులకు అంటిపెట్టుకొని తర్వాత పైరుకు కూడా ఉపయోగపడుతుంది. పైరుకు ప్రథమ దశలో భాస్వరం ఆవశ్యకత అధికం కావున పూర్తి మోతాదు మొదటనే పైరు అడుగులో ఒకేసారి వేయాలి. వేసి నేలలో కలిసేటట్టు చేయాలి. పంటల పెరుగుదలలో.. ● పూత, కాత గింజ పట్టడానికి.. ● పైరు దుబ్బు చేయుటకు, మొక్క శాఖోపశాఖలుగా పెరుగుటకు.. ● సేంద్రియ పదార్ధాలు బాగా చివుటకు ● మొక్కలలో మాంసకృత్తులు, ఎంజైముల తయారీకి భాస్వరం, నత్రజని తగినంత మోతాదులో ఉన్నప్పుడు రెండింటిని మొక్క అత్యంత సమర్థవంతంగా ఉపయోగించుకోవడంలో ఒకదానికి ఒకటి తోడ్పడతాయి. భాస్వరం లోపిస్తే.....! ● మొక్క పెరుగుదల, పిలకలు పెట్టె శక్తి తగ్గుతుంది. ● వేళ్లు బలహీనంగా మారుతాయి. ● ఆకులు ముదురు ఆకు పచ్చ నీటి రంగు కలిసినట్లుగా ఉంటాయి. ● పూత రావడం, పైరు పక్వానికి రావడం ఆలస్యం అవుతుంది. ● పండ్లు, గింజలు, విత్తనాల అభివృద్ధి కావడం తక్కువగా ఉంటుంది. పొటాషియం.. ప్రాధాన్యం వాడుకలో దీన్ని పోటాష్ అంటారు. ఈ పోషకాన్ని మొక్క పొటాషియం రూపంలో తీసుకుంటుంది. ● పైరుకు ఆరోగ్యం, ధృడత్వం చేకూరుతుంది. ● మొక్కల్లో జరిగే జీవ రసాయన క్రియలకు ఆకుల్లో తయారైన పిండి పదార్థం ఇతర భాగాలకు చేకూరేందుకు పైరుకు రోగ నిరోధక శక్తిని కలిగించి పురుగులకు, తెగుళ్లకు లొంగనీయదు. ● శాఖీయ భాగాలను కాండాన్ని బలపరిచి నేలపై వాలనీయదు. ● గింజ కట్టు పూర్తిగా ఉండి నాణ్యత పెరుగుతుంది. ● ప్రత్యేకించి పండ్లు కూరగాయలు మొదలగు పంటల్లో నాణ్యత పెరగడానికి దోహదపడుతుంది. ● చలి వాతావరణం లాంటి ప్రతి కూల పరిస్థితులను తట్టుకోవడానికి ఉపయోగపడుతోంది. పొటాషియం లోపిస్తే ● ముదురు ఆకుల అంచులు ఆకు పచ్చని రంగు నుంచి పసుపు రంగులోకి మారిపోవడం ● ఆకు కొనలు గోధుమ రంగులోకి మారి దిగువ భాగానికి విస్తరించడం జరుగుతుంది. ● పెరుగుదల నెమ్మదిగా ఉండి మొక్క గిడసబారుతుంది. ● కాండం బలంగా లేక సులభంగా వాలిపోతుంది. ● పండ్లు కూరగాయాల్లో రంగు, రుచి, వాసన, రవాణాలో నిల్వ ఉండే గుణం తగ్గుతుంది. పాడి–పంట -
పట్టించుకునే వారే లేరు
జడ్చర్ల పత్తి మార్కెట్యార్డు ఒకప్పడు అన్ని వసతులతో కళకళలాడేది. నేడు యార్డును పట్టించుకునే వారే కరువయ్యారు. ఇక్కడ చెత్తచెదారం నిండిపోయి విషసర్పాలకు నిలయంగా మారింది. అధికారులు పట్టించుకొని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. – శాంతయ్య, హమాలీ సంఘం అధ్యక్షుడు, జడ్చర్ల మార్కెట్లో ఎన్నో సంవ త్సరాలుగా హమాలీ ప నులు చేస్తున్నాం. ఇక్కడి సివిల్ సప్లయ్ గోదాము లలో కూలీ పనులు చేస్తు న్నా. ఇక్కడ తాగేందుకు నీరు దొరకడం లేదు. మరుగుదొడ్లు కూడా లేవు. అధికారులు పట్టించుకోవడం లేదు. –కృష్ణ, హమాలీ, జడ్చర్ల ● -
నాడు కళకళ.. నేడు వెలవెల
నిరుపయోగంగా పత్తి మార్కెట్ యార్డు ● శిథిలావస్థకు చేరిన దుకాణ సముదాయం జడ్చర్ల: ఒకప్పుడు అన్ని సౌకర్యాలతో కళకళలాడిన జడ్చర్ల పత్తి వ్యవసాయ మార్కెట్యార్డు ప్రస్తుతం సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. పూర్వ వైభవం కోల్పోయి వెలవెలబోతోంది. సువిశాల స్థలంలో నిర్మించినా నిరుపయోగంగా మారింది. అన్ని హంగులతో నిర్మాణం జడ్చర్ల పత్తి మార్కెట్ యార్డును టీఎంసీ(టెక్నాలజీ మిషన్ ఆన్ కాటన్) ముంబాయి వారి సౌజన్యంతో దాదాపు రూ.3.38 కోట్ల వ్యయంతో 2008లో నిర్మించారు. ఇందులో టీఎంసీ రూ.50 లక్షల సాయం చేసింది. 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న రెండు గోదాములను నిర్మించారు. వీటికి అనుబంధంగా 500 మెట్రిక్ టన్నుల మరో రెండు గోదాములు ఏర్పాటు చేశారు. 2008లో ప్రారంభం అన్ని హంగులతో నిర్మించిన పత్తి మార్కెట్ను అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి 09 ఏప్రిల్ 2008న ప్రారంభించారు. అదేవిధంగా పత్తి మార్కెట్కు స్థలాన్ని ఉచితంగా ఇచ్చిన విజయ్కుమార్ తల్లిదండ్రుల విగ్రహాలను వైఎస్ఆర్ ఆవిష్కరించారు. ప్రస్తుతం పత్తి మార్కెట్ యార్డును కేవలం ప్రభుత్వం కొనుగోలు చేసే కేంద్రాలను ఏర్పాటు చేసేందుకే పరిమితం చేశారు. పత్తి మార్కెట్ యార్డులో ఎక్కడి సమస్యలు అక్కడ పేరుకుపోయాయి. తూకాలు వేసే వే బ్రిడ్జి తుప్పు పట్టి కంపచెట్లు కమ్ముకుపోయాయి. మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. నీటి ఎద్దడి సమస్య తీవ్రంగా ఉంది. కమీషన్ ఏజెంట్ల 60 దుకాణాల సముదాయం సైతం మూతపడి షట్టర్లు తుప్పుపట్టాయి. యార్డు ప్రహరీ కూలిపోయింది. ఏజెంట్ల అడ్డంకి అయితే గంజి నుంచి పత్తి మార్కెట్కు యార్డును తరలించడానికి కమీషన్ ఏజెంట్లు ససేమిరా అంటున్నారు. గతంలో ఓ సారి పత్తి మార్కెట్కు తరలించేందుకు పాలకమండలి నిర్ణయించినా కమీషన్ ఏజెంట్ల వ్యతిరేకతతో వెనక్కి తగ్గారు. కమీషన్ ఏజెంట్లు దశాబ్దాలుగా మార్కెట్ సమీపంలో నివాసాలను నిర్మించుకొని కుటుంబాలతో ఉంటున్నా రు. ఇళ్లకు దగ్గరగా ఉండాలని పట్టుబడుతున్నారు. తుప్పపట్టిన దుకాణ సముదాయంలో ఒక భాగం -
సీఎస్ఆర్ సమ్మిట్కు యెన్నంకు ఆహ్వానం
స్టేషన్ మహబూబ్నగర్: ‘చేంజ్ టూ లెగసీ’ ధీమ్తో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద సీఎస్ఆర్ సమ్మిట్కు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డిని నిర్వాహకులు సోమవా రం మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈనెల 25వ తేదీన హైదరాబాద్ గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్లో ఈ ప్రతిష్టాత్మక సమ్మిట్ జరగనుంది. సమాజంలో మార్పును తీసుకువచ్చే ఆలోచనలు, భాగస్వామ్యాలు, వినూత్న కార్యక్రమాలు, సామాజి క ప్రభావాన్ని పెంపొందించే అంశాలపై ఈ సమ్మిట్ వేదికగా నిలవనుంది. ఈ సమ్మిట్లో విద్య అనే అంశంపై యెన్నం ముఖ్య వక్తగా ప్రసంగించనున్నారు.సమ్మిట్కు దేశంలోని వివిఽ ద రంగాలకు చెందిన 300 మందికిపై కార్పొరేట్ ప్రతినిధులు, 1200కు పైగా స్వచ్చ సంస్థల ప్రతినిధులు, సీఎస్ఆర్ నిపుణులు, విద్యావేత్త లు, ప్రభుత్వ ప్రముఖులు హాజరుకానున్నారు. నాన్టీచింగ్ సిబ్బంది అభ్యన్నతికి కృషి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది అభ్యున్నతికి కృషిచేస్తానని వీసీ శ్రీనివాస్ అన్నారు. ఇటీవల వేతనాలు పెంచిన నేపథ్యంలో సోమవారం అడ్మిన్ మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు వీసీని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీయూ అభివృద్ధిలో నాన్టీచింగ్ సిబ్బంది ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్నారని, వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని జీతాల పెంపు నిర్ణయాన్ని తీసుకున్నట్లు పేర్కొన్నారు. జీతాల పెంపును బాధ్యతగా భావించి నిర్వహించామని, అలాగే ప్రతి ఉద్యోగి కూడా ఉద్యోగాన్ని బాధ్యతగా తీసుకొని సమయపాలన పాటిస్తూ.. క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని సూచించారు. రిజిస్ట్రార్ రమేష్బాబు మాట్లాడుతూ పీయూలో భాగమైన సిబ్బంది సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకుంటామని, సిబ్బంది కూడా యూనివర్సిటీ అభివృద్ధికి పూర్తిస్థాయిలో కృషి చేయాలని కోరారు. అనంతరం వీసీ, రిజిస్ట్రార్తో పాటు కంట్రోలర్ ప్రవీణ, ఓఎస్డీ మధుసూదన్రెడ్డి తదితరులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, బోధనేతర సిబ్బంది రామ్మోహన్, బుర్రన్న, సత్యం, శేఖర్, సూర్య, స్వాతి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయిలో ప్రతిభచాటాలి
మహబూబ్నగర్ క్రైం: జోనల్ డ్యూటీ మీట్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాల ఖ్యాతిని మరింత పెంచాలని మహబూబ్నగర్ ఎస్పీ డి.జానకి అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఆమె ఉమ్మడి పాలమూరులోని జిల్లాల జోనల్ పోలీస్ డ్యూటీ మీట్–2026–27ను ప్రారంభించారు. ఈ జోనల్ మీట్లో జోగుళాంబ జోన్–7 పరిధిలోని ఐదు జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పలు విభాగాల్లో పోటీలు నిర్వహించగా ప్రధానంగా సైంటిఫిక్ విచారణ పద్ధతి, కంప్యూటర్ పరిజ్ఞానం, డాగ్స్క్వాడ్, ఫొటో, వీడియోగ్రఫీలలో పోటీలు కొనసాగాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జోనల్ స్థాయిలో విజేతలుగా నిలిచిన వారు రాష్ట్రస్థాయిలో జరిగే పోలీస్ డ్యూటీ మీట్కు అర్హత సాధించి అక్కడ కూడా అత్యుత్తమ ప్రతిభ చాటాలన్నారు. ఇలాంటి పోటీలు పోలీస్ సిబ్బందిలో వృత్తి నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, దర్యాప్తు సామర్థ్యాలు మరింత మెరుగుపడుతాయని చెప్పారు. కార్యక్రమంలో ఏఎస్పీలు రత్నం, సురేష్కుమార్, ఆర్ఐలు కృష్ణయ్య, నగేష్, అశోక్కుమార్, భూత్పూర్ సీఐ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
నందిమళ్లలో టెన్షన్.. టెన్షన్
ఫిర్యాదులపై సత్వర విచారణ పూర్తిచేయాలి మహబూబ్నగర్ క్రైం/ అమరచింత: పోక్సో కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న నందిమళ్ల గ్రామానికి చెందిన కిశోర్కుమార్రెడ్డి జైలు నుంచి పరారై.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్వగ్రామంలో కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. అమరచింత మండలంలోని నందిమళ్ల గ్రామానికి చెందిన కిషోర్కుమార్రెడ్డి ట్రాక్టర్ నడుపుతూ, వ్యవసాయం పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఓ బాలికను ప్రేమించి.. గత నెల 2న పారిపోయి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు అమరచింత పోలీస్స్టేషన్లో జూన్ 7న ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదైంది. జూన్ 10న పోలీసులు ఇద్దరిని ఆత్మకూర్ స్టేషన్కు తీసుకువచ్చారు. అమ్మాయి మైనర్ (మేజర్ కావడానికి ఇంకా మూడు నెలల సమయం ఉంది) కావడంతో కిశోర్కుమార్రెడ్డిపై పోక్సో కేసు నమోదు చేసి జూన్ 12న రిమాండ్లో భాగంగా మహబూబ్నగర్ జిల్లా జైలుకు తరలించారు. సదరు బాలికను వనపర్తి సఖి సెంటర్లో ఉంచారు. దాదాపు 25 రోజులపాటు జైలు జీవితం గడిపిన కిశోర్కుమార్రెడ్డి సోమవారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో జైలు నుంచి తప్పించుకొని స్వగ్రామానికి చేరుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తోటి ఖైదీలతో చెస్ ఆడి.. జైలు నుంచి పరారైన కిశోర్కుమార్రెడ్డి అర్ధరాత్రి వరకు జైలులో తోటి ఖైదీలతో చెస్ ఆడినట్లు తెలుస్తోంది. జైలు నుంచి తప్పించుకోవాలని ముందే ప్రణాళిక వేసుకున్నాడా..? లేక అప్పటికప్పుడు ఆలోచించి తప్పించుకున్నాడా.. అనేది స్పష్టత లేదు. జనరల్ బ్యారక్లో అందరి మధ్య ఉన్న అతను ఒంటరిగా వెనక భాగం వైపు వెళ్లినప్పుడు విధుల్లో ఉన్న సిబ్బంది ఏం చేస్తున్నారనేది ప్రశ్నగా మారింది. జైలులో సాధారణంగా అధికారులు, సిబ్బంది 24 గంటలపాటు అప్రమత్తంగా ఉంటారు. కానీ, ఒక రిమాండ్ ఖైదీ జైలు నుంచి తప్పించుకున్నాడంటే జైలులో భద్రతా లోపంపై విమర్శలు వస్తున్నాయి. సుదీర్ఘంగా విచారణ జిల్లా జైలు నుంచి ఖైదీ పరారైన విషయం తెలుసుకున్న జైళ్ల శాఖ డీఐజీ డి.శ్రీనివాస్ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో జైలుకు చేరుకున్నాడు. అప్పటి నుంచి సాయంత్రం వరకు ఖైదీ పరారైన ఘటనపై సుదీర్ఘంగా విచారణ సాగించారు. స్వగ్రామంలో కలకలం.. జైలు నుంచి తప్పించుకున్న కిశోర్కుమార్రెడ్డి నేరుగా స్వగ్రామానికి వచ్చాడన్న సమాచారంతో గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే కిశోర్ తమ ప్రేమ పెళ్లిని కాదని విడదీసిన పంచాయతీ పెద్దలను దూషిస్తూ.. తన ప్రియురాలు లేని జీవితం తనకు వద్దంటూ నానో యూరియా తాగడంతో సర్వత్రా కలకలం రేగింది. తాను పేదవాడినని, ఖాళీగా తిరుగుతున్నాననే సాకుతో తమను విడదీశారని, అమ్మాయిని కలవకుండా మైనర్ అని సఖి కేంద్రంకు పంపారనే కారణాలతో కిశోర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడని గ్రామస్తులు తెలిపారు. వనపర్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కిశోర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. మహబూబ్నగర్ క్రైం: ఫిర్యాదిదారుల సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ నిత్యం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎస్పీ డి.జానకి అన్నారు. ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి బాధితులు హాజరై సమస్యలపై ఎస్పీకి ఫిర్యాదులు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ ఒక్కొక్కరితో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకొని సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతోనూ మాట్లాడారు. ఫిర్యాదులపై చట్టపరమైన విధానంలో సత్వర పరిష్కారం చూపాలన్నారు. స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదులలో రెండు వైపులా విచారణ చేసి బాధితులకు సరైన న్యాయం చేయాలని సూచించారు. జైలు నుంచి రిమాండ్ ఖైదీ తప్పించుకొని రావడంతో కలకలం తాను ప్రేమించిన అమ్మాయి కావాలంటూ గొడవ.. ఆత్మహత్యాయత్నం జిల్లా జైలులో బయటపడిన భద్రతడొల్లతనం.. జైళ్ల శాఖ డీఐజీ విచారణ -
అధునాతన వసతులతో ట్రిపుల్ ఐటీ
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: గతేడాది జిల్లాకేంద్రంలో ప్రారంభించిన బాసర ఐఐఐటీ కళాశాల నూతన క్యాంపస్ భవనాల నిర్మాణానికి సంబంధించిన సైట్ లేఅవుట్ ప్లాన్ను సోమవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి పరిశీలించారు. ఈ మేరకు 6 వేల మంది విద్యార్థులు చదువుకునే విధంగా 40 ఎకరాల విస్తీర్ణంలో క్యాంపస్ నిర్మిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. క్యాంపస్ హైదరాబాద్, బెంగుళూరు హైవేకు సమీపంలో నిర్మిస్తామని, ఇందులో అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, అకడమిక్ బ్లాక్, పీయూసీ భవనాలు, విద్యార్థులకు హాస్టల్స్, కిచెన్, డైనింగ్ హాల్ వంటివి నిర్మించనున్నట్లు వెల్లడించారు. అలాగే విద్యార్థులకు అవసరమైన సూపర్ మార్కెట్, హెల్త్ సెంటర్, సెక్యూరిటీ బ్లాక్ వంటివి వీటిలో వస్తాయని, లైబ్రరీ, ల్యాబొరేటరీ, ఆడిటోరియం, ఓపెన్ థియేటర్, క్రీడా మైదానాలు, బాస్కెట్బాల్ కోర్టు, వాలీబాల్ కోర్టులను కూడా నిర్మించే ప్రతిపాదనలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ క్యాంపస్ నిర్మాణం పాలమూరు విద్యారంగానికి ఒక దిశానిర్దేశం చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఈడబ్ల్యూఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ గణపతిరెడ్డి, ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ షఫీ పాల్గొన్నారు. -
ఖాతాదారులకు మెరుగైన సేవలు
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): బ్యాంక్ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించి వారి మన్ననలు పొందాలని జిల్లా సహకార అధికారి కృష్ణ అన్నారు. సోమవారం పాలమూరు కోపరేటివ్ అర్బన్ బ్యాంక్లో సహకార వారోత్సవాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాభాల బాటలో ఉన్న పాలమూరు అర్బన్ బ్యాంక్ త్వరలోనే మల్టీస్టేట్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్గా ఆవిష్కరణ కావాలని ఆకాంక్షించారు. అనంతరం బ్యాంక్ చైర్మన్ కండె కుమారస్వామి మాట్లాడుతూ జిల్లాకేంద్రంలో 1998లో ఏర్పడిన ఈ బ్యాంక్ 28 సంవత్సరాల్లోనే గణనీయమైన లాభాలు ఆర్జించిందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ రూ.1.29 కోట్ల నికర లాభంతోపాటు రూ.55 కోట్ల రుణాలను సభ్యులకు ఇచ్చామని చెప్పారు. అంతేకాకుండా దాదాపు రూ.60 కోట్ల డిపాజిట్లు సంఘం సభ్యులతో సేకరించి.. దాదాపు రూ.3.5 కోట్లకుపైగా వాటాలు కలిగి సంఘం సభ్యులకు 25 శాతం డివిడెంట్ ఇచ్చామని చెప్పారు. రాబోయే కాలంలో ఉమ్మడి పాలమూరులోని గద్వాల, వనపర్తి, నారాయణపేటలో బ్రాంచ్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో ఆడిట్ అధికారి టైటస్పాల్, బ్యాంక్ సీఈఓ రాజేంద్రకుమార్, సహకార శాఖ ఉద్యోగులు కల్పన, దివ్య, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. -
శాంపిల్స్ సేకరిస్తున్నాం..
ఇటీవల జరిగిన కలుషిత ఆహార ఘటనలో శాంపిల్స్ సేకరించాం. ఇందులో సోరకాయతో తయారు చేసిన స్వీట్ 5– 6 గంటలు మాత్రమే నిల్వ ఉంటుంది. ఆ తర్వాత స్వీట్లో లోపల ఫంగస్, బ్యాక్టీరియా వస్తుంది. దీనివల్ల తిన్నవారికి వాంతులు, విరేచనాలు ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆహారం వండిన తర్వాత 6–8 గంటల వరకు తీసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ సమయం ఉంటే టాక్సిల్స్ ఏర్పడుతాయి. కలుషిత ఆహారంపై గత నెల 18న అంగన్వాడీలకు శిక్షణ ఇచ్చాం. ఇటీవల తనిఖీలు పెంచడంతోపాటు శాంపిల్స్ సేకరిస్తున్నాం. కలుషిత ఆహారంపై కూడా అవగాహన కార్యక్రమాలు పెంచుతాం. – శ్రీలత, ఫుడ్ ఇన్స్పెక్టర్, మహబూబ్నగర్ ● పాలమూరులో కలవరపెడుతున్న కలుషిత ఆహార ఘటనలు ● ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు ● అత్యధికంగా నిల్వ చేసిన పదార్థాలతోనే వినియోగదారులకు వడ్డింపు ● ఉమ్మడి జిల్లాకు ముగ్గురే ఫుడ్ ఇన్స్పెక్టర్లతో కనిపించని తనిఖీలు ● మున్సిపాలిటీల్లో శానిటరీ విభాగాలదీ అదే తీరు పాలమూరు: ఉమ్మడి జిల్లాలో కలుషిత ఆహారంతో అనారోగ్యాలకు గురవుతూ ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, పెళ్లి వేడుకల్లో తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఫుడ్ పాయిజన్తో అధికంగా చిన్నారులే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నారులు కలుషితమైన ఆహారం తీసుకున్న రెండు గంటల్లో అస్వస్థతకు గురవుతారు. ప్రస్తుతం వర్షాకాలం కారణంగా చల్లబడిన వాతావరణం బ్యాక్టీరియా ఎదుగుదలకు అనుకూలంగా ఉండి.. వ్యాధులు విస్తరిస్తాయి. ఈ సమయంలో హోటళ్లు, రెస్టారెంట్లు, మెస్లు, పాఠశాలలు, వసతి గృహాల్లో వంటగదులు శుభ్రంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ వ్యవస్థను పర్యవేక్షించాల్సిన ఆహార భద్రతా అధికారులు సరిపడా లేకపోవడంతో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇదే అదునుగా హోటళ్లు, రెస్టారెంట్, ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో నిల్వ చేసిన పదార్థాలకు మసాలాలు దట్టించి వినియోగదారులకు అంటగడుతున్నారు. లక్ష్యం కేటాయింపు ప్రతి జిల్లాలో ప్రతినెల అన్ని రకాలుగా 25 శాంపిల్స్, 25 తనిఖీలు చేయాలని ఫుడ్ ఇన్స్పెక్టర్లకు లక్ష్యం కేటాయించారు. ఇచ్చిన లక్ష్యం కంటే తక్కువ చేస్తే శాఖ ఇచ్చే నివేదికలో వారి పేరు రెడ్మార్క్లో వస్తోంది. ఒక్కో ఫుడ్ ఇన్స్పెక్టర్కు రెండు జిల్లాలు ఉండటంతో సకాలంలో లక్ష్యం చేరుకోవడం పెద్ద సవాల్గా మారింది. ప్రతి నెలలో సేకరించే నమూనాల్లో హోటళ్లు, బేకరీలు, కిరాణ దుకాణాలు, టిఫిన్ సెంటర్లు, స్వీట్హౌజ్లు ఉండేలా చూసుకోవాలి. ఇక తనిఖీల్లో అన్ని రకాల ప్రభుత్వ హాస్టళ్లు, పాఠశాలలు పరిశీలించాల్సి ఉంటుంది. వీటి నుంచి సేకరించిన నమూనాలను పరీక్షల కోసం హైదరాబాద్ ల్యాబ్కు పంపించాలి. ల్యాబ్ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా సదరు నిర్వాహకులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి. కర్రీపఫ్లో పాము (ఫైల్) -
అంతర్గత రోడ్లు వేయాలి..
