breaking news
Mahabubnagar
-
విద్యుత్షాక్తో కాంట్రాక్టు సిబ్బందికి గాయాలు
కొత్తకోట: విద్యుత్ షాక్కు గురై వ్యక్తి గాయాలపాలైన ఘటన కొత్తకోట పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలిలా.. మదనాపురం మండలం దంతనూర్కు చెందిన యాదగిరి కొత్తకోట మండలంలోని విద్యుత్ శాఖలో కాంట్రాక్టు సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం కొత్తకోట పట్టణంలోని ఓ ట్రాన్స్ఫార్మర్ వద్ద మరమ్మతులు చేస్తుండగా.. ముందస్తు హెచ్చరికలు లేకుండానే విద్యుత్ సరఫరా ప్రారంభమైంది. ఈ సందర్భంలో యాదగిరి అకస్మాత్తుగా విద్యుత్ షాక్కు గురయ్యాడు. ప్రమాదంలో తీవ్ర గాయాలు కాగా హైదరాబాద్లోని న్యూరో ఆస్పత్రికి తరలించినట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. విద్యుత్శాఖ అధికారుల పర్యవేక్షణ లోపంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపించారు. గుర్తింపు పొందిన విద్యుత్శాఖ లైన్మెన్లు, లైన్ ఇన్స్పెక్టర్లు క్షేత్రస్థాయిలో ఉండి పనులు చేయాల్సి ఉండగా బినామీ కాంట్రాక్టర్గా మారుతున్నారు. కిందిస్థాయి కాంట్రాక్టు సిబ్బందికి బాధ్యతలు అప్పగించడమే ప్రమాదానికి కారణమని ఆరోపణలు వస్తున్నాయి. ఘటనపై భద్రతా నిర్లక్ష్యం కార్యాచరణలో వైఫల్యం కోణాల్లో ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సహచర ఉద్యోగులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
యువకుడి ఆత్మహత్య
ధన్వాడ: భార్యతో గొడవ పడిన ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం ధన్వాడలో చోటుచేసుకుంది. పో లీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని అప్పాజీ నగర్కు చెందిన భాస్కర్(24) భార్యాభర్తల మధ్య న తరచుగా గొడవ జరుగుతుంది. ఈ క్రమంలో మరోసారి రాత్రి ఇద్దరి మధ్యన గొడ వ చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో విసిగిపోయిన భాస్కర్ తెల్లవారుజమున ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. రైలు కిందపడి వ్యక్తి బలవన్మరణం మక్తల్: గూడ్స్ రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని జక్లేర్ రైల్వేస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. జక్లేర్కు చెందిన కుర్వ మల్లేష్ (38)కు మతిస్థిమితం సరిగా లేకపోవడంతో తాను ఆత్మహత్య చేసుకుంటానని అప్పుడప్పుడు చెప్పేవాడన్నారు. ఈ క్రమంలోనే గురువారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కొందరు కుటుంబ సభ్యులకు, రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం బిజినేపల్లి: మండలంలోని గంగారం, లట్టుపల్లి గ్రామాల శివారులో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న శంకర్నాయక్(50) బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురై అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్నాయక్ బుధవారం రాత్రి 10 గంటల సమయంలో గంగారం నుంచి తన స్వగ్రామం అయిన ఉడుగులకుంట తండాకు బయలుదేరాడు. గురువారం తెల్లవారుజామున ఇప్పలతండా సమీపంలో ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురైనట్లు అటుగా ప్రయాణించే వాహనదారులు గుర్తించారు. వారు కొన ప్రాణంతో ఉన్న శంకర్నాయక్ నీళ్లు తాపి ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసేలోపు మరణించాడు. విషయం కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య మదనాపురం: కుటుంబంలో ఏర్పడిన కలహాలతో మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం అజ్జకొల్లులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సంకరి అంజలి (సహస్ర) (24)కు భర్తతో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె గురువారం ఉదయం 10 గంటల సమయంలో ఇంట్లోని బాత్రూమ్లోకి వెళ్లి టవల్తో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి కిష్టయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి కుమారుడు ఉన్నాడు. -
విహారయాత్రకు వెళ్తున్న కళాశాల బస్సు బోల్తా
● విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం ● ప్రమాదస్థలాన్ని పరిశీలించిన మంత్రి వాకిటి శ్రీహరి, కలెక్టర్, ఎస్పీ రాజాపూర్: ఓ ప్రైవేటు కళాశాలకు చెందిన విద్యార్థులు బస్సులో విహారయాత్రకు వెళ్తుండగా బస్సు బోల్తా పడిన ఘటన గురువారం చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు బస్సులో ఉన్న విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీ ల్చుకున్నారు. పూర్తి వివరాలు.. నారాయణపేట జి ల్లా మరికల్ మండల కేంద్రంలోని మణికంఠ జూనియర్ కళాశాల విద్యార్థులు 43 మంది క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో కళాశాల బస్సులో హైదరాబాద్ లోని జలవిహార్ విహారయాత్రకు బయలు దేరారు. ఈ క్రమంలో బాలానగర్ మండలం కేతిరెడ్డిపలక్లి శివారులో జాతీయరహదారిపై ముందు వెళ్తున్న కారును ఢీకొట్టడంతో రోడ్డుపై బస్సు బోల్తా పడింది. విద్యార్థుల హాహాకారాలు విన్న స్థానికులు కిటికీల్లోంచి వారిని బయటకు తీశారు. ప్రమాదంలో గా యాలపాలైన 10 మంది విద్యార్థులను బాలానగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం షాద్నగర్ బుగ్గారెడ్డి ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రి వాకిటి శ్రీహరి.. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వనపర్తికి వెళ్తున్న మంత్రి వాకిటి శ్రీహరి ప్రమాద స్థలం వద్ద పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన విద్యార్థులను అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించి రోడ్డు మధ్యలో పడి ఉన్న బస్సును భారీ క్రేన్ సాయంతో పక్కకు తొలగించి అక్కడి నుంచి వనపర్తికి వెళ్లారు. అనంతరం కలెక్టర్ విజయేంద్రబోయి, ఎస్పీ జానకి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. జాతీయ రహదారిపై ఏర్పడిన ట్రాఫిక్ జామ్ను జడ్చర్ల రూరల్ సీఐ నాగార్జునగౌడ్, బాలానగర్, రాజాపూర్ ఎస్ఐలు లెనిన్, శివానందంగౌడ్ క్రమబద్ధీకరించారు. -
పాలమూరుకు రెండో విజయం
● సత్తాచాటిన గద్వాల, నాగర్కర్నూల్ జట్లు కొనసాగుతున్న తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ–20 లీగ్ మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఎండీసీఏ క్రికెట్ మైదానంలో కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ–20 లీగ్ కొనసాగుతోంది. గురువారం నాలుగోరోజు ఆతిథ్య మహబూబ్నగర్ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. గద్వాల క్రీడాకారుడు సుజల్రెడ్డి లీగ్లోనే మొదటి సెంచరీ నమోదు చేశారు. ● 46 పరుగుల తేడాతో.. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్లో మహబూబ్నగర్ జట్టు 46 పరుగుల తేడాతో జోగుళాంబ గద్వాల జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన మహబూబ్నగర్ జట్టు 16 ఓ వర్లలో 3 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. జట్టులో డేవిడ్ క్రిపాల్ 35 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్లతో 81 పరుగులు చేయగా, శ్రీకాంత్ 22 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 61 పరుగులు, అబ్దుల్ రాఫే 29 పరుగులు చేశారు. గద్వాల బౌలర్లు ఖయ్యూం ఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన గద్వాల జట్టు 15.1 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో ఎస్.అరవింద్ 23 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 48 పరుగులు, మహ్మద్ ఖయ్యూం 28 పరుగులు చేశారు. మహబూబ్నగర్ బౌలర్లు వెంకటచంద్ర 2, ముఖితుద్దీన్ 2, శశాంక్ 2, షాదాబ్ అహ్మద్ 2 వికెట్లు, కొండ శ్రీకాంత్, యువన్ చెరో వికెట్ తీశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ డేవిడ్ క్రిపాల్ (మహబూబ్నగర్)కు దక్కింది. ● 9 వికెట్ల తేడాతో నాగర్కర్నూల్ విజయం.. మరో లీగ్మ్యాచ్లో నాగర్కర్నూల్ జట్టు 9 వికెట్ల తేడాతో వనపర్తి జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన వనపర్తి జట్టు నాగర్కర్నూల్ బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పో యింది. నిర్ణీత 16 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది. జట్టులో యశ్వంత్ 13, నవీనకుమార్ 13 పరుగులు చేశారు. నాగర్కర్నూల్ బౌలర్లు రాంచరణ్ 4 ఓవర్లలో 12 పరుగులు ఇచ్చి 4 వికెట్లు, జష్షు 3 ఓవర్లలో 4 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన నాగర్కర్నూల్ జట్టు సునాయసంగా ఆడి లక్ష్యాన్ని ఛేదించింది. 6.4 ఓవర్లలో వికెట్ కోల్పోయి 69 పరుగులు చేసింది. జట్టులో బి.సంజయ్ 23 బంతుల్లో 9 ఫోర్లతో 46 పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు. మ్యాన్ ఆప్ ది మ్యాచ్గా రాంచరణ్ (నాగర్కర్నూల్) నిలిచారు. ● 82 పరుగుల తేడాతో గద్వాల విజయం.. మరో లీగ్ మ్యాచ్లో జోగుళాంబ గద్వాల జట్టు 82 పరుగుల తేడాతో వనపర్తి జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన గద్వాల జట్టు నిర్ణీత 16 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 201 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఓపెనర్ సుజల్రెడ్డి 48 బంతుల్లో 17 ఫోర్లు, 2 సిక్స్లతో 102 పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు. మహ్మ ద్ ఖయ్యూం 38, యూనుస్ 37 పరుగులు చేశా రు. వనపర్తి బౌలర్ యశ్వంత్ 3 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన వనపర్తి జట్టు 16 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. జట్టులో రాంచారి 38, గణేష్రెడ్డి 21 పరుగులు చేశారు. గద్వాల బౌలర్లు ఖ య్యూం 2, వెంకటసాగర్ 2 వికెట్లు తీశారు. మ్యాన్ ఆఫ్ది మ్యాచ్గా సుజల్రెడ్డి (గద్వాల) నిలిచారు. ● చక్కటి ప్రతిభ చాటాలి.. క్రికెట్ లీగ్లను క్రీడాకారులు సద్వినియోగం చేసుకొని చక్కటి ప్రతిభ కనబర్చాలని పుర కమిషనర్ ప్రవీణ్కుమార్రెడ్డి అన్నారు. గురువారం ఆయన మ్యాన్ ఆప్ ది మ్యాచ్గా నిలిచిన క్రీడాకారుడికి ఎండీసీఏ ప్రతినిధులతో కలిసి రూ.2 వేల నగదు, మెమోంటో అందజేశారు. కార్యక్రమంలో శ్రీనివాసరాజు, ఎండీసీఏ ప్రధానకార్యదర్శి ఎం.రాజశేఖర్, ఉపాధ్యక్షులు సురేష్కుమార్, కోచ్లు గోపాలకృష్ణ, అబ్దుల్లా, మన్నాన్, ముఖ్తార్అలీ, సభ్యులు శివశంకర్ పాల్గొన్నారు. -
మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారం
● గర్భం దాల్చడంతో వెలుగులోకి ఘటన.. ఇద్దరిపై కేసు నమోదు భూత్పూర్: మానసిక దివ్యాంగురాలిపై ఇద్ద రు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడగా గ ర్భం దాల్చిన ఘటన వెలుగుచూసింది. ఎస్ ఐ చంద్రశేఖర్ కథనం ప్రకారం.. భూత్పూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మానసిక దివ్యాంగురా లు(35) అవావిహిత. ఈమె ఇంటి వెనకాల ఉండే పరమేష్, పిండి శేఖర్ కొన్ని నెలలుగా ఆమెతో శారీరక సంబంధం ఏర్పరుచుకు న్నారు. కాగా.. ఇటీవల సదరు మహిళకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆమె తండ్రి జిల్లాకేంద్రంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా ఐదు నెలల గర్భిణి అని నిర్ధారించారు. ఈ ఘటనపై గ్రామపెద్దలు జోక్యం చేసుకుని పుట్టిన బిడ్డ పేరు మీద రూ.9 లక్షలు బ్యాంకులో జమ చేయడానికి నిర్ణయించారు. అ యితే ఈ విషయం చివరికి బయటపడటంతో బాధితురాలి తండ్రి గురువారం భూ త్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పరమేష్, పిండి శేఖర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. త్రుటిలో తప్పిన ప్రమాదం ఊట్కూరు: త్రుటిలో ఘోర బస్సు ప్రమాదం తప్పిన ఘటన గురువారం మండలంలోని కొల్లూరు స్టేజి సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మక్తల్ నుంచి పల్లె వెలుగు బస్సు నారాయణపేటకు వెళ్తుండగా మండలంలోని కొల్లూరు గేటు సమీపంలో బస్సు కమాన్ పట్టీలు విరిగిపోయాయి. దీంతో డ్రైవర్ కాలప్ప అప్రమత్తతతో బస్సు ఆపేందుకు ప్రయత్నించగా రోడ్డు పక్కన పొలాల్లోకి దూసుకెళ్లింది. బస్సులో సుమారు 20 మంది ప్రయాణికులు ఉండగా కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. కాలం చెల్లిన బస్సుల వలనే ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఆధారాలున్నా.. పక్కదారి
ప్రియుడితో కలిసి భర్తను చంపిన కేసులో ట్విస్టు ● ఇద్దరూ ఉపాధ్యాయులు కావడంతో కేసు తారుమారుకు ప్రయత్నాలు? ● పోలీసుల తీరుపై బాధిత కుటుంబ సభ్యుల అనుమానాలు ● ఎట్టకేలకు నిందితుల అరెస్టు, రిమాండ్కు తరలింపు అచ్చంపేట రూరల్: అచ్చంపేట పట్టణంలో ఓ వ్యక్తి హత్య జరిగి నెలరోజులైంది. అందుకు సంబంధించిన అన్ని ఆధారాలను మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు అందించారు. అయినప్పటికీ అది హత్య కాదని కొట్టి పారేశారు పోలీసులు. చివరికి మృతుడి బంధవులు పోలీసు ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులను కలిసి హత్యోదంతంపై ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో హత్యకేసు తమకు చుట్టుకునేలా ఉందని గ్రహించిన స్థానిక పోలీసులు ఎట్టకేలకు నిందితులను అరెస్టు చేశారు. అయితే హత్య కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వివరించాల్సి ఉండగా.. బుధవారం రాత్రి 9.30 గంటలకు వాట్సప్ గ్రూప్లో ప్రెస్మీట్ పెట్టినట్టుగా ఫొటో, అసంపూర్తి సమాచారాన్ని పోస్టుచేసి చేతులు దులుపుకొన్నారు. అచ్చంపేటలోని మారుతీనగర్ కాలనీలో నివాసముంటున్న లక్ష్మణ్నాయక్(38) నవంబర్ 25న అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈయన సోదరుడు శ్రీరామ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే.. లక్ష్మణ్ భార్య పద్మ 2024 డీఎస్సీలో ఉపాధ్యాయురాలిగా ఎంపికై ఉప్పునుంతల మండలం తాడూరు ప్రభుత్వ పాఠశాలలో పనిచేసింది. అదే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు గోపితో ఆమెకు పరిచయం ఏర్పడి ఏడాదికాలంగా వివాహేతర సంబంధం కొనసాగింది. ఈ విషయం భర్తకు తెలియడంతో మందలించాడు. ఈ విషయాన్ని గోపికి చెప్పడంతో తమకు అడ్డుగా ఉన్న లక్ష్మణ్నాయక్ను హతమార్చేందుకు పథకం రచించారు. నవంబర్ 24న రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న లక్ష్మణ్నాయక్ను భార్య పద్మ, ఆమె ప్రియుడు గోపి కలిసి హత్య చేశారు. మరుసటి రోజు ఉదయం ఏమీ తెలియనట్టుగా పద్మ పాఠశాలకు వెళ్లింది. ఆ తర్వాత ఇంటి యజమానికి ఫోన్ చేసి.. తన భర్తకు ఫోన్ చేసినా స్పందించడం లేదని నటించింది. మధ్యాహ్నం హడావుడిగా ఇంటికొచ్చి.. లోపల తన భర్త చనిపోయి ఉన్నాడని బంధువులు, ఇంటి చుట్టుపక్కల వారిని నమ్మించింది. తాడూరు పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేసిన పద్మ, గోపి ప్రవర్తనపై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదులు అందాయి. అప్పట్లో పద్మను మందలించి ఉప్పునుంతల మండలం గట్టుకాడిపల్లి పాఠశాలకు పంపించారు. ఈ క్రమంలోనే ఉపాధ్యాయురాలు పద్మ తన భర్తను హత్యచేసిన ఘటన బయట పడటంతో గట్టుకాడిపల్లి గ్రామస్తులు ఆ ఉపాధ్యాయురాలు తమకొద్దంటూ విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. నెల రోజుల తర్వాత అచ్చంపేట పోలీసులు దర్యాప్తులో వాస్తవాలను రాబట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ నాగరాజు, ఎస్ఐ సద్దాంహుస్సేన్ వెల్లడించారు. లక్ష్మణ్నాయక్ను తన భార్య పద్మ, ప్రియుడు గోపి హత్యచేసినట్లు ఆధారాలను సేకరించి బుధవారం రాత్రి అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితులను అచ్చంపేట జూనియర్ సివిల్కోర్టు జడ్జి ఎదుట హాజరుపర్చగా.. రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. లక్ష్మణ్నాయక్ హత్యకు సంబంధించిన అన్ని ఆధారాలను బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు అందించినా పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. స్థానిక పోలీసుల తీరుపై ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులకు ఫిర్యాదు చేయడంతో.. ఇక చేసేదేమీ లేక దర్యాప్తు ముమ్మరం చేశారని తెలుస్తోంది. కాగా, ఈ కేసులో మరో ఇద్దరిని తప్పించినట్లు బాహాటంగా చర్చ జరుగుతోంది. పోస్టుమార్టం రిపోర్టును కూడా తారుమారు చేయడానికి ప్రయత్నాలు జరిగాయని.. పెద్ద మొత్తంలో కొందరికి ముడుపులు ముట్టజెప్పడానికి నిందితులు వెనకాడలేదని తెలుస్తోంది. దీంతోనే హత్యకు సంబంధించిన వివరాలను కూడా మీడియా ముందు వెల్లడించడానికి పోలీసులు ఆసక్తి చూపలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పరవశించిన పాలమూరు
అయ్యప్పకొండపై వైభవంగా మహా పడిపూజ స్వామివారికి విశేష పూజలు.. ● ప్రధాన రహదారులపై ఊరేగిన హరిహరసుతుడు ● మార్మోగిన అయ్యప్ప నామస్మరణ ● హాజరైన ప్రముఖులు పూజల్లో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మెట్లపూజలో పాల్గొన్న మహిళా భక్తులు మహిళలతో కలిసి కోలాటం ఆడుతున్న ఎంపీ డీకే అరుణ స్టేషన్ మహబూబ్నగర్: పాలమూరు పద్మావతీకాలనీలో ఉన్న అయ్యప్పకొండపై గురువారం అయ్య ప్ప సేవా సమాజం ఆధ్వర్యంలో మహా పడిపూజ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఉదయం తూర్పుకమాన్ రామాలయం నుంచి అయ్యప్ప పల్లకీతో పాటు రథం, పూర్ణ కలశం, స్వామివారి ఆభరణాల శోభాయాత్ర ప్రారంభమై గడియారం చౌరస్తా, అశోక్టాకీస్ చౌరస్తా, అంబేడ్కర్ చౌరస్తా, న్యూటౌన్, మెట్టుగడ్డ, పద్మావతికాలనీ మీదుగా ఆలయానికి చేరుకుంది. శోభాయాత్రలో అయ్యప్ప మాలధారులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. పట్టణం అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది. ఊరేగింపులో ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొని పూజలు చేశారు. ఊరేగింపు అనంతరం అయ్యప్ప ఆలయంలో స్వామివారికి అష్టాభిషేకం, పుష్పాభిషేకం నిర్వహించారు. ఉదయం గణపతి, నవగ్రహ హోమాలు, నిత్యాభిషేకం, సహస్ర నామార్చన చేశారు. రాత్రి తిరుపతికి చెందిన వెంకటేశ్వర చంద్రమౌళిశర్మ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్పస్వామికి చందనం, పంచామృతాలతో అభిషేకాలు, ఏకశిల దివ్య పదునెట్టాంబడి పూజ, మహా మంగళహారతి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో అయ్యప్ప సేవా సమాజం అధ్యక్షుడు సీఆర్ భగవంతరావు, ప్రధానకార్యదర్శి ముత్యంస్వామి, పంబరాజు, చంద్రశేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పడిపూజ సందర్భంగా అయ్యప్పకొండపై మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎస్పీ డి.జానకి శిబిరాన్ని ప్రారంభించగా 504 మంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ జిల్లా చైర్మన్ లయన్ నటరాజ్, డా. హిమబిందు, డా. అంజన్నరాజు, డా. శ్రీకర్, మధుసూదన్రెడ్డి, కోటేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేతల వసూళ్ల పర్వం
వైన్షాపులు మొదలుకొని.. వీధివ్యాపారుల దుకాణాల కేటాయింపులో జోరుగా దందా ● హాట్టాపిక్గా మారిన కూల్పాయింట్స్ అడ్డాలు ● ప్రతిచోటా జోక్యం చేసుకుంటున్న కొందరు నేతలు పాలమూరు: చిన్నపాటి వ్యాపారం చేసుకునే వారి దగ్గరి నుంచి వసూళ్ల పర్వానికి తెరలేపారు కొందరు నేతలు. ఇటీవల కాలంలో నగరంలో కొత్తగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాల ఎదుట నిర్వహించే కూల్పాయింట్స్ (వాటర్ బాటిల్స్, అన్ని రకాల స్నాక్స్, సిట్టింగ్ నిర్వహణ)పై తీవ్ర పోటీ నెలకొన్న క్రమంలో వాటి కేటాయింపు ప్రస్తుతం హాట్టాపిక్గా మారింది. ఈ వ్యవహారంలో అధికార పార్టీ నేతలు జోక్యం చేసుకుని మనవాళ్లకు ఇవ్వాలని మద్యం దుకాణాల నిర్వాహకులపై ఒత్తిడి చేయడంతో ఒకరిద్దరూ వ్యాపారులు గుడ్విల్కు దుకాణాలు విక్రయించుకొని వెళ్లిపోయారు. ఈ వ్యవహారంలో కూల్పాయింట్స్ తీసుకున్న వ్యక్తుల నుంచి వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఫుట్పాత్లపై చిన్నపాటి దుకాణాలు ఏర్పాటు చేసుకొని జీవనం సాగించే వారిని సైతం వదలడం లేదు. డబ్బులు ఇస్తేనే అడ్డా దొరుకుతుంది.. లేకుంటే లేదు అంటూ హుకుం జారీ చేస్తున్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో సదరు వీధివ్యాపారులు అప్పులు చేసి అడిగినంత ముట్టచెబుతున్నారు. నేతలు అడిగిన మొత్తంలో ఇవ్వకపోతే దుకాణం లేకుండా కుటుంబం గడవటం ఇబ్బందిగా మారుతుందనే ఉద్దేశంతోపాటు జీవనం దెబ్బతింటుందనే భయంతో అడిగినంత ముట్టజెప్పినట్లు సమాచారం. షెట్టర్కు ఒక రేటు.. నగరంలోని క్లాక్టవర్ దగ్గర ఎమ్మెల్యే నిధులతో పది షెట్టర్స్ నిర్మించారు. ఇదే స్థానంలో గతంలో తోపుడు బండ్లపై వీధి వ్యాపారులు పండ్లు, చెప్పుల విక్రయాలు జరిపేవారు. అయితే వాటి స్థానంలో శాశ్వతంగా షెట్టర్స్ నిర్మించడం వల్ల దాంట్లో వీధి వ్యాపారులు పండ్లు, చెప్పుల విక్రయాలు చేసుకోవడానికి అధికార పార్టీ నేతలతో మాట్లాడుకొని తీసుకున్నారు. దీంట్లో కొంత మంది పాతవారు ఉంటే మరికొందరు కొత్త వాళ్లకు ఇచ్చారు. ఈ దుకాణాల కేటాయింపులలో ఇద్దరు వ్యక్తులు కల్పించుకొని ఒక్కో షెట్టర్ ఇవ్వడానికి ఒక రేటు ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన ప్రముఖ నేతతోపాటు ఒక ముఖ్య నేత దగ్గర వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసే వ్యక్తి ఉండటం విశేషం. ఈ ఇద్దరూ కలిసి ఒక్కో షెట్టర్ కేటాయించిన వీధి వ్యాపారుడి దగ్గర రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేసినట్లు నగరంలో విస్తృతంగా ప్రచారం సాగుతుంది. మళ్లీ కొత్తగా మార్కెట్ రోడ్లో సైతం మూడు షెట్టర్స్ నిర్మించగా వాటి కేటాయింపులలో కూడా డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారం ఇటు అధికారులతోపాటు అధికార పార్టీ పెద్దల దృష్టికి పోయిందా.. లేక అందరికి తెలిసి చేస్తున్నారా అనే విషయంపై స్పష్టత లేదు. డబ్బులు ఇచ్చిన వీధి వ్యాపారులు మాత్రం బయటకు చెప్పుకోలేక చేసిన అప్పులు తీర్చుకోలేక అవస్థలు పడుతునట్లు తెలుస్తోంది. -
యాసంగి పంటలకు సాగునీరు
దేవరకద్ర: కోయిల్సాగర్ ప్రాజెక్టు నుంచి సాగునీటి విడుదలపై రైతుల ఆశలు పదిలం అయ్యాయి. ప్రస్తుత యాసంగి సీజన్లో పంటలకు సాగునీటిని విడుదల చేయడానికి షెడ్యూల్ ఖరారు చేశారు. కలెక్టరేట్లో మంగళవారం జరిగిన సాగునీటి సలహా మండలి సమావేశం కలెక్టర్ విజయేందిర, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. జిల్లా ఇరిగేషన్ శాఖ అధికారులు, ఆయకట్టు రైతులతో చర్చించి నీటి విడుదల చేసే తేదీలను ఖరారు చేశారు. 2 టీఎంసీల నీరు.. కోయిల్సాగర్ ప్రాజెక్టు పాత ఆయకట్టు కింద కుడి, ఎడమ కాల్వల యాసంగి సీజన్ పంటలకు సాగునీటిని వదులుతారు. గతేడాది రూపొందించిన షెడ్యూల్లో తేదీలను అటు ఇటుగా మార్చి అయిదు తడులుగా నీటిని వదలడానికి నిర్ణయించారు. దేవరకద్ర మండలంలో ఎడమ కాల్వ పూర్తిస్థాయిలో ఉండగా.. కుడి కాల్వ కింద ధన్వాడ, మరికల్, చిన్నచింతకుంట మండలాలు ఉన్నాయి. అయితే పాత ఆయకట్టు ప్రకారం 12 వేల ఎకరాల మేర ఉండగా అందులో పూర్తిస్థాయిలో సాగునీరు అందే అవకాశం ఉండకపోవచ్చని అధికారులు అంటున్నారు. వానాకాలంలో దాదాపు మూడు నెలలపాటు నీటి విడుదల చేయడానికి అవకాశం ఉంటుందని దీనివల్ల దాదాపు 35 వేల ఎకరాల మేర సాగవుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న 2 టీఎంసీల నీటిలో ఒక టీఎంసీ సాగునీటికి, మరో టీఎంసీ వేసవిలో తాగునీటి అవసరాలకు ఉపయోగించే విధంగా అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. కోయిల్సాగర్ నీటి విడుదల షెడ్యూల్ ఖరారు పాత ఆయకట్టు 12 వేల ఎకరాలకే అవకాశం జనవరి 5 నుంచి ఏప్రిల్ 14 వరకు తడులు ప్రాజెక్టులో ప్రస్తుత నీటిమట్టం 32.2 అడుగులు ప్రణాళిక సిద్ధం చేశాం.. కోయిల్సాగర్లో ఉన్న నీటిని సద్వినియోగం చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఉన్న రెండు టీఎంసీల నీటిలో సాగుకు ఒక టీఎంసీ, తాగునీటి అవసరాలకు ఒక టీఎంసీని ఉపయోగించేలా ప్రణాళిక సిద్ధం చేశాం. యాసంగి సీజన్ పంటల కోసం రైతులు ఇప్పటికే వరినారు మడులు సిద్ధం చేసుకోవడం జరిగింది. దీనివల్ల నేరుగా నాట్లు వేసుకోడానికి నీటిని వదిలేందుకు తేదీలను ఖరారు చేశాం. – ప్రతాప్సింగ్, ఈఈ, కోయిల్సాగర్ ప్రాజెక్టు -
పద్యకృతుల ఆవిష్కరణ మహోత్సవం
స్టేషన్ మహబూబ్నగర్: జాతీయ సాహిత్య పరిషత్ పాలమూరు జిల్లాశాఖ ఆధ్వర్యంలో ప్రముఖ కవి రాచాలపల్లి బాబుదేవిదాస్రావు రచించిన ‘రామచంద్ర ప్రభో’, ‘చిత్రాంగద– సారంగధరుడు’ పద్యకృతుల ఆవిష్కరణ మహోత్సవాన్ని గురువారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించారు. జాతీ య సాహిత్య పరిషత్ జిల్లాశాఖ అధ్యక్షుడు ఇరివింటి వెంకటేశ్వరశర్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ సాహిత్యం జగద్వితం కోసం సృష్టించబడుతుందన్నారు. కవులు సమాజ హితాన్ని కోరుకుంటారని తెలిపారు. ముఖ్య అతిథి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రామచంద్ర ప్రభో కావ్యం సరళమైన, సుందరమైన సుమధుర తెలుగు భాషలో అందించినట్లు తెలిపారు. ఇందు లో ప్రాచీన కవుల గుంబనం, లలిత పదజాతం ఆకట్టుకుంటుందన్నారు. రామచంద్రప్రభో మకుటంతో ఆద్యంతం పద్యాలను ఎంతో శ్రావ్యంగా చదువుతూ బాబుదేవిదాసును అభినందిస్తూ సమీక్ష చేశారు. డాక్టర్ పొద్దుటూరు ఎల్లారెడ్డి రామచంద్రప్రభో మకుటం ఉన్న 131 పద్య కావ్యాన్ని, పద్యాలను చదువుతూ రామ కథను అసాంతం పరి చయం చేశారు. డాక్టర్ తంగెళ్లపల్లి శ్రీదేవి చిత్రాంగద–సారంగధరుడు కథను 126 ప్యదాల కృతిని సమీక్ష చేస్తూ చక్కగా వివరించారు. అదేవిధంగా ప్రముఖ న్యాయవాది వి.మనోహర్రెడ్డి, అవధాని చుక్కాయపల్లి శ్రీదేవి, డాక్టర్ కె.బాలస్వామి, తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్షురాలు రావూరి వనజ పద్యకృతులపై ప్రసంగించారు. కార్యక్రమంలో పాలమూరు నగర అధ్యక్షులు జి,శాంతారెడ్డి, కవులు ప్రభులింగంశాస్త్రి, దేవదానం, రవీందర్రెడ్డి, ఖాజా మైనొద్దీన్, జగపతి రావు, గడ్డం వనజ, డాక్టర్ కృష్ణవేణి, జమున, ఈశ్వరమ్మ, గుముడాల చక్రవర్తి, శ్యాంప్రసాద్, అను రాధ, వీరేందర్గౌడ్, శ్రీరాములు పాల్గొన్నారు. -
మహబూబ్నగర్
పార్టీలు, పంతాలు వద్దు.. అభివృద్ధి చేసుకుందాం సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/కోస్గి: గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం సమగ్ర అభివృద్ధి చెందినట్లనే విషయాన్ని గుర్తించి నూతనంగా ఎన్నికై న సర్పంచులు గ్రామాల అభివృద్ధికి తమవంతు కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు. సమష్టి కృషితో దేశంలోనే కొడంగల్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఎన్నికలు వచ్చినప్పుడే పార్టీలు, రాజకీయాలుంటాయని, ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీలు, పంతాలు పక్కన బెట్టి అభివృద్ధియే ఏకైక ఎజెండాగా గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని పేర్కొన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో కొడంగల్ నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఎన్నికై న సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్లను సన్మానించారు. అనంతరం సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. ‘మీరు ఆశీర్వదించిన మీ బిడ్డ ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. బెట్టి గ్రామాలను అభివృద్ధి చేసుకోవడమే లక్ష్యంగా నూతన సర్పంచ్లు పాలకవర్గాలతో కలిసి పని చేయాలి. అభివృద్ధికి ఎన్ని నిధులైన మంజూరు చేస్తా. గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు కాకుండా చిన్న పంచాయతీలకు రూ.5 లక్షలు, పెద్ద పంచాయతీలకు రూ.10 లక్షలు ప్రత్యేక ముఖ్యమంత్రి నిధులు అందిస్తా. ప్రజలు మీపై నమ్మకంతో ఓట్లు వేసి సర్పంచులుగా గెలిపించారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలు అందించే బాధ్యత నూతన సర్పంచ్లుగా మీపైనే ఉంది. గ్రామస్థాయి మొదలు మండలస్థాయి నాయకుల వరకు రాజకీయాలు పక్కనబెట్టి అన్ని పార్టీల సర్పంచ్లను కలుపుకొని గ్రామాల అభివృద్ధియే ఏకై క లక్ష్యంగా పని చేయాలి.’ అని పేర్కొన్నారు. చదువుతోనే వెలుగులు ‘చదువుతోనే వెలుగు, మార్పు వస్తుంది. నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నాం. కొడంగల్ నియోజకవర్గంలో 25 వేల మంది విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. రాష్ట్రం మొత్తం అన్ని పాఠశాలల్లో అల్పాహారం, మధ్యాహ్న భోజనం పెట్టించి చదువు చెప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపండి. విద్యా, వసతులు, భోజనం అందిస్తేనే విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. నియోజకవర్గంలోని లగచర్లలో 250 ఎకరాల్లో ఎడ్యుకేషన్ హబ్ కడుతున్నాం. రాష్ట్రంలో ఎక్కడా లేని సైనిక్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నాం. దేశంలోని ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకునేలా విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ ప్రాంతం నుంచి ఉన్నత చదువులు చదివి ఐఏఎస్, ఐపీఎస్లై తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలి.’ అని సీఎం సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే లు రామ్మోహన్రెడ్డి, మనోహర్రెడ్డి, కాలె యా దయ్య, నారాయణపేట, వికారాబాద్ జిల్లాల కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, ప్రతిక్ జైన్, డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్రెడ్డి, నాయకులు కుంభం శివకుమార్రెడ్డి, వార్ల విజయ్కుమార్, రఘువర్ధన్రెడ్డి, విక్రంరెడ్డి, నర్సిములు, మహేందర్రెడ్డి, యూసూ ఫ్, శేఖర్, మద్దప్ప దేశ్ముఖ్, అన్న కిష్టప్ప, నాగులపల్లి నరేందర్ పాల్గొన్నారు. గురువారం శ్రీ 25 శ్రీ డిసెంబర్ శ్రీ 2025హోరాహోరీగా టీ–20 లీగ్ హోరాహోరీగా సాగిన ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ–20 లీగ్లో గద్వాల, నారాయణపేట జట్లు విజయం సాధించాయి. –8లో uనాడు వై ఎస్సార్.. నేడు రేవంతన్న: మంత్రి వాకిటి నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పాదయాత్ర చేసి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకువచ్చి పేదల కోసం సంక్షేమ పథకాలు అమలు చేశారని, అలాగే పదేళ్లు అభివృద్ధిలో వెనుకబడిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధియే లక్ష్యంగా నేడు రేవంతన్న అలుపెరగని పోరాటం చేసి కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చి పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. రేవంతన్న హయాంలో దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు జరుగుతుందన్నారు. సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా కొడంగల్ గ్రామాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తా ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికీఅందించే బాధ్యత సర్పంచులదే -
తండ్రి ప్రాణం తీసిన కుమారుడి వివాహేతర బంధం
● హమాలీ హత్య కేసును ఛేదించిన పోలీసులు ● నిందితుల అరెస్టు ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ వెంకటేశ్వర్లు దేవరకద్ర రూరల్: దేవరకద్ర మండలం అడవి అజిలాపూర్ స్టేజీ వద్ద గత అక్టోబర్ 24న జరిగిన హమాలీ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం స్థానిక పోలీస్స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. అజిలాపూర్కు చెందిన దానం మైబు (45) దేవరకద్రలోని మార్కెట్యార్డులో హమాలీ పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన అక్కినోళ్ల రాజు, హనుమన్న, రాఘువులు ముగ్గురు అన్నదమ్ములు కాగా.. చిన్నవాడైనా రాఘవులు భార్యతో మృతుడి కొడుకు అనిల్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంపై గతంలో పలుమార్లు గొడవలు జరిగాయి. అయినప్పటికీ వారి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో మనస్తాపానికి గురైన రాఘవులు.. మూడేళ్ల క్రితం గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఘటనకు కారణమైన అనిల్ను గ్రామం నుంచి హైదరాబాద్కు పంపించారు. అయినప్పటికీ రెండు కుటుంబాల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. తన తమ్ముడి మృతికి కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని అక్కినోళ్ల హనుమన్న భావించాడు. ఈ మేరకు చిన్నరాజమూరుకు చెందిన మ్యాదరి చిన్న రాములు సహాయంతో మహబూబ్నగర్లోని దొడ్డలోనిపల్లికి చెందిన గొల్ల మల్లేష్, మణికొండకు చెందిన శరత్ను ఆశ్రయించాడు. తన తమ్ముడి చావుకు కారణమైన అనిల్ లేదా అతడి తండ్రి దానం మైబును హతమార్చేందుకు గాను గొల్ల మల్లేష్, శరత్తో హనుమన్న రూ. 8 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. హత్యకు ముందు రూ. 3.90 లక్షలను అడ్వాన్స్గా చెల్లించాడు. అయితే అనిల్ హైదరాబాద్లో ఉండటంతో, తండ్రి దానం మైబును హతమార్చాలని నిందితులు నిర్ణయించుకున్నారు. అందుకోసం వారం రోజులుగా మృతుడి కదలికలపై నిఘా ఉంచారు. అక్టోబర్ 24న మృతుడు దేవరకద్ర మార్కెట్యార్డులో పనులు ముగించుకొని బైక్పై ఒంటరిగా ఇంటికి వెళ్తుండటాన్ని గమనించిన నిందితులు.. అజిలాపూర్ స్టేజీ వద్ద బైక్ను అడ్డగించి తమతో తెచ్చుకున్న వేట కొడవళ్లతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. వారి నుంచి మైబు తప్పించుకొని పారిపోతుండగా.. వెంబడించి మరీ ఇష్టానుసారంగా నరకడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఆ తర్వాత నిందితులు తమ వేట కొడవళ్లను సమీపంలోని నీటి గుంతలో వేసి వెళ్లిపోయారు. ఈ హత్యను పలు కోణాల్లో విచారించిన పోలీసులు.. కాల్డేటా ఆధారంగా నిందితులను పట్టుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో ఏ–1గా అక్కినోళ్ల హనుమన్న, ఏ–2గా గొల్ల మల్లేష్, ఏ–3గా గంజి శరత్, ఏ–4, మ్యాదరి చిన్నరాములును చేర్చినట్లు తెలిపారు. వీరిలో ఏ–3 నిందితుడు గంజి శరత్ పరిటాల రవి హత్య కేసులో నిందితుడైన అభంగాపూర్ ఆశన్నను చంపిన వారిలో ఏ–6 ముద్దాయిగా ఉన్నాడన్నారు. అదే విధంగా హమాలీని హత్యచేసిన వారం రోజులకు దేవరకద్ర మండలం నాగారం గ్రామానికి చెందిన ఒక యువకుడిని మణికొండలో హత్య చేశాడని.. ఆ హత్య కేసులో ప్రస్తుతం జైలులో ఉన్నాడని తెలిపారు. మిగతా నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. హత్య కేసు ఛేదనకు కృషిచేసిన ఎస్ఐ నాగన్న, కానిస్టేబుల్ రాజశేఖర్, నాను నాయక్లను ఎస్పీ అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ రామకృష్ణ ఉన్నారు. -
ఎంబీ చర్చికి ఘనమైన చరిత్ర
స్టేషన్ మహబూబ్నగర్: జిల్లాకేంద్రంలో ఎంబీ చర్చి (కల్వరి మెన్నోనైట్ బ్రదరన్ చర్చి)కి ఘనమైన చరిత్ర ఉంది. మహబూబ్నగర్ నడిబొడ్డున ఈ చర్చి నిర్మాణమై 1957 నుంచి క్రైస్తవులకు ప్రధాన ప్రార్థన మందిరంగా మారింది. ఉమ్మడి జిల్లాలోనే పెద్ద చర్చిగా ప్రత్యేక గుర్తింపు ఉంది. క్రిస్మస్, గుడ్ఫ్రైడే, ఈస్టర్, కృతజ్ఞత తర్పణ పండుగలు ఇక్కడ ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది సీ్త్రల సమాజం, యువత తదితర సమావేశాలు జరుగుతాయి. ఎంబీ చర్చి ఎదుట విశాలమైన ప్రాంగణం అందుబాటులో ఉంది. ఆయా పండుగ రోజుల్లో చర్చి లోపల, ప్రాంగణంలో ఒకేసారి 5వేలకుపైగా క్రైస్తవులు ప్రార్థనలు చేస్తారు. 43 ఏళ్ల నుంచి పాస్టర్గా పనిచేస్తున్న 43 ఏళ్ల నుంచి ఎంబీ చర్చిలో పాస్టర్గా పనిచేస్తున్న. ఆ ఏసు ప్రభువు దయవల్లే నాకు ఇన్నేళ్లు నుంచి చర్చి పాస్టర్గా ఉన్న. ఎంబీ చర్చి మేనేజింగ్ కమిటీకి చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నాను. ఈ చర్చి ఆధ్వర్యంలో 11 చర్చిల నిర్వహణ చేపడుతున్నాం. ఉమ్మడి జిల్లాలో దాదాపు 100 మంది పాస్టర్లకు నెలసరి సహాయం అందజేస్తున్నాం. వితంతువులకు కూడా నెలసరి ఆర్థికసాయం ఇస్తున్నాం. – రెవరెండ్ ఎస్.వరప్రసాద్, ఎంబీ చర్చి, సీనియర్ పాస్టర్ 68 ఏళ్ల నుంచి చర్చిలో ప్రార్థనలు ఒకేసారి 5 వేలకు పైగా ప్రార్థనలు చేసుకునే అవకాశం ఉమ్మడి జిల్లాలోనే పెద్దచర్చిగా ప్రత్యేక గుర్తింపు -
చోరీ కేసులో నలుగురికి రిమాండ్
వనపర్తి రూరల్: జిల్లా పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ ఘటనల్లో నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ వెంకటేశ్వరావు తెలిపారు. బుధవారం వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సీఐ కృష్ణయ్య, ఎస్ఐలు జలేందర్రెడ్డి, వేణుగోపాల్తో కలిసి వివరాలు వెల్లడించారు. ఈ నెల 12న వనపర్తి పట్టణంలోని లక్ష్మీనరసింహ కాలనీకి వెళ్లే దారిలో మహిళా నడుచుకుంటూ వెళ్తుండగా బంగారు గొలుసు చోరీ జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ప్రత్యేక టీం ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈ నెల 23న నాగవరం దగ్గర వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితుల్లో ఇద్దరు బైక్, మరో ఇద్దరు కారులో పారిపోతుండగా పట్టుకున్నట్లు తెలిపారు. అదుపులోకి తీసుకొని విచారించగా అమరచింత మండలం నాగల్కడ్మూర్కు చెందిన ఏ1 కుర్వ రాములు, ఏ2 గట్టు వెంకటేష్, ఏ3 డ్యామ్ వెంకటేష్, ఏ4 బండమీది రాజేష్ ముఠాగా ఏర్పడి 2024 నుంచి ఉమ్మడి జిల్లా పరిధిలో పలుచోట్లు చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. నిందితుల నుంచి 104 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు కార్లు, రెండు బైకులు, ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. కేసును త్వరితగతిన చేధించిన సిబ్బందిని ఎస్పీ సునీతారెడ్డి అభినందించి రివార్డులు అందజేశారు. -
ఆస్తిపన్ను వసూళ్లలోవెనుకంజ
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లాలోని పాలమూరు నగరంతో పాటు జడ్చర్ల, భూత్పూర్ పట్టణాలలో ఆస్తిపన్ను వసూలు చేయడంలో మున్సిప ల్ అధికారులు వెనుకబడ్డారు. కేవలం కొత్త మున్సిపాలిటీ దేవరకద్రలో మాత్రమే లక్ష్యంలో సగాన్ని అధిగమించగలిగారు. ఈ ఆర్థిక సంవత్సర (2025 –26)లో ఇప్పటికే తొమ్మిది నెలలు గడిచిపోయింది. ఇక మిగిలింది మూడు నెలల గడువు మాత్రమే మిగిలింది. మరోవైపు అర్బన్ డే పేరిట ఉన్నతాధికారులు నెలలో కనీసం రెండుసార్లయినా ఆయా విభాగాల అధికారులతో సమీక్షిస్తున్నా.. క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు దక్కడం లేదు. దీంతో ఏటేటా మొండి బకాయిలు పేరుకుపోతూనే ఉన్నాయి. ఇక ఆర్థిక సంవత్సరం చివర్లో ఆస్తిపన్ను చెల్లిస్తే సరిపోతుందిలే.. అని అసెస్మెంట్దారులు చెబుతుండ టం గమనార్హం. వాస్తవానికి ఏడాదిలో రెండుసార్లు ఇంటింటికీ మున్సిపల్ సిబ్బంది వెళ్లి వీరికి డిమాండ్ నోటీసులను ఇస్తున్నా చలనం లేదు. 9 నెలల్లో పాలమూరు కార్పొరేషన్ పరిధిలో 24.23 శాతమే! జడ్చర్లలో 30.94, భూత్పూర్లో 33.79 శాతం మాత్రమే కొత్త మున్సిపాలిటీ దేవరకద్రలో 55.04 శాతం వసూలు తరచూ సమీక్షలతోనే సరిపెడుతున్నఉన్నతాధికారులు పట్టణాల్లో ఏటేటా పేరుకుపోతున్న మొండి బకాయిలు -
హత్య కేసులో ప్రధాన నిందితుడి అరెస్టు
గద్వాల క్రైం: గూడ్స్ వాహనంతో బైక్ను ఢీకొట్టి మాజీ సర్పంచ్ను హతమార్చిన కేసులో తప్పించుకొని తిరుగుతున్న ప్రధాన నిందితుడిని పోలీసులు పట్టుకొని అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం స్థానిక పోలీసు సర్కిల్ కార్యాలయంలో సీఐ టి.శ్రీను విలేకర్లకు వెల్లడించారు. కేటీదొడ్డి మండలం నందిన్నె గ్రామ మాజీ సర్పంచ్ చిన్న భీమరాయుడు (41), అదే గ్రామానికి చెందిన మిల్లు వీరన్న కుటుంబ సభ్యుల మధ్య పాత కక్షలు, రాజకీయ వైరం, ఆర్థిక విభేదాల నేపథ్యంలో ఇరువురి మధ్య వివాదాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో భీమరాయుడిని ఎలాగైనా అడ్డు తొలగించాలనే లక్ష్యంతో మిల్లు వీరన్న కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కె.వెంకటాపూర్కు చెందిన ఈడిగ ఈశ్వర్గౌడ్ను కలిసి చర్చించారు. అతడి హత్యకు రూ. 25లక్షల ఒప్పందం చేసుకున్నారు. సుపారీ తీసుకున్న ఈశ్వర్గౌడ్.. భీమరాయుడి హత్యకు వ్యూహం రచించారు. అందులో భాగంగా తనకు తెలిసిన వ్యక్తులను ఈ వ్యూహంలో భాగస్వామ్యం చేసుకున్నారు. నవంబర్ 21న మృతుడు గద్వాల నుంచి స్వగ్రామానికి బైక్పై వెళ్తుండగా.. ధరూర్ మండలం జాంపల్లి స్టేజీ సమీపంలో గూడ్స్ వాహనంతో ఢీకొట్టి హతమార్చారు. ఈ కేసులో 10 మంది నిందితులను నవంబర్ 27న అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ప్రధాన నిందితుడు ఈశ్వర్గౌడ్ తప్పించుకుని తిరుగుతున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం కర్నూలు జిల్లాలోని కాల్వబుగ్గ గ్రామ సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. కాగా, ఈశ్వర్గౌడ్పై గతంలోనే రెండు కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. కట్టుకున్న భార్యను హత్యచేసి పత్తికొండ సబ్ జైలుకు సైతం వెళ్లాడు. బెయిల్పై బయటకు వచ్చిన అతడు.. మంత్రాలయంలోని కోస్గిలో జరిగిన ఫ్యాక్షన్ గొడవలో నాటుబాంబులు వేసిన ఘటనలో అరెస్టయి ఆదోని సబ్జైలుకు వెళ్లాడని తెలిపారు. అతడిని గద్వాల కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తున్నట్లు సీఐ వెల్లడించారు. ఈ హత్య కేసులో మరి కొంతమ ంది ఉన్నారని.. వారిని సైతం త్వరలోనే అదుపులో కి తీసుకుంటామన్నారు. నిందితుడి నుంచి బైక్, సె ల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఎస్ఐలు శ్రీహరి, శ్రీనివాసులు ఉన్నారు. -
ఆలిండియా ఉమెన్స్ కిక్బాక్సింగ్ పోటీలకు జిల్లా క్రీడాకారిణులు
మహబూబ్నగర్ క్రీడలు: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో గురువారం నుంచి ఈనెల 28 వరకు జరిగే ఆలిండియా ఉమెన్స్ కిక్బాక్సింగ్ జోనల్ పోటీల్లో స్పోర్ట్స్ కిక్బాక్సింగ్ అసోసియేషన్ ఆఫ్ మహబూబ్నగర్కు చెందిన నలుగురు జిల్లా క్రీడాకారిణులు పాల్గొంటున్నట్లు జిల్లా అధ్యక్షుడు రవికుమార్ తెలిపారు. ఈ పోటీల్లో 22కేజీల విభాగంలో వినూత్న, 37కేజీల కేటగిరీలో తన్షిత, 47కేజీల విభాగంలో సాయిలక్ష్మి పాయింట్ ఫైట్లో, సీనియర్ విభాగంలో యామిని మ్యూజికల్ ఫామ్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీమ్ మేనేజర్ జయదీప్ సింగ్ పాల్గొన్నారు. -
గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకే..
