Mahabubnagar
-
ఉత్కంఠగా బార్ అసోసియేషన్ ఎన్నికలు
పాలమూరు: జిల్లా బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికకు గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు బార్ అసోసియేషన్ భవన్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 505 ఓటర్లు ఉండగా దీంట్లో 454ఓట్లు పోలయ్యాయి. సాయంత్రం 5గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం చేయగా.. రాత్రి 10:30గంటలకు ముగిసింది. నూతన అధ్యక్షుడిగా ఆనందరావు తన సమీప ప్రత్యేర్థి ఉమామహేశ్వరిపై 181 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఉపాధ్యక్షుడిగా వెంకటయ్య తన ప్రత్యర్థి రాజశేఖర్పై 27ఓట్ల తేడాతో విజయం సాధించాడు. అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా నర్సింహారెడ్డి తన సమీప ప్రత్యేర్థి శ్రీధర్రావుపై 61ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కోశాధికారిగా బి.రాజుగౌడ్ ప్రత్యర్థి వెంకట్రావుపై 31ఓట్ల అధిక్యతతో విజయం సాధించాడు. కార్యవర్గ సభ్యులుగా కృష్ణవంశీ, మహేశ్కుమార్, విష్ణు వేద, శ్రీకర్, చంద్రశర్మ, మురళీమోహన్, మధ్వరాజ్ గెలుపొందారు. అదేవిధంగా సంయుక్త కార్యదర్శిగా సబితా, గ్రంథాలయ కార్యదర్శిగా ప్రభావతి, మహిళా కార్యవర్గ సభ్యులుగా మమత, ఝాన్సీ, జ్యోతి ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి కొండయ్య ప్రకటించారు. గెలుపొందిన నూతన కార్యవర్గ సభ్యులకు ఎన్నికల అధికారి నియామక పత్రాలు అందజేశారు. పాలమూరు జిల్లా అధ్యక్షుడిగా ఆనందరావు -
లెదర్పార్కు అభివృద్ధికి చర్యలు చేపట్టాలి
జడ్చర్ల: మండలంలోని పోలేపల్లి గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్కులో లెదర్పార్కు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో జీరో అవర్లో గురువారం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ లెదర్పార్కు కోసం 25ఎకరాల భూమిని కేటాయించారని, అప్పట్లో చర్మ ఉత్పత్తుల తయారీకి సంబంధించి ఇక్కడి యువతకు శిక్షణ కూడా ఇచ్చారని గుర్తు చేశారు. అంతేగాక మలుపు పథకంలో భాగంగా ఇక్కడ ఓ భవనాన్ని కూడా నిర్మించారని తదుపరి పట్టించుకోక పోవడంతో పథకం లక్ష్యం నీరుగారిపోయిందన్నారు. వృథాగా మారిన ఈ భూమిలో సమీప ఫార్మ పరిశ్రమల చెత్తను డంప్ చేసి కాలుష్యానికి కారణమవుతున్నారని అన్నారు. ఆయా పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఉదండాపూర్ రిజర్వాయర్ను సోమశిల మాదిరిగా పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దాలని. ఇక్కడ టూరిజం హోటల్ నిర్మాణంతోపాటు పర్యాటకులకు అందుబాటులో బోట్లను ఏర్పాటు చేయాలన్నారు. బస్డిపో ఏర్పాటు చేయండి జడ్చర్లలో ఆర్టీసీ బస్ డిపోను ఏర్పాటు చేయాలని సంబంధిత మంత్రి పొన్నం ప్రభాకర్ను ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి హైదరాబాద్లో కలిసి విన్నవించారు. కొత్త బస్రూట్లను ఏర్పాటు చేయాలని, బస్టాండ్ను ఆధునీకరించి ప్రయాణికులకు సౌకర్యాలను మెరుగుపరుచాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలకు బస్ సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. -
పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించండి
మహబూబ్నగర్ క్రైం: జిల్లాలోని ప్రతి పోలీస్స్టేషన్లో పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టిసారించి.. విచారణ త్వరగా పూర్తిచేయాలని ఎస్పీ డి.జానకి ఆదేశించారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలోని వీసీ హాల్లో గురువారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులతో పాటు అదృశ్య కేసులు, ఎన్బీడబ్ల్యూ, ఎస్సీ, ఎస్టీ కేసుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి కేసు పారదర్శకంగా విచారణ చేసి, బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. ప్రధానంగా సున్నితమైన ఎస్సీ, ఎస్టీ కేసుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించొద్దన్నారు. నేరాల నియంత్రణ కోసం నిత్యం వాహనాల తనిఖీలు చేపట్టాలని.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారి కట్టడి కోసం డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. ప్రతి స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ పెంచడంతో పాటు అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. అదనపు ఎస్పీ ఎన్.బిరత్నం, డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీసీఆర్బీ డీఎస్పీ రమణారెడ్డి, వర్టికల్ డీఎస్పీ బాలాజీ ఉన్నారు. ● విద్యార్థులు, యువకులు లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం ప్రాణాలకు ముప్పు అనే విషయాన్ని గ్రహించాలని ఎస్పీ జానకి అన్నారు. అరైవ్–అలైవ్లో భాగంగా స్థానిక రిషి జూనియర్ కళాశాలలో రోడ్డు భద్రతపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. త్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడ్, రాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ చేయరాదన్నారు. రూరల్ సీఐ గాంధీనాయక్, ఎస్ఐ విజయ్కుమార్, ఐటీ కోర్ టీం ఎస్ఐ రవి, రిషి విద్యాసంస్థల డైరెక్టర్ వెంకటయ్య, చంద్రకళ పాల్గొన్నారు. -
భయం.. భయంగా!
గండేడ్: మండలంలోని ఆశిరెడ్డిపల్లికి చెందిన ఉప్ప రి బాలయ్య మంగళవారం రాత్రి పొలం దగ్గర పడుకున్నాడు. అర్ధరాత్రి ప్రాంతంలో కుక్కలు విపరీతంగా మొరిగాయి. దీంతో ఆయన లేచి టార్చిలైట్ వేసి చూడడంతో కొద్ది దూరంలో చిరుత కూర్చుని కనిపించింది. దీంతో ఆయన గట్టిగా చప్పుడు చేసుకుంటూ భయంతో ఇంటికి వెళ్లిపోయాడు. కొండాపూర్కు చెందిన గొల్ల మైబయ్య బుధవారం మేకలను మేపుకొని సాయంత్రం ఆరుగంటలకు ఆశిరెడ్డిపల్లి వైపు నుంచి కొండాపూర్కు తిరిగి వస్తుండగా బొందెగట్టు సమీపంలోకి రాగానే రెండు చిరుతలు మేకలపై దాడికి దిగాయి. వెంటనే అప్రమత్తమైన మైబయ్య, ఆయన కుమారుడు మల్లేష్ గట్టిగా ఆరుస్తూ కట్టెలు విసిరారు. దీంతో రెండు మేకలను చిరుతలు వదిలేసి వెళ్లిపోయాయి. అప్పటికే ఒక్క మేక చనిపోగా మరో మేక తీవ్రంగా గాయపడింది. దీంతో వారు భయంతో మిగతా మేకలను తోలుకొని ఇంటికి పరుగులు పెట్టారు. ఇలా ఒక్కటికాదు రెండుకాదు తరుచుగా ఏడాది నుంచి ఈ ప్రాంతంలో చిరుతలు సంచరిస్తూ పశువులపై దాడి చేయడంతోపాటు రైతులు, ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. తాజాగా బొందెగట్టు ప్రాంతంలో ఒకేసారి మూడు చిరుతలు కంటపడడంతోపాటు మేకల మీద దాడిచేయడంతో ఈప్రాంతం వారు అనుక్షణం భయాందోళన చెందుతున్నారు. పెరిగిన చిరుతల సంచారం పొలాలకు వెళ్లాలంటేనే జంకుతున్న రైతులు పశువులకు కొరవడిన రక్షణ బోను ఏర్పాటుపై వీడని సందిగ్ధం ఆందోళనలో గ్రామీణ ప్రజలు -
జనరల్ ఆస్పత్రిలోని కుక్కల తరలింపు
పాలమూరు: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఏడుగురు బాధితులపై కుక్క దాడి ఘటనపై ఈనెల 24న సాక్షిలో ‘పిచ్చి కుక్కలు దొంగలు స్వైరవిహారం’ కథనం ప్రచురితమైంది. దీనిపై జనరల్ ఆస్పత్రి అధికారులతోపాటు కార్పొరేషన్ అధికారులు స్పందించారు. కార్పొరేషన్ అధికారులతో సమన్వయం చేసుకొని 24గంటలపాటు శ్రమించి గురువారం ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న మూడు వీధికుక్కలను తరలించారు. రోగులతో పాటు వారివెంట వచ్చే అటెండర్ల భద్రతకు ప్రాధన్యత ఇస్తూ ఇలాంటి ఘటనలు మళ్లీ కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని ఆస్పత్రి సూపరింటెండెంట్ రంగా అజ్మీరా వెల్లడించారు. -
కొత్త గ్రూపులు ఏర్పాటు చేయాల్సిందే
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఈనెలాఖరు వరకు నగర పరిధిలో ఇంకా 227 కొత్త ఎస్హెచ్జీలను ఏర్పాటు చేయాలని ఇన్చార్జ్ స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ మధుసూదన్నాయక్ ఆదేశించారు. గురువారం మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశ మందిరంలో మెప్మా సీఓలు, ఆర్పీలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరం (2025–26) లో కొత్తగా 377 మహిళా గ్రూపులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ణయిస్తే.. కేవలం 150 మాత్రమే చేయడమేమిటని మండిపడ్డారు. అలాగే కొత్తగా వీధి వ్యాపారులు 1,236కి గాను 743 మందినే చేర్పించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందిరా మహిళా శక్తి కింద 130 యూనిట్లకు గాను 104 ఏర్పాటు చేస్తే ఎలా? అని ప్రశ్నించారు. మిగిలిన 24 యూనిట్లు సైతం మహిళలతో ఏర్పాటు చేయించాల్సిందేనన్నారు. సమావేశంలో మెప్మా పీడీ మహమ్మద్ యూసుఫ్, సీ్త్రనిధి ఆర్ఎం వేణుగోపాల్రెడ్డి, ఏఎంసీ అజ్మీర రాజన్న, ఇన్చార్జ్ డీఎంసీ ఎం.లక్ష్మి, సీఓలు యాదయ్య, వరలక్ష్మి, దేవమ్మ, నిర్మల తదితరులు పాల్గొన్నారు. గురుకులాల్లో గ్రూప్–1 అధికారుల పర్యటన స్టేషన్ మహబూబ్నగర్: గ్రూప్–1 అధికారులు శిక్షణలో భాగంగా శుక్రవారం స్థానిక టీజీఎంఆర్ఎస్జేసీ బాలుర–1, బాలుర–2, బాలికల–1 గురుకులాల్లో క్షేత్రస్థాయి పర్యటన చేశారు. 24 మంది అధికారులు ఈ మూడు గురుకులాల్లో పర్యటించారు. ఆర్ఎల్సీ ఖాజా బాహుద్దీన్ వారిని ఆహ్వానించారు. -
వనపర్తిలో తీవ్ర ‘ఉద్రిక్తం’
● లైంగిక దాడి ఘటనలో బాలిక తరఫున పోరాడిన నేతలపై కేసులు ● పట్టణ పోలీస్స్టేషన్ ఎదుట రాజకీయ పార్టీల నేతల బైఠాయింపు.. నిరసన వనపర్తి: జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో మూడోతరగతి చదువుతున్న చిన్నారిపై వార్డెన్ లైంగికదాడికి పాల్పడిన ఘటనలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. సోమవారం ఘటన జరగగా.. బుధవారం వెలుగులోకి రావడం, విషయం బయటకు రాకుండా యాజమాన్యం, లైంగిక దాడికి పాల్పడిన వార్డెన్పై బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేయడం, పాఠశాలలో సామగ్రి ధ్వంసం చేసిన విషయం విధితమే. బాలిక తరుఫున పోరాడిన పలువురు రాజకీయ పార్టీల నాయకులను పోలీసులు గురువారం తెల్లవారుజామున ఇళ్లకు వెళ్లి అరెస్ట్చేసి పట్టణ పోలీస్స్టేషన్కు తరలించి నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపించే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న ఆయా పార్టీల నాయకులు, ముస్లిం మతపెద్దలు, యువకులు పోలీస్స్టేషన్కు భారీగా చేరుకున్నారు. అప్పటికే పోలీస్స్టేషన్ గేటు ఎదుట సుమారు పదిమంది కానిస్టేబుళ్లను గస్తీ ఉంచి మీడియా, బాధితుల తరుఫు వారిని, అరెస్ట్ చేసిన నాయకుల తరుఫు వారిని లోనికి రానివ్వకుండా అడ్డుకున్నారు. అధికార పార్టీ నేతలకు మాత్రం లోనికి వెళ్లే వెసులుబాటు కల్పించడంతో అక్కడున్న ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. తెల్లవారుజామున తొమ్మిది మందిని అరెస్టు చేయగా.. ఇటీవల కాంగ్రెస్ను వీడిన నేతకు స్టేషన్ బెయిల్ ఇస్తూ, మిగతా ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎనిమిది మందిని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. పోలీస్స్టేషన్ ఎదుట నిరసన.. అధికార పార్టీ అండదండలతో పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేసి తమను జైలుకు పంపించే ప్రయత్నం చేశారని నాయకులు నందిమళ్ల అశోక్, మెకానిక్ శ్రీను తదితరులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు, ఆయా కులసంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు పోలీస్స్టేషన్ ఎదుట బైఠాయించి పోలీసుల చర్యలను తప్పుపడుతూ నినాదాలు చేశారు. అక్రమంగా అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని కోరారు. అధికారం చేతిలో ఉందని ఇష్టారీతిన కేసులు నమోదు చేస్తే భవిష్యత్లో తగిన మూల్యం చెల్లించక తప్పదని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, అఽధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ హెచ్చరించారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అక్కడికి చేరుకొని పోలీసుల తీరును తప్పుబట్టారు. అత్యుత్సాహం ప్రదర్శించి ఇబ్బందులకు గురికావద్దని పోలీసులను హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాజశేఖర్గౌడ్, పెద్దిరాజు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాగితాల లక్ష్మీనారాయణ, ఉంగ్లం తిరుమల్, కౌన్సిలర్లు మురళీసాగర్, శ్రీకర్గౌడ్, నాయకులు సమద్, స్టార్ రహీం, జోహర్ హుస్సేన్, సూర్యవంశం గిరి, యుగంధర్రెడ్డి, చిట్యాల రాము, సీపీఎం నాయకుడు పరమేశ్వరాచారి, సీపీఐ నాయకుడు గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా సీతారామచంద్రస్వామి మాస కల్యాణం
సిర్సనగండ్లలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు చారకొండ: అపర భద్రాద్రి సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా సిర్సనగండ్ల నుంచి భక్తులు, గ్రామస్తులు ఉత్సవ విగ్రహాలను పల్లకీలో ఊరేగింపుగా గుట్టపై నున్న ఆలయానికి తీసుకొచ్చారు. మధ్యాహ్నం 12 గంటలకు సీతారాములు మాస కల్యాణ ఘట్టం కనులపండువగా ప్రారంభమైంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్య లో తరలి వచ్చి వేడుకను తిలకించారు. ఆలయ చైర్మన్ రామశర్మ, ఈఓ స్వర్గం అంజనేయులు, తహసీల్దార్ ఉమదంప తులు, ఎస్ఐ వీరబాబు దంపతులు, ఎంపీడీఓ శంకర్నాయక్, ఆలయ మాజీ చైర్మన్ మల్లికార్జున శర్మ, సర్పంచ్ రామస్వా మి దంపతులు, ఉప సర్పంచ్ కల్లు సురేందర్రెడ్డి దంపతులు కల్యా ణంలో కూర్చున్నారు. అనంతరం భక్తులకు సిర్సనగండ్లకు చెందిన పిన్నపురెడ్డి వెంకట్రెడ్డి అన్నదానం చేశారు.కార్యక్రమంలో మే నేజర్ నిరంజన్, అర్చకులు లక్ష్మణ్ శర్మ, వేణుశర్మ, కోదండ రామశర్మ, మురళీధర్శర్మ, గోపిశర్మ, ప్రవీణ్ శర్మ, అనంత రామశర్మ, , నాయకులు వెంకట్గౌడ్, బాల్రాంగౌడ్, సందీప్రెడ్డి, నర్సింహారెడ్డి,ప్రశాంత్ నాయక్, సాంబయ్యగౌడ్ ఉన్నారు. పటిష్ట నిఘా.. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఆలయ పరిసరాల్లో గట్టి బందోబస్తు, సీసీ నిఘా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్ఐ వీరబాబు తెలిపారు. ప్రత్యేక బస్సులు బ్రహ్మోత్సవాలకు మహబుబ్నగర్, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతాల నుంచి తరలివచ్చే వేలాది మంది భక్తుల కోసం కల్వకుర్తి, అచ్చంపేట, దేవరకొండ ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడిపించనున్నారు. ఉత్సవాలకు హాజరైన భక్తులు శ్రీరామనవమి పురస్కరించుకొని శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు సీతారాముల కల్యాణ వేడుక నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రభుత్వం తరుఫున స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందించనున్నారు. వేడుకలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎంపీ మల్లు రవి పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. వేడుకకు తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ అధ్వర్యంలో చలువ పందిళ్లు, అవసరం అయిన చోట టెంట్లు, తాగునీరు, విద్యుత్ తదితర సౌకర్యాలు కల్పించారు. కల్యాణం మండపం ఎదురుగా సుమారు 10 వేల మంది కూర్చునేలా, కల్యాణ మండపం చుట్టూ 20 వేల మంది భక్తులు తిలకించేలా ఏర్పాట్లు చేశారు. వీఐపీల వాహనాల పార్కింగ్కు గట్టపై చదును చేశారు. వృద్ధులకు, మెట్ల నుంచి ఎక్కలేని వారి కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గుట్టపైకి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు చైర్మన్ డేరం రామశర్మ చెప్పారు. -
రోడ్డుప్రమాదంలో యువకుడి దుర్మరణం
కేటీదొడ్డి: మండలంలోని గురువారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడిక క్కడే మృతిచెందగా, మ రో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్తుల స మాచారం మేరకు.. కుచినెర్లకు చెందిన మల్లేష్ (24) అదే గ్రామానికి చెందిన శేషప్ప, కుర్వ మల్లేష్తో కలిసి బైక్పై నందిన్నె నుంచి కుచినెర్ల వైపు బయలుదేరారు. వీరి బైక్ కుచినెర్ల వాగు సమీపంలోకి రాగానే అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న మల్లేష్ తలకు బలమైన గాయమై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. వెనుక కూర్చున్న శేషప్ప, కుర్వ మల్లేష్ సమీపంలోని పొలంలో పడిపోవడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు తక్షణమే పోలీసులకు సమాచారం అందించి ఆస్పత్రికి తరలించారు. కుటుంబంలో విషాదం మృతుడు మల్లేష్ భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చేతికి అందిన కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు, భార్యాపిల్లల రోధనలు విన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు ఆలుముకున్నాయి. గంజాయి సరఫరా చేసే ఇద్దరి అరెస్టు మహబూబ్నగర్ క్రైం: హైదరాబాద్ నుంచి జిల్లాకు ఎండు గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరూ యువకులను ఎకై ్సజ్ పోలీసులు అరెస్టు చేశారు. ఏఈఎస్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో గురువారం డీటీఎఫ్ బృందం మన్యంకొండ స్టేజీ దగ్గర చేసిన వాహనాల తనిఖీల్లో భానుప్రసాద్గౌడ్, సోమ్లానాయక్ బైక్లో గంజాయి సరఫరా చేస్తూ పట్టుబడ్డారు. ఈ ఇద్దరూ కొన్ని రోజులుగా హైదరాబాద్ నుంచి గంజాయి తీసుకొచ్చి జిల్లాలో విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించారు. వీరినుంచి 200గ్రాముల గంజాయి, ఒక బైక్, రెండు సెల్ఫోన్లు సీజ్ చేశారు. ఈ ఇద్దరిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించనున్నట్లు ఎకై ్సజ్ సీఐ వీరారెడ్డి వెల్లడించారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి విక్రయాలు, రవాణా, వినియోగం జరుగుతున్నట్లు తెలిస్తే 8712658872కు సమాచారం ఇవ్వాలన్నారు. తనిఖీల్లో సీఐ కవిత, ఎస్ఐ రాజేందర్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. హత్యాయత్నం కేసులో ముగ్గురికి జైలు శిక్ష మహబూబ్నగర్ క్రైం: హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితులకు నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. నవాబ్పేట పోలీస్స్టేషన్ పరిధిలో 2023 జనవరి 31న చెన్నారెడ్డిపల్లిలో భూవివాదం నేపథ్యంలో ఎరుకలి వెంకటయ్య, ఎరుకలి శ్రీను, ఎరుకలి మల్లేష్ ముగ్గురు కలిసి పథకం ప్రకారం ఎరుకలి చెన్నయ్యను కర్రలు, కత్తులతో పొడిచి హత్య చేయడానికి దాడి చేశారు. ఈ దాడిలో బాధితుడు ఎరుకలి చెన్నయ్యకు తల, శరీర భాగాలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై 2023 ఫిబ్రవరి 1న కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన నవాబ్పేట పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేసి కోర్టులో హాజరుపరచగా గురువారం ఈ కేసు కోర్టుకు వచ్చింది. ఈ కేసుపై వాదనలు పూర్తయిన తర్వాత నేరం రుజువుకావడంతో న్యాయమూర్తి ఈశ్వరయ్య ముగ్గురు నేరస్థుల్లో ఒక్కొక్కరికి నాలుగేళ్ల జైలుశిక్షతోపాటు రూ.6వేల జరిమానా విధించడంతోపాటు బాధితుడికి పరిహారంగా రూ.30వేలు చెల్లించాలని తీర్పు ఇచ్చారు. ఈ కేసులో ఉత్తమ పనితీరు కనబరిచిన పోలీస్ అధికారులతోపాటు కోర్టు సిబ్బందిని ఎస్పీ జానకి అభినందించారు. సంస్థల పేరుతో బలవంతపు వసూళ్లు జడ్చర్ల: వృద్ధాశ్రమం తదితర సంక్షేమ సంస్థల పేరుతో బలవంతంగా చందాలు వసూలు చేసిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు. సీఐ కథనం మేరకు.. కోడింగటి నర్సింహ, మూడ నర్సమ్మ, సిరిగిరి శివశంకర్, రమేశ్, బన్ని తదితరులు గురువారం ఓ కారులో జడ్చర్లలో పలువురు వ్యాపారులు తదితరుల దగ్గరకు వెళ్లి తాము ఆదర్శ హోం ఫర్ చిల్డ్రన్, ఆదర్శ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ, వృద్ధాశ్రమం నిర్వహిస్తున్నామని తమకు సహాయం అందించాలని పట్టణంలోని పలువురు వ్యాపారులను డిమాండ్ చేశారు. అయితే తాము డబ్బులు ఇవ్వలేమని చెప్పగా.. తాము బహుజన సామాజికవర్గానికి చెందిన వారమని, మిమ్మల్ని ఇబ్బందుల పెట్టే పనులు చేయాల్సి వస్తుందని, అంతు చూడాల్సి వస్తుందని బెదిరింపులకు దిగారు. దీంతో భయబ్రాంతులకు గురైన పతంజలి దుకాణం నిర్వాహకులు బండారు అచ్చుతారెడ్డి రూ.5వేలు, మరో వ్యాపారి మంచని పాండయ్య రూ.21,000, మనోహర్ రూ.5,116, బక్క రామ్మోహన్ రూ.5116, నర్సింహులు రూ.21,000, గోవర్ధన్రెడ్డి రూ.5000, బండారు కృష్ణారెడ్డి రూ.15,000 తదితరులతో డబ్బులు వసూలు చేశారు. బాధితుడు అచ్చుతారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం
● అధికారులు సమన్వయంతోపనిచేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లాలో యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లకు యంత్రాంగం సన్నద్ధం కావాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో సంబంధిత అధికారులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు. 2025– 26 యాసంగిలో 2.01 లక్షల ఎకరాల్లో వరి సాగైందన్నారు. 5.10లక్షల మెట్రిక్ టన్ను ల ధాన్యం ఉత్పత్తి అంచనా కాగా.. 2.50 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ప్రభుత్వ కొ నుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈసారి జిల్లావ్యాప్తంగా ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంఎస్, హాకా ద్వారా 190 కొ నుగోలు కేంద్రాలను వచ్చే నెల రెండో వారంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపా రు. కేంద్రాల్లో రైతులకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలన్నారు. వరి పూర్తి పక్వానికి వచ్చిన తర్వాతే కోసేలా రైతులు, హార్వెస్టర్ల యజమానులకు అవగాహన కల్పించాలని సూచించారు. మిల్లులకు ధాన్యం కేటాయింపు, రవాణా ఏర్పాట్లు నిబంధనల ప్రకారమే జరగాలన్నారు. ముఖ్యంగా జిల్లా సరిహద్దులో చెక్పోస్టులు చేయాలని పోలీసులను ఆదేశించారు. మిల్లర్లు సహకరించాలి.. వరిధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు మిల్లర్లు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా అన్నారు. కలెక్టరేట్లో జిల్లా రైస్మిల్లర్ల సంఘం సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆ సంఘం అధ్యక్షుడు అశోక్ పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. యాసంగి ధాన్యంలో 75 శాతం బ్రోకెన్ పాడీగా ఉండటం వల్ల తాము నష్టపోతామని.. ప్రభుత్వం నిర్దేశించిన సివిల్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) లక్ష్యాన్ని పూర్తిగా చేరుకోవడం కష్టసాధ్యమన్నారు. దీనిపై తమకు కొంత సడలింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే అందరికీ సమాన ప్రాధాన్యతతో ఫైన్, దొడ్డు రకం ధాన్యం కేటాయించాలని, పెండింగ్లో ఉన్న మిల్లింగ్ చార్జీలను చెల్లించాలని కోరారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. మిల్లర్ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ధాన్యం అన్లోడింగ్ కోసం వాహనాలను 3–4 రోజులు నిలిపివేయకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. మిల్లర్లు, అధికారులు సమన్వయంతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. కాగా, జిల్లాలో 112 రైస్ మిల్లులు ఉండగా.. 84 మిల్లులకు సీఎంఆర్ కోసం ధాన్యం కేటాయిస్తున్నట్లు జిల్లా మేనేజర్ రవినాయక్ తెలిపారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ జెఎల్బి హరిప్రియ, ఏఎస్పీ ఎన్బి రత్నం, డీసీఎస్ఓ గంప శ్రీనివా స్, డీఆర్డీఓ నర్సింహు లు, డీసీఓ కృష్ణ, జిల్లా సహకార ఆడిట్ అధికా రి టైటస్ పాల్, డీఏఓ బి.వెంకటేశ్, జిల్లా లీగ ల్ మెట్రాలజీ అధికారి రవీందర్, ఎల్డీఎం చంద్రశేఖర్ ఉన్నారు. -
అనుమతి కోసం ఉన్నతాధికారులకు రాశాం
బోను ఏర్పాటు కోసం ఉన్నతాధికారులకు రాసి పంపాం. చిరుతులు ఉన్న ట్లు మన్సూర్పల్లి సర్పంచ్ నుంచి ఫిర్యాదు రావడంతో మేము వెళ్లి పరీక్షించాం. చిరుతలు ఉన్న విషయాన్ని గుర్తించాం. పైనుంచి అనుమతులు రాగానే బోను ఏర్పాటు చేస్తాం. అప్పటి వరకు మా సిబ్బంది పర్యవేక్షణ కొనసాగుతుంది. మృతిచెందిన పశువులకు వెటర్నరీ వైద్యుల నివేదిక ఆధారంగా పరిహారం అందిస్తాం. రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. – అబ్దుల్హై, ఫారెస్టు రేంజర్, మహమ్మదాబాద్. ● -
ఇండియా జట్టులో ఆడాలన్నదే లక్ష్యం
భారత జట్టులో విరాట్కోహ్లీ అంటే ఎంతో ఇష్టం. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని క్రికెట్ ఆడడం ప్రారంభించా. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్ భరత్గౌడ్ శిక్షణలో క్రికెట్లో రాణిస్తున్నా. పెవిలియన్ క్లబ్లో ఉదయం 5.30 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 10.30 గంటల వరకు ప్రాక్టిస్ చేస్తున్నా. బ్యాటింగ్, బౌలింగ్లో ప్రతిభ కనబరిచి ఆల్రౌండర్గా ఎదుగుతా. భవిష్యత్లో హైదరాబాద్ రంజీ జట్టుకు, ఇండియా జట్టుకు ఎంపికకావడమే లక్ష్యంగా పెట్టుకున్నా. అందుకోసం నిరంతరం శ్రమిస్తా. – సాయిరాం, క్రికెటర్, మహబూబ్నగర్ ● -
క్రికెట్లో సాయిరాం ప్రతిభ
● రెండుసార్లు హెచ్సీఏ అండర్–14కు ఎంపిక ● చైన్నెలో జరిగిన లీగ్లో టాప్స్కోరర్ ● సెంచరీలతో రాణింపు మహబూబ్నగర్ క్రీడలు: మహబూబ్నగర్ రూరల్ మండలం అల్లీపూర్కు చెందిన పిట్ల యాదయ్య, శైలజ దంపతుల కుమారుడు సాయిరాం క్రికెట్లో విశేష ప్రతిభ కనబరుస్తున్నాడు. తల్లిదండ్రులతోపాటు తాతయ్య పిట్ల ఊషన్న కూడా సాయిరాంను క్రికెట్లో ప్రోత్సహిస్తున్నారు. సాయిరాం జిల్లాకేంద్రంలోని లిటిల్ స్కాలర్స్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. కాగా.. గత ఐదేళ్ల నుంచి క్రికెట్లో శిక్షణ తీసుకుంటున్న సాయిరాం అనతికాలంలోనే బ్యాటింగ్లో సత్తాచాటి అందరి మన్ననలు పొందుతున్నాడు. మొదట్లో ఇంటివద్ద నుంచే సాయిరాం తన క్రికెట్ శిక్షణ ప్రారంభించాడు. కోచ్ భరత్గౌడ్ ఇంటి వద్దే ప్రత్యేక క్రికెట్ శిక్షణ ఇచాడు. ప్రస్తుతం మహబూబ్నగర్ పట్టణంలోని పెవిలియన్ క్రికెట్ క్లబ్లో కోచ్ భరత్గౌడ్ వద్ద క్రికెట్లో శిక్షణ తీసుకుంటూ బ్యాటింగ్లో రాణిస్తున్నాడు. బ్యాటింగ్లో మెరుగైన ప్రతిభ గతేడాది హైదరాబాద్లోని నటరాజ్ క్రికెట్ క్లబ్ తరపున బ్యాటింగ్లో మెరుగైన ప్రతిభ కనబరిచాడు. ఈ సీజన్లోనూ సాయి రాం బ్యాటింగ్లో మెరుగైనప్రదర్శన కనబరిచా డు. హైదరాబాద్లోని ఎంఎల్ జయసింహ క్రికెట్ క్లబ్ తరపున ఈ సీజన్ లో తొమ్మిది లీగ్ మ్యా చుల్లో 280 పరుగులు చేశాడు. ఒక మ్యాచ్లో 75 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అండర్–14 ప్రాబ బుల్స్ నాలుగు మ్యాచుల్లో 232 పరుగులు చేసి రాణించాడు. ఒక మ్యాచ్లో 121 పరుగులు నాటౌట్, మరో మ్యాచ్లో 82 పరుగులు చేసి మరోసారి హెచ్సీఎం అండర్–14 జట్టుకు ఎంపికయ్యాడు. చైన్నెలో ఫిబ్రవరి 13 నుంచి 23 వరకు జరిగిన అండర్–14 క్రికెట్ టోర్నీలో పాల్గొని 150 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్గా నిలిచాడు. ముంబాయి జట్టుపై 88 పరుగులు, తమిళనాడు జట్టుపై 56 పరుగులు చేశాడు. బౌలింగ్ చేసి 5 వికెట్లు తీశాడు. -
బీచుపల్లిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ఎర్రవలి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని పంచాహ్నిక బ్రహ్మోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు ఆలయంలో గరుడ పటంతో గ్రామ ప్రదక్షణ, ధ్వజస్తంభ స్నపనం, ధ్వజారోహణం, అష్టదిగ్భందనం, యాగశాలలో ప్రధాన కుంభ ఆరాధన, అగ్ని ప్రతిష్ఠ, మూర్తి మంత్ర హోమం, లఘుపూర్ణాహుతి, తీర్థ ప్రసాద వితరణ వంటి పూజా కార్యక్రమాలను అర్చకులు వైభవంగా నిర్వహించారు. చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ మేనేజరు సురేందర్రాజు, పాలక మండలి సభ్యులు, అర్చకులు, భక్తులు, తదితరులు ఉన్నారు. -
గిరిజనుల అభ్యున్నతికే పునరావాసం
అచ్చంపేట/ మన్ననూర్: అటవీ సరిహద్దు ప్రాంతా ల్లో నివాసముంటూ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు దూరమవుతున్న గిరిజన గ్రామాల కుటుంబాల వారికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తున్నట్లు అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సమక్షంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అభిప్రాయం వ్యక్తం చేశారు. బుదవారం హైదరాబాద్లోని సచివాలయం/అసెంబ్లీ హాల్లో అటవీ లోతట్టు కోర్ ఏరియా, అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యంలోని సార్లపల్లి, కుడిచింతల బైలు, తాటిగుండాలు, కొల్లంపెంటకు చెందిన 160 కుటుంబాలకుగానూ ఆప్షన్–1లో భాగంగా రూ: 24కోట్లు నగదు రూపంలోని చెక్కులు అందజేశారు. అదేవిధంగా 257 కుటుంబాలకు ఆఫ్షన్–2 వర్తింపజేస్తూ పెద్దకొత్తపల్లి మండలం బాకారం సమీపంలో 5 ఎకరాల సాగుకు అనుకూలమైన భూమి, పక్కా ఇళ్లు, జీపీ భవనం, పాఠశాల, ఆస్పత్రితోపాటు గ్రామంలో అన్నిరకాల వసతుల ఏర్పాట్లు చేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎస్ రామకృష్ణారావు, నాగర్కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి, పీసీసీఎఫ్ సువర్ణ, కలెక్టర్ సంతోష్, డీఎఫ్ఓ రేవంత్చంద్ర, సార్లపల్లి సర్పంచ్ చిర్ర వీరమ్మరాములు, అటవీశాఖ అధికారులు, సిబ్బంది, ఆయా గ్రామాల పునరావాస లబ్ధిదారులు పాల్గొన్నారు. -
ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడు
● పోలీసులను ఆశ్రయించిన కుటుంబ సభ్యులు ● పోక్సో కేసు నమోదు ఊట్కూర్: ప్రేమ పేరుతో యువతిని(19) మోసం చేసిన పులిమామిడికి చెందిన యువకుడు బి.శ్రీకాంత్పై పోక్సో కేసు నమోదు చేసినట్లు బుధవారం ఎస్ఐ రమేశ్ తెలిపారు. అదే గ్రామానికి చెందిన యువతి, యువకుడు మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. కొంతకాలంగా యువతి పెళ్లి చేసుకుందామని యువకుడిని కోరగా ఇంట్లో కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదని చెబుతూ వచ్చాడు. యువతి పక్షం రోజుల క్రితం యువకుని ఇంటికి వెళ్లి పెళ్లి విషయమై నిలదీయగా ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. యువకుడు నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదని చెప్పడంతో యువతి మనస్తాపం చెంది పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు గమనించి యువతిని నారాయణపేట ఏరియా ఆప్పత్రికి తరలించారు. ఈ విషయమై యువతి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా.. విచారణ చేపట్టి యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. చికిత్స పొందుతూ యువకుడి మృతి మిడ్జిల్: మండలంలోని బోయిన్పల్లి సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతిచెదిన ఘటన చోటుచేసుకంది. ఎస్ఐ శివనాగేశ్వర్నాయు డు కథనం ప్రకారం.. మండలంలోని బోయిన్పల్లికి చెందిన బోయశేఖర్(38) మంగళవా రం సాయంత్రం బైక్పై మిడ్జిల్ నుంచి ఇంటికి వెళ్తుండగా.. గ్రామ సమీపంలో వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో బలమైన గాయాలయ్యాయి.చికిత్స నిమిత్తం మహబూబ్నగర్ ఆస్పత్రికి తరలించగా.. పరి స్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్లోని ని మ్స్కు రెఫర్ చేశారు. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందినట్లు తెలిపారు. మృతు డి భార్య శైలజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి నవాబుపేట: మండలంలోని కొల్లూర్కు చెందిన వ్యక్తి చికిత్సపొందుతూ మృతిచెందాడు. కొల్లూర్కు చెందిన శ్రీనివాస్(49)ఈనెల 21న తన పొలానికి బైక్పై వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు కిందపడి గాయపడ్డాడు. అక్కడున్నవారు కుటుంబ సభ్యుల సహకారంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించిందని హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొంది ఈనెల 23వ తేదీన ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో మరోసారి అనారోగ్యం పాలయ్యాడు. షాద్నగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి కుమారుడు శివప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు. జాతీయ బాక్సింగ్ పోటీలకు సరస్వతి మహబూబ్నగర్ క్రీడలు: నాగ్పూర్లో వచ్చేనెల 4 నుంచి 11 వరకు జరిగే జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలకు ఉమ్మడి జిల్లాలోని మానవపాడుకు చెందిన సరస్వతి ఎంపికై ంది. హైదరాబాద్లోని షేక్పేట్లో ఈ నెల 22 నుంచి 24 వరకు జరిగిన రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో సరస్వతి అండర్–19 విభాగంలో ప్రతిభకనబరిచి బంగారు పతకం సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ంది. సరస్వతిని బుధవారం రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో డీవైఎస్ఓ శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి నర్సింహులు, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్, అథ్లెటిక్స్ కోచ్ సునీల్కుమార్, శంకర్, శశికిరణ్ పాల్గొన్నారు. -
ఆర్బీఐ నిబంధనల మేరకే కార్యకలాపాలు
● డీసీసీబీ సర్వసభ్య సమావేశంలో కలెక్టర్ ఖుష్బూ గుప్తా ● చిన్నకారు రైతులు, చిరు వ్యాపారులకు రుణాలు అందించాలి మహబూబ్నగర్ (వ్యవసాయం): గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నకారు రైతులు, చిరు వ్యాపారులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సులభంగా రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కేంద్ర బ్యాంకు అధికారులను కలెక్టర్ ఖుష్బూగుప్తా ఆదేశించారు. బుధవారం డీసీసీబీ సర్వసభ్య సమావేశాన్ని మహబూబ్నగర్లోని ప్రధాన కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీబీ ఇన్చార్జీ సీఈఓ రవికాంత్రెడ్డి గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు లావాదేవీలు, రుణాల పంపిణీ, డిపాజిట్లు, రికవరీలు, డిఫాల్టర్ల వివరాలను సభ్యులకు వివరించారు. అనంతరం కలెక్టర్, బ్యాంక్ పర్సన్ ఇన్చార్జీ ఖుష్బూగుప్తా మాట్లాడుతూ.. మార్చి 25 నాటికి బ్యాంకు యొక్క డిపాజిట్లు దాదాపుగా రూ.489 కోట్లకు చేరుకున్నాయని, నేటి వరకు బ్యాంకు ద్వారా రూ.753 కోట్ల స్వల్పకాలిక వ్యవసాయ రుణాలు, రూ.1,393 కోట్ల దీర్ఘకాలిక వ్యవసాయ, వ్యవసాయేతర రుణాల అందించామన్నారు. అదేవిధంగా రుణ వసూళ్లలోనూ ప్రగతిని కనబరుస్తూ నిరర్థక ఆస్తులను 2.86 శాతానికి తగ్గించినట్లు తెలిపారు. ఆర్బీఐ అనుమతితో త్వరలోనే బ్యాంకు వినియోగదారులందరికీ యూపీఐ సేవలు, 14 నూతన బ్రాంచ్ సేవలను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. 31 మార్చి, 2026 నాటికి రూ.2,500 కోట్ల బిజినెస్ టర్నోవర్ లక్ష్యంగా నిర్ణయించుకొని ముందుకు సాగుతున్నామని, అందులో భాగంగా 23 మార్చి, 2026 నాటికి రూ.2,400 కోట్ల టర్నోవర్ సాధించినట్లు వెల్లడించారు. స్వయం సహాయక సంఘాలకు.. మహిళా స్వయం సహాయక సంఘాలు, పాడి పరిశ్రమ నిర్వహిస్తున్న వారికి కూడా రుణాలు విస్తరించాలని, వీరు మంచి రీపేమెంట్ సామర్థ్యం కలిగిన వర్గమని పేర్కొన్నారు. అలాగే డిపాజిటర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మరిన్ని వర్గాలకు రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రుణాల రికవరీ, వడ్డీ చెల్లింపుల సమస్యలు ఉన్నచోట అధికారులు స్వయంగా గ్రామాలకు వెళ్లి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. డీసీసీబీకి ఎన్నికై న పాలక మండలి లేకపోవడంతో నియమించబడ్డ సభ్యులు, అధికారులు ఆర్బీఐ, నాబార్డ్ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసుకోవద్దని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో బ్యాంకు సీఈఓ రవికాంత్రెడ్డి, డీజీఎం బాలు, నాబార్డ్ డీడీఎం షణ్ముఖచారి, డీసీఓ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
బెదిరింపులతోనే బలవన్మరణం
● యువతి ప్రేమ వ్యవహారంలో పాల్పడినట్లుగా భార్య ఫిర్యాదు కల్వకుర్తి టౌన్: బంధువులకు సంబంధించిన యువతి ప్రేమ వ్యవహారంలో వారి కుటుంబ సభ్యులు బెదిరించటంతోనే తన భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడని, మృతిపై అనుమానాలు ఉన్నాయని భార్య ఫిర్యాదు చేసిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ రాజశేఖర్, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మండలంలోని పంజుగులకు చెందిన బాలస్వామి(30)తో తాడూరు మండల కేంద్రానికి చెందిన శ్రీవాణితో నాలుగేళ్ల కిందట వివాహామైంది. వారికి ఇద్దరు సంతానం ఉన్నారు. తాడూరుకు చెందిన శ్రీవాణి అన్న మల్లేశ్ అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకొని, యువతితో పాటుగా శ్రీవాణి ఇంటిలోనే అతను తలదాచుకున్నాడని యువతి తరఫు బంధువులు పంజుగులలోని శ్రీవాణి ఇంటికి ఈ నెల 22వ తేదీన బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపారు. అనంతరం బుధవారం తాడూరు పోలీస్స్టేషన్కు వచ్చి సదరు విషయమై మాట్లాడేందుకు 11 గంటల ప్రాంతంలో వెళ్లగా, పంజుగులకు చెందిన కొండల్రెడ్డి ఫోన్చేసి నీ భర్త మా పొలంలో పశువుల దొడ్డిలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడని తెలిపినట్లు బాధితురాలు తెలిపారు. కఠిన చర్యలు తీసుకోవాలి ప్రేమ వ్యవహారంలో నా భర్త బాలస్వామిని తీవ్ర బెదిరింపులకు గురిచేసిన కారణంగానే మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడ్డాడని భార్య శ్రీవాణి ఆవేదన వ్యక్తం చేశారు. బెదిరింపులకు గురిచేయటమే కాకుండా, వారిద్దరిని కొట్టడంతో అవమానాన్ని భరించలేకనే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. మృతికి కారణమైన మల్లేష్, సాయిబాబు, బాలులపై కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని కల్వకుర్తి పోలీస్స్టేషన్లో శ్రీవాణి ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పట్టణంలోని సీహెచ్సీకి తరలించి అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య భూత్పూర్: మండలంలోని రావులపల్లి గ్రామానికి చెందన మహమూద్ పాష(19) మంగళవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు మహమూద్పాష ప్రైవేటుగా కరెంట్ పనులు చేస్తుండేవాడు. మంగళవారం పనుల్లో భాగంగా భూత్పూర్ వెళ్లి పనులు ముగించుకొని సాయంత్రం ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో రాత్రి 9: 30 గంటలకు గదిలోకి వెళ్లి తనను క్షమించాలని, మిస్యూ అమ్మ, అక్క, అన్న అని ఇన్స్ట్రాగాంలో పోస్టు పెట్టాడు. బయటకు వెళ్లిన పాష అన్న ఇన్స్ట్రాగాంలో తమ్ముడు పెట్టిన పోస్టును గమనించి ఇంటికి వచ్చి చూడగా గదిలో చీరతో ఫ్యానుకు ఉరేసుకుని విగతజీవిగా ఉండటాన్ని గుర్తించాడు. వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. బుధవారం మృతుడి తల్లి హసీనా బేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
అపర భద్రాది ‘సిర్సనగండ్ల’
చారకొండ: రాష్ట్రంలోనే రెండో అపర భద్రాద్రిగా భ క్తులు చేత పూజలందుకుంటున్న సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి ఆలయం బ్రహోత్సవాలకు ము స్తాబైంది. గురువారం నుంచి మార్చి 7 వరకు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ప్రతి ఏటా శ్రీరామనవమిని పురస్కరించుకొని వేడుకల ను నిర్వహించడం ఆనవాయితీ. ఈ పుణ్యక్షేత్రం నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని సిర్సనగండ్ల పంచాయతీలో పరిధిలో అయోధ్యనగర్ (గుట్ట)పైన సుమారు 60 ఎకరాల్లో 300 అడుగుల ఎతైన ఏకశిలపై వెలసింది. ఉమ్మడి మ హబుబ్నగర్ నుంచే కాకుండా రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తు లు బ్రహోత్సవాలకు హాజరై స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. శ్రీరామనవమి రోజున భద్రాచలం మాదిరిగానే ఇక్కడ కూడా లాంఛనాలతో సీతారాముల కల్యాణం జరిపిస్తారు. పక్షం రోజుల పాటు కొనసాగే బ్రహోత్సవాల కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. శు క్రవారం జరిగే కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తు లు అధిక సంఖ్యలో హాజరు కానున్న నేపథ్యంలో ఆల య ప్రాంగణంలో చలువ పందిళ్లు వేశారు. తాగునీటి సౌకర్యం,విద్యుత్ సరాఫరాకు ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు చేపట్టారు.అలాగే అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు నిర్వహించనున్నారు. ఆలయ రాజగోపురం బ్రహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు సీతారామచంద్రస్వామి మాసకల్యాణం, శుక్రవా రం మధ్యాహ్నం 12 గంటలకు మహా కల్యా ణోత్సవం, హనుమత్ సేవ, శనివారం చిన్న రఽథం (చిన్నతేరు), ఆదివారం గరుడ సేవ, సోమవారం రాత్రి బ్రహోత్సవం (పెద్దరథం), మంగళవారం జగసేవ, దోపోత్సవం, బుధవారం చక్రతీర్థం, ఏకాంత సేవ, ద్వాదశ ఆరాధన తదితర కార్యక్రమాలు ఉంటాయని ఆలయ చైర్మన్ డేరం రామశర్మ, ఈఓ స్వర్గం అంజనేయులు తెలిపారు. ఏకశిలపై కొలువైన సీతారామచంద్రులు నేటి నుంచి ఉత్సవాలు ప్రారంభం వైభవంగా కల్యాణోత్సవం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి -
పేదలకు సేవ చేసేందుకే ఆస్పత్రి ఏర్పాటు
● 25 ఏళ్ల అనుభవంలో ఎన్నో వైద్య సేవలు ● సుశ్రుత ప్రజావైద్యశాల ఎండీ డాక్టర్ మధుసూదన్రెడ్డి పాలమూరు: పేదలకు తక్కువ ఖర్చుతో నాణ్యత వైద్యం అందించాలనే లక్ష్యంతోనే సుశ్రుత ప్రజా వైద్యశాల 2001 ఏప్రిల్ 5న 20 పడకలతో ప్రారంభించారు. మొదట్లో కేవలం సర్జరీ, గైనిక్ విభాగాలతో ఆస్పత్రి ఏర్పాటు చేసుకున్న దశాలవారిగా 12 విభాగాలకు విస్తరించారు. ఏప్రిల్ 5తో ఆస్పత్రి ఏర్పాటు చేసి 25 వసంతాలు పూర్తవుతాయి. 20 నుంచి 50 పడకలకు ఆ తర్వాత 120 పడకలకు పెంచామని, ఆస్పత్రిలో ఇప్పటి వరకు 40 వేల అన్ని రకాల సర్జరీలు చేయగా 10 వేల ప్రసవాలు చేశారు. లక్ష వరకు అడ్మిట్ అయిన రోగులకు వైద్య సేవలు అందిస్తే.. ఆరు లక్షల వరకు ఓపీ సేవలు అందించారు. ఉమ్మడి జిల్లాలో మొదటిసారిగా 50 పడకలకు 2010లో ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభించారు. ప్రధానంగా ఉమ్మడి జిల్లాలో మొదటిసారి 2013లో టెస్టు ట్యూబ్ బేబీకి చికిత్స శ్రీకారం చుట్టగా.. ఇటీవల కాలంలో ఆరోగ్యశ్రీలో గుండె సర్జరీలు ఉచితంగా నిర్వహించారు. ప్రస్తుతం 12 విభాగాలలో 150 మంది వైద్య సిబ్బందితో వైద్యసేవలు అందిస్తున్నారు. ప్రత్యేక గుర్తింపు సుశృత ఆస్పత్రి నిర్వహణలో అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించినందుకు ఎన్ఏబీహెచ్ అక్రిడేషన్ గుర్తింపు వచ్చింది. దీనికోసం ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందం సందర్శించి అన్ని రకాల తనిఖీలు చేసిన తర్వాతే ఈ గుర్తింపు ఇచ్చింది. దీంతోపాటు ఐ ఇౖ అవార్డు సైతం వచ్చింది. నాకు చిన్ననాటి నుంచి పేదలకు ఏదో రకమైన సేవ చేయాలనే ఆసక్తి ఉండేది. దీంతో వైద్య రంగంలోకి వెళ్లాలని నిర్ణయించుకొని ఎంబీబీఎస్ పూర్తి చేశాను. ఆ తర్వాత యూకేలో ఎఫ్ఆర్సీఎస్ పూర్తి చేసి ఆ తర్వాత మహబూబ్నగర్ పట్టణంలో 2001లో ఆస్పత్రి ప్రారంభించాం. నా ప్రాక్టీస్ కొత్తలో 2003లో సరైన వైద్య సేవలు అందుబాటులో లేని సమయంలో వనపర్తికి చెందిన గర్భిణికి ప్రసవం కోసం ఎన్నో ఆస్పత్రులు తిరిగారు. ఆమె ఊపిరితిత్తుల్లో చీము ఉండటం వల్ల ప్రసవం కష్టంగా మారింది. దీంతో మా ఆస్పత్రిలో ఆమెకు ప్రత్యేక వైద్యంతో చీము తొలగించి ప్రసవం చేస్తే బాబు జన్మించాడు. ఆ బాబుకు నా పేరు పెట్టుకోవడం నేను మరిచిపోలేని విషయం. – డా. మధుసూదన్రెడ్డి, జనరల్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ -
అడ్డు తొలగేనా..?
గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని బీడు భూ ములను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, కేఎల్ఐ, భీమా, నెట్టెంపాడు, గట్టు ఎత్తిపోతలతోపాటు ఆర్డీఎస్ ప్రా జెక్టు పనులు దశాబ్దాలుగా అసంపూర్తిగానే ఉన్నా యి. ప్రాజెక్టుల పూర్తికి నిధుల లేమికి తోడు భూసేకరణ ప్రక్రియ ప్రధాన అడ్డంకిగా మారింది. ము ఖ్యంగా రెండు దశాబ్దాల క్రితం ప్రారంభించిన నెట్టెంపాడు ప్రాజెక్టుకు పదేళ్లుగా నిధులు లేకపోవడంతోపాటు భూసేకరణ ప్రక్రియ ముందుకు సాగ డం లేదు. అదేవిధంగా ఎనిమిదేళ్ల క్రితం చేపట్టిన గట్టు ఎత్తిపోతల కుడి, ఎడమ కాల్వల పరిధిలో 461 ఎకరాల భూసేకరణలో జరుగుతున్న జాప్యం పనులకు అడ్డంకిగా మారింది. ఆర్డీఎస్ ప్రాజెక్టు పరిధిలో నిర్మించాల్సిన మల్లమ్మకుంట రిజర్వాయ ర్ కోసం 567 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. 6–7 లక్షల ఎకరాలకు మాత్రమే.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 10 లక్షల ఎకరాల లక్ష్యంతో చేపట్టిన ఆయా ప్రాజెక్టుల ద్వారా కేవలం 6– 7 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. ప్రాజెక్టుల పూర్తిస్థాయి నిర్మాణాలనకు భూ సేకరణ ప్రక్రియ అడ్డంకిగా మారడంతో లక్ష్యం నెరవేరడం లేదు. దీనిపై దృష్టిసారించిన ప్రభుత్వం.. భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేసి, పనులు పూర్తిచేసేలా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్నాయుడు ఇటీవల గద్వాల జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణపై ప్రత్యేకంగా సమీక్షించారు. భూ సేకరణ ప్రక్రియ త్వరగా పూర్తిచేసి.. పెండింగ్ పనులు పూర్తిచేయాలని ఇరిగేషన్, రెవెన్యూశాఖ అధికారులను ఆదేశించారు. ఇదీ పరిస్థితి.. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలో 2లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సిన నెట్టెంపాడు ప్రాజెక్టు.. కేవలం 1.45 లక్షల ఎకరాలకే పరిమితమైంది. ఈ ప్రాజెక్టు 99, 100 ప్యాకేజీల పరిధిలో 541 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. 2018లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. ఎత్తిపోతల కుడి, ఎడమ కాల్వల పరిధిలో 249 ఎకరాలు, రిజర్వాయర్ నిర్మాణానికి మరో 212 ఎకరాలు అవసరం. భూసేకరణ ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయింది. 87,500 ఎకరాలకు సాగునీటిని అందించాల్సిన ఆర్డీఎస్ ప్రాజెక్టు.. అంతర్రాష్ట్ర జలవివాదం కారణంగా వానాకాలంలో గరిష్టంగా 50వేల ఎకరాలకు మించి సాగునీరు అందిన పరిస్థితి లేదు. దీంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాజోళి మండలంలో మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే రిజర్వాయర్ నిర్మాణానికి 567 ఎకరాలు సేకరించాల్సి ఉండగా.. భూములు ఇచ్చేందుకు స్థానిక రైతులు అభ్యంతరం చెబుతుండటంతో పనులకు అడ్డంకిగా మారింది. పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు సైతం వివిధ దశల్లో పెండింగ్లో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులో సివిల్, మెకానికల్ పనులతోపాటు భూసేకరణ సమస్య నెలకొంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా.. రెండు దశాబ్దాలుగా పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. ఇక్కడ సుమారు 130 ఎకరాల వరకు భూమి సేకరించాల్సి ఉంది. అసంపూర్తి పనులతో కేవలం 2.50 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు పారుతుంది. 4లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సిన భీమా ఎత్తిపోతల పథకం పనులు రెండు దశాబ్దాలుగా పెండింగ్లోనే ఉన్నాయి. సాగునీటి ప్రాజెక్టులకుభూసేకరణ సమస్య ముందుకు సాగని పెండింగ్ పనులు భూసేకరణ పూర్తయితేనే పూర్తి ఆయకట్టుకు సాగునీరు ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులతో ఆర్అండ్ఆర్ కమిషనర్ సమీక్ష త్వరితగతిన భూసేకరణ చేపట్టాలని ఆదేశం వేగవంతంగా భూసేకరణ.. నెట్టెంపాడు, ఆర్డీఎస్, గట్టు ఎత్తిపోతల పథకాలకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ కొంత పెండింగ్లో ఉంది. దీనిపై ఇటీవలి ఆర్అండ్ఆర్ కమిషనర్ సమీక్షించారు. ఆయా ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్లో ఉన్న భూమిని సేకరించాలని చెప్పారు. భూసేకరణ ప్రక్రియ పూర్తయితే పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీటిని అందించవచ్చు. పెండింగ్లో ఉన్న భూేమిని వేగవంతంగా సేకరించేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకెళ్తాం. – రహీముద్దీన్, ఎస్ఈ, ఇరిగేషన్శాఖ -
2న యూనివర్సిటీస్థాయి కామర్స్ ఫెస్ట్
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూలో వచ్చే నెల 2న తెలంగాణ కామర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యూనివర్సిటీ స్థాయి అంతర్ కళాశాలల కామర్స్ ఫెస్ట్ ప్రేరణ–2026 నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం కార్యక్రమ బ్రోచర్ను వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇది కేవలం ఫెస్ట్ మాత్రమే కాదని, కామర్స్ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజన, ప్రతిభను వెలికి తీసేందుకు చేస్తున్న కార్యక్రమం అన్నారు. ఈ నెల 30లోగా విద్యార్థులు తమ పేరును నమోదు చేసుకోవాలని, ఇక్కడ గెలుపొందిన విద్యార్థులు సికింద్రాబాద్లోని అవినాష్ కళాశాలలో వచ్చేనెల 7న జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఆడిట్సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, కంట్రోలర్ ప్రవీణ, ప్రిన్సిపాల్ మధుసూదన్రెడ్డి, అడిషనల్ కంట్రోలర్ అనురాధరెడ్డి, బీఓఎస్ చైర్మన్ ఆఫ్ కామర్స్ రాజ్కుమార్, రంగప్ప, సురేష్ తదితరులు పాల్గొన్నారు. పుస్తకం ఆవిష్కరణ పీయూలో అధ్యాపకులు మధు మోటమారి, భారతి సంయుక్తంగా రచించిన నానోఫ్లూయిడ్స్ రంగంలో విశేష పరిశోధన, నూతన గ్రంథం పుస్తకాన్ని వీసీ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశోధన విద్యార్థులకు ఇది ఒక దిక్సూచిలా పనిచేస్తుందన్నారు. -
ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో నిర్వహించిన జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశంలో మాట్లాడారు. ఏప్రిల్ 1 నుంచి వందశాతం మన ఇసుక వాహనం ద్వారా ఆన్లైన్లోనే సరఫరా చేయాలని ఆదేశించారు. గతంలో తనిఖీ కమిటీ గుర్తించిన 16 రీచ్లలో రెండు మాత్ర మే ఇసుక బుకింగ్కు కేటాయించినట్లు అధికారులు వివరించారు. ఇందులో అడ్డాకుల మండలం కన్మనూర్, మూసా పేట మండలం పోల్కంపల్లి రీచ్ల నుంచి మన ఇసుక వాహనం ద్వారా బుకింగ్ సరఫరా చేస్తున్నామన్నారు. తనిఖీల్లో అక్రమ ఇసుక రవాణా స్వాధీనం, ఇసుక డంప్ల వివరాలు, పట్టుబడిన లారీలు, ట్రాక్టర్లు, అక్రమ తవ్వకాలపై విధించిన జరిమానాలపై సమగ్ర సమాచారం ఇసుక వాట్సప్ గ్రూప్లో వివరాలు పోస్ట్ చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. వచ్చేసారి నిర్వహించే జిల్లాస్థాయి ఇసుక సమీక్ష సమావేశానికి ప్రతి తహసీల్దార్ తమ మండలాల్లో జరిగిన ఆన్లైన్, ఆఫ్లైన్ బుకింగ్ల వివరాలు, అక్రమ తవ్వకాలపై తీసుకున్న చర్యలు, స్వాధీనం చేసిన వాహనాల వివరాలతో సిద్ధంగా ఉండాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు కావాల్సిన ఇసుకపై సరైన సమాచారం తీసుకొని.. దానికి అనుగుణంగా అనుమతులు ఇవ్వాలన్నారు. ఇసుక బుకింగ్, సరఫరాపై ఫిర్యాదుల సెల్ ఏర్పాటు చేయాలని, వచ్చే ఫిర్యాదులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మధుసూదన్నాయక్, హరిప్రియ, ఏఎస్పీ రత్నం, జెడ్పీసీఈఓ వెంకట్రెడ్డి, ఆర్డీఓ నవీన్, జిల్లా మైన్స్ శాఖ ఏడీ గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు సోలార్పై దృష్టిపెట్టాలి ప్రజలు సోలార్ విద్యుత్పై దృష్టిపెట్టాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. కలెక్టరేట్ ఆవరణలో పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన ప్రచార రథాన్ని ప్రారంభించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలని, హరిత ఇంధన వినియోగాన్ని పెంచి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. టీజీ రెడ్కో మనోహర్రెడ్డి, ఫీల్డ్ ఆఫీసర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
పోటెత్తిన ఉల్లి
● గరిష్టంగా రూ.1,400,కనిష్టంగా రూ.800 దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు బుధవారం ఉల్లి పోటెత్తింది. వివిధ గ్రామాల నుంచి రైతులు పెద్దఎత్తున ఉల్లిని అమ్మకానికి తెచ్చారు. దాదాపు 10 వేల బస్తాల ఉల్లి మార్కెట్కు రావడంతో ఎక్కడ చూసినా ఉల్లి కుప్పలే కనిపించాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన వేలం మధ్యాహ్నం వరకు కొనసాగింది. అయితే వచ్చిన ఉల్లిలో అటు ఇటుగా ఉన్న ఉల్లి కుప్పలకు ధరలు నిర్ణయించి వ్యాపారులు కొనుగోలు చేశారు. ఉల్లి వేలంలో క్వింటాల్ గరిష్టంగా రూ.1,400, కనిష్టంగా రూ.8,00 వరకు ధరలు పలికాయి. మార్కెట్ నిబంధనల ప్రకారం 50 కిలోల బస్తాలుగా ఉల్లిని తూకం వేసి అమ్మకాలు సాగించారు. బస్తా ధర గరిష్టంగా రూ.700, కనిష్టంగా రూ.400 వరకు విక్రయించారు. ఇతర మార్కెట్ల నుంచి వచ్చిన వ్యాపారులు పెద్దమొత్తంలో ఉల్లిని కొనుగోలు చేసి తరలించారు. ఇక స్థానిక వ్యాపారులు, చిరు వ్యాపారులు, వినియోగదారులతో మార్కె ట్ అంతా సందడిగా కనిపించింది. -
ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు తరలిన ఖోఖో జట్టు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు పీయూ పురుషుల ఖోఖో జట్టు మంగళవారం తరలివెళ్లింది. కర్ణాటకలోని దేవాగిరి యూనివర్సిటీలో జరిగే పోటీల్లో విద్యార్థులు పాల్గొనున్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు వీసీ శ్రీనివాస్ ట్రాక్షూట్లను అందజేశారు. యూనివర్సిటీలో ఉన్న అన్ని క్రీడా సౌకర్యాలను వినియోగించుకుని జాతీయ స్థాయి పోటీల్లో మంచి ప్రతిభకనబరిచి.. పీయూకు గుర్తింపు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, పీడీ శ్రీనివాస్, కోచ్ వెంకటప్ప, మేనేజర్ కథలప్ప తదితరులు పాల్గొన్నారు. -
పవర్ప్లాంట్ ఏర్పాటుకు స్థల పరిశీలన
కృష్ణా: మండలంలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సూపర్ థర్మల్ పవర్ప్లాంట్ ఏర్పాటుకు జెన్కో అధికారులు మంగళవారం స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో మక్తల్ నియోజకవర్గంలో పవర్ప్లాంట్ ఏర్పాటుకు అవసరమయ్యే స్థలాన్ని పరిశీలించి, సాధ్యాసాధ్యలపై నివేదికను అందించాలని అధికారులను ఆదేశించారన్నారు. దీంతో జెన్కో అధికారులు కృష్ణా మండల కేంద్రంతో పాటూ హిందుపూర్ శివారులో గతంలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు సేకరించిన భూమిని పరిశీలించారు. వపర్ప్లాంట్ ఏర్పాటుకు అనుకూలంగా ఉండడంతో అధికారులు సానుకూలంగా స్పందించినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో జెన్కో అధికారులు ఎస్ఈ రామకృష్ణారెడ్డి, ఈఈ నవీన్, ఏడీ గంగారామ్, మంత్రి వాకిటి శ్రీహరి వ్యక్తిగత కార్యదర్శి వినోద్కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్, సర్పంచ్ సోలాపూర్ నాగప్ప, రాజప్పగౌడ్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు. -
దశాబ్దాల కల సాకారం!
● అజిలాపూర్ లిఫ్టు పనులకు శ్రీకారం ● ఏప్రిల్ మొదటివారంలో శంకుస్థాపన ● హాజరుకానున్న మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి దేవరకద్ర రూరల్: దేవరకద్ర మండలం అజిలాపూర్లో ఏర్పాటు చేయనున్న ఎత్తిపోతల పథకంతో ఆరు గ్రామాల రైతుల సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. రూ.32కోట్లతో కోయిల్సాగర్ ప్రాజెక్ట్ సమీపంలో ఈ లిప్టు ఏర్పాటుకు పరిపాలన అనుమతులు గతంలో మంజూరైన పనులకు సబంధించి టెండర్ ప్రక్రియ పూర్తికావడంతోపాటు ఏప్రిల్ మొదటివారంలో శంకుస్థాపన పనులుకు ఏర్పాట్లు జరుగుతుండంతో రైతుల్లో ఆనందం నెలకొంది. సాగునీరు అందక ఇబ్బందులు ప్రాజెక్ట్ కూతవేటు దూరంలో ఉన్న పోలాలు ఎత్తయిన ప్రదేశంలో ఉండటంతో దశాబ్ధలుగా సాగునీరు అందక ఆరు గ్రామాల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. గెలిచిన వెంటనే లిఫ్టు పనులు ప్రారంభిస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి పలుమార్లు సమస్యను తీసుకెళ్లి రూ.32కోట్ల పరిపాలన అనుమతులు తీసుకొచ్చారు. ఇటీవల టెండర్ ప్రక్రియ పూర్తి కావడంతో మంగళవారం అజిలాపూర్ స్టేజ్ వద్ద శంకుస్థాపన పనులను అధికారులు పరిశీలించారు. కార్యక్రమానికి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవనున్నట్లు సమాచారం. ప్రాజెక్ట్ పూర్తయితే సూమారు 5వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. స్థల పరిశీలన చేసినవారిలో ఏఈ హరీందర్, నాయకులు భాస్కర్రెడ్డి, అంజిల్రెడ్డి, రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఈత.. మిగల్చొద్దు కడుపు కోత!
మహబూబ్నగర్ క్రైం/వనపర్తి: వేసవి ఎండల తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు చెరువులు, క్వారీలు, కాల్వలు, డ్యాంల్లో ఈత పడేందుకు వెళ్తున్న చిన్నారులు, యువకులు, విద్యార్థులు అజాగ్రత్తగా ఉంటూ తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చుతున్నారు. ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు ముగియడంతో పాటు పాఠశాల విద్యార్థులకు ఒంటిపూట బడులు కొనసాగుతున్న తరుణంలో విద్యార్థులు ఈత పడేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈత రాకుండా నీటి కుంటల్లోకి దిగడం, ఇతరత్రా కారణాలతో ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు. చిన్నారులతో అప్రమత్తం చిన్నారులకు ఈత నేర్పేందుకు బావుల వద్దకు తీసుకెళ్లినప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఏమాత్రం వారు నిర్లక్ష్యంగా ఉండి, చిన్నారులను గమనించకుండా ఉన్నా.. బావుల్లో ఈత పడే వారిని చూస్తూ అమాయకంగా పిల్లలు అందులో దూకే ప్రమాదం ఉంటుందన్నారు. చిన్నారులకు ఈత నేర్పించే సమయంలో మొదట వాళ్లు అలవాటు పడే వరకు తల్లిదండ్రులు రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. కొన్నిసార్లు పిల్లలకు ఖాళీ ప్లాస్టిక్ క్యాన్లను కట్టి ఈత పడేందుకు పంపిస్తారని, అలా చేయకూడదన్నారు. అనుకోని పరిస్థితుల్లో వాటిలోకి నీరు వెళితే చిన్నారులు మునిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బావుల్లో కంప చెట్లు, రాళ్లు ఉండడంతో వాటిలో చిక్కుకొని మరికొందురు మృత్యువాత పడుతున్నారని, ఈతకు వెళ్లే సమయంలో ఇలాంటి ప్రమాదాలను గుర్తించాలి. ఏడాది కాలంగా ఉమ్మడి జిల్లాలో అధికమవుతున్న ప్రమాదాలు క్వారీలు, గుంతల్లో ఈతకు వెళ్లి పలువురు మృత్యువాత అవగాహన కల్పిస్తున్న అధికారులు,పోలీసులు తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి జాగ్రత్తలు పిల్లలు సాహసం చేస్తున్నామనే భ్రమలో లోతు తెలుసుకోకుండా నీటిలో దూకుతుంటారు. ఇలాంటివి చేయకుండా ఉండాలనే విషయం అర్థమయ్యే విధంగా చెప్పాలి. ఫిట్స్, గుండె జబ్బులున్న పిల్లలను ఈతకు వెళ్లనీయకూడదు. ప్రమాదకరమైన నదులు, చెరువులు, కాల్వల్లో పిల్లలు దిగకుండా అధికారులు, పోలీసులు హెచ్చరిక బోర్డులు అమర్చాలి. పిల్లలు సెలవుల్లో ఎక్కడికెళ్తున్నారు? ఎవరితో వెళ్తున్నారు? అనేది తల్లిదండ్రులు తప్పక గమనించాలి. చెరువులు, కాల్వలు, బావుల వైపు ఒంటరిగా వెళ్లకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది నీటి ప్రవాహాలు, గతంలో జరిగిన ప్రమాదాల గురించి పిల్లలకు వివరించాలి. నీళ్లు అంటే పిల్లలు భయపడేలా కాకుండా బాధ్యతాయుతంగా మెలిగేలా చేయాలి. నీటిలో ఆడుకోవడానికి, ఈత కొట్టడానికి సురక్షితమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి. ప్రమాద హెచ్చరికలు ఉన్న ప్రదేశాల్లో ఈతకొట్టే సాహసం చేయరాదు. ఈత నేర్చుకునేటప్పుడు లైఫ్ జాకెట్లు, ఫ్లోటింగ్ ట్యూబ్ల వంటి సురక్షిత సామగ్రిని వినియోగించాలి. దరికి దూరంగా ఈత కొట్టుకుంటూ వెళ్లే క్రమంలో అలసిపోవడం, అక్కడి నుంచి వెనుకకు వద్దామన్న రాలేక.. ఊపిరాడక నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉంది. నీటిలో అడుగుభాగాలకు వెళ్లి మట్టిని తేవడం, ఎవరు ఎంత సేపు నీటిలో మునిగి ఉంటారనే పోటీలు ఇతర ఆటలు ఆడరాదు. నీటిలో మునిగిన వ్యక్తిని, కొట్టుకుపోయే వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేసేవారు సైతం రక్షణ చర్యలు తీసుకోవాలి. -
బొందెగట్టు ప్రాంతాన్ని పరిశీలించిన అటవీ అధికారులు
● బోను ఏర్పాటుకు చర్యలు గండేడ్: చిరుతల అవాసానికి బొందెగట్టు అనువైన ప్రదేశమని ఫారెస్టు డివిజనల్ అధికారి గణేష్ పేర్కొన్నారు. మండల పరిధిలోని మన్సూర్పల్లి గ్రామ శివారులో చిరుతలు సంచరిస్తున్న బొందెగట్టును మహమ్మాదాబాద్ ఫారెస్టు రేంజర్ అబ్దుల్హైతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బొందెగట్టు ప్రాంతం చిరుత పులుల నివాసానికి అనువుగా ఉందన్నారు. దీనికి తోడు సమీపంలో రెడ్డి చెరువు కూడ ఉండడంతో వేసవికాలంలో దాహార్తి తీర్చుకోవడానికి కూడా ఏలాంటి లేకపోవడంతో ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు వివరించారు. ఉన్నతాధికారుల అనుమతులు రాగానే బోను ఏర్పాటు చేసి చిరుతలను పట్టుకుంటామన్నారు. అప్పటి వరకు రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పశువులు మేకలు, గొర్రెలు వంటివి పొలాల దగ్గర కట్టెయకుండా ఇంటి దగ్గర ఉంచుకోవాలన్నారు. ఎప్పటికపుడు పరిస్థితిని గమనిస్తూ ఉండాలని డిప్యూటి రేంజ్ ఆఫీసర్ రాఘవేందర్కు సూచించారు. డిప్యూటీ రేంజర్ రాఘవేందర్ , బీట్ ఆఫీసర్ ఉదయేశ్వర్లు సాయంత్రం వరకు ఉండి చుట్టూ పక్కల ప్రాంతాల రైతులతో మాట్లాడి పలు సూచనలు. సలహాలు ఇచ్చారు. చిరుత పులులు బయటికి వచ్చినపుడు తమకు సమాచారం ఇవ్వాలని చుట్టుపక్కల వారిని కూడా అప్రమత్తం చేయాలని రైతులకు సూచించారు. -
సలేశ్వరం జాతరకు పకడ్బందీగా ఏర్పాట్లు
కందనూలు: సలేశ్వరం జాతరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్ లాల్, డీఎఫ్ఓ రేవంత్ చంద్ర, సలేశ్వరం ఆలయ కమిటీ సభ్యులతో కలిసి కలెక్టర్ జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు జరిగే సలేశ్వరం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా భక్తులకు అన్నిరకాల ఏర్పాట్లు చేయాలన్నారు. ఈసారి జాతరకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారని అందుకు తగ్గట్టు ఏర్పాటు చేయాలన్నారు. ఈ జాతరకు మూడు రోజులపాటు పరహాబాద్ నుంచి లోపలికి అనుమతించనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ప్రమాదవశాత్తు అవాంఛనీయ ఘటనలు జరుగకుండా అటవీశాఖ సిబ్బందితో కలిసి పోలీస్శాఖ గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేపట్టాలని రాత్రి వేళల్లో నడిచే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా మధ్యమధ్యలో సోలార్ లైట్లును ఏర్పాటు చేయాలని, ఆర్టీసీ బస్సులు నాగర్కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి, అచ్చంపేట డిపో నుంచి భక్తుల సౌకర్యార్థం విరివిగా బస్సులను ఏర్పాట్లు చేయాలని నాగర్కర్నూల్ డీఎంను ఆదేశించారు. వైద్యశాఖ తరఫున పలుచోట్ల ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసి వైద్యసిబ్బంది, అంబులెన్స్లను 24గంటలు పర్యవేక్షణ జరిపేలా ఏర్పాటు చేయాలని, కింద గుండం వద్ద వైద్యసిబ్బంది అన్నిరకాల సదుపాయాలతో సంసిద్ధంగా ఉంచాలని డీఎంహెచ్ఓ ఆదేశించారు. సలేశ్వరం జాతరకు వచ్చే వాహనాలు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ జామ్ కాకుండా, వాహనాల అనుమతి తదితర అంశాలను పోలీస్, ఫారెస్ట్ అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. సలేశ్వరం జాతరకు గర్భిణులు, శ్వాసకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు రాకుంటే మంచిదని తెలిపారు. ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ మాట్లాడుతూ.. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అందుకు అధికారులు కమిటీ సభ్యులు చెంచు సంఘాల నాయకులు పోలీస్శాఖకు సహకారాలు అందించాలని, సలేశ్వరం జాతరను అత్యంత పకడ్బందీగా సజావుగా నిర్వహించేందుకు పోలీస్శాఖ సంసిద్ధంగా ఉందని తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి ఫిరంగి, అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్డబ్ల్యూఎస్ డీఈ, సలేశ్వరం ఆలయ కమిటీ సభ్యులు, సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
ఆస్పత్రిలో దొంగతనంపై విచారణ
● అంతర్మథనంలో సిబ్బంది ● అనుమానిత వ్యక్తులపై నిఘా గద్వాల క్రైం: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి డ్రెస్సింగ్ గదిలో వృద్ధురాలి బ్యాగులోని నగదు, బంగారు ఆభరణాల మాయంపై జిల్లా పోలీసులు ముమ్మరంగా విచారణ చేపట్టారు. 16 రోజుల క్రితం నారాయణపేట జిల్లా మక్తల్కు చెందిన ఓ వృద్ధురాలు రూ.14 లక్షల నగదు, రెండు తులాల బంగారు ఆభరణాలు మాయం అయిన సంఘటన విదితమే. ఈ వ్యవహారంలో ఎంతమంది పాత్ర ఉందనే విషయంపై విచారణ బృందం ఆస్పత్రిలోని సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. వృద్ధురాలు వచ్చిన సమయంలో ఒంటరిగా వచ్చారా లేక మరొకరి సహాయంతో అక్కడికి వచ్చారనే కోణంలో ఆరా తీస్తున్నారు. భారీ మొత్తంలో నగదు, ఆభరణాలు అపహరణకు గురయ్యాయని వృద్ధురాలు, కుమారుడి ఫిర్యాదుపై పోలీసులు కూపీలాగుతున్నారు. మక్తల్ నుంచి గద్వాలకు రావడం గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఓ సిబ్బంది వ్యవహరించిన తీరును సీసీ ఫుటేజీలో పరిశీలించగా అటువైపు ఆ సిబ్బంది మాత్రమే ఉన్నట్లు తెలుస్తుంది. వృద్ధురాలు నిద్రలోకి జారుకున్న క్రమంలో ఓ మహిళ సిబ్బందితో బ్యాగును తీసుకున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో సదరు మహిళను విచారణ బృందం ఆస్పత్రి అధికారుల సమక్షంలో వాకబు చేశారని, సోమవారం సైతం ఇద్దరు వ్యక్తులను విచారించినట్లు సమాచారం. అయితే పోలీసు విచారణలో ఉన్న సిబ్బంది గతంలోను మృతి చెందిన మహిళ ముక్కుపుడక, కమ్మలను అపహరించినట్లు ఆస్పతి సిబ్బంది తెలుపుతున్నారు. ఈ రెండు ఆరోపణలపై సదరు సిబ్బంది సైతం పెదవిరుస్తున్నారు. అంతర్మథనంలో.. ఆస్పత్రిలోనే నగదు, ఆభరణాలు మాయం అయినట్లు తెలియడం, పోలీసులు విచారణ చేపడ్తున్న క్రమంలో సిబ్బంది అంతర్మథనంలో పడ్డారు. ఆస్పత్రిలో విలువైన మందులు, శస్త్ర చికిత్స పరికరాలు తదితర వాటికి రక్షణ ఉంటుందనే విషయంపై మల్లగులాలు పడుతున్నారు. -
అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయం
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులలో బా ధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో ఎస్పీ జానకితో కలిసి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, అధికారులతో జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. 2019 నుంచి 2026 వరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నమోదైన కేసులు, బాధితులకు పరిహారం చెల్లింపు, పెండింగ్ కేసులపై చర్చించారు. జిల్లాలో ఇప్పటి వరకు 380 కేసుల్లో 224 కేసులకు గాను రూ.38,33,07,500 బాధితులకు పరిహారం అందించామని, 156 కేసులు పెండింగ్లో ఉన్నాయని అధికారులు వివరించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్పీ జానకి మాట్లాడుతూ పోలీస్ శాఖ ద్వారా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో సత్వరం స్పందించి చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. -
నెరవేరని డబుల్ కల
●అసంపూర్తి దశలో వందలాది డబుల్ బెడ్రూం ఇళ్లు జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని బోయలకుంటలో బహుళ అంతస్థుల విధానంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం చేపట్టారు. అయితే కొన్నాళ్ల తర్వాత పనులు ఎక్కడికక్కడ నిలిచిపోగా.. ఇప్పటి వరకు మళ్లీ మొదలు పెట్టలేదు. ఈ కోవలోనే బోయలకుంటకు చెందిన మోటం అంజమ్మ తనకు డబుల్ బెడ్ రూం ఇల్లు ఎప్పుడు దక్కుతుందా అంటూ ఆశగా ఎదురుచూస్తుంది. కవర్లతో కప్పిన గుడిసె లాంటి ఇంట్లో ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. కాలం వెళ్లదీస్తుంది. జడ్చర్ల: జిల్లాలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎక్కడికక్కడ వృథాగా మారడం ఆందోళన కలిగిస్తోంది. రూ. కోట్లు వెచ్చించి.. నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లు కొన్నిచోట్ల అసంపూర్తిగా, మరికొన్నిచోట్ల నిర్మా ణాలు పూర్తయినా కేటాయించకపోవడంతో అటు ప్రభుత్వ లక్ష్యం.. ఇటు నిరుపేదల సొంతింటి కల నెరవేరడం లేదు. కనీస మౌలిక సదుపాయాల కల్పనతో అర్హులందరికీ డబుల్బెడ్ రూం ఇళ్లు మంజూరు చేస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో నిరుపేదలు తమకు సొంతిళ్లు దక్కుతాయనుకున్న ఆశలు అడియాశలయ్యాయి. అర్హులైన లబ్ధిదారుల ఎంపికలో ఆలస్యం, మౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం, రాజకీయ విభే దాలతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది డబుల్ బెడ్రూం ఇళ్ల వ్యవహారం. నిలిచిన నిర్మాణాలు బహుళ అంతస్థుల విధానంలో చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్లడ్ల నిర్మాణాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఆయా ఇళ్లను పూర్తి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. బాదేపల్లి రంగనాయకస్వామి గుట్ట ప్రాంతంలో నిర్మించిన 48 డబుల్ బెడ్రూం ఇళ్లు అసంపూర్తి దశలోనే శిథిలావస్థకు చేరుకున్నాయి. అలాగే ఆలూరు రోడ్డులోని ఫకీర్నగర్లో నిర్మించిన 24 ఇళ్లు అసంపూర్తిగానే ఉన్నాయి. బోయలకుంటలో నిర్మించిన 96 ఇళ్ల పరిస్థితి ఇలాగే ఉంది. కొత్తపల్లి గ్రామంలో నిర్మించిన ఇళ్లు నిరుపయోగంగా మారాయి. నోటీసులు జారీ.. ఎర్రగుట్ట ప్రాంతంలోని డబుల్ బెడ్రూం ఇళ్లలో నివాసం ఉంటున్న వారికి రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి ఇల్లు లేని నిరుపేదలకు కేటాయించాల్సిన ఇళ్లను అక్రమంగా ఆక్రమించారని, ఒకవేళ ఆయా ఇళ్లను ప్రభుత్వం కేటాయించి ఉంటే అందుకు ప్రభుత్వం జారీ చేసిన ధ్రువపత్రాలు తమకు మూడు రోజుల గడువులో సమర్పించాలని నోటీసులలో పేర్కొన్నారు. అలా చేయకపోతే అక్రమంగా నివాసం ఉంటున్నట్లు భావించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిర్మాణాలు పూర్తయిన చోటా కేటాయించని వైనం ఎర్రగుట్టలో యథేచ్ఛగా సాగుతున్న ఆక్రమణలు నోటీసులు జారీచేసి చేతులు దులుపుకొంటున్న అధికారులు లబ్ధిదారుల ఎంపికలో తాత్సారం.. ఆందోళనలో నిరుపేదలు జడ్చర్ల నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో దశల వారిగా 2,700 డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరయ్యాయి. ఎక్కువగా జడ్చర్ల మండలంలోనే 2,132 ఇళ్లు నిర్మించారు. అయితే కావేరమ్మపేట, బాదేపల్లి, బండమీదిపల్లి, కోడ్గల్ వంటి గ్రామాలు మినహాయిస్తే ఎక్కడా డబుల్బెడ్ రూం ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించలేదు. మిడ్జిల్, బాలానగర్, నవాబుపేట, రాజాపూర్ మండలాల్లో సైతం డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం అసంపూర్తిగానే ఉంది. అయితే డబుల్ బెడ్ రూం ఇళ్ల మంజూరుకు సంబంధించి ఒక్క జడ్చర్ల పట్టణంలోనే దాదాపు 3 వేలకుపైగా దరఖాస్తులు రావడం గమనార్హం. -
పెట్రోల్ బాంబ్
● బంకుల్లో నోస్టాక్ బోర్డులు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం ● రాత్రి 11 గంటల వరకు క్యూలైన్లలో వాహనదారుల బారులు పాలమూరు: నగరంలో పెట్రోల్ కొరత ఉందని.. బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారనే ప్రచారంతో వాహనదారులు బంకుల దగ్గర బారులుదీరారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి ఇదే పరిస్థితి కనిపించింది. ప్రధానంగా జిల్లా జైలు పెట్రోల్ బంకు దగ్గర ద్విచక్రవాహనాలతోపాటు కార్లు సైతం క్యూ కట్టాయి. ముఖ్యంగా జైలు దగ్గర ఉన్న బంకులో రాత్రి 11 గంటల వరకు వాహనదారులు భారీగా క్యూ కట్టడంతో జైలు సిబ్బంది, వన్టౌన్ కానిస్టేబుళ్లు వాహనదారులను క్యూలైన్లలో ఏర్పాటు చేయించి సమస్య రాకుండా పెట్రోల్ వేసుకునేలా చర్యలు చేపట్టారు. అలాగే హాజ్గఫర్ పెట్రోల్ బంకు దగ్గర వాహనదారులు అధికంగా కనిపించారు. శ్రీనివాసకాలనీ, పద్మావతి కాలనీలోనూ పరిస్థితి ఉండటం విశేషం. స్థానికంగా పెట్రోల్ కొరత లేదని, సోషల్ మీడియాలో ప్రచారం నమ్మరాదని నిర్వాహకులు సూచిస్తున్నారు. -
గుడిసెల్లో ఉంటున్నాం..
స్థలం, ఆర్థిక స్థోమత లేక ఇల్లు కట్టుకోలేదు. ఐదేళ్ల క్రితం డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామంటూ పనులు చేపడితే సంతోషించాం. సొంతిల్లు దక్కుతుందని సంబరపడ్డాం. కానీ, పనులు నిలిచిపోవడంతో ఏళ్లుగా గుడిసెలల్లోనే నివాసం ఉంటున్నాం. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి డబుల్ బెడ్ రూం ఇళ్లు పూర్తి చేసి తమకు ఇవ్వాలి. – గోరిబీ, ఫకీర్నగర్, బాదేపల్లి ఎర్రగుట్టలో డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమించుకున్నారు. ఇప్పటికే వారికి నోటీసులు జారీచేశాం. వీరిలో డబుల్ బెడ్ రూం ఇళ్లకు సంబంధించి అర్హులైన వారిని ఎంపిక చేయాల్సి ఉంది. మా దగ్గర ఉన్న దరఖాస్తులను విచారించి అర్హులైన వారిని త్వరలోనే గుర్తించే విధంగా చర్యలు తీసుకుంటాం. – నర్సింగరావు, తహసీల్దార్, జడ్చర్ల -
రాజకీయ పార్టీలు ‘సర్’కు సహకరించాలి
జడ్చర్ల టౌన్: స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ (సర్)కు ఈ నెల 31 వరకు బూత్లెవల్ ఏజెంట్లను నియమించి రాజకీయ పార్టీలు సహకరించాలని ఈఆర్ఓ, అదనపు కలెక్టర్ హరిప్రియ అన్నారు. మంగళవారం జడ్చర్లలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష నాయకుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 2002 ఓటరు జాబితా ఆధారంగా రివిజన్ కొనసాగుతుందని, అందుకు ఇప్పటికే మ్యాపింగ్ జరుగుతుందని వివరించారు. మ్యాపింగ్ ప్రకారం బీఎల్ఓలు ఇంటింటికి తిరుగుతారన్నారు. సర్ ద్వారా డబుల్ ఓట్లు ఉంటే తొలగిస్తామని, ఓటరు ఎక్కడ కోరుకుంటే అక్కడ ఉంచుతామన్నారు. మ్యాపింగ్ జాగ్రత్తగా చేయాలి సర్ మ్యాపింగ్ జాగ్రత్తగా చేయాలని బీఎల్ఓలకు అదనపు కలెక్టర్ హరిప్రియ సూచించారు. డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన బీఎల్ఓ శిక్షణలో ఆమె పాల్గొని సూచనలు చేశారు. సర్లో భాగంగా ఇంటింటికి తిరిగి పరిశీలించాల్సి ఉంటుందన్నారు. శిక్షణలో ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా శిక్షణ దోహదపడుతుందని, రాజకీయ పార్టీల ఏజెంట్లు సైతం సహకరిస్తారని చెప్పారు. నగరంలో లోతట్టు ప్రాంతాల పరిశీలన మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నగరంలో లోతట్టు ప్రాంతాలైన రామయ్యబౌలి, గణేష్నగర్, ఎర్రకుంట పరిసరాలు, రాయచూర్ రోడ్ తదితర ఏరియాలను మంగళవారం ఇన్చార్జి అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ పరిశీలించారు. ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి.రామాంజులరెడ్డిని ఆదేశించారు. అలాగే ఆయాచోట్ల కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. అందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎక్కడబడితే అక్కడ చెత్త వేయొద్దని ప్రజలకు సూచించారు. అప్పన్నపల్లిలో మేయర్ పరిశీలన డివిజన్ నం.3 పరిధిలోని అప్పన్నపల్లిలో నగర మేయర్ మమత పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా వీధుల్లో నెలకొన్న సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వీటిని వీలైనంత వరకు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో శానిటరీ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్జీ, లక్ష్మయ్య, టీపీబీఓ అభిలాష్, ఏఈ రాగవి తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లాలో అభివృద్ధి పనులను వేగంగా పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ అన్నారు. అభివృద్ధి పనుల పురోగతి, ప్రభుత్వ ప్రధాన పథకాల అమలుపై వెబెక్స్ ద్వారా ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనులను పూర్తి చేయడానికి ఎంపీడీఓలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. -
ఎర్రగుట్టలో వివాదాస్పదం..