నగరంలోని 29వ డివిజన్ పరిధి హనుమాన్ పురలో సీసీ రోడ్లు ధ్వంసమై ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీనికితోడు డ్రెయినేజీలను శుభ్రం చేయడం లేదు. మిషన్ భగీరథ పైప్లైన్లు లీకేజీలు అవుతున్నాయి. వెంటనే అధికారులు స్పందించి ఆయా సమస్యలను పరిష్కరించాలి. ఎంఏ ఖాదర్, ప్రగతిశీల సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భూమి కబ్జా చేశారు.. నగర పరిధిలోని ఏనుగొండ గ్రామంలో సర్వే నం.81/2లో 3 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. మా భూమిలో ఇల్లు కట్టుకోవడానికి పూనుకుంటే కొంతమంది వ్యక్తులు రాజకీయ నాయకుల సహాయంతో అది మా స్థలమని బెదిరిస్తున్నారు. మాకు మా తాతల నుంచి సంక్రమించిన ఆస్తి ఇది. పట్టాదారు పాసుపుస్తకాలు కూడా మా పేర్లపై ఉన్నాయి. అధికారులు స్పందించి మా భూమిని మాకు ఇప్పించాలి. – చింతకింది వెంకటయ్య, ఏనుగొండ -
దివ్యాంగుల పింఛన్ ఇప్పించండి
నేను ఉప్పరి పని చేసుకుంటూ జీనం సాగించేవాడిని. ఈ క్రమంలో భవనం పై నుంచి కింద పడటంతో కుడి కాలు చచ్చుబడిపోయింది. నాలుగు సంవత్సరాల నుంచి ఏ పని చేసుకోలేకపోతున్నాను. సదరం సర్టిఫికెట్ ఉంది. నాకు దివ్యాంగ పింఛన్ ఇప్పించి ఆదుకోండి. – కాట్రావత్ శ్రీను, మునిమోక్షంతండా, హన్వాడ మండలం ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వలేదు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సర్ ప్రక్రియలో ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు ఇప్పటికి జిల్లాకేంద్రంలో ఇవ్వలేదు. ఈ విషయమై అంగన్వాడీ టీచర్లను అడిగితే నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి వెంటనే ఫారాలు ఇవ్వని వార్డుల్లో ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందించేలా చర్యలు తీసుకోవాలి. – బీసీ జేఏసీ నాయకులు -
ఫిర్యాదులు @132
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గత కొన్ని వారాలుగా వందకు పైగా ఫిర్యాదులు వస్తుండగా.. పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. తాజాగా సోమవారం నిర్వహించిన ప్రజవాణిలోనూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో కలెక్టర్ ఖుష్బూగుప్తా 132 అర్జీలు స్వీకరించారు. ఇందులో ఎక్కువగా మున్సిపల్, పంచాయతీరాజ్, జిల్లా సంక్షేమం, వ్యవసాయం, పౌరసరఫరాల శాఖ, భూ సర్వే రికార్డులు, గృహ నిర్మాణం, రోడ్డు రవాణా, పోలీస్, గిరిజన అభివృద్ధి, ప్రణాళిక, విద్యుత్, విద్య, వైద్య ఆరోగ్యం, అటవీ, గ్రామీణ అభివృద్ధి తదితర శాఖలకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు అందించే ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహించొద్దని అధికారులకు సూచించారు. అలాగే జిల్లా అధికారుల సమావేశంలో మాట్లాడుతూ అధికారులందరూ తప్పనిసరిగా ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీలో లైఫ్ మెంబర్ రూ.వెయ్యి చెల్లించి సభ్యత్వం తీసుకోవాలని చెప్పారు. అలాగే జిల్లాలో సభ్యత్వ సంఖ్యను పెంచడంతోపాటు రెడ్క్రాస్ నిర్వహిస్తున్న రక్త బ్యాంకులు, పేద విద్యార్థులకు ఉన్నత విద్య కోసం ఆర్థిక సహాయం వంటి మానవతా సేవా కార్యక్రమాలు మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మధుసూదన్నాయక్, హరిప్రియ, భూ సేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రాంరెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రెయినీ సాయిశివాని, డీఆర్ఓ నిర్మల, డీపీఓ వెంకటరెడ్డి, డీఆర్డీఓ నర్సింహులు, రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ నటరాజ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణికి వెల్లువెత్తిన అర్జీలు బాధితుల నుంచి వినతులు స్వీకరించిన కలెక్టర్ ఖుష్బూ గుప్తా పరిష్కారంలో నిర్లక్ష్యం వహించొద్దని అధికారులకు ఆదేశం -
అదుపుతప్పిన బైక్.. యువకుడు మృతి
గట్టు: రాత్రంతా గొర్రెల మంద వద్ద కాపలా ఉండి, తెల్లవారుజామున ఇంటికి బయలుదేరిన యువకుడు బైక్ అదుపు తప్పడంతో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. స్థానికు లు తెలిపిన వివరాల ప్రకారం.. పెంచికలపా డు గ్రామానికి చెందిన వెంకటన్న, పద్మమ్మ దంపతుల చిన్న కుమారుడు కుర్వ గోవర్ధన్ (18) బోయ ఈశ్వర్తో కలిసి శనివారం రాత్రంతా గొర్రెల మందకు కాపలాగా ఉండి ఆదివారం తెల్లవారుజామున బైక్పై ఇంటికి బయలుదేరారు. దారి మధ్యలో వీరి ద్విచక్ర వాహ నం అదుపు తప్పి, రోడ్డు పక్కనే ఉన్న స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గోవర్ధన్, ఈశ్వర్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను గద్వాల ఆస్పత్రికి తరలించగా.. గోవర్ధన్ చికి త్స పొందుతూ మృతి చెందాడు. తీవ్రంగా గా యపడిన బోయ ఈశ్వర్ను మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలుకు తీసుకెళ్లారు. ఘనపై కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ శేఖర్గౌడ్ తెలిపారు. తనగలలో బంగారం, వెండి ఆభరణాల చోరీ రాజోళి: వడ్డేపల్లి మండలంలోని తనగల గ్రామంలో శనివారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఎస్ఐ నాగశేఖర్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన అశోక్కుమార్ శనివారం కుటుంబ సభ్యులతో కలిసి కల్వకుర్తికి వెళ్లారు. తిరిగి అదే రోజు రాత్రి ఒంటి గంట సమయంలో ఇంటికి చేరుకున్నాడు. లోపలికి వెళ్లి చూడగా.. బీరువా తెరుచుకొని ఉండడంతో అనుమానంతో బీరువాలో గమనించారు. తాళం పగలగొట్టి అందులో ఉన్న నాలుగు తులాల బంగారు వస్తువులు, 8 తులాల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించాడు. ఈ విషయమై బాధితుడు శాంతిగనర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. సీఐ శంకర్తో కలిసి ఎస్ఐ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి కొత్తకోట రూరల్: బైక్ అదుపుతప్పి కిందపడడంతో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన పెద్దమందడి మండలంలోని పామిరెడ్డిపల్లి తండా స్టేజీ సమీపంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పెద్దమందడి ఎస్ఐ జలంధర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నమందడి గ్రామానికి చెందిన కురుమూర్తి (36) వ్యక్తిగత పనిమీద తన చెల్లెలు ఊరైన జంగమయ్యపల్లికి శనివారం మధ్యాహ్నం వెళ్లాడు. తిరిగి రాత్రి 11 గంటల సమయంలో స్వగ్రామానికి బైక్పై వస్తుండగా.. పామిరెడ్డిపల్లి తండా స్టేజీ సమీపంలో బైక్ అదుపుతప్పి కిందపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో కుటుంబ సభ్యులు క్షతగాత్రుడిని 108 అంబులెన్స్లో వనపర్తి ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం మహబూబ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. మృతుడి భార్య జనిగె లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ చోరీ వనపర్తి రూరల్: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చోరీ జరిగిన ఘటన శనివారం అర్ధరాత్రి పెబ్బేరు మండలంలోని తోమాలపల్లిలో చోటుచేసుకుంది. సర్పంచ్ అశోక్కుమార్ తెలిపిన వివరాల మేరకు.. తోమాలపల్లి పంచాయతీకి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ను శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని ఆదివారం పెబ్బేరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. స్కూటీలో నాగుపాము ప్రత్యక్షం మరికల్: మండలకేంద్రంలో ఓ వ్యక్తి స్కూటీలో నాగుపాము ప్రత్యక్షం కావడంతో అతడు ఖంగుతిన్నాడు. తీలేర్కు చెందిన కుర్వ నిరంజన్ ఆదివారం స్కూటీపై తన వ్యవసాయ పొలానికి వెళ్లాడు. పొలంలోనే స్కూటీని ఆపి పనులు ముగించుకొని నేరుగా మరికల్కు వచ్చాడు. కిరాణ సామగ్రి తీసుకొని డిక్కీలో పెట్టేందుకు దానిని తెరిచాడు. అందులో నాగుపాము బూసలు కొడుతూ పైకి లేవడంతో అక్కడ ఉన్న వారందరూ భయంతో పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన ఆయన కర్రతో పామును కిందకు తోసేసి చంపేశాడు. -
మీసేవలో మరిన్ని డిజిటల్ సేవలు
హన్వాడ: జిల్లాలోని మీసేవ కేంద్రాల ద్వారా ప్రజలకు, విద్యార్థులకు అందించే సేవలను ప్రభుత్వం మరింత సులభతరం చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మీసేవ పోర్టల్లో తాజాగా ‘ఎస్సెస్సీ మెమో ఈ–కాపీ’ అనే సరికొత్త సేవను అందుబాటులోకి తెచ్చింది. ఈ నూతన డిజిటల్ సేవ ద్వారా 2004 నుంచి 2024వ సంవత్సరం వరకు ఎస్సెస్సీ (10వ తరగతి) ఉత్తీర్ణులైన విద్యార్థులు తమ ఎస్సెస్సీ మెమో (డూప్లికేట్ ఈ–కాపీ) ను సమీపంలోని మీసేవ కేంద్రాల ద్వారా అత్యంత సులభంగా పొందవచ్చు. కేటగిరీ ‘ఏ’ కింద ఒక్కో దరఖస్తుకు రూ.62 సేవా రుసుము చెల్లించి, అభ్యర్థి వివరాలను నమోదు చేయడం ద్వారా మీసేవ ‘సెక్యూర్ బేస్ సర్టిఫికెట్’పై ఈ–మెమో ప్రింట్ తీసుకోవచ్చని అధికారులు తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభమై ఉన్నత చదువులకు అడ్మిషన్లు జరుగుతున్న తరుణంలో ఈ సేవ విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. పూర్తిగా కాగిత రహిత విధానం మరోవైపు జిల్లావ్యాప్తంగా మీసేవ సేవల్లో కాగిత రహిత (పేపర్ లెస్) విధానాన్ని జిల్లా యంత్రాంగం మరింత సమర్థవంతంగా అమలు చేస్తోంది. ఇకపై ఆదాయం, కులం, నివాస, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రాలు, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వంటి రెవెన్యూ సేవల వెరిఫికేషన్ కోసం దరఖాస్తుదారులు ఎలాంటి భౌతిక పత్రాలను (ఫిజికల్ డాక్యుమెంట్లు) కార్యాలయాల్లో సమర్పించాల్సిన అవసరం లేదని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి పరిశీలన పేరిట దరఖాస్తుదారులపై భౌతిక పత్రాల కోసం ఒత్తిడి తీసుకురావొద్దని జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ఈఎస్డీ) సంస్థ ప్రవేశపెట్టిన నూతన మొబైల్ అప్లికేషన్ ద్వారానే వీఆర్ఓ, తహసీల్దార్లు ఆన్లైన్లో పత్రాలను పరిశీలించి వేగంగా సర్టిఫికెట్లను జారీ చేస్తున్నారు. డిజిటల్ విప్లవంలో భాగంగా అటు ఎస్సెస్సీ ఈ–మెమోలు, ఇటు పేపర్లెస్ రెవెన్యూ సేవలతో దరఖాస్తుదారులకు సమయం, డబ్బు ఆదా అవుతుందని, ఈ నూతన అవకాశాలను జిల్లా ప్రజలు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఇక ఆన్లైన్లోనే ఎస్సెస్సీ ఈ–మెమోలు.. 2004–24 వరకు ఉత్తీర్ణులైన వారికి అవకాశం జిల్లాలో వేగంగా కాగిత రహిత సేవల విస్తరణ ఆదాయ, కుల ధ్రువీకరణల వెరిఫికేషన్కు తప్పిన భౌతిక పత్రాల సమర్పణ -
సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయం
గండేడ్: సనాతన ధర్మ సంరక్షణలో ఎన్ని సమస్యలు వచ్చినా వెనక్కి తగ్గేదిలేదని అంబాత్రయ క్షేత్రం ఆదిత్యపరాశ్రీస్వామి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని వెన్నాచేడ్లో ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరయ్యారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి, పరాశ్రీ చేతులమీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. హిందూధర్మం ప్రపంచ దేశాలకే ఆదర్శమని అన్నారు. సనాతన ధర్మాన్ని మంటగలిపేందుకు ఎన్నో కుయుక్తులు పన్నుతున్నారని అలాంటి వాటిని అడ్డుకునేందుకు సాధు సన్యాసులు స్వామీజీలు తప్పకుండా అడ్డుకుంటారని తెలిపారు. పరధర్మాన్ని పాటించాల్సిన అవసరం లేదని గ్రామాల్లో కందురలు, పీర్లపండుగలు బందు చేయాలని హిందువులకు ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచాన్ని బ్రహ్మాండమని అంటారు కాని అల్లాండం, క్రీస్తుఆండం అని పిలువరని తెలిపారు. తాము ప్రపంచ దేశాల్లో మార్పు తీసుకొచ్చేందుకు నిరంతర సాధన చేస్తున్నామని.. అది క్రమంగా నెరవేరుస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో మార్పు రావాలని హిందూధర్మ పరిరక్షణ ప్రతీ ఒక్కరి ఆకాంక్ష కావాలని కోరారు. హిందూ ధర్మాన్ని రక్షించాలి హిందూ ధర్మ పరిరక్షణలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని అవంతరాలు ఎదురైనా కేసులకు జైళ్లకు భయపడేదిలేదని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. శివాజీ హిందూధర్మ పరిరక్షణ కోసం ఎన్నో యుద్ధాలు చేశారన్నారు. ఈ క్రమంలో ఆయన ఏనాడు కూడా తన స్వార్థం స్వలాభం గురించి ఆలోచించలేదని ధర్మ పరిరక్షణే లక్ష్యంగా యుద్ధాలు చేశారన్నారు. ముఖ్యంగా ఆయన తల్లి జిజియాను ఆదర్శంగా తీసుకుని తమ పిల్లలను పెంచి పోషించాలని సూచించారు. శివాజీ ఆశయాలను ఇంటింటా తీసుకెళ్లాలని తమ పిల్లలను శివాజీ శంభాజీల్లా తయారు చేయాలని పేర్కొన్నారు. కలిసి వస్తే అక్కున చేర్చుకుంటామని దుష్టాలోచన చేస్తే అంతు చూస్తామన్నారు, మన హిందువులే పరులకు చెంచాగిరి చేస్తూ ధర్మాన్ని ముందుకు సాగనివ్వడంలేదని అసలైన హిందువులే వారిని అడ్డుకుని ధర్మపరిరక్షణకు పాటుపడాలని తెలిపారు. మనం తాగేది ఆవుపాలే కాని గాడిదపాలు కాదని ప్రతీ ఒక్కరూ గోవును పెంచుకోవాలని వాటని సంరక్షించే భాద్యత తీసుకోవాలని తెలిపారు. అనంతరం పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందని ప్రతీ ఒక్కరూ ధర్మాన్ని కాపాడాలని తెలిపారు. శివాజీ అడుగుజాడల్లో ప్రతిఒక్కరూ నడుచుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ నవనీత, ఛత్రపతి యువజన సంఘం అధ్యక్షుడు కేశవులు, విగ్రహదాత వెన్నె ఈశ్వరప్ప, వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రహాళ్లద్రావు, పరిగి ఇన్చార్జి మారుతికిరణ్, ఆర్బీఓఎల్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు అనంతలక్ష్మారెడ్డి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పుల్లారెడ్డి, మహమ్మదాబాద్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు నారాయణ, మల్లప్ప, సత్యసాయి సేవాసమితి జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి శివమాజీ సర్పంచ్ గోపాల్, రాంరెడ్డి, రవికాంత్రెడ్డి, పులీందర్రెడ్డి, ఆయా గ్రామాల యువకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు. -
ముద్దుగా.. టీకా వేయిద్దాం
పెంపుడు జంతువులకు సకాలంలో టీకాలు తప్పనిసరి ● నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతక వ్యాధుల ముప్పు ● జంతువుల పెంపకంపై పెరుగుతున్న ఆసక్తి ● అవగాహన, వ్యాక్సినేషన్తో సంరక్షణ సులభం అంటున్న వైద్యులు ● నేడు ప్రపంచ జునోసిస్ డే మహబూబ్నగర్ (వ్యవసాయం)/జడ్చర్ల టౌన్: అనాదిగా మూగజీవాలతో మనిషికి విడదీయలేని బంధం ఏర్పడింది. పెంపుడు శునకాలు, పిల్లులు, కుందేళ్లు వంటి జంతువులను ఇంటి సభ్యుల్లా చూసుకునే వారి సంఖ్య గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగింది. కొందరు ప్రేమ తో.. మరికొందరు స్టేటస్ చూపడానికి.. ఇంకొందరు ఇంటికి రక్షణ కోసం మూగజీవాల్ని పెంచుతూ ఉంటారు. అయితే వీటి ఆరోగ్యంపై ఏమాత్రం అజ్రాగత్తగా ఉన్నా.. సరైన సమయంలో టీకాలు వేయించలేకపోయినా.. అపరిశుభ్రంగా ఉంచినా.. వాటి ద్వారా ప్రాణాంతక వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. వీటిని జునోసిస్ (జంతువులు, మానవుల మధ్య వ్యాపించే ఏవియన్ ఫ్లూ, రేబిన్, రిఫ్ట్ వ్యాలీ ఫీవర్ వంటివి) వ్యాధులు అంటారు. రేబిస్ను అరికట్టేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా పశు సంవర్ధకశాఖ ఆధ్వర్యంలో, కొన్ని ప్రైవేట్ సంస్థలు ఉచితంగా రేబిస్ టీకాలు వేస్తున్నా యి. నేడు జునోసిస్ డే సందర్భంగా జంతు ప్రేమికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’ కథనం. ఏటా జూలై 6న.. జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు సోకే వ్యాధులను జునోసిస్ వ్యాధులు అంటారు. లూయిస్ పాశ్చర్ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా 1885 జూలై 6 న పిచ్చికుక్క కాటుకు గురైన బాలుడికి రేబిస్ టీకా వేి స పునర్జన్మ ప్రసాదించి న సందర్భంగా ఏ టా ఇదే రో జు జునోసిస్ డేగా నిర్వహిస్తున్నారు. జునోసిస్ వ్యాధుల్లో 200 రకాలు ఉన్నట్లు గుర్తించగా.. మొత్తం అంటువ్యాధుల్లో ఇవే 60 శాతం అని అంచనా. జునోసిస్ వ్యాధులు పశుపోషకులు, పెంపుడు జంతువుల యజమానులు, రైతులకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా వ్యాపించే వ్యాధులు జునోసిస్ వ్యాధుల్లో ప్రధానమైనది రేబిస్. ిపిచ్చికుక్క కాటు ద్వారా వ్యాప్తి చెందే ఈ వ్యాధి లక్షణాలు వారం నుంచి పది రోజుల్లో కనిపిస్తాయి. ఈ వ్యాధి సోకిన వారు గుటక వేయలేకపోగా, దాహం వేస్తున్నా నీళ్లు తాగాలంటే భయపడతారు. కుక్క కరిచిన వెంటనే ఆ భాగాన్ని సబ్బుతో శుభ్రంగా కడిగి తగు చికిత్స చేయించుకోవాలి. అలాగే పెంపుడు కుక్కలకు యాంటీ రేబిస్ టీకాలు వేయిస్తే ఇబ్బంది ఉండదు. ఇక రేబిస్, జపనీస్ ఎన్సైఫిలైటిస్ (మెదడువాపు), వైరల్ హైపటైటిస్, అమ్మవారు, డెంగీ, కొక్కెర, ఆంత్రాక్స్ తదితరాలు సైతం జునోసిస్ వ్యాధుల జాబితాలో ఉన్నాయి. నివారణ ఇలా... వ్యాధులు సోకిన జంతువులు, కోళ్ల మాంసం, సరిగా ఉడకని గుడ్లు, పాడైన పాలు ఆహారంగా తీసుకోకూడదు. రేబిస్ సోకిన పశువుల పాలు తాగకూడదు. పాడి పశువులు, జంతువుల పాకలను ఎల్లప్పుడు శుభ్రంగా ఉంచాలి. పశువులు, జంతువులు, పక్షులు, కోళ్లకు కాలానికి అనుగుణంగా రోగ నిరోధక టీకాలు వేయించాలి. చనిపోయిన పశువులు, జంతువులను దూర ప్రాంతాల్లో లోతైన గోతిలో సున్నం చల్లి పూడ్చి పెట్టాలి. నా మిత్రుడు అనిల్ ఐదేళ్ల క్రితం హస్కి పెట్ను నా జీవితంలోకి తీసుకువచ్చాడు. నాటి నుంచి మా కుటుంబంలో ఒకరి లా కలిసిపోయింది. ఎంత ఒత్తిడి ఉన్నా పెట్ తో కాసేపు గడపగానే రిలాక్స్గా ఉంటుంది. వైద్యులు సూచించినట్లుగా వాక్సినేషన్ చేయిస్తుంటాం. – కృష్ణకాంత్, జడ్చర్ల మనుషులతో సన్నిహితంగా ఉండే జంతువులకు పశు వైద్యులు సూచించిన టీకాలు షెడ్యూల్ ప్రకారం వేయించాలి. జునోసిక్ వ్యాధులు, వాటి నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ముందస్తుగా గుర్తించడం వల్ల వ్యాప్తిని నివారించవచ్చు. బయట తిరిగే పెంపుడు జంతువులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. వాటిపై ఉన్న క్రిములు తొలగించాలి. కుక్కలు, పిల్లులకు 42 రోజుల నుంచి వ్యాక్సిన్ షెడ్యూల్ను తయారు చేసుకోవాలి వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా రేబిస్తో పాటు వివిధ రకాల బ్యాక్టీరియాలు, రింగ్వార్మ్ వంటి రోగాల నుంచి దూరం చేయవచ్చు నాణ్యమైన ఫుడ్ అందజేయడం, పరిశుభ్రమైన స్థలంలో నివాసం ఏర్పాటు చేయాలి. కుక్కలను గొలుసులు వేసి బంధించకుండా ప్రేమతో పెంచాలి. సైగలు, మాటలతోనే దాన్ని నియంత్రించేలా చిన్నప్పటి నుంచే శిక్షణ ఇవ్వాలి. అలా చేయటం వల్ల మనలో కలిసిపోతుంది. కుక్కను పెంచడం ఎంత ముఖ్యమో.. దాని ఆరోగ్యం, ఆహారంపై కూడా అంతే జాగ్రత్తలు పాటించాలి. – అనిల్గౌడ్, జడ్చర్ల -