మూడోరోజు క్రికెట్ పోటీలకు మహబూబ్నగర్ డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ ముఖ్యఅతిథిగా హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకొని మాట్లాడారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు క్రికెట్ పోటీలు నిర్వహిస్తుండటం అభినందనీయమని కొనియాడారు. ఇలాంటి లీగ్లతో క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీయవచ్చని.. జాతీయ, అంతర్జాతీయస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మాజీ క్రీడాధికారి రమేష్కుమార్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, ఎండీసీఏ ప్రధానకార్యదర్శి ఎం.రాజశేఖర్, ఉపాధ్యక్షులు సురేష్కుమార్, వెంకటరామారావు, కోచ్లు గోపాలకృష్ణ, మన్నాన్, కాంగ్రెస్ నాయకులు చంద్రకుమార్గౌడ్, బెక్కరి మధుసూదన్రెడ్డి, చందుయాదవ్, బాలస్వామి, ప్రవీణ్, తాహెర్ తదితరులు పాల్గొన్నారు. -
యువకుడి ఆత్మహత్య
మదనాపురం: అప్పుల బాధ తాళలేక యువకుడు ప్రాణాలు తీసుకున్న విషాద ఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చిన్నచింతకుంట మండలం ఉంధ్యాలకు చెందిన మాల వినోద్కుమార్ (28) కొంతకాలంగా ఆత్మకూరులో నివాసం ఉంటున్నాడు. అప్పులు ఎక్కువగా ఉండడంతో కొద్దిరోజులుగా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే ఉదయం సుమారు 6గంటల ప్రాంతంలో కొత్తపల్లి బ్రిడ్జి వద్దకు చేరుకుని, నీటిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య లావణ్య, కుమారుడు ఉన్నారు. చేతికి అందిన కొడుకు మరణించడంతో ఆ కుటుంబంలో తీరని శోకం నెలకొంది. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ శేఖర్రెడ్డి తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి బల్మూర్: మండలంలోని పోలేపల్లి గ్రామానికి చెందిన కృష్ణమ్మ అనే మహిళ అనుమానాస్పద స్థితితో మృతి చెందింది. ఎస్ఐ రాజేందర్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన చిట్టిగోరి కృష్ణమ్మ(45) భర్త విష్ణుతో కలిసి హైదరాబాద్లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో ఈ నెల 22న అనారోగ్యంతో ఎవరికి సమాచారం ఇవ్వకుండా హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వచ్చింది. కుటుంబ సభ్యులు నాగర్కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అనంతరం గ్రామానికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఇంటి నుంచి పాల కోసం వెళ్లిన కృష్ణమ్మ ఎంతకు తిరిగి రాలేదు. ఆచూకీ కోసం వెతకగా తన ఇంటి వెనుక చెట్లపొదల్లో శవమై కనిపించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలి కుమారుడు భానుప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. విద్యుదాఘాతంలో రెండు దుకాణాలు దగ్ధం మహబూబ్నగర్ క్రైం: మొబైల్ దుకాణంలో ఏర్పడిన షార్ట్సర్క్యూట్ కారణంగా రెండు దుకాణాల్లో ఉన్న సామగ్రితో పాటు ఇంట్లో కిచెన్లో వస్తువులు దగ్ధమైన ఘటన బుధవారం చోటుచేసుకుంది. అగ్నిమాపక శాఖ అధికారి మల్లికార్జున్ కథనం ప్రకారం.. నగరంలోని ఎంబీసీ చర్చి ఎదురుగా ఉన్న కేజీఎన్ మొబైల్ దుకాణంలో బుధవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో షార్ట్సర్క్యూట్ వల్ల మంటలు ఏర్పడ్డాయి. దుకాణంలో ఉన్న మొబైల్ సామగ్రితో పాటు ఇతర వస్తువులు దగ్ధం కావడంతో మంటలు పక్క దుకాణంలోకి వ్యాప్తించి అందులోని ఎలక్ట్రిక్ వస్తువులు కాలిపోయాయి. దుకాణం వెనుక భాగంలో ఉన్న ఇంట్లోకి సైతం మంటలు వ్యాపించి కిచెన్లో ఉన్న ఫ్రీజ్ ఇతర వస్తువులు, సామన్లు దగ్ధమయ్యాయి. ఘటన స్థలానికి ఫైర్ ఇంజన్ చేరుకుని మంటలు అదుపు చేసినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం జడ్చర్ల: మండలంలోని గంగాపూర్కు చెందిన వడ్ల యాదగిరి (28) బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు సీఐ కమలాకర్ తెలిపారు. జడ్చర్ల నుంచి బైక్పై స్వగ్రామానికి వెళ్తుండగా.. గ్రామ సమీపంలో ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్డడంతో కిందపడి తీవ్రంగా గాయపడ్డాడని చెప్పారు. వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ వివరించారు. ట్రాక్టర్ కింద పడి వ్యక్తి.. వనపర్తి రూరల్: ట్రాక్టర్ కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకున్నది. ఏఎస్ఐ ఎండీ సాజిద్అలి తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల గ్రామానికి సూగూరు మహేష్ (29) మంగళవారం పొలం దగ్గరుకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వస్తున్నాడు. మార్గమధ్యంలో చవటబావి దగ్గర ఊర చెరువు కాల్వకట్టపై వెనకాల వస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ బాలకృష్ణ ఎదుట ఉన్న వాహనాలను తప్పించబోయి మహేష్ను ఢీకొనడంతో అతడు కాల్వలో పడగా.. ట్రాక్టర్ మీదపడడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షి ంచి అప్పటికే మృతి చెందాడని తెలిపారు. మృతుడి అన్న సూగూరు భాస్కర్ బుధవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్ఐ తెలిపారు. -
హోరాహోరీగా టీ–20 క్రికెట్ లీగ్
● సత్తాచాటిన జోగుళాంబ గద్వాల, నారాయణపేట జట్లు మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఎండీసీఏ మైదానంలో వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ–20 లీగ్ మూడోరోజు బుధవారం హోరాహోరీగా కొనసాగాయి. మూడో లీగ్ మ్యాచ్లో జోగుళాంబ గద్వాల, నారాయణపేట జట్లు విజయం సాధించాయి. ఈ లీగ్లో నారాయణపేట రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. ఏడు వికెట్ల తేడాతో.. బుధవారం జరిగిన మొదటి లీగ్ మ్యాచ్లో జోగుళాంబ గద్వాల జట్టు ఏడు వికెట్ల తేడాతో నాగర్కర్నూల్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన నాగర్కర్నూల్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. చరణ్ 36 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్తో 38 పరుగులు, సంజయ్ 21 పరుగులు చేశారు. గద్వాల బౌలర్లు కె.విక్రం 2, జునైద్ మీర్జా 2, యూనుస్, వెంకట్సాగర్, మహ్మద్ ఖయ్యూం చెరో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన గద్వాల జట్టు 15.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది. జట్టులో ఎస్.అరవింద్ 42 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 59 పరుగులు, మహ్మద్ ఖయ్యూం 42 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ కొట్టి 51 పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు. నాగర్కర్నూల్ బౌలర్లు గగన్ 3 వికెట్లు తీశారు. మ్యాన్ ఆఫ్ది మ్యాచ్గా మహ్మద్ ఖయ్యూం (గద్వాల) నిలిచారు. 75 పరుగుల తేడాతో.. మరో లీగ్ మ్యాచ్లో నారాయణపేట జట్టు 75 పరుగుల తేడాతో వనపర్తి జట్టుపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన నారాయణపేట జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 169 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. జట్టులో ఆర్యాన్ 68 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్తో 64 పరుగులు, ఈ.అభిలాష్గౌడ్ 49 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్తో 52 పరుగులు చేశారు. వనపర్తి బౌలర్లు యశ్వంత్, గట్టు పవన్, రోహిత్ చరణ్ ఒక్కో వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన వనపర్తి జట్టు నారాయణపేట బౌలర్ల ధాటికి 14.3 ఓవర్లలో 94 పరుగులకు ఆలౌట్ అయింది. బౌలర్లు అక్షయ్ 3, భానుప్రసాద్ 3 వికెట్లు తీశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా అక్షయ్ (నారాయణపేట) నిలిచారు. -
ఎస్జీఎఫ్ జాతీయ పోటీలకు ఎంపిక
మహబూబ్నగర్ క్రీడలు: ఢిల్లీలో వచ్చేనెలలో జరిగే అండర్–19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జాతీయ కరాటే పోటీలకు జిల్లా క్రీడాకారిణి మహిమాన్విత ఎంపికై నట్లు జీకే మాస్టర్ షోటోకాన్ జిల్లా అధ్యక్షుడు, సీనియర్ కరాటే మాస్టర్ శివకుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రతిభ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మహిమాన్విత ములుగు జిల్లా కేంద్రంలో ఈనెల 22, 23 తేదీల్లో జరిగిన రాష్ట్రస్థాయి అండర్–19 ఎస్జీఎఫ్ పోటీల్లో ప్రతిభ కనబరిచినట్లు తెలిపారు. కుమితె –48 కేజీల విభాగంలో ఆమె ప్రథమ స్థానంలో నిలిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. క్రీడాకారిణిని జీకే మాస్టర్ షోటోకాన్ కరాటేడూ ఇండియా ఫౌండర్ చీఫ్ జి.కృష్ణయ్య, ఎగ్జామినర్ రవికుమార్, కరాటే మాస్టర్లు శివకుమార్, దామోదర్ అభినందించారు. జాతీయ స్థాయి పోటీల్లో పతకం సాధించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. -
కావేరమ్మపేటలో గుప్తనిధుల కోసం తవ్వకాలు
జడ్చర్ల: కావేరమ్మ పేటలో ఓ పాడుబడిన పురాతన ఇంటిలో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేసిన ఘటన బుధవారం వెలుగు చూసింది. కావేరమ్మపేటకు చెందిన తల్లోజు లక్ష్మికి సంబంధించిన ఇంటిలో ఆరు నెలలుగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కొందరు గుప్తనిధుల కోసం తవ్వకాలు సాగిస్తున్నారు. తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో ఆ ఇంటి పనులు చేపడుతున్నట్లు యజమానులు చెబుతుండడంతో ఎవరికీ అనుమానం రాలేదు. ఇంటి ప్రహరీ లోపల చేస్తున్న తవ్వకాలు బయటకు కూడా కనిపించకపోవడంతో పలు చోట్ల గోతులు తవ్వడం, పూడ్చడం వంటివి చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొందరు విషయాన్ని గ్రహించి సమాచారం చేరవేయడంతో పోలీసులు రంగప్రవేశం చేసి తవ్వకాలు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. హైదరాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన 8 మందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి, విచారిస్తున్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు. కాగా కావేరమ్మపేటలోని పాత ఇళ్లలో గుప్త నిధులు ఉన్నాయన్న ప్రచారం కొంత కాలంగా ఉంది. గతంలో ఇదే ప్రాంతంలో ఓ పాడుబడిన ఇంటిలో తవ్వకాలు చేయగా.. వెండి నాణెలు బయట పడ్డాయి. గుట్టుగా ఉన్న ఈ విషయం బయటపడడంతో అప్పట్లో ఆర్డీఓ, పోలీసు ఉన్నతాధాకారులు స్పందించి నిర్విరామంగా రెండు రోజుల పాటు జేసీబీతో తవ్వకాలు చేపట్టారు. అప్పుడు కూడా కొన్ని వెండి నాణెలు లభించాయి. వాటన్నింటిని స్వాధీనం చేసుకున్న అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈ కోవలోనే గుట్టుగా గుప్త నిధుల తవ్వకాలు చేస్తున్నట్లు తెల్సింది. సైబర్ మోసం.. ఖాతా నుంచి నగదు ఖాళీ నాగర్కర్నూల్ క్రైం: జిల్లా కేంద్రానికి చెందిన వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు నగదు చోరీకి పాల్పడిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గోవర్ధన్ బుధవారం తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని సంతబజార్ కాలనీకి చెందిన అబ్దుల్నయీం ఫోన్కు ఈ నెల 10న సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి క్రెడిట్ కార్డు గడువు ముగుస్తుందని, అప్డేట్ చేయాలని చెప్పడంతో నమ్మాడు. తన ఫోన్కు వచ్చిన ఓటీపీని సైబర్ నేరగాళ్లకు చెప్పడంతో అబ్దుల్నయీం బ్యాంకు ఖాతా నుంచి రూ.65,361 నగదు బదిలీ అయ్యింది. గుర్తించిన బాధితుడు బుధవారం స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
ఉల్లి ధర తగ్గుముఖం
దేవరకద్ర: స్థానిక మార్కెట్ యార్డులో మూడు వారాలుగా పెరుగుతూ వచ్చిన ఉల్లి ధర బుధవారం ఒక్కసారిగా పడిపోయింది. కొత్త ఉల్లి వచ్చిన ప్రారంభంలో కనిష్ట స్థాయికి పడిపోయిన ఉల్లి ధరలు మూడు వారాల నుంచి పెరుగుతూ వచ్చాయి. వారం గడవక ముందే మళ్లీ ధరలు మొదటికి వచ్చాయి. రూ.1,700 పలికిన ధర మార్కెట్లో జరిగిన ఉల్లి వేలంలో గరిష్ట ధర క్వింటాల్కు రూ.1,700లు పలికింది. గత వారం రూ. 2600 వరకు గరిష్ట ధర పలికిన క్వింటాల్ ఏకంగా రూ.900 వరకు తగ్గింది. కనిష్ట ధర రూ.1100 వరకు పడిపోవడంతో గత వారంతో పోల్చితే రూ. 800 వరకు ధర తగ్గుదల కనిపించింది. ధరలు తగ్గడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మార్కెట్కు దాదాపు అయిదు వందల బస్తాల ఉల్లి విక్రయాలు జరిపారు. వేలంలో కొనుగోలు చేసిన ఉల్లి 50 కేజీల బస్తా ధర గరిష్టంగా రూ. 850, కనిష్టంగా రూ. 550గా విక్రయించారు. -
సహజ వనరులు కాపాడాలి
మాగనూర్: సహజ వనరులను కాపాడాలని చిట్యాల గ్రామ రైతులు డిమాండ్ చేశారు. మాగనూర్ మండల పరిధిలోని మందిపల్లి గ్రామ పెద్దవాగు నుంచి టీజీఎండీసీ అనుమతులతో మక్తల్కు చెందిన ఓ వ్యక్తి ఇసుక తరలించేందుకు చేస్తున్న ఏర్పాట్లను బుధవారం రెండో రోజు కూడా గ్రామ రైతులు అడ్డుకున్నారు. మాగనూర్ మండలంతో పాటు మక్తల్ మండలం చిట్యాల గ్రామానికి చెందిన రైతుల పొలాలు మందిపల్లి పెద్ద వాగు పరిసరాలలో ఉన్నాయని ఇష్టం వచ్చినట్లు ఇసుకను తవ్వి తరలిస్తే బోర్లు ఎండిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అదే విధంగా చిట్యాల గ్రామం మీదుగా ఇసుక తరలించేందుకు మట్టి రోడ్డు నిర్మిస్తుండటంతో ప్రధాన రోడ్డు ధ్వంసం కావడంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని వాపోయారు. ఇప్పటికై నా అధికారులు ఇసుక అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన కార్యక్రమం చేపడతామని చిట్యాల గ్రామ రైతులు తెలిపారు. -
దేవరకద్ర పట్టణంలో ఇలా..
ఇదిలా ఉండగా గత జనవరి 27న కొత్తగా ఏర్పడిన దేవరకద్ర మున్సిపాలిటీలో మొత్తం ఐదు గ్రామపంచాయతీలు విలీనమయ్యాయి. అప్గ్రేడ్ అయినప్పటికీ భువన్ యాప్ అమలులోకి రాకపోవడంతో కేవలం ఇళ్లు ఉన్నట్లుగా అధికారులు లెక్క గట్టి గ్రామపంచాయతీ ఉన్నప్పటి ఆస్తి పన్నుతోనే సరిపెడుతున్నారు. కేటగిరీల వారీగా వాణిజ్య–వ్యాపార సముదాయాలు, మిక్స్డ్, ప్రభుత్వ భవనాలు ఎన్ని ఉ న్నాయన్నది ఇంకా తేల్చలేకపోయారు. దీంతో ఆస్తిపన్నుకు సంబంధించి భారీగా గండిపడింది. దేవరకద్రలో మొత్తం 3,431 మంది అసెస్మెంట్ దారులకు గాను ఈ ఏడాది (2025– 26) రూ.29,17,000, అలాగే పాత బకాయిల కింద రూ.20,53,000 కలుపుకొని రూ. 49,70,000 రావాల్సి ఉంది. ఇందులో ఇప్పటివరకు ఈ ఏడాదికి సంబంధించి రూ. 16,63,000, అలాగే పాత బకాయిల కింద రూ.10,73,000 ఇలా 1,641 మంది నుంచి మొత్తం రూ.27,36,000 (55.04 శాతం) వసూలు చేశారు. ఇంకా 1,790 మంది నుంచి ఈ ఏడాదికి సంబంధించి రూ.11,91,000, అలాగే పాత బకాయిల కింద రూ.9,80,000 ఇలా మొత్తం రూ.21,71,000 రావాల్సి ఉంది. ఆస్తిపన్ను వసూలుకు ప్రత్యేక బృందాలు నగరంలో ఆస్తిపన్ను బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోయింది వాస్తవమే. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా మూడు నెలల గడువు ఉంది. ఆస్తిపన్ను వసూలు వేగవంతం చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశాం. ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటింటికీ తిరిగి వీలైనంత ఎక్కువ మంది నుంచి వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేశాం. ముఖ్యంగా పాత బకాయిదారులకు నోటీసులు అందజేసి రాబట్టాలని సూచించాం. – టి.ప్రవీణ్కుమార్రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, మహబూబ్నగర్ ● -
భారత్మాల భూసర్వేకు సహకరించాలి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: భారత్మాల భూసర్వేకు రైతులందరూ సహకరించాలని కలెక్టర్ విజయేందిర సూచించారు. జాతీయ రహదారి భూసేకరణపై బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలోని అన్నాసాగర్, తాటికొండ, హస్నాపూర్కు చెందిన బాధిత రైతులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రా యాలను తెలుసుకున్నారు. కాగా, జాతీయ రహదా రి కోసం భూములు కోల్పోతే తమ జీవనోపాధి దెబ్బతింటుందని, దీని అలైన్మెంట్ మార్చాలని కోరారు. స్పందించిన ఆమె మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టినందున ఎన్హెచ్ఏఐ అధికారులకు నివేదిస్తామన్నారు. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నడుచుకుంటామన్నారు. ము ఖ్యంగా భూసేకరణ కు సంబంధించి ని బంధనలననుసరించి తగిన పరిహారం ఇస్తామన్నారు. ఈ ప్రక్రియలో పారదర్శకత పాటిస్తూ బాధిత రైతుల సమస్యలను చట్టబద్ధంగా పరిష్కరిస్తామన్నారు. అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్, ఆర్డీఓ నవీన్ పాల్గొన్నారు. సకాలంలో బోనస్ జమ చేయాలి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా ట్యాబ్ ఎంట్రీలను తక్షణమే వేగవంతం చేయాలని కలెక్టర్ విజయేందిర ఆదేశించారు. వరి కొనుగోళ్లపై కలెక్టర్ వీసీ నిర్వహించారు. గోదాముల్లో తగినంత స్థలం అందుబాటులో ఉన్నందున, పెండింగ్లో ఉన్న సీఎంఆర్ను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. మంగళవారం వరకు మొత్తం 1,21,577 మెట్రిక్ టన్నుల వరిని 23,451 మంది రైతుల నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపారు. దీని విలువ రూ.290కోట్లు కాగా, 20,288మంది రైతులకు రూ.251 కోట్లు ఎంఎస్పీగా చెల్లించినట్లు చెప్పారు. కొనుగోళ్లు, ఆన్లైన్ ఎంట్రీల మధ్య ఉన్న గ్యాప్ను మూడు రోజుల్లో తగ్గించాలని సూచించారు. కొనుగోలు చివరి దశలో ఉన్నందున, ఎలాంటి ప్రతికూల ఫిర్యాదులు రాకుండా అధికారులు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. -
మద్యం బాటిల్లో బల్లి తోక..
మహబూబాబాద్ జిల్లా: మందుబాబులు తాగుతున్న మద్యం బాటిల్లో బల్లితోక కనిపించడంతో ఒక్కసారిగా వాంతులు చేసుకున్నారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ఓ బెల్ట్ షాపులో బుధవారం చోటుచేసుకుంది. బాధిత మందుబాబుల కథనం ప్రకారం.. మండలంలోని వీరారం గ్రామానికి చెందిన కొందరు మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ చౌరస్తా సమీపంలోని ఓ బెల్ట్ షాపులో బ్లెండర్ స్పైడ్ ఫుల్ బాటిల్ కొనుగోలు చేసి సేవిస్తున్నారు. ఈ క్రమంలో సగానికిపైగా అయిపోయిన మద్యం బాటిల్లో ఓ వింత ఆకారం కనిపించగా బయటికి తీశారు. అది తోకగా గుర్తించారు. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ మందుబాబులు వాంతులు చేసుకున్నారు. గొంతులో మంటగా ఉందని కేకలు పెట్టారు. అక్కడున్న కొందరు సదరు బెల్ట్ షాపు నిర్వాహకుడిని నిలదీయగా సమాధానం చెప్పకుండా అక్కడినుంచి జారుకున్నాడు. ఇది కల్తీ మద్యంగా భావించిన బాధితులు సంబంధిత ఎక్సైజ్ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లగా, వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. -
మళ్లీ.. అధికారం మాదే: సీఎం రేవంత్
వచ్చే ఏడాది మార్చిలో రూ.3 వేల కోట్లు పంచాయతీలకు ఇస్తాం. నూతన సంవత్సరం కానుకగా కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు ప్రత్యేక అభివృద్ధి నిధి ఇస్తాం. చిన్న గ్రామ పంచాయతీలకు రూ.5 లక్షలు,పెద్ద గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున ఇస్తాం. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు అదనం. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు సంబంధం లేకుండా సీఎం నుంచి నేరుగా సర్పంచ్లకు ఈ నిధులు పంపించే బాధ్యత తీసుకుంటాం. గ్రామ పంచాయతీల్లో దీర్ఘకాలికంగా వాయిదా పడుతున్న సమస్యను పరిష్కరించుకోవడానికి ఈ నిధులు వాడుకోండి. దుర్వినియోగం చేయొద్దు.విద్యతోనే రాష్ట్ర, దేశాభివృద్ధి సాధ్యం. కొడంగల్ నియోజకవర్గంలో సర్కారు బడుల్లో చదువుకుంటున్న 25 వేల మంది పిల్లలకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం. వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని సర్కారు బడుల్లో అల్పాహారం, భోజనం అందుబాటులోకి తెస్తాం. మంచి భోజనంతోపాటు నాణ్యమైన విద్యనూ అందిస్తాం. కావాల్సిన వసతులు కల్పిస్తాం. మీ పిల్లలను సర్కారు బడులకు తీసుకురండి.సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజార్టీతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. 119 నియోజకవర్గాలు ఉంటే 80 సీట్లతో, డీలిమిటేషన్తో 153 ఉంటే 100 సీట్లకు పైగా గెలిచి అధికారంలోకి వస్తాం’అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘నీ రాజకీయమేందో నేను చూస్తా. నేను రాజకీయం చేసినంత కాలం కల్వకుంట్ల కాలకూట విషం లాంటి కేసీఆర్ కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వ. కొడంగల్ బిడ్డగా ఈ గడ్డ మీద నుంచి శపథం చేస్తున్నా. నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం కేసీఆర్ కుటుంబానికి అధికారం అనేది ఓ కల. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ చరిత్ర గతమే. మీ పార్టీకి, మీకు భవిష్యత్ లేదు. రాష్ట్రానికి నీ తరఫున ఒరిగేదేమీ లేదు. తెలంగాణ భవిష్యత్ కాంగ్రెస్సే’అని రేవంత్ అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా కోస్గిలోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం కొడంగల్ నియోజక వర్గంలోని పంచాయతీ పాలకవర్గాల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. నూతన సర్పంచ్లకు శాలువాలు కప్పి సన్మానించిన తర్వాత సీఎం మాట్లాడారు. ఆయన మాటల్లోనే... మీరు రండి.. ముఖాముఖి చర్చిద్దాం.. ‘కేసీఆర్.. నీ వయసు, అనుభవానికి గౌరవిస్తాం. ప్రతిపక్ష నాయకుడిగా మీకు హోదా ఉంది. శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేశాం. 29 నుంచి చర్చలు జరగనున్నాయి. ఆ రోజు మీరు అడిగినన్ని రోజులు అసెంబ్లీ నడిపిస్తాం. మీరు చెప్పినవన్నీ చర్చకు పెడతాం. ముఖాముఖి చర్చిద్దాం. వెనుక మాట్లాడి.. వెనుక ఉరుకుడు కాదు. అభివృద్ధి, రైతు భరోసా, రుణమాఫీ, ఆడబిడ్డలకు ఇచ్చిన ఉచిత బస్సు మీద మాట్లాడుదామా చెప్పండి. లేకపోతే మీరు ఏం కోరుకుంటారో చెప్పండి. అప్పులా, నీళ్లా, మీరు కట్టి కూలిన కాళేశ్వరమా, టెలిఫోన్ ట్యాపింగా, ఇంకా అభివృద్ధి మీదనా. షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లపైనా.. దేనిపైనైనా నేను సిద్ధం. మీరు మొహం చాటేసి.. ఖాళీగా ఉన్నప్పుడు పార్టీ ఆఫీస్కు వచ్చి.. పది మంది చెంచాలను పెట్టుకుని వారి ముందు పొంకనాలు కొట్టుడు కాదు. రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్నగర్ అంటూ సభ పెడతాడట. మీరు ఎక్కడైనా పెట్టుకోండి. నేను వద్దన్నానా. ఎన్నికలు ముగిసినయ్.. ఇంకా సందులకు రమ్మంటే ఎలా? చర్చ చేయడానికి సభ ఉంది. ప్రజలు అసెంబ్లీలో చర్చ చేయమని చెబుతుండ్రు. ఎవరేం మాట్లాడుతారో వారు వింటరు. ఆ తర్వాత విజు్ఞలైన ప్రజలే తీర్మానం చేస్తరు. ఇంత ఓడగొట్టినా సిగ్గు లేదా.. కేసీఆర్ తన ఫామ్హౌస్నే బందీఖానా చేసుకున్నడు. ఆయన్ను అరెస్ట్ చేసి చర్లపల్లి, చంచల్గూడకు పంపించినా ఇదే అయితది. ప్రభుత్వానికి తిండి బరువు. ఆయన మీద ఒక్క కేసూ పెట్టలేదు. కేసీఆర్ నా మీద 181 కేసులు పెట్టి చర్లపల్లి, చంచల్గూడ జైల్లో బంధించాడు. నన్ను ఎన్నో రకాలుగా సతాయించాడు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు పేదలను ఆస్తులను గుంజుకుండ్రు. కేసులు పెట్టి హింసించిండ్రు. నాకు ఈ బాధ్యత వచ్చాక ఆలోచన చేశా. బాధను దృష్టిలో పెట్టుకుని పగ సాధించే కార్యక్రమం పెట్టుకుంటే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని భావించా. పైన దేవుడు చూస్తున్నడు. వాళ్ల పాపాలన్నీ దేవుడు మిత్తితో తీరుస్తుండు. నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఆయన నడుం ఇరిగింది. అసెంబ్లీలో ఓడగొట్టినం. పార్లమెంట్ ఎన్నికల్లో గుండుసున్నా చేసినం. ఇటీవల జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బోరబండలో బండ కింద పాతిపెట్టినం. సర్పంచ్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 12,726 స్థానాల్లో 8,335 మందిని గెలిపించుకున్నాం. ఇంత ఓడగొట్టినా సిగ్గు లేదా? నన్ను గెలక్కు.. అన్నీ చూశా.. నా తోలు తీస్తానని అంటావా.. షేక్పేటలో మటన్ కొట్టు మస్తాన్ ఉంటడు. ఆయన రోజూ మేకలు కోసి మండి నడుపుతుంటడు. కేసీఆర్ ఖాళీగా ఉన్నడు. తోలు తీస్తడు.. ఆయనకు నౌకరీ ఇవ్వమని చెప్పిన. నౌకరీ అయ్యాక ఇంటికి పోయేటప్పుడు దావత్కు ఉచితంగా ఇంత బోటి, కాళ్లు, తలకాయ పెట్టు పాపం.. సాయంత్రం రెండేసేటప్పుడు తీసుకుంటడని. మాజీ సీఎంగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, సీఎంగా పనిచేశానని చెప్పుకునే నువ్వు ఇలాంటి మాటలా మాట్లాడేది. మేము ఫ్యూచర్ సిటీ కడుతుంటే తొక్క, తోలు అంటవా. మా సర్పంచులు వచ్చారు. నువ్వు తోలు తీసుడు కాదు. నిన్ను చీల్చి చింతకు కట్టి చింతమడకలో వేలాడదీసి కొడ్తరు. కొడంగల్ వస్తవా.. మమ్మల్నే చింతమడకకు రమ్మంటవా. ఒక్కటైనా అక్కరకొచ్చే మాట మాట్లాడావా? నన్ను గెలక్కు. నేను అన్నీ చూసిన. నల్లమల అడవుల నుంచి వచ్చిన. కక్ష సాధింపు రాజకీయాలు చేయం.. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందని కేసీఆర్ కొడుకు కేటీఆర్ విమర్శిస్తడు. తండ్రి ఏమో ప్రభుత్వం రియల్ దందా చేస్తోందంటడు. రియల్ ఎస్టేట్ బిజినెస్ వల్ల అభివృద్ధి జరుగుతుంది. వ్యాపారం, ఆదాయం పెంచుతుంది. నేను అయ్య పేరు చెప్పి మంత్రిని కాలే. పాస్పోర్టు బ్రోకర్ల దందా చేయలే. ఆంధ్రలోని గుంటూరు, గుడివాడలో చదువుకున్న నీకేం తెలుసు తెలంగాణ గురించి. మీ జాతినంతా తెచ్చుకో.. మా ఊరికొస్తవా? లేదా మేమే మీ ఊరికి రావాలా? గతంలో గజ్వేల్ వచ్చి చూడు అన్నావ్. లక్షల మంది కార్యకర్తలతోపోయి తొక్కితే పాతాళానికి పోయినవ్. మేం కక్ష సాధింపు రాజకీయాలు చేయం. ఎవరి సొమ్ము గురించి ఆలోచన చేయం. మా కాళ్లలో కట్టెలు పెడితే మాత్రం ఊకోం. మా సంగతి చూపిస్తాం. ఇప్పటికైనా మారండి.. సొంత బిడ్డ అని చూడకుండా ఇంటి అల్లుడి ఫోన్లనే ట్యాపింగ్ చేసిండ్రు. ఇంతకన్న సిగ్గులేనోడు ఉంటడా అని వాళ్ల బిడ్డ వాళ్లే అంటుండ్రు. సొంత చెల్లికే బుక్కెడు బువ్వ పెట్టనోడు ఒక మనిషా. తండ్రి సంపాదించిన ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తదని మెడబెట్టి బయటకు పంపితివి. సొంత చెల్లెలికి సమాధానం చెప్పలేనోడు నాకు సవాల్ విసురుతుండు. నా సంగతి నీకు తెల్వదు. మీ నాయనను అడుగు.. నా గురించి చెబుతడు. ఇంకో ఆయన కేసీఆర్ గర్జించాడని మాట్లాడుతుండ్రు. గాండ్రింపులు, ఉడత ఊపులకు ఎవరూ భయపడరు. మీ తోలు సంగతి ముందు తెలుసుకోండి. మేం నాటు కోడి తోలు తీసి, పసుపు పూసినట్లు పూస్తాం. అన్ని ఎన్నికల్లో డిపాజిట్లు పోతున్నయ్. ఇప్పటికైనా మారండి. లేకపోతే దేనికీ పనికి రాకుండా పోతరు. తెలంగాణలో ప్రతిపక్షం లేదంటే సిగ్గుపోతది. -
ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
● ఉమ్మడి పాలమూరు డీటీసీ కిషన్ ఆదాయానికి మించి ఆస్తులున్నాయని కేసు నమోదు ● మూడుగంటల పాటు కొనసాగిన తనిఖీలు ● ప్రైవేట్ వ్యక్తులతో పాటు సిబ్బందితో లావాదేవీలు జరిగినట్లు గుర్తింపు ● లభించని ఆధారాలు మహబూబ్నగర్ క్రైం: హైదరాబాద్ సిటి రేంజ్–1 ఏసీబీ డీఎస్పీ కె.శ్రీనివాస్రెడ్డి, సీఐ వెంకటేశ్ ఆధ్వర్యంలో 8 మంది బృందం మంగళవారం ఉదయం 11.30 ప్రాంతంలో ఆర్టీఏ కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. ఉమ్మడి పాలమూరు జిల్లా రవాణాశాఖ డీటీసీగా పని చేస్తున్న కిషన్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడంటూ కేసు నమోదులో భాగంగా నేరుగా చాంబర్కు చేరుకున్న బృందం బయటి వ్యక్తులు లోనికి రాకుండా, అక్కడి సిబ్బంది ఎవరితో మాట్లాడకుండా ఆదేశాలిచ్చారు. సుమారు మూడు గంటల పాటు అన్నిరకాల రిజిస్ట్రేషన్ దస్త్రాలు, ఇతర డాక్యుమెంట్స్, వ్యక్తిగత కంప్యూటర్ తనిఖీ చేశారు. అలాగే కార్యాలయంలో పనిచేసే అధికారుల నుంచి సమాచారం సేకరించారు. అయితే ఇక్కడ విధులు నిర్వర్తించే ఇద్దరు, ముగ్గురు ప్రైవేట్ వ్యక్తులతో సంబంధాలు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా సోదాల్లో విలువైన డాక్యుమెంట్స్, ఇతర ఆధారాలు ఏవీ లభించలేదు. మధ్యాహ్నం 2.30 ప్రాంతంలో బృందం కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. కార్యాలయంలో పని చేసే సిబ్బందితో పాటు ప్రైవేట్ వ్యక్తుల నుంచి లెక్కల్లో లేని కొంత నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్స్ ఒరిజినల్ కార్డులు ప్రైవేట్ వ్యక్తుల ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. గతేడాది డిసెంబర్లో డీటీసీ కిషన్ విధుల్లో చేరారు. గతంలో పని చేసిన ప్రాంతాలతో పాటు హైదరాబాద్లోని బోయిన్పల్లిలో ఉన్న ఇంట్లో కూడా సోదాలు జరిగినట్లు సమాచారం. ● ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు డీటీసీ కిషన్పై కేసు నమోదు చేసినట్లు హైదరాబాద్ ఏసీబీ డీఎస్పీ కె.శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. సోదాల అనంతరం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తనిఖీల్లో భాగంగా కిషన్ ఇంటితో పాటు బంధువుల ఇళ్లు, కార్యాలయంలో సోదాలు చేశామన్నారు. తనిఖీల నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని తెలిపారు. మహబూబ్నగర్ ఆర్టీఏ కార్యాలయంలో ఈ ఏడాది మూడుసార్లు ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆకస్మిక తనిఖీల్లో భాగంగా జూన్ నెలలో ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం తనిఖీలు చేసి ఇద్దరు ఏజెంట్లపై చర్యలు తీసుకోవడంతో పాటు ప్రత్యేక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందించింది. అక్టోబర్ 19న కృష్ణా చెక్పోస్టులో మహబూబ్నగర్ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ ఆధ్వర్యంలో తనిఖీలు చేసి అనధికారిక నగదు రూ.30,450 సీజ్ చేశారు. ఓవైపు ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్న క్రమంలోనే లారీడ్రైవర్లు టేబుల్పై డబ్బులు పెట్టిన ఘటన అప్పట్లో కలకలం రేపింది. తర్వాత చెక్పోస్ట్ రద్దు చేశారు. తాజాగా మంగళవారం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ బృందం ఆర్టీఏ కార్యాలయంలో అడుగుపెట్టింది. -
శాంతి యాక్టు, విద్యుత్ సవరణ బిల్లుకు నిరసనగా ధర్నా
దోమలపెంట: కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న శాంతి యాక్టు, విద్యుత్ సవరణ చట్టాలను వ్యతిరేకిస్తూ ఎన్సీసీఓయి ఐకాస పిలుపుమేరకు మంగళవారం ఈగలపెంటలోని భూగర్భ జలవిద్యుత్ కేంద్రం సీఈ పరిపాలన భవనం వద్ద విద్యుత్ ఇంజినీర్లు, ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. ప్రధానంగా పార్లమెంట్లో పూర్తిస్థాయి చర్చ జరపకుండా శాంతి యాక్టును ఆమోదించడం ప్రజాస్వామ్యానికి వ్యతిరకే నిర్ణయంగా తెలిపారు. దీని ఫలితంగా ప్రభుత్వం ఆధీనంలో కాకుండా ప్రైవేట్ వ్యక్తులను ప్రోత్సహిస్తూ పూర్తిస్థాయిలో అణు విద్యుత్ ఉత్పాదనను ప్రైవేటీకరించడంగా చెప్పారు. ప్రస్తుతం కేంద్రం శీతాకాల సమావేశంలో విద్యుత్ సవరణ చట్టం 2025 బిల్లును పార్లమెంటలో పెట్టనున్నారు. అణువిద్యుత్ అనేది పెద్ద అంశం. దీనిని ప్రభుత్వ ఆధీనంలో కాకుండా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే దేశ వ్యవస్థ అంతా అస్తవ్యస్తం అవుతుందన్నారు. విద్యుత్ అంశాన్ని ఒక సహజ వనరుగా కాకుండా వ్యాపారంగా కేంద్రం చేయబోతుందన్నారు. ఒక మనిషికి తిండి, కూడు, గూడు, నీడ ఏవిధంగా అవసరమో ప్రస్తుత సమాజంలో సహజ విద్యుత్ కూడా సహజ వనరు అయ్యిందన్నారు. ఈ సవరణ చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం వ్యాపారం చేయాలని ప్రయత్నిస్తుందన్నారు. పార్లమెంట్లో ఆమోదం పొందిన శాంతి యాక్టు బిల్లుకు, ప్రస్తుతం ప్రవేశపెట్టనున్న విద్యుత్ సవరణ బిల్లు ప్రజావ్యతిరేక చట్టాలని నిరసిస్తూ మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఎన్సీసీఓఈ ఐకాస పిలుపు మేరకు నిరసన వ్యక్తం చేయడం జరిగిందని జేఏసీ నాయకులు వంశీకృష్ణ, నరేశ్కుమార్, సందీప్, యాదయ్య, వెంకటరెడ్డి తెలిపారు. -
పాలమూరుకు అన్యాయం చేసిన కేసీఆర్
పాలమూరు: కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉండి ఆర్డీఎస్ ఎందుకు పూర్తి చేయలేదని, పెండింగ్లో మిగిలిన ప్రాజెక్టులను పట్టించుకోకుండా గాలికి వదిలేశారని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ ధ్వజమెత్తారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాతే జూరాల నుంచి కాకుండా శ్రీశైలం బ్యాక్వాటర్ తీసుకునే విధంగా డీపీఆర్ మార్పులు చేసి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు శంకుస్థాపన చేశారన్నారు. కాళేశ్వరానికి రూ.లక్షల కోట్లు ఖర్చు చేసిన అప్పటి సర్కార్ పాలమూరు–రంగారెడ్డిపై ఎందుకు ఖర్చు చేయలేదన్నారు. జిల్లా కేంద్రంలోని పద్మావతికాలనీలో ఎంపీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలో రోడ్లు వేసుకుని పాలమూరులో ఎందుకు వేయలేదని, ప్రాజెక్టులతోపాటు వైద్యం, విద్య ప్రతిదాంట్లో ద్రోహం చేశారన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి రెండు పార్టీలు కుట్ర చేస్తున్నట్లు తెలిపారు. డిండికి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకెళ్లడంపై తీవ్రంగా వ్యతిరేకించడం జరిగిందని, ఇప్పుడు అదే మాటకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు సరిపోవని ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ కొత్త అప్పులు చేస్తోందన్నారు. కేంద్రం నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం ఉంటే మరింత పనులు జరుగుతాయన్నారు. ఉపాధి హామీ పథకంలో మార్పులు తెస్తూ జీ రామ్ జీ బిల్లు కేంద్రం చట్ట సవరణ చేసిందన్నారు. దేశంలో 60ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ సమయంలో జరగని ఓటు చోరి.. మూడేళ్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ హయాంలో జరిగిందని చెప్పడం సరికాదన్నారు. కొత్తగా గెలుపొందిన సర్పంచులు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గ్రామాభివృద్ధి కోసం పనిచేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, నేతలు పద్మజారెడ్డి, రమేశ్, కృష్ణవర్ధన్రెడ్డి, పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ● మూసాపేట మండలం దాసర్పల్లి ఉపసర్పంచ్ బోయ నర్సింహులుతోపాటు వార్డు సభ్యులు, హన్వాడ మండలం గొండ్యాల్ ఉపసర్పంచ్ రంగన్నతోపాటు వార్డు సభ్యులు ఎంపీ డీకే అరుణ సమక్షంలో బీజేపీలో చేరారు. అనంతరం జాతీయ రహదారి అధికారులతో బండమీదిపల్లి దగ్గర ఉన్న రోడ్డు సమస్యపై చర్చించారు. ● నగరంలోని కాళికాదేవి కల్యాణ మండపంలో మంగళవారం సర్పంచుల ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ డీకే అరుణ పాల్గొన్ని మాట్లాడారు. -
నైపుణ్యాభివృద్ధితోనే విద్యార్థులకు భవిష్యత్
కొత్తకోట రూరల్: విద్యార్థులు తమ తమ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి సాధిస్తేనే వారికి భవిష్యత్ ఉంటుందని మోజర్ల ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వీణజోషి అన్నారు. శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం 11వ వార్షిక దినోత్సవాన్ని పురస్కరించుకొని కొండా లక్ష్మణ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాశాల అసోసియేట్ డీన్ మాట్లాడుతూ రోజురోజుకూ జనాభా పెరిగి సహజ వనరులు తగ్గుతున్నాయన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని నేల, నీరు కాలుష్యం కాకుండా పంటల సాగులో నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేయాలన్నారు. ఉద్యోగాల కల్పన పూర్తిగా విద్యార్థులు నైపుణ్యం మీదనే ఆధారపడి ఉంటుందన్నారు. వర్టికల్ ఫార్మింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీ, మైక్రో ఇరిగేషన్ వంటి ఆధునిక అంశాల్లో మానవనరుల అవసరాలు చాలా ఎక్కువ అని గుర్తు చేశారు. ఖర్చులు తగ్గేలా.. పెట్టుబడి ఖర్చులు తగ్గించే టెక్నాలజీ, నూతన వంగడాలు రైతుకి ఎంతో మేలు చేస్తాయని, ఆ దిశగా శాస్త్రవేత్తలు పని చేయాలన్నారు. ఆయిల్పాం సాగుతో సంవత్సరం అంతా ఉపాధితో పాటు రైతుల ఆదాయ వనరులు పెరుగుతాయని, అలాగే సూక్ష్మసేద్యానికి రైతులు అలవాటు పడితే నీటి వినియోగ సామర్థ్యం కూడా పెరుగుతుందని ఉద్యాన అధికారి రావుల విద్యాసాగర్ అన్నారు. అనంతరం విశ్వవిద్యాలయం సాధించిన విజయాలపై ఏర్పాటు చేసిన వీడియోను ప్రదర్శించారు. వివిధ మోడళ్లపై బీఎస్సీ హార్టికల్చర్ విద్యార్థుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఓఎస్ఏ డాక్టర్ శంకరస్వామి, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కళాధర్ బాబు, డాక్టర్ షహనాజ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మాధవి, శ్వేత విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
ఆరు వికెట్ల తేడాతో నారాయణపేట విజయం
లీగ్ మ్యాచ్లో నా రాయణపేట జట్టు ఆరు వికెట్ల తేడాతో జోగులాంబ గద్వా ల జట్టు పై విజ యం సాధించింది. మొదట బ్యా టింగ్ చేసిన గద్వాల జ ట్టు 17.3 ఓవర్లలో 94 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో సుజాల్రెడ్డి 32 పరుగులు చేశారు. నారాయణపేట బౌలర్లు మహ్మద్ అఫ్పాన్ 4, భానుప్రసాద్ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన నారాయణపేట జట్టు 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. అభిలాశ్గౌడ్ 34, అక్షయ్ 34 పరుగులు చేశారు. గద్వాల బౌలర్ అరవింద్ 2వికెట్లు తీశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా మహ్మద్ అఫ్పాన్ (నారాయణపేట) నిలిచాడు. మ్యాన్ ఆప్ది మ్యాచ్గా నిలిచిన క్రీడాకారులకు ఎండీసీఏ ప్రతినిధులు రూ.2వేల నగదుతోపాటు మెమోంటో అందజేశారు. -
పీడీఎస్ బియ్యం పట్టివేత
మద్దూరు: మండల పరిధిలోని దమగ్నాపూర్ గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. గ్రామా నికి చెందిన శశిధర్ పీడీఎస్ బియ్యాన్ని అక్ర మంగా కొనుగోలు చేసి నిల్వ ఉంచారన్నా స మాచారం మేరకు మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఆనంద్ దాడి చేసి 29 క్వింటా ళ్లు సీజ్ చేసి నాగిరెడ్డిపల్లిలోని డీలర్షాపుకు తరలించినట్లు తెలిపారు. అనంతరం శశిధర్పై కేసు నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. చోరీ కేసును ఛేదించిన పోలీసులు దామరగిద్ద: మండలంలోని మొగుల్మడ్క గ్రా మంలో ఐదు రోజుల క్రితం జరిగిన చోరీ కేసు ను పోలీసలు ఛేదించారు. బాధితుడు కొనాపురం వెంకటేశ్ ఇచ్చిప ఫిర్యాదు మేరకు దర్యా ప్తు చేపట్టిన పోలీసులు వేలిముద్రల ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. నిందితు లు కర్ణాటకలోని తిలార్కొట్ గ్రామానికి చెందిన కూరుకు నవీన్, బైరంకొండ శ్రీను, అలి యాస్ శ్రీనివాస్గా గుర్తించి వారిని పట్టుకొని మంగళవారం పోలీస్ స్టేషన్లో హాజరు పరిచారు. అలాగే చోరీకి గురైన 5 గ్రామాల బరువు గల రెండు బంగారు ఉంగరాలు, ఆరు మాసాల బ రువు గల చెవి కమ్మలు, 16 వెండి ఉంగరాలు, ఒక వెండి బ్రాస్లెట్, రూ.30 వేల నగదు ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ రాజు తెలిపారు. రోడ్డు పనులు అడ్డగించిన గ్రామస్తులు మాగనూర్: భారీ వాహనాలతో ఇసుక తరలించడం వలన రోడ్డు ధ్వంసమవుతుందంటూ చిట్యాల గ్రామస్తులు మంగళవారం రోడ్డు పనులను అడ్డుకున్నారు. మండల పరిధిలోని మందిపల్లి పెద్దవాగు నుంచి మక్తల్కు చెందిన ఓ వ్యక్తి టీజీఎండీసీ ద్వారా ఇసుక తరలించేందుకు అనుమతులు పొందారు. అయితే ఇసుక రవాణా కోసం కావాల్సిన రోడ్డు పనులను చేస్తుండగా మక్తల్ మండలం చిట్యాల గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇసుక రవాణాను మాగనూర్ మండలం మీదుగా తరలించాలని డిమాండ్ చేశారు. ఇసుక లోడుతో భారీ వాహనాలు వెళ్లడం వలన రోడ్డు మొత్తం గుంతలుగా మారి అధ్వానంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇసుకను తరలింపు మాగనూర్ మండలం మీదుగా చేయకపోతే ఆందోళనకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇద్దరికి జైలు శిక్ష అమరచింత: ఎనిమిదేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తుల మృతికి కారణమైన బోయ రాజు, మండ్ల పుట్టయ్యకు 18 నెలల జైళ్లు శిక్ష, రూ.1,000 జరిమానా విధించినట్లు వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. 2017 సంవత్సరంలో అమరచింత మండలం ధర్మాపురం సమీపంలో నిందుతులు ఇద్దరు టిప్పర్, ట్రాక్టర్ను అజాగ్రత్తగా నడుపుతూ ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి ఇద్దరి మృతికి కారకులయ్యారన్నారు. ఆ సమయంలో అమరచింత పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మంగళవారం ఆత్మకూర్ సివిల్ కోర్టులో జడ్జి శిరీష విచారణ చేపట్టి నిందితులకు శిక్ష ఖరారు చేసినట్లు పేర్కొన్నారు. వెండి ఆభరణాలు చోరీ నాగర్కర్నూల్ క్రైం: 40 తులాల వెండి ఆభరణాలు చోరీ అయిన ఘటన మున్సిపాలిటీ పరిధిలోని దేశిటిక్యాలలో చోటుచేసుకోగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ గోవర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన నాగమ్మ గొర్రెలను మేపేందుకు వెళ్లింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆమె ఇంటికి వేసిన తాళా న్ని విరగ్గొట్టి బీరువాలో ఉన్న 40 తులాల వెండి కడియాలే ఎత్తుకెళ్లారు. ఈ నెల 21న ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళం విరగ్గొట్టి ఉండటంతో పాటు వస్తువులు చిందరవందరగా పడి ఉండగా గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశా రు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చెరువులో వ్యక్తి మృతదేహం లభ్యం చిన్నంబావి: మండల పరిధిలోని బెక్కం గ్రామ పెద్ద చెరువులో వ్యక్తి మృతదేహం మంగళవా రం లభ్యమైంది. ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాలు.. పెంట్లవెళ్లి మండలం జటప్రోల్కు చెందిన నరసింహ్మ(70) ఈ నెల 15న కుమార్తె చిట్టెమ్మ ఇంటికి వెళ్లి వస్తానని మండలంలోని వెలగొండకు వచ్చాడు. తిరిగి జటప్రోల్కు వెళ్తా నని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. ఎంతకూ ఆ చూకీ తెలియకపోవడంతో సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో కుమార్తె ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో గ్రామంలోని చెరువులో వ్యక్తి మృతదేహం తేలుతుందన్న స్థానికుల సమాచారం మేరకు దర్యాప్తు చేపట్టి మృతి చెందింది నరసింహ్మగా గుర్తించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
రూ.1.50కోట్ల విలువైన మత్తుపదార్థాల దహనం
