breaking news
Suryapet
-
ఆధారాలు చూపిస్తేనే ఓటు
భానుపురి (సూర్యాపేట) : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)కు సంబంధించి తుదిదశ ప్రక్రియ జిల్లాలో వేగవంతమైంది. జిల్లావ్యాప్తంగా గురువారం నిర్వహించిన గ్రామసభల్లో ఓటర్ల జాబితాను, తొలగించిన ఓటర్ల వివరాలను, నోటీసులు అందుకోనున్న ఓటర్ల జాబితాను అందుబాటులో ఉంచడమే కాకుండా చదివి వినిపించారు. ఇప్పటికే మ్యాపింగ్ కాని వారితో పాటు అనామలీస్ (స్పష్టమైన గుర్తింపు లేని ఓటర్లు) జాబితాలో చేరిన ఓటర్లకు బీఎల్ఓల ద్వారా నోటీసుల జారీ ప్రక్రియ చేపట్టారు. నోటీసులు అందుకునే వారంతా నిర్ణీత గడువులోగా తగిన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో సుమారు 1,90,676 మంది ఓటర్లకు నోటీసులు అందించనున్నారు. నో మ్యాపింగ్, ఎనామలీ కేటగిరీలకు.. జిల్లావ్యాప్తంగా ఎస్ఐఆర్కు ముందు 10,08,252 మంది ఓటర్లు ఉండగా, డిజిటలైజేషన్ అనంతరం 9,11,945 మంది ఓటర్లతో కూడిన ముసాయిదా జాబితాను అధికారులు ప్రకటించారు. మిగతా వారిలో మృతిచెందిన వారు 26,059 మంది, శాశ్వతంగా వలస వెళ్లిన వారు 48,310 మంది కాగా, ఇతర కారణాలతో మొత్తంగా 96,307 ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. ముసాయిదా జాబితాలో పేరున్న ఓటర్లలో వివిధ రకాల తప్పుల కారణంగా ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లా యంత్రాంగం నోటీసులు అందించనుంది. ఎస్ఐఆర్ ప్రక్రియలో నో మ్యాపింగ్గా గుర్తించిన ఓటర్లకు, అలాగే సరైన వివరాలు అందించకపోవడం వల్ల ఎనామలీ కింద నమోదైన వారికి ఈ నోటీసులు అందనున్నాయి. తొలిరోజు 4,796 మందికి.. జిల్లావ్యాప్తంగా నో మ్యాపింగ్ కింద 22,997 మందికి, ఎనామలీ కేటగిరీ కింద 1,70,463 మందికి కలిపి మొత్తంగా 1,90,676 మందికి నోటీసులు అందించాల్సి ఉంది. గురువారం చేపట్టిన గ్రామసభల్లో హుజూర్నగర్ నియోజకవర్గంలో 1,896 మందికి, కోదాడలో 1,468 మందికి, సూర్యాపేటలో 1,318 మందికి, తుంగతుర్తిలో 114 మందికి మొత్తంగా 4,796 మందికి అధికారులు నోటీసులు అందజేశారు. ఇంకా 1,85,880 మంది ఓటర్లకు నోటీసులు అందించాల్సి ఉంది. నోటీసులు అందుకున్న వారంతా అందులో పేర్కొన్న తేదీ, ప్రాంతంలో ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకదానిని బీఎల్ఓకు చూపించి తమ ఓటు హక్కును కాపాడుకోవాల్సి ఉంటుంది. నియోజకవర్గం ఓటర్లు మొత్తం నోటీసులు ఇంకా నోటీసులు అందించినవి ఇవ్వాల్సింది హుజూర్నగర్ 2,27,398 43,204 1,896 41,308 కోదాడ 2,21,879 44,598 1,468 43,130 సూర్యాపేట 2,20,335 55,665 1,318 54,347 తుంగతుర్తి 2,42,333 47,209 114 47,095 ఫ జిల్లావ్యాప్తంగా ముగిసిన గ్రామసభలు ఫ ఓటరు జాబితాతోపాటు నోటీసులు అందే ఓటర్ల వివరాలు వెల్లడి ఫ జిల్లాలో సుమారు 1,90,676 మంది ఓటర్లకు నోటీసులు ఫ రేపటి నుంచి ఆధారాల స్వీకరణ -
ప్రణాళికతో నేరాల అదుపు
కోదాడ రూరల్ : నేరాల అదుపు, ప్రమాదాల నివారణకు పోలీసులు ప్రణాళికతో పనిచేయాలని ఎస్పీ నరసింహ సూచించారు. గురువారం కోదాడ పట్టణంలోని డీఎస్పీ, ట్రాఫిక్ పోలీసు కార్యాలయాల్లో వార్షిక తనిఖీలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. సబ్ డివిజన్ పరిధిలో ఉన్న పోలీసు స్టేషన్ల పనితీరుపై పర్యవేక్షణ చేస్తూ సిబ్బందిని అప్రమత్తంగా ఉంచాలని డీఎస్పీకి తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని, రహదారుల వెంట ఉన్న హోటళ్లు, వ్యాపారులకు అవగాహన కల్పించాలన్నారు. అన్ని చోట్లా సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని, అవి నేరాల నియంత్రణకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. సబ్ డివిజన్ పరిధిలో ఎక్కువ భాగం అంతర్ రాష్ట్ర సరిహద్దు ఉందని, ఆయా ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి అక్రమ రవాణా జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. వరకట్నం, అట్రాసిటీ, మైనర్లపై వేధింపులు, తీవ్రమైన చీటింగ్ కేసులకు డీఎస్పీయే దర్యాప్తు అధికారిగా ఉంటారని, ఇలాంటి కేసుల్లో పురోగతి సాధించాలన్నారు. అనంతరం రికార్డులను పరిశీలించి కార్యాలయ ఆవరణలో మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి, డివిజన్ పరిధిలోని సీఐలు కె.శివశంకర్, చరమందరాజు, రామకృష్ణారెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐ అంజిరెడ్డి, ఎస్ఐలు నవీన్, మోహన్, స్టోర్ ఆర్ఎస్ఐ అఖిల్, సిబ్బంది అంజన్రెడ్డి, శేఖర్రెడ్డి, సీసీ సందీప్ తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ స్టేషన్ తనిఖీ పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా సిబ్బంది తగు చర్యలు చేపట్టాలని ఎస్పీ సూచించారు. డ్రంకెన్ డ్రైవ్, ఎన్ఫోర్స్మెంట్ రిజిస్టర్లను పరిశీలించారు. ‘ఆపరేషన్ రోప్’ కార్యక్రమాన్ని సమర్థవంతంగా చేపట్టాలని ఆదేశించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై, మైనర్ల డ్రైవింగ్పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు.ఫ ఎస్పీ నరసింహ -
సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి
భానుపురి (సూర్యాపేట): ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చొరవ చూపి, తమను చర్చలకు ఆహ్వానించాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్య వేదిక (టీజీఈజేఏసీ) జిల్లా సెక్రటరీ జనరల్ భూపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండో పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న ఆరు డీఏలను ప్రభుత్వం తక్షణమే మంజూరు చేయాలని కోరారు. అలాగే సీపీఎస్ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు హెల్త్ కార్డులను సక్రమంగా వర్తింపజేయడంతో పాటు ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేసి జీఓ 25ను సవరించాలని ప్రభుత్వాన్ని కోరారు. సెప్టెంబర్ 10వ తేదీన ఇందిరాపార్క్ వద్ద జరగనున్న మహాధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అడిషనల్ సెక్రటరీ జనరల్ తంగెళ్ల జితేందర్ రెడ్డి, రాధాకృష్ణ, కో చైర్మన్లు ఎన్.సోంబాబు, పి.వీరన్న, షేక్ ఉమర్, నిమ్మల శ్రీనివాస్, సీతారామయ్య, నాగేశ్వరరావు, మన్నెం యాదగిరి, పాండు నాయక్, నాగేందర్, లక్కపాక ప్రవీణ్కుమార్, ఎస్.రవికుమార్, ఆకాష్ వర్మ, సైదులు, డి.బాలు నాయక్, బంధం వెంకటేశ్వర్లు, అనిత, పద్మావతి, పి.శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.ఫ సీపీఎస్ రద్దుచేసి ఓపీఎస్ పునరుద్ధరించాలి ఫ కలెక్టరేట్ ఎదుట టీజీఈజేఏసీ ధర్నా -
మెడికోలకు ప్రత్యేక ప్రయాణం
సూర్యాపేట టౌన్ : గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వెళ్లే మెడికల్ కళాశాల విద్యార్థులకు ప్రత్యేక బస్సు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఫ్యామిలీ అడాప్షన్ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లోని కుటుంబాలను దత్తత తీసుకున్న మొదటి సంవత్సరం వైద్య విద్యార్థులు ప్రతినెలా ఆయా గ్రామాలకు వెళ్లేందుకు కలెక్టర్ ప్రత్యేక నిధులతో ఈ బస్సును ఏర్పాటు చేశారు. 51 మంది ప్రయాణించే సామర్థ్యం ఉన్న ఈ బస్సును ఇటీవల మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రారంభించారు. ఒక్కో విద్యార్థికి మూడు నుంచి ఐదు కుటుంబాలు.. నేషనల్ మెడికల్ కమిషన్ సూచనల మేరకు ‘ఫ్యామిలీ అడాప్షన్’ కార్యక్రమాన్ని గత సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ప్రతి వైద్య విద్యార్థి మూడు నుంచి ఐదు కుటుంబాలను దత్తత తీసుకుని, ఆయా కుటుంబాల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాల్సి ఉంటుంది. గత విద్యాసంవత్సరంలో విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో గ్రామాలకు వెళ్లి ఎంపిక చేసుకున్న కుటుంబాలను సందర్శించారు. విద్యార్థులకు అవగాహన కోసం.. కుటుంబాలను సందర్శించే సమయంలో విద్యార్థులు ఆయా కుటుంబాల్లోని అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులు, జీవనశైలి, ఆహార అలవాట్లు తదితర అంశాలను తెలుసుకుంటారు. వ్యాధులు ఎందుకు వస్తున్నాయి.. వాటిని ఎలా నివారించాలి.. చికిత్స ఎలా పొందాలి.. అనే అంశాలపై కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తారు. ఫ కుటుంబాలను దత్తత తీసుకున్న మెడికల్ విద్యార్థులకు బస్సు సౌకర్యం ఫ కలెక్టర్ ప్రత్యేక నిధులతో ఏర్పాటు ఫ ప్రతినెలా బ్యాచ్లవారీగా వెళ్లనున్న విద్యార్థులు -
చిన్న నిర్లక్ష్యం.. ఘోర ప్రమాదం!
కోదాడ రూరల్ : హైవే అథారిటీ, లారీ డ్రైవర్, పోలీసుల చిన్న నిర్లక్ష్యం కోదాడ మండల పరిధిలోని దోరకుంట వద్ద జరిగిన ఘోర ప్రమాదానికి కారణమైంది. హైదరాబాద్లోని జీడిమెట్ల నుంచి ఐరన్ స్తంభాల లోడ్తో విజయవాడ వైపు వెళ్తున్న లారీ కోదాడ దాటిన తర్వాత బుధవారం తెల్లవారుజామున 3.36 గంటల సమయంలో ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో బ్రేకులు ఫెయిల్ కావడంతో డివైడర్ను ఎక్కినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. లారీ సంగం డివైడర్పై, సగం రోడ్డుపై ఉండి నిలిచిపోయింది. 3.45 గంటలకు హైదరాబాద్ నుంచి విజయవాడవైపు వెళ్తున్న ఓ ట్రావెల్స్ బస్సు డ్రైవర్.. ఈ లారీ దగ్గరకు వచ్చి తృటిలో తప్పించడంతో బస్సుకు గీతలు పడ్డాయి. దీంతో ఆ బస్సులో ఉన్న ఇద్దరు డ్రైవర్లు లారీ డ్రైవర్తో గొడవకు దిగారు. బస్సు డ్యామేజీకి డబ్బులు చెల్లించాలని ఒక డ్రైవర్ అక్కడే ఉండిపోగా మరో డ్రైవర్ బస్సును తీసుకొని వెళ్లిపోయారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ఉంటే.. తెల్లవారుజామూన 3.36 గంటలకు లారీ డివైడర్ ఎక్కి నిలిచిపోతే.. బస్సు 4.45 గంటలకు ఆ లారీని ఢీకొట్టగా ఆరుగురు మృతిచెందారు. 15 మంది గాయపడ్డారు. లారీ డివైడర్ ఎక్కిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. కనీసం, తొలుత ఒక బస్సు వచ్చి స్వల్పంగా ఢీకొట్టిన వెంటనే గానీ ఇండికేటర్లు ఏర్పాటు చేసినా ఘోర ప్రమాదం తప్పేదని పేర్కొంటున్నారు. లారీ డివైడర్ ఎక్కిన గంట సమయం తర్వాత.. ఘోర ప్రమాదానికి గురైన బస్సు వచ్చి ఢీకొట్టింది. అంటే గంటకు పైగా అక్కడ రోడ్డుపై ప్రమాదకరంగా కంటైనర్ ఉందనే విషయాన్ని హైవే పెట్రోలింగ్ సిబ్బంది గానీ, పోలీసులు గానీ గుర్తించలేకపోయారు. ఆ సమయంలో ఆ రెండు శాఖల వారు ఎక్కడ ఉన్నారనేది ప్రశ్న. సంఘటన స్థలం పరిశీలన ప్రమాదానికి గురైన బస్సును, కారణమైన లారీని ప్రమాద స్థలం నుంచి కొద్దిదూరంలో రోడ్డు పక్కన ఫంక్షన్హాల్ వెంట పెట్టారు. రోడ్డు ప్రమాదం జరిగిన స్థలాన్ని గురువారం ఉమ్మడి నల్లగొండ జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ ఎన్.వాణి పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను స్థానిక పోలీసులు, రవాణాశాఖ, రెవెన్యూ, హైవే అథారిటీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. హైవే అథారిటీ అధికారులు 60 కిలో మీటర్లకు ఒక పెట్రోలింగ్ వాహనం నడిపితే ఎలా అన్ని ఆమె ప్రశ్నించారు. దీనిపై పూర్తి వివరాలను ఇవ్వాలని ఆయా శాఖ అధికారులను ఆదేశించారు. వారి వెంట ఆర్టీఓ పురుష్తోమరెడ్డి, ఆర్డీఓ సూర్యనారాయణ, డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి, ఎంవీఐ జిలానీ, హైవే అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఉన్నారు. నికలడగా క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి ప్రమాదంలో గాయడిన 15 మంది ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని కోదాడ రూరల్ పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన ఫ్రెష్ బస్సు డ్రైవర్ మల్లికార్జున్ హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఫ 3.36 గంటలకు లారీ డివైడర్ ఎక్కి నిలిచిపోయినట్లు గుర్తించిన అధికారులు ఫ 4.45 గంటలకు బస్సు వచ్చి లారీని ఢీకొట్టింది ఫ గంటకు పైగా లారీ హైవేపై నిలిచిపోయినా గుర్తించని పెట్రోలింగ్ సిబ్బంది ఫ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తే ప్రమాదం తప్పేదంటున్న స్థానికులు ఫ సంఘటన స్థలాన్ని పరిశీలించిన రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ -
అలైన్మెంట్ మార్చడం సరికాదు
సూర్యాపేట అర్బన్ : ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పని చేయాలని, నాయకుల స్వప్రయోజనాల కోసం అలైన్మెంట్ మార్చడం సరికాదని ఐద్వా రాష్ట్ర జనరల్ సెక్రటరీ మల్లు లక్ష్మి అన్నారు. బుల్లెట్ ట్రైన్ సాధన కోసం అఖిలపక్ష పోరాట కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలో నిర్వహిస్తున్న దీక్షలు గురువారం 14వ రోజుకు చేరుకున్నాయి. ఐద్వా ఆధ్వర్యంలో మహిళలతో కలిసి ఆమె ఈ దీక్షలో పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మొదటి అలైన్మెంట్ ప్రకారం జాతీయ రహదారి వెంట బుల్లెట్ ట్రైన్ను ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించే వరకు ఉద్యమం కొనసాగుతుంద న్నారు. 40 రోజులుగా సూర్యాపేట, నకిరేకల్, కోదాడ, చౌటుప్పల్ ప్రాంతాల్లో జరుగుతున్న బుల్లెట్ ట్రైన్ దారిమళ్లింపు వ్యతిరేక ఉద్యమాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ప్రజా ఉద్యమం తీవ్రరూపం దాలుస్తుందని హెచ్చరించారు. బుల్లెట్ ట్రైన్ను హైవే వెంటే ఏర్పాటు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జ్యోతి, వెంకటమ్మ, సైదమ్మ, రజిత, రమాదేవి, విజయలక్ష్మి, నాగమణి, కిజాబీ, లక్ష్మమ్మ, సుభద్ర, అమృతమ్మ, జానమ్మ పాల్గొన్నారు. -
ఆధారాలు చూపించి ఓటు హక్కు పొందాలి
సర్పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లాలో గ్రామసభలు నిర్వహించాం. నో మ్యాపింగ్, ఎనామలీ కేసులను గుర్తించి వారికి నోటీసులు అందించాం. తొలిరోజు 4 వేలమందికి పైగా నోటీసులు ఇచ్చాం. రెండు మూడు రోజుల్లోనే మిగతావారికి ఇస్తాం. ఈ నోటీసులు అందుకున్న వారంతా 12 రకాల ఎన్నికల సంఘం సూచించిన గుర్తింపు కార్డులను ఆధారంగా చూపించి తిరిగి ఓటు హక్కును పొందాలి. కొత్తగా నమోదు చేసుకునే వారు సైతం సంబంధిత ఫారాలతో దరఖాస్తులు అందించాలి. –తేజస్ నంద్లాల్ పవార్, కలెక్టర్ -
బుల్లెట్ రైలు వచ్చేంత వరకు ఉద్యమం
సూర్యాపేట : సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ వచ్చే వరకు ఉద్యమం కొనసాగుతుందని బుల్లెట్ ట్రైన్ సాధన సమితి నాయకులు పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని రైతుబజార్ వద్ద అంబేద్కర్ విగ్రహం ఎదుట నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలో దివ్యాంగుల ఐక్య సంఘాల నాయకులు పాల్గొన్నారు. దీక్షలను సమితి నాయకులు ప్రారంభించి మాట్లాడారు. జిల్లా కేంద్రం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో బుల్లెట్ ట్రైన్ మార్గాన్ని సూర్యాపేట మీదుగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దాంతో రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు వ్యాపార, పారిశ్రామిక, విద్యా రంగాల అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందన్నారు. దీక్షల్లో పాల్గొన్న వారికి బీసీ ఉద్యమ నాయకుడు వట్టె జానయ్య యాదవ్తో పాటు పలువురు నాయకులు మద్దతు తెలిపారు. దీక్షలో పాల్గొన్న వారిలో షేక్ నయీమ్. జహీర్ బాబా, కొరివి సైదులు, మిద్దె సైదులు, స్నేహలత, భిక్షపతి, మాధవ్రెడ్డి, జయకృష్ణ, యాదగిరి, సుశీల, సునీత, వీరమ్మ, రమేష్, ఏలె జానయ్య, రుక్సానా, కుర్రి నాగయ్య, వెంకట్రెడ్డి, రాంకుమార్, సంతోష, లింగయ్య, తదితరులు పాల్గొన్నారు. -
గమ్యం చేరకుండానే తెల్లారిన బతుకులు
ఫ కోదాడ మండలం దోరకుంట వద్ద డివైడర్పై ఆగిన లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఫ గాలిలో కలిసిన ఆరుగురి ప్రాణాలు ఫ రాఖీ పండుగ వేళ విషాదంకోదాడ: స్వగ్రామంలో రాఖీ పండుగను ఆనందంగా జరుపుకోవాలని అనుకున్న వారి ఆశలు.. జాతీయ రహదారిపైనే రక్తమోడాయి. కష్టపడి చదువుకుని, ఇప్పుడిప్పుడే సాఫ్ట్వేర్ కొలువుల్లో స్థిరపడుతూ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్న ఐరుగురితో పాటు మరో మహిళను.. ఒకరి నిర్లక్ష్యం బలితీసుకుంది. గమ్యం చేరడానికి మరో రెండు గంటల సమయం ఉందనగా, గాఢ నిద్రలో ఉన్న వారు అనంతలోకాలకు వెళ్లిపోయారు. పండుగ పూట ఆ ఇళ్లలో మిగిలిన కడుపుకోత ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేస్తోంది. బుధవారం తెల్లవారుజామున సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని దోరకుంట వద్ద విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రమాదానికి గురై ఆగి ఉన్న ట్రాలీ లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఆరుగురు మృత్యువాత పడగా 15మంది గాయాలపాలయ్యారు. మృతుల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెదిన యాసరపు చిన్ని, బొల్లిపోగు మేరిజ్యోష్నా, సురవరపు షకీన, చెన్నకేశవుల నాగేంద్రబాబు, పిడికిడి లక్ష్మీతేజ, కొండురు భావనవర్ష ఉన్నారు. -
సంతోషిమాత ఆలయంలో కలశ స్థాపన
సూర్యాపేట : జిల్లా కేంద్రంలోని సంతోషి మాత ఆలయంలో బుధవారం కలశ స్థాపన పూజలతో సంతోషిమాత జన్మదిన వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అర్చకుడు బట్టారం వంశీకృష్ణ ఆధ్వర్యంలో గణపతి పూజ పుణ్యాహవాచనం, మంటపారాధన, కంకణ ధారణ, దీక్ష వస్త్రధారణ నిర్వహించారు. అనంతరం రుద్రహోమం, లలిత హోమం చేపట్టారు. కార్యక్రమంలో దేవాలయ అధ్యక్షుడు బ్రాహ్మడ్లపల్లి మురళీధర్, ప్రధాన కార్యదర్శి పబ్బ ప్రకాష్, కోశాధికారి కొత్త మల్లికార్జున్, సహాయ అర్చకుడు అశోక్ మిశ్రా, భక్తులు పాల్గొన్నారు. లక్ష్మీనరసింహుని నిత్యకల్యాణంమఠంపల్లి : మట్టపల్లిలోని రాజ్యలక్ష్మీ, చెంచులక్ష్మీ సమేత లక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని బుధవారం అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. కల్యాణతంతులో భాగంగా స్వామి, అమ్మవార్లకు ఎదుర్కోళ్ల మహోత్సవం నిర్వహించారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ, తలంబ్రాలతో కల్యాణం జరిపించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ చలపతిరావు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. 12వ బెటాలియన్ కమాండెంట్గా రామకృష్ణరామగిరి(నల్లగొండ): నల్లగొండ మండల పరిధిలోని అన్నెపర్తిలో గల 12వ తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ బెటాలియన్ కమాండెంట్గా బి.రామకృష్ణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది సమన్వయంతో బాధ్యతలు నిర్వర్తిస్తూ బెటాలియన్కు పేరు ప్రఖ్యాతులు తేవాలన్నారు. -
ఉద్యోగ సంఘాల ఉద్యమ బాట
సూర్యాపేటటౌన్ : ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో ఉద్యోగ సంఘాలు పోరుబాట పట్టాలని నిర్ణయించాయి. ప్రతి ఆరు నెలలకు మంజూరు కావాల్సిన డీఏలు అందకపోవడం, వారికి రావాల్సిన బిల్లులు, జీపీఎఫ్ రుణాలు వంటివి సంవత్సరాలుగా పెండింగ్లో ఉండడంతో చాలా మంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సంఘాల నాయకులు చెబుతున్నారు. వాటి సాధనకు ఉద్యమించాలని అన్ని సంఘాల జేఏసీ నిర్ణయించిది. పీఆర్సీ, పెండింగ్ బిల్లులపై .. ప్రతి ఐదేళ్లకు ఒక సారి పే రివిజన్ కమిషన్(పీఆర్సీ) సిఫార్సుల ఆధారంగా ఉద్యోగుల వేతనాలను సవరించాల్సి ఉంటుంది. 2023 జూలైలో అమల్లోకి రావాల్సిన పీఆర్సీ ఇప్పటికీ అమలు కాలేదని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. దాంతో ఒక్కో ఉద్యోగి నెలకు సుమారు రూ.20 వేల వరకు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీఏలను ఎప్పటి కప్పుడు పెంచకుండా పెండింగ్లో ఉంచుతున్నారని, ఇప్పటి వరకు ఆరు డీఏలు పెండింగ్లో ఉన్నాయని, ఉద్యోగుల జీపీఎఫ్ రుణాలు, పార్ట్ ఫైనల్ బిల్లులు ఏడాది దాటినా మంజూ కావడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేడు మహా ధర్నా. సమస్యల పరిష్కారం కోసం ఇప్పటి వరకు అర్జీలు, వినతిపత్రాలు, నిరసనలు చేపట్టినా ప్రభుత్వం సానుకూలంగాా స్పందించడం లేదని, దాంతో 206 ఉద్యోగ సంఘాలతో ఏర్పడిన తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్లు ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం 10 గంటలకు సూర్యాపేట వద్ద మహా ధర్నా నిర్వహించనున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరై ధర్నాను విజయవంతం చేయాలని జేఏసీ పిలుపునిచ్చింది. ఫ వచ్చే నెల 30లోపు రెండో పీఆర్సీ నివేదకను తెప్పించుకుని వెంటనే అమలు చేయాలి. ఫ పెండింగ్లో ఉన్న ఆరు డీఏలను వెంటనే విడుదల చేయాలి. ఫ ఈహెచ్ఎస్ పథకాన్ని సక్రమంగా అమలు చేయాలి. ఫ పెండింగ్లో ఉన్న బిల్లుల క్లియరెన్స్ కోసం నెలకు రూ.రెండు వేల కోట్లు విడుదల చేయాలి. ఫ ఓపీఎస్ విధానాన్ని అమలు చేసి సీపీఎస్ను రద్దు చేయాలి. ఫ దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉంటున్న సమస్యలను పరిష్కరించాలి. నేడు కలెక్టరేట్ ఎదుట టీజీఈ జేఏసీ మహాధర్నాఫ పెండింగ్ బిల్లులు, పీఆర్సీపై తప్పని నిరీక్షణ ఫ డీఏలు, జీపీఎఫ్ రుణాలు, సరెండర్ లీవ్ బిల్లులకు కలగని మోక్షం -
డెత్ హైవే!
జాతీయ రహదారిపై ప్రమాదాలకు ప్రధాన కారణాలివే..అతివేగం.. అడ్డగోలుగా పార్కింగ్సాక్షి ప్రతినిధి, నల్లగొండ : హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి ప్రయాణికుల పాలిట మృత్యుమార్గంగా మారుతోంది. అతివేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం, రోడ్డు పక్కన ప్రమాదకరంగా భారీ వాహనాలు నిలిపివేయడం, వీటికి తోడు హైవే పెట్రోలింగ్ వ్యవస్థ పర్యవేక్షణ లోపాలు వెరసి నిత్యం ఏదో ఒకచోట ప్రమాదం జరుగుతూనే ఉంది. తాజాగా బుధవారం తెల్లవారుజామున కోదాడ మండలం దోరకుంట వద్ద జరిగిన ఘోర ప్రమాదం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది. ఉమ్మడి జిల్లా పరిధిలో ఏడాది కాలంలో.. ఈ ఏడాది కాలంలో ఉమ్మడి జిల్లా పరిధిలోని హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి పొడవునా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 200 మందికిపైగా మరణించారు. ఈ మూడు నెలల్లోనే 20 మందికిపైగా మృతిచెందారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూఫ్రాన్పేట నుంచి మొదలుకొని కోదాడ వరకు హైవేపై ప్రమాదాలు నిత్యకృత్యం అయ్యాయి. తూఫ్రాన్పేట, మల్కాపురం జంక్షన్, బొర్రోళ్లగూడెం స్టేజీ, కై తాపురం స్టేజీ, ధర్మోజిగూడెం స్టేజీ, దివీస్ పరిశ్రమ ముందు, పంతంగి గ్రామ స్టేజీ, ఆరెగూడెం క్రాస్రోడ్డు వరకు ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. అలాగే నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు, నార్కట్పల్లి మండలం ఏపీ లింగోటం, సూర్యాపేట జిల్లా దురాజ్పల్లి, ఖాసీంపేట, వల్లభాపురం, గుంజలూరు, మునగాల, కోదాడ ప్రాంతాల్లో తరచుగా ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. గతేడాది జూలై 26న చౌటుప్పల్ మండల పరిధిలోని కై తాపురం స్టేజీ వద్ద జరిగిన ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు పోలీసు అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఇష్టారీతిన పార్కింగ్తో సమస్యలు హైవే వెంట వాహనాలు ఇష్టానుసారంగా పార్కింగ్ చేస్తున్నారు. ఎలాంటి హెచ్చరికలు, సూచికలు ఏర్పాటు చేయకుండా నిలుపుతున్నారు. దీంతో రాత్రి సమయాల్లో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వెనుక నుంచి వచ్చే వాహనదారులు అయోమయానికి గురై ప్రమాదాల బారిన పడుతున్నారు. వాహనం ఆగిపోయినా, డ్రైవర్ విశ్రాంతి తీసుకుంటున్నా.. వెనుక నుంచి వచ్చే వాహనాలకు ముందస్తు హెచ్చరికలు, తగిన భద్రతా ఏర్పాట్లు ఉండాల్సి ఉంటుంది. ఇవి సక్రమంగా లేకపోతే చిన్నపాటి పొరపాటు కూడా ప్రాణాంతకంగా మారుతోంది. ఏటా వందల మంది మృత్యువాత హైదరాబాద్–విజయవాడ హైవేపై ఒక్క చౌటుప్పల్ప్పల్ మండల పరిధిలోని 28 కిలోమీటర్ల హైవే పరిధిలోనే గతేడాది 129మంది చనిపోయారు. ఈ ఏడాది 8 నెలల్లోనే 156 మంది మరణించారు. నార్కట్పల్లి మండలంలో 17 మంది, చిట్యాల మండలంలో ఏడుగురు మృతిచెందారు. మొత్తంగా చౌటుప్పల్ నుంచి కోదాడ వరకు హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో గతేడాది 200 మందికిపైగా, ఈ ఏడాది ఇప్పటివరకు మరో 200 మందికిపైగా మరణించారు. ఇతర జాతీయ, రాష్ట్ర రహదారుల్లోనూ పెద్ద మొత్తంలో మరణాలు సంభవించాయి. రహదారులపై డేంజర్ స్పాట్లు–జోన్ పేజీలోఫ ఎక్కడపడితే అక్కడ లారీల నిలుపుదల ఫ పట్టించుకోని హైవే పెట్రోలింగ్ ఫ గాల్లో కలుస్తున్న ప్రాణాలు ఫ గత ఏడాది కాలంలో 200 మందికిపైగా బలి ఫ ఈ ఎనిమిది నెలల్లోనే అంతకంటే ఎక్కువ మంది మృత్యువాత -
సూర్యాపేట రోడ్డు ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి
సాక్షి, హైదరాబాద్: సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజును ఆదేశించారు. బుధవారం ఉదయం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో కంటైనర్ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.మంత్రుల సంతాపంసూర్యాపేట బస్సు ప్రమాద ఘటనపై మంత్రులు దామోదర్ రాజనర్సింహ, ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కోరారు. మృతదేహాలకు త్వరగా పోస్టుమార్టం నిర్వహించాలని అధికారులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. పోస్టుమార్టం కోసం రెండు బృందాల ఏర్పాటు చేయాలని, మృతదేహాలను కుటుంబ సభ్యులకు త్వరగా అప్పగించాలని సూచించారు. కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా ప్రమాదంపై దిగ్భ్రాంతి తెలిపారు.ప్రభుత్వం ఆదుకోవాలిసూర్యాపేట రోడ్డు ప్రమాదంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందడం అత్యంత బాధాకరమని అన్నారు. కోదాడ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు ప్రభుత్వం తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. గాయపడిన వారు త్వరగా పూర్తిస్థాయిలో కోలుకోవాలని ఆకాంక్షించారు. ఊహించని ఈ ప్రమాదంలో ఆత్మీయులను కోల్పోయి శోకసంద్రంలో ఉన్న బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.చదవండి: బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదంఘటనా స్థలంలో కలెక్టర్కోదాడ మండలం ద్వారకుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పరిశీలించారు. ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య పరామర్శించారు. డ్రైవర్ మారిన మరుక్షణమే.. తాను డ్యూటీ మారిన తర్వాతనే ప్రమాదం జరిగిందని రెండో డ్రైవర్ మీడియాతో చెప్పారు. సూర్యాపేటలో తాను డ్రైవింగ్ను మరో డ్రైవర్కు అప్పగించి, పడుకున్నానని వెల్లడించారు. తర్వాత కొద్దిసేపటికే ప్రమాదం సంభవించిందని తెలిపారు. బస్సులో 42 మంది ఉన్నారని చెప్పారు.కొద్దిలో బతికిపోయావెనుక సీటులో కూర్చోవడం వల్ల ప్రమాదం నుంచి కొద్దిలో ప్రాణాలతో బయటపడ్డానని ఓ ప్రయాణికుడు తెలిపారు. రాఖీ పండుగ కోసం చెల్లెలు దగ్గరికి వెళుతుండగా ప్రమాదం బారిన పడ్డానని చెప్పారు. ఇనుప రాడ్ తన ముఖం వరకు వచ్చి ఆగడంతో బతికిపోయానని వెల్లడించారు. బస్సు సూర్యాపేటలో ఆగి.. మళ్లీ స్టార్ట్ అయిన 15 నిమిషాల్లోనే ఈ యాక్సిడెంట్ జరిగిందని తెలిపారు. -
సూర్యాపేట: ప్రాణాలు తీసిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం
సాక్షి, సూర్యాపేట: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఐరన్ లోడ్తో వెళ్తున్న కంటైనర్ లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 14 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని క్షతగాత్రులు చెబుతున్నారు.బుధవారం వేకువ జామున హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రెష్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు.. కోదాడ మండలం ద్వారకుంట శివారులో ఈ ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో డివైడర్ మధ్యలో ఐరన్ లోడ్ లారీ ఆగిపోయింది. అయితే వేగంగా వెళ్లిన బస్సు.. లారీ కంటైనర్ను ఢీ కొట్టింది. దీంతో ఐరన్ దిమ్మెలు బస్సులోకి దూసుకెళ్లాయి. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సాయంతో గాయపడిన వాళ్లను హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.అతివేగం.. ముందు ఆగిఉన్న లారీని బస్సు డ్రైవర్ గమనించకపోవడమే ప్రమాదానికి కారణమై ఉంటుందని ఎస్సీ నరసింహ తెలిపారు. డ్రైవర్ అందుబాటులో లేడని(పరారీ?).. ఉదయం 4గం. సమయంలో ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. మృతుల్లో.. చిన్ని, మేరీ, నాగేంద్రబాబులను గుర్తించినట్లు తెలిపారు. మిగతా మృతుల పేర్లు.. వివరాలు అందాల్సి ఉంది. ఈ ప్రమాదంతో హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో పోలీసులు రంగంలకి దిగి క్లియర్ చేశారు.టీ విరామం తర్వాత బస్సు ప్రారంభమైన గంటకు ప్రమాదం జరిగిందని.. బస్సు బలంగా ఢీ కొట్టాక ఐరన్ దిమ్మెలు వచ్చి పడ్డాయని క్షతగాత్రుడొకరు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని బాధితులు చెబుతున్నారు. ప్రమాదం తర్వాత 20 మందిని ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చినట్లు కోదాడ ఆస్పత్రి సూపరిండెంట్ తెలిపారు. వాళ్లలో ముగ్గురిని సూర్యాపేటకు తరలించినట్లు వెల్లడించారు. -
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
భానుపురి (సూర్యాపేట) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ట్రైకార్–గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ఉఫాది పొందాలని కల్లెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ కోరారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన వారు, ఇతర కోర్సులను మధ్యలో ఆపివేసిన వారు అర్హులని పేర్కొన్నారు. ఉచిత భోజన, వసతి సౌకర్యాలతో వివిధ కోర్సుల్లో 3 నుంచి 6 నెలల పాటు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించబడతాయని తెలిపారు. ఆసక్తి గల వారు ఈనెల 25 వరకు ప్రభుత్వ గిరిజన బాలుర కళాశాల వసతి గృహం కోదాడ(ఎ) (సెల్ : 9912739723), ప్రభుత్వ గిరిజన బాలుర కళాశాల వసతి గృహం సూర్యాపేట (సెల్:9505767833)లో తమ పేర్లు రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. 22ఏ జాబితా నుంచి భూములు తొలగించాలిభానుపురి (సూర్యాపేట) : 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న అర్హులైన రైతుల భూములను తొలగించి న్యాయం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతారెడ్డి కోరారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో డీఆర్ఓ ప్రేమ్రాజ్ను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూములపై హక్కులు ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్లు, క్రయవిక్రయాలు, ఇతర లావాదేవీలు జరగక జిల్లాలో వేలాది మంది రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రంగినేని రుక్మారావు, రాష్ట్ర టీచర్స్ సెల్ కన్వీనర్ తీకుళ్ల సాయిరెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు చలమల్ల నరసింహ, దోసకాయల పని నాయుడు, ఉపాధ్యక్షుడు బండపల్లి పాండురంగాచారి, బీజేవైఎం మోర్చా జిల్లా అధ్యక్షుడు గునుగంటి పృథ్వీగౌడ్, నాయకులు మన్మథరెడ్డి, బాలాజీ నాయక్, దాసరి వెంకన్న, రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణమ్మకు హారతిమఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు పవిత్ర కృష్ణానదికి పసుపు, కుంకుమ, గాజులు, చీరె సారెతో హారతి ఇచ్చారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. అనతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ చలపతిరావు, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు భక్తులు పాల్గొన్నారు. -
రూపారెడ్డి హత్యను ఖండిస్తూ ర్యాలీ
సూర్యాపేట : నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలోని నాగార్జున పాఠశాల ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్యను ఖండిస్తూ యునైటెడ్ ట్రస్మా, తెలంగాణ ప్రైవేట్ టీచర్ అండ్ లెక్చరర్స్ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తల్లిదండ్రుల తరువాతి స్థానం గురువదని, అలాంటి గురువును హత్య చేయడం దారుణమన్నారు. ఉపాధ్యాయులకు రక్షణకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ట్రస్మా ప్రతినిధులు హరి, ఆర్.ప్రకాష్రెడ్డి, ఉపేందర్రెడ్డి, శ్రీనివాసనాయుడు, భిక్షపతి, రమేష్, లింగారెడ్డి, అజయ్కుమార్, ఉపేందర్రావు, నరసింహారావు, సోమరాజు, బాలకృష్ణ, రాజశేఖర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
గంజాయిని కట్టడి చేద్దాం
సూర్యాపేటటౌన్ : గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం నిరంతరం కృషిచేస్తోంది. గంజాయి వినియోగం యువత, విద్యార్థుల భవిష్యత్పై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఈ అంశాన్ని అత్యంత సీరియస్గా తీసుకుంటున్నాం. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు జిల్లాలోనూ డ్రగ్స్ నియంత్రణ, గంజాయి అక్రమ రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపేందుకు ప్రత్యేక బృందాలతో నిరంతరం నిఘా కొనసాగిస్తున్నామని ఎస్పీ నరసింహ వెల్లడించారు. శుక్రవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించిన పలు విషయాలు ఆయన మాటల్లోనే.. అన్ని శాఖల సమన్వయంతో.. ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రాంతాల నుంచి జిల్లాలోకి గంజాయి రవాణా కాకుండా అంతర్రాష్ట్ర మార్గాల్లో తనిఖీలు పెంచడంతోపాటు అనుమానాస్పద వాహనాలు, వ్యక్తుల కదలికలను నిశితంగా పరిశీలిస్తూ నిఘా పెట్టాం. ఇతర శాఖలు, సంబంధిత ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ గంజాయి సరఫరా గొలుసును ఛేదించేలా చర్యలు చేపడుతున్నాం. ఈ ఏడాది 23 కేసులు నమోదు ఇటీవల కోదాడ, హుజూర్నగర్ ప్రాంతాల్లో భారీగా గంజాయి పట్టుబడిన ఘటనల్లో కేసులు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశాం. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు గంజాయికి సంబంధించి 23 కేసులు నమోదు చేసి, 40 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నాం, మొత్తం 91 మందిని అరెస్టు చేసి జైలు పంపించాం. అనుమానితులకు పరీక్షలు గంజాయి వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. అనుమానం ఉన్న వ్యక్తులను పోలీస్ స్టేషన్లకు పిలిపించి అవసరమైన సందర్భాల్లో యూరిన్, బ్లడ్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. వారు గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నారా లేదా అన్నది పరీక్షల ద్వారా నిర్ధారించుకుని తదనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. గంజాయి విక్రేతలపై మాత్రమే కాకుండా వినియోగదారులపైనా నిఘా కొనసాగుతుంది. ముఖ్యంగా యువత, విద్యార్థులు డ్రగ్స్కు దూరంగా ఉండేలా జిల్లాలో పోలీస్ భరోసా కార్యక్రమం ద్వారా విద్యాసంస్థల్లో విద్యార్థులకు గంజాయి, డ్రగ్స్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన, స్నేహితుల వర్గం, కదలికలపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నాం. టోల్ ఫ్రీ నంబర్ 1933 స్పెషల్ బ్రాంచ్ కంట్రోల్ రూమ్ 8712686026ఫ సరఫరా, వినియోగంపై ప్రత్యేక నిఘా ఫ అనుమానితులకు డ్రగ్ పరీక్షలు ఫ ఈ ఏడాదిలో 40 కిలోల గంజాయి స్వాధీనం ఫ 23 కేసులు..91 మంది అరెస్ట్ ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఎస్పీ నరసింహ గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగానికి సంబంధించి సమాచారం తెలిసిన ప్రజలు వెంటనే పోలీసులకు తెలియపర్చాలి. తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. జిల్లాలో గంజాయి, డ్రగ్స్ ఆనవాళ్లు లేకుండా చేయడమే పోలీసుల లక్ష్యం. గంజాయి, డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతిఒక్కరూ తమ సహకారం అందించాలి. -
ఆటో కార్మికులను ప్రభుత్వమే ఆదుకోవాలి
సూర్యాపేట : ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేసి వారిని ఆదుకోవాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ నెల 24న నిర్వహించనున్న ఆటో కార్మికుల బంద్కు సంబంధించిన పోస్టర్ను శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఆర్టీసీ యాజమాన్యా నికి ఈ–ఆటోలను అందించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలన్నారు. ఆటో రవాణా రంగ కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఆటో మీటర్ చార్జీలను పెంచాలని కోరారు. అక్రమంగా యాప్ల ద్వారా నడుస్తున్న ద్విచక్ర వాహనాలను నియంత్రించి ఆటో కార్మికులకు న్యాయం చేయాలన్నారు. ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ.12 వేల ఆర్థిక సహాయం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, డిఆర్టియు యూనియన్ అధ్యక్షులు సైదులు, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ అహ్మద్, పట్టణ అధ్యక్షుడు ఖుషి వెంకన్న, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకన్న, మట్టయ్య, నరేష్, సొందు, వేణు, రాజు, వెంకన్న, మాంగళ్య వెంకన్న, అనాసపురం యూసుఫ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.ఫ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి -
కొందరికే యూనిఫాం
సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత యూనిఫాం పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేదు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తోంది. జిల్లాలో సగం మందికే యూనిఫాం అందగా మిగతా సగం మంది విద్యార్థులు యూనిఫాం కోసం ఎదురుచూస్తున్నారు. సగం మందికిపైగా అందలే.. జిల్లాలో మొత్తం 950 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వీటిల్లో ఈ ఏడాది 50వేల మంది విద్యార్థులు నమోదయ్యారు. ఇందులో ఇప్పటి వరకు సుమారు 21 వేల మంది విద్యార్థులకు మాత్రమే యూనిఫాం అందింది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్లు అందించాల్సి ఉంది. ఇందుకోసం సంబంధిత అధికారులు మహిళా సంఘాలకు యూనిఫామ్ల కుట్టే బాధ్యతలు అప్పగించారు. వస్త్రాల సరఫరా, కొలతలు తీసుకోవడం, కుట్టించడం, పంపిణీ లో జాప్యం జరిగింది. దీంతో ఇప్పటికీ మిగిలిన సగానికిపైగా విద్యార్థులకు యూనిఫాం అందలేదు. కొలతల్లో హెచ్చుతగ్గులు యూనిఫామ్ల కొలతలు తీసుకునే సమయంలోనూ పలుచోట్ల సమస్యలు ఎదురవుతున్నాయి. విద్యార్థుల వయసు, శరీరాకృతికి అనుగుణంగా సరైన కొలతలు తీసుకోకపోవడంతో కొందరికి దుస్తులు బిగుతుగా, మరికొందరికి వదులుగా వస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సరైన కొలతలు లేకుండా కుట్టించిన యూనిఫాంను తిరిగి సరిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో విద్యార్థులకు యూనిఫాంలు అందించే ప్రక్రియ మరింత ఆలస్యమవుతోంది. పాఠశాలలకు వెళ్తున్నా.. యూనిఫాం లేదు విద్యార్థులందరికీ ఒకే విధమైన యూనిఫాం ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులందరికీ ఒకేసారి యూనిఫాం అందకపోవడంతో పాఠశాలల్లో అసమాన పరిస్థితి కనిపిస్తోంది. యూనిఫాం అందిన విద్యార్థులు కొత్త దుస్తులతో వస్తుండగా, అందని విద్యార్థులు సాధారణ దుస్తులతోనే పాఠశాలలకు హాజరవుతున్నారు. ఫ మఠంపల్లి మండలంలో 32 ప్రభుత్వ పాఠశాలల్లో 2,596 మంది విద్యార్థులున్నారు. 23 పాఠశాలలకు చెందిన 1,210 మంది విద్యార్థులకే యూనిఫాం అందింది. తొమ్మిది పాఠశాలలకు చెందిన 1,386 మంది విద్యార్థులకు యూనిఫాం అందజేయాల్సి ఉంది ఫ పెన్పహాడ్ మండల కేంద్రంలోని సీతారాంపురం ప్రాథమిక పాఠశాలలో యూనిఫాం కొలతలు తేడాతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మండలంలోని హైస్కూల్ విద్యార్థులకు యూనిఫాం అందలేదు. ఫ ఆత్మకూర్(ఎస్) మండలంలో 2,694 మంది విద్యార్థులకు గాను 1,450 మందికే ఒక్కో జత యూనిఫాం అందింది. ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆ ఒక్క జత కూడా అందలేదు. అందిన దుస్తులు సైతం నాణ్యత లేకుండా ఉన్నాయని విద్యార్థులు తల్లిదండ్రులు అంటున్నారు. ఫ హుజూర్నగర్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు ఇంతవరకు యూనిఫాం అందజేయలేదు. ఫ గరిడేపల్లి మండలంలో మొత్తం 49 పాఠశాలలు ఉండగా కొందరికే యూనిఫాం ఇచ్చారు. ఇంకా 4,120 మంది విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ చేయాల్సి ఉంది. ఫ ఇప్పటి వరకు 21 వేల మంది విద్యార్థులకు పంపిణీ ఫ ఈ ఏడాది అన్ని స్కూళ్లలో 50 వేల మంది నమోదు ఫ మిగతా వారికి తప్పని ఎదురుచూపులు ఫ యూనిఫాం ఇచ్చిన చోట కొలతల్లో హెచ్చుతగ్గులతో ఇబ్బందులు -
బుల్లెట్ ట్రైన్ను సాధించి తీరుతాం
సూర్యాపేట : సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ వచ్చేంత వరకు తమ పోరాటం ఆగదని మున్సిపల్ మాజీ చైర్మన్ జుట్టు కొండ సత్యనారాయణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద బుల్లెట్ ట్రైన్ సాధన అఖిలపక్ష కమిటీ చేపట్టిన రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపి మాట్లాడారు. సూర్యాపేటకు రైలుమార్గం సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ దీక్షలో పాల్గొన్న తెలంగాణ ఆడబిడ్డల వేదిక నాయకురాలు వెలుగు వనిత ఆధ్వర్యంలో మహిళలు దీక్షలో కూర్చున్నారు. ఈ దీక్షకు ప్రైవేట్ విద్యా సంస్థల సంఘం ఆధ్వర్యంలో 40 మంది విద్యా సంస్థల యజమానులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ జనరల్ సెక్రెటరీ పెద్దిరెడ్డి కళ్యాణ్ చక్రవర్తి, కార్యదర్శి నేరెళ్ల మధు, సీపీఎం నేత మట్టిపల్లిసైదులు, మైబు, షామియా సుగుణ శాంత మలాంబ, పద్మ, సహేనా తదితరులు పాల్గొన్నారు. -
400 ధాన్యం బుక్కారు!