బాదేపల్లి శివారు ఎర్రగుట్ట ప్రాంతంలో 560 డబుల్ బెడ్ రూం ఇళ్లను పూర్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వచ్చి.. ఆరుగురికి ఇళ్ల పట్టాలను సైతం అందజేశారు. తర్వాత అప్పటి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అర్హులను ఎంపిక చేసేందుకు పట్టణంలో పర్యటించి క్షేత్రస్థాయిలో కసరత్తు చేశారు. కానీ, అర్హుల జాబితాను రూపొందించేలోగా అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఇళ్ల కేటాయింపు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దీంతో ఎవరికి వారు ఆయా ఇళ్లలో చేరి ఆక్రమణలకు పాల్పడ్డారు. -
దుఃఖాన్ని దిగమింగుకొని.. ‘పది’ పరీక్షకు హాజరు
మానవపాడు: అనారోగ్యంతో తండ్రి మరణించినా దుఃఖాన్ని దిగమింగుకొని ఓ విద్యార్థి పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడు. మానవపాడుకు చెందిన సమీర్ పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి తన తండ్రి కరీం(40) అనారోగ్యంతో మృతిచెందాడు. అయితే సోమవారం ఉదయం ఇంగ్లిష్ పరీక్ష ఉండటంతో బాధలోనూ రాశాడు. మధ్యాహ్నం పరీక్ష ముగిసిన తర్వాత తండ్రి అంత్యక్రియలకు హాజరవడంతో తీవ్ర విషాదం నెలకొంది. మరో ఘటనలోనూ.. అమరచింత: మండలంలోని నందిమళ్ల ఎక్స్రోడ్కు చెందిన జలేందర్ ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతిచెందాడు. కాగా ఈయన కుమారుడు సాగర్ పుట్టెడు దుఃఖంలోనూ సోమవారం ఉదయం పదో తరగతి ఇంగ్లిష్ పరీక్ష రాశాడు. అనంతరం తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. ఉల్పరలో మరొకరు.. వంగూరు: మండలంలోని ఉల్పర జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి పరీక్ష రాస్తున్న శివకృష్ణ తండ్రి ఆదివారం అనారోగ్యంతో మరణించాడు. అయితే తండ్రికి కర్మకాండ నిర్వహించాల్సిన శివకృష్ణ పరీక్ష రాసేందుకు రాకపోవడంతో ఉపాధ్యాయులు కొండల్రెడ్డి, గణేష్ వెంట తీసుకెళ్లి పరీక్ష రాయించారు. అనంతరం ఇంటికి వచ్చి తండ్రి కర్మకాండ శివకృష్ణ నిర్వహించాడు. ఈ సంఘటన గ్రామస్తులను కలిచివేసింది. -
మన్సూర్పల్లిలో మూడు చిరుతలు
గండేడ్: మండలంలో మరోమారు చిరుతలు కలకలం రేగింది. గతంలో ఒక చిరుత మాత్రమే పలుమార్లు దర్శనం ఇవ్వగా.. ఇప్పుడు ఏకంగా మూడు చిరుతలు కంటపడడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఏవైపు నుంచి చిరుతలు దాడి చేస్తాయోనని తెలియక ప్రాణాలు అరచేత పట్టుకుని పొలాలకు వెళ్లడానికి జంకుతున్నారు. సోమవారం చిరుతలు ఉన్నట్లు స్పంష్టంగా ఫారెస్టు అధికారుల ధ్రువీకరించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మరింత భయాందోళన చెందుతున్నారు. వివరాలిలా.. గండేడ్ మండలంలోని మన్సూర్పల్లి సమీపంలో రెడ్డిపల్లి రెడ్డిచెరువుకు చేరువలో బొందెగట్టు వద్ద మూడు చిరుతలు సంచరిస్తున్నాయి. వారం రోజులు తరచుగా చిరుతలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని మన్సూర్పల్లికి చెందిన రైతు ఏదుల బాలయ్య గమనించి సోమవారం ఉదయం ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. వారంరోజులుగా చిరుతలు తిరగాడుతున్నాయని ఉదయం బయటికి వచ్చి గుట్టకిందికి వెళ్తాయని చెప్పాడు. అయితే తాము వాటిని చూస్తేగాని ధ్రువీకరించలేమని.. అవి బయటకు వచ్చినప్పుడు సమాచారం ఇవ్వాలని డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రాఘవేందర్ రైతు బాలయ్యకు సూచించాడు. దీంతో సోమవారం సాయంత్రం అవి గుట్టమీద గుండుపై బయట కూర్చోవడంతో వెంటనే డిప్యూటీ రేంజ్ ఆఫీసర్కు సమాచారం ఇచ్చాడు. వెంటనే డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రాఘవేందర్, బీట్ ఆఫీసర్ ఉదయేశ్వర్ మన్సూర్పల్లి బొందెగట్టుకు చేరుకొని ఏదుల బాలయ్య పొలం వద్ద నిలబడి గుట్టపై తిరుగాడుతున్న చిరుతలను గుర్తించారు. మూడు పెద్ద చిరుతలు ఉన్నట్లు ఫారెస్టు అధికారులు తెలిపారు. వెంటనే ఈ విషయాన్ని రేంజర్ అబ్దుల్హైకి తెలుపడంతోపాటు జిల్లా ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. కనిపించిన చిరుతలు పెద్దవేనని వారు పేర్కొన్నారు. 2011లో ఇక్కడే చిక్కిన చిరుత 2011 మే11న మనూర్పల్లి ఏదుల బాలయ్య పొలం సమీపంలో చిరుత బోనుకు చిక్కింది. ఇదే రైతు అప్పట్లో చిరుత సంచారాన్ని గుర్తించి అప్పటి రేంజ్ ఆఫీసర్ లక్ష్మణ్కు సమాచారం ఇచ్చాడు. దీంతో ఆయన ఉన్నతాధికారులతో మాట్లాడి బోను ఏర్పాటు చేస్తే వారంలోపే చిరుత బోనుకు చిక్కింది. దానిని తీసుకెళ్లి శ్రీశైలం రిజర్వ్ ఫారెస్టులో అప్పట్లో వదిలిపెట్టారు. తిరిగి చిరుతలు అదేప్రాంతంలో తిరుగాడుతుండడంతో అదే రైతు ఫారెస్టు అధికారులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఏదీఏమైనా ఫారెస్టు అధికారులు వీలైనంత త్వరగా చిరుతలు పట్టుకుని తరలించాలని ఆయా గ్రామాల ప్రజలు రైతులు కోరుతున్నారు. స్థానికుల సమాచారంతోగుర్తించిన ఫారెస్టు అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం,నేడు బోను ఏర్పాటుకు సన్నాహాలు ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక -
కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యం
జడ్చర్ల: కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక అంబేడ్కర్ కళాభవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చినా రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి, సంక్షేమం కన్పించడం లేదని విమర్శించారు. తొమ్మిదిన్నర ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.2.80 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి భారీ నీటిపారుదల ప్రాజెక్ట్లతో పాటు విద్య, వైద్య, వ్యవసాయ, తదితర రంగాల అభివృద్ధితో పాటు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, నూతన కలెక్టరేట్, మెడికల్ కళాశాల, తదితర అనేక ప్రభుత్వ భవనాల నిర్మాణాలు చేపట్టిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర ఏళ్ల పాలనలో రూ.3.50 లక్షల కోట్లు అప్పులు తీసుకువచ్చి ఏంచేశారని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ చెల్లించామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆరు గ్యారంటీ హామీలకు బడ్జెట్లో నిధుల కేటాయింపు విస్మరించారని పేర్కొన్నారు. యువతకు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేవలం 11 వేల ఉద్యోగాలు ఇచ్చి మోసగించారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతామన్నారు. సమావేశంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, కౌన్సిలర్లు ప్రశాంత్రెడ్డి, మహేశ్, సతీష్, నాయకులు రాంమ్మోహన్, నాగిరెడ్డి, ఇమ్ము, తదితరులు పాల్గొన్నారు. -
సంఘాల ఉత్పత్తులను ప్రోత్సహించడమే లక్ష్యం
● మినీ సరస్ మేళా ప్రారంభించినకలెక్టర్ ఖుష్బూగుప్తా ● శిల్పారామంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయం జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్తో పాటు వారికి ప్రోత్సాహం కల్పించడమే సరస్ ఎగ్జిబిషన్ ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ ఖుష్బూగుప్తా అన్నారు. జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా గ్రామాభివృద్ధి సంస్థలు, నాబార్డు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘మినీ సరస్ మేళా‘ను సోమవారం కలెక్టర్ ప్రారంభించారు. ఈ నెల 29 వరకు నిర్వహించనున్న మేళాను ప్రజలు పెద్దఎత్తున సందర్శించి, స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన వస్తువులను విక్రయించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఎగ్జిబిషన్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన స్వయం సహాయక సంఘాల ద్వారా సుమారు 50 స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు అభినందనలు తెలియజేస్తూ, డీఆర్డీఏ, నగరపాలక సంస్థ, ఇతర శాఖల అధికారులను కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఎగ్జిబిషన్లో స్టాళ్లతో పాటు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘భరోసా’, వైద్యారోగ్య శాఖ హెల్త్ క్యాంప్, బీసీ సంక్షేమ శాఖ, ఎస్బీఐ బ్యాంక్ స్టాళ్లు ఏర్పాటు చేసి, వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, డిప్యూటీ మేయర్ సురేందర్రెడ్డి, అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్, డీఆర్డీవోలు నరసింహులు, మొగులప్ప, మున్సిపల్ కమిషనర్ రామానుజులరెడ్డి, నాబార్డు ఏజీఎండీఈ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
హుండీ చోరీకి వచ్చిన వ్యక్తి అరెస్టు
కొత్తపల్లి(మద్దూరు): నారాయణపేట జిల్లా మద్దూరు మున్సిపల్ పట్టణంలో హుండీ దొంగతనానికి యత్నించిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు మద్దూరు ఎస్ఐ విజయ్కుమార్ తెలిపారు. మద్దూరు పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో ఉన్న హనుమాన్ ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి హుండీని పగలగొట్టి చోరీకి యత్నిస్తుండగా అదే సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు అతని అనుమానాస్పద కదలికలను గమనించి వెంటనే పట్టుకున్నారు. అనంతరం పోలీస్స్టేషన్కు తరలించి విచారణ చేపట్టగా నేరం ఒప్పుకున్నాడు. నిందితుడు దామరగిద్ద మండలం మొగలమడ్కకు చెందిన అవుసుల రమేశ్ తండ్రి వేణుగోపాలచారిగా గుర్తించారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు కొనసాగిస్తునట్లు తెలిపారు. గ్రామాల్లో చోరీలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసర సమయంలో డయల్ 100కి సమాచారం ఇవ్వాలని తెలిపారు. -
బోను ఏర్పాటు చేస్తాం
మన్సూర్పల్లి బొందెగుట్ట వద్ద చిరుతలు ఉన్న విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేశాం. చీఫ్ వైల్డ్లైఫ్ వార్డెన్తో అనుమతి తీసుకొని వీలైనంత వరకు మంగళవారం బోను ఏర్పాటు చేస్తాం. చిరుతలు మనుషులపై దాడులు చేయవని ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. కాకపోతే పశువులను పొలాల వద్ద కట్టేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకై నా మంచిది ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలి. – రాఘవేందర్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, మహమ్మదాబాద్ వారం రోజులుగా గమనిస్తున్నా.. చిరుతలు కనిపిస్తున్న బొందెగట్టు నా పొలాన్ని ఆనుకొని ఉంది. వారం రోజులుగా ఉదయం వేళల్లో మూడు చిరుతలు కనిపించాయి. పలుమార్లు రాత్రివేళల్లో కూడా కనిపించేవి. దూరం నుంచి గమనించి టార్చిలైట్ వేస్తే వెళ్లిపోయేవి. సోమవారం కనిపించడంతో ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చా. సాయంత్రం వచ్చి చిరుతలు ఉన్నట్లు గుర్తించారు. గతంలో కూడా నా పొలం వద్దే బోనుకు చిక్కింది. మళ్లీ ఇప్పుడు మూడు చిరుతలు కనిపించడంతో భయంగా ఉంది. – ఏదుల బాలయ్య, రైతు మన్సూర్పల్లి -
సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో తప్పిన ప్రమాదం
● షెడ్డులో మహిళపై ఊడి పడిన ఫ్యాన్ మెట్టుగడ్డ: మహబూబ్నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మహిళకు త్రుటిలో ప్రమాదం తప్పింది. రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయానికి వచ్చిన మహిళపై ఫ్యాన్ ఊడి పడటంతో గాయాలపాలైన ఘటన సోమవారం చోటు చేసుకుంది. రోజు వందలాది మంది వచ్చే కార్యాలయంలో ఇలాంటి ఘటన జరగడంతో అంతా షాక్కు గురయ్యారు. రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయానికి వచ్చిన కిందిగేరి స్వాతి అనే మహిళ కార్యాలయ ఆవరణలో గల షెడ్డులో కూర్చొని ఉండగా సీలింగ్ ఫ్యాన్ ఊడి మహిళపై పడటంతో భుజం, కాలికి బలమైన గాయాలయ్యాయి. గాయాలైన మహిళను కనీసం కార్యాలయ సబ్రిజిస్ట్రార్, సిబ్బంది యోగక్షేమాలు అడగకపోవడం వారి నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలో కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వాపోతున్నారు. -
ఈతకు వెళ్లి విద్యార్థి మృతి
అయిజ: ఈతకు వెళ్లి ఆరో తరగతి విద్యార్థి మృతిచెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. ఆదివారం ఉత్తనూరుకు చెందిన దర్శన్(11) గ్రామం పక్కనున్న బావిలో ఈతకొట్టడానికి వెళ్లి కనపడకుండా పోయాడు. రాత్రి వరకు బాలుడు ఇంటికి రాకపోవడంతో విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు బావిదగ్గరకు వెళ్లి చూశారు. పోలీసులు, ఎండీఆర్ఎఫ్ బృందం రాత్రి 12గంటలకు బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్ట్మార్టం కోసం మృతదేహాన్ని గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సోమవారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బావిలో పడి రైతు మృతి గోపాల్పేట: ప్రమాదవశాత్తు బావిలో పడి రైతు మృతిచెందిన ఘటన మండలంలోని తాడిపర్తిలో సోమవారం వెలుగు చూసింది. గోపాల్పేట ఎస్ఐ జగన్మోహన్ కథనం ప్రకారం.. తాడిపర్తికి చెందిన లక్ష్మి, శేషయ్య(50) భార్యాభర్తలు. గ్రామశివారులోని కిషన్రావుకు చెందిన పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఆదివారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి తిరిగి రాలేదు. సోమవారం భార్య లక్ష్మి, ఆమె చిన్నకుమారుడు, మరొక యువకుడు కలిసి బావిలో వెతకగా శేషయ్య మృతిచెంది కనిపించాడు. కాలుజారి ప్రమాదవశాత్తు పడి మృతిచెంది ఉంటాడని, శేషయ్య మృతిపై ఎటువంటి అనుమానం లేదని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం మహమ్మదాబాద్: మండలంలోని నంచర్ల గేట్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాలిలా.. గాధిర్యాల్కు చెందిన ఆముదాల హన్మయ్య(55) వార్డు మెంబరు మేసీ్త్రగా కూలీనాలి చేసుకుంటూ జీవిస్తున్నాడు. సోమవారం ఆయన బైక్పై మహమ్మదాబాద్కు వెళ్లి తిరిగి వస్తుండగా.. నంచర్ల గేటు సమీపంలో వెనక అతివేగంగా వస్తున్న యువకుల బైక్ బలంగా ఢీకొట్టింది. దీంతో హన్మయ్య తీవ్రగాయాలతో కిందపడిపోయాడు. కాలువిరగడంతోపాటు తలకు తీవ్ర గాయాలయ్యా యి. వెంటనే అక్కడున్న వారు 108లో మహబూబ్నగర్కు తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. హన్మయ్య మృతితో కుటుంబీకుల రోధనలు మిన్నంటాయి. శ్రీశైలం రహదారిపై.. వెల్దండ: మండల కేంద్రంలో హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారిపై సోమవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సోమవారం జరిగింది. పూర్తి వివరాలు.. మండలంలోని చెరుకూరు చెందిన దొడ్ల రమేష్(36) కల్వకుర్తి మండలం ఎల్లికల్ గ్రామంలో సమీప బంధువు అంత్యక్రియలకు బైకుపై వెళ్లి వస్తున్నాడు. ఈ క్రమంలో మార్గమధ్యలో వెల్దండ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో కిందపడ్డాడు. అనంతరం మరో వాహనం అతనిపై వెళ్లడంతో మృతి చెందాడు. మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య పద్మతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కురుమూర్తి తెలిపారు. ఉరేసుకుని యువకుడి బలవన్మరణం గట్టు: పొలంలో చెట్టుకు ఉరివేసుకొని యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. మండల కేంద్రానికి చెందిన కుర్వ మల్లేశ్ అలియస్ ఉలిగెప్ప(21) ఆదివారం రాత్రి ఇంట్లో భోజనం చేసి పొలానికి వెళ్లాడు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారు జామున పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకొని విగతజీవిగా ఉన్న విషయాన్ని చుట్టు పక్కల రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య సరోజమ్మ, ఏడాదిన్నర కుమార్తె ఉన్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. వివాహిత ఆత్మహత్య అచ్చంపేట రూరల్: కడుపునొప్పి తాళలేక మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం పట్టణంలో చోటు చేసుకుంది. రెండో ఎస్ఐ ఇందిర తెలిపిన వివరాలు.. గోకుల్నగర్కు చెందిన శారద(38) కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతుండేది. ఈ క్రమంలో శనివారం తీవ్రంగా నొప్పి రావడంతో భరించలేక పురుగు మందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం వెల్దండ సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలి సోదరుడు శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఆస్తిపన్ను వసూళ్లలో లక్ష్యం చేరుకోవాలి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పాలమూరు నగరంలో ఆస్తిపన్ను, నల్లా బిల్లు లు, ట్రేడ్ లైసెన్స్ వ సూళ్లలో లక్ష్యం చేరుకో వాలని ఇన్చార్జి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ ఆదేశించారు. సోమవారం రాత్రి మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఆయా విభాగాల అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక సంవత్సరం ముగియడానికి కేవలం వారం రోజులు మాత్రమే ఉందని వీటి వసూలుకు అయిదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలన్నారు. పాత బకాయిలతో కలుపుకొని ఆస్తిపన్ను మొత్తం రూ.51.61 కోట్లకు గాను కేవలం రూ.19 కోట్లే వసూలు కావడమేమిటని మండిపడ్డారు. ఇంకా రూ.7 కోట్లు రాబట్టగలిగితేనే 16వ ఆర్థిక సంఘం నుంచి రూ.27 కోట్ల గ్రాంట్ మంజూరవుతుందన్నారు. సమావేశంలో కమిషనర్ పి.రామాంజులరెడ్డి, ఏఎంసీ అజ్మీర రాజన్న, ఆర్ఓలు మహమ్మద్ ఖాజా, యాదయ్య, డీఈఈలు విజయ్కుమార్, నర్సింహ, హేమలత తదితరులు పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.7,889 జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం వేరుశనగ క్వింటాల్ గరిష్టంగా రూ.7,889, కనిష్టంగా రూ.4,505 ధరలు లభించాయి. అలాగే కందులు గరిష్టంగా రూ.6,511, కనిష్టంగా రూ.5,569, జొన్నలు గరిష్టంగా రూ.5,777, కనిష్టంగా రూ.4,127, పెబ్బర్లు గరిష్టంగా రూ.5,050, కనిష్టంగా రూ.4,777 చొప్పున వచ్చాయి. -
ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ప్రజలు తమ సమస్యలపై ప్రజావాణిలో అందించిన ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి సత్వరమే పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ముఖ్యంగా భూ సర్వే, రెవెన్యూ సంబంధిత సమస్యలు, గృహ నిర్మాణ పథకాలు, వృద్ధాప్య పింఛన్లు, మున్సిపాలిటీ, పంచాయతీ పరిపాలనకు సంబంధించిన అంశాలపై మొత్తం 90 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన వినతులపై నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మధుసూదన్నాయక్, హరిప్రియ, జెడ్పీసీఈఓ డీపీఓ వెంకట్రెడ్డి, ఆర్డీఓ నవీన్ తదితరులు పాల్గొన్నారు. ‘పది’ పరీక్ష కేంద్రాల తనిఖీ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా కొనసాగాయి. ఈ క్రమంలో జిల్లాకేంద్రంలోని మోడల్ బేసిక్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ఖుష్బూ గుప్తా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పరీక్ష కేంద్రంలోకి ఎవరూ సెల్ఫోన్ తీసుకువెళ్లకూడదని, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. పాఠశాల కాంపౌండ్ వాల్ కూలిపోవడాన్ని గమనించిన ఆమె వెంటనే దానిని తిరిగి నిర్మించాలని సూచించారు. అలాగే అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ జిల్లాకేంద్రంలోని రాంనగర్ పాఠశాలను తనిఖీ చేశారు. ఇదిలా ఉండగా మొత్తం 13,218 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా.. 13,176 మంది హాజరవగా.. 18 మంది గైర్హాజరయ్యారు. జిల్లావ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాలను డీఈఓ ప్రవీణ్కుమార్తోపాటు ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీ చేసింది. -
పిచ్చికుక్కలు దొంగలు..
చర్యలు తీసుకుంటాం.. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆవరణలో కుక్కల సంచారంపై మున్సిపల్ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంగా ఆజ్మీరా వెల్లడించారు. దీనిపై మున్సిపల్ అధికారులు కుక్కల నియంత్రణ కోసం కుటుంబ నియంత్రణ (స్టెరిలైజేషన్) చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ప్రస్తుత చట్టాల ప్రకారం కుక్కలకు హాని చేయడం, చంపడం వంటి చర్యలకు పాల్పడటం దానికి అనుమతి లేదన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులు తగిన జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మున్సిపల్ అధికారులతో కలిసి సమస్యకు పరిష్కారం చేస్తామని పేర్కొన్నారు. 31న జిల్లాస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: రాష్ట్ర క్రీడాప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల కోసం జిల్లాస్థాయి ఎంపికలను ఈ నెల 31న స్థానిక మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు డీవైఎస్ఎఓ శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికలకు వచ్చేవా రు తప్పనిసరిగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. పది పాస్ట్పోర్ట్ ఫొటోలు, తహసీల్దార్ కార్యాలయం నుంచి జనన ధ్రువీకరణ పత్రం, పాఠశాలల నుంచి 3వ తరగతి ప్రోగ్రెస్ రిపోర్ట్, కమ్యూనిటీ సర్టిఫికెట్, ప్రస్తుత పాఠశాల నుంచి స్టడీ సర్టిఫికెట్, ఒరిజినల్ ఆధార్కార్డుతో ఎంపికలకు హాజరుకావాలని కోరారు. పూర్తి వివరాల కోసం సునీల్కుమార్ అథ్లెటిక్స్ కోచ్ (94406 56162)ను సంప్రదించాలని సూచించారు. 1 నుంచి స్వయం ఉపాధి శిక్షణ మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోర్సుల్లో వచ్చే నెల 1 నుంచి 20వ బ్యాచ్ శిక్షణ ప్రారంభిస్తున్నట్లు డీవైఎస్ఓ శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పాస్ లేదా ఫెయిలైన యువతకు మూడు నెలలపాటు ఫ్యాషన్ డిజైనింగ్, గార్మెట్ తయారీ, బ్యూటీషియన్, కంప్యూటర్ కోర్సు (ఎంఎస్ ఆఫీస్), రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషన్, మొబైల్ సర్వీసింగ్, రిపేరుపై, 7వ తరగతి పాసైన వారికి జర్దోసి, మగ్గం, ఎలక్ట్రిషియన్ కోర్సుల్లో శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణ అనంతరం పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి హైదరాబాద్ సెట్విన్ వారిచే సర్టిఫికెట్ అందజేస్తామన్నారు. ఆసక్తి గలవారు పాత డీఈఓ కార్యాలయంలోని వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రంలో విద్యార్హత, ఆధార్ కార్డు, రెండు పాస్పోర్టు సైజ్ ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు కేంద్రం ఇన్చార్జి రవీందర్రెడ్డి (94407 88502)ను సంప్రదించాలని కోరారు. 31న జిల్లాస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: రాష్ట్ర క్రీడాప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల కోసం జిల్లాస్థాయి ఎంపికలను ఈ నెల 31న స్థానిక మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు డీవైఎస్ఎఓ శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికలకు వచ్చేవా రు తప్పనిసరిగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. పది పాస్ట్పోర్ట్ ఫొటోలు, తహసీల్దార్ కార్యాలయం నుంచి జనన ధ్రువీకరణ పత్రం, పాఠశాలల నుంచి 3వ తరగతి ప్రోగ్రెస్ రిపోర్ట్, కమ్యూనిటీ సర్టిఫికెట్, ప్రస్తుత పాఠశాల నుంచి స్టడీ సర్టిఫికెట్, ఒరిజినల్ ఆధార్కార్డుతో ఎంపికలకు హాజరుకావాలని కోరారు. పూర్తి వివరాల కోసం సునీల్కుమార్ అథ్లెటిక్స్ కోచ్ (94406 56162)ను సంప్రదించాలని సూచించారు. 1 నుంచి స్వయం ఉపాధి శిక్షణ మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోర్సుల్లో వచ్చే నెల 1 నుంచి 20వ బ్యాచ్ శిక్షణ ప్రారంభిస్తున్నట్లు డీవైఎస్ఓ శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పాస్ లేదా ఫెయిలైన యువతకు మూడు నెలలపాటు ఫ్యాషన్ డిజైనింగ్, గార్మెట్ తయారీ, బ్యూటీషియన్, కంప్యూటర్ కోర్సు (ఎంఎస్ ఆఫీస్), రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషన్, మొబైల్ సర్వీసింగ్, రిపేరుపై, 7వ తరగతి పాసైన వారికి జర్దోసి, మగ్గం, ఎలక్ట్రిషియన్ కోర్సుల్లో శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణ అనంతరం పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి హైదరాబాద్ సెట్విన్ వారిచే సర్టిఫికెట్ అందజేస్తామన్నారు. ఆసక్తి గలవారు పాత డీఈఓ కార్యాలయంలోని వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రంలో విద్యార్హత, ఆధార్ కార్డు, రెండు పాస్పోర్టు సైజ్ ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు కేంద్రం ఇన్చార్జి రవీందర్రెడ్డి (94407 88502)ను సంప్రదించాలని కోరారు. -
కంటైనర్ ఢీకొని డీసీఎం హెల్పర్ మృతి
రాజాపూర్(బాలానగర్): కోళ్లలోడ్తో ముందు వెళ్తున్న డీసీఎంను వెనక నుంచి ఓ కంటైనర్ ఢీకొనడంతో తీవ్రగాయాలపాలైన హెల్పర్ చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన ఆదివారం తెల్లవారుజామున బాలానగర్ మండల శివారులో చోటుచేసుకుంది. వివరాలిలా.. వరంగల్ టౌన్కు చెందిన డీసీఎం డ్రైవర్ మహేశ్, హన్మకొండకు చెందిన అరవింద్(24) హెల్పర్ స్నేహ కోళ్లఫాంలో పనిచేస్తూ శనివారం అనంతపురంలో కోళ్లఫాంలో కోళ్లను లోడ్ చేసుకుని హైదరాబాద్కు వస్తుండగా.. ఆదివారం వీరు వెళ్తున్న ఢీసీఎంను వెనక నుంచి ఓ కంటేనర్ ఢీకొనడంతో డ్రైవర్ మహేశ్ గాయాలు కాగా.. హెల్పర్ అరవింద్ తీవ్ర గాయాలతో డీసీఎం క్యాబిన్లో ఇరుక్కుపోయాడు గమనించిన స్థానికులు అరవింద్ను క్యాబిన్లో నుంచి బయటికి తీసి షాద్నగర్లోని బుగ్గారెడ్డి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అరవింద్ మృతిచెందినట్లు బాలానగర్ ఎస్ఐ లెనిన్గౌడ్ తెలిపారు. డీసీఎం డ్రైవర్ మహేశ్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రైలు కిందపడి వ్యక్తి బలవన్మరణం గద్వాల క్రైం: రైలు కిందపడి వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. గద్వాల పట్టణంలోని నదిగ్రహారం కాలనీకి చెందిన తెలుగు మునిస్వామి (48) మేసీ్త్ర పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. దీంతో మనస్థాపం చెంది ఉదయం రైల్వే స్టేషన్ సమీపంలోని పిల్లిగుండ్ల కాలనీ శివారులో గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. భార్య సువర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి కోడేరు: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానికంగా ని వాసముంటున్న ఎరుకలి వెంకటయ్య(40) తన ఇంటి వద్ద ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి నీళ్లు పట్టేందుకు మోటార్ స్విచ్ పెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.మృతు డికి భార్య బాలీశ్వరమ్మ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మృతదేహానికి పో స్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వేణుగోపాల్ తెలిపారు. మహిళ ఆత్మహత్య మక్తల్: ఉరివేసుకొని ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మక్తల్ మండలం బోందల్కుంటలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామా నికి చెందిన దాసరి లావణ్య (32)కూలీ చేసుకొని జీవనం గడుపుతుండేది. ఎప్పటిలాగానే కూలీ పని ముగించుకొని సాయంత్రం శనివారం ఇంటికి చేరుకుంది. ఆదివారం లావణ్య ఇంకా ఇంటి తలుపులు తెరువకపోవడంతో చుట్టుపక్కలవారు అక్కడికి చేరుకొని తలుపులను విరగొట్టారు. ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈమెకు పిల్లలున్నారు. మృత్యురాలి తల్లి దాసరి రేవతమ్మ ఫిర్యాదు మేర కు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి కేసు నమో దు చేసినట్లు ఎస్ఐ భాగ్యలక్ష్మిరెడ్డి తెలిపారు. ఉరేసుకొని యువకుడి బలవన్మరణం వనపర్తి రూరల్: మండలంలోని చిట్యాల తూర్పుతండాకు చెందిన నానావత్ యాదగిరి (సిద్ధార్థ్) హైదరాబాద్లోని శివరాంపల్లిలో శనివారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుతండాకు చెందిన నేనావత్ గోపాల్నాయక్, మణెమ్మ దంపతులు కుమారుడు యాదగిరి (25)తో కలిసి హైదరాబాద్లోని శివరాంపల్లిలో కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. యాదగిరి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం ఉదయం తల్లిదండ్రులు పనికి వెళ్లి, సాయంత్రం తిరిగి వచ్చి ఇంట్లోకి వెళ్లగా యాదగిరి ఉరేసుకున్నట్లు గుర్తించారు. కిందకు దింపి చూడగా.. అప్పటికే మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు అక్కడి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పెళ్లి ముహూర్తాన్ని అడ్డుకున్న అధికారులు లింగాల: మండలంలోని ఓ గ్రామంలో బాలికకు వివాహం చేసేందుకు ముహూర్తం పెట్టుకుంటున్నట్లు చైల్డ్ హెల్ప్లైన్ 1098కు సమాచారం అందడంతో అధికారులు వచ్చి ముహూర్తాన్ని అడ్డుకున్నారు. నాగర్కర్నూల్ చైల్డ్ హెల్ప్ లైన్ అధికారులు యశ్వంత్, ప్రమీల గ్రామానికి చేరుకొని 18 ఏళ్లు నిండని బాలికకు పెళ్లి ముహూర్తం పెట్టడాన్ని చూశారు. అధికారులు పూజారి, తల్లిదండ్రులను హెచ్చరించారు. మైనర్లకు వివాహం చేయడం చట్ట విరుద్ధమని, 2006 బాల్య వివాహాల నిషేధ చట్ట ప్రకారం రెండేళ్ల శిక్షతోపాటు రూ.లక్ష జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించారు. బాలికతోపాటు కుటుంబ సభ్యులతో అంగీకార పత్రం తీసుకోవడంతో ముహూర్తానికి అడ్డుకట్ట పడింది. -
రోడ్డు ప్రమాదంలో కర్ణాటక వాసులు మృతి
● ట్రాక్టర్ను ఢీకొట్టిన ద్విచక్ర వాహనం గట్టు: రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్ను చీకటిలో బైకు ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు కర్ణాటక యువకులు మృతి చెందిన ఘటన బల్గెర సమీపంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. కర్నూలు– రాయచూర్ అంతర్రాష్ట్ర రహదారి బల్గెర సమీపం(అయిజ వైపు)లో శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ఇద్దరు యువకులు తిమ్మప్ప(35), ఓగులప్ప(40)లు మృత్యువాత పడ్డారు. మాచర్లకు చెందిన ట్రాక్టర్ యజమాని ముక్కెరయ్య చిన్నోనిపల్లెలో కంకర అన్లోడ్ చేసి మాచర్లకు బయలు దేరాడు. బల్గెర సమీపంలో కాల్వకు కొద్ది దూరంలో చీకట్లో ఓ కారు ఆగి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న క్రమంలో ట్రాక్టర్ను రోడ్డు పక్కనే ఆపి, కారులో ఉన్న వారికి సహాయం చేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో కర్ణాటకలో దేవనపల్లెకు చెందిన తిమ్మప్ప, ఓగులప్ప వరి కోతలకు సంబంధించి అయిజ మండలం తుంగభద్రా నది పరివాహక ప్రాంతంలో రైతులను కలసి వరికోత మిషన్ను తీసుకొచ్చేందుకు స్వగ్రామం దేవనపల్లెకు బైకుపై బయలు దేరగా బల్గెర వద్ద కాల్వకు కొద్ది దూరంలో రోడ్డు పక్కన నిలిచిన ట్రాక్టర్ను బలంగా ఢీకొట్టారు. ప్రమాదంలో బైకుపై ఉన్న ఇద్దరు అక్కడకక్కడే మృతి చెందారు. అనంతరం వారి మృతదేహాలను గద్వాల ఆస్పత్రికి తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శేఖర్గౌడ్ తెలిపారు. -
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
కృష్ణా: మండలంలోని కృష్ణానది నుంచి ట్రాక్టర్ల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా ఇసుకను తరలిస్తుండడంతో ఆదివారం టాస్క్ఫోర్స్, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి నాలుగు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ విషయంపై ఏఎస్ఐ యాదయ్య మాట్లాడుతూ గుడెబల్లూర్ శివారులోని కృష్ణానది నుంచి అనుమతులు లేకుండా తిమ్మప్ప, సాయికిరణ్, నరసింహా, వెంకటేష్ ఇసుకను తరలిస్తుండడంతో వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.అదే విధంగా మండలంలోని ముడుమాల్ గ్రామంలోని యాదవేంద్ర మఠం సమీప ప్రాంతం నుంచి సెలవు రోజు వచ్చిందంటే చాలు గ్రామంలో ట్రాక్టర్లు అన్ని కూడ కృష్ణానదిలోని ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇసుక ట్రాక్టర్ పట్టివేత మాగనూర్: మండల పరిధిలోని నేరడగం గ్రామ పెద్దవాగు దగ్గర అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకున్నట్లు ఎస్ఐ అశోక్బాబు తెలిపారు. కర్ణాటక రాష్ట్రం దుప్పల్లి గ్రామానికి చెందిన లక్ష్మణ్ నేరడగం పెద్దవాగు నుంచి ఇసుకను మక్తల్కు తరలిస్తున్నట్లు తెలిపారు. దీంతో ముందస్తు సమాచారం మేరకు పట్టుకొని ట్రాక్టర్ను స్టేషన్కు తరలించామన్నారు. ఇసుక రవాణాలో నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవన్నారు. ఇసుక డంపులు సీజ్ ఊట్కూర్: మండలంలోని సమస్తాపూర్ వాగు శివారులో నిల్వ చేసిన ఇసుక డంపులను ఆదివారం ఆర్ఐ కృష్ణారెడ్డి ఆధ్వర్యంంలో సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైన ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ఏఎస్ఐ సంజీవయ్య, చెన్నకేశవులు తదితరులు ఉన్నారు. -
సేంద్రియ సేద్యమే లాభసాటి
సిద్దమైన వర్మీకంపోస్టు ఎరువు జనుము సాగు పాడి–పంట అలంపూర్: వ్యవసాయం పూర్వం సేంద్రియ ఎరువుల ద్వారానే జరిగేది. పూర్వికులు రసాయన ఎరువులు, పురుగుల మందులు వినియోగించకుండానే సేంద్రియ ఎరువులపై ఆధారపడేవారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార దిగుబడులు పెంచడానికి ఆధునిక వంగడాలతోపాటుగా రసాయనాల వినియోగించుకోవాల్సిన అవసరం నెలకొంది. రసాయన ఎరువులు, పురుగుల మందులు అధికంగా వాడుతూ.. దిగుబడులు పెంచుకోనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిస్థితులను అధిగమించి సేంద్రియం ద్వారా పంటల సాగు ఎంతో నయంగా ఉంటుందని వ్యవసాయ శాఖ ఏడీఏ సక్రియానాయక్ సూచిస్తున్నారు. వీటి వల్ల కలిగే లాభాలను రైతులకు వివరించారు. రసాయనాల వాడకంతో..! సాగులో బస్తాల కొద్ది రసాయన ఎరువులను కుమ్మరించడంతో ఆ మందులను తట్టుకోనే స్థాయి పంటలను ఆశించే పురుగుకు పెరుగుతుంది. రసాయన ఎరువులు, పురుగుల మందులు అన్నీ పంటకు అధికంగా వాడకంతో వాటిని తట్టుకోనే స్థాయి పురుగులు, తేగుళ్లు కాలక్రమేన అధికమైపోతాయి. వీటి వినియోగం అధికంగా ఉంటే సాగు ఖర్చు విపరితంగా పెరుగుతుంది. ఆహార ఉత్పత్తుల నాణ్యత తగ్గిపోతాయి. సరైన అవగాహన లేకుండా రసాయనాల వాడకం వల్ల వాటి అవశేషాలు నీటిలో, సాగు నేలలో కలిసి కలుషితమవుతాయి. నష్టాలు–సూచనలు : మితిమీరిన రసాయనాల వాడకంతో మిత్ర కీటకాలు నశించి పర్యావరణంలో వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. ఆరోగ్యం, పర్యావరణంపై అవగాహన పెంచుకోవాలి. వ్యవసాయంలో పురుగుల మందులు, రసాయనాలు లేకుండా చూసుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యవసాయ ఒప్పందాల ప్రకారం మార్కెట్లో పోటీకి మన ప్రాంత రైతులు నిలవాలంటే నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇవ్వాలి. పంట ఉత్పత్తులు తక్కువ ధరలకు లభించేలా సాగు చేసుకోవాలి. సేంద్రియ విధానం: సాగులో లింగాకర్షక బుట్టలు వాడాలి. పరిమితులకు లోబడి బీటీ వైరస్ శిలీంధ్రాన్ని వాడాలి. గంధకం, రాగి ఉత్పత్తులు వాడవచ్చు. వృక్ష సంబంధం నూనెల్ని కొన్ని జాగ్రత్తలతో వాడాలి. వేప సంబంధిత ఉత్పత్తులు, పచ్చిరొట్ట, వర్మీకంపోస్టు ఎరువులను వాడాలి. పంట వ్యర్థాలు, కొబ్బరి వ్యర్థాలు, షజొల్లా ఉపయోగపడేవే. పంటల నుంచి వచ్చే బూడిద, జీవన ఎరువులు, జిప్సం పంటల్లో వాడుకోవచ్చు. సేంద్రియ ఎరువులతోనే సాధ్యం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తక్కువ ఖర్చుతో వ్యవసాయ చేసే దిశగా రైతులు అడుగులు వేస్తున్నారు. సేంద్రియ ఎరువులైన వానపాముల ఎరువులు, పశువుల ఎరువులు, కోళ్ల ఎరువు, పచ్చి ఆకులు, పిండి చెక్కలు వాడాలి. నాణ్యమైన రుచికరమైన ఉత్పత్తులను పండించి దేశానికి అందించాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ శాఖ ద్వారా చిన్న, సన్నకారు రైతులకు సైతం అందుబాటులో ఉండే వర్మీ కంపోస్టు బెడ్స్నూ రూ.5వేల సబ్సీడిపై రైతులు పొందవచ్చు. వ్యవసాయ శాఖ ద్వారా పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగు, జనుము, పిల్లిపెసర విత్తనాలను రూ.5శాతం సబ్సీడీపై అందిస్తున్నారు. సేంద్రియ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లోకి...! అంతర్జాతీయ మార్కెట్లో సేంద్రియ ఎరువులు నిలవాలంటే నిబంధనలు పాటించాల్సిందే. మన ప్రాంతంలోని నేలల్లో సేంద్రియ కర్భణం చాలావరకు తగ్గిపోయి దిగుబడుల్లో రైతులు ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. అనేక చోట్ల ఒకశాతం కార్బనం ఉన్నట్లు తెలుస్తోంది. సేంద్రియ కర్బనం పెంచడానికి కృషి చేయాలి. సేంద్రియ సాగు ద్వారా ఆహార ఉత్పత్తులు సాధించాలంటే ప్రపంచ దేశాలతోపాటు మన ప్రాంతంలో కూడా సేంద్రియ వ్యవసాయం చేసే రైతుల కమతాల్ని పరిశీలించి వారికి ధ్రువీకరణ పత్రం జారీ చేయడానికి కొన్ని ప్రమాణాలను ప్రభుత్వం నిర్ధేశించడం జరిగింది. ఆ జాబితాలు సిద్ధమవుతున్నాయి. ఏదైనా ఆహార ధాన్యాలు సేంద్రియ ఉత్పత్తిగా గుర్తించాలంటే సాగులో అనేక ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. సేంద్రియ వ్యవసాయ ఉద్యమాల అతర్జాతీయ సమాఖ్య కొన్ని సాగు ప్రమాణాలను సూచించింది. -
డిండి.. ఆశల గండి
ప్రాజెక్టు అలుగు పారుతున్నా కాల్వలో పారని నీరు ● గువ్వలోనిపల్లి సమీపంలో పూడుకుపోయిన మట్టి కాల్వ ● సాగునీరు వృథా అవుతున్నా పట్టించుకోని వైనం ● ఆందోళన చెందుతున్న ఆయకట్టు రైతులు కుడి కాల్వ పనులు నాసిరకంగా చేపట్టారు. తీగలకుంట కింద సిమెంట్ కాల్వ ఎత్తు తక్కువగా ఉండడంతో నీరు పై నుంచి పారుతోంది. గువ్వలోనిపల్లి సమీపంలో కాల్వ సరిగా లేకపోవడంతో నీరు ముందుకెళ్లడం లేదు. దాదాపుగా పదిహేనేళ్ల క్రితం తీసిన కుడి కాల్వ కింద ఇప్పటివరకు ఒక్క పంట సరిగా పండించుకోలేదు. కాల్వలో మొత్తం చెట్లు పెరిగాయి. మరమ్మతు చేసే వారే కరువయ్యారు. ఒక పక్క డిండి ప్రాజెక్టు అలుగు పారుతున్నా మాకు మాత్రం సాగునీరు అందడం లేదు. స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి రైతుల కష్టాలు తీర్చాలి. – వడ్డె బాల్రాం, ఆయకట్టు రైతు, వడ్డెర గుడిసెలు ●ఉప్పునుంతల: జిల్లా సరిహద్దులోని డిండి ప్రాజెక్టు ఆరు నెలల నుంచి అలుగుపారుతున్నా.. అధికారుల అలసత్వంతో కుడి కాల్వ వెంట సాగునీరు అందక మండలంలోని లత్తీపూర్, వడ్డెర గుడిసెలు, గువ్వలోనిపల్లికి చెందిన ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. దాదాపుగా పదిహేనేళ్ల క్రితం కుడి కాల్వ తవ్వినా ఇప్పటివరకు ఆయకట్టు కింద ఒక్క పంట కూడా పండలేదు. సాగునీటి కాల్వను నల్గొండకు చెందిన అధికారులు పర్యవేక్షిస్తుండడంతో వారు ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. తమ సమస్యను స్థానిక ప్రజాప్రతినిధులకు వివరించినా ఫలితం లేకపోవడంతో సాగునీటిపై రైతులు పెట్టుకున్న ఆశలు అందని ద్రాక్షగా మారుతున్నాయి. -
గొర్రెల దొంగ బీభత్సం
● పట్టుకునే ప్రయత్నంలో హెడ్కానిస్టేబుల్కు గాయాలు ● కారు వదిలి పారిపోయిన నిందితుడు ● కారులో కత్తి, సెల్ఫోన్ స్వాధీనం మాగనూర్: మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్కు అతిసమీపంలో గొర్రెల దొంగలు బీభత్సం సృష్టించారు. వారి పట్టుకునేందుకు ప్రయత్నించిన హెడ్ కానిస్టేబుల్ను తోసివేయడంతో గాయాలైన ఘటన శనివారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ పి.అశోక్బాబు వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని కొత్తపల్లి క్రాస్రోడ్డు వద్ద మక్తల్ మండలంలోని గుడిగండ్ల గ్రామానికి చెందిన కొందరు తమ గొర్రెల మంద ఆపి పడుకున్నారు. ఈ క్రమంలో డయల్ 100 సిబ్బంది పెట్రోలింగ్ చేస్తుండగా గొర్రెల అలజడి కనిపించి అనుమానం వచ్చి అటు వెళ్లగా.. ఓ వ్యక్తి గొర్రెలను అపహరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు. దీంతో వారు దొంగను పట్టుకునేందుకు వెళ్లగా అతడు సమీపంలో నిలిపి ఉంచిన కారులో పారిపోవడానికి ప్రయత్నించాడు. డయల్ 100 సిబ్బంది ఎస్ఐతో కలిసి కారును వెంబడిస్తూ కర్ణాటక రాష్ట్రం దేవసూగురుకు వెళ్లగా.. నిందితుడు పోలీసులపై దాడికి ప్రయత్నించారు. పోలీసులు ప్రతిదాడికి దిగడంతో దొంగ మళ్లీ మాగనూర్ వైపు రావడంతో ఎస్ఐ మాగనూర్ పోలీస్స్టేషన్లో ఉన్న సిబ్బందిని అప్రమత్తం చేసి జాతీయ రహదారిపై లారీ, బస్సును అడ్డుగా ఉంచారు. దీంతో దొంగ తప్పించుకునే ప్రయత్నంలో బస్సును కారుతో వేగంగా ఢీకొట్టాడు. అనంతరం కారు దిగి పారిపోతుండగా పట్టుకునేందుకు ప్రయత్నించిన హెడ్కానిస్టేబుల్ ఉమేష్గౌడ్ను దొంగ బలంగా రోడ్డుపై తోసివేయడంతో ఆయనకు తల, చేతికి గాయాలయ్యాయి. దొంగ పక్కనే ఉన్న చెరువులోకి దూకి పారిపోయాడు. చాలా సేపు చెరువు పరిసరాల్లో వెతికినా దొంగ జాడ దొరకలేదని ఎస్ఐ తెలిపారు. దొంగ వినియోగించిన కారును స్వాధీనం చేసుకోని నంబర్ ప్లేట్పై వేసిన బ్లాక్ స్టికర్ను తొలగించారు. కారులో ఓ సెల్ఫోన్తో పాటు కత్తి లభ్యమైనట్లు పోలీసులు పేర్కొన్నారు. హెడ్కానిస్టేబుల్ను గాయపర్చడంతో పాటు దొంగతనానికి యత్నించినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
రాములోరి బ్రహ్మోత్సవాలకు సిద్ధం
● 24 నుంచి 29వ తేదీ వరకు ఉత్సవాలు ● 27న సీతారాముల కల్యాణోత్సవంఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని ఈ నెల 24 నుంచి 29వ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్రాజు ఆదివారం తెలిపారు. ఆరు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా 24న కోయిల్ఆళ్వార్ తిరుమంజనం, అంకురార్పణ, 25న ధ్వజారోహణం, శ్రీలక్ష్మీహయగ్రీవ హోమం, 26న శ్రీ ధన్వంతరీహోమం, శ్రీసుదర్శన హోమం, 27న సీతారాముల కల్యాణోత్సవం, రథోత్సవం, 28న శ్రీ రాముడి సామ్రాజ్య పట్టాభిషేకం, ఐశ్వర్యప్రాప్తి, మహాలక్ష్మీ హోమం, 29న చక్రస్నానం, మహా పూర్ణాహుతి, పుష్పయాగం, ధ్వజారోహణం వంటి కార్యక్రమాలతో ఉత్సవాలు ముగియనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు హాజరై ఉత్సవాలను తిలకించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. -
వేగంగా.. తగ్గుముఖం
కృష్ణానదిలో భారీగా పడిపోతున్న బ్యాక్ వాటర్ లెవల్స్ ● శ్రీశైలం డ్యాంలో 837 అడుగుల ఎత్తులో నీటిమట్టం ● గతేడాది కంటే నెలరోజులు ముందుగానే తగ్గుముఖం ● వచ్చేనెలలో కేఎల్ఐ ద్వారా ఎత్తిపోతలకు బ్రేక్ పడే అవకాశం ● ఇప్పటి వరకు 33 టీఎంసీలు పంపింగ్ నీటి ఎత్తిపోతలకు ఇక్కట్లు.. ప్రస్తుతం శ్రీశైలం డ్యాంలో 60 టీఎంసీల నీటినిల్వ ఉంది. విద్యుత్ ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగితే కేఎల్ఐ ద్వారా తాగు, సాగునీటి ఎత్తిపోతలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సీజన్లో కేఎల్ఐలోని మూడు మోటార్ల ద్వారా 33 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. ప్రతిరోజు రెండు మోటార్లను నడిపిస్తున్నారు. 805 అడుగుల వరకు నీటిని ఎత్తిపోసుకోవచ్చు. ఆ తర్వాత నీటిని ఎత్తిపోస్తే మోటార్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే 810 అడుగుల వరకు మాత్రమే కేఎల్ఐ ద్వారా ఎత్తిపోతలు సాగుతున్నాయి. మోటార్లపై భారం పడకుండా నీటి ఎత్తిపోతలు కొనసాగించాలని అధికారులు భావిస్తున్నారు. మిషన్ భగీరథ పథకానికి తాగునీటిని అందించడంతో పాటు సాగు అవసరాలకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు నీటిపారుదలశాఖ అధికారులు చెబుతున్నారు. కొల్లాపూర్: కృష్ణానదిలో నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. శ్రీశైలంలో రెండు తెలుగు రాష్ట్రాలు నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేపడుతుండటంతో కొ న్ని రోజులుగా బ్యాక్ వాటర్ లెవల్స్ భారీగా పడిపోతున్నాయి. దీనికితోడు కేఎల్ఐ ప్రాజెక్టులో నీటి ఎత్తిపోతలు విరామం లేకుండా సాగుతున్నాయి. ఇ దే తరహాలో నీటిమట్టం తగ్గితే.. వచ్చే నెలలో ఎత్తిపోతలకు బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 837 అడుగుల దిగువకు.. గతేడాది మార్చి నెలాఖరు వరకు శ్రీశైలం బ్యాక్ వాటర్ 850 అడుగులకు పైగానే ఉంది. ఏప్రిల్లో బ్యాక్ వాటర్ తగ్గడం ప్రారంభమైంది. కానీ ఈ ఏడాది నెల రోజుల ముందునుంచే బ్యాక్ వాటర్ లెవెల్స్ తగ్గుతూ వస్తున్నాయి. శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి ప్రారంభించడంతో రోజుకు 1 నుంచి 1.5 టీఎంసీల నీటిని వినియోగిస్తున్నారు. ఫలితంగా బ్యాక్ వాటర్ లెవెల్స్ వేగంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం శ్రీశైలం బ్యాక్వాటర్ లెవెల్స్ 837 అడుగులకు చేరుకుంది. నెలాఖరు వరకు ఇంకా తగ్గనుంది. మోటార్లకు మరమ్మతు.. కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా ఏప్రిల్లోనే ఎత్తిపోతలు ఆగితే ఎల్లూరు పంపుహౌజ్లోని మోటార్లకు మరమ్మతులు చేపట్టాలనే యోచనలో అధికారులు ఉన్నారు. కొన్నేళ్ల క్రితమే పంపుహౌజ్లోని రెండు మోటార్లు పాడయ్యాయి. మిషన్ భగీరథ కోసం విరామం లేకుండా నీటి ఎత్తిపోతలు కొనసాగిస్తుండటంతో.. వాటికి మరమ్మతు చేయడం వీలు కా వడం లేదు. అయితే ఈ ఏడాది నార్లాపూర్ రిజర్వాయర్లో ఉన్న నీటిని మిషన్ భగీరథకు మళ్లించి.. కేఎల్ఐ మోటార్లకు మరమ్మతు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. కేఎల్ఐ అప్రోచ్ కెనాల్లో పారుతున్న శ్రీశైలం బ్యాక్ వాటర్ -
మిగిలింది 9 రోజులే..
