Mahabubnagar
-
నల్లమలలో దేశ, విదేశీ ప్రతినిధుల పర్యటన
మన్ననూర్: దేశంలో అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రాల్లో ఒకటిగా ఉన్న అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యంలో బిగ్క్యాట్ ఆవాసాల సంరక్షణ దిశగా అంతర్జాతీయ స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బిగ్ క్యాట్ సంరక్షణ వర్క్షాప్లో భాగంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ, తెలంగాణ అటవీశాఖ, హైదరాబాద్ సెక్రటేరియట్ సంయుక్త దౌత్య ప్రతినిధి బృందం సభ్యులు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో పర్యటించారు. ఈ సందర్భంగా పెద్దపిల్లి జాతికి చెందిన పెద్దపులులు, చిరుతలు, మంచు చిరుతలు, జాగ్వార్, సింహాల జాతుల ఆవాసాలు, పర్యావరణ సుస్థిరత, అంతర్జాతీయ సహకారం వంటి అంశాలపై 11, 12వ తేదీ రెండు రోజుల పాటు చర్చ జరిగింది. ఈ క్రమంలో మంగళవారం మన్ననూర్ అటవీశాఖ వనమాళిక ప్రాంగణం నుంచి అటవీ శాఖ అధికారులతో కలిసి బృందం సభ్యులు జంగిల్ సఫారీలో అటవీ అందాలను వీక్షించారు. అటవీశాఖ చేపట్టిన జీవ వైవిధ్యం, వన్య ప్రాణుల సంరక్షణకు సంబంధించిన చర్యలను పరిశీలించారు. అంతకు ముందు రోజు మన్ననూర్లోని జంగిల్ సఫారీకి సంబంధించిన రిసార్ట్లో బస చేసిన సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పులులు, వన్య ప్రాణులు, హాబిటాట్ పర్యవేక్షణ, ఎకో టూరిజం, పునరావాసం చర్యలపై అభినందించారు. ముఖ్యంగా వన్యప్రాణుల సంరక్షణతో పాటు వేటగాళ్ల నివారణ చర్యలు, పర్యావరుణ పునరుద్ధరణ అంశాలు చర్చకు వచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో బంగ్లాదేశ్, మలేషియా, రష్యా, శ్రీలంక, థాయ్లాండ్ దేశాలకు చెందిన ప్రతినిధులతో పాటూ అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ ప్రియాంక వర్గీస్, ఫీల్డ్ డైరెక్టర్ సునిల్, డీఎఫ్ఓ రేవంత్చంద్ర, ఎఫ్డీలు రామ్మూర్తి, రామ్మోహన్, రేంజ్ అధికారులు వీరేష్, గురుప్రసాద్, వాణి, ఎఫ్ఎస్ఓలు, ఎఫ్బీఓలు, సిబ్బంది పాల్గొన్నారు. వ్యూఫాయింట్ వద్ద బృందానికి టైగర్ రిజర్వు గురించి వివరిస్తున్న సీసీఎఫ్ -
రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య
మక్తల్: రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పట్టణ సమీపంలోని రైల్వేస్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. మక్తల్కు చెందిన జుట్లు వాసు(25) ఇంటర్ వరకు చదువుకున్నాడు. హైదరాబాద్లో కొందరు దళారులు ఓ ఏజెన్సీలో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.20 వేలు వాసు వద్ద తీసుకున్నారు. ఉద్యోగం రాకపోవడంతో హైదరాబాద్ నుంచి సోమవారం మక్తల్కు వచ్చాడు. అనంతరం ఇంటి నుంచి వెళ్లిన వాసు మోసపోయానన్న మనస్తాపంతో స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే అధికారులు రైల్వే పోలీసులకు సమాచారం అందించగా వారు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మహబూబ్నగర్కు తరలించారు. మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. లారీని ఢీకొని...ఇద్దరు మృతి సనత్నగర్: బైక్పై దూసుకెళ్తున్న ఇద్దరు యువకులు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సనత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా కోడూరుకు చెందిన వాకిటి కుమార్ కుమారుడు సందీప్ (26) ప్రైవేటు ఉద్యోగం చేస్తూ మహేంద్రహిల్స్లో ఉంటున్నాడు. అతని స్నేహితుడు కామారెడ్డికి చెందిన ధాత్రిక సాయి కౌషిక్ (24) కూడా ప్రైవేటు ఉద్యోగం చేస్తూ రామంతాపూర్లో ఉంటున్నాడు. ఇద్దరు బీటెక్ చదువుకునే సమయంలో స్నేహితులయ్యారు. ఇద్దరూ కలిసి సోమవారం రాత్రి సికింద్రాబాద్లో జరిగిన స్నేహితురాలి పుట్టినరోజు వేడుకలకు యమహా ఆర్ 15 బైక్పై వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఎర్రగడ్డ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై వేగంగా ప్రయాణిస్తూ భరత్నగర్ వద్ద బ్రిడ్జి దిగే క్రమంలో ఎదురుగా వెళ్తున్న లారీలను ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించారు. కౌషిక్ బైక్ నడుపుతుండగా సందీప్ వెనుక కూర్చున్నాడు. ముందున్న లారీల్లో మొదటి లారీని ఓవర్ టేక్ చేసి, రెండో లారీని కూడా అదే వేగంతో ఓవర్టేక్ చేయబోతూ బైక్తో లారీని ఢీకొట్టారు. సంఘటనలో బైక్తో సహా ఇద్దరూ రోడ్డు పడిపోఆరు. వేగంతో కిందపడడంతో తలలు పగిలి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సందీప్, కౌషిక్ మృతదేహహాలను మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మొక్కజొన్న పంటకు నిప్పు
● 2.5 ఎకరాలల్లో పంట దగ్ధం పాన్గల్: మండలంలోని కేతేపల్లి గ్రామానికి చెందిన రైతు రవీందర్రెడ్డికి చెందిన మొక్కజొన్న పంటకు మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో పంట పూర్తిగా దగ్ధమైంది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. 2.5 ఎకరాలల్లో సాగు చేసిన మొక్కజొన్న పంటకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో చేతికొచ్చిన పంట పూర్తిగా కాలిపోవడంతో పాటు పొలంలో ఉన్న 30 స్పింక్లర్ పైపులు, విద్యుత్ మోటార్, వైర్లు దగ్ధమయ్యాయని వాపోయాడు. వీటి విలువ సుమారుగా రూ.2.50 లక్షలు ఉంటుందని రైతు తెలిపాడు. -
రండి.. విశేషాలు పంచుకుందాం
పరీక్షలు ముగిశాయి. స్కూళ్లకు సెలవులూ వచ్చాయి. అమ్మా, నాన్నలకూ రిలీఫ్ దొరికితే.. అలా అంతా ఓ ట్రిప్ వేయొచ్చు. అది అమ్మమ్మ, తాతల ఇంటికి కావచ్చు. లేదా పర్యాటక కేంద్రానికి కావచ్చు. జాలీగా ఇంకెక్కడైనా కావచ్చు. ఆ అనుభవాలను ‘సాక్షి’తో పంచుకోండి. వేసవిలో మీరు చూసిన విశేషాలు, అక్కడ తీసుకున్న ఫొటోలు పంపండి. వీటితో పాటు మీ అనుభూతిని రాయడం మరవకండి. అలాగే అమ్మమ్మ, నానమ్మ ఊరిలో గడిపిన సన్నివేశాల ఫొటోలు, మీ సృజనకు పదును పెట్టే బొమ్మలు గీసినా.. కథలు రాసినా, నృత్యాలు నేర్చుకున్న వాటిని ఫొటోలతో సహా పంపొచ్చు. -
11మంది బైకర్లపై కేసు నమోదు
● ఫంక్షన్ నిర్వాహకుడు జహంగీర్పై కూడా.. ● మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తి ● పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్న రూరల్ పోలీసులు మహబూబ్నగర్ క్రైం: బైపాస్ రోడ్డుపై పాలకొండ చౌరస్తా వద్ద యూటర్న్ తీసుకుంటున్న కారును స్పోర్ట్స్ బైక్ ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు మృతి చెందిన విషయం విదితమే. గాయపడిన వారిలో రేష్మా ఖాతూమ్ ఎస్వీఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఆమె దవడ భాగం పూర్తిగా దెబ్బతినడంతో శస్త్రచికిత్స చేయనున్నట్లు తెలిసింది. ఆమె కొడుకు శ్రీకృష్ణ న్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గౌసియా బేగం జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఆమెకు ఊపిరితిత్తుల్లో కొంత మేర పక్కటెముకలు విరిగినట్లు సమాచారం. మహ్మద్ బాసిత్ ఇంటి దగ్గర ఉండగా ఇతని మరో కొడుకు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసి సోమవారం రాత్రి కుటుంబ సభ్యులకు అప్పగించారు. రైడర్ల మృతదేహలను హైదరాబాద్కు తరలించారు. ఈ ముగ్గురి మృతదేహలను మంగళవారం ఉదయం 5.30 ప్రాంతంలో వారి సాంప్రదాయం ప్రకారం ఖననం చేశారు. 12 మందిపై కేసు నమోదు బైక్, కారు రోడ్డు ప్రమాద ఘటనలో మొత్తం 12 మందిపై 304–పార్ట్ 2 బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ విజయ్కుమార్ తెలిపారు. 11 మంది బైక్ రైడర్లతో పాటు మెట్రో ఫంక్షన్ హాలులో ఫంక్షన్ చేసిన జహంగీర్పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఫంక్షన్ హాల్ నుంచి హైదరాబాద్ వెళ్లడానికి బైకర్లు రేస్ పెట్టుకున్నారా? లేదా అనే అంశంపై విచారణ చేస్తున్నామన్నారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
ఆందోళనలో నీట్ విద్యార్థులు
● ఉమ్మడి జిల్లాలో పరీక్ష రాసిన 4,141 మంది విద్యార్థులు ● సీటు వస్తుందనుకుంటే మరోసారి పరీక్ష రాయాల్సిన వస్తుందని ఆవేదనసీటు వస్తుందని అనుకున్నాం. పరీక్షకు కొన్నినెలలుగా పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాం. పరీక్ష రాశాక తీరా పేపర్ లీక్ అయ్యిందని, మరోసారి పరీక్ష రాయాల్సి వస్తుందని తెలిసింది. పరీక్షలో మంచి మార్కులు వస్తాయని, సీటు సాధిస్తామని అనుకునేలోపే ఇలా పేపర్లీక్ గురించి తెలిసింది. వీలైనంత త్వరగా పరీక్షలు మళ్లీ నిర్వహిస్తే బాగుటుంది. – గిరిజ, నీట్ అభ్యర్థిని ఎన్నో ఆశలు పెట్టుకున్నాం నీట్కు ఎన్నో రోజులు కష్టపడి సిద్ధమయ్యాం. తీరా పేపర్ లీక్ కావడంతో ఆశలన్నీ ఆవిరయ్యాయి. లీకులతో విద్యార్థుల భవిష్యత్ ఇబ్బందికరంగా మారింది. పరీక్ష వాయిదా వేస్తే మరోసారి కష్టపడి సమయం కేటాయించి చదవాల్సిన పరిస్థితి నెలకొంది. ఫలితాలు ప్రశ్నాపత్రంలో వచ్చిన మార్కులపై ఆధారపడి ఉంటాయి. అంచనాలు మారుతాయి. – వైష్ణవి, నీట్ అభ్యర్థిని నిర్లక్ష్యం వల్లే .. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ను నిర్ణయించే నీట్లో పేపర్ లీక్ కావడం బాధాకరం. ఎంతో మంది భవిష్యత్ దీనిపై ఆధారపడి ఉంది. పేపర్ లీక్ కావడం వెనుక అధికారుల నిర్లక్ష్యం ఉంది. లీక్కు కారణమైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. వీలైనంత త్వరగా పరీక్ష నిర్వహిస్తే విద్యార్థులకు ఇబ్బందులు ఉండవు. –సిద్దార్థ, నీట్ అభ్యర్థి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: దేశ వ్యాప్తంగా పలు మెడికల్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న మెడికల్ సీట్ల భర్తీకి ఈనెల 3వ తేదీన ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) ఆధ్వర్యంలో నీట్–యూజీ పరీక్షను నిర్వహించారు. పరీక్ష పూర్తి కావడంతో విద్యార్థులు తదుపరి ఫలితాల కోసం ఎదురుచూస్తుండగా.. పేపర్ లీక్ కావడంతో ఒక్కసారి ఉలికిపాటుకు గురయ్యారు. దీంతో పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. మంచి ర్యాంకులు సాధించేందుకు విద్యార్థులు నెలల తరబడి కసరత్తు చేసి లాంగ్టర్మ్, షార్ట్టర్మ్ కోచింగ్కు వెళ్లి, గంటల తరబడి సిద్ధమైతే చివరకు పరీక్ష వాయిదా పడడంతో గందరగోళం నెలకొంది. వాయిదా పడిన పరీక్ష తదుపరి ఎప్పుడు నిర్వహిస్తారన్న అంశంపై ఎన్టీఏ నుంచి ఇంకా స్పష్టత రాకపోవడంతో విద్యార్థులు మరోమారు కోచింగ్ సెంటర్లకు వెళ్లి పరీక్షకు సిద్ధమయ్యే పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4,141 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. మరోసారి పరీక్ష రాసేందుకు ఎటువంటి దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం లేదని సూచించారు. మరోసారి పేపర్ లీక్లకు పాల్పడకుండా, పేపర్ లీక్ చేసిన వారిపై ఖఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. జీవితాలతో చెలగాటం ఆడటం సరికాదు గతంలో ఓసారి నీట్ రాస్తే సరైన ర్యాంకు రాకపోవడంతో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని ఏడాది మొత్తం కష్టపడి చదివా. ఈ సారి కీ చూసుకుంటే 530 మార్కులు వచ్చాయి. కచ్చితంగా సీటు వస్తుంది. ఎక్కడో కొందరు చేసిన తప్పిదాల కారణంగా మొత్తం విద్యార్థుల భవిష్యత్ను అనిశ్చితిలోకి నెట్టడం సరైంది కాదు.ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటం సరికాదు. పేపర్ లీక్ జరిగినట్లయితే అందుకు బాధ్యులైన వారిపై కఠినచర్యలు తీసుకోవాలి కానీ.. ఇలా పరీక్ష మొత్తం రద్దు చేసి విద్యార్థులను మానసిక ఆందోళనకు గురి చేయకూడదు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తో ముడిపడి ఉన్న పరీక్షల విషయంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని. – ఎం.భవాని, నీట్ అభ్యర్థి, కొత్తకోట, వనపర్తి జిల్లా పేపర్ లీక్ లేకుండా చూడాలి నీట్ ప్రతి విద్యార్థికి కూడా ఎంతో కీలకమైంది. ఎన్నో నెలలు కష్టపడి చదివినటువంటి పరీక్షకు సంబంధించిన పేపర్ లీకయితే విద్యార్థుల భవిష్యత్పై తీవ్ర ప్రభావం పడుతుంది. మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వీలైనంత త్వరగా పరీక్ష నిర్వహించాలి. – ధన్రాజ్, నీట్ అభ్యర్థి సీబీటీ విధానంలో నిర్వహించాలి ఆఫ్లైన్ పరీక్ష నిర్వహించడంతో పేపర్ లీక్ అవుతున్న క్రమంలో జేఈఈ మెయిన్స్ పరీక్ష నిర్వహించిన విధంగా కంప్యూటర్ బేస్డ్గా నిర్వహిస్తే బాగుటుంది. లక్షలాది మంది విద్యార్థులు కళలు ఒక్క లీకేజ్తో తలకిందులయ్యాయి. ప్రభుత్వం వెంటనే పరీక్ష నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. – జ్ఞానేశ్వర్, నీట్ అభ్యర్థి ● -
ముగిసిన హజ్రత్ షా అలీ ఉర్సు
అలంపూర్: పట్టణంలో వెలిసిన హజ్రత్ షా అలీ పహిల్వాన్ ఉత్సవాలు మంగళవారంతో వైభవంగా ముగిశాయి. ఉత్సవాల చివరి రోజు మహిళల ప్రత్యేక ఉర్సు జరిగింది. ఈ నెల 9న గంధోత్సవంతో ఉత్సవాలు ప్రారంభించారు. 10న సర్ ముబారక్ దర్గాలో చిన్న కిస్తీ, 11న ధడ్ ముబారక్ దర్గాలో పెద్ద కిస్తీలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు కిస్తీలకు ప్రసాదం అందించి మొక్కులు తీర్చుకున్నారు. 12న ఉర్సులో వెలిసిన బ్యాంగిల్స్, బొమ్మల దుకాణాల వద్ద మహిళల కొనుగోళ్లతో రద్దీగా మారాయి. నాలుగు రోజులుగా భక్తుల రాకపోకలతో వీధులు కిటకిటలాడాయి. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. అధికారులు భక్తులకు కావాల్సిన సౌకర్యాలను కల్పించారు. -
నేను.. నా విహారం
అరకు, బొర్రా కేవ్స్ అద్భుతం హాయ్ ఫ్రెండ్స్.. నా పేరు శ్రీ చైత్రిక, నేను మహబూబ్నగర్లోని మౌంట్బాసిల్ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నా.నేను, అమ్మ, నాన్న, మా తమ్ముడు అభిరామ్తో పాటు తాత, నాయనమ్మతో పాటు బాబాయ్, అత్తమ్మ ఫ్యామిలీలతో కలిసి నాలుగు రోజుల పాటు విశాఖపట్నంతో పాటు అరకు విహారయాత్రకు వెళ్లాం. అన్నవరం, విశాఖపట్నం, అరకు బొర్రా కేవ్స్లో సంతోషంగా గడిపాం. వైజాగ్ ఆర్కే బీచ్లో అర్ధరాత్రి చంద్రుడి వెన్నలలో మా అమ్మ లక్ష్మి, అత్తమ్మ ఉమాదేవి పాటు వారి పిల్లలు అక్షయ, భవ్య, మా పిన్నిలు లక్ష్మి, అంజలితో కలిసి కాసేపు కబడ్డీ ఆడాం. రిషికొండ బీచ్లో ఆటపాటలతో సందడి చేశాం. అరకులో కాపీ తోటలు, వాటర్ఫాల్స్ కనువిందు చేశాయి. చివరిగా బొర్రా కేవ్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ యాత్ర నాకు ఎన్నో అనుభూతులు, జ్ఞాపకాలను ఇచ్చింది. మీరు మీ కుటుంబసభ్యులతో ఓసారి వెళ్లి రండి.. చాలా బాగుంటుంది. -
టీ20 లీగ్లో మహబూబ్నగర్ శుభారంభం
మహబూబ్నగర్ క్రీడలు: హైదరాబాద్లోని 22 యార్డ్స్ మైదానంలో మంగళవారం జరిగిన హెచ్సీఏ బి–డివిజన్ టీ–20 లీగ్ కమ్ నాకౌట్ టోర్నమెంట్లో మహబూబ్నగర్ జిల్లా జట్టు శుభారంభం చేసింది. మహబూబ్నగర్ జట్టు ఐదు వికెట్ల తేడాతో ఉస్మానియా యూనివర్సిటీ జట్టుపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఉస్మానియా యూనివర్సిటీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. జట్టులో హయాన్ ఆరిఫ్ మొహియోద్దీన్ 45 పరుగులు నాటౌట్, సూర్య కిరణ్ యాదవ్ 45 పరుగులు చేశారు. మహబూబ్నగర్ బౌలర్లు జస్వంత్ 2 వికెట్లు, శశాంక్, వర్షిత్రెడ్డి, ఎండి.ముఖితుద్దీన్ చెరో వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన మహబూబ్నగర్ జట్టు 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. జట్టులో అభిలాష్గౌడ్ అర్ధసెంచరీతో రాణించాడు. 44 బంతుల్లో 8 ఫోర్లతో 54 పరుగులు చేయగా సంజయ్ 33 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. టీ–20 లీగ్లో జిల్లా జట్టు మ్యాచ్ గెలుపొందడంపై ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ అభినందించారు. ఇదే స్పూర్తితో రానున్న మ్యాచుల్లో మెరుగైన ప్రతిభ కనబరిచి విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. ఐదు వికెట్ల తేడాతో ఓయూ జట్టుపై విజయం -
ఆర్అండ్ఆర్ పనులు త్వరగా పూర్తిచేయాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ఉదండాపూర్ రిజర్వాయర్ భూ నిర్వాసితుల పునరావాసం (ఆర్అండ్ఆర్) పనులను వేగంగా పూర్తిచేసి నిర్వాసిత కుటుంబాలను వీలైనంత త్వరగా పునరావాస కాలనీకి తరలించాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో కలెక్టర్ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డితో కలిసి ఆయా శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉదండాపూర్ పునరావాస కాలనీలో పెండింగ్లో ఉన్న పనులను తక్షణమే పూర్తిచేయాలన్నారు. ఆలయ నిర్మాణానికి దేవాదాయ శాఖ నుంచి అవసరమైన డిజైన్ అనుమతులు తీసుకుని పనులను ప్రారంభించాలని సూచించారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం, అంతర్గత రహదారులు, విద్యుత్ సదుపాయాలు, ఇతర మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలన్నారు. ప్రాజెక్టు నిర్మాణం మూలంగా మిగిలిన వ్యవసాయ భూములకు వెళ్లడానికి బండ్ల బాటలు వేయాలని ఎమ్మెల్యే కోరగా ఈ విషయాన్ని పరిశీలించి నివేదిక సమర్పించాలని కలెక్టర్ జడ్చర్ల తహసీల్దార్ను ఆదేశించారు. ● ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వాసితుల ఖాతాల్లో పరిహారం నిధులు జమ చేసినా ఇప్పటి వరకు ఒక్క కుటుంబం కూడా పునరావాస కాలనీకి వెళ్లకపోవడం సరికాదన్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించి నిర్వాసితులను కాలనీకి తరలించాలన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితుల తరహాలో ప్లాట్లను లబ్ధిదారుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేస్తే వారు ఇళ్ల నిర్మాణానికి ముందుకు వస్తారని సూచించారు. ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు మొక్కజొన్న, వరిధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి ఆయన వీసీ నిర్వహించారు. జిల్లాలోని ప్రతి ప్రైవేట్ గోదాంను అవసరమైతే ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని నిల్వ సదుపాయాలు పెంచాలని, జిల్లాలో స్థానిక హమాలీలను వందశాతం వినియోగించుకోవాలని సూచించా రు. హమాలీలు అధికంగా డబ్బు డిమాండ్ చేస్తే లైసెన్సు రద్దు చేయాలని, కొనుగోలు కేంద్రాల్లోనే నాణ్యత పరిశీలన అనంతరం రైతులకు వెంటనే రశీదులు ఇవ్వాలని, రైస్ మిల్లుల వద్ద ఎలాంటి కోతలు ఉండకూడదని, రవాణా కోసం ఖాళీగా ఉన్న అన్ని వాహనాలు, ట్రాక్టర్లు, డీసీఎంలను పూర్తిస్థాయిలో వినియోగించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్ కవర్లు సిద్ధంగా ఉంచాలని, తడిసి న ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, ప్రతిరోజు కొను గోళ్ల పురోగతిని సమీక్షించాలని చెప్పారు. అనంతరం కలెక్టర్ ఖుష్బు గుప్తా మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పకడ్బందీ చర్యలు చేపడుతున్నామన్నారు. -
18 ప్రమాదాలు.. 12 మంది మృతి
నగరంలో ఉన్న జాతీయ రహదారితో పాటు బైపాస్ రోడ్లపై ప్రమాదాలు నిత్యకృత్యమవుతున్నాయి. నెలరోజుల వ్యవధిలో రెండు బైపాస్లపై 18 రోడ్డు ప్రమాదాలు జరిగితే 12 మంది దుర్మరణం చెందారు. మరో పదిమంది వరకు క్షతగాత్రులయ్యారు. ఇక నగరంలో రోడ్డు పక్కన ఉండే ఫుట్పాత్లు ఆక్రమణలకు గురవడంతో పాదచారులు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని నడవాల్సి వస్తోంది. ధాన్యం, ఇసుకతోపాటు ఇతర వస్తువులు రవాణా చేసే భారీ వాహనాల రాకపోకలతో ట్రాఫిక్ సమస్య అధికంగా వస్తోంది. నగరీకరణ అధికంగా ఉన్న పాలమూరులో వాహనాల రద్దీతో పాటు ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంలో పోలీసులు, మున్సిపల్ యంత్రాంగం విఫలమవుతోంది. -
తెలియక వచ్చాను..
బాదేపల్లి యార్డులో మంగళవారం కొనుగోళ్లు చేయడం లేద ని తెలియక ధాన్యం తీసుకువచ్చాను. దీంతో ధాన్యం కుప్ప వద్దే పడిగాపులు కాసే పరిస్థితి ఏర్పడింది. ముందస్తు సమాచారం తెలిసి ఉంటే బుధవారమే తీసుకువచ్చే వాడిని. రైతులను ఇబ్బంది పెట్టకుండా చర్యలు తీసుకోవాలి. – మధుసూదన్రెడ్డి, రైతు, గోప్లాపూర్ వర్షం వస్తే ఎలా..? మార్కెట్లో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడంతో యార్డులోనే పడిగాపులు కాస్తున్నాం. దీనికితోడు ఇక్కడ రైతులను ఎవరూ పట్టించుకోవడం లేదు. అలాగే అకాల వర్షం వస్తే ఆరుబయట ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉంది. వెంటనే కొనుగోళ్లు నిర్వహించేలా చూడాలి. – రాములు, కావేరమ్మపేట రైతులు సహకరించాలి.. బాదేపల్లి యార్డుకు సోమవారం ఒక్కరోజే 30 వేల బస్తాల దిగుబడులు వచ్చాయి. దీంతో బస్తాలు తూకం వేయడంలో ఆలస్యమైంది. మంగళవారం కూడా అవే బస్తాలు తూకాలు వేశాం. బస్తాల తరలింపులోనూ ఆలస్యం కావడంతో రోజు విడిచి రోజు కొనుగోళ్లు చేయాలని నిర్ణయించాం. ఈ విషయం రైతులు గమనించి సహకరించాలి. – అశ్వక్ ఆహ్మద్, మార్కెట్ కార్యదర్శి, బాదేపల్లి -
పట్టించుకోలేదు..
బైపాస్ రోడ్డుపై రోజురోజుకూ ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతున్నా నియంత్రణ చర్యలు మాత్రం కనిపించడం లేదు. ముఖ్యంగా రాత్రివేళల్లో వాహనాలు అతివేగంగా వెళ్తున్నాయి. వెంటనే స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. ఈ విషయమై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. – శ్రీనివాసులు, పాలకొండ అడ్డాగా మారింది.. పాలకొండ చౌరస్తా ప్రమాదాలకు అడ్డాగా మారింది. ఇటీవల టిప్పర్ ఢీకొని ముగ్గురు మృతిచెందారు. ఇది మరువక ముందే కారు, బైక్ ఢీకొని ఐదుగురు చనిపోయారు. పోలీసులు తరచూ తనిఖీలు నిర్వహించి రూల్స్ ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజల్లో కూడా ట్రాఫిక్పై అవగాహన పెంచాలి. – రామాంజనేయులుగౌడ్, హోటల్ యజమాని, పాలకొండ చౌరస్తా చర్యలు తీసుకుంటాం.. బైపాస్ రోడ్డుపై ఇక నుంచి రాత్రి 11 గంటల తర్వాత హోటళ్లు, రెస్టారెంట్లు ఇతర ఎలాంటి ఆహార విక్రయాలు జరిపే దుకాణాలు తెరిచి ఉండటానికి అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. బైపాస్పై ప్రత్యేకంగా పెట్రోలింగ్, నిఘా పెంచుతాం. నిత్యం వాహనాల తనిఖీలు, డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపడుతాం. మరికొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నళ్ల ఏర్పాటు కూడా త్వరలోనే పరిష్కారం అవుతుంది. – వెంకటేశ్వర్లు, డీఎస్పీ, మహబూబ్నగర్ ● -
ప్రాణాల మీదికి తెస్తున్న రాంగ్రూట్ ప్రయాణం
సిగ్నల్స్ లేక ఎదురెదురుగా వెళుతున్న వాహనాలు నగరంలో పనిచేయని సిగ్నల్స్.. బైపాస్లో ట్రాఫిక్పై కొరవడిన పర్యవేక్షణ నచ్చినట్లు వెళ్తూ.. హల్చల్ చేస్తున్న కొందరు వాహనదారులు రాంగ్రూట్లలో వెళ్లడానికే బైకర్స్ ఆసక్తి ప్రధాన కూడళ్లు, రోడ్లపై ఇష్టారాజ్యంగా వాహనాల పార్కింగ్ రాత్రివేళలోనూ బైపాస్ రోడ్డుపై కనిపించని పెట్రోలింగ్ -
స్తంభించిన కొనుగోళ్లు
జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో పంట దిగుబడుల క్రయవిక్రయాలు స్తంభించాయి. యార్డుకు వివిధ ప్రాంతాల నుంచి ధాన్యం పోటెత్తడంతో మార్కెట్ ఆవరణలో స్థలం లేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా ఎక్కడి ధాన్యం అక్కడే ఉండిపోవడంతో కొనుగోళ్లు నిలిచిపోయాయి. సోమవారం దాదాపు 30 వేల బస్తాల వరి ధాన్యం, మొక్కజొన్న ఇతర దిగుబడులు మార్కెట్కు రావడంతో కొనుగోళ్లు జరిపినా తూకాలు, బస్తాల తరలింపు చేయకపోవడంతో మంగళవారం కొనుగోళ్లు నిలిపివేశారు. దీంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. వరుసగా శుక్ర, శనివారాల్లో సైతం ఇదే సమస్య కారణంగా కొనుగోళ్లు నిలిపివేయగా.. ఆదివారం బస్తాలను గోదాంలకు తరలించడంతో సోమవారం క్రయవిక్రయాలు సాఫీగా సాగాయి. అయితే మూడు రోజుల సరుకు మంగళవారం ఒకేసారి రావడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. దీంతో కొనుగోళ్లు నిలిపివేసి.. తూకాలు, బస్తాల తరలింపు చేపట్టారు. రోజుల తరబడి పడిగాపులు బాదేపల్లి యార్డు ఆవరణలో సామర్థ్యానికి మించి దిగుబడులు రావడం, సకాలంలో టెండర్లు దాఖలు చేసి తూకాలు వేయడం, బస్తాల తరలింపులో ఆలస్యం చోటు చేసుకునే పరిస్థితి వస్తుంది. దీంతో రోజు విడిచి రోజు కొనుగోళ్లు చేయాలని మార్కెట్ యార్డు అధికారులు, పాలక మండలి నిర్ణయించారు. అయితే సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు రెండు, మూడు రోజులపాటు మార్కెట్లోనే పడిగాపులు కాయాల్సి వస్తుంది. లారీలు, హమాలీలతో ఇబ్బందులు ఒకవైపు పేరుకుపోయిన నిల్వలు.. మరోవైపు మొక్కజొన్న ఇతర దిగుబడులు మార్కెట్కు ప్రతిరోజు భారీగా వస్తుంది. ఈ క్రమంలో బస్తాలు తరలించేందుకు లారీలు, హమాలీలు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మార్కెట్ నుంచి బయటి ప్రాంతాల్లోని గోదాంలకు తరలించాలంటే అక్కడ కూడా ఖాళీ లేని పరిస్థితి కారణంగా ఆలస్యం జరుగుతుంది. కాబట్టి క్రయవిక్రయాలలో ఇబ్బందులు రాకుండా చూడాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆరుగాలం అష్టకష్టాలు పడి పండించిన పంట దిగుబడులను అమ్మడానికి సైతం ఇబ్బందులు పడాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ఇదే పరిస్థితి ఉందని, ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారుల కుమ్మక్కు..? ధాన్యం దిగుబడులు అధికంగా రావడం, రోజుల తరబడి రైతులు మార్కెట్లోనే ఉండిపోయే పరిస్థితులు తలెత్తడం కారణంగా వ్యాపారులు ఇదే అదునుగా తక్కువ ధర కేటాయిస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు. బాదేపల్లి యార్డుకు పోటెత్తిన మొక్కజొన్న, వరిధాన్యం ఇకపై రోజు విడిచి రోజు చేపట్టాలని నిర్ణయం మంగళవారం కొనుగోళ్లు నిలిపివేత.. నేడు టెండర్ ప్రక్రియ తీవ్ర ఆందోళనలో రైతులు -
5.5 కిలోమీటర్ల దారిలో..
నగరంలో ఉన్న అతి ప్రధానమైన బైపాస్ రోడ్డు 5.5 కిలోమీటర్ల దారిలో ఇరువైపులా మూడు బార్లు, 8 దాబాలు, 9 టీ పాయింట్స్, పదిలోపు చిన్నపాటి హోటళ్లు దర్శనమిస్తాయి. ముఖ్యంగా పిస్తాహౌస్ అర్ధరాత్రి వరకు ఓపెన్ ఉండటంతో నగరంతో పాటు జడ్చర్ల, హైదరాబాద్ వైపు నుంచి వెళ్లే చాలామంది యువకులు రాత్రి 11 గంటల తర్వాత ఇక్కడ కలుస్తుంటారు. పిస్తాహౌస్ సమయపాలనపై ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో అక్కడికి వచ్చిన యువత బైపాస్ మార్గంలో బైక్లపై చక్కర్లు కొడుతుంటారు. దాబాల్లో లభించే మద్యం కారణంగా గ్రూప్లు, గ్రూప్లుగా చేరుకొని మద్యం తాగుతూ హల్చల్ చేస్తుంటారు. బైపాస్లో పోలీసుల పాయింట్స్ లేకపోవడంతో అడ్డూ అదుపూ లేకుండా పోయింది. కేవలం పిస్తాహౌస్ చౌరస్తాలో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ మాత్రమే ఉంటారు. న్యూటౌన్లోని రోడ్డుపై ద్విచక్రవాహనాల పార్కింగ్ -
నీటి సంపులో పడి బాలుడి మృతి
హన్వాడ: నీటి సంపులో పడి బాలుడి మృతి చెందిన ఘటన మండలంలోని మాధారంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన నరసయ్య కుమారుడు లక్కీ(6) ఇద్దరు స్నేహితులతో కలిసి తమ ఇంటి పరిసరాల్లోనే ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో తమ ఇంటి ముందు తవ్విన నీటి సంపులో పడి ఊపిరాడక మృతి చెందాడు. అక్కడే ఉన్న కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై మరో ఇద్దరు చిన్నారులను కాపాడినా లక్కీని మాత్రం రక్షించలేకపోయారు. స్కూళ్లకు సెలవులు వస్తే పిల్లలు కళ్ల ముందు తిరుగుతూ సందడి చేస్తారని సంబరపడే తల్లిదండ్రులకు తీరని గర్భశోకం మిగిలిందని వాపోతున్నారు. అప్పటి వరకు కళ్ల ముందు ఆడుకోవాల్సిన బిడ్డ విగతజీవిగా పడి ఉండటం చూసి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. గుర్తు తెలియని వ్యక్తి మృతి గద్వాల క్రైం: గుర్తు తెలియని రైలు కిందపడి వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ అశోక్కుమార్ తెలిపారు. ఆదివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి(70) రైలులో ప్రయాణిస్తూ.. ప్రమాదవశాత్తు జారి కిందపడడంతో మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడి వివరాల కోసం రైల్వే పోలీసులను సంప్రదించాల్సిందిగా హెడ్ కానిస్టేబుల్ సూచించారు. -
అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా డ్రైవర్ మృతి
రండి.. విశేషాలు పంచుకుందాం ప్రమాదవశాత్తు చెరువులో పడి వృద్ధురాలి మృతి ● భక్తిశ్రద్ధలతో గంధోత్సవం ● సర్ ముబారక్ దర్గాలో చిన్న కిస్తీలు శ్రీజ మూడో తరగతి, గంగారం (బిజినేపల్లి మండలం) నాగర్కర్నూల్ పరీక్షలు ముగిశాయి. స్కూళ్లకు సెలవులూ వచ్చాయి. అమ్మా, నాన్నలకూ రిలీఫ్ దొరికితే.. అలా అంతా ఓ ట్రిప్ వేయొచ్చు. అది అమ్మమ్మ, తాతల ఇంటికి కావచ్చు. లేదా పర్యాటక కేంద్రానికి కావచ్చు. జాలీగా ఇంకెక్కడైనా కావచ్చు. ఆ అనుభవాలను ‘సాక్షి’తో పంచుకోండి. వేసవిలో మీరు చూసిన విశేషాలు, అక్కడ తీసుకున్న ఫొటోలు పంపండి. వీటితో పాటు మీ అనుభూతిని రాయడం మరవకండి. అలాగే అమ్మమ్మ, నానమ్మ ఊరిలో గడిపిన సన్నివేశాల ఫొటోలు, మీ సృజనకు పదును పెట్టే బొమ్మలు గీసినా.. కథలు రాసినా, నృత్యాలు నేర్చుకున్న వాటిని ఫొటోలతో సహా పంపొచ్చు. నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలోని రిటైర్డ్ పోస్టుమాస్టర్ నరసింహసాగర్ నివాసంలో ‘మే పుష్పం’ వికసించి చూపరులను కట్టిపడేస్తోంది. దీనిని ఫుట్బాల్ లిల్లీ అని, బ్లడ్ లిల్లీ అని కూడా అంటారు. ఇది లిల్లీ జాతికి చెందిన దుంప రకం మొక్క.సాధారణంగా మే నెలలో మాత్రమే పూసే ఈ పుష్పం ఎర్రటి రంగులో, గుండ్రంగా బంతి ఆకారంలోఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న తరుణంలో వికసించే ఈ ‘మే ఫ్లవర్’ ఏడాది పొడవునా మొక్క దశలో ఉండి, కేవలం ఈ సీజన్లో మాత్రమే తన అందాలను వెదజల్లుతుంది. – కందనూలు వైభవంగా షా అలీ పహిల్వాన్ ఉర్సు కొత్తకోట రూరల్: ట్రాక్టర్ అదుపుతప్పి కాల్వలో బోల్తా పడటంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నాచారంపేట శివారులో చోటు చేసుకుంది. ఎస్ఐ శివానందంగౌడ్ కథనం ప్రకారం...పెద్దమందడి మండలం చిలకటోనిపల్లి గ్రామానికి చెందిన సాయితేజ(19) అదే గ్రామానికి చెందిన గోపాల్ ట్రాక్టర్పై డ్రైవర్గా పనిచేస్తున్నాడు. రోజువారీ పనిలో భాగంగా ఈనెల 9న ట్రాక్టర్ ఇంజన్కు గడ్డి చుట్టే యంత్రాన్ని తీసుకొని కొత్తకోట మండలం నాచారంపేటలో ఓ రైతు పొలంలో గడ్డి చేట్టేందుకు సాయితేజ వెళ్లాడు. రోజంతా పనిచేసి సాయంత్రం 7 గంటల సమయంలో స్వగ్రామానికి ట్రాక్టర్తో తిరుగు ప్రయాణం అయ్యాడు. నాచారంపేట గ్రామ శివారులో కాల్వలో అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పడటంతో సాయితేజ అక్కడిక్కడే మృతి చెందాడు. అటుగా వెళ్తున్న వారు గమనించి పోలీసలకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కాల్వలో నుంచి బయటకు తీసి వనపర్తి మార్చూరీకి తరలించి ట్రాక్టర్ యజమానికి సమాచారం అందించారు. మృతుడి తండ్రి శేరుమీది రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. అలంపూర్: పట్టణంలో వెలిసిన హజ్రత్ షా అలీ పహిల్వాన్ ఉర్సు భక్తిశ్రద్ధలతో కొనసాగుతుంది. ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి దర్గాలో గంధోత్సవం నిర్వహించారు. గుల్బార్గా నుంచి తీసుకొచ్చిన గంధాన్ని మేళతాళాల మధ్య సయ్యద్ఖాదర్ బాషా ఇంటి నుంచి తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ మత పెద్దలు, తహసీల్దార్ ప్రభాకర్తో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం అక్కడి నుంచి నుంచి మత పెద్దలు గంధం శిరస్సుపై పెట్టుకొని సర్ ముబారక్ దర్గా, ధడ్ముబారక్ దర్గాలకు తీసుకెళ్లి గంధోత్సవ ఘట్టాన్ని ముగించారు. ఘనంగా చిన్న కిస్తీ పోటీలు ఉత్సవాల్లో హజ్రత్ షా అలీ పహిల్వాన్ సర్ ముబారక్ దర్గాలో చిన్న కిస్తీ పోటీలు నిర్వహించగా.. యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భక్తులు ప్రసాదాన్ని కిస్తీలో వేసి మొక్కులు చెల్లించుకున్నారు. పహిల్వాన్లు పోటీ పడి కిస్తీ పోటీలు కొనసాగించారు. ఈ సందర్భంగా పహిల్వాన్లు చేసిన విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. మతసామరస్యాన్ని చాటుతూ భక్తులు తరలి వచ్చి దర్గాల్లో మొక్కులు చెల్లించి, ప్రార్థనలు చేశారు. నేడు పెద్ద కిస్తీలు ఉత్సవాలను పురస్కరించుకొని ధడ్ ముభారక్ దర్గాలో సోమవారం పెద్ద కిస్తీ పోటీలు జరగనున్నాయి. పెద్ద కిస్తీ పోటీలు వీక్షించడానికి భక్తులు భారీగా వస్తారని, అందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేశామని నిర్వాహకులు తెలిపారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో సౌకర్యాలను అధికారులు సమీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. రెండు చోరీ కేసులు నమోదు కల్వకుర్తి టౌన్: పట్టణంలోని పలుచోట్ల జరిగిన రెండు చోరీ కేసులు నమోదు చేసినట్లుగా ఆదివారం ఎస్ఐ కురుమూర్తి తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాలిలా.. చారకొండ మండలంలోని సిర్సనగండ్లకు చెందిన ఖాజాభాను సుమారు మూడున్నర తులాల బంగారం లాంగ్ చైన్ను బ్యాగ్లో పెట్టుకొని ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వచ్చేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కింది. రద్దీ ఎక్కువగా ఉండటంతో లగేజీ బ్యాగును బస్సులోని ర్యాక్లో పెట్టి ముందుకు వచ్చి నిలబడింది. కల్వకుర్తిలో బస్సు దిగిన తర్వాత దిగి బ్యాగును చూడగా, అందులో పెట్టిన బంగారు గొలుసు కనపడకపోవటంతో వెంటనే కల్వకుర్తి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇంటి తాళం పగలగొట్టి.. పట్టణంలోని మార్గదర్శి కాలనీలో నివాసముండే లక్ష్మి తన భర్త గోపాల్కు అనారోగ్యంగా ఉండడంతో ఆస్పత్రిలో చూయించేందుకు శుక్రవారం హైదరాబాద్కు వెళ్లారు. బంధువైన మంగమ్మకు ఇంటి తాళం ఇచ్చి, జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది. ఆదివారం ఇంటిపైన ఉన్న బెడ్షీట్స్ తీసేందుకు మంగమ్మ అక్కడికి వెళ్లగా.. ఇంటి తలుపులకు ఉన్న తాళం విరగగొట్టి ఉండటం చూసి లక్ష్మికి సమాచారం ఇచ్చింది. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తాళం పగులగొట్టి ఉండడం గమనించారు. బీరువాలో ఉన్న రెండున్నర తులాల బంగారు ఉంగరాలు, రెండు చిన్న ఉంగరాలు, మహాలక్ష్మి పొదుపు సంఘం డబ్బులు రూ.1.40లక్షలు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి ఖిల్లాఘనపురం: విద్యుదాఘాతంతో వేరు వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని అప్పారెడ్డిపల్లికి చెందిన జోగు బక్కన్న తన ఇంటికి మరమ్మతు పనులు చేయిస్తున్నాడు. సిమెంటు చేసిన గోడలకు నీరు పట్టేందుకు ఆయన కుమారుడు జోగు మహేష్ (22) శనివారం రాత్రి సమయంలో సింగిల్ ఫేస్ మోటార్ పెట్టేందుకు వెళ్లాడు. ఈ సమయంలో ప్రమాదవశాత్తు వైర్లు అతడి చేయికి తగిలి విద్యుదాఘాతానికి గురి కాగా.. కుటుంబ సభ్యులు బాధితుడిని ఖిల్లాఘనపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో అక్కడే వైద్యం పొందుతూ.. శనివారం రాత్రే మృతి చెందాడు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆముదంబండ తండాలో.. ఖిల్లాఘనపురం మండలంలోని ఆముదంబండతండాలో ఆదివారం ఉదయం కేతావత్ బాబు (28) ఇంటి ఆవరణలో ఉన్న మోటార్ ఆన్ చేసి బైక్ కడుగుతున్నాడు. ఈ సమయంలో ప్లగ్ వద్ద వైరు తేలి ఉండటంతో ఒక్కసారిగా షాక్ వచ్చింది. బాబు స్పృహ తప్పి పడిపోవడంతో చికిత్స కోసం ఖిల్లాఘనపురం ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించగా.. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య జ్యోతి, కుమార్తె, కుమారుడు ఉన్నారు. పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. కెతావత్ బాబు (ఫైల్) జోగు మహేష్ (ఫైల్) తెలకపల్లి: నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి పెద్దచెరువులో అదివారం మధ్యాహ్నం మహిళ వృద్ధురాలి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో స్థానికులే చెరువులో నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు. లింగాల మండలం వల్లాభాపూర్ గ్రామానికి చెందిన కిష్టమ్మ(75)గా గుర్తించారు. ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లుగా స్థానికులు తెలిపారు. కుటుంబసభ్యులు ఆమె మృతదేహాన్ని స్వగ్రామానిక తీసుకెళ్లారు. ఈ విషయంపై పోలీసులను వివరాలు అడగగా.. తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. కనువిందు చేస్తున్న మే పుష్పం -
సాఫ్ట్బాల్ సందడి
●మెరుగైన ప్రతిభ కనబరుస్తున్నారు వేసవి సాఫ్ట్బాల్ శిక్షణ శిబిరంలో కొద్ది రోజుల్లోనే విద్యార్థులు మంచి ప్రతిభను కనబరుస్తున్నారు. కొత్లబా ద్లో ఏర్పాటు చేసిన ఈ శిబిరం గ్రామీణ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతున్నది. ఈ శిబిరంలో ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులను గుర్తించి వారికి రెగ్యులర్ శిక్షణ అందజేస్తాం. – లక్ష్మినారాయణ, సాఫ్ట్బాల్ కోచ్ మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను ప్రోత్సహించడానికి జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లాలోని ఎంపిక చేసిన 10 గ్రామ పంచాయతీల్లో ఈ ఏడాది వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు మొదటిసారిగా కోయిలకొండ మండలంలోని కొత్లబాద్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఈనెల 1వ తేదీ నుంచి సాఫ్ట్బాల్ శిబిరం కొనసాగుతోంది. కొత్లబాద్, మల్లాపూర్ గ్రామాలకు చెందిన దాదాపు 25 మంది బాలబాలికలు శిబిరంలో పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ నాగరాజు ప్రోత్సాహంతో కోచ్లు లక్ష్మినారాయణ, మమత విద్యార్థులకు శిక్షణ అందజేస్తున్నారు. గ్రామీణ విద్యార్థులకు సాఫ్ట్బాల్ వేసవి శిక్షణా శిబిరం ప్రతిభకు వేదికలా నిలుస్తుంది. శిబిరంలో మొదట విద్యార్థులకు వార్మప్, ఫిట్నెస్ ట్రైనింగ్ అందజేస్తున్నారు. బేసిక్ అంశాలైన రోల్ బాల్స్, ఫీల్డింగ్, క్యాచింగ్, బేస్ రన్నింగ్, స్లగ్గింగ్, పిచ్చింగ్ ఇస్తున్నారు. విద్యార్థుల త్రో, హ్యాండ్ పవర్ను బట్టి పిచ్చింగ్, స్లగ్గింగ్పై శిక్షణ అందజేస్తున్నారు. ప్రతి శని, ఆదివారాల్లో విద్యార్థులకు రెండు జట్లుగా విభజించి మ్యాచ్లు ఆడిపిస్తున్నారు. కొత్లబాద్లో వేసవి సాఫ్ట్బాల్ శిబిరం ఉత్సాహంగా శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు -
ముగిసిన వేసవి యువ నిర్మాణ శిబిరం
జడ్చర్ల టౌన్: పట్టణంలోని ఆర్యసమాజం ఆధ్వర్యంలో దయానంద విద్యామందిరంలో వారం రోజులుగా నిర్వహిస్తున్న వేసవి యువ నిర్మాణ శిబిరం ఆదివారంతో ముగిసింది. మహబూబ్నగర్, నల్లగొండ, హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల నుంచి మొత్తం 65 మంది శిబిరంలో పాల్గొన్నారు. శిబిరంలో హర్యాన నుంచి వచ్చిన శిక్షకులు కరెన్సీ, డింపుల్, బాలాజీ కర్రసాము, కత్తిసాము, డంబుల్స్, పిరమిడ్, కరాటే, భూమి నమస్కారం, సూర్యనమస్కారాలతో పాటు వ్యక్తిత్వ వికాసం, సమాజం, పెద్దలు, ఇతరులతో ఎలా మెలగాలి అనే అంశాలపై శిక్షణ ఇచ్చారు. అలాగే యజ్ఞాల వల్ల కలిగే ప్రయోజనాలు, భాష పట్ల పట్టు సాధించటం, ఆంగ్ల భాషలో ప్రావీణ్యంపైనా అవగాహన కల్పించారు. భజనలు, వేదోక్త ప్రవచనాలు, ధార్మిక సందేశాలతో భక్తిభావం పెంపొందింపజేశారు. విద్యార్థులకు ప్రతిభ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ముగింపు సందర్భంగా నిర్వహించిన సమావేవంలో ఆచార్య వేదసింధు పాల్గొని నైతిక విలువలతో కూడిన విద్యను అందిస్తున్న ఆర్యసమాజం గూర్చి వివరించారు. పితృభక్తి, మాతృభక్తి, గురు భక్తి, దేశభక్తి, దైవభక్తి అంశాలపై అవగాహన కల్పిస్తూ సందేశమిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర సంగీత నాటక అకాడమి మాజీ చైర్మన్ బి.శివకుమార్, ఆర్యసమాజ ప్రతినిధులు ప్రభాకర్, శ్రీనివాసులు, గుబ్బనర్సింహులు, బక్క రాజేశ్వర్, డి.కృష్ణయ్య, బి. విజయ్కుమార్, గోనెల రాధాకృష్ణ, లావణ్య, ప్రవీణ్ పాల్గొన్నారు. శిక్షణలో అనేక అంశాలు నేర్చుకున్న వేసవి యువ నిర్మాణ శిబిరంలో అనేక అంశాలను నేర్చుకున్నా. ఇక్కడికి రాకముందు ఇతరులతో ఎట్లపడితే అట్ల ఉన్నా. ఇప్పుడు ఎవరితో ఎలా మెలగాలో పూర్తి అవగాహన వచ్చింది. అలాగే సూర్య నమస్కారాలపై మరింత ప్రావీణ్యత సంపాదించగలిగాను. కర్ర, కత్తి సాము లు కూడా నేర్చుకున్న. ఇలాంటి శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. – యోగానంద సాయి, ఇంటర్ విద్యార్థి, నల్లగొండ. కర్రసాము, కత్తిసామునేర్చుకున్న ఆర్యసమాజం ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి ఏటా వేసవిలో యువనిర్మాణ శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ సారి శిబిరంలో టీచర్లు కర్రసాము, కత్తిసాముపై శిక్షణ ఇచ్చారు. రెండింటినీ నేను చాలా ఇష్టంగా నేర్చుకున్నా. సూర్య నమస్కారాలు అయితే మాకు ముందే నేర్పించారు. శిబిరంలో కొత్తగా భూమి నమస్కారాలు నేర్చుకున్నాను. – మణిశంకర్, దయానంద 7వ తరగతి విద్యార్థి. -
క్రికెట్ శిబిరాలకు వేళాయే...