కోట్ల కోదాడ : రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన కష్టమ్ మిల్లింగ్ ధాన్యాన్ని జిల్లాలో పలువురు రైస్ మిల్లర్లు భారీగా పక్కదారి పట్టించారు. కొద్దిరోజులుగా జిల్లా వ్యాప్తంగా విజిలెన్స్ అధికారులు జరుపుతున్న దాడుల్లో మిల్లర్ల అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా కేవలం 15 మిల్లుల్లో అధికారులు తనిఖీలు చేయగా సీఎంఆర్ ధాన్యంలో భారీ తేడాలు ఉన్నట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈ 15 మిల్లుల వద్ద 1,81,667 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు ఉండాల్సి ఉండగా కేవలం 72,171 మెట్రిక్ టన్నులఽ ధాన్యమే ఉంది. 1,29,292 మెట్రిక్ టన్నులు మాయం చేశారు. దీని విలువ రూ.400 కోట్లుగా అధికారులు తేల్చారు. ఇంకా జిల్లా వ్యాప్తంగా సీఎంఆర్ ధాన్యం కేటాయించిన అన్ని మిల్లుల్లో తనిఖీలు చేస్తే ఈ కుంభకోణం మరో రూ.400 కోట్ల వరకు విస్తరించే అవకాశం ఉందని, మొత్తంగా దాదాపు రూ.800 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టి ఉండొచ్చని అధికారుల అంచనా. కోర్టుకు వెళ్లారని..ప్రభుత్వం నుంచి సీఎంఆర్ ధాన్యం తీసుకుంటున్న సమయంలోనే ముందస్తుగా మిల్లర్లు పక్కా ప్రణాళికతో ఈ ధాన్యం మాయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ధాన్యం మిల్లులకు తరలించిన తరువాత ధాన్యం దిగుమతి చేసుకున్న మిల్లర్లు కొద్దిరోజుల వ్యవధిలోనే తమకు కేటాయించిన ధాన్యం నాణ్యత లేదని... దీన్ని వెనక్కి తీసుకోవాలని అధికారులకు వినతిపత్రాలు ఇచ్చి వారి నుంచి రిసీవ్డ్ కాపీ తీసుకుంటున్నారు. అధికారులు దీనిపై విచారణ చేయకుండా మిల్లర్లకు లోపాయికారీగా సహకరిస్తూ ఆ విషయాన్ని పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. సీఎంఆర్ బియ్యం ఇవ్వమని సదరు మిల్లర్లను అధికారులు అడిగినప్పుడు.. గతంలో తమకు నాణ్యత లేని ధాన్యం ఇచ్చారని.. దీనిపై తాము ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పి కోర్టులను ఆశ్రయించి స్టే తెచ్చుకుంటున్నారు. సంవత్సరాల కొద్ది దీన్ని పొడిగించుకుంటూ దందా కొనసాగిస్తున్నారు. ఒకవేళ అధికారులు మిల్లులకు ధాన్యం కేటాయించడం ఆపివేస్తే ఇతర ప్రాంతాల్లో మిల్లులను లీజుకు తీసుకొని బినామీల పేరుతో అక్కడ తిరిగి తమ దందా కొనసాగిస్తున్నారు. అధికారులు, మిల్లర్లు కలిసి ముందస్తు ప్రణాళికతో ఈ దందా చేస్తున్నారని పలువురు మిల్లర్లే అంటున్నారు. ఈ వ్యవహారంలో సివిల్ సప్లయ్ అధికారుల పాత్రపై కూడా ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేయాలని వారు అంటున్నారు. నిద్రావస్థలో జిల్లా యంత్రాంగం సీఎంఆర్ ధాన్యం మిల్లులకు కేటాయించిన తరువాత వారు బియ్యం ఇచ్చేవరకు తరచూ తనిఖీలు చేయాల్సిన స్థానిక సివిల్ సప్లయ్ అధికారులు మిల్లర్లతో కుమ్మక్కవుతున్నారు. వేల టన్నుల ధాన్యం బయటకు తరలిస్తున్నా వారు పట్టించుకోవడం లేదు. జిల్లా నుంచి విజిలెన్స్ అధికారులు వచ్చి దాడులు చేసే వరకు అక్రమాలు బయటకుయ రాకుండా కాపాడుతున్నారని పలువురు అంటున్నారు. అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. 15 మిల్లుల్లో లెక్క తేల్చిన విజిలెన్స్ అధికారులు ఫ సీఎంఆర్ ధాన్యంలో భారీ తేడాలు ఫ మిగతా మిల్లుల్లో మరో రూ.400 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టినట్లు అనుమానాలు ఇది కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండ వద్ద ఉన్న ఓ పారబాయిల్డ్ రైస్ మిల్లు. ఈ మిల్లు యజమాని సీఎంఆర్ ఇవ్వకుండా ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం పక్కదారి పట్టించాడు. ప్రభుత్వానికి రూ.34 కోట్ల మేర బాకీ పడ్డాడు. ప్రభుత్వం ఈ మిల్లుకు ధాన్యం కేటాయించకుండా మిల్లు యజమానిపై కేసులు పెట్టింది. ఇది జరిగి నాలుగేళ్లవుతున్నా నేటి వరకు ఈ మిల్లర్పై చర్యలు తీసుకోలేదు. ఒక్క రూపాయి వసూలు చేయలేదు. అధికారులను విషయమై అడిగితే మిల్లర్ కోర్టుకు వెళ్లారని తాపీగా సమాధానం ఇస్తున్నారు. ఇలా కోట్ల రూపాయల ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన మిల్లర్లతో అధికారులు కుమ్మకై ్క కోర్టుల బూచి చూపుతూ పరోక్షంగా మిల్లర్లకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. -
‘సర్’ విజయవంతానికి కృషి చేయాలి
హుజూర్నగర్ : బీజేపీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ఓటరు జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్)–2 ప్రక్రియ విజయవంతానికి కృషి చేయాలని బీజేపీ ఎన్ఆర్ఐ సెల్ రాష్ట్ర కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి అన్నారు. గురువారం హుజూర్నగర్లో బీజేపీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్–2పై నిర్వహించిన నియోజక వర్గ స్థాయి కార్యశాలలో వారు మాట్లాడారు. ఎస్ఐఆర్ రెండవ భాగం ప్రారంభమైనందున బీఎల్ఏలు, పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం బీజేపీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యశాలలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొండా హరీష్ గౌడ్, అసెంబ్లీ బీఎల్ఏ తాళ్ల నరేందర్రెడ్డి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు భూక్య సీత, రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు ఉమామహేశ్వరరావు, కుందూరు కోటిరెడ్డి, ఎం.లక్ష్మీనారాయణ, బి.వెంకట శివ, జి.వీరబాబు, కె.వెంకటేశ్వర్లు, కె.నాగిరెడ్డి, నరీ నాయక్, ఎ.భిక్షమయ్య, బి.నరేష్, ఎస్.ప్రదీప్, కె.లక్ష్మీనారాయణ, పి.చంద్రయ్య, గోపి, రామారావు, నాగరాజు, విజయ్, సోమయ్య, శ్రీనివాస్, వివిధ మోర్చాల ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. -
బుల్లెట్ ట్రైన్ సాధించేవరకూ పోరాటం
సూర్యాపేట : బుల్లెట్ ట్రైన్, రైల్వే కారిడార్ సాధించే వరకూ పోరాటం ఆగదని రైతు కూలి సంఘం జిల్లా నాయకుడు బోడ బాలస్వామి అన్నారు. బుల్లెట్ ట్రైన్ సాధన అఖిలపక్ష పోరాట సమితి కొనసాగిస్తున్న దీక్షలో గురువారం ఏడవ రోజు రైతు కూలి సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుల్లెట్ ట్రైన్ దారి మళ్లింపు చర్యను ఖండిస్తున్నామన్నారు. మొదటి అలైన్మెంట్నే కొనసాగేలా ప్రతిపాదనలు పంపాలన్నారు. ఈ దీక్షలో రైతు కూలి సంఘం నాయకులు బయ్య రామచంద్రు, బెల్లి నాగరాజు, కుంచం వెంకన్న, బయ్య సతీష్ కోడి బాబు, ఇరుగు వెంకటేశ్, బయ్య లింగయ్య, గుర్వయ్య, గంగయ్య, సత్తుపల్లి రాములు, ఇరుగు నాగయ్య, వెంకన్న రమేష్, కష్ణయ్య శ్రీనివాస్ రెడ్డి పుల్లారెడ్డి, కొమురయ్య సత్తయ్య పన్నీరు వాసుదేవరావు, పాల్గొన్నారు. దీక్షకు అఖిలపక్ష నేతలు, ఉపాధి కోసం వచ్చి పట్టణంలో స్థిరపడ్డ పంజాబ్ యువకులు సంఘీభావం తెలిపారు. -
కాంగ్రెస్తోనే విప్లవాత్మక మార్పులు
భానుపురి(సూర్యాపేట) : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పాలనతోనే ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో లబ్ధిదారులకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రేషన్ కార్డులు అందక అర్హులైన ఎందరో పేదలు ఇబ్బంది పడ్డారన్నారు. తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి పౌరసరఫరాల శాఖను ప్రజల చెంతకు చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా తెల్ల రేషన్ కార్డుదారులందరికీ ఉచితంగా నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేసే చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.06 కోట్ల కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ఆహార భద్రత కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ఎస్పీ నరసింహ, పేరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. పంటల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించాలి హుజూర్నగర్ : ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు పంటల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి సూచించారు. గురువారం హుజూర్నగర్లోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసి మాట్లాడారు. ఎల్నినో ప్రభావంతో నాగార్జున సాగర్ నిండలేదని, రాష్ట్రంలో 31 శాతం వర్షాలు తక్కువగా పడి తీవ్ర వర్షాభావం కొనసాగుతోందన్నారు. ఈ నేపథ్యలో రైతులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ పంటలు వేసుకోవాలన్నారు. హుజూర్నగర్లోని మోడల్ కాలనీని సెప్టెంబర్లో ప్రారంభించి లబ్ధిదారులకు ఇళ్ల కేటాయిస్తామన్నారు. అనంతరం ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న ఆధ్వర్యంలో మంత్రి ఉత్తమ్ను గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్, కొణతం వెంకటరెడ్డి, వైస్ చైర్మన్ తన్నీరు మల్లిఖార్జున్, రాష్ట్ర పెరక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు, ఏఎంసీ చైర్పర్సన్ డి.రాధిక, ఏఎంసీ మాజీ చైర్మన్లు సాముల శివారెడ్డి, యరగాని నాగన్న గౌడ్, ఆర్డీఓ శ్రీనివాసులు, కౌన్సిలర్ కోతి సంపత్రెడ్డి, ఈడ్పుగంటి సుబ్బారావు, రామరాజు, గురవయ్య, ముక్కంటి, నాగేందర్, అమర్నాధ్రెడ్డి, అజీజ్ పాషా తదితరులు పాల్గొన్నారు. పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
కేంద్ర ప్రభుత్వానికి బీ టీమ్గా ఎలక్షన్ కమిషన్
భానుపురి (సూర్యాపేట) : కేంద్ర ప్రభుత్వానికి బీ టీమ్గా ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తూ ఓట్లను తొలగించే కుట్రలకు పాల్పడుతోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. గురువారం సూర్యాపేటలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సర్ రెండో దశ కార్యక్రమంపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఎల్ఏలు, కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉంటూ ప్రతి ఓటును కాపాడుకోవాలన్నారు. ఓటరు జాబితాలో పేర్లలో అక్షర దోషాలు, వ్యత్యాసాలు ఉంటే ఫామ్ 8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన నూతన ఓటర్లు కూడా ఫామ్ సిక్స్ ద్వారా తమ ఓటు నమోదు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట నియోజకవర్గ సమన్వయకర్త కుసుబా శ్రీనివాస్, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్రెడ్డి, టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, పీసీసీ ప్రధాన కార్యదర్శి, సర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ చకిలం రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ -
విద్యార్థుల జీవితాలతో ఆటలొద్దు
సూర్యాపేటటౌన్ : పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి విభాగంలో విలీనం చేసి విద్యార్థుల జీవితాలతో ఆటలాడొద్దని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు దనియాకుల శ్రీకాంత్వర్మ అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మహిళా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. పాలిటెక్నిక్ డిప్లమా కోర్సులను ఇతర శిక్షణ కోర్సులతో అనుసంధానం చేయడం సరికాదన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు ఆకారపు సాయి, నవీన్, మహేష్, గోపికృష్ణ, రిషిత ఇరుగు ఇందు,స్నేహ, అమత వర్షిణి, నవీన,శ్రీవాణి, హాసిని, గాయత్రి, లహరి పాల్గొన్నారు. -
అవును.. దొంగలనే దోచుకునా్నరు!
కోదాడ : దొంగలను పట్టుకుని వారికి శిక్షలు పడేలా చూడాల్సిన పోలీసులే వారిని కేసుల నుంచి తప్పించడానికి లంచం పుచ్చుకున్నారనే ఆరోపణలు కోదాడ డివిజన్ పరిధిలో వెల్లువెత్తుతున్నాయి. రైతుల పశువులను రాత్రి సమయాల్లో దొంగతనం చేసి ఇతర ప్రాంతాల్లో అమ్ముతున్న దొంగలను నాలుగు నెలల క్రితం చిలుకూరు, అనంతగిరి పోలీసులు పట్టుకున్నారు. శిక్ష పడకుండా కాపాడుతానని, పోలీసులకు డబ్బులు ఇవ్వాలని అధికార పార్టీ నాయకుడు ఓ బాధితుడి నుంచి డబ్బులు వసూలు చేశాడనే ఆరోపణలు న్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించిన ఆడియో గురువారం కోదాడలోని వివిధ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండడం చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగిందంటే..కోదాడ మున్సిపల్ పరిధిలోని శ్రీరంగాపురంలో నివాసం ఉండే కొందరు చిలుకూరు, అనంతగిరి మండలాల పరిధిలో రాత్రి సమయంలో ఆరుబయట ఉండే గేదెలను వాహనంలో ఎక్కించుకొని ఇతర ప్రాంతాల్లోని సంతల్లో అమ్ముతున్నారని ఫిర్యాదులు రావడంతో పోలీసులు నిఘా పెట్టారు. కోదాడ డివిజన్లోని రెండు పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీసులు ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. గేదెలను అప్పటికే అమ్మివేయడంతో రికవరీగా సదరు నిందితుడి నుంచి సుమారు రూ.3 లక్షల వరకు కోర్టులో డిపాజిట్ చేయించినట్లు సమాచారం. ఇదే సమయంలో రంగ ప్రవేశం చేసిన కోదాడ పట్టణ పరిధిలోని లక్ష్మీపురానికి చెందిన అధికార పార్టీ నాయకుడు పోలీసులతో మాట్లాడి శిక్ష పడకుండా చూస్తానని చెప్పి తమ వద్ద దశల వారీగా రూ.18 లక్షలు తీసుకున్నాడని ప్రధాన నిందితుడు ఆరోపిస్తున్నాడు. ఈ నెల 6న అనంతగిరి పోలీసులు తనను అరెస్ట్ చేసి జైలుకు పంపారని ప్రధాన నిందితుడు తెలిపాడు. మధ్యవర్తిని డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా తాను పోలీసులకు డబ్బులు ఇచ్చానని, మళ్లీ అడిగితే కేసులు పెట్టిస్తానని సదరు నాయకుడు తమను బెదిరిస్తున్నాడని బాధితుడితో పాటు అతని తల్లి ఆరోపిస్తున్నారు. ఈ మేరకు గురువారం వారు పట్టణ పోలీసులను ఆశ్రయించడంతో వారు తమ ఫిర్యాదును తీసుకోలేదని, తాము ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.రెండు స్టేషన్ల పరిధిలో రూ.లక్షలు లంచంగా వసూలు దొంగలకు పోలీసులకు మధ్యవర్తులుగా రాజకీయ నాయకులు డబ్బులు తీసుకొని రిమాండ్ చేయడంతో అడ్డం తిరిగిన నేరస్తులు కోదాడలో చర్చనీయాంశంగా మారిన ఆడియో ఫిర్యాదు స్వీకరణకు పట్టణ పోలీసుల నిరాకరణ -
సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి
గరిడేపల్లి : సీజనల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ పెండెం వెంకటరమణ సూచించారు. గరిడేపల్లి మండలం కల్మల్చెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆయన తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. పలు వివరాలు తెలుసుకున్నా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమల వ్యాప్తి పెరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, మలేరియా, డెంగీ వంటి వ్యాధుల నివారణకు ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డాక్టర్ అఖిల్ కిషోర్, హెచ్ఈఓ సురేంద్ర, పీహెచ్ఎస్ జయమ్మ, నర్సింగ్ ఆఫీసర్లు జానకి, కళ్యాణి, ఏఎన్ఎంలు సుజాత, రాంబాయి, సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలితుంగతుర్తి : విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగేలా నాణ్యమైన విద్యనందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని తెలంగాణ గురుకుల పాఠశాలల కార్యదర్శి ఉషారాణి అన్నారు. గురువారం తుంగతుర్తిలోని తెలంగాణ గురుకులాన్ని తనిఖీ చేశారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించి సమాజంలో ఎలా ఉండాలో లక్ష సాధనకు ఎలా ముందుకు వెళ్లాలో వివరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గురుకులంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఆమె వెంట డిప్యూటీ కార్యదర్శి వేణుగోపాల్రెడ్డి, ప్రిన్సిపాల్ సతీష్ ఉన్నారు. సీపీఎస్ విధానం రద్దుచేయాలినేరేడుచర్ల : సీపీఎస్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించి టీచర్ల సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకుడు డిమాండ్ చేశారు. గురువారం నేరేడుచర్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో భాగంగా ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ఆరు డీఏలను తక్షణమే విడుదల చేయడంతోపాటు 2వ పీఆర్సీని అమలు చేయాలన్నారు. సెప్టెంబర్ 10న హైదరాబాద్లో చేపట్టే మహా ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో వివిధ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతలు, పాఠశాల హెచ్ఎం బట్టు మధు, ఉపాధ్యాయులు శ్రీనయ్య, నరసింహారావు, వెంకటేశ్వర్రావు, వెంకటేశ్వర్లు, సైదులు, వెంకట్రెడ్డి, సత్యనారాయణరెడ్డి, వెంకన్న, అక్కయ్య బాబు పాల్గొన్నారు. -
రాజీవ్గాంధీ సేవలు చిరస్మరణీయం
● డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్యసూర్యాపేట అర్బన్ : దేశంలో సాంకేతిక విప్లవం తీసుకొచ్చిన మాజీ ప్రధాని, దివంగత నేత రాజీవ్ గాంధీ స్ఫూర్తితో దేశ సమగ్రతను కాపాడుకునేందుకు ముందుకెళ్దామని డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, మున్సిపల్ వైస్ చైర్మన్ యండి. షఫీ ఉల్లా అన్నారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సూర్యాపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెలుగు వెంకన్న, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్ ఆధ్వర్యంలో జమ్మిగడ్డలో రాజీవ్ విగ్రహనికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు. దేశానికి రాజీవ్గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ప్రతిఒక్కరూ రాజీవ్ గాంధీ ఆశయాల సాధనకు కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు నాగుల వాసు, చిలుముల సునీల్ రెడ్డి, తన్వీర్ హుసేన్, ఎస్కె.జహీర్, ఎలిమినేటి అభినయ్, వీరన్న నాయక్, పారూక్, పోలగాని బాలు గౌడ్, కమ్మరికుంట్ల లింగయ్య, కోడి శివ, బండారు వెంకన్న, గడ్డం వెంకన్న, సాజిద్, అక్కినపల్లి జానయ్య, రుద్రంగి రవి, కరుణాకర్రెడ్డి, పడిదల రవి తదితరులు పాల్గొన్నారు. -
30 వేల ఎకరాల్లోనే ఆరుతడి
ఆదాయం రూ.3.52 కోట్లు యాదగిరిగుట్ట ఆలయ హుండీలు లెక్కించగా రూ.3.52కోట్ల ఆదాయం వచ్చినట్లు ఈఓ వెల్లడించారు.- 8లోభానుపురి (సూర్యాపేట) : ఎల్నినో పరిస్థితుల కారణంగా జిల్లా రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. కానీ సీజన్ ముగుస్తున్నా ఇప్పటివరకు రైతులు కేవలం 30 వేల ఎకరాల్లోనే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేశారు. అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా జిల్లాలో వరిసాగు చేయకుండా రైతాంగం ఉండని పరిస్థితి నెలకొంది. అయితే గతంలో 4.70 లక్షల ఎకరాల్లో సాగైన వరి ఈసారి 3 లక్షల ఎకరాలకే పరిమితమైంది. ఇంకా వర్షాలు కురుస్తాయన్న ఆశతోనే రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపడం లేదని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రత్యామ్నాయ సాగు అంచనా ఇలా..జిల్లాలో 5.80 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని జిల్లా వ్యవసాయ శాఖ వానాకాలం పంటల సాగు అంచనాలను రూపొందించింది. ఇందులో 4.80 వేల ఎకరాల్లో వరి, 90 వేల ఎకరాల్లో పత్తి ఉండగా కేవలం 68 52 ఎకరాల్లో మాత్రమే పెసర, కందులు, మినుములు వంటి ఆరుతడి పంటలు ఉంటాయని పేర్కొంది. అయితే ఎల్నినో పరిస్థితుల కారణంగా ఈ అంచనాలు తారుమారయ్యాయి. వరిసాగు విస్తీర్ణం భారీగా తగ్గుతుందని, ఈ మేరకు ఆరుతడి పంటలు 1.40లక్షల ఎకరాల్లో సాగు చేయాలని అధికారులు లక్ష్యం పెట్టుకుని రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. 22 శాతం కూడా మించలే..సీజన్ ప్రారంభమైన నాటినుంచి వాతావరణ పరిస్థితులు వరిసాగుకు అనుకూలంగా ఉండవని రైతులు అరుతడి పంటలను సాగు చేయాలని జిల్లా యంత్రాంగం చెబుతూ వస్తోంది. అయినా చాలామంది రైతులు ఈ పంటల సాగుకు ఏమాత్రం ముందుకు రావడం లేదు. అధికారులు నిర్దేశించుకున్న 1.40 లక్షల ఎకరాల లక్ష్యానికి గాను ఇప్పటివరకు కేవలం 30 వేల ఎకరాల్లో (21 శాతం) మాత్రమే ఆరుతడి పంటలు సాగు చేశారు. వర్షాలపై ఇంకా ఆశలుజిల్లాలో ఇంకా 1.20 లక్షల ఎకరాల నుంచి 1.40లక్షల ఎకరాల వరకు పంటల సాగుకు భూములు అనుకూలంగా ఉన్నాయి. వీటిల్లోనూ కేవలం ఆరుతడి పంటలు అయితేనే ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు తట్టుకొని రైతుల చేతికి వచ్చే పరిస్థితి ఉంది. కానీ రైతులు ఇంకా ఈ నెలాఖరు వరకు వర్షాలు కురుస్తాయని వరిసాగు చేసుకోవచ్చనే ఆశతోనే ఆరుతడి పంటలను వేసేందుకు ముందుకు రావడం లేదు. అయితే జిల్లా వ్యవసాయ శాఖ మాత్రం ఎలాగైనా మిగిలిపోయిన భూమిలో ఆరుతడి పంటల విస్తీర్ణాన్ని పెంచాలని, ఇందుకు కావాల్సిన విత్తనాలను సిద్ధం చేసే పనిలో ఉంది.ప్రత్యామ్నాయ పంటల సాగు లక్ష్యం 1.40 లక్షల ఎకరాలు తలకిందులైన అధికారుల అంచనా వ్యవసాయ శాఖ అవగాహన కల్పిస్తున్నా ముందుకురాని రైతులు ఈ నెలాఖరు వరకు సాగుకు అవకాశం సెల్ఫీ పంపాల్సిన వాట్సప్ నంబర్99489 38922ప్రత్యామ్నాయ పంటల సాగు ఇలా.. పంట విస్తీర్ణం (ఎకరాల్లో..)పెసర 10,000కందులు 10,000మినుము, జొన్న, వేరుశనగ, కూరగాయలు 20,000 -
బుల్లెట్ ట్రైన్ ఉద్యమ బాటలో ఆర్యవైశ్యులు
సూర్యాపేట : సూర్యాపేట మీదుగా బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ కొనసాగించాలంటూ బుధవారం ఆర్య వైశ్య సంఘం నాయకులు జిల్లా కేంద్రంలో రిలే నిరాహార దీక్ష బాట పట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బుల్లెట్ ట్రైన్ మార్గాన్ని శంషాబాద్ నుంచి సూర్యాపేట మీదుగా అమరావతి, చైన్నెకి వెళ్లే విధంగా ప్రతిపాదన చేసిన రాష్ట్ర ప్రభుత్వం అలైన్మెంట్ మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ముందుగా ప్రకటించిన అలైన్మెంట్ను మార్చొద్దన్నారు. ఆర్యవైశ్యుల రిలే నిరాహార దీక్షకు సూర్యాపేట పట్టణ ప్రముఖులతో పాటు వివిధ సంఘాలు సంఘీభావం తెలిపాయి. జాతీయ రహదారి 65కు సమాంతరంగా బుల్లెట్ ట్రైన్, రైల్వే కారిడార్ సాధనకు చేపట్టిన 6వ రోజు రిలే నిరాహార దీక్షలో ప్రముఖ పారిశ్రామిక వేత్త మీలా మహదేవ్, బండారు రాజా, తోట శ్యామ్ ప్రసాద్, పోతుగంటి వెంకటేశ్వర్లు, కలకోట లక్ష్మయ్య, వెంపటి శబరినాథ్, కర్నాటి కిషన్, ఈగ దయాకర్ గుప్త, ఈగ వెంకటేశ్వర్లు, బొమ్మిడి లక్ష్మీనారాయణ, వెంపటి సురేష్, గుండా శ్రీధర్, వెంపటి పురుషోత్తం, తప్సి గాంధీ, గోండ్రాల అశోక్, వంగవేటి రమేష్, బజ్జూరి శ్రీనివాస్, నవిలిపురి నరేందర్ పాల్గొన్నారు. మున్సిపల్ పాలకవర్గం తీర్మానం చేయాలి కేంద్ర ప్రభుత్వం ముందుగా ప్రకటించిన బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ను కొనసాగించాలని సూర్యాపేట మున్సిపల్ పాలకవర్గం ప్రత్యేక తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని బుల్లెట్ ట్రైన్ సాధన అఖిల పక్ష కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదితకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నివేదిత మాట్లాడుతూ పాలక వర్గ సభ్యుల అనుమతితో తీర్మానం చేసి ప్రభుత్వానికి అందజేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అఖిలపక్షాల నాయకులు కన్వీనర్ ఆరుట్ల జానకిరెడ్డి, కుంట్ల ధర్మార్జున్, మండాది డేవిడ్ కుమార్, జీడి భిక్షం, కర్ణాటి కిషన్, కొత్తపల్లి శివకుమార్ రేణుక, పేర్ల నాగయ్య, బూర వెంకటేశ్వర్లు, వీరేంద్ర, నేరెళ్ల మధు, ఎర్ర అఖిల్, భయ్యా మల్లికార్జున్, సట్టు నాగయ్య,సాయి అజయ్ తదితరులు పాల్గొన్నారు. 6వ రోజు కొనసాగిన రిలే నిరాహార దీక్ష -
ఆటో డ్రైవర్లు బాధ్యతగా వ్యవహరించాలి : ఎస్పీ
కోదాడరూరల్ : ప్రతి ఆటో డ్రైవర్ బాధ్యతగా వ్యవహరిస్తూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యం స్థానాలకు చేర్చాలని ఎస్పీ కె.నరసింహ అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో ప్రజల భద్రత కోసం మై ఆటో ఈజ్ సేఫ్ కార్యక్రమంలో భాగంగా ఆటో డ్రైవర్లకు పట్టణ, ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలో ఉన్న ప్రతి ఆటోకు క్యూఆర్ కోడ్తో కూడిన రక్షణ సర్టిఫైడ్ కాపీ, స్టిక్కర్ను అతికించే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. దీంతో ఆటోలో ప్రయాణించే ప్రయాణికులకు ఏమైనా ఇబ్బందులకు గురైనట్లైతే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఆటో ఎక్కడ ఉందనే సమాచారాన్ని పోలీసులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు చేరవేయొచ్చన్నారు. దీనిలో టీ సేఫ్ యాప్ కూడా ఉందని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఎమర్జెన్సీ బటన్ నొక్కితే పోలీసులకు సమాచార చేరి వారు ప్రయాణికులకు రక్షణ కల్పిస్తారన్నారు. విద్యార్థులు కూడా దీనిపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన విద్యార్థినులు ఎస్పీకి ర్యాఖీ కట్టారు. యాప్ రూపొందించిన రమేష్రెడ్డిని ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, పట్టణ సీఐ కె.శివశంకర్, ట్రాఫిక్ ఎస్ఐ బైరెడ్డి అంజిరెడ్డి, పోలీసు సిబ్బంది, ఆటో డ్రైవర్లు విద్యార్థులు పాల్గొన్నారు. -
బాల్యం.. మత్తుకు బానిస
సూర్యాపేటటౌన్ : గంజాయి మత్తు పాఠశాలల విద్యార్థుల వరకు చేరింది. మత్తు పదార్థాల విక్రయదారులు మైనర్లు, ముఖ్యంగా స్కూల్, కాలేజీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గంజాయితో విద్యార్థులను ఆకర్షించడం, అలవాటు పడిన వారినే ఇతరులకు సరఫరా చేసేలా ప్రోత్సహించడం లాంటివి జిల్లాలో చోటుచేసుకుంటున్నాయి. కొండమల్లేపల్లి ఘటనతో కలకలం..నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో మైనర్లు గంజాయి మత్తులో ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ను హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మత్తు పదార్థాల ప్రభావం మైనర్ల ఆలోచనా విధానంపై ఎంతటి ప్రభావం చూపుతుందో ఈ ఘటనే నిదర్శనం. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో గంజాయి విక్రయాలు, వినియోగంపై పోలీసులు మరింత దృష్టి సారించాల్సి ఉంది. మైనర్లు కావడంతో కేసుల పెట్టకుండానే..గంజాయి సేవిస్తూ పట్టుబడుతున్న మైనర్లపై కేసులు పెట్టకుండా పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగిస్తున్న సందర్భాలు ఉన్నాయి. మత్తుకు బానిసైన కొందరిని డీఅడిక్షన్ కేంద్రాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే అసలు సరఫరాదారులు, విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోకపోతే సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విద్యార్థులే టార్గెట్..పాఠశాలలు, కళాశాలల పరిసర ప్రాంతాలు, నిర్మానుష్య ప్రదేశాలు, శివారు ప్రాంతాల్లో విద్యార్థులకు గంజాయి చేరుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మొదట సరదాగా ప్రయత్నించేలా చేసి.. ఆ తర్వాత మత్తుకు బానిసలుగా మార్చుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్నేహితుల ద్వారా గంజాయి పరిచయం తాగడం, సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వ్యక్తుల నుంచి మత్తు పదార్థాలు పొందడం వంటి మార్గాలు కూడా ప్రమాదకరంగా మారుతున్నాయి. గంజాయి మత్తులో స్కూల్ విద్యార్థులు దారితప్పుతున్న మైనర్లు స్కూల్, కాలేజీ విద్యార్థులే లక్ష్యంగా గంజాయి విక్రయాలు తరచూ పోలీసులకు పట్టుబడుతున్న కొందరు మైనర్లు కావడంతో కౌన్సెలింగ్కే పరిమితం కట్టడి చేయకుంటే ప్రమాదరక పరిణామాలే అంటున్న నిపుణులుతల్లిదండ్రులు అప్రమత్తంగా ఉంటేనే.. విద్యార్థుల ప్రవర్తనలో ఆకస్మిక మార్పులు, చదువుపై ఆసక్తి తగ్గడం, కొత్త స్నేహాలు, ఇంట్లో ఎక్కువ డబ్బు అడగడం, ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నించడం వంటి అంశాలను తల్లిదండ్రులు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. తమ పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు కూడా విద్యార్థులపై ప్రత్యేక నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది.జిల్లాలో ఈ ఏడాది కేసులు ఇలా.. గంజాయి కేసులు 20కౌన్సిలింగ్ పొందిన గంజాయి బాధితుల సంఖ్య 15 -
నేడు జిల్లాలో మంత్రి ఉత్తమ్ పర్యటన
హుజూర్నగర్ : రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్రెడ్డి గురువారం హుజూర్నగర్, కోదాడ నియోజవవర్గాల్లో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 8.45 గంటలకు చింతలపాలెం మండలం పాత వెల్లటూరుకు చేరుకుంటారు. అక్కడ ఎంబీసీ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించి సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధిలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. పలు నూతన భవనాలను ప్రారంభిస్తారు. సాయంత్రం 5 గంటలకు సూర్యాపేటలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. సాయంత్రం 6 గంటలకు సూర్యాపేట కలెక్టరేట్లో స్మార్ట్ రేషన్ కార్డులు, అర్హులైన కుటుంబ సభ్యులకు కారుణ్య నియామక పత్రాలను పంపిణీ చేస్తారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్కు వెళతారని మంత్రి పీఆర్ఓ వెంకట్రెడ్డి బుధవారం తెలిపారు. నారసింహుడికి గరుడ వాహన సేవమఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో బుధవారం అర్చకులు శ్రీలక్ష్మీనారసింహస్వామి నిత్య కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో మూలవిరాట్ స్వామికి పంచామతాభిషేకం నిత్యహోమం నిర్వహించారు. అనంతరం నిత్య కల్యాణం చేపట్టి స్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ మాడ వీధుల్లో వైభవంగా ఊరేగించారు. క్షేత్రపాలకుడైన శ్రీ వీరాంజనేయ స్వామికి నాగవల్లి దళాలతో ప్రత్యేక అర్చనలు చేశారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ గావించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయకుమార్, ఈఓ చలపతిరావు, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయచార్యులు, భక్తులు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులపై అవగాహన ఉండాలి తుంగతుర్తి : సీజనల్ వ్యాధులపై విద్యార్థులకు అవగాహన ఉండాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) పెండెం వెంకటరమణ అన్నారు. తుంగతుర్తిలోని ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో బుధవారం సీజనల్ వ్యాధులపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. వర్షాకాలంలో ఇళ్ల పరిసరాలలో నీరునిల్వ లేకుండా చూసుకోవా లన్నారు. నీరు నిల్వ ఉంటే దోమలు వ్యాప్తిచెంది మలేరియా, డెంగీ, చికున్ గున్యావ్యాధుల బారిన పడతామన్నారు. కార్యక్రమంలో జిల్లా కీటక జనిత నియంత్రణ అధికారి డాక్టర్ నాగరాజు, వైద్యాధికారి డాక్టర్ లింగమూర్తి, సామాజిక ఆరోగ్య అధికారి మాలోతు బిచ్చునాయక్, మాణిక్యమ్మ, రాజల్ బీ, ప్రిన్సిపాల్ సంధ్యారాణి వైస్ ప్రిన్సిపాల్ ఆశా జ్యోతి, జేవీపీ అబ్జలున్నిసా బేగం, సోమన్న, యాదగిరి, నరసింహాచారి పాల్గొన్నారు. -
ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి : జూలకంటి
సూర్యాపేట అర్బన్ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీలక్ష్మీ ఫంక్షన్ హాల్లో జరిగిన సీపీఎం జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజా సమస్యలపై స్పందించాలన్నారు. సాగర్ ఎడమ కాలువ ద్వారా వెంటనే నీటిని విడుదల చేసి ఆయకట్టులో సాగవుతున్న లక్షలాది ఎకరాల వరి పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నవంబర్ 15 నుంచి 18 వరకు నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగే అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభల విజయవంతానికి కృషిచేయాలన్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు, నాగారపు పాండు, మట్టి పెల్లిసైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయ పార్టీలు సహకరించాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ తేజస్నంద్ లాల్ పవార్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ వీసీ హాల్లో రాజకీయ పార్టీల నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఓటరు లిస్టులో ఏమైనా సందేహాలు, ఫిర్యాదులు ఉంటే దరఖాస్తు చేసుకోవాలన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులకు డ్రాఫ్ట్ రోల్ అందించామన్నారు. ఎన్నికల నిబంధనలపై రాజకీయ పార్టీ ప్రతినిధులు.. ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, డీఆర్ఓ ప్రేమ్రాజ్, సి సెక్షన్ సూపరింటెండెంటట్ రాజేందర్ రెడ్డి, రాజేశ్వరరావు, చల్లమల్ల నరసింహ, ఎండి హాబిద్, ఎం.స్టాలిన్, సత్యనారాయణ, డి.రమేష్ తదితరులు పాల్గొన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలి మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఉద్దేశంతో ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తోందని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. బుధవారం సూర్యాపేటల కలెక్టరేట్లో జిల్లా మహిళా శక్తి ఉత్సవంలో భాగంగా వియ్ హబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బూట్ క్యాంప్ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. మహిళామణులు అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. సూర్యాపేటలో చేపట్టిన మహిళా శక్తి భవనాన్ని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ సన్యాసయ్య, సీఈఓ సీతా, డీడబ్ల్యూఓ నరసింహారావు, అడిషనల్ డీఆర్డీఓ సురేష్, డీపీఎం అరుణ్ కుమార్, ఏపీఎంలు, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు స్వయం సహాయక మహిళలు, వియ్ హబ్ అసోసియేట్ డైరెక్టర్ జహీర్ అక్తర్ షేక్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
పద్మశాలి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
సూర్యాపేట : పద్మశాలి సేవా సమాజ ట్రస్ట్ ఆధ్వర్యంలో పద్మశాలి విద్యార్థులకు ప్రతిభా పురస్కారములు, నోట్ పుస్తకములు పంపిణీ చేయనున్నట్లు ట్రస్ట్ అధ్యక్షుడు పెండెం చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి పెండెం వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు గానూ అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 2025–26 విద్యా సంవత్సరంలో 10 తరగతి, సీనియర్ ఇంటర్లో ఉత్తమ మార్కులు సాధించిన 20 మంది విద్యార్థులకు రూ.1500 చొప్పున నగదు బహుమతి అందిస్తామని పేర్కొన్నారు. 6వ తరగతి నుంచి ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, బ్యాగులు అందించనున్నట్లు తెలిపారు. వీటిని ఈ నెల 23న ఆదివారం ఉదయం10 గంటలకు పద్మశాలి భవన్లో అందిస్తామని చెప్పారు. ఆసక్తిగల విద్యార్థులు తమ పేర్లను పద్మశాలి భవన్లో లేదా సెల్: 7893661102 నంబర్కు ఫోన్ చేసి నమోదు చేసుకోవాలని సూచించారు.అభివృద్ధి పనులు వేగవంతం చేయాలిపెన్పహాడ్ : పామ్ పాండ్స్ పనులను వేగవంతం చేయాలని జడ్పీ సీఈఓ శిరీష ఆదేశించారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించారు. మండలంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో పామ్ పాండ్స్ల నిర్మాణంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇంటిగ్రేటెడ్ పామ్ పాండ్స్ ప్రాధాన్యతపై అవగాహన కల్పించాలని సూచించారు. వీటి ద్వారా వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, వ్యవసాయానికి నీటి లభ్యత వంటి ప్రయోజనాలు కలుగుతాయన్నారు. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలను సమగ్రంగా అభివృద్ధి చేసే విధంగా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. సమావేశంలో డీపీఓ యాదగిరి, ఎంపీడీఓ జానయ్య, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలిసూర్యాపేటటౌన్ : విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని, వాటి సాధనకు కష్టపడి చదవాలని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ వనం సత్యేందర్, ట్రెజర్ జయరాజ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కళాశాలలో నూతన విద్యార్థులకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో వారు వాట్లాడారు. రెండు దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తోందన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల భవిష్యత్కు ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో హెచ్ఓడీలు సీహెచ్. సురేష్కుమార్, డి.నాగరాజు, జి.వెంకటేష్, ఆర్.శివశంకర్, బి.గాంధీ, పి.వెంకటేష్, సూపరింటెండెంట్లు కె. జానకిరాములు, బి.శ్రీనివాస్, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
పీఆర్టీయూ అధ్యక్ష కార్యదర్శుల ఎన్నిక
పీఆర్టీయూ టీఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా తంగెళ్ల జితేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా తీగల నరేష్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం రాత్రి పట్టణంలో జరిగిన సంఘం జిల్లా కౌన్సిల్ సమావేశంలో 23 మండలాల కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా వీరిని ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి కట్ట శేఖర్రావు ప్రకటించారు. అనంతరం వారితో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు.తీగల నరేష్ ప్రధాన కార్యదర్శితంగెళ్ల జితేందర్రెడ్డి (అధ్యక్షుడు) -
అందుబాటులోకి మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్ : ఎస్పీ
సూర్యాపేటటౌన్ : సాంకేతిక పరిజ్ఞానంతో కేసుల దర్యాప్తును మరింత వేగవంతం చేసేందుకు సూర్యాపేట జిల్లా పోలీసు శాఖకు అత్యాధునిక మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్ అందుబాటులోకి వచ్చిందని ఎస్పీ నరసింహ అన్నారు. రాష్ట్ర పోలీసుశాఖ కేటాయించిన మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్న్ను మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ప్రారంభించి మాట్లాడారు. నేర పరిశోధనలో ఫోరెన్సిక్ ఆధారం అత్యంత కీలకమైనదన్నారు. ఈ వాహనం ద్వారా ఘటనా స్థలం నుంచే నేరుగా ఫోరెన్సిక్ ఆధారాలను వేగంగా సేకరించవచ్చన్నారు. సాంకేతిక పద్ధతులను ఉపయోగించి కేసుల దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను త్వరగా గుర్తించవచ్చని వివరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ రవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ప్రవీణ్ కుమార్, జానయ్య, ఆర్ఎస్ఐలు సురేష్, అశోక్, రాజశేఖర్, సాయిరాం పాల్గొన్నారు. -
బుల్లెట్ ట్రైన్ సాధించే వరకు ఉద్యమం
సూర్యాపేట : కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ మార్చడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేసిన కుట్రను భగ్నం చేసే వరకు, సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ వచ్చే వరకు ఉద్యమం కొనసాగుతుందని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్ అన్నారు. జాతీయ రహదారి 65కి సమాంతరంగా బుల్లెట్ ట్రైన్ కారిడార్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14 నుంచి అఖిలపక్షాల ఆధ్వర్యంలో పట్టణంలోని వాణిజ్య భవన్ సెంటర్లో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు మంగళవారం కొనసాగాయి. దీక్షల్లో సీపీఐ అనుబంధ జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు ఉత్సల సృజనతో పాటు 16 మంది మహిలు కూర్చున్నారు. దీక్షలను సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, అనంతుల మల్లేశ్వరి, దంతాల రాంబాబు, ఏడేళ్ల శ్రీకాంత్ ప్రారంభించారు. దీక్షలకు బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం తెలిపి మాట్లాడారు. సంఘీభావం తెలిపిన వారిలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అంగిరేకుల నాగార్జున, నాయకులు బండారు రాజా, జీడి భిక్షం, బొమ్మగాని శ్రీనివాస్, గండూరి కృపాకర్, రేణుబాబు, సయ్యద్, నాగమణి, అఖిలపక్ష నాయకులు, స్థానికులు ఉన్నారు. ఐదో రోజు కొనసాగిన రిలే నిరాహార దీక్షలు -
