Mahabubnagar
-
నాణ్యతపై గొంతు విప్పండి
నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంఇతని పేరు సురేష్బాబు, మహబూబ్నగర్లోని షాసాబ్గుట్ట ఏరియా శివాలయం వీధిలో ఉంటాడు. శేరీ ఫైనాన్స్ నుంచి టిప్పర్ కోసం రుణం తీసుకున్నాడు. కొంతకాలం తర్వాత పనులు నడవకపోవడంతో కిస్తీలు కట్టలేదు. దీంతో ఫైనాన్స్ వారు టిప్పర్ను సీజ్ చేశారు. కిస్తీలు కట్టలేనని ఒప్పుకొని వాహనానికి సంబంధించిన కాగితాలను ఫైనాన్స్ వారికి అప్పగించాడు. కొద్దిరోజుల తర్వాత సీజ్ చేసిన టిప్పర్ను ఫైనాన్స్ వారు ఇతరులకు అమ్మారు. అయినా వాహనానికి సంబంధించిన కాగితాలు కొనుగోలుదారులకు బదిలీ కాలేదు. ఆర్టీఏ మహబూబ్నగర్ కార్యాలయం నుంచి సంబంధిత టిప్పర్ ట్యాక్స్ డ్యూ ఉందని, చెల్లించాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ ఇతడికి నోటీసులిచ్చారు. వాహనాన్ని సీజ్ చేసి ఇతరులకు ఫైనాన్స్ వారు అమ్మినట్లు తెలిపాడు. ఎక్కడైనా వాహనం ప్రమాదానికి గురైనా, ఇతరత్రా ఏమైనా జరిగినా మీది బాధ్యత అవుతుందని, రిజిస్ట్రేషన్ పత్రాలు మీ పేరుపైనే ఉన్నాయని ఆర్టీఏ కార్యాలయం అధికారులు తెలిపారు. ఫైనాన్స్ వారికి ఎన్నిసార్లు చెప్పినా స్పందించలేదు. మహబూబ్నగర్ వినియోగదారుల ఫోరంలో 2023 డిసెంబర్లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదును పరిశీలించిన వినియోగదారుల ఫోరం టిప్పర్ను కొనుగోలు చేసిన వారిపై వెంటనే రిజిస్ట్రేషన్ పత్రాలు బదిలీ చేయాలని, మానసికంగా ఇబ్బందులకు గురైనందున రూ.2 లక్షలు నష్టపరిహారం, రూ.2 వేలు కోర్టు ఖర్చులు బాధితుడికి చెల్లించాలని వినియోగదారుల ఫోరం జనవరి 22న తీర్పు ఇచ్చింది. మారిన చట్టం.. ● ప్రతి వస్తువు నాణ్యతను తెలుసుకోవాలి ● జిల్లాలో వినియోగదారుల హక్కుల కోసం ప్రత్యేక కోర్టు ● ఆశించిన స్థాయిలో ప్రచారం కల్పించని జిల్లా వినియోగదారుల కేంద్రం 1986 వినియోగదారుల రక్షణ చట్టం స్థానంలో 2019 వినియోగదారుల కమిషన్గా మార్పు చేశారు. 1986 నాటి వినియోగదారుల రక్షణ చట్టంలో ఆన్లైన్లో లేని వస్తువులను లేదా ఇతర ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా కొనుగోలు చేసిన వారికి హక్కులు వర్తించడం కోసం 2019 చట్టం పరిధిలో చేర్చారు. ఈ చట్ట ప్రకారం నాణ్యత లేని వస్తువులను ఉత్పత్తి చేసినందుకు, వాటిని విక్రయించడానికి ప్రకటనల్లో నటించే సెలబ్రెటీలకు సైతం రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల జరిమానా, రెండేళ్ల నుంచి పదేళ్ల కఠిన జైలు శిక్ష విధించే విధంగా రూపొందించారు. అలాగే ఆన్లైన్ ద్వారా విక్రయించే వస్తువులకు సంబంధించి పూర్తి వివరాలతో మార్కెట్లోకి విడుదల చేయాలి. నాణ్యత లేని వస్తువులు విక్రయిస్తే వస్తువులు ఉత్పత్తి చేసిన వారితో పాటు అమ్మిన వ్యక్తులపై కేసులు వేయడానికి చట్టంలో సవరణ తెచ్చారు. ఎలాంటి కేసులు వేయడానికి అవకాశం ఉంది వినియోగదారులు ఎయిర్లైన్స్, మెడికల్, రైల్వే, బ్యాంకులు, ఇన్సూరెన్స్, టెలికాం, పోస్టల్, విద్యుత్, రియల్ ఎస్టేట్, ఇళ్ల నిర్మాణం, రవాణా, చిట్ఫండ్స్, వ్యవసాయం, కస్టమర్ గూడ్స్, కొరియర్ సర్వీస్, విద్యారంగం, నాన్ బ్యాకింగ్ ఫైనాన్షియల్ సంస్థల వల్ల నష్టపోతే కేసులు వేయడానికి అవకాశం ఉంది. వినియోగదారుల్లోచైతన్యం రావాలి జిల్లాలో ప్రతిరోజు హక్కుల ఫోరానికి రెండు నుంచి మూడు వరకు కేసులు వస్తుంటాయి. ఎక్కువగా ఎలక్ట్రానిక్ వస్తువులు, జీవిత బీమా, చిట్ఫండ్, ఫైనాన్స్లో నష్టపోయిన వాళ్లు అధికంగా వస్తుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి ఎవరూ రావడం లేదు. పట్టణ ప్రాంతాల నుంచి అవగాహన ఉన్న వ్యక్తులు మాత్రమే కేసులు వేయడానికి వస్తున్నారు. ఇంకా ప్రజల్లో దీనిపై చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. వచ్చిన కేసులు పెండింగ్లో లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి కృషి చేస్తున్నాం. జిల్లాలో వినియోగదారులు ఎలాంటి కేసులు వేయడానికి అవగాహన లేకుంటే 08542–245633 నంబర్కు ఫోన్ చేయాలి. – సృజన్కుమార్, వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సూపరింటెండెంట్ ఐదేళ్లుగా వినియోగదారుల ఫోరం కోర్టులో కేసుల వివరాలుపరిష్కరించినవినమోదైన కేసులుపెండింగ్ 202085 84 12021227 226 1202296 90 62023 80 57 232024101 29 72● జిల్లా వినియోగదారుల హక్కుల ఫోరంలో వినియోగదారులు ఒక్క రూపాయి నుంచి రూ.50 లక్షల వరకు కేసులు వేయడానికి అవకాశం ఉంది. దీంట్లో రూపాయి నుంచి రూ.5 లక్షల వరకు ఉన్న కేసులు కోర్టులో ఉచితంగా వాదిస్తారు. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు వరకు కోర్టు ఫీజు రూ.200, రూ.10 లక్షల నుంచి రూ.20లక్షల వరకు ఫీజు రూ.400 ఉంటుంది. రాష్ట్ర కమిషన్లో రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఉంటే కోర్టు ఫీజు రూ.వెయ్యి, రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉంటే రూ.4వేలు ఉంటుంది. జాతీయ కమిషన్లో రూ.కోటికి పైగా ఉంటే ఫీజు రూ.5 వేలు ఉంటుంది. ఇదీ నేపథ్యం వినియోగదారుల హక్కుల ఫోరం ఉమ్మడి జిల్లాలో 1988 అక్టోబర్లో ప్రారంభించారు. ప్రస్తుతం దీనికి ప్రత్యేక న్యాయమూర్తితో పాటు, ఒకరు సభ్యులు ఉన్నారు. పరిపాలన కోసం ప్రత్యేక విభాగంతో పాటు ఒక కోర్టు కూడా అందుబాటులో ఉంది. వచ్చిన వినియోగదారుల కేసుల నమోదు చేసు కోవడం కోసం ప్రత్యే క భవనం ఉంది. ● ఏదైనా ఒక వస్తువులు కొనుగోలు చేసిన తర్వాత ఆ వస్తువు నాసిరకంగా ఉండటం లేదా మరమ్మతుకు గురైతే అప్పుడు సెక్షన్ 35 ప్రకారం వినియోగదారుల ఫోరం కోర్టులో ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసిన 30 రోజుల వ్యవధిలో సదరు వ్యక్తి లేదా సంస్థకు నోటీస్ ఇవ్వగా 45 రోజుల వ్యవధిలో దీనికి సమాధానం చెప్పాలి. లేకపోతే కోర్టు ఎక్స్పార్టీ చేసి ఆర్డర్ వన్సైడ్ చేసి కోర్టు తీర్పు ఇస్తుంది. ఇచ్చిన జడ్జిమెంట్పై ప్రతివాది 45 రోజుల్లో నష్టపరిహారం చెల్లించాలి.. లేకపోతే అప్పీల్ వేసుకోవాలి. ● వినియోగదారులఫోరం కోర్టులో ఎలాంటి కేసు వేయాలి, వాటి వివరాలు తెలుసుకోవడానికి స్థానికంగా ప్రత్యేక హెల్ప్ డెస్క్ అందుబాటులో ఉంది. ముఖ్యంగా వినియోగదారుడు ఎలాంటి న్యాయవాది లేకుండా కోర్టులో కేసు వేయడానికి అవకాశం కల్పించారు. ● ఎక్కువగా పాత బాట్లే, రాళ్లు వాడకం ● తక్కెడనే వినియోగిస్తున్న చిరు వ్యాపారులు ● కూరగాయల మార్కెట్లోనూ ఇదే పరిస్థితి ● తూనికలు, కొలతల అధికారుల పర్యవేక్షణ లోపం మహబూబ్నగర్ మున్సిపాలిటీ/రూరల్: జిల్లాకేంద్రంలో తూనికలు, కొలతల శాఖ అధికారుల పర్యవేక్షణ, అజమాయిషీ కరువైంది. దీంతో తూకం కోసం చాలా చోట్ల చిరు వ్యాపారులు, తోపుడుబండ్ల నిర్వాహకులు ఎక్కువగా తక్కెడ, పాత బాట్లు, రాళ్లు వాడుతున్నా పట్టించుకునేవారు లేదు. ఇక కూరగాయల, మాంసం మార్కెట్లో కిక్కిరిసిన జనం మధ్య ఈ వ్యవహారం బహిరంగంగా జరుగుతున్నా ఎవరూ ప్రశ్నించే పరిస్థితి లేదు. కిలోకు సుమారు వంద గ్రాములు తక్కువ వస్తుండటంతో వినియోగదారులు నష్టపోతున్నారు. మహబూబ్నగర్లోని ప్రధాన రోడ్లపై సుమారు వేయి మంది వరకు తోపుడు బండ్లలో పండ్లు, ఇతర నిత్యావసర వస్తువులు అమ్ముతుంటారు. ఇక టీడీ గుట్ట సమీపంలోని పెద్ద మార్కెట్లో రైతుబజార్తో పాటు చుట్టుపక్కల వందలాది మంది చిరు వ్యాపారులు, రైతులు రోడ్లపై కూరగాయలు, ఆకుకూరలు విరివిగా అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ ప్రాంతంలోనే మాంసం దుకాణాలు పదుల సంఖ్యలో వెలిశాయి. వీరిలో 90 శాతం తక్కెడ, పాత బాట్లు, బరువు కోసం రాళ్లనే వాడుతున్నారు. ఎలక్ట్రానిక్ కాంటాలు ఉపయోగించాలని తూనికలు, కొలతల శాఖ అధికారులు సూచిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. అధికారులు ఈ ప్రాంతంలో తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. దీంతో సరైన ప్రమాణాలు పాటించకుండా తూకంలో వివిధ రకాలుగా దండెకొడుతూ లాభాలు గడిస్తున్నారు. తూకానికి వినియోగిస్తున్న పాత బాట్లు, రాళ్లు పెద్ద మార్కెట్లో చేయి ఆనించి కూరగాయల తూకంలో దండెకొడుతున్న మహిళలు సామర్థ్యాల మదింపు.. కిలో కొంటే 900 గ్రాములే.. షాసాబ్గుట్ట, వన్టౌన్ చౌరస్తా ప్రాంతాల్లో ఉన్న మాంసం దుకాణాల్లో కిలో మాంసం కొంటే 900 గ్రాములకు మించదు. ఇదేమిటని మాంసం విక్రయదారుడిని అడిగితే.. మీ ముందే తూకం వేశాను కదా అంటారు. మళ్లీ రెండు, మూడు ముక్కలు వేసి గొడవ జరగకుండా చూసుకుంటున్నారు. ఇదంతా సంబంధిత అధికారులకు తెలిసినా మాముళ్ల ముసుగులో మాంసం విక్రయదారులపై చర్యలు తీసుకోవడం లేదు. – వెంకటయ్యగౌడ్, ప్రభుత్వ ఉద్యోగి అవగాహనే అస్త్రంమనిషి సమగ్ర వికాసానికి న్యాయ పరిజ్ఞానం అవసరం అవుతుంది. సమాజంలో ప్రజలు ఉత్తమ వినియోగదారులుగా ఉండాలంటే చట్టాలను ఆయుధాలుగా ఉపయోగించుకోవాలి. మార్కెట్లో వ్యాపారులు చేసే మోసాలు గుర్తించి వాటిపై పోరాటం చేయడానికి ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. లోపాలు ఉన్న వస్తువులు కొనుగోలు చేసిన సమయంలో వాటి వల్ల వినియోగదారుడు నష్టపోతే దానిని ప్రశ్నించడానికి ఉన్న చట్టాలు ఉపయోగించుకోవాలి. మనుషులు ఉపయోగించే ప్రతి వస్తువును పరీక్షించి నాణ్యత తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎలాంటి వస్తువు అయినా సక్రమంగా లేకపోతే అలాంటి వస్తువు ఉత్పత్తి చేసిన కంపెనీపై పోరాటం చేసే అవకాశం వినియోగదారుడికి హక్కు ఉంది. శనివారం ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. – మహబూబ్నగర్ క్రైం రాళ్లతో తూకాల్లో మోసాలు కూరగాయలు మొదలుకొని నిత్యావసర సరుకులు ఏవీ కావాలన్నా మహబూబ్నగర్లోని మార్కెట్కు వస్తాం. మార్కెట్లో వ్యాపారులు బాట్లకు బదులు రాళ్లను వినియోగిస్తూ తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. పండ్లు, కూరగాయలు విక్రయించే వ్యాపారులు అందినకాడికి దోచుకుంటున్నారు. రైతుబజార్, మార్కెట్లో అధికారుల ముందే వ్యాపారులు రాళ్లు వినియోగిస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. – అశోక్, ధర్మాపూర్ -
విజయవంతం చేస్తాం..
తక్కువ సామర్థ్యాలు ఉన్న విద్యార్థులను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం ఏఐ ల్యా బ్ అందుబాటులోకి తె చ్చింది. ఇందులో ఇంగ్లిష్, తెలుగు, మ్యాథ్స్పై ఏఐ ద్వారా సామర్థ్యాలను పెంచేందుకు వీలుంది. వారి సామర్థ్యం ఎంతో కంప్యూటర్ ఒక అంచనా రిపోర్టు ఇస్తుంది. దాని ఆధారంగా విద్యార్థిని మరింత మెరుగుపర్చే విధంగా చర్యలు ఉంటాయి. పైలెట్ ప్రాజెక్టు కింద శనివారం 10 పాఠశాలల్లో ప్రారంభిస్తున్నాం. జిల్లాలో ఈ కా ర్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తాం. – ప్రవీణ్కుమార్, డీఈఓ, మహబూబ్నగర్ సులభంగా ఉంది.. ఉపాధ్యాయులు పుస్తకాలతో ప్రతిరోజు పాఠ్యాంశాల బోధన చేస్తుంటారు. కానీ, ఇటీవల మా పాఠశాలలో కంప్యూటర్ ద్వారా చదువు చెబుతున్నారు. దీంతో పుస్తకాల్లోని అంశాలు చాలా సులభంగా అర్థమవుతున్నాయి. చదవాలనే ఉత్సాహం మరింత పెరిగింది. – మీనాక్షి, 5వ తరగతి, నారాయణపేట అర్థం అవుతున్నాయి.. మా తరగతిలో విద్యార్థులు చాలా వరకు పాఠశాలకు గైర్హాజరు అయ్యేవారు. పాఠాలు అర్థం కాక హోంవర్క్ చేసుకుని రాకపోతే టీచర్లు కొడతారని డుమ్మా కొట్టేవారు. విద్యార్థుల స్థాయిని బట్టి కంప్యూటర్లో బోధన వేగంగా, నిదానంగా జరుగుతుండటంతో అన్ని విషయాలు బాగా అర్థం అవుతున్నాయి. – భార్గవ్, 5వ తరగతి, నారాయణపేట -
జోగుళాంబ క్షేత్రంలో చండీహోమాలు
అలంపూర్ : అలంపూర్ క్షేత్రంలో వెలిసిన శ్రీజోగుళాంబ అమ్మవారి ఐద శక్తిపీఠ ఆలయంలో శుక్రవారం చండీహోమాలు నిర్వహించారు. జోగుళాంబ అమ్మవారి ఆలయంలో ప్రతి శుక్రవారం, పౌర్ణమి, అమావాస్యకు చండీహోమాలు నిర్వహిస్తారు. శుక్రవారం పౌర్ణమిని పురస్కరించుకొని చండీహోమా లు నిర్వహించారు. 117మంది భక్తులు ఈ హో మాల్లో పాల్గొన్నారు. పౌర్ణమి రోజు భక్తులు పెద్దసంఖ్యలో హాజరై శ్రీబాలబ్రహ్మేశ్వర స్వామి, జోగుళాంబ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. అర్చకులు భక్తులకు తీర్ధ ప్రసాదాలను అందజేసి అశీర్వచనం పలికారు. -
వైభవంగా అలివేలు మంగ కల్యాణం
మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీఅలివేలు మంగతాయారు తిరుకల్యాణోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన వేలాదిగా భక్తులు తరలివచ్చారు. సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన శేషవాహనంలో వేంకటేశ్వరస్వామి, అలివేలు మంగతాయారు దేవతామూర్తులను ఉంచి దేవస్థానంలోని గర్భగుడి నుంచి పురోహితుల వేదమంత్రాలు, సన్నాయి వాయిద్యాల మధ్య ఊరేగిస్తూ కల్యాణకట్ట వద్దకు తీసుకొచ్చారు. భక్తుల హరినామ స్మరణల మధ్య ఈ ఊరేగింపు ముందుకు కదిలింది. కన్నుల పండువలా తిరుకల్యాణోత్సవం .. కల్యాణోత్సవం సందర్భంగా మామిడి తోరణాలు, వివిధ రకాల పూలు, శోభాయమానంగా అలంకరించిన కల్యాణకట్ట మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కల్యాణోత్సవంలో జిలకర్ర, బెల్లం తదితర పూజల అనంతరం శ్రీ అలివేలు మంగ మంగళసూత్రధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పురోహితుల వేదమంత్రాల మధ్య జరిగిన ఈ పవిత్ర ఘట్టాన్ని చూసి భక్తులు భక్తి పారవశ్యంతో పులకించిపోయారు. అనంతరం వేంకటేశ్వరస్వామి, అలివేలు మంగతాయారు దేవతామూర్తులకు పట్టు వస్త్రధారణ, తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ బంగారు, వెండి ఆభరణాలు, రకరకాల పూల మధ్య ఈ దేవతామూర్తుల దంపతులు దగదగ మెరిసిపోతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. భక్తులు ఈవేడుకలను కనులారా తిలకించి పునీతులయ్యారు. చాలా మంది దేవతామూర్తుల మీద వేసిన తలంబ్రాలను తీసుకెళ్లడానికి పోటీపడ్డారు. కల్యాణోత్సవానికి హాజరైన భక్తులకు దేవస్థానం తరఫున వారి చేతులకు పసుపుకొమ్మలను ధరింపచేశారు. కల్యాణోత్సవం అనంతరం ఈ దేవతామూర్తులను శేషవాహనంలో మళ్లీ కల్యాణ కట్ట నుంచి గర్భగుడిలోకి ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ ఉత్సవాలకు హాజరైన భక్తులు చాలా మంది దేవస్థానంలో కూడా అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. కొంత మంది భక్తులు దేవస్థానం ముందున్న ధ్వజస్తంభం వద్ద రూపాయి నాణేలను ఉంచి తమ అదృష్ట పరీక్షను చూసుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత, దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి, పాలక మండలి సభ్యులు వెంకటాచారి, సురేందర్, గోవింద్, అలువేలమ్మ, సుధా, మంజుల పాల్గొన్నారు. మంత్రోచ్ఛరణల నడుమ వేంకటేశ్వర, అలివేలు కల్యాణోత్సవం వేలాదిగా తరలివచ్చిన భక్తజనం అన్నదాన కార్యక్రమం -
ఆలయాభివృద్ధికి కృషి చేస్తా : ఎంపీ డీకే అరుణ
అడ్డాకుల: ప్రసిద్ధి చెందిన శ్రీరామలింగేశ్వరస్వామి దేవాలయం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. మండలంలోని కందూర్ సమీపంలో స్వయంభూగా వెలిసిన శ్రీరామలింగేశ్వరస్వామి దేవాలయం వద్ద రూ.7లక్షల ఎంపీ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాలును శుక్రవారం రాత్రి ఆమె ప్రారంభించి అందులో పూజలు చేశారు. అనంతరం ప్రధాన ఆలయంలోని శివలింగానికి అర్చకులు అభిషేకం, పూజలు చేయించారు. ఆలయ నిర్వాహకులు తీర్థప్రసాదాలను అందజేసి సత్కరించారు. రామలింగేశ్వరాలయం చరిత్ర చాలా గొప్పదని, ఇక్కడి భక్తులకు మౌలిక వసతులు కల్పించాలని బీజేపీ నాయకులు తన దృష్టికి తేవడంతో నిధులు మంజూరు చేసినట్లు ఎంపీ తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు వస్తున్నందున కమ్యూనిటీ హాలును వినియోగించుకోవాలని సూచించారు. పార్లమెంట్ కన్వీనర్ డోకూర్ పవన్కుమార్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, దేవరకద్ర ఇన్చార్జి కొండా ప్రశాంత్రెడ్డి, సీనియర్ నాయకుడు సుదర్శన్రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి అరవింద్రెడ్డి, మండలాధ్యక్షుడు రమేష్, టీకే నర్సింహ్మ, నాయకులు గట్టు మల్లేష్ యాదవ్, కొండారెడ్డి, గోవర్ధన్రెడ్డి, రవీందర్గౌడ్, ఈఓ రాజేశ్వరశర్మ ఉన్నారు. -
తుంగభద్ర నదిలో నీటి కుక్కలు
అలంపూర్: తుంగభద్ర నదిలో శిరకుక్కలు అందరిని ఆకట్టుకున్నాయి. స్థానిక నదుల్లో చేపలు, తాబేలు, నీటి పాములను చూసి ఉంటారు. కానీ అరుదైన నీటి కుక్కలను చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. అలంపూర్ పట్టణంలోని తుందభద్ర నదీతీరంలో వింత జలజీవులు కనువిందు చేశాయి. దాదాపు 10వరకు ఉన్న జల జీవులు నది ఒడ్డులో గుట్టపక్కన నీటిలో ఈదుతూ కనిపించాయి. కొద్దిసేపు నదిలో ఉన్న గుట్టపైకి వచ్చిన జీవులు ఆతర్వాత నదిలోకి వెళ్లాయి. స్థానిక మత్స్యకారులు వీటిని శిరకుక్కలు అని పిలుస్తారని తెలిపారు. ఈ జాతి జీవులు శ్రీశైలం డ్యాంలో ఎక్కువగా సంచరిస్తుంటాయని పేర్కొన్నారు. ప్రస్తుతం కృష్ణా–తుంగభద్ర నదులు అడుగంటుతున్నాయి. నదిలో నీటి ప్రవాహం పూర్తిగా తగ్గిపోవడంతో అక్కడి నుంచి ఈ ప్రాంతానికి ఈ జీవులు వచ్చి ఉంటాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. సాధారణంగా నదిలో పెద్దచేపలు, తాబేలు, నీటిపాములను చూసిన స్థానికులు వింతగా ఉన్న జీవులు కనిపించేవరకు వాటిని తమ ఫోన్లలో వీడియోలు, ఫోటోలు తీసి సంబురపడ్డారు. -
కనులపండువగా అశ్వవాహన సేవ
అడ్డాకుల: మండలంలోని కందూర్ సమీపంలో స్వయంభూగా వెలిసిన శ్రీరామలింగేశ్వరస్వామి దేవాలయం వద్ద స్వామివారి బ్రహోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. గురువారం అర్ధరాత్రి దాటాక స్వామివారికి అశ్వవాహనసేవ నిర్వహించారు. ఆలయం ముందున్న చిన్నతేరును పూజారులు శుద్ధిచేశారు. ఆలయంలో ఉన్న స్వామివారి ఉత్సవ విగ్రహాలను పూజారులు తీసుకొచ్చి చిన్నతేరుపై ఉన్న అశ్వవాహనంపై అలంకరించారు. అనంతరం తేరు ముందు పండితులు హోమం నిర్వహించారు. భక్తులంతా కలిసి ఆలయం ముందున్న తేరును జయజయధ్వానాల మధ్య కొద్ది దూరం ముందుకు తీసుకెళ్లి అశ్వవాహనసేవను ముగించారు. శుక్రవారం ఉదయం స్వామి వారికి ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, బలిహరణ పూజా కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. గ్రామంలో ఉన్న స్వామి వారి వెండి ముఖం, నాగపడగలను రాత్రి పల్లికిలో ఉంచి గ్రామంలో ఊరేగింపు చేపట్టారు. మేళతాళాల సవ్వడిలో వెండి ముఖాన్ని ఆలయానికి తీసుకు వచ్చారు. అనంతరం ప్రధాన ఆలయంలో శివలింగానికి స్వామి వారి వెండి ముఖం, నాగపడగను అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత రథోత్సవం నిర్వహించనున్నారు. కార్యక్రమంలో ఈఓ రాజేశ్వరశర్మ, ఆలయ ఉద్యోగి అనంతసేన్శర్మ, అర్చకులు యాదగిరిశర్మ, తాళ్లపాక రామలింగశర్మ, శివశర్మ, మణికంఠశర్మ, రేవంత్శర్మ, వినయ్శర్మ, గ్రామస్తులు ఉన్నారు. హోమం నిర్వహించిన పండితులు స్వామివారి వెండి ముఖం, నాగపడగకు ప్రత్యేకపూజలు -
పొలం పనిచేస్తూ కుప్పకూలి..
● గుండెపోటుతో యువ రైతు మృతి దామరగిద్ద: పొలంలో పనిచేస్తూ కుప్పకూలి గుండెపోటుతో ఓ యువ రైతు మృతిచెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండలంలో వత్తుగుండ్లకి చెందిన కొత్తమాలే మాణిక్యప్ప(35) శుక్రవారం తన పొలంలో సాగుచేసిన కీరదీస పంటను కోసేందుకు పొలానికి వెళ్లాడు. పొలం పనుల్లో ఉండగా మధ్యాహ్నం ఒక్కసారిగా గుండెలో నొప్పి రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. పొలంలోనే కుప్పకూలి అక్కడికక్కడే మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు మహేష్, గణేష్లు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానిక నాయకులు కోరుతున్నారు. అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి మహమ్మదాబాద్: మొకర్లాబాద్ శివారులో అనుమానాస్పదస్పద స్థితిలో ఓ గుర్తు తెలియని మహిళ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.. వివరాలు.. మండలంలోని మొకర్లాబాద్ రెవెన్యూ శివారులో ముందలితండా అటవీ ప్రాంతంలో 8రోజుల క్రితం గుర్తుతెలియని వృద్ధ మహిళ (65) అక్కడికెళ్లి మరణించింది. శుక్రవారం విషయం పోలీసులకు తెలియడంతో వారు అక్కడికెళ్లి చూడగా మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నది. మహిళకు సంబంధించిన ఆనవాళ్లు తెలియలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మహిళ వివరాలు తెల్పిన వాళ్లు మహమ్మదాబాద్ పోలీస్టేషన్ను సంప్రదించాలని పోలీసులు కోరారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం బిజినేపల్లి : మండలంలోని వెల్గొండకి చెందిన రమేష్ (38) అనే వ్యక్తి శుక్రవారం సాయంత్రం శాయిన్పల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదానికి గురై అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. వెల్గొండకి చెందిన రమేష్ అతని స్నేహితుడు కలిసి బైక్పై బుద్దారం నుంచి బిజినేపల్లికి వస్తున్నారు. శాయిన్పల్లి గ్రామంలో ఎత్తైన స్పీడ్బ్రేకర్ వద్ద బైక్ అదుపుతప్పి రమేష్ ఎగిరి కిందపడి అక్కడికక్కడే మరణించాడు. అతని స్నేహితుడికి గాయాలు కాగా చికిత్స కోసం నాగర్కర్నూల్లోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. శాయిన్పల్లిలోని ఈ ఎత్తైన స్పీడ్ బ్రేకర్ ప్రజల పాలిట మృత్యువుగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గొంతులో అన్నం ముద్ద ఇరుక్కొని వృద్ధురాలి మృతి మల్దకల్ : గొంతులో అన్నం ముద్ద ఇరుక్కొని శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన అమరవాయి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. అమరవాయికి చెందిన శాంతమ్మ(75) రోజు ఇంటి, కూలీ పనులు చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేది. శుక్రవారం హోలీ పండగ ఉండటంతో ఇంటి వద్ద ఉన్న ఆమె మధ్యాహ్న భోజనం సమయంలో అన్నం ముద్ద గొంతుల్లో ఇరుక్కోవడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు వెంటనే108అంబులెన్స్లో చికిత్స నిమిత్తం గద్వాల ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నారు. -
చికిత్స పొందుతూ మహిళ మృతి
గట్టు : మండలంలోని రాయాపురానికి చెందిన సరోజమ్మ(50) పాము కాటుకు గురై గద్వాలలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు ఎస్ఐ మల్లేష్ తెలిపారు. వివరాలు.. రాయాపురానికి చెందిన భార్యాభర్తలు సరోజమ్మ, హనుమంతు గురువారం వ్యవసాయ పొలానికి వెళ్లారు. సాయంత్రం ఇంటికొచ్చే క్రమంలో వంట చెరుకు కోసం కట్టెలను మూట కట్టుకుంటున్న తరుణంలో సరోజమ్మను పాము కాటేసింది. విషయం తెలుసుకున్న భర్త హనుమంతు హుటాహుటిన సరోజమ్మను గట్టులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరిస్థితి ఆందోళన కరంగా ఉండడంతో అక్కడి నుంచి గద్వాలకు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతిచెందగా భర్త హనుమంతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. నిప్పంటుకొని గొర్రె పిల్లలు.. ఊట్కూరు: ప్రమాదవశాత్తు నిప్పంటుకొని గొర్రెపిల్లలు మృతిచెందిన సంఘటన ఊట్కూరు శివారులో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. బాధితుల తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన గొర్రెల కాపర్లు అయ్యలప్ప, తిప్పన్న, కురువ బలరాం, చెన్నప్ప, కొండప్ప సుమారు 60 గొర్రె పిల్లలను గ్రామశివారులో ఓ రైతు పొలం దగ్గర ముళ్లతో కంచె ఏర్పాటుచేసి అందులో ఉంచారు. గొర్రెలను మేపడానికి వారంతా వెళ్లారు. మధ్యాహ్నం వేళ పొలాల గట్లకు నిప్పంటుకొని గొర్రెలు నిల్వఉన్న ప్రాంతానికి వ్యాపించింది. దీంతో సుమారు 50 గొర్రె పిల్లలు అక్కడికక్కడే మృతి చెందాయి. నిప్పంటుకున్న విషయాన్ని తెలుసుకున్న గొర్రెల కాపరులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మంటలు ఆర్పగా అప్పటికే 50 గొర్రెపిల్లలు మృతి చెందగా 10 గొర్రె పిల్లలు గాయాలతో మిగిలాయి. సుమారు రూ. 2లక్షల నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. గొర్రెల కాపర్లను ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు గ్రామస్తులు కోరారు. -
ఆర్థిక ఇబ్బందులతో యువకుడు బలవన్మరణం
నవాబుపేట: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన శుక్రవారం లింగంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు .. లింగంపల్లికి చెందిన బాల్రాజ్ (26) అనే యువకుడు శుక్రవారం తన బొలెరో గూడ్స్ వాహనాన్ని ఇంటి నుంచి తీసుకొని వ్యవసాయ పొలానికి వె ళ్లాడు. అక్కడే వాహనాన్ని నిలిపి వెనుకభాగంలో ఉన్న కొండికి తాడుతో ఉరేసుకొని ఆత్మహత్యకు పా ల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే మరణించాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు. నేత్రదానం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించిన అనంతరం మృతుడి తల్లి యా దమ్మ తన కుమారుడి కళ్లను దానం చేసేందుకు అంగీకరించింది. దీంతో ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి సిబ్బంది మృతుడు బాల్రాజ్ కళ్లను తీసుకొని కుటుంబ సభ్యులకు ధ్రువపత్రం అందించారు. నేత్రదానం చేసిన ఆకుటుంబాన్ని అందరూ అభినందించారు. కుమారుడి కళ్లను దానం చేసిన తల్లి -
SLBC టన్నెల్లోకి అటామనస్ హైడ్రాలిక్ పవర్ రోబో
సాక్షి, మహబూబ్నగర్/నాగర్ కర్నూల్: ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యు ఆపరేషన్ కొనసాగుతోంది. మనుషులకు బదులుగా రోబోలతో మట్టి తవ్వకాలు చేపట్టారు. టన్నెల్ లోపల సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు అటానమస్ హైడ్రాలిక్ పవర్డు రోబోకు అనుసంధానంగా ప్రత్యేకమైన యంత్రాలను ఉపయోగిస్తున్నారు. 30 HP సామర్థ్యం గల లిక్విడ్ రింగ్ వాక్యూమ్ పంపు, వాక్యూమ్ ట్యాంకుతో కూడిన మెషిన్ను వినియోగిస్తున్నారు. దీంతో మట్టిని త్వరగా తొలగించేందుకు, టన్నెల్ లోపల పనులను వేగవంతం చేయడానికి చర్యలు చేపట్టారు. వాక్యూమ్ ట్యాంక్ ద్వారా వచ్చిన మట్టిని గంటకు 620 క్యూబిక్ మీటర్ల బురదతో కూడిన మట్టిని కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు తరలించే అవకాశం ఉంది. -
కొనసాగుతున్న రామలింగేశ్వరుడి బ్రహ్మోత్సవాలు
అడ్డాకుల: మండలంలోని కందూరులో స్వయంభూగా వెలసిన రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం శైవాగమ పండితులు పుల్లేటికుర్తి గణపతిశర్మ ఆధ్వర్యంలో గురువారం ప్రధాన ఆలయంలోని శివలింగానికి గవ్యాంత పూజలు, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, నిత్యార్చన, నిత్యోపాసన, రుద్రహోమం, నిత్య బలిహరణ, నిరాజన మంత్రపుష్పాలు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా గౌరమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రుద్రాభిషేకం, రుద్రహోమాలు నిర్వహించారు. ఇదిలా ఉండగా శుక్రవారం అర్ధరాత్రి తర్వాత స్వామివారికి రథోత్సవం నిర్వహించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈఓ రాజేశ్వరశర్మ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఉద్యోగి అనంతసేన్శర్మ, అర్చకులు మణికంఠశర్మ, రేవంత్శర్మ తదితరులు పాల్గొన్నారు. -
వందోసారి తిరుమలకు కాలినడక
మక్తల్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావిస్తారు భక్తులు. కొందరు అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లి మొక్కులు తీర్చుకుంటారు. ఇదే కోవకు చెందిన మక్తల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రంజిత్కుమార్రెడ్డి ఏకంగా వందసార్లు అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లి భక్తిభావం చాటుకున్నారు. గురువారం వందోసారి తిరుమలకు కాలినడకన వెళ్లినట్లు ఆయన తెలిపారు. ప్రతినెలా అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లి స్వామివారిని దర్శించుకుంటున్నట్లు చెప్పారు. -
ఎస్ఎల్బీసీ ఘటన దురదృష్టకరం
అమ్రాబాద్: ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాద ఘటన దురదృష్టకరమని.. 8 మంది కార్మికుల ప్రాణాలు గాలిలో కలవడం వెనుక ప్రభుత్వ నిర్లక్ష్య వెఖరి ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డా. గడ్డం లక్ష్మణ్ ఆరోపించారు. గురువారం ఎస్ఎల్బీసీని పౌరహక్కుల సంఘం, కుల నిర్మూలన వ్యతిరేక పోరాట సమితి బృందంతో కలిసి సందర్శించారు. రెస్క్యూ బృందం, కలెక్టర్ బదావత్ సంతోష్తో మాట్లాడి సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడే మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలు వేగవంతంగా ఉన్నాయని.. సొరంగంలో ప్రమాదం జరగకముందే పరిస్థితిని పసిగట్టి ఉంటే ప్రాణనష్టం జరిగేది కాదన్నారు. గత ప్రభుత్వం 2019లో ఇన్లెట్ వన్ వద్ద పనులు ఎందుకు నిలిపివేసిందో ప్రస్తుత ప్రభుత్వానికి విషయం చెప్పలేదా అని ప్రశ్నించారు. నేటికీ ఏడుగురు కార్మికుల ఆచూకీ లభించకపోవడంతో ఆయా కుటుంబాల ఆవేదన వర్ణనాతీతమన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ.కోటి, జేపీ కంపెనీ మరో రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట కులనిర్మూలన వ్యతిరేక సమితి రాష్ట్ర సభ్యుడు లక్ష్మీనారాయణ, పౌరహక్కుల సంఘం జిల్లా నాయకులు పి.బాలయ్య, జె.బాలయ్య, ఎన్.లక్ష్మీనారాయణ, వెంకటేష్ తదితరులు ఉన్నారు. 8 మంది కార్మికుల మృతి ప్రభుత్వ నిర్లక్ష్యమే.. పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యకుడు డా.గడ్డం లక్ష్మణ్ -
అందుబాటులోకి రాని సేవలు
అచ్చంపేట: శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చేపట్టిన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే టన్నెల్ చివరి 40 మీటర్ల వద్ద ప్రమాదకర స్థలంలో సహాయక చర్యల కోసం తీసుకొచ్చిన రోబోల సేవలు ఇంకా అందుబాటులోకి రాలేదు. బుధవారం అన్వి రోబోటిక్ సంస్థకు చెందిన అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోను టన్నెల్ లోపలికి పంపించారు. కానీ, గురువారం సాయంత్రం వరకు 30 గంటలు గడిచినా ప్రమాద స్థలంలో రోబో పనితనం మొదలుకాలేదు. ఇప్పటి వరకు హైడ్రాలిక్ పవర్ రోబో లోపల ఏం చేస్తుందో అధికారులు వివరించలేదు. అత్యంత ప్రమాదకరమైన డీ– 1, 2 ప్రదేశాలకుి చేరుకోవడం ఎంతో క్లిష్టమైన పరిస్థితులు నెలకొన్నాయి. రోబోకు అవసరమైన సాంకేతిక లోపాలు ఎదరవుతున్నాయి. మొత్తం మూడు స్టేజీల్లో తవ్వకాలు చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం రెస్క్యూ బృందాలు మొదటి స్టేజీలోని శిథిలాలు, మట్టి, బురద, ఇనుప రాడ్లు, రాళ్లు తొలగిస్తున్నారు. సహాయక చర్యలు ఇలాగే కొనసాగితే మరో నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు రెస్క్యూ బృందాలు పేర్కొంటున్నాయి. టీబీఎం మిషన్ ఉన్న ప్రాంతానికి మినీ జేసీబీ వెళ్తుండటంతో సహాయక చర్యల్లో కొంత పురోగతి కనిపిస్తోంది. 200 మంది రెస్క్యూ బృందాలను తగ్గించి ఎక్కువగా సింగరేణి కార్మికులతో శ్రమిస్తున్నారు. సొరంగంలో దుర్వాసన కూడా తగ్గినట్లు సహాయక సిబ్బంది చెబుతున్నారు. పేరుకుపోయిన బురద, రాళ్లు తొలగిస్తూ దక్షిణ మధ్య రైల్వేకు చెందిన ప్లాస్మా కట్టర్స్, థర్మల్ గ్యాస్ కట్టర్తో టీబీఎం విడి భాగాలను కట్ చేస్తూ లోపలి నుంచి బయటికి తెస్తున్నారు. బుధవారం రాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు తీసిన శిథిలాలను బయటికి తీసుకొచ్చారు. సొరంగం పైకప్పు కూలిన ప్రదేశంలో భూగర్భ పరిస్థితులను తెలుసుకునేందకు జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ) ప్రతినిధుల బృందం తొమ్మిది రోజుల వ్యవధిలో 200 మీటర్ల వరకు మాత్రమే సర్వే చేయగలిగారు. మరో 250 మీటర్లు సర్వే చేస్తే తప్ప సొరంగం పైభాగం కూలడానికి గల కారణాలు తెలియవు. టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారిలో ఒకరి మృతదేహం బయటికి తీసుకురాగా, మిగతా ఏడుగురి కోసం సర్వశక్తులు వడ్డుతున్నారు. అత్యున్నత సాంకేతికను వాడుతూ ఎన్డీఆర్ఎ్ఫ్, సింగరేణి, హైడ్రా, రాడర్ హోల్ మైనర్స్ వంటి 12 బృందాలు 20 రోజులుగా నిరంతరం శ్రమిస్తూ వారీ ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. రెండు రోజుల నుంచి కన్వేయర్ బెల్టుకు సరిపడా మెటీరియల్ లేక పనిచేయడం లేదు. మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్కుమార్, కలెక్టర్ బదావత్ సంతోష్ గురువారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మరోసారి డాగ్స్ సాయం సొరంగంలో చిక్కుకున్న వారి ఆచూకీ కనుకొనేందుకు డీ– 1, 2 వద్ద సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్స్ బృందాలు తవ్వకాలు చేపడుతున్నారు. డీ–2 వద్ద కేరళకు చెందిన కాడవర్ డాగ్స్ పసిగట్టిన ప్రదేశంలో నాలుగు రోజులుగా తవ్వకాలు జరిపారు. ఇక్కడ టీబీఎం మిషన్కు చెందిన రాడ్లు, బేస్, శిథిలాలు కనిపించడంతో గురువారం వాటిని బయటికి తీసుకువచ్చారు. అక్కడ మిగతా ఎలాంటి ఆనవాళ్లు లభించకపోవడంతో మరోసారి డాగ్స్ను లోపలికి తీసుకెళ్లారు. అవి పసిగట్టే ప్రదేశాల్లో మరోసారి తవ్వకాలు చేపట్టి కార్మికుల ఆచూకీ గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. హైడ్రాలిక్ పవర్డ్ రోబో యంత్రానికి అవరోధం అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంలో సాంకేతిక సమస్యలు 30 గంటలు గడిచినా వివరాలు వెల్లడించని అధికారులు ఎస్ఎల్బీసీలో కొనసాగుతున్న సహాయక చర్యలు -
పదో బెటాలియన్ అభివృద్ధికి కృషి
ఎర్రవల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ సిబ్బందికి అవసరమైన పూర్తి వసతులు అందించి బెటాలియన్ల అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తుందని తెలంగాణ స్పెషల్ పోలీస్ అదనపు డీజీపీ సంజయ్కుమార్ జైన్ అన్నారు. గురువారం స్థానిక పదో బెటాలియన్లో నూతనంగా ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్రీనివాసరావు, పటాలం కమాండెంట్ సాంబయ్యతో కలిసి నూతన చిల్డ్రన్స్ పార్క్, పరేడ్ గ్రౌండ్ గ్యాలరీలతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంబించారు. అనంతరం కమాండెంట్ కార్యాలయంలో సిబ్బందితో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే పటాలం అభివృద్ధితోపాటు సిబ్బందికి అందుతున్న వివిధ సంక్షేమ పథకాల గురించి కమాండెంట్తో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో బెటాలియన్ పోలీసులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివన్నారు. విధి నిర్వహణలో పటాలం సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించి పటాలానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. పటాలంలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించేందుకు తనవంతు కృషిచేస్తానని సూచించారు. కార్యక్రమంలో అదనపు కమాండెంట్ జయరాజు, అసిస్టెంట్ కమాండెంట్లు నరేందర్రెడ్డి, శ్రీనివాసులు, పాణి, ఆర్ఐలు వెంకటేశ్వర్లు, రాజారావు, రాజేష్, రమేష్బాబు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు అదనపు డీజీపీకి ఎస్పీ శ్రీనివాసరావు ఎర్రవల్లిలో మర్యాద పూర్వకంగా కలిసి పూలబొకే అందించి స్వాగతం పలికారు. అదనపు డీజీపీ సంజయ్కుమార్ జైన్ పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం -
రైతు ఆత్మహత్యాయత్నం
గట్టు: మండలంలోని మిట్టదొడ్డికి చెందిన రైతు మారెప్ప గురువారం పురుగుమందు తాగి ఆత్మహత్యా యత్నానికి యత్నించారు. భార్య సరోజమ్మ కథనం మేరకు.. మారెప్పకు గ్రామ శివారులో పొలం ఉండగా, పక్కనే గ్రామానికి చెందిన సీడ్ ఆర్గనైజర్ నర్సింహారెడ్డి, నల్లారెడ్డి, కిష్టారెడ్డి వ్యవసాయ భూములున్నాయి. రెండు పొలాల మధ్య నక్ష బాట ఉండగా.. సదరు వ్యక్తులు బాటను ఆక్రమించే ప్రయత్నం చేశారు. బాట ఆక్రమణపై గతంలో రెవెన్యూ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండల, జిల్లా సర్వే అధికారులు వచ్చి సర్వే చేసినా ఆక్రమించుకునేందుకు యత్నిస్తే అడ్డుకోగా తమపై అట్రాసిటి కేసు నమోదు చేయించడంతో పాటు దాడిచేసి గాయపర్చినట్లు వివరించారు. దీంతో మానసిక వేధనకు గురై తన భర్త గడ్డి మందు తాగాడని తెలిపారు. వెంటనే చికిత్స నిమిత్తం కర్నూలు ఆస్పత్రికి తరలించామని, పోలీస్స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినట్లు సరోజమ్మ చెప్పారు. యువకుడి బలవన్మరణం ఉండవెల్లి: రైలు కిందపడి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఉండవెల్లి శివారులో గురువారం చోటు చేసుకుంది. రైల్వే కానిస్టేబుల్ అశోక్ వివరాల మేరకు.. మండలంలోని కలుగొట్ల గ్రామానికి చెందిన గొల్ల మధు (21) కర్నూలులో జరిగిన వివాహానికి వెళ్లి.. స్వగ్రామానికి బైక్పై బయలుదేరాడు. ఉండవెల్లి శివారులో గుర్తుతెలియని రైలు వస్తుండగా.. రైల్వే బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడి మృతికిగల కారణాలు తెలియరాలేదు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అలంపూర్ మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు రైల్వే కానిస్టేబుల్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చిన్నచింతకుంట: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన చిన్నచింతకుంట మండలం పర్దీపురం గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. ఎస్ఐ రాంలాల్ నాయక్ వివరాల మేరకు.. పర్దీపూర్కు చెందిన కుమ్మరి రాజు (31) స్వగ్రామం నుంచి లాల్కోటకు బైక్పై వెళ్తుండగా.. జల్మానాయక్ తండాకు చెందిన రమేష్ నాయక్ అతివేగంగా బైక్పై వచ్చి ఢీకొట్టాడు. ప్రమాదంలో రాజుకు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం అంబులెన్స్లో జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో మృతిచెందాడు. రమేష్ నాయక్కు స్వల్పగాయాలు కావడంతో జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
వైభవం.. ధ్వజారోహణం
మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీఅలివేలు మంగతాయారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ధ్వజారోహణం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా దేవస్థానం సమీపంలోని పుట్ట వద్ద ప్రత్యేక పూజలు చేసి.. మట్టి తీసుకువచ్చారు. అనంతరం దేవస్థానం వద్ద ఉన్న మండపంలో పురోహితుల వేదమంత్రాల మధ్య హోమం నిర్వహించారు. ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజల అనంతరం ధ్వజారోహణం, అమ్మవారి సన్నిధిలో దేవతా ఆహ్వానం, బలిహరణం, ఎదుర్కోలు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి హనుమత్ వాహన సేవ.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి అమ్మవారికి హనుమత్ వాహన సేవ వైభవంగా జరిగింది. శోభాయమానంగా అలంకరించిన హనుమత్ వాహనంపై అమ్మవారిని గర్భగుడి నుంచి దేవస్థానం ముందున్న మండపం వరకు సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈ సందర్భంగా భక్తుల హరినామస్మరణ మార్మోగింది. వివిధ రకాల పూలు, బంగారు ఆభరణాల అలంకరణలో అమ్మవారు భక్తకోటికి దర్శనమిచ్చారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందాచారి తదితరులు పాల్గొన్నారు. నేడు తిరుకల్యాణ మహోత్సవం.. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన తిరుకల్యాణ మహోత్సవాన్ని శుక్రవారం నిర్వహించనున్నారు. ప్రతి ఏడాది హోలీ పండుగ రోజు కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా దేవస్థానం వద్ద తిరుకల్యాణ వేడుకకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
నవ వధువు ఆత్మహత్య
కొందుర్గు: కాళ్ల పారాణి ఆరక ముందే ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొందుర్గు మండల పరిధిలోని వెంకిర్యాలలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలం ఎన్కెపల్లికి చెందిన కప్పరి మణ్యం, సుగుణమ్మల కూతురు సుజాత(21)ను మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం లింగంపల్లికి చెందిన రాములుకు ఇచ్చి గత నెల 7న వివాహం జరిపించారు. ఈ సమయంలో వరకట్నం కింద అర తులం బంగారు అభరణాలు, స్కూటీ కొనుక్కునేందుకు రూ.70 వేల నగదుతో పాటు వంట సామాగ్రి అందజేశారు. అయితే పెళ్లి జరిగిన రోజు నుంచి భర్త రాములుతో పాటు మామ పోచయ్య, బావ సైదులు మానసికంగా బాధపెడుతున్నారు. పెళ్లికి రూ.6 లక్షలు ఖర్చు అయిందని, ఈ మొత్తాన్ని మీ తల్లిదండ్రుల నుంచి తేవాలని సుజాతను ఒత్తిడి చేస్తున్నారు. ఇదిలా ఉండగా మణ్యం, సుగుణమ్మ వెంకిర్యాలలోని తమ సమీప బంధువు రామకృష్ణకు చెందిన టీ స్టాల్లో పని చేస్తూ ఇక్కడే ఉంటున్నారు. గురువారం వెంకిర్యాలకు వచ్చిన సుజాత రాత్రి వేళ వద్ద బాత్రూమ్లో చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి మణ్యం ఫిర్యాదు మేరకు తహసీల్దార్ రమేశ్కుమార్ సమక్షంలో షాద్నగర్ కమ్యూనిటీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ బాలస్వామి తెలిపారు. ఇదిలా ఉండగా సుజాత అంత్యక్రియలను అత్తగారి గ్రామమైన లింగంపల్లిలో నిర్వహించారు. వరకట్న వేధింపులతో మనస్థాపం ఉరేసుకుని బలవన్మరణం -
ఎల్ఆర్ఎస్ను సద్వినియోగం చేసుకోవాలి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఎల్ఆర్ఎస్పై కల్పించిన 25 శాతం రాయితీని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. ఈ విషయంపై దరఖాస్తుదారులందరికీ పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. గురువారం మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఈ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా లే–అవుట్, ప్లాట్ యజమానులకు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి ఫోన్ ద్వారా సమాచారం అందించి ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారో మెప్మా ఆర్పీలను అడిగి తెలుసుకున్నారు. ఎల్ఆర్ఎస్కు సంబంధించి ఏమైనా సందేహాలుంటే హెల్ప్డెస్క్ ద్వారా దరఖాస్తుదారులు నివృత్తి చేసుకోవాలన్నారు. ప్రభుత్వ నియమ, నిబంధనల ప్రకారమే ఈ నెల 31 లోగా రుసుం చెల్లించాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్రెడ్డి, మెప్మా ఇన్చార్జ్ డీఎంసీ ఎం.లక్ష్మి, సీఓలు వరలక్ష్మి, నిర్మల, దేవమ్మ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. చిరుధాన్యాలు ఆరోగ్యానికి మేలు చిరుధాన్యాల ఆహారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని కలెక్టర్ విజయేందిర అన్నారు. స్థానిక మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ‘ఆహారంతో ఆరోగ్యంశ్రీలో భాగంగా చిరు ధాన్యాల వంటకాలపై శిక్షణ, మానవ అక్రమ నివారణపై అవగాహన నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. మానవ అక్రమ రవాణా ప్రధాన సమస్యగా ఉందని, మహిళా సంఘాల సభ్యులు అప్రమత్తంగా గ్రామస్థాయిలో మహిళలకు అవగాహన కలిగిస్తూ ఐక్యంగా, సంఘటితంగా సామాజిక రుగ్మతలను రూపు మాపాలని తెలిపారు. చిరుధాన్యాలతో మిల్లెట్ రాంబాబు 10 రకాల వంటకాలు డెమో నిర్వహించారు. వంటకాలు మహిళా సభ్యులకు, అతిథులకు వడ్డించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ నర్సింహులు, అదనపుడీఆర్డీఓ జోజప్ప, డీఎఫ్ఓ సత్యనారాయణ, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు రజిత, కార్యదర్శి సుమతి, కోశాధికారి అనిత, డీపీఎంలు నాగమల్లిక, చెన్నయ్య, సలోమి, ఏపీఎంలు మాధవి, నాగరాజు, అనురాధ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ విజయేందిర బోయి మున్సిపల్ కార్యాలయంలో ప్రక్రియ పరిశీలన నిబంధనల ప్రకారమే రుసుం చెల్లించాలి -
రూపాయి సాయం అందలేదు..
ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తాము సంతకాలు చేశాం. తమ బ్యాంకు ఖాతాల లో మూడు దఫాలుగా పరిహారాన్ని జమ చేస్తామని అధికారులు అప్పట్లో చెప్పారు. ఇప్పటి వరకు రూపాయి జమ చేయలేదు. రోజురోజుకు మార్కెట్ విలువ పెరిగిపోతుంది. ప్రస్తుతం ప్యాకేజీని రూ.25 లక్షలకు పెంచి ఇవ్వాలి. – రామాంజనేయులు, నిర్వాసితుడు, ఉదండాపూర్ నిధులు విడుదల కావాలి ఉదండాపూర్ రిజర్వాయర్కు సంబంధించి ఆర్అండ్ఆర్ అమలు పెండింగ్లో ఉంది. గి రిజన తండాలకు అవా ర్డ్ పాస్ కావడంతో రూ.42 కోట్లు నిర్వాసితుల ఖాతాలలో జమయ్యాయి. వల్లూరు, ఉదండాపూర్ ముంపు గ్రామాలకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి సంబంధించి అవార్డ్ సిద్ధం చేయాల్సి ఉంది. ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ఆదేశాలతో అక్కడక్కడా వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి ముందుకు వెళుతున్నాం. – నర్సింగరావు, తహసీల్దార్, జడ్చర్ల పదవీ త్యాగానికి సిద్ధం ఉదండాపూర్ నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతా. అవసరం అనుకుంటే పార్టీని, పదవీని పక్కన పెట్టి నిర్వాసితుల తరఫున నిలబడుతా. ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి నుంచి న్యాయం చేస్తామన్న హామీ దక్కింది. అవార్డు పాసైన తండాలకు ఆర్అండ్ఆర్ పరిహారంతో పాటు ప్లాట్లు త్వరలోనే అందజేస్తాం. – అనిరుధ్రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే ● -
గడువులోగా లక్ష్యం చేరుకోవాలి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఆర్థిక సంవత్సరం (2024–25) ముగియడానికి 17 రోజులే మిగిలి ఉందని.. ఆలోపు పట్టణాలలో ఆస్తిపన్ను, ఎల్ఆర్ఎస్కు సంబంధించి లక్ష్యం చేరుకోవాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్ ఆదేశించారు. గురువారం సాయంత్రం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మహబూబ్నగర్, జడ్చర్ల, భూత్పూర్ కమిషనర్లు, మెప్మా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్నగర్ నగరంలో ఇంకా రూ.నాలుగు కోట్ల ఆస్తి పన్ను వసూలైతేనే 16వ ఆర్థిక సంఘం గ్రాంట్కు అర్హత దక్కుతుందన్నారు. అలాగే జడ్చర్ల పట్టణంలో రూ.80 లక్షలు, భూత్పూర్లో రూ.60 లక్షల మేర ఆస్తిపన్ను ఎలాగైనా రాబట్టాలని సూచించారు. ఇక ఒక్కో ఆర్పీ కనీసం వంద మంది ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు ఫీజు చెల్లింపులో కల్పిస్తున్న 25 శాతం రాయితీపై అవగాహన కల్పించాలన్నారు. వీలైనంత ఎక్కువ మంది ఈ ప్రక్రియను పూర్తి చేసేలా చూడాలన్నారు. సమావేశంలో మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్రెడ్డితో పాటు జడ్చర్ల, భూత్పూర్ కమిషనర్లు లక్ష్మారెడ్డి, నూరుల్ అహ్మద్, ఆర్ఓ మహమ్మద్ ఖాజా, మెప్మా ఇన్చార్జ్ డీఎంసీ ఎం.లక్ష్మి, సీఓలు వరలక్ష్మి, నిర్మల, దేవమ్మ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్శివేంద్రప్రతాప్ మున్సిపల్ కమిషనర్లు, మెప్మా అధికారులతో సమీక్ష -
హోలీ సంబరాలు ప్రారంభం
పాలమూరు: హోలీ పండుగ సందర్భంగా మహబూబ్నగర్లోని పలు చౌరస్తాల్లో గురువారం రాత్రి కాముడి దహనం నిర్వహించారు. ప్రధానంగా బ్రహ్మణవాడి, రాంమందిర్ చౌరస్తాలో స్థానిక మహిళలతో పాటు యువకులు కాముడి దహనం చేశారు.సంజయ్నగర్, క్లాక్టవర్, పద్మావతి కాలనీ, శ్రీనివాస కాలనీ, మర్లు, సాంబశివ దేవాలయం వద్ద స్థానికులు పెద్ద పెద్ద మంటలు ఏర్పాటు చేసి కాముడి దహనంచేసి, ఆ మంటల చుట్టూ సందడి చేశారు. మరోవైపు రంగులు విక్రయించే దుకాణాలు జనంతో కిటకిటలాడాయి. శుక్రవారం హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు యువత ఏర్పాట్లు చేసుకుంది. కాగా.. వేడుకల్లో కాలుష్య కారకాలు లేని సహజసిద్ధమైన, పూల వ్యర్థాలతో తయారు చేసిన రంగులనే ఉపయోగించాలని అధికారులు, వైద్యులు చెబుతున్నారు. ● విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో క్లాక్టవర్ చౌరస్తాలో నిర్వహించిన కాముడి దహన కార్యక్రమానికి ఎస్పీ డి.జానకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి భారీగా ఏర్పాటు చేసిన కాముడిని దహనం చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాములు, డీఎస్పీ వెంకటేశ్వర్లు, వన్టౌన్ సీఐ అప్పయ్య, విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు యాదిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు విగ్నేష్కాంత్, లక్ష్మీనారాయణ, శ్రీధర్, ప్రభాకర్, మయూరీనాథ్, సుబ్రహ్మణ్యం, బాబుల్రెడ్డి పాల్గొన్నారు. జిల్లాకేంద్రంలో పలు చౌరస్తాల్లో కాముడి దాహనం -
క్రీడలతో ఉజ్వల భవిష్యత్
మహబూబ్నగర్ క్రీడలు: క్రీడలతో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని డీటీడీఓ ఛత్రునాయక్, డీవైఎస్ఓ ఎస్.శ్రీనివాస్ అన్నారు. మోడల్ స్పోర్ట్స్ స్కూల్, వాటర్ స్పోర్ట్స్ అకాడమీల్లో 5వ తరగతి ప్రవేశాలకు సంబంధించి జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో గురువారం ట్రైబల్ వెల్ఫేర్ విద్యార్థులకు ఆయా క్రీడాంశాల్లో ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ మోడల్ స్పోర్ట్స్ స్కూల్, వాటర్ స్పో ర్ట్స్ అకాడమీలకు ఎంపికై తే మెరుగైన క్రీడాశిక్ష ణ లభిస్తుందన్నారు. విద్యార్థులకు ఎత్తు, బరు వు, 30మీటర్ల ఫ్లయింగ్ స్టార్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, మెడిసిన్ బాల్, 6x10 మీటర్ల షటిల్ రన్, ఫ్లెక్సిబిలిటీ, వర్టికల్ జంప్, 800 మీటర్ల రన్ అంశాల్లో ఎంపికలు నిర్వహించా రు. కార్యక్రమంలో ఏటీడీఓ చిన్యనాయక్, వా ర్డెన్లు రాజేందర్, పద్మ, క్రీడాశాఖ కోచ్లు సునీల్కుమార్, పర్వేజ్పాష, అంజద్ పాల్గొన్నారు. ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్లో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ద్వారా నెలరోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ స్వప్న ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లో ఈనెల 15 నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించిన స్క్రీనింగ్ టెస్టు వచ్చే నెల 12వ తేదీన నిర్వహిస్తామని పేర్కొన్నారు. 252 మంది గైర్హాజరు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్ష గురువారం ప్రశాంతంగా జరిగాయి. ప్రథమ సంవత్సరానికి సంబంధించి మ్యాథ్స్–2, జువాలజీ, హిస్టరీ సబ్జెక్టులకు సంబంధించి పరీక్ష జరిగింది. 36 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 10,599 మంది విద్యార్థులకు 10,347 మంది హాజరై, 252 మంది గైర్హాజరయ్యారు. స్క్వాడ్ అధికారులు పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. టెక్నీషియన్ విధులు కీలకం పాలమూరు: జిల్లా జనరల్ ఆస్పత్రిలోని సమావేశ మందిరంలో గురువారం ల్యాబ్ టెక్నీ షియన్ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్కుమార్ సింగ్ కేక్ కట్ చేసి ల్యాబ్ టెక్నీషియన్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్నీషియన్స్ విధులు చాలా కీలకంగా ఉంటాయని, వారు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే వైద్యులు రోగికి చికిత్స చేస్తారని తెలిపారు. అనంతరం ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ఆస్పత్రిలోని డయాలసిస్సెంటర్లో రోగులతో కూడా కేక్ కట్ చేయించారు. కార్యక్రమంలో వైద్యులు సునీల్, ఆర్ఎంఓ జరీనా, శిరీష, దుర్గ, శ్వేత, జనరల్ మెడిసిన్ హెచ్ఓడీ అమరావతి, నోడల్ ఆఫీసర్ డాక్టర్ బాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వేరుశనగ క్వింటాల్ రూ.6,989 జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం వేరుశనగ క్వింటాల్కు గరిష్టంగా రూ.6,989, కనిష్టంగా రూ.5,363 ధరలు లభించాయి. కందులు గరిష్టంగా రూ.6,800, కనిష్టంగా రూ.4,000, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,304, కనిష్టంగా రూ.2,165, పెబ్బర్లు గరిష్టంగా రూ.6,010, కనిష్టంగా రూ.5,450, జొన్నలు రూ.3,889, పొద్దుతిరుగుడు రూ.4,250, ఆముదాలు రూ.6,151, మినుములు గరిష్టంగా రూ.7,262, కనిష్టంగా రూ.7,222 ధరలు లభించాయి. అలసందలు క్వింటాల్ రూ.7,072 నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం అలసందలు క్వింటాల్కు గరిష్టం రూ.7,072, కనిష్టంగా రూ.6,982 ధర పలికాయి. అలాగే, శనగలు గరిష్ట, కనిష్టంగా రూ.5,680, వేరుశనగ గరిష్టం రూ.6,020, కనిష్టం రూ.4,110, జొన్నలు గరిష్టం రూ.4,640, కనిష్టం రూ.2,650, ఎర్ర కందులు గరిష్టం రూ.7,314, కనిష్టం రూ.6,339, తెల్ల కందులు గరిష్టంగా రూ.6,769, కనిష్టంగా రూ.6,650 ధరలు పలికాయి. -
మహిళలకే ఆరోగ్య సమస్యలు
మహబూబ్నగర్ రూరల్: దేశంలో ఎక్కువ ఆరోగ్య సమస్యలు మహిళలకే ఉన్నాయని, ప్రతిఒక్క మహిళ తినే ఆహారాన్ని పౌష్టికంగా తీసుకోవాలని సుశ్రుత ప్రజా వైద్యశాల ఎండీ డాక్టర్ ప్రతిభ సూచించారు. బుధవారం మండలంలోని మాచన్పల్లి గ్రామంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, మాచన్పల్లి గ్రామ మహిళా సమాఖ్య సంఘాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు–పరిష్కార మార్గాలు’ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రతిభ మాట్లాడుతూ భారతదేశంలో క్యాన్సర్ వ్యాధి అత్యధికంగా మహిళలకే వస్తుందన్నారు. దీన్ని అరికట్టడానికి ప్రతి మహిళా ముందుగానే పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. ప్రతిరోజు గుడ్లు, పాలు, ఆకు కూరలు అధిక శాతంలో తినాలని సూచించారు. అనంతరం డాక్టర్ ప్రతిభను శాలువతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కడియాల మోహన్, మండల మహిళా సమాఖ్య ఏపీఎం మాధవి, సీసీ నాగలక్ష్మి, గ్రామ ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం అరుంధతి పాల్గొన్నారు. -
వర్గీకరణ తరువాతే ఫలితాలు విడుదల చేయాలి
జడ్చర్ల టౌన్: రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్–2 పరీక్షల ఫతితాలు నిలుపుదల చేసి ఎస్సీ వర్గీకరణ తరువాతే విడుదల చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మందకృష్ణ పిలుపుమేరకు నియోజకవర్గ కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలను బుధవారం ప్రారంభించారు.తెలంగాణలోని యావత్తు మాదిగ జాతి సమాజానికి ఇచ్చిన మాటను నిలుపుకోకుండా మాల లీడర్ల ఒత్తిడి మేరకే గ్రూప్ 2 ఫలితాలు విడుదల చేశారని దీక్షలో పాల్గొన్న నాయకులు ఆరోపించారు. మంత్రివర్గంలోనూ మాదిగలకు రెండు మంత్రి పదవులు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టి ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రయత్నిస్తామన్నారు. దీక్షలకు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పాలాది సారిక సంఘీభావం ప్రకటించారు. ఎమ్మార్పీఎస్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి జంగయ్య మాదిగ, సీనియర్ నాయకులు కొంగళి నాగరాజు, ధర్నాచౌక్లో.. మహబూబ్నగర్ రూరల్: ఎస్సీ వర్గీకరణ తర్వాతే ప్రభుత్వ ఉద్యోగ ఫలితాలను, నియామకాలను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎంఈఎఫ్ జాతీయ నాయకుడు పోలే బా లయ్య, బాలరాజు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగ ఫలితాలను, నియామకాలను చేపట్టరాదన్నారు. ఫలితాలను వాయిదా వేయాలి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఎస్సీ వర్గీకరణ అయ్యేంత వరకు గ్రూప్స్ ఫలితాలు ఇవ్వకూడదని, తక్షణమే ఇచ్చిన ఫలితాలను వాయిదా వేయాలని ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కార్తీక్ డిమాండ్ చేశా రు. పీయూ ముఖద్వారం వద్ద ఏర్పాటుచేసిన ని రసనలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టే క్రమంలో ఇలాంటి పనులు చేయడంతో అన్యాయం చేయడమే అన్నారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు -
వర్గీకరణ తరువాతే ఫలితాలు విడుదల చేయాలి
జడ్చర్ల టౌన్: రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్–2 పరీక్షల ఫతితాలు నిలుపుదల చేసి ఎస్సీ వర్గీకరణ తరువాతే విడుదల చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మందకృష్ణ పిలుపుమేరకు నియోజకవర్గ కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలను బుధవారం ప్రారంభించారు.తెలంగాణలోని యావత్తు మాదిగ జాతి సమాజానికి ఇచ్చిన మాటను నిలుపుకోకుండా మాల లీడర్ల ఒత్తిడి మేరకే గ్రూప్ 2 ఫలితాలు విడుదల చేశారని దీక్షలో పాల్గొన్న నాయకులు ఆరోపించారు. మంత్రివర్గంలోనూ మాదిగలకు రెండు మంత్రి పదవులు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టి ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రయత్నిస్తామన్నారు. దీక్షలకు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పాలాది సారిక సంఘీభావం ప్రకటించారు. ఎమ్మార్పీఎస్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి జంగయ్య మాదిగ, సీనియర్ నాయకులు కొంగళి నాగరాజు, ధర్నాచౌక్లో.. మహబూబ్నగర్ రూరల్: ఎస్సీ వర్గీకరణ తర్వాతే ప్రభుత్వ ఉద్యోగ ఫలితాలను, నియామకాలను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎంఈఎఫ్ జాతీయ నాయకుడు పోలే బా లయ్య, బాలరాజు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగ ఫలితాలను, నియామకాలను చేపట్టరాదన్నారు. ఫలితాలను వాయిదా వేయాలి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఎస్సీ వర్గీకరణ అయ్యేంత వరకు గ్రూప్స్ ఫలితాలు ఇవ్వకూడదని, తక్షణమే ఇచ్చిన ఫలితాలను వాయిదా వేయాలని ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కార్తీక్ డిమాండ్ చేశా రు. పీయూ ముఖద్వారం వద్ద ఏర్పాటుచేసిన ని రసనలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టే క్రమంలో ఇలాంటి పనులు చేయడంతో అన్యాయం చేయడమే అన్నారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు -
ఎల్ఆర్ఎస్పై విస్తృత ప్రచారం చేయాలి
భూత్పూర్: మున్సిపాలిటీలోని ప్రజలకు ఎల్ఆర్ఎస్పై విస్తృత ప్రచారం చేపట్టాలని అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ఆదేశించారు. బుధవారం మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. 2020లో ఎల్ఆర్ఎస్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి వివరాలను కమిషనర్ నూరుల్ నజీబ్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. 2020లో ఎల్ఆర్ఎస్కు రూ.1,000 చెల్లించి అప్పట్లో ఖాళీ స్థలం లబ్ధిదారులు తమ ప్లాట్లను రిజస్ట్రేషన్ చేయించుకున్న వారికి మాత్రమే ఈ నెల 31వ తేదీ వరకు పూర్తి ఫీజు చెల్లిస్తే 25 శాతం రాయితీ లభిస్తుందని తెలిపారు. మున్సిపాలిటీలోని 10 వార్డుల్లో ప్రజలకు ఎల్ఆర్ఎస్ రాయితీ కల్పిస్తున్నట్లు ప్రచారం నిర్వహించాలని, మున్సిపాలిటీలో హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేయాలని కమిషర్ను ఆదేశించారు. -
నేటి నుంచి ఆదిబసవేశ్వరస్వామి ఉత్సవాలు
నవాబుపేట: మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో పల్లెగడ్డ గ్రామ శివారులో స్వయంభూగా ఆదిబసవేశ్వరస్వామి వెలిశారు. స్వామివారి ఉత్సవాలు గురువారం నుంచి ప్రా రంభం కానున్నాయి. ప్రతి ఏటా ఉత్నవాలు హోలీకి ముందు రోజు ఉత్సవాలు ప్రారంభిస్తారు. గురువారం ప్రారంభమయ్యే సోమవా రం ముగుస్తాయి. 13న ప్రభోత్సవం, 14న రథోత్సవం, 15న శకటోత్సవం, 16న అగ్నిగుండం, 17న శివపార్వతుల కల్యాణంతో ఉత్సవాలు ముగుస్తాయని పూజారి శ్రీశైలం, కార్యక్రమ నిర్వాహకులు జంగయ్య, రాజలింగం, ధర్మకర్త భూపాల్రెడ్డి తెలిపారు. ఈ ఉత్సవాలకు చుట్టుపక్కల దాదాపుగా 70 గ్రామాల ప్రజలు వస్తుంటారు. దాదాపుగా 40 గ్రామల ప్రజలు ఇంటికి ఒకరు చొప్పున విధిగా వచ్చి దేవాలయంలో టెంకాయ కొట్టాలన్న ఆనవాయితీ ఇక్కడ ఉండటంతో అన్ని గ్రామాల ప్రజలు మా ఊరి జాతరగా పిలుస్తుంటారు. -
భూమాతను కాపాడుకుందాం
జడ్చర్ల టౌన్: ప్రతిఒక్కరం బాధ్యతగా భూమాతను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డా.సుకన్య పిలుపునిచ్చారు. తెలంగాణ బొటానికల్ గార్డెన్లో ప్రారంభమైన ఎన్ఎస్ఎస్3 యూనిట్ ప్రత్యేక శిబిరంను ఆమె బుధవారం ప్రారంభించి మాట్లాడారు. భూ మాతను కాపాడుకోవాలంటే మన జీవన విధానంలో సమూలమైన మార్పులు రావాలన్నారు. మన ప్రతిచర్య పర్యావరణ హితంగా ఉండాలన్నారు. శిబిరం 7రోజుల పాటు కొనసాగనున్నందున పర్యావరణ హిత కార్యక్రమాలు చేయాలన్నారు. చెట్లకు పాదులు చేయటం, ఔషధమొక్కల నర్సరీ ఏర్పా టు, చెత్తచెదారంతో కంపోస్ట్ తయారీ, మొక్కలు నాటాలన్నారు. న్నారు.ఎన్ఎస్ఎస్ యూనిట్–3 ప్రోగ్రాం అధికారి డా.సదాశివయ్య, వైస్ ప్రిన్సిపాల్ నర్మద, 50మంది వాలంటీర్లు పాల్గొన్నారు. డిగ్రి కళాశాల ప్రిన్సిపాల్ డా. సుకన్య -
బీసీలకు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం
మహబూబ్నగర్ రూరల్: బీసీలకు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం కావాలని బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు పాండుయాదవ్ పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలో బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ‘ఓటుహక్కు బీసీల ఓటు బీసీలకే’ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలు రాష్ట్రంలో ఉన్నారన్న విషయాన్ని మరిచి కులగణనలో తప్పుడు లెక్కలు చూయించే ప్రయత్నిస్తుందని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సకల జనుల సర్వేలో ఏ లెక్కలు అయితే చూయించిందో వాటి ఆధారంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అత్యధిక శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. నేషనల్ జస్టిస్ ఫోరం చైర్మన్ నారగోని మాట్లాడారు. సంఘం మహిళావిభాగం రాష్ట్ర ప్రధా న కార్యదర్శి సంధ్యారాణి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయ్ మహేంద్ర, రాష్ట్ర కోశాధికారి అరుణ్కుమార్, నాయకులు భీమేష్, కృష్ణ, సుజిత్యాదవ్, మల్లేష్యాదవ్, దీపక్, ఎం.కృష్ణ, రాము పాల్గొన్నారు. -
పట్టాల పంపిణీలో నిర్లక్ష్యం
● ప్రజా సమస్యలపై సీపీఎం సర్వే మహబూబ్నగర్ రూరల్: సీపీఎం చేసిన పోరాటాల ఫలితంగా ప్రభుత్వం 310 డబుల్ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేసిందని, కానీ నేటికీ ఇళ్ల యజమానులకు పట్టాలు పంపిణీ చేయడంలో నిర్లక్ష్యం చూపుతోందని ఆ పార్టీ పట్టణ కార్యదర్శి చంద్రకాంత్ ఆరోపించారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం క్రిష్టియన్పల్లి రెవెన్యూ వార్డు శివారులో గల డబుల్ బెడ్రూం కాలనీలో సర్వే నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారంటీల్లో సమస్యలు ఉన్నాయని, రేషన్ కార్డులు, గ్యాస్ సిలిండర్లు, ఉచిత విద్యుత్ వంటి పథకాలు అర్హులకు అమలు కావడం లేదన్నారు. ఆరు గ్యారెంటీలు అమలయ్యేదాకా అనేక రకాల పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. నాయకులు రాజ్కుమార్, అనురాధ, మాణిక్రావు, నర్సింగ్రావు, కొండమ్మ పాల్గొన్నారు. -
రేపు అయ్యప్ప ఆలయంలో రుద్రాభిషేకం
జడ్చర్ల టౌన్: గంగాపురం రోడ్డులోని అయ్యప్ప ఆలయంలో శుక్రవారం అయ్యప్పస్వామి జన్మదినం పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు అయ్యప్ప సేవాసమితి అధ్యక్షుడు రంజిత్బాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 6గంటలకు విశేషంగా పంచామృత రుద్రాభిషేకం నిర్వహిస్తామని, భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు. పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లా కేంద్రంలోని బీకేరెడ్డి కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయ దంపతులు శోభ, కరుణాకర్గౌడ్ తమ పిల్లల పుట్టిన రోజును పురస్కరించుకొని బుధవారం 20 మంది పారిశుద్ధ్య కార్మికులకు ఉచితంగా చీరలు పంపిణీ చేశారు. జేఎల్ నియామకపత్రం అందుకున్న వెన్నచేడ్ వాసి గండేడ్: మండలంలోని వెన్నచేడ్ గ్రామానికి చెందిన రాజశేఖర్ బుధవారం సీఎం రేవంత్రెడ్డి చేతులమీదుగా జేఎల్(జూనియర్ లెక్చరర్) నియామక పత్రాన్ని అందుకున్నారు. సీఎంతో పోస్టింగ్ ఆర్డర్ను అందుకోవడం సంతోషంగా ఉందని రాజశేఖర్ తెలిపారు. ఆయన్ను గ్రామ మాజీ సర్పంచ్లు పుల్లారెడ్డి, గోపాల్ అభినందించారు. విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ.. నవాబుపేట: విద్యార్థులే ఉపాధ్యాయులై తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. బుధవారం మండలంలోని మెట్టుగడ్డతండా ప్రాథమిక పాఠశాలలో స్వయం పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా తమ గురువుల పాత్రతో పాటు మండల, జిల్లా స్థాయి అధికారులు పాత్రలు వేసి అందరి మన్ననలు పొందారు. ప్రతిభ కనబర్చినవారికి బహుమతులు అందించారు. పాఠశాల హెచ్ఎం విష్ణు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
విద్యార్థి దశ కీలకమైంది
దేవరకద్ర: విద్యార్థి దశ ఎంతో కీలకమైందని, వ్యసనాలకు బానిస కావొద్దని ఎస్ఐ నాగన్న అన్నారు. బుధవారం దేవరకద్ర జెడ్పీహెచ్ఎస్(బాలికల)లో సైబర్ క్రైం అవేర్నెస్, 100 డయల్, పొదుపు, పౌష్టికాహారం వంటి అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రభుత్వం విద్య కోసం ఎంతో ఖర్చు చేస్తోందని, నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలల్లోనే లభిస్తుందన్నారు. ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. క్రమశిక్షణతో చదువుకోవాలని, సైబర్ నేరాలపై అవగాహన కలిగి సెల్ఫోన్లకు వచ్చే మెసేజ్లా పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ గీత, ట్రైనింగ్ ఎస్ఐ కృష్ణాజీ, హెచ్ఎమ్ నాగేంద్రమ్మ పాల్గొన్నారు. మెరుగైన విద్యా బోధన అందించేందుకు చర్యలు మిడ్జిల్: ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా బోధన అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఎంఈ వెంకటయ్య అన్నారు. వస్పుల ఉన్నత పాఠశాల హెచ్ఎంగా పనిచేస్తున్న వెంకటయ్య మండల ఇన్చార్జి ఎంఈఓగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు.మండలంలోని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఎంఈఓను సన్మానించాయి. కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం సరస్వతి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు రాజేందర్గౌడ్, నర్సింహులు, రమేష్, వెంకటేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. పది ఇసుక ట్రాక్టర్లపట్టివేత దేవరకద్ర: గూరకొండ, నార్లోనికుంట్ల సమీపంలోని కోయిల్సాగర్ వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఆరు ఇసుక ట్రాక్టర్ల పట్టుకున్నారు. బుధవారం తెల్లవారుజామున ఇసుకను నింపుకొని దేవరకద్ర వైపు వస్తుండగా పోలీసులు దాడిచేసి ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. గత కొన్ని రోజులుగా ఆయా గ్రామాలను అడ్డాగా చేసుకుని పెద్ద ఎత్తున ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రతి రోజు అర్థరాత్రి దాటితే వాగు ఇసుక ట్రాక్టర్లతో నిండి పోతుందని ఆరోపించారు. ఇసుక తరలింపును అరికట్టాలని పలువురు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రెండు ట్రాక్టర్లు.. మహమ్మదాబాద్: అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్ఐ శేఖర్రెడ్డి తెలిపారు. మండలంలోని గోవిందపల్లి గ్రామ సమీపంలోని వాగు నుంచి బుధవారం అర్ధరాత్రి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకొని పోలీసుస్టేషన్కు తరలించారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు మిడ్జిల్: మండలంలో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు తప్పవని ఎస్ఐ శివనాగేశ్వర్ నాయుడు హెచ్చరించారు. బుధవారం కొత్తూర్ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మండలంలో ఇసుక అక్రమ రవాణాపై గ్రామస్తులు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. -
యూనిఫాంలను నాణ్యతగా కుట్టాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): విద్యార్థులకు కుట్టే యూనిఫాంలను నాణ్యతగా కుట్టాలని డీఆర్డీఏ ఏపీడీ జొజప్ప అన్నారు. బుధవారం స్థానిక జిల్లా మహిళా సమాఖ్య భవనంలో మహిళలకు కుట్టులో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందజేసే యూనిఫాంలను మహిళా సంఘాల ద్వారా కుట్టించనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా మహిళలకు కుట్టులో శిక్షణ ఇస్తున్నామన్నారు. జిల్లాస్థాయిలో శిక్షణ పొందిన టీఓటీ శిక్షకులు మండలస్థాయిలో శిక్షణ ఇస్తారన్నాని అన్నారు. ఈ శిక్షణలో యూనిఫాంలు కుట్టడంతో పాటు బట్ట కట్టింగ్, కాజాలు తదితర అంశాలపై శిక్షణ ఇస్తారని తెలిపారు. కుట్టే క్రమంలో మహిళలు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో డీపీఎం ఆలూరిచెన్నయ్య, రమేష్ పాల్గొన్నారు. డీఆర్డీఏ ఏపీడీ జోజప్ప మహిళలకు కుట్టుపై శిక్షణ -
రక్తదాన శిబిరంవిజయవంతం చేయాలి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల 94వ వర్ధంతిని పురస్కరించుకొని అంతర్జాతీయ స్థాయిలో రెడ్క్రాస్, ఎన్వైపీఓ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రక్తదాన శిభిరాన్ని విజయవంతం చేయాలని పీయూ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ మధుసూదన్రెడ్డి పేర్కొన్నారు. ఈమేరకు రక్తదాన శిభిరానికి సంబంధించిన బ్రోచర్ను బుధవారం ఆయన పీయూలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ చైర్మన్ నటరాజ్, వైస్ ప్రిన్సిపాల్ కృష్ణయ్య, కుమారస్వామి, పర్వతాలు, యాదరాజ్, గాలెన్న, రవికుమర్, ఈశ్వర్, జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు సీసీ రోడ్డు పనులు ప్రారంభం గండేడ్: మండలంలోని రెడ్డిపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు జితేందర్రెడ్డి భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈజీఎస్ నిధులు రూ.10 లక్షలతో సీసీ రోడ్డు పనులను చేపడుతున్నట్లు తెలిపారు. కృష్ణారెడ్డి, అంజిలయ్య, లింగయ్య, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు భగవంతురెడ్డి, రఘురాంరెడ్డి, సాయిలు, వేణుగోపాల్, గోవర్థన్రెడ్డి, కృష్ణయ్య, నారాయణ పాల్గొన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): రాష్ట్రంలోని ఉద్యోగుల పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని టీజీఓ జిల్లా అధ్యక్షుడు విజయ్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్ను వెంటనే ఏర్పాటు చేసి ఉద్యోగుల సమస్యలపై చర్చించాలని కోరారు. ఉద్యోగ ఉపాధ్యాయ, పెన్షనర్లకు సంబంధించిన ఆర్థికేతర డిమాండ్లు అన్నింటిని వెంటనే పరిష్కరించాలని పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు వివిధ రూ పాల్లో నిరసనలు చేపడుతామని హెచ్చరించారు. ఆశా వర్కర్కు న్యాయం చేయాలి నారాయణపేట టౌన్: జగిత్యాల జిల్లాలో లైంగిక దాడికి గురైన ఆశా వర్కర్కు న్యాయం చేయాలని జిల్లా ఆశా వర్కర్స్ యూనియన్ ( సీఐటీయూ) నాయకురాలు బాలమణి డిమాండ్ చేశారు. పట్టణంలోని ఆరోగ్యకేద్రం వద్ద ఆశా వర్కర్స్తో కలిసి ప్లకార్డులతో నిరసన తెలిపారు. దాడికి పాల్పడిన నిదితుడిని కఠినంగా శిక్షించాలన్నారు. -
విద్యార్థి కంటికి సురక్ష
జడ్చర్ల టౌన్: కంటి సమస్య ఉన్న విద్యార్థులకు ప్రభుత్వం చూపును ప్రసాదిస్తోంది. ఆర్బీఎస్కే ద్వారా ‘సమగ్ర కంటి పరీక్ష– ఉచిత కంటి అద్దాల పంపిణీ’లో పరీక్షలు నిర్వహించి సమస్యలున్న విద్యార్థులకు కంటి అద్దాలు మంజూరయ్యాయి. మహబూబ్నగర్ జిల్లాలో 2,355 మంది విద్యార్థులకు కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో విద్యార్థులకు కంటి సమస్యలు ఉన్నవారికి పరీక్షలు జరిపారు. ఫిబ్రవరి 28వ తేదీన మహబూబ్నగర్ జిల్లాలో 2,373 మందికి, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9,427 మంది విద్యార్థులు, రాష్ట్రవ్యాప్తంగా 89,105 మంది విద్యార్థులు కంటి సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వీరంతా చూపు మందగించి చదవడానికి ఇబ్బంది పడుతున్నట్లు నిర్ధారించారు. మహబూబ్నగర్ జిల్లాలో ఆర్బీఎస్కేకు చెందిన ఏడు బృందాలు 2,373 మందికి పరీక్షలు జరపగా.. వారిలో 2,355 మందికి అద్దాలు వచ్చాయి. వీరందరికి అద్దాల పంపిణీ చేస్తున్నారు. సమస్యలున్న వారికి అద్దాలు విద్యార్థులకు కంటి చూపు అందించే లక్ష్యంగా వైద్య పరీక్షలు నిర్వహించి సమస్యలున్న వారికి అద్దాలు పంపిణీ చేసినట్లు డీఐఓ డా.పద్మజ తెలిపారు. బుధవారం బాదేపల్లి జెడ్పీహెచ్ఎస్లో 14 మంది విద్యార్థులకు అద్దాలను ఆమె పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ మంజులాదేవి, ఆర్బీఎస్కే డాక్టర్లు సునీల్, లీల, కంటి వైద్యపరీక్ష నిపుణులు దత్తాత్రేయ రావు, అర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్ మనుప్రియ, హెచ్ఎం చంద్రకళ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ‘సమగ్ర కంటి పరీక్ష– ఉచిత కంటి అద్దాల పంపిణీ’లో పరీక్షలు ఉమ్మడి జిల్లాలో 9,427మంది విద్యార్థులకు కంటి సమస్యలు మహబూబ్నగర్ జిల్లాలో 2,355 మందికి అద్దాలు పంపిణీ 310 మందికి అద్దాలు.. జడ్చర్ల, మిడ్జిల్ మండలాల్లో 310 మంది విద్యార్థులకు అద్దాలను పంపిణీ చేస్తున్నాం. ఫిబ్రవరి 28న హైస్కూళ్లు, గురుకులాల్లో చదవడానికి ఇబ్బంది పడే వారికి స్థానిక ఏరియా ఆస్పత్రిలో పరీక్షలు చేయించాం. వీరందరికీ అద్దాలను అందజేస్తాం. – డా.సునీల్, ఆర్బీఎస్కే, జడ్చర్ల -
కనులపండువగా కల్యాణోత్సవం
● భక్తులతో కిటకిటలాడిన రామలింగేశ్వరస్వామి ఆలయం అడ్డాకుల: కందూర్ శ్రీరామలింగేశ్వర క్షేత్రంలో బుధవారం కల్యాణోత్సాన్ని కనులపండువగా నిర్వహించారు. ముందుగా గ్రామంలో మహిళలు సిద్ధం చేసిన తలంబ్రాల బియ్యాన్ని ప్రత్యేక పల్లకిలో మేళతాళాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి తీసు కొచ్చారు. అనంతరం పురోహితుల వేదమంత్రాల మధ్య ఉత్సవమూర్తులకు కల్యాణ వేడుకను నిర్వహించారు. కారెడ్డి నాగిరెడ్డి, తోకల దామోద్రెడ్డిరెడ్డిలు స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయంలో అభిషేకాలు నిర్వహించి, శివలింగాన్ని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. ● ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి, కవిత దంపతులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామలింగేశ్వరాలయం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ఆలయ ఆవరణలో ఇటీవల పూర్తి చేసిన సీసీ రోడ్లు, మంచి నీటి కుళాయిలను ప్రారంభించారు. బ్రహ్మో త్సవాల ఏర్పాట్లను పరిశీలించి ఆలయ నిర్వాహకులతో మాట్లాడారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈఓ రాజేశ్వరశర్మ, జూనియర్ అసిస్టెంట్ అనంతసేన్రావు, నాయకులు అరవింద్రెడ్డి, నాగిరెడ్డి, తోట శ్రీహరి, జగదీశ్వర్, నాగార్జున్రెడ్డి, విజయమోహన్రెడ్డి పాల్గొన్నారు. -
డంపింగ్ యార్డులో ఇదీ పరిస్థితి
స్థానిక కోయిల్కొండ ఎక్స్రోడ్డులోని డంపింగ్ యార్డుకు ప్రతి నిత్యం 88 వాహనాల ద్వారా సుమారు 106 మెట్రిక్ టన్నుల తడి, పొడిచెత్తను మున్సిపల్ అధికారులు తరలిస్తున్నారు. ఇందులో సుమారు పది మెట్రిక్ టన్నుల వరకు కంపోస్టు యూనిట్ షెడ్డుకు, 12 మెట్రిక్ టన్నులు పొడి చెత్తను రీసైక్లింగ్ చేసే డీఆర్సీసీకి పంపిస్తున్నారు. మిగిలిన 84 మెట్రిక్ టన్నుల మిక్స్డ్ వేస్టేజీని డంపింగ్ యార్డులోని బహిరంగ ప్రదేశంలో వదిలేస్తున్నారు. ఇందులో ఎక్కువగా ప్లాస్టిక్ కవర్లే ఉంటున్నాయి. ఇవి భూమిలో ఇంకిపోక పోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కాల్చివేస్తున్నారు. -
గోధుమపిండి అక్రమంగా దిగుమతి
జడ్చర్ల: పట్టణంలోని కొందరు వ్యాపారులు ఇతర రాష్ట్రాల్లో మాత్రమే విక్రయించే గోధుమపిండిని అక్రమంగా దిగుమతి చేసుకుంటుండటంతో ప్రభుత్వం ఆదాయం కోల్పోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో విక్రయించడానికి ఉద్దేశించబడినది కాదని సదరు కంపెనీలు గోధుమపిండి పాకెట్లపై స్పష్టంగా రాసినా.. ఆ ఉత్పత్తులను వ్యాపారులు అక్రమంగా దిగుమతి చేసుకుంటున్నారు. తెలంగాణలో విక్రయించే 5 కిలోల గోధుమపిండి పాకెట్ ధర రూ.365 ఉండగా.. అక్రమంగా దిగుమతి చేసుకున్న పాకెట్లపై రూ.254 ఉంది. అంతేగాక జీఎస్టీ చెల్లించకుండా దిగుమతి చేసుకోవడంతో పన్నుల లాభం కలిసి వస్తుంది. ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇలా వెలుగులోకి.. జడ్చర్లలోని ఓ హోల్సేల్ వ్యాపారి బుధవారం గోధుమపిండి 5 కిలోల పాకెట్ల లోడ్ను అక్రమంగా తెప్పించారు. లోడ్ పట్టణానికి చేరిన వెంటనే తమ వ్యాపారులకు వాట్సాప్లో సమాచారం అందించారు. దీంతో రిటైల్ వ్యాపారులు ఒక్కసారిగా అక్కడికి చేరుకొని కావాల్సినంత సరుకు తీసుకెళ్లారు. ఈ విషయాన్ని ఓ డీలర్ మీడియాకు చేరవేశారు. ప్రభుత్వాకి 5 శాతం జీఎస్టీ ఎగ్గొట్టి అక్రమంగా దిగుమతి చేసుకుంటున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
చెత్త శుద్ధి కరువు..!