మహబూబ్నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలో ఎకై ్సజ్ శాఖ గతేడాదిలో సీజ్ చేసిన మత్తు పదార్థాల ను డ్రగ్ డిస్పోజల్ కమిటీ సూచన మేరకు మంగళవారం డీసీ విజయ్ భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో షాద్నగర్లోని ఓ కంపెనీలోని బాయిలర్ మిషన్లో వేసి కాల్చివేశారు. ఉమ్మడి జిల్లాలో ని అన్ని ఎకై ్సజ్ పోలీస్స్టేషన్లలో పట్టుబడిన రూ.1.50కోట్ల విలువ చేసే నార్కోటిక్ మత్తు పదార్థాలైన 3.5కేజీల ఎండు గంజాయి, 13.5 కేజీల అల్పాజోలం, 5.8కేజీల డైజోఫాంను దహనం చేశారు. కార్యక్రమంలో మహబూబ్నగర్ ఈఎస్ సుధాకర్, అసిస్టెంట్ ఎకై ్సజ్ అధి కారి నర్సింహారెడ్డి, సీఐ వీరారెడ్డి పాల్గొన్నారు. కట్ట నిర్మాణానికి మట్టి నమూనాల సేకరణ బల్మూర్: మండల కేంద్రం సమీపంలోని ఉమామహేశ్వర రిజర్వాయర్ కట్ట నిర్మాణం కోసం మంగళవారం తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్ రీసెర్చ్ లేబోరేటరి(టీఎస్ఈఆర్ఎల్) సంస్థ ఈఈ లక్ష్మయ్య ఆధ్వర్యంలో మట్టి నమూనాల సేకరణ చేశారు. ఈ సందర్భంగా రిజర్వాయర్ (బండు) కట్ట నిర్మించే బల్మూర్ ఊరచెరువు, మైలారం గుట్ట తదితర చోట్ల రెండు మీటర్ల లోతులో మట్టిని తవ్వి నమూనాలు సేకరించినట్లు ఈఈ తెలిపారు. పరీక్షల అనంతరం ఫలితాలు ఇరిగేషన్ శాఖకు అందజేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఈలు సుధామాధురి, మాధవి, జేఈలు శ్రీనివాస్నాయక్, ప్రవీణ్, ఇరిగేషన్ డీఈ బాలస్వామి, ఏఈలు రమేష్, ప్రవీణ్కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. భారీగా పోలీసు బందోబస్తు.. మట్టి నమూనాల సేకరణకు అధికారులు రావడంతో భూ నిర్వాసితులు అడ్డు కొనే అవకాశం ఉందనే సమాచారం మేరకు ముందు జాగ్రత్తగా అచ్చంపేట సీ ఐ నాగరాజు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పొలాలకు వెళ్లే రైతులనుఽ అధికారుల వద్దకు వెళ్లకుండా నిఘా ఉంచారు. -
ఉత్పత్తులపై సమగ్ర సమాచారం ఉండాలి
● తూనికల, కొలతల అధికారుల ముమ్మర దాడులు ● నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై చర్యలు ● పట్టణంలో 50 కేసులు నమోదు జడ్చర్ల: పట్టణంలో మంగళవారం తూనికలు, కొలతల శాఖ అధికారులు ముమ్మర దాడులు నిర్వహించారు. ఆరు బృందాలుగా విడిపోయి ఎలక్రికల్, ఎలక్ట్రానిక్, జనరల్స్ స్టోర్స్ తదితర దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. నిబంధనల మేరకు పలు ఉత్పత్తులపై నమోదు చేయాల్సిన సమాచారం లేకపోవడాన్ని తప్పుబట్టారు. వినియోగదారులకు కొనుగోలు చేసే ఉత్పత్తులపై సమగ్ర సమాచారం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. నిబంధనలకు విరుద్ధగా చేపట్టే క్రయవిక్రయాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఉమ్మడి పాలమూరు, నల్లగొండ జిల్లాల తూనికలు, కొలతల శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ సిద్దార్థ్కుమార్ తెలిపారు. పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న దుకాణాలకు సంబంధించి 50 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. దాడుల్లో వనపర్తి జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారి రవీందర్, నాగర్కర్నూల్ జిల్లా అధికారి నాగేశ్వర్రావు, నల్లగొండ జిల్లా అధికారి శ్రీనివాసులు, భువనగిరి జిల్లా అధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కలకలం రేపిన దాడులు: పట్టణంలో తూనికలు, కొలతల శాఖ ఆధ్వర్యంలో జరిగిన దాడులు చర్చనీయాంశంగా మారింది. గతంలో అడప దడపా కిరాణ దుకాణాలపై మొక్కుబడిగా తనిఖీలు చేసి వెళ్లిన సందర్భాలు ఉన్నాయని, ఇంత పెద్దఎత్తున అన్ని రకాల దుకాణాలపై దాడులు చేయడం ఇదే ప్రథమమని వ్యాపారులు పేర్కొన్నారు. వినియోగదారులను మోసం చేస్తున్న వ్యాపారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రజలు విజ్ఞప్తి చేశారు. -
ఉత్సాహంగా టీ–20 క్రికెట్ లీగ్
● రెండో రోజు మహబూబ్నగర్, నారాయణపేట జట్ల విజయం ● అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన శ్రీకాంత్ మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని ఎండీసీఏ క్రికెట్ మైదానంలో కాకా మెమోరియల్ తెలంగాణ ఇంటర్డిస్ట్రిక్ట్ టీ–20 లీగ్ ఉత్సాహంగా జరుగుతోంది. రెండోరోజు లీగ్ మ్యాచుల్లో మహబూబ్నగర్, నారాయణపేట జట్లు విజ యం సాధించాయి. క్రికెట్ మైదానంలో ఏర్పా టు చేసిన టర్ఫ్ పిచ్పై మొదటిసారిగా లీగ్ మ్యాచ్లు జరుగుతున్నాయి. కాకా వెంకటస్వామి మెమోరియల్ టీ–20 లీగ్లో క్రీడాకారులు ప్రతిభచాటాలని ఎండీసీఏ చీఫ్ ప్యాట్రన్, ప్రముఖ న్యాయవాది మనోహర్రెడ్డి అన్నారు. రెండో రోజు మ్యాచ్లను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా క్రికెట్ మైదానాన్ని తీర్చిదిద్దిన క్యూరెటర్ సత్యనానారాయణ యాదవ్ను ఘనంగా సన్మానించి ఎండీసీఏ తరఫున రూ.25వేల నగదు ప్రోత్సాహకం అందజేశారు. ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ మాట్లాడుతూ క్యూరెటర్ సత్యనారాయణయాదవ్ ఎంతో కష్టపడి జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ క్రికెట్ మైదానాన్ని ఆధునీకరించినట్లు తెలిపారు. ఆయనను ఎండీసీఏ ఆధ్వర్యంలో సన్మానించుకోవడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో ఎండీసీఏ ఉపాధ్యక్షులు సురేష్కుమార్, వెంకటరామారావు, కోచ్లు గోపాలకృష్ణ, అబ్దుల్లా, మన్నాన్తోపాటు శివశంకర్, వజాహత్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఆతిథ్య మహబూబ్నగర్ జట్టు 111 పరుగుల తేడాతో వనపర్తి జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన మహబూబ్నగర్ జ ట్టు నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. ఓపెనర్లు అబ్దుల్ రాఫే, డేవిడ్ క్రిపాల్ 77 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. డేవిడ్ క్రిపాల్ 42 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్లతో 65 పరుగులు, అబ్దుల్ రాఫే 40 పరుగులు చేశారు. మొదటిడౌన్లో బ్యాటింగ్కు వచ్చిన ఎ.శ్రీకాంత్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 38 బంతుల్లో 7ఫోర్లు, 6 సిక్స్లతో 81 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అనంతరం భారీ లక్ష్యంతో బ్యా టింగ్కు దిగిన వనపర్తి జట్టు పాలమూరు బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లను కోల్పోయింది. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. జట్టులో రాంచారి 31 పరుగులు చేశా రు. మహబూబ్నగర్ బౌలర్లు షాదాబ్ 2, యు వన్ 2 వికెట్లు తీశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎ.శ్రీకాంత్ (మహబూబ్నగర్) నిలిచాడు. -
నలుగురు పోలీస్ సిబ్బందికి ప్రశంసాపత్రాలు
మహబూబ్నగర్ క్రైం: జిల్లా పోలీస్ శాఖకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఎప్పటికప్పుడు సకాలంలో సీసీటీఎన్ఎస్లో అప్డేట్ చేయడంతో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఐటీ సెల్ కో–ఆర్డినేటర్లు, ఐటీకోర్ టీం, టెక్టీం సిబ్బందిని మంగళవారం హైదరాబాద్లో డీజీపీ కార్యాలయంలో 171మందికి రివార్డ్ మేళా నిర్వహించి అభినందించారు. జిల్లా నుంచి ఐటీసెల్ కో–ఆర్డినేటర్ విభాగంలో హెడ్కానిస్టేబుల్ రాజేశ్వర్రెడ్డి, ఐటీకోర్ టీం సభ్యుడు హెడ్కానిస్టేబుల్ విజయ్కుమార్, టెక్టీం సిబ్బందిలో బాలానగర్ స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ శ్రీనివాసులు, హన్వాడ స్టేషన్కు చెందిన యాదమ్మకు ప్రశంసా పత్రాలను అదనపు డీజీ శ్రీనివాసరావు అందజేశారు. జిల్లా నుంచి ప్రశంసా పత్రాలు అందుకున్న నలుగురు సిబ్బందిని ఎస్పీ డి.జానకి అభినందించారు. శ్రీనివాసులు యాదమ్మ విజయ్కుమార్రాజేశ్వర్రెడ్డి -
అట్టడుగు వర్గాలకు విద్య, వైద్యం
వనపర్తి/ గద్వాల టౌన్/ అలంపూర్: అట్టడుగు వర్గాలకు విద్య, వైద్యం వంటి సంక్షేమ ఫలాలు అందించడంతోనే బలమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అ న్నారు. పీఎం నరేంద్రమోదీ కలలుగన్న వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరాలంటే దేశంలోని అన్నివ ర్గాల వారు ఆర్థిక సాధికారత సాధించాలని పే ర్కొన్నారు. మంగళవారం వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో ఆయన పర్యటించారు. ముందుగా వనపర్తి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాళ్లు, బాలభవన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిన్నారుల కూచిపూడి నృత్య ప్రదర్శనను కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీతారెడ్డి తదితరులతో కలిసి తిలకించారు. అనంతరం కవులు, కళాకారులు, ఆయా శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, గవర్నర్ స్పెషల్ సెక్రటరీ భవాని శంకర్తో కలిసి హాజరయ్యారు. క్షయరహిత సమాజ నిర్మాణం, బాల్యవివాహాల నిర్మూలన కోసం కవులు, కళాకారులు, రచయితల గళం ఎంతో కీలకమన్నారు. అనంతరం జిల్లాలో అమలు చేస్తున్న ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలను అధికారులు గవర్నర్కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. క్షయరహిత సమాజ నిర్మాణానికికృషిచేయాలి చేనేత రంగానికి గుర్తింపు తెచ్చి..భావితరాలకు అందించాలి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అలంపూర్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు -
ప్రజలు అందించిన గొప్ప విజయం
● డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ ● సర్పంచ్లకు ఘనంగా సన్మానం స్టేషన్ మహబూబ్నగర్: సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గొప్ప విజయం అందించారని డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహబూబ్నగర్ నియోజకవర్గంలో నూతనంగా గెలుపొందిన కాంగ్రెస్ సర్పంచ్లకు అభినందన సన్మానసభ నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించడంతో అధిక సంఖ్యలో సర్పంచ్ స్థానాలను గెలుచుకున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పట్ల నమ్మకంతో ప్రజలు గెలిపించినట్లు తెలిపారు. ఇంత ప్రజాస్వామికంగా ఎన్నికలు ఎప్పుడూ జరగలేదన్నారు. ఐక్యతకు నిదర్శనమే ఎన్నికల్లో ఘన విజయం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాబలం, కార్యకర్తల ఐక్యత, నాయకత్వ సమన్వయానికి నిదర్శనమే సర్పంచ్ ఎన్నికల్లో సాధించిన ఘన విజయ మని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. మ హబూబ్నగర్, హన్వాడ మండలాల్లోని 60 సర్పంచ్ స్థానాలకు 40స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించడం చూస్తే.. ప్రజలు మా వెంటే ఉన్నారని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారన్నారు. అయితే కొన్ని పొరపాట్లు కూడా జరిగాయని, నేను ఒక ప్రొఫార్మా ఇచ్చి గ్రామాల్లోకి వెళ్లి ఒక్కో ఇంటికి వెళ్లి ఏ పథకం వచ్చిందని గుర్తించమని చెబితే నూటికి 90 శాతం మంది పనిచేయలేదన్నారు. కొంతమంది నాయకులు గివన్ని చేస్తామా అని చెప్పారని.. వారు ఎవరో తనకు తెలుసని, భవిష్యత్తులో వారు పోస్టుల కోసం వచ్చినప్పుడూ ఈ విషయం చెబుతానని తెలిపారు. ఇప్పటి నుంచి గ్రామాల్లోని కార్యకర్తల మానసిక స్తైర్యాన్ని, వారిని తప్పుదోవ పట్టేలా గ్రూపులు చేస్తే వేటు పడటం ఖాయమని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ అధ్యక్షుడు మల్లు నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వసంత, నాయకులు వినోద్కుమార్, చంద్రకుమార్గౌడ్, జహీర్ అక్తర్, సురేందర్రెడ్డి, సీజే బెనహర్, సిరాజ్ఖాద్రీ, బి.మధుసూదన్రెడ్డి, ఆనంద్కుమార్గౌడ్, లింగం నాయక్, అజ్మత్అలీ, ఫయాజ్, అవేజ్, కృష్ణయ్య, నాగరాజు, మహేందర్, రాంచంద్రయ్య, శ్రీనివాస్యాదవ్, మైత్రి యాదయ్య, రియాజుద్దీన్ పాల్గొన్నారు. -
రేపు అయ్యప్పకొండపై మహాపూజ
స్టేషన్ మహబూబ్నగర్: జిల్లాకేంద్రంలో అయ్యప్పకొండపై 25వ తేదీన 28వ వార్షికోత్సవ అయ్యప్ప స్వామి మహాపూజ నిర్వహిస్తున్నట్లు అయ్యప్ప సేవా సమాజం అధ్యక్షుడు భగవంతురావు వెల్లడించారు. మంగళవారం అయ్యప్పకొండపై ఆయన మాట్లాడుతూ ఆ రోజు ఉదయం 5 గంటల నుంచి 8.30 గంటల వరకు సుప్రభాతసేవ, గణపతి, నవగ్రహ హోమం, నిత్యాభిషేకం ఉంటుందని, అనంతరం రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 10 గంటలకు తూర్పు కమాన్ వద్దగల రామాల యం నుంచి కలశ, స్వామి వారి పల్లకీసేవ ప్రారంభమై పట్టణ ప్రధాన రహదారుల మీదుగా అయ్య ప్ప కొండ ఆలయం వరకు కొనసాగుతుందని తెలిపారు.10 గంటలకు అష్టాభిషేకం ఉంటుందని, మధ్యాహ్నం ఒంటిగంటకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం 7.30 గంటలకు తిరుపతికి చెందిన వెంకటేశ్వర చంద్రమౌళి శర్మ, పాలమూరుగురుస్వాముల ఆధ్వర్యంలో ఏకశిల దివ్య పదునెట్టాంబడి పూజ, మహామంగళహారతి పూజలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మహాపడిపూజ కరపత్రాలను ఆవిష్కరించారు. సేవా సమాజం ప్రధాన కార్యదర్శి ముత్యం గురుస్వామి, పంబరాజు, ఎత్తెపు కేశవులు, హర్షవర్దన్రెడ్డి, ప్రసాద్, గణేష్, యాదయ్య పాల్గొన్నారు. -
వణుకుతున్న వసతి గృహాలు
కేజీబీవీలు, గురుకులాల్లో భిన్న పరిస్థితులు.. జిల్లాలో 15 కేజీబీవీలు ఉండగా ఇందులో 4,600 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిలో పాఠశాల స్థాయిలో చదువుతున్న వారికి మాత్రమే వేడినీళ్లు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కొన్నింటిని ప్రభుత్వం ఇంటర్మీడియట్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేసింది. అయితే ఇంటర్ విద్యార్థులకు సోలార్ వాటర్ హీటర్లు కానీ, గీజర్లు కానీ ప్రభుత్వం అందజేయకపోవడంతో చల్లని నీటితోనే స్నానాలు చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలు మొత్తం 32 ఉండగా వీటిలో వీటిలో 9 వేలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. వీటిలో కొన్నింటిలో గీజర్లు మరమ్మతులకు గురి కావడంతో అందరికీ వేడి నీళ్లు అందడం లేదు. ● గండేడ్ మండల పరిధిలోని వెన్నాచేడ్లో ఎస్సీ వసతి గృహంలో 146 మంది విద్యార్థులు ఉన్నారు. సరిపడే బాత్రూంలు లేకపోవడంతో ఆరుబయటే చల్లని నీటితో స్నానాలు చేస్తున్నారు. మహమ్మదాబాద్లోని ఎస్టీ బాలుర వసతి గృహంలో చలికి విద్యార్థులు ఆలస్యంగా నిద్రలేచ్చారు. పెద్ద తరగతి విద్యార్థులు పాత దుప్పట్లతోనే సర్దుకున్నారు. చిన్నచింతకుంటలోని ఎస్పీ, బీసీ సంక్షేమ హాస్టళ్లలోనూ ఇదే పరిస్థితి. వేడినీళ్లు ఇవ్వడం కలే.. జడ్చర్లలోని గిరిజన ఆశ్రమ పాఠశాల, ఇంటిగ్రేటెడ్ హాస్టల్లోని విద్యార్థులు చన్నీళ్లతోనే స్నానాలు చేస్తున్నారు. ఆశ్రమ పాఠశాలలో తెల్లవారుజామున 5.30 గంటల నుంచి బోరు వేశాక వచ్చే ఆ కాస్త ప్రకృతి సిద్ధమైన వేడినీటితో చలిలో స్నానం చేస్తున్నారు. గతంలో వేంకటేశ్వరస్వామి దేవాలయం వద్దకు వెళ్లి స్నానాలు చేసేవాళ్లమని విద్యార్థులు తెలిపారు. చన్నీళ్లతో స్నానం చేయడం అలవాటుగా మారిపోయిందని చెబుతున్నారు. మూడో తరగతి విద్యార్థులు సైతం చన్నీటితోనే స్నానాలు చేయాలి. ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో మిషన్భగీరథ నీటిని ట్యాంక్లో నింపాక దాని నుంచి వచ్చే నీటితో స్నానం చేస్తున్నారు. ఇదే హాస్టల్లో కిటికి అద్దాలు పగిలిపోగా వాటిస్థానంలో థర్మకోల్, బెడ్షీట్లు అడ్డుగా పెట్టారు. ఇటీవల కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ చూపి బెడ్షీట్లు పంపడంతో ఇబ్బంది తీరిందని విద్యార్థులు చెబుతున్నారు. -
ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి
మహబూబ్నగర్ రూరల్: దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని, ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకుంటూ అన్ని రంగాల్లో విజయాలను సాధించాలని కలెక్టర్ విజయేందిర బోయి పేర్కొన్నారు. జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాకేంద్రంలోని శిశుగృహ హాల్లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఆయా రంగాల్లో దివ్యాంగులు ప్రదర్శిస్తున్న ప్రతిభా పాటవాలను గుర్తు చేస్తూ వారిని కొనియాడారు. విద్య, రాజకీయ రంగాలతో పాటు క్రీడలు, ఉన్నత ఉద్యోగాలు, వ్యాపారాలు ఇలా ఏ రంగంలో చూసినా దివ్యాంగులు సమాజంలోని ఇతరులకు ఏమాత్రం తీసిపోకుండా తమ ప్రతిభను చాటుకుంటున్నారని అన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల కోసం ఉద్దేశించిన భవిత కేంద్రాలను జిల్లాలో అన్ని వసతులతో ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. జిల్లాలోని దివ్యాంగుల సమస్యలను చాలా వరకు పరిష్కరించామని, ఇంకా మిగిలిన వాటిని కూడా త్వరలో పరిష్కరిస్తామన్నారు. అనంతరం దివ్యాంగుల క్రీడా పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, డీడబ్ల్యూఓ జరీనాబేగం,అంధుల ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపాల్ రాములు పాల్గొన్నారు. -
పగిలిన కిటికి అద్దాలు
దేవరకద్రలోని ఎస్సీ సాంఘిక సంక్షేమ హాస్టల్లో వందమంది విద్యార్థులున్నారు. వేడినీటి వసతి లేకపోవడంతో తెల్లవారుజాము నుంచే చలికి వణుకుతూ స్నానాలు చేస్తున్నారు. కొందరు ఆరు బయట కట్టెల పొయ్యిపై నీటిని వేడి చేసుకోవడం కనిపించింది. కిటికీలకు అద్దాలు సరిగ్గా లేకపోవడం, కొన్ని వెంటిలేటర్లకు అద్దాలు పగలిపోవడంతో రాత్రివేళ చలికి వణుకుతున్నట్లు విద్యార్థుల చెప్పారు. ఈ విషయంపై వార్డెన్ తురియానంద్ను వివరణ కోరగా గీజర్ కోసం, కిటికి అద్దాల కోసం అధికారులు వచ్చి పరిశీలించి ప్రతిపాదనలు చేశారని తెలిపారు. -
అన్ని పంటలకు కొత్త రుణ పరిమితి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఈసారి యాసంగి సీజన్లో పండించే అన్ని రకాల పంటలకు రుణ పరిమితి (కొత్త స్కేల్ ఆఫ్ ఫైనాన్స్)ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం డీసీసీబీ కార్యాలయంలో జిల్లా వ్యవసాయ అధికారి బి.వెంకటేశ్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లాస్థాయి సాంకేతిక కమిటీ (డీఎల్టీసీ) సమావేశంలో తీర్మానించారు. ఇందులో భాగంగా వరి పంటకు గతంలో ఎకరాకు రూ.44 వేల రుణం ఇవ్వగా ప్రస్తుతం రూ.48 వేలకు పెంచారు. మొక్కజొన్నకు రూ.19వేల నుంచి రూ.23వేలకు, వేరుశెగనకు రూ.30 వేల నుంచి రూ.35 వేలకు, కందులకు రూ.23 వేల నుంచి రూ.28 వేల వరకు పెంచారు. సమావేశంలో ఉద్యానవన, నాబా ర్డు, మత్స్య, పశుసంవర్ధక శాఖ అధికారులు, ఆయా బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. -
బొటానికల్ గార్డెన్ ఓ అద్భుతం
● జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బాలభాస్కర్ జడ్చర్ల టౌన్: డా.బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశా ల కు బొటానికల్ గార్డెన్ మకుటం లాంటిదని జా యింట్ డైరెక్టర్ బాలభాస్కర్ అన్నారు. సోమ వా రం ఆయన జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డీఎస్ఆర్ రాజేందర్సింగ్తో కలసి కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా బొటానికల్ గార్డెన్ను సందర్శించి మాట్లాడారు. ప్రతి అధ్యాపకుడు కళాశాల అభివృద్ధికి పాటు పడాలని పిలుపునిచ్చారు. కళాశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని, డ్రాపౌట్ సంఖ్యను తగ్గించాలని, మెంటార్–మెంటిని అమలుచేయాలన్నారు. మరో డైరెక్టర్ రాజేందర్సింగ్ కళాశాలలో ఔషధ మొక్కలు నాటి అద్భుతమైన గార్డెన్ కలిగి ఉన్న ఈ కళాశాల తెలంగాణలోనే మొదటిదని గార్డెన్ ఓ అద్భుతమని కొనియాడారు. అనంతరం అధ్యాపకుడు రాఘవేందర్రెడ్డి రాసిన ప్రపంచ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఎన్సీసీ విద్యార్థులకు సర్టిఫికెట్లు పంపిణి చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా. సుకన్య, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, నర్మద, అకాడమిక్ కో ఆర్డినేటర్ రాఘవేందర్రెడ్డి, గార్డెన్ సమన్వయకర్త డా. సదాశివయ్య, కంట్రోలర్ సులేమాన్, మాధురి, పుష్పలత, సూరయ, జబిన్ పాల్గొన్నారు. -
యంగంపల్లిలో ఉద్రిక్తత.. ఇరువర్గాల ఘర్షణ
రాస్తారోకోలో జైపాల్యాదవ్, తదితరులు కల్వకుర్తి రూరల్: మండలంలోని యంగంపల్లి గ్రా మంలో ఇరువర్గాల మధ్య చోటు చేసుకున్న వివా దం ఘర్షణగా మారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా యి. పూర్తి వివరాలు.. ఈ నెల 11న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారుడు బొల్గం యాదగిరిరెడ్డి విజయం సాధించారు. విజయం అనంతరం అదే రోజు ర్యాలీ చేయొద్దన్న పోలీసులు ఇచ్చిన సూచన మేరకు ర్యాలీని వాయిదా వేసుకున్నారు. ఆదివారం గ్రామంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించగా అనంతరం బీఆర్ఎస్ కార్యకర్త ఇంటిపై కాంగ్రెస్ మద్దతు దారులు దాడి చేయగా బీఆర్ఎస్ శ్రేణులు ప్రతిఘటించి పరస్పరం దాడి చేసు కున్నారు. ఇది ఇలా ఉండగా సోమవారం ప్రమాణ స్వీకారానికి వచ్చే గ్రామస్తులకు భోజనం ఏర్పాట్లు చేశారు. కూరగాయలను కొనుగోలు చేసేందుకు సర్పంచ్ బంధువులు కల్వకుర్తి కూరగాయల మార్కెట్కు వచ్చిన సందర్భంగా వారిపై కాంగ్రెస్ మద్దతుదారులు మరోసారి దాడికి దిగారు. దాడిపై పోలీసులకు బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని మధ్యాహ్నం గ్రామంలో సర్పంచ్ యాదగిరిరెడ్డితో కలిసి పెద్దఎత్తున రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎడమ సత్యం, పార్టీ మండల అధ్యక్షుడు విజయ్గౌడ్ తదితరులు రాస్తారోకోలో పాల్గొన్నా రు. దాడిని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ దాడులను మరోసారి చేస్తే సహించే ప్రసక్తే లేదని సర్పంచ్, పాలకవర్గానికి అండగా ఉంటామన్నారు. హామీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీ దాడులకు దిగడం వారి నైజాన్ని బయటపెట్టిందని ఆరోపించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గస్తీ పెంచారు. -
గొర్రెల కాపరుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
మహబూబ్నగర్(వ్యవసాయం): గొర్రెల కాపరుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్థక శాఖమంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. అప్పనపల్లిలో సోమవారం రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజహరుద్దీన్లతో కలిసి ఆయన గొర్రెలు–మేకలకు, నట్టల నివారణ మందులు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ప్రభుత్వం రూ.4.5కోట్లతో నట్టల నివారణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. గొర్రెలు, మేకలు వ్యాధుల కారణంగా మృతి చెందినప్పుడు కాపరులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కొత్త బీమా పథకాలను తీసుకొస్తోందని తెలిపారు. పశుపోషణే అనేక కుటుంబాలకు ప్రధాన జీవనాధారం కావడంతో, వాటి రక్షణకు ప్రభుత్వం అన్ని విధాలా కట్టుబడి ఉందన్నారు. కుక్కల దాడుల నుంచి గొర్రెలు, మేకలను కాపాడేందుకు ప్రభుత్వం తేలికపాటి బలమైన నెట్లను కాపరులకు అందజేస్తోందని తెలిపారు. ఇవి ఉపయోగించడానికి సులభంగా ఉండటంతో పాటు రాత్రి సమయంలో కూడా పశువులకు మెరుగైన రక్షణ కల్పిస్తాయని వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పూర్తిగా వినియోగించుకోవాలని, వెటర్నరీ సిబ్బందితో సహకరించాలని కాపరులను కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, అనిరుధ్రెడ్డి, కలెక్టర్ విజయేందిర, తదితరులు పాల్గొన్నారు. -
విపత్తులు ఎదుర్కోవడంపై మాక్ డ్రిల్
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆదేశాల మేరకు వర్షాలు, వరదలు లాంటి విపత్తులు సంభవిస్తే జిల్లా యంత్రాంగం ఎలా స్పందించాలి.. సహాయక చర్యలు ఎలా సమన్వయంతో నిర్వహించాలి అనే అంశాలపై మాక్ డ్రిల్ చేపట్టారు. సోమవారం జిల్లాలో ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహించారు. మహబూబ్నగర్లోని రామయ్య బౌలి, పరిసర ప్రాంతం పెద్ద చెరువు, కొత్త చెరువు, అమరరాజా ప్రాంతం, జడ్చర్ల ఏరియా హాస్పిటల్ తదితర ప్రాంతాలలో వరద పరిస్థితులను సృష్టించి, వాటికి సంబంధించిన సహాయక చర్యలను ప్రత్యక్షంగా అమలు చేశారు. కలెక్టర్ విజయేందిర ఎస్పీ జానకితో కలిసి రామయ్యబౌలి వద్ద ఉన్న పెద్ద చెరువు, కొత్తచెరువు వద్ద మాక్ డ్రిల్ను పర్యవేక్షించారు. నీటి ప్రవాహంలో చిక్కుకున్న పశువులను, నీటిలో మునిగి కొట్టుకుపోతున్న వ్యక్తిని, నీటిలో చిక్కుకుపోయిన వ్యక్తులను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీస్, అగ్నిమాపక, అటవీ , రెవెన్యూ, పశు సంవర్ధక శాఖ, ఆపద మిత్ర వలంటీర్లు, ఎన్సీసీ క్యాడెట్లు, వైద్య ఆరోగ్యశాఖ సమన్వయంతో రక్షణ సహాయక చర్యలు మాక్ డ్రిల్ చేపట్టారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, అగ్నిమాపక శాఖ అధికారి కిషోర్, డీఎఫ్ఓ సత్యనారాయణ, డీపీఆర్ఓ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు -
విరిసిన విజ్ఞానం... మెరిసిన ప్రయోగం
● ఉత్సాహంగా జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ● నూతన ఆవిష్కరణలతో సత్తా చాటిన విద్యార్థులు గద్వాలటౌన్: తరగతి గదిలో ఉపాధ్యాయులు కలిగించిన ప్రేరణ.. చుట్టూ ఉన్న సమాజంలో కనిపించిన సమస్యలను పరిష్కరించాలనే ఆలోచనలతో సరికొత్త ఆవిష్కరణలకు తెర తీస్తున్నారు విద్యార్థులు. విజ్ఞానం, వికాసం కోసమే కాదు.. జనహి తం కోసం అన్న మహనీయుల స్ఫూర్తి పథాన్ని అణువణువునా నింపుకొని అద్భుతాలు సృష్టిస్తున్నా రు. సోమవారం జరిగిన జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలోని శ్రీనివాస రామానుజన్ ప్రాంగణంలో నిర్వహించిన పోటీల్లో ప్రతిభతో పోటీ పడ్డారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన వీక్షకులతో ప్రాంగణం కోలాహలంగా మారింది. -
మోసాలు చేసే వ్యక్తులపై ప్రత్యేక దృష్టి
మహబూబ్నగర్ క్రైం: బాధితుల సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం చోటు చేసుకోకుండా ఉండాలని, సకాలంలో చర్యలు చేపట్టి న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ డి.జానకి అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి జిల్లావ్యాప్తంగా 11 మంది బాధితులు హాజరై వినతులు అందించారు. ఆయా బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన తర్వాత సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడి దరఖాస్తులపై వేగవంతంగా స్పందించాలన్నారు. ముఖ్యంగా భూవివాదాలు, కుటుంబ తగదాలు, మోసాలకు సంబంధించిన ఫిర్యాదులకు ప్రాధాన్యతతో పరిష్కరించాలన్నారు. ప్రజావాణికి వచ్చే ప్రతి ఫిర్యాదుపై క్షేత్రస్థాయిలో విచారణ చేసి న్యాయం చేయాలన్నారు. ● కేంద్ర మాజీమంత్రి జి.వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఎస్పీ డి.జానకి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. -
పల్లెల్లో నవశకం
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): పల్లెల్లో నవ శకం ప్రారంభమైంది. సోమవారం గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు కొత్త పాలక వర్గం సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. జిల్లాలో మొత్తం 423 గ్రామ పంచాయతీలు ఉంటే ఒక్క పంచాయతీ మినహా మిగిలిన 422 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. గ్రామాల్లో ఓ పండుగ వాతావరణంలో ప్రమాణస్వీకార కార్యక్రమాలు నిర్వహించారు. కొత్త పాలక వర్గం సభ్యులకు అధికారులు శాలువాతో సన్మానించారు. పక్కాభవనాలు లేని గ్రామాల్లో సాదాసీదాగా ప్రమాణ స్వీకారం చేయించారు. ● ఎన్నో ఆశలు, ఆశయాలతో కొలువుదీరిన పంచాయతీల పాలకవర్గాలకు నిధులలేమి అసలు సమస్యగా కనిపిస్తోంది. పంచాయతీలకు ఇంటి పన్నులు తప్ప.. ఇతర ఆదాయ వనరులు పెద్దగా ఉండవు. కార్మికుల జీతాలు, విద్యుత్ చార్జీలు, చెత్త సేకరణ ట్రాక్టర్లకు డీజిల్, నీటి వనరుల సంరక్షణ వంటి వాటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. గత ప్రభుత్వ హయాంలో రైతువేదికలు, క్రీడా ప్రాంగణాలు, పల్లె ప్రకృతివనాలు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలను నిర్మించారు. అవసరాలకు మూలం నిధులే కావడంతో ప్రభుత్వం సరిపడా నిధులు ఇవ్వాలని కొత్త పాలకవర్గాలు కోరుతున్నాయి. విధులు.. బాధ్యతలు గ్రామ పంచాయతీల పరిపాలకులుగా సర్పంచులు వ్యవహరిస్తూ గ్రామసభలు నిర్వహించాలి. ఎన్నిక తర్వాత 15 రోజుల్లో తొలి గ్రామసభ జరపాలి. 15వ ఆర్థిక సంఘం నిధులు రాబట్టుకునేలా చొరవ తీసుకోవాలి. బడ్జెట్ ఆమోదం, అభివృద్ధి పనులు, రోడ్డు, నీటి సరఫరా, ఆరోగ్యం, విద్య, వీధి దీపాలు, పారిశుద్ధ్యం పర్యవేక్షణ, గ్రామీణాభివృద్ధి, ఉపాధిహామీ, స్వచ్ఛభారత్ వంటి కేంద్ర, రాష్ట్ర పథకాలను అమలు చేయాల్సిన బాధ్యత సర్పంచులపైనే ఉంటుంది. పంచాయతీ ఆర్థిక నిర్వహణ, లాభనష్టాల రిపోర్టులు సమర్పించాల్సి ఉంటుంది. పీఎం ఆవాస్ యోజన వంటి పథకాల్లో పారదర్శకత ఉండాలి. ● జిల్లావ్యాప్తంగా వివిధ పార్టీల మద్దతుతో విజయం సాధించిన సర్పంచులు, వార్డు సభ్యులను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించి అభినందనలతో ముంచెత్తారు. గ్రామాల్లో పండుగ వాతావరణం కనిపించింది. గ్రామపంచాయతీల్లో కొలువుదీరినపాలకవర్గాలు అట్టహాసంగా ప్రమాణ స్వీకారోత్సవాలు -
నాగర్కర్నూల్ శుభారంభం
లీగ్లో తొలి మ్యాచ్లో నాగర్కర్నూల్ జట్టు 9 వికెట్ల తేడాతో మహబూబ్నగర్ జట్టుపై విజయం సాధించి.. శుభారంభం చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన మహబూబ్నగర్ 18 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది. జట్టులో కేతన్కుమార్ (23) ఒక్కడే రాణించాడు. నాగర్కర్నూల్ బౌలర్లు జశ్వంత్ 3, గగన్ 2 వికెట్లు తీశారు. వెలుతురు సరిగా లేని కారణంగా 15 ఓవర్లలో 64 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నాగర్కర్నూల్ 9 ఓవర్లలో వికెట్ కోల్పోయి విజయం సాధించింది. ఆ జట్టులో పి.సుబ్రత్ కౌషిక్ 39, సాయి వంశీవర్మ 20 పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు. మ్యాన్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచిన జశ్వంత్ (నాగర్కర్నూల్)కు రూ.2 వేలు, మెమోంటో అందజేశారు. లీగ్లో భాగంగా మంగళవారం ఉదయం 9 గంటలకు గద్వాల–నారాయణపేట, మధ్యాహ్నం ఒంటి గంటకు వనపర్తి–మహబూబ్నగర్ జట్లు తలపడుతాయి. -
దేశం గర్వించే నేత కర్పూరి ఠాకూర్
మెట్టుగడ్డ: రిజర్వేషన్లకు ఆధ్యునిగా దేశ రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించిన మహనీయుడు కర్పూరి ఠాకూర్ అని.. భారతరత్నతో గౌరవించడం గొప్ప విషయం అని బీసీ సమాజ్ అధ్యక్షుడు సంగెం సూర్యారావు అన్నారు. మహబూబ్నగర్ ప్రెస్ క్లబ్లో బీసీ సమాజ్ ఆధ్వర్యంలో జాతీయ ఎంబీసి ఆత్మగౌరవ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్రవర్ణాలు, బీసీల్లోని కొన్ని పెత్తందారి కులాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప మహనీయుడు కర్పూరి ఠాకూర్ అని అన్నారు. రెండు సార్లు బీహార్ ముఖ్యమంత్రిగా పని చేసిన ఆయన జీవితం అందరికి ఆదర్శం అని అన్నారు. కర్పూరి ఠాకూర్ రూపొందించిన రిజర్వేషన్ల విధానమే ఆయన ఫార్మూలాగా ప్రసిద్ధి చెందిందని అన్నారు. ఆ రోజుల్లోనే బీసీలకు 26శాతం రిజర్వేషన్లు కల్పించిన మహనీయుడని, తదుపరి కాలంలో మండల కమీషన్కు నమూనాగా కూడా అదే నిలిచిందన్నారు. బడుగు వర్గాల గుండె చప్పుడుగా భారతీయ రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తారన్నారు. కార్యక్రమంలో బీసీ జేఏసి కన్వీనర్ బెక్కెం జనార్ధన్, బీసి సమాజ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ సాగర్, కోరమోని వెంకటయ్య, రవి ముదిరాజ్, వెంకటస్వామి, సత్యశిల సాగర్, వెంకటేష్ గౌడ్, దుర్గేష్, బుగ్గన్న, డీకె నాయీ, అశ్వి ని సత్యం, బాలరాజు తదితరులు పాల్గోన్నారు. -
లీగ్లో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి : మైనార్టీశాఖ మంత్రి అజహరుద్దీన్
మహబూబ్నగర్ క్రీడలు: రాష్ట్రంలో క్రీడా వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.జిల్లా కేంద్రంలోని ఎండీసీఏ మైదానంలో విశాఖ ఇండస్ట్రీస్ సౌజన్యంతో హెచ్సీఏ ఆధ్వర్యంలో సోమవారం కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ జిల్లాల టీ–20 లీగ్ ప్రారంభోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. శ్రీహరితో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్స్వామి, అజహరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడామంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి ఆలోచనా విధానం మేరకు ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చి, ఈ సారి క్రీడలకు రూ.800 కోట్లు, వచ్చే ఏడాది క్రీడలకు దాదాపు రూ.1500 కోట్లు వెచ్చిస్తామని అన్నారు. 2034 జరిగే ఒలింపిక్స్లో తెలంగాణ నుంచి బంగారు పతకం రావాలన్న లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. హెచ్సీఏ మాతో సంప్రదిస్తే ఫిబ్రవరిలో బీసీసీఐ మ్యాచ్ జరిగే ముందే ఈ మైదానంలో కావాల్సిన వసతులు ఏర్పాటుకు కృషి చేస్తామని అన్నారు. తెలంగాణ ప్రాతినిధ్యం ఉండాలి.. క్రికెట్ పరంగా భారతదేశంలో తెలంగాణ ప్రాతినిఽ ద్యం ఉండాలని రాష్ట బీసీ వెల్ఫేర్, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేలా 33 జిల్లాల్లో కాకా వెంకటస్వామి మెమోరియల్ క్రికెట్ లీగ్ నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు. వెంకటస్వామి పేదరిక నిర్మూలన, కార్మికుల సంక్షేమం కోసం కృషి చే శారని కొనియాడారు.క్రీడల్లో ప్రావీణ్యతకు ప్రాధాన్యత లభిస్తుందన్నారు. అంతర్గత రాజకీయాలు వీడి నూతన క్రీడాకారులను తయారుచేసేలా పాటుపడాలని క్రికెట్ అసోసియేషన్ను కోరారు. ఈ లీగ్లో క్రికెటర్లు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించా లని రాష్ట్ర మైనార్టీశాఖ మంత్రి, మాజీ క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్ అన్నారు. ఇంత పెద్ద ఎత్తున లీగ్ నిర్వహిస్తుండడం అభినందనీయమని అన్నా రు. రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారులు ఏపీ జి తేందర్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలోనే మహ బూబ్నగర్లో అన్ని విధాలుగా క్రికెట్ మైదానాన్ని అభివృద్ధి చేసినట్లు తెలిపారు. మైదానంలో ఇంకా అనేక అభివృద్ధి పనుల కోసం నిధుల ఇవ్వడంతోపాటు ఫ్లడ్ౖలైట్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడానికి ఈ టోర్నమెంట్ గొప్ప అవకాశమని అన్నారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ.. ఇక్కడి క్రికెట్ మైదానం లార్డ్స్ మైదానాన్ని తలపిస్తుందన్నారు. ఇంత మంచి మైదానాన్ని తీర్చిదిద్దిన జిల్లా క్రికెట్ అసోసియేషన్ను అభినందనలు తెలిపారు. అంతకుముందు మంత్రులు టోర్నీ ప్రారంభోత్సవ జెండాను ఆవిష్కరించారు. మైదానంలో బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శివలాల్యాదవ్, కలెక్టర్ విజయేందిర బోయి, ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, టీజీఎంఎఫ్సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, మన్నె జీవన్రెడ్డి, సంజీవ్ ముదిరాజ్, మిథున్రెడ్డి, బెక్కరి అనిత, హెచ్సీఏ ప్రతినిధులు దల్జిత్సింగ్, బస్వరాజ్, సునీల్ అగర్వాల్, ఎండీసీఏ ప్యాట్రన్ మనోహర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్, ఉపాధ్యక్షులు సురేష్కుమార్, వెంకటరామారావు, సభ్యులు క్రిష్ణమూర్తి, శివశంకర్, నరేందర్రెడ్డి, కోచ్లు గోపాలకృష్ణ, అబ్దుల్లా, మన్నాన్ తదితరులు పాల్గొన్నారు. క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించేలా మా తండ్రి స్మారకంగా తెలంగాణలో టీ–20 లీగ్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రతి ఒక్కరూ లీగ్లో పోటీతత్వంతో క్రికెట్ ఆడాలని కోరా రు. ఈ లీగ్కు సంబంధించి అన్ని జిల్లాల్లో చాలా చక్కగా జట్ల ఎంపికలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ లీగ్లో తెలంగాణ వ్యాప్తంగా 104 మ్యాచ్లు జరుగుతాయని తెలిపారు. గతంలో హెచ్సీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడూ ఈ మైదానం ఎర్ర మట్టితో ఉండేదని, ఇప్పుడు చక్కటి గ్రీనరీ స్టేడియం కావడం సంతోషంగా ఉందన్నారు. -
కాంగ్రెస్ మండల అధ్యక్షుడిపై దాడి
● తీవ్రగాయాలు.. ఆస్పత్రికి తరలింపు కొత్తకోట రూరల్: పంచాయతీ ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో సోమవారం నూతన సర్పంచులు కొలువు దీరారు. ఈ క్రమంలో ఓడిపోయిన అభ్యర్థులు గెలిచిన అభ్యర్థులకు మద్దతు తెలిపిన వారిపై దాడికి పాల్పడిన ఘటన మండలంలోని నాటవెళ్లి గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. గ్రామంలో నూతన సర్పంచ్, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం అనంతరం కాంగ్రెస్కు చెందిన కొందరు యువకులు పార్టీ మండలాధ్యక్షుడు బీచుపల్లి యాదవ్కు కాంగ్రెస్, మీకు కాంగ్రెస్కు వ్యతిరేకంగా పలువురు మాట్లాడుతున్నారంటూ వారిని నివారించాలంటూ మొరపెట్టుకున్నా రు. స్పందించిన ఆయన కాంగ్రెస్ వ్యతిరేకుల తో మాట్లాడుతుండగా మాటా మాటా పెరగడంతో బీచుపల్లి యాదవ్తో పాటు నలుగురిపై వారు దాడి చేశారు. బీచుపల్లి యాదవ్కు తలకు తీవ్రగాయాలు కావడంతో కొత్తకోటలో ని ఓ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం మహబూబ్నగర్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులను సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. -
భద్రతను బలోపేతం చేయాలి
రాజాపూర్: పరిశ్రమలు చట్టపరమైన నిబంధనలకే పరిమితి కాకుండా ముందస్తు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయాలని డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం రాజాపూర్ శివారులోని పోలేపల్లి సెజ్లో గల ఎన్ఐఎంఐఎస్ యూనివర్సీటీలో ఏర్పాటు చేసిన ప్రమాదాల నుంచి నివారణ పాఠాలు అనే అంశంపై వర్క్షాప్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడారు. ఇటీవల పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాల నుంచి పాఠాలు నేర్చుకొని అన్ని స్థాయిలో భద్రతా చర్యలు తీసుకోవాలని ఫ్యాక్టరీల యాజమాన్యానికి సూచించారు. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోని పక్షంలో కఠిన చర్యలు తప్పవన్నారు. కార్మికుల భవిష్యత్ కూడా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ పరిశ్రమల భద్రతా నిపుణులు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి స్వగ్రామంలో వార్డు మెంబర్ రాజీనామా
చిన్నంబావి: మంత్రి జూపల్లి కృష్ణారావు స్వగ్రామమైన పెద్దదగడలో వార్డుమెంబర్ రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కంచి జ్ఞానేశ్వరి వార్డు మెంబర్గా పోటీచేసి గెలుపొందింది. అయితే, సోమవారం పాలకవర్గం ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే ఆమె రాజీనామా చేయడం గమనార్హం. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్థానిక రాజకీయ నాయకులు, గ్రామానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు తనకు ఉపసర్పంచ్ పదవి రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. సాక్షాత్తు గ్రామంలో మంత్రి, ఆయన కుమారుడు చెప్పిన మాటకు విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా, గ్రామంలో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సైతం ఆమె బహిరంగంగా అసహనం వ్యక్తం చేశారు. హామీల అమలులో కాంగ్రెస్ విఫలం జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ప్రైవేట్ ఎంప్లాయిస్ యూనియన్ మహబూబ్నగర్ జిల్లా నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలను అందచేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ప్రైవేట్ రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, శ్రీనివాస్ యాదవ్ మరియు తదితరులు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు మక్తల్: టిప్పర్, బైక్ ఢీకొన్న ఘటనలో యువకుడికి తీవ్రగాయాలైన ఘటన దాసర్దొడ్డి సమీపంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. మాగనూర్ మండలం కొత్తపల్లికి చెందిన విశ్రాంత జవాన్ సంజీవ్ (35) పని నిమిత్తం బైక్పై మక్తల్కు వెళ్లి తిరిగి వస్తుండగా దాసరదొడ్డి వద్ద రాయచూర్ నుంచి మక్తల్ వైపు వస్తున్న బూడిద టిప్పర్ బైకును ఢీకొట్టింది. ప్రమాదంలో సంజీవ్కు తలకు బలమైన గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదవశాత్తు రైలు కింద పడి మృతి గద్వాల క్రైం: కదులుతున్న రైలు ఎక్కబోయి ప్రమాదవశాత్తు కిందపడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం మధ్యాహ్నం గద్వాల రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. రైల్వే హేడ్ కానిస్టేబుల్ అశోక్ తెలిపిన కథనం మేరకు.. వనపర్తి జిల్లాకు చెందిన చాకలి కొండన్న గద్వాల నుంచి గుంతకల్కు బయలుదేరాడు. ఈ క్రమంలో రైలు కదులుతుండగా ఎక్కే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు కాలు జారీ రైలు కిందపడ్డాడు. ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు రైల్వే హేడ్ కానిస్టేబుల్ తెలిపారు. రైలు కిందపడి వ్యక్తి దుర్మరణం మానవపాడు: రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని నారాయణపురం రైల్వేట్రాక్పై చోటుచేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ అశోక్కుమార్ తెలిపిన కథనం ప్రకారం.. మండలంలోని నారాయణపురం శివారు ప్రాంతంలో రైలు కిందపడి గుర్తు తెలియిని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి శరీరంపై బనియన్, గోధుమ రంగు కలర్ షార్ట్ ఉంది. మృతుడికి సుమారు 50 ఏళ్ల ఉండవొచ్చన్నారు. కర్నూలు జిల్లాలోని సి.బెళగల్ నుంచి కర్నూల్కు ఆర్టీసీ బస్సులో ప్రయాణించినట్లు మృతుడి వద్ద టికెట్ లభించిందని తెలిపారు. మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంచామని, సమాచారం తెలిసిన వారు గద్వాల రైల్వే హెడ్ కానిస్టేబుల్ 83412 52529 సంప్రదించాలన్నారు. -
సాహిత్యం ద్వారానే సమాజంలో మార్పు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: సాహిత్యం ద్వారానే సమాజంలో మార్పు తీసుకొచ్చే అవకాశం ఉందని ఆర్జేడీ రాజేందర్సింగ్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో గోవర్ధన్ రచించిన ఐదు శతకాలను ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. పద్య రచనపై గోవర్ధన్ అభిరుచి చాలా ఉన్నతమైందని, ఇప్పటి వరకు 9 శతకాలు రచించడం చాలా గొప్ప విషయం అన్నారు. ఇవి సమాజంలో వ్యక్తులను ఆలోచింపజేసే విధంగా ఉన్నాయని, ఇటువంటి చరనలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు పొందేందుకు ఆస్కారం ఉందని తెలిపారు. భవిష్యత్లో గోవర్ధన్ కలం నుంచి మరిన్ని శతకాలు రావాలని ఆకాంక్షించారు. ఈమేరకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన కవి కసిరెడ్డి వెంకటరెడ్డి పద్యం యొక్క ప్రధాన్యతను ఆయన వివరించారు. గోవర్ధన్ రచించిన బిజేపల్లి వెంకటేశ శతకం, పద్యోపహారం, ఈరా శతకం, కంద మకరందాలు, వాణి త్రిశతిలు ఉన్నాయి. వీటిలో దేవుళ్ల పేరుపై శతకాలు ఉన్న ఇందులో అంశాలు సమకాలిన సమాజిక అంశాలతో మిలితమై ఉంటాయని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పద్మావతి, ఆర్జేడీ–1 బాలుభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
స్వాతి? సుజాత?.. సర్పంచ్ ఎవరో??
మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గ్రామంలో ఎన్నికల ఫలితాలపై తీవ్ర అయోమయం నెలకొంది. ఒకే పదవికి సంబంధించి ఇద్దరు అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారులు గెలుపు పత్రాలు జారీ చేయడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. వివరాలు ఇలా.. మొదటగా మూడు ఓట్ల ఆధిక్యంతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నూనావత్ స్వాతి గెలిచినట్లు ప్రకటిస్తూ రిటర్నింగ్ అధికారులు ఆమెకు గెలుపు పత్రాలు అందజేశారు. అయితే అనంతరం కాంగ్రెస్ పార్టీ రీకౌంటింగ్కు డిమాండ్ చేయడంతో మళ్లీ ఓట్ల లెక్కింపు చేపట్టారు. రీకౌంటింగ్ అనంతరం ఒక్క ఓటు ఆధిక్యంతో సానుప సుజాత గెలిచినట్లు ప్రకటిస్తూ రిటర్నింగ్ అధికారులు ఆమెకు కూడా గెలుపు పత్రాలు ఇవ్వడం గమనార్హం. దీంతో ఇద్దరు అభ్యర్థులు తామే విజేతలమని చెప్పుకుంటూ పోటీ పడుతున్నారు.ఇదే సమయంలో దామరవంచ గ్రామంలో మొత్తం 10 మంది వార్డు సభ్యులు ఉండగా, అందులో 5 మంది కాంగ్రెస్ పార్టీకి, 5 మంది బీఆర్ఎస్కు చెందినవారు గెలుపొందారు. ఈ సమబలం పరిస్థితి కూడా గ్రామ రాజకీయాల్లో అయోమయానికి దారి తీసింది. ఒకే ఎన్నికలో ఇద్దరికి గెలుపు పత్రాలు ఇవ్వడంపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ఈ గ్రామనికి సర్పంచ్ ఎవరని తేల్చాల్సింది అధికారులే -
‘మాలల చైతన్య సమితి’ కరపత్రం విడుదల
మహబూబ్నగర్ రూరల్: మాలల చైతన్య సమితి 10వ వార్షికోత్సవ కరపత్రాన్ని సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మూలె కేశవులు ఆదివారం జిల్లాకేంద్రంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2015లో మాలల చైతన్య సమితి ఆవిర్భవించి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశామన్నారు. అంతేగాక సమాజంలో దళితులపై జరిగిన దాడులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టామని గుర్తుచేశారు. ఈ నెల 28 ఉదయం 11 గంటలకు జిల్లాకేంద్రంలోని టీఎన్జీఓస్ భవనంలో వార్షికోత్సవ కార్యక్రమం ఉంటుందని.. జిల్లాలోని మాలల చైతన్య సమితి నాయకులు, ఉద్యోగులు, మేధావులు, విద్యార్థులు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు చిన్నయ్య, యాదయ్య, వెంకట్రాములు, జి.యాదగిరి, బి.చెన్నయ్య, మల్లేష్, కావలి చెన్నయ్య, జి.రాజు, కె.బాలచెన్నయ్య, కుర్మయ్య, రామచందర్, నర్సింహ, విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
శతాబ్ది ఉత్సవాలకు రావాలని సీఎంకు ఆహ్వానం
స్టేషన్ మహబూబ్నగర్: జిల్లాకేంద్రంలోని షాసాబ్గుట్ట హజ్రత్ సయ్యద్ మర్దాన్అలీషా ఖాద్రీ రహెమతుల్ల అలైహి శతాబ్ది ఉర్సు వేడుకల్లో పాల్గొనాలని కోరుతూ ఆదివారం హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డిని నిర్వాహకులు ఆహ్వానించారు. దర్గా శతాబ్ది వేడుకలు వచ్చేనెల 21 నుంచి 23వ తేదీ వరకు జరుగుతాయని, ఉత్సవాల్లో పాల్గొనాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహ్మద్ అలీ షబ్బీర్, రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి మహ్మద్ అజహరుద్దీన్, టీజీఎంఎఫ్సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా ‘పదరా పోదాం మన్యంకొండ’
● గోవింద నామస్మరణతో సాగిన పాదయాత్ర ● యాత్రలో పాల్గొన్న వేలాదిమంది భక్తులు స్టేషన్ మహబూబ్నగర్: ధర్మవాహిని పరిషత్ పాలమూరు ఆధ్వర్యంలో ఆదివారం ‘పదరా పోదాం మన్యంకొండ ’ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. జిల్లా కేంద్రం బండ్లగేరిలోగల రుక్మిణి పాండురంగస్వామి దేవాలయం నుంచి దాదాపు 2500 మంది భక్తులు మన్యంకొండ ఆలయానికి పాదయాత్రగా వెళ్లారు. బండ్లగేరి నుంచి ప్రారంభమైన పాదయాత్ర రాంమందిర్ చౌరస్తా, గ్రంథాలయం, వన్టౌన్, బండమీదిపల్లి, పాలమూరు యూనివర్సిటీ, ధర్మాపూర్ మీదుగా మన్యంకొండ దేవాలయం వరకు నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో భక్తులు పాదయాత్రకు స్వాగతం పలికారు. లక్ష గోవింద నామస్మరణ, భజనలు, హరినామస్మరణతో భక్తియాత్ర మన్యంకొండ ఆలయం వరకు కొనసాగింది. ఉదయం 7 గంటల సమయంలో ప్రారంభమైన పాదయాత్ర మధ్యాహ్నం 2 గంటలకు మన్యంకొండ ఆలయానికి చేరుకుంది. పాదయాత్రకు దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదనాచారి స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మవాహిని పరిషత్ వ్యవస్థాపకులు జ్యోషి సంతోషాచార్యులు మాట్లాడుతూ.. లోక కల్యాణం కోసం మూడోసారి మన్యకొండకు పాదయాత్ర చేపట్టడం జరిగిందన్నారు. పాదయాత్రలో వేలాదిమంది మంది భక్తులు పాల్గొన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్గౌడ్, జేపీఎన్సీఈ చైర్మన్ కేఎస్ రవికుమార్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్రెడ్డి, వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడుయాదిరెడ్డి, సంతోషాచార్యులు, స్వరలహరి కల్చరల్ అకాడమీ అధ్యక్షుడు భాగన్నగౌడ్, మన్యంకొండ దేవస్థానం బోర్డు సభ్యులు శ్రవణ్కుమార్, శాంతన్న యాదవ్, డీకే ఆంజనేయులు, నరేందర్ పాల్గొన్నారు. -
పాలమూరులో మెగా క్రికెట్ టోర్నీ
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రం పిల్లలమర్రి రోడ్డు సమీపంలోని ఎండీసీఏ క్రికెట్ మైదానం సోమవారం వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ–20 లీగ్ ప్రారంభోత్సవానికి వేదికకానుంది. విశాఖ ఇండస్ట్రీస్ సౌజన్యంతో హెచ్సీఏ ఆధ్వర్యంలో ఈ మెగా టీ–20 లీగ్ నిర్వహించనున్నారు. ఈలీగ్ ప్రారంభోత్సవం అనంతరం ఆయా జిల్లాల్లో ఉమ్మడి జిల్లాస్థాయిల్లో లీగ్లు జరగనున్నాయి. లీగ్లో భాగంగా ఈనెల 27వ తేదీ వరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా జోన్స్థాయి లీగ్ జరగనుంది. ఐదు జట్లు పాల్గొంటుండగా లీగ్ తొలి మ్యాచ్లో మహబూబ్నగర్–నాగర్కర్నూల్ జట్లు తలపడనున్నాయి. 29 జిల్లాల క్రీడాకారుల రాక తెలంగాణ అంతర్ జిల్లా టీ–20 లీగ్ ప్రారంభోత్సవంలో రాష్ట్రంలోని 29 జిల్లాల నుంచి దాదాపు 500 మంది క్రీడాకారులు హాజరుకానున్నారు. ఈ మెగా టోర్నీ ప్రారంభోత్సవంలో రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, బీసీ సంక్షేమశాఖ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి మహ్మద్ అజహరుద్దీన్తోపాటు రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారులు ఏపీ జితేందర్రెడ్డి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, హెచ్సీఏ ప్రతినిధులు హాజరున్నారు. సిద్ధమైన క్రికెట్ మైదానం తెలంగాణ జిల్లాలోనే ఎండీసీఏ మైదానాన్ని తీర్చిదిద్దారు. జాతీయస్థాయిలో మ్యాచ్లు జరిగేలా మైదానంలో టర్ఫ్ వికెట్లు, గ్రీనరీ ఏర్పాటు చేశారు. దీంతో క్రికెట్ మైదానం అంతర్జాతీయ స్థాయి స్టేడియాన్ని తలపిస్తుంది. టీ–20 లీగ్ ప్రారంభోత్సవ వేడులకు ఎండీసీఏ క్రికెట్ మైదానాన్ని అన్ని విధాలుగా సిద్ధం చేశారు. మూడురోజుల నుంచి మైదానంలో ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎండీసీఏ మైదానాన్ని ఎస్పీ జానకి పరిశీలించారు. లీగ్ నిర్వహణ వివరాలను ఎండీసీఏ ప్రతినిధులతో అడిగి తెలుసుకున్నారు. మంత్రులు రానుండడంతో పోలీసులు గట్టిబందోబస్తు చర్యలు చేపట్టనున్నారు. నేడు తెలంగాణ ఇంటర్డిస్ట్రిక్ టీ–20 లీగ్ ప్రారంభం హాజరు కానున్న ఐదుగురు మంత్రులు, హెచ్సీఏ ప్రతినిధులు టోర్నీలో పాల్గొననున్న 29 జిల్లాల జట్లు ఏర్పాట్లు పూర్తిచేసిన ఎండీసీఏ -
ఉత్సాహంగా సాఫ్ట్బాల్ ఎంపికలు
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని మెయిన్స్టేడియంలో ఆదివారం ఉమ్మడి జిల్లా సబ్జూనియర్ బాల, బాలికల సాఫ్ట్బాల్ జట్ల ఎంపికలు నిర్వహించారు. ఎంపికలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 80 మంది క్రీడాకారులు హాజరైనట్లు జిల్లా సాఫ్ట్బాల్ సంఘం సభ్యులు నాగరాజు, రాఘవేందర్ తెలిపారు. మెదక్ జిల్లా మనోహారాబాద్లో ఈనెల 24, 25 తేదీల్లో బాలికల రాష్ట్రస్థాయి సబ్ జూనియర్, 28, 29 తేదీల్లో బాలుర పోటీలు జరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు సుగుణ, వెంకటయ్య, శ్రీకాంత్, సునీత తదితరులు పాల్గొన్నారు. ఎస్జీఎఫ్ అండర్–19 కరాటే ఎంపికలు జిల్లా కేంద్రంలోని ఇండోర్స్టేడియంలో ఆదివారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా అండర్–19 విభాగం బాల, బాలికల కరాటే ఎంపికలు నిర్వహించా రు. ఎంపికలకు 50 మంది క్రీడాకారులు హాజరైనట్లు జిల్లా ఎస్జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ శారదాబాయి తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 22 నుంచి 24 వరకు వరంగల్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో పీడీ వేణుగోపాల్, కరాటే మాస్టర్లు పాల్గొన్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి లింగాల: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆంజనేయులు (32) ఆదివారం తెల్లవారుజామున మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పదరకు చెందిన ఆంజనేయులు శనివారం రాత్రి ద్విచక్ర వాహనంపై లింగాలకు వస్తున్న సమయంలో నర్సాయపల్లి గేటు దాటిన తర్వాత అడవి పందులు అడ్డురావడంతో ప్రమాదం చోటు చేసుకుంది. పందులను తప్పించబోయిన బైక్ అదుపుతప్పి కింద పడడంతో ఆంజనేయులుకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని నాగర్కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తరలించి, ప్రథమ చికిత్స అందించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడికి పదరకు చెందిన హరితతో నెల రోజుల క్రితం వివాహం జరిగింది. ఆమె మండల కేంద్రంలోని సాంఘీక సంక్షేమ శాఖ బాలుర గురుకుల పాఠశాల, కళాశాలలో నర్సుగా విధులు నిర్వహిస్తున్నారు. హరిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వరగౌడ్ తెలిపారు. జాతీయ సమైక్యతే ఆర్ఎస్ఎస్ లక్ష్యం బిజినేపల్లి: దేశ అంతర్గత శక్తులను అధిగమించడానికి ప్రతి గ్రామం నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను తయారు చేయాలని ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యవాహ నాగయ్య అన్నారు. జాతీయ సమైక్యతే ఆర్ఎస్ఎస్ లక్ష్యమని పేర్కొన్నారు. ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా పాలెంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తల పద సంచలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతిని, విలువలను కాపాడటంతో పాటు జాతీయ సమైక్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో పతంజలి యోగ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వస్పరి శివుడు, ఆర్ఎస్ఎస్ కార్యవాహకులు వాసవీ రామకృష్ణ, మహేష్, ముఖ్య శిక్షక్ కొంకలి మధు పాల్గొన్నారు. -
‘సిట్’తో దర్యాప్తు చేయించాలి
అడ్డాకుల: మూసాపేట మండలం వేముల గ్రామంలో లైంగికదాడికి గురై మృతి చెందిన దళిత యవతి కుటుంబాన్ని ఆదివారం రాత్రి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పరామర్శించారు. మృతురాలి చిత్రపటం వద్ద నివాళులర్పించి కుటుంబసభ్యులను ఓదార్చారు. అత్యాచారం జరిగిన ఘటన గురించి కుటుంబసభ్యులు, గ్రామస్తులతో ఆరా తీశారు. ఘటన తర్వాత జరిగిన పరిణామాలను తెలుసుకుని కుటుంబసభ్యులకు మనోధైర్యం కల్పించారు. అనంతరం ఘటన జరిగిన రైతు వేదిక వద్దకు వెళ్లి పరిశీలించారు. తర్వాత అక్కడే విలేకరులతో మాట్లాడారు. అత్యాచార ఘటనపై ప్రభుత్వం వెంటనే సిట్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఘటనపై జిల్లా ఎస్పీ ఇచ్చిన స్టేట్మెంట్ ఫైనల్ అన్న నిర్ణయానికి రావద్దని కోరారు. జరిగిన ఘటనపై మరోసారి సమీక్ష చేయాలని డిమాండ్ చేశారు. నిందితుడు విష్ణుతో పాటు మరి కొందరు అత్యాచార ఘటనకు పాల్పడి ఉండవచ్చని బంధువులు, గ్రామస్తులకు అనుమానాలు ఉన్నాయన్నారు. ఘటన స్థలంలో జరిగిన రక్తస్రావం, మద్యం బాటిళ్లు ఉండటం అనేక అనుమానాలకు తావిస్తున్నట్లు చెప్పారు. ఈ కేసులో పూర్తిస్థాయి దర్యాప్తు జరగక ముందే ఎలాంటి రాజకీయ కోణం చూడొద్దని జిల్లా ఎస్పీ మాట్లాడటం సమంజసం కాదన్నారు. రాజకీయ కోణం చూడాలని ఎవరూ ఫిర్యాదు చేయలేదని, ఎస్పీ స్టేట్మెంట్ను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. విష్ణు ఫోన్ కాల్ లిస్టును పరిశీలించి ఘటన సమయంలో ఎవరికి ఫోన్ చేశారన్న దాన్ని బయట పెట్టాలని కోరారు. కేసులో నిందితులు ఒకరి కంటే మించి ఉండటానికి అవకాశం ఉన్నందున సిట్తో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని పేర్కొన్నారు. ఆయన వెంట ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి జంగయ్య, ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సందె కార్తీక్ మాదిగ, ఎరుకలి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు పుతాడి కుమార్, డీఎస్ మహేష్ తదితరులు ఉన్నారు. కుక్కల దాడిలో 23 గొర్రె పిల్లలు మృతి గోపాల్పేట: కుక్కలు దాడి చేయడంతో 23 గొర్రె పిల్లలు మరణించిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. బాధిత గొర్రెల కాపరి తెలిపిన వివరాల మేరకు.. రేవల్లి మండలంలోని తల్పునూరు గ్రామానికి చెందిన దొడ్డి మల్లేష్ 23 గొర్రె పిల్లలను తన పొలం వద్ద పెంచుతున్నాడు. ఆదివారం మధ్యాహ్నం మంద వద్ద ఎవరూ లేని సమయంలో ఒక్కసారిగా కుకులు దాడి చేయడంతో 23 గొర్రె పిల్లలు చనిపోయాయి. వాటి విలువ రూ.1.5 లక్షలు ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరాడు. రేవల్లి పశువైద్య అధికారులు మాట్లాడుతూ జరిగిన నష్టంపై ప్రభుత్వానికి నివేదిక పంపుతామని, బాధిత కాపరికి న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ -
హైదరాబాద్లో ఏదుట్ల వాసి ఆత్మహత్య
గోపాల్పేట: మండలంలోని ఏదుట్ల గ్రామానికి చెందిన వ్యక్తి హైదరాబాద్లో ఉరేసుకొని మరణించాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన దక్షణమూర్తి, తిరుపతమ్మల కుమారుడు రంగయ్య (40) భార్యాపిల్లలతో కలిసి హైదరాబాద్లో కార్పెంటర్ పనులు చేసుకుంటూ జీవించేవాడు. ఏం జరిగిందో తెలియదు కానీ శనివారం రాత్రి పనికి వెళ్లిన చోటే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న బంధువులు, కుటుంబ సబ్యులు హైదరాబాద్కు వెళ్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. చెరువులోకి దూసుకెళ్లిన ఎద్దుల బండి ● నీట మునిగి ఎద్దులు మృత్యువాత అమరచింత: ధాన్యం బస్తాలను ఎడ్లబండిపై రైస్మిల్లుకు తీసుకెళ్తున్న క్రమంలో చెరువు కట్టను దాటుతుండగా ఎద్దులు భయపడి చెరువులోకి దూసుకెళ్లడంతో నీట మునిగి రెండు ఎద్దులు మృతి చెందగా రైతు బయటపడిన ఘటన మండలంలోని నందిమళ్ల గ్రామంలో ఆదివారం జరిగింది. బాధిత రైతు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన రైతు మాల నరసింహులు తన ఎడ్లబండిపై వరిని బియ్యంగా మార్చడానికి ధాన్యం సంచులతో ఆత్మకూర్లోని రైస్ మిల్లుకు బయలు దేరాడు. గ్రామంలోని చెరువు కట్టను దాటుతుండగా ఎద్దులు ఒక్క సారిగా భయపడి పరుగు తీశాయి. దీంతో బండితో సహా చెరువులో పడిపోయాయి. పరిస్థితిని గమనించిన రైతు అప్పటికే కిందకు దూకడంతో ప్రాణాలు కాపాడుకోగలిగాడు. విషయాన్ని సమీపంలో ఉన్న రైతులకు తెలుపగా రైతులు, గ్రామస్తులు వచ్చి చెరువులో పడిపోయిన ఎడ్ల బండిని తాడుతో ట్రాక్టర్కు కట్టి బయటకు లాగారు. అప్పటికే ఎద్దులు మృతి చెందడంతో రైతు బోరున విలపించాడు. సుమారు రూ.2 లక్షల నష్టం వాటిల్లిందని గ్రామ సర్పంచ్ రాజేందర్ రెడ్డి తెలిపారు. నష్టపోయిన రైతును ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. వ్యక్తి అనుమానాస్పద మృతి జడ్చర్ల: అనుమానస్పదంగా ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని బోయలకుంట శివారులో చోటు చేసుకుంది. మృతుడి భార్య వెంకటమ్మ కథనం మేరకు.. బోయలకుంటకు చెందిన జాజాల వెంకటేశ్ (60) బోయలకుంట శివారులోని సర్వే నంబర్లు 167, 168, 162లో 3.12 ఎకరాల భూమి ఉంది. భూమికి సంబంధించి కోర్టులో కేసు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి 7 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన భర్త తిరిగి రాలేదని, చుట్టుపక్కల వెతికినా ప్రయోజనం లేకపోయిందన్నారు. ఆదివారం ఉదయం వ్యవసాయ పొలంలో గల పశువుల కొట్టంలో తాడుతో ఉరి వేసుకుని అనుమానస్పదంగా మృతి చెందినట్లు గుర్తించామన్నారు. భూమికి సంబంధించి ఐదు రోజుల కిందట కొందరు తమ వద్దకు వచ్చి భూమి తమదంటూ బెదిరింపులకు గురిచేశారని, దీంతో మానసిక వేధన, భయాందోళనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడా.. మరే విధంగానైనా చనిపోయాడా అన్న అనుమానాలు ఉన్నాయని తెలిపారు. భూమికి సంబంధించి తమ వద్ద పట్టాదారు పాసు పుస్తకం, తదితర అన్ని ఉన్నా పత్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. తన భర్త మృతిపై పూర్తి విచారణ చేసి న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు. -
కాంగ్రెస్లో పంచాయితీ..!
పేలుతున్న నేతల మాటల తూటాలు ● వనపర్తిలో చిన్నారెడ్డిపై మేఘారెడ్డి ఘాటు వ్యాఖ్యలు ● మంత్రి వాకిటి ఇలాకాలోనూ మంటలు ● సామాజిక మాధ్యమాల్లోనూ ఇరువర్గాల పోరు ● వైరల్గా మారిన పలు పోస్టులు.. ● జిల్లాలో రసవత్తరంగా మారిన రాజకీయాలు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పంచాయతీ ఎన్నికలు ముగిసినా.. అధికార కాంగ్రెస్లో సం‘గ్రామం’ ఇంకా కొనసాగుతూనే ఉంది. ‘రెబల్స్’తో రాజుకున్న సెగ దావానలంలా ఎగిసిపడుతోంది. గెలుపును ప్రభావితం చేసిన తిరుగుబాటుదారులు.. ఓడిపోయిన వర్గాల మధ్య పోరు ఆ పార్టీ ముఖ్య నేతలను రచ్చకీడుస్తోంది. మరోవైపు కీలక బాధ్యతల్లో ఉన్న పెద్దలు సంయమనం కోల్పోయి అసహనం వ్యక్తం చేస్తుండడం.. స్వపక్షంలోని నాయకులపై బాహాటంగానే విమర్శలు గుప్పిస్తుండడం రాజకీయాలను రసవత్తరంగా మార్చాయి. ప్రధానంగా వనపర్తి, మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్లతో పాటు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నారాయణపేట జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలో పేలుతున్న మాటాల తూటాలు ఉమ్మడి పాలమూరులో హాట్ టాపిక్గా మారాయి. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలో గెలపొందిన కాంగ్రెస్ సర్పంచ్ మద్దతుదారులకు జరిగిన సన్మాన కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రహ్మతుల్లా మాట్లాడుతూ చేపలు గ్రామాలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కాంగ్రెస్ మద్దతుదారులు ఓడిపోయిన పలు గ్రామాల ప్రజలను బాహాటంగా తూర్పారబట్టడం విమర్శలకు దారితీసింది. మంత్రి వాకిటి శ్రీహరి సమక్షంలోనే ఇదంతా జరగగా.. కనీసం ఆయన వారించకపోవడంపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్గా మారాయి. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ఇటీవల పలు సందర్భాల్లో అసహనం వ్యక్తం చేశారు. కొన్నిసార్లు ఆగ్రహం వెలిబుచ్చారు. ఈ క్రమంలో తన స్వగ్రామం రంగారెడ్డిగూడలో బీజేపీ మద్దతుదారు గెలుపొందడం.. సొంత మండలం రాజాపూర్లో బీఆర్ఎస్ సత్తా చాటడంతో ఆయనలో అసహనం.. ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయనే చర్చ నియోజకవర్గంలో జరుగుతోంది. అధికార, ప్రతిపక్షాలు, వర్గాలు సామాజిక మాధ్యమాలు వేదికగా పోరు సాగిస్తుండడం హాట్టాపిక్గా మారింది. కాంగ్రెస్లో ఎమ్మెల్యే మేఘారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మధ్య తొలి నుంచీ విభేదాలు ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సైతం వారివారి వర్గాల మధ్య పోరు కొనసాగింది. ఈ నియోజకవర్గంలో జీపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పైచేయి సాధించినా.. బీఆర్ఎస్ సత్తా చాటింది. ఈ క్రమంలో ఎన్నికల అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ‘ఎమ్మెల్యేగా నాపై, నాగర్కర్నూల్ ఎంపీ మల్లురవిపై కోపం ఉంటే ప్రత్యక్షంగా చూసుకోవాలి. కాంగ్రెస్ విధేయులుగా, జెండా మోసిన కార్యకర్తలను టార్గెట్ చేయడం ఏమిటి?’ అని చిన్నారెడ్డిపై ప్రెస్మీట్లో పరోక్షంగా విమర్శలు చేయడం దుమారం రేపాయి. ప్రతిగా చిన్నారెడ్డి వర్గీయులు సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్టులు వైరల్గా మారగా.. నియోజకవర్గం అట్టడుకుతోంది. వనపర్తి పంచాయతీ ఎన్నికల్లో అవకాశం ఉన్నా.. సర్పంచ్ స్థానాల్లో గెలవకపోవడంపై ఉమ్మడి పాలమూరులోని పలువురు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్రెడ్డి అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు, స్థానిక నేతల మధ్య సమన్వయ లోపాన్ని సైతం వారికి ఎత్తిచూపినట్లు తెలుస్తోంది. కొందరు ఎమ్మెల్యేలు వారి బంధువులు, అనుచరులకు పార్టీ తరఫున మద్దతిచ్చి నిలబెట్టడం ‘రెబల్స్’ బరిలో ఉండేందుకు ఆస్కారమిచ్చిందని.. దీంతో ఓట్లు చీలిపోయి ప్రతిపక్షానికి కలిసి వచ్చిందంటూ ఉదాహరణలతో వారిని ఎండగట్టినట్లు సమాచారం. వచ్చేవి పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు.. జాగ్రత్తగా వ్యవహరించాలని.. డీసీసీలు సైతం పక్కా కార్యాచరణతో విజయం సాధించేలా శ్రమించాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సీఎం ఎవరెవరికి చీవాట్లు పెట్టారు.. ఇప్పటికై నా కాంగ్రెస్ ముఖ్యనేతల్లో మార్పు వచ్చేనా అనే చర్చ పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది. -
22,710 కేసుల పరిష్కారం
పాలమూరు: లోక్ అదాలత్లో ఒక్కసారి రాజీ అయితే శాశ్వత పరిష్కారం లభిస్తుందని, కక్షిదారులు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత అన్నారు. ఇరువర్గాలకు సమయం ఆదా కావడంతో పాటు ప్రశాంత జీవనం లభిస్తోందన్నారు. జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం కోర్టు ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో న్యాయమూర్తి మాట్లాడారు. జిల్లా ప్రధాన కోర్టులో నాలుగు బెంచీలు, జడ్చర్ల కోర్టులో రెండు బెంచీలు ఏర్పాటు చేసి ఒక్కో బెంచీలో ఒక న్యాయమూర్తి ఆధ్వర్యంలో కేసులు పరిష్కరించారు. దీంతో రాత్రి 8 గంటల వరకు ఆరు బెంచీల్లో కలిపి 22,710 కేసులు పరిష్కరించారు. అదేవిధంగా మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులో నష్టపరిహారం కింద ఒకరికి రూ.66 లక్షలు, మరొకరికి రూ.22 లక్షలు అవార్డును కక్షిదారులకు న్యాయమూర్తి అందించారు. ఓ దివ్యాంగుడికి వీల్ఛైర్, మరొకరికి ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో ఎస్పీ డి.జానకి, న్యాయమూర్తులు కల్యాణ్ చక్రవర్తి, ఇందిర, రాధిక, మమతారెడ్డి, భావన, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జాతీయ లోక్ అదాలత్లో పోలీస్ శాఖకు సంబంధించి మొత్తం 1,780 కేసులు పరిష్కరించారు. ఇందులో ఐపీసీ 197, డ్రంకన్డ్రైవ్ 499, ఈ–పెట్టీ కేసులు 1059 రాజీ చేశారు. అలాగే సైబర్ నేరాల్లో రూ.25 వేల లోపు నష్టపోయిన వాటిలో ఎఫ్ఐఆర్ కానీ వాటిలో 89 కేసులు పరిష్కరించి రూ.4.22లక్షల నగదు ఆయా బాధితుల ఖాతాల్లో జమ చేశారు. రూ.25 వేల కంటే ఎక్కువ నగదు కోల్పోయి ఎఫ్ఐఆర్ అయిన కేసుల్లో 25 కేసులు పరిష్కరించి రూ.12.74 లక్షల నగదు సంబంధిత బాధితుల ఖాతాల్లో జమ చేశారు. కక్షిదారులకు నష్టపరిహారం అందజేత పోలీస్ శాఖలో 1780 కేసులు రాజీ సైబర్ నేరాల్లో రూ.17లక్షల నగదు బాధితుల ఖాతాల్లో జమ -
పల్లె మురవాలె
పాలన మెరవాలె.. కొత్త సర్పంచ్లకు సమస్యల స్వాగతం గ్రామ పంచాయతీ పరిధిలో పెండింగ్లో ఉన్న ప్రతి పనిని పూర్తి చేసేందుకు కృషి చేస్తా. ప్రజలు నాకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా. అందరికీ నిత్యం అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తా. నిర్మాణంలో ఉన్న పంచాయతీ భవనాన్ని త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తా. – కె.రాకేష్, సర్పంచ్, చౌదర్పల్లి పెద్ద తండా, మహమ్మదాబాద్ నా భర్త శ్రీనునాయక్ గతంలో సర్పంచ్గా పని చేశారు. సేవ చేస్తానన్న నమ్మకంతో ప్రజలు ఈసారి నాకు పట్టం కట్టారు. తండాలో మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా పని చేస్తా. వార్డు సభ్యుల సహకారంతో అభివృద్ధి పనులు చేపడతాం. తండా రూపురేఖలు మార్చేందుకు కృషి చేస్తాం. – కె.జ్యోతి, సర్పంచ్, మాచన్పల్లి తండా, మహబూబ్నగర్ రూరల్ గ్రామాల్లో కొత్త పాలక వర్గాలు కొలువుదీరనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిబంధనల ప్రకారం సోమవారం ప్రమాణ స్వీకార కార్యక్రమం కొనసాగుతుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ఎండీపీఓలకు ఆదేశాలు జారీ చేశాం. ఇలాంటి పొరపాట్లు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. – వెంకట్రెడ్డి, ఇంచార్జీ డీపీఓ జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): పల్లె సీమలే దేశానికి పట్టుకొమ్మలు. గ్రామాల్లో సర్పంచ్ పదవి బాధ్యతాయుతమైంది. గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా ప్రభుత్వం 1959లో జిల్లా, బ్లాక్, గ్రామ పంచాయత్ అనే మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. స్థానిక ప్రజల అవసరాలకనుగుణంగా వనరుల వినియోగం, శాశ్వతమైన పరిపాలన అమలుకు యంత్రాంగం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గ్రామీణుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చాలనే సంకల్పంతో ఏర్పాటైన పంచాయతీరాజ్ వ్యవస్థ రోజురోజుకు గాడి తప్పుతోంది. ఏ పల్లెలో చూసినా సమస్యలు తిష్ట వేశాయి. సీసీలకు నోచుకోని అంతర్గత రోడ్లు, లోపించిన పారిశుద్ధ్యం, నేటికీ సొంత భవనాలకు నోచుకోని పంచాయతీలు ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలో నూతనంగా గెలిచిన సర్పంచ్లు సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టనుండగా.. ఏ మేరకు ఆయా సమస్యలను పరిష్కరిస్తారో.. పాలన ఏ విధంగా సాగిస్తారో వేచిచూడాల్సి ఉంది. జిల్లాలో 423 గ్రామ పంచాయతీలు ఉండగా 134 జీపీలకు పక్కా భవనాలు లేవు. ఇందులో 42 కార్యాలయాలు అద్దె భవనాల్లో, 92 భవనాలు కమ్యూనిటీ హాళ్లు, అంగన్న్వాడీ కేంద్రాలు, పాఠశాలలు ఇతరత్రా సెంటర్లలో తాత్కాలికంగా సర్దుబాటు చేసి పంచాయతీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. కొన్ని చోట్ల రేకుల షెడ్లలో కూడా భవనాలు కొనసాగుతున్నాయి. మరికొన్ని భవనాలు శిఽథిలావస్థకు చేరాయి. చాలా కార్యాలయాలకు మరుగుదొడ్లు, మూత్రశాలలు లేకపోవడంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం గత ప్రభుత్వం తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. తండాలతో పాటు కొన్ని గ్రామ పంచాయతీలకు గూడు లేకుండాపోయింది. ప్రభుత్వం పలు జీపీలకు నూతన భవనాలను మంజూరు చేసినా నిధుల కొరత కారణంగా మధ్యలో నిలిచిపోయాయి. సొంత భవనాలకు నోచుకోని పంచాయతీలు ఎన్నో.. అద్దె భవనాలు, పాఠశాలలు, అంగన్వాడీల్లో కొనసాగింపు చెట్ల కిందే గ్రామసభల నిర్వహణ నేడు కొలువుదీరనున్న నూతన పాలకవర్గాలు రెండేళ్లుగా గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు లేక పల్లెపాలన అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించినా నిధులలేమి సమస్యతో ఇప్పటి వరకు పల్లెబాట పట్టలేదు. దీంతో స్థానిక కార్యదర్ములు ఎలాగోలా నెట్టుకొచ్చారు. కార్యదర్శులు తమకున్న అధికార పరిధిలో పరిపాలన అందించినా ప్రజాప్రతినిధులు లేక ప్రజలు సైతం సమస్యలను భరిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధులు ఆలస్యమైనా పాలకవర్గాలు ఉంటే సర్పంచ్, వార్డు సభ్యులు తమ పలుకుబడిని ఉపయోగించి ప్రజల కనీస అవసరాలైన తాగునీరు, వీధి దీపాలు, మురుగు కాల్వలను శుభ్రం చేయించే పరిస్థితి ఉండేది. జిల్లా అధికారులు, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలకు స్థానిక సమస్యలు వివరించి అదనపు నిధులు రాబట్టేందుకు పాలకవర్గాలు ప్రయత్నించేవారు. సోమవారం సర్పంచ్లు బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో పల్లె పాలనలో గాడిలో పడనుంది. -
జాతర్ల సందడి
పాలమూరులోని ప్రముఖ ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు ● కార్తీక మాసంలో మొదలై.. ఉగాది పండుగ వరకు వేడుకలు ● తమ ఇంటి ఇలవేల్పుగా కొలిచి మొక్కుల చెల్లింపు ● మట్టికుండలో భోజనం, పచ్చిపులుసుతో నైవేద్యం ● ఉమ్మడి జిల్లాలోని పలు ఆలయాలకు తిరుమలతో సారూప్యత ● వివిధ రకాల వేలం పాటలు, హుండీ ద్వారా రూ.కోట్లలో ఆదాయం ఆర్జన కురుమూర్తి.. ఘన కీర్తి చిన్నచింతకుంట మండలం అమ్మాపురంలో వెలసిన కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు, జాతర దీపావళి అమావాస్యతో మొదలవుతుంది. రాష్ట్రంలోని మేడారం తర్వాత ఆ స్థాయిలో ఇక్కడికే జనాలు ఇక్కడికి తరలివస్తారు. అలాగే స్వామివారు తిరుపతి వేంకటేశ్వరస్వామి మాదిరిగానే ఏడుకొండల మధ్య కాంచనగుహలో కొలువుదీరారు. మరెక్కడా లేని విధంగా ఉద్దాల ఉత్సవం (పాదరక్షల ఊరేగింపు) ప్రధాన ఘట్టంగా నిలుస్తోంది. చిన్నవడ్డెమాన్లో మొదలయ్యే ఈ ఊరేగింపు అప్పంపల్లి, తిర్మలాపూర్ గ్రామాల మీదుగా కురుమూర్తికి చేరుకుంటుంది. జాతర దాదాపు నెలరోజులపాటు సాగినా.. భక్తుల రద్దీ దృష్ట్యా మరికొన్ని రోజులు పొడిగించిన సందర్భాలు కోకొల్లలు. అలాగే ఇక్కడ లభించే కాల్చిన మాంసం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి మాంసప్రియులు తరలివస్తారు. ప్రత్యేకం.. గంగాపూర్ ఆలయం గంగాపూర్ గ్రామంలో వెలసిన శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయం కోణార్క్ సూర్యదేవాలయం ఒకే విధంగా నిర్మించారని ప్రతీతి. ఈ ఆలయం చతురస్త్రాకారంలో నిర్మితమై ఉండటం ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. అలాగే మెట్లు సైతం చతురస్త్రాకారంలో మెట్లు నిర్మించడం వల్ల ఎటు నుంచి చూసినా కోనేరు ఒకేలా కనిపిస్తుంది. స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రతిఏటా మాఘశుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు కొనసాగుతాయి. ఇక్కడ స్వామివారి కల్యాణోత్సవం, పెద్ద తేరు (రథోత్సవం), చిన్న తేరు (పుష్పరథం), శకటోత్సవం ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఆలయం పడమర ప్రాంతమైన కోయిలకొండ, కోస్గి, కొడంగల్, తాండూరు, నారాయణపేట నుంచి అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తారు. తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు హాజరవుతారు. కాగా.. జనవరి 19 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. -
నల్లమల చరిత్ర సంతృప్తినిచ్చింది
మన్ననూర్: నల్లమల అటవీ ప్రాంతం, సహజ సంపద, జీవవైవిధ్యం, పర్యాటక అంశాలు తనను ఎంతగానో ఆకర్శించాయని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్వర్కుమార్ అన్నారు. శ్రీశైలం పుణ్యక్షేత్రంను దర్శించుకున్న ఆయన తిరుగు ప్రయాణంలో శనివారం మన్ననూర్లోని మృగవాణి గెస్టు హౌస్లో నాగర్కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్తో సమావేశమై కొద్దిసేపు చర్చించారు. ఈ సందర్భంగా నల్లమల పరివాహక ప్రాంతంతోపాటు అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యం, చారిత్రక ప్రదేశాలు, శైవక్షేత్రాలు, జలపాతాలు, వన్యప్రాణి సంరక్షణ, జీవవైవిధ్యం, జంగల్ సఫారీ, టూరిజం అభివృద్ధి తదితర అంశాల గురించి సమగ్రంగా అడిగి తెలుసుకున్నారు. నల్లమలలో ఎకో టూరిజం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు జరుగుతున్నాయని తెలిపారు. అదేవిధంగా జిల్లాలో బూత్ స్థాయి అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతున్న ఓటర్ల నమోదు ప్రక్రియ, ఓటరు జాబితా ఆధునీకరణ, ఎన్నికల నిర్వహణకు తీసుకుంటున్న ముందస్తు ఏర్పాట్ల గురించి కలెక్టర్ వివరించారు. అనంతరం సీఈసీ మాట్లాడుతూ ఈ పర్యటన తనను ఎంతగానో ఆకట్టుకోవడంతోపాటు చిరస్థాయిగా గుర్తుండిపోతుందని సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ పనివిధానంను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, డీఎఫ్ఓ రేవంత్చంద్ర తదితరులు పాల్గొన్నారు. సీఈసీ జ్ఞానేశ్వర్కుమార్ -
లైంగికదాడి ఘటనలో నిందితుడి అరెస్ట్
● మూసాపేట పీఎస్లో వివరాలు వెల్లడించిన ఎస్పీ జానకి అడ్డాకుల: మూసాపేట మండలం వేములలో దళిత యువతిని అత్యాచారం చేయడంతో యువతి మృతిచెందిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ డి.జానకి మూసాపేట పోలీస్ స్టేషన్లో శనివారం సాయంత్రం వెల్లడించారు. ఎస్పీ కథనం ప్రకారం.. వేములకు చెందిన తిరుపతయ్యకు ఇద్దరు భార్య లు. పెద్ద భార్య జయమ్మతో కలిసి తిరుపతయ్య వేములలో నివాసం ఉంటున్నాడు. చిన్న భార్య పద్మ చిన్నచింతకుంట మండలం పల్లమర్రిలో నివాసముంటుండగా.. ఆమె కుమారుడు, నిందితుడు సంగు విష్ణు అక్కడే ఉంటున్నాడు. నిందితుడు తరచూ వేములకు వచ్చిపోయేవాడు. ఈ క్రమంలో రెండేళ్ల కిందట వినాయక చవితి నిమజ్జనానికి వచ్చినప్పుడు మృతురాలు యువతి (21)కు విష్ణుతో పరిచయం ఏర్పడింది. ఇద్దరు తరచూ ఫోన్లో మాట్లాకునేవారు. ఈ క్రమంలో ఈనెల 15న విష్ణు వేములకు వచ్చాడు. 17న ఎన్నికలు పూర్తయి ఊరేగింపు జరుగుతుండగా.. రాత్రి 8గంటల సమయంలో యువతికి ఫోన్ చేసి రైతువేదిక వద్దకు రమ్మని పిలిచాడు. రైతువేదిక వద్దకు రాగానే ఆమెతో మాట్లాడుతూ.. లైంగిక దాడి చేశాడు. ఈ క్రమంలోఆమె స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే బంధువు భారతికి ఫోన్ చేసిన విష్ణు ఆమె రాగానే బాధితురాలిని సమీపంలోని అంగన్వాడీ కేంద్రం వద్దకు తీసుకెళ్లారు. తర్వాత భారతితోపాటు వారి బంధువులైన అరుణ్, అజయ్తో కలిసి స్థానిక ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో తల్లి సత్యమ్మను పిలిచి శివకుమార్ ఆటోలో జానంపేటకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో అంబులెన్స్ రాగా అందులో జానంపేట పీహెచ్సీకి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతిచెందినట్లు నిర్ధారించారు. మరుసటి రోజు ఉదయం మృతురాలి తండ్రి శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేశారని తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలను సేకరించారని చెప్పారు. నిందితుడు విష్ణును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఈ కేసులో ఇంకా ఎవరి ప్రమేయమేమైనా ఉందా అన్నదానిపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఎవరికైనా వివరాలు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. ఇందులో ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేదని పేర్కొన్నారు. సమావేశంలో మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, భూత్పూర్ సీఐ రామకృష్ణ, ఎస్బీ సీఐ బాలరాజు, ఎస్ఐ వేణు తదితరులు ఉన్నారు. -
రాజీ మార్గం.. ఇరువర్గాలకు న్యాయం
● నేడు జాతీయ లోక్ అదాలత్ మహబూబ్నగర్ క్రైం: దేశ్యాప్తంగా న్యాయస్థానాల్లో ఎన్నో కేసులు వివిధ కారణాలతో పెండింగ్లో ఉంటున్నాయి. సకాలంలో న్యాయం పొందక..ఏళ్లుగా తిరుగుతూ ఆర్థిక, శారీరకంగా వ్యయప్రయాసలకు లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో లోక్ అదాలత్లలో ఇరు వర్గాలను ఒకే వేదికపై హాజరుపర్చి న్యాయమూర్తుల సమక్షంలో వారి సమస్యలను సామరస్యంగా రాజీ పద్ధతిలో సమస్యలకు వెంటనే పరిష్కారం దొరుకుతుంది. ఈ నేపథ్యంలో కోర్టు పరిధిలో రాజీ పడదగిన కేసులన్నింటినీ పరిష్కరించుకునేందుకు ఆదివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా 5 బెంచీలు ఏర్పాటు చేశారు. ఇందులో జిల్లా కోర్టులో 3 బెంచీలు, జడ్చర్లలో 2 బెంచీలలో కేసుల సివిల్, మోటార్ వెహికిల్, ఫ్యామిలీ కేసులు రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చు. అన్ని రకాల సివిల్, క్రిమినల్ కేసులు, భూ తగాద కేసులు, కుటుంబ వివాదకేసులు, మోటార్ వెహికిల్ కేసులను ఇద్దరు రాజీపడి కేసులను పరిష్కరించుకోవచ్చు. హత్యలు, హత్యాయత్నాలు, అత్యాచారాలు, బాలికపై లైంగిక దాడులు, దొంగతనాలు, దోపిడీలు, ప్రత్యేక చట్టాలపై నమోదైన కేసులను, క్రూరమైన కేసును లోక్ అదాలత్లో రాజీకి వీల్లేదు. -
జోగుళాంబ సన్నిధిలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్
అలంపూర్: దక్షిణ కాశీ అలంపూర్ క్షేత్ర ఆలయాలను ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టీ. రవిశంకర్ కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు. అధికారులు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన బాలబ్రహ్మేశ్వర స్వామి, జోగుళాంబ అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు వారిని శేషవస్త్రాలతో సత్కరించారు. అర్చకులు వారికి తీర్ధ ప్రసాదాలు అందజేసి అశీర్వచనం పలికారు. ఈ క్షేత్ర ప్రశస్త్యాన్ని వారికి వివరించారు. వీరితోపాటు అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
మన్యంకొండలో వైభవంగా తిరుచ్చి సేవ
మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం రాత్రి స్వామివారి తిరుచ్చి సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి శనివారం రాత్రి స్వామివారి తిరుచ్చిసేవ నిర్వహిస్తారు. అందులో భాగంగానే ఈ పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహంచారు. ఈ సందర్భంగా స్వామివారిని గర్బగుడి నుంచి శోభయమానంగా అలంకరించిన తిరుచ్చివాహనం పై దేవస్థానం ముందున్న మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. సన్నాయి వాయిధ్యాలు, భక్తుల హరినామశ్చరణ మధ్య ఊరేగింపు ముందుకు కదిలింది. మండపం వద్ద ప్రత్యేక పూజల అనంతరం స్వామివారిని మళ్లీ గర్భగుడి వద్దకు తీసుకవెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా నలుమూలల నుంచి ఈ సేవను తిలకించడానికి భక్తులు అధి క సంఖ్యలో మన్యంకొండకు తరలివచ్చా రు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మ ధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారితోపాటు పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. -
23న గవర్నర్, 24న సీఎం పర్యటన
వనపర్తి/ కోస్గి రూరల్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో మంగళవారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, బుధవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వనపర్తి జిల్లా పర్యటనకు విచ్చేస్తున్నారని, ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో ముఖాముఖిలో పాల్గొంటారని, ఇందుకోసం పలువురు ప్రముఖులను ఆహ్వానించాలని ఆర్డీఓ సుబ్రహ్మణ్యంకు సూచించారు. ప్రొటోకాల్, బందోబస్తు, స్టాళ్ల సందర్శన, డయాస్, సౌండ్ సిస్టం, కరెంట్ సరఫరా తదితరవి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని, విద్యార్థులతో సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా ప్రొఫైల్తో పాటు వివిధ రంగాల్లో జిల్లా సాధించిన అభివృద్ధి గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్లు కొడంగల్ నియోజకవర్గంలోని నూతన సర్పంచ్లతో ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా ఈ నెల 24న కోస్గికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రానున్నారని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్, వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్జైన్ తెలిపారు. శనివారం కోస్గిలోని లక్ష్మీనరసింహ ఫంక్షన్హాల్లో ఇరు జిల్లాల అధికారులతో వారు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొడంగల్ నియోజకవర్గంలో 8 మండలాలకు చెందిన నూతన సర్పంచ్ల సన్మాన కార్యక్రమానికి ఏర్పాట్లు చేపట్టాలని, 24న మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి హెలికాప్టర్లో కోస్గికి చేరుకుంటారన్నారు. అలాగే, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారని, వారికి వసతులు కల్పించాలన్నారు. సన్మానం అనంతరం ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులతోపాటు నూతన సర్పంచ్లు మధ్యాహ్న భోజనం చేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యమంత్రి వచ్చి.. వెళ్లే వరకు అన్ని బాధ్యతలను సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించాలని, పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్త వహించాలని అధికారులను ఆదేశించారు. -
రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి
చిన్నచింతకుంట: రోడ్డు ప్ర మాదంలో గాయపడిన వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని అల్లీపురంలో చోటుచేసుకుంది. ఎస్ ఐ ఓబుల్రెడ్డి కథనం ప్రకా రం.. అడ్డాకుల మండలం ముత్యాలంపల్లికి చెందిన ఎండీ మహిమూద్( 31) శుక్రవారం తెల్లవారుజామున అత్తగారి ఊరైన ఆత్మకూర్ నుంచి ముత్యాలంపల్లికి వెళ్తుండగా.. అల్లిపురం సమీపంలో రోడ్డుపై నిలిచి ఉన్న ట్రాక్టర్ను ఢీకొట్టాడు. మహిమూద్ కు తీవ్రగాయాలు కాగా.. వెంటనే తన మిత్రు డు సంజీవయ్య ఘటనా స్థలానికి చేరుకొని ఆత్మకూర్ ఆస్పత్రికి తరలించాడు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఈఎస్ఐ ఆస్పత్రికి తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. సంజీవయ్య ఫిర్యాదు మేరకు శనివారం కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. మహిళ అదృశ్యం తిమ్మాజిపేట: మహిళ అదృశ్యమైన ఘటన శనివారం మండలంలోని ఆవంచలో చోటుచేసుకుంది. ఎస్ఐ హరిప్రసాద్రెడ్డి వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కర్నె సావిత్రమ్మ ఊర్కొండ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్తున్నానని ఈ నెల 5న చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో ఎంత వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. సావిత్రమ్మ కుమారుడు శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. నేడు కవిత పర్యటన గద్వాల: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల 21, 22 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నట్లు తెలంగాణ జాగృతి నాయకుడు గొంగళ్ల రంజిత్కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జాగృతి–జనంబాట కార్యక్రమంలో భాగంగా ఆమె జిల్లాకు వస్తున్నట్లు పేర్కొన్నారు. పులి ఆనవాళ్లు కనిపిస్తే సమాచారం ఇవ్వండి పెంట్లవెల్లి: గ్రామాల్లో అటవీ అధికారులు నిత్యం పర్యటిస్తుంటారని.. పులి ఆనవాళ్లు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కొల్లాపూర్ అటవీ అధికా రి కాశన్న తెలిపారు. రెండ్రోజుల కిందట ఎంగంపల్లితండాలో పెద్దపు లి జా డలు కనిపించడంతో అధికారులు అప్రమత్తమై అడ విప్రాంత పల్లెల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శనివారం మండలంలోని మల్లేశ్వ రం గ్రామంలో సిబ్బందితో కలిసి ఆయ న ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామస్తులు భయభ్రాంతులకు గురికావద్దని, పొలాలు, గొర్రెలు, పశువుల మేపునకు వెళ్లే రైతులు, కాపరులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది ముజీబ్, నర్సింహనాయుడు, కురుమయ్య పాల్గొన్నారు. -
విపత్తుల నివారణపై 6 ప్రాంతాల్లో మాక్ డ్రిల్
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): భారీ వర్షాలు, వర దలు కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, చెరువులు పొంగి ప్రవహించడం వలన ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా విపత్తుల నిర్వహణపై ఈనెల 22వ తేదీన జాతీయ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఆదేశాల ననుసరించి జిల్లాలో ఆరు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ తెలిపా రు. శనివారం సంబంధిత అధికారులతో వీసీ నిర్వ హించారు. జిల్లాలో జడ్చర్ల ఏరియా ఆస్పత్రిలో వరదల వలన లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, ఆస్పత్రి గ్రౌండ్ ఫ్లోర్లో వరదలు వస్తే ఏవిధంగా విపత్తు నిర్వహణ చేస్తారు, కృష్ణసాగర్ చెరువులో నీటి మట్టం పెరిగి వ్యక్తి కొట్టుకుపోవడం, మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలో రామయ్యబౌలిలో వర్షం వరద నీరు ఇళ్లలోకి చేయడం, దివిటిపల్లిలో అమరరాజా బ్యాటరీకి వెళ్లే రోడ్డు తెగిపోవడం, మోదెంకుంట చెరువు నీటి మట్టం పెరిగి, లోతట్టు కాలనీలు జలమయం కావడం వంటి సంఘటనలు జరిగితే వివిధ శాఖల అధికారులు ఏ విధంగా స్పందించి సహాయక చర్యలు చేపడుతారో మాక్డ్రిల్ నిర్వహిస్తారని పేర్కొన్నారు. దీని వల్ల వరదల సమయంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, అత్యవసర పరిస్థితుల్లో రక్షణ చర్యలు, పార సహాయక చర్యలు, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు, గాయపడిన వారికి తక్షణ వైద్య సేవలు అందించే విధానాలపై అవగాహన కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ, పోలీస్ , అగ్నిమాపక, ఆరోగ్య , మునిసిపల్, పరిశ్రమల శాఖతో పాటు ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొనాలని ఆదేశించారు. సమావేశంలో ఏఎస్పీ రత్నం, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి కిషోర్, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డా.మధుసూదన్గౌడ్, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం యాదయ్య, డీఎంహెచ్ఓ కృష్ణ, ఇరిగేషన్, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ దుర్మరణం
నాగర్కర్నూల్ క్రైం/ పెద్దకొత్తపల్లి: విధులు ముగించుకొని ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తున్న ఓ కానిస్టేబుల్ గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ సతీష్ కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా రేవల్లి మండలంలోని శాయినిపల్లికి చెందిన ఆంజనేయులు(32) పెద్దకొత్తపల్లి పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఆంజనేయులు శుక్రవారం రాత్రి విధులు ముగించుకొని స్వ గ్రామానికి బైక్పై వెళ్తుండగా మండలంలోని వావిల్లబావి వద్ద జాతీయ రహదారి–167కేపై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని నాగర్కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటనపై ఆంజనేయులు భార్య మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కానిస్టేబుల్ కుటుంబానికి అండగా ఉంటాం రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కానిస్టేబుల్ ఆంజనేయులు కుటుంబానికి పోలీసుశాఖ తరపున అండగా ఉంటామని ఎస్పీ సంగ్రామ్ సింగ్జి పాటిల్ తెలిపారు. ఎస్పీ శనివారం జనరల్ ఆస్పత్రి వద్దకు చేరుకుని కానిస్టేబుల్ మృతదేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు లాంచనాలతో కానిస్టేబుల్కు అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ శ్రీనివాసులు తదితరులున్నారు. -
ఆవిష్కర్తలకు గొప్ప వేదిక టీజీఐసీ
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): నూతన ఆవిష్కర్తలకు టీజీఐసీ గొప్ప వేదికని.. సద్వినియో గం చేసుకోవాలని మహబూబ్నగర్ అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అన్నారు. శనివారం పుర పరిధిలోని ఎదిర ఐటీ టవర్లో శ్రీఇన్నోవేషన్ పంచాయత్శ్రీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రోటో టైపింగ్, మార్కెట్ యాక్సె స్ అండ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న ఆవిష్కర్తలు, వ్యవస్థాపకుల ఇబ్బందులను తొలగించి విజయానికి కావాల్సిన సాంకేతిక వ్యూహాత్మాక సహకారం అందించడానికి టీజీఐసీ సిద్ధంగా ఉందన్నారు. ఇది ఒక గొప్ప అవకాశమని.. వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. సందేహాలు నివృత్తి చేసుకొని తదుపరి కార్యాచరణపై స్పష్టత పొందాలని కోరారు. తెలంగాణ ఇన్నోవేషన్సెల్ సీఈఓ మెరాజ్ ఫహీమ్ మాట్లాడుతూ.. ఆవిష్కరణలు పెద్ద నగరాలకే పరిమితం కాదని మహబూబ్నగర్లో నేడు కనిపిస్తున్న ఉత్సాహం నిరూపిస్తోందన్నారు. శ్రీఇన్నోవేషన్ పంచాయత్శ్రీ ద్వారా మంచి ఆలోచనలు, ఆవిష్కరణలు ఉన్న ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు లభించేలా చూస్తున్నామని తెలిపారు. స్థానిక ఆవిష్కరణలు విజయవంతమైన వ్యాపారులుగా ఎదగడానికి అవసరమైన శిక్షణ, వనరులు అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో వనపర్తి, గద్వాల, నారాయణపేట, నాగర్కర్నూల్, మహబూబ్నగర్ జిల్లాల నుంచి 250 మందికిపైగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, గ్రామీణ ఆవిష్కర్తలు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో దళితులు, గిరిజనులకు రక్షణ లేదు
● బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి అడ్డాకుల: కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో దళితులు, గిరిజనులకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. మూసాపేట మండలం వేములలో జరిగిన లైంగికదాడి ఘటనలో మృతి చెందిన దళిత యువతి కుటుంబాన్ని శనివారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డితో కలిసి ఆయన పరామర్శించారు. అత్యాచార ఘటనకు సంబంధించిన వివరాలను బాఽధిత కుటుంబీకులతో మాట్లాడి తెలుసుకున్నారు. అండగా ఉంటామని, అధైర్య పడొద్దని భరోసా కల్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రజాపాలన చేస్తున్నామని చెబుతున్న ప్రభు త్వం సిగ్గుతో తలదించుకోవాలన్నారు. ఎస్సీలపై ముఖ్యమంత్రి వివక్షను ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో దళితులు, గిరిజనులపై అత్యాచారాలు, దాడులు జరుగుతున్నా సీఎం, డిప్యూటీ సీఎం, పోలీసులు నిద్రపోతున్నారా అని విమర్శించారు. దళితులపై జరుగుతున్న దాడులను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఇప్పటి వరకు ఆదుకోకపోవడం దారుణమన్నారు. యువతిపై అత్యాచారం జరిగి హత్య జరిగినా ప్రభుత్వపరంగా అందాల్సిన నష్టపరిహారం ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఆయన వెంట కమిషన్ మాజీ సభ్యుడు అభిలాష్రావు, బస్వరాజుగౌడ్, నరేష్రెడ్డి, వామన్గౌడ్, లక్ష్మినర్సింహ, నారాయణగౌడ్, గాడీల ప్రశాంత్, తదితరులు ఉన్నారు. -
నేటి నవాబుపేట
నాటి నవాబుల నజరానే.. నవాబుపేట: నాటి నిజాం పాలనలో నవాబుపేట చుట్టుపక్కన ప్రాంతాలు గురుకుంట కొనదుర్గంగా, ఇప్పటూర్ సంస్థానంగా పాలన సాగుతున్న తరుణంలో నవాబుపేట జాగీరుదారుగా ఉంటూ పరిపాలన సాగిందని.. నాటి నుంచి ఈ గ్రామాన్ని నవాబుపేటగా పిలుస్తున్నట్లు పూర్వీకులు చెబుతుంటారు. అయితే ఈ నవాబుపేట పంచాయతీ ఎన్నికల్లో తనకుంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు 45 ఏళ్లుగా సర్పంచ్లుగా కొనసాగారు. వీరిలో మొదట లక్ష్మణ్రావు 12 ఏళ్లు, ఆయన సోదరుడు రంగారావు 17 ఏళ్లు ఏకగ్రీవ సర్పంచ్లుగా వరుసగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. 1981లో మొదటి సారి సర్పంచ్ ఎన్నికలు జరిగితే వాటిలో సైతం మాజీ సర్పంచ్ రంగారావు సోదరుడు ప్రహ్లద్రావు విజయం సాధిచి రెండు పర్యాయలు వరుసగా సర్పంచ్గా గెలుపొందుతూ వచ్చారు. అనంతరం 1995లో గ్రామపంచాయతీల పునర్విభజనలో యన్మన్గండ్ల గ్రామం విడిపోగా నవాబుపేట ప్రత్యేక పంచాయతీగా ఏర్పడింది. 30 ఏళ్ల తర్వాత మహిళా సర్పంచ్ నవాబుపేటకు 1995లో గాండ్ల శకుంతల చంద్రశేఖర్ సర్పంచ్గా ఎన్నికయ్యారు. అనంతరం దాదాపు 30 ఏళ్ల తరువాత తాజాగా 2025లో గీతారాణి సర్పంచ్గా ఎన్నిక కావడం విశేషం. కాగా నవాబుపేట చరిత్రలో 46 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ 20 సంవత్సరాలు కాంగ్రెసేతర పార్టీల మద్దతుతో పలువురు సర్పంచ్గా కొనసాగితే తాజాగా ప్రజలు స్వతంత్ర అభ్యర్థికి పట్టం కట్టారు. -
31న కురుమూర్తిస్వామి గిరి ప్రదక్షిణ
చిన్నచింతకుంట: మండలంలోని అమ్మాపురంలో వెలిసిన కురుమూర్తి స్వామి ఆలయం వద్ద ఈనెల 31 చేపట్టే గిరిప్రదక్షిణ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి పిలుపునిచారు. కురుమూర్తిస్వామి ఆలయం వద్ద నిర్వహించే గిరిప్రదక్షిణపై శనివారం విశ్వహింద్ పరిషత్, బజరంగ్దళ్ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ప్రతిఒక్కరూ గిరిప్రదక్షిణలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో విశ్వహిందూ, బజరంగ్దళ్ నాయకులు రాచర్లజనార్దన్, కురువ రమేశ్, చంద్రయ్య, కొట్టంశ్రీనివాస్రెడ్డి, భగవంత్రెడ్డి, బొజ్జన్న, భూపాల్రెడ్డి, శివయ్య, చంద్రయ్య, శంకరయ్యతోపాటు పలువురు ఉన్నారు. చోరీ కేసు ఛేదన కల్వకుర్తి టౌన్: పట్టణంలోని కేశవనగర్కాలనీలో ఈ నెల 8న జరిగిన చోరీ కేసులో ఓ నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు కల్వకుర్తి సీఐ నాగార్జున తెలిపారు. ఆయన కథనం మేరకు.. ఊర్కొండపేట ఆలయ పూజారి శ్రీనివాస్శర్మ పట్టణంలోని కేశవనగర్కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆయన ఇంట్లో 8వ తేదీన దొంగతనం జరగగా.. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. దొంగలు ఉత్తరప్రదేశ్కు చెందిన వారిగా గుర్తించి ఎస్పీ, కల్వకుర్తి డీఎస్పీ ఆధ్వర్యంలో సీఐ, ఎస్ఐల బృందం అక్కడకు వెళ్లింది. ఈ నెల 17న ఉత్తరప్రదేశ్లోని కంద్లా పోలీసుల సాయంతో ఆపరేషన్ నిర్వహించి నిందితుల్లో ఒకరైన మహ్మద్ ఉస్మాన్ను పట్టుకున్నారు. మిగతా వారిని పట్టుకునే క్రమంలో అక్కడి పోలీసులు జరిపిన కాల్పుల్లో మరో నిందితుడు సమయుద్దీన్ మృతిచెందగా.. షమ్మూలు తప్పించుకున్నాడు. నిందితుడి నుంచి రూ.3.02 లక్షలు, 25.4 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు. నిందితుడిని కల్వకుర్తి కోర్టులో హాజరుపర్చి రిమాండ్ తరలించినట్లు తెలిపారు. నేర విచారణలో ప్రతిభ కనబర్చిన సీఐ నాగార్జున, ఎస్ఐ మాధవరెడ్డి, సీసీఎస్ అధికారి శంకర్, సిబ్బంది వెంకట్రాములు, చిరంజీవి, నజీర్, శ్రవణ్ను ఎస్పీ సంగ్రామ్సింగ్ పాటిల్తో పాటు డీఎస్పీ వెంకట్రెడ్డి అభినందించారు.● ఉత్తరప్రదేశ్లో నిందితుడి పట్టివేత.. ● పోలీసుల కాల్పుల్లో మృతిచెందిన మరో నిందితుడు, మరొకరు పరారీ -
మహబూబ్నగర్లో ఘనంగా టీజీఐసీ ‘ఇన్నోవేషన్ పంచాయత్’కార్యక్రమం
మహబూబ్నగర్,సాక్షి:రాష్ట్ర అంకుర వ్యవస్థను జిల్లాల్లోని ఔత్సాహిక ఆవిష్కర్తలు, వ్యవస్థాపకులకు మరింత అందుబాటులోకి తీసుకువెళ్లే పనిలో భాగంగా తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ (TGIC) శనివారం (20 డిసెంబరు, 2025) మహబూబ్నగర్లోని ఐటీ టవర్ వేదికగా ‘ఇన్నోవేషన్ పంచాయత్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. వనపర్తి, గద్వాల్, నారాయణపేట్, నాగర్కర్నూల్, మహబూబ్నగర్ జిల్లాల నుండి 250 మందికి పైగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు మరియు గ్రామీణ ఆవిష్కర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి జిల్లా అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ముఖ్య అతిథిగా విచ్చేయగా, TGIC సీఈఓ మెరాజ్ ఫహీమ్, వారి బృందం కూడా పాల్గొన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు ఈ సదస్సులో పాల్గొన్నారు. నిధుల సేకరణ (Funding), వ్యాపార విస్తరణ మరియు మార్కెటింగ్ మెళకువలకు సంబంధించి తమకున్న సందేహాలను నిపుణులతో చర్చించి నివృత్తి చేసుకున్నారు.ఒక సాధారణ 'వాక్-ఇన్' (Walk-in) ప్లాట్ఫామ్గా రూపొందించబడిన ఈ వేదికపై, ఆవిష్కర్తలు తమ ప్రోటోటైప్లను ప్రదర్శించారు. తెలంగాణ అంకుర వ్యవస్థ నుండి 12 మంది మెంటార్లతో వ్యవసాయ, ఆరోగ్య, లైవ్లీహుడ్ రంగాల్లో వారి ఆలోచనలను పరిశీలించి, తగిన సూచనలు మరియు సలహాలను అందించారు. మంచి ఆలోచనలు ఉన్నవారు హైదరాబాద్కు దూరంగా ఉన్నామనే కారణంతో వెనుకబడకూడదన్నదే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. క్షేత్రస్థాయిలో మార్గదర్శకత్వం అందించడం మరియు ప్రభుత్వ సహకారాన్ని నేరుగా అందించడం ద్వారా రాష్ట్రంలోని ప్రతి మూలకు స్టార్టప్ సంస్కృతిని తీసుకెళ్లాలని TGIC లక్ష్యంగా పెట్టుకుంది."ప్రోటోటైపింగ్, మార్కెట్ యాక్సెస్ మరియు ప్రొడక్ట్ డెవలప్మెంట్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న ఆవిష్కర్తలు, వ్యవస్థాపకులకు... ఇబ్బందులను తొలగించి మీ విజయానికి కావాల్సిన సాంకేతిక మరియు వ్యూహాత్మక సహకారాన్ని అందించడానికి TGIC సిద్ధంగా ఉందని మహబూబ్నగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, IAS తెలిపారు. ఇక్కడ ఉన్న వారందరికీ ఇది ఒక గొప్ప అవకాశమని, ఈ వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ఆయన సూచించారు. మీకున్న సందేహాలన్నింటినీ అడిగి తెలుసుకుని, తదుపరి కార్యాచరణపై స్పష్టత తెచ్చుకోమని సూచించారు.తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ సీఈఓ మెరాజ్ ఫహీమ్ మాట్లాడుతూ'ఇన్నోవేషన్ పంచాయత్' ద్వారా మేము జిల్లాల్లోకి వెళ్లి, మంచి ఆలోచనలు, ఆవిష్కరణలు ఉన్న ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు లభించేలా చూస్తున్నామన్నారు.. వ్యవసాయ రంగంలో కొత్త పరికరాల నుండి పర్యావరణహిత ఇంధన వనరుల వరకు విభిన్నమైన ఆలోచనలను ఆవిష్కర్తలు ప్రదర్శించారు. -
సర్పంచ్ విజయోత్సవాల నడుమ దారుణం..
మహబూబ్నగర్ జిల్లా: మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం వేములలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిపై అదే గ్రామానికి చెందిన యువకుడు లైంగికదాడికి పాల్పడడంతో ఆమె మృతి చెందింది. పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ యువతి (22) ఇంటర్ వరకు చదివి ఇంటి వద్దే ఉంటోంది. బుధవారం రాత్రి సర్పంచ్ ఎన్నికల విజయోత్సవాలు జరుగుతున్న సమయంలో అదే గ్రామానికి చెందిన విష్ణు మాట్లాడాలని చెప్పి ఆ యువతిని రైతువేదిక వద్దకు తీసుకెళ్లాడు. అక్కడే ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో అధిక రక్తస్రావం కావడంతో ఆ యువతి అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే అతను ఇతరుల సాయంతో స్థానిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. చుట్టు పక్కల వారు తల్లికి సమాచారం ఇవ్వడంతో ఆమె కూడా అక్కడకు వచి్చంది. అప్పటికే ఆ యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికుల సాయంతో అంబులెన్స్లో జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆ యువతి మృతి చెందినట్టు తెలిపారు. మృతదేహాన్ని అదే రోజు రాత్రి ఇంటికి తీసుకొచ్చారు. గురువారం ఉదయం కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తమ కూతురిపై అత్యాచారం చేసి హత్య చేశారని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ ఘటనా స్థలాన్ని మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, భూత్పూర్ సీఐ రామకృష్ణ, మూసాపేట ఎస్ఐ వేణు పరిశీలించారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలతో గ్రామంలో విచారణ జరిపారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు అత్యాచారం, అట్రాసిటీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టు ఎస్ఐ వేణు చెప్పారు. యువకుడు ఒక్కడే అత్యాచారం చేశాడా... ఇతరుల ప్రమేయం ఉందా అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
పంచాయతీ ఎన్నికలు.. కాంగ్రెస్లో కొత్త ట్విస్ట్!
సాక్షి, వనపర్తి: వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఓడిపోయేందుకు పార్టీల్లోని కొందరు నేతలే కారణమని అన్నారు. పరోక్షంగా మాజీ మంత్రి చిన్నారెడ్డిపై ఆరోపణలు గుప్పించారు. నియోజకవర్గంలో ఎక్కడెక్కడ పార్టీ అభ్యర్థుల ఓటమికి కారణమేంటో ఆ వివరాలన్నీ పీసీపీకి, ఏఐసీసీకి ఫిర్యాదు చేస్తాను. వనపర్తిలో నేను ఒరిజినల్ కాంగ్రెస్ అంటూ కామెంట్స్ చేశారు.వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో మెగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘మూడు విడతలలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో మేము ఈ రెండు సంవత్సరాలలో చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు బాగా ఆదరించారు. వనపర్తి నియోజకవర్గంలోని 140 పంచాయతీల్లో 85 సీట్లు కాంగ్రెస్కు వచ్చాయి. 60.66% ఓటు శాతం వచ్చింది. బీఆర్ఎస్కు 51 గ్రామ పంచాయతీ సీట్లు రాగా ఓటు శాతం 36% వచ్చింది. అంటే బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ పుంజుకుంది అనేది అందరూ గ్రహించాలి. గ్రామ పంచాయతీ వరకు చూస్తే కాంగ్రెస్కు 92407 ఓట్లు వచ్చాయి.. బీఆర్ఎస్కు 59788 ఓట్లు వచ్చాయి. రెండింటిని చూస్తే వారికన్నా కాంగ్రెస్కు 35.09% అధికంగా వచ్చాయి. ఎన్నికల ఓటు పర్సంటేజ్ విషయంలో బీఆర్ఎస్కు ఓటు శాతం తగ్గింది. వచ్చే ఎన్నికల్లో ఇంకా వాళ్ళు కిందికి పడిపోవడం ఖాయం.మా కాంగ్రెస్ పెద్ద మనిషి చిన్నారెడ్డి నియోజకవర్గంలోనే 15 గ్రామాలలో కావాలని పార్టీకి వెన్నుపోటు పొడిచి బీఆర్ఎస్ వాళ్లకు సపోర్ట్ చేశారు. బీఫామ్స్ విషయంలో ఆయనకు కాకుండా నాకు వచ్చిందని కక్ష పెంచుకుంటే నామీద కోపం తీర్చుకోవాలి కానీ ఇలా పార్టీకి వెన్నుపోటు పొడిచి పార్టీ అభ్యర్థులను ఓడించడం సబబు కాదు. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్టానం వనపర్తి ప్రజలు అందరు గమనిస్తూనే ఉన్నారు. తగిన సమయంలో ఆయనకు బుద్ధి చెప్పడం ఖాయం. చిన్నారెడ్డి పంచాయతీ ఎన్నికలలో ఓటర్లకు ఫోన్లు చేసి కాంగ్రెస్కు ఓటు వేయవద్దు.. బీఆర్ఎస్కు ఓటు వేయమని చెప్పిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. దీనిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాం. ఆయనకు పార్టీ ఏం తక్కువ చేసిందని అభ్యర్థులను ఓడించారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
ప్రజలకు సేవ చేయాలని..
రైతు కుటుంబంలో పుట్టినప్పటికీ బీటెక్ చదివి నాలుగేళ్ల పాటు సాఫ్ట్వేర్ ఇంజినీరు ఉద్యోగం చేశాను. గ్రామ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చాను. సర్పంచ్గా పోటీచేస్తే ప్రజలు ఆశీర్వదించి పట్టం కట్టారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా. – ఆంజనేయులు, సర్పంచ్, జీడిపల్లి, కల్వకుర్తి మండలం పీయూలో విద్యార్థి నాయకుడిగా పనిచేసిన నేను గత పాలకవర్గంలో ఉపసర్పంచ్గా పనిచేశా. తనపై నమ్మకంతో సర్పంచ్ పదవిని కట్టబెట్టిన గ్రామస్తులకు రుణపడి ఉంటా. అందరి నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. గ్రామ పెద్దలు, యువత సహకారంతో గ్రామాన్ని అన్నివిధాలా తీర్చిదిద్దుతా. – బీసం నాగరాజు, సర్పంచ్, రాంపూర్, నర్వ మండలం -
బిల్లులు ఇవ్వకుండా సర్పంచ్లను చంపింది మీరు కాదా?
జడ్చర్ల: బీఆర్ఎస్ పాలనలో గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన సర్పంచ్లకు బిల్లులు ఇవ్వకుండా వారు చనిపోవడానికి కారణం మీరు కాదా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం జడ్చర్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కమీషన్ల కోసం ఇరిగేషన్ బిల్లులు ఇచ్చిన మీరు సర్పంచ్ల బిల్లులను మాత్రం పెండింగ్లో పెట్టారని, బిల్లులు రాకపోవడంతో అప్పుల గుది బండతో కొందరు గుండెపోటుకు మరి కొందరు ఆత్మహత్యలకు పాల్పడలేదా అంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి తనను గెలిపించకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ ప్రజలను ఎమోషనల్గా బ్లాక్ మెయిల్ చేసి గెలిచారని, ఆయననే బ్రాండ్ అంబాసిడర్గా తీసుకున్న బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులు కూడా గ్రామాలలో కన్నీళ్లు పెట్టి చచ్చిపోతామంటూ ఎమోషనల్ సీన్ పండించి గెలుపునకు ప్రయత్నించారని విమర్శించారు. అలాంటి సర్పంచ్లకు తాము నిధులు ఇవ్వకుండా చంపేస్తామని ప్రచారంలో చెప్పింది వాస్తవమేనని, తాను కత్తితో పొడిచి చంపుతానని అనలేదు కదా అన్నారు. బడికి వెళ్లే తమ పిల్లలను సైతం ప్రచారంలో తిప్పి ఓటర్ల కాళ్లు మొక్కించి ఓట్లు అభ్యర్థించారని ఆరోపించారు. ఇంత చేసినా 10 శాతం సర్పంచ్లను గెలిపించుకోలేక పోయారని ఎద్దేవ చేశారు. ఇండిపెండెంట్లుగా గెలిచిన వారిని బీఆర్ఎస్ తమ ఖాతాలో వేసుకుని జబ్బలు చరుచుకుంటున్నారని అన్నారు. తాము సింగిల్గా పోటీ చేసి జడ్చర్లలో 188 సర్పంచ్ స్థానాలకు 108 గెలిచామన్నారు. మరో 35 మంది స్వతంత్రులు తమకు టచ్లో ఉన్నారని అన్నారు. అవినీతి అక్రమాలకు అతీతంగా అభివృద్ధిని కాంక్షించే బీఆర్ఎస్ సర్పంచ్లను పార్టీలోకి తీసుకుంటామని అన్నారు. ఏ పార్టీకి చెందిన సర్పంచులయినా సరే భూకబ్జాలకు పాల్పడితే సహించేది లేదన్నారు. తనకు సంబంధించిన రూ.5 కోట్ల ఎస్డీఎఫ్ నిధులను కాంగ్రెస్ సర్పంచ్లకు కేటాయిస్తామన్నారు. ఇందిరమ్మ కమిటీల ద్వారానే ఇళ్ల కేటాయింపు ఉంటుందని, వారిపై సర్పంచ్ల పెత్తనం ఉండబోదన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ పుష్పలత, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్యాదవ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు గోప్లాపూర్ యాదయ్య, పట్టణ అధ్యక్షుడు మినాజ్ పాల్గొన్నారు. -
పైసా పాయె.. పరువు పోయె
● మనోవేదనలో ఓటమి పాలైన అభ్యర్థులు ● రూ.లక్షలు ఖర్చు పెట్టినా.. ● ప్రజలు ఎందుకు ఆదరించలేదని ఆరా అచ్చంపేట: ఎలాగైనా పంచాయతీ ఎన్నికల్లో గట్టెక్కుతామనే అతి విశ్వాసంతో మూడో విడతలో పోటీకి దిగిన పలువురు ఓటమితో డీలాపడ్డారు. ప్రజల్లో తమకున్న గుర్తింపు ఓట్లు తెచ్చి పెడుతుందని, పార్టీల మద్దతు ఉంటే ఇక విజయం నల్లేరుపై నడికే అని భావించిన పలువురు ఓటమితో భంగపడ్డారు. ఆయా పార్టీల్లోని సర్పంచ్ అభ్యర్థులు తమ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో తాము చేసిన పనులు చూసి ప్రజలు తిరిగి తమకే పట్టం కడతారని భావించి పలువురు తాజా మాజీ సర్పంచ్, ఎంపీటీసీలు ఎన్నికల్లో పోటీకి దిగినా వారిని ప్రజలు ఆదరించలేదు. ఎన్నికల్లో అప్పులు చేసి ఖర్చు పెట్టినా ఓటమి చెందడంతో పైసా పాయే, పరువు పాయే అని పలువురు వాపోతున్నారు. అప్పులు చేసి మరీ.. పలువురు సర్పంచ్ పదవిపై ఆశతో ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేయాలనే ఉద్దేశంతో అప్పులు చేసి మరీ ఎన్నికల్లో పోటీ చేశారు. అయినా ప్రజలు ఆదరించలేదు. దీంతో ఇటు పదవి రాకుండా పోగా.. అటు అప్పులు మిగిలాయి. చేసిన అప్పులు ఎలా తీర్చాలో దారిలేక అయోమయంలో ఉన్నారు. ఓడిన వారు ఎంపీటీసీ పదవిపై గురి సర్పంచ్ పదవులకు పోటీ చేసి ఓటమిపాలైన వారు త్వరలో వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీకి దిగాలని యోచిస్తున్నారు. ప్రజలు తమపై సానుభూతి చూపుతారనే నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే ప్రజల వైపు నుంచి తమకు హామీలు వస్తున్నట్లు ఓటమి పాలైన వారు పేర్కొంటున్నారు. ఓటమితో నేర్చుకున్న గుణపాఠం ఒక అనుభవమంటున్నారు. రానున్న ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటమి పాలైన సర్పంచ్ అభ్యర్థులను ప్రజలు ఏమేరకు ఆదరిస్తారో వేచి చూడాల్సిందే. -
గ్రామ ప్రగతే ధ్యేయం
మా గ్రామాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. ముఖ్యంగా ప్రాథమికోన్నత పాఠశాలను ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ చేయాలని ఉంది. గ్రామస్తులకు మెరుగైన వైద్యం అందించడం, అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండటం, తదితర అభివృద్ది కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తా. – ఎన్.సురేశ్, సర్పంచ్, మద్దిగట్ల, భూత్పూర్ మండలం కౌకుంట్ల మండలకేంద్రం మొదటి సర్పంచ్గా నాకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. గ్రామస్తుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తా. అందరి సహకారం, నిరంతర కృషితో కౌకుంట్లను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా. – నరేశ్, సర్పంచ్, కౌకుంట్ల ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా -
నాడు భర్త... నేడు భార్య
● ఎంపీపీ, సర్పంచ్ రెండు పదవులు ‘చెరోసారి’ అడ్డాకుల: మూసాపేట మండలం కొమిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన దంపతులు ఎంపీపీ, సర్పంచ్ పదవులను చేజిక్కించుకుని రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. గ్రామానికి చెందిన బగ్గి కృష్ణయ్య, కమలమ్మ దంపతులు. 1994లో బగ్గి కృష్ణయ్య కొమిరెడ్డిపల్లి సర్పంచ్గా విజయం సాధించారు. తర్వాత 2005లో ఆయన ఎంపీటీసీగా గెలిచి ఉమ్మడి అడ్డాకుల మండల ఎంపీపీగా రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత 2014లో ఆయన భార్య కమలమ్మ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీటీసీగా గెలుపొంది ఉమ్మడి అడ్డాకుల మండల ఎంపీపీగా పనిచేశారు. తాజాగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కమలమ్మ సర్పంచ్గా గెలుపొందారు. భర్త మొదట సర్పంచ్గా పనిచేసి తర్వాత ఎంపీపీ అయ్యారు. భార్య మొదట ఎంపీపీగా పనిచేసి ఇప్పుడు సర్పంచ్గా విజయం సాధించారు. దంపతులిద్దరు ఎంపీపీ, సర్పంచ్ చెరోసారి దక్కించుకోవడం మండల వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒకే కుటుంబంలో దంపతులిద్దరు ముఖ్యమైన పదవులను అధిరోహించడం విశేషం. -
సర్పంచ్లు బాధ్యతగా పనిచేయాలి
ఆత్మకూర్: కొత్త సర్పంచ్లు పదవికి కలంకం తీసుకురాకుండా బాధ్యతాయుతంగా గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి డా. వాకిటి శ్రీహరి కోరారు. గురువారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో మండలంలో గెలుపొందిన సర్పంచ్, వార్డుసభ్యులను శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులను అత్యధిక స్థానాల్లో గెలిపించి తన ఉత్సాహాన్ని రెట్టింపు చేశారని, ఇదే ఉత్సాహాన్ని ఇకముందు జరిగే ఎన్నికల్లో చూపాలని కోరారు. మండలానికి ఇప్పటి వరకు రూ.250 కోట్లు మంజూరయ్యాయని.. రానున్న మూడేళ్లలో మరో రూ.300 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు 500 ఇళ్లు మంజూరు చేయగా.. మరో 500 ఇళ్లు కేటాయిస్తానని ప్రకటించారు. జూరాల వంతెనతో మహర్దశ.. జూరాల గ్రామం వద్ద రూ.123 కోట్లతో హైలేవల్ వంతెన నిర్మాణ పనులు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభించగా.. పనులు కొనసాగుతున్నాయని, ఏడాదిలోగా పూర్తి చేస్తామని మంత్రి ప్రకటించారు. రూ.23 కోట్లతో 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రి, రూ.15 కోట్లతో సీసీ రహదారులు, రూ.5 కోట్లతో ఇండోర్ స్టేడియం, మార్కెట్యార్డు భవనం, షాపింగ్ కాంప్లెక్స్, చెరువుకట్ట ఆధునీకరణ, ఆత్మకూర్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు తదితర పనులు చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో ఆత్మకూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రహ్మతుల్లా, నాయకులు పరమేష్, తులసీరాజ్, నల్గొండ శ్రీను, గంగాధర్గౌడ్, బాలకృష్ణారెడ్డి, మణివర్ధన్రెడ్డి, నాగేష్, దామోదర్, సాయిరాఘవ, మహేష్, షాలం, జుబేర్, కరణ్లాల్ తదితరులు పాల్గొన్నారు. ● రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి భూగర్భ విద్యుత్ కేంద్రం సొరంగం కొండపై మంటలు దోమలపెంట: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి అనంతరం నీళ్లు బయటకు వెళ్లే సొరంగం (ఎగ్జిట్)పైన ఉన్న కొండ వద్ద గురువారం మంటలు వ్యాపించాయి. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో సొరంగం కొండపైన పెరిగి ఉన్న ఎండిన గడ్డిలో గుర్తు తెలియని వ్యక్తి బీడి, సిగరెట్ తాగి పడేయడం వలన మంటలు వ్యాపించి ఉంటాయని భావిస్తున్నామని భూగర్భ విద్యుత్ కేంద్రం స్టేషన్ ఫైర్ ఆఫీసర్ మల్లికార్జున తెలిపారు. కేంద్రం ఫైర్ సిబ్బంది మొత్తం మంటలు ఆర్పేందుకు కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. -
లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించుకోవాలి
మహబూబ్నగర్ క్రైం: కోర్టులో రాజీ పడదగిన కేసులన్నింటినీ రాజీ మార్గంలో ఈనెల 21న జాతీయ లోక్ అదాలత్ను వినియోగించుకొని కక్షిదారులు కేసులను పరిష్కరించుకోవాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత తెలిపారు. గురువారం జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా న్యాయమూర్తి మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్లో అన్నిరకాల సివిల్, క్రిమినల్, భూతగాద, కుటుంబ వివాద కేసులు, మోటార్ వెహికిల్ కేసులను ఇద్దరు రాజీపడి కేసులను పరిష్కరించుకోవాలన్నారు. లోక్ అదాలత్లో రాజీపడిన కేసులో కోర్టు ఫీజు వాపసు ఇవ్వబడుతుందన్నారు. రాజీపడ్డ దగ్గ క్రిమినల్ కేసులన్నింటినీ పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. జిల్లావ్యాప్తంగా 5 బెంచీలు ఏర్పాటు చేశామని, జిల్లాకోర్టులో 3 బెంచీలు, జడ్చర్లలో 2బెంచీలలో కేసుల సివిల్, మోటార్ వెహికిల్, ఫ్యామిలీ కేసులు రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. ఇందులో ఏ పార్టీ గెలిచినట్టు, ఒకరు ఓడినట్టు ఉండదని, లోక్ అదాలత్ ఇరు వర్గాలను సమన్యాయం చేసే విధంగా చేసినటువంటి కార్యక్రమం అని వివరించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఇందిర పాల్గొన్నారు. ఆస్తి పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఈ ఆర్థిక సంవత్సరం (2025–26) ముగియడానికి మూడు నెలలే మిగిలినందున ఆస్తి పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.ప్రవీణ్ కుమార్రెడ్డి ఆదేశించారు. గురువారం మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో అధికారు లు, సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు కేవలం 24.23 శాతమే ఆస్తిపన్ను వసూలైందన్నారు. ప్రత్యేక బృందాలు ప్రతినిత్యం అన్ని డివిజన్ల లో ఇంటింటికీ తిరిగి ఆస్తిపన్నుతో పాటు నల్లా బిల్లులు సకాలంలో చెల్లించాలని నగర ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా మొండి బకాయిదారులకు తక్షణమే నోటీసులు అందజేయాలన్నారు. సమావేశంలో ట్రెయినీ మున్సిపల్ కమిషనర్ దిలీప్రెడ్డి, ఏఎంసీ అజ్మీర రాజన్న, మేనేజర్ వెంకటేశ్వరరావు, ఇన్చార్జ్ ఎంఈ విజయకుమార్, డీఈఈలు నర్సింహ, హేమలత, ఏఈలు , శానిటరీ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్జీ, లక్ష్మయ్య, హెల్త్ అసిస్టెంట్ వజ్రకుమార్రెడ్డి పాల్గొన్నారు. తూకం వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): కొనుగోలు కేంద్రాలలో తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లుకు రవాణా చేయాలని అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ధాన్యం కొనుగోళ్లపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 191 వరి ధాన్యం కొనుగోలు సెంటర్ల ద్వారా 1.06 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. దాదాపు రూ.260 కోట్ల విలువైన ధాన్యం సేకరించగా ఇప్పటివరకు రూ.219 కోట్లను రైతుల ఖాతాలలో జమ చేసినట్లు చెప్పారు. మిగిలిన రూ.40 కోట్లను సంబంధించి ట్యాబ్ ఎంట్రీ చేసి, వెంటనే చెల్లింపులు చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత ఐకేపీ, పీఏసీఎస్ ఏజెన్సీలను ఆదేశించారు.ధాన్యం కొనుగోలుపై ఎప్పటికప్పుడు జిల్లా పౌర సరఫరాల అధికారి, పౌర సరఫరాల సంస్థ డీఎంలు పర్యవేక్షించాలని సూచించారు. సమావేశంలో డీఆర్డీఓ నర్సింహులు, పౌర సరఫరాల సంస్థ డీఎం రవినాయక్, అధికారులు గంప శ్రీనివాస్, టైటస్పాల్, బాలమణి, హైమావతి, తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతాం
● డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ ● పాలమూరులో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన స్టేషన్ మహబూబ్నగర్: దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతామని డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. జిల్లాకేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. తెలంగాణ చౌరస్తా నుంచి బీజేపీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. ప్రతిపక్షాలను భయబ్రాంతులకు గురి చేయడానికి ఈడీ, సీబీఐలను ఇష్టానుసారంగా వాడుకుంటున్నదని విమర్శించారు. దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గట్టిగా ప్రస్తావిస్తున్న కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్గాంధీపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ అనేది కేవలం జర్నలిజంకు సంబంధించినదని అన్నారు. సోనియాగాంధీ, రాహుల్గాంధీ పట్ల బీజేపీ అవలంభిబిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని అన్నారు. నిరసనలో ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్కుమార్గౌడ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్రెడ్డి, నాయకులు వినోద్కుమార్, సీజే బెనహర్, అజ్మత్ అలీ, బెక్కరి మధుసూదన్రెడ్డి, ఫయాజ్, అవేజ్, రాములుయాదవ్, నాగరాజు, ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
● రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి ● కలెక్టర్ విజయేందిర బోయి దేవరకద్ర: ఆరోగ్య కేంద్రంలో పరిశుభ్రతను మరింత మెరుగుపరచాలని పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అలాగే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. గురువారం దేవరకద్ర మున్సిపాలిటీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రికి ఎక్కువగా పేదలు వైద్యసేవల కోసం వస్తారని, వారికి మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వపరంగా రోగులకు అన్ని వైద్య పరీక్షలు చేయడంతో పాటు సరైన మందులను అందించాలని కోరారు. ఆస్పత్రిలో మందుల కొరత లేకుండా చూసుకోవాలని సూచించారు. దేవరకద్ర పీహెచ్సీని ఆదర్శ ఆరోగ్య కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆస్పత్రికి వచ్చిన గర్భిణితో మాట్లాడి.. నెలనెలా చేస్తున్న వైద్య పరీక్షల వివరాలు అడిగి తెలుసుకున్నారు. హిమోగ్లోబిన్ తగ్గితే వచ్చే సమస్యల గురించి వివరించి, పోషకాహారం తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. అనంతరం ఆస్పత్రి రికార్డులను తనిఖీ చేసి, లేబర్రూమ్లో సౌకర్యాలను పరిశీలించారు. ● దేవరకద్రలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్.. మధ్యాహ్న భోజనంను పరిశీలించారు. ఈ సందరభంగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలకు ప్రహరీ లేదని, సైన్స్ ల్యాబ్ సుదుపాయం కల్పించాలని కలెక్టర్ను కోరగా.. ఆమె సానుకూలంగా స్పందించారు. -
ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు
● ఎన్నికల కోడ్ కఠిన ంగా అమలు చేశాం : ఎస్పీ జానకి పాలమూరు: స్థానికసంస్థల ఎన్నికల్లో భాగంగా జిల్లా లో మూడు విడతలుగా నిర్వహించిన గ్రామపంచాయ తీ సర్పంచ్ ఎన్నికలు ఎలాంటి చిన్న అవాంచానీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా పూర్తయినట్లు ఎస్పీ జానకి తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా చేపట్టిన తనిఖీలు, నిఘా చర్యల్లో రూ.11,08,250 నగదును సీజ్ చేశామని చెప్పారు. అలాగే రూ.6,93,858 విలువ గల మద్యం కేసులకు సంబంధించి 81 ఎకై ్సజ్ కేసులు నమోదు చేసి 1050.23 లీటర్ల మద్యంను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే రూ.7,200 విలువ గల ఉచితాల పంపిణీకి సంబంధించి ఒక కేసు, 3 ఎన్నికల నిబంధన ఉల్లంఘన కేసులు, 4 మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) ఉల్లంఘటన నమోదు చేసినట్లు పేర్కొన్నారు. భద్రతా చర్యల్లో భాగంగా 70 నాఖా బందీ ఆపరేషన్లు, 37 ఆయుధాల డిపాజిట్, 640 మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగిందని, జిల్లా వ్యాప్తంగా 3 చెక్పోస్టులు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగించినట్లు వివరించారు. ఎన్నికల విధుల నిర్వహణకు మొత్తం 1249 మంది పోలీస్ అధికారులు, సిబ్బందిని నియమించి సమర్థవంతమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామన్నారు. జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి ఈనెల 21న జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ను ప్రజలు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ డి.జానకి గురువారం ఓ ప్రకటనలో సూచించారు. క్షణికావేశంలో జరిగిన తప్పులను సరిదిద్దుకోవడానికి లోక్ అదాలత్ ఒక ఉత్తమ అవకాశమని, రాజీకి అవకాశం ఉన్న అన్ని కేసుల్లో కక్షిదారులుపరస్పర సమ్మతితో రాజీ పడవచ్చని తెలిపారు. జిల్లావ్యాప్తంగా దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదాలు, ఆస్తి విభజన, కుటుంబ, వైవాహిక వివాదాలు, బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్బౌన్స్ వంటి రాజీకి అర్హమైన అన్ని కేసుల్లో ఇరువర్గాల సమ్మతితో రాజీ కుదిరేలా చర్యలు తీసుకోవాలని ఎస్హెచ్ఓలు, కోర్టు డ్యూటీ అధికారులను ఆదేశించారు. -
కోవర్ట్స్.. రెబల్స్!
