breaking news
Suryapet
-
పత్తి కొనుగోళ్లు బంద్!
భానుపురి (సూర్యాపేట) : కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తీరుతో జిల్లాలో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఈ ఏడాది వరుసగా తీసుకొస్తున్న నిబంధనలు, కొర్రీల కారణంగా మిల్లర్లు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మిల్లర్లు, ప్రభుత్వం, సీసీఐ అధికారుల నడుమ ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగి.. ఇటీవలే సీసీఐ కేంద్రాలను ప్రారంభించి కొనుగోళ్లు జరుపుతున్నారు. తాజాగా ఎకరానికి 7 క్వింటాల పత్తి దిగుమతి, తేమ శాతంలో కొర్రీల కారణంగా నెలకొంటున్న ఇబ్బందుల దృష్ట్యా నిబంధనలు సడలించాలన్న మిల్లర్ల విజ్ఞప్తిని సీసీఐ పట్టించుకోకపోవడంతో మిల్లర్ల అసోసియేషన్ కొనుగోళ్లను నిలిపివేసింది. దీంతో అధికార యంత్రాంగం రైతన్నలను అప్రమత్తం చేసి.. నేటినుంచి అమ్మకానికి రావొద్దంటూ మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో ప్రకటనలు విడుదల చేసింది. 6వ తేదీ నుంచే బంద్కు పిలుపు..! వీటికి తోడు జిల్లాలోని అన్ని పత్తి మిల్లుల్లో సీసీఐ కేంద్రాలను ఒకేసారి తెరవకుండా దశలవారీగా తెరవాలని ఆదేశాలిచ్చారు. జిల్లాలో ఆరు జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కేంద్రాలుగా ఏర్పాటు చేయగా.. వీటిని ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3, ఎల్ 4, ఎల్ 5, ఎల్ 6గా విభజించారు. ఇందులో ప్రస్తుతం ఎల్ 1, ఎల్ 2గా ఉన్న సూర్యాపేట సమీపంలోని బాలెంల, తిరుమలగిరి సీసీఐ కేంద్రాల్లోనే పత్తిని కొనుగోలు చేస్తున్నారు. వీటిల్లో కొనుగోలు సామర్థ్య పూర్తయ్యాకే మిగతా వాటిని తెరవాలంటూ సీసీఐ ఆంక్షలు విధించింది. దీంతో రైతులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాటన్ మిల్లు యాజమాన్యాలకు పత్తి రైతులతో ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో నేటి నుంచి రాష్ట్ర కాటన్ మిల్లర్స్ అసోసియేషన్ కొనుగోళ్లను నిలిపివేయాలని నిర్ణయించింది. వాస్తవంగా ఈనెల 6 నుంచే కొనుగోళ్లు నిలిపివేస్తామని అసోసియేషన్ ప్రకటిస్తే బిహార్ ఎన్నికల నేపథ్యంలో కేంద్రమంత్రి అందుబాటులో లేరని, కొద్దీ సమయం ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. దీంతో తమ మూసివేతను తాత్కాలికంగా వాయిదా వేశారు. అయితే ఆ తర్వాత కూడా వీరి ఆందోళనను పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో మరోసారి ఆందోళనకు సిద్ధమవుతూ కొనుగోళ్లను సోమవారం నుంచి నిలిపివేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం స్పందించి సీసీఐ తీరును సరిదిద్ది పత్తి కొనుగోళ్లు కొనసాగేలా చూడాలని రైతులు, రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఫ నేటినుంచి మూతపడనున్న సీసీఐ కేంద్రాలు ఫ సీసీఐ నిబంధనలు సడలించే వరకూ ఇదే పరిస్థితి ఫ కొర్రీలతో కాటన్ మిల్లర్ల అసోసియేషన్ నిర్ణయం ఫ అమ్మకానికి పత్తిని తీసుకు రావొద్దని అధికారుల ప్రకటన జిల్లాలో 2025–26 సీజన్లో సుమారుగా 93వేల ఎకరాల్లో పత్తి సాగైంది. తుపాన్ కారణంగా కొంత పత్తి తడిసినా.. ఎక్కడా నష్టం వాటిల్లలేదు. దిగుబడి బాగానే రావడంతో రైతులు మద్దతు ధర ఒక్కటీ వస్తే లాభపడతామని సంబురపడ్డారు. ఈ తరుణంలో సీసీఐ పత్తి కొనుగోళ్ల విషయంలో మొదటినుంచి కొర్రీలు పెడుతూ కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ నిబంధనలతో ఓ వైపు రైతులు, మరోవైపు జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పత్తి పంట చేతికొచ్చే సమయంలో కొనుగోళ్లకు కొత్తగా కపాస్ యాప్ పెట్టి అందులో నమోదైన రైతుల పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రకటించింది. ఇందుకు కొంత సమయం పట్టడంతో ఆలస్యంగా సీసీఐ కేంద్రాలను ప్రారంభించారు. అటు తర్వాత రైతులు ముందుగా స్లాట్బుక్ చేసుకుంటేనే.. కొనుగోలు చేస్తామని, అదీ ఎకరానికి ఏడు క్వింటాళ్ల పత్తినే కొంటామన్న మరో కఠిన నిబంధన అమలులోకి తెచ్చారు. -
లక్కీ లాటరీల పేరుతో మోసాలు చేయొద్దు
సూర్యాపేటటౌన్ : స్థిరాస్తి భూముల అమ్మకానికి లక్కీ లాటరీల పేరుతో ఆర్థిక మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. జిల్లాలో అక్కడక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మరికొంతమంది వ్యవస్థీకృతంగా ఏర్పడి రూ.వెయ్యి కట్టు, ప్లాట్ పట్ట్ఙు అంటూ లక్కీ లాటరీల పేరుతో స్థిరాస్తులు అమ్ముతున్నారని, ఇది చట్టపరంగా నేరమని పేర్కొన్నారు. పోలీసుల దృష్టికి రావడంతో ఇలాంటివి మోసపూరితమైన ఆర్థిక నేరమని కొందరిని హెచ్చరించామని, మళ్లీ ఇలాంటి నేరాలకు ఎవరైనా పాల్పడితే కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని పేర్కొన్నారు. ఇలాంటి లాటరీలకు ప్రజలు డబ్బులు కట్టి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. వేతన సవరణ రిపోర్టు ప్రకటించాలిసూర్యాపేటటౌన్ : వేతన సవరణ కమిషన్ రిపోర్టును ప్రకటించి అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్.రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సూర్యాపేటలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్.సోమయ్య అధ్యక్షతన నిర్వహించిన జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. 2023 జూలై 1 నుంచి అమలు కావాల్సిన తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయుల వేతన సవరణ కమిషన్ రిపోర్టును పట్టించుకోకపోవడం దారుణమన్నారు. పెండింగ్లో ఉన్న ఐదు డీఎలను వెంటనే ప్రకటించాలని, రిటైరైన ఉద్యోగ, ఉపాధ్యాయుల పెన్షనరీ బెనిఫిట్స్, సరెండర్, టీఎస్జీఎల్ఐ, ఈ కుబేర్లో పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.అనిల్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు పి.శ్రీనివాస్రెడ్డి, కె.అరుణ భారతి, జిల్లా కోశాధికారి జి.వెంకటయ్య, జిల్లా కార్యదర్శులు ఆర్.దామోదర్, ఎన్.నాగేశ్వరరావు, బి.ఆడమ్, వెలుగు రమేష్, బాల సైదిరెడ్డి పాల్గొన్నారు. ఆధార్ కార్డుతో రావాలి సూర్యాపేట : సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో ఈనామ్ 2.0 ప్రారంభమవుతున్నందున పంట ఉత్పత్తులను అమ్ముకునేందుకు వచ్చే రైతులు తమ వెంట తప్పనిరిగా ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ తెచ్చుకోవాలని మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎండి.ఫసీయొద్దీన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు మార్కెట్ యార్డుకు వచ్చినప్పుడు గేట్ వద్ద లాట్ ఐడీ జనరేట్ చేసుకోవాలని కోరారు. మట్టపల్లి క్షేత్రంలో పంచామృతాభిషేకంమఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో ఆదివారం విశేష పూజలు కొనసాగాయి. ఈ సందర్భంగా శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్లకు ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల నిత్యకల్యాణాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని క్షేత్రంలోని శివాలయంలో గల శ్రీపార్వతీ రామలింగేశ్వర స్వామికి పంచామృతాభిషేకం, పూజలు, ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఇన్చార్జి ఈఓ బి.జ్యోతి, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, ఆంజనేయాచార్యులు, దుర్గాప్రసాద్శర్మ, భక్తులు పాల్గొన్నారు. -
తిరుమలగిరి బీసీ హాస్టల్లో మంచాలు లేక..
రెండు రోజులుగా చలి బాగా పెడుతోంది. హాస్టల్లో మంచాలు లేకపోవడంతో బండలపైన పడుకుంటున్నాం. ఉదయం పూట చన్నీళ్లతోనే స్నానం చేస్తున్నాము. మంచాలు, గీజర్లు ఏర్పాటు చేయాలి. – గౌతమ్ కృష్ణ, విద్యార్థి, బీసీ హాస్టల్, తిరుమలగిరితిరుమలగిరి(తుంగతుర్తి) : తిరుమలగిరిలోని బీసీ బాలురు, గిరిజన వసతి గృహాల్లో వేడి నీటితో స్నానం చేయడానికి గీజర్లు లేకపోవడంతో చలి నీళ్లతో స్నానం చేస్తున్నారు. బీసీ బాలుర హాస్టల్లో మంచాలు లేకపోవడంతో బండలపైనే పడుకుంటూ చలికి వణికిపోతున్నారు. -
చన్నీటిస్నానం.. పరుపులపై నిద్ర
హుజూర్నగర్ : హుజూర్నగర్లోని ఎస్సీ హాస్టల్లో 50 మంది విద్యార్ధులకు గాను ప్రస్తుతం 33మంది విద్యార్ధులు ఉన్నారు. ఈ హాస్టల్లో ఉన్న సోలార్ పవర్ ప్యానళ్లు పనిచేయడం లేదు. గీజర్ లేకపోవండతో విద్యార్దులు ఉదయం, సాయంత్రం వేళల్లో చన్నీళ్ల తోటే స్నానం చేస్తున్నారు. విద్యార్ధులకు దుప్పట్లు పంపిణీ చేసినప్పటికీ రగ్గులు, చలికోట్లు ఇవ్వకపోవడంతో చలికి వణకుతున్నారు. మంచాలు లేక నేలపైన పరులు వేసుకుని నిద్రిస్తున్నారు. అలాగే ఎస్టీ హాస్టల్లో 169 విద్యార్థులకు 132 మంది ఉన్నారు. చలికాలంలో పంపిణీ చేసే రగ్గులు, చలికోట్లు ఇంత వరకు పంపిణీ చేయలేదు. ఈ హాస్టల్కు హీటర్లు సప్లై చేయకపోవడంతో విద్యార్ధులు చలిలోనే చన్నీటితో స్నానాలు చేస్తున్నారు. -
నిర్మించుకోకుంటే ఇల్లు రద్దే
ఫ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై కొనసాగుతున్న సర్వే ఫ నిర్మించని వాటిని గుర్తిస్తున్న అధికారులు ఫ వచ్చే నెలలో రెండో విడత లబ్ధిదారుల గుర్తింపుప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇల్లు మంజూరైన 45 రోజుల్లో నిర్మాణం ప్రారంభించాలి. అలా ప్రారంభించకపోతే రద్దు అవుతుంది ఆరు నెలలైనా 34శాతం మంది లబ్ధిదారుల నిర్మాణాలు ప్రారంభించలేదు. వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పిస్తాం – సిద్ధార్థ్, హౌసింగ్ పీడీ, సూర్యాపేట సూర్యాపేట అర్బన్ : నిర్మానాలు ప్రారంభించని ఇందిరమ్మ ఇళ్లను రద్దు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇల్లు మంజూరైన వారు 45 రోజుల్లో నిర్మాణ పనులు ప్రారంభించాలి. కానీ ఆరు నెలలుగా దాటుతున్నా జిల్లాలో రెండువేల మందికిపైగా లబ్ధిదారులు ఇంకా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో నిర్మాణాలు ప్రారంభించని వాటి రద్దుచేసి కొత్తవారికి కేటాయించేందుకు అంతటా సర్వే చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ఎల్–1 కింద సొంత స్థలాలు ఉన్నవారు, ఎల్–2 కింద సొంత స్థలం కానీ ఇల్లు కాని లేనివారు, ఎల్–3 కింద ఇతరులు అని మూడు జాబితాలుగా అధికారులు నిర్ధారించి దరఖాస్తులు స్వీకరించారు. అప్పట్లో తమ పేర్లు ఎల్–1 కింద రావాల్సి ఉండగా ఎల్–2 కింద వచ్చాయని సరిచేసి ఎల్–1 కింద చేర్చాలని చాలామంది అధికారులకు అర్జీలు సమర్పించారు. ప్రస్తుతం నిర్మాణం మొదలుపెట్టని ఇళ్లను రద్దుచేసి నిర్మించుకునే వారికి ఇచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. 67 శాతం ఇళ్ల పనులు ప్రారంభం జిల్లాలో మొతం 8,112 మందికి ఇళ్లు మంజూరు చేశారు. ఇందులో 5,494 మంది (67 శాతం) లబ్ధిదారులకు అధికారులు మార్క్ అవుట్ ఇవ్వగా ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. ఇందులో ఇప్పటి వరకు 72 ఇళ్లు నిర్మాణం పూర్తయినట్టుగా అధికారులు గుర్తించారు. మిగతా వాటి నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. కాని ఇప్పటి వరకు 2,618 లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించలేదని అధికారులు గుర్తించారు. రద్దుకు అధికారుల సర్వే నిర్మాణాలు ప్రారంభించని ఇళ్ల రద్దు చేసేందుకు ఎంపీడీఓ, హౌసింగ్ ఏఈ, పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో అధికారులు గుర్తిస్తున్నారు. తాము కట్టుకోలేని పరిస్థితి ఉందని లబ్ధిదారులు పేర్కొంటే వాటిని అధికారులు రద్దు చేస్తారు లేదా ప్రారంభించుకునేందుకు సిద్ధంగా ఉంటే మార్క్ అవుట్ ఇస్తారు. వచ్చే ఏడాది నిర్మించుకుంటామని పేర్కొంటే ప్రస్తుతం రద్దుచేసి వచ్చే ఏడాది మంజూరు చేయనున్నారు. రద్దు చేసిన ఇళ్లను నిర్మించుకునేందుకు సిద్ధంగా ఉన్న వారికి మంజూరు చేయనున్నారు. వచ్చే నెల మొదటి వారంలో రెండో విడత లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేయనున్నారు. బిల్లుల భయంతో అనాసక్తి నిర్మాణాలు చేపట్టినా బిల్లు రావన్న వదంతులు వినిపిస్తున్న కారణంగా చాలామంది ఇళ్ల నిర్మాణాలపై అనాసక్తి చూపుతున్నారు. తద్వారా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించలేదు. ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బేస్మెంట్ పూర్తయితే రూ.లక్ష, రూప్ లెవెల్కు రూ.లక్ష, ఆర్సీసీ పూర్తయితే రూ.2 లక్షలు నిర్మాణం పూర్తి చేసుకుని రంగులు వేశాక మరో రూ.లక్ష చొప్పున మొత్తం రూ.ఐదు లక్షలు చెల్లిస్తున్నారు. నిర్మించుకుని వివిధ దశలో ఉన్న లబ్ధిదారులకు డబ్బులను వారి బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తున్నారు. -
యాదాద్రిలో ఏకాదశి పూజలు
యాదగిరిగుట్ట: పంచ నారసింహులు కొలువైన యాదగిరి క్షేత్రంలో కార్తీక ఏకాదశి సందర్భంగా శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ప్రధానాలయ ముఖ మండపంలో యజ్ఞమూర్తులను కొలుస్తూ, వేద మంత్రాలు పఠిస్తూ తీరొక్క పూలు, తులసీ దళాలతో ఆగమశాస్త్రం ప్రకారం లక్ష పుష్పార్చన చేశారు. వేకువజామున సుప్రభాత సేవ, స్వయంభూలకు అభిషేకం, సహస్రనామార్చన, సుదర్శన హోమం, గజవాహన సేవ, ఉత్సవమూర్తుల నిత్య తిరుకల్యాణోత్సవం తదితర నిత్యారాధనలు, దైవదర్శనాలతో ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది. కొంద కింద మండపంలో దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. -
ఐదేళ్లక్రితం దరఖాస్తు
ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన ఆవుల స్వర్ణ మానసిక దివ్యాంగురాలు. ఆమె సదరం సర్టిఫికెట్లో 100 శాతం వైకల్యం ఉన్నట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. దివ్యాంగుల పింఛన్ కోసం ఐదేళ్ల క్రితం గ్రామపంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేశారు. కానీ పింఛన్ మంజూరు కాలేదు. తన కూతురికి పింఛన్ ఇప్పించాలని కోరుతూ ఆమె తండ్రి ఆవుల సింహాద్రి ఏడాది కిందట సూర్యాపేట కలెక్టరేట్లో కూడా అర్జి అందించాడు. ఏళ్లు గడుస్తున్నాయే కానీ పింఛన్ మంజూరు కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. -
వయోవృద్ధులకు సముచిత స్థానం కల్పించాలి
సూర్యాపేట అర్బన్ : సమాజంలో వయోవృద్ధులకు సముచిత స్థానం కల్పించాలని జిల్లా సంక్షేమ అధికారి కె. నరసింహారావు అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వారోత్సవాల సందర్భంగా శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన వయోవృద్ధుల ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ గాంధీ పార్క్ నుంచి మినీ ట్యాంక్ బండ్ వరకు సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వయోవృద్ధులైన తల్లి దండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత వారి పిల్లలదే అన్నారు. తల్లిదండ్రుల సంరక్షణలో నిర్లక్ష్యం వహించే వారిపై చట్ట పరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో వయోవృద్ధుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హమీద్ ఖాన్, సభ్యులు కృష్ణారెడ్డి, రామకృష్ణారెడ్డి, కాకి మల్లారెడ్డి, సీడీపీఓలు సుబ్బలక్ష్మీ, కిరణ్మయి, శ్రీజ, సూపర్ వైజర్ వినోద్కుమార్ పాల్గొనారు. వృద్ధులకు ఆటల పోటీలు మునగాల : మండలంలోని ముకుందాపురం శివారులో గల ఇందిర అనాథ వృద్ధాశ్రమంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో వృద్ధులకు శని వారం ఆటలు, పాటల పోటీలు నిర్వహించారు. వృద్ధులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందించా రు. కార్యక్రమంలో ఆశ్రమ వ్యవస్థాపకురాలు నాగిరెడ్డి విజయమ్మ, కోఆర్డినేటర్ వాచేపల్లి జ్యోతి, సిబ్బంది పాల్గొన్నారు. ఫ జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు -
టెట్కు యువత సిద్ధం
సూర్యాపేటటౌన్ : టీటీసీ, బీఈడీ పూర్తి చేసిన వారికి ఉపాధ్యాయ అర్హత పరీక్ష కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. శనివారం నుంచి దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉద్యోగం రావాలంటే టెట్ క్వాలిఫై కావాల్సి ఉండడంతో అభ్యర్థులు భారీ సంఖ్యలోనే దరఖాస్తు చేసుకోనున్నారు. అందుకు గానూ జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరిలో పరీక్ష రాబోయే రోజుల్లో ఉపాధ్యాయులుగా స్థిరపడాలనుకునే వారు టెట్కు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం కూడా శనివారం నుంచి టెట్కు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించింది. ఈ నెల 29 వరకు టెట్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 31 తేదీల మధ్య ఆన్లైన్లో టెట్ నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధ మవుతున్నారు. 8వేల వరకు దరఖాస్తులు గతేడాది జూన్ 18 నుంచి 30 వరకు టెట్ పరీక్ష నిర్వహించారు. నిబంధనల మేరకు సరిగ్గా ఆరు నెలల వ్యవధిలో వచ్చే ఏడాది జనవరిలో పరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత టెట్ పరీక్షకు జిల్ల నుంచి 5వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రస్తుతం అభ్యర్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. జిల్లాలో డీఎడ్, బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు సుమారు 6వేల మంది ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. వీరందరూ టెట్ పరీక్షకు దరఖాస్తులు చేసుకోనున్నారు. దీంతో పాటు ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా టెట్ క్వాలిఫై కావాల్సిందేననే ప్రభుత్వ ఉత్వర్వుల మేరకు వారు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. గతంలో టెట్ క్వాలిఫై అయిన వారు మార్కులు మెరుగు పర్చుకునేందుకు మళ్లీ టెట్ రాసే అవకాశం ఉంది. దాంతో హాజరయ్యే వారి శాతం పెరుగనుంది. ఈ సారి జిల్లాలో అభ్యర్థులు, టీచర్లు కలిపి 8 వేల మంది వరకు టెట్కు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉపాధ్యాయులకు టెట్ భయం.. డీఎస్సీ 1995 నుంచి మొన్నటి డీఎస్సీ 2024 వరకు ఉపాధ్యాయులుగా నియమితులైన వారు టెట్ క్వాలిఫై కావాల్సిందేనని ఉన్నత విద్యామండలి ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో మొత్తం 3800 మంది ఉపాధ్యాయులు ఉండగా ఇందులో 1800 మంది వరకు టెట్ క్వాలిఫై కలిగిన వారు ఉండగా మిగిలిన 2వేల మంది టెట్ అర్హత సాధించాల్సి ఉంది. ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్ సర్వీస్ టీచర్లు తప్పక పరీక్ష రాయాల్సిందేనని తేల్చిచెప్పింది. దాంతో ఉపాధ్యాయుల్లో ప్రస్తుతం టెట్ భయం పట్టుకుంది. ఇన్ సర్వీస్లో ఉన్న ఎస్టీజీటీలు పేపర్– 1, స్కూల్అసిస్టెంట్లు పేపర్– 2 రాయాల్సి ఉంది. అయితే ఎంత మంది ఉపాధ్యాయులు టెట్కు దరఖాస్తు చేసుకుంటారో చూడాల్సిందే. జిల్లాలో బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన నిరుద్యోగులు టెట్కు సన్నద్ధమవుతున్నారు. వారంతా ఇప్పటికే టెట్ రాసేందుకు కోచించ్ సెంటర్లను ఆశ్రయించారు. మరి కొందరు గ్రంథాలయాల్లో, ఇంటివద్ద సొంతంగా ప్రిపేర్ అవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయనుందనే ఊహాగానాల నేపథ్యంలో చాలా మంది టెట్లో స్కోరింగ్ మార్కులు తెచ్చుకోవాలనే తపనతో ప్రిపేర్ అవుతున్నారు. ఫ ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ ఫ 29వరకు తుది గడువు ఫ నిరుద్యోగుల్లో కొత్త ఉత్సాహం ఫ టీచర్లకు ఉత్తీర్ణత భయం ఫ ఈసారి పెరుగనున్న దరఖాస్తుల సంఖ్య -
23న నేషనల్ మీన్స్కం మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్
సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ను ఈ నెల 23న నిర్వహించనున్నట్లు డీఈఓ కె.అశోక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 1,262 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానుండగా వారికి సంబంధించిన హాల్టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. సూర్యాపేటలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, సిటీ హైస్కూల్, ప్రభుత్వ నం–2 ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ఎంఏఎం పాఠశాల, కోదాడలోని కేబీఎస్ఎస్ జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల, ఎస్టీ జోసెఫ్ హైస్కూల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏది అక్రమ విజయంసూర్యాపేట అర్బన్ : బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రజల మధ్య కులం, మతోన్మాదం పేరుతో విద్వేశాలు సృష్టించి, అధికార యంత్రంగాన్ని వినియోగించుకొని అక్రమ పద్ధతిలో విజయం సాధించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి అన్నారు. శనివారం సూర్యాపేటలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రధాని మోదీ, హోం మంత్రితో సహా ఎన్డీఏ నేతలు ప్రజల మధ్య చీలికలు తీసుకొచ్చి లబ్ధి పొందారని, దుర్మార్గమైన వారి ఎత్తుగడలకు కార్పోరేట్ మీడియా పూర్తి సహకారం అందించిందన్నారు. బిహార్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న 85 లక్షల మంది ఓట్లను తొలగించిందన్నారు. బీజేపీ రాజ్యాంగ వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్రెడ్డి, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, నాయకులు మట్టిపల్లి సైదులు, కోట గోపి పాల్గొన్నారు. సకాలంలో సిలబస్ పూర్తి చేయాలి నడిగూడెం : ఇంటర్ సిలబస్ను త్వరగా పూర్తి చేయాలని డీఐఈఓ వి.భానునాయక్ ఆదేశించారు. శనివారం మండల కేంద్రంలోని ప్రభు త్వ జూనియర్ కళాశాల, కరివిరాల మోడల్ స్కూల్ను ఆయన తనిఖీ చేశారు. తరగతి గదులు, ల్యాబ్ను పరిశీలించారు. విద్యార్థులు, అధ్యాపకుల హాజరు రిజిస్టర్ను తనిఖీ చేశారు. అనంతరం అధ్యాపకులతో సమావేశమై పలు అంశాలపై సూచనలు చేశారు. వార్షిక పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలన్నారు. ప్రాక్టికల్స్ను పకడ్బందీగా నిర్వహించాలని, అధ్యాపకులు సమయ పాలన పాటించాలని సూచించారు. ఉదయం స్టడీ అవర్స్ నిర్వహించి, చదువులో వెనుకబడిన విద్యార్థుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. ఆయన వెంట ప్రిన్సిపాల్స్ డి.విజయనాయక్, సాయి ఈశ్వరి, అధ్యాపకులు ఉన్నారు. నేడు సూర్యక్షేత్రంలో కార్తీక వనభోజనాలు అర్వపల్లి : కార్తీక మాసం సందర్భంగా తిమ్మాపురం శివారులోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో ఆదివారం కార్తీక వన భోజనాల కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా క్షేత్రంలో ప్రత్యేక పూజలు జరుపనున్నట్లు క్షేత్ర వ్యవస్థాపకురాలు కాకులారపు రజితజనార్దన్స్వామి తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించి వనభోజన కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. -
మందులు కొనడానికి పైసల్లేవ్
మాది నిరుపేద కుటుంబం. కూలి పనులకు వెళ్తే గానీ కుటుంబం గడవదు. ఐదేళ్ల క్రితం వృద్ధాప్య పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న. కానీ నేటికీ మంజూరు కాలే. ఆరోగ్యం బాగాలేక రోజూ మందులు వేసుకోవాల్సి వస్తుంది. కూలికి వెళ్తే గాని మాత్రలు కొనలేని పరిస్థితి. పింఛన్ వస్తే కనీసం మందులకు ఆసరా అవుతాయని పలుమార్లు అధికారుల దగ్గరికి వెళ్లి మొరపెట్టుకున్న. కానీ ఇప్పటివరకు పింఛన్ మంజూరు చేయలే. బొడ్డు లచ్చమ్మ, ఆత్మకూర్(ఎస్) ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులు మండల పరిషత్ కార్యాలయాల్లో పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాగానే చేయూత పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారిని గుర్తించి మంజూరు చేస్తాం. అప్పారావు, డీఆర్డీఓ, సూర్యాపేట -
తూకంలో తేడాలున్నాయని రైతుల ఆందోళన
నేరేడుచర్ల : మండలంలోని చిల్లేపల్లి వద్ద ఉన్న రైస్ మిల్లులో ధాన్యం ఒక్కో ట్రాక్టర్కు 95కిలోలు తక్కువగా వస్తున్నాయంటూ శనివారం రైతులు ఆందోళన నిర్వహించారు. రైతు కొండ ముసలయ్య చిల్లేపల్లి వద్ద గల రైస్ మిల్లుకు ట్రాక్టర్లో ధాన్యం తేగా మిల్లు ఆవరణలో ఉన్న వేబ్రిడ్జిలో తూకం వేస్తే 7,880 కిలోలు వచ్చింది. దాంతో ఆయన తన ట్రాక్టర్ను మరో మిల్లుకు తీసుకెళ్లి తూకం వేయగా 7,975 కిలోలు వచ్చింది. ఈ విషయమై రైతులు మిల్లు వద్ద ఆందోళన నిర్వహించారు. ఎస్ఐ రవీందర్నాయక్ విచారణ నిర్వహించారు. తూనికలు కొలతల అధికారితో తూకంలో తేడాను నిర్ధారించి రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. -
లోకల్ టు గ్లోబల్
ప్రతిష్టాత్మకమైన ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీపై కోదాడ యువకుడికి చోటు లభించింది.- 10లోడీఎంహెచ్ఓగా వెంకటరమణ బాధ్యతలుసూర్యాపేటటౌన్ : జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిగా డాక్టర్ పెండెం వెంకటరమణ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఖమ్మం జిల్లా ప్రోగ్రాం అధికారిగా పని చేస్తున్న ఆయనను పదోన్నతిపై సూర్యాపేట డీఎంహెచ్ఓగా ప్రభుత్వం నియమించింది. బాధ్యతలు చేపట్టిన వెంకటరమణను ఉద్యోగులు, సిబ్బంది సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన కలెక్టర్ తేజస్నంద్లాల్ పవా ర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. -
కోదాడ యువకుడి ఘనత: ఫోర్బ్స్ ఇండియా కవర్ పేజీపై జానీ పాష
స్వయంకృషి, పట్టుదలతో కోదాడ పట్టణానికి చెందిన జానీ పాష ప్రతిష్టాత్మకంగా భావించే ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీపై చోటు సంపాదించాడు. ఆసియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న 100 స్టార్టప్ కంపెనీలలో జానీ పాష స్థాపించిన ‘లోకల్ యాప్’ చేరింది. దీంతో ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ అక్టోబర్ సంచిక కవర్ పేజీపై జానీ పాష ఫొటోను ప్రముఖంగా ప్రచురించింది. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన జానీపాష అరుదైన ఈ గౌరవాన్ని పొందడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.సూర్యాపేట జిల్లా: కోదాడకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు యాకుబ్ పాష కుమారుడైన జానీ పాష 10వ తరగతి వరకు కోదాడలోనే చదువుకున్నారు. విజయవాడలో ఇంటర్ చదివిన అతడు ఐఐటీ ఖరగ్పూర్లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అనంతరం బెంగళూరులో ఉద్యోగం చేసుకుంటూ 2018లో ‘లోకల్’ పేరుతో తన మిత్రుడు విపుల్ చౌదరితో కలిసి యాప్ను రూపొందించారు. ఈ యాప్ను జానీ పాష కోదాడలోనే లాంచ్ చేశారు. దీనిలో తెలుగు, కన్నడ భాషలలో లోకల్ సమాచారాన్ని అప్పటికప్పుడు అందించే విధంగా తయారు చేశారు. గడిచిన ఏడు సంవత్సరాల్లోనే ఈ యాప్ రూ.238 కోట్ల పెట్టుబడులను సమీకరించి ఆసియాలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ కంపెనీగా నిలిచింది. దీంతో ప్రతిష్టాత్మకమైన బిజినెస్ మ్యాగజైన్ అయిన ఫోర్బ్స్ ఇండియా అక్టోబర్ నెలలో “100 టు వాచ్’ పేరుతో కథనాన్ని ప్రచురించింది. అందులో జానీపాషతో పాటు మరికొందరు స్టార్టప్ ఫౌండర్ల ఫొటోలను ప్రచురించింది. ఈ మ్యాగజైన్లో వారు విజయాన్ని ఎలా అందుకున్నారనే అంశాలతో ఇంటర్వూ్యలను ప్రచురించింది., Johnny Pasha, -
ప్రమాదాల నివారణ మార్గం
సూర్యాపేటటౌన్ : జాతీయ రహదారులు, గ్రామీణ రహదారులపై నిత్యం ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. కుటుంబ పెద్దను కోల్పోయి ఆ కుటుంబం చిన్నాభిన్నమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్డు ప్రమాదాలను కొంతవరకై నా నివారించాలనే ఉద్దేశంతో ఎస్పీ నరసింహ ప్రత్యేక చొరవతో 43 రోడ్డు భద్రతా కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు బ్లాక్ స్పాట్స్ వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వాహనదారులకు అవగాహన కల్పించడంతో పాటు ప్రమాదం జరిగితే వెంటనే స్పందించేలా ప్రణాళిక రూపొందించారు. బ్లాక్ స్పాట్స్ ఇవీ.. జిల్లా వ్యాప్తంగా జాతీయ, గ్రామీణ రహదారులపై మొత్తం 43 బ్లాక్ స్పాట్లను పోలీసులు గుర్తించారు. వీటిలో.. ● ఎన్హెచ్ 65పై టేకుమట్ల నుంచి రామారం రోడ్డు వరకు 23 బ్లాక్ స్పాట్స్ ● ఎన్హెచ్ 167పై కోదాడ నుంచి చిల్లెపల్లి బ్రిడ్జి వరకు ఐదు బ్లాక్ స్పాట్స్ ● ఎన్హెచ్ 365పై అర్వపల్లి నుంచి బిక్కుమళ్ల వరకు ఒకటి ● ఎన్హెచ్ 365 బిపై జనగామ ఎక్స్ రోడ్డు నుంచి తిరుమలగిరి(ఈదులపర్రెతండా )వరకు ఏడు బ్లాక్ స్పాట్స్ ● ఎన్హచ్ 365పై టేకుమట్ల నుంచి మోతె వరకు నాలుగు బ్లాక్ స్పాట్స్ ● ఎన్హెచ్ 930పై తిరుమలగిరి బిగ్గేరు వాగు నుంచి మామిడాల క్రాస్ రోడ్డు వరకు మూడు బ్లాక్ స్పాట్స్ ఒక్కో కమిటీలో 11 మంది 43 బ్లాక్ స్పాట్ల వద్ద 43 రోడ్డు భద్రత కమిటీలను వారం పది రోజుల క్రితం ఏర్పాటు చేశారు. ఒక్కో కమిటీలో 11 మంది ఉన్నారు. వీరిలో స్థానిక పోలీస్ ఒకరు, రిటైర్డ్ టీచర్ ఒకరు, మహిళా ప్రతినిధులు ఇద్దరు, వ్యాపారుల నుంచి ఇద్దరు, స్వచ్ఛంద సంస్థల నుంచి ఇద్దరు, యూత్ ఆర్గనైజేషన్ నుంచి ఇద్దరు, రహదారుల సంస్థ ప్రతినిధుల నుంచి ఒకరు ఉన్నారు. ఈ కమిటీలు బ్లాక్స్పాట్ల వద్ద యాక్సిడెంట్లు జరగకుండా చర్యలు చేపడతున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. పోలీసుల సూచనలు ● అతివేగంగా, నిద్రమత్తులో వాహనాలు నడపవద్దు. ● రోడ్లపై ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలపవద్దు. ● హెల్మెట్, సీట్ బెల్ట్ విధిగా ధరించాలి. ● వాహన సామర్థ్యానికి మించి ప్రయాణికులను తీసుకెళ్లవద్దు. ● పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దు. ● మద్యం మత్తులో వాహనాలు నడపరాదు. ● ఓవర్టేక్ చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. ● రాంగ్రూట్లో వాహనాలు నడపవద్దు. ● వాహనాలకు లైటింగ్, సైడ్ మిర్రర్స్ ఉండాలి. ● డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. రోడ్డు ప్రమాదాల నివారణకు కమిటీలు ఏర్పాటు చేశాం. ఈ కమిటీల ద్వారా ప్రజలు, వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నాం. ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే ఈ కమిటీలు స్పందించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు ప్రథమ చికిత్స అందించడం, అంబులెన్స్లకు ఫోన్లు చేయడంలాంటి పనులు చేస్తున్నాయి. – కె.నరసింహ, జిల్లా ఎస్పీ, సూర్యాపేట హైవేలు, గ్రామీణ రహదారులపై 43 బ్లాక్ స్పాట్ల గుర్తింపు ఫ 43 రోడ్డు భద్రతా కమిటీల ఏర్పాటు ఫ ఒక్కో కమిటీలో 11మంది ఫ బ్లాక్స్పాట్ల వద్ద వాహనదారులకు అవగాహన సదస్సులు -
42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి
సూర్యాపేట : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ జేఏసీ జిల్లా కోఆర్డినేటర్ చలమళ్ల నర్సింహ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రాజా, గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు సూర్యాపేట వాణిజ్య భవన్ సెంటర్లో నిర్వహించిన బీసీల ధర్మ పోరాట దీక్షలో వారు పాల్గొని మాట్లాడారు. 42 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా వచ్చేవరకు పార్టీలకతీతంగా బీసీ కులసంఘాలు, ప్రజా సంఘాలు ఏకమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలన్నారు. కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తలమల్ల హసేన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వర్లు, సీపీఎం జిల్లా నాయకుడు మట్టపల్లి సైదులు, తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు గట్ల రమాశంకర్, నిద్ర సంపత్ నాయుడు, బండపల్లి శ్రీనివాస్ గౌడ్, బండారి డేవిడ్ కుమార్, డాక్టర్ బంటు కృష్ణ, భయ్యా మల్లికార్జున్, బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్, నారా బోయిన వెంకట్ యాదవ్, రేణి కుంట్ల నరేందర్, కందాల భాస్కర్, జెల్లీ సత్యనారాయణ, సలిగంటి నాగయ్య, గిలకత్తుల నాగమణి, అమరవాది శ్రావణి, ఆకుల లవకుశ, నేరెళ్ల మధు, కోడి లింగ యాదవ్, కోడిదల రాంబాబు, దాసరి దేవయ్య, కొండగడపల సూరయ్య పాల్గొన్నారు. ధర్మ పోరాట దీక్షలో పాల్గొన్న బీసీ జేఏసీ, ఇతర సంఘాల నాయకులు -
మూడు వేల ఎకరాల్లో ఆయిల్పామ్
సూర్యాపేట : జిల్లాలో 2025–26 సంవత్సరానికి 3వేల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ వెల్లడించారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్లో పీఏసీఎస్ అధ్యక్ష, కార్యదర్శులు, ఉద్యాన, వ్యవసాయ, సహకార శాఖల అధికారులతో ఆయిల్ పామ్ సాగుపై నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఇప్పటి వరకు 2,011 ఎకరాలను గుర్తించి 1,139 ఎకరాలకు సబ్సిడీ మంజూరు చేయగా 696 ఎకరాల్లో మొక్కలు నాటినట్లు వివరించారు. అధిక లాభాలు చేకూర్చే ఆయిల్ పామ్ పంటను రైతులు సాగు చేసేలా చూడాలని కలెక్టర్ కోరారు. అనంతరం హార్టికల్చర్ టెక్నికల్ అధికారి మహేష్ పీపీటీ ద్వారా ఆయిల్ పామ్ సాగుకు సంబంధించిన అంశాలను వివరించారు. ఈ సమావేశంలో జిల్లా సహకార అధికారి ప్రవీణ్, ఉద్యానవన అధికారి నాగయ్య, జిల్లా వ్యవసాయ అధికారి నివేదిత, నాబార్డ్ డీడీఎం వినయ్ కుమార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ అంజయ్య, పీఏసీఎస్ అధ్యక్షులు, కార్యదర్శులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి సూర్యాపేటను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. గురువారం కలెక్టరేట్లో డ్రగ్స్ నార్కోటిక్పై ఎస్పీ నరసింహతో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో మాట్లాడారు. డ్రగ్స్, మత్తు పదార్థాల వల్ల విద్యార్థుల జీవితాలు ఎలా పాడవుతున్నాయో తెలియజేసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఎస్పీ కె. నరసింహ మాట్లాడుతూ డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు అన్ని శాఖలు సహకరించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, డీఎఫ్ఓ సతీష్ కుమార్,డీఆర్డీఓ వి.వి. అప్పారావు, సీ్త్ర, శిశు సంక్షేమ అధికారి నరసింహారావు, డీఎస్పీ ప్రసన్నకుమార్, ఆబ్కారీ సూపరింటెండెంట్ లక్ష్మా నాయక్, డీపీఓ యాదగిరి, డ్రగ్స్ ఇన్స్పెక్టర్ సురేందర్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి భాను నాయక్, విద్యాశాఖ కోఆర్డినేటర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
ఈసారి వారోత్సవాలు లేనట్టేనా?
చిలుకూరు: ఎంతో చర్రిత కలిగిన చిలుకూరు బాపూజీ శాఖా గ్రంథాలయంలో ఈ ఏడాది కూడా వారోత్సవాలు లేనట్టే కనిపిస్తోంది. శుక్రవారం నుంచి జరగాల్సిన వారోత్సవాలకు ఇప్పటి వరకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. గత ఏడాది కూడా ఉత్సవాలు నిర్వహించలేదు. అష్టాంధ్రమహాసభకు చిలుకూరు గ్రంథాలయం వేదికగా నిల్చింది. రెండేళ్ల క్రితమే నూతన భవనం నిర్మించారు. ఒకప్పుడు గ్రంథాలయ వారోత్సవాలు వచ్చాయంటే చిలుకూరులో పండుగ వాతావరణంలో కార్యక్రమాలు నిర్వహించేవారు. ఉదయం, సాయంత్ర వేళలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేవారు. ప్రముఖలతో సమావేశాలు ఏర్పాటు చేసేవారు. విద్యార్థులకు క్రీడా పోటీలు, మహిళలకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి బహుమతులు ఇచ్చేవారు. అలాంటి గ్రంథాయలం నేడు ఎలాంటి కార్యక్రమాలకు నోచుకోవడం లేదు. ఈ గ్రంథాలయానికి ప్రస్తుతం ఇన్చార్జి గ్రంథాలయ అధికారి ఉన్నారు. ఒక అటెండర్ ఉన్నారు. ఇప్పటికై నా ఈ గ్రంథాలయానికి పూర్వవైభం తేవాలని పాఠకులు కోరుతున్నారు.ఫ రెండేళ్లుగా వారోత్సవాలకు నోచని చిలుకూరు గ్రంథాలయం -
1.44లక్షలకు 13వేలే వచ్చాయి
నేరేడుచర్ల : ఉచిత చేప పిల్లల పంపిణీలో అవకతవకలు జరిగాయని నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి సహకార సంఘం సభ్యులు గురువారం ఆందోళనకు దిగారు. 1.44 లక్షల చేప పిల్లలకుగాను 13వేలు మాత్రమే వచ్చాయని పంపిణీ ప్రక్రియను అడ్డుకొని లారీని వెనక్కి పంపించారు. ఈ సందర్భంగా సొసైటీ సభ్యులు మాట్లాడుతూ చిల్లేపల్లి ఊర చెరువులో పోసేందుకు 1.44లక్షల చేప పిల్లలు పంపిణీ చేయాల్సి ఉందని, అయితే చేప పిల్లలతో లారీ రాగా అనుమానం వచ్చి డ్రమ్ములను పరిశీలించామన్నారు. ఒక్కో డ్రమ్ములో 1,300 చేప పిల్లల చొప్పున 10 డ్రమ్ముల్లో కలిపి 13వేలు మాత్రమే వచ్చాయన్నారు. దీంతో ఆ లారీని వెనక్కి పంపించామన్నారు. ఇప్పటికై నా అధికారులు చొరవ తీసుకొని తమ చెరువుకు కేటాయించిన చేప పిల్లలన్నింటినీ పంపించాలని కోరారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ నల్లమేకల వెంకయ్య, కార్యదర్శి పిట్టల గోవిందు, ఉపాధ్యక్షుడు బయ్య నర్సయ్య, సభ్యులు లచ్చయ్య, నాగరాజు, కృష్ణా, శంకర్ తదితరులు పాల్గొన్నారు. చేపపిల్లల పంపిణీలో అవకతవకలు ఫ చిల్లేపల్లి సహకార సంఘం సభ్యుల ఆందోళన బాట ఫ లెక్కతేల్చి చేపల లారీని వెనక్కి పంపిన సభ్యులు -
తిరుమలగిరి ఎస్ఐ అటాచ్?
