breaking news
Mahabubnagar
-
హైవే పోలీసుల చేతివాటం!
● హార్వెస్టర్ డ్రైవర్ల నుంచి లంచం వసూలుకు యత్నం జడ్చర్ల: పట్టణ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై వెళ్తున్న హార్వెస్టర్ డ్రైవర్ల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసేందుకు జాతీయ రహదారి భద్రతను పర్యవేక్షించే పోలీసులు ప్రయత్నించారు. ఆదివారం తమిళనాడు నుంచి కరీంనగర్కు జాతీయ రహదారిపై దాదాపు 40 హార్వెస్టర్లు వరుస క్రమంలో వెళ్తున్నాయి. అయితే జడ్చర్ల శివారులోకి రాగానే జాతీయరహదారి భద్రతను పర్యవేక్షించే పోలీసులు వాటిని ఆపి రోడ్డుపై బేరసారాలు కొనసాగించారు. ఒక్కో హార్వెస్టర్కు రూ.500 చెల్లించాలని డిమాండ్ చేయడంతో ఆయా డ్రైవర్లు రూ.200 ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో విషయం మీడియాకు తెలిసి అక్కడకు చేరుకునే లోపు సంబంధిత పోలీసులు అక్కడి నుంచి జారుకున్నారు. అయితే హార్వెస్టర్లకు రోడ్డుపై ప్రయాణించే పర్మిట్ ఉంటుందని, ఇందుకు సంబంధించి పన్నులు కూడా రిజిస్ట్రేషన్ సమయంలోనే కడతామని హర్వెస్టర్ యాజమానులు, డ్రైవర్లు తెలిపారు. అయినా జాతీయ రహదారి పోలీసులు తమను వెంటాడి డబ్బులు డిమాండ్ చేశారని వాపోయారు. -
మిర్చి.. తెగుళ్లు ముంచి
అలంపూర్: రైతన్న ఆరుగాలం కష్టపడి సాగు చేసిన మిరప పంటకు ముడత తెగుళ్లు సోకుతున్నాయి. దీనికి సకాలంలో నివారణ చర్యలు చేపట్టకపోతే దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియ నాయక్ రైతులకు సూచిస్తున్నారు. జిల్లాలో వందల ఎకరాల్లో మిర్చి పంట సాగులో ఉంది. దీంతో పాటు హైబ్రిడ్ మిరపను రైతులు సాగు చేస్తున్నారు. సాగు చేసిన మిరప పైర్లకు పైముడత కింది ముడత తెగుళ్లు ఆశిస్తుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు నివారణ చర్యలను సూచిస్తున్నారు. తెల్ల నల్లి (కింది ముడత): తెల్ల నల్లి పురుగులు ఆకుల నుంచి రసాన్ని పీల్చడం వలన ఆకులు కిందికి ముడ్చుకుంటా యి. దీంతో ఆకులు తిరగబడి పడవ ఆకారంలో కనబడతాయి. ఆకుల కాడలు సాగి ముదురు ఆకుపచ్చగా మారి మొక్కల పెరగుదల ఆగిపోయి లేత ఆకులు ముద్దకడతాయి. నివారణ : నీటిలో కరిగే గంథకం 3 గ్రాములు లేదా డైకోపాల్ 5.0 మి.లీ లేదా పెగాసెస్ను 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఉధృతిని బట్టి ఎకరా కు ఫానలోన్ 400 మి.లీ లేదా ఇంట్రిపిడ్ 400 మి.లీ పిచికారీ చేసుకోవాలి. తామర పురుగు (పైముడత) : ఇవి ఆకుల నుంచి రసం పీల్చడం వ లన అకులు పైకి ముడ్చుకుంటా యి. ఆకులు, పిందెలు, రాగి రంగులోకి మారి పూత పిందె దశలో నే నిలిచిపోతుంది. నివారణ : పై ముడత నివారణకు 10 లీటర్ల నీటికి 12.5 గ్రా ముల డైపెన్ ధయురాన్ లేదా 20 మి.లీ ప్రిపోనిల్ లేదా 30 మి.లీ స్పైనోసాడ్ లేదా 20 మి.లీ పానలోస్, 15 గ్రాముల ఎసిఫెట్ కలిపి ఆకుల అడుగు భాగం తడిసేలా పిచికారీ చేయాలి. పాడి–పంట -
బంగారం దుకాణంలో చోరీకి యత్నం
మరికల్: మండల కేంద్రంలో అర్ధరాత్రి సమయంలో ఓ బంగారం దుకాణంలో దొంగలు చోరీకి యత్నించారు. మరికల్ ప్రధాన చౌరస్తాలో ఉన్న గణేష్ జ్యువెలర్స్ దుకాణంలో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని దొంగలు షాపు షెట్టర్ను కట్చేసి లోపలికి ప్రవేశించి లాకర్ను కూడా కటర్తో కట్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే అది సాధ్యం కాకపోవడంతో అక్కడి నుంచి పరారయ్యరు. ఆదివా రం ఉదయం గమనించిన చుట్టుపక్కల వ్యా పారులు విషయాన్ని దుకాణా యాజమానికి సమాచారం అందించారు. షాపు యాజమాని చోరీ విషయంపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ రాము దుకాణాన్ని పరిశీలించారు. అనంతరం కూల్స్ టీంతో వేలిముద్రలను సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
పట్టువస్త్రాల తరలింపు..
కురుమూర్తిస్వామి అలంకారోత్సవంలో భాగంగా అమరచింత పద్మశాలీ కులస్తులు మగ్గంపై నేసిన పట్టువస్త్రాలను ఆలయానికి తరలించారు. వారం రోజులపాటు భక్తిశ్రద్ధలతో స్వామివారికి పట్టుపంచె, అమ్మవారికి పట్టుచీర తయా రు చేసిన పద్మశాలీలు.. స్థానిక భక్త మార్కండేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, పట్టువస్త్రాలను ఉరేగింపుగా ఆత్మకూర్ కు తరలించారు. అక్కడ మంత్రి వాకిటి శ్రీహరి పట్టువస్త్రాలను తలపై పెట్టుకొని ఊరేగింపుగా కురుమూర్తి క్షేత్రానికి బయలుదేరారు. కార్యక్రమంలో ఎస్పీ రావుల గిరిధర్ దంపతులు, రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్ సీతాదయాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి, రాష్ట్ర గీత కార్మిక సంఘం చైర్మన్ కేశం నాగరాజుగౌడ్, నారాయణపేట డీసీసీ అధ్యక్షు డు ప్రశాంత్రెడ్డి, ప్రధాన కార్యదర్శి అయూబ్ ఖాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ రహ్మతుల్లా, మాదిరెడ్డి జలంధర్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ గాడి కృష్ణమూర్తి, లక్ష్మీకాంత్రెడ్డి, మాజీ ఎంపీపీలు బంగారు శ్రీను, శ్రీధర్గౌడ్, వీరేశ లింగం పాల్గొన్నారు. -
గంజాయి విక్రేతల అరెస్టు.. రిమాండ్కు తరలింపు
నాగర్కర్నూల్ క్రైం : పట్టణంలోని లాడ్జిలో గంజాయి విక్రయిస్తున్న నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డిఎస్పీ బుర్రి శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. స్థానిక హరిజనవాడకు చెందిన బొండ్ల రేణుకుమార్, ఈశ్వర్ కాలనీకి చెందిన మైలగాని సందీప్, రాఘవేంద్ర కాలనీకి చెందిన అరకు విశ్వాస్, అచ్చంపేట మండలం హాజీపూర్కు చెందిన ఎదుల వంశీలు హైదరాబాద్లోని దూల్పేటలో అకాశ్సింగ్ అనే వ్యక్తి వద్ద గంజాయిని కొనుగోలు చేసి విక్రయించేవారు. ఈ క్రమంలో ఆదివారం స్థానిక చైతన్య లాడ్జిలో గంజాయి విక్రయించడానికి వెళ్లగా ముందస్తు సమాచారం రావడంతో ఆకస్మికంగా దాడి చేసి నలుగురు నిందితులతో పాటు గంజాయి కొనుగోలు చేసేందుకు వచ్చిన జిల్లా కేంద్రానికి చెందిన కొత్త వెంకటేష్, కొత్త మనోజ్ కుమార్, తాడూరు మండలం గుంతకోడూరుకు చెందిన ఆది కిష్ణ్రగౌడ్, పరేమేష్ను అదుపులోకి తీసుకొని వారి నుంచి 735 గ్రా గంజాయి, ఏడు సెల్ఫోన్లు స్వాధీ నం చేసుకున్నట్లు డిఎస్పీ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో సీఐ అశోక్రెడ్డి, ఎస్ఐ గోవర్దన్ పాల్గొన్నారు. గంజాయి తీసుకున్న యువకులపై కేసు జడ్చర్ల: గుట్టుగా గంజాయి తీసుకున్న నలుగురు యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు. మండల పరిదిలో ని మాచారం గ్రామానికి చెందిన మరికంటి సుమంత్రెడ్డి గంజాయి వినియోగించడం, విక్రయించడం చేస్తున్నాడన్న సమాచారం మేరకు శనివారం గ్రామానికి వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో నిందితుడి వద్ద ఒక ప్యాకెట్ గంజాయి లభించడంతో పాటు గంజాయి పరీక్షలో పాజిటివ్గా తేలింది. దీంతో సుమంత్రెడ్డిని విచారించగా జడ్చర్ల టీహోటల్ నిర్వాహకుడు అబ్దుల్ రహెమాన్, మహబూబ్నగర్లో బీహార్కు చెందిన సెక్యూరిటీ గార్డ్ సుబద్ కాంత్ శర్మ, షాద్నగర్లో ఉన్న సెక్యూరిటీ గార్డ్ మిథుకుమార్ యాదవ్ ద్వారా గంజాయి తీసుకుంటున్నట్లు తెలిపాడు. దీంతో వారిని అరెస్ట్ చేసి వారి నుంచి 250 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వీరు నేపాల్కు చెందిన సుభాద్సింగ్ ద్వారా రూ.9,500కు కిలో చొప్పున గంజాయిని కొనుగోలు చేసి ఇక్కడ విక్రయించడం, తీసుకోవడం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
మృతదేహంతో రోడ్డుపై నిరసన
గోపాల్పేట: బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని మృతదేహంతో రోడ్డుపై నిరసన చేసిన ఘటన ఆదివారం ఏదుల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కొమ్ము ఆంజేనేయులు ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. మృతుడు ఏదుల ప్రాజెక్టులో మినుముల పంట సాగు చేశాడు. సాగు చేసుకున్న మినుముల పంటలో నుంచి టిప్పర్లు, లారీలు వెళ్లడంతో పాటు రిజర్వాయర్ పనులు చేసేందుకు అడ్డుపడుతున్నాడని కాంట్రాక్టర్ ఆంజనేయులుపై కేసు పెట్టి పోలీసులతో వేధించడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని బాధిత కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి కుటుంబసభ్యులతో పాటు గ్రామస్తులు, వివిధ సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ధర్నా సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగింది. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్, రాచాల యుగంధర్గౌడ్, డీఎస్పీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నారాయణ బాధితులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు. కాంట్రాక్టర్ శ్రీనివాస్రెడ్డి ధర్నా వద్దకు రావాలని డిమాండ్ చేశారు. సీఐ కృష్ణ మాట్లాడుతూ బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, సాయంత్రం వరకు రిమాండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఒప్పించేందుకు ప్రయత్నించారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షలు ఇచ్చి ఆదుకోవాలని కోరగా.. కాంట్రాక్టర్ రూ.10 లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకున్నట్లు తెలిసింది. బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాంట్రాక్టర్ శ్రీనివాస్రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ కృష్ణ తెలిపారు. -
విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి
కోడేరు: కరెంట్ షాక్తో పారిశుద్ధ్య కార్మికుడు మృతి చెందిన ఘటన మండలంలోని ఖానాపూర్ గ్రా మంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆది కర్రె బాలస్వామి (60) ఆదివారం వీధి లైట్ల ఏర్పాటులో భాగంగా ట్రాన్స్ఫార్మర్ బంద్ చేశాడు. లైట్లు వేసిన అనంతరం ట్రాన్స్ఫార్మర్ను ఆన్ చేసి చుట్టూ ఉన్న పిచ్చిమొక్కలు తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ వైరు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. బాలస్వామికి భార్య మశమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నా రు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జగదీష్ తెలిపారు. భవనం పైనుంచి పడి బీహార్ వాసి మృతి ● మంకి లిఫ్ట్ ఆపరేటింగ్కు వెళ్లి మృత్యువాత? వనపర్తి: జిల్లాకేంద్రంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల పైనుంచి ప్రమాదవశాత్తు కిందపడి బీహార్కు చెందిన మేసీ్త్ర తిలక్సా (45) మృతిచెందిన ఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. తోటి కార్మికులు, నిర్మాణ కంపెనీ ఇంజినీర్ సతీష్రావు కథనం మేరకు.. బిహార్కు చెందిన తిలక్సా తన బృందంతో వైద్య కళాశాల, రెసిడెన్సీ, డైనింగ్ తదితర ఐదు భవనాల నిర్మాణాలు చేపడుతూ సుమారు మూడేళ్లుగా ఇక్కడే ఉంటున్నాడు. పనులు తుదిదశకు చేరుకోవడంతో ఇటీవల వేగం పెంచారు. ఆదివారం ఉదయం వైద్య కళాశాల భవనం వెనకభాగంలో మూడో అంతస్థులో మంకీ లిఫ్ట్ వద్ద పని చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. అక్కడే ఉన్న ఓ వైద్యు డు పరీక్షించి వెంటనే ఆస్పత్రికి తరలించాలని సూచించడంతో ఇంజినీర్ వాహనంలో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు రూరల్ ఎస్ఐ జలంధర్రెడ్డి తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బిహార్కు తరలించామని ఇంజినీర్ వివరించారు. ● భవన నిర్మాణ సమయంలో కార్మికులు, మే సీ్త్రల రక్షణకు తగిన చర్యలు చేపట్టాల్సిన బాధ్య త అగ్రిమెంట్ చేసుకున్న కాంట్రాక్టర్పై ఉంటుంది. సుమారు నాలుగైదేళ్లుగా భవన నిర్మాణ ప నులు కొనసాగుతున్నా..ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హెచ్ఎంపై ఎస్బీ కానిస్టేబుల్ దాడి గోపాల్పేట: రేవల్లి మండల కేంద్రంలోని ప్రైమరీ స్కూల్లో పనిచేస్తున్న మహిళా ప్రధానోపాద్యాయురాలిపై శనివారం ఎస్బీ కానిస్టేబుల్ చేయి చేసుకున్నాడు. పాఠశాల హెచ్ఎం తెలిపిన వివరాల మేరకు.. ఎస్బీ కానిస్టేబుల్ శనివారం కొత్తగా జాబ్ వచ్చిన వ్యక్తికి సంబంధించిన బోనఫైడ్ సేకణరించేందుకు రేవల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల వెళ్లాడు. అతడు ఐదోతరగతి వరకు ఈ ప్రాథమిక పాఠశాలలోనే చదివాడు. పరుష పదజాలంతో హెచ్ఎంను దూషిస్తూ అతడి బోనఫైడ్ ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాఠశాల హెచ్ఎం అందుకు నిరాకరించింది. దీంతో ఎస్బీ కానిస్టేబుల్ పోలీస్స్టేషన్కు వెళ్లి ఓ మహిళా కానిస్టేబుల్, కానిస్టేబుల్ను తీసుకుని తిరిగి పాఠశాలకు వచ్చాడు. ఆ తర్వాత వాదోపవాదాలు జరుగుతుండగా విచక్షణ కోల్పోయిన ఎస్బీ కానిస్టేబుల్ ప్రధానోపాద్యాయురాలిపై చేయిచేసుకున్నాడు. అనంతరం ఇరువురూ రేవల్లి పోలీస్స్టేషన్లో శనివారం ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. తనకు అవమానం జరిగిందని ఈ విషయం సోమవారం ఉన్నతాఅధికారుల దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు హెచ్ఎం తెలిపారు. ఇదే విషయం ఆదివారం రేవల్లి ఎస్ఐని వివరణ కోరగా.. విచారణ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు వెల్లడించారని తెలిపారు. స్వగ్రామానికి జవాన్ మృతదేహం అమరచింత: రాజస్థాన్లోని జోథ్పూర్లో విధులు నిర్వర్తించే శంకర్నాయక్ కుటుంబ కలహాలతో శుక్రవారం అక్కడే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం పాఠకులకు విధితమే. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఆదివారం విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు రాగా కుటుంబ సభ్యులు అక్కడి నుంచి అంబులెన్స్లో స్వగ్రామమైన మండలంలోని దీప్లానాయక్తండాకు తీసుకొచ్చారు. ముందుగా అమరచింత వీధుల్లో యువకులు, తండావాసులు జాతీయ జెండాలు చేతబట్టి మృతదేహంతో భారీ ర్యాలీ నిర్వహించి తండాలో అంత్యక్రియలు నిర్వహించారు. చిన్న వయస్సులో కుమారుడు దూరమవడం, తమ తండ్రి ఇక రాడని తెలియని చిన్నారుల రోధనలు పలువుర్ని కంటతడి పెట్టించాయి. -
కాంచనగుహకు స్వర్ణకాంతులు
● వైభవంగా కురుమూర్తిస్వామి అలంకారోత్సవం ● మార్మోగిన గోవింద నామస్మరణ ● పూజలు చేసిన మంత్రి వాకిటి శ్రీహ రి, ఎంపీ డీకే అరుణ , ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి ఆభరణాలను పూజారులకు అందిస్తున్న అధికారులు ఆత్మకూర్లో ఆభరణాల ఊరేగింపులో పాల్గొన్న భక్తజనం చిన్నచింతకుంట/ఆత్మకూర్/మదనాపురం/ అమరచింత: పేదల తిరుపతి కురుమూర్తి గిరుల్లో శ్రీనివాసుడు కొలువుదీరిన కాంచనగుహ స్వర్ణకాంతులను సంతరించుకుంది. కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన అలంకారోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా సాగింది. వనపర్తి జిల్లా ఆత్మకూర్ పటణంలోని ఎస్బీఐ లాకర్లో భద్రపరిచిన స్వామివారి ఆభరణాలకు రాష్ట్ర మ త్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, దేవరకద్ర ఎమ్మె ల్యే జి.మధుసూదన్రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు చేశా రు. అనంతరం మేళాతాళాలు, మంగళ వాయిద్యా లు మధ్య ఊరేగింపు ప్రారంభమైంది. ఆలయ సంప్రదాయ ప్రకారం గాడి వంశానికి చెందిన గాడి శేషుచారి స్వామివారి ఆభరణాలను పరమేశ్వరస్వా మి చెరువు వరకు తలపై పెట్టుకుని ఊరేగించారు. అనంతరం పోలీసు కాన్వాయ్లో స్వామివారి ఆలయానికి బయల్దేరారు. మదనాపురం మండలం కొ త్తపల్లి, దుప్పల్లి గ్రామాల మీదుగా చిన్నచింతకుంట మండలం అమ్మపూరం గ్రామానికి చేరుకోగా.. గ్రామస్తులు పూలవర్షంతో స్వాగతించారు. అనంతరం గ్రామంలోని ముక్కెర వంశీయులు రాజ శ్రీ రాంభూపాల్ నివాసానికి చేర్చారు. అక్కడ ఆనవాయితీ ప్రకారం ప్రత్యేక పూజలు జరిపారు. మహ బూబ్నగర్ ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి, బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్పర్సన్ సీతాదయాకర్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి స్వామివారి ఆభరణాలకు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మపూరం గ్రామానికి చెందిన నంబి వంశస్తులు ఆభరణాలను తలపై పెట్టుకొని అంభోరు మధ్య కాలినడకన కురుమూర్తి కొండకు చేర్చారు. ఈ సందర్భంగా గోవింద నామస్మరణతో కురుమూర్తి గిరులు మార్మోగాయి. ఊరేగింపుగా తీసుకొచ్చిన ఆభరణాలను ఆలయ చైర్మన్ గోవర్ధన్రెడ్డి, ఈఓ మధనేశ్వరెడ్డిల సమక్షంలో ఆలయ ప్రధాన అర్చకుడు వెంకటయ్యకు అందజేయగా.. స్వామివారికి అలంకరించారు. దీంతో కాంచనగుహ స్వర్ణకాంతులతో పులకరించింది. -
ఉత్కంఠగా జిల్లా క్లబ్ కార్యవర్గ ఎన్నికలు
పాలమూరు: జిల్లా క్లబ్ ఎన్నికలు ఆదివారం ఉత్కంఠగా సాగాయి. ఈసారి రాజకీయ నేతల ప్రమేయం పెరగడంతో రాజకీయ ఎన్నికలను తలపించాయి. ప్రధాన కార్యదర్శి పోస్టుకు కాంగ్రెస్ నేత సంజీవ్ ముదిరాజ్తో పాటు మల్లు నర్సింహ్మారెడ్డి మధ్య పోటీ కొనసాగింది. ఇక ఇతర పోస్టులకు బరిలో ఉన్న వారందరూ విస్తృతంగా ప్రచారాలు నిర్వహించారు. పార్టీల నేతలు అక్కడే తిష్టవేసి వారి అభ్యర్థులను గెలిపించుకోవడానికి పావులు కదిపారు. ● జిల్లా క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక కోసం ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు క్లబ్లో ఎన్నికలు జరిగాయి. ఇప్పటికే జిల్లా క్లబ్ అధ్యక్షుడిగా నాగేశ్వర్రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకోగా.. మిగిలిన కార్యవర్గం ఎన్నిక కోసం ఎన్నికలు నిర్వహించారు. జిల్లా క్లబ్లో మొత్తం 2,045 మంది ఓటర్లు ఉండగా.. 1,169 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు, పలువురు రాజకీయ నేతలు, న్యాయవాదులు, వైద్యులు, వ్యాపారులు క్లబ్లో సభ్యులుగా ఉన్నారు. ఉపాధ్యక్షుడి పోస్టుకు ముగ్గురు, ప్రధాన కార్యదర్శికి నలుగురు, సంయుక్త కార్యదర్శికి ముగ్గురు, స్పోర్ట్స్ జాయింట్ కార్యదర్శి పదవికి ఇద్దరు, కోశాధికారి పోస్టుకు ముగ్గురు, ఈసీ సభ్యుల పోస్టులకు 12మంది పోటీ చేయగా.. వీరిలో ఐదుగురిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. రెండేళ్లకు ఒకసారి.. జిల్లా క్లబ్ 1958లో ఏర్పాటు కాగా.. ఆనాటి నుంచి ప్రతి రెండేళ్లుకు ఒకసారి నూతన కార్యవర్గం ఎన్నుకుంటున్నారు. జిల్లా క్లబ్లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సభ్యులు ఉన్నారు. గతంలో రూ. లక్ష ఉన్న సభ్యత్వాన్ని ప్రస్తుతం రూ. 3లక్షలుగా నిర్ణయించారు. చివరగా 2023లో ఎన్నికలు జరిగాయి. ● రాజకీయ ఎన్నికలను తలపించిన వైనం ● ఓటుహక్కు సద్వినియోగం చేసుకున్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రముఖులు -
వివాహితపై కానిస్టేబుల్ లైంగిక దాడి
మహబూబాబాద్ జిల్లా: మాయమాటలు చెప్పి వివాహితపై ఓ కానిస్టేబుల్ లైంగిక దాడికి పాల్పడిన సంఘటన ఆదివారం మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. బయ్యారం మండల కేంద్రానికి చెందిన దంపతులు కొన్ని నెలల క్రితం గొడవ పడ్డారు. గార్ల–బయ్యారం సర్కిల్ కార్యాలయంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ బి.దినేశ్కు వివాహిత గొడవ విషయం తెలిసింది. దీనిని ఆసరాగా చేసుకున్న కానిస్టేబుల్ తాను అండగా ఉంటానని వివాహితను నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం తన భర్తకు తెలిసిందని, తనను వివాహం చేసుకోవాలని ఆమె కానిస్టేబుల్ను కోరింది. అయితే వివాహానికి కానిస్టేబుల్ నిరాకరించాడు. దీంతో ఆమె తనను నమ్మించి మోసం చేసిన కానిస్టేబుల్పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆదివారం కానిస్టేబుల్పై లైంగిక దాడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. -
జూరాలకు స్వల్ప ఇన్ఫ్లో
ధరూరు/ దోమలపెంట/ దేవరకద్ర/ ఆత్మకూర్: జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్ప ఇన్ఫ్లో వ స్తుంది. శనివారం రాత్రి 7,30 గంటల వరకు ప్రాజె క్టుకు 20 వేల క్యూసెక్కుల వరద రావడంతో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. ఇందుకోసం 22, 680 క్యూసెక్కులు, కుడి కాల్వకు 600 క్యూసెక్కులు వదలగా.. మరో 47 క్యూసెక్కులు ఆవిరైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.255 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ● సుంకేసుల నుంచి 49,228, జూరాలలో విద్యుదుత్పత్తి చేస్తూ 22,680 మొత్తం 71,908 క్యూసెక్కుల నీటి ప్రవాహం శనివారం శ్రీశైలం జలాశయం వచ్చింది. దీంతో శ్రీశైలంలో భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 62,107 క్యూసెక్కుల నీటిని దిగువనున్న నాగార్జునసాగర్కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 880.5 అడుగుల వద్ద 191.2118 టీఎంసీల నీటి నిల్వ ఉంది. అలాగే 24 గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడు ద్వారా 5,000, హెచ్ఎన్ఎస్ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి 2,674, ఎంజీకేఎల్ఐకి 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నాలుగు యూనిట్లలో విద్యుతుత్పత్తి జూరాల దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో కేవలం 4 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపడుతున్నారు. ఈ మేరకు శనివారం ఎగువలో 2 యూనిట్ల ద్వారా 78 మెగావాట్లు, దిగువలో 2 యూనిట్ల ద్వారా 80 మెగావాట్లు విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్, డీఈ పవన్కుమార్ తెలిపారు. కోయిల్సాగర్లో ఒక గేటు ఎత్తివేత.. కోయిల్సాగర్ ప్రాజెక్టు నుంచి శనివారం ఒక గేటు తెరిచి నీటిని విడుదల చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు పెద్దవాగు ప్రవాహం రావడంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి 32.6 అడుగులకు చేరడంతో అధికారులు ఒక గేటును తెరిచి నీటిని వదిలారు. -
నేడు అలంకారోత్సవం
చిన్నచింతకుంట/ఆత్మకూర్: అమ్మపూరం కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం అలంకారోత్సవం నిర్వహించనున్నారు. అత్యంత వైభవంగా నిర్వహించే ఈ ఉత్సవానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. వనపర్తి జిల్లా ఆత్మకూర్లోని ఎస్బీఐ లాకర్లో భద్రపరిచిన స్వామివారి ఆభరణాలను తీసుకొచ్చేందుకు ఆలయ కమిటీ సభ్యులు వెళ్లనున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ వాయిద్యాలు, బాణసంచా కాలుస్తూ ఊరేగింపుగా ఆభరణాలు తీసుకురానున్నారు. బ్యాంకు నుంచి ఆత్మకూర్ చెరువు కట్ట వరకు మధ్యనగాడి వంశస్తులు స్వామివారి ఆభరణాలను తలపై పెట్టు కుని వస్తారు. అక్కడ శివుడికి పూజలు చేసిన తర్వా త పోలీసు భద్రత మధ్య మదనాపురం మండలం కొత్తపల్లి, దుప్పల్లి గ్రామాల మీదుగా చిన్నచింతకుంట మండలం అమ్మపూరంలోని రాజ శ్రీరాంభూపాల్ ఇంటికి చేరుస్తారు. అక్కడ ఆనవాయితీ ప్రకారం గంటపాటు ప్రత్యేక పూజలు చేస్తారు. అమ్మపూరం నుంచి నంబీ వంశస్తులు తలపై పెట్టుకొని అంభోరు మధ్యన కాలినడకన ఆభరణాలను కురుమూర్తి కొండలకు చేరుస్తారు. ఈ కార్యక్రమం కనులపండువగా సాగుతుంది. స్వామివారి ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం అధికారుల సమక్షంలో ఆభరణాలను ఆలయ పూజారులకు అందజేస్తారు. స్వామివారి కిరీటం, హస్తాలు, పాదుకలు, కోర మీసాలు, కెంపు, ముత్యాలహారం, కనకహారాలతో పాటు అనేక రకాలైన ఆభరణాలను కాంచనగుహలో కొలువుదీరిన శ్రీనివాసుడికి అలంకరిస్తారు. ఆతర్వాత స్వామివారు స్వర్ణకాంతులతో కనిపిస్తారు. ఈ సందర్భంగా కాంచనగుహ ప్రత్యేక శోభను సంతరించుకుంటుంది. హాజరుకానున్న మంత్రి, ఎమ్మెల్యేలు కురుమూర్తిస్వామి అలంకారోత్సవానికి రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు జి.మధుసూదన్రెడ్డి, చిట్టెం పర్ణికారెడ్డి, మేఘారెడ్డి హాజరవుతారని ఆత్మకూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రహ్మతుల్లా తెలిపారు. అదే విధంగా రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్ సీతాదయాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి, రాష్ట్ర గీత కార్మిక సంఘం చైర్మన్ కేశం నాగరాజుగౌడ్తో పాటు అన్ని పార్టీల నాయకులు హాజరుకానున్నారు. 100మంది పోలీసులతో బందోబస్తు కురుమూర్తిస్వామి అలంకారోత్సవం సందర్భంగా వనపర్తి ఎస్పీ పర్యవేక్షణలో డీఎస్పీ, ఇద్దరు సీఐలు, 10 మంది ఎస్ఐలు, 15 మంది ఏఎస్ఐలతో పాటు 100 మంది పోలీసు సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీఐ శివకుమార్ తెలిపారు. అలంకారోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా రాజకీయ పార్టీల నాయకులు, భక్తులు సహకరించాలని కోరారు. -
స్కాలర్షిప్ విడుదల చేయాలని నిరసన
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులకు వెంటనే స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీయూ ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాచకులు కృష్ణకుమార్, రవితేజ మాట్లడుతూ.. తెలంగాణలో విద్యావ్యవస్థ క్షీణిస్తుందని, ప్రభుత్వం కనీసం విద్యాశాఖ మంత్రిని కూడా నియమించకపోవడం వల్ల పర్యవేక్షణ లేకుండా పోయిందన్నారు. సంవత్సరాల త్వరబడి ప్రభుత్వం స్కాలర్షిప్లు, ఫీజులు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కళాశాలల్లో సర్టిఫికేట్లు సైతం ఇవ్వకపోవడంతో మద్యలోనే చదువులను నిలిపివేసే పరిస్థితి నెలకొందన్నారు. వీలైనంత త్వరగా ఫీజులు విడుదల చేయకపోతే రాష్ట్ర స్థాయిలో నిరసన కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు సంగీత, శరత్, హరికృష్ణ, గోపి, అర్జున్, నందిని, రేణుక, సాయిచరణ్ తదితరులు పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు
● 5.5 గ్రాముల ఆభరణాలు, రూ.1.20 లక్షలు స్వాధీనం ● రెండు బైక్లు, మూడు సెల్ఫోన్లు సీజ్ గద్వాల క్రైం: తాళం వేసిన ఇళ్ల తలుపులు ధ్వంసం చేసి చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నిందితులను అరెస్టు చేసి 5.5 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.1.20 లక్షల నగదు, రెండు బైక్లు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు గద్వాల డీఎస్పీ మొగిలయ్య తెలిపారు. శనివారం సాయంత్రం గద్వాల సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ కేసు వివరాలను వెల్లడించారు. కొన్ని రోజులుగా కేటీదొడ్డి మండలంలోని చింతలకుంటకు చెందిన కుర్వ చిన్న వెంకన్న, మొర్రి ప్రణేష్, కర్ణాటకకు చెందిన కుర్వ గిరీష్, చంద్రశేఖర్ నలుగురు కలిసి ముఠాగా ఏర్పడి గద్వాల, మల్దకల్, ధరూర్, కేటీదొడ్డి మండలంలో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్నారన్నారు. నిందితులను పట్టుకునేందుకు గద్వాల సీఐ శ్రీను ఆధ్వర్వంలో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టి, జిల్లాలో నిఘా పెంచామని తెలిపారు. ఈ క్రమంలో శనివారం ఉదయం మల్దకల్ పోలీసులు మండల శివారులో వాహనాలు తనిఖీ చేపట్టిన క్రమంలో అనుమానస్పదంగా ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించగా చోరీలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నారని పేర్కొన్నారు. కేసు చేధనలో ఎస్ఐలు నందికర్, శ్రీకాంత్, శ్రీనివాసులు, శ్రీహరి, సిబ్బంది కృషి చేశారన్నారు. వీరికి నగదు రివార్డును ఎస్పీ చేతుల మీదుగా అందజేస్తామన్నారు. స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు, నగదు, బైక్లు, సెల్ఫోన్లను త్వరలో కోర్టులో డిపాజిట్ చేసి బాధితులకు అందజేస్తామన్నారు. సమావేశంలో సీఐ శ్రీను, ఎస్ఐ నందికర్ సిబ్బంది తదితరులు ఉన్నారు. -
కురుమతిరాయుడి సేవలో.. అమరచింత పద్మశాలీలు
● నేటి అలంకారోత్సవంలో పట్టువస్త్రాల సమర్పణ అమరచింత: కురుమూర్తిరాయుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్థానిక మార్కండేయ ఆలయ సత్రంలో పట్టణ పద్మశాలీ కులస్తులు ప్రత్యేకంగా మగ్గం ఏర్పాటు చేసుకొని వారం రోజులుగా నిష్టతో నేత పనులు చేపట్టారు. ఆదివారం జరిగే అలంకారోత్సవానికి ఇక్కడి నుంచి భక్తిశ్రద్ధలతో ఆలయానికి వస్త్రాలను తరలించేందుకు సర్వం సిద్ధం చేశారు. వీటిని తలపై పెట్టుకొని ఆలయం వరకు తీసుకెళ్లేందుకు లక్కీడిప్ ద్వారా కులస్తుల్లో ముగ్గురిని ఎంపిక చేయనున్నట్లు పద్మశాలి సంఘం అధ్యక్షుడు దేవరకొండ లచ్చన్న తెలిపారు. ఇలవేల్పునకు కానుక.. ఏటా బ్రహ్మోత్సవాల సమయంలో పట్టణ పద్మశాలి కులస్తులు వస్త్రాలు నేసి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. కాలానుగుణంగా నూలుకు బదులు పట్టు అందుబాటులోకి రావడంతో స్వామివారికి పట్టు పంచ, గౌను, అమ్మవారికి పట్టు చీరను ప్రత్యేక మగ్గంపై నిష్టతో స్వయంగా తయారుచేసి సమర్పిస్తున్నారు. పద్మశాలి కులస్తులందరూ భాగస్వాములై ప్రతి ఇంటి నుంచి కొంత నగదు సేకరించి వస్త్రాల తయారీకి వినియోగిస్తారు. గతంలో కోనేటిపై.. 60 ఏళ్ల కిందట కోటకొండ కుర్మన్న, కొంగరి చిన్నయ్య, నరాల సింగోటం ఆలయ ఆవరణలోని పుష్కరిణిలో డ్రమ్ములను ఏర్పాటు చేసుకొని మగ్గంపై వస్త్రాలను తయారుచేసి ఆలయ అర్చకులకు అందించి వారిచ్చే అతిథ్యాన్ని స్వీకరించేవారు. -
కారు బోల్తా పడి వ్యక్తి మృతి
● మరో నలుగురికి గాయాలు మానవపాడు: అదుపుతప్పి కారు బోల్తా పడిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం జాతీయ రహదారి –44పై మానవపాడు శివారులో చోటుచేసుకుంది. ఎస్ఐ చంద్రకాంత్, స్థానికుల కథనం ప్రకారం.. సులోమన్, మనోజ్కుమార్, బేబి స్టెఫి, ఫియాపాప, మేరీకళావతి(60) కారులో కర్నూలు నుంచి హైదరాబాద్కు బయల్దేరారు. అయితే, మానవపాడులోని శివారులోకి వచ్చేసరికి కారు అదుపుతప్పి జాతీయ రహదారి పక్కనే ఉన్న డివైడర్ను, అనంతరం ఓ చెట్టును ఢీకొట్టి బోల్తాపడింది. దీంతో కారులోని ఐదుగురిలో మేరీకళావతికి తీవ్రగాయాలై మృతి చెందగా.. సులోమన్, మనోజ్కుమార్, బేబి స్టెఫి, ఫియాపాపకు గాయాలైనట్లు ఎస్ఐ తెలిపారు. ఈ సంఘటనపై బేబీ స్టెఫీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి కల్వకుర్తి రూరల్: కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారిపై మండలంలోని మార్చాల సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా.. పట్టణంలోని బాలరాంనగర్కు చెందిన ఈశ్వర్రెడ్డి నడుచుకుంటూ వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. మృతుడికి మతిస్థిమితంలేదని కాలనీవాసులు తెలిపారు. కొన్నిరోజులు సూర్యలత కాటన్ మిల్లు పనిచేయడంతోపాటు రిక్షా తొక్కుతూ జీవనం సాగించాడని చెప్పారు. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. యువకుడి ఆత్మహత్య నాగర్కర్నూల్ క్రైం: ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. జిల్లాకేంద్రంలోని ఎర్రగడ్డకాలనీకి చెందిన గాజుల మధు (22) ఓ ఎలక్ట్రానిక్ షాపులో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడు శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. గమనించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో చికిత్స నిమిత్తం హైద్రాబాద్కి తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. గాజుల మధు మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సంఘటనకు సంబందించి ఎస్ఐ గోవర్ధన్ను వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. గడ్డిమందు తాగి వ్యక్తి బలవన్మరణం గోపాల్పేట: గడ్డిమందు తాగి వ్యక్తి మృతిచెందిన ఘటన ఏదుల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు కథనం ప్రకారం.. ఏదులకు చెందిన కొమ్ము ఆంజనేయులు(52)కు ఏదుల ప్రాజెక్టు వద్ద వ్యవసాయ పొలం ఉండేది. ప్రాజెక్టులో పొలం పోయింది. జీవనోపాధికి పొలం లేకపోవడంతో అదే పొలంలో ఆంజనేయులు మినుముల పంట వేశాడు. ప్రాజెక్టు పనుల్లో భాగంగా ఇటీవల పంటలో నుంచి లారీలు వెళ్లడంతో నష్టపోతానని కాంట్రాక్టరుతో వాదోపవాదాలు జరిగాయి. గురువారం తీవ్ర మనస్తాపానికి గురై పొలంవద్ద గడ్డిమందు తాగాడు. అనంతరం కుటుంబ సబ్యులకు ఫోన్చేసి తాను గడ్డిమందు తాగానని చెప్పగా.. వెంటనే వనపర్తి, మహబూబ్నగర్ అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించారు. శనివారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ విషయంపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశామని బంధువులు తెలిపారు. మృతుడికి భార్య అంజనమ్మ, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. చికిత్సపొందుతూ మహిళ మృతి ఆత్మకూర్: పురుగుల మందుతాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ మహిళ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందిందని ఎస్ఐ నరేందర్ తెలిపారు. మండలంలోని మేడేపల్లికి చెందిన భారతమ్మ(30)కు తిప్డంపల్లికి చెందిన శివతో 13 ఏళ్లక్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు. శుక్రవారం భర్తతో గొడవపడ్డ భారతమ్మ మేడేపల్లిలోని తన పుట్టింటికి వెళ్లింది. అక్కడ ఎవరూలేని సమయంలో పురుగుల మందు తాగింది. అపస్మారక స్థితిలో పడిఉన్న తమ కూతురుని చూసిన కుటుంబ సభ్యులు ఆత్మకూర్ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మహబూబ్నగర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. తల్లి సత్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
నిష్టతో వస్త్రాల తయారీ..
స్వామివారి సేవలో త రించేందుకు ఎన్నో ఏళ్లు గా ఎదురుచూస్తున్నా. ఆ అవకాశం ఇప్పటికి ద క్కింది. నియమ నిష్టలు, ఉపవాస దీక్షతో స్వామి, అమ్మవార్ల పట్టువస్త్రాలు తయారు చేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. – పగడాకుల శేషు, చేనేత కార్మికుడు, అమరచింత అదృష్టంగా భావిస్తున్నా.. కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలకు ఏటా పట్టువస్త్రాలు సమర్పించడం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ క్రతువులో ఐదేళ్లుగా పాల్గొంటుడటం అదృష్టంగా భావిస్తున్నా. స్వామివారి సేవలో పాల్గొనే అవకాశం దక్కడం ఆనందంగా ఉంది. – దేవరకొండ వెంకటేశ్వరమ్మ, నేత కార్మికురాలు ● -
బీసీలకురాజ్యాధికారం దక్కాలి
మక్తల్: రాష్ట్రంలో అగ్రకులాలు బీసీలను మోసం చేస్తున్నారని బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు పాండుయాదవ్ అన్నారు. శనివారం పట్టణంలో జిల్లా బీసీ ముఖ్య నాయకుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 42 శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో కోర్టులో పిటిషన్ వేసి కొందరు అడ్డుపడుతున్నారన్నారు. బీసీలకు రాజ్యాధికారం దక్కాలంటే ఇప్పటికై నా సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కొన్ని పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయానికి వాడుకుంటున్నాయని మండిపడ్డారు. అనంతరం మాగనూర్ మండంల కర్కూర్ గ్రామానికి చెందిన పసుల అంజనేయులుకు జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించి, నియామకపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి లోకపల్లి భీమేష్, జిల్లా నాయకులు నర్సింహ, శాలివాహన దండు, దేవప్ప, కుర్మయ్య, తోటి అశోక్, ఆశప్ప, వెంకటప్ప, పరశురాం, బుగ్గప్ప, వెంకటప్ప, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు. -
యువత రాజకీయాల్లోకి రావాలి
కందనూలు/కల్వకుర్తి రూరల్: యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరముందని తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్కుమార్ అన్నారు. ఆయన చేపట్టిన సామాజిక చైతన్య రథయాత్ర శనివారం జిల్లా కేంద్రానికి చేరింది. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో 369 మంది, మలి దశ ఉద్యమంలో 1200 మంది చేసిన ఆత్మబలిదానాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. అయితే నేటికీ ఒక భౌగోళిక తెలంగాణగానే మిగిలిపోవడం.. బహుజనులకు అధికార పగ్గాలు అందకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ. 6వేల కోట్లతో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ఎకారానికి రూ. 25వేల చొప్పున పరిహారం అందించాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎల్డీ నాయకులు ముద్దం మల్లేష్, రిషబ్ జైన్, జానీ, నర్సింహారావు, సుధాకర్ పాల్గొన్నారు. ● జిల్లా కేంద్రం నుంచి కల్వకుర్తికి సామాజిక చైతన్య రథయాత్ర చేరుకోగా.. పాలమూరు చౌరస్తాలో దిలీప్కుమార్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలందరూ ఆర్థికంగా, రాజకీయంగా రాణించాలన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఫాం అడిగే స్థాయి నుంచి బీఫాం ఇచ్చే స్థాయికి ఎదగాలన్నారు. కార్యక్రమంలో నాయకులు రాజేందర్, జంగయ్య, సదానందంగౌడ్, గోపాల్, రమేశ్ బాబు, శ్రీనివాసులు, శేఖర్, రాములు యాదవ్ పాల్గొన్నారు. -
హ్యామ్ నిధులతో రోడ్ల అభివృద్ధి
జడ్చర్ల: జడ్చర్ల నియోజకవర్గంలో హైబ్రీడ్ యాన్యుటీ మోడల్(హ్యామ్) పథకం కింద ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల ద్వారా రోడ్లను అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం తొలి విడుతలో సర్కిల్కు రూ.421 కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో 20రోడ్లను అభివృద్ధి పరుస్తామని, నవాబుపేట మండలంలో లింగంపల్లి మీదుగా బాలానగర్, రుద్రారం నుంచి కూచూరు మీదుగా మల్రెడ్డిపల్లికి, నవాబ్పేట నుంచి పోమాల్ మీదుగా కేశవరావుపల్లి రోడ్లకు నిధులు మంజూరయ్యాయని వివరించారు. అదేవిధగా బాలానగర్ నుంచి నేలబండ తండా, హేమాజీపూర్, బిల్డింగ్తండా వరకు, జెడ్పీరోడ్డు నుంచి బోడజానంపేట, ఆగ్రహారంపొట్లపల్లివరకు, బాలానగర్ నుంచి నందారం, మోతిఘన్పూర్ వరకు, బూర్గుల నుంచి లింగారం రోడ్డు, రాజాపూర్ మండలంలో మర్రిబాయితండా రోడ్డు, ఈద్గానిపల్లి, నాన్చెరువుతండా మీదుగా తిరుమలగిరి, జాతీయ రహదారి నుంచి ముదిరెడ్డిపల్లి మీదుగా నందారం వరకు, కుచ్చర్కల్ నుంచి ఖానాపూర్ వరకు, జడ్చర్ల మండలంలోని గొల్లపల్లి క్రాస్రోడ్డు నుంచి ఈర్లపల్లి వరకు, అల్వాన్పల్లి నుంచి తంగెళ్లపల్లి మీదుగా నసరుల్లాబాద్ వరకు, బూర్గుపల్లి మీదుగా పెద్దతండా వరకు, మంగలికుంట తండా రోడ్డు, మిడ్జిల్ మండలంలోని రానిపేట నుంచి దోనూర్, సింగందొడ్డి మీదుగా తొమ్మిదిరేకుల వరకు, వాడ్యాల నుంచి వేముల మీదుగా వెల్జాల వరకు, వేముల నుంచి మసిగుండ్లపల్లి మీదుగా చెన్నంపల్లి వరకు, ఊర్కొండ మండలంలో ముచ్చర్లపల్లి నుంచి రాంరెడ్డిపల్లి, బొమ్మరాసిపల్లి, జగబోయిన్పల్లి మీదుగా వెల్జాల రోడ్డు వరకు, మాదారం నుంచి గుడిగానిపల్లి మీదుగా మల్లాపూర్ క్రాస్రోడ్డు వరకు రోడ్లను అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. పిడుగుపాటుకు 14 గొర్రెలు మృత్యువాత అలంపూర్: పట్టణంలోని సంతోష్నగర్కు చెందిన వెంకటేశ్కు చెందిన 14 గొర్రెలు పిడుగుపడి మృతిచెందాయి. వెంకటేశ్ గొర్రెల పెంపకంతో జీవనం సాగిస్తున్నాడు. శనివారం తెల్లవారుజామున వర్షంతోపాటు పిడుగులు పడడంతో వాటి ధాటికి 14 గొర్రెలు మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతి చెందిన గొర్రెల విలువు దాదాపు రూ.2 లక్షల వరకు ఉంటందని బాధితుడు తెలిపారు. పశు సంవర్థక శాఖ అధికారులు మృతిచెందిన గొర్రెలను పరిశీలించిట్లు తెలిపారు. ప్రభుత్వం బాధిత కుటుంబానికి ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని కోరారు. -
పార్లమెంట్లో చట్టం చేస్తేనే.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు
● కోర్టులను నిందించడం సరి కాదు ● మాజీ గవర్నర్, బండారు దత్తాత్రేయ నారాయణపేట: ‘రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శా తం రిజర్వేషన్లు కల్పించడాన్నిస్వాగతిస్తున్నాం. స్థా నిక సంస్థల ఎన్నికల్లో ఎలా అమలు చేస్తారనేది వేచిచూడాలి. పార్లమెంటులో చట్టం చేస్తేనే రిజర్వేషన్లు అమలు అవుతాయి. కోర్టులను నిందించడం సరైన ది కాదు. పార్లమెంటులో బీసీ బిల్లు అమలు అయ్యే లా దేశంలోని అన్ని జాతీయ పార్టీలు సహకరించాలి.’ అని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పే ర్కొన్నారు. శనివారం ఆయన నారాయణపేట జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ రాష్ట్రంలో, దేశంలో అత్యధికంగా వెనుకబడిన కూలాలు ఉన్నాయని, వాటిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ప్రభు త్వం సంకల్పించిన సమయంలోని సాధ్యసాధ్యాలను ఆలోచన చేయాల్సి ఉండేదని.. దాన్ని రాజకీయం చేయడం తగదన్నారు. సామాజిక న్యాయమనేది చాలా అవసరమని, వెనకబడిన సామాజిక వర్గాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కలిపిస్తే.. పరిపాలన వారిచేతుల్లోకి వెళ్లడం శుభపరిణామన్నారు. పార్లమెంట్లో చట్టం చేస్తే తప్పా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలును మనం ముందుకు తీసుకెళ్లలేమని స్పష్టం చేశారు. కోర్టులపై నిందలు వేయడం సరైంది కాదని, రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని కోర్టులు తీర్పునిస్తాయని పేర్కొన్నారు. జాతీయస్థాయిలో ఏకాభిప్రాయం రావాలని, అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించి చొరవ తీసుకోవాలని మనసారా కోరకుంటున్నట్లు వెల్లడించారు. సమావేశంలో నాగురావు నామాజీ, సత్య యాదవ్, కొండయ్య, తదితరులు పాల్గొన్నారు. -
నోటీసులు జారీ..