● గడువు దగ్గర పడుతుండటంతో వేగం పెంచిన అధికారులు ● ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో స్పెషల్ డ్రైవ్ ● పుర ఎన్నికలు, సిబ్బంది కొరతతోనే జాప్యం ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో అంతంతమాత్రంగానే పన్నుల వసూళ్లు ఏటా మార్చిలోనే అత్యధికంగా పన్ను వసూళ్లు అవుతాయి. ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది.. ప్రజాపాలన–పట్టణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పన్ను వసూళ్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నాం. పుర ప్రజలు, వ్యాపారులు ఆస్తి పన్ను సకాలంలో చెల్లించి అభివృద్ధికి సహకరించాలి. వారం రోజులుగా పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టిసారించాం. ఈ నెల 31 వరకు వంద శాతం పన్ను వసూలు చేసేందుకు కృషి చేస్తున్నాం. – నర్సయ్య, పుర కమిషనర్, నారాయణపేట నారాయణపేట: మున్సిపాలిటీల అభివృద్ధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసే నిధులతోపాటు ఆస్తి పన్ను వసూళ్లు ప్రధాన భూమిక పోషిస్తాయి. మున్సిపాలిటీల్లోని నివాస, వాణిజ్య సముదాయాలకు సంబంధించి 2025– 26 ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను వసూళ్లపై పుర యంత్రాంగం దృష్టిసారించింది. క్యూఆర్కోడ్ స్కాన్, డెబిట్, క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, వాట్సప్ నంబర్, ఏటీఎం ద్వారా నేరుగా ఆయా పురపాలికల ఖాతాల్లో జమ చేయవచ్చని చెబుతోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 16 నుంచి 31వ తేదీ వరకు పన్ను వసూళ్లకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. కాగా ఈ ఏడాది ఇప్పటి వరకు పన్ను వసూలు అంతంత మాత్రమే ఉండటం.. లక్ష్యం చేరుకునేందుకు కేవలం 9 రోజులు మాత్రమే గడువు ఉండటంతో అధికారులు, సిబ్బంది వసూళ్లలో వేగం పెంచారు. -
రైతుభరోసా నిధులు సద్వినియోగం చేసుకోండి
మహబూబ్నగర్ (వ్యవసాయం): రైతులు రైతుభరోసా నిధులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి వెంకటేష్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదివారం సిద్ధిపేట జిల్లాలోని నర్మెట్టలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించి, అనంతరం రైతు భరోసా నిధుల విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని 48 రైతు వేదికల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా రైతులు వీక్షించారు. రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడ గ్రామంలోని రైతువేదికలో జరిగిన కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి బి.వెంకటేష్ పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 2,15,923 మంది రైతులకు రూ.104,77,74,728 విడతల వారీగా 45 రోజుల్లో వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. జిల్లాలోని 2,15,923 మంది రైతులకు ఎకరాకు రూ.6 వేల చొప్పున తొలి విడత నిధులు సోమవారం వారి ఖాతాల్లో జమ కానున్నట్లు తెలిపారు. రైతులు ఈ నిధులను సద్వినియోగం చేసుకుని యాసంగి పంటలను లాభదాయకంగా సాగు చేయాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
గంపజాతర: గ్రామాన్ని కాపాడే విశ్వాస సంప్రదాయం
మహబూబ్నగర్ న్యూటౌన్: గ్రామంలో అనుకోని విపత్కర సంఘటనలు, అశుభాలు దరిచేరకుండా.. ఏడాదికోసారి నిర్వహించేదే గంపజాతర. ప్రతి ఏటా ఫిబ్రవరి ప్రారంభం నుంచి మే నెల వరకు ప్రతి ఆదివారం, మంగళవారాల్లో ఏదో ఒకరోజు ఈ గంపజాతర నిర్వహిస్తారు. ఉదయాన్నే లేచి వంట పాత్రలు, వంటకు కావాల్సిన సరుకులు తీసుకొని ఒక గంపలో పెట్టుకొని ఇళ్లకు తాళం వేసి గ్రామాన్ని వదిలిపెడతారు. గంపను నెత్తిపై పెట్టుకొని ఊరు చివర, పంట పొలాల వద్ద చెట్లకిందకెళ్లి అక్కడే వంటలు చేసుకొని పిల్లాపాపలతో గడుపుతారు. ఏడాదిసారి ఇలా చేస్తే అంటురోగాలు రావని, పట్టిన దారిద్య్రం వదులుంతుందనేది ప్రజల్లో గట్టి నమ్మకం. గంపజాతర కార్యక్రమాన్ని ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్, దేవరకద్ర, జడ్చర్ల, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో జరుపుకొంటున్నారు.ఉదయం వెళ్లి.. సాయంత్రం రాక ప్రతి సంవత్సరం గంప జాతర పేరుతో గ్రామాన్ని వదిలి చెట్లకింద గడిపి పొద్దు పోయాక ఇళ్లకు చేరుకుంటే అంటురోగాలు, దారిద్య్రం దరిచేరవని ప్రజల నమ్మకం. గంప జాతర కార్యక్రమాన్ని ఇప్పటికీ చాలా గ్రామాల్లో ప్రతి సంవత్సరం నిర్వహించడం ఆచారంగా వస్తోంది. నిర్ణయించిన ప్రకారం ఆ రోజు తెల్లవారుజామునే లేచి వంటపాత్రలు గంపలో పెట్టుకొని గ్రామంలో ఎవరూ ఉండకుండా ఇళ్లకు తాళం వేసి వెళ్తారు. కాలకృత్యాలు సైతం ఊరు బయటనే తీర్చుకుంటారు. తిరిగి సాయంత్రం ఇళ్లకు వచ్చి శుద్ధి చేసుకుని దీపాలు వెలిగిస్తారు. ఆ రోజు ఇంట్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదని తీర్మానిస్తారు.ఆ తర్వాతే పొలం పనులు.. గ్రామాల్లో ఆచారంగా వస్తున్న గంపజాతర కార్యక్రమం నిర్వహించిన తర్వాతనే పొలం పనులు మొదలుపెడతారు. వర్షాలు కురువక ముందే గంపజాతర జరుపుకొంటారు. గంపజాతర నిర్వహించిన తర్వాత పంటలు వేసుకునేందుకు పొలాలను సిద్ధం చేసుకుంటారు. వర్షాలు కురిసిన వెంటనే పంటలు వేసుకుంటారు.గతంలో వర్షాల కోసం.. మూడు నాలుగు దళాబ్దాల క్రితం వరకు గంపజాతరను అన్ని గ్రామాల్లో జరుపుకొనేవారని పెద్దలు చెబుతారు. వర్షాలు కురవాలని కోరుతూ గ్రామాల్లో గంపజాతర నిర్వహించేవారని పేర్కొంటున్నారు. ఉదయం తెల్లవారక ముందే లేచి ఇళ్లకు తాళం వేసి గ్రామాన్ని వదిలేవారని, కాకపోతే చెట్ల కిందకు కాకుండా అడవిలోకి వెళ్లి ప్రకృతిని పూజించే వారని చెబుతున్నారు. గట్టిగా ఏడ్వడం, బాధ పడటం వంటివి చేసేవారని, తినడానికి మంచి ఆహారం కాకుండా చింతపండు, ఉప్పు, కారం వంటివి తీసుకెళ్లేవారన్నారు. రోజంతా అడవిలో బాధపడుతూ వర్షాలు కురవాలని ప్రకృతిని పూజించి సాయంత్రం ఇళ్లకు చేరుకునే వారని చెబుతున్నారు.క్రమంగా ఆచారంలో మార్పులు గతంలో ఉన్న గంపజాతర నిర్వహణ ఆచారాల్లో మానవ అభివృద్ధి క్రమంలో మార్పులు చోటు చేసుకున్నట్లు పెద్దలు చెబుతున్నారు. ఇళ్లను వదిలి గ్రామాన్ని దాటి అడవిలో కాకుండా పొలాల్లో చెట్ల కింద గడపడం, ఆహారపు ఆచారంలోనూ ఎవరికి నచ్చిన విధంగా వారు మార్పులు తెచ్చారని అంటున్నారు. చెట్ల నీడలో ఊయల ఊగడం, పిల్లాపాపలు, మిత్రులు, కుంటుంబ సభ్యులతో కలిసి ఆటలు ఆడటం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆహ్లాదకర వాతావరణంలో గడుపుతున్నారు. జడ్చర్ల మండలం గంగాపూర్ శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్మామి బ్రహ్మోత్సవాల్లో గంప జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. జడ్చర్లతో పాటు కోయిలకొండ, మద్దూరు, దేవరకద్ర, కోస్గి, కొడంగల్, తాండూర్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు తమ ఇంటి దేవుడు శ్రీ లక్ష్మి చెన్నకేశవస్వామి చిత్రపటంతో పాటు వారు పండించిన పంటలను గంపలో పెట్టుకొని పాదయాత్రగా ఆలయానికి చేరుకుంటారు. అక్కడే దాసంగాలు పెట్టి స్వామివారి మొక్కు తీర్చుకుంటారు.ప్రతిఏటా నిర్వహిస్తాం.. గంపజాతర కార్యక్రమం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో ఒకరోజు నిర్వహించడం ఆచారంగా వస్తోంది. ఇలా చేస్తే కొన్నిరకాల రోగాలు దరిచేరవనే నమ్మకం అందరిలో ఉంది. అంతేకాకుండా గంపజాతర నిర్వహిస్తూ చెట్ల కింద ఆనందంగా గడపడానికి కూడా ప్రజలు దీన్ని నిర్వహిస్తున్నారు. – శిర్ప రవి, వేపూరు గ్రామం, హన్వాడ మండలం, మహబూబ్నగర్ జిల్లా గ్రామస్తుల ఇష్టం మేరకే.. గ్రామస్తుల ఇష్టం మేరకే గంపజాతర నిర్వహించేందుకు అందరం కలిసి నిర్ణయిస్తాం. ప్రతి సంవత్సరం ఆచారంగా వస్తోంది. ముందుగా నిర్ణయించిన తేదీ ప్రకారం గ్రామంలో ప్రజలందరూ గంపజాతరకు వెళ్తున్నారు. కుటుంబ సమేతంగా పిల్లాపాపలతో ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకొంటున్నారు. – శ్రీదేవి, మాజీ సర్పంచ్, షేక్పల్లి, హన్వాడ మండలం, మహబూబ్నగర్ జిల్లావిపత్కర పరిస్థితులు రావు.. గ్రామంలో గంపజాతర నిర్వహిస్తే అనుకోని విపత్కర పరిస్థితులు ప్రజలకు రావని, దారిద్య్రం, అంటురోగాలు రావని ప్రతి సంవత్సరం ముందుగా నిర్ణయించిన తేదీ ప్రకారం నిర్వహిస్తారు. గంపజాతర నిర్వహించడం ద్వారా వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండుతాయని నమ్ముతాం. గంపజాతర నిర్వహించకపోతే గ్రామంలో ఏదో కోల్పోయినట్లుగా ఉంటుంది. – శ్రీకాంత్, నవాబ్పేట, మహబూబ్నగర్ జిల్లా -
వటువర్లపల్లి రీలొకేషన్కు అనుమతి
మన్ననూర్/అమ్రాబాద్: అటవీ సరిహద్దు ప్రాంత గ్రామాల పునరావాసంలో భాగంగా రెండవ ఫేజ్లో ఉన్న వటువర్లపల్లి గ్రామాన్ని తరలించేందుకు కేంద్రం అనుమతులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన అటవీ సంరక్షణ అధికారిణి (పీసీసీఎఫ్) సువర్ణ తెలిపారు. శనివారం అమ్రాబాద్ మండలం వటువర్లపల్లి నుంచి పునరావాసం కోరుకునే లబ్ధిదారులను అటవీశాఖ అధికారులతో కలిసి ఆమె కలిశారు. గ్రామంలోని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం రీలొకేషన్పై గ్రామస్తులతో చర్చించారు. మొదటి విడతగా సార్లపల్లి, కుడిచింతలబైలు, తాటిగుండాల గ్రామాల్లోని కుటుంబాలకు పూర్తిస్థాయిలో పునరావాసం పనులు ఇదివరకే ప్రారంభమైన విషయాన్ని తెలియజేశారు. రెండవ విడతలో వటువర్లపల్లిలోని సుమారు 670 కుటుంబాలకు పునరావాసం ప్యాకేజీ కేటాయించనున్నట్లు వివరించారు. పులు ల రక్షిత అభయారణ్యంలో జన సంచారం ఉండకూడదనే నిబంధనలను అనుసరిస్తూ.. పునరావాసం అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. అదే విధంగా అంతర్జాతీయ అటవీ దినోత్సవంలో భాగంగా మద్దిమడుగు రేంజ్ పరిధిలోని చింతలమట్ట, సోమచెల్క, ఇసుక రేగడి, గద్దలసరి, మన్ననూర్ రేంజ్ పరిధిలోని గుండం, పర్హాబాద్ వ్యూ పాయింట్ ప్రాంతాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పార్క్ నుంచి విడిచిన 60 మచ్చలజింకలను పరిశీలించారు. రివర్ పెట్రోలింగ్, అటవీ సంరక్షణపై తీసుకుంటున్న చర్యలను సిబ్బందితో తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎఫ్డీ సునీల్, డీఎఫ్ఓ రోహిత్ చంద్ర, ఎఫ్డీఓ రామ్మూర్తి, ఫ్లయింగ్ స్క్వాడ్ ఎఫ్డీఓ రామ్మోహన్, ఎఫ్ఆర్ఓ వీరేశ్ తదితరులు పాల్గొన్నారు. -
‘సిర్సనగండ్ల’ ఆలయ అభివృద్ధికి కృషి
● రూ.2 కోట్లతో అభివృద్ది పనులు ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు చారకొండ: రాష్ట్రంలో అపర భద్రాద్రిగా ప్రసిద్ధిగాంచిన సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధికి పెద్దపీట వేసి మరిన్ని నిధులతో అన్నిరకాలుగా అభివృద్ధి చేసి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం మండలంలోని సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి ఆలయ ఆవరణలో రూ.2 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి మంత్రి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. అంతకు ముందు సీతారామచంద్రస్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో మంత్రి, ఎమ్మెల్యేలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి గతంలో ఇచ్చిన హామీ మేరకు రూ.2 కోట్లు మంజూరు చేశామని, త్వరలోనే మరో రూ.కోటి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రజాపాలనలో సీఎం రేవంత్రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో ఆలయం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. త్వరలో జరిగే బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్నిరకాల వసతులు కల్పిస్తామని చెప్పారు. అనంతరం బ్రహ్మోత్సవాల వాల్పోస్టర్ను మంత్రి, ఎమ్మెల్యేలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఉమ, ఆలయ కమిటీ చైర్మన్ డేరం రామశర్మ, ఈఓ ఆంజనేయులు, సర్పంచ్ రామస్వామి, ఉపసర్పంచ్ సురేందర్రెడ్డి, నాయకులు బాల్రాంగౌడ్, వెంకట్గౌడ్, వెంకటయ్యయాదవ్, జైపాల్, గణేష్గౌడ్, వెంకటయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
18 క్వింటాళ్ల పత్తి దగ్ధం
మానవపాడు: మండల కేంద్రంలో బింగిదొడ్డి గ్రామానికి చెందిన సునీల్రెడ్డి పత్తి పంటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటలు దట్టంగా వ్యాప్తి చెందడంతో దాదాపు 6 ఎకరాల్లో 18 క్వింటాళ్ల పత్తి దగ్ధమైంది. దీంతో బాధిత రైతుల లబోదిబోమని వేడుకుంటున్నాడు. కౌలుకు తీసుకొని పంట సాగు చేస్తుండగా పంట మొత్తం కాలి బూడిదైందని, ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని వేడుకుంటున్నారు. విద్యార్థి బలవన్మరణం తెలకపల్లి: మండల కేంద్రానికి చెందిన డీఎంఎల్టీ విద్యార్థి సామ శివ (22) శనివారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ నరేశ్ వివరాల మేరకు.. మృతుడు సామ శివ హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో డీఎంఎల్టీ చదువుతున్నాడు. మూడు రోజుల క్రితం ఇంటికి వచ్చిన అతడు.. తన మనసు బాగోలేదని ముభావంగా ఉండేవాడు. ఈ క్రమంలోనే శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి రాంచంద్రమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ నరేశ్ తెలిపారు. -
తాడిపర్తి చెరువులో మొసలి కలకలం
గోపాల్పేట: మండలంలోని తాడిపర్తి చెరువు నుంచి శనివారం మొసలి ఒడ్డుకు రావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. మొసలిని చూసిన ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఆరు నెలల క్రితం మొసలి తాడిపర్తి చెరువు ఒడ్డుకు రాగా.. ప్రజలు స్నేక్ సొసైటీ ఫౌండర్ క్రిష్ణసాగర్కు ఫోన్లో సమాచారం అందించారు. దీంతో ఆయన అక్కడికి వచ్చేలోపు చెరువులోకి వెళ్లిపోయింది. శనివారం ఉదయం మరోసారి మొసలి బయటికి రావడంతో స్థానికులు కేకలు వేయడంతో మళ్లీ చెరువులోకి వెళ్లిపోయింది. మొసలి పెద్దగా ఉందని చిన్నపిల్లలు, పెద్దలు ఎవరూ ఈతకు వెళ్లడం, పశువులను నీళ్లకు తీసుకువెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలని పెద్దలు సూచించారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకుని మొసలిని పట్టుకుని వేరే ప్రాంతానికి తరలించాలని కోరారు. కల్వరాలలో.. వీపనగండ్ల: మండలంలోని కల్వరాల అమ్మ చెరువులో మొసలి సంచరిస్తుండడంతో సమీప పంట పొలాల రైతులు భయాందోళనకు గురవుతున్నారు. చెరువులో సంచరిస్తున్న మొసలి రాత్రి వేళలో సమీప పంట పొలాల్లోకి వచ్చి నివాసం ఉటుండంతో ఎప్పుడు ఎలాంటి ఆపద వస్తుందోనని పలువురు రైతులు పొలా లకు వెళ్లాలంటే జంకుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి మొసలిని బంధించి సురక్షిత ప్రాంతానికి తరలించాలని, చెరువు సమీపంలో హెచ్చరిక బో ర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. -
మినీ ట్యాంక్బండ్గా ఊరచెరువు
● రూ.కోటి11లక్షలతో అభివృద్ధి పనులు ● శంకుస్థాపన చేసిన ఎంపీ అరుణ, ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ● హర్షం వ్యక్తం చేస్తున్న పాతబజార్ వాసులు జడ్చర్ల టౌన్: మున్సిపాలిటీ పరిధిలోని పాతబజార్ పోచమ్మ ఆలయానికి ఆనుకుని ఉన్న ఊరచెరువుకు మహార్దశ పట్టనుంది. అమృత్ 2.0, రాష్ట్ర ప్రభుత్వం, యూఎల్బీ సంయుక్త నిధుల ద్వారా చెరువును మినిట్యాంక్బండ్గా మార్చేందుకు రూ.కోటి11లక్షలు కేటాయించారు. ఈ నిధులకు సంబంధించి శనివారం మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మున్సిపాలిటీ పరిధిలో పోచమ్మ ఆలయం వద్ద ఉన్న ఊరచెరువును పరిరక్షించేందుకు కొన్నేళ్లుగా పోరాటాలు జరిగాయి. దశాబ్దం కిందట చెరువులో ప్లాట్లు వెలియడంతో పాతబజార్వాసులు ప్రస్తుత కౌన్సిలర్ ఉమాశంకర్గౌడ్, జీనురాల సత్యంతోపాటు మరికొందరు పరిరక్షణ కమిటీగా ఏర్పడి ఆందోళనలు చేశారు. చెరువులో ప్లాట్లు చేయడం వల్ల భూగర్భజలాలు అడుగంటిపోతాయని ఆందోళనలు చేశారు. వీరికి స్థానికుల నుంచి మద్దతు లభించింది. ఆ నేపథ్యంలోనే అప్పటి కలెక్టర్ ప్రియదర్శిని చెరువును సందర్శించి ఇరిగేషన్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి కట్టను పునఃరుద్ధరింపజేశారు. అప్పటినుంచి ఏదో సందర్భంలో చెరువు సమస్య వివాదం నడుస్తూనే ఉంది. ఇటీవల వరదనీటి కాల్వల నిర్మాణం చేస్తున్న సమయంలో అలుగునీరు వెళ్లే ప్రాంతంలో కాలువ నిర్మాణం చేయకుండా కొందరు తమ ప్లాట్లు ఉన్నాయని అడ్డుకున్నారు. అయితే ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి కాల్వ నిర్మాణం వైపు మొగ్గుచూపటంతో సమస్య సద్దుమణిగింది. పాతబజార్ వాసుల హర్షం ఊరచెరువును మినీట్యాంక్బండ్గా అభివృద్ధి చేస్తుండటంపై పాతబజార్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోచమ్మ ఆలయం వద్ద చెరువు మురుగు లేకుండా శుభ్రం అవుతుందని, నిధులు కేటాయించినందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అభివృద్దే లక్ష్యంగా.. అభివృద్ధే లక్ష్యంగా అన్ని మున్సిపాలిటీల అభివృద్ధికి అమృత్ ద్వారా కేంద్రం నిధులు కేటాయిస్తుందని, దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం సైతం నిధులు కేటాయించింది. అందులో భాగంగానే ఊరచెరువు మినీ ట్యాంక్బండ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. రూ.45కోట్లతో జడ్చర్ల మున్సిపల్లో నీటి సమస్య పరిష్కారానికి నిధులు కేటాయించాం. పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. త్వరితగతిన పూర్తిచేయాలని కాంట్రాక్టర్కు చెప్పాం. – డీకే అరుణ, పార్లమెంట్సభ్యురాలు. అభివృద్ధికి కట్టుబడి ఉన్నా నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను. అందులో భాగంగానే మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటికే రూ.14కోట్లతో వరద కాలువలు నిర్మించుకుంటున్నాం. ఇప్పుడు కేంద్ర సహకారంతో ఊరచెరువు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకున్నాం. త్వరలోనే మరిన్ని నిధులు తెచ్చి మున్సిపాలిటీని ముందుకు తీసుకువెళ్తా. – అనిరుధ్రెడ్డి, ఎమ్మెల్యే, జడ్చర్ల మినీట్యాంక్బండ్ ఊర చెరువు మినీట్యాంక్ బండ్గా మార్చాలని అనేక ఏళ్లుగా ప్రతిపాదనలున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో మినీట్యాంక్ బండ్ ఏర్పాటుకు నిధులు విడుదలయ్యాయి. అమృత్ 2.0లో రూ.45లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.45లక్షలు, యూఎల్బీ నిధులు 21లక్షలు కేటాయించారు. శంకుస్థాపన కార్యక్రమంలో మున్సిపల్ పాలకవర్గం, ఆయాపార్టీల నాయకులు పాల్గొన్నారు. -
దేవరగుట్టలో మరోసారి చిరుత హల్చల్
నవాబుపేట: గతేడాది దాదాపుగా నెలరోజులపాటు దేవర గుట్టలో తిష్ట వేసిన చిరుత అప్పట్లో అటవీశాఖ అధికారులు బోన్లు ఏర్పాటు చేసిన వాటికి చిక్కకుండా తప్పించుకుని తిరిగింది. కాగా నెలరోజులు ఇక్కడే మకాం వేసిన చిరుత రోజూ సాయంత్రం జాగింగ్కు వచ్చినట్లు వచ్చి గుట్టలోని గుండ్లపై సేదతీరుతూ అందరికీ కనపడేలా కూర్చునేది. కాగా అప్పట్లో కనిపంచకుండా పోయిన చిరుత మరోసారి దర్శనం ఇచ్చింది. అదే దేవరగుట్టలో గుండ్లపై తీరుగుతూ శనివారం యన్మన్గండ్ల గ్రామస్తులను ఆందోళనకు గురి చేసింది. దర్జాగా గుండ్లపై గంతులు వేస్తూ చిరుత హల్చల్ చేయడంతో గ్రామస్తులు భయాందోళన చెందారు. కాగా ఇప్పటికే ఒక లేగదూడ మృతి చెందితే చిరుత తీన్నదన్న అనుమానంతో అక్కడివారు సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయిన అధికారు లు పట్టించుకోలేదు. తాజాగా చిరుతనే గుట్టపై కనిపించడంతో మరోసారి గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే అటవీశాఖ అధికారులు నిర్లక్ష్యం వీడి చిరుతను బంధించి గ్రామస్తుల భయాందోళన తొలగించాల్సిన అవసరం ఉంది. పిల్లిగుండు అటవీ ప్రాంతాల్లో చిరుత సంచారం హన్వాడ: మండలంలోని పెద్దర్పల్లి, పల్లెమోనికాలనీ, పిల్లిగుండుతండా, కొత్తచెరువు పరిసర అటవీ ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్లు భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. పెద్దర్పల్లికి చెందిన వెంకటయ్యకు చెందిన ఆవుదూడపై దాడిచేసి చంపినట్లు పేర్కొంటున్నారు. అదే గ్రామానికి చెందిన రామయ్య పొలం వద్ద శనివారం ఉదయం ఆవుదూడ కళేబరం లభిచడం, పరిసర ప్రాంతాల్లో చిరుత జాడలు లభ్యమవడంపై పరిస ప్రాంతాల ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆవుదూడపై శనివారం తెల్లవారుజామున 5గంటల ప్రాంతంలో చిరుత దాడి చేసినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఆయా గ్రామాల శివార్లలోని గిద్దెగట్టు, చీకర్లబండ, బండకుంట పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్లు ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. మేకలు, గొర్రెలు, పశువుల కాప ర్లు ఆయా ప్రాంతాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు గ్రామస్తులు సూచిస్తున్నారు. -
బైక్ను ఢీకొట్టిన కారు.. వ్యక్తి దుర్మరణ ం
మిడ్జిల్: కారు బైకును ఢీకొట్టిన ప్రమాదంలో బైకుపై ఉన్న వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని రాణిపేట్ గ్రామానికి చెందిన బోయ మల్లేశ్(31) బైకుపై జడ్చర్ల వెళ్లి ఇంటికి వస్తుండగా మార్గ మధ్యలో కొత్తపల్లి గ్రామ శివారులో కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఎస్ఐ శివనాగేశ్వర్నాయుడు సంఘటనా స్థలానికి చేరుకొని మల్లేశ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య రేణుక, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రేణుక రాణిపేట్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యురాలుగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందారు. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి కోస్గి రూరల్: అత్తగారింటికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. పోలీసులు కథనం మేరకు.. వికారాబాద్ జిల్లాలోని దుద్యాల మండలంలోని కుదురుమళ్ల గ్రామానికి చెందిన దేవరకొండ భీమానందం (35)కు ఇద్దరు భార్యలు. పట్టణానికి చెందిన మహిళను వివాహం చేసుకోగా ఆమెకు కుమార్తె ఉన్నారు. అనంతరం ఈర్లపల్లి గ్రామానికి చెందిన సంగీతను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలో ఉగాది పండుగను పురస్కరించుకొని రెండో భార్య సంగీత గ్రామమైన ఈర్లపల్లికి వెళ్లాడు. తిరిగి శుక్రవారం అర్ధరాత్రి కోస్గి బయలుదేరగా.. మార్గమధ్యలో సర్జఖాన్పేట్ గ్రామ శివారులోని బ్రిడ్జి సమీపంలో బైక్ అదుపు తప్పి కిందపడటంతో తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావమైంది. వాహనదారులు గమనించి 108 వాహనానికి సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకోని క్షతగాత్రుడిని కోస్గి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. రెండో భార్య సంగీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని ఎస్ఐ బాల్రాజ్ తెలిపారు. శనివారం పోస్టుమార్టం ఆనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అందించగా.. సొంత గ్రామమైన కుదురుమళ్లలో అంతక్రియలు చేపట్టారు. నీరు తాగేందుకు వెళ్లి బావిలో పడి వ్యక్తి మృతి కొత్తకోట రూరల్: నీరు తాగేందుకు బావి దగ్గరకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందిన ఘటన మండలంలోని నాటవెళ్లి పెద్దతండాలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, తండావాసులు తెలిపిన వివరాల మేరకు నాటవెళ్లిపెద్దతండాకు చెందిన ముడావత్ బుజ్జినాయక్ (58) తన మేకలను మేత కోసం శుక్రవారం ఉదయం తండా శివారులోని పొలాల్లోకి వెళ్లాడు. సాయంత్రమే మేకలు ఇంటికి వచ్చినా.. బుజ్జినాయక్ మాత్రం రాత్రయిన ఇంటికి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు శనివారం ఉదయం వెతకగా.. గ్రామ శివారులోని ఓ బావి వద్ద నీళ్ల బిందె, చెప్పులు కనిపించడంతో గ్రామస్తులతో కలిసి బావికి రెండు మోటార్లను బిగించి నీటికి బయటకు తోడారు. దీంతో బావిలో బుజ్జినాయక్ మృతదేహం లభ్యమైంది. నీళ్లు తాగేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బుజ్జినాయక్ మృతితో తండాలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. రోడ్డుప్రమాదంలో బాలుడి దుర్మరణ ం ● మరో బాలుడికి తీవ్ర గాయాలు మరికల్: కారు ఢీకొని ఓ బాలుడు మృతిచెందగా.. మరో బాలుడికి తీవ్ర గాయాలైన ఘటన శనివారం మరికల్ శివారులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మరికల్కు చెందిన సాయినాథ్రెడ్డి, మరో బాలుడు రిషివర్ధన్రెడ్డి బైక్పై పొలానికి వెళ్తుండగా.. ఆత్మకూర్–కన్మనూర్ క్రాసింగ్ వద్దకు రాగానే మరికల్ నుంచి ఆత్మకూర్ వైపు వేగంగా వచ్చిన కారు బైక్ను ఢీకొట్టింది. కారు మూడు పల్టీలు కొట్టి నిలిచిపోయింది. అదే సమయంలో అక్కడి నుంచి వస్తున్న ఎస్ఐ రాము ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు పిల్లలను అంబులైన్స్లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. రిషివర్ధన్రెడ్డి పరి స్థితి పూర్తిగా విషమించడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రుల రోదనలు కన్నీళ్లు తెప్పిస్తున్నా యి. కారులో బెలున్స్ ఓపెన్ కావడంతో డ్రైవర్ సాయికిరణ్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాము తెలిపారు. -
లాభసాటిగా అల్లం పంట సాగు
అలంపూర్: వ్యవసాయంలోను నూతన పంటల సాగుపై రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. సంప్రదాయ పంటల సాగులో వస్తున్న నష్టాల నుంచి గట్టెక్కడానికి అన్నదాతలు వాణిజ్య పంటలపై దృష్టి కేంద్రికరిస్తున్నారు. ఆ కోణంలోనే అల్లం పంట సాగు చేసి లాభాలను ఆర్జిస్తున్నారు. వరి కంటే తక్కువ నీటి వినియోగంతో అల్లం పంట సాగు చేసే అవకాశం ఉండటంతో అనేక మంది రైతులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. వ్యవసాయ శాఖ ఏడీఏ సక్రియానాయక్ రైతులకు అల్లం పంట సాగుకు సంబంధించి పలు సూచనలు చేశారు. అనువైన నేలలు అల్లం సాగుకు ఎర్ర నేలలు అనువుగా ఉంటాయి. నీరు నిల్వ ఉండని నేలలు అయితే సాగుకు అనుకూలం. వరి సాగుతో పోల్చితే నీటి వినియోగం చాలా తక్కువ. ఒక ఎకరా పొలంలో వరి సాగు చేయడానికి కావాల్సిన నీటితో ఒక్కటిన్నర ఎకరంలో అల్లం సాగు చేసుకొనే వెసలుబాటు ఉంటుంది. పంట కాలం అల్లం పంట ఎనిమిది నుంచి తొమ్మిది నెలల్లో చేతికి అందుతుంది. దుక్కి ఇలా... అల్లం సాగులో దుక్కి చాలా ముఖ్యమైనది. దుక్కిని 30 సెంటీమీటర్ల లోతు వరకు దున్నుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరానికి 10 ట్రక్కుల బాగా చిలికిన పశువుల ఎరువు, 150 కిలోల సూపర్, 30 కిలోల పొటాష్ వేసుకోవాలి. కనీసం 30 సెంటీమీటర్ల ఎత్తు, బొదె పైభాగం, 90 సెంటీమీటర్లు ఉండేలా 4 అడుగుల వెడల్పుతో బొదెలు తయారు చేసుకోవాలి. నీటి తడుల కోసం బొదెల మధ్య ఇన్లైన్ డ్రిప్ అమర్చుకోవాలి. విత్తన మోతాదు ఎకరానికి 1000 కిలో విత్తనం అవసరం అవుతుంది. 20 రోజుల పాటు కుప్పగా వేసి మండె కట్టాలి. మండె కట్టిన 20 రోజుల తర్వాత విత్తిన దుంపలు చిన్న చిన్న మొలకలు రాగానే వాటిని 30 గ్రామాల బరువు ఉండేలా కత్తిరించాలి. వీటిని లీటర్ నీటికి 3 గ్రాముల మాంకోజెబ్, 2 మిల్లీ లీటర్ల క్లోరోఫైరిపాస్ కలిపి 30 నిమిషాలు నానబెట్టి భూమిలో విత్తాలి. విత్తిన 3–5 వారాల్లో పూర్తిగా మొలక వస్తోంది. ప్రతి రోజు 6 గంటల పాటు డ్రిప్తో నీటిని అందించాలి. విత్తే సమయం సాధారణంగా రైతులు జూన్ మాసంలోనే అల్లం పంట సాగు చేసుకోవచ్చు. నీటి పారుదల ఉంటే ఫిబ్రవరిలో లేదా మార్చి నెలలో నాటుకున్న ఉత్తమమైనదే. తెగుళ్ల యాజమాన్యం : అల్లం సాగులో ప్రధానంగా దుంప కుళ్లు తెగులే, బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు ఆశిస్తుంది. వీటి వలన 30 నుంచి 50 శాతం వరకు పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. దుంప కుళ్లును గుర్తించినట్లయితే మెటలాక్సిల్ 1 గ్రాము లీటర్ నీటిలో కలిపి వేరు ప్రాంతం తడిచేలా పోయాలి. ఈ విధంగా పది రోజుల వ్యవధిలో రెండు సార్లు చేయాల్సి ఉంటుంది. వేడి గాలుల నుంచి రక్షణ : అల్లం మొలకెత్తిన తర్వాత బొదెలకు రెండు వైపులకు కింది భాగంలో 30 సెంటీమీటర్ల దూరంలో మొక్కజొన్న నాటుకోవాలి. దీని వలన పిలక దశలో అల్లం పంటను వేడి గాలులు, అధిక ఉష్ణోగ్రతల నుంచి కాపాడుకోవచ్చ. దిగుబడి : ఎకరానికి 15 నుంచి 20 టన్నుల దిగుబడి వస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో టన్ను రూ.30 వేల వరకు పలుకుతోంది. పాడి–పంట అల్లంలో మారన్ విత్తనాలు మంచి దిగుబడిని ఇస్తాయి. దీనిని కేరళ నుంచి తెప్పించుకోవాల్సి ఉంటుంది. మహావ రకం మహరాష్ట్రలో లభి స్తోంది.ఇవేకాక కేరళలో ఎర్నాడ్, వేనాడ్, కరు ప్పం పాడి, నడియా రకాలు ప్రసిద్ధిగాంచినవి. పిలక దశలో మొదటి నాలుగు నెలలు యూరియా, 20:20 ఎరువులు రోజు మార్చి రోజు డ్రిప్ ద్వారా అందించాలి. దుంప ఎదుగుదల దశలో 13:0:45 ఎరువులను 3 నుంచి 5 నెలల వరకు ప్రతి నెల ఒకసారి ఇవ్వాలి. వీటితోపాటు మెగ్నీషియం సల్ఫేట్, కాల్షియం నైట్రేట్ ఇవ్వాలి. -
గంప జాతర
బయలెల్లుతున్న గ్రామాలు మహబూబ్నగర్ న్యూటౌన్: గ్రామంలో అనుకోని విపత్కర సంఘటనలు, అశుభాలు దరిచేరకుండా.. ఏడాదికోసారి నిర్వహించేదే గంపజాతర. ప్రతి ఏటా ఫిబ్రవరి ప్రారంభం నుంచి మే నెల వరకు ప్రతి ఆదివారం, మంగళవారాల్లో ఏదో ఒకరోజు ఈ గంపజాతర నిర్వహిస్తారు. ఉదయాన్నే లేచి వంట పాత్రలు, వంటకు కావాల్సిన సరుకులు తీసుకొని ఒక గంపలో పెట్టుకొని ఇళ్లకు తాళం వేసి గ్రామాన్ని వదిలిపెడతారు. గంపను నెత్తిపై పెట్టుకొని ఊరు చివర, పంట పొలాల వద్ద చెట్లకిందకెళ్లి అక్కడే వంటలు చేసుకొని పిల్లాపాపలతో గడుపుతారు. ఏడాదిసారి ఇలా చేస్తే అంటురోగాలు రావని, పట్టిన దారిద్య్రం వదులుంతుందనేది ప్రజల్లో గట్టి నమ్మకం. గంపజాతర కార్యక్రమాన్ని ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్, దేవరకద్ర, జడ్చర్ల, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో జరుపుకొంటున్నారు. ఇళ్లకు తాళాలు..రోజంతా వనవాసాలు పిల్లాపాపలు, బంధుమిత్రులతో కలిసి విందులు ప్రతి సంవత్సరం ఆచారంగా జాతర నిర్వహణ అంటురోగాలు, దారిద్య్రం పోతుందనే నమ్మకం ఫిబ్రవరి నుంచి మే నెల వరకు కొనసాగింపు -
క్రమంగా ఆచారంలో మార్పులు
గతంలో ఉన్న గంపజాతర నిర్వహణ ఆచారాల్లో మానవ అభివృద్ధి క్రమంలో మార్పులు చోటు చేసుకున్నట్లు పెద్దలు చెబుతున్నారు. ఇళ్లను వదిలి గ్రామాన్ని దాటి అడవిలో కాకుండా పొలాల్లో చెట్ల కింద గడపడం, ఆహారపు ఆచారంలోనూ ఎవరికి నచ్చిన విధంగా వారు మార్పులు తెచ్చారని అంటున్నారు. చెట్ల నీడలో ఊయల ఊగడం, పిల్లాపాపలు, మిత్రులు, కుంటుంబ సభ్యులతో కలిసి ఆటలు ఆడటం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆహ్లాదకర వాతావరణంలో గడుపుతున్నారు. ● జడ్చర్ల మండలం గంగాపూర్ శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్మామి బ్రహ్మోత్సవాల్లో గంప జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. జడ్చర్లతో పాటు కోయిలకొండ, మద్దూరు, దేవరకద్ర, కోస్గి, కొడంగల్, తాండూర్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు తమ ఇంటి దేవుడు శ్రీ లక్ష్మి చెన్నకేశవస్వామి చిత్రపటంతో పాటు వారు పండించిన పంటలను గంపలో పెట్టుకొని పాదయాత్రగా ఆలయానికి చేరుకుంటారు. అక్కడే దాసంగాలు పెట్టి స్వామివారి మొక్కు తీర్చుకుంటారు. -
ప్రతి ఈద్గా వద్ద ప్రత్యేక బందోబస్తు
మహబూబ్నగర్ క్రైం: రంజాన్ సందర్భంగా శనివారం నగరంలోని ఈద్గా దగ్గర బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ డి.జానకి పర్యవేక్షించారు. ప్రత్యేక ప్రార్థనలు చేయడానికి వచ్చే మైనార్టీలకు ఎలాంటి సమస్య రాకుండా చూడాలని ఆదేశించారు. ప్రధానంగా వాహనాల పార్కింగ్ దగ్గర, రోడ్డు మార్గాల్లో ట్రాఫిక్ సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఈద్గాల దగ్గర ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జిల్లావ్యాప్తంగా పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు. పండగ సందర్భంగా నిరంతరం పెట్రోలింగ్ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎన్బీ రత్నం, సురేష్కుమార్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐలు అప్పయ్య, శ్రీనివాస్, రాజేందర్రెడ్డి పాల్గొన్నారు. అన్ని వర్గాలను నిరాశపరిచిన బడ్జెట్ జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్తో కాంగ్రెస్ సర్కారు అన్ని వర్గాల ప్రజలను మరోసారి మోసం చేసిందని మరోసారి తేలిపోయిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. శనివారం ఆయన విలేకరలుతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మూడో బడ్జెట్లోనైనా ప్రభుత్వం సంక్షేమం పథకాలపై ఎక్కువ దృష్టి పెడుతుందనుకున్నారని.. కానీ అందుకు భిన్నంగా ఉందన్నారు. ఈ బడ్జెట్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 11 డిక్లరేషన్లకు ఊసే లేదన్నారు. బీసీలకు ఏడాదికి రూ.20వేల కోట్లు ఐదేళ్లకు లక్ష కోట్లు ఇస్తామని ఇప్పుడు 3.85 శాతం నిధులు మాత్రమే కేటాయించారని విమర్శించారు. బీసీ గురుకులాల్లో అన్నం సరిగ్గా లేక విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నారని, మైనారిటీ గురుకులాల్లో వసతులు లేక ఖాళీ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎస్ రద్దు చేస్తామని ప్రభుత్వం మాట తప్పిందని, పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు సరిగా ఇవ్వడం లేదని ఆరోపించారు. పదవీ విరమణ పొందిన వారికి ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉండడం సిగ్గుచేటన్నారు. అన్నం పెట్టే రైతు ఇబ్బందుల్లో ఉన్నాడని, రైతుబంధు, విద్యుత్ సరఫరా, యూరియా సరిగా ఇవ్వడం లేదని, పండించిన తరువాత కనీసం గిట్టుబాటు ధర లేదని మండిపడ్డారు. జనాభాలో సగ భాగం ఉన్న బీసీలకు రూ.50 వేల కోట్లు ఇవ్వాల్సిందేని, దళితులకు రూ.10 లక్షలు ఇచ్చేందుకు బడ్జెట్ పెట్టాలని డిమాండ్ చేశారు. మైనార్టీలకు ప్రత్యేక సబ్ ప్లాన్ అమలు చేయాలని కోరారు. సమావేశంలో మైనారిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రెహమాన్ కార్పొరేటర్లు కిషోర్, సిద్దిఖి, శరత్, మధు, నవకాంత్, నాయకులు నరేందర్, అన్వర్, నరేష్, శ్రీశైలం పాల్గొన్నారు. బకాయిలు చెల్లించేదెన్నడో? మహబూబ్నగర్ మున్సిపాలిటీ: రాష్ట్ర బడ్జెట్లో ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు మొండిచేయి చూపించడం తగదని ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫోరం అధ్యక్షుడు ఎ.రాజసింహుడు అన్నారు. శనివారం మెట్టుగడ్డలోని సీనియర్ సిటిజన్స్ ఫోరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రిటైరైన ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. బకాయిలు రాక, పింఛను లేక ఎలా బతకాలని ప్రశ్నించారు. 2024 జూలై నుంచి పదవీ విరమణ పొందిన ఉద్యోగుల లీవ్ ఎన్కాష్మెంట్, గ్రాట్యుటీ ఇంతవరకు చెల్లించలేదన్నారు. 2017 పేస్కేల్, డిఫరెన్స్ ఎరియర్స్, డీఏ బకాయిలు చెల్లించడానికి ఆర్టీసీకి నిధులు కేటాయించకపోవడం ఎంతవరకు సమంజసమన్నారు. సమావేశంలో ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫోరం నాయకులు డి.భగవంతు, బీహెచ్ కుమార్, అంజన్న, మోహన్రెడ్డి, ఉమేష్కుమార్, రాంరెడ్డి, మనోహర్, ఇజ్రాయెల్, చక్రధర్ పాల్గొన్నారు. -
ఆదాయం అంతంతే..
తలసరి ఆదాయంలో అట్టడుగునే నారాయణపేట, గద్వాల, వనపర్తి జిల్లాలు 7జీడీడీపీ.. (ప్రస్తుత ధరల వద్ద.. రూపాయల్లో)మహబూబ్నగర్ నాగర్కర్నూల్ వనపర్తి జో.గద్వాల నారాయణపేట17,27828,47137,456ఉత్పత్తి కేంద్రాలు.. యూనిట్లు 8,165 2,298 4,4764,142 4,070 ఉపాధి ‘హామీ’ అంతంతే.. ఉపాధి హామీ పథకం కింద కూలీలకు పూర్తిస్థాయిలో పనిదినాలు కల్పించి వారి ఆదాయం పెంచాల్సి ఉండగా, ఉమ్మడి జిల్లాలో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. కూలీలకు లక్ష్యం మేరకు పూర్తిస్థాయిలో పనిదినాలు కల్పించడం లేదు. ఉపాధి హామీలో లక్ష్య సాధన విషయంలోనూ మహబూబ్నగర్ మినహా మిగతా జిల్లాలు వెనుకే ఉన్నాయి. మహబూబ్నగర్లో 88.60 శాతం లక్ష్యం చేరుకోగా, వనపర్తి జిల్లాలో అత్యల్పంగా 73.10 శాతం, గద్వాల జిల్లాలో 74.60 శాతం, నారాయణపేట జిల్లాలో 77.40 శాతం, నాగర్కర్నూల్ జిల్లాలో 81.60 శాతం లక్ష్యం నెరవేరింది. వ్యవసాయ రంగంలో మిశ్రమ పంటల విధానం, పంటల సాంద్రతలో ఉమ్మడి జిల్లా చివరన ఉంది. వనపర్తి జిల్లాలో పంటల సాంద్రత 169 కాగా, మహబూబ్నగర్లో 146, నాగర్కర్నూల్ 143, నారాయణపేట 133, గద్వాలలో 132 పాయింట్లుగా పంటల సాంద్రత నమోదైంది. సాక్షి, నాగర్కర్నూల్: దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. అన్ని రంగాల్లో క్రమంగా వృద్ధి కనిపిస్తోంది. కానీ రాష్ట్రంలో మిగతా జిల్లాల కన్నా ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్ మినహా నారాయణపేట, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాలు తలసరి ఆదాయం విషయంలో అట్టడుగు స్థానంలో కొనసాగుతున్నాయి. నారాయణపేట జిల్లా రాష్ట్రంలోనే 28వ స్థానంలో కొనసాగుతుండగా, జోగుళాంబ గద్వాల జిల్లా 26వ స్థానంలో ఉంది. వస్తు సేవల ఉత్పత్తిలో ప్రామాణికంగా నిలిచే జీడీడీపీ విషయంలోనూ ఈ జిల్లాలు వెనుకంజలో ఉన్నాయి. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్ లుక్ సర్వే 2026లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఏడాదిలో వ్యక్తులకు లభిస్తున్న సగటు ఆదాయం విషయంలో మహబూబ్నగర్ మినహా మిగతా జిల్లాలు అట్టడుగునే కొనసాగుతున్నాయి. మహబూబ్నగర్ తలసరి ఆదాయం రూ. 3.36 లక్షలతో రాష్ట్రంలోనే 6వ స్థానంలో మెరుగ్గా ఉంది. నారాయణపేట జిల్లా రూ.2.59 లక్షల తలసరి ఆదాయంతో 28 స్థానంలో, గద్వాల జిల్లా రూ. 2.66 లక్షలతో 26వ స్థానంలో ఉండగా, వనపర్తి జిల్లా రూ.2.74 లక్షలతో 21వ స్థానం, నాగర్కర్నూల్ జిల్లా రూ. 2.79 లక్షల తలసరి ఆదాయంతో 19వ స్థానంలో నిలిచింది. వస్తుసేవల ఉత్పత్తిలోనూ పాలమూరు జిల్లాలు వెనుకంజలో ఉన్నాయి. ప్రస్తుత ధరల వద్ద జీడీడీపీ రూ.37,456తో మహబూబ్నగర్ జిల్లా 11వ స్థానంతో మెరుగ్గా కనిపిస్తుండగా, మిగతా జిల్లాలు వెనుకబడ్డాయి. నారాయణపేట జిల్లా రూ.17,278 జీడీపీపీతో 29వ స్థానంలో ఉండగా, వనపర్తి జిల్లా 27వ స్థానం, గద్వాల 26వ స్థానం, నాగర్కర్నూల్ జిల్లా 19వ స్థానంలో ఉంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆశించినంతంగా పరిశ్రమలు ఏర్పాటు కావడం లేదు. చిన్న తరహా పరిశ్రమలు, ఉత్పత్తి కేంద్రాల ద్వారా స్థానికులు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. కానీ ఉమ్మడి జిల్లాలో పరిశ్రమలు, ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు తక్కువగా ఉంది. అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లాలో 8,165 ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటుకాగా, అతి తక్కువగా నారాయణపేట జిల్లాలో 2,298 యూనిట్లు మాత్రమే ఉన్నాయి. నారాయణపేట జిల్లా రాష్ట్రంలోనే 29వ స్థానం జీడీడీపీలోనూ పాలమూరు జిల్లాలు వెనుకంజ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్ లుక్ సర్వేలో వెల్లడి -
‘ఇందిరమ్మ’ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లాలో ‘ఇందిరమ్మ’ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఇన్చార్జి స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ మధుసూదన్నాయక్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామానికి క్రమం తప్పకుండా ఇంజినీర్లు వెళ్లి ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి రోజువారీ నివేదికలు సమర్పించాలన్నారు. ఎక్కడైనా ఈ పనులు ఆగిపోతే వెంటనే లబ్ధిదారులను కలిసి చైతన్యపరచాలన్నారు. స్లాబ్ స్థాయికి చేరుకున్న చోట పనులు ఎందుకు ఆలస్యమవుతున్నాయో ఏఈలతో అడిగి తెలుసుకున్నారు. జిల్లాకు 10,555 ‘ఇందిరమ్మ’ ఇళ్లు మంజూరు కాగా 7,898 కి మార్కింగ్ వేశారని వారు వివరించారు. మిగిలినవి ఇందిరమ్మ కమిటీల ద్వారా లబ్ధిదారులు త్వరగా పనులు ఆరంభించేలా చూడాలని ఆయన సూచించారు. ఇసుకతో పాటు ఇతర సామగ్రి కొరత ఉంటే వెంటనే పరిష్కరించాలన్నారు. రెవెన్యూ శాఖ ద్వారా ఇసుక సరఫరా సులభతరం చేస్తామన్నారు. వచ్చే నెలలో 1,300 ఇళ్లు పూర్తి కావాలి ఇక ‘ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళికశ్రీలో భాగంగా ఏప్రిల్ 20 నుంచి 26వ తేదీ వరకు కనీసం 1,300 గృహ ప్రవేశాలు అయ్యేలా చూడాలన్నారు. వచ్చే జూన్ 2 నాటికి మిగిలిన ఇళ్లు సైతం పూర్తి చేయాలన్నారు. ప్రస్తుతం ఈ ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రంలోనే జిల్లా 21వ స్థానంలో ఉందని, వచ్చే జూన్ 2 నాటికి టాప్ 5లోకి తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇకపై ప్రతిరోజూ ఏఈలు, ఎంపీడీఓలు, హౌసింగ్ అధికారులతో సమీక్షించి ఇళ్ల పురోగతిని పర్యవేక్షిస్తామన్నారు. సమావేశంలో హౌసింగ్ పీడీ వెంకట ఉపేందర్ రెడ్డితో పాటు డీఈఈలు పాల్గొన్నారు. -
క్రీడాకారులకు ‘వర్కటం’ ప్రోత్సాహ ం
మక్తల్: క్రీడాకారులు ఉన్నత శిఖరాలకు ఎదిగేందుకు తన వంతు సహకారం అందిస్తానని వీజేఆర్ ఫౌండేషన్ చైర్మన్ వర్కటం జగన్నాథ్రెడ్డి అన్నారు. పట్టణానికి చెందిన క్రీడాకారులు శ్రీనివాస్గౌడ్, శివాణి, అక్షిత, జాహ్నవి, జయకాత్యాయని, తన్మయ ఇటీవల హైదరాబాద్లో జరిగిన అండర్–19 క్రికెట్, ఇతర క్రీడల్లో సత్తా చాటడంతో వారిని తన కార్యాలయానికి పిలిపించి సన్మానించి అభినందించారు. అనంతరం ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజ సేవలో వీజేఆర్ ఫౌండేషన్ ఎప్పుడు ముందుంటుందని పేర్కొ న్నారు. వీజేఆర్ నిర్వాహకులు అంజనారెడ్డి, క్రీడా కారులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజారంజక బడ్జెట్..