విద్యార్థుల భవిష్యత్తో చెలగాటం వద్దు
సూర్యాపేట అర్బన్ : పాలిటెక్నిక్ను శక్తి పథకానికి అనుసంధానం చేయడం వల్ల విద్యార్థుల భవిష్యత్ను కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టవద్దని, ప్రస్తుతం అమలులో ఉన్న ఎస్బీటీఈటీ విధానాన్ని కొనసాగించాలని, జీఓ 97ను రద్దు చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్ర అఖిల్కుమార్ డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ను శక్తిలో విలీనం చేయాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల నుంచి కల్నల్ సంతోష్ చౌరస్తా, ఎస్వీ కాలేజి వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అఖిల్కుమార్ మాట్లాడుతూ డిప్లోమా పూర్తిచేసిన అనంతరం బీటెక్లో చేరేందుకు ప్రస్తుతం ఉన్న విధానం ద్వారా ప్రవేశ పరీక్షలు, లాటరల్ ఎంట్రీ ద్వారా అవకాశం ఉందన్నారు. శక్తి పథకం అమలుతో ఈ అవకాశాలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జీఓ 97ను రద్దు చేసి, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రిషిత, సాహితి, హాసిని, రక్షణ, నవీన, గాయత్రి, సుహాని, సిరివెన్నెల, మనీషా, రుచిత, బ్లెస్సీ పాల్గొన్నారు. తిరుమలగిరిలో రాస్తారోకో..తిరుమలగిరి (తుంగతుర్తి) : పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి విభాగంలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ తిరుమలగిరిలో పీడీఎస్యూ, పీవైఎల్ ఆధ్వర్యంలో విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు పి.వైష్ణవ్, పోలబోయిన కిరణ్, జక్కుల సుధాకర్ వంశీ, నిఖిల్, సన్ని, రవితేజ, తనూష్, ఛత్రపతి, శ్రీనాథ్, అవినాష్, విష్ణు, చరణ్, గీత, రక్షిత పాల్గొన్నారు. పాలిటెక్నిక్ను శక్తిలో విలీనంపై విద్యార్థుల నిరసన -
పీఆర్సీ కోసం పోరాటానికి సిద్ధం
సూర్యాపేట : రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు నూతన పీఆర్సీ కోసం పోరుబాటకు సిద్ధం కావాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం రాత్రి జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు తంగెళ్ల జితేందర్రెడ్డి అధ్యక్షతన జరిగిన సంఘం జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పీఆర్సీ కమిటీ వేసి మూడు సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఎటువంటి పురోగతి లేదన్నారు. 30 శాతం ఫిట్మెంట్ కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. పెండింగ్ డీఏలు, బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని, వెంటనే ఈహెచ్ఎస్ కార్డులు అమలులోకి వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ప్రధానమైన డిమాండ్లతో సెప్టెంబర్ ఒకటో తేదీన హైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్ద వేలాది మంది ఉపాధ్యాయులతో మహాధర్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్, పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పేరి వెంకటరెడ్డి, ఆడిట్ కమిటీ చైర్మన్ సోమిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, జిల్లాశాఖ మాజీ అధ్యక్షుడు కొండేటి రవీందర్రెడ్డి, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్మన్ బొల్లికొండ కోటయ్య, అకాడమిక్ కమిటీ వైస్ చైర్మన్ చల్ల ప్రభాకర్రెడ్డి, మాసపత్రిక సంపాదక వర్గ సభ్యుడు పప్పుల వీరబాబు, క్రమశిక్షణ కమిటీ సభ్యుడు కందుకూరి శివశంకర్, అకడమిక్ కమిటీ సభ్యుడు రాపర్తి వీరేష్, జిల్లా గౌరవాధ్యక్షుడు కొనతం వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి తీగల నరేష్, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు కట్టా శేఖర్రావు, ఏఐఎఫ్టీఓ ఉపాధ్యక్షుడు చిత్తలూరి ప్రసాద్, మేడ్చల్ అధ్యక్షుడు రామేశ్వర్గౌడ్, తదితరులు పాల్గొన్నారు.ఫ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి -
కాంగ్రెస్ పాలనలో నిరుద్యోగులకు అన్యాయం
హుజూర్నగర్ : కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ యువతను ఎన్నికల్లో వాడుకొని వదిలేసిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్రెడ్డి విమర్శించారు. మంగళవారం హుజూ ర్నగర్లో యూత్ డిక్లరేషన్పై నిర్వహించిన నిరుద్యోగ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతే లక్ష్యంగా రాహుల్గాంధీ, ప్రియాంక, మల్లికార్జున ఖర్గేతో పాటు నాయకులు యూత్ డిక్లరేషన్ విడుదల చేసి అనేక హామీలిచ్చారన్నారు. దాంతో తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువత కోటి ఆశలతో ఓట్లేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. గద్దెనెక్కిన తరువాత వారి గురించి పట్టించుకోవడం వదిలేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో దాదాపు 13 సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయని, స్థానిక పరిశ్రమలలో 75 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించే జీఓ ఉన్నప్పటికీ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాల మీద దృష్టే లేదన్నారు. కేవలం మంత్రి పదవులపై ధ్యాసే తప్ప యువతను పట్టించుకోవడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకుడు పిల్లుట్ల రఘు అధ్యక్షతన జరిగిన సదస్సులో బీఆర్ఎస్ నియోజకవర్గ, మండల నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో నిరుద్యోగ యువత, స్థానికులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేష్రెడ్డి -
మూతబడ్డ మిల్లుకు ధాన్యం కేటాయింపు
కోదాడ: ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన కస్టమ్ మిల్లింగ్ (సీఎంఆర్) ధాన్యాన్ని ఓ రైస్ మిల్లర్ అక్రమంగా బహిరంగ మార్కెట్లో అమ్ముకొన్నాడు. రూ.13.5 కోట్ల విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించి సొమ్ము చేసుకున్నాడు. రాష్ట్ర విజిలెన్స్ అధికారులు సోమవారం రాత్రి నిర్వహించిన మెరుపు దాడుల్లో ఈ భారీ అక్రమాలు వెలుగు చూసింది. నల్లగొండ నుంచి వచ్చిన విజిలెన్స్ అధికారులు కోదాడ నుంచి హుజూర్నగర్ రోడ్డులో ఉన్న విజయలక్ష్మి రైస్ కార్పోరేషన్ మిల్లుపై దాడులు నిర్వహించి భారీగా ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. ఈ మిల్లును రంగనాయక రైస్ కార్పోరేషన్ పేరుతో మేళ్లచెరువు శంకర్రావు అనే వ్యాపారి కాంట్రాక్ట్కు తీసుకొని నడిపిస్తున్నట్లు రికార్డులలో నమోదైంది. సదరు వ్యాపారి ధాన్యం పక్కదారి పట్టించాడని అధికారులు తేల్చారు. ధాన్యం మాయం చేసినా..సీఎంఆర్ ధాన్యం బకాయిలున్న మిల్లులకు కొత్తగా ధాన్యం కేటాయించేది లేదని అధికారులు చెబుతున్నారు. అయినా కొంతమంది అధికారులు మిల్లర్లతో ములాఖాత్ అవుతూ మళ్లీ వారికే భారీగా ఽసీఎంఆర్ ధాన్యం కేటాయిస్తున్నారు. కోదాడలోని విజయలక్ష్మిరైస్ కార్పోరేషన్ మిల్లుకే కేటాయింపులు చూస్తుంటే ఈ విషయం వెలుగులోకి వస్తున్నది. రంగనాయక రైస్మిల్లు పేరుతో దీనిని లీజుకు తీసుకున్న వ్యాపారి మూడేళ్లుగా యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డాడు. ఈ మిల్లు 2022–23 యాసంగి సీజన్కు సంబంధించి ప్రభుత్వం కేటాయించిన రూ.3.35 కోట్ల విలువైన ధాన్యాన్ని (1499.480 టన్నులు) యజమాని మాయం చేశాడు. అధికారులు మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా 2024–25 యాసంగి, 2025–26 వానకాలం సీజన్లకు సంబంధించి 3237.236 మెట్రిక్ టన్నుల ధాన్యం(దీని విలువ రు.10.16కోట్లు) కేటాయించారు. ఈ ధాన్యాన్ని సైతం సదరు మిల్లరు పక్కదారి పట్టించి సొమ్ము చేసుకున్నాడు. మూడు సీజన్లకు సంబంధించిన మొత్తం రూ.13.51 కోట్ల విలువైన ధాన్యాన్ని సదరు మిల్లర్ పక్కదారి పట్టించినట్లు విజిలెన్స్ అధికారులు తేల్చారు. దాంతో మిల్లు యజమానిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. విజిలెన్స్ తనిఖీల్లో వెలుగు చూసిన ఘరానా మోసం రూ.13.5 కోట్ల విలువైన సీఎంఆర్ బియ్యం మాయం అధికారుల నిర్లక్ష్యంతో మూడేళ్లుగా కొనసాగుతున్న తంతు పోలీసుల అదుపులో మిల్లు యజమానికేసు నమోదు చేశాం : డీఎస్పీ శ్రీనివాసరెడ్డి సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టించాడని విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు మిల్లు యజమాని మేళ్లచెరువు శంకర్రావుపై కేసు నమోదు చేశాము. అతడిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నాం.ఈ ఫొటోలో కనిపిస్తున్నది కోదాడ నుంచి హుజూర్నగర్ రోడ్డులో ఉన్న విజయలక్ష్మి రైస్ మిల్లు. పూర్తిగా పాడుపడి పనిచేయని స్థితిలో ఉన్న ఈ మిల్లును కోదాడకు చెందిన ధాన్యం వ్యాపారి మేళ్లచెరువు శంకర్రావు లీజుకు తీసుకొని రంగనాయక రైస్ మిల్లు పేరుతో సీఎంఆర్ ధాన్యం కేటాయింపు చేసుకుంటున్నాడు. అధికారులు మిల్లును పరిశీలించకుండానే మూడు సంవత్సరాలుగా ధాన్యం కేటాయిస్తున్నారే గానీ ఇప్పటి వరకు కేజీ బియ్యం కూడ వెనక్కి తీసుకోలేదు. మిల్లు యజమాని 2022–23 సంవత్సరానికి సంబంధించి రూ.3.35 కోట్ల విలువైన సీఎంఆర్ బకాయి ఉన్నప్పటికీ 2024–25, 2025–26 సంవత్సరాలకు గానూ రూ.10 కోట్ల విలువైన ధాన్యం కేటాయించారు. -
కన్నతండ్రే కాటికి పంపాడు
● కొడుకు తీరుతో విసుగుచెంది రోకలిబండతో కొట్టి హత్యచందంపేట : మద్యం మత్తులో తల్లిదండ్రులపై దాడికి పాల్పడిన కుమారుడిని తండ్రి రోకలిబండతో కొట్టి హతమార్చాడు. ఈ ఘటన చందంపేట మండలం బుడ్డోనితండా గ్రామ పంచాయతీ పరిధిలోని వెంకటినాయక్తండాలో సోమవారం జరిగింది. తండావాసులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటినాయక్తండాకు చెందిన నేనావత్ లష్కర్, కంసాలి దంపతులతో పాటు వారి పెద్ద కుమారుడు మకట్లాల్(31) బతుకుదెరువు నిమిత్తం రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్కు వలస వెళ్లి జీవనం సాగిస్తున్నారు. గతంలో చాలాసార్లు మకట్లాల్ మద్యం మత్తులో తల్లిదండ్రులపై దాడికి పాల్పడ్డాడు. తీజ్ పండుగ కోసం ముగ్గురు కలిసి శుక్రవారం స్వగ్రామానికి వచ్చారు. ఈ క్రమంలోనే సోమవారం తెల్లవారుజామున మకట్లాల్ మద్యం మత్తులో తల్లిపై దాడి చేస్తుండగా.. పక్కనే ఉన్న తండ్రి లష్కర్ అతడిని వారించాడు. దీంతో మకట్లాల్ తండ్రిపై కూడా దాడి చేశాడు. క్షణికావేశంలో నేనావత్ లష్కర్ తన కుమారుడి తలపై రోకలిబండతో కొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న డిండి సీఐ బీసన్న ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లోకేష్ తెలిపారు. మృతుడు అవివాహితుడు. -
నమ్మించాడు.. రూ.5వేలతో ఉడాయించాడు
చౌటుప్పల్ : ఓ యువకుడి అమాయకత్వాన్ని గమనించిన కేటుగాడు తన మాయమాటలతో అతడిని నమ్మించాడు. మాటల్లో పెట్టి ఏటీఎం సెంటర్లో డ్రా చేసుకున్న నగదును బాధితుడి చేతుల్లోంచి తీసుకున్నాడు. ఫోన్ ద్వారా డబ్బులను పంపిస్తానని మాటల్లో పెట్టి ఉడాయించాడు. ఈ ఘటన సోమవారం సాయంత్రం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాలకు చెందిన ప్రభాకర్ చౌటుప్పల్ పట్టణంలో అద్దెకుంటూ హైదరాబాద్లోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. సోమవారం పని ఉండడంతో డ్యూటీకి వెళ్లలేదు. సాయంత్రం డబ్బులు అవసరం రావడంతో ఇంటి నుంచి నడుచుకుంటూ బస్టాండ్ వద్దకు వచ్చాడు. పోచంపల్లి కో–ఆపరేటివ్ బ్యాంకు ఏటీఎంలోకి వెళ్లి డబ్బులు డ్రా చేస్తుండగా.. అప్పటికే అక్కడ ఉన్న ఓ 25ఏళ్ల యువకుడు ఫోన్ మాట్లాడుతున్నాడు. ప్రభాకర్ ఏటీఎం నుంచి రూ.5వేలు డ్రా చేసి బయటకు వస్తుండగా.. సదరు కేటుగాడు ప్రభాకర్తో మాటలు కలిపాడు. ‘నేను ఫోన్ పే ద్వారా నీకు డబ్బులు పంపిస్తా.. నాకు క్యాష్ ఇవ్వు’ అని ప్రభాకర్ను నమ్మించాడు. సదరు కేటుగాడు ప్రభాకర్ చేతిలోని డబ్బులు తీసుకుని ఫోన్పే ద్వారా డబ్బులు పంపిస్తున్నట్లు చేశాడు. రెండు నిమిషాల తర్వాత ప్రభాకర్ ఫోన్ చూసుకోగా డబ్బులు రాలేదు. ఐదు నిమిషాలలో తన ఫ్రెండ్ నుంచి డబ్బులు పంపిస్తానని ప్రభాకర్కు చెప్పి.. పక్కనే ఉన్న మొబైల్ షాపుకు వెళ్లి వస్తాను, అప్పటి వరకు నా ఏటీఎం కార్డు తీసుకొని రూ.20వేలు డ్రా చేసిపెట్టు అని పిన్ నంబర్ చెప్పి వెళ్లాడు. ఇది నిజమేనని నమ్మిన ప్రభాకర్ అతడిచ్చిన ఏటీఎం కార్డు తీసుకొని డబ్బులు డ్రా చేసేందుకు ప్రయత్నించగా పిన్ నంబర్ తప్పుగా తేలింది. పది నిమిషాలు ఎదురుచూసినా కేటుగాడు రాకపోవడంతో తాను మోసపోయానని ప్రభాకర్ గ్రహించాడు. వెంటనే ప్రభాకర్ పోచంపల్లి బ్యాంక్కు వెళ్లి సీసీ కెమెరాల్లో నమోదైన కేటుగాడి ఫొటోను తీసుకుని బస్టాండ్ పరిసరాల్లో కోసం వెతకడం ప్రారంభించాడు. ఏటీఎం సెంటర్లో యువకుడికి మాయమాటలు చెప్పి డబ్బులు తీసుకొని పరారైన కేటుగాడు -
గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్టు
కోదాడ : కోదాడ సమీపంలోని ఓ మామిడి తోటలో గంజాయి విక్రయిస్తున్న ముఠాను సోమవారం కోదాడ పట్టణ పోలీసులు పట్టుకున్నారు. కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ సమీపంలోని ఓ మామిడి తోటలో కొందరు వ్యక్తులు గంజాయి విక్రయిస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో పట్టణ ఎస్ఐ అజయ్కుమార్ తన సిబ్బందితో కలిసి దాడి చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఐదు సెల్ఫోన్లు, నాలుగు బైక్లు, 1.2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో మేళ్లచెరువుకు చెందిన కొండారి సైదులు, పసుపులేటి వెంకటేష్, చిన్నపంగు నవీన్, కోదాడకు చెందిన షేక్ ఫయాజ్బాబ, షేక్ రేహాన్, కొండ నిఖిల్, షేక్ వాజిద్ ఉన్నారు. మరో ముగ్గురు పరారైనట్లు డీఎస్పీ తెలిపారు. వీరు ఆంధ్ర, ఒడిస్సా బార్డర్ నుంచి గంజాయి తీసుకొచ్చి కోదాడ, మేళ్లచెరువు పరిసర ప్రాంతాలలో విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సీఐ శివశంకర్, ఎస్ఐ అజయ్కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
రూ.79లక్షలతో శంఖు చక్ర నామాలు..
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట ఆలయానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు వైటీడీ పాలకమండలి కృషి చేయనుంది. 2014కు ముందు యాదగిరిగుట్ట ఆలయ దక్షిణ భాగంలో విద్యుత్కాంతులతో భారీ శంఖు, చక్రనామాలు ఉండేవి. ఆలయ అభివృద్ధి, విస్తరణలో భాగంగా వాటిని తొలగించారు. కాగా.. నూతనంగా ఏర్పాటైన వైటీడీ పాలకమండలి ఆధ్వర్యంలో మళ్లీ భారీ శంఖు, చక్ర నామాలను రూ.79లక్షలతో ఏర్పాటు చేయనున్నారు. వీటికి విద్యుత్ దీపాలను సైతం ఏర్పాటు చేయనున్నారు. ఈ శంకు, చక్ర నామాలను తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసేందుకు వైటీడీ పాలకమండలి సభ్యురాలు కొణిదెల సురేఖ ముందుకొచ్చారు. -
యాదగిరిగుట్టపై రూ.43 కోట్లతో భారీ మండపం
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ సన్నిధిలోని విష్ణు పుష్కరిణి సమీపంలో భారీ మండపం ఏర్పాటు కానుంది. రూ.43.12 కోట్లతో దీక్షాపరుల మండపం, కారు, బైక్ పార్కింగ్, సెల్లార్ పార్కింగ్, డార్మిటరీ హాల్ నిర్మించనున్నారు. ఈ మండపంలో మూడు సెల్లార్స్ రానున్నాయి. ఇందులో 550 ద్విచక్ర వాహనాలు, 310 కార్లు పార్కింగ్ చేసేలా నిర్మాణం జరగనుంది. అంతేకాకుండా భక్తులు బస చేసేందుకు 34 గదులు, 300 మంది భక్తులు ఉండే విధంగా డార్మిటరీ హాల్, సుమారు 320 మంది మండల దీక్ష చేసే భక్తుల కోసం దీక్షాపరుల మండపాన్ని నిర్మాణం చేయనున్నారు. -
అర్జీలను వేగంగా పరిష్కరించాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 95 అర్జీలు స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా, మండల స్థాయి ప్రజావాణి దరఖాస్తులను తప్పనిసరిగా ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. పాత ప్రజావాణి పోర్టల్లో ఇంకా పరిష్కారం కాకుండా ఉన్న దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. మండల స్థాయిలో ప్రారంభమైన ప్రజావాణి కార్యక్రమంపై కూడా కలెక్టర్ సమీక్షించారు. మండల స్థాయి ప్రజావాణికి అన్ని శాఖల మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా జిల్లా అధికారులు పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, డీఆర్ఓ ప్రేమ్రాజ్, జిల్లా పరిషత్ సీఈఓ శిరీష, డీఆర్డీఓ సన్యాసయ్య, డీఈఓ అశోక్, డీపీఓ యాదగిరి, డీఏఓ శ్రీధర్రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
బంధువుల ఇంటికి వెళ్లొస్తూ..
● బైక్పై నుంచి పడి వ్యక్తి దుర్మరణంయాదగిరిగుట్ట రూరల్ : బైక్పై నుంచి పడి వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామ శివారులో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోటకొండూర్ మండలం దిలావర్పూర్ గ్రామానికి చెందిన నమిలె ఐలయ్య(61) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ఉదయం బైక్పై తుర్కపల్లి మండలం దత్తాయపల్లి గ్రామంలోని తన బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడ పనులు ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వస్తుండగా.. మార్గమధ్యలో యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామం వద్దకు రాగానే నియంత్రణ కోల్పోయి బైక్పై నుంచి కిందపడ్డాడు. దీంతో అతడి తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ భాస్కర్ తెలిపారు. -
పోలీస్ స్టేషన్పై దాడికి 20 ఏళ్లు
ఆత్మకూరు(ఎం) : సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం 2006 ఆగస్టు 18న రాత్రి మావోయిస్టుల మెరుపుదాడితో ఆత్మకూరు(ఎం) పోలీస్ స్టేషన్ రక్తసిక్తమైంది. ఆ భీకర దాడిలో ఎస్ఐ ఎండీ చాంద్ పాషా, ఏఎస్ఐ సుల్తాన్ మోహినొద్దీన్, హోంగార్డు లింగయ్య అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. తీవ్రంగా గాయపడిన మరో కానిస్టేబుల్ కరీం ఏడాది పాటు మంచానికే పరిమితమై కన్నుమూశారు. ఈ దాడి అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవడంతో అసలు ఏం జరుగుతుందో తెలియక స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆ తర్వాత వెంటనే తేరుకుని స్టేషన్ వద్దకు వెళ్లి చూడగా, విధ్వంసకర దృశ్యాలు కనిపించాయి. స్టేషన్ ఆవరణ అంతా భయానకంగా మారింది. తోటి పోలీసు సిబ్బంది కొందరు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తప్పించుకున్నారు. ఈ దారుణ సంఘటన జరిగి 20 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా, ప్రాణ త్యాగం చేసిన పోలీసులను మండల ప్రజలు, అధికారులు ఇప్పటికీ స్మరించుకుంటున్నారు. ఆనాటి ఘటనలో మృతిచెందిన ఎస్ఐ, ఏఎస్ఐ, హోంగార్డు, కానిస్టేబుల్ -
వేతనాలు పెంచేదాకా తగ్గేదే లేదు
పెద్దవూర : తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న అకాడమిక్ ఇన్స్ట్రక్టర్(ఏఐ) ఉపాధ్యాయులు సోమవారం నుంచి నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సమ్మెలో భాగంగా మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నారు. ఒకే పాఠశాలలో రెగ్యులర్, సీఆర్టీ (కాంట్రాక్ట్ రెసిడెన్స్ ఉపాధ్యాయులు)లతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్న తమకు వేతనాల్లో తీవ్ర వ్యత్యాసం చూపడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఆర్టీలతో సమానంగా వేతనాలు ఇచ్చేదాకా తమ పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 110 మంది..ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 18 గిరిజన ఆశ్రమ పాఠశాలలు ఉండగా.. అందులో నల్లగొండ జిల్లాలో 14, సూర్యాపేట జిల్లాలో 3, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక పాఠశాల ఉన్నాయి. నల్ల గొండ జిల్లాలో 76 మంది, సూర్యాపేటలో 27 మంది, యాదాద్రి భువనగిరి జిల్లాలో 7 గురు చొప్పున మొత్తం 110 మంది అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు పనిచేస్తున్నారు. జీతం తక్కువ.. పని ఎక్కువ..తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉమ్మడి జిల్లాలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న ఆరు గిరిజన వసతి గృహాలను 2015 నవంబర్లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆశ్రమ పాఠశాలలుగా మార్చారు. ఇక్కడ ఎలాంటి శాంక్షన్డ్ పోస్టులను మంజూరు చేయకుండా, 2015లో పార్ట్ టైం ఉపాధ్యాయులుగా రూ.5,000 వేతనంతో నోటిఫికేషన్ విడుదల చేశారు. భవిష్యత్తులో వేతనాలు పెరుగుతాయనే ఆశతో ఉన్నత విద్యనభ్యసించిన నిరుద్యోగులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. వేతనాలు పెంచాలని వీరు ఆందోళనలు చేపడటంతో, 2020లో వేతనాన్ని రూ.12,000కు పెంచి ‘పార్ట్ టైం’ అని తొలగించి ‘విద్యా వాలంటీర్లు’గా మార్చారు. అనంతరం సీఆర్టీలతో సమానంగా వేతనం ఇవ్వాలని విన్నవించగా, 2023లో ఈ పోస్టును ఔట్సోర్సింగ్కు మార్చి ‘అకాడమిక్ ఇన్స్ట్రక్టర్’ ఉపాధ్యాయులుగా పేరు మార్చారు. వేతనాన్ని ఔట్సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగించడంతో ప్రస్తుతం చేతికి రూ.10,440 మాత్రమే వస్తున్నాయని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఆశ్రమ పాఠశాలల్లో ప్రస్తుతం సీఆర్టీ స్కూల్ అసిస్టెంట్లకు రూ.28,977, ఎస్జీటీలకు రూ.21,255 చెల్లిస్తున్నారు. తమకు కూడా ఇదే వేతనాన్ని వర్తింపజేయాలని అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. వీరికి సంబంధించిన వేతన పెంపు ఫైల్ ఆర్థికశాఖ మంత్రి పేషీలో రెండేళ్లుగా పెండింగ్లో ఉందని, తక్షణమే దానికి ఆమోదం తెలిపేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల నిరవధిక సమ్మె నేడు కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా సీఆర్టీలతో సమానంగా వేతనం చెల్లించాలని డిమాండ్అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లకు సీఆర్టీలతో సమానమైన వేతనం ఇవ్వాలి. పీజీలు, బీఈడీలతో పాటు టెట్ క్వాలిఫై అయినా ఈ వ్యత్యాసం ఏంటో అర్థం కావడం లేదు. ఎన్నో ఏళ్లుగా మా సమస్య పరిష్కారం కాలేదు. అందుకే చేసేది లేక సమ్మెకు దిగాం. వేతనాలు పెంచేదాకా సమ్మె కొనసాగిస్తాం. – బి. సురేందర్, అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ మార్చొద్దు
సూర్యాపేట : జాతీయ రహదారి 65 వెంట మంజూరైన బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ను మార్చొద్దని చేపట్టిన రిలే నిరాహార దీక్ష సోమవారం నాలుగో రోజు చేరింది. అఖిలపక్షాల ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణం వాణిజ్య భవన్ సెంటర్లో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలో పీఓడబ్ల్యూ మహిళా నాయకులు కూర్చున్నారు. ప్రజల ఓట్లతో గద్దెనెక్కిన నేతలు ప్రజా సంక్షేమాన్ని మరిస్తే ఊరుకునేది లేదని మహిళలు హెచ్చరించారు. ఈ రిలే నిరాహార దీక్షలో ఈరోజు నాలుగవ రోజు పీఓడబ్ల్యూ ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక ఆధ్వర్యంలో దీక్షలో మరసాని చంద్రకళ, కట్టా కల్పన, సూరం రేణుక, ఐతరాజు పద్మ ,భీమనపల్లి పద్మ, శెట్టిపల్లి గౌరమ్మ, గుండగాని రేణుక, చందనబోయిన లక్ష్మి, వేమనూరు పావని, సిరికొండ శ్యామల, ఎస్కే.ఫర్వీన్, చెరుకు అరుణ దీక్షలో కూర్చున్నారు. ఈ దీక్షలకు నాయకులు కుంట్ల ధర్మార్జున్, రమణాచారి, చల్లమల్ల నర్సింహ, కొత్తపల్లి శివకుమార్, వజ్జే వీరయ్య, సట్టు నాగయ్య, చామకూరి నరసయ్య, బూర వెంకటేశ్వర్లు తదితరులు సంఘీభావం తెలిపారు. నాలుగో రోజు రిలే నిరాహార దీక్షలో మహిళలు -
పగలు రెక్కీ.. రాత్రివేళ చోరీలు
ఆత్మకూరు(ఎం) : పగలు రెక్కీ నిర్వహించి.. రాత్రివేళ ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను ఆత్మకూరు(ఎం) పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఎస్ఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్కు చెందిన బండారి దుర్గాప్రసాద్, బండారి సాయి ముఠాగా ఏర్పడ్డారు. వారు డి పగలు గ్రామాలకు చివరన ఉన్న దేవాలయాలను గుర్తించేవారు. రాత్రివేళ వారు దేవాలయాల్లోని ఇత్తడి గంటలు, పూజా సామగ్రి చోరీ చేసేవారు. ఇలా వలిగొండ, ఆత్మకూరు(ఎం), మోటకొండూరు, గుండాల పోలీస్ స్టేషన్ల పరిధిలో చాలా దొంగతనాలకు పాల్పడ్డారు. సోమవారం ఆత్మకూరు(ఎం) మండలం తిమ్మాపురం ఎక్స్రోడ్డు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. టీవీఎస్ ఎక్సెల్పై అనుమానాస్పదంగా వస్తున్న వారిద్దరిని ఆపారు. ఈ క్రమంలో బండారి సాయి పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. బండారి దుర్గాప్రసాద్ను విచారించగా.. ఆలయాల్లో ఇత్తడి గంటలు చోరీ చేస్తున్నట్లు నిజం ఒప్పుకున్నాడు. అతడి నుంచి రూ.11,200 నగదు, టీవీఎస్ ఎక్సెల్, ఇత్తడి గంటలు, పూజా సామగ్రి, నేరాలకు ఉపయోగించిన పనిముట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న బండారి సాయి కోసం గాలిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పట్టుబడ్డ బండారి దుర్గాప్రసాద్ను రిమాండ్కు తరలించనున్నట్లు పేర్కొన్నారు. ఆలయాల్లో ఇత్తడి గంటలు అపహరిస్తున్న దొంగ అరెస్టు మరొకరు పరారీ -
ద్విచక్ర వాహనంపై నుంచి పడి యువకుడి మృతి
మోటకొండూర్ : ద్విచక్ర వాహనంపై నుంచి పడి యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన మోటకొండూర్ మండల కేంద్రంలో సోమవారం జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోటకొండూర్ మండల కేంద్రానికి చెందిన గంధమల్ల రాజు(29) ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి సడెన్గా బ్రేక్ వేశాడు. దీంతో అతడు జారి పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని వెంటనే అంబులెన్స్లో బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కుమారస్వామి తెలిపారు. -
సాక్షి ఫొటోగ్రాఫర్కు మరో ప్రతిష్టాత్మక అవార్డు
రామగిరి(నల్లగొండ) : ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ఫొటోగ్రఫీ అకాడమీ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీల్లో సాక్షి నల్లగొండ జిల్లా ఫొటోగ్రాఫర్ కంది భజరంగ్ప్రసాద్ అవార్డు సొంతం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పోటీకి మొత్తం 510 ఫొటోలు పోటీ పడగా, వాటిలో ఉత్తమ ఫొటోలను జ్యూరీ సభ్యులు ఎంపిక చేశారు. ఇందులో కంది భజరంగ్ప్రసాద్ తీసిన ఫొటో అవార్డుకు ఎంపికై నట్లు నిర్వాహకులు తెలిపారు. విజేతలుగా నిలిచిన వారికి త్వరలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి అవార్డులు ప్రదానం చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఫొటోగ్రఫీ అకాడమీ కార్యదర్శి సుధాకర్రెడ్డి తెలిపారు. బైక్ను ఢీకొట్టిన కారు.. వ్యక్తికి గాయాలుమోత్కూరు : కారు ఢీకొని బైక్పై వెళ్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మోత్కూరు మండలం అనాజిపురం చౌరస్తాలో సోమవారం జరిగింది. వివరాలు.. శాలిగౌరారం మండలం ఎన్జి కొత్తపల్లి గ్రామానికి చెందిన మురారిశెట్టి చంద్రయ్య కిరాణ దుకాణం నిర్వహిస్తున్నాడు. సోమవారం బైక్పై మోత్కూరుకు వచ్చి కిరాణ సామాను తీసుకొని స్వగ్రామానికి వెళ్తున్నాడు. అనాజిపురం చౌరస్తాలో రోడ్డు క్రాస్ చేస్తుండగా తిరుమలగిరి నుంచి వలిగొండ వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చంద్రయ్య తలకు తీవ్ర గాయమైంది. అతడిని అంబులెన్స్లో నార్కట్పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. బస్సు ఫుట్బోర్డుపై నుంచి కిందపడిన ప్రయాణికుడు● కాలిపై నుంచి బస్సు వెళ్లడంతో గాయాలు కట్టంగూర్ : ఆర్టీసీ బస్సు ఫుట్బోర్డుపై నుంచి కిందపడిన ప్రయాణికుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కట్టంగూర్ మండలంలో సోమవారం జరిగింది. స్థానికులు తెలిపి న వివరాల ప్రకారం.. కట్టంగూర్ మండలం బొల్లేపల్లి గ్రామానికి చెందిన ముత్తయ్య సోమవారం హైదరాబాద్కు వెళ్లేందుకు కట్టంగూర్లోని నల్లగొండ బస్టాప్ వద్ద ఆర్టీసీ బస్సు ఎక్కాడు. బస్సు ఫుట్బోర్డుపై ఉన్న ముత్తయ్య లోనికి వెళ్తుండగా.. బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయటంతో ముత్తయ్య ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. అతడి కాలుపై నుంచి బస్సు వెనుక టైరు ఎక్కడంతో తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ముత్తయ్యకు ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మద్యం మత్తులో ఉరేసుకుని ఆత్మహత్యపెద్దఅడిశర్లపల్లి : మద్యం మత్తులో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పెద్దఅడిశర్లపల్లి మండలం అంగడిపేట ఎక్స్రోడ్డు వద్ద సోమవారం జరిగింది. గుడిపల్లి ఎస్ఐ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. అంగడిపేటకు చెందిన బోదాసి శ్రీశైలం(39) హైదరాబాద్లో మేసీ్త్ర పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం హైదరాబాద్ నుంచి అంగడిపేటకు వచ్చాడు. సోమవారం ఉదయం తిరిగి హైదరాబాద్కు వెళ్దామని శ్రీశైలంను తనకు వరసకు బావ అయిన శివ అడిగాడు. కాసేపు ఆగు వస్తా అని చెప్పి శ్రీశైలం ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత అతడి భార్య నాగలక్ష్మి ఎంత పిలిచినా తలుపులు తీయలేదు. దీంతో ఆమె తన కొడుకు శివకుమార్, అన్న శివతో కలిసి కిటికీలోంచి చూడగా శ్రీశైలం చీరతో ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించాడు. వెంటనే తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే శ్రీశైలం మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడు మద్యం మత్తులో ఆత్మహత్య చేసుకున్నట్లు అతడి భార్య చెబుతుండగా.. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
నీట్ లాంగ్టర్మ్ శిక్షణకు దరఖాస్తులు
నల్లగొండ : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరం నీట్ ఉచిత లాంగ్టర్మ్ శిక్షణకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నల్లగొండ జిల్లా కోఆర్డినేటర్ శోభారాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న బాలురకు హైదరాబాద్లోని చిలుకూరు టీజీఎస్డబ్ల్యూఆర్ఎస్ ఫౌండేషన్ సీఓఈలో, బాలికలకు మహేంద్రహిల్స్ కేంద్రంలో ఉచితంగా నీట్ లాంగ్టర్మ్ శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ బైపీసీ పూర్తి చేసి, నీట్ (యూజీ)–2026 పరీక్షకు హాజరైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు. అధికారిక వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్లోడ్ చేసుకుని, పూర్తి చేసిన దరఖాస్తుకు నీట్–2026 స్కోర్కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్ మార్కుల మెమోలను జత చేయాలని, పూర్తి చేసిన దరఖాస్తులను టీజీఎస్డబ్ల్యూఆర్ఎస్ జేసీ (బాలికల) నకిరేకల్ (డీసీఓ), నకిరేకల్, నల్లగొండ జిల్లా–508211 చిరునామాకు ఈ నెల 22వ తేదీలోగా పంపాలని సూచించారు. సిమెంట్ లారీ బోల్తాఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : ఆత్మకూర్(ఎస్) మండలం బోరింగ్తండా వద్ద సోమవారం తెల్లవారుజామున సిమెంట్ లారీ బోల్తా పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ నుంచి కాళేశ్వరానికి వెళ్తున్న సిమెంట్ లారీ అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సంజయ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. తీజ్ పండుగకు వచ్చి మృత్యుఒడికి..● బైక్ అదుపుతప్పి యువకుడి మృతి చందంపేట : తీజ్ పండుగకు స్వగ్రామానికి వచ్చిన యువకుడు బైక్పై వెళ్తూ అదుపుతప్పి కిందపడి మృతిచెందాడు. ఈ ఘటన చందంపేట మండలం కేతేపల్లి గేటు వద్ద సోమవారం జరిగింది. వివరాలు.. నేరెడుగొమ్ము మండలం చిన్నమునిగల్ గ్రామానికి చెందిన కేతావత్ దేవ్సింగ్(25) హైదరాబాద్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి భార్య, ఆరు నెలల కుమార్తె ఉన్నారు. ఇటీవల తీజ్ పండుగకు స్వగ్రామానికి వచ్చిన దేవ్సింగ్ సోమవారం మరో ఇద్దరితో కలిసి బైక్పై నేరెడుగొమ్ము నుంచి చిన్నమునిగల్కు వెళ్తుండగా.. చందంపేట మండలం కేతేపల్లి గేటు వద్ద బైక్ అదుపుతప్పి రోడ్డు సైడ్ వాల్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దేవ్సింగ్ అక్కడికక్కడే మృతిచెందాడు. బైక్పై ఉన్న మిగతా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పండుగకు ఇంటికి వచ్చిన దేవ్సింగ్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
అటవీ భూముల్లో అక్రమ నిర్మాణాల తొలగింపు
మఠంపల్లి : మండలంలోని మట్టపల్లి రెవెన్యూ పరిధిలో గల సుల్తాన్పూర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఎన్సీఎల్ సిమెంట్ పరిశ్రమ యాజమాన్యం అక్రమంగా నిర్మించిన కట్టడాలను సోమవారం సూర్యాపేట, నల్లగొండ జిల్లాల ఫారెస్ట్, పోలీసు శాఖల అధికారులు జేసీబీల సహాయంతో తొలగింజేశారు. ఈ సందర్భంగా జిల్లా అటవీ శాఖ అధికారి (డీఎఫ్ఓ) కె.దామోదర్రెడ్డి మాట్లాడుతూ ఎన్సీఎల్ సిమెంట్ పరిశ్రమ వారు ఎలాంటి అనుమతులు లేకుండా సుల్తాన్పూర్ రిజర్వ్ ఫారెస్ట్లోని మట్టపల్లి రెవెన్యూ సర్వేనంబర్ 88లో గల 12.6 ఎకరాల భూముల్లో అక్రమంగా భారీ రేకుల షెడ్లు, వాటర్ ప్లాట్లు, ప్రహరీ, సీసీ రోడ్డు నిర్మించారన్నారు. దీనిపై రెండు మాసాల క్రితమే నోటీసులు అందజేయగా వారు సమర్పించిన సర్టిఫికెట్లు, ఆధారాలను పరిశీలించగా అవి అటవీ భూములుగా నిర్ధారించామన్నారు. సదరు పరిశ్రమ హైకోర్టును ఆశ్రయించగా విచారణ అనంతరం కోర్టు ఉత్తర్వుల మేరకు అక్రమ నిర్మాణాలను తొలగింపజేస్తున్నట్లు తెలిపారు. ఫారెస్ట్ భూములను ఎవరు ఆక్రమించినా చట్టరీత్యా చ్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజర్ అధికారులు కిరణ్కుమార్, ఆదిత్య, బీట్ ఆఫీసర్లు, పోలీసులు పాల్గొన్నారు. -
‘కల్యాణ లక్ష్మి’ ఎత్తివేతకు కాంగ్రెస్ కుట్ర
కోదాడ : పేదింటి ఆడబిడ్డల కోసం మాజీ సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన కల్యాణ లక్ష్మి, షాదీముబారాక్ పథకాన్ని ఎత్తివేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ఆరోపించారు. కల్యాణ లక్ష్మి పథకంపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ సోమవారం కోదాడ బస్టాండ్ సెంటర్లోని గాంధీ విగ్రహం వద్ద బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఈ పథకాలకు ఇస్తున్న లక్ష రూపాయలకు అదనంగా తులం బంగారం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు నేడు ఆ పథకాలను లేకుండా చేయాలనుకుంటున్నారన్నారు. దీనివల్ల పేద ఆడబిడ్డల వివాహం చేసిన తల్లిదండ్రులకు గత ప్రభుత్వం అందించిన ఆర్థిక చేయూత అందకుండా పోనుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ పథకానికి నిధులను విడుదల చేసి అర్హులైన పేదలను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఎస్కె.నయీం, కౌన్సిలర్ చీమ నరేష్, తుమ్మలపల్లి భాస్కర్, అజంతా, చింతా కవిత, భూపాల్రెడ్డి, జానకిరామాచారి, దొంగరి లక్ష్మీనారాయణ, తాళ్లూరి శ్రీనివాస్, పద్మ, విజయలక్ష్మి, పోట్ట విజయ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.ప్రభుత్వ నిర్లక్ష్యం తగదుభానుపురి (సూర్యాపేట) : కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోంస్తుందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. పెండింగ్లో ఉన్న కల్యాణ లక్ష్మి నిధులు విడుదల చేయాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్లో మహిళలతో కలిసి కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్కు వినతిపత్రం అందించి మాట్లాడారు. పథకానికి సంబంధించిన న్యాయపరమైన అంశాలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి, అర్హులైన లబ్ధిదారులకు నిధులు అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ -
శివయ్యకు పుష్పార్చన
మేళ్లచెరువు : మండల కేంద్రంలోని శ్రీఇష్టకామేశ్వరీ సమేత శ్రీస్వయంభు శంభులింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివలింగాన్ని పుష్పాలతో అలంకరించి గంధంతో పూజించారు. స్వామివారికి గణపతిపూజ, పుణ్యాహవచనం, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సహస్రనామార్చన, మహాలింగార్చన, అనంతరం గోపూజ నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ శంభిరెడ్డి అర్చకులు విష్ణువర్ధన్శర్మ, ధనుంజయశర్మ పాల్గొన్నారు. బాధితులకు అండగా ఉంటాం : ఎస్పీ సూర్యాపేటటౌన్ : బాధితులకు అండగా ఉంటూ వారికి న్యాయం జరిగేలా చూస్తామని ఎస్పీ నరసింహ అన్నారు. సూర్యాపేటలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఎస్పీ నరసింహ ఫిర్యాదుదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతిఒక్క బాధితుడి సమస్యను విని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకునేలా సంబంధిత పోలీస్ అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు. చిన్నారులకు సకాలంలో టీకాలు వేయాలిఅర్వపల్లి : చిన్న పిల్లలకు సకాలంలో టీకాలను వేయాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ కోటిరత్నం వైద్య సిబ్బందికి సూచించారు. అర్వపల్లి పీహెచ్సీని సోమవారం ఆమె సందర్శించి రికార్డులు పరిశీలించారు. చిన్నారుల టీకాల కార్యక్రమంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సకాలంలో టీకాలు వేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. టీకాలు ఇవ్వడం వల్ల వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి వ్యాధుల బారిన పడకుండా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ బి.నగేష్నాయక్, వీసీసీఎం లతీఫ్, సూపర్వైజర్ లలిత, నర్సింగ్ ఆఫీర్ మాధవి, ఫార్మసిస్టు అనూష, హెల్త్ అసిస్టెంట్లు సైదమ్మ, దుర్గమ్మ, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజావాణి పక్కాగా నిర్వహించాలి చివ్వెంల(సూర్యాపేట) : మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా పరిషత్ సీఈఓ శిరీష అన్నారు. సోమవారం చివ్వెంల మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని ఆమె తనిఖీ చేసి మాట్లాడారు. గ్రామాల ప్రజలు తమ సమస్యలను ప్రతి సోమవారం ప్రజావాణిలో అధికారులకు విన్నవించుకోవాలన్నారు. మొదటి రోజు 5 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ జి.చంద్రశేఖర్, ఎంపీడీఓ సంతోష్ కుమార్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
‘సర్’ ముసాయిదా జాబితా ప్రకటించిన జిల్లా ఎన్నికల అధికారి