భాస్వరంతో నేలకు పోషకాలు
గ్రీన్టీలో కనిపిస్తున్న గండు చీమలు అలంపూర్: భూమికి భాస్వరం ముఖ్యమైన పోష కం. ప్రకృతి సిద్ధంగా లభించే గాలి, నీరులాగానే మొక్క పెరుగుదలకు కావాల్సిన 16 రకాల పోషకాలు భూమి ద్వారా లభ్యమవుతాయి. అయితే పోషక పదార్థాల లభ్యత నేల రకాన్ని బట్టి నేల భౌతిక స్థితి, రసాయన లక్షణాలు, సూక్ష్మ జీవుల చ ర్య, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. భాస్వరం ప్రాముఖ్యతను మండల వ్యవసాయ అధికారి నాగార్జున రెడ్డి రైతులకు వివరించారు. కరగని రూపంలో భాస్వరం : సాగవుతున్న భూముల్లో 60 శాతం కంటే ఎక్కువగా ఉన్న భాస్వరం పోషకం కరగని డై కాల్షియం, ట్రై కాల్షియం ఫాస్పేట్ల రూపంలో ఉంటుంది. తేలిక భూముల్లో కంటే బరువు నేల (వరి పండించే డెల్టా భూములు)ల్లో భాస్వరం పోషకం ఎక్కువ శాతం మొక్కలకు అందుబాటులో లేని రూపంలో ఇమిడీకృతమై దాగి ఉంటుంది. ఈ నేలల్లో భాస్వరం వినియోగ సామర్థ్యం తక్కువేనని చెప్పవచ్చు. రైతులు వాడే భాస్వరపు ఎరువుల్లోని భాస్వర పోషకం మోనో కాల్షియం ఫాస్సెట్ రూపంలో ఉంటుంది. ఇది పూర్తిగా నీటిలో కరుగుతుంది. కరిగిన వెంటనే నేలలోని అల్యూమినియం, ఐరన్ ఆకై ్సడ్లతోను కాల్షియం, మెగ్నిషీయం కార్బొనేట్లతోనూ రసాయన చర్య జరుపుతుంది. దీని ఫలితంగా అల్యూమినియం ఫాస్పేట్, మెగ్నీషియం ఫాస్పేట్లుగా మారుతాయి. ఇవి కరగని రూపంలో ఉండి తర్వాత భూమిలోని సూక్ష్మజీవుల చర్యల వలన మొక్కకు అందుబాటులోకి వస్తాయి. ఏ దశలో వేయాలి : భాస్వరం ముఖ్యంగా వేరు వ్యవస్థను అభివృద్ధి ప రుస్తోంది.వరి పంటలో నాట్లకు ముందు మురుగు దమ్ము చేసేటప్పుడు సింగిల్ సూపర్ ఫాస్పెట్ 75–100 కిలోలు, 20 కిలోల యూరియా కలిపి వే యాలి. లేదా వరి నాటిన తర్వాత పది రోజులకు డీ ఏపీ ప్లస్ యూరియా లేక ఇతర భాస్వరం పోషకం కలిగిన కాంప్లెక్స్ ఎరువులు వేసుకోవాలి. వర్షాధార మెట్ట పంటలకు పత్తి, వేరుశనగ, మొక్కజొన్న మొదలగు పంటలకు ఆఖరి దుక్కిలో వేయాలి. భాస్వరం ఏ మేరకు వాడాలి....? మట్టి నమునాల్లో వచ్చే భూసార పరీక్షల ఫలితాల్లో వచ్చే ఆధారంగానే ఎంత భాస్వరం అవసరమో తె లుస్తోంది. దీనిని బట్టి పశువుల ఎరువులు, పచ్చిరొ ట్టే ఎరువులు, జీవన ఎరువులు, రసాయన ఎరువుల ద్వారా భాస్వరాన్ని అందించాలి. సింగిల్ సూ పర్ ఫాస్పేట్ డిఏపీ, ఎన్పీకే కాంప్లెక్స్ ఎరువులు మొదలగు వాటి ద్వార భాస్వరాన్ని అందజేయవచ్చు. జీవన ఎరువుల వలన ఉపయోగాలు : జీవన ఎరువుల్లో బాసిల్లాస్, సూడోమోనాస్ వంటి సూక్ష్మజీవులు ఆస్పర్జిల్లడ్, పెన్సిలియం వంటి శీలింధ్రాలు భూమిలో భాస్వరాన్ని కరిగించి మొక్కకు అందేలా చూస్తాయి. సిఫార్సు చేసిన భాస్వర మో తాదును ఎకరాకు 10 నుంచి 12 కిలోల వరకూ తగ్గించుకోవచ్చు.పచ్చి రొట్టె ఎరువుల వాడకం వల న భూమి సారవంతమై సూక్ష్మజీవుల సంతతి వృద్ధి చెందుతాయి. మట్టి నమునాల్లో భాస్వరం విలువ 20 కంటే తక్కువ గల భూములను 21 నుంచి 50 వరకు మధ్య భూములుగా పరిగణించబడతాయి. మొక్కజొన్నలో.. వరిలో భాస్వర లోపం మొక్కలు భాస్వరాన్ని లవణాల రూపంలో తీసుకుంటాయి. పూలు, విత్తనాలు, దుంపలు తదితర ఆర్థిక ప్రాముఖ్యత గల పంటలకు ఈ పోషకం చాలా అవసరం. భూమిలో సేంద్రియ ఎరువులు బాగా కుళ్లుటకు దోహదపడుతుంది. పంట త్వరగా పక్వానికి రావడానికి ఉపయోగపడుతుంది. కణ విభజన, పైరు అభివృద్ధి, మొక్కలో మాంసకృతులు, ఎంజైముల తయారీకి ఉపయోగపడుతుంది. భాస్వరం తగినంత ఉంటే నత్రజని ఎక్కువైన పైర్లకు కలిగే దుష్పలితాలను కొంత మేరకు అరికడుతుంది. మొక్కకు భాస్వరం లోపిస్తే పత్ర హరితం(క్లోరోఫిల్) ఏర్పడకుండా ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులోకి మారుతాయి. -
తప్పిన పెను ప్రమాదం
● బస్సును వెనుక నుంచి ఢీకొట్టిన లారీ ● 8 మందికి గాయాలు మానవపాడు: జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న బస్సును వెనుక నుంచి లారీ ఢీకొట్టగా.. పలువురికి గాయాలైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఎస్ఐ స్వాతి తెలిపిన కథనం ప్రకారం.. హిందుపూర్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సును అనంతపురం నుంచి జమ్మూకశ్మీర్ వైపుగా వెళ్తున్న లారీ మానవపాడు స్టేజీ దాటిన తర్వాత వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. వెంటనే సమాచారం అందుకున్న 108 సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108 అంబులెన్స్లో కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 22 మంది ప్రయాణిస్తుండగా.. దాదాపు 8మందికి పైగా గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై బస్సు డ్రైవర్ నరసింహమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్ మహ్మద్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. బస్సు, ట్రక్కు ఢీ.. వ్యక్తి దుర్మరణం దేవరకద్ర రూరల్: ట్రక్కు, వోల్వో బస్సు ఢీకొన్న ఘటనలో ట్రక్కు డ్రైవర్ మృతి చెందిన ఘటన జాతీయ రహదారి–167పై ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మంగళూరు నుంచి హైదరాబాద్కు ప్రయాణికులతో వస్తున్న భారతి ట్రావెల్స్కు చెందిన వోల్వో బస్సు, హైదరాబాద్ నుంచి రాయిచూర్ వైపు వెళ్తున్న మినీ ట్రక్కు దేవరకద్ర సమీపంలోని భారత్ పెట్రోల్ బంక్ వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్ దినకర్ (22) వాహనంలో ఇరుక్కుపోయి అక్కడిక్కడే మృతి చెందగా.. వోల్వో బస్సు డ్రైవర్కు రెండు కాళ్లు విరిగిగాయి. బస్సులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, జేసీబీ సహయంతో ట్రక్కులో ఇరుక్కుపోయిన డ్రైవర్ దినకర్ మృతదేహన్ని బయటకు తీశారు. గాయపడిన బస్సు డ్రైవర్తో పాటు మరో వ్యక్తిని అంబులెన్స్లో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు దేరవకద్ర ఎస్ఐ భాస్కర్రెడ్డి తెలిపారు. -
ముద్దుగా.. వేయిద్దాం టీకా
ఇంటికి కాపలాగా కొందరు.. ఒంటరితనానికి కాలక్షేపంగా మరికొందరు.. హోదా చూపడానికి.. ప్రేమతో ఇంకొందరు.. ఇలా కారణం ఏదైనా సగటు మనిషి జీవనంలో పెంపుడు జంతువులు భాగమైపోయాయి. అయితే వీటి సంరక్షణ విషయంలో అవగాహన లేక.. తెలియకుండానే ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. ప్రేమగా పెంచుకునే పెంపుడు జంతువుల నుంచీ వ్యాధులు ప్రబలే అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలో వాటికి సరైన సమయంలో టీకా వేయించడం.. ఇతరత్రా జాగ్రత్తలు తీసుకోవడంతో మూగజీవాలతోపాటు మనమూ సంతోషంగా ఉండవచ్చు. – మహబూబ్నగర్ (వ్యవసాయం) – వివరాలు 8లో.. -
బ్రిడ్జిలతో మారనున్న రూపురేఖలు
జడ్చర్ల: జడ్చర్ల నియోజకవర్గంలో పారుతున్న దుందుభీ వాగుపై బ్రిడ్జి(వంతెన)ల నిర్మాణంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు సులభతరం కావడంతోపాటు వరద పారుతున్న సమయంలో ప్రమాదాల నివారణకు అడ్డుకట్ట పడనుంది. ఈ మేరకు మిడ్జిల్లో జరిగిన కృతజ్ఞత సభలో సీఎం రేవంత్రెడ్డి ప్రకటించిన వరాలతో అటు మిడ్జిల్.. ఇటు జడ్చర్ల మండలాల పరిధిలోని పలు గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో ఆయా గ్రామాల దశ మారనుంది. నియోజకవర్గంలోని బాలానగర్, రాజాపూర్, జడ్చర్ల, మిడ్జిల్ మండలాల గుండా పారుతున్న దుందుబీ వాగు కారణంగా పరివాహక ప్రాంతాల్లోని పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోతాయి. దీంతో కొన్నిరోజులపాటు ఆయా గ్రామాల ప్రజలు అక్కడే బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తుంది. దీనికితోడు వ్యవసాయ భూములు వాగుకు అటు ఇటుగా ఉండడంతో వర్షాల సమయంలో ప్రాణాలు అరచేత పట్టుకుని పొలాలకు వెళ్లే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఎంతోమంది వాగు దాటుతూ ప్రాణాలు కోల్పోయారు. రవాణా సౌకర్యం మెరుగు.. దుందుభీ వాగుపై బ్రిడ్జిల నిర్మాణంతో ఆయా గ్రామాలకు మహర్దశ పట్టనుంది. జడ్చర్ల మండలంలోని దుందుభీ పరివాహక ప్రాంతంలో ఉన్న నెక్కొండ, అమ్మపల్లి గ్రామాల పరిస్థితి ఇదే. ఈ గ్రామాలకు ఒక వైపు మాత్రమే రాకపోకలు కొనసాగించాల్సి ఉండటంతో.. ప్రజలు గంగాపూర్ ద్వారానే రావాల్సి వస్తుంది. ఒకవేళ దుందుభీ వాగుపై బ్రిడ్జి నిర్మిస్తే రెండోవైపు మిడ్జిల్ మండలంలోని కంచనపల్లి, దోనూరు గ్రామాల ద్వారా వెళ్లే ఆస్కారం ఉంటుంది. ఇక ఎక్వాయిపల్లి నుంచి లింగందన వెళ్లే మార్గంలో కూడా దుందుభీ వాగుపై బ్రిడ్జి లేకపోవడంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇక్కడ బ్రిడ్జి నిర్మాణంతో అంతారం, వెల్జాల గ్రామాల వైపు రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. అలాగే లింగంపేట– నల్లకుంటతండా మధ్య వాగుపై బ్రిడ్జి లేకపోవడంతో వర్షాకాలంలో రాకపోకలు నిలిచిపోవడం ప్రతిఏటా జరుగుతుంది. మిడ్జిల్ మండలంలోని వల్లభ్రావుపల్లి– వేముల మధ్య బ్రిడ్జి నిర్మాణంతో ఆయా గ్రామాల మధ్య రాకపోకలు ఏర్పడనున్నాయి. దుందుభీ వాగుపై బ్రిడ్జిల నిర్మాణంతో రవాణా సౌకర్యం మెరుగుపడి వ్యవసాయ భూములకూ డిమాండ్ పెరుగుతుందని ఆయా గ్రామాల ప్రజలు భావిస్తున్నారు. నెక్కొండ, అమ్మపల్లి గ్రామాలకు ఒకవైపు మాత్రమే రాకపోకలు సాగించే పరిస్థితి ఉంది. దుందుభీ వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నా ఫలితం లేకపోయింది. ఇన్నాళ్లకు తమ కల సాకారం కానుంది. బ్రిడ్జి నిర్మాణం చేపడితే మిడ్జిల్ మండలం వైపు ఉన్న గ్రామాల ద్వారా అనేక ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు కలుగుతాయి. – కృష్ణయ్య, సర్పంచ్, నెక్కొండ ఎక్వాయిపల్లి– లింగందన గ్రామాల మధ్య దుందుభీ వాగుపై బ్రిడ్జి నిర్మించడం వల్ల మరోవైపు రాకపోకలు ఏర్పడనున్నాయి. దీంతో మా గ్రామం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. దుందుభీ వాగుపై బ్రిడ్జి లేకపోవడంతో అనేక ఏళ్లుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇన్నాళ్లకు తమ కల నెరవేరే అవకాశం కలిగింది. – మమత, సర్పంచ్, ఎక్వాయపల్లి నెరవేరనున్న ఆయా గ్రామాల చిరకాల స్వప్నం వాహన రాకపోకలతో తప్పనున్న ప్రమాదాలు వ్యవసాయ భూములకు పెరగనున్న డిమాండ్ సీఎం ప్రకటనతో హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు దుందుభీ వాగుపై బ్రిడ్జిల నిర్మాణానికి సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేశారు. నెక్కొండ వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ.4.50 కోట్లు, లింగంపేట– నల్లకుంటతండా మధ్య బ్రిడ్జికి రూ.4.50 కోట్లు, ఎక్వాయిపల్లి– లింగందన మధ్య వంతెన పనులకు రూ.3 కోట్లు, వల్లభ్రావుపల్లి– వేముల మధ్య బ్రిడ్జికి రూ.10.50 కోట్లు కేటాయించినట్లు ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి వెల్లడించారు. ఎట్టకేలకు దుందుభీ వాగుపై వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు సీఎం రేవంత్రెడ్డి ప్రకటించడంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎక్వాయిపల్లి గ్రామానికి సంబంధించి 60 శాతం వ్యవసాయ భూములు దుందుభీ వాగు అవతలి వైపే ఉన్నాయి. దుందుభీ ప్రవాహంలో మనుషులు, పశువులు కొట్టుకుపోయిన సంఘటనలు ఉన్నాయి. వర్షాకాలంలో పంట పొలాలకు రాకపోకలు నిలిచిపోతాయి. బ్రిడ్జి నిర్మాణంతో ఆ బాధలన్నీ తీరిపోతాయి. అలాగే మా భూములకు మంచి డిమాండ్ కూడా వస్తుంది. – బాల్రెడ్డి, రైతు సంఘం నాయకులు, ఎక్వాయిపల్లి -
బస్టాండులో సమస్యలు పరిష్కరించాలని ధర్నా
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నగరంలోని ఆర్టీసీ కొత్త బస్టాండులో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు నల్లవెల్లి కురుమూర్తి డిమాండ్ చేశారు. ఆదివారం పార్టీ ఆధ్వర్యంలో బస్టాండు పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి.. డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ కింద సెల్లార్ తాగుబోతులకు అడ్డాగా మారిందని ఆరోపించారు. పరిసర ప్రాంతాలన్నీ అపరిశుభ్రంగా ఉన్నాయని, దుర్గంధంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా ఎవరూ పట్టించుకోడం లేదని విమర్శించారు. ముఖ్యంగా ఆటోవాలాలు గేట్ల (ఇన్, అవుట్తోపాటు ప్రయాణికులు లోపలికి వెళ్లే మార్గం)లో అడ్డదిడ్డంగా ఆపుతూ ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్నారన్నారు. బస్టాండ్ ఆవరణ మొత్తం గుంతలమయంగా మారిందని, శిథిలావస్థలో ఉన్న మూత్రశాలలను కూల్చివేయాలన్నారు. క్యాంటీన్ నుంచి బయటకు వచ్చే మురుగు కాల్వలో సాఫీగా ముందుకు వెళ్లే పరిస్థితి లేదని దుయ్యబట్టారు. ఇప్పటికై నా ఆర్టీసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. వారం రోజుల్లో ఆయా సమస్యలను పరిష్కరించకుంటే ఆర్ఎం కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కంట్రోలర్ ఆంజనేయులుకు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు రాజ్కుమార్, కమర్అలీ, గాలన్న, భాస్కర్, రవి, కృష్ణ, ఎల్లప్ప, ఖయ్యూం తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేటుకు గడ్డుకాలమే
ప్రభుత్వం డిగ్రీలో వివిధ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ ఇప్పటికే మూడు దశల్లో పూర్తి అయ్యింది. అయినా ఆశించిన స్థాయిలో అడ్మిషన్లు జరగలేదు. ఈ క్రమంలో ఎప్ సెట్ వంటి కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిస్తే మరో దశ స్పెషల్ కౌన్సెలింగ్ నిర్వహించి ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసే అవకాశం ఉంది. – రమేష్బాబు, రిజిస్ట్రార్, పీయూ పీయూ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ కాలేదని తెలుస్తుంది. ప్రభుత్వం త్వరలో మరో దశ స్పెషల్ కౌన్సెలింగ్కు ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. ప్రైవేటు కళాశాలల్లో కూడా సీట్లు భర్తీ అవుతాయి. కౌన్సెలింగ్లో విద్యార్థులు ఏ కళాశాల ఎంపిక చేసుకుంటే అందులో సీటు వస్తుంది. – చంద్రకిరణ్, డైరెక్టర్ ఆఫ్ అకడమిక్, ఆడిట్సెల్ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూ పరిధిలో డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. అయితే ఎప్పుడూ లేనంతగా అడ్మిషన్లు చాలా తక్కువ కావడం ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. మూడు దశల్లో జరిగిన అడ్మిషన్ల ప్రక్రియలో ఎక్కువ మొత్తంలో సీట్లను ప్రభుత్వ, అటానమస్ డిగ్రీ కళాశాలలకు ప్రభుత్వం కేటాయించింది. దీంతో చాలా ప్రైవేట్ కళాశాలల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. గత మూడేళ్లుగా పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో ఆర్థికంగా నష్టాల్లో ఉన్న కళాశాలలు.. ఇప్పుడు సీట్ల భర్తీ కూడా అంతంత మాత్రంగా ఉండడంతో యాజమాన్యాలు ఆందోళనకు గురవుతున్నాయి. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మూడు దశల్లో నిర్వహించాల్సిన ప్రక్రియ పూర్తి అయ్యింది. అయినా ప్రైవేటు కళాశాలల్లో గతం కంటే చాలా తక్కువ సీట్లు భర్తీ అయ్యాయి. ఈ నేపథ్యంలో మరో ప్రత్యేక కౌన్సిలింగ్ ప్రభుత్వం నిర్వహిస్తుందా.. లేదా.. అనే అంశంపై సందిగ్ధం నెలకొంది. యూజీలో మొత్తం 65 కళాశాలలు ఉండగా వీటిలో 28,860 సీట్లు భర్తీకి ప్రభుత్వం కౌన్సిలింగ్ నిర్వహిస్తే 8,561 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. దోస్త్ ద్వారా డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం మూడు దశల్లో పూర్తయిన చేరికలు ఇప్పటి వరకు సగమైనా పూర్తికాని సీట్ల భర్తీ పీయూ పరిధిలో మొత్తం 28,860 సీట్లకు 8,561 మాత్రమే.. కళాశాలలు మూతబడితే యూనివర్సిటీ ఆదాయానికి గండి -
రక్షణ చర్యలు చేపట్టాలి..