నారాయణపేట నియోజకవర్గం, మహబూబ్నగర్ జిల్లా పరిధి కోయిల్కొండ మండలంలో పేరు చివర నగర్ ఉన్న గ్రామానికి రెండో విడతలో ఎన్నికలు జరిగాయి. ఇక్కడ కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలిచిన వ్యక్తి ఓటమి పాలయ్యాడు. ఈయన ఓటమి వెనుక స్థానిక ‘హస్తం’ నాయకులే ఉండడం గమనార్హం. లోపాయికారిగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి మద్దతు తెలిపారు. ఇది గ్రహించక అంతా ఖర్చు చేసిన సదరు అభ్యర్థి తలపట్టుకుంటున్నాడు. ‘నా పనేందో నేను చేసుకుంటున్నా. హైదరాబాద్కు వచ్చి నన్ను ఒప్పించి వారే సర్పంచ్గా నిలబెట్టారు. వారే ఖర్చు చేయించారు. చివరకు వారే ఓడించారు. నా కొంప ఆర్సిండురోయ్.’ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇదే మండలంలో మరో గ్రామంలో సైతం ఇలాగే జరిగినట్లు తెలుస్తోంది. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పల్లె రాజకీయాలు ఎప్పుడూ విభిన్నమే. స్థానిక పరిస్థితులు ప్రభావం చూపించే ఈ ఎన్నికలు ఎప్పటికై నా ఆసక్తికరమే. పార్టీ గుర్తులపై కాకుండా జరిగే సంగ్రామమైనప్పటికీ.. వాటి ప్రభావం ఊరి ప్రజలపై చెరగని ముద్ర వేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలకు స్థానిక ఎన్నికల్లో కలిసి వస్తుందనే దానికి గతంలో వెలువడిన ఫలితాలే నిదర్శనం. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ సైతం పల్లె పోరులో పైచేయి సాధించింది. కానీ వరుసగా అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో సత్తా చాటడం హస్తం నేతలను బెంబేలెత్తిస్తోంది. ఆశించిన ఫలితాలు రాకపోవడం వారిని కుంగదీస్తోంది. దీనికంతటికీ పార్టీలోని కోవర్టులు, రెబల్స్ కారణం కాగా.. ఎవరు గెలిచినా తమ వారే అన్నట్లు వ్యవహరించడం కూడా ఫలితాలపై ఎఫెక్ట్ పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రులతో పాటు ‘అధికార’ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కోవర్టులు, రెబల్స్ ప్రభావం చూపిన తీరుపై ‘సాక్షి’ కథనం.. రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ నియోజకవర్గంలో నాగర్కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, కోడేరు, వనపర్తి జిల్లాలోని చిన్నంబావి, వీపనగండ్ల, పాన్గల్ మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో 137 జీపీలు ఉండగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ నడిచింది. 69 మంది హస్తం మద్దతుదారులు గెలుపొందగా.. 44 మంది కారు, ఆరు చోట్ల బీజేపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో అధిక జీపీల్లో బీఆర్ఎస్, బీజేపీ ఒకరికొకరు మద్దతు తెలుపుకోగా.. మొత్తంగా 50 స్థానాల్లో గెలుపొందారు. స్వతంత్రులు పది మంది విజయం సాధించగా.. వీరిలో ఎక్కువగా ఉమ్మడి (కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ) అభ్యర్థులే ఉన్నారు. వీరికి అధికార పార్టీలోని గ్రామ, మండలస్థాయి ముఖ్యులు లోపాయికారిగా సహకరించినట్లు తెలుస్తోంది. ఈ సెగ్మెంట్లో రెబల్స్తో పాటు ముఖ్య నాయకుల మధ్య వర్గపోరు సైతం గెలుపు ఫలితాలపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఇంకా ఎక్కడెక్కడ అంటే.. నారాయణపేట నియోజకవర్గంలో 95 జీపీలు ఉన్నాయి. ఇందులో 43 చోట్ల కాంగ్రెస్, 16 పంచాయతీల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. హస్తం ఆధిక్యతను సాధించినా.. ఇక్కడ రెబల్స్ ఐదుగురు, ఉమ్మడి అభ్యర్థులు తొమ్మిది మంది విజయం సాధించారు. గెలుపొందిన ఉమ్మడి అభ్యర్థుల్లో అధిక శాతం మందికి ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు సహకరించినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఇతర పార్టీల సర్పంచ్ అభ్యర్థులతో ముందుగానే లోపాయికారీ ఒప్పందం చేసుకుని.. సొంత పార్టీ అభ్యర్థులకు వెనున్నపోటు పొడిచినట్లు తెలుస్తోంది. ప్రధానంగా కోయిల్కొండ మండల పరిధిలో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఎమ్మెల్యేకు, నియోజకవర్గ ముఖ్యనేతకు సంబంధించి మండలాల వారీగా షాడో నాయకులుగా వ్యవహరిస్తున్న వారి నిర్వాకం వల్ల పలు జీపీలు చేజారిపోయినట్లు తెలుస్తోంది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో 172 గ్రామపంచాయతీలు ఉండగా.. శంకరాయపల్లి తండి మినహా అన్నింటిలో ఎన్నికలు జరిగాయి. 83 జీపీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందగా.. ఆ పార్టీ ఆధిక్యతను కనబరిచింది. బీఆర్ఎస్ గట్టి పోటీ ఇవ్వగా.. 72 స్థానాల్లో ఆ పార్టీ మద్దతుదారులు సర్పంచ్లుగా గెలుపొందారు. అయితే ఎమ్మెల్యేకు షాడో నేతగా వ్యవహరిస్తున్న ఒకరి నిర్వాకం.. పాత కాంగ్రెస్ నాయకులకు దక్కని ప్రాధాన్యం, నియోజకవర్గంలో ఒంటెద్దు పోకడలు ఫలితాలపై ప్రభావం చూపించినట్లు పార్టీ శ్రేణుల్లో చర్చజరుగుతోంది. వనపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు షాడో నేతలుగా వ్యవహరిస్తున్న వారికి ఈ పంచాయతీ ఎన్నికల్లో షాక్ తగిలింది. గోపాల్పేట మండలంలోని ఓ నాయకుడి స్వగ్రామం, పెబ్బేరు మండలంలోని మరో గ్రామం, ఖిల్లాఘనపురం మండలంలోని ఓ పల్లెలో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. ఆయా ప్రాంతాల్లో అధికార నేతకు షాడో నాయకులుగా వ్యవహరిస్తున్న తీరుతో ప్రజలతో పాటు కాంగ్రెస్ అభిమానులు సైతం కారు బలపరిచిన అభ్యర్థులను గెలిపించినట్లు తెలుస్తోంది. గద్వాల నియోజకవర్గంలో మొత్తంగా కాంగ్రెస్ ఆధిపత్యమే కొనసాగింది. అయితే పార్టీలో రెండు వర్గాలుగా ఉన్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ వర్గాలకు చెందిన వారే సర్పంచ్లుగా ఎన్నికయ్యారు. ఇందులో బండ్ల వర్గం సత్తా చాటినట్లు తెలుస్తోంది. నారాయణపేట మండలం ఓ జీపీ సర్పంచ్ ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. పాత కాంగ్రెస్ నుంచి ఒకరు పోటీ చేశారు. కొత్త కాంగ్రెస్ నుంచి ఓ నాయకుడు తన భార్యతో నామినేషన్ వేయించి.. ఒత్తిళ్లతో విరమించుకున్నాడు. తాను 8వ వార్డులో బరిలో నిలిచాడు. తన వార్డు వరకే ఆ నాయకుడు పరిమితం కాగా.. అక్కడ గెలుపొందాడు. కాంగ్రెస్ సర్పంచ్ మద్దతుదారు ఓడిపోగా.. బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. నా కొంప ఆర్సిండురోయ్..! కొల్లాపూర్: రెబల్స్, వర్గ పోరుతో.. మక్తల్: ‘వాకిట’ మెజార్టీపై ఎఫెక్ట్.. మక్తల్ నియోజకవర్గంలో నారాయణపేట జిల్లాలో మక్తల్, మాగనూరు, కృష్ణ, నర్వ, ఊట్కూరు.. వనపర్తి జిల్లాలో అమరచింత, ఆత్మకూరు మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 138 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ మద్దతుదారులు 70, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 31 మంది గెలుపొందారు. హస్తం ఆధిక్యం సాధించినా.. పది స్థానాల్లో అదే పార్టీకి చెందిన రెబల్స్ విజయం సాధించారు. రెబల్స్ ప్రభావానికి ఇది నిదర్శనం కాగా.. ఐదారు స్థానాల్లో కాంగ్రెస్, కాంగ్రెస్ రెబల్స్ మధ్య పోటీతో బీజేపీ, బీఆర్ఎస్కు లాభించింది. అంతేకాకుండా పలు చోట్ల స్థానిక కాంగ్రెస్ నాయకులే.. ఆ పార్టీ బలపరిచిన వారికి కాకుండా లోపాయికారిగా కారు, కమలం బలపరిచిన వారికి సహకరించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ను దెబ్బతీసింది వీరే.. పలు చోట్ల షాడోల తీరు సైతం.. నారాయణపేట, వనపర్తి, జడ్చర్లలో అధిక ప్రభావం మంత్రి జూపల్లి ఇలాకా కొల్లాపూర్లో అత్తెసరు ఫలితాలే.. మరో అమాత్యుడి సెగ్మెంట్ మక్తల్లో మెజార్టీపై ఎఫెక్ట్ గద్వాల నియోజకవర్గంలో విభిన్నం.. స్వపక్షంలోని వర్గాలదే విజయం -
తెలంగాణ ఔన్నత్యాన్ని చాటాలి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్లో పాల్గొని తెలంగాణ ఔనత్యాన్ని చాటాలని పీయూ వీసీ శ్రీనివాస్ కోరారు. జిల్లాకేంద్రం సమీపంలోని ఎస్సీ గురుకుల విద్యార్థిని పాత్లావత్ పద్మావతి పీయూ తరఫున ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో పాల్గొననుండగా.. బుధవారం ఆయన విద్యార్థిని అభినందించి మాట్లాడారు. వివిధ దశల్లో జరిగిన స్క్రీనింగ్ పరీక్షల్లో విద్యార్థిని ప్రతిభ చాటి ఎంపిక కావడం గొప్ప విషయమన్నారు. పరేడ్లో ప్రధాని, రాష్ట్రపతి తదితర ప్రముఖులు పాల్గొంటారని.. యూనివర్సిటీకి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కో–ఆర్డినేటర్ ప్రవీణ, కంటినిజెంట్ అధికారి అర్జున్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ట్రెయినీ మున్సిపల్ కమిషనర్గా దిలీప్రెడ్డి ● పాలమూరు, జడ్చర్లలో 20 రోజుల పాటు శిక్షణ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఇటీవల గ్రూప్–1లో విజయం సాధించి గ్రేడ్–2 మున్సిపల్ కమిషనర్గా ఎంపికై న దిలీప్రెడ్డి శాఖాపరంగా శిక్షణ పొందేందుకు గాను బుధవారం మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్కు వచ్చారు. ఇక్కడే పది రోజుల పాటు ఉండి ఆయా విభాగాలలో చేపట్టే పనులను పరిశీలించనున్నారు. ఈ శిక్షణ పూర్తయిన తర్వాత జడ్చర్ల మున్సిపాలిటీలో మరో పది రోజుల పాటు తర్ఫీపు పొందనున్నారు. కాగా, వనపర్తి జిల్లా ఖిల్లాగణపురానికి చెందిన ఈయన కొన్నాళ్లుగా తల్లిదండ్రులతో కలిసి నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని దేవునిపాలెంలో నివాసం ఉంటున్నారు. -
ప్రతిభ చాటి జాతీయస్థాయికి ఎదగాలి
మహబూబ్నగర్ క్రీడలు: స్థానిక క్రికెట్ క్రీడాకారులు ప్రతిభచాటి జాతీయస్థాయికి ఎదగాలని ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ ఆకాంక్షించారు. ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకు విశాఖ ఇండస్ట్రీస్ సౌజన్యంతో హెచ్సీఏ ఆధ్వర్యంలో కాక వెంకటస్వామి మెమోరియల్ టీ20 క్రికెట్ లీగ్లో పాల్గొనే మహబూబ్నగర్ జిల్లా అండర్–14 బాలుర క్రికెట్ జట్టు ఎంపికలు బుధవారం జిల్లా కేంద్రంలోని పిల్లమర్రి రోడ్డు సమీపంలో గల క్రికెట్ మైదానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు లీగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ లీగ్లో మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట జట్లు పాల్గొంటాయని తెలిపారు. ప్రతి జట్టు నాలుగేసి మ్యాచ్లు ఆడాల్సి ఉంటుందన్నారు. ప్రతి జట్టులో 15 మంది క్రీడాకారులను ఎంపిక చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకొని టోర్నీలో వ్యక్తిగత ప్రదర్శనను చాటాలని పిలుపునిచ్చారు. మహబూబ్నగర్ జిల్లాస్థాయి ఎంపికల్లో దాదాపు 75 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎండీసీఏ ఉపాధ్యక్షుడు సురేష్కుమార్, వెంకటరామారావు, కోచ్లు గోపాలకృష్ణ, మన్నాన్, ముఖ్తార్అలీ, ఆబిద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
ఓవైపు సంతోషం.. మరోవైపు విషాదం
జడ్చర్ల: సర్పంచ్గా గెలిచిన సంతోషం ఓ వైపు ఉండగానే.. మరో వైపు అదే కుటుంబ సభ్యురాలు ఆకస్మికంగా మృత్యువాత పడడంతో ఒక్కసారిగా వారంతా శోకసంద్రంలో మునిగిన ఘటన జడ్చర్ల మండలంలోని ఎక్వాయపల్లిలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలిలా.. ఎక్వాయపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా కాంగ్రెస్ అభ్యర్థి పోలం మమత తిరుపతయ్య 432 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఆనందంతో పోలింగ్ కేంద్రం నుంచి ఇంటికి చేరకముందే కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె అత్త పోలం భారతమ్మ (70) ఆకస్మికంగా మృతిచెందారు. దీంతో సంతోషం వెల్లివిరియాల్సిన ఆ ఇంట్లో విషాదం అలుముకుంది. గెలుపు సంబరాలలో మునిగి తేలాల్సిన అభ్యర్థి, ఆమె మద్దతుదారులు, కుటుంబ సభ్యులు ఒక్కసారిగా దుఖఃసాగరంలో మునిగిపోయారు. మరింత పెరిగిన ఉల్లి ధర దేవరకద్ర: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో బుధవారం జరిగిన వేలంలో ఉల్లి ధర మరింత పెరిగింది. నవంబర్ మూడోవారంలో కొత్త ఉల్లి మార్కెట్కు వచ్చిన సమయంలో క్వింటా రూ.800 ధర పలకగా.. రెండువారాల తర్వాత రూ.1,600కు పెరిగింది. గత వారం రూ.1,800.. ఈ వారం ఏకంగా క్వింటా గరిష్టంగా రూ.2,600, కనిష్టంగా రూ.,2000 ధరలు లభించాయి. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ చివరి వరకు రూ.రెండు వేలు దాటని ఉల్లి ధర ప్రస్తుతం గరిష్ట ధరకు చేరుకోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బస్తా రూ.1,300.. ఉల్లి వేలం తర్వాత 50 కిలోల ఉల్లి బస్తా గరిష్టంగా రూ.1,300, కనిష్టంగా రూ.1,000కి విక్రయించారు. మార్కెట్కు దాదాపు 500 బస్తాల ఉల్లి విక్రయానికి వచ్చింది. ● గెలుపు ఇంట కుటుంబసభ్యురాలి ఆకస్మిక మృతి -
ఆనందంగా ఉంది..
● పోటాపోటీగా సర్పంచ్ ఫలితాలు ● బీఆర్ఎస్ 30, కాంగ్రెస్ 25, స్వతంత్రులు 20 జీపీలు కై వసం మొదటి సారి ఓటు హక్కు వచ్చింది. తొలిసారిగా పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయడం ఆనందంగా ఉంది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా వయోజనుడిగా ప్రశ్నించే హక్కు కలుగుతుంది. – పవన్కుమార్, నేరడగం గ్రామం జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలో జరిగిన తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్సే పైచేయి సాధించింది. బుధవారం అడ్డాకుల మండలంలో 17, బాలానగర్లో 37, భూత్పూర్లో 19, జడ్చర్లలో 45, ముసాపేట మండలంలో 15 జీపీలకు ఎన్నికలు జరిగాయి. ఐదు మండలాల్లో మొత్తం 133 సర్పంచ్ స్థానాలకు గాను నామినేషన్ల ఉపసంహరణ నాటికే 10 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. జడ్చర్ల మండలంలో ఒక సర్పంచ్ స్థానానికి ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. మిగిలిన 122 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 67 స్థానాల్లో విజయం సాధించగా.. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 52 స్థానాల్లో గెలుపొందారు. ఈ విడతలోనూ బీజేపీ బలపరిచిన అభ్యర్థులు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. జడ్చర్ల మండలంలో బీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్న పలు మేజర్ జీపీల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు తమ హవాను కొనసాగించారు. నసరుల్లాబాద్, గంగాపూర్, కోడ్గల్, పెద్దపల్లి, పెద్ద ఆదిరాల గ్రామాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు ఘోర పరాజయం పాలయ్యారు. భూత్పూర్ మండలంలో 14 సర్పంచ్ స్థానాలకు గాను లంబడికుంట తండా, తాటిపర్తి, కొత్తూర్, రావులపల్లి, శేరిపల్లి(హెచ్), అన్నాసాగర్లో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలిచారు. ఆరు జీపీలు కొత్తమొల్గర, పాత మొల్గర, పోతులమడుగు, హస్నాపూర్, కర్వెన, కప్పెటలో కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు. ఎల్కిచర్లలో స్వతంత్ర అభ్యర్థి నెగ్గడం విశేషం. శేరిపల్లి (హెచ్)లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్ధి చంద్రకళ రెండు ఓట్ల తేడాతో విజయం సాధించారు. అడ్డాకుల మండలంలో 17 జీపీలు ఉండగా.. కాంగ్రెస్ మద్దతుదారులు అడ్డాకుల, కాటవరం, రాంచంద్రాపూర్, పెద్దమునుగల్చేడ్, రాచాల, బలీదుపల్లి, తిమ్మాయిపల్లి, శాఖాపూర్లో విజయం సాధించారు. బీఆర్ఎస్ మద్దతుదారులు వర్నె, చిన్నమునుగల్చేడ్, సుంకరామయ్యపల్లి, పొన్నకల్, కన్మనూర్, తిమ్మాయిపల్లి, గుడిబండలో గెలుపొందారు. కందూర్లో బీజేపీ మద్దతుదారు సర్పంచ్ కుర్చీని దక్కించుకున్నారు. మూసాపేట మండలంలో 15 జీపీలు ఉండగా.. కాంగ్రెస్ మద్దతుదారులు మూసాపేట, సంకలమద్ది, నందిపేట, తుంకినీపూర్, స్ఫూర్తితండా, పోల్కంపల్లి, కొమిరెడ్డిపల్లి, వేముల, నిజాలాపూర్ జీపీల్లో, బీఆర్ఎస్ మద్దతుదారులు దాసర్పల్లి, మహ్మదుస్సేన్పల్లి, జానంపేట, తిమ్మాపూర్, చక్రాపూర్లో గెలుపొందారు. అచ్చాయపల్లిలో కాంగ్రెస్ మద్దతుదారు ఏకగ్రీవమయ్యారు. తొలిసారి సర్పంచ్ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోవడం చాలా సంతోషంగా ఉంది. 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి. ఎన్నికల్లో ఓటర్లంతా ఓటు హక్కు వినియోగించుకుంటే అంత ఎక్కువ ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది. – దీపిక, మాగనూర్ తొలిసారి ఓటు హక్కు వచ్చింది. ఓటు హక్కు మన అందరి బాధ్యత. దానిని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. మొదటిసారి ఓటు వేయడం సంతోషంగా ఉంది. ఈవీఎం ద్వారా ఓటు వేయాల్సి ఉందని అనుకున్నా. కానీ బ్యాలెట్ పేపర్పై వేయడం జరిగింది. మొత్తంగా మొదటి సారి ఓటు హక్కు వినియోగించుకోవడం చాలా ఆనందంగా ఉంది. సమర్థవంతమైన వ్యక్తులకే నా ఓటు వేశాను. – శ్యాముల్, నేరడగం మండలాల వారీగా.. మండలం జీపీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇతరులు అడ్డాకుల 17 8 7 1 1 బాలానగర్ 37 15 15 2 5 భూత్పూర్ 19 11 7 0 1 జడ్చర్ల 45 22 18 1 3 మూసాపేట 15 9 5 0 1 అలంపూర్లో గులాబీ జోరు పాలమూరులో మూడో విడతలోనూ హస్తం హవా -
లారీ, ఆటో ఢీ.. ఇద్దరి దుర్మరణ ం
మక్తల్: పట్టణ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. యూపీకి చెందిన కొంతమంది కూలీలు స్థానిక హిర్షద్ సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో పని చేస్తున్నారు. వీరిలో రవీంద్ర కుమార్ (32), ప్రదీప్ కుమార్ (40) ఇద్దరు కలిసి మంగళవారం అర్ధరాత్రి స్వగ్రామానికి వెళ్లడానికి బస్టాండ్కు వెళ్లారు. ఎంత సేపు వేచిచూసిన బస్సు రాకపోవడంతో ఆకలి అవుతుండడంతో బస్టాండ్ దగ్గర ఉన్న ఆటో తీసుకొని సమీపంలోని డాబా దగ్గరకు బయలుదేరారు. అదే సమయంలో మహబూబ్నగర్ నుంచి రాయచూర్కు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. డ్రైవర్ కాశీనాత్కు స్వల్ప గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ భాగ్యలక్ష్మిరెడ్డి తెలిపారు. -
ఓటు కోసం పరుగో పరుగు..!
ప్రవేశ పరీక్షల చివరి సమయంలో విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ఉరుకులు పరుగులు తీస్తూ చేరుకునే దృశ్యాలు సాధారణంగా చూస్తుంటాం. కానీ, అలాంటి ఘటనే ఎర్రవల్లి పోలింగ్ కేంద్రం వద్ద బుధవారం చోటుచేసుకుంది. కేవలం పోలింగ్ సమయం ముగిసే 2 నిమిషాల ముందు పోలింగ్ కేంద్రంలోకి పరుగున వచ్చి.. ఓటు వేసింది ఓ మహిళ. వివరాల్లోకి వెళ్తే.. ఎర్రవల్లికి చెందిన సువర్ణ ఆంధప్రదేశ్ రాష్ట్రం కర్నూల్లో ఉంటుంది. ఓటు వేసేందుకుగాను భర్తతో కలిసి బైక్పై ఎర్రవల్లికి వస్తుండగా మార్గమధ్యలో బైక్ రిపేర్ కావడంతో ఆలస్యమైంది. సరిగ్గా 12.58 గంటలకు ఉరుకులు పరుగులు పెడుతూ పోలింగ్ కేంద్రానికి చేరుకోగా.. రెండు నిమిషాల సమయం ఉండడంతో అక్కడి అధికారులు గేటు తెరిచి లోపలికి అనుమతిచ్చారు. పోలింగ్ స్టేషన్లోకి వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకుంది. పోలింగ్ కేంద్రంలో చివరి ఓటు తనదే అవుతుందని అస్సలు ఊహించలేదని ఆమె పేర్కొన్నారు. – ఎర్రవల్లి ఎర్రవల్లి పోలింగ్ కేంద్రంలోకి పరిగెడుతున్న సువర్ణ -
నల్లమలలో హస్తం హవా..
● చివరి విడతలో మెజార్టీ గ్రామాలు కై వసం అచ్చంపేట: జిల్లాలో నిర్వహించిన మూడో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ అధికార కాంగ్రెస్ హవా కొనసాగింది. ఈ విడతలో 134 సర్పంచ్, 1,064వార్డులకు ఎన్నికలు జరగగా.. మెజార్టీ స్థానాల్లో హస్తం పార్టీ అభ్యర్థులు జయకేతనం ఎగరవేశారు. పలుచోట్ల అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం, సీపీఐలు బలపరిచిన అభ్యర్థుల మధ్య నువ్వా.. నేనా అన్నట్లుగా పోటీ సాగింది. మరికొన్ని చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతుదారులు పోటీ పడ్డారు. బుధవారం ఎన్నికలు జరిగిన ఏడు మండలాల్లో మొత్తంగా కాంగ్రెస్ 84, బీఆర్ఎస్ 37, బీజేపీ 1, ఇతరులు 12 గెలుపొందారు. 18 ఏకగ్రీవాలతో కలిపి మొత్తం 102 సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ కై వసం చేసుకుంది. సర్పంచుల ఫలితాలను అధికారికంగా ప్రటించిన అనంతరం రిటర్నింగ్ అధికారుల సమక్షంలో ఆయా పంచాయతీల్లో ఉప సర్పంచ్ల ఎన్నిక నిర్వహించారు. గెలుపొందిన సర్పంచ్లు, వార్డుసభ్యులకు ఆర్ఓలు ధ్రువపత్రాలు అందజేశారు. కాంగ్రెస్లో వర్గపోరు కాంగ్రెస్లో వర్గపోరు కారణంగా కొన్నిచోట్ల పార్టీ నుంచి ఇద్దరు, ముగ్గురు పోటీ చేసి నువ్వా.. నేనా.. అన్నట్లుగా తలపడ్డారు. అచ్చంపేట మండలం నడింపల్లి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఇద్దరూ ఓటమిని చవిచూశారు. సొంత పార్టీలోనే ఓట్లు చీల్చుకోవాల్సి రావడంతో మూడో వ్యక్తి గెలుపొందారు. ఉప్పునుంతల మండలం ఉప్పరిపల్లిలో కాంగ్రెస్ నుంచి ఇద్దరు పోటీ పడగా ఎమ్మెల్యే మద్దతు తెలిపిన వ్యక్తి ఓడిపోగా.. రెబల్ అభ్యర్థి గెలుపొందారు. మండలాల వారీగా పరిశీలిస్తే.. మూడో విడతలోనూ అధికార కాంగ్రెస్ అధిక్యం ప్రదర్శించిన కొన్ని మండలాల్లో బీఆర్ఎస్ గట్టిపోటీ ఇచ్చింది. చారకొండ మండలంలో ఎన్నికలు జరిగిన 14 పంచాయతీల్లో సగం.. సగం సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందారు. లింగాల మండలంలో కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 8 చొప్పున గెలిచింది. అచ్చంపేట, బల్మూర్, ఉప్పునుంతల, అమ్రాబాద్, పదర మండలాల్లో కాంగ్రెస్ అధిక్యం కనబర్చింది. ఈ మండలాల్లో బీఆర్ఎస్ వెనకబడగా.. బీజేపీ అసలు ప్రభావమే చూపలేకపోయింది. ప్రభుత్వంపై వ్యతిరేకత తమకు కలిసొస్తుందని ఆశించినప్పటికీ ప్రతిపక్ష పార్టీలు బలపర్చిన అభ్యర్థులు చాలాచోట్ల ఓటమి పాలయ్యారు. ముఖ్యంగా సంక్షేమ పథకాల లబ్ధిదారులు, మహిళలు అధికంగా అధికార కాంగ్రెస్ వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. -
మంత్రి ఇలాకాలో హస్తం హవా
● శ్రీరంగాపురంలో మిశ్రమ ఫలితం ● చెరో మూడు స్థానాలతో సరిపెట్టుకున్న బీజేపీ, సీపీఎంవనపర్తి: గ్రామపంచాయతీ ఎన్నికల ఘట్టం బుధవారంతో ముగిసింది. మూడోవిడతలో పెబ్బేరు, శ్రీరంగాపురం, పాన్గల్, వీపనగండ్ల, చిన్నంబావి మండలాల్లో జరగగా.. పోలింగ్ ముగిసే సమయానికి 85.55 శాతం ఓటింగ్ నమోదైంది. మధ్యాహ్న భోజన విరామం తర్వాత స్టేజ్–2 ఆర్వో సారథ్యంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించారు. రాత్రి పొద్దుపోయే వరకు శ్రీరంగాపురం, పెబ్బేరు మండలం రంగాపూర్ గ్రామాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగింది. మొత్తం 80 సర్పంచ్, 702 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగగా.. కాంగ్రెస్ మద్దతుదారులు ఆధిక్యం చాటుకోగా, బీఆర్ఎస్ ఆశించిన మేర స్థానాలు దక్కించుకుంది. శ్రీరంగాపురంలో.. జిల్లాలో అతి చిన్న మండలం శ్రీరంగాపురంలో మొత్తం ఎనిమిది గ్రామాలుండగా.. రెండు పంచాయతీల్లో కాంగ్రెస్, మరో రెండు పంచాయతీల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందగా.. మరో నాలుగు గ్రామాల్లో రెబల్స్ కై వసం చేసుకోవడం గమనార్హం. ఉనికి చాటుకున్న బీజేపీ, సీపీఎం.. మూడోవిడతలో సీపీఎం, బీజేపీ చెరో మూడు సర్పంచ్ స్థానాలు దక్కించుకొని ఉనికి చాటుకున్నాయి. బీజేపీ పాన్గల్ మండలంలో ఒక స్థానం, చిన్నంబావి మండలంలో రెండు స్థానాల్లో తెలుపొందగా.. సీపీఎం పాన్గల్ మండలంలో రెండు, వీపనగండ్ల మండలంలో ఒక స్థానం దక్కించుకున్నాయి. తొలి, రెండోవిడతలో ఆశించిన మేర స్థానాలు రాకపోయినా.. తుదివిడతలో ఉనికి కాపాడుకున్నాయనే వాదనలు ఆయా రాజకీయ పార్టీల్లో వినిపిస్తున్నాయి. 110 స్థానాలకు 59 స్థానాలు కై వసం నారాయణపేట: జిల్లాలోని మక్తల్, మాగనూరు, కృష్ణా, ఊట్కూర్, నర్వ మండలాల్లో బుధవారం జరిగిన మూడో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్రాతినిధ్యం వహిస్తున్న మక్తల్ నియోజకవర్గంలో 110 జీపీలకు గాను 59 స్థానాలు హస్తగతమయ్యాయి. మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ మద్దతుదారులు 25 స్థానాల్లో సర్పంచులుగా గెలుపొందారు. ఎంపీ డీకే అరుణ అండతో బీజేపీ మద్దతుదారులు 17 మంది సర్పంచులుగా విజయం సాధించారు. మరో 9మంది స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించి తమ సత్తా చాటుకున్నారు. డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి తన స్వగ్రామం పాన్గల్ మండలం కేతపల్లిలో బుధవారం ఓటుహక్కును వినియోగించుకున్నారు. వృద్ధులు, జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన ఓటర్లు సైతం అధికసంఖ్యలో గ్రామాలకు తరలివచ్చి ఓటుహక్కు వినియోగించుకున్నారు. -
అక్కడక్కడ..
● వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం కాళ్లూరు గ్రామంలో ఆరో వార్డులో ఒక్క ఓటు ఎక్కువగా వచ్చింది. దీంతో ఫలితాలు తారుమారు చేస్తున్నారని రోడ్డుపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బైఠాయించారు. పోలీస్లు అక్కడకు చేరుకుని వారిని సముదాయించారు. చివరకు బీఆర్ఎస్ మద్దతుదారు గెలవడంతో వారు ఆందోళనను విరమించారు. ● నారాయణపేట జిల్లా నర్వ మండలం జంగంరెడ్డిపల్లిలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. సర్పంచ్గా బీఆర్ఎస్ మద్దతుదారు మెట్ల తిరుపతమ్మ గెలుపొందారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. బ్రహ్మం అనే వ్యక్తిపై ‘కారు’ కార్యకర్తలు దాడికి పాల్పడగా.. అక్కడున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. -
అన్నపై తమ్ముడి పై‘చేయి’
అడ్డాకుల మండల కేంద్రంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో అన్నపై తమ్ముడు విజయం సాధించారు. బీఆర్ఎస్ తరఫున బొక్కలపల్లి తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి అతడి తమ్ముడు దశరథ్రెడ్డి పోటీపడ్డారు. హోరాహోరీ పోరులో తిరుపతిరెడ్డి 758 ఓట్లతో మూడో స్థానానికి పరిమితం కాగా.. దశరథ్రెడ్డి 888 ఓట్లతో తన సమీప ప్రత్యర్థి అయిన స్వతంత్ర అభ్యర్థి ఖాజామైనొద్దీన్ (840)పై 48 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గ్రామంలో 3,142 ఓట్లకు గాను 2,829 ఓట్లు పోలయ్యాయి. – అడ్డాకుల -
తాతదే జయకేతనం
మూసాపేట మండలం చక్రాపూర్ సర్పంచ్ ఎన్నికల్లో మనువడిపై తాత గెలుపొందాడు. ఈ గ్రామంలో 1285 ఓట్లకు 1175 పోలయ్యాయి. ఇందులో బీఆర్ఎస్ మద్దతుదారుడు గంటెల రఘురాములుకు 639 ఓట్లు, కాంగ్రెస్ మద్దతుదారుడు లక్ష్మినారాయణకు 484 ఓట్లు వచ్చాయి. దీంతో 155 ఓట్ల మెజార్టీతో మనువడిపై తాత నెగ్గాడు. రఘురాములుకు ముగ్గురు సంతానం ఉండటంతో గతంలో ఆయన పోటీ చేసే అవకాశం లేకపోవడంతో ఆయన తన తల్లిని పోటీ చేయించి రెండు సార్లు సర్పంచ్గా విజయం సాధించాడు. తాజాగా ప్రభుత్వం ముగ్గురు పిల్లలు ఉన్న వారికి అవకాశం ఇవ్వడంతో స్వయంగా రఘురాములు పోటీలో నిలిచి తొలిసారి విజయం సాధించాడు. – అడ్డాకుల -
కోడలిపై అత్త విజయం
జడ్చర్ల మండలం మాటుబండతండా పంచాయతీలో కోడలిపై అత్త విజయం సాధించింది. తండా ఎస్టీ మహిళకు రిజర్వు కాగా నేనావత్ లక్ష్మిని ఆమె పెద్ద కుమారుడు దీపక్రాథోడ్ సర్పంచ్గా పోటీలో ఉంచారు. అయితే లక్ష్మి చిన్న కుమారుడు నేనావత్ బాలకోటి తన భార్య పల్లవిని సర్పంచ్ బరిలో దింపాడు. వీరితోపాటు ఆంగోతు రూప్లి అనే మహిళ సైతం బరిలో నిలిచింది. ఈ క్రమంలో ఎన్నికల్లో 228 ఓట్లు పోలు కాగా లక్ష్మికి 98, పల్లవికి 72, రూప్లికి 56 ఓట్లు వచ్చాయి. చివరికి అత్త లక్ష్మి 26 ఓట్ల తేడాతో విజయం సాధించారు. – జడ్చర్ల టౌన్ -
చనిపోయిన వారికి ఎన్నికల విధులు..
నారాయణపేట రూరల్: పంచాయతీ ఎన్నికల నిర్వహణ తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. వివిధ శాఖల మధ్య సమన్వయ లోపంతో పాటు డేటాను అప్డేట్ చేయకపోవడంతో తప్పిదాలకు దారితీస్తుంది. ఇటీవల మొదటి విడత ఎన్నికల నిర్వహణలో ఉన్న ఉపాధ్యాయులకు మూడో విడత ట్రైనింగ్కు రావాలని ఫోన్ చేయడంతో పాటు గైర్హాజరు పేరుతో షోకాజ్ నోటీసులు ఇచ్చిన సంఘటన మరవక ముందే.. తాజాగా మరొకటి బయటకు వచ్చింది. మరణించిన ఉపాధ్యాయులకు సైతం ఎన్నికల విధులు కేటాయించడం చూస్తుంటే అధికారుల పనితీరు ఇట్టే అర్థం అవుతుంది. నారాయణపేటకి చెందిన అలివేలుమంగ దామరగిద్ద జీపీఎస్లో ప్రధానోపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తూ.. ఆరు నెలల క్రితం మృతి చెందింది. అయితే తాజాగా ఆమెకు మాగనూరు మండలంలో ఎన్నికల విధులు కేటాయిస్తూ ఆదేశాలిచ్చారు. అయితే దీనిని చూసిన పలువురు చనిపోయిన వారి ఆత్మ వచ్చి డ్యూటీ చేయలేమో అంటూ సైటెర్లు వేస్తున్నారు. ఇలా చాలా తప్పుల తడకగా ఎన్నికల విధుల కేటాయింపు జరిగిందని ఆరోపణలున్నాయి. -
గెలుపు ముఖ్యం బిగిలూ..
● చివరి విడత ఎన్నికల్లో కొనసాగిన ప్రలోభాలు ● బాలానగర్ మండలంలో అత్యధికంగా ఓటుకు రూ.5 వేల వరకు అందజేత ● అభ్యర్థులందరి ఖర్చు కలిపి రూ.కోట్లలోనే.. పాలమూరు: ‘ఎలాగైనా పంచాయతీ ఎన్నికల్లో గెలవాలి.. పరువు నిలబెట్టుకోవాలి’ ఇదే నినాదం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రధానంగా అభ్యర్థులు, నాయకుల నుంచి వినిపిస్తోంది. పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో కొందరు ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలుపు బాట పట్టేందుకు రూ.లక్షలు ఖర్చు చేసేందుకు వెనకాడట్లేదు. బుధవారం ఐదు మండలాల్లో చివరి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం తుది దశ పంచాయతీ ఎన్నిక సందర్భంగా పంపకాలు మంగళవారం రాత్రి వరకు సాగాయి. గ్రామాల్లో కొందరు అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అంతర్గతంగా కలిసి, మద్యం, నగదు, ఇతర కానుకలు అందజేస్తున్నారు. ఓటర్లకు తాయిలాలు సమర్పిస్తే తప్పా ఎన్నికల్లో గెలవడం కష్టమే ధోరణి పెరగడంతో అభ్యర్థులు అందుకు సిద్ధపడ్డారు. కొన్ని చోట్ల ఇంటింటికీ వెళ్లి.. మరో చోట కుల, యువజన సంఘాల ప్రతినిధులను కలిసి క్రీడా, వంట సామగ్రి ఇస్తూ ఓటర్ల ప్రసన్నం చేసుకునేందుకు ఆపసోపాలు పడుతున్నారు. చివరి విడత ఎన్నికల్లో భాగంగా పోటీలో ఉన్న అభ్యర్థులు చాలా మంది ఇంటింటికీ కిలో చికెన్ పంపిణీ చేస్తున్నారు. కొన్ని ఇళ్లల్లో ఓట్లు ఎక్కువగా ఉన్నాయంటే మటన్ కూడా అందిస్తున్నారు. వాటిని వద్దన్న వారికి స్వీట్బాక్స్లు పంపిణీ చేస్తున్నారు. అడ్డాకుల, భూత్పూర్ మండలాల పరిధిలో ఓటుకు రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు.. జడ్చర్ల పరిధిలో రూ.3 వేల వరకు ఇస్తే అత్యధికంగా బాలానగర్ మండలంలో చాలా గ్రామాల్లో ఓటుకు రూ.3వేల నుంచి రూ.5వేల వరకు పంపిణీ చేసినట్లు సమాచారం. భూత్పూర్ మండలంలోని ఓ గ్రామంలో హ్యాండ్ బ్యాగ్ల్లో మద్యం బాటిల్స్ పెట్టి ఇచ్చినట్లు తెలిసింది. ఎలాగైనా విజయం సాధించడానికి చివరి వరకు ప్రయత్నం చేశారు. మరికొందరు అభ్యర్థులు ఎదుటి వర్గం ఏమేమి పంపిణీ చేస్తున్నారో ఆరా తీసి అంతకు ఎక్కువగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల రెండవ విడతలో హన్వాడ మండలంలోని ఓ గ్రామంలో ఇద్దరు అభ్యర్థులు పోటీ పడి రూ.కోటి ఖర్చు చేశారు. చారిత్రాత్మక గ్రామం ముంపులో.. వల్లూరుకు చారిత్రాత్మకంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముందుగా ఊరంతా కోటలనే ఉండేదని పెద్దలు చెప్పేవాళ్లు. కాలక్రమేణా కోట బయట ఇండ్లు నిర్మాణమయ్యాయి. ఇప్పుడు కోట, ఇండ్లు అన్ని ముంపులోకే వెళ్తున్నాయి. మా గ్రామంలో పంచాయతీకి ఇవే చివరి ఎన్నికలు. ఎలాగోలా వచ్చే ఎన్నికల్లోగా మమ్మల్ని ఇక్కడి నుంచి తరలిస్తరు. ఆ మాట తలుచుకుంటేనే బాధగా ఉంది. ఏం చెప్పలేం. – ఈదె సత్తయ్య, వల్లూరు. పెరిగిన చికెన్ కల్చర్.. -
సీఎన్బీ అధికారుల మెరుపు దాడులు
గద్వాల క్రైం: సెంట్రల్ నార్కోటిక్ ఆఫ్ బ్యూరో అధికారులు సోమవారం అర్ధరాత్రి మెరుపు దాడులు చేపట్టి.. నిషేధిత ఆల్ఫాజోలం తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 171 గ్రాముల ఆల్ఫాజోలం స్వాధీనం చేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో మెరుపు దాడులు చేపట్టిన సీఎన్బీ అధికారులు.. జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. మల్దకల్ మండలం బిజ్వారం గ్రామానికి చెందిన ఈడిగి నరేశ్గౌడ్ నిషేధిత మత్తు పదార్థం (ఆల్పాజోలం)తో హైదరాబాద్ నుంచి వాహనంలో గద్వాలకు బయలుదేరాడు. పక్కా సమాచారం మేరకు సీఎన్బీ అధికారులు సుష్పాల్, పవన్, సాయివరుణ్, గౌరవ్లు అతడి వాహనాన్ని ఎర్రవల్లి–గద్వాల మార్గంలో పట్టుకొని 171 గ్రాముల నిషేధిత ఆల్ఫాజోలం తరలిస్తున్నట్లు గుర్తించారు. పట్టుబడిన ఆల్ఫాజోలం విలువ రూ. 4లక్షలు ఉంటుందని తెలిపారు. కాగా, నిందితుడు నరేశ్గౌడ్ను సీఎన్బీ అధికారులు గద్వాల రూరల్ పోలీస్స్టేషన్కు తరలించి విచారణ చేపట్టగా.. పలువురు కీలక వ్యక్తుల పేర్లును బహిర్గతం చేసినట్లు తెలిసింది. నిందితుడు తన స్వగ్రామంలో కల్లు దుకాణం ఏర్పాటు చేసుకుని కల్లు విక్రయాలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వెలుగులోకి ఇలా.. హైదరాబాద్లో నివాసముంటున్న మెదక్ జిల్లావాసి సుంకి శ్రీనివాస్ అలియాస్ కృష్ణతో నరేశ్గౌడ్ నిషేధిత ఆల్ఫాజోలం కొనుగోలుచేసి స్వగ్రామానికి బయలుదేరాడు. ఈ క్రమంలోనే సుంకి శ్రీనివాస్ను సీఎన్బీ అధికారులు పట్టుకొని విచారణ చేపట్టగా.. ఆల్ఫాజోలం మాఫియా దందా వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. ప్రధాన నిందితుడి సమాచారం మేరకు సీఎన్బీ అధికారులు బృందాలుగా ఏర్పడి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు చేపట్టారు. ఓ బృందం కర్నూలు జిల్లాలో ఇద్దరు నిందితులు నవీన్, మాధవ్ అలియాస్ గోపాల్ వద్ద 3 కేజీల ఆల్ఫాజోలం పట్టుకోగా.. మరో బృందం జోగుళాంబ గద్వాల జిల్లాలో నరేశ్గౌడ్ వద్ద 171 గ్రాముల ఆల్ఫాజోలం స్వాధీనం చేసుకున్నారు. సిన్నీ ఫక్కీలో.. ఎర్రవల్లి–గద్వాల మార్గంలో కాపు కాసిన సీఎన్బీ అధికారులు.. నరేశ్గౌడ్ వాహనాన్ని గుర్తించి నిలుపు దల చేశారు. అయితే వారి నుంచి నిందితుడు తప్పించుకునే ప్రయత్నం చేసిన క్రమంలో ఓ అధికారి గన్ ఎక్కుపెట్టడంతో లొంగిపోయినట్లు తెలుస్తోంది. అంతా గోప్యం.. మాదకద్రవ్యాలను సరఫరాచేసే మాఫియాను సెంట్రల్ నార్కోటిక్ ఆఫ్ బ్యూరో అధికారులు గుర్తించిన క్రమంలో ఎకై ్సజ్, పోలీసు, ఇంటెలిజెన్సీ, ఎస్బీ విభాగం అధిపతులకు ముందస్తు సమాచారం చేరవేయకుంగా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. మెదక్కు చెందిన ప్రధాన నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు పట్టుబడిన నిందితుల జాబితా బయట తెలియకుండా అంతా గోప్యంగా విచారించి.. పెద్ద మొత్తంలో ఆల్ఫాజోలం స్వాధీనం చేసుకున్నారు. ఈ చీకటి దందా వెనుక ఉన్న అసలు దోషులు ఎవరనే కోణంలో విచారణ చేపట్టినట్లు సమాచారం. జిల్లాలో ప్రకృతిసిద్ధ కల్లు కంటే ప్రమాదకరమైన కల్లు విక్రయాలు ఉన్నట్టు గుర్తించిన సీఎన్బీ అధికారులు.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు నివేదికలు సమర్పించనున్నట్లు తెలిసింది. నడిగడ్డలో 171 గ్రాముల నిషేధిత ఆల్ఫాజోలం సీజ్ సనీ ఫక్కీలో బిజ్వారం గ్రామవాసి అరెస్టు ప్రధాన నిందితుడి అరెస్టుతో వెలుగులోకి -
ఆర్ఎన్ఆర్ క్వింటా రూ.2837
జడ్చర్ల/దేవరకద్ర/నవాబుపేట: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్యార్డులో మంగళవారం ధాన్యం ఆర్ఎన్ఆర్ క్వింటా గరిష్టంగా రూ.2,837, కనిష్టంగా రూ.2,099 ధరలు లభించాయి. అదేవిధంగా హంస రూ.1,901, కందులు రూ.6,500, వేరుశనగ గరిష్టంగా రూ.7,668, కనిష్టంగా రూ.7,351, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,025, కనిష్టంగా రూ.1,650 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్లో ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ. 2673, కనిష్టంగా రూ.2406, హంస ధాన్యం ధర గరిష్టంగా రూ.2009గా ఒకే ధర పలికాయి. కాగా.. దేవరకద్ర మార్కెట్ యార్డులో బుధవారం ఉదయం ఉల్లి పాయల బహిరంగ వేలం నిర్వహిస్తారు. నవాబుపేటకు పోటెత్తిన ధాన్యం నవాబుపేట మార్కెట్ యార్డుకు భారీగా ధాన్యం పోటెత్తింది.ఇప్పటికే మార్కెట్లో 40 వేల బస్తాల ధాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం 55 వేలకు పైగానే ధాన్యం రాగా టెండర్లు సైతం సోమవారం నిర్వహించాల్సి వచ్చింది. మంగళవారమే యార్డు నిండిపోగా బుధవారం ధాన్యం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో రోజు వారి టెండర్లు వేసేలా మార్కెట్ అధికారులు వ్యాపారులతో చర్చిస్తున్నట్లు సమాచారం. ‘జైభీమ్ జైమీమ్’ నినాదంతో ముందుకు.. ఆత్మకూర్: జై భీమ్, జై మీమ్ నినాదంతో ముందుకెళ్తున్నామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ గ్రామాల్లో పార్టీని బలోపేతం చేస్తున్నామని ఏఐఎంఐఎం రాష్ట్ర సంస్థాగత బాధ్యుడు అబ్దుల్సమద్బిన్ అబ్దాద్ అన్నారు. మంగళవారం ఆత్మకూర్లోని ఎంజీ గార్డెన్లో ఏఐఎంఐఎం పార్టీ కార్యకర్తలతో సంస్థాగత సమావేశం నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించి అనవసరమైన విషయాలపై రాద్ధాంతం చేస్తోందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో సైతం సత్తాచాటే విధంగా కార్యకర్తలు ముందుకెళ్లాలని కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. మండల అధ్యక్షుడిగా నిరంజన్, ప్రధానకార్యదర్శిగా షాకీర్, మున్సిపాలిటీ అధ్యక్షుడిగా ఇమ్రాన్, ప్రధానకార్యదర్శిగా జావిద్, కోశాధికారిగా ఫిరోజ్ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జుబేర్బిన్సయిద్, ఎంఏ రహీం, అబ్దుల్హాదీ, సాదతుల్లాహుస్సేన్, గయాసుద్దీన్, ఖదీర్, అప్రోజ్ తదితరులు పాల్గొన్నారు. -
స్థానభ్రంశం అనివార్యం.. ఉన్నచోట చివరి ఓటు!