డంపింగ్ యార్డులో గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన ప్లాస్టిక్ కవర్లు, చెత్త మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంతో పాటు దేవరకద్ర, భూత్పూర్ మున్సిపాలిటీల్లో ‘చెత్త’శుద్ధి కరువైంది. మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కొందరు ఎక్కడబడితే అక్కడ చెత్తను కుప్పలుగా వదిలేస్తున్నారు. కొన్నేళ్లుగా నగరంలో ఒకవైపు అధికారులు స్వచ్ఛత కార్యక్రమాలు చేపడుతున్నా.. మరోవైపు కొందరు వ్యక్తుల అవగాహన లోపంతో ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు. వాస్తవానికి చెత్త సేకరణకు గాను 69 స్వచ్ఛ ఆటోలు, 19 మున్సిపల్ ట్రాక్టర్లను ఏర్పాటు చేశారు. ఇంటింటికీ వచ్చే స్వచ్ఛ ఆటోలకు వేరు చేసిన తడి, పొడి చెత్త ఇవ్వాల్సి ఉన్నా కొన్ని ప్రాంతాల్లో ప్రజల నుంచి సహకారం లభించడం లేదు. ఎక్కడబడితే అక్కడ చెత్త వేస్తున్న వైనం ● అధికారులు అవగాహన కల్పిస్తున్నా ప్రయోజనం దక్కని వైనం ● కొందరు ఇప్పటికీ స్వచ్ఛ ఆటోలకు ఇవ్వనితడి, పొడి చెత్త ● మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలో నిత్యం 106 మెట్రిక్ టన్నుల సేకరణ ● ప్లాస్టిక్ కవర్లతో గుట్టలుగా పేరుకుపోతున్న డంపింగ్ యార్డు -
రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
అడ్డాకుల: మండలంలోని కందూర్ శివారులో స్వయంభూగా వెలిసి దక్షిణకాశీగా పేరొందిన శ్రీరామలింగేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు గోపూజతో మంగళవారం రాత్రి ప్రారంభమయ్యాయి. ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన యాగశాలలో భూతబలి కార్యక్రమం నిర్వహించి యాగశాల ప్రవేశం చేశారు. విఘ్నేశ్వర పూజ, అగ్నిప్రతిష్ఠ, అంకురారోహణ, ధ్వజారోహణం, బలిహరణ కార్యక్రమాలను పండితులు ఘనంగా నిర్వహించారు. ధ్వజస్తంభం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజ స్థాపన చేసి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఆలయ ఆవరణలో స్వామి వారి ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం ఉదయం ఆలయంలో పార్వతి సమేత రామలింగేశ్వరస్వామి కల్యాణాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయం వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కల్యాణానికి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయంలో చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. ఈఓ రాజేశ్వరశర్మ, జూనియర్ అసిస్టెంట్ అనంతసేన్రావు, ఆలయ నిర్వాహకులు రవీందర్శర్మ, కారెడ్డి నాగిరెడ్డి, తోట శ్రీహరి, దామోదర్రెడ్డి, రవీందర్రెడ్డి, విజయలక్ష్మి, కారెడ్డి లత, దేవన్న యాదవ్, ఆలయ పూజారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నేడు పార్వతి సమేత రామలింగేశ్వరుడి కల్యాణ మహోత్సవం -
పొలం కబ్జా చేశారు.. న్యాయం చేయండి
● తహసీల్దార్ కార్యాలయం ఎదుట కుటుంబంతో కలిసి మహిళా రైతు ధర్నా రాజాపూర్(బాలానగర్): రెండెకరాల్లో ఒక ఎకరా పొలం రోడ్డులో పోగా.. మరో ఎకరా ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేశారని.. తనకు న్యాయం చేయాలంటూ ఓ మహిళా రైతు కుటుంబంతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగింది. బాలానగర్ మండలకేంద్రానికి చెందిన సులోచనదేవికి సర్వే నంబర్ 139/1, 139/2లో రెండెకరాల పట్టా పొలం ఉండేది. ఒక ఎకరా రోడ్డు విస్తరణలో పోగా మరో ఎకరా పొలం ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేశారు. ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా తమకు న్యాయం జరగకపోవడంతో ఆమె తన కుమారులతో కలిసి మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ధర్నా దిగింది. జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ఆల్వాల్రెడ్డి మద్దతు తెలిపారు. రైతు కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. అవసరమైతే హైదరాబాద్లో నిరాహార దీక్ష చేపడతామని పేర్కొన్నారు. -
నాగుపాముకు చికిత్స
జడ్చర్ల టౌన్: మండలంలోని ఆల్వాన్పల్లిలో పట్టుకునే క్రమంలో గాయపడిన నాగుపాముకు సర్ప రక్షకుడు డా.సదాశివయ్య చికిత్స అందించి కాపాడారు. వివరాలు.. ఆల్వాన్పల్లిలో నాగుపామును గుర్తించిన యువకులు సర్పరక్షకుడు డా. సదాశివయ్యకు ఫోన్ద్వారా సమాచారం అందించారు. దీంతో ఆయన తన శిష్యులైన రాహుల్, రవీందర్ అక్కడికి చేరుకునేలోపు నాగుపాము సమీపంలోని రంధ్రంలోకి వెళ్లింది. దాన్ని తవ్వి పామును బయటకు తీసేందుకు యువకులు గడ్డపారతో తవ్వుతుండగా పాము నడుములో దిగబడింది. అది ఒక్కసారిగా బుసలు కొడుతూ బయటికొచ్చింది. అదిగమనించిన యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. అక్కడికి చేరుకున్న రాహుల్, రవీందర్ చాకచక్యంగా పామును పట్టుకొని జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల జీవ వైవిధ్య సంరక్షణ కేంద్రానికి తీసుకొచ్చారు. అక్కడ డా.సదాశివయ్య పాముకు చికిత్స అందించి కట్టువేసి కాపాడారు. ప్రస్తుతం గాయపడిన పాము ఇదే కేంద్రంలో ఉంచారు. -
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు
కోస్గి: స్కానింగ్ కేంద్రాల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్యశాఖ అధికారి డా. జయంతిరెడ్డి హెచ్చరించారు. మంగళవారం పట్టణంలోని పలు స్కానింగ్ కేంద్రాలను జిల్లా వైద్యాధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. స్కానింగ్ చేసే వారి వివరాలు విధిగా సమగ్రంగా నమోదు చేయాలని, ఆధార్కార్డు, పూర్తి చిరునామా, స్కానింగ్ తీయడానికి గల కారణాలు ఉండాలని సూచించారు. రేడియాలజిస్టులే స్కానింగ్ తీయాలన్నారు. ఆమె వెంట జిల్లా ఉప వైద్యాధికారి డా. శైలజ తదితరులు ఉన్నారు. -
ఉదండాపూర్ నిర్వాసితులకు మేలు జరిగేలా చర్యలు
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్వాసిత కుటుంబాలకు అన్ని విధాల మేలు జరిగేలా చూస్తామని కలెక్టర్ విజయేందిర అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డితో కలిసి రెవెన్యూ, ఇరిగేషన్, సర్వే ల్యాండ్ రికార్డ్స్, సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉదండాపూర్ రిజర్వాయర్ కింద వల్లూరు, ఉదండాపూర్, తుమ్మలకుంట తండా, రేగడిపట్టి తండా, చిన్నగుట్టతండా, శామగడ్డతండా, ఒంటి గుడిసె తండా, పోలేపల్లి వ్యవసాయక్షేత్రంలో ఇళ్లు కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలకు అవార్డు అందుకున్న వారందరికీ పునరావాసం కింద మూడు వందల గజాల స్థలం, వారి అవసరాలకు ప్రైమరీ హెల్త్ సెంటర్, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రా లు, వెటర్నరీ హాస్పిటల్, కమ్యూనిటీ హాల్స్, పార్కులను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ వాటర్ పైపు లైన్లు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి మాట్లాడుతూ ప్రభు త్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు కొందరు అడ్డుపడుతున్నారని, భూమి కోల్పోయిన వారికి అపోహలు, భయాన్ని కలగజేస్తున్నారని, ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు. ఉదండాపూర్ రిజర్వాయర్లో భూమి కోల్పోయిన వారికి ఎక్కువ మొత్తంలో నష్టపరిహారం అందేలా చూడాలని అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించినట్లు తెలిపారు. ఆర్అండ్ఆర్ విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే ఆర్డీఓ దృష్టికి తీసుకురావాలన్నారు. సమావేశంలో స్పెషల్ కలెక్టర్ మధుసూదన్నాయక్, ఆర్డీఓ నవీన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
సాగునీరు, పర్యాటక రంగం..
అచ్చంపేట నియోజకవర్గానికి సాగునీరు తేవడంపైనే ప్రధానంగా అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తా. ఉన్నత విద్యపై దృష్టిపెడతాం. ఈ ప్రాంతంలో 3.50 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టుల నిర్మాణం, ఇప్పటికే మంజూరైన అమ్రాబాద్ లిఫ్టుల ఏర్పాటు త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతాను. సీఎం సహకారంతో నల్లమల ప్రాంతాన్ని మరో కోనసీమగా మార్చడమే నా లక్ష్యం. నల్లమలలోని వనరుల ద్వారా ఉపాధి అవకాశాలు, పరిశ్రమలు, పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై గళం వినిపిస్తాను. – వంశీకృష్ణ, ఎమ్మెల్యే, అచ్చంపేట -
‘ఇంటర్’ వాల్యూయేషన్ ప్రారంభం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ పరీక్షల జవాబు పత్రాల వాల్యూయేషన్ను అధికారులు మంగళవారం ప్రారంభించారు. జిల్లాకేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాలలో వాల్యూయేషన్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి 20 వేలకు పైగా సంస్కృతం సబ్జెక్టుకు సంబంధించిన జవాబుపత్రాలు క్యాంప్నకు చేరాయి. తెలుగు, ఇంగ్లిష్ సబ్జెక్టులకు సంబంధించిన జవాబుపత్రాలు ఒకట్రెండు రోజుల్లో రానున్నాయి. వీటికి అధికారులు కోడింగ్ ప్రక్రియ చేపట్టారు. మొత్తంగా అన్ని సబ్జెక్టులకు సంబంధించి రెండు లక్షలకు పైగా జవాబు పత్రాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులను క్యాంప్నకు రావాలని ఆదేశించారు. మొత్తంగా రెండు వారాల్లో వాల్యూయేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 11,690 మంది హాజరు జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు మ్యాథ్స్–1 ఏ, బోటనీ–1, పొలిటికల్ సైన్స్–1 పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా జరిగాయి. ఈ మేరకు మొత్తం 36 పరీక్ష కేంద్రాల్లో 11,690 మంది విద్యార్థులు హాజరయ్యారు. మరో 326 మంది గైర్హాజరయ్యారు. పలు కేంద్రాల్లో సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులతో పాటు ఇంటర్ బోర్డు అధికారులు పరిశీలించారు. కాగా.. మంగళవారం జరిగిన పరీక్షలో కూడా తప్పులు వచ్చినట్లు పలువురు విద్యార్థులు పేర్కొన్నారు. -
అనుమానాస్పదంగా వృద్ధురాలి మృతి
గద్వాల క్రైం: అనుమానాస్పదంగా వృద్ధురాలు మృతి చెందిన ఘటన గద్వాలలో చోటుచేసుకున్నట్లు పట్టణ ఎస్ఐ కల్యాణ్కుమార్ తెలిపారు. వివరాలు.. మోమిన్ మహాల్ల కాలనీకి చెందిన చిన్నమ్మ(85) కొన్ని రోజుల క్రితం కిందపడి తీవ్ర అనారోగ్యానికి గురైంది. కుటుంబ సభ్యులు ఉన్నా ఆమె బాగోగులను పట్టించుకునే వారు కాదు. రాఘవేంద్ర కాలనీలోని అనాథశ్రమంలో ఉండేది. వారం రోజుల క్రితం వృద్ధురాలిని కుమారులు జలదుర్గం రమేష్, రాజు మోమిన్ మహాల్లలోని స్వంత ఇంట్లో(పాడుబడ్డ)కి తీసుకొచ్చారు. ఆమెకు వంతులవారీగా ఆహారం అందించేవారు. అయితే సోమవారం రాత్రి కుటుంబ సభ్యులు వృద్ధురాలికి ఆహారం అందించి చీకటి గది కావడంతో వెలుతురు కోసం కొవ్వొత్తిని వెలిగించి మంచం సమీపంలో పెట్టి వెళ్లారు. ఆమె నిద్రించే క్రమంంలో కొవ్వొత్తికి దుప్పటి తగిలి మంటలు వ్యాపించి ఉండొచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. అయితే స్థానికులు మాత్రం ఆమెను కుటుంబ సభ్యులే హత్య చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. ఘటనాస్థలికి గద్వాల సీఐ శ్రీను చేరుకొని పరిశీలించారు. కేసు విచారణలో నిజనిజాలు నిర్ధారణ అవుతాయని ఆయన వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుమారుడు రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. రైలు నుంచి పడి వ్యక్తి.. ఆత్మకూర్: ప్రమాదవశాత్తు రైలులో నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మంగళవారం వెలుగు చూసింది. రైల్వే హెడ్కానిస్టేబుల్ అశోక్ కథనం మేరకు.. సోమవారం అర్ధరాత్రి మండల పరిధిలోని శ్రీరాంనగర్ రైల్వేస్టేషన్ – గద్వాల రైల్వేస్టేషన్ మధ్య 184వ కిలోమీటరు వద్ద పట్టాలపై 45 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు సమాచారం అందింది. మంగళవారం ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు వివరించారు. మరిన్ని వివరాలకు సెల్నంబర్లు 87126 58608, 83412 52529 సంప్రదించాలని సూచించారు. బావిలో పడి.. శాంతినగర్: ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన వడ్డేపల్లి పుర పరిధిలోని శాంతినగర్ జములమ్మ ఆలయ సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. బంధువులు జములమ్మ దేవర చేస్తున్నారని కలుకుంట్లకు చెందిన మద్దిలేటి (36) ఆలయానికి వచ్చి వెనక ఉన్న బావిలో ప్రమాదవశాత్తు పడిపోయాడు. బంధువుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు శాంతినగర్ పోలీసులు వివరించారు. లారీ బోల్తా.. తప్పిన ప్రమాదం తాడూరు: మండల కేంద్రానికి సమీపంలోని మల్కాపూర్ గేట్ కాజ్వే బ్రిడ్జి వద్ద మంగళవారం సాయంత్రం కోళ్ల ఎరువుతో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం వాటిల్లలేదు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. మామిడితోట దగ్ధం రాజాపూర్: మండలంలోని రాయపల్లికి చెందిన మహిళా రైతు మాధవి మామిడితోట సోమవారం రాత్రి అగ్నికి ఆహుతైంది. గ్రామస్తుల కథనం మేరకు.. పోలేపల్లి శివారులోని పరిశ్రమల నుంచి వెలువడే పొగతో పాటు నిప్పు రవ్వలు వచ్చి రైతు పొలంలో పడి ఎండిన గడ్డి అంటుకొని మంటలు వ్యాపించి మామిడి తోట కాలిపోయిందన్నారు. రైతులను నష్టపరుస్తున్న పరిశ్రమలపై అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జడ్చర్లలో పశుగ్రాసం.. జడ్చర్ల: పట్టణంలోని శ్రీనివాసనగర్లో కౌలు రైతు సంజీవ్ నిల్వ చేసిన పశుగ్రాసం ప్రమాదవశాత్తు నిప్పంటుకొని కాలి బూడిదైంది. వరి గడ్డివాము నుంచి మంగళవారం ఒక్కసారిగా పొగలు రావడంతో రైతు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేసి పొక్లెయిన్తో చెల్లాచెదురు చేసినా ఫలితం లేకపోయింది. సుమారు రూ.2 లక్షల నష్టం వాటిల్లిందని.. ప్రభుత్వపరంగా సాయం అందించి ఆదుకోవాలని బాధితుడు విజ్ఞప్తి చేశారు. -
ముమ్మరంగా సహాయక చర్యలు
అచ్చంపేట/మన్ననూర్: ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరుగుతున్న సహాయక చర్యలకు రోబోలను ఉపయోగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు మంగళవారం ఉదయం హైదరాబాద్కు చెందిన అన్వి రోబోటిక్స్ సంస్థకు చెందిన ఏఐ బేస్డ్ కెమెరా సదుపాయం గల రోబోటిక్లను తీసుకెళ్లారు. సంస్థ ప్రతినిధులు విజయ్, అక్షయ్ లోకో ట్రైన్లో సొరంగంలోకి వాటిని తీసుకెళ్లారు. అన్వి రోబోటిక్ సంస్థకు చెందిన ప్రతినిధులు టన్నెల్ దగ్గర ఆఫీసులో కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాట్లను ప్రారంభించారు. ప్రమాద ప్రదేశంలో చేపట్టే సహాయక చర్యల్లో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకుండా రోబోలను ఉపయోగించుకుంటున్నట్లు డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్కుమార్ తెలిపారు. సహాయక చర్యల్లో కావాల్సిన సామగ్రితోపాటు సహాయక బృందాలు మరోమారు కాడవర్ డాగ్స్ ప్రమాద ప్రదేశానికి వెళ్లాయని తెలిపారు. సమావేశంలో ప్రస్తుత సహాయక చర్యల పురోగతిని సమీక్షించి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. టన్నెల్ సహాయక చర్యలలో అనుసరించాల్సిన విధివిధానాలు, రోబోటిక్స్, మెకానికల్ పరికరాల వినియోగం, మట్టి తొలగింపు ప్రక్రియ, భద్రతా చర్యలపై విస్తృతంగా చర్చించిన అధికారులు సహాయక చర్యలను మరింత వేగవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు వివరించారు. సమావేశంలో కలెక్టర్ బదావత్ సంతోష్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అన్వి రోబోటిక్స్, హైడ్రా, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, ర్యాట్ మైనర్స్, దక్షిణ మధ్య రైల్వే తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లోకి రోబోటిక్ సంస్థ ప్రతినిధులు కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాట్లు -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
నవాబుపేట: బైక్ అదుపు తప్పి కింద పడి తీవ్ర గాయాలపాలైన వ్యక్తి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు. గత నెల 27న పత్తేపూర్కి చెందిన కమ్మరి శ్రీనివాస్చారి(40) అనే వ్యక్తి బైక్పై జిల్లా కేంద్రానికి వెళ్లాడు. పని ముగించుకొని తిరిగి ఇంటికి వస్తుండగా కాకర్లపహాడ్ సమీపంలో బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. తీవ్రగాయాలు కావటంతో స్థానికులు 108 వాహనంలో జిల్లా ఆస్పత్రిలో చేర్పించి కుటుంబీకులకు సమాచారం అందించారు. వారు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. మృతుడి సోదరుడు కమ్మరి రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కొప్పునూరులో మరొకరు.. చిన్నంబావి: పురుగుమందు తాగి చికిత్స పొందుతూ కోలుకోలేక ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని కొప్పునూరులో చోటుచేసుకున్నట్లు ఎస్ఐ జగన్మోహన్ తెలిపారు. వివరాలు.. కొప్పనూరుకి చెందిన బంకుమిది నరసింహారెడ్డి (56) అనారోగ్య సమస్యలతో సోమవారం పురుగుమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కొల్లపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నాగర్ కర్నూలు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడి భార్య అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. బైక్పై నుంచి కిందపడి.. చిన్నచింతకుంట: మోటార్ సైకిల్ అదుపు తప్పి కిందపడి గాయాలపాలై చికిత్స పొందుతూ ఓ వ్యక్తి చెందినట్లు ఎస్ఐ రామ్లాల్నాయక్ తెలిపారు. వివరాలు.. మండలంలోని లక్ష్మీదేవ్పూర్కి చెందిన పల్లె పాగు ఆనందం(50) ఈ నెల 7న తన బైక్పై చిన్నచింతకుంటకు వచ్చాడు. కూరగాయలు తీసుకొని గ్రామానికి తిరుగు ప్రయాణం అయ్యాడు. మార్గమధ్యలో బైక్ అదుపు తప్పి కిందపడగా ఆనందంకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆత్మకూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మహబూబ్నగర్ ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మంగళవారం మృతి చెందాడు. మృతుడి తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
ప్రధాన సమస్యలపై దృష్టి
అలంపూర్ రైతులు ప్రధానంగా సాగునీటిని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల ద్వారా పూర్తిస్థాయిలో సాగునీరు అందించడానికి మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణ పనులు పూర్తి చేయాలి. అలాగే వంద పడకల ఆస్పత్రిని నిర్మించి ప్రారంభించినా.. ప్రస్తుతం వైద్య సేవలు అందించడం లేదు. దీంతో వైద్యం కోసం ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. అలాగే అసంపూర్తిగా ఉన్న రోడ్ల పనులు పూర్తి చేయాలని, అధ్వానంగా ఉన్న రోడ్ల ఆధునీకరణ అంశాలను అసెంబ్లీలో ప్రస్తావిస్తాను. – విజయుడు, ఎమ్మెల్యే, అలంపూర్ సాగునీరు, విద్య, వైద్యం గద్వాల నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టు గుడ్డెందొడ్డి జలాశయం సామర్థ్యం పెంపు, ర్యాలంపాడు మరమ్మతుతోపాటు జలాశయం పెంపుపై కూడా ప్రధానంగా ప్రస్తావిస్తాను. అదేవిధంగా మెడికల్ కాలేజీలో స్టాఫ్ నియామకం, జిల్లా ఆస్పత్రిని 500 బెడ్లకు పెంచాలని కోరుతాను. ఇదివరకే దీనిపై పలుమార్లు సీఎం, సంబంధిత మంత్రులు, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు వ్యక్తిగతంగా లేఖలు రాశాను. అసెంబ్లీ సమావేశాల్లో వీటిపైనే మరోసారి ప్రస్తావించి ప్రభుత్వ సాయంతో వీటిని సాధించేలా కృషి చేస్తాను. – బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ఎమ్మెల్యే, గద్వాల -
గళం విప్పుతాం.. నిధులు రాబడతాం
పరిశ్రమల ఏర్పాటు కోసం పేట నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించవచ్చు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణం, నియోజకవర్గంలో ప్రైవేట్ అద్దె భవనాల్లో కొనసాగుతున్న డిగ్రీ, జూనియర్ ప్రభుత్వ కళాశాలలకు సొంత భవనాలకు నిధులు కావాలని, ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా ప్రాజెక్టుల రూపకల్పన చేయాలని కోరుతాను. – చిట్టెం పర్ణికారెడ్డి, ఎమ్మెల్యే, నారాయణపేట ముంపు గ్రామాలపై.. మక్తల్ నియోజవర్గంలో ఏళ్ల తరబడిగా ముంపు గ్రామాల ప్రజల సమస్యలు తీరడం లేదు. ఈ సమస్యలను తీర్చాలని అసెంబ్లీలో చర్చిస్తా. జూరాల బ్యాక్ వాటర్లో ముంపునకు గురైన అనుగొండ, గడ్డంపల్లి, దాదాన్పల్లి, అంకేన్పల్లి గ్రామాలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. సంగంబండ, భూత్పుర్ రిజర్వాయర్ కింద ముంపునకు గురైన ఉజ్జెల్లి, గార్లపల్లి, నేరడుగం, భూత్పుర్లో ఊట నీటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అసెంబ్లీలో చర్చించి శాశ్వత పరిష్కారానికి కృషిచేస్తా. – వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే, మక్తల్అసెంబ్లీ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో నెలకొన్న దీర్ఘకాల సమస్యలు, ప్రాజెక్టుల నిర్మాణాలు, సాగునీటి సరఫరా, నిర్వాసితుల నష్టపరిహారం, రోడ్ల విస్తరణ, విద్యాసంస్థలు, పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పన తదితర వాటిపై తమ గళం వినిపించి పరిష్కారానికి కృషిచేస్తామని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుతం నిర్వహించేది బడ్జెట్ సమావేశాలు కావడంతో అధికంగా నిధులు మంజూరుకు కృషిచేస్తామని పేర్కొన్నారు. – సాక్షి నెట్వర్క్ -
నిధుల కేటాయింపు..
అసెంబ్లీ సమావేశాల్లో విద్య, వైద్యం, ఉపాధి కల్పనపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా. నూతనంగా ఏర్పడిన మహబూబ్నగర్ కార్పొరేషన్కు ప్రత్యేక నిధుల కేటాయింపు, ఏదైనా ఉన్నత విద్యా సంస్థ మంజూరు, విద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పన, జిల్లాలో పరిశ్రమలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటు, ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం, పెద్ద గ్రామాల్లో హెల్త్సెంటర్ల ఏర్పాటు గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. – యెన్నం శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే, మహబూబ్నగర్ -
‘కల్వకుర్తి’ని పూర్తి చేయడమే ధ్యేయం
నియోజకవర్గ రైతులకు వరప్రదాయిని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం. ఈ ప్రాజెక్టు ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని, డిస్ట్రిబ్యూటరీ కాల్వలు పూర్తి చేయాలని శాసనసభలో ప్రభుత్వాన్ని కోరుతాను. దీంతోపాటు విద్య, వైద్యం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయించడంతోపాటు.. మంజూరైన పనులకు టెండర్లు వేయాలని ప్రభుత్వాన్ని కోరుతా. అలాగే ఇప్పటికే మంజూరైన రోడ్ల నిర్మాణం వెంటనే చేపట్టాలని సభ దృష్టికి తీసుకెళ్తాను. – కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే, కల్వకుర్తి -
గొల్లపల్లి రిజర్వాయర్ప్రతిపాదనలపై..
నియోజకవర్గంలో మరో పదివేల ఎకరాలకు సాగునీరందించేందుకు రేవల్లి మండలం గొల్లపల్లి వద్ద నూతనంగా మినీ రిజర్వాయర్ నిర్మాణం కోసం ప్రతిపాదనను ప్రభుత్వానికి అందజేశాం. ఈ అంశంపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా. ఇప్పటికే కేఎల్ఐ, భీమా, జూరాల సాగునీటి కాల్వలతో చాలా మేరకు సాగునీరు అందుతుంది. ప్రభుత్వం, ఫారెస్ట్ అధికారుల నుంచి అనుమతులు లభిస్తే గొల్లపల్లి రిజర్వాయర్ పనులు వేగంగా పూర్తిచేస్తాం. రింగ్ రోడ్డు, సాగునీటి కాల్వల పనులు పెండింగ్లో ఉన్నాయి. దరఖాస్తు చేసుకున్న 2,713 మంది రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని విన్నవిస్తాం. – తూడి మేఘారెడ్డి, ఎమ్మెల్యే, వనపర్తి -
కంపుకొడుతున్న కాలనీలు
డ్రెయినేజీలు అస్తవ్యస్తం ● దోమలు, ఈగలకు ఆవాసంగామురుగు కాల్వలు ● వివిధ డివిజన్లలో దుర్వాసనతో ప్రజల నరకయాతన ● ముక్కు మూసుకుని వెళ్తున్న వైనం ● పట్టించుకోని మున్సిపల్ అధికారులు మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలో చాలా చోట్ల డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఇన్నాళ్లు స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న మహబూబ్నగర్ కాస్తా ఇటీవల కార్పొరేషన్గా మారింది. స్థాయి పెరిగినా కొత్తగా ఎలాంటి నిధులు కేటాయించకపోవడంతో నగర పరిధిలోని 49 డివిజన్లలో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయి. వాస్తవానికి మున్సిపల్ పాలకవర్గం పదవీకాలం గత జనవరి 26న ముగిసి ప్రత్యేక అధికారి పాలనలోకి వచ్చినా ఎలాంటి ప్రయోజనం దక్కడం లేదు. ముఖ్యంగా మురుగుకాల్వలు కంపు కొడుతున్నాయి. ఏ వీధి చూసినా చిన్న, చిన్న కాల్వలతో మురుగు పేరుకుపోయి పరిసరాలు అపరిశుభ్రంగా తయారవుతున్నాయి. మర్లు, శాంతినగర్, విఘ్నేశ్వరకాలనీ తదితర ప్రాంతాల్లో అన్నీ చిన్న గల్లీలే ఉన్నాయి. చాలాచోట్ల డ్రెయినేజీలు కనిపించవు. ఎవరికి వారు ఇళ్ల యజమానులు మురుగు కాల్వలు తాత్కాలికంగా నిర్మించినవే ఉన్నాయి. దీంతో దుర్గంధం మధ్య సహవాసం చేస్తున్నామని స్థానికులు వాపోతున్నారు. 13 ఏళ్ల క్రితం మున్సిపాలిటీలో కలిసిన అప్పన్నపల్లి, ఎనుగొండ, ఎదిర, పాలకొండ, క్రిష్టియన్పల్లి, బండమీదిపల్లి, చిన్నదర్పల్లి, బోయపల్లి, దొడ్డలోనిపల్లి, తిమ్మసానిపల్లితో పాటు ఇటీవల కార్పొరేషన్లో విలీనమైన జైనల్లీపూర్, దివిటిపల్లిలో పరిస్థితి దారుణంగా ఉంది. ఆయా గ్రామాలలో డ్రెయినేజీలు ఎక్కడా సరిగా లేవు. ఎక్కడికక్కడ రోడ్లపై మురుగు పారుతుండటంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇన్నేళ్లయినా మున్సిపల్ అధికారులు డ్రెయినేజీ నిర్మాణం గురించి పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మంగళవారం పలు డివిజన్లను ‘సాక్షి’ పరిశీలించగా ఈ విషయాలు వెలుగు చూశాయి. ఎవరూ పట్టించుకోరు.. మా ప్రాంతంలో ఇళ్ల మధ్య నుంచి ప్రవహిస్తున్న పెద్ద కాల్వతో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నెలకోసారి మాత్రమే అందులోని చెత్తను పారిశుద్ధ్య కార్మికులు తొలగిస్తున్నారు. డ్రెయినేజీ నిర్మించాలని మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఉపయోగం దక్కలేదు. ఎస్సీ కమ్యూనిటీ హాలు మొదలుకుని రైసా మసీదు వరకు అటు, ఇటు మోరీలు నిర్మించకపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. దోమలు, ఈగల సైర విహారంతో తరచూ రోగాల బారిన పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. – కౌకుంట్ల మహేష్, పాతపాలమూరు మురుగుతో దుర్గంధం మా ఇంటి ముందున్న చౌరస్తాలో మురుగు ఏరులైపారుతోంది. గట్టు ప్రాంతంలో నివసిస్తున్న ఇళ్లవారు కిందికి అలాగే మురుగును బయటకు వదిలేస్తున్నారు. డ్రెయినేజీ నిర్మించాలని ఎన్నోసార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఉపయోగం లేదు. అప్పట్లో మున్సిపల్ కమిషనర్, ఇంజినీరింగ్ అధికారులు వచ్చి చూసి పోయారు. ఎగువ నుంచి దిగువకు కొంత దూరం సీసీరోడ్డును తొలగించి అండర్గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మిస్తే సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుంది. – వారాల కృష్ణ, కృష్ణ టెంపుల్చౌరస్తా, పద్మావతికాలనీ ● -
ఎల్ఆర్ఎస్ఎంతవరకు వచ్చింది?
● ఆర్పీలతో ఆరా తీసిన స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ● మున్సిపల్ కార్యాలయంలో మరో హెల్ప్లైన్ సెంటర్ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ‘జిల్లా కేంద్రంలో ఎల్ఆర్ఎస్ ఎంతవరకు వచ్చింది.. నిత్యం దరఖాస్తుదారులకు ఫోన్లు చేస్తున్నారా? లేదా?.. వారి నుంచి సరైన స్పందన ఎందుకు రావడం లేదు’ అని ఆర్పీలతో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్ ఆరా తీశారు. మంగళవారం మహబూబ్నగర్ మున్సిపల్ కార్యాలయ ఆవరణ లోని మెప్మా భవనంలో ఆర్పీలతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెలాఖరు వరకే ఎల్ఆర్ఎస్కు గడువు ఉందన్నారు. వీలైనంత వరకు ఎక్కువ మంది దరఖాస్తుదారులతో ఫోన్లో మాట్లాడి అవగాహన కల్పించి పూర్తి ఫీజు చెల్లించేలా చూడాలన్నారు. కేవలం 20 రోజులే మిగిలిందని, 25 శాతం రాయితీ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాగా, సమావేశానికి ఆలస్యంగా హాజరైన ఆర్పీలనుద్దేశించి విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఇక దరఖాస్తుదారులకు సంబంధించిన నమోదు రికార్డుల తనిఖీతో పాటు ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేశారా? లేదా? అని ర్యాండమ్గా కొందరి ఫోన్లలో వివరాలు పరిశీలించారు. అనంతరం టౌన్ ప్లానింగ్ విభాగం, పౌరసేవా కేంద్రాన్ని పరిశీలించి ఎల్ఆర్ఎస్పై సిబ్బందికి తగు సూచనలిచ్చారు. అలాగే రూంనం.2లో మరో హెల్ప్లైన్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్రెడ్డిని ఆదేశించారు. కార్యక్రమంలో మెప్మా ఇన్చార్జ్ డీఎంసీ ఎం.లక్ష్మి, సీఓలు వరలక్ష్మి, నిర్మల, దేవమ్మ, ఆంజనేయులు, టీపీఎస్ విశాల్కుమార్, సీనియర్ అటౌంటెంట్ ఇందిర తదితరులు పాల్గొన్నారు. వేరుశనగ క్వింటాల్ రూ.7,061 జడ్చర్ల: బాదేపల్లి మార్కెట్లో మంగళవారం వేరుశనగకు క్వింటాల్ గరిష్టంగా రూ.7,061, కనిష్టంగా రూ.5,649 ధరలు లభించాయి. అదేవిధంగా కందులు గరిష్టంగా రూ.6,930, కనిష్టంగా రూ.4,656, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,337, కనిష్టంగా రూ.2,051, ఆముదాలు రూ.5,873, రాగులు రూ.4,211, మినుములు రూ.7,117, పొద్దుతిరుగుడు రూ.4,316 పలికాయి. -
పీయూలో 27, 28 తేదీల్లో వర్క్షాప్
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో ఈ నెల 27, 28 తేదీల్లో ఎంబీఏ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రీసెర్చ్ మెథడాలజీ, ప్రాజెక్టుపై రాష్ట్రస్థాయి వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. అందుకు సంబంధించిన బ్రోచర్ను ఆయన మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఎంబీఏ చివరి సంవత్సరం విద్యార్థులకు ఈ వర్క్షాప్ ఎంతో ఉపయోగకరం అని, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ చెన్నప్ప, ప్రిన్సిపాల్ మధుసూదన్రెడ్డి, కన్వీనర్ అర్జున్కుమార్, కో కన్వీనర్ నాగసుధ, జావిద్ఖాన్, అరుంధతి, గాలెన్న తదితరులు పాల్గొన్నారు. 31 లోగా చెల్లించి రాయితీ పొందండి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న ప్లాట్ యజమానులు మార్చి 31లోగా క్రమబద్ధీకరణ రుసుం చెల్లిస్తే ప్రభుత్వం 25 శాతం రాయితీ కల్పించినట్లు కలెక్టర్ విజయేందిర మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎల్ఆర్ఎస్కు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే కలెక్టరేట్ టోల్ ఫ్రీ నంబర్ 08542–241165, మహబూబ్నగర్ నగర పాలక సంస్థలో హెల్ప్లైన్ నంబర్ 7093911352ను సంప్రదించవచ్చని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సమాచారం పొందవచ్చని ప్లాటు యజమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. 2020 ఆగస్టు 26 నాటికి లేఔట్లో 10 శాతం ప్లాట్లు రిజిస్టర్ అయితే మిగిలిన వాటికి కూడా ఎల్ఆర్ఎస్ కింద క్రమబద్ధీకరణ అవకాశం కల్పించినట్లు తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ ద్వారా నిర్ణీత నమూనాలో నూతన దరఖాస్తులు స్వీకరించి ఎల్ఆర్ఎస్ కోసం మున్సిపల్ శాఖకు వివరాలు పంపించి క్రమబద్ధీకరిస్తారని పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణాను అరికట్టాలి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): సమాజంలో జరుగుతున్న మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని డీఆర్డీఓ నర్సిములు అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా మహిళా సమాఖ్య భవనంలో మానవ అక్రమ రవాణా నివారణపై ఏపీఎంలు, సీసీలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా, శ్రమ దోపిడీ, లైంగిక దోపిడీపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. పని ఉందని మాయమాటలు చెప్పి నిర్మానుష ప్రదేశాలకు తీసుకుపోయి లైంగికదాడికి గురిచేస్తే వారి నుంచి జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎవరిపైనా అనుమానాలు వస్తే వెంటనే పోలీసులకు 100 నంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. శిక్షణ పొందిన ఏపీఎంలు సీసీలు స్థానికంగా ఉంటే వీఓలకు అవగాహన కల్పిస్తారని కోరారు. కార్యక్రమంలో డీపీఎం ఆలూరి చెన్నయ్య టీఓటీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రిజర్వేషన్ల ఖరారు తర్వాతే ఫలితాలివ్వాలి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించి, వాటిని ఖరారు చేసే వరకు గ్రూప్–1, 2, 3 ఫలితాలను ప్రకటించవద్దని ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కార్తీక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పీయూ మెయిన్ గేట్ వద్ద మంగళవారం చేపట్టిన రిలే నిరాహార దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వంలో ఉన్న కొంత మంది స్వార్థపరుల ఒత్తిడి మేరకు మాదిగ విద్యార్థుల భవిష్యత్ను దెబ్బతీయాలన్న కుట్రతో ముందస్తుగా గ్రూప్స్ ఫలితాలను విడుదల చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణలో ఏబీసీడీ వర్గీకరణ అనంతరం మాత్రమే ఫలితాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెడతామని ప్రభుత్వం చెబుతూనే ఫలితాల విడుదలకు కసరత్తు చేయడం బాధాకరమని, రిజర్వేషన్ల బిల్లు పెట్టి వర్గీకరణ చేసే వరకు నిరసన చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో ఎంఎస్పీ అధ్యక్షుడు టైగర్ అంజయ్య, వీరస్వామి, జేఏసీ చైర్మన్ రాము, దాసు, శ్రీను, రవితేజ, రాము, నాగేందర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
SLBC Tunnel: టన్నెల్లోకి ప్రవేశించిన రోబోలు
సాక్షి, నాగర్కర్నూల్/మహబూబ్నగర్: ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ 18వ రోజు కొనసాగుతోంది. సహాయ చర్యల్లోకి రోబోలతో పాటు వాటి బృందాలు అనుమానిత ప్రాంతాల్లో విస్తృతంగా తవ్వకాలు కొనసాగుతున్నాయి. నేడు ఒకటో, రెండో మృతదేహాలు బయటపడే అవకాశం ఉంది. మంగళవారం ఉదయం అన్వి రోబో బృందంతో పాటు మొదటి షిప్ట్లో 110 మంది ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లోకో ట్రైన్లో బృందాలు టన్నెల్ లోపలికి వెళ్లాయి. టన్నెల్ నుంచి ఇప్పటికే ఒక మృతదేహాన్ని వెలికితీశారు. మిగిలిన ఏడుగురి కోసం గాలింపు కొనసాగుతోంది. మినీ జేసీబీలతో శిథిలాలను తొలగిస్తున్నారు.ఇప్పటికే 14 బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటుండగా.. సింగరేణి కారి్మకులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. సొరంగం లోపల చిక్కుకున్న వారిని గుర్తించేందుకు కేరళ రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా వచ్చిన కాడవర్ డాగ్స్ తమవంతు పాత్ర పోషిస్తున్నాయి. జీపీఆర్, కాడవర్ డాగ్స్ చూయించిన ప్రదేశంలోనే ప్రధానంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. ఆదివారం రాబిన్స్ కంపెనీలో టీబీఎం ఆపరేటర్గా పనిచేస్తున్న గురుప్రీత్సింగ్ మృతదేహం లభించింది. దీంతో మిగతా 7 మంది కోసం సహాయక బృందాలు అన్వేషణను ముమ్మరం చేశాయి. టీబీఎం విడి భాగాలను తొలగిస్తూనే ఆ ఏడు మంది కోసం సొరంగంలో గాలిస్తున్నారు. స్థానిక యంత్రాంగం గంటగంటకూ సొరంగంలో జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తున్నారు.ఎస్ఎల్బీసీ సొరంగంలో 13.850 కి.మీ. వద్ద ప్రమాదం చోటుచేసుకోగా, అక్కడి చేరుకుని సహాయక చర్యలు చేపట్టడమే రెస్క్యూ బృందాలకు ప్రతిరోజు క్లిష్టతరమవుతోంది. సొరంగంలో 13 కి.మీ. లోపల రెస్క్యూ నిర్వహించే సిబ్బందికి సైతం ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. 16 రోజుల పాటు నిరంతరం శ్రమించిన రెస్క్యూ బృందాలకు ఆదివారం ఒక కారి్మకుడి మృతదేహం లభ్యమైంది. సమీపంలో గాలిస్తున్నా మిగతా వారి ఆచూకీ లభించడం లేదు. సోమవారం రెస్క్యూ బృందాలతో కలసి సొరంగంలోని ప్రమాదస్థలం వద్దకు ‘సాక్షి’ వెళ్లి పరిశీలించింది.సొరంగం ఇన్లెట్ నుంచి 13.850 కి.మీ. దూరంలో ఉన్న ప్రమాదస్థలం వద్దకు రెస్క్యూ బృందాలు చేరుకునేందుకే కనీసం 1.45 గంటలు పడుతోంది. లోకోట్రైన్ ద్వారా రాకపోకలకే కనీసం 3›–4 గంటలు పడుతోంది. ఒక్కో షిఫ్టులో సహాయక బృందాలు 12 గంటల పాటు పనిచేస్తున్నారు. సొరంగంలో 12 కి.మీ. వద్దకు చేరుకున్నాక సీపేజీ నీరు, బురద వస్తోంది. 13.200 కి.మీ. పాయింట్ వరకూ లోకో ట్రైన్ వెళ్లగలుగుతోంది. లోకో ట్రైన్ ట్రాక్ తర్వాత రెండు ఎస్కవేటర్లు మట్టి, శిథిలాలను తొలగిస్తున్నాయి.13.400 వద్ద టీబీఎం భాగాలు టన్నెల్ నిండా చిక్కుకుని ఉండగా, సహాయక బృందాలు లోపలికి వెళ్లేందుకు వీలుగా కుడివైపు నుంచి మిషిన్ భాగాలను కట్చేసి దారిని ఏర్పాటుచేశారు. అక్కడి నుంచి ప్రమాదస్థలం 13.850 వరకూ కాలినడకన బురద, శిథిలాల మధ్య జాగ్రత్తలు పాటిస్తూ చేరుకోవాల్సి ఉంటుంది. సొరంగానికి కుడివైపున కన్వేయర్ బెల్టు అందుబాటులోకి తీసుకురాగలిగారు. సుమారు 150 మీటర్ల విస్తీర్ణంలో 15 ఫీట్ల ఎత్తులో టన్నెల్ నిండా మట్టి, బురద పేరుకుని ఉండటంతో వాటిని తొలగించేందుకు రోజులు పట్టే అవకాశం ఉంది. దీంతో కడావర్ డాగ్స్ సూచించిన ప్రాంతాల్లోనే తవ్వకాలను జరిపి కార్మికుల జాడ కోసం అన్వేషణ చేపడుతున్నారు.సొరంగంలో చిక్కుకున్న 8 మందిలో గురుప్రీత్సింగ్ మృతదేహం లభ్యమైన ప్రదేశంలో పక్కనే ఆదివారం, సోమవారం సహాయక చర్యలను ముమ్మరం చేశారు. కేరళ నుంచి వచ్చిన కడావర్ డాగ్స్, జీపీఆర్ సిస్టం ద్వారా గుర్తించిన డీ1, డీ2 లొకేషన్లలో సింగరేణి కార్మికులు, ర్యాట్ హోల్ మైనర్లు, ఇతర సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. సోమవారం పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ సహాయక బృందాలకు దిశానిర్దేశం చేస్తూ డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్కుమార్ పలు సూచనలు చేశారు. మంగళవారం సొరంగం వద్ద సహాయక చర్యల్లో భాగంగా రోబోలు రంగంలోకి దిగనున్నాయి. హైదరాబాద్కు చెందిన అన్వి రోబో నిపుణులు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించనున్నారు. -
సెర్ప్లో.. మెప్మా విలీనం
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): పట్టణ ప్రాంతాల్లో పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకుల్లో రుణాలు ఇప్పించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న మెప్మా.. ఇక నుంచి డీఆర్డీఏలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లో విలీనం కానుంది. ఈ మేరకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేయడంతో పాటు ఇటీవల నిర్వహించిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం నుంచి నిర్ణయం వెలువడగానే జిల్లాలోని మహబూబ్నగర్, భూత్పూర్, జడ్చర్ల, దేవరకద్ర మున్సిపాలిటీల్లోని మెప్మా ఉద్యోగులు, సిబ్బందితో పాటు జిల్లాకేంద్రంలోని మెప్మా జిల్లా కార్యాలయం ఉద్యోగులు అందరూ సెర్ప్ పరిధిలోకి వెళ్లనున్నారు. పట్టణాల్లో సర్వేలకు ఇబ్బందే.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు, ఇతరత్రా పనులను క్షేత్రస్థాయిలో మెప్మా ఆర్పీలు సీఓలు సర్వే చేస్తుంటారు. మెప్మా ఆర్పీలకు కాలనీల్లో ఉండే వివరాలు తేలికగా తెలిసే అవకాశం ఉంటుందని.. ప్రతి సర్వేకు వారి సేవలను వినియోగించుకున్నారు. ఇక నుంచి వారు ఇతర శాఖ పరిధిలోకి వెళ్తే.. మున్సిపాలిటీ సేవలకు వారు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ప్రభుత్వం చేపట్టే సర్వే చేయాలంటే ఇక నుంచి మున్సిపల్ యంత్రాంగానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. మర్గదర్శకాలు రాలేదు.. డీఆర్డీఏలో మెప్మాను విలీనం చేస్తున్నట్లు ప్రభుత్వం నుంచి ఇప్పటి దాక మాకు ఎలాంటి మర్గదర్శకాలు రాలేదు. ప్రభుత్వం నుంచి వచ్చే మార్గ దర్శకాల మేరకు నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతానికి డీఆర్డీఏ, మెప్మాలు వేరువేరుగా విదులు నిర్వహిస్తున్నాయి. – నర్సిములు, డీఆర్డీఏ ఒకే గొడుగు కిందికి రానున్న మహిళా సంఘాలు డీఆర్డీఏ పరిధిలోకి రిసోర్స్పర్సన్లు ప్రతిపాదనలు రూపొందించిన ప్రభుత్వం -
మిగిలింది 20 రోజులే..
