breaking news
Mahabubnagar
-
శ్రీశైలం వెళ్తూ యువకుడు..
నవాబుపేట: శివరాత్రి సందర్భంగా శ్రీశైల మల్లన్న దర్శనానికి వెళ్తున్న యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం జరిగింది. మండల పరిధిలోని గురకుంట గ్రామానికి శ్రీనివాస్(25) మిత్రుడు కేశవులుతో కలిసి శనివారం శ్రీశైలం బయలుదేరారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున అచ్చంపేట సరిహద్దులో బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాగా కేశవులు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేశవులను చికిత్స నిమిత్తం నాగర్కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడటంతో హైదరాబాద్ ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి
తిమ్మాజిపేట: అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి చెందిన ఘటన మండల పరిధిలోని బుద్దసముద్రం గ్రామ సమీపంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన రాసుమల్ల మేఘన(16) ఈ నెల 14 రాత్రి కుటుంబ సభ్యులు నిద్రపోయాక 10:30 గంటల సమయంలో ఇంటి నుంచి నరేష్ అనే యువకుడి బైక్పై వెళ్లింది. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం గ్రామ సమీపంలో విగత జీవిగా పడి ఉండగా గ్రామస్తులు బాలిక తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. ఈ నేపథ్యంలో అనుమానాస్పద మృతిపై మృతురాలి తండ్రి వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హరిప్రసాద్రెడ్డి తెలిపారు. విషయం తెలుసుకున్న నాగర్కర్నూల్ డీఎస్పీ శ్రీనివాస్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలు మేఘన జడ్చర్ల కళశాలలో ఇంటర్ చదువుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
వైభవంగా భౌరమ్మ, మల్లన్న లగ్గం
● బౌరపూర్లో భ్రమరాంబిక, మల్లికార్జునస్వామి కల్యాణోత్సవం ● కల్యాణానికి భారీగా తరలి వచ్చిన చెంచులు ● పెళ్లిపెద్దలుగా ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్ దంపతులు అచ్చంపేట: లింగాల మండలం అప్పాపూర్ జీపీ పరిధిలోని బౌరాపూర్ చెంచుపెంటలోని భ్రమరాంబిక ఆలయంలో బౌరమ్మ, మల్లికార్జున స్వామివార్ల కల్యాణం చెంచులు వైభవంగా నిర్వహించారు. ఏటా మహాశివరాత్రి పర్వదినాన బౌరమ్మను తమ అడబిడ్డగా, మల్లికార్జునస్వామిని అల్లుడిగా భావించి చెంచులు స్వామివారికి కల్యాణం జరిపిస్తారు. కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి చెంచులు భారీగా తరలివచ్చారు. గిరిజన సంక్షేమశాఖ, ఐటీడీఏ ఆధ్వర్యంలో వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోంది. చెంచులు తమ సంప్రదాయ నృత్యాలతో బౌరమ్మ, మల్లికార్జున స్వామివార్లకు ఎదుర్కోళ్లు నిర్వహించారు. దేవతామూర్తల విగ్రహాలను కొప్పెరలో ఉంచి డప్పుచప్పుళ్లతో ఆలయ సన్నిధికి తీసుకొచ్చారు. చెంచుపూజారి మల్లయ్య కల్యాణాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ, అనురాధ దంపతులు స్వామివారి తరఫున వ్యవహరించగా, అమ్మవారి తరఫున పెళ్లిపెద్దలుగా డిప్యూటీ కలెక్టర్ అమరేందర్ దంపతులు వ్యవహరించారు. పకడ్బందీ ఏర్పాట్లు బౌరాపూర్ ఉత్సవాల్లో ఎలాంటి ఘటనలు జరగకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. నల్లమల అడవిలో తరచుగా సంభవిస్తున్న అగ్నిప్రమాదాలను దృషిలో ఉంచుకుని అధికారులు పైర్ఇంజన్ల అందుబాటులో ఉంచారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఐలు నాగరాజు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అర్టికల్చర్, జీసీసీ, ఆర్డీటీ, వైద్యారోగ్యశాఖ, సీ్త్ర, శిశు సంక్షేమశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, ఐటీడీఏ, ఆర్డబ్ల్యూఎస్కు సంబంధించిన ప్రభుత్వ స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఐటీడీఏ అధికారులు వివిధ ప్రాంతాల నుంచి చెంచులను తరిలించేందుకు ప్రత్యేకంగా 14 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయడంతో చెంచులు భారీగా తరలివచ్చారు. కార్యక్రమంలో నాగర్కర్నూలు ఎంపీ మల్లురవి, కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా వైద్యాధికారి రవికుమార్, డీటీడీఓ ఫిరంగి, ఆర్డీఓ యాదగిరి, ఐటీడీఏ అధికారి జాఫర్ ఉస్సేన్ తదితరులు పాల్గొన్నారు. 4కిమీ వరకు ట్రాఫిక్ జామ్ బౌరాపూర్ భ్రమరాంబ ఆలయంలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. వాహనాల రద్దీతో సుమారు 4కి.మీ వరకు ట్రాఫిక్ జామ్ అయి వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్లో ఎంపీ మల్లు రవి వాహనం కదలేని పరిస్థితి ఏర్పడటంతో చివరకు ఆయన బైక్పై ఆలయానికి చేరుకున్నారు. స్వామివారిని ఎదుర్కోలకు తీసుకొస్తున్న ఎమ్మెల్యే దంపతులు తాగునీటి సౌకర్యం కల్పించాలి చెంచుపెంటల్లో తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ప్రతి చెంచుపెంటలో ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని అప్పాపూర్ సర్పంచ్ శివమ్మ కోరారు. ప్రతి చెంచు కుటుంబానికి జీవనోపాధి కల్పించాలని, ప్రత్యేక ఉపాధిహామీ చట్టం అమలు చేయాలని కోరారు. ఐటీడీఏ రెగ్యూలర్ పీఓ నియమించాలని, పీసా చట్టం పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు. అటవీ హక్కుల చట్టాన్ని ఉమ్మడిగా అమలు చేస్తూ, గతంలో అడవిలో కొంత చెంచులకు కేటాయించిన భూమిని తిరిగి అప్పగించాలని కోరారు. -
అగ్నికి ఆహుతైన శ్రీగంధం చెట్లు
● రూ.5 లక్షల నష్టం మాగనూర్: మండల పరిధిలోని అచ్చంపేట శివారులో నర్సింగ్ రాథోడ్ అనే రైతుకు చెందిన శ్రీగంధం, గందపు చెట్లు ఆదివారం అగ్నికి ఆహుతయ్యాయి. కర్ణాటక రాష్ట్రం దేవసూగురుకు చెందిన రాథోడ్ 11 ఎకరాల్లో శ్రీగంధం, గందపు చెట్లు సాగు చేశాడు. అయితే ఆదివారం తోటలో మంటలు వ్యాపించినట్లు తోటి రైతులు అతడికి సమాచారం అందించారు. అతడు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చి తాను రైతులతో వెళ్లి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. సమయానికి స్పందించిన ఫైర్ ఇంజిన్ సిబ్బంది స్థానిక పోలిసుల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే అనేక చెట్లు కాలి బూడిద అయ్యాయి. ప్రమాదంలో దాదాపు రూ.5 లక్షల నష్టం వాటిల్లిందని రైతు నర్సింగ్రాథోడ్ వాపోయారు. కాలిన గాయాలతో మహిళ మృతి కొల్లాపూర్: గ్యాస్ స్టవ్పై వంట చేస్తూ ప్రమాదవశాత్తు నిప్పంటుకొని గాయపడిన మహిళ ఆదివారం చికిత్స పొందుతూ మృతి చెందింది. పూర్తి వివరాలు.. పెద్దకొత్తపల్లి మండలం మారెడుమాన్దిన్నె చెందిన మంగలి దేవేంద్రమ్మ ఈ నెల 9న ఇంట్లో గ్యాస్స్టవ్పై వంట చేస్తుండగా నిప్పంటుకొని తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం మహబూబ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందడంతో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సతీష్ తెలిపారు. -
క్యాంపుల్లో విభిన్న స్వరాలు
● పార్టీ పెద్దల దృష్టికి గెలిచిన అభ్యర్థుల ‘డిమాండ్లు’ ● ఎన్నికల్లో పెద్దమొత్తంలో ఖర్చు చేశామని వెల్లడి ● మేయర్, చైర్మన్ అభ్యర్థుల నుంచి ‘ప్యాకేజీ’ కి ఆశలు పాలమూరు: ఉమ్మడి జిల్లాలోని పలు మున్సిపాలిటీలతోపాటు మహబూబ్నగర్ కార్పొరేషన్లో జరుగుతున్న క్యాంపు రాజకీయ శిబిరాల్లో పలు రకాల డిమాండ్లు వినిపిస్తున్నాయి. కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్తో పాటు మిగతా మున్సిపాలిటీల పీఠాలు చేజిక్కించుకొనేందుకు అధికార పార్టీ ప్రత్యేక దృష్టిసారించింది. ఇతర పార్టీల నుంచి గెలిచిన సభ్యులతోపాటు స్వతంత్రులను తమవైపు తిప్పుకొనేందుకు వ్యూహాలు రచిస్తోంది. హంగ్ ఏర్పడిన స్థానాలపై దృష్టిపెట్టిన బీఆర్ఎస్ సైతం ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటుంది. పాలమూరులో ప్రత్యేకం.. ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల కంటే పాలమూరు రాజకీయం భిన్నంగా ఉంది. ఇక్కడ అధికార పార్టీ నుంచి 29 మంది కార్పొరేటర్లతోపాటు నలుగురు స్వతంత్రులను క్యాంపు శిబిరాలకు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఇందులో ఒక స్వతంత్ర అభ్యర్థి అధికార పార్టీకి మద్దతు ఇవ్వడానికి షరతు విధించినట్లు సమాచారం. తన డివిజన్లో కోఆప్షన్ సభ్యుడిగా ఎవరికి అవకాశం ఇవ్వరాదని పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. అదేవిధంగా కాబోయే మేయర్ కార్పొరేటర్లకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు, స్వతంత్రులకు రూ.10 లక్షలకుపైగా ప్యాకేజీ ఇవ్వాలనే డిమాండ్లు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో అధిక మొత్తంలో ఖర్చు చేశామని, ఇందుకోసం ప్యాకేజీలు కావాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. ● భూత్పూర్ మున్సిపాలిటీలో అధికార పార్టీకి అధిక మెజార్టీ ఉండగా, దేవరకద్ర మున్సిపాలిటీలో ఒక స్వతంత్ర అభ్యర్థి అధికార పార్టీకి మద్దతు ఇవ్వగా, బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన అభ్యర్థి సైతం ఒకరు కాంగ్రెస్లో చేరారు. దీంతో సంఖ్యాబలం పెరిగి నేరుగా చైర్మన్ పీఠం కై వసం చేసుకునే అవకాశం లభించింది. ● గద్వాలలో చైర్మన్ పీఠం కోసం 16 మంది కౌన్సిలర్లు కావాల్సి ఉండగా ఎంఐఎం అభ్యర్థి ఒకరు వైస్చైర్మన్ ఇవ్వాలని ప్రతిపాదన పెట్టారు. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల్లో ఒకరు ఎన్నికల ఖర్చు అధికంగా అయ్యిందని అధిక మొత్తంలో ప్యాకేజీ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ● నారాయణపేటలో ముగ్గురు అభ్యర్థులు చైర్మన్ రేస్లో ఉండగా.. ఇందులో ఒకరికి మాత్రమే అవకాశం ఇస్తే.. మిగిలిన ఇద్దరు అభ్యర్థులకు అధిక మొత్తంలో సమర్పించుకోవాలనే చర్చ నడుస్తోంది. ● అమరచింతలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య సయోధ్య కుదిరినా.. తొలి చైర్మన్ ఎవరిని చేయాలనే మంతనాలు జోరుగా నడుస్తున్నాయి. ● పెబ్బేరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉన్న కూడా పలు రకాల డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో ఓటుకు దరఖాస్తుకు చేసుకున్నట్లు తెలుస్తోంది. -
శ్రీశైలం మల్లన్నకు పట్టువస్త్రాల అందజేత
అమరచింత: అమరచింత పద్మశాలీలు 15 రోజులుగా నిమయ నిష్టలతో మగ్గంపై తయారు చేసిన పట్టువస్త్రాలను శివరాత్రి సందర్భంగా ఆదివారం శ్రీశైలం ఆలయ చైర్మన్ రమేష్నాయుడు, ఈఓ శ్రీనివాసరావుకు అందించారు. శ్రీశైల క్షేత్రంలోని పద్మశాలి భవన్లో పట్టణానికి చెందిన మహంకాళి సత్యనారాయణ, మహంకాళి ఎల్లప్ప, శ్రీనివాసులుతోపాటు మరో ఇద్దరు అక్కడే ప్రత్యేకంగా మగ్గం ఏర్పాటు చేసుకుని మల్లికార్జున స్వామికి పట్టువస్త్రాలు, భ్రమరాంబికదేవికి పట్టుచీరను తయారు చేశారు. ప్రతి సంవత్సరం అమరచింత పద్మశాలీలు తరతరాలుగా వస్తున్న ఆచారం ప్రకారం స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించి తమ మొక్కులు తీర్చుకుంటారు. ఇందులో భాగంగానే ఈ సంవత్సరం శివరాత్రికి పట్టువస్త్రాలను తయారు చేసి అప్పగించడం జరిగిందని వారు తెలిపారు. కార్యక్రమంలో శ్రీశైల క్షేత్రంలోని పద్మశాలి భవన్ అధ్యక్షుడు చిలువరి కాశీనాథ్ పాల్గొన్నారు. -
బాలబ్రహ్మేశ్వరుడికి నీరాజనం
అలంపూర్: దక్షిణకాశీ అలంపూర్ క్షేత్రం జనసంద్రంగా మారింది. ఉత్తరవాహిని తుంగభద్ర నదీ తీరాన వెలసిన అలంపూర్ క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. వేలాది మంది భక్తులు శ్రీబాలబ్రహ్మేశ్వరస్వామి, శ్రీజోగుళాంబ అమ్మవార్లను దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి లింగోద్భావాన కాలం వరకు భక్తుల అభిషేకాలతో బ్రహ్మేశ్వరస్వామి ఆలయం కిక్కిరిసింది. యాగశాలలో నిత్యహోమాలలో భాగమైన రుద్రహోమాలతోపాటు ఆవాహిత హోమాలు, త్రికాల సమయాలలో ఆలయం చుట్టూ బలిహరణలు నిర్వహించారు. స్వామివారికి అభిషేకాలు చేయడానికి భక్తులు బారులుతీరారు. పాపనాశిని, సంగమేశ్వర ఆలయాలను భక్తులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. జోగుళాంబ గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అలాగే పలువురు ప్రముఖులు ఆలయాలను దర్శించుకున్నారు. జాగరణకు ప్రత్యేక ఏర్పాట్లు.. మహాశివరాత్రిని పురస్కరించుకొని బాలబ్రహ్మేశ్వర, జోగుళాంబదేవి ఆలయం భక్తజనసంద్రంగా మారింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ముందుగా పుష్కర ఘాట్లో స్నానాలు ఆచరించారు. అనంతరం స్వామి, అమ్మవారి ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో క్యూలైన్లలో బారులుదీరి.. గంటల తరబడి నిరీక్షించారు. ఈ క్రమంలో పలు స్వచ్ఛంద సంస్థలు భక్తులకు మజ్జిగ, నీళ్ల బాటిల్స్, ప్రసాదం, అల్పాహారాలు, పండ్లు అందజేశారు. అలంపూర్ క్షేత్రంలో మహాశివరాత్రి జాగరణకు భక్తులు భారీగా తరలివచ్చారు. జాగరణకు వచ్చిన భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాత్రి మొత్తం భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలంపూర్లో పుష్కర ఘాట్లో మహాశివుడి విగ్రహానికి ప్రణమిల్లుతున్న భక్తులు అంగరంగ వైభవంగా మహాశివరాత్రి వేడుకలు అలంపూర్ క్షేత్రానికి భారీగా తరలొచ్చిన భక్తులు స్వామి, జోగుళాంబదేవిలకుప్రత్యేక పూజలు తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు కొనసాగిన అభిషేకాలు కిక్కిరిసిన రహదారులు.. అలంపూర్ క్షేత్ర రహదారులు మహాశివరాత్రి పర్వదినాన భక్తుల రాకపోకలతో కిక్కిరిశాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో క్షేత్రానికి చేరుకున్నారు. ఉదయం సాధారణంగా కనిపించిన భక్తుల రద్దీ.. ఆ తర్వాత గంట గంటకూ భారీ స్థాయిలో పెరిగింది. దీంతో అలంపూర్ చౌరస్తా నుంచి వాహనాలు బారులుదీరాయి. ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకొని పోలీసులు భక్తుల వాహనాలను పట్టణ ముఖద్వారం వద్దనే నిలిపివేశారు. ఫోర్ వీలర్స్, త్రీ వీలర్స్, ట్రావెల్స్ బస్సులను కోర్టు పక్కన ఉన్న ఖాళీ స్థలంలో నిలిపివేశారు. దీంతో భక్తులు అక్కడి నుంచి ఆలయాల వరకు కాలినడకన చేరుకున్నారు. వృద్ధులు, దివ్యాంగులను ఉచిత ఆటోల ద్వారా తరలించారు. -
ఎంఐఎం డీలా..
పాలమూరు: నూతనంగా ఏర్పాటైన మహబూబ్నగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన మజ్లిస్ పార్టీకి చేదు అనుభవం మిగిలింది. నగరంలో 60 డివిజన్లు ఉండగా 16 డివిజన్లలో మాత్రమే పోటీ చేసి కేవలం మూడు స్థానాలకే పరిమితం కావడంపై ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నాయి. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పార్టీకి సంబంధించిన అధినేతలు అసదుద్దీన్ ఓవైసీతో పాటు అక్బరుద్దీన్ ఓవైసీలతో ప్రచారసభలు ఏర్పాటు చేశారు. ఎంఐఎంకు పట్టున్న డివిజన్లలో ఇతర పార్టీలకు దీటుగా ప్రచారం చేసినా ఆశించిన ఫలితం రాలేదు. పలువురు తాజా మాజీ కార్పొరేటర్లు ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. 2020లో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో గెలుపొందారు. ఈ సారి ఒక స్థానం పడిపోయి మూడు స్థానాలకు పరిమితమయ్యారు. ప్రస్తుతం గెలుపొందిన వారిలో 50 డివిజన్ కార్పొరేటర్ అబ్దుల్ ముస్తాక్ రషీద్ వరుసగా మూడోసారి గెలిచారు. మిగిలిన 34వ డివిజన్, 14వ డివిజన్లో ఇద్దరూ కొత్తగా గెలుపొందారు. అయితే ఆరు డివిజన్లలో ఎంఐఎం రెండో స్థానాల్లో రావడం విశేషం. మూడు స్థానాలకే పరిమితమైన మజ్లిస్ పార్టీ -
కారు, బైక్ ఢీకొన్న ఘటనలో..
దోమలపెంట: బ్రహ్మగిరి అటవీ చెక్పోస్ట్ పరిధిలోని ఆక్టోపస్ ప్రాంతం వద్ద ఆదివారం కారు, బైక్ ఢీకొన్న ఘటనలో బైక్పై ఉన్న కృష్ణ(35) అనే వ్యక్తి మృతి చెందాడు. ఈగలపెంట ఎస్ఐ జయన్న తెలిపిన వివరాలు.. శ్రీశైలం నుంచి ఆమన్గల్కు వెళ్తున్న కారు సంగారెడ్డి నుంచి శ్రీశైలం వస్తున్న బైక్ను ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్పై ఉన్న కృష్ణకు తీవ్రగాయాలు కాగా అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. బైక్పై వెనుక కూర్చన్న మరో వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు. కారు అతివేగం, నిర్లక్ష్యంగా నడపడమే ప్రమాద కారణమని స్థానికులు పేర్కొన్నారు. -
మన్యంకొండలో శివరాత్రి వేడుకలు
మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి భక్తులు ఉపవాస దీక్షలతో మన్యంకొండకు చేరుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా దేవస్థానం ముందున్న కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకొన్నారు. అలాగే దేవస్థానం పక్కనున్న శివాలయంలో కూడా భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచే భక్తులు స్వామి దర్శనానికి బారులుతీరారు. కోనేరు నుంచి గర్భగుడి, అక్కడి నుంచి శివాలయం వరకు భక్తులు దైవదర్శనానికి క్యూలైన్లలో నిల్చున్నారు. కొంతమంది భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన దాసంగాలు.. తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శివరాత్రి సందర్భంగా ఆర్టీసీ మహబూబ్నగర్ నుంచి మన్యంకొండకు ప్రత్యేక బస్సులు నడిపింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మన్యంకొండలోని శివాలయంలో అర్చనలు, ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా శివాలయంలోని శివలింగాన్ని రకరకాల పూలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. దేవస్థానం వ్రత మండపంలో భక్తులు వ్రతాలు జరిపించారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందాచారి, పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. -
పాలమూరుపై పీఠ‘ముడి’!
చివరలో తెరపైకి కొత్త పేరు.. ● నియోజకవర్గ నేత, ఆయన వర్గం ప్రతిపాదన? ● విభేదించిన పలువురు నాయకులు.. పార్టీలో చీలిక ● నగరంలో వైరల్గా మారిన క్యాంప్ రాజకీయాలు ● రంగంలోకి ‘పెద్ద’ నేతలు.. మంత్రులకు బాధ్యతలు ● ప్రమాణ స్వీకార సమయంలోనే తేలనున్న మేయర్ అభ్యర్థిత్వం సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యతను సాధించింది. మ్యాజిక్ ఫిగర్కు కేవలం రెండడుగుల దూరంలో ఉన్నా.. ఎంఐఎం, స్వతంత్రుల మద్దతుతో హస్తానికి పీఠం దక్కేది ఖాయమైంది. మేయర్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కాగా.. తొలి పదవిని ఎవరిని వరిస్తుందనేది ఆసక్తిగా మారింది. ఈ పదవిపై 49వ డివిజన్ నుంచి గెలుపొందిన ప్రసన్న ఆనంద్ గౌడ్తో పాటు ఎన్పీ వెంకటేష్ కూతురు ఎన్పీ నేహా, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ భార్య స్వప్న ఆశలు పెట్టుకున్నారు. ప్రధాన పోటీదారులుగా ఉన్న నేహా, స్వప్న ఓటమి పాలు కావడంతో ప్రసన్నకే పదవి దక్కనుందనే ప్రచారం జోరుగా సాగింది. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం గెలిచిన అభ్యర్థులతో నేతలు చీరాల, విజయవాడ క్యాంప్నకు తరలివెళ్లారు. ప్రమాణ స్వీకారానికి ఒక రోజు ముందు ఆదివారం క్యాంప్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు పాలమూరులో హీట్ తెప్పించాయి. ఆదివారం అలజడి.. క్యాంప్లో ఉన్న కార్పొరేటర్ అభ్యర్థులతో మహబూబ్నగర్ నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మేయర్ పదవికి ఎవరైతే బాగుంటుంది.. మీరు ఎవరిని కోరుకుంటున్నారంటూ కార్పొరేటర్లుగా గెలుపొందిన వారిని ఒక్కొక్కరిని గదిలోకి పిలిపించుకుని అభిప్రాయాలు సేకరించారు. ఈ క్రమంలో ముఖ్యనేతతో పాటు ఆయన వర్గం కాంగ్రెస్ నాయకుడైన మైనార్టీవర్గానికి చెందిన సిరాజ్ఖాద్రీ భార్య 39వ డివిజన్లో గెలుపొందిన హజీరాబేగం పేరును ప్రతిపాదించినట్లు సమాచారం. అభిప్రాయ సేకరణ అనంతరం అందరూ ఆ మైనార్టీ నాయకుడి భార్యనే ప్రతిపాదించారంటూ రాష్ట్రస్థాయిలో పెద్ద నేతకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఈ విషయం ఒయటకు పొక్కడంతో క్యాంప్లో అలజడి చెలరేగినట్లు సమాచారం. ముందు రోజే ప్రతిపాదన.. చీలిన నేతలు సిరాజ్ఖాద్రీ భార్యకు మేయర్ పదవి అంశాన్ని జిల్లాలో పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించే ఓ నాయకుడు, ఓ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న మైనార్టీ నేత వద్ద నియోజకవర్గ ముఖ్యనేత, ఆయన వర్గం శనివారమే ప్రస్తావించినట్లు సమాచారం. ఇరువురు నాయకుల మధ్య సంభాషణ కొనసాగుతుండగానే ఒకానొక దశలో మేయర్ పదవికి 40వ డివిజన్ నుంచి తొలిసారిగా కార్పొరేటర్గా ఎన్నికై న సీబీ పూజిత పేరు సైతం వచ్చినట్లు వినికిడి. ఈ ప్రతిపాదనలను తోసిపుచ్చిన వారు.. తొలి కార్పొరేషన్లో పట్టు ఉన్న వ్యక్తికే పదవి ఇస్తే బాగుంటుందని.. అనుభవం చాలా ముఖ్యమని.. తొలిసారే కార్పొరేటర్గా గెలిచిన వారికి ఇవ్వడం సరికాదని వారించినట్లు తెలిసింది. అయినా ముఖ్యనేత వర్గం పట్టు వీడకపోవడంతో అదే రోజు రాత్రి మహబూబ్నగర్కు పయనమైనట్లు సమాచారం. హైదరాబాద్, ఢిల్లీ టు మంత్రులు మేయర్ పదవిపై చోటుచేసుకున్న రాజకీయాలు పార్టీ నేతల మధ్య చీలికకు కారణం కాగా.. తొలుత హైదరాబాద్లోని ఆ పార్టీకి చెందిన ఇద్దరు పెద్దల వద్దకు చేరినట్లు తెలిసింది. ఆ తర్వాత ఢిల్లీకి చేరగా.. సమష్టి నిర్ణయంతో ముందుకు సాగాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు మేయర్ పదవి ఎంపిక బాధ్యతను ఉమ్మడి జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో పాటు జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సంహికు అప్పగించినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఆదివారం సాయంత్రం చీరాల క్యాంప్ నుంచి కార్పొరేటర్లతో కలిసి నేతలు హైదరాబాద్కు బయల్దేరారు. అదేవిధంగా అర్ధంతరంగా క్యాంప్ నుంచి తిరిగి మహబూబ్నగర్కు చేరుకున్న నేతలు సైతం పట్నం బాట పట్టారు. సోమవారం ప్రమాణ స్వీకార సమయం వరకు వీరందరూ మహబూబ్నగర్కు చేరుకోనున్నారు. మేయర్ పీఠంపై క్యాంప్లో చోటుచేసుకున్న రాజకీయాలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నగరంలో ఆయా సామాజిక వర్గాల మధ్య చాటింగ్ల యుద్ధం కొనసాగింది. పలు సంఘాల నేతలు ముఖ్యనేత, ఆయన వర్గం తీరును దుయ్యబట్టారు. ఈ క్రమంలో ఈ లొల్లి హైదరాబాద్, ఢిల్లీలోని పార్టీ పెద్దల వరకు వెళ్లినట్లు సమాచారం. దీంతో కొందరు కీలక నేతలు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలిసింది. క్యాంప్ నుంచి హైదరాబాద్కు బయలుదేరే ముందు నియోజకవర్గ ముఖ్యనేత మాట్లాడుతూ పార్టీ అధిష్టానం చేతుల్లోకి వెళ్లిందని.. తన చేతిలో ఏమీ లేదని.. పార్టీ నిర్ణయమే ఫైనల్ అని వెళ్లిపోయినట్లు సమాచారం. దీంతో ఆ ముఖ్యనేత వర్గంలో నిరాశ అలుముకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు డిప్యూటీ చైర్మన్గా 11వ డివిజన్ నుంచి గెలుపొందిన ఎం.సురేందర్రెడ్డి ఖాయమై నట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతుండగా.. ఈ పదవిని మైనార్టీ ముస్లిం వర్గానికి ఇవ్వాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. మొత్తానికి ఈ ఎపిసోడ్ హైదరాబాద్కు మారగా కాగా.. సోమవారం ప్రమాణ స్వీకార సమయంలోనే మేయర్ అభ్యర్థిపై స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. -
నేడే.. పురస్కారం
మహబూబ్నగర్మున్సిపాలిటీల్లో కొలువుదీరనున్న నూతన పాలకవర్గాలు ● ఉమ్మడి జిల్లాలో ఒక కార్పొరేషన్, 18 పురపాలికల్లో ఏర్పాట్లు ● వడ్డేపల్లితో కలిపి కాంగ్రెస్కు మొత్తంగా 12 చోట్ల స్పష్టమైన ఆధిక్యం ● మహబూబ్నగర్, దేవరకద్ర కూడా వారి ఖాతాలోనే.. ● గద్వాలలో సైతం హస్తానికే అవకాశం ● నారాయణపేటలో బీజేపీకే మొగ్గుచూపుతున్న పరిస్థితులు ● అయిజతోపాటు అలంపూర్లో బీఆర్ఎస్కు లైన్క్లియర్ ● అమరచింతలో బీఆర్ఎస్, బీజేపీ కూటమికే.. సోమవారం శ్రీ 16 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి పాలమూరు ఎన్నికలు జరిగిన ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీల్లో నూతన పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. ఆయా పురపాలికల్లో సోమవారం నిర్వహించే కొత్త పాలక మండళ్ల సమావేశానికి ఆయా జిల్లాల అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 11 గంటలకు ఎన్నికై న కార్పొరేటర్లు/కౌన్సిలర్లతో ప్రత్యేకాధికారి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం 12.30 గంటలకు పరోక్ష పద్ధతిలో మహబూబ్నగర్ బల్దియాలో మేయర్, డిప్యూటీ మేయర్.. మున్సిపాలిటీల్లో చైర్మన్/ చైర్పర్సన్, డిప్యూటీ చైర్మన్/డిప్యూటీ చైర్పర్సన్లను ఎన్నుకోనున్నారు. భూత్పూర్, కొత్తకోట, వనపర్తి, పెబ్బేరు, ఆత్మకూరు, నాగర్కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి, మక్తల్, కోస్గి, మద్దూర్తో కాంగ్రెస్కు స్పష్టమైన ఆధిక్యత వచ్చింది. వడ్డేపల్లిలో ఏఐఎఫ్బీ మ్యాజిక్ ఫిగర్ను సాధించగా.. గెలుపొందిన ఎనిమిది మంది చేయి అందుకున్నారు. మ్యాజిక్ ఫిగర్కు ఒకటి, రెండు అడుగుల దూరంలో ఉన్న దేవరకద్ర మున్సిపాలిటీ, మహబూబ్నగర్ కార్పొరేషన్లో పీఠం హస్తానికి దక్కడం ఖాయమైంది. ఇప్పటివరకు మొత్తంగా 14 పురపాలికల్లో ఆ పార్టీ పాగా వేయనుంది. -
మేయర్ ఎన్నికకు పటిష్ట భద్రత
మహబూబ్నగర్ క్రైం: మహబూబ్నగర్ కార్పొరేషన్లో సోమవారం నూతన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా ఆదివారం ఎస్పీ జానకి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్పొరేషన్ కార్యాలయం లోపల, బయట పోలీస్ పరంగా తీసుకోవాల్సిన అంశాలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ మార్గంలో పూర్తిగా ట్రాఫిక్ చర్యలు తీసుకోవాలని, ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల దాకా క్లాక్టవర్, అశోక్టాకీస్ చౌరస్తా వరకు రాకపోకలపై తాత్కాలికంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించించాలని సూచించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు అధికంగా హాజరయ్యే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ రద్దీ నివారించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అత్యవసర సేవల వాహనాలకు అనుమతి ఇవ్వబడుతుందని, ఇతర వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. నగర ప్రజలు, అన్ని రకాల వాహనదారులు పోలీసులకు సహకరించాలని కోరారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐలు ఇజాజుద్దీన్, అప్పయ్య, గాంధీనాయక్, ఎస్ఐ శీనయ్య పాల్గొన్నారు. -
సీఎంను కలిసిన వడ్డేపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు
అలంపూర్: జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు శనివారం రాత్రి హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిశారు. వడ్డేపల్లి పురపాలిక ఎన్నికల్లో వడ్డేపల్లి శ్రీనివాసులు వర్గానికి చెందిన ఆల్ ఇండియా ఫార్వర్డుబ్లాక్ పార్టీ నుంచి ఎనిమిది మంది పోటీ చేసి కౌన్సిలర్లుగా విజయం సాధించారు. మున్సిపాలిటీలో ఉన్న 10 వార్డులు ఉండడంతో 8 స్థానాలతో చైర్మన్ పీఠాన్ని ఆల్ ఇండియా ఫార్వార్డు బ్లాక్ పార్టీ దక్కించుకోనుంది. చైర్మన్ ఎన్నిక ఈ నెల 16న జరగనున్న నేపథ్యంలో... హైదరాబాద్లోని సీఎం నివాసంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ సంపత్కుమార్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలిశారు. -
అక్కమహాదేవి గుహల అభివృద్ధికి కృషి
కొల్లాపూర్ రూరల్: మండలంలోని సోమశిల పరిధిలో అక్కమహాదేవి గుహలను జిల్లా పర్యాటక శాఖ అధికారి నర్సింహ శివస్వాములతో కలిసి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమశిల నుంచి కృష్ణానదిలో లాంచీలో 20 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే అక్కమహాదేవి గుహలు వస్తాయన్నారు. 14వ శతాబ్దం నాటి ఈ గుహలు ఎంతో ప్రాచుర్యం చెందాయన్నారు. ఈ గుహలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక దృష్టిపెట్టడం జరిగిందన్నారు. నల్లమల ప్రాంతంలో పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈగలపెంట నుంచి అక్కమహాదేవి గుహలకు ప్రత్యేక బోటు ఏర్పాటు చేశామ న్నారు. ఈ బోటు సదుపాయం ఏడాది మొత్తం ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని, ఒకరికి టికెట్ రూ.600 నిర్ణయించడం జరిగిందన్నారు. పర్యాటకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
హోరాహోరీగా ఎస్జీఎఫ్ క్రికెట్ టోర్నీ
జడ్చర్ల టౌన్: బాదేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, స్వామి నారాయణ గురుకుల మైదానాల్లో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండర్–17 బాలుర క్రికెట్ టోర్నీలో మహబూబ్నగర్, ఖమ్మం జట్లు సెమీస్కు చేరాయి. హోరాహోరీగా కొనసాగుతున్న టోర్నీలో ఉమ్మడి పది జిల్లాల జట్లు తలపడుతుండగా.. ఆతిథ్య మహబూబ్నగర్ జట్టు ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ విజయం సాధించి సెమీస్కు చేరింది. శనివారం జరిగిన లీగ్మ్యాచ్లో మెదక్ – హైదరాబాద్ జట్లు తలపడగా.. హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. నల్లగొండ – రంగారెడ్డి జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో నల్లగొండ 26 పరుగుల తేడాతో గెలిచింది. హైదరాబాద్ – వరంగల్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆదిలాబాద్ – నిజామాబాద్ జట్ల మధ్య జరిగిన పోటీలో నిజామాబాద్ 39 పరుగుల తేడాతో గెలుపొందింది. ఖమ్మం– నిజామాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఖమ్మం 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ● స్వామినారాయణ గురుకుల మైదానంలో ఉదయం ఆతిథ్య మహబూబ్నగర్ – కరీంనగర్ జట్లు పోటీపడ్డాయి. మహబూబ్నగర్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 12 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 98 పరుగులు సాధించింది. జట్టులో హర్షిత్ 22 బంతుల్లో 35 పరుగులు చేయగా.. కరీంనగర్ జట్టులో రిషిత్, విశ్వతేజ చెరో రెండు వికెట్లు తీశారు. ఆ తర్వాత 99 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన కరీంనగర్ జట్టు.. 12 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 80 పరుగులు మాత్రమే చేయగలిగింది. మహబూబ్నగర్ జట్టులో అభినవ్, దేవేందర్ చెరో మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. సాయంత్రం ఆదిలాబాద్తో జరిగిన మరో మ్యాచ్లోనూ మహబూబ్నగర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 12 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 116 పరుగులు సాధించింది. హర్షిత్ 30 బాల్స్లో 55 పరుగులు చేయగా.. రామాచారి 27 బంతుల్లో 51 పరుగులు చేసి జట్టు భారీ స్కోరులో కీలక పాత్ర పోషించారు. ఇరువురు అర్ధసెంచరీలతో స్కోరు బోర్డును పరుగెత్తించారు. తర్వాత 117 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ఆదిలాబాద్ జట్టు.. తడబడుతూ ఆడింది. నిర్ణీత 12 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 70 పరుగులు మాత్రమే చేయగలిగింది. జట్టులో హోమేస్ 14 పరుగులు చేయగా.. బౌలింగ్లో అభినవ్, వంశీ, చరణ్ తలా ఒక వికెట్ తీశారు. సెమీస్కు చేరిన మహబూబ్నగర్, ఖమ్మం జట్లు -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం
● ఊర్కొండ మండలం తిమ్మన్నపల్లి వద్ద ఘటన ● మృతులు కర్ణాటకకు చెందిన వారిగా గుర్తింపు సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలోని ఊర్కొండ మండలం తిమ్మనపల్లి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. వివరాలిలా.. కర్ణాటక రాష్ట్రం విజయపురి జిల్లా కలకేరి మండలం తాళికోట ప్రాంతం నుంచి రెండు క్రూయిజర్లలో సుమారు 20 మంది శ్రీశైలం దైవదర్శనానికి బయలుదేరారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఊర్కొండ మండలంలోని తిమ్మన్నపల్లి వద్ద జడ్చర్ల– కోదాడ జాతీయ రహదారి–167పై ఓ క్రూయిజర్ వేగంగా కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాంరెడ్డి(52), ఆయన భార్య మేఘన(45), మహాదేవి(55) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. రాత్రి గస్తీలో ఉన్న మండల పోలీసులు గమనించి ఓ లారీ డ్రైవర్ సహాయంతో వాహనంలో ఇరుక్కున్న వారి మృతదేహాలు, క్షతగాత్రులను బయటికి తీశారు. అనంతరం క్షతగాత్రులను వెల్దండలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కృష్ణదేవ తెలిపారు. తల్లి, ఇద్దరు పిల్లలు మిస్సింగ్.. కేసు నమోదు గోపాల్పేట: వివాహిత, ఇద్దరు పిల్లలు మిస్సింగ్ కాగా ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై జగన్మోహన్ తెలిపారు. ఆయన వివరాల మేరకు.. మండలకేంద్రానికి చెందిన ఈశ్వరమ్మకు ఇద్దరు కుమారులు ఒకకూతురు యాదమ్మ ఉండగా ఆరేళ్లక్రితం యాదమ్మకు పెద్దకొత్తపల్లికి చెందిన రామకృష్ణతో పెళ్లిచేశారు. వీరికి పాప, బాబు ఉన్నారు. 20రోజుల క్రితం బోనాలపండుగ కోసం ఈశ్వరమ్మ తన కూ తురు యాదమ్మ, ఐదేళ్ల మనుమరాలు మనీషా, మూడేళ్ల మనుమడు కన్నయ్యను పెద్దకొత్తపల్లి నుంచి గోపాల్పేటకు తీసుకువచ్చింది. ఆ తర్వాత ఈ నెల ఏడున తి రిగి తన అత్త గారింటికి వెళ్తున్నాను చెప్పి వెళ్లింది. ఇప్పటివరకు అత్తవారింటికి వెళ్లలేదు. బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. శనివారం ఈశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై వివరించారు. -
‘మహా’వేడుకకు ముస్తాబు
అచ్చంపేట: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలోని శైవక్షేత్రాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. భక్తుల సందడితో నల్లమలలోని శివాలయాలు కిటకిటలాడుతున్నాయి. హరహర మహాదేవ శంభోశంకర అంటూ పరమశివుడిని కీర్తిస్తూ తరలివస్తున్నారు. సదాశివుడికి ఇష్టమైన మహాశివరాత్రి పండుగ ఈనెల15న ఆదివారం కావడంతో వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఆలయాలను విద్యుద్దీపాలతో అలంకరించడంతోపాటు దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. తేజోలింగ రూపంలో దర్శనం మహాశివరాత్రి నాటి రాత్రి పరమశివుడు కమలనాభ, కమలగర్భులిరువురికీ తేజోలింగరూపంలో దర్శనమిచ్చాడని లింగ, కూర్మ, శివ పురాణాల్లో ఉంది. మహాశివరాత్రి గురించి మరో అంశం కూడా ఉంది. దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మధిస్తున్నప్పడు వచ్చిన గరళాన్ని పరమశివుడు మింగి సకలలోకాలకు శుభాన్ని కలిగించిన మాఘ బహుళ చతుర్థశినే మహాశివరాత్రిగా ఆచరిస్తున్నాం. శివుడికి ప్రీతిపదమైన ఆదివారం మహాశివరాత్రి పర్వదినాని రాత్రి 10గంటల నుంచి 11మంది రుత్వికులు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని, లింగోద్భవకాల అభిషేకాన్ని పరమాద్భుతంగా నిర్వహిస్తారు. ఆ సమయంలో అర్చకులు, వేదపండితులు మినహా మరెవరినీ గర్భాలయంలోకి అనుమతించరు. క్షేత్రంలో వెలిసిన ఉమామహేశ్వరుడు సోమేశ్వరాలయం ముస్తాబు కొల్లాపూర్రూరల్: కొల్లాపూర్ మండలం సోమశిలలో వెలిసిన లలితాంబికా సోమేశ్వరాయలం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయాన్ని ముస్తాబు చేశారు. ఈ సందర్భంగా ఆలయాన్ని అందంగా తయారు చేశారు. ఈనెల 15నుంచి 19వరకు వేదపండితులు పలు పూజాకై ంకర్యాలునిర్వహించనున్నారు. మహాశివరాత్రి సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అన్నిఏర్పాట్లు చేసినట్లుగా నిర్వాహకులు తెలిపారు. కృష్ణానది బ్యాక్వాటర్లో సప్తనదులు కలవడంతోపాటు ఆలయంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు, లలితాంబిక అమ్మవారు ఉండడంతో భక్తులు అధికసంఖ్యలో వస్తారని నిర్వాహకులు తెలిపారు. 15న శివరాత్రి సందర్భంగా ఉదయం నుంచి సాయంకాలం వరకు భక్తులకు దర్శనాలు ఉంటాయని, 9గంటలకు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 16న ఉదయం శివపార్వతులకు కల్యాణోత్సవం, సాయంత్రం రథోత్సవం, 19న స్వామివారికి మంగళహారతి నిర్వహిస్తారు. సోమశిలకు వచ్చే భక్తులకు కొల్లాపూర్, వనపర్తి, నాగర్కర్నూల్ ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఉంటుదని తెలిపారు. నల్లమలలోని శైవక్షేత్రాలకు భక్తుల తాకిడి ఆలయాల్లో మార్మోగుతున్న శివనామస్మరణ విద్యుద్దీపాలంకరణలో సర్వాంగ సుందరంగా.. -
భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు
స్టేషన్ మహబూబ్నగర్: మహాశివరాత్రిని పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం శ్రీశైలం క్షేత్రానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్కుమార్ అన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుంచి శ్రీశైలంకు వెళ్లే ప్రత్యేక బస్సును శనివారం ఆర్ఎం ప్రారంభించారు. రీజియన్లోని అన్ని డిపోల నుంచి శ్రీఽశైలంకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. రద్దీ దృష్ట్యా మరిన్ని నడుపడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్ లక్ష్మిధర్మ, డిపో మేనేజర్ అశోక్కుమార్, అసిస్టెంట్ మేనేజర్ కవిత, జయరాం, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. -
దేవుడి సొమ్ముపై తేలని ‘అవినీతి’ లెక్క
● దేవదాయశాఖ కమిషనర్కుఫిర్యాదు చేయాలని నిర్ణయం ● శివరాత్రి తర్వాత టెండర్ల ఖరారు అడ్డాకుల: మండలంలోని కందూర్ సమీపంలో వెలిసిన శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయానికి సంబంధించిన దేవుడి సొమ్ము స్వాహాపై శనివారం సాయంత్రం మొదలైన చర్చ రాత్రి వరకు కొనసాగింది. స్వామివారి సొమ్మును పక్కదారి పట్టించిన అంశంపై దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ మదనేశ్వర్రెడ్డి సమక్షంలో గ్రామస్తులు ఆలయంలో శనివారం చర్చించారు. దేవుడి సొమ్ముకు సంబంధించిన నిధుల లెక్క తేల్చాలని గ్రామస్తులు పట్టుబట్టారు. టెండరుదారుడు మురళిని గ్రామస్తుల సమక్షంలో అసిస్టెంట్ కమిషనర్ విచారించారు. ఎప్పుడెప్పుడు డబ్బులు ఇచ్చారని, డబ్బులు ఇచ్చినప్పుడు రసీదులు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. తర్వాత అక్కడికి చేరుకున్న ఈఓ రాజేశ్వరశర్మపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు పక్కదారి పట్టించిన విషయంపై లెక్క చూపాలని నిలదీశారు. దీనికి ఈఓ సరైన సమాధానం చెప్పలేకపోయారు. దీంతో అధికారులు, గ్రామస్తుల మధ్య కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. చివరివరకు అవినీతి లెక్క తేలకపోవడంతో దీనిపై దేవదాయశాఖ కమిషనర్, కలెక్టర్, ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయాలని గ్రామస్తులు నిర్ణయించారు. శివరాత్రి ఉత్సవాలు జరిగిన తర్వాత బ్రహోత్సవాల టెండర్ల నిర్వాహణపై నిర్ణయం తీసుకోవాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. ప్రస్తుతం కొత్తగా ఎవరికీ ఆలయం ఇన్చార్జి బాధ్యతలు ఇవ్వవద్దని గ్రామస్తులు డిమాండ్ చేశారు. అసిస్టెంట్ కమిషనర్ మదనేశ్వర్రెడ్డినే స్వామివారి బ్రహోత్సవాలు ముగిసే వరకు ఇన్చార్జిగా ఉండాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఉన్నతాధికారులు తీసుకునే నిర్ణయం మేరకు తాను పనిచేస్తానని ఆయన బదులిచ్చారు. మొత్తంగా ఆలయంలో స్వామివారి నిధుల గోల్మాల్కు సంబంధించిన వ్యవహారంపై రాత్రి వరకు జరిగిన చర్చలో ఎలాంటి క్లారిటీ రాలేదు. నిధుల స్వాహాపై ఫిర్యాదు చేయాలని మాత్రమే నిర్ణయం తీసుకున్నారు. దేవుడి సొమ్ము స్వాహా చేసినదానిపై లెక్క తేల్చడానికి అధికారులు ఇంకా మీనమేశాలు లెక్కించడం విమర్శలకు దారి తీస్తోంది. ఇదిలా ఉండగా దేవుడికి దాతలు ఇచ్చిన వెండి వస్తువులను కూడా మాయం చేశారేమోనని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో లాకర్లో ఉన్న వెండి వస్తువులను అధికారులు తీసుకొచ్చి గ్రామస్తులకు చూపించారు. -
పాలమూరు టు ఏపీ
కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ కౌన్సిలర్ ● క్యాంప్ రాజకీయాలకు తెరలేపిన అధికార పార్టీ ● కార్పొరేటర్లను రెండు బస్సుల్లో విజయవాడ, చీరాలకు తరలింపు పాలమూరు: మహబూబ్నగర్ కార్పొరేషన్లో శిబిర రాజకీయాలు మొదలయ్యాయి. అధికార పార్టీ నుంచి కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందిన 29 మంది అభ్యర్థులతో పాటు నలుగురు స్వతంత్రులను శిబిరాలకు తరలించారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి రెండు బస్సులతో పాటు కొన్ని కార్లలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డితో పాటు డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, నాయకులు వినోద్కుమార్, ఎన్పీ వెంకటేష్, లక్ష్మణ్యాదవ్, ఆనంద్గౌడ్, మల్లు నర్సింహారెడ్డి, కార్పొరేటర్లలో ప్రధానంగా సురేందర్రెడ్డి, సిరాజ్ఖాద్రీ తదితరులు వెళ్లారు. విజయవాడతో పాటు గుంటూరు సమీపంలో ఉన్న చీరాల దగ్గర ప్రత్యేక హోటల్కు రాత్రి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఆదివారం అల్పహారం తర్వాత నూతన కార్పొరేటర్లతో ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు భేటీ కానున్నట్లు సమాచారం. గెలుపొందిన తర్వాత మేయర్ పీఠం కోసం అభ్యర్థులు వేరు కుంపటి పెట్టుకోకుండా శిబిర రాజకీయాలకు తెరలేపారు. ఈ బృందం మొత్తం ఈనెల 16న నిర్వహించే మేయర్ ఎన్నిక సందర్భంగా అదే రోజు ఉదయం 11 గంటలకు నేరుగా మహబూబ్నగర్ కార్పొరేషన్ కార్యాలయానికి రానున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ కార్పొరేటర్లు సైతం క్యాంప్నకు.. బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన 15 మంది కార్పొరేటర్లను శనివారం ఉదయం మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ క్యాంపు కార్యాలయంలో సన్మానించారు. ఆ తర్వాత వారిని కూడా క్యాంపు శిబిరాలకు తరలించినట్లు సమాచారం. బీజేపీ నుంచి గెలుపొందిన 8 మంది కార్పొరేట్ అభ్యర్థులను పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. వారందరూ ఇక్కడే నగరంలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఎంఐఎం నుంచి గెలుపొందిన ముగ్గురు అభ్యర్థులు సైతం స్థానికంగానే ఉన్నారని సమాచారం. దేవరకద్ర: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడి రెండు రోజులు గడవకముందే కౌన్సిలర్లు పార్టీ కండువాలు మారుస్తున్నారు. దేవరకద్ర 12వ వార్డు నుంచి అధిక మెజార్టీతో గెలుపొందిన బీఆర్ఎస్ కౌన్సిలర్ యుగంధర్రెడ్డి శనివారం హస్తం గూటికి చేరగా.. ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు. మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా.. కాంగ్రెస్ 6 వార్డుల్లో గెలుపొందింది. బీఆర్ఎస్ 4, బీజేపీ 1, స్వతంత్ర అభ్యర్థి 1 స్థానంలో గెలిచారు. స్వతంత్ర అభ్యర్థి అరుణ చంద్రమౌళి కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ బలం 7కు చేరింది. ఇప్పుడు బీఆర్ఎస్ కౌన్సిలర్ చేరడంతో మెజార్టీ 8కి చేరింది. మరో ఇద్దరు కౌన్సిలర్లు కూడా హస్తం గూటికి చేరేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. -
ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు
● అలంపూర్లో ప్రారంభమైనబ్రహ్మోత్సవాలు ● తొలిరోజు ఆలయాల్లో ప్రత్యేక పూజలు అలంపూర్: అలంపూర్లో వెలసిన బాలబ్రహ్మేశ్వరస్వామి క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో తొలిరోజు శనివారం బాలబ్రహ్మేశ్వరస్వామి, జోగుళాంబ అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈఓ దీప్తి ధ్వజ మండపం వద్ద గోపూజలు చేశారు. అనంతరం అమ్మవారికి మంగళద్రవ్యాలు, పట్టువస్త్రాలను సమర్పించారు. యాగశాలలో గణపతి పూజ, పుణ్యాహవచన, కంకణధారణ, ఋత్విక్ వరణ వంటి ఆరంభ పూజలు జరిపించారు. నవగ్రహ, క్షేత్రపాలక, చతుషష్టియోగిని, వాస్తు, సర్వతో భద్రభద్ర మండపం, ద్వాదశలింగతో భద్రమండపాలను ఆవాహన చేసి ఆయా దేవతలను మంత్ర పూర్వకంగా ఆహ్వానించి ప్రాణప్రతిష్ఠ చేశారు. బాలబ్రహ్మేశ్వర ఉద్యానవనంలో పుట్టమట్టిని తీసుకొచ్చి ప్రదక్షిణలు చేశారు. ఘనంగా ధ్వజారోహణం బాలబ్రహ్మేశ్వరస్వామి వారి ఆలయంలో ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం నిర్వహించడం ఆనవాయితీగా ఉంటుందని అర్చక స్వాములు తెలిపారు. ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉత్సవాలకు ముస్తాబు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మహన్యాస, ఏకాదశ రుద్రపారాయణ, లింగోద్భవ కాలంలో విశేష అభిషేకాలు జరుగనున్నాయి. తెల్లవారు జామున ఆది దంపతుల కల్యాణం వైభవంగా నిర్వహిస్తారు. జాగరణకు వచ్చే భక్తుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈఓ తెలిపారు. -
53వ డివిజన్పై హై‘డ్రామా’
● ఒక్క ఓటుతో గెలుపొందిన బీజేపీ అభ్యర్థి రమేష్కుమార్ ● అర్ధరాత్రి దాటిన తర్వాతఫలితం ప్రకటన పాలమూరు: మహబూబ్నగర్ కార్పొరేషన్లో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ సొంతం చేసుకుంది. మొత్తం 60డివిజన్లలో కాంగ్రెస్ 29, బీఆర్ఎస్ 15, బీజేపీ 8, ఎంఐఎం ముగ్గురు, స్వతంత్రులు ఐదుగురు గెలుపొందారు. అయితే 53వ డివిజన్ ఫలితాలపై అర్ధరాత్రి వరకు హైడ్రామా సాగింది. మొదటి కౌంటింగ్లో కాంగ్రెస్ అభ్యర్థి రాఘవేందర్కు 816, బీజేపీ అభ్యర్థి రమేష్కుమార్కు 815 ఓట్లు వచ్చాయి. దీంతో బీజేపీ రీకౌంటింగ్ కోరడంతో అధికారులు మళ్లీ లెక్కింపు నిర్వహించారు. దీంట్లో కాంగ్రెస్ అభ్యర్థి రెండు ఓట్లు పెరిగి 818కి, బీజేపీ అభ్యర్థికి నాలుగు ఓట్లు పెరగడంతో 819కి చేరింది. దీంతో బీజేపీ అభ్యర్థి ఒక్క ఓటు ఆధిక్యం సాధించాడు. మూడోసారి జరిగిన రీకౌంటింగ్లో కాంగ్రెస్కు 818, బీజేపీ 819 ఓట్లు రావడంతో.. ఒక్క ఓటుతో బీజేపీ అభ్యర్థి రమేష్కుమార్ను గెలుపొందినట్లు కమిషనర్ రామానుంజులరెడ్డి వెల్లడించారు. అర్ధరాత్రి 2 గంటల తర్వాతనే రమేష్ గెలుపొందినట్లు ప్రకటించారు. నలుగురు వెయ్యి ఓట్లకు పైగా.. ఎనిమిది మంది 25 ఓట్ల లోపే.. మహబూబ్నగర్ కార్పొరేషన్లో ఉన్న 59 డివిజన్లలో పోలింగ్ జరగగా.. నలుగురు అభ్యర్థులు వెయ్యికి పైగా ఓట్లతో విజయం సాధించారు. అత్యధికంగా 13వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి షేబానా బేగం మోసిన్ 1,152 ఓట్లతో విజయం సాధించగా.. 23వ డివిజన్లో కాంగ్రెస్అభ్యర్థి బీసం వరలక్ష్మీ 1,138 ఓట్లతో, 27వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి అతీర్ హాబీబా ఫయాజ్ 1,109 ఓట్లతో, 8వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి సరస్వతి 1,023 ఓట్లతో విజయం సాధించారు. ● ఇక అత్యల్ప మెజార్టీ విషయానికి వస్తే 53వ వార్డులో రమేష్ ఒక్క ఓటుతో విజయం సాధించగా.. 12వ డివిజన్లో స్వతంత్ర అభ్యర్థి రఘుపై బీఆర్ఎస్ అభ్యర్థి కుర్వ సత్యం 8 ఓట్ల తేడాతో గెలుపొందాడు. 9వ డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థి హైందవి 14ఓట్లతో, 56వ డివిజన్లో బీజేపీ అభ్యర్థి సువర్ణ 17 ఓట్లతో 35వ డివిజన్లో స్వతంత్ర అభ్యర్థి షబీనా బేగం 20 ఓట్లతో, 40వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి సీబీ పూజిత 20 ఓట్లతో, 44వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి విఠల్రెడ్డి 22 ఓట్లతో, 28వ డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థి నస్రీన్ 22 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రమేష్కుమార్ -
ఎక్స్ అఫీషియో.. ప్రభావమెంత?