ఇది ప్రజారంజక బడ్జెట్. ముఖ్యంగా చేయూత పథకం కింద కొత్తగా 2లక్షల మందికి పింఛన్లు ఇవ్వడం అభినందనీయం. అలాగే విద్యారంగానికి పెద్దపీట వేయడం మా ప్రజాపాలనకు అద్దం పడుతుంది. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు మధ్యాహ్న భోజనం అమలు చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలు తమ పిల్లలను బడికి పంపేందుకు ముందుకు వస్తారు. రైతుభరోసాకు నిధులు కేటాయించడం రైతులపై మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. వైద్యరంగానికి సైతం పెద్దఎత్తున నిధులు కేటాయించడంతో పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించినట్లయ్యింది. – జనంపల్లి అనిరుధ్రెడ్డి, ఎమ్మెల్యే, జడ్చర్ల అంకెలగారడీ కాంగ్రెస్ ప్రభుత్వం ముచ్చటగా మూడవసారి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ అంకెలగారడీగా ఉంది. ప్రజలను బడ్జెట్ రూపంలో మరోమారు మోసం చేసింది. ఎన్నికల సమయంలో పింఛన్లు రూ.2వేల నుంచి రూ. 4వేలకు పెంచుతామని చెప్పి.. దాన్ని ఊసే ఎత్తడం లేదు. బడ్జెట్తో జిల్లాకు ఒరిగిందేమీ లేదు. కొత్త ఉద్యోగాల ఊసేలేదు. మహాలక్ష్మి పథకం అంటూ ఆర్టీసీని పూర్తిగా నష్టాల్లోకి నెట్టేశారు. ప్రజలను మభ్యపెట్టి మోసం చేసేందుకే బడ్జెట్లో అంకెలు చూయించారు. – సి.లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ● -
ఈద్గా వద్ద ప్రత్యేక బందోబస్తు
మహబూబ్నగర్ క్రైం: నగరంలో శనివారం రంజాన్ సందర్భంగా శుక్రవారం అదనపు ఎస్పీ ఎన్బీ రత్నం ఈద్గా దగ్గర బందోబస్తు ఏర్పాట్లపై పరిశీలించారు. ఉదయం 9.30గంటలకు నిర్వహించనున్న ఈద్ ఉల్ ఫితర్ నమాజ్కు భారీ సంఖ్యలో ముస్లింలు హాజరుకానున్న నేపథ్యంలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయడంపై అధికారులతో సమీక్షించారు. ప్రధానంగా ఆ మార్గంలో ట్రాఫిక్ సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. నమాజ్ కోసం వారి వాహనాల పార్కింగ్ నిర్వహణపై కూడా దృష్టి పెట్టాలన్నారు. తెలంగాణ కూడలి, బోయపల్లి గేట్ దగ్గర రద్దీ క్రమంలో ట్రాఫిక్ సమస్య రాకుండా చూడాలని, ఆ తర్వాత ఈద్గా దగ్గర పార్కింగ్ సక్రమంగా చేసే విధంగా చూడాలన్నారు. వీఐపీఐ వచ్చిన సమయంలో ఎలాంటి సమస్య లేకుండా ముదస్తు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో టూటౌన్ సీఐ ఇజాజుద్దీన్, ట్రాఫిక్ సీఐ రాజేందర్రెడ్డి, ఎస్ఐలు భాస్కర్రెడ్డి, నరేందర్రెడ్డి పాల్గొన్నారు. ● మహబూబ్నగర్ ఎస్పీ కార్యాలయంలోని మోటార్ ట్రాన్స్పోర్ట్లో హైడ్రాలిక్ లిప్ట్ నిర్మాణం కోసం శుక్రవారం జిల్లా ఎస్పీ డి.జానకి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో వాహనాల నిర్వహణ అత్యంత కీలకమని, హైడ్రాలిక్ లిప్ట్ ద్వారా వాహనాలకు మరమ్మతులు సులువుగా చేయవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీలు ఎన్బీ రత్నం, సురేష్కుమార్, డీఎస్పీలు రమణారెడ్డి, బాలాజీ ఇతర అధికారులు పాల్గొన్నారు. -
అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
దేవరకద్ర: మున్సిపాలీటీలో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ కుష్బూ గుప్తా ఆదేశించారు. శుక్రవారం మున్సిపాలీటీలోని 7వార్డులో ఇందిమ్మ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణాలు పూర్తి చేస్తున్నా నాల్గవ విడత డబ్బులు రాలేదని పలువురు లబ్ధిదారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సంబంధిత అధికారులు సాంకేతిక సమస్య కారణంగా అప్లోడ్ చేయలేదని మున్సిపల్ కమిషనర్ను తప్పదోవ పట్టించినట్లు, అలాగే సాంకేతిక సమస్య లేనట్లు కలెక్టర్ స్వయంగా గుర్తించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేసిన మున్సిపల్ మేనేజర్, వార్డు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో దశల వారీగా ఫోటోటు యాప్లో క్యాప్చర్ చేయడంలో జాప్యం చేయవద్దని, జాప్యం చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని పేర్కొన్నారు. గురుకుల పాఠశాల తనిఖీ.. దేవరకద్రలోని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. గురుకుల పాఠశాల, డీగ్రీ కళాశాలలో మౌలిక వసతులు మెరుగు పర్చాలని సూచించారు. తరగతి గదులను పరిశీలించి మధ్యాహ్నా భోజనాన్ని రుచి చూశారు. పాఠశాలలో తగినన్ని ఫ్యాన్లు లేక పోవడంపై ప్రిన్సిపాల్ను ప్రశ్నించారు. కార్యక్రమంలో తహసీల్దార్ దీపిక, ఎంపీడీఓ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ నరేష్బాబు తదితరులు పాల్గొన్నారు. -
సీఎంను కలిసిన ఎమ్మెల్యే యెన్నం
స్టేషన్ మహబూబ్నగర్: రాష్ట్ర శాసనసభలో సీఎం రేవంత్రెడ్డిని శుక్రవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల తనను ప్రభుత్వ విప్గా నియమించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పనిచేస్తానని.. అసెంబ్లీలో ప్రభుత్వ విధానాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు పాత్ర నిర్వర్తిస్తానని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, విజయరమణారావు, వేముల వీరేశం, శాసనమండలి ప్రభు త్వ విప్లు అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్ తది తరులు పాల్గొన్నారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జీ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ను ఎమ్మెల్యే యెన్నం కలిసి ధన్యవాదాలు తెలిపారు. -
మాహే రంజాన్.. ఈద్ ముబారక్
● నేడు ‘ఈద్ ఉల్ ఫితర్’ ● ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు ● ముగిసిన రంజాన్ ఉపవాసాలు జోరుగా సామగ్రి కొనుగోళ్లు... రంజాన్ మాసంలో జిల్లా కేంద్రంలోని వ్యాపార కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. ముస్లింలు పగలంతా ధ్యానంలో గడుపుతారని భావించిన వ్యాపారులు రోజూ రాత్రి 12 గంటల వరకు షాపులను తెరచి ఉంచారు. గత మూడు రోజుల నుంచి క్లాక్టవర్, పాన్ చౌరస్తా, పాత గంజ్, అశోక్టాకీస్ చౌరస్తా, బస్టాండ్, న్యూటౌన్, మెట్టుగడ్డ, పద్మావతి కాలనీ తదితర ప్రాంతాల్లో ముస్లింలతో షాపులన్నీ కిటకిటలాడాయి. ముఖ్యంగా వస్త్రాలు, కాస్మోటిక్ వస్తువులు, మెహందీ, మిస్వాక్, ఇత్తర్ (సుగంధ ద్రవ్యాలు), సుర్మా, ధార్మిక పుస్తకాలైన ఖురాన్, జానీమాస్లు, గృహ పరికరాలతో పాటు రంజాన్ మాసం ప్రత్యేక వంటకం షీర్కుర్మా తయారీ కోసం ఉపయోగించే సేమియాలు, డ్రైఫ్రూట్స్ షాపుల వద్ద సందడి నెలకొంది. స్టేషన్ మహబూబ్నగర్: శుక్రవారం రాత్రి షవ్వాల్ నెలవంక దర్శనమివ్వడంతో ముస్లింలు 30 రోజుల పాటు చేసిన ఉపవాసాలు విరమించారు. నేడు (శనివారం) జిల్లా వ్యాప్తంగా ఈద్గాలు, మజీదుల్లో ఈద్–ఉల్–ఫితర్ పండుగను జరుపుకొని సర్వ మానవ కల్యాణం కోసం ప్రత్యేక నమాజు చేసి ప్రార్థనలు చేస్తారు. పేదలు, ధనికుల తేడా లేకుండా అందరూ నూతన వస్త్రాలను ధరించి ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకుంటారు. జిల్లా కేంద్రంలోని జామీయ మసీద్ నుంచి ఉదయం 8 గంటలకు సామూహికంగా గడియారం చౌరస్తా మీదుగా స్థానిక వానగట్టు రహెమానియా ఈద్గా వద్దకు చేరుకుంటారు. ఈద్గా వద్ద ఉదయం 9.30 గంటలకు జామియా మసీద్ ప్రధాన ఇమామ్ హాఫిజ్ మహ్మద్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో ప్రత్యేక నమాజు, సామూహిక ప్రార్థనలు చేస్తారు. ఈ క్రమంలో ఈద్ ముబారక్ చెప్పడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు ఈద్గా వద్దకు చేరుకొని పట్టణ ఖౌమీ ఏకతా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే శిబిరం వద్ద ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలుపనున్నారు. విక్రయానికి ఉంచి సేమియా, బాదం, పిస్తాలు -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
పాన్గల్: చింతచెట్టుపై నుంచి కింద పడి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం పాన్గల్లో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన గెంటీల తెలుగు నర్సింహ(54) ఈ నెల 4న గ్రామ శివారులో చింతచెట్టు పైన చింతపండు తెంపుతుండగా ప్రమాదవశాత్తుతో కాలు జారి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు జిల్లా ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్కు తరలించారు. అనంతరం మహబూబ్నగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడికి భార్య వెంకటమ్మ, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. బాధిత కుటుంబాన్ని మత్స్యకార సంఘం నాయకులు పరామర్శించి సానుభూతిని తెలిపారు. మృతుడి భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కుర్మయ్య తెలిపారు. కారు, బైక్ ఢీ: ఒకరు దుర్మరణం ● ఇద్దరికి తీవ్రగాయాలు అమ్రాబాద్: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలైన ఘటన శుక్రవారం రాత్రి అమ్రాబాద్ సమీపంలో మద్దిమడుగు రహదారిపై చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం వివరాల ప్రకారం అమ్రాబాద్ మండలంలోని వెంకటేశ్వర్లబావి గ్రామానికి చెందిన చాంద్పాషా(21), పర్వతాలు, వెంకటేష్లు బైక్పై రాత్రి తమ గ్రామం వెంకటేశ్వర్లబావి వెళ్తుండగా మన్ననూర్ నుంచి అమ్రాబాద్ వైపు వస్తున్న కారు మార్గమధ్యలో అమ్రాబాద్ సమీపంలో బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చాంద్పాషా మృతిచెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వారి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంకటేష్, పర్వతాలుకు జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేశారు. -
వాలిడేషన్ చట్టం రాజ్యాంగ విరుద్ధం
కల్వకుర్తి రూరల్: కేంద్ర ప్రభుత్వం 25 మార్చి 2025లో ప్రవేశపెట్టిన వాలిడేషన్ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, అది దేశంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని కోటి 80 లక్షల రిటైర్డ్ ఉద్యోగులకు గొడ్డలి పెట్టని ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం కల్వకుర్తి పట్టణంలోని రిటైర్డ్ ఉద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం లోక్భలో ప్రవేశపెట్టిన ఈ చట్టం వల్ల 1 జనవరి 2026 కంటే ముందు పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు వేతన సవరణ చట్టం, ఇతర బెనిఫిట్స్ ఏవీ లభించవన్నారు. చట్టానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్క రిటైర్డ్ ఉద్యోగి గళం విప్పి కేంద్ర ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఉద్యోగులలో విభజన తెచ్చే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం దారుణమన్నారు. మార్చి 25న రాష్ట్రంలోని రిటైర్డ్ ఉద్యోగులందరూ మండల కేంద్రాలు, డివిజన్ కేంద్రాలు, కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి అధికారులకు వినతిపత్రాలు అందించాలని వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణయ్య, సుధాకర్, పెంటయ్య, నిర్మల, రామారావు, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. -
పీయూకు రూ.45 కోట్లు
● గతేడాది వేతనాలకు రూ.13 కోట్లు, ఈసారి రూ.20 కోట్లు ● కొత్త ఇంజినీరింగ్, లా కళాశాలల ఏర్పాటు, సిబ్బందికి వేతనాలతో పెరిగిన బడ్జెట్ ● అభివృద్ధి పనుల కోసం రూ.25 కోట్లు కేటాయింపు ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని స్వాగతిస్తున్నాం.. ఉద్యోగులు పెన్షనర్లు, ఆరోగ్య పథకానికి రూ.1,056 కోట్లు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నాం. దీని ద్వారా ఉద్యోగులు, వారి కుటుంబంపై ఆధారపడిన వారికి డిజిటల్ హెల్త్కార్డుల ద్వారా నగదు రహిత వైద్యం చేయడం మంచి విషయం. అయితే రెండో పీఆర్సీ, అదనపు నిధులు, అనుకున స్థాయిలో విద్యారంగానికి నిధులు కేటాయించకపోవడం, పెంచిన నిధుల్లో మధ్యాహ్న భోజనం, బ్రేక్ ఫాస్ట్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు వంటి వాటికే సరిపోయే అవకాశం ఉంది. పాఠశాలల్లో వసతుల కల్పనకు నిధులు అనుకున్న స్థాయిలో కేటాయించలేదు. – జుర్రు నారాయణ, తెలంగాణ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు వ్యవసాయ రంగానికి అనుకూలం.. గ్రామీణ ప్రాంత వారిని ఆకట్టుకునేలా బడ్జెట్ ఉంది. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం శుభపరిణామం. ఉమ్మడి జిల్లాకు చెందిన వ్యక్తి సీఎంగా ఉన్నా ప్రాజెక్టులకు కొత్తగా ఏమీ కేటాయించలేదు. పాఠశాల విద్య మినహాయిస్తే యూనివర్సిటీ లు, ఉన్నత విద్యకు అనుకున్న స్థాయిలో ని ధులు లేవు. వైద్యరంగానికి ఆరోగ్యశ్రీకి కూ డా అనుకున్న స్థాయిలో నిధులు లేవు. మొ త్తంగా ప్రాంతీయ ఎన్నికలను దృష్టిలో పెట్టు కుని బడ్జెట్ కేటాయించినట్లు అనిపిస్తుంది. – డాక్టర్ గడ్డం జిమ్మీకార్టన్, మాజీ విభాగాధిపతి, ఎకనామిక్స్, పీయూ విద్యారంగానికి మొండిచేయి.. ప్రభుత్వం విద్యారంగానికి ఈసారి కూడా మొండిచేయి చూపించింది. రూ.3.24 లక్షల కోట్ల బడ్జెట్లో కేవలం రూ.26 వేల కోట్లు (8.22 శాతం) మాత్రమే కేటాయించారు. కొఠారీ కమిషన్ నివేదిక ప్రకా రం విద్యకు కనీసం 30 శాతం బడ్జెట్లో నిదులు కేటాయించాలి. స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ వంటి వాటికి అదనపు నిధులు లేవు. – భరత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూకు ప్రభుత్వం గత రెండేళ్లుగా స్థిరంగా బడ్జెట్ కేటాయిస్తోంది. ఈసారి సిబ్బందికి వేతనాలు పెంచేందుకు మరిన్ని నిధులు వెచ్చించింది. గతేడాది కేవలం టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బంది కోసం రూ.13 కోట్లు మాత్రమే కేటాయించింది. గత కొన్నేళ్లుగా ఇదే బడ్జెట్ వెచ్చిస్తూ వచ్చిన ప్రభుత్వం ఈసారి ఏకంగా రూ.7 కోట్లు అధికంగా కేటాయించారు. ఇందులో ప్రధానంగా పీయూలో లా, ఇంజినీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేయడంతో అక్కడ పనిచేస్తున్న టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బందికి వేతనాలు ఇవ్వాల్సి ఉంది. వచ్చే విద్యా సంవత్సరంలో రెండు కళాశాలలు సెకండ్ ఇయర్లోకి అడుగు పెట్టనున్న క్రమంలో సిబ్బంది సంఖ్య కూడా మరింత పెరగనుంది. అలాగే పీయూతోపాటు గద్వాల, కొల్లాపూర్, వనపర్తి పీజీ సెంటర్లలో పనిచేస్తున్న సిబ్బందికి ఈసారి అధికారులు 12 శాతం వేతనాలు పెంచగా.. వచ్చే సంవత్సరం కూడా మరో 12 శాతం ఈ నిధుల నుంచి కేటాయించనున్నారు. రెగ్యులర్ సిబ్బందికి ఇంక్రిమెంట్ తదితరాలు ఇచ్చేందుకు ఈ నిధుల నుంచే వెచ్చించనున్నారు. వీటితోపాటు యూనివర్సిటీలో జరుగుతున్న అభివృద్ది పనుల కోసం రూ.25 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. పీయూలో కొత్తగా నిర్మిస్తున్న లా, ఇంజినీరింగ్ కళాశాలలు, హాస్టల్ భవనాలతోపాటు ఇతర నిర్మాణాలు చేపట్టేందుకు బడ్జెట్లో వెచ్చించిన నిధులు ఖర్చు చేయనున్నారు. వేతనాలు పెంచనున్నాం.. ప్రభుత్వం గతేడాదితో పోల్చితే ఈసారి వేతనాలకు కేటాయించే బడ్జెట్ పెంచింది. గతంలో రూ.13 కోట్లు ఉండగా.. ఈసారి రూ.7 కోట్లు పెంచి రూ.20 కోట్లు ఇచ్చింది. దీంతో లా, ఇంజినీరింగ్ కళాశాలల సిబ్బందికి వేతనాలు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి కూడా వేతనాలు పెంచనున్నాం. వీటితోపాటు అభివృద్ధి కోసం రూ.25 కోట్లు కేటాయించారు. దీంతో పీయూలో విద్యార్థులకు నాణ్యమైన విద్య, అభివృద్ధి చేస్తాం. – జీఎన్ శ్రీనివాస్, వీసీ, పీయూప్రగతికి బాటలు.. రాష్ట్ర బడ్జెట్ ప్రగతికి బాటలు వేసే విధంగా ఉంది. ఉమ్మడి జిల్లాలోని రైతాంగానికి, పేదలకు, ఉద్యోగులకు కొండంత అండగా నిలిచేలా నిధుల కేటాయింపులు జరిగాయి. ఇది ఇందిరమ్మ రాజ్యానికి అసలైన పునాది. కేవలం అంకెలు మాత్రమే కాదు.. సామాన్యుడి ఆశలను ప్రతిబింబించే బడ్జెట్ ఇది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వడం హర్షణీయం. రైతుభరోసా, రైతు రుణమాఫీతో పాటు సాగునీటి రంగానికి, విద్యుత్ సబ్సిడీలకు భారీ కేటాయింపులు చేయడం రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చాటుతోంది. – సంజీవ్ ముదిరాజ్, డీసీసీ అధ్యక్షుడు, మహబూబ్నగర్ బీసీలను మోసం చేసేలా.. బీసీలను మోసం చేసేలా బడ్జెట్ ఉంది. 56శాతం ఉన్న బీసీలకు కేవలం 4శాతం నిధులు రూ. 12,500 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ నిధులు కూడా ఖర్చు చేస్తారన్న నమ్మకం లేదు. గత బడ్జెట్లో బీసీల సంక్షేమానికి కేటాయించిన నిధులే ఖర్చు చేయలేదు. ప్రతి సంవత్సరం బీసీ సంక్షేమానికి రూ. 20వేల కోట్లు కేటాయిస్తామని చెప్పిన మాటాలు గాలి మాటలే అయ్యాయి. బీసీలను ఈ ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది. గత బడ్జెట్లోని అంకెలే ఈ బడ్జెట్లో ెపెట్టారు. 6 గ్యారంటీల ప్రస్తావనే లేదు. మొత్తంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను గాలి బడ్జెట్గా చెప్పవచ్చు. – శ్రీనివాస్గౌడ్, మాజీ మంత్రి, మహబూబ్నగర్ -
సజావుగా ‘పది’ పరీక్షలు
● పరీక్ష కేంద్రాలను మొబైల్ జీరో జోన్గా మార్చాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలో కొనసాగుతున్న పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సజావుగా నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి విద్యాశాఖ అధికారులు, పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లతో వెబెక్స్ ద్వారా పరీక్షల నిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోకి అనుమతించరాదన్నారు. పరీక్ష కేంద్రాలను మొబైల్ జీరోజోన్గా మార్చేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలు లేకుండా విజయవంతంగా నిర్వహించామని.. మిగిలిన పరీక్షలను కూడా అదే విధంగా జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించే ముందే క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. మాస్ కాపీయింగ్ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షలు ముగింపు వరకు చీఫ్ సూపరింటెండెంట్లు అప్రమత్తంగా ఉండాలని.. ఏదేని సమస్య తలెత్తితే వెంటనే ఉన్నతాధికారులను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్ సరఫరా నిరంతరాయంగా ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, జెడ్పీ సీఈఓ, ఇన్చార్జి డీపీఓ వెంకట్రెడ్డి, ఏఎంఓ శ్రీనివాస్ ఉన్నారు. -
ప్రత్యేక నిధుల్లేవ్..!
అంచనాల మేరకు దక్కని ప్రాధాన్యత ● ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులకు రూ.4,252.53 కోట్లు కేటాయింపు ● మక్తల్– పేట–కొడంగల్ లిఫ్ట్కు పెద్దపీట ● ‘పాలమూరు–రంగారెడ్డి’ ప్రాజెక్టుకు మరోసారి నిరాశే.. ● కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి రూ.800 కోట్లు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/ సాక్షి, నాగర్కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఉమ్మడి పాలమూరు జిల్లాకు నిరాశే మిగిల్చింది. ప్రధానంగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు అధిక మొత్తంలో ప్రత్యేక నిధులు సమకూరుస్తారని భావించగా, కేవలం రూ.1,800 కోట్ల కేటాయింపులు దక్కాయి. గతేడా ది బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు రూ.2,514 కోట్లు ఇవ్వ గా.. ఈసారి రూ.714 కోట్ల తగ్గించారు. కాగా.. జిల్లావ్యాప్తంగా పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజె క్ట్ల కోసం మొత్తం రూ.4252.53 కోట్లు కేటాయించగా... మక్తల్–పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకా నికి పెద్దపీట వేశారు. అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టి న బడ్జెట్పై ఉమ్మడి జిల్లావాసుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. లక్ష్యం కొండంత.. నిధులు అరకొర ఉమ్మడి జిల్లాకు ఆశాదీపంగా ఉన్న పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తిచేసేందుకు ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించింది. మరో 20 నెలల్లో ప్రాజెక్ట్ పనులు పూర్తిచేసి ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని చెబుతోంది. అయితే ఈ మేరకు నిర్మాణం పూర్తి కావాలంటే ఇంకా కనీసం రూ.22 వేల కోట్లు అవసరమని ప్రభుత్వమే చెబుతోంది. ఈ లెక్కన ప్రాజెక్ట్ను గడువులోగా పూర్తి చేయాలంటే ఈ బడ్జెట్లోనే సింహభాగం నిధులు అవసరం. కానీ, ఇందుకు బదులుగా కేవలం రూ.1,800 కోట్లే కేటాయించడంతో పనుల పురోగతిపై నీలినీడలు అలుముకొన్నాయి. రూ.20 వేల కోట్లకుపైగా నిధులు అవసరం ఉంటే ఇంత తక్కువ కేటాయించడంపై సాగునీటి రంగ నిపుణులు పెదవి విరుస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించుకున్న గడువులోగా ప్రాజెక్ట్ పూర్తి చేయడం కష్టమేనన్న భావన నెలకొంది. -
సంక్షేమం కోసం కొత్త పథకాలు..
రాష్ట్ర బడ్జెట్లో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఈసారి కొత్త పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకు అవసరమైన నిధులు కేటాయింపులు చేసింది. ప్రధానంగా విద్యార్థుల కోసం అల్పాహారం పథకం అమలు చేయనుంది. 2026– 27 విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రీప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు బ్రేక్ఫాస్ట్ అందించనున్నారు. వారంలో మూడు రోజులపాటు పాలు, మూడు రోజులపాటు రాగిజావతో చేసిన నాణ్యమైన అల్పాహారం అందిస్తారు. అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉదయం అల్పాహారంతోపాటు మధ్యాహ్నం భోజన సౌకర్యం కల్పిస్తారు. అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ పథకం అమలుకానుంది. ఇంటర్మీడియట్ చదివే దివ్యాంగ విద్యార్థుల కోసం రెట్రోఫిట్టెడ్ మోటరైజ్డ్ టూ వీలర్ వాహనాలను పంపిణీ చేయనున్నారు. విదేశాల్లో చదివే విద్యార్థుల కోసం ఉపాధి, భాషా నైపుణ్యాల కోసం ప్రత్యేక పథకాన్ని అమలుచేయనున్నారు. రెండో విడతలో ఇందిరమ్మ ఇళ్లు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ పథకాన్ని మరింత వేగంగా అమలు చేసేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించింది. ఇప్పటికే మొదటి విడత కింద ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను చేపట్టగా, రెండో విడతలోనూ కొత్త లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేయనుంది. -
ప్రజా సంక్షేమానికి దిశానిర్దేశం
రాష్ట్ర బడ్జెట్లో సామాన్యుల సంక్షేమం, యువత అభివృద్ధి, పేదల జీవన ప్రమాణాల పెంపు వంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం ఎంతో శుభపరిణామం. తెల్లరేషన్ కార్డుదారులకు ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రవేశపెట్టడం ద్వారా ఆర్థిక భద్రత కలుగుతుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అత్యధిక నిధులు కేటాయించడం ద్వారా పేదల సొంతింటి కల నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాజీవ్ యువ వికాసం పథకానికి నిధులు కేటాయించడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మొత్తంగా ఈ బడ్జెట్ అన్ని వర్గాల ప్రజల ఆశలను నెరవేర్చే విధంగా ఉంది. – యెన్నం శ్రీనివాస్రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, మహబూబ్నగర్ -
ఆక్యుపెన్సీ అవస్థలు!
జడ్చర్ల టౌన్: మున్సిపాలిటీ, గ్రామాల్లో గృహ నిర్మాణదారులకు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేనిదే విద్యుత్ మీటర్లను కేటగిరీ 8నుంచి 1కి మార్చడం సాధ్యం కాదని అధికారులు తేల్చడంతో బిల్లులు తడిసి మోపెడవుతున్నాయని వినియోగదారులు లబోదిబోమంటున్నారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. విద్యుత్ కార్యాలయానికి వెళ్తే సర్టిఫికెట్ కావాల్సిందేనని, మున్సిపల్కు వెళితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఎవరికివారు తప్పించుకుంటున్నారు. దీంతో గృహ నిర్మాణదారుడు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామ పంచాయతీల్లో మాన్యువల్గా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ను జారీ చేస్తుండటంతో అక్కడ సమస్య అంతగా ఉత్పన్నం కావడంలేదు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి. సాధారణంగా గృహ నిర్మాణం చేసే సమయంలో విద్యుత్ శాఖ తాత్కాలిక కనెక్షన్ ఇస్తారు. ఇంటి నిర్మాణం పూర్తయ్యాక దానిని క్యాటగిరి 1 కిందకు మార్చడంతో సమస్య తీరిపోతుంది. భారీ గృహాలు, చిన్నగృహాలు తేడా లేకుండా అన్నింటికి ఇదే అమలు చేస్తూ వచ్చారు. అయితే 2024 డిసెంబర్ 15నుంచి వచ్చిన కొత్త నిబంధనలు గృహ నిర్మాణదారులకు కష్టాలు తెచ్చిపెట్టాయి. ఇంటి నిర్మాణం 10మీటర్ల ఎత్తు దాటితో దానికి తప్పనిసరిగా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వాలనే నిబంధన తీసుకొచ్చారు. ఇదే గృహ నిర్మాణదారులకు అసలు సమస్యగా మారింది. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ను మున్సిపాలిటీ నుంచి జారీ చేయాలి. ఇందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అపార్ట్మెంట్, భారీ నిర్మాణాలు చేసేవారు నేరుగా తమ బిల్డర్ ద్వారా ఆన్లైన్ చేసుకుంటుండగా చిన్నగృహాలు నిర్మాణం చేసుకునేవారు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో తెలియక తికమకపడుతున్నారు. నేరుగా ఆన్లైన్ చేసుకునే వెసులుబాటు లేకపోవటమే ఇందుకు కారణం. వాస్తవానికి జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో 18వేలకుపైగా గృహాలు ఉండగా కేవలం 10లోపు మాత్రమే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందాయి. మున్సిపల్ వ్యూ మున్సిపాలిటీ నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేయాలంటే ముందుగా వినియోగదారుడు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్నాక టీపీఓ వచ్చి గృహాన్ని పరిశీలించి ఓకే అంటే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేయబడుతుంది. దీనివల్ల నిబంధనల ప్రకారం ఇళ్ల నిర్మాణం జరిగేందుకు ఆస్కారం పెరుగుతుంది. నిబంధనలు పాటించని వారికి కొంత ఇబ్బంది కలుగుతుందనడంలో నిస్పందేహం. ఇటీవల ఆక్యుపెన్సీ కోసం కార్యాలయానికి వస్తున్నవారి సంఖ్య పెరుగుతుంది. – లక్ష్మారెడ్డి, కమిషనర్ మున్సిపాలిటి, జడ్చర్ల విద్యుత్ బిల్లు వచ్చాక చూస్తే గుండె గుబేళ్మనేలా ఉంది. వేలల్లో బిల్లు రావడంతో విద్యుత్ కార్యాలయానికి పరుగులు తీశాం. అక్కడ అధికారులు క్యాటగిరి 8లో ఉందని, అందుకే బిల్లు ఎక్కువగా వచ్చిందని చెబుతున్నారు. క్యాటగిరి–1లోకి మారిస్తేనే బిల్లు తగ్గుతుందని, అందుకు మున్సిపాలిటీ నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తేవాలని చెబుతున్నారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారు. ఇంతకు ముందులాగే ఆక్యుపెన్సీ లేకుండా విద్యుత్ మీటర్లు క్యాటగిరి 1 కింద ఇస్తే బాగుంటుంది. – పావనదీప్తి, శ్రీనివాసనగర్కాలనీ, జడ్చర్ల మున్సిపాలిటీ 2024 డిసెంబర్ 15నుంచి మున్సిపాలిటీ, జీపీ ఎక్కడైనా సరే కొత్తగా ఇళ్లు నిర్మాణం చేసుకున్న వారికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఉంటేనే క్యాటగిరి మార్చేందుకు వీలవుతుంది. ఇంటి నిర్మాణ సమయంలో తాత్కాలికంగా మీటరు కేటాయిస్తాం. నిర్మాణం పూర్తయ్యాక నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణం జరిగి ఉంటే మున్సిపాలిటీ, పంచాయతీ నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఆ సర్టిఫికెట్ ఉంటేనే క్యాటగిరి మార్చటం జరుగుతుంది. విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు సైతం చేస్తున్నారు. అందుకే నిబంధనలకు లోబడే క్యాటగిరి కేటాయిస్తాం. – చంద్రశేఖర్, ఏడీఈ, జడ్చర్ల సబ్డివిజన్ గృహనిర్మాణదారులకు కొత్త కష్టాలు కేటగిరీ 8గా మార్చడంతో భారీగా విద్యుత్ బిల్లులు వినియోగదారులను తిప్పుకుంటున్న అధికారులు మున్సిపాలిటీ, విద్యుత్శాఖలకు పెరగనున్న ఆదాయాలు బల్దియా ఎన్నికల వేళ తలనొప్పిగా మారిన నిబంధనలు వాస్తవానికి గృహనిర్మాణం చేసే సమయంలో నిబంధనలు పాటించకుండా వదిలేస్తున్నారు. గ్రౌండ్ఫ్లోర్ అనుమతి తీసుకుని కొందరు మూడు ఫ్లోర్లు, మరికొందరు 4, 5 అంతకుమించి ఫ్లోర్లు కడుతున్నారు. దీంతో మున్సిపాలిటీకి పన్నులు సైతం సక్రమంగా చెల్లించకుండా ఉన్నారు. 2024 డిసెంబర్ వరకు విద్యుత్శాఖ సైతం నిర్మాణాలు ఎలా ఉన్నా అన్నింటికి క్యాటగిరి 1 కింద కనెక్షన్లు క్రమబద్దీకరించారు. నూతన నిబంధనలు రావడంతో తప్పనిసరిగ క్యాటగిరి 8 ఇస్తున్నారు. దీంతో విద్యుత్ శాఖకు భారీగా ఆదాయం సమకూరుతుంది. ఆక్యుపెన్సీ కోసం దరఖాస్తు చేసుకుంటే తనిఖీ సమయంలో నిబంధనలు పాటించని విషయం వెలుగుచూసి మున్సిపాలిటీ అధికారులు సైతం పన్నులను విధించేందుకు ఆస్కారం కలుగుతుంది. దీంతో మున్సిపాలిటీకి ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. ఈ కారణంగా గృహ నిర్మాణదారులు ఇబ్బందులు పడుతున్నారు. పదిమీటర్ల ఎత్తు దాటిందంటే తప్పనిసరిగా క్యాటగిరి 8కిందే ఉంచుతామని విద్యుత్శాఖ తేల్చడంతో వినియోగదారుడికి కష్టాలు తప్పడంలేదు. జడ్చర్ల మున్సిపాలిటీలో త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆక్యుపెన్సీ కష్టాలు అధికార పార్టీకి తలనొప్పిగా మారే అవకాశం ఉంది. దీనిపై స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి స్పందించి మున్సిపల్, విద్యుత్శాఖలకు ఆదాయం తగ్గకుండా వినియోగదారులపై భారం తగ్గేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
మేకల కాపరిపై ఎలుగుబంటి దాడి
అమ్రాబాద్: మేకల కాపరిపై ఎలుగుబంటి దాడిచేయగా తీవ్రంగా గాయపడిన ఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకోగా.. గురువారం ఆలస్యంగా తెలిసింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. పదర మండలం పెట్రాల్చేన్పెంటకు చెందిన చిగుళ్ల ప్రశాంత్ మేకలను మేపేందుకు బుధవారం సమీప అడవికి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి వస్తుండగా పొదలచాటున ఉన్న ఎలుగుబంటి అకస్మాత్తుగా దాడిచేసింది. దగ్గరలో ఉన్న మరో ఇద్దరు కేకలు వేయడంతో ఎలుగుబంటి పారిపోయింది. ఈ దాడిలో ప్రశాంత్ కాలు, చేతులు, శరీర బాగాలకు తీవ్రగాయాలు కాగా 108అంబులెన్స్లో అచ్చంపేటకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఆర్డీటీ సహకారంతో హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నారు. చికిత్స పొందుతూ మహిళ మృతి నాగర్కర్నూల్ క్రైం : కడుపునొప్పి తాళలేక పురుగు మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందిన ఘటన జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ గోవర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం మున్సిపాలిటీ పరిధిలోని నాగనులు గ్రామానికి చెందిన ఎత్తపు పద్మ (49) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ఈమె చాలా రోజుల నుంచి తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుంది. దీంతో మనస్తాపానికి గురైన పద్మ ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు జనరల్ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. మృతురాలి భర్త వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ట్రాక్టర్ అదుపు తప్పి యువకుడి మృతి ఇటిక్యాల: ట్రాక్టర్ అదుపు తప్పి యువకుడు మృతి చెందిన ఘటన ఇటిక్యాల పీఎస్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మండల పరిధిలోని మొగళిరావుల చెరువుకు చెందిన బాబర్ (19) స్నేహితుడు ఫిరోజ్తో కలిసి గురువారం ఉగాది పండుగ సందర్భంగా ట్రాక్టర్ కడిగేందుకు గ్రామ సమీపంలోని జూరాల కుడి కాలువ వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో కాలువపై ట్రాక్టర్ అదుపు తప్పి ఒక్కసారిగా కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాబర్, ఫిరోజ్లను స్థానికులు చికిత్స నిమిత్తం గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరిశీలించి అప్పటికే బాబార్ మృతి చెందినట్లు తెలిపారు. పండగ పూట విషాదం జరగడంతో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. ప్రమాదంపై స్ధానిక ఎస్ఐను వివరణ కోరగా తమకు సమాచారం అందలేదని తెలిపారు. చేపల వేటకు వెళ్లి దుర్మరణం తెలకపల్లి: చేపల వేటకు వెళ్లి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాలు మేరకు.. మండల పరిధిలోని చిన్నముద్దునురు గ్రామానికి చెందిన సంగిశెట్టి మల్లయ్య (63) గురువారం భార్యతో కలిసి చిన్నముద్దును రాంరెడ్డిపల్లి గ్రామాల మధ్య ఉన్న చెరువులో చేపల వేటకు వెళ్లారు. మల్లయ్య చేపలు పట్టే క్రమంలో చెరువులో పడి మునిగిపోయాడు. గమనించిన భార్య చుట్టుపక్కల వారిని పిలువగా అప్పటికే మల్లయ్య మృతి చెందగా మృతదేహాన్ని బయటికి తీశారు. ఉగాది పర్వదినం రోజు మరణించడంతో కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి ఆత్మకూర్: పండుగపూట విషాదం నెలకొంది. ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతిచెందిన ఘటన గురువారం వనపర్తి జిల్లా ఆత్మకూర్ పట్టణంలో చోటుచేసుకున్నది. ఎస్సై జయన్న తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక భాగ్యనగర్లో నివాసం ఉంటున్న రాములు (47) ఉదయం 11 గంటల సమయంలో స్నానానికి చెరువుకు వెళ్లాడు. చెరువులో ఈత కొడుతున్న నేపథ్యంలో అటువైపుగా వెళ్తున్న వారందరు చూస్తుండగానే మునిగిపోయాడు. ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో, కుటుంబ సభ్యులు, ప్రయాణికులు రాములును ఒడ్డుకు చేర్చారు. దీంతో అపస్మార స్థితిలో ఉన్న రాములును స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యం అందించేలోపే రాములు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆస్పత్రిలో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
గంజాయి ముఠా అరెస్టు
● 160 గ్రాముల గంజాయి స్వాధీనం అమ్రాబాద్: మండల కేంద్రంలో గంజాయి అమ్ముతున్న ముఠాను బుధవారం రాత్రి అమ్రాబాద్ ఎస్ఐ హన్మంత్రెడ్డి చాకచక్యంగా పట్టుకున్నారు. వీరిలో ఒకరు పరారు కాగా మిగతా ఐదుగురిని రిమాండ్కు తరలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను ఎస్ఐ హన్మంత్రెడ్డి గురువారం విలేకరులకు వివరించారు. అమ్రాబాద్కు చెందిన నోము ల అభిగౌడ్ హైదరాబాద్ నుంచి గంజాయిని తెచ్చి అధిక దరకు అమ్రాబాద్లో అమ్ముతుండేవాడు. ఈ క్రమంలో ముందస్తు సమాచారం మేరకు నిఘా పెట్టి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దాడిలో అభి గౌడ్ పరారు కాగా అమ్రాబాద్ కు చెందిన సయ్యద్, లక్ష్మాపూర్(బీకే)తండాకు చెందిన కొర్రవిక్రమ్, కొర్ర శ్రీకాంత్, కొర్రపవన్, మాదవానిపల్లి గ్రామానికి చెందిన చంద్రకంటి అనిల్ పట్టుబడ్డారు. సీఐ శంకర్నాయక్ ఆదేశాలతో వారిని విచారించి రిమాండ్కు తరలించామన్నారు. కాగా నిందితుల్లో ఇద్దరు విద్యార్థులు ఉండటం గమనార్హం. అయితే నిందితులు పట్టుబడిన రోజే పదర మండలం వంకేశ్వరంలో నేనావత్ తిరుపతి వ్యవసాయ పొలంలో పదహారు గంజాయి మొక్కలను ఎకై ్సజ్ అధికారులు గుర్తించి ధ్వంసం చేయడంతో పాటు 180 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. -
మృత్యువుతో పోరాడి.. మృతిచెందిన బాలుడు
పాన్గల్: స్వైన్ప్లూ వ్యాధితో వారం రో జుల పాటు ఆస్ప త్రిలో చికిత్స పొందుతూ ఐదేళ్ల బాలు డు గురువారం మృతి చెందాడు. పాన్గల్ మండలం నిజామాబాద్ (మంగళ్లపల్లి) గ్రామానికి చెందిన పసుపుల వరలక్ష్మి, మద్దిలేటిల కుమారుడు రిషికేష్(5) అరుదైన స్వైన్ప్లూతో బాధపడుతూ హైదరాబాదులోని రెయిన్బో ఆసుపత్రిలో వారం రోజుల పాటు చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాలుడిని రక్షించుకోవాలనే ఉద్దేశంతో కుటుంబసభ్యులు అప్పులు చేసి రూ.10లక్షలు ఖర్చుచేసి చికిత్స అందించిన ప్రాణం దక్కకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్సాగర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ రవికుమార్, మాజీఎంపీపీ వెంకటేష్నాయుడు, మాజీ విండో డైరెక్టర్ ఉస్మాన్ గ్రామానికి చేరుకొని బాలుడి మృతదేహనికి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ మరాఠిలక్ష్మి, మాజీసర్పంచ్ అంజి, వెంకట్, జూపల్లి యువసేన నాయకులు పాల్గొన్నారు. -
స్వర్ణాభరణ అలంకరణలో వెంకన్న
● మన్యంకొండలో వైభవంగా ఉగాది సంబరాలు ● భక్తిశ్రద్ధలతో పంచాంగ శ్రవణంమహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో గురువారం ఉగాది సంబురాలను ఘనంగా నిర్వ హించారు. ప్రతి ఏడాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారిని నూతన వస్త్రధారణ, బంగారు అభరణాలతో అలంకరించారు. అనంతరం ప్రత్యేక అభిషేకాలు, అర్చన లు చేశారు. అనంతరం స్వామివారిని పల్లకీలో గర్భగుడి నుంచి హనుమద్దాసుల మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి హారతి సమర్పించారు. రకరకాల పూలు, స్వర్ణాభరణ అలంకరణలో స్వామి వారు భక్తకోటికి దర్శనమిచ్చారు. అనంతరం పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారి సన్నిధిలో పూజలు చేసి తరించారు. భక్తుల సౌకర్యార్థం నిర్వాహకులు దేవస్థానం వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. ఘనంగా సుదర్శన పేరుమాళ్ల పల్లకీ సేవ.. ఉగాది పండుగ సందర్భంగా దేవస్థానంలో స్వామివారి సుదర్శన పేరుమాళ్ల పల్లకీ సేవను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి సుదర్శన పేరుమాళ్లను గర్భగుడి నుంచి గుండం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాలు, భక్తు ల హరినామచరణ మధ్య స్వామి వారి పల్లకి సే వ ముందుకు కదిలింది. అనంతరం గుండం వద్ద ఆరగింపు తదితర పూజలు చేశా రు. తిరిగి పల్లకీలో స్వామివారి సు దర్శన పేరుమాళ్లను ఊరేగింపుగా గర్భగుడి వద్దకు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేశారు.కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళ హరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి, పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. 27 వరకు స్వర్ణాభరణ అలంకరణ మన్యంకొండ శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామివారు స్వర్ణాభరణ అలంకరణలో ఈ నెల 27, శ్రీరామనవమి వరకు భక్తులకు దర్శనమిస్తారు. విశేషోత్సవాల్లో మాత్రమే స్వామివారికి స్వర్ణాభరణ అలంకరణ చేస్తారు. దీంతో స్వామివారు నిత్యం వివిధ రకాల అభరణాల మధ్య భక్తులకు దర్శనమిస్తారు. సంగమేశ్వరాలయంలో ఉగాది పూజలు -
వంటగ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు ధ్వంసం
● తప్పిన ప్రాణాపాయం ● రూ.లక్షల విలువ చేసే ఆస్థి నష్టం లింగాల: మండలంలోని సూరాపూర్లో పండుగ పూట విషాదం నెలకొంది. వంట గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధమైన ఘటన గురువారం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. సూరాపూర్లో గ్రామానికి చెందిన ముష్టిపల్లి వెంకటస్వామి కుమారుడు మణికంఠ వంట గ్యాస్ సిలిండర్ పొయ్యికి పెట్టేందుకు దానిపై ఉన్న మూతను తొలగించడంతో ఒక్కసారిగా గ్యాస్ లీకై ంది. దానిని అదుపు చేసేందుకు పొయ్యి రెగ్యులేటర్ను పెట్టినప్పటికీ గ్యాస్ లీక్ ఆగకపోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీనితో భయాందోళనలకు గురైన ఇంటి వారు బయటకు పరుగు తీశారు. ఈ ప్రమాదంలో ఇంటిలో ఉన్న వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. రూ.50 వేల నగదుతో పాటు 5 తులాల బంగారం, 60 తులాల వెండి, తిండి గింజలు, భూములకు సంబంధించిన పాసు పుస్తకాలు, విద్యకు సంబంధించిన సర్టిఫికెట్లు పూర్తిగా కాలిపోయాయి. గ్యాస్ లీకై న సమయంలో పక్కనే ఫ్రిజ్ ఉన్నట్లు తెలిసింది. ఇంటి యజమాని ముష్టిపల్లి వెంకటస్వామి స్వల్ప గాయాలతో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. మండల కేంద్రంలోని సీహెచ్సీలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి వచ్చి మంటలను అదుపు చేశారు. ఎస్ఐ వెంకటేశ్వర్గౌడ్ ఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబాన్ని సర్పంచు ఆంగోతు శేఖర్ పరామర్శించారు. -
బాలకిష్టారెడ్డికి అమెరికాలో ఉత్తమ పురస్కారం
వంగూరు: అమెరికా లోని అట్లాంటలో స్థిరపడ్డ నాగర్కర్నూల్ జిల్లా డిండి చింతపల్లికి చెందిన ఇందుర్తి బాలకిష్టారెడ్డికి న్యూజెర్సీలోని ఎడిసన్ టౌన్షిప్ అసాధారణ నాయకత్వం, మానవతావాది పురస్కారం లభించింది. సమాజంలో ఏకత్వాన్ని పెంపొందించే దిశగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల నిర్వహణకు గుర్తింపునిస్తూ నూజెర్సీ సెనెట్ అభినందించింది. శంకర్ నేత్రాలయంలో అనేక కీలక పదవులు నిర్వహించిన బాలకిష్టారెడ్డి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో అంధత్వ నివారణకు విశేష కృషిచేశారు. ఆర్అండ్బీ శాఖలో ఈఎన్సీగా పనిచేసిన గణపతిరెడ్డి సోదరుడే బాలకిష్టారెడ్డి. -
వైభవంగా ఉగాది
● ఆలయాల్లో పంచాంగ శ్రవణం ● అలరించిన కవి సమ్మేళనాలు స్టేషన్ మహబూబ్నగర్/మహబూబ్నగర్ మున్సిపాలిటీ/చిన్నచింతకుంట: శ్రీ పరాభవ నామ తెలుగు సంవత్సరాదికి జిల్లా ప్రజలు సాదరంగా ఆహ్వానం పలుకుతూ ఉగాది వేడుకలను గురువారం అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. పండుగ సందర్భంగా వ్యాపార సంస్థల్లో, ఇళ్లలో విశేష పూజలు నిర్వహించారు. పలు చోట్ల నిర్వహించిన కవి సమ్మేళనాలు అలరించాయి. జిల్లాకేంద్రం పిల్లలమర్రి రోడ్డులోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం, టీడీ గుట్ట తిరుమలనాథుని ఆలయం, శ్రీనివాసకాలనీ పంచముఖాంజనేయస్వామి, టీచర్స్ కాలనీ రామాలయం, బ్రాహ్మణవాడిలోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం, పద్మావతి కాలనీ కాళికాలయం, వేంకటేశ్వర కాలనీ రాజరాజేశ్వరి ఆలయాల్లో దేవతామూర్తులకు విశేష అభిషేకాలు, అలంకరణ పూజలు చేశారు. పలు ఆలయాల్లో ఉగాది పంచాంగ శ్రవణం నిర్వహించారు. -
ప్రభుత్వ విప్గా యెన్నం
● మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్రెడ్డికి అవకాశం ● ఉమ్మడి జిల్లాకు మరో కీలక పదవి సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డికి ప్రభుత్వ విప్గా అవకాశం దక్కింది. ఈమేరకు గురువారం రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉత్తర్వులు జారీచేశారు. ఉమ్మడి జిల్లాలో మహబూబ్నగర్ ఎమ్మెల్యేకు కీలకమైన విప్ పదవి వరించడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి జిల్లాకు చెందిన రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి కాగా, మంత్రులుగా జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరిలకు అవకాశం దక్కింది. ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జి.చిన్నారెడ్డి ఉన్నారు. తాజాగా మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డికి ప్రభుత్వ విప్గా అవకాశం రావడంతో ఆయన సైతం కేబినెట్ సత్సమాన ర్యాంకులో వ్యవహరించనున్నారు. 2012 ఉప ఎన్నికలో యెన్నం మహబూబ్నగర్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ తరపున మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2023 ఎన్నికల్లో మహబూబ్నగర్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగాగెలిచారు. బీఆర్ఎస్ హయాంలో ఇద్దరికీ.. ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పాలనలో ఇద్దరు మంత్రులతో పాటు మరో ఇద్దరు ప్రభుత్వ విప్లుగా వ్యవహరించారు. బీఆర్ఎస్ హయాంలో గతంలో మంత్రులుగా శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డితో పాటు ప్రభుత్వ విప్లుగా ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, గువ్వల బాలరాజు వ్యవహరించారు. 2016లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ నుంచి గెలుపొందిన కూచుకుళ్ల అనంతరం బీఆర్ఎస్లో చేరారు. 2019లో బీఆర్ఎస్ ఆయనకు ప్రభుత్వ విప్గా అవకాశం కల్పించింది. -
భూసేకరణ పూర్తయితే9 నెలల్లో పూర్తి చేస్తాం..
