breaking news
Suryapet
-
ఇబ్బందులు కలగకుండా సీఎం సభ ఏర్పాట్లు చేయాలి
తిరుమలగిరి (తుంగతుర్తి) : ఈనెల 14 రేషన్కార్డుల పంపిణీకి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తిరుమలగిరి మండల కేంద్రానికి రానున్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సభా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. మంగళవారం తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని మాలిపురం శివారులోని స్థలంతో పాటు ఈదులపర్రె తండా సమీపంలోని స్థలాన్ని, తహసీల్దార్ కార్యాలయం పక్కనే ఉన్న స్థలాన్ని ఎస్పీ నరసింహతో కలిసి కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ రాంబాబు, డీఆర్డీఓ అప్పారావు, ఆర్డీఓ వేణుమాధవరావు, డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ నాగేశ్వరరావు, తహసీల్దార్ హరిప్రసాద్, ఎస్ఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
14 నుంచి విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమ్మె
సూర్యాపేట అర్బన్ : విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 14 నుంచి సమ్మె చేపట్టనున్నట్లు తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల జేఏసీ చైర్మన్ మేడె మారయ్య పిలుపునిచ్చారు. జిల్లా ఆర్టిజన్ కార్మికులు మంగళవారం టీజీఎస్పీడీసీఎల్ సూర్యాపేట సర్కిల్ ఆఫీస్లో సర్వసభ సమావేశం నిర్వహించి మాట్లాడారు.ప్రతి ఆర్టిజన్ కార్మికుడు యూనియన్లకు అతీతంగా సమ్మెలో పాల్గొనాలని కోరారు. ఒకే సంస్థలో రెండు రూల్స్ తీసుకురావడం అన్యాయమని పేర్కొన్నారు. స్టాండింగ్ ఆర్డర్స్ను రద్దుచేసి ఏపీ ఎస్ ఈబీ రూల్స్ వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఆర్టిజన్కార్మికుల జేఏసీ నాయకులు రెహమాన్, దయాకర్ రెడ్డి, మురహరి, రామస్వామి, రాఘవ గోపికృష్ణ, నాగయ్య, యాకయ్య, రమేష్, చారి, రవీంద్ర చారి, పరమేష్, సైదులు పాల్గొన్నారు. నేటి నుంచి మూడు రోజులు కళాశాలలు బంద్ చేయాలిసూర్యాపేట : పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ను విడుదల చేయాలని కోరుతూ ఈనెల 2, 3, 4 తేదీల్లో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ కళాశాలలు బంద్ చేయాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి కోరారు. పీడీఎస్యూ ఆధ్వర్యంలో చేపట్టే కళాశాలల బంద్కు సంబంధించిన వాల్పోస్టర్ను సంఘం నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రూ.7200 కోట్ల స్కాలర్షిప్స్, ఫీజురీయింబర్స్మెంట్ను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి పిడమర్తి భరత్, మహేష్, నవీన్, వినయ్, సంధ్య, మానస, ప్రసన్న, పవన్, మనోజ్ పాల్గొన్నారు. 9న సమ్మెను జయప్రదం చేయాలి సూర్యాపేట : మోదీ ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఈనెల 9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వేంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. మంగళవారం సూర్యాపేటలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో పెయింటర్స్ వర్కర్స్ పట్టణ జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ పదేళ్ల పాలనలో కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చట్టాలను అమలు చేస్తున్నారని అన్నారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి పెట్టుబడి దారులకు అనుకూలంగా ఉండే లేబర్ కోడ్లను తెచ్చారని ఆరోపించారు. ఈ సమావేశానికి పెయింటర్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు పాముల ఉపేందర్ అధ్యక్ష వహించగా, యూనియన్ నాయకులు కృష్ణ, రఫి, మూర సైదులు, బాబా, మార్క్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధి పనులు వినియోగించుకోవాలిమద్దిరాల : కూలీలు ఉపాధిహామీ పనులను వినియోగించుకోవాలని డీఆర్డీఓ వి.వి. అప్పారావు కోరారు. మద్దిరాల మండల పరిధిలోని పోలుమల్లలో కొనసాగుతున్న ఉపాధిహామీ పనులను మంగళవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఉపాధిహామీ పనులను సక్రమంగా చేసి ప్రభుత్వం అందించే కూలి పొందాలన్నారు. -
చెత్త సేకరణలో జాప్యం
సూర్యాపేట అర్బన్ : సూర్యాపేట పట్టణంలో చెత్తను సేకరించడానికి మున్సిపాలిటీ సిబ్బంది పనిచేస్తున్నా, అధికారుల పూర్తిస్థాయి పర్యవేక్షణ లేక ప్రజలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వర్షాకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులు విజృంభించే ఈ తరుణంలో సూర్యాపేట మున్సిపాలిటీలో 100 రోజుల ప్రణాళికలో భాగంగా నిత్యం చెత్త సేకరణ చేస్తున్నారు. కానీ శివారు ప్రాంతాలు, చిన్నచిన్న గల్లీలలో చెత్త సేకరణలో జాప్యం జరిగుతోంది. దీంతో ఇళ్లలో చెత్త పేరుకుపోతోందని ప్రజలు అంటున్నారు. శివారు ప్రాంతాల్లో చెత్తను రోడ్ల పక్కన ఖాళీ ప్లాట్లలోనే వేస్తున్నారు. ఈ క్రమంగా దోమలు, ఈగలు వ్యాప్తి చెంది అనారోగ్యం బారిన పడుతున్నామని శివారు కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడి, పొడి చెత్త వేరు చేయకుండా సేకరిస్తున్నారని చెబుతున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారుల్లో చెత్తను పూర్తిస్థాయిలో సేకరించి శుభ్రంగా ఉంచుతున్నారు. -
ఉపాధిలో రాణించారు
ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి జాబ్కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవా లి. ఈ ఆర్థిక సంవత్సరంలో మూడునెలల్లోనే పురుషుల కంటే ఎక్కువగా మహిళలే ఉపాధి పనులకు హాజరవుతున్నారు. ఇంకా ఎవరైనా ఉపాధి పని చేయాలనుకుంటే సంబంఽధిత క్షేత్ర సహాయకులను సంప్రదించి జాబ్కార్డులను పొందవచ్చు. – వి.వి.అప్పారావు, డీఆర్డీఓ, సూర్యాపేట నాగారం : మహిళలు తాము ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు. అవకాశాలను అందిపుచ్చుకుని రాణిస్తున్నారు. ఇంటిని చక్కదిద్దడమే కాకుండా.. కుటుంబ పోషణకు కావాల్సిన ఆర్థిక సహకారం తమ వంతుగా అందిస్తున్నారు. పురుషులతో సమానంగా ఉద్యోగాల్లోనే కాకుండా వ్యవసాయం, కూలి పనుల్లోనూ చెమటోడ్చి కష్టపడుతున్నారు. ఉపాధి హామీ పనుల్లోనూ పార, గడ్డపార పట్టి పనులు చేస్తున్నారు. ఒకప్పుడు ఊరు వదిలి పట్టణాలకు వెళ్లి కూలి పనులు చేసుకునే వారు. ఇప్పుడు ఉన్న ఊరిలోనే కూలి పనులు చేసుకుంటున్నారు. జిల్లాలో ఈ(2025–26) ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మూడు నెలల్లోనే పురుషుల కంటే మహిళలు ఎక్కువ పని దినాలను వినియోగించుకొని శభాష్ అనిపించుకున్నారు. జాబ్ కార్డులు పరిశీలిస్తే... ఉపాధి హామీ పథకం ప్రారంభించిన కొత్తలో పురుషులే కూలి పనులకు వెళ్లేవారు. తర్వాత రోజుల్లో క్రమంగా మహిళలు ఆసక్తి చూపించారు. ఇప్పుడు ఎక్కువ పని దినాలను వినియోగించుకోవడంలో అతివలే ముందంజలో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పథకంలో భాగంగా 2025–26 ఆర్థిక సంవత్సరంలో మూడునెలల్లోనే పనిదినాలను పురుషుల కంటే ఎక్కువగా మహిళలే వినియోగించుకున్నారు. జిల్లాలో మొత్తం 2.15లక్షల మంది కూలి పనులు చేస్తే వీరిలో మహిళలు 1.25 లక్షల మంది ఉన్నారు. పురుషుల కంటే ఎక్కువగా మహిళలు పని దినాలు చేసి తాము ఎందులోనూ తక్కువ కాదని నిరూపించుకున్నారు. ఉపాధి కూలీలు చేసిన మొత్తం పనిదినాలు 24.64లక్షల్లో 15.13లక్షల పనిదినాలను మహిళలు వినియోగించుకున్నారు. సాగుతున్న పనులు.. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటడానికి గుంతలు తవ్వుతున్నారు. ఇంకుడు గుంతల నిర్మాణాలు, నర్సరీల పెంపకం పనులు కొనసాగుతున్నాయి. ఈ పథకంలో మేకలు, పశువుల షెడ్లు, కోళ్ల ఫారాల నిర్మాణాలు చేసుకోవచ్చు. ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేస్తారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలి. రూ.6.19 కోట్లు ఖర్చు.. జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో మూడు నెలల్లోనే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.6.19 కోట్లు ఖర్చు చేశారు. ఈ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణాలు, ఫాంపాండ్, ఫిష్ పాండ్, ఇంకుడు గుంతలు, పొలాల్లో కట్టలు, నర్సరీల నిర్వహణ, చెట్ల పెంపకం, ఇతరత్రా పనులు చేపట్టారు. 2025–26లో మూడునెలల్లోనే 1.25 లక్షల మంది మహిళలు ఉపాధి బాట పురుషుల కంటే అధికంగా పనులకు హాజరు ఎక్కువ పనిదినాలు సైతం వినియోగంఉపాధి పనుల వివరాలుజాబ్ కార్డులు : 2.63 లక్షలు కూలీలు మొత్తం : 5.70 లక్షలు ఖర్చయిన నిధులు : రూ.6.19 కోట్లు పనిచేసిన కూలీలు : 2.15 లక్షలు మహిళలు : 1.25 లక్షలు పురుషులు : 90 వేలు మొత్తం పని దినాలు : 24.64 లక్షలు మహిళ పనిదినాలు : 15.13 లక్షలు పురుషుల పనిదినాలు : 9.51 లక్షలు -
నకిలీ విత్తనాలు అంటగట్టారని రైతుల ఆందోళన
సూర్యాపేట : తనకు నకిలీ విత్తనాలు అంటగట్టారని ఆరోపిస్తూ ఓ రైతు మరి కొందరు కర్షకులతో కలిసి విత్తన దుకాణం ఎదుట ఆందోళన నిర్వహించాడు. ఈ సంఘటన మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. మోతె మండలం కూడలి గ్రామానికి చెందిన భూక్య మహేందర్ మే 31వ తేదీన మూడు బస్తాల సాంబ మసూరి విత్తనాలను కొనుగోలు చేశాడు. ఈ విత్తనాలను గత నెల 23వ తేదీన నానబెట్టి మండె కట్టి అదే నెల 26న నారు చల్లాడు. మూడు రోజులపాటు చూసినా నారులో ఎదుగుదల లేకపోవడంతో మొలకశాతం తక్కువగా వచ్చిందని భావించాడు. వెంటనే వరి విత్తనాలు కొనుగోలు చేసిన సూర్య ఆగ్రో ట్రేడర్స్ ముందు కొందరు రైతులతో కలిసి ఆందోళనకు దిగాడు. దీనిపై సూర్యాపేట మండల వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేయగా స్పందించి విత్తన కంపెనీ ప్రతినిధి, సూర్య ఆగ్రో ట్రేడర్స్ యజమానితో మాట్లాడి మొలకశాతం తక్కువగా వచ్చినందున మూడు బస్తాలకు బదులుగా మరో మూడు బస్తాల కొత్త విత్తనాలను రైతుకు ఇచ్చే విధంగా ఒప్పించారు. ఈ విత్తనాలను వెంటనే మండల వ్యవసాయ అధికారి సమక్షంలోనే అందించారు. ఈ విషయమై రైతు భూక్య మహేందర్ మాట్లాడుతూ మండె కట్టిన సమయంలో వాతావరణ మార్పుల కారణంగా వరినారు సరిగా పెరగలేదన్నారు. నారు చల్లిన సమయంలో అధిక ఉష్ణోగ్రత కారణంగా ఈ విధంగా జరిగిందని వ్యవసాయ అధికారులు చెప్పినట్లు తెలిపారు. సానుకూలంగా స్పందించి తాను కొలుగోలు చేసిన మూడు బస్తాల సాంబ మసూరి వరి విత్తనాల స్థానంలో తిరిగి మరోమూడు బస్తాలు ఇప్పించిన మండల వ్యవసాయ అధికారి, ఇచ్చిన సూర్య ఆగ్రో ట్రేడర్స్ కు ఆరైతు కృతజ్ఞతలు తెలిపారు. -
మోదీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీలేదు
గరిడేపల్లి: ప్రధాని మోదీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. మంగళవారం గరిడేపల్లి మండల కేంద్రంలో చింతలపాలెం, మేళ్లచెరువు, గరిడేపల్లి, హుజూర్ నగర్ మండలాల సీపీఎం నాయకులు, కార్యకర్తలకు ఒక రోజు రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతోందని ధ్వజమెత్తారు. ఈకార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్రెడ్డి, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నగరపు పాండు, ములకలపల్లి రాములు, జిల్లా కమిటీ సభ్యులు పల్లె వెంకట్రెడ్డి, ఎస్కె యాకూబ్, బ్రహ్మం, సైదులు, మండల కమిటీ సభ్యులు తుమ్మల సైదయ్య, యానాల సోమయ్య, బోయిళ్ల అర్జున్ దోసపాటి భిక్షం, శ్రీనివాస్, వీరరాఘవులు, నందిపాటి మట్టయ్య, సుధాకర్, మండవ సైదులు, వెంకటేశ్వర్లు, శ్రీను, రామస్వామి, వెంకయ్య, వీరస్వామి పాల్గొన్నారు. ఫ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి -
మూడు, నాలుగు రోజులకు ఒకసారి..
కోదాడ: కోదాడ పట్టణంలోని పలు ప్రాంతాల్లో మురుగునీరు నిల్వ ఉండి దోమల బెడద పెరిగింది. మూడు, నాలుగు రోజులకు ఒకసారి ఇంటింటికి తిరిగి చెత్త సేకరిస్తుండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్లో కాకుండా కోదాడ పెద్దచెరువు, అనంతగిరి రోడ్డు, బైపాస్ సర్వీస్ రోడ్ల వెంట వేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీంతో ఇక్కడ మార్నింగ్ వాక్కు వెళ్లేవారు ఇబ్బంది పడుతున్నారు. ఇళ్ల మధ్య ఖాళీ స్థలాల్లో నీరు నిల్వ ఉండి దోమలు, పందులకు నిలయంగా మారుతున్నాయి. ఈ సమస్య ప్రధానంగా భవానీనగర్, నయానగర్లో తీవ్రంగా ఉంది. ఇది కోదాడ పట్టణంలోని నయానగర్లో అనంతగిరికి వెళ్లే రోడ్డులో ఉన్న ఖాళీ స్థలం. చిన్న వర్షం వచ్చినా నీరు నిల్వ ఉండి మురికి కూపంగా మారుతుంది. దీనిపై అధికారులకు విన్నవించినా సమస్య పరిష్కారం కావడం లేదని ప్రజలు అంటున్నారు. స్థల యజమానులకు నోటీసులు ఇచ్చి నీరు నిల్వ ఉండకుండా మట్టిపోయించాలని కోరుతున్నారు. -
ఉపాధ్యాయుల కృషి అభినందనీయం
భానుపురి (సూర్యాపేట) : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ఉపాధ్యాయులు చేసిన కృషి అభినందనీయమని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమలగిరి జెడ్పీహెచ్ఎస్లో 190 మంది, కోదాడ బాలికల జెడ్పీహెచ్ఎస్లో 170 మంది, కోదాడ బాలుర జెడ్పీహెచ్ఎస్ 166 మంది చేరారని వివరించారు. జిల్లా వ్యాప్తంగా 1 వ తరగతిలో 2,857 మంది కొత్తగా చేరారని, అన్ని పాఠశాలల్లో 9,582 మంది కొత్తగా చేరారని, ఇది త్వరలో 10,000కు చేరుకోవాలని ఆకాక్షించారు. మూతబడిన 11 పాఠశాలలు రీ ఓపెన్ చేసినట్లు తెలిపారు.సమావేశంలో డీఈఓ అశోక్, కో ఆర్డినేటర్లు జనార్దన్, శ్రవణ్ కుమార్, రాంబాబు, పూలమ్మ, ఎంఈఓలు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, అధికారులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తం
తిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ప్రధానంగా మోత్కూరు–తొర్రూరు ప్రధాన రహదారిపై రెండేళ్లుగా రోడ్డు నిర్మాణ పనులు నత్త నడకన సాగుతుండటంతో ఇళ్లలోని మురుగు నీరంతా రహదారిపై చేరి దుర్గంధం వెదజల్లుతోంది. శివారు ప్రాంతాల్లో వారం రోజులకు ఒకసారి కూడా మురుగు కాల్వలు శుభ్రం చేయడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. కొన్నిచోట్ల డ్రెయినేజీలు లేక ఖాళీ స్థలాల్లో మురుగు నీరు చేరి దోమలు, పందులకు ఆవాస కేంద్రాలుగా మారాయి. వర్షా కాలం ప్రారంభమైనా బ్లీచింగ్ చల్లడంలేదని, ఫాగింగ్ సరిగా చేయడం లేదని ప్రజలు చెబుతున్నారు. -
ముగిసిన రేషన్ బియ్యం పంపిణీ
సూర్యాపేట : మూడు మాసాల రేషన్ పంపిణీ ప్రక్రియ సోమవారంతో ముగిసింది. జిల్లాలో 86 శాతం మంది రేషన్షాపుల ద్వారా సన్న బియ్యం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనివిధంగా వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామీణ ప్రాంత ప్రజలు రేషనన్షాపులకు వెళ్లి బియ్యం తీసుకోవాలంటే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్ కోటాను జూన్ లోనే ఇచ్చింది. ఆ కోటా పంపిణీ ముగియడంతో రెండు నెలలపాటు రేషన్ దుకాణాలు మూతపడనున్నాయి. రెండునెలల తర్వాతే..జూన్, జూలై, ఆగస్టు మాసాలకు సంబంధించిన బియ్యం కోటా జూన్ మాసంలోనే రేషనన్ షాపుల ద్వారా పేదలకు పంపిణీ చేశారు. ఆ ప్రక్రియ మొత్తం ముగిసిపోయింది. జిల్లాలో 86 శాతం మంది కార్డుదారులు జిల్లాలో రేషన్ తీసుకున్నారు. అయితే బియ్యం పంపిణీలో పోర్టబులిటీ ఉన్నందున ఇతర జిల్లాల్లో కూడా సూర్యాపేట జిల్లాకు సంబంధించిన కార్డుదారులు 10 శాతం వరకు బియ్యం తీసుకుని ఉండవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. మూడు నెలల కోటా జూన్లో ఇచ్చినందున జూలై, ఆగస్టు నెలల్లో రేషన్షాపులు మూత పడనున్నాయి. సెప్టెంబరు 1 నుంచి మళ్లీ రేషన్షాపులు తెరుచుకోనున్నాయి. సన్న బియ్యం తీసుకున్న 86 శాతం మంది లబ్ధిదారులు రెండు నెలలపాటు మూతపడనున్న రేషన్ షాపులురేషన్ పంపిణీ ఇలా.. రేషన్ దుకాణాలు : 601 మొత్తం కార్డులు : 3,24,158 బియ్యం తీసుకున్నవారు : 2,80 లక్షల మంది -
పేదల డాక్టర్.. రంగారెడి్డ
ఫ సామాన్యులకు వైద్యం అందుబాటులోకి తేవాలన్నదే ఆయన తపన ఫ సూర్యాపేటలో ఆస్పత్రి నెలకొల్పిన తొలుత రూ.5కే వైద్య సేవలు ఫ ప్రస్తుతం రూ.20లకే ఓపీ ఫ పూర్వవిద్యార్థుల సేవాసమితి ఏర్పాటు చేసి పలు కార్యక్రమాలు నేడు డాక్టర్స్ డే సూర్యాపేట అర్బన్: రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన ఓ వ్యక్తి కష్టపడి చదవి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. పేదలకు వైద్యం అందుబాటులో తీసుకురావాలనే ఆలోచనతో ఆస్పత్రి ఏర్పాటు చేశారు. నామమాత్రపు ఫీజుతో వైద్య సేవలు అందిస్తూ పేదల వైద్యుడిగా పేరుగాంచారు. పూర్వ విద్యార్థుల సేవా సమితి ఏర్పాటు చేసి అనేక సేవకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సూర్యాపేట పట్టణంలోని ఆదిత్య ఆస్పత్రి డాక్టర్ రంగారెడ్డి. నేడు డాక్టర్స్ డే సందర్భంగా వైద్యుడి జీవిత విశేషాలు, వైద్య రంగంలో చేస్తున్న సేవలు ఆయన మాటల్లోనే.. -
వానమ్మ.. ఒక్కసారి రావమ్మ
అర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలం కొత్తగూడెం గ్రామంలో వానమ్మ.. వానమ్మ.. వానమ్మా ఒక్కసారైన వచ్చిపోవమ్మా అంటూ మహిళలు పాటలు పాడుతూ చుట్టు కాముడు ఆడుతూ వరుణదేవుడిని వేడుకున్నారు. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పత్తిచేలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వానదేవుడు కరుణించి వర్షాలు కురిపించి చెరువులు, కుంటలు నింపి పంటలు సమృద్ధిగా పండేలా చూడాలని చుట్టుకాముడు వేస్తూ పాటలు పాడారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన మహిళలు ఆకుల నాగమ్మ, ఆకుల లింగమ్మ, చల్లా మంగమ్మ, తాడూరి నర్సమ్మ, రామసాని రాధ తదితరులు పాల్గొన్నారు. -
ఫార్మర్ రిజిస్ట్రీ అంతంతే..
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రీ నామమాత్రంగానే కొనసాగుతోంది. వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు ఆసక్తి చూపడం లేదు. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన కర్షకులు వివరాల నమోదుకు ముందుకు రాక ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. వ్యవసాయ అధికారులు సైతం పనిభారం కారణంగా అవగాహన కల్పించడంలో కొంత ఆలస్యమవుతోంది. జిల్లాలో 3,03,767 మంది రైతులు పట్టాదారు పాసు పుస్తకాలు పొంది ఉండగా.. ఇప్పటి వరకు కేవలం 28.93శాతం మంది మాత్రమే తమ వివరాలు నమోదు చేయించుకున్నారు. మే 5 నుంచి ప్రారంభం..వ్యవసాయ రంగంలో రైతుల వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేయడానికి, వారి భూమి యాజమాన్యం, పథకాల లభ్యత అనుసంధానం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో నమోదు చేసుకున్న రైతులకు ఆధార్ కార్డు లాగా.. 11 అంకెలతో కూడిన ఐడీని అందిస్తారు. ఈ ప్రక్రియను జిల్లాలో మే 5 నుంచి వ్యవసాయ శాఖ అధికారులు ప్రారంభించారు. ఆ సమయంలో రైతులు ధాన్యం అమ్మకానికి కొనుగోలు కేంద్రాలకు రావడం, వ్యవసాయ పనులు లేకపోవడంతో ఈ ప్రక్రియ చకాచకా సాగింది. ఆ తర్వాత వానాకాలం సీజన్ ప్రారంభం కావడం.. మెట్టపంటల సాగు వైపు రైతన్నలు మళ్లడంతో ఈ ప్రక్రియ ముందుకుసాగడం లేదు. జిల్లాలో రైతుల వివరాల నమోదులో నూతనకల్ మండలం మొదటిస్థానంలో నిలిచింది. అవగాహన కల్పిస్తేనే..ఫార్మర్ రిజిస్ట్రీలో రైతులకు అందించే ఐడీ కీలకంగా మారనుంది. ఈ ఐడీతోనే రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రైతుల పథకాలన్నీ దక్కనున్నాయి. త్వరలో అందించనున్న 20వ విడత కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు సైతం ఈ ఐడీ పొందిన రైతులకే అందనున్నట్లు ప్రచామవుతోంది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టే పంటల నమోదు కార్యక్రమంలోనూ ఈ ఐడీని తప్పనిసరి చేయొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఐడీ పొందని రైతులకు ఇబ్బందులు తలెత్తే అవకాశముంటుంది. క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారులు సైతం మరింతగా రైతులకు అవగాహన కల్పించాల్సి ఉంది.రైతులు ముందుకు రావడం లేదు జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ సాగుతోంది. ఇప్పటి వరకు 87,881 మంది రైతులు వివరాలు నమోదు చేసుకున్నారు. వానాకాలం వ్యవసాయ పనులు ప్రారంభం కావడంతో రైతులు బిజీగా ఉన్నారు. ఎలాంటి చివరి తేదీ లేకపోయినా రైతులు ఐడీని పొందితే మేలు కలుగుతుంది. తప్పనిసరిగా ఏఈఓలను సంప్రదించి నమోదు చేసుకోవాలి. – శ్రీధర్రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారినమోదుకు ముందుకురాని రైతులు వ్యవసాయ సీజన్ కావడంతో అనాసక్తి 28.93శాతం మంది రైతులు మాత్రమే నమోదు పనిభారంతో అవగాహన కల్పించలేకపోతున్న అధికారులు -
నేడు సూర్యాపేటకు మంత్రి వివేక్ వెంకటస్వామి రాక
సూర్యాపేట : సూర్యాపేట జిల్లా కేంద్రానికి రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మంగళవారం రానున్నట్లు మాల మహానాడు జేఏసీ సూర్యాపేట జిల్లా కోకన్వీనర్ కట్ల మురళి సోమవారం ప్రకటనలో తెలిపారు. కుల దురహంకార హత్యకు బలైన మాలబంటి (వడ్లకొండ కృష్ణ) జయంతి సందర్భంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలోని జీవివి ఫంక్షన్ హాల్లో నిర్వహించే కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు నాయకులు కంచె ఐలయ్య, రేంజర్ల రాజేష్, మందాల భాస్కర్ పాల్గొంటారని వివరించారు. బంటి కుటుంబానికి న్యాయం జరిగేలా దోషులకు శిక్ష పడే వరకు కుల సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు కదిలి రావాలని పిలుపునిచ్చారు. బాధితులకు అండగా ఉండాలిసూర్యాపేటటౌన్ : ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ బాధితులకు అండగా ఉండాలని జిల్లా ఎస్పీ కె.నరసింహ పోలీస్ సిబ్బందికి సూచించారు. సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఫిర్యాదుదారులకు భరోసా కల్పించాలని, ప్రతి అంశాన్ని చట్ట పరిధిలో పరిష్కరించాలన్నారు. డీసీసీబీ టర్నోవర్ రూ.598.16 కోట్లు పెరిగిందినల్లగొండ అగ్రికల్చర్ : డీసీసీబీలో తమ పాలకవర్గం ఏర్పడిన సంవత్సర కాలంలో ఎన్నడూ లేని విధంగా రూ.598.16 కోట్లకు టర్నోవర్ పెరిగి మొత్తం రూ.2940.29 కోట్లకు చేరుకుందని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి వెల్ల డించారు. పాలకవర్గం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా సోమవారం డీసీసీ బీలో కేక్ కట్చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పాలకవర్గం బాధ్యతలు స్వీకరించిన వెంటనే పంట రుణాల గరిష్ట పరిమితిని రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షలకు పెంచామన్నారు. పంట రుణాల బడ్జెట్ను రూ.100 కోట్లకు తెచ్చామన్నారు. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్, గ్రామీణ ప్రాంతాల్లో గృహ రుణాలు, సొసైటీలకు గోడౌన్ల నిర్మాణం కోసం రుణాలు ఇస్తున్నామన్నారు. బ్యాంకు అభివృద్ధికి సహకరిస్తున్న పాలకవర్గం, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్లు పాశం సంపత్రెడ్డి, కొండా సైదయ్య, ఇరిగినేని అంజయ్య, గుడిపాటి సైదయ్య, దనావత్ జయరాం, బంటు శ్రీనివాస్, సుష్మ, కొమ్ము కరుణ, కె.వీరస్వామి, సీఈఓ శంకర్రావు, జీఎం నర్మద, డీజీఎంలు, ఏజీఎంలు, సిబ్బంది పాల్గొన్నారు. పప్పు దినుసుల సాగుకు ప్రోత్సాహంభానుపురి (సూర్యాపేట) : పప్పు దినుసుల సాగును ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతులకు వందశాతం రాయితీపై విత్తనాలు అందిస్తోందని మార్కెట్ చైర్మన్ వేణా రెడ్డి పేర్కొన్నారు. సోమవారం జాతీయ ఆహార భద్రత మిషన్ పథకంలో భాగంగా సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డితో కలిసి సూర్యాపేట, చివ్వెంల, ఆత్మకూరు, పెన్పహాడ్ మండలాల రైతులకు వందశాతం రాయితీపై కంది విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ అబ్దుల్ రహీమ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజద్ అలీ, సూర్యాపేట, చివ్వెంల, ఆత్మకూరు, పెన్పహాడ్ మండలాల వ్యవసాయ అధికారులు కృష్ణసందీప్, వెంకటేశ్వర్లు, దివ్య, అనిల్, వ్యవసాయ విస్తరణ అధికారులు స్వాతి, అనూష, ముత్తయ్య, పవన్ రైతులు పాల్గొన్నారు. -
ఇంటర్నల్ కమిటీ ఏర్పాటు చేయాలి
భానుపురి (సూర్యాపేట) : పనిప్రదేశాల్లో లైంగిక వేధింపుల నివారణకు కార్యాలయాల్లో ఇంటర్నల్ కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులకు కలెక్టర్ తేజస్ నంద్ పవార్ సూచించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ పి.రాంబాబుతో కలిసి కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వారం రోజుల్లో జిల్లా, మండల స్థాయి కార్యాలయాల్లో ఇంటర్నల్ కమిటీ ఏర్పాటు చేసి వారం రోజుల్లో సంక్షేమ అధికారి కార్యాలయంలో సమర్పించాలన్నారు. కమిటీ ఏర్పాటు చేయకపోతే వారిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ప్రజావాణిలో పరిష్కరించిన దరఖాస్తులను అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ కొన్ని దరఖాస్తులు తిరిగి పరిశీలిస్తుందని, ఇందులో ఏమైనా తప్పులు జరిగినట్లు తేలితే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ వి.వి అప్పారావు, డీపీఓ యాదగిరి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, డీఈఓ అశోక్, సీపీఓ కిషన్, సంక్షేమ అధికారులు దయానంద రాణి, శంకర్, శ్రీనివాస నాయక్, జగదీశ్వర్ రెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
కమలం చీఫ్ మనోడే..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ నారపరాజు రాంచందర్రావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ పగ్గాలు చేపట్టబోతున్నారు. పార్టీ అధ్యక్ష పదవికి సోమవారం నిర్వహించిన నామినేషన్ల ప్రక్రియలో ఆయనొక్కరే రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో మంగళవారం ఆయన ఎన్నిక లాంఛనమే కావడంతో జిల్లాలోని ఆయన బంధువులు, కోదాడ ప్రాంతంతోపాటు జిల్లా బీజేపీ నేతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. హైదరాబాద్లో స్థిరనివాసం రాంచందర్రావు తల్లిదండ్రులు కోదాడ ప్రాంతానికి చెందిన వారే. తండ్రి ప్రొఫెసర్ ఎన్వీఆర్ లక్ష్మీనారాయణరావు కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామానికి చెందినవారే. లక్ష్మీనారాయణరావు బాల్యం ఇక్కడే గడిచింది. ఉన్నత విద్యాభ్యాసం తరువాత ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్గా సేవలందించారు. రాంచందర్రావు చిన్నతనంలోనే తండ్రి లక్ష్మీనారాయణరావు, తల్లి రాఘవసీతమ్మ హైదరాబాద్లో స్థిరపడ్డారు. దీంతో రాంచందర్రావు బాల్యం, చదువు అంతా హైదరాబాద్లోనే కొనసాగింది. గతంలో ఉమ్మడి కుటుంబంగా ఉన్న సమయంలో నల్లబండగూడెంలో వారి కటుంబం నివసించిన ఇల్లు ప్రస్తుత శిథిలావస్థకు చేరుకుంది. రాంచందర్రావు అమ్మమ్మ ఊరు కూడా కోదాడ పక్కనే ఉన్న అనంతగిరి మండల కేంద్రమే. అక్కడ రాంచందర్రావు తరఫు బంధువులు ఉన్నారు. కుటుంబంలో పెద్దవాడు ఆయనే.. మాజీ ఎమ్మెల్సీ రాంచందర్రావుకు ఇద్దరు సోదరులు. వారిలో పెద్ద తమ్ముడు ప్రొఫెసర్ ఎన్వీ రమణరావు. ఆయన జేఎన్టీయూ రిజిస్ట్రార్గా, వరంగల్ ఎన్ఐటీ డైరెక్టర్గా పనిచేశారు. ప్రస్తుతం రాయపూర్ ఎన్ఐటీ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్ఐటీకి కూడా ఇన్ఛార్జి డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. రెండో తమ్ముడు హేమచందర్ అమెరికాలో స్ధిరపడ్డాడు. రాంచందర్రావు బాబాయి కుమారుడు నారపరాజు రాఘవరావు కోదాడలో చిన్న పిల్లలహాస్పిటల్ నిర్వహిస్తున్నారు. కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక కానున్న రాంచందర్రావు ఫ ఆయన సొంతూరు కోదాడ మండలం నల్లబండగూడెం అంచెలంచెలుగా ఎదిగిన రాంచందర్రావు రాంచందర్రావు విద్యార్థి దశనుండే క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో న్యాయ విద్యను అభ్యసించిన ఆయన 1980–85 కాలంలో యూనివర్శిటీలో ఏబీవీపీ నాయకుడిగా పనిచేశారు. న్యాయ విద్య పూర్తయిన తరువాత హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూనే బీజేపీ నాయకుడిగా ఎదిగారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా సేవలందించారు. ప్రస్తుతం బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకం కాబోతున్నారు. ఆయనకు తెలుగుతోపాటు హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ప్రావీణ్యం ఉండటంతో మంచి వక్తగా పేరుపొందారు. ఇప్పటికీ కోదాడ ప్రాంతంలో జరిగే వివిధ కార్యక్రమాలకు ఆయన తరచుగా హాజరవుతుంటారు. -
14న తిరుమలగిరికి సీఎం రాక: ఎమ్మెల్యే
తిరుమలగిరి : ఈనెల 14న సీఎం రేవంత్రెడ్డి తిరుమలగిరి మండలానికి రానున్నట్లు ఎమ్మెల్యే మందుల సామేలు తెలిపారు. తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని మాలిపురంలో సీఎం సభా స్థలాన్ని సోమవారం సామేలు పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తిరుమలగిరి మండల కేంద్రంలో సీఎం చేతుల మీదుగా రేషన్ కార్డులు అందజేయనున్నట్లు చెప్పారు. తిరుమలగిరిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనానికి శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా మార్చేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా అంగీకరిచినట్లు తెలిపారు. కార్యక్రమానికి మంత్రులంతా హాజరవుతారని తెలిపారు. సమావేశంలో సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవరావు, డీఎస్పీ ప్రసన్నకూమార్, తహసీల్దార్ హరిప్రసాద్, మండల పార్టీ అధ్యక్షుడు వై.నరేష్, జమ్మిలాల్, వీరేష్, లింగయ్య, గోవర్థన్ పాల్గొన్నారు. -
వృద్ధ మహిళలపై మతిస్థిమితం లేని యువకుడి దాడి
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ కొండకు దిగువన ఉన్న లక్ష్మీ పుష్కరిణి సమీపంలో మతిస్థిమితం లేని యువకుడు ఇద్దరు భిక్షాటన చేసే వృద్ధ మహిళలపై దాడికి పాల్పడిన ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పట్టణ సీఐ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. కొంతకాలంగా లక్ష్మీ పుష్కరిణి చెంత ఇద్దరు వృద్ధ మహిళలు భిక్షాటన చేస్తున్నారు. అక్కడే మతిస్థిమితం లేని యువకుడు కూడా ఉంటున్నాడు. అతడికి చెవులు వినిపించవు. శనివారం ఇద్దరు వృద్ధ మహిళల్లో ఒకరు భిక్షాటన చేసేందుకు వస్తుండగా.. సదరు యువకుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె కడుపులో తన్నాడు. వెంటనే ఆమె బీటీ రోడ్డుపై పడటంతో తలకు గాయమైంది. ఆమెకు కాపాడేందుకు వచ్చిన మరో వృద్ధ మహిళను సైతం ఆ యువకుడు కొట్టి గాయపరిచారు. స్థానిక హోటల్ నిర్వాహకులు, దుకాణదారులు, యువకులు ఆ మతిస్థిమితం లేని యువకుడిని తాళ్లతో కట్టేసి పోలీసులకు అప్పగించారు. గాయపడిన వృద్ధ మహిళలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆదివారం సీఐ భాస్కర్ను వివరణ కోరగా.. గతేడాది సైతం ఆ యువకుడు పలువురిపై దాడి చేసి గాయపరిచాడని తెలిపారు. ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదన్నారు. మహిళను కడుపులో తన్నుతూ, దాడి చేసిన వీడియో అక్కడే ఉన్న హోటల్ సీసీ కెమెరాలో రికార్డయ్యింది అన్నారు.విద్యుదాఘాతంతో రైతు మృతిచందంపేట: నేరెడుగొమ్ము మండలం బచ్చాపూర్ గ్రామానికి చెందిన కేతావత్ లష్కర్(34) ఆదివారం తన వ్యవసాయ పొలంలో బోరు మోటారు ఆన్ చేసేందుకు వెళ్లి విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
సంస్కృత విద్యా పీఠం సందర్శించిన ఈఓ
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట పట్టణంలోని బస్టాండ్ సమీపంలో దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంస్కృత విద్యా పీఠాన్ని, వైటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిల్ప కళాశాలను ఈఓ వెంకట్రావ్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా శిల్ప కళాశాలలోని వసతులు, బోధన గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం టెంపుల్ ఆర్కిటెక్చర్ కోర్సు వివరాలను ప్రిన్సిపాల్ మోతీ లాల్ను అడిగి ఈఓ తెలుసుకున్నారు. విద్యార్థులు తాము నేర్చుకున్న టెంపుల్ ఆర్కిటెక్చర్ డ్రాయింగ్, రాతి, సిమెంట్తో చేసే విధానాన్ని ఈఓకు వివరించారు. అనంతరం సంస్కృత విద్యా పీఠానికి వెళ్లి విద్యార్థులు, బోధకులతో మాట్లాడారు. ఈ విద్యా పీఠంలో ఎంతో సామాజిక స్పృహతో అన్ని కులాల వారికి సంస్కృత భాషా జ్ఞానం కల్పించి, దినదినాభివృద్ధి చెందుతుందని ఈఓ తెలిపారు. ఆయన వెంట డిప్యూటీ ఈఓ భాస్కర్శర్మ, సంస్కృత విద్యా పీఠం, శిల్పా కళాశాల బోధకులున్నారు. -
ఆటో వచ్చింది.. కాలినడక తప్పింది
మఠంపల్లి: మఠంపల్లి మండలం అల్లీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గతంలో చదివిన విద్యార్థులు చదువులో రాణించడంతో పాటు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో వివిధ క్రీడా పోటీల్లో పాల్గొని పాఠశాలకు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చారు. ఈ పాఠశాలలో అల్లీపురంతో పాటు కాల్వపల్లి తండా, పాతదొనబండ తండా, కొత్తదొనబండ తండా, జామ్లా తండా గ్రామాలకు చెందిన విద్యార్థులు చదువుకునేవారు. కానీ ప్రస్తుతం సరైన రవాణా సౌకర్యం లేక ఆయా తండాల విద్యార్థులు పట్టణాల్లో బడులకు వెళ్తున్నారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బడిబాట కార్యక్రమంలో భాగంగా అల్లీపురం జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం మోదుగు శేషిరెడ్డి, ఉపాద్యాయులు ఎలాగైనా పాఠశాలకు పూర్వ వైభవం తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పాఠశాల పరిధిలోని ఆయా తండాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి అల్లీపురం జెడ్పీహెచ్ఎస్కు తమ పిల్లలను పంపించాలని కోరారు. అయితే అల్లీపురం పాఠశాలకు గతంలో తమ తండాల నుంచి బస్సులు, ఆటోలు నడిచేవని, ప్రస్తుతం బస్సు లేకపోవడంతో 2 నుంచి 4 కిలోమీటర్ల దూరం ఉన్న తండాల నుంచి పిల్లలు పాఠశాలకు చేరుకోవాలంటే కాలినడకన రావాల్సి ఉంటుందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. దీంతో ఎలాగైనా విద్యార్థులకు వాహనం ఏర్పాటు చేస్తామని వారి తల్లిదండ్రులకు హెచ్ఎం, ఉపాధ్యాయులు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కాల్వపల్లితండా మాజీ సర్పంచ్ మాలోతు సుజాతాసక్రునాయక్ను హెచ్ఎం, ఉపాధ్యాయులు కలిసి.. పరిస్థితిని వివరించి, ఏడాది కాలానికి పాఠశాల పరిధిలోని తండాలకు చెందిన విద్యార్థులు పాఠశాలకు వచ్చి వెళ్లేలా ఆటో ఏర్పాటు చేశారు. దీంతో పాఠశాలలో 40మంది వరకు ఉన్న విద్యార్థుల సంఖ్య 60కి పెరిగింది. ఇప్పటికీ నిత్యం అడ్మిషన్లు జరుగుతూనే ఉన్నాయని హెచ్ఎం తెలిపారు. ఆటో ఏర్పాటు చేసిన దాతను, హెచ్ఎం, ఉపాధ్యాయులను విద్యార్థుల తల్లిదండ్రులు అభినందిస్తున్నారు. దాత సహకారంతో అల్లీపురం జెడ్పీహెచ్ఎస్కు ఆటోను ఏర్పాటు చేసిన హెచ్ఎం, ఉపాధ్యాయులు చుట్టుపక్కల తండాల నుంచి వచ్చే విద్యార్థులతో పెరిగిన అడ్మిషన్లురోజూ ఆటోలోనే వచ్చివెళ్తున్నాం మా తండా నుంచి అల్లీ పురం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు సుమారు 3 కిలో మీటర్లు దూరం ఉండటంతో పాఠశాలకు కాలినడకన రాలేక ఇబ్బందులు పడేదాన్ని. ఇప్పుడు ప్రతిరోజు హెచ్ఎం సార్, టీచర్లు ఏర్పాటు చేయించిన ఆటోలోనే వచ్చివెళ్తున్నాం. ఎంతో ఆనందగా ఉంది. – భూక్యా శరణ్య, 7వ తరగతి, కాల్వపల్లితండాదాత సహకారం మరువలేనిది అల్లీపురం జెడ్పీహెచ్ఎస్కు విద్యార్థులను చేరవేయడానికి ఆటోను సమకూర్చిన కాల్వపల్లితండా మాజీ సర్పంచ్ మాలోతు సుజాతాసక్రునాయక్ సహకారం మరువలేనిది. ఆటో ఏర్పాటు చేయడంతో విద్యార్థుల సంఖ్య పెరగడంతో పాటు ఇంకా అడ్మిషన్లు జరుగుతూనే ఉన్నాయి. – మోదుగు శేషిరెడ్డి, హెచ్ఎం -
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి
సూర్యాపేట : జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని టీయూసీఐ (ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా) జిల్లా అధ్యక్షుడు గొడ్డలి నర్సయ్య కోరారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను అంబానీ, అదానీలకు దోచిపెట్టేందుకు కార్మికుల హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వర్గ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 9న జాతీయ కార్మిక సంఘాలు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయని, ఈ సమ్మెలో టీయూసీఐ కార్యకర్తలు క్రియాశీలకంగా పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా సహాయ కార్యదర్శి గోగుల వీరబాబు, జిల్లా నాయకులు శేషగిరి, సాహెబ్ హుస్సేన్, పుప్పాల అంజయ్య, మోహన్, వెంకన్న, యాదగిరి పాల్గొన్నారు. -
దళారులను ఆశ్రయించొదు్ద