గద్వాల: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎక్స్ అఫీషియో ఓట్లపైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. ఎక్స్ అఫీషియో ఓట్లకు సంబంధం ఏమిటి అనుకుంటున్నారా..? అయితే ఒకసారి ఇటువైపు చూడండి. ఉమ్మడి పాలమూరులోని గద్వాల, నారాయణపేట, అమరచింత, అలంపూర్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఆయా మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవాలంటే ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకం కానున్నాయి. సంపూర్ణ మెజారీటి లేకపోతే.. మున్సిపాలిటీలో ప్రజల ఓట్లతో గెలుపొందిన కౌన్సిలర్లు తమ వర్గానికి చెందిన ఒకరిని చైర్మన్ లేదా చైర్పర్సన్గా ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే సంపూర్ణ మెజార్టీ లేనప్పుడు ఆయా మున్సిపాలిటీ పరిధిలో ఎక్స్అఫీషియో ఓటు కీలకంగా మారుతుంది. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యుడు, రాజ్యాంగబద్ధ కమిటీకి చైర్మన్ ఇలా ఎవరైనా సరే వారి మున్సిపాలిటీ పరిధిలో రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును వినియోగించుకునే వీలుంటుంది. దీనినే ఎక్స్ అఫీషియో ఓట్లుగా పరిగణిస్తారు. గద్వాల, పేట, అమరచింత, పెబ్బేరు, అలంపూర్లో కీలకం ఎన్నికల సంఘం నూతన నిబంధనలతో తప్పని ఇబ్బందులు దీని ఆధారంగానే సుప్రీంను ఆశ్రయించనున్న బీఆర్ఎస్? -
చెల్లని ఓట్లతో చిక్కులు
ఉమ్మడి జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో అధిక సంఖ్యలో ఓట్ల తిరస్కరణ సాక్షి, నాగర్కర్నూల్: ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు మిగతా మున్సిపాలిటీల్లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో పలుచోట్ల పెద్దసంఖ్యలో ఓట్లు తిరస్కరణకు గురికావడం ఆశ్చర్యం కలిగించింది. అతి తక్కువ మెజార్టీతో పరాభావం పొందిన అభ్యర్థులు తమ ఓటమిలో చెల్లని ఓట్లు కూడా కారణంగా ఉన్నాయని అంచనా వేసుకుంటున్నారు. అలాగే చాలాచోట్ల అభ్యర్థుల కన్నా నోటాకు వచ్చిన ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. వాస్తవికంగానే అభ్యర్థులు ఎవరూ నచ్చక నోటాకు ఓటేశారా, లేక గుర్తులపై అయోమయంతో నోటాపై ఓటు ముద్ర వేశారా? అన్న దానిపై అభ్యర్థులు చర్చించుకున్నారు. గుర్తులు తెలియక తికమక.. ఈవీఎం ద్వారా నిర్వహించే ఎన్నికల్లో ఓట్ల తిరస్కరణకు అవకాశం ఉండదు. ఈవీఎం బ్యాలెట్పై నోటాకు మాత్రమే ఓట్లు పడే అవకాశం ఉంటుంది. కానీ బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించిన ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఓట్లు తిరస్కరణకు గురికావడంతో అభ్యర్థులు ఆందోళన చెందారు. బ్యాలెట్పై సరైన గుర్తును ఎంచుకుని అదే గుర్తుపై ఓటు వేయడంలో చాలామంది ఓటర్లు పొరపాట్లు చేశారు. అయోమయంలో రెండు గుర్తులపై ముద్ర వేయడం, గుర్తులపై బొటనవేలితో ముద్ర వేయడం, బ్యాలెట్ పేపర్పై ఓటు వేయకుండా ఖాళీగా బాక్స్లో వేయడం కనిపించింది. అలాగే బ్యాలెట్ పేపర్లో ఒక గుర్తుపై వేసిన ఇంక్ ముద్ర మరో గుర్తుపై పడకుండా ఉండేందుకు పేపర్ను నిలువుగా మడత పెట్టాల్సి ఉంటుంది. కానీ కొందరు నిలువుగా కాక అడ్డంగా మడిచి బ్యాలెట్ వేయడంతో ఇంకు ముద్ర మరో గుర్తుపై కూడా పడి చాలా ఓట్లు చెల్లకుండా పోయాయి. తక్కువ మెజార్టీతో పోటాపోటీగా ఉన్న వార్డుల్లో చెల్లని ఓట్ల ప్రభావంతో అభ్యర్థులు ఆవేదనకు లోనయ్యారు. పోలైనవి...1012, చెల్లనివి 216 మహబూబ్నగర్ కార్పొరేషన్కు మొదటిసారిగా జరిగిన ఎన్నికలు చరిత్రాత్మకంగా నిలువనున్నాయి. ఈ కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లలో 58వ డివిజన్ ఏకగ్రీవం కావడంతో మిగిలిన 59 డివిజన్లలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. మొత్తం 1012 ఓట్లు పోలవ్వగా.. అందులో 216 ఓట్లు చెల్లనివి నమోదు కావడం గమనార్హం. ఉద్యోగులు తమ ఓటుహక్కును వినియోగించుకోవడంలో ఎంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శించరనేది దీన్ని బట్టి తెలుస్తోంది. అత్యధికంగా 10, 25వ డివిజన్లలో 16 చొప్పున చెల్లని ఓట్లు నమోదయ్యాయి. ఓటింగ్పై పూర్తిస్థాయి అవగాహన ఉన్న ఉద్యోగులే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకుంటారు. పైగా వీరంతా ఎన్నికల విధుల్లో పాల్గొంటూ ఎన్నికల ప్రక్రియను ప్రత్యక్షంగా నిర్వహిస్తారు. అలాంటి పోలింగ్ సిబ్బంది ఓటు వేసే పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనూ పెద్ద సంఖ్యలో చెల్లని ఓట్లు ఉండటం చర్చనీయాంశమైంది. మహబూబ్నగర్, వనపర్తి, గద్వాలలో చెల్లని ఓట్లతో పాటు నోటాకు అధికంగా ఓట్లు వీటి ప్రభావంతో అభ్యర్థుల భవితవ్యం తలకిందులు అయినట్టుగా అంచనాలు పొరపాట్లు, తప్పిదాలతోనే అధికంగా చెల్లని ఓట్లు మహబూబ్నగర్లో పోస్టల్ బ్యాలెట్లోనూ చెల్లని ఓట్లు -
రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్లో ప్రతిభ చూపాలి
మహబూబ్నగర్ క్రైం: ఈనెల 17నుంచి తెలంగాణ రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్కు ఎంపిక అయిన పోలీస్ క్రీడకారులు ఉత్తమ ఫలితాలు తీసుకురావాలని ఎస్పీ డి.జానకి అన్నారు. పో లీస్ క్రీడలకు ఎంపిక అయిన సిబ్బందికి శనివా రం ఎస్పీ కార్యాలయంలో స్పోర్ట్స్ కిట్లు, ట్రాక్సూట్లు, షూలను ఎస్పీ అందజేశారు. జోగుళాంబ జోన్ నుంచి వెళ్తున్న క్రమంలో జిల్లాకు మంచి ఖ్యాతి తీసుకురావాలన్నారు. క్రీడలు కేవలం పోటీలు మాత్రమే కాకుండా పోలీస్ శా ఖలోని క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, సహన శక్తి, నాయకత్వ లక్షణాలను పెంపొందించే వేదిక అని తెలిపారు. ఏఎస్పీ సురేష్కుమార్, ఆర్ఐలు కృష్ణయ్య, నగేష్, సత్యం పాల్గొన్నారు. శివాలయాల్లో ప్రత్యేక బందోబస్తు మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం శివాలయాల్లో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ తెలిపారు. జిల్లాలో ప్రముఖ ఆలయాలు కందూరు రామలింగేశ్వరస్వామి, మన్యంకొండ, వీరన్నపేటలోని పెద్దశివాలయం, పిల్లలమర్రి శివాలయం వద్ద భక్తులకు ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్ సమస్యలు రాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ముగిసిన జిల్లాస్థాయి సీఎం కప్ క్రీడలు మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో సీఎం కప్ జిల్లాస్థాయి క్రీడలు శనివారం ముగిశాయి. చివరిరోజు బాక్సింగ్, యోగా, అత్యపత్య, ఆర్చరీ, హాకీ, తైక్వాండో విభాగాల్లో పోటీలు నిర్వహించారు. క్రీడాకారుల యోగా విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు మెడల్స్ అందజేశారు. పురుషుల బాక్సింగ్లో పి.సాయిరాం(దేవరకద్ర), మహిళల విభాగంలో జోగు వైష్ణవి(మహబూబ్నగర్), ప్రథమ, యోగాలో వినోద్కుమార్ (జడ్చర్ల), ధనలక్ష్మి (మహబూబ్నగర్), తైక్వాండోలో ఎండీ బాలేషరీఫ్, సోఫియాతస్లీమ్, హాకీలో బాలానగర్ జట్టు ప్రథమ స్థానంలో నిలిచాయి. జిల్లా యువజన, క్రీడలశాఖ సీనియర్ అసిస్టెంట్ రవీందర్రెడ్డి, బాల్రాజు, అరుణజ్యోతి, నర్సింలు, సాయికుమార్, సురేష్, డీఎస్ఏ కోచ్లు తదితరులు పాల్గొన్నారు. తగ్గిన వేరుశనగ ధరలు జడ్చర్ల: బాదేపల్లి మార్కెట్లో వేరుశనగ ధర లు రోజురోజుకు తగ్గుతున్నాయి. శనివారం క్వింటా గరిష్టంగా రూ.9,399, కనిష్టంగా రూ.3,029 ధరలు లభిచాయి. కందులకు గరిష్టంగా రూ.7,812, కనిష్టంగా రూ. 5,555, మినుములు గరిష్టంగా రూ.8,349, కనిష్టంగా రూ.8,339, పెబ్బర్లు గరిష్టంగా రూ.6,693, కనిష్టంగా రూ.6,689, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,876, కనిష్టంగా రూ.1,848, ఆర్ఎన్ఆర్ ధాన్యం రూ.2,409, పత్తి గరిష్టంగా రూ.6,869 ధరలు లభించాయి. దేవరకద్రలో కందులు క్వింటా గరిష్టంగా రూ.7,579, కనిష్టంగా రూ.7,219గా ధరలు పలికాయి. -
ట్విస్ట్లపై ట్విస్ట్లు
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి పాలమూ రులో హంగ్ ఏర్పడిన పురపాలికల్లో క్యాంప్ రాజ కీయాలు రసవత్తరంగా మారాయి. మొత్తంగా ఐదు మున్సిపాలిటీల్లో సంకీర్ణ పరిస్థితులు తలెత్తగా.. మ్యాజిక్ ఫిగర్కు అడుగుదూరంలో ఉన్న రెండింటిలో పాగా వేసేదెవరనే దానిపై స్పష్టత వచ్చింది. స్వతంత్ర అభ్యర్థి చేయి అందుకోవడంతో దేవరకద్రలో కాంగ్రెస్, ఎక్స్ అఫీషియోగా ఎమ్మెల్యే విజయుడు ఓటు వేయనుండడంతో అలంపూర్లో బీఆర్ఎస్ పీఠం దక్కించుకోనుంది. మిగిలిన నారాయణపేట, గద్వాల, అమరచింతలో విభిన్న పరిస్థితు లు నెలకొనగా.. అటు, ఇటు జంపింగ్లు, క్యాంప్ లు, గడియగడియకూ మారుతున్న రాజకీయ పరి ణామాలు, ట్విస్ట్లపై ట్విస్ట్లు హీటెక్కిస్తున్నాయి. అటు ఇటుగా ఒకరికొకరు.. నారాయణపేటలో కాంగ్రెస్తో బీఆర్ఎస్ కలవకుండా చేస్తే బీజేపీ విజయం సాధించడం ఖాయం. ఒకవేళ బీజేపీకి బీఆర్ఎస్ మద్దతిస్తే పీఠం అధిరోహించడం నల్లేరు మీద నడకనే. అదేవిధంగా గద్వాలలో కాంగ్రెస్కు పీఠం దక్కకుండా, ఎమ్మెల్యే చేతికి చిక్కకుండా ఉండాలంటే బీఆర్ఎస్కు బీజేపీ మద్దతు తప్పనిసరి. ఈ నేపథ్యంలో గద్వాలలో బీఆర్ఎస్కు మద్దతు ఇస్తే నారాయణపేటలో తమకు మద్దతు ఇవ్వాలనే షరతుతో బీజేపీ రాయబారాలు నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇలా జరిగిన పక్షంలో అటు గద్వాల, ఇటు నారాయణపేటలో పుర పీఠాలు కాంగ్రెస్కు దక్కడం కష్టమేనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ కారణాలతోనే.. ● నారాయణపేటలో 24 వార్డు స్థానాల్లో బీజేపీ 11, కాంగ్రెస్ ఏడు, బీఆర్ఎస్, ఎంఐఎం రెండు స్థానాల చొప్పున, ఏఐఎఫ్బీ, ఇండింపెండెంట్ ఒక్కో స్థానంలో గెలుపొందాయి. బీజేపీకి ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతు పలుకుతుండగా.. మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ ఎక్స్ అఫీషియో ఓటుతో కలిపి బలం మ్యాజిక్ ఫిగర్ 13కు చేరుతుంది. కాంగ్రెస్కు ఎంఐఎం అభ్యర్థులు ఇద్దరు, ఒక ఏఐఎఫ్బీ అభ్యర్థి మద్దతు తెలుపుతుండగా.. వారి బలం పదికి చేరింది. ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ఎక్స్ అఫీషియోగా ఓటు వేస్తే 11కు చేరనుంది. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థులు కాంగ్రెస్కు మద్దతు ఇచ్చిన పక్షంలో ఆ పార్టీ బలం 13కు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థులు కాంగ్రెస్కు మద్దతు ఇవ్వకుండా బీజేపీ కట్టడి చేసే వ్యూహాలను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ● గద్వాలలో మొత్తం 37 వార్డు స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ 16, బీఆర్ఎస్ 11, బీజేపీ ఏడు, స్వతంత్రులు ఇద్దరు, ఎంఐఎం అభ్యర్థి ఒకరు గెలుపొందారు. మ్యాజిక్ ఫిగర్ 19 కాగా.. ఇద్దరు స్వతంత్రులు ఇద్దరు, ఒక ఎంఐఎం అభ్యర్థితో కలిపి కాంగ్రెస్ బలం 19కి చేరింది. అదే బీఆర్ఎస్, బీజేపీ కలిస్తే వారి బలం 18కి చేరుతోంది. ఈ క్రమంలో ఇద్దరు స్వతంత్రులనుతమ వైపునకు తిప్పుకునేలా ఆ పార్టీల నేతలు పావులు కదుపుతున్నారు. ● పెబ్బేరు పుర పీఠం జనరల్కు కేటాయించడం.. కాంగ్రెస్కు స్పష్టమైన మెజార్టీ రావడంతో పార్టీ సీనియర్ నేత శ్రీనివాస్గౌడ్, తన భార్యకు అవకాశం ఇవ్వాలని ఎల్లారెడ్డి పట్టుబట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఇరువురిని ఎమ్మెల్యే మేఘారెడ్డి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఐదు వార్డుల ను దక్కించుకున్నందున ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తే ఇబ్బంది కలిగే అవకాశం ఉందనే ఆలోచనలో ఎమ్మెల్యే తన ఎక్స్ అఫీషియో ఓటును అక్కడే వినియోగించుకునేందుకు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. ● అమరచింత మున్సిపాలిటీలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. బీజేపీ కౌన్సిలర్లను కాంగ్రెస్ లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నా.. ఎంపీ డీకే అరుణ ముందస్తుగా వారిని క్యాంపునకు తరలించినట్లు ప్రచారం సాగుతోంది. మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి బీఆర్ఎస్ కౌన్సిలర్లను తన కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారు. బీజేపీ, బీఆర్ఎస్ ఏకమైతే పూర్తి మెజార్టీ వచ్చి చైర్మన్ పీఠం దక్కించుకునే అవకాశం ఉంది. రసవత్తరంగా క్యాంప్ రాజకీయాలు నారాయణపేట, గద్వాలలో హైడ్రామా ఒకరికొకరు చేదోడువాదోడుగా బీఆర్ఎస్, బీజేపీ ఇచ్చిపుచ్చుకునే ధోరణితో రాయబారాలు -
కోర్టుకు వెళ్తా
కల్వకుర్తి టౌన్: ఎన్నికల్లో గెలుపొందేందుకు అభ్యర్థులు నానాపాట్లు పడుతుంటారు. కొందరు సునాయాసంగా గెలిస్తే మరికొందరు నానా తిప్పలు పడాల్సి వస్తుంది. దీనికి తోడు ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలని పలువురు అంటుంటారు. అలాంటి పరిస్థితే ఏర్పడింది మున్సిపల్ ఎన్నికలలో. పట్టణంలోని పదో వార్డులో కాంగ్రెస్ తరఫున ఎజాస్, బీఆర్ఎస్ తరఫున తాహిర్అలీ పోటీ చేశారు. కౌంటింగ్లో మొదటగా కాంగ్రెస్ అభ్యర్థికి 259 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థికి 257 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థికి రెండు ఓట్ల మెజార్టీ వచ్చింది. బీఆర్ఎస్ అభ్యర్థి రీకౌంటింగ్ చేయాలని కోరడంతో అధికారులు కౌంటింగ్ చేశారు. రీకౌంటింగ్లో బండిల్లో ఓ బ్యాలెట్ పేపర్ కట్టలో ఉండే 25 పేపర్ల కన్నా ఒకటి ఎక్కువగా కట్టడంతో బీఆర్ఎస్ అభ్యర్థికి ఆ ఓటును అధికారులు కలిపారు. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థికి 258 ఓట్లు వచ్చినట్లుగా అధికారులు ప్రకటించారు. మరల రీకౌంటింగ్కు బీఆర్ఎస్ అభ్యర్థి కోరగా ఇన్వాలిడ్గా ఉన్న ఒక్క ఓటు మిగిలిపోయింది. దీంతో అధికారులు ఆ ఇన్వాలిడ్ ఓటులో ఇద్దరి అభ్యర్థుల గుర్తుల దగ్గర ఉన్న ఇంకు సమస్య వచ్చింది. ఇంక్ సమస్య రావటంతో ఆ ఓటును చెల్లని ఓటుగా పరిగణించి, ఒక్క ఓటుతో కాంగ్రెస్ అభ్యర్థి ఎజాస్ గెలిచినట్లుగా ధ్రువీకరించి ప్రకటించారు. ఈ వార్డులో పోటీ చేసిన ఎంఐఎం అభ్యర్థికి ఒక్క ఓటు రావడం, ఆ ఒక్క ఓటుతోనే బీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోవడం విశేషం. రిటర్నింగ్ అధికారులు ఒక్క ఓటును పక్కన పెట్టి దానిని పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా ఎన్నిక ఫలితాన్ని ప్రకటించారని బీఆర్ఎస్ అభ్యర్థి తాహిర్అలీ ఆరోపించారు. ఎన్నిక ప్రకటనను నా సంతకం లేకుండానే ప్రకటించడాన్ని తప్పు బట్టారు. ఈ ఎన్నికను అధికారికంగా ప్రకటించవద్దని రిటర్నింగ్ అధికారికి వినతిని అందించేందుకు వెళ్తే పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. ఎన్నికపై కోర్టులో పోరాడుతానని, అప్పటివరకు ఎన్నిక ఫలితాన్ని ప్రకటించవద్దని అధికారులను డిమాండ్ చేశారు. -
రీకౌంటింగ్లో గందరగోళం
దేవరకద్ర కాంగ్రెస్ చేతిలోకి.. సరితలు ఓడిపోయారు... శ్వేతలు గెలిచారు ప్రజాతీర్పు మా పాలనకు నిదర్శనం అమరచింత మున్సిపాలిటీ దేవరకద్ర: మున్సిపాటిటీ ఎన్నికల ఫలితాలు ముందుగా హంగ్గా భావించినప్పటికీ స్వతంత్ర అభ్యర్థి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడంతో కాంగ్రెస్ వశమైంది. మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉండగా అందులో 6 వార్డుల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. బీఆర్ఎస్ 4, బీజేపీ 1, స్వతంత్ర అభ్యర్థి ఒకరు గెలిచారు. మెజార్టీ స్థానాలు 7 రావాల్సి ఉంది. అయితే ఎవరికి స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో హంగ్ అవుతుందని అందరూ భావించారు. ఒక అభ్యర్థి కలిస్తే కాంగ్రెస్కు మెజార్టీ వచ్చే అవకాశం ఉండడంతో స్వతంత్ర అభ్యర్థిని కాంగ్రెస్లోకి రావాలని మండల నాయకులు చర్చలు సాగించారు. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన చంద్రమౌళి అరుణకు టికెట్ దక్కక పోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. గెలిచిన తరువాత కాంగ్రెస్లోకి రావాలని అందరూ బుజ్జగింపులు చేశారు. చివరకు ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి అరుణ భర్త చంద్రమౌళితో చర్చించగా కాంగ్రెస్కు మద్దతుగా ఉంటామని ప్రకటించారు. దీంతో దేవరకద్ర హంగ్ తొలగి కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి చేరింది. గద్వాల: గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డుకు సంబంఽధించిన ఫలితం నాటకీయ పరిణామాలు చోటుచేసుకుని ఉత్కంఠకు తెరలేపింది. మొదటగా 8వ వార్డులో 2 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ పార్టీకి చెందని అభ్యర్థి జయమ్మ సమీప ప్రత్యర్థి వెంకటమ్మపై గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. అయితే ఓట్ల తేడా స్వల్పంగా ఉండడంతో మరోసారి కౌంటింగ్ చేయాలని కాంగ్రెస్ అభ్యర్థి వెంకటమ్మ అధికారులను కోరారు. మరోసారి కౌంటింగ్ చేసిన అధికారులు ఒక్క ఓటు తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి జయమ్మ గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. అనంతరం వెంకటమ్మ అభ్యర్థన మేరకు మరోసారి కౌంటింగ్ చేశారు. చివరికి ఒక్క ఓటు మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి వెంకటమ్మ గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి జయమ్మ మరల కౌంటింగ్ చేపట్టాలని అధికారులను కోరారు. అయితే ఇప్పటికే పలుమార్లు కౌంటింగ్ చేశామని చెప్తూ అధికారులు తిరస్కరించారు. దీంతో ఒక్కసారి గందరగోళం నెలకొంది. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు బీఎస్ కేశవ్, ఆంజనేయగౌడ్, హనుమంతు, రాఘవేంద్రరెడ్డి కౌంటింగ్ సెంటర్కు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో పోలీసులు బీఆర్ఎస్ పార్టీ నాయకులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువురి మధ్యమాటల యుద్ధం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డికి అధికారులు, పోలీసులు ఒత్తాసు పలుకుతున్నారని, ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని నిరసన తెలిపారు. రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. ఏదైనా అభ్యంతరం ఉంటే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలని, ట్రాఫిక్కు ఇబ్బందులు కలిగించడం తగదని పోలీసులు నచ్చచెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జయమ్మ కౌంటింగ్ హాలులోకి వెళ్లి అధికారులకు ఫిర్యాదు చేసే ప్రయత్నం చేయగా అధికారులు స్పందించలేదు. ఆగ్రహం వ్యక్తం చేసిన జయమ్మ కోర్టుకు వెళ్తానని మీడియాకు తెలిపారు. అలంపూర్ రూరల్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి చైర్మన్ ఆభ్యర్థిగా పేరు వినిపిస్తున్న ఇస్మాయిల్ ఓటమి పాలయ్యరు. మూడో వార్డు నుంచి కాంగ్రెస్ నుంచి ఇస్మాయిల్, బీఆర్ఎస్ నుంచి ఆసీఫ్ఖాన్, బీజేపీ నుంచి జంగం నాగమల్లయ్య పోటీలో నిలిచారు. ఇందులో ఆసిఫ్ ఖాన్ గెలుపోందారు. కల్వకుర్తి టౌన్: మున్సిపాలిటీలోని 16వ వార్డులో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి పసుల లలిత, బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థి ఎడ్మ రాధికను ఓడించింది. కల్వకుర్తి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎడ్మ సత్యం తన భార్యను ఆ పార్టీ తరఫున చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించి ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థికి 487 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థికి 435 ఓట్లు వచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో మాజీ చైర్మన్ సత్యం, ఈ వార్డులో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి కుమారుడు రమాకాంత్రెడ్డిని కొట్టాడని స్వయంగా ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రస్తావించారు. ఎమ్మెల్యే సైతం ఈ వార్డు ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని చెప్పటంతో విజయం సులువైంది. కొల్లాపూర్/మక్తల్: మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు మా పాలనకు నిదర్శనమని రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిట శ్రీహరి పేర్కొన్నారు. కొల్లాపూర్, మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో వారు ఆయా ప్రాంతాల్లో మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అత్యధిక స్థానాలు గెల్చుకోవడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇదే తరహాలో ప్రజలు తీర్పు ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కౌన్సిలర్ల గెలుపునకు కృషిచేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో గెలుపొందిన కౌన్సిలర్లను మంత్రి వాకిటి శాలువాతో సన్మానించారు. మమబూబ్నగర్ కార్పొరేషన్లో 37వ డివిజన్ జనరల్ మహిళకు కేటాయించగా కాంగ్రెస్ పార్టీ నుంచి న్యాయవాది నేహాశ్రీ పోటీ చేసి ఓడిపోయారు. ఈమె గెలిచి ఉంటే మేయర్ పదవి రేసులో ఉన్నారు. ఈమె తండ్రి ఎన్పీ వెంకటేష్ చాలా కాలంగా ఒలింపిక్ సంఘం జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. కుమార్తె గెలుపు కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. జూపల్లి కృష్ణారావు వరాల తల్లి.. పోలేపల్లి ఎల్లమ్మ ఎస్జీఎఫ్ అండర్–17 క్రికెట్ టోర్నీ ప్రారంభం కల్వకుర్తిలో తప్పని ఓటమి నాటకీయ పరిమాణాల మధ్య కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటన నారాయణపేట: సరితలు ఓడిపోయారు.. శ్వేతలు గెలిచారు అంటే ఆశ్చర్యపోతున్నారా.. ఆశ్చర్యపోవాల్సిందే మరి.. ఈ సారి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థులు 16వ వార్డులో చైర్పర్సన్ అభ్యర్థి సరిత భట్టడ్, 19వ వార్డు సిట్టింగ్ కౌన్సిలర్ సరితగౌడ్ ఓటమి చవి చూశారు. 20వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి కే. శ్వేత, 4వ వార్డు బీజేపీ అభ్యర్థి కొండ శ్వేత తాజా మాజీ కౌన్సిలర్ విజయం సాధించారు. దీంతో సరితలు ఇద్దరు ఓడిపోవడంతో బలం లేనట్లుందని.. శ్వేతలు గెలువడంతో విజయాలపై బలం బాగుందని చర్చించుకుంటున్నారు. -
అత్తాకోడళ్ల జయభేరి
కదిరె రాములు దంపతులు నారాయణపేట మున్సిపాలిటీలో అత్తాకోడళ్లు ఇద్దరు వేర్వేరు జాతీయ పార్టీల నుంచి విజయం సాధించారు. వరుసకు అత్త అయ్యే కల్పన 17వ వార్డులో బీజేపీ తరపున, కోడలు శ్వేత 20వ వార్డులో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి కౌన్సిలర్గా గెలుపొందారు. – గద్వాలగద్వాలలో అక్కాచెల్లెలు ఇద్దరూ కూడా ఒకేపార్టీ నుంచి పక్కపక్క వార్డుల్లో పోటీ చేసి మిశ్రమ ఫలితం సాధించారు. 33వ వార్డులో బీజేపీ అభ్యర్థిగా బండల పద్మావతి పోటీచేసి ఓటమి చెందారు. 34వ వార్డు నుంచి ఆమె సోదరి బండల రామలక్ష్మి మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగి గెలుపొందారు. కల్వకుర్తి టౌన్: మున్సిపల్ ఎన్నికల్లో భార్యభర్తలిద్దరూ విజయకేతనం ఎగరేయాలని అనుకున్నారు. ఓటర్లు భార్యను మాత్రమే గెలిపించి, భర్తకు మాత్రం ఓటమిని చవిచూపారు. ఎన్నికల్లో 7వ వార్డులో కాంగ్రెస్ పార్టీ తరఫున చైర్మన్ అభ్య ర్థిగా పోటీచేసిన రత్నమాల తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి ఇందుపై 425 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 13వ వార్డులో పోటీచేసిన ఆమె భర్త ఆనంద్కుమార్ బీజేపీ అభ్యర్థి నర్సింహ చేతిలో 63ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2019, 2026 మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిల్లోకి అడుగు పెడుదామనుకున్న ఆనంద్కుమార్ మరోసారి ఓటమి పాలయ్యారు. భర్త ఓడిపోయిన భార్య గెలవడంతో చైర్మన్ పదవి రత్నమాలకు వరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గద్వాలలో అత్త, అల్లుడు పలు వార్డుల నుంచి వివిధ పార్టీల తరఫున పోటీచేసి ఓటమి చెందారు. నాలుగో వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా శారద పోటీ చేసి ఓటమి చవి చూశారు. ఇమె అల్లుడు మహేశ్ 25వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. మున్సిపల్ ఎన్నికల్లో విచిత్రాలు గద్వాల మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో విచిత్రాలు ఆవిష్కృతమయ్యాయి. భార్యాభర్తలు, అక్కాచెల్లెలు, అత్తాఅల్లుడు ఇలా పలు వార్డుల్లో పోటీ చేసి మిశ్రమ ఫలితాలను చవిచూశారు. వాటి వివరాలిలా.. -
మూడింట పైచేయి..
సాక్షి, నాగర్కర్నూల్: మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించింది. జిల్లాలో ఎన్నికలు జరిగిన మూడు మున్సిపాలిటీ చైర్మన్ పీఠాలను కై వసం చేసుకుంది. నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అత్యధిక వార్డు స్థానాల్లో గెలుపొందగా.. మూడు చోట్ల బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కనీసం పోటీ ఇవ్వలేకపోయాయి. నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అత్యధికంగా 6 వార్డు స్థానాలు దక్కించుకోగా.. కల్వకుర్తి, కొల్లాపూర్ మున్సిపాలిటీల్లో 3 స్థానాలకే పరిమితమైంది. కల్వకుర్తిలో బీఆర్ఎస్ కన్నా బీజేపీ 5 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. ● జిల్లాలోని మూడు మున్సిపాలిటీ చైర్మన్ పీఠాలు కాంగ్రెస్కే.. ● నాగర్కర్నూల్లో 6 స్థానాలు దక్కించుకున్న బీఆర్ఎస్ ● కల్వకుర్తిలో రెండో స్థానంలో బీజేపీ, మూడో స్థానానికి కారు పార్టీ జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నుంచి రెబల్గా పోటీచేసిన వారిలో ఒకరు విజయం సాధించగలిగారు. కల్వకుర్తి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీలో 8వ వార్డు నుంచి రెబల్గా పోటీచేసిన లలిత గెలుపొందారు. సమీప అభ్యర్థి బీజేపీకి చెందిన హైమావతిపై ఆమె 16 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ వార్డులో కాంగ్రెస్ తరపున టికెట్ కోసం లలిత ప్రయత్నించగా చివరికి భంగపాటు ఎదురైంది. రెబల్గా ఎన్నికల బరిలో దిగగా విజయం వరించింది. ఈ వార్డులో బీజేపీ రెండో స్థానంలో ఉండగా, కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితమవడం గమనార్హం. -
‘సింహ’గర్జన..!
● నాడు కొల్లాపూర్, అయిజలో.. నేడు వడ్డేపల్లి మున్సిపాలిటీలో.. గత పుర పాలక ఎన్నికల్లో నాగర్కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్, అయిజ మున్సిపాలిటీల్లో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ విజయకేతనం ఎగురవేసింది. కొల్లాపూర్కు చెందిన మంత్రి జూపల్లి అప్పుడు బీఆర్ఎస్లో ఉండగా అప్పటి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డితో పొసగని పరిస్థితి ఉండేది. ఈ మున్సిపాలిటీలో మొత్తం 19 వార్డులు ఉండగా.. తన వర్గానికి చెందిన వారిని ఏఐఎఫ్బీ నుంచి బరిలో నిలిపారు.. 11 స్థానాల్లో వారే గెలుపొందారు. అదేవిధంగా జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీలో తిరుమల్రెడ్డి తన వర్గాన్ని ఏఐఎఫ్బీ నుంచి బరిలో దించారు. 20 వార్డులు ఉండగా.. 10 స్థానాల్లో వారే విజయం సాధించారు. ప్రస్తుతం ఇదే నియోజకవర్గంలోని వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఏఐఎఫ్బీ పూర్తిస్థాయిలో మెజార్టీ సాధించింది. మొత్తం పది వార్డులు ఉండగా.. ఎనిమిది స్థానాల్లో గెలుపొందారు. -
నాడు కానిస్టేబుల్.. నేడు కార్పొరేటర్
మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 10వ డివిజన్ పాతపాలమూరులో కాంగ్రెస్ అభ్యర్థి టి.రమేష్బాబు ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లో కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన ఈయన ఓటమి చవిచూడగా.. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గతంలో తనను ఓడించిన అభ్యర్థిపైనే 417 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం విశేషం. దీంతో పాతపాలమూరులో రమేష్బాబు విజయోత్సవ సంబరాలు జరుపుకొన్నారు. – మహబూబ్నగర్ రూరల్ -
‘హంగు’..ఆర్భాటాలు!