తిరుమలగిరి ( తుంగతుర్తి): విధుల్లో అలసత్వం ప్రదర్శించడంతో తిరుమలగిరి ఎస్ఐ సీహెచ్. వెంకటేశ్వర్లును ఎస్పీ కార్యాలయానికి గురువారం అటాచ్ చేసినట్లు తెలిసింది. వెంకటేశ్వర్లు మార్చి 13న తిరుమలగిరిలో బాధ్యతలు స్వీకరించారు. వచ్చినపప్పటి నుంచి సివిల్ వివాదాలు, కుటుంబ పంచాయతీలలో తల దూర్చి ఇరువురి నుంచి మధ్య వర్తుల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. పోలీస్ స్టేషన్ లో సిబ్బందితో సఖ్యతగా లేనట్లు తెలుస్తోంది. వెంకటేశ్వర్లు కంటే ముందు పనిచేసిన ఎస్ఐ సురేష్ పీడీఎస్ బియ్యంకేసులో బాధితుడి నుంచి డబ్బులు వసూలు చేస్తూ కానిస్టేబుల్ తో సహా పట్టుబడ్డారు. తిరుమలగిరి పోలీస్స్టేషన్ కు వస్తున్న అధికారుల తీరుతో వరుస సంఘటనలు జరుగుతున్నా అధికారులు, సిబ్బందిలో మార్పు రావడంలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. ధైర్యం కల్పించడమే ధ్యేయంసూర్యాపేటటౌన్ : వేధింపులకు గురైన మహిళలు, బాలలకు నైతిక ధైర్యం కల్పించడమే పోలీస్ భరోసా సెంటర్ ధ్యేయమని జిల్లా ఎస్పీ నరసింహ పేర్కొన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పోలీస్ భరోసా సెంటర్, షీ టీమ్స్ కార్యాలయాన్ని ఎస్పీ పరిశీలించారు. మహిళలు, పిల్లల రక్షణకు తీసుకుంటున్న చర్యలు, కౌన్సిలింగ్ నిర్వహణ, అవగాహన కార్యక్రమాలను పరిశీలించి సిబ్బందికి సలహాలు, సూచనలు చేశారు. ఎవరైనా వేధింపులకు గురిచేస్తే ధైర్యంగా ఫిర్యాదు చేయాలని కోరారు. సాంకేతికత ఆధారాలతో నాణ్యమైన దర్యాప్తును చేస్తున్నామని, ఫాస్ట్ ట్రాక్ లో మాదిరిగా నేరాల్లో త్వరగా శిక్షలు అమలయ్యేలా పోలీస్శాఖ పని చేస్తోందన్నారు. ఎస్పీ వెంట భరోసా సెంటర్ మహిళా ఏఎస్ఐ సైదావి, సిబ్బంది ఉన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి కృషినేరేడుచర్ల : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా మత్స్యశాఖ అధికారి నాగులు పేర్కొన్నారు. గురువారం నేరేడుచర్ల మండలం పెంచికల్దిన్నలోని చెరువులో ఎంపీడీఓ సోమసుందర్రెడ్డితో కలిసి చేప పిల్లలు వదిలారు. అనంతరం నాగులు మాట్లాడుతూ చేపల పెంపకం తో జీవనోపాధి దొరుకుతుందన్నారు. కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులు రోజా, సుమలత, సతీష్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ఆర్కే, నాగరాజు, సైదులు, హరిబాబు, నాగేశ్వర్రావు, శ్రీధర్, నాగయ్య, లచ్చయ్య, మట్టయ్య, వెంకటయ్య, రాంబాబు పాల్గొన్నారు. ఎంజీయూ పీజీ సెమిస్టర్ ఫలితాలు విడుదలనల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో పీజీ రెండవ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను గురువారం ఎంజీయూ వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ విడుదల చేశారు. సెప్టెంబర్లో నిర్వహించిన పరీక్షలకు 1,160 మంది విద్యార్థులు హాజరు కాగా 794 మంది ఉత్తీర్ణత సాధించినట్లు సీఓఈ ఉపేందర్రెడ్డి తెలిపారు. వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపర్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంజీయూ రిజిస్ట్రార్ అలువాల రవి, డెవలప్మెంట్ డైరెక్టర్ ఆకుల రవి, లక్ష్మీప్రభ, సంధ్యారాణి పాల్గొన్నారు. -
‘నీ వాహనం వేగంగా వెళుతుంది.. కానీ నీ జీవితం ఆగిపోతుంది’..
చిట్యాల: హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి పక్కన చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులో పోలీసులు వినూత్న రీతిలో హోర్డింగ్ ఏర్పాటు చేశారు. శ్రీనీ వాహనం వేగంగా వెళుతుంది.. కానీ నీ జీవితం ఆగిపోతుందిశ్రీ అని హోరింగ్పై పెద్ద అక్షరాలతో రాయించారు. దాని కింద శ్రీఎవ్రీ లైఫ్ కౌంట్–నల్లగొండ పోలీస్ కేర్శ్రీ అని రాసి ఉంది. అంతేకాకుండా.. రోడ్డు ప్రమాదానికి గురై తుక్కుగా మారిన కారును కూడా హోర్డింగ్కు ప్రత్యేకంగా అమర్చారు. ఈ హోర్డింగ్.. హైవే మీద ప్రయాణించే వారికి ఒక కిలోమీటర్ దూరం నుంచే కనిపించేలా 25ఫీట్ల ఎత్తులో ఏర్పాటు చేశారు. భారీ హోర్డింగ్ను గురువారం నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ప్రారంభించారు. హైవేపై అతివేగంగా వెళ్లే వాహనదారులను హెచ్చరించేందుకు ఈ హోర్డింగ్ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ప్రతి ఒక్క వాహనదారుడు రోడ్డు భద్రత నియమాలను పాటించాలని, రహదారి వెంట ఏర్పాటు చేసిన ప్రమాద సూచికలకు అనుగుణంగా నియమిత వేగంతో ప్రయాణిస్తూ గమ్యాన్ని చేరుకోవాలన్నారు. -
దేశభక్తిని పెంపొందించడంలో పటేల్ పాత్ర మరువలేనిది
సూర్యాపేట : దేశభక్తిని పెంపొందించడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర మరువలేనిదని ఎంపీ కేశ్రీ దేవ్ సిన్హాజ్వాల కొనియాడారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా గురువారం సూర్యాపేట జూనియర్ కళాశాల మైదానంలో సర్దార్ @ 150 యూనిటీ మార్చ్ను ఆయన ప్రారంభించారు. పటేల్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అధికారులు, విద్యార్థులు ,స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, సూర్యాపేట ఆర్డీఓ వేణు మాధవ్, డీఎస్పీ ప్రసన్నకుమార్, జిల్లా క్రీడల యువజన శాఖ అధికారి వెంకట్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి, తహసీల్దార్ కృష్ణయ్య, యూత్ కో–ఆర్డినేటర్ రాజేష్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి భానునాయక్ పాల్గొన్నారు. -
రోడ్డు భద్రతకు ప్రాధాన్యమివ్వాలి
భానుపురి (సూర్యాపేట): రోడ్డు భద్రతకు అధికారులు అత్యంత ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్లో ఎస్పీ నరసింహతో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జాతీయ, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రహదారులపై ప్రమాదాలు జరగకుండా భద్రతా ప్రమాణాలు పాటించాలన్నారు. ఎక్కువగా భద్రతా వైఫల్యం, రోడ్లు సరిగా లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రమాదాలు ఎక్కువగా ఎక్కడ జరుగుతున్నాయో ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్ అధికారులు గుర్తించి వారం రోజుల్లో మరమ్మతులు చేయించాలన్నారు. బ్లాక్ స్పాట్లను గుర్తించి రేడియం స్టిక్కర్లు, స్టడ్స్ లైట్స్, బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. నేషనల్ హైవేలపై ప్రమాదాలు జరిగే చోట, సర్వీస్ రోడ్ల వెంట సూచిక బోర్డులు, డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని, 22చోట్ల ముందుజాగ్రత్తలు ఏర్పాటు చేయాలన్నారు. సమావేవంలో అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, డీఎస్పీ ప్రసన్నకుమార్, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి మాధవి, డీపీఓ యాదగిరి, సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి, ట్రాన్స్పోర్ట్ అధికారులు, ఆర్ అండ్బీ అధికారులు, నేషనల్ హైవే అధికారి రత్న కుమార్ పాల్గొన్నారు. -
‘తెలామిన్’.. పశుపోషకులకు వరం
కోదాడరూరల్ : రాష్ట్ర ప్రభుత్వం పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం నుంచి తెలామిన్ అని నామకరణం చేసి నాణ్యమైన ఖనిజ లవణమిశ్రమం(మినరల్ మిక్సర్) పశు పోషకులకు అందుబాటులోకి తీసుకరావడం ఓ వరమని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ దామచర్ల శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలలో తెలామిన్ మినరల్ మిక్సర్ లోగోతే వచ్చిన ప్యాకెట్ను ఆవిష్కరించి మాట్లాడారు. విశ్వవిద్యాలయం వారు పశు పోషకులకు లాభసాటిగా ఉండాలన్న ఉద్దేశంతో తెలంగాణ పేరు ప్రతిబింబించేలా ఈ తెలామిన్ను ఆవిష్కరించిందన్నారు. ఈ ఖనిజలవణ మిశ్రమం పశువులకు వాడటం ద్వారా పాలదిగుబడి పెరుగుతుందన్నారు. కోదాడ పశుఔషధ బ్యాంకుకు 9.5టన్నుల ఖనిజ మిశ్రమం రాగా 7.5టన్నులను కోదాడ పశువైద్యశాల నుంచి పశుపోషకులకు అందజేశారు. టన్ను నడిగూడెం, అర టన్ను హుజూర్నగర్కు పంపిణీ చేసినట్లు తెలిపారు. కోదాడ పశుఔషధబ్యాంకు స్ఫూర్తితో ఈ మిశ్రమాన్ని అందించడానికి రూ.5లక్షల రివాల్వింగ్ ఫండ్ కేటాయించిన కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్య క్రమంలో స్థానిక పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పెంటయ్య, డాక్టర్ మధు, డాక్టర్ సురేంద్ర ఉన్నారు. -
వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలి
సూర్యాపేట : అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం సందర్భంగా వారోత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్లో మహిళా, శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వారోత్సవాల వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం సీనియర్ సిటిజన్స్తో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. నవంబర్ 12 నుంచి 19 వరకు నిర్వహించే వారోత్సవాల్లో పోస్టర్ల ఆవిష్కరణ, జిల్లాస్థాయిలో వృద్ధుల చట్టాలపై అవగాహన, వృద్ధాశ్రమాల్లో ఆటల పోటీలు, సీనియర్ సిటిజన్స్ హక్కులపై అవగాహన ర్యాలీ నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, జిల్లా సంక్షేమ అధికారి కె.నరసింహారావు, వయో వృద్ధుల కమిటీ మెంబర్లు, అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, సభ్యులు, జి.విద్యాసాగర్, హమీద్ఖాన్, రాంబాబు, కృష్ణారెడ్డి, కిరణ్మయి, జావిద్ ఖాన్, వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం
హుజూర్నగర్ : పాలకవీడు మండలంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపబోతున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. పాలకవీడు మండలంలోని యల్లాపురం గ్రామంలో రూ.3.20 కోట్లతో చేపట్టనున్న 33/11కేవీ సబ్స్టేషన్ నిర్మాణానికి, మూసీఒడ్డుసింగారం గ్రామం నుంచి రోళ్లవారిగూడెం వరకు రూ.1.80 కోట్లతో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ పనులకు ఆయన బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం బెట్టెతండా వద్ద మూసీ నదిపై రూ.33 కోట్లతో చేపడుతున్న సాగునీటి లిఫ్ట్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించి పురోగతిపై నీటిపారుదలశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనుల్లో కాంట్రాక్లర్లు నాణ్యత ప్రమాణాలు పాటించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ క్యాక్రమంలో ఎస్పీ నరసింహ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎన్వి.సుబ్బారావు, మాజీ ఎంపీపీ భూక్యా గోపాల్, మాళోతు మోతీలాల్, బైరెడ్డి జితేందర్రెడ్డి, గుత్తికొండ భూపాల్రెడ్డి, తీగల శేషురెడ్డి, బెల్లంకొండ నరసింహారావు, రెవెన్యూ, నీటిపారుదల, విద్యుత్, పంచాయతీరాజ్, వ్యవసాయశాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
మైసమ్మ జాతరకు ముస్తాబు
మఠంపల్లి: మంచ్యాతండా దుబ్బలగట్టు బంగారు మైసమ్మతల్లి జాతరకు గిరిజనులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయాన్ని రంగులతో తీర్చిద్దారు. ఈ ఆలయంలో ఈనెల 15నుంచి 17వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. అనునిత్యం మహిళా పూజారి పానుగోతు మిర్యాలీ.. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. బంగారుమైసమ్మ జాతరను గిరిజనులు పెద్దపోలిగ గా పిలుస్తారు. ఈజాతరకు నల్లగొండ, సూర్యాపేట జిల్లాలతోపాటు ఏపీలోని గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని తండాలకు చెందిన గిరిజనులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఈనెల 15న రాత్రి 9గంటలనుంచి అర్ధరాత్రివరకు అమ్మవారి చరిత్ర పారాయణం చేస్తారు.16వ తేదీ తెల్లవారుజామున 3గంటలనుంచే ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అమ్మవారిని అదేవిధంగా దున్నపోతును భారీగా ఊరేగింపు నిర్వహిస్తారు. ఉదయం 10గంటలకు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. మధ్యాహ్నం భారీగా అన్నదానం చేస్తారు.17న అమ్మవారికి ప్రత్యేక పూజలతో ఉత్సవాలు ముగిస్తారు. ఈసందర్భంగా గిరిజన యువకులతో కోలాటం, భజనలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఉత్సవాలకు వచ్చేభక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగ కుండా నిర్వాహకులు అన్నిర్పాట్లు చేశారు. దుబ్బలగట్టు శ్రీబంగారు మైసమ్మ అమ్మవారు భక్తులు కోరిన కో ర్కెలు తీర్చే చల్లని తల్లి. చాలా కాలంగా అమ్మవారికి పూజలు సేవలు చేస్తున్నాను. ఇటీవల పెద్దలంతా ఆలయాన్ని లక్షల రూపాయలతో సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయం ముందు దున్నను బలి ఇచ్చే విగ్రహం ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ. –పానుగోతు మిర్యాలీ, ఆలయ మహిళా పూజారి. ఫ 15 నుంచి మూడురోజుల పాటు ఉత్సవాలు ఫ భారీగా తరలిరానున్న గిరిజనులు. -
ఇంటర్లో మంచి ఫలితాలు సాధించాలి
సూర్యాపేట : మోడల్ స్కూల్ విద్యార్థులు ఇంటర్మీడియట్లో మంచి ఫలితాలు సాధించాలని మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసాచారి సూచించారు. బుధవారం ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని సైన్స్ ల్యాబ్, లైబ్రరీ, మధ్యాహ్న భోజన కేంద్రాన్ని పరిశీలించారు. ఉపాధ్యాయుల బోధన విధానాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఉత్తీర్ణత శాతం పెంపునకు కృషి చేయాలిసూర్యాపేట: పదో తరగతి వార్షిక పరీక్ష ఉత్తీర్ణత శాతం పెంపునకు కృషిచేయాలని డీఈఓ అశోక్ ఉపాధ్యాయులను కోరారు. బుధవారం పెన్పహాడ్ మండలం గాజులమల్కాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చీదెళ్ల, దూపహాడ్ ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయా పాఠశాలల్లో బోధన తీరును పరిశీలించి మాట్లాడారు. విద్యార్థుల్లో ఉన్న భయాన్ని తొలగించి పాఠ్యపుస్తకాలపై ఆసక్తి కలిగేలా ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలన్నారు. గ్రంథాలయాన్ని సందర్శించి 6, 7వ తరగతి విద్యార్థుల పఠనాశక్తి పరిశీలించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు వై. లింగయ్య, ఉపాధ్యాయులు వెంకట్రెడ్డి, జనార్దనాచారి, శ్రీనివాస్, అంజినికుమార్ పాల్గొన్నారు. మహిళలు ఆర్థిక శక్తిగా ఎదగాలి నూతనకల్: మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక శక్తిగా ఎదగాలని సెర్ప్ రాష్ట్ర డైరెక్టర్ జాన్సన్ సూచించారు. బుధవారం నూతనకల్ మండల కేంద్రంలో వివిధ పథకాల ద్వారా బ్యాంకు లింకేజీతో ఏర్పాటు చేసిన వ్యవసాయేత ఉత్పత్తులను పరిశీలించారు. మిల్క్ ప్రాడక్ట్స్ యూని ట్స్, టీ పొడి, కిరాణషాపులను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన మహిళలు ఏర్పాటు చేసుకున్న యూనిట్లను సక్రమంగా నిర్వహించి ఆర్థిక లాభాలను పొందాలని ఆయన కోరారు. కార్యక్రమంలో డీఆర్డీఓ అప్పారావు, ఏపీడీ సురేష్, డీపీఎం అరుణ్కుమార్, లక్ష్మీనారాయణ, ఏపీఎం నగేష్, వెంకట్రెడ్డి, సీసీ సునిత, వీవోలు సత్తెయ్య , అనిల్, భాగ్యలక్ష్మి, పరుశరాములు, గీత, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి డిగ్రీ పరీక్షలు భువనగిరి : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. యూనివర్సిటీ పరిధిలో 84 కళాశాలలు, వాటిలో 16,867 మంది విద్యార్థులున్నారు. 1,3,5 సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు 30 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో నల్లగొండ జిల్లాలో 12, సూర్యాపేట జిల్లాలో 9, భువనగిరి జిల్లాలో 9 కేంద్రాలు ఉన్నాయి. సెమిస్టర్–1కు 5,400, సెమిస్టర్–3కి 5,830, సెమిస్టర్–5కు 5,597 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలు డిసెంబర్ 1వ తేదీతో ముగియనున్నాయి. -
వేలకోట్లతో శరవేగంగా అభివృద్ధి
మఠంపల్లి: హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లో వేల కోట్ల రూపాయతో శరవేగంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం రాత్రి మఠంపల్లి మండలం బక్కమంతుగూడెంలోని ప్రభుత్వ పాఠశాలలో డీఎంఎఫ్టీ నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఆయా నియోజకవర్గాలను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతానన్నారు. విద్యావకాశాల మెరుగు పర్చడానికి గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో రూ.200 కోట్లతో యంగ్ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల, కోదాడలో రూ.50కోట్లతో నవోదయ పాఠశాల, హుజూర్నగర్ సమీపంలో రూ.100కోట్లతో వ్యవసాయ కళాశాల, ముఖ్యంగా కృష్ణానది నుంచి ఎత్తిపోతల పథకాల ద్వారా రూ.1500కోట్లతో 6వేల ఎకరాలకు సాగునీరందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. హుజూర్నగర్లో డిగ్రీ, జూనియర్ కళాశాలల నిర్మాణం, హుజూర్నగర్ నుంచి మఠంపల్లి మీదుగా మట్టపల్లి వరకు ఆంధ్రా ప్రాంతాన్ని కలుపుతూ నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి రూ.80కోట్లతో పనులు కొనసాగుతున్నాయన్నారు. ఇటీవల హుజూర్నగర్లో ఉమ్మడి జిల్లా స్థాయిలో 25వేల మంది నిరుద్యోగులతో జాబ్మేళా నిర్వహించి 4,500మందికి ఉద్యోగావకాశాలు కల్పించామన్నారు. మున్ముందు మరిన్ని జాబ్మేళాలు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. బక్కమంతులగూడెం పాఠశాలకు స్థలం ఇచ్చిన అంతిరెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఉత్తమ్ను నాయకులు, అదికారులు సన్మానించారు. ఈకార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ మగారాథోడ్, నాయకులు మంజీనాయక్, కిషోర్రెడ్డి, మల్లిఖార్జున్రావు, సీతారామిరెడ్డి, గోవిందరెడ్డి, వీరారెడ్డి, ఎల్లారెడ్డి, బాబు, శ్రీను, సక్రు, కరీమ్, అజీజ్పాషా, నాగరాజు, శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు.ఫ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
సీఈఐఆర్తో 2,340 మొబైల్స్ రికవరీ
సూర్యాపేట : సీఈఐఆర్ ద్వారా ఇప్పటి వరకు 2,340 మొబైల్స్ను రికవరీ చేసినట్లు ఎస్పీ నరసింహ అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేశారు. జిల్లాలో ప్రజలు పోగొట్టుకున్న 102 ఫోన్లను గుర్తించి రికవరీ చేసిన మొబైల్స్ను బాధితులకు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ ఏడాది 7వ దఫా మొబైల్ మేళా నిర్వహించి రికవరీ చేసిన మొబైల్స్ను బాధితులకు అందించినట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్ల పరిధిలోని సైబర్ వారియర్స్ నిరంతర కృషి ఫలితంగానే 102 మొబైల్స్ను గుర్తించి వివిధ రాష్ట్రాల నుంచి తెప్పించామని చెప్పారు. రైతులు అప్రమత్తంగా ఉండాలి ప్రస్తుతం సైబర్ మోసగాళ్లు కొత్త ఎత్తులతో ప్రజలను మోసం చేస్తున్నారని, పంట చేతికొచ్చే సమయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. పంట డబ్బులు బ్యాంక్ అకౌంట్లో వేస్తామంటూ అపరిచితులు ఫోన్ చేసి బ్యాంకు, ఓటీపీ వివరాలు అడిగితే ఇవ్వవద్దని సూచించారు. వరి ధాన్యాన్ని రోడ్లపై ఆరబోయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. వాహన దారులు జాగ్రత్తలు తీసుకోవాలని, హెల్మెట్ ధరించాలని, సీట్బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ రవి, స్పెషల్స్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు. ఫ ఎస్పీ నరసింహ సూర్యాపేట : ఎస్పీ సూర్యాపేట పేరుతో ఫేస్బుక్లో నకిలీ ప్రొఫైల్ను క్రియేట్ చేశారని, దీని నుంచి వచ్చే మెసేజ్లు, సమాచారానికి ఎవరూ స్పందించవద్దని ఎస్పీ నరసింహ మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. నకిలీ ఫేస్బుక్ ప్రొఫైల్నుంచి డబ్బులు అడిగినా, వ్యాపారం బాగుంది పెట్టుబడి పెట్టండి అని అడిగినా స్పందించవద్దని పేర్కొన్నారు. -
విద్యార్థులు లక్ష్య సాధనకు కృషి చేయాలి
చివ్వెంల(సూర్యాపేట) : విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాని సాధనకు కష్టపడి చదువాలని జిల్లా న్యాయసేవాధికారసంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జీ ఫర్హీన్కౌసర్ అన్నారు. మంగళవారం సూర్యాపేటలోని గిరిజన మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాతీయ విద్యాదినోత్సవంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మంచి విద్య ద్వారానే ఉన్నత స్థానానికి చేరుకోగలమన్నారు. న్యాయవిద్య ద్వారా మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. ఈ సందర్భంగా బాలికల సంరక్షణ, హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజిక ఎదుగుదల వంటి అంశాలపై బాలికలకు వివరించారు. ఆడపిల్లల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు ఉన్నాయని, వాటిని వినియోగించుకోవాలని సూచించారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సూచించారు. డీఎల్ఎస్ఏ బాలికల సంరక్షణ కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో బార్ అసోషి యేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, మీడియేషన్ సభ్యులు గుంటూరు మధు, అల్లంనేని వెంకటేశ్వర్రావు, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్కుమార్, ప్రిన్సిపాల్ నాగేశ్వర్రావు పాల్గొన్నారు.ఫ జిల్లా న్యాయసేవాధికారసంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ -
నేడు హుజూర్నగర్కు మంత్రి ఉత్తమ్
హుజూర్నగర్ : రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి బుధవారం హుజూర్నగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం గరిడేపల్లి మండలం గడ్డిపల్లితో పాటు పలు గ్రామాల్లో, మేళ్లచెరువులో బీటీ రోడ్లకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పొనుగోడు ఊర చెరువులో చేప పిల్లలను వదలనున్నారు. యల్లాపురంలో నిర్మించనున్న 33/11 కేవీ సబ్స్టేషన్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేస్తారు. మఠంపల్లి మండలం బక్కమంతులగూడెంలో అదనపు తరగతి గదులను ప్రాంభించిన అనంతరం చింతలపాలెంలో పాఠశాల భవనాన్ని మంత్రి ఉత్తమ్ ప్రారంభించనున్నారు. లక్ష్మీనరసింహస్వామికి నిత్యకల్యాణంమఠంపల్లి: మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం స్వామివారికి అర్చకులు నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృతాభిషే కం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి తమలపాకులతో అర్చనలు చేశారు.మట్టపల్లిలోని శివాలయంలో పార్వతీరామలింగేశ్వరస్వామికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ నవీన్కుమార్, అర్చకులు పాల్గొన్నారు. గాలికుంటు వ్యాధిని సమూలంగా నిర్మూలిద్దాంకోదాడరూరల్ : పశువులకు వచ్చే గాలికుంటు వ్యాధిని సమూలంగా నిర్మూలించేందుకు సిబ్బంది ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ దాచేపల్లి శ్రీనివాస్రావు అన్నారు. మంగళవారం పట్టణంలోని ప్రాంతీయ పశువైద్యశాలలో కోదాడ, అనంతగిరి, చింతలపాలెం మండలాల పశువైద్య సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి పశువుకు క్యూఆర్కోడ్తో కూడిన చెవిపోగును వేసి మరీ గాలికుంటు నివారణ టీకా వేయాలన్నారు. దాంతో టీకాలు వేయని పశువులను సులభంగా గుర్తించవచ్చన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకుతోడు సిబ్బంది కొరతతో చింతలపాలెం మండలంలో గాలికుంటు నివారణ టీకాలు వేయడం ఆలస్యమైందన్నారు. టీకాలు వేసేందుకు ఏడు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో స్థానిక వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పి.పెంటయ్య, పశు వైద్యాధికారులు బి.మధు, సిరిపురపు సురేంద్ర పాల్గొన్నారు. -
డిజిటల్ విద్యకు ఇంటర్నెట్ కొరత
ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేయాలిపెన్పహాడ్ : ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యాబోధన కోసం ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి అత్యాధునిక సౌకర్యాలు కల్పించినప్పటికీ, కేవలం ఒక వైఫై కనెక్షన్ లేకపోవడం వలన ఆ ప్రయత్నం అసంపూర్ణంగా మారింది. ఏడాది కాలంగా వైఫై సౌకర్యం అందుబాటులో లేకపోవడంతో, ఉపాధ్యాయులే తమ సొంత సెల్ఫోన్ల డేటాను వినియోగించి విద్యార్థులకు పాఠాలు బోధించాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది. సౌకర్యాలున్నా... సౌలభ్యం లేదు గత ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యా విధానాన్ని అమలు చేసేందుకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా పెన్పహాడ్ మండలంలోని పెన్పహాడ్, గాజులమల్కాపురం, అనంతారం, అన్నారం వంటి గ్రామాల్లోని పాఠశాలలతో పాటు ఆదర్శ పాఠశాల, కేజీబీవీ పాఠశాలల్లో కూడా ప్యానెల్ బోర్డులు, టీవీలతో కూడిన డిజిటల్ సామగ్రిని సరఫరా చేసింది. కొన్ని పెద్ద పాఠశాలల్లో 3 నుంచి 7 ప్యానెల్ బోర్డులను ఏర్పాటు చేయగా, లింగాల, చీదెళ్ల, భక్తాళాపురం, అనాజీపురం వంటి పాఠశాలలకు కూడా 2 చొప్పున బోర్డులను సమకూర్చారు. ఈ ప్యానెల్ బోర్డులన్నీ ఇంటర్నెట్ ఆధారిత విద్యాబోధన కోసమే అయినా వీటికి వైఫై కనెక్షన్ను ప్రభుత్వం నేటికీ కల్పించలేదు. ఉపాధ్యాయులపైనే భారం.. వైఫై సౌకర్యం లేకపోవడంతో, 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులు తమ వ్యక్తిగత సెల్ఫోన్ల ద్వారా నెట్వర్క్ను కనెక్ట్ (హాట్స్పాట్) చేసుకుని తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తరచూ నెట్వర్క్ మధ్యలో నిలిచిపోవడం లేదా డేటా అయిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. దీనివల్ల డిజిటల్ తరగతులు పూర్తిస్థాయిలో జరగడం లేదు. ఇది కేవలం బోధన నాణ్యతపైనే కాక, ఉపాధ్యాయులపై ఆర్థిక భారం కూడా మోపుతోంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల డిమాండ్లు.. ప్రభుత్వం తక్షణమే ఈ సమస్యపై స్పందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. డిజిటల్ ప్యానల్ బోర్డులకు వెంటనే వైఫై కనెక్షన్ను ఏర్పాటు చేసి, డిజిటల్ బోధన సమర్థవంతంగా జరిగేలా చర్యలు చేపట్లాలని అంటున్నారు. ప్రస్తుతం 8–10 తరగతులకు మాత్రమే పరిమితమైన డిజిటల్ పాఠాలను 6, 7వ తరగతి విద్యార్థులకు కూడా బోధించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జాడలేని ఉన్నతాధికారుల తనిఖీ.. పాఠశాలల్లో రూ. లక్షలు వెచ్చించి సమకూర్చిన డిజిటల్ సామగ్రి సరిగా పనిచేస్తుందా లేదా, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం నెరవేరుతుందా లేదా అనే అంశాలను తెలుసుకునేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారుల తనిఖీలు పూర్తిగా కరువయ్యాయి అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెలకోసారైనా ఉన్నతాధికారులు పాఠశాలలను తనిఖీ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చి, సమస్యల పరిష్కారానికి మార్గం ఏర్పడుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం, విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈ సమస్యపై దృష్టి సారించి, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని డిజిటల్ తరగతులకు వైఫై సౌకర్యాన్ని కల్పించాల ని ప్రజలు, ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేస్తున్నారు.సూర్యాపేట : జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించి వాటిని బలోపేతం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ములకలపల్లి రాములు డిమాండ్ చేశారు. మంగళవారం సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వారం రోజులుగా జిల్లాలోని 26 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, నాలుగు ఏరియా ఆస్పత్రుల్లో సర్వే నిర్వహించినట్లు తెలిపారు. పీహెచ్సీల్లో అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, వాటిని పరిష్కరించాలని కోరారు. ఆస్పత్రులకు వచ్చిన రోగులకు తాగునీరు, కూర్చోవడానికి కుర్చీలు లేవన్నారు. ఎక్స్రే సౌకర్యం లేకపోవడంతో బయటకు వెళ్లి తీయించుకోవాల్సిన దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్కు, అనంతరం డీఎంహెచ్ఓకు అందించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శులు మట్టిపెల్లి సైదులు, నాయకులు పులుసు సత్యం, సోమపంగు జానయ్య, పోసనబోయిన హుస్సేన్, మట్టపల్లి లక్ష్మీ, గుంజ వెంకటేశ్వర్లు, కడెం కుమార్, పేరుమాండ్ల రాజారావు, లక్ష్మయ్య, రాములు, రామకష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాఠశాలల్లో అరకొరగా కొనసాగుతున్న డిజిటల్ క్లాస్లు వైఫై సౌకర్యం లేకపోవడంతో మొబైల్ నెట్వర్క్తో బోధిస్తున్న ఉపాధ్యాయులు డేటా సరిపోక తరగతులకు ఆటంకం నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం -
దొంగ అరెస్ట్
జల్సాలకు అలవాటుపడి, బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుని చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫ హై అలెర్ట్పూర్తిస్థాయి నీటి మట్టం : 590 అడుగులు ప్రస్తుత నీటి మట్టం : 588.50 అడుగులు ఇన్ఫ్లో : 51,476 క్యూసెక్కులు అవుట్ ఫ్లో : 51,476 క్యూసెక్కులు విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా : 34,011 క్యూసెక్కులు కుడికాల్వ ద్వారా : 10,000 క్యూసెక్కులు ఎడమకాల్వ ద్వారా : 5,654 క్యూసెక్కులు ఏఎమ్మార్పీకి : 1800 క్యూసెక్కులు వరద కాల్వకు : నిల్- 8లో -
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయవద్దు
తిరుమలగిరి(తుంగతుర్తి) : ధాన్యం కొనుగోళ్లలో జాప్యం లేకుండా చూడాలని, సరైన తేమశాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే తూకం వేసి మిల్లులకు పంపించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. మంగళవారం తిరుమలగిరి మండలం తొండ, కోక్యానాయక్ తండాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రానికి ట్యాగింగ్ చేసిన మిల్లుల వివరాలు, ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఏఓ, ఏఈఓతో మాట్లాడి ధాన్యం కొనుగోళ్ల వివరాలను తెలుసుకున్నారు. టాబ్ ఎంట్రీని ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. అనంతరం తిరుమలగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతిలో మంచి మార్కులు, విషయపరిజ్ఞానాన్ని సంపాదిస్తే ఉన్నత చదువుల్లో రాణించేందుకు అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట జిల్లా పౌరసరఫరాల అధికారి మోహన్బాబు, జిల్లా మేనేజర్ రాము, తహసీల్దార్ హరిప్రసాద్, ఏఓ నాగేశ్వరరావు, ఎంపీడీఓ లాజర్, ఎంఈఓ శాంతయ్య, ప్రిన్సిపాల్ మృత్యుంజయ ఉన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
చలి మొదలాయే..
సూర్యాపేట : చలి మొలైంది. మూడు రోజులుగా చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. వానాకాలం సీజన్ ముగియడంతో వాతా వరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతల్లో మార్పుల కారణంగా చలి తీవ్రత అధికమైంది. ఈనెల 5వ తేదీన 23 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదుకాగా.. 8వ తేదీ నాటికి ఏకంగా 6 డిగ్రీల తగ్గి 17డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న మూడురోజుల్లో రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువై చలి తీవ్రత మరింత అధికం కానుంది. మూడు రోజులుగా..గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ వానాకాలం సీజన్లో వర్షాలు కురిశాయి. జిల్లాలో దీపావళి పండుగ వచ్చిందంటే వర్షాల జాడే ఉండదు. అలాంటిది వానాకాలం సీజన్లో నవంబర్ మొదటి వారం వరకు భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ పరిస్థితి ఇలాగే ఉంటుందేమోనని అందరూ భావిస్తుండగా.. శనివారం నుంచి చలి పెడుతోంది. పగటి ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు లేకున్నా.. రాత్రి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. జిల్లాలోని అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గతంలో రాత్రి సమయంలో ఫ్యాన్లు, కూలర్లు పనిచేస్తేనే నిద్రపట్టగా.. మూడురోజులుగా వాటిని బంద్ చేసే పరిస్థితి జిల్లాలో ఏర్పడింది. సాయంత్ర 5.30 గంటలు దాటితే..ప్రస్తుతం సాయంత్రం 5.30 గంటలు అయితే చాలు చలిగాలులు వీస్తున్నాయి. ఇక తెల్ల వారుజామున 3గంటల నుంచే చలి విపరీతంగా పెరుగుతోంది. దీనికి తోడుగా అక్కడక్కడ మంచు పడుతోంది. ప్రస్తుతం రాత్రి ఉష్ణోగ్రత 16 డిగ్రీలు ఉండగా రానున్న రెండు, మూడురోజుల్లో 15 డిగ్రీలకు చేరి చలి మరింత పెరగనుంది. ఈనెల 11వ తేదీన 16 డిగ్రీలు, 12న 16 డిగ్రీలు, 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉష్ణోగ్రతలు ఇలా ( డిగ్రీల సెంటీగ్రేడ్లలో ) జిల్లాలో మూడురోజులుగా పెరిగిన చలి తీవ్రత తగ్గుతున్న ఉష్ణోగ్రతలు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశంతేదీ గరిష్టం కనిష్టం 05 31 23 06 30 21 07 31 20 08 31 17 09 29 17 10 28 16 -
మొదటి అదనపు జడ్జిబాధ్యతల స్వీకరణ
చివ్వెంల(సూర్యాపేట) : సూర్యాపేట జిల్లా కోర్టు మొదటి అదనపు న్యాయమూర్తిగా డాక్టర్ రాధాకృష్ణ చౌహాన్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. హూజూర్ నగర్ కోర్టులో సీనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్న ఆయన పదోన్నతిపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, గుంటూరు మధు, బాణాల విజయ్ కుమార్, రాచకొండ యాదగిరి, అనంతుల సందీప్ కుమార్, జవ్వాజీ సతీష్, కాసం సతీష్ తదితరులు పాల్గొన్నారు.26న భగవద్గీత కంఠస్థ పోటీలుసూర్యాపేట : తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో గీతా జయంతి సందర్భంగా విశ్వహిందూ పరిషత్ సహకారంతో పాఠశాల విద్యార్థులకు భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహించనున్నట్లు కార్యక్రమ ఉమ్మడి నల్లగొండ జిల్లా నిర్వాహకులు సేవాలా నాయక్, విశ్వహిందూ పరిషత్ సూర్యాపేట పట్టణ కార్యదర్శి బైరు విజయకృష్ణలు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల్లో దైవభక్తిని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. సూర్యాపేట పట్టణంలోని జనగామ క్రాస్రోడ్డులోగల టీటీడీ కల్యాణ మండలంలో ఈ కార్యక్రమం ఉంటుందని, దీనికి విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఉదయం 9గంటల్లోపు ఆరోగ్య పరీక్షలు పూర్తి చేయాలిసూర్యాపేట : ఆర్బీఎస్కే బృందాలు ప్రభుత్వ ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6 నుంచి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు రోజూ ఉదయం 9 గంటల్లోపు కంటి పరీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్యాధికారి పి.చంద్రశేఖర్ సూచించారు. సోమవారం సూర్యాపేట జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆర్బీఎస్కే వైద్యులు, సిబ్బంది సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో డాక్టర్ కోటి రత్నం, ఆర్బీఎస్కే వైద్యులు, సిబ్బంది, డాక్టర్ అశ్రీత, డిప్యూటీ డీఎంఓ సంజీవరెడ్డి పాల్గొన్నారు. కేజీబీవీలో లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులుమఠంపల్లి: మఠంపల్లి మండలం బక్కమంతులగూడెం సమీపంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో ఇంటర్ సివిక్స్, ఇంగ్లిష్ లెక్చరర్ పోస్టుల భర్తీకి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపాల్ విజయకుమారి తెలి పారు. సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ, బీఈడీ, టెట్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 12వ తేదీ వరకు నేరుగా విద్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఎక్స్గ్రేషియా బకాయిలు విడుదల చేయాలిసూర్యాపేట : ప్రమాదవశాత్తు తాటి, ఈత చెట్లపై నుంచి పడి మరణించిన గీత కార్మికులకు చెల్లించాల్సిన రూ.13 కోట్ల ఎక్స్గ్రేషియా బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ గీత పనివారల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రేగటి లింగయ్య, కొండ కోటయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ కె.సీతారామారావుకు వినతి పత్రాన్ని అందజేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బొమ్మగాని శ్రీనివాస్, పాలకూరి బాబు, దొరపెల్లి శంకర్, బూర వెంకటేశ్వర్లు, తొట్ల ప్రభాకర్, బొడ్డు రామచంద్రు, బండారు లక్ష్మయ్య, రెడ్డిమల్ల శ్రీను, పెద్ది వెంకన్న, బూర లింగయ్య, అయితే గాని వెంకన్న, పందుల జానయ్య పాల్గొన్నారు. అందుబాటులో కూరగాయలు, పూల నారుగరిడేపల్లి : గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లిలో గల కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)లో కూరగాయలు, పూల నారు అందుబాటులో ఉందని కేవీకే శాస్త్రవేత్త నరేష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. టమాట, వంగ, పచ్చిమిర్చి, బంతి, చామంతి, పెరటి తోటల కూరగాయల విత్తనాల కిట్, కోకో పీట్ కావాల్సిన రైతులు గడ్డిపల్లి కేవీకేలో ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సంప్రదించాలని పేర్కొన్నారు. రైతులు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. -
అర్జీలు త్వరగా పరిష్కరించాలి
సూర్యాపేట : ప్రజావాణిలో వచ్చిన అర్జీలకు ప్రాధాన్యం ఇచ్చి త్వరగా పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ కె. సీతారామారావు అధికారులను ఆదేశించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా వాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అదనపు కలెక్టర్ అర్జీలు స్వీకరించి మాట్లాడారు. ప్రతి కార్యాలయంలో ప్రజా వాణిలో వచ్చే దరఖాస్తుల నమోదుకు ఒక రిజిస్టర్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, తేమ శాతం 17 రాగానే కాంటా వేసి లారీల ద్వారా మిల్లులకు ఎగుమతి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ వీవీ అప్పారావు, డీఎఫ్ఓ సతీష్ కుమార్, డీపీఓ యాదగిరి, డీఈఓ అశోక్, సీపీఓ కిషన్,డీడబ్ల్యూఓ నరసింహారావు, సంక్షేమ అధికారులు శంకర్, శ్రీనివాస్, నరసింహారావు, దయానందరాణి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీనివాస్, హౌసింగ్ పీడీ సిద్ధార్థ, జిల్లా స్పోర్ట్స్ అధికారి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. సాఫీగా ధాన్యం సేకరణజిల్లాలో వానాకాలం ధాన్యం సేకరణ సాఫీగా కొనసాగుతోందని అదనపు కలెక్టర్ కె. సీతారామారావు మంత్రులకు తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావులు ధాన్యం, పత్తి , మొక్కజొన్న, సోయా తదితర పంటల సేకరణపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్లో ఈ కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఇందులో డీఆర్డీఓ వి.వి. అప్పారావు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రాము, డీఎస్ఓ మోహన్ బాబు, డీసీఓ పి.ప్రవీణ్ కుమార్, జిల్లా ఇన్చార్జ్ వ్యవసాయ అధికారి నివేదిత పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ సీతారామారావు -
బాల మేధావులు.. సృజనకు పదును
సూర్యాపేట : విద్యార్థులను భావిశాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే కాకుండా వారిలోని సృజనాత్మకతను వెలికి తీయడానికి ఏటా కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వశాఖ, రాష్ట్ర విద్యాశాఖ సంయుక్తంగా వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్స్పైర్ మనక్ పోటీలను నిర్వహిస్తోంది. సామాజిక సమస్యలకు పరిష్కారం చూపుతూ రెండు కార్యక్రమాల్లో వైజ్ఞానిక, గణిత, పర్యావరణ అంశాలపై రూపొందించిన నమూనాలను విద్యార్థులు ప్రదర్శించనున్నారు. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇన్స్పైర్ మనక్ పోటీల్లో జిల్లాలో 64 ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. వీటితో ఈ నెల మూడో వారం లేక చివరి వారంలో జిల్లాలో వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. విద్యార్థుల ఖాతాల్లో రూ.10వేలు జమఇన్స్పైర్ మనక్ పోటీల్లో ఎంపికై న 64 ప్రదర్శనలకు సంబంధించి రూ.10వేల చొప్పున సంబంధిత విద్యార్థుల ఖాతాల్లో జమ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఆ నగదుతో ప్రాజెక్టులు రూపొందించి ప్రదర్శించాల్సి ఉంటుంది. జిల్లా స్థాయిలో ఎంపికై న ఉత్తమ నమూనాలను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు. ఈ మేరకు వైజ్ఞానిక ప్రదర్శన రాష్ట్ర విద్య, పరిశోధన శిక్షణ మండలి, రాష్ట్ర బాల వైజ్ఞానిక ప్రదర్శన పేరుతో నమూనాలు ప్రదర్శించనున్నారు. అభివృద్ధి, స్వయం సమృద్ధి చెందే భారతదేశానికి శాస్త్ర సాంకేతిక రంగాలైన టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం ఆవశ్యకత అనే అంశాలతో నమూనాలు రూపొందించాల్సి ఉంటుంది. ఏడు అంశాల్లో జూనియర్ విభాగంలో (6 నుంచి 8వ తరగతి వరకు), సీనియర్ విభాగంలో 9 నుంచి 12వ తరగతుల విభాగాల్లో ఉత్తమమైన 20 ప్రాజెక్టులను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నారు. మొత్తం ఏడు అంశాల్లో...జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన 2025–26లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు పాల్గొననున్నారు. ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో ఏడు అంశాలు ఉన్నాయి. ఇందులో 1.సుస్థిర వ్యవసాయం, 2.వ్యర్థ పదార్థాల నిర్వహణ, 3.ప్రత్యామ్నాయ మొక్కలు, 4.హరితశక్తి(పునరుత్పాదక శక్తి), 5.అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, వినోదభరిత గణిత నమూనాలు, 6.ఆరోగ్యం, పరిశుభ్రత, 7.నీటి సంరక్షణ– నిర్వహణ అంశాలు ఉండనున్నాయి. ఒక పాఠశాల నుంచి గరిష్టంగా ఏడుగురు ఏడు ప్రాజెక్టులతో మాత్రమే పాల్గొనే అవకాశం ఉంది. ఏడు ప్రాజెక్టులు వచ్చినా ఒక గైడ్ టీచర్ మాత్రమే పాల్గొనాల్సి ఉంటుంది. ప్రతి స్కూల్ నుంచి 1నుంచి 7ప్రాజెక్టుల వరకు.. జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను ఈ నెల మూడో వారంలో నిర్వహించే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో మొత్తం ప్రభుత్వ పాఠశాలలు 180, ప్రైవేట్ పాఠశాలలు 250, ప్రాథమికోన్నత పాఠశాలలు 70, కేజీబీవీలు 18, మోడల్ స్కూల్స్ తొమ్మిది, అన్ని ప్రభుత్వ రెసిడెన్షియల్స్కూల్స్ 12 ఉన్నాయి. వీటిలో ప్రతి స్కూల్ నుంచి 1 నుంచి 7 ప్రాజెక్టుల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే జిల్లాలో మొత్తం 250 నుంచి 300 ప్రాజెక్టులు సైన్స్ ఫెయిర్లో ప్రదర్శించనున్నారు. ఈ నెల మూడో వారంలో జిల్లాలో సైన్స్ ఫెయిర్ సన్నాహాలు చేస్తున్న విద్యాశాఖ అధికారులు 300 ప్రాజెక్టులు ప్రదర్శించే అవకాశంజిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులు వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. విద్యార్థులు తయారు చేసిన ప్రయోగాలతో పాల్గొనవచ్చు. ఉపాధ్యాయులు కూడా బోధనోపకరణాలు, నూతన ఆవిష్కరణలు ప్రదర్శించే అవకాశం ఉంది. వివరాల కోసం జిల్లా సైన్స్ అధికారి ఎల్.దేవరాజ్ను సంప్రదించాలి. – అశోక్, డీఈవో -
పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లొద్దు
సూర్యాపేట : వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లవద్దని ఎస్పీ నరసింహ ఒక ప్రకటనలో సూచించారు. ప్రజలు, కూలీలు, చిన్న పిల్ల లను గూడ్స్ వాహనాలలో రవాణా చేసినా, పరిమితికి మించి ప్యాసింజర్ వాహనాలలో రవాణా చేసిన కేసులు నమోదు చేస్తున్నామని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే తమ లక్ష్యమని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నిత్యం వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 70 వాహనాలను గుర్తించి జరిమానాతో పాటు కేసులు విధించినట్లు వివరించారు. సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాలిఫిర్యాదుదారుల సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని ఎస్పీ నరసింహ అధికారులను కోరారు. సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులనుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఎస్పీ నరసింహ -
న్యాయ సేవాధికార సంస్థ సేవలు వినియోగించుకోవాలి
చివ్వెంల(సూర్యాపేట) : కక్షి దారులు న్యాయసేవాధికార సంస్థ సేవలు సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీ శారద కోరారు. సోమవారం న్యాయసేవాధికార దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నిరుపేదలు, న్యాయవాదులను పెట్టుకునే స్థోమత లేని వారు డీఎల్ఎస్లో దరఖాస్తు చేసుకోవాలని, దీని ద్వారా ఉచితంగా న్యాయవాదులను నియమించనున్నట్లు ఆమె తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో చట్టాలపై అవగాహన కల్పించేందుకు పారా లీగల్ వలంటీర్లను నియమించినట్లు చెప్పారు. ఈనెలల 15వ తేదీన నిర్వహించే స్పెషల్ లోక్ అదాలత్ను సద్వినియోగ చేసుకోవాలని కోరారు. ఇందులో సివిల్, క్రిమినల్, బ్యాంకు, విద్యుత్, గృహ హింస, మోటార్ వెహికల్ వంటి కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి రాధాకృష్ణ చౌహాన్, సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎన్, అపూర్వ రవళి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, మీడియేషన్ సభ్యులు గుంటూరు మధు, అల్లంనేని వెంకటేశ్వర్రావు, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద -
బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాసరావు
హుజూర్నగర్ : జాతీయ బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా హుజూర్నగర్కు చెందిన ధూళిపాల శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ నగరంలోని బీసీ భవన్లో ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆయనకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు స్థానికంగా విలేఖరులతో మాట్లాడారు. జిల్లా అధ్యక్షుడిగా నియమించిన ఆర్ కృష్ణయ్య, ఇతర నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కమిటీలు ఏర్పాటు చేసి మండల, గ్రామ స్థాయిలో బీసీల ఐక్యతకు కృషి చేస్తానని చెప్పారు. జిల్లాలో అన్ని కులాలకు ప్రాధాన్యమిస్తూ కమిటీ నిర్మాణం చేపడతామని ఆయన తెలిపారు. -
సూర్యాపేట: క్షణం ఆలస్యమైనా ఆ 43 మంది మృత్యుఒడిలోకే..