మహబూబ్నగర్ పరిధిలో నిర్మించే మూడు ఎస్టీపీల్లో రెండు చోట్ల భూసేకరణలో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మూడో దాని పనులు నడుస్తున్నాయి. భూసేకరణ ప్రక్రియ పూర్తయితే కేవలం తొమ్మిది నెలల్లో ప్లాంట్ల నిర్మాణాలు పూర్తి చేసే అవకాశం ఉంది. – విజయభాస్కర్రెడ్డి, ఈఈ, పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజినీరింగ్ శాఖ, మహబూబ్నగర్ నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి.. మహబూబ్నగర్ కార్పొ రేషన్ పరిధిలో మంజూరైన మూడు ఎస్టీపీల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి. నిధులు మంజూరై రెండేళ్లు దాటినా ఇంకా పనులు ప్రారంభించకపోవడం అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి నిదర్శనం. చిత్తశుద్ధి, ప్రణాళిక కొరవడడంతో పనుల్లో జాప్యం జరుగుతోంది. ప్రధాన అడ్డంకి అయిన భూ సేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేసేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపి.. గడువులోపు అన్ని పనులు చేసేలా చూడాలి. – పగడం మల్లేష్, పద్మావతి కాలనీ, మహబూబ్నగర్ ● -
సమావేశాలు నిర్వహించాలి..
గ్రామాల్లో రెండేళ్లుగా పాలకవర్గాలు లేకపోవడంతో సమస్యలు పేరుపోయాయి. మండల సమావేశాలు ఏర్పాటు చేస్తే గ్రామాల్లో నెలకొన్న సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో సమస్యల పరిష్కారానికి మండల సభలు వేదికగా మారుతాయి. – స్వర్ణలత, సర్పంచ్, కోడూరు, మహబూబ్నగర్ రూరల్ మండలం ప్రతి పక్ష సర్పంచ్లపై వివక్ష కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతిపక్ష సర్పంచ్లపై వివక్ష చూపుతున్నారు. ఇటీవల విడుదలైన ఈజీఎస్ నిధులు కేవలం కాంగ్రెస్ సర్పంచ్లకు మాత్రమే ఇచ్చారు. దీనిపై ఎక్కడ ప్రశ్నించాలో తెలియడం లేదు. మండల సమావేశాలు జరిగితే అక్కడ ఉన్న అధికారులకు తమ గోడును వినిపిస్తాం. – నవనీత, సర్పంచ్, వెన్నచేడ్, గండేడ్ మండలం అవగాహన పెరుగుతుంది.. మండల సమావేశాలు ఏర్పాటు చేస్తే గ్రామాలు అభివృద్ధి ఎలా చేయాలనే అంశంలో నూతన సర్పంచులకు అవగాహన పెరుగుతుంది. అధికారులు ఇచ్చే సలహాలు, సూచనలు సర్పంచులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. – వెంకటయ్య, సర్పంచ్, మాచన్పల్లి, మహబూబ్నగర్ రూరల్ -
ఉగాది ప్రత్యేకం భక్షాలు
జడ్చర్ల టౌన్: తెలుగు నూతన సంవత్సరం ఉగాది అనగానే షడ్రుచులతో కూడిన పచ్చడితోపాటు బెల్లం, చక్కెరతో చేసే భక్షాల వంటకం ప్రత్యేకం. ఈ రెండు ఉంటేనే ఉగాది పండుగ చేసుకున్నట్లు లెక్క. తెలంగాణ ప్రాంతంలో భక్షాలు, ఆంధ్ర, మహారాష్ట్ర, యూపీతో పాటు మరికొన్ని రాష్ట్రాలు, ప్రాంతాల్లో బొబ్బట్లు, పోలెలు అని పిలుచుకుంటారు. భక్షాలను మైదాపిండి, శనగపప్పు, బెల్లం, చక్కెర, ఇలాచీలు ఉపయోగించి చేస్తారు. అయితే ప్రతిఏటా బెల్లం భక్షాలకు డిమాండ్ పెరుగుతుంది. ఆరోగ్య రీత్యా బెల్లం వినియోగం మంచిదనే అభిప్రాయం ఉండటంతో వాటిపట్ల కొనుగోలు దారులు ఆసక్తి చూపుతున్నారు. 15 వేలకు పైగా అమ్మకం పట్టణంలో పలుచోట్ల తయారు చేసి విక్రయిస్తుండటంతో పండుగ ఒక్కరోజే అన్ని కేంద్రాల్లో కలిపి 15వేలకు పైగా అమ్ముడవుతుంటాయి. యాంత్రిక జీవనం, పనిఒత్తిడి, ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయి చిన్న కుటుంబాలు పెరగటంతో భక్షాలు ఇళ్లల్లో తయారు చేసుకునేందుకు సమయం చాలటం లేదు. కొందరికి సమయం ఉన్నా చేయటానికి రాకపోవటంతో పండుగ పూట ఎలా అన్న అసంతృప్తి వెంటాడుతుంది. అలాంటి వారందరికీ భక్షాల తయారీ, విక్రయాలు వరంగా మారుతున్నాయి. పెరిగిన ధరలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఇబ్బందుల వల్ల భక్షాల ధరలకు సైతం రెక్కలు వచ్చాయి. గతేడాది చక్కెర భక్షాలు రూ.20– 22 ఉండగా ఈ ఏడాది రూ.24కు పెరిగింది. అదే బెల్లం భక్షం అయితే గత ఏడాది రూ.24 ఉండగా ఈ ఏడాది రూ.26కు పెంచారు. అయితే బేకరీలు, చిప్స్ సెంటర్లలో మాత్రం చక్కెర భక్షాలు ఇష్టారాజ్యంగా రూ.30కి ఒకటి విక్రయిస్తున్నారు. ఫార్మా సెజ్ కారణంగా పోలేపల్లి ఫార్మా సెజ్ కారణంగా జడ్చర్లలో వివిధ రాష్ట్రాల ప్రజలు వలస వచ్చి నివసిస్తున్నారు. వీరిలో ఆంధ్ర, మహారాష్ట్ర ప్రజలు బొబ్బట్లు, పోలెలుగా పిలుచుకునే భక్షాలను పండగపూట తినాలన్న ఆతృత కలిగి ఉండటం వల్ల ప్రతి ఏటా తయారీదారులకు డిమాండ్ పెరుగుతుంది. ఒక కూలి గంటకు 50 భక్షాలు తయారు చేస్తున్నప్పటికి వాటిని నిల్వచేసి విక్రయించే అవకాశం లేకపోవటంతో ఎక్కువగా ఆర్డర్లు తీసుకోలేకపోతున్నట్లు విక్రయదారులు పేర్కొంటున్నారు. ధరలు పెంచక తప్పటం లేదు గత కొన్నేళ్లుగా భక్షాలు తయారు చేస్తున్నాం. ఉగాది, దసరా పండగ రోజుల్లో భక్షాలకు ప్రతిఏటా ఆర్డర్లు పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఉగాదికి బుధవారం సాయంత్రం వరకు ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి. అయితే పెరిగిన కూలీ ధరలు, గ్యాస్ సిలిండర్ల సమస్య వల్ల ధరలు పెంచక తప్పటం లేదు. ముందు రోజు చేసి నిల్వ చేసే పరిస్థితి ఉండదు. తెల్లవారుజాము నుంచి తయారు చేయాల్సి వస్తుంది. – కోటకాడి కౌసల్య, బాలాజినగర్, జడ్చర్ల ఆర్డర్లు తీసుకోలేకపోతున్నాం.. ఉగాది పండుగకు ప్రతిఏటా 2వేల నుంచి 3వేలకు పైగా భక్షాలు తయారు చేస్తాం. ఎక్కువ ఆర్డర్లు వస్తున్నప్పటికీ తీసుకోలేని పరిస్థితి. గ్యాస్ సమస్య వల్ల ఈ ఏడాది భక్షాలు తయారు చేయటం కష్టంగా మారింది. – రాజనర్సింహ, భక్షాల విక్రయదారు, సాయినగర్ కాలనీ -
హోటళ్లపై అధికారుల దాడులు
తెలకపల్లి: పట్టణంలోని పలు హోటళ్లపై రెవెన్యూ, పోలిసులు దాడులు నిర్వహించారు. సిలిండర్ కొరత నేపథ్యంలో వినియోగదారులు సిలిండర్లు అందక అవస్థలు పడుతున్నారు. దీంతో హోటళ్లలో తనిఖీలు చేపట్టి అక్రమంగా వినియోగిస్తన్న గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు. దాదాపు ఏడు డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం చేసుకొని గ్యాస్ ఏజెన్సీకి అప్పగించారు. డొమెస్టిక్ సిలిండర్లను హోటళ్లలో వాడితే చర్యలు తీసుకుంటామన్నారు. దాడుల్లో నాయబ్ తహసిల్దార్ పట్టాబి, ఎస్ఐ నరేష్, ఆర్ఐ రామస్వామి, జీపీఓలు పాల్గొన్నారు. -
ఉగాది ప్రత్యేకం భక్షాలు
● పరాభవ నామ సంవత్సరం జోరుగా విక్రయాలు ● గ్యాస్ సిలిండర్ ప్రభావంతో పెరిగిన ధరలు జడ్చర్ల టౌన్: తెలుగు నూతన సంవత్సరం ఉగాది అనగానే షడ్రుచులతో కూడిన పచ్చడితోపాటు బెల్లం, చక్కెరతో చేసే భక్షాల వంటకం ప్రత్యేకం. ఈ రెండు ఉంటేనే ఉగాది పండుగ చేసుకున్నట్లు లెక్క. తెలంగాణ ప్రాంతంలో భక్షాలు, ఆంధ్ర, మహారాష్ట్ర, యూపీతో పాటు మరికొన్ని రాష్ట్రాలు, ప్రాంతాల్లో బొబ్బట్లు, పోలెలు అని పిలుచుకుంటారు. భక్షాలను మైదాపిండి, శనగపప్పు, బెల్లం, చక్కెర, ఇలాచీలు ఉపయోగించి చేస్తారు. అయితే ప్రతిఏటా బెల్లం భక్షాలకు డిమాండ్ పెరుగుతుంది. ఆరోగ్య రీత్యా బెల్లం వినియోగం మంచిదనే అభిప్రాయం ఉండటంతో వాటిపట్ల కొనుగోలు దారులు ఆసక్తి చూపుతున్నారు. 15 వేలకు పైగా అమ్మకం పట్టణంలో పలుచోట్ల తయారు చేసి విక్రయిస్తుండటంతో పండుగ ఒక్కరోజే అన్ని కేంద్రాల్లో కలిపి 15వేలకు పైగా అమ్ముడవుతుంటాయి. యాంత్రిక జీవనం, పనిఒత్తిడి, ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయి చిన్న కుటుంబాలు పెరగటంతో భక్షాలు ఇళ్లల్లో తయారు చేసుకునేందుకు సమయం చాలటం లేదు. కొందరికి సమయం ఉన్నా చేయటానికి రాకపోవటంతో పండుగ పూట ఎలా అన్న అసంతృప్తి వెంటాడుతుంది. అలాంటి వారందరికీ భక్షాల తయారీ, విక్రయాలు వరంగా మారుతున్నాయి. పెరిగిన ధరలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఇబ్బందుల వల్ల భక్షాల ధరలకు సైతం రెక్కలు వచ్చాయి. గతేడాది చక్కెర భక్షాలు రూ.20– 22 ఉండగా ఈ ఏడాది రూ.24కు పెరిగింది. అదే బెల్లం భక్షం అయితే గత ఏడాది రూ.24 ఉండగా ఈ ఏడాది రూ.26కు పెంచారు. అయితే బేకరీలు, చిప్స్ సెంటర్లలో మాత్రం చక్కెర భక్షాలు ఇష్టారాజ్యంగా రూ.30కి ఒకటి విక్రయిస్తున్నారు. ఫార్మా సెజ్ కారణంగా పోలేపల్లి ఫార్మా సెజ్ కారణంగా జడ్చర్లలో వివిధ రాష్ట్రాల ప్రజలు వలస వచ్చి నివసిస్తున్నారు. వీరిలో ఆంధ్ర, మహారాష్ట్ర ప్రజలు బొబ్బట్లు, పోలెలుగా పిలుచుకునే భక్షాలను పండగపూట తినాలన్న ఆతృత కలిగి ఉండటం వల్ల ప్రతి ఏటా తయారీదారులకు డిమాండ్ పెరుగుతుంది. ఒక కూలి గంటకు 50 భక్షాలు తయారు చేస్తున్నప్పటికి వాటిని నిల్వచేసి విక్రయించే అవకాశం లేకపోవటంతో ఎక్కువగా ఆర్డర్లు తీసుకోలేకపోతున్నట్లు విక్రయదారులు పేర్కొంటున్నారు. ధరలు పెంచక తప్పటం లేదు గత కొన్నేళ్లుగా భక్షాలు తయారు చేస్తున్నాం. ఉగాది, దసరా పండగ రోజుల్లో భక్షాలకు ప్రతిఏటా ఆర్డర్లు పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఉగాదికి బుధవారం సాయంత్రం వరకు ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి. అయితే పెరిగిన కూలీ ధరలు, గ్యాస్ సిలిండర్ల సమస్య వల్ల ధరలు పెంచక తప్పటం లేదు. ముందు రోజు చేసి నిల్వ చేసే పరిస్థితి ఉండదు. తెల్లవారుజాము నుంచి తయారు చేయాల్సి వస్తుంది. – కోటకాడి కౌసల్య, బాలాజినగర్, జడ్చర్ల ఆర్డర్లు తీసుకోలేకపోతున్నాం.. ఉగాది పండుగకు ప్రతిఏటా 2వేల నుంచి 3వేలకు పైగా భక్షాలు తయారు చేస్తాం. ఎక్కువ ఆర్డర్లు వస్తున్నప్పటికీ తీసుకోలేని పరిస్థితి. గ్యాస్ సమస్య వల్ల ఈ ఏడాది భక్షాలు తయారు చేయటం కష్టంగా మారింది. – రాజనర్సింహ, భక్షాల విక్రయదారు, సాయినగర్ కాలనీ -
సేంద్రియ ఎరువులతో భూసారం పెంపు
జీలుగ ఎరువు వర్మీ కంపోస్టు ఎరువు అలంపూర్: పంటల సాగులో కొన్నేళ్లుగా రసాయన ఎరువుల వాడకం విపరీపతంగా పెరిగింది. దీంతో నేల తన సహజత్వాన్ని కోల్పోతుంది. భూసారం క్షీ ణిస్తుండడంతో అనుకున్న స్థాయిలో పంట దిగుబడి రాక రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. పంట ఉత్పత్తుల్లోనూ రసాయ న ఎరువులు, పురుగు మందుల అవశేషాలు ఉండి ప్రజా ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఈ పరిస్థితుల్లో నేల సంరక్షణకు సేంద్రియ పోషకాల అవసరం ఎక్కువగా ఉంటుందని వ్యవసాయ శాఖ ఏడీఏ సక్రియానాయక్ రైతులకు సూచించారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించి వాటి స్థానంలో పశువులు, గొర్రెలు, మేకల, కోళ్ల ఎరువులు, వేప, కానుగ లాంటి వృక్ష సంబంధిత ఎరువులు వర్మి, పచ్చిరొట్టె ఎరువులు వేయాలి. భూమిలో పోషకాల లభ్యతకు అనుగుణంగా ఎరువుల యాజమాన్యం చేపట్టాలి. సేంద్రియ ఎరువుల్లో స్థూల పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాష్ శాతం ఎంత ఉందని తెలసుకోవాలి. దీనిని బట్టి సేంద్రియ ఎరువులు పంటకు వేయాలి. ఇలా చేయడం వలన భూమి సారవంతం కావడంతో పాటు పెట్టుబడి తగ్గి పంటల దిగుబడి పెరిగే అవకాశం ఉంటుందని ఏడీఏ వివరించారు. పాడి–పంట -
‘పది’ పరీక్ష కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రత
మహబూబ్నగర్ క్రైం: పదో తరగతి విద్యార్థులు ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి పోలీసులు అన్ని విధాలుగా భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ జానకి తెలిపారు. నగరంలోని వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని మహాత్మాగాంధీ రోడ్ పరీక్ష కేంద్రాన్ని బుధవారం ఎస్పీ సందర్శిచి తనిఖీ చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల వద్ద ట్రాఫిక్ సమస్యలు రాకుండా, ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పరీక్ష కేంద్రాలకు సమీపంలో ఉన్న ప్రతి జిరాక్స్ సెంటర్లను పరీక్ష జరిగే సమయంలో మూసివేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులు పరీక్ష కేంద్రాల వద్ద అవసరంగా నిలబడకుండా సహకరించాలన్నారు. -
పుట్టెడు దుఃఖంలో ‘పది’ పరీక్షకు హాజరు
కేటీదొడ్డి: కన్నతండ్రి ఇక లేరనే నిజాన్ని జీర్ణించుకోలేక ఆ పిల్లాడి గుండె తల్లడిల్లింది. కంటిపాపలా చూసుకున్న తండ్రి భౌతికంగా దూరమైనా ఆశయమే లక్ష్యంగా ఆ విద్యార్థి పుట్టెడు దుఃఖంలోనూ పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కేటీదొడ్డి మండలం గంగన్పల్లికి చెందిన విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సదానందం ఆచారి మృతిచెందారు. ఇంట్లో పార్థివదేహం ఉండగానే బుధవారం పాతపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో జరిగే హిందీ పరీక్షకు అతడి కుమారుడు సాయివిష్ణు హాజరు కావాల్సి ఉంది. సమాచారం అందుకున్న ఎంఈఓ విజయభాస్కర్, ఉపాధ్యాయులు విద్యార్థికి ధైర్యం చెప్పడంతో పరీక్షకు హాజరయ్యాడు. పరీక్ష రాస్తున్నంత సేపు ఆ విద్యార్థి కళ్లు కన్నీళ్లతో నిండిపోవడం చూసిన తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు చలించిపోయారు. పరీక్ష అనంతరం తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. -
కొత్త ఉషస్సు..
నేడు తెలుగువారి తొలి పండుగ ● శ్రీపరాభవ నామ సంవత్సరానికి స్వాగతం ● ఆలయాల్లో ప్రత్యేక పూజలు.. పంచాంగ శ్రవణం స్టేషన్ మహబూబ్నగర్: తెలుగు పండుగలలో తొలి పండుగ ఉగాది. యుగాల ప్రారంభానికి ఆదిగా నిలిచే వేడుక అయినందున కాలగమనంలో యుగాదే ఉగాదిగా మారిందని చెబుతుంటారు. శ్రీసీతారాముల కల్యాణ వేడుకకు ముందుగా జరిగే నవరాత్రి ఉత్సవాలు కూడా ఉగాది నుంచే ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే తెలుగు నూతన సంవత్సరంగా భావించే ఈ రోజున కొత్త కార్యాలు ప్రారంభిస్తే శుభపద్రంగా ఉంటుందని నమ్మకం. గురువారం జిల్లావ్యాప్తంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకోనున్నారు. పాలమూరులో పండుగ సందడి. ఉగాది వేడుకల సందడి మహబూబ్నగర్ నగరంలో రెండు రోజుల నుంచే ప్రారంభమైంది. పండుగకు కావాల్సిన మామిడి తోరణాలు, వేపపువ్వు, కొత్త కుండలు, బంతిపూలు, మామిడి కాయలు, కొత్తచింతపండు, కొత్త బెల్లం, తదితర సామగ్రి కొనుగోలు చేయడం కనిపించింది. పాన్చౌరస్తా, క్లాక్టవర్, న్యూబస్టాండ్, తదితర ప్రాంతాల్లో ఉగాది పండుగ సందడి నెలకొంది. ● జిల్లాకేంద్రంలోని పలు ఆలయాల్లో గురువారం పంచాంగ శ్రవణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పిల్లలమర్రి రోడ్డు సమీపంలోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం, బ్రాహ్మణవాడి శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం, టీడీగుట్ట, టీచర్స్కాలనీ రామాలయం, సింహగిరి శ్రీలక్ష్మీనృసింహస్వామి దేవాలయం, పరిమళగిరి ఆంజనేయస్వామి దేవాలయాలతోపాటు పలు ఆలయాల్లో పంచాంగ శ్రవణం చేయనున్నారు. ముందుగా దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి, పండితులు పంచాంగ శ్రవణం చేయనున్నారు. -
తాగునీటి సమస్య లేకుండా చూడాలి
చట్టాలపై అవగాహన పెంచుకోవాలి అడ్డాకుల: చట్టాలపై అందరూ అవగాహన పెంంచుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి డి.ఇందిర అన్నారు. మూసాపేట మండలం నిజాలాపూర్ గ్రామంలో బుధవారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామని చెప్పారు. హెల్ప్ లైన్ సెంటర్ 15100కు డయల్ చేసి న్యాయ సహాయం కోసం తగిన సలహాలు పొందవచ్చని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలు, మహిళలు, చిన్న పిల్లలు, మానసిక, శారీరక దివ్యాంగులు, అనాధలు, సీనియర్ సిటిజన్ల కేసుల కోసం ఉచితంగా న్యాయవాదులను అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. న్యాయ సహాయం కోసం మొదట పారా లీగల్ వలంటీర్లను సంప్రదించాలని కోరారు. రైతులకు సంబంధించిన చట్టాల గురించి వారికి అవగాహన కల్పించారు. మూసాపేటలోని అగ్రి లీగల్ ఎయిడ్ క్లీనిక్కు వెళ్లి రైతులు తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు.గ్రామాల్లో బాల్య వివాహాలను అరికట్టాలని సూచించారు. తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించాలని, సమాజంలో అందరు సత్ప్రవర్తనతో మెలగాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వి.రాంచందర్, పంచాయతీ కార్యదర్శి సురేష్, ఉప సర్పంచ్ దేవుని శ్రీను, లీగల్ వాలంటీర్ బాలయ్య, తదితరులు పాల్గొన్నారు. ఉగాది పచ్చడి విశేషాలు.. ఉగాది నాడు పంచాంగ శ్రవణంతోపాటు పచ్చడికి విశేష ప్రాధాన్యత ఉంది. ఇది షడ్రుచుల సమ్మేళనం. జీవితంలో ఎదురయ్యే మంచీచెడులు, కష్టసుఖాలను ఒకేలా స్వీకరించాలని ఉగాది పచ్చడి చెబుతోంది. పచ్చడి కోసం చెరుకు, మామిడి కాయలు, వేపపువ్వు, చింతపండు, ఉప్పు, మిరపకాయలు, బెల్లం వాడుతారు. ఉగాది పచ్చడిని ఆయుర్వేద శాస్త్రాల్లో ‘నింబ కుసుమ భక్షణం అశోక కళికా ప్రాశనం’ అనే పేర్లతో వ్యవహరించేవారు. బుతుమార్పుల కారణంగా వచ్చే వాత, కాప, పిత్త దోషాలను హరించే ఓ ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది. బెల్లంలోని తీపి సుఖానికి, లాభానికి, ప్రేమకు, విజయానికి సంకేతం. వేపలోని చేదు దుఖానికి, నష్టానికి, ద్వేషానికి సంకేతం. ఈ రెండు కలిపి తినడం అంటే సుఖ దుఃఖాలు, ప్రేమానురాగాలు, విజయాలు చేకూరాలని చెప్పడమే. జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, హాస్టళ్లు, ఏరియా ఆస్పత్రి, పీహెచ్సీలు, సబ్ సెంటర్లలో వేసవిలో తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుష్బూగుప్తా అధికారులను ఆదేశించారు. బుధవారం మిషన్ భగీరథ, వైద్య, ఆరోగ్య శాఖ, పంచాయతీ రాజ్, విద్యాశాఖ, మహిళా, శిశుసంక్షేమ శాఖల అధికారులకు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలు, పీహెచ్సీల్లో ప్రాధాన్యతనిచ్చి విద్య, వైద్యసేవలు అందించాలని సూచించారు. వేసవిలో తాగునీటి సమస్య, పారిశుధ్యం చర్యలు తలెత్తకుండా సంబంధిత శాఖల అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాలల్లో తాగునీరు, టాయిలెట్ సమస్యలపై చర్చించారు. జడ్చర్ల ఏరియా ఆస్పత్రిలో పారిశుద్ధ్యం, డ్రెయినేజీ సమస్య పరిశీలించాలని అదనపు కలెక్టర్ను ఆదేశించారు. పాఠశాల్లో ఈజీఎస్ ద్వారా మంజురైన 139 టాయిలెట్లలో 58 ప్రగతిలో ఉన్నట్లు, 3 పూర్తయినట్లు డీఆర్డీఓ వివరించారు. ఈ పనులన్నీ ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. 1,163 అంగన్వాడీల్లో 44 చోట్ల తాగునీటి సమస్య ఉందని జిల్లా సంక్షేమ శాఖ అధికారి తెలిపారు. మిషన్ భగీరథ ఈఈ తాగునీటి సమస్య పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లకు 594కుగాను 173 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేసినట్లు తెలుపగా మిగతా వాటిని కూడా మంజూరు చేయాలని సూచించారు. -
ఉత్సాహంగా బాస్కెట్బాల్ ఎంపికలు
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో సోమవారం ఉమ్మడి జిల్లా జూనియర్ బాలబాలికల బాస్కెట్బాల్ జట్ల ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ఎంపికై న జట్లు సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఈనెల 20 నుంచి 22వ తేదీ వరకు జరిగే రాష్ట్రస్థాయి జూనియర్ బాస్కెట్బాల్ పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభచాటి విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మక్సూద్బిన్ అహ్మద్ జాకీర్ అడ్వకేట్, నసరుల్లా హైదర్, సుబాన్జీ, ఎండీ ఇలియాజ్, షకీల్, ఉస్మాన్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు. -
వచ్చే వారం సంగమేశ్వరుడికి తొలిపూజలు
కొల్లాపూర్ రూరల్: మండలంలోని సోమశిల గ్రామ సమీపంలో కృష్ణానది అవతలి ఒడ్డున నదిలో ఉన్న ప్రాచీన సంగమేశ్వర దేవాలయం కృష్ణమ్మ ఒడి నుంచి బయట పడుతుంది. సోమవారం ఆలయం దాదాపుగా సగం భాగం వరకు దర్శనమిచ్చింది. శ్రీశైలం జలాశయం నీటిమటం 843.70 అడుగులకు చేరడంలో ఆలయ ప్రహరీ భాగం కింది వరకు నీరు తగ్గుముఖం పట్టింది. దీంతో ఆలయ ముఖద్వారం దర్శనమిచ్చింది. మరో ఐదు అడుగులు నీరు తగ్గితే ఆలయం పూర్తిగా బయట పడుతుందని ఆలయ అర్చకులు తెలకపల్లి రఘురామ శర్మ తెలిపారు. రానున్న సోమవారం ప్రాచీన సంగమేశ్వరుడికి తొలి పూజలు ప్రారంభమవనున్నట్లు పేర్కొన్నారు. -
పీయూలో ఖోఖో మహిళా జట్టు ఎంపిక
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూలో ఖోఖో మహిళా జట్టు ఎంపికలను సోమవారం నిర్వహించారు. ఈ మేరకు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వీసీ శ్రీనివాస్ హాజరై ప్రసంగించారు. విద్యార్థులకు యూనివర్సిటీ క్రీడలకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తున్నామని, ఇక్కడ క్రీడల్లో ఎంపికై న విద్యార్థులు నిరంతర సాధన ద్వారా మంచి ఫలితాలను రాబట్టేందుకు అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఇక్కడ ఎంపికై న విద్యార్థినులు ఈనెల 26నుంచి 31వ వరకు కర్ణాటకలోని దేవేంగిరి యూనివర్సిటీలో నిర్వహించే పోటీల్లో పాల్గొనున్నారు. కార్యక్రమంలో పీడీ శ్రీనివాస్, ఇన్చార్జి సత్యభాస్కర్, కోకో అసోసియేషన్ సెక్రెటరీ బాలరాజయ్య, కోచ్లు రూప, శ్రీనివాస్, రజిని, శ్వేత పాల్గొన్నారు. పీయూలో భగత్సింగ్ వర్ధంతి పీయూలో భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ 95వ వర్ధంతి కార్యక్రమాన్ని పీడీఎస్యూ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మారుతి, సీతారాం మాట్లాడుతూ.. బ్రిటీష్ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో బలైన రాజ్గురు, సుఖ్దేవ్, భగత్సింగ్ విప్లవవీరులు స్వాతంత్య్రం కోసం జీవితాలనే అర్పించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో హర్షవర్ధన్, సంజీవ్, బాలు, నవీన్, తిరుమలేశ్ తదితరులు పాల్గొన్నారు. మహిళలు సామాజికంగా ఎదగాలి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): మహిళలు సామాజికంగా ఎదగాలని చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కొకన్వీనర్ శ్రీదేవి అన్నారు. సోమవారం స్థానిక డైట్ కాలేజీలో అంతర్జాతీయ శ్రామిక పోరాట దినంపై సెమినార్ నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా శ్రామిక పోరాట దినం అంటే అందాలు, ముగ్గులు పోటీలు కాదని.. అదొక స్ఫూర్తిదాయకమైన రోజని తెలియజేశారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను సామాజికంగా, ఆర్థికంగా రాజకీయంగా సాంస్కృతికపరంగా ముందుండి వాటిని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. డైట్ కాలేజీ లెక్చరర్ జ్యోతి మాట్లాడుతూ.. మహిళలకు వేరే ఎవరో చెప్పనవసరంలేదని.. తమకు తాము అద్భుతంగా సృష్టించుకోగలరన్నారు. పాలమూరు యూనివర్సిటీ జేఏసీ లీడర్ నరేందర్ మాట్లాడుతూ.. మహిళలు అన్నిరంగాల్లో సాధించాల్సింది ఇంకా మిగిలే ఉందని, హక్కులు, చట్టాల కొరకు నిరంతరం వి ద్యార్థిదర్శనం నేర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో డైట్ లెక్చరర్స్ రఫియా, ఐషా, బాలీశ్వరి, పాలమూ రు యూనివర్సిటీ విద్యార్థి పవన్ పాల్గొన్నారు. -
క్యాన్సర్ను మొదటి దశలో గుర్తిస్తే నయం
● పాలమూరు క్యాన్సర్ ఆస్పత్రివైద్యనిపుణుడు రాజ్కుమార్ పాలమూరు: ఉమ్మడి జిల్లాలో ఇటీవల కాలంలో క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, మొదటి దశలో గుర్తిస్తే చికిత్స ద్వారా సులువుగా తగ్గించ్చవచ్చని పాలమూరు క్యాన్సర్ ఆస్పత్రి సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బిల్లకంటి రాజ్కుమార్, మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ కె రెడ్డి, జనరల్ సర్జన్ డాక్టర్ కృష్ణకిషోర్ పేర్కొన్నారు. నగరంలోని పాలమూరు క్యాన్సర్ ఆస్పత్రిలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. క్యాన్సర్ నానాటికి పెరుగుతున్న క్రమంలో పేదలకు స్థానికంగా ఖరీదైన క్యాన్సర్ వైద్యం అందుబాటులో ఉండాలని 2022లో ఆస్పత్రి ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆస్పత్రి ఏర్పాటు చేసిన నాటినుంచి ఇప్పటి వరకు వెయ్యి వరకు సర్జరీలు, 5వేల మందికి కీమో థెరపీ చేసినట్లు పేర్కొన్నారు. ఊపిరితిత్తులు, లివర్, మూత్రాయం, పాన్క్రీస్ క్యాన్సర్కు మొదటిసారిగా స్థానికంగా వైద్యం చేసినట్లు వెల్లడించారు. క్యాన్సర్ అనేది వంశపారంపర్యంగా, ఒత్తిడి, కెమికల్స్ కూడిన ఆహారం, ఊబకాయం, మద్యం, సిగరేట్ గుట్కా వంటి అలవాట్లతో వచ్చే అవకాశం ఉంటుందని సూచించారు. జిల్లాలో క్యాన్సర్పై అవగాహన లేకపోవడంతో చాలామంది ఆలస్యంగా గుర్తించి ఆ తర్వాత వైద్యులను సంప్రదిస్తున్నారని అప్పటికే ఆలస్యం చేస్తున్నారని, అలా కాకుండా లక్షణాలు కన్పిస్తే వెంటనే పరీక్షలు చేసుకోవాలని తెలిపారు. మొదటి దశలో వస్తే తప్పక రోగం నయం చేయడానికి అధికంగా అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఒకవైపు వైద్యసేవలతోపాటు ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రత్యేక సదస్సులు, ర్యాలీలు నిర్వహించి పల్లెల్లో విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. జిల్లాలో రొమ్ము క్యాన్సర్, నోటి క్యాన్సర్, కార్భశయ ముఖద్వారా క్యాన్సర్ కేసులు అధికంగా ఉన్నాయని, చిన్నారుల నుంచి పెద్దలు ఈ ప్రాణాంతకమైన వ్యాధిబారినపడుతున్నట్లు వెల్లడించారు. మహిళల్లో గర్భాశయ, రొమ్ము క్యాన్సర్లు ప్రజల్లో ఈ వ్యాధిపై సరైన అవగాహన ఉండడం లేదన్నారు. ముఖ్యంగా మహిళల్లో రొమ్ము, గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్లు పంజా విసురుతున్నాయని తెలిపారు. వ్యాధిసోకుతున్న వారిలో గ్రామీణ ప్రాంతాలవారే అధికంగా ఉంటున్నారని, గతంలో గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ 50ఏళ్లపైబడి మోనోపాజ్ దశలో ఉన్నవారికి మాత్రమే వచ్చేదని పేర్కొన్నారు. ప్రస్తుతం యుక్త వయస్సు వారిలో ఇది వస్తున్నట్లు తేలిందని, హ్యూమన్ పాపిలోమా వైరస్(హెచ్పీవీ) ద్వారా ఈ వ్యాధి సోకుతుందని, బాల్యవివాహాలు, సుఖవ్యాధులు, పౌష్టికాహార లోపం ఎక్కువమంది పిల్లలను కనటం ఇందుకు కారణంగా తెలుస్తోంది. జిల్లాలో 90శాతానికిపైగా రొమ్ము క్యాన్సర్ బాధితులు వ్యాధి ముదిరిన తర్వాతే వైద్యుల వద్దకు వెళ్తున్నారని తెలిపారు. చిన్నచిన్న గడ్డలను గుర్తించినా నిర్లక్ష్యం చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
కరివేపాకు సాగుతో లాభాలు
అలంపూర్: కరివేపాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుంది. అందుకే కొందరు కూరల్లో వేసుకోని తింటే మరి కొందరు పౌడర్ రూపంలో తీసుకోని ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. కరివేపాగు సాగు చేయడం ఎంతో సులభమని వ్యవసాయ శాఖ ఏడీఏ సక్రియానాయక్ పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కరివేపాకు సాగు పలు సూచనలు అందిస్తున్నారు. జిల్లా వాతావరణానికి కరివేపాకు సాగు అనుకూలంగా ఉంటుందని వివరించారు. ఎర్రనేలలో పంట సాగు చేయడంతో అధిక దిగుబడి, సులభంగా సాగు చేసుకోనే అవకాశం ఉందని దీంతో పాటు అధిక లాభాలు ఆర్జించవచ్చని పేర్కొంటున్నారు. కరివేపాకు సాగులో మెళకువలు.. పంట రకాలు.. సెంకంపు: ఈ రకాన్ని తమిళ నాడులో అధికంగా సాగు చేస్తారు. ఆకు ఎక్కువగా ఉండి నూనె శాతం, వాసన కలిగి ఉంటాయి. డీడబ్ల్యూడీ–1 : ఈ రకం వేరు పిలకల ద్వారా ఎన్నుకోబడింది. ఆకు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇది చలిని తట్టుకోలేదు. ఆకులను పొడిగా చేసుకోని వాడుకోవచ్చు. డీడబ్ల్యూ డీ–2: విత్తనాల ద్వారా వేసిన పంట రకం నుంచి ఎన్నుకోబడిన రకం ఇది. ఆకు లేత పసుపు రంగులో ఉండి వాసన తక్కువగా ఉంటుంది. ఈ రకం చలిని తట్టుకుంటుంది. దీని పెరుగుదల అధికంగా ఉంటుంది. సువాసిని: వేరు మొక్కల ద్వారా మాత్రమే వ్యాప్తి చెందుతుంది. మెట్ట ప్రాంతాలకు ఇది అనుకూలం. భువనేశ్వర: నీటి వసతి ప్రాంతాల్లో ఎక్కువగా సాగు అవు తుంది. అన్ని రకాల నేలల్లో పండిస్తారు. మురుగు నీటి పారుదల సౌకర్యం ఉన్న ఎర్ర నేలలు శ్రేష్టం. ఎర్రతువ్వ నేలల్లో పెరుగుదల బాగా ఉంటుంది. ఆకు దిగుబడి ఎక్కువగా ఉంటుంది. మురుగు నీటి పారుదల లేని నల్ల నేలలు పనికి రావు. విత్తుట.. కరివేపాకును విత్తనాల ద్వారా పెంచవచ్చు. విత్తనా లతో నారు మొక్కలను పెంచి ప్రధాన పొలాల్లో నా టాలి. నారు పెంచేందుకు బాగా పండించిన మంచి పండ్లను, బాగా పెరుగుదల కలిగిన తల్లి చెట్ల నుంచి కోయాలి. జూలై, ఆగస్టు నెలల్లో పండ్లు కాస్తా యి. ఆగస్టు నెలలో పండ్లను సేకరించిన 3–4 రోజు ల్లో విత్తనాలను తీసి నారుమళ్లు, పాలిథిన్ సంచుల్లో విత్తాలి. ప్రతి పండులో 3– 4 విత్తనాలు ఉంటాయి. విత్తన మోతాదు.. ఎకరాకు 80 నుంచి 100 కిలోల విత్తనాలు లేదా 25 కిలోల పండ్లు సరిపోతాయి. విత్తే పద్ధతి.. మీటర్ విస్తీర్ణంలో 30 సెం.మీ. ఎత్తు కలిగిన నారుమళ్లను తయారు చేయాలి. నారుమళ్లకు తగినంత పశువుల ఎరువులు వేసిన తరువాత 10 సె.మీ. దూరంలో గీసి విత్తనాలను విత్తుకోవాలి. మూడు రోజుల్లో విత్తనాలు మొలకెత్తుతాయి. నేల తయారీ మొక్కలు నాటుట.. ప్రధాన భూమిని 3 నుంచి 4 సార్లు బాగా దున్నాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 8 టన్నుల పశువుల ఎరువులు వేయాలి. 30.30.30 సె.మీ. పరిమాణం గల గుంతలను 1.2 నుంచి 1.5 మీ దూరంలో మొక్కలు నాటాలి. మొక్కలు నాటడానికి రెండు నెలల ముందు గుంతలు తీయాలి. ఈ గుంతలను పశువుల ఎరువును కలిపి నింపాలి. గుంత మధ్యలో ఒక్కో నారుమొక్క నాటాలి. ఎరువులు.. ఎకరాకు 8 టన్నుల పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేయాలి. ఎకరాకు 28 కేజీల నత్రజని, 9 కిలో భాస్వరం, 8 కిలో పొటాష్ని ఇచ్చే ఎరువులను కలిపి గుంతలో సమానంగా నింపాలి. నీటి యాజమాన్యం, మొక్కలను నాటిన వెంటనే గుంతలను తడపాలి. నాటిన మూడో రోజు మరొక తడి అందించాలి. తర్వాత వారానికి ఒక తడి అందిస్తూ ఉండాలి. గుంతలను కలుపుతూ కాల్వలను ఏర్పాటు చేసి నీటిని అందించాల్సి ఉంటుంది. అంతర కృషి.. గుంతల మధ్య ఎలాంటి కలుపు లేకుండా చూడాలి. మొదటి సంవత్సరం గుంతల మధ్య అపరాలు పండించవచ్చు. సస్యరక్షణ చర్యలు గొంగళి పురుగు: గొంగళి పురుగు చిన్నప్పుడు తెల్లని చా రలతో నలుపు రంగులో ఉంటుంది. తరువాత ముదురు ఆకుపచ్చ రంగులో లావుగా స్థూపాకారంలో ఉంటుంది. పురుగులను చేతితో తీసి నాశనం చేయడం శ్రేయస్కరం, వేప సంబంధిత క్రిమి సంహార మందులు ఉపయోగించాలి. తప్పని పరిస్థితుల్లో నువాన్ 1 మి.లీ. లేదా 2 మి.లీ. క్వినాల్పాస్ లీటర్ నీటితో కలిపి పిచికారీ చేయాలి. తెగుళ్లు : ఆకుపచ్చ తెగుళ్ల సోకే ఆవకాశం ఉంది. దీని నివారణకు గ్రామ కార్బాండిజమ్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. గంధం కలిగిన క్రిమి నాశకాలను వాడితే ఆకు రాలిపోతుంది. కాబట్టి మందును వాడరాదు. కోత దిగుబడి మొదటి సంవత్సరం ఎకరాకు 100 నుంచి 160 కిలోల దిగుబడి వస్తుంది. రెండు నుంచి మూడు సంవత్సరాల్లో ప్రతి నాలుగు నెలలకు ఒక్కోక్క కోతలో ఎకరాకు 700 కిలో చొప్పున సంవత్సరానికి 2,100 కిలోల ఆకు దిగుబడి వస్తుంది. 4వ సంవత్సరంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఒక కోతలో 1000 కిలోల చొప్పున 4 వేల కిలోల ఆకు దిగుబడి వస్తుంది. అయిదు సంవత్సరాల్లో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఒక కోతలో ఎకరాకు 2 వేల కిలోల ఆకు చొప్పున ఏడాదికి 8 వేల కిలోల ఆకు దిగుబడి వస్తుంది. పాడి–పంట -
గ్యాస్ ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటాం
● గోదాంలో 250 సిలిండర్ల వ్యత్యాసం అచ్చంపేట రూరల్: గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని తహసీల్దార్ సైదులు హెచ్చరించారు. పట్టణంలోని లక్ష్మీప్రసన్న గ్యాస్ ఏజెన్సీ(భారత్) గోదాంను సోమవారం ఆయన తనిఖీ చేశారు. గోదాంలోని సిలిండర్ల నిల్వలను పరిశీలించారు. అలాగే ఏజెన్సీ కార్యాలయంలోని రికార్డులను పరిశీలించగా 250 సిలిండర్లు వ్యత్యాసం వచ్చినట్లు గుర్తించారు. దీంతో కలెక్టర్కు నివేదిక అందించనున్నట్లు తెలిపారు. లబ్ధిదారులకు సకాలంలో సిలిండర్లు అందించకుండా కృత్రిమ కొరతకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్యాస్ సిలిండర్లు డోర్ డెలివరీ చేయాల్సి ఉంటుందని, డెలివరీ పేరుతో అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు. తనిఖీలో ఎంఆర్ఐ శివ, ఆర్ఐ బాల్రాం, సిబ్బంది పాల్గొన్నారు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు పట్టివేత బిజినేపల్లి: మండల కేంద్రంలోని పలు హోటళ్లలో మండల రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. అమెరికా–ఇరాన్ యుద్ధం కారణంగా గ్యాస్ కొరత నెలకొనడంతో ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ దాడులు చేపట్టినట్లు డిప్యూటి తహాసీల్దారు రవికుమార్ తెలిపారు. సోమవారం నిర్వహించిన దాడులలో 10 దుకాణాలలో 20 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. -
ప్రతి పల్లెకు న్యాయ సేవలు వెళ్లాలి
పాలమూరు: జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రతి పల్లెకు న్యాయసేవలను తీసుకువెళ్లడానికి పారా లీగల్ వలంటీర్లు బాధ్యత తీసుకోవాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత అన్నారు. అన్ని రకాల చట్టాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడం వల్ల ప్రజలకు అవగాహన పెరుగుతుందన్నారు. నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లాన్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర అధ్యక్షతన సోమవారం పారా లీగల్ వలంటీర్లకు శిక్షణ నిర్వహించారు. లీగల్ ఎయిడ్ క్లినిక్, అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్లు, చైల్డ్ ఫ్రెండ్లీ కమిటీలు అందిస్తున్న న్యాయ సేవలు మరింత మెరుగైన స్థాయిలో అందించేందుకు కృషి చేయాలన్నారు. గ్రామాల్లో ఉన్న పేదలకు న్యాయం సక్రమంగా అందడం లేదనే విషయం ఎన్నో నివేదికలు చెబుతున్నాయని, ఇలాంటి అంశాలపై వలంటీర్లు దృష్టి సారించాలన్నారు. సమస్య తీవ్రతను బట్టి పరిష్కారం జరగాలన్నారు. శిక్షణలు ప్రతి వలంటీర్ సద్వినియోగం చేసుకుని నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమల్లోకి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయమూర్తి ఇందిర, డీపీఓ నర్మద, సహాయ కార్మికశాఖ అధికారి అల్తాఫ్, న్యాయవాదులు కృష్ణ, కార్తీక్, సామాజిక కార్యకర్తలు చంద్రశేఖర్, శివన్న పాల్గొన్నారు. -
డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని కలెక్టరేట్ ఎదుట ఆందోళన
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లా కేంద్రంలోని క్రిష్టియన్పల్లిలో 523 సర్వే నంబర్లో ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇండ్ల స్థలాల పట్టా సర్టిఫికెట్లను అప్పటి ప్రభుత్వం తీసుకుని డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించలేదని టీఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ఖలీల్ అన్నారు. పట్టాలు తీసుకున్న ప్రతిఒక్కరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలనే డిమాండ్తో సోమవారం కలెక్టరేట్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అప్పటి కలెక్టర్ రొనాల్డ్రోస్ మాటను నమ్మి అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో తమ పట్టా సర్టిఫికెట్లు ఇచ్చినట్లు గుర్తు చేశారు. అప్పటి నుంచి బాధితులు ఇండ్లకోసం అధికారుల చుట్టూ తిరుగుతున్న ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఏడేళ్లు గడుస్తున్నా కలెక్టర్ హామీ నెరవేరకపోవడం శోచనీయమన్నారు. ప్రస్తుత కలెక్టర్ గత కలెక్టర్ హామీని అమలు చేసి ప్రభుత్వ పాలనపై ప్రజలకు విశ్వాసం కలిగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికై నా కలెక్టర్ పట్టా సర్టిఫికెట్లు ప్రభుత్వానికి స్వాధీనపరిచిన వాళ్లందరికీ తక్షణం డబుల్బెడ్రూం ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షులు జలాల్ పాషా, గట్టన్న, డబుల్ బెడ్రూం బాధితులు పాల్గొన్నారు. -
భైక్ అదుపుతప్పి యువకుడు మృతి
ఉండవెల్లి: మండలంలోని పుల్లూరు శివారులోని జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉండవెల్లికి చెందిన తల్లి కుమారుడు సర్తాజ్ బేగం, మజూర్ (19) బైక్పై కర్నూలుకు బయలుదేరారు. ఈ క్రమంలో బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టింది. ప్రమాదంలో తల్లి పక్కనే పడిపోగా కుమారుడు ఎగిరిపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి 108లో కర్నూలు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో తల్లి కన్నిటిపర్యంతమయ్యారు. తల్లి ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. చికిత్స పొందుతూ యువతి మృతి తెలకపల్లి: చికిత్స పొందుతూ యువతి మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ నరేష్ తెలిపిన వివరాల మేరకు.. మండల పరిధిలోని గడ్డంపల్లి గ్రామానికి చెందిన వడ్డెమాన్ భార్గవి (21)కు తండ్రి పెళ్లి సంబంధం చూశారు. పెళ్లి నిశ్చయం కోసం ఈనెల 15న తెలకపల్లికి వెళ్లగా అదే రోజు సాయంత్రం భార్గవి క్రిమి సంహారక మందు తాగి అత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన స్థానికులు తండ్రికి సమాచారం అందింంచి చికిత్స నిమిత్తం నాగర్కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె సోమవారం మృతి మరణించింది. భార్గవి వేరే యువకుడిని ఇష్టపడుతుందని, ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తండ్రి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆలయంలో చోరీ.. కేసు నమోదు ఉప్పునుంతల: మండలంలోని జప్తీ సదగోడు లో గల పెద్దమ్మ ఆలయంలో ఆదివారం రాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. అమ్మవారి వెండి విగ్రహం, వడ్డానం, బంగారు మాంగల్యం, ముక్కుపుడకను అపహరించుకుపోయారు. సోమవారం ఉదయం స్థానిక యాదవ సంఘం నాయకులు ఆలయంలోకి రాగా చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్ఐ వెంకట్రెడ్డి జిల్లా నుంచి వచ్చిన ప్రత్యేక బృందాన్ని రప్పించి ఆలయంలో వేలి ముద్రలను సేకరించినట్లు పేర్కొన్నారు. మొగుల్మడ్కలో నగదు, నగలు చోరీ దామరగిద్ద: మండలంలోని మొగుల్మడ్క గ్రామానికి చెందిన మహామ్మద్ ఆసిఫ్ ఇంట్లో దొంగలు ప్రవేశించి నగలుతో పాటు నగదు ఎత్తుకెళ్లారు. ఆసిఫ్ జీవనోపాధి కోసం హైదరాబాద్కు వలస వెళ్లి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల పోలెపల్లి ఎల్లమ్మ జాతరకు ఇంటికి వచ్చి తిరిగి హైదరాబాద్కు వెళ్లాడు. కాగా సోమవారం ఉదయం గ్రామానికి వచ్చి ఇంటిని తెరిచి చూడగా బీరువా తలపులు తెరిచి ఉండటాన్ని చూసి కంగుతిన్నాడు. బీరువాల్లో దాచి ఉంచిన 15 తులాల వెండి, 10 వెండి ఉంగరాలు. కాళ్లపట్టీలు, రూ.20 వేల నగదు చోరీ చేసినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు. -
జీవవైవిధ్య సంరక్షణకు పాటుపడాలి
జడ్చర్ల టౌన్: జీవ వైవిధ్య సంరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలని నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ మాజీ చైర్మన్ అచలేందర్రెడ్డి, కళాశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డీఎస్ఆర్ రాజేందర్సింగ్ కోరారు. పట్టణంలోని డా.బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని తెలంగాణ బొటానికల్ గార్డెన్ 6వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథులుగా నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ మాజీ చైర్మన్ అచలేందర్రెడ్డి, కళాశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డీఎస్ఆర్ రాజేందర్సింగ్ హాజరై గార్డెన్లో మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం కళాశాల సమావేశ మందిరంలో జ్యోతి వెలిగించి సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులకు ఎన్సీసీ సభ్యులు గౌరవ వందనం సమర్పించారు. గార్డెన్లో దాతలు, పూర్వ విద్యార్థుల సహకారంతో ఔషధ మొక్కల కోసం నిర్మించిన చరక నెట్హౌస్ను అచలేందర్రెడ్డి, 1993–96 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సహకారంతో ఏర్పాటు చేసిన వాండా ఆర్కిడేరియం, కాక్టస్హౌస్ను ప్రొఫెసర్ డీఎస్ఆర్ రాజేందర్సింగ్, ప్రిన్సిపాల్ సుకన్య ప్రారంభించారు. బొటానికల్ గార్డెన్ తలమానికం డా.సదాశివయ్య రూపొందించిన బొటానికల్ గార్డెన్ జడ్చర్లకే తలమానికంగా మారిందని, ప్రతి కళాశాలలోనూ మొక్కలు నాటి ప్రకృతి పరిరణక్షకు పాటు పడాల్సిన అవసరం ఉందన్నారు. కళాశాల రాష్ట్రానికే ఆదర్శ కళాశాలగా మారిందన్నారు. గార్డెన్ సమన్వయకర్త డా.సదాశివయ్య మాట్లాడుతూ ఆరేళ్లలో జరిగిన అభివృద్ధిని వివరించారు. 852 జాతులు, 8 వేల పైచిలుకు మొక్కలను సంరక్షిస్తున్నామని వివరించారు. జీవవైవిధ్య సంరక్షణకు, పరిశోధనలకు గార్డెన్ కేంద్రబిందువుగా మారిందన్నారు. గార్డెన్ అభివృద్ధికి సహకరించిన పూర్వవిద్యార్థులు, పట్టణవాసులకు కృతజ్ఞతలు తెలిపారు. వేడుకల్లో ప్రిన్సిపాల్ డా.సుకన్య, వైస్ప్రిన్సిపాల్ నర్మద, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు పాల్గొన్నారు. స్కిల్ ఓరియంటెడ్ కోర్సులతో సంపాదన విద్యార్థులు చదువుతోపాటు స్కిల్ ఓరియంటెడ్ కోర్సుల ద్వారా భావితరాలు చదువుతో పాటు సంపాదించడం నేర్చుకోవాలని నేషనల్ బయోడైవర్సిటి మాజీ చైర్మన్ అచలేందర్రెడ్డి పిలుపునిచ్చారు. బొటానికల్ గార్డెన్లో సంరక్షిస్తున్న అరుదైన ఔషధ మొక్కలు, అటవీ జాతుల మొక్కలను తక్కువ ఖర్చుకై నా అమ్మి గార్డెన్కు సంపాదన వచ్చేలా చేయాలన్నారు. -
సత్వరం పరిష్కరించండి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ప్రజావాణి వచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యతనిచ్చి పెండింగ్లో ఉంచకుండా సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 165 ఫిర్యాదులు అందాయి. కలెక్టర్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలు శ్రద్ధగా విని సంబంధిత అధికారులతో మాట్లాడి ఎండార్స్ చేస్తూ ఫిర్యాదులు పరిష్కారం చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఫిర్యాదులు, ప్రజావాణిలో కలెక్టర్కు అందిన పెండింగ్ ఫిర్యాదులు శాఖల వారీగా సమీక్షించారు. మూడు నెలలకు మించి పెండింగ్లో నున్న ఫిర్యాదులు అన్ని వెంటనే పరిష్కరించాలని, గత ప్రజావాణిలో కూడా కలెక్టర్ సమీక్షించి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. సమావేశంలో భూసేకరణ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాంరెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ వెంకట్రెడ్డి, డీఆర్డీఓ నరసింహులు, ఆర్డీఓ నవీన్ తదితరులు పాల్గొన్నారు. ● ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజు కార్యక్రమానికి చెందిన హెల్ప్లైన్ నంబర్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఖుష్బూ గుప్తా పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ తన చాంబర్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన హెల్ప్లైన్ నంబర్స్ పోస్టర్స్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా అధికారి జరీనాబేగం, తదితరులు పాల్గొన్నారు. మహిళలు ధైర్యంగా ముందుకు సాగాలి స్టేషన్ మహబూబ్నగర్: సమాజంలో చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ మహిళలు ధైర్యంగా ముందుగా సాగాలని కలెక్టర్ ఖుష్భూ గుప్తా అన్నారు. జిల్లాకేంద్రం మదీనా మసీద్ప్రాంతంలో గాలిబ్ హాల్లో మెరాజ్ ఎడ్యుకేషనల్, వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఐదురోజుల ‘సమాత్–ఏ–ఖురాన్ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కట్నం, బాల్య వివాహాలు, బాలికల నిరక్షరాస్యత వంటి సమస్యలు ఇంకా సమాజంలో ఉన్నాయని, మహిళలు విద్యను సాధించి ఈ సమస్యలను అధిగమించి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఒక కుటుంబంలో మహిళ విద్యావంతురాలైతే ఆ కుటుంబమంతా వెలుగొందుతుందన్నారు. రంజాన్ మాసం ఐక్యత, సోదరభావం, శాంతి, సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. అనంతరం సమాత్–ఏ–ఖురాన్ కార్యక్రమంలో భాగంగా ఖురాన్ పఠనం విజయవంతంగా పూర్తి చేసిన వారికి కలెక్టర్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మెరాజ్ ఎడ్యుకేషన్, వెల్ఫేర్ సొసైటీ స్థాపకురాలు అయేషా తఖీయోద్దీన్, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ హాదీ, జేబా, ఫర్హతుల్లా, షఫియోద్దీన్ పాల్గొన్నారు. -
పోలీస్, న్యాయశాఖ సమన్వయంతో పనిచేయాలి
● అప్పుడే నిందితులకు శిక్షలు పడతాయి: ఎస్పీ జానకి పాలమూరు/హన్వాడ: ఇటీవల మూడు పోక్సో కేసులతో పాటు ఒక రాబరీ, ఒక అత్యాచార కేసులలో నిందితులకు కోర్టు ద్వారా కఠిన శిక్షలు పడటంలో కీలక పాత్ర పోషించిన అధికారులను, పోలీస్ సిబ్బందిని సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ డి.జానకి సన్మానించడంతో పాటు ప్రశంసాపత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసుల దర్యాప్తులో పోలీస్ అధికారులు సేకరించిన బలమైన సాక్ష్యాధారాలు, న్యాయ శాఖ అధికారుల సమర్ధమైన వాదనల వల్ల నిందితులకు కఠిన శిక్షలు పడటం సాధ్యమైందన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా పోలీస్, న్యాయ శాఖలు సమన్వయంతో పని చేయడం అత్యంత ముఖ్యమన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎన్బీ రత్నం, డీసీఆర్బీ డీఎస్పీ రమణారెడ్డి, సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు. హన్వాడ పోలీస్స్టేషన్ను తనిఖీ చేసిన ఎస్పీ హన్వాడ పోలీస్స్టేషన్ను సోమవారం సాయంత్రం ఎస్పీ డి.జానకి ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లోని రికార్డులు, పెండింగ్ కేసుల వివరాలు, ఇతర కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ నిర్వహణపై సమీక్షించారు. పోలీస్స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల పోలీసులు బాధ్యతగా ఉండాలని, ఫిర్యాదులు స్వీకరించిన తర్వాత సకాలంలో పరిష్కరించాలన్నారు. నేరాల నియంత్రణలో నిత్యం అప్రమత్తంగా ఉంటూ చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ప్రమాదాలు, సమాజంపై పడే ప్రతికూల ప్రభావాల గురించి ప్రజలకు, ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ వెంకటేష్, సిబ్బంది పాల్గొన్నారు. -
నారాయణపేట–మక్తల్–కొడంగల్ ఎత్తిపోతల్లో కదలిక
● తొలి విడతలో రూ.1,400 కోట్లు మంజూరు.. స్టేజీ–1 పనులు షురూ ● కాట్రేవులపల్లి వద్ద అప్రోచ్ చానల్, పంప్హౌస్ పనులు ముమ్మరం ● మొత్తంగా లక్ష ఎకరాలకు సాగునీరు.. ప్రాజెక్ట్ వెంట గ్రీన్బెల్ట్ ● 56 హెక్టార్లలో మొక్కల పెంపకం.. రైతాంగంలో హర్షాతిరేకాలు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి పాలమూరులోని నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాలను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా చేపట్టిన కొడంగల్ ఎత్తిపోతల పథకంలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. పది మండలాల పరిధిలో లక్ష ఎకరాలకు సాగు, 123 గ్రామాలకు తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన ఈ పథకానికి ఇటీవలే తొలి విడత నిధులు మంజూరు కాగా.. పనులు ఊపందుకున్నాయి. ఆర్థిక భారం పడకుండా ఇదివరకే అనుకూలంగా ఉన్న చెరువులను రిజర్వాయర్లుగా మార్చడంతోపాటు ప్రాజెక్ట్ వెంట గ్రీన్బెల్ట్ ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా 56 హెక్టార్లలో మొక్కలను పెంచనున్నారు. రిజర్వాయర్ల సామర్థ్యం: 4 టీఎంసీలు మొత్తం విడతలు : 3మంజూరైనవి : రూ.1,400 కోట్లు వ్యయం : రూ.2,945 కోట్లు కొడంగల్ పనులు ప్రారంభమయ్యాయి. స్టేజీ–1 కింద మక్తల్ మండలంలోని కాట్రేవులపల్లి నుంచి ఊట్కూర్ వరకు, స్టేజీ–2 కింద ఊట్కూర్ మండలంలోని బాపూర్ నుంచి కానుకుర్తి వరకు పనులను డిసెంబర్ 2027 డిసెంబర్ వరకు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. 2 ప్యాకేజీలకు సంబంధించి రూ.2,945 కోట్లతో భూసేకరణ, కాల్వ, పంప్ హౌస్లు, రిజర్వాయర్ల పనులు రాఘవ, మెగా కన్స్ట్రక్షన్ల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. – శ్రీధర్, ఎస్ఈ, ఇరిగేషన్, మహబూబ్నగర్ -
స్టేజీ–1 పనులు ప్రారంభం..