జిల్లాలోని పలు ప్రాంతాల్లో చారిత్రక శిలాశాసనాలు, పురాతన విగ్రహాలు ఉన్నాయి. వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతోపాటు స్థానికులపై ఉంది. పురావస్తు అధికారులు వాటి పరిరక్షణకు చర్యలు చేపట్టాలి. జటప్రోల్ మధనగోపాలస్వామి ఆలయం వంటి పురాతన ఆలయాలకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కృషిచేయాలి. – శివకృష్ణ యాదవ్, కొల్లాపూర్ మల్లేశ్వరం సమీపంలోని గుట్టపై పురాతన కాలభైరవ విగ్రహం, 11వ శతాబ్దానికి చెందిన శేషశయన విష్ణుమూర్తి విగ్రహాలు ఉన్నాయి. మల్లేశ్వరం సమీపంలోనే టూరిజం అభివృద్ధి పనులు చేపడుతున్నారు. గ్రామంలోని పురాతన విగ్రహాల రక్షణ, ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించాలి. – అశోక్నంద, మల్లేశ్వరం ● -
పట్టా భూమి అక్రమ నమోదుపై కలెక్టర్ సీరియస్
కందనూలు: అచ్చంపేట మండలం హాజీపూర్కు చెందిన రైతు జంచుక మసన్న జీవించి ఉండగానే.. ఆయన మరణించినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి, పట్టా భూమిని ప్రభుత్వ అసైన్డ్ భూమిగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసిన ఘటనపై కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సీరియస్ అయ్యారు. బాధిత రైతు ఫిర్యాదు మేరకు పూర్తిస్థాయి విచారణ చేపట్టిన కలెక్టర్.. బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. అచ్చంపేట తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి ఆపరేటర్గా పనిచేస్తున్న మూడావత్ జైపాల్ను విధుల నుంచి తొలగించి.. అతడిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో అచ్చంపేట తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్గా విధులు నిర్వహించి.. ప్రస్తుతం పెద్దకొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయంలో డీటీగా (డిప్యుటేషన్)పై పనిచేస్తున్న ఎ.అశోక్కుమార్పై సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ తహసీల్దార్ నిర్లక్ష్యం కారణంగానే జీవించి ఉన్న రైతును మృతుడిగా చూపిస్తూ.. రికార్డుల్లో మార్పులు జరిగాయని.. ఫలితంగా రైతు పట్టాదారు భూమి ప్రభుత్వ అసైన్డ్ భూమిగా నమోదై రైతు హక్కులకు తీవ్ర భంగం కలిగిందని విచారణలో వెల్లడైంది. శాఖాపరమైన విచారణ పూర్తయ్యే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు డీటీపై సస్పెన్షన్ అమల్లో ఉంటుందని కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పోక్సో కేసులో యువకుడు రిమాండ్ గద్వాల క్రైం: బాలికను అపహరించిన ఘటనలో ఓ యువకుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు గద్వాల సీఐ శ్రీను తెలిపారు. ఆయన వివరాల మేరకు.. గద్వాల మండలానికి చెందిన బాలికను అదే మండలానికి చెందిన అద్భుతకుమార్ అనే యువకుడు ఐదు రోజుల క్రితం ప్రేమ పేరుతో నమ్మించి అపహరించాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. అతడిపై పోక్సో కేసు నమోదు చేసి.. గద్వాల కోర్టులో హాజరుపర్చగా, రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. ● డిప్యూటీ తహసీల్దార్పై సస్పెన్షన్ వేటు ● భూభారతి ఆపరేటర్పై కేసు నమోదు -
‘దామిని’తో పసిగట్టు
●కల్వకుర్తి టౌన్: ప్రకృతి వైపరీత్యాలతో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు కూడిన వర్షాలతో పాటుగా పిడుగుపాట్లతో ప్రాణనష్టం, ఆస్తినష్టం జరుగుతూ ఉంటాయి. వర్షా కాలానికి ముందే వేసవికాలంలో వచ్చే అకస్మాత్తు వర్షాలతో ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు పడుతుంటారు. ప్రతిఏటా పిడుగులు పడి ఎక్కువ సంఖ్యలో మూగజీవాలు మృత్యువాత పడటమే గాక, ప్రజలు ప్రాణాలను సైతం కోల్పోయిన సంఘటనలు అనేకం ఉన్నాయి. పిడుగుపాటుపై పలు పరిశోధనలు చేసిన భారత వాతావరణ శాఖ అధికారులు పిడుగుపాటును ముందే పసిగట్టగలిగితే ప్రాణాలను కాపాడుకునేలా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మెటరాలజీ (ఐఐటీఎం) ‘దామిని’ యాప్ను రూపకల్పన చేసింది. దీనిపై అవగాహన పెంచుకోని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తోంది. డౌన్లోడ్ చేసుకోండిలా.. ప్రతి పౌరుడు మొబైల్ఫోన్లో ప్లే స్టోర్ నుంచి దామిని అని టైప్చేసి యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ను ప్రారంభించాక మీ పేరు, మొబైల్ నంబర్, అడ్రస్, పిన్కోడ్తో రిజిస్టర్ చేసుకోవాలి. అనంతరం జీపీఎస్ లొకేషన్ తీసుకునేందుకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. యాప్ను వాడుతున్న సమయంలో మీ ప్రాంతంలో పిడుగుపడే అవకాశాలు ఉన్నాయో లేదో మూడు రంగుల గుర్తులను కలర్ల కింద చూపిస్తుంది. వాటి ఆధారంగా మీరు ఉన్న చోట పిడుగుపడే అవకాశం ఉంటే ముందే హెచ్చరిస్తుంది. రెడ్ కలర్: మీరు ఉన్న ప్రాంతంలో మరో 7 నిమిషాల వ్యవధిలో పిడుగుపడే అవకాశం ఉందని ఆ సర్కిల్ ఎరుపు రంగులోకి వస్తుంది. ఎల్లో కలర్: మరో 10– 15 నిమిషాలలో పిడుగుపడే అవకాశం ఉంటే యాప్లోని మీరు ఉన్న ప్రాంతం సర్కిల్ ఎల్లో కలర్లోకి మారుతుంది. బ్లూ కలర్: మరో 18– 25 నిమిషాలలో మీరు ఉన్న ప్రాంతంలో పిడుగుపడే అవకాశం ఉందని, ఆ ప్రాంతం సర్కిల్ బ్లూ కలర్లోకి మారుతుంది. జాగ్రత్తలు పాటిస్తే... ● నల్లని మబ్బులు ఆకాశం అంతటా విస్తరించి భారీ వర్షం కురుస్తున్నప్పుడు రైతులు పంట పొలాల్లో తిరగకుండా ఏవైనా భవనాలు లేకపోతే తాము ఉన్న స్థానంలోనే మోకాళ్లపై కూర్చొని రెండు చెవులను తమ చేతులతో మూసుకోవాలి. ● బహిరంగ ప్రదేశాల్లో పిడుగుపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పంట పొలాల్లో మొబైల్ వాడకూడదు. మొబైల్ నుంచి వచ్చే సిగ్నల్ పిడుగుపడే అవకాశాన్ని ఎక్కువ చేస్తుంది. ● విద్యుత్ సరఫరా అయ్యే పరికరాలకు (విద్యుత్ స్తంభాలు, సెల్ఫోన్ టవర్లు, బోర్ పంపుసెట్ల) దూరంగా ఉండాలి. వాటి నుంచి వచ్చే నీటిని కూడా ఆ సమయంలో ఉపయోగించరాదు. ● పాడి పశువులను మేతకు బయటకు తీసుకెళ్లకుండా పాకలోనే ఉంచాలి. ● వర్షం కురిసినప్పుడు చెట్ల కింద ఉండొద్దు. పిడుగులు పొడవైన చెట్ల మీద పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. యాప్ ఉపయోగకరం వాతావరణంలో మార్పులను పసిగట్టి పిడుగుపడే అవకాశాన్ని తెలిపే దామిని యాప్ ప్రజలతో పాటుగా ముఖ్యంగా రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. యాప్ని వినియోగించటం వలన పిడుగుపడే విషయాన్ని గుర్తించి ప్రాణాలను కాపాడుకోవచ్చు. – జనార్ధన్ రెడ్డి, ఆర్డీఓ, కల్వకుర్తి పిడుగుపాటుపై ముందస్తు హెచ్చరికలు చేస్తున్న యాప్ జాగ్రత్తలు పాటిస్తే నుంచి బయటపడే అవకాశం అకాల వర్షాలు, పిడుగులతో ప్రాణాలను కోల్పోతున్న ప్రజలు -
సమయానికి.. పూర్తయ్యేనా ‘సర్’!
అచ్చంపేట: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో ఓటర్లు తంటాలు పడుతున్నారు. 2002 నాటి ఓటరు గుర్తింపు కోసం క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలు ఎలా నింపాలి.. ఏ వివరాలు, ఎక్కడ రాయాలో తెలియక చాలామంది గందరగోళానికి గురవుతున్నారు. ఎన్నో ఏళ్ల క్రితం నాటి వివరాలు ఇప్పుడు అడిగితే ఎలా తెలుస్తాయనే ప్రశ్న తలెత్తుతోంది. ఎప్పుడో మరణించిన తల్లిదండ్రుల పాత ఎన్నికల గుర్తింపు కార్డులను ఇప్పుడు ఎలా తీసుకురావాలంటూ ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా చదువుకోని నిరక్షరాస్యులు పాత వివరాలు ఎలా తెలుసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. 24 ఏళ్ల క్రితం ఓటరు గుర్తింపు కార్డు నంబరు, ఓటరు సీరియల్ నంబర్, పోలింగ్ స్టేషన్ తదితర వివరాలు తెలియక అయోమయానికి గురవుతున్నారు. చాలామంది తెలియక 2002లో ఉన్న ఓటర్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, పాత జిల్లా పేర్లు కాకుండా కొత్త రాష్ట్రం, కొత్త జిల్లా పేర్లు రాయడం వంటి తప్పులు చేస్తున్నారు. అధికారులు ఓటర్లకు అవగాహన కల్పించకపోవడంతో ఇలాంటి ఇబ్బుందులు ఎదురవుతున్నాయి. 97.68 శాతం పంపిణీ పూర్తి ఉమ్మడి పాలమూరులో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ చివరి దశకు చేరుకుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 27,39,123 మంది ఓటర్లు ఉండగా.. 26,75,580 మందికి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయడంతో 97.68 శాతం లక్ష్యం చేరుకుంది. కేవలం 63,543 మంది ఓటర్లకు మాత్రమే ఫారాలు అందించాల్సి ఉండగా.. ఈ ప్రక్రియను పూర్తిచేసేందుకు అధికారులు, బీఎల్ఓలు, బీఎల్ఏలు శ్రమిస్తున్నారు. ఎన్యూమరేషన్ ఫారాలు నింపడంలో గందరగోళం 2002 నాటి వివరాలు లభించక ఓటర్ల తికమక ఉమ్మడి జిల్లాలో 97.68 శాతం ఫారాల పంపిణీ -
డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల
జడ్చర్ల టౌన్: డా.బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సెమిస్టర్ ఫలితాలను పాలమూరు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ రమేష్బాబు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రవీణ విడుదల చేశారు. ఏప్రిల్, మేలో నిర్వహించిన సెమిస్టర్ 2, 4, 1, 3 బ్యాక్లాగ్ పరీక్షల ఫలితాలు విడుదల చేసినట్లు ప్రిన్సిపాల్ సుకన్య తెలియజేశారు. ఫలితాల్లో 25శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఫలితాల విడుదలలో విశ్వవిద్యాలయం అదనపు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డా.అనురాధ, డా.అరుంధతి, వైస్ ప్రిన్సిపాల్ నర్మద, కళాశాల సీఓఈ ప్రవీణ్కుమార్, అకడమిక్ కో ఆర్డినేటర్ రాఘవేందర్రెడ్డి, అటానమస్ కో ఆర్డినేటర్ డా.సులేమాన్, జబీన్ పాల్గొన్నారు. -
‘సీ్త్ర’నిధులు గోల్మాల్
ధన్వాడ: మహిళా స్వయం సహాయక సంఘాలలో ఇటీవల కాలంలో పలు రకాల ఆర్థిక మోసాలు, నిధుల దుర్వినియోగం వెలుగుచూస్తున్నాయి. నిరక్షరాస్యత, అవగాహన లోప మరియు నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు. సీ్త్రనిధి నుంచి తక్కువ వడ్డీకి రుణాలు తీసుకొని రెగ్యులర్గా తిరిగి చెల్లిస్తుంటే.. మధ్యలో వీఓఏలు, సీసీలు వాటిని వాడుకొని తినేస్తున్నారు. అంతా తెలిసిన అధికారులు వారినుంచి రికవరీ చేయకుండా మహిళా సంఘాలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. వాటికి వడ్డీ, చక్రవడ్డి వేస్తూ చెల్లించాలని లేకుండా కేసులు నమోదు చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ● మండల కేంద్రంలోని మానికేశ్వరి మహిళా సంఘం 26 నవంబర్ 2018లో ఇద్దరు మహిళలు రూ.50వేలు, ఐదుగురు మహిళలు రూ.25వేయిల చొప్పున్న రూ.2.50లక్షలను సీ్త్రనిధి కింద వడ్డీకి తీసుకున్నారు. ఇందుకుగాను ప్రతినెలా బ్యాంకులో చెల్లిస్తూ వస్తున్నారు. ఐకేపీ సిబ్బంది వారిని బ్యాంకులో కట్టొద్దు మాకు లెక్క సరిగా రావడంలేదు.. మీరు ఐకేపీ వీఓఏల వద్ద డబ్బులను కట్టాలని సీసీ కుర్మన్న తెలియజేయడంతో అప్పటినుంచి బాలరాం అనే వీఓఏతో డబ్బులను కడుతూ వచ్చారు. ఇలా రెండేళ్లు వీఓఏతో డబ్బులను కట్టారు. వారు కట్టాల్సిన ఈఎంఐ 20జూన్ 2022లో పూర్తయింది. కొత్తగా లోన్ కోసం వెళ్లగా.. ఐకేపీ సిబ్బంది మీరు లోన్ పూర్తిస్థాయిలో కట్టలేదు.. ఇంకా రెండేళ్లకు చెందిన రూ.50వేలు కట్టాల్సి ఉందని చెప్పడంతో మహిళలు అశ్చర్యపోయి వారు కట్టిన పూర్తి రసీదులను అధికారుల ముందు ఉంచారు. అందులో బ్యాంకులో కట్టిన రసీదుల వరకు క్లియర్గా ఉండగా.. వీఓఏతో కట్టిన డబ్బులు బ్యాంకులో జమ కాలేదని తేలింది. అప్పటికే వీఓఏ మోసాలు చేశాడని అధికారులు అతనిపై కేసు నమోదు చేశారు. వారు కట్టాల్సిన రూ50వేలకు వడ్డీ, చక్రవడ్డి వేసి ఇప్పుడు రూ.92వేలు కట్టాలని.. వీఓఏ మోసం చేసిన డబ్బులను కట్టాలని మహిళా సంఘాలపై సీ్త్రనిధి అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారు. కనీసం వాటిలో ఆసలు మాత్రమే తీసుకొని వడ్డీ అయినా.. తగ్గించండని నెత్తినోరు మోత్తుకున్నా.. అధికారులు స్పందించలేదు. ఇందులో వన్టైం సెటిల్మెంట్ లాంటివి అవకాశం ఉండదని.. పూర్తిగా డబ్బులను కట్టాల్సిందేనని అధికారులు తేల్చి చెప్పారు. చేసేది లేక మహిళా సంఘాల వారు తమ పొదుపు నుంచి డబ్బులను విత్డ్రా చేసి కట్టేందుకు సిద్ధమవుతున్నారు. రూ.25వేలు తీసుకున్నారు నేను 2018లో రూ.25వేలు సీ్త్రనిధి కింద రుణం తీసుకున్నా.. ప్రతిరోజు బీడీ కూలీ పనిచేస్తూ వాటిని క్రమం తప్పుకుండా కట్టుకుంటూ వచ్చా. ఇప్పుడు ఐకేపీ అధికారులు డబ్బులు కట్టలేదని.. వడ్డీతోపాటు చెల్లించాలని మాపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇప్పుడు కట్టిన డబ్బులు పోగా ఇంకా రూ.25వేలు చెల్లించాలని లేదంటే ఎలాంటి రుణాలు రావని రోజురోజుకు వడ్డీ పెరుగుతుందని చెబుతున్నారు. – బుదారపు మణెమ్మ, ధన్వాడ రెగ్యూలర్గా కట్టాను సీ్త్రనిధి నుంచి తీసుకున్న రుణానికి ప్రతినెల బ్యాంకులో చెల్లిస్తుంటే ఐకేపీ అధికారులు తమకు లెక్క సరిగ్గా రావడలేదు.. మీకు కేటాయించి వీఓఏతో కట్టండని చెప్పారు. మధ్యలో కరోనా రావడంతో ప్రతినెల అతనికి ఇచ్చి రసీదులు తీసుకున్నాం. ఇప్పుడు ఆ రసీదులు పనిచేయవు.. మీరు కట్టాల్సిన డబ్బులు వీఓఏకు ఎందుకిచ్చారు. వీఓఏ కట్టకపోతే మీదే బాధ్యత ఇప్పుడు వడ్డీతో కట్టాల్సిందే లేకుండా రుణాలు ఇవ్వమని తెగేసి చెబుతున్నారు. – గాయిత్రి, ధన్వాడ డబ్బులు కట్టాల్సిందే.. సీ్త్రనిధి నుంచి డబ్బులు తీసుకున్నవారు సీ్త్రనిధి అంకౌట్లోనే డబ్బులు జమ చేయాలని.. అలాకాకుండా సిబ్బంది చెప్పారని వీఓఏలకు అందజేసి వారు కట్టకపోతే మహిళ సంఘాలదే బాధ్యత. వడ్డీ తగ్గింపులాంటి అవకాశాలు ఇందులో ఉండవు. వారు డబ్బులు కట్టాల్సిందే.. – తిరుపతయ్య, ఆర్ఎం, సీ్త్రనిధి చెల్లింపులో వీఏఓల చేతివాటం మహిళా సంఘాలకు ఇబ్బందులు డబ్బులు కట్టినవారికి సైతం నోటీసులు బెదిరింపులకు పాల్పడుతున్న అధికారులు -
పలకరింత.. పులకింత
జడ్చర్ల/మిడ్జిల్: మిడ్జిల్ మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా శనివారం ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట ఆంజనేయస్వామి దేవస్థానం వద్ద తన గెలుపునకు సహకరించిన వారిని ఆయన కలుసుకున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరంలో ఆయన ప్రతి టేబుల్ దగ్గరకు వెళ్లి పేరు పేరున పలకరించి.. యోగక్షేమాలు తెలుసుకున్నారు. వారితో ఫొటోలు దిగారు. ఇన్నేళ్ల తర్వాత కూడా తమను పేరు పెట్టి పిలవడంతో సంబ్రమాశ్చర్యంలో మునిగిపోయారు. అంతకు ముందు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రూ.10 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. -
ఇంటర్ గురుకులాల్లో స్పాట్ అడ్మిషన్లు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాలోని పలు ఎస్సీ ఇంటర్మీడియట్ గురుకుల కళాశాలల్లో పలు కోర్సులో సీట్లు ఖాళీగా ఉన్నాయని, ఆసక్తి గల విద్యార్థులు చేరాలని ఇన్చార్జి ప్రిన్సిపాల్ అర్చన ఒక ప్రకటనలో తెలిపారు. బాలుర గురుకులంలో ఎంపీసీలో 38, బైపీసీలో 40, బాలికల గురుకులాల్లో ఎంపీసీలో 14, బైపీసీలో 10, సీఈసీలో 8, ఎంఈసీ 14 సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 6వ తేదీన రాంరెడ్డిగూడెం గురుకులంలో నిర్వహించే కౌన్సెలింగ్ హాజరుకావాలని, టీసీ, బోనోఫైడ్, కులం, ఆదాయం, ఫొటోలతో రావాలని సూచించారు. డే కేర్ను సద్వినియోగం చేసుకోవాలి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన డే కేర్ సెంటర్ను మహిళా ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్ రాజీవ్రెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్లోని డే కేర్ సెంటర్ను ఆయన తన బృందంతో కలిసి సందర్శించారు. ఉద్యోగుల పిల్లల సంరక్షణ ఎలా ఉందని నిర్వాహకులను అడిగి తెలుకున్నారు. డే కేర్లో కల్పించిన సౌకర్యాలు చాలా బాగున్నాయని తెలిపారు. చిన్నారుల సంరక్షణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చంద్రానాయక్, సహాయ అధ్యక్షుడు శ్యాంసుందర్రెడ్డి, ఉపాధ్యక్షులు వెంకట్రామిరెడ్డి, నంద కిషోర్, నాయకులు మధుసూదన్, మల్లయ్య, పటేల్ మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యావ్యవస్థలో మార్పులు రావాలి: యెన్నం మహబూబ్నగర్ మున్సిపాలిటీ: విద్యా వ్యవస్థలో మార్పులతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని ప్రభు త్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. శనివా రం నోయిడాలో టీఈడీఎక్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ విద్యావంతులు అయినప్పుడే సమాజ వికాసం సాకారమవుతుందన్నారు. విద్య అనేది వ్యక్తిగత ఎదుగుదలకే కాకుండా దేశ అభివృద్ధికీ ఎంతో కీలక మని పేర్కొన్నారు. ‘మహబూబ్నగర్ ఫస్ట్’ ఆధ్వర్యంలో తన నియోజకవర్గంలో అమలు చేస్తున్న విద్యా కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రస్తావించారు. డిజిటల్ లెర్నింగ్ విస్తరణ, డిజిటల్ లైబ్రరీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ద్వారా విద్యార్థులకు కొత్త అవకాశాలు కల్పించామన్నారు. ‘మై విలేజ్ స్కూల్’ ద్వారా ప్రతి పాఠశాలకు ఆధునిక సదుపాయాలు కల్పిస్తూ, గ్రామీణ విద్యను బలోపేతం చేస్తున్నామన్నా రు. విద్యార్థుల్లో సృజనాత్మకత, నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా వారిని ప్రపంచ స్థాయిలో పోటీపడేలా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ వేదికపై ఒక ప్రజాప్రతినిధిగా పాల్గొ నే అవకాశం దక్కడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. -
మిడ్జిల్ అభివృద్ధి నా బాధ్యత..
20 ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే రోజున కృతజ్ఞత సభ ఏర్పాటు చేయడం సంతోషం. ఉమ్మడి పాలమూరులో ఆనాడు మిడ్జిల్, గట్టు మండలాలను డార్క్ మండలాలుగా ప్రకటించారని గుర్తు చేశారు. అత్యంత వెనకబడిన ప్రజలు చీకట్లో నుంచి వెలుగు రావాలని 2006లో మీరు నిర్ణయం తీసుకున్నారు. మీరు తీసుకున్న ఆ నిర్ణయంతో ఈనాడు ముఖ్యమంత్రిగా ఎదిగే అవకాశం వచ్చింది. నాకు ఇంకా అవకాశం ఇచ్చేందుకు ప్రజల వద్ద ఇంకా ఏమీ లేదు. ఉన్నదంతా సర్వం నాకు ఇచ్చారు. అందుకే మిడ్జిల్ను తీర్చిదిద్దాల్సిన బాధ్యత నాపై ఉంది. మిడ్జిల్ డార్క్ మండలం కాదు.. ఈ ప్రాంతానికి వెలుగు రేఖలు వచ్చినాయనేది ప్రభుత్వ లెక్కల్లో తేలాలి. ఈ మండలం ఈ జిల్లాకే ఆదర్శంగా నిలవాలనేదే నా కోరిక. అందుకే ఈ మండలాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు దత్తత తీసుకోవాలని కోరుతున్నా. -
ప్రాణమిచ్చినా తక్కువే..