ఆన్లైన్ ద్వారా 2020 సంవత్సరంలో వచ్చిన సాదాబైనామా దరఖాస్తుల క్రమబద్ధీకరణ ప్రక్రియకు రెవెన్యూ అధికారులు శ్రీకారం చుట్టారు. దరఖాస్తుల ఆధారంగా సాదా కాగితాలపై భూములు అమ్మిన, కొనుగోలు చేసిన వారికి నోటీసులు జారీ చేశారు. ఇరువురిని పిలిచి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. మార్గదర్శకాల ప్రకారమే.. సాదాబైనామా క్రమబద్ధీకరణ కోసం చేసిన దరఖాస్తుల పరిషారం విషయంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేసింది. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం క్రమబద్ధీకరణ ప్రక్రియను చేపడుతున్నాం. మండలాల వారీగా సాదాబైనామా దరఖాస్తులకు సంబంధించి నోటీసులు జారీ చేశాం. విచారణ ప్రక్రియ కొనసాగుతోంది. – మధుసూదన్నాయక్, ఇన్చార్జి రెవెన్యూ అదనపు కలెక్టర్ ● -
అమరుల త్యాగాలు స్మరించుకోవాలి
మహబూబ్నగర్ క్రైం: ప్రజల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల సేవలను ప్రతిఒక్కరూ గుర్తు చేసుకోవాలని ఎస్పీ జానకి అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శనివారం జిల్లా పరేడ్ మైదానంలో ఓపెన్ హౌజ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖలో ఉండే షీటీం, భరోసా సెంటర్, ట్రాఫిక్ విభాగం, సైబర్ క్రైం, ఫింగర్ ప్రింట్స్ బ్యూరో, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఐటీ సెల్ విభాగాల పనితీరును విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రజల సహకారం లేకుండా చట్ట వ్యవస్థ సక్రమంగా పనిచేయడం సాధ్యం కాదన్నారు. ప్రతి పౌరుడు చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. పోలీస్ శాఖలో అందుబాటులోకి వచ్చిన సాంకేతిక ప్రగతిని గమనించాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఎన్బీ రత్నం, ఏఆర్ ఏఎస్పీ సురేష్కుమార్, డీసీఆర్బీ డీఎస్పీ రమణారెడ్డి, ఆర్ఐలు, టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు. బాధితులకు న్యాయం చేయాలి.. పోలీస్ స్టేషన్లో నమోదయ్యే ప్రతి కేసులో బాధితులకు న్యాయం జరిగే విధంగా పోలీసులు సమయపాలన, బాధ్యతగా వ్యవహరించాలని ఎస్పీ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో కోర్టు డ్యూటీ, కోర్టు లైజన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కోర్టులకు సంబంధించిన అన్ని రకాల విధులు, పత్రాలు, సాక్ష్యాధారాలు నిర్ణీత సమయంలో సమర్పించాలన్నారు. ప్రతి కేసులో ప్రస్తుత పరిస్థితిని వివరంగా తెలుసుకుని కోర్టులో శిక్షలు ఖరారయ్యే విధంగా చూడాలన్నారు. -
మత్స్యకారుల సంక్షేమానికి ప్రాధాన్యం
● రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి హన్వాడ: జిల్లాలో ఉన్న మత్స్యకారుల సంక్షేమానికి, వారి అభివృద్ధికి కట్టుబడి మొదటి ప్రాధాన్యత ఇస్తానని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ప్రభుత్వం 100 శాతం రాయితీతో అందించిన చేపపిల్లల పంపిణీని కలెక్టర్ విజయేందిర, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డితో కలిసి శనివారం ఆయన మండలంలోని ఇబ్రహీంబాద్ గ్రామం హేమసముద్రం చెరువులో చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా జిల్లాలోని మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నానన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారికి కాకుండా ఇతరులకు మత్స్య శాఖను కేటాయించి వారి అభివృద్ధికి తోడ్పడలేదన్నారు. సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మత్స్యకారుడినైనా తనకు ఆ శాఖను కేటాయించి, మత్స్యకారుల సంక్షేమంపై తమ చిత్తశుద్ధిని నిరూపించుకుందని వివరించారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేకంగా రూ.125 కోట్ల బడ్జెట్ తీసుకొచ్చినట్లు చెప్పారు. జిల్లాలో ప్రధానంగా నీటి వనరులున్న ప్రాజెక్టులు, చెరువులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ చేపలతోపాటు రొయ్యల పెంపకానికి శ్రీకారం చుట్టామన్నారు. అదేవిధంగా మత్స్యకార సంఘాలకు రవాణా వాహనాలను ప్రతి సంఘానికి అందించేందుకు కృషిచేస్తానని, ఇందుకు ఎన్ని నిధులైనా తెస్తానని భరోసా ఇచ్చారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లోని విద్యార్థులకు ఎండుచేపలను పౌడర్ రూపకంగా పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ కోల్డ్ స్టోరేజ్ లేని కారణంగా చాలామంది మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారని, వీటిని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం వారి సంక్షేమానికి కట్టుబడి ప్రతి జిల్లాకు కోల్డ్ స్టోరేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. ప్రజా సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను చేపడుతున్న ప్రభుత్వానికి కార్యకర్తలు కట్టుబడి పనిచేయాలని కోరారు. అంతకు ముందు హేమసముద్రం చెరువులో రూ.2.70 లక్షల విలువైన 1.80 లక్షల చేపపిల్లలను విడుదల చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫిషరీష్ చైర్మన్ సాయికుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ మల్లు నర్సింహారెడ్డి, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్పీ.వెంకటేష్, ఏఎంసీ చైర్మన్ బెక్కరి అనిత, వైస్ చైర్మన్ విజయ్కుమార్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్, నాయకులు సురేందర్రెడ్డి, సుధాకర్రెడ్డి, సిరాజ్ఖాద్రి, కృష్ణయ్య, మహేందర్, ఆంజనేయులు, యాదయ్య, నవనీత, శ్రీను, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణమ్మ ఒడిలో.. జలవిహారం
సోమశిల నుంచి శ్రీశైలం వరకు కృష్ణానదిలో తిరిగే ఏసీ లాంచీప్రయాణాల్లో మార్పులు సోమశిల నుంచి శ్రీశైలానికి నడిపే ఏసీ లాంచీలో గతేడాది కొన్ని రకాల మార్పులు చేశారు. గతంలో 60 నుంచి 70 మంది ప్రయాణికులు బుకింగ్ చేసుకుంటేనే లాంచీ ప్రయాణం చేపట్టేవారు. అయితే ఒకేసారి అంతమంది బుకింగ్ చేసుకోవడం సమస్యగా మారింది. దీంతో ఏడాదిలో ఒకటి, రెండు సార్లు కూడా ఈ లాంచీ ప్రయాణం కొనసాగేది కాదు. గతేడాది ప్రతి శని, ఆది వారం ప్రయాణికులు ఉన్నా.. లేకున్నా.. లాంచీని తిప్పాలని టూరిజం శాఖ నిర్ణయించింది. దీంతో పర్యాటకులు ఆయా రోజుల్లో లాంచీ ప్రయాణాలకు మొగ్గుచూపడంతో ఇదే పద్ధతిని కొనసాగించాలని భావిస్తున్నారు. టికెట్ల ధరలు, వసతుల కల్పనలోనూ ఈ ఏడాది నుంచి మార్పులు చేపట్టాలని నిర్ణయించారు. సోమశిల నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణానికి ఏర్పాట్లు వరదలతో రెండు నెలలుగా వాయిదా పడిన వైనం తాజాగా తగ్గుముఖం పట్టడంతో ప్రారంభించేందుకు కసరత్తు పర్యాటకులకు మెరుగైన వసతుల కల్పనకు చర్యలు బ్యాక్వాటర్లో ఆకట్టుకుంటున్న చిన్నబోట్ల షికారు -
హైజెనస్ కంపెనీతో పీయూ ఎంఓయూ
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: హైజెనస్ బయోస్యూటికల్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీతో పీయూ అధికారులు ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా వీసీ జీఎన్. శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ఎంఓయూ ద్వారా రీసెర్చి, ప్రాక్టికల్స్ విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని, వీటి ద్వారా భవిష్యత్లో ఉద్యోగాలు సాధించే అవకావం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, కంపెనీ ప్రతినిధులు సూర్యవెంకటసుబ్బరాజు, లియో డానియల్, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ మధుసూదన్రెడ్డి, అధ్యాపకులు కిషోర్ తదితరులు పాల్గొన్నారు. డీపీఆర్ఓలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లా పౌర సంబంధాల శాఖలో ఔట్ సోర్సింగ్ పద్ధతిపై సహాయ పౌర సంబంధాల అధికారి (ఏపీఆర్ఓ), పబ్లిసిటీ అసిస్టెంట్ పోస్టులకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ విజయేందిర శనివారం ఒక ప్రకటనలో చెప్పారు. మార్చి 31, 2026 వరకు పనిచేసేందుకు ఆసక్తి, అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఏపీఆర్ఓ (1), పబ్లిసిటీ అసిస్టెంట్ (ఫొటోగ్రాఫర్–1) అవుట్ సోర్సింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఏపీఆర్ఓ పోస్టుకు జర్నలిజం/ పబ్లిక్ రిలేషన్స్లో డిగ్రీ లేదా డిప్లొమాతోపాటు ఏదైనా సబ్జెక్ట్లో బ్యాచిలర్స్ డిగ్రీ కలిగి ఉండాలని, డిజిటల్ మీడియా, ఏఐ టూల్స్లో అనుభవం ఉన్నవారికి, అలాగే పబ్లిసిటీ అసిస్టెంట్ (ఫొటోగ్రాఫర్) వారికి ఏదైనా సబ్జెక్టులో బ్యాచిలర్స్ డిగ్రీ కలిగి ఉండాలని, కాలేజీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ నుంచి ఫొటోగ్రఫీలో డిప్లొమా లేదా జర్నలిజం, పబ్లిక్ రిలేషన్స్లో గుర్తించిన యూనివర్సిటీ/ ఇనిస్టిట్యూషన్ నుంచి డిప్లొమా ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఏపీఆర్ఓ పోస్టుకు నెలకు రూ.36,750, పబ్లిసిటీ అసిస్టెంట్ పోస్టుకు నెలకు రూ.27,130 గౌరవ వేతనం చెల్లిస్తామన్నారు. ఆసక్తి గలవారు వచ్చే నెల 1లోగా కలెక్టరేట్లోని డీపీఆర్ఓ కార్యాలయం రూం నం.106లో దరఖాస్తు అందజేయాలన్నారు. నేడు బల్మూరుకుగవర్నర్ రాక అచ్చంపేట రూరల్: బల్మూర్ మండలంలోని చంద్రారెడ్డి గార్డెన్లో వనవాసీ కల్యాణ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించే ఆదివాసీ చెంచుల సామూహిక వివాహాలకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరు కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం నుంచి ప్రెస్నోట్ శనివారం సాయంత్రం సంబంధిత అధికారులు విడుదల చేశారు. ఆదివారం ఉదయం 9.30 గంటలకు గవర్నర్ బయలుదేరి మధ్యాహ్నం సామూహిక వివాహాల కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం తిరిగి రాజ్భవన్కు బయలుదేరి వెళ్తారని ప్రకటనలో పేర్కొన్నారు. -
నేరుగా ఉల్లి విక్రయాలు
దేవరకద్ర: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డుకు బుధవారం ఉల్లి తక్కువగా రావడంతో వ్యాపారులు వేలం నిర్వహించకుండా నేరుగా కొనుగోలు చేశారు. 50 కిలోల బస్తా గరిష్టంగా రూ.800, కనిష్టంగా రూ.600 ధర పలికింది. మార్కెట్కు వచ్చిన విత్తనాల ఉల్లికి డిమాండ్ ఉండటంతో 50 కిలోల బస్తా గరిష్టంగా రూ.1,300, కనిష్టంగా రూ.1,200 కు విక్రయించారు. వినియోగదారులు, చిరు వ్యాపారులే ఎక్కువగా ఉల్లి కొనుగోలు చేశారు. ఇద్దరికి జైలుశిక్ష కల్వకుర్తి టౌన్: రెండు వేర్వేరు కేసుల విచారణలో న్యాయమూర్తి ఇద్దరు నిందితులకు జైలుశిక్షతో పా టు అందులో ఒకరికి జరిమానా విధించినట్లు బుధ వారం ఎస్ఐ మాధవరెడ్డి తెలిపారు. పట్టణంలోని ఎన్జీఓ కాలనీకి చెందిన వరికుప్పల వెంకటేశ్ 2021 లో ఓ మహిళకు కల్లు తాగించి ఆటోలో తీసుకెళ్లి బంగారు ఆభరణాలు అపహరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ మహేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పట్టణంలోని సీని యర్ సివిల్ కోర్టులో కేసును విచారించిన న్యాయమూర్తి కావ్య బుధవారం అతడికి ఆరునెలల జైలుశిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధించారు. ● 2018లో వంగూర్ మండలం జాజాలతండాకు చెందిన దాసును తెల్కపల్లి మండలం పెద్దూరుకు చెందిన జంగం రమేష్ బైక్తో ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడు దాసు ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ రవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బుధవారం కేసును విచారించిన సీనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి కావ్య నిందితుడికి 41 రోజుల జైలుశిక్ష విధించారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
కృష్ణా: మండల కేంద్రంలోని రైల్వేస్టేషన్లో ఈ నెల 19న రాత్రి 11 గంట ల సమయంలో ట్రె యిన్ నుంచి కిందపడిన గుర్తు తెలియని వ్యక్తికి గాయా లు కాగా, రైల్వే పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం రాయచూర్లోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. బుధవారం మధ్యాహ్నం చికిత్సపొందుతూ ఆ వ్యక్తి మృతి చెందాడు. ఆ వ్యక్తి వివరాలు ఇప్పటివరకు తెలియ లేదని, ఘటనపై కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్లు కానిస్టేబుల్ మునిస్వామి తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మరో వ్యక్తి కల్వకుర్తి టౌన్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మహిళ మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ తెలిపిన వివరాలిలా.. మున్సిపాలిటీలోని సిలార్పల్లికి చెందిన స్వాతి (33), తన భర్త సైదులుతో కలిసి వెల్దండ నుంచి కల్వకుర్తి బైక్పై ఈ నెల 18న వెళ్తున్నారు. పట్టణ సమీపంలోకి రాగానే జింజర్ హోటల్ వద్దకు రాగానే బైక్ అదుపుతప్పి పడిపోయింది. ఘటనలో తీవ్రగాయాలైన స్వా తిని మెరుగైన చికిత్స కో సం హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. చికిత్స పొందుతూ బుధవారం ఆమె మృతి చెందినట్లు ఎస్ఐ మాధవరెడ్డి తెలిపారు. ఘటనపై స్వా తి సోదరుడు నరసింహ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. మృతురాలికి భర్తతో పాటుగా ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి
ఎర్రవల్లి: ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తూ అమరులైన పోలీసుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పదో పటాలం కమాండెంట్ జయరాజు అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలను పురస్కరించుకొని బుధవారం బీచుపల్లి పదో పటాలంలో పోలీస్ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి కమాండెంట్ హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎర్రవల్లి కూడలిలోని పుర వీధుల గుండా పటాలం అధికారులు, సిబ్బందితో కలిసి బైక్ ర్యాలీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణలో నిబద్దతతో విధి నిర్వహణ చేస్తూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముందుకు సాగుతున్న పోలీసుల కృషి ఎంతో అభినందనీయమన్నారు. అనంతరం ఎర్రవల్లి కూడలి నుంచి బైక్లతో ర్యాలీగా గద్వాల జిల్లా కేంద్రానికి తరలివెళ్లారు. కార్యక్రమంలో ఆర్ఐలు, ఆర్ఎస్సైలు, సిబ్బంది, తదితరులు ఉన్నారు. పదో పటాలం కమాండెంట్ జయరాజు -
మార్మోగిన గోవింద నామస్మరణ
కనులపండువగా పాగుంట వేంకటేశ్వరస్వామి రథోత్సవం కేటీదొడ్డి: అశేషంగా తరలివచ్చిన భక్తజనం నడుమ పాగుంట వేంకటేశ్వరస్వామి రథోత్సవం కనులపండువగా సాగింది. నడిగడ్డ భక్తుల కోరికలు తీర్చే వెంకన్నగా విరాజిల్లతున్న పాగుంట లక్ష్మీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామివారి రథోత్సవం బుధవారం వైభవంగా నిర్వహించగా.. కర్ణాటక, ఆంద్రపదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి రథాన్ని లాగారు. ఆంజనేయస్వామి ఆలయం వరకు రథాన్ని లాగారు. ఇదిలాఉండగా, వేలాదిగా తరలివచ్చిన భక్తజనంతో ఆలయ ప్రాంగణం, పరిసరాలు కిటకిటలాడాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు ముందస్తుగా చర్యలు తీసుకున్నారు. జాతర సందర్భంగా తినుబండారాలు, ఆటబొమ్మల దుకాణాల్లో రద్దీ నెలకొంది. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ కుర్వ నల్లా హనుమంతు, నాయకులు గడ్డం కృష్ణరెడ్డి, శ్రీధర్గౌడ్, మాజీ ఎంపీపీ విజయ్కుమార్, మాజీ జెడ్పీటీసీ రాజశేఖర్, మాజీ వైస్ఎంపీపీ రామకృష్ణనాయుడు, మాజీ సర్పంచు ఆంజనేయులు, గోపి, ఉరుకుందు, నవీన్, రాజేష్, శేఖర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
చెరుకు రైతులను ఆదుకోవాలి
అమరచింత: ఫ్యాక్టరీకి తరలించిన చెరుకులో రికవరీ శాతాన్ని పెంచి చెరుకు రైతులను ఫ్యాక్టరి యాజమాన్యం ఆదుకోవాలని కృష్ణవేణి చెరుకు రైతు సంఘం ఉమ్మడి జిల్లా గౌరవ సలహాదారుడు సీహెచ్ రాంచందర్, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజన్న డిమాండ్ చేశారు. కొత్తకోట మండలంలోని ఆమడబాకుల రైతువేదికలో బుధవారం ఏర్పాటు చేసిన చెరుకు రైతుల ఉమ్మడి జిల్లా సమావేశంలో పాల్గొని చెరుకు రైతుల సమస్యల సాధనకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం గత సీజన్లో ప్రకటించిన సబ్సిడీలను ఈ సీజన్లో సైతం అమలు చేస్తున్న యాజమాన్యం రికవరీ శాతాన్ని 11నుంచి 12శాతానికి పెంచాలన్నారు. సబ్సిడీలను 2026 నుంచి 2027వరకు కొనసాగించాలన్నారు. కోతలకు సరిపడా మిషన్లు ఏర్పాటు చేసి 40, 50 ఎకరాల రైతులను గ్రూపులుగా చేసి కోతలను ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. కోతలు ముగిసే వరకు నిర్ణయించిన ధరలకే కోయించాలన్నారు. చెరుకు రైతులకు ప్రమాదాలు నష్టాలు జరిగినప్పుడు ట్రాన్స్పోర్టు భరించాలన్నారు. ఫ్యాక్టరీకి పంపిన 14రోజుల్లో రైతుల ఖాతాలో డబ్బులను జమ చేయాలని యాజమాన్యానికి విన్నవించడం జరిగిందన్నారు. చెరుకు కోతల సమయాన్ని రైతులకు ముందస్తుగా ప్రకటించడమే కాకుండా వారి పంటలను ఎప్పుడు ఫ్యాక్టరీకి తరలిస్తారనే విషయాలను వివరించాలన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఫ్యాక్టరి ఈడీ రవికుమార్, వీపీ రామరాజు, కేన్ డీజీఎం నాగార్జునరావుకు అందించామన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా చెరుకు సంఘం ఉపాధ్యక్షుడు వాసారెడ్డి, ప్రధాన కార్యదర్శి జింక రవి, చంద్రసేనారెడ్డి, ఆయా జిల్లాల చెరుకు రైతులు పాల్గొన్నారు. -
కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
చిన్నచింతకుంట: రాష్ట్ర ప్రజల ఆరాధ్య ధైవమైన అమ్మాపురం కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున ఆలయ సిబ్బంది స్వామివారి ప్రధాన ఆలయాన్ని శుద్ధి చేసిన అనంతరం సుప్రభాత సేవ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు ఉదయం 8 గంటలకు అవాహిత దేవతా పూజలు, ధ్వజారోహణం, దేవతాహ్వానం, బేరిపూజ, 108 అష్టోత్తర కలశాభిషేకం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కురుమూర్తి స్వామి, పద్మావతి, అలివేలు మంగమ్మ అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను నూతన పట్టు వస్త్రాలు, బంతి, మల్లెపూలతో పూజారులు అలంకరించారు. అక్కడి నుంచి కల్యాణ మండపంలోకి తీసుకువచ్చారు. బ్రాహ్మణుల వేదమంత్రోచ్ఛరణల నడుమ కురుమూర్తి స్వా మి, పద్మావతి, అలివేలు మంగమ్మ అమ్మవార్ల కల్యాణం వైభవంగా జరిపించారు. ఈ వేడుకను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో కురుమూర్తిగిరులు గోవింద నామస్మరణతో మార్మోగాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ మదనేశ్వరెడ్డి, చైర్మన్ గోవర్ధన్ రెడ్డి దంపతులు, ప్రధాన అర్చకులు వెంకటయ్య, నర్సింహులు, కమిటీ సభ్యులు భాస్కరచారి,బాదం వెంకటేశ్వర్లు, భారతి, కమలాకర్ శేఖర్తో పాటు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. వైభవంగా స్వామివారి కల్యాణం -
భవనం పైనుంచి పడి వ్యకి మృతి
నాగర్కర్నూల్ క్రైం: ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడి ఓ కార్మికుడు మృతిచెందిన ఘటన జిల్లా కేంద్రంలోని ఎర్రగడ్డకాలనీలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ గోవర్ధన్ తెలిపిన వివరాలిలా.. జిల్లా కేంద్రానికి చెందిన పాలమూరు శ్రీనివాసులు (55) మేస్త్రి పని చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో మంగళవారం ఎర్రగడ్డకాలనీలో ఓ ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు శ్రీనివాసులు భవనంపై నుంచి కిందపడడంతో తీవ్రగాయాలయ్యాయి. గమనించిన తోటి కూలీలు వెంటనే చికిత్స నిమిత్తం జనరల్ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు రెఫర్ చేశారు. తరలిస్తుండగా మార్గమద్యలో మృతిచెందడటంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన బుధవారం వెలుగులోకి రాగా.. సంఘటనకు సంబందించి మృతుడి కుమారుడు ఆంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చేపలు పట్టేందుకు వెళ్లి.. ఊట్కూరు: ఊట్కూరులో వాగులో ప్రమాదవశాత్తు ముకేష్జోహన్ కొటారె(30) పడి మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మహారాష్ట్రలోని పూణె జిల్లాకు చెందిన ముకేష్జోహన్ కొటారె ఊట్కూరు గ్రామ శివారులో కూలీ పనిచేస్తూ జీవిస్తున్నాడు. రెండు రోజుల క్రితం చెరువు కిందగల వాగులోకి చేపలు పట్టేందుకు వెళ్లా డు. ఆయన తిరిగి రాకపోవడంతో చుట్టు పక్క ల ప్రాంతాలలో ఆయన ఆచూకీ కోసం వెతికా రు. బుధవారం ఉదయం వాగులోని నీటి గుంతలో మృతదేహం ఉండడంతో రైతులు గమ నించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల సహాయంతో కూలీలు అక్కడకు వెళ్లి మృతదేహాన్ని గుర్తించారు. అతని తాత ఖాళ్ళురాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు. విద్యుదాఘాతానికి యువకుడు బలి నవాబుపేట: కొబ్బరి చెట్లు తరలిస్తూ విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన మండంలోని దయాపంతులపల్లిలో చో టుచేసుకుంది. మండలంలోని యన్మన్గండ్లకు చెందిన యువకుడు జగదీశ్(30) తన బొలేరోలో కొబ్బరి చెట్లను తీసుకొచ్చి రైతుల పొలాల్లో దించుతుండగా..ప్రమాదవశాత్తు చెట్లకు విద్యు త్ వైర్లు తగిలి షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా అక్కడే కింద ఉండి చెట్లు అందుకుంటున్న మరో ముగ్గురు రైతులు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. జగదీశ్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ట్రాక్టర్ పైనుంచి పడి వ్యక్తి మృతి పాన్గల్: ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాసులు తెలిపి న వివరాల ప్రకారం.. మండలంలోని రేమద్దుల గ్రామానికి చెందిన గొల్లకుంట లక్ష్మ య్య(79) ఈనెల 17న గ్రామం నుంచి మండల కేంద్రం పాన్గల్కు సబ్సిడీ వేరుశనగ విత్తనాల కోసం ట్రాక్టర్పై వెళ్తుండగా, గోప్లాపూర్ గ్రామ శివారులోని డంపింగ్ యార్డు సమీపంలో మలుపు వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడింది. ట్రాక్టర్ ఇంజిన్పై కూర్చున్న గొల్లకుంట లక్ష్మయ్య కిందపడటంతో ట్రాక్టర్ ట్రాలీ టైర్ అతని మీదనుంచి వెళ్లింది. దీంతో కాళ్లకు, ఛాతికి తీవ్ర గాయాలయ్యా యి. వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్ మెడిటెక్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. ట్రాక్టర్ డ్రైవర్ గొల్లకుంట రాములు అతివేగంగా, అజాగ్రత్తగా నడిపి లక్ష్మయ్య మృతి చెందాడని, డ్రైవర్పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాల ని లక్ష్మయ్య కుమారుడు గోవర్ధన్ బుధవారం ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. జగదీశ్(ఫైల్) -
కుక్కల స్వైరవిహారం.. 9 మందిపై దాడి
చారకొండ: మండలంలోని సిర్సనగండ్లలో వీధి కుక్కలు స్వైరవిహారం చేశా యి. బుధవారం దాదాపు 9 మందిని గా యపర్చడంతో గ్రామస్తులంతా భయాందోళనకు గురయ్యారు. పెద్దల పరిస్థితే ఇ లా ఉంటే.. చిన్నారులు, పిల్లల పరిస్థితి ఏంటి అని, ఇప్పటికై నా పంచాయతీ అధి కారులు స్పందించి తగు చర్యలు చేప ట్టాలని గ్రామస్తులు కోరారు. పూర్తి వివరాలిలా.. బుధవారం మధ్యాహ్నం ఓ వీ ధి కుక్కల గుంపు గ్రామంలో కనిపించిన వారందరిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. ఈక్రమంలో పగడాల శ్రీను, కు మ్మరి లక్ష్మమ్మ, గ్యార లక్ష్మమ్మ, ఒట్టే లక్ష్మ మ్మ, మరో మహిళ, ముగ్గురు చిన్నారులు గాయపడగా.. వీరందరూ కల్వకుర్తి ప్ర భుత్వ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందారు. ముగ్గురికి తీవ్రగాయాలు కావడంతో వారికి అక్కడే వైద్యం అందిస్తున్నారు. ఇదిలాఉండగా, సిర్సనగండ్లలో వీధికుక్క ల బెడద తీవ్రంగా ఉందని, చిన్నారులు, పిల్లలను బడికి పంపాలన్నా, వృద్ధులు ఆరుబయట కూర్చోవాలన్నా ఎక్కడి నుంచి కుక్కలు వచ్చి దాడి చేస్తాయోనని భయపడే పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికై నా పంచాయతీ శాఖ అధికారులు స్పందించి వీధికుక్కల బెడద తీర్చాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. -
పాలమూరు వాసి సాహసయాత్ర
స్టేషన్ మహబూబ్నగర్: జిల్లా కేంద్రం బోయపల్లి వార్డుకు చెందిన మునిమంద మల్లేశ్గౌడ్ అరుదైన ఘనతను సాధించాడు. దేశంలోని 12 జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకోవడానికి సైకిల్పై సాహసయాత్ర చేయడానికి గతేడాది అక్టోబర్ 17వ తేదీన శ్రీకారం చుట్టాడు. బోయపల్లి మీదుగా సైకిల్యా త్ర చేపట్టి తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్లోని రక్సౌల్ బార్డర్ మీదుగా నేపాల్ చేరుకున్నా డు. అక్కడ 45రోజులపాటు సైకిల్పై తిరిగి అక్కడి నయాపూల్ ప్రాంతం నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ 4,130 మీటర్ల ఎత్తుగల అన్నపూర్ణ బేస్క్యాంప్కు చేరాడు. 12 జ్యోతిర్లింగాలు.. 18 వేల కిలోమీటర్లు 367రోజులు 14 రాష్ట్రాలు, నేపాల్లో మల్లేశ్గౌడ్ సైక్లింగ్ యాత్ర పూర్తిచేసుకొని స్వస్థలానికి చేరుకొన్న యువకుడు 367 రోజుల పాటు..మల్లేశ్గౌడ్ 367 రోజులపాటు సుదీర్ఘంగా సైకిల్యాత్ర చేపట్టారు. మొదటి నుంచి ఫిట్నెస్పై మంచి అవగాహన ఉన్న మల్లేశ్గౌడ్ ఈ యాత్రలో ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా 18వేల కిలమీటర్ల యాత్రను పూర్తిచేశాడు. ప్రతిరోజూ పక్కా ప్రణాళికతో యాత్ర చేశారు. ఉదయం 8 గంటల నుంచి 11గంటల వరకు, మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు యాత్ర చేపట్టారు. ప్రతిరోజూ దాదాపు 90 నుంచి 100 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేశారు. పాలమూరులో ఘనస్వాగతం 18వేల కిలోమీటర్ల యాత్ర పూర్తి చేసుకొని ఈనెల 19వ తేదీన పాలమూరు నగరానికి చేరుకున్న మల్లేశ్గౌడ్ను పలువురు ఘనంగా స్వాగతం పలి కారు. జిల్లా కేంద్రంతోపాటు బోయపల్లిలో పలువురు పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. -
కొత్త అల్లుడికి 150 రకాల వంటలతో విందు
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని అత్తగారింటికి మొదటి సారి వచ్చిన అల్లుడికి మరిచిపోని ఆతిథ్యాన్ని ఇచ్చారు అత్తామామలు. ఒకట్రెండు కాదు.. ఏకంగా 150 రకాల తెలంగాణ వంటకాలను సిద్ధం చేయడంతో అల్లుడు ఆశ్చర్యానికి గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా పాన్గల్ మండలం రేమద్దుల గ్రామానికి చెందిన జాజాల తిరుపతయ్య, రేణుక దంపతుల కూతరు శిరీషను అదే గ్రామానికి చెందిన మహంకాళి రాముడు కుమారుడు మహంకాళి మహేష్కు ఇచ్చి ఇటీవల వివాహం జరిపించారు. ఈక్రమంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని అల్లుడు బుధవారం అత్తగారింటికి రాగా.. అతడికి 150 రకాల వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారు. వేపుళ్లు, పచ్చళ్లు. చట్నీళ్లు, పప్పులు, స్నాక్స్, స్వీట్స్, మటన్, చికెన్, బిర్యానీలను చూసి అల్లుడు ఆశ్చర్యానికి లోనయ్యాడు. తనపై అభిమానంతో ఏర్పాటు చేసిన విందు భోజనాన్ని ఆరగించి అత్తామామల ఆశీర్వాదం తీసుకున్నారు. – పాన్గల్ -
టెండర్లకు నేడే చివరి అవకాశం
● మద్యం దుకాణాలపై ఆసక్తి చూపనివ్యాపారులు ● చివరి రోజుపై ఆశలు పెట్టుకున్న ఎకై ్సజ్ అధికారులు మహబూబ్నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలోని మద్యం దుకాణాలకు టెండర్ల స్వీకరణకు కేవలం 24గంటల సమయం మాత్రమే మిగిలింది. ప్రభుత్వం మద్యం దుకాణాలకు టెండర్లు వేసేందుకు మరోసారి అవకాశం కల్పించినా వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. బుధవారం ఉమ్మడి జిల్లాలో 42 టెండర్లు మాత్రమే దాఖలయ్యాయి. గతంలో వచ్చిన టెండర్ల కంటే ఈ సారి పెంచాలని ఎకై ్సజ్ అధికారులు చేసిన ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాయి. ఇక ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో ఉన్న 227 ఏ–4 దుకాణాలకు 5,230 దరఖాస్తులు వచ్చాయి. గురువారం చివరి రోజు కావడంతో మరో 500 నుంచి 1000 టెండర్లు దాఖలు కావొచ్చని ఎకై ్సజ్ అధికారులు ఆశిస్తున్నారు. -
మయూర వాహనంపై కురుమూర్తిరాయుడు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు బుధవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేతుడైన కురుమూర్తిస్వామిని మయూర వాహనంపై కురుమూర్తి కొండల్లో ఊరేగించారు. పల్లకీలో ఉత్సవమూర్తులను ఆశీనులను చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించి, గోవింద నామస్మరణల మధ్య ఉద్దాల మండలం వరకు తీసుకొచ్చి.. తిరిగి ఆలయానికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ మధనేశ్వరెడ్డి, పాలకమండలి చైర్మన్ గోవర్ధన్రెడ్డి, భక్తులు పాల్గొన్నారు. – చిన్నచింతకుంట -
నిఘా అవసరం
చెక్పోస్టులను తొలగించడం వల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు ఎక్కువసేపు నిలిచే అవకాశం ఉండదు. ఇదే అదనుగా ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా జరగడానికి ఆస్కారం ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఏపీ, కర్ణాటక రాష్ట్రాలు సరిహద్దులుగా ఉండటంతో అక్రమ గోవుల తరలింపు, గంజాయి, మద్యం, కలప, ఇసుక ధాన్యాలు వంటి అక్రమ వ్యాపారాలకు అవకాశం కలుగుతుంది. ప్రభుత్వం రాష్ట్రంలో సన్న వడ్లకు బోనస్ ఇస్తోంది. ఈ సమయంలో ఆయా రాష్ట్రాల నుంచి దళారులు జిల్లాకు వడ్లను తీసుకొచ్చి విక్రయాలు చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికారులు నిఘా తీవ్రతరం చేసి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం చాలా ఉంటుంది. -
డీపీఓగా నిఖిలశ్రీ
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లా పంచాయతీ అధికారిగా నిఖిల శ్రీ నియమితులయ్యారు. ఈ మేరకు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్–1 ఫలితాల్లో ఈమె ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం డీపీఓగా విధులు నిర్వహిస్తున్న పార్థసారధిని బదిలీ చేస్తూ సపోర్టింగ్ ఆర్డర్ రాలేదని తెలుస్తోంది. మరో మూడు రోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. భూసేకరణకు రైతులు సహకరించాలి అడ్డాకుల: మండలంలోని ముత్యాలంపల్లి శివారులో ఉన్న రైల్వే ట్రాక్ను బుధవారం రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్, ఆర్డీఓ నవీన్ పరిశీలించారు. మహబూబ్నగర్ నుంచి డోన్ వరకు రైల్వే డబుల్ లైన్ పనుల నిమిత్తం చేయాల్సిన భూసేకరణపై ముత్యాలంపల్లి గ్రామానికి చెందిన రైతులతో అధికారులు మాట్లాడారు. రైల్వే ట్రాక్ వద్ద భూసేకరణకు సంబంధించిన అంశాలపై రెవెన్యూ అధికారులతో మాట్లాడి వివరాలపై అడిషనల్ కలెక్టర్ ఆరా తీశారు. ట్రాక్ సమీపంలో భూములు ఉన్న రైతులతో మాట్లాడి రైల్వే డబుల్ లైన్ పనుల కోసం భూసేకరణకు సహకరించాలని కోరారు. భూములు కోల్పోయే రైతులకు ప్రభుత్వ పరిహారం చెల్లిస్తుందని తెలిపారు. దీనికి రైతులు కూడా సమ్మతించి మార్కెట్లో ఉన్న ధర చెల్లించాలని కోరారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి రైతులకు నష్టం జరగకుండా తగిన పరిహారం అందేలా చూస్తామని అడిషనల్ కలెక్టర్ తెలిపారు. తహసీల్దార్ శేఖర్, గిర్దావర్ శశికిరణ్, సర్వేయర్ పార్వతమ్మ తదితరులు ఉన్నారు. మార్కెట్ కళకళ..ధాన్యం సీజన్ ప్రారంభం దేవరకద్ర/జడ్చర్ల: ధాన్యం సీజన్ ప్రారంభం కావడంతో వ్యవసాయ మార్కెట్ యార్డులు కళకళలాడుతున్నాయి. వానాకాలం పంట కింద సాగు చేసిన వరి కోత దశకు రావడంతో చాలామంది రైతులు కోతలు ప్రారంభించారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో వరి పంట రికార్డు స్థాయిలో సాగైంది. ఒక్క కోయిల్సాగర్ ఆయకట్టు కింద దాదాపు 40 వేల ఎకరాల వరి సాగుచేశారు. అలాగే చెరువులు, బావుల కింద అదనంగా వరి పంట వేశారు. దిగుబడులు కూడా బాగా వస్తుండడంతో మార్కెట్లో సీజన్ జోరుగా సాగే అవకాశం ఉంది. దేవరకద్ర మార్కెట్ యార్డులో బుధవారం జరిగిన టెండర్లలో ఆర్ఎన్ఆర్ ధాన్యం ధర క్వింటాల్కు గరిష్టంగా రూ.2,121, కనిష్టంగా రూ.2,079గా ధరలు లభించాయి. హంస ధాన్యం క్వింటాల్కు గరిష్టంగా రూ.1,803, కనిష్టంగా రూ.1,757గా ధరలు నమోదయ్యా యి. ఆముదాలు క్వింటాల్కు గరిష్టంగా రూ. 5,804, కనిష్టంగా రూ.5,779గా ధరలు పలికాయి. మార్కెట్కు రెండు వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. బాదేపల్లి మార్కెట్లో పత్తి క్వింటాల్కు గరిష్టంగా రూ.6,769, కనిష్టంగా రూ.6,521 ధరలు లభించాయి. మొక్క జొన్న గరిష్టంగా రూ.2,041, కనిష్టంగా రూ.1,600, వేరుశనగ రూ.4,331 ధరలు పలికాయి. మద్దతు ధరలు లభించేలా చర్యలు జడ్చర్ల: రైతులకు మద్దతు ధరలు లభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మార్కెట్ యార్డు చైర్పర్సన్ జ్యోతి తెలిపారు. బుధవారం మార్కెట్ యార్డు ఆవరణలో పత్తి కొనుగోళ్లను ప్రారంభించారు. ఇక ప్రతి బుధ, శనివారాల్లో బాదేపల్లి మార్కెట్ యార్డు ఆవరణలో పత్తి కొనుగోళ్లు జరుగుతాయన్నారు. రైతులు నాణ్యమై పత్తిని తీసుకొచ్చి మద్దతు ధరలు పొందాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అడిషనల్ డైరెక్టర్ ప్రసాదరావు, మున్సిపల్ చైర్పర్సన్ పుష్పలత, మార్కెట్ వైస్ చైర్మన్ రాజేందర్గౌడ్, శివకుమార్, నిత్యానందం, వెంకటయ్య, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘స్వచ్ఛత’ ప్రతి ఒక్కరి బాధ్యత
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని రైల్వేస్టేషన్, బస్స్టాండ్, తదితర ప్రాంతాల్లో పీయూ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు స్వచ్ఛతా కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయా పరిసర ప్రాంతాల్లో చెత్తను ఏరివేసి, పిచ్చిమొక్కలను తొలగించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ రీజినల్ డైరెక్టర్ సంజయ్కుమార్ మాట్లాడుతూ సమాజంలో స్వచ్ఛత విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మెలగాలని, ఎక్కడబడితే అక్కడ అక్కడ బహిరంగ ప్రదేశాల్లో చెత్తా చెదారం వేయకూడదన్నారు. ఇళ్ల వద్ద వెలువడిన తడి, పొడి చెత్తను వేర్వేరుగా కవర్లలో కట్టి కట్టి డంపింగ్ యార్డుకు పంపించడం వల్ల పర్యావరణానికి నష్టం జరగకుండా ఉంటుందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో నాటికల ద్వారా పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ పీయూ కోఆర్టినేటర్ ప్రవీణ, ప్రోగ్రాం అధికారులు అర్జున్కుమార్, గాలెన్న, రవికుమార్, ఈశ్వర్, రాఘవేందర్, శివకుమార్సింగ్, ఇమానియేల్ పాల్గొన్నారు. -
చెక్పోస్టులు ఎత్తేశారు!
పాలమూరు: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రంలో సరిహద్దులో ఉన్న ఆర్టీఏ చెక్పోస్టులు రద్దు చేస్తున్నట్లు, బుధవారం సాయంత్రం 5 గంటల నుంచే ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని అధికారులు ఆదేశాలిచ్చారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ సరిహద్దు కోసం ఏర్పాటు చేసిన జోగుళాంబ గద్వాల జిల్లా జల్లాపురం ఆర్టీఏ చెక్పోస్టు, కర్ణాటక కోసం నారాయణపేట జిల్లా కృష్ణా మండలం దగ్గర ఏర్పాటు చేసిన రెండు చెక్పోస్టులను ఎత్తేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. జీఎస్టీ అమల్లోకి వచ్చాక రాష్ట్రాల సరిహద్దుల్లో వస్తువుల తనిఖీ, పన్ను వసూళ్ల అవసరం తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో చెక్పోస్టులను తొలగించాలని రాష్ట్ర కేబినెట్ ఇటీవల నిర్ణయం తీసుకోగా ప్రస్తుతం అమల్లోకి వచ్చింది. ● జిల్లాలోని ఆర్టీఏ చెక్పోస్టులు అక్రమ వసూళ్లకు కేంద్రంగా మారాయని తాజాగా ఏసీబీ జరిపిన దాడుల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అధికారులు నేరుగా ముడుపులు తీసుకోకుండా ప్రైవేట్ ఏజెంట్లను నియమించుకుని మరీ లారీ డ్రైవర్ల ముక్కు పిండి వసూలు చేసినట్లు తనిఖీల్లో బహిర్గతమైంది. ఇటీవల కృష్ణా చెక్పోస్టులో ఏసీబీ బృందం దాడులు నిర్వహిస్తుండగానే మరోవైపు లారీ డ్రైవర్లు వచ్చి టేబుల్పై డబ్బులు పెట్టడాన్ని చూసి తనిఖీకి వచ్చిన ఏసీబీ అధికారులు అవాక్కయ్యారు. తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఇక నుంచి ముడుపుల వ్యవహారానికి తెరపడినట్లే. ఉమ్మడి జిల్లాలో అలంపూర్, కృష్ణా వద్ద చెక్పోస్టులు బుధవారం సాయంత్రం నుంచే మూసివేసినట్లు డీటీసీ ప్రకటన అధికారులు, సిబ్బందిని ఆర్టీఏ కార్యాలయాల్లో సర్దుబాటు -
కొత్త అల్లుడికి 150 రకాల వంటలతో విందు
వనపర్తి జిల్లా: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని అత్తగారింటికి మొదటి సారి వచ్చిన అల్లుడికి మరిచిపోని ఆతిథ్యాన్ని ఇచ్చారు అత్తామామలు. ఒకట్రెండు కాదు.. ఏకంగా 150 రకాల తెలంగాణ వంటకాలను సిద్ధం చేయడంతో అల్లుడు ఆశ్చర్యానికి గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా పాన్గల్ మండలం రేమద్దుల గ్రామానికి చెందిన జాజాల తిరుపతయ్య, రేణుక దంపతుల కూతరు శిరీషను అదే గ్రామానికి చెందిన మహంకాళి రాముడు కుమారుడు మహంకాళి మహేష్కు ఇచ్చి ఇటీవల వివాహం జరిపించారు.ఈక్రమంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని అల్లుడు బుధవారం అత్తగారింటికి రాగా.. అతడికి 150 రకాల వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారు. వేపుళ్లు, పచ్చళ్లు. చట్నీళ్లు, పప్పులు, స్నాక్స్, స్వీట్స్, మటన్, చికెన్, బిర్యానీలను చూసి అల్లుడు ఆశ్చర్యానికి లోనయ్యాడు. తనపై అభిమానంతో ఏర్పాటు చేసిన విందు భోజనాన్ని ఆరగించి అత్తామామల ఆశీర్వాదం తీసుకున్నారు. -
పెట్టుబడి కూడా వచ్చేలా లేదు..