సాక్షి, సూర్యాపేట: మరో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి(NH-65)పై గత రాత్రి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. అయితే సిబ్బంది, ప్రయాణికులు అప్రమత్తం కావడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది.హైదరాబాద్ నుంచి కందుకూరుకు వెళ్తున్న విహారి ట్రావెల్స్ బస్సులో చిట్యాల మండలం పిట్టంపల్లికి చేరుకోగానే పొగలు మొదలయ్యాయి. బస్సు సిబ్బంది అప్రమత్తం చేయడంతో ప్రయాణికులు వెంటనే బస్సు అద్దాలు, తలుపుల నుంచి బయటకు దూకి వారి ప్రాణాలను కాపాడుకున్నారు. ఆ వెంటనే బస్సు మంటల్లో కాలిపోయింది. ఘటనాస్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 43 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అదే నిర్లక్ష్యమా?కర్నూలు ఘోర బస్సు ప్రమాదంలో 19 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్పై తనిఖీల పేరుతో హడావిడి చేశారు. అయితే అది రెండు రోజుల ముచ్చటగానే మిగిలిపోయింది. తాజా ఘటనతో.. నిబంధనలు పాటించని ప్రైవేట్ ట్రావెల్స్ లపై చర్యలు తీసుకోవడంలో రవాణాశాఖ అధికారుల అలసత్వం మరోసారి బయటపడింది. తాజాగా పిట్టంపల్లి వద్ద ప్రమాదానికి గురైన విహారి ట్రావెల్స్ బస్సుకు ఫిట్నెస్ లేదని తేలింది. అంతేకాదు ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్ రిజిస్ట్రేషన్తో.. తెలంగాణ కేంద్రంగా ఏపీ, తమిళనాడుకు నిబంధనలకు విరుద్ధంగా బస్సులు విహారి యాజమాన్యం నడిపిస్తోందని బయటపడింది. సీటింగ్ కోసమని అనుమతులు తీసుకుని స్లీపర్ మార్చేశారని.. బస్సుపై ఐదు చలాన్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. దీంతో.. వరుస ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వ యంత్రాంగాలు నిద్రమత్తు వీడడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిబ్బంది సకాలంలో స్పందించకపోయి ఉన్నా.. ప్రయాణికులు అప్రమత్తం కావడంలో క్షణం ఆలస్యమైనా.. అంతా మృత్యువు ఒడిలోకి చేరుకునేవారేమో!. -
పారిశుద్ధ్యానికి ప్రత్యేక వారం
సూర్యాపేట : పారిశుద్ధ్యానికి ప్రత్యేక వారం కార్యక్రమం జిల్లాలో ముమ్మరంగా సాగుతోంది. పల్లెలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కరిస్తున్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది వీధులను శుభ్రం చేయడంతో పాటు తాగునీటి సరఫరా పైపులకు ఉన్న లీకేజీలను సరి చేస్తున్నారు. ఈ నెల మూడవ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం వారం పాటు కొనసాగనుంది. పలు కార్యక్రమాల నిర్వహణ ప్రత్యేక వారం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పంచాయతీ సిబ్బంది పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తను సేకరించడం, ట్రాక్టర్లతో దానిని డంపింగ్ యార్డుకు తరలించడం, సెగ్రిగేషన్ షెడ్లు, డంపింగ్ యార్డుల నిర్వహణను పరిశీలిస్తున్నారు. దాంతో పాటు ఖాళీ స్థలాల్లో ఉన్న చెత్త, వ్యర్ధాలు, పిచ్చిమొక్కలు, ముళ్ల పొదలను తొలగిస్తున్నారు. మురుగు కాల్వలు, పల్లె ప్రకృతి వనంలో స్వచ్ఛతా కార్యక్రమం, తాగునీటి పైప్లైన్ లీకేజీలకు మరమ్మతులు వంటి పనులు చేపడుతున్నారు. దాంతో పల్లెలన్నీ పరిశుభ్రంగా మారుతున్నాయి. నిధుల లేమితో ఇబ్బందులు వారం పాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్న గ్రామ పంచాయతీ సిబ్బందికి నిధుల లేమి సమస్యగా మారుతున్నది. పారిశుద్ధ్య మెరుగు పర్చే పనులను సిబ్బంది చేపడుతున్నా పైప్లైన్ల లీకేజీతో పాటు ఇతర పనులు చేపట్టేందుకు అవసరమైన సామగ్రి కొనుగోలుకు వీలు లేకుండా పోతోంది. ప్రస్తుతం పాలవర్గం లేకపోవడంతో పంచాయతీ కార్యదర్శులే నిధులను సమకూర్చాల్సిన పరిస్థతి నెలకొంది. చాలాకాలంగా పంచాయతీల నిర్వహణకు కార్యదర్శులే చేతినుంచే డబ్బులు పెట్టాల్సి రావడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఫ గ్రామాల్లో వారంరోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు ఫ పారిశుద్ధ్యంతో పాటు నీటి పైప్లైన్ లీకేజీలపై ప్రత్యేక దృష్టి ఫ పరిష్కారమవుతున్న సమస్యలు -
తరలిన కూలీలు.. నిలిచిన పనులు
కోదాడ: మన ప్రాంతంలోని వివిధ పనులు నిర్వహిస్తున్న బిహార్ కూలీలు స్వరాష్ట్రానికి వెళ్లారు. ఆ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వారంతా వెళ్లడంతో వివిధ రంగాల్లో కూలీల కొరత ఏర్పడింది. రోడ్ల విస్తరణ, నిర్మాణ రంగంతో పాటు పార్బాయిల్డ్ మిల్లులు తీవ్ర కూలీల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఆయా పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్లు పనులను నిలిపివేశారు. 80శాతం మంది బిహారీలేసాగర్ ఆయకట్టులో ఉన్న పార్బాయిల్డ్ మిల్లుల్లో హమాలీలుగా 80 శాతం మంది బిహార్కు చెందిన వారు ఉన్నారు. ధాన్యం లోడ్, అన్లోడ్ వంటి కష్టమైన పనులను మిల్లర్లు బిహార్, ఉత్తరప్రదేశ్కు చెందిన కూలీలతో చేయిస్తున్నారు. స్థానిక కూలీలకు ఇచ్చే కూలి రేట్లలో సగానికే వీరు పని చేస్తుండడంతో పాటు ఎక్కువ గంటలు అందుబాటులో ఉంటుండంతో వీరినే పనిలో పెట్టుకుంటున్నారు. ధాన్యం మిల్లులో అన్లోడ్ చేయడంతో పాటు నెట్కట్టడం వంటి పనులు కూడా వారే చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ ఆయకట్టులో వరి కోతలు ప్రారంభమవుతున్నాయి. వారం పది రోజుల్లో భారీ ఎత్తున ధాన్యం మిల్లులకు వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో బిహార్ కూలీలు స్వరాష్ట్రానికి వెళ్లడంతో ధాన్యం దిగమతిపై ప్రభావం పడే అవకాశం ఉందని మిల్లర్లు చెబుతున్నారు. నిలిచిన ఫ్లై ఓవర్ల నిర్మాణం 65వ నంబర్ జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో వాటి నివారణకు అధికారులు బ్లాక్స్పాట్స్ను గుర్తించారు. చిట్యాల నుంచి కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్డు వరకు గుర్తించిన బ్లాక్స్పాట్స్ వద్ద ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టారు. ఈ పనుల్లో కీలకంగా ఉన్న బిహార్ కూలీలు ఆ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో తమ ఓటు వేసేందుకు వెళ్లిపోయారు. దాంతో కాంట్రాక్టర్లు నిర్మాణ పనులను ఆపేశారు. వారు లేకుండా స్థానిక కూలీలతో పనులు చేయించలేమని పలువురు కాంట్రాక్టర్లు అంటున్నారు. ప్రైఓవర్ నిర్మాణంలో కీలకమైన రాడ్బెండింగ్తో పాటు భారీ యంత్రాలను నడపడం బిహార్ కూలీలు మాత్రమే చేస్తారని వారు చెబుతున్నారు.నెల రోజులు ఇదే పరిస్థితిబిహార్ రాష్ట్రంలో ఈ నెల 11తో ఎన్నికలు పూర్తి అవుతాయి. 14 వరకు ఫలితాలు వస్తాయి. ఐనప్పటికీ బిహార్కు వెళ్లిన కూలీలు రావడానికి మరో నెల రోజులు పట్టే అవకాశం ఉందని జాతీయ రహదారుల విస్తరణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు అంటున్నారు. వలస కూలీలు సాధారణంగా స్వరాష్ట్రానికి వెళితే అంత త్వరగా వెనక్కి రారని చెబుతున్నారు. వారు వచ్చే వరకు ఇదే పరిస్ధితి ఉంటుందని, వారు వచ్చిన తరువాతే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని అంటున్నారు. హమాలీలుగా పని చేసే వారిని ఆయా రాష్ట్రాలనుంచి త్వరగా వెనక్కి రప్పించడానికి ట్రైన్ టికెట్స్ కూడ బుక్ చేస్తున్నామని ఓ మిల్లర్ తెలిపారు.ఫ ఎన్నికల కోసం స్వరాష్ట్రానికి బిహార్ కూలీలు ఫ రహదారి నిర్మాణ పనులపై తీవ్ర ప్రభావం ఫ పార్బాయిల్డ్ మిల్లుల్లో హమాలీల కొరత ఫ మరో నెల రోజుల వరకు ఇదే పరిస్థితి -
బీసీ రిజర్వేషన్లతోనే సామాజిక తెలంగాణ
సూర్యాపేట : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన సామాజిక తెలంగాణ నిర్మాణంలో కీలక ముందడుగు అని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆదివారం సూర్యాపేటలో పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సామాజిక తెలంగాణ– బీసీ రిజర్వేషన్లు– ప్రాతినిథ్యం ప్రజాస్వామ్యం’ అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. అనేక త్యాగాలతో సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ భాగస్వామ్యం కల్పించాల్సి ఉందన్నారు. బీజేపీ మొదటి నుంచీ కుల గణనకు వ్యతిరేకమని, రాష్ట్ర ప్రభుత్వం కులగణనపై ముందడుగు వేయడం హర్షణీయమన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చి న్యాయసమీక్ష నుంచి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. శాసనసభ చట్టం చేసి పంపితే తిరస్కరించే అధికారం గవర్నర్లకు లేదన్నారు. గవర్నర్లు కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లుగా వ్యవహరిస్తూ ఫెడరల్ వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నారబోయిన కిరణ్ అధ్యక్షతన జరిగిన సదస్సులో తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు గట్ల రమాశంకర్, నాయకులు కుంట్ల ధర్మార్జున్, నాగరాజుగౌడ్, నరసింహ, వీరేశ్నాయక్, వినయ్గౌడ్, నారాయణ, సుమన్నాయక్, మురళి పాల్గొన్నారు. -
ప్యాడీ క్లీనర్లు ఉన్నా.. ప్రయోజనం సున్నా!
సూర్యాపేట జిల్లాలో 338 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా ఇప్పటివరకు కొనుగోళ్లలో వేగం పుంజుకోలేదు. ఇక ఆయా కేంద్రాల్లో 220 వరకు ప్యాడీ క్లీనర్లు పాతవి ఉండగా అవి ఏ మాత్రం పనిచేయడం లేదు. వాటి స్థానంలో ఇటీవల 100 ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్లను కొనుగోలు చేశారు. ఒక్కో ప్యాడీ క్లీనర్కు రూ.40,000 చొప్పున వెచ్చించారు. రెండు లిఫ్టింగ్ కం ప్యాడీ క్లీనర్లను రూ.1.92 లక్షల చొప్పున వెచ్చించి కొనుగోలు చేశారు. మరో రెండు ప్యాడీ డ్రయర్లను రూ.14 లక్షలతో కొనుగోలు చేశారు. ప్యాడీ క్లీనర్లు ఉన్నా చాలా చోట్ల విద్యుత్ సదుపాయం లేకపోవడంతో రైతులే సొంతంగా విద్యుత్ సరఫరాను ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోంది. కేంద్రం నిర్వాహకులు కానీ, అధికారులు కానీ పట్టించుకోవడం లేదు. చాలా గ్రామాలో కొనుగోలు కేంద్రాలు దూర ప్రాంతంలో ఉండడంతో విద్యుత్ సదుపాయం లేక ప్యాడీ క్లీనర్లు రైతులకు ఉపయోగపడడం లేదు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని తూర్పార పట్టేందుకు ఏర్పాటు చేసిన ప్యాడీ క్లీనర్లు నిరుపయోగంగా మారాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో వాటిని మూలన పడేశారు. కొన్నిచోట్ల విద్యుత్ సదుపాయం లేకపోవడంతో.. మరికొన్ని చోట్ల విద్యుత్ సదుపాయం ఉన్నా నిర్వాహకులు ఇవ్వకపోవడంతో అవి రైతులుకు ఉపయోగపడడం లేదు. కొన్ని కేంద్రాల్లో నిర్వాహకులే ప్యాడీ క్లీనర్లతో పనేంటి? ఓ రెండు బస్తాలు తగ్గిస్తారు.. అంతేకదా.. అమ్ముకోండంటూ రైతులకు ఉచిత సలహా ఇస్తున్నారు. దీంతో రైతులు ఏం చేయలేని పరిస్థితిలో పడ్డారు. మీ ధాన్యం తాలు ఉదంటూ మిల్లర్లు ఒకటీ రెండు బస్తాల వరకు కోత పెడుతున్నా గత్యంతరం లేక అమ్ముకోవాల్సి వస్తోంది. ప్రభుత్వ సొమ్ము వృథా.. కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ప్యాడీ క్లీనర్లు రైతులకు ఉపయోగపడడం లేదు. కొన్ని చోట్ల రైతులు ప్యాడీ క్లీనర్లకు రైతులే విద్యుత్ సదుపాయాన్ని ఏర్పాటు చేసుకొని వినియోగించుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వ సొమ్ముతో కొన్న యంత్రాలు రైతులకు ఉపయోగపడకపోగా, ప్రభుత్వ డబ్బు వృథా అవుతోంది. రైతులకు మద్దతు ధర ఇప్పిస్తున్నామని చెబుతున్న అధికారులు కొనుగోలు కేంద్రాలు, మిల్లుల్లో అడ్డగోలు కోతలను మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో మరో 107 యంత్రాలకు ఇండెంట్ ఈ వానాకాలం సీజన్లో నల్లగొండ జిల్లాలో 356 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన యంత్రాంగం ఇప్పటివరకు 250 కేంద్రాలను తెరిచి, కొనుగోళ్లు ప్రారంభించింది. ధాన్యంలో తాలు, మట్టి, గడ్డి వంటివి లేకుండా, ధాన్యం తూర్పారా బట్టేందుకు ప్యాడీ క్లీనర్లను వ్యవసాయ శాఖ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసింది. జిల్లాలో 388 ప్యాడీక్లీనర్లు ఇప్పటికే ఉన్నాయి. ఇంకా 107 ఆటోమెటిక్ మిషన్ల కోసం వ్యవసాయ శాఖ ఇండెంట్ పెట్టింది. ప్రస్తుతం ఏర్పాటు చేసే కేంద్రాల కంటే ప్యాడీ క్లీనర్లు ఎక్కువగా ఉన్నా వాటిని రైతులకు ఉపయోగపడేలా చేయడంతో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిరుపయోగంగా దర్శనం ఫ కొన్నిచోట్ల విద్యుత్ సదుపాయం లేదు.. మరికొన్ని చోట్ల సిబ్బంది సహకరించడం లేదు ఫ విద్యుత్ సౌకర్యం ఉన్నా.. బిల్లు ఎవరు చెల్లిస్తారంటున్న నిర్వాహకులు ఫ ఒకటి రెండు బస్తాలు తరుగు తీస్తే ఏం కాదంటూ ఉచిత సలహా -
ప్రయోగాలతో పాఠాల బోధన సులువు
సూర్యాపేట : ప్రయోగాలతోనే విద్యార్థులకు పాఠాలు సులువుగా అర్థమయ్యేలా బోధించవచ్చని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మారం పవిత్ర అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్న పాఠశాలో సైన్స్ అకాడమీ బృందం ఆధ్వర్యంలో జీవశాస్త్ర ఉపాధ్యాయులకు 7 నుంచి 10వ తరగతి వరకు పాఠాలను సులభంగా బోధించే ప్రక్రియపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి 40 మంది జీవశాస్త్ర ఉపాధ్యాయులు హాజరు కాగా వారికి పలు అవయవాల గురించి ప్రయోగాత్మకంగా వివరించారు. కార్యక్రమంలో తెలంగాణ బయాలజికల్ సైన్స్ ఫోరం అధ్యక్షుడు ఎల్.దేవరాజు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. డీఏలు, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలిసూర్యాపేట : ప్రభుత్వం నుంచి రావాల్సిన ఐదు డీఏలు, పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి డి.మోతీలాల్నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి భగ్గులాల్నాయక్ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన టీజీయూఎస్ జిల్లా కమిటీ సమావేశంలో వారు మాట్లడారు. ప్రభుత్వం ఉద్యోగులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రతి నెలా విడుదల చేయాల్సిన రూ.700 కోట్లను కూడా సరైన సమయంలో విడుదల చేయడం లేదన్నారు. దాంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమావేశంలో సంఘం రాష్ట్ర సహ అధ్యక్షుడు డి.వస్రాంనాయక్, నాయకులు రాములునాయక్, మోతీలాల్, లింగానాయక్, హనుమంత్, ఉప్పయ్య పాల్గొన్నారు. దేశంలో పెరుగుతున్న పేదరికం, నిరుద్యోగం సూర్యాపేట అర్బన్ : ప్రస్తుతం దేశంలో నిరుద్యోగం, పేదరికం, అధిక ధరలు, తీవ్ర అసమానతలు పెరిగి పోతున్నాయని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండాది డేవిడ్ కుమార్ అన్నారు. కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతి సభను శనివారం జిల్లా కేంద్రంలోని చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం అభివృద్ధిలో దూసుకు పోతుందని ప్రధాని మోదీ ప్రచారం చేసుకుంటున్నారని, కార్పొరేట్ శక్తుల అభివృద్ధే దేశాభివృద్ధిగా చెబుతూ ప్రజల్ని ప్రక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. చండ్ర పుల్లారెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని యువత పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా నాగయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు కునుకుంట్ల సైదులు, పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలెబోయిన కిరణ్, జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి, పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్ల నరసమ్మ, దేశోజు మధు, సామ నర్సిరెడ్డి, బొల్లె వెంకన్న పాల్గొన్నారు . -
పెరిగిన మెస్ చార్జీలు
చిలుకూరు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం ఇస్తున్న చార్జీలు సరిపోవడం లేదని, పెరిగిన సరుకుల ధరల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వంట ఏజేన్సీ మహిళలు ప్రభుత్వానికి విన్నవిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం మెస్ చార్జీలు పెంచడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులకు మరింత నాణ్యమైన మధ్యాహ్న భోజనం లభించనుంది. 1435 ఏజెన్సీలకు లబ్ధి జిల్లాలో 600 ప్రాథమిక, 76 ప్రాథమికోన్నత, 182 ఉన్నత పాఠశాలలు మొత్తం 858 ప్రభుత్వ విద్యా సంస్థలు ఉన్నాయి. ఇందులో చదివే పిల్లలకు మధ్యాహ్నం భోజనం వండి పెట్టేందుకు మొత్తం 1435 ఏజెన్సీలు ఉన్నాయి. ఆయా ఏజెన్సీ మహిళలు ప్రభుత్వం అందించే మెస్ బిల్లుల్లోనే బయటి నుంచి సరుకులు తీసుకు రావడంతో పాటు వంట చేసేందుకు అవసరమైన వంట సరుకు, తమ కూలి అన్ని తీసుకోవాల్సి ఉంటుంది. దానికి తోడు ప్రస్తుతం పెరిగిన నిత్యావసరాల ధరలతో విద్యార్థులకు వంటచేసి పెట్టడం తలకు మించిన భారంగా మారుతోందని వంట కార్మికులు వాపోతున్నారు. వంట చార్జీలు పెంచాలని చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి 74 పైసలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో రూ.1.12 పైసల చొప్పున వంట ధరలు పెంచింది. దాంతో వంట కార్మికులకు కొంత వరకు ఉపశమనం కలుగనుంది. 43,469 మంది విద్యార్థులకు భోజనం జిల్లాలో ఉన్న 858 ప్రభుత్వ పాఠశాలల్లో 43,469 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వారికి వంట ఏజెన్సీ వారు ప్రతిరోజూ మధ్యాహ్నం భోజనం వండి పెడుతున్నారు. స్కూళ్లలో మధ్యాహ్న భోజనం కోసం ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. దానికి తోడు వంట పాత్రలను కూడా సరఫరా చేసింది. మిగిలిన సరుకులను వంట ఏజెన్సీల నిర్వాహకులు కొనుగోలు చేసి వంట చేయాల్సి ఉంటుంది. ప్రతి రోజూ పాఠశాలల్లో విద్యార్థుల హాజరును బట్టి ప్రభుత్వం ప్రతినెలా భోజన బిల్లులను మంజూరు చేస్తోంది. ప్రస్తుతం పెరిగిన మెస్ చార్జీల వల్ల అటు వంట ఏజెన్సీలకు ఇటు విద్యార్థులకూ ప్రయోజనం కలుగనుంది. పెరిగిన వంట ధరలు (ఒక్కో విద్యార్థికి రూపాయల్లో) పాఠశాల పాత ధర కొత్త ధర ప్రాథమిక 5.45 6.19 ప్రాథమికోన్నత 8.17 9.29 ఉన్నత పాఠశాల 10.67 11.79 ఫ మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు లబ్ధి ఫ పెరిగిన నిత్యావసరాల ధరలకు అనుగుణంగా పెంపు ఫ విద్యార్థులకు అందనున్న నాణ్యమైన భోజనం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల వివరాలు ప్రాథమిక పాఠశాలలు 600 ప్రాథమికోన్నత పాఠశాలలు 76ఉన్నత పాఠశాలలు 182 మొత్తం విద్యార్థులు 43,469 వంట ఏజెన్సీలు 1435 -
ప్రపంచ ఖ్యాతి పొందుతున్న మన వస్త్రాలు
ఫ అరబ్, ఆఫ్రికా దేశాలకు రఘునాథపురం కడలుంగీలు ఫ అమితంగా ఇష్టపడుతున్న ఆఫ్రికా మహిళలు ఫ పుట్టపాక వస్త్రాలకు సైతం విదేశాల్లో డిమాండ్ ఫ ఫ్రాన్స్ ప్రథమ పౌరురాలిని ఆకట్టుకున్న దుబీయన్ ప్రాంతానికో ప్రత్యేకత, ఊరికో వైవిధ్యం, ప్రతి దాని వెనకా ఓచరిత్ర.. అలాంటివెన్నో రఘునాథపురం, పుట్టపాక ఖ్యాతిని ఖండాంతరాలకు చేర్చాయి. ఇక్కడి చేనేత, పవర్లూమ్ కార్మికుల చేతిలో రూపుదిద్దుకున్న వస్త్రాలు ఎంతోమంది ప్రముఖులను ఆ‘కట్టు’కున్నాయి. జిల్లా కీర్తిని నలుదిశలా ఇనుమడింపజేస్తున్నాయి. రఘునాథపురం కడలుంగీలు, పుట్టపాక తేలియా రూమాల్, దుబీయన్ వస్త్రాలు నేతన్నల కళాప్రతిభకు నిదర్శనాలు రఘునాథపురంలో నిలువ ఉన్న కడలుంగీలు -
తొలినాళ్లలో షేర్గోలా వస్త్రాల తయారీకి ప్రసిద్ధి
రఘునాథపురంలో పవర్లూమ్ పరిశ్రమ స్థాపించిన తొలినాళ్లలో షేర్గోలా వస్త్రాలను ప్రసిద్ధి. ఈ వస్త్రాలను హైదరాబాద్లోని రిక్షా కార్మికులు ఎక్కువగా ఉపయోగించేవారు. క్రమేణా హైదరాబాద్ నుంచి ఢిల్లీ, ముంబయికి షేర్గోల వస్త్రాలు ఎగుమతి అయ్యేవి. కాలానుగుణంగా నక్కీ, జననీలు, అక్రాలిక్, ఎల్లో ట్రైప్, రీడ్ బైపిక్ వంటి రకరకాల కడలుంగీలను తయారు చేస్తున్నారు. రఘునాథపురానికి చెందిన కొందరు మాస్టర్ వీవర్స్ హైదరాబాద్, ఢిల్లీ, ముంబయి కేంద్రాలుగా దుబాయ్, సౌదీ అరేబియా, ఒమన్ తదితర అరబ్ దేశాలతో పాటు ఆఫ్రికాలోని ఉగాండాకు ఎగుమతి చేస్తున్నారు. ఈ దేశాల్లో కడలుంగీలను పురుషులు లుంగీలుగా ఉపయోగిస్తే, మహిళలు డ్రెస్ మెటీరియల్గా వినియోగిస్తుంటారు. -
కూరగాయల ధరలు (కిలోలల్లో)
కూరగాయ వారం ప్రస్తుతం క్రితం టమాట 20 40 ఆలుగడ్డ 30 50 దోసకాయ 40 60 పచ్చిమిర్చి 50 80 సోరకాయ 40 80 కాకరకాయ 50 80 క్యారెట్ 40 80 బెండకాయ 50 80 వంకాయ 50 80 దొండకాయ 40 100 బీరకాయలు 50 100 చిక్కుడుకాయ 80 120 మునగకాయ 70 150 బీన్స్ 80 160వెజిటేబుల్.. రేటు డబుల్ ఫ బెంబేలెత్తుతున్న సామాన్య ప్రజలు ఫ మోంథా తుపాను ప్రభావంతో ధరలు పెరిగాయంటున్న వ్యాపారులు ఫ పేద, మధ్య తరగతి వారిపై అదనపు భారం సూర్యాపేట : మన పెరట్లో పెరిగిన దొండ కాయలను ఇరుగు పొరుగు వారికి ఉత్తిగనే ఇచ్చే వారు. మన డాబాపై కాసే సోర కాయలు బంధువులందరికీ పంచే వారు. బజారులో అయితే ఏ కాయ తీసుకున్నా రూ.10కి ఇచ్చే వారు. అలాంటి దొండ నేడు కిలో రూ.100 పలుకుతోంది. సోరకాయ కూడా కిలో రూ.80 చొప్పున విక్రయిస్తున్నారు. ఇక మిగతా కూరగాయలు కూడా కిలో రూ.100కు చేరువలోనే ఉన్నాయి. కూరగాయల ధరలు అమాంతం పెరగడంతో పేద, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. వారం రోజుల్లోనే వాటి రేట్లు రెట్టింపు కావడంతో సామాన్యులపై అదనపు భారం పడుతోంది. ప్రస్తుతం మార్కెట్లో కూరగాయల రేట్లు రెట్టింపయ్యాయి. ఏ కూరగాయ కొన్నా కిలో రూ.100కు చేరువలోనే ఉంది. దాంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బడ్జెట్ తారుమారవుతోంది. నిన్నటి వరకు రూ.20కే కిలో అమ్మిన టమాట, ఆలుగడ్డలు నేడు రూ. 50 నుంచి 60 రూపాయలకు అమ్ముతున్నారు. పచ్చిమిర్చి, సోరకాయ, వంకాయ, బీర వంటివి కిలో రూ.100కు చేరువలో ఉన్నాయి. ఇక బీన్స్, చిక్కుడు, మునగ వంటివి కిలో వంద దాటి పోయాయి. దాంతో పేదలు కూరగాయలు కొనుగోలు తగ్గించేశారు. రోజుకు రెండు కూరలు వండే వారు ఒక దానితోనే సరిపెట్టుకుంటున్నారు. మిగతా పూటలు పచ్చడి, పప్పుచారుతో లాగించేస్తున్నారు.భారీ వర్షాలతోనే.. జిల్లాలో ప్రజల అవసరాలకు అనుగుణంగా కూరగాయల సాగు లేదు. దాంతో నిత్యం ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలను దిగుమతి చేసుకుంటుంటారు. అయితే మోంథా తుపాన్ కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురిశాయి. వర్షాలకు కూరగాయల తోటలు దెబ్బతిని దిగుబడి తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. మనకు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, విజయవాడతో పాటు హైదరాబాద్ నుంచి కూర గాయలు దిగుమతి అవుతుంటాయి. అయితే వర్షాల తరువాత అక్కడి వ్యాపారులే కూరగాయల రేట్లు పెంచి సరఫరా చేస్తున్నారని హోల్సేల్ వ్యాపారులు చెబుతున్నారు. మార్కెట్కు కూరగాయలు తక్కువగా రావడం, స్థానికంగా డిమాండ్ ఉండడంతో వ్యాపారులు కూరగాయల రేట్లను రెట్టింపు చేసి విక్రయిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యస్తం చేస్తున్నారు. కొన్ని కూరగాయల ధరలు తక్కువగా ఉన్నప్పటికీ వ్యాపారులు అధిక ధరలకు అమ్ముతున్నారని కొనుగోలు దారులు ఆరోపిస్తున్నారు. గత నెల 22 నుంచి ఈ నెల 19వరకు కార్తీక మాసం ఉంటుంది. ఈ నెలలో ప్రతి ఇంట్లో పూజలు, వ్రతాలు ఆచరిస్తారు. అయ్యప్ప, భవాని, ఆంజనేయస్వామి ఇలా వివిధ మాలలు ధరిస్తారు. స్వాములకు అన్నదానాలు నిత్యం కొనసాగుతాయి. ఎక్కువ మంది మాంసాహారం మానేసి శాకాహారం మాత్రమే తింటారు. దాంతో కూరగాయలకు డిమాండ్ పెరిగి ధరలు మండుతున్నాయి. ఏది కొనాలన్నా కిలో 100కు చేరువలో ఉన్నాయని, మార్కెట్కు రూ.500 తీసుకెళ్లినా సంచి నిండటం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
గ్రామీణ క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగాలి
నడిగూడెం, తుంగతుర్తి: గ్రామీణ క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగాలని సాంఘిక సంక్షేమ గురుకులాల సంస్థ జోనల్ అధికారి హెచ్.అరుణ కుమారి ఆకాంక్షించారు. మూడు రోజులుగా నడిగూడెం, తుంగతుర్తి మండల కేంద్రాల్లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలల్లో జరుగుతున్న ఉమ్మడి జిల్లా స్థాయి 11వ జోనల్ స్పోర్ట్స్మీట్ శనివారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొని విజేతలకు బహుమతులు అందించారు. ప్రభుత్వ గురుకులాల్లో చదివే విద్యార్థులకు ఉత్తమ విద్యతో పాటు అన్ని రంగాల్లో ప్రత్యేక శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు క్రీడల్లో నైపుణ్యాలను పెంపొందిచుకోవాలన్నారు. ఓవరాల్ చాంపియన్గా నడిగూడెంజోనల్ స్పోర్ట్స్ మీట్లో ఓవరాల్ చాంపియన్గా నడిగూడెం బాలికల గురుకుల పాఠశాల నిలిచింది. అండర్–14, అండర్–17 కబ్బడ్డీ, అండర్–19 వాలీబాల్లో ప్రథమ బహుమతి, అండర్–14 ఖోఖోలో ద్వితీయ, అండర్–19 టెన్నికాయిట్తో పాటు చెస్, క్యారమ్స్ అండర్–14, 17 విభాగాల్లో సైతం నడిగూడెం గురుకులం ప్రథమ బహుమతి గెలుచుకున్నట్లు ప్రిన్సిపాల్ వాణి తెలిపారు. కార్యక్రమంలో డీసీఓ పద్మ, కోదాడ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వేపూరి తిరపమ్మ, ఎస్ఐ గందమళ్ల అజయ్ కుమార్ పాల్గొన్నారు. తుంగతుర్తిలో..మూడు రోజుల పాటు కొనసాగిన 11వ జోనల్ లెవెల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్లో సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగాం జిల్లాలకు చెందిన 765 మంది విద్యార్థులు పాల్గొన్నారు. జోనల్ స్థాయి చాంపియన్స్గా పాలకుర్తి, అడ్డగూడూరు గురుకుల పాఠశాలలు నిలిచాయి. కార్యక్రమంలో పాఠశాల డీసీఓ శోభారాణి, ప్రిన్సిపాల్ కె.సంధ్యారాణి, స్పోర్ట్స్ ఇన్చార్జి జ్యోతిర్మయి, డాక్టర్ విజయ్కుమార్, హెచ్ఈఓ రవికుమార్, తల్లిదండ్రుల కమిటీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కొండగడుపుల ఎల్లయ్య, పీడీలు పాల్గొన్నారు. -
వేధింపులపై ధైర్యంగా ఫిర్యాదు చేయాలి
సూర్యాపేటటౌన్ : మహిళలు, యువతులు తమపై జరుగుతున్న వేధింపులను ఉపేక్షించకుండా ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ నరసింహ శనివారం ఒక ప్రకటనలో సూచించారు. మహిళల రక్షణకు షీ టీమ్స్ కృషి చేస్తున్నాయని తెలిపారు. జిల్లాలో షీ టీం ఆధ్వర్యంలో స్కూల్స్, కాలేజీల్లో ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, పోక్సో వంటి వాటిపై అవగాహన కల్పిస్తునట్లు పేర్కొన్నారు. టీమ్ సభ్యులు ప్రత్యక్షంగా ఫిర్యాదులు తీసుకుంటారని, ఆన్లైన్, వాట్సాప్ ద్వారా కూడా స్వీకరిస్తారని తెలిపారు. గత నెలలో షీటీమ్స్కు 21 ఫిర్యాదులు అందాయని, 31 మందిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారని, రెండు కేసులతో పాటు 5పెట్టీ కేసులు నమోదు చేశారని తెలిపారు. 44 కేసుల్లో కౌన్సెలింగ్ ఇచ్చారని, 6 కేసులను పోలీస్ స్టేషన్లకు పంపినట్లు పేర్కొన్నారు. మహిళలు షీ టీం నబర్ 8712686056కు కాల్ చేసి లేదా వాట్సాప్ ద్వారానైనా, డయల్ 100కు కాల్ చేసి కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. వైభవంగా లక్ష్మీనరసింహుడి నిత్యకల్యాణంమఠంపల్లి: మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని శనివారం అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం నిర్వహించారు. స్వామి అమ్మవార్లను అందంగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవం, నిత్యకల్యాణం చేపట్టారు. అనంతరం స్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ వీధుల్లో ఊరేగించారు. మట్టపల్లిలోని శివాలయంలో పార్వతీరామలింగేశ్వరస్వామికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ నవీన్కుమార్, అర్చకులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలిసూర్యాపేట అర్బన్ : ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసి రైతులను ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎంవీఎన్ భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఐకేపీ కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చి నెలలు గడుస్తున్నా నేటికీ కాంటాలు వేయక పోవడంతో వర్షాలకు ధాన్యం తడుస్తున్నదని చెప్పారు. మోంథా తుపాన్ వల్ల వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్నతో పాటు ఇతర పంటలు, కూరగాయల తోటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయాయరన్నారు. ప్రభుత్వం పంటనష్టపోయిన రైతుకు వరికి ఎకరాకు రూ.30వేలు, పత్తికి రూ.50 వేలు, ఇతర వాణిజ్య పంటలకు రూ.70 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్లను వెంటనే విడుదల చేయాలన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, మట్టిపల్లి సైదులు, కోట గోపి పాల్గొన్నారు. అమరుల ఆశయసాధనకు కృషి చేయాలి తిరుమలగిరి : భారత విప్లవోద్యమంలో భూమి, భుక్తి, విముక్తి కోసం అసువులు బాసిన అమరవీరుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్, పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలెబోయిన కిరణ్ అన్నారు. నవంబర్ 1 నుంచి 9 వరకు జరిగే అమరవీరుల వారోత్సవాలు, వర్ధంతి సభల సందర్భంగా సీపీఐ (ఎంఎల్) న్యూడెమక్రసీ ఆధ్వర్యంలో శని వారం నాగారం మండల పరిధిలోని ఈటూరులో అమరవీరుల స్థూపం వద్ద జెండావిష్కరించి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆర్థిక అసమానతలు లేని సమసమాజ స్థాపన కోసం, నూతన ప్రజాస్వామిక విప్లవ లక్ష్యం కోసం ఎంతోమంది తమ ప్రాణాలను బలిదానం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యూడెమోక్రసీ నాయకులు అంజయ్య, అంజయ్య, నాగరాజు, అంజయ్య, సోమన్న, పరశురాములు, వీరష్ పాల్గొన్నారు. -
ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి
సూర్యాపేట : పెండింగ్లో ఉన్న రూ. 8వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ వీరబోయిన లింగయ్య యాదవ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు విడుదల చేయక పోవడంతో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పొనుగంటి రంగా, తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు బారి అశోక్, బీసీ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడు పోలోజు మహేశ్ చారి, నాయకులు పరాల సాయి, రాజబోయిన సుమన్, శివ, సాయికుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.ఫ బీసీ విద్యార్థి సంఘాల భారీ ర్యాలీ -
పుట్టపాక ప్రత్యేకత.. దుబీయన్ వస్త్రం
సంస్థాన్నారాయణపురం: సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామ చేనేత కళాకారులు రూపొందించిన వస్త్రాలను ఫ్రాన్స్, సింగపూర్, అమెరికా, జర్మనీ, జపాన్, నెదర్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, అరబ్ దేశాలకు ఎగుమతి చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫ్రాన్స్ పర్యటనలో ఆ దేశ ప్రథమ పౌరురాలు బ్రిగిట్టే మెక్రాన్కు పుట్టపాక చేనేత కళాకారులు నేసిన దుబీయన్ సిల్క్ చీరను చందనం పెట్టెలో పెట్టి బహూకరించారు. చీరను చూసిన బ్రిగిట్టే మెక్రాన్ పుట్టపాక చేనేత కళాకారుల నైపుణ్యంపై అప్పట్లో ప్రశంసలు కురిపించారు. లండన్ మ్యూజియం, అమెరికా అధ్యక్షుని భవనంతో పాటు ముఖ్య కార్యక్రమాల్లో, విదేశాల్లోని ప్రముఖ మహిళలు పుట్టపాకలో తయారైన వస్త్రాలను ధరిస్తుంటారు. -
యాదగిరి క్షేత్రంలో సుదర్శన హోమం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనర్సింహ స్వామి క్షేత్రంలో బుధవారం ఉదయం నిత్యారాధనలో భాగంగా సుదర్శన నారసింహ హోమాన్ని ఘనంగా నిర్వహించారు. వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ అర్చకులు హవనం చేశారు. వేకువజూమున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి తిరువారాధన జరిపి ఆరగింపు చేపట్టారు. గర్భాలయంలో కొలువైన స్వయంభూలకు నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన చేసి భక్తులకు స్వామి,అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం ఉత్సవమూర్తులకు నిత్యతిరుకల్యాణ వేడుక ఘనంగా జరిపించారు. సాయంత్రం స్వామి, అమ్మవారి వెండి జోడు సేవను ఆలయంలో ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.రాత్రి స్వామివారికి శయనోత్సవం నిర్వహించి ఆలయాన్ని ద్వార బంధనం చేశారు. -
ఎయిమ్స్లో మానవ, జంతు ఆరోగ్యంపై అవగాహన
బీబీనగర్: బీబీనగర్ ఎయిమ్స్ వైద్య కళాశాలలో నిర్వహిస్తున్న ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం మైక్రోబయాలజీ విభాగం ఆధ్వర్యంలో మానవ, జంతు ఆరోగ్యం, పర్యావరణ పరస్పర అనుసంధానంపై ఎంబీబీఎస్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. జూనోటిక్ వ్యాధులను నివారించడానికి ఆహారభద్రతను నిర్ధారించడం, వ్యాధుల విచ్ఛిన్నం చేయడంపై వివరించారు. అనంతరం ఆరోగ్య విధానాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అదే విధంగా జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా రేడియేషన్, అంకాలజీ విభాగాల ఆధ్వర్యంలో క్యాన్సర్ నివారణపై వైద్య నిపుణులు అవగాహన కల్పించారు. క్యాన్సర్ నివారణకు వైద్యులు, నర్సులు కృషి చేయాలని డైరెక్టర్ అమితా అగర్వాల్ సూచించారు. ఈ కార్యక్రమంలో మైక్రోబయాలజీ విభాగం అధిపతి డాక్టర్ రాహుల్నారంగ్, ప్రొఫెసర్ శ్యామల, వైద్యులు లక్ష్మీజ్యోతి, రుద్రేష్కుమార్, చావాన్ పాల్గొన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
సూర్యాపేట : అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం–2025 సందర్భంగా రాష్ట్రస్థాయి పురస్కారాల కోసం అర్హులైన దివ్యాంగ వ్యక్తులు, సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి కె.నరసింహారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు, సంస్థలు ఈనెల 15వ తేదీ సాయంత్రం 5గంటలలోగా సూర్యాపేట లోని మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. దరఖాస్తులను రాష్ట్ర స్థాయి కమిటీ పరిశీలించి ఎంపిక చేయనుందని తెలిపారు. పూర్తి వివరాలకు జిల్లా సంక్షేమ అధికారి, మహిళా, శిశు దివ్యాంగుల వయో వృద్ధులు, ట్రాన్స్జెండర్స్ సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. జిల్లా మొదటి అదనపు జడ్జిగా రాధాకృష్ణ చౌహాన్సూర్యాపేట, హుజూర్నగర్ : సూర్యాపేట జిల్లా కోర్టు మొదటి అదనపు న్యాయమూర్తిగా ఎం.రాధాకృష్ణ చౌహాన్ నియమితులయ్యారు. హుజూర్నగర్ కోర్టులో సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న ఈయనకు జిల్లా మొదటి అదనపు జడ్జిగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ పనిచేసిన ఎం.శ్యామ్శ్రీ నా లుగు నెలల క్రితం బదిలీపై వెళ్లడంతో ఆ పోస్టులో రాధాకృష్ణ చౌహాన్ను నియమించారు. అలా గే హుజూర్నగర్ రెండవ అదనపు జిల్లా జడ్జిగా, పోక్సో కోర్టు న్యాయమూర్తిగా అదనపు పూర్తి బాధ్యతలు నిర్వర్తించాలని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. అయితే రెండు రోజుల్లో ఆయన నూతన బాధ్యతలు చేపట్టనున్నట్టు సమాచారం. చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి సూర్యాపేట : ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ అన్నారు. శుక్రవారం సూర్యాపేటలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో కక్షిదారులకు చట్టాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. రాజీ పడే కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. బాల్య వివాహలు చట్టరీత్యా నేరమన్నారు. మహిళలకు డీఎల్ఎస్ఏ ద్వారా ఉచిత న్యాయసేవలతో పాటు, సలహాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ సదస్సులో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ బి.వెంకటరమణ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, మిడియేషన్ సభ్యులు గుంటూరు మధు, అల్లంనేని వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. ఇన్చార్జి డిప్యూటీ డీఎంహెచ్ఓగా వేణుగోపాల్ హుజూర్నగర్ : మండలంలోని లింగగిరి ప్రాథమిక వైద్యశాల వైద్యాధికారి డాక్టర్ వేణుగోపాల్ నాయక్ ఇన్చార్జి డిప్యూటీ డీఎంఎంహెచ్ఓగా నియమితులయ్యారు. ఇప్పటి వరకు పనిచేసిన డాక్టర్ జయమనోరి పదోన్నతి పొందారు. దీంతో డాక్టర్ వేణుగోపాల్ నాయక్ను ఇన్చార్జి డిప్యూటీ డీఎంహెచ్ఓగా నియమిస్తు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి పి.చంద్రశేఖర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ వేణుగోపాల్ గతంలో ఆర్మీలో మేజర్గా పనిచేశారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. 15 వరకు గాలికుంటు నివారణ టీకాలుహుజూర్నగర్ : జిల్లాలో ఈ నెల 15 వరకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను వేయనున్నామని జిల్లా పశువైద్యాధికారి శ్రీనివాస్రావు అన్నారు. శుక్రవారం నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని రామాపురంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల ప్రక్రియను పరిశీలించి మాట్లాడారు. పశువులకు టీకాలు వేసే గ్రామాల్లో రైతులకు ఒకరోజు ముందే తెలియపర్చాలన్నారు. ఆయన వెంట పశు సంవర్ధకశాఖ సహాయ సంచాలకులు కందుల సత్యనారాయణ, ఎల్ఎస్ఏ దుర్గాభవాని, సిబ్బంది మహమ్మద్ ఇస్మాయిల్ ఉన్నారు. -
పామాయిల్ లోడ్తో వెళ్తున్న డీసీఎం బోల్తా
గరిడేపల్లి: పామాయిల్ లోడ్తో వెళ్తున్న డీసీఎం బోల్తా పడింది. ఈ సంఘటన శుక్రవారం రాత్రి గరిడేపల్లి మండలం అప్పన్నపేట గ్రామ శివారులో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడేనికి చెందిన షేక్ అస్గర్(40) హాలియా నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ సమీపంలోని అంపాపురం పామాయిల్ ఫ్యాక్టరీకి డీసీఎంలో పామాయిల్ పంట లోడ్ను తరలిస్తున్నాడు. అప్పన్నపేట గ్రామ శివారులో ఇటీవల పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తప్పించే క్రమంలో డీసీఎం అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ తలకు స్వల్ప గాయాలయ్యాయి. అతడిని 108 వాహనంలో హుజూర్నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ట్రాక్టర్ ఢీకొని వ్యక్తికి గాయాలుమోటకొండూర్ : సైకిల్ నడిపించుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని ట్రాక్టర్ ఢీ కొట్టడంతో గాయాలయ్యాయి. ఈ ఘటన శుక్రవారం మోటకొండూర్ మండలంలోని తేర్యాల గ్రామంలో చోటు చేసుకుంది. తేర్యాల గ్రామానికి చెందిన నల్ల శంకరయ్య వ్యవసాయ బావి వద్దకు సైకిల్ను నడిపించుకుంటూ వెళ్తున్నాడు. ఈక్రమంలో ఇసుక లోడ్తో వస్తున్న ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న మరో ట్రాక్టర్ను తప్పించి వెనకాల వస్తున్న సైకిల్ను ఢీ కొట్టింది. దీంతో శంకరయ్యకు కాలికి బలమైన గాయమైంది. క్షతగాత్రుడిని ట్రాక్టర్ డ్రైవర్ పంజాల సాయి హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కానిస్టేబుళ్లపై దాడి చేసిన నిందితుల అరెస్ట్చండూరు: ఇద్దరు కానిస్టేబుళ్లపై దాడి చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. చండూరు మండల కేంద్రంలోని భవాని ఫంక్షన్హాల్ పక్కన కారుంగు క్రాంతికుమార్, మహమ్మద్ సాజిద్బాబా, మహమ్మద్ నాసర్పాషా అనే ముగ్గురు వ్యక్తులు ఈనెల 4న అర్ధరాత్రి సమయంలో మద్యం బాటిళ్లతో ఉన్నారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు వారికి సూచించగా సదరు వ్యక్తులు పోలీసులపై దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడుతూ దాడి చేశారు. ఈ విషయమై కానిస్టేబుళ్ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించినట్లు ఎస్ఐ కారింగు వెంకన్నగౌడ్ శుక్రవారం తెలిపారు. ఇసుక ట్రాక్టర్ల పట్టివేత సూర్యాపేట : అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు పెన్పహాడ్ ఎస్ఐ గోపికృష్ణ శుక్రవారం తెలిపారు. పెన్పహాడ్ మండలంలోని దోసపహాడ్ మూసీ నుంచి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా దోసపహాడ్ గ్రామానికి చెందిన రెండు ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తుండగా గ్రామ శివారులో పట్టుకొని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అక్రమంగా ఇసుక విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు చౌటుప్పల్ : అక్రమంగా ఇసుకను నిల్వ చేసి అధిక ధరలకు అమ్ముతున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ కేంద్రంలోని వలిగొండ క్రాస్రోడ్డులో ఇసుకను కుప్పలుగా పోసి అధిక ధరలకు అమ్ముతున్నారన్న సమాచారం మేరకు పోలీసులు తనిఖీ నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి గ్రామానికి చెందిన బలికె సత్యనారాయణ అనే వ్యక్తి నిల్వ చేసిన 15 టన్నుల ఇసుకను గుర్తించారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో ఇసుకను సీజ్ చేసి సత్యనారాయణపై కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు. -
డీసీఎంఎస్ ఎత్తివేత!