భానుపురి (సూర్యాపేట) : జిల్లా ఓటరు ముసాయిదా జాబితా విడుదలైంది. దాదాపు 9,11,945 మంది ఓటర్లు ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ప్రకటించారు. ఇందులో పురుషులు 4,47,090 మంది, మహిళలు 4,64,806 మంది ఉన్నారు. మరో 49 మంది ఇతరులకు ఈ జాబితాలో చోటు దక్కింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లాలో చేపట్టిన సర్ (స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్) కారణంగా 96,307 ఓట్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించినట్లయింది. ఈ ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం పోర్టల్తో పాటు జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం, ఈఆర్వో, ఏఈఆర్వో కార్యాలయాలు, సంబంధిత పోలింగ్ సెంటర్లలోనూ అందుబాటులో ఉంచారు. ఈ ఓటర్ జాబితాలో అర్హులైన ఓటర్ల పేరు లేకుంటే అభ్యంతరాలు స్వీకరించి విచారణ అనంతరం చోటు కల్పించనున్నారు. ఇందుకు నెల రోజుల గడువు ఉండగా.. తుది జాబితాను అక్టోబర్ 19న ప్రచురించనున్నారు. సర్కు ముందు.. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ప్రక్రియకు ముందు జిల్లాలో 10,08,252 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో హుజూర్నగర్ నియోజకవర్గంలో 2,49,904 మంది, కోదాడలో 2,48,175 మంది, సూర్యాపేటలో 2,46,432 మంది, తుంగతుర్తి నియోజకవర్గంలో 2,63,741 మంది చొప్పున ఓటర్లు నమోదయ్యారు. వీరందరికీ ఎన్యూమరేషన్ ఫారాలు అందించారు. 9,11,945 ఎన్యూమరేషన్ ఫారాలు డిజిటలైజ్ అయ్యాయి. మిగతా వాటిలో 26,059 మంది మృతిచెందిన ఓటర్లు, 48,310 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిన ఓటర్లు, 13,016 మంది డబుల్ ఓటర్లు, 6,862 మంది గైర్హాజరు కాగా, ఇతర కారణాలతో మరో 2,060 మంది ఎన్యూమరేషన్ ఫారాలతో మొత్తం 96,307 మంది ఓటర్ల ఫారాలు తొలగింపు జాబితాలో చేర్చారు. అర్హుల ఓట్లు పోకుండా..ఎన్యూమరేషన్ దశలో నిర్ణీత గడువులో ఫారం సమర్పించలేకపోయిన అర్హులైన ఓటర్ల ఓటు పోకుండా, ఐదైనా పొరపాట్లతో ఫారాలు నింపిన తుది ఓటరు జాబితాలో ఓటు హక్కు కల్పించేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. ఇందుకోసం తప్పుగా ఫారాలు నింపడం, ఫారం సమర్పించని వారికి నోటీసులు అందించనున్నారు. అలాగే అన్ని అర్హతలు ఉండి జాబితాలో పేరు లేకున్నా ఓటర్లు అప్పీల్ చేసుకునే వెసులు బాటు ఉంది. ముసాయిదా జాబితా ప్రకటించిన నాటినుంచి నెల రోజుల పాటు సెప్టెంబర్ 16వ తేదీ వరకు వీటిని స్వీకరించనున్నారు. ఫారం–6 ద్వారా కొత్త ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించగా.. 6ఏతో విదేశాల్లో నివసిస్తున్న భారతీయ ఓటర్ల నమోదు, ఫారం–7 ద్వారా ప్రతిపాదిత చేర్పుపై అభ్యంతరాలు, పేర్లు తొలగింపునకు దరఖాస్తు, ఫారం–8 ద్వారా నివాస మార్పు, ఓటరు వివరాల సవరణకు దరఖాస్తు చేసుకునే వీలును కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. నోటీసులు, క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ పరిష్కారానికి అక్టోబర్ 15వరకు గడువు విధించారు. పారదర్శకమైన జాబితానే లక్ష్యంఅర్హులైన ప్రతి పౌరుడు తమ పేరు ముసాయిదా ఓటరు జాబితాలో ఉందో లేదో పరిశీలించుకోవాలి. పేరు లేకపోతే వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే నిర్ణీత గడువులో సంబంధిత ఫారాల ద్వారా క్లెయిమ్, ఆబ్జెక్షన్ దాఖలు చేయాలి. అర్హుత కలిగిన ప్రతి ఒక్క ఓటరు జాబితా నుంచి మిగిలిపోకుండా పారదర్శకమైన జాబితా రూపకల్పనకు కృషి చేస్తున్నాం. ఇందుకు రాజకీయ పార్టీలే కాకుండా ఓటర్లంతా సహకరించాలి. – తేజస్ నంద్లాల్ పవార్, జిల్లా కలెక్టర్ మొత్తం ఓటర్లు 9,11,945 మంది అభ్యంతరాలకు నెలరోజుల గడువు అక్టోబర్ 19న తుది ఓటరు జాబితానియోజకవర్గాల వారీగా ఓటర్లు నియోజకవర్గం పోలింగ్కేంద్రాలు పురుషులు మహిళలు ఇతరులు మొత్తంహుజూర్నగర్ 311 1,10,766 1,16,618 14 2,27,398 కోదాడ 296 1,08,036 1,13,829 14 2,21,879 సూర్యాపేట 278 1,07,563 1,12,757 15 2,20,335 తుంగతుర్తి 327 1,20,725 1,21,602 06 2,42,333 మొత్తం 1,212 4,47,090 4,64,806 49 9,11,945 -
సీనియర్లకు తగిన గుర్తింపు లేదు
సాక్షి, యాదాద్రి : ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీల(పీఏసీ) సమావేశాలు సోమవారం భువనగిరిలో జరిగాయి. ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలో సర్పై అప్రమత్తంగా ఉండడం, పార్టీ సంస్థాగత బలోపేతం, రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. మూడు జిల్లాల వారీగా సమావేశాలు జరిగాయి. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్తో పాటు మూడు జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బీర్ల ఐలయ్య, గుడిపాటి నర్సయ్య, పున్న కై లాష్, ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు, మాజీ డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. సీనియర్లకేదీ ప్రాధాన్యత పీఏసీ సమావేశంలో పలువురు నాయకులు తమ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు మీనాక్షి నటరాజన్కు వివరించారు. ఇక్కడి సీనియర్ నాయకులకు, సుదీర్ఘకాలం సేవలందించిన వారికి ప్రభుత్వంలో, నామినేటెడ్ పోస్టులలోనూ తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావస్తున్నా పదవులు ఇంకా భర్తీ చేయడం లేదని ఆమె దృష్టికి తీసుకువచ్చారు. నామినేటేడ్ పదవుల కోసం జిల్లాల నుంచి ఇప్పటికే జాబితాలను అధిష్టానానికి పంపించామని, వారికి అవకాశం ఇవ్వాలని మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కోరారు. మున్సిపల్ పాలకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు కొన్ని మున్సిపాలిటీల పాలకవర్గాల్లో చైర్మన్లకు, కౌన్సిలర్లకు మధ్య సహకారం కొరవడిందనే అంశం సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. మోత్కూరుతో పాటు పలు ప్రాంతాల్లో కౌన్సిలర్లు చైర్మన్ తీరుపై అసంతృప్తిగా ఉన్నారని అధిష్టానం దృష్టికి తీసుకుపోయారు. నియోజకవర్గంలో నిర్వహించిన వివిధ కార్యక్రమాల పురోగతిని, ప్రజల నుంచి వస్తున్న స్పందనను సమీక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో స్థానిక ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమని స్పష్టం చేశారు. పనిచేయకుంటే తప్పించాలి..ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయికి చేరాలని, ప్రజాభిప్రాయం తీసుకోవడంలో లోపాలు ఉన్నాయని, సోషల్ మీడియా టీమ్లను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సమావేశంలో చర్చకు వచ్చింది. పార్టీ పదవుల్లో ఉంటూ పనిచేయని వారి స్థానంలో కొత్తవారిని నియమించాలని కూడా పలువురు అధిష్టానం దృష్టికి తెచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం మంచిదే అయినప్పటికీ, కండక్టర్లు, డ్రైవర్లు మహిళా ప్రయాణికులతో ప్రవర్తిస్తున్న తీరు ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా ఉందని కొందరు నాయకులు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న అల్పాహారం (టిఫిన్) వంటి కార్యక్రమాలు ప్రజలకు ఇంకా సరిగ్గా చేరలేదని, దీనిపై విస్త్రత ప్రచారం సాగాలన్నారు.నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం కల్పించాలి మున్సిపాలిటీల్లో వర్గపోరుతో తలనొప్పులు సమావేశంలో నాయకుల చర్చ పార్టీ బలోపేతంపై దృష్టిసారించాలన్న మీనాక్షి నటరాజన్ బీజేపీతో మరింత జాగ్రత్త అవసరమని సూచన భువనగిరిలో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పీఏసీల సమావేశంపార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి మీనాక్షి నటరాజన్రాష్ట్రంలో ప్రతిపక్షాల వ్యూహాలను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ శ్రేణులంతా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీకి, ప్రజాప్రతినిధులకు మధ్య మెరుగైన సమన్వయం ఉండాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీకి ఆయువుపట్టుగా ఉన్న దక్షిణ తెలంగాణాలోని నల్లగొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలపై బీజేపీ పార్టీ దృష్టిసారించిందని, దీనిపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశాల్లో అభిప్రాయాలపై సానుకూలంగా స్పందించిన నేతలు, ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుంటామని, పార్టీ కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికీ తగిన న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. సర్ రెండవ విడతలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటర్లుగా ఎన్రోల్ చేయించే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. -
బుద్ధవనంలో వియత్నాం బుద్ధ విగ్రహం
ఫ ఏర్పాటుకు స్థల పరిశీలన నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్లోని బుద్ధవనంలో వియత్నాం దేశానికి చెందిన అమితాబ బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఆ దేశ ప్రతినిధులు శనివారం స్థల పరిశీలన చేశారు. బుద్ధవనంలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న అనంతరం వియత్నాం దేశ ప్రతినిధులు, ఇంజనీర్లు, బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లెపల్లి లక్ష్మయ్యతో కలిసి సుమారు 45 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు గాను అనువైన స్థలాన్ని పరిశీలించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న డిజిటల్ మ్యూజియం సమీపంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు వారు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు మల్లెపల్లి లక్ష్మయ్య తెలిపారు. విగ్రహ ఏర్పాటుకు సంబంధించి బుద్ధవనం ప్రాజెక్టు తరఫున ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నామని, ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే విగ్రహ ఏర్పాటుకు చర్యలు చేపడుతామని ఆయన పేర్కొన్నారు. అనంతరం వియత్నాం దేశ ప్రతినిధులు నాగార్జునకొండ మ్యూజియాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమయంలో బుద్ధవనం డీఈ శ్రీనివాస్రెడ్డి, ఏఈ నజీష్, ఆర్ఆండ్బీ డీఈ సతీష్, ఏఈ ప్రదీప్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ ఆఫీసర్ రవిచంద్ర, బుద్ధవనం ఆర్ట్స్ అండ్ ప్రమోషన్స్ మేనేజర్ శ్యాంసుందర్రావు, టూరిజం గైడ్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
విషాదం నింపిన విహారయాత్ర
ఫ వైజాగ్ కాలనీలో సాగర్ వెనుక జలాల్లో మునిగి యువకుడి మృతి చందంపేట : స్నేహితులతో కలిసి నేరెడుగొమ్ము మండలంలోని వైజాగ్ కాలనీకి వచ్చిన యువకుడు సాగర్ వెనుక జలాల్లో మునిగి మృతిచెందాడు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లి మండలం కొప్పోలు గ్రామానికి చెందిన ఆరుగురు స్నేహితులు కలిసి విహారయాత్ర నిమిత్తం నేరెడుగొమ్ము మండలం వైజాగ్ కాలనీకి శుక్రవారం వచ్చారు. రాత్రి అక్కడే బస చేశారు. శనివారం మధ్యాహ్నం సమయంలో స్నేహితులంతా కలిసి ఈత కొట్టేందుకు సాగర్ వెనుక జలాల్లోకి వెళ్లారు. ఈ క్రమంలో దుర్గం మల్లేష్(25) అనే వ్యక్తి నీట మునిగిపోయాడు. సమాచారం తెలుసుక్ను ఘటనా స్థలానికి చేరుకుని మల్లేష్ మృతదేహాన్ని వెలికితీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగేంద్రబాబు తెలిపారు. కారు ఢీకొని బాలుడు మృతి మోతె : రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన మోతె మండలం రాఘవాపురం ఎక్స్ రోడ్డు వద్ద శనివారం జరిగింది. రాఘవాపురం గ్రామానికి చెందిన బయ్య సైదులు కుమారుడు మహేష్(14) శనివారం రాఘవాపురం ఎక్స్ రోడ్డు వద్ద గల పీఎన్ఆర్ ఫంక్షన్హాల్లో జరిగిన ఫంక్షన్ హాజరయ్యాడు. ఈ క్రమంలో ఫంక్షన్హాల్ నుంచి బయటకు వచ్చి రోడ్డు దాటుతుండగా.. సూర్యాపేట వైపు నుంచి ఖమ్మం వైపు వేగంగా వెళ్తున్న కారు అతడిని ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. కారు ఆచూకీ కనిపెట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
ఊరు చేరేలోపే ఆగిన ఊపిరి
ఆలేరురూరల్ : కుటుంబ సభ్యుల మధ్యన పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు బైక్పై స్వగ్రామానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. మరో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై ఆలేరు బైపాస్లో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మద్దూంపూర్ గ్రామానికి చెందిన చీకటి ప్రదీప్ (26), అదే గ్రామానికి చెందిన చిలుకూరి కళాంజలి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. శనివారం స్వగ్రామంలో బోనాల పండుగతో పాటు ప్రదీప్ పుట్టినరోజు కావడంతో కుటుంబ సభ్యుల మధ్య వేడుకలు జరుపుకునేందుకు గాను శుక్రవారం సాయంత్రం అతడు బైక్పై హైదరాబాద్ నుంచి బయల్దేరాడు. కళాంజలిది కూడా అదే గ్రామం కావడంతో ప్రదీప్తో పాటు బైక్పై బయల్దేరింది. మార్గమధ్యలో ఆలేరు సమీపంలోకి రాగానే హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై బహద్దూర్పేట ఫ్లైఓవర్ దాటగానే వెనుక నుంచి వస్తున్న అశోక్ లేలాండ్ వాహనం బైక్ను ఢీకొట్టింది. దీంతో ప్రదీప్, కళాంజలి రోడ్డుపై పడిపోయారు. ప్రదీప్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. కళాంజలి కుడి కాలుకు గాయాలయ్యాయి. ఆమెను హన్మకొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి ప్రభాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వినయ్ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం ప్రదీప్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఫ హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం ఫ మరో యువతికి తీవ్ర గాయాలు -
గుట్టుగా యూరియా అమ్మకాలు
ఫ కోదాడ కేంద్రంగా బ్లాక్ దందా ఫ పట్టణ శివారులోని గోదాములో నిల్వచేసిన వ్యాపారులు కోదాడ శివారు తమ్మర వద్ద ఉన్న సబ్బుల గోదాములో అక్రమంగా యూరియా నిల్వచేసి బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని రైతులు ఫిర్యాదు చేయడంతో అక్కడికి వెళ్లిన కోదాడ ఏడీఏ, ఏఓలు సదరు గోదాములో ఎంత నిల్వలు ఉన్నాయి.. అవి ఎవరివి.. రెండు దుకాణాలకు ఒకే గోదాము ఎందుకు ఉన్నది.. యూరియా హోల్సేల్ డీలర్ గోదాములో ఇతర ఎరువులు ఎలా ఉన్నాయి.. అన్న విషయాలపై విచారణ చేయలేదు. దీనిపై వివరణ కోరడంతో వెంటనే వ్యాపారిని పిలిపించి కొంత డబ్బు వసూలు చేసి నోటీసు ఇస్తున్నట్లు ఫొటో దిగి ఉన్నతాధికారులకు పంపారు. కానీ, గోదామును మాత్రం సీజ్ చేయలేదు. దీంతో వ్యాపారి రాత్రికి రాత్రే సరుకును తరలించాడని రైతులు ఆరోపిస్తున్నారు.ఇది కోదాడ పట్టణ శివారులోని ఓ సబ్బుల కంపెనీకి చెందిన గోదాము. దీంట్లో కొంతకాలంగా కొందరు వ్యాపారులు భారీగా యూరియాను నిల్వచేసి రాత్రి సమయాల్లో ఖమ్మం, ఇతర జిల్లాల వారికి అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. రెండు రోజుల క్రితం యూరియాను తరలిస్తుండగా రైతులు పట్టుకుని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇది గమనించిన వ్యాపారులు వెంటనే రంగంలోకి దిగి అధికారులకు రూ.లక్షల్లో ముట్టజెప్పారు. ఇంకేముంది అక్కడ ఏమి జరగలేదని. వారికి నోటీసులు ఇచ్చామని అధికారులు చెప్పుకొచ్చారు. ఇంకా విచిత్రమేమిటంటే అప్పటి వరకు అది ఎరువుల గోదామని ఎవరికి తెలియదు. విషయం బయటకు పొక్కిన తరువాత గోదాముకు రెండు దుకాణాల బ్యానర్లు కట్టారు.కోదాడ : యాప్ ద్వారానే యూరియా కొనుగోలు చేయాలని ఉన్నతాధికారులు చెబుతున్నా.. వ్యాపారుల మాత్రం వందల బస్తాల యూరియాను అక్రమంగా నిల్వచేసి బ్లాక్ మార్కెట్కు తరలించి అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. నిత్యం పర్యవేక్షించాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు మామూళ్ల మత్తులో వ్యాపారులకే కొమ్ముకాస్తూ రూ.లక్షలు దండుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్క యూరియా బస్తాకోసం అన్నదాతలు పడరాని పాట్లు పడుతుండగా వ్యాపారులు వందల బస్తాలను ఇతర జిల్లాలకు ఎలా తరలిస్తున్నారో అర్థంకాని పరిస్ధితి. రెండు రోజుల క్రితం కోదాడలో బయట పడిన యూరియా బ్లాక్ మార్కెట్ దందాలో అధికారులు పొంతనలేని సమాధానాలు ఇవ్వడం, ఉన్నతాధికారులు కూడా ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఇంత జరిగినా సీజ్ చేయని గోదాము తమ్మర వద్ద యూరియా నిల్వ చేయడానికి సదరు వ్యాపారులకు అనుమతి ఉందా.. అక్కడ అంత భారీగా యూరియా నిల్వ చేయడానికి నడిగూడెం మండల కేంద్రానికి చెందిన ఓ హోల్సేల్ వ్యాపారికి ఎవరు అనుమతి ఇచ్చారు. అక్కడ యూరియాతో పాటు ఇతర ఎరువులు ఎందుకు ఉన్నాయని వాటిపై అధికారులు సమాధానం ఇవ్వడం లేదు. అక్రమాలు జరిగాయని రైతులు ఫిర్యాదు చేస్తే వెంటనే సదరు గోదామును సీజ్ చేయాల్సిన అధికారులు.. స్టాఫ్ సేల్స్.. నోటీసు ఇచ్చామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని రైతులు అంటున్నారు. అప్పటి వరకు గోదాములో ఏమి నిల్వ చేశారో రహస్యంగా ఉంచిన వ్యాపారులు రైతుల ఫిర్యాదు అనంతరం ఒకే గోదాముకు రెండు దుకాణాల బోర్డులు ఏర్పాటు చేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి నిజాలను వెలికి తీయాలని రైతులు కోరుతున్నారు. ఫ ఖమ్మం, ఇతర జిల్లాలకు తరలిస్తుండగా పట్టుకున్న రైతులు ఫ కనీస చర్యలు తీసుకోని వ్యవసాయ శాఖ ఫ మిగిలిన నిల్వలు రాత్రికి రాత్రే తరలింపు ఫ నోటీసులు ఇచ్చామని చెబుతున్న అధికారులు -
యాదగిరి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు శనివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సెలవు రోజు కావడంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు భక్తులతో నిండుగా కనిపించాయి. స్వామివారి ధర్మ దర్శనానికి రెండున్నర గంటల సమయం పట్టగా.. వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. స్వామివారిని 40వేలకు పైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ పూజలతో స్వామికి నిత్యాదాయం రూ.34,39,385 వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. -
ఆర్థిక సమస్యలతో బలవన్మరణం
శాలిగౌరారం : ఆర్థిక సమస్యలతో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శాలిగౌరారం మండలం అంబారిపేట గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. శనివారం ఎస్ఐ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. అంబారిపేట గ్రామానికి చెందిన బీరం నర్సిరెడ్డి(54) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పంట పెట్టుబడి కోసం అప్పులు చేశాడు. చేసిన అప్పు తీర్చేందుకు గాను తనకున్న రెండెకరాల వ్యవసాయ భూమిని విక్రయించినప్పటికీ అప్పులు పూర్తిస్థాయిలో తీరలేదు. దీనికి తోడు కొంతకాలంగా భుజానికి సంబంధించిన సమస్యతో బాధపడుతున్నాడు. అటు ఆర్థిక ఇబ్బందులు, ఇటు అనారోగ్య సమస్యతో మానసికంగా కుంగిపోయిన నర్సిరెడ్డి శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి కుమారుడు ఉపేందర్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నకిరేకల్ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
వివాహిత దారుణ హత్య
చౌటుప్పల్ : తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తోందన్న కక్షతో ఓ వివాహితను ఆమె ప్రియుడు దారుణంగా హత్య చేశాడు. ఆధారాలు దొరకకుండా మృతదేహానికి నిప్పంటించి పరారయ్యాడు. దారుణం జరిగిన 20 రోజుల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. చౌటుప్పల్ సీఐ జి. మన్మథకుమార్ శనివారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. చౌటుప్పల్ మండలం పెద్దకొండూరు గ్రామానికి చెందిన షేక్ సలీమా(37) భర్త చనిపోయాడు. ఆమెకు వివాహమైన ఒక కుమార్తె ఉంది. బండరాళ్లు కొట్టే పని చేసుకుంటూ సలీమా జీవనం సాగిస్తోంది. కుల వృత్తిలో భాగంగా ఆమె ఏడాది క్రితం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం క్యాతంపల్లి గ్రామానికి చెందిన సయ్యద్ బషీర్ వద్దకు పనికి వెళ్లింది. ఆ సమయంలో వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి, అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని బషీర్ను సలీమా ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది. అయితే అప్పటికే బషీర్కు వివాహమై భార్య, పిల్లలు ఉండటంతో సలీమాను పెళ్లి చేసుకునేందుకు అతడు నిరాకరించాడు. పథకం ప్రకారమే హత్య.. సలీమా తీరుతో విసిగిపోయిన బషీర్.. ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు. ఈ మేరకు గత నెల 25న ఉదయం సలీమాకు ఫోన్ చేసి భువనగిరి వస్తే తాను బైక్పై వచ్చి తీసుకెళ్తానని నమ్మబలికాడు. బషీర్ మాటలు నమ్మిన సలీమా.. పెద్దకొండూరు వద్ద బస్సు ఎక్కి భువనగిరి ఆర్టీసీ బస్స్టేషన్కు చేరుకుంది. అక్కడికి వచ్చిన బషీర్ ఆమెను బైక్పై ఎక్కించుకొని తుర్కపల్లి మండలం వెంకటాపురం రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ సలీమా మళ్లీ పెళ్లి ప్రస్తావన తెచ్చింది. తాను పెళ్లి చేసుకోనని బషీర్ తెగేసి చెప్పడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కోపంతో రగిలిపోయిన బషీర్ పక్కనే ఉన్న కర్రతో సలీమా తలపై బలంగా కొట్టి హత్య చేశాడు. అనంతరం అక్కడే ఉన్న కర్రలను సలీమా మృతదేహంపై వేసి నిప్పంటించి వెళ్లిపోయాడు. తల్లి ఫిర్యాదుతో కదిలిన డొంక.. తన కుమార్తె కనిపించడం లేదంటూ మృతురాలి తల్లి సైదాభి అదే రోజున చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక, ఇతర ఆధారాల సాయంతో సయ్యద్ బషీర్ను అనుమానితుడిగా గుర్తించి శనివారం అతడి స్వగ్రామం క్యాతంపల్లిలో అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు జరిగిన విషయాన్ని చెప్పి చేసిన నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిని అరెస్ట్ చేసి నల్లగొండ జైలుకు రిమాండ్కు తరలించినట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. ఫ తలపై కర్రతో బాది చంపి, దహనం చేసిన ప్రియుడు ఫ 20 రోజుల తర్వాత వెలుగులోకి వచ్చిన ఘటన -
స్వగ్రామంలోనే ఓటుకు మొగ్గు
సూర్యాపేట : ఇన్నాళ్లు రాజకీయ అవసరాల కోసం పట్టణాలు, సొంతూర్లలో ఓటు కలిగిన వారంతా ఇప్పుడు స్వగ్రామంలోనే ఓటు హక్కు ఉంచుకునేలా చూసుకుంటున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా డబుల్ ఓట్లను వదులుకోవాల్సిందేనని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇందులో వలస వెళ్లిన ప్రాంతాలు, పట్టణంలో ఓటర్లు తమ ఓటును తొలగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలోని సూర్యాపేట, కోదాడ వంటి మున్సిపాలిటీల్లో ఓటర్లు తగ్గుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 13,016 మంది ఓటర్లకు రెండు చోట్ల ఓట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 96,307 ఓట్లు తొలగింపే.. జిల్లాలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్లో భాగంగా దాదాపు 96,307 ఓట్లు తొలగింపునకు గురి కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో అత్యధికంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్లే 48,310 మంది ఉన్నారు. తర్వాత మృతిచెందిన ఓటర్లు 26,059 మంది, డబుల్ ఓట్లు కలిగిన వారు మరో 13,016 మంది ఉన్నారు. ఇంతకాలం స్వగ్రామంతోపాటు సమీప పట్టణాలైన సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, తిరుమలగిరి వంటి మున్సిపాలిటీల్లోనూ ఈ డబుల్ ఓట్లు కలిగి ఉన్నారు. రాజకీయపరంగా వచ్చే అవకాశాల కోసం వీరంతా వీటిని కొనసాగిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఏదో ఒకదాన్ని మాత్రమే ఎంచుకోవాల్సి రావడంతో ఈ డబుల్ ఓటర్లంతా ఆస్తులు, వ్యవసాయ భూములు ఉన్న స్వగ్రామాలనే ఎంపిక చేసుకుంటున్నారు. వలస ఓటర్లు ఏటో..! జిల్లాలో తొలగింపునకు గురయ్యే ఓటర్లలో వలసలకు వెళ్లిన వారే 50 శాతం మేర ఉన్నారు. అయితే ఈ వలస ఓటర్లు జిల్లాలోని సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల పరిధిలో సమానంగానే ఉన్నారు. ఈ నేపధ్యంలో ముసాయిదా జాబితా వస్తే గానీ ఈ వలస ఓటర్ల జాబితాలో ఉన్నవారు అధికంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారా..? లేదంటే పట్టణ ప్రాంతాల్లో ఉన్నారో తేలాల్సి ఉంది. ఉపాధి నిమిత్తం 20 ఏళ్లకు పైబడి పట్టణ ప్రాంతాలకు వచ్చిన వారంతా శాశ్వతంగా ఇక్కడే ఉంటున్నా.. వారికి సంబంధించి ఓట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నాయి. ఈ సర్ ప్రక్రియలో వీరంతా పట్టణ ప్రాంతాల్లోనే ఓటు హక్కును పొందేలా.. వలస ఓటర్లుగా మారారా..? అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ తమకు లోకల్గానే ఓటు హక్కు ఉండాలని ఓటర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఫ పట్టణ ప్రాంతాల్లో ఓటు హక్కును వదులుకుంటున్న ఎస్ఐఆర్లు ఫ డబుల్ ఓట్లుంటే ఒక్కచోటే ఉంచుకోవాలన్న ఎన్నికల సంఘం ఫ జిల్లాలో 96,307 ఓట్లు తొలగించే అవకాశం -
ప్రతిఒక్కరూ రాజ్యాంగ హక్కులు పొందాలి
చివ్వెంల (సూర్యాపేట) : ప్రతిఒక్కరూ రాజ్యాంగ హక్కులు పొందడంతో పాటు, బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని విధులు నిర్వహించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీ శారద సూచించారు. శనివారం సూర్యాపేట జిల్లా కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి పూర్వ రవళి, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మంచాల మమత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నూకల సుదర్శన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి తల్లమల హస్సేన్ పాల్గొన్నారు. కాంట్రాక్టు కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి మేళ్లచెరువు : అన్యాయంగా తొలగించిన తమ ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని పులిచింతల ప్రాజెక్టు జలవిద్యుత్ కేంద్రంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు చింతలపాలెం మండలం పులిచింతల ప్రాజెక్టు వద్ద గల జెన్కో గేటు ఎదుట కార్మికులు చేపట్టిన నిరాహార దీక్ష మూడవ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా పలువురు కార్మికులు మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణ సమయం నుంచి కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్నామని, మరి కొందరు నిర్మాణ సమయంలో జరిగిన ప్రమాదాల్లో ప్రాణాలు పోగొ ట్టుకున్న కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వకుండా కాంట్రాక్టు ఉద్యోగాలు చేస్తుండగానే సమాచారం లేకుండానే తొలగించాని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ కేంద్రం నిర్మాణానికి తాము భూములిస్తే కాంట్రాక్టు ఉద్యోగాలు ఇచ్చి తొలగించడం సరికాదని వజినేపల్లి గ్రామానికి చెందిన పలువురు వాపోయారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలిచివ్వెంల (సూర్యాపేట) : విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా కోర్టు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి అపూర్వ రవళి, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మంచాల మమత అన్నారు. స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం సూర్యాపేట పట్టణంలోని వివిధ పాఠశాలల్లో నిర్వహించిన న్యాయప్రాప్తి– ఉచిత న్యాయ సహాయంపై విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సమావేశంలో మాట్లాడారు. కార్యక్రమంలో డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. -
కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం
మేళ్లచెరువు : కార్మికుల న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలని, వారికి న్యాయం చేసే వరకు పోరాటం ఆగబోదని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం పులిచింతల జెన్కో విద్యుత్ కేంద్రం వద్ద నిరాహర దీక్ష చేస్తున్న కార్మికులకు మద్దతు తెలిపి మాట్లాడారు. 16 సంవత్సరాలుగా జెన్కోలో పనిచేస్తున్న కార్మికులను తొలగించడం సరికాదన్నారు. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవడంతో పాటు ఆర్టీజన్లుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కార్మికులు నాలుగు రోజులుగా నిరాహరదీక్ష చేస్తున్నా పట్టించుకోక పోవడం సరికాదని, వెంటనే యాజమాన్యం స్పందించి వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు ఎస్ఈని కలిసి కార్మికుల సమస్యను పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కోటగిరి వెంకటనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు శీలం శ్రీను, సోమయ్య గౌడ్, వట్టెపు సైదులు తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి మండలాల్లో ప్రజావాణి
హుజూర్నగర్ , తిరుమలగిరి (తుంగతుర్తి) : ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు ఉద్దేశించిన ప్రజావాణి కార్యక్రమం ఇప్పటి వరకు కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల్లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు మండల కేంద్రాల్లో కూడా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడానికి, ప్రజలు తమ సమస్యలను విన్నవించేందుకు జిల్లా కేంద్రానికి, ఆర్డీఓ కార్యాలయాలకు వచ్చేందుకు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు వీలుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతి సోమవారం మండల పరిషత్ కార్యాలయాల్లో అధికారులు అందుబాటులో ఉండి ప్రజల నుంచి వినతులు స్వీకరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 17 నుంచి జిల్లాలోని 23 మండల కేంద్రాల్లో ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం కానున్నది. కార్యక్రమానికి ఎంపీడీఓలు నోడల్ అధికారులుగా వ్యవహరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజా వాణి పోర్టల్కు అనుసంధానం చేయనున్నారు. నోడల్ అధికారులుగా ఎంపీడీఓలుప్రతి సోమవారం మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ఎంపీడీఓలు నోడల్ అధికారులుగా వ్యవహరించ నున్నారు. మండలస్థాయి అధికారులు అందుబాటులో ఉండి ప్రతి వారం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. మండల స్థాయిలో ఆయా శాఖలకు వచ్చే ఫిర్యాదులను ప్రజావాణి పోర్టల్కు అనుసంధానం చేయనున్నారు. ఫిర్యాదు దారునికి గ్రీవెన్స్ ఐడీతో కూడిన రసీదు అందిస్తారు. వారి సమస్యలను సంభందిత అధికారుల ద్వారా పరిష్కారం చేసి వాటి వివరాలను ఫిర్యాదు దారుడికి వెల్లడిస్తారు. మండల పరిషత్కు కొత్త రూపు మండల కేంద్రాలల్లోని మండల ప్రజాపరిషత్ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందున వాటికి కొత్త రూపు తీసుకు రానున్నారు. ప్రజావాణిలో ఎంపీడీఓ, తహసీల్దార్, పంచాయతీ అధికారి, వ్యవసాయ, ఉద్యానవన, పశు సంర్ధక, మత్స్య, విద్య, వైద్యాధికారితోపాటు ఐసీడీఎస్, గృహ నిర్మాణ, మిషన్ భగీరథ, సీటిపారుదల, ఆర్అండ్బీ, మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులు పాల్గొననున్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులలో మండలస్థాయిలోని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించనున్నారు. అంతకు మించిన సమస్యలను వర్గీకరించి డివిజన్, జిల్లాస్థాయి సమస్యలైతే ఉన్నతాధికారులకు పంపించనున్నారు. ప్రతి వినతి పత్రానికి నమోదు సంఖ్య ఇచ్చి, నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా తగిన చర్యలు చేపట్టనున్నారు.స్థానిక సమస్యలపై ఫిర్యాదులుధరణి, భూ రికార్డుల సమస్యలు, సర్వే వారసత్వ సమస్యలు, ఆదాయం, కులం, నివాస ధ్రువ పత్రాలు, రేషన్ కార్డులు, పింఛన్లు, రైతుల సమస్యలు, సాగు నీటి అంశాలు, తాగు నీరు, డ్రైనేజీ, రహదారులు, విద్యుత్, గ్రామాభివృద్ధి, సంక్షేమ పథకాల సమస్యలపై అధికారులకు వినతి పత్రాలు అందించవచ్చు. మండల పరిషత్ కార్యాలయాల్లో నిర్వహణ స్థానిక సమస్యలపై వినతుల స్వీకరణ ప్రజావాణి పోర్టల్కు అనుసంధానం -
ఆర్ఎంపీలు పరిధికి మించి వైద్యం చేయొద్దు
కోదాడరూరల్ : ఆర్ఎంపీలు తమ పరిధికి మించి వైద్యం చేయవద్దని జిల్లా ఆర్ఎంపీల సంఘం అధ్యక్షుడు దొంతగాని రవిబాబు సూచించారు. ఆదివారం పట్టణంలో నిర్వహించిన ఆర్ఎంపీ, పీఎంపీల అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. సీరియస్, అబార్షన్ కేసులను తీసుకోవద్దని, లింగ నిర్ధారణ పరీక్షలను ప్రోత్సహించవద్దన్నారు. పరిధికి మించి వైద్యం చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దన్నారు. కేసు సీరియస్గా అనిపించిన వెంటనే ఆయా విభాగాల్లో క్వాలిఫైడ్ వైద్యుల వద్దకు వెళ్లాలని సూచించాలన్నారు. కొత్తగా ఆర్ఎంపీలు వస్తున్న వారు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సూచనలు పాటించాలన్నారు. సమస్యల పరిష్కారానికి సంఘం సభ్యులు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆర్ఎంపీల సంఘం మండల అధ్యక్షుడు భూతం శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంఘం సభ్యులు వెంకటప్పయ్య, అంజిరెడ్డి, సిద్ధారెడ్డి, ఉపేందర్, శ్రీశైలం, ఖాజా, శౌరీ, నాగరాజు, లింగయ్య, శ్రీకాంత్, నాని, తదితరులు పాల్గొన్నారు. -
ఊర ముత్యాలమ్మకు బోనాలు
ఫ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న భక్తులు సూర్యాపేట టౌన్ : జిల్లా కేంద్రంలో ఆదివారం బోనాల సందడి నెలకొంది. సూర్యాపేట కృష్ణ టాకీస్ సమీపంలో ఉన్న ఊర ముత్యాలమ్మ దేవాలయంతో పాటు పలు ప్రాంతాల్లో బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు బోనాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల సందర్భంగా కృష్ణటాకీస్ సమీపంలో ఉన్న ఊర ముత్యాలమ్మ ఆలయ పరిసర ప్రాంతాల్లో భక్తుల సందడి నెలకొంది. జిల్లా కేంద్రంలోని వివిధ వార్డుల నుంచి మహిళలు, చిన్నారులు, యువత తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. బోనాల పండుగలో భాగంగా నిర్వహించిన శివసత్తుల ప్రదర్శన ఆకట్టుకుంది. డప్పు చప్పుళ్లు, భక్తుల నినాదాలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. -
లక్ష్మీనరసింహుని నిత్య కల్యాణం
మఠంపల్లి: మట్టపల్లిలోని రాజ్యలక్ష్మీ, చెంచులక్ష్మీ సమేత లక్ష్మీనరసింహుని ఆలయంలో ఆదివారం అర్చకులు వేదమంత్రాలతో స్వామివారి నిత్య కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అంతకు ముందు ఆలయంలో సుప్రభాతసేవ, ప్రత్యేక పూజలు, హోమశాలలో నిత్యఅగ్రిహోత్రి చేపట్టారు. గర్భాలయంలో స్వామివారి మూలవిరాట్కు పంచామృతాభిషేకం నిర్వహించారు. నిత్య కల్యాణం అనంతరం భక్తులకు మహానివేదనలతో తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ చలపతిరావు, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయా చార్యులు, సాయికుమారాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. సూర్యక్షేత్రంలో ప్రత్యేక పూజలుఅర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. అనంతరం యజ్ఞశాలలో మహాసౌరహోమాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితజనార్దన్స్వామి, గణపురం నరేష్, అర్చకుడు భీంపాండే పాల్గొన్నారు. గురుకులాల్లో పార్ట్ టైమ్ ఉద్యోగాలుసూర్యాపేటటౌన్ : జిల్లాలో ఉన్న గిరిజన గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో పార్ట్ టైమ్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశాల మేరకు నియామకాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లాలో డిగ్రీ లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్లు, పీజీటీ, టీజీటీ విభాగాల్లో మొత్తం 19 పోస్టులు ఉండగా అందులో డిగ్రీ లెక్చరర్లు 3 పోస్టులు, జూనియర్ లెక్చరర్లు 9, పీజీటీ 4, టీజీటీ 3 పోస్టులు ఉన్నట్లు తెలిపారు. అర్హులు ఈ నెల 22 సాయంత్రం 5 గంటల వరకు జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ సమన్వయాధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఫుట్బాల్ ట్రయల్స్కు ముగ్గురు క్రీడాకారులు నల్లగొండ టూటౌన్ : తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 17 నుంచి హైదరాబాద్లో నిర్వహించే రాష్ట్ర జట్టు సెలక్షన్ ట్రయల్స్కు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన జి.శివమణి, బి.దత్తు, ఎన్.చరణ్ తేజ్ లను పంపించామని ఉమ్మడి జిల్లా పుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు ఆదివారం తెలిపారు. జిల్లాలో ప్రతిభావంతమైన ఫుట్బాల్ క్రీడాకారులను గుర్తిస్తూ, వారికి చేయూతనిచ్చి జాతీయస్థాయి క్రీడాకారులగా తయారు చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. -
బుల్లెట్ ట్రైన్ పాత అలైన్మెంట్ కొనసాగించాలి
సూర్యాపేట : శంషాబాద్ నుంచి చౌటుప్పల్, సూర్యాపేట, అమరావతి మీదుగా చైన్నె వరకు జాతీయ రహదారికి సమాంతరంగా బుల్లెట్ ట్రైన్ కారిడార్ను గతంలో ప్రతిపాదించిన విధంగా కొనసాగించాలని కోరుతూ సూర్యాపేట బుల్లెట్ ట్రైన్ సాధన సమితి, అఖిలపక్షాల ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లో కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి ఈ అంశంపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల అవసరాలను, వర్తక వాణిజ్య అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో కారిడార్ ఏర్పాటు చేసి మూడు బుల్లెట్ ట్రైన్లను మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. సూర్యాపేట మీదుగా వెళ్లే బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ మార్పుపై రాష్ట్ర సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడతానని, కేంద్ర మంత్రిమండలితో చర్చించి ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు అఖిలపక్ష నాయకులు విలేకరులకు తెలిపారు. కిషన్ రెడ్డిని కలిసిన వారిలో బుల్లెట్ ట్రైన్ సాధన సమితి కన్వీనర్ ఆరుట్ల జానకిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు, అఖిలపక్ష నాయకులు పాదూరి కరుణ, అనుములపురి రవిబాబు, మల్లు నాగార్జునరెడ్డి, ధర్మార్జున్, రమణాచారి, బెజవాడ వెంకటేశ్వర్లు, చల్లమల నర్సింహ, జీడి భిక్షం, కర్నాటి కిషన్, మల్లు లక్ష్మి, రాంబాబు, సట్టు నాగయ్య, తదితరులు ఉన్నారు. కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష జాతీయ రహదారి 65కి సమాంతరంగా బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ కొనసాగించాలని కోరుతూ జిల్లా కేంద్రంలో బుల్లెట్ ట్రైన్ సాధన సమితి, అఖిల పక్షాల ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలోని వాణిజ్య భవన్ సెంటర్లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం కొనసాగాయి. మూడో రోజు దీక్షలో మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. దీక్షలను సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి డేవిడ్ కుమార్ ప్రారంభించారు. దీక్షలో మైనార్టీ నాయకులు హఫీజ్ జావెద్, న్యాయవాది ఖలీద్ అహ్మద్, హఫీజ్ రహ్మాన్, మౌలానా, యూనుస్, హఫీజ్ ఆసిఫ్, ఎండీ కలీమొద్దీన్, ఎస్కే సాజిద్, ముఫ్తీ అస్రార్, కాంగ్రెస్ నాయకులు అయ్యుబ్ ఖాన్, జమాల్, లక్ష్మీనారాయణ, వనిత, వజ్జే వీరయ్య పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి అఖిలపక్షం వినతి -
జాబితాలో ఓటు ఉండేనా..