నాగారం : ‘ఈ ఏడాదికి సంబంధించి వార్షిక రుణ ప్రణాళిక రూ.11,866 కోట్లు లక్ష్యంగా విధించుకున్నాం. ఆర్బీఐ నిబంధనల మేరకే రుణాలు ఇస్తాం. రుణాల కోసం వచ్చే లబ్ధిదారులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా బ్యాంక్ మేనేజర్, క్షేత్రాధికారిని సంప్రదించాలి. దళారులను నమ్మి మోసపోవద్దు. రాజీవ్ యువవికాసం పథకానికి సంబంధించి అర్హులైన లబ్ధిదారులకు ఎలాంటి సిఫారసు లేకుండా రుణాలు అమలు చేస్తాం’ అని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ చింతల బాపూజీ స్పష్టం చేశారు. 2025– 26కు సంబంధించి వార్షిక రుణ ప్రణాళిక ఖరారు కావడంతో ఆయనతో ‘సాక్షి’ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ నిర్వహించింది. వివరాలు ఆయన మాటల్లోనే.. వ్యవసాయ రంగానికి పెద్దపీట వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తాం. ఆర్బీఐ నిబంధనల ప్రకారం అన్ని రకాల రుణాలిస్తాం. సిఫారసులు, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గం. జిల్లాలో జిల్లా, మండల స్థాయి బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి రుణాల పంపిణీలో కలిగే సమస్యలపై సిబ్బందితో మాట్లాడి పరిష్కరిస్తాం. గతేడాది రూ.10,425.41కోట్ల రుణాలు ఇచ్చాం గత ఏడాది 2024–25కు సంబంధించి వార్షిక రుణ ప్రణాళిక జిల్లాకు రూ.8994.61కోట్లుగా ఖరారు చేశాం. అయితే 100శాతం లక్ష్యం పూర్తి కావడంతో ఆయా రంగాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని అదనంగా మరో రూ.1430.8 కోట్లు చెల్లింపులు చేశాం. మొత్తంగా జిల్లాలో రూ.10,425.41 కోట్ల రుణాలు ఇచ్చాం. వీటిలో వ్యవసాయ రంగానికి రూ.6,793 కోట్లు, చిన్నమధ్య తరహా పరిశ్రమలకు రూ.1,081 కోట్లు, విద్యారుణాలు రూ.36 కోట్లు, గృహ రుణానికి రూ.180, నాన్ ప్రియారటీ సెక్టార్ కింద రూ.2335.41 కోట్ల రుణాలు ఇచ్చాం. అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాంబీమా పథకాలపై ఖాతాదారులు, ప్రజలకు గ్రామాల్లో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. మున్సిపాలిటిల్లో పారిశుద్ధ్య సిబ్బంది, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య సిబ్బంది చేత బీమా చేయించాం. పీఎంఎంవై రుణాలు అత్యధికంగా ఇచ్చిన జిల్లాగా ఎంపిక ప్రధాన మంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) రుణాలు అత్యధికంగా ఇచ్చిన జిల్లాగా రాష్ట్రం నుంచి సూర్యాపేట జిల్లా ఎంపికై ంది. ఇందుకుగాను ఈ ఏడాది ఏప్రిల్– 6న ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ స్వయంగా నిర్వహించిన పీఎంఎంవై దశాబ్ది ఉత్సవాలకు హాజరయ్యాం. నేరుగా బ్యాంక్ మేనేజర్ను సంప్రదించాలి రుణాల కోసం వచ్చే బ్యాంక్ ఖాతాదారులు, లబ్ధిదారులు పైరవీకారులను, దళారులను ఆశ్రయించకుండా నేరుగా బ్యాంక్ మేనేజర్, క్షేత్రాధికారిని సంప్రదించాలి. దళారులను నమ్మి మోసపోవద్దు. ఏ రుణమైనా ఆర్బీఐ నిబంధనల మేరకే ఇస్తాం. ఉన్నత విద్య చదువుకునే విద్యార్థులకు విద్యా రుణాలిస్తున్నాం. విద్యారుణం తీసుకున్న కుటుంబానికి అప్పు భారం కాకుడదన్న ఉద్దేశంతో క్రెడిట్ లింక్ టర్మ్ బీమా తప్పనిసరి. సంక్షేమం, రాజీవ్ యువవికాసం పథకాలకు సంబంధించి అర్హులైన లబ్దిదారులకు ఎలాంటి సిఫారసు లేకుండా రుణాలు అమలు చేస్తాం. రాజకీయ నాయకుల ప్రమేయానికి ఆస్కారం లేదు. పారదర్శకంగా రుణాల అందజేత ఏ రుణమైనా ఆర్బీఐ నిబంధనలే ప్రామాణికం 2025– 26కు సంబంధించి రుణ లక్ష్యం రూ.11,866 కోట్లు వ్యవసాయ రంగానికి రూ.3861.42 కోట్లు.. అనుబంధ రంగాలకు రూ.2,999.49 కోట్లు జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ చింతల బాపూజీ చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ.2418.38 కోట్లు ఈఏడాది జిల్లాలో వార్షిక రుణ ప్రణాళిక రూ.11,866 కోట్లు లక్ష్యంగా విధించుకున్నాం. వీటిలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమిస్తూ రూ.3861.42 కోట్లు రుణాలివ్వనున్నాం. వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.2999.49 కోట్లు అందించనున్నాం. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ.2418.38 కోట్లు, విద్యా రుణాలు రూ.36 కోట్లు, గృహ రుణాలు రూ.180 కోట్లు, నాన్ ప్రియారటీ రంగానికి రూ.2,370.71 కోట్లు ఇవ్వాలని లక్ష్యం విధించుకున్నాం. -
పెండెం జగదీశ్వర్ సాహిత్య సేవ చిరస్మరణీయం
రామగిరి(నల్లగొండ): బాల సాహితీరత్న పెండెం జగదీశ్వర్ బాల సాహిత్యానికి చేసిన కృషి చిరస్మరణీయమని ప్రముఖ బాల సాహితీవేత్త గరిపెల్లి అశోక్ అన్నారు. నల్లగొండ పట్టణంలోని ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రంలో ఆదివారం నిర్వహించిన పెండెం జగదీశ్వర్ స్మారక ఆరో జాతీయ పురస్కార ప్రదానోత్సవ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. పెండెం జగదీశ్వర్ సాహిత్యాన్ని ప్రతి పాఠశాలకు చేర్చవలసిన బాధ్యత ప్రభుత్వానికి, సమాజానికి ఉందన్నారు. జగదీశ్వర్ స్మారక జాతీయ పురస్కారాన్ని విజయవాడకు చెందిన ప్రముఖ బాల సాహితీవేత్త ముంజలూరి కృష్ణకుమారికి అందజేశారు. ఈ పురస్కారం కింద రూ.5వేల నగదు, ప్రశంసా పత్రంతో ఆమెను ఘనంగా సత్కరించారు. పురస్కార గ్రహీత ముంజులూరి కృష్ణకుమారి మాట్లాడుతూ.. జగదీశ్వర్ పేరిట వారి స్నేహితులు పురస్కారాన్ని ఏర్పాటు చేసి జాతీయస్థాయిలో బాల సాహిత్యంలో విశిష్ట కృషిచేసిన రచయితలకు అందజేస్తుండడం అభినందనీయమన్నారు. ప్రముఖ కథా రచయిత మేరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ.. జగదీశ్వర్ మరణం బాల సాహిత్యానికి తీరని లోటని అన్నారు. డాక్టర్ తండు కృష్ణకౌండిన్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహితీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కుకుడాల గోవర్ధన్, సృజన సాహితీ అధ్యక్ష, కార్యదర్శులు పెరుమాళ్ల ఆనంద్, డాక్టర్ సాగర్ల సత్తయ్య, రచయితలు పుప్పాల కృష్ణమూర్తి, డాక్టర్ పగడాల నాగేందర్, డాక్టర్ ఉప్పల పద్మ, పెందోట సోము, దాసోజు శ్రీనివాస్, శంకర్, బాసరాజు యాదగిరి, బండారు శంకర్, శ్రవణ్ కుమార్, భీమార్జున్రెడ్డి, మాదగాని శంకరయ్య, మోత్కూరు శ్రీనివాస్, వడ్డేపల్లి వెంకటేష్, ముక్కామల జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేయాలి
● కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ భానుపురి (సూర్యాపేట) : మండల స్థాయిలో సామాజిక, ఆర్థిక అంశాలపై విశ్లేషణ చేయాలని, భవిష్యత్ ప్రణాళికలు రూపొందించి జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. పీసీ మెహలనోబిస్ జయంతి సందర్భంగా 19వ జాతీయ అర్ధ గణాంక దినోత్సవాన్ని ఆదివారం కలెక్టరేట్లో ముఖ్య ప్రణాళిక అధికారి కిషన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మహలనోబిస్ చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. గణాంకాధికారులు క్షేత్రస్థాయిలో కచ్చితమైన సమాచారాన్ని సేకరించాలని, ఎప్పటికప్పుడు నూతన సాంకేతిక పద్ధతులు నేర్చుకుంటూ, సమాచారాన్ని ఉన్నత అధికారులకు అందించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రామచంద్ర రావు, డివిజన్ పంచాయతీ అధికారి నారాయణ రెడ్డి, గణాంక అధికారి రమేష్, రిటైర్డ్ సీపీఓ ఎస్సీఎస్. రాజు, ఉపగణాంక అధికారులు రాజేష్, కోటేశ్వరరావు, రామారావు, లోక్య, విజయ కుమార్, దున్న శ్యామ్, రిటైర్డ్ ఎస్ఓ సీతారాములు పాల్గొన్నారు. -
వైద్యం వికటించి బాలుడి మృతి
సూర్యాపేట టౌన్: వైద్యం వికటించి మూడు నెలల బాలుడు మృతిచెందిన ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. వైద్యుడి నిర్లక్ష్యంతోనే బాలుడు మృతిచెందాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట ఆదివారం ధర్నా చేశారు. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. తుంగతుర్తి మండలం గుడితండాకు చెందిన జాటోత్ జలంధర్, మనీషా దంపతులకు మూడు నెలల క్రితం బాబు జన్మించాడు. నాలుగు రోజుల క్రితం బాలుడికి జ్వరం రావడంతో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రైమ్ చిన్నపిల్లల ఆస్పత్రికి తీసుకొచ్చారు. మొదటి రెండు రోజులు బాగానే ఉందని చెప్పిన వైద్యుడు.. ఆదివారం బాలుడి ఆరోగ్యం విషమించడంతో ఖమ్మం తీసుకెళ్లాలని చెప్పాడని, ఖమ్మం తీసుకెళ్లాక బాలుడు మృతిచెందాడని అక్కడి వైద్యులు తెలిపాడని బాలుడి కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపారు. ప్రైమ్ పిల్లల హాస్పిటల్ వైద్యుడి నిర్లక్ష్యంతోనే బాలుడు మృతిచెందాడని, తమకు న్యాయం చేయాలని బంధువులు, కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆందోళన చేశారు. హాస్పిటల్లో సరైన వసతులు లేకుండా వైద్యం నిర్వహిస్తున్నారని, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు హాస్పిటల్ను సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డాక్టర్ నిర్లక్ష్యంతోనే మృతిచెందాడని కుటుంబ సభ్యులు, బంధువుల ఆరోపణ ఆస్పత్రి ఎదుట ఆందోళన పోలీసులు రావడంతో ఉద్రిక్తత బాధితులు రాళ్లు రువ్వడంతో కానిస్టేబుల్కు గాయాలు -
కాలినడక తప్పింది
దాత సహకారంతో అల్లీపురం జెడ్పీహెచ్ఎస్కు హెచ్ఎం, ఉపాధ్యాయులు ఆటో సదుపాయం ఏర్పాటు చేశారు. - 8లోజ్యుడీషియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఎన్నిక చివ్వెంల(సూర్యాపేట) : జ్యుడీషియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఎన్నిక ఆదివారం సూర్యాపేట పట్టణంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడిగా జిల్లా కోర్టు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, కోర్టు సూపరింటెండెంట్ దాసరి మధుసూదన్రావు, అసోసియేట్ అధ్యక్షుడిగా సంజయ్ కుమార్, కోశాధికారిగా జులైద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా బ్రహ్మారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా మహేశ్వర్, ఉపాధ్యక్షులుగా సైదానాయక్, శ్రీకాంత్, ఉమ, జాయింట్ సెక్రటరీలుగా నాగాంజనేయులు. మధుకర్, నాగరాజును ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారులుగా వెంకట్రెడ్డి, శ్యాంసుందర్ వ్యవహరించారు. -
స్నేహానికి షష్టిపూర్తి.. మరువలేని అనుభూతి
● మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి నార్కట్పల్లి: స్నేహానికి షష్టిపూర్తి.. మరువలేని అనుభూతి అని తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. నిజామాబాద్లోని జెడ్పీ హైస్కూల్లో 1965 విద్యాసంవత్సరంలో 10వ తరగతి చదివి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నార్కట్పల్లి మండలం గోపాలయపల్లి గ్రామ సమీపాన గల శ్రీ వారిజాల వేణుగోపాలస్వామి దేవాలయ చైర్మన్, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పెద్దన్న కోమటిరెడ్డి మోహన్రెడ్డి ఆహ్వానం మేరకు తన క్లాస్మేట్ అయిన పోచారం శ్రీనివాస్రెడ్డి ఆదివారం ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో మరికొంతమంది మిత్రులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందజేసి ఘనంగా సన్మానించారు. అనంతరం పోచారం మాట్లాడుతూ.. పెళ్లికి షష్టిపూర్తి, వయస్సుకి షష్టిపూర్తి ఉంటుంది, కానీ స్నేహానికి షష్టిపూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆయన వెంట మరికొంత మంది మిత్రులు ఉన్నారు. -
కార్మికుల చట్టాలు, హక్కులను హరిస్తున్న కేంద్రం
సూర్యాపేట అర్బన్ : కేంద్ర ప్రభుత్వం కార్మికుల చట్టాలు, హక్కులను హరిస్తోందని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లు నాగార్జునరెడ్డి ఆరోపించారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రజా సంఘాల జిల్లా బాధ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మిక వర్గాన్ని బానిసత్వంలోకి నెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటీకరణకు అప్పగించి కార్పొరేట్, పెట్టుబడిదారులకు ప్రయోజనం కలిగించే విధంగా లేబర్ కోడ్లలో చట్టాలను వారికి అనుకూలంగా మార్చారని విమర్శించారు. నాలుగు లేబర్ కోడ్లు అమలైతే కార్మికుల హక్కును కోల్పోతారన్నారు. అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం రోజురోజుకు నిర్వీర్యం చేస్తోందన్నారు. దీనిని వ్యతిరేకిస్తూ జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెకు అన్ని ప్రజా సంఘాలు మద్దతు తెలుపుతున్నాయన్నారు. ఈ సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ జూలై 3న జిల్లా కేంద్రంలో జరిగే కార్మిక, వ్యవసాయ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ జిల్లా సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి, తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మడ్డి అంజిబాబు, గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం జిల్లా నాయకులు వీరబోయిన రవి, కడెం లింగయ్య, ఉప్పుల రమేష్ పాల్గొన్నారు. ఫ తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లు నాగార్జునరెడ్డి -
యాదగిరిగుట్టలో ఆర్టీఏ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట మున్సిపాలిటిలోని పాతగుట్టలో 33 జిల్లాలకు చెందిన రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ(నాన్ అఫీషియల్) సభ్యుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆర్టీఏ సభ్యుడు ఆకుల నరసింహ మాట్లాడుతూ.. నిత్యం ప్రజలతో మమేకమవుతూ ప్రయాణికులకు ప్రయోజనం కల్పించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా పరమైన సమస్యలు, రోడ్డు ప్రమాదాల నివారణ వంటి విషయాల్లో రవాణా శాఖ అధికారులతో కలిసి పనిచేస్తూ రాష్ట్ర రవాణా శాఖ గౌరవాన్ని పెంచేలా తమవంతు కృషి చేసేందుకు ప్రతిఒక్కరు ప్రయత్నించాలన్నారు. ఈ సమావేశంలో వివిధ జిల్లా సభ్యులు పడాల రాహుల్, జాఫర్, వెంకన్న, కృష్ణ, అభిగౌడ్, భూపాల్రెడ్డి, మురళీ తదితరులున్నారు. -
ఎస్కేప్ షట్టర్లు బిగించేందుకు ఏర్పాట్లు
నడిగూడెం : నడిగూడెం మండలం కాగితరామచంద్రాపురం వద్ద సాగర్ ఎడమ కాల్వకు 132, 133 కిలోమీటర్ల వద్ద గతేడాది రెండు గండ్లు పడ్డాయి. దీంతో వందలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈ గండ్లు పడడానికి పాలేరు రిజర్వాయర్ బ్యాక్ వాటర్ కాల్వలోకి వెనక్కి రావడం, ఎస్కేప్ షట్టర్లు సరిగ్గా లేకపోవడమేనని అధికారులు గుర్తించారు. దీంతో నీటిపారుదల శాఖ ప్రత్యేక నిధులతో 133 కిలోమీటర్ వద్ద ఎస్కేప్కు పాత షట్టర్లు తొలగించి, కొత్త షట్టర్లు అమర్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో అత్యవసర సమయంలో నీటిని విడుదల చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. -
ఫిట్లెస్ బస్సులపై నిఘా
సూర్యాపేటటౌన్ : పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభం కావడంతో ప్రైవేట్ విద్యాసంస్థల బస్సులపై రవాణా శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు కొంత మంది తమ బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయించగా మరికొందరు చేయించకుండానే వాటిల్లో విద్యార్థులను పాఠశాలలు, కళాశాలలకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫిట్నెస్ లేని పాఠశాలలపై జిల్లా రవాణా శాఖ ప్రత్యేక దృష్టిపెట్టింది. పాఠశాలలు ప్రారంభమైనప్పటి నుంచి ఆ శాఖ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. దీంతో చాలా మంది ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు తమ బస్సులకు ఫిట్నెల్ పరీక్షలు చేయించుకోంగా ఇంకా కొంత మంది బస్సులను ఫిట్నెస్ చేయించకుండానే రోడ్లపై తిప్పుతున్నారు. ఫిట్నెస్ పరీక్షలు లేకపోతే సీజే.. జిల్లాలో 350 ప్రైవేట్ విద్యాసంస్థలు ఉన్నాయి. వీటిలో 40వేలకుపైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అయితే విద్యార్థులను తీసుకొచ్చేందుకు ఆయా ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు బస్సులను కొనుగోలు చేసి నడిపిస్తున్నారు. కాగా జిల్లాలోని అన్ని ప్రైవేట్ విద్యాసంస్థలకు చెందినవి 570 బస్సులు ఉండగా అందులో 475 బస్సులను ఫిట్నెస్ చేయించారు. ఇంకా 95 బస్సులను ఫిట్నెస్ చేయించకుండా యాజమాన్యాలు తిప్పుతున్నారు. ఈ నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టి ఫిట్నెస్, సరైన ధ్రువపత్రాలు లేనివి, ఓవర్ లోడింగ్తో వెళ్లున్న 19 బస్సులను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. నిబంధనలు ఇలా.. ఫ ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు తమ బస్సులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏటా ఫిట్నెల్ పరీక్షలు చేయించాలి. ఫ స్కూల్ బస్సుకు తప్పనిసరిగా ఎల్లో కలర్ వేయించడంతో పాటు నాలుగు వైపులా పాఠశాల పేరు రాయించాలి. ఫ డ్రైవర్కు నాలుగేళ్ల సీనియారిటీతో పాటు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఫ బస్సులో సీటింగ్ సామర్థ్యానికి మించి విద్యార్థులను ఎక్కించవద్దు. ఫ బస్సుల్లో కిటికీలు, సీట్లు సరిగ్గా ఉండేలా ఎప్పటికప్పుడు చూసుకోవాలి. ప్రైవేట్ విద్యాసంస్థల వాహనాలపై రవాణా శాఖ ముమ్మర తనిఖీలు ఫ ఫిట్నెస్ లేకుండా రోడ్లపై తిరిగే వాటిపై ప్రత్యేక దృష్టి ఫ ఇప్పటికే 19 బస్సులను సీజ్ చేసిన అధికారులు మొత్తం విద్యాసంస్థల బస్సులు 570 ఫిట్నెస్ పరీక్షలు పూర్తయినవి 475పరీక్షలు చేయించనివి 95ఫిట్నెస్ ఉంటేనే రోడ్లపై తిప్పాలి ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు తమ బస్సులను ఫిట్నెస్ ఉంటేనే రోడ్లపై తిప్పాలి. లేకుండా సీజ్ చేస్తాం. విద్యార్థుల భద్రతలో నిర్లక్ష్యం వహించొద్దు. లైసెన్స్ ఉన్న వ్యక్తులనే డ్రైవర్లుగా నియమించాలి. వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలు ఉండాలి. బస్సులో అగ్నిమాపక పరికరాలు, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బస్సులను నడపాలి. స్సులపై నిరంతరం నిఘా ఉంటుంది. – జయప్రకాష్రెడ్డి, ఎంవీఐ, సూర్యాపేట -
అరచేతిలో అందం.. ఆరోగ్యం
సూర్యాపేట అర్బన్, రామగిరి(నల్లగొండ): ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు అతివలకు గోరింటాకు గుర్తుకువస్తుంది. ఆషాఢం గడిచేలోగా ఏదో ఒక రోజున గోరింటాకు పెట్టుకొని తీరాలంటూ పెద్దలు చెబుతారు. అతివలకు ఆరోగ్యంతోపాటు ఆధ్యాత్మికాన్ని పెంపొందించే గోరింటాకు సందడి జిల్లాలో మొదలైంది. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం సౌభాగ్యానికి, శ్రేయస్సుకు సంకేతంగా భావిస్తారు. గోరింటాకు మహిళల చేతులు, కాళ్లకు కొత్త అందాన్నిస్తుంది. యువతుల చేతికి గోరింటాకు ఎంత ఎర్రగా పండితే.. అంత మంచి భర్త దొరుకుతాడని విశ్వసిస్తారు. గోరింటాకు శుభానికి చిహ్నంగా భావిస్తారు. అనేక ఔషధ గుణాలు.. వేసవిలో మన శరీరం వేడితో కూడుకుని ఉంటుంది. ఆషాఢంలో బయటి వాతావరణం చల్లబడిపోతుంది. అలాంటి సమయంలో మన శరీరంలోని వేడి.. బయట చల్లబడిన వాతావరణానికి విరుద్ధంగా తయారవుతుంది. దీంతో అనారోగ్య సమస్యలు వస్తాయి. గోరింటాకుకు శరీరంలో ఉండే వేడిని తగ్గించే శక్తి ఉంటుంది. అంతేకాకుండా గోరింటాకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఆషాడంలో గోరింటాకు తప్పకుండా పెట్టుకోవా లని డాక్టర్లు కూడా చెప్తున్నారు. ఆరోగ్యానికి ఎంతో మేలు గోరింటాకు పెట్టుకోవడంతో అంటురోగాలు దరికి చేరవు. గోరింటాకు శరీరాన్ని చల్ల పరచడానికి సహాయపడుతుంది. జ్వరం, తలనొప్పిని తగ్గిస్తుంది. జుట్టును రాలకుండా సంరక్షిస్తుంది. కేశాల పెరుగుదలకు సహాయపడుతుంది. చుండ్రును తొలగించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. రుతువు మారడంతో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ఆరోగ్యానికి మంచిది. – డాక్టర్ పాల ఆనంద్, జనరల్ మెడిసిన్, సూర్యాపేట రవీంద్రనగర్లో గోరింటాకు పెట్టుకుంటున్న మహిళలు●ప్రయోజనాలు ఇలా.. ఫ చర్మ వ్యాధుల నుంచి రక్షణ ఫ ఒంట్లోని వేడిని తగ్గించడం ఫ రోగనిరోధక శక్తిని పెంచడం ఫ రక్త ప్రసరణను మెరుగుపర్చడం ఫ గోళ్లను ఆరోగ్యంగా ఉంచడంగోరింటాకును శుభకార్యాలు, పండుగలప్పుడు పెట్టుకోవడం ఆనవాయితీ. కొన్ని సంప్రదాయాల ప్రకారం గోరింటాకు గర్భాశయ దోషాలను తొలగిస్తుందని, సీ్త్ర ఆరోగ్యాన్ని కాపాడుతుందని నమ్ముతారు. ఆయుర్వేధంలో గోరింటాకు వేర్లు, బెరడు, ఆకులు, పూలు, విత్తనాలు అన్నీ ఔషధ గుణాలు కలిగి ఉన్నాయని చెబుతారు. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం సీ్త్రలకు సౌభాగ్యానికి చిహ్నంగా భావిస్తారు. ఇది సీ్త్ర తత్వానికి, అందానికి ప్రతీక అని నమ్ముతారు. ఆషాఢంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ద్వారా సౌభాగ్యాన్ని పొందిన వారవుతారని జ్యోతిష్యులు అంటున్నారు. పట్టణాల్లో సామూహికంగా వేడుకపట్టణాల్లో పలు కాలనీలలో మహిళలు ఒక చోట చేరి గోరంటాకు సేకరిస్తారు. సంప్రదాయ పద్ధతిలో రోలులో గోరంటాకును నూరుతారు. అంతా ఒకచోట సమూహంగా కూర్చొని పాటలు పాడుతూ ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుంటారు. దోషాలను నివారిస్తుందిఆషాఢ మాసంలో అతివల గోరింటాకు సందడి ఫ సౌభాగ్యానికి, శ్రేయస్సుకు సంకేతంగా భావిస్తున్న మహిళలు ఫ పట్టణాల్లోని కాలనీల్లో సామూహికంగా వేడుకలు ఫ గోరింటాకు పెట్టుకుని మురిసిపోతున్న యువతులు -
మట్టపల్లిలో నిత్యారాధనలు
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శనివారం నిత్యారాధనలు కొనసాగాయి. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రబాతసేవ, నిత్యాగ్నిహోత్రి, మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేశారు. అనంతరం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామిని నూతన పట్టువస్త్రాలతో అలంకరించి ఎదుర్కోలు నిర్వహించారు. అనంతరం నిత్యకల్యాణం జరిపి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈవో సిరికొండ నవీన్కుమార్, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
పోలీస్ శాఖపై నమ్మకం పెంచాలి
సూర్యాపేటటౌన్ : ప్రజా ఫిర్యాదులపై, సంఘటనలపై త్వరితగతిన స్పందించి బాధితులకు, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడం ద్వారా పోలీస్ శాఖపై మరింత నమ్మకం పెంచాలని ఎస్పీ నర్సింహ అన్నారు. శనివారం సూర్యాపేటలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ స్టేషన్ బ్లూ కోట్స్, కోర్ట్ విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి నిర్వహించిన ఒక రోజు శిక్షణలో ఆయన మాట్లాడారు. డయల్ 100 ద్వారా ఫిర్యాదుల పరిష్కారానికి అన్ని పోలీస్స్టేషన్న్లలో బ్లూ కోట్స్, కోర్టు డ్యూటీ సిబ్బంది సమర్థవంతంగా పనిచేయాలన్నారు. విధి నిర్వహణపై పలు సూచనలు చేశారు. ఈ శిక్షణలో సీసీఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, బీసీఆర్బీ ఇన్స్పెక్టర్ హరిబాబు, టెక్నికల్ సిబ్బంది, బ్లూ కోట్స్, కోర్టు డ్యూటీ సిబ్బంది పాల్గొన్నారు.ఫ ఎస్పీ నర్సింహ -
రెండు రోజులే గడువు
గడువులోగా బియ్యం తీసుకోవాలి రేషన్ బియ్యం పంపిణీకి మరో రెండు రోజులే గడువు ఉంది. ఇంకా బియ్యం తీసుకోని లబ్ధిదారులు గడువులోపు తీసుకోవాలి. గడువు పెంచే అవకాశం లేదు. జిల్లాలో ఇప్పటి వరకు 88శాతం బియ్యం పంపిణీ పూర్తయింది. మిగతా వారు కూడా గడువులోపు బియ్యం తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నాం. – మోదుగు శ్రీనివాస్రెడ్డి, ఇన్చార్జి డీఎస్ఓ నాగారం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డుదారులకు మూడు నెలల (జూన్, జూలై, ఆగస్టు)కు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఈనెలలోనే ఒకేసారి పంపిణీకి శ్రీకారం చుట్టింది. అయితే మూడు నెలల బియ్యం తీసుకునేందుకు 30వ తేదీ వరకు (రెండు రోజులు) మాత్రమే గడువు ఉంది. జిల్లాలో ఇప్పటి వరకు 88శాతం మందికి పంపిణీ చేశారు. ఇంకా 12శాతం మంది బియ్యం తీసుకోలేదని పౌరసరఫరాల శాఖ గుర్తించింది. దీంతో పంపిణీ గడువుపై గ్రామాల్లో ప్రచారం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో జిల్లా పౌరసఫరాల శాఖ అధికారులు దీనిపై దృష్టి సారించారు. పలు కారణాలతో పంపిణీలో జాప్యం జిల్లాలోని 486 గ్రామ పంచాయతీల పరిధిలో 610 రేషన్ దుకాణాలు, 3.24లక్షల రేషన్ కార్డులున్నాయి. వర్షాకాలం నేపథ్యంలో పేదలు నిత్యావసర సరకులకు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో మూడు నెలల బియ్యాన్ని ప్రభుతం ఒకేసారి పంపిణీ చేస్తుంది. దీనిలో భాగంగా జిల్లాలకు మూడు నెలలకు గాను 1,78,000 క్వింటాళ్ల బియ్యాన్ని కేటాయించారు. కానీ పంపిణీకి ఉపయోగించే ఈపాస్ యంత్రాల్లో సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం, సర్వర్ బిజీగా ఉండటం, బ్లూటూత్ సక్రమంగా కనెక్ట్ కాకపోవడం వంటి కారణాల వల్ల పంపిణీలో జాప్యం జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో వలసలు, ఇతర పనుల నిమిత్తం గ్రామాలు వదిలి వెళ్లడంతో కొంత మంది వినియోగదారులు ఇంకా తీసుకోలేదు. ఈ నేపథ్యం వంద శాతం బియ్యం పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం విస్తృత ప్రచారం చేస్తోంది. వంద శాతం ప్రశ్నార్థకం ఈనెల 1 నుంచి బియ్యం పంపిణీ ప్రారంభించాల్సి ఉన్నా షాపులకు సరఫరా కాకపోవడంతో జాప్యం చోటుచేసుకుంది. కొన్ని దుకాణాల్లో 5వ తేదీ నుంచి ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా పంపిణీ తీరును పరిశీలిస్తే శనివారం నాటికి 88 శాతం పూర్తయింది. రెండు రోజులే గడువుంది. సాధారణ రోజుల్లో బియ్యం పంపిణీ 1నుంచి 15వ తేదీ వరకు జరిగేది. ఈ సారి మూడు మాసాల బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తుండడంతో నెలాఖరు వరకు గడువు విధించారు. అయినా వంద శాతం పంపిణీ ప్రశ్నార్థకం గానే మారింది. ప్రతినెలా 80 నుంచి 90శాతం మంది లబ్ధిదారులు మాత్రమే బియ్యాన్ని తీసుకుంటున్నారని అధికారులు పేర్కొంటున్నారు. రేపటితో ముగియనున్న రేషన్ బియ్యం పంపిణీ ఫ ఇప్పటి వరకు 88 శాతం పంపిణీ పూర్తి ఫ గడువులోగా తీసుకోవాలంటున్న పౌర సరఫరాల శాఖ అధికారులు ఫ గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న సిబ్బందిరేషన్ దుకాణాలు 610రేషన్ కార్డులు 3.24 లక్షల పంపిణీ శాతం 88 శాతం -
ఉపాధిహామీ పనుల్లో అలసత్వం చేయొద్దు
కోదాడరూరల్ : ఉపాధిహామీ పనుల్లో సిబ్బంది అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని డీఆర్డీఓ వీవీ.అప్పారావు హెచ్చరించారు. కోదాడ మండల పరిధిలోని 16 గ్రామాల్లో గత వార్షిక ఏడాదిలో జరిగిన ఉపాధి పనులపై శనివారం పట్టణంలో ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన 15వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదికలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొన్ని గ్రామాల్లో మస్టర్లలో సంతకాలు లేకుండా బిల్లులు డ్రా చేసిన ఫీల్డ్ అసిస్టెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొన్ని గ్రామాల్లో తక్కువ పనులు చేసి ఎక్కువ పనులు చేసినట్లు కొలతలు తీశారని తనిఖీలో తేలడంతో ఆ నగదు రికవరీకి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ శిరీషా, ఎంపీడీఓ వీవీ.రాంచందర్రావు, ఎంపీఓ పాండురంగన్న, పీఆర్ఏఈ రాము, అంబుడ్స్మెన్ లచ్చిరాంనాయక్, డీవీఏ పద్మనాభరావు, ఏవీఓ ఆశా, ఏపీఓ ఠానియా ఉన్నారు. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం ఆపాలి సూర్యాపేట అర్బన్ : గోదావరి జలాల అక్రమ తరలింపునకు చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపాలని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వి.కోటేశ్వరరావు అన్నారు. శనివారం సూర్యాపేట పట్టణంలోని చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు పోటు లక్ష్మయ్య అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి పంపకం కోసం కొత్త ట్రిబ్యునల్స్.. ప్రజా సంఘాలతో చర్చించి నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో అఖిలభారత రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.డేవిడ్ కుమార్, ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శంకర్, జిల్లా ఉపాధ్యక్షుడు పెద్దింటి రంగారెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి అలుగుబెల్లి వెంకట్రెడ్డి, జిల్లా నాయకులు కాకి మోహన్రెడ్డి, ఎస్.కె జిలేరు, మేకల కనకారావు, దాసరి శ్రీనివాస్, భయ్యా లింగయ్య, సుంకిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, జాజుల సామేలు, ఎస్.కె మైబెల్లి, నాగయ్య తదితరులు పాల్గొన్నారు. మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణహుజూర్నగర్ : మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ జరుగుతుందని జిల్లా సహకార అధికారి (డీసీఓ) సువర్చల పద్మ అన్నారు. వన మహోత్సంలో భాగంగా శనివారం హుజూర్నగర్ మండలం లింగగిరి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవణరలో, శ్రీనివాసపురం గ్రామంలోని గోదాం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు కట్ట గోపాల్రావు, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు రాంబాయి, అంజయ్య, ఆడిటర్ సంధ్యారాణి, రవికుమార్, డైరెక్టర్లు కోనుగంటి కోటిరెడ్డి, తిమ్మారెడ్డి కళావతి, అరబండి అప్పారావు, మాజీ అధ్యక్షుడు లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వమే నిర్వహించాలిమునగాల : సాగర్ ఎడమ కాలువపై ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాల బాధ్యతలను ప్రభుత్వమే చూడాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్రెడ్డి కోరారు. శనివారం మునగాల మండలం మాధవరంంలో శనివారం ఆ పార్టీ మండల స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను అందించాలన్నారు. మండల కార్యదర్శి బుర్రిశ్రీరాములు అధ్యక్షన జరిగిన ఈ శిక్షణలో నెమ్మాది వెంకటేశ్వర్లు, ఎం.రాములు, షేక్ సైదా, జూలకంటి విజయలక్ష్మి, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, ఆరె రామకృష్ణారెడ్డి, జి.వెంకట్రెడ్డి, బచ్చలకూరి స్వరాజ్యం, చందా చంద్రయ్య, డి.స్టాలిన్రెడ్డి, వెంకన్న, జూలకంటి కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సమగ్ర వ్యవసాయ ప్రణాళికను ప్రకటించాలి
సూర్యాపేట : రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం సీజన్లో రైతాంగాన్ని ఆదుకునేందుకు సమగ్ర వ్యవసాయ ప్రణాళికను ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకటనర్సింహారెడ్డి భవన్లో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ సీజన్ ప్రారంభం అవుతున్నందున ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించుకొని ఏ భూమిలో ఏ పంట పండుతుందో, ప్రజలకు ఎంత పంట అవసరమో అంచనా వేసి వాటికి అవసరమైన ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు, బ్యాంకు రుణాలు రైతాంగానికి అందించాలని కోరారు. ప్రతి సంవత్సరం కల్తీ విత్తనాలు, పురుగుల మందుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే నకిలీ పురుగుల మందులు, విత్తనాలు లేకుండా చూడాలన్నారు. బనకచర్ల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకొని తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చూడాలన్నారు. రాజకీయ జోక్యం లేకుండా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరి రావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు, నాగారపు పాండు, మట్టి పెళ్లి సైదులు, కోట గోపి, ఏకలక్ష్మి పాల్గొన్నారు. -
యువత డ్రగ్స్ జోలికి వెళ్లొద్దు
సూర్యాపేటటౌన్ : యువత డ్రగ్స్ జోలికి వెళ్లొద్దని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ , పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గురువారం సూర్యాపేట పట్టణంలో నిర్వహించిన ర్యాలీని ఎస్పీ నరసింహ, అదనపు కలెక్టర్ పి. రాంబాబుతో కలిసి కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సూర్యాపేటను డ్రగ్స్రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడు బాధ్యతగా కృషి చేయాలన్నారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలు అవగాహన కల్పించాలన్నారు. మాదక ద్రవ్యాలు కనిపిస్తే వెంటనే 1908 నంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని లేదా 100కు డయల్ చేసి వివరాలు తెలియజేయాలన్నారు. రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ మన ప్రాంతాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఎస్పీ నరసింహ మాట్లాడుతూ డ్రగ్స్ ఆరోగ్యాన్ని మాత్రమే కాదు అందమైన జీవితాన్ని కూడా బలి తీసుకుంటుందన్నారు. డ్రగ్స్ కలిగి ఉండడం నేరం అందుకు చట్టరీత్యా శిక్ష తప్పదని చెప్పారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఇన్చార్జి డీడబ్ల్యూఓ రూప , ఆర్డీఓ వేణుమాధవ్, తహసీల్దార్ కృష్ణయ్య, డీటీడీఓ శంకర్, డీవైఎస్ఓ రామచంద్రరావు, అడిషనల్ ఎస్పీలు రవీందర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, డీఎస్పీ ప్రసన్న కుమార్, నరసింహా చారి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఫ సూర్యాపేటలో మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ ర్యాలీ -
‘ఇన్స్పైర్’ అవుదాం
ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి సమాజంలో నిత్యం ఎదుర్కొనే అనేక సమస్యలకు పరిష్కార రూపంలో ఆవిష్కరణలకు వేదికగా ఇన్స్పైర్ మనక్ నిలుస్తోంది. విద్యార్థులు తమ ఉపాధ్యాయుల సహకారంతో పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటాలి. ఉపాధ్యాయులు విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించాలి. విద్యార్థులు తమలో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇన్స్పైర్ ఎంతగానో దోహదపడు తుంది. ప్రతి పాఠశాల నుంచి విద్యార్థులు పోటీల్లో పాల్గొనేలా సైన్స్ ఉపాధ్యాయులు కృషి చేయాలి. – దేవరాజు, జిల్లా సైన్స్ అధికారి ఫ ఇన్స్పైర్ మనక్ అవార్డులకు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం ఫ సెప్టెంబర్ 15 వరకు గడువు ఫ ప్రతిభ చూపిన విద్యార్థులకు నగదు పురస్కారాలు సూర్యాపేటటౌన్ : పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను ప్రయోగాల వైపు నడిపించి, వారిలో వినూత్న ఆలోచనలకు పదును పెట్టి భావి భారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు ‘ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్సూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్’ (ఇన్స్పైర్) పేరుతో ఇన్స్పైర్ మనక్ పురస్కారాలను అందిస్తోంది. 2025–26 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, గురుకుల పాఠశాలల్లోని విద్యార్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ నెల 15న ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబర్ 15వ తేదీ వరకు కొనసాగనుంది. ఎవరు అర్హులంటే.. 10 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి 6 నుంచి 10వ తరగతి చదివే ప్రతిభ కలిగిన విద్యార్థులకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్, గురుకుల, మోడల్ స్కూల్స్, కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో 6 నుంచి 10వ తరగతి వరకు ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు అర్హులు. వీరు పాఠశాలలోని సైన్స్ ఉపాధ్యాయుడి గైడ్లైన్ పాటిస్తూ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే విధానం.. ● ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ● www.inspireawards-dst.gov.in వెబ్సైట్లోకి వెళ్లి న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి. ● పాఠశాలకు సంబంధించిన వివరాలు నమోదు చేసుకొని, సేవ్ చేసుకోవాలి. ఈ దరఖాస్తు జిల్లా అథారిటీకి వెళ్తుంది. ● వీరు ఆమోదిస్తే విద్యార్థికి సంబంధించి పొందుపర్చిన మెయిల్ ఐడీకి యూజర్ ఐడీతో కూడిన లింక్ వస్తుంది. అప్పుడు విద్యార్థి యూజర్ ఐడీకి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ● విద్యార్థి తన సమాచారంతో పాటు బ్యాంక్ అకౌంట్ నంబర్, ఆధార్ నంబర్ నమోదు చేయాల్సి ఉంటుంది. ● విద్యార్థి ప్రదర్శించాలనుకున్న ప్రాజెక్టును సంక్షిప్తంగా వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి. ● ఎంపికై న ప్రాజెక్టు ప్రయోగ నిమిత్తం విద్యార్థి బ్యాంక్ ఖాతాకు రూ.10వేలు జమ చేస్తారు. ● రాష్ట్ర స్థాయికి ప్రాజెక్టు ఎంపికై తే రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు అందిస్తారు. ● ఆన్లైన్లో ఉచితంగా విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ● 2024–25 విద్యా సంవత్సరంలో 950 పాఠశాలలకు సంబంధించి 88 నమూనాలు ఎంపికయ్యాయి. ఇందులో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించగా రాష్ట్ర స్థాయికి ఎనిమిది ప్రదర్శనలు ఎంపికయ్యాయి. విద్యార్థులకు ప్రోత్సాహకాలు ప్రాజెక్టులను డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రతినిధులు పరిశీలిస్తారు. ఎంపికైన ప్రాజెక్టు ప్రయోగ నిమిత్తం ఎంపిక చేసిన విద్యార్థి వ్యక్తిగత అకౌంట్లో రూ.10వేలు జమ చేస్తారు. రాష్ట్ర స్థాయి ప్రదర్శననకు ఎంపికై తే రూ.25వేలు, జాతీయ స్థాయిలో ఎంపికై తే రూ.40 వేల నుంచి రూ.60వేల వరకు నగదు ప్రదానం చేస్తారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందజేస్తారు. ప్రతిభావంతులకు ఐఐటీ, నీట్ ప్రవేశాల్లో రిజర్వేషన్ కల్పిస్తారు. ప్రతి పాఠశాల నుంచి ఐదు ప్రాజెక్టులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. -
ఏకత్వంలో భిన్నత్వం సృష్టిస్తున్న బీజేపీ