ఉమ్మడి పాలమూరులో పుర ఫలితాల అనంతరం క్యాంప్ రాజకీయాలు ఊపందుకున్నాయి. ప్రధానంగా హంగ్ ఏర్పడిన ఆరు పురపాలికల్లో గంటగంటకూ సమీకరణలు మారుతున్నాయి. గద్వాల, నారాయణపేటలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పేట మున్సిపాలిటీలో 24 వార్డులు ఉండగా.. బీజేపీ 11, కాంగ్రెస్ ఏడు, బీఆర్ఎస్ రెండు, ఎంఐఎం రెండు, ఏఐఎఫ్బీ ఒకటి, స్వతంత్రులు ఒకరు గెలుపొందారు. ఏఐఎఫ్బీ అభ్యర్ధి కాంగ్రెస్ రెబల్, స్వతంత్ర బీజేపీ రెబల్ కాగా.. వారు ఆయా పార్టీలవైపే మొగ్గుచూపుతున్నారు. ఈ విధంగా జరిగిన పక్షంలో బీజేపీకి 12, కాంగ్రెస్ ఫిగర్ ఎనిమిదికి చేరనుంది. అయితే బీఆర్ఎస్, ఎంఐఎం మద్దతుతో పీఠం దక్కించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ● గద్వాలలో మొత్తం 37 వార్డులు ఉండగా.. కాంగ్రెస్కు 16, బీఆర్ఎస్కు 11, బీజేపీకి ఏడు, స్వతంత్రులు ఇద్దరు, ఎంఐఎం అభ్యర్థి ఒకరు గెలుపొందారు. గెలిచిన ఇద్దరు స్వతంత్రులు, ఒక ఎంఐఎం అభ్యర్థిని కాంగ్రెస్ తమవైపునకు తిప్పుకున్నట్లు తెలిసింది. ఈ లెక్కన వారి బలం 19 కాగా మ్యాజిక్ ఫిగర్ను చేరుకుంది. ఈ క్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య మంతనాలు కొనసాగుతున్నాయి. తమ అభ్యర్థులను ఎవరికి వారు క్యాంప్లకు తరలించిన ముఖ్యులు చెరో రెండున్నరేళ్లు మున్సిపల్ పీఠాన్ని పంచుకునేలా పావులు కదుపుతున్నారు. బండ్ల కృష్ణమోహన్రెడ్డిని ఇరుకునపెట్టేలా బీఆర్ఎస్ విప్ జారీ చేసే వ్యూహంతో ఉన్నట్లు సమాచారం. ఇక్కడ ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకం కానున్నాయి. ఎక్స్ అఫీషియో ఓట్లతో దేవరకద్రలో కాంగ్రెస్, అలంపూర్లో బీఆర్ఎస్ పీఠం దక్కించుకోనున్నాయి. ● అమరచింతలో 10 వార్డులు ఉండగా.. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు చొప్పున, సీపీఎం ఒక స్థానంలో విజయం సాధించింది. ఫలితాలకు ముందే బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థులు క్యాంప్నకు వెళ్లగా.. గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులను మాజీ ఎమ్మెల్యే చిట్టెం తన వాహనంలో క్యాంప్కు తరలించారు. ఇరు పార్టీల నేతలు సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. చెరి రెండున్నరేళ్లు చైర్మన్ గిరిని పంచుకునేలా ఒక అవగాహనకు రానున్నట్లు చర్చ జరుగుతోంది. దాదాపుగా అంతటా క్యాంప్ రాజ‘కీ’యాలు గద్వాలలో హైడ్రామా.. బేరసారాలు ఇటు బీజేపీ, బీఆర్ఎస్ ముఖ్య నేతల చర్చలు ఎక్స్ అఫీషియో ఓట్లే కీలకం -
విజేత.. ఆశా కార్యకర్త
కొత్తకోట పురపాలికలో 5వ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన ఆశా కార్యకర్త ముంత మంజుల విజయం సాధించారు. అధికార కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య జరిగిన పోరులో 67 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ కావడం.. భర్త బీఆర్ఎస్ కార్యకర్త కావడంతో ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఆశా కార్యకర్తలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. తనకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. – కొత్తకోట రూరల్ -
చేతిపురం..!
11 మున్సిపాలిటీల్లో ‘హస్తం’ హవా ఉమ్మడి పాలమూరులో గ్రామపంచాయతీ పోరులో పైచేయి సాధించిన కాంగ్రెస్ పురపాలిక ఎన్నికల్లోనూ హవా కొనసాగించింది. పదవీ కాలం ముగియని జడ్చర్ల, అచ్చంపేట మినహా మహబూబ్నగర్ కార్పొరేషన్తోపాటు మరో 18 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్, ఐదు పురపాలికల్లో (గద్వాల, నారాయణపేట, అమరచింత, దేవరకద్ర, అలంపూర్) హంగ్ ఏర్పడింది. 11 చోట్ల ‘హస్తం’ పూర్తి స్థాయిలో మెజార్టీ సాధించింది. మహబూబ్నగర్ కార్పొరేషన్, దేవరకద్రలో మ్యాజిక్ ఫిగర్కు అడుగు దూరంలో ఉండగా.. ఈ పీఠాలనూ కై వసం చేసుకోనుంది. గత పురపాలక ఎన్నికల్లో ఎనిమిదింటిలో పూర్తి ఆధిక్యతను కనబర్చిన బీఆర్ఎస్కు ఈ సారి చేదు అనుభవమే ఎదురైంది. ఒక్క అయిజలోనే గెలుపొందింది. బీజేపీ బోణీ కూడా చేయలేక చేతులెత్తేసింది. నారాయణపేటలో ఆధిక్యతను కనబర్చినా.. మ్యాజిక్ ఫిగర్ను చేరుకోలేకపోయింది. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ కాంగ్రెస్.. బీఆర్ఎస్.. బీజేపీ.. ఉమ్మడి పాలమూరులో ఎన్నికలు జరిగిన మహబూబ్నగర్ కార్పొరేషన్లో 60 డివిజన్లు.. 18 పురపాలికల్లో 316 వార్డులు ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ 30 డివిజన్లు, 179 వార్డుల్లో విజయం సాధించి పైచేయిగా నిలిచింది. అదేవిధంగా బీఆర్ఎస్ 15 డివిజన్లు, 75 వార్డులు.. బీజేపీ ఏడు డివిజన్లు, 38 వార్డుల్లో గెలుపొంది ఆ తర్వాత స్థానాలతో సరిపెట్టుకున్నాయి. ఏఐఎఫ్బీ తొమ్మిది, ఎంఐఎం ఆరు, స్వతంత్రులు తొమ్మిది, సీపీఎంకు చెందిన ఇద్దరు గెలుపొందారు. మక్తల్లోని ఆరో వార్డులో ఎన్నికలు వాయిదా పడ్డాయి. మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు ఐదింటిలో హంగ్ బోల్తాపడ్డ కారు.. ఒక్క అయిజలోనే మెజార్టీ తారుమారైన బీజేపీ అంచనాలు నారాయణపేటలో ఆధిక్యత.. అయినా ఊగిసలాట దేవరకద్రలో రెబల్ చేరికతో హస్తానికి లైన్క్లియర్ అలంపూర్లో బీఆర్ఎస్కు అవకాశం గద్వాలలో ఎమ్మెల్యే బండ్లకు షాకిచ్చిన ఫలితాలు ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ, బీఆర్ఎస్ మధ్య దోబూచులాట -
23 ఏళ్లకే కౌన్సిల్లోకి...
వరుసగా ఐదోసారి నెగ్గి.. స్థానిక పురపాలికలోని ఆరో వార్డు నుంచి 23 ఏళ్ల పుట్టా రేణుక కాంగ్రెస్పార్టీ నుంచి పోటీచేసి గెలుపొంది కౌన్సిల్లో అడుగు పెడుతున్నారు. రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశం, అనుకూలమైన రిజర్వేషన్ రావటంతో ఎన్నికల బరిలో నిలిచానని.. వార్డు ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధించానని చెప్పుకొచ్చారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వార్డు ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని తెలిపారు. – కల్వకుర్తి టౌన్ -
జీఎమ్మార్.. స్టార్ ‘లీడర్’
● దేవరకద్రలోని 3 మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ గెలుపు మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి (జీఎమ్మార్) స్టార్ లీడర్గా పేరు సాధించారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో దేవరకద్ర, భూత్పూర్, కొత్తకోట మున్సిపాల్టీలకు ఎన్నికలు జరగగా.. అన్ని పీఠాలను కాంగ్రెస్ కై వసం చేసుకోనుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అంతర్గత ఒప్పందం చేసుకుని ఈ మున్సిపాల్టీలను హస్తానికి చేజిక్కకుండా రాజకీయాలు నడిపాయి. ఆయా పార్టీలకు చెందిన కొందరు నేతలు కలిసి ప్రచారం చేపట్టాయి. అయినా భూత్పూర్, కొత్తకోటలో కాంగ్రెస్ పూర్తి ఆధిక్యం సాధించింది. దేవరకద్రలో మ్యాజిక్ ఫిగర్కు అడుగుదూరంలో ఉన్నా.. ఎక్స్ అఫీషియో ఓటుతో ఆ పార్టీకే పీఠం దక్కనుండడంతో నియోజకవర్గంలోని కాంగ్రెస్శ్రేణులు ఎమ్మెల్యేను పొగడ్తలతో ముంచెత్తడంతో పాటు సంబరాల్లో మునిగారు. ● 16 స్థానాల్లోనూ హస్తం అభ్యర్థుల గెలుపు ● సీఎం ఇలాకా కావడంతో హాట్టాపిక్ ● గత ఎన్నికల్లో బీఆర్ఎస్కు దక్కిన పీఠం ● ప్రతీకారం తీర్చుకున్నారంటున్న రేవంత్ అభిమానులు -
శ్రీశైలం వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
సాక్షి, నాగర్కర్నూల్: నాగర్కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఊర్కొండ మండలం తిమ్మన్నపల్లి శివారులో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటక నుంచి శ్రీశైలం వెళ్తున్న ఓ వ్యాన్ అదుపు తప్పి కల్వర్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. మృతులను కర్ణాటకకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద సమయంలో వ్యాన్లో 10 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి
మెట్టుగడ్డ: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 252ను సవరించి డెస్క్ జర్నలిస్టులు అందరికీ అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని డెస్క్ జర్నలిస్టులు డిమాండ్ చేశారు. గురువారం డెస్క్ జర్నలిస్ట్ల ఆధ్వర్యంలో మహబూబ్నగర్ ప్రెస్క్లబ్లో సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన డెస్క్ జర్నలిస్టులు మాట్లాడుతూ డెస్క్ జర్నలిస్టులకు ఎడిషన్ సెంటర్లలో నాలుగు అక్రిడిటేషన్ కార్డులు మాత్రమే ఇస్తామనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గత ప్రభు త్వం మంజూరు చేసినట్లుగానే డెస్క్లో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు. పేపర్ సర్క్యులేషన్ను ప్రామాణికంగా తీసుకోవడం ద్వారా చిన్న పత్రికల్లో విధులు నిర్వహించే జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థ లాలు, ఇళ్లు, హెల్త్కార్డులు మంజూరు చేయాలని, అక్రిడిటేషన్ కమిటీలో ప్రాతినిధ్యం కల్పించాలని, ప్రెస్క్లబ్లో అందరికీ సభ్యత్వం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నూతన కార్యవర్గం ఎన్నిక.. డెస్క్ జర్నలిస్టుల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.ఇందులో అధ్యక్షుడిగా కె.శ్రీనివాస్ (నమ స్తే తెలంగాణ), ప్రధాన కార్యదర్శిగా మల్లెల విష్ణువర్ధన్రెడ్డి (సాక్షి), కోశాధికారిగా రవి (వార్త), ఉపాధ్యక్షులుగా చిన్నకుర్మయ్య (సాక్షి), వెంకటేష్ (ఆంధ్రజ్యోతి), సహాయ కార్యదర్శులుగా బి.వెంకటగిరి (ఫ్రీలాన్స్), ఎ.విష్ణు (నమస్తే తెలంగాణ), కమిటీ సభ్యులుగా నవీన్చారి (సాక్షి), నవీన్ (ఆంధ్రజ్యోతి), పరమేష్ (తెలుగుప్రభ), బి.శివకుమార్ (నమస్తే తెలంగాణ), జగదీశ్ (సూర్య), రాష్ట్ర కమిటీ సభ్యులుగా జమ్మన్న (ఆంధ్రజ్యోతి), శ్రీనివాస్యాదర్ (నవ తెలంగాణ)లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి ఎడిషన్ ఇన్చార్జి తిరుపతయ్య, సాక్షి ఎడిషన్ ఇన్చార్జి హరిప్రసాద్, అన్ని పత్రికల సబ్ ఎడిటర్లు పాల్గొన్నారు. -
చెంచుల పండుగకు వేళాయె..
అచ్చంపేట: నల్లమలలోని భౌరాపూర్ భ్రమరాంబ ఆలయంలో ఏటా శివరాత్రి పర్వదినాన రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చెంచుల పండుగ నిర్వహిస్తోంది. 14 నుంచి 16వ తేదీ వరకు మూడురోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు కలెక్టర్ బదావత్ సంతోష్ మంగళవారం మన్ననూర్ ఐటీడీఏ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించి సౌకర్యాల కల్పనపై పలు సూచనలు చేశారు. పురాతన ఆలయంలో కొలువుదీరిన భ్రమరాంబిక, మల్లికార్జునస్వామికి మహా శివరాత్రి రోజున శ్రీశైలంలో జరిగే విధంగా ఇక్కడ కూడా కల్యాణం జరిపిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదేళ్లుగా ఐటీడీఏ ఆధ్వర్యంలో అధికారికంగా ఉత్సవాలు నిర్వహిస్తోంది. రహదారి, ఆదరణ లేక కనుమరుగు.. నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలో జరిగే భౌరాపూర్ ఉత్సవాలు ఆదివాసీ చెంచుల సంస్కతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. అప్పట్లో శ్రీశైలానికి భౌరాపూర్ మీదుగా కాకుండా వటువర్లపల్లి, దోమలపెంట మీదుగా రోడ్డు వేశారు. దీంతో పట్టించుకునే వారు లేక ఆదరణ కరువైంది. ఆదివాసి సాంప్రదాయాలను కాపాడాలనే ఉద్ధేశంతో 2016లో అన్ని చెంచుపెంటలు, గ్రామాల్లో ప్రచారం కల్పించారు. దీంతోపాటు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత చెంచు గిరిజనులు గిరిజన సంక్షేమశాఖ మంత్రిని కలిసి ఇక్కడి పరిస్థితి వివరించడంతో నాటి నుంచి ప్రభుత్వం అధికారికంగా ఈ పండుగ నిర్వహిస్తోంది. ● రెడ్డిరాజులు, చాళక్యులు, ఈక్ష్వాకుల కాలంలో భౌరాపూర్ చెరువు వద్ద భ్రమరాంబిక అమ్మవారి ఆలయ నిర్మాణం జరిగినట్లు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఆలయానికి ఎదురుగా చెరువు కట్టపై వీరభద్రుడు, మూడుకిలోమీటర్ల దూరంలో నైరుతి వైపున వంటి వీరన్న (వీరభద్రుడు) వెలిశారు. దీంతో ఆ ప్రాంతమంతా పుణ్యక్షేత్రంగా మారింది. ఆలయ నిర్మాణం జరగడంతో మహాశివరాత్రి రోజున శ్రీశైలంలో ఉత్సవాలు ఎంత ఘనంగా జరుగుతాయో భౌరాపూర్ జాతర కూడా చెంచుల సాంప్రదాయాలతో వైభవంగా నిర్వహించేవారు. శ్రీశైలం వెళ్లే భక్తులతో పాటు నల్లమల చెంచులు జాతరలో పాల్గొని తమ సాంప్రదాయాలు, సంస్కతిని కొనసాగించేవారు. భౌరాపూర్ భ్రమరాంబిక మల్లికార్జునస్వామి ఆలయం 14న శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు స్వాగతోపన్యాసం.. సాయంత్రం 4 నుంచి అర్ధరాత్రి 12 వరకు చెంచుల సంస్కతి ఉట్టిపడేలా సాంస్కతిక కార్యక్రమాలు, చెంచుల ఆట పాట, శివనామస్మరణ, జాగరణ, సాంప్రదాయ నత్యాలు. 15న ఆదివారం ఉదయం 8 నుంచి 9.55 వరకు అల్పాహారం, 10 నుంచి 11 వరకు ముఖ్యఅతిథులకు స్వాగతం, వేదపండితులతో గణపతిపూజ, రుద్రహోమం, అభిషేకం, అంకురార్పణ అనంతరం 11 గంటలకు భ్రమరాంబ, మల్లికార్జునస్వామి కల్యాణం. 16న అమ్మవారు, స్వామివారికి ప్రత్యేక పూజలు, జాతర ముగింపు కార్యక్రమాలు ఉంటాయి. ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వ శాఖల ద్వారా స్టాల్స్ ఏర్పాటు చేసి అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తారు. నల్లమల చెంచులతో పాటు నల్లగొండ, రంగారెడ్డి, వికారాబాద్, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చెంచులు, ఇతర సామాజిక వర్గాల ప్రజలు కూడా అధిక సంఖ్యలో వస్తారు. 15న భ్రమరాంబిక, మల్లన్న కల్యాణం పులకించనున్న అడవి తల్లి వివిధ జిల్లాల నుంచి చెంచుల రాక ఏర్పాట్లు పరిశీలిస్తున్న అధికారులు జాతరకు వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ అధికారులు బస్సులు నడుపుతారు. అమ్రాబాద్ మండలం మన్ననూర్ దగ్గర ఉన్న ఫర్హాబాద్ చౌరస్తా వద్ద అటవీశాఖ ఏర్పాటు చేసిన చెక్పోస్టు ప్రధాన రహదారి నుంచి 15 కిలోమీటర్లు అటవీ ప్రాంతంలో ప్రయాణం చేయాలి. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేవారు శ్రీశైలం నుంచి ఫర్హాబాద్ చౌరస్తా చెక్పోస్టు వద్దకు వచ్చి అటవీ మార్గంలో భౌరాపూర్ చేరుకోవచ్చు. అప్పాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఉండటంతో ప్రత్యేక అధికారి, కార్యదర్శి, ఆలయ కమిటీ ఉత్సవ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కలెక్టర్ ఆధ్వర్యంలో ఐటీడీఏ పీఓ వివిధ శాఖల అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ప్లాస్టిక్ వినియోగించకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఆలయ అలంకరణ, విద్యుద్ధీకరణ, వైద్యసేవలు, 108, ఫైరింజన్లు, తాత్కాలిక మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం తదితర మౌలిక వసతులు కల్పించడంతో పాటు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అటవీ, పోలీస్శాఖ సమన్వయంతో పర్యవేక్షించనున్నారు. అవసరమైన చోట సీసీ కెమెరాలు, మార్గమధ్యంలో పెంటల వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటు కానున్నాయి. -
విద్యుదాఘాతంతో బాలుడి మృతి
● ఇందిరమ్మ ఇంటికి నీళ్లు పడుతుండగా ఘటన బిజినేపల్లి: నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇంటికి నీళ్లు పడుతుండగా కరెంట్ షాక్కు గురై ఓ బాలుడు మృతిచెందాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని వెల్గొండ గ్రామంలో పంచాయతీలో పనిచేస్తున్న శశికళ అనే కార్మికురాలు ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటుంది. కొత్తగా కట్టిన గోడకు నీళ్లు పట్టిన తర్వాత ఆమె కుమారుడు ఉపేందర్(14) మోటార్ స్విచ్ ఆఫ్ చేయడానికి ఫ్లగ్ తీయబోయాడు. అప్పటికే నీటితో మోటార్ బోర్డు తడవడంతో ఎర్త్ వచ్చి బాలుడు అక్కడికక్కడే పడిపోయి చనిపోయాడు. కొద్ది సంవత్సరాల క్రితమే తండ్రి రాములు కూడా మరణించడంతో ఆ ఇంటిలో విషాదచాయలు అలుముకున్నాయి. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి మరికల్: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతిచెందిన ఘటన తీలేర్ స్టేజీ సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్కు చెందిన సయ్యద్గౌస్(45) ఊట్కూర్ మండలం పగిడిమారిలో తనకు కూతురును చూసేందుకు బుధవారం సాయంత్రం హైదరాబాద్లో నారాయణపేట డిపో బస్సు ఎక్కాడు. అప్పటికే మద్యంతాగి ఉండడంతో బస్సుల్లో అల్లరి చేయడంతో మరికల్ మండలం తీలేర్ స్టేజీ సమీపంలో రాత్రి 10గంటల సమయంలో బస్సును నిలిపి దింపేశారు. రోడ్డుపై ఎక్కడికి వెళ్లాలో తెలియక రోడ్డుపై అక్కడిక్కడా తిరుగుతుండగా గుర్తు తెలియని వాహనం వేగంగా ఢీకొన్నడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. మృతాదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని మృతుడి వద్ద ఉన్న ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం ఇ చ్చారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ ఎల్లయ్య తెలిపారు. యువకుడి ఆత్మహత్య హన్వాడ: మండలంలోని పెద్దర్పల్లికి చెందిన యువకుడు కడుపునొప్పి భరించలేక ఆత్మహత్యకు చేసుకున్నట్లు ఎస్ఐ వెంకటేశ్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకార.. గ్రామానికి చెందిన బోయిని శివరాజు(30) గతేడాదిగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. బుధవారం రాత్రి కడుపునొప్పి తీవ్రమవడంతో ఇంట్లోని మరో గదిలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుర్తించిన కుటుంబీకులు జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతుడికి భార్య ముగ్గురు పిల్లలున్నారు. మృతుడి అన్న బోయిని కృష్ణయ్య ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. రోడ్డుప్రమాదంలో యువకుడు మృతి గోపాల్పేట: ద్విచక్రవాహనం అదుపుతప్పి యువకుడు మృతిచెందిన ఘటన రేవల్లి మండలంలోని గొల్లపల్లి గేటు సమీపంలో చోటుచేసుకుంది. రేవల్లి ఎస్ఐ రజిత కథనం ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా వెన్నచెర్లకు చెందిన వంగూరి కురుమూర్తి(31) వనపర్తి నుంచి వెన్నచర్లకు సాయంత్రం ఏడుగంటల సమయంలో వెళ్తుండగా గొల్లపల్లి గేటు సమీపంలో మలుపువద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడ్డాడు. స్థానికులు గమనించి అంబులెన్స్లో ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇదే విషయంపై గురువారం కురుమూర్తి తల్లి శంకరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. వ్యక్తి బలవన్మరణం ఉండవెల్లి: మండలంలోని బొంకూరుకు చెందిన వ్యక్తి మద్యం మత్తులో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కర్ణ(31) కొన్నేళ్లుగా మతిస్థిమితం లేక పిచ్చిపిచ్చిగా ప్రవర్తించేవాడు. బుధవారం రాత్రి 10గంటల సమయంలో ఇంట్లో ఎవరూలేని సమయంలో మద్యం మత్తులో తాడుతో ఊరేసుకున్నాడు. ఉదయం తల్లి వెళ్లి చూడగా.. ఉరేసుకుని ఉండగా చుట్టుపక్కల వారిని పిలిచి చూడగా అప్పటికే మృతిచెందాడు. పోలీసులు పరిశీలించి పోస్టుమార్టంకు తరలించారు. గురువారం తల్లి బోయ నాగమ్మ ఫిర్యాదు మేరకు ఎస్ఐ శేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతి చెందిన వ్యక్తికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని సమాచారం. తెల్లరాళ్లపల్లితండాలో విషాదఛాయాలు పాన్గల్: హైదరాబాద్–కల్వకుర్తి ప్రధాన రహదారిపైన వెల్దండ మండలంలోని కొట్ర రెవెన్యూ శివారులో శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్తూ బుధవారం ట్రాక్టర్, ఆటో ఢీకొన్న ఘటనలో మండలంలోని తెల్లరాళ్లపల్లితండాకు చెందిన కేతావత్ సురేష్ మృతి చెందడంతో తండాలో విషాదఛాయాలు అలుముకున్నాయి. గురువారం స్వగ్రామమైన తండాకు మృతదేహాన్ని తీసుకరావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించడం పలువురిని కంటతడి పెట్టించింది. మృతుడు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తూ హైదరాబాద్లోని బీరంగూడలో నివాసం ఉంటున్నాడు. మృతుడికి భార్య సౌమ్య, 8 ఏళ్ల బాబు ఉన్నాడు. బాధిత కుటుంబాన్ని గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి బాల్యనాయక్, తండా సర్పంచ్ ఉషాలింగానాయక్ పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
ఓట్లు రీకౌంటింగ్కు సమయం
● అంతలోపే కారణాలు చూపి లెటర్ అందించాలి ● ఫలితం ప్రకటిస్తే రిటర్నింగ్ అధికారి చేసేదేమీ ఉండదు కబడ్డీ ఆడుతున్న క్రీడాకారులు కల్వకుర్తి టౌన్: బ్యాలెట్ బాక్సులో ఒకసారి లెక్కించిన ఓట్లను మళ్లీ లెక్కించటం అంటూ ఉండదు. నమోదైన ప్రతిఓటు చెల్లుబాటు ఓటే, అది చెల్లదనే విషయానికి, వివాదానికి తావులేదు. పోలింగ్ స్టేషన్ ఓటింగ్ ఫలితాన్ని కొంతమంది అభ్యర్థులు, వారి ఏజెంట్లు రాసి పెట్టుకొని ఉండాలి. ఏజెంట్లతోపాటు అభ్యర్థులకు ఏదైనా సందేహం వచ్చి, లెక్కింపులో ఏదైనా తేడా కనిపిస్తే వెంటనే రీకౌంటిగ్ చేయాలని రిటర్నింగ్ అధికారికి లిఖితపూర్వక అభ్యర్థనను ఇవ్వాల్సి ఉంటుంది. ● ఓట్లు మొత్తం లెక్కించిన తర్వాత రిటర్నింగ్ అధికారి తుది ఫలితం షీటులో నమోదైనట్లు, ప్రతి అభ్యర్థి పొందిన మొత్తం ఓట్ల సంఖ్యను ప్రకటిస్తాడు. అలా ప్రకటన జరిగాక అభ్యర్థి, ఏజెంట్, కౌంటింగ్ ఏజెంట్లలో ఏ ఒక్కరైనా పోలింగ్ స్టేషన్లో నమోదైన ఓట్లను మళ్లీ లెక్కించాలని లిఖితపూర్వకంగా అందుకు కారణాలను వివరిస్తూ అభ్యర్థన ఇవ్వాలి. ● ఎన్నికల సంఘం జారీచేసిన మార్గదర్శక సూత్రాలు ఆధారంగా ఎన్నికల నిర్వహణ నియామవళి ప్రకారం రిటర్నింగ్ అధికారి మళ్లీ ఓట్ల లెక్కింపునకు నిర్ణయం తీసుకుంటారు. ● రిటర్నింగ్ అధికారి ఓట్ల రీకౌంటింగ్, లిఖిత అభ్యర్థన ఇచ్చేందుకు కచ్చితంగా సమయం, నిమిషాలను ప్రకటిస్తారు. అంతలోపు ఏదైనా అభ్యర్థన వస్తే పరిశీలించి సహేతుకమైతే నిర్ణయం తీసుకుంటారు. ● రిటర్నింగ్ అధికారి ఫైనల్ ఫలితం షీట్ను పూర్తిచేసి సంతకం చేశాక ఎలాంటి అభ్యర్థనకు హక్కు ఉండదు. -
నేటినుంచి ఎస్జీఎఫ్ క్రికెట్ టోర్నీ
● ఉమ్మడి జిల్లాల నుంచి పాల్గొనున్న అండర్–17 బాలుర జట్లు ● మూడు మైదానాల్లో 24మ్యాచ్ల నిర్వహణకు ఏర్పాట్లు జడ్చర్ల టౌన్: జడ్చర్లలో శుక్రవారం జరగనున్న ఎస్జీఎఫ్ అండర్–17 బాలుర రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉమ్మడి పది జిల్లాల నుంచి 10జట్లు పాల్గొంటున్న టోర్నీలో మొత్తం 24మ్యాచ్లు జరగనున్నాయి. ఇందుకు పట్టణంలో జడ్చర్ల మినీస్టేడియం, బాదేపల్లి బాలుర జెడ్పీహైస్కూల్, స్వామి నారాయణ గురుకుల పాఠశాలలోని మైదానాలు సిద్ధం చేశారు. నాలుగు రోజులపాటు జరిగే టోర్నీలో 20లీగ్మ్యాచ్లు, 2 సెమీఫైనల్ మ్యాచ్లు, మూడో స్థానం కోసం ఒకమ్యాచ్, ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. టోర్నీకి ఇప్పటికే స్వామినారాయణ గురుకుల పాఠశాలలోని మైదానంలో మ్యాట్ను సిద్ధం చేశారు. జడ్చర్ల మినీస్టేడియంలో ఇప్పటికే జేఏఆర్ ప్రీమియం లీగ్ నడుస్తుండడంతో టోర్నీకి గ్రౌండ్ సిద్ధంగానే ఉంది. బాదేపల్లి జెడ్పీ హైస్కూల్లోని కింది మైదానాన్ని టోర్నీలోని మ్యాచ్లకు తీర్చిదిద్దుతున్నారు. టోర్నీ ముగిశాక ఏప్రిల్లో జాతీయ పోటీలు జడ్చర్లలోనే నిర్వహించనున్నారు. రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండర్–17 బాలుర క్రికెట్ టోర్నీకి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. జడ్చర్ల మినీస్టేడియం, బాదేపల్లి బాలుర జెడ్పీహైస్కూల్ మైదానం, స్వామి నారాయణ గురుకుల పాఠశాల మైదానంలో నాలుగురోజులపాటు క్రీడలు నిర్వహిస్తున్నాం. మొత్తం 10 ఉమ్మడి జిల్లాల నుంచి జట్లు టోర్నీలో పాల్గొంటున్నాయి. మొత్తం 24 మ్యాచ్లు ఉండగా 20లీగ్మ్యాచ్లు, 2 సెమిఫైనల్లు, ఒకటి మూడో స్థానం కోసం, తర్వాత ఫైనల్ మ్యాచ్ పెడుతున్నాం. – మంజులాదేవి, ఎస్జీఎఫ్ క్రికెట్ టోర్నీ కో ఆర్డినేటర్ -
స్వామివారి సేవలో..
మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైల మల్లన్నకు పట్టువస్త్రాల తయారీలో తాను పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నా. స్వామివారి సేవలో పట్టువస్త్రాలను నియమ నిష్టలతో ఉపవాస దీక్ష చేపట్టి తయారు చేస్తున్నాం. ఇలాంటి అదృష్టం దక్కడం ఎంతో ఆనందంగా ఉంది. – సత్యనారాయణ, అమరచింత శ్రీశైల మల్లన్నకు పట్టువస్త్రాల తయారీ పనుల్లో పాల్గొనేందుకు ప్రతి సంవత్సరం వెళ్తున్నాను. ఇలా స్వామివారి సేవలో తరించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. శరీరంలో శక్తి ఉన్నంత వరకు పట్టువస్త్రాల తయారీ పనుల్లో పాల్గొంటాను. – శ్రీను, అమరచింత -
శ్రీశైల మల్లన్నకు పట్టువస్త్రాలు
అమరచింత: మహాశివరాత్రికి శ్రీశైల మల్లికార్జునస్వామి, భ్రమరాంబికదేవిలకు అమరచింత పద్మశాలిలు పట్టువస్త్రాలను అందించే పనులకు శ్రీకారం చుట్టారు. ఇందుకు గాను శ్రీశైల క్షేత్రంలోని పద్మశాలి భవన్లో ప్రత్యేకంగా మగ్గం వేసుకుని నేత పనులను ప్రారంభించిన పద్మశాలీలు తాము కొలిచే దేవేర్లకు పట్టువస్త్రాలను సమర్పించేందుకు నేత పనులను చేపట్టారు. వారం రోజుల్లో వీటిని పూర్తిచేసి మహాశివరాత్రి రోజు ఆలయ ఈఓకు అప్పగించనున్నారు. కొన్ని వందల ఏళ్లుగా వస్తున్న ఆచారం ప్రకారం ప్రతి ఏటా వీటిని కొనసాగిస్తున్నట్లు పద్మశాలి సంఘం సభ్యులు తెలిపారు. మల్లన్నకు కానుకగా.. శ్రీశైల మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా కానుకగా పట్టువస్త్రాలను తయారు చేసి అందిస్తున్నారు. భక్త మార్కండేయస్వామి పద్మశాలిలకు కులదైవం కావడంతో ఆయన కొలిచే శివయ్యకు తమవంతు నైవేద్యరూపకంగా పట్టువస్త్రాలను అందిస్తున్నట్లు వెల్లడించారు. గతంలో ఇక్కడే పట్టువస్త్రాలను తయారు చేసి శ్రీశైలం తీసుకెళ్లి అందించేవారమని ప్రస్తుతం శ్రీశైల క్షేత్రంలోని పద్మశాలి భవన్లో మగ్గం ఏర్పాటు చేసుకొని పట్టువస్త్రాలను అక్కడే తయారు చేస్తున్నట్లు చెప్పారు. పట్టణంలోని శివచౌడేశ్వరి ఆలయాన్ని నిర్మించిన మహంకాళి గంగ, శ్రీనివాసులు సోదరులు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం పట్టువస్త్రాల తయారీకి అయ్యే ఖర్చులను భరిస్తున్నారు. స్వామివారి సేవలో అమరచింత పద్మశాలీలు మహాశివరాత్రి నాటికి అందించేలా తయారీ పనులు వందల ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం -
క్రీడాపోటీలు
ఉత్సాహంగా మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో గురువారం జిల్లాస్థాయి క్రీడాపోటీలు ఉత్సాహంగా జరిగాయి. మొదటి రోజు బాల బాలికలకు అథ్లెటిక్స్, కబడ్డీ, బేస్బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్, నెట్బాల్, క్యారమ్, చెస్, సాఫ్ట్బాల్, కిక్బాక్సింగ్ పోటీలు జరిగాయి. క్రీడాకారులు పోటాపోటీగా తలపడ్డాయి. రెండు రోజు నేడు (శుక్రవారం) ఫుట్బాల్, హ్యాండ్బాల్, ఖోఖో, బాస్కెట్బాల్, బాల్ బ్యాడ్మింటన్, కరాటే, జూడో పోటీలు జరగనున్నాయి. ● మహిళల కబడ్డీలో జడ్చర్ల ప్రథమ, మహబూబ్నగర్ ద్వితీయ, పురుషుల్లో జడ్చర్ల ప్రథమ, దేవరకద్ర ద్వితీయ, నెట్బాల్ మహిళల్లో మహబూబ్నగర్ అర్బన్ ప్రథమ, మహబూబ్నగర్ రూరల్ ద్వితీయ, పురుషుల్లో మహబూబ్నగర్ అర్బన్ ప్రథమ, మహబూబ్నగర్ రూరల్ ద్వితీయ, సాఫ్ట్బాల్ మహిళల్లో మహబూబ్నగర్ అర్బన్ ప్రథమ, మహబూబ్నగర్ రూరల్ ద్వితీయ, పురుషుల్లో మహబూబ్నగర్ రూరల్ ప్రథమ, మహబూబ్నగర్ అర్బన్ ద్వితీయ, బేస్బాల్ మహిళల్లో మహబూబ్నగర్ అర్బన్ ప్రథమ, మహబూబ్నగర్ రూరల్ ద్వితీయ, మహబూబ్నగర్ అర్బన్ ప్రథమ, మహబూబ్నగర్ రూరల్ ద్వితీయ, క్యారమ్స్ మహిళల్లో అర్చన ప్రథమ, డబుల్స్లో చందన–విజయలక్ష్మి ప్రథమ, బాలురలో మహ్మద్ జాబేర్ ప్రథమ, డబుల్స్లో శ్రీకాంత్–ప్రతీక్ ప్రథమ, చెస్ బాలికల్లో లాస్యశ్రీ ప్రథమ, ఆయేఝా జబీన్ ద్వితీయ, బాలురలో హవేష్రెడ్డి ప్రథమ, భానుప్రకాశ్ ద్వితీయ, బ్యాడ్మింటన్ 15 ఏళ్ల విభాగం బాలికల్లో రిషిత ప్రథమ, సర్వఘ్న ద్వితీయ, బాలురలో శివకుమార్ ప్రథమ, సహష్రద్ ద్వితీయ....అనంతరం గెలుపొందిన వారికి ట్రోఫీలు, మెడల్స్ అందజేశారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్, జిల్లా యువజన, క్రీడలశాఖ సూపరింటెండెంట్ రాజ్గోపాల్, సీనియర్ అసిస్టెంట్ రవీందర్రెడ్డి, డీఎస్ఏ కోచ్లు సునీల్కుమార్, పర్వేజ్పాష, ఖలీల్, రాజ్గోపాల్, అంజద్, పీడీలు వేణుగోపాల్, జగన్మోహన్గౌడ్, శ్రీనివాస్రెడ్డి, అయూబ్ఖాన్, ఆంజనేయులుగౌడ్, సాదత్ఖాన్, వడెన్న, బాల్రాజ్, రామేశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. -
ముందుగా పోస్టల్ ఓట్ల లెక్కింపు
● అధికారిక కవర్లో లేకుంటే తిరస్కరణ ● మొత్తం వీడియో చిత్రీకరణ కల్వకుర్తి టౌన్: కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. తొలుత రిటర్నింగ్ అధికారి పోస్టల్ బ్యాలెట్ పత్రాల లెక్కింపు చేపడతారు. అరగంట వెసులుబాటు అనంతరం ఓట్ల లెక్కింపును అధికారులు ప్రారంభిస్తారు. ● పోస్టల్ బ్యాలెట్ పత్రాల లెక్కింపునకు ప్రత్యేక టేబుల్ ఏర్పాటు చేస్తారు. సహాయ రిటర్నింగ్ అధికారి సహకారంతో రిటర్నింగ్ అధికారి బాధ్యత వహిస్తారు. ● ఓటరు నుంచి వచ్చే ప్రతి పోస్టల్ బ్యాలెట్ పత్రం, ఫారం–13బి లోపల ఉంచిన కవర్లో ఉంటుంది. ఈ కవర్, ఫారం–13ఏలో ఎలక్టర్ చేసిన డిక్లరేషన్తో పాటు మరో పెద్ద కవర్లో ఉంటుంది. ఈ పెద్ద కవర్ ఫారం–13సిలో ఉండి రిటర్నింగ్ అధికారి చిరునామాపై ఉండాలి. ● లెక్కింపు ప్రారంభానికి అనగా ఉదయం 8 తర్వాత వచ్చే ఏ పోస్టల్ బ్యాలెట్ పత్రం కలిగిన ఫారం–13సి కవర్ను రిటర్నింగ్ అధికారి తెరవరు. ఫారం–13సిలో ఉన్న పై కవర్ మీద నోట్ రాస్తారు. ఈ కవర్లలోని ఓట్లను లెక్కించటం జరగదు. అలాంటి కవర్లన్నింటిని ఓ ప్యాకెట్గా చేసి సీలు చేస్తారు. ● పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు, కవర్లు అన్ని సరిచూసిన తర్వాతే రిటర్నింగ్ అధికారి దాని చెల్లుబాటును నిర్ణయిస్తారు. ● పోస్టల్ బ్యాలెట్పై ఓటు నమోదు కాని పక్షంలో ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులకు ఓటు నమోదు చేసినా, తప్పు బ్యాలెట్ పేపర్ అయినా, బ్యాలెట్ పత్రం పూర్తిగా చిరిగిపోయినా, ఎలక్టర్కు పంపిన కవర్లో దాన్ని తిరిగి పంపకపోయినా, నమోదు చేసిన గుర్తు ఏ అభ్యర్థికి ఓటువేశారో నిర్ధారణ కాకుండా సందేహం కలిగించే విధంగా ఉన్నా, ఓటరును గుర్తించే ఏ గుర్తుగాని, రాతగాని బ్యాలెట్ పత్రం రాసి ఉంటే చెల్లని ఓటుగా తిరస్కరిస్తారు. ● చెల్లని ఓట్లను, ప్రతి అభ్యర్థికి వచ్చిన ఓట్లను లెక్కించి ఫారం–20లో ఫలితం నమోదు చేస్తారు. ● పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపైనే అభ్యర్థి గెలుపు నిర్ధారితమయ్యే సందర్భంలో రిటర్నింగ్ అధికారి అనివార్యంగా వాటిని మళ్లీ ధ్రువీకరణ జరిపి ప్రతి అభ్యర్థి పక్షాన లెక్కింపబడిన ఓట్లను మరోసారి పరిశీలించి సంఖ్య సరిపోయిందా లేదా చూసి ఫలితానికి తుది రూపం ఇస్తారు. ● మళ్లీ లెక్కింపు జరిగినప్పుడు రహస్య భగ్నం కాని విధంగా మొత్తం వీడియో చిత్రీకరణ చేస్తారు. దాని సీడీ, క్యాసెట్ను భద్రపరుస్తారు. -
ఎవరి ధీమా వారిదే..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పురపాలక ఎన్నికలు ముగిశాయి. బుధవారం పోలింగ్ జరగగా.. శుక్రవారం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. గెలుపోటములపై కార్పొరేటర్/కౌన్సిలర్ అభ్యర్థులు, రాజకీయ పక్షాలతో పాటు ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ మేరకు ఆయా ప్రధాన రాజకీయ పార్టీల ముఖ్య నేతలు గురువారం డివిజన్ల వారీగా అభ్యర్థులు, ముఖ్య నాయకులతో కలిసి గెలుపోటలములపై అంచనాలు వేశారు. ప్రచారం, పోలింగ్ రోజున కలిసి వచ్చినవి, ఏయే డివిజన్లలో వెనుకబడ్డాం వంటి అంశాలను బేరీజు వేసుకుంటూ ఫలితాలు ఎలా వస్తాయనే లెక్కల్లో మునిగారు. ఎగ్జిట్ పోల్స్, సర్వే అంచనాలతో.. పోలింగ్ అనంతరం విడుదలైన పలె ఎగ్జిట్ పోల్స్తో పాటు ఆయా పార్టీలు స్వయంగా చేయించుకున్న సర్వేల ఫలితాలను విశ్లేషిస్తూ లెక్కలు కట్టినట్లు తెలుస్తోంది. మహబూబ్నగర్ కార్పొరేషన్లో ఒకటి (కాంగ్రెస్) ఏకగ్రీవం పోనూ 59 డివిజన్లపై అధికార కాంగ్రెస్ నేతలు ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక్కడ మెజార్టీ సీట్లు తమకే వస్తాయని.. దీంతో పాటు జిల్లాలోని దేవరకద్ర, భూత్పూర్ మున్సిపాలిటీల్లో అత్యధిక స్థానాలు తమవేనని ఆ పార్టీ ముఖ్య నేతలు ఆశాభావంతో ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత కార్పొరేషన్ పరిధిలో చోటుచేసుకున్న పరిణామాలు.. గెలుస్తామనుకున్న చోట మారిన తీరుపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు డివిజన్ల వారీగా విళ్లేషించినట్లు సమాచారం. జిల్లాలోని మూడు పురపాలికల్లోనూ ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని బీఆర్ఎస్, సత్తా చాటుతామని బీజేపీ ముఖ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మెజార్టీ మాదే.. మహబూబ్నగర్లోని కార్పొరేషన్తో పాటు దేవరకద్ర, భూత్పూర్ మున్సిపాలిటీల్లో మెజార్టీ మాదే. సీఎం రేవంత్రెడ్డి ఉమ్మడి జిల్లాకు అత్యం ప్రాధాన్యం ఇవ్వడం.. వందలాది కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేపట్టడం కలిసి వస్తుంది. – యెన్నం శ్రీనివాస్రెడ్డి, మహబూబ్నగర్ ఎమ్మెల్యే – జి.మధుసూదన్రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే -
ఓట్లు సమానంగా వస్తే..