నారాయణపేట: మున్సిపాలిటీల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులతోపాటు ఆస్తి పన్నుల రాబడితో పట్టణాల్లో ప్రగతి పరుగులు పెడుతుంది. మున్సిపాలిటీల్లోని నివాసగృహాలు, వాణిజ్య సముదాయ భవనాలకు 2024– 25 ఆర్థిక సంవత్సరానికి గాను ఆస్తిపన్ను వసూలుపై మున్సిపల్ అధికార యంత్రాంగం డిజిటల్ చెల్లింపు (టెక్నాలజీ)లపై దృష్టిసారించింది. క్యూఆర్ కోడ్ స్కాన్, డెబిట్, క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, వాట్సప్ నంబర్, ఏటీఎం ద్వారా నేరుగా ఆయా మున్సిపాలిటీ ఖాతాల్లో జమ చేయవచ్చని చెబుతోంది. అయితే ప్రభుత్వం చేపట్టిన సర్వేలతోనే మున్సిపాలిటీల్లో పన్నుల వసూళ్లకు అధికారులు ఒక అడుగు ముందుకు.. మూడు అడుగులు వెనక్కి పడినట్లు చెబుతున్నారు. అయితే మున్సిపాలిటీల్లో ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు వసూలు అంతంత మాత్రమే ఉండటం.. టార్గెట్ చేరుకునేందుకు కేవలం 20 రోజులే ఉండటంతో అధికారులు సిబ్బందిని పరుగులు పెట్టిస్తున్నారు. 80 శాతంతో నాలుగో స్థానం.. రాష్ట్రస్థాయిలో పన్నులు వసూలు చేయడంలో ఉమ్మడి జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీ నాలుగో స్థానంలో నిలిచింది. సుమారు 4 వేల ఆస్తులకు రూ.98 లక్షలు వసూలు చేయాల్సి ఉండగా ఇప్పటికే రూ.78 లక్షలు (80 శాతం) వసూలు చేశారు. అదనపు కలెక్టర్లకు బాధ్యతలు.. ఈ ఏడాది జనవరి 26తో మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో అదనపు కలెక్టర్లు (లోకల్ బాడీస్) ప్రత్యేకాధికారులుగా బాధ్యతలు అప్పగించింది. వీరు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను వసూళ్లపై ఎప్పటికప్పుడు మున్సిపల్ రెవెన్యూ, బిల్ కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లు, కమిషనర్లకు ఆదేశాలు ఇస్తున్నారు. వారం రోజులుగా ప్రత్యేక దృష్టిసారిస్తూ రోజూవారిగా పన్నుల వసూళ్లపై నివేదిక తెప్పించుకుంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పన్నుల వసూళ్లకు మిగిలింది కేవలం 20 రోజులేనని.. అంతలోపే లక్ష్యం చేరుకోవాలని ప్రత్యేకాధికారులు మున్సిపల్ యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆస్తి, నీటి పన్ను చెల్లింపులు, రివిజన్ పిటిషన్ సహా ఇతర సమస్యల పరిష్కా రం కోసం సోమ, గురువారాల్లో ఉద యం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మున్సి పాలిటీల్లో రెవెన్యూమేళా నిర్వహించేందుకు చర్యలు చేప ట్టారు. ఈ మేళా ద్వారా ప్రజలకు అ నేక రకాల సేవలు అందుబాటులో ఉంటాయని అధికారు లు చెబుతున్నారు. మున్సిపాలిటీల పరిధిలో ఆస్తి, నీటి పన్ను చెల్లింపులు, ఇతర సమస్యలకు పరిష్కారం పొందవచ్చు. ప్రాపర్టీ పేరు మార్పు, మ్యూటేషన్, ఇంటి నంబర్ కేటాయింపు లేదా మార్పు వంటి సేవలు పొందవచ్చు. రాష్ట్రస్థాయిలో 63వ స్థానం.. సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మున్సిపాలిటీలో 5,332 ఆస్తులకు రూ. 1.94 కోట్లు వసూలు చేయా ల్సి ఉండగా.. ఇప్పటి వరకు రూ.1.10 కోట్లు (57 శాతం) వసూలు చేశా రు. దీంతో ఈ మున్సిపాలిటీ రాష్ట్రస్థాయిలో 63వ స్థానంలో నిలిచింది. అలాగే ఉమ్మడి జిల్లాకు చెందిన ఎక్సైజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లపూర్లో సైతం 6,406 ఆస్తుల కు రూ.1.28 కోట్లకు రూ.72 లక్షలు వసూలు (56 శాతం) చేశారు. ఈ మున్సిపాలిటీ రాష్ట్రస్థాయిలో 68వ స్థానంలో నిలిచింది. మున్సిపాలిటీల్లో పన్నుల వసూళ్లు అంతంతే సీఎం ఇలాఖాలో 57 శాతమే వసూలుతో రాష్ట్రస్థాయిలో 63వ స్థానం ఉమ్మడి జిల్లాలో వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లే దిక్కు ప్రత్యేకంగా సోమ, గురువారాల్లో రెవెన్యూ మేళాలు గడువు నేపథ్యంలో పరుగులు పెట్టిస్తున్న ప్రత్యేకాధికారులు -
ఆహార భద్రతకు పకడ్బందీ చర్యలు
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలో సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు, గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన ఆహారం అందించి ఆహార భద్రతకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కలెక్టర్ చైర్మన్గా వివిధ శాఖల అధికారులతో జిల్లా ఆహార భద్రత సలహా మండలి ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కమిటీలో రెవెన్యూ అదనపు కలెక్టర్, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి, వైద్య ఆరోగ్య శాఖ, వ్యవసాయ, పరిశ్రమలశాఖ జీఎంలు, డీఈఓ, జిల్లా పౌరసరఫరాల అధికారి, ఫుడ్ ఇన్స్పెక్టర్ తదితరులు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. ఆహార భద్రత చట్టం అనుసరించి జిల్లాలో ఆహార భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. జిల్లాకు నూతనంగా రీజనల్ ఫుడ్ లేబరేటరీ, ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ వెహికల్ కూడా రాబోతుందని పేర్కొన్నారు. వీటి ద్వారా జిల్లాలో మరింత మెరుగ్గా ఆహార కల్తీ నిరోధానికి పాటుపడాలని, ప్రభుత్వ పాఠశాలల్లో, వసతిగృహాల్లో, గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా పాఠశాలల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి పరీక్షించాలని, రక్తహీనత, ఐరన్ లోపం ఉన్న వారికి తగు చికిత్స అందించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మోహన్రావు, శివేంద్ర ప్రతాప్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మనోజ్, డీఈఓ ప్రవీణ్ కుమార్, అదనపు డీఎంహెచ్ఓ డాక్టర్ శశికాంత్, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి జరీనా బేగం, తదితరులు పాల్గొన్నారు. తాగునీటి సమస్యపై దృష్టి సారించాలి జిల్లాలో తాగునీటి సమస్య, విద్యుత్ సరఫరాపై అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. కలెక్టరేట్లో జిల్లా అధికారుల సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామాల్లో తాగునీటి సమస్య, విద్యుత్ సరఫరాలో సమస్య ఉంటే వెంటనే పరిష్కరించాలని సూచించారు. భూగర్భ జల వనరులు తగ్గినా పంటలు ఎండిపోకుండా రెవెన్యూ, వ్యవసాయ, ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా కలిసి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. -
మహబూబ్నగర్కే ఎక్కువ నిధులా?
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ముడా నుంచి జిల్లాలోని మహబూబ్నగర్ నియోజకవర్గానికే ఎక్కువ నిధులు కేటాయిస్తే ఎలా అని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అధికారులను ప్రశ్నించారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక ముడా కార్యాలయంలో చైర్మన్ కె.లక్ష్మణ్యాదవ్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మిగతా నియోకవర్గాలకూ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఇక నుంచి మహబూబ్నగర్ (పరిగి నియోజవకర్గంలోని రెండు మండలాలు కలుపుకొని)కు 40 శాతం, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాలకు 30 శాతం చొప్పున మంజూరు చేస్తే బాగుంటుందన్నారు. అందుకు వైస్ చైర్మన్ డి.మహేశ్వర్రెడ్డి అంగీకారం తెలిపారు. ఇక గతంలోనూ మహబూబ్నగర్కు తప్పా ఇతర నియోజకవర్గాలకు అసలు కేటాయింపులే జరగలేదని ఆయన వాపోయారు. జిల్లాకేంద్రంలోని పది పార్కుల అభివృద్ధికి అయ్యే రూ.3.30 కోట్లను కేవలం మున్సిపల్ కార్పొరేషన్ నిధుల నుంచి కేటాయించాలన్నారు. ఇదివరకే చేపట్టిన పనుల్లో తన నియోజకవర్గంలో 34 పెండింగ్లో ఉన్నాయని, ఇంజినీరింగ్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరుగుతోందన్నారు. కాగా, జిల్లాలో ఏఈల కొరత తీవ్రంగా ఉందని, చాలా చోట్ల డిప్యూటేషన్పై పని చేస్తున్నందున ఈ పరిస్థితి నెలకొందని పబ్లిక్ హెల్త్ ఈఈ విజయభాస్కర్రెడ్డి బదులిచ్చారు. ముడాకు ప్రత్యేకంగా ఈఈ, ఇద్దరు డీఈఈలు, నియోజవర్గానికి ఒక్కొక్కరు చొప్పున ఏఈ పోస్టులు కేటాయిస్తే పనులు త్వరగా చేపట్టడానికి వీలవుతుందని సమావేశం దృష్టికి తెచ్చారు. కాగా, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి, ముడా పాలకవర్గం అమోదంతో రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సూచించారు. కేటాయింపులు ఇలా.. ఇక మహబూబ్నగర్ నియోజకవర్గానికి రూ.14,05,06,000లతో 108 పనులు, జడ్చర్లకు రూ.8,21,50,000లతో 142, దేవరకద్రకు రూ.8,20,00,000లతో 192, పరిగి నియోజకవర్గంలోని మహమ్మదాబాద్, గండేడ్ మండలాలకు రూ.1,54,10,000లతో 77 పనులు (ఇలా మొత్తం రూ.32,00,66,000) చేపట్టేందుకు ప్రతిపాదనలు చేయగా పాలకవర్గం ఆమోదం తెలిపింది. అలాగే కార్పస్ఫండ్ కింద ముడాకు రూ.500 కోట్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలని తీర్మానించింది. జిల్లాకేంద్రంలోని బైపాస్, భూత్పూర్ రోడ్డు, ఎన్హెచ్–167లపై ఐదు చోట్ల మొక్కల పెంపకం, సంరక్షణకు గాను నిర్వహణ ఖర్చుల కింద రూ.1.84 కోట్లు కేటాయించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్రెడ్డి, అనిరుధ్రెడ్డి, చిట్టెం పర్ణికారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని మిగతా నియోకవర్గాలకూ ప్రాధాన్యం ఇవ్వాలి పార్కుల అభివృద్ధిని మున్సిపల్ కార్పొరేషన్ చూసుకోవాలి ముడా సమావేశంలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి -
ఆ ఏడుగురి కోసం అన్వేషణ
ఆ చోటనే గాలింపు సొరంగంలో చిక్కుకున్న 8 మందిలో గురుప్రీత్సింగ్ మృతదేహం లభ్యమైన ప్రదేశంలో పక్కనే ఆదివారం, సోమవారం సహాయక చర్యలను ముమ్మరం చేశారు. కేరళ నుంచి వచ్చిన కడావర్ డాగ్స్, జీపీఆర్ సిస్టం ద్వారా గుర్తించిన డీ1, డీ2 లొకేషన్లలో సింగరేణి కార్మికులు, ర్యాట్ హోల్ మైనర్లు, ఇతర సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. సోమవారం పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ సహాయక బృందాలకు దిశానిర్దేశం చేస్తూ డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్కుమార్ పలు సూచనలు చేశారు. మంగళవారం సొరంగం వద్ద సహాయక చర్యల్లో భాగంగా రోబోలు రంగంలోకి దిగనున్నాయి. హైదరాబాద్కు చెందిన అన్వి రోబో నిపుణులు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించనున్నారు. సాక్షి, నాగర్కర్నూల్ /అచ్చంపేట రూరల్: దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న వారి కోసం 17 రోజులుగా చేపడుతున్న సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్లో చిక్కుకున్న 8 మందిలో ఒకరి మృతదేహం ఆదివారం లభించడంతో సహాయక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. ఇప్పటికే 14 బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటుండగా.. సింగరేణి కార్మికులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. సొరంగం లోపల చిక్కుకున్న వారిని గుర్తించేందుకు కేరళ రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా వచ్చిన కాడవర్ డాగ్స్ తమవంతు పాత్ర పోషిస్తున్నాయి. జీపీఆర్, కాడవర్ డాగ్స్ చూయించిన ప్రదేశంలోనే ప్రధానంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. ఆదివారం రాబిన్స్ కంపెనీలో టీబీఎం ఆపరేటర్గా పనిచేస్తున్న గురుప్రీత్సింగ్ మృతదేహం లభించింది. దీంతో మిగతా 7 మంది కోసం సహాయక బృందాలు అన్వేషణను ముమ్మరం చేశాయి. టీబీఎం విడి భాగాలను తొలగిస్తూనే ఆ ఏడు మంది కోసం సొరంగంలో గాలిస్తున్నారు. స్థానిక యంత్రాంగం గంటగంటకూ సొరంగంలో జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తున్నారు. సహాయక చర్యలకు అన్నీ సవాళ్లే.. ఎస్ఎల్బీసీ సొరంగంలో 13.850 కి.మీ. వద్ద ప్రమాదం చోటుచేసుకోగా, అక్కడి చేరుకుని సహాయక చర్యలు చేపట్టడమే రెస్క్యూ బృందాలకు ప్రతిరోజు క్లిష్టతరమవుతోంది. సొరంగంలో 13 కి.మీ. లోపల రెస్క్యూ నిర్వహించే సిబ్బందికి సైతం ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. 16 రోజుల పాటు నిరంతరం శ్రమించిన రెస్క్యూ బృందాలకు ఆదివారం ఒక కార్మికుడి మృతదేహం లభ్యమైంది. సమీపంలో గాలిస్తున్నా మిగతా వారి ఆచూకీ లభించడం లేదు. సోమవారం రెస్క్యూ బృందాలతో కలసి సొరంగంలోని ప్రమాదస్థలం వద్దకు ‘సాక్షి’ వెళ్లి పరిశీలించింది. సొరంగం ఇన్లెట్ నుంచి 13.850 కి.మీ. దూరంలో ఉన్న ప్రమాదస్థలం వద్దకు రెస్క్యూ బృందాలు చేరుకునేందుకే కనీసం 1.45 గంటలు పడుతోంది. లోకోట్రైన్ ద్వారా రాకపోకలకే కనీసం 3–4 గంటలు పడుతోంది. ఒక్కో షిఫ్టులో సహాయక బృందాలు 12 గంటల పాటు పనిచేస్తున్నారు. సొరంగంలో 12 కి.మీ. వద్దకు చేరుకున్నాక సీపేజీ నీరు, బురద వస్తోంది. 13.200 కి.మీ. పాయింట్ వరకూ లోకో ట్రైన్ వెళ్లగలుగుతోంది. లోకో ట్రైన్ ట్రాక్ తర్వాత రెండు ఎస్కవేటర్లు మట్టి, శిథిలాలను తొలగిస్తున్నాయి. 13.400 వద్ద టీబీఎం భాగాలు టన్నెల్ నిండా చిక్కుకుని ఉండగా, సహాయక బృందాలు లోపలికి వెళ్లేందుకు వీలుగా కుడివైపు నుంచి మిషిన్ భాగాలను కట్చేసి దారిని ఏర్పాటుచేశారు. అక్కడి నుంచి ప్రమాదస్థలం 13.850 వరకూ కాలినడకన బురద, శిథిలాల మధ్య జాగ్రత్తలు పాటిస్తూ చేరుకోవాల్సి ఉంటుంది. సొరంగానికి కుడివైపున కన్వేయర్ బెల్టు అందుబాటులోకి తీసుకురాగలిగారు. సుమారు 150 మీటర్ల విస్తీర్ణంలో 15 ఫీట్ల ఎత్తులో టన్నెల్ నిండా మట్టి, బురద పేరుకుని ఉండటంతో వాటిని తొలగించేందుకు రోజులు పట్టే అవకాశం ఉంది. దీంతో కడావర్ డాగ్స్ సూచించిన ప్రాంతాల్లోనే తవ్వకాలను జరిపి కార్మికుల జాడ కోసం అన్వేషణ చేపడుతున్నారు. సొరంగంలో కాడవర్ డాగ్స్ స్క్వాడ్ ప్రమాద స్థలంలో గుర్తించిన డీ2 పాయింట్ వద్ద సింగరేణి బృందాలు టన్నెల్లో కాడవర్ డాగ్స్తో గాలింపు ముమ్మరం కీలకంగా వ్యవహరిస్తున్న సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్లు ఇప్పటికే ఒక కార్మికుడి మృతదేహం లభ్యం ఎస్ఎల్బీసీలో కొనసాగుతున్న సహాయక చర్యలు అభినందనల వెల్లువ.. ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న 8 మందిలో ఒకరి మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చిన సహాయక బృందాలను ప్రజాప్రతినిధులు, వివిధ విపత్తుల ఉన్నతాధికారులు అభినందించారు. సోమవారం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గురుప్రతీసింగ్ మృతిచెందడం బాధాకరమని, తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మున్ముందు జరగబోయే సహాయక చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్కుమార్, కలెక్టర్ బదావత్ సంతోష్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స్ఫూర్తితో మిగిలిన సహాయక చర్యలను మరింత వేగంగా, సమర్థవంతంగా కొనసాగించాలని సూచించారు. సహాయక బృందాలు పూర్తిస్థాయిలో పాల్గొని పనులను వేగంగా ముగించాలని ఆదేశించారు. అలాగే టన్నెల్ వద్ద సహాయక సిబ్బందికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించినట్లు వివరించారు. సహాయక చర్యల్లో పాల్గొనే బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. సమావేశంలో ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి మైన్స్, ర్యాట్ మైనర్స్, దక్షిణ మధ్య రైల్వే, కేరళకు చెందిన కాడవర్ డాగ్స్ స్క్వాడ్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రేషన్ బియ్యం పట్టివేత
కొత్తపల్లి: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు మద్దూర్ ఎస్ఐ విజయ్కుమార్ తెలిపారు. వివరాలు.. కర్ణాటక రాష్ట్రం గుర్మిట్కాల్కు బొలెరోలో తరిలిస్తున్నట్లు సమాచారం అందింది. సోమవారం తెల్లవారుజామున కొత్తపల్లి మండలం భూనీడు గ్రామ శివారులో వాహనంలో బియ్యాన్ని గుర్తించి పోలీస్స్టేషన్కు తరలించారు. ఈవిషయమై కోస్గి ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు సమాచారమివ్వగా పట్టుబడిన బియ్యాన్ని పంచనామా నిర్వహించారు. వాహనంలో 57బస్తాలు 28 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. వాహనాన్ని పోలీసులకు అప్పగించి డ్రైవర్ పరశురాం, యజమానికి శ్రీనివాస్ఐ కేసు నమోదుచేశారు. ఈ బియ్యం దేవరకద్ర మండలం పూసలపహాడ్ నుంచి కర్ణాటకకు తరలిస్తున్నట్లు ఎస్ఐ విజయ్కుమార్ తెలిపారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
పెద్దకొత్తపల్లి: పంటకు నీరందించేందుకు వెళ్లిన ఓ రైతు విద్యుదాఘాతానికి గురై మృతిచెందిన ఘటన పెద్దకొత్తపల్లి మండలం యాపట్ల గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. యాపట్లకు చెందిన రైతు బక్కయ్యగౌడ్ (60)కు మూడెకరాల పొలం ఉండగా.. వేరుశనగ పంట సాగుచేశాడు. ఆదివారం రాత్రి పంటకు నీరందించేందుకు వెళ్లిన అతడు.. విద్యుత్ బోరుమోటారు ఆన్ చేస్తుండగా షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. అతడికి భార్య కిష్టమ్మ, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. మృతుడి కుమారుడు శివుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ సతీష్ తెలిపారు. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య అడ్డాకుల: మూసాపేట మండలం మహ్మదుస్సేన్పల్లికి చెందిన రైతు కుర్వ పూల మహేష్(39) పురుగుల మందు తాగిన ఘటనలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మూసాపేట ఎస్ఐ ఎం.వేణు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం...మహ్మదుస్సేన్పల్లి గ్రామానికి చెందిన మహేష్ ఐదేళ్ల క్రితం రూ.30 లక్షలు ఫైనాన్స్ తీసుకుని రెండు హార్వేస్టర్లు కొనుగోలు చేశాడు. వాటి ద్వారా నష్టం వాటిల్లడంతో వాటిని అమ్మేశాడు. తర్వాత గ్రామంలో కొంత పొలాన్ని కౌలుకు తీసుకుని పంటలు సాగు చేశాడు. పంటల సాగుకు చేసిన అప్పులు కూడా తీరకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈక్రమంలో జీవితంపై విరక్తి చెందిన మహేష్ ఈనెల 9న ఉదయం ఇంటి వద్ద పురుగుల మందును తాగాడు. కొద్దిసేపటికే గమనించిన తల్లి నారమ్మ వెంటనే జిల్లాకేంద్రంలోని ఆస్పత్రికి తరలించింది. అక్కడ చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఆదివారం రాత్రి హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు ఎస్ఐ ఎం.వేణు తెలిపారు. మృతుడికి భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నట్లు తెలిసింది. మృతుడి తల్లి నారమ్మ సోమవారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. అన్నదమ్ముల గొడవలో తమ్ముడిపై కేసు నమోదు అడ్డాకుల: మండలంలోని తిమ్మాయిపల్లికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు పొలానికి నీళ్లు పెట్టుకునే క్రమంలో జరిగిన గొడవలో అన్నపై దాడి చేసిన తమ్ముడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. గ్రామానికి చెందిన బాలకిష్టయ్య ఆదివారం సాయంత్రం తన పొలానికి నీళ్లు పారిస్తున్నాడు. అదే సమయంలో అక్కడికి వెళ్లిన తమ్ముడు రవి నీళ్లు పారించుకునే వంతుల విషయంలో గొడవపడ్డారు. ఈక్రమంలో రవి కర్రను తీసుకొని బాలకిష్టయ్యపై దాడి చేసి గాయపర్చాడు. దీంతో బాలకిష్టయ్య సోమవారం అడ్డాకుల ఠాణాలో ఫిర్యాదు చేశాడు. గాయపడిన బాలకిష్టయ్యను పోలీసులు ఆస్పత్రికి పంపించారు. తమ్ముడు రవిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఆన్లైన్లో పెట్టుబడి.. మోసపోయిన యువకుడు కొత్తకోట రూరల్: సైబర్ నేరాలపై పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ.. ఎక్కడో చోట ఆన్లైన్లో పెట్టుబడి పెట్టి మోసపోతున్న వారు వెలుగులోకి వస్తూనే ఉన్నారు. తాజాగా కొత్తకోటకు చెందిన ఓ యువకుడు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయాడు. ఎస్ఐ ఆనంద్ వివరాల మేరకు.. కొత్తకోటకు చెందిన డి.ఉదయ్కుమార్ను ఈ నెల 3న గుర్తుతెలియ ని వ్యక్తి టెలిగ్రామ్ యాప్లో ‘బిట్ కై న్ ఇన్వెస్టర్’ గ్రూప్లో యాడ్ చేశారు. ఆ గ్రూప్లో ఒక లింక్ను పంపించి.. అందులో డబ్బులు పె ట్టుబడిగా పెడితే రెట్టింపు అవుతాయని చెప్పా రు. నమ్మిన ఉదయ్కుమార్.. అదే రోజు తన బ్యాంక్ ఖాతా నుంచి రూ.70వేలు పెట్టుబడి పెట్టాడు. డబ్బులు పెద్ద మొత్తంలో రావడంతో సైబర్ నేరగాడు రాత్రికి రాత్రే ఆ టెలిగ్రామ్లో ఉన్న ఇన్వెస్టర్ గ్రూప్ మొత్తాన్ని తొలగించాడు. మోసపోయానని తెలుసుకున్న ఉదయ్కుమార్.. 1930కు కాల్ చేయడంతో పాటు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. నవజాత శిశువును కాపాడిన 108 సిబ్బంది నర్వ: నవజాత శిశువుకు 108 సిబ్బంది సీపీఆర్ చేసి కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని రాయికోడ్కు చెందిన గర్భిణి అఖిల మొదటి కాన్పు నిమిత్తం సోమవారం నర్వ పీహెచ్సీకి వచ్చింది. మధ్యాహ్నం సాధారణ ప్రసవమై మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే శిశువు ఉమ్మనీరు మింగడంతో శ్వాస తీసుకోలేకయింది. ఈ క్రమంలో శిశువు మరణించిందని అందరూ భావించారు. అయితే ప్రసవం చేసిన నర్సు 108 అంబులెన్స్కు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్నారు. శిశువు అంబులెన్స్లోకి తీసుకొని ఆర్సీపీ డాక్టర్ శివ, మరో డాక్టర్ మౌనిక సూచనలతో సీపీఆర్ చేశారు. నవజాత శిశువుకు మందులు, ఆక్సిజన్ అందిస్తూ.. మహబూబ్నగర్ ఆస్పత్రికి తరలించారు. నవజాత శిశువును సీపీఆర్తో కాపాడిన 108 సిబ్బందిని చిన్నపిల్లల వైద్యురాలు మమత అభినందించారు. -
మంటల వ్యాప్తికి కారణమైన వ్యక్తి అరెస్టు
దోమలపెంట: అమ్రాబాద్ టైగర్ రిజర్వు పరిధిలోని దోమలపెంట రేంజ్ అటవీ ప్రాంతంలో మంటల వ్యాప్తికి కారణమైన వ్యక్తి శీలం బయన్నను సోమవారం కోర్టులో హాజరుపర్చినట్లు దోమలపెంట ఎఫ్ఆర్ఓ గురుప్రసాద్ తెలిపారు. ఈ నెల 2, 3 తేదీల్లో దోమలపెంట రేంజ్ పరిధిలోని దూబోడు, ఉల్లిందలూట బీట్లలో రాత్రివేళలో వ్యాపించిన మంటలను జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో 7 బృందాలు శ్రమించి అదుపులోకి తెచ్చాయి. అయితే ఇతర ప్రాంతాల్లో మంటలు, పొగలు వస్తుండటంతో అడవిలో అన్ని బ్లాక్లను కాలినడక ద్వారా వెళ్లి ఆర్పుతుండగా సమీపంలో నివాసముంటున్న పదర మండలం చిట్లంకుంట గ్రామానికి చెందిన శీలం బయన్న మేకలను కాయడం తారసపడిందన్నారు. అతన్ని విచారించగా లింగాలగట్టుకు చెందిన బాలచెన్నయ్యకు చెందిన మేకలు కాస్తున్నట్లు చెప్పారని, బయన్న వద్ద అగ్గిపెట్టె, బీడీలు, పొగాకును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సుమారు 150 హెక్టార్ల విస్తీర్ణం మేర అడవిలో మంటలు వ్యాపించడానికి శీలం బయన్న కారణమని, కేసు నమోదు చేసి అచ్చంపేట కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి చార్జీషీటు దాఖలు చేయాలని సూచించారన్నారు. -
నల్లమలలో కార్చిచ్చు
కొల్లాపూర్: నియోజకవర్గ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కార్చిచ్చు రాజుకుంది. 15 రోజుల క్రితం జాలుపెంట, చుక్కలపెంట ప్రాంతాల్లో అడవి అంటుకొని మంటలు చెలరేగాయి. వాటిని ఆర్పివేయడంలో కొల్లాపూర్ అటవీ శాఖాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వాతావరణ మార్పుల కారణంగా మంటల వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. చిన్నపాటి మంటలే కదా అనుకున్న అటవీ అధికారులకు కార్చిచ్చు తలనొప్పిగా మారింది. కొన్ని రోజులుగా అధిక వేడితో పాటు గాలులు వీస్తుండడంతో మంటల సమీప ప్రాంతాలకు వ్యాపించాయి. జాలుపెంట, చుక్కలపెంట, పెగ్గర్లపెంట, తొంగిచూపులు ప్రాంతాల్లో మంటలు చెలరేగుతున్నాయి. మంటలను అదుపుచేయలేక సమస్యను ఉన్నతాధికారులకు నివేదించారు. దీంతో వారి ఆదేశానుసారం మంటలను ఆర్పేందుకు బ్లోయర్స్ను వినియోగిస్తున్నారు. అయినా కూడా మంటలు అదుపులోకి రావడం లేదు. శివరాత్రి సందర్భంగా అటవీ మార్గంగుండా శ్రీశైలం వెళ్లిన శివస్వాములే మంటల వ్యాప్తికి కారణమై ఉంటారని ఫారెస్టు రేంజర్ చంద్రశేఖర్ అనుమానం వ్యక్తం చేశారు. అడవిలో మంటలు వ్యాప్తి చెందుతున్నాయని గొర్రెలు, పశువుల కాపరులతో పాటు ఇతరులు ఎవరూ అనుమతుల్లేకుండా అడవిలోకి ప్రవేశించరాదని ఆయన హెచ్చరించారు. అగ్ని ప్రమాదం కారణంగా అడవిలో జీవజాలం చనిపోతుందని, దీనివల్ల జీవ వైవిధ్యం దెబ్బతింటుందని ఆయన వివరించారు. మంటలను అదుపుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జాలుపెంట, చుక్కలపెంటల్లో 15 రోజుల క్రితం అంటుకున్న అడవి రోజురోజుకూ వ్యాప్తి చెందుతున్న మంటలు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అటవీ శాఖాధికారులు ఉన్నతాధికారుల ఆదేశంతో వినియోగంలోకి బ్లోయర్స్ -
అలంపూర్ క్షేత్రం అభివృద్ధికి ప్రణాళికలు
అలంపూర్: అలంపూర్ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి క్షేత్రం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి అన్నారు. ఆలయ సముదాయంలోని చైర్మన్ చాంబర్లో సోమవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జోగుళాంబ ఆలయ అభివృద్ధిపై ఈ నెల 7న హైదరాబాద్లోని ప్రజాభవన్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి, దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా జోగుళాంబ ఆలయ సమగ్ర అభివృద్ధికి తాత్కాలిక, దీర్ఘకాలిక పనుల జాబితాను సిద్ధం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటికీ అలంపూర్లో ఐదవ శక్తిపీఠం ఉన్నట్టు చాలా మందికి తెలియని పరిస్థితి ఉందన్నారు. ఆలయ చరిత్రతో కూడిన ప్రచార బోర్డులు పెట్టడానికి ప్రధాన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ముఖ్య ప్రదేశాలను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఇటీవల ఆలయాల్లో అవినీతి జరిగిందని.. అర్చకుల పనితీరుపై మీడియాలో కథనాలు వస్తున్నాయన్నారు. అందుకు సంబంధించిన రికార్డులను దేవదాయశాఖకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. అవినీతికి పాల్పడిన వారిపై శాఖాపరమైన చర్యలు ఉంటాయన్నారు. ఆలయాల ప్రతిష్ట దెబ్బతిసే విధంగా ఎవరూ ప్రయత్నించవద్దని కోరారు. సమావేశంలో ఆలయ ధర్మకర్తలు నాగశిరోమణి, జగన్మోహన్ నాయుడు, జగన్గౌడు, గోపాల్, అడ్డాకుల రాము ఉన్నారు. -
సప్లయర్ ఇంట్లో అంగన్వాడీ సరుకులు
జడ్చర్ల టౌన్: అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేయాల్సిన సరుకులు సప్లయర్ ఇంట్లో నిల్వ ఉండటంతో జడ్చర్ల సీడీపీఓ శోభారాణి సోమవారం పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. అంగన్వాడీ కేంద్రాలకు బాలామృతం, పప్పు, నూనెలను జడ్చర్ల వెంకటేశ్వరకాలనీకి చెందిన కృష్ణారెడ్డి సరఫరా చేసే సప్లయర్గా పనిచేస్తున్నాడు. అయితే ప్రతి సరుకు గోదాం నుంచి మాత్రమే కేంద్రాలకు తరలించాల్సి ఉంది. అలాంటిది అతడి ఇంట్లో అక్రమంగా సరుకులు నిల్వ ఉన్నాయని ఆదివారం రాత్రి అంగన్వాడీ అధికారులకు సమాచారం అందింది. దీంతో అదేరోజు రాత్రి ఆప్రాంత అంగన్వాడీ టీచర్, సూపర్వైజర్లు వెళ్లి పరిశీలించగా 111 కిలోల బాలామృతం 80కిలోల కందిపప్పు, 8లీటర్ల వంటనూనెలు ఉండటాన్ని గుర్తించి సీడీపీఓకు సమాచారమిచ్చారు. సోమవారం ఉదయం సీడీపీఓ శోభారాణి, ఆర్ఐ హర్షవర్దన్రెడ్డిలతోపాటు పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేసి సరుకులను ఐసీడీఎస్ కార్యాలయానికి తరలించారు. గోడౌన్లో ఉండాల్సిన సరుకు ఇంట్లో ఎందుకు ఉంచుకున్నారని సప్లయర్ను ప్రశ్నించగా కేంద్రాలకు సప్లయ్ చేయగా మిగిలినది ఇక్కడ నిల్వచేసినట్లు చెప్పుకొచ్చారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన సీడీపీఓ -
ట్రాక్టర్ను ఢీకొట్టి.. బోల్తా పడిన బొలెరో
గద్వాల క్రైం: స్వగ్రామంలో ఉపాధి లేకపోవడంతో కొందరు వ్యవసాయ కూలీలు మరో ప్రాంతానికి కూలీ పనుల కోసం బొలెరో వాహనంలో బయలుదేరారు. ఈ క్రమంలో ఓ ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడుపుతూ అకస్మాత్తుగా రోడ్డుపైకి రావడంతో.. కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాదంలో 26 మంది కూలీలకు గాయాలు కాగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన గద్వాల మండలం జమ్మిచేడ్ స్టేజీ సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. కేటీదొడ్డి మండలం పాతపాల్లెం, గంగన్పల్లి, జాంపల్లి గ్రామాలకు చెందిన 26 మంది కూలీలు మానవపాడు మండలం ధర్మవరం గ్రామంలో మిర్చి తెంచేందుకు బొలెరో గూడ్స్ వాహనంలో బయలుదేరారు. మార్గమధ్యంలోని జమ్మిచేడ్ స్టేజీ వద్ద క్రాస్రోడ్డు దాటేందుకు ట్రాక్టర్ వేగంగా రావడంతో బొలెరో వాహనం అదుపుతప్పి వెనక నుంచి ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాదంలో జాంపల్లికి చెందిన సవారన్న, పాతపాలెంకు చెందిన కృష్ణ, పావని, శాంతమ్మ, పద్మలకు తీవ్ర గాయాలయ్యాయి. మిగతా వారికి స్వల్పగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో సవారన్న, కృష్ణ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కాగా.. ట్రాక్టర్, బొలెరో వాహనం డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగంతో కూడిన డ్రైవింగ్ కారణంగానే ప్రమాదం చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. విషయం తెలుసుకున్న జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత, నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు రంజిత్ కుమార్, పీఏసీఎస్ చైర్మన్ సుభాన్ తదితరులు జిల్లా ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. కూలీలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ ఘటనపై గద్వాల సీఐ శ్రీను, ఎస్ఐలు శ్రీకాంత్, కళ్యాణ్కుమార్ విచారణ చేపట్టారు. ట్రాక్టర్ డ్రైవర్ నవీన్, బొలెరో వాహన డ్రైవర్ మహబూబ్ పరారీలో ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. ఐదుగురు కూలీలకు తీవ్రగాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం నిర్లక్ష్యం, అతివేగంతో కూడిన డ్రైవింగ్తోనే ప్రమాదం -
శాంతికుమార్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ పరామర్శ
పాలమూరు: బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ను ఆదివారం జిల్లాకేంద్రంలోని ఏనుగొండలోని ఆయన నివాసంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ పరామర్శించారు. శాంతికుమార్ తండ్రి బండారి లక్ష్మణ్ మృతిచెందడంతో ఆయన చిత్రపటానికి బండి సంజయ్ పువ్వులు వేసి నివాళులర్పించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్యాహ్నం 12 గంటలకు పట్టణంలోని శాంతికుమార్ ఇంటికి చేరుకోగా బీజేపీ నేతలు స్వాగతం పలికారు. నేరుగా ఇంట్లోకి వచ్చిన బండి సంజయ్ బండారి లక్ష్మణ్ చిత్రపటం దగ్గరకు వెళ్లి నివాళులర్పించారు. ఆ తర్వాత శాంతికుమార్ను పరామర్శించారు. పార్టీ శ్రేణులు, నేతలు, కార్యకర్తలతో ఫొటోలు దిగారు. అనంతరం పార్టీ నేతలతో మాట్లాడిన మంత్రి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మహబూబ్నగర్ నుంచి తిరిగి హైదరాబాద్ వెళ్లారు. అలాగే శాంతికుమార్ను మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీజేపీ ఎస్సీ మోర్చ జాతీయ అధ్యక్షుడు ఎస్.కుమార్, సంగప్ప, ఎన్వీ సుభాష్, బీసీ సంఘాల నాయకులు పరామర్శించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, నాగూరావు నామాజీ, మయూర్నాథ్, రాములు తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా రాములోరి కల్యాణం
ఎర్రవల్లి: శ్రీరాముని జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో ఆదివారం సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించా రు. ఆలయ ప్రధాన అర్చకులు భానుమూర్తి, దత్తుస్వాముల ఆధ్వర్యంలో సీతారాములను ముస్తాబుచే సి వేదమంత్రాల నడుమ వైభవంగా కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో బీచుపల్లికి చేరుకొని సీతారాముల కల్యాణాన్ని కనులారా తిలకించారు. భక్తులకు ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో అన్నదానం చేసినట్లు ఆలయ మేనేజర్ సురేందర్రాజు పేర్కొన్నారు. -
కష్టం బీసీలది.. అధికారం రెడ్డీలదా?
మహబూబ్నగర్ న్యూటౌన్: ‘ఏళ్లకు ఏళ్లుగా భుజాలు కాయలు కాసేలా బీసీలు పార్టీల జెండాలు మోస్తూనే ఉన్నారు.. అధికారం అనుభవిస్తున్నది మాత్రం రెడ్డీలు’ అని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ఆదివారం మహబూబ్నగర్లో నిర్వహించిన బీసీ రాజకీయ చైతన్య సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడ అవకాశముంటే అక్కడ బీసీలు అధిక సంఖ్యలో పోటీ చేసి సత్తాచాటాలని పిలుపునిచ్చారు. పాలమూరు జిల్లాలోని అగ్రకుల నాయకులైన సీఎం రేవంత్రెడ్డి, ఎంపీ డీకే అరుణ, యెన్నం శ్రీనివాస్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి పార్టీలు మారుతూ అధికారాన్ని అనుభవిస్తున్నారన్నారు. బీసీ బిడ్డ ముదిరాజ్ సింహంగా పేరొందిన ఎర్రసత్యంను బుల్లెట్లతో కాల్చి చంపిన వారే ఆయన ఆశయాలను కొనసాగిస్తామని కపట ప్రేమ చూపుతున్నారని, బీసీలంతా ఈ విషయాన్ని గమనించాలన్నారు. రాష్ట్రంలో బీసీలపై జరుగుతున్న కుట్రలను దృష్టిలో ఉంచుకొని ఒక బీసీ అభ్యర్థికి ఏ పార్టీ నుంచి అవకాశం వచ్చినా బీసీలంతా ఐక్యంగా ఉండి గెలిపించుకోవాలని అన్నారు. 70 ఏళ్ల పాలనలో అధికారాన్ని అనుభవించి అగ్రకులాలు ఆస్తులు కూడగట్టుకుంటే వెనుకబడిన కులాలపై అప్పులు మోపారని మండిపడ్డారు. మీ ఓట్లు మాకొద్దని, దమ్ముంటే మా బీసీల ఓట్లు మీకొద్దని చెప్పాలని సవాల్ విసిరారు. ఇది బీసీల రాజకీయ చైతన్య సదస్సు కాదని.. రెడ్లకు, బీసీలకు విడాకుల సభ అన్నారు. 2028లో ముఖ్యమంత్రిగా బీసీలు అయి తీరుతారన్నారు. ● పాలమూరు జిల్లాలో 14 నియోజకవర్గాలుంటే 9 నియోజకవర్గాల్లో మీరే ఉన్నారని, పార్టీలు మారుతూ అధికారాన్ని అనుభవిస్తున్నారని, మీరు బీసీలు పార్టీలు మారొద్దని నీతులు చెబుతున్నారని విమర్శించారు. బీసీ ప్రజా ప్రతినిధులారా ఎక్కడ అవకాశమున్నా పోటీ చేయాలని, తీన్మార్ మల్లన్న పూర్తి మద్దతుతో గెలుపులో భాగమవుతామన్నారు. బీసీ రాజ్యంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను ఎత్తివేస్తామని, దొంగదారిన వచ్చిన ఉద్యోగాలను రద్దు చేసి రికవరీ చేస్తామన్నారు. ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి గెలిచిన మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి, రజక బిడ్డ వీర్లపల్లి శంకరయ్య మంత్రి ఎందుకు కావడం లేదని ప్రశ్నించారు. సమావేశంలో బీసీ టైమ్స్ అధినేత సంగెం సూర్యారావు, సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థి వడ్డే జానయ్య, సర్పంచ్ల సంఘం రాష్ట్ర నాయకుడు ప్రణీల్చందర్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు రాజు, నిర్మల, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటయ్య, బీసీ రాజ్యాధికార సమితి ఉమ్మడి జిల్లా కన్వీనర్ మైత్రి యాదయ్య, బీసీ సమాజ్ అధ్యక్షుడు శ్రీనివాస్సాగర్, తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు రవి ముదిరాజ్, ముదిరాజ్ మహాసభ మహిళా అధ్యక్షురాలు లక్ష్మీదేవి, లక్ష్మణ్, వన్నాడ అంజన్న, కావలి శంకర్ పాల్గొన్నారు. ‘స్థానికం’లో బీసీలు సత్తా చాటాలి అప్పులు మాకు.. ఆస్తులు మీకు పార్టీలు మారొద్దని మీరు నీతులు చెబుతారా 2028లో బీసీయే రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీ రాజకీయ చైతన్య సదస్సులో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న -
రోడ్డు ప్రమాదంలోవ్యక్తి
రాజాపూర్: మండలంలోని ముదిరెడ్డిపల్లి గ్రామంలో ఓ శుభకార్యంలో పూజ చేసేందుకు స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని వెనకనుంచి మోటార్సైకిల్పై వచ్చి ఢీకొట్టింది. తీవ్రగాయాల పాలైన వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందినట్లు ఎస్ఐ శివానంద్గౌడ్ తెలిపారు. వివరాలు.. జడ్చర్లకు చెందిన ఓరుగంటి సత్యనారాయణశర్మ(71) ఆదివారం తన స్కూటీపై ముదిరెడ్డిపల్లిలో ఓఇంట్లో బాసింగపు పూజ చేయించేందుకు వెళ్తున్నాడు. ముదిరెడ్డిపల్లి ఎక్స్రోడ్డులో గ్రామంలోకి వెళ్లేందుకు మళ్లుచుండగా వెనకనుంచి ఓమోటార్సైకిల్ వేగంగా వచ్చి ఢీకొన్నది. తీవ్రగాయాల పాలైన సత్యనారాయణను స్థానికులు చికిత్స నిమిత్తం 108లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుమారుడు ఓరుగంటి ఆదిత్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
పాలమూరు యువకుడి ఘనత
స్టేషన్ మహబూబ్నగర్: జిల్లాకేంద్రం బోయపల్లి 16వ వార్డుకు చెందిన మల్లేష్గౌడ్ దేశంలోని జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకోవడానికి సైకిల్పై సాహస యాత్రకు పూనుకున్నాడు. ఈ క్రమంలో గతేడాది అక్టోబర్ 17న బోయపల్లి నుంచి సైకిల్యాత్ర చేపట్టి తాండూరు మీదుగా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రంలోని రక్సౌల్ బార్డర్ మీదుగా నేపాల్లోకి ఈ ఏడాది జనవరి 23న ప్రవేశించాడు. 45 రోజులపాటు సైకిల్పై నేపాల్ దేశంలో తిరిగి అక్కడి నయాపూల్ ప్రాంతం నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ 4,130 మీటర్ల ఎత్తుగల అన్నపూర్ణ బేస్క్యాంప్ వద్దకు ఈ నెల 8న చేరాడు. మల్లేష్గౌడ్ ఇప్పటి వరకు 7,500 కిలోమీటర్ల యాత్ర పూర్తి చేసి భీమా శంకర్, త్రయంభకేశ్వర్, గ్రిస్నెశ్వర్, సోమనాథ్, నాగేశ్వర్, ఓంకారేశ్వర్, ఉజ్జయిని, కాశీ జ్యోతిర్లింగాలతోపాటు గుజరాత్లోని ధామ్ ద్వారకదేశ్ను దర్శించుకున్నాడు. ఈ నెల 15న నేపాల్ నుంచి బయలుదేరి ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్, బద్రినాథ్, గంగోత్రి, యమునోత్రిని దర్శించుకుంటానని మల్లేష్గౌడ్ తెలిపారు. నా సైకిల్ యాత్రలో నీటి పొదుపు, మొక్కల పెంపకంపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు వివరించారు. సైకిల్ తొక్కడం ద్వారా ఇప్పుడున్న కలుషిత వాతావరణాన్ని కొంతమేర తగ్గించవచ్చనే ప్రధాన అంశాన్ని వివరించడం జరిగిందన్నారు. సైకిల్పై యాత్రను కొనసాగిస్తూ దేశం మొత్తం తిరగడమే తన ధ్యేయమన్నారు. సైకిల్పై ఇప్పటి వరకు 7,500 కిలోమీటర్ల ప్రయాణం ట్రెక్కింగ్ ద్వారా నేపాల్లోని అన్నపూర్ణ బేస్క్యాంప్ చేరిక -
ఆర్టీసీ బస్సు కిందపడి వృద్ధురాలు..