ఎన్డీసీఎంఎస్కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రభుత్వం కోరింది. ప్రభుత్వం కోరిన విధంగా ఆస్తులు, ఉద్యోగులు, తాత్కాలిక ఉద్యోగులతో పాటు అన్ని వివరాలను ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. – నాగిళ్ల మురళి, డీసీఎంఎస్ మార్కెటింగ్ మేనేజర్ నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్) దివాళా తీసింది. వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఉన్న డీసీఎంఎస్ నిర్వహణ కష్టంగా మారడంతో.. దాన్ని వేరే కార్పొరేషన్లో విలీనం చేయాలా.. పూర్తిగా రద్దు చేయాలా అనే ఆలోచన చేస్తోంది. రైతులకు విత్తనాలు, ఎరువుల సరఫరాతో పాటు ధాన్యం కొనుగోళ్లు తదితర సేవలు అందించేందుకు ప్రభుత్వం 1987లో డీఎసీఎంఎస్ను ఏర్పాటు చేసింది. కానీ దీనికి.. సరైన బడ్జెట్ కేటాయింపులు లేకపోవడంతో అభివృద్ధి చెందలేదు. డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టినా ఎక్కడా విజయవంతం కాలేదు. ఉద్యోగుల కొరత, పాలకవర్గాలు అనాసక్తితో వీటి నిర్వహణ భారంగా మారింది. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉండడంతో.. వీటిని రద్దు చేసేందుకుగాను ఇప్పటికే పూర్తి సమాచారాన్ని ప్రభుత్వం సేకరించింది. నిలిచిన ఎరువుల అమ్మకాలు డీసీఎంఎస్ ఆధ్వర్యంలో గతంలో యూరియా, కాంప్లెక్స్ ఎరువులు, విత్తనాలు అమ్మాకాలు సాగేవి. వాటి ద్వారా వచ్చే కమీషన్తో లాభాలు వచ్చేవి. కానీ ప్రభుత్వం రెండేళ్ల క్రితం యూరియా, ఎరువుల అమ్మకానికి సంబంధించి ట్రాన్స్పోర్ట్ భారం డీసీఎంఎస్ మీదే వేసింది. ఎమ్మార్పీకే విక్రయించాలని నిబంధన పెట్టింది. కానీ, పీఏసీఎస్లకు మాత్రం ట్రాన్స్పోర్ట్ భారం ప్రభుత్వమే భరిస్తోంది. దీంతో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఎరువుల విక్రయాలు నిలిచిపోయాయి. రెండేళ్లుగా ఎలాంటి వ్యాపారాలు నిర్వహించకపోడంతో డీసీఎంఎస్ దివాళా తీసింది. ఉమ్మడి జిల్లాలో రూ.100 కోట్లకుపైగా ఆస్తులు.. డీసీఎంఎస్కు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రూ.100 కోట్లకు పైగా ఆస్తులున్నాయి. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో 3 ఎకరాల భూమి, యాదాద్రి జిల్లా భువనగిరిలో దుకాణాల సముదాయం ఉంది. ఈ ఆస్తుల విక్రయం గతంలో వివాదాస్పదంగా మారి కోర్టుల వరకు వెళ్లింది. నల్లగొండలోని గడియారం సెంటర్ సమీపంలో లతీఫ్ సాబ్ గుట్ట మెట్ల వద్ద విలువైన ఆస్తులతో పాటు నిడమనూరులో 3 ఎకరాలు, యాదాద్రి జిల్లా రామన్నపేటలో గోదాములు ఉన్నాయి. ఈ ఆస్తులను కాపాడేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో డీసీఎంఎస్కు సంబంధించిన సమాచారాన్ని ఆ సొసైటీ నుంచి ప్రభుత్వం తీసుకుంది. ఉమ్మడి జిల్లాలోని ఆస్తుల వివరాలు, పని చేస్తున్న ఉద్యోగులు, తాత్కాలిక ఉద్యోగులు, జీత భత్యాలు తదితర వివరాలను ప్రభుత్వం సేకరించింది. ఫ నిర్వహణ కష్టంగా మారడంతో సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి ఫ కార్పొరేషన్లో విలీనం చేయాలా.. పూర్తిగా రద్దు చేయాలా అనే ఆలోచనలో ప్రభుత్వం -
కళాకారులను ఆదుకోవాలి
సూర్యాపేట అర్బన్ : యాభై ఏళ్లు నిండిన జానపద వృత్తి కళాకారులకు నెలకు రూ.4వేల పింఛన్ ఇచ్చి ఆదుకోవాలని ప్రజా నాట్య మండలి (పీఎన్ఎం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ట నరసింహ ప్రభుత్వానికి కోరారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంవీఎన్ భవనంలో నిర్వహించిన పీఎన్ఎం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పల్లె సంస్కృతిని సంప్రదాయాలను కాపాడుతూ ప్రజలను చైతన్యపరుస్తున్న జానపద కళాకారులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇచ్చి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. వచ్చే ఏడాది జనవరి 4 5 6 తేదీల్లో హైదరాబాద్లో జరగనున్న పీఎన్ఎం రాష్ట్ర మహాసభలు, జానపద సంబరాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి వేల్పుల వెంకన్న, అధ్యక్షుడు బచ్చలకూర రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు పిడమర్తి అశోక్, మామిడి నాగ సైదులు, బూరుగుల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
పశుసంపదను కాపాడేందుకే టీకాలు
భూదాన్పోచంపల్లి: పశుసంపదను కాపాడేందుకే పశువైద్య, పశుసంవర్థక శాఖల ఆధ్వర్యంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేస్తున్నట్లు ఆ శాఖ రాష్ట్ర డైరెక్టర్, ఐఏఎస్ అధికారి డాక్టర్ గోపి తెలిపారు. శుక్రవారం భూదాన్పోచంపల్లి మండలంలోని జూలూరులో పీవీ నర్సింహారావు వెటర్నరీ యూనివర్సిటీ, పశుసంవర్థకశాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మెగా పశువైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గాలికుంటు వైరస్ వల్ల పశువుల్లో నోరు, గిట్టల మధ్య పుండ్లు ఏర్పడి అనతి కాలంలోనే ఇతర పశువులకు వ్యాపిస్తుందన్నారు. వ్యాధి నివారణకే టీకాలు వేస్తున్నామని, రైతులు అపోహపడవద్దని సూచించారు. పశుసంపదను పెంచాలని, పశుసంవర్థకశాఖలో అందుబాటులోకి వస్తున్న సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత వెటర్నరీ అధికారులపై ఉందన్నారు. గ్రామాలను దత్తత తీసుకొని రైతులకు మరింత చేరువ కావాలని సూచించారు. పశువులకు ఉచిత టీకాలు, ఫీడు అందజేయడంతో పాటు బీమా సౌకర్యం కల్పించేందుకు శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. శిబిరంలో 700 పశువులకు గాలికుంటు నివారణ టీకాలు, 150 పశువులకు వైద్య చికిత్స, 800 మూగజీవాలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. అలాగే రైతులకు ఉచిత కిట్లు అందజేశారు. కార్యక్రమంలో వెటర్నరీ యూనివర్సిటీ డీన్ ఉదయ్కుమార్, అసోసియేట్ డాక్టర్లు డి.మాధురి, కల్యాణి, విశ్వేశ్వర్, కవిత, జిల్లా పశువైద్యాధికారి జానయ్య, జిల్లా వ్యవసాయ అధికారి రమణారెడ్డి, పశువైద్యులు కిషోర్, రాంచంద్రారెడ్డి, శ్రీధర్రెడ్డి, పృథ్వి, శ్రీకాంత్, అశోక్బాబు, శ్రీనివాస్, రఘు, ఏఓ శైలజ, జమీల్, గోపాలమిత్రలు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, యూనివర్సిటీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
పద్మావతి అమ్మవారికి సహస్ర కుంకుమార్చన
భువనగిరి: భువనగిరి పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో గల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం ఆలయ అర్చకులు పద్మావతి అమ్మవారికి సహస్ర కుంకుమార్చన సేవ నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ, సహస్రనామార్చన సేవ, కార్తీక దామోదర హవనం, సత్యనారాయణ వ్రతం, రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని మదన వేణుగోపాల స్వామికి నవకలశ పూర్వక పంచామృతాభిషేకం, పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారికి నిత్య కల్యాణ మహోత్సవం జరిపించారు. సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
విద్యార్థినులు ఉన్నత స్థాయికి ఎదగాలి
కోదాడరూరల్: నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను విద్యార్థినులు ధైర్యంగా అధిగమిస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని మహిళా సాధికారత కేంద్రం జిల్లా కోఆర్టినేటర్ చైతన్య అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణ పరిధిలోని బాలాజీనగర్లో గల గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా సాధికారత కేంద్రం నిర్వహించిన బాలిక చైతన్యం కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సోషల్ మీడియా పట్ల జాగ్రత్తగా ఉండాలని, వాట్సప్, ఇన్స్ట్రాగాం, స్నాప్చాట్లలో ఫొటోలను అప్లోడ్ చేయొద్దన్నారు. సైబర్ నేరగాళ్లు వాటిని మార్ఫింగ్ చేసి ఇబ్బందులకు గురిచేసే ప్రమాదం ఉందన్నారు. బేటీ బచావో బేటీ పడావో పథకంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కె.నాగజ్యోతి, భవ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా యువజనోత్సవాలు
సూర్యాపేట : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవాలు ఉత్సాహంగా కొనసాగాయి. వివిధ అంశాల్లో యువత పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఈ పోటీలను జిల్లా అదనపు కలెక్టర్ సీతారామారావు ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. స్వామి వివేకానందని ఆదర్శంగా తీసుకొని యువత ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. వివిధ విభాగాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విజేతలకు మెమొంటోలు, మెరిట్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, జిల్లా యువజన, క్రీడల అధికారి బి.వెంకట్రెడ్డి, ప్రిన్సిపాల్ పెరుమాళ్ల యాదయ్య తదితరులు పాల్గొన్నారు. బహుమతులు సాధించింది వీరే.. జానపద నృత్యం గ్రూప్.. ప్రథమ స్థానం : టీజీటీడబ్ల్యూఆర్డీసీ, సూర్యాపేట ద్వితీయ స్థానం : జెడ్పీహెచ్ఎస్, ఏనుబాముల తృతీయ స్థానం : పాలిటెక్నిక్ కళాశాల సూర్యాపేట జానపద పాటలు గ్రూప్.. ప్రథమ స్థానం: టీజీటీడబ్ల్యూఆర్జేసీ, సూర్యాపేట ద్వితీయ స్థానం : జెడ్పీహెచ్ఎస్ కోదాడ తృతీయ స్థానం : జెడ్పీహెచ్ఎస్ జలాల్పురం ఉపన్యాసం.. ప్రథమ స్థానం: ఏఆర్ శారియా, ప్రభుత్వ జూనియర్ కళాశాల, సూర్యాపేట ద్వితీయ స్థానం: క్రిషిత, పాలిటెక్నిక్ కళాశాల, సూర్యాపేట తృతీయ స్థానం:బి.మహాంత్రి, టీజీటీడబ్ల్యుయుఆర్జేసీ, చివ్వెంల కథా రచన.. ప్రథమ స్థానం: ఎం.రిధిర్న, ప్రభుత్వ జూనియర్ కళాశాల, సూర్యాపేట ద్వితీయ : పి.కీర్తిన, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, సూర్పాయేట తృతీయ : డి.లోహిత, టీజీటీడబ్ల్యువీఆర్జేసీ చివ్వెంల పెయింటింగ్.. ప్రథమ స్థానం : ఎం.రిధిర్న, ప్రభుత్వ జూనియర్ కళాశాల, సూర్యాపేట ద్వితీయ : పి.కీర్తన, పాలిటెక్నిక్ కళాశాల, సూర్యాపేట తృతీయ : కె.సుప్రియా, పాలిటెక్నిక్ కళాశాల, సూర్యాపేట వ్యాస రచన.. ప్రథమ స్థానం: ఆర్.సరిత, ప్రభుత్వ జూనియర్ కళాశాల, సూర్యాపేట ద్వితీయ : కె.సుప్రియ, పాలిటెక్నిక్ కళాశాల, సూర్యాపేట తృతీయ : టి.గురుదీప్ కౌర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, సూర్యాపేట సైన్స్మేళా.. ప్రథమ స్థానం: జెడ్పీహెచ్ఎస్ కోదాడ ద్వితీయ స్థానం: జెడ్పీహెచ్ఎస్, ఏనుబాముల తృతీయ స్థానం: జెడ్పీహెచ్ఎస్, జలాల్పురం. ఫ పోటీలను ప్రారంభించిన అదనపు కలెక్టర్ సీతారామారావు ఫ ప్రతిభ కనబర్చిన వారికి బహుమతుల అందజేత -
పుష్కరిణిలోకి భక్తులను అనుమతించాలి
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ సన్నిధిలోని విష్ణు పుష్కరిణిలోకి భక్తులకు అనుమతి ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆలయ ఈఓ వెంకట్రావ్ సూచించారు. ‘సాక్షి’ దినపత్రికలో శుక్రవారం ‘స్నాన సంకల్పానికి మంగళం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించిన ఈఓ విష్ణు పుష్కరిణిని పరిశీలించారు. పుష్కరిణిలో స్నాన సంకల్పంకు సంబంధించిన ఏర్పాట్లు చేసి, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. పుష్కరిణి ప్రదేశం వద్ద భక్తులకు అందుబాటులో ఉండే విధంగా ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతకు ముందు విష్ణు పుష్కరిణిలో స్నాన సంకల్ప పూజలో పాల్గొన్నారు. అంతరాయం లేకుండా ప్రసాదం అందించాలి యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రానికి వచ్చే భక్తులకు నిరంతరం పులిహోర ప్రసాదం ఉచిత పంపిణీ అంతరాయం లేకుండా చూడాలని ఆలయ ఈఓ వెంకట్రావ్ ఆదేశించారు. యాదగిరీశుడి ఆలయ సన్నిధిలోని ఉచిత ప్రసాద వితరణ, పుష్కరిణి, శివాలయం, క్యూలైన్లు, ప్రసాదం కౌంటర్లు, దుకాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యూలైన్ మూమెంట్కు భక్తులకు సంబంధించి ఇంజనీరింగ్ అధికారులకు, ఎస్పీఎఫ్ భద్రత సిబ్బందికి ఇబ్బందులు లేకుండా సూచించారు. కార్తీక మాసం సందర్భంగా భక్తుల రద్దీ ఉంటుందని, సోమవారాలు, మాస శివరాత్రి, ఏకాదశి రోజులలో శివాలయం ఉచిత ప్రసాదం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రసాదం తయారీ, కౌంటర్స్ పరిశీలించి భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రసాదం తయారు చేయాలన్నారు. కొండపైన దుకాణాలలో దేవస్థానం నిర్ణయించిన ధరలకే విక్రయించాలని, లేకుంటే టెండర్లు రద్దు చేస్తామన్నారు. ఆయన వెంట ఈఈ జె.దయాకర్రెడ్డి, ఇన్చార్జ్ డీఈఓ కృష్ణ, సహాయ కార్యనిర్వహణాధికారి నవీన్కుమార్, మహేష్, శంకర్ నాయక్, ఎస్పీఎఫ్ ఆర్ఐ శేషగిరిరావు తదితరులున్నారు. ఫ ‘సాక్షి’ కథనంతో విష్ణు పుష్కరిణిని పరిశీలించిన ఈఓ వెంకట్రావ్ -
పంట ఆగం..
భానుపురి (సూర్యాపేట) : అధిక వర్షాలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి. అతివృష్టి, అనావృష్టి కారణంగా ఏటా ఏదోవిధంగా పంటలు నష్టపోతూనే ఉన్నారు. ప్రధానంగా ఈ రెండేళ్ల కాలంలో అతివృష్టి కారణంగా చేతికి వచ్చిన పంటలను రైతులు కోల్పోవాల్సి వచ్చింది. ఇలాంటి విపత్తుల సమయంలో రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు సకాలంలో పరిహారం అందజేయడం లేదు.. ఈ సీజన్లో పంటలు నష్టపోయిన వారికి ఎకరానికి రూ.10వేల చొప్పున పరిహారం ఇస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇంకా అమలుకు నోచుకోవడం లేదు. దీంతో పంటల సాగుకు అయిన పెట్టుబడి కూడా రాకపోవడంతో రైతులు అప్పుల పాలవుతున్నారు. జిల్లాలో 6లక్షల ఎకరాల సాగుభూమి ఉండగా దాదాపు 2.50 లక్షల మందికిపైగా రైతులు వ్యవసాయాన్నే నమ్ముకుని పంటలు సాగుచేస్తున్నారు. ఫసల్ బీమా లేదు.. పరిహారం రాదు! జిల్లాలో పంటల బీమా పథకాలు అసలు అమలు కావడమే లేదు. రైతుబంధు అమలు చేస్తున్నామని చెప్పి గత ప్రభుత్వం ఈ పంటల బీమా పథకాలకు మంగళం పాడింది. మధ్యలో ఓసారి ఫసల్ బీమా పథకాన్ని అమలు చేసినా.. మండల యూనిట్గా పంటల నష్టాన్ని అంచనా వేయడంతో రైతులకు ఏ మాత్రం మేలు జరగడం లేదని వదిలేశారు. కనీసం పదేళ్ల కాలంలో పంటల నష్టాన్ని కూడా అంచనా వేసిన పాపాన పోలేదు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాము రాష్ట్రంలో అధికారంలోకి వస్తే పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పినా.. ఇప్పటి వరకు ఫసల్ బీమా అమలు చేయకపోగా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించడం లేదు. ముంచుతున్న అధిక వర్షాలు రెండు, మూడేళ్లుగా వర్షాలు ఏ సమయంలో వస్తున్నాయో అర్థంకాని పరిస్థితి నెలకొంది. వానాకాలం సీజన్ ప్రారంభంలో కనీసం సాధారణ వర్షాలు కూడా నమోదు కావడం లేదు. తదనంతరం పంటలు చేతికి వచ్చే సమయంలో అధిక వర్షాలు కురిసి అన్నదాతలు నష్టపోయేలా చేస్తున్నాయి. 2024–25 వానాకాలం సెప్టెంబర్లో కురిసిన వర్షాలకు జిల్లాలో 25,967 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఎకరానికి రూ.10వేల పరిహారం ఇస్తామని చెప్పి 33 శాతానికి మించి నష్టం జరిగితేనే అన్న నిబంధన పెట్టారు. దీంతో ఈ సీజన్లో మొత్తం రూ.14.43 కోట్ల పంట నష్టం జరిగినట్లు అంచనా వేశారు. అంతకు ముందు 2023 ఏప్రిల్లో అకాల వర్షాల కారణంగా కోతదశకు వచ్చిన 26,177 ఎకరాల వరిపంటకు నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేసినా పైసా పరిహారం అందలేదు. అలాగే 2025–26 వానాకాలం సీజన్లో తుపాను ప్రభావంతో పెద్ద ఎత్తున రైతులు పంటలను నష్టపోవాల్సి వచ్చింది. ఓ వైపు కోతలు ప్రారంభమైన తర్వాత మోంథా తుపాను 64,939 ఎకరాల్లో పంటలకు నష్టాన్ని మిగిల్చింది. ఈ నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేయగా.. 33శాతం నష్టం జరిగిన పంట లెక్కలు తేల్చే పనిలో అధికార యంత్రాగం ఉంది. ఇలా ఏటా ఏదోవిధంగా పంటను నష్టపోయినా పరిహారం అందక రైతులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పంటలు నష్టపోయిన వారికి ఎంతోకొంత పరిహారం ఇప్పించాలని రైతులు కోరుతున్నారు. కోతకొచ్చిన వరిపొలం మోంథా తుపాను కారణంగా కురిసిన వర్షాలకు వరద నీటి పాలైంది. ఆత్మకూర్(ఎస్) మర్రికుంట కింద దాదాపు 7 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అలుగు నీరంతా పొలం గుండానే వెళ్లింది. ఇప్పటికీ నీరు పారుతూనే ఉంది. పరిహారం ఇస్తే పెట్టుబడిలో కొంతైనా వస్తోంది. – చిలుముల గోపాల్రెడ్డి, రైతు, ఆత్మకూర్(ఎస్) 2023 ఏప్రిల్లో కురిసిన అకాల వర్షానికి దాదాపు 8 ఎకరాల్లో వరిపంట నేలకొరిగి నష్టపోయా. ఈదురుగాలులు, వడగండ్ల కారణంగా పంట చేతికి రాకుండా పోయింది. బీమా పథకాలు లేకపోవడంతో పరిహారం అందలేదు. ప్రభుత్వం ప్రకటించిన రూ.10వేల నష్టం పరిహారం కూడా రాలేదు. – విసవరం రాంరెడ్డి, రైతు, ఆత్మకూర్(ఎస్) దెబ్బతిన్న పంటలు 25,967 ఎకరాలు పంటనష్టం అంచనా విలువ రూ.14.43 కోట్లు మోంథా తుపానుతో పంటనష్టం 64,939 ఎకరాల్లో ఫ ప్రస్తుత సీజన్లో నిండా ముంచిన అధిక వర్షాలు ఫ 90వేల ఎకరాలకుపైగా పంట నష్టం ఫ సాయం అందక అప్పుల్లో కూరుకుపోతున్న రైతాంగం ఫ ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు -
ఇంటి ముందే మట్టి పోశారు
మ్యాన్ హోల్స్ కోసం గుంటలు తీశారు. తీసిన మట్టి ఇంటి ముందే పోయడంతో ఇబ్బందులు పడుతున్నాం. కనీసం ఇంట్లో నుంచి బయటికి వెళ్లే పరిస్థితి లేదు. ప్రత్యామ్నాయం కూడా చూపలేదు. అధికారులు స్పందించి యూజీడీ పనులను త్వరగా పూర్తిచేయించాలి. – కేశగాని సతీష్, బాలాజీ నగర్ రోడ్డు మధ్యలో తవ్వి పైప్లైన్ వేసిన తర్వాత మట్టితో పూడ్చి వదిలేశారు. అది కాస్త వర్షానికి కుంగి బురద మడుగులా తయారైంది. వీధుల్లో నడవడానికి, వాహనాలకు ఇబ్బందిగా ఉంది. అధికారులు స్పందించి రోడ్డు మధ్యలో ఉన్న గుంటలపై సిమెంట్ ప్యాచెస్ వేయాలి. – బొమ్మగాని లోకేష్, బాలాజీ నగర్ -
ఫైనాన్స్ వ్యాపారి ఆత్మహత్య
చౌటుప్పల్ రూరల్: ఫైనాన్స్ వ్యాపారి గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడిపల్లి గ్రామానికి చెందిన చెందిన చీకూరి కృష్ణంరాజు(49) కొంతకాలంగా హైదరాబాద్లోని వనస్థలిపురంలో గల హుడా సాయినగర్ కాలనీలో నివాసం ఉంటూ ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. గురువారం ఉదయం దామెర గ్రామంలో తన వ్యవసాయ పొలానికి వచ్చాడు. అక్కడే ఉన్న పనిమనిషితో గడ్డిమందు తెప్పించుకున్నాడు. కృష్ణంరాజు తనతోపాటు తెచ్చుకున్న కూల్డ్రింక్లో గడ్డి మందు కలుపుకొని తాగాడు. అనంతరం సాయినగర్ కాలనీలోని తన ఇంటికి వెళ్లాడు. ఇంటికి చేరుకుని కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. కృష్ణంరాజు ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఫైనాన్స్ వ్యాపార లావాదేవీల్లో జరిగిన తేడాలతో మానసికంగా ఇబ్బంది పడుతున్నాడని అతని స్నేహితులు చెబుతుండగా.. నడుమునొప్పితో విపరీతంగా బాధపడుతున్నాడని మరికొంత మంది చెబుతున్నారు. -
ఆయిల్ పామ్ సాగుపై శ్రద్ధపెట్టాలి
కోదాడరూరల్: రైతులు వరికి బదులుగా ఆయిల్పామ్ సాగుపై శ్రద్ధపెట్టాలని, అందుకు అధికారులు కూడా రైతులను ప్రోత్సహించాలని జిల్లా ఉద్యానవన అధికారి నాగయ్య, జిల్లా కోఆపరేటివ్ అధికారి పి.ప్రవీణ్కుమార్ అన్నారు. శుక్రవారం కోదాడ మండలం గుడిబండ రైతువేదికలో పీఏసీఎస్ సీఈఓలు, ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికారులకు నిర్వహించిన అవగాహన సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పీఏసీస్ సీఈఓలు సంఘం పరిధిలో 100 ఎకరాల ఆయిల్ పామ్ సాగు చేసేలా రైతులను గుర్తించి జాబితా ఇవ్వాలన్నారు. నీటి వసతి ఉన్న రైతులు ఈ పంటను సాగు చేస్తే రాయితీపై మొక్కలు, డ్రిప్తోపాటు మొక్కల పెంపకానికి పెట్టుబడి నిమిత్తం ఎకరాకు రూ.4,200 నగదు కూడా అందిస్తామన్నారు. సమావేశంలో కోదాడ పీఏసీఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాసరెడ్డి, టెక్నికల్ హెచ్ఈఓ మహేష్, అనిత, ప్రదీప్తి పాల్గొన్నారు. -
ట్రాక్టర్ను ఢీకొన్న లారీ
మిర్యాలగూడ టౌన్ : ధాన్యం లోడ్తో వెళ్తున్న లారీ, ట్రాక్టర్ ఢీకొనడంతో ట్రాక్టర్ పల్టీకొట్టింది. దీంతో ట్రాక్టర్లో ఉన్న ధాన్యం చెల్లాచెదురుగా పడింది. ఈ సంఘటన శుక్రవారం మిర్యాలగూడ మండలంలో అవంతీపురం వద్ద చోటు చేసుకుంది. మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ మల్లికంటి లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లకు చెందిన పొరెడ్డి అప్పిరెడ్డి ట్రాక్టర్లో ధాన్యాన్ని మిర్యాలగూడకు తీసుకువస్తున్నాడు. ఈక్రమంలో మిర్యాలగూడ మండలం అవంతీపురం వ్యవసాయ మార్కెట్ ఎదుటకు రాగానే మిర్యాలగూడ నుంచి మార్కెట్ యార్డు వైపు వెళ్తున్న ధాన్యం లారీ ట్రాక్టర్ను ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ పల్టీకొట్టింది. ట్రాక్టర్ ముందు భాగం దెబ్బతినగా రోడ్డుపై ధాన్యం చెల్లాచెదురుగా పడింది. ట్రాక్టర్ డ్రైవర్ కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. కాగా.. లారీ డ్రైవర్ వాహనాన్ని వదిలి పరారయ్యాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఫ ట్రాక్టర్ పల్టీకొట్టడంతో చెల్లాచెదురుగా పడిన ధాన్యం -
20 నెలలుగా 35 శాతం పనులే..
యూజీడీ నిర్మాణంలో జాప్యం ఫ సూర్యాపేటలో కొనసాగుతున్న అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు ఫ పైప్లైన్ ఏర్పాటు కోసం అంతర్గత సీసీ రోడ్ల తవ్వకం ఫ అస్తవ్యస్త దారులతో అవస్థలు ఫ గడువులోగా పనులు పూర్తిచేయాలని అంటున్న పట్టణవాసులు సూర్యాపేట అర్బన్ : సూర్యాపేట జిల్లా కేంద్రంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) పనులు నత్తనడకన సాగుతున్నాయి. అమృత సిటీ పేరుతో చేపట్టిన సెంట్రల్ డ్రెయినేజీ పనులన్నీ ఒక క్రమపద్ధతిలో కాకుండా అస్తవ్యస్తంగా జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వివిధ కాలనీల్లో అంతర్గత సీసీ రోడ్లను జేసీబీలతో తవ్వేస్తున్నారు. దీంతో రోడ్లనీ గుంతలమయంగా దర్శనమిస్తున్నాయి. మంచి రోడ్లన్నీ తవ్వేస్తున్నారని, తర్వాత మరమ్మతులు చేస్తారో చేయరో అని పట్టణవాసులు అంటున్నారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో గుంతలు తవ్వి పైపులు వేస్తుండగా మరికొన్ని వార్డుల్లో మ్యాన్హోల్స్ గుంతలు తీస్తున్నారు. దీంతో ఏ గల్లీలో ప్రయాణించాలన్నా ఎక్కడ బ్లాక్ చేశారో ఎటునుంచి వెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొంది. గడువు ఐదు నెలలే.. పట్టణంలో యూజీడీ పనులు రూ.316 కోట్ల అంచనా వ్యయంతో 290 కిలోమీటర్ల పొడవున చేపట్టడానికి ప్రణాళికలు రూంపొందించారు. కేఎన్ఆర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నిర్మాణ కాంట్రాక్టు దక్కుంచుకుంది. పనుల కోసం పట్టణాన్ని రెండు జోన్లుగా విభజించారు. పనులకు 2023లో శంకుస్థాపన చేయగా 2024 మార్చిలో ప్రారంభించారు. 2026 మార్చిలో పనులు పూర్తి చేయడానికి గడువు విధించారు. ఐదేళ్ల పాటు మెయింటనెన్స్ బాధ్యత కేఎన్ఆర్ కంపెనీ చూడాల్సిఉంది. అయితే పనులు చేపట్టి 20 నెలలు పూర్తయినా 35 శాతమే పూర్తయ్యాయి. ప్రస్తుతం బాలాజీ నగర్, భగత్సింగ్ నగర్, చింతలచెర్వు, జమ్మిగడ్డ, చర్చి కాంపాండ్, అంబేద్కర్ నగర్లో పనులు కొనసాగుతున్నాయి. పనుల పూర్తికి ఐదు నెలల సమయమే ఉండడంతో ఆలోగా పూర్తవుతాయో కావో.. ఇంకెన్నాళ్లు ఈ ఇబ్బందులు పడాలని పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇబ్బందుల్లో వాహనదారులు పట్టణంలో రోడ్లను తవ్వి మెయిన్ పైప్లైన్ వేసి పూడ్చారు కానీ రోడ్డును చదును చేయకుండా సిమెంటుతో నిర్మాణం చేపట్టకుండా వదిలేస్తున్నారు. దీంతో గుంటలు ఏర్పడి దానికి తోడు వర్షం పడడంతో ఆయా రోడ్లన్నీ బురదమయంగా మారరడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యంతో పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని పట్టణంలోని వివిధ కాలనీల వాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సదురు కాంట్రాక్టర్తో పనులు వేగంగా పూర్తిచేయించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. యూజీడీ నిర్మాణం పొడవు 290 కి.మీ. అంచనా వ్యయం రూ.316 కోట్లు పనులు ప్రారంభమైంది 2024మార్చి అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పైప్లైన్ వేయటం దాదాపు పూర్తయింది. ప్రస్తుతం చాలా కాలనీల్లో మ్యాన్ హోల్స్ నిర్మిస్తున్నారు. తవ్విన రోడ్లను కాంట్రాక్టు సంస్థనే మరమ్మతులు చేస్తుంది. గడువులోగా అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు పూర్తిచేయించి వినియోగంలోకి తెస్తాం. – అనిల్, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఏఈ, సూర్యాపేట -
మంచి ఆలోచనలకు పునాది వేయాలి
సూర్యాపేటటౌన్ : విద్యార్థులు మంచి ఆలోచనలకు పునాది వేయాలని, ఉన్నత స్థాయికి చేరుకోవడానికి నిరంతరం సాధన చేయాలని ఎస్పీ నరసింహ అన్నారు. గురువారం సూర్యాపేట మండలంలోని బాలెంలలో గల తెలంగాణ రెసిడెన్షియల్ సోషల్ వెల్ఫేర్ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు సైబర్ మోసాలు, సోషల్ మీడియా ప్రభావం, లక్ష్యాలు, విజయ అంశాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమస్యలకు కుంగిపోవద్దని, శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదగాలని, ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తప్పులను అధిగమిస్తూ విజయాల వైపు వెళ్లాలని, మంచి పుస్తకాలను, మంచి స్నేహితులను ఎంచుకోవాలని పేర్కొన్నారు. సైబర్ మోసాల నివారణకు వారియర్స్గా పని చేయాలన్నారు. అదేవిధంగా పోలీసు కళాబృందం సామాజిక అంశాలు, సామాజిక రుగ్మతలు, సామాజిక భద్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సూర్యాపేట రూరల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. ఫ ఎస్పీ నరసింహ -
శాసీ్త్రయ విజ్ఞానాన్ని పెంపొందించేలా..