నేటి నుంచి సమ్మర్ క్యాంప్ ● పెబ్బేర్ పీజేపీ మున్సిపల్ మైదానం ● నారాయణపేట మినీ స్టేడియం అచ్చంపేట రూరల్: పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం నుంచి సమ్మర్ క్యాంప్ నిర్వహించనున్నామని ఆ పాఠశాల జీహెచ్ఎం గోపాల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు క్యాంపు కొనసాగనుందని, స్థానికంగా, పట్టణంలో ఉండే 6 నుంచి 9తరగతి విద్యార్థులు క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిబిరంలో పరిశుభ్రత, యోగా, డ్రాయింగ్, పెయింటింగ్, నీతి కథలు చెప్పడం, డాన్స్ వంటి పలు సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, సేవాభావం పెంపొందించే లక్ష్యంతో ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతారని, క్యాంప్లో పాల్గొనే విద్యార్థులకు రోజు స్నాక్స్ కూడా అందిస్తామని తెలిపారు. మహబూబ్నగర్ క్రీడలు: గ్రామీణ ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈ వేసవిలో ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాలకు శ్రీకారం చుట్టారు. హెచ్సీఏ సౌజన్యంతో మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో ఆరు పట్టణాల్లో ఈ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. గతేడాది ఐదు వేసవి శిబిరాలు నిర్వహించగా వందలాదిమంది యువత సద్వినియోగం చేసుకున్నారు. సోమవారం మహబూబ్నగర్, జడ్చర్లలో, 12న నారాయణపేట, గద్వాల, 13న పెబ్బేర్, కల్వకుర్తి పట్టణాల్లో క్రికెట్ శిబిరాలు ప్రారంభం కానున్నాయి. ఆయా శిబిరాల్లో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు శిక్షణ ఉంటుంది. ఈ శిబిరాల్లో అండర్–14, అండర్–16, అండర్–19, అండర్–23 విభాగాల క్రీడాకారులకు శిక్షణ ఇవ్వనున్నారు. నేడు ఎండీసీఏ మైదానంలో ప్రారంభమయ్యే వేసవి ఉచిత క్రికెట్ శిక్షణ శిబిర ఏర్పాట్లను ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ పరిశీలించారు. శిబిరాల్లో క్రీడాకారుల కోసం మౌలిక సౌకర్యాలు కల్పించనున్నారు. క్రీడాకారుల కోసం జంబో కిట్లు, ఫిజికల్ ఫిట్నెస్ కిట్లు అందుబాటులో ఉంచుతారు. కేంద్రాల్లో నిష్ణాతులైన కోచ్లతో శిక్షణ అందిస్తారు. ప్రతి రోజు శిబిరాల్లో శిక్షణ తీసుకుంటున్న క్రీడాకారులకు అల్పాహారం కింద అరటిపండు, గుడ్లతో పాటు తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయనున్నారు. నేటి నుంచి వేసవి ఉచితక్రికెట్ శిక్షణా శిబిరాలు ఉమ్మడి జిల్లాలో ఆరు పట్టణాల్లో ఏర్పాట్లు నాలుగు విభాగాల క్రీడాకారులకు అవకాశం -
ఉమ్మడి జిల్లా క్రీడా కోచ్ల సంఘం అధ్యక్షుడిగా సునీల్
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర క్రీడాప్రాధికారిక కోచ్ల సంఘం ప్రధాన కార్యదర్శి, పరిశీలకులు జె.రాజశేఖర్రెడ్డి సమక్షంలో ఉమ్మడి జిల్లా క్రీడా కోచ్ల సంఘాన్ని (ఎస్ఏటీజీసీఏ) ఎన్నుకున్నారు. కోచ్ల సంఘం అధ్యక్షుడిగా సీనియర్ అథ్లెటిక్స్ కోచ్ ఎం.సునీల్కుమార్, ప్రధాన కార్యదర్శిగా సీనియర్ బాస్కెట్బాల్ కోచ్ ఎండి.ఖలీల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. అనంతరం నూత న అధ్యక్ష, ప్రధాన కార్య దర్శిని పలువురు శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు. కార్యక్రమంలో మ రో పరిశీలకుడు ఎండి.జియావుద్దీన్తోపాటు పలువురు కోచ్లు పాల్గొన్నారు. -
యుద్ధవిద్యలో ప్రావీణ్యం
చిన్నారి కరాటే పంచ్ నేను కరాటే శిక్షణకు వస్తుండటంతో ఫిట్నెస్పై అవగాహన కలిగింది. భయపడకుండా నా పని నేను చేసుకోగలుగుతున్నాను. బయటకు ధైర్యంగా వెళ్లగలుగుతున్నాను. ఫిట్నెస్తో పాటు చదువులో కూడా ఏకాగ్రత కనిపిస్తుంది. – శ్రావ్య, నాగర్కర్నూల్ మాస్టర్ స్వాతి మెళకువలతో నేర్పిస్తున్నారు. కరాటే కేవలం ఆట కాదు. కరాటే యోగాలా కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఉచితంగా నేర్పించడం చాలా బాగుంది. మాస్టర్ నేర్పిన అంశాలను ప్రాక్టిస్ చేస్తూ ధృడంగా తయారవుతున్నాం. – గణేశ్, నాగర్కర్నూల్ -
‘కిస్తీ’మే సవాల్
● ఉత్సాహంగా పెద్దకిస్తీ పోటీలు ● వైభవంగా షా అలీ పహిల్వార్ దర్గా ఉర్సు ● ప్రసాదం కోసం పోటీపడిన పహిల్వాన్లు ● వేలాదిగా తరలివచ్చిన భక్తులు అలంపూర్: హజరత్ షా అలీ పహిల్వాన్ ఉర్సులో కిస్తీ పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. భక్త జనసందోహం మద్య పెద్ద కిస్తీ పోటీలు పోటాపోటీగా జరిగాయి. కిీస్తీలో వేసిన తబురుక్(ప్రసాదం) కోసం పహిల్వాన్లు పోటీ పడ్డారు. కిస్తీలో వేసిన ప్రసాదాన్ని పహిల్వాన్లు భక్తులపైకి విసురుతూ ఉర్సు ప్రాధాన్యతను కొనసాగించారు. అలంపూర్లో వెలిసిన హజ్రత్ షా అలీ పహిల్వాన్ ఉర్సు సోమవారం మూడోరోజుకు చేరుకుంది. హజ్రత్ షా అలీ పహిల్వాన్ ధడ్ ముబారక్ దర్గాల్లో పెద్ద కిస్తీ పోటీలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉర్సుకు ప్రధాన ఆకర్షణగా నిర్వహించే పెద్ద కిస్తీ పోటీలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలొచ్చారు. పహిల్వాన్లు అబ్బురపరిచే విన్యాసాలతో వీక్షకులను అలరిస్తూ కిస్తీల్లో పోటీపడ్డారు. భక్తులు ఆనందోత్సవాల మధ్య కిస్తీ పోటీలను తిలకించారు. ఉత్సాహంగా ఉర్సు హజ్రత్ షా అలీ పహిల్వాన్ ఉర్సును భక్తులు ఉత్సహంగా జరుపుకొన్నారు. పెద్ద కిస్తీ పోటీల కోసం భక్తులు ప్రసాదాన్ని మేళతాలల మధ్య ఊరేగింపుగా తీసుకొచ్చి కిస్తీ పోటీలకు సమర్పించారు. పట్టణంలోని వివిధ కాలనీలు, మండలంలోని ఆయా గ్రామాల నుంచి సైతం భక్తులు కిస్తీ పోటీలకు ప్రసాదంను అందించి తమ మొక్కులు తీర్చుకున్నారు. ప్రత్యేక అండాల్లో(పలావ్) సిద్ధం చేసుకొని కాడేద్దుల బండ్లు, ట్రాక్టర్లలో దర్గా వద్దకు చేరుకొని ప్రసాదం అందించి కిస్తీలను కొనసాగించారు. ఉర్సుకు తరలివచ్చిన భక్తజలతో ప్రధాన వీధులు సందడిగా మారాయి. ఉర్సుకు చుట్టుపక్కల గ్రామాలతోపాటు వివిధ ప్రాంతాల భక్తులు వచ్చారు. ప్రధాన రహదారుల్లోని మిఠాయి, బొమ్మల, బ్యాంగిల్స్ దుకాణాలు కొనుగోళ్లతో రద్దీగా కనిపించాయి. రంగులరాట్నాల వద్ద పిల్లలు సందడి చేశారు. ఉర్సు ఉత్సవాలలో సర్కారి కిస్తీయే ప్రధానంగా కొనసాగుతుంది. దర్గా అభివృద్ధి కమిటీ చైర్మన్ సయ్యద్ అహ్మద్ షా ఒవైసీ అధ్వర్యంలో సర్కారి కిస్తీ పోటీలు ప్రారంభించారు. ఎమ్మెల్యే విజయుడు దర్గాలను సందర్శించి ప్రార్థనలు చేశారు. అనంతరం కిస్తీ వద్దకు వద్దకు చేరుకున్నారు. నిర్వాహక కమిటీ సభ్యులు ఎమ్మెల్యే విజయుడు, మున్సిపల్ చైర్మన్ జయరాముడు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహ్మద్ ఇస్మాయిల్ను శాలువాలు, పూలమాలతో సన్మానించారు. అనంతరం సయ్యద్ ఖాదర్ బాషా ఇంటినుంచి వచ్చిన సర్కారి కిస్తీని ఊరేగింపుగా దర్గాల వద్దకు తీసుకొచ్చారు. అక్కడ నిర్వాహక కమిటీ సభ్యులు ప్రసాదంను పడవలాంటి ఆకారంలో ఉన్న కిస్తీలో నింపి సర్కారి కిస్తీని సిద్ధం చేశారు. మతపెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం కిస్తీ పోటీలను ప్రారంభించారు. పహిల్వాన్లు పోటీపడుతు బలప్రదర్శనతో ప్రసాదాన్ని దక్కించుకోని భక్తులపైకి విసిరుతూ పోటీలను కొనసాగించారు. కిస్తీ పోటీలకు వచ్చిన పహిల్వాన్లు విన్యాసాలను ప్రదర్శిస్తూ ఆహుతులను ఆకట్టుకున్నారు. ఉర్సులో సీఐ ప్రదీప్, ఎస్ఐ రామకృష్ణల అధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
మక్కల కుప్పను ఢీకొని యువకుడు దుర్మరణం
గోపాల్పేట: రోడ్డుపై ఆరబోసిన మక్కల కుప్పను బైక్తో ఢీకొని ఓ యువకుడు మృతిచెందినట్లు ఎస్ఐ జగన్మోహన్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఏదుల మండల కేంద్రానికి చెందిన వీరపాగ కృష్ణ(25) ఆదివారం సాయంత్రం రేవల్లికి వెళ్లాడు. రాత్రికి తిరిగి వస్తుండగా ఏదుల రిజర్వాయర్ వద్ద రోడ్డుపై బ్రిడ్జిపై అనంతపురం గ్రామానికి చెందిన చిన్ననర్సింహ మక్కలను ఆరబోసి నల్లకవర్ కప్పి వెళ్లిపోయాడు. ఇది గమనించకుండా బైక్పై వెళ్లి మక్కలకుప్పను ఢీకొట్టడంతో కృష్ణ ఎగిరిపడి అక్కడికక్కడే మృతిచెందాడు. సోమవారం ఉదయం అక్కడికి వచ్చిన రైతులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడి తండ్రి దానయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బావిలో పడి వృద్ధురాలి మృతి మానవపాడు: ప్రమాదవశాత్తు బావిలో పడి వృద్ధురాలు మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ స్వాతి తెలిపిన కథనం ప్రకారం.. మండలంలోని జల్లాపురం గ్రామానికి వడ్డె లక్ష్మమ్మ (80) సోమవారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందింది. మృతురాలికి నలుగురు కుమారులు, ముగ్గరు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై ఎస్ఐ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తామని ఎస్ఐ పేర్కొన్నారు. కొత్త యాపట్లలో పులి కలకలం పెద్దకొత్తపల్లి: మండలంలోని కొత్తయాపట్ల నల్లమల అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరించడంతో గ్రామస్తులు భయందోళనకు గురయ్యారు. గ్రామానికి చెందిన గొల్ల శివుడు ఆదివారం సాయంత్రం అడవిలో మేకలను మేపుకొని ఇంటికి తిరిగి వస్తుండగా.. మేకల గుంపుపై పెద్ద పులి దాడి చేసి ఒక మేకను లాక్కెళ్లిందన్నారు. మంద వెంట ఉన్న కుక్కలు పులిని వెంబడించగా మేకను వదిలిపెట్టి అడవిలోకి పారిపోయిందని గొర్రెల కాపారి తెలిపారు. కొత్త యాపట్ల సమీపంలో పులి కనిపించడంతో గొర్రెల కాపారులు, గ్రామస్తులు రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. -
క్రికెట్ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
● ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ ● పాలమూరులో వేసవి ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభం మహబూబ్నగర్ క్రీడలు: వేసవి క్రికెట్ శిక్షణ శిబిరాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ అన్నారు. జిల్లాకేంద్రం పిల్లలమర్రి రోడ్డు సమీపంలోని ఎండీసీఏ మైదానంలో ఏర్పాటు చేసిన వేసవి ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాన్ని సోమవారం ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డిప్యూటీ మేయర్ ఎం.సురేందర్రెడ్డి తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముడా చైర్మన్ మాట్లాడుతూ క్రికెటర్లు ఆటపై ఆసక్తి, పట్టుదలతో ఆడాలని సూచించారు. మైదానంలో అభివృద్ధి పనులకు తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు. డిప్యూటీ మేయర్ ఎం.సురేందర్రెడ్డి మాట్లాడుతూ జిల్లా క్రీడాకారులు క్రికెట్లో రాష్ట్రానికి, జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. జిల్లా క్రికెటర్లు ఇండియాకు, ఐపీఎల్లో ఆడాదని, మిమ్మల్ని టీవీలో చూడాలనే ఆకాంక్ష ఉందన్నారు. ఇష్టపడి, పట్టుదలతో క్రికెట్ ఆడి ఉన్నతస్థాయికి చేరుకోవాలన్నారు. ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ మాట్లాడుతూ ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో ఆరు చోట్ల వేసవి ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిభ కనబరిచే క్రీడాకారులను గుర్తించి అండర్–14, 16 జట్లుగా విభజించి మ్యాచ్లు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతిభ కనబరుస్తున్న క్రీడాకారులను రానున్న హెచ్సీఏ టోర్నమెంట్లకు ఎంపిక చేస్తామన్నారు. అనంతరం ముడా నిధులతో ఏర్పాటు చేసిన వాటర్ప్లాంట్ను ప్రారంభించారు. కార్యక్రమంలో టీజేఏసీ మాజీ చైర్మన్ రాజేందర్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మేఘ్యానాయక్, ఎండీసీఏ ఉపాధ్యక్షులు సురేష్కుమార్, కార్యదర్శి రాజశేఖర్, సంయుక్త కార్యదర్శి వెంకటరామారావు, కోచ్లు గోపాలకృష్ణ, అబ్దుల్లా, ఎండీ మన్నాన్, ముఖ్తార్అలీ, ఆబిద్ హుస్సేన్, సీనియర్ క్రీడాకారుడు రంజిత్కుమార్ పాల్గొన్నారు. -
‘రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైంది’
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): మహిళలకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందిన మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. సోమవారం తెల్లవారుజామున బైపాస్లోని పాల్కొండ చౌరస్తాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన బాధిత కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూకట్పల్లిలో ఒక అమ్మాయిని చంపేసి దొంగతనం చేశారని, మాజీ డీజీపీ భార్యను చంపి దొంగతనం చేసినట్లు తెలిపారు. బాధ్యత గల కేంద్ర మంత్రి పదవిలో ఉన్న బండి సంజయ్ కొడుకు భగీరథను అదుపులో పెట్టుకోలేదని, ర్యాగింగ్ చేసిన సమయంలోనే అదుపులో పెట్టి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని తెలిపారు. కొడుకును గాలికి వదిలేయడంతో అమ్మాయి జీవితాలతో చెలగాటం అడుతున్నారడని ఆరోపించారు. అమ్మాయి కేసు పెడితే పోలీసులు కనీసం కేసు నమోదు చేసుకోలేదని విమర్శించారు. అమ్మాయిపై తెలివిగా వేరే ప్రాంతంలో కేసులు పెట్టించి కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. హిందువులు, ముస్లింలను రెచ్చగొట్టుడు తప్పా.. బండి సంజయ్ రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. సంజయ్ స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకోవాలని, కొడుకుపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు సహకారం ఇవ్వాలన్నారు. కేసీఆర్, కేటీఆర్ మీద నోరు పారేసుకోవడం తప్పా రాష్ట్రానికి ఒక్కపైస తెచ్చే తెలివిలేదన్నారు. రాష్టంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై పని చేస్తున్నాయని ఆరోపించారు. రాష్టంలో శాంతి భద్రతలు క్షీణించాయనడానికి రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలే నిదర్శనమన్నారు. ఇలాంటి పరిస్థితులు ఉంటే బయటి నుంచి పెట్టుబడులు రావడం కష్టం అవుతుందన్నారు. -
రండి.. విశేషాలు పంచుకుందాం
మీరు ఫొటోలు, విశేషాలు, గీసిన చిత్రాలను 94415 43232 నంబర్కు వాట్సప్ చేయండి. పరీక్షలు ముగిశాయి. స్కూళ్లకు సెలవులూ వచ్చాయి. అమ్మా, నాన్నలకూ రిలీఫ్ దొరికితే.. అలా అంతా ఓ ట్రిప్ వేయొచ్చు. అది అమ్మమ్మ, తాతల ఇంటికి కావచ్చు. లేదా పర్యాటక కేంద్రానికి కావచ్చు. జాలీగా ఇంకెక్కడైనా కావచ్చు. ఆ అనుభవాలను ‘సాక్షి’తో పంచుకోండి. వేసవిలో మీరు చూసిన విశేషాలు, అక్కడ తీసుకున్న ఫొటోలు పంపండి. వీటితో పాటు మీ అనుభూతిని రాయడం మరవకండి. అలాగే అమ్మమ్మ, నానమ్మ ఊరిలో గడిపిన సన్నివేశాల ఫొటోలు, మీ సృజనకు పదును పెట్టే బొమ్మలు గీసినా.. కథలు రాసినా, నృత్యాలు నేర్చుకున్న వాటిని ఫొటోలతో సహా పంపొచ్చు. వీటిని ప్రచురించి మీ సందడిని అందరితో పంచుకునేలా చేస్తాం. -
పీయూలో ఇంజినీరింగ్ ల్యాబ్స్ ప్రారంభం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూలో ఇంజినీరింగ్ కళాశాల బీఈఈ ల్యాబ్, ఇంజనీరింగ్ వర్క్షాప్, ఇంజినీరింగ్ ఫిజిక్స్ ల్యాబ్ను పీయూ వీసీ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ల్యాబ్స్ వినియోగించడంతో విషయ పరిజ్ఞానం పెరుగుతుందని, సబ్జెక్టుతోపాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ పెరుగుతుందన్నారు. విద్యార్థులు బాగా చదివి శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, ప్రిన్సిపాల్ చంద్రకిరణ్, కంట్రోలర్ ప్రవీణ, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. -
బైక్ ఢీకొని రైతు మృతి
మన్ననూర్: అమ్రాబాద్–మన్ననూర్ ప్రధాన రహదారిలో జరిగిన ప్రమాదంలో రైతు మృతిచెందిన ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మన్ననూర్లోని అంబేడ్కర్ కాలనీకి చెందిన పంబలి తిర్మలయ్య(68) వ్యక్తిగత పని నిమిత్తం బటకు వెళ్లి తిరిగి వస్తుండగా.. ఇంటికి కొద్ది దూరంలో కుమ్మరోనిపల్లికి చెందిన ఆర్టీసీ పీహెచ్బీ (ప్రైవేటు) డ్రైవర్ రాకేష్ బైక్తో వేగంగా వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టాడు. తల వెనుకభాగం, కాలు, చేతులకు తీవ్రగాయాలు కావడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యసిబ్బంది వైద్యం అందించే విషయంలో నిర్లక్ష్యం వహించడంతో మృతిచెందాడనే ఆరోపణలు ఉన్నాయి. అయతే ఘటన జరిగిన వెంటనే బాధితులు 108 అంబులెన్స్కు ఫోన్ చేశారు. అప్పటికే స్వల్పగాయాలతో ఉన్న రాకేష్తో ఉన్న అంబులెన్స్ ఆస్పత్రి వద్దకు వేగంగా వెళ్లిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆస్పత్రి, 108 అంబులెన్స్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే తిర్మలయ్య మృతిచెందాడని ఆవేశానికి గురైన బంధువులు ఆస్పపత్రి ఆవరణలో ఆందోళనకు దిగారు. అమ్రాబాద్ పోలీసులు ఆందోళనకారులను శాంతింపజేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య బాలకిష్టమ్మతోపాటు కూతురు, కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అమ్రాబాద్ ఎస్ఐ హన్మంత్రెడ్డి తెలిపారు. -
వామ్మో.. బైపాస్!
● ఇటీవల పాలకొండకు చెందిన ఓ మహిళ బైపాస్ రోడ్డులో వాకింగ్ చేస్తుండగా.. వెనుక నుంచి వచ్చిన ఒక బైక్ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఆ మహిళ మృతి చెందింది. ● తాజాగా హైదరాబాద్కు చెందిన ఓ యువకుడు దాదాపు స్పోర్ట్స్ బైక్ను 200కిలోమీటర్ల వేగంతో పాలకొండ చౌరస్తాలో యూటర్న్ తీసుకుంటున్న కారును ఢీ కొట్టింది. కారు బోల్తా పడడంతో పాటు బైక్ నుజ్జునుజ్జుగా మారింది. ఈ ఘటనలో బైక్ రైడర్తో పాటు వెనుక కూర్చున యువకుడు, కారులో ఉన్న ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. -
తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం
● ప్రశ్న: తెలంగాణ చౌరస్తాలో తరచూ మెయిన్ పైపులైన్ పగిలి తాగునీరు లీకేజీ అవుతోంది. ఎన్నిసార్లు బాగు చేసినా ఉపయోగం లేకుండాపోతోంది. – మోహన్, క్రిస్టియన్కాలనీ (డివిజన్ నం.41) ● మేయర్: తాగునీటి వ్యవస్థ పటిష్టానికి నగరానికి మంజూరైన రూ.220 కోట్లతో త్వరలోనే కొత్త పైపులైన్ వేయనున్నాం. అప్పుడు తప్పక అక్కడ మార్చి ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారమయ్యేలా చూస్తాం. ● సమస్యాత్మక ప్రాంతాలకు ట్యాంకర్లు ● నగర మేయర్ జి.మమత ● ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమానికి విశేష స్పందన ● ప్రశ్న: వారంలో రెండు రోజులు మాత్రమే మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు వస్తోంది. అందులోనూ ఒండ్రు కలిసి రావడంతో తాగే పరిస్థితి లేదు. – శాంతిభూషణ్, బీసీ కాలనీ, ఏనుగొండ (డివిజన్ నం.2) ● మేయర్: ఇక నుంచి సమీపంలోని ఓవర్హెడ్ ట్యాంకును శుభ్రం చేయించిన తర్వాతే తాగునీరు వదులుతాం. ● ప్రశ్న: పీహెచ్సీ సమీపంలోని పాత నీటి ట్యాంకు వద్ద అంతా అపరిశుభ్రంగా ఉంది. అక్కడ చెత్తాచెదారం వేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో తాగునీరు కలుషితమయ్యే ప్రమాదం పొంచి ఉంది. – ఆనంద్కుమార్, సుభాష్నగర్ (డివిజన్ నం.56) ● మేయర్: అక్కడికి పారిశుద్ధ్య సిబ్బందిని పంపించి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయిస్తాం. చెత్త వేయొద్దని బోర్డు ఏర్పాటు చేయిస్తాం. ● ప్రశ్న: ఆరు నెలలుగా మా ప్రాంతంలోని పవర్ బోర్ పని చేయడం లేదు. ఈ విషయమై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఇంత వరకు స్పందించడం లేదు. – సిద్దిరామప్ప, జగదాంబ కాలనీ, (డివిజన్ నం.45) ● మేయర్: అక్కడికి ఇంజినీరింగ్ అధికారులను పంపిస్తాం. వీలైనంత త్వరగా పవర్ బోరును బాగు చేయిస్తాం. మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నగరంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి సమస్యలను పరిష్కరిస్తామని మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జి.మమత హామీ ఇచ్చారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలకు వాటర్ ట్యాంకర్లు పంపిస్తామన్నారు. ఇదే అంశంపై ‘సాక్షి’ ఆధ్వర్యంలో సోమవారం ఆమెతో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. పలువురు నగర ప్రజలు తమ డివిజన్లలో నెలకొన్న తాగునీటి సమస్యలను ప్రస్తావించారు. ● ప్రశ్న: మిషన్ భగీరథ పథకం పైపులైన్లు పగిలినప్పుడు తాగునీటి సరఫరా నిలిచిపోతోంది. దీనిపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా వెంటనే స్పందించడం లేదు. – షేక్ ఫారూక్ హుస్సేన్, షాషాబ్గుట్ట–న్యూటౌన్ ప్రాంతం (డివిజన్ నం.59) ● మేయర్: వెనువెంటనే బాగు చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచిస్తాం. ఇక ముందు ఎలాంటి సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. ● ప్రశ్న: నెల రోజులుగా మా ఇంటి (నం.1–1–9/22/3/2)కి మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు సరఫరా కావడం లేదు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. చుట్టుపక్కల వారికి వస్తున్నా, మాకు మాత్రం అందడం లేదు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ స్పందించడం లేదు. – కె.రాములు, న్యూమోతినగర్ (డివిజన్ నం.18) ● మేయర్: మీ ప్రాంతానికి వెంటనే ఇంజినీరింగ్ సిబ్బందికి పంపించి ఈ సమస్యను పరిష్కరిస్తాం. ● ప్రశ్న: మా ప్రాంతానికి మూడు రోజులకోసారి మాత్రమే తాగునీరు సరఫరా అవుతోంది. పాల్సాబ్గుట్టలోని ఓవర్హెడ్ ట్యాంకు నుంచి సన్నగా వస్తున్నాయి. దీంతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. – బాబా, సద్దలగుండు (డివిజన్ నం.47) ● మేయర్: మిషన్ భగీరథ పథకం ద్వారా సరఫరా కాని రోజుల్లో అక్కడికి మున్సిపల్ వాటర్ ట్యాంకర్ను పంపిస్తాం. ● ప్రశ్న: వేసవికాలం కావడంతో తరచూ తాగునీటి సమస్య తలెత్తుతోంది. సమీపంలోని పవర్ బోరు నుంచి నీరు సైతం సరిగా రావడం లేదు. – అనుపటి చెన్నయ్య, ఎస్సీ కాలనీ, ఏనుగొండ (డివిజన్ నం.2) ● మేయర్: ఇంజినీరింగ్ సిబ్బందిని అక్కడికి పంపి పవర్ బోరు ప్రెస్సింగ్ చేయిస్తాం. ● ప్రశ్న: మూడు రోజులకోసారి మిషన్ భగీరథ పథకం ద్వారా వస్తున్న తాగునీరు ఎక్కువ సేపు వదలాలి. సన్నగా వదలడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. – శ్రీకాంత్, ఎదిర (డివిజన్ నం.5)/ రమేష్, ఏనుగొండ (డివిజన్ నం.6) ● మేయర్: మీ ప్రాంతాలకు అవసరమైనప్పుడు మున్సిపల్ ట్యాంకర్ పంపిస్తాం. -
ఒక ప్రమాదం.. 2 కుటుంబాల్లో విషాదం
మహబూబ్నగర్ క్రైం: పాలకొండ బైపాస్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో స్పోర్ట్స్ బైక్ రైడర్ అతివేగం వల్ల నగరంలో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. న్యూ ప్రేమ్నగర్కు చెందిన మహ్మద్ బాసిద్ భార్య సారాబేగం ఇద్దరు పిల్లలతో పాటు రబియా మజీద్ ఏరియాకు చెందిన సారాబేగం తల్లి గౌసియా బేగం ఆమె కొడలు రేష్మా ఖాతూమ్, ఇద్దరు మనవలతో కలిసి యూబీ గార్డెన్లో జరిగిన బంధువుల పెళ్లికి హాజరయ్యారు. అప్పటి వరకు సంతోషంగా గడిపిన ఆ రెండు కుటుంబాలు శుభకార్యం పూర్తి చేసుకొని తిరిగి ఇంటికి వస్తున్న క్ర మంలో బైకర్ రూపంలో వచ్చిన ప్రమాదం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. దీంతో ప్రేమ్నగర్తో పాటు రబియా మజీద్ ఏరియా(మర్లు)లో విషాదం అలుముకుంది. అటు మహ్మద్ బాసిద్ కుటుంబంలో బాసిత్తో పాటు అతని ఏడేళ్ల కొడుకు మహ్మద్ జైద్ గాయపడ్డారు. భార్య సారా బేగం(30), కొడుకు హుజేఫా(9) మృతి చెందారు. ఇటు గౌషియా బేగం, ఆమె కొడలు రేష్మా ఖాతూ మ్, నాలుగేళ్ల మనవడు మహ్మద్ జమాద్ద్దీన్ తీవ్రంగా గాయపడ్డారు. మరో రెండేళ్ల మనవడు మహ్మద్ హమ్మర్ మృతి చెందాడు. ఇటీవల దుబాయ్ వెళ్లిన హమ్మర్ తండ్రి మహ్మద్ ఇమ్రాన్ వెంటనే ఇండియాకు బయల్దేరాడు. ప్రమాద విషయం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు సోమవారం జనరల్ ఆస్పత్రికి భారీగా చేరుకున్నారు. ఇద్దరూ స్నేహితులే.. ఈ ఘటనలో మృతి చెందిన బైకర్లు హైదరాబాద్లోని చార్మినార్కు చెందిన మహ్మద్ అబ్దుల్ ఒవైజ్(30), మెహదీపట్నంకు చెందిన ఎండీ యాకూబ్ అబ్జల్(26) ఇద్దరూ స్నేహితులే. ఆదివారం రాత్రి మహబూబ్నగర్లోని మెట్రో ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమానికి మరికొంతమంది స్నేహితులతో కలిసి హైదరాబాద్ నుంచి స్పోర్ట్స్ బైక్లపై మహబూబ్నగర్కు వచ్చారు. కార్యక్రమం పూర్తి చేసుకుని తిరిగి హైదరాబాద్ వెళ్తుంటే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన బైక్ రిజిస్ట్రేషన్ మాత్రం హర్యాన పాసింగ్ ఉండటం విశేషం. వీరితో పాటు వచ్చిన ఇతర బైకర్లు ఎవరు? ప్రమాదం జరిగిన తర్వాత వారు ఎటూ వెళ్లారు అనేది మహబూబ్నగర్ పోలీసులు ఆరా తీసే పనిలో ఉన్నారు. ● రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఐదుగురు మృతదేహలను జనరల్ ఆస్పత్రి పోస్టుమార్టంకు తరలించారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రులకు తరలించారు. ఘటన జరిగిన తీరుతో పాటు ఇతర అంశాలను అదనపు ఎస్పీ ఎన్బీ రత్నం, డీసీఆర్బీ డీఎస్పీ రమణారెడ్డి, సీసీఎస్ సీఐ కృష్ణ, రూరల్ ఎస్ఐ విజయ్కుమార్ పర్యవేక్షించి బాధిత కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. బైపాస్పై రోడ్డు ప్రమాదంలో ఐదుగురి దుర్మరణం మరో ఐదుగురికి తీవ్ర గాయాలు ప్రేమ్నగర్, రబియా మజీద్ ఏరియాలో విషాదం -
ప్రజావాణికి 114 వినతులు
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ప్రజావాణిలో బాధితుల నుంచి అందిన ఫిర్యాదులు పెండింగ్లో ఉంచకుండా ప్రతి దరఖాస్తును సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజావాణికి జిల్లా అధికారులు కచ్చితంగా హాజరు కావాలన్నారు. పంచాయతీరాజ్, మున్సిపల్, ఎకై ్సజ్, భూ సర్వే రికార్డులు, గృహనిర్మాణం, జిల్లా సంక్షేమం, వెనుకబడిన తరగతుల సంక్షేమం, రోడ్డు రవాణా, బ్యాంకింగ్, పోలీస్, విద్య, వైద్యం, గ్రామీణ అభివృద్ధి తదితర శాఖలకు సంబంధించిన 114 వినతులను అధికారులు నమోదు చేసుకున్నారు. అడిషనల్ కలెక్టర్లు మధుసుదన్నాయక్, హరిప్రియ, డీఆర్ఓ రాంరెడ్డి, జెడ్పీ సీఈఓ వెంకట్ రెడ్డి, డీఆర్డీఓ నరసింహులు పాల్గొన్నారు. ఈవీఎం గోదాం తనిఖీ కలెక్టరేట్ ఆవరణలో ఉన్న ఈవీఎం గోదాం భద్రత ఏర్పాట్లు, సీల్ను కలెక్టర్ ఖుష్బూగుప్తా తనిఖీ చేశారు. ఎన్నికల సామగ్రి భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు. ఎస్టీ గురుకులాల్లో అడ్మిషన్లు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలు గురుకులాల్లో ఖాళీగా ఉన్న ఇంటర్మీడియట్ సీట్లను భర్తీ చేస్తున్నట్లు ఆర్సీఓ కల్యాణి ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 9 గురుకులాల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయని, వాటిని ఈ నెల 16, 18 కౌన్సెలింగ్ నిర్వహించిన భర్తీ చేస్తామన్నారు. ధర్మాపూర్ వద్ద ఉన్న ఎస్టీ బాలికల హాస్టల్లో కౌన్సెలింగ్ ఉంటుదని, పదోతరగతి ఉత్తీర్ణులైన వారు, ఒరిజినల్ సర్టిఫికెట్లుతో హాజరుకావాలని, మరింత సమాచారం కోసం 94909 57312, 94909 57314, 94909 57315 నంబర్లను సంప్రదించాలని సూచించారు. క్రీడాకారులకు సన్మానం మహబూబ్నగర్ క్రీడలు: వరంగల్లో ఈనెల 10వ తేదీన జరిగిన రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల అథ్లెటిక్స్ పోటీల్లో పతకాలు సాధించిన జిల్లా క్రీడాకారులను సన్మానించారు. ఈ పోటీల్లో పురుషుల 400 మీటర్ల పరుగులో డి.శ్రీధర్ బంగారు పతకం, 18ఏళ్ల లోపు బాలికల విభాగం డిస్కస్త్రోలో పౌర్ణమి బంగారం, షాట్పుట్లో కాంస్యం, 18 ఏళ్లలోపు బాలికల విభాగం లాంగ్జంప్లో సాయికీర్తన కాంస్యం, 20 ఏళ్ల లోపు బాలుర 400 మీటర్ల పరుగులో కేతావత్ నవీన్ కాంస్యం సాధించినట్లు జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్చంద్ర పేర్కొన్నారు. అథ్లెట్లను సోమవారం జిల్లా అథ్లెటిక్స్ సంఘం ఉపాధ్యక్షుడు రాజేంద్రకుమార్. సి.శ్రీనివాసులు శాలువాలతో సత్కరించి అభినందించారు. -
ఆత్మబంధువులు
● నిస్వార్థ సేవలతో ఎంతోమంది ప్రాణాలు రక్షిస్తున్న వైనం ● ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్సీల్లో కీలక విధుల నిర్వహణ ఆస్పత్రుల్లో అభాగ్యులకు అండగా నిలుస్తున్న నర్సులు ● పాలమూరు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల జనరల్ ఆస్పత్రిలోని ఎంసీహెచ్ బ్లాక్లో కొనసాగుతుంది. ఈ కళాశాలలో ఫస్టియర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు తగరతులు ఉండగా మొత్తం 231 మంది విద్యార్థులు నర్సింగ్ అభ్యసిస్తున్నారు. ఫస్టియర్లో 59, సెకండియర్లో 58, థర్డ్ ఇయర్లో 57, ఫోర్త్ ఇయర్లో 57 మంది ఉన్నారు. నర్సింగ్ కళాశాలకు సొంత భవనం లేకపోవడంతో తరగతుల నిర్వహణ, వసతి గృహానికి సమస్యగా మారింది. ఇటీవల మెడికల్ కళాశాల సమీపంలో ఐదు ఎకరాల్లో శాశ్వత కళాశాల భవనం, హాస్టళ్లు నిర్మించాలని భూమి చదును చేశారు. దాదాపు రూ.40 కోట్లతో కళాశాల భవనం రెండు అంతస్తులు, హాస్టళ్లు రెండు అంతస్తులు, క్రీడా స్థలాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు రూపొందించారు. అలాగే నారాయణపేట జిల్లాలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో 120 మంది విద్యార్థులు నర్సింగ్ అభ్యసిస్తున్నారు. ● గద్వాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో 11 మంది స్టాఫ్ నర్సులు, 72 మంది జీఎన్ఎమ్లు, అలంపూర్ ఏరియా ఆస్పత్రిలో 27 మంది నర్సులు, ఇతర ఆస్పత్రుల్లో 156 మంది నర్సులు ఉన్నారు. గద్వాల నర్సింగ్ కళాశాలలో 320 మంది విద్యార్థులు నర్సింగ్ అభ్యసిస్తున్నారు. ● వనపర్తి జిల్లా ఆస్పత్రితో పాటు పీహెచ్సీలు, ఇతర ఆస్పత్రుల్లో మొత్తం 326 మంది నర్సింగ్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు, ఎన్హెచ్ఎంలు ఉన్నారు. జిల్లాకేంద్రంలో 214 మంది విద్యార్థులు నర్సింగ్ కోర్సు చేస్తున్నారు. ● నాగర్కర్నూల్ జనరల్ ఆస్పత్రిలో గ్రేడ్, హెడ్ నర్సులతో పాటు జీఎన్ఎంలు 327 మంది, అచ్చంపేట, కొల్లాపూర్ ఏరియా ఆస్పత్రుల్లో 42 మంది, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 76 మంది, పీహెచ్సీల్లో 32 మంది, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 400 మంది నర్సులు ఉన్నారు. ఇక ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో 160 మంది, రెండు ప్రైవేట్ కళాశాలల్లో 300 మంది విద్యార్థులు నర్సింగ్ అభ్యసిస్తున్నారు. నేడు ప్రపంచ నర్సుల దినోత్సవం -
హెచ్పీవీ నత్తనడకన
ఫోన్ చేయాల్సిన నంబర్: 94413 57967 తేది: 11–05–2026, సమయం: సోమవారం ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ● జిల్లాలో 14–15 ఏళ్లు బాలికలు 8,563 ఉన్నట్లు గుర్తించిన ఆరోగ్యశాఖ ● రెండు నెలల్లో 2,510 మందికే వ్యాక్సినేషన్ ● అర్బన్, కమ్యూనిటీ హెల్త్సెంటర్ల్లో అధ్వానం ● లక్ష్యంలో 50 శాతం కూడా చేరని వైనం పాలమూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెచ్పీవీ వ్యాక్సినేషన్ పంపిణీ జిల్లాలో నత్తనడకన సాగుతోంది. కిషోర బాలికల్లో భవిష్యత్లో సర్వైకల్ (గర్భాశయ ముఖ ద్వారా) క్యాన్సర్ రాకుండా ప్రభుత్వం ప్రారంభించిన హెచ్పీవీ వ్యాక్సిన్ ఆదరణ లభించడం లేదు. 14–15 వయసు మధ్య బాలికలకు ఉద్దేశించిన ఈ వ్యాక్సిన్ను మార్చి 8న మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో ప్రారంభించారు. అయితే ఈ టీకా విషయంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అవగాహన కల్పించకపోవడం, అపోహ లు నెలకొనడంతో కార్యక్రమం నత్తనడకన సాగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు నెలల వ్యవధిలో జిల్లాలో కేవలం 2,510 మంది బాలికలకు మాత్రమే టీకాలు అందించారు. హెచ్పీవీ వ్యాక్సిన్ ఇవ్వడానికి జిల్లా వ్యాప్తంగా 14–15 ఏళ్లు ఉన్న బాలికలను 8,563 మందిని గుర్తించారు. రెండు నెలలు గడుస్తున్న లక్ష్యంలో 50 శాతం కూడా చేరుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా 14–15 ఏళ్ల బాలికలకు హెచ్పీవీ టీకాలను వేయడానికి జనరల్ ఆస్పత్రి, జడ్చర్ల ఆస్పత్రిలో మార్చి 8న కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆనంతరం అర్బన్ హెల్త్సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సైతం విస్తరించారు. ఇప్పటి వరకు జనరల్ ఆస్పత్రిలో 406, గండేడ్లో 339, జడ్చర్లలో 215, నవాబ్పేటలో 176, బాలానగర్లో 163, జానంపేట 134, ఎదిర 211, భూత్పూర్లో 102 మంది మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చారు. నగరంలో ఉన్న అర్బన్ హెల్త్సెంటర్లలో ఇప్పటి వరకు కుమ్మరివాడిలో ఒకరు, మోతీనగర్లో ఆరు, రామయ్యభౌళిలో ఒకరు, పాత పాలమూరులో ఇద్దరికి ఇచ్చారు. పలు పీహెచ్సీల్లో వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య రెండు అంకెలు కూడా దాటలేదు. -
సెల్ఫోన్లను సద్వినియోగం చేసుకోవాలి
మహమ్మదాబాద్: ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు అంగన్వాడీలకు స్మార్ట్ఫోన్లు తప్పకుండా అవసరమని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి తెలిపారు. ఆదివారం మహమ్మదాబాద్ మండలం నంచర్లగేట్ వద్ద ఆడిటోరియంలో గండేడ్, మహమ్మదాబాద్ మండలాలకు చెందిన 20 మంది అంగన్వాడీలకు స్మార్ట్ఫోన్లను అందించారు. అనంతరం మాట్లాడుతూ అంగన్వాడీలు ఎలా వినియోగించాలో అధికారులు తెలియజేయాలన్నారు. మదర్స్డే సందర్భంగా కేక్ కట్చేసి మహిళలకు పంచిపెట్టారు. అమ్మ గొప్పతనం మాటల్లో చెప్పలేనిదని, అమ్మ నేర్పిన పాఠాలతోనే తండ్రి, గురువులు ఆదరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేఎం నారాయణ, జితేందర్రెడ్డి, సీడీపీఓ రాధిక, ఐసీడీఎస్ సూపర్వైజర్లు అలవేలు, మల్లమ్మ, పద్మ, సర్పంచ్లు పాల్గొన్నారు. -
తాగునీటికి తండ్లాట..!