పాలమూరు: మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు దేవరకద్ర, భూత్పూర్ మున్సిపాలిటీలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ శుక్రవారం పాలమూరు యూనివర్సిటీలో నిర్వహించనున్నారు. ఇందుకోసం పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్న నేపథ్యంలో మధ్యాహ్నం వరకు పూర్తి చేసి విజేతలను ప్రకటించనున్నారు. గురువారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయేందిర బోయి, అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, మున్సిపల్ కమిషనర్ రామానుంజులరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కౌంటింగ్ సిబ్బందితో పాటు రిటర్నింగ్ అధికారులకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. ● మహబూబ్నగర్ కార్పొరేషన్లో మొత్తం 59 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించారు. 67.73శాతం పోలింగ్ కాగా 1,31,765 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 59 డివిజన్లకు కలిపి మొత్తం 30 టేబుల్స్ ఏర్పాటు చేసి ఒక్కో టేబుల్కు ఐదుగురు సిబ్బందిని కేటాయించారు. మొత్తం 150 మంది ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయగా వీరు ఒక్కో టేబుల్పై రెండు డివిజన్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఒక్కో రౌండ్లో వెయ్యి ఓట్లు లెక్కించనున్నారు. మొత్తం 59 డివిజన్లలో 3 వేల ఓట్లలోపే పోలింగ్ జరిగిన నేపథ్యంలో మూడు రౌండ్లలో లెక్కింపు ప్రక్రియ పూర్తి కానుంది. కొన్ని డివిజన్లలో రెండు రౌండ్లలోనే ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. భూత్పూర్ మున్సిపాలిటీలో 10 వార్డులు ఉండగా 40 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు కోసం 10 టేబుల్స్ ఏర్పాటు చేసి 30 మంది లెక్కింపు సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్పై వెయ్యి ఓట్లు లెక్కింపు చేయనున్న నేపథ్యంలో ఒకే రౌండ్లో పూర్తయ్యే అవకాశం ఉంది. అలాగే దేవరకద్ర మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా 40 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 12 టేబుల్స్ ఏర్పాటు చేసి ఒక్కో టేబుల్కు ముగ్గురు సిబ్బంది చొప్పున మొత్తం 36 మందిని నియమించారు. 12 వార్డుల్లో వెయ్యిలోపే ఓట్లు ఉన్న నేపథ్యంలో ఒకే రౌండ్లో పూర్తి చేసి ఫలితాలు ప్రకటించనున్నారు. కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో ఒకే వార్డులో ఇద్దరు అభ్యర్థులకు ఓట్ల లెక్కింపులో ఓట్లు సమానంగా వస్తే అధికారులు డ్రా.. లేదా టాస్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒకటి రెండు చోట్ల సమానంగా వస్తే డ్రా ద్వారా విజేతను ఎంపిక చేశారు. -
మన్యంకొండ హుండీ లెక్కింపు
● రూ.37.64 లక్షల ఆదాయం మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం హుండీ ఆదాయం రూ.37,64,907 ఆదాయం వ చ్చింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం ఈ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 10గంటలకు ప్రా రంభమైన ఈ లెక్కింపు సాయంత్రం 7 గంటలకు సాగింది. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి, ఇన్స్పెక్టర్ వీణ, ఐడీబీఐ మేనేజర్ మల్లిఖార్జున్, సత్యసాయి సమితి, మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు. -
77.96%
2020లో‘పుర’ ఎన్నికల్లో 0.52 శాతం తగ్గిన పోలింగ్ 78.48%2026లోసాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: గత పురపాలక ఎన్నికలతో పోలిస్తే ఉమ్మడి పాలమూరులో ఈసారి పోలింగ్ శాతం తగ్గింది. పదవీ కాలం ముగియని జడ్చర్ల, అచ్చంపేట.. కొత్తగా ఏర్పడిన దేవరకద్ర, మద్దూరు మినహాయించి మిగిలిన 17 మున్సిపాలిటీల్లో 2020లో మొత్తంగా 78.48 శాతం పోలింగ్ నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి. అవే పురపాలికల్లో తాజాగా జరిగిన ఎన్నికల్లో 77.96 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ఈ లెక్కన పోలింగ్ 0.52 శాతం మేర తగ్గినట్లు తెలుస్తోంది. ఎక్కడెక్కడ.. ఎలా అంటే.. మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా ఆవిర్భవించిన మహబూబ్నగర్లో గత ఎన్నికల్లో 67.17 శాతం మంది ఓటేశారు. ఈ ఎన్నికల్లో 67.73 శాతం పోలింగ్ నమోదు కాగా.. స్వల్పంగా 0.56 శాతం పెరిగింది. అదేవిధంగా వనపర్తి జిల్లాలోని కొత్తకోటలో 0.75, పెబ్బేరులో 0.60, అమరచింతలో 2.89, జోగుళాంబ జిల్లాలోని గద్వాలలో 0.47, అలంపూర్లో 1.15, వడ్డేపల్లిలో 0.02 శాతం పోలింగ్ పెరిగినట్లు స్పష్టమవుతోంది. గత ఎన్నికలతో పోలిస్తే నారాయణపేట జిల్లాలోని మక్తల్ మున్సిపాలిటీలో ఈ సారి అత్యధికంగా 4.04 శాతం పోలింగ్ తగ్గింది. అదేవిధంగా నారాయణపేటలో 0.75, కోస్గిలో 0.24, నాగర్కర్నూల్ జిల్లాలోని నాగర్కర్నూల్లో 2.91, కల్వకుర్తిలో 0.04, కొల్లాపూర్లో 1.32, జోగులాంబ గద్వాల జిల్లాలోని అయిజలో 2.37, మహబూబ్నగర్ జిల్లాలోని భూత్పూర్లో 1.54, వనపర్తి జిల్లాలోని వనపర్తిలో 1.45, ఆత్మకూరులో 0.53 శాతం మేర పడిపోయింది. 10 మున్సిపాలిటీల్లో తగ్గుదల.. మరో ఏడింటిలో పెరుగుదల అత్యధికంగా మక్తల్లో 4.04 శాతం మేర పడిపోయిన ఓటింగ్ అమరచింతలో 2.89 శాతం మేర పైకి.. -
ఓట్ల లెక్కింపు పారదర్శకంగా నిర్వహించాలి
● మాక్ కౌంటింగ్ ద్వారా సిబ్బందికి దిశానిర్దేశం చేసిన కలెక్టర్ జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఓట్ల లెక్కింపును పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయేందిర అన్నారు. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించిన కౌంటింగ్ సిబ్బందికి ఓట్ల లెక్కింపు ప్రక్రియపై గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మాక్ కౌంటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్ ట్రైనర్లు కౌంటింగ్ సూపర్వైజర్లకు, కౌంటింగ్ అసిస్టెంట్లకు మాక్ ఓట్ల లెక్కింపు శిక్షణ తరగతులు నిర్వహించి ప్రక్రియపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కౌంటింగ్ సిబ్బంది ఎన్నికల నిబంధనలపై పూర్తి అవగాహనతో విధులు నిర్వహించాలని, వార్డు వారీగా ఓట్ల లెక్కింపు క్రమబద్ధంగా జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పాలమూరు విశ్వవిద్యాలయంలో మహబూబ్నగర్ కార్పొరేషన్, భూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీలకు సంబంధించి మూడు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సిబ్బంది ఓట్ల లెక్కింపు రోజున ఉదయం 6 గంటల వరకు కేటాయించిన కౌంటింగ్ కేంద్రాలకు హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును ప్రారంభించి, అనంతరం పోలింగ్ కేంద్రాల వారీగా, వార్డుల వారీగా బ్యాలెట్ బాక్సులను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తెరవాలని సూచించారు. ప్రతి 25 ఓట్లను ఒక కట్టగా తయారు చేసి లెక్కించాలని సూచించారు. చెల్లిన ఓట్లను మాత్రమే సంబంధిత అభ్యర్థి గుర్తు ఉన్న బాక్సుల్లో వేయాలని, చెల్లని ఓట్లను గుర్తించి ప్రకటించే పూర్తి బాధ్యత రిటర్నింగ్ అధికారులదేనని స్పష్టం చేశారు. మొత్తం కౌంటింగ్ ప్రక్రియ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు లోబడి పారదర్శకంగా కొనసాగాలని ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, మూడంచెల భద్రత కల్పించినట్లు తెలిపారు. కౌంటింగ్ సందర్భంగా అభ్యర్థులకు, వారి ఏజెంట్లకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ఏవైనా అభ్యంతరాలు లేదా సందేహాలు తలెత్తిన పక్షంలో వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామిరెడ్డి, ఆర్డీఓ నవీన్, డీపీఓ వెంకట్ రెడ్డి, డీఈఓ ప్రవీణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్లు, మాస్టర్ ట్రైనర్లు బాలు యాదవ్ బైకాని శ్రీకాంత్, నాగరాజ్ పాల్గొన్నారు. -
కదం తొక్కిన కార్మిక లోకం
మహబూబ్నగర్ న్యూటౌన్: కేంద్రప్రభుత్వం కార్మికుల పట్ల వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా నిర్వహించిన సార్వత్రిక సమ్మెలో కార్మికులు కదం తొక్కారు. కేంద్ర కార్మిక సంఘాలు, రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె లో భాగంగా జిల్లాకేంద్రంలో వందలాది మంది కార్మికులు పాల్గొన్నారు. ఆర్అండ్బీ అతిథి గృహంలో సభ నిర్వహించిన అనంతరం ర్యాలీగా తెలంగాణ చౌరస్తాకు చేరుకొని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పలు కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభు త్వం అత్యంత ప్రమాదకరమైన లేబర్ కోడ్లు తెచ్చి కార్మికవర్గంపై యుద్ధం చేస్తుందని ఆరోపించారు. మోదీ ప్రభు త్వం వ్యవసాయ, పారిశ్రామిక రంగాన్ని దివాలా తీయించడానికి, కార్మికులను కట్టు బానిసలుగా మార్చడానికి కుట్రలు చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరించేందుకు, బ్యాంకులను కుదించడం, బీమా రంగంలో విదేశీ బహుళ జాతి కంపెనీలను ఆహ్వానించి దేశ సంపాదనను విదేశాలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తుందన్నారు. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తున్నారని, 8 గంటల పనిని పెంచడం, కనీస వేతనాలు లేకుండా యాజమాన్యాలు మోసం చేస్తున్నాయన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సురేష్, వివిధ సంఘాల నాయకు లు వెంకటేష్, జెట్టి రాజేష్, ఎన్.కిష్టయ్య, సి.కృష్ణయ్య, రాజేశ్వర్, కలమంద రామదాస్, విజయవర్ధన్ రాజు, పద్మ, యాదమ్మ, కడియాల మోహన్, మన్యం, వెంకట్ రాములు, కురుమయ్య, మారుతి, తిరుమల్రెడ్డి, కమర్ అలీ, బి.చంద్రకాంత్, రాజ్ కుమార్, సంతోష్, నవీన్ సాగర్ పాల్గొన్నారు. -
ఇల్లు దగ్ధం.. కాలిబూడిదైన నగదు, నగలు, సామగ్రి
ఆత్మకూర్: పట్టణంలోని డీకే రవి కాంప్లెక్స్లో ఉన్న ఓ ఇంట్లో బుధవారం వంట గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగి నగదు, నగలు, సామగ్రి కాలిబూడిదయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. బిజ్జారం గ్రామానికి చెందిన చంద్రశేఖర్గౌడ్ కుటుంబం 12 ఏళ్లుగా పట్టణంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం వంట చేస్తుండగా సిలిండర్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలతో సహ ఏడుగురు బయటకు పరుగులు తీశారు. మంటల్లో దుస్తులు, సామగ్రితో పాటు బీరువాలోని నగదు, నగలు కాలి బూడిదయ్యాయి. గుర్తించిన చుట్టుపక్కల వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. అప్పటికే ఇంట్లోని సామగ్రి బూడిదయ్యాయని కుటుంబ సభ్యులు రోధించారు, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. -
నల్లమల.. శివమయం
అచ్చంపేట: ఓం హరోం హరా..శంభో శంకరా..ఓం నమ!శివాయ.. అంటూ భక్తుల శిమనామస్మరణతో నల్లమల గిరులు మార్మోగుతున్నాయి. ఈనెల 8న ప్రారంభమైన శ్రీశైలేశుడి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, మాలధారులు తరలి వస్తున్నారు. కొందరు కాలినడకన శ్రీగిరి చేరుకుంటుండగా.. మరికొందరూ వాహనాల్లో వస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో పాదయాత్రగా శ్రీశైలం వైపు అడుగులు వేస్తున్నారు. భక్తుల శివనామస్మరణతో నల్లమల అటవీ ప్రాంతం మార్మోగుతుంది. ముందుగా పాతాళగంగలో ఫుణ్యస్నానాలు అచరించి భ్రయరాంబ, మల్లికార్జునస్వామిని దర్శించుకుంటున్నారు. రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వేలాదిమంది భక్తులు తరలివస్తున్నారు. కై లాసనాథుడిని దర్శించుకుని ఇరుముడులు, మొక్కులు చెల్లించుకుంటున్నారు. అంతా శివమయం.. అష్టాదశ మహాశక్తి పీఠాల్లో ఒక్కటైన భ్రరాంబమహాశక్తి పీఠం స్వయంభుగా వెలిసిన శ్రీశైలం కొండలపై కొలువుదీరిన మల్లికార్జునస్వామిని దర్శించుకునేందుకు లక్షలాదిమంది భక్తులు తరలి వస్తున్నారు. ఈనెల 15న ఆదివారం మహాశివరాత్రి కావడంతో భక్తులు ఇప్పటికే చేరుకున్నారు. వారం రోజులుగా శ్రీశైలంలోని క్యూలైన్లన్నీ భక్తులతో రద్దీగా కనిపిస్తున్నాయి. అచ్చంపేట నియోజకవర్గంలోని హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారితోపాటు మహబుబ్నగర్–శ్రీశైలం ప్రధాన రహదారి పూర్తి గా శివభక్తులతో నిండిపోయింది. రవాణా సౌకర్యాలున్నా ధట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో శివనామసంకీర్తనలు చేసుకుంటూ కాలినడకన కొండలు, గుట్టులు, బండరాళ్లు, ముళ్లకంపలను అడ్డుతొలగించుకుంటూ శ్రీశైలం చేరకుంటున్నారు. శ్రీశైలం బ్రహ్మోత్సవాలు, శివరాత్రి పురస్కరించుకుని ఉమ్మడి జిల్లాతోపాటు రంగారెడ్డి, హైదరాబాద్ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. కాలినడకన వెళ్లిన భక్తులు తిరుగు ప్రయాణం కోసం జిల్లా నుంచేకాక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి బస్సులు నడిపించేందుకు ఏర్పాట్లు చేశారు. అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి, నాగర్కర్నూలు, మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల, షాద్నగర్ డిపోల నుంచి బస్సులు నడిపించనున్నారు. ఈనెల13నుంచి రెండు బస్సుల చొప్పున పెంచుకుంటూ ఈనెల 16వరకు ఏ రోజుకారోజు బస్సుల సంఖ్య పెంచుతూ శుక్రవారం, మహాశివరాత్రి ఆదివారం, మరుసటి రోజు సుమారు జిల్లా నుంచి 300లకుపైగా బస్సులు నడిపించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసుకుంది. శ్రీశైలేశుడి చెంతకు శివమాలధారుల పాదయాత్ర అటవీదారి పొడవునా వైద్యశిబిరాలు, అన్నదానాలు -
మహదేవప్ప కుటుంబానికి కేంద్రమంత్రి పరామర్శ
● రూ.10 లక్షల ఆర్థిక సాయం చెక్కు అందజేత మక్తల్/మాగనూర్: మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహదేవప్ప కుటుంబాన్ని బుధవారం కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పరామర్శించారు. మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన మహదేవప్ప అధికార పార్టీ నాయకుల వేధింపుల నెపంతో మంగళవారం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పార్టీ తరపున బాధిత కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల ఆర్థిక సహాయం చెక్కును అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 6వ వార్డులో ఈ రోజు పండుగ వాతావరణం ఉండాల్సిన సమయంలో ఇలాంటి సంఘటన జరగడం బాధాకరం అన్నారు. కొంతకాలంగా మక్తల్ నుంచి మొదలుపెడితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికార పార్టీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల బరిలో నిల్చున్న మహిళా అభ్యర్థుల భర్తలను, యువకులను బెదిరించి పోలీస్టేషన్కు పిలిపించి కేసులు నమోదు చేయిస్తున్నారని, భూ రికార్డుల్లో మార్పులు, మధ్య తరగతి కుటుంబాల్లో రేషన్ కార్డులను తొలగిస్తామని భయబ్రాంతులకు గురిచేస్తూ ఉన్నారని దుయ్యబట్టారు. ఇతర పార్టీల అభ్యర్థులు ఎన్నికల్లో విత్డ్రా చేసుకుంటే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఆశ చూపిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఈ విధంగా జరగడం, అందరిని బెదిరించడం చాలా దురదృష్టకరం అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరిరోజు ర్యాలీలో కూడా పాల్గొని ఎంపీ డీకే అరుణతో గెలుపునకు చేరువలో ఉన్నానని చెప్పిన మహదేవప్ప అకాల మృతిచెందడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబానికి పార్టీ పరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ, నాయకులు నాగురావు నామోజీ, కొండయ్య పాల్గొన్నారు. -
తీర్పు రిజర్వ్..
ప్రశాంతంగా ముగిసిన మున్సి‘పోల్స్’ ● 19 పురపాలికల్లో మొత్తంగా 75 శాతం పోలింగ్ ● గద్వాల జిల్లాలో అత్యధికం.. మహబూబ్నగర్లో అత్యల్పం ● అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహాయిస్తే.. ● రేపు ఓట్ల లెక్కింపు.. అదే రోజు ఫలితాల వెల్లడి సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ : ఉమ్మడి పాలమూరులో పురపాలక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఐదు జిల్లాల పరిధిలోని ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీల్లో మొత్తం 373 డివిజన్లు/వార్డు స్థానాలకు బుధవారం పోలీసుల పటిష్ట బందోబస్తు మధ్య పోలింగ్ నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభమైనప్పటికీ.. 11 గంటల తర్వాతే ఓటర్ల రాక ఊపందుకుంది. నిర్దేశిత సమయం సాయంత్రం ఐదు గంటల వరకు మొత్తంగా 75 శాతం పోలింగ్ నమోదైంది. అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. ఓటరు తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో రిజర్వ్ కాగా.. శుక్రవారం ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటించనున్నారు. 14న మున్సిపాలిటీల్లో చైర్మన్/చైర్పర్సన్, వైస్ చైర్లన్లు.. కార్పొరేషన్లో మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకోనున్నారు. ఆ తర్వాత 16న పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. 35 మందిలో 16 మంది.. ఉమ్మడి జిల్లాలోని పుర పాలికల్లో ఇతన ఓటర్లు 35 మంది ఉన్నారు. వీరిలో 16 మంది మాత్రమే తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. పట్టణ మహిళల వెనుకంజ.. ఉమ్మడి జిల్లాలోని పోలింగ్ జరిగిన పురపాలికల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నా.. ఓటు హక్కు వినియోగంలో వారే వెనుకబడ్డారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మహిళా ఓటర్లు పోటెత్తగా.. పుర పోరుకు వచ్చేసరికి అతివలు ఓటుకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మహబూబ్గనర్, నాగర్కర్నూల్ జిల్లాలో సరాసరిగా పురుషులు, మహిళల ఓటింగ్ శాతం సమానంగా ఉండగా.. మిగతా జిల్లాల్లో ఒక్క శాతానికి పైగానే తేడా ఉంది.మున్సిపాలిటీల వారీగా పరిశీలిస్తే మహబూబ్నగర్, దేవరకద్ర, వనపర్తి, కొత్తకోట, పెబ్బేరు, అమరచింత, ఆత్మకూరు, గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి, నారాయణపేట, మక్తల్, మద్దూర్, కొల్లాపూర్లో మహళలు ఓటుకు దూరంగా ఉన్నారు. భూత్పూర్, కోస్గి, నాగర్కర్నూల్, కల్వకుర్తిలో మాత్రమే అతివల ఓటింగ్ శాతం పురుషుల కంటే కొంత మేర మెరుగ్గా ఉంది. బద్ధకించిన కార్పొరేషన్ ఓటర్లు.. జోగుళాంబ గద్వాల జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో అత్యధికంగా 78.22 శాతం పోలింగ్ నమోదు కాగా.. మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో అత్యల్పంగా 67.73 శాతం మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కార్పొరేషన్గా ఆవిర్భవించిన తర్వాత తొలి సారిగా జరుగుతున్న ఎన్నికలు కావడంతో నగర ఓటర్లు ఓటెత్తుతారని అందరూ భావించారు. ఇందుకు విరుద్ధంగా అత్యల్పంగా పోలింగ్ నమోదు కావడంతో ఈ ప్రభావం ఎవరిపై పడుతోందని రాజకీయ పార్టీల నేతలు డివిజన్ల వారీగా లెక్కల్లో మునిగారు. నాగర్కర్నూల్ 77.64 శాతంతో రెండు, వనపర్తి 75.56 శాతంతో మూడు, నారాయణపేట 74.04 శాతంతో నాలుగో స్థానంలో నిలిచాయి. -
పీయూకు బ్యాలెట్ బాక్సులు తరలింపు
● స్ట్రాంగ్రూంలను పరిశీలించిన కలెక్టర్ విజయేందిర పాలమూరు: మహబూబ్నగర్ కార్పొరేషన్, భూత్పూర్, దేవరకద్ర మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన తర్వాత సంబంధిత బ్యాలెట్ బాక్సులను పాలమూరు యూనివర్సిటీకి తరలించారు. వేరువేరు భవనాల్లో బ్యాలెట్ బాక్సులను భద్రపరిచారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలతో పాటు స్ట్రాంగ్ రూంలు, రిసెప్షన్ సెంటర్లను బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయేందిర బోయి, అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ పరిశీలించారు. ఒక కార్పొరేషన్, రెండు మున్సిపాలిటీలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు ప్రత్యేక భవనంలోని వేరు వేరు గదుల్లో భద్రపరిచారు. భద్రపరిచేందుకు బ్యాలెట్బాక్స్లను తీసుకెళ్తున్న సిబ్బంది -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
అడ్డాకుల: వివాహం నిశ్చయం కావడంతో పెళ్లి పనుల్లో భాగంగా ఇంటికి మరమ్మతులు చేయిస్తూ ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికై గురై యువకుడు మృతి చెందిన ఘటన మూసాపేట మండలం పోల్కంపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన జామ్ పాపమ్మ, చిన్న వెంకటయ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వెంకటయ్య మృతి చెందగా కుటుంబ బాధ్యతలను ప్రైవేటులో ఉద్యోగం చేసే కుమారుడు జామ్ రవికుమార్యాదవ్ చూస్తున్నాడు. ఇటీవల రవికుమార్కు వివాహం నిశ్చయమైంది. వచ్చే నెల పెళ్లి కూడా జరగాల్సి ఉంది. ఈ క్రమంలో ఇంటిలో మరమ్మత్తు పనులు చేయిస్తున్నారు. ఇందులో భాగంగా ఇంట్లో ప్లోరింగ్ వేయిస్తున్నారు. ఇందుకోసం క్యూరింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ తీగలకు తగిలి షాక్కు గురై కింద పడిపోయాడు. గమనించిన తల్లి చుట్టుపక్కల వారి సాయంతో కుమారుడిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు అక్కడి వైద్యులు ధ్రువీకరించారు. పెళ్లి చేసుకోవాల్సిన ఒక్కగానొక్క కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లి రోదనలు అందరినీ కలచి వేశాయి. తల్లి పాపమ్మ ఫిర్యాదు మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి ఎర్రవల్లి: జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన ఇటిక్యాల పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రవినాయక్ కథనం మేరకు.. మండల కేంద్రానికి చెందిన ఉప్పరి రామాంజనేయులు (33) సోమవారం రాత్రి తోళ్ల మడుగు సమీపంలో జాతీయ రహదారి దాటుతుండగా హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో అతడికి తీవ్ర రక్తగాయాలు కాగా స్థానికులు చికిత్స నిమిత్తం అంబులెన్స్లో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య గోవిందమ్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మంగళవారం మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని.. వనపర్తి రూరల్: పెబ్బేరు మండలం రంగాపురం శివారులో జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందినట్లు ఎస్ఐ యుగంధర్రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించామని.. మరిన్ని వివరాలకు పోలీస్స్టేషన్లో సంప్రదించాలని సూచించారు. -
‘బీఆర్ఎస్ అభ్యర్థులను భయపెడుతున్నారు’
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులను అధికార కాంగ్రెస్ పార్టీ పోలీస్ వ్యవస్థను చేతిలో పెట్టుకుని భయపెడుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన మహబూబ్నగర్లోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమ పార్టీ అభ్యర్థులను కొట్టడం, బెదిరించడం, ఇళ్ల మీదకు వెళ్లి కుటుంబ సభ్యులను హెచ్చరించడం వంటివి చేస్తున్నారని ఆరోపించారు. ఒక పార్టీకి సంబంధించి అభ్యర్థి స్వచ్ఛందంగా వచ్చి మద్దతు ఇస్తామని ముందుకు వచ్చిన అభ్యర్థులను పోలీసులు బెదిరిస్తున్నారన్నారు. ఇలాంటి అరాచక శక్తులకు ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికలను ఎన్నికల కమిషన్ చేతిలో లేకుండా అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు అధికారులు నడుకుకుంటున్నారని, ఇలాంటి వారిపై ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్కు పంపించామన్నారు. ఇప్పటికై నా ఎన్నికలు నిష్పక్షపాతంగా, సజావుగా నిర్వహించాలని కోరారు. తెలంగాణ పోలీస్ అంటేనే దేశంలో మంచి పేరు ఉండేదని, దానికి కొందరు అధికారుల తీరుతో చెడ్డపేరు వస్తుందన్నారు. అధికార పార్టీ నాయకుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నారని, ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఈ పరిస్థితి ఉండటం దారుణమన్నారు. కాంగ్రెస్, బీజేపీ జాతీయ స్థాయిలో కొట్లాడుతూ ఇక్కడ కలిసి పనిచేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో న్యాయవాదులు బెక్కం జనార్దన్, మనోహర్, కరుణాకర్గౌడ్, స్వదేశ్, మురళి, ఉమామహేశ్వరి, రవిప్రకాష్, శ్రీహరి, రామనాథ్గౌడ్, శ్రీరామ్కుమార్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. -
నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తాం: మంత్రి వాకిటి
నారాయణపేట/ మక్తల్: మహదేవప్ప ఆత్మహత్యపై నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తామని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. స్థానిక విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. మహదేవప్ప మృతిపై బీజేపీ నేతల మాటలు అత్యంత అమానవీయంగా ఉన్నాయన్నారు. మహదేవప్ప ఆత్మహత్యను రాజకీయాల కోసం బీజేపీ నేతలు వాడుకోవాలని చూడటం అనైతికమన్నారు. ఘర్షణ, ఫ్యాక్షన్ రాజకీయాలకు నేను వ్యతిరేకమన్నారు. చీమకు హాని చేయని వ్యక్తిత్వం తనదని, ఆరోగ్యకరమైన రాజకీయాలను కోరుకునే వాడినన్నారు. సర్పంచ్గా, జెడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా అంచెలంచెలుగా ఎదిగిన తాను రాజకీయ జీవితంలో ఏ ఒక్కరికి హాని తలపెట్టలేదన్నారు. మహదేవప్ప కుటుంబానికి అండగా నిలబడాల్సిన బీజేపీ నేతలు ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం తప్పుడు ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్ వ్యాఖ్యలు బాఽ ద్యత మరిచి మాట్లాడినట్లుగా ఉందన్నారు. మహ దేవప్ప ఆత్మహత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఒకవేళ నిరూపిస్తే దేనికై నా సిద్ధమని సవాల్ చేశారు. మహదేవప్ప ఆత్మహత్య విషయంలో మీడియా వాస్తవాలను చూపాలని కోరారు. -
మక్తల్లో బీజేపీ ఆందోళన
నారాయణపేట/ మక్తల్: మక్తల్ మున్సిపాలిటీలోని 6వ వార్డు బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు ముందుగానే మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిమిత్తం మృతదేహం తేవడంతోపాటు మహదేవప్ప భార్యతో ఫిర్యాదు తీసుకొని తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టించుకోవడం ఏమిటని డీఎస్పీతో రాష్ట్ర నాయకులు నాగూరావు నామోజీ, కొండయ్య, శంకరోళ్ల రవికుమార్ తదితరులు వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ పార్టీ నేతల బెదిరింపులకే ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. పోలీసులు తీసుకున్న ఫిర్యాదు పత్రం తమకు వెంటనే చూపించాలని డిమాండ్ చేశారు. డీఎస్పీతో వాగ్వాదానికి దిగిన బీజేపీ నాయకులు -
మక్తల్లో హై‘టెన్షన్’..!
మంత్రి వాకిటి ఇలాకాలో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యతో కలకలం ● తీవ్ర ఉద్రిక్తత.. 6వ వార్డులో ఎన్నిక వాయిదా ● బీజేపీ నాయకుల ఆందోళన ● బాధితులను పరామర్శించిన నాయకులు● నారాయణపేట డీఎస్పీ లింగయ్య, మక్తల్ సీఐ రాంలాల్, ఎస్ఐ భాగ్యలక్ష్మిరెడ్డి చందాపూర్కు చేరుకొని సంఘటన వివరాలను మహదేవప్ప భార్య సత్తెమ్మను అడిగి తెలుసుకున్నారు. మహదేవప్పకు చెందిన సెల్ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత మృతదేహాన్ని మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటనపై మహదేవప్ప కూతురుతో ఫిర్యాదు తీసుకోవడంతో బీజేపీ నాయకులు పోలీసులపై మండిపడ్డారు. భార్య ఉండగా కూతురుతో ఎందుకు తప్పుడు వివరాలతో ఫిర్యాదు తీసుకున్నారని బీజేపీ నాయకులు నాగూరావు నామోజీ, కొండయ్య, రతన్పాండురెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఫిర్యాదులో ఏముందో తమకు తెలియాలని, అప్పటి వరకు పోస్టుమార్టం చేయనీయబోమని పట్టుబట్టారు. నారాయణపేట/ మక్తల్: రాష్ట్ర క్రీడలు, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సొంత నియోజకవర్గ కేంద్రం మక్తల్ మున్సిపాలిటీలో 6వ వార్డు అభ్యర్థిగా బీజేపీ తరపున పోటీ చేస్తున్న మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మంత్రి వాకిటి శ్రీహరి మక్తల్ మున్సిపాలిటీని ఎలాగైనా కై వసం చేసుకోవాలనే ఉద్దేశంతో విపక్ష అభ్యర్థులను టార్గెట్ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్డులో బీజేపీ గెలుస్తుందని సర్వే నివేదికలు రావడంతో అభ్యర్థిని కాంగ్రెస్ నేతలు కొందరు టార్గెట్ చేసి భయపెట్టినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు బీజేపీ ఎలాగైనా మక్తల్ మున్సిపాలిటీని దక్కించుకోవాలని ఎంపీ డీకే అరుణ గత రెండు రోజులుగా మక్తల్ మకాం వేసి.. కౌన్సిలర్లను గెలిపించేందుకు వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా 6వ వార్డు కౌన్సిలర్ విజయానికి సైతం వ్యూహం చేస్తుండడంతో విజయం దగ్గరలో ఉన్నట్లు తేలింది. దీంతో అధికార పార్టీ నేతలు జీర్ణించుకోలేక మహదేవప్పను తీవ్ర ఒత్తిళ్లకు గురిచేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పోలింగ్కు ముందురోజు మహదేవప్ప ఆత్మహత్యకు పాల్పడడంతో పలు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. తల్లి ఆశీర్వాదంతో ప్రచారం.. 6వ వార్డు నుంచి ఎన్నికల బరిలో నిలిచిన మహదేవప్ప మొదటి తన తల్లి అనంతమ్మ ఆశీర్వాదం తీసుకొని ప్రచారాన్ని ప్రారంభించారు. తాజాగా కొడుకు మృతితో ఆ తల్లి గుండె పగిలేలా విలపించింది. నా కొడుకు గెలుస్తాడనుకుంటి ఇలా చనిపోతాడని అనుకోలేదంటూ రోదించింది. నా కొడుకుకు చాలామంది ఫోన్లు చేసి బెదిరిస్తున్నారనే విషయం కొంత వరకే తనకు తెలుసని.. ఇంకా మిగతా విషయాలు తనకు చెప్పలేదని వాపోయింది. నా కొడుకును బెదిరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. పోలింగ్ వాయిదా మున్సిపాలిటీలోని 6వ వార్డు నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న మహదేవప్ప ఆకస్మిక మృతి సంఘటనతో పోలింగ్ వాయిదా వేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పాలెం శివయ్య పేర్కొన్నారు. అసలు ఫోన్ చేసిందెవరు? ఆత్మహత్యకు పాల్పడిన మహదేవప్పకు రెండు రోజులుగా ఫోన్ చేసి బెదిరిస్తున్నదేవరోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. తన భార్యకు ఫోన్ ఇచ్చి ఇంట్లోకి వెళ్లిపోయి బెడ్రూంలో చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడం.. సమాచారం అందుకున్న పోలీసులు ఆయన భార్య దగ్గరకు వెళ్లి ఫోన్ తీసుకెళ్లడం క్షణాల్లో జరిగిపోవడంతో మహదేవప్ప మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహదేవప్ప ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతో ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక అధికార పార్టీ ఒత్తిళ్లకు భయపడి చేసుకున్నాడా.. అనే దానిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. దీనిపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపితే ఫోన్ కాల్ డాటాలో ఏముందో తేలనుంది. ముమ్మాటికి రాజకీయ హత్యనే.. మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి చందాపూర్కు వెళ్లి మహదేవప్ప కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో దమ్ముంటే పోటీ చేసి గెలవాలని ఇలా బెదిరింపులకు పాల్పడడం సరికాదన్నారు. గిరిజన వార్డు మెంబర్లు అవమానాల గురిచేయడం చూస్తుంటే ఈ రెండు పార్టీలు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేకుండా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఇది ముమ్మాటికీ కాంగ్రెస్, బీజేపీల రాజకీయ హత్యేనని ఆరోపించారు. -
శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు
● రీజియన్ నుంచి 304 కేటాయింపు ● మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 13 నుంచి 16 వరకు రాకపోకలు స్టేషన్ మహబూబ్నగర్: మహాశివరాత్రిని పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం శ్రీశైలం క్షేత్రానికి మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో ప్రత్యేక బస్సులు నడుపనున్నారు. రీజియన్లోని మొత్తం తొమ్మిది డిపోల నుంచి ఈ నెల 13 నుంచి 16 వరకు 304 ప్రత్యేక బస్సులు రాకపోకలు కొనసాగించనున్నాయి. మహబూబ్నగర్ నుంచి 72, నాగర్కర్నూల్ నుంచి 53, వనపర్తి డిపో నుంచి 47, గద్వాల నుంచి 34, అచ్చంపేట డిపో నుంచి 28, నారాయణపేట నుంచి 23, కొల్లాపూర్ నుంచి 22, కల్వకుర్తి నుంచి 16, షాద్నగర్ నుంచి 9 ప్రత్యేక బస్సులు నడువనున్నాయి. మహాశివరాత్రి రోజు రీజియన్ నుంచి 153 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. భక్తులు సద్వినియోగం చేసుకోవాలి.. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రీజియన్లోని డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని.. భక్తులు సద్వినియోగం చేసుకోవాలని రీజినల్ మేనేజర్ సంతోష్కుమార్ కోరారు. భక్తుల రద్దీ మేరకు అవసరమైతే మరిన్ని అదనపు బస్సులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తిరుగు ప్రయాణానికిగాను ఈ నెల 15న అర్ధరాత్రి నుంచి 16 సాయంత్రం వరకు బస్సుల రాకపోకలు కొనసాగేలా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం శ్రీశైలంతో పాటు ఆయా డిపోల ప్రయాణ ప్రాంగణాల్లో చలువ పందిళ్లు, తాగునీరు, సమాచార వ్యవస్థ, వాలంటీర్లను నియమించామన్నారు. డిపో తేదీలు 13 14 15 16 మహబూబ్నగర్ 5 15 36 16 నాగర్కర్నూల్ 5 11 22 15 వనపర్తి 5 8 22 12 నారాయణపేట 3 3 15 2 అచ్చంపేట 2 8 10 8 గద్వాల – 2 20 12 కల్వకుర్తి – 2 10 4 కొల్లాపూర్ 2 4 12 4 షాద్నగర్ – – 6 3 -
నల్లగొండపై పాలమూరు జట్టు విజయం
మహబూబ్నగర్ క్రీడలు: మెదక్లో మంగళవారం జరిగిన హెచ్సీఏ అండర్–19 ఇంటర్ డిస్ట్రిక్ట్ వన్డే టోర్నీలో మహబూబ్నగర్ విజయం సాధించింది. మ్యాచ్లో 9వికెట్ల తేడాతో నల్లగొండ జట్టుపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన నల్గొండ జట్టు 38.8 ఓవర్లలో 184 పరుగులకు ఆలౌటైంది. మహబూబ్నగర్ బౌలర్లు గగన్, మణిచరణ్, జశ్వంత్ చెరో మూడేసి వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన మహబూబ్నగర్ జట్టు 41 ఓవర్లలో వికెట్ కోల్పోయి 187 పరుగులు చేసింది. రెండో వికెట్కు అబ్దుల్ రాఫే బిన్ అబ్దుల్లా, వర్షిత్ రెడ్డి అజేయంగా నిలిచి 177 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అబ్దుల్ రాఫే 125 బంతుల్లో 11 ఫోర్లతో 95, వర్షిత్రెడ్డి 115 బంతుల్లో 9 ఫోర్లతో 71 పరుగులు చేశారు. అబ్దుల్ రాఫే (95 పరుగులు నాటౌట్) వర్షిత్రెడ్డి (71 పరుగులు నాటౌట్) హెచ్సీఏ టోర్నీలో రాణించిన అబ్దుల్ రాఫే, వర్షిత్రెడ్డి -
ఫోన్ పే, గూగుల్ పే తో ఓట్లు కొనుగోలు
● మున్సిపల్ ఎన్నికల్లో కొత్త ట్రెండ్ ● ఓటుకు రూ.2,500 వరకు జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు. గతంలో నగదు, బహుమతులు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేసిన రాజకీయ నాయకులు, ఇప్పుడు డిజిటల్ పేమెంట్ యాప్లను వినియోగిస్తున్నట్లు సమాచారం. స్థానికంగా కొందరు అభ్యర్థులు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్ల ద్వారా ఓటర్లకు డబ్బులు పంపుతున్నారనే చర్చ జరుగుతోంది. ఓటు వేస్తే వెంటనే గూగుల్ పేలో డబ్బు పంపిస్తాం.. అనే సందేశాలు కొన్ని డివిజన్లలో వాట్సాప్ గ్రూపుల్లో తిరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. జిల్లా కేంద్రంలోని టీడీ గుట్ట, కొత్త గంజ్, కొత్త చెరువు, సంజయ్నగర్, మోనప్పగుట్ట, శ్రీనివాస్ కాలనీ, వెంకటేశ్వర కాలనీ, దివిటిపల్లి, పాలకొండ, మార్కెట్ ఇలా పలు డివిజన్లలో డిజిటల్ పేమెంట్ ద్వారా ఓట్ల కొనుగోలు జరుగుతున్నట్లు వినికిడి. అధికార పార్టీకి దీటుగా అన్ని పార్టీల అభ్యర్థులు ఓట్ల కొనుగోలుకు వెనుకాడడం లేదు. ఓడిపోతే చెల్లించిన డబ్బులను మళ్లీ రికవరీ చేసుకోవడానికి ఆధారంగా ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్క ఓటుకు రూ.2,500 వరకు చెల్లిస్తున్నారు. ఎన్నికల సంఘం, అధికారులు ఈ కొత్త ధోరణిపై నిఘా వేసింది. సైబర్ సెల్ సహకారంతో డిజిటల్ లావాదేవీలను పరిశీలిస్తోంది. ఒకే ప్రాంతానికి చెందిన మొబైల్ నంబర్లకు అనూహ్యంగా డబ్బు బదిలీలు జరగడం గమనిస్తే విచారణ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. డిజిటల్ మార్గంలో అయినా ఓటు కోసం డబ్బు ఇవ్వడం లేదా తీసుకోవడం నేరమే. ‘ఆధారాలు లభిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని జిల్లా ఎన్నికల అధికారి హెచ్చరించారు. మొత్తంగా, మున్సిపల్ ఎన్నికల్లో క్యాష్ ఫర్ ఓటు పద్ధతి ఇప్పుడు పే ఫర్ ఓటుగా మారింది. టెక్నాలజీని వాడి ప్రజాస్వామ్యాన్ని మలినం చేసే ఈ కొత్త ట్రెండ్పై ఎన్నికల అధికారులు సీరియస్గా వ్యవహరించాలని ప్రజాస్వామిక వాదులు కోరుకుంటున్నారు. -
పోలీసులపై చర్యలు తీసుకోవాలి
మక్తల్: మహదేవప్ప మృతిపై తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు అన్నారు. ఈ ఘటనపై మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశామని, ఇందుకు బాధ్యులైన మక్తల్ సీఐ, ఎస్ఐలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న పోలీసులు అధికార పార్టీ నాయకులు చెప్పిన మాటలు వింటే ఎలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్టీలను చిన్నచూపు చూస్తుందని ఆరోపించారు. మహదేవప్ప కుటుంబానికి బీజేపీ రాష్ట్ర కమిటీ నుంచి రూ.10 లక్షలు ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. బీజేపీ అభ్యర్థులను భయపెడితే సహించేది లేదన్నారు. మహదేవప్ప కుటుంబానికి పార్టీ తరపున అన్నివిధాలుగా అండగా ఉంటామన్నారు. బెదిరింపులకు భయపడే ఆత్మహత్య మక్తల్: మక్తల్ మున్సిపాలిటీలోని 6వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి మహదేవప్ప అధికార పార్టీ నాయకుల బెదిరింపులకు భయపడే ఆత్మహత్య చేసుకున్నాడని ఎంపీ డీకే అరుణ అన్నారు. మహదేవప్ప ఆత్మహత్య సమాచారం తెలుసుకున్న ఆమె పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావుతో కలిసి మక్తల్కు చేరుకుని ప్రభుత్వ ఆస్పత్రి వద్ద బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ పోలీసులు తప్పుడు ఫిర్యాదులు తీసుకుని పోస్టుమార్టానికి పంపించడం సరికాదన్నారు. భార్య ఉండగా కూతురితో ఎందుకు ఫిర్యాదు తీసుకున్నారని ప్రశ్నించారు. ఈ క్రమంలో పోలీసులతో గంటపాటు వాగ్వాదం జరగగా.. అనంతరం కుటుంబ సభ్యులతో మళ్లీ ఫిర్యాదుతీసుకున్నారన్నారు. మహదేవప్పది ఆత్మహత్య కాదని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్య అన్నారు. ఆయన మృతిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గత కొద్దిరోజులుగా బీజేపీ అభ్యర్థులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. కోస్గిలోనూ ఇటీవల ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన బీజేపీ అభ్యర్థిని సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి బెదిరించి కాంగ్రెస్లో చేర్చుకున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలను సహించేది లేదని, బీజేపీ కార్యకర్తలు భయపడొద్దని, ధైర్యంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు కొండయ్య, నాగూరావు నామోజీ, ఎన్నికల ఇన్చార్జి అమర్నాథ్, భాస్కర్, రాజశేఖర్రెడ్డి, బాల్రాంరెడ్డి, కర్నిసామి, సోంశేఖర్గౌడ్ పాల్గొన్నారు. -
రూ.1.17 లక్షలు పట్టివేత
నారాయణపేట: పుర ఎన్నికల సందర్భంగా నిర్వహిస్తున్న వాహన తనిఖీల్లో మంగళవారం పట్టణంలోని ఎర్రగుట్ట చెక్పోస్ట్ వద్ద రూ.1.17 లక్షలు పట్టుబడినట్లు సీఐ శివశంకర్, ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. మహబూబ్నగర్కు చెందిన మహ్మద్ షఫీ యాద్గిర్ నుంచి నగదు తీసుకెళ్తుండగా ఎర్రగుట్ట చెక్పోస్ట్ వద్ద తనిఖీల్లో పట్టుకున్నామని చెప్పారు. సరైన ఆధారాలు చూపించకపోవడంతో ఎన్నికల నిబంధనల మేరకు స్వాధీనం చేసుకొని తదుపరి చర్యల నిమిత్తం గ్రీవెన్స్ కమిటీకి అప్పగించినట్లు పేర్కొన్నారు. ప్రజలు ఎన్నికల నిబంధనలు విధిగా పాటించాలని ఆయన సూచించారు. -
రైల్వే స్టేషన్లు తనిఖీ చేసిన జీఎం
స్టేషన్ మహబూబ్నగర్: ఉమ్మడి జిల్లా పరిధిలోని పలు రైల్వే స్టేషన్లను మంగళవారం సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్కుమార్ శ్రీవాస్తవ తనిఖీ చేశారు. డోన్– సికింద్రబాద్ సెక్షన్ తనిఖీలో భాగంగా ఉమ్మడి జిల్లా పరిధిలోని ఎస్బీబీ జోగులాంబ, గద్వాల, మహబూబ్నగర్, జడ్చర్ల రైల్వే స్టేషన్లను పరిశీలించారు. ఎస్బీబీ జోగులాంబ అమృత్ స్టేషన్లోని ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలు, గద్వాల స్టేషన్లో చేపట్టిన పనుల పురోగతిపై సమీక్షించారు. పనులను మరింత వేగవంతంగా చేయాలని అధికారులకు సూచించారు. కృష్ణ వంతెన వద్ద భద్రతా తనిఖీని నిర్వహించి ట్రాక్మెన్లతో సంభాషించారు. ఆరేపల్లి వద్ద లెవల్ క్రాసింగ్ గేట్ నంబర్ 96–ఈను తనిఖీ చేశారు. మహబూబ్నగర్ అమృత్ రైల్వే స్టేషన్లో చేపట్టిన పనులను తనిఖీ చేసి, ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలు, వసతులు, అదే విధంగా జడ్చర్ల రైల్వే స్టేషన్లో పనుల పురోగతిపై సమీక్షించారు. సిగ్నల్, టెలికాం సిబ్బంది స్టేషన్లో ప్రదర్శించిన సిగ్నలింగ్ పరికరాల గురించి ఆరా తీశారు. ఆయన వెంట హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ సంతోష్కుమార్ వర్మ తదితర అధికారులు ఉన్నారు. ఏబీఎస్ఎస్ పనుల పరిశీలన -
ఎలాగైనా గెలవాల్సిందే.. ఎంతైనా పంచాల్సిందే!