ఆత్మకూర్: ఆర్టీసీ బస్సు ఎక్కే క్రమంలో వృద్ధురాలు బస్సు కింద పడి తీవ్ర గాయాలపాలై మృతి చెందిన సంఘటన ఆత్మకూర్లో చోటుచేసుకుంది. ఎస్సై నరేందర్ తెలిపిన వివరాలు.. చిన్నచింతకుంట మండలం అప్పంపల్లికి చెందిన తిమ్మమ్మ(67) ఆదివారం గ్రామస్తులతో కలసి ఆత్మకూర్లో జరిగే సంతలో కూరగాయలు కొనేందుకు వచ్చింది. సాయంత్రం 4 గంటల సమయంలో స్థానిక గాంధీచౌక్లో బస్సుకోసం ఎదురు చూస్తుండగా మహబూబ్నగర్ డిపోకు చెందన బస్సు వచ్చింది. బస్సు ఎక్కుతుండగా ముందుకు కదలడంతో తిమ్మమ్మ వెనుక టైర్ల కింద పడి గాయాల పాలైంది. గమనించిన తోటి ప్రయాణికులు 108లో స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. బస్సు డ్రైవర్ అజాగ్రత్తతోనే తిమ్మమ్మ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
సొరంగంలో ర్యాట్ మైనర్స్
సాక్షి, నాగర్కర్నూల్: ఎస్ఎల్బీసీ సొరంగంలోపల 13.85 కి.మీ. వద్ద జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసేందుకు మొత్తం 18 బృందాలు పని చేస్తున్నాయి. 16 రోజులుగా నిరంతరం సహాయక చర్యలు చేపడుతున్నా వారి ఆచూకీ లభ్యం కావడం లేదు. సొరంగంలో 13 కి.మీ. అవతల సొరంగ పైకప్పు కుప్పకూలడంతో సుమారు 18 ఫీట్ల ఎత్తులో 200 మీటర్ల విస్తీర్ణం వరకూ మట్టి, బురద, శిథిలాలు మేట వేశాయి. మట్టిని తొలగిస్తే పైనుంచి మరింత కుంగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ ఇన్లెట్ టన్నెల్లో ఎలాంటి ఆడిట్, ఎస్కేప్ టన్నెల్స్ లేకపోవడం, నిత్యం నీటి ఊట, బురద ఉంటుండటంతో ఇంతటి క్లిష్ట పరిస్థితి ఎక్కడా చూడలేదని రెస్క్యూ నిపుణులు అంటున్నారు. ఆయా రెస్క్యూ బృందాలతో పాటు ఢిల్లీ నుంచి వచ్చిన ర్యాట్ హోల్ మైనర్స్ బృందం వినూత్న పద్ధతిలో సేవలు అందిస్తోంది. రైల్వేలైన్లు, రహదారుల పనుల్లో సేవలు.. మేఘాలయా, ఈశాన్య రాష్ట్రాల్లోని బొగ్గు గనుల్లో ఎలుక బొరియలుగా సొరంగాలు తవ్వుతూ ర్యాట్ హోల్ మైనర్స్ బొగ్గును బయటకు వెలికితీస్తారు. ప్రమాదకరమైన ఈ మైనింగ్ను సుప్రీంకోర్టు నిషేధించింది. అయితే రైల్వే లైన్ల నిర్మాణం, జాతీయ రహదారులు, రోడ్ల నిర్మాణంలో వీరు సేవలందిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. సాధారణంగా రోడ్డు, రైల్వేలైన్ కిందుగా పైప్లైన్ వేయాలంటే జేసీబీల సాయంతో తవ్వుతూ రోడ్డును కట్ చేయాల్సి ఉంటుంది. ర్యాట్ హోల్ మైనర్స్ రవాణాకు ఆటంకం కలిగించకుండా, రోడ్డును తవ్వాల్సిన పని లేకుండానే కింద నుంచి సొరంగం తవ్వి పైప్లైన్ వేస్తారు. నిత్యం రద్దీగా ఉండే ఢిల్లీ రోడ్లపై వాహనాల రాకపోకలు కొనసాగుతుండగానే, రోడ్డు కింద నుంచి సొరంగం తవ్వి పైప్లైన్ వేయడంలో వీరి సేవలు విశేషంగా ఉపయోగపడుతున్నాయి. దారి ఏర్పాటు చేస్తూ తవ్వకాలు.. ప్రమాద స్థలంలో సుమారు 8 మీటర్ల మేర మట్టి, బురద, మిషిన్ శిథిలాలు మేట వేసి ఉన్నాయి. బురద, కాంక్రీట్ కలసి గట్టిగా ఉంది. ఒక్క పక్కగా దారి ఏర్పాటు చేస్తూ తవ్వకాలు కొనసాగిస్తున్నాం. రోజంతా అక్కడే ఉండి పనులు నిర్వహిస్తున్నాం. – మహమ్మద్ రషి, ర్యాట్హోల్ మైనర్ సభ్యుడు●వినూత్న సేవలందిస్తున్న 24 మంది సభ్యులు కార్మికుల జాడ కోసం నిరంతరం అన్వేషిస్తున్న బృందం రాత్రింబవళ్లు ప్రమాదస్థలంలోనే తవ్వకాలు జరుపుతున్న వైనం తవ్విన కొద్దీ ఊటనీరు వస్తోంది.. మేం మొత్తం 24 మంది ర్యాట్ హోల్ మైనర్స్ బృందం రెస్క్యూ పనుల్లో పాల్గొంటున్నాం. ఒక్కో షిప్టులో ఆరుగురు చొప్పున 24 గంటల పాటు ప్రమాద స్థలం వద్ద తవ్వకాలు జరుపుతున్నాం. ఇనుప కడ్డీలు, పారలతో మట్టిని తొలగించిన కొద్దీ ఊటనీరు పెరుగుతోంది. – ఖలీల్ ఖరేషి, ర్యాట్హోల్ మైనర్ సభ్యుడు 24 గంటల పాటు సొరంగంలోని ప్రమాద స్థలం వద్దే.. సొరంగంలో మట్టి కింద చిక్కుకున్న కార్మికులను బయటకు తీసేందుకు ర్యాట్ హోల్ మైనర్స్ బృందం గతనెల 25న రంగంలో దిగింది. మొత్తం 24 మంది సభ్యులు ఉండగా, వీరిలో ఎల్లప్పుడూ ఐదు, ఆరుగురు సొరంగంలోని ప్రమాదస్థలం వద్ద మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. కేవలం ఇనుప కడ్డీలు, తట్టా, పారల సాయంతో తవ్వకాలు చేపడుతూ, మట్టిని పక్కకు వేస్తున్నారు. టన్నెల్ నిండా మట్టి పేరుకుపోయిన నేపథ్యంలో రాడార్ గుర్తించిన చోటుతో పాటు అనుమానాస్పద ప్రాంతాల్లో తవ్వకాల చేపట్టి కార్మికుల జాడను అన్వేషిస్తున్నారు. వంతుల వారీగా సొరంగంలోకి వెళుతూ రాత్రింబవళ్లు ప్రమాద స్థలంలోనే తవ్వకాలు చేపడుతున్నారు. భోజనం సైతం అక్కడే చేస్తూ మళ్లీ తవ్వకాలకు ఉపక్రమిస్తున్నారు. -
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
మదనాపురం: చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు మృతిచెందిన ఘటన మదనాపురం మండలం రామన్పాడులో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. రామన్పాడుకు చెందిన మత్స్యకారుడు వాకిటి గిరన్న (55) రోజు మాదిరిగానే తెల్లవారుజామున రామన్పాడు జలాశయంలో చేపల వేటకు వెళ్లాడు. ఉదయం 10 గంటలు దాటినా అతడు ఇంటికి రాకవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు.. జలాశయంలో గాలింపు చేపట్టడంతో మృతదేహం లభ్యమైంది. అతడి రెండు కాళ్లకు వల చుట్టుకోవడంతో నీటిలో మునిగి మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి భార్య వాకిటి కుర్వతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శేఖర్రెడ్డి తెలిపారు. -
అసంపూర్తి పనులతో అవస్థలు
జడ్చర్ల: పట్టణంలోని సిగ్నల్గడ్డ వద్ద రహదారి విస్తరణ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పని ప్రదేశంలో యంత్రాలు, కార్మికులు, సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్ సుమారు మూడు నెలలుగా కనిపించడం లేదు. రోడ్డు, రైల్వే వంతెన ఇరుకుగా ఉండడంతో దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో రాకపోకలకు ఇబ్బందిగా ఉండేది. మూడేళ్ల కిందట రహదారి విస్తరణకు అంకురార్పణ జరిగింది. నాటి నుంచే మరిన్ని కష్టాలు మొదలయ్యాయి. రూ.45.81 కోట్ల వ్యయం.. ఈ ప్రాంతంలో రహదారి విస్తరణ పనులకు కేంద్రం రూ.45.81 కోట్లు మంజూరు చేసింది. వంతెన నిర్మాణానికి రైల్వే విద్యుత్లైన్ ఆటంకంగా ఉండటంతో పనుల్లో జాప్యం జరిగింది. రెండునెలల కిందట రైల్వేశాఖ అధికారులు అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించినా.. ఇప్పటి వరకు పనులు తిరిగి ప్రారంభం కాలేదు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవరిస్తుండటంతో పనులు ముందుకు సాగడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ● సిగ్నల్గడ్డ ప్రాంతం పట్టణానికి కూడలిలా ఉంది. అటు హైదరాబాద్తో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గోవా తదితర దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాలు, ఇటు ఉమ్మడి జిల్లాలోని నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, వనపర్తి తదితర ప్రాంతాలకు వెళ్లాలంటే ఈ కూడలి నుంచే వెళ్లాల్సి ఉంటుంది. నిత్యం వెయ్యికిపైగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ ప్రాంతంలో పనులు చేపట్టేందుకు పాలకులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో స్థానికంగా ఉండే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ చిన్న సమస్య ఎదురైనా గంటల తరబడి రాకపోకలకు నిలిచిపోతున్నాయి. రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారడం, విస్తరణ పనులు చేపట్టకపోవడంతో భారీ వాహనాలు వెళ్లే సమయంలో దుమ్ము లేస్తోంది. ఫిబ్రవరి నెలాఖరు వరకు ఒకవైపు రహదారి పనులు పూర్తి చేస్తామని స్థానిక నాయకులు, ప్రజలకు కాంట్రాక్టర్ చెప్పినా ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. మరో రెండునెలల్లో వర్షాకాలం ప్రారంభమైతే పనులు చేసే పరిస్థితి ఉండదు. ఇప్పటికై నా ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి, కలెక్టర్ స్పందించి రోడ్డు పనులపై దృష్టి సారించి త్వరితగతిన పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. పనుల్లో వేగం పెంచాలి.. కూడలిలో ఎక్కడికక్కడ గుంతలు ఉన్నాయి. దుమ్ము విపరీతంగా వస్తుండటంతో రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణదారులు, పాదచారులు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలి. – బాలవర్ధన్న్గౌడ్, జడ్చర్ల దుకాణాలు మూసుకోవాల్సి వస్తుంది.. సిగ్నల్గడ్డ వద్ద రహదారి విస్తరణ పనులు ఏళ్లుగా కొనసాగుతున్నాయి. దుమ్ము విపరీతంగా వస్తుండటంతో వ్యాపారాలు సాగడం లేదు. దుమ్ము కారణంగా దుకాణాలు మూసుకోవాల్సి వస్తోంది. అధికారులు ఎంతమాత్రం స్పందించడం లేదు. త్వరగా రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయాలి. – అబిదాలి మహ్మద్ ,జడ్చర్ల త్వరలో బీటీ పనులు చేపడతాంబీటీ రోడ్డు పనులు త్వరలోనే చేపడతాం. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అదేవిధంగా రహదారి విస్తరణ పనులు పూర్తి చేసేందుకు కావాల్సిన చర్యలు తీసుకుంటాం. బ్రిడ్జి కూడా త్వరితగతిన నిర్మిస్తాం. – రవి, ఏఈ, నేషనల్ హైవే అథారిటీ జడ్చర్ల సిగ్నల్గడ్డ వద్ద నిలిచిన రహదారి పనులు మట్టి, దుమ్ముతో రాకపోకలకు ఇబ్బందులు ట్రాఫిక్ సమస్యలు.. చోద్యం చూస్తున్న అధికారులు -
తగ్గిన దూకుడు
ఉమ్మడి జిల్లాలో పన్ను వసూళ్లలో ఆర్టీఏ వెనుకంజ ● ఈ ఏడాది జిల్లాలో నామమాత్రంగా తనిఖీలు ● ఫీజు, జీవితకాల పన్ను రాకపోవడంతో అంతంతగానే రాబడి ● ఆ శాఖలో వేధిస్తున్న సిబ్బంది కొరత ● గడిచిన మూడేళ్లతో పోల్చితే మహబూబ్నగర్ క్రైం: ఉమ్మడి జిల్లా రవాణా శాఖలో పూర్తిస్థాయిలో ఎంవీఐ, ఏఎంవీఐలు, ఇతర సిబ్బంది లేకపోవడంతో ఆశించిన స్థాయిలో పన్ను వసూలు కావడం లేదు. ప్రతి జిల్లాలో ఒకే ఒక్క ఎంవీఐ ఉండటంతో కార్యాలయంలో విధులు నిర్వహించడానికే సమయం సరిపోకపోవడంతో ఎన్ఫోర్స్మెంట్పై సరైన దృష్టిపెట్టడం లేదు. దీంతో బయట తనిఖీలు, ఇతర రూపాల్లో వచ్చే పన్నుల్లో జాప్యం ఏర్పడుతోంది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా 118 మంది ఏఎంవీఐలకు పోస్టింగ్ ఇవ్వగా.. ఇందులో వనపర్తికి ఒకరు, నారాయణపేటకు ఒకరిని కేటాయించగా వారు సైతం ప్రస్తుతం శిక్షణలో ఉన్నారు. గత మూడేళ్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం కంటే ఎక్కువ మొత్తంలో పన్ను వసూలు చేసి రాష్ట్రస్థాయిలో ఉమ్మడి జిల్లాకు మొదటి స్థానం వచ్చేది. కానీ, పరిస్థితులు ఇప్పుడు జిల్లా లక్ష్యం వసూలు శాతం చేసిన పన్ను (రూ.కోట్లలో..) మహబూబ్నగర్ 90.08 82.00 89.05 నాగర్కర్నూల్ 58.14 48.04 82.63 వనపర్తి 39.76 32.63 82.07 గద్వాల 43.09 35.87 83.24 నారాయణపేట 32.65 28.16 86.25 తారుమారైన పరిస్థితులు పూర్తిగా తారుమారు అయ్యాయి. నంబర్ 1 స్థానంలో ఉన్న పాలమూరు ఇప్పుడు ఏకంగా మూడు స్థానాలు దిగజారి నాలుగో స్థానానికి పడిపోయింది. ఇక నాగర్కర్నూల్ 24, వనపర్తి 28, గద్వాల 22, నారాయణపేట 8వ స్థానంలో ఉన్నాయి. -
బ్రహ్మోత్సవాలకు ‘దక్షిణకాశి’ ముస్తాబు
● రేపటి నుంచి కందూరు రామలింగేశ్వరుడి ఉత్సవాలు ● 12న స్వామివారి కల్యాణం, 14న రథోత్సవం అడ్డాకుల: కందూరు శివారులో స్వయంభూగా వెలసి ‘దక్షిణకాశి’గా గుర్తింపు పొందుతున్న శ్రీరామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. మంగళవారం నుంచి ఈ నెల 16 వరకు కొనసాగే స్వామివారి ఉత్సవాల కోసం ఇప్పటికే ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. శైవులకు నిజకాశీలాంటి ఆలయం వద్ద మొదలయ్యే ఉత్సవాలు ఏప్రిల్ 6న జరిగే శ్రీరామ నవమిన ముగుస్తాయి. కాశీలో తప్ప మరెక్కడా లేని కల్పవృక్షాలు (కబంధ) కందూరు రామలింగేశ్వరస్వామి ఆలయం ఆవరణలో కనిపిస్తాయి. కాశీ తర్వాత కల్ప వృక్షాలు ఇక్కడే ఉన్నాయని పురాణం చెబుతోంది. కార్యక్రమాలు ఇలా.. ● ఈ నెల 11న భూతబలి, యాగశాల ప్రవే శం, అంకురార్పణం, అగ్ని ప్రతిష్ఠాపన, ధ్వజారోహణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ● 12న పార్వతీసమేత శ్రీరామలింగేశ్వరస్వామి కల్యాణం జరిపిస్తారు. ● 13న స్వామివారి ప్రభోత్సవం నిర్వహిస్తారు. ● 14న అర్ధరాత్రి రథోత్సవం (తేరు) వైభవంగా కొనసాగుతుంది. ● 15న గవ్యాన్తం, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, వృషభవాహన సేవ ఉంటుంది. ● 16న రుద్రహోమం, మహాపూర్ణాహుతి, త్రిశుల స్నానం కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఈఓ రాజేశ్వరశర్మ తెలిపారు. మరుసటి రోజు నుంచి మొదలయ్యే జాతర ఏప్రిల్ 6న జరిగే శ్రీరామ నవమి రోజున ముగియనుంది. నేడు జడ్చర్ల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జడ్చర్ల టౌన్: మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సోమవారం నిర్వహిస్తున్నట్లు చైర్పర్సన్ పుష్పలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం సమావేశం జరగాల్సి ఉండగా.. 15వ ఆర్థిక సంఘం నిధుల కేటాయింపులో తేడాల వల్ల కొందరు వార్డు కౌన్సిలర్లు అసంతృప్తి వ్యక్తం చేయడంతో వాయిదా వేశారు. తాజాగా నిధుల కేటాయింపు సమానంగా చేస్తూ.. సోమవారం సమావేశం నిర్వహిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. -
SLBC: నేడు మరో రెండు మృతదేహాలు వెలికితీత!
సాక్షి, మహబూబ్నగర్: ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు 17వ రోజు కొనసాగుతున్నాయి. సొరంగంలో చిక్కుకున్న వారిని ఒక్కొక్కరికిగా గుర్తిస్తున్నారు. సహాయక చర్యల్లో భాగంగా ఆదివారం ఎట్టకేలకు ఒక మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు. ఎత్తు, చేతి కడియం తదితర ఆనవాళ్లను బట్టి పంజాబ్కు చెందిన టీబీఎం ఆపరేటర్ గుర్ప్రీత్సింగ్ (40)గా గుర్తించారు. గురుప్రీత్ సింగ్ మృతదేహాం లభ్యమైన చోటే మరో ఇద్దరి ఆనవాళ్లు గుర్తించినట్టు తెలుస్తోంది. నేడు ఇద్దరి మృతదేహాలను వెలికి తీసే అవకాశం ఉంది.గత నెల 22న ఎస్ఎల్బీసీ సొరంగంలో చోటుచేసుకున్న ప్రమాదం కారణంగా ఎనిమిది మంది టన్నెల్లో చిక్కుకుపోయారు. అప్పటి నుంచి సొరంగంలో సహాయచర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం టీబీఎం ఆపరేటర్ గుర్ప్రీత్సింగ్ మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం, బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల పరిహారం అందించనున్నట్లు అధికారులు వెల్లడించారు. మృతదేహాన్ని స్వస్థలానికి తరలించనున్నట్లు తెలిపారు.సహాయచర్యల్లో భాగంగా సొరంగం లోపల పేరుకుపోయిన మట్టి, టీబీఎం యంత్రం దిగువన డాప్లర్ సంకేతాలతో కొన్ని ప్రాంతాలను గుర్తించారు. కేరళకు చెందిన క్యాడవర్ డాగ్స్ (స్నిఫర్స్) కూడా పలువురి ఆనవాళ్లను పసిగట్టాయి. దీంతో, శనివారం రాత్రి సహాయక బృందాలు టీబీఎం ఎడమవైపు భాగంలో తవ్వుతుండగా ఆరు అడుగుల లోతులో మొదట కుడిచేతి వేళ్లు, చేతి కడియం కనిపించాయి. అధికారుల సూచనల మేరకు గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని వెలికితీశారు. దాదాపు 12 గంటల పాటు శ్రమించి మృతదేహాన్ని జాగ్రత్తగా వెలికితీశారు. ఇంజినీర్ ఆచూకీని కనుగొన్న ప్రాంతానికి కొంచెం అటూ ఇటూ మరో ముగ్గురి జాడ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈరోజు మరో ఇద్దరి జాడ లభించే అవకాశం ఉందని సహాయ బృందాలు తెలిపాయి. మిగిలినవారు సొరంగం చిట్టచివరి భాగం వద్ద టీబీఎం కట్టర్ సమీపంలో చిక్కుకుని ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.మూడేళ్లుగా గుర్ప్రీత్సింగ్ విధులు ఎస్ఎల్బీసీ సొరంగంలో మృతదేహం లభ్యమైన గుర్ప్రీత్సింగ్ స్వస్థలం పంజాబ్ రాష్ట్రంలోని తరన్తరాన్. రాబిన్స్ సంస్థలో 2022 నుంచి టీబీఎం ఆపరేటర్గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య రాజేందర్ కౌర్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్యాపిల్లలు స్వస్థలంలో ఉండగా.. గుర్ప్రీత్సింగ్ మూడేళ్లుగా దోమలపెంటలోని రాబిన్స్ క్యాంపులో ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. ప్రమాదం జరిగాక బంధువులు వచ్చి కొన్ని రోజులు వేచిచూశారు. ఆచూకీ తెలియకపోవడంతో స్వస్థలానికి వెళ్లిపోయారు. -
భర్త మటన్ కట్టింగ్.. ప్రియుడు కిరాణం షాపు.. చివరికి..
సాక్షి, నాగర్ కర్నూల్/మహబూబ్నగర్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపించిన భార్య కటకటాల పాలైంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలను శుక్రవారం విలేకరుల సమావేశంలో వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వర్రావు వెల్లడించారు. పాన్గల్కు చెందిన ఎండీ పర్వీన్బేగం 12 ఏళ్ల క్రితం ఏపీలోని కర్నూలుకు చెందిన ఎండీ రహమతుల్లాకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి సంతానం. వివాహమైన రెండేళ్లపాటు పాటు కర్నూలులోనే ఉండగా.. సంసారం విషయంలో గొడవలు వచ్చాయి. దీంతో పదేళ్ల క్రితమే భార్యాభర్తలు, పిల్లలు కలిసి ఆమె తల్లిగారి గ్రామమైన పాన్గల్కు వచ్చి సంతబజార్లో కిరాయి ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. భర్త రహమతుల్లా పెయింటింగ్, మటన్ కట్టింగ్ పనిచేస్తుండగా.. భార్య టైలర్ పనిచేస్తుంది. ఈ క్రమంలో పక్కనే ఉన్న కిరాణం షాపు నడుపుతున్న కుమ్మరి రాఘవేందర్(ఎ1)తో పరిచయం ఏర్పడి.. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం పసిగట్టిన రహమతుల్లా ఇరు కుటుంబ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. ఆ తర్వాత కూడా రహమతుల్లా తరుచుగా ఆమెను వేధించేవాడు. దీంతో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన వారు రహమతుల్లాను హత్య చేయడానికి నిర్ణయించారు. ఈ క్రమంలోనే రాఘవేంద్ర తనకు పరిచయం ఉన్న కురుమూర్తితో కలిసి ఒప్పందం కుదుర్చుకున్నారు. పథకం ప్రకారం ఈ నెల 1న తెల్లవారుజామున 4 గంటల సమయంలో కురుమూర్తిని రహమతుల్లా ఇంటికి పంపించి గొర్రెను కోసేది ఉంది అని చెప్పి వెంట తీసుకొని పాన్గల్ గ్రామ శివారులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని కేఎల్ఐ కాల్వ దగ్గరకు వెళ్లగా అప్పటికే రాఘవేంద్ర తన బైక్పై అక్కడికి వచ్చి హతమార్చారు. చదవండి: తెల్లారితే పెళ్లి.. అంతలోనే బలవన్మరణంరాఘవేంద్ర రహమతుల్లా గొంతు పిసకగా.. కురుమూర్తి అతని చేతులు పట్టుకున్నాడు. కొద్దిసేపటికి రహమతుల్లా మృతదేహం, అతని వెంట తెచ్చుకున్న కత్తిని పక్కనే ఉన్న కేఎల్ఐ కాల్వలో పడేసి రాఘవేంద్ర, కురుమూర్తి కలిసి మోటార్ సైకిల్పై వెళ్లిపోయారు. ఈ మేరకు నిందితులు ఉపయోగించిన మోటార్ సైకిల్, 3 సెల్ఫోన్లు స్వాదీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హత్య కేసులో ఎ1 కుమ్మరి రాఘవేంద్ర, ఎ2 ప్యాట కురుమూర్తి, ఎ3 పర్వీన్బేగంను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. కేసు ఛేదనలో ప్రతిభచూపిన వనపర్తి సీఐ కృష్ణ, స్థానిక ఎస్ఐ శ్రీనివాసులును, పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
SLBC: కాంక్రీట్లో కూరుకుపొయిన మృతదేహం గుర్తింపు
Slbc Tunnel Rescue Operation Updates:👉జీపీఆర్, కేడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాలలో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం తవ్వకాలు ముమ్మరం చేశారు. టీబీఎంకు ఎడమ పక్కన కనిపించిన ఓ మృతదేహానికి సంబంధించిన చేయిని గుర్తించారు. మృతదేహం పూర్తిగా కాంక్రీట్లో కూరుకుపోయింది. డ్రిల్లింగ్ ద్వారానే బయటికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నేడు రెస్క్యూ ఆపరేషన్లో 130 మంది నిపుణుల బృందం పాల్గొంటున్నారు.👉ఎస్ఎల్బీసీ టన్నెల్లో 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇంకా 8 మంది కార్మికుల జాడ తెలియలేదు. ఇక రోబోల వినియోగం తప్పదని అధికారులు అంటున్నారు. ఆ మేరకు చర్యలకు ఉపక్రమిస్తున్నారు. చివరి 50 మీటర్ల ప్రాంతంలో సహాయక చర్యలు క్లిష్టంగా మారాయి. టెన్నెల్ ఎండ్ పాయింట్లో కీలక స్పాట్స్ను గుర్తించారు. కీలకమైన స్పాట్స్లో ర్యాట్ హోల్ మైనర్ల తవ్వకాలు చేపట్టారు. రెస్య్కూలో జాతీయ, అంతర్జాతీయ నిపుణులు పాల్గొంటున్నారు.👉కాగా, ఎనిమిది మందిని గుర్తించేందుకు చేపడుతున్న సహాయక చర్యలకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇప్పటి వరకు 13.50 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లిన రెస్క్యూ బృందాలు మిగిలిన 50 మీటర్ల ముందుకు వెళ్లడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. సొరంగంలోకి నీటి ఊట వేగంగా వస్తుండటంతో ప్రత్యేక మోటార్ల ద్వారా నీటిని బయటికి తోడేస్తున్నారు. 👉కన్వేయర్ బెల్ట్ పూర్తిగా మరమ్మతు జరగడంతో.. పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. సొరంగంలో పేరుకుపోయిన మట్టి, బురద, రాళ్లు, టీబీఎం విడిభాగాలు (ఇనుము), ఊడిపోయిన కాంక్రీట్ సెగ్మెంట్లను తొలగించే రోబోలు తయారు చేసేందుకు కనీసం వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే రోబోలు సాయం వారం రోజుల తర్వాతే వినియోగంలోకి వస్తోంది. 👉ప్రమాదం జరిగిన సొరంగంలో పరిశోధన చేసేందుకు కేరళ నుంచి వచ్చిన కాడవర్ డాగ్స్ కూడా ఇది వరకు గుర్తించిన డాగ్స్ స్థానాల్లోనే గుర్తించాయి. 13.500 కి.మీ., అవుతల ఒకే దగ్గర ముగ్గురు వ్యక్తుల అవశేషాలు ఉన్నట్లు నిర్ధారించాయి. కారి్మకులు చిక్కుకున్నట్లు డాగ్స్ చూపించిన ప్రదేశాల్లో శనివారం రెస్క్యూ బృందాలు తవ్వకాలు ప్రారంభించాయి. టీబీఎం పరికరాలు గ్యాస్ కట్టర్తో కత్తిరించి లోకో ట్రైన్ ద్వారా సొరంగం బయటికి పంపించారు. కూలిపడిన పైకప్పు మట్టి దిబ్బలను హిటాచీతో ఒకవైపు తరలిస్తున్నారు. రోజుకో బృందాన్ని సింగరేణి నుంచి రప్పించి సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు. సొరంగంలో వస్తున్న దుర్వాసన సహాయక చర్యలకు ఇబ్బంది కలిగిస్తోంది.👉టన్నెల్లో జరిగిన ప్రమాదం జాతీయ విపత్తు అని, అందులో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి ప్రపంచంలోని అత్యుత్తమ సాంకేతికత ఉపయోగిస్తున్నామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. శనివారం టన్నెల్ను సందర్శించిన ఆయన రెస్క్యూ బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.👉సొరంగంలో చిక్కుకున్న కార్మికులను గుర్తించేందుకు ఇప్పటి వరకు జరిగిన పురోభివృద్ధి గురించి రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి అరవింద్కుమార్, ఆర్మీ కమాండెంట్ పరీక్షిత్ మెహ్రా మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సహాయక చర్యల్లో అవంతరాలను అధిగమిస్తూ వేగంగా ముందుకెళ్తున్నామని, సొరంగం లోపల ఆక్సిజన్ సరిగా లేకపోవడం, నీటి ఊట అధికంగా రావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. 👉టీబీఎం దృఢమైన లోహ శకలాలు, రాళ్లు, మట్టితో కూరుకుపోయి ఇబ్బందులు ఉన్నప్పటికీ సహాయక చర్యలు కొనసాగించేందుకు ప్రభుత్వం కృతనిత్చయంతో ఉందన్నారు. రెస్క్యూ ఆపరేషన్లో పనిచేసే కారి్మకులకు, అధికారులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘనాథ్, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, మిలటరీ ఇంజినీర్ వికాస్సింగ్, ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ ప్రసన్నకుమార్, ఎస్డీఆర్ఎఫ్ కమాండెంట్ ప్రభాకర్, సింగరేణి, రైల్వే, ఎన్జీఆర్ఐ, హైడ్రా తదితర బృందాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్స్ పరిశ్రమలకు ప్రోత్సాహం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్స్ పరిశ్రమలకు అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తున్నామని కేంద్ర రైల్వే, ఐటీ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ అన్నారు. శనివారం మహబూబ్నగర్ నగర శివారులోని దివిటిపల్లి ఐటీ పార్కు ఆవరణలో అధునాతన టెక్నాలజీతో రూ.3,225 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కాను న్న నాలుగు పరిశ్రమలకు ఆయన శంకుస్థాపన చేశా రు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యుత్ వాహనాలకు ఎంతో డిమాండ్ ఉందన్నారు.వీటికి అవసరమ య్యే లిథియం అయాన్ గిగా బ్యాటరీలను తయా రు చేసే అమరరాజా కంపెనీకి దివిటిపల్లిలో మహి ళా దినోత్సవం రోజే శంకుస్థాపన చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ పరిశ్రమలతో వేలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఈసారి కేంద్ర బ డ్జెట్లో తెలంగాణకు రైల్వేశాఖ పరంగా రూ.5,337 కోట్లు కేటాయించామని, గత పదేళ్ల కంటే ఇది ఆరు రెట్లు ఎక్కువ అని తెలిపారు. అలాగే గత 11 సంవత్సరాల్లో మహిళలకు 10 కోట్ల వంటగ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని, 14 కోట్ల తాగునీటి కుళాయి కనెక్షన్లు మంజూరు చేశామని, 54 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిపించామని వివరించారు.ఇక్కడి ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని దివిటిపల్లి రైల్వే స్టేషన్ను ఆధునీకరిస్తామని చెప్పారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్బాబు మాట్లాడుతూ, తెలంగాణ బ్రాండ్ను విశ్వవ్యాప్తం చేస్తామని పేర్కొన్నారు. పారిశ్రామికాభివృద్ధిలో మరింత ముందుకు వెళ్లేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో సెమీ కండక్టర్స్, ఇతర పరిశ్రమల అభివృద్ధికి అన్ని విధాలా సహకరించాలని ఆయన అశ్వినీవైష్ణవ్ను కోరారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల, మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి శంకుస్థాపన చేసిన పరిశ్రమలు ఇవే.. రూ.1,900 కోట్లతో నిర్మించే అమరరాజా గిగా ఫ్యాక్టరీ–1 మూడో దశ యూనిట్, రూ.800 కోట్లతో లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ (ఎల్ఎఫ్పీ) టెక్నాలజీతో బ్యాటరీలు, ఇతర కీలకమైన పదార్థాలను రూపొందించే (అల్ట్మిన్ ప్రైవేట్ లిమిటెడ్) ఫ్యాక్టరీ, రూ.502 కోట్లతో చేపట్టే వ్యర్థాల ప్రాసెసింగ్ (లోహమ్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్) కంపెనీ, రూ.23 కోట్లతో తలపెట్టిన ప్రత్యేక క్యాన్, క్యాప్లను తయారు చేసే (సెల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్) పరిశ్రమలు ఉన్నాయి. -
బ్యాటరీ, సెల్ టెక్నాలజీపై పరిశోధన
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ప్రస్తుతం బ్యాటరీ, సెల్ టెక్నాలజీపై పరిశోధనలు, అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినివైష్ణవ్ అన్నారు. శనివారం మధ్యాహ్నం మహబూబ్నగర్ నగర శివారులోని దివిటిపల్లి ఐటీ పార్కు ఆవరణలో మొత్తం రూ.3,225 కోట్లతో ఏర్పాటు చేయనున్న అమరరాజా గిగా ఫ్యాక్టరీ–1, అల్టమిన్, లోహం మెటీరియల్స్, ఎస్సెల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాంట్లకు ఆయనతో పాటు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్బాబు కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం కేంద్ర మంత్రి తన ప్రసంగాన్ని తెలుగులో ‘నమస్తే.. బాగున్నారా..!’ అని ప్రారంభించారు. ఈ సందర్భంగా పుష్ప సినిమాలోని ‘పుష్ప తగ్గేలే..’ డైలాగ్ను ప్రస్తావిస్తూ ‘దివిటిపల్లి అభివృద్ధి ఆగదు.. ఇక నిరంతర అభివృద్ధే..’ అని చెప్పా రు. ప్రధాని నరేంద్రమోదీ మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. ఇక్కడి అమరరాజా కంపెనీలో 80 శాతం మహిళలే పనిచేస్తుండటం అభినందనీయమన్నారు. కాగా మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల, కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ డి.జానకితో పాటు మహిళా ఉద్యోగులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని రకాలుగా అండగా ఉంటాం: మంత్రి శ్రీధర్బాబు సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వంపై విశ్వాసం ఉంచి పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ డి.శ్రీధర్బాబు అన్నారు. ఇటీవల దావోస్ సమ్మిట్లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వివిధ పెద్ద సంస్థలు సుమారు రూ.78 వేల కోట్లకు ఎంఓయూ కుదుర్చుకోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. వారికి ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. ఇతర రాష్ట్రాలకు దీటుగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. దివిటిపల్లిలో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ) కోసం భూములిచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ధ్యేయమన్నారు. పరిశ్రమలను అన్ని ప్రాంతాలకు విస్తరిస్తామన్నారు. పెద్ద పరిశ్రమలు రావడానికి గ్రీన్ ఎనర్జీ పాలసీ అమలు చేస్తున్నామన్నారు. అమరరాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ, చైర్మన్ గల్లా జయదేవ్ మాట్లాడుతూ దివిటిపల్లిలో ఏర్పాటు చేస్తున్న గిగా ఫ్యాక్టరీ ద్వారా సుమారు 4,500 మందికి ప్రత్యక్షంగా, మరో పది వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. కార్యక్రమంలో మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర మైనారిటీ ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, టీజీఐఐసీ వీసీ అండ్ ఎండీ విష్ణువర్ధన్రెడ్డి, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్, పరిశ్రమల శాఖ జీఎం ప్రతాప్రెడ్డి, మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్రెడ్డి, ముడా చైర్మన్ కె.లక్ష్మణ్యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినివైష్ణవ్ సెమీ కండక్టర్స్ అభివృద్ధికి సహకరించాలి: మంత్రి శ్రీధర్బాబు దివిటిపల్లిలో 4 పరిశ్రమలకు శంకుస్థాపన -
జొన్నరొట్టెలతో జీవనోపాధి
బ్రహ్మణవాడికి చెందిన అలివేలమ్మకు భర్త యాదయ్యతో పాటు నలుగురు సంతానం ఉన్నారు. ఈమె 20 ఏళ్ల క్రితం శ్రీరాఘవేంద్ర మహిళా సంఘంలో సభ్యురాలిగా చేరి ప్రస్తుతం అధ్యక్షురాలిగా వ్యవహరిస్తోంది. మేసీ్త్ర పనిచేస్తున్న భర్త రెండేళ్ల క్రితం కాలు విరగడంతో ఇంటికే పరిమితమయ్యారు. అప్పటి నుంచి భార్య రాంనగర్ గ్రంథాలయానికి ఎదురుగా ఓ దుకాణానికి కిరాయికి తీసుకుని జొన్నరొట్టెలు అమ్ముతోంది. నిత్యం 80 నుంచి వంద వరకు అమ్ముతుండగా రూ.1,500 గిరాకీ వస్తోంది. వీటిని తయారీ చేసే మరో ముగ్గురు మహిళలకు ఉపాధి కల్పిస్తూ ఒక్కొక్కరికి రూ.200 చొప్పున చెల్లిస్తోంది. వీరు కూడా మహిళా సంఘాల సభ్యులే. ఇక పొదుపు నుంచి రూ.50 వేలు, సీ్త్రనిధి నుంచి రూ.లక్ష, బ్యాంకు లింకేజీ ద్వారా రూ.రెండు లక్షల చొప్పున రుణాలు తీసుకుంది. ప్రతినెలా కిస్తీలు క్రమం తప్పకుండా చెల్లిస్తూ వస్తోంది. అన్ని ఖర్చులు పోను రూ.10 వేలు సంపాదిస్తూ కుటుంబానికి ఎంతో ఆసరాగా ఉంటోంది. -
నేడు బీసీ రాజకీయ సదస్సు
స్టేషన్ మహబూబ్నగర్: జిల్లాకేంద్రంలో ఆదివారం నిర్వహించనున్న బీసీ రాజకీయ చైతన్య సదస్సును జయప్రదం చేయాలని, ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ముఖ్యఅతిథిగా హాజరవుతారని బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సంగెం సూర్యారావు అన్నారు. జిల్లాకేంద్రంలోని బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నేడు బీసీ భావజాలం బలంగా ఉందని, భవిష్యత్తులో మన ఓటు మనకే వేసుకొని బీసీ రాజ్యాధికారం సాధించుకుందామని పిలుపునిచ్చారు. బీసీ రాజకీయ సదస్సుకు బీసీలు పెద్దలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్సాగర్ మాట్లాడుతూ రాజకీయ సదస్సులో ఉమ్మడి జిల్లాలోని బీసీలందరూ హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సమాజ్ నల్గొండ జిల్లా కన్వీనర్ బొడ్డుపల్లి చంద్రశేఖర్, దేవరకద్ర నియోజకవర్గ కన్వీనర్ బి.శేఖర్, భూత్పూర్ కన్వీనర్ ఆంజనేయులుసాగర్ తదితరులు పాల్గొన్నారు. -
నెలకు సుమారు రూ.లక్ష ఆదాయం
కోయిలకొండ మండలం సూరారానికి చెందిన అనసూయ, కేశవులు దంపతులకు ముగ్గురు సంతానం ఉన్నారు. పొట్టకూటి కోసం 2008లో మహబూబ్నగర్లోని హౌసింగ్ బోర్డు కాలనీకి మకాం మార్చారు. ఈమె ఆరాధన మహిళా సంఘంలో చేరి పొదుపు చేయసాగింది. 2020లో స్థానికంగా రెండు షెట్టర్లను రూ.3,500కు అద్దెకు తీసుకుని ఎంబ్రాయిడరీ, టైలరింగ్, గాజులు, చీరల దుకాణం ఏర్పాటు చేసుకుంది. ఇప్పటివరకు రూ.10 లక్షలకు పైగానే పెట్టుబడి పెట్టింది. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్, పీకో మిషన్, కుట్టుమిషన్లు కొనుగోలు చేసింది. తొమ్మిది నెలల క్రితం పొదుపు నుంచి రూ.లక్ష, నాలుగు నెలల క్రితం రూ.50 వేలు అప్పుగా తీసుకుని క్రమం తప్పకుండా కిస్తీలు చెల్లిస్తోంది. బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి నుంచి సైతం రుణాలు తీసుకుంది. సీజన్లో ప్రతిరోజూ రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు గిరాకీ అవుతుండటంతో అన్ని ఖర్చులు పోను నెలకు సుమారు రూ.లక్ష ఆదాయం వస్తోందని ఆమె చెబుతున్నారు. ● 3 మున్సిపాలిటీల పరిధిలో3,781 మహిళా గ్రూపులు ● 15 ఏళ్ల క్రితం సుమారు రూ.50 లక్షలతో ప్రారంభం ● పెద్ద, చిన్న సంఘాలతో కలిపి రూ.54.35 కోట్లకు చేరిక -
రేషన్ బియ్యం పట్టివేత
జడ్చర్ల: మండలంలోని నసరుల్లాబాద్ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు. వివరాలు.. నసరుల్లాబాద్లోని రేషన్ డీలరు అన్వర్ పాష నిర్వహిస్తున్న రేషన్ దుకాణం దగ్గర ఓ బొలెరో వాహనంలో 40బస్తాల రేషన్ బియ్యం ఉండగా గ్రామస్తులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో ఎస్ఐ జయప్రసాద్ వెంటనే గ్రామానికి చేరుకొని సివిల్ సప్లయ్ అధికారులకు సమాచారమిచ్చి వాహనాన్ని పోలీస్స్టేషన్కు తరలించారు. వాహనంలో మొత్తం 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. సివిల్ సప్లయ్ డిప్యూటీ తహసల్దార్ ఆదిత్యగౌడ్ వివరాలు సేకరించి పంచనామ నిర్వహించారు. నసరుల్లాబాద్కు చెందిన కురుమూర్తి రేషన్ బియ్యాన్ని సేకరించి తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. డ్రైవర్ రాజును అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. 25 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత లింగాల: స్థానిక ఎస్సీ వాడలో ఉన్న కమ్యూనిటీ భవనంలో అక్రమంగా తరలించుటకు నిల్వ ఉంచిన 25 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని శనివారం స్వాధీన పర్చుకున్నట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు. వివిధ రేషన్ షాపుల ద్వారా అక్రమంగా కొనుగోలు చేసిన బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలించుటకు సిద్ధంగా ఉంచినట్లు సమాచారం అందింంది. అచ్చంపేట సీఐ రవీందర్ ఆకమ్యూనిటీ భవనాన్ని పరిశీలించి బియ్యాన్ని స్వాధీనం చేసుకొని సివిల్ సప్లై అధికారులకు సమాచారమిచ్చినట్లు ఎస్ఐ తెలిపారు. -
పొదుపు సంఘంలో తక్కువ వడ్డీ
నేను 25 ఏళ్లుగా మహి ళా సంఘంలో సభ్యురాలిగా ఉంటున్నాను. సుమారు పదేళ్లుగా గ్రైండింగ్ షాపు నిర్వహిస్తున్నాను. మూడేళ్ల క్రితం పొదుపు సంఘం నుంచి రూ.లక్ష అప్పు తీసుకుని ప్రతినెలా కిస్తీలు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నాను. కేవలం రూపాయి మిత్తీ మాత్రమే పడుతుండటం ఎంతో వెసులుబాటు కలిగింది. అదే బయట ప్రైవేట్ వ్యక్తుల వద్ద అయితే రూ.3 వడ్డీకి అప్పు తీసుకోవాల్సి ఉండేది. హోల్సేల్ షాపుల వారు కొబ్బరి, ఆవాలు, వివిధ రకాల దినుసులకు పొడుల కోసం తీసుకొచ్చి గ్రైండింగ్ పట్టిస్తుండటం కలిసి వచ్చింది. మరో ఇద్దరు మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాను. అన్ని ఖర్చులు పోను నెలకు రూ.30 వేలు మిగులుతుంది. – ఎ.పద్మ, జైసంతోషిమాత మహిళా సంఘం సభ్యురాలు, రాంనగర్ టైలరింగ్ యూనిట్స్థాపించా.. మహిళా సంఘంలో 2005 నుంచి సభ్యురాలిగా కొనసాగుతున్నా ను. ఇంటి వద్ద 2018 లో టైలరింగ్ యూనిట్ స్థాపించాను. ప్రభుత్వపరంగా హాస్టళ్లు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు సంబంధించి యూనిఫాం ఆర్డర్లు వస్తున్నాయి. క్లాత్ కటింగ్ చేసే మిషన్లు ఏర్పా టు చేసుకున్నాను. స్టిచ్చింగ్ కోసం మహిళా సంఘాల సభ్యులకు ఇంటి వద్దకే ఇస్తున్నాను. వీటితో పాటు ఆఫ్రాన్, గాగ్రా, పెట్టికోట్స్, ప్యాంటీ తయారు చేయించి అమ్ముతున్నాను. పొదుపు సంఘంతో పాటు అవసరమైనప్పుడు బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి ద్వారా రుణాలు తీసుకుని కిస్తీలు చెల్లిస్తున్నాను. – సౌధామిని, మైసమ్మ మహిళా సంఘం సభ్యురాలు, శ్రీనివాసకాలనీ ● -
దీర్ఘకాలిక కేసులు రాజీ చేసుకోవాలి
పాలమూరు: కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న కేసులను లోక్ అదాలత్ వేదికల ద్వారా పరిష్కరించుకోవచ్చునని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి అన్నారు. చిన్నపాటి గొడవలకు కోర్టుల చూట్టు తిరగడం వల్ల సమయంతో పాటు ఆర్థిక నష్టం జరుగుతుందన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ను ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారు. కేసుల వల్ల జీవితకాలం నష్టపోకుండా రాజీ అయ్యే అవకాశం ఉన్న కేసులను కక్షిదారులు పరిష్కారం చేసుకోవాలన్నారు. అధిక సంఖ్యలో కేసులు రాజీ కావడానికి కోర్టుతో పాటు పోలీస్శాఖ, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రతి ఒక్కరూ కృషి చేశారని తెలిపారు. రోడ్డు ప్రమాదాల కేసులు, ఫ్రీ లిటిగేషన్, సివిల్, క్రిమినల్, ఈ–పెట్టి, బ్యాంకు, బీఎస్ఎన్ఎల్ ఫ్రీ లిటిగేషన్ కేసులను న్యాయమూర్తుల సమక్షంలో పరిష్కారం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు శ్రీదేవి, రాజా రాజేశ్వరి, ఇందిర, రాధిక, మమతారెడ్డి, భావన, మహ్మద్ మునావర్ హుస్సేన్, రవి శంకర్, డీసీఆర్బీ డీఎస్పీ రమణారెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుదర్శన్రెడ్డి, న్యాయవాదులు, బ్యాంకు మేనేజర్లు, ఇన్సూరెన్స్ కంపెనీల నిర్వహకులు పాల్గొన్నారు. జాతీయ లోక్ అదాలత్లో 17,254 కేసులు పరిష్కారం జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి -
మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించాలి
మహబూబ్నగర్ క్రైం: సమాజంలో మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ కలిసి పని చేయాలని ఎస్పీ డి.జానకి అన్నారు. సమాజంలో అత్యంత ప్రాముఖ్యత పాత్ర మహిళా పోలీస్ అధికారులు, సిబ్బంది పోషిస్తున్నారని, ఎన్నో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా పరేడ్ మైదానంలో శనివారం రాత్రి నిర్వహించిన మహిళ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మహిళ పోలీసులను ప్రోత్సాహించడానికి జిల్లా పోలీస్ శాఖ కట్టుబడి ఉంటుందన్నారు. మహిళ సంక్షేమానికి అనుగుణంగా పలు కార్యక్రమాలు అమలు చేస్తామని తెలిపారు. మహిళ సిబ్బంది విధుల్లో కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలన్నారు. మహిళ హక్కులను కాపాడేందుకు పోలీస్ మరింత కృషి చేయాలన్నారు. ● ఎప్పుడూ విధుల్లో బిజీ ఉండే పోలీస్ మహిళా అధికారులు మహిళ దినోత్సవం సందర్భంగా కాసేపు ఉల్లాసంగా గడిపారు. పరేడ్ మైదానంలో ఎస్పీ డి.జానకి సమక్షంలో పలు రకాల ఆటలు ఆడారు. పలు రకాల పాటలకు మహిళ సిబ్బంది నృత్యాలు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఎస్పీ బహుమతులు అందించారు. మహిళా సిబ్బందికి ప్రత్యేక జ్ఞాపికలను ఇచ్చారు. ఆనంతరం కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. పరేడ్ మైదానంలో నృత్యాలు చేసి అలరించిన మహిళ పోలీసులు -
అడుగడుగునా ఆటంకాలు
సొరంగంలో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు శ్రమిస్తున్న రెస్క్యూ బృందాలు అచ్చంపేట: శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను రక్షించేందుకు చేపట్టిన సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. 15 రోజులైన వారీ ఆచూకీ లభ్యం కాలేదు. ఎనిమిది మందిని గుర్తించేందుకు చేపడుతున్న సహాయక చర్యలకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇప్పటి వరకు 13.50 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లిన రెస్క్యూ బృందాలు మిగిలిన 50 మీటర్ల ముందుకు వెళ్లడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. సొరంగంలోకి నీటి ఊట వేగంగా వస్తుండటంతో ప్రత్యేక మోటార్ల ద్వారా నీటిని బయటికి తోడేస్తున్నారు. కన్వేయర్ బెల్ట్ పూర్తిగా మరమ్మతు జరగడంతో.. పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. సొరంగంలో పేరుకుపోయిన మట్టి, బురద, రాళ్లు, టీబీఎం విడిభాగాలు (ఇనుము), ఊడిపోయిన కాంక్రీట్ సెగ్మెంట్లను తొలగించే రోబోలు తయారు చేసేందుకు కనీసం వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే రోబోలు సాయం వారం రోజుల తర్వాతే వినియోగంలోకి వస్తోంది. డాగ్స్ గుర్తించిన ప్రదేశాల్లో.. ప్రమాదం జరిగిన సొరంగంలో పరిశోధన చేసేందుకు కేరళ నుంచి వచ్చిన కాడవర్ డాగ్స్ కూడా ఇది వరకు గుర్తించిన డాగ్స్ స్థానాల్లోనే గుర్తించాయి. 13.500 కి.మీ., అవుతల ఒకే దగ్గర ముగ్గురు వ్యక్తుల అవశేషాలు ఉన్నట్లు నిర్ధారించాయి. కార్మికులు చిక్కుకున్నట్లు డాగ్స్ చూపించిన ప్రదేశాల్లో శనివారం రెస్క్యూ బృందాలు తవ్వకాలు ప్రారంభించాయి. టీబీఎం పరికరాలు గ్యాస్ కట్టర్తో కత్తిరించి లోకో ట్రైన్ ద్వారా సొరంగం బయటికి పంపించారు. కూలిపడిన పైకప్పు మట్టి దిబ్బలను హిటాచీతో ఒకవైపు తరలిస్తున్నారు. రోజుకో బృందాన్ని సింగరేణి నుంచి రప్పించి సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు. సొరంగంలో వస్తున్న దుర్వాసన సహాయక చర్యలకు ఇబ్బంది కలిగిస్తోంది. 15 రోజులైనా లభ్యం కాని కార్మికుల ఆచూకీ ఉబికివస్తున్న నీటితో సహాయక చర్యలకు విఘాతం -
బాలుడి ప్రాణం తీసిన వాటర్ హీటర్
మల్దకల్: వాటర్ హీటర్ ఓ బాలుడి ప్రాణం తీసింది. ఈ ఘటన మల్దకల్ మండలం ఉలిగేపల్లిలో తీవ్ర విషాదం రేపింది. స్థానికుల వివరాల మేరకు.. ఉలిగేపల్లికి చెందిన కుర్వ నాగేంద్ర – జయమ్మ కుమారుడు పవన్కుమార్ (8) గ్రామంలోని పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. శనివారం ఇంట్లో ఆడుకుంటున్న బాలుడు.. వేడి నీటి కోసం ఏర్పాటుచేసిన విద్యుత్ వాటర్ హీటర్ను పట్టుకోవడంతో షాక్కు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. అప్పటికే బాలుడు మృతిచెందినట్లు నిర్ధారించారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదించారు. బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ నందికర్ తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి పాన్గల్: తాగునీరు అనుకొని పొరపాటున గడ్డి మందు తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసుల వివరాల మేరకు.. పాన్గల్ మండలం శాగాపూర్కు చెందిన పుట్టపాగ శ్రీనివాసులు (47) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి రోజు సాయంత్రం వేళలో ఇంటికి మద్యం తెచ్చుకొని తాగే అలవాటు ఉంది. మూడు రోజుల క్రితం తన పొలంలోని మామిడితోటకు పిచుకారీ చేయగా మిగిలిన గడ్డి మందును వాటర్ బాటిల్లో పోసి ఇంట్లో పెట్టాడు. ఈ నెల 7న రోజు మాదిరిగానే బయటి నుంచి మద్యం తెచ్చుకున్న శ్రీనివాసులు.. ఇంట్లో ఉంచిన మంచినీరు బాటిల్ అనుకొని పొరపాటున గడ్డి మందు ఉన్న బాటిల్ తీసుకుని మద్యంలో కలుపుకొని తాగాడు. కొద్దిసేపటికి తీవ్ర అస్వస్థతకు గురైన అతడిని కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతుడికి భార్య అలివేల, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. అలివేల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. బావిలో పడి వివాహిత.. లింగాల: ప్రమాదవశాత్తు బావిలో పడి వివాహిత మృతిచెందిన ఘటన లింగాల మండలం కొత్తకుంటపల్లిలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ నాగరాజు వివరాల మేరకు.. కొత్తకుంటపల్లికి చెందిన చెంచు మహిళ అనూష (19) తన భర్త పరుశరాములు, చిన్నమ్మ ఎల్లమ్మతో కలిసి గ్రామ సమీపంలోని బావి వద్ద బట్టలు ఉతికేందుకు వెళ్లింది. బట్టలు ఉతుకుతున్న క్రమంలో అనూష ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో పడిపోయింది. భర్త రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే ఆమె మృతిచెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. అనుమానాస్పద స్థితిలో గొర్రెల కాపరి.. ఆత్మకూర్: అనుమానాస్పద స్థితిలో గొర్రెల కాపరి మృతిచెందిన ఘటన ఆత్మకూర్ మండలం తూంపల్లిలో చోటు చేసుకుంది. ఎస్ఐ నరేందర్ వివరాల మేరకు.. మండలంలోని గుంటిపల్లికి గొళ్ల చెన్నయ్య (48)కు తూంపల్లికి చెందిన పద్మతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో మూడునెలల క్రితం పద్మ తన పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే చెన్నయ్య గ్రామంలోని తన ఇంటిని అమ్ముకుని పక్షం రోజుల క్రితం భార్య వద్దకు వెళ్లిపోయాడు. తన వద్ద ఉన్న గొర్రెలు, పశువులను కాస్తూ తూంపల్లిలోనే నివాసం ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి గ్రామ శివారులో అతడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతుడి సోదరి గొళ్ల మణెమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. మూడు తులాల బంగారం చోరీ గద్వాల క్రైం: గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి మూడు తులాల బంగారు ఆభరణాలు అపహరించిన సంఘటన శనివారం పట్టణంలోని హమాలీకాలనీలో చోటుచేసుకుంది. పరుశరాముడు కూలీ పనులుచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజు వారిలాగే తన కుమారుడు ఇళ్లు పక్కనే ఉండడంతో రాత్రి నిద్ర పోయేందుకు వెళ్లాడు. తను ఉంటున్న ఇంటికి తాళం వేసి ఉండడం గమనించిన గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి బీరువాలోని మూడు తులాల బంగారు ఆభరణాలను అపహరించారు. ఉదయం ఇంటికొచ్చి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించారు. పట్టణ పోలీసులకు సమాచారం అందించాడు. ఎస్ఐ కళ్యాణ్కుమార్ ఘటనాస్థలికి చేరుకొని సమాచారం సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ ధర్నా
ఊర్కొండ: బైక్ ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ మండల కేంద్రంలోని కల్వకుర్తి–జడ్చర్ల ప్రధాన రహదారిపై బంధువులు శనివారం ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రాంరెడ్డిపల్లి గ్రామ నివాసి అయిన చిన్న వెంకటయ్య (54) శుక్రవారం రాత్రి కల్వకుర్తి–జడ్చర్ల ప్రధాన రహదారిపై కాలినడకన స్వగ్రామం వెళ్తున్నాడు. ఈక్రమంలో బైకు బలంగా ఢీకొట్టడంతో మృతి చెందాడు. మృతుడికి భార్య తెరపోగు పద్మ, కుమారుడు, కూతురు పిల్లలు ఉన్నారు. కూలీ పనిచేస్తే తప్ప డొక్కాడని బాధిత కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవాలన్నారు. ఎస్ఐ కృష్ణదేవ ధర్నా వద్దకు చేరుకొని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. నాయకులు హరీష్, జంగారెడ్డి, ఆంజనేయులు, సుజీవన్ రెడ్డి, లాలయ్య తదితరులు ఉన్నారు. -
ఆటోలో నుంచి దూకి మహిళ మృతి
దేవరకద్ర రూరల్: క్షణికావేశంలో ప్రయాణిస్తున్న ఆటోలో నుంచి దూకి ఓ మహిళ మృతిచెందింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. మండలంలోని నార్లోనికుంట్ల గ్రామానికి చెందిన కురుమూర్తికి అడవి అజిలాపూర్ గ్రామానికి చెందిన పాలెం అనూష(20)తో ఏడాది క్రితం వివాహమైంది. వీరికి ఇటీవల కుమారుడు జన్మించడంతో రెండు రోజుల క్రితం భర్త ఇంటి దగ్గర బారసాల నిర్వహించారు. ఆ ఫంక్షన్లో అత్తాకోడలుకు చిన్నపాటి వివాదం జరిగింది. ఈ క్రమంలోనే తనను ఇంటికి తీసుకెళ్లాలని అనూష బతుకుదెరువు కోసం హైదరాబాద్లో ఉంటున్న తన తల్లితండ్రులను కోరింది. భర్త కురుమూర్తి కూడా హైదరాబాద్లో ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తుండటంతో భార్య, కొడుకుతో కలిసి ఆటోలో హైదరాబాద్కు బయలుదేరారు. దేవరకద్ర సమీపంలోకి రాగానే అనూష మూడు నెలల కుమారుడిని ఆటోలో వదిలేసి దూకింది. ఈ ఘటనలో అనూష తలకు తీవ్రగాయాలు కాగా, చికిత్స కోసం దేవరకద్ర ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందిందని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగన్న తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
మహబూబ్నగర్ క్రైం: గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతి చెందాడు. రూరల్ ఎస్ఐ విజయ్కుమార్ కథనం ప్రకారం..ధర్మపూర్ గ్రామానికి చెందిన కన్నయ్య(34), దేవరకద్రకు చెందిన శివరాజ్తో కలిసి శుక్రవారం రాత్రి 11.30 ప్రాంతంలో ఏపీ 11కె 7109 నంబర్ కలిగిన బైక్పై దేవరకద్ర నుంచి మన్యంకొండ దేవస్థానంలో నిద్రచేసేందుకు బయల్దేరాడు. మన్యంకొండ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో కన్నయ్యకు, శివరాజ్కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని జనరల్ ఆస్పత్రికి తరలించారు. కన్నయ్యను మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. -
బతుకుదెరువు కోసం సౌదీకి వెళ్లాడు..
హన్వాడ: బతుకుదెరువు కోసం 16ఏళ్ల క్రితం భార్యాపిల్లల్ని వదిలి ఓ వ్యక్తి సౌదీకి వలస వెళ్లాడు. రెండున్నర నెలల క్రితం గుండెపోటుతో మృతిచెందగా శనివారం అతడి మృతదేహం స్వగ్రామం చేరగా కుటుంబీకులు అంత్యక్రియలు నిర్వహించారు. స్థానికులు తెలిపిన వివరాలు.. మండలంలోని రామాలయంతండాకు చెందిన సబావత్ రవి(45) 16 ఏళ్ల క్రితం సౌదీకి వెళ్లాడు. అక్కడికి వెళ్లిన ఏడాదికే అతడిపై మోసానికి సంబంధించిన కేసు నమోదైంది. దీంతో తప్పించుకు తిరిగిన రవి వీసా గడువు కూడా ముగియడంతో స్వదేశానికి వచ్చే వీలు లేకుండాపోయింది. భార్యాపిల్లలకు దూరమై దుర్భరమైన ఏడాది జీవితాన్ని అనుభవించాడు. గత జనవరి 26న గుండెపోటుతో మృతి చెందాడు. అతని శవాన్ని స్వదేశానికి తరలించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. స్థానిక బీజేపీ నాయకులు ఎంపీ డీకే అరుణ దృష్టికి ఈవిషయాన్ని తీసుకెళ్లారు. ఆమె స్పందించి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రితో మాట్లాడి మృతదేహా న్ని స్వస్థలానికి రప్పించారు. శనివారం మధ్యాహ్నం మృతదేహం స్వగ్రామానికి చేరుకోగా సాయంత్రం కుటుంబీకులు అంత్యక్రియలు చేశారు. మృతుడు సౌదీ వెళ్లే సమయంలో అతని కూతురు పూజకు మూడు నెలలు. ప్రస్తుతం ఆమె స్థానిక కేజీబీవీలో 9వ తరగతి చదవుతున్నాడు. కుమారుడు సచిన్ (7వ తరగతి వరకే) చదివి మధ్యలో ఆపేసి హైదరాబాద్లో కూలీ పనులు చేసుకుంటున్నాడు. భార్య తారాబాయి ఇళ్లల్లో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తోంది. మృతుడి కుటుంబాన్ని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఆదుకోవా లని స్థానికులు కోరుతున్నారు. రెండున్నర నెలల క్రితం గుండెపోటుతో మృతి శనివారం స్వగ్రామం చేరుకున్న మృతదేహం అంత్యక్రియలు నిర్వహించిన కుటుంబీకులు -
భక్తిశ్రద్ధలతో ఆరుద్రోత్సవం
అలంపూర్: ఐదో శక్తిపీఠం జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి క్షేత్రంలో శనివారం ఆరుద్రోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద అర్చక స్వాములు గోమాతకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ ప్రదక్షిణలు, దర్భార్ సేవలు నిర్వహించారు. ఆలయంలోని రససిద్ధి గణపతికి అభిషేకాలు, పంచామృత అభిషేకాలు విశేషంగా జరిగాయి. అనంతరం బాలబ్రహ్మేశ్వరస్వామిని పండ్ల రసాలు, పంచామృతాలు, మంగళద్రవ్యాలతో అభిషేకించారు. అన్నసూక్త పఠనంతో స్వామివారికి స్వేతాన్నంతో అభిషేకాలు జరిగాయి. అన్నాన్ని లింగాకృతిలో అలంకరించి.. బిల్వదళాలు, వివిధ రకాల పూలతో అష్టోత్తర అర్చనలు, పంచభక్ష పరమాన్నాలతో మహా నైవేద్యాలు సమర్పించారు. భక్తులు స్వామివారి నామాన్ని స్మరిస్తూ అభిషేకాలు చేశారు. అదే విధంగా ఏక హారతి, నేత్ర హారతి, బిల్వ హారతి, వేద హారతి, కర్పూర పంచక హారతి, రథ హారతి, చక్ర హారతి, కుంభ హారతి, నక్షత్ర హారతులతో శతవిద నీరాజనాలు సమర్పించారు. ఆరుద్రోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అర్చక స్వాములు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశ్వీరచనాలు పలికారు. -
రాష్ట్రపతిని ఆకట్టుకున్న గద్వాల చేనేత చీరలు
గద్వాలటౌన్: రాష్ట్రపతి భవన్లో గద్వాల చేనేత చీరల ప్రదర్శన ఆకట్టుకుంది. అమృత్ కా మహోత్సవ్లో భాగంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో దక్షిణ భారతంలో ప్రసిద్ధి చెందిన హస్తకళలు, హ్యాండ్ల్యూమ్, అథెంటిక్ సౌత్ ఇండియా ఫుడ్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. ఈ ఎగ్జిబిషనల్లో తెలంగాణ నుంచి 40 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇందులో 25 చేనేత రంగానికి సంబంధించినవి ఉన్నాయి. ఖండాంతర ఖ్యాతి గడించిన గద్వాల చేనేత జరీ చీరలు ఎగ్జిబిషన్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును గద్వాల చీరలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా జరీ చీరల ప్రత్యేకతను అడిగి తెలుసుకున్నారు. గద్వాల చేనేత జరీ చీరల ఉత్పుత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రదర్శనలో సంఘం నాయకులు అక్కల శాంతరాం, అక్కల శ్రీనివాసులు, మంత్రి సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
SLBC టన్నెల్లో రోబోలతో సహాయక చర్యలు: మంత్రి ఉత్తమ్
ఎస్ఎల్బీసీ సహాయక చర్యల అప్డేట్స్..టన్నెల్లో రోబోలతో సహాయక చర్యలు: మంత్రి ఉత్తమ్టన్నెల్ వద్ద సహాయక చర్యలను పరిశీలించిన మంత్రి ఉత్తమ్మంత్రి ఉత్తమ్ కామెంట్స్..సొరంగంలో జరిగిన ప్రమాదంలో ఇలాంటి క్లిష్టమైన ప్రమాదం ఎక్కడా జరగలేదు14 కిలోమీటర్ల సొరంగ మార్గం ఉందిచివరి 50 మీటర్లలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఇబ్బందులుఅక్కడ సహాయక చర్యలు చేపడితే రెస్క్యూ ఆపరేషన్ చేసే వాళ్లకు సైతం ప్రమాదంఅందుకే రోబోల సాయంతో సహాయక చర్యలు చేపట్టాలని చూస్తున్నాం 👉ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన ఎనిమిది మంది కార్మికుల కోసం ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. నేటితో సహాయక చర్యలు 15వ రోజుకు చేరుకున్నాయి. ఇక, టన్నెల్లో జీపీఆర్ గుర్తించిన అనుమానిత ప్రాంతాలనే క్యాడవర్ డాగ్స్ మళ్లీ గుర్తించాయి. మరోవైపు.. టన్నెల్లో సహాయక చర్యలపై మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి నేడు మరోసారి సమీక్షించనున్నారు. హెలికాప్టర్లో మంత్రి ఉత్తమ్ దోమలపెంట చేరుకోనున్నారు.👉ఇక, హైదరాబాద్కు చెందిన అన్వీ రోబోటిక్స్, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్లు వరసగా రెండోరోజు కూడా సొరంగంలోని పరిస్థితులను అంచనా వేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో టీబీఎం చుట్టుపక్కల, అక్కడి నుంచి మరికొంత దూరంలో కొన్ని ప్రదేశాలను గుర్తించినట్లు సమాచారం. ఇంతకుముందు క్యాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాలనే ఇవి కూడా గుర్తించినట్లు తెలిసింది.👉ఇదిలా ఉండగా.. సొరంగంలోకి వెళ్లిన రోబోటిక్ నిపుణులు, ఐఐటీ ప్రొఫెసర్లు టీబీఎం కత్తిరింపునకు అవసరమైన సామగ్రిని లోకో ట్రైన్ ద్వారా సొరంగంలోకి తెప్పించుకున్నారు. రాకపోకలకు అనుకూలంగా ఉండేందుకు కూలిపడిన మట్టి దిబ్బ వరకు పొక్లెయిన్ వెళ్లేలా టీబీఎంను ఒకవైపు కత్తిరిస్తున్నారు. టీబీఎం భాగాలను కత్తిరించే పనిలో సహయక సిబ్బంది వేగం పెంచారు. రోజుకు సుమారు ఐదు అడుగుల మేర తొలగించుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరో రెండు రోజుల్లో మట్టి కూలిన ప్రదేశం వరకు పొక్లెయిన్ చేరుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొలగించిన టీబీఎం సామగ్రిని లోకో ట్రైన్తో బయటకు పంపిస్తూ రాకపోకలకు క్లియర్ చేస్తున్నారు. -
No Headline
259 మంది గైర్హాజరు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇంగ్లిష్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. మొత్తం 36 పరీక్ష కేంద్రాల్లో 11,303 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 11,044 మంది హాజరయ్యారు. 259 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లా ఇంటర్మీడియట్ శాఖ అధికారులు పరీక్ష కేంద్రాల్లో తనిఖీలు చేశారు. 18న పీయూలో యువ ఉత్సవ్ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఈనెల 18 జిల్లా యువజన సర్వీసుల ఆధ్వర్యంలో యువ ఉత్సవ్ నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ను పీయూ వీసీ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా యూత్ అధికారి కోటానాయక్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతిభ ఉన్న యువతను గుర్తించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది నిర్వహిస్తున్నామని తెలిపారు. పాటలు, ఫొటోగ్రఫీ, వ్యాసరచన, ఆర్ట్, సైన్స్మేళా, కల్చరల్ విభాగాల్లో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. పీయూ పరిధిలోని వనపర్తి పీజీ సెంటర్లో 2022లో చేసుకున్న ఒప్పందం మేరకు అక్కడ భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, కంప్యూటర్ ల్యాబ్కు సంబంధించిన భవనాలు నిర్మించాల ని హైదరాబాద్ జేఎన్టీయూ వీసీ కిషన్కుమార్ను పీయూ వీసీ శ్రీనివాస్ విన్నవించారు. స్పందించిన ఆయన ల్యాబ్ నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
వివక్ష లేదు.. వేధింపులుతగ్గలేదు
ఇంట్లో వివక్ష లేకున్నా... బహిరంగ ప్రదేశాల్లో మహిళలపై వేధింపులు కొంతమేర కొనసాగుతున్నాయి. బస్టాప్, కళాశాల, ఆఫీస్తో పాటు అసభ్యపద జాలంతో పంపిస్తున్న మెసేజ్లతో ఇబ్బంది పడుతున్నారు. తెలియనివారితోనే ఎక్కువ సమస్యలు ఎదురవుతున్నాయని పలువురు మహిళలు చెబుతున్నారు. మహిళా దినోత్సవం నేపథ్యంలో ఆడ–మగ వివక్ష, పని ప్రదేశంలో వివక్ష తదితర అంశాలపై ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా సాక్షి సర్వే నిర్వహించగా పలు విషయాలు వెలుగుచూశాయి. – సాక్షి నెట్వర్క్ సాక్షి సర్వేలో మహిళల మనోగతం -
పెళ్లికి అడ్డంకులు..
‘మేము ముగ్గురం అక్కాచెల్లెళ్లం. కూలీపని చేసి, జీవనం గడిపేవాళ్లం. నేను ఆరో తరగతిలో ఉన్నప్పుడు (1985లో) జోగినిగా మార్చారు. అప్పుడు మా అమ్మానాన్నకు జోగిని వ్యవస్థ గురించి అసలే తెలియదు. తెలిస్తే అలా చేసేవారు కాదు. 1995లో ఊట్కూర్కు చెందిన లక్ష్మయ్యతో పెళ్లి నిశ్చయం కాగా.. చాలామంది గ్రామస్తులు, జోగినిలు వ్యతిరేకించారు. స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులను అడ్డుకున్నారు. ఊరోళ్లయితే పంచాయితీ పెట్టి.. జోగినికి పెళ్లి ఎలా చేస్తారని నిలదీశారు’ అని హాజమ్మ తన గాథను చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తాను మూఢనమ్మకాలను పట్టించుకోనని స్పష్టం చేసినట్లు వివరించారు. తాను ఊరందరికీ భార్య అంటున్నారు కదా.. మరి మీ ఆస్తి రాసివ్వాలని అడిగితే ఎవరూ సమాధానం చెప్పలేకపోయారన్నారు. అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకున్నానని.. తాను జోగినిని కాదని సమాజానికి తెలియజేసేందుకు చాలా సమయం పట్టిందని పేర్కొన్నారు. -
మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలి
జెడ్పీసెంటర్( మహబూబ్నగర్): మహిళలకు సమాజంలో సమాన అవకాశాలు కల్పించాలని, అప్పుడు వారు అభివృద్ధి చెందుతారని కలెక్టర్ విజయేందిర పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు అన్నిరంగాల్లో పని చేస్తూ ముందుకు వెళుతున్నారని అన్నారు. ఇంట్లో, పని చేసే స్థలంలో వివక్ష తొలగిపోవాలన్నారు. 30 ఏళ్లు దాటిన ప్రతి మహిళ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, ప్రతి ఏడాది క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అనంతరం మహిళా ఉద్యోగులకు నిర్వహించిన క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేయగా.. వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, మోహన్రావు, మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారిని జరీనా బేగం, భూగర్భ జల వనరుల శాఖ డీడీ రమాదేవి, వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఇందిరా, వైద్య ఆరోగ్య శాఖ మాస్ మీడియా అధికారిణి మంజుల తదితరులు పాల్గొన్నారు. -
వనిత.. ప్రగతి బావుటా
మక్తల్: జోగిని వ్యవస్థ నిర్మూలనకు ఆమె చేసిన పోరాటం ఆదర్శనీయం.. ఒక దృఢ సంకల్పతో ముందుకు సాగుతూ.. ఏ ఒక్కరినీ జోగినిగా మార్చకుండా అడ్డుకోవడంతో పాటు ఆదర్శ వివాహాలు జరిపిస్తూ.. జోగినుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు ఊట్కూరుకు చెందిన దళిత మహిళ హాజమ్మ. చిన్నతనం నుంచే జోగిని వ్యవస్థను వ్యతిరేకించిన ఆమె.. ఓఎంఐఎఫ్, ఏహెచ్టీయూ సంస్థల సహకారంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని జోగినులకు అండగా నిలుస్తున్నారు. ఇందుకోసం ఆశ్రయ్ సంస్థ నిర్వాహకురాలు గ్రీస్ నిర్మలతో కలిసి ‘ఆంధ్రప్రదేశ్ జోగిని వ్యవస్థ వ్యతిరేక పోరాట సంఘటన సంస్థ’ను ఏర్పాటుచేశారు. ఈ సంస్థకు హాజమ్మ ఉమ్మడి జిల్లా కన్వీనర్గా పనిచేస్తున్నారు. 20 ఏళ్లుగా జోగిని వ్యవస్థను అడ్డుకుంటున్నారు. ఇప్పటి వరకు 30 మంది జోగినులకు వివాహాలు జరిపించి.. వారి జీవితాల్లో వెలుగులు నింపారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 5 వేల మంది జోగినులు ఉన్నారని.. అందులో 2 వేల మందికి ప్రభుత్వం నేటికీ పునరావాసం కల్పించలేదని హాజమ్మ తెలిపారు. ● వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ అన్ని రంగాల్లో ప్రతిభ చాటుతున్న ‘ఆమె’ ● ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు కృషి ● ఉమ్మడి జిల్లాలో ఆదర్శంగా నిలుస్తున్న పలువురు మహిళలు -
మహిళలు నడిపే ఏకై క సాహిత్య సంస్థ
స్టేషన్ మహబూబ్నగర్: తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థను 2020 ఫిబ్రవరి 7వ తేదీన మహబూబ్నగర్కు చెందిన పలువురు మహిళా రచయిత్రులు కలిసి ఏర్పాటు చేశారు. మహిళలు నడుపుతున్న ఏకై క సాహిత్య సంస్థ ఇదే కావడం విశేషం. ఈ సంస్థ ద్వారా యువ మహిళ రచయి త్రులు, కవయిత్రులను ప్రోత్సహిస్తున్నారు. సంస్థకు అధ్యక్ష, కార్యదర్శులుగా రావూరి వనజ, జి.శాంతారెడ్డి వ్యవహరిస్తున్నారు. సంస్థ ఆధ్వర్యంలో పలు పుస్తకావిష్కరణ, కవి సమ్మేళనాలు నిర్వహించారు. ప్రతి ఏడాది మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రంగాల్లో సేవలు చేస్తున్న మహిళలకు సీ్త్ర స్ఫూర్తి పురస్కారాలతో సత్కరిస్తున్నారు. విద్యార్థులకు పద్యంపై అవగాహన కల్పించడానికి ప్రత్యేకంగా పద్య కార్యశాల నిర్వహించారు. జిల్లాకు చెందిన సాహితీ దిగ్గజం డాక్టర్ పాకాల యశోదారెడ్డి జయంతి వేడుకలతో పాటు తెలంగాణ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని కాళోజీ జయంతి వేడుకలు నిర్వహించి పలువురు రచయిత్రులకు పురస్కారాలు అందజేస్తున్నారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 13 పుస్తకాలను ఆవిష్కరించారు. 2023లో హైదరాబాద్లో పద్మాకర్ అవధానిచే శతవధానం నిర్వహించారు. ప్రముఖ రచయిత్రి చుక్కాయపల్లి శ్రీదేవిచే శతావధానం, పలుసార్లు అష్టావధానాలు నిర్వహించారు. గత ఏడాది సంస్థ తరఫున ప్రముఖ పద్యకవులు సందాపురం బుచ్చయ్య, గన్నోజు శ్రీనివాసాచారి, అల్వాల లక్ష్మణమూర్తి, శాసీ్త్రయ సంగీత గాయకురాలు సాయి మనస్వినిలకు ఉగాది పురస్కారాలు అందజేశారు. కాళోజీ సాహితీ పురస్కారాన్ని ప్రముఖ కవి డాక్టర్ రామరావు సూర్య ప్రకాశ్రావు, పాకాల యశోదారెడ్డి సాహితీ పురస్కారాన్ని కవయిత్రి కె.వీణారెడ్డికి అందజేసి సన్మానం చేశారు. మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాం ఐదేళ్ల నుంచి సంస్థ ఆధ్వర్యంలో సాహిత్య కార్యక్రమాలు, కవి సమ్మేళనాలు, పుస్తకావిష్కరణలు నిర్వహిస్తున్నాం. సంస్థ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న మహిళలకు ప్రతి ఏడాది అందజేసే సీ్త్ర స్ఫూర్తి పురస్కారాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. తెలంగాణ మహిళా సాహి త్య సాంస్కతిక సంస్థ ఆధ్వర్యంలో భవిష్యత్లో మరిన్ని సాహితీ కార్యక్రమాలు చేపడుతాం. నూతన రచయిత్రులు, కవిత్వంపై ఆసక్తిగల విద్యార్థులను ప్రోత్సహిస్తాం. – సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు రావూరి వనజ, జి.శాంతారెడ్డి -
No Headline
మహబూబ్నగర్ క్రీడలు: కోయిలకొండ మండలం కేశ్వాపూర్ పెద్దతండాకు చెందిన అక్కా, చెల్లెలు కె.జ్యోతి, కె.ప్రియాంక బాస్కెట్బాల్లో మెరుగైన ప్రతిభ కనబరుస్తున్నారు. అక్క జ్యోతి 12 సార్లు జాతీయస్థాయి బాస్కెట్బాల్ టోర్నీల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహించింది. 2015లో పంజాబ్లో జరిగిన జూనియర్ నేషనల్, వరంగల్లో జరిగిన జాతీయ ఆర్జీకేఏ బాస్కెట్బాల్ టోర్నీలో పాల్గొంది. 2016లో కర్ణాటకలో జరిగిన యూత్, ఉత్తరప్రదేశ్లో జరిగిన జూనియర్ నేషనల్ టోర్నీలో తెలంగాణ తరఫున ఆడిన జ్యోతి ఆ తర్వాత హైదరాబాద్, లుథియానా, ఢిల్లీ, చైన్నెలో జరిగి పలు జాతీయస్థాయి టోర్నీలో ప్రతిభ చూపారు. అలాగే 25కు పైగా రాష్ట్రస్థాయి టోర్నీల్లో పాలమూరు జట్టు తరఫున బరిలోకి దిగి సత్తా చాటారు. గుజరాత్ రాష్ట్రం భావ్నగర్లో జరిగిన 36వ జాతీయ క్రీడల్లో పాల్గొని, తెలంగాణ జట్టు స్వర్ణం సాధించడంలో కీలకపాత్ర పోషించారు. చెల్లి ప్రియాంక 2014లో ఖమ్మంలో తన తొలి రాష్ట్రస్థాయి టోర్నీలో జిల్లాకు ప్రాతినిధ్యం వహించింది. ఇప్పటి వరకు 25కుపైగా రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో పాల్గొంది. అక్క జ్యోతితో కలిసి పలు సార్లు రాష్ట్రస్థాయి టోర్నీలో ఆడింది. మూడు సార్లు జాతీయస్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో రాష్ట్ర జట్టు తరఫున పాల్గొంది. 2017 ఢిల్లీలో జరిగిన ఎస్జీఎఫ్ జాతీయస్థాయి టోర్నీలో తొలిసారిగా తెలంగాణ తరఫున బరిలోకి దిగారు. అలాగే 2019 ఢిల్లీలో జరిగిన అండర్–19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జాతీయస్థాయి బాస్కెట్బాల్ టోర్నీలో ఆడింది. అండర్–23 విభాగంలో నేషనల్ బాస్కెట్బాల్ కోచింగ్ క్యాంపునకు ఎంపికై ంది. ప్రస్తుతం స్పోర్ట్స్ కోటాలో వీరు హైదరాబాద్లోని కేఎల్ యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతున్నారు. గిరిజన బిడ్డలు.. బాస్కెట్బాల్లో దిట్టలు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్న అక్కాచెల్లెలుఅతివకు అందలం అన్నిరంగాల్లో రాణించాలంటే చదువు ఎంతో ముఖ్యం ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారతపై ‘సాక్షి’ డిబేట్ -
మహిళా సాధికారతతోనేసమాజం అభివృద్ధి
మహిళా సాధికారతతోనే సమాజం అభివృద్ధి జరుగుతుంది. మహిళలు తమ హక్కులను తెలుసుకోవాలి. సమాజంలో పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు కల్పించాలి. మూఢ నమ్మకాల నుంచి బయటకు రావాలి. మారుతున్న కాలంతో పాటు మహిళల ఆలోచనలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. మహిళలపై వివక్ష సమాజంలో కొంతమేర ఉంది.. ఇది పూర్తిగా పోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా మహిళల కోసం మహిళా శక్తి క్యాంటీన్ను మంజూరు చేసింది. దీన్ని విజయవంతంగా నడిపిస్తున్న మహిళలు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు. – విజయేందిర, కలెక్టర్ -
ఆరోగ్యంపై దృష్టి సారించాలి: ఎస్పీ
మహబూబ్నగర్ క్రైం: మహిళా పోలీస్ ఉద్యోగుల ఇబ్బందులను అర్థం చేసుకుని, వారి కోసం మరిన్ని మెరుగైన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఎస్పీ డి.జానకి అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్శాఖ ఆధ్వర్యంలో శుక్ర వారం పరేడ్ మైదానంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళ సిబ్బంది కోసం ఎస్వీఎస్ ఆస్పత్రి సహకా రంతో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ మహిళా పోలీసులు తమ ఆర్యోగాన్ని నిర్లక్ష్యం చేయరాదని, ఆరోగ్యంగా ఉంటేనే మెరుగైన సేవలు అందిస్తారని తెలిపారు. ఉద్యోగ బాధ్యతల మధ్య మహిళ ఉద్యోగులు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలను గుర్తించి వీటిని సమర్థవంతంగా ఎదుర్కొవడానికి పోలీస్శాఖ సహాయపడుతుందన్నారు. కార్యక్రమంలో ఉమెన్ ఎస్ఐలు సుజాత, వసంత, శ్వేత, ఇందిర పాల్గొన్నారు. -
భర్తను చంపించిన భార్య
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. పాన్గల్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపించిన భార్య కటకటాల పాలైంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలను శుక్రవారం విలేకరుల సమావేశంలో వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వర్రావు వెల్లడించారు. పాన్గల్కు చెందిన ఎండీ పర్వీన్బేగం 12 ఏళ్ల క్రితం ఏపీలోని కర్నూలుకు చెందిన ఎండీ రహమతుల్లాకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి సంతానం. వివాహమైన రెండేళ్లపాటు పాటు కర్నూలులోనే ఉండగా.. సంసారం విషయంలో గొడవలు వచ్చాయి. దీంతో పదేళ్ల క్రితమే భార్యాభర్తలు, పిల్లలు కలిసి ఆమె తల్లిగారి గ్రామమైన పాన్గల్కు వచ్చి సంతబజార్లో కిరాయి ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. భర్త రహమతుల్లా పెయింటింగ్, మటన్ కట్టింగ్ పనిచేస్తుండగా.. భార్య టైలర్ పనిచేస్తుంది. ఈ క్రమంలో పక్కనే ఉన్న కిరాణం షాపు నడుపుతున్న కుమ్మరి రాఘవేందర్(ఎ1)తో పరిచయం ఏర్పడి.. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం పసిగట్టిన రహమతుల్లా ఇరు కుటుంబ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. ఆ తర్వాత కూడా రహమతుల్లా తరుచుగా ఆమెను వేధించేవాడు. దీంతో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన వారు రహమతుల్లాను హత్య చేయడానికి నిర్ణయించారు. ఈ క్రమంలోనే రాఘవేంద్ర తనకు పరిచయం ఉన్న కురుమూర్తితో కలిసి ఒప్పందం కుదుర్చుకున్నారు. పథకం ప్రకారం ఈ నెల 1న తెల్లవారుజామున 4 గంటల సమయంలో కురుమూర్తిని రహమతుల్లా ఇంటికి పంపించి గొర్రెను కోసేది ఉంది అని చెప్పి వెంట తీసుకొని పాన్గల్ గ్రామ శివారులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని కేఎల్ఐ కాల్వ దగ్గరకు వెళ్లగా అప్పటికే రాఘవేంద్ర తన బైక్పై అక్కడికి వచ్చి హతమార్చారు. రాఘవేంద్ర రహమతుల్లా గొంతు పిసకగా.. కురుమూర్తి అతని చేతులు పట్టుకున్నాడు. కొద్దిసేపటికి రహమతుల్లా మృతదేహం, అతని వెంట తెచ్చుకున్న కత్తిని పక్కనే ఉన్న కేఎల్ఐ కాల్వలో పడేసి రాఘవేంద్ర, కురుమూర్తి కలిసి మోటార్ సైకిల్పై వెళ్లిపోయారు. ఈ మేరకు నిందితులు ఉపయోగించిన మోటార్ సైకిల్, 3 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హత్య కేసులో ఎ1 కుమ్మరి రాఘవేంద్ర, ఎ2 ప్యాట కురుమూర్తి, ఎ3 పర్వీన్బేగంను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. కేసు ఛేదనలో ప్రతిభచూపిన వనపర్తి సీఐ కృష్ణ, స్థానిక ఎస్ఐ శ్రీనివాసులును, పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
రోడ్డు ప్రమాదంలో సీడీసీ చైర్మన్ దుర్మరణం
కొత్తకోట: పట్టణానికి చెందిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా చెరుకు అభివృద్ధి మండలి అధ్యక్షుడు, కాంగ్రెస్పార్టీ సీనియర్ నాయకుడు పాపయ్యగారి చంద్రశేఖర్రెడ్డి అలియాస్ గొల్లబాబు (55) హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. గురువారం హైదరాబాద్లో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై ఎల్బీనగర్లోని తన కుమార్తె ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈయన గతేడాది అక్టోబర్ 27న ఉమ్మడి జిల్లా సీడీసీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రశేఖర్రెడ్డి మరణంతో పట్టణంలో విషాదచాయలు అలుముకున్నాయి. దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి ప్రగాడ సానుభూతి తెలిపి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. -
గడ్డు పరిస్థితులు
సొరంగంలో అచ్చంపేట/అచ్చంపేట రూరల్/బల్మూర్: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల జాడ కనుగొనేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సహాయక చర్యలకు నీటి ఊట అడ్డంకిగా మారింది. సొరంగంలో 14 రోజులుగా 12 విపత్తు బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నా కార్మికుల ఆచూకీ మాత్రం లభించడం లేదు. డిజాస్టర్ మేనేజ్మెంట్ చీఫ్ సెక్రటరీ అరవింద్కుమార్ నిరంతరం పర్యవేక్షిస్తూ కావాల్సిన సహాయక చర్యలు, వనరులు సమకూరుస్తున్నారు. గురువారం కేరళలోని త్రిసూల్ నుంచి వచ్చిన కడావర్ డాగ్స్ శుక్రవారం సొరంగంలోని ప్రమాద స్థలంలో సహాయక బృందాల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టాయి. రోబోటిక్ నిపుణులు, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్లు టన్నెల్ లోపల పరిసరాలు పరిశీలించారు. అన్వి రోబోటిక్, హైదరాబాద్ బృందం ఎప్పటికప్పుడు మొబైల్ ద్వారా సమాచారం తెలుసుకొని అవసరమైన సహకారం అందిస్తున్నారు. సొరంగంలో సహాయక బృందాలకు రోజురోజుకు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. సఫారీ వాహనంలో సిస్మాలజీ బృందం.. భూ ప్రకంపనలు, భూమిలో ప్రయాణించే ప్రత్యాస్తి తరంగాలను అధ్యయనం చేసే నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రతినిధుల బృందం నల్లమలలో సర్వే చేస్తున్నారు. రెండు ప్రత్యేక సఫారీ వాహనాలను అటవీశాఖ అధికారులు కేటాయించారు. సొరంగంలో ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి అధికారులు సిస్మాలజీ ప్రతినిధులకు లాంగిట్యూడ్, ల్యాటిట్యూడ్ లొకేషన్ను పంపిస్తుండగా సర్వే చేపడుతున్నారు. సమగ్ర నివేదికలను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు తెలిసింది. సక్రమంగా పనిచేయని కన్వేయర్ బెల్ట్.. సొరంగంలో సింగరేణి కార్మికుల పనికి ప్రాధాన్యం ఉండటంతో అధికంగా తరలివస్తున్నారు. కాగా టీబీఎం వద్ద 7 కంటైనర్లు ఉండగా.. ఒక కంటైనర్ మాత్రం బయట పడిందని, మిగిలినవన్నీ మట్టితో కూరుకుపోయినట్లు సమాచారం. బయటపడ్డ కంటైనర్లో ఆక్సిజన్ సౌకర్యం ఉందని.. అందులో చిక్కుకున్న కార్మికులు ఉండి ఉంటే క్షేమంగా బయటపడేవారని సహాయక బృందాలు చెబుతున్నాయి. టీబీఎం విడిభాగాలను తొలగించడానికే అధిక సమయం పడుతుందని.. సరైన విద్యుత్ సౌకర్యం లేక కన్వేయర్ బెల్ట్ సక్రమంగా పని చేయకపోవడంతో మట్టి తరలింపునకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. సొరంగంలో కార్మికులు సుమారు ఆరు నుంచి 10 గంటలు పని చేస్తుండగా.. మొబైల్ టాయిలెట్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. కార్మికుల జాడ కనుగొనేందుకు రంగంలోకి కడావర్ డాగ్స్, రోబోటిక్ బృందం 14 రోజులైనా లభించని ఆచూకీ కొనసాగుతున్న సహాయక చర్యలు సహాయక చర్యలు ఇలా.. చిక్కుకున్న కార్మికులను గుర్తించేందుకు కడావర్ డాగ్స్ బృందం శుక్రవారం ఉదయం 7.15 గంటలకు ఎస్ఎల్బీసీ సొరంగంలోకి వెళ్లింది. 15 ఫీట్ల లోపలున్న వారిని గుర్తించగలగటం ఈ శునకాల ప్రత్యేకత. సొరంగంలోని బురద, మట్టి, ఇతర శిథిలాలను తొలగించేందుకు 110 మంది ఎన్డీఆర్ఎఫ్, ఇతర బృందాలు లోకో ట్రైన్లో వెళ్లారు. నలుగురు సభ్యుల అన్వి రోబోటిక్ నిపుణుల బృందం, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్లు ఉదయం 11.25కు మరోమారు సొరంగంలోకి వెళ్లారు. నాగర్కర్నూల్ కలెక్టర్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. -