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘‘2006 జూలై 4.. నేను గెలిచిన గెలుపు నాది కాదు. ఈ మిడ్జిల్ మండల ప్రజలది. స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన ఈ బిడ్డను ఆశీర్వదించిన మీ నిర్ణయం గొప్పది. ఆ రోజు మిడ్జిల్ మండల ప్రజలు సువర్ణాక్షరాలతో ఒక చరిత్రను లిఖించిన రోజు. ఆనాడు మీరు నాటిన మొక్క.. ఈనాడు మహా వృక్షమైంది. జెడ్పీటీసీ సభ్యుడిగా ప్రస్థానం మొదలు పెట్టి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్.. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా నిలిపింది. ఈ స్థాయికి ఎదిగానంటే మీరే కారణం. నిధులు ఇవ్వడం పెద్ద విషయం కాదు. మీకు ప్రాణమిచ్చినా తక్కువే.’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. మిడ్జిల్ జెడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మండలకేంద్రంలో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయత కృతజ్ఞత సభలో ఆయన మాట్లాడారు. వాతావరణం అనుకూలించకపోవడంతో హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో వచ్చిన సీఎం ముందుగా అప్పటి ఉమ్మడి మిడ్జిల్ పరిధి, ప్రస్తుత నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండపేటలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడే ఆనాటి మిడ్జిల్ మండల పెద్దలు, నాయకులు, ఆత్మీయులు సుమారు 150 మందిని ఆత్మీయంగా పలకరించి.. ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత మిడ్జిల్ సమీపంలో డీసీసీబీ మాజీ చైర్మన్ ధ్యాప గోపాల్రెడ్డి, బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం బహిరంగసభలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన మిడ్జిల్ మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి పెద్దఎత్తున సభ నిర్వహించడంపై సంతోషం వ్యక్తం చేశారు. మిడ్జిల్ మండల ప్రజల రుణం తీర్చుకోలేనిదన్నారు. ఇంకా రేవంత్ ఏమన్నారనేది ఆయన మాటల్లోనే.. మిడ్జిల్ ప్రజల రుణం తీర్చుకోలేనిది.. ఈ మండలాన్ని డిప్యూటీ సీఎం భట్టి దత్తత తీసుకోవాలి అభివృద్ధి చెందినప్రాంతంగా ప్రభుత్వ లెక్కల్లో చూపెట్టాలి.. ఉమ్మడి పాలమూరు అభివృద్ధికి సహకారం అందించాలి.. కృతజ్ఞతసభలో సీఎం రేవంత్రెడ్డి రూ.47.08 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన -
తిరిగి ఇవ్వడంలో జాప్యం
బీఎల్ఓలకు క్షేత్రస్థాయిలో ఓటర్ల నుంచి ఇబ్బందులు ఎదురువుతున్నాయి. ఇంటింటికి వెళ్లి ఫారాలు అందజేసి.. వివరాలు పూరించి తిరిగి ఇవ్వాలని చెబుతున్నా ఓటర్ల నుంచి స్పందన లేదని, అభ్యంతరాలు కూడా వ్యక్తం చేస్తున్నారని బీఎల్ఓలు వాపోతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల వివరాలు, ఇంటి నంబర్లు లభించని కారణంతో బీఎల్ఓలు ఫారాలు అందించలేకపోతున్నారు. దీంతో చాలాచోట్ల బీఎల్ఏల సహకారంతో ఒకే దగ్గర ఉండి ఫారాలు ఇవ్వడం, నింపడం చేస్తున్నారు. ఇప్పటి వరకు పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాల్లో 96,699 (3.53 శాతం) డిజిటలైజేషన్ చేశారు. ఈ నెల 30 వరకు ఫారాలు సేకరణ పూర్తి చేసి డిజిటలైజేషన్ చేయాలి. ఈ నెల 31న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేయాల్సి ఉండగా.. ఈలోగా ఫారాలు నింపి.. వాటిని డిజిటలైజేషన్ చేయడం పెద్ద సవాల్గా మారింది. -
కోర్టు నిర్మాణ పనుల్లో నాణ్యత ముఖ్యం
● భవనాలు త్వరగా పూర్తి చేయాలి ● హైకోర్టు న్యాయమూర్తి శ్రవణ్కుమార్ పాలమూరు: బండమీదిపల్లిలో జరుగుతున్న నూతన కోర్టు కాంప్లెక్స్ భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా కోర్టు పరిపాలన అధికారి ఎన్వీ శ్రవణ్కుమార్ పేర్కొన్నారు. జిల్లా కోర్టు న్యాయమూర్తి ప్రేమలతతో కలిసి శనివారం మధ్యాహ్నం నూతన కోర్టు భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఆర్అండ్బీ అధికారులతో పనుల పురోగతిపై మాస్టర్ ప్లాన్ పరిశీలించి పనుల నాణ్యతపై ఆరా తీశారు. కోర్టు భవనాలు, పార్కింగ్, న్యాయమూర్తుల క్వార్టర్స్, కోర్టు చుట్టూ వచ్చే ప్రహరీ ఇతర పనులపై ఆరా తీశారు. సాధ్యమైనంత త్వరగా నిర్మాణ పనులు పూర్తిచేయాలని సూచించారు. ప్రధానంగా కోర్టు నిర్మాణ పనుల్లో చాలా నాణ్యత పాటించడం చాలా ముఖ్యమని తెలిపారు. స్లాబ్ నిర్మాణాలు పూర్తి అయిన తర్వాత మరోసారి పరిశీలిస్తానని పేర్కొననఆరు. కార్యక్రమంలో న్యాయమూర్తులు వి.శారదా దేవి, పి.ఆంజనేయులు, మహ్మద్ ఆఫ్రోజ్ అక్తర్, రాజా రాజేశ్వరి,ఈశ్వరయ్య, రాధిక కోర్టు అధికారులు పాల్గొన్నారు. -
పెండింగ్ ప్రాజెక్టుల సాధనే లక్ష్యం
హన్వాడ: పాలమూరు జిల్లా జలవనరుల పరిరక్షణకు దశాబ్దాలుగా నలుగుతున్నా.. పెండింగ్ ప్రాజెక్టుల సాధనే లక్ష్యంగా ఉమ్మడి జిల్లా జలసాధన సమితి ఆధ్వర్యంలో ఈనెల 19వ తేదీన భారీ రౌండ్టేబుల్ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన వాల్పోస్టర్నును జేఏసీ నాయకులు హన్వాడలో శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పోరాటం రాజకీయాలకతీతంగా జిల్లా ప్రయోజనాల కోసమేనని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత విస్తారమైన కృష్ణానది పరివాహక ప్రాంతం దాదాపు 300 కి.మీ. మహబూబ్నగర్ జిల్లాలోనే ఉన్నప్పటికీ.. సాగు, తాగునీటి కష్టాలు తప్పకపోవడం పాలకులు, అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అని ఆవేదన వ్యక్తం చేశారు. 1983లో ప్రారంభించిన కల్వకుర్తి ఎత్తిపోతలు నేటికీ అసంపూర్తిగానే ఉందని, పాలమూరు–రంగారెడ్డి, జూరాల, భీమా, నెట్టెంపాడు వంటి కీలక ప్రాజెక్టులన్నీ కాగితాలకే పరిమితమయ్యామని విమర్శించారు. అలాగే ఆర్డీఎస్ పరిధిలో కర్ణాటక అక్రమంగా నీటిని ఆపేస్తున్నా.. అడిగే నాథుడు కరవయ్యారన్నారు. జిల్లాలో 40 లక్షల ఎకరాల సాగు భూమి ఉందని, ప్రాజెక్టులు పూర్తి చేసి రిజర్వాయర్లలో నీటిని నింపితే వలసలు ఆగిపోతాయన్నారు. రాబోయే తరాల భవిష్యత్ కోసం ఈనెల 19న నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశానికి మంత్రలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాలు, ముఖ్యంగా రైతాంగం పెద్ద ఎత్తున తరలివచ్చి జలసాధన పోరాటాన్ని విజయవంతం చేయా లని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బెక్కెం జనార్దన్, వీరబ్రహ్మచారి, తదితరులు పాల్గొన్నారు. -
నీటి సంపులో పడి ఉపాధ్యాయుడు మృతి
అమ్రాబాద్: నీటి సంపులో పడి ఉపాధ్యాయుడు మృతిచెందిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. అమ్రాబాద్ మండలం మాదవానిపల్లికి చెందిన ఎస్జీటీ గాజుల మోహన్ (26) ఇదే మండలంలోని కల్ములోనిపల్లి ప్రాథమిక పాఠశాలలో ఇన్చార్జి హెచ్ఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు. శుక్రవారం లక్ష్మాపూర్ (బీకే)లో జరిగే బంధువు వివాహానికి వెళ్లారు. అందరితో కలిసి ఉన్న సమయంలో ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న నీటి సంపులో పడ్డాడు. వెంటనే అక్కడున్న వారు అతడిని సంపులో నుంచి బయటికి తీసి.. ప్రైవేటు వాహనంలో అమ్రాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే సంేపులో పడే సమయంలో తలకు బలమైన గాయమై అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య అఖిల, తల్లిదండ్రులు సుగుణమ్మ, చెన్నకిష్టయ్య ఉన్నారు. ఉపాధ్యాయుడి మృతితో పెళ్లింట విషాదచాయలు అలుముకున్నాయి. ఎంఈఓ బాలకిషన్ మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, సంతాపం తెలిపారు. బైక్ను ఢీకొట్టిన ట్రాక్టర్.. వ్యక్తి మృతి వనపర్తి రూరల్: ట్రాక్టర్ బైక్ను ఢీకొట్టిన ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం పెబ్బేరు మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటేష్గౌడ్ వివరాల ప్రకారం.. మండలంలోని సూగూరు గ్రామానికి చెందిన చనమోని శ్రీనివాసులు(46) శనివారం బైక్పై పెబ్బేరుకు వచ్చి తిరిగి ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యలో బునాదిపురం గ్రామ శివారులోని కోళ్ల షెడ్డు వద్ద ట్రాక్టర్ ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి భార్య గోవిందమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. విద్యుదాఘాతంతో యువకుడు మృతి అచ్చంపేట రూరల్: ఇంటి నిర్మాణ పనులు చేపడుతున్న సమయంలో యువకుడు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతిచెందిన ఘటన శనివారం మండలంలోని బొమ్మనపల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని కొర్రతండాకు చెందిన సిద్దూ (19) కూలీ పనుల నిమిత్తం బొమ్మనపల్లిలో ఓ ఇంటి నిర్మాణంలో పనిచేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు 11 కేవీ విద్యుత్ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆర్థిక సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య గద్వాల క్రైం: ఆర్థిక సమస్యలతో ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గద్వాల మండలం కుర్వపల్లిలో శనివారం చోటు చేసుకుంది. రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ వివరాల మేరకు.. కుర్వపల్లికి చెందిన కుర్వ గోపాల్(40) పంటల సాగు, కుటుంబ అవసరాల కోసం తెలిసిన వ్యక్తుల వద్ద కొంత అప్పు చేశాడు. అయితే అప్పులు చెల్లించే దారిలేక మనస్తాపానికి గురైన అతడు.. వ్యవసాయ పొలంలో పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడి కుమారుడు శివ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
చేయూత నిలిచేనా..?
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): చేయూత పింఛన్ల లబ్ధిదారుల లెక్క ఇంకా తేలడం లేదు. కొంతమంది లబ్ధిదారుల ఆచూకీ లేకపోవడంతో వివరాలు ఎలా నమోదు చేయాలలో అధికారులు సతమతం అవుతున్నారు. లబ్ధిదారుల ధ్రువీకరణకు జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ఫేస్ రికగ్నిషన్ సిస్టం(ఎస్ఆర్ఎస్) సిబ్బందికి సవాల్గా మారింది. జూన్ 15 నుంచి జిల్లావ్యాప్తంగా ఎస్ఆర్ఎస్ ప్రక్రియ ప్రారంభించారు. పూర్తిస్థాయిలో లబ్ధిదారులను గుర్తించేందుకు అధికారులు అన్వేషిస్తున్నారు. జిల్లాలో మొత్తం 96,343 మంది చేయూత లబ్ధిదారులున్నారు. వీరిలో వృద్ధాప్య పింఛన్ లబ్ధిదారులు 33,646, వితంతులు 41,224, దివ్యాంగులు 12,960, గీత కార్మికులు 990, చేనేత 882, బీడీకార్మికులు 2,085, ఒంటరి మహిళలు 4,556 లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రతి నెల రూ.23,92,56,688 ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇందులో 76,778 లబ్ధిదారులకు బ్యాంక్ ఖాతాలో పింఛన్ డబ్బులు నమోదు అవుతుండగా.. 19,565 మంది లబ్ధిదారులు పోస్టాఫీస్ అకౌంట్ ద్వారా పింఛన్ తీసుకుంటన్నారు. దీంతో వీరికి సంబంధించిన ఎస్ఆర్ఎస్ ప్రక్రియ నిర్వహించగా.. 1,246 మంది లబ్ధిదారులు చనిపోయినట్లు గుర్తించారు. ఇప్పటి వరకు 15,082 మంది ఫేస్ రికగ్నిషన్ సిస్టంలో పొందుపరిచారు. ఇంకా 3,608 మంది ఫేస్ రికగ్నిషన్ ప్రక్రియ జరగాల్సి ఉంది. ఇందులో 935 మంది లబ్ధిదారుల లెక్క తేలాల్సి ఉంది. కొందరు అందుబాటులో లేకపోవడం, ఆధార్ కార్డుల సీడింగ్ సమాచారం పొంతన లేకపోవడం, ఇతర రాష్ట్రాల్లో ఉండడం, వీరిని గుర్తింపు సమస్యగా మారడం లాంటి వివిధ కారణాలతో ఫేస్ రికగ్నిషన్ లెక్క కొలిక్కి రాలేదు. త్వరితగతిన ప్రక్రియ పూర్తి జిల్లాలో ఫేస్ రికగ్నిషన్ పక్రియను త్వరితగతిన పూర్తి చేస్తాం. మున్సిపాలిటీల్లో ఆసరా, చేయూత పథకం లబ్ధిదారుల రికగ్నిషన్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేస్తాం. కొద్ది శాతం మిగిలింది. వివిధ కారణాలతో ఫేషియల్ రికగ్నిషన్ జరగని వారిని గుర్తించి సమగ్ర వివరాలు యాప్లో పొందుపరుస్తాం. – నర్సిములు, డీఆర్డీఓ ఇంకా తేలని పింఛన్ లబ్ధిదారుల లెక్క సవాల్గా మారిన ‘ఫేస్ రికగ్నిషన్’ సవాల్.. సతమతమవుతున్న యంత్రాంగం దొరకని 935 మంది లబ్ధిదారుల వివరాలు -
రాముడా.. రావణుడా? ఎవరి పాలన కావాలి
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలి. దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలి. రాహుల్ను ప్రధానిని చేయాల్సిన చారిత్రక అవసరం దేశంలో ఉంది. ఇందుకు తెలంగాణ ప్రజలు అండగా ఉండి.. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాందీకి కృతజ్ఞత తెలపాలి. నాతో కలిసి నడవండి.. రాహుల్ను ప్రధానిని చేద్దాం. అందుకు మొదటి అడుగు మిడ్జిల్ మండలం నుంచే పడాలి. – సీఎం రేవంత్రెడ్డిసాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పాపాల భైరవుడు రావాలి.. రావాలి అని కొడుకు, అల్లుడు తిరుగుతున్నారని, పదేళ్లలో రూ.8.21 లక్షల కోట్లు అప్పులు చేసిన కేసీఆర్ ప్రజలకు ఏం చేశారని సీఎం రేవంత్రెడ్డి నిలదీశారు. ‘మీ ఊళ్లలో ఎవరికైనా డబుల్ బెడ్రూమ్లు, ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాలు ఇచ్చారా? కోటి ఎకరాలకు నీళ్లు అందించారా? ఎందుకు వీళ్లు మళ్లీ రావాలి?..’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనను రావణుడితో, కాంగ్రెస్ పాలనను రాముడి పాలనతో పోలుస్తూ.. రాముడి పాలన కావాలా.. రావణుడి పాలన కావాలా? అనేది ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ప్రజా ప్రతినిధిగా 20 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా రేవంత్రెడ్డి శనివారం మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్లో పర్యటించారు. ముందుగా నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండపేటలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడే ఆత్మీయులతో ముచ్చటించారు. ఆ తర్వాత డీసీసీబీ మాజీ చైర్మన్ ధ్యాప గోపాల్రెడ్డి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉమ్మడి మిడ్జిల్ మండలంలోని 40 గ్రామ పంచాయతీలకు రూ.50 లక్షల చొప్పున మొత్తం రూ.20 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా ఊర్కొండ ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి రూ.10 కోట్లతో శిలాఫలకం ఆవిష్కరించారు. సుమారు రూ.17 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన ఆత్మీయ కృతజ్ఞత వందన సభలో మాట్లాడారు. ఏం చేశారని మీకు లక్షల కోట్లు వచ్చాయి? ‘పదేళ్లలో ఏం వ్యాపారం చేశారని మీకు, మీ కుటుంబాలకు లక్ష కోట్లు వచ్చాయి. తెలంగాణకు రూ.8.21 లక్షల కోట్ల అప్పులు ఎలా మిగిలాయి? బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే ఫామ్హౌస్లో పండించిన గంజాయి, డ్రగ్స్ను రైతు బజార్లలో పెట్టి అమ్ముతారు. మీతో పాటు పాటు దోపిడీ చేసిన ఆఫీసర్లను నిన్న మొన్న ఏసీబీ ఆఫీసర్లు పట్టుకుంటున్నారు. ఒక్కొక్కరి వద్ద రూ.100 కోట్లు, రూ.200 కోట్లు, రూ.300 కోట్ల అక్రమ సంపాదన బయట పడుతోంది. వీళ్లకు ఈ సొమ్ము ఎక్కడిది? ప్రజల నుంచి దోచుకున్నదే కదా. కేసీఆర్కు గజ్వేల్, ఎర్రవల్లిలో వెయ్యి ఎకరాల ఫాంహౌస్ ఎక్కడి నుంచి వచ్చింది? కేటీఆర్కు జన్వాడలో వంద ఎకరాలు, హరీశ్రావుకు మొయినాబాద్లో 50 ఎకరాలు, కల్వకుంట్ల కవితకు శంకర్పల్లిలో 25 ఎకరాల ఫామ్హౌస్లు ఎక్కడి నుంచి వచ్చాయి? నీ షడ్డకుడి కొడుకు సంతోష్రావుదైతే లెక్కలు చెప్పనికే లేదు. ఇంత సంపాదన ఈ పదేళ్లలో ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడివి ఈ ఆస్తులు? ఎక్కడ సంపాదించారు. ఎందుకు తెలంగాణ అప్పుల పాలైంది? మీకు ఉరి శిక్ష వేసినా తక్కువే.. బతుకమ్మ చీరల్లోనూ కమీషన్లు దండుకున్న దుర్మార్గులు, నీచులు. వాళ్ల సంపాదన, దోపిడీ, దొంగతనాలు ఆగిపోయాయనే మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారు. అప్పులు, తప్పులు చేసినవాళ్లు మళ్లీ వస్తే రాష్ట్రంలో ఫోన్ కూడా స్వేచ్ఛగా మాట్లాడుకోలేరు. ఆడబిడ్డల మాటలు దొంగతనంగా వినేవాడు అసలు మనిõÙనా? అసెంబ్లీకి రాడు.. ప్రజాసమస్యలు ప్రస్తావించడుం. అధికారం ఇస్తే దోచుకోవడానికి మాత్రం వస్తాడట. పదేళ్లలో రాష్ర్టంలో ఆయన చేసింది ఏమంటే ఇసుక దోపిడీకి అడ్డుపడిన నేరెళ్ల దళితులపైకి లారీలు ఎక్కించుడు. పండించిన పంటకు గిట్టుబాటు ధర అడిగినందుకు ఖమ్మం జిల్లాలో రైతులకు బేడీలు వేసి జైళ్లలో పెట్టించుడు. ప్రశ్నలు, ప్రశ్నపత్రాలను పల్లీ, బఠానీల మాదిరి అమ్ముకున్నారు. నిధులు, నీళ్లు, ఉద్యోగాలు ఇవ్వలేదు. పరిపాలనకు పాలమూరు బిడ్డ పనికిరాడా? ఆ పశుపతి ఫామ్హౌస్లోనే కుంగికృశించి పోవాల్సిందే. అధికారం అనేది ఇక వాళ్లు మరిచిపోవాల్సిందే. నల్లమల నుంచి వచ్చిన నాకు ఏమీ తెలియదని కొందరు అవహేళన చేశారు. పరిపాలనకు పాలమూరు బిడ్డ పనికిరాడా? అహంకారానికి, అహంభావానికి ఒక హద్దు ఉంటుంది. ప్రజాయుద్ధ నౌక, పేదల గళం గద్దర్ను గడీల ముందు నిలబెట్టిన మీకు ఉరి శిక్ష వేసినా తక్కువే..’ అంటూ సీఎం మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన ఖర్చేందో తేల్చండి ‘ఏం అన్యాయం చేశామని ప్రజా ప్రభుత్వం పోవాలి. గంజాయి, డ్రగ్స్ అమ్మే వాళ్లను జైల్లో పెట్టినందుకా? ధాన్యం చివరి గింజ వరకు కొని రైతుల ఖాతాల్లో రూ.80 వేల కోట్లు వేసినందుకా? 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, రేషన్కార్డులు, సన్న బియ్యం ఇచ్చినందుకా? రైతు రుణమాఫీ చేసినందుకా? సన్న వడ్లకు బోనస్, మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చింది వాస్తవం కాదా? జనగణనలో కులగణన చేసి వందేళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేదా?కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 30 నెలల్లో రైతు భరోసా కోసం రూ.1.76 లక్షల కోట్లు ఖర్చు చేసింది. సరాసరి ప్రతి నెలా రూ.5,600 కోట్లు మేం ఖర్చు చేస్తున్నాం. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు చేసిందేందో లెక్కలు తేల్చండి. నా ఆత్మ బంధువులు మిడ్జిల్ ప్రజల మధ్య నుంచి చెబుతున్నా. 2034 వరకు కాంగ్రెస్దే అధికారం..’ అని రేవంత్ అన్నారు. రబ్బానీకి పదవి ఇవ్వాలి.. మిడ్జిల్ను దత్తత తీసుకోవాలి ‘2006 జూలై 2 నాడు మిడ్జిల్ మండల ప్రజలు సువర్ణాక్షరాలతో ఒక చరిత్రను లిఖించిన రోజు. ఆనాడు మీరు నాటిన మొక్క ఈనాడు మహావృక్షమై ముఖ్యమంత్రిగా మీ ముందు నిలిచింది. ఆనాడు జెడ్పీటీసీగా నా గెలుపు నాది కాదు.. ఈ మిడ్జిల్ మండల ప్రజలది. స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన ఈ బిడ్డను ఆశీర్వదించిన మీ నిర్ణయం గొప్పది. అయితే నా వల్ల ఎవరికీ కష్టం, నష్టం రాకూడదన్నదే నా ఆలోచన. అందుకే ఆనాడు జెడ్పీ చైర్మన్ రేసులో నిలిచి జెడ్పీటీసీ అభ్యరి్థగా నాపై ఓడిన రబ్బానీకి ఈ రోజు ఒక మంచి పదవి ఇవ్వాలని డిప్యూటీ సీఎంకు సూచిస్తున్నా. నా బాధ్యతను నెరవేర్చేందుకు మిడ్జిల్ను దత్తత తీసుకోవాలని భట్టిని కోరుతున్నా. మిడ్జిల్ మండలానికి ఏమిచ్చినా, చివరికు నా ప్రాణమిచ్చినా తక్కువే..’ అని ముఖ్యమంత్రి అన్నారు. సీఎం కాన్వాయ్కు ట్రాఫిక్ చిక్కులు శంషాబాద్ రూరల్: మిడ్జిల్ నుంచి హైదరాబాద్కు బయలుదేరిన సీఎం రేవంత్రెడ్డి కాన్వాయ్కు శనివారం ట్రాఫిక్ చిక్కులు ఎదురయ్యాయి. దీంతో బెంగళూరు జాతీయ రహదారిపై ఆయన వాహన శ్రేణి నెమ్మదిగా వెళ్లాల్సి వచ్చింది. రాత్రి 7.35 గంటల సమయంలో శంషాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో కాన్వాయ్ వెళ్తుండగా.. హైవేపై ట్రాఫిక్ జాంను క్లియర్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారనే విమర్శలు విన్పించాయి. ప్రజలకు మంచి చేయడమే లక్ష్యం: భట్టి ప్రజలకు మంచి చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ప్రజా సమస్యలను దగ్గరగా చూసిన సీఎం రేవంత్రెడ్డి అధికారులపైనే ఆధారపడి పాలన సాగించడం లేదని, ప్రజలకు దగ్గరగా సంక్షేమాన్ని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. 20 ఏళ్ల క్రితం ఓట్లు వేసి జెడ్పీటీసీగా గెలిపించిన ప్రజలను మర్చిపోకుండా వారందరికీ కృతజ్ఞతలు తెలపడం మంచి సాంప్రదాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎంపీలు మల్లు రవి, వేం నరేందర్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు జితేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు అనిరు«ద్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, వంశీకృష్ణ, మధుసూదన్రెడ్డి, మేఘారెడ్డి, రాజేష్రెడ్డి, వీర్లపల్లి శంకర్, కార్పొరేషన్ చైర్మన్లు శివసేనారెడ్డి, కొత్వాల్, తదితరులు పాల్గొన్నారు. -
‘ఆనాడు మీరు నాటిన మొక్క ఇప్పుడు మహావృక్షమైంది’