హుజూర్నగర్ : విద్యార్థుల్లో శాసీ్త్రయ విజ్ఞానాన్ని పెంపొందించేందుకు ప్రతిఏటా జనవిజ్ఞాన వేదిక తెలంగాణ ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ ప్రతిభ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో భాగంగా శుక్రవారం జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో జరగనున్న చెకుముకి సైన్స్ ప్రతిభ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 8–10 తరగతులు చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షను రాయొచ్చు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రూ.5, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రూ.10లు చొప్పన పరీక్ష రుసుం చెల్లించాల్సి ఉంటుంది. పరీక్షా విధానం.. చెకుముకి సైన్స్ ప్రతిభ పరీక్షలో విద్యార్థులకు 8 నుంచి 10 తరగతులకు చెందిన సిలబస్ నుంచి ప్రశ్నలు వస్తాయి. మొదటగా పాఠశాల స్థాయిలో ప్రతిభా పరీక్ష నిర్వహించి ముగ్గురిని ఎంపిక చేసి ఈ నెల 21న మండలస్థాయిలో పరీక్షకు పంపిస్తారు. ఇందులో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసి జిల్లాస్థాయికి నాలుగు జట్లను పంపిస్తారు. ఈ నెల 28న జిల్లా స్థాయిలో నిర్వహించే ప్రతిభ పరీక్షకు ప్రతి మండలం నుంచి నాలుగు టీమ్లను పంపిస్తారు. జిల్లాస్థాయిలో క్విజ్, డిబేట్ అంశాల ఆధారంగా రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలకు ఎంపిక చేస్తారు. రాష్ట్ర స్థాయి సైన్స్ సంబరాలను డిసెంబరు 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు మూడు రోజుల పాటు కరీంనగర్లో నిర్వహించనున్నారు. ఫ నేడు చెకుముకి సైన్స్ ప్రతిభా పరీక్ష ఫ 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు అవకాశం -
తడి, పొడి.. ఆచరణలో తడబడి
సూర్యాపేట అర్బన్: సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించాలని మున్సిపల్ అధికారులు నిరంతరం అవగాహన కల్పిస్తున్నా ప్రజల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. రెండు రకాల చెత్తను ఒకే డబ్బాలో వేసి ఇస్తున్నారు. దీంతో తడి వ్యర్థాలతో సేంద్రియ ఎరువులు తయారు చేయాలన్న లక్ష్యం పూర్తిస్థాయిలో ఫలించడం లేదు. రెండు డబ్బాలు ఇచ్చినా.. మున్సిపాలిటీలో తడి, పొడి చెత్త సేకరణ కోసం ఆకుపచ్చ, నీలం రంగు డబ్బాలు ఇంటింటికి రెండు చొప్పున అందజేశారు. కానీ పట్టణవాసులు రెండు రకాల వ్యర్థాలను కలిపి చెత్త సేకరణ వాహనదారులకు అందజేస్తున్నారు. దీంతో ఆటోలో వేర్వేరు అరలు ఏర్పాటు చేసినా ఫలితం ఉండడం లేదు. గతంలో పొడి చెత్తను వేరుచేసి కార్మికులు విక్రయించుకునేవారు. ఇప్పుడు అది పట్టించుకోకుండా డంపింగ్ యార్డుల్లో గుట్టలుగా పోస్తున్నారు. వందరోజుల ప్రణాళికలో భాగంగా చెత్త సేకరణ, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలపై అధికారులు అవగాహన కల్పిస్తున్నా పట్టణవాసుల్లో మార్పు కనిపించడం లేదు. కొందరు మాత్రమే చెత్తను వేరు చేసి ఇస్తున్నట్లు సిబ్బంది పేర్కొంటున్నారు. సూర్యాపేట మున్సిపాలిటీలో మొత్తం వార్డులు 48పట్టణ జనాభా 1,53,000నివాస గృహాలు 38000రోజు వెలువడే చెత్త తడి చెత్త 30 టన్నులు పొడి చెత్త 15 టన్నులు మిక్స్డ్ 10 టన్నులుఫ చెత్తను వేర్వేరుగా అందించాలని అవగాహన కల్పిస్తున్నా ప్రజల్లో కనిపించని మార్పు ఫ ఫలించని సేంద్రియ ఎరువుల తయారీ లక్ష్యం -
చొరబడిన దుండగులు
యాదగిరిగుట్ట మున్సిపాలిటీ కార్యాలయంలోకి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి విధ్వంసం సృష్టించారు. ఫ అట్టహాసంగా జోనల్ స్పోర్ట్స్ మీట్పూర్తిస్థాయి నీటి మట్టం : 590 అడుగులు ప్రస్తుత నీటి మట్టం : 590.00 అడుగులు ఇన్ఫ్లో : 60,319 క్యూసెక్కులు అవుట్ ఫ్లో : 49,944 క్యూసెక్కులు విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా : 33,657 క్యూసెక్కులు కుడికాల్వ ద్వారా : 10,000 క్యూసెక్కులు ఎడమకాల్వ ద్వారా : 5,087 క్యూసెక్కులు ఏఎమ్మార్పీకి : 1200 క్యూసెక్కులు వరద కాల్వకు : నిల్స్నాన సంకల్పానికి మంగళం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి కొండపై ఉన్న విష్ణు పుష్కరిణి కొంతకాలంగా నిరుపయోగంగా ఉంది. శుక్రవారం శ్రీ 7 శ్రీ నవంబర్ శ్రీ 2025- 8లో -
కూలీల కొరత.. రైతు వ్యథ
తిరుమలగిరి (తుంగతుర్తి) : మోంథా తుపాన్ పత్తి రైతులను నిండా ముంచింది. వర్షాల కారణంగా పత్తి చేలన్నీ దెబ్బతిన్నాయి. చెట్లపై ఉన్న పత్తి కాయలు కుళ్లిపోయాయి. దీంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపనుంది. దీనికి తోడు ఉన్న కాస్త పత్తి ఏరుదామంటే ఇప్పుడు కూలీల కొరత ఏర్పడింది. ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తీసుకురావాలంటే కూలి రేట్లు రెండింతలై రైతులపై ఆర్థికభారం పడుతోంది. 93,826 ఎకరాల్లో సాగు జిల్లా వ్యాప్తంగా 93,826 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. జూన్, జూలై మాసాల్లో అదునుకు కురిసిన వర్షాలకు రైతులు గుంటుకలు తోలుకొని ఎరువులు పెట్టుకున్నారు. సరైన సమయంలో ఎరువులు పెట్టడంతో పూత కాపుకొచ్చింది. అప్పటి పరిస్థితులను బట్టి ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని రైతులు, అధికారులు అంచనా వేశారు. కానీ వీరి అంచనాలను వర్షాలు తలకిందులు చేశాయి. వరుస వర్షాలకు పత్తి చేలన్నీ పూర్తిగా దెబ్బ తిన్నాయి. మోంథా తుపాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పత్తి అంతా తడిసి రాలిపోయింది. సగానికి సగం దిగుబడి తగ్గే పరిస్థితి నెలకొన్నది. వర్షాల కారణంగా పత్తి చేను పెద్ద ఎత్తున దెబ్బ తినడంతో రైతులకు నష్టం వాటిల్లుతోంది. దీనికి తోడు కూలీల కొరత ఉండటంతో పత్తి అంతా చేలలోనే ఉంటోంది. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాకు మద్దతు ధర రూ.8100 ఉండగా తేమ శాతం అధికంగా ఉండటంతో రైతుల నుంచి క్వింటాకు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకే కొనుగోలు చేస్తున్నారు. సరిహద్దు జిల్లాల నుంచి.. చెట్లపై ఉన్న కొదిపాటి పత్తిని ఏరడానికి రైతులు ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తీసుకొస్తున్నారు. జిల్లాకు సరిహద్దున ఉన్న మహబూబాబాద్, జనగామ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం జిల్లాల నుంచి కూలీలను ఆటోలు, టాటాఏస్ వాహనాల్లో ఉదయం తీసుకొచ్చి సాయంత్ర పంపిస్తున్నారు. పత్తి ఏరడాకి గతంలో ఒక్కో కూలీకి రూ.300 నుంచి రూ.350 చెల్లించే వారు. వారం రోజులుగా కేజీల చొప్పున ఏరిస్తున్నారు. కేజీకి రూ.15 నుంచి రూ.20 వరకు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు వాహనం కిరాయితో పాటు డ్రైవర్కు బత్తా ఇవ్వాల్సివస్తోంది. దీంతో పత్తి రైతులపై అదనపు భారం పడుతోంది. మూడున్నర ఎకరాల్లో పత్తి సాగు చేశాను. ఇప్పటి వరకు 2 ఎకరాలలో మాత్రమే ఒకసారి పత్తి తీశాను. పత్తి తీయాల్సి ఉన్నా కూలీల కొరత ఏర్పడింది. కూలీలను ఇతర ప్రాంతాల నుంచి తీసుకురావాల్సి వస్తోంది. రవాణా ఖర్చులు భారంగా మారాయి. గ్రామానికి చెందిన కూలీలతో వ్యవసాయ పనులు చేయిస్తే కూలి డబ్బులు కొంత ఆలస్యంగా చెల్లించేందుకు అవకాశం ఉండేది. వేరే గ్రామాల నుంచి పత్తి తీసేందుకు కూలీలకు సాయంత్రమే అన్ని డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. అప్పు చేసి సాయంత్రమే కూలి చెల్లించాల్సి వస్తోంది. – నర్సయ్య, రైతు, తాటిపాముల. ఈ ఫొటోలో కన్పిస్తున్న రైతు పేరు వెంకన్న. సొంతూరు తిరుమలగిరి మండలం తొండ గ్రామం. ఈ ఏడాది వానాకాలంలో 3 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు. ఎకరాకు రూ.10 వేల చొప్పున కౌలు కింద మొత్తం రూ.30 వేలు ముందుగానే చెల్లించాడు. ఇప్పటి వరకు లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టాడు. ఎకరాకు 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని ఆశించాడు. కానీ వరుస వర్షాల కారణంగా చేలల్లోని పత్తి కాయలు సగానికి పైగానే కుళ్లి పోయాయి. ఎకరాకు కనీసం 5 క్వింటాళ్ల దిగుబడి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఉన్నకొద్దిపాటి పత్తి ఏరిద్దామంటూ కూలీల కొరత ఏర్పడింది. దీంతో ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తీసుకొచ్చాడు. వీరికి పత్తి ఏరినందుకు కిలోకు రూ.16 చొప్పున చెల్లిస్తున్నారు.ఫ ఇప్పటికే తుపాన్ కారణంగా దెబ్బతిన్న పత్తి పంట ఫ దిగుబడిపై తీవ్ర ప్రభావం ఫ పత్తితీతకు కూలీలు దొరకని పరిస్థితి ఫ ఇతర ప్రాంతాల నుంచి తీసుకొస్తున్న కర్షకులు ఫ రెండింతలవుతున్న ఖర్చులు -
విద్యార్థులను దోచేస్తునా్నరు!
కోదాడ: జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ జూనియర్ కళాశాలలు పరీక్ష ఫీజు దందాకు తెరలేపాయి. పరీక్ష ఫీజు వందల్లో ఉండగా కళాశాలలు మాత్రం విద్యార్థుల నుంచి వేలల్లో వసూలు చేస్తున్నాయి. పరీక్ష ఫీజు పేరుతో సగటున ఒక్కో విద్యార్ధి నుంచి రూ.2వేల నుంచి రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నాయి. ఇదేంటని ప్రశ్నిస్తే ఇంటర్నల్ ఎగ్జామ్ ఫీజు, ఎంసెట్ ఫీజు అంటూ రకరకాల పేర్లు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ తంతు ప్రతిసంవత్సరం జరుగుతున్నా జిల్లా ఇంటర్ బోర్డు అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్ని కళాశాలల్లో రూ.5వేల వరకూ వసూలు 2025– 26 విద్యాసంవత్సరానికి సంబంధించి మార్చిలో జరగనున్న వార్షిక పరీక్షకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల 14 వరకు ఫీజు చెల్లించవచ్చని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం రెగ్యులర్ ఆర్ట్స్ విద్యార్థులకు పరీక్ష ఫీజు ఇంగ్లిష్ ప్రాక్టికల్స్తో కలిపి రూ.630గా బోర్డు నిర్ణయించింది. సైన్స్, ఒకేషనల్ విద్యార్థులకు అన్నీ కలిపి రూ.870 చెల్లించాల్సి ఉంది. రూ.100 అపరాధ రుసుముతో ఈ నెల 16 నుంచి 24వ తేదీ వరకు చెల్లించవచ్చు. కానీ ప్రైవేట్ కళాశాలలు దీనికి భిన్నంగా ఒక్కో విద్యార్థి నుంచి రూ. 2వేల నుంచి రూ.3వేల వరకు వసూలు చేస్తున్నాయి. కోదాడ, సూర్యాపేటలో కొన్ని కళాశాలలు రూ.5 వేల వరకూ వసూలు చేస్తున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా రూ.2.25 కోట్లు.. జిల్లా వ్యాప్తంగా ఉన్న 30 ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో 4404 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో 4,591 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరి నుంచి సగటున రూ.2500 అధికంగా వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా ఇంటర్ విద్యార్థుల నుంచి రూ.2.25 కోట్లు అక్రమంగా వసూలు చేస్తున్నారు. అయితే ప్రతి విద్యార్థి నుంచి కొంత మొత్తం నిర్ణయించి బోర్డు అధికారులకు ముట్టజెప్పుతున్నందునే వారు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇంటర్ విద్యార్థుల నుంచి ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుకు ఒక్క రూపాయి అధికంగా వసూలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇతర ఇంటర్నల్ పరీక్షల ఫీజు పేరుతో అదనంగా వసూలు చేస్తున్నారని మాకు సమాచారం వస్తుంది. పరీక్ష ఫీజు మాత్రమే ప్రత్యేకంగా తీసుకుని రశీదు ఇవ్వాలి. ప్రైవేట్ కళాశాలల్లో తనిఖీలు చేస్తాం. విద్యార్థులుగాని, తల్లిదండ్రులుగాని ఫిర్యాదు చేస్తే సదరు కళాశాలపై చర్యలు తీసుకుంటాం. – భానునాయక్, జిల్లా ఇంటర్ బోర్డు అధికారికళాశాలలు సంఖ్య ఫస్టియర్ సెకండియర్ (విద్యార్థుల సంఖ్య) ప్రభుత్వ 8 1,599 1,167 ఎయిడెడ్ 48 2,594 2,178 ప్రైవేట్ 30 4,404 4,591 మొత్తం 86 8,567 7,936ఫ పరీక్ష ఫీజు రూ.వందల్లో ఉంటే వేలల్లో వసూలు చేస్తున్న ప్రైవేట్ కళాశాలలు ఫ ఇంటర్నల్ ఎగ్జామ్స్, ఎంసెట్ ఫీజు పేర్లు చెప్పి అదనంగా వసూలు ఫ 9వేల మంది విద్యార్థులపై భారం ఫ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జిల్లా ఇంటర్ బోర్డు అధికారులు -
16న పీఓడబ్ల్యూ శిక్షణ తరగతులు
సూర్యాపేట అర్బన్ : కోదాడలో ఈ నెల 16న జరిగే ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు మారసాని చంద్రకళ పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని విక్రమ్ భవన్ వద్ద కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. మహిళలను చైతన్యవంతులను చేయడం కోసం శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు సూరం రేణుక, సహాయ కార్యదర్శి సంతోషిమాత, ఐతరాజు పద్మ, రేహమతి, భీమనపల్లి పద్మ తదితరులు పాల్గొన్నారు. వైభవంగా శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణంమఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో గురువారం శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం గావించి స్వామి అమ్మవార్లకు ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం జరిపించారు. కల్యాణవేడుకలో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ, తంలబ్రాలతో నిత్య కల్యాణం నిర్వహించారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు విజయ్కుమార్, ఈఓ నవీన్కుమార్, అర్చకులు పాల్గొన్నారు. అదేవిధంగా కార్తీక మాస పూజల్లో భాగంగా మట్టపల్లిలోని శివాలయంలో శ్రీపార్వతీరామలింగేశ్వరస్వామికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాబిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలిసూర్యాపేటటౌన్ : పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని టీపీటీఎల్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నరసింహారావు డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ల రోడ్లోని మహర్షి డిగ్రీ కళాశాల వద్ద కళాశాల యాజమాన్యం, అధ్యాపకులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ కళాశాలలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయని, గత నాలుగేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో అనేక కళాశాలలు మూతపడే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బకాయిలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫెడరేషన్ నాయకులు ఉయ్యాల నరసయ్య, మహర్షి డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ ప్రవీణ్ రెడ్డి, ప్రిన్సిపాల్ నగేష్, వైస్ ప్రిన్సిపాల్ రమాదేవి, అధ్యాపకులు పాల్గొన్నారు. నల్లగొండ నుంచి రాజధానికి ప్రత్యేక బస్సులు రామగిరి(నల్లగొండ): నల్లగొండ ఆర్టీసీ డిపో నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు ప్రత్యేక బస్సు సర్వీసులు ప్రారంభించినట్లు డిపో మేనేజర్ వెంకటరమణ తెలిపారు. నల్లగొండ నుంచి హైటెక్ సిటీ, రాజీవ్గాంధీ ఎయిర్పోర్టుకు రెండు డీలక్స్ బస్సులు ప్రారంభించనట్లు పేర్కొన్నారు. నల్లగొండ నుంచి వయా ఔటర్ రింగ్రోడ్డు మీదుగా విప్రో హైటెక్ సిటీకి, ఎల్బీ నగర్ మీదుగా ఎయిర్పోర్టు మధ్య ఈ బస్సులు నడుస్తాయని పేర్కొన్నారు. నల్లగొండ హైటెక్ సిటీకి ఉదయం 6.45, మధ్యాహ్నం 2 గంటలకు, తిరిగి హైటెక్ సిటీ నుంచి ఉదయం 10 గంటలకు, సాయంత్రం 6 గంటలకు బస్సులు బయలుదేరుతాయని తెలిపారు. నల్లగొండ నుంచి ఎయిర్పోర్టుకు ఉదయం 10 గంటలకు, సాయంత్రం 6.30 గంటలకు, ఎయిర్పోర్టు నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు, ఉదయం 5 గంటలకు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. -
విద్యార్థులందరూ భాగస్వాములు అయ్యేలా చూడాలి
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడంతోపాటు వారికి సైన్స్ పట్ల అవగాహన కల్పించేందుకు చెకుముకి సైన్స్ ప్రతిభా పరీక్ష నిర్వహిస్తున్నాం. దీనికి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, సమగ్ర శిక్ష అభియాన్ అభియాన్ అధికారులు తోడ్పాటునందిస్తున్నారు. ఈ పరీక్షలో ఎక్కువ మంది విద్యార్థులు భాగస్వామ్యం అయ్యేలా ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు సహకరించాలి. – సైదులు, జిల్లా ప్రధాన కార్యదర్శి, జనవిజ్ఞాన వేదిక సూర్యాపేట -
రాష్ట్రస్థాయి ‘ఆర్చరీ’కి 12 మంది ఎంపిక
భువనగిరి: రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు ఉమ్మడి జిల్లాకు చెందిన 12 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు.భువనగిరిలోని న్యూ డైమెన్షన్ ఇంటర్నేషనల్ స్కూల్ మైదానంలో బుధవారం ఉమ్మడి నల్లగొండ ఆర్చరీ ఎంపిక పోటీలు నిర్వహించారు.ఈ పోటీల్లో 25 మంది క్రీడాకారులు పాల్గొనగా.. ప్రతిభ కనబరచిన 12 మందిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేశామని, ఆర్చరీ అసోసియేషన్ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీగిరి విజయ్కుమార్రెడ్డి, టి.విద్యాసాగర్ తెలిపారు. సబ్ జూనియర్ విభాగంలో ఈ నెల 9, జూనియర్ విభాగంలో 16వ తేదీన హైదరాబాద్లో పోటీలు ఉంటాయని, క్రీడాకారులు రాష్ట్రస్థాయిలోనూ రాణించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల్లో ఏకాగ్రత, మానసికోల్లాసం పెంపొందడానికి క్రీడలు దోహదపడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ సుభాష్రెడ్డి, టీజీపీఈటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజుగౌడ్, ఉపాధ్యక్షుడు స్వామిరాజ్, జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రమౌళి, పీఈటీ విష్ణువర్ధన్రెడ్డి, కోచ్ సాయిరాం పాల్గొన్నారు. రాష్ట్రసాయికి ఎంపికై న క్రీడాకారులు బి.హర్ష, సూర్యతేజ, టి.అభినవ్, సాయివిష్ణు, నిహల్రెడ్డి, విఖ్యా, హర్షవర్థన్రెడ్డి, షేక్హస్న, అక్షిత, విశ్రుత, శ్రీలక్ష్మీ, నూర్సభ రాష్ట్రస్థాయి అర్చరీ పోటాలకు ఎంపికయ్యారు. -
యువత.. పెడదారి
సూర్యాపేటటౌన్ : యువతం అంటేనే సమాజానికి దిక్సూచిలా ఉండాల్సిన బాధ్యత. కానీ ప్రస్తుతం కొంత మంది యువకులు పెడదారిపడుతున్నారు. మద్యం, గంజాయి, డ్రగ్స్లాంటి మత్తు పదార్థాలకు బానిసవుతున్నారు. జల్సాలకు అలవాటుపడి , ఈజీమనీ కోసం మత్తులోనే హత్యలు, చోరీలకు పాల్పడుతున్నారు. తెలిసీతెలియని వయస్సులో క్షణికావేశంలో ఎంతటికై నా తెగిస్తున్నారు. నేరాలు చేస్తూ జైలుపాలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. తల్లిదండ్రుల కలలను కల్లలు చేస్తున్నారు. తల్లిదండ్రులు దృష్టి సారిస్తే మేలు.. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై దృష్టి సారించకపోవడంతోనే చెడు మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం చాలా మంది తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగులు కావడం, ఎవరి జీవన విధానంలో వారు బిజీగా ఉండి పిల్లలను పట్టించుకోవడం లేదు. దీంతో పిల్లలు యుక్త వయస్సులోనే చెడిపోతున్నారు. పిల్లల కదలికలను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు కని పెడుతూ ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కళాశాలకు వెళ్తున్నారా.. స్నేహితులు ఎవరు.. ఎలాంటి వారు.. వారి కుటుంబ వివరాలు తెలుసుకుంటేనే మేలు. పిల్లలు ఏం చదువుతున్నారు, ఎలా చదువుతున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కళాశాల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులతో తరచూ పిల్లల చదువుపై చర్చిస్తూ ఉండాలి. జల్సాలకు పోవద్దని, డబ్బు పొదుపుగా వాడుకోవాలని వారికి అర్థమయ్యేలా చెప్పాలి. తెలిసో, తెలియకో నేరాలకు పాల్పడితే భవిష్యత్ ఏమవుతుందో, ఎటువంటి శిక్షలు ఉంటాయో వారికి అవగాహన కల్పించాలి. మత్తుకు బానిసై నేరాలు.. ముఖ్యంగా గంజాయి, డ్రగ్స్, మద్యం ప్రభావం యువత పై ఎక్కువగా చూపిస్తుంది. ఇటీవల గంజాయి కేసులలో పట్టుబడిన వారిలో ఎక్కువగా జల్సాలకు అలవాటు పడి డబ్బులు సరిపోకపోవడంతో ఇతర ప్రాంతల నుంచి గంజాయి తీసుకొచ్చి అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. మరోపక్క ఈజీ మని కోసం మర్డర్లు చేసేందుకు వెనుకాడడం లేదు. జిల్లాలో ఇప్పుడు చాలా మంది యువత గంజాయి మత్తులో తమ భవిష్యత్ నాశనం చేసుకుంటోంది. ఇటీవల జరిగిన హత్య కేసుల్లో చూస్తే మత్తులో పడి, ఈజీ మని కోసం చేసినవే ఎక్కువగా ఉంటున్నాయి. ఫ మద్యం, గంజాయి, డ్రగ్స్కు బానిస ఫ జల్సాలు, ఈజీమనీ కోసం నేరాలబాట ఫ ఇటీవల హత్య కేసుల్లో 30ఏళ్ల లోపు వారే అధికం ఫ పిల్లలపై తల్లిదండ్రులు దృష్టిపెట్టాలంటున్న పోలీసులు చదువుకొని భవిష్యత్ను బంగారు మయం చేసుకోవాల్సిన చాలా మంది యువకులు జల్సాలకు అలవాటుపడి చెడు మార్గంలో పయనిస్తున్నారు. హత్యలు, దొంగతనాలు, చైన్స్నాచింగ్లకు పాల్పడుతూ జైలు జీవితం అనుభవిస్తున్నారు. ఇలా జీవితాలను ఆగం చేసుకోవద్దు. మంచి,చెడుల గురించి పిల్లలకు వివరించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. ప్రతి యువకుడు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి. చట్టాలు, శిక్షలు వంటి అంశాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించడానికి పోలీసు శాఖ తరఫున పోలీస్ ప్రజా భరోసా సైతం నిర్వహిస్తున్నాం. – నరసింహ, ఎస్పీ ఇటీవల సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ కాలనీ సమీపంలో యువకుడిని దారుణంగా హత్య చేశారు. అయితే ఈ కేసులో 10 మందిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇందులో ఆరుగురు 35 ఏళ్ల లోపు వారే. వీరంతా జల్సాలకు, ఈజీమనీకి అలవాటు పడి హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. గతనెల ఆత్మకూర్(ఎస్)మండలంలోని ఒక గ్రామంలో ఓ వ్యక్తి తన ఇద్దరు కొడుకులతో పాటు మరికొందరితో కలిసి భార్యను హత్య చేశాడు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేస్తే వీరిలో 25 ఏళ్ల లోపు యువకులు ముగ్గురు, 30 సంవత్సరాలలోపు వారు ఇద్దరు, 50 ఏళ్ల వయస్సు వారు ఒకరు ఉన్నారు. ఇలాంటివి జిల్లాలో జరిగిన మరెన్నో సంఘటనల్లో అత్యధికంగా యువకులే ఉండటం గమనార్హం. సంవత్సరం 2024 2025(ఇప్పటి వరకు)నమోదైన హత్య కేసులు 20 13 అరెస్ట్ అయిన నిందితులు 55 86 30ఏళ్ల లోపువారి సంఖ్య 16 36(వీరిలో ఒకరు మైనర్) 40 ఏళ్లలోపు వారు 14 27 40 ఏళ్లుపైబడిన వారు 25 23 -
గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి
కోదాడ రూరల్ : పశువులకు తప్పకుండా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని గాలికుంటు నివారణ టీకా రాష్ట్ర పరిశీలకుడు డాక్టర్ కె.అనిల్కుమార్ సూచించారు. బుధవారం కోదాడ పట్టణంలోని ప్రాంతీయ పశువైద్యశాలలో కొనసాగుతున్న గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణే లక్ష్యంగా 7వ విడత టీకాల పంపిణీని పకడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న రెండు లక్షల పశువులకు గాను 70శాతం మేర టీకా పంపిణీ పూర్తి అయిందని తెలిపారు. కోదాడ పశువైద్యశాలలో 4000 వేల పశువులకు గాను 3300 పశువులు టీకాలు వేసి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ పశువైద్యశాలలో నిర్వహిస్తున్న పశుఔషధ బ్యాంకును పరిశీలించారు. ఔషధ బ్యాంకు ఏర్పాటు చేసి తక్కువ ధరకే పాడి రైతులకు , జీవాల పెంపకం దారులకు క్యాల్షియం, మినరల్ మిక్చర్తో పాటు పలు రకాల మందులను అందజేస్తున్న డాక్టర్ పెంటయ్యను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పి.పెంటయ్య, కోదాడ, అనంతగిరి పశువైద్యాధికారులు డాక్టర్ వీరారెడ్డి, డాక్టర్ సురేంద్ర, సిబ్బంది రాజు, చంద్రకళ ఉన్నారు. ఫ రాష్ట్ర పరిశీలకుడు డాక్టర్ అనిల్కుమార్ -
నేటి నుంచి జోనల్ స్పోర్ట్స్ మీట్
నడిగూడెం : నడిగూడెం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 6,7,8 తేదీలలో జోనల్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించనున్నట్లు డీసీఓ పద్మ తెలిపారు. బుధవారం నడిగూడెంలో క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించిన అనంతరం ఆమె స్థానికంగా విలేకరులతో మాట్లాడారు. ఈ క్రీడా పోటీల్లో సూర్యాపేట, నల్లగొండ జిల్లాలకు చెందిన 9 బాలికల గురుకుల పాఠశాలలకు చెందిన 765 మంది క్రీడాకారులు హాజరు కానున్నట్లు ఆమె పేర్కొన్నారు. గురువారం జరిగే ప్రారంభ కార్యక్రమానికి కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి హాజరు కానున్నట్లు తెలిపారు. ఆమె వెంట స్థానిక సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సీహెచ్.వాణి ఉన్నారు. గోదావరి జలాల నిలిపివేతఅర్వపల్లి: గోదావరి జలాలను నిలిపివేశారు. వానాకాలం సీజన్కు సంబంధించి 50రోజుల పాటు నిరంతరాయంగా జిల్లాకు గోదావరి జలాలను విడుదల చేశారు. కాగా భారీ వర్షాలకు ఎస్సారెస్పీ ప్రాజెక్టు నిండి గేట్లు ఎత్తడంతో మళ్లీ అదనంగా నీటిని ఈనెల 2న వదిలారు. ప్రస్తుతం రైతులకు నీటి అవసరం లేక పోవడంతో నిలిపివేశారు. మూసీకి కొనసాగుతున్న వరదకేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం వరకు మూసీకి 3,936 క్యూసెక్కుల వరద వస్తుండగా ప్రాజెక్టు మూడు క్రస్ట్గేట్లను పైకెత్తి 3,870 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కుడి, ఎడమ కాల్వలకు 23 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 645 (4.46 టీఎంసీలు) అడుగుల గరిష్ట నీటిమట్టం గల మూసీ రిజర్వాయర్లో 643.50 (4.07 టీఎంసీలు) అడుగుల వద్ద నీటిమట్టాన్ని నిలకడగా ఉంచి ఎగువ నుంచి వచ్చే నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. పెండింగ్ డీఏలు చెల్లించాలిసూర్యాపేట : ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ డీఏలు, ఇతర బిల్లులను వెంటనే విడుదల చేయాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు పబ్బతి వెంకటేశ్వర్లు కోరారు. బుధవారం ఆత్మకూర్(ఎస్)లో నిర్వహించిన మండల కమిటీ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారులుగా పబ్బతి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కౌన్సిలర్ యోగానందచారి వ్యవహరించారు. వైభవంగా సుదర్శన హోమంసూర్యాపేట : కార్తీక మాసాన్ని పురస్కరించుకొని చివ్వెంల మండల పరిధిలోని ఉండ్రుగొండ గిరిదుర్గంలో గల శ్రీలక్ష్మీ నర్సింహస్వామి ఆలయంలో బుధవారం సుదర్శన హోమం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు శ్రీకరచార్యులు, కృష్ణమాచార్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హోమం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు కృష్ణకుమార్, మురళీకృష్ణ, డాక్టర్ రామయ్య, శంకరాచారి, శ్రీనివాస్, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డీఎంహెచ్ఓగా వెంకటరమణ
సూర్యాపేట టౌన్ : సూర్యాపేట జిల్లా వైద్యాధికారిగా డాక్టర్ పెండెం వెంకటరమణను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ఎన్సీవీబీడీసీ ప్రోగ్రాం ఆఫీసర్ గా పని చేస్తున్నారు. రెండు రోజుల్లో వెంకటరమణ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇంతకాలం ఎల్బీనగర్ డీఎంహెచ్ఓ డాక్టర్ చంద్రశేఖర్ ఇన్చార్జిగా కొనసాగారు. గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలిహుజూర్నగర్ : పశువులకు విధిగా గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని జిల్లా పశువైద్యాధికారి డి. శ్రీనివాస్రావు సూచించారు. మంగళవారం నేరేడుచర్ల మండలం మేడారం గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత పశువైద్య శిబిరాన్ని ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. ఒక వేళ వ్యాధి సోకితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గేదెలు, ఆవులకు రెండు మిల్లీలీటర్ల చొప్పున ప్రతి ఆరు నెలలకు ఒక్కసారి క్రమం తప్పకుండా టీకాలు వేయించి గాలి కుంటు వ్యాధి సోకకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా వ్యాధి సోకిన గేదె పాలను దూడలకు తాపవద్దని, అప్పుడే దూడలను రక్షించుకోవచ్చాన్నారు. ఈ కార్యక్రమంలో పెంచికల్దిన్న పశువైద్యాధికారి జంపాల నరేష్, గోపాల మిత్రలు భుజంగరావు, సాయి కృష్ణ, స్వప్న, వంశీ, కృష్ణలతో పాటు పలువురు రైతులు తదితరులు పాల్గొన్నారు. మట్టపల్లి క్షేత్రంలో నిత్యకల్యాణంహుజూర్నగర్ : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో మంగళవారం శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు వేద మంత్రాలతో వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేసి స్వామి అమ్మవార్లను నూతన పట్టు వస్త్రాలతో అందంగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం రక్తికట్టించారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తంలబ్రాలతో నిత్య కల్యాణతంతు ముగించారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. ఆలయ ప్రవేశంచేసి నీరాజన మంత్రపుష్పాలతో మహా నివేదనచేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ నవీన్కుమార్, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభా చార్యులు, ఆంజనేయాచార్యులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. ధర్నాను జయప్రదం చేయాలిసూర్యాపేట : ఈనెల 7వ తేదీన హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి కోరారు. మంగళవారం సూర్యాపేటలోని పెన్షనర్ల సంఘం కార్యాలయంలో నిర్వహించిన ఆత్మకూరు మండల శాఖ అత్యవసర సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పెన్షనర్ల సమస్యలను పరిష్కరిస్తూ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు కె. వీరారెడ్డి, జిల్లా కోశాధికారి ఎస్ ఏ హమీద్ ఖాన్ ,జిల్లా ఉపాధ్యక్షుడు టి. లక్ష్మీకాంత రెడ్డి, మండల కార్యదర్శి ఎస్. కె అబ్దుల్లా, డి. సత్యనారాయణ, కె. వెంకటా చారి, కె. సత్యనారాయణ రెడ్డి, కె. సురేందర్ రెడ్డి, జి. సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. -
అమ్మేందుకు.. లక్కీడ్రా
స్థిరాస్తి విక్రయానికి కొత్త పంథా ప్రజలు ఇలాంటి స్కీంలను నమ్మి మోసపోవద్దు. ఎవరూ కూడా ఇలాంటి స్కీంలలో పాల్గొనవద్దు. లక్కీ డ్రా స్కీంల పేరుతో ప్రజలను మోసం చేయడం చట్టరీత్యా నేరం. ఇలాంటి వాటిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తాం. – నరసింహ, ఎస్పీ, సూర్యాపేట సూర్యాపేటటౌన్ : ఇప్పటి వరకు వినాయక మండపాలు, దుర్గమాత మండపాల వద్ద, దసరా పండుగ వేళలో స్కూటీలు, బైక్లు, లడ్డూలు, చీరలు, గొర్రెపోతులంటూ లక్కీ డ్రా నిర్వహించడం చూశాం. కానీ ఇప్పుడు నయా ట్రెండ్ వచ్చింది. ఏకంగా కొందరు తమ స్థిరాస్తిని విక్రయించడానికి కొత్త పంథా ఎంచుకున్నారు. ప్లాట్లు, ఇళ్లకు సైతం లక్కీ డ్రా పేరిట రూ.500 నుంచి రూ.1000దాకా కూపన్లకు ధర నిర్ణయించి దీనిపై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు ఇది హాట్టాపిక్గా మారింది. అదృష్టం కలిసి వస్తే.. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్లాటు, ఇళ్ల యజమానులు తమకు సంబంధించిన ప్రాపర్టీని అమ్ముకునేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కాస్త తగ్గుముఖం పట్టడం, ప్లాట్లు, ఇళ్ల కొనుగోళ్లు తక్కువగా ఉండటంతో తమ స్థిరాస్తిని ఎలాగైనా అమ్ముకునేందుకు కొత్త దందాకు తెరలేపారు. పోతే వెయ్యి.. వస్తే లక్షలు విలువ చేసే ప్లాటు అంటూ ఫ్లెక్సీలు, కరపత్రాలను ముద్రించి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అలాగే వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల్లో వైరల్ చేస్తున్నారు. ఈ లక్కీ డ్రా కూపన్లతో వారికి ఎక్కువ డబ్బులు వస్తాయనే ఆశతో ఈ స్కీంలు పెడుతున్నారు. రూ.వెయ్యి పెట్టి కూపన్ కొనుగోలు చేస్తే అదృష్టం కలిసి వస్తే డ్రాలో ప్లాటు గెలుపొందవచ్చనే ఆశతో ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. వ్యాపారులు, యజమానులు ఎక్కువ డబ్బులు రావాలనే ఆలోచనతో ఈ లక్కీ డ్రా స్కీం పెడుతున్నప్పటికీ చట్టబద్ధంగా ఇది ఎంత వరకు నిజమనేది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరముందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కొత్త దందా నల్లగొండ జిల్లా కేంద్రంతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్, మిర్యాలగూడ, సూర్యాపేట ప్రాంతాల్లో ఈ లక్కీ స్కీంల దందా ప్రస్తుతం ట్రెండింగ్లో కొనసాగుతోంది. సంబంధిత ప్లాట్ల వద్ద యజమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే కరపత్రాలను విరివిగా పంచిపెడుతున్నారు. చౌటుప్పల్లో మూడు నెలల క్రితం ఓ యజమాని లక్కీ డ్రాం స్కీం ప్రారంభించి గత ఆదివారం లక్కీ డ్రా తీశారు. ఈ డ్రాలో 3,600 మంది రూ.500 చొప్పున కొనుగోలు చేసి పాల్గొనగా ఆ యజమానికి రూ.18లక్షల ఆదాయం వచ్చినట్టు తెలిసింది. అతని ప్లాటుకు రూ.12లక్షల వరకు ధర చెప్పినా ఎవరూ కొనకపోవడంతో ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. కాగా, ప్లాటు, ఇల్లుకు సంబంధించి అన్ని అనుమతులు ఉన్నాయా.. లేవా అనేది, చట్టపరమైన సమస్యలు ఏమైనా వస్తాయనేది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరముంది. ఫ పోతే వెయ్యి..వస్తే ఇల్లు అని సోషల్ మీడియాలో ప్రచారంఫ చౌటుప్పల్లో ఇప్పటికే డ్రా తీసిన ఇంటి యజమాని ఫ సూర్యాపేట, నల్లగొండ పట్టణాల్లో మూడు నెలల గడువుతో లక్కీడ్రా పెట్టిన ఇద్దరు యజమానులు ఫ లక్కీడ్రాలు నేరం అంటున్న పోలీసులు -
ఖోఖో క్రీడాకారుల ఎంపిక
ఖోఖో ఆడుతున్న విద్యార్థినులు సూర్యాపేట : జిల్లాస్థాయి ఖోఖో క్రీడాకారులను ఎంపిక చేశారు. గురువారం సూర్యాపేట మండల పరిధలోని పిల్లలమర్రి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ 14, 17 బాలబాలికల విభాగాల్లో నియోజకవర్గ స్థాయి ఖోఖో పోటీలు నిర్వహించారు. క్రీడాపోటీలను ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు సునిత రాణి ప్రారంభించారు. అండర్ 17 బాలుర విభాగంలో మొదటి స్థానంలో తుంగతుర్తి, రెండవ స్థానంలో కోదాడ, బాలికల విభాగంలో మొదటి స్థానంలో తుంగతుర్తి, రెండవ స్థానంలో సూర్యాపేట నిలిచాయి. అండర్ 14 బాలుర విభాగంలో మొదటి స్థానంలో తుంగతుర్తి, రెండవ స్థానంలో సూర్యాపేట, బాలికల విభాగంలో మొదటి స్థానంలో తుంగతుర్తి, రెండవ స్థానంలో సూర్యాపేట జట్లు నిలిచాయి. వీరిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఉమ్మడి జిల్లాకు ఎంపిక చేయనున్నట్లు ఎస్జీఎఫ్ సెక్రటరీ మందడి కిరణ్ కుమార్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్జీఎఫ్ మాజీ సెక్రటరీ ఆజాం బాబా, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగోని శ్రీనివాస్, పీడీలు గడ్డం వెంకటేశ్వర్లు, లొడంగి సైదులు, మైసయ్య, వీరయ్య, శ్రీను, ఉస్మాన్, కార్తిక్ రెడ్డి, వెంకటేష్, ప్రమీల పాల్గొన్నారు. -
మానవ అవయవాల పనితీరు ఇలా..