జడ్చర్ల టౌన్: ఉదండాపూర్, వల్లూరు రెండు గ్రామాల్లోనూ అక్కడ పంచాయతీ ఎన్నికలు ఇవే చివరివి. అదేమిటి రెండు గ్రామాలు మున్సిపాలిటీలో ఏవైనా.. విలీనమవుతున్నాయా.. అనే సందేహం వస్తుంది. అదికాదు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ఉదండాపూర్ రిజర్వాయర్లో ముంపునకు గురవుతుండడంతో ఆ గ్రామాలు అక్కడి నుంచి తరలింపు అనివార్యమవుతుంది. ప్రస్తుతం రెండు గ్రామాలకు అక్కడ ఎన్నికలు చివరివి కావడం గమనార్హం. దీంతో ఆయా గ్రామాల ప్రజలు భావోద్వేగానికి గురవుతున్నారు. ఉదండాపూర్ రిజర్వాయర్ కింద ఉదండాపూర్, వల్లూరు జీపీలు పూర్తిగా ముంపునకు గురవుతున్నాయి. ఆ రెండు గ్రామాలకు బండమీదిపల్లి జీపీ సమీపంలో పునరావాసం ఏర్పాటు చేస్తున్నారు. అయితే ముంపు నిర్వాసితులకు అందాల్సిన ప్యాకేజీ ఆలస్యం కావడంతో ఇంకా గ్రామాల తరలింపు జరగలేదు. కొన్నేళ్లుగా గ్రామస్తులు పోరాటం చేస్తూనే ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పునరావాసానికి హామీ ఇచ్చినప్పటికీ సాధ్యపడలేదు. ప్రస్తుత ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్రెడ్డి ముంపు బాధితుల పక్షాన ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప్యాకేజీ పెంపునకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో రూ.144కోట్లు పెంచుతూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. ఎన్నికల కోడ్ ముగిశాక ఆ డబ్బులు నిర్వాసితులకు పంపిణీ చేయనున్నారు. దీంతో గ్రామాల తరలింపు అనివార్యంగా మారింది. ఏడాదిలోగా గ్రామం పూర్తిగా తరలింపు కావాల్సిందే. అందుకే రెండు జీపీలకు ప్రస్తుతం ఉన్నచోట జరిగే ఎన్నికలు ఇవే చివరివి. పునరావాసం తర్వాత ఇవే గ్రామాలకు ఎన్నికలు జరగనున్నప్పటికీ స్థానభ్రంశం తప్పదు. అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఇక్కడే జరిగే అవకాశాలున్నాయి. -
నిలువురాళ్ల పరిశోధనకు సహకారం
కృష్ణా: మండలంలోని ముడుమాల్ నిలువురాళ్ల పరిశోధనకు దక్కన్ హెరిటేజ్ అకాడమీ చేస్తున్న కృషి అమోఘమని, వారికి తన సహాయ సహకారాలు అందిస్తామని పురవాస్తుశాఖ డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్రావువ అన్నారు. మంగళవారం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ముడుమాల్ నిలువురాళ్ల ప్రాంతంలోని సప్తరుషి మండలి తదితర వాటిని ఆయన పరిశీలించారు. అనంతరం దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ చైర్మన్ ప్రొఫెసర్ వేదకుమార్ మణికొండతో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. నిలువురాళ్ల ప్రదేశంలో పూర్తిస్థాయిలో పరిశోధనలు చేసేందుకు త్వరలోనే తవ్వకాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫ్రొఫెసర్ పుల్లారావు, నాగలక్ష్మి, రాములునాయక్, రాజు, నాగేష్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
పాన్గల్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం మండలంలో చోటు చేసుకుంది. హెడ్కానిస్టేబుల్ చంద్రశేఖర్ తెలిపిన వివరాలు.. వీనపగండ్ల మండలం తూంకుంటకు చెందిన వసంతపురం వీరస్వామి(37) జిల్లా కేంద్రంలో కారు డ్రైవర్గా పని చేస్తున్నాడు. భార్య, పిల్లలు సొంత గ్రామంలో ఉంటారు. సోమవారం రాత్రి వనపర్తి నుంచి స్వగ్రామం తూంకుంటకు బైక్పై వెస్తుండగా మండలంలోని దావాజిపల్లితండా సమీపంలో బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కన పంట పొలాలలో పడి మృతి చెందాడు. మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి భార్య శ్యామల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెచ్సీ తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. గుర్తుతెలియని వ్యక్తి మృతి వనపర్తి రూరల్: పట్టణంలోని కొత్తకోట రోడ్డులో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి పట్టణంలో కొత్తకోట రోడ్డులోని విజన్ స్కానింగ్ సెంటర్ పక్కన 75 ఏళ్ల వృద్ధుడు మృతిచెందాడు. అతడి ఒంటిపై ఆకుపచ్చ రంగు టీషర్ట్, మెరూన్ కలర్ షార్ట్ ధరించి ఉన్నాడు. మృతదేహం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో ఉందని, గుర్తు పట్టిన వ్యక్తులు పట్టణ పోలీసులను సంప్రదించాలని ఆయన కోరారు. షార్ట్ సర్క్యూట్తో గుడిసె దగ్ధం రాజోళి: వడ్డేపల్లి మండల పరిధిలోని బుడమరుసు గ్రామంలో షార్ట్ సర్క్యూట్తో గుడిసె దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన కుర్వ వెంకటేశ్వర్లు గుడిసెలో మంగళవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. మంటల్లో బంగారం, రూ.2.50 లక్షల నగదు, నిత్యవసర వస్తువులు పూర్తిగా దగ్ధమైనట్లు బాధితుడు పేర్కొన్నాడు. జాతీయ రహదారిపై వాహనం బోల్తా మానవపాడు: జాతీయ రహదారి– 44పై డీసీఎం వాహనం అదుపు తప్పి బోల్తా పడిన ఘటన మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం బెంగుళూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న డీసీఎం వాహనం జాతీయ రహదారిపై బోరవెల్లి స్టేజి సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్ మహమూద్కు స్వల్ప గాయాలయ్యాయి. 108 అంబులెన్స్ సిబ్బంది కల్పన ప్రథమ చికిత్స అందించి కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
సర్పంచ్ అభ్యర్థి ఇంటి ఎదుట క్షుద్రపూజలు
మక్తల్: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మండలంలోని కాచ్వార్ గ్రామంలో అభ్యర్థి ఇంటి ఎదుట క్షుద్రపూజలు చేయడం కలకలం రేపుతోంది. సర్పంచు ఎన్నికల్లో తమను ఓడించేందుకు ప్రత్యర్థి వర్గం తన ఇంటి ఎదుట క్షుద్రపూజలు చేశారని బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటమ్మ ఆరోపించారు. ఇంటి ముందు తెల్ల ఆవాలు, చనిపోయిన తర్వాత మృతదేహంపై చల్లే మొలకెత్తిన గింజలు, ఇసుక చల్లారని ఆందోళన వ్యక్తం చేశారు. తమ ఇంటి ముందే కాకుండా తమకు మద్దతు ఇస్తున్న వారి ఇంటి వద్ద క్షుద్రపూజలు చేస్తున్నారని వాపోయారు. ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని, ఇలాంటి పనులు చేయొవద్దని హితువు పలికారు. తమకు ఏమైనా జరిగితే ప్రత్యర్థి వర్గం వారు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కాచ్వార్ గ్రామంలో సర్పంచు పదవి బీసీ మహిళకు రిజర్వ్ అయింది. బరిలో నిలిచిన ప్రత్యర్థి మహిళా అభ్యర్థి మామనే ఈ పని చేసినట్లు గ్రామస్తుల ఎదుట ఒప్పుకున్నారు. ఈ తతంగం అంతా జరుగుతుండగానే వెంకటమ్మ భర్తకు గుండెనొప్పి రాగా చికిత్స కోసం అంబులెన్స్ల్లో మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రి వెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో ఈ ఘటన జరగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ● ‘పాలమూరుశ్రీలో ముంపునకు గురవుతుండడంతో తరలింపు ● ఉదండాపూర్, వల్లూరులో భావోద్వేగానికి గురువుతున్న గ్రామస్తులు -
సీసీకుంట పోలీస్స్టేషన్ ఎదుట బైఠాయింపు
● బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన ● ఎస్ఐ హామీతో ధర్నా విరమించిన గ్రామస్తులు, కుటుంబీకులు చిన్నచింతకుంట: ప్రమాదవశాత్తు రోడ్డుప్రమాదంలో మృతిచెందిన మధు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చిన్నచింతకుంట పోలీస్స్టేషన్ ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మృతుడి భార్య మనీష, గ్రామస్తులు మాట్లాడుతూ.. గరుడ కెమికల్ కంపెనీకి చెందిన బొలేరో డ్రైవర్ బొలేరోను నిర్లక్ష్యంగా నడుపుతూ ఏదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టి కౌకుంట్ల మండలం అప్పంపల్లికి చెందిన తెలుగు మధును అకారణంగా చంపేశాడని ఆరోపించారు. మృతుడు నిరుపేద కుటుంబానికి చెందిన వాడని.. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడని తెలిపారు. మృతుడికి భార్యతోపాటు ఇద్దరు బాలికలు, ఓ బాలుడు ఉన్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికి పెద్దదిక్కు మృతిచెందడంతో భార్యాపిల్లలు రోడ్డున పడ్డారని వాపోయారు. మృతుడి కుంటుబానికి సరైన న్యాయం చేయాలని రెండురోజులుగా పోలీసులను ఆశ్రయిస్తున్నా.. పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ఓ పక్కన మృతదేహాన్ని పెట్టుకొని భార్యాపిల్లలు పోలీస్స్టేషన్ చుట్టూ తిరుగుతూ తల్లడిల్లిపోతున్నారని వాపోయారు. ఇప్పటికై నా పోలీసులు స్పందించి చర్యలు చేపట్టి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. నిరసన వద్దకు ఎస్ఐ ఓబుల్రెడ్డి చేరుకొని బాధితులు ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేసి విచారణ చేపట్టి కుటుంబానికి సరైన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. పోలీసులు డ్రామా చేస్తున్నారని ఆరోపణ మృతుని కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇస్తూ పోలీసులు డ్రామా చేస్తున్నారని పలువురు గ్రామస్తులు ఆరోపించారు. ప్రమాదం జరిగి రెండు రోజులు గడుస్తున్నప్పటికీ ఎలాంటి న్యాయం చేయలేదని మండిపడ్డారు. సోమవారం రాత్రి ప్రమాదం జరిగిన ఘటన వద్దనే మృతుడి కుటుంబానికి న్యాయం జరిగే వరకు కదలనివ్వమని భీష్మిస్తే బొలేరో యాజమాన్యంతో సంప్రదింపులు జరిపి తగు న్యాయం చేస్తామని కల్లిబొల్లి మాటలు చెప్పి మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించి చేతులు దులుపుకొన్నారని మండిపడ్డారు. తీరా ఉదయం చూస్తే బొలేరో యాజమాన్యంతో చేతులు కలిపి యాజమాన్యం స్పందించడంలేదంటూ చావుకబురు చల్లగా చెబుతున్నారని ఆరోపించారు. రెండురోజులుగా తిండీతిప్పలు లేక కుటుంబ సభ్యులు అల్లాడుతుంటే పోలీసులకు ఆటవిడుపుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును ఉన్నతాధికారులు గమనించాలని కోరారు. -
పాన్గల్లో పట్టుబడిన చీరలు
పాన్గల్: మండల కేంద్రంలో బీఆర్ఎస్ మద్దతు దారుల ఇళ్లలో చీరలు పట్టుబడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. పంచాయతీ ఎన్నికల దృష్ట్యా బీఆర్ఎస్ నాయకుల ఇళ్లలో ఓటర్లకు పంచేందుకు చీరలు ఉన్నాయన్నా కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని వందల సంఖ్యలో ఉన్న చీరలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్టేషన్కు తరలించారు. పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో ఓ నాయకుడు చీరలను కేఎల్ఐ కాల్వ సమీపంలోని చెట్ల పొదల్లో వేశారు. అనంతరం కాంగ్రెస్ మద్దతుదారుడి ఇంటిలో రెండు కాటన్ల మద్యం పట్టుబడిందని, రెండు సంఘటనలపై విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
ప్చ్.. ఈ ఏడు గ్రామాలలో ఎన్నికలే లేవు!
సాక్షి, హైదరాబాద్: మూడో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ పలు సిత్రాలు కనిపిస్తున్నాయి. పలు గ్రామాల్లో ఏకగ్రీవాలు.. అయిన వాళ్ల మధ్యే పోరు.. ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఏడు గ్రామాలకు ఎన్నికలే లేకుండా పోయాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 563 సర్పంచ్.. 5,016 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాలి. ఇందులో 52 జీపీలు ఏకగ్రీవం కాగా.. ఏడు పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు కాకపోవడం గమనార్హం. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం లక్ష్మాపురం (బీకే), వంగురోనిపల్లె, కల్ములోనిపల్లె, ప్రశాంత్నగర్ పంచాయతీలకు మూడో విడతలో నిర్వహించే ఎన్నికలను ప్రజలు బహిష్కరించారు. కారణం ఆ పల్లెల్లో గిరిజనులు లేకున్నా.. ఏజెన్సీ నిబంధనల ప్రకారం సర్పంచి స్థానాలను గిరిజనులకే కేటాయించాల్సి రావడం. ఇక చారగొండ మండలం ఎర్రవల్లి గ్రామస్తులు గోకారం రిజర్వాయర్ ముప్పు తగ్గించాలంటూ ఎన్నికలను బహిష్కరించారు. జడ్చర్ల మండలం శంకరాయపల్లిలో ఓటర్లు లేకున్నా ఎస్టీ రిజర్వేషన్ రావడంతో సర్పంచ్ స్థానానికి ఎన్నికలు లేకుండా పోయాయి.ఇవి పోనూ 504 గ్రామపంచాయతీల్లో పోలింగ్ జరగనుంది. 504 సర్పంచ్ స్థానాలకు 1,652 మంది పోటీ పడుతున్నారు. అదేవిధంగా 942 వార్డులు ఏకగ్రీవం కాగా.. 58 వార్డు స్థానాల్లో నామినేషన్లు వేయలేదు. ఇవి పోనూ మిగిలిన 4,016 వార్డుల్లో పోలింగ్ జరగనుండగా.. 10,436 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఒక్కో సర్పంచ్, ఒక్కో వార్డుకు సగటున ముగ్గురు చొప్పున పోటీపడుతున్నారు. -
ఏజెన్సీ పేరున్నా.. గిరిజనులు లేరాయె!
అచ్చంపేట: ఏజెన్సీ పంచాయతీలుగా గుర్తింపున్న కొన్ని గ్రామాలకు ఎస్టీ ఓటర్లు లేక ఎన్నికలకు దూరంగా ఉండాల్సి వస్తోంది. వాటిని నాన్ ఏజెన్సీ గ్రామాలుగా మార్చాలంటే పార్లమెంట్లో చట్టం చేయడం రాజ్యాంగ పరమైన మార్పులతో రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. అది అనుకున్నంత సులువైనదేం కాదు. మూడంచెల పంచాయతీరాజ్ చట్టం 1995 ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చింది. ఏజెన్సీలో 1/70 చట్టం అమలు కారణంగా ఈ గ్రామాల్లో సర్పంచ్ రిజర్వేషన్ ఎస్టీలకే ఉంటుంది. అప్పట్లో కొంతమంది ప్రజాప్రతినిధులు, అధికారులు చేసిన తప్పులతో ఇప్పుడు ఈ పరిస్థితి తలెత్తింది. అమ్రాబాద్ మండలం కుమ్మరోనిపల్లి, లక్ష్మాపూర్, కల్ములోనిపల్లి, వంగరోనిపల్లి, ప్రశాంత్నగర్ ఎస్టీలకు రిజర్వు అయ్యాయి. తెలంగాణ వచ్చిన తర్వాత 2018లో కుమ్మరోనిపల్లి పంచాయతీ నుంచి వంగరోనిపల్లి, మన్ననూర్ నుంచి ప్రశాంత్నగర్, కల్ములోనిపల్లి నుంచి తెలుగుపల్లి, లక్ష్మాపూర్ నుంచి లక్ష్మాపూర్తండాను ప్రత్యేక పంచాయతీలుగా మార్చడంతో గిరిజనేతరులున్నా ఏజేన్సీ గ్రామాలుగా ఏర్పడ్డా యి. సర్పంచ్తోపాటు వార్డుస్థానాలను ఎస్టీలకు కేటాయించడంతో ఎన్నికలకు అవరోధకంగా మారుతోంది. సర్పంచ్తో సహా 8వార్డుల్లో 4వార్డులకు జరపాల్సిన ఎన్నికలు ఎస్టీ జనాభా లేకుండా వాయిదా వేసుకోవాల్సి వస్తోంది. ఎస్టీ జనాభా లేక పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే పరిస్థితి లేకుండా పోయింది. హన్వాడ: మండలంలోని టంకర సర్పంచ్ స్థానానికి ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో మహిళా జనరల్లో పోటీచేసిన స్వంతంత్ర అభ్యర్థిని మెండె లక్ష్మి భారీ మెజార్టీతో గెలుపొందింది. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిని మదులపాటి పూజపై 2వేల మెజార్టీతో విజయం సాధించారు. గ్రామంలో మొత్తం 3,425 ఓట్లలో 3,113ఓట్లు పోలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థి మెండె లక్ష్మికి 2,113ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థిని మధులపాటి పూజకు వెయ్యి ఓట్లు వచ్చాయి. మండలంలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొందిన అభ్యర్థినిగా నిలిచింది. స్వతంత్ర అభ్యర్థిని మెండె లక్ష్మికి స్థానిక బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు మద్దతుగా నిలవడంతో ఆమె గెలుపు సులువుగా మారింది. ఆమె ప్యానెల్లో బీజేపీ 5, బీఆర్ఎస్ 6వార్డు స్థానాలు కై వసం చేసుకోగా.., కాంగ్రెస్ కేవలం ఒక్కవార్డు స్థానంలో మాత్రమే గెలుపొందింది. ఆ వార్డు స్థానం కూడా కేవలం 6ఓట్ల స్వల్ప మెజార్టీలో గెలుపొందింది. భారీ మెజార్టీతో స్వతంత్ర అభ్యర్థి ఘనవిజయం -
టోర్నీలో ప్రతిభ చాటాలి
మహబూబ్నగర్ క్రీడలు: హైదరాబాద్లో మంగళవారం నుంచి జరుగనున్న హెచ్సీఏ ఇంటర్ స్కూల్స్ వన్డే నాకౌట్ టోర్నీలో జిల్లా జట్టు మెరుగైన ప్రతిభ కనబర్చాలని ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ అన్నారు. పిల్లలమర్రి రోడ్డు సమీపంలోని ఎండీసీఏ మైదానంలో టోర్నీలో పాల్గొననున్న అండర్– 14 జిల్లా బాలుర క్రికెట్ జట్టును సోమవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టోర్నీలో క్రీడాకారులు ఉత్తమ ప్రదర్శన కనబర్చాలన్నారు. సమష్టిగా ఆడితే విజయం సాధించవచ్చని సూచించారు. టోర్నీలో గ్రూప్– ఏలో జిల్లా జట్టు మొదటి మ్యాచ్లో ఎస్టీ మైకల్స్ స్కూల్ (ఆల్వాల్) జట్టుతో తలపడనుందని పేర్కొన్నారు కార్యక్రమంలో కోచ్లు గోపాలకృష్ణ, ముఖ్తార్అలీ, సీనియర్ క్రీడాకారుడు రంజిత్కుమార్ పాల్గొన్నారు. అండర్–14 క్రికెట్ జట్టు రాహుల్ రైన (మహబూబ్నగర్), అర్హాన్, జైద్ (జడ్చర్ల), సాయిహర్షిత్ (మహబూబ్నగర్), రాఘవ, పునీత్ (జడ్చర్ల), వెంకటసాయి– కెప్టెన్, కార్తీకేయ (గద్వాల), సాయిరాం (మహబూబ్నగర్), జోసెఫ్ (జడ్చర్ల), హృతిక్ (వనపర్తి), చరణ్తేజ (జడ్చర్ల), సాత్విక్, సోహైల్, ధనుష్ (మహబూబ్నగర్), కోచ్ ముఖ్తార్ అలీ. -
నల్లమలలో పెద్దపులుల కనువిందు
మన్ననూర్: నల్లమల, అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యంలో పెద్ద పులులు పర్యాటకులను ఆకర్శిస్తున్నాయి. అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జంగల్ సఫారీలో ప్రయాణం చేస్తున్న ప్రకృతి ప్రియులకు అటవీ ప్రాంతంలో తరుచుగా పెద్దపులులు కనిపిస్తుండటంతో పర్యాటకుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఆదివారం సాయంత్రం సమయంలో హైద్రాబాద్కు చెందిన కొందరు సఫారీలో ప్రయాణిస్తుండగా నిజాం బంగ్లా సమీపంలో వాహనం ముందు నుంచి పెద్ద పులి నడుచుకుంటూ వెళ్లడం కనిపించింది. అభయారణ్యంలో సహజ సిద్ధంగా సంచరిస్తున్న పెద్దపులిని చూసి సంబరపడిన పర్యాటకులు వారి సెల్ఫోన్లలో ఆ దృశ్యాలను చిత్రీకరించారు. -
సుంకరామయ్యపల్లిలో ఒకే ఓటు..!
అడ్డాకుల: సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ ఓటుతో పాటు వార్డు సభ్యుడి ఓటు వేయాల్సి ఉంటుంది. కానీ అడ్డాకుల మండలం సుంకరామయ్యపల్లి గ్రామంలో మాత్రం ఒకే ఓటు వేయాల్సి ఉంది. అది కూడా సర్పంచ్ ఓటు మాత్రమే. వివరాల్లోకి వెళ్తే.. గ్రామంలో 445 ఓట్లు, 8 వార్డు స్థానాలు ఉన్నాయి. సర్పంచ్, వార్డు సభ్యులను ఏకగ్రీవం చేయాలని నిర్ణయించిన గ్రామస్తులు ఒక్కో వార్డుకు ఒక్కరితోనే నామినేషన్ వేయించారు. సర్పంచ్ స్థానానికి మాత్రం ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ వేశారు. తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరూ నామినేషన్ ఉపసంహరించుకోలేదు. దీంతో సర్పంచ్ ఎన్నిక అనివార్యమైంది. ఇకపోతే వార్డు స్థానాలకు ఒక్కొక్కరే నామినేషన్ వేయడంతో వారంతా ఏకగ్రీవమయ్యారు. ఇక రేపు (బుధవారం) గ్రామంలో జరిగే పోలింగ్లో ఓటర్లు సర్పంచ్ ఓటు మాత్రమే వేయాల్సి ఉంది. -
మార్కెట్లోకి ఎంజీ హెక్టర్ నూతన మోడల్
పాలమూరు: ఎంజీ హెక్టర్ నూతన మోడల్ను సోమవారం నగరంలోని ఏనుగొండ షోరూంలో కంపెనీ ఏఎస్ఎం టేజా కిలారి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా షోరూం ఎండీ వేణుగోపాల్సింగ్ మాట్లాడుతూ.. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఎంజీ హెక్టర్ సీవీటీ పెట్రోల్ మోడల్లో ఆకర్షిణీయమైన ఫీచర్స్ ఉన్నాయన్నారు. ఆరా హెక్సాగ్ రిల్, ఆధునిక ఐఎస్ఎంఐఐఈ టెక్నాలజీ, పనోరామిక్ సన్రూఫ్ ఉంటుందన్నారు. ఆరా స్కల్ప్ బంపర్లు, స్టైలిష్ ఆరా బోల్ట్ అలాయ్ వీల్స్, 14 ఇంచుల పోర్ర్టెయిట్ టచ్ స్క్రీన్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మహబూబ్నగర్లో ఎంజీ హెక్టర్ వాహనాలకు మంచి స్పందన లభిస్తోందని, ఈ కొత్త వేరియంట్ కస్టమర్లకు అత్యుత్తమంగా ఉపయోగపడుతుందన్నారు. -
అన్నదమ్ముళ్ల సవాల్..!
● రసవత్తరంగా స్థానిక ఎన్నికలు ● తిమ్మాయిపల్లి తండాలో సొంత అన్నదమ్ముళ్ల మధ్య పోటీ ● అడ్డాకులలోనూ సోదరుల పోరు ● సుంకరామయ్యపల్లిలో బాబాయ్, అబ్బాయ్ల అమీతుమీ అడ్డాకుల: పల్లె పోరులో రక్తం పంచుకు పుట్టిన వారు, ఒకే కుటుంబానికి చెందిన వారు ప్రత్యర్థులవుతున్నారు. సొంత అన్న, తమ్ముళ్లు, బాబాయ్, అబ్బాయ్ల మధ్య పోటీతో సర్పంచ్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అడ్డాకుల మండలం తిమ్మాయిపల్లితండాలో నలుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నలుగురిలో జరుప్ల హన్మంతునాయక్, జరుప్ల గోపాల్నాయక్ సొంత అన్నదమ్ముళ్లు. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థిగా హన్మంతునాయక్, రెబల్గా గోపాల్నాయక్ పోటీ చేస్తున్నారు. అడ్డాకుల మండల కేంద్రంలో ఐదు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో బీఆర్ఎస్ తరఫున బొక్కలపల్లి తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ నుంచి బొక్కలపల్లి దశరథ్రెడ్డి పోటీలో ఉన్నారు. ఇద్దరు వరుసకు అన్నదమ్ముళ్లు. సుంకరామయ్యపల్లిలో బాబాయ్, అబ్బాయ్ మధ్య పోటీ జరుగుతోంది. బీఆర్ఎస్ తరఫున ఆకులమోని రవి, కాంగ్రెస్ తరఫున ఆకులమోని చెన్నకేశవులు పోటీలో ఉన్నారు. అయితే ఇక్కడ ఏకగ్రీవంగా రవిని సర్పంచ్, చెన్నకేశవులను ఉప సర్పంచ్గా నిర్ణయం తీసుకున్నా నామినేషన్ల ఉపసంహరణ రోజు ఏకాభిప్రాయం కాస్త పోరుకు దారి తీసింది. ఏదేమైనా పల్లె పోరులో రక్తం పంచుకు పుట్టిన వారు కూడా ప్రత్యుర్థులుగా మారడం రసవత్తరంగా మారింది.గోపాల్నాయక్ – జరుప్ల తిరుపతిరెడ్డి– బొక్కలపల్లి దశరథ్రెడ్డి– బొక్కలపల్లి రవి– ఆకులమోని చెన్నకేశవులు– ఆకులమోని -
పట్టపగలు ఇంట్లోకి చొరబడి చోరీ
కల్వకుర్తి టౌన్: తాగేందుకు నీళ్లు ఇవ్వాలంటూ వచ్చిన ఓ వ్యక్తి.. ఇంట్లోకి చొరబడి మహిళ మెడలో నుంచి మంగళసూత్రం అపహరించుకువెళ్లాడు. ఈఘటన కల్వకుర్తిలో సోమవారం చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలిలా.. పట్టణంలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల వద్ద ఉన్న లకీ్ష్మ్నగర్ కాలనీలో రాజేశ్వరి, సంతోష్రెడ్డి దంపతులు నూతనంగా ఇళ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. రోజు మాదిరిగానే రాజేశ్వరి తన బిడ్డను ఇంటి వరండాలో ఆడిస్తూ ఉండగా.. ఓ వ్యక్తి బాగా దాహంగా ఉంది, నీరు ఇవ్వాలని అడిగాడు. నీరు ఇచ్చాక.. మరోగ్లాస్ ఇవ్వాలంటూ అడగడంతో ఆమెకు అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకోవాలని చూసింది. ఇంతలోనే ఆ దొంగ తలుపు గడియ పెట్టకుండా అడ్డుతగిలి ఇంట్లోకి చొరబడి రాజేశ్వరిని కొట్టడంతోపాటు ఆమె బిడ్డను పక్కకు విసిరేసి ఆమె మెడలో ఉన్న మంగళసూత్రాన్ని లాక్కొని పారిపోయాడు. రాజేశ్వరి బయటకు వచ్చి చుట్టుపక్కల వాళ్లకు ఏడుస్తూ జరిగిన విషయాన్ని చెప్పే సరికి అతను పారిపోయాడు. పోలీసులకు బాధితురాలి భర్త ఫిర్యాదు చేయగా సీఐ నాగార్జున, ఎస్ఐ మాధవరెడ్డి అక్కడికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. తాగేందుకు నీళ్లు ఇవ్వాలంటూ వచ్చి మంగళసూత్రం అపహరణ -
మా ఊరోళ్ల్లే.. నా గుండెల మీద కొట్టారు
జడ్చర్ల: మా సొంత ఊరుకు ఎంతో చేశా.. కానీ సర్పంచ్ ఎన్నికల్లో తమ అభ్యర్థిని ఓడించి తన గుండెల మీద కొట్టారని ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్తో కలిసి మండలంలోని గంగాపూర్, నసరుల్లాబాద్, చర్లపల్లిలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. సీఎం రేవంత్రెడ్డి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఈ సందర్భంగా వివరించారు. మంచి అభ్యర్థులను ఎన్నుకుంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. గంగాపూర్లో పలువురు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారికి పార్టీ కండవాలు వేసి ఆహ్వానించారు. కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం మాట్లాడుతూ.. తన సొంతూరు రంగారెడ్డిగూడలో రూ.1.50 కోట్లతో అభివృద్ధి పనులు చేశామన్నారు. అయినా బయటినుంచి వచ్చిన వ్యక్తులు తమ గ్రామస్తులను ప్రభావితం చేసి ఎమ్మెల్యేను ఓడించాలన్న ప్రయత్నం చేశారన్నారు. అయితే తన నియోజకవర్గంలోని అన్నిగ్రామాలు తన సొంతూర్లేనన్నారు. పదేళ్లపాటు ప్రతిపక్షంగా ఉంటూ ప్రజాసమస్యలపై పోరాడానని, నేడు ఎమ్మెల్యేగా ఉదండాపూర్ నిర్వాసితుల పక్షాన ప్రభుత్వంతో పోరాడుతున్నానంటూ వివరించారు. కార్యక్రమంలో నాయకులు జనార్దన్రెడ్డి, గిరిప్రసాద్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి -
బాండ్ పేపర్పై ఆస్తుల ప్రకటన
వనపర్తి రూరల్: పెబ్బేరు మండలంలోని కంచిరావుపల్లి గ్రామంలో కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి బత్తుల బాలగౌడ్ తన ఆస్తులను బాండ్ పేపర్పై ప్రకటించారు. ఎన్నికల చివరి రోజైన సోమవారం ప్రజలతో సమావేశం నిర్వహించి ఆస్తులను ప్రకటించాడు. తనకు రెండు రూములు, 15/40 ఖాళీ స్థలం, చెరువు కింద 10 గుంటల భూమి, హీరోహోండా బైక్ కలదని పేర్కొన్నాడు. ఈ రోజు ఎన్ని ఆస్తులు ఉన్నాయో పదవీకాలం పూర్తయిన తర్వాత కూడా అదే ఆస్తులతో ఉంటానని చెన్నకేశవస్వామిపై ప్రమాణం చేసి బాండ్ పేపరును ప్రజలకు అందజేశారు. ఒకవేళ ఈ ఆస్తుల కన్నా ఎక్కువ సంపాదిస్తే గ్రామానికి అందజేస్తానని అన్నారు. సర్పంచ్ అభ్యర్థి వినూత్న ప్రచారం -
రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి
చిన్నచింతకుంట: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన ఘటన చిన్నచింతకుంట మండలంలోని పెద్దవడ్డెమాన్–నెల్లికొండి మధ్యలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ ఓబుల్రెడ్డి కథనం ప్రకారం.. కౌకుంట్ల మండలంలోని అప్పంపల్లికి చెందిన తెలుసు మధు బైక్పై నెల్లికొండి నుంచి వడ్డేమాన్వైపు వస్తున్నాడు. వడ్డెమాన్ నుంచి నెల్లికొండి వైపు వెళ్తున్న బొలేరో డ్రైవర్ అజాగ్రత్తగా నడుపుతూ ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్ రోడ్డుపక్కకు పడిపోగా.. మధుకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఎలాంటి ఫిర్యాదు అందక పోవడంతో కేసు నమోదు చేయలేదని తెలపారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నాడు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన మృతుడు తెలుగు మధు కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఘటనా స్థలం వద్ద రోడ్డుపై బైఠాయించారు. బొలేరో డ్రైవర్ అజాగ్రత్తతోనే ఓ నిండు ప్రాణం బలైందని ఆరోపించారు. మృతుడి కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించమని భీష్మించారు. ఘటనా స్థలానికి సీఐ రామకృష్ణ చేరుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ వారు ఆందోళనను విరమించలేదు. భవనంపై నుంచిపడి తాపీమేసీ్త్ర మృతి పెంట్లవెల్లి: మండల కేంద్రంలో ఇంటినిర్మాణం చేపడుతుండగా.. ప్రమాదవశాత్తు భవనం పైనుంచి పడిన ఘటనలో తాపీమేసీ్త్ర బత్తిని వెంకటేశ్(46) మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రామన్గౌడ్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నూతన భవనం నిర్మాణంలో భాగంగా సెంట్రింగ్ తొలగిస్తుండగా.. ప్రమాదవశాత్తు మొదటి అంతస్తు పైనుంచి కాలుజారి కిందపడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కొల్లాపూర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందినట్లు ఎస్ఐ తెలిపారు. -
ఎడమ చేతికి చూపుడు వేలు లేకపోతే..
పాలమూరు: పోలింగ్ కేంద్రంలో ఓటరుకు ఎడమచేతి చూపుడు వేలుకు సిరా చుక్క పెడతారు. కానీ ఆ వ్యక్తి ఎడమచేతికి చూపుడువేలు లేకుంటే ఎలా? అనే ప్రశ్న కొందరికి తలెత్తవచ్చు. ఎన్నికల సంఘం దీనికి ప్రత్యామ్నాయం చూపింది. ఎడమచేతి చూపుడువేలు లేకపోతే మధ్య వేలు, అదికూడా లేకుంటే ఉంగరం వేలు, అదీ లేకుంటే చిటికెన వేలు, అదీ లేకుంటే బొటన వేలుకు సిరాచుక్క పెట్టే అవకాశం కల్పించింది. ఎడమ చెయ్యి లేకుంటే కుడిచేతి చూపుడువేలు, మధ్యవేలు, ఉంగరం వేలు, బొటనవేలుకు సిరాచుక్క పెట్టవచ్చు. రెండు చేతులకు వేళ్లు లేని పక్షంలో ఎడమ, కుడి చేతుల పైభాగంలో సిరాచుక్క పెడతారు. -
పల్లె పాలనకు 61 ఏళ్లు
● 1964లో తొలిసారి పంచాయతీ ఎన్నికలు ● మొదటి పంచాయతీగా షాద్నగర్ ఎంపిక ● 1959 నుంచి మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ బల్వంత్రాయ్ మెహతా కమిటీ నివేదిక ప్రకారం.. ● ప్రజల భాగస్వామ్యం కోసం మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ● పాలన వికేంద్రీకరణ ద్వారా స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా వనరులను వినియోగించుకోవాలి. ● శాశ్వతమైన పరిపాలన అమలుకు యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. అచ్చంపేట: గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలన్నారు మహాత్మాగాంధీ. ప్రజాస్వామ్య వ్యవస్థలో మూల స్తంభమైన గ్రామ పంచాయతీల ఏర్పాటు, కాలానుగుణంగా చోటు చేసుకున్న మార్పులు ఆసక్తిగా ఉన్నాయి. ఇంతకీ గ్రామ పంచాయతీ వ్యవస్థ ఎలా ఏర్పడిందో తెలుసుకొందాం. నెహ్రూ నాయకత్వంలో ప్రజాస్వామ్యం– సామ్యవాదం నినాదంతో దేశంలో పాలన సాగించారు. 1951లో మొదటి పంచవర్ష ప్రణాళికను ప్రారంభించారు. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధితో పాటు గ్రామీణుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చాలని సంకల్పించారు. ప్రొఫెసర్ ఎస్కే డే నేతృత్వంలో కమ్యూనిటీ డెవలప్మెంట్ కార్యక్రమం అమలు చేశారు. దీనిపై శాసీ్త్రయ అధ్యయనానికి 1957లో సామాజిక, ఆర్థికశాస్త్రవేత్త డాక్టర్ బల్వంత్రాయ్ మెహతా నేతృత్వంలో అధ్యయన బృందాన్ని నియమించారు. దాని ఆధారంగా 1959లో జిల్లా, బ్లాక్, గ్రామ పంచాయతీ ఇలా మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. దీనిని దేశంలో మొట్టమొదట రాజస్థాన్లో అక్టోబర్ 2న, మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్లో 1959 అక్టోబర్ 11న అప్పటి ప్రధాని నెహ్రూ ప్రారంభించారు. అనంతరం దశల వారీగా దేశమంతటా అమలైంది. మొదట్లో పరోక్ష పద్ధతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1964లో సమగ్ర గ్రామ పంచాయతీ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం ప్రకారం 500కు పైగా జనాభా కలిగిన గ్రామాలను ఒక పంచాయతీగా ఏర్పాటు చేశారు. జనాభాను బట్టి 5 నుంచి 17 మంది వరకు వార్డు సభ్యులు ఉండవచ్చని ఇందులో పేర్కొన్నారు. 1964లో సర్పంచ్ల ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరిగాయి. వార్డు సభ్యులను ఓటర్లను ఎన్నుకుంటే, వారు సర్పంచ్ను ఎన్నుకునే వారు. ఎన్నికై న సర్పంచ్లు కలిసి సమితి(బ్లాక్) ప్రెసిడెంట్ను ఎన్నుకుంటారు. సమితి ప్రెసిడెంట్లు జిల్లా పరిషత్ అధ్యక్షుడిని, ఉపాధ్యక్షుడిని ఎన్నుకనేవారు. 1976 వరకు ఇదే పద్ధతి కొనసాగింది. వీరి ఎన్నికలో ఎమ్మెల్మేలు, ఎమ్మెల్సీలకు ఓటుహక్కు ఉండేది. 1978 నుంచి ప్రత్యక్ష పద్ధతి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1978లో నరసింహం కమిటీని ఏర్పాటు చేసింది. సర్పంచ్లను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాలని ఈ కమిటీ సూచించింది. దీంతో అప్పటి నుంచి సర్పంచ్ల ఎన్నిక ప్రక్రియ ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహిస్తున్నారు. ఎస్పీ, ఎస్టీలకు రిజర్వేషన్లు 1992లో అమలులోకి వచ్చిన 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం గ్రామ పంచాయతీల్లో షెడ్యూల్డ్ కులాలు, తెగల వారికి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల కల్పించాలని, అలాగే 1/3వ వంతు మహిళలకు రిజర్వు చేయాలని సూచించింది. అప్పటి నుంచి గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్లో రిజర్వేషన్లు అమలవుతున్నాయి. మండల వ్యవస్థ మార్పుతో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 1986 ఫిబ్రవరి 15న అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తాలుకాలను రద్దుచేసి మండల వ్యవస్థను ఏర్పాటు చేశారు. మండలాలకు 1987లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. మండల పరిషత్ అధ్యక్షుడిని నేరుగా ఎన్నుకున్నారు. దీనిలో సభ్యులుగా ఆయా మండలాల పరిధిలోని సర్పంచ్లు ఉండే వారు. ఎంపీపీలు జిల్లా పరిషత్ చైర్మన్ను ఎన్నుకునేవారు. 1994లో పరిషత్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం– 1994 ద్వారా అదే సంవత్సరం నుంచి గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ అనే మూడంచెల వ్యవస్థను ఆమోదించింది. మండల పరిషత్లో సర్పంచ్లను సభ్యులుగా తొలగించి వారి స్థానంలో ఎంపీటీసీలను, జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలో ఎంపీపీలను సభ్యులుగా తొలగించి జెడ్పీటీసీలను సభ్యులుగా చేర్చారు. మెజార్టీ ఎంపీటీసీలు ఎంపీపీని, మెజార్టీ జెడ్పీటీసీలు జెడ్పీ చైర్మన్ను ఎన్నుకోవడం ప్రారంభమైంది. -
మహబూబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్ భారీ సభ?
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కేంద్ర,, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమవుతోంది. మరోవైపు నదుల అనుసంధానం పేరిట ఏపీ ప్రభుత్వం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులపైనా ఉద్యమించాలని నిర్ణయించింది. అందులో భాగంగా పాలమూరు జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకు సన్నద్ధమవుతోంది. పాలమూరు ఎత్తిపోతలపై అనుసరించాల్సిన ఉద్యమ కార్యాచరణపై ఈ నెల 19న తెలంగాణ భవన్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు కీలక ప్రకటన చేయనున్నారు. పాలమూరు ఎత్తిపోతలకు సంబంధించి ఈ నెల 11న ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ కీలక భేటీ నిర్వహించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్రావు, వి.శ్రీనివాస్గౌడ్, వేముల ప్రశాంత్రెడ్డితో పాటు మరికొందరు ముఖ్య నేతలు ఈ భేటీలో పాల్గొన్నట్లు సమాచారం. ‘కొడంగల్ లిఫ్ట్’పై బీఆర్ఎస్ వ్యతిరేకత90 శాతం పనులు పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పక్కన పెట్టి కొత్తగా కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని చేపట్టడాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ద్వారా పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు జరిగే నష్టాన్ని వివరించేందుకు ఈ నెలాఖరు లేదా జనవరిలో మహబూబ్నగర్ జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ బహిరంగ సభలు నిర్వహించాలని భావిస్తోంది. కేసీఆర్ ఈ సభలకు హాజరయ్యే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు నదీ జలాల అనుసంధానం పేరిట ఏపీ చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులపైనా ఉద్యమానికి కేసీఆర్ ఇప్పటికే రూపకల్పన చేసినట్లు సమాచారం.కాళేశ్వరం మరమ్మతుల కోసం ఒత్తిడికాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బరాజ్ను మరమ్మతు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ప్రభుత్వానికి జల విధానం లేకపోవడాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఉద్యమ కార్యాచరణ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 19న జరిగే భేటీలో కేసీఆర్ ప్రకటించే ఉద్యమ కార్యాచరణపై బీఆర్ఎస్లో ఉత్కంఠ నెలకొంది. ఈ ఏడాది ఏప్రిల్ 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన పార్టీ రజతోత్సవ వేడుకల తర్వాత కేసీఆర్ పార్టీ బహిరంగ కార్యక్రమాల్లో కనిపించలేదు. సుదీర్ఘ కాలం తర్వాత పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి వస్తున్న కేసీఆర్.. పంచాయతీ ఎన్నికలు, ఫలితాలు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై కూడా స్పందించే అవకాశం ఉంది. -
ఆ ఇద్దరికి స్వగ్రామాల్లో చుక్కెదురు!