మహబూబ్ నగర్: ఒకనాడు మిడ్జిల్ ప్రజలు నాటిన మొక్కే ఈరోజు మహా వృక్షమై ముఖ్యమంత్రిగా మీ ముందు నిలిచందన్నారు సీఎం రేవంత్రెడ్డి. మిడ్జిల్ “కృతజ్ఞత సభ”లో ముఖ్యమంత్రి రేవంత్ ప్రసంగించారు. ‘జూలై 2, 2006 నాడు మిడ్జిల్ మండల ప్రజలు సువర్ణాక్షరాలతో ఒక చరిత్రను లిఖించిన రోజు. ఆనాడు మీరు నాటిన మొక్క ఈనాడు మహా వృక్షమై ముఖ్యమంత్రిగా మీ ముందు నిలిచింది. 20 ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే రోజున కృతజ్ఞత సభ ఏర్పాటు చేయడం సంతోషం. ఈ జిల్లాకు ఒక గొప్ప నాయకత్వం బాధ్యత నిర్వహించిన అనుభవం ఉంది. హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదట ముఖ్యమంత్రిగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు ఈ జిల్లా బిడ్డనే. ఉత్తమ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డిది ఈ గడ్డనే. జైపాల్ రెడ్డి రాజకీయ ఎదగడానికి తోడ్పడిన ద్యాప గోపాల్ రెడ్డి ఈ మిడ్జిల్ బిడ్డ. అందుకే రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్తో పాటు ద్యాప గోపాల్ రెడ్డి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకున్నాం. జూలై 4,2006 నా గెలిచిన గెలుపు నాది కాదు.. ఈ మిడ్జిల్ మండల ప్రజలది. స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన ఈ బిడ్డను ఆశీర్వదించిన మీ నిర్ణయం గొప్ప నిర్ణయం. నా వల్ల ఎవరికీ కష్టం నష్టం రాకూడదన్నదే నా ఆలోచన. అందుకే ఆనాడు జర్పీటీసీ అభ్యర్థిగా నాపై ఓడిన రబ్బానీకి ఈనాడు ఒక మంచి పదవి ఇవ్వాలని ఉపముఖ్యమంత్రికి సూచన చేస్తున్నా’ అని పేర్కొన్నారు. -
18న ఎన్ఐ యాక్ట్పై లోక్ అదాలత్
పాలమూరు: జిల్లాలో ఈనెల 18న జిల్లా కోర్టు ఆవరణలో ఎన్ఐ యాక్ట్ కేసులపై ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత ఒక ప్రకటనలో తెలిపారు. కోర్టులో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఎన్ఐ యాక్ట్ కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కేసులలో ఉన్న కక్షిదారులు, చిట్ఫండ్స్, ఫైనాన్స్ కంపెనీల నిర్వాహకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టీఈడీఎక్స్ సదస్సుకు ప్రభుత్వ విప్ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నోయిడాలో ఈనెల 4న టీఈడీఎక్స్ ఆధ్వర్యంలో జరిగే జాతీయ సదస్సులో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి పాల్గొననున్నారు. ఈ సందర్భంగా నియోజక వర్గంలో ‘మహబూబ్ నగర్ ఫస్ట్’ ఆధ్వర్యంలో చేపడుతున్న విద్యాభివృద్ధి కార్యక్రమాలను ఆయన వివరించనున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలను ప్రస్తావించనున్నారు. వేతనాల పెంపునకు పోరుబాట మహబూబ్నగర్ మున్సిపాలిటీ: కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచాలంటూ ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు పోరుబాట పడుతున్నామని తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్ చెప్పారు. దీనికి సంబంధించి శుక్రవారం జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.రంగా అజ్మీరాకు సమ్మె నోటీసులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య, సెక్యూరిటీ, పేషంట్ కేర్ సూపర్వైజర్ కార్మికుల నిర్వహణను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించారన్నారు. అయితే ప్రభుత్వం నిర్ణయించిన వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ చెల్లింపులు పారదర్శకంగా లేవన్నారు. ఈ కార్మికుల వేతన చెల్లింపుల్లో అనేక అవినీతి అక్రమాటు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఆస్పత్రి పడకల సామర్థ్యానికి అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచి పనిభారం తగ్గించాలన్నారు. ఏజెన్సీల వ్యవస్థను రద్దు చేసి కార్పొరేషన్ ద్వారానే వేతనాలు చెల్లించాలన్నారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఈనెల 7, 8న ప్రభుత్వ ఆస్పత్రుల ఎదుట ఆందోళన చేపట్టనున్నామన్నారు. అలాగే 9న చలో హైదరాబాద్ పేరిట కోఠిలోని తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, వైద్య విధాన పరిషత్ కార్యాలయాలను ముట్టడిస్తామన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు బి.చెన్నయ్య, ఎస్.దేవానంద్, రంగన్న, భీమన్న, శ్రీనివాస్రెడ్డి, జగ్గానాయక్, సాయిప్రకాష్, లక్ష్మి, నరేష్ పాల్గొన్నారు. జూపల్లి వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాం కందనూలు/ లింగాల: కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులపై మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలకు తామంతా కట్టుబడి ఉన్నామని ఎంపీ మల్లురవి అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు రాజేష్రెడ్డి, వంశీకృష్ణతో కలిసి ఆయన మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం రూ.8.21 లక్షల కోట్ల అప్పు చేసిందని, వీటికి తమ ప్రభుత్వం ప్రతినెలా రూ.6.800 కోట్ల వడ్డీ కడుతుందని పేర్కొన్నారు. వీటిని ఆధారాలతో సహా నిరూపిస్తామని, అలా చేస్తే బీఆర్ఎస్ నేతలు రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. తమ సవాల్ను స్వీకరించే దమ్ము లేక ప్రభుత్వంపై బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు ఎదురు దాడికి దిగుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, అది చూసి ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ గ్లోబల్ ప్రచారం మానుకోవాలని, మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. -
పీఏసీఎస్ సేవలు అభినందనీయం
ఉప్పునుంతల: రుణాలు అందజేయడమే కాకుండా విత్తనం మొదలు పంట కొనుగోలు వరకు సంఘ సభ్యులకు అన్ని విధాలుగా సహకారం అందజేస్తున్న ఉప్పునుంతల పీఏసీఎస్ సేవలు అభినందనీయమని తెలంగాణ సహకార శాఖ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి అన్నపూర్ణ అన్నారు. శుక్రవారం ఉప్పు నుంతల పీఏసీఎస్లో నిర్వహిస్తున్న సహకార వారోత్సవాల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో మొత్తం 906 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉండగా వాటిలో 311 సంఘాలు రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్పీఓ)గా ఎంపికై నట్లు తెలిపారు. వాటిలో నాగర్కర్నూల్ జిల్లాలో 16 సంఘాలు ఎఫ్పీఓకు ఎంపిక కాగా ఉప్పునుంతల పీఏసీఎస్ మొదటి స్థానంలో నిలువగా ప్రశంసించారు. కొత్తగా వేరుశెనగ డికార్టికేటర్ ఏర్పాటుచేయడం, వెయిట్ బ్రిడ్జి, డ్రోన్ సేవలు, ఎరువుల పంపిణీ, వ్యవసాయ పంట రుణాలతోపాటు ధీర్ఘకాలిక రుణాలు, బంగారు ఆభరణాలపై రుణాలు అందిస్తూ రైతుల సంక్షేమానికి వినూత్న సేవలు అందిస్తున్న ఉప్పునుంతల సహకార సంఘ పాలకవర్గం, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. నాగర్కర్నూల్ డీసీఓ రఘునాథ్ మాట్లాడుతూ..ఎఫ్పీఓల ద్వార రైతులకు అందే ప్రయోజనాలు, ఇతర సేవల ను వివరించారు. బిజినెస్ డెవలఫ్మెంట్ ప్లాన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వేరుశెనగ డికార్టికేటర్ వినియోగంతో రైతులకు కలిగే ప్రయోజనాలు, విలువ ఆధారిత సేవలపై అవగాహన కల్పించారు. అంతకు ముందు వారు పీఏఎస్ ద్వారా అందిస్తున్న సేవలను పరిశీలించారు. కార్యక్రమలంలో జిల్లా సంయుక్త రిజిస్ట్రార్ శ్రీమతి పరిమిళ, సూపరింటెండెంట్ మధురావు, పీఏసీఎస్ చైర్మన్ మడ్డు నరేందర్రెడ్డి, మాజీ చైర్మన్ సత్తు భూపాల్రావు, సంఘ డైరెక్టర్లు సాయిబాబు, నారాయణ్రెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
ఉండవెల్లి: తాళం వేసిన ఇంట్లో బంగారు, వెండి ఆ భరణాలు చోరీ జరిగిన ఘ టన మండలంలోని పుల్లూరు గ్రామంలో జరిగింది. హెడ్ కానిస్టేబుల్ వీరన్న తెలిపిన వివరాలు.. కర్నూ లు జిల్లా జూపాడు బంగ్లాకు చెందిన శ్రీనివాసు లు ప్రైవేటు ఫైనాన్స్ ఉద్యోగం చేస్తూ పుల్లూ రు శివారులో కుటుంబంతో కలిసి నివాస ముంటున్నారు. ఈ నెల 1న శ్రీనివాసులు అత్త గారి దినకార్యాలకు ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లా కు వెళ్లి 2వ తేదీ రాత్రి ఇంటికి వ చ్చి చూడగా వస్తువులు చెల్లా చెదురుగా పడి ఉండటంతో పాటు 4 తులాల బంగారు, 6 తు లాల వెండి తదితర వస్తువులు కూడా చోరీకి గురైనట్లు గుర్తించారు. అనంతరం ఉండవెల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా శుక్రవారం సీఐ ప్రదీప్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
కేజీబీవీలో మౌలిక వసతులు కల్పిస్తాం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: కేజీబీవీలో మౌలిక వసతులు కల్పిస్తామని రీజినల్ జాయింట్ డైరెక్టర్ సోమిరెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఏనుగొండ కేజీబీవీలో విద్యార్థులకు అవసరమైన పరికరాలను కార్పొరేట్ రెస్పాన్సిబుల్ ఫండ్ కింద 25 లీటర్ల సామర్థ్యం గల మూడు వేడినీటి గీజర్లు, 15 కిలోల సామర్థ్యం గల రోటీ మేకింగ్ మిషన్, 16 కిలోల స్టీల్ కుక్కర్, 20 లీటర్ల సామర్థ్యం గల 8 కూల్ వాటర్ క్యాన్లను శుక్రవారం విద్యార్థులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్వీఎస్ ఆస్పత్రి సహకారంతో మౌలిక సదుపాయాలు సమకూర్చుతున్నామన్నారు. ఉచిత వసతి, పోషకాహారం, యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, డిజిటల్ విద్యతో పాటు నీట్, ఎంసెట్ వంటి వాటికి ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. డీఈఓ విజయకుమారి, జీసీడీఓ అస్త్రాఖాద్రీ, ఎస్ఓ శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ఈసీ డిజిటల్ అస్త్రం!
● ఓటర్ల జాబితా సవరణలో కీలకంగా యాప్ ● బీఎల్ఓల యాప్లో మాడ్యూళ్లతో పారదర్శకత ● సర్వే వివరాలు, మ్యాపింగ్ అంతా ఆన్లైన్లోనే.. అచ్చంపేట: ఓటర్ల జాబితా పారదర్శకంగా రూపకల్పన చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)కొనసాగుతుంది. ఈ క్రమంలో లోటుపాట్లు ఎదరుకాకుండా ఎన్నికల సంఘం సరికొత్త సాంకేతికతను జోడించింది. ఇందుకోసం ఇంటింటా వివరాలు సేకరించే బూత్ లెవల్ అధికారి(బీఎల్ఓ)ల కోసం యాప్లోని ఎసినెట్ ఆప్టికేషన్లలో మార్పులు తీసుకొచ్చింది. ఈ మేరకు ఫీ–డ్రాఫ్ట్, పోస్ట్ డ్రాప్ట్ మాడ్యూళ్లను చేర్చారు. వారు.. ప్రత్యేకం.. బీఎల్ఓలు ఓటరు ఇంటికి ఓ సారి వెళ్లినప్పుడు లేకపోతే మరో రెండు సార్లు వెళ్లాలి. అయినప్పటికీ అందుబాటులో లేకపోయినా, ఓటరు చనిపోయినా, శాశ్వతంగా వలస వెళ్లినా, ఫారంపై సంతకం చేయడానికి నిరాకరించినా ప్రత్యేకంగా నమోదు చేయాలి. ఇందుకు సంబంధించిన వివరాలను 150 అక్షరాల్లో రాసి ఫారాన్ని యాప్లో అప్లోడ్ చేసి మార్క్ అన్కలెక్టబుల్గా నమోదు చేయాల్సి ఉంటుంది. పొరపాట్లు జరగకుండా.. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ అనంతరం అభ్యంతరాలు, సవరణల కోసం యాప్లో ప్రత్యేక ఫీచర్లు చేర్చారు. ఓటరు పేరు, బంధుత్వాల పేర్లలో తప్పులు ఉంటే (గత ఓటరు లిస్ట్తో తండ్రి పేరు సరిపోకపోతే) యాప్ చూపిస్తుంది. దీంతో ఆధారాలను బీఎల్ఓలు అప్లోడ్ చేయడమే కాక, అభ్యంతరాలపై విచారణ నోటీసులకు ఇచ్చిన రసీదులను కూడా నమోదు చేయాలి. విచారణ సమయాన గ్రూప్ ఫొటో, అటెండెన్స్ షీట్ను సైతం లైవ్లో అప్లోడ్ చేయడాన్ని తప్పనిసరి చేశారు. ఓటరు గుర్తింపు కార్డులోని పాత ఫొటో స్పష్టంగా లేకపోతే కొత్త ఫొటోను యాప్ ద్వారా పరిశీలించి అప్డేట్ చేయొచ్చు. ఇక 85 ఏళ్లకు పైబడిన వృద్ధులు, అనుమానాస్పద ఇళ్లల్లో లేని, ఇళ్లు మారిన, చనిపోయిన ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో మరొసారి పక్కాగా నిర్ధారించుకునే సదుపాయం బీఎల్ఓలకు యాప్ ద్వారా కల్పించారు. ఒకే క్లిక్తో అధికారుల డైరెక్టరీ క్షేత్రస్థాయిలో తిరిగే బీఎల్ఓలకు ఏలాంటి అత్యవసర సాయం కావాలన్నా.. ఉన్నతాధికారులను సంప్రదించాలన్నా ఎసినెట్ యాప్లోనే ప్రత్యేక కాంటాక్ట్ డైరెక్టరీని పొందుపరిచారు. ఇందులో సీఈఓ, డీఈఓ, ఈఆర్ఓ, ఆర్ఓ, ప్రిసైడింగ్ అధికారుల ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంటాయి. ఆ నంబర్ల ఆధారంగా ఉన్నతాధికారులకు ఫోన్ చేసి మాట్లాడొచ్చు. ఇలాంటి అనేక సౌకర్యాలతో బీఎల్ఓలు చేపట్టే ప్రక్రియలు సులభంగా మారాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. -
ఆర్ఎన్ఆర్ క్వింటా రూ.2,769
జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం ధాన్యం ఆర్ఎన్ఆర్ రకానికి సంబంధించి క్వింటా గరిష్టంగా రూ.2,769, కనిష్టంగా రూ.2,279 ధరలు లభిచాయి. మొక్కజొన్న గరిష్టంగా రూ.2,470, కనిష్టంగా రూ.2,372, పొద్దుతిరుగుడు రూ.5,866 ధరలు లభించాయి. గద్వాల మార్కెట్ యార్డుకు 1,400 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. కాగా.. క్వింటా గరిష్టంగా రూ.7,832, కనిష్టంగా రూ.2,639, సరాసరిగా రూ.5,900 ధరలు లభించాయి. అలాగే కంది క్వింటా సరాసరిగా రూ.6,251 పలికింది. జూరాలకు స్వల్ప ఇన్ఫ్లో ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్ప ఇన్ఫ్లో వస్తుంది. శుక్రవారం ప్రాజెక్టుకు కేవలం 223 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా.. 38 క్యూసెక్కులు ఆవిరైందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 2.511 టీఎంసీల నీరు నిల్వ ఉందని చెప్పారు. -
సభ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, డీఐజీ
మిడ్జిల్: మండలకేంద్రంలో శనివారం సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను జోగుళాంబ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎస్పీ జానకితో కలిసి సభా ప్రాంగణం, హెలిప్యాడ్, పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. అనంతరం డీఐజీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు, ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సకాలంలో పూర్తి చేయండి.. సీఎం సభకు సంబంధించి ఏర్పాట్లను అన్ని శాఖల అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా ఆదేశించారు. విగ్రహాల ఏర్పాటు స్థలం, హెలిప్యాడ్ పనులు, సభ ప్రాంగణంలో ఏర్పాట్లను శుక్రవారం ఆమె పరిశీలించారు. ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా వేగంగా పనులు పూర్తి చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ మధుసూదన్రెడ్డి, ఆర్డీఓ నవీన్, డీఎస్పీ మహేస్, తదితరులు ఉన్నారు. -
పెళ్లి పత్రికలు పంచుతూ వరుడు అదృశ్యం
నవాబుపేట: మరో మూ డు రోజుల్లో పెళ్లి పీటలెక్కనున్న వరుడు అకస్మాత్తు గా అదృశ్యమయ్యా డు. ఫలితంగా పెళ్లి ఇంట్లో ఆందోళన మొదలైంది. వరుడి కోసం 24గంటలపాటు వే చిచూసిన కుటుంబ సభ్యులు చివరికి శుక్రవా రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండలంలోని లోకిరేవుకు చెందిన రఘురాంగౌడ్కు హైదరాబాద్కు చెందిన యువతితో ఈనెల 5వ తేదీన పెళ్లి నిశ్చయించారు. దీనికిగాను అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. శనివారం వరుడు రఘురాం ఇంటిముందు పెళ్లి పందిరి వేయా ల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ నెల 2వ తేదీన పెళ్లి పత్రికలు ఇచ్చి తన మిత్రులు, బంధువులను పెళ్లికి ఆహ్వానించేందుకు జడ్చర్ల వెళ్లి వస్తానని ఇంట్లో నుంచి వెళ్లాడు. కాగా, అదేరో జు మధ్యాహ్నం నుంచి ఫోన్ స్వీచ్ ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది బంధువుల చెంత వెతికారు. ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లికొడుకు అదృశ్యంతో ఇటు వరుడు, అటు వధువు కుటుంబ సభ్యు ల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. వరుడి సోద రుడు విజయ్కుమార్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్ఐ నరేందర్ తెలిపారు. యువకుడి అనుమానాస్పద మృతి ఊట్కూర్: మండల కేంద్రంలోని శ్రీరాంనగర్వీధిలో శంకర్(25) అనే యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు... గ్రామానికి చెందిన రోషనప్ప, పద్మమ్మ కుమారుడు శంకర్ నారాయణపేటలోని ఓ పెట్రోల్ బంక్లో పనిచేస్తుండేవాడు. సాయంత్రం ఇంట్లో నిద్రిస్తున్న కుమారుడిని తండ్రి నిద్రలేపగా అపస్మారక స్థితిలో ఉండటంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అనుమానాస్పదంగా మృతి చెందాడని మృతుడి తండ్రి రోషినప్ప పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేశ్ తెలిపారు. అల్లుడి దాడి ఘటనలో మామ మృతి కేటీదొడ్డి: కుటుంబ కలహాల నేపథ్యంలో అల్లుడి వరుసైన వ్యక్తి దాడి చేసిన ఘటనలో గాయపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాలు.. మల్లాపురం తండాకు చెందిన మూడావత్ రాజునాయక్ (45) అల్లుడి వరుసైన పాండునాయక్ ఈ నెల 2న మధ్యాహ్నం ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో రాజునాయక్ తల, పొత్తికడుపుపై బలంగా దాడి చేశాడు. ఈ క్రమంలో తెల్లవారుజామున మూత్రం రాకుండా ఇబ్బందులు పడుతుండగా కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో రాజునాయక్ మృతి చెందాడు. మృతుడి భార్య నీలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
కొత్తగా 5,016 మందికి రైతు భరోసా
● జూన్ 15 నాటికి పాస్ పుస్తకాలు పొందిన వారికి అవకాశం ● దరఖాస్తుకు ఈ నెల 5వ తేదీ వరకు గడువు మహబూబ్నగర్ (వ్యవసాయం): రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జూన్ 15వ తేదీ నాటికి కొత్త పట్టా పాస్ పుస్తకాలు పొందిన రైతులు కూడా రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి సాయం పొందేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం తగిన పత్రాలతో స్థానిక రైతు వేదికల్లో ఏఈఓలకు ఈ నెల 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని గడువు విధించింది. ఈ నిర్ణయంతో జిల్లాలో మరికొంత మంది రైతులు లబ్ధి పొందనున్నారు. కటాఫ్ తేదీ ప్రకారం జిల్లాలో కొత్త పట్టాదారు పుస్తకాలు పొందిన వారు 5,016 మంది ఉన్నట్లుగా వ్యవసాయ శాఖ వెల్లడించింది. అయితే వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధులు జూన్ 30వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తున్న సంగతి తెలిసిందే. పాత రైతులతో పాటు కొత్త రైతులకు కూడా పెట్టుబడి సాయం అందనుంది. ఎకరానికి రూ.6 వేల చొప్పున ప్రభుత్వం ఇవ్వనుంది. కొత్త పట్టాలు పొందిన రైతులు దరఖాస్తు చేసుకునేలా వ్యవసాయ అధికారులు వాట్సాఫ్ గ్రూపుల్లో, స్టేటస్ల ద్వారా సమాచారాన్ని చేరవేస్తున్నారు. జిల్లాలో వానాకాలం రైతు భరోసా కోసం మొత్తం 2,63,019 మంది రైతులు అర్హులుగా ఉన్నారు. వీరందరికీ పెట్టుబడి సాయం అందించేందుకు రూ.263.19 కోట్ల నిధులు అవసరం అవుతాయి. అయితే ప్రస్తుతం ప్రభుత్వం నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమ చేశారు. -
ప్రజాస్వామ్యాన్ని అందరూ కాపాడుకోవాలి
● రాజ్యాంగం ప్రజల చేతిలో ఉండాలి ● ప్రొఫెసర్ జి.హరగోపాల్ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఫాసిజం నుంచి అందరూ బయటపడాలని, ఏమి మాట్లాడితే ఏమి జరుగుతుందోననే భయాందోళన చాలా మందిలో నెలకొందని ప్రొఫెసర్ జి.హరగోపాల్ అన్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని.. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించొద్దన్నారు. అందరికీ విద్య సమంగా అందాలని, మానవీయ సమాజం కావాలని, ప్రజాస్వామ్యాన్ని అందరూ కాపాడుకోవాలన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం మెట్టుగడ్డలోని సీనియర్ సిటిజన్స్ ఫోరం కార్యాలయంలో ‘ఎస్ఐఆర్ నేపథ్యం, ప్రత్యేకతలు, పర్యవసానాలు’పై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ హక్కులను కాపాడాలని, రాజ్యాంగం సంపన్న వర్గాల వద్ద కాకుండా ప్రజల చేతిలో ఉండాలన్నారు. ప్రపంచీకరణ పేరుతో ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పుల కారణంగా ప్రజల సంక్షేమాన్ని పాలకులు గాలికొదిలేశారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో అధికారం కేంద్రీకృతం కావొద్దని దీనివల్ల ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. దేశ భవిష్యత్ కోసం ఆర్థిక విధానాలు మారాలని, న్యాయ వ్యవస్థ, ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించాలన్నారు. ముఖ్యంగా రాజకీయ పార్టీలతో ఎస్ఐఆర్ సంబంధమే లేదన్నారు. వాస్తవానికి పాలకులను ఓటరు ఎన్నుకోవాలి..అలాంటిది ఓటర్లను పాలకులే మభ్యపెడుతూ తమ పబ్బం గడుపుకొంటున్నారని విమర్శించారు. ఆర్థిక, సామాజిక విశ్లేషకుడు డా.పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ సర్ ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందని పేర్కొన్నారు. దీని పేరిట సమాజంలోని కొన్ని వర్గాల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించడం సరికాదన్నారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ధరలతో పాటు కూలీలు, యువతకు ఉపాధి లేక ఎన్నో ఇబ్బందులు పడుతుంటే వీటిని పక్కనబెట్టి కేవలం ‘సర్’పై దృష్టి పెట్టడమేమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షుడు ఎస్.జగపతిరావు, ఉపాధ్యక్షుడు ఎ.రాజసింహుడు, సభ్యులు నస్కంటి నాగభూషణం, కోటేశ్వర్రెడ్డి, ఎ.తిమ్మప్ప, న్యాయవాది బెక్కం జనార్దన్, పాలమూరు అధ్యయన వేదిక ప్రతినిధులు ఎం.రాఘవాచారి, హనీఫ్అహ్మద్, హిమబిందు తదితరులు పాల్గొన్నారు. -