అన్ని పంటలతో పోలిస్తే మిర్చికి పెట్టుబడి ఎక్కువ. కాలం కలిసొస్తే ఇబ్బందులు తీరుతాయనే ఆశతో నష్టం, లాభం చూడకుండా ప్రతి ఏటా మిర్చి సాగు చేస్తున్నా. పోయిన ఏడాది అనావృష్టితో దిగుబడి సరిగా రాలేదు. ధర కూడా లేకపోవడంతో చాలా నష్టపోయా. ఈ ఏడాదైనా కలిసిరాకపోతుందా అని 4 ఎకరాల్లో మిర్చి సాగు చేశా. ఇటీవల కురిసిన వర్షాలకు తెగుళ్లు సోకడంతో పెట్టుబడులు భారీగా పెట్టాల్సి వచ్చింది. పంట పూతకు వచ్చే సమయంలో వర్షాలు తగ్గకపోవడంతో పంట పూర్తిగా నాశనమైంది. ప్రభుత్వం ఆదుకోవాలి. – రాజశేఖర్, అయ్యవారిపల్లి, చిన్నంబావి, వనపర్తి అధిక వర్షాలతో తెగుళ్లు పెరిగాయి.. ఈసారి కురిసిన అధిక వర్షాలకు మిర్చి పంటలో మొదలు కుళ్లు (కాలర్ రాట్), విల్ట్ తెగులు వచ్చింది. ఎండు తెగులు(విల్ట్ తెగులు) నివారణకు కాపర్ ఆక్సి క్లోరైడ్ను లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి మొక్క మొదట్లో వేరు దగ్గర మందు నీళ్లు పోయాలి. ఈ సమయంలో బూడిద తెగులు కూడా ఎక్కువగా కనిపిస్తోంది. బూడిద తెగులు నివారణ కోసం అమిస్టార్ ఫంగిసైడ్ను లీటర్ నీటికి 1 ఎంఎల్ చొప్పున లేదా సాఫ్ ఫంగిసైడ్ను లీటర్కు 2 గ్రాముల చొప్పున కలుపుకుని పిచికారీ చేయాలి. – ఆదిశంకర్, శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం, పాలెం ● -
అమరవీరులను నిరంతరం స్మరించుకోవాలి
● డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ ● పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా వేడుకలు ● జిల్లాకేంద్రంలో శాంతి ర్యాలీ మహబూబ్నగర్ క్రైం: పోలీస్శాఖలో సేవ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన అమరవీరులు దేశానికి అందించిన అత్యున్నత సేవలకు చిహ్నం అవుతుందని జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవం సందర్భంగా మంగళవారం పరేడ్ మైదానంలో స్మృతి పరేడ్ నిర్వహించారు. మొదట డీఐజీ చౌహాన్తో పాటు ఎస్పీ డి.జానకి, అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ అమరవీరుల స్థూపం దగ్గర పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇద్దరు అమరవీరుల కుటుంబసభ్యులు సైతం కంటతడి మధ్య ఘనమైన నివాళులు అర్పించారు. అనంతరం ఎస్పీ డి.జానకి గతేడాది కాలంలో దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించి అమరులైన 191 మంది పోలీస్ అమరవీరుల పేర్లను చదివి వినిపించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ అమరుల త్యాగం వల్లే సమాజం శాంతియుతంగా సాగుతోందని, ప్రతి రోజు వారి సేవలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసులు అమరుల సేవలను గుర్తు చేసుకొని మరింత నిబద్ధతో పని చేయాలన్నారు. ఎస్పీ డి.జానకి మాట్లాడుతూ దేశానికి సేవ చేస్తూ ప్రాణత్యాగం చేసిన నిజమైన వీరులను స్మరించుకోవడం గొప్ప విషయమన్నారు. అమరుల త్యాగాలు ఎప్పటికీ మరిచిపోలేనిది అని వారి కుటుంబాలకు పోలీస్శాఖ ఎప్పుడూ తోడుగా ఉంటుందన్నారు. ● జిల్లాకు చెందిన రెండు అమరవీరుల కుటుంబసభ్యులతో డీఐజీ చౌహాన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కుటుంబసభ్యులకు ధైర్యం చెబుతూ సమస్యలు ఏమైనా ఉన్నాయా? పోలీస్శాఖ నుంచి రావాల్సిన సంక్షేమ ఫలాలపై ఆరా తీశారు. శాంతి ర్యాలీ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శాంతి ర్యాలీని డీఐజీ ప్రారంభించారు. అమరవీరుల కుటుంబసభ్యులతో పాటు డీఐజీ, ఎస్పీలు ర్యాలీలో పాల్గొన్నారు. పాత బస్టాండ్, క్లాక్టవర్, రాంమందిర్ చౌరస్తా, వన్టౌన్ కూడలి వరకు నిర్వహించారు. అనంతరం అక్కడ దివంగత ఎస్పీ పరదేశినాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎన్బీ రత్నం, సురేష్కుమార్, జైలు సూపరింటెండెంట్ వెంకటేశం, మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్కుమార్రెడ్డి, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
విద్యుత్ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): విద్యుత్ సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వద్దని ట్రాన్స్కో ఎస్ఈ పీవీ రమేష్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లాకేంద్రంలోని హనుమాన్ పుర ప్రాంతంలో ఎస్ఈ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రతి మంగళ, గురు, శనివారాల్లో ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్థానిక ప్రజలతో మాట్లాడి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకోవడానికే ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో తలెత్తే విద్యుత్ సమస్యలను తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. పాత స్తంభాలు, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ స్తంభాలు, లూజ్ వైర్లు, లో ఓల్టేజీ లాంటి సమస్యలను ప్రజలు తమ దృష్టికి తెచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డీఈ లక్ష్మన్నాయక్, మహబూబ్నగర్ టౌన్ ఏడీ థావుర్యనాయక్, ఏఈలు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్లో వేగం పెంచాలి
● నిర్మాణాలు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి ● కలెక్టర్ విజయేందిర బోయి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్, నిర్మాణం త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏపీఓలతో ఏర్పాటు చేసిన వెబ్ఎక్స్ సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా ఎన్ని గ్రౌండింగ్ లెవెల్లో ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా ఇల్లు మార్కింగ్ చేసుకోకుండా కట్టుకోవడానికి సిద్ధంగా లేకుంటే వారి నుంచి డిక్లరేషన్ తీసుకొని వారి దరఖాస్తును రద్దు చేసి, మరొకరికి మంజూరు చేయాలని సూచించారు. ఉపాధి హామీ పనులపై వచ్చిన మార్గదర్శకాలు పాటించాలని, ఈ కేవైసీ త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. జలశక్తి–జలాభియాన్ డేటాను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నారు. సోషల్ ఆడిట్కి సంబంధించి అన్ని రికవరీలు, జరిమానాలపై దృష్టిసారించి, వాటిని త్వరితగతిన పూర్తి చేసేలా చూడాలని, గ్రామ పంచాయతీ, అంగన్వాడీ భవనాలు మంజూరు చేసిన వాటిని నిర్మాణం త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మహిళా స్వయం సహాయక సంఘాలు బ్యాంకు లింకేజీలు, సీ్త్ర నిధి రుణాలు లక్ష్యం పూర్తి చేయాలన్నారు. అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డీఆర్డీఓ నరసింహులు, జెడ్పీ సీఈఓ వెంకట్రెడ్డి, హౌసింగ్ పీడీ వైద్యం భాస్కర్, డీపీఓ పార్థసారథి, మత్స్య శాఖ ఏడీ రాధా రోహిణి, ఏపీడీలు శారద, ముషాయిర, తదితరులు పాల్గొన్నారు. ‘సిటిజన్ సర్వే’లో అందరూ పాల్గొనాలి రాష్ట్ర భవిష్యత్ రూపకల్పన కోసం ఉద్దేశించిన ‘తెలంగాణ రైజింగ్– 2047’ సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని కలెక్టర్ విజయేందరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గత వారం ప్రారంభించిన ఈ సర్వే ఈనెల 25 వ తేదీతో ముగుస్తుందని, ఈ సర్వే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉన్నందున www.telangana.gov.in/tela nganarising అనే వెబ్సైట్ను సందర్శించి తమ అమూల్యమైన సలహాలు, సూచనలను అందించాలని కోరారు. నగరంలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు మహబూబ్నగర పాలక సంస్థ పరిధిలో ప్రజలకు ఇబ్బంది కాకుండా తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో కార్పొరేషన్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాగునీటి సరఫరా పైపులైన్లు పగిలిన వాటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయడంపై చర్చించారు. తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు, విద్యుత్ సరఫరాలో సమస్యలు లేకుండా ఎస్పీడీసీఎల్ఎస్ఈ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మున్సిపల్ డీఈ, ఏఈలు ప్రతిరోజు నీటి సరఫరాపై పర్యవేక్షణ చేయాలని సూచించారు. సమావేశంలో మిషన్ భగీరథ ఎస్ఈ జగన్మోహన్, గ్రిడ్ ఈఈ శ్రీనివాస్, నగర పాలక కమిషనర్ ప్రవీణ్కుమార్రెడ్డి, ట్రాన్స్ కో ఎస్ఈ రమేష్, మున్సిపల్ డీఈ విజయ్కుమార్ పాల్గొన్నారు. -
కురుమూర్తికి తరలివచ్చిన భక్తులు
చిన్నచింతకుంట: పేదల తిరుపతిగా విరాజిల్లుతున్న అమ్మాపురం కురుమూర్తి స్వామి దర్శనానికి మంగళవారం అమావాస్యను పురస్కరించుకొని భకు ్తలు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఆలయ అర్చకులు ఆలయాన్ని శుద్ధి చేసి సుప్రభాత సేవ అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఉదయం నుంచే ఉమ్మడి పాలమూరు జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి క్యూలైన్లో నిల్చున్నారు. మెట్లపై దీపాలు వెలిగిస్తూ గోవింద నామస్మరణ చేశారు. మెట్టుమెట్టుకు కొబ్బరి కాయలు కొట్టి స్వామి చెంతకు చేరారు. కొందరు భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కొండ దిగువన మట్టికుండలో పచ్చిపులుసు అన్నం నైవేద్యంగా తయారు చేసి స్వామికి సమర్పించారు. అనంతరం కొండపైన అలివేలు మంగమ్మ, చెన్నకేశవస్వామి, ఆంజనేయస్వామి, ఉద్దాల మండపాన్ని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా భక్తుల రద్దీతో కనిపించింది. భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి ఇబ్బంది కలుగ కుండా ఆలయ చైర్మన్ గోవర్ధన్రెడ్డి, ఈఓ మదనేశ్వర్రెడ్డి, కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లులు, భారతమ్మ, నాగరాజు, భాస్కర చారి ఏర్పాట్లను పరిశీలించారు. -
రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య
మానవపాడు: రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమ వారం మండలంలో చోటు చేసుకుంది. హెడ్కానిస్టేబుల్ అశోక్కుమార్ తెలిపిన వివరాల మేరకు.. మా నవపాడుకు చెందిన ఆంద్రిచెట్టు ఆనంద్ (26) ట్రాక్టర్ డ్రైవర్గా జీవనం కొనసాగించేవాడు. అయితే తరచూ మూర్చ వస్తుండడంతో మాన సికంగా బాధపడుతూ ఉండేవాడు. అనేక ఆస్ప త్రులలో చూపించినప్పటికీ నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది సోమవారం రాత్రి మానవపాడు రైల్వేస్టేషన్ సమీపంలో ట్రైన్ కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచరం రావడంతో రైల్వే పోలీసులు ఘట నా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అశోక్కు భార్య కౌసల్య, 2 నెలల బాబు ఉన్నాడు. వాహనం ఢీ.. వ్యక్తి మృతి అయిజ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘ టన మండలంలో సోమ వారం జరిగింది. అయిజ పట్టణానికి చెందిన మాల వీరేష్ (34) స్కూల్ బస్సు డ్రైవర్గా కుటుంబాన్ని పోషించేవాడు. సోమవారం రాత్రి పనినిమిత్తం ద్విచక్ర వాహనంపై గద్వాల వెళ్తుండగా మండలంలోని బింగుదొడ్డి గ్రామ శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో వీరేష్కు గాయాలు కాగా స్థానికులు 108కు సమాచారం అందించగా అంబులెన్స్లో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చని పోయాడు. వీరేష్కు భార్య, కూతురు ఉండగా తోటి స్కూల్ బస్సు డ్రైవర్లు తమ వంతుగా కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పిడుగుపాటుకు రైతు బలి రాజోళి: మండలంలోని ముండ్లదిన్నెలో మంగళవా రం పిడుగుపాటుకు రైతు మృతిచెందిన ఘటన చో టుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు కుర్వ మద్దిలేటి(42) రోజువారీగా మంగళవారం కూడా తన పొలానికి వెళ్లాడు. మధ్యాహ్నం కురిసిన వర్షానికి పిడుగు పడటంతో రైతు అక్కడిక్కడే కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు గమనించి ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేసినప్పటికీ అప్పటికే మృతిచెందాడు. మృతుడికి భార్య జ్యోతి, కూతురు, కుమారుడు ఉన్నారు. పురుగుల మందు తాగి బలవన్మరణం బిజినేపల్లి: అంగోతు పరెంగ (80) అనే వృద్ధుడు సో మవారం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని కీమ్యాతాండ గ్రా మ పంచాయతీ కేతరబండ తండా పరిధిలో జరిగింది. అంగోతు పరెంగ భార్య కొన్నేళ్ల కిందట చనిపోయింది. పరెంగకు ఎనిమిది మంది కుమారులు ఉన్నా ఎవరు పట్టించుకోకపోవడంతో కొద్ది కాలంగా మనస్థాపానికి గురయ్యాడు. తండాలోని అందరూ సంతోషంగా పండుగ చేసుకుంటుంటే తనను ఎవరు పట్టించుకోకపోవడంతో మనోవేదనకులోనై పురుగు మందు తాగాడు. చుట్టుపక్కల వారు గమనించి అంబులెన్స్లో ఆస్పత్రిగా తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి ఎర్రవల్లి: పురుగుల మందు తాగి వ్యక్తి మృతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన కోదండాపురం పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ మురళి కథనం మేరకు.. మండల పరిధిలోని వల్లూరు గ్రామానికి చెందిన ఈడిగ శ్రీనివాసులు (55) వ్యవసాయంలో నష్టాలు రావడంతో మనస్థాపానికి గురై తాగుడుకు బానిసయ్యాడు. ఈ క్రమంలో సోమవారం పొలానికి వెళ్లి పురుగు మందు తాగాడు. గమనించిన స్థానికులు కర్నూల్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్యతో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మృతుడి సోదరుని కుమారుడు రాజగోపాల్గౌడ్ ఫిర్యాదు మేరకు మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. లారీ, టిప్పర్ ఢీ : డ్రైవర్ మృతి రాజాపూర్: మండలంలోని జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. తమిళనాడుకు చెందిన గోవింద్ (43) లారీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. సోమవారం కేరళ నుంచి హైదరాబాద్కు లారీలో లోడ్తో వెళ్తుండగా.. టిప్పర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. గోవింద్ కుమారుడు కౌషిక్ ఫిర్యాదు మేరకు మంగళవారం టిప్పర్ డ్రైవర్ కావలి కుమార్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవం
● నేటినుంచి కురుమూర్తిస్వామి జాతర ప్రారంభం ● 26న అలంకారోత్సవం, 28న ఉద్దాల ఉత్సవం ● ఏర్పాట్లు పూర్తిచేసిన అధికార యంత్రాంగం చిన్నిచింతకుంట: తెలంగాణ ప్రజల ఆరాధ్యదైవమై న అమ్మపూరం కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవా లు ఈనెల 22వ తేదీ నుంచి అంగరంగా వైభవంగా కొనసాగనున్నాయి. అమావాస్య పాడ్యమిని పురస్కరించుకొని స్వామివారి బ్రహ్మోత్సవాలు ఏడు రోజులపాటు అంగరంగ వైభవంగా కొనసాగుతా యి. వీటితోపాటు జాతర ఉత్సవాలు నెలరోజుల పాటు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు తెలంగాణ ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా తదితర రా ష్టాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. దాదాపు పదిలక్షల మంది భక్తులు హాజరుకానున్నట్లు ఆలయ అధికారులు అంచనాలు వేస్తున్నారు. దీంతో నెలరోజులపాటు కాంఛన గుహ గోవింద నామస్మరణలతో మారు మోగుతుంది. బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు స్వామివారి బ్రహ్మోత్సవాలకు అధికారులు అన్నిఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ ప్రాగణమంతా రంగులు అద్దారు. అర్చకులు స్వామివారు విహరించే వాహనసేవా కార్యక్రమాల వస్తువులను శుద్ధి చేసి సిద్ధం చేశారు. స్వామివారి ప్రధాన ఆలయం, అమ్మవారి ఆలయం, రాజగోపురం తదితర వాటిని విద్యుత్ దీపాలతో అలంకరించారు. అక్కడక్కడా హైమాస్ట్ లైట్లతోపాటు వీధిదీపాలు ఏర్పాటు చేశారు. విద్యుత్ అంతరాయం కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జాతర మైదానంలో ఉన్న తాగునీటి ట్యాంకులు శుభ్రపరిచారు. కొళాయిలు ఏర్పాటు చేసి తాగునీటిని అందించనున్నారు. జాతర ప్రాగణంలో పారిశుద్ధ్యం లోపించకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళలకు ఇబ్బందులు కలుగకుండా మరుగుదొడ్డు నిర్మించి అక్కడక్కడా తాత్కాలిక మూత్రశాలు ఏర్పాటు చేసేవిధంగా చర్యలు చేపడుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఆలయ ముఖద్వారం నుంచి ఉద్దాల గుండువరకు భారీకేడ్లు ఏర్పాటు చేసి జాతర ప్రాగణంలో సీసీ కెమరాలు అమర్చనున్నారు. 26న అలంకారోత్సవం కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన మైన ఘట్టం అలంకారోత్సవం. ముక్కెర వంశపురాజులు బహూకరించిన ఆభరణాలను నెలరోజులపాటు స్వామివారికి అలకంచడం ఈ ఉత్సవ ప్రత్యేకత వనపర్తి జిల్లా ఆత్మకూర్లోని ఎస్బీఐ లాకర్లో భద్రపరిచిన స్వామివారి బంగారు ఆభరణాలను పోలీస్ బందోబస్తు మధ్య కొత్తపల్లి, దుప్పల్లి మీదుగా అమ్మాపురం సంస్థానదీసులు రాజశ్రీరాంభూపాల్ ఇంటికి చేరుస్తారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి అంబోరు మధ్యన కాలినడకతో కురుమూర్తి గిరులకు తరలిస్తారు. కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. 28న ఉద్దాల ఉత్సవం స్వామివారి ఉత్సవాల్లో ఉద్దాల ఉత్సవం ప్రత్యేక ఘట్టం. చిన్న వడ్డేమాన్లో దళితులు వారం రోజులపాటు భక్తిశ్రద్ధలతో తయారు చేసిన పాదుకలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అప్పంపల్లి, తిర్మలాపూర్ మీదుగా ఊరేగింపుగా కురుమూర్తి గిరులకు తరలిస్తారు. ఈ ఊరేగింపులో శివసత్తుల ఆటపాటలు, గోవింద నామస్మరణ మార్మోగుతాయి. ఈ ఉత్సవానికి లక్షలాది మంది భక్తులు హాజరవుతారు. ● 22న బుధవారం ధ్వజారోహణం, దేవత ఆహ్వానం, భేరీపూజ, అష్టోత్తర శత కలశాభిషేకం, స్వామివారి కల్యాణో త్సవం, మహానివేదన, మంగళ నిరాజనం సాయంత్రం 6:15గంటలకు భూసమేత స్వామివారి మయూర వాహనసేవ నిర్వహించనున్నారు. ● 23న గురువారం ఉదయం హోమ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాయంత్రం 6:20 గంటలకు హంసవాహన సేవ. ● 24న శుక్రవారం సాయంత్రం 6:25 గంటలకు శేషవాహన సేవ. ● 25న శనివారం సాయత్రం 6:30 గంటలకు గజ వాహన సేవ. ● 26 ఆదివారం మధ్యాహ్నం స్వర్ణాభరణా లతో ఊరేగింపు అలంకారోత్సవం, రాత్రి 9:45 గంటలకు అశ్వవాహన సేవ. ● 27న సోమవారం రాత్రి 10 గంటలకు హనుమద్వాహన సేవ. ● 28న మంగళవారం ఉద్దాల ఉత్సవం, రాత్రి 10:15గంటలకు గరుడవాహన సేవ ● 29న బుధవారం పుష్పయాగం, ప్రత్యేక పూజలు. ● 30న గురువారం ప్రత్యేక పూజలు ● 7న శుక్రవారం ఉదయం 9:45గంటలకు అలంకరణ ఆభరణాలు తీస్తారు. అనంతరం జాతర ఉత్సవాలు కొనసాగుతాయి. కోనేరువిద్యుద్దీపాలతో ప్రవేశ ద్వారంరోజువారీ కార్యక్రమాలు -
దక్షిణకాశీలో అమావాస్య పూజలు
● ‘జోగుళాంబ’ఆలయంలో చండీ హోమాలు ● స్వామివారికి అభిషేక పూజలు అలంపూర్: దక్షిణ కాశీగా వెలుగొందుతున్న అలంపూర్ క్షేత్రంలో మంగళవారం అమావాస్య పూ జలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో క్షేత్రానికి తరలివచ్చారు. శ్రీజోగుళాంబ అమ్మ వారి ఆలయంలో చండీ హోమాలు ని ర్వహించారు. ప్రతి అమావాస్య, పౌర్ణమితో పాటు శుక్రవారం అమ్మవారి ఆలయంలో సాముహిక చండీ హోమాలు నిర్వహించడం ఆనవాయితీ. శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకాలు, అర్చన పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో భక్తులు కుంకుమార్చన పూజలు చేశారు. భక్తులకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం పలికారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణాలు భక్తులతో సందడిగా మారాయి. క్షేత్రానికి వచ్చిన భక్తులకు ప్రసాద్ స్కీం భవనంలోని నిత్య అన్నదాన సత్రంలో అన్నప్రసాదం అందించారు. -
తిప్పేసిన ముఖితుద్దీన్
● నిజాం కళాశాలపై సంచలన బౌలింగ్ ● ఏడు పరుగులకే 8 వికెట్లు తీసిన స్పిన్నర్ ● మహబూబ్నగర్ ఘన విజయం మహబూబ్నగర్ క్రీడలు: హెచ్సీఏ రెండు రోజుల లీగ్లో సంచలన బౌలింగ్తో సత్తా చాటాడు. నిజాం కళాశాల జట్టుతో జరిగిన మ్యాచ్లో మహబూబ్నగర్ జట్టు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఎండీ ముఖితుద్దీన్ 9.5 ఓవర్లలో కేవలం 7 పరుగులు ఇచ్చి 8 వికెట్లు తీసి రెండు రోజుల లీగ్లో జిల్లా తరఫున అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శించాడు. ఆరుగురు బ్యాట్స్మెన్ను డకౌట్గా ఔట్ చేశారు. హైదరాబాద్లోని గ్రీన్వ్యూ–3 మైదానంలో మంగళవారం నిజాం కళాశాల జట్టుతో జరిగిన లీగ్ మ్యాచ్లో మహబూబ్నగర్ జిల్లా జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన నిజాం కళాశాల జట్టు జిల్లా బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లను కోల్పోయింది. ముఖితుద్దీన స్పిన్ జోరుకు 31.5 ఓవర్లలో కేవలం 55 పరుగులకే కుప్పకూలింది. స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన జిల్లా జట్టు 12 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. అబ్దుల్ రాఫె 23 నాటౌట్, కొండ శ్రీకాంత్ 23 పరుగులు చేశారు. 8 వికెట్లు తీసిన ముఖితుద్దీన్తో పాటు జిల్లా జట్టును ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ అభినందించారు. భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. -
ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు పీయూ జట్టు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పంజాబ్లోని గురుకాసి యూనివర్సిటీ ఈనెల 24న నిర్వహించే సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ టౌర్నీలో పాల్గొనేందుకు ఆర్చరీ పురుషుల జట్టు మంగళవారం ప్రయాణమైంది. ఈ మేరకు జట్టు సభ్యులను పీయూ వీసీ శ్రీనివాస్ అభినందిచి, క్రీడా దుస్తులు అందజేశారు. విద్యార్థులు పూర్తిస్థాయిలో తమ ప్రతిభను చూపి పీయూకు గోల్డ్మెడల్ సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేశ్బాబు, అధ్యాపకులు కిషోర్, పీడీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
బల్మూర్: మండలంలోని మహాదేవ్పూర్ శివారులో ని వ్యవసాయ పొలంలో అనుమా నాస్పద స్థితి లో ఓ యువకుడి మృతదే హం మంగళవారం గుర్తించినట్లు ఎస్ఐ రా జేందర్ తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం.. మండలంలోని జిన్కుంటకు చెందిన మదన మోని సైదులు(25)కు అచ్చంపేట మండలం పల్కపల్లికి చెందిన మంజులతో వివాహమైంది. వారికి ఇద్దరు సంతానం. సైదులు పల్కపల్లిలోని అత్తాగారింట్లో భార్యాపిల్లలతో కాపురం ఉంటున్నాడు. ఈ క్రమంలో ఈనెల 16న భార్యాభర్తల మధ్య బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం విడిపించే విషయంలో ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో సైదులు ఆరోజు ఇంట్లో నుంచి వెళ్లి కనిపించకుండాపోయాడు. భార్య మంజుల అచ్చంపేట పోలీస్స్టేషల్లో తన భర్త కనిపించడం లేదని ఫిర్యారు చేసింది. మహదే్పూర్ శివారులోని చెట్లపొదల్లో మంగళవారం పశువుల కాపరులు గుర్తించలేని స్థితిలో కుళ్లిపోయిన మృతదేహాన్ని గమనించి కుటంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికెళ్లి పరిశీలించగా.. మృతదేహం వద్ద బైక్, ఫోన్తోపాటు పురుగుల మందు డబ్బ, చెట్లు షర్టు కట్టి ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. కాని తమ కుమారుడి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ మృతుడి తల్లి బాలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. -
వందనం
వీరులారా.. ● ఉమ్మడి జిల్లాలో అమరులైన 39 మంది పోలీసులు ● సమాజ రక్షణ కోసం ప్రాణత్యాగం ● బాధిత కుటుంబాలకు అండగా పోలీస్ శాఖ ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు ● రేపు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలో అమరవీరుల స్తూపం శాంతిభద్రతల పరిరక్షణ కోసం నక్సలైట్ల కాల్పుల్లో మృతిచెందిన కుటుంబాలకు ప్రభుత్వం గతంలో ఎక్స్గ్రేషియా చెల్లించేది కాదు. అయితే 1997లో లక్ష్మాపూర్ ఘటనలో మృతి చెందిన వారిని పరామర్శించేందుకు అప్పటి హోంమంత్రి మాధవరెడ్డి మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రికి వచ్చారు. ఈ క్రమంలో పోలీస్ కుటుంబాలు మంత్రి దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి రూ.1.50 లక్షలు అమరవీరుల కుటుంబ సభ్యులకు ఇచ్చేలా ఎస్పీకి అధికారం కల్పించగా.. ఇప్పటికీ కొనసాగుతూ వస్తోంది. ప్రస్తుతం ఈ ఎక్స్గ్రేషియా రూ.10 లక్షలకు పెంచారు. అలాగే ఒక ప్లాటు, రైల్వే ప్రయాణం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తున్నారు. విధి నిర్వహణలో అమరులైన పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులకు మహబూబ్నగర్లోని హౌసింగ్బోర్డు కాలనీ సమీపంలో ఇళ్ల స్థలాలు కేటాయించారు. మహబూబ్నగర్ క్రైం/ కొల్లాపూర్: విధి నిర్వహణలో అసువులు బాసినవీరులు వారు.. ఉగ్రవాదుల నుంచి దేశాన్ని రక్షించే క్రమంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయని నిర్భయులు.. ఎక్కడ బాంబు పేలినా.. ఎక్కడ తుపాకులు గర్జించినా.. వెనకా ముందు చూడకుండా దూసుకుపోతారు.. శత్రువులతో జరిగే పోరాటంలో తుదిశ్వాస వరకు పోరాడుతారు. అలాంటి పోరాటాల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల జ్ఞాపకాలు పదికాలాలపాటు పదిలంగా దాచే ప్రయత్నం చేస్తోంది పోలీస్ శాఖ. ఏటా ఒకరోజు వారిని స్మరించుకునే ఏర్పాట్లు చేసింది. కర్తవ్య నిర్వహణలో వెన్నుచూపని ఆ ధీరులను స్మరించుకోవడానికి ప్రతిఏటా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినోత్సవం చేపడుతారు. ఈ క్రమంలోనే మంగళవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. అమరవీరుల కుటుంబ సభ్యులను కేవలం అమరవీరుల సంస్మరణ దినోత్సవం రోజు కాకుండా ఎప్పుడు సమస్య వస్తే అప్పుడు ఆదుకోవడానికి శాఖ సిద్ధంగా ఉంటుంది. వారికి ఇవ్వాల్సిన ఇళ్ల పట్టాల విషయంలో ఉన్న పెండింగ్ పనులు పూర్తిచేసి అందజేయడం జరిగింది. వారి కుటుంబ సమస్యలతోపాటు పిల్లల చదువులకు సంబంధించిన విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. జిల్లాలో రెండు అమరవీరుల కుటుంబాలు ఉన్నాయి. – జానకి, ఎస్పీ, మహబూబ్నగర్ ●ఉమ్మడి పాలమూరులో మావోయిస్టుల తూటాలకు ఇప్పటి వరకు 39 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. 1990లో కోడేరు మండలం తుర్కదిన్నె వద్ద ఎమ్మెల్యే ఇంటిపై మావోయిస్టులు దాడి చేసిన ఘటనలో ప్రభాకర్ అనే కానిస్టేబుల్ బలయ్యాడు. 1991లో వంగూరు పోలీస్స్టేషన్పై దాడి చేయగా ఖాజాపాషా అనే కానిస్టేబుల్ మృతిచెందాడు. అదే ఏడాది కొల్లాపూర్లోని ఓ హోటల్లో ప్రభాకర్ అనే కానిస్టేబుల్ భోజనం చేస్తుండగా నక్సలైట్లు కాల్చి చంపారు. 1993లో కొల్లాపూర్ మండలం సోమశిల వద్ద అప్పటి మహబూబ్నగర్ ఎస్పీ పరదేశినాయుడు, సిబ్బందితో కలిసి బస్సులో వెళ్తున్న సమయంలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ దుర్ఘటనలో ఎస్పీతోపాటు ఇద్దరు ఎస్ఐలు కిషోర్కుమార్, శివప్రసాద్, హెడ్కానిస్టేబుల్ రంగారెడ్డి, కానిస్టేబుళ్లు సుభాణ్, జహబ్ ఇక్బాల్, జయరాం, వైవీఎస్ ప్రసాద్ అక్కడికక్కడే మృతిచెందారు. 1994లో తలకొండపల్లి పోలీస్స్టేషన్పై మావోయిస్టులు జరిపిన దాడులో ఫయోద్దీన్ అనే కానిస్టేబుల్ మృతిచెందాడు. 1996లో కొల్లాపూర్ మండలం కుడికిళ్లలో ఎన్నికల విధుల్లో ఉన్న కానిస్టేబుల్ మురళీధర్రెడ్డిని నక్సల్స్ కాల్చిచంపారు. 1997లో బల్మూర్లో పరీక్షల బందోబస్తు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ చంద్రశేఖర్ నక్సల్స్ తూటాలకు బలయ్యాడు. అదే ఏడాదిలో అమ్రాబాద్ పరిధి లక్ష్మాపూర్ నుంచి ట్రాక్టర్లో వెళ్తున్న ఎస్ఐ మాల్సూర్, కానిస్టేబుళ్లు నాగేశ్వరుడు, జగదీశ్వర్రెడ్డి, మారెప్ప, శంకరయ్య మందుపాతరలకు బలయ్యారు. అదే ఏడాదిలో అమ్రాబాద్ వద్ద పోలీసులు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మహబూబ్ అలీఖాన్ అనే కానిస్టేబుల్ మరణించాడు. 1999లో వీపనగండ్ల వద్ద నక్సల్స్ పేల్చిన మందుపాతరకు ఎస్ఐ భాస్కర్రెడ్డి, కానిస్టేబుళ్లు ఆంజనేయులు, గోపాల్ బలయ్యారు. 2000 ఏడాదిలో కానిస్టేబుల్ హన్మనాయక్ను హతమార్చారు. 2001లో హోంగార్డు శ్రీనివాసరాజును అచ్చంపేట పరిధిలోని ఎదిరలో మావోయిస్టులు హతమార్చారు. అదే ఏడాదిలో ఆమనగల్ సమీపంలోని కాటన్మిల్లు వద్ద జరిగిన ప్రమాదాన్ని తెలుసుకునేందుకు వెళ్లిన ఎస్ఐ హన్మంతురెడ్డిని నక్సలైట్లు కాల్చిచంపారు. 2002లో మన్ననూర్ పండరీ అనే కానిస్టేబుల్ చంపేశారు. 2004లో కొల్లాపూర్ ఎమ్మెల్యే గన్మెన్గా ఉన్న హుమ్లానాయక్, వెంకట్రెడ్డిలను తుపాకీతో కాల్చిచంపారు. అదే ఏడాది అడ్డాకుల ఎంపీపీ కందూరు నారాయణ గన్మేన్ సుగుణాకర్ను కాల్చిచంపారు. 2005లో బాలానగర్ ఎస్ఐని హతమార్చేందుకు మావోయిస్టులు రెక్కీ నిర్వహించి.. చివరకు ప్రకాష్ అనే కానిస్టేబుల్ కాల్చారు. ఇదే ఏడాదిలో అచ్చంపేట పోలీస్స్టేషన్ ఎదుట నిల్చొని ఉన్న హెడ్కానిస్టేబుల్ లక్ష్మయ్య, కానిస్టేబుల్ శేఖర్నాయక్లను మావోయిస్టులు కాల్చిచంపారు. నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి గన్మెన్ రాజారెడ్డి నక్సల్స్ తూటాలకు బలయ్యారు. అలాగే చిన్నచింతకుంట ఎస్ఐ అహ్మద్ మోహియుద్దీన్ను పోలీస్స్టేషన్ ఎదుటే పట్టపగలు కాల్చిచంపారు. 2006లో కొండనాగులలో జహంగీర్ అనే హెడ్కానిస్టేబుల్, అదే ఏడాది కూంబింగ్ నిర్వహిస్తున్న జోష్బాబు అనే గ్రేహౌండ్ కానిస్టేబుల్ను అత్యంత దారుణంగా హతమార్చారు. అదే ఏడాది కొల్లాపూర్ పరిధిలోని సింగోటం వద్ద రమేష్ అనే కానిస్టేబుల్ మావోల తూటాలకు బలయ్యాడు. -
ఉత్సాహంగా యోగాసన క్రీడా ఎంపికలు
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఆదివారం ఉమ్మడి జిల్లా యోగాసన క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్ మాట్లాడుతూ నిరంతరం యోగా సాధన చేయడం వల్ల ఎలాంటి రోగాలు దరిచేరవన్నారు. యోగా రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు ప్రతిభచాటాలని కోరారు. ఉమ్మడి జిల్లా యోగాసన క్రీడా సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్.బాల్రాజు మాట్లాడుతూ ఎంపికలకు ఉమ్మడి జిల్లా నుంచి 130 మంది క్రీడాకారులు హాజరయ్యారని, ఎంపికై న వారు త్వరలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ జిల్లా మాజీ కార్యదర్శి శ్రీనివాసులు, శరణ్య, మణికంఠ, పవన్కుమార్, కె.వెంకటేశ్ పాల్గొన్నారు. కిక్బాక్సింగ్ లీగ్లో ప్రతిభ మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో శనివారం రాత్రి వరకు జిల్లా స్పోర్ట్స్ కిక్బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అస్మితా ఖేలో ఇండియా వుమెన్స్ కిక్బాక్సింగ్ సిటీ లీగ్లో జిల్లా క్రీడాకారిణులు ప్రతిభచాటారు. పాయింట్ ఫైట్, లైట్, మ్యూజికల్ ఫాం విభాగాల్లో పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో మహబూబ్నగర్ జిల్లా క్రీడాకారిణులు 57 పతకాలు సాధించారు. ఇందులో 31 బంగారు పతకాలు, 15 రజతం, 11 కాంస్య పతకా లు సాధించి లీగ్లో అగ్రస్థానంలో నిలిచి సత్తాచాటారు. క్రీడాకారిణులు ప్రతిభ చాటి పతకాలు సాధించడంపై జిల్లా స్పోర్ట్స్ కిక్బాక్సింగ్ అసోసియేషన్ అధ్య క్షులు కె.రవికుమార్, ప్రధాన కార్యదర్శి రవినాయక్లు అభినందించారు. ప్రథ మ స్థానంలో నిలిచిన వారు త్వరలో జరిగే జోనల్ సెలక్షన్స్కు ఎంపికవుతారని తెలిపారు. జోనల్ సెలక్షన్స్లో పతకాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. -
మళ్లీ తాగునీటికి కటకట
జిల్లాకేంద్రంలోని హౌసింగ్బోర్డు కాలనీలో ట్యాంకర్ల ద్వారా తాగునీరు పట్టుకుంటున్న ప్రజలు జడ్చర్ల పరిధిలోని నాగసాల వద్ద మిషన్ భగీరథ పథకం మెయిన్ పైపులైన్కు మరమ్మతు చేస్తుండటంతో జిల్లాకేంద్రంలోని 35 శాతం ప్రాంతాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆరు రోజులుగా నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యామ్నాయ చర్యలలో భాగంగా మున్సిపల్ అధికారులు నిత్యం 20 ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తుండటంతో కొంత ఊరట కలిగింది. ధర్మాపూర్ వద్ద మరోసారి మిషన్ భగీరథ పైపులైన్కు ఆదివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో లీకేజీ ఏర్పడింది. దీన్ని మరమ్మతు చేయడానికి అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. దీంతో నగరంలో మంగళవారం నుంచి తాగునీటి సరఫరా పునరుద్ధరిస్తామని కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్కుమార్రెడ్డి తెలిపారు. – మహబూబ్నగర్ మున్సిపాలిటీ -
స్కూటీపై వచ్చి.. కోడిపుంజు అపహరించి
జడ్చర్ల: స్కూటీపై వచ్చిన ఇద్దరు యువకులు ఇంటి ముందు ఉన్న ఓ కోడిపుంజును అపహరించుకెళ్లారు. విషయం తెలుసుకున్న కోడి యజమాని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో.. విచారించిన పోలీసులు ఎట్టకేలకు దొంగలను గుర్తించి వారి వద్ద నుంచి కోడిపుంజును స్వాధీనపర్చుకుని యజమానికి అప్పగించడంతో కథ సుఖాంతమైంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని నాగసాల గ్రామంలో గొర్రెల కాపరి గోపాల్ కోడిపుంజులు పెంచుతున్నాడు. అయితే శనివారం ఇద్దరు యువకులు స్కూటీపై వచ్చి ఇంటి ముందు ఉన్న కోడిపుంజును పట్టుకుని వెళ్లిపోయారు. ఈ విషయాన్ని గమనించిన గోపాల్ కూతురు తండ్రికి చెప్పడంతో అతను ఇంటికి వచ్చి ఇంటి వద్ద గల సీసీ పుటేజీలను పరిశీలించి పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయడంతోపాటు చుట్టుపక్కల వారికి చెప్పారు. ఆదివారం నిమ్మబాయిగడ్డ ప్రాంతంలో సదరు యువకులు కోడిపుంజును విక్రయిస్తుండగా అప్పటికే కోడిపుంజు చోరీ గురించి విన్నవారు గోపాల్కు తెలిపారు. అతను పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు వచ్చి కోడిపుంజును అపహరించిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. వారి నుంచి కోడిపుంజు, స్కూటీని స్వాధీనపర్చుకున్నారు. తర్వాత కోడిపుంజను యజమాని గోపాల్కు అప్పగించారు. కోడిపుంజు విలువ రూ.10 వేలు ఉంటుందని, కోడిపుంజులు పెంచి విక్రయించడం తనకు అలవాటు అని గోపాల్ పేర్కొన్నారు. కాగా.. పోలీసులు చోరీకి పాల్పడిన ఇద్దరు యువకులను మందలించి వదిలిపెట్టినట్లు తెలిసింది. -
కారు ఇంజిన్లో మంటలు
జడ్చర్ల: స్థానిక ఎల్ఐసీ కార్యాలయం సమీపంలో ప్రధాన రహదారిపై వెళ్తున్న ఓ కారు ఇంజన్లో మంటలు రావడంతో డ్రైవర్ వెంటనే గమనించి కారును నిలిపి వేసిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. మండలంలోని పోలేపల్లి సెజ్ నుంచి జడ్చర్ల సిగ్నల్గడ్డ వైపు వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కారు ఇంజన్లో పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ కారును వెంటనే నిలిపి పరిశీలిస్తుండగానే ఇంజన్లో మంటలు చెలరేగాయి. వెంటనే చుట్టుపక్కల వారు నీటిని చల్లి మంటలను ఆర్పారు. కారులో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరుగలేదు. డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. పాముకాటుతో గొర్రెల కాపరి మృతి నవాబుపేట: మండలంలో ని కూచూర్లో గొర్రెల కా పరి పాము కాటుతో మృతి చెందినట్లు గ్రా మస్తులు తెలిపారు. ఈ ఘటన వివ రాలు ఇలా.. కూచూర్కు చెందిన చిన్న మల్లయ్య (55) శనివా రం గొర్రెలను ఎప్పటి మాదిరిగా మేతకు తీసుకెళ్లాడు. అక్కడ పొలాల్లో పాము కాటువేయగా అంతగా పట్టించుకోలేదు.ఏదో పురుగు అని ధీమాగా ఉన్నాడు.తీరా ఇంటికి వచ్చే సరికి విషం ఎక్కడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అనంత రం బాధిత కుటుంబ సభ్యులు అస్పత్రికి తరలించే లోగా మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. చోరీకి పాల్పడిన దొంగకు దేహశుద్ధి కొత్తపల్లి: తాగిన మైకంలో దొంగతనానికి పాల్పడుతున్న వ్యక్తి గమనించిన గ్రామస్తులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన ఘటన కొత్తపల్లి మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మద్దూరు మండలంలోని పెద్దిరిపాడు తండాకు చెందిన రాజునాయక్ కొత్తపల్లిలోని ప్రధాన చౌరస్తా వద్ద శివాలయంలో హుండీ పగలగొట్టి అందులో ఉన్న రూ.1,450 నగదు అపహరించడంతోపాటు ఆలయం ముందున్న బోరు మోటరు కేబుల్ వైరును కటింగ్బ్లేడ్తో కట్ చేస్తుండగా గ్రామస్తులు గమనించి పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం మద్దూరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దొంగను అదుపులోకి తీసుకొని విచారించారు. రాజునాయక్ తాగుడుకు బానిసై దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. మూడేళ్ల క్రితం భార్య పుట్టింటికి వెళ్లడంతో అప్పటినుంచి తాగడానికి డబ్బుల్లేక దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
కురుమూర్తి దారులకు మోక్షం!
● రోడ్డుకిరువైపులా ముళ్లపొదల తొలగింపు ● భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చిన్నచింతకుంట: కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవా లు ఈనెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉ త్సవాలకు ఉమ్మడి పాలమూరు జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధికసంఖ్యలో హాజరవుతారు. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కురుమూర్తి రహదారులన్నింటికీ అధికారు లు మరమ్మతులు చేపట్టారు. ముఖ్యంగా రహదారులకు ఇరువైపులా పెరిగిన ముళ్లపొదల తొలగింపు, గుంతల పూడ్చివేత తదితర పనులు చేపట్టారు. ఆదివారం అమ్మాపురం, దేవరకద్ర, అల్లీపురం, అడ్డాకుల మండలంలోని వర్నే ముత్యాలంపల్లి, రోడ్లకు జేసీపీలను పెట్టి ముళ్ల పొదలను తొలగిస్తున్నారు. రోడ్ల మరమ్మతుకు ప్రతిపాదనలు కురుమూర్తి స్వామి రహదారులకు మరమ్మతులు చేపట్టాలని ఈ సంవత్సరం ముందస్తుగానే ఆలయ అధికారులు ఆర్అండ్బీ, పంచాయితీరాజ్ అధికారులకు ప్రతిపాదనలు పెట్టారు. అందుకు రెండుమూడురోజుల క్రితమే పంచాయతీరాజ్ నుంచి గ్రా మా ల్లో మరమ్మతులు చేపట్టేందుకు నిధులు మంజూరయ్యాయి. ఆర్అండ్బీ నుంచి నిధులు మంజూరు కా కున్న బ్రహ్మోత్సవాల సమయం దగ్గర పడుతుందన్న ఉద్దేశతో ప్రధాన రోడ్ల మరమ్మతులు చేపట్టారు. పీఆర్ నిధులు మంజూరు కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని చిన్నచింతకుంట మండలంలోని పలు గ్రామా ల్లో స్వామివారి ఉత్సవ కార్యక్రమాలు చేపడుతారు. అందుకు ఆయా గ్రామాల్లో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు రోడ్ల మరమ్మతులు చేపడుతున్నారు. అందుకు నిధులు కూడా మంజూరు చేశారు. చిన్నవడ్డేమాన్ నుంచి అప్పంపల్లి వరకు ఉద్దాల బాటకు రూ.40వేలు, అప్పంపల్లి నుంచి గ్రామ సమీపంలోని వాగు వరకు ఉద్దాల బాటకు రూ.లక్ష, తిర్మలాపురం సమీపం నుంచి గ్రామ సమీపంలోని వాగు వరకు ఉద్దాల బాటకు రూ.లక్ష, కురుమూర్తి గ్రామం నుంచి అమ్మాపురం వరకు దేవుని బాటకు రూ.1.20లక్షలు, అమ్మాపురం నుంచి గ్రామ వాగుకు, కురుమూర్తి గ్రామం వరకు రూ.75వేలు, ఉంధ్యాల నుంచి చిన్నచింతకుంట వరకు రూ.70వేలు, అమ్మాపురం నుంచి గూడూరు వరకు రూ.75వేలు, అప్పంపల్లి నుంచి అమ్మాపురం, రాజోళి బాటకు రూ.1.20లక్షలు, లాల్కోట నుంచి పల్లమరి వరకు రూ.60వేలు, మద్ధూర్ నుంచి గ్రామ వాగు వరకు రూ.30వేలు, కౌకుంట్ల నుంచి పొన్నకల్, రాచాల, ఇస్రంపల్లి వరకు రూ.2లక్షలు మంజూరు చేశారు. ఈ పనులను త్వరలోనే చేపట్టి పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతిపాదనలు పెట్టిన పనులు కురుమూర్తి స్వామి ఆలయానికి వచ్చే రహదారులకు మరమ్మతులు చేపట్టేందుకు ఆలయ అధికారులు పదిరోజుల క్రితం ఆర్అండ్బీ అధికారులకు ప్రతిపాదనలు పెట్టారు. మహబుబ్నగర్, వనపర్తి డివిజన్లకు సంబంధించి మహబుబ్నగర్ జిల్లాకు చెందిన దేవరకద్ర నుంచి అమ్మాపురం, ఆత్మకూర్ వరకు, అల్లిపురం నుంచి లాల్కోట క్రాస్ రోడ్డు వరకు, దేవరకద్ర నుంచి తిర్మలాపురం, అప్పంపల్లి వరకు, దేవరకద్ర నుంచి కౌకుంట్ల, వెంకంపల్లి, కురుమూర్తి దేవస్థానం వరకు, వనపర్తి డివిజన్ చెందిన లక్ష్మీపురం నుంచి కొత్తకోట వరకు, కొన్నూర్ నుంచి నెల్విడి వరకు, మదనాపురం నుంచి కురుమూర్తి దేవస్థానం వరకు మరమ్మతులు చేపట్టాలని ప్రతిపాదనలు పెట్టారు. అయితే మహబుబ్నగర్ డివిజన్ అధికారులు మాత్రం ఆదివారం పనులు చేపట్టారు. వనపర్తి డివిజన్వారు ఇంకా పసనులు చేపట్టలేదు. -
జిల్లాకేంద్రంలో దీపావళి సందడి..