● కార్పొరేషన్ ఎన్నికల్లో కొనసాగిన ప్రలోభాలు ● ఓ డివిజన్లో అత్యధికంగా ఓటుకు రూ.5 వేల వరకు అందజేత ● కార్పొరేషన్ బరిలో ఉన్న అభ్యర్థులందరికి కలిపి రూ.90 కోట్ల వరకు ఖర్చు పాలమూరు: ‘ఇజ్జత్ కీ సవాల్ ఎలాగైనా కార్పొరేషన్ ఎన్నికల్లో గెలవాలి, పరువు నిలబెట్టుకోవాలి’ ఇదే కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు గట్టిగా నమ్ముకున్న సిద్ధాంతం. ఇందుకోసం తుది దశ ఎన్నికల్లో చివరిసారి పంపకాలు మంగళవారం రాత్రి వరకు సాగాయి. ఓట్లు వేయడానికి ఇంకా కొన్ని గంటల సమయమే మిగిలి ఉండటంతో కార్పొరేషన్లో ఉన్న 60 డివిజన్లలో కొందరు అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అంతర్గతంగా కలుస్తున్నారు. గుట్టుగా దాచి ఉంచిన మద్యం, నగదు, ఇతర కానుకలు అందజేస్తున్నారు. ఒక్కొక్క ఇంట్లో కలిసేందుకు వీలులేని చోట కుల, యువజన సంఘాల ప్రతినిధులను కలిసి క్రీడా, వంట సామగ్రి ఇస్తూ ఓటున్న సభ్యులతో తమకే వేయించమని అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. చికెన్ కావాలా? స్వీట్బాక్స్లా.. కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా పోటీలో ఉన్న అభ్యర్థులు చాలా మంది ఇంటింటికీ తిరుగుతూ మద్యం, డబ్బులు, మటన్, చికెన్ పంపిణీ చేస్తున్నారు. వద్దన్న వారికి స్వీట్బాక్స్లు అందజేస్తున్నారు. మాస్ ఏరియా పరిధిలో ఓటుకు రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు ఇస్తే పోటీ కొంత తీవ్రంగా ఉండి ఎలాగైనా గెలువాలని భావించిన డివిజన్లలో రూ.3 వేల వరకు ఇస్తున్నారు. మరో రెండు, మూడు డివిజన్లలో ఓటుకు రూ.3 వేల నుంచి రూ.5వేల వరకు పంపిణీ చేసినట్లు సమాచారం. ఒక డివిజన్లో అత్యధిక ధర కలిగిన మద్యం బాటిళ్లు ఇచ్చినట్లు సమాచారం. ఇక ప్రతి డివిజన్లో మద్యం నిల్వలు పెట్టుకుని చివరి రోజు ఓటర్లకు భారీగా అందించారు. మరికొందరు అభ్యర్థులు ఎదుటి వర్గం ఏమేమి పంపిణీ చేస్తున్నారో ఆరా తీసి అంతకు ఎక్కువగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలా మహబూబ్నగర్ కార్పొరేషన్లో ఉన్న 347 మంది అభ్యర్థులు పోటీ పడి రూ.90 కోట్ల వరకు ఖర్చు చేశారు. -
ఓటర్స్ డే
ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో పోలింగ్ కేంద్రాలకు వెళ్లడానికి సామగ్రితో సిద్ధంగా ఉన్న సిబ్బంది నేడే పురపాలిక ఎన్నికల పోలింగ్ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ /సాక్షి, నాగర్కర్నూల్: పురపాలిక పోరుకు వేళయింది. పది రోజుల నుంచి తలపడిన అభ్యర్థులను ఓటర్లు ఆశీర్వదించే తరుణం ఆసన్నమైంది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభం కానుండగా, సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. నిర్ణీత సమయంలో లోగా పోలింగ్ కేంద్రంలో వేచి ఉన్న ఓటర్లందరికీ ఓటు వేసేందుకు అవకాశం కల్పించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు మరో 18 మున్సిపాలిటీలకు ఎన్నికల నిర్వహణ చేపట్టారు. ఇందుకోసం అవసరమైన బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామగ్రితో సిబ్బంది మంగళవారం సాయంత్రానికే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. బరిలో 1,573 మంది అభ్యర్థులు.. ఉమ్మడి జిల్లాలో ఒక కార్పొరేషన్, 20 మున్సిపాలిటీలు ఉండగా.. అచ్చంపేట, జడ్చర్ల పురపాలికల్లో ఎన్నికలు జరగడం లేదు. మిగిలిన వాటిలో మొత్తం 376 వార్డులు, డివిజన్లు ఉండగా.. మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని 58వ వార్డులో కాంగ్రెస్కు చెందిన రమాదేవి, అలంపూర్ మున్సిపాలిటీలోని పదో వార్డు కౌన్సిలర్గా విక్రం (బీఆర్ఎస్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో 374 వార్డుల్లో 1,573 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. మక్తల్లోని 6వ వార్డులో బీజేపీకి చెందిన మహాదేవప్ప ఆత్మహత్య చేసుకోవడంతో చివరి నిమిషంలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు పలుచోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పోటీ తీవ్రత పెరిగింది. అత్యధికంగా మహబూబ్నగర్ కార్పొరేషన్లో 347 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. అత్యల్పంగా అలంపూర్లో 36 మంది పోటీ చేస్తున్నారు. దేవరకద్ర, వడ్డేపల్లి మున్సిపాలిటీల్లో 40 మంది చొప్పున అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బ్యాలెట్ పేపర్లలో రాజకీయ పార్టీల గుర్తులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థుల గుర్తులను ముద్రించారు. ఎన్నికల సమయంలో తప్పుల సవరణకు అవకాశం లేకపోవడంతో ముందు జాగ్రత్తగా బ్యాలెట్ పేపర్లను వివిధ దశల్లో అధికారులు నిశితంగా పరిశీలించారు. ● ఉమ్మడి జిల్లాలో 376 వార్డుల్లో 6,18,516 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 3,03,793 మంది, మహిళలు 3,14,688 మంది, ఇతరులు 35 మంది ఉన్నారు. వీరి కోసం 971 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అన్ని కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ నిర్వహణ.. మున్సిపల్ ఎన్నికలను నిర్వహించనున్న అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్కాస్టింగ్ నిర్వహణ చేపట్టారు. పోలింగ్ కేంద్రాల నుంచే వెబ్కాస్టింగ్ ద్వారా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ఓటింగ్ను పర్యవేక్షించనున్నారు. ఒక్కో వార్డుకు ఒక్కో పోలింగ్కేంద్రాన్ని ఏర్పాటుచేయగా, ఒక్కో కేంద్రంలో ఒక బ్యాలెట్బాక్సును ఏర్పాటుచేశారు. ఒక్కో పోలింగ్కేంద్రంలో కనీసం ఐదుగురు చొప్పున ఎన్నికల సిబ్బంది విధుల్లో పాలుపంచుకోనున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం వెంటనే బ్యాలెట్ బాక్సులను ఆయా మున్సిపాలిటీ కేంద్రాల్లోని స్ట్రాంగ్రూం వద్దకు తరలించనున్నారు. ఈనెల 11 మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా, కౌంటింగ్ ఉదయం 8 గంటల నుంచే ప్రారంభం కానుంది. ఉమ్మడి జిల్లాలో మహబూబ్నగర్కార్పొరేషన్, 18 మున్సిపాలిటీల్లో ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచిసాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ మహబూబ్నగర్ 58వ డివిజన్,అలంపూర్ 10వ వార్డు ఏకగ్రీవం బీజేపీ అభ్యర్థి మృతితో మక్తల్ 6వ వార్డులో పోలింగ్ వాయిదా మిగిలిన 373 వార్డులు/ డివిజన్లలో 1,570 మంది అభ్యర్థులు బరిలో.. పోలింగ్కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ద్వారా నిశిత పరిశీలన పోలింగ్ సామగ్రితో వెళుతున్న సిబ్బంది -
నిఘా నీడలో పోలింగ్ కేంద్రాలు
● 1,163 మంది పోలీస్ సిబ్బందికి విధులు ● సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి మహబూబ్నగర్ క్రైం: మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో పోలీస్శాఖ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటుపై దృష్టిసారించింది. ఒకవైపు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి ఇప్పటికే డివిజన్లు, వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేయాల్సిన బందోబస్తుపై కార్యచరణ సిద్ధం చేశారు. దశలవారీగా పోలీస్ అధికారులు, సిబ్బందికి సమావేశాల నిర్వహణ పూర్తి చేశారు. డివిజన్లలో ఫ్లాగ్మార్చ్లు ఏర్పాటు చేసి ఓటర్లు ధైర్యంగా ఓటుహక్కు వినియోగించుకోవాలని అవగాహన కల్పించారు. ప్రతి సమస్యాత్మక కేంద్రం వద్ద ఏఎస్ఐ, నలుగురు కానిస్టేబుళ్లు ఉంటారు. ఒక్కో రూట్ పెట్రోలింగ్లో ఎస్ఐ, ముగ్గురు సిబ్బంది గస్తీ తిరుగుతుంటారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలతో కమ్యూనిటీ కాంటాక్టు నిర్వహిస్తున్నారు. గతంలో ఆయా పోలింగ్ స్టేషన్లలో జరిగిన గొడవలు, ఘర్షణలు, దాడులు, ఓటర్లను మభ్య పెట్టడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. సమస్యాత్మక కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ జిల్లాలో కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలకు కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ డి.జానకి వెల్లడించారు. నగరంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో మంగళవారం ఉదయం ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో బందోబస్తు నిర్వహించే సిబ్బందికి సూచనలు అందించారు. రాత్రి నగరంలోని మోతీనగర్, బోయపల్లిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికలు జరిగే పరిధిలో 144సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఎన్నికలు పూర్తయ్యి బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్రూం చేరేవరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రధానంగా సమస్యాత్మక కేంద్రాల్లో ఎలాంటి విధులు నిర్వహించాలనే విషయంపై సిబ్బందికి వివరించారు. 87 సమస్యాత్మక పోలింగ్ లోకేషన్స్లలో సీఐ లేదా ఎస్ఐ స్థాయి అధికారులతో స్టాటిక్ఫోర్స్, స్పెషల్ పార్టీ బలగాలచే బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొబైల్ రూట్టీంలు, సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, ఎక్కడైనా ఘటనలు జరిగితే మొబైల్ టీంలు క్షణాల్లో అక్కడికి చేరుకొని సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. భూత్పూర్ ఎన్నికల ప్రక్రియ ఏఆర్ ఏఎస్పీ సురేష్కుమార్, దేవరకద్ర అడ్మిన్ అదనపు ఎస్పీ ఎన్బీ రత్నం, మహబూబ్నగర్ కార్పొరేషన్ ఎస్పీతో పాటు మరో ఇద్దరు డీఎస్పీలు పర్యవేక్షణ చేయనున్నట్లు తెలిపారు. -
సర్వం సిద్ధం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో పోలింగ్కు ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఒక్కో డివిజన్లో మూడు నుంచి అయిదు వరకు ఇలా మొత్తం 272 పోలింగ్ కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించారు. ఈ ప్రక్రియ పూర్తికి ఆర్ఓలు 20, ఏఆర్ఓలు 20 మందితో పాటు సుమారు 2,500 సిబ్బందిని నియమించారు. వీరిలో 160 మంది స్టాండ్బైగా ఉంటారు. సిబ్బందిలో ఎవరైనా హాజరుకాని పక్షంలో ఎన్నికల విధులను వీరు నిర్వర్తిస్తారు. ఇక మంగళవారం ఉయదం నుంచి సాయంత్రం వరకు స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో సిబ్బందికి ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. మొత్తం 23 రూట్లుగా విభజించగా ఆయా డివిజన్లకు ప్రత్యేక వాహనాలలో సామగ్రిని తీసుకుని తరలివెళ్లారు. వీరు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలలోనే బస చేయనున్నారు. కాగా, సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ఎన్నికల పరిశీలకురాలు, ఐఏఎస్ అధికారిణి కాత్యాయనీదేవి, అడిషనల్ కలెక్టర్లు మధుసూదన్ నాయక్, శివేంద్రప్రతాప్ తనిఖీ చేసి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి.రామాంజులరెడ్డి, ఏఎంసీ అజ్మీరా రాజన్నలకు తగు సూచనలిచ్చారు. ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా కృషి చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో, భూత్పూర్లోని జెడ్పీహెచ్ఎస్ ఆవరణలో, దేవరకద్రలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సామగ్రి పంపిణీ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చెక్లిస్ట్ ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి పూర్తిగా అందిందా? లేదా? అనేది జాగ్రత్తగా సరి చూసుకోవాలన్నారు. సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకునేలా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. పోలింగ్ సామగ్రి, ప్రత్యేకించి బ్యాలెట్ పేపర్లు తరలించే సమయంలో తప్పనిసరిగా సాయుధ పోలీసులతో కూడిన బందోబస్తు ఉండాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే ఆర్ఓలు, స్పెషల్ ఆఫీసర్ల దృష్టికి తేవాలన్నారు. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. కార్పొరేషన్ పరిధిలో 277 పోలింగ్ కేంద్రాలు ఎన్నికల కోసం 2,500 సిబ్బంది నియామకం పోలింగ్ సామగ్రిని పంపిణీ చేసిన అధికారులు -
మక్తల్ ఘటనతో కలకలం..
మంత్రి వాకిటి శ్రీహరి ఇలాకా మక్తల్ మున్సిపాలిటీలోని ఆరోవార్డు ఎస్టీ జనరల్కు రిజర్వ్ అయింది. ఈ వార్డులో బీఆర్ఎస్కు చెందిన మొగిలప్ప, శివరాజ్.. కాంగ్రెస్ నుంచి మారెప్ప.. బీజేపీ నుంచి మహదేవప్ప నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో శివరాజ్ నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత ఈ వార్డులో ముగ్గురు బరిలో నిలవగా.. ఎవరికి వారు విస్తృత ప్రచారం చేశారు. ఈ క్రమంలో పోలింగ్కు ముందు రోజు బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. అధికార నేతలు బెదిరింపులకు గురిచేయడంతోనే మహదేవప్ప ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆయన భార్య సత్తెమ్మ ఆరోపించడంతో కలకలం రేగింది. ఆరో వార్డులో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న మారెప్ప, బీజేపీ నుంచి పోటీ చేస్తున్న మహదేవప్ప అన్నదమ్ముల పిల్లలు. ఇరువురి ఇళ్లు పక్కపక్కనే ఉన్నాయి. ఇరువురు కుటుంబాల మధ్య ఎలాంటి తగాదాలు లేవని గ్రామస్తులు చెబుతుండగా.. విచారణ తర్వాతే నిజాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. -
నిష్పక్షపాతంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ
● కలెక్టర్ విజయేందిర బోయి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిష్పక్షపాతంగా ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను పాటిస్తూ నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయేందిర బోయి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్ల శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొ ని మాట్లాడారు. ఈనెల 11వ తేదీన మహబూబ్నగర్ కార్పొరేషన్, భూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీల్లో ఎన్నికల ఓటింగ్ పూర్తయిన తర్వాత 13వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు విధానాలపై కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఓట్ల లెక్కింపును విశ్వసనీయంగా నిర్వహించడంలో రిటర్నింగ్ అధికారులు కౌంటింగ్ సిబ్బందికి సరైన మార్గదర్శకం చేయాలన్నారు. కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, రిటర్నింగ్ అధికారులు నిష్పక్షపాతంగా అత్యంత జాగ్రత్తతో ఎన్నికల విధివిధానాలను పాటిస్తూ పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. ఒకవేళ రీకౌంటింగ్కు ఏవైనా అభ్యర్థనలు వస్తే వాటిని రాతపూర్వకంగా స్వీకరించాలని తెలిపారు. రీకౌంటింగ్ను ఆమోదించాలా, తిరస్కరించాలా అ నేది రిటర్నింగ్ అధికారి విచక్షణ ఆధారంగా నిర్ణ యం తీసుకోవాలని సూచించారు. లెక్కింపు కేంద్రా ల్లో రిటర్నింగ్ అధికారికి తప్పా.. ఇతరులకు మొబై ల్ ఫోన్లు అనుమతించరాదని సూచించారు. కౌంటింగ్ ఏజెంట్లు, అభ్యర్థులకు ఓటింగ్ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా చేస్తున్న విధానాన్ని చూపించాలన్నారు. ప్రతిరౌండ్ లెక్కింపు పూర్తవగానే కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలని, లెక్కింపు అనంతరం అభ్యర్థుల ఎన్నికల ఫలితాలు, జిల్లా ఎన్నికల అధికారుల అనుమతితోనే ప్రకటించాలని సూచించారు. ఒకవేళ పోటీలో ఉన్న అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే డ్రా ద్వారా ఫలితాలను నిర్ణయించాలని సూచించారు. ఈ సందర్భంగా సాధారణ ఎన్నికల పరిశీలకురాలు కాత్యాయనీదేవి మాట్లాడుతూ.. రికౌంటింగ్ విషయంలో సందేహాలుంటే రిటర్నింగ్ అధికారులు ఎన్నికల నియమావళిలో సూచించిన మార్గదర్శకాలను పాటించి నిర్ణ యం తీసుకోవాలన్నారు. లెక్కింపులో లోటుపాట్ల కు తావివ్వకుండా వ్యవహరించాలని, చేయాల్సిన పనులను మాక్ శిక్షణ ద్వారా కౌంటింగ్ సిబ్బందికి చూపించారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, తర్వాత బ్యాలెట్ బాక్సులోని ఓట్లను లెక్కించాలన్నారు. బ్యాలెట్ పేపర్ అకౌంట్, పీఓ డైరీ, పేపర్ సీల్ అకౌంట్, విసిట్ షీట్ను ఓట్ల లెక్కింపు సమయంలో తప్పకుండా పరిశీలించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్, మధుసూదన్నాయక్, ఆర్డీఓ నవీన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామిరెడ్డి, ఇన్చార్జి జిల్లా పంచాయతీ అధికారి వెంకట్రెడ్డి, డీఈఓ ప్రవీణ్కుమార్, సీఎంఓ సుధాకర్రెడ్డి, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు. -
ప్రతి ఓటరు ప్రశాంతంగా ఓటు వేయవచ్చు: ఎస్పీ
మహబూబ్నగర్ క్రైం: ఈనెల 11న జిల్లాలో జరిగే కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో పకడ్బందీగా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ డి.జానకి వెల్లడించారు. కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన పోలీస్ ఫ్లాగ్మార్చ్లో ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల ప్రచార గడువు ముగిసిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం నడుచుకోవాలని, ఎవరైనా గడువు ముగిసిన కూడా ప్రచారం చేయాలనే చూస్తే కఠినచర్యలు తీసుకున్నారు. ప్రతి ఓటరు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఫ్లాగ్మార్చ్ వన్టౌన్ నుంచి క్లాక్టవర్, అక్కడి నుంచి వీరన్నపేట వరకు నిర్వహించారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐలు అప్పయ్య, ఇజాజుద్దీన్, ఎస్ఐ శీనయ్య పాల్గొన్నారు. -
తెలంగాణలో పోటీ చేసేందుకు సిగ్గుండాలి
స్టేషన్ మహబూబ్నగర్: తెలంగాణ ప్రజలది నరదిష్టి అన్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ పార్టీ జనసేన నుంచి మున్సిపల్ ఎన్నికల్లో నిలబడేవారికి సిగ్గుండాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్రెడ్డి విమర్శించారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. పవన్కల్యాణ్ ఒక యాక్టర్ అని, ప్రొడ్యూసర్ పైసలు పెడితే యాక్టింగ్ చేస్తారని ఎద్దేవా చేశారు. 2019లో ప్రొడ్యూసర్ లేకుండా ఎన్నికల్లో పోయిండు.. ఒక్క సీటు గెలవలేదన్నారు. 2024లో ఒక ప్రొడ్యూసర్ చంద్రబాబును, కో–ప్రొడ్యూసర్ లోకేష్ను మెచ్చుకొని గెలిచిండు, ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్ మోదీ సహాయంతో తెలంగాణకు రావాలని చూస్తున్నాడని ఆరోపించారు. మళ్లీ ఆంధ్రోళ్ల కన్ను తెలంగాణపై పడిందని దుయ్యబట్టారు. మన భూముల రేట్లు ఎక్కువగా ఉన్నాయి, ఆంధ్రాలో భూముల రేట్లు తక్కువగా ఉన్నాయి, వాళ్లు నరదిష్టి అన్న సరే మనం పడుతున్నాం.. తెలంగాణ ప్రజలే దీని గురించి ఆలోచించాలన్నారు. ఫోన్ ట్యాపింగ్తో నీచ రాజకీయాలు బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్తో నీచ రాజకీయాలకు పాల్పడ్డారని అనిరుధ్రెడ్డి ఆరోపించారు. ఫోన్ట్యాపింగ్ జరిగిందని కేసీఆర్ కూతురు కవితనే చెప్పిందన్నారు. మాజీ మంత్రి పాలనలో ప్రజలకు బయటకు వచ్చి స్వేచ్చగా మాట్లాడుకోలేని పరిస్థితుల్లో ఉండేదన్నారు. మన జిల్లా బిడ్డ సీఎంగా ఉండడం వల్ల జిల్లాకేంద్రంలో రూ.2 వేల కోట్ల శంకుస్థాపన చేసిన విషయాన్ని ప్రజలందరూ గ్రహించాలని కోరారు. బాసర తర్వాత రెండో ఐఐఐటీని ఇక్కడికి తీసుకురావడంలోఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి కృషి ఉందన్నారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, నాయకులు చంద్రకుమార్గౌడ్, సీజే బెనహర్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగులను అరిగోస పెడుతున్న ప్రభుత్వం
జెడ్పీసెంటర్(మహబూబ్నర్): ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వారిని అరిగోస పెడుతోందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం ఆయన విలేకరుతో మాట్లాడుతూ చనిపోయిన రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన ఆర్థికపరమైన సహాయం ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. డీఏలు కూడా ఇవ్వడం లేదని, ఐదు డీఏలు పెండింగ్ ఉన్న రాష్టం తెలంగాణ ఒక్కటే అన్నారు. 317 ప్రభుత్వ ఉత్తర్వులపై సమీక్షించి భార్యాభర్తలు ఒకే జిల్లాలో పనిచేసే విధంగా చేస్తామని మాట తప్పారని ఆరోపించారు. బదిలీల క్యాలెండర్ ఇస్తామని చెప్పారని, జర్నలిస్టు, ఉద్యోగులకు అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తామని చెప్పి మాట తప్పారని ఆరోపించారు. ఉద్యోగులకు రావాల్సిన జీపీఎఫ్ కూడా ఇవ్వడం లేదని, దాచుకున్న డబ్బులు రాక గుండెపోటుతో పలువురు మృతి చెందారన్నారు. ఎన్నికలప్పుడు గొప్పగా మాట్లాడిన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయడం లేదన్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నెలల తరబడి ఇవ్వకుండా శ్రమదోపిడీ చేస్తున్నారని అన్నారు. సీపీఎస్ రద్దు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందన్నారు. ఉద్యోగి చనిపోతే దహన సంస్కారాల ఖర్చులు ఇవ్వలేని దుర్మర్గమైన ప్రభుత్వం అని మండిపడ్డారు. -
జిల్లా మొత్తం సెలవు ప్రకటించాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఈ నెల 11న జిల్లా మొత్తం సెలవు ఇవ్వాలని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు రాజీవ్రెడ్డి కోరారు. ఈ మేరకు కలెక్టర్ విజయేంద్రకు వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని ఉద్యోగులలో చాలా మంది మహబూబ్ నగర్ పట్టణంలో నివసిస్తూ, వారి ఓటు హక్కు పట్టణంలోనే ఉన్నందున, వారు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించాలని కోరారు. కలెక్టర్ స్పందిస్తూ వెంటనే సంబంధిత అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా కార్యదర్శి చంద్రనాయక్, ట్రెజరర్ కృష్ణమోహన్, శ్యాంసుందర్రెడ్డి, దేవేందర్ ఇతర నాయకులు పాల్గొన్నారు. -
మహబూబ్నగర్ను అగ్రగామిగా నిలబెడతాం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: మహబూబ్నగర్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలబెడతామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు సోమవారం నగరంలోని తూర్పు కమాన్ నుంచి అంబేడ్కర్ చౌరస్తా, తెలంగాణ చౌరస్తా, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం మీదుగా క్లాక్టవర్ వరకు రోడ్ షో నిర్వహించారు. అలాగే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ఆధ్వర్యంలో మెట్టుగడ్డ, జీజీహెచ్, న్యూటౌన్ మీదుగా క్లాక్టవర్ చేరుకున్నారు. అనంతరం కార్నర్ మీటింగ్లో యెన్నం మాట్లాడుతూ పదేళ్ల పాటు బీఆర్ఎస్కు అధికారం ఇస్తే ప్రజల భవిష్యత్ను అంధకారంలోకి నెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం, మౌలిక వసతులు, నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టి ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ వి.హన్మంతరావు, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మల్లు నర్సింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్.వినోద్కుమార్, సత్తూర్ చంద్రకుమార్గౌడ్, గోనెల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
నగర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ అవసరం: ఎంపీ
పాలమూరు: వారం రోజుల పాటు ఉమ్మడి జిల్లాలో అన్ని మున్సిపాలిటీల్లో ప్రచారం చేసి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరించినట్లు ఎంపీ డీకే అరుణ అన్నారు. ఎంపీ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆమె మహబూబ్నగర్ కార్పొరేషన్ బీజేపీ మేనిఫెస్టో విడుదల చేశారు. మహబూబ్నగర్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ అవసరం ఉందని, దానిని త్వరలో తీసుకొస్తామని, ఇప్పటికే రూ.వేల కోట్లు మున్సిపాలిటీకి ఇచ్చినట్లు తెలిపారు. చెత్తసేకరణ వ్యవస్థ ఏర్పాటు, కోల్డ్స్టోరేజ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, సీనియర్ సిటిజన్స్కు ఇంటి పన్నుల్లో 30 శాతం రాయితీ కల్పిస్తామన్నారు. అర్బన్ హౌసింగ్, పార్కులు, క్రీడా మైదానాలు, వాణిజ్య సముదాయాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతామన్నారు. మహబూబ్నగర్తో పాటు ఇతర మున్సిపాలిటీలు ఎలా అభివృద్ధి చేస్తామనే విషయాన్ని మేనిఫెస్టోలో స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిపారు. అండర్గ్రౌండ్ డ్రెయినేజీ, అమృత్ పథకం కింద రూ.400 కోట్ల, 14, 15వ ఆర్థిక సంఘాల ద్వారా నిధులు తీసుకొచ్చినట్లు తెలిపారు. కార్పొరేషన్తో పాటు భూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని కేంద్రానికి నివేదిక ఇచ్చినట్లు చెప్పారు. ఆర్ఓబీలు మంజూరు చేసుకున్నామని, కార్పొరేషన్లో విలీన గ్రామాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. డ్రెయినేజీ, సీసీ రోడ్లు, తాగునీటి సదుపాయాలు కల్పించే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. అప్పన్నపల్లి నుంచి చించోళి వరకు బైపాస్ డీపీఆర్ సిద్ధమైందన్నారు. -
ఓటర్లూ.. ఇవి తెలుసుకోండి
జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్రెడ్డి పాలమూరు: ఉమ్మడి జిల్లాలో అందరి దృష్టి ప్రస్తుతం మహబూబ్నగర్పైనే ఉంది. ఐదు జిల్లాల్లో ఒకే ఒక్క కార్పొరేషన్ ఉండటం.. మొదటిసారి ఎన్నికలు జరుగుతుండడంతో ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. మేయర్ పదవి బీసీ మహిళకు కేటాయించడంతో ఆ కుర్చీ దక్కించుకునేందుకు ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. అధికార కాంగ్రెస్ పార్టీ.. మేయర్ అభ్యర్థి ఎవరనేది అధికారికంగా ప్రకటించకపోయిన ఎవరికి వారే మేము రేస్లో ఉన్నామని తమకే అవకాశం ఉంటుందని పార్టీ సైతం హామీ ఇచ్చిందని ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో అధికార పార్టీలో మేయర్ పదవికి తీవ్ర పోటీ నెలకొంది. ఆ నలుగురు పేర్లు జోరుగా ప్రచారం మేయర్ పదవి రిజర్వేషన్ ఖరారయ్యే ముందు వరకు ఒకే వ్యక్తి పేరు జోరుగా వినిపించింది. రెండు నెలల ముందు నుంచి ఆ నేత పేరు వినపడగా.. తీరా మేయర్ పీఠం బీసీ మహిళకు కేటాయించడంతో పోటీ మరింత తీవ్రమైంది. ఎన్నికల ముందు వరకు ఒక్కరే ప్రచారంలో ఉండగా ప్రస్తుతం మరి కొంతమంది మేయర్ సీటులో కూర్చోవడానికి తమ వంతుగా ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రధానంగా 49వ డివిజన్ ప్రసన్న ఆనంద్కుమార్గౌడ్, 37వ డివిజన్ ఎన్.పీ నేహాశ్రీ, 52వ డివిజన్ నుంచి బురుజు కల్పన, 41వ డివిజన్ నుంచి కె.స్వప్న మేయర్ పోటీలో ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. తొలి కార్పొరేషన్ ఎన్నికలు కావడం వల్ల మొదటి పీఠం ఎవరు అధిరోహిస్తారు అనేది ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలో ఇటూ ఎమ్మెల్యేతో పాటు పార్టీ కీలక నేతలు సైతం కుర్చీలో ఎవరిని కూర్చొపెట్టాలనే విషయంపై తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. మేయర్ పదవి రేసులో ఉన్న ప్రతి డివిజన్లో అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రస్థాయిలో ఉంది. ఎక్కడా వెనకడుగు వేయకుండా భారీ మొత్తంలో ఖర్చు పెడుతున్నారు. అధికార పార్టీలో పోటీ తీవ్రం తొలి మేయర్ పీఠం ఎవరికో..! కల్వకుర్తి టౌన్: మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఫిబ్రవరి 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే ఓటరు జాబితాలు సిద్ధం చేశారు. పోలింగ్కు ముందు ఓటర్లు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఓటరు జాబితాలో పేరు ఉందా అనే విషయాన్ని పరిశీలించుకోవాలి. సీఈఓ తెలంగాణ వెబ్సైట్లో పరిశీలించుకోవాలి. లేదా స్థానికంగా ఓటరు నమోదు కేంద్రంలో పరిశీలించుకోవచ్చు. ఓటరు గుర్తింపు కార్డు, ఇతర ఫోటో గుర్తింపు కార్డు, ఓటరు చీటి మీ వద్ద ఉంచుకోవాలి. మీ ఇంటి వద్దకే బూత్స్థాయి అధికారులు వచ్చి ఓటరు చీటి ఇచ్చి వెళ్తారు. ఒకవేళ ఓటరు చీటి ఇవ్వకుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పోలింగ్ కేంద్రాల వద్ద ఉండే రాజకీయ పార్టీల ఏజెంట్ల వద్ద పొందవచ్చు. పోలింగ్ కేంద్రం వద్ద మీ ఓటరు చీటి, గుర్తింపు కార్డులను చూపించాలి. ఓ పోలింగ్ అధికారి ఓటరు జాబితాలో గుర్తింపుకార్డుతో పాటు మీ పేరును పరిశీలిస్తారు. మరో అధికారి మీ వేలికి ఇంక్ అంటిస్తారు. ఆ తర్వాత ఒక చీటి ఇస్తారు. మూడో అధికారి ఆ చీటిని పరిశీలిస్తారు. ఆ తర్వాత ప్రధాన అధికారి బ్యాలెట్ పేపరు ఇచ్చి దానిని ఎలా మడిచి బ్యాలెట్ బాక్సులో వేయాలన్న విషయాన్ని వివరిస్తాడు. బ్యాలెట్ పేపరును తీసుకొని ఓటింగగ్ రూంలోకి వెళ్లి అక్కడే ఏర్పాటు చేసిన స్వస్తిక్ గుర్తు స్టాంపుతో మీరు ఓటు ఎవ్వరికి వేయాలనుకున్నారో దానిపై ఆ గుర్తును వేయాలి. అనంతరం బ్యాలెట్ పేపర్ను నిలువుగగా మడిచిన తర్వాత అడ్డంగా మడిచి అక్కడే ఉన్న బ్యాలెట్ బాక్సులో వేసి ఓటరు బయటకు రావాలి. -
నలుగురు రెబల్స్పై సస్పెన్షన్ వేటు
● ఉత్తర్వులు జారీ చేసిన డీసీసీ ప్రెసిడెంట్ శివసేనారెడ్డి ● ఎన్నికల్లో ప్రభావం చూపించే వారిపైనే వేటు పడిందా ? వనపర్తి: జిల్లా కేంద్రం, వనపర్తి మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీకి రెబల్స్ ఎఫెక్ట్తో పలు వార్డుల్లో పుర ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులపై ప్రభావం పడుతోందని గుర్తించిన డీసీసీ సోమవారం నలుగురిపై సస్పెన్షన్ వేటు వేసింది. సోమవారం ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి రెబల్స్ రంజిత్కుమార్, డి.వెంకటేష్, ఎన్.బాలస్వామి, ఎన్ భువనేశ్వరీలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ ప్రాథమిక నిబంధనలను పాటించకపోవటం, ఆయా వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ తరుఫున పోటీ చేస్తున్న వారికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కారణంగా జారీ చేసిన షోకాస్ నోటీసులకు ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంతో సస్పెన్షన్ వేటు వేసినట్లు డీసీసీ అధ్యక్షుడు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ విషయాన్ని సంబంధిత వ్యక్తులతో పాటు ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్గౌడ్, మంత్రి వాకిటి శ్రీహరి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి. చిన్నారెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిలకు ప్రతులను పంపించారు. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో గానీ.. గత కాంగ్రెస్ చరిత్రలో రెబల్స్ను ఇలా సస్పెండ్ చేసిన దాఖలాలు లేవనే చర్చ స్థానికంగా హాట్ టాపిక్గా మారింది. మిగిలిన వారి మాటేంటీ..? వీరితో పాటు జిల్లా కేంద్రంలో పలు వార్డుల్లో రెబల్స్ కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారనేది బహిరంగ రహస్యం. వారి వెనుక అధికార పార్టీలోని పలువురు పెద్దలు ఉన్నారు. మరి కొందరిపైనే సస్పెన్షన్ వేటు వేయటంలో ఆంతర్యమేంటినే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీలోని పెద్దల వత్తిళ్లు కొందరినుద్దేశించే ఉన్నాయా.. లేక ఎన్నికల్లో అత్యంత ప్రభావం చూపిస్తారనే వారిని గుర్తించి వారిపైనే.. చర్యలు తీసుకున్నారనే అంశం పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. పలువురు రెబల్స్ అభ్యర్థులు ఏకంగా ఎమ్మెల్యే ఫోటోలతో ఎన్నికల ప్రచారం చేసుకోవటం గమనార్హం. -
అటవీశాఖ పరిధిలో ఉచ్చుల తొలగింపు
అచ్చంపేట: అమ్రాబాద్ అభయారణ్య ప్రాంతంలో వన్యప్రాణులను ఉచ్చుల నుంచి రక్షించేందుకు అటవీశాఖ అధికారులు, సిబ్బంది వాటిని తొలగించినట్లు హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ ల్యాండ్ స్కేప్ కోఆర్డినేటర్ బాపురెడ్డి తెలిపారు. సోమవారం అచ్చంపేట సబ్ డివిజన్ కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ చేపట్టిన ప్రతిష్టాత్మక క్యాచ్ ద ట్రాప్ (ఉచ్చులను పట్టుకోవడం) కార్యక్రమాన్ని 2024లో ప్రారంభించడం జరిగిందన్నారు. హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ (హైటికోస్) స్వచ్ఛంద సంస్థ అమ్రాబాద్, మద్దిమడుగు, మన్ననూరు,అచ్చంపేట, కొల్లాపూర్, లింగాల, దోమలపెంట, నాగర్ కర్నూల్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ భాగస్వామ్యంతో 3,462 కిలోమీటర్ల నడక మార్గం పరిధిలో 1,076 ఉచ్చులను తొలగించడం జరిగిందన్నారు. వన్యప్రాణుల కోసం ఏర్పాటు చేసిన వాటిని తొలిగించి జంతువులను రక్షించేందుకు అటవీశాఖ ప్రయత్నిస్తోందన్నారు. వన్యప్రాణులకు హాని తలపెట్టకూడదని, వన్యప్రాణుల సంరక్షణ మన సంరక్షణ అన్నారు. వన్యప్రాణుల సంరక్షణకు ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అచ్చంపేట రేంజ్ అధికారి మహమ్మద్ అబ్దుల్ సుబూర్, సెక్షన్ అధికారి సుజాత, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ అధికారులు అఖిల్ గౌడ్, శ్రీకాంత్, వికాస్, స్నేక్ క్యాచేర్ సుమన్ తదితరులు పాల్గొన్నారు. -
పల్లి ధరలు పతనం!
● ఆందోళనలో అన్నదాతలు ● బాదేపల్లి యార్డులో కనిష్ట ధర రూ.3,900 ●రూ.3900 వచ్చింది బాదేపల్లి మార్కెట్లో వేరుశనగకు మంచి డిమాండ్ ఉందని భావించి ఇక్కడకు 52 బస్తాలను తీసుకొచ్చా. క్వింటా ధర రూ.3900 మాత్రమే వచ్చింది. 3 ఎకరాల్లో సాగుచేసిన వేరుశనగకు రూ.70వేలపైనే పెట్టుబడి అయ్యింది. కానీ వచ్చిన దిగుబడిని అమ్మితే పెట్టుబడి కూడా వచ్చేలా లేదు. పంటను వెనక్కి తీసుకుపోలేక, యార్డులో పడిగాపులు పడే పరిస్థితి లేక వచ్చిన ధరకు అమ్ముకుపోతున్నా. – నరేశ్యాదవ్, హస్నాబాద్, కొడంగల్ పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు వేరుశనగ పంట దిగుబడులు తగ్గాయి. పండిన పంటను అమ్ముకుపోదామని వస్తే సరైన ధరలు రావడంలేదు. వ్యాపారులు పూర్తిగా ధరలను తగ్గించేశారు. 48 బస్తాల వేరుశనగను యార్డుకు తీసుకొస్తే క్వింటాకు రూ.8700 ధర మాత్రమే వచ్చింది. అధికారులు స్పందించి మంచి ధరలు వచ్చేలా చూడాలి. – బాల్రాజ్, హకీంపేట, కొడంగల్ జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో కొన్నిరోజులుగా ఎగిసి పడిన వేరుశనగ(పల్లి) ధరలు వరుసగా పడిపోతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వేరుశనగకు ప్రభుత్వ మద్దతు ధరలను మించి లభిస్తుండడమేగాక అత్యధికంగా క్వింటా రూ.13వేల చేరువకు చేరిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల రైతులు వేరుశనగ దిగుబడులను బాదేపల్లి యార్డుకు తీసుకొస్తున్నారు. అయితే ఇక్కడి వ్యాపారులు క్రమంగా వేరుశనగ ధరలను తగ్గించి కొనుగోలు చేస్తుండడంతో రైతులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు కుమ్మకై ్క ఒకటి రెండు కుప్పలకు అధిక ధరలను కేటాయించి మిగతా కుప్పలకు మద్దతు ధర కంటె తక్కువగా ధరలను నిర్ణయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో తమకు సరైన ధరలు లభించడంలేదని వాపోతున్నారు. ఇంటి వద్ద మిగతా వ్యవసాయ పనులు ఉండడం తదితర కారణాలతో ఆశించిన ధరల కోసం రోజుల తరబడి మార్కెట్లో పడిగాపులుగాసే పరిస్థితిలేదని రైతులు ఈ సందర్భంగా తెలిపారు. కనిష్ట ధర రూ.3869 బాదేపల్లి మార్కెట్కు సోమవారం వివిధ ప్రాంతాల న ఉంచి 2, 607 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి వచ్చింది. క్వింటా గరిష్టంగా రూ.10,361 రాగా.. కనిష్టంగా రూ.3,869 ధరను కేటాయించారు. నెలరోజులుగా సగటున వేరుశనగ కనిష్ట ధరలను పరిశీలిస్తే క్వింటాకు రూ.3869నుంచి రూ.6వేలలోపే ఎక్కువగా ధరలు కేటాయించారు. ఎక్కడో ఒకటిరెండు కుప్పలకు మాత్రం మద్దతు ధర రూ.7263ను మించి ఎక్కువ వేసి మిగతా కుప్పల వద్ద ధరలను తక్కువ వేస్తున్నారని రైతులు తెలిపారు. దీంతో పెట్టుబడులు రాని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత మార్కెట్ యార్డు అధికారులు, పాలకులు స్పందించి వేరుశనగకు మంచి ధరలు లభించేలా చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
తెలుగు జాతి సంస్కృతిని కాపాడుకుందాం
స్టేషన్ మహబూబ్నగర్: తెలుగు జాతి సంస్కృతిలో భాగమైన నాటక రంగాన్ని కాపాడుకుందామని రాష్ట్ర సంగీత నాటక అకాడమీ మాజీ చైర్మన్ బాద్మి శివకుమార్ అన్నారు. మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవాలయం ప్రాంగణంలో శ్రీమిత్ర కళానాట్య మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పౌరాణిక పద్యనాటక ప్రదర్శనలు సోమవారం మూడో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటక కళారంగాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మండలి ప్రధాన కార్యదర్శి వి.నారాయణ మాట్లాడుతూ 11 ఏళ్ల నుంచి తమ సంస్థ ఆధ్వర్యంలో మన్యంకొండ క్షేత్రంలో పౌరాణిక నాటకాలను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు.వివిధ సంస్థలచే శ్రీరామాంజనేయ యుద్ధ సన్నివేశం, భవాని చింతామణి, సుభద్ర అర్జున సీను, కర్ణ రహస్యం సీను, రావణబ్రహ్మ ఏకపాత్రాభినయం నిర్వహించారు. అనంతరం కళాకారులను సన్మానించిన సత్కరించారు. కార్యక్రమంలో సీనియర్ కళాకారుడు కె.శివప్రసాద్, బంగారు వెంకటయ్య, భాస్కరాచారి, ధర్మన్న, నాగరాజు, వెంకటయ్య, విజయదేవి, శివ పాల్గొన్నారు. మజ్లిస్కు మద్దతు ఇవ్వండి: ఓవైసీ స్టేషన్ మహబూబ్నగర్: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మజ్లిస్కు మద్దతుగా నిలిచి ఎంఐఎం కార్పొరేటర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. జిల్లాకేంద్రంలోని షాసాబ్గుట్ట దర్గా ఆవరణలో సోమవారం జరిగిన ఎన్నికల సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అధికారంలో ఉన్నామని ఒకరు, ఢిల్లీలో అధికారంలో ఉన్నామని మరొకరు, పదేళ్లు పాలించామని ఇంకొకరు ఈ ఎన్నికల్లో ఓట్లు వేయమని అడుగుతారని, మీరందరూ గుర్తుంచుకోవాలి ఈ ఎన్నికల వల్ల అధికారం ఏర్పడన్నారు. క్షేత్రస్థాయిలో ఈ ఎన్నికలు చాలా కీలకమన్నారు. ఉమ్మడి జిల్లాలో మహబూబ్నగర్ కార్పొరేటర్, వనపర్తి, గద్వాల, కల్వకుర్తి, నారాయణపేట, నాగర్కర్నూల్, మక్తల్ పట్టణాల్లో మున్సిపల్ ఎన్నికల్లో నిలబడిన ఎంఐఎం అభ్యర్థులను గెలిపిస్తే మీ గొంతుకే డివిజన్లలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తారని అన్నారు. బిహార్లో ఐదుచోట్ల ఎమ్మెల్యే సీట్లు గెలిచినట్లు తెలిపారు. మజీస్ పార్టీతో వ్యతిరేకించిన ఒక వ్యక్తి నిలబడితే ఆయనకు డిపాజిట్ కూడా రాలేదన్నారు. మహారాష్ట్రలో 125 మున్సిపల్ కార్పొరేటర్ స్థానాలను మజ్లిస్ పార్టీ గెలిచినట్లు తెలిపారు. ఔరంగాబాద్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 33 చోట్ల కార్పొరేటర్, ముంబైలో 8 చోట్ల కార్పొరేటర్ స్థానాల్లో గెలవడం జరిగిందన్నారు. జిల్లాలో ఎంఐఎం పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే వారిస్ పఠాన్, ఎంఐఎం ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ జాబిర్ బిన్ సయీద్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అబ్దుల్ హాదీ, మక్సూద్బిన్ అహ్మద్ జాకీర్, ఎన్నికల ఇన్చార్జిలు జఫర్ఖాన్, అన్వర్సాదత్, పార్టీ పట్టణశాఖ అధ్యక్షులు సాదుతుల్లా హుస్సేని, ఎంఐఎం కార్పొరేటర్ అభ్యర్థులు పాల్గొన్నారు. -
ఓటు అమ్మకు.. హక్కు కోల్పోకు..