అతివకు అందలం
●మహిళలు అన్నిరంగాల్లో రాణించాలంటే చదువు ఎంతో ముఖ్యం ● కుటుంబ పోషణతో పాటు ఉద్యోగాల్లోనూ రాణించడం ఆమెకే సాధ్యం ● ప్రభుత్వం మరిన్ని చట్టాలు, స్కీంలు తీసుకువస్తే మహిళా సాధికారత ● ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో మహిళళా సాధికారతపై ‘సాక్షి’ డిబేట్ అవగాహన అవసరం.. సమాజం ఎంత అభివృద్ధి చెందినా చాలామంది మహిళలకు బయటి ప్రపంచం గురించి తెలియని పరిస్థితి. అందుకే వంటిళ్లు కుటుంబమే జీవితంగా జీవిస్తున్నారు. అందుకోసం ప్రతి మహిళ తమ హక్కులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అగ్రశ్రేణి సంస్థల్లో మహిళలు ఉన్నత పదవుల్లో ఉన్నారు. కానీ, చాలా మంది అవగాహన లేనందుకు ప్రతి విషయానికి పురుషులపై ఆధారపడాల్సి వస్తోంది. – తనీష, ఎంపీసీ, ఫస్ట్ ఇయర్ కట్టుబాట్లు ప్రతిబంధకాలు.. మన సమాజంలో మహిళలు సాధికారత సాధించకపోవడానికి కట్టుబాట్లు, పద్ధతులు ఒక ప్రతిబంధకంగా మారాయి. ఉన్న ఒక్క జీవితానికి ప్రతి మహిళ తన లక్ష్యాన్ని, తన కలలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేయాలి. చరిత్రలో ఎంతో మంది మహిళలు దేశ అస్తిత్వం కోసం పోరాటం చేశారు.. అలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని.. కొత్త చరిత్ర సృష్టించాలి. – వాహిని, ఎంపీసీఎస్, సెకండ్ ఇయర్ కుటుంబ సభ్యుల ప్రోత్సాహంఎంత కష్టాన్ని అయిన భరించేతత్వం ఒక్క మహిళకే ఉంటుంది. నేనూ ఒక మహిళ అయినందుకు గర్విస్తున్నా. నాకు అన్ని విష యాల్లో సహకరించే కుటుంబ సభ్యులు, మా తల్లిదండ్రుల సహకారం మరువలేనిది. మహిళ సాధికారత, సమానత్వం సాధించాలంటే తప్పకుండా కుటుంబ సభ్యుల సహకారం ఉంటే ఏదైనా సాధ్యమే. ప్రభుత్వాలు, మరిన్ని చట్టాలు, స్కీంలు తీసుకురావాలి. – ఆలియా, ఎంజెడ్సీ, సెకండ్ ఇయర్ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఆధునిక ప్రపంచంలో సమాజం ఎంతో అభివృద్ధి చెందినా మహిళలు తక్కువ, మగవారు ఎక్కువ అనే భావన తొలగిపోవడం లేదు. మహిళా సాధికారత, సమానత్వం సాధించాలంటే ప్రతి మహిళ కూడా ఉన్నత విద్యను అభ్యసించి.. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో తమదైన ముద్ర వేసినప్పుడే అన్నీ సాధ్యమవుతాయని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల విద్యార్థినులు అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సాక్షి’ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన డిబేట్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో డిగ్రీ, పీజీ విద్యార్థినులు, అధ్యాపకులు పాల్గొని తమ అభిప్రాయాలు పంచుకున్నారు. మహిళగా గర్విస్తున్నా.. సమాజంలో మహిళలు ఉద్యోగం చేసేవారు ఇటు కుటుంబాన్ని.. అటు ఉద్యోగం రెండింటినీ సమన్వయం చేసే శక్తి ఒక్క మహిళకు మాత్రమే ఉంది. అంత ఓర్పు మహిళలకు ఉన్నందుకు ఒక మహిళగా గర్విస్తున్నా. మహిళ కేవలం వంటింటికే పరిమితం కాకుండా ప్రస్తుతం అనేక రంగాల్లో రాణిస్తున్న వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్థిక సమానత్వం సాధిస్తే సాధికారత సాధ్యపడుతుంది. – వసంత, ఎంజెడ్బీటీ, సెకండ్ ఇయర్ ఉన్నత విద్యతోనే.. మహిళా సాధికారత సాధించి, సమానత్వం రావాలంటే తప్పకుండా ఉన్నత విద్యను అభ్యసించి, మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందినప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది. అందుకే పాఠశాల, కళాశాలలో చదువుతున్న క్రమంలో ప్రతి విద్యార్థిని కూడా అనవసర విషయాల జోలికి పోకుండా చదువులపై దృష్టి సారించినప్పుడు అవకాశాలు వాటంతట అవే వస్తాయి. – భవాని, బీకాం, ఫస్ట్ ఇయర్ ఉద్యోగావకాశాలు కల్పించాలి.. మహిళా సాధికారత రావాలంటే ప్రతి ఒక్కరు తప్పకుండా ఏదో ఒక ఉద్యోగం చేసే విధంగా అవకాశాలు రావాలి. చదువులు ఉన్నప్పటికీ కొంత మంది ఉద్యోగాలు చేయలేని పరిస్థితి ఉంది. అందుకు ప్రభుత్వం మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఉద్యోగాలకు అవసరమైన స్కిల్స్ అందిస్తే సులువుగా ఉద్యోగాలు పొందేందుకు అవకాశం ఉంది. – నిహారిక, బీకాం, ఫస్ట్ ఇయర్ పాఠశాల, ఇంటర్మీడియట్ స్థాయి వరకు బాలికలు చదువుతున్నప్పటికీ ఉన్నత విద్యకు వచ్చే సరికి వారి సంఖ్య మరింత పెరగాల్సిన అవసరం ఉంది. వీటితోపాటు స్కిల్ డెవలప్మెంట్, మరిన్ని యూనివర్సిటీలను అందుబాటులోకి తీసుకువస్తే మహిళలు చదువుకునేందుకు ఆస్కారం ఉంది. నాకు అన్ని స్థాయిల్లో కుటుంబ సభ్యులు సహకరించడం వల్ల ప్రిన్సిపాల్ స్థాయి వచ్చా. మహిళలకు కుటుంబమే బలం. అలాంటి అవగాహన అందరిలో రావాలి. – పద్మావతి, ప్రిన్సిపాల్, ఎంవీఎస్ డిగ్రీ కళాశాల చైతన్యం అవసరం.. చాలామంది మహిళలు అవగాహన లేకకపోవడం, హక్కులు తెలియపోవడం వంటి విషయాల కారణం సాధికారత సాధ్యపడడం లేదు. అందుకోసం సామాజిక అంశాల పట్ల పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి మహిళలో కూడా చైతన్యం వచ్చి రాజకీయ, సామాజిక, ఉద్యోగాల్లో వారి సంఖ్య పెరిగితే అప్పుడు మహిళలు పురుషులతో సమానంగా రాణించగలుగుతారు. – నీలిమ, బీబీఏ, సెకండ్ ఇయర్ తోటివారికి సహకరించాలి.. సమాజంలో మహిళలకు తోటివారే సహకరించాలి. పనిచేసే ప్రదేశం, ఇతర చోట్ల ఎక్కడైనా మహిళలు ఒకరికి ఒకరు సహరించుకుంటే ముందుకు సాగేందుకు ఆస్కారం ఉంటుంది. రెండు కొప్పులు ఒక దగ్గర కలవవు అనే నానుడి నుంచి బయటికి రావాలి. ప్రతి మహిళా సాధికారత సాధించాలంటే తప్పకుండా విద్యను ఒక ఆయుధంగా మలచుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. – సుభాషిణి, ఎంవీఎస్ కళాశాల అధ్యాపకురాలు కుటుంబమే బలం.. -
ఆమె కోసం.. ఒకరోజు
అచ్చంపేట: రాష్ట్ర ప్రభుత్వం 2023, మార్చి 8న మహిళా క్లినిక్లను ప్రారంభించింది. జిల్లాలోని జనరల్ ఆస్పత్రులు, 24 గంటలు సేవలందించే పీహెచ్సీల్లో మహిళా క్లినిక్లు కొనసాగుతున్నాయి. ఈ క్లినిక్లలో ప్రతి మంగళవారం మహిళలకు వైద్యసేవలు అందిస్తారు. ప్రతి వారం ఒక రకమైన వైద్య సేవలు అందిస్తున్నారు. సోమవారం గర్భిణులకు వైద్య పరీక్షలు చేస్తుండగా.. బుధవారం, శనివారం టీకాలు, శుక్రవారం డ్రై డే, గురువారం హెల్త్కేర్ క్లినిక్ వృద్ధుల కోసం చేస్తుండగా.. ఖాళీగా ఉన్న మంగళవారాన్ని మహిళలకు కేటాయించారు. ఇందులో 57 రకాల వైద్య పరీక్షలు చేయనున్నారు. ఈ క్లినిక్స్లో పరీక్షలు చేసి 24 గంటల్లో రిపోర్టు అందజేస్తారు. ఈ మేరకు తెలంగాణ డయాగ్నోస్టిక్ పోర్టల్ ప్రత్యేక లింక్ రూపొందించింది. నమూనాల సేకరణ, కేంద్రాలకు తరలింపునకు వాహనాలు, స్టాప్ను నియమించారు. -
SLBC: ఆ ప్రదేశంలో ఆగిన క్యాడవర్ డాగ్స్.. రెస్క్యూ ఆపరేషన్లో కీలక పరిణామం
సాక్షి, నాగర్ కర్నూల్/మహబూబ్నగర్: ఎస్ఎల్బీసీ టన్నెల్లో మూడు మృతదేహాల స్పాట్స్ను క్యాడవర్ డాగ్స్ గుర్తించాయి. జీపీఆర్ ద్వారా మార్క్ చేసిన ప్రదేశంలోనే క్యాడవర్ డాగ్స్ ఆగాయి. ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల జాడ రెండు వారాలైనా లభించకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్లో సాయం చేసేందుకు కేరళ పోలీసు శాఖకు చెందిన కడావర్ డాగ్స్ను రాష్ట్ర ప్రభు త్వం రంగంలోకి దించిన సంగతి తెలిసిందే. కేరళలోని త్రిసూర్ నుంచి రెండు కడావర్ జాగిలాలతోపాటు వాటి శిక్షకులను దోమలపెంటకు రప్పించింది.నేషనల్ డిజా స్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డీఎంఏ), కేంద్ర హోంశాఖ కార్యదర్శి కల్నల్ కీర్తిప్రకాశ్ సింగ్ ఆధ్వర్యంలో రెండు సైనిక హెలికాప్టర్లలో ఆ శునకాలు, శిక్షకులు వచ్చారు. ముందుగా ప్రమాదస్థలం వద్ద పరిస్థితులను పరిశీలించేందుకు కల్నల్ కీర్తి ప్రకాశ్సింగ్తోపాటు కేరళ పోలీసు అధికారి ప్రభాత్ నేతృత్వంలో కడావర్ డాగ్స్ రెస్క్యూ బృందం సొరంగంలోకి వెళ్లింది.శుక్రవారం ఉదయం 7 గంటలకు రెండు కడావర్ డాగ్స్తో కలసి సొరంగంలోని ప్రమాదస్థలం వద్ద కార్మికుల జాడ కోసం సహాయ బృందం గాలింపు చర్యలు చేపట్టింది. గతేడాది కేరళలోని మున్నార్ సమీపంలో పెట్టిముడి వద్ద కొండచరియలు విరిగి మట్టిలో కూరుకుపోయిన నలుగురిని కడావర్ డాగ్స్ గుర్తించగలిగాయి. మట్టిలో 10–15 అడుగుల లోతులో కూరుకు పోయిన మానవ అవశేషాలను ఈ శునకాలు పసిగడతాయి.8 మంది కార్మికుల ఆచూకీ కోసం 14 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. అయినా ఇప్పటి వరకు గల్లంతైన వారి జాడ దొరకలేదు.12 విభాగాలకు చెందిన దాదాపు 650 మంది సభ్యులు నిరంతం షిఫ్టుల వారిగా సహయక చర్యల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఇవాళ టన్నెల్లో చిక్కుకున్న వారి అచూకీ కనుగొనేందుకు కేరళ రాష్ట్రం నుంచి ప్రత్యేక శిక్షణ పొందిన రెండు క్యాడవర్ డాగ్స్ను సొరంగంలోకి పంపించారు. ఉదయం ఏడున్నర గంటలకు లోకో ట్రైన్లో వాటిని లోపలికి తీసుకెళ్లారు. తిరిగి మధ్యాహ్నం రెండున్నరకు బయటకు తీసుకొచ్చారు. తప్పిపోయిన వారి ఆనవాళ్లకు సంబంధించి పలు అనుమానిత ప్రాంతాలను డాగ్స్ గుర్తించినట్టు చెబుతున్నారు. వాటి ఆధారంగా తదుపరి చర్యలపై అధికారులు సమీక్ష చేస్తున్నారు.టన్నెల్లోకి నలుగురు సభ్యులతో కూడిన ఎన్వీ రోబోటిక్ నిపుణుల బృందం వెళ్లింది. వారితో పాటు ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ కూడా వెళ్లి అందులో అధ్యయనం చేశారు. మరో వైపు కన్వేయర్ బెల్ట్ కూడ పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావటంతో సహయచర్యలు వేగవంతమయ్యాయి. సొరంగంలో కూరుకుపోయిన మట్టి, బురదను తొలగిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే నిపుణులతో ప్లాస్మాకట్టర్స్ ద్వారా టీబీఎం మిషన్ భాగాలు కట్ చేస్తూ వాటిని లోకో ట్రైన్ ద్వారా బయటికి తీసుకొస్తున్నారు.టీబీఎంపై ఉన్న మట్టిని వాటర్గన్తో తొలగిస్తున్నారు. కాని జీపీఆర్ అనుమానిత ప్రాంతాల్లో జరుపుతున్న తవ్వకాల్లో పెద్దఎత్తున సీఫేజ్ వాటర్ వస్తుండటంతో సహయక చర్యలకు కొంత అవరోధం ఏర్పడుతుంది. మరోవైపు అదనపు మోటార్లు ఏర్పాటు చేసి సీఫేజ్ వాటర్ను త్వరిత గతిన బయటికి పంపే ప్రక్రియను చేపడుతున్నారు. మొత్తంగా టన్నెల్లో ఇరుకున్న వారి ఆచూకీని కనుగొనేందుకు అనేక చర్యలు చేపడుతున్నా ఇప్పటికీ 8 మంది ఆచూకీ దొరకపోవటంతో ఆందోళన వ్యక్తం అవుతుంది. గడచిన 14 రోజులుగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన బాధిత కుటుంబ సభ్యులు తమ వారి ఆచూకీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. -
SLBC: టెన్నెల్లోకి క్యాడవర్ డాగ్స్ బృందం.. వీటి ప్రత్యేకత ఇదే..
సాక్షి, దోమలపెంట: ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు 14వ రోజుకు చేరుకున్నాయి. సహాయక చర్యల్లో భాగంగా కార్మికుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఇక, తాజాగా మరణించిన కార్మికులను గుర్తించేందుకు కేరళకు చెందిన క్యాడవర్ డాగ్స్ బృందం టన్నెల్లోకి వెళ్లింది. ఇదే సమయంలో టన్నెల్లో తవ్వేందుకు అవసరమైన సామగ్రిని లోకోమోటర్ తీసుకెళ్లింది.ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కార్మికులను గుర్తించేందుకు అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. శుక్రవారం ఉదయమే రెండు క్యాడవర్ డాగ్స్తో సహాయక బృందం టన్నెల్లోకి వెళ్లింది. బెల్జియం మ్యాల్నోయిస్ బ్రీడ్కు చెందిన క్యాడవర్ డాగ్స్ 15 ఫీట్ల లోపల ఉన్న వస్తువులను, మృతదేహాలను గుర్తిస్తాయి. ఇదే వీటి ప్రత్యేకత. వీరితో పాటుగా 110 మంది కూడా టెన్నెల్లోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో మృతదేహాల గుర్తించి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎనిమిది మంది కార్మికుల అన్వేషణ అనంతరం ఈ బృందం మధ్యాహ్నం 2 గంటల తర్వాత టన్నెల్ నుంచి బయటకు రానుంది.ఇదిలా ఉండగా.. టన్నెల్లో కార్మికుల జాడ గుర్తించేందుకు జీపీఆర్ సహాయంతో సిగ్నళ్లు పంపగా.. 8 ప్రదేశాల నుంచి బలమైన సిగ్నల్స్ వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాలను, లోతును లెక్కకడుతున్నారు. ఎనిమిది ప్రాంతాల్లో మార్కింగ్ చేసి రెండుచోట్ల తవ్వకాలు జరిపితే యంత్ర పరికరాలు బయటపడ్డాయి. ఆ ప్రాంతాలను వదిలేసి మిగతా ఆరు చోట్ల తవ్వకాలు చేపట్టారు.మరోవైపు.. టన్నెల్లోని వ్యర్దాలను కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటికి పంపుతున్నారు. ఈ బెల్ట్ ద్వారా గంటకు 8 వందల టన్నుల వ్యర్దాలను బయటికి పంపుతున్నారు. దీంతో టన్నెల్లో భారీగా పేరుకుపోయిన మట్టి, బురదను త్వరిత గతిన తొలగించే అవకాశం ఏర్పడింది. వీలైనంత త్వరగా మట్టిని బయటకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు వివరించారు. -
ఔటర్పై ఘోర ప్రమాదం
ఇబ్రహీంపట్నం రూరల్: ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆదిబట్ల పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం 4 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. సీఐ రాఘవేందర్రెడ్డి కథనం ప్రకారం.. రావిర్యాల వండర్లా సమీపంలోని ఎగ్జిట్ నంబరు 13 దాటిన అనంతరం 200 మీటర్ల దూరంలో డివైడర్పై ఉన్న మొక్కలకు హెచ్ఏండీఏ ట్యాంకర్ ద్వారా కొంగరకలాన్కు చెందిన చెనమోని రాములు (55) నీళ్లు పోస్తున్నాడు. ఉప్పల్లో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై ఘట్కేసర్ వద్ద ఔటర్ ఎక్కిన వనపర్తి జిల్లా చిన్నంబాయి మండలం బెక్కం గ్రామానికి చెందిన కోషిక రవీందర్రెడ్డి, బత్తిని కృష్ణారెడ్డి (టీఎస్07జెఎం 1210) కారులో అతివేగంగా వెనుక నుంచి వచ్చి ట్యాంకర్తో నీరు పోస్తున్న రాములును ఢీకొట్టారు. దీంతో అతడు గాల్లో ఎగిరి డివైడర్పై పడి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. కారు.. ట్యాంకర్ వెనుకభాగం కిందికి దూసుకెళ్లింది. దీంతో కారు ముందు సీట్లో కూర్చున్న కోషిక రవీందర్రెడ్డి (50) అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కారు నడుపుతున్న బత్తిని కృష్ణారెడ్డి (45) పరిస్థితి విషమంగా ఉండటంతో నగరంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు 120– 140 స్పీడ్లో ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ట్యాంకర్ కిందికి దూసుకెళ్లడంతో రవీందర్రెడ్డి మృతదేహంతో పాటు కృష్ణారెడ్డిని బయటకు తీసేందుకు పోలీసులు ఎంతో శ్రమించాల్సి వచ్చింది. సీఐ రాఘవేందర్రెడ్డితో పాటు ఎస్ఐ వెంకటేశ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు స్నేహితులు.. రోడ్డు ప్రమాదానికి గురైన కృష్ణారెడ్డి, రవీందర్రెడ్డి ఇద్దరూ ఒకే గ్రామానికి చెందిన స్నేహితులు. కృష్ణారెడ్డి కొండాపూర్లో ఉంటూ స్వీట్ షాప్ నిర్వహిస్తుండగా, రవీందర్రెడ్డి బోరబండలో ఉండేవాడు. వీరి మృతితో బెక్కంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆదిబట్ల మున్సిపాలిటీ కొంగరకలాన్కు చెందిన రాములు ఓ కాంట్రాక్టర్ వద్ద కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతివేగంగా వచ్చి ట్యాంకర్ను ఢీకొట్టిన కారు అక్కడికక్కడే ఇద్దరి దుర్మరణం మరొకరి పరిస్థితి విషమం -
సారూ.. మా బతుకులు ఆగమైపోతున్నాయ్
కోయిలకొండ: సారూ.. మా బతుకులు ఆగమైపోయాయ్.. రైతు రుణమాఫీ రాలే.. రైతుబంధు పడలే.. కరెంటు సక్కగా లేదు.. బోర్లలో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి సారు అంటూ.. మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్తో ఓ రైతు తన గోడు వెళ్లబోసుకున్నారు. గురువారం ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్న మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ మండలంలోని దమాయపల్లి వద్ద బాలయ్య అనే రైతు వ్యవసాయ పొలంలో కొత్తగా వేస్తున్న బోరును చూసి అక్కడికి వెళ్లి రైతును పలకరించారు. దీంతో రైతు మాట్లాడుతూ నాలుగున్నర ఎకరాల వరి పూర్తిగా ఎండిపోయింది.. పంటను కాపాడేందుకు మల్లో బోరు వేస్తున్న.. 300 ఫీట్లు దాటిన చుక్క నీరు లేవు.. మొత్తం రాళ్లు, రప్పలే వస్తున్నాయి అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. మీరే ఏదైనా చేయండి సార్ అంటూ వేడుకున్నారు. మళ్లీ కాంగ్రెస్ పాలనలో పాత రోజులు వచ్చినాయని వాపోయాడు. ఇది ఒక్క బాలయ్య ఆవేదనే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని మాజీ మంత్రి పేర్కొన్నారు. సాగునీటి నిర్వహణ సరిగా లేకపోవడంతో జలాశయాల్లో ఉన్న నీరంతా ఖాళీ అయ్యిందని, రిజర్వాయర్ల కింద పంటలన్నీ ఎండిపోతున్నాయని, ఈ దుస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. రైతు రుణమాఫీ చేసి ఉంటే.. రైతుబంధు సకాలంలో వేసి ఉంటే.. 24 గంటల కరెంటు ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదన్నారు. ఎండిపోయిన పంటలకు ప్రభుత్వం బాధ్యత వహించి ఎకరాకు రూ.25 వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మాజీమంత్రితో ఓ రైతు ఆవేదన -
మహబూబ్నగర్
శుక్రవారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2025వివరాలు 8లో uమహబూబ్నగర్ న్యూటౌన్: భూమి లేని పేదలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిలో పట్టాలు ఇవ్వాలని కొందరు.. పట్టాలు పొందినా తమను భూమిలోకి రానివ్వడం లేదంటూ మరికొందరు రైతులు అటవీ సరిహద్దు ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్నారు. అటవీ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం కొరవడటంతో క్షేత్రస్థాయిలో పట్టాదారులు అయోమయానికి గురవుతున్నారు. రెవెన్యూ శాఖ ద్వారా అసైన్డ్ పట్టాలు ఇచ్చిన భూములు అటవీ శాఖ భూములా? లేక ప్రభుత్వ మిగులు భూములా అనేది తేలడం లేదు. ఇదిలా ఉంటే, అటవీ సరిహద్దులో ఉన్న రెవెన్యూ మిగులు భూమిలో తమకు పట్టాలివ్వాలని కొందరు రైతులు న్యాయస్థానాలను సైతం ఆశ్రయించారు. జిల్లాలోని అటవీ సరిహద్దు గ్రామాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నా.. సమస్య పరిష్కారంపై ఆయా శాఖలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. గతంలో రెండు, మూడు అటవీ సరిహద్దు గ్రామాల్లో జాయింట్ సర్వే నిర్వహించినా.. ఆశించిన ఫలితాలు రాలేదు. ఉమ్మడిగా సర్వే నిర్వహించి రెవెన్యూ, అటవీ శాఖల భూముల హద్దులను నిర్ణయిస్తే.. సమస్యకు పరిష్కారం దొరికే ఆస్కారమున్నా ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో సమస్య మరింత జఠిలంగా మారుతోంది. జాయింట్ సర్వే నిర్వహించి మిగులు భూముల లెక్క తేల్చాలని.. భూమిలేని పేదలకు అసైన్డ్ పట్టాలు ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతోంది. హద్దులు లేకపోవడంతో.. రెవెన్యూ, అటవీ శాఖలకు సంబంధించిన భూములకు హద్దులు లేకపోవడంతో సమస్య మరింత పెద్దదైంది. జిల్లాలోని 15 మండలాల పరిధిలో దాదాపు 48,320 ఎకరాల భూమికి ప్రభుత్వం అసైన్డ్ పట్టాలు ఇచ్చింది. మొత్తం 52 రెవెన్యూ గ్రామాల పరిధిలో అటవీ విస్తీర్ణం దాదాపు 66,901.05 ఎకరాల్లో ఉంది. ఇందులో అటవీ సరిహద్దులోని 11 మండలాల్లో దాదాపు 38,770 ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అటవీ సరిహద్దు గ్రామాల్లో హద్దులు లేకపోవడం కారణంగా సమస్యలు తలెత్తుతున్నాయి. న్యూస్రీల్ -
తెల్లవారితే గృహప్రవేశం..
అంతలోనే గుండెపోటుతో వ్యక్తి మృతి తెలకపల్లి: ఎంతో కష్టపడి.. ఇష్టంగా నిర్మించుకున్న ఇల్లు.. తెల్లవారితే నూతన గృహప్రవేశం.. కానీ, అంతలోనే గుండెపోటుతో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన ఆ ఇంట్లో విషాదం నింపింది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని కారువంగ గ్రామానికి చెందిన దొడ్ల రాజు(34) గ్రామంలో నూతనంగా నిర్మించుకున్న ఇల్లు గృహ ప్రవేశం ఏర్పాట్లలో నిమగ్నమయ్యాడు. ఈ క్రమంలోనే గురువారం తెల్లవారుజామున గృహ ప్రవేశం ఉండగా.. అర్ధరాత్రి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందాడని నిర్ధారించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. రాజు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాజుకు భార్య, కూతురు ఉన్నారు. -
ఏమైపోయారో..
అచ్చంపేట రూరల్: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 13 రోజులుగా ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల జాడ గుర్తింపు కోసం అన్వేషణ కొనసాగుతోంది. తిండీ తిప్పలు దేవుడెరుగు.. కనీసం గాలి, వెలుతురు కూడా లేకుండా ఊపిరి సలపని చీకటి గుహలో తమ వారు ఎలా ఉన్నారో.. ఏమైపోయారో అంటూ టన్నెల్ వెలుపల కార్మికుల కుటుంబాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎదురుచూస్తూనే ఉన్నాయి. దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న వారి కోసం 13 రోజులుగా సహాయక చర్యలు చేపడుతున్నారు. గురువారం పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ సహాయక బృందాలకు దిశానిర్దేశం చేస్తూ డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్కుమార్ సూచనలు చేశారు. ఈ క్రమంలోనే సొరంగం లోపల చిక్కుకున్న వారిని గుర్తించేందుకు కేరళ రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా క్యాడావర్ డాగ్స్ రప్పించినట్లు ఆయన తెలిపారు. గురువారం ఉద యం షిఫ్టులో సింగరేణి, ఐఐటీ నిపుణులతోపాటు సైనిక అధికారులు సొరంగం లోపలికి వెళ్లారు. మట్టి తరలింపులో ఇబ్బందులు.. సొరంగంలో పేరుకుపోయిన, మట్టి, రాళ్లు, బురద బయటకు పంపడానికి సింగరేణి కార్మికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. జీపీఆర్ మిషన్ చూయించిన చోట 6, 7 మీటర్ల లోపల ఉన్న అవశేషాల కోసం ప్రతిరోజు అన్వేషణ కొనసాగుతోంది. జీపీఆర్ చూయించిన ప్రదేశంలోనే ఎక్కువ శాతం పనులు కొనసాగిస్తుండటం, చివరికి ఆ ప్రాంతంలో ఎలాంటి అవశేషాలు కనిపించకపోవడంతో శ్రమిస్తున్న సింగరేణి కార్మికులకు నిరాశే మిలుగుతోంది. దీనికి తోడు 7 మీటర్ల లోతులో మట్టిని తవ్వి పక్కనే పడేస్తున్నారు. మట్టిని తవ్వడానికి కార్మికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. కన్వేయర్ బెల్ట్ పనులు కొనసాగితే ఆ మట్టి, రాళ్లు, ఇతర శిథిలాలను బయటకు పంపిస్తే పని సులువవుతుందని కార్మికులు అంటున్నారు. గోతులు తవ్వితే అధికంగా నీరు, బురద వస్తుంది. దీంతో ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. అందుబాటులో ఉండాలి.. సొరంగం వద్ద సహాయక చర్యల్లో అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండి సహకరించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. అందరూ సమన్వయంతో, సహకారం అందిస్తూ సహాయక చర్యలు చేపట్టాలన్నారు. వివిధ విపత్తుల ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది సొరంగ ప్రాంతానికి వస్తున్నారని, వారికి అన్ని వసతులు కల్పిస్తూ.. సర్వే, ఇతర పనులు చేయించుకోవాలన్నారు. ఐఐటీ నిపుణులు, సింగరేణి సాంకేతిక నిపుణులు, సైనిక అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఉదయం ఒక చివర నుంచి మట్టిని తీసి ఎక్సలేటర్పై వేస్తూ నీటిని మరోవైపు దారి మళ్లిస్తూ ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు పడిగాపులు.. టన్నెల్లో చిక్కుకున్న కార్మికులకు సంబంధించి కుటుంబసభ్యులు దోమలపెంట జేపీ కంపెనీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కంపెనీ యజమానితో మాట్లాడటానికి కుటుంబ సభ్యులు చూస్తుండగా.. కంపెనీ అధికారులు, సిబ్బంది పొంతన లేని సమాధానం చెబుతూ వారిని అక్కడి నుంచే పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. గురువారం ఓ కార్మికుడి కుటుంబసభ్యులు కార్యాలయం వద్దకు వచ్చి ఆరా తీశారు. అదే సమయంలో జేపీ కంపెనీ యజమాని హెలికాప్టర్లో వస్తుండటంతో అక్కడి నుంచి వారిని పంపించేశారు. లాంగిట్యూడ్, లాటిట్యూడ్ ఆధారంగా.. భూ ప్రకంపనలు, భూమిలో ప్రయాణించే ప్రత్యాస్తి తరంగాలను అధ్యయనం చేసే నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రతినిధుల బృందం సొరంగం ప్రాంతానికి చేరుకుంది. వారితో ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించి.. సర్వే చేసి కచ్చితమైన నివేదిక అందించాలని కోరారు. గురువారం అమ్రాబాద్ రేంజ్లో లాంగిట్యూడ్, లాటిట్యూడ్ ఆధారంగా సర్వే చేయనున్నట్లు తెలిసింది. స్థానిక ఫారెస్టు అధికారులు వారికి సహకరిస్తున్నారు. ● సహాయక చర్యలను కేంద్రం నుంచి వచ్చిన మినిస్ట్రీ ఫర్ హోం అఫైర్స్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సెక్రటరీ కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ పరిశీలించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆయనకు రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి అరవింద్కుమార్ టన్నెల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, కొనసాగుతున్న సహాయక చర్యలను వివరించారు. నేటికీ అంతుచిక్కని 8 మంది కార్మికుల ఆచూకీ ఎస్ఎల్బీసీలో కొనసాగుతున్నసహాయక చర్యలు ఐఐటీ నిపుణులతో టన్నెల్లోకి సింగరేణి, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు -
233 మంది విద్యార్థులు గైర్హాజరు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం మొదటి పరీక్ష పరీక్ష గురువారం ప్రశాంతంగా జరిగాయి. పేపర్–2లో తెలుగు, హిందీ, సంస్కృతం, అరబిక్లకు సంబంధించిన పరీక్షలు జరిగాయి. 36 పరీక్ష కేంద్రాల్లో 10,222 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. 9,989 మంది హాజరయ్యారు. జనరల్ కోర్సుల్లో 8,295 మంది, ఒకేషనల్ కోర్సుల్లో 1,694 మంది విద్యార్ధులు హాజరు కాగా.. 233 మంది గైర్హాజరయ్యారు. పలు పరీక్ష కేంద్రాలను జిల్లా ఇంటర్మీడియట్ శాఖ అధికారులు, ఫ్లయింగ్, సిటింగ్ స్వాడ్ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఇంటర్ పరీక్ష కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ జానకి -
పుట్టెడు దుఃఖంలోనూ ఇంటర్ పరీక్ష
మరో దూడను హతమార్చిన హైనా తిమ్మాజిపేట: మండలంలోని చేగుంట శివారులో సంచరిస్తున్న హైనా గురువారం మరో దూడపై దాడిచేసి హతమార్చింది. చేగుంటకు చెందిన రైతు తుంగని బాలయ్య బుధవారం సాయంత్రం తన వ్యవసాయ పొలంలో గేదెలను కట్టివేసి ఇంటికి వచ్చారు. గురువారం ఉదయం పొలానికి వెళ్లి చూడగా.. హైనా దాడిలో మృతిచెందిన దూడను గుర్తించారు. అయితే వ్యవసాయ పొలాల వద్ద పశువుల పాకలపై హైనా ఆకస్మిక దాడులు చేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు జంకుతున్నారు. అయితే ఫారెస్టు అధికారులు ఏ జంతువు అనేది గుర్తించక పోగా.. కనీసం బోను కూడా ఏర్పాటు చేయడం లేదని రైతులు వాపోతున్నారు. ముగ్గురు రైతులకు చెందిన దూడలను హతమార్చిందని.. ఫారెస్టు అధికారులు మాత్రం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అడవి జంతువును పట్టుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ఐదుగురికి రిమాండ్ బిజినేపల్లి: గుట్టుగా గంజాయి సరఫరా చేస్తున్న ఐదుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ కనకయ్యగౌడ్ తెలిపారు. గురువారం సాయంత్రం తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. మండలంలోని వసంతాపూర్ శివారులో బుధవారం జార్కండ్ రాష్ట్రానికి చెందిన బిట్టుకుమార్ రాం, పుప్పుకుమార్, గుడ్లనర్వకు చెందిన మహేష్, దుర్గాప్రసాద్, ఉదయ్ బిజినేపల్లిలో గంజాయి సరఫరా చేస్తుండగా ఎస్ఐలు శ్రీనివాసులు, రాజశేఖర్ ప్రత్యేక నిఘా ఉంచి పట్టుకున్నారని తెలిపారు. వీరిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామని.. వీరి నుంచి 900 గ్రాములకు పైగా గంజాయి, ఒక ద్విచక్ర వాహనం, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. సమావేశంలో ఎస్లు శ్రీనివాసులు, రాజశేఖర్, ఇతర సిబ్బంది ఉన్నారు. చికిత్స పొందుతూ మహిళ మృతి మహబూబ్నగర్ క్రైం: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ మృతి చెందింది. వన్టౌన్ ఎస్ఐ శీనయ్య వివరాల మేరకు.. జిల్లా కేంద్రంలోని హనుమాన్ నగర్కు చెందిన ఈశ్వరమ్మ (60) కొడుకు శివరాజ్ గతనెల 20న మృతిచెందాడు. అతడి అంత్యక్రియల కోసం వైకుంఠ రథంపై వెళ్తున్న క్రమంలో మార్గమధ్యంలోని పెద్ద శివాలయం వద్ద రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి వాహనం ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాదంలో ఈశ్వరమ్మకు తీవ్రగాయాలు కావడంతో జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. మృతురాలి కొడుకు అంబుదాస్ ఫిర్యాదు మేరకు వైకుంఠ రథం డ్రైవర్ ఇసాక్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. అలంపూర్ రూరల్: తండ్రి మరణాన్ని పంటిబిగువన ఆపి.. పుట్టెడు దుఃఖంలోనూ ఇంటర్ పరీక్ష రాశాడు ఓ విద్యార్థి. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలంలోని లింగన్వాయి గ్రామానికి చెందిన మహబూబ్బాషా(50)కు ఇద్దరు సంతానం. కాగా చిన్న కుమారుడు సమీర్ మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలోని మైనార్టీ గురుకుల పాఠశాలో ఇంటర్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అయితే సమీర్ తండ్రి మహబూబ్బాషా బుధవారం మధ్యాహ్నం అనారోగ్యంతో మృతి చెందాడు. గురువారం ఇంటర్ సెకండియర్ పరీక్ష ప్రారంభం కానుండగా.. ఈ విషయాన్ని సమీర్కు ముందు తెలపకుండా పరీక్షకు వెళ్లే ముందు చెప్పారు. తండ్రి మరణ వార్త తెలిసిన సమీర్ పంటి బిగువన దుఃఖాన్ని ఆపుకొని పరీక్ష పూర్తి చేశాడు. పరీక్ష అనంతరం స్వగ్రామానికి వచ్చి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు జంకుతున్న రైతులు పరీక్ష అనంతరం తండ్రి అంత్యక్రియలకు హాజరైన విద్యార్థి -
ఎల్ఆర్ఎస్పై అవగాహన కల్పించాలి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఎల్ఆర్ఎస్ కోసం 2020లో దరఖాస్తు చేసుకున్న లే–అవుట్ల యజమానులకు ఫీజు చెల్లింపుపై అవగాహన కల్పించాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్ ఆదేశించారు. గురువారం సాయంత్రం మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పాలమూరు, జడ్చర్ల, భూత్పూర్, దేవరకద్ర కమిషన్లు, ఆయా విభాగాల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 31లోగా నిర్ణయించిన ఫీజును చెల్లిస్తే 25 శాతం రాయితీ కల్పిస్తామన్నారు. ఈ పథకానికి సంబంధించిన ఏమైనా సందేహాలుంటే కలెక్టరేట్లోని టోల్ ఫ్రీ నం.08542–241165, మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో హెల్ప్లైన్ నంబరు 7093911352 లను సంప్రదించవచ్చన్నారు. ప్రతిరోజూ ఉదయం పది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ నంబర్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ అవకాశాన్ని దరఖాస్తుదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. https://lrs.telangana.gov.in/layouts/citizenlogin.arpx వెబ్సైట్ లాగిన్ ద్వారా కూడా ఫీజు చెల్లించవచ్చన్నారు. అంతకుముందు ఎల్ఆర్ఎస్ హెల్ప్లైన్ ను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలిచ్చారు. అనంతరం సమీక్షలో భాగంగా ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా వంద శాతం ఆస్తిపన్ను వసూలు చేయాలని ఆదేశించారు. ప్రస్తుత వేసవికాలంలో నగరంతో మూడు పట్టణాల్లో ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలన్నారు. మున్సిపల్ దుకాణాల అద్దె, నల్లాబిల్లులు సైతం బకాయిలు లేకుండా రాబట్టాలన్నారు. కాగా, ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్లాట్ల, లే–అవుట్ యజమానులు తాజాగా మహబూబ్నగర్ టౌన్ ప్లానింగ్ విభాగంలో కిక్కిరిసి కనిపించారు. తాము చెల్లించాల్సిన ఫీజు గురించి అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా నుంచి 2,500 మంది మహిళలు అంతకుముందు మెప్మా అధికారులతో శివేంద్రప్రతాప్ మాట్లాడుతూ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 8న హైదరాబాద్లో జరిగే కార్యక్రమానికి జిల్లా నుంచి కనీసం 2,500 మంది మహిళ (ఎస్హెచ్జీ)లు బస్సుల్లో తరలి వెళ్లాలని సూచించారు. ఆయా సమావేశాల్లో మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్రెడ్డి, జడ్చర్ల, భూత్పూర్ మున్సిపల్ కమిషనర్లు లక్ష్మారెడ్డి, మహ్మద్ నూరుల్నజీబ్, ఇన్చార్జ్ ఎంఈ సందీప్, ఏసీపీ జోత్సా ్నదేవి, టీపీఓ లక్ష్మీపతి, టీపీఎస్ విశాల్కుమార్, మెప్మా ఇన్చార్జ్ డీఎంసీ, సీఓలు వరలక్ష్మి, దేవమ్మ, నిర్మల తదితరులు పాల్గొన్నారు. వంద శాతం ఆస్తిపన్ను వసూలు చేయాలి స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్శివేంద్రప్రతాప్ మున్సిపల్ కమిషనర్లు, అధికారులతో సమీక్ష -
తీరొక్క పంటలు
కృష్ణానదిలో మినుములు, నువ్వులు, వేరుశనగ పంటల సాగు ●కృష్ణా నదీతీరంలో నల్లరేగడి భూమి ఎరువులు వాడం ఈ పొలాల్లో ఎరువులు వాడుకుండానే పంటలు సాగుచేస్తాం. తేమ నీళ్లకు వివిధ రకాల పంటలు పండిస్తాం. అధిక దిగుబడులు వస్తాయి. – శివ, రైతు, మంచాలకట్ట మంచి దిగుబడులు ప్రతి యేడు కాలానికి తగినట్లుగా రకరకాల పంటలు వేస్తూ సరైన మోతాదులో ఎరువులు వాడుకొని పంటలు సాగు చేస్తా. ఇతర పొలాల కంటే ఈ నల్లరేగడి పొలాల్లో మంచి దిగుబడులు వస్తాయి. – శేఖర్, మల్లేశ్వరం మినుములు, నువ్వులు పండిస్తా ప్రతి సంవత్సరం జటప్రోల్ గ్రామ శివారులో 10 ఎకరాల్లో మినుములు, నువ్వుల పంట పండిస్తా. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి పంటలు పండించి లాభాలు పొందుతున్నా. – భీంరెడ్డి, జటప్రోల్ తక్కువ ఖర్చుతో.. నల్లరేగడి పొలాలు కనుక ఎకరాకు నువ్వుల పంట 6 క్వింటాళ్లు, మినుములు 10 నుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడులు వస్తాయి. అతి తక్కువ ఖర్చుతో ఈ పంటలను పండిస్తాం. – బాలరాజు, రైతు పెంట్లవెల్లి: ప్రతి యేటా కృష్ణానదిలో నీరు తగ్గే కొద్ది తీరొక్క పంటలను రైతులు సాగు చేస్తారు. కృష్ణా నదీతీరాన ఉన్న ఒండ్రుమట్టిలో నది ఎండిన తర్వాత నాణ్యమైన రకరకాల పంటలను పండిస్తుంటారు. శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టినప్పుడు ప్రాజెక్ట్ బ్యాక్వాటర్లో దాదాపు 2000 ఎకరాల వరకు నల్లమట్టితో కూడిన ఒండ్రు మట్టి పొలాలు ఉండేవి. పెంట్లవెల్లి మండలంలోని మంచాలకట్ట, జటప్రోల్, చెల్లపాడు, మాధవస్వామినగర్, మల్లేశ్వరం, సోమశిల, అమరగిరి వాసులు కృష్ణానదిలో పొలాలున్న రైతుల దగ్గర కౌలురైతులు కౌలుకు తీసుకొని నీరు తీస్తుండేకొద్ది సాగు చేస్తూ తీరొక్క పంటలను సాగు చేస్తున్నారు. ఈ పంటలు నాణ్యతతో పాటు అధిక దిగుబడులు ఇచ్చేవి. ముఖ్యంగా మినుములు, నువ్వులు, వేరుశనగ, మొక్కజొన్న, శనగ, పొద్దుతిరుగుడు పంటలను అధికంగా సాగుచేస్తారు. వివిధ గ్రామాల రైతులు 1500 నుంచి 2000 ఎకరాల వరకు పంట సాగు అవుతున్నాయి. రూ.10వేల నుంచి రూ.15వేలు కౌలు పెట్టి.. ఈ పొలాలు కృష్ణానది నీటిలో దాదాపు ఆరు నెలలపాటు మునిగి ఉంటాయి. అందులో పదును, తేమతో ఎక్కువగా పంటలు పండుతాయి. దీంతో నీరు పెట్టడం తక్కువ మోతాదులోనే ఉంటుంది. ఎరువులు కూడా తక్కువగానే వాడుతుంటారు. ఎకరాకు రూ.10వేల నుంచి రూ.15వేలు కౌలునకు తీసుకొని మరీ ఈ పొలాలను సాగుచేయడానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు. మంచాలకట్ట, మల్లేశ్వరం, జటప్రోల్ గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు చేపలు పట్టడంతో పాటు పంటలు కూడా సాగు చేస్తారు. శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టినప్పుడు దాదాపు వేల ఎకరాలు ముంపునకు గురయ్యాయి. కొల్లాపూర్ నియోజకవర్గంలోని కృష్ణానదీ పరివాహక ప్రాంతాల కొన్ని గ్రామాల ప్రజలు కృష్ణానదికి దగ్గర్లో నూతనంగా గ్రామాలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి సంవత్సరం కృష్ణానదిలో ఈభూములు మునకకు గురైన తర్వాత మళ్లీ నీరు తీశాక అక్కడే ఉన్న కొంతమంది రైతులు భూములను వ్యవసాయం చేసుకుంటారు. మరికొందరు మునకకు గురైనప్పుడు ఆ గ్రామాలు వదిలిపెట్టి ఇతర ప్రాంతాలకు వెళ్లినవారి భూములను అక్కడే ఉన్న రైతులు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తుంటారు. నాణ్యతతో పాటు అధిక దిగబడులు 1500 నుంచి 2000 ఎకరాల్లో పంట పొలాలు -
ఆపద మిత్రలు అప్రమత్తంగా ఉండాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): గ్రామాల్లో జరిగే విపత్తుల సందర్భంగా ఆపద మిత్రలు అప్రమత్తమై గోల్డెన్ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎ్స్డీఆర్ఎఫ్ రాష్ట్ర నోడల్ అధికారి గౌతమ్ అన్నారు. గురువారం జెడ్పీ హాల్లో ఆపద మిత్రలకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ విపత్తుల నివారణ సంస్థతో చేసుకొన్న ఒప్పందం ప్రకారం రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ ఆదేశాల మేరకు జిల్లాలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ జిల్లాలో 300 మంది ఆపద మిత్ర వలంటీర్లకు 3 దశలలో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. గ్రామాల్లో ప్రమాదాలు జరినప్పుడు ఎలా వ్యవహరించాలో వారికి శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమయంలో గోల్డెన్ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే అంశంపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర అధికారులు ఆర్ఎస్ మిశ్రా, లికున్ పాత్రా, జిల్లా ఫైర్ అధికారి కిశోర్, తహసీల్దార్ జె. సువర్ణరాజు, జిల్లా శిక్షణ కేంద్ర కోఆర్డినేటర్ హన్మంతు పాల్గొన్నారు. -
జాయింట్ సర్వే నిర్వహిస్తేనే మేలు..