పాలమూరు పట్టణంలో రెండు, మూడు రోజుల నుంచి దీపావళి పండుగ సందడి నెలకొంది. బాణాసంచా స్టాళ్ల వద్ద చిన్నారులు, పెద్దలు టపాసులు కొనుగోలు చేస్తున్నారు. గ్రీన్ టపాసుల కొనుగోలుకు చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు. అదేవిధంగా మహిళలు వివిధ రకాల ప్రమిదలను కొనుగోలు చేస్తున్నారు. షాపుల్లో కూడా దీపావళి సందడి నెలకొంది. పండుగను పురస్కరించుకొని జిల్లాకేంద్రంలోని పలుచోట్ల ప్రత్యేకంగా పూల స్టాళ్లు వెలిశాయి. జడ్చర్ల టౌన్: దీపావళి సందర్భంగా గోగునార కట్టలతో చేసిన దుందువాతో దిష్టి తీస్తారు. జడ్చర్ల మండలంలోని చాలా గ్రామాల్లో ఈ సంప్రదాయం కొనసాగుతుంది. పొలాల్లో ఉన్న జీనుగ, పుంటికూర (గోగునార) కట్టెలు తీసుకువచ్చి వాటిని కట్టలా తయారు చేసి చిన్న చిన్న గుడ్డ పీలికలతో కాగడాలు కట్టి వెలిగించి దిష్టితీయడం ఆనవాయితీగా వస్తుంది. దీన్ని వాడుక భాషలో దుందువాగా వ్యవహరిస్తారు. దిష్టి తీశాక పిల్లలు దక్షిణ దిశగా నిలబడి దీపం వెలిగించడం చేస్తారు. దీన్ని ఉల్కాదానంగా పిలుస్తారు. పితృదేవతలకు దక్షిణ దిక్కుగా దీపం వెలిగించడం వల్ల స్వర్గానికి వెళ్లేందుకు దారి చూపినట్లవుతుందని భావిస్తారు. దీపం వెలిగించాక పిల్లలు కాళ్లు కడుక్కుని ఇంట్లోకి వచ్చి పూజాగృహంలో నువ్వుల నూనెతో దీపాలు వెలిగించి దీపలక్ష్మికి నమస్కారం చేయాలి. సోమవారం సాధారణ నోములు, వ్రతాలు, లక్ష్మీపూజలు చేసుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. అయితే కేదారేశ్వర వ్రతం ఆచరించే వారు మంగళవారం జరుపుకోనున్నారు. సోమవారమే చతుర్దశి కూడా ఉండడంతో ఉదయం భోగి మంగళహారతులు స్వీకరించి.. సాయంత్రం నోములు చేసుకోనున్నారు. ● లక్ష్మీచెన్నకేశవస్వామి కొలువైన గంగాపురం గ్రామంలో పెద్ద దుందువాతో వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే కార్తీక పాడ్యమి రోజున ఈ వేడుకలు జరుపుతారు. ఈ ఏడాది బుధవారం రోజున దుందువా వేడుకలను జరుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఏసీబీ తనిఖీల్లో అవినీతి గుట్టురట్టు
కృష్ణా ఆర్టీఏ చెక్పోస్టులో రూ.30 వేల అనధికార డబ్బు గుర్తింపు● ఒక్కో లారీకి ఒక్కో రేటు చొప్పున డబ్బు వసూలు ● తనిఖీల సమయంలోనూ డబ్బులు టేబుల్పై పెట్టి వెళ్లిన లారీ డ్రైవర్లు ● ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక అందజేస్తాం : ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ మహబూబ్నగర్ క్రైం: ఒకవైపు ఏసీబీ అధికారుల బృందం ఆర్టీఏ చెక్పోస్టులో తనిఖీలు చేస్తుంటే.. మరోవైపు లారీ డ్రైవర్లు ఒక్కొక్కరుగా అక్కడ ఏం జరుగుతుందో అని కూడా పట్టించుకోకుండా జేబులో నుంచి డబ్బులు తీసి టేబుల్పై పెట్టి వెళ్తున్నారు.. ఈ దృశ్యాలన్నింటిని ఏసీబీ అధికారులు వీడియో తీయడం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ఆర్టీఏ చెక్పోస్టుల్లో ఏసీబీ అధికారుల బృందం సోదాలు చేయగా నారాయణపేట జిల్లా కృష్ణా ఆర్టీఏ చెక్పోస్టులో మహబూబ్నగర్ ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, పది మంది బృందం కలిసి శనివారం అర్ధరాత్రి 12.30 నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. దాదాపు ఆరు గంటలపాటు సాగిన తనిఖీల్లో అనేక అక్రమ అంశాలను గుర్తించారు. ఇటీవల ప్రభుత్వం జీఓ 58 ప్రకారం ఆర్టీఏ చెక్పోస్టులు ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్న క్రమంలో మూడు నెలలపాటు చెక్పోస్టుల దగ్గర ఎలాంటి కలెక్షన్స్ చేయకుండా ఆన్లైన్లో చలాన్స్ చెల్లించడం ఇతర అంశాలపై లారీ డ్రైవర్లతోపాటు అన్ని రకాల డ్రైవర్లకు అవగాహన కలిగించడంతోపాటు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించింది. కానీ, కృష్ణా చెక్పోస్టులో అలాంటి అంశాలు కాకుండా లారీ డ్రైవర్ల నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నారు. చెక్పోస్టులో సరైన లైటింగ్ లేకపోవడం, ఉన్న రెండు సీసీ కెమెరాలు సైతం సక్రమంగా పనిచేయడం లేదని, ప్రధానంగా వసూళ్ల కోసం ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏసీబీ బృందం తనిఖీలు చేస్తున్న సమయంలో చెక్పోస్టులో ఏఎంవీఐ ప్రవీణ్కుమార్ విధుల్లో ఉన్నారు. చెక్పోస్టులో ఎలాంటి రశీదులు లేకుండా అనధికారమైన డబ్బులు రూ.30,450 గుర్తించారు. నివేదిక అందిస్తాం.. కృష్ణా చెక్పోస్టులో చేసిన తనిఖీలపై ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ ‘సాక్షి’కి వివరాలు వెల్లడించారు. ఆకస్మికంగా చేసిన తనిఖీల్లో అనేక అక్రమ అంశాలను గుర్తించామని, ఈ చెక్పోస్టుపై డీటీవోతోపాటు ఇతర ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం ఉన్నట్లు గుర్తించామని వీటన్నింటిపై ప్రత్యేక నివేదిక తయారు చేసి డీజీకి అందజేస్తామని తెలిపారు. దీనిపై సంబంధిత అధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకుంటారని డీఎస్పీ పేర్కొన్నారు. కృష్ణా ఆర్టీఏ చెక్పోస్టు దగ్గర సరిహద్దు దాటే లారీలకు స్థానిక అధికారులు ఒక్కో లారీకి ప్రత్యేక రేట్లు నిర్ణయించారు. 14 టైర్ల లారీ, బొగ్గు లారీ, బూడిద లారీ, ఇసుక, బియ్యం ఇలా ఒక్కో దానికి నిర్ణయించిన ధరల ప్రకారం చెక్పోస్టు దగ్గరకు లారీ వచ్చిన తర్వాత పక్కనే నిలిపి వచ్చి ముందే నిర్ణయించిన ధరల ప్రకారం డబ్బులు టేబుల్ మీద పెట్టి వెళ్లాలి. ఇలా రోజువారి కలెక్షన్ రూ.వేలల్లో ఉంటుంది. ఇక సరైన డాక్యుమెంట్స్, ఓవర్ లోడ్ ఇతర వాటికి అధిక మొత్తంలో రేట్లు నిర్ణయించారు. -
అప్రమత్తతే శ్రీరామ రక్ష
● హానికర బాణాసంచాకు దూరంగా ఉండాలి ● చిన్నారులతో జాగ్రత్త ● పర్యావరణ హితమే మేలు మహబూబ్నగర్ క్రైం: వెలుగు పూలు పూయించే దీపాల పండగ దీపావళి కొందరికీ సంతోషాన్ని.. మరికొందరికి అనారోగ్యాన్ని మోసుకొస్తోంది. ఆనందం కోసం కాల్చే టపాసులు పర్యావరణానికి తూట్లు పొడుస్తూ ప్రాణికోటి మనుగడకే ముప్పు తెస్తున్నాయి. ఇదే సమయంలో మోతల మాటున శబ్ద కాలుష్యం, వెలుగుల మాటున రసాయన కాలుష్యం వెదజల్లుతూ ప్రకృతికి హాని కల్గిస్తోందన్న వాదన ఉంది. ఇటీవల సుప్రీంకోర్టు నిర్ణీత సమయం వరకు టపాసులు కాల్చుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఎక్కువ శబ్దలు వింటే.. టపాసులు కాల్చే సమయంలో ఎంతో ఆనందిస్తాం. కానీ అవి విడుదల చేసే వాయువులు, దుమ్ము, శబ్దాలు ఎంతో మందికి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తాయి. వాతావారణం పూర్తిగా నాశనం అవుతుంది. ఎక్కువ శబ్దం వచ్చే టపాసులు కాల్చడం వల్ల చెవులకు హని కలిగే ప్రమాదం ఉంది. మనిషి సాధారణంగా వినే శబ్దాల తీవ్రత 60 నుంచి 65 డెసిబుల్స్ మధ్య ఉంటుంది. అంతకంటే ఎక్కువ తీవ్రత కల్గిన శబ్దాల వల్ల మనిషి వినికిడి శక్తి కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిసస్తునన్నారు. గాలిలో కలుస్తున్న దుమ్ము కణాలు దీపావళి పండగ సందర్భంగా వారం రోజుల పాటు కాల్చే టపాసుల కారణంగా శబ్దాలే కాకుండా పొగ, దుమ్ము, దూళి గాలిలో పెద్ద మొత్తంలో కలుస్తాయి. నేల మీద టపాసులు పేలినప్పుడు ఆ శబ్దాల తీవ్రతకు దుమ్ము ఒక్కసారిగా పెద్ద మొత్తంలో గాలిలోకి చేరుతుంది. మహబూబ్నగర్ పట్టణంలో సాధారణ రోజులల్లో రోడ్లపై దుమ్ము కణాలు 30 నుంచి 35 ఆర్ఎస్పీఎం (రెస్పిరబుల్ సస్పెండబుల్ పార్టిక్యులేట్ మ్యాటర్) శాతంగా ఉంటాయి. అదే దీపావళి రోజు 52శాతం వరకు చేరుతున్నట్లు సమాచారం. గాలిలో 50 శాతం దుమ్ము కణాలు ఉంటే ఆరోగ్యానికి మంచిది కాదు. ఆరోగ్యంతో జాగ్రత్త వినలేని శబ్దాలను అదే పనిగా వింటూ ఉండటం వల్ల ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. రక్తపోటు, గుండె జబ్బులు ఉన్న వారి ఆరోగ్యానికి ఇలాంటి శబ్దాలు మరింత ప్రమాదకరం. ముఖ్యంగా పెద్ద శబ్దాలు వినడం వల్ల తలనొప్పి, రక్తపోటు, అజీర్ణం వంటి సమస్యలతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మైగ్రేన్తో బాధపడేవారికి శబ్దాలు వింటే రెండు గంటల పాటు తీవ్రమైన తలనొప్పి వస్తుంది. శబ్ద ప్రభావం పసిపిల్లలు, వృద్ధులు, గర్భిణులపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఇలా చేస్తే ఇబ్బంది ఉండదు టపాసులు కాల్చే సమయంలో వచ్చే పొగ ఎక్కువగా మనుషులపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ముక్కు, నోటికి మాస్క్, చెవుల్లో దూది లాంటివి పెట్టుకోవడం మేలు. టపాసుల నుంచి వచ్చే కా లుష్యం వల్ల చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కాటన్ దుస్తులు ధరించాలి. దగ్గర ఉండి కాల్చకండి.. దీపావళి పండగ సందర్భంగా ప్రతి ఒక్కరూ టపాసులు కాల్చడానికి రూ.వేలు ఖర్చు చేసి అధిక స్థాయిలో టపాసులు కొనుగోలు చేస్తారు. వాటిని దగ్గర నుంచి కాల్చడం వల్ల 91 డెసిబుల్స్ తీవ్రత గల శబ్దాలను స్పష్టంగా వినిపిస్తాయి. 100 డెసి బు ల్స్ తీవ్రత గల శబ్దాలను 15 నిమిషాల వరకు.. 112 డెసిబుల్స్ శబ్దాలను ఒక నిమిషం పాటు వినగలం. 140 డెసిబుల్స్ శబ్దం మనుషులు వింటే వినికిడి శక్తి కొంత మేరకు కోల్పోవడానికి అవకాశం ఉంది. తీవ్రమైన శబ్దం వచ్చే బాణాసంచా 140 నుంచి 150 డీబీ శబ్ద తీవ్రత విడుదల చేసే ప్రమాదం ఉంది. శబ్ధాలతో ప్రమాదం టపాసులు కాల్చుతున్న సమయంలో అతి ధ్వనులనిచ్చే వాటికి దూరంగా ఉండాలి. భారీ శబ్దాల కారణంగా కర్ణభేరి పగిలి కొన్నిసార్లు వినికిడి శక్తి కోల్పోవాల్సి వస్తోంది. దీపావళి సమయంలో ఇలాంటి వారు చాలా మంది చికిత్స కోసం వస్తుంటారు. బాణాసంచా నుంచి వెలువడే హనికర రసాయనాల ద్వారా పొగతో ఆస్తమా, శ్వాసకోశ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. – డాక్టర్ సందీప్కుమార్, పల్మానాలజిస్ట్ -
ఆకట్టుకుంటున్న ‘ప్రమిదలు’
దీపావళి పండుగలో ప్రమిదలు (మట్టి దీపాలకు) ప్రత్యేక స్థానం ఉంది. ఈ పండుగకు ఇంటిల్లిపాది దీపాలతో అలంకరించడం ఆనవాయితీగా వస్తుంది. దీపావళి పండుగను పురస్కరించుకొని నగరంలో ప్రమిదల స్టాళ్లు వెలిశాయి. గత మూడు రోజుల నుంచి దీపాల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. వివిధ డిజైన్లలో దీపావళి ప్రమిదలు అందుబాటులోకి వస్తున్నాయి. నగరంలోని ఏనుగొండ, పద్మావతీకాలనీ, మెట్టుగడ్డ, జనరల్ ఆస్పత్రి, జిల్లా పరిషత్ ఎదుట, మల్లికార్జున్ చౌరస్తా, అశోక్టాకీస్ చౌరస్తా, క్లాక్టవర్, బస్టాండ్, పాన్చౌరస్తాలతోపాటు పలు ప్రాంతాల్లో ప్రమిదల స్టాళ్లు వెలిశాయి. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి.. కొంతమంది స్టాళ్ల నిర్వాహకులు కొన్ని ప్రమిదలను ఇక్కడే తయారు చేసి విక్రయిస్తున్నారు. వివిధ డిజైన్ల ఆకర్షణీయమైన మట్టి దీపాలను తమిళనాడు, గుజరాత్, రాజస్తాన్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు దిగుమతి అవుతుండగా అక్కడి నుంచి స్థానిక వ్యాపారులు కొనుగోలు చేసి స్టాళ్లలో అందుబాటులో ఉంచుతున్నారు. ప్రమిదల పరిణామం, డిజైన్ను బట్టి విక్రయిస్తున్నారు. ముఖ్యంగా గాజుతో చేసిన దీపాలు, కందీల్ దీపాలు, ఐదు క్యాండిల్స్ దీపాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చిన్నపాటి దీపాలు డజన్ రూ.50 నుంచి అమ్ముతుండగా.. ఇతర దీపాలు రూ.1,600 వరకు కూడా లభిస్తున్నాయి. వాటర్ ఫ్లవర్ రూ.150 నుంచి రూ.200, ఎలక్ట్రిక్ ప్రమిద రూ.200 నుంచి 250 వరకు విక్రయిస్తున్నారు. -
వెలుగుల దివ్వెలు..
శుభ, సంతోషాలకు సూచిక.. దీపావళి ● చెడుపై గెలిచిన మంచికి ప్రతీకగా సంబరాలు ● ఇళ్లలో లక్ష్మీపూజకు ప్రత్యేక ఏర్పాట్లు ● నేడు జిల్లావ్యాప్తంగా వేడుకలు చీకటి నుంచి వెలుగు వైపు పయనిద్దామని పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. జ్ఞానానికి ప్రతీక అయిన దీపాన్ని వెలిగించి.. మనలోని అజ్ఞానాన్ని దూరం చేసుకోవాలని ధార్మికవేత్తలు ప్రజలను మేల్కొలుపుతారు. దీపాన్ని జ్ఞానానికి, సంతోషానికి, నిర్మలత్వానికి ప్రతీకగా పేర్కొన్నారు. అలాంటి దీపం ప్రాముఖ్యత తెలిపే విధంగా ఏర్పాటు చేసిందే ఈ దీపావళి పర్వదినం. ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసం అమావాస్య రోజు దీపావళి వస్తుంది. సోమవారం జిల్లాలో ప్రజలు సంప్రదాయబద్ధంగా ఈ వేడుకలను నిర్వహించుకోనున్నారు. ప్రాంత భేదాన్ని అనుసరించి దీపాలిక, కౌముదీ మహోత్సవం, దివ్వెల పండుగ అనే పేర్లతో పిలుస్తారు. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. వెలిగించిన దీపాలు స్వర్గానికి దారి చూపిస్తాయని విశ్వసిస్తారు. దీపావళి రోజు దీపాలు వెలిగిస్తే దేవతలు కరుణిస్తారని హిందువులు నమ్ముతారు. అందుకే ప్రతి ఇంట్లో దీపాల వరుసలు కనిపిస్తూ శుభసంకేతాలు ప్రసరిస్తాయి. దీపావళిని కొన్ని ప్రాంతాల్లో మూడు, మరికొన్ని ప్రాంతాల్లో ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు. రాజస్తాన్ మార్వాడీలకు దీపావళి ప్రత్యేకమని చెప్పవచ్చు. దాదాపు వందేళ్ల క్రితమే రాజస్తాన్కు చెందిన మార్వాడీల కుటుంబాలు పాలమూరులో స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు. పిల్లల చదువులు, వ్యాపారాల నిమిత్తం చాలా కుటుంబాలు హైదరాబాద్లో స్థిరపడ్డాయి. ప్రస్తుతం నగరంలో 150కిపైగా రాజస్తాన్ కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడే ఉంటున్నప్పటికీ రాజస్తాన్ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా పండుగలు జరుపుకొంటారు. ముఖ్యంగా దీపావళిని ప్రతి కుటుంబం ఆనందోత్సవాల మధ్య ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహించుకుంటారు. మొదటి రోజు ధన్తేరాస్ జరుపుతారు. ఇంటిల్లిపాది లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. రెండోరోజు రూప్ చౌదాస్ వేడుకలు ఉంటాయి. కాగా.. సోమవారం సాయంత్రం 6 గంటల తర్వాత లక్ష్మీదేవి పూజలు నిర్వహించి టపాసులు కాల్చి సంబరాలు చేసుకుంటారు. ఉపవాసం ఉండి లక్ష్మీదేవికి పూజలు నిర్వహించి పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. నాలుగో రోజు గోవర్ధన్ పూజ (ఆవుపేడతో) నిర్వహిస్తారు. ఐదోరోజు బైదూజ్ వేడుకలు చేసుకుంటారు. వీరు గుంజ, బేసన్ చక్కి, పేటతోపాటు బెల్లంతో తయారుచేసిన తీపి వంటకాలు చేస్తారు. – స్టేషన్ మహబూబ్నగర్ హైందవ పర్వదినాల్లో దీపావళి ఒకటి. దీపావళి నాడు దీపాలు వెలిగించి లక్ష్మీదేవి అమ్మవారిని ఆహ్వానించి ప్రత్యేకంగా లక్ష్మి పూజలు చేయాలి. నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి. దీపావళి రోజున లక్ష్మీపూజతో ధనధాన్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. దీపావళి రోజున లక్ష్మీపూజతో తమ వ్యాపారం వృద్ధి చెందుతుందని వ్యాపారులు నమ్ముతారు. – గొండ్యాల రాఘవేంద్రశర్మ, ప్రధాన అర్చకులు, శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం -
ఉత్సాహంగా మహిళా కిక్ బాక్సింగ్ లీగ్
మహబూబ్నగర్ క్రీడలు: చిన్నారులు చదువుతోపాటు క్రీడల్లో ప్రతిభచాటాలని ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్పీ వెంరటేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో శనివారం జిల్లా స్పోర్ట్స్ కిక్బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అస్మితా ఖేలో ఇండియా వుమెన్స్ కిక్బాక్సింగ్ లీగ్ నిర్వహించారు. ఈ లీగ్లో ఉమ్మడి జిల్లాతో వివిధ జిల్లాలకు చెందిన దాదాపు 150 మంది బాలికలు పాల్గొన్నారు. పోటీలను ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్పీ వెంకటేశ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి క్రీడలను ప్రాక్టిస్ చేయాలని తద్వారా ఉన్నతస్థాయికి చేరుకోవచ్చన్నారు. సెల్ఫోన్కు దూరంగా ఉండి చదువు, క్రీడలపై దృష్టి పెట్టాలని కోరారు. మహబూబ్నగర్ క్రీడాపోటీల నిర్వహణకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఒలింపిక్ సంఘం కార్యదర్శి కురుమూర్తిగౌడ్ మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు, ఓటములు సమానంగా స్వీకరించాలన్నారు. ఓడినవారు నిరాశ చెందకుండా మళ్లీ గెలుపు కోసం శ్రమించాలని కోరారు. డీవైఎస్ఓ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆడపిల్లలను క్రీడల్లో ప్రోత్సహించడానికి ఖేలో ఇండియా కిక్బాక్సింగ్ సిటీ లీగ్ పెట్టడం జరిగిందన్నారు. క్రీడాకారుల్లో క్రమశిక్షణ చాలా ముఖ్యమని అన్నారు. రాష్ట్ర సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రామాంజనేయులు, మహిపాల్ మాట్లాడుతూ తెలంగాణలోని ఐదు ప్రాంతాల్లో వుమెన్స్ కిక్బాక్సింగ్ లీగ్లు నిర్వహిస్తున్నామని, ఇందులో ప్రతిభచాటిన వారు త్వరలో జరిగే జోనల్ స్థాయి సెలక్షన్స్లో పాల్గొంటారని చెప్పారు. జోనల్ స్థాయిలో మెడల్స్ సాధించేవారు జాతీయస్థాయి పోటీలకు వెళ్తారని, నగదు పారితోషికాలు ఉంటాయన్నారు. నిరంతరం కిక్బాక్సింగ్ ప్రాక్టిస్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా స్సోర్ట్స్ కిక్బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కె.రవికుమార్, రవినాయక్, భరత్, కనకం యాదవ్, శేఖర్, నర్సింగ్రావు, తిరుపతి, రాజు, శివ తదితరులు పాల్గొన్నారు. ఫలితాల వివరాలు.. పాయింట్ ఫైట్, లైట్, మ్యూజికల్ ఫాం విభాగాలు, టీం వెపన్, టీం కతాస్ విభాగాల్లో పోటీలు జరిగాయి. క్రియేటివిటీ ఫాంలో మహబూబ్నగర్ జట్టు భావన వర్షిణి, కె.క్రితిజ్ఞ, రిత్వికారెడ్డి ప్రథమ (మహబూబ్నగర్) ప్రథమ, శ్రీహిత, అవిశృతి– ద్వితీయ (మహబూబ్నగర్), హార్డ్ స్టైల్ ఫాంలో రితిక ప్రథమ, గోమతి (ద్వితీయ), ఆరోహి (తృతీయ), మ్యూజికల్ ఫాంలో హారికారెడ్డి ప్రథమ, వర్షిణి ద్వితీయ స్థానాల్లో నిలిచారు. -
తల్లిదండ్రులకు పాదపూజ
అడ్డాకుల: మండలంలోని కందూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం విద్యార్థులు తమ తల్లిదండ్రులకు పాదపూజ నిర్వహించారు. వందేమాతరం ఫౌండేషన్ కోఆర్డినేటర్ రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో మా తృపూజోత్సవం చేపట్టారు. ఈ సందర్భంగా పిల్లల భవిష్యత్ కోసం తల్లిదండ్రులు పడే తపణను ఆయన వివరించారు. హెచ్ఎం మురళీధర్, నిర్వాహకులు అని ల్ భగవత్, సంభూపాల్రెడ్డి, ఉపాధ్యాయులు శ్రీకాంత్శర్మ, జనార్దన్రెడ్డి, చంద్రశేఖర్, విజయ్కుమా ర్, జయశ్రీ, శ్రీదేవి, గోపాల్, నాగమణి, అనిత పాల్గొన్నారు. -
మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
బల్మూర్: ప్రేమించిన యువతి అనారోగ్యంతో మృతి చెందడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఉరి వేసుకోని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం మండల కేంద్రంలో జరిగింది. ఎస్ఐ రాజేందర్ తెలిపిన వివరాలు.. మండల కేంద్రానికి చెందిన పంజుగుల మనోహర్(24) ఐదేళ్లుగా ఆటో నడుపుతై జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తాను ప్రేమించిన యువతి ఇటీవల అనారోగ్యంలో మృతి చెందడంతో మనస్తాపానికి గురై ఐదు రోజులుగా ఇంటి వద్దే ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి బాత్రూంకు వెళ్లి ఎంతకు బయటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గమనించిగా ఉరి వేసుకోని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాపాడే ప్రయత్నం చేయగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి తల్లి సుల్తానమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య హన్వాడ: మండల కేంద్రంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం ఉదయం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన కథనం మేరకు.. మండల కేంద్రానికి చెందిన కమ్మరి వెంకటేష్ (42) కొన్ని రోజులుగా కంటి సమస్యతో బాధపడుతున్నాడు. దీనికి తోడు అప్పులు కూడా పెరిగడంతో వాటిని తీర్చలేక మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో ఇటీవలే కంటి ఆపరేషన్ కూడా చేయించుకున్నాడు. శుక్రవారం తాను నిర్వహిస్తున్న కార్పెంటర్ షాపునకు వెళ్లిన ఆయన తిరిగి రాత్రి ఇంటికి రాకపోవడంతో భార్య సుకన్య షాపు వద్దకు వెళ్లింది. ఆ సమయంలో వెంకటేష్ విద్యుత్ వైర్లతో ఉరేసుకుని మృతి చెందడాన్ని గుర్తించి, పోలీసులకు సమాచారం అందించింది. ఎస్ఐ వెంకటేష్ ఘటన స్థలానికి చేరుకొని మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వరకట్న వేధింపులు తాళలేక ఆత్మహత్య జడ్చర్ల: వరకట్నం వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని శికార్గానిపల్లిలో చోటుచేసుకుందని సీఐ కమలాకర్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని శికార్గానిపల్లికి చెందిన మండ్ల శైలజ అలియాస్ గుడిసె లాస్య(27) శుక్రవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి భర్త మూసాపేట మండలం జానంపేటకు చెందిన వెంకటేశ్ కొంతకాలంగా అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని, ముగ్గురు కుమారులు అనారోగ్యానికి గురైనా ఏమాత్రం పట్టించుకోకపోవడంతో వరుసగా మృతిచెందారు. దీంతో లాస్య శికార్గానిపల్లిలోని తల్లి మండ్ల జయమ్మ వద్దకు వచ్చి ఉంటోంది. తనకు అదనంగా కట్నం ఇస్తేనే కాపురానికి తీసుకెళ్తానని భర్త చెప్పడంతో మనస్తాపానికి గురైన ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు కారకుడైన వెంకటేశ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లాస్య తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
గుమ్మకొండ తండాలో విషాదం
తిమ్మాజిపేట: మండల పరిధిలోని గుమ్మకొండ తండాకు చెందిన శంకర్ నాయక్ రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. శంకర్నాయక్ పనులు ముగించుకొని బైక్పై ఇంటికి తిరిగి వస్తుండగా ఓ వ్యక్తిని తప్పించబోయి ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే చికిత్స నిమిత్తం ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ మరణించడంతో శుక్రవారం రాత్రి శంకర్ నాయక్ మృతదేహాన్ని శనివారం తండాకు తీసుకురావడంతో కుటుంబ సభ్యులు, తండావాసుల రోదనలతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నా యి. కాగా శంకర్ నాయక్ మరణవార్త తెలుసుకున్న మరికల్ చైటచెరువు తండాకు చెందిన రామునాయక్, మంజుల దంపతులు అంత్యక్రియల నిర్వహణకు గాను మృతుడి కుటుంబానికి రూ.5వేలు ఆర్థికసాయం అందజేశారు. డీసీఎం, కారు ఢీ: ఇద్దరి దుర్మరణ ం వనపర్తి రూరల్: ముందు వెళ్తున్న డీసీఎంను కారు ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన శనివారం తెల్లవారుజామున పెబ్బేరు మండలంలోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఎస్ఐ యుగేంధర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డికి చెందిన నాగరాజు (డ్రైవర్), కొంపల్లికి చెందిన మనీష్, విశాల్, రాజేష్ బ్యాండ్ మేళం వాయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఈ క్రమంలో వీరు బ్యాండ్ మేళం వాయించడానికి కర్నూల్కు వెళ్తున్నారు. మార్గ మధ్యలో పెబ్బేరు మండలంలోని జాతీయ రహదారిపై నందగోపాల్ హోటల్ సమీపంలోకి రాగానే తెల్లవారుజామున 3.30కు వీరి కారు ముందు వెళ్తున్న డీసీఎం సడన్గా బ్రేక్ వేయడంతో వెనక నుంచి బలంగా ఢీకొట్టారు. దీంతో నాగరాజు (24), మనీష్ (24) అక్కడిక్కడే మృతి చెందారు. విశాల్, రాజేష్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్లో వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి జంగాల రాజేష్ ఫిర్యాదు మేరకు డీసీఎం డ్రైవర్పై కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి ఊట్కూరు: మండలంలోని నిడుగుర్తిలో శనివారం ఇంటి దగ్గర ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతిచెందగా.. మరొకకరికి తీవ్ర గాయాలైన ఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన అనంతమ్మ(55) అదే గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి ఇంటికి పెరుగు కోసం వెళ్లింది. పెరుగు తీసుకొని కృష్ణారెడ్డి కూతురు మంజులతో మాట్లాడుతూ.. ఎదురుగా ఉన్న అరుగులపై కూర్చుంది. అప్పు డే పొలానికి వెళ్లేందుకు ఆంజనేయులు ట్రాక్టర్ను స్టార్ట్ చేయగా.. వేగంగా వెళ్లి ఇద్దరు మహి ళలపై దూసుకెళ్లిది. అనంతమ్మ, మంజులకు తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా అనంతమ్మ మృతిచెందింది. మంజుల కాలు విరిగింది. ఈ విషయమై మృతురాలి మేనల్లుడు రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేశ్ తెలిపారు. పురుగు మందు తాగి.. వ్యక్తి బలవన్మరణ ం భూత్పూర్: మండలంలోని పోతులమడుగుకు చెందిన ఖాసీం (48) చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే ఖాసీం వ్యవసాయ కూ లీగా పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. గురువారం ఉదయం కోట్ల నారాయ ణ వ్యవసాయ పొలంలో పనికి వెళ్తున్నానని భా ర్య సుజాతతో చెప్పి వెళ్లాడు. ఖాసీం స్నేహితుడు జోగు చెన్నప్ప కూడా పనినిమిత్తం కోట్ల నారాయణ పొలం వద్దకు వెళ్లగా ఖాసీం చలికి వణుకుతున్న స్థితిలో కనిపించాడు. ఏమైందని ఆరా తీయగా ఆర్ధిక పరిస్ధితి బాగా లేకపోవడంతో పురుగు మందు తాగినట్లు ఖాసీం చెప్పాడు. దీంతో చెన్నప్ప వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా ఆస్పత్రికి తరలించారు. పరి స్థితి విషమించడంతో ఖాసీం మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
నెట్టెంపాడు కాల్వలో పడిన యువకుడు
ధరూరు: పొట్ట కూటి కోసం జాతరలో సర్కస్ చేసేందుకు వచ్చిన ఓ యువకుడు ప్రమాదశాత్తు నెట్టెంపాడు కాల్వలో పడి ప్రాణాలతో బయటపడిన ఘటన మండలంలోని గుడ్డెందొడ్డి శివారులో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కేటీదొడ్డి మండలంలోని పాగుంట లక్ష్మీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో సర్కస్ వేసేందుకు వచ్చిన కర్ణాటకలోని బీజాపూర్కు చెందిన తనాజీ అనే 25 ఏళ్ల యువకుడు వచ్చాడు. అతడు శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో మండలంలోని గుడ్డెందొడ్డి శివారులోని నెట్టెంపాడు ప్రధాన కాలువలో చేపల పట్టేందుకు వెళ్లాడు. పంప్హౌస్ సమీపంలోనే కాల్వ లోతుగా ఉందని తెలియని ఆ యువకుడు కాల్వలోకి దిగి జారిపడిపోయాడు. అక్కడే ఉన్న వారి బంధువైన మరో యువకుడు గట్టిగా కేకలు వేయడంతో చుట్టు పక్కల రైతులు, అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి ముందుగా రేవులపల్లి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఫైర్ సిబ్బంది, రెస్క్యూ టీం సిబ్బందికి విషయం తెలిపారు. అందరూ కలిసి గంట పాటు శ్రమించి ఆ యువకుడిని తాళ్లు, నిచ్చెన సహాయంతో బయటకు తీశారు. ప్రాణాలకు తెగించి ఓ నిండు ప్రాణానాన్ని కాపాడిన ఎస్ శ్రీహరి, గద్వాల ఫైర్ స్టేషన్ ఎస్ఐ రాకేష్, పోలీసులను గుడ్డెందొడ్డి మాజీ సర్పంచు రఘువర్ధన్రెడ్డి, సామాజిక కార్యకర్త అంజి సాగర్ శాలువాలతో సన్మానించారు. 10 అడుగుల దూరంలోనే పంప్ హౌస్ మోటారు రన్నింగ్లో ఉండడంతో అందులోకి జారుకునే ప్రమాదం ఉందని, పోలీసులు సమయానికి వచ్చి ప్రాణాలను కాపాడారని గుడ్డెందిడ్డి గ్రామస్తులు తెలిపారు. బాధితుడికి తల, చేతికి గాయాలవడంతో చికిత్స కోసం 108 అంబులెన్స్లో గద్వాల ఆస్పత్రికి తరలించారు. -
కురుమూర్తి ఉత్సవాలకు ఏర్పాట్లు
● ఆలయ పరిసరాల్లో పనుల ముమ్మరం ● పూర్తిదశకు చేరుకున్న రంగులు అద్దడం ● మంచినీరు, పారిశుద్ధ్యంపైప్రత్యేక దృష్టి చిన్నచింతకుంట: కాంచన గుహలో కొలువుదీరిన కురుమూర్తి స్వామి బహ్మోత్సవాలు, జాతర ఈనెల 22 అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేశారు. అందుకు ఆలయం వద్ద వివిధ పనులు చేపట్టారు. పనులను పూర్తి చేసేందుకు రెండుమూడు రోజులుగా పనులను ముమ్మరంగా చేస్తున్నారు. ముఖ్యంగా అధికారులు పారిశుద్ధ్యం, మంచినీరు, ట్రాఫక్ నియంత్రణ, పార్కింగ్, ప్రయాణ సౌకర్యాలు, వైద్యం, నిఘా ఏర్పాట్లపై దృష్టిసారించి అందుకనుగుణంగా పనులు చేపడుతున్నారు. అయితే ఇప్పటికే రంగులు అద్దే పనులు పూర్తి దశకు చేరుకోగా.. పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. జాతర మైదానంలోని డ్రైనేజీల్లో జేసీబీల ద్వారా మురుగు, పిచ్చిమొక్కలను తొలగించారు. అన్నదాన సత్రం, కోనేరు వద్ద మరుగు దొడ్లు, మూత్రశాలలు, స్నానపుగదుల మరమ్మతులు చేపట్టారు. మంచినీటికి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేదుకు తగు చర్యలు చేపడుతున్నారు. భక్తుల ప్రయాణానికి బస్స్టాప్ల ఏర్పాటు, ట్రాఫిక్ నియంత్రణకు బారికేడ్లు, సీసీ కెమెరాలు, వైద్య, ఆరోగ్య కేంద్రాలకు ఏర్పాట్లు చేయాల్సి ఉంది. అందుకు ఆయా ప్రదేశాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టి చదును చేయాల్సి ఉంది. జాతర మైదానంలోని పలుచోట్ల నీటిగుంతలు పూడ్చాల్సి ఉంది. కొన్నిచోట్ల ఉన్న మరుగుదొడ్ల మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. వాటికి ట్యాపులు బిగించాల్సి ఉంది. అయితే ఇంకా చేపట్టాల్సిన పనులను అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. త్వరలోనే పనులు ప్రారంభించి పూర్తి చేయనున్నట్లు తెలిపారు. చేపట్టాల్సిన పనులు పనులు పూర్తి చేస్తాం స్వామివారి బ్రహ్మోత్సవాల సమయానికి అన్ని పనులు పూర్తి చేస్తాం. ఇప్పటికే ఆలయం వద్ద రంగులు అద్దే పనులు పూర్తి చేశాం. ఆలయ ప్రాంగణం, మెట్ల ప్రాంగణంలో పారిశుద్ధ్య పనులు చేపట్టి శుభ్రపరిచాం. జాతర మైదానంలో చేయాల్సిన పనులు చేపట్టి త్వరగా పూర్తి చేస్తాం. – మధనేశ్వరెడ్డి, ఈఓ, కురుమూర్తిస్వామి ఆలయం ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు, జాతర ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఇప్పటికే ఆలయం వద్ద వివిధ పనులు చేపట్టాం. ముఖ్యంగా మంచినీటి వసతి, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నింత్రణపై దృష్టిసారించి చర్యలు చేపడుతాం. బ్రహ్మోత్సవాల సమయానికి అన్ని పనులు పూర్తి చేస్తాం. – గోవర్ధన్రెడ్డి, చైర్మన్, కురుమూర్తి స్వామి ఆలయం -
వేలూరు రైల్వేస్టేషన్లో గట్టువాసులు
గట్టు: మండలానికి చెందిన మూగవారు తప్పిపోయి తమిళనాడులోని వేలూరు రైల్వేస్టేషన్లో ప్రత్యక్షమయ్యారు. ఈ ప్రాంతానికి చెందిన ఓ దివ్యాంగుడు, మహిళ, ఇద్దరు పిల్లలను వేలూరులో రైల్వే పోలీసులు గుర్తించి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారని.. ఏ ప్రాంతం వారని ఆరా తీసినట్లు సమాచారం. వారంతా మూగవారు కావడంతో అతికష్టం మీద వారి వివరాలను రైల్వే పోలీసులు గుర్తించే ప్రయత్నం చేశారు. అయితే తమది జోగుళాంబ గద్వాల జిల్లాలోని గట్టు ప్రాంతమని పేపర్పై రాసి ఇవ్వడంతో.. రైల్వే పోలీసులు శనివారం గద్వాల ఆర్డీఓకు సమాచారం అందించారు. ఈ మేరకు వేలూరు రైల్వే స్టేషన్లో కనిపించిన వారి ఫొటోలను గట్టు తహసీల్దార్ విజయ్కుమార్కు పంపించి.. గుర్తించాల్సిందిగా చెప్పారు. రెవెన్యూ అధికారులు సామాజిక మాధ్యమాలతో పాటు వివిధ గ్రామాలకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులకు వీరి ఫొటోలను ఫార్వర్డ్ చేశారు. వారు ఎవరనే విషయాన్ని తెలియజేయాలని అభ్యర్థించారు. -
ఎస్పీ పర్యవేక్షణ
మహబూబ్నగర్ క్రైం: బీసీ రిజర్వేషన్ సాధన కోసం బీసీ జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపు సందర్భంగా శనివారం ప్రజా సంఘాలు, పలు పార్టీలు చేస్తున్న కార్యక్రమాలపై బందోబస్తును ఎస్పీ జానకి ప్రత్యేకంగా పర్యవేక్షించారు. ప్రధానంగా జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్తోపాటు ప్రధాన చౌరస్తాలను ఎస్పీ పరిశీలించారు. అలాగే వ్యాపార కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలను సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో ముందస్తు చర్యలు తీసుకున్నామని, అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో అదనపు బందోబస్తు, రోడ్లపై పెట్రోలింగ్, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ చేశామన్నారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని, ప్రభుత్వ ఆస్తులకు ఎలాంటి నష్టం జరగలేదన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ రత్నం, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, గిరిబాబు, సీఐలు తదితరులు పాల్గొన్నారు. -
జర్నలిస్టులపై దాడులు దుర్మార్గం
● ‘సాక్షి’పై ఏపీ ప్రభుత్వం వేధింపులు మానుకోవాలి పాలమూరు: సమాజంలో ఫోర్త్ పిల్లర్గా పేరొందిన మీడియాపై కక్ష్యసాధింపు చర్యలకు ప్రభుత్వాలు పూనుకోవడం అప్రజాస్వామికమని, దుర్మార్గపు చర్య అని మేధావులు అభిప్రాయపడ్డారు. ఇటీవల కాలంలో ఏపీ కూటమి ప్రభుత్వం ‘సాక్షి’ పత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డితోపాటు జర్నలిస్టులపై అక్రమ కేసులతోపాటు వేధింపులకు గురిచేస్తున్న క్రమంలో పలువురు సంఘాల నాయకులు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. బెదిరింపులు సరికాదు.. ప్రజాస్వామ్యంలో అన్ని పత్రికలు సమానమే. ఏ పత్రిక అయినా ప్రజల పక్షానే ప్రశ్నిస్తుంది. అంతే తప్పా ప్రశ్నించే గొంతులకు నొక్కివేసే ప్రయ త్నం చేయకూడదు. నిజంగా తప్పు జరిగి ఉంటే చట్టబద్ధంగానే చర్యలు తీసుకోవాలి తప్పా.. బెదిరింపు ధోరణి సరైన విధానం కాదు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టు వంటిది. – భరత్, ఎస్ఎఫ్ఐ కార్యదర్శి దాడులను ఖండించాలి.. ప్రజా సమస్యలపై ప్రజా స్వామ్యబద్ధంగా పోరాటం చేసే పత్రికలపై ప్రభుత్వాలు దాడులు చేయడం, కేసులతో నిర్బంధం చేయడం తగదు. పత్రికా స్వేచ్ఛను హరిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు. ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, ప్రతిఒక్కరూ పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న దాడులను ఖండించాలి. – బాలకిషన్, సిపిఐ జిల్లా కార్యదర్శి ● -
పత్రికా స్వేచ్ఛ హరిస్తున్నారు
రాజ్యాంగబద్ధంగా కల్పించిన పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న ‘సాక్షి’పై దాడు లు, పోలీసుల బెదిరింపు లు తగవు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పత్రికలకు విమర్శ చేసే హక్కు, ప్రజలు, ప్రభుత్వాల కు వారధిగా ఉండేలా రాజ్యాంగం కల్పించిన హక్కు. మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, సా మాజిక స్పృహ కలిగిన వారు ‘సాక్షి’ పత్రిక, చా నల్పై చేస్తున్న కక్ష్యపూరిత చర్యను ఖండించాలి. – ఎన్.కురుమూర్తి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ప్రజలే తిరగబడతారు.. మీడియా గొంతు నొక్కితే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు. సమాజంలో నాలుగో స్తంభం పత్రిక. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక అన్ని రాష్ట్రాల్లో ప్రజల అభిప్రాయాలను వ్యక్తం చేయకుండా తమ భావజాలాన్ని ప్రచారం చేయాలని ఒత్తిడి చేస్తుంది. పత్రికా స్వేచ్ఛ హరిస్తోంది. అణచివేతకు గురిచేసిన ప్రభుత్వాలకు గతంలో ఏ గతి పట్టిందో అదేగతి ఈ ప్రభుత్వాలకు పడుతుంది. – రాములు, సీపీఎం జిల్లా కార్యదర్శి -
రిజర్వేషన్లు ఇచ్చేవాళ్లు రోడ్లపైకి రావడం విడ్డూరం
జెడ్పీసెంటర్: రిజర్వేషన్ ఇచ్చేవాళ్లు రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బంద్లో భాగంగా తెల్లవారు జామున 5 గంటలకే బస్సులు బయటకు రాకుండా బస్టాండ్ ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రిజర్వేషన్ అంశాన్ని రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ బంద్లో పాల్గొని ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ ఇచ్చిన హామీ అమలు చేయాలన్నారు. పార్లమెంట్లో బిల్లు పెట్టి బీసీ రిజర్వేషన్ ఇవ్వగలిగే బీజేపీ కూడా ధర్నా చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ రెండు పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో ధర్నా చేయాలని డిమాండ్ చేశారు. బీసీల సంక్షేమానికి పదేళ్లలో బీఆర్ఎస్ అనేక కార్యక్రమాలు చేపట్టిందని, బీసీలకు ప్రత్యేక కార్పొరేషన్, పేదలకు రుణాలు, బీసీ విద్యార్థులు చదువుకునేందుకు గురుకులాలు ఏర్పాటు చేసిందని వివరించారు. -
బంద్ సంపూర్ణం
జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన బీసీ బంద్ నిర్మానుష్యంగా మారిన జిల్లాకేంద్రంలోని కొత్త బస్టాండ్స్టేషన్ మహబూబ్నగర్/ జెడ్పీసెంటర్/ మహబూబ్నగర్ క్రైం: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ శనివారం చేపట్టిన తెలంగాణ బంద్ జిల్లాలో ప్రశాంతంగా, సంపూర్ణంగా జరిగింది. వ్యాపారులు ఉదయం నుంచే దుకాణాలను బంద్ చేయగా.. ఆర్టీసీ బస్సులు డిపోలు, బస్టాండ్లలోనే నిలిచిపోయాయి. ఉదయం నుంచే ప్రధాన పార్టీల నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్కు చేరుకొని బస్టాండ్ గేటు ఎదుట బైఠాయించి.. బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం మహబూబ్నగర్ డిపోకు చెందిన 137 బస్సులు నిలిచిపోయాయి. మధ్యాహ్నం 3 గంటల తర్వాత బస్సులు రోడ్డెక్కాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బస్సుల బంద్తో డిపోకు సంబంధించిన రోజువారీ ఆదాయంపై ప్రభావం ఏర్పడింది. ముందస్తుగా తెలంగాణ బంద్ సమాచారం ఉండడంతో బస్టాండ్లో ప్రయాణికులు చాలా తక్కువ సంఖ్యలో కనిపించారు. ముందుగా ఆర్టీసీ బస్టాండ్ గేటు ఎదుట బీఆర్ఎస్ నాయకులు బైఠాయించి బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్గౌడ్, నాయకులు శివరాజు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నాయకులు పార్టీ కార్యాలయం నుంచి మోటార్ సైకిల్ ర్యాలీ చేపట్టి బస్టాండ్ గేటు ఎదుట నిరసన చేపట్టారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, నాయకులు నాగేశ్వర్రెడ్డి, అంజయ్య, రమేష్కుమార్, పాండురంగారెడ్డి, సతీష్కుమార్, కృష్ణవేణి, యాదమ్మ పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు ఆర్అండ్బీ చౌరస్తా నుంచి ప్రధాన వీధుల మీదుగా మోటార్బైక్ ర్యాలీలు చేపట్టారు. స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో సమూహంగా ఏర్పడి నినాదాలు చేశారు. రాష్ట్ర ఫిషరిస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లుకు చట్టబద్ధతతోపాటు రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్గౌడ్, నాయకులు సంజీవ్ ముదిరాజ్, మైత్రియాదయ్య, బీసీ జేఏసీ నాయకులు బెక్కం జనార్దన్, శ్రీనివాస్సాగర్, సారంగి లక్ష్మీకాంత్, మున్నూరు రాజు తదితరులు గేటు ఎదుట నిరసన చేపట్టారు. ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్ చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ఆటోలతో ర్యాలీ తీశారు. అఖిలభారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో సంప్రదాయమైన డోలుతో బస్టాండ్ గేటు వరకు ర్యాలీ నిర్వహించారు. మోటార్బైక్ మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. వామపక్ష పార్టీలు సీపీఎం, సీపీఐ, సీపీఐ ఎంఎల్ మాస్లైన్, టీఎఫ్టీయూ, సబ్బండ ప్రజా సంఘాలు పట్టణ పురవీధుల్లో ప్రదర్శనలు, తెలంగాణ చౌరస్తా, క్లాక్టవర్, అంబేద్కర్ చౌరస్తాలో సభలు నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి రాములు, సీపీఐ జిల్లా కార్యదర్శి బాలకిషన్, ఆయా ప్రతినిధులు రామచందర్, ఎస్ఎం ఖలీల్, హనీఫ్ అహ్మద్, రాఘవాచారి, కిల్లె గోపాల్, కురుమూర్తి, తిరుమలయ్య, చంద్రకాంత్, రాజ్కుమార్, పాష, విజయ్కుమార్, సురేష్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. డిపోలు, బస్టాండ్లకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు స్వచ్ఛందంగా దుకాణాలు తెరవని వ్యాపారులు బస్టాండ్ గేటు ఎదుట పార్టీలు, బీసీ సంఘాల నేతల బైఠాయింపు జిల్లాకేంద్రంలో బైక్, ఆటోల ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు -
డీసీసీ అధ్యక్షుడి ఎంపికకు సీఎం అభిప్రాయం
● ఏఐసీసీ పరిశీలకుడు, ఎమ్మెల్సీ ఎం.నారాయణస్వామి స్టేషన్ మహబూబ్నగర్: నారాయణపేట డీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం స్వయంగా సీఎం రేవంత్రెడ్డి అభిప్రాయాన్ని ఫోన్ ద్వారా తీసుకున్నామని ఏఐసీసీ పరిశీలకుడు, కర్ణాటకకు చెందిన ఎమ్మెల్సీ ఎం.నారాయణస్వామి అన్నారు. మహబూబ్నగర్ డీసీసీ అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి శనివారం జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహబూబ్నగర్ అర్బన్ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘటన్ సృజన్ అభియాన్ ద్వారా కాంగ్రెస్ నాయకులు, పార్టీ ప్రతినిధుల అభిప్రాయాలతో డీసీసీ అధ్యక్షుడి నియామకంపై ఏఐసీసీ నేతృత్వంలో టీపీసీసీ ఆధ్వర్యంలో తుది నిర్ణయం ఉంటుందని, ఎవరూ ఎలాంటి అపోహలు లేకుండా అభిప్రాయాలు తెలియజేయాలని సూచించారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ చేపట్టిందన్నారు. పంచాయతీ, మున్సిపల్, జెడ్పీ, మండల పరిషత్ ఎన్నికలు ముందున్నాయని, వీటిని దృష్టిలో పెట్టుకొని పార్టీని ఎవరు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలరో, ఎవరు డీసీసీ అధ్యక్షుడిగా ఉంటే పార్టీ పటిష్టంగా ఉంటుందో గ్రహించి వారి పేరును ఏఐసీసీ పరిశీలకులకు తెలియజేయాలన్నారు. అనంతరం ఏఐసీసీ పరిశీలకులు నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను తీసుకున్నారు. అదేవిధంగా హన్వాడ, మహబూబ్నగర్ రూరల్ మండలాలకు సంబంధించి అభిప్రాయ సేకరణ ఓ కన్వెన్షన్ హాల్లో చేపట్టారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి, టీజీఎంఎఫ్సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, పీసీసీ పరిశీలకులు సాయికుమార్, ఉజ్మా షాకీర్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్గౌడ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్, అధికార ప్రతినిధులు హర్షవర్ధన్రెడ్డి, జహీర్ అఖ్తర్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వసంత, నాయకులు వినోద్కుమార్, ఎన్పీ వెంకటేశ్, చంద్రకుమార్గౌడ్, మన్నె జీవన్రెడ్డి, సురేందర్రెడ్డి, రాధ, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. -
బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిద్దాం
చిన్నచింతకుంట: కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు, జాతర ఉత్సవాలు వైభవంగా నిర్వహిద్దామని ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి అన్నారు. గురువారం చిన్నచింతకుంట మండలంలోని దమగ్నాపురంలో ఎమ్మెల్యే నివాసంలో కురుమూర్తి స్వామి ఆలయ పాలక మండలితో కలిసి స్వామి వారి బ్రహ్మోత్సవాల వాల్పోస్టర్ను విడుదల చేశారు. అనంతరం ఆలయం వద్ద కొనసాగుతున్న పనులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ సంవత్సరం కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు, జాతర ఉత్సవాలు వైభవంగా జరుపుకుందామన్నారు. అందుకు ఆలయం వద్ద పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఉత్సవాలకు తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ మధనేశ్వరెడ్డి, పాలక మండలి సభ్యులు, తదితరులు ఉన్నారు. -
చెంచుల అభ్యున్నతికి పథకాలు
● క్షయ రహిత దేశంగా తీర్చిదిద్దడంలో కళాకారులు, రచయితలుభాగస్వాములు కావాలి ● గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): ఆదివాసీ చెంచుల సమగ్ర, సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు జిల్లాలో ఉన్న 1,441 మంది లబ్ధిదారులకు చేరాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కోరారు. గురువారం మహబూబ్నగర్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అధికారులు, వివిధ రంగాల ప్రముఖులతో నిర్వహించిన ముఖాముఖిలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వయం ఉపాధి, సౌర విద్యుత్, పక్కా ఇళ్లు, విద్య తదితర పథకాలు చెంచులకు అందేలా చూడాలన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో క్షయ పరీక్షలు నిర్వహించి వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యం అందించాలని, క్షయ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సూచించారు. సామాజిక కార్యకర్తలు, ప్రముఖులు, రచయితలు, కవులు, కళాకారులు వీధి నాటకాలు, జానపద గేయాలు, రచనలతో మూడ నమ్మకాలు, సామాజిక రుగ్మతలను పారద్రోలడానికి తమవంతు కృషి చేయాలన్నారు. చెంచులు, ఆదివాసీ మహిళలను మహిళా సంఘాల్లో చేర్చుకొని వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడాలని కోరారు. అంతకుముందు కలెక్టర్ విజయేందిర బోయి మహబూబ్నగర్ జిల్లా విశిష్టత, ప్రముఖ పర్యాటక స్థలాలు, విద్య, వెద్యం, వివిధ శాఖల్లో సాధించిన అభివృద్ధిని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. విద్య, వైద్యం, క్రీడలు, రచనలు, సేంద్రియ సాగు, సామాజిక సేవ తదితర రంగాల్లోని 16 మంది ప్రముఖులు ఆయా రంగాల్లో చేసిన సేవలను తెలియజేశారు. మొక్క నాటిన గవర్నర్.. కలెక్టరేట్ ఆవరణలో గవర్నర్ మొక్కనాటి నీరు పోశారు. పచ్చదనంతో పర్యావరణానికి మేలు చేకూరుతుందని.. మొక్కలను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్రెడ్డి, జి.మధుసూదన్రెడ్డి, గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ దానకిషోర్, డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, ఎస్పీ డి.జానకి వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. గవర్నర్కు ఘన స్వాగతం.. కలెక్టరేట్కు చేరుకున్న గవర్నర్కు కలెక్టర్ విజయేందిర బోయి, అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మధుసూదన్నాయక్ స్వాగతం పలకగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించిన అనంతరం గ్రామీణాభివృద్ధి, వైద్య, మెప్మా, రెడ్క్రాస్ సొసైటీ, మహిళా, శిశుసంక్షేమ తదితర శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను గవర్నర్ తిలకించారు. చెంచుల ఆరోగ్య పరీక్షల నిర్వహణకుగాను ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయమహా అభియాన్ కింద సంచార వైద్య వాహనాన్ని గవర్నర్ జెండా ఊపి ప్రారంభించారు. -
హైవేపై దారి మళ్లింపు
● కర్నూలులో ప్రధాని మోదీ పర్యటన ● తెలంగాణ సరిహద్దులో ట్రాఫిక్ ఆంక్షలు ● జాతీయరహదారిపై నిలిచిన వాహనాలు ● దారి మళ్లించే ప్రాంతాల్లో ఏపీ పోలీసులు అలంపూర్/మానవపాడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ జిల్లాలో గురువారం ప్రధాని మోదీ పర్యటన కారణంగా జాతీయ రహదారి నుంచి ప్రత్యామ్నాయ మార్గాలకు వాహనాలను మళ్లించారు. పోలీసులు సూచించిన రోడ్డు మార్గాల ద్వారా వాహనదారులు తమ గమ్యస్థానాలకు తరలివెళ్లారు. కర్నూల్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేయడంతో పాటు ప్రధాని భారీ బహిరంగ సభలో పాల్గొనందున అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో సరిహద్దు ప్రాంతమైన అలంపూర్ నియోజకవర్గంలో ఈ పరిస్థితి రోజంతా కొనసాగింది. దీంతో అలంపూర్, అలంపూర్ చౌరస్తా, శాంతినగర్, అయిజ వంటి ప్రాంతాలు వాహనాలతో రద్దీగా మారాయి. అలంపూర్ సీఐ రవిబాబు, ఉండవెల్లి ఎస్ఐ శేఖర్, అలంపూర్ ఎస్ఐ వెంకటస్వామి ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలను దారి మళ్లించి, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షించారు. అలంపూర్ చౌరస్తాలోని జాతీయ రహదారి ఫ్లైఓవర్ వద్ద ఏపీకి చెందిన సీఐ, పోలీసులు సైతం ట్రాఫిక్ మళ్లింపులో భాగస్వాములయ్యారు. ఉదయం నుంచి ఒక్కసారిగా వచ్చిన వాహనాలతో ఫ్లైఓవర్, జాతీయ రహదారిలో రద్దీ ఏర్పడింది. వాహనదారులు ఇబ్బందులు పడకుండా దారి మళ్లించే ప్రదే శాల్లో ఆయా ప్రాంతాల పేర్లు, గుర్తులతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే మొదట్లో ఏపీ పోలీసులు లారీ వంటి వాహనాలతో పాటు కార్లను సైతం దారి మళ్లించారు. దీంతో జాతీయరహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. సీఐ రవిబాబు ఇక్కడికి చేరుకోని కార్ల లాంటి చిన్న వాహనాలను నేరుగా జాతీయరహదారి గుండా వెళ్లడానికి అవకా శం కల్పించారు. దీంతో ట్రాఫిక్ సమస్య సద్దుమణిగింది. భారీ వాహనాల నిలిపివేత కర్నూల్ జిల్లాలోని నన్నూరులో ప్రధాని భారీ బహిరంగ సభ నేపథ్యంలో మానవపాడు స్టేజీ సమీపంలో జాతీయ రహదారి–44పై భారీ వాహనాలను పోలీసులు నిలిపివేశారు. దీంతో బెంగుళూరు, అనంతపురం, హిందూపురం, పుట్టపర్తికి వెళ్లే వాహనాదారులు ఇబ్బందులు పడ్డారు. -
ఈగలపెంట వద్ద..