నోటుకు ఓటును అమ్ముకుంటే నీకున్న హక్కును కోల్పోతావని సీనియర్ సిటీజన్ ఫోరం అధ్యక్షుడు జగపతిరావు అన్నారు. సీనియర్ సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో ఓటుహక్కుపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక రెడ్క్రాస్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఓటును అమ్ముకున్నప్పుడు సమస్యలపై ప్రశ్నించే హక్కును కోల్పోతారని, ప్రజాస్వామ్యానికి ఓటే పునాది అన్నారు. సమాజ భవిష్యత్ను నిర్ణయించే శక్తి ఓటుకు ఉందన్నారు. ప్రతి వ్యక్తి నిజాయితీగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫోరం ఉపాధ్యక్షుడు రాజసింహుడు, ప్రధాన కార్యదర్శి నస్కంటి నాగభూషణం, కోటేశ్వర్రెడ్డి, లక్ష్మణ్గౌడ్, నాగభూషణం, రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. – మెట్టుగడ్డ -
ఓటుకు ఉంది ఓ చరిత్ర
పాలమూరు/కల్వకుర్తి టౌన్: ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగం ఎన్నుకున్న విధానం ఓటు. ఏ భాషలో అయినా అభ్యర్థులను ఎన్నుకునేందుకు ఓటు అనే పిలుస్తారు. ఎన్నికల నేపథ్యంలో ఓటు, ఓటర్లు అనే పదాల సాధారణంగా వినిపిస్తున్నాయి. కానీ చాలా మందికి ఓటు అన్న పదానికి అర్థం తెలియదు. ఓటు అన్న పదం ఓటమ్ అనే లాటిన్ ఇంగ్లిష్ భాష నుంచి తీసుకున్నారు. ఓటు అన్న పదానికి తెలుగులో చాలా అర్థాలు ఉన్నాయి. తెలుగు నిఘంటువు ప్రకారం సమ్మతి తెలపడం, మద్దతు ఇవ్వడం, అంగీకారం, వాగ్దానం, ఎన్నుకోవడమని అర్థాలు ఉన్నాయి. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థికి పాలన అధికారాన్ని ఇవ్వడానికి తమ సమ్మతిని తెలపడమని అర్థం. ఓటు వినియోగం క్రీస్తు పూర్వం 139వ సంవత్సరం నుంచి ఉన్నట్లుగా తెలుస్తుంది. పురాతన గ్రీస్ దేశంలో పగిలిన మట్టిపాత్రల ముక్కలను ఓట్లుగా వినియోగించినట్లు ప్రాచుర్యంలో ఉంది. ప్రాచీన భారతదేశంలో క్రీస్తు శకం 920లో తమిళనాడు రాష్ట్రంలో అరటి ఆకులను వినియోగించి ఓటుహక్కు ద్వారా ఎన్నికలు నిర్వహించారు. అభ్యర్థుల ఓట్లను లెక్కించడానికి ఓట్ల కోసం వినియోగించిన అరటి ఆకులను కుండలో ఉంచి ఎన్నికలు నిర్వహించారు. ఈ పద్ధతిని కూడా ఓలై వ్యవస్థ అని పిలిచారు. అమెరికాలో మొదటిసారిగా కాగితపు బ్యాలెట్లతో మసాచుసెట్స్ చర్చిలో పాస్టర్ని ఎంపిక చేసుకోవడం కోసం వినియోగంలోకి తీసుకొచ్చారు. ఆయా దేశాల రాజ్యాంగాలు పాలనా పరంగా ప్రజా ప్రతినిధులను ఎన్నుకునేందుకు ప్రజలకు హక్కును కల్పిస్తూ ఓటు అనే ఆయుధాన్ని అందించాయి. 1950 నుంచి మన దేశంలో సార్వత్రిక వయోజన ఓటుహక్కు వినియోగంలోకి వచ్చింది. గతంలో బ్యాలెట్ ద్వారా ఓటు వేసేవారు తదనంతరం ఈవీఎం ద్వారా ఓటు వేసే విధానాన్ని ఎన్నికల సంఘం అభివృద్ధి చేసింది. -
కందనూలు @ నాగర్కర్నూల్
● జాగీర్ కేంద్రం నుంచి మున్సిపాలిటీగా అవతరణ ● అంచెలంచెలుగా అభివృద్ధి పథంలో నాగర్కర్నూల్ ● పర్యాటక హబ్గా మినీ ట్యాంక్బండ్ కందనూలు: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నాగర్కర్నూల్కు ప్రత్యేక స్థానం ఉంది. నాడు వలసల ప్రాంతం.. నిత్యం కరువు కాటకాలకు చిరునామాగా ఉన్న కందనూలు.. ప్రస్తుతం కేఎల్ఐ సాగు నీటితో కోనసీమను తలపిస్తూ ఇతర ప్రాంతాల వారికి ఉపాధి కేంద్రంగా విరాజిల్లుతోంది. నిజాం పాలనలో 1794 నుంచి 1904 వరకు జిల్లా కేంద్రంగా, జాగీర్ కేంద్రంగా ఉండేది. మొదటి మున్సిపాలిటీగా, గ్రామపంచాయతీగా, మేజర్ పంచాయతీగా, నగరపంచాయతీగా కొనసాగిన కందనూలు ఎనిమిదేళ్ల క్రితం మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. 2016లో అక్టోబర్లో జిల్లాకేంద్రం ఏర్పాటుతో పట్టణ రూపురేఖలే మారిపోయాయి. రియల్భూమ్తో పాటు కలెక్టరేట్, జిల్లా పోలీస్ తదితర కార్యాలయాల నిర్మాణాలతో కొల్లాపూర్ చౌరస్తా వరకు పట్టణం శరవేగంగా శివారు కాలనీలకు విస్తరించింది. కేఎల్ఐ సాగునీటితో పచ్చని పంట పొలాల మధ్యన, ఆహ్లాదకరమైన వాతావరణంలో నాగర్కర్నూల్పట్టణం అభివృద్ధి పథకంలో పయనిస్తోంది. నాగర్కర్నూల్ పట్టణానికి మణిపూసగా ఉన్న మినీట్యాంక్బండ్ పర్యాటక హబ్గా మారింది. పదేళ్ల క్రితం వరకు బోసిపోయి కనిపించే కేసరి సముద్రం చెరువు.. ప్రస్తుతం హైదరాబాద్లోని ట్యాంక్బండ్ తరహాలో అభివృద్ధి చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సీసీ రోడ్లు, పార్క్లు, చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు, ఓపెన్ జిమ్, చెరువు మధ్యలో బుద్ధుడి విగ్రహం, బతుకమ్మ ఘాట్, తదితర నిర్మాణాలు చేపట్టారు. దీంతో కందనూలు రూపురేఖలే మారిపోయాయి. ఉమ్మడి జిల్లాలో తొలి అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ ఉన్న పట్టణంగా నాగర్కర్నూల్ నిలిచింది. ఇక జిల్లా ఏర్పాటు తర్వాత రియల్ఎ స్టేట్ ఊపందుకుంది. పట్టణం వాల్ మాదిరిగా పొడవుగా ఉండడంతో నల్ల చెరువు ప్రాంతం నుంచి ఉయ్యాలవాడ, కొల్లాపూర్ చౌరస్తా, మంతటి చౌరస్తా వరకు భూముల ధరలకు రెక్కలొచ్చాయి. పదేళ్ల క్రితం వరకు రూ.20 లక్షలకు ఉన్న ఎకరా భూమి ధర ఇప్పుడు రూ.3 కోట్లకు పైగా పలుకుతోంది. ఒకవైపు రియల్ వ్యాపారం, మరోవైపు పచ్చని పంట పొలాలతో పట్టణ శివారు ఆహ్లాదంగా ఉంటుంది. 2011 సంవత్సరంలో జీఓ నంబర్ 364 ప్రకారం నాగర్కర్నూల్ను 20 వార్డులతో నగర పంచాయతీగా ఏర్పాటు చేశారు. కొంతకాలం ప్రత్యేకపాలనలో సాగిన నగరపంచాయతీకి 2014లో ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల తర్వాత మోహన్గౌడ్ తొలి చైర్మన్గా ఎన్నికయ్యారు. 2016లో జిల్లాకేంద్రంగా, 2018 మార్చిలో పురపాలిక సంఘంగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నగర పంచాయతీగా ఉన్నప్పుడు 20 వార్డులు ఉండగా.. మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయిన తర్వాత విలీన గ్రామాలతో కలిసి 24 వార్డులకు చేరింది. అప్పుడు 30,675 ఓటర్లు ఉన్నారు. 2020లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ 14, కాంగ్రెస్ 9, ఓ స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించగా.. టీఆర్ఎస్కు చెందిన కల్పన గౌడ్ మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం పట్టణంలో 35,378 మంది ఓటర్లు ఉన్నారు. మారిన రూపురేఖలు పరిపాలనా సౌలభ్యం.. నాగర్కర్నూల్ 1951లో మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. మొదటి కౌన్సిలర్ చైర్మన్గా వీఎన్ గౌడ్ ఎన్నికయ్యారు. పాలనాపరమైన వ్యవహారాల్లో ఏర్పడిన సంక్షోభంతో 1961లో మేజర్ పంచాయతీగా మార్చారు. మొదటి సర్పంచ్గా చెరువు రామారావు, తర్వాత హకీం బాలస్వామి, నర్మదాబాయి, మాసుద్దీన్ అహ్మద్ అలీ, వంగా శరత్బాబు, సంధ్యారాణి సర్పంచ్గా పనిచేశారు. 2011లో నగరపంచాయతీగా. -
హెచ్సీఏ అండర్–14 జట్టుకు ఎంపిక
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు సాయిరాం హెచ్సీఏ అండర్–14 బాలుర జట్టులో చోటు దక్కించుకున్నాడు. గత ఏడాది కూడా అండర్–14 జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. తమిళనాడులోని చైన్నెలో ఈనెల 13వ తేదీ నుంచి 23 వరకు జరిగే అండర్–14 క్రికెట్ టోర్నమెంట్లో సాయిరాం పాల్గొననున్నాడు. పెవిలియన్ క్రికెట్ క్లబ్లో శిక్షణ తీసుకుంటున్న సాయిరాం హైదరాబాద్లోని ఎంఎల్ జయసింహ క్రికెట్ క్లబ్ తరఫున లీగ్ మ్యాచుల్లో ప్రతిభ చాటాడు. 9 లీగ్ మ్యాచుల్లో 277 పరుగులు చేశాడు. సాయిరాం ఎంపికపై పెవిలియన్ క్రికెట్ క్లబ్ కోచ్ భరత్గౌడ్, అసిస్టెంట్ కోచ్ మెకల్లమ్, సీనియర్ క్రీడాకారుడు రియాజుద్దీన్ హర్షం వ్యక్తం చేశారు. మద్యం మత్తులో అత్తపై అత్యాచారం, హత్య కల్వకుర్తి రూరల్: మద్యం మత్తులో వృద్ధురాలు అయిన అత్తను అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన మండలంలోని రఘుపతిపేటలో జరిగింది. కల్వకుర్తి సీఐ నాగార్జున కథనం ప్రకారం.. పసుపుల చెన్నమ్మ (65) భర్త మూడేళ్ల క్రితం మృతి చెందాడు. ఆమెకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు కాగా ఒక కుమారుడు చనిపోగా మరో కుమారుడు వేరుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామంలో ఉంటున్న కుమార్తె రేణుక, అల్లుడు బైరంపల్లి రాఘవేందర్ ఇంట్లో చెన్నమ్మ ఉంటోంది. రాఘవేందర్ మద్యానికి బానిస కావడంతో భార్యాభర్తలు తరచూ గొడవపడేవారు. రెండు రోజుల క్రితం గొడవపడి రేణుక వెల్దండ మండలంలోని తన అక్క ఇంటికి వెళ్లింది. ఆదివారం రాత్రి అతిగా మద్యం తాగిన రాఘవేందర్ అత్త చెన్నమ్మపై అత్యాచారం చేసి, హత్య చేశాడని సీఐ వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. -
‘సామాజిక’ చైతన్యం’
● ఓటుకు అమ్ముడుపోవద్దంటూ సూచనలు ● సోషల్ మీడియాలో స్ఫూర్తిదాయక పోస్టింగులు ● మార్పునకు బీజం వేస్తున్న సామాజిక మాధ్యమాలు అచ్చంపేట: మున్సిప్ల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. ఈ నేపథ్యంలో ప్రచారం జోరందుకుంది. నేతలు ప్రచారంలో పోటాపోటీగా కొనసాగిస్తుండగా ఇటు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులు హోరెత్తుతున్నాయి. స్ఫూర్తిదాయక పోస్టింగులు కొత్తకొత్త ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి. తమ స్నేహితులు, బంధుమిత్రులకు షేర్ చేయడానికి యువత ఆసక్తి చూపుతోంది. అందరిలో చైతన్యం నింపుతుంది. వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్, టెలిగ్రాం, టిట్టాక్ మొదలైన సామాజిక మాధ్యమాలు అన్ని వర్గాల ప్రజల్లో చైతన్యం నింపుతున్నాయి. గతంలో దుష్పచార రాతలు క్షణాల్లో వైరల్ అయ్యేవి. ఇప్పడిలా కాదు ఏదీ మంచి, ఏదీ చెడు అనే కోణం నుంచి ప్రజలు అలోచిస్తుండడం శుభ పరిమాణం. చెడును మొగ్గలోనే తుంచివేస్తున్నారు. ఒకవేళ తెలిసీ తెలియక ఎవరైనా పోస్టింగ్ చేస్తే అలాంటిది సదరు గ్రూపు నుంచి తొలగించడమో, లేకపోతే మందలించి వదిలేస్తున్నారు. ఏ రోజుకు ఆ రోజు సామాజిక మాధ్యమాల్లో కొత్తదనం తొణికిసలాడుతోంది. ప్రతి పౌరుడు తమ ఓటుహక్కును వినియోగించుకునేలా, పోలింగ్ శాతాన్ని పెంచేలా రాతలు ఉంటున్నాయి. అలాగే మద్యం వంటి ప్రలోభాలకు లొంగకుండా ఉండడానికి సామాజిక మాధ్యమాల రాతలు చైతన్యం నింపుతున్నాయి. మచ్చుకు కొన్ని.. ఏపాటి వాడో చూడు.. అభ్యర్థి ఏ పార్టీ వాడని కాదు. ఏపాటి వాడో చూడు. ఎన్నుకుంటే వెలగబెట్టడం కాదు ఇప్పటి వరకు ఏం చేసాడో చూడు. పెట్టుకునే టోపీ కాదు పెట్టని టోపీ చూడు. ఒక నిమిషంలో జీవితం ఏమీ మారదు. కానీ ఒక్క నిమిషం అలోచించి వేసే ఓటు జీవితాన్ని మార్చేస్తుంది. ఐదేళ్లు పాలించే నాయకుడు ఓటు కోసం మీకిచ్చే లంచం రూ.500 అంటే రోజకు 27 పైసలు మాత్రమే. బిక్షగాళ్లు కూడా 27 పైసలు తీసుకోరు. అలోచించు డబ్బు కావాలా..మంచి నాయకుడు కావాలా..? ప్రజల మీద బతికే వాళ్లకు కాదు. ప్రజల కోసం బతికే వారిని ప్రజాప్రతినిధిగా ఎన్నుకుందాం.. అప్పడే ఓటుకు విలువ. ఆశతో ఉన్నవాడికి అధికారం ఇస్తే దోచుకుంటాడు. ఆశయంతో ఉన్నవాడికి అధికారం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తాడు. పదవి అనేది అనుభవించడానికి కాదు పది మందికి సాయం చేయడానికి అని నిరూపిస్తాడు. -
‘ఫోన్’లోనే ప్రచారం
గద్వాలమున్సిపల్ ఎన్నికల్లో కొన్ని చోట్ల ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులు, బంధువులు పోటీ చేస్తున్నారు. వారి తరఫున నేరుగా ప్రచారం చేయాలంటే నిబంధనలు అడ్డంకిగా నిలుస్తున్నాయి. ప్రత్యర్థులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తారనే భయం. మరోపక్క అలాంటి వారుందరూ ‘ఫోన్’ ప్రచారం ప్రారంభించారు. వార్డుల్లోని పలువురి ఓటర్ల ఫోన్ నంబర్లు తెప్పించుకొని, వారితో పరిచయం చేసుకుని ఓటు వేసి తమవారిని గెలిపించాలని కోరుతున్నారు. పట్టణంలోని 2, 3, 6, 17, 16, 17, 18, 28 వార్డుల్లో ఎక్కువగా ఫోన్ అభ్యర్థనలు ఉన్నాయి. విధులు ముగించుకొని ఇంటికి రాగానే ఈ తరహ ప్రచారం చేపట్టడం విశేషం. దీంతో పాటు రెండు రోజులుగా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే ఉద్యోగ, ఉపాధ్యాయుల జాబితాను ముందుగానే సేకరించి, ముఖ్య నాయకులతో వారికి ఫోన్ చేయిస్తున్నారు. -
జీవితం మీద ఆశలేదని మిత్రులకు మెసేజ్ పెట్టి..
మిడ్జిల్: మండల కేంద్రంలో యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మిడ్జిల్కు చెందిన ఎరుకలి అశోక్ (25) బైక్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి తల్లిదండ్రులను బంధువుల ఇంటికి పంపించి, ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. తనకు జీవీతం మీద ఆశలేదని, తాను చనిపోవాలనుకుంటున్నానని ఇన్స్ట్రాగామ్లో మిత్రులకు మేసెజ్ పెట్టాడు. అనంతరం ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్నేహితులు ఇంటికి వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా విగతజీవిగా మారాడు. ఎస్ఐ శివనాగేశ్వర్నాయుడును వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. కారు, బైక్ ఢీ.. ఒకరు మృతి తిమ్మాజిపేట: మండలంలోని మరికల్ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తిమ్మాజిపేటకు చెందిన అరవింద్ (17) అనే యువకుడు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. తిమ్మాజీపేటకు చెందిన యువకులు అరవింద్, శివ, చింటు పని మీద జడ్చర్లకు వెళ్లారు. తిరిగి తిమ్మాజిపేటకు బైక్పై వస్తుండగా మార్గ మధ్యలో మరికల్ సమీపంలో జడ్చర్ల వైపు వెళ్తున్న కారు ఢీకొట్టడంతో అరవింద్ అక్కడికక్కడే మృతి చెందాడు. శివ చింటు తీవ్రంగా గాయపడ్డాడని స్థానికులు తెలిపారు. చికిత్స నిమిత్తం ఇద్దరిని మహబూబ్నగర్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘనా స్థలంలో వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు తప్పించుకొని పోగా ఇంటర్ సెకండియర్ చదువుతున్న అరవింద్ మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. -
ముచ్చటగా మూడోసారి
అచ్చంపేట: నగర పంచాయతీగా ఉన్న అచ్చంపేటను 2018లో అప్పటి ప్రభుత్వం మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసింది. పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటుకు ముందు నిజాం కాలం (1954)లో అచ్చంపేట పురపాలికగా ఉండేది. అప్పట్లో నిర్వహించిన ఎన్నికల్లో తొలి పురపాలిక చైర్మన్గా బుచ్చికారి ఎన్నికయ్యారు. 1959లో పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడింది. నాడు అభివృద్ధికి సరిపడా నిధులు లేకపోవడంతో మున్సిపాలిటీగా ఉన్న అచ్చంపేటను 1964లో మేజర్ గ్రామ పంచాయతీగా ఏర్పాటుచేసి.. పుర చైర్మన్తోనే పరిపాలన కొనసాగించారు.1964 నుంచి 2013 వరకు మేజర్ గ్రామ పంచాయతీగా కొనసాగిన అచ్చంపేటను నగర పంచాయతీగా, మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేశారు. పురపాలికగా ఏర్పడిన తర్వాత నిర్మించిన భవనం గతేడాది కూల్చివేసి దాని స్థానంలో కొత్త భవనం నిర్మించారు. ప్రస్తుతం మూడోసారి మున్సిపల్ పోరుకు సిద్ధమైంది. ● 1954లోనే మున్సిపాలిటీగా అచ్చంపేటకు గుర్తింపు ● పరిపాలన మార్పుతో 1964లో మేజర్ జీపీగా ఏర్పాటు ● 2013లో నగర పంచాయతీ.. 2018లో మున్సిపాలిటీగా అవతరణ ఇదీ పరిస్థితి.. 2016 మార్చి 6న జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ 20/20 వార్డులు కై వసం చేసుకుంది. తొలి నగర పంచాయతీ చైర్మన్ పీఠం ఎస్టీకి రిజర్వు కావడంతో మార్చి 15న కె.తులసీరాం చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీ కాలం 2021 మార్చి14తో ముగియడంతో 2021 ఏప్రిల్ 30న రెండోసారి ఎన్నికలు నిర్వహించగా.. బీఆర్ఎస్–13, కాంగ్రెస్–6, బీజేపీ ఒక స్థానం కై వపం చేసుకున్నాయి. జనరల్ స్థానం నుంచి మే 6న బీఆర్ఎస్కు చెందిన ఎండ్ల నర్సింహాగౌడ్ చైర్మన్గా ఎన్నికయ్యారు. 2023లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్కు చెందిన 8మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2024 జూలై 6న చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం పెట్టి.. కాంగ్రెస్ పార్టీకి చెందిన గార్లపాటి శ్రీనివాసులును చైర్మన్గా ఎన్నుకున్నారు. పెరిగిన పోటీ.. రోజురోజుకు పట్టణం నలుదిక్కులా విస్తరిస్తోంది. ప్రస్తుతం 10,500 పైగా కుటుంబాలు ఉండగా.. 36,952 జనాభా ఉంది. ఇందులో ఎస్టీ జనాభా 4,858, ఎస్సీలు 2,728, ఇతరులు 28,425 మంది ఉన్నారు. మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులు, 50 పైగా కాలనీలు ఉండగా.. 23,139 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 11,335 మంది పురుఘలు, 11,803 మంది మహిళలు, ఒకరు ఇతర ఓటర్లు ఉన్నారు. 2016లో మొదటి సారి చైర్మన్ స్థానం ఎస్టీకి రిజర్వు కాగా.. రెండోసారి 2021లో జనరల్కు రిజర్వు చేశారు. ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని బీసీ మహిళకు కేటాయించడంతో ఎన్నికల్లో పోటీ పెరిగింది. అన్ని వార్డుల్లో త్రిముఖ పోటీ నెలకొంది. పరిపాలన మార్పు ప్రభావంతో.. పరిపాలన మార్పు ప్రభావంతో అచ్చంపేట మున్సిపాలిటీ గ్రామ పంచాయతీగా మార్చాల్సి వచ్చింది. అప్పటి వరకు మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న అచ్చంపేట 2013 జూన్ 25న 20 వార్డులతో నగర పంచాయతీగా ఏర్పడింది. కమిషనర్, ప్రత్యేక అధికారిగా (ఆర్డీఓ) పాలనలో కొనసాగిన నగర పంచాయతీకి 2016 మార్చి 5న మొదటిసారి ఎన్నికలు జరిగాయి. 2018 మార్చి 30న తెలంగాణ ప్రభుత్వం పెద్దసంఖ్యలో పంచాయతీలను పట్టణ స్థాయికి మార్చే నిర్ణయంలో భాగంగా పలకపల్లి, లింగోటం, పులిజాల, నడింపల్లి, లక్ష్మాపూర్, చౌటపల్లి, గుంపన్పల్లి, బల్మూర్ మండలం పొలిశెట్టిపల్లి గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేసింది. ఆయా గ్రామాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అప్పటి ప్రభుత్వం 2019 జూన్ 28న చట్టసవరణ చేస్తూ.. ఆర్డినెన్స్ 4 జారీ చేయడంతో విలీన గ్రామాలు రద్దయ్యాయి. దీంతో కేవలం పట్టణ జనాభాతోనే మున్సిపాలిటీ కొనసాగుతోంది. -
‘తులం బంగారం ఏమైందని నిలదీయండి’
కొల్లాపూర్: ప్రజలను ఓట్లడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటివరకు నెరవేర్చలేదని ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం కొల్లాపూర్లో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ అల్లీపూర్ వెంకటేశ్వరరెడ్డితో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నవీన్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. ఓట్లడిగేందుకు వస్తున్న కాంగ్రెస్ నాయకులను ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చడం లేదని నిలదీయాలన్నారు. కల్యాణలక్ష్మి పథకం కింద తులం బంగారం ఏమైందని ప్రశ్నించాలని సూచించారు. రైతుభరోసా ఎగ్గొట్టారన్నారు. మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని, వారి మాటలు నమ్మొద్దని హితువు పలికారు. బీరం హర్షవర్ధన్రెడ్డి మాట్లాడుతూ కొల్లాపూర్ మున్సిపాలిటీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు బీఆర్ఎస్ హయాంలో జరిగాయన్నారు. ప్రతి వార్డులో సీసీ రోడ్లు, మురుగుకాల్వలు నిర్మించామని, తాగునీటి వసతులు మెరుగుపర్చామని, ఆలయాలు, దర్గాలు అభివృద్ధి చేశామని, స్మశానవాటికలకు రోడ్లు వేయించి, భూములు ఇప్పించడంతో పాటు వాగులపై బ్రిడ్జిలు కట్టించామని గుర్తుచేశారు. రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని, మరో రెండేళ్లలో చేయబోయేది కూడా ఏమీ లేదని ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీలతో గెలిపించాలని కోరారు. -
పోలింగ్ కేంద్రాల్లో నో సెల్ఫీ
కల్వకుర్తి టౌన్: సాంకేతికత పెరుగుతున్నా కొద్దీ వయస్సు తారతమ్యం, సమయం, సందర్భం లేకుండా ప్రతి ఒక్కరిలో సెల్ఫీల పిచ్చి నానాటికీ పెరుగుతుంది. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన తర్వాత ఎవరైనా ఓటు వేస్తూ సెల్ఫీ దిగడానికి ప్రయత్నించటం కుదరదు. ఒకవేళ ఎవరూ చూడటం లేదు కదా అని సెల్ఫీ దిగడానికి ప్రయత్నిస్తే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుంది. పోలింగ్ కేంద్రాల్లో సెల్ఫీలు పూర్తిగా నిషేదం. ఓటరు నిబంధనలకు విరుద్ధగా చూపిస్తూ ఓటు వేసినట్లగా గుర్తిస్తే అధికారులు వెంటనే 49– ఎం (ఓటు రహస్యం) బహిర్గతం నియమం కింద బయటకు పంపిస్తారు. వేసిన ఓటును 17– ఏలో నమోదు చేస్తారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఆ ఓటును పరిగణలోకి తీసుకోరు. రూల్ నంబర్ 49– ఎన్ ప్రకారం అంధులైన ఓటర్లు తాము ఓటు వేయడానికి 18 ఏళ్లు దాటినా సహాయకుడిని వెంట తీసుకొని వెళ్లవచ్చు. సహాయకుడు అతడి ఓటును బహిరంగ పర్చనని నిబంధన–10లో ధ్రువీకరించాల్సి ఉంటుంది. -
రైల్వేస్టేషన్ అభివృద్ధి పనుల పరిశీలన
ఉండవెల్లి: మండలంలోని జోగుళాంబ రైల్వే స్టేషన్ను ఆదివారం సౌత్ సెంట్రల్ రైల్వే డీఆర్ఎం సంతోష్కుమార్ వర్మ పరిశీలించారు. జోగుళాంబ రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనుల్లో భాగంగా విశ్రాంతి గదులు, హైలెవెల్ ఫ్లాట్ఫాం, గదులలో ఏర్పాటు చేసిన పరికరాల నాణ్యత, మౌలిక వసతుల కల్పన, నీటి సదుపాయాన్ని డీఆర్ఎం పరిశీలించారు. స్టేషన్కు సమీప మార్గంలో సూచిక బోర్డు లేకపోవడంతో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలో రైల్వే జీఎం స్టేషన్ను పరిశీలించి పునఃప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో రైల్వే అధికారులు, ఇంజినీయర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఎవరికి ఓటు వేశారో చెబితే నేరమే
పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసి వచ్చిన తర్వాత ఎవరికి ఓటు వేశారు అనే విషయాన్ని గోప్యంగా ఉంచాలి. బహిరంగంగా వెల్లడిస్తే ఎన్నికల కమిషన్ దానిని నేరంగా పరిగణిస్తుంది. ఓటుహక్కును వినియోగించుకునే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటువేసే పద్ధతిని పాటించకపోతే ఎన్నికల సంఘం నియమావళి 49–ఏ ప్రకారం ఓటింగ్కు అనర్హులు. ఓటింగ్ సమయంలో ఆలస్యం జరిగిన, వెళ్లిన ఓటరు బ్యాలెట్ బాక్స్పై కాగితాలు, టేపులు అతికిస్తున్నట్లు అనుమానం వస్తే వెంటనే పోలింగ్ ఏజెంట్లు రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లి ఓటింగ్ బూతులోకి వెళ్ళవచ్చు. రిటర్నింగ్ అధికారి మాత్రమే అది బాగానే ఉందని ఏజెంట్ల సమక్షంలో నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. -
కారు గుర్తుకు ఓటేస్తే డస్ట్బిన్లో వేసినట్టే
పాలమూరు: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటువేస్తే డస్ట్ బిన్లో వేసినట్టే అవుతుందని, బీజేపీకి ఓటు వేస్తే ఎలాంటి అభివృద్ధి జరగదని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. మహబూబ్నగర్లోని 23వ డివిజన్ మర్లులో ఆదివారం నిర్వహించిన కార్నర్ మీటింగ్లో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డితో కలిసి మాట్లాడారు. హస్తం గుర్తుకు ఓటువేస్తే రమేష్రెడ్డి మాతో పాటు కూర్చొని డివిజన్ అభివృద్ధి పనులపై చర్చించి సంబంధిత నిధులు తెచ్చి పనులు చేస్తాడన్నారు. గతంలో ఉన్న పాలకులు పదేళ్లు ఉండి ఎలాంటి అభివృద్ధి చేయలేదని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధిపనులు చేస్తుందన్నారు. ● మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నగర పరిధిలో పాలకొండ, క్రిస్టియన్పల్లి, గొల్లబండ తండా, బండమీదిపల్లి, హనుమాన్పురా, శాంతినగర్, విఘ్నేశ్వర కాలనీ–మర్లు, కోయనగర్, న్యూమోతీనగర్, ఎంప్లాయీస్ కాలనీ, గణేష్నగర్, వల్లభ్నగర్, బండ్లగేరి, సద్దలగుండు, శేషాద్రినగర్, బీకేరెడ్డికాలనీ తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎ.ఆనంద్కుమార్గౌడ్, కాంగ్రెస్ అభ్యర్థి బీసం వరలక్ష్మీ, యువనాయకుడు సోమిరెడ్డి రమేష్రెడ్డి, సందీప్, అప్పు, నరేష్, సాయి, వేణు, పృథ్వీరెడ్డి, సలీం, మేరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
పోలింగ్ ఏజెంట్లు కీలకం
● అమ్ముడు పోతే అభ్యర్థి పరిస్థితి అంతే సంగతి ● ఒక్క ఓటుతో కూడా ఓటమి చెందే అవకాశం ● అత్యంత విశ్వాసపాత్రులే ఏజెంట్లుగా ఉండాలి అచ్చంపేట/కల్వకుర్తి టౌన్: పోలింగ్ బూత్లో అభ్యర్థుల తరఫున పరిశీలన కోసం కూర్చుండే ఏజెంట్ల పాత్ర చాలా కీలకం. బోగస్ ఓట్లు పడకుండా ఓటేయడానికి వచ్చే వారిని నిశితంగా చూడాలి. ఒక ఓటు తేడాతో అభ్యర్థులు గెలుపొందే అవకాశం ఉన్నందున ఏజెంట్లుగా ఉండేవారు అభ్యర్థికి అత్యంత విశ్వాసపాత్రులుగా ఉండాలి. లేకపోతే ఇతర అభ్యర్థులకు అమ్ముడుపోయే సందర్భాలు కూడా ఉంటాయి. పోలింగ్ ఏజెంట్ల నియామకంలో ఎన్నికల సంఘం కొన్ని మార్పులు చేసింది. ● పోలింగ్ స్టేషన్లో గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు, రాష్ట్ర పార్టీలు, గుర్తింపు పొందిన ఇతర రాష్ట్రాల పార్టీలు, తమ ఎన్నికల గుర్తును ఇక్కడ ఉపయోగించడానికి అనుమతి పొందిన వారు, గుర్తింపు పొందని రిజిస్టర్ పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులకు ప్రాధాన్యత క్రమంలో కుర్చీలు వేస్తారు. ● పోలింగ్ ఏజెంట్లు తప్పనిసరిగా అదే గ్రామానికి చెందిన వారై ఉండి, ఓటరుగా నమోదై ఉండి, ఎన్నికల సంఘం ఫొటో గుర్తింపు కార్డు కూడా కలిగి ఉండాలి. ● ప్రతి పోలింగ్స్టేషన్కు ప్రతి అభ్యర్థి తరపున పోలింగ్ ఏజెంట్, ఇద్దరు రిలీఫ్ ఏజెంట్లను నియమించుకోవచ్చు. ● పోలింగ్ ఏజెంట్ ఫారం–10లో పోటీచేస్తున్న అభ్యర్థి లేదా అతని ఎన్నికల ఏజెంటు నియామక పత్రం పొందిన వారికి నిరూపణ డిక్లరేషన్పై ఏజెంట్ పాస్ జారీ చేస్తారు. ● ఒక్కో బూత్కు మూడు పాసులు జారీ చేసిన ఒక్కరు మాత్రమే కూర్చోవడానికి అనుమతి ఇస్తారు. ఓటర్ల జాబితాను బయటకు తీసుకెళ్లేందుకు వీలు ఉండదు. ● పోలింగ్ ఏజెంట్ల ఓటింగ్ సమయానికి కనీసం గంట ముందుగా బూత్కు చేరుకోవాలి. ఆలస్యంగా వెళ్లినా అధికారులు వారి ప్రక్రియ వారు చేసుకుపోతారు. ఆలస్యమయితే సీల్లో ఏజెంట్ సంతకం చేయటం, పరిశీలన చేయలేకపోతారు. అలాగే ఓటింగ్ ముగిసిన అనంతరం కూడా బ్యాలెట్ బాక్సుల సీలింగ్ ప్రక్రియను పర్యవేక్షించి దానిపై సంతకం చేయాలి. -
చెరువులో మొసలి కలకలం
కేటీదొడ్డి: మండలంలోని వెంకటాపురం గ్రామ శివారులో ఉన్న చెరువులో ఆదివారం మొసలి కనబడడం కలకలం రేపింది. పొలాల వద్దకు వెళ్లిన రైతులకు చెరువు గడ్డపై సేదతీరుతున్న మొసలి కనబడింది. దీంతో మొసలి ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అటవీశాఖ అధికారులు గమనించి మొసలిని పట్టుకొని వేరే చోటికి తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు. తనువు చాలించి.. మరొకరి చూపునిచ్చి.. నర్వ: 65 ఏళ్ల వయస్సులో మరణాంతరం మరొకరికి చూపినిచ్చి ఆదర్శంగా నిలిచారు పాతర్చేడ్ గ్రామానికి చెందిన పులుసు అమ్మక్క. రెడ్క్రాస్ జూనియర్ కోఆర్డినేటర్ కందుకూరి అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. తల్లి అక్మమ్మ మరణాంతరం కుమారులు నర్సిములు, రమేష్ సూచన మేరకు ఆమె కళ్లను ఆదివారం హైదరాబాద్లోని ఎల్వీప్రసాద్ ల్యాబ్కు అందజేశారు. ఈ సందర్భంగా అశోక్కుమార్ మాట్లాడుతూ నేత్రదానం చేయడం వల్ల ఇద్దరు వ్యక్తులకు ప్రపంచాన్ని చూసే అదృష్టం కల్పించినట్లయిందన్నారు. అమ్మక్క కుమారులు రమేష్, నర్సిములను క్లబ్ సభ్యులు, వైద్యులు, గ్రామస్తులు అభినందించారు. -
అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యం
కొల్లాపూర్: కాంగ్రెస్తోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం పట్టణంలోని పలు వార్డుల్లో ఆయన పర్యటించారు. 13 వార్డు పరిధిలోని చౌటబెట్ల గ్రామంలో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. వంగ అనూష రాజశేఖర్గౌడ్ను గెలిపించాలని కోరారు. గ్రామానికి డబుల్ రోడ్డు నిర్మిస్తున్నామని, గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్పై రూ. 500 రాయితీ, నివాస గృహాలకు ఉచిత కరెంట్, రైతు రుణమాఫీ చేస్తున్నట్లు వివరించారు. ఆరు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. గత పాలకులు కొల్లాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి గుర్చి పట్టించుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్కు అవకాశం ఇస్తే మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని పేర్కొన్నారు. మంత్రి వెంట స్థానిక కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. -
ఉద్యోగం వదిలి.. పుర బరిలోకి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): కార్పొరేషన్ పరిధిలోని పదో డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్ అభ్యర్థిగా రమేష్బాబు పోటీ చేస్తున్నారు. ఆయన గతంలో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. 2020 మున్సిపల్ ఎన్నికల్లో మహబూబ్నగర్ మున్సిపల్ పరిధిలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయిన నిరుత్సాహ పడకుండా ప్రస్తుతం కార్పొరేషన్ ఎన్నికల బరిలో నిలిచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావడం అప్పట్లోనే చర్చనీయాంశమైంది. తాగునీరు, డ్రెయినేజీ, రహదారులు, పేదల సమస్యలు వంటి అంశాలపై ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండటం ఆయన ప్రత్యేకతగా నిలిచింది. తన పట్టుదలను గుర్తించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇచ్చారని రమేష్బాబు తెలిపారు. -
1,007 మంది ఉద్యోగులు ఓటేశారు
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లకు గాను 1,007 పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. గత నెల 30 నుంచి ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఇందులో భాగంగా ఈనెల 7న 458 మంది, 8న 549 మంది స్థానిక మెప్మా భవనంలో ఏర్పాటు చేసిన కేంద్రానికి వచ్చి పోస్టల్ బ్యాలెట్లను వినియోగించుకున్నారు. మొదట్లో ఈ నెల 3వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే ఆ తర్వాత కూడా రావడంతో వాటినీ పరిగణలోకి తీసుకోవడం గమనార్హం. కాగా, డివిజన్ల వారీగా ఎన్నెన్ని ఉన్నాయనేది ఇంకా తేల్చలేకపోయారు. -
నేటి ‘ప్రజావాణి’ రద్దు
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా సోమవారం నిర్వహించాల్సిన ‘ప్రజావాణి’ని రద్దు చేసినట్లు కలెక్టర్ విజయేందిర బోయి ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం ఈ కార్యక్రమాన్ని తిరిగి నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని జిల్లాలోని ప్రజలందరూ గమనించాలని విజ్ఞప్తి చేశారు. పోలింగ్ రోజు స్థానిక సెలవు: కలెక్టర్ జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థలకు పోలింగ్ రోజు ఫిబ్రవరి 11న స్థానిక సెలవు దినంగా ప్రకటిస్తూ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి విజయేందిర ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే పోలింగ్స్టేషన్లు ఉన్న అన్ని ప్రభుత్వ భవనాలు, విద్యాసంస్థల భవనాలు, పోలింగ్ నిర్వహణకు అవసరమైన ఇతర భవనాలలో పనిచేస్తున్న సిబ్బందికి పోలింగ్ ముందు రోజు ఫిబ్రవరి 10వ తేదీ రోజు కూడా సెలవు ప్రకటించారు. మహబూబ్ నగర్ కార్పొరేషన్, దేవరకద్ర, భూత్పూర్ మునిసిపాలిటీ ప్రాంతాలలో ఎన్నికలకు నోటిఫై చేయబడిన ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు/సంస్థలకు ఆ సంస్థలలో పనిచేసే ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలుగా స్థానిక సెలవుగా ప్రకటించారు. 48 గంటల పాటు మద్యం దుకాణాలు బంద్ పాలమూరు: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నియమావళి అనుసరిస్తూ జిల్లాలో ఎన్నికలు జరిగే మహబూబ్నగర్, దేవరకద్ర, భూత్పూర్ మున్సిపాలిటీలలో సోమవారం 5 గంటల నుంచి ప్రచారంపై నిషేదం అమల్లోకి వస్తుందని కలెక్టర్ విజయేందిర బోయి ఒక ప్రకటనలో తెలిపారు. నేడు సా యంత్రం 5 గంటల నుంచి ఈ నెల 11న పో లింగ్ ముగిసే మద్యం దుకాణాలు, కల్లు దుకాణాలు మూసివేయాలని, అలాగే కౌంటింగ్ జరగనున్న 13వ తేదీన కూడా మద్యం, కల్లు దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. అలరించిన పద్యనాటక ప్రదర్శనలు స్టేషన్ మహబూబ్నగర్: మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని దేవాలయం ప్రాంగణంలో మిత్ర కళానాట్య మండలి ఆధ్వర్యంలో పౌరాణిక పద్యనాటక ప్రదర్శనలు ఆదివారం రెండో రోజు కొనసాగాయి. శ్రీకృష్ణరాయబారం, శ్రీరామాంజనేయ యుద్ధం పూర్తి నాటకం, హరిశ్చంద్ర కాటికసీను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీమిత్ర కళానాట్యమండలి ప్రధాన కార్యదర్శి వి.నారాయణ మాట్లాడుతూ మన్యంకొండ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని కొన్నేళ్ల నుంచి పద్యనాటక ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పద్యనాటక ప్రదర్శనలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నట్లు తెలిపారు. ప్రదర్శనలు ఈనెల 11వ తేదీ వరకు ఉంటాయని వెల్లడించారు. ఉత్సాహంగా ఆలిండియా కరాటే చాంపియన్షిప్ మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం వీఐపీ ఆలిండియా కరాటే చాంపియన్షిప్ ఉత్సాహంగా జరిగింది. పలు రాష్ట్రాల నుంచి దాదాపు 500 వందలాది మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. వివిధ కేటగిరిల్లో కతాస్, కుమితే, వెసన్ పోటీలు నిర్వహించారు. 14 విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి గ్రాండ్చాంపియన్షిప్లు అందజేశారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. పలువురు కరాటే మాస్టర్లు మాట్లాడుతూ ప్రస్తుతం కరాటే మార్షల్ ఆర్ట్స్కు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. కరాటే మార్షల్ ఆర్ట్స్తో దేహదారుఢ్యంతోపాటు మానసికంగా ఎదగవచ్చని అన్నారు. ఇలాంటి టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ సయ్యద్ అశ్వాక్, జీకే మాస్టర్ ఆలిండియా చీఫ్ క్రిష్ణయ్య, సీనియర్ మాస్టర్లు ఇలియాజ్ బిన్ సిద్దిఖీ, రవికుమార్, జగదీష్, కనకరాజ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఎలా గెలుద్దాం!