సూర్యాపేట : దేశంలో హిందుత్వం ముసుగులో ఏకత్వంలో భిన్నత్వాన్ని బీజేపీ సృష్టిస్తోందని శాసనసభ డిప్యూటీ స్పీకర్, డోర్నకల్ ఎమ్మెల్యే రాంచందర్ నాయక్ ఆరోపించారు. గురువారం ట్రైకార్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్ అధ్యక్షతన నిర్వహించిన ఆదివాసీ కాంగ్రెస్ బునియాది కార్యకర్తల సమ్మేళనం ముగింపు సభలో ఎమ్మెల్యేలు పద్మావతిరెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, శాసన మండలి సభ్యుడు కేతావత్ శంకర్ నాయక్ లతో కలిసి పాల్గొని మాట్లాడారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఆదివాసీ, గిరిజనులకు ఏదైనా లబ్ధిచేకూరిందంటే అది కాంగ్రెస్ పార్టీతోనే అని చెప్పారు. ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్ పార్టీనే అని గుర్తు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు కట్టబెడుతోందని ఆరోపించారు. బీజేపీ కుటిల ప్రయత్నాలను ప్రశ్నించిన ఏకై క వ్యక్తి రాహుల్ గాంధీ అని అన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే వరకు ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేయాలి అన్నారు. బీఆర్ఎస్ పాలకులు విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగాలు ఇవ్వకుండా గొర్లు, బర్లు ఇచ్చారని విమర్శించారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. గత పదేళ్లో ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రాలేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల రూ.200 కోట్లు విడుదల చేసిందన్నారు. సభలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, ఆదివాసీ కాంగ్రెస్ బునియాది శిక్షణ శిబిరం జాతీయ కోఆర్డినేటర్ రాహుల్ బాల్, కాంగ్రెస్ ఎస్టీసెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ కోట్య నాయక్ భూక్య, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఎలిమినేటి అభినయ్, శిక్షణ శిబిరం ఇన్చార్జి లింగం, రాణా ప్రతాప్, కృష్ణ, శ్రీను, మల్లికార్జున్, మోహన్, గుగులోతు నాగు నాయక్ పాల్గొన్నారు. ఫ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రాంచందర్ నాయక్ -
మొలకెత్తని ఆశలు
విత్తనాలు మళ్లీ పెడుతున్నాం ఈసారి 20 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి గింజలు నాటాం. రూ.3.20 లక్షలు ఖర్చు చేశాం. వర్షాభావ పరిస్థితులతో పత్తి గింజలు మొలవ లేదు. ఎక్కడో ఒక చోట కొన్ని గింజలు మొలిచినా ఎండ వేడికి వాడి పోయాయి. రూ.30 వేలతో మళ్లీ పత్తి గింజలు తెచ్చి 9 ఎకరాలలో మళ్లీ విత్తుతున్నాం. –గుగులోతు కవిత, నెల్లిబండతండా, తిరుమలగిరి మండలం విత్తనాలు మొలకెత్తలేదు ఈనెల మొదట్లో వర్షాలు పడ్డాయి. మాకున్న 15 ఎకరాల్లో పత్తి విత్తనాలు వేశాం. పదును సరిపడలేకపోవడంతో విత్తనాలు సగానికి పైగా మొలకెత్తలేదు. వర్షం కోసం ఎదురుచూస్తున్నాం. మరో పది రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే పూర్తిగా నష్టపోవాల్సి వస్తుంది. – పిట్టల సైదులు, జాన్పహాడ్, పాలకవీడు మండలం సాక్షి ప్రతినిధి, నల్లగొండ: తొలకరి వర్షంతో విత్తనాలు వేసిన రైతుల ఆశలు ఆడియాశలయ్యాయి. వర్షకాలం ప్రారంభమై 25 రోజులు గడుస్తున్నా వరుణుడు కరుణించక అన్నదాత ఆందోళనలో పడ్డాడు. ఉమ్మడి జిల్లాలోని వివిధ మండలాల్లో తీవ్ర వర్షభావ పరిస్థితులు నెలకొన్నాయి. పత్తి, మక్క తదితర మెట్ట పంటల విత్తనాలు నాటినా వర్షాల్లేక మొలకత్తలేదు. అక్కడక్కడా మొలకెత్తినవి ఎండిపోతున్నాయి. దీంతో రైతులు వాటిని కాపాడుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. బిందెలతో నీళ్లు పోస్తున్నా ప్రయోజనం లేకుండాపోయింది. మొదట్లో కాస్త ఊరించిన వరుణుడు నెల రోజులుగా ముఖం చాటేయడంతో రైతన్న వర్షాల కోసం ఆకాశంవైపు చూస్తున్నాడు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని వివిధ మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. నల్లగొండ జిల్లాలోని శాలిగౌరారం, కనగల్, పెద్దపూర తదితర మండలాల్లో సుమారు 70 నుంచి 100 శాతం వరకు వర్షపాతం లోటు ఉంది. మిగితా మండలాల్లోనూ ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో కేవలం 0.3 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది..అంటే ఒక్క తుంపర కూడా లేదు. చింతలపాలెం, నేరేడుచర్ల, పెన్పహాడ్, చివ్వెంల మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట, అడ్డగూడూరు, భువనగిరి తదితర మండలాల్లోనూ వర్షాభావ పరిస్థితుల నెలకొన్నాయి. మొదట్లో ఊరించిన వానలు ఈ నెల మొదట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నైరుతి రుతు పవనాల ప్రభావంతో కొద్దిపాటి జల్లులు పడటంతో రైతులు ఆనందంతో పత్తి విత్తనాలు విత్తారు. ఆ తరువాత నుంచి మళ్లీ వర్షాలు పెద్దక పడకపోవడంతో తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా కొద్ది రోజులు ఇలాగే ఉంటే పెట్టిన పెట్టుబడి మొత్తం పోవడంతోపాటు మళ్లీ అదనంగా విత్తనాలకు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఈఫొటోలో కన్పిస్తున్న రైతు పేరు పేర్ల రామయ్య. సొంతూరు చివ్వెంల మండలం వట్టిఖమ్మం పహాడ్. ఈ రైతు తనకున్న మూడెకరాలతో పాటు మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. మొత్తం 13 ఎకరాల్లో దాదాపు రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టి పత్తి గింజలు వేశాడు. విత్తనాలు నాటిన నాటి నుంచి ఇప్పటివరకు వర్షం లేక పోవడంతో మొలకెత్తలేదు. దీంతో పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపిండచం లేదు. ఇది జిల్లాలో పత్తి సాగు చేసిన రైతులందరి పరిస్థితికి నిదర్శనం.పత్తి విత్తనాలు మొలకెత్తక రైతుల ఆందోళన ఫ మొలకెత్తిన చోట వర్షాలు లేక వాడుబడుతున్నయ్ ఫ కాపాడుకునేందుకు నానాపాట్లు ఫ వానల కోసం ఆకాశంవైపు ఎదురు చూస్తున్న రైతాంగం -
ఆరుగురు ఏఎస్ఐలకు ఎస్ఐలుగా పదోన్నతి
సూర్యాపేటటౌన్ : జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పని చేస్తున్న ఆరుగురు ఏఎస్ఐలకు ఎస్ఐలుగా పదోన్నతి లభించింది. ఎస్ఐలుగా ప్రమోషన్ పొందిన వారిలో బి.రామచందర్, హనుమాన్, వి.వెంకన్న , జి.చినమల్సూర్, పి.ముత్తయ్య, ఎస్కె.రహీమొద్దీన్ ఉన్నారు. పదోన్నతి పొందిన వారు గురువారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్పీ వారికి మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగోన్నతితో పాటుగా బాధ్యతలు పెరుగుతాయని, అందుకనుగుణంగా విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలన్నారు. పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలని కోరారు. మల్టీపర్పస్ సొసైటీలుగా అభివృద్ధి చేయాలిచిలుకూరు: పీఏసీఎస్లను మల్టీపర్పస్ సొసైటీలుగా అభివృద్ధి చేయాలని నల్లగొండ డీసీసీబీ ఏజీఎం పసుపులేటి వెంకటేశ్వర్లు సూచించారు. డెవలపింగ్ పీఏసీఎస్ ఇన్టూ మల్టీపర్పస్ సొసైటీ కార్యక్రమంలో భాగంగా గురువారం చిలుకూరు పీఏసీఎస్ను ఫ్యాకల్టీ సభ్యులతో కలిసి ఆయన పరిశీలించి మాట్లాడారు. జిల్లాలో 40 పీఏసీఎస్లను డెవలపింగ్ మల్టీపర్పస్ సొసైటీలుగా ఎంపిక చేశామని తెలిపారు. జిల్లాలోనే ఆదర్శవంతమైనది చిలుకూరు పీఏసీఎస్ అని కొనియాడారు. అనంతరం డెవలపింగ్ పీఏసీఎస్ ఇన్టూ మల్టీపర్పస్ సొసైటీపై సిబ్బందికి ఫ్యాకల్టీ సభ్యులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఫ్యాకల్టీ సభ్యులు విజయశేఖర్, సంపత్కుమార్, డీసీసీబీ డైరెక్టర్ కొండా సైదయ్య, చిలుకూరు ప్యాక్స్ చైర్మన్ అలసకాని జనార్దన్, సెక్షన్ మేనేజర్ అశోక్, కోదాడ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ రామకృష్ణ, సీఈఓ చిలువేరు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఐక్యంగా ఉంటూ సమస్యలు పరిష్కరించుకుందాంసూర్యాపేట టౌన్: క్రైస్తవులంతా ఐక్యంగా ఉంటూ సమస్యలను పరిష్కరించుకుందామని జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు మీసాల గోవర్దన్ పేర్కొన్నారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని గ్రేస్ టెంపుల్లో ఏర్పాటు చేసిన జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ సమావేశంలో ఆయన మాట్లాడారు. క్రైస్తవు సమస్యలను పరిష్కరించడంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని కోరారు. ఈ సందర్భంగా క్రైస్తవ సమాజానికి సేవలందించిన దళిత సంఘం జాతీయ నాయకుడు గుద్దేటి ఎల్లయ్య మాదిగను సన్మానించారు. అనంతరం ఆయన వైద్య ఖర్చులకోసం ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ గౌరవ అధ్యక్షుడు కాసర్ల శ్రవణ్ కుమార్, చీఫ్ అడ్వైజర్ కొత్తపల్లి సిల్వి, కమిటీ వైస్ ప్రెసిడెంట్ రెమిడాల ప్రకాష్, ప్రధాన కార్యదర్శి కాపర్తి సైమన్, కోశాధికారి పూజర్ల శామ్యూల్, కిరణ్, చంద్రశేఖర్ ,జలగం డేవిడ్ రాజ్, కరుణాకర్, రామారావు, జాషువా పాల్గొన్నారు. మట్టపల్లిలో నిత్యకల్యాణంమఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం నిత్యకల్యాణం నిర్వహించారు. ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యఅగ్నిహోత్రి, పంచామృతాభిషేకం, నూతన పట్టు వస్త్రాలంకరణ చేశారు. అనంతరం ఎదుర్కోళ్లమహోత్సవ నిర్వహించారు. విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర కార్యక్రమాలతో నిత్యకల్యాణతంతు ముగించారు. కార్యక్రమంలో విజయ్కుమార్, మట్టపల్లిరావు, నవీన్కుమార్, రామాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు. -
రాష్ట్ర పండుగగా గుర్తించాలి
చివ్వెంల(సూర్యాపేట) : శ్రీ లింగమంతులస్వామి (పెద్దగట్టు) జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలని గొర్రెల, మేకల పంపెకం దారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్ కోరారు. గురువారం చివ్వెంల మండలం దురాజ్పల్లి గ్రామ శివారులోగల శ్రీ లింగమంతుల స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఆ సంఘం జిల్లా మహాసభలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం గొర్రెలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చి ఆ ఊసే ఎత్తడంలేదన్నారు. సమావేశంలో కడం లింగయ్య, వీరబోయిన రవి, వట్టే వినయ్, కంచుగట్ల శ్రీనివాస్, బొల్లం గోపాల కృష్ణ, వీరబోయిన సైదులు, బట్టు కొమరయ్య, దాసరి లింగయ్య, మున్న భిక్షం, సింగం వెంకన్న, కన్నబోయిన ఎర్రయ్య, వెంకన్న, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
మాదక ద్రవ్యాల నిర్మూలనకు కృషి చేయాలి
సూర్యాపేటటౌన్ : మాదక ద్రవ్యాల నిర్మూలనకు యువత కృషి చేయాలని ఎస్పీ నరసింహ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. భావితరాలకు మంచి సమాజాన్ని అందించాలన్న ఉద్దేశంతో ఈనెల 26న యాంటీ డ్రగ్ డే ను పురస్కరించుకొని వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. జిల్లాలో ఎవరైనా గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను వినియోగించినా అక్రమ రవాణా చేసినా రాష్ట్ర పోలీస్ యాంటీ నార్కోటిక్ బ్యూరో టోల్ ఫ్రీ నంబర్ 1908కు లేదా, సూర్యాపేట జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్ 8712686026కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో జరిగే అవగాహన ర్యాలీలో పౌరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జిల్లా యంత్రాంగం, జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొని యాంటి డ్రగ్ సోల్జర్ గా నమోదు చేసుకోవాలన్నారు. ధర్నాను విజయవంతం చేయాలినూతనకల్ : తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 27న హైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముప్పాని కృష్ణారెడ్డి కోరారు. బుధవారం నూతనకల్ మండల కేంద్రంలో ధర్నా కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విద్యను విధ్వంసం చేసే విధానాలను ప్రతిఘటించాలని కోరారు. కార్పొరేటీకరణ, కేంద్రీకరణ, కాషాయీకరణను ప్రోత్సహించే జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇరుగు యాదగిరి, పద్మం మల్లయ్య, పీడీ నాగేందర్, నారాయణదాస్, శ్రీనివాస్, రాములు, ఇరుగు సోమయ్య, వంగపల్లి రమేష్, పులుసు శ్రీనివాస్, యాస రాంకుమార్రెడ్డి, ఝాన్సీ, ఎల్లమ్మ, ఉమేష్రెడ్డి పాల్గొన్నారు. మంత్రి ఉత్తమ్కు ఆహ్వానంహుజూర్నగర్ : హుజూర్నగర్ పట్టణంలో గురువారం నుంచి ప్రారంభం కానున్న మొహర్రం (పీర్ల పండుగ) కు ముఖ్య అతిథులుగా హాజరు కావాలని కోరుతూ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతికి ముజావర్లు బుధవారం హైదరాబాద్లో ఆహ్వాన పత్రిక అందజేశారు. వారితో పాటు రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈఓ అసదుల్లా ఖాన్, తదితరులకు ఆహ్వాన పత్రికలు ఇచ్చారు. కార్యక్రమంలో ముజావర్లు ఎస్కే.సైదా, నాగుల్ మీరా, మీరాపాషా, హుజూర్నగర్ గౌడ్ సొసైటీ అధ్యక్షుడు వి.కృష్ణగౌడ్ పాల్కొన్నారు. -
వీడిన ఉత్కంఠ
సూర్యాపేట : స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ తొలగింది. నేడోరేపో నోటిఫికేషన్ వస్తుందని కొందరు, ఇప్పట్లో ఎన్నికల నిర్వహణ ఉండకపోవచ్చని మరికొందరు ప్రచారం చేస్తుండగా.. మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో స్థానిక సంస్థలైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతోపాటు గ్రామ పంచాయతీ ఎన్నికలు సెప్టెంబర్ చివరి నాటికి పూర్తి కానున్నా యి. జిల్లాలో 486 గ్రామపంచాయతీలు, 213 ఎంపీటీసీ స్థానాలు, 23 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. అయితే ఎన్నికల నిర్వహణపై ఓ స్పష్టత రాగా.. రాజకీయ పార్టీలు, ఆసక్తి ఉన్న అభ్యర్థులతో పాటు ప్రజల్లోనూ ఇక రిజర్వేషన్లపై చర్చ మొదలైంది. ముందుగా సర్పంచ్ ఎన్నికలేనా..? జిల్లా వ్యాప్తంగా గతంలో 475గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కొత్తగా 11పంచాయతీలు ఏర్పడ్డాయి. దీంతో మొత్తం 486 గ్రామపంచాయతీలు అయ్యాయి. అయితే గతేడాది ఫిబ్రవరిలో సర్పంచ్ల పదవీ కాలం ముగిసింది. తర్వాత జూలైలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, ఈ ఏడాది జనవరిలో మున్సిపాలిటీల పదవీకాలం ముగిసింది. ఈ క్రమంలో ఏడాదిన్నర కాలంగా గ్రామ పంచాయతీల్లో పాలన పడకేసింది. తీవ్ర నిధుల కొరత ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్నిరకాల నిధులు నిలిచిపోయాయి. దీంతో ముందుగా ఈ ఎన్నికలే నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వెంటనే అదే గుర్తులతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను సైతం 20రోజుల వ్యవధిలోనే నిర్వహిస్తారని సమాచారం. ఆశావహుల్లో ఉత్సాహం రాజకీయ పార్టీల్లో మళ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న కోర్టు ఆదేశాలతో రాజకీయ పార్టీలు, ఆశావహులు పోటీకి సై అంటున్నారు. ఎన్నికలు ఎప్పుడొస్తాయన్న ఆతృతతో ఎదురు చూస్తున్న ఆశావహులకు హైకోర్టు తీర్పు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. జిల్లాలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలతోపాటు, సీపీఎం, సీపీఐ, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీలు కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. అయితే రిజర్వేషనన్ ప్రక్రియ ఎలా ఉంటుందోనన్న ప్రధాన చర్చ జిల్లాలో ఇప్పుడు మొదలైంది. బీసీలకు 42శాతం రిజర్వేషనన్ అమలు అవుతుందా..? లేదంటే పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరుగుతాయా అన్నది తేలాల్సి ఉంది. ఇదే ఉత్కంఠ ప్రస్తుతం రాజకీయ పార్టీలు, ఆసక్తి ఉన్న అభ్యర్థుల్లో నెలకొంది. అయితే పార్టీలే తాము ఇచ్చే టికెట్లలో 42 శాతం బీసీలకు ఇచ్చే ప్రతిపాదన కూడా వస్తోంది. ఫ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పుతో పల్లెల్లో సందడి ఫ సెప్టెంబర్ 30లోపు నిర్వహించాలని ఆదేశం ఫ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై చర్చ ఫ సన్నద్ధమవుతున్న ఆశావహులు -
అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి
సూర్యాపేటటౌన్ : విద్యార్థులు ప్రభుత్వం కల్పించే అవకాశాలను సద్వినియోగం చేసుకొని తమ ప్రతిభనువెలికి తీయాలని జిల్లా విద్యాశాఖ అధికారి కె.అశోక్ సూచించారు. హకీంపేట, ఆదిలాబాద్, కరీంనగర్ తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూళ్లలో నాలుగో తరగతిలో ప్రవేశాలకు బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఎంపిక లు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లా నలుమూలల నుంచి 34 మంది బాలురు, 16 మంది బాలికలలు ఎంపికలకు హాజరయ్యారు. వీరికి తొమ్మిది మోటార్ క్వాలిటీ టెస్టులు నిర్వహించారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి 10 మంది బాలురు, 10 మంది బాలికలను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయిలో జరిగే ఎంపికకు పంపనున్నట్టు జిల్లా స్పోర్ట్స్ అధికారి జి.రాంచందర్రావు తెలిపారు. ఈ కార్యక్రమములో ఎస్జీఎఫ్సెక్రటరీ ఆజమ్ బాబా, బాక్సింగ్ కోచ్ లోకేష్ రాజ్, వ్యాయామ ఉపాధ్యాయలు పాల్గొన్నారు. -
వన మహోత్సవ లక్ష్యం సాధించాలి
భానుపురి (సూర్యాపేట) : వనమహోత్సవ లక్ష్యాన్ని అన్నిశాఖలు సాధించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. ఎన్ఆర్ఈజీఎస్లో వనమహోత్సవం వాటర్ రీచార్జి స్ట్రక్చర్స్, ఇతర అంశాలపై బుధవారం సూర్యాపేట కలెక్టరేట్లో ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏపీఓలు, ఈసీలు, టీఏలతో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని, ఈసారి వనమహోత్సవంలో ఈత, తాటి వనాలకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఎకై ్సజ్, హార్టికల్చర్, ఫారెస్ట్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు వారి పరిధిలోని స్థలాలను గుర్తించి మొక్కలు నాటాలని ఆదేశించారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా గ్రామాల్లో కొనసాగుతున్న పనులను పర్యవేక్షించడానికి అధికారులు, బృందాలు రానున్నాయని తెలిపారు. ఎంపీఓలు పంచాయతీలోని టాక్స్ కలెక్షన్ల రికార్డులను పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. డైలీ శానిటేషన్ రిపోర్టును 100శాతం అమలయ్యేలా పనిచేయాలని తెలిపారు. అనంతరం స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ వాల్పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వి.వి. అప్పారావు, డీపీఓ యాదగిరి, డిప్యూటీ సీఈఓ శిరీష, డీఎల్పీఓ నారాయణరెడ్డి, ఎస్బీఎం నరేందర్రెడ్డి. అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఉక్కుపాదం మోపాలి మాదక ద్రవ్యాల వినియోగంపై జిల్లాలో ఉక్కుపాదం మోపాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పేర్కొన్నారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్లో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం (జూన్ 26) సందర్భంగా విద్యార్థినులకు వ్యాసరచన, స్లోగన్, డ్రాయింగ్, పోస్టర్ మేకింగ్, ముగ్గుల పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువతకు మంచి భవిష్యత్తు ఉందని మత్తు పదార్థాలకు బానిస కావొద్దని సూచించారు. ఎవరైనా మత్తు పదార్థాలు వినియోగిస్తున్నట్లు తెలిస్తే 1908 హెల్ప్ లైన్ నంబర్కు కాల్ చేయాలని కోరారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వినియోగం వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఉద్యోగులు, డాక్టర్లు, విద్యార్థులు, పలు రంగాలకు చెందిన వ్యక్తులు మెడికల్ కాలేజీ నుంచి సద్దల చెరువు వరకు గురువారం జరిగే ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు. ఈ సమావేశంలో ఇన్చార్జి డీడబ్ల్యూఓ రూప, అధికారులు హుస్సేన్, చంద్రశేఖర్, వినోద్, సంజీవ్, చైతన్య, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
డ్రగ్స్ రహిత జిల్లాగా మారుద్దాం
భానుపురి (సూర్యాపేట) : మత్తు పదార్థాలను అరికట్టేందుకు ప్రజలు యువత విద్యార్థులు కలిసికట్టుగా ముందడుగు వేసి సూర్యాపేటను డ్రగ్రహిత జిల్లాగా మారుద్దామని కలెక్టర్ తేజస్నంద్ లాల్ పవార్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న వారోత్సవాలను పురస్కరించుకొని బుధవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ‘అయామ్ యాన్ యాంటీ డ్రగ్ సోల్జర్’ అనే సెల్ఫీ పాయింట్ వద్ద ఎస్పీ నరసింహతో కలిసి ఆయన సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డ్రగ్స్ బారిన ఎవరూ పడకుండా పోలీస్ శాఖ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ప్రతి అధికారి సెల్ఫీ పాయింట్ వద్ద ఫొటో దిగి మాధ్యమాల్లో యువతకు అవగాహన కలిగేలా విస్తృత ప్రచారంలో అందరూ పాల్గొనాలన్నారు. గురువారం సూర్యాపేటలో జరగే ర్యాలీలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్, ఎస్పీలు కోరారు. -
పారిశుద్ధ్యం ఎలా..
గ్రామ పంచాయతీలకు నిధులు కరువు గురువారం శ్రీ 26 శ్రీ జూన్ శ్రీ 2025ఫ వానాకాలంలో పారిశుద్ధ్య నిర్వహణ విషయంలో అయోమయం ఫ ఏడాదిన్నరగా పెండింగ్లోనే బిల్లులు ఫ ఎన్నికలు జరిగి సర్పంచ్లొస్తే తగ్గనున్న భారం ఫ మరో మూడునెలల వరకు కార్యదర్శులదే బాధ్యతభానుపురి (సూర్యాపేట) : వానాకాలంలో పారిశుద్ధ్య సమస్య తలెత్తనున్న నేపథ్యంలో గ్రామ పంచాయతీలను నిధుల కొరత వేధిస్తోంది. వేసవిలో మంచినీటి ఎద్దడి నివారణకు పంచాయతీ కార్యదర్శులు పెద్ద ఎత్తున ఖర్చు చేయగా.. నిధులు రాలేదు. ప్రస్తుత వానాకాలంలో గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు మళ్లీ నిధులు అవసరం పడతాయి. ఈ నిధులు ఎక్కడినుంచి తేవాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 475 గ్రామ పంచాయతీలకు సంబంధించి సుమారు 2కోట్ల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఇటీవల స్థానిక ఎన్నికలు జూలైలోనే ఉండే అవకాశముందని ప్రచారం జరగ్గా.. అధికారులు, కార్యదర్శులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇంతలోనే సెప్టెంబర్ వరకు ప్రభుత్వం, ఎన్నికల సంఘం సమయం కోరడంతో తప్పనిసరిగా కార్యదర్శులే ఈ భారాన్ని మోయాల్సి వస్తుంది. నిధులు లేక.. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైనా ఇప్పటి వరకు వరుణుడి జాడ లేకపోవడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదు. వర్షాలు పడి ముసురు పెడితే పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారుతుంది. వీధులన్నీ చిత్తడిగా మారడం, చెత్తాచెదారంతో దోమలు వ్యాపించి అంటువ్యాధులు ప్రబలే అవకాశముంది. ఈ క్రమంలో పంచాయతీలు పారిశుద్ధ్య నిర్వహణకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా బ్లీచింగ్ పౌడర్, దోమల నివారణకు ఆయిల్ బాల్స్, ఫాగింగ్ మందు, మురుగు కాల్వల్లో పూడికతీత, ట్రాక్టర్ మెయింటెనెన్స్, పైప్లైన్ల లీకేజీలకు మరమ్మతులు ఉంటాయి. ఇప్పటికే ప్రభుత్వం వానాకాలం పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించినా.. ఎలాంటి నిధులు కేటాయించలేదు. పంచాయతీ కార్యదర్శులు దుకాణదారుల వద్ద అప్పు తేవాలన్నా.. గతంలో తీసుకొచ్చిన వాటికి బిల్లులు మంజూరు కాకపోవడంతో మళ్లీ ఇచ్చే పరిస్థితి లేకుండాపోయింది. న్యూస్రీల్పెండింగ్లో ఉన్న బిల్లులు సుమారు రూ.2కోట్లు మొత్తం గ్రామ పంచాయతీలు 475ఏడాదిన్నరగా ప్రత్యేక అధికారుల పాలన పారిశుద్ధ్య నిర్వహణకు కావాల్సిన నిధులు ప్రస్తుతం పంచాయతీల వద్ద లేవు. ఏడాదిన్నరగా సాగుతున్న ప్రత్యేకాధికారుల పాలనలో ఇంతవరకూ ఒక్క బిల్లు మంజూరు కాకపోవడమే ఇందుకు నిదర్శనం. అయితే జూన్ నెలాఖరుకు నోటిఫికేషన్ ఇచ్చి జూలై, ఆగస్టులో స్థానిక సంస్థలకు ఎన్నికలు పూర్తవుతాయన్న ప్రచారం జరిగింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి కూడా మంత్రుల నుంచి ఈ మేరకు పలుమార్లు ప్రకటనలు రావడంతో పంచాయతీ కార్యదర్శులు తమ భారం తగ్గతుందని ఆశపడ్డారు. కానీ సెప్టెంబర్ నాటికి ఎన్నికలు పూర్తయ్యే అవకాశముండడంతో వర్షాలు పడే ఈ మూడునెలలు ఎలా వెళ్లదీయాలోనని మదనపడుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని ఒక్కో చిన్న పంచాయతీకి రూ.7లక్షల నుంచి రూ.8 లక్షలు, పెద్ద పంచాయతీలకు రూ.12లక్షల నుంచి రూ.15 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉంది. పంచాయతీలు వసూలు చేసే ఇంటి, నల్లా బిల్లులు సైతం ఏడాదిగా డ్రా చేసుకునే వీలు లేకుండా ఫ్రీజింగ్ చేశారు. దీంతో నిధుల కొరత ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని కోరుకుంటున్నారు. -
దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి
మునగాల : జూలై 9న చేపట్టబోయే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం.రాంబాబు కోరారు. బుధవారం మునగాల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రామకృష్ణారెడ్డికి సీఐటీయూ మండల కమిటీ ఆధ్వర్యంలో సమ్మె నోటీస్ అందజేసి మాట్లాడారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చి వాటి అమలుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. నాలుగు లేబర్ కోడ్లు అమలైతే కార్మిక సంఘాల ఏర్పాటు కష్టతరమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్లో కార్మికుల సమ్మె హక్కుకు సైతం పరిమితులు ఏర్పడతాయని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగ భద్రత లేకుండా పోతుందని, ఉపాధి అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని, కార్మికశాఖ నిర్వీర్యం అవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్కోడ్లను రద్దు చేసి కార్మికచట్టాలను అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూరి రాంబాబు, హమాలీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు అనంతు మైసయ్య గౌడ్, మండల నాయకులు బి.వీరబాబు, నరేష్, బి.సైదులు తదితరులు పాల్గొన్నారు. ఫ సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాంబాబు -
ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి
భానుపురి (సూర్యాపేట) : ఆరేళ్లుగా ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని జీవనంసాగిస్తున్న పేదలకు శాశ్వతంగా పట్టాలిచ్చి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని సీపీఐ ఎంఎల్ మాస్లైన్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ కోరారు. బుధవారం ఈ మేరకు సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం ఎదుట ఽసీపీఐ ఎంఎల్ మాస్లైన్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందించి మాట్లాడారు. చివ్వెంల మండల పరిధిలోని కుడకుడ గ్రామశివారులో గల 126 సర్వేనంబర్లో, అలాగే నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్లు 243, 244లో గల ప్రభుత్వ భూములను బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆక్రమించుకోగా ఎన్నో నిర్బంధాలు, అరెస్టులను ఎదుర్కొని వాటిలో నిరుపేదలు గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారని తెలిపారు. ఈ విషయమై అధికారులు విచారణ చేసి గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న అర్హులైన పేదలందరికీ పట్టాలు ఇవ్వడమే కాకుండా వీలైనంత త్వరగా ఇందిరమ్మ ఇళ్లు కూడా మంజూరు చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విచారణ చేపట్టి అర్హులైన వారికి పట్టాలు ఇచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్ర అఖిల్, పార్టీ జిల్లా నాయకులు వాస పల్లయ్య, టీయూసీఐ జిల్లా కార్యదర్శి సయ్యద్ హుస్సేన్, సహాయ కార్యదర్శి గోగుల వీరబాబు, నాయకులు విజయ్, రజాక్, మరియమ్మ, సైదులు, సత్తెమ్మ, శ్యామల తదితరులు పాల్గొన్నారు. -
పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
చివ్వెంల(సూర్యాపేట) : రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ కోరారు. రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్పరెన్స్ను చివ్వెల మండల పరిధిలోని జి.తిర్మలగిరి రైతువేదికలో కలెక్టర్ వీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించి దిగుబడులు సాధించాలన్నారు. వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలతో పంటలు సాగు చేయాలన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన రైతు భరోసా పంటల సాగు పెట్టుబడులకు ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, మండల ప్రత్యేకాఽధికారి జగదీశ్వర్ రెడ్డి, ఏఓ వెంకటేశ్వర్లు ఏఈఓలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 15నాటికి భూ దరఖాస్తుల పరిష్కారం భానుపురి (సూర్యాపేట) : భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా జిల్లావ్యాప్తంగా వచ్చిన 44,741 దరఖాస్తులను ఆగస్టు 15నాటికి పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ తేజస్నంద్ లాల్ పవార్ పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి సీఎస్ కే.రామకృష్ణారావు.. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై సమీక్షించడానికి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సూర్యాపేట కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ రాంబాబు, జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేసి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యమివ్వాలని, ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రై డే కార్యక్రమాలు నిర్వహించి పరిసరాలను పరిశుభ్రం చేయాలన్నారు. టీబీ ముక్త్ భారత్ లో భాగంగా స్క్రీనింగ్ పెంచాలని, అనుమానితులకు ఎక్స్రేలు తీసి లక్షణాలు బయట పడితే తక్షణం చికిత్సలు అందజేయాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వివి అప్పారావు, డీఎఫ్ఓ సతీష్కుమార్, డీఏఓ శ్రీధర్ రెడ్డి, డీహెచ్ఓ నాగయ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ చంద్ర శేఖర్, హౌసింగ్ పీడీ ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఫొటొఫైల్నెం:24ఎస్పిటి252ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ బదిలీ
సూర్యాపేట అర్బన్: సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ బి.శ్రీనివాస్ బదిలీ అయ్యారు. ఈమేరకు మంగళవారం సీడీఎంఏ నుంచి ఉత్వర్వులు వెలువడ్డాయి. శ్రీనివాస్ హైదరాబాద్లోని కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో రిపోర్ట్ చేశారు. సూర్యాపేట కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. కాగా సెక్రటేరియట్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్న హనుమంత రెడ్డి పదోన్నతిపై సూర్యాపేట గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్గా రానున్నారు. ఆయన 26న బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. పశువైద్యాధికారులు అందుబాటులో ఉండాలితుంగతుర్తి : వర్షాకాలంలో పశువైద్యాధికారులు.. రైతులకు అందుబాటులో ఉండాలని జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాసరావు సూచించారు. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని పశు వైద్య శాలను తనిఖీ చేసి మాట్లాడారు. పశువులకు సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు అందుబాటులో ఉంచి రైతులకు తగిన సలహాలు సూచనలు అందించాలన్నారు. అనంతరం పశు వైద్యశాలలోని రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట సహాయ సంచాలకుడు డాక్టర్ రవి ప్రసాద్, సిబ్బంది బుచ్చిబాబు తదితరులు ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు టీజేఎస్ కసరత్తు సూర్యాపేట : రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ జన సమితి(టీజేఎస్) కసరత్తు చేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల సబ్ కమిటీ సభ్యుడు కుంట్ల ధర్మార్జున్, నాయకులు గోపగాని శంకర్, రమేష్ తెలిపారు. మంగళవారం సూర్యాపేట పట్టణంలో టీజేఎస్ నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, కొత్తగూడెం జిల్లా కమిటీల అధ్యక్ష, కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. సమావేశంలో రమాశంకర్, బొడ్డు శంకర్, సర్దార్ హుస్సేన్, రవి, దేవదానం, కరుణాకర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, నాగేశ్వరరావు, గిరిబాబు, సందీప్, పాపయ్య, వినయ్ గౌడ్, కృష్ణారెడ్డి, సుమాన్నాయక్, సైదానాయక్ పాల్గొన్నారు. హౌస్ వైరింగ్లో ఉచిత శిక్షణనల్లగొండ : ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణ నిరుద్యోగులకు హౌజ్ వైరింగ్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నల్లగొండలోని ఎస్బీఐ ఆర్సెటీ డైరెక్టర్ ఇ.రఘుపతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాకు చెందిన నిరుద్యోగులు ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. 31 రోజుల ఉండే శిక్షణకు ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు ఉంటాయని తెలిపారు. 19 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు కలిగి 10వ తరగతి ఉత్తీర్ణులైన నిరుద్యోగ గ్రామీణ యువకులు అర్హులని తెలిపారు. -
మూడంచెల్లో ప్రగతి పరిశీలన
కనీస సామర్థ్యాలు సాధించేలా.. ఎస్సీఈఆర్టీ ఆదేశానుసారం జిల్లాలో పకడ్బందీగా బేస్ లైన్ పరీక్ష నిర్వహిస్తాం. విద్యార్థుల ప్రగతికి ఈ పరీక్షలు కొలమానంగా నిలుస్తాయి. బేస్లైన్ పరీక్షల ఆధారంగా కనీస సామర్థ్యాలు లేని విద్యార్థులను గుర్తిస్తాం. వీరు 45 రోజుల ప్రత్యేక కార్యాచరణ ద్వారా కనీస సామర్థ్యాలు సాధించేలా చూస్తాం. జిల్లాలో ఆగస్టు31 నాటికి విద్యార్థులందరికీ వంద శాతం కనీస సామర్థ్యాలు సాధించేలా చర్యలు చేపట్టాం. – దేవరశెట్టి జనార్దన్, జిల్లా కోఆర్టినేటర్ ఫర్ క్వాలిటీ ఎడ్యుకేషన్తిరుమలగిరి(నాగారం) : తరగతిలో చేరినప్పటి నుంచి విద్యా సంవత్సరం ముగిసే వరకు 1 నుంచి 9 తరగతుల విద్యార్థుల ప్రగతిని పరిశీలించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందుకుగాను అభ్యసన సామర్థ్యాలపై మూడంచెల్లో (ఎఫ్ఎల్ఎన్, ఎల్ఐపీ, బేస్లైన్) పరీక్షలు నిర్వహించనుంది. ప్రధానమైన బేస్లైన్ పరీక్షను బుధవారం నుంచి ఈనెల 30వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) నుంచి మార్గదర్శకాలు జారీ అయ్యాయి. సంబంధిత ప్రశ్నాపత్రాలను తరగతుల వారీగా జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి అందజేశారు. ఆయా పరీక్షల మూల్యాంకన వివరాలను జూలై 15 నాటికి తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో అప్లోడ్ చేయనున్నారు. సామర్థ్యాన్ని అనుసరించి ప్రణాళిక విద్యా సంవత్సరం ఆరంభంలో బేస్లైన్ పరీక్షను తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్ సబ్జెక్టుల్లోని అంశాలపై నిర్వహిస్తారు. ఆయా సబ్జెక్టుల్లో విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షిస్తారు. ఫలితాల ఆధారంగా వారిని ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజిస్తారు. వెనుకబడిన వారికి ప్రత్యేక ప్రణాళిక ప్రకారం బోధన చేపడతారు. కరోనా తర్వాత విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు తొలిమెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు ప్రత్యేక బోధనా ప్రణాళికలుంటాయి. 6 నుంచి 9 తరగతుల వారికి లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం (లిప్) కార్యక్రమాన్ని చేపడతారు. నవంబర్ 25 నుంచి 30వరకు రెండో (మిడ్ లైన్), విద్యా సంవత్సరం ముగింపున మార్చి5 నుంచి 7వరకు చివరి (ఎండ్లైన్ ) పరీక్షలుంటాయి. ఫలితాల ఆధారంగా విద్యార్థుల అభ్యసనను మెరుగుపరిచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తారు. ఇదే సమయంలో విద్యార్థుల ప్రగతి తీరుపై తల్లిదండ్రులతోనూ సమావేశాలు నిర్వహిస్తారు. ఫ నేటి నుంచి 30వ తేదీ వరకు విద్యార్థులకు అభ్యసన సామర్థ్య పరీక్షలు ఫ ఎస్సీఈఆర్టీ మార్గదర్శకాలు జారీ ఫ మూల్యాంకన వివరాలు స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో అప్లోడ్ -
మార్పు కోసమే జరిమానాలు
ఫ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని జాగ్రత్తగా ఉండాలి ఫ ఆటో డ్రైవర్ల అవగాహన సదస్సులో ఎస్పీ నరసింహ సూర్యాపేటటౌన్ : వాహనాలకు జరిమానాలు విధించడం అనేది మార్పుకోసమేనని, తప్పుల నుంచి మంచి పాఠాలు నేర్చుకొని జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎస్పీ కె.నరసింహ పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ, డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించారు. డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాల జోలికి వెళ్లమని ఆటోడ్రైవర్లతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. ఆటో డ్రైవర్లు వాహనాలు కండిషన్లో ఉంచుకోవాలని, వాహనాలు నడిపేటప్పుడు సౌండ్ బాక్స్లు వినియోగించొద్దన్నారు. ప్రతి ఒక్కరూ లైసెన్సు, వాహన రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలని, ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దని, నిబంధనల ప్రకారం డ్రైవర్ దుస్తులు ధరించి వాహనాలు నడపాలన్నారు. వ్యక్తిగత క్రమశిక్షణ, వ్యక్తిగత ఆత్మాభిమానం ఉన్నప్పుడే ఇతరుల పట్ల మర్యాదగా ఉండగలమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర పోలీస్ యాంటి నార్కోటిక్ బ్యూరో ఆదేశాల మేరకు జిల్లాలో డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాల నివారణకు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం యాంటీ డ్రగ్స్ సోల్జర్ ఫ్లెక్సీ తో ఆటో డ్రైవర్లతో కలిసి ఎస్పీ, ఆర్టీఓ సెల్ఫీ ఫొటోలు దిగి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి సురేష్రెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం, సిబ్బంది, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. సదస్సుకు హాజరైన ఆటో డ్రైవర్లు -
ఇసుక ఉచితమే..
ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం ఎక్కడ ఉంటే అక్కడి నుంచి.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తమకు సమీపంలో వాగులు, వంకలు, చెరువులు, చెక్ డ్యాంలు ఇలా ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడి నుంచి ఇసుక పొందడానికి అవకాశం కల్పించారు. అంతకు ముందు కలెక్టర్ ఇసుక లభ్యత ప్రాంతాలపై సర్వే చేయించి వాటిని గుర్తించారు. లబ్ధిదారులకు అనుకూలమైన ప్రాంతం నుంచి ఇసుకను తీసుకెళ్లడానికి ప్రస్తుతం అవకాశం కల్పిస్తున్నారు. స్థానిక వాగుల్లో ఇసుక లేనట్లయితే క్వారీల నుంచి కూడా తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుంది. స్థానిక మండలంలో ఇసుక లేకపోతే పక్క మండలం నుంచి తీసుకోవచ్చు. సూర్యాపేట : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా లబ్ధిదారులపై ఆర్థికభారం పడకుండా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో జిల్లాలో 4,322 మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలగనుంది. ఇసుక రవాణా చార్జీలు మాత్రం లబ్ధిదారులే భరించాల్సి ఉంటుంది. జిల్లాలో 4,322 ఇళ్లు మంజూరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా పేదల సొంటికలను నెరవేర్చడానికి పూనుకుంది. ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి చర్యలు చేపట్టింది. ఈనేపథ్యంలో గృహ నిర్మాణశాఖను బలోపేతం చేసింది. జిల్లా వ్యాప్తంగా 4,322 ఇళ్లు మంజూరు చేసింది. అందులో మొదటి విడతలో 1,210 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి లబ్ధిదారులకు ఇసుకను ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో ఇంటికి 6 నుంచి 10 కూపన్లు.. ఒక్కో ఇంటి నిర్మాణానికి కనీసం 6 నుంచి 10 ట్రాక్టర్ల ఇసుక అవసరమవుతుందని గృహ నిర్మాణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం ఇసుకను అధికారుల అనుమతి ద్వారా తెచ్చుకోవాలి. తొలుత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుక అవసరమైతే పంచాయతీ కార్యదర్శులు ధ్రువీకరిస్తారు. పని జరిగింది లేనిది క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తర్వాత అనుమతి ఇస్తారు. వీరిచ్చేధ్రువీకరణ పత్రాలతో తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తే తహసీల్దార్ అనుమతి కూపన్లు అందజేస్తారు. ఈ కూపన్ల ఆధారంగా లబ్ధిదారు తమకు అనుకూలంగా ఉన్న చోట నుంచి ఇసుకను తెచ్చుకోవచ్చు. మొదట ఆరు కూపన్లు జారీ చేస్తారు. తర్వాత అవసరాన్ని బట్టి ఇసుక ఇస్తారు. మార్కెట్లో ఇసుక ధరను బట్టి చూస్తే రూ.25వేల నుంచి 30 వేల వరకు ఆదా అవుతాయి. లబ్ధిదారులకు తప్పనున్న ఆర్థికభారం ఫ రూ.30వేల నుంచి రూ.40 వేల వరకు ఆదా ఫ రవాణా ఖర్చులు మాత్రం భరించాల్సిందే.. ఫ తొలివిడతలో నిర్మాణ దశలో 1,210 ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులకు ప్రయోజనకరం లబ్ధిదారులకు ఇసుకను ఉచితంగా అందజేస్తాం. క్షేత్రస్థాయిలో పంచాయతీ కార్యదర్శి పరిశీలించి ధ్రువీకరణ పత్రం అందజేస్తే దాన్ని తహసీల్దార్ పరిశీలించి లబ్ధిదారులకు అనుకూలంగా ఉన్న వాగులు, వంకల నుంచి లేకపోతే ఇతర మండలాల్లో గుర్తించిన ప్రదేశాల నుంచి ఇసుకను తీసుకెళ్లడానికి అనుమతి ఇస్తూ కూపన్లను జారీ చేస్తారు. ఇది లబ్ధిదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. – ధర్మారెడ్డి, హౌసింగ్ పీడీ ఇందిరమ్మ ఇళ్ల వివరాలు మొత్తం మంజూరైన ఇళ్లు 4,322 తొలివిడత పనులు ప్రారంభమైనవి 1,210వీటిలో బేస్మెంట్ లెవల్ 796వాల్ లెవల్ 276 స్లాబ్ లెవల్ 106 -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉన్నాం
ఫ ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఫ ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలు ఏర్పాటు చేశాం ఫ హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా 10బెడ్ల చొప్పున కేటాయించాం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్ వివిధ శాఖల అధికారుల సహకారంతో.. జిల్లాలో వివిధ శాఖల అధికారుల సహకారంతో సీజనల్ వ్యాధులు ప్రబల కుండా చర్యలు తీసుకుంటున్నాం. మే 30న కలెక్టర్ తేజస్నంద్లాల్ పవార్ జిల్లా పంచాయతీరాజ్, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా విద్యాశాఖ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. మురుగు గుంతల్లో మట్టి పోయించడం, డ్రెయినేజీలను శుభ్రం చేయించడం వంటివి వెంటనే చేపట్టాలని పంచాయతీ రాజ్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే మంచినీటి సరఫరా విషయంలో అప్రమత్తంగా ఉండాలని, మంచినీళ్లు కలుషితం కాకుండా చూడాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశాలిచ్చారు. పాఠశాలల్లో విద్యార్థులకు సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా విద్యాధికారికి సూచనలు చేశారు. ఆయా శాఖల అధికారుల సమన్వయంతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా, మండల స్థాయిలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలు జిల్లా, మండల స్థాయిలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేశాం. ఈ టీమ్లలో ఫిజీషియన్, పీడియాట్రిక్ డాక్టర్లతో పాటు మరో ఇద్దరు వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ఇతర సిబ్బంది ఉంటారు. జిల్లాలో ఎక్కడైనా విషజ్వరాలు, ఇతర సీజనల్ వ్యాధులు ప్రబలినట్లు సమాచారం వస్తే వెంటనే ఆ టీమ్లు అక్కడికి చేరుకొని వైద్య సేవలను అందిస్తాయి. అక్కడ వ్యాధులు ఎలా ప్రబలాయి అనే విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తాయి. వెంటనే టెస్టింగ్లు చేసి వారికి మందులు అందజేస్తాయి. అందుబాటులో టెస్టింగ్ కిట్లు జిల్లాలో సీజనల్ వ్యాధుల్లో భాగంగా డెంగీ, మలేరియా, ఇతర వైరల్ ఫీవర్ను తెలుసుకునేందుకు టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉన్నాయి. డెంగీకి 28,701 ర్యాపిడ్ టెస్ట్ కిట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే మలేరియాకు సంబంధించి ర్యాపిడ్ టెస్ట్ కిట్లు 38,717 ఉన్నాయి. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అన్ని పీహెచ్సీలు, పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాల్లో అత్యవసరమైన మందులు సైతం అందుబాటులో ఉన్నాయి. 58,600 ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉన్నాయి. దోమల నివారణకు మురుగు కాల్వల్లో పైరాత్రమ్ లిక్విడ్, ఆబేగ్ ట్యాబ్లెట్లను వేయాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చాం. ప్రత్యేకంగా బెడ్లు రిజర్వ్లో ఉంచాం సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో జిల్లాలోని హుజూర్నగర్ ఏరియా ఆస్పత్రిలో 10 బెడ్లు, కోదాడ ఏరియా ఆస్పత్రిలో పది బెడ్లు, సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 10బెడ్ల చొప్పున అందుబాటులో ఉంచాం. అత్యవసర సమయంలో వాటిని వినియోగిస్తాం. రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన వైద్య సేవలందిస్తాం. ప్రతి శుక్రవారం డ్రైడే ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించాలని, దోమలకు ఆవాసాలైన నీటి గుంతలు, తొట్లు, కుండలు, చెడిపోయిన కూలర్లు, ఖాళీ కొబ్బరి బోండాలు, పాత టైర్లలో నిలిచిన నీటిని పారబోయించేలా అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి ఇంటికి వెళ్లి ఎవరైనా జ్వరం, ఇతర వ్యాధులతో బాధపడుతున్నారా అనే వివరాలను తెలుసుకొని వారికి అవసరమైన మందులు అందిస్తున్నాం. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి వర్షాకాలం ప్రారంభం కావడంతో ప్రజలు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలి. ఆహార పదార్థాలపై ఈగలు, దోమలు వాలకుండా మూతలు పెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తాగునీరు కలుషితం కాకుండా చూసుకోవాలి. కాచి చల్లార్చిన నీటిని వడబోసుకొని తాగాలి. వేడి వేడి పదార్థాలు తినాలి. అనారోగ్యానికి గురైతే వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్యా కేంద్రాలకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. -
కార్యకర్తలకు అండగా ఉంటా
తుంగతుర్తి : కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు అండగా ఉంటానని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. మంగళవారం తుంగతుర్తిలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డిని అద్దంకి దయాకర్ కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించేందుకు కృషి చేస్తాన్నారు. తనకు రాజకీయ ఓనమాలు నేర్పిన ప్రాంతం తుంగతుర్తి అని, ఈ ప్రాంతాన్ని ఎప్పటికీ మర్చిపోనని స్పష్టం చేశారు. ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందిస్తానన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కరడుగట్టిన కాంగ్రెస్ వాది మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అని పేర్కొన్నారు. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన తనకు మాజీ మంత్రి దామోదర్ రెడ్డి తండ్రిలా అండగా నిలిచారని గుర్తు చేశారు. మాజీ మంత్రి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ అద్దంకి దయాకర్ తన కొడుకు లాంటివాడని, కాంగ్రెస్ పార్టీకి దయాకర్ సేవలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. మున్ముందు మంత్రి పదవితో పాటు ఉన్నతమైన పదవులను దయాకర్ అధిరోహించాలని ఆకాంక్షించారు. త్వరలో దయాకర్కు పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. అనంతరం దామోదర్ రెడ్డిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. వారి వెంట ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, నాయకులు గుడిపాటి నర్సయ్య, దొంగరి గోవర్దన్, కొండ రాజు, పెండెం రామ్మూర్తి, రామడుగు నవీన్ చారి, అనిల్ క్యాస్ట్రో, టైగర్ వెంకన్న, ప్రభు తదితరులు ఉన్నారు.ఫ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ -
రెగ్యులర్ ప్రాతిపదికన ఉంటే ఇంకా బాగుంటుంది
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పీఆర్టీయూ ఎప్పుడూ సమర్థిస్తుంది. పాఠశాలల్లో పర్యవేక్షణ ఉండడం ఆహ్వానించదగ్గ పరిణామమే. దీని ద్వారా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ పర్యవేక్షణ రెగ్యులర్ అధికారుల పోస్టులను భర్తీ చేయడం ద్వారా చేస్తే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి. విద్యా ప్రమాణాలు కూడా పెరగడానికి దోహద పడుతుంది. సర్వీసు రూల్స్ రూపకల్పన చేసి రెగ్యులర్ డీఈఓ, డిప్యూటీ డీఈఓ, మండల విద్యాధికారుల పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – తంగెళ్ల జితేందర్రెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు● -
ఏఓ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా
మఠంపల్లి: మఠంపల్లిలోని మండల వ్యవసాయ కార్యాలయం సోమవారం మధ్యాహ్నం 12గంటల వరకు తెరుచుకోలేదు. దీంతో వివిధ పనుల నిమిత్తం వచ్చిన రైతులు ఆందోళనకు దిగారు. రైతు భరోసా, పట్టాదారు పాస్బుక్ వివరాల నమోదు, ఎరువులు, విత్తనాల స్లిప్పుల కోసం వ్యవసాయ కార్యాలయానికి వస్తే అధికారులు అందుబాటులో ఉండడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోందని గ్రహించిన ఏఈఓలు శ్రావ్యాంజలి,త్రివేణిలు అక్కడికి చేరుకుని ఆటోలో వస్తుండగా తమ వద్ద ఉన్న తాళంచెవిపోయిందని తెలిపారు. దీంతో తాము ఉదయం నుంచి కార్యాలయం బయటనే ఉన్నామని చెప్పారు. మధ్యాహ్నం వరకు కూడా కార్యాలయం తెరవడానికి ఎందుకు ప్రయత్నించలేదని రైతులు ఆగ్రహించారు. దీంతో ఏఈఓలు.. రైతుల సహకారంతో కార్యాలయం తాళాన్ని దగ్గరుండి పగులగొట్టించారు. అనంతరం కార్యాయంలో విధులు నిర్వహించారు. ఇంతజరిగినా కార్యాలయం వైపునకు వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రాలేదు. కానీ రైతులు తమకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు, పీఏసీఎస్ కార్యాలయంలో సిద్ధంగా ఉన్నాయని, రైతులు సబ్సిడీపై కొనుగోలుచేసుకోవాలన్న సమాచారాన్ని వాట్సప్ గ్రూపుల్లో పోస్ట్ చేశారు. వ్యవసాయ సీజన్లో అందుబాటులో ఉండాల్సిన అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఉన్నతాధికారులు విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. మధ్యాహ్నం 12 గంటల వరకు తెరుచుకోని మఠంపల్లి మండల వ్యవసాయ అధికారి కార్యాలయం అధికారుల తీరుపై కర్షకుల ఆగ్రహం ఆటోలో తాళంచెవి పోవడంతో తెరువలేకపోయామన్న ఏఈఓలు రైతుల సహకారంతో కార్యాలయ తాళం పగులగొట్టి విధులకు.. -
మట్టపల్లిలో నిత్యకల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఆలయంలో సుప్రభాత సేవ, నిత్యహోమం, పంచామృతాభిషేకం, ఎదుర్కోళ్లమహోత్సవ సంవాదం చేపట్టారు. కల్యాణవేడుకలో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గరుడవాహనంపై శ్రీస్వామివారిని ఆలయ తిరుమాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం మహానివేదన చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కాగా క్షేత్రంలోని శివాలయంలోగల శ్రీపార్వతీరామలింగేశ్వరస్వామికి ఏకా దశ రుద్రాభిషేకం నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్ కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్కుమార్, అర్చకులు శ్రీనివాసాచార్యులు, పద్మనాభా చార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, దుర్గాప్రసాద్శర్మ పాల్గొన్నారు.ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా సుధాకర్సూర్యాపేట : ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా బత్తుల సుధాకర్ ఎన్నికయ్యారు. ఈనెల 21, 22 తేదీలో ఖమ్మం పట్టణంలో నిర్వహించిన స్టాఫ్వర్కర్స్ ఫెడరేషన్ 4వ రాష్ట్ర మహాసభలో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని విమర్శించారు. కార్మిక వర్గం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.దేశ సమగ్రతకు కృషి చేసిన విద్యావేత్త శ్యామ్ప్రసాద్తాళ్లగడ్డ(సూర్యాపేట): దేశ సమగ్రత కోసం కృషి చేసిన విద్యావేత్త డాక్టర్ శ్యామ్ప్రసాద్ ముఖర్జీ అని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి కొనియాడారు. సోమవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో శ్యామ్ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బూర శకుంతల ఆధ్వర్యంలో స్థానిక రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మొక్కల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ చాన్స్లర్గా నియమితులై విద్యారంగంలో నూతనోత్సాహాన్ని తీసుకువచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కన్వీనర్ బూర మల్సూర్గౌడ్, జల్లా జనార్దన్, బీజేపీ నాయకులు కడియం రామచంద్రయ్య, జుట్టుకొండ సత్యనారాయణ, చల్లమల నరసింహ, రుక్మారావు, మన్మథరెడ్డి, గజ్జల వెంకటరెడ్డి, మహేష్, లింగారెడ్డి, కాశయ్య, ఫణినాయుడు, రవి, తాళ్ల నరేందర్రెడ్డి, శోభారెడ్డి, మౌనిక, దాసరి వెంకన్న, బైరు విజయ్కృష్ణ, వర్మ, గణేష్ పాల్గొన్నారు. -
బాధితులకు భరోసా కల్పించాలి
సూర్యాపేటటౌన్ : పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితులకు భరోసా కల్పించాలని జిల్లా ఎస్పీ కె.నరసింహ సూచించారు. సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ స్టేషన్ రిసెప్షన్ సెంటర్, ఫిర్యాదుల నిర్వహణ సిబ్బందికి, పోలీస్ స్టేషన్ సెక్షన్ ఇన్చార్జిలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడారు. సమాజంలో పోలీస్ యూనిఫాంకు ప్రత్యేకత ఉందని, సిబ్బంది క్రమశిక్షణతో ఉండి ప్రజలు, పోలీసు స్టేషన్కు వచ్చే బాధితులు, ఫిర్యాదుదారులను గౌరవిస్తూ గర్వంగా పని చేయాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పారదర్శకంగా పని చేస్తే సమాజంలో పోలీస్ శాఖపై నమ్మకం పెరుగుతుందన్నారు. ఆ దిశగా సిబ్బంది టీం వర్క్ చేయాలన్నారు. పోలీస్ విధుల్లో అత్యంత ప్రధానమైంది పోలీస్ స్టేషన్ రిసెప్షన్ విధులు, ఫిర్యాదుల నిర్వహణ అని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే వారికి ఇబ్బంది కలగకుండా విధిధర్మంతో వారికి కావాల్సిన సహాయాన్ని అందించాలని, వారితో మర్యాదగా మెలగాలని సూచించారు. ప్రతి ఫిర్యాదును పిటిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్లో నమోదు చేసి రశీదు ఇవ్వాలని ఆదేశించారు. ప్రజలు పోలీస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ రవీందర్రెడ్డి, డీసీఆర్బీ హరిబాబు, ఐటీకోర్ ఆర్ఎస్ఐ రాజశేఖర్, రిసెప్షన్ పని విభాగం కో ఆర్డినేటర్ మహిశ్వర్, టెక్నికల్ టీం, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ నరసింహ -
ఇరాన్పై యుద్ధాన్ని ఆపాలి
సూర్యాపేట అర్బన్ : ఇరాన్పై అమెరికన్ సామ్రాజ్యవాదులు చేస్తున్న యుద్ధ దాడిని ఆపాలని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ డిమాండ్ చేశారు. ఇరాన్పై అమెరిక, ఇజ్రాయిల్ దాడులకు వ్యతిరేకంగా సోమవారం జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్లజెండాలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా నాయకుడు కారింగుల వెంకన్న, పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్ర అఖిల్ కుమార్, నాయకులు పేర్ల నాగయ్య, సూరం రేణుక, ఎస్కె.సయ్యద్, ఐతరాజు వెంకన్న, శేషగిరి, ఐతరాజు పద్మ, కల్పన, పజ్జూరి రేణుక, అరుణ, పీవైఎల్ నాయకులు కట్ట రమేష్ పాల్గొన్నారు. -
బడుల పర్యవేక్షణకు టీచర్లు
సూర్యాపేటటౌన్ : రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యా వ్యవస్థను మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు పలు మార్పులు తీసుకొస్తోంది. విద్యావ్యవస్థను గాడిలో పెట్టి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు ఉన్న వ్యవస్థకు అదనంగా ఉపాధ్యాయులతోనే పాఠశాలలు తనిఖీలు చేయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాథమిక పాఠశాలలను ఎస్జీటీలతో, యూపీఎస్, ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లతో తనిఖీలు చేయనున్నారు. దీనిపై ఉపాధ్యాయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధ్యాయుల సంఖ్యలో 2శాతం మందిని నియమించే యోచనజిల్లాలో 182 జెడ్పీ ఉన్నత పాఠశాలలు, 78ప్రాథమికోన్నత , 690ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 3,790 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. అయితే జిల్లాలో పని చేస్తున్న మొత్తం ఉపాధ్యాయుల్లో రెండు శాతం మందిని తనిఖీ అధికారులుగా నియమించాలనే నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ఉపాధ్యాయులను తనిఖీ అధికారులుగా నియమించడం సరికాదంటున్నారు. ఏడాదిపాటు టీచర్లను బోధనకు దూరం చేసి తనిఖీ అధికారులుగా నియమిస్తే విద్యార్థులకు నష్టం కలుగుతుందని అభిప్రాయపడుతున్నారు.రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ ఫ విద్యావ్యవస్థలో పెను మార్పులు తీసుకురావాలని సర్కారు యోచన ఫ ఈ ప్రకటనతో ఉపాధ్యాయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు -
ప్రజల గుండెల్లో నిలిచిన మహానేత వైఎస్సార్
కోదాడరూరల్ : అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజల గుండెల్లో నిలిచిన మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి అని ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి కొనియాడారు. సోమవారం కోదాడ పట్టణ పరిధిలోని గుడిబండ రోడ్డులో గల గోపిరెడ్డినగర్ వద్ద రైతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్, రాజీవ్ఆరోగ్య శ్రీ, ఫీజురీయింబర్స్మెంట్, 108, వికలాంగులు, వృద్ధులకు పింఛన్ల వంటి అనేక సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. ఆ పథకాలతోనే కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో రెండో సారి అధికారంలోకి తీసుకొచ్చిన గొప్ప నాయకుడని అన్నారు. ఆయన ఆశయాలను కాంగ్రెస్ పార్టీ సాధిస్తుందని తెలిపారు. విగ్రహం ఏర్పాటు చేసినవారిని ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, మాజీ కౌన్సిలర్లు కందుల కోటేశ్వరరావు, కొల్లా లక్ష్మీప్రసన్న కొటిరెడ్డి, వాచేపల్లి వెంకటేశ్వరరెడ్డి, అంచూరి వెంకట్రెడ్డి, పిన్నపురెడ్డి వీరారెడ్డి, కొనగళ్ల నారాయణరెడ్డి, రెడ్డిమళ్ల వెంకట్రెడ్డి, గాయం బ్రహ్మారెడ్డి ఉన్నారు. ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి -
రైతు భరోసా
రైతులతో మాట్లాడనున్న సీఎం హైదరాబాద్లో మంగళవారం సాయంత్రం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వీడియో కాన్పరెన్స్ ద్వారా రైతులతో మాట్లాడనున్నారు. రైతు వేదికల్లో మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించే వీడియో కాన్పరెన్స్లో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. జిల్లాలోని 93 రైతు వేదికల ద్వారా రైతులు ప్రత్యక్షంగా వీక్షించే ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. జిల్లాలోని 93 రైతు వేదికల పరిధిలోని రైతులు ఈ కార్యక్రమానికి హాజరుకావాలని పేర్కొన్నారు. ప్రతి రైతు వేదికకు ఒక నోడల్ అధికారిని నియమించినట్లు కలెక్టర్ తెలిపారు. -
విద్యాభివృద్ధికి తిరోగమన చర్య
పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతను ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లకు అప్పగించడం సరైంది కాదు. విద్యారంగాన్ని సంక్షోభంలోకి నెట్టి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులను ప్రైవేట్ వైపు మళ్లించడానికి చేస్తున్న చర్యగానే చూడాలి. ఎందుకంటే పాఠశాలల్లో పని చేస్తున్న ఎస్జీటీలను, స్కూల్ అసిస్టెంట్లను పర్యవేక్షణ అధికారులుగా నియమించి అక్కడ విద్యాబోధన చేయడానికి టీచర్లు లేకుండా చేయడమే. దాంతో పిల్లలు ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతారు. అంతేగాక ఒకే స్థాయి ఉన్న టీచర్ల మీదనే కాకుండా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల మీద పర్యవేక్షణ చేయడం ద్వారా విద్యా వ్యవస్థ మరింత దిగజారడానికి కారణమవుతుంది. అనాలోచిత చర్యలను విరమించుకొని పర్యవేక్షణ అధికారులైన ఎంఈఓలను, డిప్యూటీ డీఈఓలను, రెగ్యులర్ డీఈఓలను నియమించాలి. – పబ్బతి వెంకటేశ్వర్లు, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు -
ఉపాధ్యాయులకు తనిఖీల బాధ్యతలు అప్పగించొద్దు
సూర్యాపేటటౌన్ : రాష్ట్రంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల పనితీరును పర్యవేక్షించడానికి ఎస్జీటీ, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను పర్యవేక్షణ అధికారులుగా నియమించి బాధ్యతలు అప్పగించడం సరికాదని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పబ్బతి వెంకటేశ్వర్లు, వేణు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని నంబర్– 2 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఓ వైపు ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో విద్యా ప్రమాణాలకు చర్యలు తీసుకుంటామని చెబుతూనే ఇలాంటి చర్యలకు తీసుకోవడం అనాలోచితమైన చర్యగా పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు సీహెచ్ వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షుడు జి.వెంకటేశ్వర్లు, రమణ, సింహాద్రి, క్రాంతి కుమార్, వెంకటయ్య, యాదగిరి, లింగయ్య, ప్రభాకర్, దేవేందర్, నాగన్న పాల్గొన్నారు. -
పక్కాగా ఎకో క్లబ్లు
విద్యార్థి దశ నుంచే పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ నిర్ణయం సూర్యాపేటటౌన్ : పచ్చదనం పెంచుతూ పర్యావరణాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా మొక్కల ప్రాధాన్యంతోపాటు వివిధ అంశాలపై విద్యార్థి స్థాయి నుంచే అవగాహన కల్పించేందుకు కేంద్ర విద్యా శాఖ చర్యలు చేపట్టింది. పర్యావరణ సంబంధిత కార్యకలాపాల నిర్వహణలో విద్యార్థులను భాగస్వాములను చేసేందుకు ప్రభుత్వం ఎకో క్లబ్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ క్లబ్లను ఈ విద్యాసంవత్సరం నుంచి ‘ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్’గా పిలవనున్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలల్లోనూ కొత్త క్లబ్ల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది ఇవి ఆశించిన స్థాయిలో పనిచేయకపోవడంతో ఈ సంవత్సరం పకడ్బందీగా నిర్వహించేలా జిల్లా అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. వచ్చే నెలాఖరులోగా.. వచ్చేనెల 29 వరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఎకో క్లబ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 16 నుంచి ఈ ప్రకియ మొదలుపెట్టారు. ప్రతి తరగతి నుంచి చురుగ్గా ఉన్న నలుగురు లేదా ఐదుగురు విద్యార్థులను ఎంపిక చేసి టీచర్లను, పాఠశాల కమిటీ చైర్మన్ను క్లబ్లో భాగస్వాములు చేయనున్నారు. పాఠశాల యాజమాన్య కమిటీలు, ఉపాధ్యాయులు ఇందులో సభ్యులుగా ఉండాలి. ప్రధానోపాధ్యాయుడు పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఏడు అంశాలకు సంబంధించిన యాక్టివిటీ ఫొటోలు, వీడియోలు తీసి ప్రత్యేక వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ప్రతి స్కూల్ నుంచి ఒక కమిటీ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 950, మోడల్ స్కూల్స్ తొమ్మిది, కేజీబీవీలు 19, నాలుగు మినీ గురుకులాలు, ఎనిమిది రెసిడెన్షియల్స్ స్కూల్స్, 398 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో లక్ష మందికిపైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇందులో ప్రతి పాఠశాల నుంచి ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచ ప్రజా ఉద్యమంగా చేపట్టిన ఏడు అంశాల్లో ఎకో క్లబ్లను భాగస్వామ్యం చేస్తారు. ఏడు అంశాలు ఇవే.. ఇంధన పొదుపు నీటి పొదుపు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడొద్దు సుస్థిర ఆహార వ్యవస్థ వృథాను అరికట్టడం ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవడం వ్యర్థాల రీసైక్లింగ్ ఫ గతేడాది ఆశించిన స్థాయిలో పనిచేయకపోవడంతో ఈసారి పక్కాగా చేపట్టేందుకు కార్యాచరణఫ జూలై 29లోపు కమిటీలు వేయాలని ఆదేశం ఫ ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్ పేరుతో ఏడు అంశాలపై ప్రచారం ఫ ప్రతి పాఠశాల నుంచి ఒక కమిటీ ఏర్పాటు అన్ని స్కూళ్లలో ఎకో క్లబ్లు ఏర్పాటు చేయాలి పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఎకో క్లబ్లు ఎంతో ఉపయోగపడతాయి. అన్ని స్కూళ్లలో క్లబ్లు ఏర్పాటు చేయాలని ఇప్పటికే హెచ్ఎంలకు ఆదేశాలు జారీ చేశాం. కేటాయించిన అంశాల వారీగా ఏడాదిపాటు కార్యక్రమాలు నిర్వహించాలి. రోజూ నిర్వహించే కార్యక్రమాల ఫొటోలు, వీడియోలను ప్రత్యేక పోర్టల్లో అప్లోడ్ చేయాలి. – దేవరశెట్టి జనార్దన్, జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ పాఠశాలల వివరాలు ప్రభుత్వ పాఠశాలలు 950 మోడల్ స్కూల్స్ 9 కేజీబీవీలు 19 మినీ గురుకులాలు 4 రెసిడెన్షియల్స్ స్కూల్స్ 8 ప్రైవేట్ పాఠశాలలు 398 విద్యార్థుల సంఖ్య : లక్ష మందికిపైగా -
ముఖం చూపిస్తేనే సరుకులు
నాగారం : అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే లబ్ధిదారులకు పారదర్శకంగా సరుకులు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం (ఎఫ్ఆర్ఎస్ ) తీసుకొచ్చింది. సరుకులు పక్కదారి పట్టకుండా ముఖ గుర్తింపుతోనే అందజేస్తారు. గతంలో అంగన్వాడీ లబ్ధిదారులకు అందించే సరుకుల విషయంలో జాబితాలో పేర్లు ఒకరివి ఉంటే.. మరొకరికి సరుకులు ఇస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ పద్ధతికి స్వస్తి పలికేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ నుంచి ఆదేశాలు రావడంతో జిల్లాలో ఈ విధానం అమలుకు ఐసీడీఎస్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. జూలై–1 నుంచి అంగన్వాడీ టీచర్లకు గతంలో అందజేసిన ఫోన్లలో పోషణ్ ట్రాకర్ యాప్ ద్వారా ఈ ముఖ గుర్తింపు విధానాన్ని అమలు చేయనున్నారు. దీనికి అనుగుణంగా యాప్ను అప్డేట్ చేశారు. మూడేళ్లలోపు చిన్నారులకు.. ప్రస్తుతం ముఖ గుర్తింపు విధానం 6 నెలల వయసు నుంచి 3ఏళ్ల లోపు చిన్నారులకు పంపిణీ చేసే అదనపు ఆహారమైన బాలామృతం, గుడ్లు పంపిణీకి మాత్రమే వర్తిస్తుంది. పోషణ్ ట్రాకర్ యాప్లో చిన్నారి లేదా తల్లి ఫొటో తీస్తారు. ఆధార్ కార్డులో ఉన్న వివరాలను పొందుపరుస్తారు. అలాగే 3ఏళ్లు దాటిన చిన్నారులకు ఇంటికి ఇచ్చే పోషకాహారాన్ని తల్లి ఫొటోను యాప్లో నమోదు చేసి పంపిణీ చేస్తారు. దీంతో పోషకాహారం పంపిణీ ఏమేర జరుగుతోందో అనే దానిపై జిల్లా, రాష్ట్రస్థాయి అధికారుల పర్యవేక్షణ సులువు కానుంది. కాగా జిల్లాలో ఇప్పటికే ప్రయోగాత్మకంగా పోషణ్ ట్రాకర్ ద్వారా యాప్లో నమోదు చేస్తున్నారు. కాగా జూలై 1 నుంచి అధికారికంగా అమల్లోకి రానుంది. ప్రస్తుతానికి నమోదు ఒక్కటే అయినప్పటికీ రానురాను ముఖగుర్తింపును విస్తరింపజేయనున్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందించే ఆహారానికి కూడా ముఖ గుర్తింపు తప్పనిసరి చేయనున్నారు. ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో.. జిల్లాలోని 5 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,209 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలు కలిపి54,683 మంది నమోదై ఉన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నారు. సరుకులు అసలైన లబ్ధిదారులకు అందించాలనే లక్ష్యంతో అంగన్వాడీ కేంద్రాల్లో ముఖ గుర్తింపు హాజరును ప్రవేశపెట్టారు. ఫ అంగన్వాడీల్లో ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం ఫ జూలై 1 నుంచి అమలుకు సన్నాహాలు ఫ సరుకులు పక్కదారి పట్టకుండా కొత్త విధానం పారదర్శకత కోసమే.. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎఫ్ఆర్ఎస్తో లబ్ధిదారులకు పారదర్శంగా సరుకులు అందుతాయి. ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం ద్వారా 6నెలల నుంచి 3ఏళ్లలోపు చిన్నారులకు అందిస్తున్న టేక్ హోమ్ రేషన్ను నిర్ధారణ పూర్వకంగా లబ్ధిదారులకు అందుతుంది. వచ్చే నెల నుంచి లబ్ధిదారులకు అందజేసే సరుకులను ఎఫ్ఆర్ఎస్లో నమోదు చేస్తారు. – నర్సింహారావు, జిల్లా సంక్షేమ అధికారి, సూర్యాపేట. జిల్లాలో ఇలా... ఐసీడీఎస్ ప్రాజెక్టులు 05అంగన్వాడీ కేంద్రాలు 1,209చిన్నారుల సంఖ్య 45,177గర్భిణులు 5,220బాలింతలు 4,286 -
తాగి నడిపితే జైలుకే!
సూర్యాపేటటౌన్ : మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాగి నడిపేవారిని ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు కృషి చేస్తున్నారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయకుండా రోడ్డు ప్రమాదాల నివారణకు పాటు పడాలని పోలీసులు అవగాహన కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు. అయినా కొంతమంది మత్తులో నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. ఈ ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎక్కడికక్కడ డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. పట్టుబడిన వారికి జరిమానాలతో పాటు జైలు శిక్షలు సైతం విధిస్తున్నారు. ఇటీవల ఎస్పీ పలు పోలీస్ స్టేషన్లకు అత్యాధునిక బ్రీత్ ఎనలైజర్లు పంపిణీ చేశారు. 200 పాయింట్లు దాటితే జైలు శిక్ష డ్రంకెన్ డ్రైవ్ చేస్తూ పోలీసులకు పట్టుబడిన వారిల్లో ఎక్కువగా యువతే ఉంటున్నారు. ఒక్కోసారి పిల్లలు చేసిన తప్పులకు తల్లిదండ్రులు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. సమాజంలో సైతం చెడు పేరు తెచ్చుకునే పరిస్థితి తలెత్తుతోంది. మద్యం మత్తులో డ్రైవింగ్ చేసిన వారికి బ్రీత్ అనలైజర్తో టెస్టులు నిర్వహించి పాయింట్ల ఆధారంగా జరిమానాలు విధిస్తున్నారు. 50 నుంచి 100 పాయింట్ల వరకు రూ.వేయి వరకు జరిమానా, 100 నుంచి 200 పాయింట్లు వస్తే రూ.2వేల జరిమానా విధిస్తున్నారు. 200 పాయింట్లు దాటితే జైలు శిక్ష సైతం పడే అవకాశం ఉంది. జీవితాలను నాశనం చేసుకోవద్దు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల వారితో పాటు ఇతరులకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇలాంటి వారు పోలీసుల నుంచి తప్పించుకునే అవకాశం లేకుండా పూర్తిస్థాయిలో నిఘా ఉంచాం. ప్రమాదాల నివారణకు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నాం. యువత మద్యం మత్తులో డ్రైవింగ్ చేసి జీవితాలను నాశనం చేసుకోవద్దు. – నరసింహ, ఎస్పీ ఫ జిల్లాలోని పోలీస్స్టేషన్ల పరిధిలో విస్తృతంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ఫ పట్టుబడితే జరిమానాతోపాటు, జైలు శిక్ష నమోదైన కేసులు ఇలా.. సంవత్సరం కేసులు జైలు శిక్ష 2023 22,875 102024 12,940 152025(ఇప్పటి వరకు) 7500 30 -
రూ.327.39 కోట్ల రైతు భరోసా నిధులు జమ
భానుపురి (సూర్యాపేట) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద ఇప్పటివరకు జిల్లాలోని 2,91,292 మంది రైతులకుగాను 2,76,787 మంది రైతుల ఖాతాల్లో రూ. 327.39 కోట్లు నిధులు జమయ్యాయి. ఈమేరకు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగుల నూతన వేతన సవరణ నివేదిక ప్రకటించాలిసూర్యాపేటటౌన్ : రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల వేతన సవరణ నివేదికను వెంటనే ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు సోమయ్య అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి రెండు సంవత్సరాల కాలం పూర్తయినా ఇంతవరకు పీఆర్సీ రిపోర్టు ప్రభుత్వం విడుదల చేయలేదని, ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. వేతన సవరణ రిపోర్టును ప్రకటించి అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో మనఊరు –మనబడి పథకంలో మంజూరై మధ్యలో నిలిచిపోయిన పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని, పెండింగ్లో ఉన్న సప్లమెంటరీ బిల్లులను విడుదల చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.అనిల్ కుమార్, శ్రీనివాసరెడ్డి, అరుణ భారతి, వెంకటయ్య, నాగేశ్వరరావు, ఆడం, వెలుగు రమేష్, సోమయ్య, చిలక రమేష్, లాలు, పాండురంగా చారి, బాల సైదిరెడ్డి, సాంబయ్య, శ్రీనివాసచారి పాల్గొన్నారు. గిరిజనులను అన్ని రంగాల్లో చైతన్యం చేస్తాం సూర్యాపేట : ఆదివాసీలు, గిరిజనులను అన్ని రంగాల్లో చైతన్య చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని తెలంగాణ ట్రైకార్ చైర్మన్ తేజావత్ బెల్లయ్యనాయక్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని రెడ్డి హాస్టల్ భవనాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సూర్యాపేట జిల్లాలోని అన్ని మండలాల నుంచి ఐదుగురు చొప్పున ఎంపిక చేసిన ఆదివాసీ, గిరిజనుల కాంగ్రెస్ ప్రతినిధులకు శిక్షణ తరగతులు ఈ నెల 24, 25, 26వ తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా గిరిజనులు, ఆదివాసీల చైతన్యం కోసం రాజకీయ శిక్షణా తరగతులు నిర్వ హించేందుకు శ్రీకారం చుట్టిందన్నారు. ఏఐసీసీ జాతీయ నేత రాహుల్గాంధీ పిలుపు మేరకు దేశంలో గిరిజన, ఆదివాసీల అభివృద్ధికి వారం రోజుల పాటు ట్రైనర్లకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. శిక్షణ తరగతుల ప్రారంభానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు హాజరవుతారని చెప్పారు. కార్యక్రమంలో సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
శ్రీలక్ష్మీ నారసింహుడికి విశేష పూజలు
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో అర్చకులు నిత్యకల్యాణం జరిపించారు. సుప్రభాత సేవ, నిత్యహోమం, పంచామృతాభిషేకం, ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం చేపట్టారు. కల్యాణవేడుకలో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ పూర్తిగావించారు. అనంతరం గరుడవాహనంపై శ్రీస్వామివారిని ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్ కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్కుమార్, అర్చకులు శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి భక్తులు పాల్గొన్నారు. -
ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి
మోత్కూరు : ఉచిత పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని బీజేపీ సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి, తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ కడియం రామచంద్రయ్య పిలుపునిచ్చారు. ప్రధానిగా నరేంద్రమోదీ 11 ఏళ్లు పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మోత్కూరు మండలంలోని పాటిమట్ల గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షుడు గూదె మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం సంకల్ప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏ ఒక్క అవినీతి మచ్చ లేకుండా పాలన కొనసాగిస్తూ రాష్ట్రాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దాహంతో ప్రజలను అభివృద్ధికి దూరం చేస్తూ ఉచితాల పేరుతో ప్రజలను మోసం చేస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి గ్రామంలో మొక్కలు నాటారు. అదేవిధంగా గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీజేపీలో చేరారు. సమావేశంలో జిల్లా నాయకులు ఏనుగు జితేందర్రెడ్డి, అండెం సుధాకర్రెడ్డి, భీముడి తిరుమలరెడ్డి, ఉపాధ్యక్షులు లెల్లల బాలనర్సయ్య, రాదారపు మల్లేషం, ప్రధాన కార్యదర్శి వేముల దశరథ, మండల ఎస్సీ మోర్చా కొంపెల్లి గణేష్, కోశాధికారి కడమంచి సైదులు, కార్యదర్శి బత్తిని సతీష్, గ్రామ శాఖ అధ్యక్షులు ఈట్టబోయిన ఆంజనేయులు, నల్లపోగుల వెంకన్న, కక్కరేను మల్లేష్, ముక్కాముల గణేష్, ఆళ్ల శివప్రసాద్, నిలిగొండ జయమ్మ, మార్గం సుజాత, మహేశ్వరం నిఖిత, కల్పన, మహేష్, మచ్చగిరి, నరేష్, అజయ్, మత్స్యగిరి, కిరణ్, మౌలానా పాల్గొన్నారు. ఫ బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి -
50ఏళ్ల అపూర్వ కలయిక
తుంగతుర్తి : మండల పరిధిలోని అన్నారం జెడ్పీహెచ్ఎస్లో 1974–1975లో 8వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆ పాఠశాలలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 50 సంవత్సరాల తర్వాత కలుసుకొని ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రంగారెడ్డి, అహల్య, హసనాబాదు సోమయ్య, రేసు సత్తయ్య, సుదర్శన్, సోమయ్య, లక్ష్మయ్య, పూర్వ విద్యార్థులు శేఖర్రెడ్డి, సోమిరెడ్డి, గోవర్ధన్, వెంకట్ రెడ్డి, అమృతరెడ్డి, సత్తిరెడ్డి, సత్తయ్య, యాదగిరి, పాల్గొన్నారు. -
ఉపాధి కూలీల కషా్టలు
నాగారం : ఉపాధి పనులు చేసే కూలీలకు అందించే వేతనాలను అధికారులు పోస్టాఫీసుల్లో జమ చేస్తున్నారు. అయితే పల్లెల్లో తపాలా సేవలు అందుబాటులో లేకపోవడంతో కూలీలకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు గ్రామాలకు పోస్టల్ సేవలు లేక ఉపాధి కూలీలు దూర ప్రాంతాలకు వెళ్లి వేతనాలు తీసుకోవాల్సి వస్తోంది. జనాభా పెరుగుతున్నా కొత్త వాటిని ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండగా.. ఆసరా పింఛన్లు, ఉపాధి కూలీ చెల్లింపులతో పాటు పలు రకాల చిన్న మొత్తాల పొదుపు పథకాలను పోస్టాఫీసుల ద్వారా అందిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో పోస్టాఫీసులు లేకపోవడంతో పొదుపునకు అవకాశం ఉండడం లేదు. గ్రామాల్లో తపాలా సేవలు కల్పించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.ఫ పల్లెల్లో తపాలా సేవలు అందక అవస్థలు ఫ వేతనాలు తీసుకునేందుకు దూరప్రాంతాలకు జిల్లాలో ఇలా...గ్రామ పంచాయతీలు 486 బ్రాంచ్ పోస్టాఫీసులు 319 సబ్ పోస్టాఫీసులు 29 -
లైసెన్స్ లేకుండా విత్తనాలు విక్రయించవద్దు
నేరేడుచర్ల: లైసెన్స్ లేకుండా విత్తనాలు విక్రయించవద్దని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి(డీఏఓ) జి. శ్రీధర్రెడ్డి సూచించారు. శనివారం నేరేడుచర్లలోని విజయలక్ష్మి ఫెర్టిలైజర్ షాపును తనిఖీ చేశారు. అనంతరం స్టాక్ రిజిస్టర్లతో పాటు విత్తనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ ధరలకు విత్తనాలు, ఎరువులు దొరుకుతున్నాయన్న ఆశతో లైసెన్స్లేని వారి వద్ద నుంచి కొనుగోలు చేయవద్దని రైతులను కోరారు. కొనుగోలు చేసిన ఎరువులు, విత్తనాలకు తప్పని సరిగా రసీదు తీసుకోవాలన్నారు. ఆయన వెంట మండల వ్యవసాయ శాఖ అధికారి జావిద్తో పాటు దుకాణ యజమాని పోలా విశ్వనాథం ఉన్నారు. అగ్రికల్చర్ కాలేజీ ఏర్పాటుకు స్థల పరిశీలనహుజూర్నగర్ : హుజూర్నగర్ నియోజకవర్గంలో అగ్రికల్చర్ కాలేజీ ఏర్పాటుకు రెవెన్యూ, రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూరివర్సిటీ అధికారులు శనివారం క్షేత్రస్థాయిలో స్థల పరిశీలన చేశారు. హుజూర్నగర్, బూరుగడ్డ శివారులోని ప్రభుత్వ భూములను పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసులు, డీఏఓ శ్రీధర్రెడ్డి, ఏడీఏ రమావత్ రవి, తహసీల్దార్ నాగార్జున రెడ్డి, ఏఓ ప్రీతం, డీఐ వంశీ, మండల సర్వేర్ మంజుల పాల్గొన్నారు. -
పంద్రాగస్టు నాటికి పరిష్కారం!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : భూ భారతి చట్టం అమలులో భాగంగా గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను ఆగస్టు 15 నాటికి పరిష్కరించనున్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి 20 వరకు 17 రోజుల పాటు నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,01,605 దరఖాస్తులు వచ్చాయి. దాదాపు 15 రకాల సమస్యలపై దరఖాస్తులు వచ్చాయి. శుక్రవారంతో రెవెన్యూ సదస్సులు ముగియడంతో అధికారులు దరఖాస్తుల పరిశీలన ప్రారంభించారు. ఆగస్టు 15లోగా అన్ని సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. 1,136 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,136 రెవెన్యూ గ్రామాల్లో భూ భారతి గ్రామసభలు నిర్వహించారు. మొత్తం 1,01,605 దరఖాస్తులు ప్రజల నుంచి స్వీకరించారు. అయితే ఇందులో అత్యధికంగా మిస్సింగ్ సర్వే నంబర్లు, ఫౌతితో పాటు అసైన్డ్ భూముల సమస్యలు, పెండింగ్ మ్యుటేషన్పైనే దరఖాస్తులు అధికంగా వచ్చాయి. ప్రారంభమైన దరఖాస్తుల పరిశీలన.. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో పెద్ద ఎత్తున భూ సమస్యలు పేరుకుపోయాయి. వాటిని పరిష్కరించేందుకు ప్రస్తుత ప్రభుత్వం ధరణిని రద్దు చేసి భూ భారతిని తీసుకొచ్చింది. అన్ని భూ సమస్యలను పరిష్కరించేలా భూ భారతిలో ఆప్షన్లను సిద్ధం చేసింది. 20వ తేదీ వరకు అన్ని రెవెన్యూ గ్రామాల్లో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ల ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలపై రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. సదస్సులు ముగియడంతో అధికారులు దరఖాస్తులను కేటగిరీల వారీగా విభజించి పరిశీలిస్తున్నారు. సాదాబైనామాలు పెండింగేనా..! ప్రభుత్వం అన్ని రకాల భూ సమస్యలను ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించింది. అయితే సాదాబైనామాల విషయం హైకోర్టులో పెండింగ్లో ఉంది. అవి తప్ప మిగిలిన సమస్యలన్నింటికీ ఆగస్టు 15 నాటికి పరిష్కారం చూపనున్నారు. ఆలోగా సాదాబైనామాలను పరిష్కరించేలా హైకోర్టు ఉత్తర్వులు ఇస్తే వాటిని కూడా పరిష్కరించే అవకాశం ఉంది. ఫ రెవెన్యూ సదస్సుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,01,605 దరఖాస్తులు ఫ వాటి పరిశీలన ప్రారంభించిన అధికారులు ఫ మండల స్థాయిలోనే కేటగిరీల వారీగా విభజన ఫ తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ స్థాయిలో ఆగస్టు 15 నాటికి పరిష్కరించేలా ప్రణాళిక దరఖాస్తుల వివరాలు జిల్లా దరఖాస్తులునల్లగొండ 42,534సూర్యాపేట 44,741యాదాద్రి 14,330మొత్తం 1,01,605 -
ఆదిలోనే విపత్తి
వరుణదేవా.. కరుణించవా తిరుమలగిరి (తుంగతుర్తి): వానాకాలం సీజన్ మొదలై రెండు వారాలు దాటినప్పటికీ సరైన వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం తిరుమలగిరి మండలం అనంతారం గ్రామంలోని 8వ వార్డులో మహిళలు వర్షం కురిపించాలని వరుణ దేవుడిని వేడుకుంటూ పాటలు పాడుతూ చుట్టు కాముడు ఆడారు. ఫ జిల్లాలో 26వేల ఎకరాల్లో పత్తి సాగు ఫ ముందస్తు వానలకు విత్తనాలు వేసిన రైతులు ఫ పక్షం రోజులుగా ముఖం చాటేసిన వరుణుడు ఫ సగానికి పైగా మొలకెత్తని గింజలు ఫ అక్కడక్కడ వచ్చిన మొలకలు వాడు దశకు.. ఫ ఆందోళనలో కర్షకులు ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు చిత్తలూరి వెంకన్న ది ఆత్మకూర్ (ఎస్) మండల కేంద్రం. ఈ రైతు తనకున్న ఎకరం భూమిలో పది రోజుల క్రితం పత్తి విత్తనాలు విత్తుకున్నాడు. తర్వాత చిరుజల్లులు కురవగా కేవలం 30 శాతం మాత్రమే గింజలు మొలిచాయి. మిగతా గింజలు పాడైపోగా మొలిచిన గింజలు సైతం కొన్ని ఎండ తీవ్రతకు వాడిపోయాయి. దీంతోమరోసారి భూమిని దున్ని విత్తనాలు విత్తుకోవాలా..? లేదంటే గింజలు పాడైపోయిన చోట విత్తుకోవాలా.. ? అన్నది తేల్చుకోలేకపోతున్నాడు. ఇదే పరిస్థితి జిల్లాలోని చాలామంది రైతులకు ఎదురైంది.భానుపురి (సూర్యాపేట) : ముందస్తుగానే మురిపించిన వర్షాలు.. పక్షం రోజులు జాడలేకుండాపోయాయి. వేలాది ఎకరాల్లో విత్తిన పత్తి విత్తనాలు మొలకెత్తడం లేదు. దీంతో మరోసారి విత్తనాలు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడక్కడ మొలిచిన పత్తి మొక్కలు ఎండ వేడిమికి వాడుపడుతున్నాయి. సీజన్్ ప్రారంభంలోనే ప్రకృతి సహకరించడం పోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. 26,364 ఎకరాల్లో పత్తి సాగు వానాకాలంలో సాగు చేసే ప్రధాన పంటల్లో వరి తరువాత పత్తిదే అగ్రస్థానం. ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 91వేల ఎకరాల్లో పత్తి సాగు కానుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. వర్షాలు సకాలంలో, సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించడంతో రైతులు ఆశాభావంతో సాగు పనులపై దృష్టి సారించారు. మే చివరి వారంలో కురిసిన తొలకరి వానలు, జూలై మొదటి వారంలో కురిసిన మోస్తరు వర్షాలకు జిల్లా వ్యాప్తంగా రైతులు 26,364 ఎకరాల్లో పత్తి విత్తనాలు వేశారు. ఆ తరువాత పక్షం రోజులుగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడక్కడ అడపాదడపా జల్లులు మాత్రమే పడ్డాయి. దీంతో సగానికి పైగా విత్తనాలు మొలకెత్తలేదు. అక్కడక్కడ కొంత మేర మొలకెత్తాయి. పది రోజులుగా ఎండ తీవ్రత పెరగడం, వేడి గాలులు వీస్తుండడంతో గింజలు భూమిలోనే మాడిపోయే ప్రమాదం ఏర్పడింది. వచ్చిన మొలకలు సైతం ఎండ వేడికి వాడు పడుతుండటంతో కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. నేల గట్టిపడకుండా గుంటుకలు తోలుతున్నారు. మొలకెత్తని చోట మళ్లీ విత్తనాలు కొనుగోలు చేసి రెండోసారి వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఎకరాకు రూ.15వేలకు పైగా ఖర్చు పత్తి సాగు చేయడానికి రైతులు ఇప్పటికే పెద్ద మొత్తంలో పెటుబడి పెట్టారు. దున్నకాలు మొదలుకొని విత్తనాలు వేసే వరకు ఎకరానికి రూ.15 వేలకు పైనే పెట్టుబడి పెట్టారు. మరో వారం రోజుల్లో వర్షాలు కురువకపోతే ఇబ్బందులు తప్పేలా లేవని రైతులు ఆందోళన చెందుతున్నారు. 15.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుజూన్ మాసంలో ఇప్పటివరకు 62.9 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా కేవలం 15.6 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. నైరుతి రుతు పవనాలు వచ్చే జూన్ మాసంలో కురిసే వర్షమే రైతులకు మంచి ఆధారం. ఈ నెలలోనే వర్షాలు లేకపోవడంతో సాగు కుంటుపడింది. సాగు ఖర్చులు ఎకరానికి.. (రూల్లో) ఎరువులు 5,000 ఎరువు చల్లడం 1,000దున్నకాలకు 3,000 అచ్చు తోలుటకు 1,000 విత్తనాలు (రెండు ప్యాకెట్లు) 3,000 కూలీలకు 1,200కలుపు మందు 2,000 -
నేరస్తులను గుర్తించడంలో సీసీ కెమెరాలు కీలకం
కోదాడరూరల్ : నేరాల నియంత్రణలో , నేరస్తులను గుర్తించడంతో సీసీ కెమెరాలు కీలకం అవుతున్నాయని ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి అన్నారు. శనివారం కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్లో కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా స్థానిక సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో రూ.27.50లక్షలతో ఏర్పాటు చేసిన 70 కెమెరాల పోలీస్ కంట్రోల్ రూంను ఎస్పీ నరసింహతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని అన్నారు. కోదాడ పట్టణంలోని ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలు తమ అపార్ట్మెంట్లు, గృహాలు, వ్యాపార సంస్థల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను వినియోగిస్తూ నేరాలను కట్టడి చేస్తూ శాంతిభద్రతలను పరిరక్షించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎస్పీ నరసింహ మాట్లాడుతు నేరాల కట్టడికి సీసీ కెమెరాలను అన్నివిధాలుగా ఉపయోగించుకుంటున్నామని దీనిలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. సూర్యాపేటను పూర్తి స్థాయిలో రక్షణ జిల్లాగా చేస్తామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీధర్రెడ్డి, పట్టణ, రూరల్ సీఐలు శివశంకర్, రజితారెడ్డి, సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ దశరథ, భరత్రెడ్డి, రంగారావు, డాక్టర్ సురేష్, డాక్టర్ రామారావు, కోటేశ్వరరావు, ఆనంద్ పాల్గొన్నారు. ఫ ఎమ్మెల్యే పద్మావతి -
ఆయిల్పాం సాగుతో అధిక లాభాలు
సూర్యాపేట : రైతులు ఆయిల్ పాం సాగు చేసి అధికలాభాలు ఆర్జించవచ్చని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. శనివారం కలెక్టర్ చాంబర్లో ఉద్యానవన అధికారులు, పతంజలి కంపెనీకి చెందిన అధికారులతో జిల్లాలో ఆయిల్ పాం సాగుపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయిల్పాం సాగుపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఆసక్తి చూపిన రైతులకు చెందిన 800 ఎకరాల్లో 15రోజుల్లో ఆయిల్ పాం మొక్కలు నాటేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు డ్రిప్ట్ ఇరిగేషన్ కోసం డీడీలు త్వరగా తీయించాలని, ఎవరైనా ఆర్థిక సమస్య ఉన్న రైతులుంటే వారికి సహకార బ్యాంకు ద్వారా లోన్లు ఇప్పించి డ్రిప్ ఇరిగేషన్కు డీడీలు తీయించాలన్నారు. ఆయిల్ పాంసాగుపై రైతుల సందేహాలు నివృత్తి చేయడానికి కాల్ సెంటర్, మొబైల్ యాప్ ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలో ఇప్పటికే 4,740 ఎకరాలలో ఆయిల్ పాం సాగు అవుతోందని, 2025 – 26 సంవత్సరంలో నూతనంగా 3000 ఎకరాల సాగు లక్ష్యంగా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా ఉద్యానవన అధికారి నాగయ్య, ఉద్యానవన టెక్నికల్ అధికారి మహేష్, మైక్రో ఇరిగేషన్ ఇంజనీర్ నరేష్, పతంజలి కంపెనీ అధికారులు యాదగిరి, హరీష్ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
ఆదర్శం.. ఆ ఉపాధ్యాయులు
ఫ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించిన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలిగించేలా.. ఆత్మకూర్ (ఎస్) : మండల పరిధిలోని మక్తా కొత్తగూడెం గ్రామానికి చెందిన మట్టపల్లి సైదులు ఏపూర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయన తన కుమారులైన గణ సాత్విక్, మంజిత్లను తాను పనిచేస్తున్న పాఠశాలలోనే శుక్రవారం చేర్పించారు. అనంతరం వారికి ఉపాధ్యాయులు పాఠ్య పుస్తకాలు నోట్ బుక్స్, స్కూల్ యూనిఫాం అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలిగించేందుకే తన ఇద్దరి కుమారులను ఈ పాఠశాలలో చేర్పించినట్లు తెలిపారు. అడ్డగూడూరు: ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు తమ పిల్ల లను తాము చదువు చెబుతున్న పాఠశాలల్లోనే చేర్పించి ఆదర్శంగా నిలిచారు. అడ్డగూడూరు మండల పరిధిలోని అజీంపేట ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు నరేష్కు కుమార్తె రిషక, కుమారుడు రిషిదేవ్ ఉన్నారు. శుక్రవారం కుమార్తె రిషికను అదే పాఠశాలలోని 3వ తరగతిలో, కుమారుడు రిష్దేవ్ 2తరగతిలో చేర్చించారు. గతంలో వీరు తిరుమలగిరి మండలంలోని ప్రైవేట్ పాఠశాలలో చదివేవారని, విద్యార్థులకు సంపూర్ణ మనో వికాసానికి దోహదపడే బోధన ప్రభుత్వ పాఠశాలల్లోనే అందుతుందని, అందుకే ప్రభుత్వ పాఠశాలలో చేర్పించినట్లు తెలిపారు. -
అనుమతి లేకుండా విక్రయిస్తున్న వరి విత్తనాలు సీజ్
గరిడేపల్లి: మండల పరిధిలోని చవ్వారిగూడెం గ్రామంలో అనుమతి లేకుండా విక్రయిస్తున్న వరి విత్తనాలను అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. మిర్యాలగూడ శివారులోని తుమ్మడం గ్రామానికి చెందిన కొంత మంది చవ్వారిగూడెం గ్రామం నుంచి అనుమతులు లేని విత్తన బస్తాలను ఆటోలో తీసుకెళ్తుండగా నేరేడుచర్ల పట్టణ శివారులో పోలీసులు పట్టుకున్నారు. ఆరా తీయగా అనుమతులు లేకుండా విత్తనాలు అమ్ముతున్నట్లు గుర్తించారు. ఈమేరకు గరిడేపల్లి మండలం వ్యవసాయ అధికారి ప్రీతమ్కుమార్, హుజూర్నగర్ సీఐ చరమందరాజు ఆధ్వర్యంలో చెవ్వారిగూడెం గ్రామానికి వెళ్లి తిప్పన రాంరెడ్డికి చెందిన గోదాంలో తనిఖీ చేశారు. అనుమతులు లేకుండా ఉన్న 150బస్తాల వరి విత్తనాలను సీజ్ చేశారు. కార్యక్రమంలో నేరేడుచర్ల ఎస్ఐ రవీందర్నాయక్, గరిడేపల్లి ఏఎస్ఐ జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. దిర్శించర్లలో 273 క్వింటాళ్లు పట్టివేత నేరేడుచర్ల : నేరేడుచర్ల మండలం దిర్శించర్ల గ్రామానికి చెందిన ఎస్కె జలీల్కు చెందిన షెడ్డులో అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన 273 క్వింటాళ్ల వరి విత్తనాలను శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. సమాచారం మేరకు హుజూర్నగర్ సీఐ చరమందరాజు, నేరేడుచర్ల ఎస్ఐ రవీందర్, వ్యవసాయ అధికారి జావిద్ తనిఖీలు చేసి, వాటిని పట్టుకున్నారు. ఈమేకు షెక్ జలీల్పై కేసు నమోదు చేసి, వరి విత్తనాలను పరీక్షల నిమిత్తం విత్తనాల ల్యాబబ్కు పంపించినట్లు అధికారులు తెలిపారు. నిఽందితుడు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. -
సోషల్ సర్వీస్!