దోమలపెంట: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన సందర్భంగా గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎన్ఎస్జీ అధికారుల ఆదేశాల మేరకు విజయవాడ డీఎస్పీ వి.వేణుగోపాల్రెడ్డి ఆధ్వర్యంలో ఏపీ పోలీసులు ఈగలపెంటలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగించారు. ఆర్టీసీ బస్సులు, ఇతరత్రా వాహనాలన్నింటిని జెన్కో గ్రౌండ్లోకి మళ్లించి అక్కడే నిలిపి వేశారు. సరిగ్గా మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సున్నిపెంట నుంచి ప్రధానమంత్రి హెలికాప్టర్లో బయలుదేరిన తర్వాత వాహనాల రాకపోకలు కొనసాగించారు. ఈగలపెంట ఎస్ఐ జయన్న ఆధ్వర్యంలో స్థానిక పోలీసులు ఏపీ పోలీసులకు సహకరించారు. -
పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు
అలంపూర్: పురావస్తు శాఖ ఆధ్వర్యంలో పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర పురావస్తు శాఖ సూపరింటెండెంట్ నిఖిల్దాస్ తెలిపారు. అలంపూర్ పట్టణంలోని పాపనాశిని ఆలయాల్లో గార్డెన్ పనులను గురువారం కేంద్ర పురావస్తు శాఖ సూపరింటెండెంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అలంపూర్ ఆలయాల సముదాయాన్ని కేంద్ర పురావస్తు శాఖ, హైదరాబాద్ ఆధ్వర్యంలో రూ.50 లక్షలతో అభివృద్ధికి చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. మొదటి విడతలో భాగంగా రూ. 20 లక్షలతో పను లు ప్రారంభించామని తెలిపారు. పాపనాశిని, సంగమేశ్వర ఆలయాల ప్రాముఖ్యత భక్తులకు, పర్యాటకుల తెలిసే విధంగా ప్రచార చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జోగుళాంబ అమ్మవారి 5వ శక్తి పీఠ క్షేత్రం కావడంతో కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీంలో భాగంగా అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ఆలయాల సందర్శన అలంపూర్ క్షేత్రంలో వెలిసిన జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి వారి ఆలయాలను కేంద్ర పురాతత్వ శాఖ సూపరింటెండెంట్ నిఖిల్దాస్ గురువారం దర్శించుకున్నారు. అనంతరం ఆయన ఈఓ దీప్తితో కలిసి ఆలయాల్లో చేపట్టాల్సిన పనులను పరిశీలించారు. వీరితో పాటు కేంద్ర పురాతత్వ శాఖ కన్సర్వేషన్ అసిస్టెంట్ వెంకటయ్య, సిబ్బంది తదితరులు ఉన్నారు. -
నగరంలో తాగునీటికి కటకట!
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలో పది రోజులుగా 65 శాతం ప్రాంతాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీనికి ప్రధాన కారణం మిషన్ భగీరథ పథకం పైపులైన్లకు లీకేజీలు ఏర్పడటమే. దీంతో రాంరెడ్డిగూడెం ఫిల్టర్బెడ్ పరిధిలోకి వచ్చే నగరంలోని ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భగీరథకాలనీ, బీకేరెడ్డికాలనీ, నాగిరెడ్డికాలనీ, బీఎన్రెడ్డికాలనీ, బాలాజీనగర్, క్రిస్టియన్పల్లి, అయోధ్యనగర్, పాతపాలమూరు, బండమీదిపల్లి, హనుమాన్పురా, గణేష్నగర్, వల్లభ్నగర్, కిసాన్నగర్, బండ్లగేరి, వీరన్నపేట, టీడీగుట్ట, కోయిల్కొండ ఎక్స్రోడ్, చిన్నదర్పల్లి, కొత్తచెరువురోడ్, కొత్తగంజి, హనుమాన్నగర్, సింహగిరి, మోతీనగర్, రైల్వేస్టేషన్ ఏరియా, సుభాష్నగర్, కోర్టురోడ్, బోయపల్లి తదితర ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోయింది.. ● నగరంలోని 60 డివిజన్ల పరిధిలో మూడు లక్షల పైచిలుకు మంది ప్రజలు నివసిస్తున్నారు. 2020 నుంచి మిషన్ భగీరథ పథకం ద్వారా మొత్తం 28 ఓవర్హెడ్ ట్యాంకులను నింపుతున్నారు. ఇంటింటికీ తాగునీటిని రెండు రోజులకోసారి సరఫరా చేస్తున్నారు. అయితే సుమారు 20 ఏళ్ల క్రితం పాత పైపులైన్లకు మిషన్ భగీరథ లైన్లు కలపడంతో తరచూ అవి ఎక్కడబడితే అక్కడి పగిలిపోతున్నాయి. అలాగే మెయిన్ పైపులైన్కు సైతం లీకేజీలు ఏర్పడుతున్నాయి. తాజాగా ఈ నెలలో ఎన్హెచ్–167పై స్థానిక షాషాబ్గుట్ట మలుపు వద్ద, రాంరెడ్డిగూడెం, ధర్మాపూర్ శివారులో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో రాంరెడ్డిగూడెం ఫిల్టర్బెడ్ పరిధిలోని ఆయా ప్రాంతాలకు తాగునీరు నిలిచిపోయింది. వీటిని బాగుచేయడానికి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు వారం రోజులు పట్టడంతో అందరూ అల్లాడిపోయారు. మూడు రోజుల నుంచే ట్యాంకర్లను పంపించగలిగారు. చివరకు గురువారం తెల్లవారుజామున పునరుద్ధరించి ఆయా ఓవర్హెడ్ ట్యాంకులను నింపారు. ఉదయం నుంచి భగీరథకాలనీ, బాలాజీనగర్ తదితర ప్రాంతాలకు తాగునీటి సరఫరా ఆరంభం కావడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. వీలైనంత త్వరగా విడతల వారీగా మిగతా ప్రాంతాలకు నీటి సరఫరా పునరుద్ధరిస్తామని అధికారులు చెబుతున్నారు. రాంరెడ్డిగూడెం, ధర్మాపూర్ శివారులో పైపులైన్లకు లీకేజీ మరమ్మతుల పేరిటమున్సిపల్ అధికారుల కాలయాపన పది రోజులుగా 65 శాతం ప్రాంతాలకు అందని వైనం మూడు రోజుల నుంచి ట్యాంకర్ల ద్వారా సరఫరా ఎట్టకేలకు ఓవర్హెడ్ ట్యాంకులకు పంపింగ్ కావడంతో కొంత ఊరట -
మెజార్టీ అభిప్రాయం మేరకు డీసీసీ అధ్యక్షుల ఎంపిక
● ఏఐసీసీ పరిశీలకుడు, ఎమ్మెల్సీ నారాయణస్వామి దేవరకద్ర/అడ్డాకుల: మెజార్టీ అభిప్రాయం మేరకు డీసీసీ అధ్యక్షులను ఎంపిక చేస్తారని ఏఐసీసీ పరిశీలకుడు, కర్ణాటక రాష్ట్ర ఎమ్మెల్సీ నారాయణస్వామి పేర్కొన్నారు. గురువారం దేవరకద్ర, అడ్డాకులలో దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన ఆయా మండలాల సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డితో పాటు మత్స్యశాఖ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి, టీపీసీసీ పరిశీలకుడు ఉజ్మాషాకీర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించి ఈ నెల 22న ఏఐసీసీకి నివేదిక అందిస్తామని వెల్లడించారు. మెజార్టీ అభిప్రాయం మేరకు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని జిల్లా అధ్యక్షుడి ఎంపికపై ఏఐసీసీ తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఉంటుందని ఏఐసీసీ తీసుకునే నిర్ణయం కూడా అభిప్రాయాలకు అనుకూలంగా ఉంటుందని చెప్పారు. జిల్లా అధ్యక్షుడి ఎంపిక పూర్తి పారదర్శకంగా, అందరి అభిప్రాయం మేరకు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఏఐసీసీ తుది నిర్ణయం తీసుకుంటుందని ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి పేర్కొన్నారు. ఆయా సమావేశాల్లో మాజీ ఎమ్మెల్యే స్వర్ణసుధాకర్రెడ్డి, టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవింద్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు శ్రీహరి, శెట్టి శేఖర్, శ్రీనివాస్రెడ్డి, అంజిల్రెడ్డి, నాగార్జున్రెడ్డి, రాఘవేందర్రెడ్డి, నాగిరెడ్డి, బగ్గి కృష్ణయ్య, గోవర్దన్రెడ్డి, కతలయ్య, నర్సింహారెడ్డి, లక్ష్మీకాంత్రెడ్డి, దశరథ్రెడ్డి, విజయమోహన్రెడ్డి, బాలస్వామి, వెంకటేశ్, కిషన్రావు, రాంపాండు, ఆదిహన్మంతరెడ్డి, అంజన్కుమార్రెడ్డి, ఫారూఖ్, కోనరాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
విలువలు పెంపొందించుకోవాలి
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు సమాజానికి టార్చ్బేరర్గా నిలవాలని, సమాజాన్ని, దేశాన్ని మార్చేందుకు తమవంతు కృషి చేయాలన్నారు. స్నాతకోత్సవం అనేది కేవలం పట్టాల ప్రదానోత్సవం మాత్రమే కాదని.. అది విద్యార్థి కృషి, ఉపాధ్యాయుల సేవ, తల్లిదండ్రుల త్యాగాలను స్మరించుకునే సందర్భం అన్నారు. విద్య యొక్క అసలు లక్ష్యం ఉద్యోగం పొందడమే కాదని.. అది వ్యక్తిత్వం, విలువలు, జీవన నైపుణ్యాలను అభివృద్ధి చేయడం అన్నారు. పీయూలో చాలా అభివృద్ధి జరిగిందని, ఇక్కడ చేస్తున్న అనేక కార్యక్రమాలు ఆకర్షణీయంగా ఉన్నాయన్నారు. ముఖ్యంగా మిలియన్ ట్రీ ప్లాంటేషన్, యూనివర్సిటీ విద్యార్థులు గ్రామాలను దత్తత తీసుకోవడం, కనెక్ట్ విత్ చాన్స్లర్ వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. తెలంగాణలో ఏ యూనివర్సిటీ సాధించలేని విధంగా పీయూ పీఎం ఉషా స్కీం ద్వారా రూ.100 కోట్లు సాధించడం ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. యూనివర్సిటీ ఈ సంవత్సరం న్యాక్ రెండోసారి వెళ్లడం మంచి పరిణామం అని, ఉన్నత విద్యకు కృషి చేసే యూనివర్సిటీలు ఆధునిక దేవాలయాలుగా నిలుస్తున్నాయన్నారు. ఇలాంటి యూనివర్సిటీలు రీసెర్చి, ఇంక్యూబేషన్ సెంటర్లుగా మారి విద్యార్థుల ద్వారా కొత్త స్టార్టప్లు ఏర్పాటు కోసం కృషి చేయాలన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.. పీయూలో ఇటీవల లా, ఇంజినీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేయడం శుభపరిణామం అని గవర్నర్ అన్నారు. ఇంజినీరింగ్లో డాటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషన్ లర్నింగ్ వంటి ఆధునిక కోర్సులు ప్రారంభించిన మొదటి సంవత్సరంలో 100 శాతం అడ్మిషన్లు సాధించడం అభినందిచదగ్గ విషయమన్నారు. ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎంలో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ సబ్జెక్టులతో ఇక్కడి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా మారుతుందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ–2020తో విద్యార్థులకు చదువుతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చేందుకు ఎంతో దోహదపడుతుందని తెలిపారు. స్నాతకోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్బాబు అభినందించారు. -
ఎట్ల జీవనం సాగించాలి..
వారం రోజుల నుంచి నీళ్లు రాకపోతే ఎట్ల జీవనం సాగించాలి. ఎప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందిని అడిగినా పైపులైన్లు పగులుతున్నాయని చెబుతున్నారు. వీటికి త్వరగా మరమ్మతులు చేసి ఇంటింటికీ మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు చేయాలి. మా ప్రాంతంలో కొన్ని నెలలుగా ఈ సమస్య తరచూ తలెత్తుతోంది. అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టి రెండు రోజులకోసారైనా క్రమం తప్పకుండా ఇంటింటికీ తాగునీటిని అందించాలి. – కమల, గృహిణి, క్రిస్టియన్కాలనీ, సుభాష్నగర్ లీకేజీలను బాగు చేశాం నగరంలోని రాంరెడ్డిగూడెం వద్ద, ధర్మాపూర్ శివారులో అలాగే ఎన్హెచ్–167పై షాషాబ్గుట్ట మలుపు వద్ద మిషన్ భగీరథ పథకం పైపులైన్లకు పది రోజుల వ్యవధిలోనే భారీగా ఏర్పడిన లీకేజీలను బాగు చేయడానికి కొంత సమయం పట్టింది. గురువారం ఉదయం నుంచి తిరిగి తాగునీటి సరఫరాను పునరుద్ధరించగలిగాం. రాంరెడ్డిగూడెం ఫిల్టర్బెడ్ పరిధిలోని ఆయా ప్రాంతాలకు విడతల వారీగా తాగునీరు అందుతుంది. ఈ పది రోజుల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ఆయా ప్రాంతాలకు నిత్యం 20 ట్యాంకర్లను పంపించాం. – నర్సింహ, ఇన్చార్జ్ ఎంఈ, మున్సిపల్ కార్పొరేషన్, మహబూబ్నగర్ తాగునీరు రాక 20 రోజులైంది.. మా తండాలో 60 నుంచి 70 వరకు కుటుంబాలు ఉంటాయి. 20 రోజుల నుంచి మిషన్ భగీరథ పథకం నుంచి తాగునీరు ఇంటింటికీ అందడం లేదు. దీంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. సమీపంలోని వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్లి తెచ్చుకుంటున్నాం. కనీసం మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా వాటర్ ట్యాంకర్లను మా ప్రాంతానికి పంపిస్తే సమస్య కొంత తీరుతుంది. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. – నీలిబాయి, మహిళా సంఘం అధ్యక్షురాలు, పూజారితండా, చిన్నదర్పల్లి ● -
భారీ పోలీస్ భద్రత ఏర్పాట్లు
మహబూబ్నగర్ క్రైం: పాలమూరులో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. దాదాపు 400 మంది పోలీస్ బలగాలు బందోబస్తులో పాల్గొన్నారు. పాలమూరు యూనివర్సిటీ నాలుగో స్నాతకోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ హాజరైన సందర్భంగా పోలీసులు పహారా కాశారు. బందోబస్తును జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, ఎస్పీ డి.జానకి పర్యవేక్షించారు. ఎప్పటికప్పుడు డీఐజీ బందోబస్తు పర్యవేక్షిస్తూ విధుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వీడియో సర్వైలైన్స్, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. నార్కోటిక్ డ్రగ్స్ తయారు చేస్తే చర్యలు పాలమూరు: ఉమ్మడి జిల్లాలో ఏదైనా ప్రాంతాల్లో కానీ, ఇళ్లు, ఫ్యాక్టరీలలో నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ వంటి డ్రగ్స్ తయారీ కార్యకలాపాలు ఉంటే టోల్ ఫ్రీ నం.18005996969తోపాటు ఆయా జిల్లాల డ్రగ్ ఇన్స్పెక్టర్లకు సమాచారం ఇవ్వాలని జిల్లా ఔషధ నియంత్రణ శాఖ ఏడీ దినేష్కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మీ ఏరియాల్లో అనుమానాస్పదంగా కనిపించినా, ఎవరైనా వ్యక్తులు డ్రగ్ విక్రయాలు చేస్తున్నట్లు తెలిసిన వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలను గుర్తిస్తే నకిలీ, నాణ్యత లేని మందులను మార్కెట్లోకి రాకుండా నివారించవచ్చని చెప్పారు. ఖాళీ సీట్ల భర్తీకిదరఖాస్తుల ఆహ్వానం మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాలోని బాలానగర్, దేవరకద్ర, రాంరెడ్డి గూడెం, జడ్చర్ల, నంచర్ల గురుకులాల్లో 5 నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కోఆర్డినేటర్ వాణిశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు. టీజీసెట్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని, ఈనెల 18 లోగా ఆయా గురుకులల్లో తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. నేడు వాలీబాల్ జట్టు ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని డీఎస్ఏ స్టేడియంలో శుక్రవారం ఉమ్మడి జిల్లా అండర్–19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వాలీబాల్ జట్టు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ శారదాబాయి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఒరిజినల్ మెమో, బోనోఫైడ్తో ఉదయం 9 గంటలకు ఎంపికలకు హాజరుకావాలని ఆమె కోరారు. 19న ఉమ్మడి జిల్లా ఖోఖో జట్ల ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: కల్వకుర్తి పట్టణంలో ఈనెల 19న ఉదయం 9 గంటలకు ఉమ్మడి జిల్లా ఖోఖో సీనియర్ పురుషుల, మహిళా జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ఖోఖో సంఘం ప్రధాన కార్యదర్శి జీఏ విలియం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దపల్లిలో వచ్చేనెల 6 నుంచి 8వ తేదీ వరకు రాష్ట్రస్థాయి సీనియర్ ఖోఖో పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ఎంపికల్లో పాల్గొనేవారు ఒరిజినల్ ఆధార్కార్డుతో హాజరుకావాలని, మిగతా వివరాల కోసం సీనియర్ క్రీడాకారుడు రాజు (9985022847) నంబర్ను సంప్రదించాలని సూచించారు. యోగాసన క్రీడాజట్ల ఎంపికలు ఉమ్మడి జిల్లా యోగాసన సబ్ జూనియర్, జూనియర్ విభాగాల బాల, బాలికల జట్ల ఎంపికలను ఈనెల 19వ తేదీన ఉదయం 9 గంటలకు జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా యోగాసన క్రీడా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కె.రాములు, ఆర్.బాల్రాజు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 8–10, 10–12, 12–14, 14–16, 16–18 ఏళ్లలోపు క్రీడాకారుల ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. క్రీడాకారులు బోనఫైడ్ సర్టిఫికెట్, ఒరిజనల్ ఆధార్కార్డుతో ఎంపికలకు హాజరుకావాలని కోరారు. మిగతా వివరాల కోసం 9440292044 నంబర్కు సంప్రదించాలని వారు సూచించారు. -
యువకుడి ఆత్మహత్య
బిజినేపల్లి: మండలంలోని ఖీమ్యాతండా జీపీ పెద్ద వే ములతండాకు చెందిన కే తావత్ శివ (21) పురుగుల మందు తాగి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. పెద్దవేములతండాకు చెందిన శివ సోమవారం తండాలో పురుగుల మందు తాగాడు. విష యం గుర్తించిన కుటుంబ సభ్యులు శివను ఆస్పత్రికి తరలించారు.హైదారాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. నీటిగుంతలో పడి వ్యక్తి మృతి చిన్నచింతకుంట: మతిస్థిమితంలేని ఓవ్యక్తి నీటిగుంతలో పడి మృతిచెందిన ఘటన కౌకుంట్ల మండ లం గూడూర్ ఊకచెట్టువాగు సమీపంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. తిర్మలాపురం గ్రామానికి చెందిన దాసరి కృష్ణయ్య(55) కొన్నిరోజులుగా మతిస్థిమితంలేకుండా తిరుగుతున్నాడు. కృష్ణయ్యకు భార్యాపిల్లలు లేకపోవడంతో అక్క చెన్నమ్మతో ఉండేవాడు. రెండు రోజులుగా కనిపించకుండాపోయాడు. బుధవారం తెల్లవారుజామున గూడూర్ ఊకచెట్టు వాగు సమీపంలోని నీటిగుంతలో శవమై తేలాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి కుటుంబ సభ్యులు చేరుకొని మృతదేహాన్ని గ్రామానికి తరలించారు.ఈ విషయంపై ఎలాంటి ఫిర్యా దు అందలేదని ఎస్ఐ ఓబుల్రెడ్డి తెలిపారు. యువకుడి బలవన్మరణం నాగర్కర్నూల్ క్రైం: యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని నల్లవెల్లిలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్ ఐ గోవర్ధన్ కథనం ప్రకారం.. నల్లవెల్లికి చెందిన నవీన్(21) వ్యవసాయం చేసుకుని జీవ నం సాగిస్తున్నాడు. బుధవారం ఉదయం తండ్రి వెంకటయ్య వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి రాగా.. కొడుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించాడు. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఘటనకు సంబంధించి మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. విద్యుదాఘాతంతో వివాహిత మృతి గద్వాల క్రైం: ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మహిళ మృతి చెందినట్లు పట్టణ ఎస్ఐ కల్యాణ్కుమార్ తెలిపారు. ఏపీలోని నంద్యాల జిల్లాకు చెందిన దుర్గమ్మ(32) భర్త ఎల్లప్ప జీవనోపాధి నిమిత్తం నాలుగు నెలల క్రితం గద్వాలకు వచ్చారు. బీసీ కాలనీలోని ప్రైవేట్ స్థలంలో గుడిసె ఏర్పాటు చేసుకుని కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం సాయంత్రం నివాసం ఉంటున్న గుడిసెలో టేబుల్ ఫ్యాన్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురైంది. గమనించిన భర్త జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై భర్త ఎల్లప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. మహిళ ఆత్మహత్య కొల్లాపూర్ రూరల్: మండలంలోని సింగోటం సమీపంలో శ్రీవారి సముద్రం చెరువు కట్టపై పురుగుల మందు తాగి మహిళ మృతి చెందిన ఘటన చోటోచేసుకుందని ఎస్ఐ హృషికేశ్ తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్కు చెందిన మొట్టె లక్ష్మి(40) పురుగు మందుతాగి చనిపోయింది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఇప్పటికీ ఎలాంటి ఫిర్యాదు అందులేదన్నారు. కుటుంబ కలహాలే మృతికి కారణమని గ్రామస్తులు తెలిపారు. మృతురాలికి భర్త చంద్రయ్య, ఉన్నారు. గుప్తనిధుల కోసం తవ్వకాలు కేటీదొడ్డి: గుప్తనిధుల తవ్వకాలు చేపట్టిన ఘటన బుధవారం మండలంలో కలకలం రేపింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండల కేంద్రం నుంచి గువ్వలదిన్నె రోడ్డు పక్కనున్న ఆంజనేయస్వామి ఆలయంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. గుప్తనిధుల కోసం చేపట్టిన తవ్వకాలు అసంపూర్తిగా ఉన్నట్లు గుర్తించారు. దుండగులు చేతకాక మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయినట్లు గమనించారు. ఆలయంలో ఎలాంటి వస్తువులు, విగ్రహాలు ధ్వంసం కాలేదని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని పురాతన ఆలయాలపై దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భక్తులు ఆలయంలో పూజ నిర్వహించడానికి వెళ్లగా.. అక్కడి పరిస్థితిని గమనించి నిధుల కోసం తవ్వకాలు జరిగాయని చుట్టపక్కల గ్రామస్తులకు తెలియజేశారు. -
ప్రతి ఒక్కరూ హస్తకళల్లో నైపుణ్యం సాధించాలి
● టీజీ హస్తకళ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సువర్చల బల్మూర్: ప్రకృత్తిలో లభించే మట్టి, చెట్లు, రాళ్లతో అనేక రకాల వస్తువులు తయారు చేసే హస్త కళాకారుల నైపుణ్యతను ప్రోత్సహించాలని తెలంగాణ హస్తకళల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సువర్చల సూ చించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కేంద్రం తెలంగాణ హస్తకళల డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో మూడురోజుల అవగాహన, వర్క్షాప్ కా ర్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు చదువుతోపాటు హస్తకళలతో నేర్చుకోవాలని సూ చించారు. హస్తకళలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ చాటుతున్న యువతి, యువకులను గుర్తించి వారికి చేతి వృత్తులపై అవగాహన కల్పించి గుర్తింపుకార్డులతోపాటు ఉపాధి కల్పించి ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సహకరిస్తామన్నారు. ప్రతిఒక్కరూ హస్తకళలపై అభిరుచి పెంచుకోవాలని కోరారు. దేశంలో హస్తకళలకు ఉన్న గుర్తింపుతో భవిష్యత్లో ఈ రంగంలో రాణిస్తే ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని సూచించారు. మూడురోజులపాటు నిర్వహించే కార్యక్రమంలో క్రోచ్ వర్కు, హాండ్ ఎంబ్రాయిండరీ, వెదురు పనిముట్లపై వర్క్షాప్ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో శిక్షకులు నిమ్మలపద్మ, వెంకటమ్మ, మౌనిక, శ్రీబిఫిన్పాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
హత్య చేసి..
రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే యత్నం నాగర్కర్నూల్ క్రైం: వివాహేతర సంబంధానికి అడ్డుగా మారాడని కట్టుకున్న భర్తను ఓ భార్య హత్య చేయించింది. ఆ తర్వాత రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 12న నాగర్కర్నూల్ మండలం గుడిపల్లి గ్రామ శివారులో జరిగిన హత్య కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం నాగర్కర్నూల్ సీఐ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. నాగర్కర్నూల్ మండలం శ్రీపురం గ్రామానికి చెందిన మైనగాని రాములు (37) గుడిపల్లి శివారులో ఈ నెల 12న అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే మృతుడు మైనగాని రాములు ఇంట్లో 6 నెలల క్రితం బంగారం చోరీకి గురికాగా.. పెద్దముద్దునూరుకు చెందిన సురేశ్గౌడ్ తన మంత్ర శక్తితో కనిపెడతారని కుటుంబ సభ్యులు ఆశ్రయించారు. ఈ క్రమంలోనే మృతుడి భార్య మానసకు సరేశ్గౌడ్తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. మానస, సురేశ్గౌడ్ వ్యవహారం ఇంట్లో తెలియడంతో కలహాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే మానస తన భర్తను ఎలాగైనా హత్య చేయించాలని పథకం రచించింది. ఈ నెల 8న తన కుటుంబ సభ్యులతో కలిసి గుడిపల్లికి వెళ్తున్నామని.. నాలుగు రోజులు అక్కడే ఉంటామని సురేశ్గౌడ్కు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. అక్కడే తన భర్తను హతమార్చాలని చెప్పింది. ఈ మేరకు రాములును హత్య చేసేందుకు సురేశ్గౌడ్ తన వద్ద పనిచేస్తున్న వెన్నచర్ల గ్రామవాసి బాలపీరు, లక్ష్మీతండాకు చెందిన హన్మంతుతో రూ. 2.80 లక్షలకు ఒప్పందం చేసుకున్నాడు. ఆ తర్వాత మానసకు ఫోన్చేసి రాములును హతమార్చేందుకు ఓ పార్టీ ఉందని.. అతడితో కలిసి పెద్దముద్దునూరుకు రావాలని చెప్పాడు. ఇవేవీ తెలియని రాములు తన భార్యతో కలిసి పెద్దముద్దునూరుకు వెళ్లగా.. అక్కడ మద్యం తాగించారు. అనంతరం నిందితుడు సురేశ్గౌడ్ తన కారులో గుడిపల్లి శివారులోని కేఎల్ఐ కాల్వ వద్దకు తీసుకొచ్చి ముక్కు, నోటికి ప్లాస్టర్ వేసి ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. అనంతరం రాములు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడని అందరినీ నమ్మిచేందుకు మృతదేహంతో పాటు మోటారు సైకిల్ను రోడ్డుపై వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించడంతో చేసిన నేరాన్ని ఒప్పుకొన్నారు. హత్యకు పాల్పడిన సురేశ్గౌడ్, మానసతో పాటు బాలపీరు, హన్మంతును అరెస్టుచేసి కోర్టులో హాజరుపర్చగా.. రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని ఘాతుకం మృతుడి తండ్రి ఫిర్యాదుతో అనుమానాస్పద కేసు నమోదు భార్య, ఆమె ప్రియుడితో పాటు మరో ఇద్దరి రిమాండ్ వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాస్ -
దీపావళికై నా వేతనాలు ఇవ్వండి
జడ్చర్ల టౌన్: ఆస్పత్రిలో పనిచేస్తున్న కార్మికులకు దసరా పండగకు ఎలాగూ వేతనాలు ఇవ్వలేదు.. కనీసం దీపావళికై నా ఇవ్వండంటూ తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి సురేశ్ డిమాండ్ చేశారు. బుధవారం జడ్చర్ల ఏరియా ఆస్పత్రిలో కార్మికులతో సమావేశం నిర్వహించారు. దసరా పండగకు ముందే నాలుగు నెలల వేతన బడ్జెట్ విడుదలైనప్పటికి శ్రీశాంతి ఏజెన్సీ నిర్వాహకుల నిర్లక్ష్యంతో ఇప్పటికీ వేతనాలు అందడంలేదని ఆరోపించారు. గత శుక్రవారం చేసిన మెరుపు సమ్మెకు ఆస్పత్రి సూపరింటెండెంట్ దిగివచ్చి ఐదురోజుల్లో వేతనాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చి నేటికీ నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరో మూడురోజుల్లో దీపావళి పండగ వస్తుందని, అందరి జీవితాల్లో వెలుగులున్నా.. ఆస్పత్రి కార్మికుల జీవితాల్లో చీకట్లు అలుముకున్నాయన్నారు. వెంటనే ఏజెన్సీ నిర్వాహకులపై చర్యలు తీసుకుని వేతనాలు ఇచ్చేలా చూడాలన్నారు. లేదంటే నిరవధిక సమ్మెకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆస్పత్రి యూనియన్ అధ్యక్షుడు నర్సింహులు, కార్మికులు నవీన్, శేఖర్, రవీందర్, రామకృష్ణ, విజయలక్ష్మి, మనెమ్మ, శివలీల, పద్మ, సుక్కమ్మ, అలివేల, భార్గవి, నీరజ, అంజలి, నర్సమ్మ, స్వామి, భాగ్యమ్మ పాల్గొన్నారు. -
నేడు నల్లమలలో ట్రాఫిక్ ఆంక్షలు
నాగర్కర్నూల్ క్రైం: ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 16న గురువారం శ్రీశైలం పర్యటన నేపథ్యంలో నల్లమల అటవీప్రాంతంలో ట్రాఫి క్ ఆంక్షలు ఉండనున్నట్లు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ బుధవారం ప్రకటనలో తెలిపారు. ప్రధాని శ్రీశైలం క్షేత్రాన్ని సందర్శించనున్నందున కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామని, హైదరాబాద్ నుంచి వీఐపీలు శ్రీశైల క్షేత్రం వెళ్లే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశాలు ఉంటాయని తెలిపారు. నల్లమల అటవీ ప్రాంతం నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులు ప్రధాని పర్యటన ముగిసిన తర్వాత సందర్శించాలని తెలిపారు. భక్తులు, ప్రయాణికులు పోలీసుశాఖకు సహకరించాలని తెలిపారు. శ్రీశైలం రాకపోకలు నిలిపివేత మన్ననూర్: మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటున్న సందర్భంగా 16వ తదీ(గురువారం) శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారి మన్ననూర్ నుంచి తాత్కాలికంగా రాకపోకలు నిలిపివేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. శాంతిభధ్రతల దృష్ట్యా ఈ రకమైన ట్రాఫిక్ ఆంక్షలు గురువారం ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు ఉంటాయన్నారు. ఎన్ఎస్జీ పర్యవేక్షణలో ఏపీ పోలీసులు దోమలపెంట: శ్రీశైలంలో గురువారం ప్రధానమంత్రి పర్యటన పురస్కరించుకుని ఒక్కరోజు ముందుగానే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అధికారుల పర్యవేక్షణలో బుధవారం ఈగలపెంటలో ఏపీ పోలీసులు బందోబస్తు విధుల్లో నిమగ్నమయ్యారు. ఎన్ఎస్జీ ఆదేశాల మేరకు విజయవాడ డీఎస్పీ వేణుగోపాలరెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాంతం నుంచి శ్రీశైలంకు వస్తున్న వాహనాలు, ఆర్టీసీ బస్సులను ఈగలపెంటలో ఉన్న జెన్కో గ్రౌండ్లోకి మళ్లించి అక్కడే వాహనాలను నిలిపి వేయిస్తున్నారు. శ్రీశైలంలో ఉన్న ఎన్ఎస్జీ అధికారులు తెలిపినప్పుడు మాత్ర మే ఈ వాహనాలను అనుమతిస్తున్నారు. అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేస్తున్నారు. సమాచారం తెలియకుండా విచ్చేస్తున్న పర్యాటకులు, భక్తులు కొంత ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. కాగా ఈగలపెంట, దోమలపెంట ప్రాంతాల్లో హోటల్స్ తెరిచి ఉండడంతో భోజనాలు, టిఫిన్లు తాగునీటికి ఇబ్బందులు లేవు. ఈగలపెంట దాటితే ఒక్క హోటల్ కాని ఇతరత్రా షాపులన్నీ మూసిఉంచారు. ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ప్రదాని మోదీ శ్రీశైలం పర్యటనలో బందోబస్తు ఈగలపెంట జెన్కో గ్రౌండ్లోకి వాహనాల మళ్లింపు -
ఆధునిక పద్ధతులు అవలంబించాలి
మహబూబ్నగర్ రూరల్: పంటల సాగుకోసం రైతులు ఆధునిక పద్ధతులను అవలంబించాలని పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శశిభూషణ్ అన్నారు. బుధవారం మండలంలోని మాచన్పల్లి రైతువేదికలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, వనపర్తి మహాత్మా జ్యోతిభా ఫూలే ఉమెన్ వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. రైతులు పంటల సాగుకు ముందు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకుని వ్యవసాయరంగ నిపుణుల సూచనలు, సలహాల మేరకు పంటలను సాగుచేయాలని తెలిపారు. పంటల సాగులో తగిన మెలకువలు పాటించాలని, తక్కువ రసాయనిక ఎరువులు వాడాలన్నారు. పురాతన పనిముట్లను వీడి ఆధునిక పరికరాలతో పంటలు సాగు చేస్తే సమయం, డబ్బు ఆదా అవుతుందన్నారు. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతుల గురించి అవగాహన పెంపొదించడానికి ప్రభుత్వం సదస్సులు నిర్వహిస్తుందని, రైతులు సదస్సులను సద్వినియోగం చేసుకుని పంటల దిగుబడిని పెంచుకొని లాభాలు పొందాలని సూచించారు. అనంతరం ఆధునిక వ్యవసాయ పరికరాల గురించి రైతులకు వ్యవసాయ కళాశాల విద్యార్థినులు అవగాహన కల్పించారు. సేంద్రియ వ్యవసాయమే రైతులకు శ్రీరామ రక్ష అని, దానినుంచి ఉత్పత్తయ్యే అన్నిరకాల ధాన్యాలు ప్రజలకు ఎంతగానో మేలు చేస్తాయని అభిప్రాయ వ్యవసాయ కళాశాల విద్యార్థినులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో విజ్ఞాన కేంద్రం సమన్వయకర్తలు అర్చన, కల్యాణి, ఏఓ శృతి, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్వర్రెడ్డి, మాజీ సర్పంచ్ మల్లికార్జున్రెడ్డి, మల్లు వెంకటేశ్వర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
మహబూబ్నగర్ విజయం
● 120 పరుగుల తేడాతో బాలాజీ కోల్ట్స్పై గెలుపు మహబూబ్నగర్ క్రీడలు: హెచ్సీఏ బి–డివిజన్ టూడేలీగ్ మ్యాచ్లో జిల్లా జట్టు 120 పరుగుల తేడాతో బాలాజీ కోల్ట్స్పై విజయం సాధించింది. మహబూబ్నగర్ జట్టు మొదటి రోజు 76.5 ఓవర్లలో 238 పరుగులు చేసి ఆలౌట్ అయింది. బుధవారం రెండో రోజు బ్యాటింగ్ చేసిన బాలాజీ కోల్ట్స్ జట్టు పాలమూరు బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లను కోల్పోయింది. 39.3 ఓవర్లలో 118 పరుగులకు ఆలౌట్ అయింది. జిల్లా బౌలర్లు ఎండి.ముఖితుద్దీన్ 28 పరుగులకు 3 వికెట్లు, జస్వంత్ 38 పరుగులకు వికెట్లు, మనోజ్ 21 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశారు. జిల్లా జట్టు మ్యాచ్లో విజయం సాధించడంపై ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్, కోచ్ అబ్దుల్లా అభినందించారు. రానున్న మ్యాచుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. -
మధ్యాహ్న భోజనంలో పురుగులు
● వాంతులు చేసుకున్న విద్యార్థులు ● మూడు రోజుల నుంచి ఇదే తీరు ● పట్టించుకోని విద్యాశాఖ అధికారులు మక్తల్: పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పా ఠశాలలో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో పురుగులు రావడంతో బుధవారం విద్యార్థులు భోజనం చేయకుండా ఇంటికి వెళ్లారు. పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు దాదాపు 500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మధ్యాహ్న భోజ నం సక్రమంగా వండటం లేదని మూడు రోజు ల నుంచి ఉపాధ్యాయులు, హెచ్ఎంకు చెప్పి నా ఏమాత్రం పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆరోపించారు. గతంలో కలెక్టర్ పాఠశాలను సందర్శించి, విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం నాణ్యతా ప్రమాణాలు పాటించాలని వంట ఏజెన్సీ మహిళలను ఆదేశించారు. కలెక్టర్ చెప్పినా ఫలితం లేకుండా పోయిందని విద్యార్థులు వాపోతున్నారు. విషయం బయటకు రావడంతో ఏబీవీపీ నాయకులు వినయ్తో పాటు మరికొందరు అక్కడికి చేరుకొని పురుగుల అన్నాన్ని పరిశీలించారు. సమస్యను ఎంఈఓ అనిల్గౌడ్కు వివరించగా.. ఆయన అక్కడికి చేరుకున్నారు. వంటలు సక్రమంగా చేయడం లేదని, నీళ్ల సాంబర్ వడ్డిస్తున్నారని విద్యార్థులు ఎంఈఓ దృష్టికి తీసుకుపోయారు. స్పందించిన ఎంఈఓ వంట ఏజెన్సీ వారిని వెంటనే తొలగించి, కొత్తవారికి అప్పగించాలని హెచ్ఎంను ఆదేశించారు. విద్యార్థులకు మెనూ ప్రకారంగా మధ్యాహ్న భోజనం అందించాలని, లేకుంటే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొందరు విద్యార్థులు వాంతులు చేసుకున్నప్పటికీ ఉపాధ్యాయులు విషయాన్ని బయటకు రానివ్వడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించడం లేదని, తూతూమంత్రంగా విధులు నిర్వహిస్తున్నారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. భోజనం వండిన తర్వాత మొదటగా హెచ్ఎం పరిశీలించిన తర్వాతే విద్యార్థులకు వడ్డించాలని కలెక్టర్ ఆదేశించినా బేఖాతరు చేస్తున్నారన్నారు. ఇలాంటి ఘటనలు ఎన్నోసార్లు జరిగాయని, బియ్యంలో పురుగులను సక్రమంగా తీయడం లేదని తెలిపారు. గోదాం నుంచి పాత బియ్యం తెచ్చారా.. లేక పాఠశాలలో మక్కిన బియ్యంతో అన్నం వండారా అని విషయంపై దర్యాప్తు చేస్తున్నామని ఎంఈఓ తెలిపారు. చిన్నచింతకుంట: మండలంలోని లాల్కోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులక వడ్డించే మధ్యాహ్నం భోజనంలో కప్ప కనిపించిందని వదంతులు వచ్చాయి. నిత్యం పాఠశాలకు అక్షయ పాత్ర ద్వారా 270మంది విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అందుతుంది. బుధవారం పాఠశాలలో సిబ్బంది విద్యార్థులకు భోజనం వడ్డిస్తుండగా.. ఓ విద్యార్థి అన్నం పెట్టుకొని పప్పు వేసుకోగానే కప్ప కనిపించిందని.. విద్యార్థులు, ఉపాధ్యాయులు భోజనాన్ని పార బోసినట్లు సమాచారం. అనంతరం విద్యార్థులు తమ ఇళ్లలోకి వెళ్లి భోజనం చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ విషయంపై హెచ్ఎం, ఎంఈఓ మురళికృష్ణను వివరణ కోరగా.. కప్ప ఉందన్న పుకార్లు మాత్రం ఉన్నాయన్నారు. కప్ప కనిపించిన ఆధారాలు ఎక్క డాలేవని తెలిపారు. ప్రస్తుతం చిన్నచింతకుంటలో సమావేశంలో ఉన్నందున పాఠశాలకు అందుబాటులో లేనన్నారు. పూర్తి సమాచారం తెలుసుకొని విచారణ చేపట్టనున్నట్లు ఎంఈఓ పేర్కొన్నారు. కప్ప ఉందని వదంతులు -
ఉల్లి క్వింటా రూ.1,900
దేవరకద్ర: దేవరకద్ర మార్కెట్ యార్డులో బుధవారం జరిగిన వేలంలో ఉల్లి ధర క్వింటాకు గరిష్ఠగా రూ.1900 వరకు పలికింది. కనిష్ఠంగా 1200 వరకు ధరలు నమోదయ్యాయి. ఈ ఏడాది సీజన్ ప్రారంభం నుంచి ఉల్లి ధరులు అటుఇటుగా నిలకడగానే ఉన్నాయి. సీజన్ ముగిసిన తర్వాత కూడా ధరల్లో మార్పురాలేదు. మార్కెట్కు కొత్త ఉల్లి వచ్చినప్పటికీ పాత ఉల్లికి ఇంకా డిమాండ్ తగ్గలేదు. నాణ్యంగా ఉన్న ఉల్లికి గరిష్ఠ ధరలు పలుకగా, రెండో రకం ఉల్లికి కనిష్ఠ ధరలు వచ్చాయి. 50 కేజీల బస్తా ధర గరిష్టంగా రూ.950, కనిష్ఠంగా రూ. 600వరకు పలికింది. కొత్త ఉల్లి నాణ్యతగా లేకపోవడంతో కొనేవారు లేక తిరిగి వాపసు తీసుకుపోయారు. హంస రకం రూ.1,809 దేవరకద్ర మార్కెట్ యార్డులో బుధవారం మధ్యాహ్నం జరిగిన టెండర్లల్లో హంస ధాన్యం ధర క్వింటాకు గరిష్ఠంగా రూ.1809గా ఒకే ధర లభించింది. మార్కెట్కు రెండు వందల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. వ్యక్తి ఆత్మహత్య ఆత్మకూర్: కుటుంబ కలహాలతో ఓవ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన బుధవారం ఆత్మకూర్ మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. జూరాలకు చెందిన కుర్వగట్టు ఆంజనేయులు(38) భార్యతో గొడవ పెట్టుకున్నాడు. దీంతో భార్య ఇద్దరు కొడుకులతో కలిసి హైదరాబాద్కు వెళింది. ఇది జీర్నించుకోలేని ఆంజనేయులు బుధవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయాన్ని గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు విచారణ చేపడుతున్నారు. -
స్నాతకోత్సవానికి వేళాయె
ఒకప్పుడు ఓయూ అనుబంధ పీజీ సెంటర్తో ప్రారంభమై.. అనంతరం యూనివర్సిటీగా ఏర్పడి.. సకల సౌకర్యాలు కల్పించడంతో పాటు పరిశోధనలకు ఊతమిస్తూ.. వేలాది మంది విద్యార్థుల ఉన్నత విద్యకు బాటలు వేసింది పాలమూరు యూనివర్సిటీ. మొదట సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాలలతో ప్రారంభమైనా క్రమంగా ఉపాధి, ఉద్యోగ కోర్సులైన ఇంజినీరింగ్, లా కళాశాలల ఏర్పాటుతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. తాజాగా పీయూ పరిధిలో 160 కళాశాలలు ఉండగా.. 42,554 మంది విద్యనభ్యసిస్తున్నారు. ఈక్రమంలో గురువారం జరిగే నాలుగో స్నాతకోత్సవానికి పీయూ ముస్తాబైంది. మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ (పీయూ) నాలుగో స్నాతకోత్సవానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. గురువారం జరిగే కార్యక్రమానికి పీయూలోని లైబ్రరీ ఆడిటోరియం వేదిక కానుంది. ముఖ్య అతిథిగా గవర్నర్, యూనివర్సిటీ చాన్స్లర్ జిష్ణుదేవ్ వర్మ హాజరుకానున్నారు. మొదటగా యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్తో సమావేశం.. ఆ తర్వాత స్నాతకోత్సవం నిర్వహించనున్నారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్, వివిధ డిపార్ట్మెంట్ల డీన్స్, గోల్డ్మెడల్స్ తీసుకునే విద్యార్థులు, పీహెచ్డీ పట్టాలు అందుకునే స్కాలర్స్, వారి తల్లిదండ్రులు పాల్గొననున్నారు. పీయూ చరిత్రలో మొదటిసారిగా సామాజిక విభాగంలో విశిష్ట సేవలందిస్తున్న ఎంఎస్ఎన్ అధినేత, పారిశ్రామికవేత్త మన్నె సత్యనారాయణరెడ్డికి గౌరవ డాక్టరేట్ను అందజేయనున్నారు. అంచెలంచెలుగా ఎదుగుతూ.. పీయూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఉమ్మడి పాలమూరు జిల్లా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిచేందుకు ఎంతో కృషి చేస్తుంది. కేవలం ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధ పీజీ సెంటర్తో ప్రారంభభమై.. 2008లో పూర్తిస్థాయి యూనివర్సిటీగా ఏర్పడింది. ప్రారంభంలో అడ్మినిస్ట్రేషన్ పరమైన అంశాలన్ని కూడా పీయూలో ప్రస్తుతం ఉన్న పీజీ కళాశాలలో జరిగేవి. 2010–11లో అడ్మినిస్ట్రేషన్ భవనం నిర్మించిన తర్వాత అక్కడికి బదిలీ చేశారు. 2018–19 ఎగ్జిమినేషన్ బ్రాంచ్ను రూ.10 కోట్లతో నిర్మించడంతో అక్కడికి ప్రత్యేకంగా బ్రాంచ్ను ఏర్పాటు చేశారు. పీయూ రక్షణ కోసం 3.1 ఎకరాల పొడువు గోడను 2020లో అధికారులు నిర్మించారు. సువిశాల పీయూ క్యాంపస్, కార్యాలయాలు, హాస్టళ్లు, కళాశాలల పర్యవేక్షణ కోసం 152 సీసీ కెమెరాలతో 24 గంటలు పర్యవేక్షణ చేస్తున్నారు. ఉన్నత విద్య చేరువ.. గద్వాల, వనపర్తి, కొల్లాపూర్లో పీజీ సెంటర్లు ఏర్పాటు చేసి వేలాది మంది విద్యార్థులకు పీజీ స్థాయి విద్యను అందిస్తుంది. ఇందులో ప్రస్తుతం ప్రొఫెషనల్, ట్రెడీషనల్ కోర్సులు కలిపి 19 కోర్సులకు తోడుగా ఇంజినీరింగ్, లా కళాశాలలు కూడా ప్రారంభం కావడంతో దీని ప్రాధాన్యత మరింత పెరిగింది. ప్రస్తుతం పీయూలో మొత్తం రెండు బాలుర హాస్టల్స్, రెండు బాలికల హాస్టల్స్ ఉండగా ఇందులో 1320 మంది విద్యార్థులు ఉంటున్నారు. నేడు పీయూకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాక నాలుగోసారి వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు ఎంఎస్ఎన్రెడ్డికి గౌరవ డాక్టరేట్.. 83 మంది విద్యార్థులకు బంగారు పతకాలు.. 12 మందికి పీహెచ్డీ పట్టాల ప్రదానం ఏర్పాట్లు పూర్తి చేశాం.. స్నాతకోత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. గురువారం ఉదయం 11 గంటలకు లైబ్రరీ ఆడిటోరియం వేదికగా జరిగే కార్యక్రమానికి గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ప్రొటోకాల్ ప్రకారం వివిధ డిపార్ట్మెంట్ అధికారుల సహకారంతో ఏర్పాట్లు చేశాం. కార్యక్రమంలో ఎంఎస్ఎన్రెడ్డి గౌరవ డాక్టరేట్, 83 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, 12 మందికి పీహెచ్డీ పట్టాలు అందుకోనున్నారు. – జీఎన్ శ్రీనివాస్, వీసీ పీయూ -
రాజ్యాధికారం కోసం బీసీలు ఏకమవ్వాలి
● టీఆర్పీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న మెట్టుగడ్డ: రాష్ట్రంలో రాజ్యాధికారం కోసం బీసీలంతా ఏకమవ్వాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టీఆర్పీ) అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. మహబూబ్నగర్ ఏనుగొండలో జరిగిన బీసీ జేఏసీ సామాజిక తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో బీసీ కార్యకర్తల ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మల్లన్న మాట్లాడుతూ 42 శాతం రిజర్వేషన్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసి బీసీ సంక్షేమానికి కృషి చేయాలని ఆయన కోరారు. బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకునేందుకు చూస్తున్నారే గానీ.. చట్టసభల్లో బీసీల ప్రాతినిధ్యంపై మొండిచేయి చూపిస్తున్నారని విమర్శించారు. ఇంటలెక్షన్ ఫోరంలో వక్తల ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. విద్య, వైద్యం, వలసలు, ఉపాధి, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు బీసీల అస్థిత్వం అని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కులగణన చేయాలన్నారు. కార్యక్రమంలో టీఆర్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ హరిశంకర్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జానయ్య, సూర్యారావు, బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్సాగర్, బెక్కెం జనార్దన్, సారంగి లక్ష్మికాంత్, కోరమోని వెంకటయ్య, విజయ్కుమార్, వెంకటయ్య, నిర్మల, వివిధ కుల సంఘాల నాయకులు, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. -
నిఘా నీడలో పీయూ
● 344మంది పోలీసులతోప్రత్యేక బందోబస్తు ● ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ డి.జానకి మహబూబ్నగర్ క్రైం: పాలమూరు యూనివర్సిటీలో గురువారం గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ పర్యటన సందర్భంగా ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ డి.జానకి వెల్లడించారు. పీయూలో బందోబస్తు ఏర్పాట్లతో పాటు ట్రాఫిక్ ఆంక్షలపై ట్రయల్ను పరిశీలించారు. పీయూతో పాటు కలెక్టరేట్లో సైతం భద్రత ఏర్పాట్లు చేశారు. పీయూ పరిసర ప్రాంతాల ఇప్పటికే పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ప్రత్యేక బలగాలు బుధవారం నుంచి పీయూలో విధుల్లో ఉన్నారు. గవర్నర్ పర్యటన పూర్తి అయ్యే వరకు ప్రత్యేక ఆంక్షలు కొనసాగనున్నాయి. 344 మంది పోలీసుల బలగాలతో ప్రత్యేక బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఒక ఎస్పీ, ఒక ఏఎస్పీ, నలుగురు డీఎస్పీలు, పది మంది సీఐలు, 28 మంది ఎస్ఐలు, 90 మంది ఏఎస్ఐలు, హెడ్కానిస్టేబుళ్లు, 210 మంది కానిస్టేబుళ్లు, హోంగార్డులు గవర్నర్ బందోబస్తులో ఉండనున్నారు. జిల్లా కేంద్రంలోని హైటెక్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బందోబస్తు కేటాయింపులలో పోలీస్ అధికారులకు ఎస్పీ సూచనలు చేశారు. సూచనలు ఇవ్వడం జరిగింది. గవర్నర్ పర్యటన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి అధికారికి అప్పగించిన బాధ్యత నిబద్ధతతో పూర్తి చేయాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల రాకపోకలు, పార్కింగ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఆమె వెంట ఏఎస్పీలు ఎన్బీ రత్నం, డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీసీఆర్బీ డీఎస్పీ రమణారెడ్డి, డీటీసీ డీఎస్పీ గిరిబాబు, సీఐలు గాంధీనాయక్, అప్పయ్య, ఇజాజుద్దీన్, భగవంత్రెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
అంచెలంచెలుగా ఎదుగుతూ.. విశిష్ట సేవలందిస్తూ..
నవాబుపేట మండలం గురుకుంట గ్రామానికి చెందిన సత్యనారాయణ రెడ్డి ఓయూ నుంచి ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్డీ సాధించారు. రసాయన శాస్త్రవేత్తగా ప్రస్థానం ప్రారంభించి.. 2003లో ఎంఎస్ఎన్ లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ను స్థాపించారు. అనతికాలంలోనే ఎంఎస్ఎన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలు నెలకొల్పారు. చైర్మన్, ఎండీగా వ్యవహరిస్తూ 27 ప్రపంచ స్థాయి ఉత్పత్తి కేంద్రాలు, 400కు పైగా డోసేజ్ ఫార్ములేషన్లు, వెయ్యికి పైగా జాతీయ, అంతర్జాతీయ పేటెంట్లతో సంస్థ వృద్ధికి కృషిచేశారు. వందకు పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. పాలమూరు జిల్లా నుంచి ఇప్పటివరకు సుమారు ఐదు వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించడంతోపాటు హృద్రోగ, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల శస్త్ర చికిత్సలకు ఆయన సహకారం అందించారు. ఈ సేవలకు గుర్తింపుగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనమిక్ స్టడీస్ నుంచి ఆయన గతంలోనే ప్రతిష్టాత్మకమైన ఉద్యోగ రతన్ పురస్కారం అందుకున్నారు. తాజాగా పీయూ నుంచి గౌరవ డాక్టరేట్ను ప్రకటించడం గర్వంగా ఉందని, నా వంతుగా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేలా ముందుకు సాగుతానని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. -
ఢీఎంఎఫ్టీ..!
మహబూబ్నగర్జిల్లా మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ తీరుపై రగడ గురువారం శ్రీ 16 శ్రీ అక్టోబర్ శ్రీ 2025సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: జోగుళాంబ గద్వాల జిల్లాలో జిల్లా మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ (డీఎంఎఫ్టీ)కు సంబంధించి చెలరేగిన వివాదం ఉమ్మడి పాలమూరువ్యాప్తంగా హాట్టాపిక్గా మారింది. పలు అభివృద్ధి పనులు, ప్రాంతాల ఎంపిక, నిధుల కేటాయింపులో ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడి లేఖ ఆలస్యంగా వెలుగుచూడగా.. చర్చనీయాంశమైంది. నియోజకవర్గ శాసనసభ్యుడిగా, డీఎంఎఫ్టీ సభ్యుడిగా ఉన్న తనకు సమావేశంపై సమాచారం ఇవ్వలేదు.. మీటింగ్ మినిట్స్ కూడా అందజేయలేదని అందులో పేర్కొనగా.. రగడ రాజుకుంది. నిబంధనలకు విరుద్ధంగా.. జిల్లా మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్లో చైర్మన్/చైర్పర్సన్గా జిల్లా ఇన్చార్జి మంత్రి, సెక్రటరీగా జిల్లా కలెక్టర్, కన్వీనర్గా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ (సీపీఓ), కోశాధికారిగా జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఉంటారు. వీరితో పాటు ఆయా జిల్లాల్లోని లోక్సభ, రాజ్యసభ ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు/జెడ్పీ చైర్పర్సన్లు, ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారు. జిల్లాలో అభివృద్ధి పనులకు సంబంధించి సమావేశం నిర్వహించి.. ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన ప్రతిపాదనల ప్రకారం జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదేశాలతో అధికారులు పనులు, ప్రాంతాల ఎంపిక, నిధుల కేటాయింపు చేపట్టాలి. కానీ.. గద్వాల జిల్లాలో ఇలా జరగలేదని కలెక్టర్ బీఎం సంతోష్కు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు రాసిన లేఖ ద్వారా స్పష్టమవుతోంది. పనులు, ప్రాంతాల ఎంపిక, నిధుల కేటాయింపుపై వివాదం తనకు తెలియకుండానే చేయడంపై అలంపూర్శాసనసభ్యుడి అసంతృప్తి జోగుళాంబ గద్వాల జిల్లాలో చర్చనీయాంశంగా మారిన లేఖ నియోజకవర్గ నేత ‘హస్తమే’ కారణమంటూ ఊహాగానాలు కమీషన్లే కారణమని విమర్శలు.. -
భోజనం కలుషితమైతే ఎవరు బాధ్యులు
భూత్పూర్: విద్యార్థుల మధ్యాహ్న భోజనంలో క్రిమి, కీటకాలు పడి కలుషితమైతే ఎవరు బాధ్యులని కలెక్టర్ విజయేందిరబోయి అసహనం వ్యక్తం చేశారు. భూత్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు బుధవారం మధ్యాహ్న భోజనం చెట్ల కింద తింటుండగా గమనించిన కలెక్టర్ ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలల్లో డైనింగ్ హాల్ ఎందుకు ఏర్పాటు చేయలేదని, చెట్ల కింద భోజనం ఎలా పెడుతారని మండిపడ్డారు. మధ్యాహ్న భోజనాన్ని బాధ్యత తీసుకున్న ఉపాధ్యాయులు ఎవరని హెచ్ఎంను ప్రశ్నించారు. హెచ్ఎం ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో ఇలాంటి పరిస్థితి మరోసారి రానివ్వరాదని హెచ్చరించారు. హాస్టళ్లలో మెనూ పాటించకుంటే చర్యలు జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలోని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో మెనూ కచ్చితంగా పాటించాలని, పాటించని హాస్టళ్లపై చర్యలు తప్పవని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. బుధవారం కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు పౌష్టికాహారం ప్రభుత్వం జారీచేసిన మెనూ ప్రకారం అదించాలన్నారు. అధికారులు తనిఖీలు చేసినప్పుడు హాస్టల్ వార్డెను అందుబాటులో ఉండాలని, బాలికల హాస్టల్లో వాచ్మెన్కు వదిలేసి వెళ్తున్నారని విమర్శించారు. స్టోర్రూమ్లో కూరగాయలు పప్పులు, పాలు ఇతర సామగ్రి అందుబాటులో ఉండడంలేదని మండిపడ్డారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మధుసూదన్నాయక్, జిల్లా మైనార్టీ అధికారి శంకరాచారి, జిల్లా గిరిజన సంక్షేమాధికారి జనార్దన్, బీసీ సంక్షేమాధికారి ఇందిర, ఎస్సీ సంక్షేమాధికారి సునీత ఇతర అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ విజయేందిర బోయి భూత్పూర్ జెడ్పీహెచ్ఎస్లో చెట్లకింద విద్యార్థుల భోజనం ఉపాధ్యాయుల పనితీరుపై కలెక్టర్ ఆగ్రహం -
చెరుకు రైతుల సమస్యల పరిష్కారానికి కృషి
ఎర్రవల్లి: చెరుకు రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు పరిష్కరించాలని ఉమ్మడి జిల్లా చెరుకు సంఘం అధ్యక్షుడు రాజన్న డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని జింకలపల్లి స్టేజీ వద్ద శాంతినగర్ జోన్ చెరుకు సంఘం అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై చెరుకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 18న కొత్తకోట మండలంలోని అమడబాకుల రైతువేదికలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కృష్ణవేణి చెరుకు రైతు సంఘం జనరల్ బాడీ సమావేశం ఉంటుందన్నారు. అందులో చెరుకు రైతుల సమస్యల పరిష్కారం, వారి అభివృద్ధి కోసం అందరితో చర్చించి పలు నిర్ణయాలతో కూడిన వినతిపత్రాన్ని కృష్ణవేణి చెరుకు పరిశ్రమ యాజమాన్యానికి సంఘం తరఫున అందజేస్తామన్నారు. కార్యక్రమంలో చెరుకు సంఘం నాయకులు లక్ష్మీనారాయణరెడ్డి, నారాయణ, చంద్రసేనారెడ్డి, వెంకటేష్గౌడ్, షాలిమియ్య, వీరన్న, వెంకటేష్, రామకృష్ణ, అశోక్రెడ్డి, అన్నారెడ్డి, రాజశేఖర్రెడ్డి, రామాంజనేయులు, మదుసూదన్రెడ్డి, లక్ష్మన్న తదితరులు ఉన్నారు. -
టీటీడీ ఆధ్వర్యంలో ధార్మిక కార్యక్రమాలు
స్టేషన్ మహబూబ్నగర్: తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో ఈనెల 31 వరకు దార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు డాక్టర్ ఉత్తరపల్లి రామాచారి వెల్లడించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో కార్యక్రమాల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ నారాయణపేట జిల్లా కుమారలింగంపల్లిలోని ఆంజనేయస్వామి దేవాలయంలో ఈనెల 18 వరకు ఉపన్యాసాలు, భజనలు, కుంకుమ పూజా కార్యక్రమాలు ఉంటాయని, ఈనెల 21 నుంచి 25 వరకు జిల్లాలోని దేవరకద్ర మండలం అజిలాపురంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో ఉపన్యాసాలు, భజనలు, కుంకుమపూజ, ఈనెల 31, 31 తేదీల్లో గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మండలం రామాపురంలోని చెన్నకేశవస్వామి దేవాలయంలో ఉపన్యాసాలు, భజనలు, కుంకుమపూజలు నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీ వారి సేవకులు కేశవు లు, పాండురంగం, సురేష్చందర్దూత్, హనుమంతురెడ్డి, పల్లాటి తారకం, రాములు, ఏనుగొండ నర్సింలు, బాల్రెడ్డి, చంద్రశేఖర్, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఫొటోగ్రఫీ, షార్ట్ఫిలిం పోటీలు మహబూబ్నగర్ క్రైం: ఈ నెల 21న పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఫొటోగ్రఫీ, షార్ట్ఫిలిం పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ జానకి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీస్ సేవలు– త్యాగాలు ప్రజా రక్షణపై ఫొటోగ్రఫీ పోటీలు ఉంటాయని, ప్రతిఒక్కరూ మూడు ఫొటోలు పంపాలన్నారు. షార్ట్ఫిలీం పోలీస్ సేవలు, కర్తవ్య నిబద్ధత– సమాజ రక్షణ అనే అంశంపై ఈ నెల 23 వరకు పంపించాలన్నారు. మీ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లలో మీ పూర్తి వివరాలతో ఫొటోలు, షార్ట్ఫిలిం వీడియోలు పంపాలన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికై న మూడు ఉత్తమ ఫొటోలు, షార్ట్ఫిలింలను రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని, జిల్లాలోని విద్యార్థులు, యువత ప్రతిఒక్కరూ ఉత్సాహంగా పాల్గొనాలని సూచించారు. -
బాలిక మృతదేహంతో ధర్నా
మల్దకల్: మహబూబ్నగర్ జిల్లా రాంరెడ్డిగూడెం గురుకుల కళాశాలలో చదువుతున్న విద్యార్థిని ప్రి యాంక సోమవారం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ బాధిత కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు మంగళవారం మండల కేంద్రంలోని అయిజ–గద్వాల ప్రధాన రహదారిపై గంటపాటు రాస్తారోకో చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని నచ్చజెప్పేందుకు యత్నించినా ఒప్పుకోలేదు. తమ కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నాయని, మృతికి కార కులైన వారిని కఠినంగా శిక్షించే వరకు విరమించే ప్రసక్తే లేదని భీష్మించుకు కూర్చున్నారు. ఆందోళన తో వాహనాలు అక్కడికక్కడ నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అక్కడికి చేరుకొని కుటుంబ సభ్యులు, పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. న్యాయం జరిగేలా చూస్తానని భరోసానివ్వడంతో ఆందోళన విరమించారు. డీఎస్పీ మొగులయ్య, సీఐ టంగుటూరి శ్రీను, ఎస్ఐలు, పోలీసులు ఉన్నారు. -
అనన్యశ్రీని అభినందించిన సీఎం
మహబూబ్నగర్ క్రీడలు: అంతర్జాతీయ వాలీబాల్ పోటీల్లో పాల్గొన్న మక్తల్కు చెందిన జాతీయ వాలీబాల్ క్రీడాకారిణి పి.అనన్యశ్రీని మంగళవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సీ ఎం రేవంత్రెడ్డి అభినందించారు. రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో అనన్యశ్రీ, ఆ మె తల్లిదండ్రులు సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. అనన్యశ్రీ సీనియర్ నేషనల్లో సాధించిన బంగారు పతకం, ఎఫ్ఐఎస్యూ వరల్డ్ యూని వర్సిటీ, ఇతర స్థాయిల్లో సాధించిన మెడల్స్ను సీఎంకు చూపించారు. ఈ సందర్భంగా అనన్యశ్రీని సీఎం అభినందించి శాలువాతో సత్కరించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బీర్ల ఐల య్య, కుంభం అనిల్కుమార్తోపాటు పి.ఆనంద్, వరలక్ష్మి, ఆదిత్య శౌర్య తదితరులు పాల్గొన్నారు. -
జూదానికి బానిసై యువకుడి ఆత్మహత్య
వంగూరు: జూదానికి బానిసై సర్వం కోల్పోయి ది క్కుతోచని స్థితిలో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ మహేష్ తెలిపిన వివరా లు.. తెల్కపల్లి మండలం గౌరారానికి చెందిన నవీన్(27) హైదరాబాద్లో నివాసం ఉంటున్నాడు. కొంత కాలంగా ఆన్లైన్ బెట్టింగ్లు, తాగుడుకు బానిసై ఆర్థిక ఇబ్బందులు ఎదు ర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారు జామున శ్రీశైలం క్రాస్రోడ్డు వద్దకు ఆటోలో వెళ్లి సమీపంలో ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, పది నెలల బాబు ఉన్నాడు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి నాగర్కర్నూల్ క్రైం: ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యలవాడ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. తెల్కపల్లి మండ లం గడ్డంపల్లికి చెందిన కాకనూరి శ్రీనివాసులు (55) తన బైక్పై బిజినేపల్లి మండలం ఖానాపూర్లో బంధువుల చావుకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా.. ఉయ్యలవాడ వద్ద ఎదురుగా వచ్చిన బైక్ ఢీకొనడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఘటనకు సంబంధించి ఎస్ఐ గోవర్ధన్ను వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. ఆర్టీసీ డ్రైవర్పై కత్తితో దాడి వెల్దండ: మండలంలోని పెద్దాపూర్ స్టేజీ వద్ద అచ్చంపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ ఎండీ సలీంపై హైదరాబాద్కు చెందిన రిషిప్రణయ్, విజయ్ కత్తితో దాడి చేసిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు.. అచ్చంపేట డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి అచ్చంపేటకు వెళ్తున్న సమయంలో వెల్దండ నుంచి హైదరాబాద్కు స్కూటీపై వెళ్తున్న ప్రణయ్, విజయ్ పెద్దాపూర్ సమీపంలో బస్సుకు అడ్డు వచ్చారు. దీంతో డ్రైవర్ వారిని మందలించారు. పెద్దాపూర్ స్టేజీ వద్ద ప్రయాణికులను దించేందుకు డ్రైవర్ బస్సును నిలిపాడు. స్కూటీపై ఉన్న ప్రణయ్ తన వద్ద ఉన్న కత్తితో ఆర్టీసీ డ్రైవర్ సలీంపై దాడి చేసి చేతిని గాయపరిచారు. అప్రమత్తమైన ప్రయాణికులు పారిపోతున్న రిషిప్రణయ్, విజయ్ను పట్టుకున్నా రు. అనంతరం నిందితులను వెల్దండ పోలీస్స్టేషన్లో అప్పగించారు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కురుమూర్తి పేర్కొన్నారు. ఉత్సాహంగా ఎస్జీఎఫ్ ఆర్చరీ ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో మంగళవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–14, అండర్–17 విభాగాల బాలబాలికల ఉమ్మడి జిల్లా ఆర్చరీ ఎంపికలు నిర్వహించారు. జిల్లా ఎస్జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ శారదాబాయి ఎంపికలను ప్రారంభించారు. రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు ఉమ్మడి జిల్లా నుంచి 9 మంది బాలురు, 5 మంది బాలికలను ఎంపిక చేశారు. కార్యక్రమంలో పీడీ, పీఈటీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దూమర్ల నిరంజన్, పెటాటీఎస్ జిల్లా అధ్యక్షులు జగన్మోహన్గౌడ్, పీడీలు వేణుగోపాల్, రాంకల్యాణ్జీ, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు. అబ్దుల్ రాఫే సెంచరీ; పాలమూరు 238 ఆలౌట్ మహబూబ్నగర్ క్రీడలు: హెచ్సీఏ బీ–డివిజన్ టూ డే లీగ్లో జిల్లా జట్టు ఓపెనర్ అబ్దుల్ రాఫే అద్భుతమైన ప్రదర్శన కనబరిచి సెంచరీ చేశాడు. హైదరాబాద్లోని ఎస్ఆర్–1 క్రికెట్ గ్రౌండ్లో మంగళవారం మహబూబ్నగర్–బాలాజీ కోల్ట్స్ జట్ల మధ్య టూడే లీగ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన జిల్లా జట్టు 76.5 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో అబ్దుల్ రాఫే బిన్ అబ్దుల్లా 235 బంతుల్లో 23 ఫోర్లతో 144 పరుగులు చేశాడు. బాలాజీ కోల్ట్స్ బౌలర్లు వివేక్ నందు 4, వి.ఆరుష్ చంద్ర 3 వికెట్లు తీశారు. బుధవారం బాలాజీ కోల్ట్స్ జట్టు బ్యాటింగ్ చేయనుంది. -
ఇసుక డంప్ సీజ్
రాజోళి: మండలంలోని మాన్దొడ్డి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపును రెవె న్యూ అధికారులు సీజ్ చేశారు. అధికారులు తెలిపిన వివరాలు.. గ్రామంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారనే సమాచారంతో తని ఖీలు చేపట్టగా గ్రామం నుంచి నౌరోజీ క్యాంపునకు వెళ్లే మార్గంలోని పెద్దవాగు వద్ద 60 ట్రాక్టర్ల ఇసుక డంప్ను గుర్తించి సీజ్ చేశామన్నారు. తుంగభద్ర నది నుంచి ఎద్దుల బండ్లు, ట్రాక్టర్ల ద్వారా అనుమతులు లేకుండా తరలించి డంప్ చేశార్నారు. ఆర్ఐ చంద్రకాంత్ ఆధ్వ ర్యంలో తనిఖీ చేసి ఇసుక సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. డంప్ ఎవరు చేశారనే వివరాలు తెలియాల్సి ఉందన్నారు. -
నీటి నిల్వకు అడుగులు
కృష్ణానదిపై ఉన్న పాత వంతెనకు షెట్టర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు ● రెండు టీఎంసీలు నిలిచే అవకాశం ● ఇప్పటికే కర్ణాటకతో కొనసాగుతున్న చర్చలు ● కృష్ణా, మాగనూర్ రైతులకు పూర్తిస్థాయిలో అందనున్న సాగునీరు కల సాకారం కానుంది.. ఈ ప్రాంత రైతుల సాగునీటి అవసరాలకు ప్రాజెక్టుగాని, డ్యాంగాని ఏర్పాటు చేయాలని చాలాకాలంగా కోరుతున్నాం. భీమా ప్రాజెక్టుపై చేపడుతామని ప్రజాప్రతినిధులు చెబుతూనే వస్తున్నారు కానీ చేపట్టడం లేదు. ఇప్పటికై నా ప్రస్తుత ప్రభుత్వం ఈ ప్రాంత రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకొని వంతెనకు షెట్టర్లు బిగించి సాగునీటిని అందిస్తామని ప్రకటించడం సంతోషంగా ఉంది. – సంతోష్, రైతు, గుడెబల్లూర్ వంతెన పనులకు వెళ్లాం.. కృష్ణానదిపై వంతెన నిర్మాణ సమయంలో నా వయస్సు 11 ఏళ్లు. అప్పుడు మా కు టుంబ సభ్యులు, గ్రామస్తులకు పనులకు వెళ్లేవారు. వా రి వెంట నేను కూడా వెళ్లా. నాడు నిర్మించిన వంతెన నేడు మాకు సాగునీరు అందించేందుకు ఉపయోగపడుతుండటం ఆనందంగా ఉంది. ఇప్పుడు నా వయస్సు 91 ఏళ్లు. – హన్మంతు, గుడెబల్లూర్ రైతుల సంక్షేమమే ధ్యేయం.. కృష్ణానదిపై ఇప్పుడున్న పా త వంతెనకు షెట్టర్లు బిగించి రెండు టీఎంసీల నీటి నిల్వ కు నిర్ణయం తీసుకున్నాం. అ లాగే భీమానదిపై ఎక్కడికక్క డ చెక్డ్యాంలు నిర్మించి ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందించబోతున్నాం.ఈ విషయంపై కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం. నిర్మాణం పూర్తయితే నియోజకవర్గ రైతులకు సాగునీటి ఇబ్బందులు ఉండవు. – వాకిటి శ్రీహరి, రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి ●కృష్ణా: మండలంలోని కృష్ణానదిపై ప్రస్తుతం ఉన్న పాత వంతెనకు షెట్టర్లు ఏర్పాటు చేసి రెండు టీఎంసీల నీటినిల్వకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. కొత్త వంతెన వచ్చే ఏడాది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పాత వంతెన నిరుపయోగంగా మారకుండా షెట్టర్లు ఏర్పాటు చేసి నదికి సమాంతరంగా నీటిని నిలిపేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. నీటినిల్వతో పరిసర గ్రామాలకు సాగు, తాగునీటి ఇబ్బందులు ఉండవు. ఇందుకు కర్ణాటక ప్రభుత్వం కూడా అంగీకరించనుందని.. ప్రాజెక్టు విజయవంతమయ్యేందుకు అవకాశం ఉందని ప్రజలు అంటున్నారు. ఇరిగేషన్, ఇతర శాఖల అధికారులు పూర్తిస్థాయి నివేదికను త్వరలో విడుదల చేయనున్నట్లు సమాచారం. మాగనూర్, కృష్ణా మండలాల్లోని పొలాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించే అవకాశం ఉంటుంది. కృష్ణా మండలంలో 31 వేల ఎకరాల సాగు భూమి ఉండగా.. కేవలం 13 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుంది. మిగతా 18 వేల ఎకరాల్లో రైతులు వర్షాధార పంటలు సాగు చేస్తున్నారు. మాగనూర్ మండలంలో 30 వేల ఎకరాలు ఉండగా.. 18 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇక్కడ పెద్దవాగు తీరంతో పాటు సంగంబండ ప్రాజెక్టు నుంచి అత్యధికంగా సాగునీరు అందుతోంది. మిగిలిన 12 వేల ఎకరాల్లో వర్షధార పంటలు సాగు చేస్తున్నారు. ● నిజాం కాలం నాటి వంతెన.. 1933లో హైదరాబాద్ నిజాం కాలంలో కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి పునాది వేయగా 1945లో పూర్తయింది. సుమారు 12 ఏళ్ల పాటు నిర్మాణ పనులు కొనసాగాయి. ● కృష్ణా జలాల్లో రాష్ట్రవాటా పూర్తిగా వినియోగించుకుంటున్నా.. భీమానది నీటి విషయంలో 5 టీఎంసీలు వృథా అవుతున్నాయి. షెట్టర్లు ఏర్పాటుతో వీటిని కూడా పూర్తిస్థాయిలో ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. జిల్లాలో వరి, పత్తి అత్యధిక దిగుబడి సాధించిన మండలంగా కృష్ణా గుర్తింపు పొందింది. ఇకమీదట సాగు విస్తీర్ణం పెరగడంతో దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మండలంలోని చేగుంట, ఐనాపూర్, కున్సీ, ఆలంపల్లి, హిందూపూర్లో నల్లరేగడి భూములున్నాయి. ఇక్కడి రైతులు ఎక్కువగా పత్తి సాగు చేస్తుంటారు. -
పోలీసుల డేగ కన్నుల్లో నల్లమల
● ప్రధాని పర్యటన నేపథ్యంలో విస్తృత తనిఖీలు ● శ్రీశైలం పరిసర ప్రాంతాలను జల్లెడ పడుతున్న స్పెషల్ పార్టీ పోలీసులు ● గురువారం మధ్యాహ్నం వరకు ట్రాఫిక్ ఆంక్షలు దోమలపెంట: శ్రీశైలంలో మల్లికార్జునస్వామి, అమ్మవార్ల దర్శనానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం పోలీసులు మంగళవారం నుంచే సరిహద్దు ప్రాంతాలు లింగాలగట్టు, సున్నిపెంట, శ్రీశైలంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆయా ప్రాంతాల్లో వ్యాపార సంస్థలు ఇతరత్రా అన్నింటిని మూయించారు. దీంతో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రధాని శ్రీశైలం పర్యటనలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతం నుంచి శ్రీశైలానికి వచ్చే వాహనాలన్నింటినీ దోమలపెంట, ఈగలపెంటలోని జెన్కో గ్రౌండ్లో నిలిపివేయనున్నారు. ఈ మేరకు ట్రాఫిక్ ఆంక్షల ఉత్తర్వులు పోలీస్ ఉన్నతాధికారుల నుంచి అందినట్లు ఈగలపెంట ఎస్ఐ జయన్న తెలిపారు. ఇదిలా ఉండగా నల్లమల ప్రాంతం అంతా పోలీసుల డేగ కన్నుల్లో ఉంది. మరో పక్కన శ్రీశైలం పరిసర ప్రాంతాలన్నింటిని స్పెషల్ పార్టీ పోలీసులు జల్లెడ వేస్తున్నారు. ఇప్పటికే ఎన్ఎస్జీ దళాలు శ్రీశైలానికి చేరుకున్నాయి. శ్రీశైలం పరిసర ప్రాంతాలు హైఅలర్ట్లో ఉన్నాయి. గురువారం ఆర్టీసీ బస్సులను సైతం ఈగలపెంటలో ఆపివేయనున్నారు. శ్రీశైలంలో ప్రధాని పర్యటన అనంతరం ఆర్టీసీ సర్వీసులు, ఇతర వాహనాల రాకపోకలకు అనుమతిస్తారు. గురువారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. -
డ్రగ్స్కు విద్యార్థులు దూరంగా ఉండాలి
పాలమూరు: మత్తు పదార్థాలు విద్యార్థుల భవిష్యత్ నాశనం చేస్తున్నాయని, అలాంటి వాటికి దూరంగా ఉండాలని జిల్లా అదనపు ఎస్పీ ఎన్బీ రత్నం అన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మంగళవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అదనపు ఎస్పీ హాజరై జిల్లాలో మత్తు పదార్థాల రహిత జిల్లాగా తీర్చిదిద్దడం లక్ష్యమన్నారు. డ్రగ్ల ఉత్పత్తి, సరఫరా, అమ్మకాలు చేసే సమాచారం ఉంటే కంట్రోల్ రూం నంబర్ 87126 59360 లేదా డయల్ 100కు చెప్పాలన్నారు. మోసపూరిత లింక్లు ఎవరూ ఓపెన్ చేయరాదని, సైబర్ నేరాల పట్ల విద్యార్థులు సైతం అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఉమెన్ సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ కృష్ణాజీ పాల్గొన్నారు. -
నూతన సాంకేతికతతో..