భానుపురి (సూర్యాపేట) : సర్ ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటరు జాబితాపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో ఎన్యుమరేషన్ ప్రక్రియ ముగిసింది. సోమవారం ముసాయిదా ఓటరు జాబితా వెలువడనుంది. కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్లతో పాటు మండల పరిషత్, గ్రామ పంచాయతీ కార్యాలయాలలో జాబితాలను ప్రదర్శించనున్నారు. మృతి చెందిన వారితో పాటు శాశ్వతంగా వలస వెళ్లిన వారు, రెండు చోట్ల ఓట్లు ఉన్న ఓటర్లను జాబితాల నుంచి తొలగించనున్నారు. అందుకోసం బీఎల్ఓలు నెల రోజులపాటు ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు ఓటర్లకు అందించి, పూర్తి చేసిన ఫారాలను తీసుకొని ఆన్లైన్ చేపట్టారు. ప్రస్తుతం వెలువడే ఓటరు జాబితాలో తమ పేరు ఉందా లేదా అన్న అయోమయం ఓటర్లలో నెలకొంది. 96 వేలకు పైగా ఓట్లు గల్లంతు.. స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్లో భాగంగా జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఆ తర్వాత తేదీ పొడిగింపుతో ఈ నెల 10వ తేదీ వరకు ఎన్యుమరేషన్ ప్రక్రియ కొనసాగింది. అంతకుముందు జిల్లాలో ఉన్న పది లక్షల ఎనిమిది వేల మంది ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను చేపట్టారు. ఇందులో ఎనిమిది లక్షల ఇరవై మూడు వేల ఓట్లు బీఎల్ఓలు చేపట్టిన మ్యాపింగ్కు మ్యాచ్ అయ్యాయి. లక్షా 84 వేల ఓట్లు మ్యాపింగ్ కాలేదు. అనంతరం ఒక్కో ఓటరుకు రెండు ఎన్యుమరేషన్ ఫారాల చొప్పున 20 లక్షల ఫారాలను బీఎల్వోలు ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు. వీటిలో 9,11,945 ఎన్యుమరేషన్ ఫారాల స్వీకరణ, డిజిటలైజేషన్ పూర్తయింది. మరో 96,307 ఓట్లు డిజిటలైజేషన్ కాక పోవడంతో తొలగింపు జాబితాలో చేరారు. దాదాపు ఈ ఓట్లను ఎన్నికల అధికారులు సోమవారం ప్రకటించే ముసాయిదా జాబితా నుంచి తొలగించనున్నారు. అప్పీల్కు అవకాశండిజిటలైజేషన్ పూర్తయిన ప్రతి ఓటరు పేరు సోమవారం ప్రకటించే ముసాయిదా జాబితాలో ఉండకపోవచ్చని తెలుస్తుంది. డిజిటలైజేషన్ పూర్తయినప్పటికీ పూరించిన ఫారంలో తప్పులు ఉంటే వీటిని సైతం ఎన్నికల అధికారులు తొలగించే అవకాశం ఉంటుంది. ఈ లెక్కన ఇప్పటికే డిజిటలైజేషన్ కాని 96 వేలతో పాటు మరిన్ని ఓట్లు ముసాయిదా జాబితాలో చోటు దక్కకపోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. జాబితాలో లేని ఓటర్లు నెలరోజుల పాటు అప్పీలు చేసుకునే వీలు ఉంటుంది. నేడు ముసాయిదా ఓటరు జాబితా ఎన్యుమరేషన్ తర్వాత జాబితాపై ఉత్కంఠ 90 వేలకు పైగా ఓట్లు గల్లంతయ్యే అవకాశం అభ్యంతరాలు, అప్పీల్కు నెలరోజుల పాటు గడువుపలువురికి నోటీసులుముసాయిదా జాబితా ప్రకటించిన అనంతరం ఎన్యుమరేషన్ ఫారంలో తప్పొప్పులు ఉన్న, డిజిటలైజేషన్ కాకుండా ఉన్నవి, వలస వెళ్లిన వారికి అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు. ఈ నోటీసులకు ఓటర్లు సరైన ఆధారాలతో సమాధానం ఇవ్వడంతో పాటు తగిన పత్రాలు అప్పగిస్తే తిరిగి తుది జాబితాలో ఓటు కల్పించనున్నారు. సోమవారం ప్రకటించే ముసాయిదా ఓటరు జాబితాలో తమ పేరు ఉంటుందో లేదోనన్న సందేహం ప్రజల్లో నెలకొంది. -
కాలనీ రచ్చబండ
అర్వపల్లి : గ్రామాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలంతా ఒకచోట చేరి మాట్లాడుకునేందుకు రచ్చబండలు ఉండేవి. ప్రస్తుత ఆధునిక కాలంలో ప్రజలు సెల్ఫోన్లకు ఆకర్షితులై ఒకరితో మరొకరు మాట్లాడుకోవడం పూర్తిగా తగ్గి పోయింది. జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం ఎస్సీ కాలనీ వాసులు తామంతా ఒకచోట చేరి మాట్లాడుకునేందుకు వీలుగా రూ.2 లక్షల సొంత ఖర్చుతో రచ్చబండను నిర్మించుకున్నారు. రచ్చబండ వద్ద అన్ని దినపత్రికలను కూడా వేయిస్తున్నారు. కాలనీవాసులు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో రచ్చబండ వద్దకు చేరి పత్రికా పఠనంతో పాటు తమ సమస్యలను చర్చించుకుంటారు. కాలనీకి వచ్చే ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా రచ్చబండ వద్దే సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలతో మాట్లాడుతున్నారు. -
ఒక్క రూపాయితో 24 రోజుల వ్యాలిడిటీ
సూర్యాపేట : బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ప్రత్యేక ఆఫర్ల గడువును సెప్టెంబర్ 12 వరకు పొడిగించినట్లు ఆ సంస్థ ఎస్డీఈలు రంజిత్ కుమార్, కిషోర్ బాబు తెలిపారు. జిల్లా కేంద్రంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల అనంతరం వారు మాట్లాడారు. రూ.1కే సిమ్తో పాటు 24 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 1జీబి డేటా, 100 ఎస్ఎంఎస్లు, అపరిమిత వాయిస్ కాల్స్ లభించే ప్రత్యేక ఆఫర్ను వినియోగదారులు పొందవచ్చన్నారు. అలాగే 365 రోజుల వ్యాలిడిటీతో ఉన్న రూ.2,399 ప్లా¯న్ను 412 రోజులకు పొడిగించినట్లు వెల్లడించారు. ఈ ప్లా¯న్లో రోజుకు 2 జీబి డేటా, 100 ఎస్ఎంఎస్లు, అపరిమిత కాల్స్ లభిస్తాయన్నారు. 60 ఎంబీపీఎస్ అ¯Œన్ లిమిటెడ్ బ్రాడ్బ్యాండ్ ప్లాన్ కేవలం రూ.399కే లభిస్తుందని, ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లతో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లు చౌక ధరలకు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజలు ఈ ప్రత్యేక ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని, పూర్తి వివరాలకు సూర్యాపేట బీఎస్ఎన్ఎల్ కార్యాలయాన్ని సంప్రదించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు లచ్చు నాయక్, జేఈ నారాయణ, రాము సిబ్బంది పాల్గొన్నారు. -
నడిగూడెం కోటలో త్రివర్ణ పతాకం
ఫ జాతీయ జెండాకు ఇక్కడే రూపునిచ్చిన పింగళి వెంకయ్య నడిగూడెం : నడిగూడెంలోని జమీందారు రాజా బహుద్దూర్ నాయిని వెంకటరంగారావు కోటలోనే స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య జాతీయ జెండాకు రూపకల్పన చేశారు. పింగళి వెంకయ్య స్వగ్రామం ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని భట్లపెనుమర్రు. 1910లో అమెరికాలోని బోస్టన్లో పింగళి వెంకయ్య, రాజా నాయిని వెంకటరంగారావు కలిసి చదువుకున్నారు. ఆ తర్వాత వెంకటరంగారావు అప్పటి మునగాల పరగణాను పాలించారు. పింగళి వెంకయ్యకు వ్యవసాయంరంగంపై ప్రావీణ్యాన్ని గుర్తించిన రాజావారు.. 1921లో ఆయనను తన ఆస్థానంలో వ్యవసాయాధికారిగా నియమించుకున్నారు. గాంధీజీ సూచనతో.. జాతీయ జెండా గాంధీ అంటే పింగళి వెంకయ్యకు ఎంతో గౌరవం. ఆయన దక్షిణాఫ్రికాలో చదువుకునే రోజుల్లోనే గాంధీజీతో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ తర్వాత రాజావారి వద్ద విధులు నిర్వహిస్తూనే వెంకయ్య స్వాతంత్య్రోద్యమంలో భాగంగా పలుమార్లు గాంధీజీని కలిశారు. మన దేశానికి జాతీయ జెండా ఉండాలని గాంధీజీ సూచన మేరకు 1921లో పింగళి వెంకయ్య నడిగూడెం కోటలోనే కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో పాటు మధ్యలో గాంధీ నూలు వడికే రాట్నం చిత్రంతో జాతీయ జెండాకు తుదిరూపునిచ్చారు. విజయవాడ సభలో అప్పగింత.. పింగళి వెంకయ్య తాను రూపొందించిన త్రివర్ణ పతాకాన్ని 1921 మార్చి 21న విజయవాడలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్న గాంధీజీకి అందించారు. దేశ నలుమూలల నుంచి 16 నమూనాలు గాంధీజీకి చేరినప్పటికీ, వెంకయ్య రూపొందించిన జెండాకే ఆయన ఆమోదం తెలిపారు. ఆ తర్వాత కాలంలో రాట్నం స్థానంలో అశోక చక్రం చేర్చి జాతీయ పతాకంగా ఖరారు చేశారు. -
చేతితో అల్లారు.. రికార్డు సృష్టించారు
కోదాడ : పట్టణంలోని కొమరబండకు చెందిన తల్లీకూతుళ్లు మహంకాళి వసంతలక్ష్మి, లాస్యప్రియ నూలు దారం ఉపయోగించి చేతితో త్రివర్ణ పతాకాలను తయారుచేసి వాటిని దండలుగా మార్చి గిన్నిస్ రికార్డు సాధించారు. ఈ నెల 7న ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగిన ‘హర్ ఘర్ తిరంగా’ యాత్రలో 12.3 కిలోమీటర్ల ఈ జాతీయ జెండాల దండలను ప్రదర్శించి ప్రపంచ రికార్డు సృష్టించారు. మహిళా మనోవికాస గ్రూపు సాయంతో... ఆంధ్రప్రదేశ్కు చెందిన సూరిభట్ల మాధవి ‘మహిళా మనోవికాస’ పేరుతో ఒక గ్రూపును ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా ద్వారా సుమారు 300 మంది మహిళలు ఈ గ్రూపులో సభ్యులుగా చేరారు. ఔత్సాహిక మహిళలు, బాలికలకు వారి అభిరుచుల మేరకు వివిధ కార్యక్రమాలను రూపొందించి వారిని భాగస్వాములను చేస్తుంటారు. ఇందులో భాగంగా నూలుదారంతో చేతితో జాతీయ జెండాలను తయారు చేసి, వాటిని ఒక దండలాగా కూర్చి అతి పొడవైన జాతీయ జెండాల దండను తయారు చేయాలని నిర్ణయించారు. మేము సైతం అంటూ... ఈ మహిళా మనోవికాస గ్రూపులో మహంకాళి వసంతలక్ష్మి, లాస్యప్రియ సభ్యులుగా చేరారు. గ్రూపులోని మరికొంత మంది సభ్యులతో కలిసి జాతీయ జెండాలను తయారు చేయడానికి ముందుకొచ్చారు. వీటి తయారీకి కావలసిన మూడు రంగుల నూలు దారాన్ని బెంగళూరు నుంచి సొంత ఖర్చుతో తెచ్చుకొని, ఇంటిలోనే వీరు జెండాలను తయారు చేయడం ప్రారంభించారు. ఇద్దరూ కలిసి రోజుకు రెండు జెండాల చొప్పున తయారు చేశారు. ఇలా గ్రూపు సభ్యులందరూ కలిసి తయారు చేసిన జెండాలను ఒక దండలాగా చేర్చగా అది 12.3 కిలోమీటర్ల పొడవుగా మారింది. ఈ నెల 7న విశాఖలో దీన్ని ప్రదర్శించగా, గిన్నిస్ వరల్డ్ రికార్డు బృందం పరిశీలించి వీరికి అతి పొడవైన జాతీయ జెండాల ప్రదర్శన రికార్డును అందజేసింది. -
జాతీయ జెండా చేతబూని..
మఠంపల్లి : యువత మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మఠంపల్లి మండలంలోని అల్లీపురం గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారుడు గూడ నరసింహారావు వినూత్న ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్ డే తో పాటు మహాత్మా గాంధీ, అంబేద్కర్ జయంతుల సందర్భంగా ఆయన జాతీయ జెండా చేతబూని మఠంపల్లి నుంచి చౌటపల్లి, బక్కమంతులగూడెం, త్రివేణినగర్, ఎర్రగట్టు, మగ్దుంనగర్ తదితర గ్రామాల మీదుగా 15 కిలోమీటర్ల మేర ఆయన ఈ రన్ చేస్తుంటారు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకూడదనే ఉద్దేశంతో 2018 నుంచి ఈ ప్రచారం చేస్తున్నట్లు ఆయన చెబుతున్నారు. తన ప్రచారాన్ని నిరంతరం కొనసాగిస్తానని నరసింహారావు స్పష్టం చేశారు. -
సాయి స్మరణ.. జనగణమన
ఫ చింతపల్లి సాయి ఆలయంలో పూజల అనంతరం జాతీయ గీతాలాపన మర్రిగూడ(చింతపల్లి): చింతపల్లి మండల కేంద్రంలోని షిరిడి సాయిబాబా ఆలయం ఆధ్యాత్మికతతో పాటు దేశభక్తిని చాటుతోంది. ఆలయంలో ప్రతి రోజు ఉదయం ప్రత్యేక పూజలు, భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతుండగా మధ్యాహ్నం సమయంలో భక్తులంతా కలిసి జాతీయ గీతం ఆలపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. భక్తితోపాటు దేశభక్తిని మేళవిస్తూ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో మహిళలు, యువత, చిన్నారులు, వృద్ధులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఆలయ ప్రాంగణమంతా జాతీయ గీతంతో మార్మోగగా, భక్తుల్లో దేశంపై గౌరవభావం, ఐక్యత, సామరస్యాన్ని చాటేలా కార్యక్రమం సాగుతోంది. -
యువతను సైనికులుగా తీర్చిదిద్దుతూ..
బీఎస్ఎన్ఎల్ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలిఫ పోలీస్, ఆర్మీ శిక్షణ ఇస్తున్న రిటైర్డ్ జవాన్ సత్యనారాయణ రామగిరి(నల్లగొండ) : నల్లగొండ పట్టణంలోని పాతబస్తీ షేర్ బంగ్లా ప్రాంతానికి చెందిన కొండోజు సత్యనారాయణ తన జీవితాన్ని దేశ సేవకే అంకితం చేశారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)లో 28 ఏళ్ల పాటు సేవలు అందించిన ఆయన 2019లో పదవీ విరమణ పొందారు. రిటైర్మెంట్ తర్వాత ఆయన యువత భవిష్యత్ను తీర్చిదిద్దే పనిలో పడ్డారు. ఉచిత శిక్షణ.. అద్భుత ఫలితాలు.. నేటి సమాజంలో యువతలో క్రమశిక్షణను పెంపొందించి, దేశ రక్షణ పట్ల వారిలో బాధ్యతను పెంచాలనే బలమైన సంకల్పంతో 2020లో ‘జై జవాన్ ట్రైనింగ్ సెంటర్’ను సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సెంటర్ ద్వారా భారత సైన్యం (ఆర్మీ), నావికాదళం (నేవీ), వాయుసేన (ఎయిర్ ఫోర్స్), సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఎన్ఐఏతో పాటు రాష్ట్ర పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ ఉద్యోగాలకు అవసరమైన ఫిజికల్ ట్రైనింగ్ను ఉచితంగా అందిస్తున్నారు. అభ్యర్థులకు ముందుగా ఫిజికల్ టెస్ట్ నిర్వహించి, వారి ఫిట్నెస్ పరిశీలించిన తర్వాతే అడ్మిషన్లు ఇస్తున్నారు.ఇప్పటివరకు ఈ సెంటర్ ద్వారా 250 మందికి పైగా శిక్షణ పొందగా.. ఏకంగా 72 మంది ఆర్మీ, వివిధ పోలీస్ ఉద్యోగాల్లో స్థిరపడటం ఆయన కృషికి నిదర్శనం. అగ్నివీర్, పోలీస్ ఉద్యోగాల ఫిజికల్ ఈవెంట్స్ సాధించడం చాలా సవాల్తో కూడుకున్నది. అందుకోసం జై జవాన్ ట్రైనింగ్ సెంటర్లో సత్యనారాయణ సర్ ఇచ్చే శిక్షణ మాలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది. రూపాయి ఖర్చు లేకుండా మమ్మల్ని లక్ష్యం వైపు సార్ నడిపిస్తున్నారు. భవిష్యత్తులో ఉద్యోగం సాధించడమే నా లక్ష్యం. – చిందాల దేవాన్ష్ ఉద్యోగ సాధనకు కావాల్సిన సరైన క్రమశిక్షణ, ఫిజికల్ ఫిట్నెస్ ఇక్కడ లభిస్తోంది. సత్యనారాయణ సార్ ఇచ్చే మెళకువలు కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి. కఠినమైన ఫిజికల్ ట్రైనింగ్ పొందుతున్నాం. యూనిఫామ్ రిక్రూట్మెంట్ ఈవెంట్లలో గెలవడానికి కావల్సి అన్ని మెళకువలను ఆయన ఉచితంగా నేర్పిస్తున్నారు. – కట్ట శరత్కుమార్రెడ్డి కేవలం అబ్బాయిలకే కాకుండా అమ్మాయిలకు కూడా ప్రత్యేక శ్రద్ధతో ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. సురక్షితమైన వాతావరణంలో, పూర్తి క్రమశిక్షణతో కూడిన శిక్షణ లభిస్తోంది. యూనిఫాం ఉద్యోగం సాధించడమే నా ధ్యేయం. – ఆరూరి అంకిత రామగిరి (నల్లగొండ): స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఆఫర్లను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆ సంస్థ నల్లగొండ బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ (పీజీఎం) పి. వెంకటేశం అన్నారు. శుక్రవారం నల్లగొండలో ఆయన ఆఫర్ల వివరాలను వెల్లడించారు. ఫ్రీడమ్ ప్లాన్ కింద ఉచిత సిమ్తో పాటు రీఛార్జ్పై 24 రోజుల వ్యాలిడిటీ, రోజూ 1జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ కాల్స్ లభిస్తాయన్నారు. రూ.2,399 ఇయర్లీ ప్లాన్పై అదనంగా 47రోజుల వ్యాలిడిటీతో మొత్తం 412 రోజుల వ్యాలిడిటీ పొందవచ్చన్నారు. రూ.1,111 ప్లాన్ ద్వారా 200 ఎంబీపీఎస్ స్పీడ్, నెలకు 5,000 జీబీ డేటా మరియు 25కు పైగా ప్రీమియం ఓటీటీ యాక్సెస్ లభిస్తుందన్నారు. 2జీ, 3జీ వినియోగదారులు ఉచితంగా 4జీ సిమ్కు మారవచ్చన్నారు. బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ ద్వారా 500 లైవ్ ఛానళ్లతో ఫ్రీ ఎంటర్టైన్మెంట్ టీవీ, శాటిలైట్ ఫోన్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. సమావేశంలో డీజీఎం మురళీకృష్ణారెడ్డి, ఐఎఫ్ భాస్కర్రెడ్డి, ఏజీఎంలు అశోక్, సదానందం, రాములు, వెంకన్న, దినేష్ పాల్గొన్నారు. -
జాతిపితకు గుడి
చిట్యాల : చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి గ్రామ పంచాయతీ పరిధిలో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన నాలుగు ఎకరాల స్థలంలో గాంధీ గుడిని నిర్మించారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన మహాత్మాగాంధీ చారిటబుల్ సంస్థ ఆధ్వర్యంలో ఈ ఆలయం రూపుదిద్దుకుంది. 2014 సెప్టెంబర్ 15న గుడిలో గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ గుడిలో నల్లరాతితో చెక్కిన గాంధీ విగ్రహంతో పాటు ధర్మచక్రాన్ని (అశోక చక్రం) ప్రతిష్ఠించారు. గుడి కింది అంతస్తులో ప్రత్యేకంగా ధ్యాన మందిరాన్ని నిర్మించారు. ఆలయ సమీపంలో పంచభూతాలు, నవగ్రహ దేవతల విగ్రహాలతో పాటు తులసి కోటను ఏర్పాటు చేయడం విశేషం. జైన దేవాలయాల్లో (దిలావర్) ఉపయోగించే ప్రత్యేకమైన గంట ఇక్కడ అమర్చారు. ఈ గుడిలో నిత్య పూజలు చేసే పూజారి కూరెళ్ల నర్సింహాచారి.. దేవుడికి మంత్రాలు చదివినట్లుగానే, గాంధీ స్తోత్రాలతో పూజలు చేస్తారు. గుడికి వచ్చే వారికి గాంధీజీ సిద్ధాంతాలను వివరిస్తుంటారు. పూజల అనంతరం భక్తులకు ‘డ్రై ఫ్రూట్స్’తో చేసిన ప్రసాదాన్ని అందించడం ఇక్కడి ప్రత్యేకత. భవిష్యత్ తరాలకు గాంధీజీ సిద్ధాంతాలను, ఆయన ఆశయాలను తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ గాంధీ గుడిని నిర్మించినట్లు మహాత్మాగాంధీ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు శ్రీపాల్రెడ్డి పేర్కొన్నారు. -
లింగనిర్ధారణ చట్టరిత్యా నేరం
సూర్యాపేటటౌన్ : గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చేయడం, దానిని బయటకు వెల్లడించడం చట్టరిత్యా నేరమని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ అన్నారు. శుక్రవారం జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో రేడియాలజిస్టులు, వైద్యులు, స్కానింగ్ కేంద్రాల ప్రతినిధులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పీసీపీఎన్డీటీ చట్టంపై అవగాహన కల్పించారు. రేడియాలజిస్ట్లు, వైద్యులు, స్కానింగ్ కేంద్రాల యాజమాన్యాలు తప్పని సరిగా నిబంధనలు పాటించాలని ఆదేశించారు. స్కానింగ్ కేంద్రాల్లో నిర్వహించే ఆల్ట్రా సౌండ్ పరీక్షకు సంబంధించిన ఫామ్ ఎఫ్ రికార్డులను నమోదు చేయడంతో పాటు భద్రపర్చాలన్నారు. స్కానింగ్ కేంద్రంలో అవసరమైన నోటీసులు, బోర్డులను ప్రదర్శించడం, రెన్యూవల్ నిబంధనలు వంటి వాటిపై వివరించారు. కార్యక్రమంలో డాక్టర్లు నాజియా తబస్సుం, శ్రీశైలం, బాసిత్, సంజీవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. నీట్ లాంగ్ టర్మ్ శిక్షణకు దరఖాస్తులునడిగూడెం : సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న నీట్ లాంగ్ టర్మ్ శిక్షణకు అర్హులైన విద్యార్థులు ఈ నెల 22 లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సంస్థ జిల్లా కోఆర్డినేటర్ సీహెచ్. పద్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్లోని టీజీఎస్డబ్ల్యూ, ఆర్ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ శిక్షణకు చిలుకూరులో 100 మంది బాలురకు, మహీంద్ర హిల్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 100 మంది బాలికలకు శిక్షణను ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలినూతనకల్ : సీజనల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ ప్రసిద్ధ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. ప్రజలకు సీజనల్ వ్యాధులపై ముఖ్యంగా నీటి కాలుష్యంతో వచ్చే వ్యాధులపై అవగాహన కల్పించాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట డాక్టర్ శిరీష, సీహెచ్ఓ శరణ్నాయక్, దయామణి, ప్రసాద్, మాధవరెడ్డి, ప్రియాంక ఉన్నారు. విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్కు జాతీయ అవార్డుపాలకవీడు : కళారంగంలో విశేష సేవలతో పాటు గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించినందుకు గాను పాలకవీడు మండల కేంద్రంలో విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న గుంటి పిచ్చయ్యకు ‘భారతీయ కళారత్న – ప్రైడ్ ఆఫ్ ఇండియా నేషనల్ అవార్డు–2026’ వరించింది. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లోని ఎన్టీఆర్ కళావేదికలో గురువారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. మంత్రి జూపల్లి ఆయనను ఘనంగా సత్కరించి, ప్రశంసా పత్రం, షీల్డ్ అందజేశారు. పిచ్చయ్యను సంస్థ సిబ్బంది, అధికారులు అభినందించారు. -
పాత అలైన్మెంట్ సాధించే వరకు విశ్రమించం
సూర్యాపేట : బుల్లెట్ ట్రైన్ కారిడార్ను పాత అలైన్మెంట్ ప్రకారమే చేపట్టాలని అప్పటి వరకు ఉద్యమాన్ని ఆపేదే లేదని బుల్లెట్ ట్రైన్ సాధన సమితి కన్వీనర్ ప్రొఫెసర్ ఆరుట్ల జానకిరెడ్డి అన్నారు. బుల్లెట్ ట్రైన్ సాధన కోసం అఖిలపక్షాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్లో శుక్రవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కొల్లు మధుసూదన్రావు, డాక్టర్ రామ్మూర్తి, మున్సిపల్ మాజీ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జానకిరెడ్డి మాట్లాడారు. పలువురి సంఘీభావంరిలే నిరాహార దీక్షలకు రాజ్యసభ మాజీ సభ్యుడు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ సంఘీభావం తెలిపారు. క్లాత్ మర్చంట్స్ సంఘం నాయకులు గండూరి శంకర్, డీటీఎఫ్, యూటీఎఫ్, టీపీటీఎప్ నాయకులు ఉమర్, డి.లాలు, ముప్పాని కృష్ణారెడ్డి, ఆర్యవైశ్య సంఘం నాయకులు బండారు రాజా, వర్తక సంఘం అధ్యక్షుడు అంతకు విజయ్, జర్నలిస్ట్ సంఘం నాయకుడు వజ్జే వీరయ్య, హైకోర్టు అడ్వకేట్ సత్తార్ ఖాన్ సంఘీభావం పలికారు. సాయంత్రం సుధాబ్యాంక్ అధినేత పెద్దిరెడ్డి గణేష్ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప జేశారు. కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు పెద్దిరెడ్డి రాజా, రమణాచారి, మల్లు నాగార్జునరెడ్డి, కుంట్ల ధర్మార్జున్, తండు శ్రీనివాస్యాదవ్, చల్లమల్ల నరసింహ, బెజవాడ వెంకటేశ్వర్లు, శివకుమార్, బూర మన్సూర్, కర్నాటి కిషన్ అనంతుల మధు, పేర్ల నాగయ్య, వనిత, కునుకుంట్ల సైదులు, తదితరులు పాల్గొన్నారు. బుల్లెట్ ట్రైన్ సాధన సమితి కన్వీనర్ ఆరుట్ల జానకిరెడ్డి -
చదువులో విద్యార్థులు పోటీ పడాలి
అర్వపల్లి : విద్యార్థులు ఒకరికొకరు పోటీపడి చదవాలని డీఆర్డీఓ ఆర్.సన్యాసయ్య సూచించారు. అర్వపల్లిలోని పీఎంశ్రీ జడ్పీహెచ్ఎస్లో శుక్రవారం 300 మంది విద్యార్థులకు సెర్ఫ్ ఆధ్వర్యంలో యూనిఫామ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తన తల్లి పేరున పాఠశాలలో ఒక మొక్క నాటి సంరక్షించాలని సూచించారు. బాలికలు సైకిల్ నేర్చుకోవడానికి వీలుగా ప్రతి మండలానికి డీఆర్డీఓ ఆధ్వర్యంలో 5 సైకిళ్లను కేటాయించినట్లు చెప్పారు. అనంతరం పాఠశాలలో మొక్క నాటారు. మధ్యాహ్న భోజనాన్ని, ల్యాబ్ను పరిశీలించారు. కార్యక్రమంలో ట్రైనీ అదనపు కలెక్టర్లు రవితేజ, అనూష, సర్పంచ్ చిల్లంచర్ల విద్యాసాగర్, ఏపీఎంలు రాంబాబు, వెంకన్న, హెచ్ఎం పి.మల్లేష్, ఏపీసీ ఛైర్పర్సన్ మేకల సునీతరాంబాబు, సీసీ యాదగిరి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. డీఆర్డీఓ సన్యాసయ్య -
రేపటి నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు
భానుపురి (సూర్యాపేట) : రేషన్ కార్డులు స్మార్ట్గా మారనున్నాయి. ఏటీఏం తరహాలో క్యూర్ కోడ్తో లబ్ధిదారుని పూర్తి వివరాలు నిక్షిప్తం చేసిన కార్డులను ఇప్పటికే రేషన్కార్డులు ఉన్న వారికి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సూర్యాపేట జిల్లాలో ఈ నెల 16 నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించనున్నారు. రాష్ట్ర ఇరిగేషన్, సివిల్ సప్లయ్శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి చేతుల మీదుగా కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మిగతా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల చేతుల మీదుగా వీటిని లబ్ధిదారులకు అందించనున్నారు. జిల్లాలో 3,71,783 కార్డులు..!జిల్లాలో 610 రేషన్ షాపులు ఉండగా, వాటి పరిధిలో ఈ ఏడాది కొత్తగా మంజూరు చేసిన వాటితో కలుపుకొని 3,71,783 రేషన్న్కార్డులు ఉన్నాయి. ప్రభుత్వం రూపొందించిన స్మార్ట్ కార్డులను వారందరికీ పంపిణీ చేయనున్నారు. మంత్రి చేతుల మీదుగా లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, ఆ తరువాత ప్రభుత్వం నుంచి వెలువడే మార్గదర్శకాల ప్రకారం కార్డులను పంపిణీ చేస్తామని అధికారులు వెల్లడించారు. ఏటీఎం కార్డు తరహాలో..!ఇప్పటి వరకు కాగితంపై ఉన్న రేషన్న్ కార్డుల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా స్మార్ట్ కార్డులను రూపొందించింది. ఏటీఎం కార్డు పరిమాణంలో ఉండే ఈ డిజిటల్ కార్డులు చిరిగి పోకుండా, తడవకుండా పూర్తి భద్రతా ప్రమాణాలతో తయారు చేశారు. కార్డుపై కుటుంబ యజమాని, కుటుంబ సభ్యుల పేర్లతోపాటు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఫొటోలను ముద్రించారు.కార్డులోనే పూర్తి సమాచారంస్మార్ట్ రేషన్న్కార్డులో ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ను పొందుపరిచారు. రేషన్ షాపులో కార్డును స్కాన్ చేయగానే కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఇదే కార్డును బహుళ ప్రయోజనాలకు ఉపయోగించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. 3.71 లక్షల మందికి పంపిణీకి ఏర్పాట్లు ఏటీఎం కార్డు తరహాలో రూపకల్పన క్యూఆర్ కోడ్తో పూర్తి వివరాలుసూర్యాపేట జిల్లాలో రేషన్ కార్డులు ఇలా.. నియోజకవర్గం రేషన్ షాపులు స్మార్ట్ కార్డులుసూర్యాపేట 171 93,770 హుజూర్నగర్ 188 1,07,631 కోదాడ 146 98,716 తుంగతుర్తి 105 71,666 మొత్తం 610 3,71,783 -
ఉపాధికి అడ్డంకులు
పెన్డౌన్లో వీబీజీ రామ్జీ ఉద్యోగులుభానుపురి (సూర్యాపేట) : వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ (వీబీజీరామ్జీ) పథకం సిబ్బంది పెన్డౌన్ సమ్మెతో గ్రామాల్లో పనులు నిలిచిపోయాయి. తమకు ఉద్యోగ భద్రతతో పాటు పలు సమస్యల పరిష్కారానికి ఫీల్డ్ అసిస్టెంట్లు మినహా టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఈసీలు, ఏపీఓలు విధులను బహిష్కరిస్తున్నారు. దాంతో గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకం కింద చేపట్టాల్సిన పనులు ముందుకు సాగడం లేదు. ఇప్పటికే తీవ్ర వర్షాభావంతో వ్యవసాయ పనులకు వెళ్లలేని కూలీలకు ఉపాధి కరువైంది. ఇప్పటి వరకు చేసిన పనులకు బిల్లులు కూడా పడడం లేదు. జిల్లాలో 152 మంది సిబ్బంది..!సూర్యాపేట జిల్లాలో వీబీజీ రామ్జీ పథకం కింద ఏపీఓ, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, పీఓలు ఇలా సుమారు 152 మంది ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తున్నారు. వీరంతా ఉద్యోగ భద్రతతో పాటు 60 రకాల డిమాండ్ల సాధనకు జూలై 31 నుంచి పెన్డౌన్ చేస్తూ తమ నిరసన తెలుపుతున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు సమ్మెకు దూరంగా ఉన్నప్పటికీ గ్రామాల్లో కూలీలకు పనులు కల్పించలేని పరిస్థితి. ప్రధానంగా కంప్యూటర్ ఆపరేటర్లు నమోదు చేయనిదే వర్క్ డిమాండ్ ముందుకు సాగదు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో కూలీలు పనులు చేయలేకపోతున్నారు. ఒకవేళ పనులు కల్పించినా వేతనాలు వచ్చేందుకు ఆస్కారం ఉండదు. జలసిరి పనులకూ అంతరాయంఎల్నినో ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్లో ఆశించిన మేర వర్షాలు కురవలేదు. రానున్న రోజుల్లోనూ భూగర్భ జలాలను సంరక్షించడంతో పాటు వ్యవసాయ, ఇతర కూలీలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జలసిరి పనులు చేపట్టాలని నిర్ణయించింది. వీబీజీ రామ్జీ పథకంలో భాగంగా జిల్లాలోని 23 మండలాలు, ఐదు మున్సిపాలిటీల పరిధిలో 97వేల ఇంకుడు గుంతలు, 5,750 పాంపాండ్స్, 486 ఊట కుంటలు, 972 మ్యాజిక్ డ్రైన్లు, 6201 బోర్వెల్ రీచార్జి యూనిట్లు నిర్మించాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా నిర్దేశించింది. ఈ లక్ష్యాలను చేరుకోవాలంటే పెద్ద ఎత్తున వీబీజీ రామ్జీ పథకం పనులు చేపట్టాల్సి ఉంది. ఈ పనులు ప్రారంభంలోనే సిబ్బంది పెన్డౌన్ కార్యక్రమాన్ని తెరపైకి తెచ్చారు. దాంతో జలసిరి కార్యక్రమంలో నిర్దేశించిన లక్ష్యానికి అంతరాయం కలుగుతోంది.కొందరు విరమించినా..!జిల్లాలో 152 మంది ఉద్యోగులు, సిబ్బందికి గాను రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు దాదాపు 95 మంది పెన్డౌన్ కార్యక్రమాన్ని విరమించారు. ఇంకా 57 మంది సిబ్బంది నిరసన తెలుపుతుండడంతో వీబీజీ రామ్జీ పనులు ముందుకు సాగడం లేదు. చాలా మండలాల్లో వర్క్ డిమాండ్ లేకపోవడంతో కూలీలు పనులకు వెళ్లడం లేదు. ఓ వైపు వ్యవసాయ పనులు దొరక్క .. మరోవైపు ఉపాధి పనులు సైతం లేకపోవడంతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పథకం అమలైన నాటినుంచి జిల్లాలో 21వేల మంది 1.62 లక్షల పనిదినాలను పొందారు. కొంతమేర రోజువారీ వేతనాల చెల్లింపులు జరిగినా సుమారుగా రూ.36.65 లక్షల బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయి. వీజీబీ రామ్జీ సిబ్బంది పూర్తిస్థాయిలో విధుల్లోకి వస్తేనే బిల్లులు, కూలీలకు ఉపాధి పనులు లభిస్తాయి. కూలీల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సిబ్బంది కోరుకుంటున్నారు. గ్రామాల్లో నిలిచిపోయిన ఉపాధి పనులు తీవ్ర వర్షాభావంతో దొరకని వ్యవసాయ పనులు జలసిరి పనులకూ అంతరాయం -