సూర్యాపేటటౌన్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మంగళవారం రెండో రోజు మెడ్ ఎక్స్ 2025 ఎగ్జిబిషన్ కొనసాగింది. మొత్తం 21 విభాగాలలో 200కు పైగా ఎగ్జిబిట్లను మెడికల్ విద్యార్థులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జయలత మాట్లాడుతూ జిల్లాలోని వివిధ కళాశాలలు, పాఠశాలలకు చెందిన 6వేలమందికి పైగా విద్యార్థులు ఈ ప్రదర్శనలను తిలకించినట్టు చెప్పారు. విద్యార్థులకు వైద్యరంగం పట్ల, ఆరోగ్యం పట్ల చెప్పాల్సిన అన్ని విషయాలను కూడా ప్రదర్శనలో ప్రయోగాత్మకంగా వివరించినట్లు వెల్లడించారు. తరగతి గదుల్లో విద్యార్థులు పాఠ్యాంశాలలో నేర్చుకున్న విషయాలను మెడికల్ ఎగ్జిబిషన్ ద్వారా ప్రాక్టికల్గా కళ్లకు కట్టినట్టుగా ప్రదర్శించామన్నారు. వైద్యరంగంలో వస్తున్న వివిధ సాంకేతిక పరికరాలు, వాటి పనితీరు ఆపదలో ఉన్న వారికి ఏ విధమైన వైద్యం అందిస్తారనే విషయాలను ఈ ఎగ్జిబిషన్ ద్వారా విద్యార్థులకు తెలియజేసినట్లు తెలిపారు. చనిపోయిన మనిషి శరీరం చూపిస్తూ మానవ శరీరంలో ఉండే వివిధ భాగాలు పనిచేసే విధానం వివరించారని చెప్పారు. మహిళలకు పోషకార లోపంతో వచ్చే ఆరోగ్య సమస్యలు, మహిళకు ఎక్కువగా వచ్చే గర్భాశయ క్యా న్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ గురించి, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు డాక్టర్ కృష్ణయ్య, పద్మావతి, తరుణి, జెమిమా, రా ధిక, బాబురావు, శ్రీకాంత్, గురురాజ్ పాల్గొన్నారు. మానవ శరీరంలోని వివిధ అవయవాల పనితీరును వివరిస్తున్న విద్యార్థులు మెదడు పనితీరును వివరిస్తున్న ఎంబీబీఎస్ విద్యార్థి ఫ రెండో రోజు కొనసాగిన మెడ్ ఎక్స్ ఎగ్జిబిషన్ -
లిఫ్టుల నిర్మాణంలో నాణ్యత లోపిస్తే ఉపేక్షించం
హుజూర్నగర్ : లిఫ్టుల నిర్మాణంలో నాణ్యత లోపిస్తే ఉపేక్షించేది లేదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లో చేపట్టిన ఎత్తిపోతల పథకాలు, వివిధ శాఖల కార్యాలయ భవనాల నిర్మాణ పురోగతిపై మంగళవారం హైదారాబాద్లోని సచివాలయంలో ఎమ్మెల్యే పద్మావతి, కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్లతో కలిసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెండు నియోజక వర్గాలను సస్యశ్యామలం చేయడానికే ఎత్తిపోతల పథకాల నిర్మాణాలను ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టామన్నారు. ఎత్తిపోతల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని, రాజీ పడితే సహించేదిలేదని తీవ్ర పరిణామాలు ఉంటాయని అధికారులను, ఏజెన్సీలను ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాల ద్వారా నిర్దేశిత ఆయకట్టుకు ఆనుకుని ఉన్న భూములు సేద్యంలోకి వస్తాయని భావిస్తే లిఫ్టుల సామర్థ్యాన్ని పెంచాలని అధికారులకు సూచించారు. స్వల్ప మార్పులతో అదనపు ఆయకట్టు సేద్యంలోకి వచ్చేందుకు అయ్యే అదనపు నిధులను సమకూరుస్తామని హామీ ఇచ్చారు. లిఫ్టుల నిర్మాణాలకు భూసేకరణ చేసి రైతులకు నగదు చెల్లించిన భూములను అధికారులు సత్వరం స్వాధీనం చేసుకోవాలన్నారు. పంటకు పంటకు మధ్యలో ఉండే సమయాన్ని సద్వినియోగం చేసుకుని లిఫ్టు నిర్మాణాలను మరింత వేగవంతం చేయాలని సూచించారు. సమావేశంలో నీటిపారుదల శాఖ ఈఎన్సీలు అంజద్ హుస్సేన్, శ్రీనివాస్, రమేష్ బాబులతో పాటు రెండు నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.ఫ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
సూర్యాపేట : విద్యార్థుల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూర్యాపేట జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ సూచించారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు చట్టాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. విద్యార్థులు తల్లిదండ్రుల మాటలు వినాలన్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సెల్ ఫోన్లను చదువుకోసం మాత్రమే వినియోగించాలన్నారు. 18 సంవత్సరాలు నిండనివారు వాహనాలు నడపవద్దని, దీని వల్ల తల్లిదండ్రులు శిక్షార్హులు అవుతారన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్ఎంకు సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, హెచ్ఎం నాగరాణి, డిఫెన్స్ కౌన్సిల్స్ సుంకరబోయిన రాజు, బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, మిడియేషన్ సభ్యులు గుంటూరు మధు, అల్లంనేని వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.ఫ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ -
జాగ్రత్తలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ
తిరుమలగిరి (తుంగతుర్తి) : వాహనదారులు జాగ్రత్తలు పాటిస్తేనే రోడ్డు ప్రమాదాలు నివారించ వచ్చని ఎస్పీ నరసింహ పేర్కొన్నారు. మంగళవారం తిరుమలగిరి క్రాస్ రోడ్డుతో పాటు తొండ, వెలిశాల, మామిడాలలో బ్లాక్ స్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకొని ముందుకు వెళ్తోందన్నారు. ప్రధాన రహదారులపై ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లు గుర్తించామన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి క్షేత్ర స్థాయిలో రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. తిరుమలగిరిలోని తెలంగాణ చౌరస్తాలో నాలుగు వైపులా రోడ్ల మీద వాహనాలు నిలుప రాదని, సర్వీస్ రోడ్లపై దుకాణాలు, పండ్ల బండ్లు ఏర్పాటు చేయవద్దని సూచించారు. ప్రమాదాలు జరిగితే జీవితాలు కోల్పోవాల్సి వస్తుందన్నారు. రోడ్లపై దుకాణాలు నిర్వహించే వారికి నోటీసులు ఇచ్చి తొలగించాలన్నారు. వాహనదారుల అతి వేగం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని, తక్కువ వేగంతో వాహనాలు నడపాలన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ నాగేశ్వరరావు, ఎస్ఐ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ మున్వర్అలీ, నేషనల్ హైవే ప్రాజెక్టు మేనేజర్ రమేష్ పాల్గొన్నారు.ఫ ఎస్పీ నరసింహ -
ప్రతి విద్యార్థి లక్ష్యం కలిగి ఉండాలి
సూర్యాపేట: విద్యార్థులు చిన్నప్పటి నుంచే లక్ష్యం కలిగి ఉండాలని సూర్యాపేట జిల్లా కోర్టు మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎన్.అపూర్వ రవళి సూచించారు. సోమవారం సూర్యాపేట పట్టణంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులకు చట్టాలపై నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు తమ హక్కులను తెలుసుకోవడం ముఖ్యమన్నారు. సెల్ఫోన్ వాడటం వల్ల చాలా దుష్ప్రయోజనాలు ఉన్నాయన్నారు. సెల్ఫోన్ కేవలం చదువు కోవడానికే ఉపయోగించాలని సూచించారు. ఫోన్లో బెట్టింగ్ గేమ్స్ ఆడటం వల్ల ఆర్థికపరమైన నష్టాలు వస్తాయన్నారు. 18ఏళ్ల వయసు నిండకుండా బైక్ నడిపితే వారి తల్లిదండ్రులు కూడా శిక్షార్హులు అవుతారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సుంకరిబోయిన రాజు, ఉపాధ్యక్షుడు గుంటూరు మధు, డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్కుమార్, న్యాయవాదులు అల్లంనేని వెంకటేశ్వర్రావు, తదితరులు పాల్గొన్నారు. -
వార్డు కమిటీలు నిస్తేజం
సూర్యాపేట అర్బన్: మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన వార్డు కమిటీలు నిస్తేజంగా మారాయి. పట్టణాల అభివృద్ధిలో ఈ కమిటీల భాగస్వామ్యం ఎక్కడా కన్పించడంలేదు. ఫలితంగా స్థానిక సమస్యలు పరిష్కారానికి నోచుకోక పేరుకుపోతున్నాయి. 141వార్డుల్లో.. పట్టణాల అభివృద్ధిలో పాలకవర్గం, అధికారయంత్రాంగంతో పాటు ప్రజలను భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో 2020 ఏప్రిల్లో అప్పటి ప్రభుత్వం వార్డుకమిటీలు ఏర్పాటు చేసింది. వార్డుకు నాలుగు కమిటీల చొప్పున ఒక్కో కమిటీల్లో 15 మంది సభ్యులను ఎంపిక చేశారు. యువజన సంఘం, సీనియర్ సిటిజన్ ,మహిళా సంఘం, వార్డు ప్రముఖులతో ఈ కమిటీలను ఏర్పాటు చేశారు. ఇలా జిల్లా వ్యాప్తంగా ఐదు మున్సిపాలిటీల పరిధిలో 141 వార్డుల్లో 2,115 మంది సభ్యులను ఎంపిక చేశారు. వీరంతా వార్డు అవసరాలపై అవగాహన కలిగి ఉంటారని భావించారు. ప్రజలు, అధికారుల మధ్య కమిటీ సభ్యులు అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తూ స్థానిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చొరవ చూపాల్సిన బాధ్యత వీరిపై ఉంది. ఏర్పాటు చేసిన రోజు మినహా సభ్యులను ఇంతవరకు మున్సిపల్ కార్యాలయాలకు పిలిచిన దాఖలాలు లేవు. వారి సలహాలు స్వీకరించింది లేదు. దీంతో వార్డుల్లో నెలకొన్న అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. వివిధ పట్టణాల్లో రాజకీయ కారణాలతో కమిటీలు నామ మాత్రం అయ్యాయి. మరికొన్ని చోట్ల అధికారుల నిర్లక్ష్యంతో మొక్కుబడిగా మారాయి. ప్రధాన సమస్యలు.. ఫ వార్డుల్లో పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగడం లేదు ఫ నాలాల ఆక్రమణలు పెరిగాయి. మిషన్ భగీరథ నీరు కొన్ని పట్టణాల్లో సరిగా రావడం లేదు. ప్లాస్టిక్ నిషేధంపై చైతన్యం కొరబడింది ఫ నాలాల ఆక్రమణతో వర్షం పడినప్పుడు ఇళ్లలోకి నీళ్లు ప్రవేశిస్తున్నాయి ఫ వార్డు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని ఆరోపణలు ఉన్నాయి ఫ అధికారులు, పాలకవర్గాల తీరుతో కాగితాలకే పరిమితం ఫ మున్సిపాలిటీల్లో పేరుకుపోతున్న సమస్యలు ఫ అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న ప్రజలు -
గోదావరి జలాలు పునరుద్ధరణ
అర్వపల్లి: జిల్లాకు గోదావరి జలాలను సోమవారం పునరుద్ధరించారు. అయితే వానాకాలం సీజన్కు గాను సెప్టెంబర్ 8నుంచి నీటిని జిల్లాకు విడుదల చేశారు. వారబంధీ విధానం అయినప్పటికీ నిరంతరాయంగా 50 రోజుల పాటు అక్టోబర్27 వరకు నీటిని వదిలారు. ఆతర్వాత నీటిని నిలిపివేశారు. అయితే భారీ వర్షాలకు ఎస్సారెస్పీ నిండి గేట్లు ఎత్తడంతో జిల్లాకు మళ్లీ గోదావరి జలాలను పునరుద్ధరించారు. ప్రస్తుతం 500 క్యూసెక్కుల నీటిని వదిలారు. విద్యుత్ సమస్యలన్నీ పరిష్కరిస్తాంసూర్యాపేట అర్బన్: విద్యుత్ సమస్యలన్నింటినీ పరిష్కరించడమే తమ లక్ష్యమని ట్రాన్స్కో ఎస్ఈ ఫ్రాంక్లిన్ పేర్కొన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యుత్ కార్యాలయంలో వినియోగదారుల దినోత్సవంలో భాగంగా నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యుత్ అధికారులు, సిబ్బంది నిరంతరం వినియోగదారులకు అందుబాటులో ఉంటారన్నారు . రైతులు, గృహ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది కలగనీయమని స్పష్టం చేశారు. మీటర్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వెంటనే తెచ్చి బిగిస్తామని తెలిపారు. సిటిజన్చార్ట్లో పేర్కొన్న విధంగా పనులు చేయకపోతే విద్యుత్ అధికారులపై వినియోగదారులు ఫిర్యాదు చేసుకోవచ్చని సూచించారు. సదస్సులో డీఈ శ్రీనివాస్, విద్యుత్ అధికారులు పాల్గొన్నారు. కనీస వేతనం 26వేల రూపాయలకు పెంచాలి భానుపురి (సూర్యాపేట) : పెరుగుతున్న ధరలకు అనుగుణంగా గ్రామపంచాయతీ, మున్సిపల్ కార్మికుల కనీస వేతనాలను 26 వేల రూపాయలకు పెంచి వారందరిని పర్మినెంట్ చేయాలని ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా నాగయ్య కోరారు. తెలంగాణ ఆదర్శ గ్రామపంచాయతీ – మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ఈమేరకు డీపీఓ యాదగిరికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కార్యక్రమంలో తెలంగాణ ఆదర్శ గ్రామపంచాయతీ – మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి సామా నర్సిరెడ్డి, ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కునుకుంట్ల సైదులు ,జిల్లా సహాయ కార్యదర్శి దేశోజు మధు, సూరారపు లక్ష్మణ్ పాల్గొన్నారు. -
విద్యలో అగ్రస్థానంలో నిలపాలి
సూర్యాపేట : ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా ను ఉపయోగించి విద్యార్థులను కార్పొరేట్కు దీటుగా పోటీ పరీక్షలకు తీర్చిదిద్దెలా ఉపాధ్యాయులు కృషి చేసి జిల్లాను విద్య లో అగ్ర స్థానంలో నిలపాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ కోరారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో విద్యా శాఖ అధికారులు, ఎంఈఓలు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. పాఠశాలలో రోజూ ఫుడ్ టెస్టింగ్ రిజిస్టర్లో వివరాలు నమోదు చేయాలని, ఎంఈఓలు, కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు క్షేత్రస్థాయి పర్యటన చేసినప్పుడు కచ్చితంగా రిజిస్టర్ను పరిశీలించాలని ఆదేశించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో బియ్యం, కూరగాయలు, వంట సామగ్రిలో నాణ్యత పాటిస్తూ మెరుగైన పోషకాహారం అందించాలన్నారు. ఎక్కడైనా మధ్యాహ్నం భోజనం విషయంలో తప్పులు దొర్లితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, కోఆర్డినేటర్లు జనార్దన్, శ్రావణ్, రాంబాబు, పూలన్, డీఈ రమేష్, ఏఈ ఓబులేసు, ఎంఈఓ లు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు పాల్గొన్నారు. ఉచిత చేపపిల్లల పంపిణీకి సంసిద్ధం జిల్లాలో చెరువులు, రిజర్వాయర్లలో ఉచిత చేప పిల్లల పంపిణీకి రూట్మ్యాప్తో సహా సంసిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. ఉచిత చేప పిల్లల పంపిణీపై రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, మత్స్య శాఖ అధికారులతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. అనంతరం ఇదే అంశంపై జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. నియోజకవర్గాల వారీగా చేప పిల్లల స్టాకింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, జిల్లా మత్స్యశాఖ అధికారి బి. నాగులు, డీపీఓ యాదగిరి, జిల్లా ఇరిగేషన్ అధికారి యాదగిరి నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
పెండింగ్ అర్జీలు పరిష్కరించాలి
సూర్యాపేట: ప్రజావాణికి సంబంధించి పెండింగ్ అర్జీలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ కె. సీతారామారావుతో కలిసి ప్రజలనుంచి అర్జీలను స్వీకరించి మాట్లాడారు. అధికారుల కృషిఫలితంగానే హుజూర్నగర్లో మెగా జాబ్ మేళా విజయవంతమైందన్నారు. అనంతరం డీఆర్డీఓ వి.వి అప్పారావు, జిల్లా ఇండస్ట్రీస్ అధికారి సీతారాంనాయక్, షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి అధికారి శ్రీనివాస్కు కలెక్టర్ ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ వి.వి. అప్పారావు, డీపీఓ యాదగిరి, డీఈఓ అశోక్, సంక్షేమ అధికారులు నరసింహారావు, శంకర్, శ్రీనివాస్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డి. శ్రీనివాస్, హౌసింగ్ పీడీ సిద్ధార్థ, జిల్లా స్పోర్ట్స్ అధికారి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. -
మూడు గేట్ల ద్వారా మూసీ నీటి విడుదల
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్ఫ్లో కొనసాగుతోంది. సోమవారం ప్రాజెక్టులోకి 4,927 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా అధికారులు 3 గేట్లను రెండు అడుగుల మేర పైకెత్తి 4,861 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 645 అడుగులు (4.46 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 643.70 అడుగుల (4.12 టీఎంసీల) నిల్వ ఉంచి దిగువకు నీటి విడుదల కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు, సీపేసీ, లీకేజీ, ఆవిరి రూపంలో మరో 70 క్యూసెక్కుల నీరు విడుదలవుతుందని తెలిపారు. -
పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
సూర్యాపేట: : ఇటీవల వచ్చిన మోంథా తుపాన్ ప్రభావంతో కురిసి భారీ వర్షాలకు నష్టపోయిన పంటను అంచనావేసి రైతాంగానికి పరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లు నాగార్జున రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. తుపాన్ వల్ల వరి పంట పూర్తిగా దెబ్బతిన్నదని, పత్తి రంగు మారడంతో పాటు చెట్లపైనే కాయలుకుళ్లిపోయాని అన్నారు. దీంతో సీసీఐ కేంద్రాల్లో పత్తి కొనుగోలు చేయడం లేదన్నారు. ఈ ఽకార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు కొలిశెట్టి యాదగిరిరావు, పారేపల్లి శేఖర్ రావు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, సహాయ కార్యదర్శి దండా వెంకటరెడ్డి, షేక్ సైదా, దుగ్గి బ్రహ్మం, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి, రైతు సంఘం నాయకులు దేవరం వెంకటరెడ్డి, నాగిరెడ్డి శేఖర్ రెడ్డి, గోపాల్ రెడ్డి,నారాయణ వీరారెడ్డి, అప్పయ్య పాల్గొన్నారు. -
నలభై వసంతాలకు ఒకే వేదికపైకి..
హుజూర్నగర్ : వారంతా పదో తరగతిలో ఒకే పాఠశాలలో చదువుకున్న స్నేహితులు.. నలభై వసంతాల తర్వాత కలుసుకుని ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. వీరే గరిడేపల్లి మండలం కల్మలచెరువు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1984–85 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు. వీరు ఆదివారం అదే పాఠశాలలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. 40 సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న వీరంతా అప్పటి తీపి జ్ఞాపకాలను పంచుకుని రోజంతా ఆనందంగా గడిపారు. అప్పట్లో తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు నారాయణరెడ్డి, పి.వీరబాబు, విజయకుమారిలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఎడవెల్లి వెంకటరెడ్డి, కంబాలపల్లి వెంకటనారాయణ, కడియం వెంకట్రెడ్డి, అనంతరెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
వార్డుల్లో అధికారుల పర్యవేక్షణేదీ?
సూర్యాపేట అర్బన్ : పట్టణాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాల్సిన వార్డు అధికారులు విధుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించాల్సిఉన్నా కార్యాలయాలకే పరిమితం అవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ఏడాది క్రితం ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీల్లో వార్డు అధికారులను నియమించింది. జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో విధులు చేపట్టిన వార్డు అధికారుల పనితీరు అంతంతమాత్రంగానే ఉంది. ప్రతిరోజూ ఉదయం పూట చెత్త సేకరణ ప్రక్రియను పరిశీలించాల్సి ఉన్నా కేవలం వాహనాల వద్దకు వెళ్లి ఫొటోలు దిగి అప్లోడ్ చేస్తున్నారు. దీంతో ఇంటింటికి తిరిగి తడి పొడి చెత్త వేర్వేరుగా సేకరించాల్సిన కార్యక్రమం సరిగా అమలు కావడం లేదు. వార్డు కేంద్రాల్లో వార్డు ఆఫీసులు ఉండి ప్రతి ఆఫీసులో అధికారుల పేర్లు సెల్ నంబర్లు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి వార్డు అధికారుల పనితీరు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని పట్టణాల ప్రజలు కోరుతున్నారు వార్డు అధికారుల విధులు ఇవీ.. ఫ రోజూ పారిశుద్ధ్య పనుల పర్యవేక్షించాలి. ఫతడిపొడిచెత్త వేర్వేరుగా ఇచ్చేలా తెలియజెప్పాలి. ఫ రోడ్లు, మురుగు కాలువలు, ప్రజా మరుగుదొడ్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలి. ఫ అంటువ్యాధులు ప్రబలకుండా చూడాలి. ఫ మార్కెట్లను పరిశుభ్రంగా ఉంచాలి. ఫ ప్లాస్టిక్ కవర్ల నిషేధం అమలు చేయాలి. ఫ వీధిదీపాలు, నీటి సరఫరాను పర్యవేక్షించాలి. ఫ వార్డు ప్రజలకు సర్టిఫికెట్లు జారీ చేయాలి. ఫ ఇంటి పన్నులు వసూలు చేయాలి. ఫ వార్డు ప్రజలకు మున్సిపల్ అధికారులకు అనుసంధానంగా ఉండి సమస్యలు పరిష్కరించాలి. ఫ వార్డు అధికారులు వార్డుల్లోనే నివాసం ఉండాలి. మున్సిపాలిటీ మొత్తం ప్రస్తుతం ఇన్చార్జ్లు సూర్యాపేట 48 33 15కోదాడ 35 25 10హుజూర్నగర్ 28 08 20 తిరుమలగిరి 15 06 09నేరేడుచర్ల 15 05 10 ఫ మున్సిపల్ కార్యాలయాలకే పరిమితమైన సిబ్బంది ఫ క్షేత్రస్థాయిలో పర్యటించట్లేదని విమర్శలు ఫ ఇన్చార్జ్లతోనే నెట్టుకొస్తున్న దైన్యం ఫ సమస్యలు పరిష్కరించడం లేదంటున్న పట్టణ వాసులు వార్డు ఆఫీసర్లు కొందరు గ్రూప్–1, 2 ఉద్యోగాల్లో చేరారు. దీంతో అధికారుల కొరత ఏర్పడింది. రెండు వార్డులకు ఒక ఇన్చార్జి ఉండడంతో పర్యవేక్షణ కొరవడింది. ప్రజలకు అందుబాటులో ఉండేలా చూస్తాం. – సీహెచ్ హనుమంతరెడ్డి, మున్సిపల్ కమిషనర్, సూర్యాపేట -
ఇ–కేవైసీ 72 శాతమే..
చిలుకూరు: కొందరికి రేషన్ కార్డులు ఉన్నా బియ్యం తీసుకోవడం లేదు. ఇలాంటి వారితోపాటు అనర్హులను తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినంది. ఇందులో భాగంగా ప్రతి రేషన్ కార్డుదారుడు ఇ–కేవైసీ చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో మొత్తం రేషన్ లబ్ధిదారులు 10.62లక్షల మందికి గాను 7.58లక్ష మందే (72 శాతమే) ఇప్పటి వరకు ఇ–కేవైసీ చేయించుకున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. వరుసగా ఆరు నెలల పాటు రేషన్ బియ్యం తీసుకోని వారిని గుర్తించి వారి కోటాను తగ్గించడం లేదా లబ్ధిదారుడి కార్డును తొలగించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తెలిసింది. రేషన్కార్డు గల కుటుంబంలోని వ్యక్తులు ఎవరైన చనిపోతే వారికి సంబంధించిన కోటాను తగ్గించడం లేదు. దీంతో ప్రతినెలా జిల్లాలో వందల క్వింటాళ్ల బియ్యాన్ని ఆయా కుటుంబ సభ్యులు తీసుకుంటున్నట్లుగా గుర్తించిన ప్రభుత్వం ఇ–కేవైసీ విధానం తెచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఇ–కేవైసీ నమోదుకు పలుసార్లు అవకాశం ఇచ్చినా అనేక మంది ఈ ప్రక్రియలో పేరు నమోదు చేయించుకోవడం లేదని అధికారులు అంటున్నారు. ఇ–కేవైసీ తప్పనిసరి జిల్లాలో 610 రేషన్షాపులు.. 3.60లక్షల కార్డులు.. 10.62లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు 7.58లక్ష మందే ఇ–కేవైసీ చేయించుకున్నారు. వీరికి ప్రతినెలా 68 వేల క్వింటాళ్ల రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నారు. రేషన్కార్డు పొందిన కుటుంబంలోని ప్రతిఒక్కరూ తప్పనిసరిగా ఇ–కేవైసీ చేయించుకోవాల్సిందేనని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు అంటున్నారు. అలాగే కొత్తగా రేషన్కార్డులు పొందిన కుటుంబాల లబ్ధిదారులు కూడా ఇ–కేవైసీ చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఫ కొనసాగుతున్న రేషన్ కార్డు ఇ–కేవైసీ ప్రక్రియ ఫ చేయించుకుంటేనే రేషన్ బియ్యం ఫ లేదంటే కార్డు తొలగించే అవకాశం ఫ జిల్లాలో రేషన్ కార్డులు 3,60,112 ఫ లబ్ధిదారులు 10,62,021 మంది ఫ ఇ–కేవైసీ చేయించుకున్నది 7,58,712 మంది -
అన్నదాతపై వరికోతల భారం
తిరుమలగిరి (తుంగతుర్తి) : మోంథా తుపాను అన్నదాతను ఆగం చేసింది. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షం కారణంగా ఒకవైపు కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం తడిసి ముద్దవుతుండగా..మరోవైపు కోతకొచ్చిన వరిపొలాల్లోకి నీరుచేరి నేలవాలాయి. నీటిలోనే మునిగిఉన్న వరిపంటను కోయించాలంటే రైతులు టైర్ హార్వెస్టర్లకు బదులు చైన్ హార్వెస్టర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో చైన్ హార్వెస్టర్లకు డిమాండ్ పెరింది. ఫలితంగా వాటి యజమానులు వరికోత ధరలు పెంచారు. గతంలో చైన్ హార్వెస్టర్తో ఎకరం వరిపొలం కోసేందుకు గంట సమయం పట్టేది. ఇందుకు రూ.3 వేలు ఖర్చు అయ్యేది. ప్రస్తుతం గంటకు రూ.3,500 వరకు వసూలు చేస్తుండడానికితోడు పొలాల్లో బురద ఉండడంతో ఎకరా వరిపంటను కోసేందుకు రెండు గంటలు పడుతుంది. అయితే టైర్ల హార్వెస్టర్కు గంటకు రూ.1,800 నుంచి రూ.2వేలు, ఫోర్వీల్ హార్వెస్టర్కు గంటకు రూ.3వేలు వేలు కాగా, చైన్ హార్వెస్టర్కు గంటకు రూ.3,500 వసూలు చేస్తున్నారు. దీంతో వరికోత ఖర్చు రెండింతలు పెరిగిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. 4.65 లక్షల ఎకరాల్లో వరిసాగు జిల్లావ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్లో 4,65,163 ఎకరాల్లో రైతులు వరిపంట సాగుచేశారు. ప్రస్తుతం 50 వేల ఎకరాల్లో వరికోతలు పూర్తికాగా 2లక్షల ఎకరాలు కోసేందుకు సిద్ధంగా ఉంది. మిగతా పొలాలు పొట్టదశలో ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇటీవల తుపాను ప్రభావంతో దాదాపు అన్ని మండలాల్లో సగానికిపైగా వరిపంట నేలకొరిగింది. దీంతో కేవలం చైన్ హార్వెస్టర్లతోనే కోస్తున్నారు. ఎకరానికి 2 గంటల సమయం సాధారణంగా ఎకరం వరిపంటను చైన్ హార్వెస్టర్ గంట సేపు కోస్తుంది. వర్షాలతో పొలాల్లో బుదర ఉండి వరి నేలవాలాయి. దీంతో ప్రస్తుతం ఎకరం వరిపొలం కోసేందుకు 2 గంటలకు మించి సమయం పడుతుంది. దీంతో ఎకరాకు రూ.5 వేలు అదనంగా చెల్లించాల్సి వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. అంతే కాకుండా ప్రస్తుతం పొలాల్లో బురద ఉండటంతో ట్రాక్టర్లు పొలాల వద్దకు వెళ్లలేని పరిస్థితి ఉంది. దీంతో చైన్ హార్వెస్టర్లు వరి పంటను కోసిన అనంతరం దూరంగా ఉన్న ట్రాక్టర్ వద్దకు వెళ్లి ధాన్యం పోసి మళ్లీ వెనక్కి వచ్చేందుకు మరికొంత సమయం పడుతుంది. ఫ మోంథా తుపానుతో కురుస్తున్న వర్షం ఫ నీళ్లు చేరి నేలవాలిన వరిపొలాలు ఫ చైన్ హార్వెస్టర్తోనే కోసేందుకు అవకాశం ఫ గంటకు రూ.3,500 వసూలు చేస్తున్న యజమానులు ఫ ఎకరాకు అదనంగా రూ.5వేలు చెల్లిస్తున్న రైతులు తుపాను ప్రభావంతో పొలాలన్నీ బురదగా మారాయి. దీంతో చైన్ హార్వెస్టర్లలో పొలాలను కోపిస్తున్నాం. గంటకు రూ.3,500 చెల్లించాల్సి వస్తుంది. 8 ఎకరాల్లో వరిపంట కోసేందుకు 17 గంటల సమయం పట్టింది. ఈసారి కోతల భారం పెరిగింది. – రామారావు, తొండ, తిరుమలగిరి మండలం తుపాను కారణంగా అంతటా వడ్లు తడిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వరికోతలు పూర్తయిన రైతులు ధాన్యం తడవకుండా భద్రపర్చుకోవాలి. కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలి. – శ్రీధర్రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి -
నేడు విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
సూర్యాపేట అర్బన్ : సూర్యాపేట డివిజన్లో విద్యుత్ సమస్యల పరిష్కారంలో భాగంగా సోమవారం ఉదయం 10 గంటలకు సూర్యాపేటలోని జమ్మిగడ్డలో ఉన్న సర్కిల్ ఆఫీస్ థర్డ్ ఫ్లోర్లో విద్యుత్ వినియోగదాల దినోత్సవాన్ని నిర్వహించనున్నట్టు జిల్లా విద్యుత్ అధికారి బి.ఫ్రాంక్లిన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించే సమావేశంలో విద్యుత్ వినియోదారుల హక్కుల గురించి తెలియజేస్తామని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులకు ఏమైనా సమస్యలు, సందేహాలు ఉంటే వినతులు అందజేయాలని తెలిపారు. అధి కారులు స్పందించకపోతే ఈ సమావేశంలో నేరుగా చెప్పవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులంతా వినియోగించుకోవాలని కోరారు. వైభవంగా నారసింహుడి నిత్యకల్యాణంహుజూర్నగర్: మఠంపల్లి మండలం మట్టపల్లి క్షేత్రంలో ఆదివారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం గావించారు. స్వామి అమ్మవార్లను నూతన పట్టువస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోలు మహోత్సవం చేపట్టారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తంలబ్రాలతో నిత్యకల్యాణాన్ని నిర్వహించారు. ఆ తర్వాత శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించి మహా నివేదన చేసి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు విజయ్కుమార్, ఈఓ నవీన్కుమార్, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, ఆంజనేయాచార్యులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. అమరుల త్యాగాలు మరువలేనివి కోదాడరూరల్ : సమాజ మార్పు కోసం అమరులైన వారి త్యాగాలు మరువలేనివని అరుణోదయ జిల్లా అధ్యక్షుడు ఉదయగిరి అన్నారు. ఆదివారం కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండలో సీపీఐ (ఎంఎల్) ఆధ్వర్యంలో నిర్వహించిన అమరువీరుల వారోత్సవాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విప్లవోద్యమంలో అసువులుబాసిన అమరులకు నివాళులర్పించి మాట్లాడారు. విప్లవోద్యమంలో ప్రతిఘటన పోరాట నిర్మాత చండ్ర పుల్లారెడ్డి లాంటి అనేక మంది ఉద్యమకారులు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మద్దెల జానయ్య, కామల్ల సైదులు, మద్దెల ప్రతాప్, భిక్షం, వెంకన్న, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
100 రోజులు.. 35 టీఎంసీలు
కేతేపల్లి: ఈ ఏడాది జిల్లాతోపాటు ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు మూసీ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఈ వానాకాలం సీజన్లో ఇప్పటి వరకు దాదాపు 39 టీఎంసీల వరద నీరు ఈ ప్రాజెక్టులోకి వచ్చి చేరింది. దీంతో విడతల వారీగా ప్రాజెక్టు క్రస్ట్గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని వదిలారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల సరిహద్దులో ఉన్న ఈ ప్రాజెక్టు కింద 35వేల ఎకరాల ఆయకట్టు ఉంది. సీజన్ ప్రారంభంలోనే నిండిన మూసీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాగార్జున సాగర్ తర్వాత అతిపెద్ద సాగునీటి వనరుగా ఉన్న మూసీ ప్రాజెక్టుకు జిల్లాతో పాటుగా వికారాబాద్, హైదరాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాల పరిధిలో క్యాచ్మెంట్ ఏరియా ఉంది. ఆయా ప్రాంతాల్లో ఈ సారి భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. దీంతో మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతంగా సాగుతోంది. ఈ ఏడాది వానాకాలం సీజన్ ప్రారంభంలోనే మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండింది. మూసీలో గరిష్ట నీటిమమట్టం 645 అడుగులు కాగా జూలై మాసంలోనే 644 అడుగులకు చేరుకుంది. దీంతో ఈ ఏడాది జూలై 25న మొదటి సారి గేట్లు ఎత్తి నీటిని దిగవకు వదిలారు. దీంతోపాటు నల్లగొండ, సూర్యాపేట జిల్లాలోని 42 గ్రామాల్లో వానాకాలం పంటల సాగుకు నీటిని విడుదల చేశారు. నాటి నుంచి వర్షాలు కురుస్తున్న కారణంగా వరదనీరు వస్తుండడంతో నేటికీ ప్రాజెక్టు నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతూనే ఉంది. తొమ్మిది రెట్ల వరద దిగువకు.. మూసీ జలాశయంలో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా గేట్లు ఎత్తడంతో గత 100 రోజుల వ్యవధిలో దాదాపు 35 టీఎంసీల నీరు దిగువన కృష్ణానదిపై నిర్మించిన పులిచింతల ప్రాజెక్టుకు చేరింది. ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం కంటే 9 రెట్ల వరదనీరు దిగువకు వెళ్లింది. సాధారణంగా ఒక టీఎంసీ నీటితో పదివేల ఎకరాలకు సాగునీటిని అందించవచ్చు. ఈ లెక్కన 35 టీఎంసీలతో 3.5లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించవచ్చు. దీన్నిబట్టి చూస్తే మూసీ ప్రాజెక్టు నుంచి ఈ ఏడాది వరదనీరు సముద్రం పాలయ్యయనేది ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వానాకాలం సాగు పంటకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేసిన తర్వాత కూడా ప్రాజెక్టు నిండు కుండలా ఉంది. దీంతో యాసంగి సీజన్లోనూ నీటి విడుదల ఎలాంటి ఢోకా ఉండదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫ మూసీ ప్రాజెక్టు నుంచి దిగువకు వెళ్లిన నీరు ఫ ఈసారి జూలైలోనే క్రస్ట్గేట్ల ఎత్తివేత ఫ ఇంకా కొనసాగుతున్న వరద, నీటి విడుదల -
పట్టణాల్లో జీ ప్లస్ వన్ ఇళ్లు
సూర్యాపేట అర్బన్ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో మున్సిపాలిటీల్లోని పేదలకు ఊరట లభించింది. ఇందిరమ్మ ఇంటిని కనీసం 600 చదరపు అడుగుల స్థలంలో నిర్మించుకోవాలనే నిబంధన ఉండగా గ్రామాలతో పోలిస్తే పట్టణాల్లోని లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలకు సరిపోయేంత స్థలం లేక ఆసక్తిచూపడం లేదు. దీంతో పట్టణ ప్రజల ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం 400 చదరపు అడుగుల కంటే తక్కువ స్థలం ఉన్నవారు కూడా జీ ప్లస్ వన్ విధానంలో ఇంటిని నిర్మించుకోవచ్చని నిబంధన సడలించింది. ఈ మేరకు ఇటీవల జీఓ కూడా జారీ చేసింది. భానుపురిలో 228 ఇళ్లకు మార్కింగ్ ఇందిరమ్మ ఇళ్లను జీ ప్లస్ వన్గా నిర్మించుకునే అవకాశం కల్పించడంతో జిల్లాలోని ఒక్క సూర్యాపేట మున్సిపాలిటీలోనే మొత్తం 48 వార్డుల్లో మొదటి విడతగా 318 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో 228 ఇందిరమ్మ ఇళ్లకు మార్కింగ్ చేశారు. వీటిలో దాదాపు 35 ఇళ్లు బేస్మెంట్ లెవల్కు చేరిన లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో రూ.లక్ష నగదు జమయ్యాయి. రూఫ్ లెవెల్ వచ్చిన ఇళ్లకు రూ.లక్ష, స్లాబ్ వేసిన తర్వాత రూ.1.40లక్షలు, లెట్రిన్తో సహా ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత రూ.1.60లక్షలను ప్రభుత్వం లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది. ఇదిలా ఉంటే ఇంటి నిర్మాణానికి ఆర్థిక స్తోమత లేనివారికి మెప్మా ద్వారా రుణాలు ఇప్పిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఇళ్ల నిర్మాణం ప్రారంభించని లబ్ధిదారులు జీ ప్లస్ వన్ విధానంలో నిర్మించుకునేలా వార్డు అధికారులు అవగాహన కల్పించాలని మున్సిపల్ కమిషనర్ హనుమంతరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని మిగతా మున్సిపాలిటీల్లోని ఇదే విధానం అమలు చేసేందుకు యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం నిబంధన సడలింపు ఫ ఇటీవల జీఓ జారీ చేసిన ప్రభుత్వం ఫ 400 చదరపు అడుగుల కంటే తక్కువ స్థలం ఉన్నా ఓకే ఫ తొలి విడతలో సూర్యాపేటకు 318 ఇళ్లు మంజూరు ఫ సరిపడా స్థలంలేని వారు కొత్త విధానంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవాలంటున్న అధికారులు -
రాజ్యాంగం వల్లే సమాన హక్కులు
తిరుమలగిరి : భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించిందని జిల్లా ప్రధాన జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్ పి.లక్ష్మీ శారద అన్నారు. శనివారం మద్దిరాల మండలం ముకుందాపురంలోని హెచ్ఎన్ఎల్ ఫంక్షన్హాల్లో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడారు. ఆర్థిక పరిస్థితి గాగాలేని ప్రతిఒక్కరూ జిల్లా న్యాయసేవ అధికార సంస్థను సంప్రదించి ఉచిత న్యాయసహాయం పొందవచ్చన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగ చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాఅధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి ఫర్హీన్కౌసర్, జూనియర్ సివిల్జడ్జ్ ఎండి గౌస్పాషా, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి అపూర్వ రవళి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొంపెల్లి లింగయ్య, సీఐ నర్సింహారావు, డీఎల్ఎస్ఏ నామినేటెడ్ మెంబర్స్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. -
15న ప్రత్యేక లోక్ అదాలత్
సూర్యాపేట : సూర్యాపేటతోపాటు కోదాడ, హుజూర్నగర్, తుంగతుర్తి కోర్టుల్లో ఈనెల 15న నిర్వహించే ప్రత్యేక లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన జడ్జి పి.లక్ష్మీ శారద శని వారం ఒక ప్రకటనలో తెలిపారు. అవకాశాన్ని కక్షిదారులు సద్విని యోగం చేసుకోవాలని కోరారు. ఓటరు జాబితా సవరణపై సమీక్షసూర్యాపేట : ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి హైదరాబాద్ నుంచి శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ఇతర అధికారులు హాజరయ్యారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పురోగతిపై సమీక్షించారు. కార్యక్రమంలో ఆర్డీఓలు తదితరులుణు పాల్గొన్నారు. రోడ్లకు మరమ్మతులుసూర్యాపేట అర్బన్ : సూర్యాపేట జిల్లా కేంద్రంలో గుంతలు పడి అధ్వానంగా ఉన్న అంతర్గత రోడ్లకు శనివారం మున్సిపాలిటీ, ఆర్అండ్బీ అధికారులు మరమ్మతులు చేపట్టారు. రోడ్డుపై వెళ్తే ఒళ్లు హూనం అనే శీర్షికన శనివారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి మున్సిపాలిటీ, ఆర్అండ్బీ అధికారులు స్పందించారు. తక్షణ మరమ్మతుల కింద పట్టణంలోని వివిధ చోట్ల రోడ్లపై ఏర్పడిన గుంతల్లో కంకర పొడి పోసి మరమ్మతులు చేయించారు. 5న ఆర్చరీ పోటీలునల్లగొండ టూటౌన్ : ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 5వ తేదీన భువనగిరిలో ఉమ్మడి నల్లగొండ జిల్లాస్థాయి సబ్ జూనియర్, జూనియర్ ఆర్చరీ సెలక్షన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆర్చరీ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీగిరి విజయ్కుమార్రెడ్డి, తునికి విజయసాగర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సెలక్షన్ పోటీల్లో పాల్గొనదల్చిన క్రీడాకారులు ఆయా పాఠశాల నుంచి జన్మదిన, బోనఫైడ్ సర్టిఫికెట్లతో న్యూ డైమెన్షన్ పాఠశాల వద్దకు 5వ తేదీన ఉదయం 9 గంటలకు చేరుకోవాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 99120 55678 ఫోన్ నంబర్ను సంప్రదించాలని సూచించారు. 3 నుంచి ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల నిరవధిక సమ్మెసూర్యాపేట : ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల విడుదలలో జాప్యాన్ని నిరసిస్తూ ప్రైవేట్ డిగ్రీ, పీజీ, అన్ని ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాలు ఈ నెల 3 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు మహాత్మాగాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ) పరిధిలోని ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు తీకుళ్ల శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి సీహెచ్.సత్యంగౌడ్ తెలిపారు. శనివారం ఆ సంఘం ఆధ్వర్యంలో ఎంజీయూ రిజిస్ట్రార్కు సమ్మె నోటీసును అందజేసి మాట్లాడారు. సమ్మెకు అన్నివర్గాలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు. -
ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాలి
సూర్యాపేట: ప్రయాణ సమయంలో ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని ఎస్పీ నరసింహ అన్నారు. రోడ్డు భద్రత చర్యల్లో భాగంగా శనివారం సూర్యాపేట మండల పరిధిలోని జాతీయ రహదారి–65, ఖమ్మం జాతీయ రహదారిపై పలుచోట్ల రోడ్డు ప్రమాద స్థలాలు అధికారులతో కలిసి జిల్లా ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు ఏ సమయంలో ఎక్కువ జరుగుతున్నాయని, ఎలాంటి సందర్భాల్లో జరుగుతున్నాయని అధ్యయనం చేసి రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. బ్లాక్ స్పాట్లు, మూలమలుపులు, గ్రామాల వద్ద హెచ్చరిక బోర్డులు, లైటింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయన వెంట డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐలు రాజశేఖర్, వెంకటయ్య, ఎస్ఐలు, సిబ్బంది ఉన్నారు. ఫ ఎస్పీ నరసింహ -
రవీందర్కు అబ్దుల్ కలాం ఎక్సలెన్స్ అవార్డు
సూర్యాపేట : తెలంగాణ విశ్వవిద్యాలయం సారంగాపూర్ బీఈడీ కళాశాలలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్న సూర్యాపేటకు చెందిన డాక్టర్ ఎస్.రవీందర్కి ప్రతిష్టాత్మకమైన డాక్టర్ ఏపీజే.అబ్దుల్ కలాం నేషనల్ ఎక్సలెన్స్ అవార్డు–2025కి ఎంపికై నట్టు శనివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల డాక్టర్ రవీందర్కు ఇంటర్నేషనల్ టీచర్ ఎక్సలెంట్ అవార్డు–2025 అందుకున్నానని పేర్కొన్నారు. ఈ రెండు అవార్డులు ప్రతిష్టాత్మకమైన త్రేతా యుగ్ ఫౌండేషన్ నుంచి రావడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. -
టీకాలతోనే పశువులకు రక్షణ
త్రిపురారం: ప్రతి యేటా వివిధ రకాల వ్యాధులతో పశువులు, జీవాలు వందల సంఖ్యలో మృత్యువాతపడుతున్నాయి. దీంతో రైతులు, కాపరులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. పశువుల మరణాలను నివారించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ప్రతి సంవత్సరం రెండుసార్లు ప్రభుత్వ ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ ఏడాది అక్టోబర్ 14 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం నవంబర్ 14 వరకు కొనసాగుతుంది. గాలికుంటు వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలు త్రిపురారం మండల పశువైధ్యాధికారి డాక్టర్ నాగేందర్ మాటల్లో.. గాలికుంటు వ్యాధి లక్షణాలు. పశువులకు గాలికుంటు వ్యాధి సూక్ష్మక్రిముల వల్ల సోకుతుంది. ఈ వ్యాధి సోకిన పశువులు 24 గంటల్లోనే చిక్కిపోయి అల్సర్కు గురవుతాయి. రెండు నుంచి ఆరు వారాల వరకు జ్వర తీవ్రత ఎక్కువగా ఉంటుంది. నోరు, పెదాలు, నాలుక, చన్నులు, కాళ్ల గిట్టల మధ్య పుండ్లు ఏర్పడి ఈ వ్యాధి తీవ్రత అధికంగా ఉంటుంది. పశువులు ఎప్పటికప్పుడు ముడుచుకొని పడుకుంటాయి. వ్యాధి కారణంగా పశువులు, మేత నీళ్లు సరిగా తీసుకోలేవు. నెమరు వేయలేవు. నోటి నుంచి సొంగ లేక నురుగ కారుతూ తక్కువ సమయంలోనే బరువు తగ్గిపోతాయి. పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గి, పశువుల్లో పునరుత్పత్తి తగ్గిపోతుంది. చూడి పశువులు ఈసుకపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాళ్ల మధ్య పుండ్లు పడడం వల్ల సరిగ్గా నడవలేవు. పాల ఉత్పత్తి తగ్గిపోవడమే కాకుండా వ్యాధి నిరోధకశక్తి తగ్గి కొన్న సార్లు పశువులు.. వ్యాధి సోకిన పశువుల పాలు తాగడం వల్ల దూడలు చనిపోతుంటాయి. చికిత్స విధానం 1. నోరు, పెదాలు, నాలుక, చన్నులు, కాళ్ల గిట్టల మధ్య పుండ్లను పొటాషియం పర్మాంగనేట్ లేదా నార్మల్ సైలెన్ నీటితో పరిశుభ్రంగా కడగాలి. 2. కడిన తర్వాత ఆరనిచ్చి యాంటీసెప్టిక్ లోషన్ రాసి అవసరమైతే ఈగలు, దోమలు వాలకుండా పుండ్లకు కట్లు కట్టాలి. 3. రెండోసారి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి యాంటీబయోటిక్స్ మందులు, పశువుల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి బీ–కాంప్లెక్స్ మందులు ఉపయోగించాలి. పాటించాల్సిన జాగ్రత్తలు 1.వ్యాధి సోకిన పశువులకు వాడిన పరికరాలను దూరంగా పడేయాలి. లేదంటే ఇతర పశువులకు గాలికుంటు వ్యుధి సోకే అవకాశం ఉంటుంది. 2. వ్యాధి సోకిన పశువులను మందలో ఉంచకుండా వేరుగా కట్టేయాలి. 3. పశువుల పాకలను ఎప్పటికప్పుడు నీరు చల్లి శుభ్రం చేసుకోవాల.ఇ వారానికి ఒకసారి సున్నం చల్లుతూ ఉండాలి. 4. జబ్బు చేసిన పశువు నుంచి తీసిన పాలను ఎక్కువగా వేడి చేసుకుని వినియోగింకోవాలి. 5. పశువులను మేతకు తోలుకెళ్లేటప్పుడు నిల్వ ఉన్న నీటిని తాగకుండా జాగ్రత్త పడాలి. 6. వ్యాధి సోకిన పశువు చనిపోతే గొయ్యి తీసి అందులో బ్లీచింగ్ పౌడర్ చల్లి పాతి పెట్టాలి. ఫ నవంబర్ 14 వరకు గాలికుంటు నివారణ టీకాల పంపిణీ -