ఫ సోషల్ మీడియా ద్వారా గ్రామస్తుల బాగోగులు ఫ ‘మన ఊరు–మన గుజ్జ’ పేరుతో పేజీల నిర్వహణ ఫ పుష్కరకాలంగా కృషిచేస్తున్న యువకుడు శశికాంత్ ఫేస్బుక్... యూట్యూబ్... ఇన్స్ట్రాగామ్... వాట్సాప్... ఇలా సోషల్మీడియాను యువత సరదా కోసమో, వినోదం కోసమో వినియోగిస్తారనే భావన అనేక మందిలో ఉంటోంది. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలం గుజ్జ గ్రామానికి చెందిన శ్రీరామోజు శశికాంత్ మాత్రం వీటి వినియోగంతో సామాజిక సేవ చేస్తున్నారు. డిగ్రీ చేసిన ఈయన ‘మన ఊరు–మన గుజ’ పేరుతో ఆయా వేదికల్లో పేజీలు నిర్వహిస్తూ గ్రామానికి, గ్రామస్తులకు సేవ చేస్తున్నారు. 12 ఏళ్లుగా అప్రతిహతంగా తన కృషిని కొనసాగిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఆలోచన మాత్రమే తనదని, ఆచరణలో మాత్రం గ్రామం మొత్తం పాలుపంచుకుంటోందని శశికాంత్ చెబుతున్నారు – సాక్షి ప్రతినిధి, నల్లగొండ గుజ్జ నుంచి దేశ విదేశాలకు వెళ్లి స్థిరపడిన వారు అనేక మంది ఉన్నారు. వారితో పాటు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ ఎప్పటికప్పుడు ఊరి విశేషాలను చేరవేయడం.. అవసరమైతే వాళ్లూ ఓ చేయి వేసి చేయూత అందించేలా చేయడం ఈ ‘సోషల్ మీడియాల’ గొప్పదనం. గుజ్జ యువతలో సేవాదృక్పఽథాన్ని నింపేలా 2013 నుంచి ఈ ‘సామాజిక ఉద్యమం’ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన గుజ్జ గ్రామస్తులకు ఊరిలో ఏం జరుగుతోంది? ఏయే పండుగలు ఎలా జరుగుతున్నాయి? తదితర వివరాలను ఎప్పటికప్పుడు ఈ పేజ్లు అందిస్తున్నాయి. ఎందరో ఆపన్నులకు ఆసరాగా నిలిచి... ‘మన ఊరు – మన గుజ్జ్ఙ వేదికను శశికాంత్ ఆ గ్రామంలో ఉన్న, గ్రామం నుంచి వెళ్లి వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన గ్రామస్తుల సహకారంతో ముందుకు నడిపిస్తున్నారు. హఠాన్మరణం పొందిన వారి కుటుంబాలకు, అనారోగ్యానికి గురైన వారికి, ఆసుపత్రిల్లో వైద్యం అవసరమైన వారికి ఆర్థిక సహాయం, తోడ్పాటు అందేందుకు ఈ శ్రీమన ఊరు–మన గుజ్జ’ పేజీలు పనిచేస్తున్నాయి. రోడ్డు ప్రమాదంలో మరణించిన గంగదేవి తిరుమలేష్ భార్య, నలుగురు పిల్లలకు, రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ నల్లగంటి చందుకు, మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆస్పత్రిలో చేరిన మంగ లింగమ్మకు వైద్యం కోసం, క్రికెట్లో ప్రతిభ కనబరుస్తున్న గోపరాజు సాయి అర్జునన్కు అవసరమైన డబ్బు సమకూర్చడంలోనూ ఈ పేజీలు కీలకపాత్ర పోషించాయి. వీరితో పాటు గ్రామంలో ఉన్న వృద్ధులు, విద్యార్థుల కోసమూ అనేక సహాయ కార్యక్రమాలు వీటి ద్వారా జరుగుతున్నాయి. సంప్రదాయ, సంస్కృతులు చాటిచెప్పేలా..శశికాంత్ గుజ్జ గ్రామస్తులతో కలిసి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా సంప్రదాయ, సంస్కృతులు అందరికీ చాటిచెప్పడానికీ కృషిచేస్తున్నారు. వాటికి అద్దం పట్టేలా బతుకమ్మ పాటల పోటీల నిర్వహణ, గ్రామ చరిత్ర, గొప్పదనం వివరిస్తూ.. రెండు బతకమ్మ పాటలు రాసి, పాడించి చిత్రీకరణ చేయించారు. జాతీయ నాయకుల జయంతులు, వర్ధంతులు క్రమం తప్పకుండా నిర్వహిస్తూ, వారి త్యాగాలు ఈ తరం యువతకు తెలిసేలా చేస్తూ వారిలో చైతన్యం నింపుతున్నారు. సేవ చేయాలన్న తపన, ఊరి కోసం పని చేయాలన్న సంకల్పం వారిలో పెరిగేందుకు కృషిచేస్తున్నారు. గ్రామంలో అవగాహన సదస్సులు నిర్వహణఈ సోషల్ మీడియా వేదిక ద్వారా పలువురిని ఆకర్షిస్తున్న శశికాంత్ వారితో గ్రామంలో అవగాహన సదస్సులు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామీణ మహిళల స్వయం ఉపాధి, స్వయం సమృద్ధి కోసం అవసరమైన ప్రాథమిక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత నెలలో గుజ్జ రైతు వేదిక వద్ద స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు తోట రాము సహకారంతో వృత్తి నైపుణ్యాల పెంపుదల, వివిధ పథకాల కింద రుణాలు పొందే అవకాశం, కుటీర పరిశ్రమల ఏర్పాటు, మార్కెటింగ్ సాయం పొందే విధానాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వివిధ వర్గాల్లో ఉన్నతంగా ఉన్న వారి సహాయ, సహకారంతో శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కృషి చేస్తున్నారు. గ్రామస్తుల సహకారంతోనే సేవ గ్రామస్తుల సహకారంతోనే ‘మన ఊరు– మన గుజ్జ’ సోషల్ మీడియాను ప్రారంభించాను. గ్రామస్తులు ఒక్కొక్కరుగా చేరడంతో సోషల్ మీడియాలో గ్రామస్తులమంతా టీంగా ఏర్పడ్డాం. సహాయ, సహకారాల్లో గ్రామం మొత్తం భాగస్వామ్యమవుతోంది. రాష్ట ప్రభుత్వం గుర్తించి ప్రతి గ్రామ పంచాయతీకి సోషల్ మీడియా గ్రూపులను ఏర్పాటు చేయాలన్నది నా ఆకాంక్ష. అవకాశం ఉన్న వారు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తే ఇంకా మెరుగైన సేవలు అందిస్తాం.– శ్రీరామోజు శశికాంత్ -
సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యం ఇవ్వాలి
సూర్యాపేట : ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలు చేసేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ వైద్యులను ఆదేశించారు. సూర్యాపేట పట్టణంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఆస్పత్రికి వచ్చే వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అత్యవసర వార్డు, టీబీ యూనిట్ వార్డు, జెరియాట్రిక్ కేర్ వార్డు, డే కేర్ కిమోథెరపీ వార్డు, జ్వరం, కోవిడ్ ఐసోలేషన్ వార్డులను కలెక్టర్ పరిశీలించారు. వైద్యసేవలు, మందులు ఇస్తున్నారా లేదా అని పేషంట్లను అడిగి తెలుసు కోన్నారు. రోజూ బ్లడ్ టెస్టుల వివరాలు, రిజిస్టర్లలో నమోదు పరిశీలించారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్ లో మందుల లభ్యత గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సదరం క్యాంపు నిర్వహించేటప్పుడు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మెరుగైన వసతులు కల్పించి సక్రమంగా నిర్వహించాలని సూచించారు. సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తలు తీసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే నిర్మాణంలో ఉన్న ఎంసీహెచ్ సెంటర్ భవనాన్ని సందర్శించి పనులను వేగవంతం చేయాలన్నారు. డి అడిక్షన్ సెంటర్ ఏర్పాటుకు స్థలం సేకరించాలని, అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూడాలని పేర్కొన్నారు. ఆయన వెంట సూపరింటెండెంట్ సత్యనారాయణ, ఆర్ఎం డాక్టర్ వినయ్ ఆనంద్, డాక్టర్ లక్ష్మణ్, వైద్య సిబ్బంది ఉన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
‘ఈవీ’లకు నో పవర్!
చార్జింగ్ సౌకర్యం లేక రోడ్డెక్కని ఎలక్ట్రిక్ బస్సులు ఫ ప్రత్యేక లైన్, సబ్స్టేషన్ ఏర్పాటులో అలసత్వం ఫ నల్లగొండ డిపోకు 15 రోజుల క్రితం వచ్చిన 40 ఎలక్ట్రిక్ బస్సులు ఫ వాటిని నార్కట్పల్లి డిపోలో ఉంచిన అధికారులు ఫ కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యంతో డిపోలు దాటని బస్సులు సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో ఎలక్ట్రిక్ బస్సు(ఈవీ)లకు చార్జింగ్ కష్టాలు వచ్చిపడ్డాయి. ఎలక్ట్రిక్ బస్సులకు అవసరమైన చార్జింగ్ కోసం విద్యుత్ లైన్, సబ్స్టేషన్ నిర్మాణంలో ఎడతెగని జాప్యం జరుగుతోంది. ఆ పనుల కోసం మూడు నెలల కిందటే టెండర్లు పిలిచినా కాంట్రాక్టు సంస్థ అలసత్వంతో ఈవీ బస్సులు రోడ్డెక్క లేదు. దీంతో నల్లగొండ డిపోకు కేటాయించిన 40 ఈవీ బస్లను నార్కట్పల్లి డిపోలో భద్రపరిచారు. సూర్యాపేట, నల్లగొండ డిపోలకు ఒకేసారి ఈవీ బస్లు వచ్చాయి. 11 కేవీ లైన్, సబ్స్టేషన్, ఛార్జింగ్ పాయింట్ల నిర్మాణ బాధ్యతలను రెండుచోట్ల ఒకేసారి కాంట్రాక్టు సంస్థకు అప్పగించారు. సూర్యాపేటలో ఇప్పటికే ఆ పనులన్నీ పూర్తయి బస్లు రోడ్డెక్కగా, నల్లగొండలో మాత్రం పనుల్లో జాప్యం జరుగుతోంది. పనుల్లో ఎడతెగని జాప్యం ఖర్చులను తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఆర్టీిసీ ఈవీ బస్లను తీసుకొస్తోంది. అందులో భాగంగా నల్లగొండ, సూర్యాపేట డిపోలకు ఎలక్ట్రిక్ బస్లను మంజూరు చేసింది. అందుకోసం ఈ రెండు డిపోల్లో ప్రత్యేకంగా 133/11 కేవీ లైన్, సబ్స్టేషన్ నిర్మించాల్సి ఉంది. వాటితోపాటు జనరేటర్ల ఏర్పాటు, ఛార్జింగ్ పాయింట్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. సూర్యాపేట, నల్లగొండ జిల్లాలో ఒకే కాంట్రాక్టర్ కాంట్రాక్టు పొందినప్పటికీ సూర్యాపేటలో పనులను ఎప్పుడో పూర్తి చేశారు. ఈ నెల 9వ తేదీన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి సూర్యాపేటలో ఈవీ బస్సులను ప్రారంభించారు. నల్లగొండ డిపోలో మాత్రం ఛార్జింగ్ పాయింట్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నా, ప్రత్యేక లైన్, సబ్స్టేషన్ పనుల్లో వేగం పుంజుకోవడం లేదు.నెలాఖరు వరకు రోడ్డెక్కేది అనుమానమే ఎలక్ట్రిక్ బస్సులు జిల్లాకు చేరి 15 రోజులు కావస్తోంది. విద్యుత్ లైన్, సబ్స్టేషన్ పనులేవీ చేపట్టలేదు. ఇప్పటికిప్పుడు పనులు ప్రారంభించి.. రాత్రింబవళ్లు పనిచేసినా ఈ నెలాఖరు వరకు కూడా అవి పూర్తికావు. బస్ డిపోలో ఇప్పటివరకు జనరేటర్లను ఏర్పాటు చేసి, ఛార్జింగ్ పాయింట్ల పనులను మాత్రమే చేపట్టారు. విద్యుత్ లైన్, సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తేనే వాటికి కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పటివరకు బస్సులు డిపోకు పరిమితం కావాల్సిందే. -
కొత్త అడ్మిషన్లు 5,289
సూర్యాపేటటౌన్ : విద్యా శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా ముగిసింది. ఈ నెల 6న ప్రారంభమైన బడిబాట గురువారం (19వతేదీ)తో పరిసమాప్తం అయ్యింది. రోజువారీ ప్రణాళిక ప్రకారం ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఇంటింటికి తిరుగుతూ బడిబాటను కొనసాగించారు. దీంతో ఈ ఏడాది కొత్తగా 5,289 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు తీసుకున్నారు. అయితే గతేడాది ఆగస్టు 31వ తేదీ వరకు 4,814 అడ్మిషన్లు రాగా ఈసారి అదనంగా 475 అడ్మిషన్లు పెరిగాయి. అడ్మిషన్ల ప్రక్రియ ఆగస్టు 31వ తేదీ వరకు కొనసాగనుంది. దీంతో పాఠశాలల్లో కొత్త అడ్మిషన్ల సంఖ్య పెరగనుందని జిల్లా విద్యా శాఖ అధికారులు భావిస్తున్నారు. కోదాడ మండలంలో అత్యధికంగా..జిల్లాలో మొత్తం 950 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వీటిలో 182 ప్రభుత్వ ఉన్నత, 78 ప్రాథమికోన్నత, 690 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. అలాగే తొమ్మిది మోడల్ స్కూల్స్, 18 కేజీబీవీలు, ఒక రెసిడెన్షియల్ పాఠశాలల్లో వీటిలో 75వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. బడిబాటలో ఇప్పటి వరకు 5,289 మంది విద్యార్థులు కొత్తగా అడ్మిషన్లు పొందగా ఇందులో కోదాడ మండలంలో అత్యధికంగా 708 మంది, మఠంపల్లి మండలంలో అత్యల్పంగా 79 మంది ఉన్నారు. తెరుచుకున్న పాఠశాలల్లో 32 మంది చేరిక జిల్లాలో మొత్తం 95 ప్రభుత్వ పాఠశాలలు గతేడాది విద్యార్థులు లేకపోవడంతో మూతపడ్డాయి. అయితే ఈ ఏడాది బడిబాట కార్యక్రమం నిర్వహించడంతో విద్యార్థుల చేరికతో 12 పాఠశాలలు తెరుచుకున్నాయి. చింతపాలెం మండలంలో ఎనిమిది ప్రాథమిక పాఠశాలలు మూత పడగా ఈ ఏడాది రెండు తెరుచుకున్నాయి. అలాగే జాజిరెడ్డిగూడెం మండలంలో నాలుగు మూతపడగా మూడు తెరిపించారు. మఠంపల్లిలో 10 పాఠశాలలు మూతపడగా ఒకటి, మేళ్లచెరువులో మూడు పాఠశాలలు మూతపడగా ఒకటి, నడిగూడెం మండలంలో ఐదు పాఠశాలలకు ఒకటి, పెన్పహాడ్ మండలంలో రెండు మూతపడగా ఆ రెండు తెరుచుకున్నాయి. తిరుమలగిరిలో నాలుగు పాఠశాలలు ఉండగా ఒక పాఠశాలను తెరిపించారు. తుంగతుర్తి మండలంలో ఎనిమిది పాఠశాలలు మూతపడగా ఒక పాఠశాలను తెరిపించారు. ఈ పాఠశాలల్లో మొత్తం 32 మంది విద్యార్థులు చేరారు. సమష్టి కృషితోనే విజయవంతం ఈ నెల 6 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించిన బడిబాట కార్యక్రమం ఉపాధ్యాయుల సమష్టి కృషితో విజయవంతంగా ముగిసింది. బడిఈడు పిల్లలను బడిలో చేర్చించేందుకు ఇంటింటి ప్రచారం చేశాం. దీంతో ఈ ఏడాది అత్యధికంగా అడ్మిషన్లు వచ్చాయి. 12 మూతపడిన పాఠశాలలను తెరిపించాం. – అశోక్, డీఈఓ ప్రభుత్వ స్కూళ్లలో పెరిగిన ప్రవేశాల సంఖ్య ఫ గతేడాది కంటే 475 అదనం ఫ మూతపడిన 12 స్కూళ్లను తెరిపించిన విద్యా శాఖ ఫ ముగిసిన బడిబాట కార్యక్రమం విద్యార్థుల చేరిక ఇలా.. ప్రభుత్వ పాఠశాలలు మొత్తం 950 1వ తరగతిలో ప్రవేశం 2,038 ప్రైవేట్ నుంచి వచ్చినవారు 1,410 2 నుంచి 10వ తరగతి వరకు 1,841 ప్రభుత్వ పాఠశాలలపై పెరిగిన నమ్మకం ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పిస్తూ నాణ్యమైన మధ్యాహ్న భోజనంతో పాటు ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, నోట్ పుస్తకాలు అందిస్తున్నారు. అలాగే జిల్లా కలెక్టర్ తేజస్నంద్లాల్ పవార్ ప్రభుత్వ పాఠశాలలపై ఫోకస్ పెట్టారు. ఎప్పటికప్పుడు పాఠశాలలపై ఆరా తీస్తూ ఎంఈఓలు, హెచ్ఎంలకు దిశానిర్దేశం చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు మెమొంటోలు అందజేసి సన్మానించారు. దీంతో తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల వైపే మొగ్గు చూపుతున్నారు. -
రూ.271.20 కోట్ల రైతు భరోసా నిధులు జమ
భానుపురి (సూర్యాపేట): రైతు భరోసా పథకం కింద ఇప్పటివరకు జిల్లాలోని 2,61,912 మంది రైతుల ఖాతాల్లో రూ.271.20 కోట్ల నిధులు జమ అయ్యాయని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవర్ తెలిపారు. వానాకాలం–2025 సీజన్కు సంబంధించి జిల్లాలో మొత్తం 2,89,371 మంది రైతులకు నిధులను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోందని పేర్కొన్నారు. రైతులు కొత్త పాస్ బుక్కులు (05.06.2025 రోజు వరకు) వచ్చిన వారు వ్యవసాయ విస్తరణాధికారులను కలిసి సరైన పత్రాలను సమర్పించాలని కోరారు. రైతు భరోసా అందించాలితుంగతుర్తి : తమకు రైతు భరోసా రావడం లేదని తుంగతుర్తికి చెందిన గుడిపూడి ఆగారావు, శంకరమంచి రవీందర్ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తుంగతుర్తిలో ఏఓ బాలకృష్ణకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తుంగతుర్తి శివారులో తమకు మూడకరాల లోపు ఉన్న వ్యవసాయ భూములకు గతంలో రైతు భరోసా అందిందని, గడచిన నాలుగు పర్యాయాలుగా ఆగిపోయిందన్నారు. ఇదే విషయమై తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా విచారణ జరిపి రెవెన్యూ రికార్డులు సక్రమంగానే ఉన్నాయని తెలిపారన్నారు. కలెక్టరేట్లో దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకుండా పోయిందన్నారు. రైతు భరోసా ఇవ్వకపోగా మీ భూముల సర్వే నంబర్లు కనిపించడం లేదని చెబుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటిఐనా రైతు భరోసా వచ్చేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. -
దరఖాస్తుల ఆహ్వానం
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం తగ్గింపు కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళిక పథకం కింద డిస్ట్రిక్ట్ డి అడిక్షన్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి, అర్హత కలిగిన సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అనుధాన్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. చెప్పారు. డ్రగ్స్ నిర్మూలన అందరి బాధ్యత : ఎస్పీసూర్యాపేటటౌన్ : డ్రగ్స్ నిర్మూలన మన అందరి బాధ్యత అని, ఇందులో భాగంగా ఈనెల 26న డ్రగ్స్ నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా యంత్రాంగంతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ నరసింహ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. డ్రగ్స్ నిర్మూలనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని, తెలంగాణ రాష్ట్ర పోలీస్ యాంటీ నార్కోటిక్ బ్యూరో అధ్వర్యంలో డ్రగ్స్ నివారణ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. యువత, విద్యార్థులు, వివిధ సంఘాల వారు ఈ అవగాహన కార్యక్రమాలల్లో పాల్గొని డ్రగ్స్ నిర్మూలనకు పాటుపడాలని కోరారు. ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలిచివ్వెంల : కై దీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్ అన్నారు. శుక్రవారం సూర్యాపేటలోని సబ్ జైలును సందర్శించారు. జైలు పరిసరాలను పరిశీలించి, ఖైదీలను ఆరోగ్య సమస్యలు, ఆహార వసతులు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఖైదీల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూపరింటెండెంట్ బి.సుధాకర్రెడ్డిని ఆదేశించారు. జైలులో ఉన్న ఖైదీలకు న్యాయవాదులు ఉన్నారా అని అడిగి తెలుసుకున్నారు. లేనట్లయితే జిల్లా న్యాయసేవాధికార కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే, ఉచితంగా న్యాయసేవలు అందిస్తామమన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, డిప్యూటి చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బి.వెంకటరత్నం, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ పెండెం వాణి, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలిఅర్వపల్లి : తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించి వారికి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సామ అంజిరెడ్డి కోరారు. అర్వపల్లిలో శుక్రవారం జరిగిన ఉద్యమకారుల సంక్షేమ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 250 గజాల ఇంటిస్థలాన్ని, నెలకు రూ.25వేల ఫించన్ను ఇవ్వాలన్నారు. ఈసందర్భంగా సంక్షేమ సంఘం నియోజకవర్గ కన్వీనర్గా అర్వపల్లికి చెందిన తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు దిర్శనపు కృష్ణమూర్తిని నియమిస్తూ నియామకపత్రాన్ని అందజేశారు. ఈ సమాశేశంలో తెలంగాణ ఉద్యమకారులు కుదురుపాక ఉదయ్, లింగంపల్లి రమణ, దడిపల్లి వెంకట్, కుంభం మధు, శివ, యాదగిరి, కొమారి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ ఆఫీస్లో ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం!సూర్యాపేటటౌన్ : డిప్యూటీ డీఎంహెచ్ఓ చంద్రశేఖర్ వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ఓ ఉద్యోగి అయిన ఇన్చార్జి డెమో మనోహరరాణి రెండో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. దీన్ని గమనించిన తోటి ఉద్యోగులు అడ్డుకున్నట్లు శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ చంద్రశేఖర్, ఇన్చార్జి డెమో మనోహరరాణి మధ్య విభేదాలు ఉన్నట్టు సమాచారం. ఈ విషయమై డాక్టర్ చంద్రశేఖర్పై జిల్లా కలెక్టర్కు సైతం మనోహరరాణి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై డిప్యూటీ డీఎంహెచ్ఓ వివరణ కోరగా విధి నిర్వహణలో అలసత్వం తగదని మందలించిన విషయం వాస్తవమేనని, అందుకే తనపై కలెక్టర్కు ఫిర్యాదు చేసిందని తెలిపారు. -
మహోన్నత వ్యక్తులు అంబేద్కర్, జగ్జీవన్రామ్
నాగారం : అణగారిన వర్గాల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేసిన మహాన్నత వ్యక్తులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్రామ్ అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. నాగారం మండలం పసునూర్ గ్రామంలో మాదిగ కళామండలి రాష్ట్ర అధ్యక్షుడు, విగ్రహాల ఏర్పాటు కమిటీ చైర్మన్ మల్లెపాక అనిల్కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్, జగ్జీవన్రామ్ విగ్రహాలను శుక్రవారం వారు ఆవిష్కరించి మాట్లాడారు. జగ్జీవన్రామ్, అంబేద్కర్ జాతి గర్వించే మహనీయులని కొనియడారు. ఆ మహానీయుల ఆశయాల సాధనలో భాగంగా కొనసాగిన 35 ఏళ్ల పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణ అన్నారు. రాజ్యాంగ నిర్మాతగా సామాజిక న్యాయం కోసం పోరాడిన యోధుడు అంబేద్కర్ అన్నారు. దళిత జనోద్ధరణ కోసం జగ్జీవన్రామ్, అంబేద్కర్ చేసిన కృషి ఎనలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన యుద్ధనౌక ఏపూరి సోమన్న, వాగ్గేయకారుడు గిద్దె రామనర్సయ్య, కాంగ్రెస్ జిల్లా నాయకులు సుంకరి జనార్దన్, నాయకులు గంధమల్ల యాదగిరి, గుడిపాటి సైదులు, చింతకుంట్ల వెంకన్న, చిన్న శ్రీరాములు, చిప్పలపల్లి మల్లేష్, అయోధ్య, బాలయ్య, శ్రీను, కిషోర్, రాజయ్య, తోడుసు లింగయ్య, బిక్కి శ్రీను, సోమన్న, బొజ్జ సైదులు, పంది శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ నాయకులు, ఆయా అనుబంధ సంఘాల నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఫ మంద కృష్ణమాదిగ, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ఫ పసునూర్లో మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ -
ఆరోగ్య‘యోగ’ం
తాళ్లగడ్డ (సూర్యాపేట) : మనస్సు, వాక్కు, కర్మలను నియంత్రించుకోవడంతో పాటుగా శారీరక ప్రశాంంతతను పొందేందుకు యోగా ఎంతగానో దోహదపడుతుంది. ప్రస్తుత ఆధునిక జీవన శైలిలో ఒత్తిడి కారణంగా ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. నిత్యం యోగా సాధన చేయడం ధ్వారా వీటి నుంచి ఉపశమనం పొందవచ్చు. మన దేశంలో పుట్టిన యోగాను ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ అనుసరించడమే గాక ఐక్యరాజ్యసమితి జూన్ 21న యోగా దినోత్సవంగా ప్రకటించడం మన దేశానికి దక్కిన గౌరవంగా చెప్పొచ్చు. యోగాపై పట్టణ ప్రజల ఆసక్తి నిత్య యోగా సాధన రక్తంలో మలినాలను శుద్ధి చేస్తుంది. శరీరంలో ప్రాణవాయువు పెంచుకునే ప్రక్రియ యోగాతోనే సాధ్యమవుతుంది. ముఖ్యంగా నగరాల్లో ఉండే ప్రజలు జంక్ఫుడ్ తినడం కారణంగా వ్యాధులతో బాధపతుంటారు. అలాంటి వారు స్వతహాగా లేదా డాక్టర్ల సలహా మేరకు యోగా కేంద్రాలను ఆశ్రయిస్తూ వారి శారీరక సమస్యల నుంచి ఉపశమనం పొందుతున్నారు. ప్రయోజనాలు ఇలా.. ఆరోగ్యంగా ఉండటమే గాక చురుకుగా తమ పనులను పూర్తి చేసేందుకు యోగా ఎంతో ఉపయోగపడుతుంది. నిత్యం యోగా చేయడంతో మానసిక ప్రశాంతత ఉంటందని యోగా గురువులు చెబుతున్నారు. బీపీ, షుగర్, థైరాయిడ్, తలనొప్పి, సైనస్, మలబద్ధకం, కిడ్నీ, ఊపిరితిత్తుల వ్యాధులు, అధిక బరువు, నిద్రలేమి, ప్రత్యేకంగా మగవారికి నరాల బలహీనత, గర్భిణులకు సుఖప్రసవం, మహిళలకు గైనిక్ సమస్యల నుంచి బయటపడేందుకు ప్రతి రోజూ యోగాసనాల వేయడం ద్వారా తగ్గించుకునే అవకాశం ఉంటుందని డాక్టర్లు సైతం చెబుతున్నారు.ఫ నిత్య యోగాతో జ్ఞాపకశక్తి వృద్ధి, ఒత్తిడి దూరం ఫ మానసిక స్థిరత్వానికి ధ్యానం ఉపయోగం ఫ శారీరక సమతుల్యతకు యోగాసనాలు దోహదం ఫ యోగాపై ఆసక్తి చూపుతున్న నేటి యువత ఫ నేడు జాతీయ యోగా దినోత్సవం -
మోదీ పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి
కోదాడరూరల్ : ప్రధాని నరేంద్రమోదీ 11 ఏళ్ల పాలనలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి పేర్కొన్నారు. గురువారం కోదాడ మండలం రామలక్ష్మీపురంలో నూతనంగా ఏర్పాటు చేసి పార్టీ జెండాను ఎగురవేసిన అనంతరం నిర్వహించిన సంకల్ప సభలో ఆమె మాట్లాడారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆమె విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు పుల్లారావు, నాయకులు నూనె సులోచన, బొలిశెట్టి కృష్ణయ్య, కన గాల నారాయణ, వెంకటేష్బాబు, పురుషోత్తం, జనార్దన్ తదితరులు ఉన్నారు. -
20 లక్షల ఇళ్ల నిర్మాణమే లక్ష్యం
నడిగూడెం : వచ్చే మూడున్నరేళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. మోతె మండలం విభళాపురంలో పైలట్ ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతిరెడ్డితో కలిసి ఆయన పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. అనంతరం నిర్వహించిన సమావేశంతో పాటు విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమైనట్లు తెలిపారు. 4.50 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 3.70లక్షల మందిని ఎంపిక చేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు తీసుకొని, అధికారాన్ని దుర్వినియోగం చేసి, నేడు సోషల్ మీడియాలో ఇందిరమ్మ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. సీఎం రేవంత్రెడ్డి, కేబినెట్ మంత్రుల సహకారంతో రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే అభివృద్ధిని గాడిలో పెడుతున్నామన్నారు. వచ్చే ఏ ఎన్నికలైనా విజయం ఇందిరమ్మ ప్రభుత్వందేనని ధీమా వ్యక్తం చేశారు. ఆగస్టు15నాటికి భూ సమస్యలన్నీ పరిష్కారం రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల్లా పరుగెడుతున్నాయని మంత్రి అన్నారు. విడతల వారీగా అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. గత పాలకులు పదేళ్లు పాలించి ఒక్క ఇల్లు, రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. భూ భారతిచట్టం ద్వారా వచ్చే ఆగస్టు 15 నాటికి భూ సమస్యలన్నీ పరిష్కారమవుతాయన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా ప్రజల సంక్షేమం కోసం ఒక్కో పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. రైతు భరోసా ఎకరానికి రూ.12 వేలు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్, ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు వైద్య సేవలు, ప్రతి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల మంజూరు ఇలా పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతిరెడ్డి మాట్లాడుతూ విభళాపురం గ్రామాన్ని పైలట్ప్రాజెక్టు కింద ఎంపిక చేసి తొలి విడత 146 ఇళ్లు మంజూరు చేశామన్నారు. ఇళ్ల నిర్మాణ పనులు మొదలు పెట్టిన 74 మంది లబ్ధిదారులకు నూతన దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వేణు మాధవరావు, గృహనిర్మాణ శాఖ పీడీ ధర్మారెడ్డి, తహసీల్దార్ వెంకన్న, ఎంపీడీఓ ఆంజనేయులు, గృహనిర్మాణ శాఖ ఏఈ నాగరత్మమ్మ పాల్గొన్నారు. ఫ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఫ విభళాపురంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పరిశీలన -
24వ తేదీన డ్రా
భానుపురి (సూర్యాపేట) :2025 – 26 విద్యా సంవత్సరానికి గాను జిల్లా పరిధిలోని ఎస్సీ విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కీం కింద ఒకటవ తరగతి డే స్కాలర్, ఐదవ తరగతి రెసిడెన్షియల్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించేందుకు ఈనెల 24వ తేదీన డ్రా తీయనున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కె. దయానందరాణి తెలిపారు. ఈమేరకు గురువారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు 24న ఉదయం 11 గంటలకు కలెక్టర్ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో జరిగే ఈ కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు. దరఖాస్తుల ఆహ్వానంభానుపురి (సూర్యాపేట) : జపాన్, సౌత్ కొరియా, న్యూజిలాండ్, సింగపూర్ దేశాల్లో చదువుకునేందుకు ఆసక్తి ఉన్న ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు, జైనుల పిల్లలు సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా మైనార్టీ అధికారి జగదీశ్వర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో సూచించారు. జనవరి 2025 నుంచి జూన్ 30వ తేదీ మధ్యకాలంలో అడ్మిషన్ తీసుకున్న అర్హత కలిగిన అభ్యర్థులు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తులు, ధ్రువపత్రాలను జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉండాలని, ఈ పథకం కింద ఎంపికై న ప్రతి విద్యార్థికి స్కాలర్షిప్ కింద రెండు విడతల్లో రూ.20 లక్షలు, విమాన ప్రయాణం చార్జీలు రూ.60 వేలు చెల్లించనున్నట్లు వివరించారు. ఈనెల 30తేదీ వరకు దరఖాస్తుచేసుకోవచ్చని సూచించారు. మట్టపల్లిలో నిత్యకల్యాణం మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో గురువారం శ్రీరాజ్యలక్ష్మిచెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహ స్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాత సేవ, నిత్యహోమం, పంచామృతాభిషేకం, ఎదుర్కోళ్లమహోత్సవ సంవాదం నిర్వహించారు. కల్యాణవేడుకల భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం , మధుఫర్కపూజ, మాంగళధారణ, తలంబ్రాలతో ఘనంగా నిర్వహించారు. అనంతరం గరుడవాహనంపై శ్రీస్వామివారిని ఆలయ తిరుమాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్కుమార్, భక్తులు పాల్గొన్నారు. యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గురువారం సంప్రదాయ పూజలు నిర్వహించారు. శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన చేశారు. ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలను నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు జరిపించారు. భక్తులు వివిధ పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచాకే ఎన్నికలు నిర్వహించాలిమునగాల : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పొనుగోటి రంగా కోరారు. గురువారం మునగాల మండల కేంద్రంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 42 శాతం అమలు చేయకుండా ఎన్నికలకు వెళ్తే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో మొగిలిచెర్ల సత్యనారాయణ, రావులపెంట రాజబాబు, గండు నారాయణ, మేకపోతుల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ఆయిల్పామ్ సాగుతో అధిక ఆదాయం
తాళ్లగడ్డ (సూర్యాపేట) : ఆయిల్ పామ్ సాగుతో అధిక ఆదాయం పొందవచ్చని జిల్లా ఉద్యాన శాఖ అధికారి తీగల నాగయ్య సూచించారు. గురువారం సూర్యాపేట మండలం పిన్నాయిపాలెంలో మాదగోని రమేష్ వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్ పామ్ మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న ఆయిల్ పామ్ సాగు చేసినట్లయితే రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చన్నారు. ఆయిల్ పామ్ తోటనాటిన నాలుగవ సంవత్సరం నుంచి దిగుబడి ప్రారంభమవుతుందన్నారు. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం బిందు సేద్యం, ఎరువులు, అంతర పంటలకు రాయితీలు ఇస్తుందన్నారు. ఎరువులు, అంతర పంటల యాజమాన్యానికి ఎకరానికి రూ. 4,200 చొప్పున మొదటి నాలుగు సంవత్సరాలు ప్రోత్సాహకంగా ఇస్తుందని తెలిపారు. ఆసక్తి గల రైతులు ఉద్యాన శాఖ అధికారులకు దరఖాస్తు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పతంజలి ఆయిల్ పామ్ కంపెనీ తెలంగాణ డివిజనల్ మేనేజర్ బి. యాదగిరి, మేనేజర్ జె. హరీష్, జూనియర్ మేనేజర్ శశి కుమార్, ఫీల్డ్ ఆఫీసర్ వెంకట్, క్షేత్ర సహాయకులు యానాల సుధాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ కాషయ్య, సుధాకర్, డ్రిప్ ప్రతినిధి మోహన్ పాల్గొన్నారు. ఫ జిల్లా ఉద్యాన శాఖ అధికారి నాగయ్య -
డుమ్మా కొట్టడం కుదరదిక!