మీసేవలో డిజిటల్ విధానం
● మీసేవ కేంద్రాల్లో రశీదుకు స్వస్తి ● దరఖాస్తుదారుడి ఫోన్కి హైపర్ లింక్ ● మెసేజ్ డిలీట్ అయితే తిరిగి పంపించే వెసులుబాటు జెడ్పీసెంటర్(మహబూబ్నగర్)/కల్వకుర్తి టౌన్: రెవెన్యూ కార్యాలయంలో కుల, ఆదాయ, నివాస, తదితర సర్టిఫికెట్ల కోసం మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నప్పుడు నిర్వాహకులు సంబంధిత రశీదు ఇస్తారు. ప్రస్తుతం అంతా ఆన్లైన్ కావడంతో ఇక రశీదులు కనుమరుగు కానున్నాయి. గతంలో రశీదులు పోతే సంబంధిత ధ్రువపత్రాలు పొందేందుకు ఎంతో ఇబ్బంది పడేవారు. ప్రస్తుతం ఆన్లైన్ కావడంతో రశీదు స్థానంలో దరఖాస్తుదారుల ఫోన్నంబర్కు మెసేజ్ రూపంలో సంబంధిత సేవ వివరాలను పంపించనున్నారు. దాని ద్వారానే దరఖాస్తుదారుడు అతను పొందే సేవ వివరాలను చూసుకోవచ్చు. మొబైల్కు రశీదు లింకు మీ సేవలో ప్రవేశపెట్టిన కొత్త విధానం ప్రకారం మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకున్న వెంటనే దరఖాస్తుదారుడికి ఒక మెసేజ్ వస్తుంది. అందరూ అప్లికేషన్ నంబరు, సేవ పేరు, చెల్లించిన ఫీజు వివరాలతో పాటు ఒక హైపర్ లింక్ వస్తుంది. దరఖాస్తుదారులు ఆ లింకుపై క్లిక్ చేసి వారి అక్నొలడ్జిమెంట్ రసీదును ఎప్పుడైనా చూసుకోవచ్చు లేదా డౌన్ లోడ్, ప్రింట్ తీసుకోవచ్చు. సర్టిఫికెట్ చేతికి వచ్చేవరకు ఈ మెసేజ్ను సురక్షితంగా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. స్పష్టమైన ఆదేశాలు మీసేవ కేంద్రాలకు నూతనంగా వచ్చిన నిబంధన ప్రకారం మీసేవ నిర్వాహకులు, ఆపరేటర్లు దరఖాస్తుదారుల నుంచి ఖచ్చితమైన, యాక్టివ్లో ఉన్న మొబైల్ నంబర్లను మాత్రమే సేకరించాల్సి ఉంటుంది. ఈనెల 19వ తేదీ నుంచి ఎలాంటి ఫిజికల్ (కాగితపు) రసీదులను ప్రింట్ తీసి ఇవ్వకూడదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఒకవేళ నిబంధనలను ఉల్లంఘించి పాత పద్ధతిలోని కాగిత రసీదులు జారీ చేస్తే సదరు కేంద్రాలపై కఠిన చర్యలు ఉంటాయని మీసేవ కేంద్రాల అధికారులు హెచ్చరిస్తున్నారు. అప్లికేషన్ ఇచ్చేటప్పుడు ప్రస్తుతం వాడుకలో ఉన్న మొబైల్ నంబర్ మాత్రమే ఇవ్వాలని, లేదంటే భవిష్యత్తులో అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడం కష్టమవుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరిన్ని విభాగాలు విస్తరించేలా.. ఆన్ లైన్ లో మీసేవ ద్వారా అందించే సేవలను కేవలం రెవెన్యూ శాఖలో మాత్రమే పేపర్ లెస్ సేవలను అందిస్తున్నారు. మీ సేవలో ముఖ్యంగా మున్సిపల్, పోలీసు ఇతర విభాగాలలో అందించే సేవలకు సంబంధించి వాటిని కూడా పేపర్ లెస్ చేయాలని ప్రజలు కోరుతున్నారు. కాగిత రహిత పాలనే ధ్యేయంగా నూతన విధా నం అమలు చేస్తున్నాం. దీనికి సంబం ధించిన ఉత్తర్వులను ఇప్పటికే మీ సేవ కేంద్రాల నిర్వాహకులకు అందజేశాం. మీసేవ కేంద్రాల్లో పేపర్ రశీదు ఇచ్చే పద్ధతికి స్వస్తి పలుకుతున్నాం. – చంద్రశేఖర్, ఈడీఎం మీ సేవ కేంద్రాల్లో రెవెన్యూ లాగిన్ లో ప్రజలు ఆదాయ, నివాస, కుల, సర్టిఫికెట్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఫిజికల్ దరఖాస్తు ఫారాలు కార్యాలయాలకు పంపిస్తే అక్కడ అధికారులకు దొరక్క నెలల తరబడి పెం డింగ్లోనే ఉంటున్నాయి. మళ్లీ జిరాక్స్ ప్రతులను తీసుకెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు పేపర్ లెస్ సేవలతో ఆ పరిస్థితి ఉండదు. – షేక్ రఫీ సిరాజ్, తెలంగాణ మీసేవ ఫెడరేసన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జిల్లాలోని మీసేవ కేంద్రాలలో ప్రజలు పొందే సేవలకు గాను ఇచ్చే రసీదులకు స్వస్తి చెప్పి పూర్తిగా డిజిటల్ రూపంలో వారికి అందించే సేవలు పక్కాగా అమలు చేయాలని సూచించాం. పేపర్ లెస్ విధానంలో భాగంగా ప్రజలు మీ సేవలో దరఖాస్తు చేసుకోగానే వారి మొబైల్ ఫోన్కు మెసేజ్ రూపంలో సందేశం వస్తుంది దాని ద్వారానే వారి యొక్క దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చు. – అమరేందర్, అడిషనల్ కలెక్టర్, రెవెన్యూ -
వేతనాల సంబురం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది వేతనాలు ఎట్టకేలకు పెరిగాయి. యూనివర్సిటీ ప్రారంభం నుంచి వేతనాల పెంపు విషయంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురైన నేపథ్యంలో సిబ్బందికి వేతనాలు పెరగడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2025 నవంబర్లో తీసుకువచ్చిన జీఓకు అనుగుణంగా వేతనాలను సిబ్బంది ఖాతాల్లో జమచేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇందులో సూచించిన విధంగా క్యాడర్ ఆధారంగా వేతనాలు ఇచ్చారు. అయితే ఇక నుంచి పీయూలో పనిచేస్తున్న సిబ్బంది అందరూ కూడా ఔట్సోర్సింగ్ ఏజెన్సీల కిందకి వెళ్లారు. ఈ కారణంగా పలువురు సిబ్బంది అభద్రతా భావానికి లోనవుతున్నారు. మొత్తం 280 మందికి పైగా సిబ్బంది ఇప్పుడు ఏజెన్సీల కింద పనిచేయాల్సి ఉంటుంది. అయితే 7 నెలల క్రితమే నాన్టీచింగ్ సిబ్బందితో పీయూ అధికారులు సమావేశం ఏర్పాటు చేసి అందరినీ ఔట్సోర్సింగ్లో విలీనం చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఐఎస్ఎంఎఫ్ పోర్టల్లో సిబ్బంది పేర్లు నమోదు చేసి ఔట్సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగించే ప్రక్రియను అధికారులు తాజాగా పూర్తిచేశారు. పీయూలో పనిచేస్తున్న సిబ్బందిని ఔట్సోర్సింగ్లో కలపాలని రాష్ట్రస్థాయి అధికారులతో చర్చలు జరిపి 2025 నవంబర్ 11న జీఓ 1626 తీసుకువచ్చినా వేతనాలు మాత్రం పెంచలేదు. కానీ శుక్రవారం సాయంత్రం సిబ్బందికి పెరిగిన వేతనాలతో ఖాతాలో జమయ్యాయి. దీంతో 2014 తర్వాత విధుల్లో చేరిన పలువురు సిబ్బందికి వేతనాలు పెరిగాయి. ఒక్కొక్కరికి రూ.1,500 నుంచి రూ.4 వేల వరకు పెరిగినట్లు తెలిసింది. అయితే వేతనాల జీఓ వచ్చిన నెల నుంచి ఇవ్వకపోవడంతో ఒక్కొక్కరు కనీసం రూ.20–30 వేల వరకు నష్టపోయారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరోవైపు 2010 కంటే ముందు విధుల్లో చేరిన సిబ్బందికి వేతనాలు పెరగకపోగా కొంత మందికి కోత విధించినట్లు తెలుస్తుంది. దీనిపై పలువురు సీనియర్ సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. పెరిగిన వేతనాలతో పీయూతోపాటు గద్వాల, వనపర్తి, కొల్లాపూర్లో పనిచేస్తున్న సుమారు 280 మంది సిబ్బందికి మేలు జరగనుంది. ఈ నెల నుంచే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగింత 2010 కంటే ముందు విధుల్లో చేరిన వారి అసంతృప్తి పెరిగిన జీతాలతో సుమారు 280 మందికి మేలు -
ఇష్టానుసారంగా యూరియూ విక్రయాలు
● ఒక్కో బస్తాపై రూ.45 అదనపు వసూలు ● డబ్బులు చెల్లించిన రశీదు ఇవ్వని యజమాని తిమ్మాజిపేట: మండలంలో పెస్టిసైడ్, ఫర్టిలైజర్ దుకాణ యజమానులు ఇష్టానుసారంగా ఎరువులు, విత్తనాలు విక్రయిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం కారణంగా అక్రమ దందాకు తెరలేపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కో బస్తా యూరియా రూ. 266.60లకు విక్రయించాల్సి ఉండగా రూ.310లకు అమ్ముతున్నారు. ఒక్కో బస్తాపై అదనంగా రూ.45 వసూలు చేస్తున్నారు. మండలంలోని తుమ్మలకుంట తండాకు చెందిన రైతు వడ్తావత్ హుసేనీ గురువారం ఆన్లైన్లో యూరియూ బుక్ చేసుకున్నాడు. తిమ్మాజిపేటలోని యూరియా సరఫరా చేస్తున్న దుకాణం వద్దకు వెళ్లి మెసేజ్ చూయించి 6 యూరియా బస్తాలకు రూ.1860లకు కొనుగోలు చేశారు. ఒక్కో బస్తాకు రూ.45 లు ఎందుకు అదనంగా తీసుకుంటున్నావని ప్రశ్నించగా రవాణా చార్జీలు, హమాలీ కూలి ఎవరిస్తారని దుకాణ యజమాని దురుసుగా సమాధానం చెప్పాడు. ఏఓకు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో అధికంగా వసూలు చేసిన డబ్బులు తిరిగి రైతుకు వేసినట్లు సమాచారం. ఎరువుల దుకాణాన్ని సీజ్ చేస్తాం ప్రభుత్వ నిబంధనల ప్రకారమే రైతులకు యూరియా విక్రయించాలి. అధిక ధరలు వసూలు చేస్తే ఎరువుల దుకాణాన్ని సీజ్ చేస్తామని ఏఓ కమల్కుమార్ హెచ్చరించారు. తిమ్మాజిపేటలో దుకాణందారులు అధిక ధరలు తీసుకుంటున్న విషయం తన దృష్టికి వచ్చింది. తనిఖీ చేపట్టి నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం. -
రాజీవ్గాంధీ సెంట్రల్ యూనివర్సిటీ వీసీగా ‘పేట’వాసి
నారాయణపేట రూరల్: అరుణాచల్ప్రదేశ్లోని రాజీవ్ గాంధీ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్గా నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం ఉడుమల్గిద్దకు చెందిన ప్రొఫెసర్ శివరాజ్ను ని యమిస్తూ రాష్ట్రపతి ద్రౌపతిముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయమై ఏబీవీపీ జాతీయ మాజీ నా యకుడు అయ్యప్ప అడ్వకేట్ హర్షం వ్యక్తం చేశారు. నిర్వహించిన బాధ్యతలు ఓయూలో ముఖ్యపరిపాలన బాధ్యతలు, పీజీఆర్ఆర్ దూరవిద్యా కేంద్రం డైరెక్టర్, యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్, రసాయన శాస్త్ర విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్, అభివృద్ధి, యూ జీసీ వ్యవహారాల డీన్, సైన్స్ ఫ్యాకల్టీ డీన్, యూ జీసీ యూపీఈ కార్యక్రమ సమన్వయకర్త, డీఎస్టీ పర్స్ కార్యక్రమ సమన్వయకర్త, పీయూ రిజిస్ట్రార్గా విధులు నిర్వహించారు. -
నూతన అధ్యాయానికి శ్రీకారం
● హాజరైన జడ్జి, ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవరకద్రలో కోర్టును వర్చువల్గా ప్రారంభించిన హైకోర్టు జడ్జిలు దేవరకద్ర: దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో గురువారం జూనియర్ సివిల్ జడ్జి కమ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ న్యాయస్థాన భవనాన్ని తెలంగాణ హైకోర్టు జడ్జిలు శ్రావణ్కుమార్, మాధవిదేవి వర్చువల్ విధానంలో ప్రారంభించి నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. జిల్లా జడ్జి ప్రేమలత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆనందరావు, కలెక్టర్ ఖుష్బూగుప్తా, ఎస్పీ జానకి, ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి కోర్టు భవనాన్ని, కోర్టులోని వివిధ విభాగాలను పూజలు చేసి ప్రారంభించారు. ప్రజలకు అందుబాటులో న్యాయసేవలు దేవరకద్రలో కోర్టు ఏర్పాటుతో ప్రజలకు న్యాయసేవలు అందుబాటులోకి వస్తాయని హైకోర్టు జడ్జిలు జస్టీస్ శ్రావణ్కుమార్, జస్టిస్ మాధవిదేవి తెలిపారు. దేవరకద్ర కోర్టును వర్చువల్గా ప్రారంభించిన తరువాత వారు మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ల ప్రయత్నంతో దేవరకద్రకు కోర్టు వచ్చిందన్నారు. దేవరకద్ర కోర్టు పరిధిలో అడ్డాకుల, మూసాపేట, చిన్నచింతకుంట, దేవరకద్ర మండలాలకు సంబంధించిన కేసులు విచారణ చేయడానికి అవకాశం లభిస్తుందని తెలిపారు. కోర్టు సేవలను కక్షిదారులు వినియోగించుకుని సత్వర న్యాయం పొందవచ్చని తెలిపారు. దేవరకద్ర చుట్టుపక్కల ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయని, నిజాం కాలంలో నిర్మించిన కోయిల్సాగర్ ప్రాజెక్టు, ఆధ్యాత్మిక కేంద్రాలైన కురుమూర్తి, మన్యంకొండ ఆలయాలు ఉన్నాయని తెలిపారు. సులభతర న్యాయసేవలే లక్ష్యం ప్రజలకు సులభతర న్యాయసేవలు అందించడమే లక్ష్యమని జిల్లా సెషన్స్ జడ్జి ప్రేమలత పేర్కొన్నారు. నూతన కోర్టు ఏర్పాటుతో స్థానిక ప్రజలకు న్యాయసేవలు మరింత చేరువవుతాయన్నారు. కోర్టు అందుబాటులోకి రావడంతో పెండింగ్ కేసుల విచారణ ప్రక్రియ వేగవంతం కావడమే కాకుండా న్యాయవ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉంటుందని తెలిపారు. దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో సివిల్ కోర్టు ఏర్పాటు కావడం వెనక ఎన్నో ఏళ్ల ప్రజల ఆకాంక్ష ఉందని.. అది నేడు సాకారం కావడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి పేర్కొన్నారు. కోర్టు ప్రారంభంతో ప్రజల ప్రయాణ సమయం ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతాయన్నారు. ప్రజలకు న్యాయం చేరువ చేయాలనే ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనమని, నియోజకవర్గ అభివృద్ధిలో ఇది ఒక మైలురాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దమయంతి, ఎంపీడీఓ శ్రీనివాసరావు, తహసీల్దార్ హర్షద్, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఇష్టానుసారంగా మట్టితవ్వకాలు
ఖిల్లాఘనపురం: మండల కేంద్రంలోని గణపసముద్రం రిజర్వాయర్లో ఇష్టానుసారంగా మట్టిని తరలిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు. రిజర్వాయర్ కట్టకు ఎత్తుకు 15 రెట్ల దూరంలో మట్టి తవ్వకాలు చేపట్టాలని నిబంధనలు ఉన్నప్పటికి ఏ అధికారి పట్టించుకోకపోవడంతో మట్టి అవసరమున్న వారంతా కట్టకు సమీపంలో మట్టిని తీసి తరలించుకుపోతున్నారు. రిజర్వాయర్ తూము వద్ద కట్ట అధికారుల లెక్కల ప్రకారం సుమారు 12 మీటర్లు ఉండగా అక్కడి నుంచి కనీసం 200 మీటర్ల దూరంలో మట్టి, ఒండ్రుమట్టిని తీయాల్సి ఉంటుంది. కానీ సుమారు 100 మీటర్ల దూరం నుంచే ఒండ్రుమట్టిని తరలిస్తున్నారు. రైతులు వ్యవసాయ పొలాలకు, కొందరు ఇటుక బట్టీలకు ఒండ్రు మట్టిని అనుమతులు లేకుండా తరలిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఎక్కడి నుంచి మట్టి తీయాలో కనీసం చెప్పేవారు కూడ లేరని పేర్కొంటున్నారు. ఇలా మట్టి తరలింపుతో రిజర్వాయర్ కట్టకు ప్రమాదం పొంచి ఉందని వాపోతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి అక్రమంగా మట్టిని తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవలని కోరుతున్నారు. -
వైభవంగా శ్రీచక్ర ప్రాణప్రతిష్ఠ
శృంగేరి శారదా పీఠాధిపతి ఆధ్వర్యంలో మహోత్సవం ● ఐశ్వర్యం, ఆరోగ్యం శాంతిని ప్రసాదించే యంత్రరాజం ● ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రవచానాలు అలంపూర్ రూరల్: అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదో శక్తిపీఠం జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి దేవస్థానం మరో విశిష్ట ఘట్టానికి వేదికై ంది. దేవిశక్తి రూపంగా భావించే శ్రీచక్ర యంత్ర ప్రాణప్రతిష్ఠ వేద పండితుల వేదోచ్ఛరణల మధ్య శృంగేరి శారదా పీఠాధిపతి శ్రీశ్రీ విధుశేఖర భారతిస్వామి అమృత హస్తాలతో గురువారం సింహలగ్న ముమూర్తంలో ఉదయం 10 గంటలకు వైభవంగా నిర్వహించారు. ఆలయ సాంప్రదాయ పద్ధతిలో ఈఓ దీప్తిరెడ్డి, ఆలయ అర్చకులు పీఠాధిపతికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. నేత్రపర్వంగా సాగిన క్రతువును వీక్షించేందుకు వచ్చిన వేలాది మంది భక్తులతో ఆలయాల ప్రాంగణాలు కిక్కిరిపోయాయి. ఆలయంలో ప్రమఖులు: జోగుళాంబ ఆలయాలను రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు రాణి కుముదిని, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, అడిషనల్ కలెక్టర్ మధుమోహన్, జాయింట్ కలెక్టర్ నర్సింగరావు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసరావు, దేవదాయ శాఖ కమిష్నర్ హనుమంతరావు, డీఎస్పీ మొగిలయ్య, దేవదాయ శాఖ స్థపతి వల్లి నాయగం ఎపిటోమ్ ప్రాజెక్ట్ ఎండీ జైపాల్ కాంత, తహసీల్దార్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. జోగుళాంబ సన్నిధిలో ప్రత్యేకంగా భక్తుల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శృంగేరి శారదా పీఠాధిపతి శ్రీశ్రీ విధుశేఖర భారతిస్వామి మాట్లాడుతూ.. జోగుళాంబ సన్నిధిలో శ్రీచక్ర ప్రాణప్రతిష్ఠ జరగడం భక్తుల అదృష్టమన్నారు. శ్రీచక్రం కేవలం యంత్రం కాదని.. అది ఒక దైవశక్తి, విశ్వ శక్తికి ప్రతీక అన్నారు. ప్రాణప్రతిష్ఠ ద్వారా ఆలయంలో ఆధ్యాత్మిక శక్తి, దైవ చైతన్యం, మరింతగా వృద్ధి చెందుతాయని, తద్వార భక్తులు ఐశ్వర్యం, ఆరోగ్యం, శాంతి సౌభాగ్యం లభిస్తాయన్నారు. శ్రీ చక్రం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రం, శక్తివంతమైన యంత్రాల్లో ఒకటిగా పరిగణించబడుతుందన్నారు. ఇది దేవి సమగ్ర స్వరూపాన్ని సూచిస్తుందని, విశ్వం సృష్టి, స్థితి లయలను ప్రతిబింభిస్తుందని పేర్కొన్నారు. శ్రీచక్ర ఆరాధన ద్వారా భక్తుల మానసిక ప్రశాంతతను శారీరక ఆరోగ్యాన్ని, ఆర్థిక శ్రేయస్సును పొందగలరని విశ్వసిస్తారన్నారు. -
రాష్ట్రస్థాయి సబ్జూనియర్ ఫుట్బాల్ పోటీలకు ఎంపిక
జడ్చర్ల టౌన్: రాష్ట్రస్థాయి సబ్జూనియర్ బాలికల ఫుట్బాల్ చాంపియన్షిప్కు మండలంలోని కొడ్గల్ సమీపంలో ఉన్న నచికేత విద్యామందిర్కు చెందిన 10 మంది విద్యార్థినులు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ విజయ్ మోహన్ తెలిపారు. శుక్రవారం నుంచి నిజామాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొ నే ఉమ్మడి జిల్లా జట్టుకు సాయిప్రియ, శ్రీవల్లి, శ్రీవర్షిణి, అక్షిత, అక్షర, సంజన, పూజిత, అంబికాశ్రీ, ప్రేక్ష, హర్షవర్దిని ఎంపికయ్యారన్నారు. ఈ మేరకు విద్యార్థినులను గురువారం పాఠశాల ఆవరణలో అభినందించి నిజామాబాద్కు పంపించారు. కార్యక్రమంలో పీఈటీ నరేష్, వైస్ ప్రిన్సిపాల్ పాండు, అధ్యాపకులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు సూగూరు విద్యార్థి వనపర్తి రూరల్: పెబ్బేరు మండలంలోని సూగూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న జి.శారద రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాలికల ఫుట్బాల్ పోటీ లకు ఎంపికై ందని హెచ్ఎం ఆర్.వెంకటరమణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 3, 4, 5 తేదీల్లో నిజామాబాద్ జిల్లాలో జరగనున్న రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ ఫుట్బాల్ బాలికల క్రీడల్లో వనపర్తి జట్టు తరఫున శారద పాల్గొంటారని ఆయన తెలిపారు. పెబ్బేరు పట్టణంలోని ఫుట్బాల్ క్రీడా మైదానంలో ఈ నెల 01న ఎంపికలు జరగగా.. ప్రతిభ కనబరిచిన శారద అవకాశం దక్కించుకున్నారని పాఠశాల పీడీ ఎండీ షబీర్ తెలిపారు. భారీగా నల్లబెల్లం పట్టివేత బల్మూర్: మండలంలోని బాణాల శివారులోని వ్యవసాయ పొలంలో దాచిన నిషేధిత నల్ల బెల్లం డంపును గురువారం ఎకై ్సజ్ పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ఎకై ్సజ్ ఎస్ఐ సతీష్ కుమార్ తెలిపిన వివరాల మేరకు.. బాణాల గ్రామానికి చెందిన రాజేష్, ధారాసింగ్ తమ పొలంలో అక్రమంగా నల్ల బెల్లం బస్తాలను డంపు చేశారనే సమాచారం మేరకు డీటీఎఫ్ సీఐ రాజేశ్వరి, ఎస్ఐ అరుణ, సిబ్బందితో దాడులు చేశారు. 25 బస్తాలలో 750 కిలోల నల్లబెల్లం పట్టుకొని నిందితులిద్దరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. దాడులలో డీటీఎఫ్, అచ్చంపేట ఎకై ్సజ్ సిబ్బంది పాల్గొన్నారు. జూరాల డ్యాం వద్ద పవర్ కేబుల్ చోరీ ధరూరు : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద సీవేజ్ డ్రెయినేజీ పంపునకు సంబంధించిన పవర్ కేబుళ్లను గురువారం గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు. విషయం తెలుసుకున్న ప్రాజెక్టు ఏఈ సుదర్శన్ యాదవ్ రేవులపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నందికర్ తెలిపారు. -
నీటి పొదుపు చర్యలు పాటించాలి
మహబూబ్నగర్ (వ్యవసాయం): ఎల్నినో ప్రభావంతో ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితుల్లో రైతులు పంటల సాగులో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సూచించారు. శాస్త్రవేత్తలు డాక్టర్ కె.కళ్యాణి, డాక్టర్ కె.సదయ్య సోమవారం మిడ్జిల్ మండలంలోని వల్లభురావుపల్లి, పస్పుల, రాణిపేట, కొత్తపల్లి గ్రామాల్లో పర్యటించి రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో సాగులో ఉన్న పత్తి, మొక్కజొన్న, మిరప, వంకాయ, మునగ పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు పలు సూచనలు అందించారు. ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటల ఎదుగుదలపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున రైతులు నీటి వినియోగంలో పొదుపు చర్యలు చేపట్టాలని సూచించారు. నేల తేమను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, పంటల పెరుగుదల దశను బట్టి యాజమాన్య పద్ధతులు పాటించాలన్నారు. పచ్చిరొట్ట పంటల సాగు వల్ల భూసారం మెరుగుపడటంతో పాటు భూమిలో సేంద్రియ పదార్థాల శాతం పెరిగి భవిష్యత్లో మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంటుందని వివరించారు. అవసరానికి మించి రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడడం వల్ల వ్యయభారం పెరగడంతో పాటు నేల నాణ్యత దెబ్బతింటుందని, అందువల్ల శాసీ్త్రయ సూచనల మేరకే వాటిని వినియోగించాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో ఏఈఓ గౌర్ పాషా తదితరులు పాల్గొన్నారు. -