జూదరుల అరెస్ట్
సూర్యాపేట: పెన్పహాడ్ మండలం గాజులమల్కాపురం గ్రామ శివారులో శనివారం పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ గోపికృష్ణ తెలిపారు. అరెస్టయిన వారిలో గాజులమల్కాపురం గ్రామానికి చెందిన ముగ్గురు, ఏపీలోని కాకినాడ జిల్లా జగ్గంపేట మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. వారి నుంచి రూ.2400 నగదు, నాలుగు బైక్లు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వర్కట్పల్లిలో మరో ఐదుగురు.. వలిగొండ: వలిగొండ మండలం వర్కట్పల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వర్కట్పల్లి గ్రామ సమీపంలోని ఓ వ్యవసాయ బావి వద్ద ఐదుగురు పేకాట ఆడుతున్నారని పక్కా సమాచారం అందడంతో పేకాట స్థావరంపై పోలీస్ సిబ్బంది దాడి చేసి ఐదుగురిని పట్టుకున్నట్లు ఎస్ఐ యుగంధర్ తెలిపారు. వారి నుంచి నగదు, నాలుగు ద్విచక్ర వాహనాలు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పశువులను తరలిస్తున్న వాహనం పట్టివేతచౌటుప్పల్: అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనాన్ని శనివారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో పోలీసులు పట్టుకున్నారు. ఖమ్మం సంతలో కొనుగోలు చేసిన 50 పశువులను వాహనంలో హైదరాబాద్లోని బహదూర్పురాకు తరలిస్తుండగా.. చౌటుప్పల్ పట్టణంలోని తంగడపల్లి చౌరస్తా వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు పట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన వాహనం డ్రైవర్ ఆరీఫ్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అజయ్భార్గవ్ తెలిపారు. విద్యావేత్తల శిక్షణ సదస్సుభువనగిరి: బీబీనగర్ మండలం మహాదేవ్పురంలో గల బ్రహ్మకుమారీస్ సైలెన్స్ రిట్రీట్ సెంటర్లో శనివారం విద్యావేత్తలకు శిక్షణ సదస్సు ఏర్పాటు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా వివిధ విద్యాసంస్థల నుంచి ప్రొపెసర్లు, అధ్యాపకులు సదస్సుకు హాజరయ్యారు. విద్యార్థుల్లో ఆలోచన శక్తి, నైపుణ్యత, నైతిక విలువలు, మానసిక ఒత్తిడిని అధిగమించడం తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో మణిపూర్ సెంట్రల్ యూరివర్సిటీ వైస్ చాన్స్లర్ తిరుపతి రావు, అనురాగ్ యూనివర్సిటీ మాజీ వీసీలు రామచంద్రం, రాజయోగ్థాట్, ట్రైనర్లు ముఖేష్, చిత్ర, సుప్రియ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటి వద్దే కోల్డ్ స్టోరేజీ
తిప్పర్తి : ఆరుగాలం కష్టం చేసి పండించిన పంటను దళారులు అడిగిన రేటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితి అధిగమించేందుకు ఓ రైతు వినూత్న ఆలోచన చేశాడు. పంటను నిల్వ చేసుకుని రేటు ఉన్న సమయంలో అమ్ముకునేలా తన ఇంటి వద్ద కోల్డ్ స్టోరేజీ నిర్మించుకున్నాడు. ఈ కోల్డ్ స్టోరేజీలో తనతోపాటు చుట్టుపక్కల రైతుల పంటలను కూడా నిల్వ చేస్తున్నాడు. ధర పెరిగినప్పుడే పంటలను విక్రయించి లాభాలు పొందుతున్నాడు. రూ.10 లక్షలతో కోల్డ్ స్టోరేజి ఏర్పాటు సిలార్మియాగూడెం గ్రామంలో రైతు సుదర్శన్రెడ్డి హార్టికల్చర్ అధికారుల సహకారంతో కో ఆపరేటివ్ బ్యాంకులో రూ.10 లక్షల రుణం తీసుకుని సొంతంగా కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ కోల్డ్ స్టోరేజీలో తాను పండించిన పంటలతోపాటు చుట్టు పక్కల గ్రామాల రైతుల పంటలను కూడా కొద్దిపాటి అద్దె తీసుకుని నిల్వ చేస్తున్నాడు. ఈ కోల్డ్ స్టోరేజీలో పంటలు సుమారు నెల రోజుల వరకు నిల్వ ఉంటున్నాయి. రైతు సుదర్శన్రెడ్డి సాగు చేస్తున్నా డ్రాగన్ ఫ్రూట్స్ ధరలేని సమయంలో కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేసి.. ధర పెరిగాక అమ్ముతున్నాడు. నష్టాలను అధిగమించేలా.. తిప్పర్తి మండలం సిలార్మియాగూడెం గ్రామానికి చెందిన రైతు చింతకుంట్ల సుదర్శన్రెడ్డి ఐదు ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్, కూరగాయలు సాగు చేస్తుంటాడు. డ్రాగన్ ఫ్రూట్ కోత వచ్చినప్పుడు నిల్వ ఉండదు. చెట్టుపైనే కుళ్లిపోతుంది. ఒకవేళ తెంపినా అదే రోజు అమ్మాలి. అంటే.. వ్యాపారులు అడిగిన ధర ఇవ్వాల్సి వస్తుంది. ఇక, కూరగాయలు కూడా నిల్వ ఉండకపోవడంతో ఏరోజుకారోజు ధర ఉన్నా, లేకున్నా.. మార్కెట్లకు వెళ్లి వ్యాపారులు అడిగిన ధరకు ఇచ్చి వెనుదిరిగి రావాల్సిందే. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నష్టాలను అధిగమించేందుకు రైతు సుదర్శన్రెడ్డి వినూత్న ఆలోచన చేశాడు. సొంతంగా శీతల గిడ్డంగి నిర్మించుకున్న రైతు ఫ నష్టాలను అధిగమించేందుకు వినూత్న ఆలోచన ఫ ఎక్కువ రోజులు పంట నిల్వ ఫ ధర ఉన్నప్పుడు విక్రయిస్తూ లాభం పొందుతున్న సుదర్శన్రెడ్డి -
విద్యుదాఘాతంతో ఇద్దరు రైతులు మృతి
యాదగిరిగుట్ట: వేర్వేరు చోట్ల విద్యుదాఘాతంతో ఇద్దరు రైతులు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు మండలం కందిగడ్డతండా గ్రామానికి చెందిన తేజావత్ హేమ్లానాయక్(55) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం ఉదయం తన పొలంలో ట్రాక్టర్తో పనిచేస్తూ.. ట్రాక్టర్ ట్రాలీని పైకి లేపగా పైన ఉన్న 11కేవీ కరెంట్ తీగలు ట్రాక్టర్ ట్రాలీకి తగిలి విద్యుదాఘాతానికి గురై కిందపడిపోయాడు. స్థానికులు గమనించి వెంటనే అతడిని ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుమారుడు తేజావత్ వినోద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఆలేరు సీఐ యాలాద్రి తెలిపారు. విద్యుత్ తీగకు మరమ్మతు చేస్తూ.. డిండి: డిండి మండలం దేవత్పల్లితండాకు చెందిన రైతు శనివారం విద్యుదాఘాతంతో మృతిచెందాడు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవత్పల్లితండాకు చెందిన రమావత్ మణిపాల్(40) గ్రామ శివారులో తనకున్న ఐదెకరాల భూమిలో వరి సాగు చేశాడు. అతడు శనివారం వరి చేనుకు నీళ్లు పెట్టేందుకు పొలం వద్దకు వెళ్లాడు. అప్పటికే పొలంలో విద్యుత్ తీగ తెగి పడి ఉండటం గమనించి మరమ్మతు చేస్తుండగా.. విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి భార్య అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బాలకృష్ణ తెలిపారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
కొండమల్లేపల్లి: రెండు బైకులు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన శుక్రవారం రాత్రి కొండమల్లేపల్లి మండల పరిధిలోని కొల్ముంతలపహాడ్ గ్రామ గేటు సమీపంలో జరిగింది. ఎస్ఐ అజ్మీరా రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండ మండలం శేరిపల్లి పెద్దతండాకు చెందిన రమావత్ మధునాయక్(33) భార్యాపిల్లలతో కలిసి దేవరకొండ పట్టణంలో అద్దెకు ఉంటూ అక్కడే అపోలో ఫార్మసీలో మెడికల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు. మూడు నెలల క్రితం కొండమల్లేపల్లి అపోలో ఫార్మసీకి బదిలీ కాగా.. ప్రతిరోజు దేవరకొండ నుంచి కొండమల్లేపల్లికి బైక్పై వచ్చి వెళ్తుండేవాడు. శుక్రవారం రాత్రి డ్యూటీ ముగించుకుని కొండమల్లేపల్లి నుంచి దేవరకొండకు వెళ్తుండగా.. కొండమల్లేపల్లి మండలం కొల్ముంతలపహాడ్ గ్రామ గేటు సమీపంలోకి రాగానే మధునాయక్ బైక్ను మరో బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మధునాయక్ అక్కడికక్కడే మృతిచెందాడు. మరో బైక్పై ఉన్న బిహార్ రాష్ట్రానికి చెందిన అనుసింగ్కు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు మధునాయక్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ప్రమీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. వ్యాన్ ఢీకొని.. మునగాల: హైవే దాటుతున్న వ్యక్తిని వ్యాన్ ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై మునగాల మండలం బరాఖత్గూడెం గ్రామంలో శనివారం జరిగింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. బరాఖత్గూడెం గ్రామానికి చెందిన సిరికొండ కోటేష్(30) గ్రామ పరిధిలోని విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై గల ఫ్లైఓవర్ దాటుతుండగా.. కోదాడ నుంచి సూర్యాపేట వైపు వెళ్తున్న మారుతీ వ్యాన్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కోటేష్ను స్థానికులు కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య ఉంది. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ బి. ప్రవీణ్కుమార్ తెలిపారు. కారు ఢీకొని.. హుజూర్నగర్: బైక్పై యూటర్న్ తీసుకుంటున్న వ్యక్తిని కారు ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన శనివారం హుజూర్నగర్ పట్టణంలో జరిగింది. ఎస్ఐ మోహన్బాబు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్నగర్ పట్టణానికి చెందిన పశ్య రాంరెడ్డి(75) తన బైక్లో పెట్రోల్ పోయించుకునేందుకు కోదాడ రోడ్డులోని పెట్రోల్ బంక్లోకి యూటర్న్ తీసుకుంటుండగా.. కోదాడ నుంచి హుజూర్నగర్ వైపు వస్తున్న మఠంపల్లికి చెందిన బధ్రంరాజు అనూష కారును అతివేగంగా నడుపుకుంటూ వచ్చి రాంరెడ్డిని ఢీకొట్టింది. అతడు రోడ్డుపై పడిపోవడంతో తలకి గాయమైంది. అతడిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి కుమారుడు అనిల్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పెదరాజుతండాలో విషాదఛాయలు
మోతె: మోతె మండలం బీక్యతండా గ్రామ పంచాయతీ పరిధిలోని పెదరాజుతండాలో విషా దఛాయలు అలుముకున్నాయి. పెదరాజుతండాకు చెదంఇన బానోతు శ్రీను రెండో కుమారుడు బానోతు మహేందర్నాయక్(21) సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సుల్తాన్పూర్లోని జేఎన్టీయూహెచ్ ఇంజనీరింగ్ కళాశాలలో సీఎస్సీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం మహేందర్నాయక్ కళాశాలలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మహేందర్నాయక్ మృతిపై అతడి తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అతడి ఆత్మహత్యపై పూర్తి సమాచారం కావాలని కళాశాల యాజమాన్యాన్ని కోరుతున్నారు. -
రైతు నేస్తం.. వాట్సాప్ చానల్
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించిన వాట్సాప్ చానల్ అన్నదాతలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తారు. పంటల తెగుళ్లు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు రైతులను అప్రమత్తం చేస్తారు. తద్వారా సాగు ఖర్చులు తగ్గడంతో పాటు మంచి దిగుబడులు కూడా పొందవచ్చు. – శ్రవణ్కుమార్, డీఏఓ, నల్లగొండ ఫ అధికారిక చానల్ ప్రారంభించిన వ్యవసాయ శాఖ ఫ దీని ద్వారా అన్నదాతలకు సలహాలు, సూచనలు ఇవ్వనున్న అధికారులు దేవరకొండ: పంటల సాగులో తరుచూ ఎదురయ్యే తెగుళ్లు, వాటి నివారణకు సరైన మందుల ఎంపికలో అవగాహన లోపం కారణంగా రైతులు ఆశించిన మేర దిగుబడులు సాధించ లేక నష్టపోతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ సాంకేతికత ఆధారంగా రైతుల ముంగిట ముఖ్య సమాచారాన్ని అందించేందుకు ఈ ఏడాది ఆగస్టు 8న ప్రత్యేక అధికారిక వాట్సాప్ చానల్ను ప్రారంభించింది. రైతు వేదికల ద్వారా ఇప్పటికే సమాచార కల్పన ప్రారంభమైంది. త్వరలో వాట్సాప్ చానల్పై ప్రతి గ్రామంలో ప్రత్యేక సదస్సులు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తారు. చానల్ ద్వారా లభించే ప్రయోజనాలు ఫ తెగుళ్ల గుర్తింపు, నివారణకు సరైన సలహాలు ఫ రోగ నిరోధక వంగడాలు, గుణాత్మక విత్తనాల ఎంపికలో మార్గదర్శకత్వం ఫ పంటల రక్షణ, ఎరువుల వినియోగం, నీటి నిర్వహణపై సూచనలు ఫ వాతావరణ సమాచారం, మార్కెట్ ధరలు, ప్రభుత్వ పథకాల వివరాలు ఫ రాయితీ విత్తనాల లభ్యత, మౌలిక వసతులపై తాజా సమాచారం నిపుణుల సలహాలు రైతులు సాగు చేసే పంటకు మొలక దశ నుంచి కోత దశ వరకు ఏ తెగులు వచ్చినా, దాని ఫొటోను చానల్కు పోస్టు చేస్తే వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆ తెగుళ్లను వెంటనే గుర్తిస్తారు. తెగులు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏ మందులు ఏ మోతాదులో ఉపయోగించాలో వివరిస్తారు. చానల్లో చేరేందుకు ఆయా గ్రామ రైతులు తమ క్లస్టర్ పరిధిలోని అసిస్టెంట్ అగ్రికల్చర్ అధికారి (ఏఈవో)ను సంప్రదించాల్సి ఉంటుంది. వారికి సదరు రైతు తమ మొబైల్ నంబర్ అందిస్తే వారు వాట్సాప్ చానల్లో చేరుస్తారు. -
డీఆర్డీఎల్ ల్యాబ్ డైరెక్టర్గా అంకతి రాజు
రాజాపేట : రాజాపేట మండల కేంద్రానికి చెందిన డీఆర్డీఎల్ శాస్త్రవేత్త అంకతి రాజు డీఆర్డీఎల్ హైదరాబాద్ ల్యాబ్ డైరెక్టర్గా శుక్రవారం నియామకమయ్యారు. ఆయన బెంగుళూరులో 1991 నుంచి 2002 వరకు 11 సంవత్సరాలపాటు డీఆర్డీఎల్లోని గ్యాస్ టర్బైన్ రీసర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ (జీటీఆర్ఈ)లో శాస్త్రవేత్తగా విధులు నిర్వహించారు. 2002 నుంచి 2022 వరకు డీఆర్డీఎల్ హైదరాబాద్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లో లిక్విడ్ ప్రొఫెషన్ డివిజన్లో దీర్ఘశ్రేణి హేర్ టూ హేర్ మిసైల్ ప్రాజెక్టు డైరెక్టర్గా విధులు నిర్వహించారు. 2022లో ఈఆర్డీఈ (అర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్) డైరెక్టర్గా పూణెకు వెళ్లారు. ప్రస్తుతం డీఆర్డీడీఓకు విశిష్ట శాస్త్రవేత్తగా ఉంటూ డీఆర్డీఎల్ హైదరాబాద్ ల్యాబ్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతిమోటకొండూర్ : ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం మోటకొండూర్ మండలంలోని నాంచారిపేట గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఎండీ ఖరీమ్(46) ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు. ఇంటి పనులు దాదాపుగా పూర్తికావస్తున్నాయి. అతను తన కుటుంబంతో వేరే ఇంట్లో ఉంటున్నాడు. పనులు జరుగుతున్న ఇంటిలో కరెంట్ బల్బ్ వేసేందుకు ప్రయత్నించాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి కింద పడిపోయాడు. అంబులెన్స్లో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు ముత్తిరెడ్డిగూడెంలో ప్రైవేటు స్కూల్లో బస్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉంది. స్వర్ణగిరిలో సహస్ర కుంకుమార్చనభువనగిరి : పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో గల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం పద్మావతి అమ్మవారికి ఆలయ అర్చకులు సహస్ర కుంకుమార్చన సేవ నిర్వహించారు. అంతకు ముందు ఆలయంలో స్వామి వారికి సుప్రభాత సేవ, తోమాల సేవ, సహస్ర నామార్చన సేవ, సత్యనారాయణ వ్రతం, నిత్య కల్యాణ మహోత్సవం, సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ జరిపించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
చిన్నారిపై లైంగికదాడికి యత్నం
చౌటుప్పల్ : మద్యం మత్తులో ఉన్న ఇద్దరు కామాంధులు లడ్డూ ఇస్తానని ఆశ చూపించి నాలుగేళ్ల చిన్నారిని తమ వెంట తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా జిల్లా మహాసువ గ్రామానికి చెందిన దినేష్ కాల్(45), శివరాజ్ కాల్(44) గత మూడు నెలల క్రితం లింగోజిగూడెం గ్రామానికి వచ్చారు. స్థానికంగా ఉన్న ఓ పరిశ్రమలో కాంట్రాక్టర్ కింద దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. వీరు లింగోజిగూడెం గ్రామంలోని బీసీకాలనీలో (రైస్మిల్ దగ్గర) మరికొంత మంది కూలీలతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్కు చెందిన బాలిక కుటుంబం సైతం మూడు నెలల క్రితం ఉపాధి నిమిత్తం ఇక్కడికి వచ్చారు. బాలిక తండ్రి అదే పరిశ్రమలో పెయింటింగ్ కాంట్రాక్టర్ వద్ద కార్మికుడిగా పనిచేస్తున్నాడు. వీరు.. నిందితులు ఉంటున్న ఇంటి వెనుక భాగంలో ఉన్న అద్దె ఇంట్లో ఉంటున్నారు. లడ్డూ ఇప్పిస్తామని చెప్పి.. చిన్నారి తండ్రి కూలికి వెళ్లగా తల్లి ఇంటి వద్దే ఉంది. శుక్రవారం ఉదయం 11గంటల సమయంలో తల్లి ఇంట్లో దుస్తులు ఉతుకుతండగా చిన్నారులు బయట ఆడుకుంటున్నారు. డ్యూటీకి వెళ్లని దినేష్, శివరాజ్లు పూటుగా మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న వారిద్దరు ఇంటి ఆరుబయట ఆడుకుంటున్న చిన్నారి దగ్గరకు వెళ్లారు. లడ్డూ ఇప్పిస్తానని ఆశ చూపించి తమ వెంట తీసుకెళ్లారు. వారు బాలికపై లైంగిక దాడికి యత్నిస్తుండగా రోదించడంతో బాలిక తల్లి బయటకు వచ్చి వెతకసాగింది. ఇద్దరు వ్యక్తులు మీ కుమార్తెను తీసుకెళ్లారని స్థానికంగా ఉన్న ఓ బాలిక చెప్పింది. దీంతో వెంటనే పక్కింటి వారి సాయంతో తల్లి అక్కడకు వెళ్లి బాలికను తీసుకువచ్చి పోలీసులకు సమాచారమిచ్చింది. పోలీసులు అక్కడకు చేరుకుని స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించారు. వైద్యచికిత్స నిమిత్తం బాలికను చౌటుప్పల్లోని ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. లడ్డూ ఆశ చూపి తమ వెంట తీసుకెళ్లిన ఇద్దరు నిందితులు బాలిక రోదనలు విని అప్రమత్తమైన తల్లి పక్కింటి బాలిక సమాచారంతో నిందితుల ఇంట్లో చిన్నారి గుర్తింపు -
బీటెక్ విద్యార్థి బలవన్మరణం
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లో ఉన్న జేఎన్టీయూ క్యాంపస్లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా మోతె మండలం సిరికొండ గ్రామానికి చెందిన బానోతు మహేందర్(24) సీఎస్ఈ మూడో సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం తన హాస్టల్ గదిలోకి వెళ్లి బ్లాంకెట్తో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన తోటి విద్యార్థులు వెంటనే కళాశాల అధ్యాపకులకు చెప్పగా, వారు సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే మహేందర్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న మహేందర్ తండ్రి చెన్వేశ్వర్రావు అక్కడకు చేరుకున్నారు. మహేందర్ బాగానే చదువుకునేవాడని కళాశాల ప్రిన్సిపాల్ విశ్వానందరాజు తెలిపారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మహేందర్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు.ఫ హాస్టల్ గదిలో ఉరివేసుకున్న మహేందర్ ఫ సుల్తాన్పూర్ జేఎన్టీయూ క్యాంపస్లో ఘటన -
మనోవిజ్ఞాన నిపుణుల అవసరం ఎంతో ఉంది
నల్లగొండ టూటౌన్: మనుషులు అనేక ఒత్తిళ్లు, ఒడిదుడుకులకు గురవుతున్న సందర్భంలో మనోవిజ్ఞాన శాస్త్ర నిపుణుల అవసరం ఎంతో ఉందని ఎంజీ యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సైకాలజీ విభాగం నూతన ల్యాబొరేటరీని శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు ఎదుర్కొనే మానసిక సమస్యలతోపాటు, వృద్ధుల్లో పెరుగుతున్న కుంగుబాటు, నిరుత్సాహం, పిల్లలకు మొబైల్ వినియోగం లాంటి అలవాట్లు కాకుండా ఉండటానికి మనో వైజ్ఞానికులు దిక్సూచిగా సహాయకారిగా నిలవాలని తెలిపారు. కార్యక్రమంలో అలువాల రవి, అరుణప్రియ, అంజిరెడ్డి, ఆకుల రవి, సైకాలజీ విభాగం అధ్యాపకులు అరవింద్, తన్వీర్, నారాయణరెడ్డి, చక్రి పాల్గొన్నారు. ఫ ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ -
సార్.. మీరు వెళ్లొద్దు
మాడుగులపల్లి: మాడుగులపల్లి మండలంలోని కుక్కడం గ్రామంలో గల మండల పరిషత్ పాఠశాలలో ప్రధానోపాద్యాయుడిగా పనిచేస్తున్న నన్నూరి వెంకట్రెడ్డి ఉద్యోగ విరమణ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు. మీరు వెళ్లొద్దు సార్.. మాతోనే ఉండాలి అంటూ రోదించారు. హెచ్ఎం వారిని ఓదార్చి వెళ్లిపోయారు. గ్రామస్తులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. కార్యక్రమంలో ఎంఈవో వెంకటమ్మ, నూతన హెచ్ఎం వీరయ్య, కేజీబీవీ ఎస్ఓ వసంతకుమారి, ఉపాధ్యాయులు నిరంజన్రెడ్డి, వేణుగోపాల్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. ● హెచ్ఎం ఉద్యోగ విరమణ పొంది వెళ్లిపోతుండడంతో రోదించిన విద్యార్థులు -
ఆయాసంతో బాధపడుతూ ఆస్పత్రిలో మహిళ మృతి
మిర్యాలగూడ అర్బన్: తీవ్ర జ్వరం, ఆయాసంతో బాధపడుతూ చికిత్స నిమిత్తం శుక్రవారం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి వచ్చిన మహిళ మృతి చెందింది. మిర్యాలగూడ మండలంలోని ముల్కలకాల్వ గ్రామానికి చెందిన నాగిళ్ల వెంకటమ్మ(35) తీవ్ర జ్వరం, ఆయాసంతో బాధపడుతుండగా చికిత్స నిమిత్తం ఆమె కుమారుడు శుక్రవారం ఉదయం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చాడు. ఓపీ నమోదు చేయించుకుని ఆస్పత్రిలో చేర్పించుకున్నారు. అయితే ఆయాసం ఎక్కువ కావడంతో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారి మృతి చెందింది. సకాలంలో వైద్య సేవలు అందించకపోవడంతోనే మృతిచెందిందని కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. సుమారు రెండు గంటల పాటు వైద్యం అందించలేదని పేర్కొన్నారు. సకాలంలో ఆక్సిజన్ అందించి వైద్యం చేస్తే మా అమ్మ బతికేదని కుమారుడు ఆవేదన వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న సీపీఐ డివిజన్ అధ్యక్షుడు బంటు వెంకటేశ్వర్లు ఆస్పత్రికి చేరుకుని మృతురాలి కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యం అందించడంతో నిర్లక్ష్యం వహించిన వైద్యులను తక్షణమే సస్పండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏరియా ఆస్పత్రి ఎదుట రోగి బంధువులతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి సంఘనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ను వివరణ కోరగా రోగి ఆస్పత్రికి వచ్చే సమయానికి ఆమె పరిస్థితి విషమంగా ఉందని, ఆమెను పరీక్షించి వైద్యం అందించే లోపే మృతి చెందిందని తెలిపారు. ఫ వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన -
యాదగిరి క్షేత్రంలో ఊంజల్ సేవోత్సవం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజలి సేవోత్సవాన్ని ఆలయ అర్చకులు శుక్రవారం విశేషంగా జరిపించారు. అమ్మవారికి ఇష్టమైన రోజు కావడంతో సాయంత్రం వేళ ఆండాళ్ అమ్మవారిని బంగారు ఆభరణాలు, వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆండాళ్ అమ్మవారిని అలకరించిన తరువాత ఆలయ తిరు, మాఢ వీధుల్లో ఊరేగించారు. ఈ సమయంలో మహిళ భక్తులు మంగళ హారతులతో స్వాగతం ఫలికారు. అనంతరం అమ్మవారిని అద్దాల మండపంలో అధిష్టించి ఊంజలి సేవోత్సవం చేపట్టారు. అనంతరం హారతినిచ్చారు. ఇక ఆలయంలో సుప్రభాతం, సహస్రనామార్చన, శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సం, ఇతర పూజలు నిర్వహించారు. శివాలయంలో కార్తీక దీపారాధనలు యాదగిరిగుట్ట: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శుక్రవారం యాదగిరి కొండపై శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయ సన్నిధిలో భక్తులు కార్తీక దీపారాధనలు నిర్వహించారు. మహాశివుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారి ఉప ఆలయం ఎదుట భక్తులు శ్రీ ఆకారంలో దీపాలు వెలిగించారు. -
ప్రిన్సిపాల్ మందలించారని..
కొండమల్లేపల్లి: ప్రిన్సిపాల్ మందలించడంతోపాటు, ఉపాధ్యాయురాలు విద్యార్థుల ముందు హేళనగా మాట్లాడడంతో మనస్థాపం చెందిన విద్యార్థిని శుక్రవారం సాయంత్రం డెటాల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. తిరుమలగిరి సాగర్కు చెందిన సభావట్ శ్రీను, కళ దంపతుల కుమార్తె సభావట్ మౌనిక దేవరకొండ పట్టణ పరిధిలో గల టీటీడబ్ల్యూఆర్ఎస్ బాలికల గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. మౌనిక వారం క్రితం తన ఇంటికి వెళ్లి శుక్రవారం పాఠశాలకు వచ్చింది. అయితే విద్యార్థిని తరచుగా పాఠశాలకు గైర్హాజరు అవుతుండడంతో ప్రిన్సిపాల్ మందలించారు. అదేవిధంగా ఉపాధ్యాయురాలు తోటి విద్యార్థినుల ముందు మౌనికతో హేళనగా మాట్లాడారు. దీంతో మనస్థాపం చెందిన విద్యార్థిని సాయంత్రం హాస్టల్ గదిలో ఉన్న డెటాల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన తోటి విద్యార్థినులు అక్కడ ఉన్న ఉపాధ్యాయులకు చెప్పడంతో హుటాహుటిన దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం మౌనిక ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. టీచర్ల వేధింపుల వల్లే తమ కుమార్తె ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపించారు. గతంలోనూ పాఠశాలకు ఆలస్యంగా వచ్చిందని గంటసేపు తరగతి బయట నిలబెట్టడంతో కళ్లు తిరిగి కిందపడిన సందర్భాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఫ డెటాల్ తాగి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం -
దేవలమ్మనాగారంలో హైనా సంచారం
చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం దేవలమ్మనాగారం గ్రామ పరిసరాల్లో హైనా సంచారం హల్చల్ చేసింది. గ్రామ పరిసరాల్లోని అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తుందని కొంతమంది గ్రామంలో చెప్పడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. గ్రామంలో చిరుతపులి సంచరిస్తుందని మొదటగా పాఠశాల విద్యార్థులు చూసి చెప్పడంతో గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు గ్రామంలోని అటవీ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. అయితే ఓ గొర్రెల కాపరి అది హైనా అని అటవీశాఖ సిబ్బందికి, పోలీసులకు చెప్పాడు. చిరుతపులి ఆనవాళ్లు కనిపించకపోవడంతో అధికారులు తిరిగి వచ్చారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఫ చిరుతపులి అనుకొని భయాందోళన చెందిన గ్రామస్తులు -
నేడు రన్ఫర్ యూనిటీ
సూర్యాపేటటౌన్ : ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని పోలీస్శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 6 గంటలకు సూర్యాపేట పట్టణంలోని ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజీ చౌరస్తా నుంచి మినీ ట్యాంక్ బండ్ వరకు రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ నరసింహ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. ఈరన్లో స్థానిక పౌరులు, యువత అధిక సంఖ్యలో పాల్గొని ఐక్యతను చాటాలని కోరారు. ప్రజలు ప్రమాదాలకు దూరంగా ఉండాలి సూర్యాపేటటౌన్ : వర్షాలు పడుతున్నందున ప్రజలు ప్రమాదాలకు దూరంగా ఉండాలని ఎస్పీ నరసింహ సూచించారు. సూర్యాపేట మండలం వెదిరెవారిగూడెం వద్ద మూసీ నదిపై బీమారం లోలెవల్ బ్రిడ్జి వద్ద నీటి ప్రవాహ పరిస్థితులను గురువారం ఆయన పరిశీలించి మాట్లాడారు. రెండు రోజులు కురిసిన వర్షాల వల్ల చెరువులు, కుంటలు, నదులు నిండి ప్రమాదకరస్థాయిలో ఉన్నాయన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రజల రక్షణలో పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా పని చేస్తున్నారని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో సెలవులు రద్దు చేసి సిబ్బందిని అందుబాటులో ఉంచామని తెలిపారు. ఎస్పీ వెంట సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, ఎస్ఐ బాలునాయక్, సిబ్బంది ఉన్నారు. విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి సూర్యాపేట : వర్షాల సమయంలో విద్యుత్ సిబ్బంది చాలా అప్రమత్తంగా ఉండాలని ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ (కమర్షియల్ ) సీహెచ్ చక్రపాణి సూచించారు. మోంథా తుపాన్ ప్రభావంతో కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడిన ప్రాంతాలను గురువారం ఆయన సందర్శించారు. సూర్యాపేటలో ఉన్న 132 కేవీ సబ్ స్టేషన్లో విద్యుత్ సరఫరాను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుపాన్ కారణంగా విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమించడంతో తాను ఇక్కడికి వచ్చి సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఎస్ఈ ఫ్రాంక్లిన్, డీఈ శ్రీనివాస్, ఏఈలు, ఏడీలు, రామకృష్ణ ఉన్నారు. ఎంజీయూ బ్యాక్లాగ్ ఫలితాలు విడుదల నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని పీజీ విద్యార్థుల బ్యాక్లాగ్ పరీక్ష ఫలితాలను గురువారం విడుదల చేసినట్లు యూనివర్సిటీ సీఓఈ ఉపేందర్రెడ్డి తెలిపారు. మొదటి సెమిస్టర్లో 52.34 శాతం, రెండవ సెమిస్టర్లో 41.74 శాతం, మూడవ సెమిస్టర్లో 37.50 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. బ్యాక్లాగ్ పరీక్ష ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపర్చామని పేర్కొన్నారు. -
రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలి
సూర్యాపేట : రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ వెంటనే అందజేయాలని తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల సాధన కమిటీ అధ్యక్షుడు పొనుగోటి కోటయ్య, ప్రధాన కార్యదర్శి ఎస్.కె సుభాని కోరారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసిన అనంతరం ఏఓ సుదర్శన్ రెడ్డికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలామంది ఉద్యోగులు పదవీ విరమణ పొంది చాలా కాలం అవుతున్నా వారికి రావాల్సిన గ్రాట్యుటీ, జనరల్ ప్రావిడెంట్ ఫండ్, గ్రూప్ ఇన్సూరెన్స్, కమ్యుటేషన్, సరెండర్ లీవులు వంటి ఆర్థిక ప్రయోజనాలు ఇంకా అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తల్లాడ ఉపేందర్, దశరథ రామారావు, షేక్ అబ్దుల్లా, విద్యాసాగర్, కృష్ణారెడ్డి, దండ శ్యాంసుందర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్లు వెంకట్రాంరెడ్డి, తీకుళ్ల సాయిరెడ్డి, రాపర్తి రాంనర్సయ్య, జాన్ సుందర్, నాగార్జున రెడ్డి, అంజయ్య, వెంకటేశ్వరరావు, సుధాకర్, కృష్ణమూర్తి, నరేందర్, లింగయ్య పాల్గొన్నారు. సాగర్కు కొనసాగుతున్న వరద నాగార్జునసాగర్ : కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నాగార్జునసాగర్ జలాశయానికి వరద కొనసాగుతోంది. జలాశయం గరిష్టస్థాయిలో ఉండటంతో ఎగువ నుంచి వస్తున్న 1,46,854 క్యూసెక్కుల వరదను.. క్రస్ట్ గేట్లు, విద్యుదుత్పాదన ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. వర్షాలు కురుస్తుండడంతో అన్ని కాల్వలకు నీటిని నిలిపివేశారు. -
మోంథా ప్రభావంతో 64,939 ఎకరాల్లో పంటలకు నష్టం
సూర్యాపేట : మోంఽథా తుపాన్ రైతన్నకు గుండెకోతను మిగిల్చింది. వేల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంట చేతికొచ్చే సమయంలో నీటిపాలైంది. రెండు రోజులు కురిసిన వర్షానికి జిల్లాలో సుమారు 64,939 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ నష్టం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. పూర్తిస్థాయి నష్టం అంచనా కోసం మరో రెండురోజుల పాటు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించనుంది. ప్రధానంగా వరి పంట వేలాది ఎకరాల్లో చేతికి రాకుండా వరద పాలు అయ్యింది. ఇక వరదల కారణంగా రోడ్లు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. జిల్లాలో అధిక వర్షాల ప్రభావాన్ని క్షేత్రస్థాయిలో తెలుకునేందుకు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పలు మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. ప్రధానంగా రెండుపంటలే.. మోంథా తుపాన్ కారణంగా బుధవారం అతి భారీ నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. ప్రస్తుతం జిల్లాలో వరి కోతలు, పత్తితీత పనులు ముమ్మరంగా సాగే సమయం. ఈ క్రమంలో కురిసిన అధిక వర్షాలు రైతన్నను నిండా ముంచాయి. కోతకు వచ్చిన పొలాలు వరద పాలయ్యాయి. జిల్లాలో 15,510 మంది రైతులకు చెందిన 54,006 ఎకరాల వరి పొలాలు తుపాన్ ధాటికి దెబ్బతిన్నాయి. అలాగే 3,597 మంది రైతులకు చెందిన 10,933 ఎకరాల పత్తి పంటకు నష్టం వాటిల్లింది. మండలాల వారీగా పరిశీలిస్తే.. వరి పంటకు అత్యధికంగా జాజిరెడ్డిగూడెం మండలంలో 6,164 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. ఆ తర్వాత గరిడేపల్లి మండలంలో 5960 ఎకరాలు, నేరేడుచర్లలో 5600 ఎకరాలు, పాలకవీడులో 5524, కోదాడలో 4650 ఎకరాల్లో రైతులు నష్టపోయారు. అయితే వర్షపాతం ఎక్కువగా నమోదైన తుంగతుర్తి మండలంలో కేవలం 80 ఎకరాలు, తిరుమలగిరి మండలంలో 12 ఎకరాలు, నూతనకల్లో 55 ఎకరాలు, మద్దిరాలలో 180 ఎకరాలు, ఆత్మకూర్ (ఎస్)లో 856 ఎకరాల్లో మాత్రమే వరి పంటకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. పత్తి అత్యధికంగా మోతె మండలంలో 3,600 ఎకరాల్లో రైతులు నష్టపోవాల్సి వచ్చింది. ఈ రెండు పంటలు కలిపి నడిగూడెం మండలంలో అత్యధికంగా 7,564 ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు తేలింది. ఇతర శాఖలకు సంబంధించి.. వ్యవసాయ శాఖ తర్వాత అధిక వరదలతో ఆర్అండ్బీ శాఖ తీవ్రంగా నష్టపోయింది. దాదాపు రూ.85 లక్షల మేర రోడ్లు, బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. ఇందులో గుండ్ల సింగారం బ్రిడ్జికి రూ.30 లక్షలు, హుజూర్నగర్ రోడ్లకు రూ.50 లక్షలు, దొండపహాడ్ రోడ్డు డ్యామేజీకి రూ.5 లక్షల చొప్పున నష్టం వాటిల్లినట్లు సంబంధిత శాఖ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. విద్యుత్ శాఖ పరిఽధిలో జిల్లావ్యాప్తంగా 72 ఎల్టీ స్తంభాలు, 22 హెచ్టీ స్తంభాలు, 5 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. వీటి విలువ సుమారు రూ.30 లక్షల దాకా ఉంటుందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రెవెన్యూ శాఖ పరిధిలో 10 ఇళ్లు పాక్షికంగా, 1 ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఇందులో సూర్యాపేట డివిజన్ పరిధిలో 7 ఇళ్లు పాక్షికంగా, 3 ఇళ్లు కోదాడ డివిజన్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పూర్తిగా ధ్వంసమైన ఇల్లు కోదాడ డివిజన్ పరిధిలో ఉంది. ఇరిగేషన్ శాఖ అధికారుల ముందస్తు చర్యల కారణంగా ఎలాంటి నష్టం వాటిల్లలేదు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ శాఖకు ఏమాత్రం నష్టం వాటిల్లినా.. పంటలు, ఇతర శాఖల ఆస్తులకు పెద్ద ఎత్తున డ్యామేజీ జరిగేదని అధికారులు భావిస్తున్నారు. నూతనకల్: మిర్యాలలో పత్తి పంటను పరిశీలిస్తున్న కలెక్టర్ తేజస్నందలాల్ పవార్ -
రాష్ట్రంలో బీజేపీ ఆటలు సాగవు
హుజూర్నగర్ : ‘ తెలంగాణ రాష్ట్రాన్ని అనాథగా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోంది.. ఎన్ని కుయుక్తులు పన్నినా రాష్ట్రంలో బీజేపీ ఆటలు సాగవు’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. గురువారం హుజూర్ నగర్లో నిర్వహించిన సీపీఐ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో కూనంనేని మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడానికి గత ప్రభుత్వాలు చేసిన అప్పులు ఒక కారణమైతే, రాష్ట్రంతో కేంద్రం అనుసరిస్తున్న తీరు మరో కారణమన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు సీపీఐ మద్దతు ఉంటుందని, కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గత త్యాగాల చరిత్రను ప్రజలకు చెప్పేందుకే ఖమ్మంలో సభ నిర్వహిస్తు న్నామన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో కేంద్రంలో ఏర్పాటు చేసిన సంస్థలను బీజేపీ సర్కార్ ప్రైవేట్ పరం చేస్తోందన్నారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ తుపాన్తో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందజేయాలన్నారు. సీపీఐ పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్, గన్నా చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, కంబాల శ్రీనివాస్, దేవరం మల్లేశ్వరి, ధనుంజయ నాయుడు, సృజన, ఉస్తేల నారాయణరెడ్డి, మండవ వెంకటేశ్వర్లు, సాహెబ్ అలి, మేకల శ్రీనివాస్, బద్దం కృష్ణారెడ్డి, పోకల వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. చిలుకూరు: తుపాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం పరిహారం చెల్లించి ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరా రు. గురువారం చిలుకూరుకు చెందిన సీపీఐ నాయకుడు చిలువేరు అంజనేయులు కుమార్తె వివాహానికి సాంబశివరావు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం స్థానికంగా విలేకరులతో మాట్లాడారు. ప్రధానంగా ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం తదితర జిల్లాల్లో వర్షం వల్ల వరి, పత్తి, మిర్చి తదితర పంటలు దెబ్బతిన్నాయన్నారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్, పార్టీ మండల సహాయ కార్యదర్శి సాహెబ్ అలీ, ఏఐవైఎఫ్ రాష్ట్ర నాయకులు చేపూరి కొండలు పాల్గొన్నారు. ఫ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు -
తడిసిన ధాన్యంపై నివేదిక ఇవ్వాలి
భానుపురి (సూర్యాపేట) : వర్ష ప్రభావిత ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం ఉంటే వెంటనే నివేదిక ఇవ్వాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. మోంథా తుపాన్ కారణంగా జిల్లాలో అధిక వర్షాలు కురుస్తాయని, అధికారులు, రైతులను ముందే అప్రమత్తం చేయడంతో ముప్పు తప్పిందన్నారు. ప్రధానంగా కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం రాశులపై టార్పాలిన్లు కప్పడంతో ఎక్కువగా తడవలేదన్నారు. అంచులు, అడుగు భాగాల్లో తడిస్తే వెంటనే మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాలను మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. అవసరం ఉన్న చోట ధాన్యాన్ని దగ్గరలోని ఫంక్షన్ హాల్ లో నిల్వ చేసుకోవాలని సూచించారు. కలెక్టరేట్లో 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా 6281492368 నంబర్తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ధాన్యం కొనుగోలు, వర్షంతో ఏదైనా సమస్య ఉంటే ఫిర్యాదు చేస్తే తక్షణమే పరిష్కరిస్తామన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
13ఎకరాల వరిచేను నేలవాలింది
నా భూమితో పాటు మరికొంత భూమి కౌలుకు తీసుకొని 10ఎకరాల్లో దొడ్డురకం, 3ఎకరాల్లో సన్నరకం ధాన్యాన్ని సాగుచేశాను. తీరా పంటచేతికొచ్చే సమయంలో వర్షాలతో మొత్తం నేలవాలింది. ప్రభుత్వం ఆదుకోవాలి. – మహంకాళి సురేష్, రైతు, కుంచమర్తి, జాజిరెడ్డిగూడెం మండలంపది రోజుల క్రితం 250 బస్తాల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాను. భారీ వర్షం కురవడంతో కొద్దిగా ధాన్యం మొలకెత్తుతోంది. అధికారులు స్పందించి త్వరగా కొనుగోళ్లు ప్రారంభించాలి. – భూక్యా వెంకన్న, భూక్యా తండా, రైతు, తిరుమలగిరి మండలం -
ఏసీబీ వలలో యాదగిరిగుట్ట ఆలయ విద్యుత్ ఈఈ
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం విద్యుత్ ఈఈ రామారావు కాంట్రాక్టర్ వద్ద రూ.1.90లక్షలు లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ జగదీశ్ చంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట ఆలయంలో లడ్డూ, పులిహోర ప్రసాదం తయారీ మిషన్ల మెయింటనెన్స్ టెండర్ను యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన ఉపేందర్, సందీప్రెడ్డి గతేడాది రూ.10లక్షలకు దక్కించుకున్నారు. కానీ గత సంవత్సర కాలంగా వారికి బిల్లులు రావడం లేదు. దీంతో తమకు రావాలి్సన రూ.10లక్షల బిల్లులు ఇవ్వాలని ఉపేందర్, సందీప్రెడ్డి గత కొన్ని నెలలుగా ఈఈ రామారావును అడుగుతూ వస్తున్నారు. రూ.2లక్షలు ఇస్తేనే..అయితే రూ.10లక్షల బిల్లుల్లో రూ.2లక్షలు తనకు ఇవ్వాలని రామారావు డిమాండ్ చేశాడు. రూ.1.90లక్షలు ఇస్తామని ఉపేందర్, సందీప్రెడ్డి చెప్పారు. ఈ విషయాన్ని వారు ఏసీబీ అధికారుల దృష్టికి రెండు నెలల క్రితం తీసుకెళ్లారు. రామారావు వివిధ పనుల్లో బిజీగా ఉండి ఉపేందర్, సందీప్రెడ్డిని ఈ రెండు నెలలు డబ్బులు అడగలేదు. బు«ధవారం విధులు ముగించుకొని హైదరాబాద్కు వెళ్తూ మార్గమధ్యలో రూ.1.90లక్షలు తీసుకుంటానని ఉపేందర్, సందీప్రెడ్డికి రామారావు చెప్పాడు. దీంతో వారు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చారు. మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లిలోని ఓ ఆస్పత్రి సమీపంలో ఉపేందర్, సందీప్రెడ్డి నుంచి రామారావు రూ.1.90లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. గతంలో 9 నెలలు సస్పెండ్.యాదగిరిగుట్ట ఆలయంలో సురక్ష సిబ్బంది వద్ద ఈఈ రామారావు డబ్బులు తీసుకొని వారిని ఉద్యోగంలో పెట్టుకున్నారని గతేడాది ఆరోపణలు రావడంతో అప్పటి ఈఓ భాస్కర్రావు విచారణ చేసి రామారావును సస్పెండ్ చేశారు. 9 నెలలు సస్పెండ్కు గురైన తర్వాత పైరవీలు చేసుకొని తిరిగి ఈ ఏడాది ఏప్రిల్లో ఉద్యోగంలో చేరినట్లు తెలుస్తోంది. ఆయన అక్రమ పద్ధతిలో ఉద్యోగం సంపాదించాడని, కింది స్థాయి ఉద్యోగులు, సిబ్బంది, ప్రైవేట్ సిబ్బందిని ఇబ్బందులకు గురిచేసేవారనే ఆరోపణలు ఉన్నాయి. తన వద్ద పనిచేసే సిబ్బందితో తన వ్యవసాయ బావి వద్ద పనులు చేయించుకునే వారని, వినకుంటే వ్యక్తిగతంగా దూషించి, ఉద్యోగంలో నుంచి తీసేస్తానని బెదిరించేవాడని సమాచారం. ఇక్కడ ఈఈ, మేడారంలో ఎస్ఈ..?ములుగు జిల్లా మేడారంలో వచ్చే ఏడాది జరగనున్న సమ్మక్క–సారక్క జాతర జరగనుండగా.. అక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న ఎస్ఈ పోస్టుకు రామారావును ఇన్చార్జిగా రెండు రోజుల క్రితం నియమించినట్లు తెలుస్తోంది. విద్యుత్ విభాగంలో పనిచేస్తున్న రామారావు.. సివిల్ విభాగంలో ఇన్చార్జి ఎస్ఈగా పదోన్నతి పొందడంపై స్థానిక ఆలయ ఉద్యోగుల్లో చర్చ మొదలైంది. ఇదిలా ఉండగా.. బుధవారం యాదగిరి క్షేత్రంలోని లక్ష్మీ పుష్కరిణిని సందర్శించేందుకు వచ్చిన సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస్రాజుతో కలిసి ఇన్చార్జి ఎస్ఈ హోదాలో రామారావు పరిశీలించాడు. ఇంట్లో సోదాలుఏసీబీ డీఎస్పీ జగదీశ్ చంద్రం ఆధ్వర్యంలో రామారావు ఇంట్లోతో పాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా యాదగిరిగుట్ట ఆలయంలో రామారావు కార్యాలయంలో సైతం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించి పలు ఫైల్స్ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. -
యువజనోత్సవాలకు వేళాయే..