● దమగ్నాపురంలో ఎమ్మెల్యే జీఎమ్మార్కు షాక్ ● 120 ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ మద్దతుదారు విజయం ● ధన్వాడలో కోడలు ఎమ్మెల్యే పర్ణికారెడ్డిపై అత్త ఎంపీ డీకే అరుణదే పైచేయి.. ● 617 ఓట్ల తేడాతో కాంగ్రెస్ మద్దతుదారుపై బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలుపు ● నాగర్కర్నూల్లోని సొంతూరు తూడుకుర్తిలో పట్టు నిలుపుకున్న ‘కూచుకుళ్ల’ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరు ‘అధికార’ ప్రజాప్రతినిధులకు వారివారి స్వగ్రామాల్లో చుక్కెదురైంది. కాంగ్రెస్కు చెందిన దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి సొంతూరు చిన్నచింతకుంట మండలం దమగ్నాపురంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి పంచాయతీ పీఠాన్ని దక్కించుకున్నారు. బీజేపీ నాయకురాలు మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ, కాంగ్రెస్కు చెందిన నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి అత్తాకోడళ్లు కాగా.. కోడలిపై అత్త పైచేయి సాధించారు. వారి పుట్టినిళ్లు అయిన ధన్వాడలో సర్పంచ్గా ‘కమలం’ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. ఇదిలా ఉండగా.. నాగర్కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్రెడ్డి, ఆయన తండ్రి ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి స్వగ్రామం తూడుకుర్తిలో వారు పట్టు నిలుపుకున్నారు. ఎక్కడెక్కడ.. ఎలా అంటే.. ● దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి స్వగ్రామం దమగ్నాపూర్లో మొత్తం 1,704 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి భారతమ్మకు 640 ఓట్లు రాగా.. బీఆర్ఎస్ మద్దతుదారు ఇ.పావనికి 760 ఓట్లు వచ్చాయి. 120 ఓట్ల మెజార్టీతో పావని గెలుపొందారు. ● ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే పర్ణికారెడ్డి సొంతూరు ధన్వాడలో సర్పంచ్ పదవికి 6,250 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ మద్దతుదారు పంది జ్యోతికి 3,287 ఓట్లు రాగా.. కాంగ్రెస్ బలపరిచిన చిట్టెం జ్యోతికి 2,670 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ మద్దతుదారు శ్రీదేవికి కేవలం 249 ఓట్లు పోలయ్యాయి. తన సమీప ప్రత్యర్థి చిట్టెం జ్యోతిపై పంది జ్యోతి 617 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ● నాగర్కర్నూల్లో కూచు కుళ్ల స్వగ్రామమైన తూడుకుర్తిలో 4,074 ఓట్లు పోలయ్యాయి. కూచుకుళ్ల దామో దర్రెడ్డి అనుచరుడైన కాంగ్రె స్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి లక్ష్మికి 2,045 ఓట్లు రాగా.. బీఆర్ఎస్ మద్దతుదారు విమలకు 1,810, బీఎస్పీ బలపరిచిన అభ్యర్థికి 179, నోటాకు 40 ఓట్లు పడ్డాయి. 235 ఓట్లతో లక్ష్మి తన సమీప ప్రత్యర్థి విమలపై గెలుపొందారు. -
గ్రామాలు పోటెత్తాయి..
● 2వ విడతలోనూ భారీగా పోలింగ్ ● 87.08 ఓటింగ్ శాతంతో మళ్లీ గద్వాల జిల్లానే టాప్ ● అత్యల్పంగా నాగర్కర్నూల్లో 84 శాతం.. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రెండో విడత పల్లె పోరులోనూ ఓటర్లు పోటెత్తారు. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో 26 మండలాల పరిధిలోని 26 గ్రామాల్లో ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవం పోనూ మిగిలిన జీపీలకు నిర్వహించిన పోలింగ్లో మొత్తంగా 85.80 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. చలి నేపథ్యంలో నామమాత్రంగానే ఓటర్లు వచ్చారు. రెండు గంటల తర్వాత ఓటర్ల రాక ఊపందుకుంది. 11.30 గంటల తర్వాత ఒకేసారి భారీ ఎత్తున ఓటర్లు రావడంతో పోలింగ్ కేంద్రాలు కిక్కిరిశాయి. కొన్ని చోట్ల ఒంటి గంట దాటినా పోలింగ్ కొనసాగింది. నిర్ణీత సమయంలోపు కేంద్రాలకు వచ్చి క్యూలో ఉన్న ఓటర్లకు మాత్రమే ఓటు వేసే అవకాశం ఇచ్చారు. 84 శాతం.. ఆపైనే.. ఉమ్మడి జిల్లాలో 2వ విడతకు సంబంధించి సగటున 85.80 శాతం పోలింగ్ నమోదైంది. నాగర్కర్నూల్ జిల్లాలో పోలింగ్ శాతం 84 కాగా.. మిగిలిన అన్ని జిల్లాల్లోనే అంతకు పైగానే నమోదైంది. తొలి విడతలోటాప్ స్థానంలో నిలిచిన జోగులాంబ గద్వాల 87.08 శాతంతో మళ్లీ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వనపర్తి 87, మహబూబ్నగర్ 86.62, నారాయణపేట జిల్లాలో 84.33 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషులతో పోలిస్తే అన్ని జిల్లాల్లోనూ మహిళల ఓటింగ్ శాతం తక్కువగా ఉంది. పలు చోట్ల చెదురుమదురు ఘటనలు.. ● నారాయణపేట జిల్లా ధన్వాడలో ఎన్టీఆర్ కాలనీ వద్ద బీజేపీ, కాంగ్రెస్ వర్గాల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది కాంగ్రెస్కు చెందిన వారు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని ప్రచారం జరగగా.. బీజేపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే వ్యక్తిగత పీఏతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాల వారిని చెదరగొట్టి పంపించారు. ● వనపర్తి మండలంలోని చిమనగుంటపల్లిలోని ఎనిమిదో వార్డులో 260 ఓట్లకు 50 ఓట్లు పోలైన తర్వాత 51వ ఓటరు వార్డు అభ్యర్థి శివమ్మ సిలిండర్ గుర్తు లేకపోవడంపై ప్రశ్నించడంతో అధికారులు అవాక్కయ్యారు. పలువురు గొడవకు దిగడంతో సుమారు గంటపాటు పోలింగ్ నిలిచింది. అధికారులు కొత్త బ్యాలెట్ పత్రాలను తెచ్చి మళ్లీ పోలింగ్ నిర్వహించారు. అంతకు ముందు వేసిన ఓటర్లను మళ్లీ పిలిపించి ఓట్లు వేయించారు. ● నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం అవంచ గ్రామంలో తెల్లవారుజామున బీఆర్ఎస్లోని ఇరువర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్ మద్దతుదారు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని అదే పార్టీకి చెందిన రెబల్ నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ సర్పంచ్ మద్దతుదారు చంద్రకళ, రెబల్గా పోటీలో ఉన్న సౌమ్య వర్గీయులు పోలింగ్ కేంద్రం సమీపంలోనే బాహాబాహీకి దిగడంతో పలువురికి గాయాలయ్యాయి. అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. దాడిలో గాయపడిన ఇద్దరిని జడ్చర్ల ఆస్పత్రికి తరలించారు. కాగా ఎన్నికల ఫలితాల్లో చంద్రకళ విజయం సాధించారు. -
1, 2, 3, 4 ఓట్ల మెజార్టీతో విజయం
నారాయణపేట జిల్లాలో నలుగురిని వరించిన అదృష్టనారాయణపేట: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల మధ్య జరిగిన హోరాహోరీ పోరులో నలుగురు అభ్యర్థులు ఒకటి, రెండు, మూడు, నాలుగు ఓట్ల మెజార్టీతో గట్టెక్కారు. దీన్ని సమీప ప్రత్యర్థి అభ్యర్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకా కొంత కష్టపడితే విజయం తమదే అయ్యేదంటూ తలపట్టుకుంటున్నారు. ఆ ఒకటి, రెండు, మూడు, నాలుగు ఓట్లు చివరగా వేసిన ఓటర్లు ఏవరోనంటూ చర్చించుకుంటున్నారు. కాగా, వరుసగా ఒకటి, రెండు, మూడు ఓట్ల తేడాతో విజయం సాధించిన అభ్యర్థులు కాంగ్రెస్ మద్దతుదారులే కావడం విశేషం. నాలుగు ఓట్ల తేడాతో సీపీఐ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుపొందడం చర్చనీయాంశంగా మారింది. నారాయణపేట జిల్లాలో 1, 2, 3, 4 ఓట్లతో విజయం సాధించిన సర్పంచుల వివరాలిలా ఉన్నాయి. ఒక్క ఓటుతో తిరుపతమ్మ గెలుపు.. మరికల్ మండలం పెద్దచింతకుంటలో ఒక్క ఓటుతో కాంగ్రెస్ మద్దతుదారు తిరుపతమ్మ విజయం సాధించారు. (రీ కౌంటింగ్ చేసినా విజయం ఆమెనే వరించింది.) ఆ గ్రామ పంచాయతీ ఎస్సీ మహిళకు రిజర్వు కాగా.. బీఆర్ఎస్ మద్దతుదారు పద్మకు 604 ఓట్లు, కాంగ్రెస్ మద్దతుదారు తిరుపతమ్మకు 605 ఓట్లు వచ్చాయి. ఒకే ఒక్క ఓటు అధికంగా రావడంతో తిరుపతమ్మను అదృష్టం వరించినట్లయింది. రెండు ఓట్లతో కేతావత్ మంగ.. ధన్వాడ మండలం మడిగేలా తండా జీపీలో ఎస్టీ మహిళా రిజర్వేషన్లో పోటీపడిన కాంగ్రెస్ మద్దతుదారు కేతావత్ మంగకు 343 ఓట్లు రాగా.. సమీప అభ్యర్థి గీతకు 341 ఓట్లు పోలయ్యాయి. అయితే 2 ఓట్ల ఆధిక్యంతో కేతావత్ మంగ విజయం సాధించారు. మూడు ఓట్లతో రాందాస్ నాయక్.. ధన్వాడ మండలం తోళ్లగుట్టతండా జీపీ ఎస్టీ జనరల్కు రిజర్వు అయింది. ఇక్కడ కాంగ్రెస్ మద్దతుదారు రాందాస్నాయక్కు 200 ఓట్లు రాగా.. సమీప అభ్యర్థి బీజేపీ మద్దతుదారు పాండునాయక్కు 197 ఓట్లు వచ్చాయి. 3 ఓట్ల తేడాతో రాందాస్ సర్పంచ్ కుర్చీని కై వసం చేసుకున్నారు. నాలుగు ఓట్లతో పేరప్ప.. ధన్వాడ మండలం పాతపల్లి జీపీ జనరల్కు రిజర్వు అయింది. అక్కడ సీపీఐ మద్దతుదారు పేరప్ప 4 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పేరప్పకు 511 ఓట్లు రాగా.. ప్రత్యర్థి బీజేపీ మద్దతుదారుకు 507 ఓట్లు వచ్చాయి. -
ఓటేసిన 92 ఏళ్ల వృద్ధుడు
గద్వాల: ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం అని చెబుతున్నప్పటికీ చాలా మంది ఓటుహక్కును వినియోగించుకునేందుకు సంశయిస్తుంటారు. అయితే ఆదివారం జరిగిన రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికలో భాగంగా మల్దకల్ మండలం అమరవాయికి చెందిన 92 ఏళ్ల వృద్ధుడు ధర్మారెడ్డి ఓటుహక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చారు. అక్కడే వృద్ధులకు ఏర్పాటు చేసిన వీల్చైర్లో వృద్ధుడిని ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లారు. ఈ సమయంలో పోలింగ్ కేంద్రానికి వచ్చిన కలెక్టర్ బీఎం సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు వృద్ధుడు ధర్మారెడ్డితో మాట్లాడారు. ఈ వయసులో కూడా ఓటువేయటానికి వచ్చినందుకు వారు ధర్మారెడ్డిని అభినందించారు. -
కందనూలులో హోరాహోరీ
సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. మొత్తం 151 సర్పంచ్ స్థానాలకు గాను కాంగ్రెస్ మద్దతుదారులు 78 చోట్ల గెలుపొందగా, బీఆర్ఎస్ మద్దతుదారులు 60 సర్పంచ్ స్థానాల్లో గెలుపొందారు. రెండో విడతలో బీఆర్ఎస్ దాదాపుగా అన్నిచోట్ల బలమైన పోటీనిచ్చింది. అంతిమంగా కాంగ్రెస్ స్వల్ప ఆధిపత్యం ప్రదర్శించినా పెద్దకొత్తపల్లి మండలం మినహా మిగిలిన ఆరు మండలాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు సత్తాచాటారు. మరో ఆరు చోట్ల బీజేపీ, ఏడు చోట్ల స్వతంత్రులు గెలుపొందారు. బీఆర్ఎస్కే 13 స్థానాలు.. మలి విడత పంచాయతీ పోరులో కాంగ్రెస్కు చేరువగా బీఆర్ఎస్ సైతం సర్పంచ్ స్థానాలను కై వసం చేసుకోవడం గమనార్హం. తిమ్మాజిపేట మండలంలో మొత్తం 26 గ్రామ పంచాయతీలు ఉండగా.. ఇందులో కాంగ్రెస్ 11 సర్పంచ్ స్థానాలు గెలుచుకుంటే బీఆర్ఎస్ 13 స్థానాలను సొంతం చేసుకుంది. బిజినేపల్లి మండలంలో 35 సర్పంచ్ స్థానాలకు గాను కాంగ్రెస్ 18, బీఆర్ఎస్ 14 స్థానాలను గెలుచుకున్నాయి. ఇక్కడ బీజేపీ మూడు సర్పంచ్ స్థానాలను కై వసం చేసుకుంది. పెంట్లవెల్లి మండలంలో 10 సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఐదేసి చొప్పున స్థానాల్లో గెలుచుకున్నాయి. కోడేరులో మొత్తం 16 స్థానాలకు కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ మద్దతుదారులు 5 స్థానాల్లో గెలిచారు. కొల్లాపూర్లో మొత్తం 18 స్థానాలకు 10 కాంగ్రెస్, 7 స్థానాలను బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుచుకున్నారు. చేజారిన సర్పంచ్ పీఠం.. రెండో విడత ఎన్నికల్లో చాలాచోట్ల అభ్యర్థులు అతితక్కువ ఓట్ల తేడాతో విజయం సాధించారు. జిల్లాలోని తిమ్మాజిపేట మండలం వెంకాయపల్లిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతుదారులకు ఇద్దరికీ సమానంగా 236 ఓట్లు వచ్చాయి. రీకౌంటింగ్ నిర్వహించినా ఒకే ఫలితం వచ్చింది. దీంతో టాస్ వేయగా కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించడంతో గెలిచినట్లుగా ప్రకటించారు. పెద్దకొత్తపల్లి మండలం దేవినేనిపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి గౌస్ 4 ఓట్ల తేడాతో గెలుపొందారు. సంజీవపురంలో కాంగ్రెస్ అభ్యర్థి 7 ఓట్ల తేడాతో విజయం సాధించారు. చంద్రబండతండాలో అభ్యర్థి చిట్టి 15 ఓట్లతో గెలిచారు. సాతాపూర్లో బీఆర్ఎస్కు చెందిన వంశీకృష్ణ 11 ఓట్లతో గెలుపొందగా ఇక్కడ రెండుసార్లు రీకౌంటింగ్ చేశారు. తిమ్మాజిపేట మండలం అప్పాజిపల్లిలో బీఆర్ఎస్కు చెందిన వెంకటయ్య 11 ఓట్లు, నాగర్కర్నూల్ మండలం నల్లవెల్లిలో కాంగ్రెస్కు చెందిన వెంకటస్వామి 17 ఓట్ల తేడాతో గెలుపొందారు. కాగా.. జిల్లాలో అత్యధికంగా పెద్దకొత్తపల్లి మండలం పెద్దకార్పాములలో బీఆర్ఎస్ మద్దతుదారు చిట్టెమ్మ 1,352 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రెండో విడతలో పార్టీల వారీగా వచ్చిన సర్పంచ్ స్థానాలు మండలం జీపీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ స్వతంత్రులు బిజినేపల్లి 35 18 14 3 – నాగర్కర్నూల్ 18 10 8 – – తిమ్మాజిపేట 26 11 13 – 2 కొల్లాపూర్ 18 10 7 1 – పెంట్లవెల్లి 10 5 5 – – కోడేరు 16 7 5 – 4 పెద్దకొత్తపల్లి 28 17 8 2 1 నాగర్కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్కు 78, బీఆర్ఎస్కు 60 సర్పంచ్ స్థానాలు తిమ్మాజిపేట మండలంలో బీఆర్ఎస్కే అధికం పెద్దకొత్తపల్లి మండలం మినహా అన్నిచోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ స్వల్ప తేడాతో సర్పంచ్గిరి కోల్పోయిన అభ్యర్థులు -
చాంపియన్ పాలమూరు
బాలుర, బాలికల విభాగాల్లో విజేతగా జిల్లా జట్లు ● ముగిసిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండర్– 19 టోర్నీ మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలో ఆదివారం ముగిసిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ 69వ రాష్ట్రస్థాయి అండర్– 19 హ్యాండ్బాల్ టోర్నమెంట్లో బాల, బాలికల విభాగాల్లో ఆతిథ్య ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా జట్లు సత్తా చాటి చాంపియన్గా నిలిచాయి. టోర్నీలో మొదటి నుంచి మెరుగైన ప్రతిభ కనబర్చిన జిల్లా జట్లు ఫైనల్లో కూడా అదేస్థాయిలో రాణించి చాంపియన్షిప్ కై వసం చేసుకున్నాయి. ఉత్కంఠ పోరులో విజయం బాలుర విభాగంలో మహబూబ్నగర్ హైస్కూల్ మైదానంలో ఉత్కంఠంగా సాగిన ఫైనల్ మ్యాచ్లో మహబూబ్నగర్ జిల్లా జట్టు 11– 7 గోల్స్ తేడాతో వరంగల్ జట్టుపై విజయం సాధించింది. బాలుర విభాగంలో మూడో స్థానంలో కరీంనగర్ జట్టు నిలిచింది. బాలికల విభాగం ఫైనల్ మ్యాచ్లో మహబూబ్నగర్ జట్టు 9– 5 గోల్స్ తేడాతో వరంగల్ జట్టుపై గెలుపొందింది. మూడో స్థానంలో ఖమ్మం జట్టు నిలిచింది. విజేత జట్లకు బహుమతుల ప్రదానం టోర్నీ విన్నర్, రన్నరప్, థర్డ్ప్లేస్ జట్లకు ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్పీ.వెంకటేశ్, ప్రముఖ పారిశ్రామికవేత్త బెక్కరి రాంరెడ్డి తదితరులు ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా ఎన్పీ వెంకటేశ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందన్నారు. గ్రామీణ స్థాయి నుంచి క్రీడలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. సీఎం రేవంత్రెడ్డి స్వయంగా క్రీడాకారుడు అయినందున క్రీడా రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రెండేళ్ల నుంచి మహబూబ్నగర్లో ఎన్నో రాష్ట్రస్థాయి క్రీడా టోర్నీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పారిశ్రామికవేత్త బెక్కరి రాంరెడ్డి మాట్లాడుతూ.. చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. క్రీడాకారుల్లో క్రమశిక్షణ చాలా ముఖ్యమన్నారు. ఓడిన వారు నిరాశ చెందకుండా గెలుపు కోసం శ్రమించాలని పేర్కొన్నారు.టోర్నీ రాష్ట్ర పరిశీలకులు శ్రీనివాస్, పుల్లయ్య, జిల్లా ఎస్జీఎఫ్ కార్య నిర్వాహక కార్యదర్శి డాక్టర్ శారదాబాయి, రజనీకాంత్రెడ్డి, ఎండీ.జియవుద్దీన్, బాల్రాజు, అహ్మద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
పాలమూరులో అధికార పార్టీ జోరు
పాలమూరు: జిల్లాలో ఆదివారం జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభీ మోగించింది. ఐదు మండలాల్లో పూర్తిగా పైచెయ్యి సాధించగా కోయిలకొండ మండల పరిధిలో మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీగా స్థానాలు కై వసం చేసుకున్నాయి. హన్వాడ మండల పరిధిలో అయితే కాంగ్రెస్ పూర్తిగా వన్సైడ్గా విక్టరీ నమోదు చేసుకున్నాయి. మిగిలిన మిడ్జిల్, దేవరకద్ర, సీసీకుంట, కౌకుంట్ల మండలాల్లో కూడా అదేవిధంగా దూసుకుపోయింది. మహబూబ్నగర్ జిల్లాలో మండలాల వారీగా.. మండలాలు జీపీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇతరులు /స్వతంత్ర చిన్నచింతకుంట 18 12 4 2 0 దేవరకద్ర 18 11 4 0 3 కౌకుంట్ల 12 10 2 0 0 హన్వాడ 35 25 4 5 1 కోయిలకొండ 44 25 17 1 2 మిడ్జిల్ 24 16 8 0 0 మొత్తం 151 98 39 8 6 -
బీఎల్వోల తప్పిదం.. ఓటర్లకు శాపం
● సంబంధంలేని వార్డులకు ఓటర్ల బదిలీ హన్వాడ: రెండో విడత పోలింగ్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మండల కేంద్రంలో బీఎల్ఓల తప్పిదంపై ఓ సీఆర్డీ అధికారి నిరుత్సాహం వ్యక్తం చేస్తూ.. విషయాన్ని ఏకంగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్లోని సీఆర్డీ అధికారి మురళీధర్ తన స్వగ్రామంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. తాను నివాసం ఉండే 6వ వార్డు నుంచి తన ఓటును 7వ వార్డుకు బదిలీ చేశారు. అదేవిధంగా మండల కేంద్రానికి చెందిన మరో రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఓటు 7వ వార్డు నుంచి 5వ వార్డుకు మార్చారు. దీంతో ఈవిషయంపై సదరు అధికారి మురళీధర్ కలగజేసుకుని ఓ వార్డులో ఉండాల్సిన ఓటును మరో వార్డుకు మార్చడంపై స్థానిక అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. పంచాయతీ అధికారి వివరణ ఇచ్చుకోక మౌనం పాటించాల్సి వచ్చింది. ఇలా ఓటును విడదీసి పక్క వీధిలో వేయడం మూలంగా తన ఇంటి ముందు శానిటేషన్, తదితర సమస్యలపై ఏ వార్డు సభ్యుడిని సంప్రదించాలని సంబంధిత అధికారులను ప్రశ్నించారు. ఉన్నతస్థాయిలో ఉండే ఓ అధికారికే ఇలాంటి సమస్య వస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని అధికారుల పనితీరును నిలదీశారు. ఈ అంశంపై తనకు క్లారిటీ కావాలని ఏకంగా కలెక్టర్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. మొత్తానికి బీఎల్ఓల నిర్లక్ష్యపు పనితీరుకు కలెక్టర్ సంజాయిషీ ఇచ్చుకునే పరిస్థితి వచ్చినట్లయిందని పలువురు పేర్కొన్నారు. -
మలివిడత పోరు.. ప్రశాంతం
వనపర్తి జిల్లాలో 87 శాతం ఓటింగ్ ● రాత్రి 10.30 వరకు కొనసాగిన ఓట్ల లెక్కింపు ● కొత్తకోట మండలం అజ్జకొల్లులో క్లీన్స్వీప్ చేసిన బీఆర్ఎస్ ● కొత్తకోట, ఆత్మకూర్, అమరచింతలో కాంగ్రెస్ హవా.. ● వనపర్తి, మదనాపురం మండలాల్లో గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్ ● రెండు సర్పంచ్ స్థానాలకు పరిమితమైన బీజేపీ వనపర్తి: గ్రామపంచాయతీ ఎన్నికల మలివిడత ఘట్టం ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఆత్మకూర్, అమరచింత, కొత్తకోట, మదనాపురం, వనపర్తి మండలాల పరిధిలోని 94 సర్పంచ్, 850 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 5 సర్పంచ్, 148 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో మిగిలిన 89 సర్పంచ్, 702 వార్డు స్థానాలకు ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్, భోజన విరామ అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. రాత్రి 10.30 వరకు అన్ని గ్రామాల్లో కౌంటింగ్ ప్రక్రియ పూర్తిచేసి ఫలితాలు వెల్లడించారు. కలెక్టర్ వనపర్తి మండలం నాచహళ్లిలో ఏర్పాటు చేసిన ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని, పెద్దగూడెం తదితర గ్రామాల్లో ఓటింగ్ సరళిని పరిశీలించి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వెబ్కాస్టింగ్ కేంద్రం నుంచి జిల్లాలోని పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఎస్పీ సునీతరెడ్డి చిట్యాల, అచ్యుతాపురం, రాజపేట, కొత్తకోట మండలం కానాయపల్లి, కొత్తకోట తదితర ప్రాంతాల్లో పర్యటించి బందోబస్తును పర్యవేక్షించారు. వనపర్తి, మదనాపురంలో పోటాపోటీ.. వనపర్తి, మదనాపురం మండలాల్లో అధికార కాంగ్రెస్పార్టీకి బీఆర్ఎస్ గట్టి పోటీనిచ్చింది. మదనాపురంలో బీఆర్ఎస్ మద్దతుదారులు కాంగ్రెస్ కంటే ఎక్కువ చోట్ల సర్పంచ్లుగా విజయం సాధించారు. వనపర్తి మండలంలోని 26 గ్రామపంచాయతీల్లో 11 స్థానాల్లో బీఆర్ఎస్ బలం చాటుకుంది. మూడు మండలాల్లో కాంగ్రెస్దే ఆధిక్యం.. కొత్తకోట, ఆత్మకూర్, అమరచింత మండలాల్లో అధికార కాంగ్రెస్పార్టీ ఆధిక్యం చాటింది. బీఆర్ఎస్ ఉనికి చాటుకోగా.. బీజేపీ అమరచింత మండలంలో రెండు సర్పంచ్ స్థానాలకు పరిమితమైంది. స్వతంత్రుల సంఖ్య 9కి చేరింది. మదనాపురం మండలం అజ్జకొల్లులో సర్పంచ్తో పాటు అన్ని వార్డుల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు విజయభేరీ మోగించారు. ఆత్మకూర్ మండలం ఆరేపల్లిలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి రామచంద్రయ్య జిల్లాలోనే అత్యధికంగా 1,180 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వనపర్తి మండలం కీర్యతండా సర్పంచ్ అభ్యర్థి క్రిష్టియా ఒక ఓటుతో విజయం సాధించింది. -
పోలింగ్ కేంద్రాల్లో పటిష్ట భద్రత
● బందోబస్తు తనిఖీ చేసిన డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ మహబూబ్నగర్ క్రైం: జిల్లావ్యాప్తంగా ఆదివారం జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల కోసం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ముగ్గురి నుంచి ఐదుగురికి వరకు బందోబస్తు కేటాయించి ఎన్నికలు ప్రశాంతంగా పూర్తి చేశారు. సమస్యాత్మక గ్రామాలు, కేంద్రాల్లో ప్రత్యేక గస్తీ పెట్టడం, ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటు చేసి సమన్వయంతో విధులు నిర్వహించారు. మొత్తం 1,249 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తూ ఎలాంటి ఘటనలు జరగకుండా చేశారు. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి: డీఐజీ హన్వాడ మండలం టంకర్ పోలింగ్ కేంద్రాన్ని జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, ఎస్పీ డి.జానకి పరిశీలించారు. టంకరలో ఉన్న సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ను డీఐజీ తనిఖీ చేసి భద్రత ఏర్పాట్లు పరిశీలించారు. అనంతరం పోలింగ్కేంద్రాల్లో తీసుకుంటున్న చర్యలు, ఓటింగ్ ప్రక్రియ సరళిని ప్రత్యక్షంగా చూశారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ జిల్లాలో సమస్యాత్మకంగా ఉండే కేంద్రాల్లో అదనపు బందోబస్తు ఉండి గస్తీ చేస్తూ పర్యవేక్షణ చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల నియమావళి కఠినంగా అమలు చేస్తున్నామని, ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ● ఎస్పీ డి.జానకి మొదట మిడ్జిల్ మండల కేంద్రంతో పాటు వాల్యాల ఆ తర్వాత హన్వాడ మండలకేంద్రంతో పాటు వేపూర్, టంకర, దేవరకద్ర మండల పరిధిలోని గురకొండ, కోయిలకొండ మండల పరిధిలోని ఇంజమూర్, ఎల్లారెడ్డిపల్లిలో ఉన్న పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. -
చెల్లని ఓటుతో విజయం
చిన్నచింతకుంట మండలం గూడూర్లో చిత్రమైన పరిస్థితి నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున శేఖర్, అదే పార్టీ రెబల్గా భీమన్నగౌడ్ పోటీపడ్డారు. ఆదివారం పోలింగ్ అనంతరం కౌంటింగ్ చేయగా.. ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయి. అభ్యర్థులు రీకౌంటిగ్కు అభ్యర్థించడంతో అధికారులు మూడు సార్లు రీ కౌంటింగ్ చేశారు. అయినప్పటికీ సమానంగానే ఓట్లు వచ్చాయి. అయితే టాస్ లేదా చీటి ద్వారా ఎంపిక చేస్తామని అధికారులు తెలియజేయగా.. అభ్యర్థులు ఒప్పుకోలేదు. సమాచారం అందుకున్న తహసీల్దార్ ఎల్లన్న పోలింగ్ కేంద్రానికి చేరుకొని మరో రెండు సార్లు కౌంటింగ్ చేయించగా.. అలాగే వచ్చాయి. దీంతో మొదట చెల్లని ఓట్లుగా పరిగణించి పక్కనపెట్టిన ఓట్లను పరిశీలించి.. అందులో గుర్తులపై సక్రమంగా ఓటు పడని పత్రాన్ని స్కేల్ ద్వారా కొలతలు వేసి సర్పంచ్ ఎన్నికను పూర్తిచేశారు. ఉత్కంఠ పోరులో సర్పంచ్గా భీమన్నగౌడ్ ఒక్క ఓటుతో అదృష్టం వరించింది. – చిన్నచింతకుంట -
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డికి షాక్
హైదరాబాద్: తెలంగాణ పంచాయతీ ఎన్నికల రెండో విడతలో.. తొలి విడత పలితాలే పునరావృతం అయ్యాయి. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులే అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్నారు. అయితే మహబూబ్ నగర్లో మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చుక్కెదురైంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి తన సొంతూరులోనే షాక్ తగిలింది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయారు. రంగారెడ్డిగూడ సర్పంచ్గా బీజేపీ అభ్యర్థి రేవతి ఆనంద్ విజయం సాధించారు. మరోవైపు.. నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డికీ ఇదే తరహా అనుభవం ఎదురైంది. ఆమె ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేసిన సొంతూరు ధన్వాడలో బీజేపీ అభ్యర్థి జ్యోతి రామచంద్రయ్య ఘన విజయం సాధించారు. ధన్వాడ మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణకు కూడా సొంతూరు కావడం, పైగా పర్ణికారెడ్డికి అత్తాకోడళ్ల వరుస.. దీనికి తోడు ధన్వాడలో పోటీ పడింది కూడా అత్తాకోడళే కావడం.. ఈ ఎపిసోడ్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇటు ఖమ్మంలోనూ కాంగ్రెస్కు ఎదురుగాలి తప్పలేదు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆది నారాయణ ప్రచారం చేసిన వాటిల్లో కేవలం రెండు చోట్ల (ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి) మాత్రమే కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచ్లుగా నెగ్గారు.రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో.. 55% స్థానాల్లో అధికార పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులదే విజయం సాధించారు. బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థుల్లో 29% మంది గెలుపొందగా.. తర్వాతి స్థానంలో బీజేపీ నిలిచింది. అదే సమయంలో స్వతంత్రులు కూడా సత్తా చాటారు. రెండో విడతకు సంబంధించి 416 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.తెలంగాణలోని 193 మండలాల్లోని 3911 పంచాయతీలకు ఆదివారం ఎన్నికలు నిర్వహించగా..కాంగ్రెస్-2,112 బీఆర్ఎస్-1,025 బీజేపీ-225ఇతరులు(స్వతంత్రులు.. సీపీఐ-సీపీఎం బలపర్చినవాళ్లు)-549 గెలుపొందారు. రెండో విడతలో 85.86% పోలింగ్ నమోదు కాగా.. ఇది తొలి విడత కంటే 1.58% ఎక్కువ. ఇప్పటి వరకు రెండు విడతల్లో ఇప్పటివరకు 8,567 పంచాయతీల ఎన్నికలు పూర్తైంది. రెండు విడతల్లో కలిపి కాంగ్రెస్ బలపర్చగా గెలిచిన వారి సంఖ్య 5,195, బీఆర్ఎస్ మద్దతుదారులు 2,338, బీజేపీ 440గా ఉన్నారు. బీజేపీ కంటే ఇతరులు సాధించిన స్థానాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ నెల 17వ తేదీన తుది దశ పంచాయితీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. -
హ్యాండ్బాల్ ఫైనల్కు పాలమూరు జట్లు
● బాల, బాలికల విభాగాల్లో జిల్లా జట్ల సత్తా ● నేడు ముగియనున్న అండర్– 19 టోర్నీ మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలో జరుగుతున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్– 19 రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ టోర్నమెంట్లో ఆతిథ్య ఉమ్మడి పాలమూరు జట్లు సత్తా చాటి ఫైనల్కు చేరుకున్నాయి. బాలుర విభాగం మ్యాచ్లను హీరా మోడల్ స్కూల్ మైదానం, బాలికల మ్యాచ్లను మహబూబ్నగర్ హైస్కూల్లో నిర్వహిస్తున్నారు. శనివారం జరిగిన బాలుర విభాగం సెమీఫైనల్ మ్యాచ్లో జిల్లా జట్టు 13–6 గోల్స్ తేడాతో కరీంనగర్ జట్టుపై విజయం సాధించింది. మరో సెమీఫైనల్లో వరంగల్ జట్టు 14–6 తేడాతో రంగారెడ్డిపై గెలుపొందింది. బాలికల విభాగం సెమీఫైనల్లో మహబూబ్నగర్ జట్టు 5– 2 గోల్స్ తేడాతో కరీంనగర్ జట్టుపై, మరో సెమీస్లో వరంగల్ జట్టు 14– 6 తేడాతో ఖమ్మం జట్టుపై గెలుపొందాయి. టోర్నమెంట్ నేటి(ఆదివారం)తో ముగియనుంది. లీగ్ మ్యాచ్ల వివరాలు.. బాలుర విభాగం లీగ్ మ్యాచ్లో మహబూబ్నగర్ జట్టు 10– 4 గోల్స్ తేడాతో నిజామాబాద్ జట్టుపై గెలుపొందగా, మరో మ్యాచ్లో జిల్లా జట్టు 15– 8 తేడాతో రంగారెడ్డి జట్టుపై విజయం సాధించింది. ఇతర మ్యాచుల్లో ఖమ్మం జట్టు 13– 10 గోల్స్ తేడాతో మెదక్పై, రంగారెడ్డి జట్టు 8– 7 తేడాతో నిజామాబాద్పై, మెదక్ జట్టు 7– 2 తేడాతో నల్లగొండపై, హైదరాబాద్ జట్టు 7– 6 తేడాతో ఆదిలాబాద్పై, వరంగల్ జట్టు 13– 1 తేడాతో నల్లగొండపై, కరీంనగర్ జట్టు 14– 6 తేడాతో ఖమ్మంపై, వరంగల్ జట్టు 13– 8 తేడాతో ఖమ్మంపై, కరీంనగర్ జట్టు 7– 1 తేడాతో మెదక్పై, హైదరాబాద్ జట్టు 6– 4 తేడాతో నిజామాబాద్పై గెలుపొందాయి. బాలికల విభాగం లీగ్ మ్యాచుల్లో మహబూబ్నగర్ జట్టు 12– 5 గోల్స్ తేడాతో మెదక్పై, మరో మ్యాచ్లో మహబూబ్నగర్ జట్టు 5– 0 గోల్స్ తేడాతో నిజామాబాద్పై విజయం సాధించింది. ఇతర మ్యాచుల్లో ఖమ్మం జట్టు 8– 5 గోల్స్ తేడాతో మహబూబ్నగర్ జట్టుపై, కరీంనగర్ జట్టు 17– 0 తేడాతో నల్లగొండపై, ఖమ్మం జట్టు 13– 2 తేడాతో మెదక్పై, ఆదిలాబాద్ జట్టు 9– 6 తేడాతో నల్లగొండపై, రంగారెడ్డి జట్టు 2– 1 తేడాతో నిజామాబాద్పై, వరంగల్ జట్టు 13– 5 తేడాతో హైదరాబాద్పై, ఖమ్మం జట్టు 12– 3 తేడాతో రంగారెడ్డిపై, వరంగల్ జట్టు 9– 0 తేడాతో నల్లగొండపై విజయం సాధించగా ఆదిలాబాద్– కరీంనగర్ జట్లు చెరో 5 గోల్స్ చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. -
బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
అమరచింత: బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న అమరచింతకు చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా.. అమరచింతకు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ పెద్దకుమారుడు శరత్ (24) రెండేళ్లుగా బెంగళూరులోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. అయితే, ఐదురోజుల క్రితం బెంగళూరులో తాను అద్దెకు ఉంటున్న ఇంటి నుంచి బయటికి వెవెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఈ విషయాన్ని ఇతర స్నేహితులు శరత్ తండ్రి చంద్రశేఖర్కు రెండు రోజుల క్రితం సమాచారం ఇచ్చారు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు తమ బంధువులు, యువకుడి స్నేహితుల గ్రామాల్లో వాకబు చేశారు. చివరకు శరత్ బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి శుక్రవారం రాత్రి అక్కడికి వెళ్లారు. అయితే, రోడ్డు ప్రమాదంలో శరత్ మృతదేహం ఛిద్రమైందని.. కొన్ని వస్తువులను గుర్తించి అవి తన కుమారుడివే అని కుటుంబసభ్యులు చెప్పడంతో పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని వారికి అందించారు. ఇదిలాఉండగా, మృతుడు శరత్ ఐదు రోజుల క్రితం తన మొబైల్ నుంచి చెల్లెలికి రూ.3 లక్షల పంపడం, అదే రోజు తండ్రికి ఫోన్ చేసినా తండ్రి ఎత్తకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనంతరం రాత్రి భోజనం ఆన్లైన్లో ఆర్డర్ చేసిన శరత్ తన మొబైల్ను రూంలోనే ఉంచి బయటకు వెళ్తున్నానని చెప్పి ఇలా ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. -
సిలిండర్ పేలిన ఘటనలో మరో మహిళ మృతి
ధరూరు: మండల కేంద్రంలో ఈ నెల 6న గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో మరో మహిళ కుర్వ సునీత (23) శనివారం చికిత్స పొందుతూ మృతి చెందింది. చికిత్స పొందుతున్న ముగ్గురూ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు సునీత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలికి భర్త వెంకటేష్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ డీఆర్ విజయ్కుమార్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇదే ప్రమాదంలో గాయపడిన తల్లీకొడుకులు (అశ్విని ఆమె ఏడాదిన్నర కుమారుడు) ఈ నెల 10న కర్నూలులో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. మూడుకు చేరిన మృతుల సంఖ్య -
తగ్గేదేలే.. !
● ఎగిసిన ప్రలోభాలు, తాయిళాలు.. మద్యం ● ఓటుకు రూ.500 నుంచి రూ.3 వేల వరకు.. ● అంచనాలకు మించిన ఖర్చులతో ఆస్తుల తనఖా.. ● బెంబేలెత్తుతున్న అభ్యర్థులు.. అయినా ముందుకే.. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. రెండో దశలో ఆదివారం ఉమ్మడి పాలమూరులోని 26 మండలాల పరిధిలో 565 గ్రామాలకు ఎన్నికలు జరగనున్నాయి. 46 ఏకగ్రీవం పోనూ 519 జీపీల్లో పోలింగ్ జరగనుంది. రెండో విడత ప్రచారం శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ముగియగా.. ఆ తర్వాత ప్రలోభ పర్వం ఎగిసిపడింది. మొదటి దశలో జరిగిన ఎన్నికల్లో ఆయా జీపీల్లో అభ్యర్థుల జయాపజయాలు.. లోటుపాట్లను బేరీజు వేసుకున్న రెండో విడత అభ్యర్థులు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ క్రమంలో గ్రామాల్లో మద్యం ఏరులై పారగా.. కుల, మహిళా సంఘాలు, యువత.. ఇలా వర్గాల వారీగా తాయిలాల పంపిణీ జోరుగా సాగింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పుంజుకోవడం చూసి కంగుతున్న ఆయా నియోజకవర్గాల్లోని అధికార కాంగ్రెస్కు చెందిన ముఖ్య నేతలు రెండు, మూడో విడతలో ఎన్నికలు జరగనున్న గ్రామాలపై ప్రత్యేక నజర్ వేశారు. ప్రధానంగా మలి విడతలో కారు, కమలం పొత్తు.. రెబల్స్ ప్రభావం.. ఏ అభ్యర్థి ముందంజలో ఉన్నారు వంటి వాటితో పాటు ఆయా పల్లెల్లో ప్రభావిత వర్గాల సమాచారాన్ని తెలుసుకుని..అందుకనుగుణంగా ముందుకు సాగారు. ఈ మేరకు వారే నేరుగా ఆయా వర్గాలకు చెందిన ముఖ్యులతో మాట్లాడడంతోపాటు పలు రకాల హామీలు గుప్పించినట్లు సమాచారం. ప్రత్యర్థి పక్షంలోని తమ సన్నిహితులైన గ్రామ స్థాయి నాయకులతోనూ టచ్లో ఉంటూ పరిస్థితులను చక్కబెట్టేలా మంత్రాంగం నడిపించారు. ఈ విషయాన్ని పసిగట్టిన ప్రత్యర్థి వర్గాలు సైతం పై ఎత్తులతో ముందుకుసాగినట్లు తెలుస్తోంది ఒక్కో చోట.. ఒక్కో రేటు రెండో విడతలో పలు గ్రామాల్లో అధికార, ప్రతిపక్షాలు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్న క్రమంలో ప్రలోభాల పర్వం ఎగిసిపడినట్లు తెలుస్తోంది. ప్రచారం ముగిసిన శుక్రవారం రాత్రి నుంచి శనివారం అర్ధరాత్రి వరకు పలు పల్లెల్లో వార్డులు, కూడళ్ల వారీగా విందులు.. వర్గాల వారీగా మద్యం పంపిణీ.. మహిళలకు చీరల వంటి పంపిణీని నిఘా కళ్లు తప్పించి పూర్తి చేశారు. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో యూత్కు క్రీడా సామగ్రి పంపిణీతో పాటు మద్యం బాటిళ్లు అందజేశారు. ప్రత్యర్థి మద్దతుదారులు, బంధువుల ఇళ్లకు అర్ధరాత్రి వేళ గుట్టుచప్పుడు కాకుండా వెళ్లి దండాలు పెట్టడంతో పాటు ఓటుకు ఇంత చొప్పన ఎందరు ఉంటే అందరికీ లెక్కలేసి ముట్టజెప్పారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోని గ్రామాల్లో ఓటుకు అత్యల్పంగా రూ.500.. అత్యధికంగా రూ.3 వేల చొప్పున అందజేసినట్లు సమాచారం. ఈ రేటు ఒక్కో పల్లెలో ఒక్కోరకంగా ఉన్నట్లు తెలుస్తోంది. అధిక శాతం గ్రామాల్లో ఓటుకు రూ.వెయ్యి.. ఒక్క క్వార్టర్, కొన్ని చోట్ల హాఫ్ బాటిల్ మద్యం పంపిణీ చేసినట్లు సమాచారం. బెంబేలెత్తుతూనే ముందుకు.. తొలి విడత సర్పంచ ఎన్నికల్లో ఊహించిన ఫలితాలు రాకపోవడంతో కాంగ్రెస్.. అనూహ్య ఫలితాలతో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఎవరికి వారు రెండు, చివరి విడత గ్రామాలపై దృష్టి సారించిన నేపథ్యంలో ఆయా పార్టీల మద్దతుదారులు ఎక్కడా తగ్గని పరిస్థితులు నెలకొన్నాయి. అంచనాలకు మించి రెట్టింపు ఖర్చులు అవుతుండడంతో బెంబేలెత్తుతున్నారు. ఎన్నికల కోసం ముందస్తుగా సమకూర్చుకున్న మొత్తం అయిపోవడంతో కొందరు అభ్యర్థులు ఆస్తులు, నగలు తనఖా పెట్టి నగదు తెచ్చి..పంచుతున్నారు. అయినా తగ్గేదేలే అన్నట్లు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే చివరి దశ ఎన్నికలకు సంబంధించి ప్రచారం జోరుగా సాగుతోంది. రోజుకు మద్యం ఇతరత్రా ఖర్చులతో అభ్యర్థులకు ఇప్పటికే తడిసిమోపైడెంది. అసలు ఘట్టం ముందుగా ఉండగా.. ఏం చేయాలో తోచక పలువురు తలపట్టుకుంటున్నారు. ● మహబూబ్నగర్ జిల్లా కోయిల్కొండ మండలంలోని ఓ గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి శనివారం రాత్రి పలు వార్డుల్లో ఓటుకు రూ.500 చొప్పున పంపిణీ చేశాడు. కాంగ్రెస్ మద్దతుదారుడైన సర్పంచ్ అభ్యర్థి పోటీగా ఒక్కో ఓటుకు రూ.వెయ్యి, కార్టర్ మద్యం బాటిల్ పంచాడు. అయితే ఆదివారం రాత్రి బీఆర్ఎస్కు చెందిన మద్దతుదారుడు మళ్లీ ఒక్క ఓటర్కు క్వార్టర్ మద్యం బాటిల్, రూ.500 చొప్పున కొందరికి పంచాడు. కాంగ్రెస్ అభ్యర్థి కూడా కొందరికి ఆ విధంగానే పంచాడు. ఆ తర్వాత ఓ వార్డులో లొల్లి మొదలైనట్లు తెలిసింది. తమకు మళ్లీ రాలేదంటూ కొందరు శాపనార్ధాలు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ● రెండో విడతలో జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి, రాజోలి మండలాల పరిధిలోని గ్రామాల్లో సర్పంచ్ స్థానాలను కై వసం చేసుకునేందుకు పోటీపడుతున్న అభ్యర్థులు పలువురు తమ విలువైన భూములను తనఖా పెట్టి అప్పులు చేసినట్లు సమాచారం. మూడో విడతలో జరిగే ఎన్నికలకు సంబంధించి ఎర్రవెల్లి, మానవపాడు మండలాల్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలిసింది. భార్య సర్పంచ్.. భర్త ఉప సర్పంచ్ గట్టు: మండలంలోని గొర్లఖాన్దొడ్డి సర్పంచ్, ఉపసర్పంచ్ పదవులు భార్యభర్తలకు దక్కాయి. వివరాల్లోకి వెళ్తే.. మొదటి విడతలో నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా గొర్లఖాన్దొడ్డి పోలింగ్ జరగగా.. షేకమ్మ అలియాస్ శ్వేత తన సమీప అభ్యర్థి జయమ్మపై 287 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. అంతకు ముందు పంచాయతీ ఎన్నికల్లో ఈ గ్రామాన్ని ఏకగ్రీవం చేసుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినా కుదరకపోవడంతో నామినేషన్లు దాఖలు చేసి పోటీపడ్డారు. మొత్తం 12 వార్డులకుగాను 7 వార్డులు ఏకగ్రీవం కాగా.. 5 వార్డుల్లో పోటీ ఏర్పడింది. ఇందులోను సర్పంచ్గా గెలిచిన అభ్యర్థి షేకమ్మ పక్షానికి 3 వార్డుల్లో విజయం సాధించగా, మొత్తం 9 వార్డులు సర్పంచ్ పక్షం వారు గెలుచుకున్నారు. దీంతో 7వ వార్డు సభ్యుడిగా ఏకగ్రీవమైన ఉప్పరి ఆంజనేయులును మిగతా వార్డు సభ్యులు ఉప సర్పంచుగా ఎన్నుకున్నారు. దీంతో గొర్లఖాన్దొడ్డి గ్రామంలో భార్య షేకమ్మ సర్పంచ్గా, భర్త ఉప్పరి ఆంజనేయులు ఉప సర్పంచ్గా ఎంపికయ్యారు. ఈ విజయం మీ అందరిదీ.. ● ఇంటింటికీ స్వీట్ బాక్సులు అందజేసిన సర్పంచ్ నవాబుపేట: తనను సర్పంచ్గా గెలిపించిన ఊరందరి నోరు తీపి చేసి కృతజ్ఞతలు తెలిపారు కొత్త సర్పంచ్ గీతారాణి. మండల కేంద్రానికి చెందిన గీతారాణీ సర్పంచ్గా విజయం సాధించిన నేపథ్యంలో శనివారం ఆమెతోపాటు కుటుంబ సభ్యులు నవాబుపేటలో ప్రతి ఇంటికి తిరిగి స్వీట్ బాక్సులు అందించి కృతజ్ఞతలు చెప్పారు. గెలిచినందుకు సంతోషంతో తానే మిఠాయిలు తింటే సరిపోదని తన ఊరందరి నోరు తీపి చేస్తేనే అసలైన సంబురమని ఆమె పేర్కొన్నారు. జుట్టు కత్తిరించి.. ఓటు పట్టి మానవపాడులో ఓ సర్పంచ్ అభ్యర్థి వినూత్న ప్రచారం నిర్వహించారు. కత్తెర గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ ఇంటింటికి తిరిగి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ క్రమంలో గ్రామంలోని హెయిర్ సెలూన్ వద్ద ఓ వ్యక్తికి కటింగ్ చేసి ఓటు అభ్యర్థించడం ఆకట్టుకుంది. – మానవపాడు