వర్షాధారంగా ఆముదం సాగు చేసే హైబ్రీడ్ రకాలు
కొత్తకోట రూరల్: వర్షాదారంగా సాగు చేసే నూనె గింజ పంటల్లో ఆముదం ఒక ముఖ్యమైన పంట. వానాకాలంలో జూన్ రెండో వారం నుంచి జూలై చివరి వారం వరకు ఆముదం సాగు చేసుకోవచ్చును. నీరు బాగా పీల్చుకునే ఎర్రనేలలు, నల్లరేగడి, గరపనేలలు ఆము దం సాగుకు అనుకూలమని మదనాపురం కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ రాజేందర్రెడ్డి సూచిస్తున్నారు. ఆముదంలో హైబ్రీడు రకాలైతే 2 కిలోలు 4కిలోలు ఎకరాకు విత్తనంగా అవసరం ఉంటుంది. వర్షాదారం ఆముదంలో అంతర పంటలుగా రెండు వరుసలు పెసర, మినుము, పెబ్బె ర్లు, గోరు చిక్కుడు, వేరుశనగ, సాగు చేసుకొని అధిక ఆధాయం పొందవచ్చును. ఆముదంలో కంది పంటను 1–1 నిష్పత్తిలో అంతర పంటగా సాగు చేసుకోవచ్చును. నేలలు: నీరు ఇంకే భూములు సాగుకు అనుకూలం. బలమైన భూములలో సాగు చేస్తే ఎక్కువ దిగుబడులు సాధించవచ్చును. బీడు నేలలు సాగుకు అనుకూలం కాదు. హైబ్రీడు రకాలను 90 సెం.మీ సాలు సాలుకు మరియు 60 సెం.మీ విత్తనానికి విత్తనానికి మధ్య దూరంలో సాగు చేసుకోవచ్చును. ● కలుపు యాజమాన్యం: ఆముదంలో విత్తనం వేసిన 48గంటల లోపల మందును ఎకరా కు పిచికారి చేసుకోవాలి. ఆముదంలో 45– 60రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. ● ఎరువుల యాజమాన్యం: ఎకరాకు 2–3 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. ఎకరా కు 25కిలోల నత్రజని 16కిలోల భాస్వరం 15కిలో ల పోటాషి యం ఎరువులను వేసుకోవాలి. ● ఆముదం పంట వయస్సు: 45–50 రోజుల పంట కాలంలో పైరులో లేత ఇగుఉరులను తీసివేయ డం వల్ల పక్క కొ మ్మలు ఎక్కువగా వచ్చి గాళసైజు కాయసైజు ఎక్కువగా వచ్చేందుకు తోడ్పడుతుంది. ● వర్షాదారంగా బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు 2–3 తడులను 10రోజు లకు వ్యవధిలో ఇవ్వడం వల్ల అధిక దిగుబడి సాధించవచ్చును. పాడి–పంట ప్రగతి (పీసీఎస్–262): పంట కాలం 120– 140 రోజులు, స్వల్ప కాలిక రకం అధిక నూనె శాతం కలింగి ఉంటుంది. ఎండు తెగులు తట్టుకుంటుంది. హరిత (పీసీఎస్–124): పంట కాలం 130– 150 రోజులు, బెట్ట, ఎండు తెగులు తట్టుకుంటి. పీసీహెచ్ (పీసీహెచ్–111): పంట కాలం 120– 140 రోజులు, ఎండు తెగులును తట్టుకుంటుంది. డీసీహెచ్ (డీసీహెచ్–177): పంట కాలం 130–160 రోజులు, బెట్టను తట్టుకుంటుంది. డీసీహెచ్ (డీసీహెచ్–519): పంట కాలం 130– 160 రోజులు, ఎండు తెగులును తట్టుకుంటుంది. ఐసీహెచ్–66 (ఐసీహెచ్–66): పంట కాలం 130–150 రోజులు, ఎండు తెగులు, వేరుకుళ్లు, పచ్చదోమ తట్టుకుంటుంది. ఐసీహెచ్–5: పంట కాలం 130–150 రోజులు ఎండు తెగులు, వేరుకుళ్లు, పచ్చదో మను తట్టుకుంటుంది. అధిక సాంద్రతలో సాగు చేసేటందుకు అనుకూలం. ఐసీహెచ్–6: పంట కాలం 110–140 రోజు లు ఎండు తెగులు, వేరుకుళ్లు తెగుళ్ల వ్యాధులను తట్టుకుంటుంది. -
తారాస్థాయికి ఇసుక వివాదం
గద్వాల క్రైం: అక్రమంగా ఇసుక తరలించే వ్యాపారులపై జిల్లా పోలీసు శాఖ కూపీలాగుతున్నారు. మరోవైపు వ్యాపారుల మధ్య ఘర్షణలకు తావిస్తుంది. మూడురోజుల క్రితం ఓ ఇసుక వ్యాపారి మరో ఇసుక వ్యాపారికి ఫోన్లో బెదిరింపులకు పాల్పడిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ వ్యవహారంపై సీఐ స్థాయి అధికారిని ఏర్పాటు చేసి గుట్టుగా విచారణ చేపట్టింది. జోగుళాంబ గద్వాల జిల్లాలోని తుంగభద్ర నది పరివాహక గ్రామాల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అక్రమార్కులు ప్రభుత్వ అనుమతులు లేకండా ఇసుకను టిప్పర్ల ద్వారా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. అయితే గద్వాల మండలంలో ని ఓ గ్రామానికి చెందిన తాజా యువ సర్పంచ్ అదే గ్రామానికి చెందిన ఇసుక వ్యాపారి మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో సర్పంచ్కు చెందిన టిప్పర్లు అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నాయని రెవెన్యూ, మైనింగ్, పో లీసు, విజిలెన్స్ అధికారులకు వైరి వర్గంకు చెందిన వ్యాపారి సమాచారం అందజేయండం కారణంగా ఇసుక టిప్పర్ల ను అదుపులోకి తీసుకుంటున్నారని గ్రహించాడు. దీంతో సదరు వ్యాపారితో యువ సర్పంచ్ ఫోన్ లో మాట్లాడారు. ఇక నుంచి అధికారులకు ఫిర్యా దులు చేయడం విరమించుకోవాల్సిందిగా పేర్కొన్నాడు. ముందునుంచి ఇసుక వ్యాపారంలో మీరే ఉన్నారు. ఎప్పుడు ఫిర్యాదులు చేయలేదు. అనవసరంగా సమస్యను సృష్టిస్తున్నా రు. ప్రతినెలా మాములు ఇస్తున్నాం.. నువ్వు ఏం చేసిన వ్యాపా రం చేస్తామని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య తారస్థాయిలో వివాదాని కి దారితీసింది. ఈ వ్యాపారంలో నువ్వో.. నేనో చూసుకుందాం.ఏవరో ఒక్కరు మీగులుతారంటూ మాట్లాడిన సంభాషణ పలు సామాజిక మాఽ ద్యమాల్లో వైరల్గా మారాయి. ఈ వ్యవహారంపై జిల్లా పోలీసు శాఖ ముమ్మరంగా కూపీలాగుతోంది. పోలీసుల విచారణలో.. గద్వాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఆ ఇద్దరు అక్రమ ఇసుక వ్యాపారులది నేర చరిత్ర ఉన్న నేపథ్యం. ఇరవై ఏళ్లుగా బ్రదర్స్ అక్రమ ఇసుక వ్యాపారంలో పైచేయిగా ఉంది. మంత్రు లు, ఎమ్మెల్యేల అభయహస్తంతోపాటు అధికారులను భయభ్రాంతులకు గురి చేసేవారు. మరో వైపు ప్రజాప్రతినిధుల అండతో బ్రదర్స్ ప్రభుత్వ అనుమతులు పొందినట్లు ఫేక్ అనుమతి పత్రాల తో కొన్నేళ్లు ఇసుకను తరలించారు. ఈ ఘటనపై బ్రదర్స్పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అక్రమ ఇసుక వ్యాపారంలో యువ సర్పంచ్ సైతం కొన్నేళ్లుగా గ్రామంలోని చెరువు నుంచి ఇసుక తరలిస్తూ కొంత ఆర్థికంగా పురోగతి చెంది నేడు తుంగభద్ర నుంచి టిప్పర్ల ద్వారా ఇసుకను అక్రమంగా తరలించే స్థాయికి చేరుకున్నాడు. యువ సర్పంచ్ ఫిల్టర్ ఇసుకను ట్రాక్టర్ల నుంచి తరలించిన ఘటనలపై కేసులు నమోదయ్యాయి. వివిధ వ్యవహారాలపై పోలీసులు రెండు రోజులుగా ఇద్దరి నేర చరిత్రను జిల్లా ఉన్నతధికారులకు నివేదికలను అందజేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఫోన్ సంభాషణలో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులకు మామూలు ఇచ్చిన వ్యవహారంపై నివేదికలను అందజేసినట్లు తెలుస్తుంది. మూడు రోజల క్రితం సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఫోన్ సంభాషణపై ఇప్పటికే విచారణ జరుగుతుంది. అక్రమంగా ఇసుక తరలించే నేరస్తుల పూర్తి సమాచారంపై ఆరా తీస్తున్నాం. ప్రస్తుతం విచారణ దశలో ఉంది. ఇద్దరిపై నమోదైన వివిధ కేసులపై విచారణ చేపట్టాం. త్వరలోనే ఇద్దరిని అరెస్టు చేస్తాం. ఇందుల్లో ఏవరి ప్రమేయం ఉన్నా.. ఉపేక్షించేది లేదు. – మొగిలయ్య, డీఎస్పీ ఇసుకాసురులపై కూపీలాగుతున్న పోలీసు శాఖ బెదిరింపు కాల్స్పై కొన్నసాగుతున్న విచారణ వ్యాపారుల నేర చరిత్రపై వాకాబు -
అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలి
మిడ్జిల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం మిడ్జిల్లో పర్యటిస్తున్న సందర్భంగా మండలకేంద్రంలో జిల్లాస్థాయి అధికారులతో అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ సమన్వయ సమావేశం నిర్వహించారు. బహిరంగసభ, విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమాల్లో ప్రతి అధికారి చేపట్టాల్సిన బాధ్యతల గురించి అదనపు కలెక్టర్ వివరించారు. ముఖ్యంగా ఆర్అండ్బీ అధికారులు హెలిప్యాడ్, సభ ప్రాంగణంలో బారికేడ్ల ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. భద్రత ఏర్పాట్లు ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల రాకపోకల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసు అధికారులకు సూచించారు. రెవెన్యూ శాఖ అధికారులు వేదిక, గ్యాలరీలు, వీఐపీ వాహనాల ప్రవేశ మార్గం, ప్రజల రాకపోకలకు సంబంధించిన అన్ని పనులు పకడ్బందీగా చేయాలన్నారు. పంచాయతీరాజ్ శాఖ అఽధికారులు విగ్రహాల ప్రతిష్ఠ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, తహసీల్దార్, మున్సిపాల్ అధికారులు తాగునీరు, గ్రీన్రూమ్ల ఏర్పాట్లు, మరుగుదొడ్ల, పారిశుద్ధ్య పనులు పూర్తి చేయాలన్నారు. విద్యుత్ శాఖ అధికారులు సభ ప్రాంగణం, పార్కింగ్ దగ్గర లైట్ల ఏర్పాటు, ఆరోగ్యశాఖ అత్యవసర వైద్య సేవలకు కావాల్సిన సౌకర్యాలు, అంబులెన్స్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో ఏఎస్పీ రత్నం, ఆర్డీఓ నవీన్, డీఎంహెచ్ఓ శ్రీనివాసులు, డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
‘ర్యాలంపాడు’కు మోక్షం!
గద్వాల: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం గుండెకాయగా పిలువబడే ర్యాలంపాడు రిజర్వాయర్ మరమ్మతుకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. నాలుగేళ్ల క్రితం ఆనకట్టకు లీకేజీలు ఏర్పడటంతో 4 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లో 2 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేస్తున్నారు. ఫలితంగా జలాయశం ఆయకట్టుకు కేవలం వానాకాలంలో ఒకే పంటకు సాగునీరు అందుతోంది. యాసంగి సీజన్లో రెండో పంటకు సాగునీరు లభించక క్రాప్హాలిడే ప్రకటిస్తున్నారు. ర్యాలంపాడు రిజర్వాయర్ ఆనకట్ట మరమ్మతు కోసం రైతులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించి మరమ్మతు కోసం రూ.4.92 కోట్లు మంజూరు చేసింది. లోపభూయిష్ట నిర్మాణంతో.. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో 2లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు తాగునీరు అందించే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖరరెడ్డి నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి 2005లో శ్రీకారం చుట్టారు. 2009 వరకు ప్రాజెక్టు నిర్మాణం పరుగులు పెట్టింది. వైఎస్సార్ అకాల మరణంతో పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. అయితే ప్రాజెక్టులో మొత్తం ఏడు రిజర్వాయర్లు ఉండగా.. ఇందులో ర్యాలంపాడు రిజర్వాయర్ను 4 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. మొత్తం ప్రాజెక్టు 20 టీఎంసీల సామర్థ్యం ఉండగా.. ఇందులో 4 టీఎంసీలు ర్యాలంపాడు రిజర్వాయరే కావడం ప్రాధాన్యత తెలియజేస్తుంది. అయితే రిజర్వాయర్ నిర్మాణ పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్.. లోపభూయిష్టంగా నిర్మించడం, అధికారుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం చోటుచేసుకోవడంతో అందుబాటులోకి వచ్చిన రెండేళ్లకే ర్యాలంపాడు రిజర్వాయర్ ఆనకట్ట, తూముల వద్ద లీకేజీలు ఏర్పడ్డాయి. ఫలితంగా సుమారు 1.12 లక్షల ఎకరాల ఆయకట్టుకు కేవలం ఒక పంటకే సాగునీటిని అందించాల్సిన దుస్థితి నెలకొంది. కాగా.. పుణెకు చెందిన ఇంజినీరింగ్ బృందం రెండుసార్లు రిజర్వాయర్ను సందర్శించి.. మరమ్మతులు చేపట్టాలని తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఈ మేరకు మరమ్మతు కోసం ప్రభుత్వం రూ.4.92 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ.1.66 కోట్లు సీడబ్ల్యూపీఆర్సీ పుణెకు, మిగిలిన రూ. 3.66 కోట్లతో రిజర్వాయర్కు ఏర్పడిన లీకేజీలకు పూర్తిస్థాయిలో మరమ్మతు చేయాలని నిర్ణయించారు. మట్టి నమూనా సేకరణ.. గత మే 26న జలాశయం మట్టి నమూనా సేకరణ ప్రక్రియను మొదలుపెట్టారు. ఇందుకోసం జలాశయంలో మొత్తం ఎనిమిది చోట్ల బోరుడ్రిల్లింగ్ చేయించి, మట్టి నమూనాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే నాలుగు చోట్ల సేకరించిన మట్టి నమూనాలను హైదరాబాద్లోని తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ల్యాబ్కు పంపారు. మిగిలిన నాలుగు చోట్ల సేకరించే మట్టిని కూడా టీఎస్ఈఆర్ఎల్కు పంపనున్నారు. అక్కడి నుంచి వచ్చే నివేదిక, మట్టి నమూనాలను పుణెలోని సీడబ్ల్యూపీఆర్ఎస్కు పంపించి.. ఆనకట్టలోని రాక్టోల్, తూముల అడుగు భాగంలో ఎలాంటి మట్టి ఎన్ని లేయర్లతో నిర్మాణం చేపట్టాలనే పరీక్షలు నిర్వహించనున్నారు. ఫలితాల అనంతరం వచ్చే తుది నివేదిక ఆధారంగా రిజర్వాయర్కు మరమ్మతు చేపట్టనున్నారు. ఎట్టకేలకు రిజర్వాయర్ లీకేజీలకు మరమ్మతు సివిల్ గ్రౌండింగ్ పరీక్షలకు రూ.1.66కోట్లు.. ఆనకట్ట రిపేరుకు రూ.3.66 కోట్లు మంజూరు ప్రారంభమైన మట్టి నమూనాల సేకరణ -
మళ్లీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే
కల్వకుర్తి రూరల్: రాష్ట్రంలో ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని.. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమని నాగర్కర్నూల్ ఎంపీ డా.మల్లురవి ధీమా వ్యక్తం చేశారు. గురువారం కల్వకుర్తిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అధ్యక్షతన ప్రజాపాలన – ప్రగతి నివేదిక, మహనీయుల జాతర ముగింపు సమావేశం నిర్వహించగా.. ఎంపీతో పాటు ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కూచుకుళ్ల రాజేశ్రెడ్డి, యెన్నం శ్రీనివాస్రెడ్డి, జి.మధుసూదన్రెడ్డి, వీర్లపల్లి శంకర్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లురవి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండున్నరేళ్ల కాలంలోనే ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశామన్నారు. ప్రధానంగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, రైతుభరోసా, సన్నరకం వరిధాన్యానికి రూ. 500 బోనస్తో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రాన్ని అప్పులపాలు జేసి.. కల్వకుంట్ల కుటుంబం ఆస్తులను కూడబెట్టుకుందని ఆరోపించారు. అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి అహర్నిశలు కృషిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ప్రజలు వెన్నుదన్నుగా నిలవాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, ఇందిరాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో టీజీఎస్డీజీసీఎఫ్ఎల్ చైర్పర్సన్ సరిత, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, శాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, చల్లా నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మహబూబ్నగర్
శుక్రవారం శ్రీ 3 శ్రీ జూలై శ్రీ 2026సర్ ప్రక్రియను వేగవంతం చేయాలి నవాబుపేట: ఎస్ఐఆర్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అడిషనల్ కలెక్టర్ హరిప్రియ సూచించారు. గురువారం ఆమె మండల కేంద్రంతోపాటు లింగంపల్లిలో పర్యటించి ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్ఓలు మరింత వేగంగా పనిచేయాలని సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఫారమ్స్ పూర్తి చేయడంలో ఇబ్బందులు పడుతున్నవారికి అధికారులు అవగాహన కల్పించి ప్రక్రియను పూర్తి చేసేలా చూడాలన్నారు. అలాగే మండల అధికారులు, పర్యవేక్షణ విధిగా చేయాలన్నారు. రోజువారీ ప్రక్రియను జిల్లా అధికారులకు సమాచారం అందించాలని ఆదేశించారు. మండలంలో ఎస్ఐఆర్ ప్రక్రియ కాస్తా ఆలస్యంగా సాగుతుందని దీన్ని వేగవంతం చేసేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఎస్ఐఆర్ విధులపై నిర్లక్ష్యం చేయకూడదన్నారు. ఆమె వెంట తహసీల్దార్ సురేష్, మండల, గ్రామస్థాయి అధికారులు ఉన్నారు. మొదటిరోజు నామినేషన్లు నిల్ అమరచింత: చేనేత సహకార సంఘం ఎన్నికలకు సంబంధించి మొదటి రోజైన గురువారం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని రిటర్నింగ్ అధికారి ప్రసాదరావు తెలిపారు. 4వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తామని.. నామినేషన్ ఫారాలు తీసుకున్న వారు ఎన్నికల ఫీజు బీసీ కుల ధ్రువీకరణ పత్రం జత చేస్తే రూ.750, లేకుంటే రూ.1000 చెల్లించాలన్నారు. వీటితోపాటు ఎన్నికల వ్యయం కోసం పోటీలో ఉన్న అభ్యర్థులు అదనంగా రూ.2 వేలు ముందస్తుగా చెల్లించాలని సూచిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 10వ తేదీన చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆర్ఎన్ఆర్ క్వింటా రూ.2872 జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం ఆర్ఎన్ఆర్ రకానికి సంబంధించి క్వింటా గరిష్టంగా రూ.2,872, కనిష్టంగా రూ.1,839 ధరలు లభించాయి. మొక్కజొన్న గరిష్టంగా రూ.2,453, కనిష్టంగా రూ.1,988, వేరుశనగ రూ.3,329 ధరలు పలికాయి. జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలోని మార్కెట్కు గురువారం 984 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ.7,542, కనిష్టంగా రూ. 3,110, సరాసరి రూ. 6,050 ధరలు పలికాయి. అలాగే 13 క్వింటాళ్ల వరి (సోన) రాగా క్వింటాకు రూ.1,809, కందులు రూ.6,389 ధర పలికింది. మహబూబ్నగర్ (వ్యవసాయం): దున్నిన దుక్కుల్లో విత్తులు పెట్టాల్సిన రైతులు వాన లేక నెల రోజులుగా ఆకాశానికేసి చూస్తున్నారు. రోహిణి కార్తె చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షం కురిపించకుండానే వెళ్లిపోయింది. తర్వాత మృగశిర కార్తె వచ్చినా వాన జాడే లేదు. రైతులు విత్తనాలు, ఎరువులు సమకూర్చుకొని సాగుకు సమాయత్తమయ్యారు. ఈ సీజన్లో జిల్లాలో 4,05,236 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసినా.. జూన్ ముగిసే నాటికి 99,440 ఎకరాల్లో మాత్రమే సాగు నమోదైంది. లక్ష్య సాగుతో పోలిస్తే ఇది 24 శాతానికి కూడా చేరలేదు. జిల్లాలో ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న, కంది, జొన్న, ఆముదం పంటల సాగు చేస్తుంటారు. ఇందులో వరి పరిస్థితి మరింత ఆందోళనకరంగా కనిపిస్తోంది. సీజన్లో 2.40 లక్షల ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేయగా.. ఇప్పటి వరకు 12,954 ఎకరాల్లో మాత్రమే నారుమడులు సిద్ధమయ్యాయి. అదీ ఎక్కువగా బోర్లు, భూగర్భజలాల ఆధారంగా రైతులు నార్లు పోసిన ప్రాంతాలే. తదుపరి వర్షాలు లేకపోతే అవి కూడా ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన పడుతున్నారు. ● పత్తి సాగు కొంతమేర ఊరటనిచ్చే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో ఈసారి 95 వేల ఎకరాల్లో పత్తి సాగు లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటి వరకు 67,025 ఎకరాల్లో సాగు పూర్తయింది. ఇటీవల ఎండల తీవ్రతతో మొలక దశలో ఉన్న పత్తిపై ప్రభావం పడే అవకాశం ఉంది. మరోవైపు జిల్లాలో జిల్లాలో సగటు వర్షపాతం సాధారణస్థాయిలో నమోదైనప్పటికీ మండలాల వారీగా పరిస్థితి భిన్నంగా ఉంది. పది మండలాల్లో జూన్ మాసంలో వర్షం లోటు కనిపించింది. జూలై మాసంలో కురిస్తే వర్షాలపైనే ఈ ఏడాది సాగు భవిష్యత్ ఆధారపడి ఉంది. నవాబుపేట, బాలానగర్, దేవరకద్ర, మహమ్మదాబాద్ వంటి మండలాల్లో అధిక వర్షపాతం నమోదవ్వగా.. చిన్నచింతకుంట, హన్వాడ, మూసాపేట, కోయిలకొండ, అడ్డాకుల, మహబూబ్నగర్ రూరల్, అర్బన్, కౌకుంట్ల మండలాల్లో వర్షం లోటు కనిపిస్తోంది. ఈ ప్రభావం నేరుగా పంటల సాగుపై పడింది. ఆరుతడి పంటల పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. పత్తి, మొక్కజొన్న, కంది, జొన్న, ఆముదం వంటి పంటలు విత్తేందుకు కనీసం 60–75 మిల్లీమీటర్లకు పైగా వర్షం అవసరమని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. జనుము, జీలుగు వంటి పచ్చిరొట్ట విత్తనాలు వేసిన వారు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాభావంతో అవి సరిగా మొలకెత్తకపోవడంతో రైతుల్లో నిరాశ పెరుగుతోంది. సాధారణంగా జూన్ చివరి నాటికి చల్లటి గాలులతో కూడిన వర్షాలు కురవాల్సి ఉండగా, ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో ఎండ వేడి, ఉక్కపోత, వడగాలులు కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కార్తెలు మారినా కరుణించని వరుణుడు ఎవుసం సాగక దిగాలు పడుతున్న అన్నదాతలు ఎండుతున్న నారుమడులు.. మొలకెత్తని పత్తి గింజలు చినుకు జాడకు రైతుల ఎదురుచూపులు లక్ష్యానికి చాలా దూరంలో పంటల సాగు విస్తీర్ణం జూలై నెల లో కురిసే వర్షాలపైనే ఆశలు