స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
సూర్యాపేటటౌన్ : జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో శనివారం నిర్వహించనున్న స్వాతంత్య్ర వేడుకలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వేడుకలకు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఉదయం 9:30 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం కలెక్టర్ తేజస్నంద్లాల్ పవార్, ఎస్పీ నరసింహ అధికారులతో కలిసి పరిశీలించారు. వేడుకలకు వచ్చే పౌరులకు, విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. జెండా ఆవిష్కరించనున్న మంత్రి ఉత్తమ్ -
గడువు ముగిసిన పదార్థాలు విక్రయించొద్దు
హుజూర్నగర్ : గడువు ముగిసిన ఆహార పదార్థాలను విక్రయిస్తే చర్యలు తప్పవని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి. జ్యోతిర్మయి హెచ్చరించారు. శుక్రవారం హుజూర్నగర్లో పలు కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లు, హోటళ్లలో ఆమె తనిఖీలు నిర్వహించారు. ఆహార పదార్థాల నాణ్యత, పప్పులు, కాలం చెల్లిన పదార్థాలు, ప్రభుత్వం నిషేధించిన ఉత్పత్తులపై సోదాలు చేశారు. అనుమానాస్పద పదార్థాల నమూనాలను సేకరించి, పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపినట్లు తెలిపారు. ఆహార వ్యాపారులు, హోటల్ నిర్వాహకులు తప్పనిసరిగా లైసెన్స్ పొందాలని సూచించారు. పజల ఆరోగ్యానికి హాని కలిగించే రంగులు, ఆహార పదార్థాలు, లూస్ టీ పౌడర్స్, ఆయిల్స్ విక్రయించవద్దన్నారు. ఇటీవల కొంతమంది తాము ఫుడ్ ఇన్స్పెక్టర్లమంటూ వ్యాపారులను భయపెట్టి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయని, అటువంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలా ఎవరైనా బెదిరిస్తే వెంటనే స్థానిక పోలీసులకు, ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆమె వెంట ఫుడ్ సేఫ్టీ అధికారి బి ప్రభాకర్, సిబ్బంది ఉన్నారు. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి -
పంట మార్పిడిని ముమ్మరం చేయాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రస్తుత సీజన్లో వర్షపాత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో చేపట్టిన శ్రీరైతులతో మాట – పంట మార్పిడికి బాటశ్రీ కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆధ్వర్యంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున వ్యవసాయ, సాగునీటి వినియోగంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సాగునీటి భరోసా లేని ప్రాంతాల్లో కొత్తగా వరి సాగు చేపట్టే విషయంలో రైతులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఒకటి రెండు రోజుల వర్షాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోకుండా, పంట పూర్తయ్యే వరకు అవసరమైన నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని సాగుచేసే పంటను ఎంపిక చేసుకోవాలన్నారు. వ్యవసాయ అధికారుల సలహాతో సరైన పంటలను ఎంపిక చేసుకోవాలని రైలులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
మోతె దంపతుల కేసులో బిగ్ ట్విస్ట్
సాక్షి, సూర్యాపేట: మోతె మండల కేంద్రంలో దంపతుల హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కానిస్టేబుల్ షరీఫ్తో పాటు మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతురాలు బూబాతో షరీఫ్కు వివాహేతర సంబంధం కొనసాగుతుండగా.. మరో మహిళతోనూ షరీఫ్కు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దీంతో మరో మహిళతో సంబంధంపై షరీఫ్ను బూబా నిలదీసింది. కొంతకాలంగా బూబా, షరీఫ్ మధ్య గొడవ జరుగుతుంది.ఓ నిర్మానుష్య ప్రాంతానికి షరీఫ్తో పాటు బూబా వెళ్లింది. మాటామాటా పెరిగి బూబాను షరీఫ్ హత్య చేశాడు. బూబాను హత్య చేసేందుకు షరీఫ్కు సుందరయ్య సహకరించాడు. అదే సమయంలో విషయం తెలుసుకుని ఘటనాస్థలికి వెళ్లిన బూబా భర్తను సైతం కొట్టి చంపిన కానిస్టేబుల్ షరీఫ్.. హత్యానంతరం దంపతుల డెడ్బాడీలను పాతిపెట్టాడు.దంపతులను హత్య చేసిన తర్వాత మోతె నుంచి సూర్యాపేట వెళ్లిపోయిన కానిస్టేబుల్ షరీఫ్.. బుధవారం యథావిధిగా విధులకు హాజరయ్యాడు. ఘటనా స్థలంలో మృతదేహాలను వెలికితీసే సమయంలో అక్కడే విధుల్లో పాల్గొన్న షరీఫ్.. తనకేం తెలియదన్నట్లు అమాయకంగా ప్రవర్తించారు. స్థానికులు.. ఘటనా స్థలంలోకి వస్తున్న సమయంలో ఆధారాలు చెదిరిపోతాయంటూ అరుస్తూ షరీఫ్ ఏమీ తెలియనట్టు నటించాడు.అయితే, ఈ కేసులో సీసీ ఫుటేజ్ నిందితులను పట్టించింది. సుందరయ్య గుంతను పూడ్చేందుకు పార తీసుకెళ్తున్న విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సుందరయ్యను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గతంలోనే ఓసారి బూబా హత్యకు షరీఫ్ ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. షరీఫ్ చంపిన బూబా వయస్సు 42 సంవత్సరాలు కాగా, హత్య చేసిన కానిస్టేబుల్ షరీఫ్ వయస్సు 26 సంవత్సరాలు. -
యువత ప్రలోభాలకు గురికావొద్దు
చివ్వెంల(సూర్యాపేట) : యువత చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ అన్నారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా బుధవారం సూర్యాపేట పట్టణంలోని బీఎన్ఆర్ జూనియర్ కళాశాలలో సాధికార యువత–బలమైన భారతదేశం అనే అంశంపై యువకులకు నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యార్థులు, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, ప్రలోభాలకు గురికావద్దన్నారు. సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నూకల సుదర్శన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తల్లమళ్ల హస్సేన్, నామినేటేడ్ సభ్యుడు గుంటూరు మధు, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పోలీసు కార్యాలయానికి సరికొత్త రూపు
సూర్యాపేటటౌన్ : జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణం సరికొత్త రూపు సంతరించుకుంది. ఎస్పీ నరసింహ చొరవతో పలు మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. పరిపాలనా కేంద్రంగానే కాకుండా, సిబ్బంది అవసరాలు, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చారు. ఆకర్షణీయమైన పరేడ్ గ్రౌండ్ గతంలో ఉన్న ఇబ్బందులను తొలగిస్తూ.. కార్యాలయ ఆవరణలోని మైదానాన్ని సుమారు ఐదు అడుగుల మేర మట్టితో ఎత్తు పెంచి చదును చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, ఇతర అధికారిక కార్యక్రమాల నిర్వహణ కోసం శాశ్వత వేదికను నిర్మించారు. జిమ్, షటిల్ కోర్టు ఏర్పాటు పోలీసు సిబ్బంది శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసం కోసం కార్యాలయ ప్రాంగణంలోనే అత్యాధునిక జిమ్తో పాటు ప్రత్యేక షటిల్ కోర్టు ఏర్పాటు చేశారు. ప్రత్యేక క్యాంటిన్ సిబ్బంది నిత్యావసర సరుకులు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు తక్కువ ధరలకే లభించేలా ‘కాప్ స్మార్ట్’ భవనాన్ని పూర్తి చేసి వినియోగంలోకి తెచ్చారు. ఈ క్యాంటిన్ ద్వారా బయటి మార్కెట్తో పోలిస్తే ప్రతి సిబ్బందికి నెలకు సుమారు రూ. 5,000 వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది. నిత్యావసరాల కోసం ఏర్పాటు చేసిన క్యాంటిన్ మెరుగైన మౌలిక వసతులు కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద ఆకర్షణీయమైన ఆర్చి, సరికొత్త గేటు ఏర్పాటు చేశారు. భద్రత కోసం కాంపౌండ్ వాల్, ఫెన్సింగ్తో పాటు ప్రాంగణం అంతటా పచ్చదనం పెంపొందించి ఆహ్లాదకర వాతావరణాన్ని తీర్చిదిద్దారు. వాహనాల పార్కింగ్ కొరకు ప్రత్యేకంగా షెడ్ల నిర్మాణం చేపట్టారు. ఎస్పీ నరసింహ తీసుకున్న ఈ ప్రత్యేక చొరవతో జిల్లా పోలీసు కార్యాలయ స్వరూపమే మారిపోయిందని సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫ సిబ్బందికి వసతులు ఫ ఎస్పీ నరసింహ చొరవతో రూపుదిద్దుకున్న సౌకర్యాలు -
లయన్స్ కంటి ఆస్పత్రి చైర్మన్గా మీలా మహదేవ్
సూర్యాపేట : లయన్స్ కంటి ఆస్పత్రి చైర్మన్గా ప్రముఖ పారిశ్రామికవేత్త, సుధాకర్ పీవీసీ ఎండీ మీలా మహదేవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. లయన్స్ ఆస్పత్రిలో ఆయన చైర్మన్గా ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర నాయకుడు పోతు భాస్కర్లు పాల్గొని మీలా మహదేవ్ను సన్మానించారు. అదేవిధంగా లయన్స్ ఐ హాస్పిటల్ కార్యదర్శిగా పెండెం చంద్రశేఖర్, కోశాధికారిగా చిలుముల సునీల్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా తోట శ్యామ్ ప్రసాద్, కక్కిరేణి చంద్రశేఖర్, పోలబోయిన నర్సయ్య, సంయుక్త కార్యదర్శి ఈగ దయాకర్ గుప్త, ఈసీ సభ్యులుగా నూక వెంకటేశం గుప్తా, భోనగిరి భాస్కర్, చల్లా లక్ష్మీకాంత్, బెలిదె అంజయ్య, మిర్యాల సుధాకర్, కుమ్మరికుంట్ల లింగయ్య, ఆరె సురేష్ రెడ్డి, పటేల్ నర్సింహా రెడ్డి, రాచకొండ శ్రీనివాస్, ధర్మారావు, గౌరవ సలహా దారులుగా గుణగంటి రాములు, గుడిపూడి వెంకటేశ్వర రావు, మొరిశెట్టి లక్షాదిలను ఎన్నుకున్నారు. -
బుకింగ్ లేకుండానే యూరియా విక్రయం!
ఫ ఖమ్మం జిల్లాకు తరలించడంతో ఆగ్రహించిన రైతులు కోదాడరూరల్ : కొందరు డీలర్లు యూరియా ను దళారులకు బ్లాక్లో ఎక్కువ రేటుకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కోదాడ పట్టణ పరిధిలోని తమ్మరలో నడిగూడెం మండల కేంద్రానికి చెందిన యాదగిరిలక్ష్మి నరసింహ ఫర్జిలైజర్ షాప్ యజమాని యాదగిరి ఎరువు గోడౌన్ను ఏర్పాటు చేసి స్టాక్ పాయింట్ పెట్టుకున్నాడు. అక్కడికి వందల బస్తాల యూరియాను దిగుమతి చేసుకున్నాడు. ఈక్రమంలో మంగళవారం రాత్రి అక్కడి నుంచి ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కొంగర గ్రామానికి చెందిన దళారులు, రైతులకు ఎలాంటి బుకింగ్ లేకుండానే వంద బస్తాలకు పైగా యూరియాను అక్రమంగా విక్రయించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక రైతులు సూర్యాపేట జిల్లాకు కేటాయించిన యూరియాను స్థానికంగా ఇవ్వకుండా ఖమ్మం జిల్లాకు చెందిన వారికి ఎలా విక్రయిస్తారని ప్రశ్నించారు. ఈవిషయంపై బుధవారం వ్యవసాయాధికారులకు సమాచారం ఇచ్చారు. వారు స్టాక్ పాయింట్ను పరిశీలించి యారియా బుకింగ్ లేకుండా విక్రయించారని గుర్తించారు. ఈమేరకు గోడౌన్ నిర్వాహకులపై పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఏఓ రజిని తెలిపారు. వైభవంగా లక్ష్మీనృసింహుడి నిత్యకల్యాణం మఠంపల్లి: మట్టపల్లి దేవాలయంలో లక్ష్మీనృసింహుడి నిత్యకల్యాణాన్ని అర్చకులు బుధవారం వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవతో ప్రత్యేక పూజ కార్యక్రమాలు ప్రారంభించారు. అనంతరం హోమశాలలో నిత్యాగ్నిహోత్రి చేపట్టారు. గర్భాలయంలో లక్ష్మీనారసింహుడి మూలవిరాట్కు పంచామృతాభిషేకం జరిపించారు. నిత్యకల్యాణంలో భాగంగా ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం చేపట్టారు. అదేవిధంగా విష్వక్సేనపూజ, రుత్విగ్వరణం, రక్షాబంధనం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ పూర్తిగావించారు. భక్తులకు మహానివేదనతో తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ చలపతిరావు, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభా చార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు. దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలినల్లగొండ టూటౌన్ : యువ ఇంజనీర్లు దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. ఎంజీ యూనివర్సిటీలో బుధవారం ఇంజనీరింగ్ కళాశాల నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశం సేవారంగం నుంచి ఉత్పత్తి ఎకనామీగా రూపాంతరం చెందడానికి యువ ఇంజనీర్ల సేవలు ఎంతో అవసరమన్నారు. ఈ సందర్భంగా అధ్యాపకులు.. కోర్సులు, నైపుణ్యాల వృద్ధి, పరీక్షల నిర్వహణ, స్పోర్ట్స్, ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి, ప్రిన్సిపాల్ హరీష్కుమార్, అధ్యాపకులు సంధ్యారాణి, సుధారాణి, జయంతి, ప్రొఫెసర్ సాంబశివరావు, రఘుమారావు, విజయ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. యువత దేశ చరిత్రను అధ్యయనం చేయాలిచౌటుప్పల్ : యువత దేశ చరిత్రను అధ్యయనం చేయాలని ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత సహ ప్రచారక్ కల్పగురు ప్రభాకర్జీ అన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని బుధవారం చౌటుప్పల్ పట్టణంలో యువ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో విభాగ్ సహకార్య వాహ తాడెం పాండుజీ, కె.కృష్ణయ్యజీ, ఏబీవీపీ నల్లగొండ జిల్లా కన్వీనర్ సుర్వి మణికంఠ, యాదాద్రి జిల్లా కన్వీనర్ ఉబ్బు సాయికిరణ్, ప్రచార ప్రతినిధి నారి మధు, ఆర్ఎస్ఎస్ చౌటుప్పల్ ఖండ మహిపాల్రెడ్డి, కార్యవాహ శ్రీరాములు, సహ కార్యవాహ రేణుకుమార్ పాల్గొన్నారు. -
పంట మారి్పడి బాట
భానుపురి (సూర్యాపేట) : వానాకాలం సీజన్ ప్రారంభమై రెండు నెలలు కావస్తోంది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా లోటు వర్షపాతమే నమోదైంది. రానున్న రోజుల్లోనూ వర్షాలు కురిసే అవకాశాలు లేనందున రైతులు వరి పంటకు బదులుగా ఆరుతడి పంటలను సాగు చేయాలి. లేదంటే నష్టపోయే అవకాశం ఉంది. ఈమేరకు రైతులను ఆరుతడి పంటల వైపు మళ్లించేందుకు జిల్లా యంత్రాంగం ‘రైతులతో మాట – పంట మార్పిడికి బాట’ పేరుతో ఈనెల 10న స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఈనెల 20వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇందులో భాగంగా అధికారులు రైతులను కలిసి ఎల్నినో పరిస్థితులను వివరించనున్నారు. ఇప్పటివరకు సాగులోకి రాకుండా మిగిలిపోయిన 2.21 లక్షల ఎకరాల భూముల్లో ఆరుతడి పంటలను సాగు చేయించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. 4.73,656 ఎకరాలకు గాను.. 2026– 27 వానాకాలం సీజన్లో అత్యధికంగా వరి 4,73,656 ఎకరాల్లో సాగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న ఎల్నినో పరిస్థితుల కారణంగా రుతుపవనాలు ప్రారంభమైన జూన్లో సాధారణ వర్షపాతానికి మించి వర్షం కురిసినా.. మెట్ట పంటలకే మేలు జరిగింది. జూలైలో 40 శాతం మేర లోటు వర్షపాతం ఉండగా ఆగస్టులో ఇప్పటివరకు 27 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఈ క్రమంలో 97,566 ఎకరాల్లో సాగు కావాల్సిన పత్తి 81 వేల ఎకరాల్లోనే సాగైంది. ఇక 4,73,656 ఎకరాల్లో సాగు కావాల్సిన వరి ఇప్పటివరకు 1.20 లక్షల ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. 2.21 లక్షల ఎకరాలే లక్ష్యంగా ప్రతి ఏటా బోరు బావుల కింద సాగయ్యే వరి పంటలు సగం కూడా సాగులోకి రాలేదు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో కలిపి దాదాపు 2.21 లక్షల ఎకరాల భూమి నాటు పడకుండా మిగిలిపోయినట్టు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. ఈ భూమిలో వరికి బదులుగా ఆరుతడి పంటలైన పెసర, కంది, మినుములు, కూరగాయలు, మొక్కజొన్న, వేరుశనగ పంటలను సాగు చేయించాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం రైతులతో మాట– పంట మార్పిడికి బాట పేరుతో పది రోజులపాటు అధికారులు రైతులను నేరుగా కలుస్తున్నారు. ఒక్కో అధికారి రోజుకు పది మంది చొప్పున రైతులను కలిసి ఆరుతడి పంటల గురించి వివరిస్తున్నారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వ్యవసాయ అధికారులే కాకుండా రెండు రోజులుగా కలెక్టర్ తేజస్నంద్లాల్ పవార్ సైతం వ్యవసాయ క్షేత్రాల బాట పట్టారు. మరో వారం రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుండగా జిల్లా యంత్రాంగం చేపడుతున్న ఈ వినూత్న కార్యక్రమం ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తుందో వేచి చూడాల్సిందే.ఫ ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన ఫ ఈనెల 20వరకు కొనసాగనున్న స్పెషల్ డ్రైవ్ ఫ మిగిలిపోయిన 2.21 లక్షల ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగే లక్ష్యం ఫ ఒక్కో అధికారి రోజుకు పది మంది రైతులను కలిసేలా ప్రణాళిక హుజూర్నగర్ : పంట మార్పిడి వ్యవసాయం ద్వారా భూమికి ఉపశమనం, రైతులకు లాభం కలుగుతుందని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. బుధవారం హుజూర్నగర్ మండలంలోని లక్కవరం, శ్రీనివాసపురం గ్రామాల్లో రైతులు సాగు చేస్తున్న కూరగాయలు, ఉద్యానవన పంటలను ఆయన పరిశీలించారు. శ్రీనివాసపురంలో ప్రొఫెసర్ డాక్టర్ పారుపల్లి శ్రీనివాసరావు వ్యవసాయ క్షేత్రంలో డ్రాగన్ ఫ్రూట్ తోటను పరిశీలించారు. లక్కవరం శివారులో రైతు పాశం వెంకటరెడ్డి రెండు ఎకరాల్లో బీర, మిర్చి, బెండకాయ, వంకాయ, సొర, బంతిపూల తోటలను కలెక్టర్ పరిశీలించారు. వారు పంటలు వేస్తున్న తీరును అడిగి తెలుసుకొని అభినందించారు. ఒకే పంట వేసి నష్టపోయే కంటే, ఇలా విభిన్న పంటలు వేయడం ద్వారా నిరంతరం ఆదాయం పొందవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. ఆయన వెంట ఆర్డీఓ శ్రీనివాసులు, ఏడీఏ రవి, ఏఓ స్వర్ణ, తహసీల్దార్ కవిత, ఉద్యానవన శాఖ అధికారి ప్రదీప్తి, హెచ్ఈఓ ఇస్మాయిల్ తదితరులున్నారు. రైతులు ప్రస్తుత వాతావరణ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. వరి సాగు చేసి నష్టపోకుండా ఆరుతడి పంటల వైపు ఆలోచన చేయాలి. అన్ని రకాల ఆరుతడి పంటల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. – శ్రీధర్రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి -
ఇళ్ల నిర్మాణ పనులు పూర్తిచేయాలి
హుజూర్నగర్ : హుజూర్నగర్లోని పెండింగ్లో ఉన్న మోడల్ కాలనీ ఇళ్ల నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. బుధవారం హుజూర్నగర్లో రామస్వామి గుట్ట వద్ద నిర్మిస్తున్న మోడల్ కాలనీ ఇళ్లను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఇళ్లలో చిన్నచిన్న లోపాలను గుర్తించి, వాటిని సరిచేయాలని కాంట్రాక్టర్లు, అధికారులకు ఆదేశించారు. ఇళ్లతోపాటు, డ్రెయినేజీ, తాగునీరు, రోడ్లు వంటి మౌలిక వసతుల కల్పన పనులను వేగవంతం చేయాలన్నారు. ఇళ్ల సముదాయం ప్రాంగణంలో మంజూరైన తెలంగాణ పబ్లిక్ స్కూల్ భవన పునాది పనులు, డైనింగ్ హాల్ నిర్మాణాలు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. వీటితో పాటు అంగన్వాడీ కేంద్రాలు, కమ్యూనిటీ హాళ్లు, షాపింగ్ కాంప్లెక్స్లు, స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ల నిర్మాణ పనులకు ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేయిస్తున్నట్లు వివరించారు. మోడల్ కాలనీ ఇళ్ల పంపిణీకి ఆర్డీఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ ద్వారా ప్రాథమికంగా 1,805 మంది అర్హులైన లబ్ధిదారులతో జాబితాను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. దీనిపై వచ్చిన అభ్యంతరాలను, ఫిర్యాదులను ప్రత్యేక బృందాల ద్వారా క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నామని తెలిపారు. అర్హత లేని వారి పేర్లు ఉంటే తొలగిస్తామని, నిజమైన పేదలకు మాత్రమే ఇళ్ల కేటాయిస్తామని స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ శ్రీనివాసులు హౌసింగ్ పీడీ జబ్బర్ హేహ్మద్, తహసీల్దార్ కవిత, మున్సిపల్ కమిషనర్ సతీష్ కుమార్, వివిద శాఖల అధికారులు, కాంట్రాక్టర్లు, సిబ్బంది ఉన్నారు. సౌకర్యాలు మెరుగు పరుస్తాం హుజూర్నగర్ : హుజూర్నగర్ గ్రంథాలయంలో సౌకర్యాలు మెరుగు పరిచేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. బుధవారం పట్టణంలోని గ్రంథాలయాన్ని ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా గ్రంథాలయ పితామహుడు ఎస్ఆర్ రంగనాథన్ జయంతి పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. గ్రంథాలయంలో విద్యార్థులు, నిరుద్యోగుల మౌలిక సదుపాయాల కల్పనకు రూ.2 లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. గ్రంథాలయానికి వచ్చే పాఠకుల సంఖ్యకు అనుగుణంగా వసతులు పెంచాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ కవిత, లైబ్రరీ ఇన్చార్జి శ్రీధర్ రెడ్డి తదితరులున్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
సంఘం చేస్తున్న కృషి అభినందనీయం
పాఠశాల అభివృద్ధికి ఉద్యోగుల సంఘం చేస్తున్న కృషి అభినందనీయం. మౌలిక వసతులు కల్పించడంతో పాటు రవాణా సౌకర్యం అందించడం మరువలేనిది. ప్రస్తుతం కొన్ని తరగతి గదులు కురుస్తుండగా, వాటి మరమ్మతులకు సంఘం సభ్యులు సహకరించాలని కోరుతున్నాం. – శోభన్బాబు, హెచ్ఎం, జెడ్పీ ఉన్నత పాఠశాల గతంలో ప్రైవేట్ పాఠశాలలో చదివేవాడిని. ఇప్పుడు మా ఊరి పాఠశాలలో మంచి చదువుతో పాటు ఉచితంగా ఆటో సౌకర్యం కల్పించడంతో ఇక్కడే చేరాను. మినరల్ వాటర్ సహా అన్ని వసతులు బాగున్నాయి. -
మూతబడే పాఠశాలలో అక్షర వెలుగులు
ఫ గ్రామంలో పాఠశాల అభివృద్ధికి సంఘంగా ఏర్పడిన ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఫ సొంత ఖర్చులతో ఆటో, మౌలిక సౌకర్యాల కల్పన గ్రామంలోని సుమారు 50 మంది ఉద్యోగులం ఏకమై సంఘంగా ఏర్పడి గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నాం. ముఖ్యంగా విద్యాభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నాం. భవిష్యత్లో మా సంఘ సభ్యుల సంఖ్యను వందకు పెంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. – పందిరి బ్రహ్మారెడ్డి, ఉద్యోగుల సంఘం సభ్యుడు మునగాల: తాము చదువుకున్న పాఠశాల మూతపడుతుందన్న ఆవేదన ఆ ఊరి ఉద్యోగుల్లో మార్పు తెచ్చింది. అందరూ కలిసికట్టుగా ఒకే తాటిపై నిలిచి జెడ్పీ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతోపాటు, విద్యార్థులను పాఠశాలకు తీసుకువచ్చేందుకు ఉచితంగా ఆటో సౌకర్యం కూడా కల్పించారు. మునగాల మండలంలోని పాత ముకుందాపురం గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గి మూతపడే స్థాయికి చేరుకోవడంతో రెండేళ్ల క్రితం ‘సాక్షి దినపత్రిక’ ప్రచురించిన కథనం స్థానిక పూర్వ విద్యార్థులను ఆలోచింపజేసింది. ఇదే పాఠశాలలో చదువుకున్న కుత్బుల్లాపూర్ డీసీపీ నంద్యాల కోటిరెడ్డి, రిటైర్డ్ ఏఎస్పీ పందిరి శ్రీనివాసరెడ్డి స్పందించారు. గ్రామానికి చెందిన 50 మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులందరినీ సమీకరించి ఓ సంఘంగా ఏర్పడి పాఠశాలల అభివృద్ధికి నడుం బిగించారు. ఈక్రమంలో తొలుత పాఠశాలలను బలోపేతం చేసే దిశగా ప్రణాళికలు రూపొందించి గ్రామ ప్రజలను చైతన్యపరిచి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడంలో సఫలీకృతులయ్యారు. ఫలితంగా గతంలో ఉన్నత పాఠశాలలో 22 మంది ఉన్న విద్యార్థుల సంఖ్య ప్రస్తుతం 48కి చేరింది. ప్రాథమిక పాఠశాలలో 20 మంది విద్యార్థుల నుంచి 31 మందికి పెరిగింది. రూ. లక్షన్నరతో మౌలిక వసతులు ఉద్యోగుల సంఘం తమ వంతుగా సుమారు రూ.లక్షన్నర వెచ్చించి పాఠశాల భవనాలకు పెయింటింగ్లు వేయించారు. మినీ మినరల్ వాటర్ ప్లాంట్, ప్రింటర్, కంప్యూటర్లను సమకూర్చారు. ముకుందాపురం గ్రామం పాత, కొత్త, మధ్య ఊరుగా విడిపోయి ఉండగా.. ఉన్నత పాఠశాల మధ్య ఊరిలో ఉంది. కొత్త, పాత ఊరి నుంచి పిల్లలు కిలోమీటరు దూరం నడిచి రావాల్సి వస్తున్న ఇబ్బందిని గుర్తించిన సంఘం.. సొంతంగా నెలకు రూ.10వేలతో ప్రత్యేకంగా ఒక ఆటోను ఏర్పాటు చేసి ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థులను ఉచితంగా బడికి తీసుకొచ్చి వదిలే సదుపాయం కల్పించింది. అదేవిధంగా ప్రాథమిక పాఠశాలలో నాణ్యమైన విద్య కోసం రెండేళ్లుగా నెలకు రూ.12వేల వేతనంతో విద్యా వలంటీర్ను నియమించారు. ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కేవలం విద్యే కాకుండా, గ్రామాభివృద్ధిని కూడా ఉద్యోగులు తమ భుజాన వేసుకున్నారు. గ్రామంలో శివాలయం నిర్మాణం కోసం రూ. 50 లక్షల విరాళాలు సేకరించి స్థలం కొనుగోలు చేశారు. రాజకీయాలకు అతీతంగా గ్రామ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని, భవిష్యత్లో సంఘాన్ని మరింత విస్తరిస్తామని సభ్యులు తెలిపారు. -
భార్యాభర్తలను హత్య చేసి పాతిపెట్టారు
మోతె: భార్యాభర్తలను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి వ్యవసాయ భూమిలో పూడ్చిపెట్టారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. మోతె మండలం బీక్యతండాకు చెందిన హలావత్ నాగులు (50), బూబ (46) దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారికి వివాహాలు అయ్యాయి. నాగులు, బూబ దంపతులు కొంతకాలంగా మోతె మండల కేంద్రంలో ఇల్లు అద్దెకు తీసుకొని.. బొక్క అమృతారెడ్డి అనే రైతుకు చెందిన భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. వీరు రోజూ ఇంటి నుంచి రెండు ఆవులను తోలుకొని పొలానికి వెళ్లి వ్యవసాయ పనులు చేసుకొని తిరిగి ఇంటికి వచ్చేవారు. అయితే వీరు కౌలుకు చేస్తున్న భూమి సమీపంలో బుధవారం ఉదయం వరి నాట్లు వేసేందుకు వెళ్లిన కూలీలు అక్కడ వీరిద్దరిని పూడ్చిపెట్టినట్లు గుర్తించి గ్రామస్తులకు చెప్పారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, మునగాల సీఐ రామకృష్ణారెడ్డి, మోతె ఎస్ఐ బి.లచ్చిరెడ్డి తహసీల్దార్ బి.వెంకన్న ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. మృతులు నాగులు, బూబగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. గుర్తుతెలియని వ్యక్తులు వారిని చంపి పూడ్చిపెట్టి ఉంటారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కాగా.. మంగళవారం రాత్రి నాగులు, బూబ దంపతులు రెండు ఆవులను తోలుకుని రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్లినట్లు చుట్టుపక్కల వారు తెలిపారు. ఘటనా స్థలాన్ని సూర్యాపేట ఎస్పీ నర్సింహ పరిశీలించారు. -
ఇంటర్ విద్యార్థులకు నోట్బుక్స్
హుజూర్నగర్ : ప్రభుత్వ కళాశాలల్లో చదివే ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం నోట్బుక్స్ పంపిణీ చేస్తోంది. ఇంటర్ విద్యను సర్వశిక్ష అభియాన్కింద చేర్చడంతో పాఠశాల విద్యార్థుల మాదిరిగానే ఇంటర్ పిల్ల లకు సైతం ఉచిత పాఠ్య పుస్తకాలతో పాటు ఒక్కొక్కరికి 200 పేజీల 12 నోట్బుక్స్ అందిస్తోంది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కళాశాలలకు ఇప్పటికే నోట్ పుస్తకాలను పంపింణీ చేశారు. ఆయా కళాశాలల ప్రిన్స్పాల్స్ వాటిని విద్యార్థులకు అందిస్తున్నారు. 8 కళాశాలలకు సరఫరా సూర్యాపేట జిల్లాలో మొత్తం 8 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. సూర్యాపేట, నడిగూడెం, తుంగతుర్తి, కోదాడ, నేరేడుచర్ల, హుజూర్నగర్, నెమ్మికల్, తిరుమలగిరిలో ఉన్న ప్రభుత్వ కళాశాలల్లో సుమారు 3,452 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఒక్కోక్క విద్యార్థికి 12 నోటు పుస్తకాల చొప్పున మొత్తం 41,424 బుక్స్ను ప్రభుత్వం జిల్లాకు సరఫరా చేసింది. ఇటీవల డీఐఈఓ సులోచనారాణి విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీని ప్రారంభించారు. ప్రస్తుతం ఆయా కళాశాలల ప్రిన్స్పాల్స్ వాటిని విద్యార్థులకు అందిస్తున్నారు. మరి కొన్ని చోట్ల ఈ నెల 15న అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నోటు పుస్తకాల పంపిణీతో విద్యార్థులపై రూ.800లకు పైగా ఆర్థిక భారం తగ్గనుంది. త్వరలో మధ్యాహ్న భోజనం ఈ విద్యా సంవత్సరం నుంచి జూనియర్ కళాశాలల్లో డిజిటల్ ప్యానల్ బోర్డులపై బోధన ప్రారంభించారు. దాంతో పాటు ప్రయోగ పరీక్షలకు సైతం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. త్వరలోనే జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం కూడా అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా న్యూట్రిషన్ కమిటీలను ఏర్పాటు చేసి వారి పర్యవేక్షణలో ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఫ ఒక్కొక్కరికి 12 చొప్పున అందజేత ఫ 8 కళాశాలలకు 41,424 బుక్స్ పంపిణీప్రభుత్వ కళాశాల విద్యార్థులందరికీ ప్రభుత్వం ఇంటర్ బోర్డు ద్వారా నోటు పుస్తకాలు సరఫరా చేసింది. జిల్లాలోని 8 జూనియర్ కాలేజీల్లో చదువుతున్న ఒక్కో విద్యార్థికి 12 నోట్బుక్స్ చొప్పున పంపిణీ చేస్తున్నాం. కాలేజీల్లో చదివే విద్యార్థులకు త్వరలో బ్యాగులు, షూస్ కూడా అందిస్తాం. – బి. సులోచనారాణి, డీఐఈఓ, సూర్యాపేట -
ఏసీ కోచ్ ఇస్తామని.. లగ్జరీ బస్సులు తీసేశారు!