● వారం రోజులకోసారి నీటి సరఫరా ● ఇబ్బందులు పడుతున్న ప్రజలు ● పట్టింపు లేని అధికారులు జడ్చర్ల: జడ్చర్ల మున్సిపాలిటీలో తాగునీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. ప్రతి రోజు తాగునీటి సరఫరా కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిషన్ భగీరథ ట్యాంకుల ద్వారా తాగునీటి సరఫరాలో అంతరాయం చోటు చేసుకోవడంతో కొన్ని కాలనీల్లో మూడునుంచి ఏడురోజులకు ఒకసారి తాగునీటి సరఫరా కొనసాగుతుంది. మధ్యలో నీరు అవసరమైతే ప్రైవేట్ ట్యాంకర్లను ఆశ్రయించాల్సి వస్తుంది. అసలే ఎండాకాలం.. ఆపై నీటిఎద్దడి తీవ్రం కావడంతో ప్రధానంగా మహిళలు నీటి కొళాయిల వద్ద పడిగాపులు పడే పరిస్థితి నెలకొంది. జడ్చర్ల మున్సిపాలిటి పరిధిలో ప్రతిరోజు 11.5 ఎంఎల్డీ నీరు అవసరం కాగా.. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి పట్టణానికి 7–8 ఎంఎల్డీ నీరు మాత్రమే సరఫరా అవుతుంది. దీంతో తాగునీటి సమస్య ఉత్పన్నమవుతుంది. కొన్నిరోజుల పాటు 11.2 ఎంఎల్డీ నీటిని సరఫరా చేసిన అధికారులు ఇటీవల మళ్లీ 7 ఎంఎల్డీ నీటిని మాత్రమే సరఫరా చేయడంతో తాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయి. పట్టణంలో పలు కాలనీల్లో తాగునీటి పైపులైన్లు లీకేజీల కారణంగా కలుషిత నీరు సరఫరా అవుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా మిషన్ భగీరథ డబ్ల్యూటీపీల నుంచి శుద్ధి చేయబడిన తాగునీటిని సరఫరా చేయాల్సి ఉంది. అయితే స్థానిక పైపులైన్లు లీకేజీ ఏర్పడడంతో ప్రజలు ఈ నీటిని తాగడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా సరఫరా అవుతున్న నీటిని డబ్బులు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం రూ.లక్షలు వెచ్చించి శుద్ధి చేయబడిన తాగునీటిని సరఫరా చేస్తున్నా.. లీకేజీల కారణంగా పథకం లక్ష్యం నిరుగారుతుంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి ప్రతిరోజు శుద్ధమైన నీటిని సరఫరా చేసే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. జడ్చర్లలో అప్పుడప్పుడు సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మున్సిపాలిటీకి 12 ఎంఎల్డీకిపైగా ప్రతిరోజు నీటిని సరఫరా చేస్తే సరిపోతుంది. ఇటీవల కొన్ని రోజులుగా 11.2 ఎంఎల్డీ నీటిని సరఫరా చేస్తున్నారు. మిషన్ భగీరథ పైపులైన్ల లీకేజీ ఏర్పడినప్పడు నీటి సమస్య ఏర్పడుతుంది. మున్సిపాలిటీ పరిధిలో లీకేజీలను సరిచేశాం. – లక్ష్మారెడ్డి, కమిషనర్, మున్సిపాలిటి, జడ్చర్ల బాదేపల్లి పట్టణంలోని పాతబజార్, ఫకీర్నగర్, జవహర్నగర్, విద్యానగర్, క్లబ్రోడ్డు, చైతన్య నగర్, కావేరమ్మపేట, ఆదర్శనగర్ తదితర ప్రాంతాల్లో వారం రోజులకు ఒకసారి తాగునీటి సరఫరా కొనసాగుతుందని ఆయా కాలనీల ప్రజలు పేర్కొంటున్నారు. కాలనీల పరిధిలోని సింగిల్ ఫేజ్ మోటర్ బోర్లను ఆశ్రయించి బిందెలతో నీటిని తీసుకొస్తున్నామని పలువురు మహిళలు పేర్కొన్నారు. పట్టణంలో దాదాపు 18వేల నల్లా కనెక్షన్లు ఉండగా 197 బోర్లు కొనసాగుతున్నాయి. మల్లెబోయిన్పల్లి పంపుల ద్వారా సరఫరా అవుతున్న నీటి విషయంలో సమస్యలు ఎక్కువగా తలెత్తుతున్నాయి. దీంతో దీని పరిధిలో ఉన్న కాలనీల్లో తాగునీటి సమస్యలు ఏర్పడుతున్నాయి. -
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్లో పౌర్ణమికి రెండు పతకాలు
మిడ్జిల్: హనుమకొండలో ఆదివారం ముగిసిన రాష్ట్రస్థాయి మూడో అథ్లెటిక్స్ పోటీల్లో మిడ్జిల్ మండలంలోని మల్లాపూర్ గ్రామానికి చెందిన పౌర్ణమి అద్భుత ప్రతిభ చాటి ఓ స్వర్ణపతకంతో పాటు ఓ కాంస్య పతకం సాధించింది. డిస్కస్త్రో ఈవెంట్లో 29.69 మీటర్లు విసిరి స్వర్ణం సొంతం చేసుకుంది. అలాగే షాట్పుట్లో 8.49 మీటర్లు విసిరి మూడో స్థానంతో కాంస్య పతకం పొందింది. ఈ సందర్భంగా పౌర్ణమికి గ్రామస్తులు అభినందనలు తెలిపారు. ఎప్సెట్ కేంద్రం తనిఖీ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జేపీఎన్సీ కళాశాలలో జరుగుతున్న ఎప్సెట్ పరీక్ష కేంద్రాన్ని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, పాలమూరు యూనివర్సిటీ వీసీ శ్రీనివాస్ ఆదివారం తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు, పరీక్షల నిర్వహణపై పకడ్బందీ చర్యలపై అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు రెండు సెషన్స్లో పరీక్షలు నిర్వహిస్తుండగా మొత్తం 360 మంది విద్యార్థులకు 345 మంది హాజరయ్యారు. వారి వెంట కళాశాల పరీక్షల నిర్వహణ అధికారి కోటాల సందీప్ పాల్గొన్నారు. కొత్త కోర్సుల్లో చేరండి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో ఇటీవలి తీసుకువచ్చిన కొత్త కోర్సుల్లో విద్యార్థులు చేరాలని కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి పేర్కొన్నారు.కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కళాశాలలో ఇటీవల బీకాంలో బీఎఫ్ఎస్ఐ, బీబీఏలో రీటైల్ ఆపరేషన్స్, పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్, హెల్త్కేర్ మేనేజ్మెంట్ వంటి కోర్సులు ఉన్నాయన్నారు. వీటి ద్వారా విద్యార్థులకు త్వరితగతిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఇంటర్న్షిప్ ఉంటుందని, వివిధ కంపెనీల్లో పని చేయడం ద్వారా అనుభవంతో పాటు వేతనం కూడా పొందవచ్చని వివరించారు. ఎంవీఎస్ కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అర్హత గల అధ్యాపకులు, పూర్తిస్థాయిలో వసతులు, ఎన్ఎసీసీ వంటి సదుపాయాలు ఉన్నాయన్నారు. వివిధ కోర్సులకు సంబంధించి దోస్తు అడ్మిషన్లలో మొదటి ఆప్షన్గా ఎంవీఎస్ కళాశాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు రవీందర్, సత్యనారాయణ, మంజూల, సూర్యనారాయణ, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. ఇస్కాన్ మందిరంలో నౌకా విహార్ ఉత్సవాలు స్టేషన్ మహబూబ్నగర్: జిల్లాకేంద్రంలోని టీచర్స్కాలనీ ఇస్కాన్ జగన్నాథ మందిరంలో శ్రీరాధా శ్యాంసుందర్ నౌకావిహార్ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మూడోరోజు ఆదివారం మ్యాంగో ఫెస్టివల్ నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ గురువు వరదరాజ్ దాస్ప్రభు మాట్లాడుతూ జగన్నాథ, బలభద్ర, సుభద్ర దేవతామూర్తులను పడవతో విహరింపజేయడం, వేసవి తాపాన్ని తగ్గించడానికి స్వామికి చందనం, నీటితో సేవలందించడమే నౌకావిహార్ విశేషమన్నారు. అంతకుముందు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. మామిడిపండ్లను నైవేద్యంగా సమర్పించారు. కార్యక్రమంలో విజయ వెంకటేశ్వరదాస్ ప్రభు, రఘునాథ్ ప్రభు, రసమయ హరిదాస్ ప్రభు తదితరులు పాల్గొన్నారు. -
వారం రోజులకు ఓసారి
ప్రతిరోజు తాగు నీటికోసం ఇబ్బందులు పడుతున్నాం. వారం రోజులకు ఒకసారి నీటిని సరఫరా చేయడంతో ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా నీటిని కొనగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. అధికారులు స్పందించి ప్రతిరోజు తాగునీరు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. – లక్ష్మమ్మ, కావేరమ్మపేట తాగునీటి కోసం ఇబ్బందులు తప్పడం లేదు. నీళ్ల సమస్యల కారణంగా బ యటి పనులకు వెళ్లలేని పరిస్థితి దాపురించింది. తెల్లారితే నీళ్ల సమస్యతో సతమత మవుతున్నాం. ప్రతిరోజు తాగునీటిని సకాలంలో సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. – మణెమ్మ, ఆదర్శనగర్ ● -
మహబూబ్నగర్లో ఘోర ప్రమాదం
సాక్షి, మహబూబ్నగర్: జిల్లాలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రేసింగ్ బైక్, కారు ఢీ కొని ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఒకరు గాయపడగా చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.పాలకొండ చౌరస్తాలో అర్ధరాత్రి దాటాక ఈ ఘోరం జరిగింది. కారు డివైడర్ దగ్గ యూటర్న్ తీసుకుంటుడగా.. వేగంగా దూసుకొచ్చిన బైక్ ఢీ కొట్టింది. ఈ యాక్సిడెంట్తో కారు, బైక్లు నుజ్జు నుజ్జు అయ్యాయి. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతులు మహబూబ్నగర్ న్యూప్రేమ్ నగర్కు చెందిన కుటుంబంగా గుర్తించారు. మృతుల్లో.. ఆర్షియా బేగం(30), MD. ఉజేప (7), MD. అమర్ (2).. హైదరాబాద్కు చెందిన బైకర్ యాకుబ్ అఫ్జల్ (25) ఉన్నారు. మరో మృతదేహంపై స్పష్టత రావాల్సి ఉంది. గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బైక్ హర్యానా రిజిస్ట్రేషన్తో ఉంది.పోలీసుల నిర్లక్ష్యంతోనే..ఈ ఘటనలో పోలీసుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డులో రాత్రి 11గం. తర్వాత నుంచి తెల్లవారుజాము దాకా బైక్ రేసింగులు జరుగుతున్నాయని.. అటుగా వెళ్లే వాహనదారుల్ని భయానికి గురి చేస్తున్నాయని.. ఎన్ని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని అంటున్నారు. సకాలంలో చర్యలు తీసుకుని ఉంటే.. ఈ ఘోరం జరిగి ఉండేది కాదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విమర్శలపై పోలీసులు స్పందించాల్సి ఉంది. -
నిస్వార్థ ప్రేమకు రూపం అమ్మ
నిస్వార్థ ప్రేమకు రూపం అమ్మ. పదాలు తెలియని పెదవులకు అమృత వ్యాఖ్యం అమ్మ. అమ్మ ప్రేమకు అవధులు.. అమ్మ త్యాగానికి హద్దులు లేవు. అమృతం ఆయుష్సు పోస్తుందో లేదో తెలియదు కానీ, అమ్మ మాత్రం తన ఆయుష్షును సైతం బిడ్డకే అందిస్తుంది. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటుంది. నవమాసాలు కడుపులో కదలాడే తన బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ప్రసవ సమయంలో నరకం అనుభవిస్తూనే తన బిడ్డ క్షేమం కోసం పరితపిస్తుంది. తన పిల్లలే లోకంగా జీవించే ఆ తల్లి రుణం తీర్చుకోవడం కష్టమే. అమ్మ మన రేపటి భవిష్యత్కై నిత్యం శ్రమించే శ్రామికురాలు. ఈ తల్లుల దినోత్సవం జిల్లా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుతూ అమ్మలకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. – ఖుష్బూ గుప్తా, కలెక్టర్, మహబూబ్నగర్ -
నెలరోజులుగా పడిగాపులు
నెలరోజుల కిందట కొనుగోలు కేంద్రానికి 266 బస్తాల మొక్కజొన్న తీసుకొచ్చా. ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదు. ప్రతిరోజూ పనులు మానుకుని కుప్పల వద్దే పడిగాపులు పడుతున్నా.. శుక్రవారం బస్తాలను తూకం వేయడంతో ట్రాక్టర్లో తానే స్వయంగా గోదాం వద్ద అన్లోడ్ చేసేందుకు తీసుకెళ్లా. గోదాం ఖాళీ లేదంటూ వెనక్కి పంపారు. – మైబు, రైతు, గంగాపూర్ 25రోజులుగా ఇబ్బందులు మొక్కజొన్న పంటను అమ్ముకుపోదామని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చా. 150 బస్తాలను ఇక్కడికి తెచ్చి 25రోజులు గడించింది. అయినా కొనుగోలు చేయక పడాగాపులు పడుతున్నాం. ఇంటి వద్ద కుటుంబం, వ్యవసాయ పనులు పట్టించుకునే పరిస్థితి లేకుండాపోయింది. రేపుమాపు అంటున్నారే తప్పా.. కొనడంలేదు. దీంతో నరకం అనుభవిస్తున్నాం. – వెంకటయ్య, రైతు, లింగంపేట ● -
రగిలిన మక్క రైతులు
జడ్చర్ల: ఆరుగాలం అష్టకష్టాలు పడి పండించిన మొక్కజొన్న దిగుబడులను విక్రయించేందుకు వచ్చిన రైతులు రోజుల తరబడి పడిగాపులు పడుతున్నా.. కొనుగోళ్లు చేయకపోవడంతో నీరసించిన రైతన్న కడుపు మండి రోడ్డెక్కిన దుస్థితి శనివారం జడ్చర్లలో చోటుచేసుకుంది. జడ్చర్ల పత్తి మార్కెట్ యార్డులో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే అక్కడ కొనుగోళ్లు సజావుగా సాగక రైతాంగం చివరికి రగిలిపోయి ఆందోళనకు దిగింది. ఎదురుగా ఉన్న 167వ నంబర్ జాతీయ రహదారిపై బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ● మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో ఇప్పటివరకు 40 వేల బస్తాలను కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన బస్తాలను సైతం గోదాములకు తరలించకపోవడంతో సమస్య మొదలైంది. లారీలు, హమాలీలు లేకపోవడంతో మొదటగా బస్తాలను తరలించలేకపోయారు. తదుపరి గోదాములు ఖాళీగా లేకపోవడంతో అన్లోడ్ చేయడంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో కొనుగోళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నెల రోజులకు పైగా మొక్కజొన్న కుప్పలు, బస్తాల వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడింది. తూకాలు పూర్తయినా బస్తాలను తరలించే వరకు రైతులను బాధ్యులను చేయడంతో రైతులు ఎటూ కదలలేని పరిస్థితి నెలకొంది. దీంతో శుక్రవారం తూకాలు వేసిన బస్తాలను రైతులే స్వయంగా 40 ట్రాక్టర్లలో లోడ్ చేసుకుని చర్లపల్లి సమీపంలోని గోదాములకు తరలించారు. అయితే అక్కడ కేవలం 4 ట్రాక్టర్లను మాత్రం అన్లోడ్ చేసుకుని గోదాములు ఖాళీగా లేవంటూ వెనక్కి పంపారు. దీంతో మళ్లీ ఆయా ట్రాక్టర్లను కొనుగోలు కేంద్రానికి తీసుకురావడం రైతుల ఆగ్రహానికి కారణమైంది. చైర్పర్సన్ భర్తపై రైతుల ఆగ్రహం రైతులు ఆందోళన చేస్తున్న సమయంలో మార్కెట్ యార్డు చైర్పర్సన్ జ్యోతి భర్త అల్వాల్రెడ్డి అక్కడకు చేరుకుని రైతులను సముదాయించే ప్రయత్నంలో ఓ రైతును కోప్పడడంతో ఒక్కసారిగా రైతులు తిరగబడ్డారు. ఈయనేనా చైర్మన్.. ఇన్నాళ్లు యాడున్నావంటూ మండిపడ్డారు. మార్కెట్ చైర్మన్, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ● రైతుల ఆందోళనతో జడ్చర్ల–కల్వకుర్తి ప్రధాన రోడ్డుపై ఆరు గంటలపాటు వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. సుమారు 5కిమీల మేరకు వాహనాలు నిలిచిపోయాయి. ఎండాకాలం కావడంతో ప్రయాణికులు నీళ్లకు, తిండికి ఇబ్బందులు పడ్డారు. చిన్నపిల్లలు, మహిళలు కొందరు ఎండను తాళలేక వెనక్కి వెళ్లిపోయారు. రోడ్డు పక్కదారులకు కూడా ట్రాక్టర్లను అడ్డుపపెట్టి మూసి వేయడంతో వాహనాలు ఎటూ కదలకుండాపోయాయి. ఇదేనా.. ప్రజాపాలనా?: మాజీమంత్రి లక్ష్మారెడ్డి రైతులు పంట పండించేందుకు మూడు నెలలు పడితే.. వచ్చిన దిగుబడులను అమ్ముకునేందుకు మరో మూడునెలలు పడుతుందుని, ఆలోగా అకాల వర్షాలతో దిగుబడులకు నష్ట వాటిల్లి రైతులు ఆధోగతి పాలవుతున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు. రైతుల ఆందోళనకు ఆయన మద్దతు పలికి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రైతాంగాన్ని ఇబ్బందుల పాలు చేయడమేనా.. ప్రజాపాలన అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పాలనలో ఇలాంటి దుస్థితి ఏనాడు రాలేదన్నారు. ప్రభుత్వానికి ముందు చూపులేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అటు ప్రభుత్వం ఇటు అధికారులు ఎంతమాత్రం రైతుల గోసను పట్టించుకోవడం లేదన్నారు. కొనుగోలు కేంద్రానికి లక్ష బస్తాలకుపైగా విక్రయానికి వచ్చాయని.. వెంటనే కొనుగోళ్లు చేపట్టి రైతులకు న్యాయం చేయకపోతే ఉపేక్షించబోమని హెచ్చరించారు. చివరకు మార్క్ఫెడ్ డీఎం రహెమున్నిసా బేగం, తహసీల్దార్ నర్సిగరావు, సింగిల్విండో సీసీఓ యాదగిరితో చర్చించి పత్తి మార్కెట్ యార్డు షెడ్లలోనే బస్తాలను నిల్వ చేసేవిధంగా నిర్ణయం తీసుకోవడంతో సమస్య సద్దుమణిగింది. తూకం వేసిన బస్తాలను వెంటనే ఆయా షెడ్లలోనే నిల్వ చేస్తామని అధికారులు ప్రకటించడంతో మాజీ మంత్రి రైతులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ యాదయ్య, నాయకులు రామ్మోహన్, ఇమ్ము, జ్యోతి, రఘుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్ని తామే భరిస్తున్నాం.. మొక్కజొన్నను విక్రయించేందుకు గన్నీ బ్యాగులు ఇవ్వడం లేదని, బయటి నుంచి తామే కొనుగోలు చేసుకుని వచ్చినా.. తూకాలు వేయడం లేదని పలువురు రైతులు పేర్కొన్నారు. గన్నీబ్యాగులతో పాటు తూకా లు వేసేందుకు బస్తాకు రూ.27 చెల్లిస్తున్నామని, బస్తాలను కుట్టు వేసే సుత్తిలి ధారాలను సైతం తామే బయటి నుంచి కొనుగోలు చేసి అందిస్తున్నామని రైతులు వాపోయారు. చివరకు గోదాముల వద్దకు ట్రాక్టర్లతో తాము తరలించినా అన్లోడ్ చేయకుండా వెనక్కి పంపారని మండిపడ్డారు. మొక్కజొన్న కొనుగోలు చేయాలంటూ ఆందోళన బస్తాల లోడ్ ట్రాక్టర్లను అడ్డుగా పెట్టి నిరసన 167వ నంబర్ జాతీయ రహదారిపై ధర్నా ఆరు గంటల పాటు నిలిచిన రాకపోకలు -
మా అమ్మ వల్లే ఈ స్థాయిలో..
మాది మధ్య తరగతి కుటుంబం. నా జీవితం ఎదుగుదలలో మా అమ్మ పాత్ర ఎంతో ఉంది. మా నాన్న సాయిబాబ, అమ్మ వెంటకసుబ్బమ్మ. మేము ముగ్గురం అన్నదమ్ములం. నేను రెండో సంతానం. మిగిలిన ఇద్దరిలో ఒకరు టీచర్ కాగా.. మరో సోదరుడు మున్సిపల్ ఆఫీసులో మేనేజర్గా పనిచేస్తున్నారు. ముందు నుంచి మా అమ్మ మమ్మల్ని బాగా చదువుకోవాలని ప్రోత్సహించేవారు. బాగా చదువుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని చెబుతూ ఉండేది. ఈ క్రమంలోనే నేను గ్రూప్–1 సాధించాను. ఆ తర్వాత 2013లో ఐపీఎస్ కన్ఫర్మ్ అయ్యింది. ప్రస్తుతం నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అది మా అమ్మ వల్లే. – టి.శ్రీనివాసరావు, ఎస్పీ, జోగుళాంబ గద్వాల -
పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటాను..
పోలీస్ విధి నిర్వహణలో బాధ్యతలు నిర్వర్తిస్తూనే పిల్లలతో ప్రత్యేకంగా సమయం కేటాయిస్తాను. ఒకవైపు విధులు, మరోవైపు కుటుంబ బాధ్యతలు నిర్వర్తించేందుకు సమయాన్ని బ్యాలెన్స్ చేసుకుంటాను. సమాజంలో ప్రస్తుత పరిస్థితులను వారికి అర్థమయ్యేలా చెబుతూ వారితో ఫ్రెండ్లీగా ఉంటాను. డ్యూటీలో బిజీగా ఉంటున్నా పిల్లలు అర్థంచేసుకుని సర్దుకుంటున్నారు. తల్లులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు – విజయలక్ష్మి, ఏఎస్ఐ, షీ టీం ఇన్చార్జి, నాగర్కర్నూల్ కూతురు మానస, కుమారుడు సాయిరాంతో ఏఎస్ఐ విజయలక్ష్మి -
మహబూబ్నగర్
త్యాగానికి ప్రతి రూపమే..నిజమైన స్వరూపం ● విధి నిర్వహణతో పాటు తల్లిగా పిల్లల బాధ్యత ● నిత్యం డ్యూటీ చేస్తూనే కుటుంబానికి ప్రత్యేకంగా సమయం కేటాయింపు ● పోలీస్, రెవెన్యూ, ఐటీ రంగాల్లో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న తల్లులు ‘ఢిల్లీకి రాజు అయినా.. ఒక తల్లికి కొడుకే..’ ఈ సూక్తినే స్మరించుకుంటున్నారు ఉమ్మడి పాలమూరులోని పలువురు ఉన్నతాధికారులు. ఐఏఎస్, ఐపీఎస్తో పాటు వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నా.. దీని వెనక తమ తల్లుల పాత్ర ఎంతో ఉందని.. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. నిత్య స్ఫూర్తి ప్రదాత.. గొప్ప శ్రామికురాలు.. నిస్వార్థ ప్రేమ, త్యాగానికి ప్రతిరూపం అంటూ కీర్తిస్తున్నారు. విధి నిర్వహణలో బిజీగా ఉన్నా.. తల్లిగా అమ్మగా పిల్లల బాధ్యతను సమర్థవంతంగా పోషిస్తున్నారు. ఆదివారం ప్రపంచ మాతృ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని పలువురు ఉన్నత ఉద్యోగుల అభిప్రాయాలతో ప్రత్యేక కథనాలు... – సాక్షి, నాగర్కర్నూల్/ పాలమూరు/గద్వాల /జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్) అమ్మకు వందనంఉదయం లేస్తే ఉరుకుల పరుగుల జీవితం.. క్షణం తీరిక లేని జీవన శైలి. నేటి సమాజంలో అమ్మపాత్ర కత్తి మీద సాములాంటింది. నిమిషం వృథా చేయకుండా సమయాన్ని సద్వినియోగం చేయాలి. లేదంటే పిల్లలకు తిప్పలు తప్పవు. ఆధునిక అమ్మల జీవన శైలిలో వేగం విపరీతంగా పెరిగింది. ఇంటి బాధ్యతంతా అమ్మదే. పిల్లల కోసం తాను చదువు నేర్చుకొని హోంవర్క్ చేయించడం, స్కూటీలు, కార్లు నేర్చుకొని నడపాల్సి వస్తోంది. బిజీ షెడ్యూల్లో కూడా రోజు హోంవర్క్ చేయించడం, సందేహాలు తీర్చడం ఆమె పనే. అమ్మ ఉదయం ఏ ఐదు గంటలకో నిద్ర లేచి ఇంటి పనులు చకచక పూర్తి చేసుకుని పిల్లలను నిద్రలేపుతోంది. తొమ్మిదింటికల్లా బడికి పంపి.. అమ్మ ఉద్యోగానికి పరుగులు తీయాలి. మళ్లీ ఇంటికొచ్చాక రాత్రి కాగానే పిల్లలు అడిగిన రుచులన్నీ వండి పెట్టడానికి విసుక్కోదు. ఒక సర్వే ప్రకారం ప్రతి తల్లి ఉదయం నుంచి రాత్రి వరకు 26 రకాల సవాళ్లు ఎదుర్కొంటుందని తేలింది. నేడు మాతృదినోత్సవం ఆదివారం శ్రీ 10 శ్రీ మే శ్రీ 2026ఒక వైపు ఉద్యోగం.. మరోవైపు తల్లి పాత్ర ఎకై ్సజ్ శాఖలో ఉద్యోగం అంటేనే హడావుడి. బిజీబిజీగా ఉండాల్సి ఉంటుంది. ఇక ప్రత్యేక రైడ్ చేయాలంటే అర్ధరాత్రి ఇంట్లో నుంచి వెళ్లాల్సి వస్తుందని.. అలాంటి సమయంలో పిల్లల రక్షణ చూసుకుంటునే మరోవైపు విధులు నిర్వహించాల్సి వస్తుంటుందని మహబూబ్నగర్ టౌన్ ఎకై ్సజ్ ఎస్ఐ సుష్మ చెప్పుకొచ్చారు. తనకు నాలుగేళ్ల కొడుకు అకీరానందన్, ఏడేళ్ల కొడుకు రోహన్ష్ ఉన్నారని ఒకవైపు వీరి బాధ్యత చూస్తూ మరో వైపు ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ‘ నావిధుల్లో భాగంగా ఒక్కసారి నేను బయటకు వెళ్తే మళ్లీ ఎప్పుడూ వస్తానో తెలియదు. దీంతో వారికి 24 గంటలకు కావాల్సిన ఆహారం ముందే రెడీ చేసి పెట్టాల్సి వస్తోంది. సాయంత్రం చేయాల్సిన పనులు కూడా ఉదయం చేసి వెళ్తాను. వారి యోగక్షేమాలను నిత్యం వీడియోకాల్ ద్వారా పర్యవేక్షణ చేస్తుంటాను. భర్త సాఫ్ట్వేర్ కావడంతో ఆయన కూడా వృత్తిరీత్య చాలా బిజీ ఉంటారు. దీంతో పిల్లల బాధ్యత, సంరక్షణ చూసుకోవడంలో ఒక తల్లిగా రెండు పాత్రలు పోషించాలి. దీనికి అనుగుణంగా ఒక ప్లానింగ్ ప్రకారం రోజువారీ కార్యక్రమాలు రెడీ చేసుకుంటాను. సెలవుల్లో పిల్లలకు ప్రత్యేక సమయం ఇచ్చి వారితో గడుపుతా.’ అని సుష్మ పేర్కొన్నారు. -
ఉదయం 6 గంటలకే దినచర్య..
మేము భార్యభర్తలు ఇద్దరం ఉద్యోగులు కావడం వల్ల చాలా బిజీగా ఉంటాం. నా దినచర్య ప్రతి రోజు ఉదయం 6 గంటలకు మొదలవుతుందని చెబుతుంది జనరల్ ఆస్పత్రి ఆర్ఎంఓ డాక్టర్ శిరీష. ప్రతి రోజు ఉదయం 6 గంటలకు నిద్రలేచిన తర్వాత పిల్లలకు వంట చేసి 7.30 గంటలకు పిల్లలను నిద్రలేపుతా. వారిని పాఠశాలకు రెడీ చేసి పంపిస్తా. ఆ తర్వాత నేనుకూడా రెడీ అయి ఆస్పత్రికి వెళ్లాల్సి ఉంటుంది. పిల్లలు చిన్నవారు కావడం వల్ల ప్రస్తుతం కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఒకవైపు పిల్లల మంచి చెడులు.. మరోవైపు ఉద్యోగం, కెరీర్ చూసుకోవడం పెద్ద టాస్క్గా మారింది. అయినా అన్నింటిని బ్యాలెన్స్గా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. – డాక్టర్ శిరీష, ఆర్ఎంఓ జనరల్ ఆస్పత్రి పిల్లలతో ఆర్ఎంఓ డాక్టర్ శిరీష -
వేర్వేరు చోట్ల అగ్నిప్రమాదాలు
నాగర్కర్నూల్, గద్వాల ప్రాంతాల్లో వేర్వేరు చోట్ల జరిగిన అగ్నిప్రమాదాలతో రూ.లక్షల్లో ఆస్తినష్టం సంభవించింది. సోషల్ మీడియా యుగంలో.. అమ్మ పాత్ర పెద్ద టాస్క్ –8లో uప్రస్తుత సోషల్ మీడియా యుంగంలో ఉద్యోగిగా ఉండే ఒక తల్లి పాత్ర అత్యంత ముఖ్యమని.. రెండువైపులా సమన్వయం చేసుకుంటూ జీవితంలో రాణించాల్సి ఉంటుందని చెబుతున్నారు మహబూబ్నగర్ ఎస్పీ డి.జానకి. మాకు ఒక కూతురు పేరు సంవేద్య చదువు కోసం హైదరాబాద్లో ఉంటుంది. వృత్తిరీత్యా ఎస్పీ కావడం వల్ల 24 గంటల బిజీగా (మహబూబ్నగర్ నగరంలో) ఉంటాను. ఆడపిల్లలు ఉన్న తల్లి మరింత అప్రమత్తంగా ఉంటూ వారికి అందుబాటులో ఉండటం చాలా అవసరం. ఎస్పీగా ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజు ఫోన్ మాట్లాడటానికి కొంత సమయం కేటాయిస్తాను. తన ఆరోగ్యంతోపాటు పాఠశాల విషయాలు, వ్యక్తిగత అంశాలు అన్నింటిని తెలుసుకుంటాను. సెలవులు వస్తే ఆమె ఇక్కడికి రావడం, లేదా వారంలో ఒకరోజు నేను అక్కడికి వెళ్లడం చేస్తాను. ఉద్యోగరీత్యా ప్రస్తుతం పాపకు కొంత దూరంగా ఉండాల్సి వస్తోంది. నేను నాన్ వెజ్ వంటలు చేయను.. కానీ, మా పాపకు చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టం.. తనకు ఇష్టమైన చికెన్ ఫ్రై ఎంతో ఇష్టంగా చేసి పెడతాను. ఉద్యోగం వేరు.. తల్లి బాధ్యత వేరు.. ఈ రెండింటికి న్యాయం చేయాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. పిల్లలు ఒక వయసుకు వచ్చే వరకు వారికి తల్లితోడు ఎంతో అవసరం. – డి.జానకి, ఎస్పీ, మహబూబ్నగర్ -
నేటివరకు స్వీయ గణనకు అవకాశం
ఫోన్ చేయాల్సిన నంబర్: 94413 57967 తేది: 11–05–2026, సమయం: సోమవారం ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జనగణన– 2027లో భాగంగా ఆదివారం (మే 10)వరకు స్వీయగణనలో ప్రజలు వివరాలు నమోదుకు అవకాశం ఉందని కలెక్టర్ ఖుష్బూగుప్తా అన్నారు. శనివారం తన క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో వీసీ నిర్వహించారు. విద్యా వారోత్సవాలను షెడ్యూల్ ప్రకారం పకడ్బందీగా నిర్వహించి విజయవంతం చేయాలన్నారు. సెన్సెస్పై సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్లకు శిక్షణ సమావేశాలు నిర్వహించి సన్నద్ధం చేయాలని సూచించారు. జనగణన ప్రక్రియను సులభంగా, సమ గ్రంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభు త్వం డిజిటల్ స్వీయ గణన విధానాన్ని అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఆన్లైన్ద్వారా ప్రజలు తమ వ్యక్తిగత, కుటుంబ వివరాలను వెబ్ పోర్టల్ లో కానీ, మొబైల్ యాప్ ద్వారా స్వయంగా న మోదు చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు కలెక్టర్ వివరించారు. జన గణనకు సంబంధించిన సమాచారాన్ని 15నిమిషాల వ్యవధిలో పూర్తి చేసుకోవచ్చని అన్నారు. వివరాలు నమోదు చేసిన అనంతరం ప్రత్యేకమైన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీ (ఎస్ఈఐడీ) జారీ చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వంచే నియమించబడిన ఫీల్డ్ ఎన్యుమరేటర్లు మే 11 నుంచి జూన్ 9వ తేదీ మధ్యకాలంలో క్షేత్రస్థాయిలో ఇంటికి వచ్చిన సమయంలో వారికి సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీ నంబర్ తెలియజేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, ముఖ్య ప్రణాళిక అధికారి రవీందర్, డీఎస్ఓ గంప శ్రీనివాస్, సివిల్ సప్లయ్ డీఎం రవినాయక్, జిల్లా సహకార అధికారి కృష్ణ, డీఏఓ బి.వెంకటేష్, డీఈఓ ప్రవీణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎస్ కె.రామకృష్ణారావు సూచించారు. శనివారం ఆయన హైదరాబాద్ నుంచి వీసీ నిర్వహించారు. ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ అన్ని జిల్లాలలో వంద శాతం పూర్తయ్యేలా చూడాలన్నారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్కు మే10 వరకు ఒక్క రోజే మిగిలి ఉండడంతో ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ను ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11వ తేదీ నుంచి నిర్వహించే విద్యా వారోత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు. -
11 నుంచి ఉచిత క్రికెట్ శిక్షణ
వేదిక ఇన్చార్జి సెల్ నం. ఎండీసీఏ మైదానం, మహబూబ్నగర్ ఆబిద్ 99482 74760 డీఎస్ఏ మైదానం, నారాయణపేట రమణ 91007 53683 డీఎస్ఏ మైదానం, కల్వకుర్తి ఎం.సుధాకర్ 96406 00329 డీఎస్ఏ మైదానం, గద్వాల శ్రీనివాస్ 77806 90883 డీఎస్ఏ మైదానం, జడ్చర్ల మోయిన్ 99853 75737 పీజేపీ మున్సిపల్ మైదానం, పెబ్బేరు చరణ్ 76748 88101 మహబూబ్నగర్ క్రీడలు: హెచ్సీఏ సౌజన్యంతో ఎండీసీఏ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో ఈ నెల 11 జూన్ 10 వరకు వేసవి ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ వెల్లడించారు. మహబూబ్నగర్లోని పిల్లలమర్రి శివారు క్రికెట్ మైదానంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఉమ్మడి జిల్లాలో ఆరు చోట్ల వేసవి క్రికెట్ శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 11న మహబూబ్నగర్ ఎండీసీఏ మైదానం, జడ్చర్ల, 12న నారాయణపేట, గద్వాల, 13న పెబ్బేరు, కల్వకుర్తి పట్టణాల్లో శిబిరాలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఆయా కేంద్రాల్లో నిష్ణాతులైన కోచ్లు శిక్షణ అందిస్తారని, క్రీడాకారులకు జంబో కిట్, వివిధ రకాల బాల్స్, ఫిజికల్ ఫిట్నెస్ కిట్లు అందజేస్తామన్నారు. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు కోచింగ్ ఉంటుందని, క్రీడాకారులకు అల్పాహారం అందిస్తామన్నారు. అండర్– 14, 16, 19, 23 విభాగాల క్రీడాకారులకు ఉచిత శిక్షణ ఉంటుందన్నారు. వేసవి శిక్షణ శిబిరాల్లో ప్రతిభగల గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. వేసవి శిక్షణ శిబిరాలను ఔత్సాహిక క్రీడాకారులు సద్వినియోగం చేసుకొని తమ నైపుణ్యాన్ని చాటుకోవాలని సూచించారు. సమావేశంలో ఎండీసీఏ ఉపాధ్యక్షుడు సురేష్కుమార్, సంయుక్త కార్యదర్శి వెంకటరామారావు, కోచ్లు గోపాలకష్ణ, మన్నాన్, ఆబిద్ హుస్సేన్ పాల్గొన్నారు. వేసవి ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాల వివరాలు ఉమ్మడి జిల్లాలో ఆరు చోట్ల వేసవి శిబిరాలు -
ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
మహబూబ్నగర్ క్రైం: చించోళి బైపాస్ రోడ్డుపై ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టనున్నట్లు ఎస్పీ జానకి వెల్లడించారు. నగర పరిధిలో నూతనంగా నిర్మించిన చించోళి బైపాస్పై ఇటీవల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం బ్లాక్స్పాట్ ఏరియాలను పరిశీలించారు. ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయనే విషయంపై అధ్యయనం చేయడం జరిగింది. ఆ తర్వాత పోలీస్ అధికారులతోపాటు జాతీయ రహదారి అథారిటీ అధికారులతో మాట్లాడారు. రోడ్డుపై ప్రమాద సూచిక బోర్డులు, రాత్రివేళలో వాహనదారులకు స్పష్టంగా కన్పించే విధంగా రేడియం స్టిక్కర్లు అమర్చాలన్నారు. వేగ నియంత్రణ చర్యలు చేపట్టడం, డివైడర్ల వద్ద హెచ్చరిక బోర్డులు వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాదకర మలుపుల దగ్గర ప్రత్యేక గుర్తులు ఏర్పాటు చేయాలని సూచించారు. వాహనదారులు సైతం ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలన్నారు. అతివేగం, నిర్లక్ష్యంతో కూడిన డ్రైవింగ్ వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో వన్టౌన్ సీఐ అప్పయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆర్ఎన్ఆర్ క్వింటా రూ.2,381 దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం జరిగిన టెండర్లలో ఆర్ఎన్ఆర్ ధాన్యం క్వింటా గరిష్టంగా రూ.2,381, కనిష్టంగా రూ.2,109 ధరలు లభించాయి. అలాగే హంస సరాసరిగా రూ.1,789, ఆముదాలు సరాసరిగా రూ.6,082 ధరలు వచ్చాయి. మార్కెట్కు దాదాపు రెండు వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. సస్పెన్షన్తో సరిపెట్టారు! ● అక్రమాలు నిగ్గు తేల్చడంలో అలసత్వం ● ఫిర్యాదులపై మాత్రమే విచారణ ● పూర్తిస్థాయి విచారణలో జాప్యం ● రికవరీలో మరిన్ని అక్రమాలపై అనుమానాలు -
రండి.. విశేషాలు పంచుకుందాం
పరీక్షలు ముగిశాయి. స్కూళ్లకు సెలవులూ వచ్చాయి. అమ్మా, నాన్నలకూ రిలీఫ్ దొరికితే.. అలా అంతా ఓ ట్రిప్ వేయొచ్చు. అది అమ్మమ్మ, తాతల ఇంటికి కావచ్చు. లేదా పర్యాటక కేంద్రానికి కావచ్చు. జాలీగా ఇంకెక్కడైనా కావచ్చు. ఆ అనుభవాలను ‘సాక్షి’తో పంచుకోండి. వేసవిలో మీరు చూసిన విశేషాలు, అక్కడ తీసుకున్న ఫొటోలు పంపండి. వీటితో పాటు మీ అనుభూతిని రాయడం మరవకండి. అలాగే అమ్మమ్మ, నానమ్మ ఊరిలో గడిపిన సన్నివేశాల ఫొటోలు, మీ సృజనకు పదును పెట్టే బొమ్మలు గీసినా.. కథలు రాసినా, నృత్యాలు నేర్చుకున్న వాటిని ఫొటోలతో సహా పంపొచ్చు. -
పరిశుభ్రమైన నీటితో చేపల ఉత్పత్తి మెరుగు
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): చెరువుల్లో కలుపు మొక్కలను తొలగించడం, పరిశుభ్రత పాటించడం, నీటి నాణ్యతను కాపాడడం ద్వారా చేపల ఉత్పత్తి పెరుగుతుందని జిల్లా మత్స్యశాఖ సహాయ సంచాలకురాలు రాధారోహిణి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మత్స్యకార సంఘాల సభ్యులకు చెరువులలో కలుపు మొక్కల నివారణ, చేపలలో వ్యాధుల నిర్మూలన, చేపల ఉత్పత్తి పెంచడంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేపల వ్యాధుల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, చేపలలో వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే మత్స్యశాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. మత్స్యశాఖ అధికారులు శాసీ్త్రయ విధానాలతో చేపల పెంపకం, నాణ్యమైన చేప పిల్లల వినియోగం, మిశ్రమ చేపల పెంపకం, కేజ్ కల్చర్ విధానాలపై సభ్యులకు అవగాహన కల్పించారు. ఈ పద్ధతుల ద్వారా అధిక దిగుబడితోపాటు ఆదాయం పెంచుకోవచ్చని వివరించారు. సదస్సుకు వివిధ మండలాల మత్స్యకార సహకార సంఘాల సభ్యులు, రైతులు హాజరై తమ సమస్యలను నివృత్తి చేసుకున్నారు. అనంతరం మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై రూపొందించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యకార పారిశ్రామిక సహకార సంఘం పర్సన్ ఇన్చార్జి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేష్, జిల్లా ఉద్యానవన అధికారి వేణుగోపాల్, ఫిషరీస్ శాస్త్రవేత్తలు గణేష్, శేఖర్, గంగారాం, మత్స్యశాఖ క్షేత్రస్థాయి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
రైతు సమస్యలపై త్వరలో పాదయాత్ర
మహబూబ్నగర్ రూరల్: రైతుల్లో భరోసా నింపేందుకు త్వరలో పాదయాత్ర నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రకటించారు. శుక్రవారం ఆయన మహబూబ్నగర్ రూరల్ మండలంలోని రాంరెడ్డిగూడెం మిల్లు వద్ద వరి ధాన్యం అమ్మకం కోసం వాహనాల్లో సంచులు పెట్టుకొని వేచి ఉన్న రైతులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఆరోపించారు. రైతులకు గిట్టుబాటు ధర, సకాలంలో యూరియా, నాణ్యమైన విద్యుత్, రైతుబంధు, రైతుబీమా అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని, పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై త్వరలో పాదయాత్ర ప్రణాళిక ప్రకటిస్తామన్నారు. పాదయాత్ర ద్వారా ప్రతి రైతును కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను వివరిస్తామని చెప్పారు. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో మిల్లర్లు రైతుల నుంచి అధిక తరుగు తీసుకుంటున్నారని, కొనుగోలు కేంద్రాలను అరకొరగా ఏర్పాటు చేసి తర్వాత ఎత్తివేయడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కల్లాల వద్దే వడ్లు కొనుగోలు చేసి, తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేశామని, రైతుల ఖాతాల్లో సమయానికి డబ్బులు జమ చేశామని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వారోత్సవాలు ఎందుకు నిర్వహిస్తుందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా సర్పంచ్లు, కార్పొరేటర్లు, నాయకులను డబ్బులతో కొనుగోలు చేయాలని ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, కోటకదిర సింగిల్విండో చైర్మన్ రాజేశ్వర్రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
ర్యాష్ డ్రైవింగ్.. త్రిబుల్ రైడింగ్
మహబూబ్నగర్ క్రైం: ఉమ్మడి పాలమూరు జిల్లాలో మైనర్లుకు ద్విచక్రవాహనాలు ఇచ్చే తల్లిదండ్రుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. మోటారు వాహన చట్టం ప్రకారం 18 ఏళ్లు నిండినవారు మాత్రమే వాహనాలు నడిపేందుకు అర్హులు. కానీ, ప్రస్తుతం పల్లెలు, పట్టణాలు, నగరాల్లో పదేళ్లు దాటిన వారికి సైతం తల్లిదండ్రులు వాహనాలు ఇస్తున్నారు. నియంత్రణ లేని పిల్లలు రోడ్లపై దూసుకుపోతూ ప్రమాదాలకు కారణమవుతూ కుటుంబ సభ్యులను క్షోభకు గురిచేస్తున్నారు. పోలీసుల తనిఖీల్లో పట్టుబడితే చట్ట ప్రకారం వారిపై కేసు నమోదు చేసి జరిమానా లేదా ఒకరోజు జువైనల్ హోంకు తరలిస్తున్నారు. పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని పోలీసులు హెచ్చరిస్తునా.. కొందరు తల్లిదండ్రుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. వేసవి సెలవుల నేపథ్యంలో ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు ఇచ్చిన క్రమంలో వారందరూ ఇళ్ల దగ్గర ఉంటారు. ఈ సమయంలో ఖాళీగా ఉన్న వారిలో చాలామంది చిన్నారులు ఇంట్లో ఉండే తల్లిదండ్రుల బైక్లు, స్కూటీలు తీసుకొని గల్లీలతోపాటు ప్రధాన రోడ్లపై త్రిబుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్లతో చక్కర్లు కొడుతున్నారు. ఈ క్రమంలో కొన్నిచోట్ల ప్రమాదాలు చోటుచేసుకోవడంతో గాయపడుతున్న ఘటనలు అనేకం. ఇక కొన్ని సందర్భాల్లో ప్రధాన రోడ్లపై మేజర్ రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు సైతం కోల్పోతున్న ఘటనలు లేకపోలేదు. ఇలాంటి ప్రమాదాల కట్టడికి మొదటి అడుగు ఇంట్లో తల్లిదండ్రుల నుంచి పడాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత పోలీస్ శాఖ ప్రత్యేక డ్రైవ్లు ఏర్పాటు చేసి తల్లిదండ్రులతోపాటు పిల్లలకు కౌన్సిలింగ్ నిర్వహించాల్సిన అవసరం ఉంది. బైపాస్ రోడ్డుపై రేస్.. నగరంలో ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన పాలకొండ బైపాస్పై రాత్రివేళలో టీనేజర్స్ రేసింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా చించోళి బైపాస్ రోడ్డుపై కూడా సాయంత్రం వేళ కొంతమంది యువకులు బైక్లతో అక్కడికి చేరుకుని పోటీలు పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా ఒక వర్గానికి చెందిన టీనేజర్స్ మరింత రెచ్చిపోయి బైక్లు ర్యాష్గా.. వేగంగా నడుపుతూ గట్టిగా హారన్స్ కొడుతూ.. సైలెన్సర్ల నుంచి మంటలు వచ్చేలా నడుపుతున్నారు. కొందరు అయితే బైక్ స్టాండ్స్ రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్తూ ఆనందిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోగణనీయంగా పెరిగిన మైనర్ల డ్రైవింగ్ వేసవి సెలవులనేపథ్యంలో బైక్లపై టీనేజర్ల చక్కర్లు పాలమూరులో రెండు బైపాస్ రోడ్లపై రేస్ల నిర్వహణ పూర్తిస్థాయిలో దృష్టిపెట్టని పోలీస్ శాఖ తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నా మార్పు రాని వైనం -
హ్యాండ్బాల్లో అదరగొడుతున్నారు
●మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా యువజన, క్రీడలశాఖ ఆధ్వర్యంలో వేసవి సెలవులను పురస్కరించుకొని మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో పలు క్రీడలకు సంబంధించి వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్న హ్యాండ్బాల్ శిబిరంలో విద్యార్థులు, యువత పాల్గొని శిక్షణ తీసుకుంటున్నారు. కొందరు సీనియర్ క్రీడాకారులు చక్కగా మెళకువలు నేర్చుకుంటూ సత్తాచాటుతున్నారు. 40 మంది క్రీడాకారులు హ్యాండ్బాల్ శిక్షణ శిబిరంలో దాదాపు 40 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. వీరిలో దాదాపు 15 మంది విద్యార్థులు కొత్తగా హ్యాండ్బాల్ శిక్షణ తీసుకుంటున్నారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5.30 గంటల నుంచి 8 గంటల వరకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. మొదట క్రీడాకారులకు వార్మప్, ఫిట్నెస్ ట్రైనింగ్ ఇస్తున్నారు. అనంతరం హ్యాండ్బాల్ టెక్నిక్పై అవగాహన కల్పిస్తున్నారు. హ్యాండ్బాల్ క్రాసింగ్, టూమెన్, త్రీమెన్ పాసింగ్తోపాటు వివిధ స్థానాల నుంచి షూటింగ్ ప్రాక్టిస్ చేయిస్తున్నారు. కొత్తగా వచ్చిన విద్యార్థులకు రీక్రియేషన్ గేమ్స్ నిర్వహిస్తున్నారు. ప్రతి శని, ఆదివారాల్లో చిన్నారులు, సీనియర్ క్రీడాకారులను జట్లుగా విభజించి మ్యాచ్లు ఆడిస్తారు. టెక్నిక్స్పై అవగాహన.. ఈ సంవత్సరం మొదటిసారి వేసవి హ్యాండ్బాల్ శిక్షణ శిబిరంలో పాల్గొంటున్నా. ఇక్కడ చాలా బాగా శిక్షణ ఇస్తున్నారు. హ్యాండ్బాల్ బేసిక్ టెక్నిక్ అంశాలపై అవగాహన పెంచుకుంటున్న. – సాయి సాహితి, మహబూబ్నగర్ పాలమూరు మెయిన్ స్టేడియంలో వేసవి శిబిరం ఉత్సాహంగా శిక్షణ తీసుకుంటున్న యువత జూనియర్, సీనియర్ జట్లుగా విభజించి మ్యాచ్లు కొత్తగా వస్తున్న వారిపై నిర్వాహకుల ప్రత్యేక దృష్టి -
అదరగొడుతున్నారు
పాలమూరులో నిర్వహిస్తున్న హ్యాండ్బాల్ శిక్షణ శిబిరంలో క్రీడాకారులు మెళకువలు నేర్చుకుంటూ సత్తాచాటుతున్నారు. –8లో uడివిజన్లలో ఇదీ పరిస్థితి.. డివిజన్ నం.1లోని దొడ్డలోనిపల్లిలో పవర్ బోర్ల ద్వారా సరఫరా అయ్యే తాగునీటికి కొన్ని ఇళ్లకు పైపులైన్లు వేసుకున్నారు. మిషన్ భగీరథ ద్వారా సరఫరా కాని రోజుల్లో ఈ నీటినే వినియోగిస్తున్నారు. డివిజన్ నం. 2లోని ఏనుగొండ బీసీకాలనీ, ఎస్సీ కాలనీలకు రెండు, మూడు రోజులకోసారి మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు వస్తోంది. డివిజన్ నం.5 పరిధిలోని ఎదిరకు మూడు రోజుల నుంచి తాగునీరు రావడం లేదని స్థానికులు తెలిపారు. డివిజన్ నం.11లోని గొల్లబండతండాలో ఎత్తు ప్రదేశంలోని సుమారు 150 ఇళ్లకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు సన్నగా వస్తోంది. డివిజన్ నం.16లోని బోయపల్లి– కోట్ల వీధి, యాదవకాలనీలు ఎత్తు ప్రదేశంలో ఉండటంతో మిషన్ భగీరథ తాగునీరు సరిగా అందడం లేదు. డివిజన్ నం.41లోని సద్దలగుండు, రాజేంద్రనగర్లో, డివిజన్ నం.42లోని ప్రేమ్నగర్కు మూడురోజులకోసారి తాగునీరు అందుతోంది. శెట్టి కాంప్లెక్స్కు వెళ్లే దారిలో ఒకచోట్ల పైపులైన్కు లీకేజీ ఏర్పడటంతో తాగునీరు వృథాగా పారుతోంది. డివిజన్ నం.47, 48, 49, 50లకు నాలుగు రోజులకోసారి తాగునీరు అందుతోంది. దీంతో కొందరు ప్రజలు ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా కొనుగోలు చేసి వాడుకుంటున్నారు. -
పకడ్బందీగా ఇంటింటి జనగణన
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ఈనెల నుంచి ప్రారంభం కానున్న ఇంటింటి జనగణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని తెలంగాణ సెన్సస్ డైరెక్టర్ భారతి హోలీకేరి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ఆమె వీసీ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో రెండో విడత జనగణనపై సమీక్షించగా.. మహబూబ్నగర్ నుంచి కలెక్టర్ ఖుష్బూ గుప్తా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చార్జి అధికారులు, సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లు తమకు కేటాయించిన బ్లాకులను మొదటి మూడు రోజులు (11, 12, 13)లలో తప్పనిసరిగా సందర్శించాలన్నారు. ఆయా బ్లాకుల్లో హెచ్బీఎల్ (హౌస్ బేస్డ్ లిస్టింగ్)ను పరిశీలించి.. లేఔట్ మ్యాప్ను సిద్ధం చేసుకోవాలని సూచించారు. అలాగే 11 నుంచి ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటిని విధిగా సందర్శించి, గృహాల వారీగా జాబితా సిద్ధం చేసి వివరాలు నమోదు చేయాలన్నారు. గృహాల జాబితా తయారీ సమయంలో ఏ ఒక్క ఇంటిని కూడా వదలకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అలాగే మండల రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ నిర్వహించి, జనాభా గణన సర్వేను విజయవంతంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. జనగణన ప్రక్రియను ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు 100 శాతం విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మధుసూదన్నాయక్, హరిప్రియ, ఆర్డీఓ నవీన్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి రవీంద్ర, మున్సిపల్ కమిషనర్ రామంజులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తాగలేం..!