రూ.4,885 కోట్ల వ్యయంతో కొడంగల్–నారాయణపేట–మక్తల్ ఎత్తిపోతల పథకం పనులను మూడు విడతలుగా చేపట్టాలని నిర్ణయించారు. మొదటి విడత కింద రూ.2,945 కోట్ల పనులను రెండు ప్యాకేజీలుగా విభజించారు. ఇందులో స్టేజీ–1 (కాట్రేవులపల్లి), స్టేజీ–2 (ఊట్కూరు/బాపూర్), స్టేజీ–3 (జాయమ్మ చెరువు)కి సంబంధించి పంప్హౌస్లు, పైపులైన్ పనులు చేయాలి. ప్రస్తుతం మొదటి విడతకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఇటీవల రూ.1,400 కోట్లు మంజూరు కాగా.. సంబంధిత కాంట్రాక్టర్లు స్టేజీ–1లో భాగంగా మక్తల్ మండలం కాట్రేవులపల్లి వద్ద అప్రోచ్ చానల్, పంప్హౌస్ పనులు ప్రారంభించారు. అదేవిధంగా కాట్రేవులపల్లి, మంథన్గోడు, కాచ్వార్ మీదుగా ఊట్కూరు పెద్దచెరువు వరకు అనుసంధానం చేసేలా ప్రెషర్ మెయిన్ పైపులను కాచ్వార్ వద్ద అందుబాటులో ఉంచారు. -
బైపాస్పై ఆశలు
డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని కలెక్టరేట్ ఎదుట ఆందోళన ప్రతి పల్లెకు న్యాయ సేవలు వెళ్లాలి ● చట్టాలపై అవగాహన కల్పించే బాధ్యత పారా లీగల్ వలంటీర్లు తీసుకోవాలి ● న్యాయమూర్తి ఎన్.ప్రేమలత జడ్చర్ల: జడ్చర్లకు బైపాస్ మంజూరుపై ఆశలు చిగురిస్తున్నాయి. జడ్చర్ల పట్టణ ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ప్రతిపాదించిన బైపాస్ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. నిత్యం ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించే విధంగా కేంద్రం పంపే కబురు కోసం ఎదురుచూస్తున్నారు. జడ్చర్ల పట్టణం చుట్టూ బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు రంగం సిద్ధం అయ్యింది. రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉన్న జడ్చర్ల పట్టణం గుండా ప్రయాణం నరకప్రాయంగా మారింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వారు జడ్చర్ల దాటితే సరి అన్న ఆందోళనలో ప్రయాణాలు సాగిస్తున్నారు. పట్టణ విస్తీర్ణం కూడా అడ్డదిడ్డంగా ఉండడంతోపాటు పట్టణంలోని ప్రధాన రహదారులు ఇరుగ్గా ఉన్నాయి. ఇక్కడ వాహనాల రాకపోకలకు.. రహదారుల వెడల్పునకు ఎక్కడా పొంతన లేక అడుగడుగునా ట్రాఫిక్తో నిత్యం సతమతమవుతున్నారు. మరోవైపు జాతీయ రహదారి–44, ఇంకోవైపు ఎన్హెచ్–167తోపాటు రాష్ట్రీయ రహదారులు సైతం పట్టణం నడిబొడ్డుగుండా వెళ్తున్నాయి. వీటికి తోడు రైల్వే మార్గం కూడా ఉండడంతో రాకపోకలు అంత సునాయసంగా ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. రైల్వే మార్గం కారణంగా రెండు ప్రాంతాల రాకపోకలు సిగ్నల్గడ్డ వద్ద ఉన్న సింగిల్ బ్రిడ్జి మీదుగా మాత్రమే దాటే పరిస్థితి ఉండడంతో ఇక్కడ ట్రాఫిక్ స్తంభించి ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. అలాగే జడ్చర్ల కొత్త బస్టాండ్ సమీపంలో ఎన్హెచ్–44పై ఫ్లై ఓవర్ బ్రిడ్జి దగ్గర సైతం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయి. ఇలా అనేక దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలతోపాటు ఇతర ప్రాంతాల ప్రజలు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో జడ్చర్లకు బైపాస్ రోడ్డు నిర్మిస్తే బాగుంటుందని ఎంతో కాలంగా ప్రజలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే బైపాస్ రోడ్డు నిర్మాణానికి పాలకవర్గాల నుంచి అనుకూల ప్రకటనలు రావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్తో సతమతం.. జడ్చర్ల మీదుగా ఒక్క హైదరాబాద్కు మాత్రమే కాకుండా కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర తదితర ఉత్తర, దక్షిణ భారతం వైపు భారీ సంఖ్యలో రాకపోకలు సాగుతుంటాయి. అయితే ఆయా ప్రాంతాలకు వెళ్లాలంటే జడ్చర్ల పట్టణం గుండానే అది కూడా సింగిల్ రోడ్డుగా ఉన్న ఒక చిన్నపాటి రైల్వే వంతెనపైనే రాకపోకలు సాగించే పరిస్థితి ఉండేది. కాగా ఇటీవల జాతీయ రహదారి–167 విస్తరణ పనులలో భాగంగా ఒకవైపు సింగిల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తిచేయగా.. మరోవైపు బ్రిడ్జి విస్తరణ పనులు నిలిచిపోవడంతో గుంతలమయంగా మారిన రహదారిపైనే రాకపోకలు సాగుతున్నాయి. వనపర్తి, కొల్లాపూర్, నాగర్కర్నూల్, కల్వకుర్తి ప్రాంతాలకు సైతం ఇదే రహదారి కీలకంగా ఉంది. జాతీయ, అంతర్రాష్ట్ర రహదారులు సిగ్నల్గడ్డ మీదుగానే సాగుతుండడంతో నిత్యం ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. దీంతో గంటల తరబడి రాకపోకలకు అంతరాయం కలుగుతుండడంతో ప్రజలు బైపాస్ రోడ్డు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నెలాఖరులోగా.. జడ్చర్ల పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని బైపాస్ రోడ్డు నిర్మాణం చేయాలన్న డిమాండ్ గత కొన్నేళ్లుగా ఉంది. అయితే గత బీఆర్ఎస్ పాలనలో బైపాస్ రోడ్డుకు అప్పటి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రతిపాదించినా కార్యాచరణ రూపొందలేదు. తాజాగా ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి జడ్చర్ల బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి నితిన్గడ్కరీకి ప్రతిపాదించడంతో అడుగులు ముందుకు పడుతున్నాయి. ఈ నెలాఖరులోగా బిడ్డింగ్ ఓపెన్ చేసి డీపీఆర్ బాధ్యతలను అప్పగించే సూచనలు కనిపిస్తుండటంతో ఈ నెలాఖరులోగా డీపీఆర్ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. జడ్చర్ల బైపాస్తోపాటు జాతీయ రహదారి–167కి సంబంధించి రెండు వరుసలుగా ఉన్న రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించాలన్న ప్రతిపాదనలకు కూడా డీపీఆర్ చేయనున్నారు. దీనికి సంబంధించి జడ్చర్ల మండలంలోని జాతీయ రహదారి–167ని అనుసరించి నక్కలబండతండా మీదుగా మల్లెబోయిన్పల్లి, చిట్టింబోయిన్పల్లి మధ్యగా జాతీయ రహదారి–44 మీదుగా మరికల్, నాగసాల గ్రామాల సమీపం నుంచి చర్లపల్లి మీదుగా ఆల్వాన్పల్లి, గంగాపూర్ గ్రామాల పరిధిలోని జాతీయ రహదారి–167ని తాకేలా ప్రతిపాదనలు నివేదించారు. అయితే డీపీఆర్ ఆయా ప్రతిపాదనల మేరకే చేపడుతారా.. మరేమైనా కొత్తవి తెరపైకి వస్తాయా అన్నది వేచిచూడాల్సి ఉంది. డీపీఆర్కు రంగం సిద్ధంతో ముందడుగు ఈ నెలాఖరులోగా కొలిక్కి వచ్చే అవకాశం పట్టణంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం అన్నీ సవ్యంగా జరిగితే జడ్చర్ల మరింత అభివృద్ధి -
7 రోజుల్లో 3,599 మందికి స్క్రీనింగ్
● జిల్లాలో పీహెచ్సీలలో కొనసాగుతున్న ఆరోగ్య వైద్య శిబిరాలు ● స్థానికంగా హైక్వాలిటీ ట్యాబ్లెట్స్ కొరత పాలమూరు: జిల్లావ్యాప్తంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం, వారి ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి కింద హెల్త్ మిషన్–100 పేరుతో ఈనెల 6 నుంచి వంద రోజుల ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పీహెచ్సీ స్థాయిలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అన్ని వయసుల వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో సోమవారం నాటికి 9 పీహెచ్సీలలో ఆరోగ్య వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మొత్తం 3,599 మందికి స్క్రీనింగ్ చేశారు. పలు విభాగాల వైద్య నిపుణులు చేస్తున్న పరీక్షల్లో అధికంగా గైనిక్లో రక్తహీనత, రుతుస్రావం, తెల్లబట్ట, కంటిచూపు సమస్యలో శుక్లాల ఇబ్బందులు, చిన్న పిల్లల ఆరోగ్య సమస్యలు బహిర్గతం అవుతున్నాయి. దంత సమస్యలు సైతం వైద్యుల దృష్టికి వస్తున్నాయి. మందుల కొరత ఆరోగ్య శిబిరాల్లో పలు రకాల విభాగాల వైద్య నిపుణులు ఆరోగ్య పరీక్షలు చేసి అవసరమైన ట్యాబెలెట్స్, ఇంజక్షన్స్ రాసిన క్రమంలో ఆయా పీహెచ్సీలలో అలాంటి మందులు స్థానికంగా ఉండటం లేదని తెలుస్తోంది. హైక్వాలిటీ ట్యాబ్లెట్స్ ఇచ్చిన క్రమంలో పీహెచ్సీలలో సాధారణ మాత్రలు అందుబాటులో ఉంటున్నాయి. దీంతో స్థానికంగా ఉన్న డ్రగ్స్తోనే సరిపెడుతున్నట్లు తెలుస్తోంది. -
ఆస్తి పన్ను వసూళ్లపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నగరంలో ఆస్తి పన్ను వసూళ్లపై నిర్లక్ష్యం వహిస్తే తగు చర్యలు తీసుకుంటామని ఇన్చార్జి స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ మధుసూదన్నాయక్ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ విభాగం అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర పరిధిలో మొత్తం రూ. 51.61కోట్లకు ఇప్పటివరకు రూ.19 కోట్లే వసూలు కావడమేమిటని మండిపడ్డారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి కేవలం 15 రోజులు మాత్రమే మిగిలి ఉందని, నిత్యం కనీసం రూ.70 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు వసూలు చేయాలని ఆదేశించారు. ఎవరైనా చెల్లించకుంటే రెవెన్యూ చట్టం ప్రకారం వారి ఆస్తులను జప్తు చేయాలని సూచించారు. అంతకుముందు నగరంలోని బండమీదిపల్లి, హనుమాన్పురా, భగీరథ కాలనీ తదితర ప్రాంతాలలో ఆయనతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ అధికారులు కలిసి ఆస్తిపన్ను వసూళ్ల కోసం తిరిగారు. సకాలంలో ఆస్తిపన్ను, నల్లాబిల్లులు చెల్లించి నగర అభివృద్ధికి అందరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ అజ్మీర రాజన్న, ఆర్ఓలు మహమ్మద్ ఖాజా, యాదయ్య, ఆర్ఐలు రమే ష్, అహ్మద్షరీఫ్, ముజీబుద్దీన్ పాల్గొన్నారు. కనీస వేతనాలు అమలు చేయాలి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: కేజీబీవీలు, యూఆర్ఎస్లు, సమగ్ర శిక్ష ఉద్యోగులకు కనీస వేతనాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు రవికుమార్ మాట్లాడుతూ విద్యాశాఖలో వివిధ విభాగాల్లో సంవత్సరాలుగా పనిచేస్తున్నారని వారికి తక్కువ వేతనాలు ఉన్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి వేతనాలు ఇవ్వాలన్నారు. హెల్త్కార్డులు మంజూరు చేయాలని, గతంతో చేసిన సమ్మే వేతనాలను కూడా ఇవ్వాలని, పీఆర్సీ ప్రకారం ప్రతి ఏడాది రూ.వెయ్యి ఇంక్రిమెంట్ ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో కోశాధికారి భాస్కర్, కార్యదర్శులు వేణుగోపాల్, అజయ్, హేమంత్కుమార్, జయంతి, ఖాదరయ్య, శ్రీనివాసులు, కనకమ్మ, రాధ, శంకర్, నరేష్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. -
సాగునీరు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం
నాగర్కర్నూల్ రూరల్: రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి ఆరోపించారు. ఆదివారం గుడిపల్లి రిజర్వాయర్ను సందర్శించిన ఆయన మాట్లాడారు. ప్రాజెక్టులో నీటిని పూర్తిస్థాయిలో నింపి రైతులకు సకాలంలో నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం మూడు మోటార్లు మాత్రమే పని చేస్తున్నాయని, మిగిలిన రెండు మోటార్లు కూడా ప్రారంభించాలని సూచించారు. కాల్వ వెడల్పు పనులు వెంటనే చేపట్టాలని అధికారులకు సూచించారు. ఇంజినీర్లు, రాజకీయ నాయకులు కక్కుర్తి వల్ల ప్రాజెక్టు పరిస్థితి దెబ్బతిందని ఆరోపించారు. సాగునీటి మంత్రి పర్యటనలు కేవలం చుట్టపు చూపులు గానే మిగిలిపోతున్నాయని వాఖ్యానించారు. గుడిపల్లి కట్టపై ముళ్లపొదలు, చెట్లు పెరగడం వల్ల ప్రమాదం పొంచి ఉందని అందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శశిధర్రెడ్డి, రవి, బాలగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయురాలి బలవన్మరణం
వనపర్తి రూరల్: మహిళా ఉపాధ్యాయురాలు ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణ ఎస్ఐ–2 శశిధర్ తెలిపిన వివరాలు.. న్యూటౌన్ కాలనీకి చెందిన రాకాసి శ్రీదేవి(45) చిన్నంబావి మండలం వెల్గొండ జిల్లా ఉన్నత పాఠశాలలో గణితం ఉపాధ్యాయురాలిగి పని చేస్తుంది. కొంత కాలం నుంచి మానసిక వ్యాధిలో బాధపడుతున్న ఆమె ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. పిల్లలతో బయటికి వెళ్లిన భర్త సత్యనారాయణరెడ్డి ఇంటికి వచ్చి చూడగా ఫ్యానుకు వేలాడుతుండటం చూ సి తక్షణమే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి తల్లి బాలీశ్వరమ్మ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
కుటుంబ కలహాలతో ఉరేసుకుని ఆత్మహత్య
నాగర్కర్నూల్ క్రైం: కుటుంబ కలహాలతో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మున్సిపాలిటీ పరిధిలోని నాగనూలులో శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ గోవర్దన్ తెలిపిన సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన జరుపటి ఖాజా (39) మేసీ్త్ర పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో భార్య శనివారం ఉదయం పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన ఖాజా ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం కూలి పనులకు పిలిచేందుకు ఓ వ్యక్తి రాగా ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ట్రాక్టర్, ద్విచక్రవాహనం ఢీ.. యువకుడి మృతి నాగర్కర్నూల్క్రైం : ట్రాక్టర్, ద్విచక్రవాహనం ఢీ కొట్టుకోవడంతో యువకుడు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన మండల పరిధిలోని వనపట్ల గేటు సమీపంలో ఆదివారం చో టుచేసుకుంది. ఎస్ఐ గోవర్దన్ తెలిపిన వివరా ల ప్రకారం లింగాల మండలం కేసితండాకు చెందిన శ్రీఽశైలం (25), బాలరాజులు సొంత అన్నదమ్ములు. ఇద్దరు హైదరాబాద్లో లేబర్ కాంట్రాక్టు పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఈ క్రమంలో ఆదివారం ఇద్దరు కలిసి బైక్పై స్వగ్రామం నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ఢీకొనడంతో శ్రీశైలానికి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందగా ,బాలరాజును హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కు టుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. దైవ దర్శనం ముగించుకొని వెళ్తూ.. జడ్చర్ల: మండలంలోని గంగాపూర్ శ్రీ లక్ష్మీచెన్నకేశవ స్వామిని దర్శించుకొని, తిరిగి వెళ్తున్న క్రమంలో గుండెపోటుతో మహిళ మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. బంధువుల కథనం మేరకు.. కోయిలకొండ మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన బొంతల చంద్రమ్మ (27) కుటుంబ సభ్యులతో కలిసి శనివారం గంగాపూర్లోని ఆలయానికి చేరుకున్నారు. అక్కడే నిద్ర చేసిన వారు ఆదివారం ఉదయం స్వామి దర్శనం చేసుకొని, తిరిగి ఆటోలో స్వగ్రామానికి వెళ్తుండగా మార్గ మధ్యంలో ఛాతీలో నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్లో వైద్య చికిత్స కోసం జడ్చర్ల ప్రభు త్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చంద్రమ్మ మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి బిజినేపల్లి: మండలంలోని వట్టెంకు చెందిన వ్యక్తి ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదానికి గురై అక్కడిక్కడే మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. రాంచంద్రయ్యరాంచంద్రయ్య (62) హైదరాబాద్లోని హైటెక్ సిటీలో పూల దుకాణం నిర్వహిస్తున్నాడు. వట్టెం జాతర ఉత్సవాల సందర్భంగా నాలుగురోజుల క్రితం గ్రామానికి వచ్చాడు. ఆదివారం సాయంత్రం వట్టెం నుంచి బిజినేపల్లి వైపు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. అటుగా వెళ్లిన కొందరు గమనించగా.. రాంచంద్రయ్య అక్కడిక్కడే మృతిచెందాడు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులకు విషయం తెలియడంతో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. రాంచంద్రయ్యకు ముగ్గురు కుమారులు ఉన్నారు. మనస్తాపంతోమహిళ ఆత్మహత్య జడ్చర్ల: కుటంబ కలహాలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ మహిళ ఆదివారం ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని బోయలకుంటకు చెందిన యాదమ్మ (42) మూడు రోజులుగా ఇంట్లో గొడవలు జరుగుతుండడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. ఈ క్రమంలో ఆదివారం ఆమె ఉరి వేసుకొనిఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది.వెంటనే గమనించిన ఆమె కు మార్తె స్వాతి వైద్య చికిత్స కోసం యాదమ్మను జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా..అప్పటి కే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ఆ స్పత్రికి వచ్చిన మంత్రి శ్రీహరి మృతురాలి కు మార్తె స్వాతిని ఓదార్చి,అండగా ఉంటామ ని భ రోసానిచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసు కుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కృష్ణా బ్రిడ్జి సమీపంలో మృతదేహం లభ్యం కృష్ణా: మండలంలోని కృష్ణా బ్రిడ్జి సమీపంలో ఓ మృతదేహం లభ్యమైంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పో లీసులు వచ్చి విచారణ చేపట్టారు. ఈ క్ర మంలో రెండు రోజుల క్రితం మాగనూర్లో స్పృహ కోల్పోయి పడిన నల్లెనాగప్ప(45)గా గుర్తించి జక్లేర్లో ఉంటున్న ఆయన కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతుడి తమ్ముడు నల్లె కుర్మయ్య ఫిర్యాదు మేరకు ఎస్ఐ నవీద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఎరువుల వాడకం– చీడపీడల నివారణ
అలంపూర్ : పంటల సాగులో అధిక ఆహార ధాన్యాల ఉత్పత్తి సాధించడానికి తీసుకోవాల్సిన చర్యల్లో సమగ్ర ఎరువుల యాజమాన్యం ముఖ్యమైంది. అభివృద్ధి చెందిన దేశాల కన్నా మన దేశంలో ఎరువుల వాడకం తక్కువగా ఉన్నప్పటికి పోషకాల సమతుల్యత సమగ్ర ఎరువుల వాడకం పాటించకపోవడం సమస్యగా మారిందని ఏడీఏ సక్రియనాయక్ పేర్కొంటున్నారు. రాబోయే రోజుల్లో దేశ జనాభాకు తగ్గట్టుగా ఆహార ధాన్యాలు అవసరమవుతాయి కాబట్టి ఆహార ఉత్పత్తిలో సమతుల సమగ్ర ఎరువుల యాజమాన్యం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచిస్తున్నారు. సమతుల ఎరువుల వాడకం : పైరుకు కావాల్సిన పోషకాలు ఎక్కువ.. తక్కువ కాకుండా అవసరమైన మేరకు అవసరమైన సమయాల్లో అందుబాటులో ఉండే విధంగా అందించ డాన్ని సమతుల ఎరువుల వాడకం అంటారు. దీని పై రైతులకు సరైన అవగాహన లేకపోవడంతో నత్రజని వినియోగం అధికమై మిగిలిన పోషకాలను మొక్కలకు అందించడంలో రైతులు అశ్రద్ధ చేస్తున్నా రు. దీని వలన నేల ఫలదత తగ్గిపోవడం, చౌడు బారడం, పైర్లు చీడపీడలకు సులభంగా గురికావడం వంటి పరిణామాలు కనిపిస్తాయి. కనుక భూసార పరీక్షల ఆధారంగా సిఫార్సు చేసిన ఎరువులను సరిపడా మోతాదులో వాడాల్సి ఉంటుంది. సమగ్ర ఎరువుల వాడకం : రసాయన, సేంద్రియ, జీవన ఎరువుల ద్వారా తగిన రీతిలో పైర్లకు పోషకాలు అందించడాన్ని సమగ్ర ఎరువుల వాడకంగా పేర్కొంటారు. పైరుకు సిఫార్సు చేసిన పోషక మోతాదులో మూడింట రెండు వంతులు రసాయన ఎరువుల ద్వారా ఒక వంతు సేంద్రియ, జీవన ఎరువుల ద్వారా అందించినప్పుడు దీర్ఘకాలం పాటు భూసారం, ఫలదతతో పాటు నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. రసాయన ఎరువుల ద్వారా ముఖ్య పోషకాలు, సేంద్రియ ఎరువుల ద్వారా అన్ని పోషకాలు కొద్ది పరిమాణంలో లభ్యమవుతాయి. జీవన ఎరువులు గాలి నుంచి నత్రజని, నేల నుంచి భాస్వరం అందించడానికి దోహదపడటమే కాక మొక్కలకు కావాల్సిన హార్మోన్లు, ఏంజైములు అందించడానికి రసాయన ఎరువుల వల్ల కలిగే దుష్ఫలితాలను తగ్గించుకోవడానికి తోడ్పడతాయి. పాడి–పంట -
ముస్లింలకు వరం హజ్యాత్ర
● ఈ ఏడాది ఉమ్మడి జిల్లా నుంచి 251 మంది ఎంపిక ● మహబూబ్నగర్ నుంచి అధికంగా 180 మంది ● కొనసాగుతున్న హజ్ యాత్రికుల శిక్షణ శిబిరాలు స్టేషన్ మహబూబ్నగర్: ముస్లింలు పవిత్రంగా భావించే హజ్యాత్రకు ప్రాముఖ్యత పెరగడంతో ధనికుల నుంచి పేదవారు కూడా హజ్ యాత్రకు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆర్థిక వెసులుబాటు ఉన్న ప్రతి ముస్లిం జీవితంలో ఒక్క సారైనా హజ్ యాత్ర చేయాలని పవిత్ర ఖురాన్లో పేర్కొనబడినందున గ్రామీణ ప్రాంతాలకు చెందిన ముస్లింలలో సైతం హజ్యాత్ర చేయాలనే ఆకాంక్ష పెరుగుతుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి కూడా హజ్యాత్ర చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఉమ్మడి జిల్లా నుంచి 251 మంది ప్రయాణం.. ఈ ఏడాది ఉమ్మడి జిల్లా నుంచి 251 మంది ముస్లింలు రాష్ట్ర హజ్ కమిటీ ద్వారా హజ్యాత్రకు వెళ్తున్నారు. వీరిలో మహబూబ్నగర్ జిల్లా నుంచి అధికంగా 180 మంది హజ్ యాత్రకు వెళ్లనున్నారు. అదే విధంగా వనపర్తి నుంచి 35, నాగర్కర్నూల్ నుంచి 9, నారాయణపేట నుంచి 10, గద్వాల నుంచి 17 మంది హజ్కు యాత్రకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అదే విధంగా ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా మరి కొంతమంది హజ్కు వెళ్లే అవకాశం ఉంది. యాత్రికులకు ప్రత్యేక శిక్షణా శిబిరాలు... ఇస్లామిక్ సంవత్సరంలోని ‘జిల్హజ్జా’ మాసంలో మక్కా, మదీనా తదితర పుణ్యక్షేత్రాల్లో పాటించాల్సిన నియమాలు, నిబంధనల పట్ల హజ్ యాత్రికులకు అవగాహన కల్పించడానికి జిల్లా హజ్ సొసైటీ ఆధ్వర్యంలో శిక్షణ శిబిరాలను నిర్వహిస్తారు. మతపెద్దలను ఆహ్వానించి హజ్ యాత్రలో పాటించాల్సిన నియమ, నిబంధనలు, ప్రసిద్ద స్థలాల ప్రాశస్త్యాలను వివరించి అవగాహన కల్పిస్తారు. కొనసాగుతున్న శిక్షణా శిబిరాలు ప్రస్తుతం జిల్లాలో హజ్యాత్రీకుల శిక్షణా శిబిరాలు కొనసాగుతున్నాయి. మతపెద్దలతో హజ్యాత్రపై యాత్రీకులకు సంపూర్ణ అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా డిజిటల్ విధానంలో హజ్ గురించి సమగ్రంగా వివరిస్తారు. అలాగే హజ్ యాత్రలో తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలపై ప్రముఖ వైద్యులతో అవగాహన కల్పిస్తారు. ఇప్పటి వరకు మూడు శిక్షణా శిబిరాలు పూర్తి కాగా మరో మూడు శిబిరాలతో పాటు చివరి శిబిరంలో టీకాల క్యాంపు ఏర్పాటు చేస్తారు. -
ఓపెన్ స్కూల్తో ఉజ్వల భవిష్యత్
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని యూనివర్సిటీ ఈఎంఆర్ఆర్ డైరెక్టర్ రబీంద్రనాథ్ సోలమాన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో ఆదివారం టీసీఎస్ ఐయాన్ జాబ్ అచీవర్ బిజినెస్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓపెన్ స్కూల్ విద్యార్థులకు టీసీఎస్ సహకారంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. డిగ్రీ మొదటి సంవత్సరం నుంచే విద్యార్థులను కార్పొరేట్ కంపెనీలకు అనుగుణంగా తయారు చేస్తామని.. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చన్నారు. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టూడెంట్ సర్వీస్ వింగ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. మూడేళ్ల డిగ్రీ పూర్తయ్యేలోగా కమ్యూనికేన్ స్కిల్స్, పలు అంశాలపై అవగాహన పెంచుతామన్నారు. వియ్ హబ్, రాస్కీ, రామానంద తీర్థ ఇనిసిట్యూషన్స్ వంటి వాటితో ఒప్పందాలు చేసుకుని మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని.. విద్యార్థులు వాటిని అందిపుచ్చుకుని జీవితంలో ఉన్నతంగా ఎదగాలన్నారు. అనంతరం బ్రోచర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్లేస్మెంట్ అధికారి వేణుగోపాల్రెడ్డి, నిరంజన్గౌడ్, రాఘవేందర్రెడ్డి, హన్మంతు, వెంకటేశ్ పాల్గొన్నారు. -
నల్లమల పండితుడి అరుదైన ఘనత
అచ్చంపేట రూరల్: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ధర్మగిరి వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో నిర్వహించిన శ్రీవేంకటేశ్వర వేదశాస్త్ర ఆగమ విద్వత్ సదస్సులో నల్లమల ప్రాంతానికి చెందిన మద్దిమడుగు దేవస్థానం ప్రధాన అర్చకుడు వీరయ్య శాస్త్రి కుమారుడు డాక్టర్ ఎస్.ఎస్. శివప్రసాద్శర్మ ఉత్తరభాగ శాస్త్రపరీక్షలో విజయాన్ని సాధించారు. వేద, శాస్త్ర, ఆగమ విద్యల అభివృద్ధి కోసం 1969లో ప్రారంభమైన ఈ ప్రతిష్టాత్మక సదస్సులో పండితుల పాండిత్యాన్ని కఠిన పరీక్షల ద్వారా పరిశీలించి ఉత్తీర్ణులైన వారికి పట్టాలు ప్రదానం చేయడం సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ ఏడాది జరిగిన పరీక్షలకు 13 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 6 మంది మాత్రమే హాజరయ్యారు. వారిలో డాక్టర్ శివప్రసాద్శర్మ ఒక్కడే ఉత్తీర్ణత సాధించడం ప్రత్యేకతగా నిలిచింది. గత నలభై సంవత్సరాల్లో దక్షిణ భారతదేశంలో ఉత్తరభాగ పరీక్షలో ఉత్తీర్ణత పొందిన వారు కేవలం కొద్ది మందే ఉండటం, అందులో ఆయన సాధించిన విజయం విశేష ప్రాధాన్యం పొందింది. ఈ సందర్భంగా శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురు శ్రీశ్రీశ్రీ విధుశేఖరభారతి స్వామిజీ చేతుల మీదుగా ఆయనకు ప్రమాణపత్రం అందజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ ఘనతను పొందిన రెండో పండితుడిగా, తెలంగాణ రాష్ట్రంలో తొలి పండితుడిగా నిలిచిన డాక్టర్ శివప్రసాద్ శర్మను నల్లమల ప్రాంతంలోని పలువురు అభినందనలు తెలియజేశారు. -
నల్లమల.. అగ్నికీల
● వేసవిలో తరచుగా కార్చిచ్చు ● అగ్నికి ఆహుతి అవుతున్న అటవీ సంపద ● ప్రశ్నార్థకంగా మారుతున్న జీవవైవిధ్యం ● ఈ ఏడాది నెల రోజుల్లోనే 50 అగ్ని ప్రమాదాలు అచ్చంపేట: ఆకులు రాలే కాలానికి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు తోడవ్వడంతో నల్లమల అటవీ ప్రాంతం భగ్గుమంటోంది. నిత్యం ఏదో ఒకచోట కార్చిచ్చు రాజుకుంటోంది. వందలాది ఎకరాల అటవీ ప్రాంతం అగ్ని కీలగా మారుతోంది. ప్రతి ఏటా వేసవిలో ఈ తంతు పరిపాటిగా మారింది. 2,611 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న నల్లమల అడవుల్లో గడ్డిక్షేత్రాలు విస్తారంగా ఉన్నాయి. దీంతో ఎక్కడ చిన్న అగ్గి రాజుకున్నా అడివంతా విస్తరిస్తోంది. వన్యప్రాణులతో పాటు వృక్ష సంపదకు తీవ్ర నష్టం కలుగుతోంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా 7.73 లక్షల ఎకరాల్లో అటవీ భూమి విస్తరించి ఉంది. ఇందులో కేవలం నాగర్కర్నూల్ జిల్లా పరిధిలో నల్లమల ప్రాంతమే 6.17 లక్షల ఎకరాలు ఉంది. ఈ ఏడాది నెలరోజుల వ్యవధిలోనే దోమలపెంట, అమ్రాబాద్, కొల్లాపూర్, లింగాల అటవీ పరిసరాల్లో మొదలైన కార్చిచ్చును ఆపడం సిబ్బందికి శక్తికి మించిన పనిగా మారింది. ఒకచోట మంటలను ఆర్పితే.. మరుసటి రోజు మరో చోట మంటలంటుకుంటున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో మరిన్ని అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. నల్లమల అడవిలో ఎండిన గడ్డి, ఎండిన చెట్లు, వెదురు కర్రలు అధికంగా ఉంటాయి. అడవి జంతువులు పరుగెత్తే సమయంలో రాళ్లకు రాళ్లు తగిలి నిప్పురవ్వలు వచ్చి క్షణాల్లోనే మంటలు వ్యాపిస్తున్నాయి. అదే విధంగా నారవేప, దేవదారు, నల్లమద్ది వంటి చెట్ల కొమ్మలు ఒకదానికొకటి తాకడం వల్ల కూడా మంటలు వచ్చే అవకాశం ఉంది. కాగా, సహజ సిద్ధంగా ఏర్పడే మంటలను మినహాయిస్తే.. 70–80 శాతం అగ్ని ప్రమాదాలకు మానవ నిర్లక్ష్యమే కారణమని అటవీశాఖ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్–శ్రీశైలం ప్రధాన రహదారి వెంట దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. మన్ననూర్ నుంచి వట్టువర్లపల్లి, దోమలపెంట, ఈగలపెంట, పాతాళగంగా, శ్రీశైలం వెళ్లే యాత్రికులు, పర్యాటకులు, ఇతరులు రోడ్డు పక్కన, అటవీ ప్రాంతంలో నిప్పు రగిల్చి సక్రమంగా ఆర్పకపోవడం.. సిగరెట్లు, బీడీలు తాగి పడే యడం వంటి వాటితో పాటు అటవీ ఉత్పత్తుల సేకరణకు వెళ్లినవారు మంటలు పెట్టి ఆర్పకపోవడం ప్రమాదాలకు ప్రధాన కారణాలు అని అటవీ అధికారులు చెబుతున్నారు. 2023లో 4,450 హెక్టార్ల అడవిలో మంటలు చెలరేగాయి. 2024లో అమ్రాబాద్ టైగర్ రిజర్వులో అచ్చంపేట డివిజన్లో 382, అమ్రాబాద్లో 989, నాగర్జునసాగర్ పరిధిలో 7 బ్లాక్ల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 2025లో నల్లమల అటవీ ప్రాంతంలో 1,026 హెక్టార్లలో అగ్ని ప్రమా దాలు చోటు చేసుకున్నాయి. ఈఏడాది ఇప్పటి వరకు 50 ప్రాంతాల్లో అగ్రి ప్రమాదాలు చోటు చేసుకున్నట్లు శాటిలైట్ వివరాలు చెబుతున్నాయి. -
భారతదేశం వేదభూమి
బిజినేపల్లి: వేల ఏళ్లు విదేశీయులు భారతదేశంపై దాడిచేసి పరిపాలించినా, హిందూ సంస్కృతి చెక్కు చెదరలేదని, భారతదేశం వేద భూమి అని భువనేశ్వరి పీఠం పీఠాధిపతి శ్రీకమలానంద భారతిస్వామి అన్నా రు. ఇలాంటి భరత భూమిపై జన్మించడం అంటే ఎన్నో జన్మల పుణ్యం కలిగి ఉండాలన్నారు. ఆదివారం పాలెం వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా భారతిస్వామి మాట్లాడుతూ.. హిందూ అంటేనే నాగరికత అని, హిందువులు భిన్నత్వంలో ఏకత్వం ప్రదర్శిస్తారన్నారు. హిందుత్వం ప్రకృతితో ముడిపడి ఉందన్నారు. ఆల యాలు కేవలం నిర్మాణాలే కాదని, అవి మన నాగరికతకు ఆత్మ అని నేటి తరానికి మనం గుర్తు చేయాలన్నారు. మనుషులు దుర్గుణా లను వదిలి సన్మార్గంలో నడిచినప్పుడే ఆధ్యాత్మికత పెంపోందు తుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రామకృష్ణ, ఆలయ కమిటీ సభ్యులు జున్న శేఖర్రెడ్డి, జగదీష్, డా.గోపాల్, జాకీర్హుస్సేన్, విష్ణుమూర్తి, గాడి శశికల, సురేందర్, భక్తులు పాల్గొన్నారు. -
అడ్డాకులకు మార్కెట్ యార్డు
అడ్డాకుల: మహబూబ్నగర్ జిల్లాకు మరో వ్యవసాయ మార్కెట్ యార్డు మంజూరైంది. దేవరకద్ర నియోజకవర్గంలోని అడ్డాకులలో మార్కెట్ యార్డు ఏర్పాటుకు ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేవరకద్ర నియోజకవర్గంలో దేవరకద్రతోపాటు ప్రస్తుతం వనపర్తి జిల్లా పరిధిలో ఉన్న మదనాపురంలో వ్యవసాయ మార్కెట్ యార్డులు ఉన్నాయి. తాజాగా అడ్డాకులకు మార్కెట్ యార్డు మంజూరు కోసం ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఆ సంఖ్య మూడుకు చేరనుంది. దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని అడ్డాకులలో మార్కెట్ యార్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరడంతో ఇటీవల ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. అడ్డాకుల, మూసాపేట, భూత్పూర్ మండలాల్లోని రైతులు పండించిన ధాన్యం సులువుగా విక్రయించుకునే సౌకర్యం ఈ మార్కెట్ యార్డు ద్వారా కలగనుంది. రైతుల సౌలభ్యం కోసమే.. దేవరకద్ర నియోజకవర్గంలోని మదనాపురం మార్కెట్ యార్డుకు అడ్డాకుల, మూసాపేట మండలాలు అనుసంధానంగా ఉండేవి. అదేవిధంగా బాదేపల్లి మార్కెట్ యార్డుకు నియోజకవర్గంలోని భూత్పూర్ మండలం అనుసంధానంగా ఉంది. అయితే అడ్డాకుల, మూసాపేట మండలాల్లోని రైతులు తమ ఉత్పత్తులను మదనాపురం తీసుకెళ్లడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారి సౌలభ్యం కోసం దేవరకద్ర నియోజకవర్గానికి మరో మార్కెట్ యార్డు మంజూరు చేయాలని ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి ఉన్నతాధికారులను పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేశారు. ఇందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అడ్డాకులలో మార్కెట్ యార్డు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహబూబ్నగర్ జిల్లాలో ఏర్పాటయ్యే కొత్త మార్కెట్ యార్డు అడ్డాకులదే కావడం విశేషం. మూడు మండలాలతో..! అడ్డాకుల మార్కెట్ యార్డు పరిధిలో అడ్డాకులతోపాటు మూసాపేట, భూత్పూర్ మండలాలను కలిపారు. భూత్పూర్ మండలాన్ని బాదేపల్లి మార్కెట్ యార్డు నుంచి, అడ్డాకుల, మూసాపేట మండలాలను మదనాపురం మార్కెట్ యార్డు నుంచి వేరు చేసి కొత్తగా ఏర్పాటు చేసే అడ్డాకుల మార్కెట్ యార్డులో చేర్చారు. అడ్డాకుల శివారులోని సర్వే నంబర్ 161లోని ఆరున్నర ఎకరాల స్థలంలో మార్కెట్ యార్డు ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ మార్కెట్ యార్డు ఏర్పాటైతే రైతుల ఉత్పత్తుల విక్రయాలు సులభతరం కావడంతోపాటు హమాలీలు, ఇతర కూలీలకు ఇక్కడ ఉపాధి కలగనుంది. రైతులకు ఎంతో మేలు.. దేవరకద్ర నియోజకవర్గంలో కొత్తగా అడ్డాకులకు మార్కెట్ యార్డును మంజూరైంది. దీంతో మూడు మండలాల రైతులకు ఈ మార్కెట్తో ఎంతో మేలు జరగనుంది. వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలు సులభతరం కావడంతోపాటు హమాలీలు, కూలీలకు స్థానికంగా ఉపాధి కలుగుతుంది. రైతుల ఉత్పత్తులకు మంచి ధర కూడా లభించనుంది. రైతుల ప్రయోజనాలకు తమ ప్రభుత్వం ఎప్పుడూ పెద్దపీట వేస్తుందనడానికి ఇదే నిదర్శనం. అడ్డాకుల, మూసాపేట, భూత్పూర్ రైతులకు ప్రయోజనం బాదేపల్లి, మదనాపురం నుంచి పై మూడు మండలాల తొలగింపు ఫలించిన ఎమ్మెల్యే కృషి.. రైతన్నల హర్షం అడ్డాకుల మండలంలోని గుడిబండ, కాటవరం, కందూరు, అడ్డాకుల, చిన్నమునుగల్ఛేడ్, కన్మనూర్, ముత్యాలంపల్లి, పెద్దమునుగల్ఛేడ్, రాచా ల, తిమ్మాయిపల్లి, శాఖాపూర్, వర్నె, బలీదుపల్లి, పొన్నకల్, తిమ్మాయిపల్లి తండా, రాంచంద్రాపూ ర్, సుంకరామయ్యపల్లి గ్రామాలున్నాయి. మూసాపేట మండలంలోని నందిపేట, దాసర్పల్లి, తుంకినీపూర్, వేముల, మూసాపేట, నిజాలాపూర్, జానంపేట, అచ్చాయపల్లి, కొమి రెడ్డిపల్లి, చక్రాపూర్, కనకాపూర్, పోల్కంపల్లి, తిమ్మాపూర్, సంకలమద్ది, మహ్మదుస్సేన్పల్లి. భూత్పూర్ మండలంలోని అన్నాసాగర్, అమిస్తాపూర్, గోప్లాపూర్, భూత్పూర్, హస్నాపూర్, కప్పెట, కర్వెన, కొత్త మొల్గర, కొత్తూరు, మద్దిగట్ల, పోతులమడుగు, రావులపల్లి, తాటికొండ, తాడిపర్తి, ఎల్కిచర్ల ఉన్నాయి. -
జన గణన–2027 అత్యంత కీలకం
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ప్రభుత్వ పథకాల రూపకల్పన, అమలు, దేశాభివృద్ధికి జన గణన–2027 అత్యంత కీలకం అని అదనపు కలెక్టర్ హరిప్రియ అన్నారు. ఆదివారం కలెక్టరేట్లో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో జన గణన–2027 నిర్వహణపై జిల్లా, మండల, మున్సిపల్ స్థాయి అధికారులకు మూడు రోజు ల శిక్షణ కార్యక్రమాన్ని ఆదివారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. జిల్లాస్థాయిలో జన గణన –2027 సమర్థమంతంగా నిర్వహించేందుకు అవసరమైన విధానాలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. జన గణన రెండు దశల్లో కొనసాగుతుందని, మొదటి దశలో ఇళ్ల జాబితా (హౌస్ లిస్టింగ్, హౌస్ ఎన్యుమరేషన్), గృహాల గణన కాగా.. రాష్ట్రంలో ఈ దశ మే 11న ప్రారంభమై జూన్ 9 వరకు కొనసాగుతుందన్నారు. రెండో దశలో జనాభా గణన ప్రక్రియ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమై.. మార్చి 1న రిఫరెన్స్ తేదీగా పరిగణి స్తారని చెప్పారు. ఈసారి జరగనున్న జనాభా గణనను దేశంలో తొలిసారిగా డిజిటల్ విధాన ంలో నిర్వహించనున్నారని, మొబైల్ యాప్, వెబ్ పోర్టల్ను ఉపయోగించి గణన చేపట్టాలని సూచించారు. అలాగే ప్రజలు తమ వివరాలను తామే స్వయంగా ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకునేందుకు ప్రత్యేక పోర్టల్ను గణన ప్రారంభానికి ముందు ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు. మొత్తం 33 ప్రశ్నలకు సంబంధించిన వివరాలను ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి సేకరించే విధానాన్ని ఈ శిక్షణలో వివరిస్తారన్నారు. జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి రవీందర్ మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో జనాభా గణన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. చార్జి అధికారులుగా గ్రామీణ ప్రాంతంలో తహసీల్దార్, పట్టణ ప్రాంతంలో మున్సిపల్ కమిషనర్, కార్పొరేషన్లో డిప్యూటీ కమిషనర్ ఉంటారన్నారు. -
హెచ్పీవీ వ్యాక్సినేషన్పై దృష్టి ఏది?