ఫ దూర ప్రయాణం చేసే ప్రయాణికులకు ఇబ్బందులు ఫ ఆర్టీసీ అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం కోదాడ ఆర్టీసీ డిపోలో ఉన్న 9 సూపర్లగ్జరీ బస్సులను తీసుకొని, వాటి స్థానంలో 14 ఇతర బస్సులను ఇచ్చారు. కోదాడ డిపో విజయవాడ– హైదరాబాద్ మధ్యలో ఉండడంతో లగ్జరీ బస్సులను ఆపరేట్ చేయడం సంస్థకు లాభదాయకంగా లేదు. ఇతర బస్సులతో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాము. – శ్రీనివాసరావు, డిపో మేనేజర్, కోదాడ కోదాడ, హుజూర్నగర్ ప్రాంత వాసులకు అవసరమైన బస్సులను కోదాడ డిపోద్వారా ఏర్పాటు చేయాలి. లగ్జరీ బస్సులను వెంటనే వెనక్కి తీసుకు రావడంతో పాటు గతంలో మంత్రుల ఇచ్చిన హామీ మేరకు రాజధాని బస్సును అందుబాటులోకి తీసుకురావాలి. అవసరమైన బస్సులే లేనప్పుడు కోట్ల రూపాయలతో బస్టాండ్ల నిర్మాణం దండగే. – రాయపూడి చిన్ని, ప్రజాచైతన్య వేదిక కన్వీనర్, కోదాడ ‘‘ కోదాడ ఆర్టీసీ డిపోకు రాజధాని ఏసీ బస్సును మంజూరు చేస్తున్నాము. కోదాడ, హుజూర్నగర్ ప్రజలు ఉదయం ఏసీ బస్సు ఎక్కి హైదరాబాద్కు వచ్చి నన్ను కలిసి సాయంత్రం అదే ఏసీ బస్సులో కోదాడ, హుజూర్నగర్కు చేరుకోవచ్చు.’’ ఇది సంవత్సరం క్రితం రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి కోదాడ బస్టాండ్ను సందర్శించిన సమయంలో చేసిన ప్రకటన. కోదాడ : కోదాడ ఆర్టీసీ డిపోకు ఏసీ బస్సులు మంజూరు చేస్తామంటూ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చలేదు. పైగా ప్రస్తుతం డిపోలో ఉన్న 9 సూపర్ లగ్జరీ బస్సులను సైతం సంస్థ అధికారులు ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించారు. వాటి స్థానంలో సాధారణ బస్సులను పంపడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దూర ప్రయాణికులకు ఇబ్బందే.. కోదాడ డిపోలో ఉన్న సూపర్లగ్జరీ బస్సులు కోదాడ నుంచి బయలుదేరి హుజూర్నగర్ మీదుగా హైదరాబాద్కు వెళ్తుండేవి. దాంతో వివిధ పనుల నిమిత్తం హైదరాబాద్కు వెళ్లే కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉండేది. ఆర్టీసీ అధికారులు వీటిని రద్దు చేయడంతో హైదరాబాద్కు వెళ్లేందుకు విజయవాడ నంచి వచ్చే ఏపీ బస్సులపైనే ఆధారపడాల్సి వస్తున్నది. ఇవి పైనుంచే ప్రయాణికులతో నిండిపోయి ఉండడంతో స్థానికులకు సీట్లు దొరక్క నిలబడి ప్రయాణించాల్సి వస్తున్నది. ఎక్స్ప్రెస్ బస్సుల్లో సమయం ఎక్కువగా పడుతుండడం, రద్దీ అధికంగా ఉంటుండడంతో దూర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వచ్చిన బస్సు వెనక్కి.. సంవత్సరం క్రితం మంత్రుల ఇచ్చిన హామీ మేరకు కోదాడ డిపోకు ఒక రాజధాని ఏసీ బస్సును అధికారులు పంపించారు. ఈ బస్సును మంత్రి ప్రారంభిస్తారని అప్పట్లో అధికారులు ప్రకటించారు. దాంతో తమకు ఏసీ బస్సు అందుబాటులో వస్తుందని కోదాడ, హుజూర్నగర్ వాసులు ఆనందం వ్యక్తం చేశారు. కానీ రాజధాని బస్సును ప్రారంభించకుండా.. నాలుగు నెలల పాటు కోదాడ డిపోలో ఉంచిన అధికారులు దానిని వెనక్కి పంపించారు. ప్రస్తుతం డిపోలో ఉన్న సూపర్లగ్జరీ బస్సులను సైతం తీసివేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయలతో బస్టాండ్ల నిర్మాణం ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడానికి హుజూర్నగర్లో రూ.4 కోట్లతో, కోదాడలో రూ.26 కోట్లతో కొత్త బస్టాండ్ల నిర్మాణానికి నెల రోజుల క్రితం మంత్రులు శంకుస్థాపన చేశారు. ప్రసుత్తం కోదాడ డిపోలో 60 ఆర్టీసీ బస్సులు, 30 అద్దెబస్సులు ఉన్నాయి. ప్రయాణికుల అవసరాలకు సరిపడ బస్సులు లేనప్పుడు కోట్ల రూపాయలతో బస్టాండ్లు నిర్మించడం ఎందుకని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. కోదాడ, హుజూర్నగర్ నుంచి హైదరాబాద్కు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామని, ఈ విషయమై మంత్రి జోక్యం చేసుకొని కోదాడ నుంచి హుజూర్నగర్ మీదుగా సూపర్లగ్జరీ, రాజధాని బస్సులను నడిపించాలని స్థానికులు కోరుతున్నారు. -
రైలు కోసం ఐదు దశాబ్దాలుగా ఎదురుచూపు
సూర్యాపేట : సూర్యాపేట జిల్లా ప్రజలు రైలు సౌకర్యం కోసం ఐదు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారని బుల్లెట్ ట్రైన్సాధన సమితి కన్వీనర్ ఆరుట్ల జానకిరెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలో టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సూర్యాపేట వంటి ప్రధాన వాణిజ్య, విద్యా, పారిశ్రామిక కేంద్రాన్ని బుల్లెట్ ట్రైన్న్ అలైన్న్మెంట్ నుంచి తొలగించడం ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛను దెబ్బతీసిందని పేర్కొన్నారు. బుల్లెట్ ట్రైన్ సాధించేందుకు అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎన్. సోంబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ అనిల్కుమార్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లు నాగార్జునరెడ్డి, టప్రా జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నె యాదగిరి, నాయకులు కొలిశెట్టి యాదగిరిరావు, మట్టిపెల్లి సైదులు, వెంకటయ్య, వెలుగు రమేష్, చిలుక రమేష్, డి.లాలు, పాపిరెడ్డి, ఎన్. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీనరసింహునికి నిత్యకల్యాణంమఠంపల్లి : మట్టపల్లి ఆలయంలో మంగళవారం రాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి సమేత లక్ష్మీనరసింహుని నిత్యకల్యాణాన్ని అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హోమశాలలో నిత్యఅగ్నిహోత్రి చేపట్టారు. గర్భాలయంలో స్వామివారి మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. నిత్యకల్యాణంలో భాగంగా విష్వక్సేనపూజ, రుత్విగ్వరణం, రక్షాబంధనం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ, తలంబ్రాలతో ఘనంగా నిర్వహించారు. క్షేత్రపాలకుడైన వీరాంజనేయస్వామికి నాగవళ్లీ దళాలతో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ చలపతిరావు, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభా చార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, వంశీ కృష్ణమాచార్యులు, సాయికుమారాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. తక్కువ నీటితో పండే పంటలు సాగు చేయాలిపెన్పహాడ్ : ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా రైతులు తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలనే సాగు చేయాలని జడ్పీ సీఈఓ శిరీష అన్నారు. మంగళవారం మండలంలోని దోసపహాడ్ గ్రామంలో నిర్వహించిన రైతుల అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. వరి పంటకు ప్రత్యామ్నాయంగా మినుములు, కందులు, అలసంద, జొన్నలు, కూరగాయాలు పండించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జానయ్య, ఏఈఓ మురళి, పంచాయతీ కార్యదర్శి జాని, ఉప సర్పంచ్ రాము పాల్గొన్నారు. నీటి ఎద్దడి నివారణకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లుతిరుమలగిరి(తుంగతుర్తి) : ఎల్నినో ప్రభావంతో మున్సిపాలిటీ పరిధిలో నీటి ఎద్దడి సమస్య ఏర్పడితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ సంకెపల్లి రఘునందన్రెడ్డి అన్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలో జరుగనున్న బోనాలు, వినాయక చవితి పండుగల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. సమావేశంలో వైస్ చైర్మన్ ఏమోజు గోవిందమ్మ రవీందర్, మున్సిపల్ కమిషనర్ సీహెచ్.వెంకన్న, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
సైబర్ మోసాల కట్టడికి ప్రత్యేక ప్రణాళిక : ఎస్పీ
సూర్యాపేటటౌన్ : సైబర్ మోసాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక ప్రణాళికతో పని చేస్తున్నట్లు ఎస్పీ నరసింహ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం సూర్యాపేట డివిజన్ స్థాయి పోలీసు అధికారుల నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించారు. గత నెలలో నమోదైన కేసుల వివరాలు, పోలీసు దర్యాప్తు, కేసుల పురోగతిని సమీక్షించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీసు అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, బాధితుల సమస్యను త్వరగా పరిష్కరించాలని సూచించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజా ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, కేసులు పెండింగ్లో ఉండొద్దని ఆదేశించారు. అదనపు ఎస్పీ రవీందర్రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ రవి, డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐలు వెంకటయ్య, నాగేశ్వరరావు, ఉపేందర్రావు, రాజశేఖర్, ఎస్ఐలు పాల్గొన్నారు. -
ఆటలతో విశ్రాంత ఉద్యోగుల్లో ఉత్సాహం
హుజూర్నగర్ : ఆటల పోటీలతో విశ్రాంత ఉద్యోగుల్లో నూతన ఉత్సాహం వస్తున్నదని ప్రభుత్వ పెన్షనర్ల సంఘం కార్యదర్శి కొప్పుల వీరారెడ్డి అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హుజూర్నగర్లోని సంఘం కార్యాలయంలో మంగళవారం పెన్షనర్ల ఆటల పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా క్యారమ్స్ సింగిల్స్, డబుల్స్, జూనియర్ సింగిల్స్, డబుల్స్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో 20 మంది పెన్షనర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు ఈ నెల 15న బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో పెన్షనర్ల సంఘం నాయకులు, పెన్షనర్లు పాల్గొన్నారు. -
ఆరుతడి పంటలు సాగు చేయాలి
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట), నూతనకల్ : వర్షాభావం పరిస్థితులు నెలకొన్న కారణంగా రైతులు ఆరు తడి పంటల సాగు దిశగా ఆలోచన చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. మంగళవారం ‘రైతులతో మాట.. పంటల మార్పిడికి బాట’ కార్యక్రమంలో భాగంగా ఆత్మకూర్ (ఎస్), తుమ్మలపెన్పహాడ్ గ్రామాలను ఆయన సందర్శించారు. బంతి సాగు చేస్తున్న సోమిరెడ్డి వీరారెడ్డి తోటను పరిశీలించారు. తుమ్మలపెన్పహాడ్లో జటంగి సౌనయ్య పొలంలో ఉన్న పాలీహౌస్ను పరిశీలించారు. తక్కువ నీటితో కూరగాయలు, పూలు, పండ్లు సాగు చేస్తున్న సౌనయ్యను అభినందించారు. అనంతరం మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో కొద్దిసేపు సరదాగా మాట్లాడారు. పాఠశాల ఆవరణను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని సూచించారు. నూతనకల్ మండలంలోని ఎర్రపహాడ్లో పామాయిల్ తోటలో అంతర పంటగా సాగు చేసిన పెసరను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ ఎం.శ్రీనివాసరావు, మండల ప్రత్యేక అధికారి భారతి, ఎంపీడీఓ సునీత, ఎంపీఓ హరిసింగ్, ఏఓ సైదానాయక్, సర్పంచ్ గాడ్దుల లింగరాజు, ఆత్మకూర్(ఎస్) మండలంలో కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, ప్రత్యేక అధికారి విశాల్ దారా, తహసీల్దార్ అమీన్ సింగ్, ఎంపీఓ ప్రియాంక, వ్యవసాయ అధికారి దివ్య, హార్టికల్చర్ అధికారి స్వాతి, ప్రిన్సిపాల్ సరస్వతి, సర్పంచ్ కాటయ్య, తదితరులు ఉన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
బుల్లెట్ రైలు సాధించే వరకు ఉద్యమం
ఆత్మకూర్ (ఎస్) (సూర్యాపేట) : శంషాబాద్ నుంచి చైన్నెకి వెళ్లే బుల్లెట్ రైలును ముందుగా ప్రకటించిన ప్రకారం సూర్యాపేట మీదుగా కొనసాగించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. బుల్లెట్ ట్రైన్ను సాధించే వరకు ఉద్యమాలను ఉపేది లేదని స్పష్టం చేశారు. ఆత్మకూర్(ఎస్) మండలం నెమ్మికల్ గ్రామంలో సూర్యాపేట – దంతాలపల్లి ప్రధాన రహదారిపై మంగళవారం అఖిలపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కేంద్రం ప్రకటించిన బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ను మార్చడాన్ని ఖండించారు. సుమారు గంటసేపు రోడ్డుపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కార్యక్రమంలో రిటైర్డ్ డీఎం బయ్య మల్లికార్జున్, అఖిల పక్షాల నాయకులు తూడి నర్సింహారావు, అవిరె అప్పయ్య నర్సిరెడ్డి, బత్తుల ప్రసాద్, దండ వెంకట్రెడ్డి, గుండు రమేష్, బెల్లం కొండ యాదగిరి, గుంశావలి, ప్రశాంత్ రామనర్సు, గుండు రమేష్, కన్నయ్య, పందిరి మాధవరెడ్డి, నల్లగొండ నాగయ్య, దానియేల్, సుందరయ్య, కంచర్ల నర్సక్క, బాలాజీ, రాంరెడ్డి, నాగరాజు, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.ఫ అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో -
వరుణుడు కరుణించాలని కృష్ణానది తీరంలో యాగం
అక్రమ కలప సీజ్ జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన 20 టన్నుల సండ్ర కలపను సీజ్ చేశారు. మంగళవారం శ్రీ 11 శ్రీ ఆగస్టు శ్రీ 2026- 8లోనాగార్జునసాగర్ : వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు మురవాలని ప్రభుత్వం సోమవారం నాగార్జునసాగర్ కృష్ణాతీరంలో మహావరుణ యాగం చేపట్టింది. కృష్ణమ్మ ఒడ్డున విజయవిహార్ ప్రాంగణం ఉదయం నాలుగు గంటల నుంచే వేద పండితుల మంత్రోచ్ఛరణలతో మార్మోగింది. రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి నదులు పరవళ్లు తొక్కాలని, జలాశయాలు, చెరువులు, కుంటలు నిండాలని ఆకాంక్షిస్తూ చేపట్టిన వరుణయాగం తెల్లవారు జామున 4.05 గంటలకు భారీనీటి పారుదల శాఖామంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి దంపతులు గోవుపూజ, యాగశాల ప్రదక్షిణతో మొదలైంది. 108 మంది రుత్విక్కు లు 11 హోమగుండాల్లో శాస్త్రోక్తంగా వైదిక క్రతువులను నిర్వహించారు. యాగంలో ప్రధాన ఘట్టమైన పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దంపతులు పాల్గొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరుణుడిని ప్రసన్నం చేసుకునే సంకల్పంతో.. సనాతన హిందూ సంప్రదాయంలో యజ్ఞయాగాలకు విశిష్ట స్థానం ఉంది. వేదకాలం నుంచే వర్షాలకు అధిపతిగా భావించే వరుణ దేవుడిని ఆరాధి స్తూ ప్రత్యేక క్రతువులు నిర్వహించే సంప్రదాయం ఉంది. ఇదే సంప్రదాయంలో భాగంగా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రభుత్వం ఈ మహావరుణ యాగాన్ని చేపట్టింది. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనకుండా, రైతులకు సాగునీరు అందుబాటులో ఉండేలా వర్షాలు సమృద్ధిగా కురవాలని, రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు పెరగాలని, యాగం సందర్భంగా సంకల్పించారు. 11 హోమ గుండాల్లో వైదిక క్రతువులు విజయవిహార్ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 11 హోమగుండాలు యాగానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.108 మంది రుత్విక్కులు వైదిక విధానాలను అనుసరిస్తూ మత్రోచ్ఛరణలతో హోమ క్రతువు నిర్వహించారు. హోమగుండాల్లో పవిత్ర ద్రవ్యాలను సమర్పిస్తూ వరుణ దేవుడిని ఆరాధించారు. యాగశాల చుట్టూ దేవతా విగ్రహాలు, కలశాలు, పుష్పాలంకరణలు ఏర్పాటు చేయడంతో వాతావరణం మరింత శోభాయమానంగా కనిపించింది. పూర్ణాహుతి ఘట్టం.. యాగంలో చివరి ఘట్టమైన మహాపూర్ణాహుతిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రుత్విక్కులు వేద మంత్రాలను పఠిస్తూ పూర్ణాహుతి ద్రవ్యాలను హోమాగ్నికి సమర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి దంపతులు యాగశాలలో పాల్గొని రుత్విక్కుల సూచనల మేరకు పూర్ణాహుతి నిర్వహించారు. యాగం విజయవంతంగా పూర్తయి రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురువాలని ప్రార్థనలు చేశారు. ప్రజలు వీక్షించేలా ఎల్ఈడీ తెరలు యాగశాలలో జరుగుతున్న వైదిక కార్యక్రమాలను ప్రజలు ప్రత్యక్షంగా తిలకించేలా విజయవిహార్ ప్రాంగణంలో ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. యాగశాలలోకి ప్రవేశించలేని భక్తులు, ప్రజలు కూడా పూర్ణాహుతి కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. యాగం సందర్భంగా భద్రత, పార్కింగ్, తాగునీరు తదితర సౌకర్యాలను అధికారులు సమకూర్చారు. ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తాంఫ ప్రధాన ఘట్టమైన పూర్ణాహుతిలో పాల్గొన్న సీఎం రేవంత్రెడ్డి దంపతులు ఫ 108 మంది రుత్విక్కులతో 11 హోమగుండాల్లో వైదిక క్రతువులు ఫ వేద మంత్రోచ్ఛరణలతో మార్మోగిన ప్రాంగణం వరుణ యాగంలో కలశ ఇష్టికి ప్రత్యేక ప్రాధాన్యం ఉందని వేద పండితులు తెలిపారు. వరుణ దేవుడిని ఆహ్వానిస్తూ నిర్ధిష్ట మంత్రోచ్ఛారణలతో ఆహుతులు సమర్పించడం, కలశాలను పవిత్ర జలంతో సిద్ధం చేసి పూజించడం వంటి కార్యక్రమాలను శాష్త్రోక్తంగా నిర్వహించారు. పూజాసామగ్రి, పండ్లు, పుష్పాలు, ధాన్యాలు తదితరాలతో హోమగుండాల చుట్టూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
మార్కెట్కు తాళం
ప్రభుత్వం కోట్ల రూపాయతో మార్కెట్ నిర్మించినప్పటికీ కూరగాయల వ్యాపారులు రోడ్డుపైనే బండ్లు, దుకాణాలు ఏర్పాటు చేసుకుని విక్రయాలు చేస్తున్నారు. ఫలితంగా మార్కెట్ నిరుపయోగంగా మారగా మున్సిపల్ అధికారులు దానికి తాళం వేశారు. రోడ్లపై విక్రయాలతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రద్దీ ఎక్కువైన సందర్భాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటున్నది. కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చే ప్రజలు రోడ్డుపైనే వాహనాలు నిలుపుతుండడంతో తరచూ ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమీకృత మార్కెట్లో కూరగాయలు, మాంసం, చేపల విక్రయాలకు అవసరమైన సదుపాయాలను కల్పించి వ్యాపారులను అక్కడికి తరలించాలని ప్రజలు కోరుతున్నారు. -
పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం
తిరుమలగిరి (తుంగతుర్తి) : పోరాటాలతోనే చేనేత కార్మికుల సమస్యలు పరిష్కారమవుతాయని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనం శాంతికుమార్ అన్నారు. తిరుమలగిరిలో సోమవారం నిర్వహించిన చేనేత పారిశ్రామిక సహకార సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల ధాన్యాన్ని ప్రభుత్వం కల్లాల వద్దనే ఎలా కొనుగోలు చేస్తున్నదో, అలానే చేనేత సహకార సంఘాల వద్ద కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. చేనేత వస్త్రాలు కొనుగోలు చేయకపొతే పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. 50 ఏళ్లు నిండిన చేనేత కార్మికులకు వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని, చేనేత కార్మికులకు హౌస్ కమ్ వర్క్ షెడ్ మంజూరు చేయాలని, ఆరోగ్య బీమా అమలు చేయాలని కోరారు. వంగరి బ్రహ్మం అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంఘం నాయకులు మహేశ్వరం జయచందర్, వైట్ల మురళి, వెంకన్న, నరసింహస్వామి, మద్దూరి వెంకన్న, పొన్నం వెంకటనారాయణ, ఉపాధ్యక్షుడు అంజయ్య, కార్యదర్శి సోమనారాయణ, మల్లయ్య పాల్గొన్నారు. చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనం శాంతికుమార్ -
బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
సూర్యాపేటటౌన్ : పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ నరసింహ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ఆయన పాల్గొని బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన వారి సమస్యలను విన్న ఎస్పీ వాటి పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకునేలా సంబంధిత పోలీస్ అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోలీస్ శాఖ అందుబాటులో ఉంటుందన్నారు. ఆరుతడి పంటలపై దృష్టి సారించాలినాగారం : ఎల్నినో ప్రభావంతో తగినంత వర్షాలు పడే అవకాశం లేనందున రైతులు వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ అధికారి యాదగిరి అన్నారు. సోమవారం మండలంలోని నాగారంబంగ్లా, వర్థమానుకోట గ్రామాల్లో ‘రైతులతో మాట–పంట మార్పిడికి బాట’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం వర్షపాతం, భూగర్భ జలాలు తగ్గే అవకాశం ఉందని, విద్యుత్ కొరత ఏర్పడవచ్చన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు వరి విస్తీర్ణం తగ్గించి కందులు, పెసర్లు, మినుములు, ఉలవలు, జొన్నలు, సజ్జలు, కుసుమ, ఆముదం, నువ్వులు, కూరగాయలు సాగు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి కె.అశోక్, ఎంపీడీఓ అంజిరెడ్డి, ఏఓ పి.కృష్ణకాంత్, సర్పంచ్లు ఆకుల బుచ్చిబాబు, బయ్యం సుజాతవెంకన్న, ఎంపీఓ సుమలత పాల్గొన్నారు. ఇంకుడు గుంతలతో ప్రయోజనంకోదాడరూరల్ : ఎల్నినో ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో భూ గర్భజలాలు పెరగడానికి ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా వీఓఏలు అవగాహన కల్పించాలని డీఆర్డీఓ సన్యాసయ్య సూచించారు. సోమవారం పట్టణంలోని మహిళా సమాఖ్య భవన్లో మహిళా రైతులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. భూగర్భ జలాలను పెంచేందుకు ఇంకుడు గుంతలు, ఊరకుంటలు, పామ్పాండ్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే పంటల సాగుపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కవిత, కార్యదర్శి అనిత, ఎంపీఓ రాంబాబు, డీపీఎం లక్ష్మీనారాయణ, ఏపీఎం పొన్నం వెంకన్న, వెంకయ్య, పరిమళ, వీఓఏ, వీఓబీ పాల్గొన్నారు. లక్ష్మీనరసింహుని నిత్య కల్యాణం మఠంపల్లి: మట్టపల్లి లక్ష్మీనరసింహుని ఆలయంలో సోమవారం స్వామివారి నిత్యకల్యాణాన్ని అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హోమశాలలో నిత్యాగ్నిహోత్రి చేపట్టారు. గర్భాలయంలో లక్ష్మీనరసింహుని మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేశారు. స్వామివారి నిత్యకల్యాణంలో భాగంగా విష్వక్సేనపూజ, రుత్విగ్వరణం, రక్షాబంధనం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ, తలంబ్రాలతో ఘనంగా నిర్వహించారు. క్షేత్రంలోని శివాలయంలో పార్వతీ రామలింగేశ్వరునికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ , అర్చకులు పాల్గొన్నారు. -
అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు
సూర్యాపేట : అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని కార్మిక, రైతు సంఘాల నాయకులు అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపట్టిన జైల్ భరో కార్యక్రమం సోమవారం జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక, మహిళా, విద్యార్థి, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. పోలీసులు అడుగడుగునా వారిని అడ్డుకుని నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు. దాంతో ప్రజా సంఘాల నాయకులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. నిరసనకారులను అడ్డుకునే క్రమంలో పోలీసులు దురుసుగా వ్యవహరించారని, అసభ్య పదజాలం ఉపయోగించారని ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు. మహిళా సంఘాల ప్రతినిధులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయడంతో వారు తీవ్రంగా వ్యతిరేకించారు. దాంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకుడు మండారి డేవిడ్కుమార్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంబాలపల్లి శ్రీను మాట్లాడుతూ ప్రజల హక్కుల కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని అరెస్టు చేయడం ప్రజాస్వామ్య హక్కులను హరించడమేనని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, వివిధ ప్రజా సంఘాల నాయకులు నెమ్మాది వెంకటేశ్వర్లు, మేకల శ్రీను, గంట నాగయ్య, మట్టి పెల్లి సైదులు, తదితరులు పాల్గొన్నారు. పలువురి అరెస్ట్జైల్ భరో నేపథ్యంలో పోలీసులు ఉదయమే రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లు నాగార్జునరెడ్డి, బుల్లెట్ ట్రైన్ సాధన సమితి కన్వీనర్ ఆరుట్ల జానకిరెడ్డిని అరెస్ట్ చేశారు. జైల్భరో కార్యక్రమంలో భాగంగా ప్రదర్శన నిర్వహిస్తున్న నాయకులను సైతం అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు -
మార్కెట్ ఉన్నా.. రోడ్లపైనే విక్రయాలు
సూర్యాపేటటౌన్ : ప్రజలకు కూరగాయలు, మాంసం, చేపలు ఇలా అన్నీ ఒకేచోట అందుబాటులో ఉండేందుకు నిర్మించిన సమీకృత మార్కెట్ వృథాగా మారింది. సూర్యాపేట పాత వ్యవసాయ మార్కెట్లో కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన మార్కెట్ను అధికారికంగా ప్రారంభించినప్పటికీ కూరగాయల వ్యాపారులు రోడ్లపైనే విక్రయాలు సాగిస్తున్నారు. మటన్, ఫిష్ విక్రయ దారులు అసలు మార్కెట్లోకే రాలేదు. ప్రస్తుతం ప్రధాన రహదారిపైనే వాటి విక్రయాలలు సాగుతుండడంతో నిత్యం రద్దీ నెలకొంటుండగా.. తరచూ ట్రాఫిక్ జామ్ అవుతోంది. రూ.19 కోట్లతో నిర్మాణంకూరగాయలు, మాంసం, చేపల విక్రయాలు ఒకే చోట ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు వాటిని కొనుగోలు చేసేందుకు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లకుండా ఉంటుందనే ఉద్దేశంతో గత ప్రభుత్వ హయాంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను నిర్మించారు. మార్కెటింగ్, మున్సిపల్ శాఖల నుంచి సుమారు రూ.19 కోట్ల నిధులు వెచ్చించి పాత వ్యవసాయ మార్కెట్ స్థలంలో మోడల్ మార్కెట్ను నిర్మించారు. ఇందులో వ్యాపారులతో పాటు కొనుగోలు దారులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించారు. ఆగస్టు 2023లో అప్పటి మంత్రి జగదీశ్రెడ్డి సమీకృత మార్కెట్ను ప్రారంభించారు. అప్పట్లో అధికారులు హడావిడిగా కొన్ని దుకాణాలను మార్కెట్లోకి తరలించారు. అన్ని దుకాణాలు మార్కెట్లోకి తరలక పోవడం, చాలా మంది వ్యాపారులు రోడ్లపైనే కూరగాయలు, మటన్, ఫిష్తో పాటు ఇతర వస్తువులు విక్రయిస్తుండడంతో లోపల ఉన్న వ్యాపారులు సైతం తమకు గిరాకీ కావడం లేదంటూ బయటకు వచ్చేశారు. ఆ తర్వాత మున్సిపల్ అధికారులు సైతం వాటిని పట్టించుకోక పోవడంతో ప్రస్తుతం వృథాగా మారింది.నిరుపయోగంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కొనుగోలు దారులు, వాహనాలతో నిత్యం ట్రాఫిక్ జామ్ ఇబ్బందులు పడుతున్న స్థానికులు, వాహనదారులు -
సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ వచ్చేలా చూడాలి
సూర్యాపేట : హైదరాబాద్ – చైన్నె బుల్లెట్ ట్రైన్న్ కారిడార్ పాత అలైన్మెంట్ కొనసాగించి, సూర్యాపేటలో స్టేషన్ ఏర్పాటు చేసేలా చూడాలని కోరుతూ బుల్లెట్ ట్రైన్న్ సాధన సమితి, అఖిలపక్ష నాయకులు సోమవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుకు వినతిపత్రం అందించారు. ఆయన కోదాడకు వచ్చినట్లు తెలుసుకొని అక్కడికి వెళ్లి మరీ విన్నవించారు. సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్న్ వచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని, ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తాలని వారు కోరారు. సూర్యాపేట మీదుగా బుల్లెట్ ట్రైన్ మార్గాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు ఖమ్మం, వరంగల్ ప్రాంతాల ప్రజలకు కూడా ప్రయోజనం కలుగుతుందని వివరించారు. వినతిపత్రం అందించిన వారిలో బుల్లెట్ ట్రైన్న్ సాధన సమితి కన్వీనర్ ప్రొఫెసర్ ఆరుట్ల జానకిరెడ్డి, ముఖ్య సలహాదారు రమణాచారి, సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంట్ల ధర్మార్జున్, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్, సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, నాయకులు మట్టిపెల్లి సైదులు, పేర్ల నాగయ్య, మిట్ట గనుపుల ముత్యాలు, జర్నలిస్టులు ఉన్నారు. -
మహిళా రిజర్వేషన్ సాధనకు ఉద్యమం
హుజూర్నగర్ : కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ను తక్షణం అమలు చేయాలని జాతీయ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి దేవరం మల్లీశ్వరి డిమాండ్ చేశారు. సోమవారం హుజూర్నగర్ బైపాస్ రోడ్డులో నిర్వహించిన సమావేశంలో సమాఖ్య ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న తలపెట్టిన ‘చలో ఢిల్లీ’ వాల్పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిర్వహించనున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 14 వరకు పాదయాత్రలు చేపడుతున్నట్లు తెలిపారు. నిత్యావసరాల ధరల పెరుగుదలను అరికట్టాలని, విద్య, వైద్యం అందరికీ అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశా రు. కార్యక్రమంలో సమాఖ్య సభ్యులు మునగ సామ్రాజ్యం, శ్రీలత, మంగమ్మ, నరసమ్మ, వీరమ్మ, జ్యోతి, కుమారి, వెంకటమ్మ, సూరమ్మ, పద్మ, రాణి, నాగమణి, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
వర్షాలు కురవాలని యాగం
నాగార్జునసాగర్ : వర్షాలు కురవాలని ఈ నెల 10న నాగార్జునసాగర్ సమీపంలోని కృష్ణానది ఒడ్డున సీఎం రేవంత్రెడ్డి చేపట్టే మహా వరుణయాగానికి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శనివారం సాగర్లో వరుణయాగం ఏర్పాట్లను ఆయన.. ఎమ్మెల్యే జైవీర్రెడ్డితో కలిసి పరిశీలించారు. యాగశాల, ప్రవచనశాల, హెలిపాడ్తో తదితర ప్రదేశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి విభాగానికి ఒక అధికారిని ఇన్చార్జిగా నియమించి ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల10న ఉదయం 4గంటలకు వరుణయాగం ప్రారంభమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ఎస్పీ నర్సింహ, నల్లగొండ అదనపు ఎస్పీ రమేశ్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్కరణ్రెడ్డి, మిర్యాలగూడ ఆర్డీఓ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సిబ్బంది ఆదరణతోనే గుర్తింపు
హుజూర్నగర్ : కింది స్థాయి ఉద్యోగులు, సిబ్బంది ఆదరణే ఉన్నత ఉద్యోగికి గుర్తింపునిస్తాయని విద్యుత్ శాఖ ఎస్ఈ అమరబోయిన శ్రీనివాస్, డీఈ వెంకటకిష్టయ్య అన్నారు. బదిలీ అయిన ఎస్ఈ అమరబోయిన శ్రీనివాస్, డీఈ వెంకట కిష్టయ్యలకు శనివారం హుజూర్నగర్లో డివిజన్ ఆర్టిజన్ కార్మికుల ఆధ్వర్యంలో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని శాలువాలు, పూల మాలలతో సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి బదిలీలు సహజం అన్నారు. అనంతరం నూతన డీఈ రామ్మోహన్రెడ్డికి స్వాగత సన్మానం చేశారు. కార్యక్రమంలో హుజూర్నగర్ ఏడీఈ గోవింద్, కోదాడ ఏడీఈ వెంకన్న, ఏఈలతో పాటు డివిజన్ బాడీ కమిటీ సభ్యులు వెంకట నరసింహ చార్యులు, పిడతల శ్రీనివాస్, నిమ్మా ప్రభాకర్, మట్టపల్లి, హఫీజ్, వీరభద్రం, వేణు, పబ్బు మల్లయ్య, జోనస్రెడ్డి, ఉసిరికాయల సైదులు, ఆర్టిజన్ కార్మికులు, సిబ్బంది పాల్గొన్నారు. మట్టపల్లిలో నిత్య కల్యాణంమఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శనివారం విశేష పూజలు కొనసాగాయి. ఆలయంలో ముందుగా సుప్రభాత సేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం జరిపి నిత్య కల్యాణాన్ని శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆ తర్వాత శ్రీస్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. చివరగా నీరాజన మంత్ర పుష్పాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కాగా శుక్రవారం రాత్రికే ఆలయానికి చేరుకున్న రెండు తెలుగు రాష్ట్రాల భక్తులు తెల్లవారుజాముననే పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ టి.చలపతిరావు, అర్చకులు పాల్గొన్నారు. బుల్లెట్ ట్రైన్ సాధనకు ఉమ్మడి పోరు సాగిద్దాం సూర్యాపేట : జాతీయ రహదారి–65 వెంట ప్రకటించిన బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ మార్పుపై 20 రోజులుగా చేస్తున్న ఉద్యమాన్ని ఉమ్మడిగా సాగిద్దామని బుల్లెట్ ట్రైన్ సాధన కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ ఆరుట్ల జానకిరెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేటలోని మహావీర్ బ్యాంకెట్ హాల్లో జరిగిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు. పట్టణంలో రైల్వే లైన్ సాధన సమితి పేరుతో సాగుతున్న మరో ఉద్యమ కమిటీ కన్వీనర్ డేగల జనార్దన్ రాచూరు ప్రతాప్తో అఖిలపక్ష కమిటీ చర్చలు జరిపారు. రెండు సంఘాల కలిసికట్టుగా పోరా టాలు కొనసాగించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య సలహాదారు రమణాచారి, సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, టీజేఎస్ రాష్ట్ర నాయకులు కుంట్ల ధర్మార్జున్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అనుములపురి రవి, కునుకుంట్ల సైదులు, మట్టిపల్లి సైదులు, జర్నలిస్ట్ భూపతి రాములు, సట్టు నాగయ్య ఆవుల నాగరాజు, ధనియాకుల శ్రీకాంత్, పేర్ల నాగయ్య, మాధవరెడ్డి, గట్ల రమాశంకర్, బూర వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. నేడు సమన్వయం సమావేశం సూర్యాపేట : జాతీయ రహదారి వెంట ఉన్న ముఖ్య పట్టణాలు, మండల కేంద్రాలకు చెందిన రైల్వేలైన్ సాధన సమితి సభ్యులతో ఆదివారం ఉదయం 11 గంటలకు సూర్యాపేటలోని పబ్లిక్ క్లబ్లో సమన్వయ సమావేశం నిర్వహించనున్నట్లు బుల్లెట్ రైలు సాధన కమిటీ కన్వీనర్ ఆరుట్ల జానకిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి సూర్యాపేటలోని వ్యాపారులు, అన్ని రకాల ఉద్యమ సంఘాల ప్రతినిధులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. -
రోడ్డునే అమ్మేశారు!