మహబూబ్నగర్శనివారం శ్రీ 9 శ్రీ మే శ్రీ 2026నగరంలో వారంలో రెండుసార్లే తాగునీటి సరఫరా సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నగరంలోని 60 డివిజన్లకు వారంలో రెండుసార్లు మాత్రమే మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు సరఫరా అవుతోంది. శుద్ధనీటి సరఫరా అంటున్నా.. ఒండ్రుతో కలిసి వస్తుండటంతో దాదాపు 90 శాతం ప్రజలు ఈ నీటిని తాగడమే లేదు. ఎక్కడికక్కడ ప్రైవేట్ ఆర్ఓ ప్లాంట్లు, ట్రాలీ ఆటోల ద్వారా వచ్చే నీటికి డబ్బులిచ్చి క్యాన్లలో పట్టుకుంటున్నారు. సుమారు మూడు లక్షల జనాభా కలిగిన మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 28 చోట్ల ఓవర్హెడ్ ట్యాంకులు ఉన్నాయి. నెలలో కనీసం రెండుసార్లు అన్నిచోట్ల క్లారిఫొక్లేటర్ క్లీనింగ్ (ఫిల్టర్బెడ్లో అడుగున చేరిన బురద, మట్టిని తొలగించే పని) చేస్తున్నట్లు మున్సిపల్ అధికారులు చెబుతున్నా.. ఒకసారి మాత్రమే ఈ ప్రక్రియ చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటి ద్వారా ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతోంది. ప్రస్తుతం వేసవి కావడంతో ఏమాత్రం సరిపోవడం లేదు. ప్రత్యామ్నాయంగా సుమారు 700 పవర్ బోర్లు ఉండటంతో మిగతా రోజుల్లో వీటిని ఆశ్రయిస్తున్నారు. మిషన్ భగీరథ ద్వారా ఒండ్రుతో వస్తున్న శుద్ధజలం సుమారు 3 లక్షల జనాభాకు సరిపోక ఇబ్బందులు ప్రత్యామ్నాయంగా పవర్ బోర్లతోసరిపెడుతున్న వైనం ‘సాక్షి’ బృందం పరిశీలనలోవెలుగులోకి వాస్తవ పరిస్థితులు -
వేణుగోపాలస్వామి ఆలయ నిర్మాణానికి భూమిపూజ
కోస్గి రూరల్: పురకేంద్రంలోని వేణుగోపాలస్వామి ఆలయ పునః నిర్మాణానికి శుక్రవారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి వికారాబాద్ జిల్లా కొడంగల్లో భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయాన్ని రూ.2 కోట్లతో సుందరంగా నిర్మించనున్నామన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు పార్టీలకతీతంగా కృషి చేయాలన్నారు. ఇప్పటికే నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ సేకరణ పూర్తయిందని, పనులు ఏడాదిన్నరలోగా పూర్తిచేసి ఈ ప్రాంత ప్రజలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. లగచర్లలో 200 ఎకరాల్లో విద్యాహబ్, ఇండస్ట్రియల్ పార్క్, సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. కృష్ణా–వికారాబాద్ రైల్వే లైన్ పనులకు 90 శాతం అనుమతులు లభించాయని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, పశుసంవర్దకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, పరిగి ఎమ్మెల్యే రాంమోహన్రెడ్డి, తాండూర్ ఎమ్మెల్యే మనోహర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సస్పెన్షన్తో సరిపెట్టారు!
గండేడ్: రుణాల రికవరీలో అక్రమాలపై పూర్తిస్థాయి విచారణలో జాప్యం జరుగుతున్నది. కేవలం తాత్కాలికంగా సప్పెన్షన్ వేటు వేశారు తప్పా.. క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి విచారణ చేపట్టడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారంపై పలు అనుమానాలు చోటుచేసుకుంటున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. ఉమ్మడి గండేడ్ మండలంలో పీఏసీఎస్తోపాటు డీసీసీబీ ఉంది. వీటి ద్వారా రైతులకు పంట, దీర్ఘకాలిక, పిటీలోన్లు ఇచ్చారు. అయితే ఇచ్చిన రుణాల రికవరీలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. గతంలో పనిచేసిన ఓ బ్యాంకు మేనేజర్ పీఏసీఎస్ సిబ్బంది సహకారంతో కలిసి చేతివాటం ప్రదర్శించారు. అయితే ఇచ్చిన రుణాలు ప్రతిఏటా రికవరీ చేయడం.. అటు బ్యాంకు.. ఇటు పీఏసీఎస్ సిబ్బంది బాధ్యత. అందులో భాగంగానే ప్రతి ఆర్థిక సంవత్సరం ముగింపులోగా రుణాలు రికవరీ చేస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని వారు రికవరీకిగాను నేరుగా లబ్ధిదారుల వద్దకెళ్లి రుణాలు కట్టాలంటూ ఒత్తిడి చేసేవారు. సిబ్బంది రికవరీకి రావడంతో రుణం తీసుకున్న లబ్ధిదారులు నానా తంటాలు పడి రుణాలు చెల్లించేవారు. రైతుల నుంచి రుణాల రికవరీ సందర్భంగా గ్రామాల్లోకి వెళ్లినప్పుడు హ్యాండ్ రిసిప్టులు ఇచ్చేవారు. అయితే అలా చెల్లించిన రుణం మాత్రం చెల్లించిన రైతుల ఖాతాల్లో స్క్రోల్గాని అక్కౌంట్కుగాని లెడ్జర్కుగాని పోలేదు. కొత్త మేనేజరు వచ్చాక రికవరీకి వెళ్లడంతో బాధితులు ఆయన దృష్టికి తీసుకువెళ్లడంతో వాస్తవాలు వెళ్లడయ్యాయి. బ్యాంకులో క్యాషియర్, పీఏసీఎస్లో సీఈఓ రిసీవ్డ్ రిసిప్టు ఇస్తాడు. వాటిపై ముద్రలతో సహా ఉంటాయి. కాని రైతులకిచ్చిన రిసిప్టులు డుప్లికేట్ హ్లాండ్ రిసిప్టులు ఇచ్చారు. కొన్ని సీలు, సిగ్నేచర్ లేకుండా ఇచ్చారు. దీంతో వారి ఖాతాల్లో జమ కాకపోవడంతో అప్పు అలాగే ఉండిపోయింది. అప్పు బాకీ వారినుంచి నేరుగా ఫోన్పే, గూగుల్ పే రూపంలో బ్యాంకు సిబ్బందికి పీఏసీఎస్ సిబ్బంది ఖాతాలకు డబ్బులు వేశారు. అయితే వీటిని వెంటనే వారి అప్పుఖాతాల్లో జమచేయకుండా మేనేజర్ స్వాహా చేశాడు. కొంరెడ్డిపల్లిలో పలువురు రైతులకు చెందిన డబ్బులు ఇదే తరహాలో స్వాహా అయ్యాయి. దీంతోపాటు జక్లపల్లిలో ఓ రైతు నుంచి కూడా ఫోన్పే ద్వారా రుణం కిస్తు వేయగా దానిని వారి ఖాతాల్లో జమచేయలేదు. ఆయన బదిలీ అనంతరం కొత్తగా వచ్చిన మేనేజరు ఆ రుణం గురించి ఆ రైతును అడగగా విషయం బయటికి వచ్చింది. రుణం కిస్తు రూ.35000 ఉండగా సదరు మేనేజరుకు రూ.45000 వేయించుకున్నట్లు సమాచారం. ఇవేకాక గోల్డ్లోన్ల రికవరీ ఉందని చెప్పి డబ్బులు వేయించుకొని లోన్ తీసుకున్నవారికి తెలియకుండా దానిని ఎక్కువ చేసి వారు వేసిన డబ్బులు కూడా జేబులో వేసుకున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. ఆగమేఘాల మీద సర్దుబాటు గండేడ్ మండలంలోని కొంరెడ్డిపల్లిలో పలు రైతుల డబ్బులు స్వాహా అవ్వడంతో విచారణ అనంతరం సదరు మేనేజర్ను సస్పెండ్ చేశారు. అయితే ఆ స్వాహా చేసిన డబ్బులు పీఏసీఎస్ సిబ్బంది ఖాతా ద్వారా సర్దుబాటు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఆగమేఘాల మీద ఈ డబ్బును సర్దుబాటు చేశారు. దీంతోపాటు జక్లపల్లి రైతు రుణాన్ని కూడా సర్దుబాటు చేశారు. అయితే విచారణలో వెల్లడైన వివరాల ఆధారంగా సస్పెండ్ చేసినా ఇప్పటివరకు పూర్తి విచారణ మాత్రం చేయడం లేదు. అంతేకాక కేవలం రెండు గ్రామాల్లో జరిగిన వాటిపైనే దష్టిపెట్టారు తప్పా.. మిగతా వాటిపై అధికారులు దృష్టిసారించలేదన్న విమర్శలు లేకపోలేదు. పీఏసీఎస్ రుణాలతోపాటు బ్యాంకు డైరెక్టు రుణాలపై కూడా పూర్తిస్థాయి విచారణ జరిపితే మరిన్ని లొసుగులు బయటికి వచ్చే అవకాశం ఉంది. 2022 సదరు మేనేజర్ పీఏసీఎస్ పూర్తిస్థాయిలో వసూళ్లు కాకపోయిన టార్గెట్ 50శాతం పూర్తయిందని తప్పుడు సమాచారం ఇచ్చి కొత్త అలాట్మెంటు తీసుకొని తిరిగి రుణాలు ఇచ్చి చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సమయంలో ఇతనికి బెస్టు రికవరీ ఆఫీసర్ అని ప్రశంసాపత్రం కూడా ఇవ్వడం విడ్డూరం. బ్యాంకులో ఉన్న పాసుపుస్తకాలు ఇతర రికార్డులు కాని జిరాక్స్ అవసరమొస్తే పీఏసీఎస్ సిబ్బందికి ఒకరికి బాధ్యత అప్పగించి రూ.వేయి చొప్పున కూడా వసూలు చేసినట్లు సమాచారం. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని క్షేత్రస్థాయిలో విచారణ చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సస్పెండ్ అయిన మేనేజర్ రైతుల డబ్బులు సర్దుబాటు చేశాక.. సస్పెన్షన్ ఎత్తేయించుకొని తిరిగి విధుల్లో చేరడానికి ముమ్మర యత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దీనికిగాను అధికారుల చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం. అక్రమాల్లో పీఏసీఎస్ సిబ్బంది హస్తం లేకపోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. కేవలం ఒక్క మేనేజరే కాక పీఏసీఎస్ సిబ్బంది లీలలు మరిన్ని బయటకు వచ్చే అవకాశం ఉంది. అక్రమాలు నిగ్గు తేల్చడంలో అలసత్వం వచ్చిన ఫిర్యాదులపై మాత్రమే విచారణ పూర్తిస్థాయి విచారణలో జాప్యం రికవరీలో మరిన్ని అక్రమాలపై అనుమానాలు -
నేటి నుంచి షా అలీ పహిల్వాన్ ఉర్సు
అలంపూర్: పట్టణంలో వెలిసిన హజ్రత్ షా అలీ పహిల్వాన్ ఉర్సు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు. 9 నుంచి 12వ వరకు ఉర్సు హజ్రత్ షా అలీ పహిల్వాన్ ఉర్సును పురస్కరించుకొని 9న రాత్రి గంధోత్సవం ఉంటుంది. రాత్రి సయ్యద్ ఖాదర్ వలీ సాహెబ్ ఇంటి నుంచి తహసీల్దార్ కార్యాలయానికి గంధం చేరుకుంటుంది. అక్కడ ప్రత్యేక ప్రార్థనల అనంతరం గంధాన్ని సర్ ముబారక్ దర్గాకు భక్త జనసందోహం మధ్య ఊరేగింపుగా తీసుకెళ్తారు. సర్ ముబారక్ దర్గాలో గంధం సమర్పించి ప్రత్యేక ప్రార్ధనలు చేస్తారు. చివరగా ధడ్ ముబారక్ దర్గాలకు గంధం తీసుకెళ్లి ప్రార్థనలు చేయడం ఆనవాయితీ. 10న సర్ ముబారక్ దర్గాలో చిన్న కిస్తి పోటీలు జరగనున్నాయి. 11న ధడ్ ముబారక్ దర్గా వద్ద పెద్ద కిస్తి పోటీలు నిర్వహిస్తారు. 12న ప్రత్యేక ఉర్సుతో ఉత్సవాలు ముగియనున్నట్లు పేర్కొన్నారు. గుల్బర్గా నుంచి గంధం ఉత్సవాలకు కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా ఖాజా బందేనవాజ్ దర్గా నుంచి గంధాన్ని అలంపూర్లోని సయ్యద్ ఖాదర్ బాషా ఇంటికి తీసుకొస్తారు. అక్కడి నుంచి గంధాన్ని దర్గాలకు తీసుకెళ్లి ఉత్సవాలను ప్రారంభిస్తారు. ఉర్సులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు కల్పించనున్నారు. బ్యాంకులో డబ్బులు జమ చేసేందుకు వచ్చి మృతి భూత్పూర్: బ్యాంకులో డబ్బులు జమ చేయడానికి వచ్చిన ఓ మహిళ గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. మండలంలోని కర్వెన గ్రామానికి చెందిన మర్కంటి లక్ష్మమ్మ(55) శుక్రవారం బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులను డ్రా చేయడానికి భూత్పూర్లోని ఓ బ్యాంకుకు వచ్చి కూర్చొంది. అకస్మాత్తుగా కుర్చీలో కూర్చున్న చోటే కిందపడిపోవడంతో వెంటనే బ్యాంకుకు వచ్చిన ఇతర ఖాతాదారులు, బ్యాంకు సిబ్బంది పరిశీలించగా అప్పటికే ఆమె మృతిచెందింది. బ్యాంకుకు వచ్చిన కర్వెన గ్రామ మహిళా సంఘం సభ్యులు లక్ష్మమ్మను గుర్తించి.. బంధువులకు సమాచారం ఇవ్వడంతో ఆమెను స్వగ్రామమైన కర్వెన గ్రామానికి తీసుకెళ్లారు. మృతురాలి భర్త ఇప్పటికే మృతిచెందగా.. సంతానం ఎవరూ లేరని గ్రామ సర్పంచ్ నాగరాణి తెలిపారు. -
షీటీంలతో ఆకతాయిలకు చెక్
మహబూబ్నగర్ క్రైం: అమ్మాయిలు, మహిళా రక్షణతో పాటు చిన్నారులపై జరిగే వేధింపులకు గురి చేసే వారిపై పోలీస్ శాఖ నిరంతర నిఘా ఉంచుతోంది. యూనిఫాం లేకుండా జనసంచారంలో ఉంటూ ఆకతాయిల ఆట కట్టించడానికి ఏర్పాటు చేసిన షీటీం సిబ్బంది నిరంతరం పోరాటం చేస్తోంది. జిల్లావ్యాప్తంగా జన సమూహం ఎక్కువగా ఉండే ప్రాంతాలతో పాటు బస్టాండ్, రైల్వేస్టేషన్, కళాశాలలు, మార్కెట్లలో నిఘా వ్యవస్థ పని చేస్తోంది. వేసవి సెలవుల్లో ఖాళీగా తిరిగే ఆకతాయిల ఆట కట్టించేందుకు పోలీస్శాఖ షీటీం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు. జిల్లాకేంద్రం బస్టాండ్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న ఎస్పీ జానకి (ఫైల్) -
రాష్ట్రస్థాయి కిక్బాక్సింగ్ పోటీలకు ఎంపిక
మహబూబ్నగర్ క్రీడలు: రంగారెడ్డి జిల్లాలో ఈనెల 9, 10 తేదీల్లో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి కిక్బాక్సింగ్ పోటీలకు 32 మంది జిల్లా విద్యార్థులు ఎంపికై నట్లు స్పోర్ట్స్ కిక్బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రవికుమార్ తెలిపారు. విద్యార్థులు వివిధ విభాగాల్లో పోటీపడుతున్నట్లు తెలిపారు. విద్యార్థులను జిల్లాకేంద్రంలో డిప్యూటీ మేయర్ సురేందర్రెడ్డి అభినందించారు. రాష్ట్రస్థాయి కిక్బాక్సింగ్ పోటీల్లో విద్యార్థులు ప్రతిభ చాటి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో టీమ్ కోచ్ నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. -
‘పది’లమైన మార్కులే సాక్షి
నారాయణపేట రూరల్: పదో తరగతి విద్యార్థులకు ‘సాక్షి’ దినపత్రిక అందించిన స్టడీ మెటీరియల్ ఎంతో ఉపయోగపడిందని ఉపాధ్యాయులు, విద్యార్థులు తెలిపారు. ఇటీవల విడుదలైన టెన్త్ ఫలితాల్లో జిల్లా వ్యాప్తంగా చాలామంది విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించారు. సాక్షి యాజమాన్యం నిష్ణాతులైన అధ్యాపక బృందం ఆధ్వర్యంలో గణితం, భౌతికశాస్త్రం మెటీరియల్ రూపొందించి పదో తరగతి పరీక్షలకు రెండు నెలల ముందు విద్యార్థులకు అందించింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే బీద, మధ్యతరగతి విద్యార్థులకు ఉచితంగా లభించిన ఈ స్టడీ మెటీరియల్ ఎంతో ఉపకరించిందని కొనియాడుతున్నారు. అదేవిధంగా పలు ప్రభుత్వ పాఠశాలలకు ‘సాక్షి’ దినపత్రికను అందించడంతో నిత్యం అందులో ప్రచురితమైన భవిత పేజీ సద్వినియోగం చేసుకున్నట్లు విద్యార్థులు చెప్పుకొస్తున్నారు. భవిత పేజీని ప్రతిరోజు టెన్త్ విద్యార్థుల వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తే వాటిని ఇంటికి వెళ్లి రివిజన్ చేసుకునేవారని, సందేహాలు ఉంటే మరుసటిరోజు నివృత్తి చేసుకునే వారిని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అత్యుత్తమ మార్కులు సాధించడంలో సాక్షి ఎంతో ఉపయోగపడిందని, భవిష్యత్లోనూ మరింత సహకారం అందించాలని కోరుకుంటున్నారు. వచ్చే విద్యా సంవత్సరం అన్ని సబ్జెక్టులకు సంబంధించిన మెటీరియల్తోపాటు తెలుగు మీడియం వారికి అందించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా టాపర్గా నిలిచా ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ 587 మార్కులు సాధించి జిల్లా టాపర్గా నిలిచా. డిసెంబర్లోగా ఉపాధ్యాయులు సిలబస్ పూర్తి చేసి రివిజన్ టెస్టులు నిర్వహించారు. దీనికితోడు సాక్షి మెటీరియల్ ద్వారా చదువుకోవడం మార్కులు పెరగడానికి ఎంతో ఉపకరించింది. – పూర్విక, మద్దూరు స్టడీ మెటీరియల్ ఉపయోగపడింది సాక్షి యాజమాన్యం అందించిన స్టడీ మెటీరియల్ మార్కుల సాధనలో ఎంతో ఉపయోగపడింది. కఠినమైన అంశాలను సులువుగా వివరించి అందించడంతో స్వయంగా చదువుకోవడానికి దోహదపడింది. చివరి రెండు నెలలు సాక్షి మెటీరియల్ పైనే ఆధారపడటంతో మంచి మార్కులు సాధించాను. – నవనీత, కొలంపల్లి. గణితంలో 95మార్కులు సాధించా గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థులం కావడంతో కొంత గణితంలో వెనకబడి ఉంటాం. ఎప్పుడూ లెక్కల సబ్జెక్ట్ లోనే మార్కులు తక్కువగా వచ్చేవి. అయితే పరీక్షల ముందు సాక్షి దినపత్రిక ఆధ్వర్యంలో ఉచితంగా ఇచ్చిన గణితం మెటీరియల్ నాకు ఎంతో ఉపయోగపడింది. రెగ్యులర్గా పుస్తకం ఫాలో కావడంతో గణితంలో 95మార్కులు సాధించాను. సాక్షికి ధన్యవాదములు. – ఎల్లప్ప, భైరంకొండ పాలిసెట్కు ఉపయోగిస్తున్న.. పరీక్షల ముందు సాక్షి దినపత్రిక అందించిన మెటీరియల్ ఎంతో ఉపయోగపడింది. గణితం, సైన్స్లో 90కి పైగా మార్కులతో మొత్తం 527 సాధించాను. పాలిసెట్లో సీటు సాధించేందుకు సైతం ఈ మెటీరియల్ను ఫాలో అవుతున్న. కష్టమైన వాటిని సులువుగా నేర్చుకుంటున్నా. –శిరీష, అమీన్పూర్ గణితం అంటే ఎంతో భయం ఉండేది. ప్రతి అధ్యాయం నుంచి పరీక్షల్లో రాయడానికి కష్టమైన లెక్కలను సులభమైన రీతిలో నమూనా ప్రశ్నలు విశ్లేషించి మెటీరియల్లో పొందుపరిచారు. తద్వారా లెక్కలు కష్టమన్న విద్యార్థుల్లో సాక్షి మెటీరియల్తో భయం పోయింది. ప్రధానంగా గణితం పరీక్షల్లో సమయాన్ని సమన్వయం చేసుకునేలా ఈ మెటీరియల్ ఉపయోగపడింది. – మధుసూదన్, గణిత ఉపాధ్యాయులు, జాజాపూర్ పత్రికలు కేవలం సమస్యలు, ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే పనిలో నిమగ్నమై ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ సాక్షి దినపత్రిక అందుకు భిన్నంగా ఆలోచిస్తూ విద్యాభివృద్ధికి కృషి చేయడం గొప్ప విషయం. ప్రతిరోజు భవిత పేజీలో కీలక అంశాలను తెలియజేస్తూనే కష్టమైన గణితం, సైన్స్ మెటీరియల్ను విద్యార్థులకు ఉచితంగా అందించడం శుభపరిణామం. భవిష్యత్లో తెలుగు మీడి యం విద్యార్థులకు అందించే విధంగా కృషిచేయాలి. – భానుప్రకాష్, జిల్లా సైన్స్ అధికారి ‘సాక్షి’ చేయూత మరువలేనిది సాక్షి దినపత్రిక విద్యార్థుల కోసం అందించిన చేయూత మరవలేనిది. ఇంటర్తోపాటు టెన్త్ చదువుతున్న విద్యార్థులకు భవిత పేజీ ఎంతో ఉపయోగపడింది. ప్రతిరోజు ఒక్కొక్క సబ్జెక్టుపై విశ్లేషణాత్మక విషయాలు, పాఠ్యాంశం వారీగా చదవాల్సిన అంశాలు చాలా బాగున్నాయి. మంచి ఫలితాలు సాధించడానికి సహకరించడం ఆనందంగా ఉంది. – శ్రీ విద్య, గురుకుల స్కూల్, నారాయణపేట మంచి ప్రోత్సాహం అందించింది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సాక్షి ఎంతో ప్రోత్సాహాన్ని అందించింది. ఆంగ్ల మాధ్యమంలో ప్రింట్ చేసిన మెటీరియల్ కొన్ని పుస్తకాలు మా పాఠశాలకు అందించారు. వాటిని ఉపాధ్యాయులు తెలుగులో తర్జుమా చేసి రోజువారీగా చదివించడం ఎంతో ఉపయోగపడింది. మెటీరియల్ ఆధారంగా పరీక్షలకు సిద్ధం కావడంతో మంచి ఫలితాలు సాధించాం. – అక్షిత, కేజీబీవీ, నారాయణపేట స్టడీ మెటీరియల్ సహకారంతో ఉత్తమ ఫలితాలు ఎంతో ఉపకరించిందని కొనియాడిన విద్యార్థులు సాక్షి పత్రికకు ధన్యవాదాలు తెలిపిన ఉపాధ్యాయ బృందం -
ఉరేసుకుని గర్భిణి ఆత్మహత్య
కేటీదొడ్డి: ఉరేసుకుని గర్భిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని సుల్తాన్పురంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన లక్ష్మీ, కృష్ణయ్య దంపతుల కుమార్తె, ఎనిమిది నెలల గర్భిణి శ్రుతి (20) రాయచూర్ జిల్లా తుర్కల్దొడ్డికి చెందిన ఓ వ్యక్తితో వివాహం జరిగింది. గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో శృతి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహన్ని అంత్యక్రియల నిమిత్తం తుర్కల్దొడ్డికి తరలించారు. శృతి మృతిపై ఎలాంటి సమాచారం లేదని పోలీసులు తెలిపారు. -
పశువుల అక్రమ రవాణాపై చర్యలు
రాజాపూర్(బాలానగర్): పశువుల అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ జానకి హెచ్చరించారు. గురువారం బాలానగర్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టును ఆమె సందర్శించారు. జిల్లా వ్యాప్తంగా అక్రమ పశువుల రవాణాపై ఏడు ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహబూబ్నగర్ జిల్లాలో పశువుల అక్రమ రవాణా అరికట్టేందుకు జిల్లా పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందన్నారు. కీలక ప్రాంతాలైన పాలమూరు యూనివర్సిటీ, కోయిల్కొండ ఎక్స్రోడ్డు, బాలానగర్, మిడ్జిల్, నవాబ్పేట, మహమ్మదాబాద్, అడ్డాకల్ ప్రాంతాల్లో ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేసి పశువుల అక్రమ రవాణాపై నిరంతరం తనిఖీలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. చెక్పోస్టులో తనిఖీలు, రిజిస్టర్లలో నమోదుపై సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. పశువుల అక్రమ రవాణాపై ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బాలానగర్ చెక్పోస్టును సందర్శించిన మహబూబ్నగర్ ఎస్పీ జానకి -
మొక్కజొన్న కొనుగోళ్లపై రైతుల ఆందోళన
జడ్చర్ల: జడ్చర్ల పత్తి మార్కెట్యార్డులో ఏర్పాటు చేసిన మార్క్ఫెడ్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రం వద్ద గురువారం రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రానికి మొక్కజొన్నను తీసుకువచ్చి నెల రోజులకు పైగా గడుస్తున్నా కొనుగోళ్లు చేయకపోవడంపై మండిపడ్డారు. కొందరివి తూకాలు వేసినా లారీలలో సంబంధిత గోదాములకు తరలించడంలో ఆలస్యం చేయడంతో తాము రేయింబవళ్లు బస్తాలు, కుప్పల వద్దే పడిగాపులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా మర్కెటింగ్ అధికారిని బాలమణి, తహసీల్దార్ నర్సింగరావు, డీసీఓ కృష్ణ, తదితరులు మార్కెట్ యార్డుకు చేరుకుని రైతులకు నచ్చజెప్పారు. సంబంధిత సీఈఓ యాదగిరితో మాట్లాడి పరిస్థితిని అంచనా వేశారు. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, వెంటనే లారీలను ఏర్పాటు చేసి తూకం వేసిన బస్తాలను త్వరితగతిన గోదాములకు తరలించే విధంగా చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు. -
‘సీడ్, ఫెర్టి డ్రిల్’తో సాగు సులభం
● విత్తనం, ఎరువులు ఒకేసారివేసుకునే అవకాశం ● కూలీల సమస్యకు చెక్ ● దిగుబడి ఆశాజనకమే.. రకం వరుసల మొక్కల మధ్య మధ్య వరి 25 15 మొక్కజొన్న 60 20 పామాయిల్ 60 20 పెసర 25 10 గోగు 25–30 15 వేరుశనగ 30 15 అలంపూర్: జిల్లాలో రైతులు సాగులో ఎక్కువగా విత్తనాలు వెదజల్లడం, నాగలి వెనుక సాళ్లలో వేసే పద్ధతులను అవలంబిస్తున్నారు. చిన్న కమతాల్లో ఇది తప్పనిసరి. అయితే పెద్ద కమతాల్లో సాగుచేసే వారు యంత్రాలను వినియోగించడం మంచిది. పెర్టికమ్ సీడ్ డ్రిల్లర్లతో విత్తనాలు, ఎరువులు సమపాళ్లలో ఒకేసారి వేసుకోవచ్చు. దీనివల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వస్తాయని మండల వ్యవసాయ శాఖ అధికారి నాగార్జున్రెడ్డి రైతులకు సూచించారు. ఈ విధానంతో కూలీల సమస్యను అధికమించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. సీడ్ డ్రిల్ యంత్రంతో సాగు పద్ధతుల గురించి ఏఓ మాటల్లో.. ఫెర్టికమ్ సీడ్ డ్రిల్ వల్ల ఉపయోగాలు ● అన్ని రకాల విత్తనాలు ఈ డ్రిల్తో వేయవచ్చు. ● 8 గంటల్లో 6 నుంచి 8 ఎకరాల్లో విత్తనాలు విత్తుకోవచ్చును. ● వర్షాధార భూముల్లో తేమ తగ్గక ముందే సకాలంలో విత్తనాలు వేసుకోనే అవకాశం ఉంటుంది. ● పంటను బట్టి వరుసల మధ్య దూరం, మొక్కల మధ్య దూరం మార్చుకోవచ్చు. ● విత్తనంతో పాటు ఎరువులు వేయడం వల్ల పంట తొలి దశలో ఆరోగ్యంగా పెరుగుతుంది. వేసిన ఎరువు మొక్కకు మాత్రమే అందడం వలన ఎరువుల వినియోగ సామర్ధ్యం పెరుగుతుంది. ● పంటకు గాలి వెలుతురు బాగా తగిలి ఆరోగ్యంగా ఉంటుంది. ● యంత్రాలతో వరి, వేరుశనగ, మొక్కజొన్న, పెసర, మినుములు, కొమ్ముశనగ, గోగు తదితర పంటలు వేసుకోవచ్చు. ● ఈ యంత్రాన్ని ఉపయోగించేటప్పుడు తప్పనిసరిగా పొలం చదునుగా ఉండాలి. ● చివరి దుక్కిలో రోటోవేటర్ ఉపయోగించాలి. ● పొలం చదునుగా ఉంటే పొలం అంతా విత్తనం, ఎరువులు ఒకే మోతాదులో పడతాయి. ఒకేసారి మొలక శాతం వస్తోంది. ● ఈ యంత్రాలను ప్రభుత్వం రాయితీపై అందజేస్తుంది. సీడ్డ్రిల్తో సాగు సీడ్ డ్రిల్ యంత్రంలో రెండు బాక్సులు ఉంటాయి. ముందు బాక్స్లో ఎరువులు వేయాలి. రెండో బాక్స్లో విత్తనం వేయాలి. ఎరువు ముందు పడుతుంది. తర్వాత విత్తనం పడుతుంది. పాటించాల్సిన దూరం (సెం.మీ) పాడి–పంట -
సరిహద్దులో పటిష్ట నిఘా ఉంచాలి
రాజోళి: ఏపీ–తెలంగాణ సరిహద్దులో ఉన్న సుంకేసుల డ్యాంపై ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వద్ద అనునిత్యం నిఘా ఉంచాలని అడిషనల్ ఎస్పీ శంకర్ అన్నారు. గురువారం ఆయన రాజోళిలో పర్యటించి, సుంకేసుల డ్యాం పరిసరాలను, చెక్పోస్టును పరిశీలించారు. బక్రీద్ పండుగను దృష్టిలో పెట్టుకుని జంతు రవాణా జరగకుండా నిఘా పెట్టాలని, ప్రస్తుతం మొక్కజొన్న, వరి కొనుగోళ్ల సందర్భంగా ఏపీ నుంచి ధాన్యం రాకుండా పటిష్ట నిఘా ఉంచాలని పోలీసులను ఆదేశించారు. అనంతరం స్థానికులతో మాట్లాడారు. డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరు హెల్మెట్,సీటు బెల్టు ధరించి,ట్రాఫిక్ నిబంధనల మేరకు నడుచుకోవాలన్నారు. ర్యాష్ డ్రైవింగ్, మద్యం మత్తులో వాహనాలు నడపటం, మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టపరంగా నేరమన్నారు. ప్రమాదాల నివారణకు అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ శంకర్, ఎస్ఐ గోకారి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అడిషనల్ ఎస్పీ శంకర్ -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
చిన్నచింతకుంట: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన ఘటన కౌకుంట్ల మండలం అప్పంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ ఓబుల్రెడ్డి తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన భారతి (20) బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో స్పృహ లేకుండా పడి ఉంది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మహబుబ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. గురువారం మృతురాలి తండ్రి చిన్న తిమ్మన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మరికల్ మండలం ఎలిగండ్లకు చెందిన భారతికి నెల క్రితం గ్రామానికి చెందిన మహేష్తో వివాహం జరిగినట్లు స్థానికులు తెలిపారు. -
అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు
మెట్టుగడ్డ: రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు అందేవరకు యూనియన్ అండగా ఉంటుందని ఐజేయూ రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ప్రెస్క్లబ్ ప్రతినిధులపైనా రాజకీయ కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగా పోలీసులు అక్రమంగా నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కేవలం సోషల్ మీడియా పోస్టులను సాకుగా చూపి జర్నలిస్టుల గొంతు నొక్కే ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు. రాజకీయ నాయకులు జర్నలిస్టుల మధ్య ఉండే ఆరోగ్యకరమైన సంబంధాలు ఇలాంటి కేసులు దెబ్బతీస్తాయని, జర్నలిస్టుల స్వేచ్ఛకు భంగం కలిగిస్తే సహించేది లేదని పేర్కొన్నారు. జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి పిలుపునిస్తామని తేల్చి చెప్పారు. క్షేత్రస్థాయిలో జర్నలిస్టులపై దాడులు, వేధింపులు జరిగితే యూనియన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సమావేశంలో యునియన్ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, రాములు, ఐజేయూ జిల్లా అధ్యక్షులు నాగరాజుగౌడ్, పాషా, కార్యదర్శి సతీష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మహిళ అదృశ్యం: కేసు నమోదు
నవాబుపేట: మండల కేంద్రంలో ప్లాస్టీక్ సామన్ల వ్యపారం నిర్వహించే ఒక మహిళ అదృశ్యం కావడంతో గురువారం ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన వివరాలిలా.. మండల కేంద్రానికి చెందిన అనగొంది వెంకటయ్య భార్య కొన్నేళ్ల క్రితం మృతి చెందగా ఆయన ప్రమీల అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. కాగా, ఆయనతోపాటు తన భార్యతోపాటు తన సోదరుడి కుమారుడు సైదులును వ్యాపారానికి తోడుగా తీసుకెళ్లేవాడు. కాగా, గతనెల 8వ తేదీన భార్యతోపాటు సైదులు ఇద్దరు మాత్రమే వ్యాపారానికి వెళ్లి ఇంకా తిరిగి రాలేదు. ఎక్కడ వెతికిన వారి ఆచూకీ లభించలేదు. దీంతో తాజాగా గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంలో కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఆక్రమణలకు అడ్డేది?