ఉద్యోగుల వివరాల సేకరణ.. జిల్లాలోని 23 మండలాల్లో మండల పరిషత్ కార్యాలయాలు ఉన్నాయి. ఆయా కార్యాలయాల్లో సుమారు 12 నుంచి 15 మంది వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. అలాగే జిల్లా పరిషత్ కార్యాలయంలో సుమారు 20 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. గతంలో వేలిముద్రల హాజరు విధానం కార్యాలయాల్లో సరిగ్గా అమలు కాలేదు. సంబంధించిన పరికరాల మరమ్మతుల కారణంగా కొద్దిరోజుల అనంతరం వాటిని మూలన పడేశారు. ఫేస్ రికగ్నైజేషన్ హాజరు నమోదుకు ఉద్యోగులు, అధికారుల వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఉద్యోగుల ఆధార్ కార్డులోని వివరాలు సేకరిస్తున్నారు. విధులకు హాజరు.. ఇంటికి వెళ్లే సమయాల్లో రెండుసార్లు ఫేస్ రికగ్నైజేషన్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. హాజరు యంత్రానికి జీపీఎస్ను అనుసంధానం చేయనున్నారు. హాజరు నమోదు వివరాలు రాష్ట్ర కార్యాలయానికి పంపిస్తారు. నాగారం : జిల్లా, మండల పరిషత్ అధికారులు, ఉద్యోగులకు ఇక నుంచి ఫేస్ రికగ్నైజేషన్ హాజరు అమలుకానుంది. ప్రస్తుతం రిజిస్టర్లో పేర్లు రాస్తుండటంతో కొందరు విధులకు హాజరు కాకపోయినా నమోదు చేసుకుంటున్నారు. ఆలస్యమైనా సమయానికి వచ్చినట్లు హాజరు వేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఈ అవకతవకలను అరికట్టడానికే ఈ కొత్త విధానాన్ని అమలులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఉద్యోగుల సమయపాలన, హాజరు సమయాలు పక్కాగా ఉండేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ విధానం అమలు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలోని 23 మండలాలు, ఒక జిల్లా పరిషత్ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది, అధికారులు తప్పనిసరిగా ఫేస్ రికగ్నైజేషన్ హాజరు నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధానం అమలుకు అధికార యంత్రాంగం కసరత్తు మొదలు పెట్టింది. పూర్తి స్థాయి సేవలు.. ఈ విధానంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు పక్కాగా అమలయ్యే అవకాశం ఉంటుంది. సంక్షేమ పథకాల అమలులో మండల స్థాయి అధికారులు కీలకపాత్ర పోషిస్తారు. గ్రామం నుంచి మండల స్థాయి వరకు అధికారుల పర్యవేక్షణ, సిబ్బంది పనితీరు సక్రమంగా ఉంటే ఫలాలు ప్రజలకు అందుతాయి. మండల పరిధిలోని ప్రభుత్వ పంచాయతీరాజ్, గృహనిర్మాణ, ఉపాధిహామీ శాఖల అధికారులు, ఎంపీడీఓలు, ఎంపీఓల పర్యవేక్షణ కీలకం. సాంకేతిక సిబ్బంది, డేటా ఎంట్రీ ఆపరేటర్ల హాజరు కూడా ప్రభావం చూపుతుంది. కార్యాలయాల్లో వీరి సమయపాలన, హాజరుతో పథకాలు పరుగులు పెడతాయి. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరే విధంగా పర్యవేక్షణ ఉండనుంది. ఫ జిల్లా, మండల పరిషత్ కార్యాలయాల ఉద్యోగులకు ఫేస్ రికగ్నైజేషన్ హాజరు ఫ సిబ్బంది వివరాలు సేకరించే పనిలో ఉన్నతాధికారులు ఫ రోజూ రెండు పర్యాయాలు హాజరు నమోదు ఫ హాజరు మిషన్కు జీపీఎస్ అనుసంధానం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి జిల్లా, మండల పరిషత్ కార్యాలయాల్లో ఫేస్ రికగ్నైజేషన్ విధానం అమలు చేయాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. దీనిని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ కొత్త విధానంతో ఉద్యోగుల సమయపాలన పక్కాగా ఉంటుంది. – కె.యాదగిరి, జిల్లా పంచాయతీ అధికారి -
ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా వెంకటరమణ
కోదాడరూరల్ : కోదాడ మండల పరిధిలోని కాపుగల్లుకు చెందిన ముత్తవరపు వెంకటరమణ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా ఎంపికయ్యారు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) వారు బుధవారం న్యూఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ఎంపిక చేశారు. ఇండియాలో ఫార్మసీ విద్యను అభివృద్ధి చేయడం, కొత్త కళాశాలల మంజూరుతో పాటు రెన్యువల్ చేయడంలో కీలకపాత్ర పోషించనున్నారు. ముత్తవరపు భాస్కర్రావు, కుమారి దంపతుల కుమారుడు వెంకటరమణ 10వ తరగతి వర కు కోదాడ సెయింట్ జోసెఫ్ సీసీరెడ్డి పాఠశాలలో, ఇంటర్ విజయవాడ విశ్వశ్రీ కళాశాలలో , బీఫార్మసీని కర్ణాటకలో, ఎం ఫార్మసీ అన్నామలై యూనివర్సిటీలో, పీహెచ్డీ నాగార్జున యూనివర్సిటీలో పూర్తి చేశారు. ఆయన ప్రస్తుతం మొయినాబాద్లోని ఆజాద్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్గా, నేషనల్ ఫార్మసీ టీచర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. ఆయనను డీసీసీబీ మాజీ చైర్మన్ పాండురంగారావు, కాపుగల్లు మాజీ సర్పంచ్ సతీష్, పీఏసీఎస్ చైర్మన్ సూర్యం, రిటైర్డ్ హెచ్ఎం రామారావు, హనుమంతరావు అభినందించారు. -
యాదవులకు మంత్రి పదవి లేకపోవడం బాధాకరం
సూర్యాపేట : యాదవులకు తెలంగాణ ప్రభుత్వంలో మంత్రి పదవి లేకపోవడం బాధాకరమని బీసీ జన సభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ పేర్కొన్నారు. యాదవ జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 30న ఇందిరా పార్క్లోని ధర్నా చౌక్ వద్ద నిర్వహించనున్న యాదవ ఆత్మగౌరవ ధర్నా పోస్టర్ను గురువారం సూర్యాపేట పట్టణంలో ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేబినెట్ యాదవ మంత్రులు లేకుండా ప్రభుత్వాలు లేవని గుర్తు చేశారు. రాష్ట్ర జనాభాలో 28 లక్షల మంది యాదవులు ఉన్నప్పటికీ మంత్రి పదవి ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం యాదవులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 10 కోట్లతో యాదవ కార్పొరేషన్ ఏమైందని ప్రశ్నించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పని అయిపోతుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోడింగ్ గోవర్దన్ యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు మేకల కృష్ణ, అఖిలభారత యాదవ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు మర్యాద సైదులు యాదవ్, ప్రధాన కార్యదర్శి తూము వెంకన్న యాదవ్, యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు తగుల జనార్దన్ యాదవ్, యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా గౌరవ అధ్యక్షుడు సుంకరబోయిన వెంకన్న యాదవ్, మాజీ సర్పంచ్ గుడ్డేటి సైదులు యాదవ్, కోడి లింగయ్య యాదవ్, బడుగుల సైదులు యాదవ్, కంచుగట్ల జానయ్య యాదవ్, నాగార్జున యాదవ్, సైదులు యాదవ్, కాసం రాము యాదవ్, ఉగ్గం నగేష్ యాదవ్ ఉన్నారు. -
వికాసం.. ఆలస్యం!
భానుపురి (సూర్యాపేట) : రాజీవ్ యువవికాసం యూనిట్ల మంజూరులో సందిగ్ధత నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 16,738 యూనిట్లు లక్ష్యం కాగా 60,304 దరఖాస్తులు వచ్చాయి. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొంతమందికి మంజూరు పత్రాలు ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మండల స్థాయిలోనే ఓ కొలిక్కి రానట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం యూనిట్ల మంజూరు పత్రాల పంపిణీని నిలిపివేసింది. ఇప్పుడు వీరందరికీ ఎదురుచూపులు తప్పడం లేదు. 60,304 దరఖాస్తులు రాజీవ్ యువ వికాసం పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రూ.50వేల నుంచి రూ.4లక్షల వరకు రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 16,738 మందికి రుణాలను మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటికోసం ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా 16,738 యూనిట్ల లక్ష్యానికి ఏకంగా 60,304 యూనిట్ల కోసం దరఖాస్తులు రావడంతో మండల స్థాయిలో ఎంపిక చేయాలని నిర్ణయించారు. కొలిక్కిరాని జాబితాలు.. రుణాల కోసం వచ్చిన దరఖాస్తుల నుంచి మండల స్థాయిలోనే అర్హుల జాబితాలను సిద్ధం చేయాల్సి ఉంది. ఈ జాబితాలు జిల్లాస్థాయికి పంపిస్తే .. అక్కడ బడ్జెట్ అంచనాలను రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాల్సి ఉంది. కానీ మండల లెవల్ కమిటీలు తుది జాబితాలను పూర్తి చేయడంలో ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఈ కమిటీలో ఎంపీడీఓ, మండల స్థాయి డీఆర్డీఏ సిబ్బంది, బ్యాంక్ సిబ్బంది ఉండగా.. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే ఇంకా తుది జాబితాలు సిద్ధం కాలేదని సమాచారం. ఈ నేపథ్యంలో జాబితాలు ఎప్పుడు పూర్తవుతాయి..? మంజూరు పత్రాలు ఎప్పుడు ఇస్తారోనని దరఖాస్తుదారులు ఎదురు చూస్తున్నారు.సందిగ్ధంలో రాజీవ్ యువవికాసం లబ్ధిదారులు ఫ జూన్ 2వ తేదీనే చెక్కుల పంపిణీ అంటూ హడావుడి ఫ అర్ధంతరంగా నిలిపివేత ఫ మండల స్థాయిలోనే కొలిక్కిరాని ఎంపికలు ఫ జిల్లా వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులు 60,304 ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది : రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ఎలాంటి ఆదేశాలు ప్రభుత్వం నుంచి రాలేదు. ఇంకా తుది జాబితా కూడా పూర్తికాలేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇస్తాం. –శ్రీనివాస్నాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రుణం యూనిట్లు వచ్చిన లక్ష్యం దరఖాస్తులు రూ. 50వేలు 5,477 886 రూ. లక్ష 4,139 1431రూ. 2లక్షలు 3537 7361రూ. 2–4 లక్షల వరకు 3,429 50,602ఎస్సీకార్పొరేషన్ రుణం 156 24 -
ఇరాన్పై యుద్ధాన్ని ఆపాలి
సూర్యాపేట అర్బన్ : ఇరాన్పై ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధాన్ని నిలిపి శాంతిని నెలకొల్పాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్కుమార్ డిమాండ్ చేశారు. పాలస్తీనా, ఇరాన్లపై ఇజ్రాయిల్ దాడులు చేయడాన్ని నిరసిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గురువారం సూర్యాపేట కొత్త బస్టాండ్ వద్ద ఇజ్రాయిల్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా నాయకుడు బూర వెంకటేశ్వర్లు, సీపీఎం జిల్లా నాయకుడు కోట గోపి, ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి ఎస్కే నజీర్లతో కలిసి ఆయన మాట్లాడారు. ఇజ్రాయిల్ అణ్వాయుధాలు ఉన్నాయనే పేరుతోఈ నెల 13నుంచి ఇరాన్పై క్షిపణి దాడులు చేసిందని, ఆయిల్ కంపెనీల పైన, నివాసాలపైన బాంబులు వేయడం మూలంగా పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలతో లక్షలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు మన దేశానికి తిరిగి చేరుకుంటున్నారని అన్నారు. కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు గంట నాగయ్య, వరికుప్పల వెంకన్న, చెరుకు ఏకలక్ష్మి, కునుకుంట్ల సైదులు, బొడ్డు శంకర్, అలుగువెల్లి వెంకటరెడ్డి, పోలబోయిన కిరణ్, పుల్లూరి సింహాద్రి, దనియాకుల శ్రీకాంత్వర్మ, తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలకు అందుబాటులో ఉండాలి
నడిగూడెం : ప్రజలకు పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉండాలని ఎస్పీ కె.నరసింహ కోరారు. బుధవారం మోతె పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు, స్టేషన్లోని డైరీ, రిసెప్షన్ రిజిస్టర్, కేసుల స్థితిగతులు, పలు రిజిస్టర్లు పరిశీలించారు. అనంతరం పోలీస్ సిబ్బందితో మాట్లాడారు. పారదర్శకంగా పని చేయాలని, బాధితులకు సత్వర న్యాయం చేయాలన్నారు. నాణ్యమైన, వేగవంతమైన దర్యాప్తు చేయాలన్నారు. ముఖ్యంగా సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. ఆయన వెంట మునగాల సీఐ రామకృష్ణారెడ్డి, పోలీసు సిబ్బంది ఉన్నారు. పెన్షనర్ల సవరణ చట్టాన్ని రద్దు చేయాలికోదాడరూరల్ : కేంద్ర ప్రభుత్వం మార్చిలో నిర్వహించిన పార్లమెంట్ సమావేశాల్లో గుట్టు చప్పుడు కాకుండా పెన్షనర్ల చట్ట సవరణ బిల్లు ఆమోదించడం బాధాకరమని, దీనిని రద్దు చేయాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతరామయ్య కోరారు. బుధవారం కోదాడ పట్టణంలోని పెన్షనర్ భవన్లో చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన తెలిపి ఆయన మాట్లాడారు. పెన్షనర్ల హక్కులను, ప్రయోజనాలను కాలరాసేలా నూతన చట్టాన్ని రూపొందించడం సరైనది కాదని అన్నారు. బిల్లుకు వ్యతిరేకంగా ఈ నెల 23న కలెక్టరేట్లో కలెక్టర్కు వినతిపత్రాన్ని ఇచ్చే కార్యక్రమంలో పెన్షనర్లు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్య క్రమంలోబొల్లు రాంబాబు, రఘువరప్రసాద్, హనుమారెడ్డి, గడ్డం నర్సయ్య, సత్తయ్య, రుక్ముద్దీన్, సాంబులు, జాన్షరీఫ్, వరప్రసాద్, చంద్రశేఖర్రెడ్డి ఉన్నారు. కోదాడ నుంచి దాచేపల్లికి ఆర్టీసీ బస్సుమఠంపల్లి: కోదాడ డిపోనుంచి హుజూర్నగర్, మట్టపల్లి క్షేత్రం మీదుగా ఏపీలోని పల్నాడు జిల్లా దాచేపల్లికి ఆర్టీసీ పల్లె వెలుగు బస్సును బుధవారం కోదాడ డిపో మేనేజర్ బి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ మట్టపల్లి క్షేత్రానికి చేరుకునే రెండు తెలుగు రాష్ట్రాల భక్తుల కోరిక మేరకు మంత్రి ఉత్తమ్ చొరవతో బస్సును ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఉదయం 6 గంటలకు కోదాడలో బయలుదేరి హుజూర్నగర్,, మఠంపల్లి, మట్టపల్లి, తంగెడ. ముత్యాలంపాడు మీదుగా 8గంటల వరకు దాచేపల్లి చేరుకుంటుందన్నారు. తిరిగి దాచేపల్లిలో 8.30 కు బయలు దేరి ఉదయం 10.30కు హుజూర్నగర్కు చేరుకుంటుందని తెలిపారు. హుజూర్నగర్ నుంచి దాచేపల్లికి మూడు ట్రిప్పులు నడుపుతున్నట్లు చెప్పారు. సాయంత్రం దాచేపల్లినుంచి బయలు దేరి రాత్రి 7గంటల 10 నిమి షాలకు కోదాడ చేరుకుంటుదని వివరించారు. -
అభినందన సభను విజయవంతం చేద్దాం
కోదాడరూరల్ : సామాజిక ఉద్యమ వీరుడు, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా గురువారం హైదరాబాద్లో బీహెచ్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ఆత్మీయ అభినందన సభను విజయవంతం చేద్దామని ఆ సంఘ జాతీయ మహిళా అధ్యక్షురాలు భవాని చౌదరి అన్నారు. గురువారం కోదాడ పట్టణంలో నిర్వహించిన వీహెచ్పీఎస్ జిల్లా సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు. వికలాంగుల హక్కుల కోసం ఎమ్మార్పీ ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అనేక ఉద్యమాలు చేశారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ఆయన పోరాటాల ఫలితంగానే వికలాంగులకు పింఛన్ల పెంపు వంటి అనేక ప్రయోజనాలు కలిగాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు బచ్చలకూరి వెంకటేశ్వర్లు, వీహెచ్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి పేరేల్లి బాబు, నాయకులు ఏపూరి రాజుమాదిగ, వీహెచ్పీస్ నాయకులు కర్ల విజయరావు, రావి స్నేహలతచౌదరి, పులి నాగేశ్వరరావు, అంజయ్య, మోషయ్య, గుర్వయ్య, కొండలు, మజహర్, అహ్మద్, అనీష్బేగం, యూసఫ్ తదితరులు పాల్గొన్నారు. -
చిన్నారిని ఎత్తుకొని.. ఆప్యాయంగా పలకరించి
నడిగూడెం : మోతె మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రం–1ను కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ బుధవారం సందర్శించారు. అంగన్వాడీ కేంద్రంలోకి వచ్చిన కలెక్టర్కు చిన్నారి గుంటి తేజస్వని పాదాభివందనం చేసి, రెండు చేతులతో నమస్కారం చేసింది. దీంతో ముగ్ధుడైన కలెక్టర్ ఆ చిన్నారిని ఎత్తుకొని ముద్దాడి ఆప్యాయంగా పలకరించారు. చిన్నారిని పేరు అడిగి తెలుసుకున్న అనంతరం ఆమెను అభినందించారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట అంగన్వాడీ కార్యకర్త పార్వతి, తదితరులున్నారు. ప్రత్యామ్నాయ పంటలపై శ్రద్ధవహించాలి చివ్వెంల(సూర్యాపేట) : రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక శ్రద్ధవహించాలని కలెక్టర్ తేజస్నంద్లాల్ పవార్ సూచించారు. బుధవారం చివ్వెంల మండల పరిధిలోని మర్కాల వెంకట్ రెడ్డి ఆయిల్ పాం తోటను సందర్శించి మాట్లాడారు. ఆయిల్పాం, మామిడి, కొబ్బరి, అన్ని రకాల పండ్లు, నాటుకోళ్లు, గొర్రెల పెంపకం, సమీకృత సాగు పద్ధతి తదితర వివరాలను రైతును కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
కొత్త అడ్మిషన్లు 106
ఆరోతరగతిలోనే 72మంది చేరిక ఈ విద్యాసంవత్సరం ఒక్క ఆరో తరగతిలోనే 72 మంది విద్యార్థులు చేరారు. పాఠశాలలో కొత్తగా 106 మంది విద్యార్థులు చేరారు. దీంతో ఈస్కూల్లో మొత్తం విద్యార్థుల సంఖ్య 460కి చేరింది. మరో 50 వరకు అడ్మిషన్లు పెరుగుతాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. కోదాడరూరల్ : అది.. కోదాడ పట్టణంలోని పీఎంశ్రీ జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల. ఇక్కడి ఉపాధ్యాయులకు విధుల పట్ల ఉన్న అంకితభావం.. కృషి.. ఉత్తమ బోధన.. వెరసి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగేలా చేస్తోంది. బుధవారం ఓ విద్యార్థిని ఎంఈఓ సలీమ్ షరీఫ్ పాఠశాలలో చేర్చుకున్నారు. తద్వారా ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 106 మంది విద్యార్థులు కొత్తగా అడ్మిషన్ తీసుకున్నట్లు అయ్యింది. మంచి ఫలితాలు సాధించడంతో.. ఈ పాఠశాలలో గత సంవత్సరం మొత్తం 455మంది ఉండేవారు. వీరిలో పదో తరగతిలో 99 మంది ఉండేవారు. గత సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో ఇక్కడి విద్యార్థి 571 మార్కులు సాధించడం ద్వారా జిల్లాలోనే టాపర్గా నిలవడంతో పాటు మరో ఆరుగురు 500కుపైగా మార్కులు సాధించారు. అదే విధంగా ఎన్ఎంఎంఎస్ మెరిట్ స్కాలర్షిప్కు ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు. ఇదంతా ఉపాధ్యాయుల కృషికి నిదర్శనంగా చెబుతున్నారు. వినూత్న రీతిలో ప్రచారం ఈ విద్యా సంవత్సరంలో బడిబాటలో భాగంగా విద్యార్థుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు వినూత్న రీతిలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆటోకు మైక్ ఏర్పాటు చేసుకొని కోదాడ పట్టణంతో పాటు సమీపంలోని శ్రీరంగాపురం, అశోక్నగర్, దుర్గాపురం, సాలార్జంగ్పేట్, రామిరెడ్డిపాలెం, వెంకట్రాంపురం, ఖానాపురం, అజ్మీరతండా, బొజ్జగూడెం తండాల్లో ప్రచారం నిర్వించారు. ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సౌకర్యాలు, ఉత్తమ బోధన, ఉచితంగా అందిస్తున్న పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం తదితర అంశాలపై విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు వివరించారు. తరగతుల వారీగా కొత్త అడ్మిషన్లు తరగతి విద్యార్థుల సంఖ్య 6వ 72 7 08 8 16 9 05 10 05ఫ కోదాడ జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో చేరేందుకు విద్యార్థుల ఆసక్తి ఫ 460కి చేరిన మొత్తం విద్యార్థుల సంఖ్య ఫ ఉపాధ్యాయుల కృషి, ఉత్తమ బోధన ఫలితం -
కొత్తగా
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో నియోజకవర్గాలను పెంచాలన్న నిబంధన ఉంది. అయితే, 2021లో జరగాల్సిన జనగణన ఆలస్యం కావడంతో నియోజకవర్గాల పునర్విభజన ఆగిపోయింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం జనగణనకు రెండు రోజుల కిందట గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో మళ్లీ నియోజకవర్గాల పునర్విభజన చర్చ తెరపైకి వచ్చింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం 12 నియోజకవర్గాలు ఉన్నాయి. 2001 జనాభా లెక్కల ప్రకారం 2008 చివరలో నియోజక వర్గాలను పునర్ వ్యవస్థీకరించారు. అంతకుముందు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉండేవి. 2008 పునర్విభజన తర్వాత కూడా ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాలున్నాయి. అదనంగా ఏమీ పెరుగలేదు. అప్పట్లో రామన్నపేట నియోజకవర్గం రద్దయి, కొత్తగా హుజూర్నగర్ ఏర్పడగా, చలకుర్తి నియోజకవర్గం స్థానంలో నాగార్జునసాగర్ నియోజకవర్గంగా ఏర్పడింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా జనాభా 50 లక్షల వరకు పెరిగినట్లు అంచనా. దాని ప్రకారం మూడు నియోజకవర్గాలు కొత్తగా ఏర్పడనున్నాయి. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో ఒక్కో నియోజకవర్గం పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు, రాజకీయ నేతలు చెబుతున్నారు. జిల్లా పరిధి మారకుండా పునర్విభజన నియోజకవర్గాల పునర్విభజనను భౌగోళిక అంశాలు, పరిపాలన సౌలభ్యం పరిగణనలోకి తీసుకొని ఆ జిల్లాల్లోనే నియోజకవర్గాల పరిధిలోని మండలాలు, గ్రామాలు ఉండేలా చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం కొన్ని మండలాలు ఒక జిల్లా పరిధిలో ఉండగా, మరికొన్ని మండలాలు మరో జిల్లా పరిధిలోని నియోజకవర్గంలో ఉన్నాయి. రామన్నపేట, మోత్కూరు, చౌటుప్పల్, నారాయణపూర్, శాలిగౌరారం మండలాలే ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో ఒక నియోజకవర్గంలోని మండలాలు, గ్రామాలు అదే జిల్లాలో ఉండేలా పునర్విభజన చేసే అవకాశం ఉంది. మరోవైపు 2027లో పూర్తయ్యే జనగణన తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం జనాభా ప్రతిపాదికన.. లేక ఓటర్ల ప్రాతిపదికన నియోజక వర్గాలను ఏర్పాటు చేస్తుందా అనేది కూడా తేలాల్సి ఉంది.తెరపైకి పాత నియోజకవర్గాలు.. గతంలో రద్దయిన పాత నియోజకవర్గాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. 2027లో జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరుగనుంది. అయితే మూడు నియోజకవర్గాలు కొత్తగా ఏర్పడనున్నందున అందులో తిరిగి రద్దయిన పాత నియోజకవర్గాల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. మరోవైపు నల్లగొండ, సూర్యాపేట పట్టణాల్లో అర్బన్, రూరల్ నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తారన్న చర్చ జరగుతోంది. రామన్నపేట లేదంటే చౌటుప్పల్..ప్రస్తుతం రామన్నపేట మండలం యాదాద్రి జిల్లాలో ఉన్నప్పటికీ అసెంబ్లీ నియోజకవర్గం పరిధి మాత్రం నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ నియోజకవర్గంలో ఉంది. ఇప్పుడు మళ్లీ రామన్నపేట నియోజకర్గం ఏర్పాటు చేస్తారనే చర్చ జరుగుతోంది. ఒకవేళ రామన్నపేట నియోజకవర్గం ఏర్పడితే దాని పరిధిలో రామన్నపేట మండలంతో పాటు వలిగొండ, ఆత్మకూర్ (ఎం), చౌటుప్పల్, నారాయణపూర్, భూదాన్ పోచంపల్లి మండలాలతో కలిపి నియోజకవర్గంగా ఏర్పడే అవకాశం ఉంది. లేదంటే అదే జిల్లాలో ప్రస్తుతం రెవెన్యూ డివిజన్గా ఉన్న చౌటుప్పల్నే నియోజకవర్గ కేంద్రంగా చేసి ఇదే మండలాలతో కొత్త నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఇక శాలిగౌరారం మండలాన్ని నకిరేకల్ నియోజకవర్గంలో కలిపే అవకాశం ఉంది. అసెంబ్లీ సెగ్మెంట్లునాగారం నియోజకవర్గం కూడా.. ప్రస్తుతం తుంగతుర్తి నియోజకవర్గంలోని నాగారంను కూడా నియోజకవర్గం చేస్తారనే చర్చ జరుగుతోంది. నాగారం గతంలో నియోజకవర్గంగా ఉంది. అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి 1962లో ఎ.రంగారెడ్డి గెలుపొందారు. అయితే 1966లో ఆ నియోజకవర్గం రద్దయి, తుంగతుర్తి ఏర్పడింది. ప్రస్తుతం నియోజకవర్గాల పునర్విభజనలో మళ్లీ దానిని ఏర్పాటు చేస్తారన్న చర్చ సాగుతోంది. నాగారంను తిరిగి నియోజకవర్గంగా చేయాల్సి వస్తే నాగారం, అడ్డగూడూరు, తిరుమలగిరి, అర్వపల్లి మండలాలతో చేసే అవకాశం ఉంది. 33 శాతం మహిళా రిజర్వేషన్.. కొత్తగా ఏర్పాటు చేసే నియోజకవర్గాల పునర్విభజనతోపాటు 33 శాతం చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల కోసం కేంద్రం చర్యలు చేపడుతోంది. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో దీనిని కచ్చితంగా అమలు చేసే అవకాశం ఉంది. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలోనూ 2028 అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు సీట్లు మహిళలకే దక్కనున్నాయి. సూర్యాపేటలోనూ అర్బన్ నియోజకవర్గం ప్రస్తుతం సూర్యాపేట నియోజకవర్గంలో సూర్యాపేట టౌన్తో పాటు రూరల్ మండలాన్ని కలుపుకొని సూర్యాపేట అర్బన్ నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేస్తారన్న చర్చ సాగుతోంది. సూర్యాపేట రూరల్ నియోజకవర్గాన్ని ఆత్మకూర్ (ఎస్), చివ్వెంల, పెన్పహాడ్, ప్రస్తుతం కోదాడలోని మోతె మండలాలను కలుపుతూ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అయితే నాగారం నియోజకవర్గం ఏర్పాటైతే సూర్యాపేట రూరల్ నియోజకవర్గం ఉండకపోవచ్చని, సూర్యాపేట రూరల్ ఉంటే నాగారం నియోజకవర్గం ఏర్పాటు చేసే అవకాశం ఉండదనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. -
స్థానిక ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధం
సూర్యాపేటటౌన్ : తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ స్పష్టం చేశారు. బుధవారం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామపంచాయతీ ఎన్నికలు కావాలని మొదటి నుంచి బీఆర్ ఎస్ కోరుతోందన్నారు. కాంగ్రెస్కు చరమగీతం పాడేందుకు స్థానిక సంస్థల ఎన్నికలు వేదిక కానున్నాయన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలు ఆలస్యం కావడంతో గ్రామాల్లో సమస్యలు పేరుకుపోతున్నాయన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా బీసీలకు ఇచ్చిన హామీ మేరకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. గతంలో జరిగిన కులగణనలో కూడా బీసీల జనాభాను తగ్గించి 56శాతంగా చూపించి బీసీలకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు బీసీలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో బీసీలకు మంత్రి పదవులు, కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వలేదన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థమాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, ఉప్పల ఆనంద్, పుట్ట కిషోర్, నెమ్మాది భిక్షం, జీడి భిక్షం, మడిపల్లి విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.ఫబీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ -
మందుల కొరత లేకుండా చూడాలి
నడిగూడెం : ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా చూడాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. బుధవారం మోతె మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మొత్తం తిరిగి ఆవరణను పరిశీలించారు. ఆస్పత్రిలో ప్రసవాలు చేస్తున్నారా లేదా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థుల సంఖ్యను పెంచాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. నోట్బుక్స్, పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందిందా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం, కూరలను పరిశీలించారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని పరిశీలించారు. పాఠశాల భవనం పై భాగంలో నీరు నిల్వ ఉండడంతో ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిసరాలు, మరుగుదొడ్లు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. మన గ్రోమోర్ ఎరువుల షాపును కూడా తనిఖీ చేశారు. ఆయన వెంట మండల ప్రత్యేక అధికారి సీతారామ్ నాయక్, ఎంపీడీఓ ఆంజనేయులు, ఏడీఏ యల్లయ్య, డాటాఎంట్రీ ఆపరేటర్ జ్యోతి, లక్ష్మి, కామేశ్వరి తదితరులున్నారు. -
పెట్టుబడి సాయం రూ.167.69కోట్లు
భానుపురి (సూర్యాపేట) : వానాకాలం – 2025 సీజన్కు సంబంధించి పంట పెట్టుబడి సాయం కింద సూర్యాపేట జిల్లాలో మూడు ఎకరాలలోపు వరకు ఉన్న 2,17,698 మంది రైతులకు రూ.167.69 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఓ ప్రకటనలో వెల్లడించారు. వ్యవసాయాన్ని పండుగలా మారుస్తూ, రైతులకు బాసటగా నిలవాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం జిల్లాలోని చిన్న, సన్నకారు రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తోందని పేర్కొన్నారు. రైతుల బ్యాంకు ఖాతా వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారులు ఇప్పటికే రైతు భరోసా పోర్టల్ లో నమోదు చేశారని తెలిపారు. పెట్టుబడి భారం తగ్గించి, వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించేందుకు రైతు భరోసా ఉపయుక్తంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఫ మూడు ఎకరాల లోపు ఉన్న 2,17,698 మంది రైతుల ఖాతాల్లో జమ ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
మట్టపల్లి క్షేత్రంలో నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో మంగళవారం శ్రీరాజ్యలక్ష్మిచెంచులక్ష్మిసమేత శ్రీలక్ష్మీనరసింహ స్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఆలయంలో సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, ఎదుర్కోళ్లమహోత్సవ సంవాదం చేపట్టారు. కల్యాణవేడుకలో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మదుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలు కార్యక్రమాలు జరిపించారు. గరుడవాహనంపై స్వామివారిని తిరుమాడవీధుల్లో ఊరేగించారు. శ్రీసుబ్రహ్మణ్య స్వామి కల్యాణం మట్టపల్లి క్షేత్రంలోని శివాలయంలో శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్యస్వామి కల్యాణాన్ని మంగళవారం అర్చకులు నిర్వహించారు. గణపతిపూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మాంగళ్యధారణ, తలంబ్రాలతో కల్యాణతంతు ముగించారు. ఈకార్యక్రమంలో విజయ్కుమార్, మట్టపల్లిరావు, నవీన్కుమార్, శ్రీనివాసాచార్యులు, పద్మనాభా చా ర్యులు, బదరీనారాయణాచార్యులు, లక్ష్మీనరసింహ మూర్తి, ఫణిభూషణ మంగాచార్యులు , ఆంజనేయాచార్యులు, శేషగిరిరావు, దుర్గాప్రసాద్శర్మ, సీతారామాచార్యులు, సుబ్రహ్మణ్యం, రాజేష్ పాల్గొన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
భానుపురి (సూర్యాపేట) : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలు – 2025 కోసం హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో గిరిజన ఐఏఎస్ స్టడీ సర్కిల్ ద్వారా రెసిడెన్షియల్ పద్ధతిలో శిక్షణ ఇచ్చేందుకు ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులనుంచి ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కె.శంకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 14వ తేదీ నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకోసం 6281766534 నంబర్ను అన్ని పనిదినాల్లో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల లోపు సంప్రదించాలని కోరారు. అక్రమ రవాణాను నిరోధించాలిసూర్యాపేటటౌన్ : అక్రమ రవాణాను నిరోధించాలని జిల్లా ఎస్పీ కె.నరసింహ సూచించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద, జాతీయ రహదారి వెంబడి మంగళవారం రాత్రి స్థానిక పోలీసులతో కలిసి పౌరుల, ప్రయాణికుల భద్రత, రక్షణను ఎస్పీ పరిశీలించి మాట్లాడారు. ప్రజలకు పూర్తి స్థాయి భద్రత కల్పించడానికి, భరోసా కల్పించడానికి నిత్యం తనిఖీలు చేయాలన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సూర్యాపేట పట్టణం ముఖ్య రవాణా కేంద్రంగా ఉందని ఇక్కడ పోలీసు శాఖ అనునిత్యం అప్రమత్తంగా ఉందన్నారు. అక్రమ రవాణా జరగకుండా నిఘా ఏర్పాటు చేయాలన్నారు.అనుమానిత వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రణాళికతో పని చేయాలన్నారు. బారికేడ్లు, డివైడర్లు ఏర్పాటు చేసుకోవాలని, రోడ్ల ను ఆక్రమించి వ్యాపారాలు చేసేవారిని సర్దుబాటు చేయాలని ట్రాఫిక్ పోలీసులకు ఎస్పీ సూచించారు. పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాలకు ఎసరు భానుపురి (సూర్యాపేట) : పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాలకు ఎసరు పెట్టేలా కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో చట్టం ఆమోదించిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సుదర్శన్రెడ్డి ఆరోపించారు. కేంద్రం ఆమోదించిన చట్టానికి వ్యతిరేకంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్రం ఆమోదించిన బిల్లుతో పెన్షనర్లకు పీఆర్సీ, తదితర ఆర్థిక ప్రయోజనాల్లో ఆటంకాలు కలుగుతాయన్నారు. ఆల్ ఇండియా పెన్షనర్ల ఫెడరేషన్ పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లు రాంబాబు, కోశాధికారి ఎం.ఏ. హమీద్ఖాన్, సూర్యాపేట మండల అధ్యక్ష, కార్యదర్శులు డి.శ్యాంసుందర్రెడ్డి, ఎస్.నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోలులో రాణించారు
సూర్యాపేట : మహిళలు మహారాణుల్లా రాణిస్తున్నారు. రంగం ఏదైనా దూసుకుపోతున్నారు. అందుకు సూర్యాపేట జిల్లా స్వయం సహాయక సంఘాల మహిళలే నిదర్శనం. మహిళా శక్తి పేరున ప్రభుత్వం అతివలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుండగా.. ఇదే అవకాశంగా తమ సత్తా చాటుతున్నారు. జిల్లాలో యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లలో మహిళా సంఘాలు రాణించాయి. దాదాపు రూ.409 కోట్ల విలువైన 1,74,909 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 29,008 మంది రైతుల వద్ద కొనుగోలు చేశాయి. ఈ కొనుగోళ్లతో సుమారు రూ.5.58 కోట్ల మేర కమీషన్ను నిర్వాహకులు ఆర్జించారు. 163 కేంద్రాలు మహిళా సంఘాలవే.. సూర్యాపేట జిల్లాలో యాసంగి వరి ధాన్యం 4లక్షల మెట్రిక్ టన్నుల వరకు అమ్మకానికి వస్తుందని అధికారులు భావించారు. ఇందుకు గాను 331 సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే గతంలో 60నుంచి 70 సెంటర్లను మాత్రమే స్వయం సహాయక సంఘాలకు అప్పగించగా.. ఈ సారి ఏకంగా 163 కేంద్రాలను వీరితోనే నడిపించారు. ఈ కేటాయింపులో కలెక్టర్ తేజస్నంద్లాల్ పవార్ ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఇందిరా మహిళా శక్తి పేరుతో ప్రభుత్వం అవకాశాలిస్తుండగా.. జిల్లాలో ప్రత్యేకంగా స్కూల్ యూనిఫాం కుట్టడంలోనూ స్వయం సహాయక సంఘాల మహిళలే సత్తాచాటారు. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లు ఎక్కువగా అప్పగించాలని నిర్ణయించగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని సేకరించారు. ముందంజలో మహిళా సంఘాలు జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లలో మహిళా సంఘాలకు చెందిన మహిళలు రాణించారు. 163 కేంద్రాల్లో 29,008 మంది రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేశారు. ధాన్యం కొనుగోళ్లే కాకుండా ఏ రంగంలోనైనా జిల్లా స్వయం సహాయక సంఘాలు ముందంజలో ఉంటున్నాయి. – వి.వి. అప్పారావు, డీఆర్డీఓ ఫ ధాన్యం సేకరణ ద్వారా మహిళా సంఘాలకు రూ.5.58కోట్ల కమీషన్ ఫ యాసంగిలో దాదాపు రూ.409 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు ఫ త్వరలో విడుదల కానున్న కమీషన్ డబ్బులు వివాదాలు లేకుండా.. ప్రతీ సీజన్లో ధాన్యం కొనుగోళ్ల విషయంలో వివాదాలు తలెత్తుతూనే ఉంటాయి. ఈ సీజన్లో అలా కాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. మహిళా సంఘాల సభ్యులతో కమిటీలు వేసి ధాన్యం కొనుగోళ్లు చేపట్టారు. ప్రతి ఒక్కరూ ఒక్కో బాధ్యతను పంచుకుని సెంటర్ను నడిపించారు. గతంలో సెంటర్ల నిర్వహణలో ఉన్న లోటుపాట్లపై ముందే అధికార యంత్రాంగం అవగాహన కల్పించింది. ధాన్యం కొనుగోళ్లలో ఆత్మకూర్ (ఎస్) మండలం తుమ్మలపెన్పహాడ్ సంఘబంధం –3 ముందంజలో ఉంది. ఈ సంఘం 28వేల క్వింటాళ్ల ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసింది. -
నవోదయకు నాంది
ఉపాధిలో దివ్యాంగులకు ప్రాధాన్యంబుధవారం శ్రీ 18 శ్రీ జూన్ శ్రీ 2025సూర్యాపేట టౌన్: జిల్లా కేంద్రంలో జవహర్ నవోదయ విద్యాలయం తరగతులను తాత్కాలికంగా ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గత ఏడాది జిల్లాకు నవోదయ విద్యాలయాన్ని కేంద్రం మంజూరు చేయగా శాశ్వత భవన నిర్మాణానికి కోదాడలో ప్రభుత్వ స్థలాన్ని అధికారులు గుర్తించిన విషయం విదితమే. కాగా ఈ విద్యాసంవత్సరం(2025–26) నుంచి శ్రీకారం చుట్టేందుకు సూర్యాపేట పట్టణంలోని రెడ్డి హాస్టల్ భవనంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆరో తరగతిలో ప్రవేశాల కోసం పరీక్షసైతం నిర్వహించారు. వచ్చే నెల 14 న తరగతులు ప్రారంభించేలా ప్రణాళిక రూపొందించారు. శాశ్వత భవన నిర్మాణానికి కోదాడలో స్థలం గుర్తింపు సూర్యాపేట జిల్లాకు జవహర్ నవోదయ విద్యాలయాన్ని మంజూరు చేస్తూ గత ఏడాది డిసెంబర్ 6న కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనేపథ్యంలో అధికారులు విద్యాలయ శాశ్వత భవన నిర్మాణానికి స్థలం కోసం అన్వేషణ చేశారు. మొదట గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో 25 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. కానీ అది స్కూల్ భవన నిర్మాణానికి అనుకూలంగా లేదు. దీంతో కోదాడ కేఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీకాలేజీ స్థలంలో నిర్మించడానికి కలెక్టర్, ఆర్టీఓ నేతృత్వంలో 19 ఎకరాలను గుర్తించి సెంట్రల్ కమిటీ కి నివేదిక పంపించారు. ఆ కమిటీ కూడా ఈ స్థలాన్ని పరిశీలించి వెళ్లింది. అన్ని వసతులతో.. ఈ విద్యాసంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించాలని ఆదేశాలు రావడంతో జిల్లా కేంద్రంలో తాత్కాలికంగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. దీని కోసం జిల్లా కేంద్రంలోని రెడ్డి హాస్టల్ భవనంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో హాస్టల్, తరగతి గదుల్లో ఫర్నిచర్, ఇతర మెటీరియల్ అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులు భోజనం చేసేందుకు మెస్ హాల్, బాత్రూంలు, టాయిలెట్లు, బెడ్స్లు సిద్ధం చేస్తున్నారు. కార్పొరేట్ స్థాయిలో విద్యా ప్రమాణాలు.. జవహర్ నవోదయ విద్యాలయం అంటేనే కార్పొరేట్ స్థాయిలో విద్య ఉంటుంది. ఈనవోదయ విద్యాలయంలో నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యనందించనున్నారు. అయితే ఇందులో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు చదువుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ విద్యా సంవత్సరం ఆరో తరగతిలో ప్రవేశాలు కల్పించనున్నారు. ఇప్పటికే అర్హత పరీక్ష సైతం నిర్వహించారు. మెరిట్ ఆధారంగా విద్యార్థుల అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో 40 మంది విద్యార్థులను చేర్చుకోనున్నారు. ఈ నూతన విద్యా సంవత్సరాన్ని జూలై 14న అట్టహాసంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇందులో బోధించేందుకు అవసరమైన బోధన, బోధనేతర సిబ్బందిని కేటాయించారు. న్యూస్రీల్ఫ సూర్యాపేటలో తాత్కాలిక భవనంలో జవహర్ నవోదయ విద్యాలయం ఫ ఈ విద్యాసంవత్సరం నుంచి శ్రీకారం చుట్టేలా రెడ్డి హాస్టల్లో ఏర్పాట్లు ఫ 6వ తరగతిలో 40మంది విద్యార్థులకు ప్రవేశాలు ఫ జూలై 14న తరగతులు ప్రారంభించేలా సన్నాహాలు ఫ శాశ్వత భవన నిర్మాణానికి కోదాడలో 19ఎకరాల స్థలం గుర్తింపు -
పట్టు చికే్కదెవరికో..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీని బలపరుస్తారు.. ఎవరు పట్టు సాధిస్తారన్న చర్చ జరుగుతోంది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండగా అత్యధిక స్థానాలు ఆ పార్టీ కై వసం చేసుకుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పట్టు సాధిస్తుందా? బీఆర్ఎస్ గతంలో సాధించిన స్థానాలను నెలబెట్టుకుంటుందా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్దే పైచేయి 2019లో స్థానిక సంస్థల ఎన్నికల్లో సూర్యాపేట జిల్లాలో 235 ఎంపీటీసీ స్థానాల్లో బీఆర్ఎస్ 141, కాంగ్రెస్ 74, బీజేపీ 3, సీపీఐ 2, సీపీఎం 2, టీడీపీ 3, స్వతంత్రులు 10 స్థానాల్లో గెలుపొందారు. 23 ఎంపీపీలకు గాను బీఆర్ఎస్ 19, కాంగ్రెస్ 4 ఎంపీపీ పీఠాలు దక్కించుకున్నాయి. 23 జెడ్పీటీసీ స్థానాలకు గాను బీఆర్ఎస్ 20 స్థానాల్లో గెలుపొంది జెడ్పీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోగా, కాంగ్రెస్ 3 జెడ్పీటీసీ స్థానాలకే పరిమితమైంది. మారిన బలాబలాలు.. ఉమ్మడి జిల్లాలోని 12 ఎమ్మెల్యే స్థానాల్లో 2018 ఎన్నికల్లో 9 సీట్లను బీఆర్ఎస్, మూడు సీట్లను కాంగ్రెస్ గెలుచుకున్నాయి. నకిరేకల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన చిరుమర్తి లింగయ్య ఆ తరువాత బీఆర్ఎస్లో చేరారు. హుజూర్నగర్ నుంచి గెలుపొందిన ఉత్తమ్కుమార్రెడ్డి నల్లగొండ ఎంపీగా గెలుపొందటంతో ఎమ్మెల్యే పదవి రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి గెలుపొందారు. దీంతో 2019లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో బీఆర్ఎస్కు 11 మంది ఎమ్మెల్యేలు ఉండగా, కాంగ్రెస్కు మునుగోడు నుంచి ఒకే ఒక్క ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి (తరువాత బీజేపీలో చేరారు. మళ్లీ కాంగ్రెస్లోకి వచ్చారు) ఉన్నారు. కాంగ్రెస్కు ఇద్దరు ఎంపీలు కూడా ఉన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండడంతో ఎమ్మెల్యేల ప్రభావంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలను గెలుపొందింది. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుంచి 11 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని స్థానాలను కై వసం చేసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ తాము చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అధిక మొత్తంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను కై వసం చేసుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. అలాగే.. బీఆర్ఎస్ పార్టీ తమ పాత స్థానాలను కాపాడుకునే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. బీజేపీ కూడా ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. ఫ గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను దక్కించుకున్న బీఆర్ఎస్ ఫ ఈసారి పైచేయి సాధించేందుకు కాంగ్రెస్ ప్రణాళిక ఫ పల్లెల్లో జోరందుకున్న రాజకీయ చర్చలు -
పఠనాసక్తి పెంచేలా..