ఈ ఏడాది జిల్లాలో 80,534 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. 8,05,340 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ ముందుగా అంచనా వేసింది. సీసీఐ విక్రయాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, రైతులకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు, దళారులు లబ్ధి పొందుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్రమాలకు తావివ్వకుండా నూతన సాంకేతికతతో ఈ యాప్ ద్వారా పత్తి అమ్మకాలను పకడ్బందీగా కొనసాగించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పకడ్బందీగా ఏర్పాట్లు.. సీసీఐ పత్తి కొనుగోళ్ల కోసం పకడ్బందీగా ఏ ర్పాట్లు చేస్తున్నాం. కపా స్ కిసాన్ యాప్లో రైతు లు తప్పనిసరిగా స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. దళారుల ఆట కట్టించేందుకు ప్రభుత్వం నూత న యాప్ తీసుకువచ్చింది. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా సీసీఐకి అమ్ముకోవచ్చు. పత్తిని పూర్తిగా శుభ్రంగా ఎండబెట్టి నాణ్యతగా తీసుకువస్తేనే మద్దతు ధర లభిస్తుంది. – బాలమణి, మార్కెటింగ్ శాఖ ఏడీ ● -
అక్షయపాత్ర, హెచ్ఎంకు షోకాజ్ నోటీసులు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: బాదేపల్లి పాఠశాల హెచ్ఎంతోపాటు అక్షయ పాత్ర ఫౌండేషన్కు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు డీఈఓ ప్రవీణ్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10న ‘సాక్షి’లో ప్రచురితమైన ‘మధ్యాహ్న భోజనంలో జెర్రి’ కథనానికి విద్యాశాఖ అధికారులు స్పందించారు. ఈ మేరకు మంగళవారం డీఈఓ పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనంపై ఆరా తీశారు. పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం పెట్టాలని, భోజనం తినే ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో అభిప్రాయాలు సేకరించారు. అనంతరం అక్షయపాత్ర ఫౌండేషన్ కిచెన్ను పరిశీలించి సూచనలు చేశారు. సీసీరోడ్డు పనులు పునఃప్రారంభం మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పాతపాలమూరులోని శ్రీవీరాంజనేయస్వామి ఆలయం నుంచి మైసమ్మ గుడి వరకు అసంపూర్తిగా ఉన్న పనులు ఎట్టకేలకు మంగళవారం పునః ప్రారంభించారు. వాస్తవానికి ఈ ప్రాంతంలో నాలుగు నెలల క్రితం యూజీడీతో పాటు సీసీరోడ్డు పనులను హైదరాబాద్కు చెందిన ఓ కాంట్రాక్టర్ చేపట్టారు. అయితే అప్పట్లో కేవలం రూ.పది లక్షలే మంజూరు కావడంతో మధ్యలో ఆపేశారు. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే విషయమై ‘సాక్షి’లో గత నెల 29న ‘ఎందుకీ నిర్లిప్తత..?’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పనులకు కావాల్సిన మరో రూ.15 లక్షలు మంజూరు చేశారు. దీంతో తాజాగా ఇక్కడ మిగిలిన పనులను పునఃప్రారంభించగా.. కార్యక్రమంలో నాయకులు సురేందర్రెడ్డి, సిరాజ్ఖాద్రీ, వెంకటేష్, శంకర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఆటలకు అందలం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని పలు డిగ్రీ, పీజీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. క్రీడల్లో మక్కువ ఉండి పీయూలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఇక్కడ ఉండే క్రీడా వసతులతో ఎంతో ప్రయోజనం పొందనున్నారు. ప్రతి సంవత్సరం సౌత్ జోన్, ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో పాల్గొనే విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. అంతేకాకుండా జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రస్థాయిలో జరిగే క్రీడా పోటీల్లో పాల్గొనే విద్యార్థులకు వచ్చే సర్టిఫికెట్తో స్పోర్ట్స్ కోటా సైతం లభించనుంది. దీంతో చాలామంది విద్యార్థులు క్రీడలపై ఆసక్తి కనబరుస్తున్నారు. వరంగా వసతులు.. హైదరాబాద్ తర్వాత సింథటిక్ ట్రాక్ ఉన్న ఏకై క జిల్లాగా పాలమూరు ఖ్యాతి గడించింది. ఇక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో 400 మీటర్ల ట్రాక్ తో పాటు 100 నుంచి 1500 మీటర్ల వరకు వివిధ స్థాయి క్రీడలు నిర్వహించవచ్చు. ఫీల్డ్ ఈవెంట్స్ లో హైజంప్, లాంగ్జంప్, జావెలిన్ త్రో, షార్ట్పుట్, డిస్కస్త్రో, పోల్వాల్ట్తో పాటు ఒక ఫుట్బా ల్ గ్రౌండ్ కూడా నిర్మించారు. సుమారు 2వేల మంది జనాలు కూర్చొని క్రీడలను వీక్షించేందుకు వీలు గా గ్యాలరీ సైతం ఏర్పాటు చేస్తున్నారు. వీటితోపాటు ఇండోర్ స్టేడియంలో టేబుల్ టెన్నిస్, షటిల్, చెస్, క్యారమ్స్తోపాటు జిమ్ కూడా అందులో అందుబాటులో ఉంది. దీంతో విద్యార్థుల ఫిట్నెస్ కోసం ఎంతో ఉపయోగపడనుంది. పీయూలో క్రీడలకు ప్రాధాన్యమిస్తున్న అధికారులు సింథటిక్ నిర్మాణంతో అథ్లెటిక్స్కు అనేక అవకాశాలు ఇండోర్ స్టేడియం, బాస్కెట్ బాల్ కోట్ నిర్మాణంతో ప్రయోజనం ప్రస్తుతం కొనసాగుతున్న పలు ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు ఎంపికలు సౌత్జోన్లో 1,050, ఆలిండియా పోటీల్లో పాల్గొన్న 350 మంది విద్యార్థులు జాతీయ క్రీడల్లో ప్రాతినిధ్యం.. పీయూ నుంచి ప్రాతినిధ్యం వహించి జాతీయ స్థాయి పోటీల్లో పలువురు విద్యార్థులు ప్రతిభచాటారు. హారికాదేవి 2018లో ఆలిండియా స్థాయి అథ్లెటిక్స్ 100 మీటర్లలో మూడో స్థానంలో నిలిచింది. 2019లో మహేశ్వరి స్టెపుల్ చేజ్తో ఆలిండియా రెండో స్థానం సాధించింది. 2020లో హారికాదేవి ఆలిండియా అథ్లెటిక్స్ 200 మీటర్లలో 2వ స్థానం, ఆలిండియా 100 మీటర్లలో 2వ స్థానంలో నిలిచింది. 2020లో మహేశ్వరి ఖేలో ఇండియాలో 3000 మీటర్ల స్టెపుల్ చేజ్లో 2వ స్థానం, 2020లో హారికాదేవి ఖేలో ఇండియాలో 100 మీటర్ల అథ్లెటిక్స్లో 4వ స్థానంలో నిలిచారు. విష్ణువర్ధన్ గత నాలుగు సంవత్సరాలు జాతీయ స్థాయి ఆర్చరీలో వివిధ స్థాయిల్లో ప్రాతినిధ్యం వహించారు. డేవిడ్ కృపాల్రే గత నాలుగేళ్లు ఎస్జీఎఫ్ఐ క్రికెట్లో జాతీయ స్థాయిలో ప్రతిభచాటారు. 2024లో భరత్ ఆర్చరీలో ఆలిండియా స్థాయిలో సత్తాచాటారు. మొత్తంగా ఇప్పటి వరకు పీయూ తరపున సౌత్జోన్ పోటీల్లో 1,050, ఆలిండియా పోటీల్లో 350 మంది విద్యార్థులు పాల్గొన్నారు. -
గవర్నర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గురువారం జిల్లా పర్యటనకు వస్తున్నందున అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ హాల్లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ గురువారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పీయూ స్నాతకోత్సవంలో పాల్గొంటారన్నారు. అనంతరం మద్యాహ్నం 2.10 నుంచి 2.45 వరకు కలెక్టరేట్లో కలెక్టర్, టీబీ అధికారులతో, రెడ్క్రాస్ సభ్యులతో సమావేశం, 2.45 గంటలకు రచయితలు, కళాకారులు, ప్రముఖులతో ముఖాముఖీలో పాల్గొంటారని చెప్పారు. ప్రొటోకాల్, బందోబస్తు, స్టాళ్ల సందర్శన, డయాస్, సౌండ్ సిస్టం, కరెంట్ సరఫరా తదితరవి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్, మధుసూదన్నాయక్, ఆర్డీఓ నవీన్, ఏఎస్పీ రత్నం, డీఆర్డీఓ నర్సింహులు, డీఎంహెచ్ఓ పద్మజ, సీపీఓ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల సంక్షేమానికి చర్యలు బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. కలెక్టరేట్లోని వీసీ హాల్ అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ బెస్ట్ అవైలబుల్ పథకం కింద ఎంపిక చేసిన పాఠశాలలో చదివే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అందిస్తున్న బోధన, ఆరోగ్యం, మెనూ ప్రకారం భోజనం ఇతర మౌలిక వసతుల అమలు తీరును పరిశీలించాలని సూచించారు. పాఠశాలకు ఎంపికై న ప్రతి విద్యార్థి పాఠశాలలో ఉండాలని, సమస్యల పరిష్కారంపై ఆయా పాఠశాలల యాజమాన్యాలతో చర్చించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. అంతకు ముందు ఈ విషయమై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వీసీ నిర్వహించి పలు సూచనలు చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి జనార్దన్, ఎస్సీ అభివృద్ధి అధికారి సునీత, జెడ్పీసీఈఓ వెంకట్రెడ్డి, డీఈఓ ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
స్నాతకోత్సవానికి హాజరు
మహూబబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూలో గురువారం నిర్వహించే నాలుగో స్నాతకోత్సవ కార్యక్రమానికి యూనివర్సిటీ చాన్స్లర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరవుతారని వీసీ శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు పీయూలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పలు కంపెనీలు ప్రారంభించి యువతకు ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్ఎన్ రెడ్డికి సామాజిక సేవా విభాగంలో పీయూ చరిత్రలో మొదటిసారి గౌరవ డాక్టరేట్ ఇస్తున్నామన్నారు. ప్రస్తుతం మొత్తం 88 గోల్డ్ మెడల్స్, 12 డాక్టరేట్లు ప్రదానం చేస్తున్నామన్నారు. అలాగే 2,809 పీజీలు, 8,291 ప్రొఫెషనల్ కోర్సులు, 18,666 యూజీ డిగ్రీలు ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, కంట్రోలర్ ప్రవీణ, మీడియా కమిటీ చైర్మన్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
మహబూబ్నగర్ క్రైం: జిల్లాలో పోలీస్ వ్యవస్థను పటిష్టంగా అమలు చేయాలని, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పారదర్శకత, సమయపాలన తప్పక పా టించాలని ఎస్పీ జానకి అన్నారు. డీజీపీ శివధర్రెడ్డి ఇచ్చిన సూచనల మేరకు ఎస్పీ మంగళవారం జిల్లా పోలీస్ అధికారులతో వీసీ నిర్వహించారు. ప్రతి వి భాగంలో ఉండే సిబ్బంది ప్రత్యేక దృష్టితో విధులు చేపట్టాలని, ఎన్బీడబ్ల్యూ వారెంట్లు పెండింగ్లో ఉన్నవాటిని అమలు చేసి ప్రతి వారానికి నివేదిక సమర్పించాలన్నారు. సీసీటీఎన్ఎస్ అప్డేట్స్ సమయానికి నమోదు చేసి పెండింగ్ ఎఫ్ఐఆర్లు, చార్జీ షీట్లు పూర్తి చేయాలన్నారు. రోడ్డు ప్రమాద కారణాలను లోతుగా విశ్లేషించి, మద్యం తాగి వాహనాలు నడపడం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వంటి అంశాలపై ప్ర త్యేక నిఘా పెట్టాలన్నారు. ప్రతి సర్కిల్ స్థాయిలో రోడ్ సేఫ్టీ టీమ్స్ ఏర్పాటు చేసి ప్రమాదాలు ఎక్కు వగా జరిగే బ్లాక్ స్పాట్స్ గుర్తించి అవసరమైన నివా రణ చర్యలు తీసుకోవాలన్నారు. అనుమానితులు, రౌడీషీటర్స్ నిఘా పెట్టడంతోపాటు తిరిగి క్రిమినల్ కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అదృశ్య కేసులు, సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టి త్వరగా న్యాయం జరిగేలా చూడాలన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామ పెద్దలు, యువజన, మహిళా సంఘాలతో సమన్వయం కొనసాగిస్తూ ప్రజా పోలీసింగ్ బలపరచాలని ఆదేశించారు. -
సద్వినియోగం చేసుకోవాలి..
పీయూలో క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా అన్ని సదుపాయాలు ఉన్నా యి. సింథటిక్ ట్రాక్, ఇండోర్ స్టేడియం వంటివి ఉండటం జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనే వారికి ఎంతో ప్రయోజనకరం. పోటీల్లో పాల్గొనే వారికి శిక్షణ ఇవ్వడంతోపాటు ప్రతిభచాటిన వారికి ప్రోత్సాహకాలు అందిస్తు న్నాం. పీయూ పరిధిలోని డిగ్రీ, పీజీ కళాశాలల విద్యార్థులు సౌత్జోన్, ఇంటర్ యూనివర్సిటీ పో టీల్లో ఎంపికయ్యే విధంగా ప్రోత్సహిస్తున్నాం. జాతీయ స్థాయి క్రీడాల్లో పాల్గొన్న వారికి ఇచ్చే సర్టిఫికెట్లతో ఉద్యోగాల్లో రిజర్వేషన్ సైతం పొందేందుకు ఆస్కారం ఉంటుంది. – శ్రీనివాస్, ఫిజికల్ డైరెక్టర్, పీయూ● -
తేలని ఇసుక పంచాయితీ
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుక సరఫరా కోసం ‘మన ఇసుక వాహనం’ ద్వారా చేపట్టిన కార్యక్రమానికి అడ్డంకులు తొలగడం లేదు. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం పరిధిలోని తుమ్మిళల్లో తుంగభద్ర నది నుంచి ఇసుకను సేకరించి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సరఫరా చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ ఇటీవల తవ్వకాలను ప్రారంభించారు. అయితే అలంపూర్ నియోజకవర్గానికి చెందిన ఓ అధికార పార్టీ నేత ఒత్తిళ్లతో ఇసుక తవ్వకాలు, రవాణా నిలిచిపోగా.. దుమారం చెలరేగింది. ఇసుక రవాణా కొనసాగాలంటే సంబంధిత కాంట్రాక్టర్ ఒక్కో టిప్పర్కు రూ.6 వేల చొప్పున కప్పం చెల్లించాలని హుకుం జారీ చేయగా.. కాంట్రాక్టర్ ససేమిరా అనడంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇసుక రవాణా నిలిచిపోవడంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఈ వివాదాన్ని సద్దుమణిగించేందుకు అధికార పార్టీకి చెందిన సన్నిహితులు రంగంలోకి దిగినట్లు తెలిసింది. ఎవరి పట్టు వారిదే.. తుమ్మిళ్ల నుంచి ఇసుక బయటకు రావాలంటే ఒక్కో ట్రిప్పర్కు రూ. 6వేల చొప్పున ఎట్టిపరిస్థితుల్లోనైనా చెల్లించాల్సిందేనని అధికార నేత పట్టుబట్టినట్టు సమాచారం. దీనిపై మంగళవారం సైతం అధికార నేతకు చెందిన సన్నిహితులు.. కాంట్రాక్టర్తో చర్చ లు జరిపినట్లు సమాచారం. బేరసారాలు జరిగినా సఫలం కానట్లు తెలిసింది. సదరు నేతకు కప్పం చెల్లించేందుకు సంబంధిత కాంట్రాక్టర్ ఒప్పుకోనట్టు తెలుస్తోంది. ఒక్క రూపాయి ఇచ్చేది లేదంటూ ఆయన భీష్మించుకొని కూర్చున్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో ఇసుక రవాణాకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అధికారుల మౌనంపై విమర్శలు.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కోసం తుంగభద్ర నుంచి ఇసుక తవ్వకాలను ప్రారంభించి 45 రోజులు గడుస్తున్నా.. ఇంకా కొలిక్కి రాకపోవడంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో అసహనం వ్యక్తమవుతోంది. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు మౌనం వీడకపోవడం.. సకాలంలో ఇసుక అందేలా చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ తో ‘అధికార’సన్నిహితుల బేరసారాలు కప్పం కట్టేందుకు అంగీకరించని కాంట్రాక్టర్ మౌనం వీడని అధికారులు ఇసుక లభించక ఇందిరమ్మ ఇళ్లలబ్ధిదారుల్లో అసహనం -
ట్రాన్స్ఫార్మర్ కోసం లంచం
● ఏసీబీకి చిక్కిన లైన్మన్ నాగేందర్ ● రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత వంగూరు: మితిమీరిన అవినీతికి పాల్పడుతూ రైతులను, విద్యుత్ వినియోగదారులను పీల్చి పిప్పి చేస్తున్న విద్యుత్ శాఖ లైన్మన్ నాగేందర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఇందుకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ కథనం ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని మాచినోనిపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు ట్రాన్స్ఫార్మర్ కావాలని నాలుగు నెలల క్రితం నాలుగు డీడీలకు డబ్బులు చెల్లించాడు. అయితే ట్రాన్స్ఫార్మర్ బిగించడంలో లైన్మన్ నాగేందర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. నిత్యం ట్రాన్స్ఫార్మర్ కోసం లైన్మన్ను కలవగా నాలుగు డీడీలకు రూ.20 వేలు అయినప్పటికీ అదనంగా రూ.10 వేలు తీసుకున్న లైన్మన్ సకాలంలో ట్రాన్స్ఫార్మర్ ఇవ్వకుండా మరో రూ.20 వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధిత రైతు ఏసీబీ అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. ఏసీబీ అధికారుల సూచన మేరకు వంగూరు గ్రామ శివారులోని మద్యం దుకాణం ఎదుట రైతు రూ.15 వేల నగదునాగేందర్కు ఇస్తుండగా సమీపంలో ఉన్న ఏసీబీ అధికారులు పట్టుకుని విద్యుత్ కార్యాలయానికి తరలించారు. నాగేందర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు. బుధవారం హైదరాబాద్లోని ఏసీబీ కోర్టుకు తరలిస్తామని పేర్కొన్నారు. దాడుల్లో ఏసీబీ సీఐలు లింగస్వామి, జిలానీ తదితరులు పాల్గొన్నారు. -
ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో కలవరం?
● కోతకు సిద్ధమవుతున్న ప్రభుత్వం ● ఉమ్మడి జిల్లా రిజిస్ట్రేషన్ శాఖలో 20 మంది.. ముగ్గురికే అవకాశం మెట్టుగడ్డ: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులను తగ్గించుకునేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. స్టాంప్స్, రిజిస్ట్రేషన్శాఖలో 300పైగా ఉద్యోగులుండగా.. కేవలం 110 మందిని మాత్రమే కొనసాగించేందుకు ఆర్థికశాఖ అనుమతినిచ్చింది. మిగతా 190 మందికి ఉద్వాసన పలుకుతారా? అన్న చర్చ పొరుగు సేవల ఉద్యోగుల్లో మొదలైంది. ఉమ్మడి జిల్లాలో.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, ఒక జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ఉంది. అన్ని కార్యాలయాల్లో 20 మంది ఉద్యోగులు పొరుగు సేవల ప్రాతిపదికన పనిచేస్తున్నారు. వీరికి ఏటా పొడగింపునకు ప్రభుత్వం అనుమతినిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలి. ఈ శాఖలో పెరిగిన పని భారానికి అనుగుణంగా నియామకాలు లేకపోవడంతో ఔట్సోర్సింగ్ ఉద్యోగులే ఆధారంగా మారారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రస్తుతం ఉన్న 20 మంది ఉద్యోగుల్లో కేవలం ముగ్గురిని మాత్రమే కొనసాగింపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మిగతా 17 మంది ఉద్యోగుల్లో టెన్షన్ మొదలైంది. చాలీచాలని వేతనాలతో పనిచేసే తాము రోడ్డున పడతామని ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై జిల్లా రిజిస్ట్రార్ను ఫోన్లో సంప్రదించేందుకు యత్నించగా అందుబాటులోకి రాలేదు. -
పులుల సంరక్షణలో కలిసి పనిచేయడం కీలకం
దోమలపెంట: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని నల్లమల అడవులలో పులుల సంరక్షణలో సహకార ప్రయత్నాలను బలోపేతం చేయడం కో సం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్(ఏటీఆర్) మరి యు నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఎన్ఎస్టీఆర్) అంతర్రాష్ట్ర సమావేశాన్ని సోమవారం దోమలపెంటలోని అటవీ శాఖ కార్యాలయం వనమయూరిలో నిర్వహించారు. సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ చీఫ్ వైల్డ్లైఫ్ వార్డెన్ ఏలూసింగ్ మేరు ముఖ్య అతిథిగా పాల్గొని మార్గ నిర్దేశం చేశారు. రాబోయే అఖిల భారత పులుల అంచనా కోసం వ్యూహాత్మక సన్నాహాలు చేయడం, జాతీయ సంరక్షణ ప్రణాళికకు ఇది కీలకం అని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల సహకారానికి సంబంధించి ముఖ్యమైన అంశాలపై చర్చించి తుది నిర్ణయాలను తీసుకున్నారు. అడవుల్లో వేట, అక్రమ కార్యకలాపాలను సమర్థవంతంగా అరికట్టడానికి ఏటీఆర్, ఎన్ఎస్టీఆర్ రిజర్వ్ల వద్ద సంయుక్త గస్తీని చేయడం కొరకు సమన్వయం పాటించాలని నిర్ణయించారు. పులుల డేటా భాగస్వామ్యం కొరకు ఖచ్చితమైన పర్యవేక్షణ, సంరక్షణ నిర్ణయాల కోసం ఫొటోగ్రాఫిక్ ఆధారాలను, కదలికల నమూనాలతో సహా పులుల డేటాను నిరంతరాయంగా ఇచ్చిపుచ్చుకోవడం కొరకు యంత్రాలను ఏర్పాటు చేసుకోవడంపై చర్చించారు. అలాగే, వన్యప్రాణుల కారిడార్ నిర్వహణ, అగ్ని నివారణ, మానవ మరియు వన్యప్రాణుల సంఘర్షణను పరిష్కరించడం వంటి వాటికి సంబంధించిన ప్రయత్నాలను సమకాలీకరంచడం కొరకు పాల్గొనే వారి నిర్దిష్ట సహకార ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. సమావేశంలో రెండు పులుల సంరక్షణ ప్రాంతాల నుంచి ఫీల్డు డైరెక్టర్లు, డిఎఫ్ఓలు, ఎఫ్డిఓలు, ఎఫ్ఆర్ఓలు, కీలకమైన క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు. -
‘ధన్ధాన్య’తో రైతులకు వరం
గద్వాల: ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన పథకం రైతులకు వరమని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. సోమవారం ఆమె జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన పథకం కింద దేశవ్యాప్తంగా వెనకబడిన ప్రాంతాలైన 100 జిల్లాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. మన రాష్ట్రంలో నాలుగు జిల్లాలు ఎంపిక కాగా పాలమూరు ఉమ్మడి జిల్లాలో జోగుళాంబ గద్వాల, నారాయణపేట, నాగర్కర్నూల్ జిల్లాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈపథకం కింద మూడు జిల్లాలకు మొదటి విడత కింద రూ.960 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. ఇందులో ప్రధానంగా సాగునీటి వనరు లు లేని ప్రాంతాల్లో సాగునీటి వనరులను కల్పించి వివిధ రకాల పంట ఉత్పత్తులు సాగుచేసేలా అభివృద్ధి చేస్తారన్నారు. అదేవిధంగా రైతులు పండించిన పంటలకు అవరమైన మార్కెటింగ్ సౌకర్యం, మద్దతు ధర కల్పించడం, ఎలాంటి పంటలు సాగుచేస్తే అధిక దిగుబడులు వస్తాయి, సాగుపంటల మార్పిడి వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తారన్నారు. రైతులు పండించిన పంట ఉత్పత్తులను నిల్వచేసుకునేలా పెద్ద ఎత్తున గోదాములను నిర్మిస్తామని, రైతుల ఉత్పత్తి సంఘాల ద్వారా రైతులకు సబ్సిడీపై రుణాలు అందిస్తామన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టి వ్యవసాయ అనుబంధరంగాలైన డైరీ, గొర్రెలపెంపకం, చేపల ఉత్పత్తి వంటివాటిని అభివృద్ధి చేస్తారని ఆమె వివరించారు. ఈప్రాంతప్రజల తరపున దేశప్రధాని మోడీ, వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్సిగ్చౌహాన్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కోన్నారు. 2047నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా అన్ని రంగాల్లో అభివృద్ది చెందేలా దేశప్రధాని మోడీ ఒకవిజన్తో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో గడచిన పదేళ్ల బీఆర్ఎస్ పాలన, ప్రస్తుతం కాంగ్రెస్ పాలన వల్ల ప్రజలకు ఎలాంటి మేలు చేకూరడం లేదన్నారు. ఈరెండు ప్రభుత్వాలు పాలనపరంగా పూర్తిగా వైఫల్యం చెందినట్లు విమర్శలు చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు డీకే స్నిగ్ధారెడ్డి, రామాంజనేయులు, రాంచంద్రారెడ్డి, బండల వెంకట్రాములు, వెంకటేశ్వర్రెడ్డి, రమాదేవి, బలిగెర శివారెడ్డి, దేవదాసు, రజకజయశ్రీ, విజయలక్ష్మీ, సమత తదితరులు పాల్గొన్నారు. అనంతరం గద్వాల జిల్లా మహిళా యువమోర్చా అధ్యక్షురాలిగా సమత, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడుగా దేవదాస్లను నియమిస్తూ వారికి నియామక పత్రాలు అందజేశారు. ఇదిలాఉండగా, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన సుమారు 250మంది నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరగా.. ఎంపీ కండువాలు కప్పారు. అలాగే, డి లిమిటేషన్ ప్రక్రియలో అయిజను అసెంబ్లీ, గద్వాలను పార్లమెంట్ నియోయోజకవర్గంగా ఏర్పాటు చేయాలని కోరుతూ వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు, కులసంఘాలకు చెందిన అఖిలపక్ష కమిటీ నేతలు ఎంపీ డీకే అరుణకు వినతిపత్రం అందజేశారు. గద్వాల, పేట, నాగర్కర్నూల్ జిల్లాలు పథకానికి ఎంపిక మొదటి విడతగా రూ.960 కోట్లతో అభివృద్ధి పనులు మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ -
బాలికపై లైంగిక దాడి
చిన్నచింతకుంట: ఇన్స్ర్ట్రాగామ్ పరిచయం ప్రేమగా మారి మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిపై పోక్సో కేసు నమోదైన ఘటన సోమ వారం మండలంలో చోటు చేసుకుంది. సీఐ రామకృష్ణ, ఎస్ఐ ఓబుల్రెడ్డి తెలిపిన వివరాలు.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక వనపర్తి జిల్లా కేంద్రంలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. బాలికకు మూడు నెలల క్రితం సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలం బోజతండాకు చెందిన చందర్నాయక్తో ఇన్స్ట్రాగామ్లో పరిచయమయ్యాడు. ఈ నేపథ్యంలో చందర్నాయక్ సదరు బాలికను ప్రేమిస్తున్నానని వంచించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో వారు చిన్నచింతకుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు చందర్నాయక్పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. జాతీయస్థాయి అథ్లెటిక్స్కు జిల్లా విద్యార్థిని కందనూలు: ఒడిశా రాష్ట్రంలో ని భువనేశ్వర్లో త్వరలో నిర్వహించే 40వ జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు జిల్లాకు చెందిన కొడావత్ స్వప్న ఎంపికై ందని జిల్లా అథ్లెటిక్స్ సంఘం అధ్యక్షుడు విజేందర్ యాదర్ సోమవారం తెలిపారు. ఇటీవల పాలమూరు యూనివర్సిటీలో జరిగిన 11వ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో విద్యార్థిని స్వప్న విశేష ప్రతిభకనబర్చడంతో జాతీయస్థాయికి ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడాకారులు అభినందనలు తెలియజేశారు. జాతీయస్థాయి అథ్లెటిక్స్ రెఫరీగా హైదర్ పాషా ఎర్రవల్లి: మండల కేంద్రానికి చెందిన సయ్యద్ హైదర్ పాషా జాతీయ స్థాయి అథ్లెటిక్స్ రెఫరీగా ఎంపికయ్యారు. ఇటీవల హన్మకొండలో నిర్వహించిన టీఏఏ సెమినార్లో ఆయన పాల్గొని ఉత్తమ ప్రతిభను కనబర్చి జాతీ య స్థాయి అథ్లెటిక్స్ రెఫరీగా ఎన్నికయ్యారు. ఈ నెల 16 నుంచి 18వరకు హన్మకొండలో నిర్వహించనున్న 5వ అండర్–23 నేషనల్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో అథ్లెటిక్స్ త్రోస్కు ఆయన ప్రాతినిథ్యం వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన పదో బెటాలియన్లోని సాయిధ చైతన్య పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా అథ్లెటిక్ అసోసియేషన్ సభ్యులు, వ్యాయామ, పాఠశాల ఉపాధ్యాయులు ఆయనను అభినందించారు. మూఢనమ్మకాల పేరుతో మోసం: నలుగురు అరెస్ట్ మదనాపురం: మూఢనమ్మకాల పేరుతో మదనాపూర్ మండలానికి చెందిన ఓ వ్యక్తిని మోసం చేసిన ఘటన సోమవారం వెలుగుచూసింది. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఓ వ్యక్తి జ్యోతిష్యం చెప్తాననే ప్రకటన ద్వారా బాధితుడిని నమ్మించి, దుష్టశక్తులు ఉన్నాయంటూ అష్టదిగ్బంధన పూజలు చేయాల్సిన అవసరం ఉందని నమ్మబ లికాడు. మొత్తం రూ.5.66 లక్షలు వసూలు చేశాడు. మోసానికి పాల్పడిన ప్రధాన నిందితుడు ఊరగోపి పల్నా డు జిల్లా బెల్లంకొండకు చెందినవాడిగా గుర్తించారు. అతనితోపాటు ఖమ్మం జిల్లాకు చెందిన సిరిగిరి బాబు, పస్తం రాజు, వరంగల్కు చెందిన అల్లం గోపి కలిసి హైదరాబాద్లో నివాసముంటూ మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. సోషల్ మీడియా ద్వారా పూజలు చేస్తామని చెప్పి మోసం చేసే వ్యక్తులపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ● ఇన్స్ర్ట్రాగామ్లో పరిచయం ● నిందితుడిపై పోక్సో కేసు నమోదు -
కారు ఢీకొట్టడంతో వ్యక్తి దుర్మరణం
మానవపాడు: జాతీయ రహదారి–44పై ఆర్టీఏ చెక్పోస్ట్ వద్ద కర్నూలు వెళ్లేందుకు రోడ్డుపై నిల్చొని ఉన్న వ్యక్తి కారు ఢీకొట్టడంతో మృతి చెందాడు. ఎస్ఐ చంద్రకాంత్ తెలిపిన వివరాలు.. మహబూబ్నగర్ జిల్లా ధర్మవరానికి చెందిన కృష్ణయ్యగౌడ్ (50) సోమవారం తెల్లవారు జామున 1 గంట సమయంలో ఆర్టీఏ చెక్పోస్ట్ వద్ద సొంత కారు పంక్చర్ అవ్వగా లిఫ్ట్ కోసం రోడ్డుపై నిల్చున్నాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని కారు ఢీకొట్టడంతో తీవ్రగాయాల పాలయ్యాడు. చెక్పోస్టు సిబ్బంది చికిత్స నిమి త్తం కృష్ణయ్యగౌడ్ను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య మంజుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. యువకుడి ఆత్మహత్య భూత్పూర్: మండలంలోని మద్దిగట్ల గ్రామాని కి చెందిన రాజు(35) సోమవారం హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మృతుడి తండ్రి బాలకిష్ట య్య తెలిపారు. పూర్తి వివరాలు.. వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురానికి చెందిన రాజు ఆదివా రం కూలీ పని నిమిత్తం వెళ్తున్నాని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లాడు. మధ్యాహ్నం పురుగు మందు తాగి అపస్మారిక స్థితిలో ఉండగా గ్రామస్తులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చా రు. 108 వాహనంలో జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో అదేరోజు రాత్రి హైదరాబాద్ గాంధీ ఆస్ప త్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అనంతరం భూత్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మృతుడి తండ్రి తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చెట్టు పైనుంచి జారిపడి యువకుడి మృతి జడ్చర్ల: సీతాఫలాలను తెంపేందుకు చెట్టుపైకి ఎక్కిన యువకుడు ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందిన ఘటన బాలానగర్ మండలం పెద్దరేవల్లి శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఛత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన రామురాం కాష్యప్(22) బోర్వెల్ పనులకు వెళ్తుండేవాడు. ఈ క్రమంలో ఆదివారం పెద్దరేవల్లి సమీపంలో సీతాఫలాలు తెంపేందుకు చె ట్టు ఎక్కాడు. పండ్లు తెంపుతూ జారి దాదా పు 15 అడుగుల లోతు గుంతలో పడడంతో తీ వ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.సోమవారం మృతుడి బావ దుర్గా రాం మార్కమ్ ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చారకొండ: ఇంటి మిద్దె పైనుంచి జారి కిందపడిన ఘటనలో చికిత్స పొందుతూ వ్యక్తి సోమవారం మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. మండలంలోని సారంబండతండాకు చెందిన ఇస్తావత్ ధన్కోటి(44) పదిరోజుల కిందట తన ఇంటి మీద నుంచి ప్రమాదవశాత్తు జారి కింద పడడంతో తలకు తీవ్రగాయలయ్యాయి. చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ ఉస్మానియాకు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడికి భార్య బుజ్జి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మృతిపై కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మహిళ మృతదేహం లభ్యం పెంట్లవెల్లి: మండలంలోని మంచాలకట్ట సమీపంలో వ్యవసాయ పొలాల వద్ద చాకలి రాము డు గట్టు వద్ద మహిళ శవం ఉందని బర్రెల కాపరి గమనించి స్థానికులకు తెలియజేశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వవగా.. ఎస్ఐ రామన్గౌడ్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. మృతదేహం మహిళదని.. మహిళ వయసు 30నుంచి 40 ఏళ్లమధ్యలో ఉండవచ్చని తెలియజేశారు. మహిళను పెట్రో ల్ పోసి కాల్చినట్లు తెలియజేశాడు. శవాన్ని పోస్ట్మార్టం చేసి పూర్తి వివరాలు సేకరిస్తామని, దుండగులను కచ్చితంగా పట్టుకుంటామని ఎస్ఐ తెలిపారు. మహిళ అదృశ్యం: కేసు నమోదు నాగర్కర్నూల్ క్రైం: మహిళ అదృశ్యంపై సోమ వారం కేసు నమోదైనట్లు ఎస్ఐ గోవర్ధన్ తెలిపారు. ఎస్ఐ వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రానికి చెందిన స్వాతి భర్తతో గొడవ పడి ఈ నెల 7న ఇంటి నుంచి వెళ్లి పోయింది. ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కొట్రలో వృద్ధుడు.. వెల్దండ: కొట్రకు చెందిన వృద్ధుడు పోనుగంటి అర్జున్రావు(65) అదృశ్యమైన ఘటనపై కేసు నమోదైంది. ఎస్ఐ కురుమూర్తి తెలిపిన వివరాలు.. అర్జున్రావు ఆదివారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లి ఎంతకి రాకపోవడంతో అర్జున్రావు సోదరుడు కృష్ణారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
వాలీబాల్ టోర్నీ విజేత మహబూబ్నగర్
జడ్చర్ల టౌన్: బాదేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో సోమవారం జరిగిన ఎస్జీఎఫ్ అండర్ 17 ఉమ్మడి జిల్లా బాల బాలికల వాలీబాల్ టోర్నీలో మహబూబ్నగర్ జట్లు విజేతగా, నాగర్కర్నూల్ జట్లు రన్నరప్గా నిలిచాయి. పోటీల్లో ఉమ్మడి జిల్లాలోని వివిధ జిల్లాల క్రీడా జట్లు పాల్గొన్నాయి. విజేతలకు బాదేపల్లి ఉన్నత పాఠశాల శతాబ్ది ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రవిశంకర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు వి.కృష్ణ , క్రీడాకమిటీ అధ్యక్షుడు కృష్ణ, ఇతర కమిటీ బాధ్యులు జ్ఞాపికలు అందజేశారు. అలాగే అన్ని జిల్లాల నుంచి చక్కటి ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఎంపిక చేశారు. ఈ జట్టు ఈ నెల 16న జరిగే రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొననుంది. కార్యక్రమంలో జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి చెన్న వీరయ్య, ఎస్జీఎఫ్ కార్యదర్శి శారదబాయి, ప్రధానోపాధ్యాయురాలు చంద్రకళ, రాష్ట్ర పీడీ, పీఈటీ అసోసియేషన్ అధ్యక్షుడు డి.నిరంజన్, పీడీలు వడెన్న, రాంకళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. -
జూరాలకు భారీగా తగ్గిన వరద
ధరూరు/ఆత్మకూర్/దోమలపెంట: ప్రియదర్శిని జూరాల జలాశయానికి ఎగువ నుంచి వచ్చే వరద రోజురోజుకు భారీగా తగ్గుతున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో 55 వేల క్యూసెక్కులు ఉండగా.. సోమవా రం రాత్రి 8 గంటలకు 43 వేల క్యూసెక్కులకు తగ్గినట్లు చెప్పారు. నెట్టెంపాడు ఎత్తిపోతలలో ఒక పంపును ప్రారంభించి నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లను నింపుతున్నట్లు వివరించారు. విద్యుదుత్పత్తి నిమి త్తం 45,177 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 71, నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750, ఎడమ కాల్వకు 1,030, కుడి కాల్వకు 600 క్యూసెక్కుల నీటిని వినియోగించినట్లు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 9.029 టీఎంసీలు ఉందన్నారు. కొనసాగుతున్న విద్యుదుత్పత్తి.. జూరాల దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో సో మవారం ఉత్పత్తి కొనసాగిందని ఎస్ఈ శ్రీధర్, డీ ఈ పవన్కుమార్ తెలిపారు. సోమవారం ఎగువ 6 యూనిట్ల నుంచి 234 మెగావాట్లు, దిగువ 6 యూని ట్ల నుంచి 240 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరిగిందన్నారు. ఎగువ, దిగువ కేంద్రాల్లో ఇప్పటి వరకు 821 .177 మి.యూ.ఉత్పత్తి సాధించామని చెప్పా రు. శ్రీశైలంలో 884.3 అడుగుల నీటిమట్టం.. శ్రీశైలం జలాశయంలో సోమవారం 884.3 అడుగుల వద్ద 211.4759 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. జూరాలలో విద్యుదుత్పత్తి చేస్తూ 45,177 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 8,958 క్యూసెక్కుల వరద జలాశయానికి చేరిందన్నారు. భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కులు, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 30,236 క్యూసెక్కులు దిగువన ఉన్న నాగార్జునసాగర్కు వదులుతున్నట్లు చెప్పారు. భూగర్భ కేంద్రంలో 17.101 మిలియన్ యూనిట్లు, కుడిగట్టు కేంద్రంలో 14.689 మి.యూ. విద్యుదుత్పత్తి జరిగిందన్నారు. రామన్పాడులో పూర్తిస్థాయి నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో సోమవారం పూర్తిస్థాయి నీటిమట్టం సముద్ర మట్టానికి పైన 1,021 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 1,030 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదన్నారు. ఇదిలా ఉండగా జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వ కు 875 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 55 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు. -
గురుకులాలు, హాస్టళ్లను తనిఖీ చేయాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లా, మండల ప్రత్యేకాధికారులు సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల పాఠశాలలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాల ని కలెక్టర్ విజయేందిర అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడా రు. వివిధ శాఖల అధికారులు వారికి కేటాయించిన హాస్టళ్లు, గురుకులాలు, కేజీబీవీలను ప్రతినెలా మొ దటి వారంలో తనిఖీ చేసి.. సంబంధిత రిపోర్టును ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. హాస్టళ్లలో పరిస్థితులను మెరుగుపరచాలని, ముఖ్యంగా మెనూ పాటించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే అంశాలపై షోకాజ్ జారీ చేయాలని ఆదేశించారు. 16న గవర్నర్ పర్యటన.. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ జిల్లాకు రానున్నారని కలెక్టర్ వెల్లడించారు. గురువారం ఉదయం 11 గంటలకు 12.30 గంటలకు వరకు పాలమూరు యూనివర్సిటీలో జరిగే స్నాతకోత్సవానికి చాన్స్లర్గా అధ్యక్షత వహిస్తారన్నారు. అనంతరం మధ్యాహ్నం 2.10 నుంచి 2.45 గంటల వరకు కలెక్టరేట్లో టీబీ అధికారులు, రెడ్క్రాస్ సొసైటీ సభ్యులతో సమావేశమవుతారని, 2.45 గంటలకు రచయితలు, కళాకారులు, ప్రముఖులతో ముఖాముఖిలో పాల్గొంటారని పేర్కొన్నారు. గవర్నర్ పర్యటన సందర్భంగా అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. కలెక్టరేట్లో ప్రొటోకాల్ ఏర్పాటు ఆర్డీఓ, తహసీల్దార్, బందోబస్తు ఏర్పాట్లు పోలీసు, శాఖ పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మధుసూదన్నాయక్, జెడ్పీసీఈఓ వెంకట్రెడ్డి, డీఆర్డీఓ నర్సింహులు, ఆర్డీఓ నవీన్ తదితరులు పాల్గొన్నారు. సీపీఆర్పై అవగాహన అవసరం ఆకస్మిక కార్డియాక్ అరెస్టుకు గురైన వ్యక్తులకు సకాలంలో సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడవచ్చని, దీనిపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని కలెక్టర్ విజయేందిర అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో వైద్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. కొందరికి అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్టు జరిగి వచ్చిన ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. అలాంటి వారికి సీపీఆర్తో ప్రథమ చికిత్స చేస్తే ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడుతారన్నారు. కార్డియాక్ హెల్త్ కేర్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు జిల్లాలోనూ ఈ నెల 13 నుంచి 17 వరకు వారం రోజుల పాటు సీపీఆర్పై అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. వైద్యాధికారులు మనుప్రియ, శివకాంత్ ప్రయోగ పూర్వకంగా సీపీఆర్ ఎలా చేయాలో క్షుణ్ణంగా వివరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ పద్మజ, డిప్యూటీ డీఎంహెచ్ఓ శశికాంత్ తదితరులు పాల్గొన్నారు. -
భవిష్యత్కు భరోసా
పీయూలో చదువుకున్న పలువురు విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు ● స్టడీ సర్కిల్లో శిక్షణ పొంది.. వివిధ స్థాయిల్లో కొలువులు ● ప్రైవేట్తోపాటు దేశ, విదేశాల్లోనూ పూర్వ విద్యార్థుల రాణింపు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నత విద్యకు కేంద్ర బిందువుగా మారిన పీయూ ఎంతోమంది పేద విద్యార్థుల జీవితాలను నిలబెట్టేందుకు వరప్రదాయినిగా మారింది. ఇంటర్ తర్వాత చేరే ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ మొదలుకొని.. డిగ్రీ తర్వాత పీజీ స్థాయి కోర్సులు చదివిన ఎంతో మంది విద్యార్థులు వివిధ స్థాయిల్లో ఉద్యోగాల్లో చేరి జీవితంలో ఉన్నతంగా రాణిస్తున్నారు. యూనివర్సిటీలో పోటీ పరీక్షలకు అవసరమైన అన్ని వసతులు కల్పించడంతో విద్యార్థులు జీవితంలో స్థిరపడి ఇక్కడి నుంచి వెళ్తున్నారు. సాధారణంగా యూనివర్సిటీలో స్టడీ సర్కిల్ ద్వారా తరగతులు బోధించేందుకు అటు ప్రభుత్వం, ఇటు విద్యార్థి నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోకుండా కేవలం యూనివర్సిటీ అధికారులు ప్రత్యేకంగా నిధులు కేటాయించి శిక్షణ ఇప్పిస్తున్నారు. దీంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. పోటీ పరీక్షలకు సన్నద్ధం.. యూనివర్సిటీలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేక లైబ్రరీ, అవసరమైన పుస్తకాలు ఎప్పటికప్పుడు అధికారులు అందుబాటులో ఉంచుతున్నారు. వీటితో పాటు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు అధికారులు ప్రత్యేక స్టడీ సర్కిల్ సైతం నిర్వహించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో కళాశాల తరగతులు లేని సమయంలో స్టడీ సర్కిల్ కొనసాగించారు. దీంతో గతేడాది వెలువడిన పలు పోటీ పరీక్షల ఫలితాల్లో చాలామంది పీయూ విద్యార్థులు ఉత్తీర్ణత పొంది ఉద్యోగాలు సాధించారు. 2018– 19 విద్యా సంవత్సరంలో 160 మంది స్టడీ సర్కిల్ ద్వారా శిక్షణ పొందితే 35 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. 2019– 20లో 143 మంది శిక్షణ పొందగా... 21 మంది ఉద్యోగాలు పొందారు. 2020– 21లో కోవిడ్ కారణంగా శిక్షణ జరగలేదు. ఇక 2021– 22లో 135 మంది శిక్షణ తీసుకుంటే 25 మంది, 2022– 23లో 197 మంది శిక్షణ తీసుకుంటే 107 మంది విద్యార్థులు కానిస్టేబుల్, డీఎస్సీ, గ్రూప్–4 వంటి ఉద్యోగాలు సాధించడం గమనార్హం. అలాగే పలు ప్రైవేట్ సంస్థలు, విదేశాల్లోనూ కొందరు ఉద్యోగాలు పొందారు. -
భక్తిశ్రద్ధలతో అగ్నిగుండ మహోత్సవం
జడ్చర్ల టౌన్: మండలంలోని మీనాంబరం పరుషవేదీశ్వరస్వామి ఆలయంలో సోమవారం అగ్నిగుండ మహోత్సవం భక్తిశ్రద్ధలతో కొనసాగింది. ముందుగా తెల్లవారుజామున ఆలయ ప్రాంగణంలో అగ్నిగుండం ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల ఓం నమః శివాయ నామస్మరణ మధ్య అగ్నిగుండంలో భక్తులు నడిచి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో పార్వతీ, పరమేశ్వరుల కల్యాణం కనుల పండువగా జరిపించారు. కల్యాణోత్సవంలో రమాదేవి, విజయమ్మ, సుదర్శన్రెడ్డి, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గోపాల్, పర్వతాలు, కై లాస్ జవహర్, మల్లేష్, యాదయ్య పాల్గొని అన్నదానం చేశారు. కార్యక్రమంలో భాగంగా కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చిన భక్తులు ఆదివారం అర్ధరాత్రి వేసిన ఖడ్గాలు ఆకట్టుకున్నాయి. -
పాఠశాల స్థలంపై రియల్టర్ల కన్ను
సాక్షి, నాగర్కర్నూల్: పెరుగుతున్న భూముల ధరలు.. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో ప్రభుత్వ, అసైన్డ్ భూములు, ఖాళీ స్థలాలపై కన్నేస్తున్న అక్రమార్కుల చూపు ఏకంగా సర్కారు బడి జాగాపై పడింది. ఆరు దశాబ్దాలుగా ప్రభుత్వ ఆస్పత్రి, ఆ తర్వాత ప్రభుత్వ పాఠశాల కొనసాగుతున్న స్థలాన్ని కాజేసేందుకు కొందరు రియల్టర్లు కుట్ర పన్నుతున్నారు. ఇందుకు ఓ ప్రధాన పార్టీకి చెందిన నాయకుడు, మాజీ ప్రజాప్రతినిధి అండగా ఉండి.. పట్టా మార్పిడిలో అన్నీ తానై వ్యవహరించడం గమనార్హం. 1961లో పీహెచ్సీ ఏర్పాటు.. బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలోని సర్వే నం.23లో ఉన్న 1.30 ఎకరాల భూమిని పీహెచ్సీ కోసం సంబంధిత యజమాని ప్రభుత్వానికి దానంగా ఇచ్చారు. 1961 మే 12న అప్పటి ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య చేతుల మీదుగా ఆస్పత్రి భవనాన్ని ప్రారంభించారు. తర్వాత ఆస్పత్రిని మరోచోట విశాలమైన భవనంలోకి మార్చగా.. పాత భవనంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్వహిస్తున్నారు. ప్రధాన రహదారికి ఆనుకుని ఉండటం.. రూ.కోట్లు విలువ చేసే స్థలం కావడంతో కొందరు రియల్ వ్యాపారుల కన్ను పడింది. ఇందుకోసం ముందస్తు ప్రణాళికతో స్థలాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పాఠశాల స్థలం నుంచి 23 గుంటల భూమిని 2012లో బిజినేపల్లికి చెందిన ఓ వ్యక్తి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకోగా.. తర్వాత 2015లో సదరు భూమిని భూత్పూర్కు చెందిన రియల్ వ్యాపారి పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యింది. పాఠశాల స్థలంలోని రోడ్డువైపు ఉన్న 6 గుంటల స్థలంలో కమర్షియల్ షెట్టర్లు, షాపుల నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. పాఠశాల స్థలం అన్యాక్రాంతమవుతున్నట్టు గుర్తించిన గ్రామస్తులు.. ఇటీవల ప్రజావాణిలో కలెక్టర్ను కలసి ఫిర్యాదు చేశారు. ప్రధాన రహదారి పక్కనే ఉన్న భూమిని దక్కించుకునేందుకు ప్రయత్నాలు బిజినేపల్లి జెడ్పీహెచ్ఎస్ స్థలంలో కమర్షియల్ షాపుల ఏర్పాటుకు పన్నాగం -
అధికారుల సహకారంతో..