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: నగరంలో కబ్జాదారుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. చెరువులు, కుంటలే లక్ష్యంగా యథేచ్ఛగా ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. అయినా అధికార యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. పైగా అవి పాతవే.. కొత్త కబ్జాలు లేవంటూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో క్రమక్రమంగా కనుమరుగవుతున్న చెరువులు.. ఆక్రమణదారుల బరితెగింపు బాగోతంపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. గతంలోనివే అంటూ... మహబూబ్నగర్ అర్బన్ మండల పరిధిలో 31 చెరువులు, కుంటలు దాదాపు 800 ఎకరాల్లో విస్తరించి ఉండగా.. పలుచోట్ల అక్రమ కట్టడాలు వెలసినట్లు నీటిపారుదల అధికారులు ఇదివరకే గుర్తించారు. మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్గా అవతరించిన క్రమంలో ఆక్రమణదారులు మరింత బరి తెగించారు. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో అనుమతుల్లేకుండా ప్లాట్లుగా చదును చేస్తున్నారు. కొన్నిచోట్ల భవనాలు నిర్మిస్తున్నారు. శ్రీనివాసకాలనీ సమీపంలోని పాలకొండ చిన్న చెరువులో ఏకంగా మొరంతో రోడ్డు వేశారు. ఇవన్నీ కళ్లకు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. కబ్జాదారులు పెట్రేగిపోతుండగా.. కలెక్టరేట్లో ప్రతివారం జరిగే గ్రీవెన్స్సెల్కు ఫిర్యాదులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. దీనిపై రెండు నెలల్లో 15కు పైగా అర్జీలు అందాయి. అయినా అధికారులు గతంలోనివే అంటూ కొట్టిపారేస్తుండడంతో అటు నీటిపారుదల, ఇటు కార్పొరేషన్ అధికార యంత్రాంగం తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమ్యామ్యాలు అందుతుండడంతోనే పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎఫ్టీఎల్ పరిధిలోనూ ఎన్ఓసీలు.. మహబూబ్నగర్ నగరం విస్తరిస్తున్న కొద్దీ చుట్టుపక్కల చెరువులు, కుంటలతో పాటు పాటు కాల్వలు సైతం కబ్జాలకు గురవుతున్నాయి. ఏనుగొండ మొదలుకుని పాలకొండ మీదుగా బండమీదిపల్లి, పీయూ.. వీరన్నపేట (చక్కనిరాయి) సమీపంలో నుంచి చిన్నదర్పల్లి వరకు బైపాస్ ఏర్పడడంతో చుట్టుపక్కల భూములకు డిమాండ్ పెరిగింది. దీంతో నగరం శివారుతో పాటు నడిబొడ్డున ఉన్న ఆయా చెరువుల శిఖం భూములపై అక్రమార్కుల కన్నుపడింది. ఇటీవల నీటిపారుదల శాఖ నుంచి కొందరు నిబంధనలకు విరుద్ధంగా ఎన్ఓసీలు పొంది ఎఫ్టీఎల్ పరిధిలో యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నా.. పట్టించుకునేనాథుడే కరువయ్యాడు. ప్రధానంగా రెవెన్యూ, మున్సిపల్, నీటిపారుదలశాఖల మధ్య సమన్వయ లోపం.. కొందరు అధికారుల చేతివాటం కబ్జాదారులకు దన్నుగా మారినట్లు తెలుస్తోంది. నగరంలో యథేచ్ఛగా చెరువుల కబ్జా గతంలోవే అంటూ అధికారుల కొట్టివేత ఫిర్యాదులు చెత్తబుట్ట పాలు కలెక్టరేట్ గ్రీవెన్స్కు రెండు నెలలుగా15కి పైగా అర్జీలు ‘అధికార’ యంత్రాంగం తీరుపై విమర్శలు -
మరో రెండు కార్పొరేషన్ పదవులు
● సరిత, గట్టు తిమ్మప్పకు దక్కిన ‘చైర్మన్ గిరి’ గద్వాల: ఉమ్మడి పాలమూరులోని జోగుళాంబ గద్వాల జిల్లాకు మరో రెండు కార్పొరేషన్ పదవులు దక్కాయి. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. కొల్లె సరిత తిరుపతయ్యను తెలంగాణ గొర్రెలు మరియు మేకల అభివృద్ధి సహకార సమాఖ్య (టీజీఎస్జీడీసీఎఫ్ఎల్) చైర్పర్సన్గా, గట్టు తిమ్మప్పను వాల్మీకి బోయ కో–ఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్కు చైర్మన్గా నియమిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే శాట్ చైర్మన్గా శివసేనారెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్గా ఒబేదుల్లా కొత్వాల్ కొనసాగుతున్నారు. ● కొల్లె సరిత బీఆర్ఎస్ హయాంలో జోగుళాంబ గద్వాల జిల్లా జెడ్పీ చైర్పర్సన్గా ఐదేళ్ల పాటు పనిచేశారు. 2023లో బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరారు. గద్వాల నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం సరిత కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ● గట్టు తిమ్మప్ప గద్వాల మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు సోదరుడు. టీడీపీలో రాజకీయ రంగప్రవేశం చేసిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మ డి పాలమూరు జిల్లా డీసీసీబీ చైర్మన్గా పదవి నిర్వహించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్లో చేరిన ఆయన గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఓసారి గట్టు జెడ్పీటీసీగా గెలిచిన ఆయన వినియోగదారుల ఫోరం రాష్ట్ర చైర్మన్గా కూడా పనిచేశారు. -
బంగారం దుకాణాల్లో నాణ్యమైన సీసీ కెమెరాలు ఉండాలి
మహబూబ్నగర్ క్రైం: ప్రతి బంగారం దుకాణంలో నాణ్యమైన సీసీ కెమెరాలు, నైట్ విజన్ కెమెరాలు ఏర్పాటు చేసి 24 గంటలు పర్యవేక్షణ ఉండే విధంగా చూసుకోవాలని ఎస్పీ డి.జానకి సూచించారు. నగరంలోని విరాట్ విశ్వకర్మ సహకార సంఘం కార్యాలయంలో బుధవారం బులియన్ మార్కెట్, స్వర్ణకారుల సంఘం సభ్యులతో ఎస్పీ భద్రత చర్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కెమెరాల ఫుటేజ్ను నిర్దిష్ట కాలం వరకు భద్రపరచడం, షాప్ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు స్పష్టంగా కనిపించే విధంగా కెమెరాలు ఏర్పాటు చేయడం కీలకమన్నారు. అలారం సిస్టమ్, సురక్షిత లాకర్లు వంటి భద్రతా ఏర్పాట్లతో పాటు మొబైల్ అలర్ట్ సిస్టమ్స్, యాక్సెస్ కంట్రోల్ వంటి ఆధునిక భద్రత సాంకేతికతను కూడా వినియోగంలోకి తీసుకురావాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులను గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. జిల్లా పోలీస్శాఖ నుంచి కూడా బంగారం దుకాణాలు ఉన్న ప్రాంతాల్లో గస్తీ మరింత పెంచనున్నట్లు వెల్లడించారు. నిరంతరం మొబైల్ పార్టీలు తిరుగుతూ పర్యవేక్షణ నిర్వహించాలన్నారు. అలాగే పాటు డిజిటల్ అరెస్ట్ మోసాలు, ఆన్లైన్ యాత్ర టికెట్ బుకింగ్ మోసాలు, ఫేక్ కాల్స్ ఇలాంటి సైబర్ నేరాల నుంచి పూర్తిగా అప్రమత్తంగా ఉండాలన్నారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు, వన్టౌన్ సీఐ అప్పయ్య, టూటౌన్ సీఐ ఇజాజుద్దీన్ పాల్గొన్నారు. -
పదవీ కాలం ముగిసింది
● రిజర్వాయర్లో ఏడు మీటర్లుతగ్గిన నీటిమట్టం ● ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో మిషన్ భగీరథ అధికారులు ● నేటినుంచి ప్రత్యేక అధికారి పాలనలో జడ్చర్ల పురపాలికం రామన్పాడు తగ్గుముఖంజడ్చర్ల టౌన్: జడ్చర్ల మున్సిపాలిటీలో గురువారం నుంచి ప్రత్యేక అధికారి పాలన ప్రారంభం కానుంది. పాలకవర్గ సభ్యులకు స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి శాలువాతో సత్కరించి అభినందించి వీడ్కోలు పలికారు. 2011 మార్చిలో అప్పటి గ్రామపంచాయతీ పాలకవర్గం గడువు ముగియటంతో ప్రత్యేక అధికారి పాలన ప్రారంభమైంది. అప్పటి నుంచి 2021 వరకు బాదేపల్లి ప్రత్యేక అధికారి పాలనలోనే కొనసాగింది. మధ్యలో జడ్చర్ల మేజర్ గ్రామపంచాయతీకి 2016లో ఎన్నికలు జరిగి ఐదేళ్ల పాటు సర్పంచ్, వార్డుసభ్యుల పాలన కొనసాగింది. బాదేపల్లి మాత్రం మార్చి, 2011 నుంచి మే, 2021 వరకు ప్రత్యేకాధికారి పాలనలోనే ఉండింది. గ్రహణం వీడి 2021 ఏప్రిల్లో ఎన్నికలు జరగగా.. మే 6న పాలక వర్గం ప్రమాణస్వీకారం చేసింది. ఐదేళ్ల గడువు ముగియటంతో ఇక ప్రత్యేక పాలన అనివార్యమైంది. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో స్పష్టత కొరవడటంతో అప్పటి వరకు అధికారుల ఆధ్వర్యంలోనే మున్సిపాలిటీలో పాలన కొనసాగనుంది. ఘనంగా వీడ్కోలు.. పాలకవర్గానికి మున్సిపల్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఘనంగా వీడ్కోలు పలికారు. మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి.. చైర్పర్సన్ పుష్పలత, వైస్ చైర్పర్సన్ పాలాది సారికతో పాటు వార్డు కౌన్సిలర్లను సత్కరించి మెమొంటోను అందజేశారు. చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలి పాలకవర్గం గడువు ముగిసినందున అధికారులు చిత్తశుద్ధితో నిబంధనలకు అనుగుణంగా పాలన సాగించాలని ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ఆదేశించారు. పాలకవర్గం ఉన్నపుడు కొంత ఆచితూచి వ్యవహరించినా ఇప్పుడు మాత్రం అలా కాకుండా ప్రజలకనుగుణంగా పని చేయాలన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కౌన్సిలర్లుగా పదవి గడువు ముగిసినప్పటికీ రాజకీయాల్లో మాత్రం చురుకుగా ఉండాలని పాలకవర్గ సభ్యులకు సూచించారు. ప్రజాసమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చూడాలని, పార్టీలను పక్కన బెట్టి అందరూ కలసి ఉండాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు చేయాలని సూచించారు. ఆత్మకూర్: ఉమ్మడి జిల్లాలో ప్రజల తాగునీటి అవసరాలు తీరుస్తున్న రామన్పాడు రిజర్వాయర్లో రోజురోజుకు నీటిమట్టం తగ్గుముఖం పడుతోంది. ఇప్పటివరకు ఏడు మీటర్ల మేర నీటిమట్టం తగ్గింది. ఒకవేళ రిజర్వాయర్లో నీటిమట్టం పూర్తిగా తగ్గితే పాలమూరులోని అనేక గ్రామాలు తాగునీటి ఎద్దడి ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొననుంది. ప్రధానంగా మిషన్ భగీరథ పథకం ద్వారా నిత్యం వనపర్తి జిల్లాలోని 6.46 లక్షల మందికి 7.66 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. వేసవి నేపథ్యంలో మే, జూన్ నెలల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటూ బోరుబావులు, చేతిపంపులు, ట్యాంకర్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు అనుసంధానంగా రామన్పాడు రిజర్వాయర్ను నిర్మించారు. రిజర్వాయర్లోని నీటితో పాటు జూరాల ప్రధాన, సమాంతర కాల్వ ద్వారా నిత్యం తాగు, సాగునీటి సరఫరా కొనసాగుతోంది. గతంలో రామన్పాడు రిజర్వాయర్ నుంచి ఉమ్మడి జిల్లాలోని 500 గ్రామాలకు 30 ఎంఎల్డీ నీటిని సరఫరా చేస్తుండేవారు. ప్రస్తుతం శ్రీశైలం వెనుక జలాల నుంచి పలు పథకాలకు తాగునీరు సరఫరా అవుతుండటంతో రామన్పాడుపై భారం తగ్గింది. ప్రస్తుతం రెండు పథకాలకు 10.4 ఎంఎల్డీ నీటిని వినియోగిస్తున్నారు. రిజర్వాయర్లో 1022.06 అడుగుల నీటిమట్టం ఉండాల్సి ఉండగా.. బుధవారం 1020.09 అడుగులకు చేరింది. తాగునీటి పథకాలు.. శ్రీశైలం వెనుక జలాల నుంచి నాగర్కర్నూల్ జిల్లా గౌరిదేవిపల్లి 77 ఎంఎల్డీ తాగునీటి పథకం ద్వా రా వనపర్తి జిల్లాలోని 8 గ్రామాలకు నీరు సరఫరా చేస్తున్నారు. అలాగే గోపాల్పేట 10 ఎంఎల్డీ ప థకం ద్వారా 44 గ్రామాలు, బుగ్గపల్లి 75 ఎంఎల్ డీ పథకం ద్వారా 87 గ్రామాలు, పాన్గల్ 5 ఎంఎల్డీ పథకం ద్వారా 19 గ్రామాలు, వీపనగండ్ల 4 ఎంఎల్డీ పథకం ద్వారా 20 గ్రామాలు, ఆత్మకూర్ 2.4 పథకం ద్వారా 12 గ్రామాలు, నందిమళ్ల సత్య సాయి 2 ఎంఎల్డీ పథకం ద్వారా 12 గ్రామాలు, కొల్లాపూర్ 31 ఎంఎల్డీ పథకంద్వారా 58 గ్రామాలకు నిత్యం తాగునీటిని సరఫరా చేస్తున్నారు. పురపాలికలకు 27.6 ఎంఎల్డీ, గ్రామాలకు 48.435 ఎంఎల్డీ నీటిని అందిస్తున్నారు. సాగునీటి సరఫరా బంద్.. ఇదిలా ఉండగా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ ద్వారా నిత్యం 350 క్యూసెక్కుల సాగునీరు విడుదల చేస్తుండేవారు. ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గిపోవడంతో ఉన్న నీటిని ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాలకు కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగిస్తున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. పీజేపీ, మిషన్ భగీరథ అధికారులు సమన్వయంతో ముందుకెళ్తే తాగునీటి కష్టాలు తలెత్తవు. -
అన్నిచోట్ల పనులను నిలిపివేయించాం
శ్రీనివాసకాలనీ సమీపంలోని చిన్నచెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నాలుగు రోజుల క్రితం సుమారు మూడెకరాలలో మొరంమట్టితో కొందరు వ్యక్తులు చదును చేసిన విషయం మా దృష్టికి వచ్చింది. ఈనెల 5న అక్కడికి వెళ్లి పనులను ఆపి వేయించాం. అలాగే ఇటీవల మోదంకుంట ఎఫ్టీఎల్ పరిధిలో భవన నిర్మాణం చేపట్టిన వ్యక్తికి నోటీసులు ఇచ్చాం. పెద్దచెరువు (మినీ ట్యాంక్బండ్) ఎఫ్టీఎల్ పరిధిలోనూ మొరంమట్టితో చేపట్టిన పనులను అప్పుడే నిలిపివేయించాం. – పి.రామాంజులరెడ్డి, కమిషనర్, మున్సిపల్ కార్పొరేషన్, మహబూబ్నగర్ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.. పాలకొండ చిన్నచెరువుపై కొందరు కబ్జాదారులు ఎప్పటినుంచో కన్నేశారు. మూడు రోజుల్లోనే పెద్ద ఎత్తున టిప్పర్ల ద్వారా మొరం తెచ్చి మూడు, నాలుగు ఎకరాల మేర చదును చేయించారు. ఏకంగా ఈ చెరువు మధ్యలో మొరంతో రోడ్డు వేశారు. దీనిపై ముందుగా అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. దీంతో కలెక్టర్ ఖుష్బూగుప్తా దృష్టికి తీసుకొచ్చాం. ఆమె ఆదేశాలతో ఎట్టకేలకు మున్సిపల్ యంత్రాంగం ఈ నెల 5న స్థానికంగా పరిశీలించి పనులు ఆపి వేయించింది. అదేవిధంగా ఆక్రమణదారులపై కఠిన చర్యలు చేపట్టాలి. చెరువుల కబ్జాతో మత్స్యకార్మికుల ఉపాధిపై ప్రభావం పడడంతో పాటు భవిష్యత్లో అనేక ఇబ్బందులు వస్తాయనేది అందరూ గ్రహించాలి. – తీగల ఆంజనేయులు, అధ్యక్షుడు, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం, పాలకొండ ● -
తక్షణ చర్యలు చేపట్టాలి..
మండలంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడి తీర్చేందుకు పాలకులు, అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలి. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయడంతో పాటు రామన్పాడు రిజర్వాయర్ నుంచి నిత్యం నీటి సరఫరా అయ్యేవిధంగా శాశ్వత చర్యలు చేపట్టాలి. రిజర్వాయర్లో నీటిమట్టం తగ్గిపోతుండటంతో పాలకులు, అధికారులే బాధ్యత వహించి ప్రజల తాగునీటి కష్టాలు తీర్చాలి. – రాజు, సీపీఎం నాయకుడు, ఆత్మకూర్ తాగునీటి కష్టాలు రానివ్వం.. వనపర్తి జిల్లాలోని తాగునీటి పథకాల నుంచి నిత్యం 7.66 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నాం. ప్రస్తుతం పథకాలకు నీటికొరత లేదు. ముందస్తుగా 1,150 బోరుబావులు, 450 చేతిపంపులతో పాటు ట్యాంకర్లను సిద్ధం చేసుకున్నాం. జిల్లా ప్రజలు తాగునీటి విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇబ్బందులు రానివ్వం. – అంజద్పాషా, ఈఈ, మిషన్ భగీరథ, వనపర్తి ● -
పారదర్శకంగా ఉద్యోగుల బదిలీలు
● ఉద్యోగ సంఘాల నాయకులతోఅడిషనల్ కలెక్టర్ భేటీ జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఉద్యోగుల సాధా రణ బదిలీలు పారదర్శంగా నిర్వహించనున్నట్లు రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ హరిప్రియ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో రెవెన్యూ ఉద్యోగుల సాధారణ బదిలీలు–2026కు సంబంధించి విధి విధానాలు, ఉద్యోగ సంఘ నాయకులతో భేటీ అయ్యారు. గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. నాలుగేళ్లుగా ఒకే దగ్గర విధులు నిర్వహించిన వారు కచ్చితంగా బదిలీ కావాల్సిందేనని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం బదిలీలు చేయనున్నట్లు అడిషనల్ కలెక్టర్ తెలిపారు. ఉద్యోగ సంఘాల నాయకులకు బదిలీ నుంచి మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. అందుకు సంఘాల నుంచి పేర్లను సూచించాలని కోరారు. అనంతరం టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు రాజీవ్రెడ్డి మాట్లాడుతూ బదిలీ విషయం ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను తప్పక పాటించాలని కోరారు. ఆప్షన్ ఫామ్ ఇచ్చిన తరువాత అర్హత ఉన్న ఉద్యోగిని కౌన్సెలింగ్ విధానం ద్వారా గుర్తింపు సంఘాల అధ్యక్ష కార్యదర్శుల సమక్షంలో నిర్వహించాలని కోరినట్లు తెలిపారు. అందుకు అదనపు కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. సమావేశంలో టీజీఓ జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్, ప్రధాన కార్య దర్శి వరప్రసాద్, టీఆర్ఈఎస్ఏ జిల్లా అధ్యక్షుడు నర్సింగ్ రావు, కలెక్టరేట్ ఏఓ సువర్ణరాజ్, టీఎన్జీఓ జిల్లా కార్యదర్శి చంద్రానాయక్, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు ఖలీద్ బిన్ అహ్మద్, శ్రీనివాస్, చైతన్యగౌడ్, నరేందర్, రామకృష్ణ, కృష్ణమోహన్, మహేశ్వర్రెడ్డి, కర్ణయ్య పాల్గొన్నారు. -
మహిళలు ఆర్థికంగా ఎదగాలి: యెన్నం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగితేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. స్థానిక బీకేరెడ్డి కాలనీలోని ‘మహబూబ్నగర్ ఫస్ట్’లో ఐదో బ్యాచ్ శిక్షణ పొందుతున్న మహిళలకు బుధవారం స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బ్యాచ్ లో ఎంఎస్ ఆఫీస్, బ్యూటీషియన్, మగ్గంవర్క్, స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సుల్లో సుమారు 400 మంది శిక్షణ పొందుతున్నారన్నారు. ఇక్కడ ప్రాథమిక కోర్సులు నేర్చుకున్న తర్వాత టాస్క్లో కంప్యూటర్ లాంగ్వేజ్, డిజిటల్ స్కిల్స్, అకౌంటింగ్ (డీసీఏ, ట్యాలీ) వంటి అడ్వాన్స్ కోర్సులు అందుబాటులో ఉంటాయన్నారు. త్వరలోనే వీరన్నపేటలోనూ మరో శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించనున్నామన్నారు. కార్యక్రమంలో ‘మహబూబ్నగర్ ఫస్ట్’ పర్యవేక్షకులు గుండా మనోహర్, శిక్షణ కేంద్రం ఇన్చార్జి నిజలింగప్ప పాల్గొన్నారు. ‘కార్పొరేట్ స్కీం’కు దరఖాస్తుల ఆహ్వానం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్పొరేట్ కళాశాల స్కీంకు ఆసక్తి గల ప్రైవేటు కళాశాలల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఎస్సీ సంక్షేమశాఖ డీడీ సునీత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ గుర్తింపు పొంది, అన్ని వసతులు, సిబ్బంది ఉండి, ఐఐటీ, నీట్ వంటి వాటికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఈనెల 11లోగా జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. బాదేపల్లి యార్డుకు పోటెత్తిన ధాన్యం జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్కు బుధవారం వివిధ ప్రాంతాల నుంచి భారీగా ధాన్యం విక్రయానికి వచ్చింది. 9,328 బస్తాల ధాన్యం యార్డుకు రావడంతో ఆవరణ కిక్కిరిసిపోయింది. ఽఅలాగే రైతులు 4,803 బస్తాల మొక్కజొన్న మార్కెట్కు వచ్చింది. ధాన్యం ఆర్ఎన్ఆర్రకం క్వింటా గరిష్టంగా రూ.2,499, కనిష్టంగా రూ.1,601, వేరుశనగకు గరిష్టంగా రూ.7,762, కనిష్టంగా రూ.6,199, ఆముదాలు గరిష్టంగా రూ.6,264, కనిష్టంగా రూ.6,254,ఽ పొద్దుతిరుగుడు రూ.5,812, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,845, కనిష్టంగా రూ.1,601 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్ యార్డులో ఆర్ఎన్ఆర్ ధాన్యం గరిష్టంగా రూ.2,401, కనిష్టంగా రూ.2,065, హంస ధాన్యం గరిష్టంగా రూ.1,803, కనిష్టంగా రూ.1,758గా ధరలు నమోదయ్యాయి. మార్కెట్కు దాదాపు వేయి బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. -
డీసీఎంను ఢీకొన్న లారీ.. వ్యక్తి మృతి
● మరో ముగ్గురికి గాయాలు ● మూడు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న వైనం ● సంఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రి శ్రీహరి దేవరకద్ర: మున్సిపాలిటీ పరిధిలోని గోప్లాపూర్ రోడ్డు మలుపులో బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు గాయపడిన ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. హైదరాబాద్ నుంచి కర్నాటకలోని సింధనూర్కు ట్రాన్స్పోర్ట్ లోడ్తో వెళ్తున్న డీసీఎం గోప్లాపూర్ ములుపులో స్పీడ్ బ్రేకర్ల వద్ద అకస్మాత్తుగా వేగం తగ్గించడంతో రాయచూర్ వెళ్తున్న లారీ వేగంగా వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ క్రమంలో డీసీఎం రాయచూర్ నుంచి హైదరాబాద్ వస్తున్న పెళ్లి బస్సును ఢీకొట్టింది. దీంతో మూడు వాహనాలు రోడ్డుపై చెల్లాచెదురగా పడ్డాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లారీ డ్రైవర్ భాస్కర్గౌడ్(49), డీసీఎం డ్రైవర్, పెళ్లి బస్సులో గాయపడిన ఇద్దరిని అంబులెన్స్లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ నాగన్న సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. జేసీబీతో డీసీఎం, పెళ్లి బస్సును పక్కకు తొలగించారు. లారీ డ్రైవర్ భాస్కర్గౌడ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు మిడ్జిల్ మండలానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గన్న తెలిపారు. సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న మంత్రి వాకిటి శ్రీహరి -
సీఈ సత్యనారాయణరెడ్డికి అభినందనలు
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఇరిగేషన్ సీఈగా బాధ్యతలు తీసుకున్న సత్యనారాయణరెడ్డికి ఆ శాఖ ఉద్యోగులు అభినందనలు తెలియజేశారు. బుధవారం స్థానిక శాఖ కార్యాలయంలోని ఆయన చాంబర్లో శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందించారు. ఏప్రిల్ 30న పదవీ విరమణ చేసిన సత్యనారాయణరెడ్డిని ప్రభుత్వం మరో ఆరు నెలల పాటు పదవీ కాలం పొడగించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు.. పాలమూర్– రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రభుత్వం ఆదేశాల మేరకు పని చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా కార్యదర్శి చంద్రనాయక్, పట్టణ అధ్యక్షుడు మహేశ్వర్రెడ్డి, సర్కిల్–1 ఎస్ఈ జగన్మోహన్రావు, డీఈ చంద్రునాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఇకనైనా అన్ని వసతులతో బతుకుతాం
పంజగుట్ట: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో తాము స్వచ్ఛందంగా గ్రామాలు ఖాళీ చేసి తాము వెళుతున్నామని అక్కడి ప్రజలు పేర్కొన్నారు. అడవుల్లో బతుకుతూ పిల్లలకు చదువులు లేక, గర్భిణీలకు ఏ సమయంలో ఏమౌతుందో తెలియక, రోడ్లు, కరెంట్ లేక ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు పడ్డామన్నారు. ఇకనైనా ప్రభుత్వం తమకు అన్ని వసతులతో కల్పిస్తున్న పునరావాసాలకు వెళ్లిపోతామని పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సార్లపల్లి సర్పంచ్ చిర్ర రాములు, సాయిలమ్మ, శివ, బుచ్చయ్య, సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. తాము ఉండే సార్లపల్లి, కుడిచింతలబైల్, తాటిగుండాల, కొల్లంపేట, వటువర్లపల్లిలో ఇప్పటివరకు రోడ్డు సదుపాయాలు లేవని, కేవలం ఫారెస్టు డిపార్ట్మెంట్ వారు వచ్చి వెళ్లే రోడ్లే ఆధారమన్నారు. ఏ పంటలు వేసుకున్నా అడవి పందులు, కోతులు, ఇతర జంతువుల పాలతున్నాయని, తమ పిల్లలు చదువుకు దూరమతున్నారని, ఇప్పటివరకు ఇంకా కరెంట్ లేదని, సెల్ఫోన్ సిగ్నల్స్ రావని ఇలా అయితే ఎలా బతకాలని ప్రశ్నించారు. అక్కడ ఉన్న గ్రామస్తులు దాదాపు అందరూ ప్రభుత్వం సూచించిన చోటకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కొంతమంది స్వచ్ఛంద సంస్థల వారు వచ్చి ఇక్కడి చెంచులను అడవులకు దూరం చేస్తున్నారంటూ తమ తరలింపు ప్రక్రియ దాదాపు అవుతుండగా అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ కేవలం చెంచులే లేరని అన్ని కులాల వారు ఉన్నారని దాదాపు అందరూ ఒప్పు కున్నారని ఎవరో ఒకరిద్దరు చెంచులు మాత్రమే వ్యతిరేకిస్తున్నారని, మిగతా వారు ఇక్కడి నుంచి వెళ్లేందుకు ఒప్పుకున్నట్లు చెప్పారు. ప్రభుత్వం కూడా పరిహారం కింద వృద్ధులకు, మహిళలకు ఒక్కొక్కరికీ రూ.15 లక్షల ఆర్థికసాయం, మగవారికి ఐదు ఎకరాల వ్యవసాయ భూమి, 250 గజాల నివాస భూమి, రహదారులు, నీరు, విద్యుత్, పాఠశాల, కమ్యూనిటీ హాల్ సదుపాయం కల్పిస్తోందని, అలాగే జీవనోపాధికి పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఇన్నిరోజులు పడ్డ కష్టాలుచాలని, ఇకపై తమ పిల్లలు కూడా అందరిలా చదువుకొని బాగుపడతారని, దీనిని ఎవరూ అడ్డుకోరాదని సూచించారు. -
పీఏసీఎస్ కార్యాలయానికి తాళం
● చైర్మన్ తీరుపై డైరెక్టర్ల ఆగ్రహం ● కోరం లేకుండానే ప్రమాణ స్వీకారం చేయడంపై అసంతృప్తి గట్టు: స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయానికి బుధవారం డైరెక్టర్లు తాళం వేశారు. కోర్టు తీర్పుతో ఇప్పటి వరకు చైర్మన్గా వ్యవహరించిన వెంకటేష్ మళ్లీ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకున్నారు. అయితే పాలకవర్గానికి కనీసం సమాచారం ఇవ్వకుండానే తంతు పూర్తి చేయడంతో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకవర్గ ఉపాధ్యక్షుడు మహదేవ్, డైరెక్టర్లు మహాదేవమ్మ, శేఖర్గౌడ్, సుధాకర్గౌడ్, తిమ్మప్ప, కొన్యనాయక్ పీఏసీఎస్ కార్యాలయానికి చేరుకుని చైర్మన్ వెంకటేష్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కార్యాలయానికి తాళం వేశారు. చేసేదేమి లేక కార్యాలయ సిబ్బంది బయటకు వచ్చేశారు. అయితే అప్పటికే పీఏసీఎస్లో చైర్మన్గా వెంకటేష్ బాధ్యతలు స్వీకరించి, పీఏసీఎస్ భవనం వద్ద కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆలూరులో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు వెళ్లిపోయారు. కార్యాలయానికి తాళం వేసిన విషయం తెలుసుకున్న ఎస్ఐ శేఖర్, పోలీస్ సిబ్బందితో అక్కడకు వచ్చి వివాదం సద్దుమణిగేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం కార్యాలయం తలుపులు తెరచుకున్నాయి. -
ఉత్సాహంగా వాలీబాల్ శిబిరం
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా యువజన, క్రీడలశాఖ ఆధ్వర్యంలో వేసవి సెలవులను పురస్కరించుకొని మహబూబ్నగర్ మెయిన్ స్టేడియంలో వాలీబాల్ శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ నెల 1వ తేదీన ప్రారంభవమైన ఈ శిబిరంలో ఉదయం 6 గంటల నుంచి 8.30 గంటల వరకు, సాయంత్రం 4.45 నుంచి 7 గంటల వరకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. 64మంది బాలబాలికలు శిక్షణకు హాజరవుతున్నారు. వీరిలో దాదాపు 50 మంది ఈ శిబిరంలో మొదటిసారి వాలీబాల్లో శిక్షణ తీసుకుంటున్నారు. కోచ్ అబ్దుల్ రహెమాన్ ఖాన్ ప్రత్యేక శిక్షణ అందజేస్తున్నారు. ఉదయం వేళలో మొదట వార్మప్, ఫిట్నెస్ అంశాల్లో శిక్షణ అనంతరం రిక్రియేషన్ క్రీడలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం బేసిక్ అనంతరం అప్పర్ హ్యాండ్, అటాకింగ్, సర్వీస్, బ్లాకింగ్, బాల్ రోటేషన్, పొజిషన్ అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. రెగ్యూలర్గా వచ్చే క్రీడాకారులను జట్లుగా విభజించి మ్యాచ్లు ఆడిపిస్తున్నారు. పరీక్షలు ముగిశాయి. స్కూళ్లకు సెలవులూ వచ్చాయి. అమ్మా, నాన్నలకూ రిలీఫ్ దొరికితే.. అలా అంతా ఓ ట్రిప్ వేయొచ్చు. అది అమ్మమ్మ, తాతల ఇంటికి కావచ్చు. లేదా పర్యాటక కేంద్రానికి కావచ్చు. జాలీగా ఇంకెక్కడైనా కావచ్చు. ఆ అనుభవాలను ‘సాక్షి’తో పంచుకోండి. వేసవిలో మీరు చూసిన విశేషాలు, అక్కడ తీసుకున్న ఫొటోలు పంపండి. వీటితో పాటు మీ అనుభూతిని రాయడం మరవకండి. అలాగే అమ్మమ్మ, నానమ్మ ఊరిలో గడిపిన సన్నివేశాల ఫొటోలు, మీ సృజనకు పదును పెట్టే బొమ్మలు గీసినా.. కథలు రాసినా, నృత్యాలు నేర్చుకున్న వాటిని ఫొటోలతో సహా పంపొచ్చు. రండి.. విశేషాలు పంచుకుందాం మహబూబ్నగర్ క్రీడలు: కింగ్షోటోకాన్ కరాటే డూ ఇండియా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ రోడ్డు స్కూల్ ఆవరణలో ఈనెల 8వ తేదీ నుంచి జూన్ 8 వరకు 28వ వేసవి ఉచిత కరాటే శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు ఫౌండర్ జహంగీర్పాష ఖాద్రీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కరాటే శిక్షణ ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి 7.30 గంటల వరకు ఉంటుందని తెలిపారు. ఈ శిక్షణ శిబిరంలో కరాటే, కిక్బాక్సింగ్, జూడో, బాక్సింగ్, యోగా, సెల్ఫ్ డిఫెన్స్, ఫిజికల్ ఫిట్నెస్పై శిక్షణ అందజేస్తామని తెలిపారు. మిగతా వివరాల కోసం 98493 01171 నంబర్ను సంప్రదించాలని కోరారు. -
మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలి
జడ్చర్ల/ పాలమూరు: ‘జై శ్రీరామ్’ నినాదాన్ని పైసలతో పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దేవాదాయశఖ మంత్రి కొండా సురేఖ వెంటనే క్షమాపణ చెప్పాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కొమరయ్య డిమాండ్ చేశారు. బుధవారం ఆయన ప్రధాని మోదీ సభకు సంబంధించి మహబూబ్నగర్ బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన సన్నాహక సమావేశంతో పాటు జడ్చర్లలో విలేకరులతో మాట్లాడారు. దేవాదాయశాఖ మంత్రిగా ఉంటూ హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆక్షేపణీయమన్నారు. కేంద్రం ఇచ్చే నిధులతోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ప్రతి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో కేంద్రం భాగస్వామ్యం ఉందన్నారు. కేంద్రం సహకారం వలననే సన్నబియ్యం, సోలార్ పంపుసెట్లు వంటి పథకాలు అమలు జరుగుతున్నాయన్నారు. పశ్చిమబెంగాల్ గెలుపు తరువాత కాంగ్రెస్లో కలవరం, భయం మొదలైందన్నారు. అభివృద్ధి చైతన్యం, అవినీతి నిర్మూలన తదితర కారణంగానే బీజేపీ పట్ల ప్రజలు ఆదరణ కనబరుస్తున్నారని అన్నారు. మూడోసారి ప్రధాని అయిన తర్వాత తొలిసారి ఈనెల 10న తెలంగాణకు వస్తున్న మోదీకి ఘనంగా స్వాగతం పలకాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి బాధ్యుల వరకు సమీక్ష నిర్వహించి ప్రధాని సభకు భారీగా జన సమీకరణ చేయాలనే అంశంపై వివరించారు. తెలంగాణలో గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ మోసపూరిత పాలన చేస్తోందన్నారు.కార్యక్రమంలో బీజేపీ నేతలు పద్మజారెడ్డి, కట్టా సుధాకర్రెడ్డి, అంజయ్య, జయశ్రీ, డోకూర్ పవన్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కొమురయ్య డిమాండ్ -
తాగునీటి ఇబ్బందులు రానీయొద్దు
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): వేసవికాలంలో గ్రామాలలో తాగునీటి సమస్య నివారణకు గ్రామ సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, మిషన్ భగీరథ అధికారులు, మండల జిల్లా అధికారులు సమన్వయం చేసుకొని పనిచేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి సూచించారు. ప్రతి గ్రామంలో మిషన్ భగీరథ మరమ్మతు పనులు త్వరితగతిన చేపట్టి నీటి సరఫరా నిరంతరాయంగా అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో మంగళవారం దేవరకద్ర నియోజకవర్గ అభివృద్ధిపై కలెక్టర్ ఖుష్బుగుప్తాతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న సమస్యలను, గ్రామస్థాయిలో పరిష్కారం దొరకనప్పుడు మండల, జిల్లాస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి ప్రయత్నించాలన్నారు. కొంతమంది అధికారులు ప్రజాసమస్యలను పట్టించుకోవటం లేదని, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు ఎన్నిసార్లు ఫోన్లు చేసినా స్పందించడం లేదని అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. తాగునీరు, విద్యుత్, డ్రెయినేజీ సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు అధికారులు సర్పంచ్లతో సమన్వయంతో పనిచేయాలన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, జిల్లా అధికారులతో మాట్లాడి పరిష్కారం చూపిస్తామని తెలిపారు. ● భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ బాలకోటి మాట్లాడుతూ ఇతర మున్సిపాలిటీలతో పోలిస్తే తమ ప్రాంతంలో ఆస్తి పన్ను అధికంగా వసూలు చేస్తున్నారని, వెంటనే తగ్గించాలని కోరారు. జానంపేట సర్పంచ్ మాట్లాడుతూ ఎముకల ఫ్యాక్టరీ నుంచి వస్తున్న దుర్గంధం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ అదనపు కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి తగిన చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మధుసూదన్ నాయక్, హరిప్రియ, దేవరకద్ర మున్సిపల్ చైర్పర్సన్ దమయంతి గోవర్ధన్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కథలప్ప, తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి సమన్వయం అవసరం గ్రామాల్లో ఉన్న సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచ్లు తమ గ్రామాల్లో తాగునీరు, డ్రెయినేజీ, సీసీ రోడ్లు, పాఠశాలల ప్రహరీలు, అంగన్వాడీ భవనాలు.. వంటి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ప్రతి గ్రామాన్ని సందర్శించడం సాధ్యం కాకపోయినా, ఇలాంటి సమావేశాల ద్వారా సమస్యలను తెలుసుకోవడం సులభమవుతుందని పేర్కొన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులను సమర్థంగా వినియోగించి అత్యవసర పనులను చేపట్టాలని సూచించారు. తాగునీటి సమస్య ఎక్కువగా ఉన్న గ్రామాల్లో మిషన్ భగీరథ అధికారులతో కలిసి తక్షణ చర్యలు చేపడతామని చెప్పారు. సీసీ రోడ్డు, డ్రెయినేజీ పనులు పూర్తి చేయాలి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి సమన్వయంతో గ్రామ సమస్యలు పరిష్కరించాలి దేవరకద్ర నియోజకవర్గ సమీక్షలో ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి,కలెక్టర్ ఖుష్బూగుప్తా -
శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
నేను ఐదు నెలల నుంచి బాక్సింగ్ కోచ్గా పని చేస్తున్న. వ్యక్తిగత క్రీడాంశాల్లో బాక్సింగ్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. వేసవి శిక్షణ శిబిరంలో బేసిక్తో పాటు ఇతర అంశాల్లో శిక్షణ అందజేస్తున్నాం. ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి. శిబిరంలో పాల్గొంటున్న క్రీడాకారులు ప్రతి రోజు రెగ్యులర్గా మెయిన్ స్టేడియానికి రావాలి. – డీఎస్ఏ బాక్సింగ్ కోచ్, మహబూబ్నగర్ వేసవి శిక్షణ శిబిరంలో విద్యార్థులు, కోచ్లు, ప్రతినిధులు -
జిల్లాలో భూగర్భ జలాలు (మీటర్ల లోతులో)
భూగర్భ జలాలను కాపాడుకోవాలి భూగర్భ జలాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అవసరానికి మించి నీటిని విచ్చలవిడిగా వినియోగించరాదు. వర్షపాతం నమోదైనా రీచార్జి ఆశించినంతగా జరగడం లేదు. బోర్ల వినియోగం పెరగడం వల్ల భూగర్భ జలాలు పడిపోతున్నాయి. ప్రతి గ్రామంలో రీచార్జి పిట్లు, చెక్డ్యాంలు ఏర్పాటు చేయడం, వర్షపు నీటిని నిల్వ చేసే చర్యలు చేపట్టడం అత్యవసరం. రైతులు మైక్రో ఇరిగేషన్ పద్ధతులను అనుసరించి నీటి వినియోగాన్ని తగ్గించాలి. భూగర్భ జలాలు పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. – రవిశంకర్, జిల్లా భూగర్భజల శాఖ అధికారి -
బాక్సింగ్ అంటే ఇష్టం
బాక్సింగ్ అంటే ఎంతో ఇష్టం. నెల రోజుల నుంచి బాక్సింగ్లో శిక్షణ తీసుకుంటున్న. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలనే ఉద్దేశంతో వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొంటున్న. ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్ర, జాతీయస్థాయి బాక్సింగ్ పోటీల్లో పతకం సాధిస్తాననే నమ్మకం ఉంది. – అమోఘ్, మహబూబ్నగర్ మొదటిసారిగా వేసవి శిబిరంలో.. టీవీల్లో బాక్సింగ్ను ఎక్కువగా చూసేవాడిని. ఈ క్రీడపై ఉన్న ఆసక్తితో కోచ్ ప్రోత్సాహంతో మొదటిసారిగా వేసవి బాక్సింగ్ శిక్షణ శిబిరంలో పాల్గొంటున్న. చాలా చక్కగా బాక్సింగ్ శిక్షణ అందజేస్తున్నారు. బాక్సింగ్ గ్లౌజ్లతో ప్రాక్టీస్ చేస్తుంటే ఇంట్రస్ట్గా అనిపిస్తుంది. శిబిరంలో రోజు పాల్గొని శిక్షణ తీసుకుంటాను. – సుశాంత్, కొత్తపేట (హన్వాడ) -
ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం తెచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు బకాయి నిధులను సకాలంలో విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ కళాశాలలు మూతపడే పరిస్థితి దాపురించిందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను 2026 – 27 విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల ఖాతాలలో జమ చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రఘునందన చారి, కార్మిక విభాగం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సురభి విజయ్ కుమార్, గొడుగు నర్సిములు, రామస్వామి, శ్రీనివాస్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
శిక్షణ బాగుంది..
ఏడాది నుంచి మెయిన్ స్టేడియంలో బాక్సింగ్ ప్రాక్టిస్ చేస్తున్న. 55–60 వెయిట్ కేటగిరీలో శిక్షణ తీసుకుంటున్న. ఇక్కడ శిక్షణ బాగుంది. ప్రతి రోజు, సాయంత్రం వేళల్లో బాక్సింగ్లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్న. బాక్సింగ్లో రాణించి భవిష్యత్లో రాష్ట్రస్థాయి అంతర్జిల్లాల టోర్నమెంట్లో పాల్గొంటాను. నేను నార్సింగ్లోని సోషల్ వెల్లేర్ బాక్సింగ్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న. వేసవి సెలవులతో పాటు మిగతా రోజుల్లో మెయిన్ స్టేడియంలో బాక్సింగ్లో శిక్షణ తీసుకుంటున్న. ఇప్పటివరకు పలుసార్లు రాష్ట్రస్థాయి బాక్సింగ్ టోర్నమెంట్లో పాల్గొని రెండు వెండి పతకాలు, ఒక కాంస్య పతకం సాధించాను. భవిష్యత్తులో ఇంటర్నేషనల్ బాక్సింగ్ పోటీల్లో ఆడాలని ఉంది. – మధులత, కొనగట్టుపల్లి (హన్వాడ) – కార్తీక్ యాదవ్, మహబూబ్నగర్ అంతర్జాతీయస్థాయిలో ఆడాలని.. -
‘నేతన్నకు పొదుపు’ జాడేది?