సూర్యాపేటటౌన్ : యువత కళా నైపుణ్యాలు ప్రదర్శించే సమయం ఆసన్నమైంది. నవంబర్ 7న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో యువజనోత్సవాలను నిర్వహించనున్నారు. జిల్లా యువజన సర్వీసులు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఈ పోటీలు ఏర్పాటు చేస్తున్నారు. వివిధ కళల్లో రాణించే యువతీయువకులకు ఇదో చక్కటి వేదిక కానుంది. ఇందులో ప్రతిభ కనబరిచే కళాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. అర్హులు వీరే... జాతీయ యువజనోత్సవాల సందర్భంగా సూర్యాపేట జిల్లాకు చెందిన యువత మాత్రమే ఈ పోటీల్లో పాల్గొనడానికి అర్హులు. 15 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. మూడేళ్లుగా జాతీయ స్థాయి యువజనోత్సవాల్లో పాల్గొన్నవారు ఇప్పుడు జరిగే పోటీలకు అనర్హులు. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన వారిని రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలకు పంపుతారు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన వారిని జాతీయ స్థాయిలో వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 12వ తేదీ వరకు న్యూఢిల్లీ లో జరిగే యువజనోత్సవాలకు పంపుతారు. అంశాలు, నిబంధనలు.. 1. జానపద నృత్యం గ్రూప్..బృందంలో సభ్యుల సంఖ్య 10 కి మించరాదు. ప్రదర్శనకు గరిష్ట కాలపరిమితి 15 నిమిషాలు. భారత సంప్రదాయానికి అనుగుణంగా ఉండాలి సినిమా పాటలను అనుమతించరు. వాయిద్య పరికరాలు అభ్యర్థులే తెచ్చుకోవాలి. 2. జానపద పాటలు గ్రూప్...● బృందంలో సభ్యుల సంఖ్య 10 కి మించరాదు. ● ప్రదర్శనకు గరిష్ట కాలపరిమితి 07 నిమిషాలు. ● భారత సంప్రదాయానికి అనుగుణంగా ఉండాలి. ● సినిమా పాటలు అనుమతించరు ● వాయిద్య పరికరాలు అభ్యర్థులే తెచ్చుకోవాలి. 3. కథా రచన ( హిందీ / ఇంగ్లిష్ / తెలుగు ).. ● ఒక్కొక్కరు ఒక రచనను మాత్రమే సమర్పించాలి. ● వ్యాస రచన 1000 పదాల సముదాయంతో 60 నిమిషాలలో పూర్తి చేయాలి. ● ఏ కులాన్నిగానీ, ఏ మతాన్ని గానీ, జాతిని గానీ, వర్గాన్ని గానీ కించపరిచే విధంగా ఉండకూడదు. ● రచనలో అభ్యంతరకరంగా గానీ, అస్పష్టంగా గానీ లేదా అనుచిత వాక్యాలు ఉండకూడదు. 4. పెయింటింగ్.. ● ఒక్కొక్కరు ఒక పెయింటింగ్ మాత్రమే సమర్పించాలి. ● ఎంట్రీ ఒరిజినల్ అయి ఉండాలి. ● పెయింటింగ్ ఏ3 సైజు , 90 నిమిషాలలో పూర్తి చేయాలి. ● పెయింటింగ్ ఏదైనా నిర్దిష్ట సంస్థకు లేదా ఏదైనా బ్రాండ్ పేరుకు ప్రాతినిధ్యం వహించకూడదు. ● పెయింటింగ్ కు సంబందించిన శీర్షిక 20–30 పదాలు మించకూడదు. 5. ఉపన్యాసం(హిందీ/ఇంగ్లిష్/తెలుగు)● టాపిక్ : భారతదేశంలో అత్యవసర పరిస్థితి, రాజ్యాంగ ఉల్లంఘన, ప్రజాస్వామ్యం, ప్రజా స్వామ్య విలువలను కాపాడటం అనే అంశంపై ఏదైనా భాషలో ఏడు నిమిషాలు మించకుండా అనర్గళంగా మాట్లాడాలి. 6. కవిత్వం ( హిందీ / ఇంగ్లిష్ / తెలుగు )● ఒక్కొక్కరు ఒక రచనను మాత్రమే సమర్పించాలి. ● వ్యాస రచన 500 పదాల సముదాయంతో 60 నిమిషాలలో పూర్తి చేయాలి. 7. ఇన్నోవేషన్ ట్రాక్(ఎగ్జిబిషన్ ఆఫ్ సైన్స్ మేళా)ఇందులో పాల్గొనే వారు పర్యావరణం, వాతావరణ మార్పు, ఆరోగ్య సంక్షోభాలు వంటి ఆధునిక సవాళ్లను పరిష్కరించడానికి అవసరమైన ఆలోచన, సమస్య పరిష్కారం, ఆవిష్కరణలకు సంబంధించిన వాటిపై చేసిన ప్రయోగాలను సైన్స్ మేళాలో ప్రదర్శించాల్సి ఉంటుంది. యువత సద్వినియోగం చేసుకోవాలి యువ కళాకారుల్లో దాగిన ప్రతిభను వెలికి తీయడానికి ప్రభుత్వం యువజనోత్సవాలను ఏర్పాటు చేస్తోంది. ఈ వేదికను యువత సద్వినియోగం చేసుకోవాలి. ఏడు అంశాల్లో పోటీలు కొనసాగుతాయి. ప్రతి అంశానికి న్యాయ నిర్ణేతలు విజేతలను ఎంపిక చేస్తారు. జిల్లా స్థాయి విజేతలను రాష్ట్ర స్థాయిపోటీలకు పంపిస్తాం. – వెంకట్రెడ్డి, జిల్లా క్రీడల, యువజన శాఖ అధికారి నవంబర్ 7న సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వేడుకలు జిల్లా స్థాయి యువజన కళాకారుల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం ఏడు అంశాలపై పోటీలు వచ్చేనెల 4వ తేదీ వరకు గడువుఆసక్తి గల వారు పేర్లు నమోదు చేసుకోవాలి జిల్లా స్థాయిలో జరిగే యువజనోత్సవాల్లో పాల్గొనే యువతీయువకులు వారి వివరాలను నవంబర్ 4వ తేదీ లోపు కలెక్టరేట్లోని రూమ్ నంబర్ 4లోని జిల్లా యువజన, క్రీడల శాఖ కార్యాలయంలో నేరుగా గానీ, సెల్ ఫోన్ నంబర్ 9490023949 ద్వారాగానీ పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా క్రీడల అధికారి వెంకట్రెడ్డి తెలిపారు. -
జాతీయ సమైక్యతకు సర్దార్ @ 150 యూనిటీ మార్చ్
సూర్యాపేట : సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని ప్రజల్లో జాతీయ సమైక్యత, దేశభక్తిని పెంపొందించేందుకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మై భారత్, ఎన్ఎస్ఎస్ సహకారంతో సర్దార్ @ 150 యూనిటీ మార్చ్ నిర్వహించనున్నట్లు రాజ్యసభ సభ్యుడు కేసరి దేవ్సిన్హా జ్వాల తెలిపారు. బుధవారం ఆయన హైదరాబాద్ నుంచి సూర్యాపేట, నల్లగొండ జిల్లాల అధికారులు, మీడియా ప్రతినిధులతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫెరెన్స్లో మాట్లాడారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా యూనిటీ మార్చ్ నిర్వహిస్తున్నామని.. ఈ కార్యక్రమానికి తాను ఉమ్మడి జిల్లా ఇన్చార్జిగా నియమితులైనట్లు చెప్పారు. జాతి నిర్మాణంలో యువతను ప్రోత్సహించడం ద్వారా 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 31 నుంచి నవంబర్ 25 వరకు జిల్లాలో విడతలవారీగా కార్యక్రమాలు ఉంటాయన్నారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో నవంబర్ 12, 13 తేదీల్లో పాదయాత్ర నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ పాదయాత్ర 8 నుంచి 10 కిలోమీటర్లు ఉండేలా చూడాలని, ఇందులో కనీసం 500 మంది యువత, విద్యార్థులు పాల్గొనేలా ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. కలెక్టరేట్లో ఈ కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, జిల్లా క్రీడల అధికారి వెంకట్ రెడ్డి, యూత్ అధికారి రాజేష్, జెడ్పీ సీఈఓ అప్పారావు, విద్యాశాఖ అధికారి అశోక్, జిల్లా ఇంటర్ విద్యాధికారి భాను నాయక్, డీఎంహెచ్ఓ చంద్రశేఖర్, సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ హన్మంత రెడ్డి పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు కేసరి దేవ్సిన్హాజ్వాల -
రాజ్యాంగంపై దాడిగా పరిగణించాలి
చివ్వెంల: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్పై జరిగిన దాడిని రాజ్యాంగంపై దాడిగా పరిగణించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీజేఐపై సనాతన ధర్మం పేరుతో దాడి చేయడం అమానుషమని అన్నారు. ఇటువంటి దాడి చట్టపరిధిలోకి రాదా అని ప్రశ్నించారు. ఈ దాడిని అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయి కానీ ఏ ఒక్కరూ నిరసన కార్యక్రమం చేపట్టలేదన్నారు. చట్ట ప్రకారం ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేయాలని కానీ ఎటువంటి కేసులు నమోదు చేయకపోవడం చాలా విచారకరమన్నారు. దాడిని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. జస్టిస్ గవాయ్పై దాడిని నిరసిస్తూ నవంబర్ 1న హైదరాబాద్లో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపెల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, జీపీ ఫరీదుద్దీన్, ఏజీపీ షఫిఉల్లా, నూకల సుదర్శన్రెడ్డి, వసంత సత్యనారాయణఫిళ్లె, డపుకు మల్లయ్య, దావుల వీరప్రసాద్, ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ సమన్వయకర్త చింతలపాటి చిన్న శ్రీరాములు, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు యాతాకుల రాజన్న, రెబల్ శ్రీను, ఎర్ర వీరస్వామి పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ -
వంతెనల వద్ద పోలీస్ పికెట్
● ఎస్పీ నరసింహ సూర్యాపేటటౌన్ : మోంథా తుపాన్ ప్రభావంతో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నందు వల్ల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నరసింహ బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని కోరారు. ఎక్కడైనా రోడ్లపై నుంచి నీటి ప్రవాహం ఉధృతంగా ఉంటే అలాంటి కల్వ ర్టులు, వంతెనలు దాటవద్దని, ప్రమాదాల బారిన పడవద్దని సూచించారు. జిల్లా పోలీస్ శాఖ అంతా అప్రమత్తంగా ఉందని పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది అంతా సెలవులు రద్దుచేసుకొని విధుల్లో ఉన్నట్లు తెలిపారు. వంతెనలు, కల్వర్టు ల వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేశామని, వరద నీరు వంతనెలపై నుంచి ప్రవహిస్తే వాహనాలతో వంతెనలు దాటవద్దని కోరారు. ప్రజలు పోలీసు వారి సూచనలు పాటించాలని, అత్యవసర సమయంలో డయల్ 100, సూర్యాపేట పోలీస్ కంట్రోల్ రూమ్ కు నంబర్ 8712686026కు ఫోన్ చేయాలని సూచించారు. -
వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
చివ్వెంల(సూర్యాపేట) : వ్యక్తిగత ఆరోగ్యం పట్ల ప్రతిఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీ శారద సూచించారు. బుధవారం సూర్యాపేట జనరల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన వైద్య శిబిరంలో ఆమె మాట్లాడారు. ఆరోగ్య సమస్యల విషయంలో వైద్యులను సంప్రదిస్తూ ముందుకెళ్లాలన్నారు. శరీరంలో వచ్చిన మార్పును చిన్నదిగా భావించకుండా, పనిలో పడి అది ప్రాణాంతకం కాకముందే చూపించుకోవాలన్నారు. అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించుకుని అవసరమైన చికిత్స తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి అపూర్వ రవళి, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ బి.వెంకటరమణ, డిప్యూటీ డీఎంహెచ్ఓ పి.విజయ మనోని, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, డాక్టర్ వై. శ్రీశైలం పాల్గొన్నారు.మట్టపల్లి క్షేత్రంలో నిత్యకల్యాణంహుజూర్నగర్ : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో బుధవారం శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు వేద మంత్రాలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృ తాభిషేకం చేశారు. స్వామి అమ్మవార్లను నూతన పట్టు వస్త్రాలతో అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం రక్తికట్టించారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తంలబ్రాలతో నిత్య కల్యాణతంతు ముగించారు. నీరాజన మంత్రపుష్పాలతో మహా నివేదనచేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ నవీన్కుమార్, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, ఆంజనేయాచార్యులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. పశువైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలికోదాడరూరల్ : మోంథా తుపాను తో భారీ వర్షాలు కురుస్తున్నందున పాడి రైతులు, జీవాల పెంపకం దారులకు ఇబ్బంది కలగకుండా పశువైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ శ్రీనివాసరావు సూచించారు. బుధవారం కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలను ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. వర్షంలో కూడా సిబ్బంది పశుపోషకులకు వైద్య సేవలు చేయడాన్ని ఆయన అభినందించారు. పశుపోషకులకు ఆసరాగా ఉండేందుకు ఏర్పాటు చేసిన పశు ఔషధ బ్యాంకు ద్వారా డాక్టర్ పెంటయ్య రూ. 3.6 కోట్ల అదనపు సంపద సృష్టించి సేవలు అందించడం పశుసంవర్ధక శాఖ చరిత్రలో ఓమైలురాయని పేర్కొన్నాడు. వర్షాల నేపథ్యంలో పశువులను లోతట్టు ప్రాంతాల్లో కట్టయ్యొద్దని, కాల్వలు, నది తీరాల వెంట మేతకు పంపవద్దని, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండే లా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పశువ్యైశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పెంటయ్య, సిబ్బంది ఉన్నారు. -
రైతులకు తీవ్ర నష్టం..
తుపాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో వరి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రధానంగా తుంగతుర్తి, సూర్యాపేట ప్రాంతాల్లో చేతికొచ్చిన వరి పంట నేలకొరిగింది. దాదాపు 40నుంచి 50వేల ఎకరాల వరి వరదలోనే ఉండిపోవడంతో దీనిప్రభావం దిగుబడిపై పడనుంది. నాణ్యత లేకుండా వరికోతల సమయంలో తీవ్ర ఇక్కట్లకు రైతులు గురి కానున్నారు. జిల్లాలో పత్తితీతకు ఉన్న పంట సైతం గింజలు మొలకెత్తనున్నాయి. తేమశాతం పెరిగిపోయి పత్తి నల్లబడిపోతోంది. కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో ఇప్పుడిప్పుడే ఈత దశలో ఉన్న పొలాలు సైతం నేలబారాయి. సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం రాశులు అక్కడక్కడా కొట్టుకుపోయాయి. జిల్లాలో పంట నష్టంపైఅధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఒకటిరెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. -
కృష్ణా నదిలో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు
మేళ్లచెరువు: చేపల వేటకు వెళ్లి కృష్ణా నదిలో చిక్కుకున్న వ్యక్తిని బుధవారం పోలీసులు కాపాడారు. మేళ్లచెరువు మండల కేంద్రంలోని శ్రీరా మనగర్ కాలనీకి చెందిన పరసగాని శ్రీను మంగళవారం తెల్లవారుజామున చింతలపాలెం మండలం పాతవెల్లటూరు గ్రామ పరిధిలోని కృష్ణా నదిలోకి పడవలో చేపల వేటకు వెళ్లాడు. వేట మధ్యలో వర్షం పడుతుండగా పడవ ఇంజన్ రిపేరు వచ్చింది. దీంతో పడవను ఒడ్డుకు చేర్చడం కష్టంగా మారింది. ఎలాగో అలా అతడు నది ఒడ్డుకు వెళ్లి రాత్రంతా వర్షంలో బిక్కుబిక్కమంటూ ఉన్నాడు. బుధవారం ఉదయం శ్రీనుకు కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా.. ఎటు వెళ్లాలో దారి తెలియక ఇబ్బంది పడుతున్నట్లు చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు రెవెన్యూ అధికారులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఏపీలోని పల్నాడు జిల్లా బెల్లంకొండ పోలీసులకు సమాచరం అందించగా.. వారు శ్రీను చిక్కున్న ప్రదేశానికి వెళ్లి అతడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రథమ చికిత్స చేయించి ఇంటికి పంపించారు. సకాలంలో స్పందించి శ్రీనును కాపాడినందుకు చింతలపాలెం ఎస్ఐ సందీప్రెడ్డికి, బెల్లంకొండ పోలీసులకు అతడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
రిటర్న్ గిఫ్ట్గా రాజ్యాంగం పుస్తకాలు
ఇబ్రహీంపట్నం రూరల్: తన కుమార్తె వివాహ వేడుకకు హాజరైన బంధువులు, అతిథులకు రాజ్యాంగం పుస్తకాలను రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చారు ఓ న్యాయవాది. వివరాలు ఇలా ఉన్నాయి.. సూర్యాపేట జిల్లాలోని ఫణిగిరికి చెందిన విశాఖ మాధవ కృష్ణారెడ్డి హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తూ హైదరాబాద్లో నివాసముంటున్నారు. బుధవారం తన కుమార్తె ఆశృతరెడ్డి వివాహాన్ని రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లోని ఓ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. న్యాయవాద వృత్తిపై ఉన్న మమకారంతో పాటు భారత రాజ్యాంగంపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పెళ్లికి హాజరైన వెయ్యి మందికి పైగా అతిథులకు రాజ్యాంగం పుస్తకాలను అందజేశారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో పాటు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, కంచె అయిలయ్య తదితరులు రిటర్న్ గిఫ్ట్లు తీసుకుని వకీల్సాబ్ ఆలోచనను అభినందించారు. 45 గొర్రెల అపహరణభువనగిరి: భువనగిరి మండల పరిధిలోని వడపర్తి గ్రామంలో 45 గొర్రెలను మంగళశారం రార్రి దుండగులు అపహరించారు. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వడపర్తి గ్రామానికి చెందిన మేడబోయిన బాలయ్య మంగళవారం సా యంత్రం గ్రామ సమీపంలోని తన వ్యవసాయ బావి వద్ద ఉన్న షెడ్డులోకి గొర్రెలను తోలాడు. రాత్రి 7.30 గంటలకు పాలు పిండుకుని ఇంటికి వెళ్లాడు. తిరిగి బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు గొర్రెల షెడ్డు వద్దకు రాగా.. 45 గొర్రెలు కనిపించలేదు. చుట్టుపక్కల ఎంత వెతికినా గొర్రెలు కనిపించకపోవడంతో సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా.. గుర్తుతెలియని వ్యక్తులు గొర్రెలను అపహరించుకెళ్తున్నట్లు అందులో రికార్డయ్యింది. దీంతో బాధితుడు భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అనిల్కుమార్ తెలిపారు.మహిళపై దాడి కేసులో ఆరుగురికి జైలుశిక్ష రామన్నపేట: మహిళపై దాడిచేసి గాయపరిచిన కేసులో ఆరుగురికి జైలుశిక్ష, జరిమానా విధిస్తూ రామన్నపేట అదనపు జ్యూడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి ఎస్. శిరీష బుధవారం తీర్పు వెలువరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వలిగొండ మండల పరిధిలోని నర్సాపురం గ్రామానికి చెందిన ఓ మహిళపై 2019వ సంవత్సరంలో విజయదశమి వేడుకల్లో అదే గ్రామానికి చెందిన కవాటి మహేష్, కవాటి నరేష్, కవాటి శివ, ఏనుగుల ఉప్పలయ్య, జక్కుల రామకృష్ణ, కవాటి సుదర్శన్ దాడి చేసి గాయపరిచారు. దీంతో సదరు మహిళ ఆరుగురిపై వలిగొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అప్పటి ఎస్ఐ పి. శివనాగప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సరైన ఆధారాలు, సాక్ష్యాలు సేకరించి ఆరుగురిపై కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో ఆరుగురు నిందితులకు ఏడాది జైలుశిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు వెలువరించారు. -
జాతీయ రహదారిపై కెమికల్ ట్యాంకర్ బోల్తా
నకిరేకల్: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్ప్లాజా వద్ద బుధవారం సాయంత్రం కెమికల్ లోడుతో వెళ్తున్న ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం హైదరాబాద్ నుంచి కెమికల్ ట్యాంకర్ విజయవాడకు బయల్దేరింది. మార్గమధ్యలో కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్ప్లాజా దాటిన వెంటనే ట్యాంకర్ అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. దీంతో ట్యాంకర్లోని కెమికల్ రోడ్డుపై పడి నురగలు రాటడంతో పాటు తెల్లని పొగ కమ్ముకుంది. సమాచారం అందుకున్న కేతేపల్లి పోలీసులు, నకిరేకల్ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుపై పడిన పారిన కెమికల్ను నీటితో శుభ్రం చేశారు. అనంతరం పోలీసులు క్రేన్ల సహాయంలో ట్యాంకర్ను రోడ్డుపై నుంచి పక్కకు తొలగించారు. ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్ ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డాడు. -
భువనగిరి గుండా వెళ్లే పలు రైళ్లు రద్దు
భువనగిరి: మోంథా తుపాన్ కారణంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో బుధవారం భువనగిరి రైల్వే స్టేషన్ గుండా వెళ్లే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు రద్దు చేశారు. సికింద్రాబాద్ నుంచి భువనగిరి రైల్వే స్టేషన్ మీదుగా విజయవాడ, కాకినాడ, విశాఖపట్నంకు వెళ్లే రైళ్లు రద్దయ్యాయి. సమచారం తెలుసుకుని ప్రయాణికులు రైల్వే స్టేషన్ నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. ప్రయాణికుల ఇబ్బందులు..బీబీనగర్ : రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బీబీనగర్ రైల్వే స్టేషన్కు వచ్చిన ప్రయాణికులు రైళ్లు రద్దయిన విషయం తెలుసుకుని వరంగల్–హైదరాబాద్ హైవేకు చేరుకొని బస్సులను ఆశ్రయించారు. తుపాన్ కారణంగా సికింద్రాబాద్–బీబీనగర్ రైల్వే మార్గం గుండా వెళ్లే భాగ్యనగర్, నారాయణాద్రి, విశాఖ, కాకతీయ నర్సాపూర్ ఎక్స్ప్రెస్లను రద్దు చేశారు.రైళ్ల రాకపోకలు ఇలా..సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్నగర్ వెళ్లే రైలును అప్ అండ్ డౌన్లో రద్దు చేశారు. భాగ్యనగర్ రైలును, సికింద్రాబాద్ నుంచి కాకినాడ పోర్టు వరకు వెళ్లే గౌతమి ఎక్స్ప్రెస్ను రద్దు చేశారు. కాకినాడ నుంచి వచ్చే రైలు యథావిధిగా నడుస్తోంది. గుంటూరు నుంచి విజయవాడ మీదుగా సికింద్రాబాద్కు వచ్చే అప్ అండ్ డౌన్ రైలును కాజీపేట మీదుగా కాకుండా దారి మళ్లించి గుంటూరు–నడికుడి మీదుగా.. ఆదిలాబాద్–తిరుపతి కృష్ణా ఎక్స్ప్రెస్ రైలును ఖాజీపేట మీదుగా కాకుండా బీబీనగర్–నడికుడి మీదుగా నడిపిస్తున్నారు. కాకతీయ, పుష్పుల్ రైళ్లను యథావిఽధిగా నడిపిస్తున్నారు. -
ఏసీబీ వలలో యాదగిరిగుట్ట ఆలయ విద్యుత్ ఈఈ
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం విద్యుత్ ఈఈ రామారావు కాంట్రాక్టర్ వద్ద రూ.1.90లక్షలు లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ జగదీశ్ చంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట ఆలయంలో లడ్డూ, పులిహోర ప్రసాదం తయారీ మిషన్ల మెయింటనెన్స్ టెండర్ను యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన ఉపేందర్, సందీప్రెడ్డి గతేడాది రూ.10లక్షలకు దక్కించుకున్నారు. కానీ గత సంవత్సర కాలంగా వారికి బిల్లులు రావడం లేదు. దీంతో తమకు రావాల్సిన రూ.10లక్షల బిల్లులు ఇవ్వాలని ఉపేందర్, సందీప్రెడ్డి గత కొన్ని నెలలుగా ఈఈ రామారావును అడుగుతూ వస్తున్నారు. రూ.2లక్షలు ఇస్తేనే.. అయితే రూ.10లక్షల బిల్లుల్లో రూ.2లక్షలు తనకు ఇవ్వాలని రామారావు డిమాండ్ చేశాడు. రూ.1.90లక్షలు ఇస్తామని ఉపేందర్, సందీప్రెడ్డి చెప్పారు. ఈ విషయాన్ని వారు ఏసీబీ అధికారుల దృష్టికి రెండు నెలల క్రితం తీసుకెళ్లారు. రామారావు వివిధ పనుల్లో బిజీగా ఉండి ఉపేందర్, సందీప్రెడ్డిని ఈ రెండు నెలలు డబ్బులు అడగలేదు. బుధవారం విధులు ముగించుకొని హైదరాబాద్కు వెళ్తూ మార్గమధ్యలో రూ.1.90లక్షలు తీసుకుంటానని ఉపేందర్, సందీప్రెడ్డికి రామారావు చెప్పాడు. దీంతో వారు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చారు. మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లిలోని ఓ ఆస్పత్రి సమీపంలో ఉపేందర్, సందీప్రెడ్డి నుంచి రామారావు రూ.1.90లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. గతంలో 9 నెలలు సస్పెండ్. యాదగిరిగుట్ట ఆలయంలో సురక్ష సిబ్బంది వద్ద ఈఈ రామారావు డబ్బులు తీసుకొని వారిని ఉద్యోగంలో పెట్టుకున్నారని గతేడాది ఆరోపణలు రావడంతో అప్పటి ఈఓ భాస్కర్రావు విచారణ చేసి రామారావును సస్పెండ్ చేశారు. 9 నెలలు సస్పెండ్కు గురైన తర్వాత పైరవీలు చేసుకొని తిరిగి ఈ ఏడాది ఏప్రిల్లో ఉద్యోగంలో చేరినట్లు తెలుస్తోంది. ఆయన అక్రమ పద్ధతిలో ఉద్యోగం సంపాదించాడని, కింది స్థాయి ఉద్యోగులు, సిబ్బంది, ప్రైవేట్ సిబ్బందిని ఇబ్బందులకు గురిచేసేవారనే ఆరోపణలు ఉన్నాయి. తన వద్ద పనిచేసే సిబ్బందితో తన వ్యవసాయ బావి వద్ద పనులు చేయించుకునే వారని, వినకుంటే వ్యక్తిగతంగా దూషించి, ఉద్యోగంలో నుంచి తీసేస్తానని బెదిరించేవాడని సమాచారం. ఇక్కడ ఈఈ, మేడారంలో ఎస్ఈ..? ములుగు జిల్లా మేడారంలో వచ్చే ఏడాది జరగనున్న సమ్మక్క–సారక్క జాతర జరగనుండగా.. అక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న ఎస్ఈ పోస్టుకు రామారావును ఇన్చార్జిగా రెండు రోజుల క్రితం నియమించినట్లు తెలుస్తోంది. విద్యుత్ విభాగంలో పనిచేస్తున్న రామారావు.. సివిల్ విభాగంలో ఇన్చార్జి ఎస్ఈగా పదోన్నతి పొందడంపై స్థానిక ఆలయ ఉద్యోగుల్లో చర్చ మొదలైంది. ఇదిలా ఉండగా.. బుధవారం యాదగిరి క్షేత్రంలోని లక్ష్మీ పుష్కరిణిని సందర్శించేందుకు వచ్చిన సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస్రాజుతో కలిసి ఇన్చార్జి ఎస్ఈ హోదాలో రామారావు పరిశీలించాడు. ఇంట్లో సోదాలు ఏసీబీ డీఎస్పీ జగదీశ్ చంద్రం ఆధ్వర్యంలో రామారావు ఇంట్లోతో పాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా యాదగిరిగుట్ట ఆలయంలో రామారావు కార్యాలయంలో సైతం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించి పలు ఫైల్స్ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రసాదం మెయింటనెన్స్ మిషన్ల కాంట్రాక్టర్ వద్ద డబ్బులు డిమాండ్ రూ.1.90లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు 9 నెలలు సస్పెండ్ అయ్యి.. ఏప్రిల్లోనే తిరిగి ఉద్యోగంలోకి.. -
యాదగిరి క్షేత్రానికి ‘మోంథా’ ఎఫెక్ట్
యాదగిరిగుట్ట: కార్తీక మాసంలో యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. మోంథా తుపాన్ కారణంగా మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో బుధవారం స్వామివారి క్షేత్రానికి భక్తుల రాక తగ్గింది. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, మాడ వీధులు భక్తులు తక్కువగా కనిపించారు. ఆరు బ్యాచ్లుగా సత్యనారాయణస్వామి వ్రత పూజలను 114 జంటలు నిర్వహించాయి. వివిధ పూజలతో స్వామివారికి నిత్యాదాయం రూ.9,17,614 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు. తుపాన్ కారణంగా తగ్గిన భక్తులు -
ఢిల్లీలో ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ సదస్సుకు ఎంపిక
నల్లగొండ: దేశ రాజ ధాని ఢిల్లీలో గురువారం, శుక్రవారం జరగనున్న ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ సదస్సుకు నల్లగొండ పట్టణంలోని గొల్ల గూడ పీఏసీఎస్ ఎంపికై ంది. ఈ మేరకు పీఏసీఎస్ చైర్మన్ నాగరత్నంరాజు బుధవారం సీఈఓ కంచర్ల అనంతరెడ్డితో కలిసి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా నాగరత్నంరాజు మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి 5 సొసైటీలు ఎంపిక కాగా అందులో గొల్లగూడ సొసైటీ ఒకటని పేర్కొన్నారు. ఆత్మకూర్(ఎం) పీఏసీఎస్ కూడా.. ఆత్మకూరు(ఎం): ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ సదస్సుకు ఆత్మకూరు(ఎం) పీఏసీఎస్ కూడా ఎంపిక కాగా.. పీఏసీఎస్ చైర్మన్ జిల్లాల శేఖర్రెడ్డి, సీఈఓ యాస కిరణ్ బుధవారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు రామన్నపేట: కుటుంబ సమస్యలతో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. బుధవారం రామన్నపేట ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన శివరాత్రి తేజ, అతడి భార్య శిరీష మధ్య ఇటీవల గొడవ జరిగింది. దీంతో శిరీష తరఫు కుటుంబ సభ్యులు, కుల పెద్దలు తేజను మందలించారు. దీంతో ఈ నెల 25న తేజ ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతడి కోసం బంధువులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. తేజ భార్య శిరీష రామన్నపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
అక్రమ దత్తత నుంచి శిశువులకు విముక్తి
నల్లగొండ: ఇద్దరు శిశువులను అక్రమంగా దత్తత తీసుకున్న వారి నుంచి పోలీసులు విడిపించి శిశుగృహకు తరలించారు. ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ విలేకరులకు వివరాలు వెల్లడించారు. తిరుమలగిరి(సాగర్) మండలం ఎల్లాపురం గ్రామానికి చెందిన కుర్ర బాబుకు 11 ఏళ్ల క్రితం పార్వతితో వివాహమైంది. వీరు నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని బీటీఎస్లో నివాసముంటున్నారు. బాబు కూలి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బాబు, పార్వతి దంపతులకు మొదట కుమారుడు పుట్టి చనిపోగా.. ఆ తర్వాత ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. అందులో ఒక పాప 2సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. 15 రోజుల క్రితం హాలియాలోని నిర్మలా ఆస్పత్రిలో పార్వతి మళ్లీ ఆడపిల్లకు జన్మించింది. కాగా.. ఆడపిల్లను పెంచి పోషించడం తనకు భారమవుతుందని అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న శాంతిప్రియ అనే డాక్టర్కు బాబు చెప్పాడు. దీంతో డాక్టర్ శాంతిప్రియ ఆ పాపను దత్తత ఇప్పించేందుకు తనకు తెలిసిన ఏపీలోని ఏలూరుకు చెందిన సాంబమూర్తి, రజిత దంపతులకు చెప్పింది. సాంబమూర్తి, రజిత దంపతులు ఈ నెల 25న నల్లగొండకు వచ్చి సాయంత్రం 7గంటల సమయంలో నల్లగొండ బస్టాండ్ నుంచి రైల్వే స్టేషన్కు వెళ్లే దారిలో బాబు, పార్వతి దంపతుల నుంచి రూ.2.30లక్షలకు పాపను దత్తత తీసుకుంటామని ఒప్పందం చేసుకుని రూ.10వేలు ఇచ్చారు. పాప హెల్త్ చెకప్ చేసిన తర్వాత లీగల్ ప్రాసెస్ పూర్తిచేసి మిగతా డబ్బులు ఇస్తామనే ఒప్పందంతో పాపను సాంబమూర్తి దంపతులు తమ వెంట తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ సూపర్వైజర్ సరస్వతి నల్ల గొండ వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు డాక్టర్ శాంతిప్రియను మంగళవారం హైదరాబాద్లో అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె ఉక్రెయిన్లో ఎంబీబీఎస్ చేసి హాలియాలోని నిర్మల ఆస్పత్రిలో డాక్టర్గా చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. డాక్టర్ శాంతిప్రియ తమ బంధువు సరస్వతి ద్వారా ఏపీలోని ఏలూరుకు చెందిన సాంబమూర్తి దంపతులు పిల్లలను దత్తత తీసుకోవాలని చూస్తున్నారని తెలుసకుందని, కుర్ర బాబు దంపతులు కూడా తమకు పుట్టిన పాపను విక్రయిస్తామనడంతో సాంబమూర్తి దంపతులకు శాంతిప్రియ సమాచారం ఇచ్చిందని ఎస్పీ వివరించారు. ఈ కేసులో కుర్ర బాబుతో పాటు సాంబమూర్తి, ఆయన భార్య రజిత, డాక్టర్ శాంతిప్రియను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు.21 రోజుల బాబును అక్రమంగా దత్తత తీసుకున్న కేసులో ముగ్గురిని అరెస్టు చేయగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. గుర్రంపోడు మండలం కోనాయిగూడెం గ్రామానికి చెందిన ఓర్సు శ్రీను, సుజాత దంపతులకు ముగ్గురు పిల్లలు సంతానం. భార్య సుజాత, పిల్లలకు దూరంగా ఉంటున్న ఓర్సు శ్రీను ఆరేళ్ల క్రితం మట్టి పని కోసం ఒరిస్సాకు వెళ్లి అక్కడ జంకర్మాల అలియాస్ మమతను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక పాప పుట్టింది. మమత రెండోసారి గర్భవతి కాగా.. రెండు నెలల క్రితం ఆమెతో కలిసి ఓర్సు శ్రీను స్వగ్రామానికి వచ్చాడు. అయితే కోనాయిగూడేనికే చెందిన వేముల నాగరాజు, సువర్ణను తమ దూరపు బంధువైన కనగల్ మండలం బోయినపల్లికి చెందిన శ్రీను రెండు నెలల క్రితం కలిసి పిల్లలు విక్రయించేవారుంటే చెప్పాలని కోరాడు. ఈ విషయాన్ని నాగరాజు, సువర్ణ కలిసి ఓర్సు శ్రీను, మమత దంపతులకు చెప్పారు. దీంతో ఓర్సు శ్రీను, మమత దంపతులు తమకు పుట్టబోయే బిడ్డను విక్రయించి తిరిగి ఒరిస్సా వెళ్లాలని నిర్ణయించుకుని అందుకు ఒప్పుకున్నారు. ఈ నెల 8న మమత మగ బిడ్డకు జన్మినిచ్చింది. పుట్టిన బిడ్డను విక్రయించాలని నిర్ణయించుకున్న ఓర్సు శ్రీను, మమత దంపతులు వేముల నాగరాజు, సువర్ణకు విషయం చెప్పారు. రూ.6లక్షలకు శిశువును విక్రయిస్తామని చెప్పడంతో మధ్యవర్తి అయిన శ్రీను, నాగరాజు, సువర్ణ ఈ నెల 10న ఈ నెల 10న రూ.4.50లక్షలకు ఒప్పందం చేసుకున్నారని ఎస్పీ తెలిపారు. ఈ నెల 15న డబ్బులు చెల్లించి బాబును తీసుకెళ్లారు. ఈ ఘటనపై కూడా ఐసీడీఎస్ సూపర్వైజర్ సరస్వతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టి మధ్యవర్తి శ్రీనుతో పాటు బాబును కొన్న వేముల నాగరాజు, సువర్ణను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని, బాలుడి తండ్రి ఓర్సు శ్రీను, మమత పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. పై రెండు కేసుల్లో మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశామని, శిశువులను శిశుగృహకు అప్పగించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో డీఎస్పీ శివరాంరెడ్డి, ఐసీడీఎస్ పీడీ నిర్మల, సీఐలు రాజశేఖర్రెడ్డి, రాఘవరావు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.మరో కేసులో ముగ్గురి అరెస్టు శిశుగృహకు అప్పగించిన పోలీసులు ఏడుగురి అరెస్టు వివరాలు వెల్లడించిన నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
చెరువులను కాపాడాలని మంత్రికి వినతి
హుజూర్నగర్ : ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఆక్రమణలకు గురైన చెరువులను కాపాడాలని కోరుతూ మంగళవారం హైదరాబాద్లో రాష్ట్ర మత్స్యసహకార శాఖ మంత్రి వాకిటి శ్రీహరికి సూర్యాపేట జిల్లా మత్స్య పారిశ్రామిక సంఘం జిల్లా ప్రమోటర్ పేరబోయిన వీరయ్య ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ప్రతి సంవత్సరం చెరువుల్లో నీరు తగ్గినప్పుడల్లా కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులను ప్రోత్సహించేందుకు ఉచిత చేప పిల్లలను పంపిణీ చేస్తోందని, కానీ చేప పిల్లల నాణ్యత లోపంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారని మంత్రికి వివరించారు. 70శాతం హాజరు ఉంటేనే పరీక్ష ఫీజు తీసుకోవాలికోదాడ : విద్యార్థుల హాజరు 70 శాతం ఉంటేనే పరీక్ష ఫీజు తీసుకోవాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి భాను నాయక్ కోరారు. మంగళవారం నడిగూడెం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన అనంతరం అధ్యాపకులు, విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మట్లాడారు. వచ్చే నెల 1 నుంచి 90 రోజుల ప్రణాళికలో విద్యార్థులు తప్పనిసరిగా పాల్గొని, వార్షిక పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. ప్రతి జూని యర్ కళాశాలలో డిజిటల్ బోర్డులను త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ డి.విజ య నాయక్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి సూర్యాపేటటౌన్ : పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ వీరబోయిన లింగయ్య యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయకపోవడంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ పేద విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారన్నారు. అదే విధంగా పై చదువులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా కళాశాల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బయ్య రాజేష్, శైలజ, విజయ కుమారి, లక్ష్మి, పల్లవి, సంధ్య, సింధు, సుజాత, భవాని, కవిత, గణిత, సరిత, విద్యార్థులు పాల్గొన్నారు. రేపు సీపీఐ జిల్లా కౌన్సిల్ సమావేశం సూర్యాపేట అర్బన్: ఈనెల 30న హుజూర్నగర్లో జిల్లా స్థాయి కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు వెల్లడించారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ధర్మభిక్షం భవన్లో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశానికి సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, శాసన మండలి సభ్యుడు నెల్లికంటి సత్యం, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్, గన్నా చంద్రశేఖర్ హాజరవుతారని వివరించారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు మండవ వెంకటేశ్వర్లు, బూర వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షుడు దంతాల రాంబాబు, పద్మ రేఖ, దేశగాని హేమలత, గాలి కృష్ణ, చిట్టిప్రోలు కోటయ్య పాల్గొన్నారు. -
ముగిసిన శ్రీరామ యజ్ఞ మహోత్సవం
హుజూర్నగర్ : కార్తీక మాసం సందర్భంగా నేరేడుచర్ల పట్టణంలోని శ్రీకోదండ రామాలయంలో నిర్వహిస్తున్న శ్రీరామ యజ్ఞ మహోత్సవం ముగిసింది. మంగళవారం ఆలయ ప్రధాన అర్చకుడు బృందావనం శ్రీరామ నర్సింహతేజ ఆధ్వర్యంలో వేద పండితులు.. వేదమంత్రోత్సవాల మధ్య వేడుకను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రపాలకుడు శ్రీఆంజనేయస్వామి, శ్రీరామ దండానికి పంచామృతాలతో అభిషేకం చేసి అరటిపండ్లతో అలంకరించారు. అనంతరం ఆలయంలోని దేవతా ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పల్లకీపై ఆలయం చూట్టు జై శ్రీరాం నినాదాలతో ఊరేగించారు. ఆలయ ఆవరణలోని మండపంలో ఏర్పాటు చేసిన హోమ గుండంలో సంప్రదాయబద్ధంగా శ్రీరామ యజ్ఞం జరిపారు. ఆలయంలోని శ్రీదేవతామూర్తులను తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామిని పోలి ఉండేలా ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వేడుకలో ఆలయ కమిటీ చైర్మన్ కొణతం సత్యనారాయణరెడ్డి, ఆలయ ధర్మకర్త రాచకొండ రామచందర్రావు, నాగమాధవరావు, నరేష్, వెంకటరమణారావు, రాంమోహన్, కృపాకర్, సుధాకర్, కొణతం చిన వెంకట్రెడ్డి, ప్రకాశ్, రామారావు, పూర్ణచంద్రారెడ్డి, లచ్చిరెడ్డి, వెంకట్రెడ్డి, వెంకటేశ్వర్లు, కిశోర్, సుబ్బారావు, భరత్, పవన్, నాయకులు, భక్తులు పాల్గొన్నారు. -
నేరాల నివారణపై ప్రత్యేక దృష్టి
సూర్యాపేటటౌన్ : నేరాల నివారణపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఎస్పీ నరసింహ సూచించారు. మంగళవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి గత నెలలో జరిగిన నేరాల స్థితిగతులను సమీక్షించారు. అనంతరం కేసుల ఫైళ్లను పరిశీలించి సిబ్బందికి సూచనలు సలహాలు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేర నిరూపణలో సిబ్బంది సాంకేతిక సామర్థ్యం కలిగి ఉండాలని, ఫిర్యాదులపై త్వరగా స్పందించి సంఘటనా స్థలానికి త్వరగా చేసుకోవాలన్నారు. రాత్రిళ్లు పెట్రోలింగ్ పటిష్టంగా చేయాలని సూచించారు. కేసులు పెండింగ్ లేకుండా వేగంగా దర్యాప్తు చేయాలన్నారు. కేసుల్లో నేరస్తులకు త్వరగా శిక్షలు పడేలా పని చేయాలన్నారు. పోలీసులు వేగవంతమైన సేవలు అందించినప్పుడే ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో ఒక్క ప్రాణం కూడా పోకుండా సిబ్బంది పని చేయాలని సూచించారు. నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ వాహన దారులు, ప్రజలను రోడ్డు భద్రత పై అప్రమత్తం చేయాలన్నారు. సమావేశంలో జిల్లా అడ్మిన్ అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్, డీసీఆర్బీ డీఎస్పీ రవి, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఫ ఎస్పీ నరసింహ