పీయూలో వివిధ సబ్జెక్టుల్లో పీజీ వరకు చదివిన అనేక మంది విద్యార్థులు ఉద్యోగా లు సాధించి జీవితంలో స్థిరపడ్డారు. అందుకోసం స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా శిక్షణ తరగతులు నిర్వహించాం. అందుకోసం యూనివర్సిటీ అధికారులు సైతం ఎంతో సహకరించారు. – భూమయ్య, స్టడీ సర్కిల్ డైరెక్టర్, పీయూ సదుపాయాలు బాగున్నాయి.. పీయూలో 2013– 15 బ్యాచ్ లో నేను ఎంఎస్డబ్ల్యూ చదివాను. ఈ క్రమంలో అప్పటికే లైబ్రరీలు, స్టడీ హాల్ వంటి సదుపాయాలు బాగానే ఉన్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అక్కడి అధ్యాపకులు, అధికారులు ఎంతో ప్రోత్సహించడంతో పోటీ పరీక్షలపై అవగాహన పెంచుకొని ఉద్యోగం సాధించా. – మల్లేష్, జూనియర్ లెక్చరర్, వనపర్తి కళాశాల యువతకు జీవితం.. నేను పీయూలో చదువుకునే క్రమంలో గ్రూప్–2కు సిద్ధ మయ్యాను. అప్పుడు అక్క డ ఉండే వసతులు చాలా వినియోగించుకున్నాం. అప్పటి రిజిస్ట్రార్ వెంకటాచలం, అధ్యాపకులు గాలెన్న ఎంతో సహకరించారు. మాతోపాటు చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు సైతం ఉద్యోగాలు సాధించారు. పీయూ 4వ స్నాత కోత్సవం జరపుకోవడం చాలా గొప్ప విషయం. చాలా మంది యువతకు జీవితాన్ని ఇచ్చింది. – పరమేశ్వర్గౌడ్, ఎకై ్సజ్ సీఐ, పటాన్చెరు స్థిరపడేందుకు ప్రోత్సాహం.. పీయూలో చదువుకునేందు కు, పోటీ పరీక్షలకు సిద్ధమ య్యేందుకు చక్కటి వాతావరణం ఉంది. అక్కడ లైబ్రరీ, స్టడీ హాల్, కంప్యూటర్ ల్యాబ్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి విద్యార్థి జీవితంలో స్థిరపడేలా ప్రోత్సహిస్తున్నారు. – అనిల్కుమార్, పీజీటీ, బీసీ గురుకులం● -
ఇకనైనా.. పెరిగేనా?
మహబూబ్నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాలకు వస్తున్న టెండర్లలో పాలమూరు అగ్రస్థానంలో ఉండగా చివరి స్థానంలో వనపర్తి జిల్లా నిలిచింది. సోమవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 187 దరఖాస్తులు వచ్చాయి. మద్యం దుకాణాలకు దరఖాస్తులు చేసుకోవడానికి మరో ఐదు రోజుల వ్యవధిలో టెండర్లు ఏ స్థాయిలో పెరుగుతాయి అనే టెన్షన్లో ఎకై ్సజ్ అధికారులు ఉన్నారు. గతంలో ఎప్పుడూ కూడా చివరి ఐదు రోజుల్లో దరఖాస్తులు అమాంతం పెరిగిన సందర్భాలు ఉండగా.. ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటుందా అనేది చూడాలి. రెండేళ్ల కిందట జరిగిన దరఖాస్తుల స్వీకరణలో మహబూబ్నగర్ సర్కిల్ పరిధిలో ఉన్న దుకాణాలకు మొత్తం 1,308 టెండర్లు రాగా.. ఇందులో చివరి మూడు రోజుల్లోనే 1,123 దరఖాస్తులు వచ్చాయి. మిగిలిన రోజుల్లో వచ్చినవి కేవలం 200లోపే.. ఈసారి కూడా అదే ట్రెండ్ కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఉమ్మడి జిల్లాలోని 14 సర్కిళ్ల పరిధిలో ఉన్న సీఐలు టెండర్లు పెంచుకోవడానికి కావాల్సిన కసరత్తు సైతం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని 227 దుకాణాలకు 455 టెండర్లే దాఖలు అత్యధికంగా పాలమూరులో, అత్యల్పంగా వనపర్తిలో.. చివరి మూడు రోజుల్లోజోరందుకుంటాయని ఆశాభావం -
కాంగ్రెస్లోకి ఎర్ర శేఖర్.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, మహబూబ్నగర్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి(MLA Anirudh Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్(Erra Shekar) కాంగ్రెస్లో(Telangana Congress) చేరికపై అసహనం వ్యక్తం చేస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఫ్యాక్షన్ రాజకీయాలు చేయాలని తనకు లేదంటూ ఘాటు విమర్శలు చేశారు.జడ్చర్ల(Jedcherla MLA) ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తాజాగా మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఫ్యాక్షన్ రాజకీయాలు లేవు. సర్పంచ్ పదవి కోసం సొంత తమ్ముడినే హత్య చేశారు. రేపు ఎమ్మెల్యే పదవి కోసం నన్ను కూడా చంపొచ్చు. ఇలాంటి వారి కోసం జడ్ కేటగిరి సెక్యూరిటీ అడగాలా?. ఫ్యాక్షన్ రాజకీయాలు చేయాలని నాకు లేదు. సంచులు తీసుకెళ్లేవారికి పార్టీలో చోటులేదు. ఎర్ర శేఖర్ కాంగ్రెస్లో చేరడానికి వీలులేదు. మోసం చేసి పోయినవారికి మళ్లీ ఎంట్రీలేదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: చేవేళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి కన్నుమూత -
ట్రోఫీలు అందజేసిన ఎమ్మెల్యే యెన్నం
రాష్ట్రస్థాయి జూనియర్ నెట్బాల్ పోటీల ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన విన్నర్, రన్నరప్, మూడో స్థానం జట్లకు ట్రోఫీలు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడలను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగపరచడమే కాకుండా ఆత్మవిశ్వాసం, నాయకత్వం, పట్టుదల, లక్ష్యాలను సాధించాలనే సంకల్పాన్ని నేర్పుతుందన్నారు. ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్పీ వెంకటేశ్ జిల్లా కేంద్రంలో నాలుగు రోజులపాటు రాష్ట్రస్థాయి నెట్బాల్ పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఓడిన వారు నిరాశ చెందకుండా మళ్లీ గెలుపు కోసం శ్రమించాలని కోరారు. అంతర్జాతీయ నెట్బాల్ పోటీల్లో పాల్గొన్న రాష్ట్ర క్రీడాకారిణులను ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, నెట్బాల్ అసోసియేషన్ తెలంగాణ అధ్యక్షుడు విక్రమాదిత్యరెడ్డి, కార్యదర్శి శిరీషరాణి, రామ్మోహన్గౌడ్, అంజద్అలీ, విహారి, షరీఫ్, మాజీ కౌన్సిలర్ షేక్ ఉమర్తోపాటు వివిధ జిల్లాల జట్ల కోచ్లు, మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు. -
ప్రేమ విఫలమైందని.. యువకుడి ఆత్మహత్య
నాగర్కర్నూల్ క్రైం: ప్రేమ విఫలమై మనస్తాపానికి గురై ఇంట్లో ఉరివేసుకుని యువకుడు మృతిచెందిన ఘటన జిల్లా కేంద్రంలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకోగా ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై గోవర్ధన్ కథనం ప్రకారం.. కొల్లాపూర్ పట్టణానికి చెందిన కొమ్ము రామకృష్ణ (25) జిల్లాకేంద్రంలోని మంతటి చౌరస్తా వద్ద బైక్ మెకానిక్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడు ఏడాది కాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఇంట్లో విషయం తెలియడంతో తల్లిదండ్రులు కొమ్ము రామకృష్ణను మందలించారు. ప్రేమించిన యువతి తనకు దక్కదని మనస్తాపానికి గురై క్షణికావేశంలో రాఘవేంద్రకాలనీలోని తన బాబాయి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరించారు. ఘటనకు సంబంధించి మృతుడి అన్న సలేశ్వరం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. నీటిగుంతలోకి దూకి యువకుడు ఆత్మహత్య జడ్చర్ల: నీటి గుంతలో దూకి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం మండలంలోని కొండేడులో చోటుచేసుకుంది. కొండేడు గ్రామ శివారులో గ్రామాభివృద్ధి కోసం భారీగా మట్టిని తీయడంతో అక్కడ ఓ గుంత ఏర్పడింది. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ గుంతలో భారీగా నీరు నిలించింది. గ్రామానికి చెందిన రమేశ్(25) అక్కడకు చేరుకుని ఆకస్మికంగా అందులోకి దూకి మునిగిపోయాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందం అక్కడకు చేరుకుని నీటి గుంతలో గాలించి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి భార్య కొన్నాళ్ల కిందటే భర్తను విడిచి వెళ్లిందని, మృతుడికి తల్లి చిలకమ్మ, తమ్ముడు సురేశ్ ఉన్నారు. మద్యం మత్తులో నీటిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని గ్రామస్తులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు. చోరీకి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు తెలకపల్లి: పంక్షన్ హాలులో చోరీకి పాల్పడిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ నరేశ్ కథనం ప్రకారం.. మండల కేంద్రంలో ఓ పంక్షన్ హాలులో ఈనెల 7న గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. పంక్షన్ హాలులో ఉన్న ఐదున్నర క్వింటాళ్ల ఇనుము, జేసీబీకి సంబంధించిన సామగ్రి చోరీకి గురైనట్లు ఎస్ఐ తెలిపారు. బాధితుడు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా.. నిందుతుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. బాధితుడికి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి నాగర్కర్నూల్ క్రైం: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని గు డిపల్లి శివారులో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ గోవర్ధన్ కథనం ప్రకారం.. మండలంలోని శ్రీపురం గ్రామానికి చెందిన మైనగాని రాములు (37) తన భార్య మానస తో కలిసి జిల్లా కేంద్రంలో ఓ అద్దె ఇంట్లో నివా సం ఉంటున్నాడు. ఇతడు ఫ్లంబర్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 9న త న బంధువుల వివాహం ఉండడంతో గుడపల్లికి వెళ్లారు. శనివారం అర్ధరాత్రి గుడిపల్లి శివా రులో మైనగాని రాములు అనుమానాస్పద స్థితిలో మృతిచెంది ఉండడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ అశోక్రెడ్డి, ఎస్ఐ గోవర్ధన్ ఘటనా స్థలా న్ని పరిశీలించి మృతదేహాన్ని జనరల్ ఆస్పత్రికి తలించారు. మృతుడు మైనగాని రాములు భార్య మానసకు పెద్దముద్దునూరుకు చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని, ఇరువురు కలిసి హత్య చేసి ఉంటారని, మృతిపై అనుమానం ఉందని పోలీసులకు మృతుడి తండ్రి మైనగాని పాండయ్య ఫిర్యాదు చేయడంతో అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. బాలింత మృతిపై కేసు నమోదు నాగర్కర్నూల్ క్రైం: బాలింత మృతిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గోవర్ధన్ ఆదివారం తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం.. బిజినేపల్లి మండలం లట్టుపల్లికి చెందిన రాత్లావత్ కవిత (26) ఈనెల 10న కాన్పు కోసం జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో చేరింది. కాన్పు అనంతరం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని నిలోఫర్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి రెఫర్ చేయడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం మృతిచెందింది. ఘటనకు సంబంధించి మృతురాలి తల్లి రాత్లావత్ తులసి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
శ్రీశైలానికి స్వల్పంగా వరద
దోమలపెంట: శ్రీశైలం ప్రాజెక్టుకు స్వల్పంగా వరద కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆదివారం తెరిచి ఉన్న ఒక్క గేటును రాత్రి అధికారులు మూసివేశారు. జూరాలలో విద్యుదుత్పత్తి చేస్తూ 45,587, సుంకేసుల నుంచి 8,892 మొత్తం 54,479 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలం జలాశయానికి వస్తుంది. భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 27,142 మొత్తం 62,457 క్యూసెక్కుల నీళ్లు అదనంగా సాగర్కు విడుదలవుతున్నాయి. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 884.6 అడుగుల వద్ద 213.4011 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 24 గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడు ద్వారా 5,000, హెచ్ఎన్ఎస్ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 2,835 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భూగర్భ కేంద్రంలో 17.264 మిలియన్ యూనిట్లు, కుడిగట్టు కేంద్రంలో 15.398 మి.యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారు. రెండు గేట్ల ద్వారా నీటి విడుదల రాజోళి: సుంకేసుల డ్యాం రెండు గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేసినట్లు ఆదివారం జేఈ మహేంద్ర తెలిపారు. ఎగువ నుంచి 15,250 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా.. రెండు గేట్లను ఒక మీటర్ మేర తెరిచి 11,156 క్యూసెక్కులు విడుదల చేశారు. కేసీ కెనాల్కు 2,445 క్యూసెక్కులు విడుదల చేసినట్లు జేఈ పేర్కొన్నారు. కోయిల్సాగర్ గేట్ల మూసివేత దేవరకద్ర: ఎగువ ప్రాంతం నుంచి ఇన్ఫ్లో తగ్గడంతో కోయిల్సాగర్ ప్రాజెక్టు గేట్లను మూసివేశారు. పెద్దవాగు ఇన్ఫ్లో తగ్గడంతో ఆదివారం ఉదయం ఒక్క గేటును తెరవగా మధ్యాహ్నం నుంచి ఆ గేటును మూసివేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 32.6 అడుగులు కాగా ప్రస్తుతం 32.4 అడుగులుగా ఉంది. జూరాల గేట్ల మూసివేత ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో తగ్గడంతో తెరిచి ఉంచిన గేట్లను మూసివేసినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. శనివారం రాత్రి 9 గంటల వరకు ప్రాజెక్టుకు 62వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. ఆదివారం రాత్రి 9.30 గంటల వరకు ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ఫ్లో 55 వేల క్యూసెక్కులకు తగ్గిందన్నారు. జెన్కో జల విద్యుత్ కేంద్రంలో ఆరు యూనిట్లను కొనసాగించి విద్యుదుత్పత్తి చేస్తున్నారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 45,527 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 71 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 1,030 క్యూసెక్కులు, కుడి కాల్వకు 600 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 47,228 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 9.255 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. 811.700 ఎంయూ విద్యుదుత్పత్తి ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ కర్ణాటక రాష్ట్రం నుంచి వరద భారీగా చేరుతుండడంతో దిగువ, ఎగువ జూరాల జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో విద్యుదుత్పత్తి వేగవంతంగా కొనసాగుతుంది. ఆదివారం 12 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 6 యూనిట్ల ద్వార 234 మెగావాట్లు, 412.937 ఎంయూ, దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు, 398.763 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని చేపడుతున్నారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటి వరకు 811.700 ఎంయూ విజయవంతంగా విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు తెలిపారు. ఉత్పత్తికి గానూ 45,587 వేల క్యూసెక్కుల నీటిని వినియోగించినట్లు పేర్కొన్నారు. -
యూరియా తిని 12 మేకలు మృతి
నవాబుపేట: పొలంలో మేతలు మేస్తున్న మేకలు అక్కడున్న యూరియాను తినడంతో అక్కడికక్కడే మృతిచెందాయి. మండలంలోని అమ్మాపూర్కు చెందిన మంగళి ప్రభాకర్కు చెందిన మేకలను ఎప్పటి మా దిరిగా ఆదివారం మేతకు తీసుకెళ్లాడు. కాగా గ్రామ సమీపంలోని పొలంలో మంగళి మా సయ్య పొలంలో మొక్కజొన్న మేత మేస్తుండగా పక్కనే ఉన్న సొప్పగూళ్లో ఉంచిన కొంత యూరియాను మేకలు తినేశాయి. దీంతో కొద్దిసేపట్లోనే మేకలు కిందపడి మృతిచెందాయి. 20మేకలను తీసుకెళ్తే 12మేకలు మాత్రం యూరియా తిన్నాయి. మిగతా మేకలు వేరేచోట మేత మేస్తున్నాయి. మేకలు ఒక్కొక్కటిగా కిందపడి మృతిచెందడంతో రైతు బోరున విలపించి గ్రామస్తులకు సమాచారం అందించాడు. గ్రామస్తు లు వచ్చేసరికే అక్కడ యూరియా తిన్న 12మేలు మృతిచెందాయి. కాగా మృతిచెందిన మేకల విలువ దాదాపు రూ.2లక్షలకు పైగానే ఉంటుందని రైతు వాపోయాడు. ఈ విషయంలో మేకలతో ఉపాధి పొంది జీవిస్తున్న మంగళి ప్రభాకర్ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
నెట్బాల్ విజేత పాలమూరు
వికసించిన అరుదైన పుష్పాలు హబీనేరియా డీజీటేటా తెల్ల కలువ జడ్చర్లలోని బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల ప్రాంగణంలో ఉన్న తెలంగాణ బొటానికల్ గార్డెన్లో అరుదైన మొక్కలకు పూ లు పూసా యి. దేశంలోని వివిధ ప్రాంతాల అడవుల నుంచి తీసు కొచ్చి నాటిన మొక్కలకు కాలానుగుణంగా పుష్పాలు వికసిస్తున్నా యని గార్డెన్ సమన్వయకర్త డా. సదాశివయ్య తెలిపారు. ఆర్కిడ్ జాతులైన హబీనేరియా, ఫర్సిఫెర, హబీనేరియా డిజిటేట, జియో డోరం, డెన్సిఫ్లోరం జియోడోరం, లా క్సిఫ్లోరం, యూలోఫియా గ్రమీనియా, లూసి యా జైలానిక, వాండ టెస్టేసియా మొక్కలకు ఇప్పటికే పూలు కాసాయని.. తెల్ల కలువ, హెటెరోస్టెమ అనే తీగజాతి మొక్క సైతం పుష్పించిందన్నారు. విద్యార్థులు పాఠ్యాంశాల్లో మా త్రమే చూసే మొక్కలు, పూలు ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పించినట్లయిందని ప్రిన్సి పాల్ డా. సుకన్య, వృక్షశాస్త్ర విభాగాధిపతి డా. నర్మద చెప్పారు. – జడ్చర్ల టౌన్ చిన్నారులపై వీధికుక్కల దాడి -
చీరాల బీచ్లో జడ్చర్ల విద్యార్థి దుర్మరణం
జడ్చర్ల: ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న జడ్చర్లకు చెందిన ఓ విద్యార్థి ఆదివారం సెలవు రోజున ఆటవిడుపు కోసం మిత్రులతో కలిసి సముద్ర తీరాలకు వెళ్లి సముద్రం అలలలో కొట్టుకుపోయి నీట మునిగి మృతిచెందాడు. బంధువుల కథనం మేరకు.. జడ్చర్ల గంజ్ ప్రాంతానికి చెందిన బాదం సాయి మణిదీప్(20) ఏపీలోని అమరావతి వద్ద ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం విద్య నభ్యసిస్తున్నాడు. ఆదివారం సెలవు కావడంతో ఏడుగురు మిత్రులతో కలిసి ఆటవిడుపు కోసం చీరాల బీచ్కు వెళ్లారు. బీచ్లోని ససముద్రం అలలలో ఎనిమిది మంది విద్యార్థులు కొట్టుకుపోయారు. వీరిలో ముగ్గురు విద్యార్థులను కాపాడగా.. ఐదుగురు విద్యార్థులు నీటిలో గల్లంతయ్యారు. గల్లంతైన ముగ్గురు మృతదేహాలను బయటకు తీశారు. వీరిలో జడ్చర్లకు చెందిన విద్యార్థి సాయి మణిదీప్ ఉండడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుమారుడి మరణవార్త తెలియడంతో తల్లిదండ్రులు బాదం రాఘవేందర్, కల్యాణి ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురయ్యారు. కన్నీరు మున్నీరై విలపించారు. విషయం తెలిసిన ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి విద్యార్థి మృతిపై ఆరా తీసి విచారం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని త్వరితగతిన జడ్చర్లకు తీసుకొచ్చే విధంగా సహాయ చర్యలను ముమ్మరం చేయాలని అక్కడి అధికారులకు విజ్ఞప్తి చేశారు. -
ఫొటోల అప్లోడ్తో ఇందిరమ్మ బిల్లు
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో వివరాల నమోదుకు యాప్లో కొత్త ఆప్షన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. బిల్లుల ప్రతిపాదలనలో జాప్యం నివారణ, ఇబ్బందులు దూరం చేసేందుకు గాను ఫొటోలు అప్లోడ్ చేసే అవకాశం నేరుగా లబ్ధిదారులకే కల్పించింది. గతంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం మొదలైనప్పటి నుంచి వివిధ దశల ఫొటోలు తీసి పంచాయతీ కార్యదర్శులు, గృహ నిర్మాణ శాఖ అధికారులు యాప్లో అప్లోడ్ చేసేవారు. అవి గృహ నిర్మాణ శాఖ ఏఈ లాగిన్కు ఆ తర్వాత డీఈ, పీడీ, కలెక్టర్కు చేరేవి. పునాది పూర్తయితే రూ.లక్ష, స్లాబ్ లెవల్ (గోడలు) వరకు పూర్తయితే మరో రూ.లక్ష, స్లాబ్ పూర్తయితే రూ.2 లక్షలు, రంగులతో సహా ఇంటి నిర్మాణం మొత్తం పూర్తయ్యాక రూ.లక్ష ఇలా విడతల వారిగా మొత్తం రూ.5 లక్షలు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి. అయితే పంచాయతీ కార్యదర్శులు ఈ ప్రక్రియ చేపట్టడంలో కొంత ఆలస్యం చేయడం, దీంతో లబ్ధిదారులు బిల్లుల కోసం ఎదురుచూసే పరిస్థితులు తలెత్తేవి. ఈ జాప్యాన్ని నివారించేందుకు గాను ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన ఫొటోలు అప్లోడ్ చేసేందుకు నూతన యాప్ను తీసుకొచ్చింది. నమోదు ఇలా.. లబ్ధిదారులు స్మార్ట్ ఫోన్ (ఇంట్లో ఎవరిదైనా)లో ఇందిరమ్మ ఇళ్ల యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. బెనిఫిషియర్ లాగిన్కు వెళ్లి.. పేరు, ఫక్షన్ నంబర్, గ్రామ వివరాలు నమోదు చేయాలి. ఇంటి నిర్మాణ ఫొటో తీసి అప్లోడ్ చేయాలి. నిర్మాణ దశలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానమిస్తే ప్రక్రియ పూర్తి అవుతుంది. ఈ ప్రక్రియను జిల్లాలోని చాలామంది లబ్ధిదారులు ఉపయోగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. యాప్లో అందుబాటులోకి కొత్త ఆప్షన్ నేరుగా లబ్ధిదారులే ఎంట్రీ చేసే అవకాశం ప్రతిపాదనలో జాప్యానికి తప్పనున్న తిప్పలు ఇందిరమ్మ లబ్ధిదారులు స్వయంగా ఫొటో అప్లోడ్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఫొటోలు అప్లోడ్ చేస్తే పరిశీలన తర్వాత బిల్లులు వారి ఖాతాలో జమ అవుతాయి. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ అవకాశం కల్పించింది. – వైద్యం భాస్కర్, గృహ నిర్మాణ శాఖ పీడీ -
అసలు వస్తదో.. రాదో..
మొదటి విడతలో భాగంగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ఆన్లైన్లో ఇసుక బుక్ చేస్తే.. రావడానికి నెల రోజులు పట్టింది. దీంతో నిర్మాణం నెమ్మదిగా సాగింది. తుమ్మిళ్ల రీచ్ పక్కనే ఉన్నా.. చాలా రోజులు ఎదురు చూడాల్సి వచ్చింది. ఏవేవో సాకులు చెబుతున్నారు. రాజకీయ కారణాలతోనే ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రెండో దశలో ఇసుక కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. అసలు వస్తదో.. రాదో, వస్తే.. ఎప్పుడొస్తదో.. తెలియని పరిస్థితి ఉంది. దీంతో ఏం చేయాలో తోచడం లేదు. – సోమేష్, రాజోళి -
డీసీసీ అధ్యక్షుల ఎంపికపై అభిప్రాయ సేకరణ
స్టేషన్ మహబూబ్నగర్: డీసీసీ అధ్యక్షుడి ఎంపికలో జిల్లా కాంగ్రెస్, బ్లాక్, మండల స్థాయిలో కార్యకర్తల అభిప్రాయ సేకరణ ఉంటుందని ఏఐసీసీ పరిశీలకుడు, కర్ణాటకకు చెందిన ఎమ్మెల్సీ ఎం.నారాయణస్వామి అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్రెడ్డి, శ్రీగణేష్తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం ద్వారా కాంగ్రెస్ నాయకులు, పార్టీ ప్రతినిధుల అభిప్రాయాలతో డీసీసీ అధ్యక్షుడి నియామకంపై ఏఐసీసీ నేతృత్వంలో టీపీసీసీ ఆధ్వర్యంలో తుది నిర్ణయం ఉంటుందన్నారు. మహబూబ్నగర్, నారాయణపేట డీసీసీ అధ్యక్షుల ఎంపిక కోనం తనకు ఏఐసీసీ పరిశీలకుడిగా నియామకం చేశారన్నారు. డీసీసీ అధ్యక్ష పదవికి ఆరుగురు అభ్యర్థులు పోటీ చేయవచ్చని, ఆశావాహులు ఈ నెల 20 వరకు దరఖాస్తుఫారాలు అందజేయాలని కోరారు. మహబూబ్నగర్ జిల్లాలో ఈ నెల 16, 17, 18 తేదీల్లో అభిప్రాయాలు సేకరిస్తామని, 22లోగా నివేదికను ఏఐసీసీకి సమర్పిస్తామని చెప్పారు. జిల్లాస్థాయిలో వ్యక్తిగతంగా, గ్రూపులుగా అభిప్రాయాలు సేకరణ ఉంటుందన్నారు. పార్టీకి కష్టపడి పనిచేసిన వారికి తప్పకుండా పదవులు లభిస్తాయన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, వివిధ చైర్మన్లు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించగా.. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని డీసీసీ అధ్యక్షుడి నియామకంపై ఏఐసీసీ తుది నిర్ణయం తీసుకుంటుందని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నట్లు తెలిసింది.సమావేశంలో టీజీఎంఎఫ్సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, పీసీసీ పరిశీలకులు మెట్టు సాయికుమార్, ఉజ్మా షాకీర్, ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, నాయకులు సంజీవ్ ముదిరాజ్, వినోద్కుమార్, హర్షవర్ధన్రెడ్డి, మన్నె జీవన్రెడ్డి, జహీర్ అఖ్తర్, వసంత, సిరాజ్ఖాద్రీ, సీజే బెనహర్, అజ్మత్అలీ, అవేజ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ముగ్గురం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారమేనని, ప్రభుత్వం కూడా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై చిత్తశుద్ధితో పోరాడుతుందని, ఈ నేపథ్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనా ర్టీల్లో సమర్థవంతమైన నాయకులను డీసీసీ అధ్యక్షుడిగా పరిగణలోకి తీసుకోవాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి తన అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. -
అర్ధరాత్రి ఎస్పీ ఆకస్మిక తనిఖీలు
మహబూబ్నగర్ క్రైం: కొత్త వ్యక్తులు, అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు తిరుగుతున్న డయల్ 100 లేదా స్థానిక పోలీస్స్టేషన్లో సమాచారం ఇవ్వాలని ఎస్పీ డి.జానకి అన్నారు. జిల్లాకేంద్రంలో రాత్రివేళ దొంగతనాలు జరుగుతున్న క్రమంలో ఎస్పీ శనివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజామున విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. నగరంలోని రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులు, అనుమానస్పద వ్యక్తులను, పిస్తాహౌజ్ చౌరస్తా, న్యూటౌన్, బస్టాండ్ ప్రాంతాల్లో వాహనాలు తనిఖీ చేయడంతోపాటు ఆ సమయంలో రోడ్లపై తిరుగుతున్న వ్యక్తుల వివరాలు ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతలు కాపాడటమే పోలీసుల లక్ష్యం అని, ప్రజల రక్షణ కోసం పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటారన్నారు. రాత్రివేళ పెట్రోలింగ్ పెంచుతున్నట్లు చెప్పారు. తనిఖీల్లో డీసీఆర్బీ డీఎస్పీ రమణారెడ్డి, రూరల్ సీఐ గాంధీనాయక్ తదితరులు పాల్గొన్నారు. లైసెన్స్ తప్పక తీసుకోవాలి దీపావళి పండగ నేపథ్యంలో ప్రత్యేకంగా హోల్సేల్తోపాటు ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు చేసి బాణాసంచా విక్రయాలు జరిపే వ్యాపారులు తప్పకుండా నిబంధనలు పాటించాలని, లైసెన్స్ తీసుకోవాలని ఎస్పీ జానకి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. టపాసుల దుకాణాలు రద్దీ ప్రదేశాలు, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, పెట్రోల్ బంకుల సమీపంలో కాకుండా.. జిల్లా అగ్నిమాపక అధికారులు సూచించిన ప్రాంతంలో మాత్రమే ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎవరైనా నిబంధనలు పాటించకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రధానంగా తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే పిల్లలు టపాసులు కాల్చేలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వార్డెన్పై సస్పెన్షన్ వేటు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: హాస్టల్ నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నవాబుపేట మండలంలోని ఎన్మన్గండ్ల హాస్టల్ వార్డెన్ పై సస్పెన్షన్ వేటు వేసినట్లు బీసీ సంక్షేమ శాఖాధికారి ఇందిర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్మన్గండ్లలోని బాలికల హాస్టల్ను శనివారం కలెక్టర్ విజయేందిర తనిఖీ చేసిన సందర్భంలో విద్యార్థులకు భోజనంలో కూరగాయలు వడ్డించకుండా కేవలం సాంబార్ మాత్రమే వడ్డించడం, వార్డెన్ అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్యలకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హాస్టల్ వార్డెన్పై సస్పెషన్ వేటు వేసినట్లు ఆమె పేర్కొన్నారు. అలాగే ఆదివారం జిల్లాకేంద్రంలోని మెట్టుగడ్డ ఎస్టీ హాస్టల్, వెంకటేశ్వరకాలనీలోని ఎస్సీ హాస్టల్ను అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ హాస్టల్లో విద్యార్థులకు వడ్డించే చట్నీలో నాణ్యత లేకపోవడంతో సంబంధిత హాస్టల్ వార్డెన్కు మెమోలు జారీ చేశారు. -
పరిశోధనలకు పట్టం
పలు అంశాలపై పరిశోధనలు చేసిన పీయూ రీసెర్చ్ స్కాలర్స్ – మహబూబ్నగర్ ఎడ్యుకేషన్ పీయూ 4వ స్నాతకోత్సవాన్ని నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 16న జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చాన్స్లర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరుకానున్న నేపథ్యంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నారు. ఈ క్రమంలో యూజీ, పీజీ విద్యార్థులతోపాటు పీహెచ్డీ పూర్తి చేసిన 12 మంది రీసెర్చి స్కాలర్స్కు కూడా డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు. ఇంత ఎక్కువ సంఖ్యలో పీహెచ్డీ పూర్తి చేసిన వారికి పట్టాలు ప్రదానం చేయడం ఇదే మొదటిసారి. ఇందులో ఎక్కువగా మైక్రోబయోలజీ విభాగంలో 5, కెమిస్ట్రీ విభాగంలో 5, కామర్స్ విభాగంలో 1, బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో ఒకరు ఉన్నారు. ఈ క్రమంలో సంబంధిత డిపార్ట్మెంట్లలో ఎక్కువ మంది రెగ్యులర్ అధ్యాపకులు ఉండడంతో ఎక్కువ రీసెర్చి పేపర్లు వెలువడ్డాయి. దీంతో స్కాలర్స్కు డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు. పీయూలో ఇప్పటి వరకు మొత్తం మూడు సార్లు స్నాతకోత్సవం నిర్వహించగా.. నాలుగోసారి జరిగే కార్యక్రమంలో మొట్టమొదటిసారి గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా ఓ రంగంలో విశేష కృషి చేసిన వారికి మాత్రమే ఈ డాక్టరేట్ను ప్రదానం చేసేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ క్రమంలో ఎంఎస్ఎన్ ల్యాబోరేటరీస్ అధినేత మన్నె సత్యనారాయణరెడ్డికి మొదటిసారి గౌరవ డాక్టరేట్ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆయన పాలమూరు జిల్లా వాసి కావడం, రాష్ట్రంలో పలు ఫార్మతోపాటు ఇతర కంపెనీలు ఏర్పాటు చేసి యువతకు పెద్దఎత్తున ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న నేపథ్యంలో ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చేందుకు అధికారులు నిర్ణయించారు. స్నాతకోత్సవంలో గవర్నర్ చేతులమీదుగా పీహెచ్డీ పూర్తి చేసిన 12 మంది రీసెర్చి స్కాలర్స్ డాక్టరేట్.. మన్నె సత్యనారాయణరెడ్డి గౌరవ డాక్టరేట్ అందుకోనున్నారు. స్నాతకోత్సవంలో 12 మందికి డాక్టరేట్లు పీయూ చరిత్రలో మొట్టమొదటిసారి మన్నె సత్యనారాయణరెడ్డికి గౌరవ డాక్టరేట్ ప్రదానం గవర్నర్ రాక నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు -
స్నాతకోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: స్నాతకోత్సవానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని పీయూ వీసీ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం పీయూ అడ్మినిస్ట్రేషన్ భవనంలో వివిధ కమిటీల చైర్మన్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్నాతకోత్సవ కార్యక్రమానికి వచ్చే అతిథులు, అధికారులు వాహనాలు నిలిపేందుకు ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేయాలని, భోజనాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమానికి హాజరయ్యే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మెడల్స్ స్పాన్సర్ కోసం అన్ని వసతులు కల్పించాలన్నారు. మీడియా వారికి అనుగుణంగా కార్యక్రమం నిర్వహించే హాల్తోపాటు పలు ప్రదేశాల్లో ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేసి వారికి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, హాస్పిటాలిటీ కమిటీ చైర్మన్ కృష్ణయ్య, మీడియా కమిటీ చైర్మన్ కుమారస్వామి, ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రవీణ, అధ్యాపకులు మాలవి, అర్జున్కుమార్, భూమయ్య, శ్రీధర్రెడ్డి, జిమ్మీకార్టన్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘చేయి’ తడపాల్సిందే!
ఇసుక కాంట్రాక్టర్కు ‘అధికార’ పార్టీ నేత హుకుం ● ఒక్కో టిప్పర్కు రూ.6 వేల చొప్పున డిమాండ్ ● పట్టించుకోకపోవడంతో రోడ్లు దెబ్బతింటున్నాయంటూ అడ్డంకులు ● తుమ్మిళ్లలో 2 రోజులుగా నిలిచిన ఇసుక రవాణా ● ఆందోళనలో లబ్ధిదారులు.. సీఎం పేషీకి చేరిన ‘పంచాయితీ’ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఇసుక కొరత గుదిబండగా మారింది. ఈ విషయాన్ని గ్రహించిన సర్కారు తొలుత జోగుళాంబ గద్వాల, ఆ తర్వాత ఉమ్మడి పాలమూరులోని మిగతా జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్లకు తుమ్మిళ్ల నుంచి ఉచితంగా ఇసుక అందజేసేలా కార్యాచరణ చేపట్టింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఫలితం కానరావడం లేదు. నదిలో నీటి ప్రవాహం బాగా ఉంది.. అందుకే అధికారిక రీచ్లోనూ ఇసుక తవ్వకాలు చేపట్టలేకపోతున్నారని అనుకుంటే పొరపాటే. తొలుత వర్షాలతో.. తాజాగా ‘చేయి’ తడపాల్సిందేనంటూ అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి హుకుంతో ఇసుక తవ్వకాలు, రవాణా నిలిచిపోయింది. ఫలితంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. అడుగడుగునా అడ్డంకులు.. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ పరిధిలోని రాజోళి మండలం తుమ్మిళ్లలో తుంగభద్ర నది నుంచి ఫ్లెడ్జింగ్ పద్ధతిన ఇసుక తోడి ‘మన ఇసుక వాహనం’ ద్వారా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉచితంగా అందజేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు నదిలో నీరు ఉన్న సమయంలోనూ కార్గో శాండ్ బోట్స్ డ్రైజింగ్ మెకానిజం పద్ధతిన ఇసుక తవ్వేలా ఈ ఏడాది జూన్లో టెండర్లు నిర్వహించింది. మూడు పాయింట్ల ద్వారా వచ్చే ఏడాది జూన్ 21 వరకు 7.25 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక తీసేందుకు ఓ కాంట్రాక్టర్ ఒప్పందం కుదుర్చుకొని జూలై 3న తవ్వకాలు ప్రారంభించారు. లబ్ధిదారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న మేరకు.. అధికారులు సూచించిన రూట్ మ్యాప్ ప్రకారం తుమ్మిళ్ల నుంచే టిప్పర్ల ద్వారా ఇసుక రవాణా చేస్తున్నారు. అయితే తొలి నుంచీ అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో సుమారు 7 వేల ఇళ్లకు ఇసుక అందించాల్సి ఉంది. 45 రోజుల క్రితం సరఫరా మొదలైనప్పటికీ.. ఇప్పటి వరకు 650 ఇళ్లకు మాత్రమే అందజేశారు. వర్షాలతో సరఫరాకు అడ్డంకులు ఏర్పడగా.. దాన్ని అధిగమించేలోపు మరోసారి బ్రేక్ పడింది. డ్రైవర్ల ఆందోళన.. ఇసుక లోడ్తో వాహనాలు నిలిచిపోగా టైర్లు దెబ్బతింటున్నాయని.. రెండు రోజులుగా తిండి, నీరు లేక ఇబ్బంది పడుతున్నామంటూ డ్రైవర్లు ఆదివారం ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కొందరు యువకులు రీచ్ వద్దకు చేరుకుని గతంలో ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు ఇసుకను కొల్లగొట్టారని ఉదహరించారు. అప్పుడు ఈ నాయకులు ఎక్కడికి వెళ్లారని.. అప్పుడు దెబ్బతిన్న రోడ్లు ఇప్పటిదాకా వేయకపోతే ఎందుకు ప్రశ్నించడం లేదని ధ్వజమెత్తారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక అందిస్తే మంచిదేనని.. మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవని తెలిపారు. అనుమతులు ఉన్నా.. అధికార పార్టీ నాయకులు వారి స్వార్థం కోసం అడ్డుకుంటూ గ్రామం పేరు చెడగొడుతున్నారంటూ వాహనాలను పంపించారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్గా మారగా.. ‘అధికార’ నేత నిర్వాకం చర్చనీయాంశమైంది. ‘ఇందిరమ్మ ఇంటికై నా.. ఇతర అవసరాలకై నా.. ఏదైనా సరే.. పర్సంటేజీ ఇవ్వాల్సిందే.. ఒక్కో టిప్పర్కు రూ.6 వేలు చెల్లించాల్సిందే’నని అలంపూర్ నియోజకవర్గానికి చెందిన ఓ ‘అధికార’ నేత తేల్చిచెప్పడంతో ఇసుక తవ్వకాలు, రవాణాకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం తుమ్మిళ్ల రీచ్ వద్దకు అధికార పార్టీకి చెందిన పలువురు నాయకులు వెళ్లి వాహనాలను అడ్డుకున్నారు. తమ గ్రామంలో రోడ్లు దెబ్బతింటున్నాయంటూ వాహనాలను నిలిపివేశారు. ఈ క్రమంలో నియోజకవర్గ ముఖ్య నేత నుంచి పర్సంటేజీ ఇవ్వని పక్షంలో ఒక్క వాహనాన్ని కూడా తిరగనిచ్చేది లేదంటూ సదరు కాంట్రాక్టర్కు వార్నింగ్ వచ్చినట్లు సమాచారం. నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ నేత డిమాండ్కు అంగీకరించని సదరు కాంట్రాక్టర్ నేరుగా ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో సీఎం పేషీకి పంచాయితీ చేరగా.. సీఎంఓ వర్గాలు ఆరా తీసినట్లు తెలుస్తోంది. పలువురు జిల్లా అధికారులతో ఫోన్లో సమాచారం సేకరించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అయితే దీనిపై జిల్లా అధికారులెవరూ నోరు విప్పడం లేదు. -
జూరాలకు 62 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో
● ప్రాజెక్టు 3 క్రస్టు గేట్ల ఎత్తివేత ● 65,140 క్యూసెక్కుల నీరు దిగువకు ధరూరు/ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్ఫ్లో క్రమంగా తగ్గుతున్నట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి 9 గంటల వరకు 79 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. శనివారం రాత్రి 8.30 గంటల వరకు ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ఫ్లో 62 వేల క్యూసెక్కులకు తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పరిధిలోని అన్ని ఎత్తిపోతల పథకాలకు తాత్కాలికంగా నీటి విడుదలను నిలిపివేశారు. దీంతో ప్రాజెక్టు కేవలం 3 క్రస్టు గేట్లను ఎత్తి 18,384 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 45,055 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 71 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 1,030 క్యూసెక్కులు, కుడి కాల్వకు 600 క్యూసెక్కులు కలిపి ప్రాజెక్టు నుంచి మొత్తం 65,140 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 9.132 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. వేగవంతంగా విద్యుదుత్పత్తి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు జల విద్యుదుత్పత్తి కేంద్రాల్లో 12 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 6 యూనిట్ల ద్వారా 408.044 ఎంయూ, దిగువలో 6 యూనిట్ల ద్వారా 394.443 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని చేపడుతున్నారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో కలిపి 802.487 ఎంయూ విద్యుదుత్పత్తిని చేపట్టామన్నారు. శ్రీశైలం ఆనకట్ట ఒక గేటు ఎత్తివేత దోమలపెంట: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టినా శ్రీశైలం జలాశయంలో పూర్తి స్థాయి నీటిమట్టానికి మించి నీరు నిల్వ ఉండడంతో సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి 63,439 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 11,238, హంద్రీ నుంచి 250 మొత్తం 74,927 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలం జలాశయం వస్తోంది. శ్రీశైలంలో ఆనకట్ట వద్ద ఒక్క గేటును పది అడుగుల మేర పైకెత్తి స్పిల్వే ద్వారా 27,983 క్యూసెక్కుల నీటిని దిగువున సాగర్కు విడుదల చేస్తున్నారు. భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 30,819 మొత్తం 66,134 క్యూసెక్కుల నీటిని అదనంగా సాగర్కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 884.8 అడుగుల వద్ద 214.8450 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇరవై నాలుగు గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడు ద్వారా 5 వేలు, హెచ్ఎన్ఎస్ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 2,835, ఎంజీకేఎల్ఐకు 866 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భూగర్భ కేంద్రంలో 16.990 మిలియన్ యూనిట్లు, కుడిగట్టు కేంద్రంలో 13.747 మి.యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారు. -
రైల్వే ఉద్యోగిని మోసం చేసిన సైబర్ నేరస్తులు
నాగర్కర్నూల్ క్రైం: వాట్సప్లో వచ్చిన ట్రెండింగ్ యాప్లో పెట్టుబడి పెడితే ఎక్కువ మొ త్తంలో నగదు వస్తుందని పెట్టుబడి పెట్టిన రై ల్వే ఉద్యోగిని సైబర్ నేరస్తులు మోసం చేసిన ఘటన చోటు చేసుకున్నట్లు ఎస్ఐ గోవర్ధన్ శనివారం తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రానికి చెందిన తిరుపతయ్య రైల్వే ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతడు తన ఫోన్లోని వాట్సాప్కు వచ్చిన మెసేజ్లో ట్రెండింగ్ యాప్లో పెట్టుబడి పెడితే డబుల్ అమౌంట్ వస్తుందని నమ్మి ఈ ఏడాది ఆగస్టు రూ. 13.5 లక్షల వరకు పెట్టుబడిగా పెట్టాడు. తాను పెట్టుబడి పెట్టిన నగదు రాకపోవడంతో వాట్సప్కు వచ్చిన ఫోన్ నంబర్కు ఫోన్ చేయడంతో సైబర్ నేరస్తులు స్పందించలేదు. దీంతో మోసపోయినట్లు గుర్తించి శనివారం స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. లక్ష్మమ్మకు మాజీ మంత్రుల ఘన నివాళి తిమ్మాజిపేట: మాజీ మంత్రి డా. ఆవంచ లక్ష్మారెడ్డి తల్లి లక్ష్మమ్మ ఈ నెల 1న హైదరాబాద్లో మృతిచెందగా.. స్వగ్రామం ఆవంచలో దహన సంస్కారాలు నిర్వహించారు. శనివారం గ్రామంలో నిర్వహించిన దశదినకర్మలో మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, రాజేందర్రెడ్డి, రామ్మోహన్రెడ్డి పాల్గొని ఆమె చిత్రపటానికి పూలుజల్లి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు వెంకటేశ్వర్రెడ్డి, యాదయ్య, శ్రీశైలంయాదవ్, దయాకర్రెడ్డి, వేణుగోపాల్గౌడ్, మోహనాచారి, అజయ్, ఊషన్న, కృష్ణయ్య, ఇబ్రహీం, స్వామి, సైఫ్ తదితరులు పాల్గొన్నారు.