అమరచింత: చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ‘నేతన్నకు పొదుపు’ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి నెల కార్మికుడు చెల్లించిన వాటాకు రెండింతల డబ్బును అందించేందుకు శ్రీకారం చుట్టింది. పథకం ప్రారంభంలో రెండు నెలల పాటు కార్మికుల వాటాతో పాటు ప్రభుత్వం రెండింతల డబ్బును కార్మికుల బ్యాంకు ఖాతాలో జమ చేసింది. ఆ తర్వాత పథకాన్ని మరుగునపడేయడంతో నేతన్నలు ఆందోళనకు గురవుతున్నారు. ● రెక్కడితేగాని డొక్కాడని చేనేత కార్మికులు పథకంలో భాగంగా నెల వేతనంలో ఎనిమిదో వంతు డబ్బును ఆర్డీ–1 ఖాతాలో జమచేసేవారు. కార్మికులు జమచేసిన వెంటనే పట్టిక ఆధారంగా జౌళిశాఖ అధికారులు రెట్టింపు డబ్బును కార్మికులకు చెందిన ఆర్డీ–2 బ్యాంకు ఖాతాలో జమచేసేవారు. ప్రస్తుతం కార్మికులు మాత్రమే ప్రతి నెల తమ మూల వేతనంలో 16 శాతం డబ్బును జమ చేస్తున్నా.. ప్రభుత్వం మాత్రం నేతన్నలకు చెల్లించాల్సిన డబ్బును మాత్రం చెల్లించలేకపోతోంది. ఉమ్మడి జిల్లాలో 3,310 జియో ట్యాగింగ్ మగ్గాలు ఉన్నాయని జౌళిశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. మొత్తంగా 6,620 మంది కార్మికులను గుర్తించిన అధికారులు వారితో ప్రతినెల రూ.66.20 లక్షల చొప్పున రూ.7.94 కోట్లను జమ చేయిస్తూ వచ్చారు. కాని ప్రభుత్వం మాత్రం తన వాటాగా రూ.15.88 కోట్లకుగాను కేవలం రూ.2.64 కోట్లు మాత్రమే జమ చేసింది. మిగిలిన రూ.13.24 కోట్లను ఎప్పుడు మంజూరు చేస్తుందో.. వాటిని తమ ఖాతాల్లో ఎప్పుడు జమ చేస్తారోనని చేనేత కార్మికులు ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 12 నెలలుగా జమకాని త్రిఫ్టు ఫండ్ ఉమ్మడి జిల్లాలో 3,310 జియో ట్యాగింగ్ మగ్గాలు.. 6,620 మంది కార్మికులు కార్మికుల వాటా రూ.7.94 కోట్లు చెల్లింపు ప్రభుత్వ వాటా రూ.15.88 కోట్లకుగాను రూ.2.64 కోట్లు మాత్రమే జమ -
అనుమానాస్పదంగా రైతు మృతి
జడ్చర్ల: మండల పరిధిలోని ఈర్లపల్లి గ్రామ శివారు పొలంలో రైతు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఎస్ఐ మల్లేశ్ కథనం మేరకు.. రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లికి చెందిన కృష్ణయ్యగౌడ్(55)కు ఈర్లపల్లి గ్రామ శివారులో వ్యవసాయ భూమి ఉంది. సోమవారం పొలంలో చెత్త చెదారానికి నిప్పు పెట్టాడు. ఈ క్రమంలో మంటలు రాజుకొని పక్కనే ఉన్న సపోట తోటకు వ్యాపించాయి. దీంతో రైతు కృష్ణయ్యగౌడ్ మంటలను అదుపులోకి తెచ్చాడు. ఎంతకూ కృష్ణయ్యగౌడ్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లి చూడగా పొలంలో విగతజీవిగా పడి ఉన్నాడు. చికిత్స నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మంగళవారం మృతుడి కుమారుడు శేఖర్గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం పాన్గల్: హైదరాబాద్ ఓఆర్ఆర్పై సోమవా రం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని జమ్మాపూర్ గ్రామానికి చెందిన యువకుడు బోయిని నాగేష్ (28) మృతిచెందాడు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం తన పొలంలోని మామిడికాయలను సోమవారం గ్రామం నుంచి హైదరాబాద్ మార్కెట్కు బొలెరో వాహనంలో తీసుకెళ్తుండగా వాహనం అదుపుతప్పి లారీని ఢీకొన్నది. ఈ ప్రమాదంలో బోయిని నాగేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. సర్పంచ్ మల్లయ్య, మాజీ ఎంపీపీ వెంకటేష్నాయుడు, మాజీ సర్పంచ్ నాగేంద్రం, కాంగ్రెస్ నాయకులు బాలు, ఎర్రంచంద్రయ్య, అంబులెన్స్ గోవింద్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. విద్యుత్ స్తంభం విరిగి.. యువకుడి మృతి రాజోళి: విద్యుత్ స్తంభం విరిగిపడి యువకుడి మృతి చెందిన ఘటన మంగళవారం మండలంలోని పెద్ద ధన్వాడలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన నర్సన్న కుమారుడు యువరాజు(19)మంగళవారం గ్రామంలో విద్యుత్ స్తంభం విరిగిపోవడంతో దాన్ని తిరిగి ఏర్పాటు చేసే క్రమంలో ఓ వైపు తాడు పట్టుకుని నిలబడ్డాడు. ప్రమాదవశాత్తు స్తంభం అతనిపై పడి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అయిజకు తరలించగా పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి గద్వాల ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. -
విద్యార్థులు సెల్ఫోన్లకు దూరంగా ఉండాలి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులు సెల్ఫోన్లకు దూరంగా ఉండి, లక్ష్యంపై దృష్టి సారించాలని ఎస్పీ జానకి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని వాగ్దేవి కళాశాలలో విద్యార్థులకు కలాం డ్రీ ఫోర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మొబైల్స్కు అలవాటు పడితే ఏకాగ్రత, సృజనాత్మకత దెబ్బతింటుందని, విద్యార్థులు పుస్తకాలు చదవడం వల్ల ప్రయోజనం ఉంటుందన్నారు. తాను బీటెక్ చదివిన తర్వాత పలు సంస్థలను సందర్శించేందుకు అవకాశం దొరికిందని, ప్రస్తుతం డ్రీం ఫోర్స్ ఆధ్వర్యంలో ప్రముఖ సంస్థలను సందర్శించే అవకాశం విద్యార్థులకు దొరికిందన్నారు. మంచి అలవాట్లను అలవర్చుకుని, సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్లాలని, మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు యోగా చేయాలన్నారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులతో పాటు, ఎస్సెస్సీలో ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి సన్మానం చేశారు. కార్యక్రమంలో ల్యాబ్ కమిటీ అధ్యక్షుడు జనార్దన్, కోశాధికారి నర్సప్ప, వెంకటేశ్వర్లు, శ్రీధర్, వాగ్దేవి కళాశాల కరస్పాండెంట్ వెంకట్రెడ్డి, మల్లప్ప, చక్రవర్తిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
రండి.. విశేషాలు పంచుకుందాం
పరీక్షలు ముగిశాయి. స్కూళ్లకు సెలవులూ వచ్చాయి. అమ్మా, నాన్నలకూ రిలీఫ్ దొరికితే.. అలా అంతా ఓ ట్రిప్ వేయొచ్చు. అది అమ్మమ్మ, తాతల ఇంటికి కావచ్చు. లేదా పర్యాటక కేంద్రానికి కావచ్చు. జాలీగా ఇంకెక్కడైనా కావచ్చు. ఆ అనుభవాలను ‘సాక్షి’తో పంచుకోండి. వేసవిలో మీరు చూసిన విశేషాలు, అక్కడ తీసుకున్న ఫొటోలు పంపండి. వీటితో పాటు మీ అనుభూతిని రాయడం మరవకండి. అలాగే అమ్మమ్మ, నానమ్మ ఊరిలో గడిపిన సన్నివేశాల ఫొటోలు, మీ సృజనకు పదును పెట్టే బొమ్మలు గీసినా.. కథలు రాసినా, నృత్యాలు నేర్చుకున్న వాటిని ఫొటోలతో సహా పంపొచ్చు. -
అంగన్వాడీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
మహబూబ్నగర్ రూరల్: అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి, సేవల్లో పారదర్శకత కోసం కట్టుబడి పని చేస్తున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ నియోజకవర్గానికి చెందిన 334 మంది అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ఫోన్లను మంగళవారం అంబేద్కర్ కళాభవన్లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో అంగన్వాడీ కేంద్రాల సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గర్భిణీలు ప్రభుత్వ ఆస్పత్రులు, ఎస్వీఎస్ ఆస్పత్రిలో ఉచిత ప్రసవ సేవలు పొందవచ్చని, ప్రసవానంతరం అవసరమైన యెన్నం హెల్త్ కిట్లు అందజేస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు సుమారు 1000 హెల్త్ కిట్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. పేదలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి అధిక ఖర్చు చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నాణ్యమైన వైద్యం పొందాలని సూచించారు.స్మార్ట్ఫోన్ల వినియోగంతో అంగన్వాడీ సిబ్బంది పనితీరు మరింత మెరుగుపడుతుందని, ప్రభుత్వ యాప్ ద్వారా పిల్లల హాజరు, వివరాలు రియల్ టైమ్లో నమోదు కావడంతో పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మేయర్ గుమ్మాల మమత, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, డీడబ్ల్యూఓ జరీనాబేగం, సీడీపీఓలు శైలశ్రీ, రాధిక పాల్గొన్నారు. -
ఉత్సాహంగా అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలు
మహబూబ్నగర్ క్రీడలు: వరంగల్లో ఈనెల 10న జరిగే అండర్–16, అండర్–18, అండర్–20 విభాగాలతో పాటు పురుషుల, మహిళల రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ టోర్నీ, 17న హైదరాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారులను ఎంపికలను మంగళవారం స్థానిక మెయిన్ స్టేడియంలో నిర్వహించారు. జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్చంద్ర ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా అథ్లెట్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఎంపికై న తుదిజట్టును త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్స్ సంఘం సభ్యులు రమేష్బాబు, పి.శ్రీనివాసులు, సి.శ్రీనివాస్, రాజు, దత్తాత్రేయ, తదితరులు పాల్గొన్నారు. -
ఫంక్షన్ హాల్లో అగ్నిప్రమాదం
మహబూబ్నగర్ క్రైం: ఓ ఫంక్షన్ హాల్ పక్కన చెత్తకు నిప్పు అంటుకోవడం వల్ల మంటలు వ్యాపించి ఫంక్షన్ హాల్ పైభాగం పూర్తిగా మంటల్లో కాలిపోయిన ఘటన మంగళవారం జరిగింది. మహబూబ్నగర్ ఫైర్ అధికారి మల్లికార్జున్ కథనం ప్రకారం.. నగరంలోని పిస్తాహౌజ్ సమీపం బైపాస్ రోడ్డుపై ఉన్న సయ్యద్ జుబేర్ అల్లీకి సంబంధించిన యూబీ బాంకెట్ హాల్ పక్కన ఉదయం చెత్తకు నిప్పు పెట్టారు. ఈ క్రమంలో మంటలు ఫంక్షన్ హాల్ పైభాగంలోకి వ్యాపించడంతో పైకప్పు పూర్తిగా దగ్ధమైంది. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి సిబ్బంది చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చారు. సుమారు రూ.20 లక్షల వరకు ఆస్తి నష్టం వచ్చినట్లు బాధితుడు ఫిర్యాదు ఇచ్చినట్లు ఫైర్ సిబ్బంది తెలిపారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
వెల్దండ: మండలంలోని పోషమ్మగడ్డతండాకు చెందిన వడ్త్యావత్ పెంట్యానాయక్(45) మంగళవారం మండల కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పెంట్యానాయక్ కిడ్నిలో నొప్పిగా ఉందని ఈ నెల 1న వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చారు. అక్కడ వైద్యులు పరీక్షించి ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. అప్పటి నుంచి ఆస్పత్రిలోనే వైద్యులు పర్యవేక్షణలో ఉన్నాడు. మంగళవారం ఉదయం వాకింగ్ చేసే క్రమంలో అకస్మాత్తుగా చాతిలో నొప్పిగా ఉందని చెప్పడంతో వెంటనే వైద్యులు పరీక్షించారు. సీపీఆర్ చేసిన ఫలితం దక్కలేదు. దీంతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పెంట్యానాయక్ మృతి చెందిన విషయం తెలుసుకున్న తండావాసులు, బంధువులో ఆస్పత్రికి చేరుకొని వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందాడని ఆరోపిస్తు వైద్యులతో వాగ్వివాదానికి దిగారు. ఆగ్రహంతో వారిపై దాడికి యత్నించారు. వెల్దండ ఎస్ఐ కురుమూర్తి సమాచారం తెలుసుకొని పోలీస్ సిబ్బందితో ఆస్పత్రికి చేరుకున్నారు. దాదాపుగా 5 గంటల పాటు ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని శాంతింపజేశారు. అనంతరం మృతదేహానికి కుటుంబ సభ్యులకు అప్పగించారు. బాధిత కుటుంబానికి సర్పంచ్ మహిపాల్నాయక్, ఉప్పల ట్రస్ట్ చైర్మన్ వెంకటేష్ సహకారంతో రూ.5వేల ఆర్థిక సాయం అందజేశారు. మృతుడికి భార్య లక్ష్మి, కుమారుడు, కుమార్తెలు ఉన్నారు. నిందితుడికి జైలు, జరిమానా విధింపు అలంపూర్: ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన కేసులో నిందితుడికి కోర్టు జైలుశిక్షతో పాటు జరిమానా విధించినట్లు ఎస్పీ శ్రీనివాస్రావు, ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. వారు తెలిపిన వివరాలు.. అలంపూర్ పట్టణానికి చెందిన నాగరాజు 2022వ సంవత్సరంలో ఆస్పత్రిలో ఆక్సిజన్ అండర్ గ్రౌండ్ పైప్లైన్పై సిమెంట్ బెడ్ వేయడానికి ఒక కాంట్రాక్టర్ వద్ద పని చేసినట్లు తెలిపారు. నాలుగు నెలలు పనిచేసినా నాగరాజుకు కాంట్రాక్టర్ కూలి డబ్బులు ఇవ్వలేదనే కోపంతో 2022 ఏప్రిల్ 2న తాను వేసిన సిమెంట్ బెడ్ను పగలగొట్టాడని పేర్కొన్నారు. ఆస్పత్రి సిబ్బంది చెప్పినా వినకుండా దాన్ని ధ్వంసం చేయడంతో ఆస్పత్రి ఇన్చార్జి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చుక్కా పరశురాం ఫిర్యాదు మేరకు ఏప్రిల్ 4న అప్పటి ఎస్ఐ శ్రీహరి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 2022 జూన్ 11న ఎస్ఐ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా.. ఎస్పీ శ్రీనివాస్రావు ఆదేశాలతో అదనపు ఎస్పీ శంకర్, డీఎస్పీ మొగిలయ్య, అలంపూర్ సీఐ ప్రదీప్కుమార్ పర్యవేక్షణలో కేసు విచారణ జరిగిందన్నారు. ఈ మేరకు ఏడీజే కోర్టు, మహబూబ్నగర్ న్యాయమూర్తి కళ్యాణ్చక్రవర్తి నిందితుడికి నెల జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు వెలువరించారు. కేసులో విచారణ చేసిన అప్పటి ఎస్ఐ శ్రీహరి, ప్రస్తుత ఎస్ఐ రామకృష్ణ, సీడీఓ కానిస్టేబుల్ మాబాషా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కిరణ్కుమార్రెడ్డి, కోర్టు లైసన్ ఆఫీసర్ ఏఎస్ఐ నరసింహులును ఎస్పీ అభినందించారు. -
రేపు బాక్సింగ్ క్రీడాకారుల ఎంపిక
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో గురువారం జిల్లాస్థాయి అండర్–19, అండర్–22 బాలబాలికల ఎంపికలను నిర్వహిస్తున్నట్లు జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి బొంబాయి నర్సింహులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. బాలబాలికలకు 10 వెయిట్ కేటగిరీల్లో ఎంపికలు జరుగుతాయని, 7వ తేదీ(గురువారం) ఉదయం 7 గంటలకు హాజరుకావాలని సూచించారు. 8న జాబ్మేళా జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఈ నెల 8న (శుక్రవారం) ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో జాబ్మేళా నిర్వహించనున్నట్లు ఎంప్లాయిమెంట్ అధికారి మైత్రి ప్రియ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. బీఆర్ఎం అసోసియేట్స్, విజయ బయో ఫెరిలైజర్స్, అపోలో కంపెనీల్లో 150 ఉద్యోగాల భర్తీ కోసం జాబ్మేళా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం 89193 80410 నంబర్ను సంప్రదించాలని కోరారు. యువతకు ఉపాధి రంగాల్లో శిక్షణ జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లా ఎంప్లాయిమెంట్ శాఖ, నిర్మాణ్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 7, 8 తేదీల్లో నిరుద్యోగ యువతకు వివిధ ఉపాధి రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు ఎంప్లాయిమెంట్ అధికారి మైత్రిప్రియ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కెరీర్ గోల్, కమ్యూనికేషన్ స్కిల్స్, టైం మేనేజ్మెంట్, ఇంటర్నెట్ అవగాహన, ఫైనాన్సియల్ లిటరసీ, ఇండస్ట్రీయల్ అవగాహన, ప్రాబ్లం సాల్వింగ్ కస్టమర్ హ్యాండ్లింగ్ ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు వివరించారు. జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని, ఇతర వివరాల కోసం 89193 80410 నంబర్ను సంప్రదించాలని సూచించారు. వేరుశనగ క్వింటా రూ.7,392 జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో మంగళవారం వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.7,392, కనిష్టంగా రూ.5,791 ధరలు లభించాయి. ఆముదాలు గరిష్టంగా రూ.6,264, కనిష్టంగా రూ.6,154, ధాన్యం ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,529, కనిష్టంగా రూ.1,601, రాగులు రూ.2,500, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,850, కనిష్టంగా రూ.1,762 ధరలు పలికాయి. దేవరకద్ర మార్కెట్ యార్డులో ఆర్ఎన్ఆర్ ధాన్యం గరిష్టంగా రూ.2,359, కనిష్టంగా రూ.2,072, హంస గరిష్టంగా రూ.1,829, కనిష్టంగా రూ.1,721, ఆముదాలు రూ.6,062గా ఒకే ధర నమోదైంది. మార్కెట్కు దాదాపు నాలుగు వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. -
రక్షణ సేన కాదు.. రాక్షస సేన
● కల్వకుంట్ల కవిత కొత్త పార్టీపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి వ్యాఖ్యలు రాజాపూర్: రాష్ట్రంలో పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కల్వకుంట్ల కవిత కాళేశ్వరంలో దోచుకుతిన్నారని అప్పుడే ఎందుకు మాట్లాడలేదని, ఇప్పుడు తెలంగాణ రక్షణసేన అంటూ కొత్తపార్టీ పెట్టి.. జన్మనిచ్చి, జీవితాన్నిచ్చిన తండ్రి మీదనే కొట్లాడుతున్న కవిత తెలంగాణ ప్రజలకు ఏం న్యాయం చేస్తారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండలం కుచ్చర్కల్లో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించి రెండు పార్టీలయ్యాయన్నారు. ‘మీ నాయన పదేళ్లు సీఎంగా అధికారంలో ఉన్నప్పుడు ఆరోజు ఎందుకు కొట్లాడలేదని, కాళేశ్వరంలో దోచుకుంటున్నారని ఎందుకు మాట్లాడలేదు.’ అని కవితను ప్రశ్నింశారు. అధికారం పోయిన తర్వాత ఇప్పుడు తమదేమీ సాగడం లేదని కొత్తపార్టీ పెట్టి.. పార్టీ పేరు చెప్పి ఫ్యాక్టరీలు, ఇతరుల దగ్గర దోచుకోవడానికి పార్టీ పెట్టారా అని విమర్శించారు. కవిత పెట్టిన పార్టీ తెలంగాణ రక్షణ సేన కాదని.. తెలంగాణ రాక్షస సేన అని హాట్ కామెంట్స్ చేశారు. ఆ పార్టీలో చేరిన వారందరూ ప్రజలను దోచుకుతినే రాక్షసులేనని పేర్కొన్నారు. నాయకులు మోటెసత్యం, సుజయ్ చంద్రారెడ్డి, యాదయ్య, శేఖర్గౌడ్,వెంకటయ్య పాల్గొన్నారు. -
లక్ష్యం స్పష్టంగా ఏర్పాటు చేసుకోవాలి
మహబూబ్నగర్ క్రైం: ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన బాలికలు సాధించిన ఈ విజయాలు అత్యంత ప్రేరణత్మకంగా ఉన్నాయని మహబూబ్నగర్ ఎస్పీ డి.జానకి అన్నారు. మహబూబ్నగర్, వనపర్తి, నారాయణపేట ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన బాలికలకు మంగళవారం వీఐపీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళ ప్రాంగణంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించడం ద్వారా వారు తమ కుటుంబాలకు, సమాజానికి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. విద్యార్థులు తమ భవిష్యత్పై స్పష్టమైన లక్ష్యం ఏర్పాటు చేసుకొని ఆ దిశగా ముందకు సాగాలన్నారు. ముఖ్యంగా అమ్మాయిలు ఎదుర్కొనే సవాళ్లను ధైర్య ంగా ఎదుర్కొని, తమ సామర్థ్యంపై నమ్మకం పెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో వీఐపీ ఫౌండేషన్ డైరెక్టర్ నాగేంద్రస్వామి, ఇతర సభ్యులు పాల్గొన్నారు. ● మహబూబ్నగర్ రూరల్ పోలీస్ సర్కిల్ పరిధిలో ఉన్న నవాబ్పేట, కోయిలకొండ, హన్వాడ, రూరల్ పోలీస్ సిబ్బందికి మంగళవారం ఎస్పీ డి.జానకి హెల్మెట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హెల్మెట్ ధరించడంలో పోలీసులే ఇతరులకు రోల్ మోడల్గా నిలిస్తే మార్పు తప్పక వస్తుందన్నారు. రోడ్డు భద్రత నిబంధనలపై ప్రజల్లో పూర్తిస్థాయిలో అవగాహన పెంచాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఎన్బీ రత్నం, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, సీఐలు గాంధీనాయక్, అప్పయ్య, ఇజాజుద్దీన్, కమలాకర్, రామకృష్ణ, ఎస్ఐలు పాల్గొన్నారు. -
రహదారిపైనే పార్కింగ్!
అడ్డాకుల: జాతీయ రహదారిపై తరుచూ వివిధ రకాల భారీ వాహనాలు నిలుపడటంతో ప్రమాదాలకు కారకులవుతున్నారు. ప్రధాన రోడ్డు పక్కనే ఎక్కువ సంఖ్యలో ఒకేచోట వాహనాలను నిలుపుతున్నారు. అందులో ప్రధాన కూడళ్ల సమీపంలోనే ఇలా వాహనాలను నిలుపుతుండటంతో యూటర్న్ తీసుకునే వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. రహదారిపై ఒకవైపు ఉండే రెండు వరుసల్లో ఒక వరుసపై ప్రయాణికులను తరలించే క్రమంలో స్టేజీల వద్ద ఆగినప్పుడు ఒకే వరుసలో వాహనాలు వెళ్లాల్సి వస్తుండటంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. శాఖాపూర్ టోల్ప్లాజా వద్ద లారీలను అడ్డుదిట్టడంగా నిలుపుతున్నారు. అడ్డాకుల నుంచి శాఖాపూర్ వైపు వచ్చేచోట టోల్ బూతులు దాటిన వెంటనే భారీ వాహనాలను నిలుపుతున్నారు. టోల్బూతుల నుంచి బయటకు వచ్చే వాహనాలతోపాటు ద్విచక్రవాహనదారులకు తీవ్ర ఆటంకం కల్గుతుంది. కందూరు, మూసాపేట, పోల్కంపల్లి స్టేజీల వద్ద బస్సు షెల్టర్ల ముందు వాహనాలు నిలుపుతున్నారు. రహదారి నిర్వాహకులు స్పందించి రోడ్డు పక్కన వాహనాలు నిలుపకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
మొక్కజొన్న కొనకుంటే ఆందోళన
● ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ధ్వజం జడ్చర్ల: ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్న దిగుబడులను వెంటనే కొనుగోలు చేయకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షు డు, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొ న్నారు. సోమవారం జడ్చర్ల పత్తి మార్కెట్ యార్డులోని మార్క్ఫెడ్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడున్న పలువురు రైతులు మాజీమంత్రి ఎదుట తమ గోడును వెళ్లబోసుకున్నారు. నెలరోజులకుపైగా మొక్కజొన్న కొనుగోలు చేయకపోవడంతో తాము రేయింబవళ్లు కుప్పల వద్దే పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం వచ్చి మొక్కజొన్న మొలకెత్తినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. ఓ బస్తాలో మొలకెత్తిన మొక్కజొన్నను లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. పంటసాగుకు మూడునెలలు పడితే పండిన పంటను అమ్ముకోవడానికి మరో మూడునెలలు పట్టే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఇబ్బందులను పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలకులు తమది ప్రజాపాలన–రైతుప్రభుత్వంగా చెప్పుకోవడమే తప్పా ఆచరణలో తీవ్ర వైఫల్యం చెందిందని విమర్శించారు. పంట దిగుబడులను అంచనా వేయకపోవడం, సకాలంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం, బస్తాలను తరలించక పోవడం తదితర ప్రణాళికలు రూపొదించడంలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం విఫలమైందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ యాదయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ సారిక, నాయకులు ప్రశాంత్రెడ్డి, రామ్మోహన్, ఇమ్ము, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
బాధితులకు న్యాయం జరిగే విధంగా చర్యలు
మహబూబ్నగర్ క్రైం: పోలీస్స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదును ప్రాముఖ్యతతో తీసుకుంటూ, బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఎస్పీ డి.జానకి సూచించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులతో ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. ఆ తర్వాత ఆయా సమస్యలపై సంబంధిత స్టేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకొని పరిష్కరించాలన్నారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి పోలీసులు బాధ్యతగా తీసుకోవాలన్నారు. ప్రజావాణి అనేది ప్రజల సమస్యలను వినడానికి మాత్రమే కాదని, వాటికి తక్షణ పరిష్కారం చూపడానికి అనే బాధ్యతను గుర్తు చేసుకోవాలన్నారు. ప్రతి ఫిర్యాదు వెనుక ఒక కుటుంబం, ఒక నమ్మకం ఉంటుందని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం పోలీస్ బాధ్యత అని సూచించారు. విద్యార్థులకు చట్టాలపై అవగాహన మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని వాగ్దేవి జూనియర్ కళాశాలలో కళాం డ్రీం ఫోర్సు ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న వారికి జిల్లా న్యాయ సేవ సంస్థ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ కార్యదర్శి ఇందిర మాట్లాడుతూ విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, వారి హక్కులను తెలుసుకోవాలని సూచించారు. ముఖ్యంగా చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ టు చిల్డ్రన్ అండ్ ప్రొటెక్షన్ స్కీం, మానసికంగా వెనుకబడిన పిల్లలకు న్యాయ సేవల పథకం, తప్పనిసరి విద్యాహక్కు చట్టం వంటి వాటిపై అవగాహన ఉండాలన్నారు. వేరుశనగ @ రూ.7,552 జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో సోమవారం వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.7,552, కనిష్టంగా రూ.4,589 ధరలు లభించాయి. ఆముదాలు గరిష్టంగా రూ.6,259, కనిష్టంగా రూ.6,199, జొన్నలు గరిష్టంగా రూ.5,777, కనిష్టంగా రూ.5,010, పొద్దుతిరుగుడు గరిష్టంగా రూ.5,992, కనిష్టంగా రూ.5,762, ధాన్యం ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,559, కనిష్టంగా రూ.1,605, రాగులు గరిష్టంగా రూ.2,777, కనిష్టంగా రూ.2,410, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,867, కనిష్టంగా రూ.1,600, మినుములు రూ.7,601 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్ ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,359, కనిష్టంగా రూ.2,001, హంస ధాన్యం గరిష్టంగా రూ.1,809, కనిష్టంగా రూ.1,701గా ధరలు నమోదయ్యాయి. -
సమ్మర్ క్యాంపుతో క్రీడల్లో ప్రతిభ
● జిల్లాలో ప్రారంభమైన వేసవి క్రీడా శిబిరాలు ● శిక్షణ పొందుతున్న విద్యార్థులు కందనూలు: విద్యార్థులకు చదువుతోపాటు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలనే సంకల్పంతో వేసవి సెలవుల్లో ఇంటికే పరిమితం కాకుండా క్రీడలపై ఆసక్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం జిల్లాలో ఏప్రిల్ 25 నుంచి జూన్ 10వ తేది వరకు సమ్మర్ క్యాంపులను జిల్లా యువజన క్రీడల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది. జిల్లాలో మొత్తం 15 సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తుండగా ఇందులో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్బాల్, తైక్వాండో, అథ్లెటిక్స్ ఇతర క్రీడలపై శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా అధికారులు తెలుపుతున్నారు. క్రీడలే కాకుండా సమ్మర్ క్యాంపులో విద్యార్థులకు యోగాపై కూడ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. సమ్మర్ క్యాంపులో తమ క్రీడా ప్రతిభను వెలికితీయడంతోపాటు శారీరక, దృఢత్వాన్ని పెంపొందిచేందుకు ఎంతగానో ఉపయోగపడుతాయని అధికారులు పేర్కొంటున్నారు. సమ్మర్ క్యాంపులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. క్రీడల్లో నైపుణ్యతను ప్రదర్శించి, రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడల్లో పాల్గొనే విధంగా కోచ్ల హాయంలో శిక్షణ పొందాలి. – సీతారాం, డీవైఎఫ్ఓ, నాగర్కర్నూల్ -
ఎట్టకేలకు మరమ్మతు
మరమ్మతులు పూర్తి చేస్తాం.... జూరాల ప్రాజెక్టు గేట్లకు సంబంధించి ఇది వరకే విడుదలైన నిధులతో మరమ్మతు ప్రక్రియ చేపట్టాం. తాజాగా 42 గేట్లకు ఇనుప రోపులను పూర్తిస్థాయిలో కొత్తవి ఏర్పాటు చేసేందుకు రూ.4.30 కోట్లు విడుదలవగా.. వారం రోజుల కిందట టెండర్ ప్రక్రియ పూర్తయింది. ఈ వేసవిలో వీలైనంత మేరకు మరమ్మతు పూర్తి చేసి వచ్చే వానాకాలం నాటికి సిద్ధం చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. – రహీముద్దీన్, ఎస్ఈ, ఇరిగేషన్ శాఖ గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగు, తాగునీటి పరంగా ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజె క్టు పెద్దన్న పాత్ర పోషిస్తుంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన జూరాల ప్రాజెక్టు గత 30 ఏళ్లుగా కనీస మరమ్మతు పనులకు నోచుకోలేదు. ఫలితంగా జూరాల కు ఉన్న 62 క్రస్టు గేట్లు మొదలుకొని.. ఇనుప రోపు లు, బకెట్ల నిర్మాణాలు వంటివి దెబ్బతిన్నాయి. ఫలితంగా కొన్నేళ్లుగా గేట్ల నిర్వహణలో అవాంతరాలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే గతేడాది జూలైలో ప్రాజెక్టుకు వరద వచ్చిన సమయంలో అధికారులు గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేశారు. అయితే 14 గేట్లకు సంబంధించిన ఇనుప రోపులు దెబ్బతిన్నాయి. ఇందులో కొన్ని గేట్లకు రెండువైపులా ఉన్న ఇనుప రోపులు తెగిపోగా.. 8 గేట్లకు సంబంధించి ఒకవైపు ఇనుప రోపులు తెగిపోయాయి. ఫలితంగా లీకేజీలు ఏర్పడి ప్రాజెక్టు ఉనికికే ముప్పు ఏర్పడింది. దీనిపై రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి జూరాలను సందర్శించి గేట్లకు పూర్తిస్థాయిలో మరమ్మతు చేపడుతామని నిధులు విడుదల చేశారు. ఈ క్రమంలో నూతనంగా 42 గేట్లకు సంబంధించి ప్రభుత్వం రూ.4.30 కోట్ల నిధులు మంజూరు చేసింది. నాలుగేళ్ల కిందట రూ.11 కోట్లు.. జూరాల ప్రాజెక్టు గేట్లు, ఇనుప రోపుల మరమ్మతు కోసం అధికారులు ఏటేటా ప్రతిపాదనలు పంపినా గడిచిన బీఆర్ఎస్ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఆ తర్వాత నీటిపారుదల శాఖ అధికారులు రెండు కమిటీలను వేసి మరమ్మతుపై అధ్యయనం చేయించారు. పూర్తిస్థాయి మరమ్మతుకు రూ.12.50 కోట్లు అవసరమని ప్రతిపాదించగా.. 2022లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.11 కోట్ల నిధులు విడుదల చేసింది. అయితే టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు పూర్తిచేయడంలో నిర్లక్ష్యం వహిస్తూ పెండింగ్లో ఉంచారు. మంత్రి పర్యటనతో.. జూరాల గేట్లకు రోపులు తెగిపోయి పెద్దఎత్తున లీకేజీలు ఏర్పడటంతో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి జూరాలను సందర్శించారు. ఈ సందర్భంలోనే గేట్ల మరమ్మతు పూర్తిస్థాయిలో చేపడుతామని, అదేవిధంగా డ్యాంపై పరిమితికి మించి వాహనాలు లోడ్తో వెళ్లడం ప్రమాదమని గుర్తించినట్లు ప్రకటించారు. దీనికి ప్రత్యామ్నాయంగా మరో కొత్త బ్రిడ్జి నిర్మించేందుకు రూ.100 కోట్లు విడుదల చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రకటించారు. అదేవిధంగా 42 గేట్లకు సంబంధించి ఇనుప రోపులను పూర్తిస్థాయిలో మార్చేందుకు ప్రభుత్వం రూ.4.30 కోట్లు మంజూరు చేసింది. టెండర్ ప్రక్రియ పూర్తి.. జూరాలలో 42 గేట్లకు సంబంధించి ఇనుప రోపులను పూర్తిస్థాయిలో మార్చేందుకు వారం క్రితం టెండర్ ప్రక్రియ పూర్తయింది. అయితే గతంలో విడుదలైన రూ.11 కోట్ల నిధులతో ఇది వరకే 10 గేట్లకు సంబంధించి ఇనుప రోపులను పూర్తిస్థాయిలో మార్చేందుకు చర్యలు చేపట్టారు. తాజాగా మరో 42 గేట్లకు సంబంధించిన ఇనుప రోపుల మరమ్మతుకు టెండర్ పూర్తికావడంతో ఈ వేసవిలోనే గేట్లకు సంబంధించి మరమ్మతు పూర్తిచేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. జూరాల డ్యాం గేట్ల రిపేరుకు రూ.4.30 కోట్లు నిధులు తాజాగా 42 ఇనుప రోప్ల పునరుద్ధరణ ఇది వరకే 10 రోప్లకు కొనసాగుతున్న పనులు ఈ వేసవిలోనే పూర్తిచేసేలా అధికారుల చర్యలు -
కారుకు నిప్పంటించిన దుండగులు
దామరగిద్ద: ఇంటి ఎదుట నిలిపిన కారుకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించిన ఘటన ఆదివారం అర్ధరాత్రి మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ కథనం ప్రకారం.. మండలంలోని వత్తుగుండ్ల గ్రామానికి చెందిన నర్సిములుకు చెందిన ఆల్టో కారును ఇంటి ముందు నిలిపి ఉంచగా.. రాత్రి వేళలో దుండగులు నిప్పంటించారు. మిద్దైపె నిద్రిస్తున్న నర్సిములు గమనించి ఇరుగుపొరుగు వారి సహాయంతో మంటలను ఆర్పివేశారు. అప్పటికే కారు వెనకభాగంతో పాటు రెండు టైర్లు కాలిపోయాయి. కారు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
అడ్వాన్స్ ఎండోస్కోపితో జీర్ణాశయ క్యాన్సర్ గుర్తింపు
పాలమూరు: అడ్వాన్స్డ్ ఎండోస్కోపి ద్వారా అన్నవాహిక, కడుపు, జీర్ణాశయ పేగుక్యాన్సర్ను మొదటి దశలోనే గుర్తించి క్యాన్సర్ను నివారించవచ్చని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు. సంకల్ప సూపర్స్పెషాలిటీ ఆస్పత్రి మొదటి వార్షికోత్సవం సందర్భంగా సోమవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జీర్ణాశయ క్యాన్సర్పై అవగహన పెంచుకోవడం చాలా ముఖ్యమని, ఎండోస్కోపిలో కొత్తగా వచ్చిన మార్పులతో న్యారో బ్యాండ్ ఇమేజింగ్(ఎన్బీఐ), ఎల్సీఐ, బీఎల్ఐ వంటి టెక్నాలజీ ద్వారా ఇప్పుడు క్యాన్సర్గా మారకముందే వచ్చే ప్రీ క్యాన్సర్ స్టేజీలోనే గుర్తించి సకాలంలో తొలగిస్తే క్యాన్సర్ను నివారించడానికి అవకాశం ఉందన్నారు. ఇలాంటి టెక్నాలజీతో కూడిన వైద్యంతోపాటు ఈఆర్సీపీ, ఎంటిరోస్కోపి వంటి సేవలు సంకల్ప ఆస్పత్రిలో అందిస్తున్నట్లు తెలిపారు. కడుపునొప్పి, అజీర్తి, ఆహారం మింగడంలో ఇబ్బంది ఉన్నవారితోపాటు అకారణంగా బరువు తగ్గడం, రక్తహీనత, మలంలో రక్తపడటం ఇలాంటి సమస్యలున్నవారు తప్పక ఎండోస్కోపి, కొలనోస్కోపి చేసుకోవాలన్నారు. ఐదేళ్లలో మహబూబ్నగర్లో 12వేలకుపైగా గ్యాస్ట్రో కేసులు చికిత్స చేసినట్లు తెలిపారు. కామెర్లు, పిత్తాశయం, పాంక్రియాస్ వంటి సమస్యలకు అత్యాధునిక వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయని వీటిని జిల్లావాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వడదెబ్బతో పశువుల కాపరి మృతి వీపనగండ్ల: వడదెబ్బతో పశువులు కాపరి మృతిచెందిన ఘటన మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన పశువుల కాపరి కుమ్మరి బొడ్డుపల్లి మురళి(45) తండ్రితో కలసి ఆదివారం పశువులను మేపేందకు వ్యవసాయ పొలానికి వెళ్లాడు. అస్వస్థతకు గురికాగా సోమవారం జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. కుమారుడు వడ్డదెబ్బకు గురై మృతి చెందడంతో గ్రామంలో విశాదం అలుముకుంది. -
సత్వరం పరిష్కరించాలి: కలెక్టర్
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ప్రజావాణిలో అర్జిదారుల నుంచి స్వీకరించిన దరఖాస్తుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అర్జిదారుల సమస్యలను పరిష్కరించడానికి జిల్లా యంత్రాంగం తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ భరోసా ఇచ్చారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను అధికారులు నిశితంగా పరిశీలించి, సమస్యను అర్థం చేసుకొని పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితులలో దరఖాస్తులను పెండింగ్లో ఉంచరాదని, నిర్దేశించిన సమయంలో పరిష్కరించాలని అధికారులను ఆమె ఆదేశించారు. ఈ వారం ప్రజావాణికి 116 వినతులు వచ్చాయి. ● కారుణ్య నియామకాలకు సంబంధించి ఖాళీ పో స్టుల వివరాలను మే 10 లోగా పంపించాలని కలెక్ట ర్ తెలిపారు. ఖాళీ పోస్టుల వివరాలను అన్ని శాఖల అధికారులు తమతమ శాఖల్లో ఉన్న ఆఫీస్ సబార్డినేట్, రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఖాళీ పోస్టుల వివరాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కేటగిరీల రోస్టర్ వారీగా నిర్ణీత ఫార్మాట్లో కలెక్టరే ట్ పరిపాలన అధికారికి సమర్పించాలని సూచించా రు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జేఎల్బీ హరిప్రియ, డీఆర్ఓ రాంరెడ్డి, డీఆర్డీఓ నర్సింహులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రతి నెల మొదటి బుధవారం దివ్యాంగుల ప్రజావాణి జిల్లాలోని దివ్యాంగుల, వయో వృద్ధుల వెసులుబాటు కోసం ప్రతి నెల మొదటి బుధవారం ప్రత్యేక ప్రజావాణిని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఖుష్బూ గుప్తా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహబూబ్నగర్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు ఈ ప్రజావాణి ఉంటుందని, దివ్యాంగులు, వయోవృద్ధులు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. -
అథ్లెటిక్స్పై ఆసక్తి
● పాలమూరు మెయిన్ స్టేడియంలో శిబిరం ● చిన్నారులు, యువతకు ప్రత్యేక శిక్షణ మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో వేసవి సెలవుల సందర్భంగా మహబూబ్నగర్ మెయిన్ స్టేడియంలో అథ్లెటిక్స్ శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. కోచ్ సునీల్కుమార్ ఆధ్వర్యంలో ఈనెల 1వ తేదీ నుంచి స్టేడియం మైదానంలో చిన్నారులు, యువతకు అథ్లెటిక్స్పై ప్రత్యేక శిక్షణ అందజేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. చిన్నారులకు మొదట వార్మప్ చేయించి రిక్రియేషన్ గేమ్స్(షటిల్ రన్, ఫ్లెక్సిబిలిటీ, వర్టికల్ జంప్, కోన్స్) సాధన చేయిస్తున్నారు. అదే విధంగా యువతకు కూడా అథ్లెటిక్స్ శిబిరంలో శిక్షణ ఇస్తున్నారు. జిల్లాలోని అథ్లెటిక్లు జాతీయ, రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు పొందారు. జిల్లా క్రీడాకారులు అథ్లెటిక్స్లోని పలు ఈవెంట్లలో పతకాలు సాధించి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టారు. జిల్లా స్టేడియంలో ప్రాక్టీస్ చేసిన వారిలో చాలా మంది జాతీయ, రాష్ట్రస్థాయి పతకాలు తీసుకొచ్చారు. మరి కొంతమంది స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించడం విశేషం. ప్రత్యేకంగా హిల్ ట్రైనింగ్ మెయిన్ స్టేడియంలో జరిగే వేసవి అథ్లెటిక్స్ శిక్షణ శిబిరంలో భాగంగా 14 ఏళ్లు దాటిన వారికి ప్రతి శనివారం ప్రత్యేకంగా హిల్ ట్రైనింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటల సమయంలో జిల్లాకేంద్రానికి సమీపంలో ని అయ్యప్పగుట్ట, కల్వరికొండలలో దాదాపు కింద నుంచి పై గుట్ట వరకు యువతకు క్రాస్కంట్రీ ప్రాక్టీస్తో పాటు వార్మప్ చేయిస్తున్నారు. -
ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల రాస్తారోకో
మహమ్మదాబాద్: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడంలేదని ఆగ్రహంతో సోమవారం రైతులు రోడ్డెక్కారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి వారం రోజులు గడుస్తున్నా తూకం వేయడం లేదంటూ మండిపడ్డారు. మహమ్మదాబాద్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. ధాన్యం సేకరణలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ఇంకా ఎన్నిరోజులు ఇలా పడిగాపులు కాయాలని ప్రశ్నించారు. రైతులు ఆందోళనకు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపాల్, బీజేపీ నాయకుడు తిరుపతిరెడ్డి మద్దతు పలికి..రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఏపీఎం నిమ్మల నిర్వాహకులతో మాట్లాడి తూకం వేయించడంతో రైతులు ఆందోళన విరమించారు. కాగా.. కొనుగోలు కేంద్రంలో ఓ మహిళా రైతుకు సంబంధించిన నాలుగు బస్తాల ధాన్యం చోరీకి గురికావడంతో ఆమె అధికారులకు ఫిర్యాదు చేశారు. -
మండుతున్న డంప్యార్డు
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: మహబూబ్నగర్ నగరపాలక సంస్థకు చెందిన డంప్యార్డులో తరుచుగా అగ్గి రాజుకుంటుంది. అసలే వేసవి కాలం.. ఆపై ఎండ వేడిమికి స్థానిక కోయిల్కొండ ఎక్స్రోడ్డులోని డంపింగ్ యార్డులో చెత్తకు మంటలు అంటుకుంటున్నాయి. మంటలు లేవడంతో సమీప ప్రాంతాల ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎండవేడికి తోడు డంప్యార్డు నుంచి దట్టమైన పొగ వస్తుండడంతో ఊపిరాడక విలవిలలాడుతున్నారు. కళ్ల మంటలతో ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నప్పటికీ వేడి, ఈదురు గాలులకు మంటలు వ్యాపిస్తూనే ఉన్నాయి. మున్సిపల్ వాటర్ ట్యాంక ద్వారా నిత్యం డంప్యార్డులో మాంటలు ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం దక్కడం లేదు. ఒకచోటు నీటిని కొడితే మరోచోట మంటలు లేస్తున్నాయి. వేడిగాలులు ఎక్కువగా వీస్తుండడంతో మంటలు ఆర్పడం తలకు మించిన భారంగా మారింది. ఇటీవల మూడుసార్లు ఫైరింజన్లను తర్పించి మంటలు ఆర్పివేశారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది. బయో మైనింగ్ చేపడితేనే ప్రయోజనం ముఖ్యంగా అక్కడ తడి, పొడి చెత్త వేరుచేసే పెద్ద యంత్రం లేకపోవడంతో కొన్నేళ్లుగా బయో మైనింగ్ కొనసాగక వ్యర్థాలు చాలా వరకు అలాగే కుప్పలుగా ఉండిపోతున్నాయి. దీనివల్ల డంపింగ్ యార్డులో తీవ్ర దుర్గంధం వెదజల్లడంతో పాటు పర్యావరణ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిని అధిగమించేందుకు గాను 2024 డిసెంబర్ 24న కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లా కలబురగి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన ఈ యంత్రాన్ని, దాని పనితీరును అప్పటి మహబూబ్నగర్ మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్లు రవీందర్రెడ్డి, గురులింగం, హెల్త్ అసిస్టెంట్ వజ్రకుమార్రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించి వచ్చారు. ఈ యంత్రం కొనుగోలుకు సుమారు రూ.కోటి వెచ్చించాల్సి వస్తుందని, దీని నిర్వహణ, రవాణా ఖర్చులు భారీగా ఉంటాయని అప్పట్లో అంచనా వేశారు. ఒకవేళ దీనిని ఏర్పాటు చేస్తే నిత్యం 120 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను 90 శాతం వరకు రీసైక్లింగ్ అవుతుంది. దీని ద్వారా వెలువడే యాష్ (బూడిద)ను సైతం సిమెంట్ కంపెనీలకు అమ్మి ఆదాయం సమకూర్చుకోవచ్చని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. డంపింగ్ యార్డులో గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన చెత్తపాలమూరు డంపింగ్ యార్డులో టన్నులకొద్దీ పోగవుతున్న చెత్త వేసవి కావడంతో తరచూ అంటుకుంటున్న మంటలు ఎప్పటికప్పుడు ట్యాంకర్లతో ఆర్పివేస్తున్న మున్సిపల్ సిబ్బంది పొగతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమీప ప్రాంత ప్రజలు -
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
చిన్నచింతకుంట: రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి అన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా రైతు వారోత్సవాలు పురస్కరించుకొని సోమవారం వడ్మెమాన్ రైతువేదికలో రైతు ముంగిట్లో శాస్త్రవేతలు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. అందుకు రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందన్నారు. రైతులు తమ పంటల దిగుబడిని పెంచుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందేవిధంగా శాస్త్రవేతలు, వ్యసాయ అధికారులే రైతుల ముంగిట్లోకి వచ్చి వారి సలహాలు, సూచనలు ఇచ్చేవిధంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. కార్యక్రమంలో డీఏఓ వెంకటేష్, శాస్త్రవేతలు అర్చన, కల్యాణి, ఏఓ రాజేష్ఖన్నా, ఎంపీడీఓ లక్ష్మీనర్సింహులు, తహసీల్దార్ ఎల్లయ్య, సర్పంచ్ ఈశ్వర్సింగ్, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
మరికల్: ట్రాక్టర్ను బైక్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి పెద్దచింతకుంట శివారులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేర కు దేవరకద్ర మండలం నాగారందాడితండాకు చెందిన కిషన్నాయక్ (45) భార్య శాంతమ్మతో కలిసి ధన్వాడ మండలంలోని మందిపల్లితండాలో బంధువుల శుభకార్యానికి హాజరయ్యారు. తిరిగి రాత్రి 8 గంటలకు బైక్పై స్వగ్రామానికి వెళ్తుండగా పెద్దచింతకుంట సమీపంలో ముందు వెళ్తున్న ట్రాక్టర్ను ఢీకొట్టాడు. ప్రమాదంలో కిషన్నాయక్ అక్కడిక్కడే మృతి చెందగా.. భార్య శాంతమ్మకు తీవ్ర గాయాలయ్యాయి.దీంతో క్షతగాత్రురాలిని చికిత్స నిమి త్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాము తెలిపారు. ప్రమాదవశాత్తు పూరిగుడిసె దగ్ధం మన్ననూర్: నల్లమల లోతట్టు ప్రాంతం, అమ్రాబా ద్ మండలం మన్ననూర్ ఆమ్లేట్ గ్రామంగా ఉన్న మల్లాపూర్ పెంటలో ఆదివారం సాయంత్రం చిగుర్ల చిన్న గంగయ్యకు చెందిన పూరిగుడిసె దగ్ధౖ మెంది. మల్లాపూర్ చెంచుపెంటకు చెందిన చిన గంగయ్య భార్య ఇతర గ్రామానికి వెళ్లగా.. చిన్న గంగయ్య అటవీ ఉత్ప త్తుల సేకరణకు అడవిలోకి వెళ్లా డు. ఇంటి వద్ద ఇద్దరు చిన్నారులు మాత్రమే ఆరుబయట ఆడుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో అను కోకుండా ప్రమాదవశాత్తు గుడిసెలో అగ్గి రాజుకొని మంటలు రేగాయి దీంతో పెంటలో ఉన్నవారు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ ఎంతకీ వీ లు కుదరకపోవడంతో గుడిసె మంటల్లో పూర్తిగా కాలి బూ డిదైంది. వంటపాత్రలు, తిండి గింజలు, దుస్తు లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అధికారులు స్పందించి బాధిత కుటుంబానికి సహాయం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. -
రెండేళ్ల నుంచి శిక్షణ..