విద్యార్థుల్లో సమకాలీన అంశాలపై అవగాహన పెంచడానికి దినపత్రికల కొనుగోలుకు నిధులు మంజూరయ్యాయి.- 8లోఏర్పాట్లు చేస్తున్నాం నూతనంగా జిల్లాకు మంజూరైన నవోదయ విద్యాలయాన్ని జిల్లా కేంద్రంలోని రెడ్డి హాస్టల్ భవనంలో తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నాం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. విద్యార్థులకు కార్పోరేట్ స్థాయిలో విద్య అందుతుంది. – అశోక్, డీఈఓ -
పల్లెల్లో సా్థనిక జోష్
భానుపురి (సూర్యాపేట) : పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీలతో పాటు మున్సిపల్ ఎన్నికలు త్వరలోనే జరుగుతాయన్న సంకేతాలు రావడం.. వీటిపై రెండు మూడు రోజులుగా పలువురు మంత్రులు ప్రకటన చేయడమే కాకుండా సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో స్వయంగా సీఎం రేవంత్రెడ్డి స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో రాజకీయ నాయకుల్లో హడావుడి నెలకొంది. స్థానిక సంస్థల పదవీ కాలం ముగిసి దాదాపు ఏడాదిన్నర కావొస్తోంది. కేంద్రం నుంచి నిధుల విడుదల లేకపోవడంతో పల్లెల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. పలుమార్లు ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ముందుకు వచ్చినా రిజర్వేషన్లు, తదితర కారణాలతో వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోవడంతో ఇటు రాజకీయ నాయకులు, అటు అధికార యంత్రాంగం ఇక ఉరుకులు పరుగులు పెట్టనుంది. ఇక ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడొచ్చినా నిర్వహించేలా ఇప్పటికే అధికారులు సంసిద్ధంగా ఉన్నారు. ఈ నెలాఖరులోగా షెడ్యూల్..? పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ జరిగే అవకాశముందని ప్రచారం జరిగింది. ఈ మేరకు అధికారులకు ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు రావడంతో దాదాపు ఎన్నికల నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేశారు. ఓటర్ల జాబితా, బ్యాలెట్ బ్యాకుల సేకరణ, ఎన్నికల నిర్వహణకు కావాల్సిన సిబ్బంది, బ్యాలెట్ పేపర్ల ముద్రణ తదితర ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈలోగా బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం తెరపైకి రావడం, కోర్టు పరిధిలోకి వెళ్లడం, ఎటూ తేలకపోవడంతో కాస్త ఆలస్యమైంది. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ ప్రతిపక్షాల విమర్శలు, నిధుల కొరత, పల్లెల్లో నెలకొన్న సమస్యల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. అయితే మొదటగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల ఎన్నికలు నిర్వహించి.. ఆతర్వాతే గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు జరిపే అవకాశముంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ నిర్వహణకు దాదాపు ఈనెలాఖరు నాటికి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చి జూలై రెండోవారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. యథాతథంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు గత స్థానిక సంస్థల ఎన్నికల నాటికే జిల్లాలో 23 మండలాలు ఉన్నాయి. తదనంతరం కొత్త మండలాల ఏర్పాటు లేకపోవడంతో ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాల్లో ఎలాంటి మార్పులు లేవు. ఇక జిల్లావ్యాప్తంగా 475 గ్రామ పంచాయతీలతో గత ఎన్నికలు నిర్వహించగా.. ఇటీవల కొత్తగా 11 గ్రామపంచాయతీలు ఏర్పాటయ్యాయి. మొత్తంగా 486 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు సంబంధించి ఆయా నియోజకవర్గాల వారీగా ఉన్న జనాభా ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. వాటిని కలెక్టర్ ఆధ్వర్యంలోనే ఖరారు చేసి ప్రభుత్వానికి నివేదిస్తే ఈ జాబితా ఆధారంగానే రిజర్వేషన్లను ప్రభుత్వం ఆమోదించి జిల్లాకు పంపుతుంది. కేవలం జిల్లా పరిషత్ చైర్మన్ రిజర్వేషన్ మాత్రమే రాష్ట్రస్థాయిలో ప్రకటించనున్నారు. ఫ ఎన్నికల నిర్వహణపై సీఎం స్పష్టమైన సంకేతాలు ఫ గ్రామాల్లో ఒక్కసారిగా వేడెక్కిన రాజకీయం ఫ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న ఆశావహులు గ్రామపంచాయతీలు (పాతవి) : 475(కొత్తవి) : 11 మొత్తం : 486ఎంపీటీసీ స్థానాలు : 213జెడ్పీటీసీ స్థానాలు : 23పల్లెల్లో మొత్తం ఓటర్లు : 6,82,862మహిళా ఓటర్ల సంఖ్య : 3,47,320 పురుష ఓటర్ల సంఖ్య : 3,35,542 -
మోదీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
మునగాల: ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం మునగాల మండలం నర్సింహులగూడెంలో మండల పార్టీ అధ్యక్షుడు మైలార్శెట్టి నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన వికసిత భారత్ సంకల్ప సభలో ఆమె మాట్లాడారు. కేంద్ర పథకాలతో గ్రామీణ ప్రజలు అభివృద్ధి దిశగా ముందుకుసాగుతున్నారన్నారు. రచ్చబండ నిర్వహించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకు న్నారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కనగాల నారాయణ, భద్రంరాజు కృష్ణంరాజు, జల్లా జనార్దన్, మల్లెబోయిన వెంకటేష్బాబు, మండల నాయకులు శ్రీనివాసరెడ్డి, పనస రమేష్, కపిల్రెడ్డి, గోవిందాచారి, ఆర్.శ్రీనివాసరెడ్డి, పి.నాగరాజు, శ్రీకాంత్, ముదిరెడ్డి వెంకటరెడ్డి, మండవ చినసైదులు , వినోద్, ప్రభాకర్, లక్ష్మణ్ పాల్గొన్నారు. -
మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి
హుజూర్నగర్ : కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు కోరారు. 17న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే మహా ధర్నాకు సంబంధించిన పోస్టర్ను సోమవారం హుజూర్నగర్లోని సీపీఐ కార్యాలయంలో ఆవిష్కరించి మాట్లాడారు. కగార్ నిర్వహించే చోట ఖనిజ సంపద ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని కార్పొరేట్లకు అప్పగించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకుడు యల్లావుల రాములు, పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, నాయకులు రమేష్, కష్ణ, మామిడి వెంకయ్య, రమణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలి
చివ్వెంల(సూర్యాపేట) : ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ కోరారు. హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్రెడ్డి సోమవారం రైతునేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించగా చివ్వెంల మండల పరిధిలోని గాయంవారిగూడెంలోని రైతు వేదికలో రైతులు, అధికారులతో కలిసి కలెక్టర్ వీక్షించి మాట్లాడారు. రాష్ట్రంలో సూర్యాపేట జిల్లా రైతులు ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. సీఎం సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతు భరోసా పెట్టుబడితో రైతులు ఆన్ని రకాల పంటలు సాగు చేసకోవాలని సూచించారు. ఆదర్శ రైతులచే జిల్లాలోని రైతు వేదికల్లో వ్యవసాయ సాగు విధానాలపై వారి అనుభవాలు పంచకునే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో ఎస్పీ నరసింహ, మార్కెట్కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, మండల ప్రత్యేకాధికారి జగదీష్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, తహసీల్దార్ ప్రకాశ్రావు, ఏఓ వెంకటేశ్వర్లు, ఏఈఓ శైలజ పాల్గొన్నారు. -
యూరియా కోటాలో కోత!
భానుపురి, గుర్రంపోడు : యూరియా కోటాను కేంద్రం తగ్గిస్తోంది. రైతులు అధిక మోతాదులో యూరియా వాడకాన్ని తగ్గించేలా.. రాయితీపై అందిస్తున్న యూరియా పక్కదాటి పట్టకుండా చర్యలు తీసుకుంటోంది. అయితే.. కేంద్రం తీసుకుంటున్న చర్యలతో భవిష్యత్లో యూరియా కష్టాలు ఎదురయ్యేలా ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో వానాకాలంలో సాగయ్యే అన్ని పంటలకు కలుపుకుని 60,731 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా కానీ 30 శాతం తక్కువగా యూరియా కేటాయిస్తున్నారు. అయితే జిల్లాలో ఇప్పటివరకు 28,256 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది. అయితే జూలై నుంచి జిల్లాకు సరిపడా కోటా విడుదల అవుతుందా.. లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓటీపీ, వేలిముద్రతోనే పంపిణీ వ్యవసాయశాఖ ఇటీవల ఎరువుల డీలర్లకు కొత్త ఈపాస్ యంత్రాలను పంపిణీ చేసింది. యూరియా కొనుగోలు చేసే రైతులు తప్పనిసరిగా తమ సెల్ఫోన్కు వచ్చిన ఓటీపీని డీలర్కు చెప్పడం లేదా వేలిముద్ర వేయడం ద్వారానే యూరియా, ఇతర ఎరువులు కొనాల్సి ఉంటుంది. దీంతో యూరియా పక్కదారి పట్టకుండా పర్యవేక్షణ పక్కాగా ఉండనుంది. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అండగా ఉండేలా.. భారీగా రాయితీతో అందిస్తున్న యూరియా.. పక్కదారి పట్టి రసాయన పరిశ్రమలకు వాడుతుండటం వల్ల రాయితీ దుర్వినియోగం అవుతోంది. దీన్ని నివారించేందుకు ప్రభుత్వం ఇప్పటికే నీమ్ కోటెడ్ యూరియాను వినియోగంలోకి తెచ్చింది. అధిక మోతాదులో వాడితే నష్టమే.. యూరియాతో పోలిస్తే కాంప్లెక్స్ ఎరువుల ధరలు నాలిగింతలు అధికంగా ఉండటం, రసాయన ఎరువుల వాడకంపై సరైన అవగాహనలేకపోవడం వల్ల రైతులు యూరియాను విచ్చలవిడిగా వినియోగించి నష్టపోతున్నారు. ఎకరా వరికి రెండు బస్తాల యూరియా వాడాల్సి ఉండగా నాలుగు నుంచి ఆరు బస్తాల వరకు వాడుతున్నారు. యూరియాను వాడటం వల్ల పైరు పచ్చగా ఏపుగా ఉంటుంది. అధిక మోతాదులో వేసినప్పుడు తేలికగా నీటిలో కొట్టుకుని పోయి పైరుకు ఉపయోగపడదు. మొక్కలు సుకుమారంగా పెరగడం వల్ల చీడపీడలు, తెగుళ్ల బారిన పడతాయి. దీంతో పెట్టుబడి అధికమవుతుంది. వరి పైరు విపరీతంగా పెరిగి కోత సమయంలో పంట దిగుబడి పడిపోతుంది. పూత ఆలస్యంగా వచ్చి పంట కాలం పొడగించబడి దిగుబడి తగ్గుతుంది. వరిలో పూత దశ తర్వాత యూరియాను వేస్తే బియ్యపు గింజలో పొట్ట తెలుపు వచ్చి నూక ఎక్కువ అవుతుంది. అధిక మొత్తంగా యూరియా వాడకం వల్ల కలిగే అనర్థాలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. సాగు అంచనా 6,17,489 ఎకరాలు ఫ మోతాదుకు మించి వాడకుండా చర్యలు ఫ రాయితీ దుర్వినియోగం కాకుండా అడ్డుకట్ట ఫ భవిష్యత్లో పొంచి ఉన్న యూరియా కొరత ఫ రైతులకు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు అవసరమైన యూరియా 60,731 మెట్రిక్ టన్నులుఇప్పటివరకు వచ్చింది 28,256 మెట్రిక్ టన్నులుయూరియా వాడకంలో మెళకువలు ఫ ద్రవ రూప నానో యూరియా సాధారణ యూరియాతో సమానంగా పనిచేస్తుంది. నానో యూరియాను పిచికారీ చేయడం వల్ల వేగంగా మంచి ఫలితాలు వస్తాయి. రైతుకు బస్తాల భారం తగ్గుతుంది. ఫ మెట్ట పైర్లలో యూరియా వేసేటప్పుడు నేలలో తేమ ఉండేటట్లు చూసుకోవాలి. మెట్టపైర్లలో యూరియాను చల్లడం కన్నా మొక్క మొదట్లో గుంట తీసి వేస్తే మంచిది. ఫ పైరుకు సిఫారసు చేసిన యూరియాను రెండు, మూడు దఫాలుగా వేసుకోవాలి. ఫ యూరియాతోపాటు వేప పిండి (50 కేజీల యూరియాకు 5 కిలోల వేపపిండి) వాడితే నత్రజని మొక్కలకు ఎక్కువ కాలం అంది చీడపీడల వ్యాప్తి తగ్గుతుంది. ఫ పైరును బట్టి సేంద్రియ ఎరువులు, రైబోజియం మొదలగు జీవన ఎరువులు వాడి యూరియా మోతాదును తగ్గించుకోవచ్చు. ఫ కాంప్లెక్స్ ఎరువుల్లో కూడా నత్రజని ఉంటున్నందున యూరియాను మరీ ఎక్కువగా జోడించి వాడకూడదు. -
ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రజావాణి దరఖాస్తులను అధికారులు సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ కోరారు.సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకొని మాట్లాడారు. దరఖాస్తులను కూలంకషంగా పరిశీలించి వాటిని పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్ నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి మూడు రోజుల్లో పరిష్కారం చూపాలని, ఆ తర్వాత నివేదికలు అందజేయాలని ఆదేశించారు. ప్రజావాణిలో 102 దరఖాస్తులు వచ్చాయని, వాటిని సంబంధిత శాఖల అధికారులకు పరిష్కారం నిమిత్తం పంపినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.రాంబాబు, డీఆర్డీఓ వివి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
రైతు భరోసా వచ్చె..
దరఖాస్తులు స్వీకరిస్తున్నాం రెండెకరాల వరకు భూమి ఉన్న రైతుల అకౌంట్లలో రైతు భరోసా డబ్బులు జమ య్యాయి. కొత్తగా పట్టాలు పొందిన రైతులకూ పెట్టుబడిసాయం ఇవ్వాలని నిర్ణయించారు. వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నాం. – జి.శ్రీధర్రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి భానుపురి (సూర్యాపేట) : వానాకాలం వ్యవసాయ పనులను రైతులు ముమ్మరం చేశారు. విత్తనాలు విత్తుకోవడం మొదలుపెట్టారు. ఈ సమయంలో సాగు ఖర్చులకోసం అన్నదాతలకు బాసటగా నిలిచేందుకు ప్రభుత్వం రైతుభరోసా డబ్బులు విడుదల చేసింది. సోమవారం జిల్లాలో రెండెకరాల వరకు భూమి ఉన్న 1,11,752 మంది రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేసింది. అలాగే ఈనెల 5 లోపు కొత్తగా భూములకు పట్టాలు పొందిన రైతులకు సైతం రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించి వారినుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈనెల 18వరకు దరఖాస్తుకు గడువు ఉంది. ఇది పూర్తయ్యాక వీరికి కూడా రైతు భరోసా అందనుంది. గత యాసంగిలో 2,44,423 మందికి సూర్యాపేట జిల్లాలో 2,70,853 మంది రైతులకు కలిపి 6.19లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అనర్హులకు రైతు భరోసా అందుతుందని భావించి విచారణ చేపట్టింది. అనర్హులను తొలగించి జిల్లాలో 2,44,423 మంది రైతులకు గత యాసంగిలో రూ.227.44 కోట్లు జమ చేసింది. సూర్యాపేట జిల్లాలో కొత్తగా పట్టాలు పొందిన 5,043 మంది రైతుల వివరాలను సీసీఎల్ఏ అధికారులు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు జాబితాను పంపారు. బ్యాంకు వివరాలు ఇవ్వని వారిపైన దృష్టి.. గత యాసంగిలో ప్రభుత్వం అందించిన రైతు భరోసా నిధులు చాలామంది రైతులకు అందలేదు. చాలామంది పట్టాలు పొంది ఉన్నప్పటికీ బ్యాంకు వివరాలను అధికారులకు ఇవ్వడంలో పొరపాట్లు చేస్తున్నారు. కొందరు బ్యాంకు వివరాలు ఇచ్చినా ఆధార్ వివరాలతో సరిపోలేకపోవడంతో తప్పుగా నమోదవుతున్నాయి. ఇలా చాలామందికి రైతు భరోసా అందడం లేదు. ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం వ్యవసాయ అధికారులకు సూచించింది. అధికారులు సైతం ఈ దిశగా చర్యలకు ఉపక్రమించగా దాదాపు 900 మంది వరకు ఉన్నట్లు తెలిసింది. కొత్తగా పట్టాలు పొందిన రైతులు రైతు భరోసా సాయం కోసం సంబంధిత మండలాల్లోని ఏఈఓలకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా జిరాక్స్ ప్రతులతో ఈనెల 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఫ రెండెకరాల వరకు భూమి ఉన్న 1,11,752 మంది రైతుల ఖాతాల్లో సోమవారం డబ్బులు జమ ఫ విడతల వారీగా మిగతా రైతులకు.. ఫ కొత్తగా పట్టాలు పొందిన వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ -
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల
సూర్యాపేటటౌన్ : ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. మొదటి సంవత్సరం జనరల్ విభాగంలో 4,177 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,725 మంది పాసై 65.24శాతం ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ విభాగంలో 707మంది విద్యార్థులకు గాను 455 మంది విద్యార్థులు పాస్ కాగా 64.36శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే ద్వితీయ సంవత్సరంలో 2,132 మంది విద్యార్థులకు గాను 1,447 మంది విద్యార్థులు పాసై 67.87శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే ఒకేషనల్ విభాగంలో 480 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 345 మంది పాసై 71.88శాతం ఉత్తీర్ణత సాధించారు. బాధితులకు అండగా ఉండాలి సూర్యాపేటటౌన్ : ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ బాధితులకు పోలీసులు అండగా ఉండాలని జిల్లా ఎస్పీ కె.నరసింహ సూచించారు. సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులతో మాట్లాడి వారి ఫిర్యాదులు స్వీకరించి మాట్లాడారు. పిర్యాదుదారులకు భరోసా కల్పించాలని, ప్రతి అంశాన్ని చట్ట పరిధిలో పరిష్కరించడంలో, బాధితులకు న్యాయం చేయడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలిఆత్మకూర్(ఎస్)(సూర్యాపేట): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని జిల్లా విద్యాధికారి అశోక్ ఆదేశించారు. సోమవారం ఆత్మకూర్(ఎస్) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమికపాఠశాల, కేజీబీవీని ఆయన తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించి మాట్లాడారు. తల్లిదండ్రులు తమపిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని కోరారు. కేజీబీవీలో విద్యార్థినులు పూర్తిస్థాయిలో రాలేదని తల్లిదండ్రులతో మాట్లాడి వెంటనే రప్పించాలన్నారు. కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రవణ్ కుమార్, ప్రాథమికపాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వనజ, కేజీబీవీ ఎస్ఓ సరస్వతి పాల్గొన్నారు. ఫాసిస్టు విధానాలు అనుసరిస్తున్న కేంద్రంసూర్యాపేట : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతం, కులం పేరుతో ప్రజలను విడదీస్తూ, ఫాసిస్టు విధానాలను అనుసరిస్తోందని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) జిల్లా అధ్యక్షుడు గొడ్డలి నర్సయ్య పేర్కొన్నారు. నిజామాబాద్లో ఈ నెల 21, 22 తేదీల్లో నిర్వహించే టీయూసీఐ రాష్ట్ర ప్రథమ మహాసభల పోస్టర్లను సోమవారం సూర్యాపేటలో ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో గోగుల వీరబాబు, ఐతరాజు వెంకన్న, సాహెబ్ హుస్సేన్, జక్కుల శేషగిరి, శ్రీను,నగేష్ తదితరులు పాల్గొన్నారు. -
కథకు పుట్టినిల్లు నల్లగొండ
రామగిరి(నల్గొండ): ఆధునిక తెలుగు కథకు నల్లగొండ పుట్టినిల్లు అని సాహితీవేత్త డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం కథా రచయిత డాక్టర్ సాగర్ల సత్తయ్య రచించిన ‘బర్కతి’ కథా సంపుటిని నల్లగొండలోని యూటీఎఫ్ భవన్లో ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. నల్లగొండ కథా పాఠశాల పేరుతో ఇటీవల నల్లగొండలో నూతన కథకులు చక్కని కథలు రాస్తుండడం అభినందనీయం అన్నారు. పెరుమాళ్ల ఆనంద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సాహితీవేత్త డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, మేరెడ్డి యాదగిరిరెడ్డి , మునాస్ వెంకట్, తండు కృష్ణ కౌండిన్య, పగడాల నాగేందర్, బైరెడ్డి కృష్ణారెడ్డి, ఎలికట్టె శంకర్రావు, మేక నాగయ్య, ఎడ్ల సైదులు, శీలం భద్రయ్య, బండారు శంకర్, ముక్కామల జానకిరామ్, డాక్టర్ మెంతబోయిన సైదులు, కాసుల ఆంజనేయులు, కుకుడాల గోవర్ధన్, కోమటిరెడ్డి రవీందర్రెడ్డి పాల్గొన్నారు. -
నృసింహుడి క్షేత్రంలో కోలాహలం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిత్యారాధనలు, వేలాదిగా తరలివచ్చిన భక్తులతో కోలాహలం నెలకొంది. ఆదివారం వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు.. స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం, అర్చనలతో కొలిచారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహనసేవ, స్వామి, అమ్మవారికి నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు గావించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చనమూర్తులకు అష్టోత్తర పూజలు చేపట్టారు. సాయంత్రం ఆలయంలో వెండి జోడు సేవను భక్తుల మధ్య ఊరేగించారు. ఆయా వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
అంగన్వాడీల్లో ఖాళీల భర్తీకి కసరత్తు
నాగారం : అంగన్వాడీ కేంద్రాల్లో సేవలు క్షేత్రస్థాయిలో మరింత మెరుగుపడాలంటే ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల హైదరాబాద్లో ఐసీడీఎస్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించిందిం. దీంతో జిల్లాలో ప్రధాన, మినీ అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 78 టీచర్, 274 ఆయా(సహాయకుల) పోస్టులు త్వరలోనే భర్తీకానున్నట్టు తెలుస్తోంది. వికాస కేంద్రాలుగా తీర్చిదిద్దాలని.. అంగన్వాడీలను అక్షర జ్ఞానానికి, పోషకాహారానికి, ఆరోగ్యానికి, మేధో వికాసానికి కేంద్రాలుగా తీర్చిదిద్దుతా మని మంత్రి సీతక్క పేర్కొన్నారు. దీంతో జిల్లాలో ఐసీడీఎస్ అధికారులు ఖాళీగా ఉన్న అంగన్వాడీ, ఆయా పోస్టుల వివరాలు సేకరించి నివేదిక తయారు చేశారు. గత కొన్నేళ్లుగా గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు, ఆయాల పోస్టులు ఖాళీగా ఉండడంతో సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. ఖాళీగా ఉన్న కేంద్రాలను సమీపంలోని కేంద్రాల టీచర్లకు అప్పగించారు. మరికొన్ని కేంద్రాలను ఆయాలతోనే నెట్టుకొస్తున్నారు. దీని కారణంగా అంగన్వాడీ సేవలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. దీన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అన్ని అంగన్వాడీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఖాళీల వివరాలు సేకరించారు. మార్కుల ఆధారంగానా.. పరీక్ష నిర్వహిస్తారా! జిల్లాలో ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,209 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో 78 టీచర్, 274 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నట్టు అధికారులు ఇప్పటికే గుర్తించారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్వాడీ పోస్టుల భర్తీకి సిద్ధమైంది. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ఓ కొలిక్కి వస్తున్న నేపథ్యంలో అంతకు ముందే పోస్టులను భర్తీచేయడం సరికాదని ప్రభుత్వం జాప్యం చేస్తోంది. వర్గీకరణ అంశం కొలిక్కి రాగానే నెలరోజుల్లో పోస్టులను భర్తీ చేయవచ్చని భావించింది. ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీల వివరాలు సేకరించింది. నోటిఫికేషన్ ఇవ్వడమే తరువాయి. గతంలో ఇంటర్ మార్కుల ఆధారంగా పోస్టులను భర్తీ చేశారు. ఇప్పుడూ అలాగే చేస్తారా లేక రాత పరీక్ష నిర్వహిస్తారా అన్నదానిపై విధివిధానాలు విడుదల కావాల్సి ఉంది. ఉన్నతాధికారులకు ఖాళీల వివరాలు అందజేశాం జిల్లాలో అంగన్వాడీ టీచర్, ఆయాలకు సంబంధించి ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు అందజేశాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే నిబంధనల ప్రకారం పోస్టులను భర్తీ చేస్తాం. – నర్సింహారావు, జిల్లా సంక్షేమ అధికారి ఫ 78 టీచర్, 274 ఆయా పోస్టులు ఖాళీ ఫ త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఫ విధివిధానాలపై స్పష్టత కరువు ఐసీడీఎస్ ప్రాజెక్టులు 05 అంగన్వాడీకేంద్రాలు 1,209 చిన్నారులు 45,177 గర్భిణులు 5,220 బాలింతలు 4,236 -
ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో రాణించాలి
కోదాడ: సేవాగుణం కలిగిన ఆర్యవైశ్యులు వ్యాపార రంగంతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి అన్నారు. ఆదివారం కోదాడలోని గుడుగుంట్ల అప్పయ్య ఫంక్షన్హాల్లో జరిగిన జిల్లావైశ్య మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో గడిచిన 30 సంవత్సరాలుగా మంత్రి ఉత్తమ్తో పాటు తనకు అండగా ఆర్యవైశ్యులు నిలిచారని, వారికి తాము ఎంతో రుణపడి ఉంటామన్నారు. ఆర్యవైశ్యులు చేపట్టే కార్యక్రమాలకు తమ పూర్తి మద్దతు, సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఆర్యవైశ్యులు సామాజిక సేవా కార్యక్రమాల్లోని ముందుండడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెంపటి వెంకటేశ్వరరావు, ఇమ్మడి సోమనర్సయ్య, జిల్లా మహిళా అధ్యక్షురాలు గరిణె ఉమామహేశ్వరితో పాటు కార్యవర్గ సభ్యులచే ఆమె ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎమ్మెల్యే పద్మావతి ఘనంగా సన్మానించారు. ఆ తర్వాత ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర, జిల్లా నాయకులు.. ఎమ్మెల్యేకు శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఉప్పల శారద, మహా సభ ప్రతినిధులు చల్లా లక్ష్మీకాంత్, కక్కిరేణి శ్రీనివాస్, వంగవేటి శ్రీనివాస్రావు, ఇరుకుల చెన్నకేశవరావు, ఓరుగంటి నాగేశ్వరరావు, ఓరుగంటి విజయలక్ష్మి, బొమ్మిడి అశోక్, చల్లా అశోక్, స్వామి గణేశ్, డాక్టర్ భరత్చంద్ర, ఇమ్మడి అనంత చక్రవర్తి, భరత్, సాయి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఫ కోదాడ ఎమ్మెల్యే పద్మావతి -
జల దోపిడీకే బనకచర్ల ప్రాజెక్టు
సూర్యాపేట : గోదావరి నది మిగులు జలాలు, వరద జలాల పేరుతో తెలంగాణ నికర జలాలను దోపిడీ చేసేందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును రూపొందించిందని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ విమర్శించారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర నాయకత్వం కృష్ణ, గోదారి నదులపై అడ్డగోలుగా ప్రాజెక్టు నిర్మించి తెలంగాణకు రావాల్సిన నీళ్లు రాకుండా దోచుకెళ్లారని మళ్లీ ఇప్పుడు గోదావరి నది నుంచి 200 టీఎంసీల నీళ్లను తరలించుకెళ్లడానికి బనకచర్ల ప్రాజెక్టు మొదలు పెట్టారన్నారు. ఇప్పటికై నా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని బనకచర్ల ప్రాజెక్టు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు గట్ల రమాశంకర్, కార్యదర్శి బొడ్డు శంకర్ గౌడ్, లీగల్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు ధరావత్ వీరేష్ నాయక్, డీఎల్ సెల్ జిల్లా కార్యదర్శి బొజ్జ అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపాలిహుజూర్నగర్ (చింతలపాలెం) : ఆపరేషన్ కగార్ పేరిట కొనసాగిస్తున్న హత్యకాండను వెంటనే ఆపాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తెల సృజన అన్నారు. ఆపరేషన్ కగార్ నిలిపివేసి, మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరిపాలని డిమాండ్ చేస్తూ ఈనెల 17న హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద చేపట్టనున్న మహాధర్నా వాల్ పోస్టర్ను ఆదివారం చింతలపాలెంలో సీపీఐ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో 2024 జనవరి నుంచి మావోయిస్టులను అణచివేసే పేరిట ఆదివాసీలతోపాటు మావోయిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలను హతమార్చడం దారుణ చర్య అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఉస్తెల నారాయణరెడ్డి, మండల కార్యదర్శి చింతిరాల రవి, గ్రామ శాఖ కార్యదర్శి గంధం మంగయ్య, నాయకులు వీరబాబు, జియాలుద్దీన్, హైమవతి, శ్రీనివాసరావు, రామారావు, రామయ్య, కాశయ్య తదితరులు పాల్గొన్నారు. వైభవంగా నారసింహుడి నిత్యకల్యాణం మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో ఆదివారం శ్రీరాజ్యలక్ష్మీచెంచులక్ష్మీసమేత శ్రీలక్ష్మీనరసింహ స్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రబాత సేవ, పంచామృతాభిషేకం, ఎదుర్కోలు మహోత్సవం నిర్వహించారు. అనంతరం కల్యాణం జరిపించి స్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్కుమార్, అర్చకులు శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, బదరీ నారాయణాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఫణిభూషణ మంగాచార్యులు, ఆంజనేయాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శేషగిరిరావు, భక్తులు పాల్గొన్నారు. స్వర్ణగిరిలో గిరిప్రదక్షిణ భువనగిరి: పట్టణ పరిధిలోని స్వర్ణగిరి క్షేత్రంలో గల శ్రీ వెంకటశ్వరస్వామి దేవాలయం వద్ద అదివారం శ్రావణ నక్షత్రం సందర్భంగా భక్తులు గిరిప్రదక్షిణ చేశారు. అంతకుముందు ఆలయంలో స్వామివారికి సుభ్రబాత సేవ, తోమాల సేవ, సహస్రనామార్చన, నిత్యకల్యాణం నిర్వహించారు. మధ్యాహ్నం సుమారు 4వేల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. సాయంత్రం తిరువీధిఉత్సవ సేవ, రథోత్సవం నిర్వహించారు. -
కల్నల్ సంతోష్బాబు త్యాగం వెలకట్టలేనిది
సూర్యాపేటటౌన్ : దేశం కోసం కల్నల్ సంతోష్బాబు చేసిన ప్రాణత్యాగం వెలకట్టలేనిదని జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. కల్నల్ సంతోష్బాబు 5వ వర్ధంతి సందర్భంగా ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల సంతోష్బాబు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ ఆర్మీ జవాన్గా వీరోచితంగా పోరాడి దేశ రక్షణలో అసువులు బాసిన కల్నల్ సంతోష్బాబును నేటి తరం యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. కల్నల్ సంతోష్బాబు త్యాగాన్ని స్మరించుకోవడం ఆయన కుటుంబాని ఎంతో ఓదార్పు అన్నారు. ఈ కార్యక్రమంలో కల్నల్ సంతోష్బాబు కుటుంబ సభ్యులు, ఆర్మీ అధికారులు, ఆర్మీ జవాన్లు, విద్యార్థులు, పట్టణప్రముఖులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫ ఎస్పీ నరసింహ -
ఆటోడ్రైవర్ నుంచి ఆర్టీసీ డ్రైవర్గా
సంస్థాన్ నారాయణపురం: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్గా చేరి.. తొలి మహిళా బస్సు డ్రైవర్గా రికార్డు సొంతం చేసుకుంది యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్యాతండాకు చెందిన సరితనాయక్. మారుమూల గిరిజన తండాలో పుట్టి పెరిగిన సరిత ఇప్పటికే ఢిల్లీలో ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో బస్సు చక్రం తిప్పి దేశంలోనే బస్సును నడిపిన మొదటి మహిళగా పేరు తెచ్చుకుంది. తాజాగా ఆమె తెలంగాణ ఆర్టీసీలో డ్రైవర్గా విధుల్లో చేరారు. అమ్మా నాన్నలు రాంకోటి, రుక్కలు. సరిత కుటుంబంలో నలుగురు అక్కలు, ఒక తమ్ముడు ఉన్నారు. అక్క దగ్గర ఉంటూ దేవరకొండలో 8వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల చదివి, అక్కడ నుంచి 10వ తరగతి వరకు ఓపెన్ స్కూల్లో చదివింది. సరిత కొన్ని రోజులు దేవరకొండలో.. తర్వాత ఐదు సంవత్సరాలు సంస్థాన్ నారాయణపురం నుంచి సీత్యాతండా వరకు ఆటో నడిపింది. ఆటో నడుపుతున్న సందర్భంగా ఎదురైన ఇబ్బందులును ఎదుర్కోవడానికి పురుషుల మాదిరిగా వేషధారణ మార్చింది హైదారాబాద్లోని బంధువులు ఇంట్లో ఉంటూ బస్సు డ్రైవింగ్ నేర్చుకుంది. తర్వాత కాలంలో హెవీ వెహికిల్స్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసుకుంది. తెలంగాణలో ఉద్యోగం చేయాలని సరిత గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు విన్నవించింది. హామీ ఇచ్చినప్పటికీ అమలు కాలేదు. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి , మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దృష్టికి తీసుకెళ్లింది. మంత్రి వెంకట్రెడ్డి ఆమె హామీ ఇచ్చారు. తాజాగా ఆమె ఎంజీబీఎస్ డిపోల్ పోస్టింగ్ పొందారు. శనివారం ఆమె ఎంజీబీఎస్ నుంచి మిర్యాలగూడ వరకు నాన్స్టాప్ బస్సు నడిపారు. -
భూ భారతి.. దరఖాస్తుల హారతి
ఆదివారం శ్రీ 15 శ్రీ జూన్ శ్రీ 2025నాగారం : పెండింగ్ భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈనెల 3 నుంచి రెవెన్యూ సదస్సులు ప్రారంభించగా 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి. జిల్లాలో 23 మండలాలు, 486గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 22 మండలాలకు సంబంధించి 311 గ్రామసభల ద్వారా 26,367 భూభారతి దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. వీటిల్లో ఇప్పటివరకు 8,668 దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేశారు. సదస్సుల అనంతరం దరఖాస్తుల ఆధారంగా నోటీసులు జారీచేసి సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. కాగా.. గరిడేపల్లి మండలంలో మే–5 నుంచి 12వరకు భూభారతి కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టారు. గరిడేపల్లి మండలంలోని 11 రెవెన్యూ గ్రామాల్లో 1690 దరఖాస్తులు వచ్చాయి. గత తప్పిదాలతో ఇబ్బందులు గతంలో చేసిన భూదస్త్రాల నమోదులో చోటుచేసుకున్న తప్పిదాలు అన్నదాతలకు శాపంగా మారాయి. ఒకరి పేరు బదులు మరొకరు, విస్తీర్ణంలో వ్యత్యాసం, తప్పుగా నమోదైన సర్వే నంబర్లు, నిషేధిత జాబితాలో చేర్చడం, పట్టా రాకపోవడం.. ఇలా పలు రకాల సమస్యలతో రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగారు. మీసేవ కేంద్రాల్లో దరఖాస్తుల ఖర్చు తడిసి మోపడైనా సమస్యలు పరిష్కారం కాలేదు. ఆన్లైన్లో నమోదు .... రెవెన్యూ సదస్సుల్లో ఊహించిన దానికంటే అధికంగా దరఖాస్తులు వస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. మండలానికి ఇద్దరు చొప్పున కంప్యూటర్ ఆపరేటర్లను నియమించి దరఖాస్తులను కేటగిరీలుగా విభజించి ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. సాదాబైనామా, అసైన్డ్ భూములకు సంబంధించిన దరఖాస్తులను మినహాయించి మిగిలిన వాటిని పరిశీలిస్తున్నారు. రెవెన్యూ గ్రామాల వారీగా నోటీసులు జారీచేసి, దరఖాస్తులను పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్గదర్శకాలు ఇలా... రెవెన్యూ అధికారులు దరఖాస్తును పరిశీలించి ఫిర్యాదు సమర్పించిన రైతుతో పాటు సమీపంలోని రైతుకు నోటీసులు జారీ చేయనున్నారు. ఇరువురి వద్ద ఉన్న రికార్డులతో పాటు ఆధారాలు సమర్పించేందుకు ఏడు రోజుల గడువు విధిస్తారు. నిర్దేశిత గడువులోపు సమర్పించిన ఆధారాలు, దస్త్రాలను పరిశీలిస్తారు. రెవెన్యూ కార్యాలయంలోని రికార్డులతో పోలుస్తారు. అనంతరం దరఖాస్తు వాస్తవికతను తేల్చనున్నారు. న్యూస్రీల్ఫ రెవెన్యూ సదస్సులకు దరఖాస్తుల వెల్లువ ఫ ఇప్పటివరకు 26,367 దరఖాస్తుల స్వీకరణ ఫ 8,668 ఆన్లైన్లో నమోదు ఫ ఈనెల 20 వరకు కొనసాగనున్న సదస్సులురెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. గ్రామాల్లో ఈనెల 20వ తేదీ వరకు రెవెన్యూ గ్రామ సభలు జరగనున్నాయి. స్వీకరించిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. అనంతరం విచారణ జరిపి సమస్యలను పరిష్కరిస్తాం. – రాంబాబు, అదనపు కలెక్టర్, సూర్యాపేట -
క్రీడా పాఠశాల పిలుస్తోంది
ఎంపిక పోటీల తేదీలు మండల స్థాయిలో ఈనెల 16 నుంచి 19 వరకు. జిల్లాస్థాయిలో 23 నుంచి 26వ తేదీ. రాష్ట్రస్థాయిలో జూలై 1 నుంచి 5వ తేదీ. అర్హతలు ఫ మూడవ తరగతి చదివిన విద్యార్థులు ఫ 1– 9– 2016 నుంచి 31– 8– 2017 మధ్య జన్మించి ఉండాలి ఫ ఎత్తు 127–147 సెంటీమీటర్లు ఫ బరువు 24 కేజీల నుంచి 33 కేజీల మధ్య ఉండాలి సూర్యాపేట అర్బన్ : రాష్ట్రంలోని క్రీడా పాఠశాలల్లో (కరీంనగర్, ఆదిలాబాద్, హకీంపేట) ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి నాలుగో తరగతిలో చేరేందుకు రాష్ట్రంలో ఈ మూడు స్పోర్ట్స్ స్కూళ్లలో అవకాశం ఉంది. చదువుతోపాటు ఆటల్లో రాణించాలనుకునే వారికి ఇక్కడి విద్యాభ్యాసం గొప్ప అవకాశం. అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో ఎదగడానికి అవసరమైన మెలకువలు ఇక్కడ నేర్పిస్తారు. ఒలంపిక్స్, ప్రపంచ ఛాంపియన్షిప్లో రాణించిన క్రీడాకారులకు అవార్డులు, నజరానాలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు దక్కుతాయి. తెలంగాణ క్రీడా పాఠశాలలో ప్రవేశాల ప్రక్రియ ఈనెల 16 నుంచి మొదలు కానుంది. మండల స్థాయిలో 16వ తేదీ నుంచి 19 వరకు ఎంపిక పోటీలు జరగనున్నాయి. జిల్లాస్థాయిలో 23వ తేదీ నుంచి 26 వరకు, రాష్ట్రస్థాయిలో జూలై 1 నుంచి 5వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలకు, జిల్లా స్థాయిలో సత్తా చాటిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. రాష్ట్ర స్థాయి పోటీలు హకీంపేటలోని క్రీడా పాఠశాలలో జరుగుతాయి. ఈ క్రీడా పాఠశాలల్లో నాలుగో తరగతికి 20 మంది బాలురు, 20 మంది బాలికలను ఎంపిక చేసి మూడు పాఠశాలల్లో మొత్తం 120 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు. ఈ క్రీడల్లో శిక్షణ ఎంపికై న విద్యార్థులకు 12 క్రీడాంశాల్లో శిక్షణ అందిస్తారు. స్విమ్మింగ్, జూడో, విలువిద్య, బాక్సింగ్, అథ్లెటిక్స్, ఫుట్బాల్, జిమ్నాస్టిక్స్, ట్రై సైక్లింగ్, ఫెన్సింగ్, యోగా, రెజ్లింగ్లో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. క్రీడాశిక్షణతో పాటు నాలుగో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉచితంగా చదువుకునే అవకాశాన్ని ప్రభుత్వం అందిస్తుంది. ప్రతిరోజు ఉదయం 6 నుంచి 8:30 వరకు సాయంత్రం 4 గంటల నుంచి 6:30 వరకు శిక్షణ ఉంటుంది. సామర్థ్య పరీక్షలు 800 మీటర్ల పరుగు, 30 మీటర్ల లైన్ స్టార్స్ స్టాండింగ్, బ్రాడ్ జంప్, మెడిసిన్ బాల్ తో సిక్స్ బై టెన్ మీటర్స్, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్, వర్టికల్ జంప్ తదితర టెస్టులు నిర్వహిస్తారు. ప్రతి టెస్ట్ కు మూడు మార్కులు ఉంటాయి. ఈ పత్రాలు తప్పనిసరి మూడవ తరగతి మార్కుల రికార్డు, కుల ధ్రువీకరణ పత్రం, బోనఫైడ్, తహసీల్దార్, పంచాయతీ లేదా మున్సిపల్ అధికారులు జారీచేసిన కుల జనన ధ్రువీకరణ పత్రాలు, 10 పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు, ఆధార్ కార్డు జీరాక్స్, ఒరిజినల్ పత్రాలు. ఫ 2025–26కు సంబంధించి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఫ ఈనెల 16 నుంచి 19 వరకు మండల స్థాయిలో ఎంపిక పోటీలు -
లోక్అదాలత్లో 3013 కేసులు పరిష్కారం
చివ్వెంల(సూర్యాపేట) : పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికే జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద అన్నారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన మెగాలోక్ అదాలత్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. నాలుగు బెంచీల ద్వారా క్రిమినల్, సివిల్, మోటార్ వెహికల్, విద్యుత్, బ్యాంకు, గృహహింసకు సంబంధించి 3013 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ పరిష్కారం కాని కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. చిన్నచిన్న ఘర్షణలకు కోర్టు మెట్లు ఎక్కకుండా, పెద్దల సమక్షంలో పరిష్కరించుకోవాలన్నారు. దీని వల్ల సమయం, ధనం వృథా కాకుండా ఉంటుందన్నారు. కోర్టు సీనియర్ న్యాయవాది గోండ్రాల అశోక్ ఆధ్వర్యంలో కక్షిదారులకు పులిహోర ప్యాకెట్లు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి అపూర్వరవళి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి పుంకరబోయిన రాజు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. ఫ జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద -
సామర్థ్యానికి మించి వాహనాల్లోకి ఎక్కించొద్దు
సూర్యాపేటటౌన్ : సామర్థ్యానికి మించి వాహనాల్లోకి విద్యార్థులను ఎక్కించొద్దని ఎస్పీ నరసింహ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలలు ప్రారంభమయ్యాయని, విద్యార్థులను రవాణా చేసే వాహనాలు కండిషన్లో ఉండాలని, వాటి నిర్వహణలో నియమ నిబంధనలు పాటించాలని, స్థితిగతులను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలని సూచించారు. బస్సులు, వ్యాన్లు, ఆటోలు, ఇతర వాహనాలు నడిపే డ్రైవర్లు మంచి నైపుణ్యం కలిగి ఉండాలని తెలిపారు. వాహనాల్లో మ్యూజిక్ పరికరాలు ఉపయోగించవద్దని పేర్కొన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపవద్దని, రోడ్డు క్రాసింగ్ల వద్ద అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గిరిజనుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషిఅనంతగిరి: గిరిజనుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషి మరువలేనిదని మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ అన్నారు. శనివారం అనంతగిరి మండలంలోని కొత్తగోల్తండా గ్రామంలో రాష్ట్ర గిరిజన మోర్చా అధికార ప్రతినిధి, కోదాడ నియోజకవర్గ గిరిజన మోర్చా అసెంబ్లీ నియోజవర్గ కన్వీనర్ బాణోతు అనుషా నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వికసిత్ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. గిరిజనులకు సమ్మక్క సారక్క యూనివర్సిటీతో పాటు అనేక జాతీయ విప్లవాత్మకమైన మార్పులు ఆర్టికల్ 370 రద్దు, ఆపరేషన్ సింధూర్ వంటివి చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి, రాష్ట్ర నాయకురాలు కవితా రెడ్డి, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు ధరావత్ సంతోష్ నాయక్, అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ కనగాల నారాయణ, బీజేపీ మండల అధ్యక్షుడు చింతకుంట్ల సతీష్, బొలిశెట్టి కృష్ణయ్య, యశ్వంత్, కిట్టు పాల్గొన్నారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణం మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శనివారం శ్రీలక్ష్మీనరసింహ స్వామి నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, ఎదుర్కోళ్ల మహోత్సవం జరిపించారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ పూర్తిగావించారు. అనంతరం గరుడవాహనంపై శ్రీస్వామివారిని ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్కుమార్, అర్చకులు పాల్గొన్నారు. -
వంతెనకు మోక్షమెప్పుడో..