ఏం చేద్దాం..నగర డివిజన్లలో అభ్యర్థుల గెలుపు వ్యూహాలు కొల్లాపూర్ మున్సిపాలిటీలో ఎన్నికలకు నెలరోజుల ముందు నుంచే మంత్రి జూపల్లి కృష్ణారావు కసరత్తు మొదలైంది. ఈసారి ఎన్నికల్లో క్లీన్స్వీప్ లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు. గత పది రోజులుగా పూర్తి సమయం కొల్లాపూర్ మున్సిపాలిటీకే కేటాయిస్తున్నారు. నిత్యం 5 నుంచి 6 వార్డుల్లో ప్రచారం నిర్వహిస్తుండగా, ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్నికల ప్రచారంలోనే నిమగ్నమయ్యారు. ప్రచార పర్వంలో భాగంగా కొల్లాపూర్ మున్సిపాలిటీ వార్డులను ఇప్పటివరకు మూడుసార్లు చుట్టేశారు. కొల్లాపూర్లోని ఆయన ఇంటిలో వార్రూం ఏర్పాటు చేసి మరీ ఎన్నికల ప్రచార తీరును పర్యవేక్షిస్తున్నారు. మంత్రిగా నాగర్కర్నూల్ జిల్లాలోని ఇతర మున్సిపాలిటీలతో పాటు మరెక్కడ ప్రచారంలో పాల్గొనకుండా కొల్లాపూర్కే పరిమితమయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇలాకాలో కోస్గి, మద్దూరు చైర్మన్ పీఠాలను దక్కించుకునేందు కాంగ్రెస్ అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోంది. సీఎం రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం నిరతరం వార్డుల్లో ఇంటింటి ప్రచారంలో సైతం పాల్గొంటున్నారు. కొడంగల్ తో పాటు కోస్గి, మద్దూరు మున్సిపాలిటీల బాధ్యతలు సైతం తానే చేపట్టగా కొడంగల్ కంటే ఎక్కువగా కోస్గి మున్సిపాలిటీపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు. నిత్యం ప్రచారానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఈ మున్సిపాలిటీలో క్లీన్స్వీప్ లక్ష్యంగా వ్యూహాలను అమలు చేస్తున్నారు. -
కాంగ్రెస్కు వస్తున్న ఆదరణ చూడలేకనే విమర్శలు
స్టేషన్ మహబూబ్నగర్: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక మాజీ మంత్రి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడారు. కార్పొరేటర్ టికెట్లను ఎమ్మెల్యే నిర్ణయించారని మాజీ మంత్రి చెప్పడం అవాస్తవమన్నారు. ఎమ్మెల్యే, కాంగ్రెస్ కమిటీ సమష్టి నిర్ణయం మేరకు కార్పొరేషన్లో డివిజన్లకు టికెట్ల కేటాయింపులు జరిగిందన్నారు. మా పార్టీ అంతర్గత విషయంలో మాజీ మంత్రి జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఎమ్మెల్యే కృషి వల్లే మహబూబ్నగర్ కార్పొరేషన్గా ఏర్పడిందన్నారు. రెండేళ్లలో కాంగ్రెస్ హయాంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో అందరం కలిసే ఉన్నామని, ఏ నిర్ణయమైనా సమష్టిగానే తీసుకుంటామన్నారు. మహబూబ్నగర్ కార్పొరేషన్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కాంగ్రెస్తోనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. ప్రతిపక్షాల మాటలను ప్రజల్లో నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, నాయకులు వినోద్కుమార్, చంద్రకుమార్గౌడ్, సీజే బెనహర్ పాల్గొన్నారు. -
ఇళ్లు కూల్చేసిన వారే ఓట్లు అడుగుతున్నారు..
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాకేంద్రంలోని క్రిస్టియన్పల్లిలోని ఆదర్శనగర్లో అంధుల ఇళ్లను కూలకొట్టిన వాళ్లే మళ్లీ ఇప్పుడు ఓట్లు అడిగేందుకు వస్తున్నారని.. వారికి ఓట్ల ద్వారా తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని క్రిస్టియన్పల్లి, పాత పాలమూరు, శివశక్తి నగర్, భగీరథ కాలనీ, వీరన్నపేట, ప్రేమ్నగర్, సద్దలగుండు తదితర ప్రాంతాల్లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ముస్లిం, క్రిస్టియన్ పిల్లల చదువు కోసం మైనారిటీ గురుకులాలు కడితే వాటిని మధ్యలోనే నిలిపివేశారని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు.ఈ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ కలిసి పని చేస్తున్నాయని విమర్శించారు. ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు శ్రీనివాసు లు, నవకాంత్ ఇతర నాయకులు పాల్గొన్నారు. -
అరచేతిలో స్వర్గం చూపిస్తున్న ప్రభుత్వాలు
స్టేషన్ మహబూబ్నగర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారని ఎంఐఎం ఎమ్మెల్యే, ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని మదీనా మజీద్ చౌరస్తాలో శనివారం రాత్రి జరిగిన ఎంఐఎం మున్సిపల్ ఎన్నికల ప్రచారసభలో ఆయన మాట్లాడుతూ దేశంలో జరుగుతున్న అన్యాయాలపై ఎంఐఎం ప్రశ్నిస్తూనే ఉంటుందన్నారు. అసెంబ్లీలో అన్ని వర్గాల ప్రజల సమస్యలను లేవనెత్తుతానని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల, ఇరిగేషన్, టూరిజం ఇలా ప్రతి రంగం సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతానని అన్నారు. ఐక్యంగా ఉండి హక్కుల సాధన కోసం పోరాడుదామని పిలుపునిచ్చారు. గతంలో ఒకరు బంగారు తెలంగాణ అంటూ, ఇప్పుడు బంగారం ఇస్తామని హామీ ప్రజలను మభ్యపెట్టారని ఆరోపించారు. ఎవరికై నా తులం బంగారం అందిందా అని ప్రజలను అడిగారు. ప్రజల మద్దతే ఎంఐఎం పార్టీకి బలమన్నారు. ఇటీవలముంబైలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించామని అన్నారు. మహబూబ్నగర్లో జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటర్లు ఎంఐఎం అభ్యర్థులకు మద్దతుగా నిలిచి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంమహారాష్ట్రకు చెందిన మాజీ ఎమ్మెల్యే వారిస్ పఠాన్, ఎన్నికల ఇన్చార్జిలు జఫర్ఖాన్, సాదత్ అన్వర్, జిల్లా నాయకులు జాబిర్ బిన్ సయీద్, అబ్దుల్ హాదీ, మక్సూద్బిన్ అహ్మద్ జాకీర్, సాదతుల్లా హుస్సేని పాల్గొన్నారు. -
మన్యంకొండ.. భక్తజన సంద్రం
● దాసంగాలతో స్వామివారికి నైవేద్యం ● వైభవంగా శేషవాహన సేవ మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండలోని లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం శనివారం భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయింది. బ్రహ్మోత్సవాల్లో విశేష సేవలు పూర్తయినప్పటికీ జాతర మాత్రం నెల రోజుల పాటు కొనసాగుతుంది. ఈ క్రమంలో శనివా రం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చి పూజ కార్యక్రమాలు జరిపించారు. దిగువ కొండ, తేరు మైదానం, కోనేరు ప్రాంతం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ముందుగా కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం స్వామివారికి ప్రీతిపాత్రమైన దాసంగాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వైభవంగా శేషవాహన సేవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారికి శేషవాహన సేవను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శోభాయమానంగా అలంకరించిన శేషవాహనంలో స్వామివారిని గర్భగుడి నుంచి రథాల మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాలు, కాగడాల వెలుతురులో స్వామివారి సేవ ముందుకు కదిలింది. భక్తులు చేసిన హరినామ స్మరణతో ఆ ప్రాంతం మారుమ్రోగిపోయింది. బంగారు ఆభరణాలు, రకరకాల పూల అలంకరణలో స్వామివారు లైట్ల వెలుతురులో ధగధగ మెరిసిపోతూ శేషవాహనంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం రథాల మంటపం వద్ద తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించి తిరిగి మళ్లీ శేష వాహనంలో స్వామివారిని గర్భగుడిలోకి తీసుకెళ్లారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారితో పాటు పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. -
చోరీ కేసును ఛేదించిన పోలీసులు
నాగర్కర్నూల్ క్రైం : వృద్ధురాలిపై దాడి చేసి బంగారు, వెండి ఆభరణాలను చోరి చేసిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ అశోక్ రెడ్డి తెలిపారు. ఈనెల 2న తెల్కపల్లి మండల కేంద్రంలో వృద్ధురాలిపై దాడి చేసి నగలు అపహరించిన ఘటనకు సంబంధించిన వివరాలను సీఐ శనివారం తన కార్యాలయంలో వెల్లడించారు. తెల్కపల్లి మండలంలోని రాకొండ గ్రామానికి చెందిన రాములమ్మ ఎరుకలి గద్దె చెప్పుకుంటూ జీవనం సాగిస్తుంది. ఈమె మండల కేంద్రంలో ఓ గది అద్దెకు తీసుకుని రాత్రి వరకు అక్కడే ఉండి పొద్దుపోయాక స్వగ్రామానికి వెళుతుండేది. ఈ క్రమంలో ఈనెల 2న బల్మూరు మండలం కొండనాగులకు చెందిన శ్రీను రాములమ్మను పరిచయం చేసుకుని కల్లు తాగించాడు. ఆమెను తన ద్విచక్రవాహనంపై ఇంటి వద్ద దింపుతానని తీసుకెళ్లి రోకలి బండతో దాడి చేసి 8 గ్రాముల బంగారు నగలు, 30 తులాల వెండి కడియాలను చోరీ చేసి పరారయ్యాడు. రోజు ఇంటికి వచ్చె తన తల్లి రాకపోవడంతో కుమారుడు వచ్చి చూడగా తీవ్ర గాయాలైనట్లు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. మరుసటి రోజు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తెల్కపల్లిలోని కల్లు కాంపౌండ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడిని అదుపులోకి విచారించగా నేరాన్ని అంగీకరించాడు. చోరీ చేసిన బంగారు, వెండి ఆభరణాలు, ఇతర సామగ్రి రికవరీ చేసినట్లు తెలిపారు. నిందితుడుపై ఇది వరకే హైదరాబాద్, శంషాబాద్, మొయినాబాద్ పోలీస్స్టేషన్లలో దొంగతనం కేసులు ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో తెల్కపల్లి ఎస్సై నరేష్, ఐడిపార్టీ కానిస్టేబుల్లు భీముడు, వెంకటేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు. నిందితుడికి రిమాండ్ -
రూ.2.89లక్షల నగదు పట్టివేత
నారాయణపేట: పట్టణ పరిధిలోని ఎర్రగుట్ట చెక్పోస్ట్ వద్ద వాహన తనిఖీల్లో రూ.2.89 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు వాహనాల తనిఖీలు చేపట్టగా కర్ణాటకకు చెందిన మల్లికార్జున రూ.1.80వేలు, జాఫర్ రూ.1.09 వేలు నగదును తరలిస్తుండగా పట్టుకొని సీజ్ చేసినట్లు తెలిపారు. అలాగే వస్త్రాలు కూడా స్వాధీనం చేసుకొని స్వాధీనం చేసుకున్న నగదును సామగ్రిని ఎన్నికల నియమావళి ప్రకారం గ్రీవెన్స్ కమిటీకి అందజేసినట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటించాలని, అనుమతులు లేకుండా నగదు లేదా ఇతర వస్తువులు తరలిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రూ.1.30 లక్షలు స్వాధీనం కొత్తపల్లి (మద్దూరు): మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన వాహన తనిఖీల్లో మద్దూరులో రూ.1.30లక్షలు నగదు పట్టుబడినట్లు ఎస్ఐ విజయ్కుమార్ తెలిపారు. వాహన తనిఖీల్లో భాగంగా ఓ ద్విచక్రవాహనాన్ని ఆపి తనిఖీ చేయగా నగదు పట్టుబడినట్లు తెలిపారు. నిందితుడిది దౌల్తాబాద్ మండలం చిన్న పస్లాబాద్ గ్రామమని, నగదుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు చూపకపోవడంతో ఎన్నికల నిబంధనల ప్రకారం సీజ్ చేసి గ్రీవెన్స్ కమిటీకి అప్పగించినట్లు పేర్కొన్నారు. అదే విధంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 21 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసి రూ.11,500 జరిమానా విధించినట్లు వెల్లడించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో వాహన తనిఖీలు ప్రతి రోజు కొనసాగుతాయని, వాహనదారులు ఎన్నికల నిబంధనలు పాటించాలని సూచించారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి తిమ్మాజిపేట: మండల పరిధిలోని రాళ్ల చెరువుతండాలో కెతావత్ తిరుపతి (18) అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ హారిప్రసాద్రెడ్డి తెలిపారు. శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా జడ్చర్ల నుంచి ఆవంచకు వెళ్లే రహదారిపై అదే తండాకు చెందిన విస్లావత్ ఈశ్వర్ కారును నిర్లక్ష్యంగా నడుపుతూ వెనుక నుంచి ఢీకొట్టడంతో తిరుపతి సృహా కోల్పోయి పడిపోయాడు. వెంటనే సమీప ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మహబూబ్నగర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు మృతుడి తండ్రి శంకర్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
మక్తల్ @ 70
మొదటి మున్సిపాలిటీగా.. 1956లో మక్తల్ తొలి మున్సిపాలిటీగా ఏర్పడింది. 1958లో మొదటి మున్సిపల్ చైర్మగా గిరినాగప్ప ఎన్నికయ్యారు. అనంతరం లక్ష్మణరావు– 1960– 62, నీలకంఠం 1962– 64లో మున్సిపల్ చైర్మన్లుగా పనిచేశారు. అనంతరం మున్సిపల్ హోదా తొలగించారు. మక్తల్: 70 ఏళ్ల క్రితం మున్సిపాలిటీగా ఏర్పడిన మక్తల్ అనేక రాజకీయ పరిణామాల మధ్య తిరిగి మేజర్ పంచాయతీగానూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక తిరిగి మున్సిపాలిటీగా మారి అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. -
తక్కువ ఖర్చుతో ఎన్నికలు చేసేవాళ్లం..
● ప్రస్తుతం డబ్బు లేనిదే రాజకీయం లేదు ● మున్సిపల్ మాజీ చైర్మన్ కొత్వాల్ పాలమూరు: అభ్యుదయ భావాలతో మొదట విద్యార్థి నాయకుడి నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించానని, దేశానికి కాంగ్రెస్తోనే రక్షణ అని విశ్వసించి ఆ పార్టీలో చేరి రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగానని చెబుతున్నాడు రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబెదుల్లా కొత్వాల్. ప్రస్తుత కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో గతంలో మహబూబ్నగర్ మున్సిపాలిటీ చైర్మన్గా పనిచేసిన నేపథ్యంలో అప్పటి ఎన్నికల తీరు.. చైర్మన్గా తాను చేసిన అభివృద్ధి పనులపై ఆయన మాటాల్లోనే.. 2005 మున్సిపల్ ఎన్నికల్లో మహబూబ్నగర్ మున్సిపాలిటీలోని 15వ వార్డు రామయ్యబౌళి నుంచి కౌన్సిలర్గా గెలిచి.. మున్సిపల్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టాను. ఆ సమయంలో మహబూబ్నగర్ మున్సిపాలిటీలో 38 వార్డులు ఉండేవి. అప్పట్లో రాజకీయాలు చాలా గౌరవంగా ఉండేవి. మంచి నాయకులు కావాలని ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేసి ఎన్నుకునేవారు. నేను చాలా తక్కువ మొత్తం ఖర్చు పెట్టి కౌన్సిలర్ గెలిచాను. ప్రతిదానికి డబ్బు అవసరం లేకుండే.. ప్రస్తుతం పరిస్థితి అలా లేదు. ఆర్ధికంగా సాధారణ పౌరులు ప్రత్యక్ష ఎన్నికల పోటీలో దిగే పరిస్థితి లేదు. ● నేను చైర్మన్గా ఉన్న సమయంలో 2008లో అప్పటి సీఎం, దివంగత నేత వైఎస్సాఆర్ మహబూబ్నగర్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి హాజరు కావడం గొప్ప అనుభూతి కలిగించింది. అప్పట్లో పాలమూరు పట్టణంలో తాగునీటి సమస్య అధికంగా ఉండేది. దాదాపు రూ.75 కోట్లతో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేశా. ఇందిరమ్మ ఇళ్లు, పట్టణంలో చాలా వరకు డ్రెయినేజీలు, డీఎఫ్ఐడీ, ఐహెచ్డీపీ నిధులతో పట్టణ పేదరిక నిర్మూలన కోసం, మహిళా సంఘం భవనాలు, మెప్మా ఏర్పాటు చేశాం. ప్రధానంగా టీఎఫ్ఐ అనే కొత్త పథకానికి ఇక్కడే శ్రీకారం చుట్టగా.. ఈ పథకం విజయవంతం కావడంతో ఏపీలో మోడల్గా దీనిని అమలు చేశారు. గతంలో ఏపీలో పలు జిల్లాలకు ఇన్చార్జ్గా, 12ఏళ్లు డీసీసీ అధ్యక్షుడిగా, పీఏసీఎస్ చైర్మన్, డీసీఎంఎస్ చైర్మన్ పని చేశాను. 1994లో కాంగ్రెస్ నుంచి అమరచింత నియోజకవర్గం నుంచి, 2014లో మహబూబ్నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాను. -
ధ్వని పెరిగితే దండనే
● ఆస్పత్రులు, విద్యా సంస్థలు, న్యాయస్థానాలు, మతపరమైన ప్రదేశాలు, అధీకృత అధికారిచే ప్రకటించిన ప్రదేశాలకు 100 మీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాన్ని నిశ్శబ్ధం మండలంగా ప్రకటించారు. మిగిలిన ప్రాంతాలను మిశ్రమ ప్రాంతాల కేటగిరీగా ప్రకటిస్తారు. ● జనావాసాల్లో లౌడ్ స్పీకర్లు, మైకులు, డీజేలు నిబంధనల ప్రకారం 10 డీబీ(డెసిబుల్స్) నుంచి 75 డీబీ లోపు వినియోగించేందుకు అనుమతి ఉంది. ● బహిరంగ సమావేశాలు, రోడ్షోలో మాత్రమే లౌడ్ స్పీకర్లు వినియోగాన్ని ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతిస్తారు. ఇతర ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అనుమతి ఉంది. ● ఎన్నికల్లో వినియోగించే మైకులు, లౌడ్స్పీకర్లకు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అనుమతులు లేకుంటే వాహనాలను సీజ్ చేస్తారు. ● పోలింగ్కు 36 గంటల ముందు మైకులు, లౌడ్ స్పీకర్ల ప్రచారాలు నిలిపివేయాల్సి ఉంటుంది. ● ఎన్నికల నిబంధనల ప్రకారం నిర్దేశిత ధ్వనికన్నా తీవ్రత పెరిగితే సదరు పార్టీలపై కేసు నమోదు చేయవచ్చు. ప్రజలు కూడా ఫిర్యాదు చేయవచ్చు. ● నిబంధనలు ఉల్లంఘిస్తే ఎన్నిలక సంఘం చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. పాలమూరు/అచ్చంపేట: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మైకులు, లౌడ్ స్పీకర్ల మోత మోగిస్తూ శబ్ధ కాలుష్యాన్ని విచ్చలవిడిగా చేస్తుంటారు. ఉదయం నుంచి రాత్రి వరకు లౌడ్ స్పీకర్లు ప్రచారంతో విద్యార్థులు, చిన్న పిల్లలు, వృద్ధులు, రోగులు తీవ్ర అసౌకర్యానికి గురువుతున్నారు. ఎన్నికల ప్రచారంలో పూర్తిగా మైకులు నిషేధం సాధ్యం కాకపోవడంతో ప్రమాణాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్డ్ ప్రకారం ఇంకా రెండురోజులు మాత్రమే ప్రచారం చేసుకునే వీలుంది. 11న పోలింగ్ ఉన్నందున ఈ నెల 9వ తేదీ సాయంత్రం ప్రచారం ముగియనుంది. కాగా.. పట్టణాన్ని ఏ, బీ, సీ, డీ కేటగీరిగా విభజించి.. ఆ మేరకే సౌండ్ ఉండేలా ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది. -
‘బీజేపీకి లైన్ క్లియర్ చేసుకుంటున్నాడు’
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డిని సీఎం రేవంత్రెడ్డి నమ్మడం లేదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి టికెట్ కోసం యెన్నం లైన్ క్లియర్ చేసుకుంటున్నాడని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. శనివారం తన క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండి బీజేపీ గెలుపునకు ఎందుకు సహకరిస్తున్నారని ప్రశ్నించారు. సీఎం వెంట ఢిల్లీకిపోయి పాలమూర్కు అధిక నిధులు తేవాలని డిమాండ్ చేశారు. ఎంపీ అరుణ అండర్ గ్రౌండ్కు నిధులు తెచ్చానని గొప్పలు చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ జీఓను తెచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే ఒక తల్లి పిల్లలమని చెప్పుకోవడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. ఈ రెండేళ్లలో మున్సిపాలిటీకి ఒక్క రూపాయి తెచ్చింది లేదని విమర్శించారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి మేయర్, డిప్యూటీ మేయర్గా గెలిపిస్తే సీఎంతో కొట్లాడి నిధులు తెస్తామన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయల సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్గౌడ్, ముడ మాజీ చైర్మన్ వెంకన్న, మున్సిపల్ మాజీ చైర్మన్నర్సిములు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
గద్వాల మున్సిపల్ బరిలో.. బంధుగణం
గద్వాల: భార్యాభర్తలు.. అక్కాచెల్లెలు... అత్తాఅల్లుడు.. వివిధ వార్డుల్లో పోటీ చేస్తున్న ఘటనలు గద్వాల మున్సిపల్ ఎన్నికల బరిలో ఆవిష్కృతమైంది. వీరిలో కొందరు ఒకే పార్టీ నుంచి పోటీ చేస్తుండగా.. మరికొందరు ప్రత్యర్థి పార్టీల నుంచి పోటీకి సిద్ధమై.. ఇంట్లో బంధుత్వాన్ని కొనసాగిస్తూనే.. బయట సవాళ్లు విసురుకుంటున్నారు. అక్కాచెల్లెళ్లు.. ఒక కుటుంబం నుంచి ఒకరు పోటీ చేస్తేనే గొప్ప విషయం. అలాంటిది అక్కాచెల్లెలిద్దరూ వేర్వేరు వార్డుల నుంచి ఒకే పార్టీ తరఫున బరిలో నిలుస్తున్నారు. 33వ వార్డులో బీజేపీ అభ్యర్థిగా బండల పద్మావతి పోటీ చేస్తున్నారు. ఈమె 2014 ఎన్నికల్లో ఇదే వార్డు నుంచి కౌన్సిలర్గా గెలుపొంది చైర్పర్సన్ అయ్యారు. 2020 ఎన్నికల్లో రెండోసారి కౌన్సిలర్గా గెలుపొందారు. తాజాగా మూడోసారి మున్సిపల్ ఎన్నికల బరిలో దిగి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 34వ వార్డు నుంచి ఆమె సోదరి బండల రామలక్ష్మి మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. భార్యాభర్తలు ఇలా.. ఈ సారి ఎన్నికల్లో భార్యాభర్తలు వేర్వేరు వార్డుల్లో బీజేపీ అభ్యర్థులుగా పోటీలో నిలబడ్డారు. 19వ వార్డు నుంచి బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, 26వ వార్డు నుంచి ఆయన సతీమణి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కృష్ణవేణి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. -
లోపల పొత్తులు.. బయటకు కత్తులు
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/సాక్షి, నాగర్కర్నూల్: మున్సిపల్ ఎన్నికల వేళ ప్రధాన రాజకీయ పార్టీల మధ్య అంతర్గత పొత్తులు ఆసక్తి రేపుతున్నాయి. పార్టీల సిద్ధాంతాలు, వైరుధ్యాలకు సంబంధం లేకుండా చైర్మన్ పీఠాలను కై వసం చేసుకోవడమే లక్ష్యంగా అంతర్గతంగా ఒప్పందాలు కుదిరిపోతున్నాయి. బాహాటంగా పొత్తు మాట లేకుండా వార్డుల్లోనే మీకిది.. మాకది అన్న చందంగా పార్టీల అభ్యర్థులు సర్దుబాట్లు చేసుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికల గడువు సమీపిస్తున్న క్రమంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థుల మధ్య అంతర్గత పొత్తులు, సర్దుబాట్లు ముమ్మరంగా చోటుచేసుకుంటున్నాయి. కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో చైర్మన్ స్థానాలను కై వసం చేసుకునేందుకు ఇతర పార్టీల అభ్యర్థులతోనూ గుట్టుగా సంప్రదింపులు జరుపుతుండటం చైర్మన్ పీఠాల కోసం పార్టీల పోటీ తీవ్రతకు అద్దం పడుతోంది. సర్దుబాట్లతో కలసిన పార్టీలు.. నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో సీపీఎం పార్టీ పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్తో సంప్రదింపులు జరిపింది. అయితే చివరి నిమిషంలో ఏ పార్టీతోనూ పొత్తు పొసగలేదు. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎవరికి వారు సొంతంగానే అభ్యర్థులను పోటీలో నిలిపాయి. చైర్మన్ పీఠమే లక్ష్యంగా ఈ మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య అంతర్గత సర్దుబాట్లు కొనసాగినట్టు ప్రచారం జరుగుతోంది. బీజేపీ అభ్యర్థుల గెలుపునకు అవకాశం ఉన్నచోట సహకరించడం, ఫలితంగా చైర్మన్ ఎన్నికల్లో మద్దతును పొందేలా ఒప్పందాలు కుదిరినట్టుగా తెలుస్తోంది. ఈ తరహా అంతర్గత సర్దుబాట్లు ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయోనని కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. వనపర్తి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ సీపీఎంతో పొత్తు పెట్టుకుంది. ఒప్పందంలో భాగంగా సీపీఎం పార్టీకి రెండు వార్డులను సైతం కేటాయించింది. అమరచింత మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్, సీపీఎం మధ్య పొత్తు కుదిరింది. ఇక్కడ పది వార్డుల్లో సీపీఎం పార్టీకి మూడు వార్డులు దక్కాయి. ఈ రెండు మున్సిపాలిటీల్లో సీపీఎం పార్టీ ఒకచోట బీఆర్ఎస్, మరోచోట కాంగ్రెస్ పార్టీతో జతకట్టడం గమనార్హం. చక్రం తిప్పేందుకు బహుముఖ వ్యూహం.. మహబూబ్నగర్ కార్పొరేషన్లో ఈసారి మేయర్ పీఠం కోసం మూడు ప్రధాన పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన కీలక నేత ఒకరు ఇతర పార్టీల అభ్యర్థులతో సైతం వేగంగా సంప్రదింపులు జరుపుతుండటం చర్చనీయాంశమవుతోంది. ఈసారి మేయర్ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకునేందుకు ఇతర పార్టీల్లోని అభ్యర్థులతో సైతం టచ్లోకి వెళుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక్కడ పలువార్డుల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య సరు ్దబాట్లు కొనసాగుతుండటం, చివరకు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై ఆసక్తి నెలకొంది. భూత్పూర్ మున్సిపాలిటీలోనూ బీఆర్ఎస్, బీజేపీల మధ్య అంతర్గతంగా చర్చలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. గద్వాలలో చైర్మన్ కోసం పోటీతీవ్రం.. గద్వాల మున్సిపాలిటీలో ఈసారి చైర్మన్ స్థానం కోసం మూడు ప్రధాన పార్టీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ సైతం అంతర్గత పోరుతో ఇరువర్గాలుగా చీలిపోయింది. ఈ క్రమంలో కాంగ్రెస్లోని ఓ వర్గం బీఆర్ఎస్ అభ్యర్థులతో సర్దుబాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య చైర్మన్ పీఠం కోసం తీవ్రమైన పోరు కొనసాగుతోంది. బీఆర్ఎస్లోనూ ఆపార్టీ కీలకనేత ఈ ఎన్నికల సందర్భంగా అంటీముట్టనట్టు వ్యవహరిస్తుండటంతో ఫలితాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందన్న అంశం ఆసక్తి రేపుతోంది. వనపర్తి, అమరచింతలో బహిరంగంగానే పొత్తు.. మున్సిపల్ ఎన్నికల వేళ పార్టీల మధ్య అంతర్గత పొత్తులు చైర్మన్ పదవులే లక్ష్యంగా అంతర్గత ఒప్పందం ఎత్తులకు పైఎత్తులు వేస్తున్న ప్రధాన పార్టీలు పార్టీలతో నిమిత్తం లేకుండా వార్డుల్లో అభ్యర్థుల సర్దుబాట్లు -
మిగిలింది 2 రోజులే..
సాక్షి, నాగర్కర్నూల్: మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఇంకా రెండు రోజుల సమయమే మిగిలి ఉంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికలను నిర్వహించనుండగా.. అంతకు 48 గంటల ముందే ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఈ క్రమంలో ప్రచారానికి తక్కువ సమయమే ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. దీంతో ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా క్షణం తీరిక లేకుండా రోజంతా ప్రచారంలో నిమగ్నమవుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ప్రధాన పార్టీల ప్రచారంలో వేగం.. ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ ప్రధాన రాజకీ య పార్టీలు తమ ప్రచారంలో వేగం పెంచాయి. ఉదయం నుంచే ప్రచార రథాలు, మైక్లతో హోరెత్తిస్తున్నాయి. వార్డుల వారీగా అభ్యర్థుల ప్రత్యేక పాటలతో రోజంతా ప్రచారం సాగిస్తున్నారు. కాంగ్రెస్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీ వార్డుల్లో కలియదిరుగుతున్నారు. వారితోపాటు సతీమణులు, కుటుంబసభ్యులు సైతం ప్రచారంలో పాలుపంచుకుంటున్నారు. మంత్రి వాకిటి శ్రీహరి సతీమణి లలిత సైతం ఇంటింటి ప్రచారంలో పాల్గొంటున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు తనయుడు అరుణ్ కొల్లాపూర్ మున్సిపాలిటీలో అన్నీతానై వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు తీరిక లేకుండా ప్రచారంలోనే నిమగ్నమవుతున్నారు. తమకు కలిసివచ్చే అంశాలపై దృష్టిపెడుతూ ఓట్ల సమీకరణకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ సైతం తమకు పట్టున్న ప్రాంతాలపై ఫోకస్ను మరింత పెంచింది. అభ్యర్థులతోపాటు నేతలు ఉదయం నుంచి సాయంత్రం వరకు వార్డుల్లో ప్రచారం నిర్వహిస్తూ రాత్రివేళల్లోనూ అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహాలకు పదునుపెడుతున్నారు. బలప్రదర్శనపై ఫోకస్.. ఇప్పటివరకు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ వచ్చిన పార్టీలు ఎన్నికల ప్రచారంలో క్రమంగా వేగం పెంచుతున్నాయి. ఎన్నికల ప్రచారానికి ఇంకా రెండు రోజులే మిగిలి ఉండటంతో తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లను ఆకర్షించేందుకు బల ప్రదర్శనపై దృష్టిపెట్టాయి. ఎక్కువ మంది మహిళలు, యువత, పెద్ద సంఖ్యలో ప్రజలను తమ వెంట ప్రచారంలో తిప్పుకొనేందుకు అధికంగా ఖర్చు చేస్తున్నాయి. ప్రచార ర్యాలీల్లో బల ప్రదర్శన చూపించడం ద్వారా తటస్థ ఓటర్లను తమ వైపు తిప్పుకొనేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. గంపగుత్తగా ఓట్లను పొందేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. వలస ఓట్ల కోసం గాలింపు.. ఉమ్మడి జిల్లాలో వలస ఓటర్ల ప్రభావం ఎక్కువ ఉండటంతో మున్సిపల్ ఎన్నికల్లో వారి ఓట్ల కోసం అన్ని పార్టీల గాలింపు కొనసాగుతోంది. హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో నివశిస్తున్న ఓటర్లను గుర్తించడంతోపాటు వారి నివాస స్థలాలు, ఫోన్ నంబర్లను సేకరిస్తున్నారు. వారందరినీ పోలింగ్ రోజున స్వస్థలాలకు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వారి బాధ్యతలు, బాగోగులను సంబంధిత వార్డుల్లో ఇన్చార్జిలకు అప్పగిస్తున్నారు. వలస ఓటర్లకు సంబంధించి వారి ప్రయాణ ఖర్చులతోపాటు ఓటుకు కనీసం రూ.2 వేల చొప్పున ముట్టజెప్పేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మిగతా ఓటర్ల కన్నా ముందస్తుగానే వలస ఓటర్లకు సర్దుబాటు చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. మొదలైన ప్రలోభాల పర్వం.. పోలింగ్కు మూడు రోజుల ముందే ఓట్ల కోసం ప్రలోభాల పర్వం మొదలైంది. ఇప్పటి కే వార్డుల్లో మద్యం ఏరులై పారుతోంది. నిత్యం ప్రచారంలో పాల్గొంటున్న వారితోపాటు వార్లుల్లో ఇంటింటికి మద్యం బాటిల్ పంపిణీ సైతం ఇప్పటికే మొదలైంది. కుల, మహిళా సంఘాల్లోని సభ్యుల ఓట్లను గంపగుత్తగా పొందేందుకు అభ్యర్థులు ఎవరికి వారు తాయిళాలు ప్రకటిస్తున్నారు. ఎన్నికల కు గడువు ముంచుకొస్తుండటంతో ప్రలోభాల పర్వం మరింత ఊపందుకోనుంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సమీపిస్తున్న గడువు సమయం దగ్గరపడుతున్న కొద్దీ అభ్యర్థుల్లో మొదలైన టెన్షన్ బలప్రదర్శనతో హోరెత్తిస్తున్న పార్టీలు -
ఫుట్పాత్పై ఆక్రమణలు తొలగించాలి
నగర పరిధిలో ఎక్కడబడితే ఫుట్పాత్ను అక్కడ కొందరు దుకాణదారులు, చిరువ్యాపారులు ఆక్రమించుకుని వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. దీనివల్ల పాదచారులు నడిరోడ్డుపైనే నడవాల్సి వస్తోంది. వాహనాలు వస్తున్నప్పుడు తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. తక్షణమే ఈ ఆక్రమణలను తొలగించాలి. ఎస్పీ కార్యాలయం వద్ద రోడ్డుకు ఇరువైపులా లెవలింగ్ (బెర్మ్) లేదు. బైక్లు, ఇతర వాహనాలు వేగంగా వస్తున్నప్పుడు కింద పడుతున్నారు. కొందరు మైనర్లు లైసెన్స్ లేకుండా రోడ్లపై వాహనాలు నడుపుతున్నారు. – ఎ.రాజసింహుడు, శ్రీనివాసకాలనీ -
అన్ని పాఠశాలల్లో బయోమెట్రిక్
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ప్రత్యేక శిబిరాల ద్వారా ఉచిత బయోమెట్రిక్ అప్డేట్లను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ విజయేందిర ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని వీసీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ (డీఎల్ఏఎంసీ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన విద్యార్థుల ఆధార్ కవరేజీ, మాండేటరీ బయోమెట్రిక్ ఆప్డేట్ (ఎంబీయూ)పై సమీక్షించారు. ముఖ్యంగా ఆరేళ్లలోపు పిల్లలకు ప్రధానంగా జనన ధ్రువీకరణ పత్రం లేకపోవడంతో నమోదు జరగలేదని గుర్తించారు. ఈ ధ్రువీకరణ పత్రాలు జారీచేసే శాఖలు వేగవంతం చేయడంతో పాటు సర్టిఫికెట్ తీసుకునే సమయంలోనే ఆధార్ నమోదు చేపట్టాలన్నారు. అనాథ, ఇతర ఆశ్రయ గృహాల్లోని ప్రతి పిల్లవాడికి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలన్నారు. 18 ఏళ్లుపై బడిన వారి ఆధార్ ధ్రువీకరణ కేసులను తహసీల్దార్లు రాష్ట్ర ధ్రువీకరణ పోర్టల్లో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. సాంఘీక సంక్షేమ, మైనారిటీ శాఖల స్కాలర్షిప్లలో ఆధార్ సమస్యలు, పీవీటీజీ సముదాయాల ఆధార్ నమోదు, ట్రాన్స్జెండర్లకు కొత్తగా నమోదు, జెండర్ అప్డేట్, వందేళ్లు పైబడిన వారి ఆధార్ ధ్రువీకరణ తదితర అంశాలపైనా చర్చించారు. ప్రభుత్వ పథకాలు, పరీక్షలు, ఇతర సేవల సమయంలో ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రతిపౌరుడు తన ఆధార్ నమోదుతో పాటు అప్టేడ్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. అలాగే అడ్డాకల్, భూత్పూర్, మూసాపేట, మహబూబ్నగర్ రూరల్, మహమ్మదాబాద్, కౌకుంట్ల మండలాలలో కొత్త శాశ్వత ఆధార్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనాలు పంపించామన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు శివేంద్రప్రతాప్, మధుసూదన్నాయక్, తెలంగాణ ఆధార్ ప్రాజెక్టు అధికారి నరేష్, డీఈఓ ప్రవీణ్కుమార్, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిణి జరీనాబేగం, సీపీఓ రవీందర్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు. -
వాయు, శబ్ద కాలుష్యం అరికట్టాలి
నగరంలో పెరుగుతున్న వాహనాల కారణంగా వాయు, శబ్ద కాలుష్యం వెదజల్లుతోంది. దీనివల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలి. గల్లీలలో విద్యుత్ స్తంభాలు, తీగలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. తాగునీటి సరఫరా సరిగ్గా జరగడం లేదు. నగరంలో సిటీ బస్సులను ప్రవేశపెడితే ఆటోవాలాల ఆగడాలను అరికట్టవచ్చు. ప్రధాన రోడ్లపై వాహనాల రద్దీతో ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. రవాణా సౌకర్యం మెరుగుపరిచి అందరికీ సౌకర్యంగా ఉండేలా చూడాలి. – లక్ష్మణ్గౌడ్, మెట్టుగడ్డ -
అంతర్గత రోడ్డు బాగు చేయాలి
అన్ని డివిజన్లలోని అంతర్గత రోడ్లు బాగు చేయాలి. విలీన గ్రామాలతో పాటు కొత్త కాలనీలలో చాలా చోట్ల మట్టిరోడ్లే ఉన్నాయి. డ్రెయినేజీలు నిర్మించాలి. ఆయా వీధులకు కొత్త నంబర్లు కేటాయించాలి. అధ్వాన స్థితికి చేరిన సీసీ, బీటీలకు మరమ్మతు చేపట్టాలి. డివైడర్లకు ఉన్న బారికేడ్లను తక్షణమే మూసివేయాలి. ఎక్కడికక్కడ ఇవి ఖాళీగా ఉండటంతో పాదచారులు వాటి నుంచే వెళ్తున్నారు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. – కె.చంద్రశేఖర్రావు, టీచర్స్కాలనీ, మహబూబ్నగర్ -
ట్రాఫిక్ను నియంత్రించాలి..