జావెలిన్త్రో, 100 మీటర్ల పరుగు అంశాల్లో ప్రాక్టీస్ చేస్తు న్న. మెయిన్ స్టేడియంలో రెండేళ్ల నుంచి రెగ్యులర్తో పాటు వేస వి అథ్లెటిక్స్ శిబిరంలో పాల్గొంటు న్న. ఇక్కడ శిక్షణ బాగా ఇస్తున్నారు. రెండుసా ర్లు రాష్ట్రస్థాయి అంతర్జిల్లా పోటీల్లో పాల్గొన్న. పెద్దయ్యాక స్పోర్ట్స్ కోటాలో జాబ్ సాధిస్తా. – అశ్విన్, మహబూబ్నగర్ మొదటిసారి వస్తున్నా.. మా బాబాయ్ సూ చనతో మెయిన్ స్టేడియంలో జరిగే వేస వి అథ్లెటిక్స్ శిబిరంలో మొదటిసారి పాల్గొంటున్న. రన్నింగ్ అంటే చాలా ఇష్టం. స్పోర్ట్స్ స్కూల్ లో సెలక్షన్స్ ప్రతిభ కనబరిచి సీటు సాధిస్తా. – మనోజ్, మహబూబ్నగర్ ప్రతిభావంతులను వెలుగులోకి తెస్తాం... నేను 2007 నుంచి అథ్లె టిక్ కోచ్గా విధు లు నిర్వర్తిస్తున్నాను. అథ్లెటిక్ లో నైపుణ్యం గల క్రీడాకారులను వెలుగులోకి తెస్తాం. డీఎస్ఏ ఆధ్వర్యంలో అథ్లెటిక్స్లో శిక్షణ అందజేస్తున్నాం. చిన్నారులు, యువకులు అథ్లెటిక్స్పై దృష్టి సారించాలి. శిక్షణ తీసుకుంటే శారీరకంగా చురుగ్గా ఉండవచ్చు. ప్రతిభ కనబరిచే క్రీడాకారులు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించే అవకాశం ఉంటుంది. – సునీల్కుమార్, డీఎస్ఏ అథ్లెటిక్స్ కోచ్ సమ్మర్ క్యాంప్ల నుంచే.. ఆరేళ్ల నుంచి అథ్లెటిక్స్ లో శిక్షణ తీసుకుంటు న్న. మెయిన్ స్టేడియంలో నిర్వహించిన స మ్మర్క్యాంప్ల నుంచే మొదటిసారిగాఅథ్లెటిక్స్లో ప్రవేశించాను. 100 మీ., 400 మీటర్ల పరుగు ప్రాక్టీస్ చేస్తు న్న. ఇప్పటి వరకు మూడుసార్లు రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల అథ్టెటిక్స్ పోటీల్లో పాల్గొని మూడు కాంస్య పతకాలు సాధించాను. – వ్రింద యాదవ్, మహబూబ్నగర్ ● -
పురుగుమందు తాగి యువకుడి ఆత్మహత్య
అమరచింత:పిన్నమ్మ మందలించిందనే కారణంతో యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసు కున్న ఘటన మండలంలోని సింగంపేట గ్రామంలో సోమవారం చోటు చే సుకుంది. గ్రామానికి చెందిన నరహరి (20) పదో తరగతి అనంతరం ఇంటి వద్దనే ఉంటూ వ్యవసాయ పనులు చేస్తుండేవాడు. ఈ క్రమంలో తన పిన్నమ్మతో సోమవారం ఉదయం గొడవ పడ్డాడు. ఈ క్రమంలో మనస్తాపంతో పొలానికి వెళ్లి క్రిమిసంహారక మందు తాగాడు. స్థానిక రైతులు గమనించి ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పోందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ స్వాతి తెలిపారు. చెట్టును ఢీకొని యువకుడి దుర్మరణం భూత్పూర్: మున్సిపాలిటీలోని గోప్లాపూర్ సమీపంలో చెట్టును ఢీకొని యువకుడు దుర్మరణం చెందిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. కొత్త మొల్గర గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. కొత్తమొల్గరకు చెందిన జో గు మల్లేష్ (22) ఆదివారం రాత్రి ఇంట్లో భోజ నం చేసి 10:30 గంటల ప్రాంతంలో గ్రామసమీపంలో వరి కల్లం వద్దకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడు. సోమవారం ఉదయం ఎంతకూ రాకపోగా తల్లిదండ్రులు ఫోన్ చేసినా రింగ్ అవుతున్నా.. ఎత్తడం లేదు. వరి కల్లం వద్ద చూసినా కన్పించలేదు. గోప్లాపూర్ సమీపంలో గొర్ల కాపారులు గొర్రెలను మేపుతుండగా వ్యక్తి మృతిచెందిన విషయాన్ని గమనించి గ్రామస్తులకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మల్లేష్ వేగంగా వచ్చి చెట్టును ఢీ కొనగా.. ద్విచక్రవాహనాం ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. యువకుడు తల భాగం చెట్టుకు తగలడంతో చెవుల నుంచి రక్తం కారడంతో మృతిచెందినట్లు గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు భూత్పూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంక్లో గుండెపోటుతో వ్యక్తి మృతి రాజాపూర్(బాలానగర్): గుండెపోటు వచ్చి సృహతప్పిన వ్యక్తిని సీపీఆర్ చేసి ఊపిరిపోసేందుకు ప్రయత్నించిన బాలానగర్ ఎస్ఐ లెనిన్గౌడ్ ప్రయత్నం ఫలించలేదు. చిన్నరేవల్లికి చెందిన ఎల్లారెడ్డి(60) సోమవారం బాలానగర్ మండల కేంద్రంలోని ఎస్బీఐ వద్దకు పనిపై వచ్చి బ్యాంకు వద్ద గుండెపోటు వచ్చి సృహతప్పి పోయాడు. వెంటనే విషయం తెలిసిన బాలానగర్ ఎస్ఐ లెనిన్గౌడ్ అక్కడికి చేరుకుని సీపీఆర్ చేసిన వెంటనే ఆస్పత్రికి తరలించిన ఆ వ్యక్తి ప్రాణాలు మాత్రం దక్కలేదు. మానవత్వంతో మోసుకెళ్లి వాహనంలో ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడేందుకు కృషిచేసిన ఎస్ఐని అక్కడున్నవాళ్లు శభాష్ అంటూ కితాబిచ్చారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని గేదెలు మృతి
మన్ననూర్: శ్రీశైలం– హైదరాబాద్ ప్రధాన రహదారి బోరెడ్డిపల్లి బావి అటవీ సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో మూడు గేదెలు అక్కడికక్కడే మృతి చెందగా 2 గేదెలు తీవ్రంగా గాయపడ్డాయి. పూర్తి వివరాలు.. అమ్రాబాద్ మండలం వటువర్లపల్లికి చెందిన గేదెల మంద అటవీ సమీప ప్రాంతం నుంచి వస్తుండగా శ్రీశైలం నుంచి మన్ననూర్ వైపు వస్తున్న మహబూబ్నగర్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు గేదెలను ఢీకొట్టింది. ప్రమాదంలో గ్రామస్తుడు రంగినేని అశోక్కు చెందిన మూడు గేదెలు అక్కడికక్కడే మృతి చెందగా మరో రెండు గేదెలు తీవ్రంగా గాయపడినట్లు బాధితుడు తెలిపారు. బస్సును రోడ్డుపైనే ఉంచి డ్రైవర్ పరారీ కావడంతో ప్రధాన రహదారిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మృతి చెందిన గేదెల విలువ సుమారు రూ: 2 లక్షల వరకు ఉంటుందని బాధితు లు తెలిపారు. బ్రహ్మగిరి పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. -
నిరుపేదలకు ఇళ్లు ఇవ్వకపోతే పోరాటం తప్పదు
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూం ఇవ్వాలని టీఎఫ్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నాలో ఆయన మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ హయాంలో 900మందికి 60–75 చదరపు గజాల ఇళ్ల స్థలాలు ఇచ్చినట్లు గుర్తుచేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్బెడ్రూం ఇళ్లను ఇస్తామని హామీ ఇచ్చి.. పట్టాలను వెనక్కి తీసుకున్నారని ఆరోపించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా పేదలకు మోసం మండిపడ్డారు. అర్హులైన వారికి డబుల్బెడ్రూం ఇళ్లు ఇవ్వకుండా కొన్నేళ్లుగా కాలయాపన చేస్తూ నిరుపేదలను క్షోభకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తమ గూడు వింటారని ఆశతో ఏడాది నుంచి కలెక్టర్తో పాటు ఎమ్మెల్యే కలుస్తూనే ఉన్నారని తెలిపారు. ఇప్పటికై నా ప్రభు త్వం పట్టించుకోకపోతే పోరాటం తప్పదని హె చ్చరించారు. అనంతరం ఆర్డీఓ నవీన్కు వినతి పత్రం అందజేశారు. నాయకులు జలాల్ పాషా, గట్టన్న, బాధితులు మాధవి, విజయలక్ష్మి, దివ్య, గీత, లలిత, అనీఫా బేగం, లాల్ బి, మహమ్మద్ సద్దాం తదితరులు పాల్గొన్నారు. -
కారణం ఏమిటి?
మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 60 డివిజన్లలో నిత్యం చెత్త సేకరణకు స్వచ్ఛ ఆటోలు 73, ట్రాక్టర్లు 21 వినియోగిస్తున్నారు. వీటి ద్వారా ప్రతిరోజూ కనీసం 107 మెట్రిక్ టన్నుల తడి, పొడి చెత్తను అధికారులు కోయిల్కొండ ఎక్స్ రోడ్డులోని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ఇందులో కేవలం 8 మెట్రిక్ టన్నుల తడి చెత్త తో సేంద్రియ ఎరువులను, ఏడు మెట్రిక్ టన్నుల పొడి చెత్తతో డీఆర్సీసీలో రీసైక్లింగ్ చేస్తున్నారు. మిగిలిన 92 మెట్రిక్ టన్నుల చెత్తను ఆరుబయట పడేయడంతో గుట్టలు గుట్టలుగా పేరుకుపోతోంది. అందులోనూ ఎక్కువశాతం ప్లాస్టిక్ వ్యర్థాలే ఉంటున్నాయి. అలాగే కొందరు ఇంటి కోసం వినియోగించిన రంగుల ప్లాస్టిక్ డబ్బాలు, ఇతరత్రా వస్తువులు సైతం ఇస్తున్నారు. ఎండాకాలం కావడంతో వేడిమికి రసాయనిక చర్య జరిగి అవి వెంటనే అంటుకుంటున్నాయి. నిత్యం ఉదయం వేళ వచ్చే పొగతో సమీపంలోని వీరన్నపేట, కోయిల్కొండ ఎక్స్రోడ్ ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆహ్లాదంతో పాటు స్వచ్ఛమైన గాలి కోసం వాకర్స్ కొత్త బైపాస్ వెంట వెళ్దామనుకున్నా అక్కడి పరిస్థితిని చూసి జంకుతున్నారు. మరో డంపింగ్ యార్డు, యంత్రం మంజూరు స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయిన నేపథ్యంలో తాజాగా మహబూబ్నగర్కు మరో డంపింగ్ యార్డు, బయో మైనింగ్ యంత్రం మంజూరయ్యాయి. త్వరలోనే స్థలం సేకరించి అక్కడ ఈ యంత్రాన్ని ఏర్పాటు చేస్తాం. వీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.పది కోట్లు కేటాయించింది. – పి.రామాంజులరెడ్డి, కమిషనర్, మున్సిపల్ కార్పొరేషన్, మహబూబ్నగర్ ● -
పచ్చిరొట్టతో భూసారం
● ఎరువుల వాడకంపై అవగాహన అవసరం ● రసాయనిక ఎరువులు వాడొద్దు మదనాపురం: పంటలు పండించే రైతులకు ఎరువులపై పరిజ్ఞానం లేక ఆశించిన స్థాయిలో పంట దిగుబడి కావడం లేదు. నేలను బట్టి ఎరువుల వాడకం, భూసారాన్ని మెరుగుపర్చేందుకు మదనాపురం కేవీకే సీనియర్ శాస్త్రవేత్త రాజేందర్ రెడ్డి రైతులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. నేల స్వభావం పంటలు సాగు చేసే ముందు నేల స్వభావం తెలుసుకోవడం తప్పనిసరి. భూమికి తగిన ఎరువులను వాడితే పంట సాగులో అధిక దిగుబడి సాధించవచ్చు. నేల బాగుంటే పంట ఆరోగ్యంగా ఉంటుంది. మితిమీరిన రసాయనిక ఎరువుల వాడకం వల్ల భూమి నిస్సారమైపోతోంది. నేలకు పూర్వ వైభవం తీసుకురావడానికి పచ్చిరొట్ట ఎరువులు ఒక దివవ్య ఔషధంలా పనిచేస్తాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ భూసారాన్ని పెంపొందించుకోవడానికి రైతులు పచ్చిరొట్ట సాగుపై దృష్టి సారించాలి. పచ్చిరొట్లో పోషకాలు మెండు సాధారణంగా మనం భూమి నుంచి పోషకాలను పంటల రూపంలో తీసుకుంటాం. కాని తిరిగి ఇచ్చేటప్పుడు కేవలం యూరియా డీఏపీ వంటి రసాయనిక ఎరువులకే పరిమితమవుతున్నాం. దీనివల్ల నే లలో సేంద్రియ కర్బనం అడుగంటిపోతోంది. పచ్చిరొట్ట పంటలను పెంచి, అవి పూత దశకు రాకముందే భూమిలో కలియదున్నడం వల్ల నేలకు అపారమైన నత్రజని సేంద్రియ పదార్థం లభిస్తుంది. ఏ పంటతో ఎంత బలం? (ఎకరాకు గణాంకాలు) శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం, ఒక ఎకరాకు సుమారు 12–15 కిలోల విత్తనాన్ని వాడి పచ్చిరొట్ట పంటలు పండిస్తే వచ్చే ఫలితాలు ఇలా.. ● జీలుగ: ఇది నేలకు రారాజు వంటిది. దీనివల్ల ఎకరాకు సుమారు 6 టన్నుల పచ్చిరొట్ట లభ్యమవుతుంది. చౌడు భూములను బాగు చేయడానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ● జనుము: ఇది త్వరగా పెరిగే పంట. దీని ద్వారా నేలకు 5 టన్నుల సేంద్రియ బలం చేకూరుతుంది. ● పిల్లిపెసర: వీటి ద్వారా నేలకు 3 నుంచి 4 టన్నుల పచ్చిరొట్ట లభించడమే కాకుండా, భూమి కి అవసరమైన సూక్ష్మ పోషకాలను ఇవి అందిస్తాయి. విత్తే సమయం వర్షాకాలం ప్రారంభంలో లేదా ప్రధాన పంట వేయడానికి కనీసం 50 రోజుల ముందు ఈ విత్తనాలను చల్లుకోవాలి. మొక్కలు విత్తిన 30 నుంచి 40 రోజుల మధ్యలో మొక్క కాండం మెత్తగా ఉండి, పూత దశకు చేరుకునే సమయంలోనే పొలంలో నీరు నిలిపి కలియదున్నాలి. ఇలా చేయడం వల్ల భూమి గుల్లబారి, వేరు వ్యవస్థకు గాలి ఆడుతుంది. తదుపరి వేసే వరి లేదా ఇతర పంటల్లో రసాయనిక ఎరువుల వాడకాన్ని 25, 30 శాతం వరకు తగ్గించుకోవచ్చు. రైతులు కేవలం దిగుబడి మీదనే కాకుండా, భూమి ఆరోగ్యం మీద కూడా దష్టి పెట్టాలి. పచ్చిరొట్ట ఎరువుల వాడకం వల్ల నేలలో మిత్ర పురుగులు, వానపాముల సంఖ్య పెరిగి భూమి పునర్జీవం పోసుకుంటుంది. ఇది పర్యావరణానికి, రైతు ఆర్థిక స్థితికి ఎంతో మేలు చేస్తుంది. పాడి–పంట -
ధర్మ పరిరక్షణ కోసం సంఘటితమవుదాం
స్టేషన్ మహబూబ్నగర్: సనాతన ధర్మపరిరక్షణ కోసం సంఘటితమవుదామని అభయ హిందూ సేన వ్యవస్థాపకులు రాధామనోహర్దాస్ స్వామి అన్నారు. మహబూబ్నగర్ జిల్లాకేంద్రం బండ్లగేరిలోని శ్రీరుక్మిణి పాండురంగస్వామి దేవాలయ ప్రాంగణంలో ఆదివారం రాత్రి ఘనంగా హిందూ సమ్మేళనం నిర్వహించారు. భారీ సంఖ్యలో ప్రజలు హిందూ సమ్మేళనంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాధా మనోహర్దాస్ స్వామిజీ ప్రసంగించారు. సనాతన ధర్మం, హిందూ సంస్కృతి, సంప్రదాయాల గురించి వివరించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వందేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా సమ్మేళనంలో ముఖ్య వక్తలుగా తెలంగాణ ప్రాంత బౌద్ధిక్ ప్రముఖ్ కూర జయదేవ్, సామాజిక కార్యకర్త భార్గవి కల్యాణి పాల్గొని ప్రసంగించారు. అంతకు ముందు చిన్నారులు చేసిన సంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సమ్మేళనంలో హిందూ సమ్మేళన ఉత్సవ కమిటీ ప్రతినిధులు జోషి సంతోషాచార్యులు, నరేష్కుమార్తోపాటు పలువురు ధార్మిక సంస్థల సభ్యులు పాల్గొన్నారు. -
అయిజ టు గట్టు
● నకిలీ పత్రాల తయారీ దందాలో గట్టుకు లింకులు ● కూపీ లాగుతున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు గట్టు: జోగుళాంబ గద్వాల జిల్లాలోని అయిజ కేంద్రంగా కొనసాగిన నకిలీ పత్రాల వ్యవహారం గట్టుకు తాకింది. ఇక్కడి పైరవీకారులు కొందరు ఏకంగా అయిజలో పట్టుబడిన ప్రింటింగ్ ప్రెస్ కేంద్రంగా నకిలీ పత్రాలతో వ్యవహారాలను కొనసాగించినట్లు సమాచారం. అయిజకు చెందిన ప్రింటింగ్ ప్రెస్ను గట్టు మండలానికి చెందిన కొందరు వ్యక్తులు తమ ఆధీనంలోకి తీసుకుని నకిలీ పత్రాల సృష్టికి కేంద్రంగా మార్చుకుని వ్యవహారాన్ని కొనసాగించినట్లు తెలిసింది. నకిలీ పత్రాలను సృష్టించుకుని వాటితో ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అనర్హులు పెద్దఎత్తున లబ్ధి పొందేలా చేసి.. వచ్చిన డబ్బుల్లో వాటా పంచుకుని తిన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంచలనం సృష్టించిన ఈ వ్యవహారంపై రెవెన్యూ, పోలీసులు కూపీ లాగుతున్నారు. 18 స్టాంపుల గుర్తింపు.. అయిజ ప్రింటింగ్ ప్రెస్లో గట్టు మండలానికి సంబంధించి 18 స్టాంపు (ముద్ర)లను అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. ఇందులో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఆయా పాఠశాలలకు చెందిన హెచ్ఎం ముద్రలు ఉన్నట్లు గుర్తించారు. పైరవీకారుల ద్వారానే నకిలీ పత్రాలతో సంక్షేమ పథకాల్లో లబ్ధి పొందినట్లు ఆరోపణలున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలైన రైతుబీమా, కల్యాణలక్ష్మి, భూభారతి పొర్టల్కు సంబంధించిన నకిలీ పత్రాలను సృష్టించి, వాటి ద్వారా పెద్దఎత్తున లబ్ధిపొందినట్లు తెలుస్తోంది. ఇందువాసి గ్రామంలో కొద్దిరోజుల క్రితం భూ యజమానికి వారసులు ఉన్నప్పటికీ వేరే వ్యక్తి తానే వారసుడినని తప్పుడు ధ్రువీకరణ పత్రంలో భూ బదలాయింపు చేసుకునేందుకు ప్రయత్నించిన వ్యవహారం వెలుగులోకి రావడంతో పెద్ద దుమారం రేగిన విషయం తెలిసిందే. రైతుబీమా పరిహారంలోనూ నకిలీ ధ్రువీకరణ పత్రాలను జత చేసి, ప్రభుత్వ సొమ్మును పెద్దఎత్తున స్వాహా చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇక కల్యాణలక్ష్మి పథకంలో ఓ గ్రామంలో నలుగురు పిల్లలున్న వారికి కల్యాణలక్ష్మి చెక్కును పైరవీకారుడు ఇప్పించినట్లు సమాచారం. వయస్సుతో సంబంధం లేకుండా అన్ని రకాల నకిలీ ధ్రువీకరణ పత్రాలను అయిజ ప్రింటింగ్ ప్రెస్లో సృష్టించుకుని పెద్దఎత్తున ప్రభుత్వ సొమ్మును కాజేశారు. అయిజ ప్రింటింగ్ ప్రెస్ కేంద్రంగా కొనసాగిన నకిలీ పత్రాల వ్యవహారం బయటకు పొక్కడంతో విషయం తెలుసుకున్న కొందరు పైరవీకారులు తమ దగ్గర ఇంకా దాచుకున్న పత్రాలను తారుమారు చేసి జాగ్రత్తపడినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తే అనేక వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చి, నకిలీ దందాను పూర్తిగా అరికట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
ఇక్కడే నేర్చుకున్నా.. ఇక్కడే శిక్షణ ఇస్తున్నా..
రెండేళ్ల నుంచిడ్రాయింగ్లో శిక్షణ . చిత్రాలు గీయడం అంటే ఎంతో ఇష్టం. స్కూల్లో చిత్రాలు గీయడం ప్రాక్టీస్ చేసేవాడిని. కొన్నిసార్లు పాఠశాలో జరిగిన చిత్రలేఖన కాంపిటేషన్లో పాల్గొన్న. రెండేళ్ల నుంచి బాలకేంద్రంలో చిత్రలేఖనంలో శిక్షణ తీసుకుంటున్నాను. – హార్దిక్, మహబూబ్నగర్ శిక్షణ బాగుంది. గతేడాది నుంచి వేసవి సెలవుల్లో బాలకేంద్రంలో శాసీ్త్రయ నృత్యంలో శిక్షణ తీసుకుంటున్న. కూచిపూడి నృత్యంలో శిక్షణ తీసుకుంటున్న. ఇక్కడ చాలా చక్కగా శిక్షణ బాగుంది. మేము చేసే తప్పులు సరిచేయడంతో పాటు చిన్నచిన్న మెళకువలతో నృత్యం బాగా చేయగలుగుతున్నాం. – సాత్విక, మహబూబ్నగర్ 2002 నుంచి 2010 వరకు బాలకేంద్రంలో కూచిపూడి నృత్యంలో శిక్షణ తీసుకున్నా.. 2016 నుంచి వేసవి సెలవుల్లో ఇక్కడే కూచిపూడిలో విద్యార్థులకు శిక్షణ అందజేస్తున్న. నేను కూచిపూడి నృత్య కళాకారిణిగా ఎన్నో వేదికల్లో ప్రదర్శనలు ఇచ్చాను. తిరుపతి, శ్రీశైలం, యాదగిరిగుట్టతో పాటు హైదరాబాద్లోని రవీంద్రభారతి, తెలుగు యూనివర్సిటీల్లో కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇచ్చాను. – దివ్యశ్రీ, కూచిపూడి డాన్స్ మాస్టర్ ఐదేళ్ల నుంచి వేసవిలో బాలకేంద్రంలో కూచిపూడిలో శిక్షణ తీసుకుంటున్నా. వేసవి అనంతరం మిగతా రోజుల్లో కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను.కూచిపూడి నృత్యంలో ఉన్నతస్థాయికి చేరడమే లక్ష్యంగా పెట్టుకున్న. గతేడాది హైదరాబాద్లో జరిగిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నృత్య ప్రదర్శనలో పాల్గొన్న. – అభిఘ్న, మహబూబ్నగర్ శిక్షణ తర్వాత మిగతా రోజుల్లో ప్రాక్టీస్ -
వ్యక్తి ఆత్మహత్యాయత్నం
అమ్రాబాద్: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం రాత్రి పదర మండలం ఇప్పలపల్లిలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కేతావత్ పీక్లానాయక్ ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆపస్మారక స్థితికి చేరుకున్నాడు. కొద్ది సేపటికి గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పదరా పీహెచ్సీకి తరలించారు. అక్కడ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో కొంతసేపు అక్కడ ఆందోళన వ్యక్తం చేసి అమ్రాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. గ్యాంగ్ రేప్ ఘటనలో ఇద్దరి రిమాండ్ మహబూబ్నగర్ క్రైం: పాలమూరులో కలకలం రేపిన బాలిక గ్యాంగ్ రేప్ కేసులో ఇద్దరిని రిమాండ్కు తరలించారు. మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. మూడురోజుల కిందట పరిగి నియోజకవర్గ పరిధిలో ఓ మండల కేంద్రానికి చెందిన 9వ తరగతి చదువుతూ అమ్మాయి, ఆమె స్నేహితుడు ఇద్దరూ కలిసి హన్వాడ మండలంలోని పిల్లిగుండు సమీప అటవీ ప్రాంతాంలోకి వెళ్లారు. ఇదే సమయంలో అక్కడున్న ఇద్దరు యువకులు వాహనంపై వారిని అనుసరించి అడవి లోపలికి వెళ్లిన తర్వాత ఇద్దరిని బెదిరించి రూ.6500ఆన్లైన్ ద్వారా వేయించుకున్నారు. అనంతరం ఇద్దరు యువకులు కలిసి ఒకరి తర్వాత ఒకరు బాలికపై లైంగికదాడికి పాల్పడ్డారు. పోలీసులకు వచ్చిన సమాచారంతో ఘటన స్థలానికి చేరుకుని లైంగికదాడి చేసిన ఇద్దరు యువకులపై పోక్సో యాక్ట్తో పాటు గ్యాంగ్రేప్ బీఎన్ఎస్ 70క్లాజ్(2) సెక్షన్స్ కింద కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. గతంలో అనేక ఘటనలు నవాబ్పేట మండలంలోని ఫతేపూర్ అటవీ ప్రాంతంలో కూడా చాలా మంది ప్రేమికులు ఒంటరిగా అడవిలోకి వెళ్లినప్పుడు దాడులు చేసి వారి దగ్గర ఉన్న డబ్బులు తీసుకోవడం, బాలికలు, అమ్మాయిలపై లైంగికదాడి చేసినా.. చాలా వరకు వెలుగులోకి రాని ఘటనలు ఉన్నాయి. నవాబ్పేట మండలంలో కొందరు యువకులు ముఠాగా ఏర్పడి ద్విచక్రవాహనాలపై అడవుల్లో సంచారిస్తూ ప్రేమికులపై దాడులకు పాల్పడుతుంటారు. అదేవిధంగా హన్వాడ మండలంలోని పిల్లిగుండు సమీపంలో ఉన్న అడవిలో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వ్యక్తి ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది వనపర్తి రూరల్: పెబ్బేరు మండలంలోని జూరాల కాల్వలో ప్రమాదవశాత్తు జారిపడిన మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తిని 108 సిబ్బంది ప్రాణాలు కాపాడి ఆస్పత్రిలో చేర్పించిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లాతూర్కు చెందిన హర్షద్ కుటుంబ సభ్యులతో కలసి తిరుపతి వెళ్తున్నారు. భోజనం తయారు చేసుకోవడానికి మార్గమధ్యలో పెబ్బేరు మండలంలోని తోమాలపల్లి శివారులోని జూరాల కాల్వ దగ్గర ఆగారు. కుటుంబసభ్యులు వంట చేసుకుంటూ ఉండగా హర్షద్ జూరాల కాల్వ దగ్గరకు వెళ్లాడు. అదే సమయంలో పిట్స్ రావడంతో కాల్వలో పడిపోయాడు. కాల్వలో ఏదో కదులుతుందని స్థానికులు గమనించి 108 సిబ్బందికి ఫోన్ చేశారు. 108 సిబ్బంది ఖాజా, మాసుంబాబా వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని కాల్వలోకి దిగి ఒడ్డుకు తీసుకొచ్చి ఆస్పత్రికి తరలించారు. 108 సిబ్బందికి హర్షద్ కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అగ్నిప్రమాదంలో రూ. 1.50లక్షల నష్టం గద్వాల క్రైం: ప్రమాదవశాత్తు ప్రార్థన మందిరంలోని స్టోర్ రూంలో షార్టు సర్క్యూట్ చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రూ.1.50లక్షల ఆస్తి నష్టం చోటు చేసుకుంది. నిర్వాహకుల కథనం మేరకు.. పట్టణంలోని మోమిన్మహాల కాలనీ సమీపంలోని పార్థన మందిరంలోని స్టోర్ రూంలో ఆదివారం సాయంత్రం షార్టు సర్క్యూట్ చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వంట సామగ్రి, సరుకులు దగ్ధమయ్యాయి. మంటలను ఆర్పేందుకు నిర్వాహకులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమా ద ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. రామాజిపల్లిలో రెండు తలల మేకపిల్ల జననం బల్మూర్: మండలంలోని రామాజిపల్లిలో ఓ విచిత్ర సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కురువ బక్కమ్మ మేక రెండు తలల మేకపిల్లను ఈనింది. ఈ విషయం గ్రామంతోపాటు చుట్టుపక్కల తెలియడంతో ప్రజలు వచ్చి ఆసక్తిగా గమనించారు. ఇదిలా ఉండగా జన్యుపరమైన లోపాలతో ఇలా జన్మిస్తాయని పశువైద్యాధికారి తెలిపారు. -
భవిష్యత్కు వేదిక బాలకేంద్రం
● బాలకేంద్రంలో వేసవి శిక్షణ శిబిరం ● మూడు అంశాల్లో ప్రత్యేక తార్ఫీదు ● ప్రతిరోజూ హాజరవుతున్న వందలాది మంది విద్యార్థులు విశేషమైన స్పందన లభిస్తుంది. బాలకేంద్రంలో వేసవి శిక్షణ తరగతులకు విశేషమైన స్పందన లభిస్తుంది. మూడు అంశాల్లో వందలాది మంది విద్యార్థులు, చిన్నారులు శిక్షణ తీసుకుంటున్నారు. శిక్షణ అనంతరం ముగింపు ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తాం. – రాజేష్ ఖన్నా, పర్యవేక్షకుడు, బాలకేంద్రం, మహబూబ్నగర్ -
బస్సును ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి
అచ్చంపేట: అమ్రాబాద్ మండలం పరిధిలోని శ్రీశైలం రహదారిలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఈగలపెంట ఎస్ఐ జయన్న తెలిపిన వివరాలు.. హైదరాబాద్ ఎల్బీ నగర్లో నివాసముంటున్న రక్షిత్ కుటుంబ సభ్యులు తొమ్మిది మంది కారులో శ్రీశైలం వెళ్తున్నారు. ఈ క్రమంలో శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సును దోమలపెంటకు సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ముందుగా వెళ్తున్న కారును ఓవర్టెక్ చేయబోయి ఢీకొట్టారు. ప్రమాదంలో కారులో ఉన్న జగదాంబ (55) అక్కడికక్కడే మృతి చెందగా, క్షతగాత్రులను 108 అంబులెన్స్లో అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ డ్రైవింగ్ సీటులో ఉన్న రక్షిత్ (40) మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 13, 14 తేదీల్లో బ్యాడ్మింటన్ పోటీలు మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఈ నెల 13, 14 తేదీల్లో ఉమ్మడి జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు కమ్ సెలక్షన్స్ నిర్వహిస్తున్నట్లు మహబూబ్నగర్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్యాంసుందర్గౌడ్, రవికుమార్, కార్యనిర్వాహక కార్యదర్శి సాదత్ఖాన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–11, 13, 15, 17, 19 బాల, బాలికలు, పురుషులు, మహిళలు, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు ఈ నెల 11లోగా పేర్లు నమోదు చేసుకోవాలని, పూర్తి వివరాల కోసం సెల్ నంబర్లు 98480 85211, 98669 28835లను సంప్రదించాలని కోరారు. -
శిక్షణ అంశాలు
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని బాలకేంద్రం వేసవి శిక్షణ శిబిరాలకు వేదికగా నిలుస్తోంది. ఎన్నో ఏళ్ల నుంచి బాలకేంద్రంలో ప్రతి ఏడాది వేసవి సెలవుల్లో చిన్నారులు, విద్యార్థులకు సాంస్కృతిక అంశాల్లో ప్రత్యేక శిక్షణ అందజేస్తున్నారు. గతనెల 25వ తేదీన ప్రారంభమైన ఈ శిక్షణ జూన్ 6వ తేదీ వరకు కొనసాగనుంది. అలాగే ముగింపు ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. శిక్షణలో తాము నేర్చుకున్న అంశాలను ఈ ముగింపు వేడుకల్లో విద్యార్థులు చక్కగా ప్రదర్శిస్తున్నారు. బాలకేంద్రంలో శాసీయ్త్ర నృత్యం, గాత్ర సంగీతం, చిత్రలేఖనం అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. శాసీ్త్రయ నృత్యంలో భాగంగా కూచిపూడి దివ్యశ్రీ, భరత నాట్యం హైందవి, జానపద నృత్యం సురేందర్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందజేస్తున్నారు. చిత్రలేఖనం రాజేష్ ఖన్నా, గాత్ర సంగీతం రాధిక శిక్షణ ఇస్తున్నారు. శాసీ్త్రయ నృత్య శిబిరంలో దాదాపు 200 మంది విద్యార్థులు చిత్రలేఖనంలో 150 మంది, గాత్ర సంగీతంలో 50 మంది చిన్నారులు హాజరవుతున్నారు. ప్రతి రోజు ఉదయం 8.30 గంటల నుంచి 12.30 గంటల వరకు శిక్షణ నిర్వహిస్తున్నారు. బాలకేంద్రాన్ని భవిష్యత్లో బాలభవన్గా అప్గ్రేడ్ చేస్తే మెరుగైన వసతులు సమకూరుతాయని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. బాలకేంద్రంలో ఎక్కువ మంది శిక్షకులు నియమితులవుతారని, సాంస్కృతిక అంశాల్లో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందజేస్తే రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు పంపించే అవకాశం ఉంటుందన్నారు. ఈ మేరకు బాల కేంద్రాన్ని బాలభవన్గా అప్గ్రేడ్ చేసేలా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. చిత్రలేఖనం శిబిరంలో చిత్రాలు గీస్తున్న చిన్నారులు బాలభవన్గా అప్గ్రేడ్ చేస్తే మెరుగైన వసతులు.. -
ముగిసిన అంజన్న బ్రహ్మోత్సవాలు
ఎర్రవల్లి: మండలంలోని బీచుపల్లి ఆంజనేయస్వామి బ్రహ్మాత్సవాలు ఆదివారంతో ముగిసాయి. ఈ సందర్భంగా ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు ఉదయం సన్నాయి వాయిద్యాల నడుమ ఆంజనేయస్వామిని ఆలయం నుంచి పల్లకీలో కృష్ణానది వరకు ఊరేగించారు. అర్చకులు పవిత్ర కృష్ణానదిలో వేదమంత్రాల నడుమ బీచుపల్లి రాయుడికి అమృతస్నానాన్ని వైభవంగా చేయించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి పంచామృతాభిషేకం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఉత్సవాలను తిలకించి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఆలయ ధ్వజస్తంభం ముందు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలను నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ పురేందర్ కుమార్, అర్చకులు మారుతీచారి, సందీప్చారి, పాలక మండలి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. -
పంట మార్పిడితో.. భూమికి ఆరోగ్యం
పంట మార్పిడి చేసే సమయాల్లో అనుకూలమైన పంటనే ఎంచుకోవాలి. లేదంటే చీడపీడల ఉధృతి ఎక్కువ అవుతుంది. బెండ తర్వాత పత్తి వేస్తే ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఈ రెండు పంటలకు ఒకే రకమైన చీడపీడలు ఆశిస్తాయి. జొన్న వేసిన పొలాల్లో మిరప వేయకూడదు. పసుపు తర్వాత మిరప, టమాటా, క్యాబేజి, దోస, గుమ్మడి, సోర, బీర, పత్తి, ఆవాలు, బెండ వేసుకోకూడదు. ఆకుముడత ఆశించే ప్రాంతాల్లో వేరుశనగ, సోయచిక్కుడు వేయకూడదు. అలంపూర్ : ఒకే పంటను ఏళ్ల తరబడి సాగు చేస్తే చీడపీడల తాకిడి అధికమవుతుంది. భూమి సైతం నిస్సారంగా మారుతుంది. అదే పంట మార్పిడి చేస్తే పంటకు చీడపీడల వ్యాప్తి తగ్గించవచ్చని వ్యవసాయ శాఖ ఏడీఏ సక్రియ నాయక్ సూచిస్తున్నారు. తరచూ పంట మార్పిడి చేయడం ద్వారా దిగుబడి పెరగడంతో పాటు భూమి సారవంతమవుతుందని పేర్కొంటున్నారు. ఎంపికలో జాగ్రత్తలు : పంట మార్పి చేయాలంటే అంతకు ముందు వేసిన పంటకు భిన్నంగా పెరిగే పైరును ఎంచుకోవాలి. కొన్ని పంటల వేరు వ్యవస్థలు నేలలోని పొరల నుంచి పోషకాలన్నీ ఎక్కువగా గ్రహిస్తూ ఉంటాయి. కాబట్టి పోషకాలన్నీ ఎక్కువగా గ్రహించే నువ్వులు, పొద్దుతిరుగుడు, మొక్క జొన్న వంటి పంటలకు బదులుగా భూమికి పోషకాలను గ్రహించే సమకూర్చే అపరాల పంటలతో పంట మార్పిడి చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అపరాల పంటలు కరువు పరిస్థితులను తట్టుకుంటాయి. ఆకుల్నీ రాల్చి భూమికి సేంద్రియ పదార్థాన్ని అందిస్తాయి. ఆపరాల పైరుల మీద ఉండే బూడిపెలు వాతావరణంలోని నత్రజనిని స్థిరీకరిస్తాయి. సూక్ష్మజీవుల చర్య జరగడం వలన ఎంజైముల ఉత్పత్తి పెరుగుతుంది. నల్లరేగడి నేలల్లో సోయచిక్కుడు వేసుకుంటే పైరు కోత సమయానికి ఆకులు పూర్తిగా రాలుతాయి. తద్వారా ఎకరానికి ఒకటి నుంచి రెండు టన్నుల సేంద్రియ పదార్థం లభిస్తోంది. ఇలా చేసుకోవచ్చు......! రబీలో వేరుశనగ వేసుకునే రైతులు తర్వాత వచ్చే ఖరీఫ్లో మొక్కజొన్న పంట వేసుకుంటే పైరుకు కొంత నత్రజని ఎరువు లభిస్తోంది. తద్వారా రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించవచ్చును. కంది, శనగ పైర్లను వరుసగా వేస్తే కాయ తొలుచు పురుగుల తాకిడి అధికంగా ఉంటుంది. అందువల్ల ఈ పురుగులు తక్కువగా ఆశించే జొన్న, సోయచిక్కుడు, నువ్వులు, మినుము, ఉలవ, మొట్ట వరి వంటి పంటలతో పంట మార్పిడి చేసుకోవాలి. వరితో పంట మార్పిడి చేసుకుంటే వేరుశనగ పైరుకు నులిపురుగుల బెడద తగ్గుతుంది. వరుసగ పొద్దుతిరుగుడు సాగు చేసే వారు కొర్ర, జొన్న, సజ్జ వంటి చిరుధాన్యపు పంటలను లేదా కంది, శనగ, మినుము వంటి అపరాల పైర్లు లేదా వేరుశనగతో పంట మార్పిడి చేసుకోవచ్చు. వంగ తోట వేసిన రైతులు కాలీఫ్లవర్తో పంట మార్పిడి చేసుకుంటే వంగకు ఎండు తెగులు సోకదు. దోస, కాకర, గుమ్మడి, పొట్ల, బీర, బూడిద గుమ్మడి, దొండ వంటి తీగ జాతి కూరగాయల పంటలను వరి పైరుతో పంట మార్పిడి చేసుకోవాలి. ఉల్లి సాగు చేసే వారు ధాన్యపు పంటలతో పంట మార్పిడి చేసుకోవాలి. ఒక సారి పసుపు సాగు చేస్తే మళ్లీ రెండేళ్ల పాటు సాగు చేయకపోవడం మంచిది. వరి, చెరకు, అరటి, తమలపాకు, కూరగాయల పంటలతో పంట మార్పిడి చేసుకోవాలి. పసుపు తర్వాత వరి, జొన్న వేసుకుంటే నులి పురుగుల ఉధృతి తగ్గుతుంది. కొన్ని రకాల పురుగులు, తెగుళ్లు కొన్ని పంటలపైన ఎక్కువగా వృద్ధి చెందుతాయి. అందువల్ల చీడ పీడలు ఆశించని పంటలతో పంట మార్పిడి చేసుకోవాలి. వరిని వరుసగా సాగు చేయకుండా వరి తర్వాత పప్పు ధాన్యాలు లేదా నునెగింజల పంటలు వేసుకోవాలి. మిరప, వేరుశనగ, క్యాబేజి, పంటల్ని ఆశించే లద్దె పురుగుల తాకిడి అరికట్టాలంటే జొన్న, వరి, సజ్జ, రాగి, పొద్దుతిరుగుడు వంటి ఆరుతడి పంటలతో పంట మార్పిడి చేసుకోవడం ఉత్తమం. పాడి–పంట -
ధాన్యం.. దైన్యం
ఆర్భాటానికే పరిమితమైన కొనుగోలు కేంద్రాల ప్రారంభం –8లో uఏఈఓలు, సిబ్బంది కొరత కారణంగా రైతులకు మూడు రోజులకోసారి టోకెన్లు జారీ చేస్తున్నారు. వారానికి ఒకసారి మాత్రమే గన్నీ బ్యాగులు కేంద్రాలకు వస్తుండగా.. అవి వచ్చినప్పుడే టోకెన్లు పొందిన రైతులు తీసుకోవాల్సి రావడం ఇబ్బందిగా మారింది. గన్నీ బ్యాగులు తీసుకున్న తర్వాత కూడా పలు కేంద్రాల్లో హమాలీల కొరత వేధిస్తోంది. ఒక బస్తా ధాన్యం నింపేందుకు రూ.25 వసూలు చేస్తుండడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. దాదాపుగా ప్రారంభమైన అన్ని కేంద్రాల్లో ధాన్యం తరలింపు ప్రధాన సమస్యగా మారింది. అధికారులు కొనుగోలు కేంద్రాలకు వెంటవెంటనే లారీలను పంపించకపోవడమూ కారణమవుతోంది. దీంతోపాటు మిల్లుల కేటాయింపుల్లో గందరగోళంతో లోడ్ అయిన వాహనాలు కేంద్రాల్లోనే ఉంటున్నాయి. దీంతో రైతులు రేయింబవళ్లు అక్కడే కాపలా ఉండాల్సి వస్తుంది. ప్రభుత్వం ఈసారి కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆన్లైన్లో మిల్లులకు కేటాయించే పద్ధతిని ప్రవేశపెట్టింది. ఈ విధానం అమలులో సమస్యలు తలెత్తడంతో క్రయవిక్రయాల్లో జాప్యం జరుగుతుండడంతో అధికారులు తిరిగి పాత విధానం ప్రకారమే రైతుల నుంచి ధాన్యం సేకరిస్తున్నారు. దీనిపై అస్పష్టతతో కొనుగోళ్లు ఊపందుకోవడం లేదని తెలుస్తోంది. గద్వాల జిల్లాలో మిల్లులకు గతంలో కేటాయించిన సీఎమ్మార్ ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. ఈ యాసంగి ధాన్యం నిల్వకు సరిపడా గోడౌన్లు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అధికారులకు మిల్లర్లు వినతిపత్రం అందించారు. వనపర్తి జిల్లాలో డీఫాల్ట్ మిల్లర్లు అధికంగా ఉండడంతో కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు కేటాయించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. యాసంగి సాగుకు సంబంధించి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఉమ్మడి పాలమూరులోని వనపర్తి, నాగర్కర్నూల్ మినహా మిగిలిన మూడు జిల్లాల్లో పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి వచ్చినా.. ఆర్భాటానికే పరిమితమయ్యాయి. సుమారు 15 రోజులు గడిచినప్పటికీ క్రయవిక్రయాల్లో వేగం పుంజుకోకపోవడంతో అసలు కొనుగోళ్లు చేస్తారా.. లేదా అనేది తెలియక రైతులు ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. క్రయవిక్రయాల్లో రోజుల తరబడి జాప్యంతో వారిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో అన్నదాతలు రాస్తారోకోకు దిగగా.. ఇలాంటి పరిస్థితులే పలు ప్రాంతాల్లో నెలకొన్నాయి. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో యాసంగి ధాన్యం కొనుగోళ్లకు 1,018 సెంటర్లు కేటాయించారు. ఇప్పటి వరకు 877 మాత్రమే అందుబాటులోకి రాగా.. ఇందులో కనీసం రెండు శాతం మేర సెంటర్లలో కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. మొత్తంగా 11,49,813 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ధారించిన అధికార యంత్రాంగం.. ఇప్పటివరకు ప్రభుత్వ కేంద్రాల ద్వారా కేవలం 36,175 మెట్రిక్ టన్నులు సేకరించింది. అయితే ఉమ్మడి జిల్లాలో వరినాట్లు ఆలస్యంగా పడుతాయని.. కోతలు కూడా ఆలస్యమవుతాయని.. ఆయా ప్రాంతాల్లో అవసరాల మేరకు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని.. కొనుగోళ్లలో ఎక్కడా జాప్యం జరగడం లేదని అధికారులు చెబుతున్నారు. సన్నాలకే మొగ్గు.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా యాసంగిలో 8,33,679 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. అయితే ప్రభుత్వం గ్రేడ్–1 సన్న వడ్లు క్వింటాల్కు మద్దతు ధర రూ.2,389, గ్రేడ్–2కు రూ.2,369 ఇస్తోంది. దీంతోపాటు సన్నాలకు బోనస్ కింద క్వింటాల్కు రూ.500 చొప్పున చెల్లిస్తోంది. ఈ నేపథ్యంలో రైతులు సన్నాల సాగుకే మొగ్గు చూపారు. 5,31,181 ఎకరాల్లో సన్న ధాన్యం సాగు చేయగా.. 3,02,498 ఎకరాల్లో రైతులు దొడ్డు రకం వరి సాగు చేశారు. అయితే సన్నాలను కొనేందుకు ప్రైవేట్ వ్యాపారులు ముందుకు వస్తున్నా.. దొడ్డు రకాల ధాన్యం కొనేందుకు ఇష్టపడడం లేదు. పలు ప్రాంతాల్లో మాత్రమే దళారులు దొడ్డు రకం వడ్లను క్వింటాకు రూ.2,200లోపు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా రైతులు ప్రభుత్వ కేంద్రాల్లో రోజుల తరబడి నిరీక్షిస్తూ.. కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఆశలు.. అడియాసలు ప్రస్తుతం ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో పలు ప్రాంతాల్లో రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. పూర్తిగా ఆరబెట్టిన సన్న వడ్లు క్వింటాకు రూ.2,400 నుంచి రూ.2,450.. తేమ ఉంటే రూ.2,300 నుంచి రూ.2,350 వరకు వెచ్చించి దళారులు కొనుగోలు చేస్తున్నారు. వెంటనే డబ్బులు చెల్లిస్తుండడంతో రైతులు వారి వైపే మొగ్గుచూపుతున్నారు. అయితే బోనస్ ఆశతో సన్నాలు పండించిన రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. బోనస్ చెల్లించాల్సి వస్తుందనే ప్రభుత్వం కావాలని కొనుగోలు చేయకుండా.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు. కొ .కేం : కొనుగోలు కేంద్రాలుజిల్లాల వారీగా యాసంగి సాగు, కొనుగోలు కేంద్రాల వివరాలు.. జిల్లా సాగు మొత్తం ప్రారంభించిన కొనుగోలు లక్ష్యం ఇప్పటి వరకు (ఎకరాల్లో) కొ .కేం కొ .కేం (మె.టల్లో) కొన్నవి (మె.టల్లో) మహబూబ్నగర్ 2,01,883 174 174 2,30,000 4,495 వనపర్తి 2,06,348 408 287 3,75,000 5,000 నారాయణపేట 1,90,000 160 160 2,44,813 25,810 నాగర్కర్నూల్ 1,69,128 200 180 2,00,000 70 జో. గద్వాల 66,320 76 76 1,00,000 800 మొత్తం 8,33,679 1,018 877 11,49,813 36,175 సెంటర్లలో అస్తవ్యస్తంగా మారిన క్రయవిక్రయాలు రోజులకొద్దీ జాప్యంతో అన్నదాతల పడిగాపులు పలు ప్రాంతాల్లో రోడ్డెక్కుతున్న రైతులు దొడ్డు వరి సాగు చేసిన వారికి తప్పని ఎదురుచూపులు -
మరో రెండు రోజుల్లో..