అసైన్డ్ పట్టాలు పొందిన రైతులు పొజిషన్లోకి వెళ్లి సాగు పనులు చేపడితే ఫారెస్టు అధికారులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో రైతులు, ఫారెస్టు అధికారులకు గొడవలు చోటు చేసుకుంటున్నాయి. కొన్నిచోట్ల పోలీసు కేసులు సైతం నమోదయ్యాయి. జాయింట్ సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించాలని పలుమార్లు న్యాయస్థానాలు సూచిస్తున్నా.. ఇరు శాఖల అధికారులు పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా జాయింట్ సర్వే నిర్వహించి.. భూములకు హద్దులు నిర్ణయిస్తే సమస్యకు పరిష్కారం లభించే ఆస్కారముంది. -
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
పాలమూరు: సమాజంలో ప్రతి ఒక్క అమ్మాయి ఉన్నత చదువులు చదవడంతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర అన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ మహిళ కళాశాలలో గురువారం అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యాయమూర్తి హాజరై మాట్లాడారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ఆరేళ్ల నుంచి 14 ఏళ్ల బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలన్నారు. సమాజంలో మహిళ పాత్ర చాలా గొప్పదని, మహిళ లేకపోతే మానవ మనుగడ లేదన్నారు. కుటుంబంలో పురుషులతో పాటు మహిళలకు సమాన ఆస్తి హక్కు ఉంటుందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా అత్యాచారాలు, గృహహింస చట్టాలపై అవగాహన కల్పించారు. అనంతరం మహిళ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ చైర్మన్ నటరాజ్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ అపర్ణ తదితరులు పాల్గొన్నారు. -
రేపు మిషన్ భగీరథనీటి సరఫరా నిలిపివేత
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): మన్యంకొండ నుంచి సరఫరా అయ్యే మిషన్ భగీరథ నీటిని ఒకరోజు పాటు నిలిపి వేయనున్నట్లు మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈ వెంకట్రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 8వ తేదీ శనివారం ఉదయం 6 గంటల నుంచి 9వ తేదీ ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరా నిలిపి వేయన్నుట్లు పేర్కొన్నారు. మన్యంకొండ నుంచి మరికల్ వెళ్లే దారిలో దేవరకద్ర ఆర్చ్ వద్ద మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ అవుతున్న నేపథ్యంలో ఆ పైపులు తీసి కొత్త పైపులు అమర్చాల్సి ఉందని తెలిపారు. దీంతో దేవరకద్ర, నర్వ, మరికల్, ఊట్కూర్, నారాయణపేట, దామరగిద్ద మండలాలు పూర్తిగా, కౌకుంట్ల, చిన్నచింతకుంట, మక్తల్, ధన్వాడ మండలాలు పాక్షికంగా, మక్త ల్, నారాయణపేట మున్సిపాలిటీలు పూర్తిగా మొత్తం 245 గ్రామాలు మరియు 2 మున్సిపాలిటీల్లో నీటి సరఫరా ఉండదని వివరించారు. కృష్ణా జలాల కేటాయింపుపై పోరాడాలి పాలమూరు: కృష్ణా బేసిన్లోని అన్ని జిల్లాల్లో నీటి వాటా కోసం కృష్ణానది జలసాధన జేఏసీలు ఏర్పాటు చేసి పోరాడాల్సిన అవసరం ఉందని పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షుడు హరగోపాల్, కన్వీనర్ రాఘవాచారి గురువారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు నిధులు అన్నింటిని ఆంధ్ర ప్రాంతాల్లో వెచ్చించి, కృష్ణానది జలాల దోపిడీకి పాల్పడ్డారని ఆ క్రమంలో ఎన్నో పోరాటాలు చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణ వచ్చినా.. పార్టీల అధికారం మారినా.. స్థానిక రైతులకు సాగునీరు ఇవ్వలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర పక్షపాత ధోరణి ప్రదర్శిస్తూ తెలంగాణకు నీటి వాటా పంపిణీ చేయలేదని, గత ప్రభుత్వం కేంద్రంతో పోరాడి నీటివాటా సాధించడంలో విఫలమైందని ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలల గడుస్తున్నా కృష్ణానది జల సాధనకు కృషి చేయడం లేదని విమర్శించారు. ప్రాజెక్టు రూపకల్పనపై అవగాహన మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో వాణిజ్యశాస్త్ర విభాగం విద్యార్థులకు ప్రాజెక్టు రూపకల్పనపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ చెన్నప్ప మాట్లాడుతూ బ్యాంకింగ్, బీమా, వ్యాపార, వాణిజ్య వంటి అంశాలను ఎన్ను కుని క్షణ్ణంగా అధ్యయనం చేయాలని సూచించారు. ఇలాంటి ప్రాజెక్టుల పరిశోధనల ద్వారా విద్యార్థుల వికాసం, సృజనాత్మకత, విశ్లేషణ నైపుణ్యాలు మెరుగుపడతాయని తెలిపారు. కార్యక్రమంలో కంట్రోలర్ రాజ్కుమార్, అనురాధారెడ్డి, రంగప్ప, సురేష్ పాల్గొన్నారు. ఆరుగురికి పదోన్నతి మహబూబ్నగర్ క్రైం: జోగుళాంబ జోన్–7 పరిధిలో ఆరుగురు కానిస్టేబుళ్లకు హెడ్కానిస్టేబుళ్లుగా పదోన్నతి ఇస్తూ గురువారం డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి వచ్చిన వారిలో చిన్ను నాయక్, బాలయ్య, బి.రాజు, వి.నాగరాజు, ఎం.వెంకటయ్య, రాములు, రాజేషం ఉన్నారు. వీరికి ఉమ్మడి జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లలో పోస్టింగ్లు కేటాయించారు. -
పరిష్కారం చూపాలి
రెవెన్యూ, ఫారెస్టు శాఖలు సమన్వయంతో జాయింట్ సర్వే నిర్వహించి అసైన్డ్ పట్టాదారులకు ఇబ్బందులు రాకుండా పరిష్కారం చూపాలి. అసైన్డ్ పట్టాలు ఉన్నా ఫారెస్టు వారు భూముల్లో సాగు చేయనివ్వడం లేదు. ప్రభుత్వ మిగులు భూమి అందుబాటులో ఉంది. అయినా అసైన్డ్ పట్టాదారులను ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదు. జాయింట్ సర్వే నిర్వహించి మిగులు భూమిని గుర్తించాలి. పేదలకు మరిన్ని అసైన్డ్ పట్టాలు ఇవ్వాలి. – బి.నాగన్న, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు -
SLBC టన్నెల్ ప్రమాదం: వీడని ఉత్కంఠ.. 13 రోజులైనా జాడే లేదు
సాక్షి, నాగర్ కర్నూల్/మహబూబ్నగర్: ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల వెలికితీతపై ఉత్కంఠ వీడటం లేదు. 13 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నా కార్మికుల ఆచూకీ లభించలేదు. మూడు షిప్టుల్లో 24 గంటలూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 13 రోజులు గడుస్తున్నా 8 మంది కార్మికుల ఆచూకీ ఇంకా దొరకలేదు. అనుమానిత ప్రాంతాల్లో ముమ్మరంగా తవ్వకాలు చేపట్టారు. టీబీఎం మిషన్పై బుర తొలగింపునకు వాటర్ గన్స్ ఉపయోగిస్తున్నారు. రోబోల వినియోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.కాగా, కొన్ని రోజులుగా కష్టపడి పునరుద్ధరించిన కన్వేయర్ బెల్టు మళ్లీ తెగిపోయింది. సొరంగంలోని మట్టి, ఇతర వ్యర్థాలను లోకో ట్రైన్ ద్వారానే తరలిస్తున్నారు. సొరంగం పైకప్పు కూలిన ప్రదేశంలో నీటి ఊట ఏ మాత్రం తగ్గలేదు. టన్నెల్లో ఉబికి వస్తున్న నీటి ఊటతో డ్రిల్లింగ్ పనులు ముందుకు సాగడం లేదు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్స్, ఇతర సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. జీపీఆర్ ద్వారా మానవ అవశేషాలను గుర్తించిన ప్రాంతాల్లో బురద, మట్టి ఇతర వ్యర్థాల తొలగింపు ప్రక్రియ చేపడుతున్నారు.అయితే సహాయక బృందాల మధ్య సమన్వయం కొరవడటంతో, ఎవరికి వారు ఇక్కడ.. అక్కడ అన్నట్టుగా పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు ఇలాగే కొనసాగితే మరో 10 రోజులైనా సొరంగంలో చిక్కుకున్న వారిని బయటికి తెచ్చే పరిస్థితి కనిపించడం లేదు. లోకో ట్రైన్ 13.5 కిలోమీటర్ల వరకు వెళ్తుండటంతో మట్టి, రాళ్లతో పాటు కట్చేసిన టీబీఎం మెషీన్ విడి భాగాలను బయటకు తరలిస్తున్నారు. కాగా, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వచ్చి వెళ్లిన నాటి నుంచి అధికారుల హడావుడి అంతగా కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను బయటికి తీసుకు రావడం కష్టతరంగా మారుతోంది. టన్నెల్లో దుర్వాసన వస్తుండటంతో సహాయక చర్యలు చేపట్టలేని పరిస్థితిలో సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పేరుకుపోయిన మట్టి, శిథిలాలకు తోడు నీటి ఊట ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో ఒక అడుగు ముందుకు పడితే.. రెండు అడుగులు వెనక్కి పడుతున్నాయని రెస్క్యూ బృందాలు వాపోతున్నాయి. గతనెల 22 నుంచి వివిధ విభాగాలకు చెందిన సహాయక బృందాలు సొరంగంలో జల్లెడ పడుతున్నా కార్మికుల ఆనవాళ్లు లభించడం లేదు. సొరంగం కూలిన ప్రాంతంలో భూ ప్రకంపనలకు గల అవకాశాలను నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రతినిధుల బృందం పరిశీలించింది. -
బాలుడి భద్రతకు భరోసా
వనపర్తి: సవతి తల్లి వేధింపులతో పసి బాలుడి హృదయానికి గాయమైంది. పోలీసులు చిన్నారిని ప్రేమతో ఓదార్చారు. వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అక్కున చేర్చుకొని నీకు మేము ఉన్నాం అంటూ భరోసా ఇచ్చారు. వివరాలు.. పెబ్బేరు మండలం సూగూరుకికి చెందిన గొల్ల నరసింహా, వనిత దంపతులకు తొమ్మిదేళ్ల బాలుడు ఉన్నాడు. వనిత అనారోగ్యంతో రెండేళ్ల క్రితం మరణించింది. పెద్దల బలవంతంపై నరసింహా సమీప బంధువైన లక్ష్మిని రెండో వివాహం చేసుకున్నాడు. పైళ్లెన కొత్తలో లక్ష్మి ఆబాలుడిని బాగానే చూసుకునేది. కాలం గడిచేకొద్ది ఆ చిన్నారిని చీటికిమాటికీ చిత్రహింసలకు గురిచేసేది. నిప్పులో కాల్చిన సలాకితో అతడి తొడలపై వాతలు పెట్టింది. ఈ విషయాన్ని ఆచిన్నారి తండ్రికి చెప్పినా ఆమె అరాచకానికి అడ్డుకట్ట వేయలేకపోయాడు. మంగళవారం సవతితల్లి అకారణంగా చితకబాదగా ఆవిషయాన్ని ఆ అబ్బాయి తన మేనమామ రామచంద్రయ్యకు ఫోన్ ద్వారా తెలిపాడు. అతడు బాలుడిని తీసుకొని ఎస్పీ కార్యాలయానికి వచ్చాడు. సవతి తల్లి పెట్టిన ఇబ్బందులు, హింసను రామచంద్రయ్య ఎస్పీకి వివరించారు. దెబ్బలను గుర్తుకు తెచ్చుకొని కన్నీటి పర్యంతమైన బాలుడిని ఎస్పీ చేరదీసి అల్పహారాన్ని అందజేసి ఓదార్చారు. అనంతరం అతడితో సమాచారమంతా రాబట్టారు. రూరల్ డెవలప్మెంట్ సొసైటీ జిల్లా అధికారి, జిల్లా బాలల పరిరక్షణాధికారి, భరోసా కేంద్రం కోఆర్డినేటర్ల ద్వారా బాలుడు ఎదుర్కొన్న మనోవేదనను, చిత్రహింసల వివరాలను సేకరించాలని కోరారు. వారి నివేదిక ఆధారంగా నిందితురాలిపై పెబ్బేరు పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకున్నారు. బాలుడిలో మనోధైర్యాన్ని కలిగించి ఏదైనా పాఠశాలలో చేర్పిస్తామని ఎస్పీ తెలిపారు. సవితి తల్లి వేధింపులు పోలీసులను ఆశ్రయించిన చిన్నారి అక్కున చేర్చుకున్న ఎస్పీ -
రమణీయం.. రామలింగేశ్వరుడి రథోత్సవం
వెల్దండ: మండలంలోని గుండాల గ్రామంలో బుధవారం తెల్లవారుజామున శ్రీఅంబా రామలింగేశ్వర స్వామి పెద్ద రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద రథోత్సవంను పూలతో అలంకరణ చేసి స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువుదీరగా భక్తులు పోటాపోటీగా రథాన్ని లాగారు. శివనామస్మరణతో గుండాల గ్రామం మార్మోగింది. రథంపై ఊరేగుతున్న ఆదిదపంతులను భక్తులు దర్శించుకొని భక్తిపారవశ్యంతో పులకించిపోయారు. రథోత్సవం సందర్భంగా సీఐ విష్ణువర్ధన్రెడ్డి, ఎస్ఐ కురుమూర్తి ఆధ్వర్యంలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఆలయ ఆవరణలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి భక్తులకు నచ్చజెపుతూ ఎస్ఐలు కృష్ణాదేవా, మహేందర్, పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ సందీప్రెడ్డి, వైస్ చైర్మన్ అరుణ్కుమార్, ఈఓ ప్రసాద్, ఆలయ అర్చకులు బాలస్వామిశర్మ, కృష్ణయ్యశర్మ, వీరేశంశర్మ, శివకుమార్శర్మ, నరహరిశర్మ, సంతోష్శర్మ, సురేష్శర్మ, ఆలయ కమిటీ సభ్యులు అంజయ్య, మల్లేష్ ముదిరాజ్ ఉన్నారు. గుండాలలో మార్మోగిన శివనామ స్మరణ భక్తి పారవశ్యంలో భక్తులు పోలీసుల భారీ బందోబస్తు -
రహదారి భద్రతపై సుప్రీం కమిటీ
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): రహదారి భద్రతపై సుప్రీంకోర్టు కమిటీ నియమించినట్లు రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ డి.జానకితో కలిసి పోలీస్, రవాణా, జాతీయ రహదారులు, వైద్యారోగ్య, ఆర్అండ్బీ శాఖల అధికారులతో జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశాలు నిర్వహించి ఎప్పటికప్పుడు ప్రమాదాలు జరిగే రాష్ట్ర, జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్, ఎస్పీ, ఆర్అండ్బీ అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు వివిధ శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. జిల్లాల్లో రహదారి భద్రతపై సమావేశాలు నిర్వహించి తీసుకున్న చర్యలపై ఆయా శాఖల అధికారులు రవాణా శాఖ కమిషనర్ కార్యాలయానికి నివేదికలు సమర్పించాలన్నారు. సుప్రీంకోర్టు కమిటీకి నివేదిక సమర్పించాల్సి ఉంటుందని, ఈ అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గతేడాది జిల్లాలో 108 రోడ్డు ప్రమాదాలు జరిగినట్టు డేటా ఉందని, ఆయా శాఖలు డేటా అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా 19 ఏళ్ల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్నవారు ఎక్కువగా రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నట్లు ఆయన వివరించారు. పాఠశాలల విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలని అన్నారు. ప్రభుత్వం నవంబర్ 16, 2024 నుంచి ఎలక్ట్రిక్ వాహనాలపై రోడ్డు టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు వంద శాతం మినహాయింపు చేసిందని, ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రానున్న రోజుల్లో రోడ్డు భద్రతకు మరిన్ని చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. జాయింట్ ట్రాన్స్ఫోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్గౌడ్, రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్రావు, ఆర్అండ్బీ ఈఈ దేశ్యానాయక్, ట్రాన్స్ఫోర్ట్ డిప్యూటీ కమిషనర్ కిషన్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో పనిచేయాలి భద్రత చర్యలపై తీసుకున్న నిర్ణయాలపై నివేదికలు పంపండి విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలి రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్ -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
● ముగ్గురికి గాయాలుకొత్తకోట రూరల్: కారు డ్రైవర్ అజాగ్రత్త కారణంగా ముందు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందినట్లు ఎస్ఐ ఆనంద్ తెలిపారు. వివరాలు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి పట్టణానికి చెందిన కనికాపురం రామయ్య, అతని భార్య వసంత, కుమారుడు లోకేష్ హైదరాబాద్లో బంధువుల పెళ్లి ఉండటంతో సొంత కారుకు డ్రైవర్గా మల్లికార్జునను తీసుకొని బయలుదేరారు. బుధవారం తెల్లవారుజామున కారు వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నాటవెళ్లి సమీపంలోకి రాగానే డ్రైవర్ అజాగ్రత్తగా అతివేగంగా నడిపాడు. ముందు వెళ్తున్న గుర్తుతెలియని వాహనాన్ని బలంగా ఢీకొనడంతో కారు ముందు సీట్లో ఉన్న రామయ్య(58) తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. కారు డ్రైవర్తో పాటు వెనుక సీట్లో ఉన్న వసంత, లోకేష్కు స్వల్పగాయాలయ్యాయి. మృతుడి కుమారుడు సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను 108లో వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. లోకేష్ ఫిర్యాదు మేరకు డ్రైవర్ మల్లికార్జునపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. వివాహిత బలవన్మరణం గద్వాల క్రైం: తీవ్రమైన తలనొప్పి, నరాల బలహీనతతో బాధపడుతున్న ఓ వివాహిత మనస్తాపం చెందిన ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని పరుమాలలో చోటుచేసుకుంది. రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన సుమతి (34) కొంతకాలంగా తీవ్రమైన అరోగ్య సమస్యలు ఎదుర్కొంటుంది. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికొచ్చిన భర్త నరేష్ గమనించి చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ తెలిపారు. రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య మహబూబ్నగర్ క్రైం: ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే ఎస్ఐ సయ్యద్ అక్బర్ కథనం ప్రకారం..జిల్లా కేంద్రంలోని ఏనుగొండకు చెందిన కె.నరేష్కుమార్(29) మంగళవారం రాత్రి 11.30 ప్రాంతంలో ఏనుగొండ సమీపంలో రైలు కింద తల పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు నరే ష్కుమార్ కొన్ని రోజుల నుంచి ఉపాధి కోసం ప్రయత్నం చేయగా ఎలాంటి పని దొరకపోవడంతో పాటు ఆరోగ్య సమస్య వల్ల మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ● రైలు ఢీకొట్టడంతో గాయాలైన క్షతగాత్రుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఈ నెల 1న మధ్యాహ్నం కౌకుంట్ల సమీపంలో గుర్తు తెలియని వ్యక్తిని (45) రైలు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు అయ్యా యి. దీంతో ఆయనను జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సయ్యద్ అక్బర్ తెలిపారు. -
క్రేన్ మరమ్మతులకు వచ్చి.. హత్య చేశాడు
బిహార్ కూలి హత్య కేసును ఛేదించిన పోలీసులు ● హైదరాబాద్ ఎంజీబీఎస్లో నిందితుడి అరెస్ట్ ● డీఎస్పీ వెంకటేశ్వర్లు జడ్చర్ల: ఓ పరిశ్రమలో భారీ క్రేన్ను మరమ్మతు చేయడానికి వచ్చిన వ్యక్తి హత్యకు పాల్పడ్డాడు. హత్య చేసిన నిందితుడు పరారీ కాగా పోలీసులు ఛేదించి పట్టుకున్నట్లు డిఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం జడ్చర్ల పోలీస్స్టేషన్లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నిందితుడు వినయ్ క్రేన్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. మండలంలోని పెద్దపల్లి గ్రామ శివారులో గల విర్కో బల్క్డ్రగ్ కంపెనీలో క్రేన్ మరమ్మతులకు గురైంది. దీని రిపేర్ చేసేందుకు గత నెల 24వ తేదీన పూణే నుంచి వినయ్ జడ్చర్లకు వచ్చాడు. అదేరోజు క్రేన్ను పరిశీలించి మరమ్మతుకు అవసరమైన విడిభాగాలను తెప్పించేందుకు క్రేన్ యజమానికి సమాచారమిచ్చి రాత్రికి పూణేకు బయలుదేరేందుకు సిద్ధమయ్యాడు. అయితే క్రేన్ ఆపరేటర్స్ ఉండేందుకు బీఆర్రెడ్డి గార్డెన్లో ఏర్పాటుచేసిన రూంలో అతడు బసచేశాడు. పూణే వెళ్లేందుకు గది నుంచి బయటకొచ్చి మెట్లపైె కూర్చున్నాడు. మెట్లు ఎక్కే క్రమంలో మద్యం మత్తులో ఉన్న హతుడు బిహార్ రాష్ట్రానికి చెందిన కూలి రషీద్ఖాన్ నిందితుడు వినయ్ను తాకుతూ వెళ్లాడు. ఈక్రమంలో వారి మధ్య మాటామాట పెరిగి ఘర్షణకు దారితీసింది. రషీద్ఖాన్ తలను వినయ్ గోడకేసి బాదడంతో బలమైన గాయమై అక్కడికక్కడే మరణించాడు. మృతుడి సెల్ఫోన్ను తీసుకొని నిందితుడు పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేపట్టారు. బీఆర్రెడ్డి గార్డెన్లో నివాసం ఉంటున్న కూలీలను విచారించారు. వినయ్ కనిపించకపోవడంతో అనుమానం వచ్చి అతడి యజమానిని విచారించగా అసలు విషయం బయటపడింది. హత్య అనంతరం వినయ్ యజమానితో జరిగిన విషయం చెప్పాడు. దీంతో అతడు పోలీసులకు లొంగిపోవాలని యజమాని సూచించాడు. నిందితుడు మాత్రం అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు బుధవారం హైదరాబాద్లోని ఎంజీబీఎస్ బస్టాండ్లో నిందితుడిని అరెస్ట్చేశారు. హతుడి సెల్ఫోన్ను స్వాధీనం చేసుకొని రిమాండ్ తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. సీఐ కమలాకర్, ఎస్ఐలు మల్లేష్, చంద్రమోహన్, జయప్రసాద్ పాల్గొన్నారు. -
మైసమ్మ సన్నిధిలో డీఐజీ చౌహాన్
నవాబుపేట: ప్రసిద్ధి చెందిన పర్వాతాపూర్ మైసమ్మ దేవాలయాన్ని బుధవారం డీఐజీ చౌహాన్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ జగన్మోహన్రెడ్డి, ఆలయ అధికారి నర్సింహులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు చేశారు. పూజారులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా డీఐజీ చౌహాన్ మాట్లాడుతూ ప్రకృతి సిద్ధమైన అడవిలో వెలసిన అమ్మవారి చెంత చాలా ప్రశాంతత ఉందన్నారు. మైసమ్మ టెండర్ల ఆదాయం రూ. 51 లక్షలు.. పర్వతాపూర్ మైసమ్మ దేవాలయంలో విక్రయించే టెంకాయలు, పూజా సామగ్రి తదితర వాటికి సంబంధించిన టెండర్ల ద్వారా రూ. 51 లక్షల ఆదాయం సమకూరినట్లు దేవాలయ చైర్మన్ జనగ్మోహన్రెడ్డి, ఆలయ అధికారి నర్సింహులులు తెలిపారు. బుధవారం మైసమ్మ దేవాలయ ఆవరణలో నిర్వహించిన టెండర్లలో టెంకాయలకు సంబంధించి రూ.31.83లక్షలకు పాశం వెంకటేష్ టెండర్ దక్కించుకున్నాడు. వాహన పూజ సామగ్రికి రూ.14.07లక్షలు, పూల విక్రయానికి రూ. 5.67లక్షలకు కాకర్లపహాడ్కు చెందిన అంకం ఆంజనేయులుకు లభించాయి. వీరంతా వచ్చే నెల నుంచి దేవాలయంలో నూతన విక్రయాలు చేసేందుకు అనుమతి ఇస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వీణదరి, గోపాల్, అనుసూయమ్మ, అంజనేయులు, మల్లేష్, బాలయ్య, రమేష్, రాజు, నరేష్, వెంకటే్ష్, రాములుపాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేకపూజలు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ చైర్మన్, అధికారి -
ఏడాది గడిచినా అందని పరిహారం
ఉప్పునుంతల: మండలంలో కేఎల్ఐ కాల్వ పనులు ప్రారంభించి ఏడాది గడుస్తున్నా తమ భూములకు పరిహారం అందని లేదని తాడూరు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం తాడూరు గ్రామ శివారులో సాగుతున్న కేఎల్ఐ కాల్వ పనులను వారు అడ్డుకున్నారు. రెండు పర్యాయాలు స్థానిక ఎమ్మెల్యేను కలిసి సమస్యను వివరిస్తే పరిహారం డబ్బులు ఇప్పిస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకు డబ్బులు అందలేదని రైతులు గున్నమోని లింగమయ్య, శంకరయ్య, లక్ష్మయ్య, బక్కయ్య, నీరంజన్, రాములమ్మ, బొడ్డుపల్లి చంద్రయ్య, పంగ వెంకటయ్య తెలిపారు. పక్కనే ఉన్న అచ్చంపేట మండలం పులిజాల లో రైతులకు పరిహారం అందించారని, తమకు డబ్బులు ఇవ్వడంతో జాప్యం చేస్తున్నారని వాపోయారు. పరిహారం ఇచ్చేంత వరకు పనులు చేయకూడదని అక్కడున్న సూపర్వైజర్లకు, కూలీలకు రైతులు చెప్పారు. కేఎల్ఐ కాల్వ పనులను అడ్డుకున్న తాడూరు రైతులు -
విద్యుత్ సరఫరా నిలిపివేయాలంటూ రైతుల ఆందోళన
● చివరి ఆయకట్టుకు నీరు అందడంలేదని వాదన ● కోతలు విధించలేమన్న అధికారులు ● విద్యుత్ సిబ్బందితో వాగ్వాదం ధరూరు : వ్యవసాయానికి కరెంటు ఇవ్వాలని పోరాడిన ఘటనలు ఇప్పటివరకు చూశాం.. కానీ వ్యవసాయానికి కరెంట్ కట్ చేయాలంటూ రైతులు ఆందోళన బాట పట్టిన వింత ఘటన ధరూరు మండలంలో చోటుచేసుకుంది. నిరంతరాయంగా కరెంటు ఇవ్వడంతో నెట్టెంపాడు కాల్వ కింద ఉన్న రైతులకు నీరందడం లేదని, పగలు రెండు లేదా మూడు గంటలు కరెంట్ సరఫరా నిలిపివేయాలని, రాత్రి వేళ పూర్తిగా బంద్ చేయాలని రైతులు అల్వాల పాడు సబ్స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. 104 కాల్వకు నీళ్లు వస్తున్నందున చివరి ఆయకట్టులో ఉన్న కేటీదొడ్డి మండలం గువ్వలదిన్నె, వెంకటాపురం, ఈర్లబండ గ్రామాల రైతులకు ర్యాలంపాడు నుంచి విడుదలయ్యే నీరు అందడం లేదన్నారు. కాల్వ ముందు భాగంలో ఉన్న పొలాలకే నీళ్లు వస్తున్నాయంటూ విద్యుత్ సిబ్బందితో రైతులు వాగ్వాదానికి దిగారు. విషయాన్ని ఏఈ, ఏడీఈలకు ఫోన్లో సమాచారమివ్వగా వారు అక్కడి చేరుకున్నారు. రైతులతో మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరా నిలిపివేయడం అన్నది తమ చేతుల్లో లేదని, ఈవిషయంలో తామేమీ చేయలేమని వారు తేల్చి చెప్పారు. దీంతో రైతులు కలెక్టర్కు విన్నవిస్తామని అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
పోటెత్తిన ఉల్లి
● ఉల్లి కుప్పలతో నిండి న దేవరకద్ర మార్కెట్ ● గరిష్ట ధర రూ. 2,550 ● కనిష్టంగా రూ. 1,800 దేవరకద్ర: దేవరకద్ర మార్కెట్కు బుధవారం ఉల్లి పోటెత్తింది. వివిధ గ్రామాల నుంచి రైతులు ఉల్లిని పెద్ద ఎత్తున అమ్మకానికి తెచ్చారు. దాదాపు ఐదు వేల బస్తాల ఉల్లి అమ్మకానికి రావడంతో మార్కెట్ యార్డు ఆవరణం అంతా ఉల్లి కుప్పలతో నిండిపోయింది. స్థలం సరిపోక గోదాంల పక్కన సీసీ రోడ్డుపై ఉల్లిని కుప్పలుగా పోశారు. ప్రస్తుతం సీజన్ కావడంతో కోతలు కోసిన ఉల్లిని రైతులు నేరుగా మార్కెట్కు తెస్తున్నారు. దిగుబడులు ఎక్కువగా వస్తుండటంతో ఒక్కో రైతు రెండు నుంచి మూడు ట్రాక్టర్ల ఉల్లిని అమ్మకానికి తెచ్చారు. ఎండలు బాగా ఉండడంతో బాగా ఆరబెట్టిన నాణ్యమైన ఉల్లి మార్కెట్కు వచ్చింది. జోరుగా కొనుగోళ్లు దేవరకద్ర మార్కెట్లో ఉదయం 10 గంటలకు ప్రారంభమైన వేలం పాటలు మధ్యాహ్నం 2గంటల వరకు కొనసాగింది. ఉల్లి ఎక్కువ రావడంతో వ్యాపారులు ప్రతి కుప్ప వద్దకెళ్లి వేలం పాట పాడాల్సి వచ్చింది. మొదటి రకం ఉల్లికి గరిష్టంగా రూ.2550, కనిష్టంగా రూ.1800 వరకు ధర పలికింది. గత వారంతో పోల్చితే ధరలు నిలకడగానే ఉన్నాయి. స్థానిక వ్యాపారులతో పాటు బయట నుంచి వచ్చిన వ్యాపారులు పోటీపడి ఉల్లిని కొనుగోలు చేశారు. వేలాది బస్తాల ఉల్లిని బయటి వ్యాపారులే ఎక్కువగా ఖరీదు చేశారు. చిరు వ్యాపారులు కూడా చిన్నచిన్న కుప్పలను కొనుగోలు చేశారు. ఇక స్థానిక వ్యాపారులు కొనుగోలు చేసిన ఉల్లిని వినియోగ దారులకు బస్తాలుగా అమ్ముకున్నారు. మార్కెట్ నిబంధనల ప్రకారం తూకం వేసిన 45 కేజీల ఉల్లి బస్తా ధర గరిష్టంగా రూ. 1300, కనిష్టంగా రూ. 900 వరకు విక్రయించారు. -
చిరుత కోసం బోను ఏర్పాటు
మద్దూరు: ఉమ్మడి మద్దూరు, దామరగిద్ద మండలాల్లో కొన్నినెలలుగా చిరుత సంచారిస్తోంది. రెండు మండలా ల్లో తరుచూ ఎక్కడో ఓ చోట చిరుత లేగదూడలను, మేకలను చంపుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈనేపథ్యంలో అటవీ శాఖాధికారులు మోమినాపూర్, కంసాన్పల్లి, బొమ్మన్పాడ్ శివారులోని గు ట్టల దగ్గర బోను ఏర్పా టుచేశారు. వాటి కదలి కలను గుర్తించడానికి అడవిలో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసినట్లు మద్దూరు సె క్షన్ అధికారి లక్ష్మణ్నాయక్ తెలిపారు. మద్దూరు, కొత్తపల్లి, దామరగిద్ద మండలాల్లో దాదాపు 4చిరుతల సంచారం ఉందని అధికారులు తెలుపుతున్నారు. ఇప్పటివరకు ఈ ప్రాంతాల్లో మూడు చిరుతలు మృతిచెందగా, ఒక చిరుత బోనుకు చిక్కింది. మోమినాపూర్, దుప్పట్గట్, జాధరావ్పల్లి, నందిపాడ్, నందిగామ గుట్టల్లో చిరుతల సంచారంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. నెల రోజుల లోపే మోమినాపూర్లో చిరుతల వరుస ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో బోను, సీసీ కెమెరా లను ఏర్పాటుచేశారు. మిగితా ప్రాంతాల్లో మాత్రం బోన్లు ఏర్పాటు చేయలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరుత దాడిలో దూడ మృతి.. మద్దూరు: చిరుత దాడిలో దూడ మృతి చెందిన ఘటన మోమినాపూర్ శివారులో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు కులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన గూళ్ల హన్మంతు మంగళవారం రాత్రి తన పొలం దగ్గర మిగతా పశువులతో పాటు దూడ కట్టేసి ఇంటికొచ్చాడు. ఉదయం పొలానికెళ్లి చూడగా దూడ మృతి చెందినట్లు గుర్తించారు. చిరుత దాడిలో దూడ మృతిచెందినట్లు ఫారెస్ట్ సెక్షన్ అధికారి లక్ష్మణ్నాయక్ ధ్రువీకరించారు. -
నకిలీ పోలీసులతో అప్రమత్తంగా ఉండాలి
మహబూబ్నగర్ క్రైం: డిజిటల్ అరెస్ట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసం చేయడానికి నకిలీ సీబీఐ, ఆదాయపు పన్ను, పోలీస్ అధికారులంటూ భయాందోళనకు గురి చేయడానికి చూస్తుంటారని వీరి పట్ల అప్రమత్తంగా ఉండాలని అదనపు ఎస్పీ రాములు అన్నారు. సైబర్ నేరాలపై బుధవారం ఎస్వీఎస్ మెడికల్ కళాశాలలో వైద్య విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మీ బ్యాంక్ ఖాతా టెర్రరిస్టులతో లింక్ అయ్యిందని, మనీలాండరింగ్ కేసులో మీ పేరు ఉందని భయపెడుతూ మెసేజ్లు చేస్తారని వెల్లడించారు. ఖాతాలు ఫ్రీజ్ కాకుండా ఉండాలంటే వాళ్లు చెప్పిన ఖాతాల్లో డబ్బులు బదిలీ చేయాలని మోసం చేస్తుంటారన్నారు. పోలీసులు ఎప్పుడూ కూడా ఫోన్లలో కేసులపై విచారణచేయడం జరగదని, ఫోన్లలో డబ్బులు అడగటం ఉండదని తెలిపారు. విద్యార్థులు సోషల్ మీడియాకు బానిసలు కావడంతో డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల పేరుతో భయపెడుతారని, స్మార్ట్ఫోన్లలో యాప్ల వాడకంపై అవగాహన ఉండాలన్నారు. విద్యార్థినులను అధికంగా భయపెడతారని, వేధింపులకు గురైతే సైబర్ పోలీసులకు, 1930 టోల్ ఫ్రీ నంబర్తో పాటు 8712672222కు ఫిర్యాదు చేయాలన్నారు. ఆనంతరం సైబర్ క్రైం డీఎస్పీ సుదర్శన్ వైద్యవిద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్గించారు. సైబర్ క్రైం సీఐ గోపాల్, రూరల్ సీఐ గాంధీనాయక్, ఐటీ సెల్ ఎస్ఐ రవి పాల్గొన్నారు. ● ఏఎస్పీ రాములు -
స్థానిక సమస్యలపై సీపీఎం బస్తీబాట
మహబూబ్నగర్ రూరల్: స్థానిక సమస్యలపై సీపీఎం బస్తీబాట పట్టనున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.రాములు తెలిపారు. బుధవారం మాచన్పల్లిలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ పోరాటాలకు ప్రజలను సిద్ధం చేస్తామన్నారు. కార్పొరేట్ శక్తులను కాపాడుకునేందుకు కేంద్ర బడ్జెట్ వారికే అనుకూలంగా ప్రవేశపెట్టి పేదలకు మాత్రం మొండి చెయ్యి చూపిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అసంపూర్తిగా అమలు చేస్తోందన్నారు. గ్రామాల్లో ఇప్పటి వరకు రైతులందరికీ రుణమాఫీ కాలేదని, అన్ని రకాల పెన్షన్స్ ఇంతవరకు ఇవ్వలేదన్నారు. రైతు భరోసా కూడా అసంపూర్తిగానే వేశారని తెలిపారు. సీపీఎం ఆధ్వర్యంలో నెల రోజుల పాటు గ్రామాల్లో ప్రజాసమస్యలు, స్థానిక సమస్యలు అధ్యయనం చేసి గ్రామపంచాయతీ కార్యాలయాల ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. నాయకులు కడియాల మోహన్, హన్మంతు, భగవంతు, లింగంగౌడ్ పాల్గొన్నారు. -
కారం, తొక్కులే నిత్య భోజనం..
నల్లమలలో మొత్తం 88 చెంచు ఆవాసాలు ఉండగా, చెంచుల మొత్తం జనాభా 9 వేల లోపే. ప్రభుత్వం వీరి సంక్షేమం, జీవన ప్రమాణాలు పెంచేందుకు రూ.కోట్లలో ఖర్చు చేస్తున్నామని చెబుతున్నా, వాస్తవంలో చెంచులు కనీసం సరైన తిండికీ నోచుకోవడం లేదు. చెంచుల్లో చిన్నారులు, మహిళల నుంచి పెద్దల వరకు నిత్యం కారం, తొక్కులతోనే కాలం గడుపుతున్నారు. అప్పాపూర్, భౌరాపూర్, మేడిమల్కల తదితర చెంచుపెంటల నుంచి కూరగాయలు కావాలంటే సుమారు 40 కి.మీ.దూరంలో ఉన్న మన్ననూరుకు వెళ్లాల్సి ఉంటుంది. పదిహేను, నెలరోజులకు ఒకసారి తెచ్చుకున్న కూరగాయలు, సరుకులతోనే సరిపెట్టుకుంటున్నారు. అటవీ అధికారుల ఆంక్షల నేపథ్యంలో తేనే, చెంచుగడ్డలు తదితర ఆహారం వారికి అరకొరగా దొరికినా, వాటిని ఆహారంగా తీసుకోకుండా ఇతరులకు విక్రయించేందుకే మొగ్గు చూపుతున్నారు. నల్లమలలోని కొమ్మెనపెంటలో చెంచు మహిళలు -
తిండికీ తిప్పలే..
కొమ్మెనపెంటలో చెంచుల ఆవాసాలు(బొడ్డు గుడిసెలు) నల్లమలలోని చెంచు మహిళలు, చిన్నారుల్లో రక్తహీనత సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: నల్లమలలోని చెంచు మహిళలు, చిన్నారుల్లో అధికశాతం మందిని రక్తహీనత సమస్య వేధిస్తోంది. సరైన పౌష్టికాహారం లేక చెంచులు తీవ్రమైన రక్తహీనతతో బాధపడుతున్నారు. దీంతో గర్భిణులకు ప్రసవ సమయంలో వేధన తప్పడం లేదు. కొన్ని సార్లు పుట్టిన శిశువులు సైతం మృత్యువాత పడుతుండటం కలచివేస్తోంది. మహిళల్లో హిమోగ్లోబిన్ శాతం కనీసం 12 వరకు ఉండాలి, అయితే చెంచు మహిళలు, గర్భిణులు, బాలింతల్లో 60 శాతానికి పైగా రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. 25 శాతం మంది మహిళలు 9 శాతం కన్నా తక్కువ రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నారు. కొన్ని కేసుల్లో 3–6 శాతం మాత్రమే హిమోగ్లోబిన్ ఉంటున్న తీవ్రమైన ఎనీమియా కేసులు చోటుచేసుకుంటున్నాయి. నల్లమలలోని చెంచు మహిళల్లో రక్తహీనత సమస్యపై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషియన్(ఎన్ఐఎన్) హైదరాబాద్ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించింది. శిశువులు నెలలు నిండక ముందే జన్మించడం, తక్కువ బరువుతో జన్మించడం, శిశు మరణాలు, పురుషులతో పాటు మహిళల్లోనూ ఆల్కహాలిక్ లివర్ సిర్రోసిస్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నట్టు గుర్తించింది. అడవినే నమ్ముకుని జీవనం గడుపుతున్న చెంచుల జీవితాలు సరైన తిండి, ఆదాయం లేక మరింత దుర్భరంగా మారుతున్నాయి. నిత్యం కారం, తొక్కులే ఆహారం చెంచు మహిళల్లో 60 శాతం మందికి ఎనీమియా సమస్య గర్భిణులు, బాలింతల్లో రక్తం లేక పెరుగుతున్న శిశుమరణాలు -
తొక్కులు, చింతపులుసే తింటాం
మేం ఎక్కువగా కారం, తొక్కులు, చింతపులుసు తింటాం. మా పిల్లలు కూడా అవే తింటారు. కూరగాయలు కావాలంటే మన్ననూరుకు పోయి తెచ్చుకుంటాం. 15 రోజులు, నెలకు ఒకసారి వెళ్లి తెచ్చుకుంటాం. వారం తర్వాత కూరగాయలు పాడవుతాయి. ఎక్కువ రోజులు కారం పొడి, తొక్కు వేసుకుని అన్నం తింటాం. – దంసాని ఈదమ్మ, కొమ్మనపెంట, అమ్రాబాద్, నాగర్కర్నూల్ జిల్లా సరైన ఆహారం లభించట్లేదు.. చెంచులు ఎక్కువగా రైస్, కారం, తొక్కులపైనే ఆధారపడుతున్నారు. కూరగాయలు, కూరలు, పౌష్టికాహారం లేక రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. పుట్టిన శిశువులు రక్తహీనతతో 2 నుంచి 2.5 కిలోల లోపే జన్మిస్తున్నారు. చలికాలంలో న్యూమోనియా, ముక్కు మూసుకుపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలతో శిశు మరణాలు చోటు చేసుకుంటున్నాయి. – డాక్టర్ సైఫుల్లా ఖాన్, ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