● ఆరు రోజుల్లో 322 మంది బాలికలకు టీకాలు పాలమూరు: జిల్లాలో ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 14 ఏళ్లు నిండిన బాలికలకు ఇస్తున్న హెచ్పీవీ వ్యాక్సినేషన్పై ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. బాలికల తల్లిదండ్రులు వారి పిల్లలకు టీకాలు వేయించడంపై ఆసక్తి చూపడం లేదా.. లేక ఆరోగ్య శాఖ అధికారులు ప్రచారం చేయడంలో వెనుకబడ్డారా.. అనేది అంతుచిక్కడం లేదు. క్షేత్రస్థాయిలో అర్హులైన బాలికలను గుర్తించి కౌన్సిలింగ్ కల్పించి టీకాలు తీసుకునే విధంగా చైతన్యం కల్పించడంలో ఆరోగ్యశాఖ సిబ్బంది పూర్తిగా విఫలం అవుతున్నారు అనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. మొదటి నెలరోజులపాటు జనరల్ ఆస్పత్రితోపాటు జడ్చర్ల ఆస్పత్రిలో టీకాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నెల 8 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 322 మంది బాలికలకు టీకాలు ఇస్తే ఇందులో మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రిలో 154, జడ్చర్లలో 168మందికి ఇచ్చారు. జిల్లాలోని ఆయా ఆస్పత్రుల్లో బాలికలకు టీకాల పంపిణీ ఇలా.. తేదీ మ.నగర్ జడ్చర్ల 08.3.2026 21 35 09.3.2026 07 06 10.3.2026 34 44 11.3.2026 13 34 12.3.2026 36 25 13.3.2026 28 6 -
మహనీయుల ఆశయ సాధనే బీసీ జాగృతిసేన లక్ష్యం
కందనూలు: మహనీయుల ఆశయసాధనే బీసీ జాగృతి సేన లక్ష్యమని బీసీ జాగృతిసేన రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయాదవ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని బీసీ బాలుర కళాశాల హాస్టల్లో మహానీయుల నెల సందర్భంగా పూలె, అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ .. పేదప్రజల బతుకుల్లో అక్షర జ్యోతి వెలిగించిన పూలె జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఉన్నత చదువులు చదివిన తర్వాత గొప్పగా జీవించే అవకాశం ఉన్నా షెడ్యూల్ కులాల ప్రజలతో పాటు దేశ ప్రజలకు రాజ్యాంగం ద్వారా స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు కల్పించారన్నారు. కార్యక్రమంలో బీసీ జాగృతిసే రాష్ట్ర కార్యదర్శి రఘునందన్చారి, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నిరంజన్, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు. -
పుట్టెడు దుఃఖంలోనూ పరీక్షకు హాజరు
నారాయణపేట రూరల్: జీవితంలో కొన్ని క్షణాలు మనసును బరువెక్కిస్తాయి. కానీ బాధను మించిపోయే బాధ్యతలు కూడా ఉంటాయి. అలాంటి హృదయాన్ని కదిలించే ఘటన నారాయణపేట జిల్లాలో చోటు చేసుకుంది. తాత మరణంతో కుటుంబం శోకసంద్రంలో మునిగినా.. చదువుపై ఉన్న నిబద్ధతతో మనవడు పుట్టెడు దుఃఖంలోనూ పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. నారాయణపేట మండలం జలాల్పూర్కు చెందిన అరవింద్ జిల్లా కేంద్రంలోని హంసవాహిని ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. శనివారం పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కావడంతో అతడు కూడా పరీక్షకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అతడి తాత భీంశప్ప (70) తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు. కుటుంబ సభ్యులంతా ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా చూసుకున్న తాత మృతితో అరవింద్ కూడా తీవ్రంగా కలత చెందాడు. అయితే తన భవిష్యత్కు ఎంతో ముఖ్యమైన పదో తరగతి పరీక్షను వదులుకోకూడదని భావించాడు. గుండెల్లో తాత జ్ఞాపకాలతోనే కన్నీరు తుడుచుకుంటూ.. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో కేటాయించిన పరీక్షా కేంద్రంలో తెలుగు పరీక్షకు హాజరయ్యాడు. పుట్టెడు దుఃఖంలోనే పరీక్షను పూర్తిచేశాడు. అనంతరం తాత భీంశప్ప అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. -
సంచార జాతుల సమగ్ర సర్వే పుస్తకావిష్కరణ
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: సంచార, వియుక్త జాతుల జీవన విధానం, సామాజిక పరిస్థితులు, అభివృద్ధి అవకాశాలపై సమగ్ర అధ్యయనానికి సంబంధించి ‘సంచార జాతుల సమగ్ర సమాచారం’ అనే పుస్తకాన్ని పీయూలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు అధ్యాపకులు మాట్లాడుతూ సంచార జాతుల జీవన స్థితిగతులను తెలుసుకునేందుకు ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక జీవన ముఖచిత్రాన్ని ప్రతిబించే ఈ పుస్తకం విద్యార్థులకు, అధ్యాపకులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు సోమేశ్వర్, చంద్రశేఖర్రెడ్డి, వేణు, రవీందర్రెడ్డి, రాఘవేందర్, నాగరాజు, నిరంజన్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. -
పంటలకు సాగునీరందేలా చూడాలి
కందనూలు: నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, కాలువల ద్వారా నీరందేలా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి అన్నారు. శనివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పంట పొలాలకు నీటి కొరత లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా మూడు కిలోమీటర్ల మేర పనులు పూర్తయితే దాదాపు 57 టీఎంసీల నీరు నిల్వ ఉండేదన్నారు. వాటిపై శ్రద్ధ పెట్టకుండా ప్రభుత్వ పెద్దలు అలసత్వంగా వ్యవహరిస్తున్నారన్నారు. పాలమూరు రంగారెడ్డి పనులు పూర్తి చేసి నాగర్కర్నూల్ జిల్లా సస్యశ్యామలం చేయాలని లేకపోతే ఏడారి అయ్యే ప్రమాదం ఉందని ఆరోపించారు. సమావేశంలో బీఆర్ఎస్ కౌన్సిలర్ తిమ్మాజీపేట పాండు, నాయకులు అర్థం రవి, తదితరులు పాల్గొన్నారు. -
ఆగుతూ.. సాగుతూ!
రాజాపూర్(బాలానగర్): రోడ్డుప్రమాదాల నివారణకు జాతీయ రహదారి పైనున్న గ్రామాల ముఖ్య కూడళల్లో ఫ్లైఓవర్ల నిర్మాణాలు ఆగుతూ.. సాగుతున్నాయి. వీటి నిర్మాణానికి కేంద్రం రూ.22కోట్ల నిఽ దులు మంజూరు చేసింది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు 2024సెప్టెంబర్లో పనులను ప్రారంభించారు. రెండేళ్లు కావస్తున్నా.. ఇప్పటికీ నత్తనడకన సాగిస్తుండటంతో ప్రతిరోజూ బాలానగర్ మండల కేంద్రంలో వాహనదారులు, గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కోక తప్పడంలేదు. ముఖ్యంగా ప్రతి శుక్రవారం బాలానగర్ మండల కేంద్రంలో వారాంతపు సంత నిర్వహిస్తుండంతో గ్రామప్రజలు సంతలో కూరగాయలు కొనుగోలు చేయాలన్నా రోడ్డు దాటాల్సిన పరిస్థితి. వంతెన పనులు సాగుతుండటంతో తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న వ్యాపారులు, గృహ యజమానులు పనులు పూర్తికాక పోవడంతో వాహనాల ధాటికి దుమ్ము, ధూళీ పడుతుండటంతో ఇంకా ఎన్నిరోజులో ఈ అవస్థలు అంటు ఆవేదన చెందుతున్నారు. ఒక్కోరోజు పెద్దాయపల్లి వరకు జాతీయ రహదారిపై ట్రాఫిక్ జాం అవుతోంది. ఇంకా ఎన్ని నెలలు పడుతుందో ఈ పనులు పూర్తికావడానికి అని వాహనదారులు, ప్రజలు ఆపిస్తున్నారు. కొన(సాగు)తున్న బాలానగర్ ఫ్లైఓవర్ పనులు మండల కేంద్రంలో రోడ్డు దాటేందుకు జనం ఇక్కట్లు రెండేళ్లు కావస్తున్నా పూర్తికాని ఫ్లైఓవర్ నిర్మాణం పనులు -
కోతులను తరిమేందుకు కొండముచ్చు వేషధారణ
అచ్చంపేట రూరల్: మండలంలోని సింగారం గ్రామస్తులను కొంతకాలంగా ఇబ్బందులకు గురిచేస్తున్న కోతుల బెడద తప్పించేందుకు గ్రామ సర్పంచ్ నీలం శేఖర్ వినూత్న ఆలోచన చేశారు. గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్ జగన్తో కొండముచ్చు వేషధారణ వేయించి.. గ్రామం నుంచి కోతులను తరిమే ప్రయత్నం చేశారు. వింత వేషధారణ చూసిన కోతులు.. కొంత వరకు ఆందోళనకు గురై చెట్లపైకి పరుగులు పెట్టాయి. కోతులు మైదాన ప్రాంతం, గ్రామాల్లోకి వచ్చి పంటలను నాశనం చేయడంతో పాటు ఇళ్లలో వండిన ఆహార పదార్థాలను తీసుకెళ్తున్నాయి. కోతుల బెడద నుంచి తప్పించి శాశ్వత పరిష్కరం చూపాలని ప్రజలు కోరుతున్నారు. -
ఇరాన్పై యుద్ధాన్ని ప్రధాని ఖండించాలి
మహబూబ్నగర్ న్యూటౌన్: ఇరాన్ దేశంపై అమెరికా దురహంకార ధోరణితో యుద్ధం చేస్తుందని, యుద్ధాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఖండించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ కళాభవన్లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం 4వ మహాసభల సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో పెద్దన్న పాత్ర పోషిస్తూ వివిధ దేశాలపై అమెరికా చూపుతున్న దురహంకారాన్ని ప్రజాస్వామ్యవాదులు ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న దాడిని ప్రధాని నరేంద్రమోదీ ఖండించడంతో పాటు చొరవ తీసుకొని చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఇరాన్లో ఉన్న నిల్వలను అమెరికా కొల్లగొట్టేందుకు న్యూక్లియర్ బాంబులు తయారు చేస్తుందని ఇరాన్పై దాడి చేసి ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. పాఠశాలపై దాడి చేసి 150 మంది విద్యార్థులను అమెరికా పొట్టనపెట్టుకుందని మండిపడ్డారు. అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా ఇండియాలో గ్యాస్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. 15 రోజుల క్రితం గ్యాస్ బుక్ చేసినా పంపిణీ జరగడం లేదన్నారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామన్నారు. ఇజ్రాయిల్, అమెరికా దేశాలు ఇరాన్పై చేస్తున్న యుద్దాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 16న రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల ఆద్వర్యంలో నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకట్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ కార్మికులు, బడుగు బలహీన వర్గాలపై పెనుభారం మోపుతుందని ఆరోపించారు. ఉపాధి హామీ చట్టాన్ని మారుస్తూ వీబీజీ రాంజీ చట్టాన్ని తెచ్చిందని, రాష్ట్రాలపై భారాన్ని మోపుతూ ఉపాధి కూలీల పొట్టకొట్టేందుకు కుట్రలు చేస్తుందని ఆరోపించారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభల ఆహ్వన సంఘాన్ని ఎన్నుకున్నారు. చైర్మెన్గా డాక్టర్ మధుసూదన్రెడ్డి, గౌరవ అధ్యక్షుడిగా జేపీఎన్సీఈ కళాశాల చైర్మన్ రవికుమార్, కోశాధికారిగా ఎ.రాములు, ఉమ్మడి జిల్లా వివిధ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, రాజకీయ పార్టీల నాయకులను ఆహ్వాన సంఘానికి ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు టి.సాగర్, సభ్యులు జయలక్ష్మి, భూపాల్, రాష్ట్ర మహిళా కన్వీనర్ బి.పద్మ, నాయకులు కిల్లెగోపాల్, ఎండీ జబ్బార్, పర్వతాలు తదితరులు పాల్గొన్నారు. -
చేనేత కార్మికులది గొప్ప కళా నైపుణ్యం
నారాయణపేట: కంచి వస్త్రాలతో గద్వాల, నారాయణపేట చీరలు డిమాండ్లో పోటీ పడుతున్నాయని.. చేనేత కార్మికులది గొప్ప కళా నైపుణ్యమని.. ఇక్కడ నేచిన చీరలు ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాయని ఎంపీ డీకే అరుణ అన్నారు. శనివారం మండలంలోని కోటకొండలో చేనేత కార్మికులకు చేనేత మగ్గాలు, ఇతర పరికరాల మొదటి విడత పంపిణీ కార్యక్రమానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేసి మాట్లాడారు. చేనేత కార్మికులను ఆదుకోవాలనే ఆలోచనతో కేంద్రం నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద కోటకొండను హ్యాండ్లూమ్ క్లస్టర్గా ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. చేనేత కార్మికులకు రూ.కోటి రెండు లక్షల నిధులతో చేనేత పరికరాలను పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. మొదటి విడతలో 70మంది చేనేత కార్మికులకు వచ్చిన పరికరాలను సరైన విధంగా ఉపయోగించుకుంటే రెండో విడతలో పరికరాలు వస్తాయన్నారు. చేనేత కార్మికులు మరింత ఆర్థికంగా స్థిరపడతారన్నారు. జక్కడ్లు, ఇతర పనిముట్లు ఉపయోగించుకొని చేనేత కార్మికులు లబ్ధి పొందితే కేంద్రం లక్ష్యం నెరవేరుతుందన్నారు. నారాయణపేట, గద్వాల చీరలు పెద్ద ఎత్తున ఆదరణ పొందుతున్నాయన్నారు. చేనేత వస్త్రాలకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతుందన్నారు. చేనేత కార్మికులందరూ ఎప్పటికప్పుడు కొత్తకొత్త డిజైన్లు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తూనే ఉండాలన్నారు. సరికొత్త డిజైన్లతో మార్కెట్తో పోటీపడి డిమాండ్ పెంచుకోవాలన్నారు. అలాగే మార్కండేయ స్వామి కమ్యూనిటీ హాల్పై మరో అంతస్తు నిర్మాణానికి ఎంపీ నిధుల నుంచి తప్పకుండా సహకరిస్తాన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకటయ్యగౌడ్, బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు రతంగ్పాండురెడ్డి, శ్రీనివాస్, సత్యయాదవ్, రఘురామయ్యగౌడ్, కెంచె శ్రీనివాస్, హ్యాండ్లూం అధికారి బాబు తదితరులు పాల్గొన్నారు. -
భార్య వివాహేతర సంబంధం.. భర్త ఆత్మహత్య
కృష్ణా: మండలంలోని ముడుమాల్ గ్రామంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన కురువ హన్మేష్(27) అదే గ్రామానికి చెందిన తాయమ్మలు ప్రేమించుకున్నారు. అనంతరం పెద్దలను ఒప్పించి 2017లో వారు పెళ్లి చేసుకున్నారు. వారికి కుమారుడు, కూతురు ఉన్నారు. హన్మేష్ వృత్తి రీత్యా గొర్రెలను కాచేందుకు అడవికి వెళ్తుంటాడు. ఈ క్రమంలో భార్య అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. విషయం తెలుసుకున్న హన్మేష్ నెలరోజుల క్రితం భార్యను, అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని హెచ్చరించాడు. అయినా అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తుండటంతో మానసిక వేధనకు గురై శుక్రవారం మధ్యాహ్నం పొలంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి పద్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ క్రమంలో హన్మేష్ మృతికి కారణమైన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని, ఆ తర్వాతే మృతదేహాన్ని ఖననం చేస్తామని మృతుడి కుటుంబ సభ్యులు శనివారం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎస్ఐ నవీద్ కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని, నిందితుడిపై చర్య తీసుకుంటామని హామీ ఇవ్వడంతో శాంతించిన వారు మృతదేహాన్ని ఖననం చేసేందుకు అంగీకరించారు. ● ప్రేమించి పెళ్లి చేసుకున్న మోసం చేసిన వైనం ఖననం చేసేందుకు కుటుంబ సభ్యుల నిరాకరణ -
దుమ్ము క్లీన్ చేయలేకపోతున్నాం
ఫ్లైఓవర్ పనులు స్టార్ట్ అయినప్పటి నుంచి విపరీతమైన దుమ్ము ధూళీ షాప్లోకి వస్తుంది. షాప్లో ఉన్న వస్తువులపై దుమ్ము క్లీన్ చేసిచేసి చస్తున్నాం. వినియోగదారులు వస్తువులు కొనుగోలుకు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనులు ఎప్పుడు పూర్తవుతాయో ఇంకా ఎన్నిరోజులు మాకి సమస్యలు. – కట్ట అనుషా, సూపర్ మార్కెట్ నిర్వాహకురాలు, బాలానగర్ ట్రాఫిక్తో ఇబ్బందులు తప్పడంలేదు ఫ్లైఓవర్ పనులు మొదలయినప్పటి నుంచి ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. ఇటు షాద్నగర్ వెళ్లాలంటే బ్రిడ్జి పనుల మూలంగా ఇటు పెద్దాయపల్లి చౌరస్తావరకు వాహనాలు నిలుస్తున్నాయి. అటు పోలీస్టేషన్ పెట్రోల్ బంక్ వరకు వాహనాలు ఆగుతున్నాయి. కాంట్రాక్టర్ పనులను త్వరగా పూర్తి చేస్తే బాగుటుంది. – నవీన్రెడ్డి, శేరిగూడ, బాలానగర్ ● -
లారీ, బైక్ ఢీకొని ఒకరి దుర్మరణం
కృష్ణా: లారీ, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందిన ఘటన కృష్ణా మండలం టైరోడ్డులో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ నవీద్ వివరాల మేరకు.. కర్ణాటకలోని ఇబ్రహీందొడ్డి గ్రామానికి చెందిన ఖతల్ (50), మరో వ్యక్తి బైక్పై వస్తుండగా.. టైరోడ్డు వద్ద ప్రమాదవశాత్తు లారీ, బైక్ డీకొన్నాయి. ప్రమాదంలో ఖతల్కు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందగా.. గాయపడిన వ్యక్తిని రాయచూర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. కారు ఢీకొని వృద్ధుడి మృతి కల్వకుర్తి రూరల్: మండలంలోని తర్నికల్ గేట్ సమీపంలో శనివారం కారు ఢీకొట్టిన ఘటనలో అదే గ్రామానికి చెందిన మంగలి ఎల్లప్ప(80) అనే వృద్ధుడు మృతి చెందాడు. పూర్తి వివరాలు.. గ్రామానికి చెందిన ఎల్లప్ప మోకాళ్ల నొప్పుల మందుల కోసం కల్వకుర్తికి వెళ్లి తిరిగి వస్తూ సుమారు రాత్రి ఏడు గంటల ప్రాంతంలో తర్నికల్ స్టేజి వద్ద బస్సు దిగి రోడ్డు దాటుతుండగా నాగర్కర్నూల్ నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎల్లప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుమారుడు సతీష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య లింగమ్మ, ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. చేపల వేటకు వెళ్లి.. శవమై తేలాడు నాగర్కర్నూల్ క్రైం: చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకోగా శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ గోవర్ధన్ తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని బొందలపల్లి గ్రామానికి చెందిన గుంటి గిరి(42) కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గ్రామ సమీపంలోని నల్లకుంట చెరువులో చేపల పట్టేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. మృతదేహం శనివారం ఉదయం నీటిపై తేలియాడటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడు మహేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య నవాబుపేట: ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని మరికల్ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నడిమింటీ శేఖరయ్య (59) భార్య అనారోగ్యంతో కొన్ని రోజుల క్రితం మృతి చెందింది. దీంతో అప్పటి నుంచి ఒంటరిగా బాధపడేవాడు. ఈ క్రమంలో శనివారం తన వ్యవసాయ పొలానికి వెళ్లి చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి కుమారుడు మల్లికార్జున్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన్నట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు. వివాహిత ఆత్మహత్య ఉప్పునుంతల: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వివాహిత పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఉప్పునుంతల బీసీ కాలనీలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకట్రెడ్డి వివరాల మేరకు.. బీసీ కాలనీకి చెందిన మెడమోని శిరీష (28) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురై తన వ్యవసాయ పొలంలో పురుగు మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సలహా మేరకు జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలి భర్త మల్లేష్ హైదరాబాద్లో బెటాలియన్ కానిస్టేబుల్గా పనిచేస్తుండగా.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతురాలి తండ్రి పర్వతాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. 60 ఏళ్ల వృద్ధురాలు నేత్రదానం భూత్పూర్: మండలంలోని కర్వెనకు చెందిన వడ్డె వెంకటమ్మ(60) శనివారం అనారోగ్యంతో మృతిచెందింది. విషయం తెలుసుకున్న జూనియర్ రెడ్క్రాస్ కో–ఆర్డినేటర్ కందుకూర్ అశోక్కుమార్ వారి కుటుంబ సభ్యులను సంప్రందించారు. కందుకూర్ అశోక్కుమార్ వడ్డె వెంకటమ్మ కుమారుడైన వడ్డె నర్సింహతో మాట్లాడి నేత్రదానం చేసేందుకు ముందుకొచ్చారు. వడ్డె వెంకటమ్మ నేత్రాలను హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ ల్యాబ్కు దానం చేశారు. నేత్రదానం చేయుటకు ముందుకొచ్చిన వడ్డె నర్సింహను సర్పంచ్ మాసగౌడ్, ఉపసర్పంచ్ మల్లేశ్, వార్డు సభ్యుడు శ్రీనివాస్, కో–ఆర్డినేటర్ కందుకూర్ అశోక్ కుమార్ అభినందించారు. -
తూకం తప్పుతోంది!
నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ● వస్తువుల నాణ్యత, సేవల్లో లోపాలను తెలుసుకోవాలి ● కొనుగోలు చేసే ప్రతి వస్తువుకు బిల్లు తీసుకోవాలి ● వినియోగదారుడికి జరుగుతున్న అన్యాయంపై అవగాహన తప్పనిసరి ఉదయం లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు వినియోగించే ప్రతి వస్తువులోనూ నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. తాగే పాల దగ్గర నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వినియోగించే మందుల వరకు ప్రతీది కల్తీయే. ప్రతి వస్తువు సరైన తూకంలో లభిస్తున్నాయా అంటే అనుమానమే. కాసుల దాహంతో వ్యాపారులు చేస్తున్న మోసం.. కళ్లు మూసుకొని నిద్ర నటిస్తున్న అధికారుల నిర్లక్ష్యం.. వెరసి వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ప్రశ్నించేతత్వం లేనంత వరకు ఈ మోసాలు కొనసాగుతూనే ఉంటాయి. ఇప్పటికై నా వినియోగదారులు మేల్కొని తప్పును నిలదీయాలి. మోసాన్ని వేలెత్తిచూపి.. జరిగిన నష్టానికి న్యాయం పొందాలి. ఆదివారం ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం... – పాలమూరు రూ.5 లక్షల వరకు ఉచితం వినియోగదారుల హక్కుల ఫోరం ఉమ్మడి జిల్లాలో 1988 అక్టోబర్లో ప్రారంభించారు. ప్రస్తుతం దీనికి ప్రత్యేక న్యాయమూర్తితో పాటు, ఒకరు సభ్యులు ఉన్నారు. పరిపాలన కోసం ప్రత్యేక విభాగంతో పాటు ఒక కోర్టు కూడా అందుబాటులో ఉంది. వచ్చిన వినియోగదారుల కేసుల నమోదు చేసుకోవడం కోసం ప్రత్యేక భవనం ఉంది. ● జిల్లా వినియోగదారుల హక్కుల ఫోరంలో వినియోగదారులు ఒక్క రూపాయి నుంచి రూ.50 లక్షల వరకు కేసులు వేయడానికి అవకాశం ఉంది. దీంట్లో రూపాయి నుంచి రూ.5 లక్షల వరకు ఉన్న కేసులు కోర్టులో ఉచితంగా వాదిస్తారు.రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు వరకు కోర్టు ఫీజు రూ.200, రూ.10 లక్షల నుంచి రూ.20లక్షల వరకు ఫీజు రూ.400 ఉంటుంది. రాష్ట్ర కమిషన్లో రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఉంటే కోర్టు ఫీజు రూ.వెయ్యి, రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉంటే రూ.4వేలు ఉంటుంది. జాతీయ కమిషన్లో రూ.కోటికి పైగా ఉంటే ఫీజు రూ.5 వేలు ఉంటుంది. ● వినియోగదారుడు ఏదైనా ఒక వస్తువులు కొనుగోలు చేసిన తర్వాత సదరు వస్తువు నాసిరకంగా ఉండటం లేదా మరమ్మతుకు గురైతే అప్పుడు సెక్షన్ 35 ప్రకారం వినియోగదారుల ఫోరం కోర్టులో ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసిన 30 రోజుల వ్యవధిలో సదరు వ్యక్తి లేదా సంస్థకు నోటీస్ ఇవ్వగా 45 రోజుల వ్యవధిలో దీనికి సమాధానం చెప్పాలి. లేకపోతే కోర్టు ఎక్స్పార్టీ చేసి ఆర్డర్ వన్సైడ్ చేసి కోర్టు తీర్పు ఇస్తుంది. ఇచ్చిన జడ్జిమెంట్పై ప్రతివాది 45 రోజుల్లో నష్టపరిహారం చెల్లించాలి.. లేకపోతే అప్పీల్ చేసుకొనే అవకాశం ఉంటుంది. వినియోగదారులు ఎలాంటి కేసులు వేయడానికి అవగాహన కోసం 08542-245633 నంబర్కు ఫోన్ చేయాలి. టోల్ఫ్రీ నంబర్లు.. 1800 425 003331967పౌర సరఫరాల శాఖతెలంగాణ రాష్ట్ర వినియోగదారుల హెల్ప్లైన్ నంబర్ 1800 11 4000, 1915జాతీయ వినియోగదారులహెల్ప్లైన్ ఎలాంటి కేసులు వేయడానికి అవకాశం ఉంది వినియోగ ఫోరం కోర్టులో ఎలాంటి కేసు వేయాలి, వాటి వివరాలు తెలుసుకోవడానికి స్థానికంగా ప్రత్యేక హెల్ప్ డెస్క్ అందుబాటులో ఉంది. ముఖ్యంగా వినియోగదారుడు ఎలాంటి న్యాయవాది లేకుండా కోర్టులో కేసు వేయడానికి అవకాశం కల్పించారు. వినియోగదారులు ఎయిర్లైన్స్, మెడికల్, రైల్వే, బ్యాంకులు, ఇన్సూరెన్స్,టెలికాం, పోస్టల్, విద్యుత్, రియల్ ఎస్టేట్, ఇళ్ల నిర్మాణం, రవాణ, చిట్ఫండ్స్, వ్యవసాయం, కస్టమర్ గూడ్స్, కొరియర్ సర్వీస్, విద్యారంగం, నాన్ బ్యాకింగ్ ఫైనాన్షియల్ సంస్థల వల్ల వల్ల వినియోగదారులు నష్టపోతే ఇలాంటి కేసులు వేయడానికి అవకాశం ఉంది. ● సురక్షిత ఆహారం లేక.. నాణ్యత వస్తువులు లభించక దాదాపు 200 రకాల వ్యాధులు వస్తున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.ఒకవైపు ప్రజల ఆర్యోగంపై కల్తీ జరుగుతుంటే మరోవైపు నాణ్యత లేని వస్తువలను వినియోగదారులకు అంటగడుతున్న ఘటనలు అనేకం ఉన్నాయి. వినియోగదారులు మోసపోవడంతో పాటు కల్తీ బారిన పడుతున్నారు. ఒక్క ఆహార వస్తువుల్లో మాత్రమే కాదు... ఎలక్ట్రానిక్, జీవిత బీమా, ఆరోగ్య బీమా ఇలా ప్రతి దాంట్లో వినియోగదారుడిని మోసం చేయాలనే భావన స్పష్టంగా కన్పిస్తోంది. చాలా వరకు వస్తువులు కొనుగోలు చేసిన వినియోగదారులు మోసపోయిన కోర్టును ఎలా ఆశ్రయించి న్యాయం పొందాలనే విషయంపై అవగాహన లేక విరమించుకుంటారు. మరికొందరు సమయం వృథా అవుతుందనే భావనతో మోసపోయినా ఊరుకుంటారు. కానీ చిన్న వస్తువు అయినా పెద్ద వస్తువు కొనుగోలు చేసినా బిల్లు తీసుకుంటే నాణ్యత లోపం ఉంటే తప్పక కోర్టుకు వెళ్లవచ్చు. నాణ్యతపై ప్రశ్నిద్దాం..!‘నగరానికి చెందిన చంద్రశేఖర్, సుమిత్ర దంపతులతో పాటు వారి పిల్లలు కలిసి 2008 నవంబర్ 26న రూ.21,250తో టీటీడీలో శ్రీవారి మేల్ చాట్ వస్త్ర సేవ టికెట్లు బుక్ చేసుకున్నారు. అప్పటి నుంచి సంవత్సరాల పాటు ఎదురుచూసినా స్వామి సేవలో పాల్గొనడానికి అవకాశం రాలేదు. చివరికు 2021 సెప్టెంబర్ 10న స్లాట్ బుకింగ్ అయిందని కరోనా కారణంగా ఆ సేవ రద్దు చేసినట్లు తెలిపారు. దాని స్థానంలో బ్రేక్ దర్శనం అవకాశం కల్పిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. ఆ తర్వాత అయిన కూడా వారికి టీటీడీ అవకాశం కల్పించలేదు. దీంతో చంద్రశేఖర్ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆశ్రయించారు. దీంతో కోర్టు చంద్రశేఖర్కు శ్రీవారి సేవలో పాల్గొనే అవకాశం ఇవ్వాలని లేనిపక్షంలో రూ.20 లక్షలు డిపాజిట్ చేస్తారా లేక జైలుకు వెళ్తారా అంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో టీటీడీ 2025 ఆగస్టు 14, 15తేదీలలో చంద్రశేఖర్ దంపతులకు శ్రీవారి సేవలో పాల్గొనే అవకాశం కల్పించారు.’ ‘నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం బొల్గట్పల్లిలో మూడు నెలల కింద రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసేందుకు వచ్చిన వ్యాపారులు ఎలక్ట్రానిక్ కాంటా తూకాల్లో మోసాలు చేస్తున్నట్టు రైతులు గుర్తించారు. పత్తి సంచుల బరువు ఎలక్ట్రానిక్ కాంటాలో తక్కువగా చూపుతూ మోసాలకు పాల్పడుతున్నట్టు గుర్తించి అచ్చంపేట మార్కెట్ కమిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. సంబంధిత అధికారులతో తనిఖీలు నిర్వహిస్తామని చెప్పినా ఇప్పటివరకు తనిఖీలు చేపట్టలేదు.’ -
తూకాల్లో మోసాలు
తూనికల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టకపోవడంతో వ్యాపారస్తులు తూకాల్లో తేడా చేస్తూ పేదలను మోసం చేస్తున్నారు. మరోపక్క వారాంతపు సంస్థలో బాట్లకు బదులు మోటు రాళ్లు పెట్టి తూకం చేసి వ్యాపారులు సామాన్యులతో భారీగా డబ్బులు గుంజుతున్నారు. అలాగే రైతులు పండించిన పంటలను దలారి వ్యాపారులు ఎలక్ట్రిక్ కాంటాల్లో మోసాలకు పాల్పడుతూన్నారు. తూనికల శాఖ అధికారులు మాత్రం కన్నెత్తి చూడడం లేదు. –మోహన్రెడ్డి, రైతు, మరికల్, నారాయణపేట జిల్లా ఫిర్యాదులు పెరుగుతున్నాయి.. వినియోగదారులు ఎవరైనా వస్తువులు కొను గోలు చేసిన ప్రతి సందర్భంలో కూడా తప్పక బిల్లు తీసుకోవాలి. వస్తువు నాణ్యతలో లోపం ఉన్నా, ఇతర సమస్య ఏది ఉన్నా.. కోర్టుకు వెళ్లడానికి అవకాశం ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో ఒకే ఒక్క కోర్టు ఉండటం వల్ల ఫిర్యాదులు పెరుగుతున్నాయి. జిల్లాలో ప్రతిరోజు హక్కుల ఫోరంకు రెండు నుంచి మూడు వరకు కేసులు వస్తుంటాయి. ఎక్కువగా ఎలక్ట్రానిక్ వస్తువులు, జీవిత భీమా, చిట్ఫండ్, ఫైనాన్స్లలో నష్టపోయిన వాళ్లు అధికంగా వస్తుంటారు. ముఖ్యంగా గ్రామీణా ప్రాంతాల నుంచి ఎవరు రావడం లేదు.. పట్టణ ప్రాంతాల నుంచి అవగహన ఉన్న వ్యక్తులు మాత్రమే కేసులు వేయడానికి వస్తున్నారు. ఇంకా ప్రజల్లో దీనిపై చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. వచ్చిన కేసులు పెండింగ్లో లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కారించడానికి కృషి చేస్తున్నాం. – అశోక్ వర్ధన్రాజు, వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సూపరిటెండెంట్ ● -
అలరించిన ఉగాది కవి సమ్మేళనం
స్టేషన్ మహబూబ్నగర్: జిల్లాకేంద్రంలోని రెడ్క్రాస్ భవన్లో శనివారం పాలమూరు సాహితీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీపరాభవ ఉగాది కవి సమ్మేళనం అలరించింది. కవి సమ్మేళనంతో పాటు బోల యాదయ్య రచించిన తండ్లాట అనువాద కృతి ‘హార్ట్ బీట్’ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కళాకారుల సంఘం అధ్యక్షుడు వి.మనోహర్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎంతో మంది యువ కవులు రావడానికి, రాయడానికి ఇలాంటి కవి సమ్మేళనాలు ఉపయోగపడతాయన్నారు. కవిత్వం అంటే ఒక రకమైన తండ్లాట అని అన్నారు. హార్ట్ బీట్ పుస్తకావిష్కర్త బెక్కెం జనార్దన్ మాట్లాడుతూ పాలమూరు కవిత్వం ప్రపంచస్థాయిలో రాణించాలంటే మన కవిత్వం ఆంగ్లంలోకి అనువాదం కావాలన్నారు. బోల కవిత్వాన్ని అనువాదం చేసిన పుస్తక అనువాదకులు సానె శివశంకర్ను ఈ సందర్భంగా అభినందించారు. బైరెడ్డి సతీష్రెడ్డి పుస్తకాన్ని సమీక్షించారు. అనంతరం శ్రీపరాభవ ఉగాది పురస్కారాలను ప్రముఖ కవి, నటులు ఏపూరి కిష్టప్ప, ప్రముఖ కవయిత్రి టి.అంబుజలకు అందజేశారు. పాలమూరు సాహితీ అధ్యక్షుడు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, లక్ష్మణ్గౌడ్, ఉదయమిత్ర పాల్గొన్నారు. -
తొలి రోజు ప్రశాంతం
● పదో తరగతి పరీక్షలు ప్రారంభం ● 13,188 మంది విద్యార్థులు హాజరు.. 23 మంది గైర్హాజరు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా పదోతరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు శనివారం తెలుగు పరీక్ష జరిగింది. ఉదయం 8 గంటలకే విద్యార్థులు, తల్లిదండ్రుల కోలాహలంతో పరీక్ష కేంద్రాలు సందడిగా మారాయి. 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా.. 9 గంటలకే విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతించారు. మొత్తం 60 పరీక్ష కేంద్రాల్లో 13,217 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా.. 13,188 మంది హాజరయ్యారు. మిగిలిన 23 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఓ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. డీఈఓ ప్రవీణ్కుమార్ 8 కేంద్రాలు, పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ నాలుగు, ఫ్లయింగ్ స్క్వాడ్లు పది కేంద్రాలను తనిఖీ చేశారు. -
బీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి
● రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: బీసీలకు విద్యా, ఉద్యోగాల్లో ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ఇటీవల ఎన్నికై న బీసీ ప్రజాప్రతినిధులకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీసీ బిల్లును ప్రవేశ పెట్టాలని పార్లమెంట్ వద్ద అనేక సార్లు ధర్నాలు చేపట్టాలని, పలువురు మంత్రులకు వినతిపత్రాలు అందజేశామన్నారు. ఎంపీలు, ప్రతిపక్ష పార్టీలను కలిసి ఈ విషయంలో విజ్ఞప్తి చేశామన్నారు. ఈ క్రమంలో కొన్ని డిమాండ్లను కేంద్రప్రభుత్వం నెరవేర్చిందన్నారు. జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ద హోదా, కేంద్రంలో ఓబీసీల వర్గీకరణకు అంగీకరించిందని, అంతేకాకుండా వివిధ వృత్తుల వారికి రూ.90 కోట్ల సబ్సిడీ ఇచ్చేందుకు జీఓలు జారీ చేసిందని తెలిపారు. మరో రెండు డిమాండ్లు అలాగే ఉండిపోయాయని, మంత్రిత్వ శాఖ ఏర్పాటు, బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్, రీయింబర్స్మెంట్ ఇవ్వడం ఉన్నాయన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గురుకులాలు, ఇతర పాఠశాలల మాదిరిగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ఉద్యోగ, విద్య విషయాల్లో ఇచ్చే రిజర్వేషన్ను 27 శాతం నుంచి 50 శాతానికి పెంచాలన్నారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 20 నుంచి 40 శాతానికి పెంచాలన్నారు. కార్యక్రమంలోమాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, మేయర్ మమత, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, బీసీటీఏ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణుడు తదితరులు పాల్గొన్నారు. -
సింగిల్ స్టూడెంట్... బోధన జీరో!
● నాగంబాయితండా ఏకోపాధ్యాయ పాఠశాలలో విచిత్ర పరిస్థితి ● విద్యార్థుల భవిష్యత్తో ఆటలాడుతున్న అధికారులు కిష్టంపల్లిగేట్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు లేకుండా కొనసాగుతున్న పాఠశాల నాగంబాయితండాలో ఉపాధ్యాయుడి రాక కోసం సింగిల్ విద్యార్థి మహేశ్ నిరీక్షణ హన్వాడ: గ్రామీణ ప్రాంతాల్లో విద్యను బలోపేతం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. అయితే అధికారుల నిర్లక్ష్యం.. ఉపాధ్యాయుల గైర్హాజరు కారణంగా కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోంది. మండల పరిధిలోని నాగంబాయితండా ఏకోపాధ్యాయ పాఠశాలలో ఇలాంటి దుస్థితే నెలకొంది. పూర్తి వివరాలు.. మాదారం ఉమ్మడి పంచాయతీ నుంచి వేరుపడి నూతన పంచాయతీగా ఏర్పడిన నాగంబాయితండా ప్రాథమిక పాఠశాలలో కేవలం ఒకే ఒక్క విద్యార్థి ఏ.మహేష్ ఐదో తరగతి విద్యనభ్యసిస్తున్నాడు. ఆ ఒక్క విద్యార్థి కోసం ప్రభుత్వం లక్షలు ఖర్చుచేసి నిర్మించిన భవనం, రూ.లక్షల్లో వేతనం పొందే ఉపాధ్యాయిని రేహానాబేగ్ను నియమించింది. కానీ ఆ ఉపాధ్యాయిని మాదారం పాఠశాలకు వెళ్లి తనకు బదులుగా అక్కడ ఉన్న మరో ఉపాధ్యాయుడు శ్రీనివాస్గౌడ్ను కేటాయించారు. కానీ సదరు ఉపాధ్యాయుడు విధులకు చుట్టపు చూపుగా వస్తూ వెళ్తున్నాడే తప్పా, ఎలాంటి బోధన చేయడం లేదని తండా ప్రజలు ఆరోపిస్తున్నారు. విద్యార్థి మహే ష్కు క్రమబద్ధమైన విద్యాబోధన లేని కారణంగా తనకు కేవలం క, ఖ వరకు మాత్రమే ఓనమాలు వస్తాయని, కానీ ఐదో తరగతికి వచ్చినా తనకు చదవడం, రాయడం పూర్తిస్థాయిలో రాదని సదరు విద్యార్థి పేర్కొంటున్నాడు. ఉపాధ్యాయుడు రాకపోవడంతో అంగన్వాడీ చిన్నారులతో కలిసి కూర్చుంటున్నాని తెలిపాడు. ఇకపోతే ఇక్కడకు వచ్చే ఉపాధ్యాయుడు వచ్చేనెల రిటైర్మెంట్ ఉందని తెలిసింది. దీంతో అతను కూడా వెళ్లిపోతే అప్పుడు ఆ పాఠశాలకు, ఆ విద్యార్థికి దిక్కెవరు అన్న ప్రశ్న తండాలో కలకలం రేపుతోంది. నాగంబాయితండాలో ఒకే విద్యార్థి ఉన్నాడు. అక్కడి ఉపాధ్యాయుడు మెడికల్ లీవ్ కారణంగా ఏమీ చేయలేని పరిస్థితి. సర్పంచ్తో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆ విద్యార్థిని మాదారం పాఠశాలలో అడ్మిట్ చేస్తాం. కిష్టంపల్లిగేట్ పాఠశాలలో పరిస్థితి పూర్తిస్థాయి విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. అంబటోనిపల్లి ప్రాథమిక పాఠశాల హెచ్ఎం అనారోగ్యం కారణంగా రాలేకపోతున్నారు. మండలంలో ఎక్కడా వలంటీర్లను నియమించలేదు. అంబటోనిపల్లిలో వలంటీర్ను నియమించుకున్న విషయం తెలియదు. వీటన్నింటిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. – గోపాల్నాయక్, ఎంఈఓ, హన్వాడ