జడ్చర్లలో ముగియనున్న మున్సిపల్ పాలకవర్గ పదవీకాలం● ఐదేళ్లలో ఇద్దరు చైర్పర్సన్లు, నలుగురు కమిషనర్ల మార్పు ● అవినీతి, అక్రమాల చుట్టే సాగిన పాలన ● అంతంత మాత్రంగానే అభివృద్ధి ● ఎన్నికల నిర్వహణపై స్పష్టత కరువు జడ్చర్ల మున్సిపల్ కార్యాలయం జడ్చర్ల: బాదేపల్లి, కావేరమ్మపేట మేజర్ పంచాయతీలను కలిపి మొదటిసారిగా ఏర్పడిన జడ్చర్ల మున్సిపాలిటీ పాలక మండలి గడువు ఈ నెల 6న ముగియనుంది. జడ్చర్ల నియోజకవర్గం కేంద్రంగా ఉన్నా గతంలో పంచాయతీలుగా కొనసాగుతున్న జంట పట్టణాల్లో నిధుల లేమి, తదితర అనేక కారణాలు అభివృద్ధికి అడ్డంకిగా మారాయని.. రెండు పంచాయతీలను కలిపి మున్సిపాలిటీగా మారిస్తే నిధులు పెరిగి.. అభివృద్ధి చెందుతుందన్న సదుద్దేశంతో ప్రభుత్వం జడ్చర్ల మున్సిపాలిటీని ఏర్పాటు చేసింది. పట్టణ ప్రజలు కూడా మున్సిపాలిటీగా ఆవిర్భవిస్తేనే అభివృద్ధి పరుగు పెడుతుందని భావించారు. అనేక ఆటుపోట్ల మధ్య ఏర్పడిన మున్సిపాలిటీకి 2021 ఏప్రిల్ 30 పోలింగ్, మే 7న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించి పాలకమండలి సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఆది నుంచి ఆరోపణలే.. అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న పుర పాలకవర్గంపై పట్టణవాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మొదటిసారిగా ఏర్పడిన పాలకవర్గం ఆదర్శంగా సేవా దృక్పథంతో వ్యవహరిస్తుందని ప్రజలు ఆశించారు. కానీ, పాలకవర్గం ఏర్పడిన తొలి ఏడాదిలోనే ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తిని మూటగట్టుకుంది. నాటి నుంచి నేటి వరకు అవినీతి అక్రమాల చుట్టే పాలన కొనసాగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. పాలక మండలి సభ్యులు ఫొటోలు దిగడం, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడమే తప్ప వార్డుల అభివృద్ధి, సమస్యల పరిష్కారంపై దృష్టిసారించడం లేదన్న విమర్శలు వచ్చాయి. అంతేగాక వ్యక్తిగత పైరవీలతోపాటు అవినీతికి పాల్పడుతున్నారన్న ప్రచారం జోరుగా సాగింది. ఇది ఎంతవరకు అంటే గడిచిన అసెంబ్లీ ఎన్నికలలో విపక్ష పార్టీలకు ప్రధాన ప్రచారాస్త్రంగా ఉపయోగపడే స్థాయికి వెళ్లింది. ఇద్దరు చైర్పర్సన్లు జడ్చర్ల మున్సిపాలిటీకి ఇద్దరు చైర్పర్సన్లు కొనసాగారు. మొత్తం 27 వార్డులలో బీఆర్ఎస్ 23 వార్డులు గెలిచి చైర్పర్సన్, వైస్చైర్పర్సన్ పదవులను దక్కించుకున్నారు. అయితే చైర్పర్సన్గా ఉన్న దోరెపల్లి లక్ష్మిని అనూహ్యంగా సొంత పార్టీ సభ్యులే అవిశ్వాసం పెట్టి తొలగించారు. తర్వాత అదే పార్టీకి చెందిన సభ్యురాలు పుష్పలత చైర్పర్సన్గా ఎన్నికై నా ఆమె తదుపరి బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరడం విశేషం. అదేవిధంగా మొదటి పాలకవర్గంలో నలుగురు కమిషనర్లు విధులు నిర్వహించారు. వీరంతా పాలకవర్గం కనుసన్నల్లో పనిచేయని కారణంగానే బదిలీలు జరిగాయన్న ప్రచారం సాగింది. వీడ్కోలుకు రూ.లక్ష కేటాయింపు.. మున్సిపాలిటీ పాలక మండలి సభ్యుల పదవీకాలం ముగియడంతో వీడ్కోలు నిర్వహించేందుకు రూ.లక్ష కేటాయించారు. ఓ శాలువా కప్పి వీడ్కోలు సందర్భంలో కూడా ప్రజల డబ్బును ఇలా దుర్వినియోగం చేస్తున్నారన్న అపవాదును పాలకమండలి సభ్యులు మూటగట్టుకునే పరిస్థితి ఏర్పడింది. కొందరు పాలకమండలి సభ్యులు సైతం రూ.లక్ష కేటాయింపు సరైంది కాదని పేర్కొనడం గమనార్హం. పాలకమండలి గడువు ముగియడంతో ఎన్నికల నిర్వహణపై ఆసక్తి నెలకొంది. గడువు ముగియడంతో వెంటనే ఎన్నికలు నిర్వహిస్తారా.. ఆలస్యం చేస్తారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ఆలోచనలు ఏమిటన్న చర్చ సాగుతుంది. ఇప్పటికే వెలువడిన రిజర్వేషన్లు నిజమైనా.. మళ్లీ మార్పు ఏమైనా ఉంటుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చైర్మన్ స్థానాన్ని జనరల్కు కేటాయించడంతో అన్ని వర్గాల వారు ఆ పదవిపై ఆశలు పెంచుకున్నారు. ఇక వార్డుల రిజర్వేషన్లకు కూడా అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీలో పలువురు తమకే టికెట్లు దక్కుతాయని ప్రచారం చేసుకుంటున్నారు. ఇక బీఆర్ఎస్లో ఎంతమంది సిట్టింగ్లకు టికెట్లు దక్కుతాయని అంచనాలు వేసుకుంటున్నారు. ఏదేమైనా స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి సకాలంలో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ నెల 6న పాలక మండలి సభ్యులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశాం. ఇందుకోసం రూ.లక్ష కేటాయించాం. జ్ఞాపికలతోపాటు శాలువా, పూలమాలలతో సభ్యులను సన్మానించి వీడ్కోలు పలికే ఆనవాయితీని కొనసాగిస్తున్నాం. గడువు ముగింపునకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది. – లక్ష్మారెడ్డి, మున్సిపల్ కమిషనర్, జడ్చర్ల -
నేటినుంచి రైతు వారోత్సవాలు
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం నుంచి ఈ నెల 9 వరకు రైతు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఖుష్బూగుప్తా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటిరోజు సోమవారం నేల ఆరోగ్య పరిరక్షణ, సమతుల్య ఎరువుల యాజమాన్యం– ప్రకృతి వ్యవసాయం, మంగళవారం ఉద్యాన పంటలు, ఆయిల్పాం విస్తీర్ణం పెంపుదల– ప్రత్యామ్నాయ పంటల సాగు, బుధవారం బ్యాంకుల ద్వారా దీర్ఘకాలిక, స్వల్పకాలిక పంట రుణాలు, సహకార సంఘాలు– ఎఫ్పీఓల ద్వారా రైతులకు సేవలు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాలు, గురువారం వ్యవసాయ క్షేత్రాలు, సౌర విద్యుత్ కేంద్రాలు– పీఎం కుసుం వ్యవసాయ యాంత్రీకరణ, డ్రోన్స్, శుక్రవారం పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమ– పశుజాతి అభివృద్ధి, దూడల ప్రదర్శన, గడ్డి విత్తనాలు– వేసవిలో పశు సంరక్షణ, మత్స్య శాఖ ద్వారా చెరువులలో కలుపు మొక్కల నివారణ, వ్యాధుల నియంత్రణ, అధికోత్పత్తికి చర్యలు, నీటిపారుదల శాఖ ద్వారా సమర్థ నీటి విడుదల కోసం గేట్ల నిర్వహణ, ఎతిపోతల పథకాల మరమ్మతు, కాల్వల్లో కంపచెట్లు గుర్రపు డెక్క తొలగింపు, శనివారం నీటిపారుదల శాఖ ద్వారా చెరువులలో కంపచెట్లు, గుర్రపు డెక్క తొలగింపు, సమతుల్య నీటి వినియోగం, కార్యాలయాల పరిశుభ్రత కార్యక్రమాలు ఉంటాయన్నారు. షెడ్యూల్ ప్రకారం ప్రతిరోజు ప్రజలు, ప్రజాప్రతినిధులు, రైతులను భాగస్వాములు చేస్తూ వ్యవసాయ అనుబంధ శాఖలు సమన్వయంతో కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. రేపు జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: వరంగల్లో ఈ నెల 10న జరిగే రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల అథ్లెటిక్స్, 17న హైదరాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలను మంగళవారం ఉదయం 9 గంటలకు స్థానిక మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్చంద్ర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు ఎస్సెస్సీ మెమో, జనన, కుల ధ్రువపత్రంతో స్టేడియం మైదానంలో రిపోర్టు చేయాలని సూచించారు. కేజీబీవీ, గురుకుల కళాశాలల ప్రవేశ పరీక్ష మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా కేజీబీవీ, గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియట్ కోర్సుల్లో 2026–27 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ మేరకు ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పరీక్ష కొనసాగింది. జిల్లావ్యాప్తంగా మొత్తం 54 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలకు 13,222 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 10,385 మంది హాజరు కాగా.. 2,837 మంది గైర్హాజరయ్యారని పరీక్ష కోఆర్డినేటర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు పరీక్ష కేంద్రాలను డీఈఓ ప్రవీణ్కుమార్ పర్యవేక్షించారు. -
నీట్గా రాశారు..!
● జిల్లావ్యాప్తంగా 12 కేంద్రాల్లో పరీక్ష ● 11.30 గంటల వరకే అనుమతించిన అధికారులు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్/ మహబూబ్నగర్ క్రైం: జిల్లాలో నీట్–యూజీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ఈ మేరకు విద్యార్థులను ఉదయం 11 నుంచి 1.30 గంటల వరకు కేంద్రాల్లోకి అనుమతించారు. దీంతో ఉదయం 8 గంటల నుంచే పరీక్ష కేంద్రాల వద్ద హడావుడి కనిపించింది. పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన అధికారులు విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి వెళ్లే క్రమంలో బాల బాలికలకు వేర్వేరుగా తనిఖీ చేసి పంపించారు. ఈ నేపథ్యంలో 11 గంటల తర్వాత పరీక్ష కేంద్రంలోకి వెళ్లని విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయకుండా సాయంత్రం 5 గంటల వరకు ఉండాల్సి వచ్చింది. దీంతోపాటు జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థులను 25 నిమిషాలు ఆలస్యంగా వదిలారు. ఈ కేంద్రంలో ఇద్దరు విద్యార్థులు తమ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా పరీక్ష రాశారని, వారి పేరును రిజిస్ట్రేషన్ చేసి బయటికి వదిలేందుకు ఆలస్యమైందని విద్యార్థులు తెలిపారు. కాగా పరీక్షకు జిల్లావ్యాప్తంగా 12 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 4,214 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 4,141 మంది హాజరుకాగా 73 మంది గైర్హాజరయ్యారు. పర్యవేక్షించిన ఎస్పీ, అదనపు కలెక్టర్ జిల్లాలో నీట్ పరీక్షకు 200 మంది పోలీసులతో బందోబస్తు కల్పించారు. ఈ క్రమంలో ఎస్పీ జానకితోపాటు డీఎస్పీ వెంకటేశ్వర్లు మొదట ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించారు. పరీక్ష నిర్వహణ సిబ్బందితోపాటు విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రధానంగా ట్రాఫిక్ పోలీసులు విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా చూశారు. ప్రత్యేకంగా సిబ్బంది విద్యార్థులకు సెంటర్ అడ్రస్ చెప్పడంతోపాటు అత్యవసరమైన విద్యార్థులను కేంద్రాలకు చేర్చారు. పీయూలోని పరీక్ష కేంద్రాన్ని అదనపు కలెక్టర్ హరిప్రియ తనిఖీ చేశారు. అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ ఎన్టీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎంవీఎస్, ప్రభుత్వ మోడల్ బేసిక్ పాఠశాలల పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. -
ఐదు రోజులుగా నిరీక్షిస్తున్నా..
కొనుగోలు కేంద్రానికి ఐదురోజుల క్రితం ధాన్యం తెచ్చినా ఇప్పటికీ కొంటలేరు. ఇక్కడ గతంలో ఐకేపీ వారు ఏర్పాటు చేయగా.. ఈసారి ఈసారి పీఏసీఎస్ చేస్తుందని చెబుతున్నా.. ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రమే ప్రారంభించ లేదు. ఇప్పటికే చాలామంది వరి ధాన్యాన్ని తీసుకొచ్చారు. సకాలంలో కొంటే డబ్బులు త్వరగా వస్తాయి. వర్షం వస్తే చేతికొచ్చిన ధాన్యం పాడవుతుంది. కొనుగోలు కేంద్రం వద్ద నీడ లేదు. తాగడానికి నీరు కూడా లేదు. – దండె రాములు, రైతు, వెన్నాచేడ్, గండేడ్ మండలం -
గన్నీ బ్యాగులు ఇవ్వలేదు..
ఏడెకరాల ధాన్యం ఆరపెట్టి 15 రోజులు అవుతుంది. ఇంత వరకు గన్నీ బ్యాగులు ఇవ్వలేదు. మా గ్రామానికి 10 వేల బస్తాలు వస్తే కొంతమంది రైతులకు మాత్రమే ఇచ్చారు. మిగతా రైతులు బస్తాలు అడిగిన ప్రతిసారి ధాన్యం తరలించేందుకు లారీలు వస్తలేవు.. అందుకే బస్తాలు ఇవ్వడం లేదని చెబుతున్నారు. అకాల వర్షాలు వచ్చి ఆరిన ధాన్యం తడిస్తే తమ బాధలను ఎవరికీ చెప్పుకోవాలి. తర్వగా గన్నీ బ్యాగులు అందజేసి ధాన్యం తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకోవాలి. – విష్ణుకాంత్రెడ్డి, రైతు, పూసల్పహాడ్, మరికల్ ● -
‘నీట్’కు పకడ్బందీ ఏర్పాట్లు
● ఎలాంటి లోటుపాట్లు ఉండొద్దు ● అధికారుల సమీక్షలో కలెక్టర్ ఖష్బూగుప్తా ● జిల్లాలో 12 పరీక్ష కేంద్రాల ఏర్పాటు ● హాజరుకానున్న 4,214 మంది విద్యార్థులు జెడ్పీసెంటర్(మహబూబ్నగర్)/మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాలో ఆదివారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీఆధ్వర్యంలో నిర్వహించనున్న జాతీయస్థాయి మెడికల్ ప్రవేశ పరీక్ష (నీట్)ను ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం పరీక్షకేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు (సీఎస్), ప్రధానోపాధ్యాయులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 12 కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. కేంద్రాల్లో సీసీ కెమెరాలు, జామర్లు, బయో మెట్రిక్ హాజరు వ్యవస్థలను ఏర్పాటు చేసి, అవి సక్రమంగా పనిచేస్తున్నాయా లేవా నిర్ధారించుకోవాలని తెలిపారు. అలాగే కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, అభ్యర్థుల తనిఖీ కోసం అవసరమైన బ్యాక్ అప్ ఏర్పాట్లును కూడా చేసుకోవాలని ఆదేశించారు. తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చూడాలని, తరగతి గదుల్లో అభ్యర్థులు సరిపడా కుర్చీలు, టేబుళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్షను పారదర్శకంగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించేందుకు పోలీస్శాఖ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా బయోమెట్రిక్ అటెండెన్స్ను అన్ని కేంద్రాల్లో ఉదయం 9.30 గంటలలోగా సిద్ధంగా ఉండేలా చూడాలని సంబంధిత అధికారికి సూచించారు. వైద్యశాఖ అధికారులు కేంద్రాలలో మెడికల్ క్యాంపులో మందులు, ఓఆర్ఎస్ పాకెట్ల ను అందుబాటులో ఉంచాలన్నారు. ఉదయం 9 గంటల నుంచి ఎక్కువ బస్సులు నడిపేలా చూడా లని ఆర్టీసీ అధికారులకు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జేఎల్బీ హరిప్రియ, డీఆర్ఓ రాంరెడ్డి, జిల్లా నీట్ నోడల్ అధికారి వై.సురేందర్, తదితరులు పాల్గొన్నారు. ● జిల్లాలో మొత్తం 4,214 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. వీరిలో 25 మంది దివ్యాంగ అభ్యర్థులు ఉండగా, వారికి అదనంగా ఒక గంట సమయం ఇచ్చి సాయంత్రం 6.00గంటల వరకు పరీక్ష రాసే అవకాశం కల్పిస్తారు. పరీక్షలను సజావు గా నిర్వహించేందుకు 372 మంది ఇన్విజిలేటర్లును, 13 మంది పరిశీలకులు నియమించారు. అభ్యర్థులకు సూచనలు.. అభ్యర్థులకు ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల లోపు మాత్రమే పరీక్ష కేంద్రాల్లోకి ప్రవేశం కల్పిస్తారు. 1.30 గంటల తర్వాత గేట్లు మూసివేస్తారు. పరీక్ష మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు జరుగుతుంది. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, చేతి గడియారాలు, కాలిక్యులేటర్లు, ఆభరణాలు, పెన్సిల్లు, పెన్నులు, అనుమతి లేని ఎలాంటి వస్తువులను తీసుకురావద్దు. పరీక్ష కేంద్రాల్లోనే అభ్యర్థులకు పెన్నులు అందజేస్తారు. అభ్యర్థులు హాల్ టికెట్తో పాటు ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ వంటి ప్రభుత్వ గుర్తింపు కార్డులను తీసుకొని రావాలి. నిర్ణీత డ్రెస్ కోడ్ను పాటిస్తూ, ఫార్మల్ దుస్తుల్లో హాజరుకావాలి. -
జీవనోపాధి కావాలి..
ఏళ్లుగా అడవిని నమ్ము కుని బతుకుతున్నాం. ఇప్పుడు ఖాళీ చేయాల ని అంటున్నారు. ప్రభు త్వం తరపున పరిహారం ఇస్తామని చెబుతున్నా రు. అయితే అది ఎప్పుడు జరుగుతుందన్నది చెప్పడం లేదు. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో పరిహారం అందించాలి. పునరావాసంతో పాటు జీవనోపాధి కల్పించాలి. – పోషప్ప, కుడిచింతల్బైల్, అమ్రాబాద్ మండలం పరిహారం ఇస్తేనే వెళ్తాం.. అడవి నుంచి బయటకు వెళ్తే పరిహారం ఇస్తామ ని, జీవనోపాధి కల్పిస్తా మని చెబుతున్నారు. పరిహారంతో పాటు పిల్లల చదువు, వైద్యం, కుటుంబాలకు ఆదాయంతో అభివృద్ధి చెందుతామని భావిస్తున్నాం. పరిహారం త్వరగా ఇచ్చిన తర్వాతే మమ్మల్ని బయటకు తరలించాలి. – మండ్ల అంజయ్య, తాటిగుండాలపెంట బలవంతం లేదు.. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో ఉన్న స్థానికులను అడవి నుంచి మై దాన ప్రాంతాలకు రీలొకేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న వారితోనే ఎంవోయూ చేసుకుంటున్నాం. రీలొకేషన్ విషయంలో ఎలాంటి బలవంతం లేదు. పూర్తిస్థాయిలో పరిహారం అందించాక పునరావాస ప్రక్రియ చేపడతాం. – రేవంత్చంద్ర, డీఎఫ్ఓ, నాగర్కర్నూల్ -
పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి: ఎస్పీ
మహబూబ్నగర్ క్రైం: జిల్లాలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించడం చాలా అవసరం అని, ప్రధానంగా కోర్టు విచారణలో ఉన్న కేసులు ఆలస్యం కాకుండా శిక్షలు పడేవిధంగా చూడాలని ఎస్పీ డి.జానకి అన్నారు. ఎస్పీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శనివారం కోర్టు డ్యూటీ అధికారులతో పాటు కోర్టు లైజన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విచారణ కేసుల్లో సాక్ష్యులను సమయానికి హాజరుపరచడం, వారితో సమన్వయం కొనసాగించడం, చార్జీషిట్లను సకాలంలో కోర్టుకు అందించాలని సూచించారు. ప్రతి కేసులో ఫాలోఅప్ చర్యలు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని, కోర్టు తేదీలను కచ్చితంగా ట్రాక్ చేయాలన్నారు. సాక్ష్యుల హాజరు విషయంలో ఎలాంటి లోపాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కోర్టు పనుల్లో నిర్లక్ష్యం చేయడం వల్ల కేసుల పరిష్కారం ఆలస్యం అవుతుందని, ప్రతి అధికారి తమ విధులను క్రమశిక్షణతో సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. కోర్టు లైజన్ అధికారులు, డ్యూటీ అధికారులు పోలీస్స్టేషన్–కోర్టుల మధ్య సమన్వయం బలోపేతం చేయాలన్నారు. అవసరం అయిన పత్రాలు, చార్జిషీట్లు, సాక్ష్యాధారాలు సమయానికి అందేలా టెక్నాలజీ వినియోగంతో కేసుల ప్రగతిని సమీక్షించాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ ఎన్బీ రత్నం, డీసీఆర్బీ సీఐ నర్సింహులు పాల్గొన్నారు. -
బాధ్యతలు స్వీకరించిన జడ్జి
పాలమూరు: జిల్లా కోర్టు మూడవ అదనపు జూనియర్ సివిల్ న్యాయమూర్తిగా ఆర్.అనిత శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా బార్ అసోసియేషన్ సభ్యులు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. కార్యక్రమంలో జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆనంద్రావు, ఉపాధ్యక్షుడు వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి నర్సింహ్మారెడ్డి, కోశాధికారి రాజుగౌడ్ ఇతర న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. బాలోత్సవం వేసవి శిబిరం ప్రారంభం స్టేషన్ మహబూబ్నగర్: జిల్లాకేంద్రంలోని రెయిన్బో హైస్కూల్ ఆవరణలో పిల్లలమర్రి బాలోత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం బాలోత్సవం వేసవి శిక్షణ శిబిరం ప్రారంభమైంది. ఈ సందర్భంగా బాలోత్సవ్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు బెక్కం జనార్దన్, డాక్టర్ ప్రతిభ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకే ఈ వేసవి శిబిరాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఆసక్తి, నైపుణ్యం ఉన్న పేద విద్యార్థులకు ఆర్థిక సమస్య అడ్డు రాకూడదనే ఉద్దేశంతోనే అతి స్వల్ప రిజిస్ట్రేషన్ ఫీజుతో ఈ అవకాశాన్ని కల్పించినట్లు తెలిపారు. ఈ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఐఎంఏ జిల్లా అధ్యక్షులు డాక్టర్ రాంమోహన్రావు సూచించారు. నృత్యకళాకారుడు అజీమ్ నేతృత్వంలో వెస్ట్రన్స్ డాన్స్, చిత్రకారుడు వేణు చిత్రలేఖన శిక్షణను అందించనున్నారు. కార్యక్రమంలో వీరాంజనేయులు, ప్రమోద్, భరత్ పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.7,162 జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో శనివారం వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.7,162, కనిష్టంగా రూ.4,169 ధరలు లభించాయి. ఆముదాలు గరిష్టంగా రూ.6,279, కనిష్టంగా రూ.6,059, పెబ్బర్లు రూ.4,350, పొద్దుతిరుగుడు గరిష్టంగా రూ.5,942, కనిష్టంగా రూ.5,842, ధాన్యం ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,570, కనిష్టంగా రూ.1,701, హంస గరిష్టంగా రూ.1,869, కనిష్టంగా రూ.1,600, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,840, కనిష్టంగా రూ.1,600 ధరలు పలికాయి. ● దేవరకద్ర మార్కెట్ యార్డులో ఆర్ఎన్ఆర్ ధాన్యం గరిష్టంగా రూ.2,339, కనిష్టంగా రూ.1989, హంస ధాన్యం గరిష్టంగా రూ.1.771, కనిష్టంగా రూ.1,739గా ధరలు నమోదయ్యాయి. మార్కెట్కు దాదాపు 4 వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. -
చెరువులను రక్షించేలా..
మహబూబ్నగర్ న్యూటౌన్: చెరువుల సంరక్షణపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు చిత్తడి నేలల సర్వే నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించింది. గ్లోబల్ అంచనా ప్రకారం అడవుల కంటే మూడురెట్లు వేగంగా చిత్తడి నేలలు కనుమరుగవుతున్నాయనే నివేదికల ఆధారంగా చెరువుల పరిరక్షణకు చర్యలు ప్రారంభించింది. వాతావరణ సమతుల్యత ప్రధానాంశంగా అంతరించిపోతున్న పక్షి జాతులను, జంతు జాతులను కాపాడటమే లక్ష్యంగా ఈ సర్వేను చేపడుతున్నారు. జిల్లాలోని 489 చెరువుల్లో చిత్తడి నేలల సర్వే చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. చెరువు శిఖం సర్వే నంబర్లతో పాటు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను గుర్తించి మ్యాపులను సిద్ధం చేస్తున్నారు. సర్వే నంబర్ల వారీగా చేపట్టే ఈ సర్వే మ్యాపులను జియో మ్యాపింగ్ చేయనున్నారు. ఈ సర్వే ఆధారంగా కాలక్రమేనా వాతావరణంలో జరిగే మార్పులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే అవకాశం కలగడంతో పాటు జీవ వైవిధ్యం, నీటి నాణ్యత, నేలల ఆరోగ్యాన్ని కొలవడానికి ఈ సర్వే ఉపయోగపడనుంది. జిల్లాలో అటవీశాఖ, నీటిపారుదల శాఖ, సర్వే ల్యాండ్ రికార్డుల శాఖ, పర్యావరణ శాఖల సమన్వయంతో చిత్తడి నేలల సర్వేను చేపడుతున్నారు. చెరువుల పరిరక్షణతో పాటు మత్స్యసంపద పెంపు, జంతు జాతులు, పక్షి జాతులను కాపాడేందుకు ఈ చిత్తడి నేలల సర్వే ఉపయోగపడతాయి. అలాగే చెరువుల ఆక్రమణను నియంత్రించేందుకు చట్టబద్ధమైన వెసులుబాటు కలుగనుంది. ఆక్రమణలకు చెక్... చెరువుల్లో శిఖం భూముల ఆక్రమణపై అధికారులకు తరచుగా ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. చిత్తడి నేలల సర్వే ద్వారా చెరువు భూముల ఆక్రమణలకు చెక్ పెట్టనున్నారు. చెరువు కట్టల మరమ్మతులు, పూడికతీతలు, కాల్వలు, తూములు, అలుగు మరమ్మతులు వంటి వాటిపైనే ఇప్పటివరకు దృష్టి సారించగా.. ప్రస్తుతం ఆక్రమణలను నివారించేందుకు చర్యలు తీసుకోవడం గమనార్హం. చెరువుల్లోని చిత్తడి నేలల సర్వే ద్వారా అంతరించిపోతున్న జంతు, పక్షి జాతులను కాపాడటంతో పాటు పర్యావరణంలోని సహజ వనరులను పెంపొందించేందుకు ఆస్కారముంటుంది. చిత్తడి నేలల ఉపయోగాలు.. సున్నితమైన ప్రకృతి వనరులతో పాటు జీవరాశులన్నింటికీ అనువైన వాతావరణం కలిగి ఉంటుంది. ఔషధ గుణాలున్న మొక్కల ఎదుగుదలకు చిత్తడి నేలలు ఉపయోగపడుతాయి. రసాయనిక, జెనెటిక్ పదార్థాలను ఇముడ్చుకొని నేలను సారవంతం చేస్తాయి. అత్యధిక జీవరాశులకు చిత్తడి నెలలు ప్రధాన ఆవాస కేంద్రంగా ఉంటాయి. ఎక్కువకాలం నీటి నిల్వకు, భూగర్భంలో నీటి శాతాన్ని పెంచేందుకు చిత్తడి నేలలు దోహదపడుతాయి. సున్నితమైన ప్రకృతి వనరులకు, పక్షులకు చిత్తడి నేలలు నిలయాలుగా ఉంటాయి. ప్రత్యేక దృష్టి సారించిన కేంద్రప్రభుత్వం సర్వేలు నిర్వహించి మ్యాపులను సిద్ధం చేస్తున్న యంత్రాంగం జియో మ్యాపింగ్ చేయడం ద్వారా సత్ఫలితాలు అంతరించిపోతున్న జంతు, పక్షి జాతులను కాపాడటమే లక్ష్యం జిల్లాలోని 489 చెరువుల్లో కొనసాగుతున్న చిత్తడి నేలల సర్వే -
కేంద్ర మాజీమంత్రి డాక్టర్ మల్లికార్జున్కు అంతర్జాతీయ గౌరవం
స్టేషన్ మహబూబ్నగర్: మాజీ కేంద్రమంత్రి డాక్టర్ మల్లికార్జున్కు అంతర్జాతీయ గౌరవం లభించింది. ప్రపంచంలో అగ్రశేణి విశ్వవిద్యాలయాల్లో ఒకటైన ఇటలీలోని బొలోనియాలో ఉన్న జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (ఎస్ఏఐఎస్) క్యాంపస్లో కొత్తగా నిర్మించిన టెర్రస్కు ‘డాక్టర్ మల్లికార్జున్ టెర్రస్శ్రీగా ఆయన జ్ఞాపకార్థం పేరు పెట్టారు. ఈ టెర్రస్ను ఎస్ఏఐఎస్ యూరప్ క్యాంప్ భవన నిర్మాణ విస్తరణలో భాగంగా నిర్మించారు. డాక్టర్ మల్లికార్జున్ 1969 తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా ప్రజా జీవితంలో ప్రవేశించారు. రెండుసార్లు మెదక్ లోక్సభకు, నాలుగు సార్లు మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. రక్షణ, రైల్వే వంటి కీలక కేంద్ర మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. ప్రపంచస్థాయి వైద్య పరిశోధనలో ముందంజలో ఉన్న జాన్స్హాప్కిన్స్ యూనివర్సిటీ వంటి సంస్థ ఆయనకు ఈ గౌరవాన్ని అందించడం విశేషం. డాక్టర్ మల్లికార్జున్ కుమారుడు మను మల్లికార్జున్ ఎస్ఏఐఎస్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఎంఏ పూర్తి చేశారు. క్యాంపస్లో జరిగిన ఫలాకావిష్కరణ కార్యక్రమంలో ఎస్ఏఐఎస్ యూరప్ రెక్టర్ రెనోడ్ డెహౌస్ సమక్షంలో మను మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. -
అడవి ‘బయటికి’ బిడ్డలు
సాక్షి, నాగర్కర్నూల్: నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా పరిధిలో నివశిస్తున్న చెంచులు, గిరిజనులను అడవి నుంచి బయటకు తరలించేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. మొదటి విడతలో కొల్లంపెంట, తాటిగుండాల చెంచు పెంటల్లోని స్థానికులను అడవి బయటకు తరలించి పునరావాసం కల్పించాలని అధికారులు నిర్ణయించారు. రెండో విడతలో సార్లపల్లి, కుడిచింతల్బైల్, వటువర్లపల్లి గ్రామాల ప్రజల రీలొకేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి ఆయా గ్రామాల ప్రజల నుంచి కుటుంబాల వారీగా ఎంవోయూ ఒప్పందాలను అటవీ అధికారులు పూర్తిచేస్తున్నారు. సంఘర్షణ నిర్మూలన కోసం.. అటవీ ప్రాంతంలోని పులులు, వన్యప్రాణులతో అక్కడే నివశిస్తున్న మనుషులకు మధ్య ఘర్షణ, దాడులను నివారించేందుకు, వన్యప్రాణుల సంరక్షణ కోసం నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) పునరావాస ప్యాకేజీని అందిస్తోంది. ఇందులో భాగంగా నిర్వాసిత కుటుంబానికి రూ.15 లక్షల ఆర్థిక సహాయం లేదా 5 ఎకరాల భూమిని అందిస్తుంది. ఈ రెండింటిలో ఏదైనా ప్యాకేజీని ఎంచుకుని పరిహారం పొందవచ్చు. పునరావాస ప్యాకేజీ కోసం ఒప్పుకొంటున్న కుటుంబాలతో అటవీ అధికారులు ఎంవోయూ ఒప్పందాలను చేయిస్తున్నారు. ఇప్పటి వరకు సార్లపల్లి, కుడిచింతల్బైల్, కొల్లంపెంట, తాటిగుండాల గ్రామాల్లో మొత్తం 96 వరకు చెంచు కుటుంబాలు పునరావాస ప్రక్రియను అనుకూలంగా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆయా గ్రామాల్లోనూ కొంతమంది చెంచులు ఈ రీలొకేషన్ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం స్వచ్ఛందంగా ముందుకు వస్తేనే ప్రక్రియ చేపడతామని చెబుతున్నారు. పరిహారం అందితేనే రీలొకేషన్కు.. నిర్వాసితులకు ఎన్టీసీఏ తరపున పూర్తిస్థాయిలో ప్యాకేజీతోపాటు పునరావాసం కల్పించిన తర్వాతే తాము అడవిని వీడుతామని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. ఏళ్లుగా అడవినే నమ్ముకున్న తాము బయటకు వెళ్లి బతికేందుకు అవసరమైన జీవనోపాధి కల్పించాలని, ఇందుకు భరోసా కల్పించాలని కోరుతున్నారు. రీలొకేషన్ ప్రక్రియలో భాగంగా చేపట్టాల్సిన పునరావాస ప్రక్రియ పూర్తయిన తర్వాతే తాము అడవి నుంచి బయటకు వెళ్తామని తేల్చి చెబుతున్నారు. స్పష్టత కరువు నల్లమల నుంచి చెంచులు, స్థానికుల తరలింపు ప్రక్రియలో పునరావాస ప్రక్రియ కీలకంగా మారనుంది. అడవి నుంచి బయటకు వెళ్లేందుకు అంగీకరించిన వారికి పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించాల్సి ఉంది. ఇందుకోసం జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం బాచారంలోని ఫారెస్ట్ భూముల్లో పునరావాస కాలనీలను ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ ప్రక్రియ ఎంతకాలంలో చేపడతారన్న దానిపై స్పష్టత కరువైంది. నల్లమలలో చెంచుపెంటల తరలింపు ప్రక్రియ వేగవంతం మొదటి విడతలో కొల్లంపెంట, తాటిగుండాల చెంచుపెంటలు మలివిడతలో సార్లపల్లి, కుడిచింతల్బైల్, వటవర్లపల్లి గ్రామాల రీలొకేషన్ స్వచ్ఛందంగా ముందుకొస్తున్న వారితో కొనసాగుతున్న ఒప్పందాలు పునరావాస ప్రక్రియే కీలకం.. పూర్తిస్థాయి పరిహారం అందించాలంటున్న స్థానికులు -
ఇక తెలంగాణపైనే ప్రధాని ఫోకస్
పాలమూరు: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 10న రాష్ట్రానికి వచ్చి.. అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని ఎంపీ డీకే అరుణ అన్నారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ప్రధాని సభ భారీ స్థాయిలో ఉంటుందని, దీనికి ఉమ్మడి జిల్లా నుంచి బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలన్నారు. అస్సాం, పాండిచ్చేరి పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. కేరళం, తమిళనాడు రాష్ట్రాల్లోనూ బీజేపీ స్థానాలు పెంచుకోబోతున్నామని, ఈ ఎన్నికలు ముగించుకొని ప్రధాని తెలంగాణలో అడుగుపెడుతున్నట్లు వివరించారు. రాబోయే రోజుల్లో ప్రధాని తెలంగాణపైనే ఫోకస్ పెట్టనున్నట్లు, ఆయన రాక దీనికి ఒక సంకేతం ఇస్తుందన్నారు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రజలను మోసం చేసి రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల పాలు చేశారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను నమ్మి మోసపోయిన ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. తెలంగాణలో రూ.7,823 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని, దేశంలో 12 గ్రీన్ఫీల్డ్ ఇండస్ట్రీయల్ కారిడార్ మంజూరు చేస్తే అందులో ఒకటి తెలంగాణలోని జహీరాబాద్కు కేటాయించారన్నారు. గుడేబల్లూర్ నుంచి మహబూబ్నగర్ వరకు ఫోర్లైన్ జాతీయ రహదారి రూ.3,175 కోట్లతో మంజూరు చేయడం జరిగిందని దీనిని కూడా ప్రధాని ప్రారంభిస్తారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, నాయకులు పద్మజారెడ్డి, కట్టా సుధాకర్రెడ్డి, కృష్ణవర్ధన్రెడ్డి, హరికృష్ణ, రమేష్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
3 నెలలకోసారి ఉద్యోగ మేళాలు
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ప్రతి ఉమ్మడి జిల్లాలో మూడు నెలలకోసారి ఉద్యోగ మేళా నిర్వహిస్తామని రాష్ట్ర పశు సంవర్ధక, క్రీడలు, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా శుక్రవారం నగరంలోని శిల్పారామంలో మెగా జాబ్మేళాను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. విద్యారంగం పటిష్టత, యువతకు ఉద్యోగావకాశాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. గురుకులాలు, వసతి గృహాల్లో మెరుగైన సౌకర్యాల కోసం మెస్, కాస్మొటిక్ చార్జీలను పెంచి విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తున్నామన్నారు. గత పదేళ్లుగా నిలిచిపోయిన ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులను పునఃప్రారంభించి సుమారు 25 వేల మందికి ప్రయోజనం కల్పించామన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. యువతకు కేవలం ప్రభుత్వ ఉద్యోగాలకే పరిమితం కాకుండా ప్రైవేట్ రంగంలోనూ విస్తృత అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా జాబ్మేళాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే 1.30 కోట్ల మంది యువత వివిధ ఉద్యోగాల కోసం ఆన్లైన్లో నమోదు చేసుకున్నారని, వారికి అవకాశాలు కల్పించేందుకు 2,200 ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. ముఖ్యంగా సెట్విన్, టాస్క్ ద్వారా నైపుణ్య శిక్షణ ఇప్పిస్తూ, యువతను ఉద్యోగ యోగ్యులుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి 24,680 మంది అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఈ జాబ్మేళాలో నమోదు చేసుకున్నారని చెప్పారు. ● ఉద్యోగార్థులకు డిగ్రీ సర్టిఫికెట్లు మాత్రమే కాకుండా ప్రొఫెషనల్ స్కిల్స్ కూడా అవసరమని మహబూబ్నగర్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. ముఖ్యంగా టెక్నాలజీ పరిజ్ఞానం, ప్రాక్టికల్ అనుభవం ఉద్యోగ సాధనలో ఎంతో కీలకమని పేర్కొన్నారు. జిల్లాలో మహిళలకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇప్పిస్తున్నామని, కంప్యూటర్ కోడింగ్, ఫ్యాషన్ డిజైన్, బ్యూటీషియన్ కోర్సులను అందుబాటులోకి తెచ్చామన్నారు. ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టు ద్వారా భవిష్యత్లో పెద్దఎత్తున ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ● 99 రోజుల కార్యాచరణలో భాగంగా పది థీమ్లను నిర్ణయించి కార్యక్రమాలు చేపడుతున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. యూత్ సర్వీసెస్ థీమ్ కింద ఈ జాబ్మేళా నిర్వహించడం గొప్ప నిర్ణయమన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 70 వేల ఉద్యోగాలు కల్పించామని, ఈ మేళాలో 105 కంపెనీలు పాల్గొనడమే గాక 3,500 ఉద్యోగాలు అందుబాటులో ఉంచాయన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 23న ఆయా జిల్లాల కలెక్టర్ల ద్వారా నియామక పత్రాలు అందజేస్తారన్నారు. నియామక పత్రాల అందజేత ఇంటర్వ్యూలలో ఎంపికై న సుమారు పది మంది అభ్యర్థులకు మంత్రి వాకిటి శ్రీహరి నియామక పత్రాలు అందజేశారు. కాగా, వీరిలో దేవరకద్రకు చెందిన గాయత్రి, జడ్చర్లకు చెందిన చంద్రకాంత్కు ఏడాదికి రూ.3 లక్షల చొప్పున, నారాయణపేట వాసి విష్ణుమూర్తికి రూ.2.05 లక్షల చొప్పున ప్యాకేజీ లభించనుంది. కార్యక్రమంలో ఎమ్మెల్సీ, శాసన మండలిలో చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లాకొత్వాల్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, వైస్ చైర్మన్, ఎండీ ఎ.సోని బాలాదేవి, టాస్క్ సీఈఓ నితిన్కుమార్రెడ్డి, కలెక్టర్ కుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్లు హరిప్రియ, మధుసూదన్నాయక్, పరిశ్రమల శాఖ జీఎం యాదయ్య, డీవైఎస్ఓ రాజశేఖర్రెడ్డి, మూడా చైర్మన్ కె.లక్ష్మణ్యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలు,యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మెగా జాబ్మేళాలో పాల్గొన్న 105 కంపెనీలు ఉమ్మడి జిల్లా నుంచి 3,450 మంది నిరుద్యోగుల హాజరు -
కార్మికుల హక్కులు, చట్టాలపై అవగాహన
పాలమూరు: కార్మిక దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి డి.ఇందిర ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ ప్రాంగణంలో మొబైల్వ్యాన్ ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్మికుల హక్కులు, ఉచిత న్యాయ సహాయం, కార్మిక చట్టాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై వివరంగా తెలియజేశారు. ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికులు తమ హక్కులను తెలుసుకొని అవసరమైనప్పుడు న్యాయ సేవలను పొందాలని సూచించారు. ప్రతి కార్మికుడు తమ హక్కులను తెలుసుకోవడం ఎంతో ముఖ్యమని, ఏదైనా సమస్యలు ఎదురైనప్పుడు జిల్లా న్యాయ సేవా సంస్థను సంప్రదించాలని సూచించారు. ‘నీట్’కు భారీ భద్రత ● ట్రాఫిక్ నియంత్రణ చర్యలు :ఎస్పీ జానకి మహబూబ్నగర్ క్రైం: జిల్లాలో ఆదివారం నీట్ ప్రవేశ పరీక్ష సందర్భంగా అన్ని కేంద్రాల దగ్గర పటిష్ట పోలీస్ బందోబస్తుతోపాటు 163బీఎన్ఎస్ యాక్ట్ అమల్లో ఉంటుందని ఎస్పీ డి.జానకి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష రోజు మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంటల వరకు కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని, కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురి కంటే ఎక్కువ మంది ఉండరాదన్నారు. జిల్లా పరిధిలో మొత్తం 12 పరీక్ష కేంద్రాలకు జడ్చర్లలో ఒకటి, పాలమూరులో 11 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని, వీటి పరిధిలో పెట్రోలింగ్తోపాటు ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ప్రత్యేక నిఘా బృందాలు పరీక్ష కేంద్రాలపై దృష్టిపెట్టడం జరుగుతుందన్నారు. పోలీస్ యాక్టు అమలు శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని జిల్లావ్యాప్తంగా శుక్రవారం నుంచి ఈ నెల 31 వరకు 30(ఎ)పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని ఎస్పీ వెల్లడించారు. పోలీసుల అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు ఏర్పాటు చేయరాదన్నారు. అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు చేస్తే సంబంధిత వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. షీటీంకు 18 ఫిర్యాదులు జిల్లాలో ఏప్రిల్ నెల రోజుల్లో షీటీం పోలీసులకు 18 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ తెలిపారు. రెండు కేసులలో కౌన్సిలింగ్ ఇచ్చామని, ఐదు కేసుల్లో రెడ్హ్యాండెడ్గా చర్యలు తీసుకున్నామని, 8 కేసుల్లో ఎఫ్ఐఆర్లు నమోదు చేయడంతోపాటు మూడు ఈపెట్టీ కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే 23 అవగహన కార్యక్రమాలు, 80 హాట్స్పాట్ ప్రాంతాలను పరిశీలించినట్లు చెప్పారు. అమ్మాయిలు, విద్యార్థినులు ఏదైనా ఇబ్బందులకు లేదా వేధింపులకు గురైతే వెంటనే డయల్ 100 లేదా సెల్ నం.87126 59365లకు ఫిర్యాదు చేయాలని సూచించారు. -
శ్రమజీవుల పర్వదినం మే డే
మహబూబ్నగర్ న్యూటౌన్: శ్రమజీవుల పర్వదినం మేడే అని రాజ్యసభ మాజీ సభ్యుడు పి.మధు అన్నారు. శుక్రవారం మేడేను పురస్కరించుకొని నగరంలోని సీపీఎం కార్యాలయం వద్ద ఎరజ్రెండా ఎగురవేసిన అనంతరం మాట్లాడారు. మే డేను దీక్షా దినంగా పాటించి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. చైనా, రష్యా, ఇండియా ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతి కోసం డాలర్ నుంచి కాకుండా ఆయా దేశాల డబ్బులు పెట్టి కొనడం ద్వారా ట్రంప్ ఆధిపత్యానికి పతనం మొదలైందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలతోపాటు కంపెనీలలో పనిచేస్తున్న కార్మికులు యుద్ధం ప్రభావంతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక చట్టాలు హక్కులు ఎవరో పెట్టిన భిక్ష కాదని, కార్మిక, కర్షక, మహిళా ఉద్యమాలతో సాధించుకున్నారని గుర్తు చేశారు. హద్దులు లేని శ్రమ దోపిడిని అరికట్టడం కోసం కార్మికులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి బానిసత్వాన్ని అంతం చేశారని గుర్తు చేశారు. మన దేశంలో నేడు కార్మిక చట్టాలు విద్యుత్ సవరణ బిల్లు వంటివి తెచ్చి సామాజిక న్యాయానికి తిలోదకాలు ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సీపీఎం ఆధ్వర్యంలో సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాములు, కార్యదర్శివర్గ సభ్యుడు కిల్లె గోపాల్, నల్లవెల్లి కురుమూర్తి, నాయకులు కిష్టయ్య, విజయ్కుమార్, చంద్రకాంత్, ప్రశాంత్, సురేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