గరిడేపల్లి: గరిడేపల్లి నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారిలో మర్రికుంట వద్ద సాగర ప్రధాన ఎడమ కాల్వ పై ఉన్న వంతెన శిథిలావస్థకు చేరింది. దీని నిర్మాణానికి నిధులు మంజూరైనప్పటికీ పనుల ప్రారంభానికి మోక్షం లభించడం లేదు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. గతంలో చిన్న చిన్న మరమ్మతులు చేసి వదిలేశారు. గరిడేపల్లి నుండి సూర్యాపేట జిల్లా కేంద్రానికి ప్రతి రోజు వేల వాహనాలు వంతెన మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. వంతెన చిన్నదిగా ఉండడంతోపాటు, శిథిలావస్థకు చేరడంతో ఎప్పుడు కూలుతుందోనని ఆందోళన చెందుతున్నారు. 2023లో రూ. కోటి 93లక్షలు మంజూరు వంతెన నిర్మాణానికి 2023లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి రూ. కోటి 93లక్షలు మంజూరయ్యాయి. అధికారులు టెండర్ కూడా పూర్తి చేశారు. వంతెన నిర్మాణానికి నూతన అలైన్మెంట్ ఏర్పాటు చేశారు. కొంతమంది గ్రామస్తులు తమ ఇళ్లు పోతాయని దీనికి అభ్యంతరం తెలపడంతో కాంట్రాక్టర్ పనులు ప్రారంభించేందుకు ముందుకు రాలేదు. దీంతో వంతెన నిర్మాణ పనులు కలగానే మిగిలాయి. 2023లో అగ్రిమెంట్ అయిందని ప్రస్తుతం అన్ని రకాల రేట్లు పెరిగాయని, తాను పనులు చేయలేనని, కొత్త ధరల ప్రకారం మాత్రమే పనులు చేసే అవకాశం ఉందని కాంట్రాక్టర్ అధికారులకు విన్నవించుకున్నాడు. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే గరిడేపల్లి, హుజూర్నగర్, మఠంపల్లి, నేరేడుచర్ల మండలాలోని ప్రజలకు సూర్యాపేట వెళ్లేందుకు ప్రయాణం సులువుగా ఉంటుంది. పనులు నిలిచిపోయాయి 2023లో వంతెన నిర్మాణానికి రూ. కోటి 93లక్షలు మంజూరయ్యాయి. కాంట్రాక్టర్ అగ్రిమెంట్ కూడా పూర్తి చేసుకున్నాడు. కానీ నూతన అలైన్మెంట్ ప్రకారం గ్రామస్తులు వంతెన నిర్మాణానికి బ్రిడ్జి లొకేషన్ ఫిక్సింగ్ విషయంలో అంగీకరించకపోడంతో పనులు ప్రారంభం కాలేదు. ప్రస్తుతం కాంట్రాక్టర్ కూడా కొత్త ధరల ప్రకారమే నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నాడు. – రఘు, ఇరిగేషన్ డీఈ, హుజూర్నగర్ ఫ శిథిలావస్థకు చేరిన మర్రికుంట వంతెన ఫ నిధులు మంజూరై రెండు సంవత్సరాలు ఫ ఇప్పటివరకు ప్రారంభం కాని పనులు -
నడిపించిన నాన్న..
పిల్లలను పక్షి వలే తన రెక్కలతో కాపాడుతూ.. వారి కష్టసుఖాల్లో నేనున్నానంటూ వెన్నుతట్టి నడిపించేది నాన్న. పిల్లల విజయాన్ని తన గెలుపుగా భావించి వారి కోసం ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొంటాడు నాన్న. పిల్లల జీవితాల్లో వెలుగు నింపేందుకు తాను కొవ్వొత్తిలా కరుగుతాడు నాన్న. ఓర్పుకు మారుపేరు.. మార్పుకు మార్గదర్శి.. నీతికి నిదర్శనం.. మన ప్రగతికి సోపానం నాన్నే. నేడు ఫాదర్స్డే సందర్భంగా ప్రత్యేక కథనాలు 8లో -
ఆటోడ్రైవర్ నుంచి ఆర్టీసీ డ్రైవర్గా
సంస్థాన్ నారాయణపురం: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్గా చేరి.. తొలి మహిళా బస్సు డ్రైవర్గా రికార్డు సొంతం చేసుకుంది యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్యాతండాకు చెందిన సరితనాయక్. మారుమూల గిరిజన తండాలో పుట్టి పెరిగిన సరిత ఇప్పటికే ఢిల్లీలో ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో బస్సు చక్రం తిప్పి దేశంలోనే బస్సును నడిపిన మొదటి మహిళగా పేరు తెచ్చుకుంది. తాజాగా ఆమె తెలంగాణ ఆర్టీసీలో డ్రైవర్గా విధుల్లో చేరారు. అమ్మా నాన్నలు రాంకోటి, రుక్కలు. సరిత కుటుంబంలో నలుగురు అక్కలు, ఒక తమ్ముడు ఉన్నారు. అక్క దగ్గర ఉంటూ దేవరకొండలో 8వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల చదివి, అక్కడ నుంచి 10వ తరగతి వరకు ఓపెన్ స్కూల్లో చదివింది. సరిత కొన్ని రోజులు దేవరకొండలో.. తర్వాత ఐదు సంవత్సరాలు సంస్థాన్ నారాయణపురం నుంచి సీత్యాతండా వరకు ఆటో నడిపింది. ఆటో నడుపుతున్న సందర్భంగా ఎదురైన ఇబ్బందులును ఎదుర్కోవడానికి పురుషుల మాదిరిగా వేషధారణ మార్చింది హైదరాబాద్లోని బంధువులు ఇంట్లో ఉంటూ బస్సు డ్రైవింగ్ నేర్చుకుంది. తర్వాత కాలంలో హెవీ వెహికిల్స్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసుకుంది. తెలంగాణలో ఉద్యోగం చేయాలని సరిత గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు విన్నవించింది. హామీ ఇచ్చినప్పటికీ అమలు కాలేదు. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి , మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దృష్టికి తీసుకెళ్లింది. మంత్రి వెంకట్రెడ్డి ఆమె హామీ ఇచ్చారు. తాజాగా ఆమె ఎంజీబీఎస్ డిపోలో పోస్టింగ్ పొందారు. శనివారం ఆమె ఎంజీబీఎస్ నుంచి మిర్యాలగూడ వరకు నాన్స్టాప్ బస్సు నడిపారు. ఫ ఆర్టీసీ డ్రైవర్గా సరితనాయక్ ఫ ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నుంచి తెలంగాణ ఆర్టీసీలో చేరిక -
ప్రమాణస్వీకార మహోత్సవం విజయవంతం చేయాలి
తాళ్లగడ్డ (సూర్యాపేట) : జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కౌన్సిల్ సభ్యుడు బండారు రాజా కోరారు. శనివారం సూర్యాపేట పట్టణంలోని పలువురు ఆర్యవైశ్యులకు జిల్లా కోశాధికారి చల్లా లక్ష్మీకాంత్తో కలిసి ప్రమాణ స్వీకార కరపత్రాలను అందజేశారు. అనంతరం బండారు రాజా మాట్లాడుతూ.. ఆదివారం కోదాడలో ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాష్ట్ర మంత్రులతో పాటు రాష్ట్ర ఆర్యవైశ్య మహా సభ నాయకులు విచ్చేస్తున్నందున పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడు తప్సీ గాంధీ, నరేంద్రుని విద్యాసాగర్ రావు, గోపారపు రాజు, బచ్చు పురుషోత్తం, కొండ శ్రీనివాసరావు, నాయకులు బొల్లం సురేష్, ఉప్పలంచు కృష్ణ, నరేందర్ పాల్గొన్నారు. -
ఆయిల్పామ్ ఫ్యాక్టరీకి అడుగులు
ఫ అనుముల మండలం యాచారం గ్రామంలో 30 ఎకరాల్లో నిర్మాణం ఫ ఇన్నాళ్లూ విజయవాడ అంభాపురం ఫ్యాక్టరీనే దిక్కు ఫ మంత్రి తుమ్మల చర్యలతో దిగొచ్చిన పతంజలి సంస్థ ఫ నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో 15 వేల ఎకరాల్లో పంటసాగు ఫ తీరనున్న ఆయిల్పామ్ రైతుల కష్టాలు -
భూ భారతితో రైతుల సమస్యలు పరిష్కారం
ఆత్మకూర్(ఎస్)(సూర్యాపేట): మండల పరిధిలోని ఏపూరు గ్రామంలో శుక్రవారం నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సును అదనపు కలెక్టర్ రాంబాబు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. భూ భారతితో రైతుల సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఏపూరు, దాచారం గ్రామాల్లోని రేషన్ దుకాణాల్లో బియ్యం, రికార్డులు పరిశీలించారు. ఆయన వెంట ఆర్డీఓ వేణుమాదవ్ రావు, తహసీల్దార్ అమీన్ సింగ్, ఆర్ఐ ప్రదీప్, స్వప్న ఉన్నారు. రెవెన్యూ సదస్సుల పరిశీలన మోతె: మోతె మండల పరిధిలోని గోపాలపురం, విభళాపురం గ్రామాల్లో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో అదనపు కలెక్టర్ రాంబాబు పాల్గొన్నారు. తహసీల్దార్ వెంకన్న మాట్లాడుతూ.. మోతె మండల వ్యాప్తంగా రెవెన్యూ సదస్సుల్లో 2,077 మంది రైతుల దరఖాస్తులు స్వీకరించినట్లు పేర్కొన్నారు. ఫ అదనపు కలెక్టర్ రాంబాబు -
ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలు పెంచాలి
ఆత్మకూర్(ఎస్)(సూర్యాపేట) : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు పెంచాలని ఇంటర్ బోర్డు డిప్యూటీ సెక్రటరీ, సూర్యాపేట జిల్లా ప్రత్యేకాధికారి హేమచందర్ అన్నారు. శుక్రవారం నెమ్మికల్లు ప్రభుత్వ కళాశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గతేడాది కన్నా ఈ ఏడాది 30శాతం అడ్మిషన్లను పెంచే బాధ్యత అధ్యాపకులు తీసుకోవాలని సూచించారు. కళాశాల పరిసర ప్రాంతాల్లోని పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులను ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేర్పించాలన్నారు. సూర్యాపేట జిల్లాలో 8 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయని, వాటిల్లో ప్రవేశాల శాతం పెంచేందుకు స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేశామన్నారు. ప్రతి తరగతిలో 40 మంది విద్యార్థులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఒక పాఠశాలకు ఒక ఇన్చార్జ్ చొప్పున ఏర్పాటు చేసి ఒక్కొక్కరు 20 అడ్మిషన్లు చేయాలని సూచించారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి భాను నాయక్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు ప్రతి కళాశాలను ఒకసారి సందర్శించి అధ్యాపకులకు సూచనలు చేశామన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ గుణగంటి వెంకటేశ్వర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
సర్కిళ్లకు దేవుళ్ల పేరు
యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ కొండ కింద ఉన్న సర్కిల్స్కు అధికారులు దేవుళ్ల పేర్లను పెట్టారు. - 8లోఇప్పుడు అన్నీ ఖర్చులే వ్యవసాయ పనులు మొదలైతే దుక్కులు, విత్తనాలు, ఎరువులు అన్నీ ఖర్చుతో కూడుకున్నవే. నాకు మూడున్నర ఎకరాల భూమి ఉంది. వరి సాగు చేస్తాను. కారుకు సుమారు రూ.60 వేల ఖర్చు వస్తుంది. అయితే నేను కొన్ని పనులు సొంతంగా చేసుకుంటాను. నాకు ఇద్దరు పిల్లలు. వారి చదువులకు రూ.రెండున్నర లక్షల వరకు ఖర్చు వస్తుంది. ప్రభుత్వం పంట పెట్టుబడికి సాయం అందిస్తే కొంతైనా ఉపశమనం ఉంటుంది. – అరవపల్లి తిరపతయ్య, రైతు, సూర్యాపేట పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నాం నాకు ఐదు ఎకరాల భూమి ఉంది. వరి పంట సాగు చేస్తున్నా. రూ.లక్ష ఖర్చు వస్తుంది. కానీ పంట చేతికి వచ్చే వరకు ఆందోళన తప్పదు. కనీసం విత్తనాలు కొనుగోలు సమయానికై నా రైతు భరోసా సాయం అందించాలి. తొండల పుల్లయ్య, రైతు, చేదెళ్ల గ్రామం -
నీరు సురక్షితమేనా!
సూర్యాపేట అర్బన్: ఏటా వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతుంటాయి. అందుకు ప్రధాన కారణం కలుషిత నీరు. వర్షాకాలం నేపథ్యంలో తాగునీటి నాణ్యతపై తప్పక దృష్టి సారించాలి. సూర్యాపేట పట్టణంలో మిషన్ భగీరథ పథకంతో పాటు శివారు ప్రాంతాలైన వార్డుల్లో స్థానిక బోర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. వర్షాలు పడుతుండడంతో అధికార యంత్రాంగం నీరు కలుషితం కాకుండా, అంటువ్యాధులు, విష జ్వరా లు ప్రబలకుండా సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది. ట్యాంకులు, నల్లాల వద్ద నీటి నమూనాలను సేకరించి తప్పనిసరిగా పరీక్షలు చేసి నాణ్యమైన నీటినే ప్రజలకు అందించాలి. ప్రజా కుళాయిల దగ్గర జాగ్రత్త సూర్యాపేట పట్టణంలోని వార్డుల్లో అనేక చోట్ల ప్రజా కుళాయిలను గాలికి వదిలేస్తున్నారు. పట్టణంలోని చాలా చోట్ల మిషన్ భగీరథ పైపులైన్లు లీకేజీకి గురై మురుగు నీటితో కలుషితమవుతున్నాయి. మున్సిపల్ ట్యాంక్లు అపరిశుభ్ర వాతావరణంలో ఉన్నాయి. నాణ్యత, పర్యవేక్షణ విషయాన్ని అధికారులు పూర్తిగా విస్మరిస్తున్నారు. మురికి వాడలు రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఎక్కువగా ఇవి ఉన్నాయి. వీటి నుంచి సరఫరా అయ్యే నీటికి నాణ్యత పరీక్షలు చేయడం లేదు. లీకేజీల సమస్య మురుగు కాలువల నుంచి పైప్ లైన్లు వేసినప్పుడు, కాలువల్లో సీల్డ్ తీసినప్పుడు పైప్లైన్ దగ్గర లీకేజీలు ఏర్పడి నీరు కలుషితమవుతుంటుంది. అధిక లోతులో ఉండే డ్రెయినేజీల్లో లోపల వేసిన పైపులు లీకేజీకి గురైతే గుర్తించే అవకాశం ఉండదు. అలాంటి సందర్భాల్లో నీరు కలుషితమై రోగాలకు దారితీస్తుంది. వర్షాకాలంలో కలుషితమయ్యే నీటి వల్ల డయేరియా, టైఫాయిడ్, కామెర్లు, వాంతులు, విరేచనాలు వస్తుంటాయి. నీటి పరీక్షలు చేస్తున్నాం 100 రోజుల ప్రణాళికలో భాగంగా నీటి పరీక్షలను ప్రత్యేకంగా చేస్తున్నాం. ఈ విషయంపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. పట్టణంలోని వార్డుల్లో ట్యాంకులను ప్రతినెల 1, 11, 21 తేదీల్లో శుభ్రం చేయాలని ఆదేశించాం. నీటి నమూనాలు సేకరించి పరీక్షలు చేసే విధానంపై వార్డ్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో పట్టణ ప్రాంతాల్లోని వార్డుల్లో అంగన్వాడీ ఆయాలు, ఏఎన్ఎంలకు శిక్షణ ఇచ్చాం. పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నాం. – శ్రీనివాస్, సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ -
జూన్.. పరేషాన్!
అంగన్వాడీల్లో ఎగ్ బిర్యానీశనివారం శ్రీ 14 శ్రీ జూన్ శ్రీ 2025రాజీమార్గమే రాజమార్గంచివ్వెంల(సూర్యాపేట) : రాజీమార్గమే రాజ మార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద అన్నారు. శుక్రవారం జిల్లా కోర్టులో ప్రాంగణంలో విలేకర్లతో మాట్లాడారు. శనివారం జిల్లా కేంద్రంతో పాటు, తుంగతుర్తి, కోదాడ, హుజూర్నగర్ కోర్టుల్లో జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజీతో ఇరు పక్షాల వారు గెలిచిన వారవుతారన్నారు. సమయం, ధనం వృథా కాకుండా ఉంటుందని పేర్కొన్నారు. సివిల్, క్రిమినల్, వెహికల్ యాక్ట్, గృహహింస, విద్యుత్, చెక్ బౌన్స్, బ్యాంకు కేసులకు సంబంధించి, పరిష్కారమయ్యే కేసులు పరిష్కరించుకోవచ్చని చెప్పారు. కక్షిదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి అర్వపల్లి: సీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రజలకు తగిన వైద్య సేవలందించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం అర్వపల్లి పీహెచ్సీలో వైద్య సిబ్బంది, ఆశాకార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కలుషిత నీరు, ఆహారంతో వచ్చే వ్యాధుల గురించి ప్రజలకు వివరించాలన్నారు. దోమల నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ కాన్పులు ఎక్కువగా జరిగేలా గర్భిణులకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని సూచించారు. సమావేశంలో మండల వైద్యాధికారి డాక్టర్ నగేష్నాయక్, సీహెచ్ఓ ఎం.బిచ్చునాయక్, సూపర్వైజర్ లలిత, ఎంఎల్హెచ్పీలు, సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. శిక్షణ తరగతులను జయప్రదం చేయాలి సూర్యాపేట అర్బన్ : జిల్లా కేంద్రంలో జూలై 12, 13, 14 తేదీల్లో నిర్వహించనున్న కేవీపీఎస్ రాష్ట్ర స్థాయి సామాజిక శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి పిలుపునిచ్చారు. శుక్రవారం సూర్యాపేటలో కేవీపీఎస్ రాష్ట్ర స్థాయి సామాజిక శిక్షణ తరగతుల కరపత్రాలు ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. దేశంలో బీజేపీ పాలనలో దళితుల జీవితాలు మరింత దుర్భరంలోకి నెట్టబడ్డాయని ఆరోపించారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఎంపిక చేయబడిన 300 మంది కేవీపీఎస్ నాయకులు, కార్యకర్తలు శిక్షణ తరగతులకు హాజరవుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పిండిగ నాగమణి, టేకుల సుధాకర్, రవి, తక్కెళ్లపల్లి శ్యామ్, ఇరుగు రమణ, సుంచు నరసింహ తదితరులు పాల్గొన్నారు. శ్రీలక్ష్మీనారసింహుడి నిత్యకల్యాణంమఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శుక్రవారం శ్రీలక్ష్మీనరసింహ స్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం జరిపించారు. కల్యాణ వేడుకలో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ నిర్వహించారు. అనంతరం గరుడ వాహనంపై శ్రీస్వామివారిని ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. మహానివేదన గావించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్కుమార్, అర్చకులు పాల్గొన్నారు.తాళ్లగడ్డ (సూర్యాపేట) : పేద, మధ్య తరగతికి చెందిన రైతుల కుటుంబాలకు ఖర్చుల గుబులు మొదలైంది. మిగతా సమయంలో నెట్టుకొచ్చిన అన్నదాతలు జూన్ మాసంలో మాత్రం ఆందోళన చెందున్నారు. ఓ వైపు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. విద్యార్థులు స్కూళ్లకు వెళ్తున్నారు. మరో వైపు వ్యవసాయ పనులు మొదలు పెట్టే సమయం ఆసన్నమైంది. రైతులకు పెట్టుబడి ఖర్చులు కావాల్సి ఉంటుంది. దీనికితోడు తమ పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించాలి. రెండు ఖర్చులు ఒకేసారి రావడంతో సతమతమవుతున్నారు. రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. పంట పెట్టుబడుల సమయంరోహిణి కార్తె ప్రారంభం నుంచే వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతులు సాగుపనులకు సమాయత్తమయ్యారు. జిల్లాలో సుమారుగా 6,13,000 ఎకరాల సాగుభూమి ఉంది. 3,03,767 మంది రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. గతంతో కాడెద్దుల వ్యవసాయంతో పెద్దగా ఖర్చు ఉండేది కాదు. ప్రస్తుతం ట్రాక్టర్ల వాడకం వల్ల ఎకరాకు సుమారుగా రూ.13 వేల వరకు ఖర్చు వస్తుంది. విత్తనాలు, ఎరువులు కలుపుకొని రైతుకు తడిసి మోపెడవుతుంది. ప్రభుత్వం ఎన్నికల ముందు పెట్టుబడి సాయం కింద రైతులకు రూ.15 వేలు ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అది అమలుకాకపోవడంతోపాటు, ఇచ్చిన పది వేలు కూడా అంతంత మాత్రంగా కొంతమందికే పరిమిత మవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. దీంతో రైతులు రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. భారంగా మారిన స్కూల్ ఫీజులు పిల్లల చదువులకు అయ్యే ఖర్చులు ఏటేటా పెరుగుతున్నాయి. కుటుంబం నుంచి ఇద్దరు పిల్లలు ఉంటే స్కూల్ ఫీజులు తడిసి మోపెడు అవుతున్నాయి. ఫీజులతో పాటుగా యూనిఫాం, షూస్, పుస్తకాలు, నోట్బుక్స్, బ్యాగులు పాఠశాలల్లోనే యాజమాన్యాలు నిర్ణయించిన ధరలకు కొనాల్సి వస్తోంది. దీనికి తోడు రవాణా చార్జీలు అన్నీ కలుపుకొని సుమారు ఎల్కేజీ విద్యార్థికి రూ.40వేల పైచిలుకు ఖర్చు వస్తుంది. 10వ తరగతి అయితే రూ.లక్ష దాటాల్సిందే. ఫ ఇంటర్ బోర్డు డిప్యూటీ సెక్రటరీ హేమచందర్ నాగారం : అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నారు. చిన్నారులకు మరింత పోషకాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో ఎగ్ బిర్యానీ అందించేందులా కొత్త మెనూ తీసుకొచ్చింది. మంత్రి సీతక్క ఆదేశాలతో బుధవారం జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఎక్స్ బిర్యానీ అందజేశారు. బుధవారం ఎలాగూ గుడ్డు అందించాల్సి ఉన్నందున బిర్యానీ చేసి ప్రతి చిన్నారికి ఒక గుడ్డు అందేలా చూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 486 గ్రామ పంచాయతీలు పరిధిలో 5 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలోని మొత్తం 1209 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో 45,117 మంది చిన్నారులున్నారు. సాధ్యపడేనా.. ఎగ్ బిర్యానీ వారానికి రెండు సార్లు అందించాలని ఇటీవల ప్రతిపాదించారు. కానీ క్షేత్రస్థాయిలో ఇది సాధ్యపడేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆహారం పంపిణీకి సంబంధించిన నిధులు పెంచకుండా నాణ్యమైన ఆహారంతో పాటు ప్రత్యేకంగా ఎగ్ బిర్యానీ ఏర్పాటు ఎలా అనే దానిపై తర్జనభర్జన పడుతున్నారు. క్షేత్రస్థాయిలో కేంద్రాల నిర్వాహకులు దీనిని అంగీకరిస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వారానికి రెండు సార్లు పెడతారా అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫ వర్షాకాలంలో కలుషిత నీటితో పొంచిఉన్న ముప్పు ఫ డయేరియా, టైఫాయిడ్, కామెర్ల బారిన పడే ప్రమాదంవిమాన ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి సూర్యాపేట అర్బన్ : గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో విమానం కుప్పకూలిపోయిన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక లోపంతో కుప్పకూలిపోవడం దురదృష్టకరమన్నారు. తక్షణమే సహాయక చర్యలు ముమ్మరం చేయాలన్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారికి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, సీపీఎం కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, కోట గోపి పాల్గొన్నారు. న్యూస్రీల్ఫ ఇదే నెలలో వ్యవసాయ పెట్టుబడులు.. పిల్లల స్కూల్ ఫీజులు ఫ రెండు ఖర్చులు ఒకేసారి రావడంతో సతమతమవుతున్న రైతులు ఫ రుణాల కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉంది అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు వారానికి రెండు సార్లు ఎగ్ బిర్యానీ అందించాలని మౌఖిక ఆదేశాలు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న కేందాల్లో గుడ్డు బిర్యానీ పెట్టాలని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు ఆదేశాలిచ్చాం. ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు రావాల్సి ఉంది. – నర్సింహారావు, జిల్లా సంక్షేమ అధికారి, సూర్యాపేట ఫ చిన్నారులకు మరింత పౌష్టికాహారం అందించాలని నిర్ణయం ఫ వారానికి రెండు రోజులు పంపిణీ ఫ 45,117 మంది చిన్నారులకు ప్రయోజనం జిల్లాలో ఇలా... ప్రాజెక్టులు 05అంగన్వాడీ కేంద్రాలు 1209చిన్నారులు 45,177గర్భిణులు 5220బాలింతలు 4236 -
దేశ భవిష్యత్ తరగతి గదుల్లో నిర్మితమవుతుంది
చివ్వెంల(సూర్యాపేట) : దేశ భవిష్యత్ తరగతి గదుల్లో నిర్మితమవుతుందని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. శుక్రవారం చివ్వెంల మండల పరిధిలోని కుడకుడ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు పట్టికను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు సమయ పాలన పాటించాలని సూచించారు. పాఠశాలలో ఎక్కువ మంది విద్యార్థులు చేరేలా చూడాలన్నారు. ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి పూర్తయిన విద్యార్థులను జెడ్పీహెచ్ఎస్లో ఆరో తరగతిలో చేర్పించాలన్నారు. పాఠశాలలో 13 మంది నూతనంగా చేరినట్లు ఉపాధ్యాయులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం ప్రాథమిక పాఠశాలను సందర్శించి ఒకటవ తరగతి చదువుతున్న చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం రెండవ తరగతి విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం అందజేశారు. ఆయన వెంట హెచ్ఎంలు కవిత, శ్రీనివాస్, ఉపాధ్యాయులు వెంకటనర్సమ్మ, ప్రతాఫ్కుమార్, రాజు, విజయలక్ష్మీ, అనురాధ, సత్తయ్య, కోటయ్య, రవిందర్, బాలచందర్ తదితరులున్నారు.ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
మోగిన బడిగంట
పండుగ వాతావరణంలో పాఠశాలలు పునఃప్రారంభం ప్రభుత్వ పాఠశాలల్లోనే చేరాలినేరేడుచర్ల : కార్పొరేట్కు దీటుగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలు చేరాలని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కోరారు. గురువారం నేరేడుచర్ల జెడ్పీఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులకు యూనిఫాం పంపిణీ చేసి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలున్నాయన్నారు. నేరేడుచర్ల జెడ్పీహెచ్ఎస్లో 10వ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యడవల్లి అశోక్రెడ్డి, ఎంఈఓ పుట్లూరి సత్యనారాయణరెడ్డి, హెచ్ఎం బట్టు మధు, ఇంపాక్ట్ ట్రైనర్ వీరవెల్లి శ్రీలత, వాసవి క్లబ్ జోన్ చైర్మన్ కొత్త లక్ష్మణ్, సభ్యులు నటరాజ్, వెంకట్, టీచర్లు వీరబాబు, వెంకటేశ్వర్రావు, అన్నపూర్ణ, నర్సింహారావు, నాగమణి, భానుమతి, జానయ్య, వెంకట్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, శ్రీనివాస్రావు, రాంమ్మూర్తి, బాబు, యాదగిరి పాల్గొన్నారు.సూర్యాపేటటౌన్ : బడిగంట మోగింది. వేసవి సెలవుల అనంతరం గురువారం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. వేసవి సెలవుల్లో ఆట పాటలతో గడిపిన విద్యార్థులు బడిబాట పట్టారు. పండుగ వాతావరణంలో 2025–26 విద్యా సంవత్సరానికి అధికారులు శ్రీకారం చుట్టారు. తొలి రోజు విద్యార్థుల హాజరు అంతంత మాత్రమే ఉంది. పండుగ వాతావరణంలో.. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను ఆయా పాఠశాల యాజమాన్యాలు, ప్రధానోపాధ్యాయులు రంగు కాగితాలు, మామిడాకులు, కొబ్బరి మట్టలతో ముస్తాబు చేశారు. పండుగ వాతావరణంలో పాఠశాలలను ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పూలు ఇవ్వడమేకాకుండా వారి పై చల్లుతూ ఘనంగా స్వాగతం పలికారు. విద్యాశాఖ అధికారులు జిల్లాలోని పలు పాఠశాలలను సందర్శించారు. 20శాతమే హాజరు జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలు కలిపి 950 వరకు ఉన్నాయి. వీటిలో 73వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కాగా తొలి రోజు 20శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు అధికారులు తెలిపారు. యూనిఫాం, పుస్తకాలు పంపిణీ.. తొలిరోజు హాజరైన విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, జత యూనిఫాం, బ్యాగులు అందజేశారు. బడిబాటలో భాగంగా విద్యార్థుల తల్లి దండ్రులతో సమావేశాలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, మధ్యాహ్న భోజనం, యూని ఫాం, బుక్స్ తదితర అంశాలను ఉపాధ్యాయులు వివరించారు. ఫ విద్యార్థులకు పూలతో స్వాగతం పలికిన ఉపాధ్యాయులు ఫ తొలిరోజు హాజరు అంతంతే.. ఫ పాఠ్యపుస్తకాలు, యూనిఫాం పంపిణీ -
భూ సమస్యల పరిష్కారానికే సదస్సులు
చివ్వెంల(సూర్యాపేట) : రైతుల భూ సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు తెలిపారు. గురువారం చివ్వెంల మండల కేంద్రంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడారు. రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చివ్వెంల, బీబీగూడెం గ్రామాల్లో రైతుల వద్ద నుంచి 441 దరఖాస్తుల వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రకాశ్రావు, ఆర్ఐలు శ్రీనివాస్, శ్రావణి పాల్గొన్నారు. సాగర్ క్రస్ట్గేట్ల డ్రై ట్రయల్ రన్ పనులు ముమ్మరం నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ జలాశయం రేడియల్ క్రస్ట్గేట్ల డ్రై ట్రయల్ రన్ పనులు ముమ్మరం చేశారు. జలాశయం గరిష్ట స్థాయి నీటిమట్టం 590.00అడుగులు కాగా 312.0450 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. అంతకు మించి వచ్చే వరదనీటి ప్రవాహాన్ని సమర్థంగా దిగువకు విడుదల చేయాలంటే క్రస్ట్గేట్ల పనితీరు అత్యంతకీలకం. గత నెలలోనే ఈ గేట్లకు సీల్స్ వేయడంతోపాటు బోల్ట్నట్స్ బిగింపు, వెల్డింగ్ పనులు పూర్తి చేశారు. రెండు రోజులుగా గేట్లకు సంబంధించి డ్రై ట్రయల్ రన్ పనులు కొనసాగుతున్నాయి. భద్రత పరంగా వర్షాకాలానికి ముందే అన్ని గేట్ల పనితీరును పూర్తిగా పరిశీలించేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు. గేట్లను ఎత్తి, దింపేందుకు వినియోగించే ఇనుపతాళ్లకు కార్డియమ్ కంపౌండ్ చేయడంతో పాటు గ్రీసింగ్, బేరింగ్ల చెకింగ్, లింక్ సిస్టం ఫంక్షనింగ్ తదితర పనులు చేస్తున్నారు. ఒక్కోగేటును మ్యానువల్గా లేపి ట్రయల్ రన్ ద్వారా పనితీరును పరీక్షిస్తున్నారు. ప్రస్తుతం 1, 2 గేట్ల పనులు పూర్తి చేసినట్లు ఇంజనీర్లు తెలిపారు. ఈ మాసాంతం లోపే 26 రేడియల్ క్రస్ట్ గేట్లన్నింటిని ట్రయల్ రన్ చేసేందుకు పనులు ముమ్మరం చేసినట్లు చెప్పారు. సీపీఐ జిల్లా కార్యదర్శిగా బెజవాడ వెంకటేశ్వర్లు సూర్యాపేట : సీపీఐ సూర్యాపేట జిల్లా కార్యదర్శిగా బెజవాడ వెంకటేశ్వర్లు మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల జిల్లాకేంద్రంలో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయనను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలు చేస్తూ ప్రజలసమస్యలు పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి పాటుపడతానన్నారు. తన ఎన్నికకు సహకరించిన జిల్లా కార్యవర్గ సభ్యులు, కౌన్సిల్ సభ్యులు, రాష్ట్ర నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. న్యాయవాద శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానంభానుపురి (సూర్యాపేట) : 2025–26 విద్యా సంవత్సరంలో న్యాయవాద వృత్తిలో మూడేళ్ల శిక్షణకు ఎస్సీ కులానికి చెందిన న్యాయవాద పట్టభద్రుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి దయానందరాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. న్యాయశాస్త్ర డిగ్రీ ఉత్తీర్ణులై, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2లక్షలకు మించని అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. శిక్షణ కాలంలో నెలకు రూ.3వేల స్టైఫండ్, పుస్తకాల కొనుగోలుకు రూ.50వేలు చెల్లించనున్నట్లు తెలిపారు. వచ్చే నెల 17వరకు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. -
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి : ఎస్పీ
సూర్యాపేటటౌన్ : విద్యార్థులు బాగా చదివి ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలని జిల్లా ఎస్పీ కె.నరసింహ సూచించారు. పాఠశాలలు పునఃప్రారంభమైన సందర్భంగా గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నంబర్ 2 ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులకు స్వాగతం పలుకుతూ వారితో మాట్లాడారు. సమాజాన్ని మంచి మార్గంలో నడిపేది ఉపాధ్యాయ వృత్తి అని, తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు అని అన్నారు. బాలలకు తరగతి గదిలోనే ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరూ పాఠశాలకు వెళ్లాలని, బాలల చదువుకు ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలన్నారు. 14 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకుంటే చర్యపరమైన చర్యలు తప్పవనిహెచ్చరించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు పోలీస్ టీమ్స్ పని చేస్తున్నాయని చెప్పారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ కష్టపడి చదవి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, మాతృభూమికి మంచి పేరు తేవాలని, ప్రజలకు సేవలు అందించే విధంగా ఎదగాలన్నారు. ఈ పాఠశాలలో చదివి ఈ విద్యా సంవత్సరం 10వ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకుని ప్రథమ స్థానంలో నిలిచే విద్యార్థికి రూ.10,116, ద్వితీయ స్థానంలో నిలిచే విద్యార్థికి రూ.5,116 జిల్లా పోలీసు శాఖ తరఫున బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, పాఠశాల ప్రిన్సిపాల్ యం.ఉదయ శ్రీ, సీఐ రాజశేఖర్, ఎస్ఐలు పాల్గొన్నారు. -
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి
హుజూర్నగర్ : పెండింగ్ ప్రాజెక్టులను ప్రభుత్వం పూర్తి చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. హుజూర్నగర్లో సీపీఎం ఆధ్వర్యంలో మూడు రోజులుగా కొనసాగుతున్న జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు గురువారం ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఆయన హాజరై మాట్లాడారు. కాళేశ్వరంపై అధికార, ప్రతిపక్ష పార్టీలు పరస్పర ఆరోపణలతో కాలయాపన చేస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. సోషల్ మీడియా – ప్రాధాన్యత అనే అంశంపై సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ పిట్టల రవి, నయా ఉదారవాద విధానాలు అనే అంశంపై కార్మిక సంఘం నేత శివకుమార్, భవిష్యత్ కర్తవ్యాలు అనే అంశంపై సీపీఎం జిల్లా కార్యదర్శి నాగార్జున రెడ్డి వివరించారు. సమావేశంలో నెమ్మాది వెంకటేశ్వర్లు, యాదగిరిరావు, పాండు, మట్టిపల్లి సైదులు, కోట గోపి, వెంకటరెడ్డి, బ్రహ్మం, అనంత ప్రకాష్, యాకూబ్, నగేష్ పాల్గొన్నారు. -
ఇన్చార్జి మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్కుమార్
సాక్షిప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రిగా అడ్లూరి లక్ష్మ ణ్కుమార్ నియమితులయ్యారు. మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ జిల్లాకు చెందిన లక్ష్మణ్ను ఇటీవల ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ మంత్రిగా నియమించిన విషయం విదితమే. ఇప్పటివరకు నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వర్రావును కరీంనగర్ జిల్లా ఇన్చార్జిగా నియమించింది. ఇప్పటి వరకు ఖమ్మం జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్న ఉత్తమ్కుమార్రెడ్డిలకు ఈ సారి ఇన్చార్జి మంత్రి బాధ్యతలు అప్పగించలేదు. -
ఉపాధిపై సాగు ప్రభావం
నాగారం : వానాకాలం సాగు పనులు ప్రారంభం కావడం, విత్తనాలు విత్తే సమయం ఉండడం, ఉపాధి కంటే వ్యవసాయ పనులకు వెళ్తే రోజు వారి కూలి ఎక్కువ రావడం తదితర కారణాలతో జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు తగ్గాయి. ఒక్కొక్క కూలీకి రోజుకు రూ.400 నగదు అందుతుండటంతో సాగు పనుల వైపే రైతులు మొగ్గుచూపుతున్నారు. గత నెలలో.. జిల్లా వ్యాప్తంగా ఉపాధి కూలీలు రోజుకు సరాసరి 60 శాతం పైనే గత నెలలో హాజరయ్యేవారు. గతనెల 10న మొత్తం 475 గ్రామాలలో ఉపాధి పనులు నిర్వహించగా సరాసరి 80.50శాతంతో 38,240 మంది కూలీలు పాల్గొన్నారు. అదే నెల 20న సరాసరి 92.31 శాతంతో 43,848 మంది కూలీలు, ఈనెలలో 10వ తేదీన 475 గ్రామాలలో ఉపాధి హామీ పనులు నిర్వహించగా సరాసరి 57.0శాతంతో 26,868 మంది కూలీలే పనులు చేయడం విశేషం. అత్యధికంగా నడిగూడెం మండలంలో సరాసరి 134 శాతంతో 2012 మంది కూలీలు పాల్గొంటే.. అత్యల్పంగా చిలుకూరు మండలంలో సరాసరి 24శాతంతో 413 కూలీలు పనులు చేశారు. ప్రస్తుతం ప్రతి గ్రామంలో కనీసం 100 మంది కూలీలు వచ్చేలా చూడాలని జిల్లా అధికారులు ఆదేశిస్తున్నారు. ఆ లెక్కన పనులు జరుగుతున్న 475 గ్రామాలలో 47,500 మంది కూలీలు పాల్గొనాల్సి ఉంది. కానీ కేవలం 26,868 మంది కూలీలే పనులు చేస్తుండటం గమనార్హం. ఏం చేయాలి..? ఉపాధి పనులను వ్యవసాయానికి అనుసంధానం చేస్తే సాగు కాలంలోనూ కూలీల రాక మరింత పెరగనుంది. రైతులకు ఆర్థికంగా ఉపయోగకరంగా మారనుంది. ఈ విషయంలో చర్చలు మినహా నిర్ణయాలు లేకపోవడం విశేషం. 2.62లక్షల జాబ్కార్డులు జిల్లాలో 23 మండలాల పరిధిలో 475 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో ఉపాధిహామీ పనులు కొనసాగుతున్నాయి. జిల్లాలో 2.62లక్షల జాబ్కార్డులు ఉండగా, వీటి పరిధిలో 5.70 లక్షల మంది కూలీలు నమోదై ఉన్నారు. కాగా వీరిలో ప్రస్తుతం పనులకు వెళుతున్న కూలీలు 26,868 మంది ఉన్నారు. జిల్లాలో వ్యవసాయ పనులు ముగిసిన తర్వాత మళ్లీ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రస్తుతం ఇంకుడు గుంతలు, పశువుల షెడ్ల నిర్మాణం, కోళ్ల షెడ్లు, నీటి తొట్లు, నీటి నిల్వ వసతులు, నర్సరీల ఏర్పాటు, చెక్ డ్యామ్లు, మరుగుదొడ్ల నిర్మాణం, పంట పొలాలకు రోడ్ల అనుసంధానం, నీటి కుంటల నిర్మాణం, వనమహోత్సవంలో పండ్ల తోటల పెంపకం, మొక్కల సంరక్షణ పనులను చేపడుతున్నారు. కూలీల సంఖ్య పెరిగే అవకాశం ఉంది లక్ష్యానికి అనుగుణంగా కూలీలకు పనులు కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. వ్యవసాయ పనులు మొదలైన నేపథ్యంలో ఆశించిన స్థాయిలో కూలీలు రాలేకపోతున్నారు. విత్తనాలు వేసే పనులు ముగిసిన తర్వాత మళ్లీ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. – వి.వి అప్పారావు, డీఆర్డీఓ ఫ ఉపాధి హామీ పనులకు వెళ్లడానికి ఆసక్తి చూపని కూలీలు ఫ గత నెలతో పోల్చితే తగ్గిన కూలీల హాజరు ఫ వ్యవసాయ పనులకు వెళ్లేందుకు మొగ్గు