సిగ్నల్ వ్యవస్థను పునరుద్ధరించాలి ● సమస్యలపై అవగాహన ఉన్నవారికే ఓటు ● ‘సాక్షి’ చర్చా వేదికలో నగర సమస్యలపై ప్రజల ఏకరువు మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నగరంలో నెలకొన్న సమస్యలపై వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఏకరువు పెట్టారు. జిల్లాకేంద్రం మెట్టుగడ్డలోని సీనియర్ సిటిజన్స్ ఫోరం కార్యాలయంలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చావేదికలో పలువురు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ముఖ్యంగా ట్రాఫిక్ను నియంత్రించాలని, పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని, యూజీడీ ఏర్పాటు చేయాలని, పార్కులను ఆహ్లాదకరంగా ఉంచాలని, ఫుట్పాత్లను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఆటోవాలాల ఆగడాలను అరికట్టాలని ముక్తకంఠంతో కోరారు. వచ్చే ఎన్నికల్లో సమస్యలపై అవగాహనతో పాటు నిజాయితీ, నిబద్ధత ఉన్నవారినే ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. -
ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పటిష్ట భద్రత
మహబూబ్నగర్ క్రైం: పీయూలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూమ్లు, కార్పొరేషన్, మున్సిపల్ ఓట్ల లెక్కింపు కేంద్రాల దగ్గర భద్రత విధానాన్ని శనివారం ఎస్పీ డి.జానకి తనిఖీ చేశారు. బ్యాలెట్ పత్రాల నిల్వ చేసే ప్రాంతంతో పాటు కౌంటింగ్ హాల్లో ఏర్పాటు చేయాల్సిన భద్రతపై సమీక్షించారు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర మూడంచెల భద్రత తప్పనిసరిగా అమలు చేయాలని, కౌంటింగ్ హాల్స్ పరిసరాల్లో సీసీ కెమెరాల ద్వారా 24 గంటల నిఘా ఏర్పాటు చేయాలన్నారు. అనధికార వ్యక్తులకు అవకాశం లేకుండా కఠినమైన ప్రవేశ నియంత్రణ వ్యవస్థ అమలు చేయాలన్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి అభ్యర్థులు, ఏజెంట్లు, అధికారులు వేర్వేరు మార్గాల ద్వారా ప్రవేశించే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. జనసంచారం అధికంగా ఉండకుండా పార్కింగ్ ప్రాంతాలను ముందే కేటాయించి ట్రాఫిక్ సజావుగా నడిచే ప్రణాళిక రూపొందించాలన్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు వెంటనే స్పందించేందుకు క్విక్ రెస్పాన్స్ టీమ్(క్యూఆర్టీ) అందుబాటులో ఉండాలన్నారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు స్ట్రాంగ్ రూమ్ల వద్ద నిరంతర పోలీస్ పహారా కొనసాగించాలన్నారు. ఆమె వెంట ఎన్నికల సెల్ డీఎస్పీ గిరిబాబు, సీఐలు అప్పయ్య, గాంధీనాయక్, మోతీరామ్, రూరల్ ఎస్ఐ విజయ్కుమార్ పాల్గొన్నారు. ● డివిజన్ 11లో ఉన్న బండమీదిపల్లిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఎస్పీ డి.జానకి తనిఖీ చేశారు. కార్పొరేషన్ ఎన్నికలను ప్రశాంతంగా ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పటిష్టభద్రత ఏర్పాటు చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల దగ్గర ప్రహారీ లేని దగ్గర తాత్కాతిక బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. -
పరిశుభ్రంగా ఉంచుకోవాలి
నగరాన్ని అందరూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా పార్కులు ఆహ్లాదకరంగా ఉండాలి. జాతీయ రహదారి 167పై ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగినా ఆ మేరకు సౌకర్యాలు కల్పించకపోవడం దారుణం. తక్షణమే సిగ్నల్స్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. పార్కింగ్ స్థలాలు లేక ఎక్కడబడితే అక్కడ నడిరోడ్లపై వాహనాలను నిలిపివేస్తున్నారు. పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. – జగపతిరావు, సీనియర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షుడు, మహబూబ్నగర్ -
భార్యల స్థానంలో భర్తలు.. భర్తల స్థానంలో భార్యలు
కొల్లాపూర్: స్థానిక మున్సిపాలిటీలోని కొన్ని వార్డుల్లో భర్తల స్థానాల్లో భార్యలు.. భార్యల స్థానాల్లో భర్తలు ఎన్నికల బరిలో నిలిచారు. మున్సిపాలిటీలోని మూడో వార్డులో గత ఎన్నికల్లో మాచుపల్లి బాలస్వామి కౌన్సిలర్గా గెలిచారు. ఈసారి ఆ వార్డు మహిళకు రిజర్వు కావడంతో ఆయన భార్య సరోజను పోటీలోకి దింపారు. నాలుగో వార్డులో (గత ఎన్నికల్లో ఐదో వార్డు) మహిమూదాబేగం కౌన్సిలర్గా గెలిచి మున్సిపల్ వైస్చైర్పర్సన్గా పనిచేశారు. ఈ స్థానం ఇప్పుడు జనరల్ కావడంతో ఆమె భర్త ఖాధర్పాషా కౌన్సిలర్గా పోటీ చేస్తున్నారు. పదో వార్డులో (గత ఎన్నికల్లో 11వ వార్డు) బోరెల్లి కరుణ కౌన్సిలర్గా గెలిచారు. ఈసారి ఆ స్థానం ఎస్సీ జనరల్కు రిజర్వు కావడంతో ఆమె భర్త బోరెల్లి మహేశ్ కౌన్సిలర్గా పోటీ చేస్తున్నారు. వీరంతా కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీలో నిలిచారు. ఈ మూడు స్థానాల్లో తమ పట్టు నిలుపుకొనేందుకు వారు కృషిచేస్తున్నారు. -
సరిహద్దు పట్టణం అయిజలో.. ఎన్నికల సందడి
2012లో నగర పంచాయతీ 2018లో మున్సిపాలిటీ మూడోసారి జరగనున్న ఎన్నికలు అయిజ: తెలంగాణ రాష్ట్రం దక్షిణ సరిహద్దు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ఆనుకొని ఉన్న అయిజ 2012లో గ్రామ పంచాయతీ నుంచి నగర పంచాయతీగా రూపాంతరం చెందింది. 2018లో మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయ్యింది. సుమారు రూ.3 కోట్ల ఆదాయంతో ఉన్న మున్సిపాలిటీలో 31 వేల జనాభా, 8 వేల నివాసగృహాలు, 23 వేల మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీ విస్తీర్ణం సుమారు 7 చదరపు కిలో మీటర్లు. 201 సెన్సస్ ప్రకారం జనాభా 22,708 కాగా, 2011 సెన్సస్ ప్రకారం 27,921 మంది ఉన్నారు. ఉత్కంఠగా మున్సిపల్ ఎన్నికలు అయిజలో మూడోసారి నిర్వహిస్తున్న మున్సిపల్ ఎన్నికలు ఉత్కంఠ పెంచాయి. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థులు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. పదేళ్ల అనంతరం మున్సిపల్ చైర్మన్ పదవి బీసీలను వరించడంతో బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న మున్సిపాలిటీ కావడంతో చైర్మన్ పదవికి పోటీ పెరిగింది. చరిత్రకు సాక్ష్యాలుగా పురాతన ఆలయాలు అయిజ చరిత్ర నియోలిథిక్ కాలం నుంచి మొదలవుతుంది. ఇక్కడి ప్రాంతాల్లో పురాతన మానవ నివాసాల ఆధారాలు లభించాయి. గద్వాల సంస్థాన పాలకుడు నల్ల సోమనాద్రి హయాంలో నిర్మించిన బక్కమ్మ బావి ప్రస్తుతం శిథిలావస్థలో ఉండడం విచారకరం, అదే విధంగా చాణుక్య రాజులు నిర్మించిన శివాలయం ఇక్కడ చరిత్రకు సాక్ష్యంగా నిలిచింది. వనవాసం సమయంలో రాముడు, సీతాదేవి ప్రతిష్ఠించిన శివలింగాలు ఇప్పటికి చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఈ దేవాలయాలు అయిజను ఆధ్యాత్మిక కేంద్రాలుగా మార్చాయి. సుమారు వంద సంవత్సరాల క్రితం మతి స్థిమితం లేకుండా తిరేగా వ్యక్తి వీరప్ప మహిమలు చూపుతూ ఉండేవాడని, అయిజలో సజీవ సమాది అయ్యారని పూర్వీకులు తెలుపుతున్నారు. అయితే సమాధిపైనే ఆయన పేరుతో ఆలయం నిర్మించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తిక్కవీరేశ్వరస్వామి జాతర ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. -
గుడి కట్టు.. ఓట్లు పట్టు
వనపర్తిటౌన్: మున్సిపల్ ఎన్నికల్లో వనపర్తిలోని 21వ వార్డులో అభ్యర్థులు వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తమ నివాస ప్రాంతంలో ఆంజనేయస్వామి గుడి లేకపోవటంతో ఇక్కడి ప్రజలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. 25 ఏళ్ల నుంచి ఎన్నికల ముందు కౌన్సిలర్ అభ్యర్థులు కట్టిస్తామని హామీ ఇచ్చి, గెలిచాక గుడిని పట్టించుకోవట్లేదని వాపోతున్నారు. 18 ఏళ్ల క్రితం ఆలయ నిర్మాణం కోసం పనులు మొదలు పెట్టినప్పటికి ముందుకు సాగడం లేదు. నందిమల్లగడ్డతో పాటు మరో ప్రాంతంలో గుడి లేకపోవటంతో ప్రజలు వెలితీగా భావిస్తున్నారు. ఆంజనేయస్వామి లేని ఊరు ఉండకూడదన్న నమ్మకంతో గుడి ఎట్టి పరిస్థితుల్లో నిర్మించాలని స్థానికులు పట్టుదలగా ఉన్నారు. తాజాగా మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి అభ్యర్థులు వస్తుండటంతో ఇక్కడ ఆంజనేయస్వామి గుడి కట్టిన వారికే ఓటు వేస్తామని ఓటర్లు తేల్చి చెబుతున్నారు. దీంతో అభ్యర్థులు తాము కడతామని యథావిధిగా హామీ ఇస్తున్నప్పటికీ ఓటర్లు మాత్రం మరోసారి మోసపోమని తెగేసి చెబుతున్నారు. -
వెట్టి చేయించుకొని చనిపోయాక వదిలేశారు
నవాబుపేట: కుటుంబపెద్దను కోల్పోయిన తమను ఆదుకోవాలని బాధిత కుటుంబసభ్యురాలు శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని ఇప్పటూర్ గ్రామానికి చెందిన యాదయ్య (46) అదే గ్రామంలో గల సోలార్ విద్యుత్ ప్లాంటులో 11 ఏళ్లుగా సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు. కాగా గత నెల 2న ప్లాంట్లో అతడు మృతి చెందాడు. అయితే బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ప్లాంట్ యాజమాన్యం బాధిత కుటుంబసభ్యులకు సూచించింది. అయితే పోస్ట్మార్టం నిర్వహించగా రిపోర్టులో కరెంట్ షాక్తో మృతి చెందినట్లు తేలిందని, కుటుంబపెద్దను కోల్పోయిన తమను ఆదుకుంటామని మాటా ఇచ్చిన ప్లాంట్ నిర్వాహకులు ఎటువంటి సాయం చేయకుండా రోడ్డున పడేశారని యాదయ్య భార్య బాలమణి ఆరోపించారు. చెక్కులు ఇస్తామని చెప్పి సంతకాలు తీసుకొని తీరా ఇప్పుడు రోడ్డున పడేశారని కన్నీటి పర్యంతమైంది. తన భర్త చావుకు సోలార్ ప్లాంటు యాజమాన్యమే కారణమని వారిపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని వేడుకుంది. ఈ విషయంలో జిల్లా అధికారులను సైతం కలిసి తమ గోడు వెల్లబోసుకుంటామని ఆమె వివరించింది. న్యాయం చేయాలంటూ బాధితురాలి మొర -
మున్సిపల్ బరిలో ఆశావర్కర్
కొత్తకోట రూరల్: వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీలోని 5వ వార్డులో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థిగా ఆశావర్కర్ ముంత మంజుల ఎన్నికల బరిలో నిలిచారు. స్థానికంగా ప్రజలకు సుపరిచితురాలైన మంజుల.. ఆరోగ్య సేవల ద్వారా మంచి గుర్తింపు పొందారు. ఆమె భర్త రామకృష్ణ బీఆర్ఎస్లో క్రియాశీల కార్యకర్తగా ఉంటూ వార్డు ప్రజలతో సన్నిహితంగా మెలుగుతున్నారు. ఈ వార్డు బీసీ మహిళకు రిజర్వు కావడంతో ఆయన పోటీలో ఉండలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పార్టీ నిర్ణయంతో ఆయన భార్య ముంత మంజులను రంగంలోకి దించారు. -
లెక్కింపులో పొరపాట్లకు తావివ్వొద్దు
పాలమూరు: మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేయాలని.. ఎక్కడా పొరపాట్లకు తావివ్వొద్దని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయేందిర బోయి, జనరల్ ఎన్నికల పరిశీలకురాలు కాత్యాయినీదేవి అన్నారు. ఎన్నికల పోలింగ్ తర్వాత బ్యాలెట్ బాక్సులను భద్రపరిచే పీయూలోని స్ట్రాంగ్రూమ్లతో పాటు ఓట్ల లెక్కింపు కేంద్రాలను శుక్రవారం వారు పరిశీలించారు. పీయూలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, స్టోర్ట్స్ కాంప్లెక్స్ల్లో మహబూబ్నగర్ కార్పొరేషన్, దేవరకద్ర ఓట్ల లెక్కింపు, ఫార్మా స్యూటికల్ కళాశాల భవనంలో భూత్పూర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఓట్ల లెక్కింపునకు అవసరమైన సామగ్రిని ముందుగానే సమకూర్చుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ పాల్గొన్నారు. -
ఆంజనేయుడికి బలమొచ్చింది..!
● ఆలయ అభివృద్ధికి రూ.40 లక్షల నగదు, రూ.25 లక్షల భరోసా? ● గుడి చుట్టూ రాజకీయం.. పేటలో హాట్ టాపిక్ ● బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు పోటాపోటీగా.. నారాయణపేట: అంబపలుకు.. జగదాంబ పలుకు మున్సిపల్ ఎన్నికల పలుకు.. ఇదేంటి అని ఆశ్చర్యపోతున్నారా.. అందరూ చదవి, విని ఆశ్చర్యపోవాల్సిందే మరి. జిల్లా కేంద్రమైన నారాయణపేట మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు శ్రీ అంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి మున్సిపల్ పోరులో కాసుల వర్షం కురుస్తోంది. ఆ వార్డు గత రెండు పర్యాయాలు ఎస్సీకి రిజర్వ్ కావడం ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ సారి జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో ఆ వార్డుకు డిమాండ్ పెరిగింది. ముందుగా ఆ వార్డులో పోటీ చేసేందుకు ఏవరూ ఆసక్తి చూపలేదు. ఒక అడుగు ముందుకేసి మార్కెట్ మాజీ చైర్మన్ కన్నా జగదీశ్ తన సతీమణి శంకరమ్మను బీఆర్ఎస్ తరఫున రంగంలోకి దింపారు. ఆ వార్డులో ఉన్న ఆంజనేయస్వామి ఆలయం అభివృద్ధికి నోచుకోకపోవడంతో.. బీసీ కాలనీలో ఉన్న కొంతమంది ఓటర్లు ఈ గుడిని ఎవరు అభివృద్ధి చేస్తే వారికి పట్టం కడతామని బహిరంగంగానే చెప్పుకొచ్చారు. తనకు అవకాశం ఇవ్వాలని.. ఆలయం పరిసర ప్రాంతాల ఓటర్లలో కీలకమైన వ్యక్తులతో మాట్లాడి రూ.20 లక్షలు ఇచ్చేందుకు కన్నా జగదీశ్ ఒప్పుకున్నారు. అంతలోనే పట్టణానికి చెందిన కాంట్రాక్టర్ రాఘవేందర్రెడ్డి తన సతీమణి మంజులను సైతం రంగంలోకి దింపారు. ఆయనకు అదే డిమాండ్ పెట్టడం.. రూ.20 లక్షలు ఇవ్వాలని కాలనీవాసులు చెప్పడంతో ఆయన నగదు ఇచ్చినట్లు బహిరంగంగానే వినిపిస్తోంది. ఆ గుడికి ఇద్దరు అభ్యర్థుల ద్వారా రూ.40 లక్షలు రావడంపై అందరూ చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మంజులను రంగంలోకి దింపారు. అయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డి సైతం తామేమి తక్కువ కాదంటూ మీరు ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఈ గుడికి రూ.25 లక్షలు దేవాదాయ శాఖ నుంచి ఇప్పిస్తాననంటూ భరోసానిచ్చారు. ఎన్నికల్లో ప్రలోభాలకు గురి చేస్తే అభ్యర్థులను పోటీలో ఉండకుండా ఎన్నికల అధికారులు డిస్క్వాలిఫై చేయారా అని ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ గుడితో పాటు ఆ వార్డులో ఉన్న మశమ్మ ఆలయానికి సైతం రూ.10 లక్షల చొప్పున బీఆర్ఎస్, బీజేపీలు ఇచ్చినట్లు సమాచారం. అభివృద్ధి గురించి కాకుండా ఆలయాల చుట్టూ రాజకీయం జరుగుతుందంటూ పలువురు అంటున్నారు. -
ఎన్నికల ఉపాధి
జిల్లాలో మున్సిపల్ ప్రచారంలో 348 ఆటోల వినియోగం పాలమూరు: సాధారణంగా ఒక ఆటో డ్రైవర్ ప్రయాణికులను తరలించడం ద్వారా రోజుకు రూ.400 నుంచి రూ.500 వరకు సంపాదిస్తాడు. ప్రస్తుతం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందడి నెలకొన్నందున కొంతమంది ఆటో డ్రైవర్లకు ప్రత్యేక ఉపాధి దొరికింది. డివిజన్లతో పాటు వార్డుల్లో కార్పొరేటర్, కౌన్సిలర్గా పోటీ చేసే అభ్యర్థుల ఎన్నికల ప్రచారం కోసం ఒక్కో డివిజన్లో రెండు నుంచి మూడు వరకు ఆటోలు ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కో ఆటోకు రోజుకు రూ.2 వేలు అద్దె చెల్లించడంతో పాటు డ్రైవర్కు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు. జిల్లాలో 348 ఆటోలతో పాటు మరో 10 ఇతర వాహనాలు ఈ ఎన్నికల ప్రచారం కోసం ఉపయోగిస్తున్నారు. భూత్పూర్లో 21 ఆటోలు, దేవరకద్రలో 23, మహబూబ్నగర్ కార్పొరేషన్లో 305 ఆటోలు ఎన్నికల ప్రచారంలో భాగమయ్యాయి. -
కోతుల బెడదపై సమరం
జడ్చర్ల: ప్రస్తుతం జడ్చర్ల మున్సిపాలిటీకి ఎన్నికలు లేకపోవడం.. మరికొద్ది నెలల్లో ఎన్నికల సందడి మొదలయ్యే అవకాశం ఉండటంతో ఆశావహులు ఏదో రకంగా జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే 4వ వార్డుకు పోటీ అభ్యర్థిగా పేర్కొంటున్న పెద్ది వెంకటేశ్ కోతుల బెడదపై సమర శంకం మోగించారు. స్థానిక వీరశివాజీ నగర్లో ఇళ్లలోకి కోతులు చొచ్చుకుని వస్తున్నాయని.. వాటి నుంచి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అటవీశాఖ అధికారులకు ఆయన ఫిర్యాదు చేశారు. అయితే ఇది తమ పని కాదని.. మున్సిపల్శాఖ పనేనంటూ అటవీశాఖ అధికారులు రిజిస్టర్ పోస్ట్ ద్వారా సమాచారం అందించారు. ఈ మేరకు మున్సిపల్శాఖ అధికారులపై ఒత్తిడి తీసుకురానున్నట్లు ఈ సందర్భంగా ఆయన ‘సాక్షిశ్రీకి తెలిపారు. కాగా ఏదో ఒక సమస్యతో ఇప్పటి నుంచే ఆశావహులు జనంలోకి వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. -
కుండ చేస్తా.. ఓటు కూడగడతా
వాలేకూం.. సలాం నాడు.. నేడు.. ప్రత్యర్థులే గద్వాలటౌన్: ఎన్నికల్లో విజయాన్ని అందిపుచ్చుకోవడానికి నాయకులు పలుమార్లు బరిలోకి దిగుతారు. ప్రజాప్రతినిధిగా ఎన్నికవ్వాల్నదే వారి ఆశయం. గత ఎన్నికల్లో పోటీ పడిన అభ్యర్థులు ఈ సారి కూడా పోటీ పడడం గమనార్హం. రిజర్వేషన్ మహిళలకు కేటాయిస్తే వారి సతీమణులు, కుటుంబ సభ్యులను బరిలో దించుతుంటారు. 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆయా వార్డుల్లో పోటీ పడిన అభ్యర్థులు తిరిగి తాజాగా ఢీకొంటున్నారు. పట్టణంలోని నాల్గో వార్డు నుంచి పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు శారద, లలితమ్మ గత ఎన్నికల్లోనూ పోటీపడ్డారు. ప్రస్తుతం 22వ వార్డులో పోటీలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి పల్లవి, కాంగ్రెస్ అభ్యర్థి లత, 24వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గోపాల్, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసులు గత మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రత్యర్థులుగానే బరిలో నిలిచారు. 33వ వార్డులో బీజేపీ అభ్యర్థి బండల పద్మావతి, కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల జయలక్ష్మి పోటీలో నిలువగా.. గత ఎన్నికల్లో బండల పద్మావతి మీద జయలక్ష్మి కటుంబ సభ్యులు పోటీ చేశారు. 34వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి జయలక్ష్మి, బీజేపీ అభ్యర్థి బండల రామలక్ష్మి పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లోనూ వీరి కుటంబ సభ్యులు పోటీ పడ్డారు. రొట్టె కాల్చి.. ఓటు రాబట్టి.. -
వామన్పల్లిలో చిరుత సంచారం..?
ధరూరు: జూరాల బ్యాక్ వాటర్ పరిధిలోని వామన్పల్లి గ్రామ శివారులో చిరుత సంచరించినట్లు గ్రామస్తులు, రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గురువారం రాత్రి నల్లగట్టు ప్రాంతంలో గుర్తు తెలియని జంతువు ఆవు దూడను ఎత్తుకెళ్లింది. దీంతో గ్రామస్తులు చిరుత సంచరిస్తున్నట్లు భయాందోళనకు గురవుతున్నారు. ముందుగా ఆవు దూడను ఎత్తుకెళ్లింది గుర్తు తెలియని జంతువుగా భావించినప్పటికీ.. అక్కడి పరిసర ప్రాంతాల్లోని జాడలను బట్టి చిరుతపులి లేక హైనాకు సంబంధించిన గుర్తులు ఉన్నట్లు గ్రామ సర్పంచు పర్ణికా కృపాకర్రెడ్డి తెలిపారు. అటవీ శాఖ అధికారులకు తెలియజేయగా వారు జాడలను పరిశీలించి వెళ్లినట్లు పేర్కొన్నారు. రైతులు పశువులను పొలాల వద్ద కట్టేయవద్దని అటవీ శాఖ అధికారులు సూచించారు. -
రికార్డు స్థాయిలో విద్యుదుత్పత్తి
దోమలపెంట: టీఎస్ జెన్కో పరిధిలోని శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ కేంద్రంలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో విద్యుదుత్పత్తి చేసినట్లు కేంద్రం సీఈ సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఎస్ఈ (సివిల్) రవీంద్రకుమార్, ఎస్ఈ (ఓఅండ్ఎం) ఆదినారాయణతో కలిసి సీఈ కేక్ కట్ చేసి ఇంజినీర్లు, ఉద్యోగులకు అందజేసి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భూగర్భ కేంద్రంలో మొదటి యూనిట్ ద్వారా 2001– 02 నుంచి విద్యుదుత్పత్తి చేపట్టామన్నారు. తర్వాత ప్రతి ఆరు నెలలకు ఒక యూనిట్ చొప్పున సిద్ధం చేస్తూ మొత్తం ఆరు యూనిట్లు ఒక్కొక్కటి 150 మొగావాట్లతో 900 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో నిర్మించారని పేర్కొన్నారు. 2020లో కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగి నాలుగో యూనిట్ మరమ్మతుకు గురవగా.. ప్రస్తుతం 5 యూనిట్ల ద్వార ఉత్పత్తి చేస్తున్నామన్నారు. ఈ ఏడాది జెన్కో యాజమాన్యం భూగర్భ కేంద్రంకు 1,500 మి.యూనిట్లు టార్గెట్ నిర్దేశించగా.. 492 టీఎంసీల నీటిని వినియోగించి.. 2,544.22 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి సాధించామన్నారు. ఈ ఏడాది విద్యుదుత్పత్తి లక్ష్యం మార్చి 31 కాగా.. ఇంకా 50 రోజులు గడువు ఉందన్నారు. ఇంజినీర్లు, సిబ్బంది అందరి సహకారంతోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. -
కాంగ్రెస్ పాపాలను ప్రజల్లో ఎండగట్టాలి
● మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పాపాలను మహబూబ్నగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలకు వివరించాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శుక్రవారం టీడీగుట్ట, చిన్నదర్పల్లి, కిద్వాయిపేట్, మొనప్పగుట్ట, టీచర్స్ కాలనీ డివిజన్లలో మాజీ హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు నీళ్లకు అరిగోస పడే రోజుల నుంచి ప్రతి రోజు నీళ్లు వచ్చే పరిస్థితిని మిషన్ భగీరథతో సమస్యలు పరిష్కారం చూపినట్లు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చి రెండేళ్లలోనే తీవ్రమైన వ్యతిరేకతను కాంగ్రెస్ ప్రభుత్వం మూట కట్టుకుందన్నారు. మళ్లీ కేసీఆర్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. అత్యధికంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచి కార్పొరేషన్ను దక్కించుకుంటామన్నారు. ఈ సందర్భంగా తిమ్మసానిపల్లిలో కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సిములు తదితరులు పాల్గొన్నారు. -
డివిజన్ల వారీగా కాంగ్రెస్ ఇన్చార్జిల నియామకం
స్టేషన్ మహబూబ్నగర్: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ శుక్రవారం 60 డివిజన్ల వారీగా సీనియర్ నాయకులు, కార్యకర్తలను ఇన్చార్జిలుగా నియమించారు. వీరు డివిజన్లలో ఎన్నికల ప్రచార కార్యకలాపాలను సమన్వయం చేయాలని, బూత్స్థాయిలో పార్టీ బలోపేతం, కార్పొరేటర్ అభ్యర్థులు, పార్టీ కేడర్ మధ్య సమన్వయం చేయాలని సూచించారు. ఎన్నికల సన్నద్ధతపై క్రమం తప్పకుండా డీసీసీకి నివేదించాలని ఆదేశించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించేలా అందరూ కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. ప్రైవేట్లో అధిక ప్రసవాలపై డీఎంహెచ్ఓ ఆగ్రహం జడ్చర్ల టౌన్: ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రసవాలు అధికం కావటం పట్ల జిల్లా వైద్యాధికారి డా.కృష్ణ వైద్యసిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం గంగాపురం ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో గంగాపురం, జడ్చర్ల అర్బన్ హెల్త్సెంటర్, మిడ్జిల్ ప్రాథమిక వైద్య ఆరోగ్యకేంద్రంలపై ఆయన సమీక్ష నిర్వహించారు. జడ్చర్ల అర్బన్హెల్త్ సెంటర్ పరిధిలో అత్యధికంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రసవం కావడంపై ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు అయ్యేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలోని నాలుగు సబ్సెంటర్లలో సిబ్బంది అదనంగా ఉన్నారని, వారందరినీ మహబూబ్నగర్ ఎంసీహెచ్కు పంపించేందుకు వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. గంగాపురం, మిడ్జిల్ కేంద్రాల్లో ప్రసవాలు కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పీహెచ్సీల్లో ప్రసవాలు అయ్యేలా చూడాలని ఆదేశించారు. మూడు కేంద్రాల్లోనూ అబార్షన్ల సంఖ్య అధికంగా ఉందని, అందుకు గల కారణాలు వివరిస్తూ నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రులపై విశ్వాసం కల్పించాలన్నారు. సమావేశంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ డా.శివకాంత్, అర్బన్ హెల్త్ సెంటర్ డా.మనుప్రియ, గంగాపురం వైద్యాధికారి డా.ప్రతాప్చౌహాన్ పాల్గొన్నారు. -
మొదటి విడతర్యాండమైజేషన్ పూర్తి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలో మహబూబ్నగర్ కార్పొరేషన్, భూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీలకు జరుగనున్న ఎన్నికల కౌంటింగ్కు మొదటి విడత ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు సాధారణ ఎన్నికల పరిశీలకురాలు కాత్యాయనీదేవి అన్నారు. శుక్రవారం కలెక్టర్ చాంబర్లో కలెక్టర్ విజయేందిర తో కలిసి మొదటి విడత ర్యాండమైజేషన్ నిర్వహించి కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అ సిస్టెంట్లకు నియామక ఉత్తర్వులు జారీ చేశారు. 20 శాతం రిజర్వ్తో కలుపుకొని 69 కౌంటింగ్ సూపర్వైజర్లు, 139 మంది కౌంటింగ్ అసిస్టెంట్లకు నియామక ఉత్తర్వులు అందజేశారు. పోస్టల్ బ్యాలెట్కు768 దరఖాస్తులు మహబూబ్నగర్ మున్సిపాలిటీ: మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గత నెల 31 నుంచి ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్కు 768 దరఖాస్తులు అందినట్లు కమిషనర్ పి.రామాంజులరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి ఈనెల 8వ తేదీ వరకు గడువు ఉందని, అందరూ వినియోగించుకోవాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు తమ కార్యాలయ ప్రాంగణంలోని మెప్మా భవనంలో కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఇంగ్లిష్పై పట్టు సాధించాలి మహబూబ్నగర్ న్యూటౌన్: ఇంగ్లిష్ భాషపై పట్టు సాధించడంతో పాటు జ్ఞాపకశక్తిని మెరుగుపర్చుకోవడం అత్యంత ముఖ్యమని ఆంగ్ల యజ్ఞం ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లిష్ డైరెక్టర్ ఏఎస్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో ఐక్యూఏసీ ఆధ్వర్యంలో ‘ఇంగ్లిష్ నైపుణ్యాలతో పాటు జ్ఞాపకశక్తిని ఎలా మెరుగుపరచుకోవాలి’అనే అంశంపై వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్ఞాపకశక్తి పెంపొందించుకునే పద్ధతులు, చదువు మీద ఏకాగ్రత, రోజువారీ అలవాట్లు, ఇంగ్లిష్ నైపుణ్యాలను మెరుగుపరుచుకునే సులభ మార్గాల గురించి విద్యార్థులకు వివరించారు. జ్ఞాపకశక్తిని పెంచుకోవడం ద్వారా విద్యార్థులు విద్యలో, వ్యక్తిత్వ వికాసంలో ముందుకు సాగవచ్చన్నారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజేంద్రప్రసాద్, ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ డా. జె. శ్రీదేవి పాల్గొన్నారు. చెరువును సురక్షితంగా ఉంచేందుకు తగిన చర్యలు మహమ్మదాబాద్: కుంగిన చెర్వు కట్ట, తూమును సురక్షితంగా ఉంచేందుకు అన్ని విధాలుగా పరిశీలించి, తగిన చర్యలు తీసుకోనున్నట్లు డ్యాం సేఫ్టీ, జియాలజిస్టు అధికారులు రాజు, కృష్ణారెడ్డి తెలిపారు. మహమ్మదాబాద్ మండలంలో 560 ఎకరాల ఆయకట్టు మల్కచెర్వు కట్టకు ప్రమాదం పొంచి ఉండడంతో శుక్రవారం డ్యాంసేఫ్టీ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు కట్ట ప్రాంతం లీకేజీ అయ్యే ప్రాంతం, తూము తదితర వాటిని పరిశీలించారు. కట్ట మధ్యలో వెనకాల నీరు ఉబికి వస్తున్నందున కట్టకు కొంత ప్రమాదం ఉన్నట్లు గుర్తించారు. చెర్వు కట్ట, తూము, అలుగు ప్రాంతం పునర్ నిర్మాణం చేపట్టి ఎలాంటి ప్రమాదం లేకుండా చేయా లని రైతులు కోరారు. మల్కచెర్వు ప్రమాదం బారిన పడకుండా అన్ని రకాల రక్షణాత్మక చర్యలు తీసుకునేందుకు నివేదిక సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. డ్యాం సేఫ్టీ అధికారులు ఈఈ శ్రీలత, డిప్యూటీ ఈఈ సతీష్కుమార్, శైలజ, డీఈఈ కృష్ణారెడ్డి, ఈఈ రమాదేవి, ఏఈ దిలీప్కుమార్ పాల్గొన్నారు. -
ఎన్నికల్లో పీఓ, ఏపీఓల పాత్ర కీలకం
పాలమూరు: మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా స్వేచ్ఛాయుతంగా నిబంధనలు ఉల్లఘించకుండా జరుగుతున్నాయా లేదా అనే విషయాన్ని మైక్రో అబ్జర్వర్లు నిశితంగా పరిశీలించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. నగరంలోని ఎస్వీఎస్ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో శుక్రవారం మైక్రో అబ్జర్వర్లకు ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 11న మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు దేవరకద్ర, భూత్పూర్ మున్సిపాలిటీల్లో జరిగే ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు మైక్రో అబ్జర్వర్లను నియమిస్తున్నట్లు తెలిపారు. పంచాయతీ ఎన్నికలు ఎలాంటి అవాంచనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా పూర్తి చేశామని, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలు కూడా సజావుగా పూర్తి చేయాలన్నారు. రాజకీయ పార్టీల ఆధారంగా జరిగే ఎన్నికలు కావడంతో పోటీ తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ ప్రక్రియలోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా గమనిస్తూ ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పూర్తి చేయాలన్నారు. పోలింగ్ సమయంలో జరిగే ప్రతి ఘటనను నివేదికలో నమోదు చేసి పరిశీలకులకు రిపోర్ట్ చేయాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో 36 మంది మైక్రో పరిశీలకులను నియమిస్తున్నట్లు తెలిపారు. ● మున్సిపల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని పీఓ, ఏపీఓలను కలెక్టర్ ఆదేశించారు. పీఓ, ఏపీఓలకు ఎన్నికలపై రెండో విడత ప్రత్యేక శిక్షణలో ఆమె మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణపై మంచి అనుభవం ఉందని, పంచాయతీ ఎన్నికల స్ఫూర్తితో మున్సిపల్ ఎన్నికలను కూడా సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. పీలోలకు ఇచ్చిన హ్యాండ్బుక్ను భగవద్గీతలా భావించి ప్రతి అంశాన్ని శ్రద్ధగా చదివి మరింత అవగాహన పెంచుకోవాలన్నారు. ఎన్నికల ముందు రోజు పీఓలు, ఏపీఓలు, పోలింగ్ సిబ్బంది తమ తమ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు ఉదయం 9 గంటల వరకు చేరుకోవాలని ఆదేశించారు. మహబూబ్నగర్ కార్పొరేషన్కు ఎన్నికల పంపిణీ కేంద్రాన్ని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, భూత్పూర్ మున్సిపాలిటీకి భూత్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, దేవరకద్రకు పంపిణీ కేంద్రాన్ని మార్కెట్ యార్డులో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సామగ్రి స్వీకరణ సమయంలో చెక్లిస్ట్ ప్రకారం అన్ని వస్తువులు ఉన్నాయా లేదా సరి చూసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రంలో ముందు రోజే అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చూసుకోవాలని, కేంద్రం చుట్టూ 100మీటర్ల వరకు మార్కింగ్ చేసి ఆ పరిసరాల్లో ఎలాంటి ఎన్నికల ప్రచారం లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రతి ఓటరు బ్యాలెట్ పేపరును తప్పనిసరిగా బ్యాలెట్ బాక్స్లో వేస్తున్నాడా లేదా అనేది పర్యవేక్షించాలన్నారు. ఓటింగ్ పూర్తయిన తర్వాత బ్యాలెట్ పేపర్ అకౌంట్, పీఓ డైరీలను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలన్నారు. సమావేశంలో ఎన్నికల పరిశీలకురాలు కాత్యాయని దేవి, అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఆర్డీఓ నవీన్, డీఈఓ ప్రవీణ్కుమార్, సీఎంఓ సుధాకర్, ఏఎంఓ దుంకుడు శ్రీనివాస్, మాస్టర్ శిక్షకులు బాలు యాదవ్ బైకాని, శ్రీకాంత్, నాగరాజు పాల్గొన్నారు. ● ఎన్నికలను న్యాయంగా నిర్వహించే బాధ్యత సూక్ష్మ పరిశీలకులపై ఉందని జిల్లా జనరల్ ఎన్నికల పరిశీలకురాలు కాత్యాయనీదేవి, కలెక్టర్ విజయేందిర పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు మున్సిపల్ కార్యాలయాల్లో ఫెసిలిటేషన్ సెంటర్ సౌలభ్యం కల్పించినట్లు తెలిపారు. ఈ నెల 7, 8, 9తేదీలలో ఫెసిలిటేషన్ సెంటర్లలో ఓటు హక్కు వినియోగించుకోవచ్చునని తెలిపారు. ఉద్యోగులు తమ ఎన్నికల విధుల ఉత్తర్వుల ఎపిక్కార్డు కాపీని నింపిన ఫారం 12తోపాటు జతచేసి అక్కడే సమర్పించాలన్నారు. పోలింగ్ కేంద్రాలకు ఒక్కరోజు ముందే చేరుకొని ఏర్పాట్లు చేసుకోవాలి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు 36 మంది మైక్రో అబ్జర్వర్ల నియామకం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయేందిర -
ప్రజల ఆశీస్సులతో కార్పొరేషన్ గెలుస్తాం
● కాంగ్రెస్ హయాంలో రేషన్కార్డుల మంజూరు ● జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదరం రాజనర్సింహ స్టేషన్ మహబూబ్నగర్: ప్రజల ఆశీస్సులతో ఈ ఎన్నికల్లో మహబూబ్నగర్ కార్పొరేషన్ను కాంగ్రెస్ పార్టీ కై వసం చేసుకుంటుందని జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదరం రాజనర్సింహ అన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం ఆయన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అంబేడ్కర్ కాలనీ, ఎనుగొండలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటికి తిరిగి ఓటర్లను కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతరం జరిగిన ఏనుగొండ చౌరస్తాలో ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ ఈ జిల్లా అభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. విద్య, వైద్యం, మహిళా సాధికారితపై రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. బాసర తర్వాత మహబూబ్నగర్ జిల్లాకు ట్రిపుల్టీ కళాశాల ఇచ్చానట్లు చెప్పారు. మహబూబ్నగర్కు ఇంటిగ్రెటెడ్ రెసిడెన్షియల్, ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేశామని, ఇటీవల రూ.600కోట్లతో అండర్ డ్రెయినేజీకి సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. తొమ్మిదన్నర ఏళ్లలో కాలంలో గత ప్రభుత్వం ఒక్క రేషన్కార్డు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులందరికీ రేషన్కార్డులు, సన్నబియ్యం, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందజేసినట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఎంతో చరిత్ర, ఒక సిద్ధాంతం ఉందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేసిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్రెడ్డి, అనిరుధ్రెడ్డి, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహరెడ్డి, నాయకులు వినోద్కుమార్, చంద్రకుమార్గౌడ్, మిథున్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్కుమార్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఐదు దశాబ్దాల బంధం.. ఐదు గంటల్లో ఎడబాటు!
● చావులోనూ వీడని తోడు ● అనారోగ్యంతో భార్య, ఆవేదనతో భర్త మృతి ● వనపర్తి జిల్లా దుప్పల్లిలో విషాదం మదనాపురం: మూడు ముళ్లు.. ఏడడుగులతో ఒక్కటైన ఆ బంధం.. ఐదు దశాబ్దాలపాటు అన్యోన్యంగా సాగింది. అయితే కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న భార్య మృతిచెందిన.. కొద్దిసేపటికే ఆవేదనతో భర్త సైతం లోకాన్ని వీడిన విషాదకర సంఘటన వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని దుప్పల్లిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. దుప్పల్లి గ్రామానికి చెందిన గుట్టకాడి అల్లెన్న(68), గుట్టకాడి కుర్మక్క(60) దంపతులు ఐదు దశాబ్దాలుగా అన్యోన్యంగా జీవిస్తున్నారు. అయితే కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కుర్మక్క గురువారం ఉదయం ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు. 50 ఏళ్లకుపైగా తన కష్టసుఖాల్లో పాలుపంచుకున్న ఇల్లాలు లేని లోకాన్ని ఆయన ఊహించుకోలేకపోయారు. భార్య పార్థివదేహం ముందు కన్నీరుమున్నీరుగా విలపించిన అల్లెన్న భార్య మరణించిన కేవలం ఐదు గంటల వ్యవధిలోనే తీవ్రమైన మనోవేదనతో గుండె పోటుకు మృతిచెందారు. ప్రాణం ఉన్నప్పుడే కాకుండా.. పోయాక కూడా తోడుండాలని ఆమె వెంటే వెళ్లిపోయారు అంటూ గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. ఒకే రోజు.. కొద్దిగంటల వ్యవధిలోనే భార్యాభర్తలు ఇద్దరూ మరణించడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. సాధారణంగా పెళ్లి మంత్రాల్లో జీవితాంతం తోడుంటాం అని ప్రమాణం చేస్తారు. కానీ, ఈ దంపతులు మరణానంతరం కూడా తోడుంటాం అని నిరూపించారని పలువురు అభిప్రాయపడ్డారు. -
పెద్ద డివిజన్ 23.. చిన్న డివిజన్ 22
● మొదటి ఫలితం 22లోనే..! ● చివరి ఫలితం 23 డివిజన్లో.. పాలమూరు: మహబూబ్నగర్ కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లు ఉండగా వీటిలో అతి పెద్ద డివిజన్ 23వ డివిజన్ కాగా అతి చిన్న డివిజన్ 22వ డివిజన్ కావడం విశేషం. వైశాల్యం పరంగా ఈ డివిజన్ చాలా చిన్నగా ఉండటం వల్ల ఇప్పటికే అన్ని పా ర్టీల నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ● ఫిబ్రవరి 11న మహబూబ్నగర్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో నగర ప్రజలు, ఓటర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఏ డివిజన్ నుంచి ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడో అనే టెన్షన్ ఉండటం సహజం. ఫిబ్రవరి 13న ఎన్నికల ఫలితాల తర్వాత అభ్యర్థుల భవితవ్యం బయటపడనుంది. ఈ క్రమంలో నగరంలో ఉన్న 60 డివిజన్లలో ఏ ఒక్కదాంట్లో కూడా 4వేల మంది ఓటర్లు లేకపోవడం విశేషం. 90 శాతం డివిజన్లలో 3వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఇదే సమయంలో అత్యల్పంగా ఓట్లు ఉన్న డివిజన్ ఫలితాలు త్వరగా వచ్చే అవకాశం ఉంది. అయితే మహబూబ్నగర్ కార్పొరేషన్లో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రెండు డివిజన్లలో ఒక దాంట్లో మొదట ఫలితాలు వస్తే.. మరో దాంట్లో చివర్లో రానున్నాయి. ఈ క్రమంలో డివిజన్లో అత్యల్పంగా ఉన్న నాలుగు డివిజన్లను పరిశీలిస్తే 22వ డివిజన్లో 2432 మంది ఓటర్లు, 44వ డివిజన్లో 2721, 7వ డివిజన్లో 2780, 37వ డివిజన్లో 2852 మంది ఓటర్లు ఉన్నారు. వీటిలో మొదటి ఫలితం 22వ డివిజన్ నుంచి వచ్చే అవకాశం ఉంది. ఇక ఆలస్యంగా ఫలితాలు వచ్చే డివిజన్లను పరిశీలిస్తే 23వ డివిజన్లో 3939 ఓటర్లు ఉండగా, 31వ డివిజన్లో 3771, 16వ డివిజన్లో 3739, 26వ డివిజన్లో 3716 ఓటర్లు ఉండటంతో వరుసగా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. అమరచింత పట్టణ హ్యూ. డివిజన్ల సంఖ్య పురుషులు మహిళలు ఇతరులు మొత్తం 60 97636 100191 14 197841 -
మున్సిపాలిటీ..
విలేజ్ టు ● అతి తక్కువ జనాభాతో ఆవిర్భావం ● కొత్త మున్సిపాలిటీలుగా ఏర్పడిన అమరచింత, ఆత్మకూర్ ● 2018 ఆగస్టు 2న గెజిట్ విడుదల ఆత్మకూర్ మున్సిపాలిటీ చైర్పర్సన్గా అవకాశం రావడంతో పట్టణంలో పలు అభివృద్ధి పనులు చేపట్టా. వీటికి తోడు రోడ్డు వైడింగ్ పనులు సైతం చేపట్టి ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకున్నాం. కొత్తగా ఏర్పాటయిన మున్సిపాలిటీకి మొదటి చైర్పర్సన్గా గుర్తింపు ఎంతో ఆనందం కలిగించింది. – గాయత్రి, మాజీ చైర్పర్సన్, ఆత్మకూర్ అభివృద్ధి పథంలో ఆత్మకూర్ -
ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి
మహబూబ్నగర్ న్యూటౌన్: ఎన్నికల ముందు ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని ఆటో యూనియన్ల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లాకేంద్రంలోని రైల్వేస్టేషన్ ఏరియాలో ఆటో యూనియన్ నాయకులు రాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీ నెలకు రూ.12 వేలు వెంటనే అమలు చేయాలని అన్నారు. ప్రతిపక్ష బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు ఇప్పటివరకు ఆటో కార్మికుల సమస్యలపై స్పందించడంలేదన్నారు. తక్షణమే ఆటో డ్రైవర్లపై ఆ పార్టీ స్టాండ్ ఏమిటో ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.సాయిలు, పజిల్బాయ్, శ్యంసుందర్, గొల్లరాజు, అంజనేయులు, కథలయ్య, గోపాల్, లక్ష్మణ్, వెంకటయ్య, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
పేదల సంక్షేమానికి పాటుపడేది కాంగ్రెస్సే
స్టేషన్ మహబూబ్నగర్: పేద, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి పాటుపడేది కాంగ్రెస్ ప్రభుత్వమని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు, ఉచిత కరెంట్ బిల్లు, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం వంటి పథకాలు అందిస్తున్నామని గుర్తు చేశారు. పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే మహబూబ్నగర్ పాలక సంస్థపై కాంగ్రెస్ జెండా ఎగరాలని కోరారు. ఎన్నికల్లో ఒక్క ఓటు చాలా కీలకమని, పోల్ మేనేజ్మెంట్ అవసరమన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలను ప్రజలకు తెలపాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు తెలుగు వెంకటేశ్, ప్రధాన కార్యదర్శి వీరేష్కుమార్, బురానప్ప, నరసింహ, శ్రీనివాసులు, వనపర్తి జిల్లా అధ్యక్షుడు భానుప్రకాశ్, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
కొత్త ఆవిష్కరణలు ఆర్థికాభివృద్ధికి దోహదం
మహబూబ్నగర్ న్యూటౌన్: కొత్త ఆవిష్కరణలు ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తాయని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. పాఠశాల విద్యాశాఖ, సాక్షర భారత్ విభాగం, అఖిలభారత సాంకేతిక విద్యా మండలి, ఎంఐసీల సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక జేపీఎన్సీఈలో పీఎంశ్రీ పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులకు ఐఈడీ బూట్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం జరిగిన సదస్సులో ఏఐసీటీయూ ఫెలో, పీఓసీ సాగర్ హరిహరమణి, కళాశాల చైర్మన్ కేఎస్ రవికుమార్, జిల్లా విద్యాశాఖ అకాడమిక్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు శ్రీనివాస్, వెంకటరామారావు, జేఎన్టీయూ అనంతాపూర్ ప్రతినిధి డా.రాజేశ్కుమార్, ఇండుపులపాయ ఐఐఐటీ ప్రతినిధి అబ్రహంలతో పాటు 170 మంది ప్రిన్సిపాల్స్, జీహెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొని కొత్త ఆవిష్కరణలకు సంబంధించి ఆసక్తికర చర్చలు, ప్రజెంటేషన్లు ఇచ్చారు.