కోదాడ : ప్రభుత్వ స్థలాలను కాపాడుతామని.. అంగుళం కూడా ఆక్రమణకు గురైన కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. డిస్ట్రిక్ట్ టౌన్ ప్లానింగ్ కమిటీ (డీటీపీసీ) లేఅవుట్ చేసిన రోడ్డునే తప్పుడు సర్వే నంబర్తో దొడ్డిదారిని విక్రయించినా.. దీనిపై అధికారులు కనీస విచారణ చేసిన దాఖలాలు లేవు. అసలు విషయం ఏమిటంటే.. కోదాడ పట్టణ పరిధిలోని సర్వే నంబర్ 149లో నాగుబండి పద్మయ్యకు భూమి ఉంది. 1959లో నాగార్జునసాగర్ ఎడమ కాలువ తవ్వకం సమయంలో సిబ్బంది క్వార్టర్స్, గెస్ట్హౌస్ల నిర్మాణాలకు ఈ సర్వే నంబర్ నుంచి ప్రభుత్వం 3.06 ఎకరాల భూమిని సేకరించింది. ఈ స్థలానికి తూర్పున జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న రెండు ఎకరాల స్థలాన్ని పద్మయ్య 1963లో కోదాడ ప్రభుత్వ వైద్యశాల నిర్మాణానికి రిజిస్టర్ దానపత్రం ద్వారా ఇచ్చారు. ఈ స్థలాన్ని డీటీపీసీ వారు లేఅవుట్ చేసి వైద్యశాల భవనాన్ని నిర్మించారు. ఎన్ఎస్పీ, దాత ఇచ్చిన వైద్యశాల స్థలాలకు మధ్య 30 అడుగుల రోడ్డు ఏర్పాటు చేశారు. ఈ రోడ్డునే తప్పుడు సర్వే నంబర్(208) వేసి అమ్మగా దానిలో కొందరు భవనాలు నిర్మించుకున్నారు. ఫిర్యాదులు చేస్తున్నా విచారణే లేదు డీటీపీసీ లేఅవుట్ రోడ్డును తప్పుడు సర్వే నంబర్తో అమ్ముకున్న వారి వారసుల్లో ఒకరు తమ భూమిని ప్రభుత్వమే ఆక్రమించిందని తప్పుడు సర్వే రిపోర్టులతో ఎన్ఎస్పీలో 20 గుంటల స్థలాన్ని అక్రమంగా పొందారని, మరొకరు ప్రభుత్వ వైద్యశాలలో తాము ఇచ్చిన రెండు ఎకరాలకు ఎక్కువగా స్థలం ఉందని 520 గజాల స్థలాన్ని తీసుకున్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని పట్టానికి చెందిన పలువురు గడిచిన 20 ఏళ్లుగా ఫిర్యాదులు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఒకే సర్వే నంబర్ 149లో ఉన్న ఎన్ఎస్పీ స్థలానికి, ప్రభుత్వ వైద్యశాల స్థలానికి మధ్యలోకి సర్వే నంబర్ 208 ఎలా వచ్చిందని కనీస విచారణ చేసేవారు కరువయ్యారని ఫిర్యాదుదారులు వాపోతున్నారు. ప్రభుత్వ వైద్యశాల స్థలంలోనూ ఇదే తంతు.. కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు దాత ఇచ్చిన రెండు ఎకరాల స్థలం కంటే ప్రస్తుతం 20 గుంటలు తక్కువగా ఉంది. అయినా సర్వే అధికారులు వైద్యశాల స్థలానికి తూర్పు రోడ్డును కూడా వైద్యశాల స్థలంగా కొలుస్తున్నారు. ఈ స్థలం తమదేనని దాత వారసులు 1991లో కోర్టుకు వెళ్లగా అది గ్రామపంచాయతీ రోడ్డు అని కోర్టు తీర్పునిచ్చింది. అయినా అధికారులు ఈ రోడ్డును కూడా కొలిచి ఇచ్చిన తప్పుడు రిపోర్టులతో దాత వారసులకు కోదాడ ప్రభుత్వ వైద్యశాల కాంపౌండ్ లోపల రెండు ఎకరాల కన్నా ఎక్కువ స్థలం ఉందని దాదాపు 520 గజాల స్థలాన్ని అధికారులు అప్పజెప్పారు. ప్రస్తుతం వైద్యశాల లోపల ఎకరం 20 గుంటలు మాత్రమే ఉందని రిపోర్టు ఇస్తున్న అధికారులు మిగిలిన 20 గుంటల ఎటుపోయిందో చెప్పడం లేదు. ఫ 30 అడుగుల రోడ్డులో 18 అడుగుల ఆక్రమణ ఫ తప్పుడు సర్వే నంబర్లో విక్రయం ఫ 20 ఏళ్లుగా ఫిర్యాదు చేస్తున్నా కనీస చర్యలు శూన్యం ఇది కోదాడ పట్టణంలోని సర్వే నంబర్ 149లోని ప్రభుత్వ వైద్యశాలకు పడమర, ఎన్ఎస్పీ స్థలానికి తూర్పున ఉన్న 30 అడుగుల రోడ్డు. ఈ స్థలాన్ని గతంలో వైద్యశాల నిర్మాణానికి దానమివ్వగా దాత వారసుడు నాగుబండి వీరయ్య ఈ 30 అడుగుల రోడ్డును 18 అడుగుల మేర ఆక్రమించి ఇది సర్వే నంబర్ 208లో ఉన్నట్లు చెప్పి రిజిస్టర్ డాక్యుమెంట్స్ 1815, 1816 ద్వారా 495 గజాల స్థలాన్ని అమ్ముకున్నాడు. సర్వే నంబర్ 149లో ఎన్ఎస్పీ స్థలం, ప్రభుత్వ వైద్యశాల ఉండగా ఈ రెండింటి మధ్యలోకి సర్వే నంబర్ 208 ఎలా వచ్చిందో అర్థకాని పరిస్థతి. -
పీఆర్సీ రిపోర్టు ప్రకటించి అమలు చేయాలి
సూర్యాపేటటౌన్ : పీఆర్సీ రిపోర్టును వెంటనే ప్రకటించి అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్ )రాష్ట్ర కార్యదర్శి ఎన్.సోమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సూర్యాపేటలోని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ఆ సంగం జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన పీఆర్సీ నివేదికను వెంటనే ప్రకటించి జూలై 2023 నుంచి అమలు చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న ఆరు డీఏలను ప్రకటించడంతోపాటు ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షనర్ల పెండింగ్ బిల్లులను చెల్లించాలన్నారు. జీవో నంబర్ 25ను సవరించి ప్రతి ప్రాథమిక పాఠశాలలో తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. హెల్త్ కార్డులను జారీ చేసి ఆసుపత్రుల లిస్టును ఫైనల్ చేసి వెంటనే చికిత్సను ప్రారంభించాలన్నారు. ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.అనిల్కుమార్, పి.శ్రీనివాసరెడ్డి, కె.అరుణ భారతి, జి.వెంకటయ్య, ఎన్.నాగేశ్వరరావు, వెలుగు రమేష్, చిలక రమేష్, డి.లాలు తదితరులు పాల్గొన్నారు. ఫ టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సోమయ్య -
రైతులు వరి వేసి నష్టపోవద్దు
భానుపురి (సూర్యాపేట) : వర్షాభావ నేపథ్యంలో వరిపంట సాగుచేసి నష్టపోవద్దని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ రైతులకు విజ్ఞప్తి చేశారు. శనివారం సూర్యాపేటలోని కలెక్టరేట్లో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్తో కలిసి ఎల్నినో ప్రభావంపై జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే సెప్టెంబర్ నాటికి ఎల్నినో ప్రభావంతో వానలు తక్కువగానే ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోందని తెలిపారు. ప్రస్తుతం నాగార్జున సాగర్, ఎస్సారెస్పీలలో సమృద్ధిగా నీరు లేనందున నీటి విడుదలపై స్పష్టత లేదన్నారు. ఈ పరిస్థితుల్లో వరిసాగుకు వెళ్లకుండా రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. 10 రోజుల పాటు పంట మార్పిడిపై స్పెషల్ డ్రైవ్ పంట మార్పిడిపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు రైతులతో మాట–పంట మార్పిడికి బాట అనే పంట మార్పిడి పథకాన్ని స్పెషల్ డ్రైవ్గా తీసుకొని ఈ నెల 10 నుంచి ప్రారంభించనున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. 10 రోజుల పాటు ప్రతి అధికారి కనీసం 10 మంది రైతులను వ్యక్తిగతంగా కలిసి అవగాహన కల్పిస్తారన్నారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఏఈఓలు, మహిళా సంఘాల ప్రతినిధులు ఇందులో పాల్గొంటారన్నారు. కరువు వచ్చినా అండగా ఉంటాం : ఎమ్మెల్యే మందుల సామేల్రాష్ట్రంలో కరువు పరిస్థితులు కనిపిస్తున్నా ప్రజలెవరూ అధైర్యపడొద్దని, ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ సీఎం రేవంత్రెడ్డి ఈనెల 10న నాగార్జున సాగర్లో మహా వరుణ యాగం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, ఇరిగేషన్ సీఈ నాగభూషణం, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్రెడ్డి, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
మూడు అడుగులు పెరిగిన సాగర్ నీటిమట్టం
ఫ శ్రీశైలంలో విద్యుదుత్పాదనతో 81,565 క్యూసెక్కుల నీరు విడుదల నాగార్జునసాగర్ : సాగర్ వైపు కృష్ణమ్మ పరవళ్లు మొదలయ్యాయి. జలాశయం నీటిమట్టం ఒక్క రోజులో మూడు అడుగుల మేర పెరిగింది. శ్రీశైలం జలాశయం విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా సాగర్ జలాశయానికి 81,565 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ వద్ద విద్యుదుత్పాదన చేస్తూ 31,248 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 900 క్యూసెక్కుల నీటిని హైదరాబాద్ తాగునీటి అవసరాలకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ జలాశయం గరిష్ట స్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.0450టిఎంసీలు)కాగా.. ప్రస్తుతం 516.50 అడుగులు (142.9715 టీఎంసీలు)గా ఉంది. ఎగువ నుంచి వరద కొనసాగుతుండడంతో త్వరలోనే శ్రీశైలం జలాశయం నుంచి రేడియల్ క్రస్ట్గేట్ల ద్వారా సాగర్ జలాశయంలోని నీటిని విడుదల చేస్తారని తెలంగాణ సాగునీటి అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
అతివేగం, నిర్లక్ష్యంతోనే రోడ్డు ప్రమాదాలు
మునగాల : అతివేగం, నిర్లక్ష్యంతోనే రోడ్డు ప్రమాదాలు జరుతున్నాయని ఎస్పీ నరసింహ అన్నారు. శనివారం ఆయన మునగాల మండల పరిధిలోని 65వ నబర్ జాతీయ రహదారిపై ఉన్న మునగాల పీహెచ్సీ, మాధవరం, మొద్దులచెరువు, తాడువాయి వద్ద ప్రమాదం జరిగే స్థలాల(బ్లాక్స్పాట్ల)ను పరిశీ లించారు. అలాగే గురువారం రాత్రి ముకుందాపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, కుమారుడు మృత్యువాత పడిన ఘటన స్థలాన్ని కూడా ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తండ్రి, కుమారుడు మృతిచెందిన ఘటనపై దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని స్థానిక ఎస్ఐని ఆదేశించారు. బ్లాక్స్పాట్స్ వద్ద ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సిబ్బంది, స్థానికులకు పలు సూచనలు చేశారు. మునగాల పీహెచ్సీ వద్ద బ్లాక్స్పాట్స్ పరిశీలనలో సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్ఐ మల్లు సంజీవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కాసర్ల కోటేశ్వరరావు, నాయకులు బచ్చు అశోక్, తక్కెళ్లపాటి సాయి, ముస్కుల సైదిరెడ్డి, నర్రా శ్రీపాల్రెడ్డి, జిల్లేపల్లి వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ నాయకుడు కోల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. ఫ ఎస్పీ నరసింహ -
ఐటీఐలో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులు
హుజూర్నగర్ : హుజూర్నగర్లోని ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీలో ఈ విద్యా సంవత్సరంలో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్స్పాల్ ఎన్. వెంకటేశ్వరరావు సూచించారు. శుక్రవారం కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని నైపుణ్య అభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు ఈ నెల 15వ తేదీలోగా www.iti.te langana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మొదటి విడతలో సీటు పొందని వారు కూడా రెండో విడతలో తిరిగి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 8247506920, 8499084414, 9160284139, 8247443682 నంబర్లను సంప్రదించాలని కోరారు. బాగా చదివి ఉన్నత స్థానానికి ఎదగాలినడిగూడెం : విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను వినియోగించుకొని బాగా చదివి ఉన్నత స్థానానికి చేరాలని జిల్లా బీసీ సంక్షేమ అభివృద్ధి అధికారి విశాల్ ధార పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని కరివిరాలలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనాన్ని మోడల్ స్కూల్ బాలురకు వసతి గృహానికి అనుకూలంగా ఉంటుందా లేదా అనే విషయాన్ని పరిశీలించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడారు. ఆయన వెంట బీసీ సంక్షేమ అభివృద్ధి అధికారి వంశీ, వార్డెన్ లతిమూన్, ఉపాధ్యాయులు ఉన్నారు. డీఎస్సీడీఓగా కె.లతభానుపురి (సూర్యాపేట) : జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయంలో సూపరింటెండెంట్గా పని చేస్తున్న కె.లత డీఎస్సీడీఓ, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ అధి కారిగా శుక్రవారం అదనపు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె కలెక్టర్ తేజస్నంద్లాల్ పవార్, అదనపు కలెక్టర్ హరిసింగ్ను మర్యాద పూర్వకంగా కలిశారు. పలువురు అధికారులు, సిబ్బంది ఆమెకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. లక్ష్మీనరసింహుని నిత్యకల్యాణంమఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శుక్రవారం అర్చకులు స్వామివారి నిత్యకల్యాణాన్ని విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం స్వామి, అమ్మవార్లలను పట్టు వస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం రక్తికట్టించారు. స్వామివారి కల్యాణోత్సవం అనంతరం స్వామి, అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాఢ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ టి.చలపతిరావు, అర్చకులు తూమాటి కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, సాయికుమారా చార్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
చేనేత వృత్తిని కాపాడేందుకు చొరవ చూపాలి
సూర్యాపేట : చేనేత వృత్తిని కాపాడేందుకు ప్రభుత్వాలు చేయూతనివ్వాలని చేనేత సహకార సంఘం అధ్యక్షుడు గండూరి రమేష్ కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికుల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలు కాకపోవడంతో ప్రస్తుతం చేనేత వృత్తి కనుమరుగయ్య పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కేంద్రంలోని సూర్యాపేట పారిశ్రామిక సహకార సంఘం భవనంలో చేనేత పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత వృత్తికి ఎంతో చరిత్ర ఉందన్నారు. 1905 ఆగస్టు 07న ఎందరో మహానుభావులు విదేశీ వస్త్రాలను బహిష్కరించారన్నారు. అదే స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం 2015 ఆగస్టు 07న అధికారికంగా జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రకటించిందని తెలిపారు. కార్యక్రమంలో సహకార సంఘం మాజీ అధ్యక్షుడు కడారి భిక్షం, రిటైర్డ్ ప్రొఫెసర్ విపూరి సుదర్శన్, రిటైర్డ్ ప్రిన్సిపాల్ మిర్యాల గోపాలకిషన్, కౌన్సిలర్ నాగుల వాసు, టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దూలం నగేష్, మాజీ ఎంపీటీసీ పున్నం వెంకటేశ్వర్లు, సంఘం ఉపాధ్యక్షుడు చిలివేరు నరసింహారావు, కార్యదర్శి భీమనపల్లి వెంకటేశ్వర్లు, కోశాధికారి ముశం హరి ప్రసాద్, డైరెక్టర్లు, మార్కండేయ పద్మశాలి సంఘం అధ్యక్షుడు మిట్టకోల సతీష్ కుమార్, సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. ఫ సహకార సంఘం అధ్యక్షుడు రమేష్ -
ఆరుతడి పంటలపై అవగాహన కల్పించాలి
భానుపురి (సూర్యాపేట) : నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ డెడ్ స్టోరేజ్కి చేరుకుంది, ఇకపై వర్షాలు వచ్చే అవకాశం కూడా లేనందున సాగర్ ఆయకట్టు రైతులు వరి కాకుండా ఆరుతడి పంటలు సాగు చేసేలా అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ఎల్నినో పరిస్థితులు, ఆరుతడి పంటల సాగు, పౌర సరఫరాలపై వీడియో కాన్ఫరెన్న్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ వ్యవసాయ, ఉద్యాన వన, ఇరిగేషన్ అధికారులతో సమావేశమై మాట్లాడారు. నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ ప్రాజెక్టులలో నీరు డెడ్ స్టోరేజ్కి చేరినందున తాగునీటికి మాత్రమే నీటిని వదులుతారని తెలిపారు. జిల్లాలోని రైతులు వరికి బదులుగా పెసలు, కందులు, మినుములు, కూరగాయలు పండించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. హరిసింగ్, డీఆర్ఓ ప్రేమ్రాజ్, డీఏఓ శ్రీధర్రెడ్డి, హార్టికల్చర్ అధికారి నాగయ్య, డీఆర్డీఓ సన్యాసయ్య, జడ్పీ సీఈఓ శిరీష పాల్గొన్నారు. అన్ని సూచనలతో జనగణన హ్యాండ్బుక్ జనగణన సంచాలకులు ఇచ్చిన అన్ని సూచనలను జిల్లాలో కచ్చితంగా అమలు చేసి జనగణన హ్యాండ్బుక్ను తయారు చేస్తామని కలెక్టర్ తేజస్నంద్లాల్ పవార్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి జిల్లా జనగణన హ్యాండ్బుక్ తయారీపై కలెక్టర్లతో జనగణన సంచాలకులు భారతి హోళీకేరి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సంబంధిత శాఖల నుంచి నిర్ణీత నమూనాలో సమాచారం సేకరించి, గడువులోపు పూర్తి స్థాయిలో పరిశీలించి, జిల్లా జనగణన హ్యాండ్బుక్కు సంబంధించిన వివరాలు, సమాచారాన్ని రాష్ట్ర కార్యాలయానికి పంపిస్తామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ బి. హరి సింగ్, సీపీఓ కిషన్, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
బుల్లెట్ రైలు అలైన్మెంట్ మార్పుతో అన్యాయం
సూర్యాపేటటౌన్ : బుల్లెట్ రైలు మార్గం అలైన్ మెంట్లో మార్పులతో నేషనల్ హైవే– 65 వెంట ఉన్న ప్రాంతాలకు తీరని అన్యాయం జరుగుతుందని ఐక్య విద్యార్థి సంఘాల ప్రతినిధులు అన్నారు. జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన సన్నాహక సమావేశంలో వారు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మొదట జాతీయ రహదారి–65కు సమాంతరంగా బాటసింగారం, చౌటుప్పల్, నార్కట్పల్లి, నకిరేకల్, సూర్యాపేట, మునగాల, కోదాడ, జగ్గయ్యపేట, నందిగామ మీదుగా అమరావతి రూట్ను ప్రకటించారన్నారు. ఆంధ్రా ప్రాంత పెత్తందారుల ఒత్తిళ్లు, కొంతమంది పాలకుల వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రస్తుతం రూట్మ్యాప్ను శంషాబాద్ నుంచి హాలియా మీదుగా అమరావతికి మార్చారని పేర్కొన్నారు. ఈ విషయమై ప్రభుత్వం స్పందించకుంటే రాబోయే రోజుల్లో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఐక్య విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఆవుల నాగరాజు, ధనియాకుల శ్రీకాంత్, పుల్లూరి సింహాద్రి, తగుళ్ల జనార్దన్, శ్రీకాంత్, భాషపంగు సునీల్, బొమ్మగాని వినయ్, పోలోజు మహేష్, తదితరులు పాల్గొన్నారు. -
మోదీ ప్రభుత్వ విధానాలపై పోరాటం
సూర్యాపేట అర్బన్ : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 12 ఏళ్ల మోదీ పాలనలో రైతులకు, కార్మికులకు తీరని నష్టం జరిగిందన్నారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని పోరాటం చేసిన సందర్భంలో రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్నారు. బ్రిటిష్ కాలం నాటి కార్మిక చట్టాలను రద్దు చేసి కార్పొరేట్లకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్లుగా మార్చడం దుర్మార్గం అన్నారు. వీటికి వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఈ నెల 10న నిర్వహించే జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు వేల్పుల వెంకన్న, ఎలుగురి గోవిందు, మేకనబోయిన శేఖర్, తదితరులు పాల్గొన్నారు -
అడవుల సంరక్షణకు కలిసి పనిచేయాలి: ఎస్పీ
సూర్యాపేటటౌన్ : అడవుల సంరక్షణకు పోలీస్, అటవీ శాఖలు సమన్వయంతో పని చేయాలని ఎస్పీ నరసింహ సూచించారు. అడవులను నాశనం చేయవద్దని, వాటి విస్తీర్ణం పెరిగితేనే కరువు లాంటి తీవ్ర పరిస్థితులను సమర్థవంతంగా అధిగమించవచ్చని పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అటవీశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అటవీ భూముల ఆక్రమణలను నిరోధించాలని ఆదేశించారు. అటవీ భూముల ఆక్రమణ, పోడు భూములకు సంబంధించి ఆందోళనలు జరిగే అవకాశం ఉన్నప్పుడు ఫారెస్ట్ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పోలీసుల సహకారంతో ముందుకు సాగాలన్నారు. అడవుల విషయంలో తరచూ సమస్యలు సృష్టించే వారిని ముందుగానే గుర్తించి, వారికి చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. ఫారెస్ట్, పోలీస్ పరిధిలో నమోదైన పాత కేసులను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారి దామోదర్రెడ్డి, ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, ఫారెస్ట్ రేంజ్ అధికారులు ఆదిత్య, కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణమ్మ చెంత మహా వరుణయాగం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, కృష్ణా–గోదావరి నదులు జలకళ సంతరించుకోవాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నాగార్జునసాగర్లో మహావరుణ యాగాన్ని తలపెట్టింది. ఈ నెల 10వ తేదీన నాగార్జునసాగర్ జలాశయం ఒడ్డున విజయవిహార్ ఆవరణలో ఈ మహాయాగం నిర్వహించనున్నారు. యాగంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వయంగా పాల్గొననుండగా, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా హాజరుకానున్నారు. లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో.. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ మహా వరుణయాగం నిర్వహించనున్నారు. దేవస్థాన పాలకమండలి ఏర్పాటైన తర్వాత తొలిసారిగా ఇంతటి స్థాయిలో వరుణయాగం నిర్వహిస్తుండడం విశేషం. యాగం విజయవంతం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపట్టగా, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డికి యాగ నిర్వహణ బాధ్యతలను అప్పగించింది. 10వ తేదీ మధ్యాహ్నం.. ఈనెల 10వ తేదీన మధ్యాహ్నం నుంచి యాగ కార్యక్రమాలు ప్రారంభమై, సాయంత్రం 3.20 నుంచి 3.24 గంటల మధ్య పూర్ణాహుతి నిర్వహించనున్నారు. ఈ మహాయాగంలో 108 మంది ఋత్విక్కులు, వేద పండితులు, అర్చక బృందం వర్ష పాశుపత వరుణ యాగంలోని విశేష మంత్రాలతో 11 హోమ గుండాల్లో ప్రత్యేక వేద మంత్రోచ్ఛరణల మధ్య హోమాలు నిర్వహించనున్నారు. ముమ్మరంగా ఏర్పాట్లు.. ప్రస్తుతం ఇతర ప్రాజెక్టుల్లోకి వరద జలాలు చేరుతున్నప్పటికీ, శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్కు ఇంకా ఆశించిన స్థాయిలో నీటి ప్రవాహం ప్రారంభం కాలేదు. దీంతో సాగర్ ఇంకా డెడ్ స్టోరేజ్కే పరిమితమై ఉంది. మరో వారం రోజుల్లో శ్రీశైలం జలాశయం నిండితే సాగర్కు నీటి విడుదల ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం యాగాన్ని తలపెట్టింది. ఇప్పటికే జిల్లా అధికారులు, దేవాదాయ, ఇరిగేషన్, పోలీసు, రెవెన్యూ తదితర శాఖల అధికారులు యాగ వేదిక వద్ద ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భద్రత, రాకపోకలు, వాహన పార్కింగ్, వేదిక, విద్యుత్, తాగునీరు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆ ఏర్పాట్లను కలెక్టర్ చంద్రశేఖర్ కూడా పరిశీలించారు. విజయ విహార్లో ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్యాగం నిర్వహణపై అర్చకులతో చర్చిస్తున్న కలెక్టర్రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం పూర్తిగా తొలగిపోయి, విస్తారంగా వర్షాలు కురవాలని, రైతులకు పాడిపంటలు సమృద్ధిగా పండాలని, జలాశయాలు నిండాలని ప్రభుత్వం ఈ యాగాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ముఖ్యంగా కృష్ణా, గోదావరి పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు అందేలా జలాశయంలో సమృద్ధిగా నీరు చేరాలనే సంకల్పంతో ప్రత్యేక పూజలు చేపడుతున్నారు. నాగార్జునసాగర్లో 10వ తేదీన నిర్వహణ ఫ వర్షాలు కురవాలని యాగం తలపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఫ స్వయంగా పాల్గొననున్న సీఎం రేవంత్రెడ్డి ఫ ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా అధికారులు -
అవగాహనతోనే ఎయిడ్స్ నివారణ సాధ్యం
సూర్యాపేట టౌన్ : అవగాహనతోనే ఎయిడ్స్ వ్యాధిని నివారించవచ్చని రెండు తెలుగు రాష్ట్రాల ఎన్ఎస్ఎస్ రీజినల్ కోఆర్డినేటర్ రమావత్ సైదానాయక్ అన్నారు. శుక్రవారం డిస్టిక్ లెవెల్ వన్డే రెడ్ రిబ్బన్ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎస్వీ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన అవసరమన్నారు. వ్యాధి నిర్మూలనపై విస్తృత ప్రచారం జరగాలని, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు తమ వంతు బాధ్యతగా పరిసర ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎయిడ్స్ అంటువ్యాధి కాదని, వ్యాధిగ్రస్తులను సమాజంలో చులకనగా చూడవద్దన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ పెండెం వెంకటరమణ, మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ మారం వెంకటరమణారెడ్డి, ప్రిన్సిపాల్ వి.వెంకటేషులు, వైస్ ప్రిన్సిపాల్ ఎంఎస్ఆర్ శాస్త్రి, ప్రోగ్రాం ఆఫీసర్లు మధుసూదన్, సృజన, అధ్యాపకులు పాల్గొన్నారు. ఫ ఎన్ఎస్ఎస్ రీజినల్ కోఆర్డినేటర్ రమావత్ సైదానాయక్ -
చేయూతకు దరఖాస్తులు
భానుపురి (సూర్యాపేట) : చాలా కాలంగా చేయూత పింఛన్ కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. పంద్రాగస్టు నుంచి ఇవ్వనున్న కొత్త పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. గతంలో లబ్ధిదారులు ఇచ్చిన దరఖాస్తుల స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలియకపోవడం... అర్హులకు పెన్షన్ అందాలన్న భావనతో నేటి నుంచి అర్జీలను స్వీకరించనున్నారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, డీఆర్డీఓలు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో పింఛన్ ప్రక్రియకు సంబంధించిన ఆన్లైన్ లాగిన్లు ఓపెన్ అయ్యాయి. ఆగస్టు 15 నాటికి అర్హులను ఎంపిక చేసి, సెప్టెంబర్లో పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం జిల్లాలో 1,56,000 మందికి ప్రతినెలా పింఛన్లు అందుతున్నాయి. మరెందరో కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో ఇచ్చిన వారు సైతం పింఛన్ కోసం అర్హులు గతంలో ఎన్నోసార్లు దరఖాస్తు చేసుకొని ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం నూతనంగా విడుదల చేసిన ఫార్మాట్లోనే దరఖాస్తు చేయడం తప్పనిసరి. గతంలో ప్రజాపాలన, మీ–సేవ కేంద్రాల్లో లేదా సాధారణ తెల్ల కాగితాలపై దరఖాస్తు చేసిన వారు కూడా ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేసిన కొత్త ఫార్మాట్లోనే వివరాలు సమర్పించాలి. గతంలో దరఖాస్తులతో పాటు ఇచ్చిన కులం, ఆదాయం, ఇతర ధ్రువీకరణ పత్రాలకు కొత్త దరఖాస్తు ఫారాన్ని జత చేసి సమర్పిస్తే సరిపోతుంది. దరఖాస్తులు ఎక్కడివ్వాలి.. గ్రామీణ ప్రాంతాల వారైతే గ్రామపంచాయతీలు, ఎంపీడీఓ కార్యాలయంలో అందించాల్సి ఉంటుంది. పట్టణ ప్రాంతాల వారు మున్సిపాలిటీలో ఇవ్వాలి. లబ్ధిదారుల ఆన్లైన్ నమోదుకు వీలుగా దరఖాస్తుదారుని బ్యాంకు ఖాతా సంఖ్య, ఐఎఫ్ఎస్సీ కోడ్, సమగ్ర వ్యక్తిగత వివరాలను కొత్త ఫారంలో పొందుపరిచి ఇవ్వాలి. గ్రామాల్లో స్వీకరించిన దరఖాస్తులను ఎంపీడీఓలు, పట్టణ ప్రాంతాల్లో స్వీకరించిన వాటిని మున్సిపల్ కమిషనర్లు పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. అనంతరం ఆన్లైన్ చేసిన దరఖాస్తులను డీఆర్డీఓ ద్వారా కలెక్టర్ పరిశీలనకు పంపిస్తారు. కలెక్టర్ పరిశీలన అనంతరం తుది ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపుతారు. ముగింపు తేదీ లేదు పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణకు నిర్దేశిత గడువు లేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది నిరంత ప్రక్రియ అని, అర్హులైన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోచ్చని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం అన్ని రకాల పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరించనున్నప్పటికీ ప్రభుత్వం ముందుగా ఏడు రకాల పింఛన్లకే ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో వితంతువులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ బాధితులు, పైలేరియా (బోధకాలు) బాధితులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, దివ్యాంగులు ఉన్నారు. వృద్ధాప్య, బీడీ కార్మికుల పింఛన్ల దరఖాస్తులు తర్వాతి దశలో ఇవ్వనున్నారు. తలసేమియా, సికిల్ సెల్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి పింఛన్లు ఇవ్వనున్నారు. కొత్త పింఛన్ల మంజూరుకు నేటి నుంచే స్వీకరణ ఫ ఆగస్టు 15 నాటికి ఎంపిక.. సెప్టెంబర్లో పంపిణీ ఫ ముందుగా ఏడు రకాల పింఛన్లకే ప్రభుత్వం ప్రాధాన్యం ఫ అర్జీల స్వీకరణకు నిర్దేశిత గడువు లేదు -
మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం
పెన్పహాడ్ : మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఎస్పీ నరసింహ అన్నారు. గురువారం పెన్పహాడ్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ రోల్ కాల్కు హాజరై పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సిబ్బంది క్రమశిక్షణ, బాధ్యతతో ఉండి నేరాలను అరికడుతూ ప్రజలకు, బాధితులకు మెరుగైన పోలీసు సేవలు అందించాలని సూచించారు. గ్రామ పోలీసు అధికారులు బాధ్యతగా పనిచేస్తూ, గ్రామాలను సందర్శిస్తూ ప్రజల్లో పోలీసుల పట్ల నమ్మకాన్ని పెంచాలని అన్నారు. స్టేషన్లోని రిసెప్షన్ సెంటర్, ఫిర్యాదుల నిర్వహణ రికార్డులను తనిఖీ చేసి, స్టేషన్కు వచ్చిన ఫిర్యాదుదారులతో మాట్లాడి వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. గంజాయి సరఫరా, వినియోగం అరికట్టేందుకు, పాత నేరస్తులపై నిఘా కట్టుదిట్టం చేయాలని సూచించారు. సామాజిక అంశాలు, సైబర్ నేరాలు, ఇతర చట్టాలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐ బాలునాయక్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.ఫ ఎస్పీ నరసింహ -
విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
సూర్యాపేట టౌన్ : విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లో కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకుని, పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి (డీఐఈఓ) సులోచన రాణి అన్నారు. సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం విద్యార్థులకు నోట్బుక్లు, స్కూల్ బ్యాగులు, షూస్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థిని ఇటీవల నీట్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించడం జిల్లాకే గర్వకారణమన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ఉచిత పాఠ్యపుస్తకాలు, డిజిటల్ బోధన, ప్రత్యేక కోచింగ్, ఇలా ఎన్నో ఉచిత సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు.అనంతరం కళాశాలలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పెరుమాళ్ల యాదయ్య, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యుత్ కోతలపై రైతుల నిరసన పాలకవీడు : పాలకవీడు మండల కేంద్రంలోని 33/11 కేవీ సబ్స్టేషన్ను గురువారం రైతులు ముట్టడించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యవసాయ విద్యుత్ సరఫరాలో తరచూ ఇష్టానుసారంగా కోతలు విధిస్తుండడం వల్ల పంటలకు నీరందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బోర్లు, బావుల సాయంతో సాగు పనులు చేపట్టిన రైతులకు మోటార్లు సక్రమంగా నడవక ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలాల్లోనే ఉండాల్సి వస్తోందని వాపోయారు. రోజుకు పది నుంచి పదిహేను విడతలు కరెంటు వచ్చిపోతుండడంతో పొలాలకు నీరు పారించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ విద్యుత్ కోతలు విధించడం వల్ల మోటార్లు ఒత్తిడికి గురై కాలిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థికంగా నష్టపోతున్నామని రైతులు వాపోయారు. మండల విద్యుత్ అధికారి శ్రీనివాస్ స్పందించి.. విద్యుత్ సరఫరాను మెరుగుపరుస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. -
సర్ను పారదర్శకంగా నిర్వహించండి
భానుపురి (సూర్యాపేట) : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకగా నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. గురువారం కలెక్టరేట్ వీసీ హాల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. షెడ్యూల్ ప్రకారం జూలై 24 తో ముగియాల్సిన బీఎల్ఓల ఇంటింటి సర్వే గడువును.. క్షేత్రస్థాయిలో మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు ఆగస్టు 10 వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు. జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్యూమరేషన్, డిజిటలైజేషన్ ప్రక్రియ 100 శాతం పూర్తయిందని తెలిపారు. ఓటర్ల జాబితాలో ఒకే వ్యక్తికి రెండు ఓట్లు ఉండడం, చనిపోయిన వారి పేర్లు అలాగే ఉండడం వంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 2026 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే యువతీ యువకులందరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. ఈ సమీక్షలో కొత్త పోలింగ్ స్టేషన్లపై రాజకీయ పార్టీ నాయకులతో చర్చించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, డీఆర్ఓ ప్రేమ్రాజ్, సి సెక్షన్ సూపరింటెండెంట్ రాజేందర్ రెడ్డి, సీహెచ్ రాజేశ్వరరావు, చల్లమల్ల నరసింహ, ఎండీ హాబిద్, ఎం. స్టాలిన్, కరుణాకర్ రెడ్డి, డి.రమేష్ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ -
మూసీకి 2,183 క్యూసెక్కుల ఇన్ఫ్లో
మూసీ రిజర్వాయర్ కేతేపల్లి : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో కొనసాగుతోంది. గురువారం ఎగువ నుంచి మూసీకి 2,183 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. ఈ సీజన్లో మూసీ ప్రాజెక్టుకు రెండువేల క్యూసెక్కులకుపైగా ఇన్ఫ్లో రావటం ఇదే మొదటి సారి. ప్రాజెక్టులో గరిష్ట స్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా గురువారం సాయంత్రానికి 638.90 అడుగులకు చేరుకుంది. మూసీ ఆయకట్టులో వానాకాలం పంటల సాగు కోసం కుడి కాల్వకు 328, ఎడమ కాల్వకు 306 క్యూసెక్కుల చొప్పున మొత్తం 634 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. లీకేజీ, సీపేజీ, ఆవిరి రూపంలో 40 క్యూసెక్కుల నీరు వృథా అవుతుంది. రిజర్వాయర్లో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.92 టీఎంసీల నీరు నిల్వ ఉందని మూసీ ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. -
ఆయకట్టులో ఆశలు
నాగార్జునసాగర్ : కృష్ణానదికి ఎగువ నుంచి వస్తున్న వరద నాగార్జునసాగర్ ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురింపజేస్తోంది. సాగర్కు ఎగువన శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండడంతో నాలుగైదు రోజుల్లో గరిష్టస్థాయికి చేరవచ్చని నీటి పారుదల శాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం గరిష్ట నీటిమట్టం 885 అడుగులు (215టీఎంసీలు) కాగా.. గురువారం సాయంత్రానికి నీటిమట్టం 871.70 అడుగులకు (149 టీఎంసీలు) చేరింది. ఎగువ నుంచి శ్రీశైలానికి రెండు లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీటి ప్రవాహం నమోదవుతోంది. జలాశయంలో నీటి నిల్వలు పెరగడంతో ఎడమ వైపు గల జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పాదన కొనసాగిస్తూ నాగార్జునసాగర్ జలాశయంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. గడిచిన 24 గంటల్లో 6,589 క్యూసెక్కుల నీటిని విద్యుదుత్పాదన ద్వారా నాగార్జునసాగర్ జలాశయానికి వదిలారు. దీంతో సాగర్ జలాశయం నీటిమట్టం కూడా క్రమంగా పెరగనుంది. సాగర్ జలాశయం గరిష్ట నీటిమట్టం 590 అడుగులు (312.0450 టీఎంసీలు)కాగా. ప్రస్తుతం 513.40 అడుగులు (137 టీఎంసీలు) ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకుంటే.. త్వరలోనే నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు మరింత పెరుగుతాయి. దీంతో ఎడమ కాల్వకు సాగునీరు విడుదల చేసే అవకాశాలు లేకపోలేదు. సెప్టెంబర్లోనైనా సాగునీరివ్వొచ్చు.. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభమైప్పటి నుంచి సాగునీటి కొరతతో సాగర్ ఆయకట్టు ప్రాంత రైతులు వరినార్లు పోయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు. అయితే, కృష్ణానది పరవళ్లు తొక్కుతుండటం, శ్రీశైలం నుంచి సాగర్కు స్వల్పంగా నీటి విడుదల కొనసాగతుండటంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. సెప్టెంబర్ నెలలోపు ఎడమ కాల్వకు నీరు విడుదలైతే ఆలస్యమైనా వరి, పప్పుధాన్యాల వంటి పంటలను సాగు చేసి కనీసం ఒక పంటను కాపాడుకునే అవకాశం ఉంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 2017లో కూడా సెప్టెంబర్ నెలలోనే నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసినప్పటికీ రైతులు విజయవంతగా పంటలు సాగు చేసి మంచి దిగుబడులు సాధించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఇదే పరిస్థితి ఈసారి కూడా పునరావృతమవుతందనే నమ్మకంతో ఆయకట్టు రైతులు కృష్ణమ్మ వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎగువ నుంచి వరద ప్రవాహం ఇలాగే కొనసాగి సాగర్ జలాశయం గరిష్టానాకి చేరుకుంటే తప్ప ఇప్పుడే నీటి విడుదలపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేము. హైదరాబాద్తో పాటు ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు తాగునీటి సరఫరా సాగర్ జలాశయంపై ఆధారపడి ఉంది. సాగర్ ఆయకట్టు మూడు లక్షల ఎకరాలతో పాటు, ఎస్ఎల్బీసీ రెండు లక్షల ఎకరాలకు నీరందించాలి. –చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్రెడ్డి కృష్ణమ్మ పరుగులు ఫ శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద ఫ విద్యుదుత్పాదన ద్వారా సాగర్కు నీటి విడుదల ఫ ఆలస్యంగానైనా సాగునీరు ఇవ్వొచ్చంటున్న రైతులు -
కూరగాయల సాగు.. ఆదాయం బాగు
● డ్రిప్, మల్చింగ్ పద్ధతులు వాడటం వల్ల వరి, పత్తి సాగుతో పోలిస్తే దాదాపు 40 శాతం వరకు నీరు ఆదా అవుతుంది. ● శాశ్వత పందిళ్లతో నాణ్యమైన దిగుబడి వస్తుంది. కాయలు నేలకు తగలకుండా, పురుగుల బెడద లేకుండా గుణాత్మకమైన అధిక దిగుబడులు సాధించవచ్చు. ● తక్కువ కాలపరిమితిలో కోతకు వచ్చే కూరగాయలు రైతులకు నిరంతరం ఆదాయాన్ని అందిస్తాయి. సూర్యాపేట : వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అన్నదాతలు ప్రత్యామ్నాయ పంటల సాగు బాట పట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఎక్కువ నీరు అవసరమయ్యే సంప్రదాయ పంటలకు స్వస్తి పలికి, తక్కువ కాలపరిమితిలో అధిక లాభాలందించే కూరగాయల సాగు వైపు దృష్టి సారించాలని ఉద్యాన శాఖ అధికారులు సూచింస్తున్నారు. ఆధునిక నీటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే తక్కువ సాగునీటితోనే బంగారు పంటలు పండించవచ్చని అధికారులు భరోసా ఇస్తున్నారు. జిల్లాలో సాగు విస్తీర్ణం.. వాతావరణ మార్పుల నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలో సుమారు 23 వేల ఎకరాల్లో కూరగాయల సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. అయితే ఇప్పటివరకు కేవలం 2,350 ఎకరాల్లో మాత్రమే సాగు జరుగుతున్నట్లు ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ తరుణంలో రైతులపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం భారీ సబ్సిడీలను ప్రకటిస్తోంది. ఎక్కడైనా విత్తనాలు లేదా నారు కొనుగోలు చేసి నాటుకున్న బిల్లులను సమర్పిస్తే, ఎకరానికి రూ.9,600 (50 శాతం సబ్సిడీ) చొప్పున అందజేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ అందిస్తున్న ప్రధాన సబ్సిడీలు, పథకాలు కూరగాయల విస్తరణ పథకం: హైబ్రిడ్ కూరగాయల సాగు విస్తరణకు ఎంఐడీహెచ్ కింద ఎకరానికి రూ.9,600 (50 శాతం సబ్సిడీ) ఆర్థిక సహాయం అందజేస్తారు. ప్లాస్టిక్ మల్చింగ్ (ఎంఐడీహెచ్) : నేలలో తేమ ఆవిరి కాకుండా కాపాడుతూ, కలుపు నివారణకు ఉపయోగపడే మల్చింగ్ షీట్ల కొనుగోలుపై ఎకరానికి రూ.8,000 (50 శాతం సబ్సిడీ) లభిస్తుంది. శాశ్వత పందిళ్లు (ఆర్కేవీవై) : సొర, కాకర, బీర వంటి తీగజాతి కూరగాయల నాణ్యమైన సాగు కోసం వేసే శాశ్వత పందిళ్ల నిర్మాణానికి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద ఎకరానికి రూ.లక్ష (50 శాతం సబ్సిడీ) అందజేస్తున్నారు. వీబీజీ రాంజీ (ఉపాధి హామీ) అనుసంధానం వికసిత్ భారత్–గ్యారంటీ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (వీబీజీ రాంజీ ) ద్వారా పందిళ్ల నిర్మాణం, తోటల పెంపకం, ఫీల్డ్ పనులకు కూలీల వేతనం రూపంలో అదనపు ఆర్థిక సహాయం అందుతుంది. బిందు సేద్యం (టీజీ ఎంఐపీ) తెలంగాణ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద ప్రతి నీటి బొట్టు సమర్థవంతంగా వినియోగించుకునేలా ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులకు సబ్సిడీపై డ్రిప్ పరికరాలు పంపిణీ చేస్తున్నారు.ఫ జిల్లాలో 23 వేల ఎకరాల్లో సాగు లక్ష్యం ఫ రైతులపై భారం తగ్గించేందుకు రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం ఫ ఆధునిక పద్ధతులు పాటిస్తే అధిక లాభాలుఎల్నినో ప్రభావం దృష్ట్యా రైతులు తక్కువ నీటితో సాగయ్యే పంటల వైపు మళ్లాలి. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలనుకునే వారు తమ పరిధిలోని ఉద్యాన విస్తరణ అధికారులను లేదా సూర్యాపేట జిల్లా ఉద్యానవన శాఖ కార్యాలయాన్ని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి. – తీగల నాగయ్య, జిల్లా ఉద్యానపట్టు పరిశ్రమల అధికారి -
ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించాలి
పెన్పహాడ్ : ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం వెంటనే పీఆర్సీని ప్రకటించాలని డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఉమర్ డిమాండ్ చేశారు. గురువారం పెన్పహాడ్ మండల కేంద్రంతోపాటు మండల పరిధిలోని అనాజీపురం, దోసపహాడ్, జంగంపడిగ, నాగులపహాడ్, నారాయణగూడెం, అన్నారం, అనంతారం, పొట్లపహాడ్ గ్రామాల్లోని పాఠశాలల్లో డీటీఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఉద్యోగులు, పెన్షనర్ల పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. న్యాయమైన డిమాండ్ల కోసం గతంలో సమ్మె చేసిన కేజీబీవీ టీచర్ల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గురుకుల, మోడల్ స్కూల్, కేజీబీవీ ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారానే వేతనాలు చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొల్లెద్దు నరేందర్, గంటపంగు వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షురాలు ఎ.గణిత, జి. ఆనంద్ భాస్కర్, చర్లపల్లి వెంకటయ్య పాల్గొన్నారు.ఫ డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఉమర్ -
యావజ్జీవ శిక్ష నిలిపివేత.. బెయిల్..
సాక్షి, న్యూఢిల్లీ: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం అజీంపేటలో సంచలనం సృష్టించిన బట్ట లింగయ్య హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న అప్పటి గ్రామ సర్పంచ్ పోలెబోయిన లింగయ్యకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. కింది కోర్టు విధించిన జీవితకాల శిక్షను సర్వోన్నత న్యాయస్థానం తాత్కాలికంగా నిలిపివేసింది. హైకోర్టులో అప్పీల్ పెండింగ్లో ఉన్నందున ఆయన్ను బెయిల్పై విడుదల చేయాలని ఆదేశించింది. ప్రత్యక్ష దాడికి పాల్పడలేదు ఈ పిటిషన్పై జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ చంద్రశేఖర్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఘటన జరిగిన సమయంలో లింగయ్య సర్పంచ్గా ఉన్నారని, మృతుడి భార్య వాంగ్మూలంలో ఆయన ప్రత్యక్షంగా దాడి చేసినట్టు ఎక్కడా పేర్కొనలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదిస్తూ.. పిటిషనర్ నేరుగా దాడి చేయకపోయినా నిందితులను రెచ్చగొట్టి హత్యకు పురికొల్పారని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. దాడిలో పిటిషనర్ ప్రత్యక్ష పాత్ర లేకపోవడాన్ని పరిగణనలోకి తీసుకొని బెయిల్ మంజూరు చేసింది. ఇదీ నేపథ్యం...: 2017 సెపె్టంబర్ 30 దసరా పండుగ రోజున అజీంపేటలోని జమ్మిచెట్టు వద్ద ఎస్సీ వర్గానికి చెందిన బట్ట లింగయ్య దారుణ హత్యకు గురయ్యారు. పాతకక్షల నేపథ్యంలో నాటి సర్పంచ్ పోలెబోయిన లింగయ్య ప్రోద్బలంతో ఆయన అనుచరులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన నల్లగొండ ఉమ్మడి జిల్లా ఎస్సీ, ఎస్టీ స్పెషల్ సెషన్స్ కోర్టు సర్పంచ్తో సహా మొత్తం 18 మందికి జీవితఖైదు విధించింది. కింది కోర్టు తీర్పుపై హైకోర్టును ఆశ్రయించినా, ఉపశమనం లభించకపోవడంతో మాజీ సర్పంచ్ పోలెబోయిన లింగయ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
పోటీ తత్వంతోనే ఉన్నత శిఖరాలు
సూర్యాపేటటౌన్ : ప్రతి విద్యార్థి ప్రాథమిక స్థాయి నుంచే పోటీ తత్వంతో ముందుకు సాగితేనే భవిష్యత్లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పిలుపునిచ్చారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో నిర్వహించిన ఫౌండేషన్ డే కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పాఠశాలలో నాణ్యమైన విద్యనందించేందుకు అవసరమైన అన్ని వసతులను కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నవోదయకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే 10 కంప్యూటర్లతో కూడిన ల్యాబ్, లైబ్రరీని త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. అద్దె భవనంలో ఉన్నప్పటికీ విద్యార్థులకు మౌలిక సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. కోదాడలో నవోదయ విద్యాలయ భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, ఏడాదిన్నర కాలంలో భవనం అందుబాటులోకి వస్తుందన్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసిన కలెక్టర్.. తన చిన్ననాటి సైనిక్ స్కూల్ జ్ఞాపకాలను కలెక్టర్ విద్యార్థులతో పంచుకున్నారు. నేను కూడా మీలాగే ఆరో తరగతిలో ఇల్లు వదిలి సైనిక్ స్కూల్లో చేరాను. నాతో పాటు చదివిన బ్యాచ్మేట్స్లో 22 మంది ఈరోజు డిఫెన్స్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాల్లో ఉన్నత స్థాయిలో సేవలు అందిస్తున్నారని, ముగ్గురికి శౌర్య చక్ర అవార్డులు వచ్చాయని తెలిపారు. నవోదయ విద్యార్థులు భవిష్యత్తులో డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా మాత్రమే కాకుండా దేశాన్ని నడిపించే నాయకులుగా ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ రోజువారీ మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నవోదయ ప్రిన్సిపాల్ ఆదినారాయణ, ఉపాధ్యాయులు రాధాకృష్ణ, గంగాభవాని, జ్ఞానేశ్వరి, రాంబాబు, వైష్ణవి, స్వాతి, విద్యార్థులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
వ్యక్తిగత వివరాలు సోషల్ మీడియాలో పెట్టొద్దు
సూర్యాపేట : విద్యావంతులే ఎక్కువగా సైబర్ మోసాల బారిన పడుతున్నారని, సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు పెట్టొద్దని ఎస్పీ కె.నరసింహ అన్నారు. బుధవారం చందన ఫార్మసీ కళాశాలలో రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించిన సురక్ష కా తిరంగా సైబర్ స్వతంత్ర తెలంగాణ, సైబర్ జాగ్రక్త దివస్ అవగాహన సదస్సులో పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. ఈనెలంతా ప్రజలను, యువతను సైబర్ నేరాలపై చైతన్య పరుస్తామన్నారు. ప్రతి బుధవారం అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ‘సైబర్ జాగృక్త దివస్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పలు విషయాలపై విద్యార్థులకు పోలీస్ కళాబృందం పాటల ద్వారా అవగాహన కల్పించింది. ఈ కార్యక్రమంలో జిల్లా సైబర్ సెక్యూరిటీ సెల్ ఇన్స్పెక్టర్ లక్ష్మినారాయణ, రూరల్ ఎస్ఐ అనిల్, షీ టీం ఎస్ఐ నీలిమ, కళాశాల యాజమాన్యం, విద్యార్థులు, సైబర్ సెక్యూరిటీ సెల్ సిబ్బంది, రూరల్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. విద్య, విజ్ఞానం కోసమే ఇంటర్నెట్ను ఉపయోగించాలి సూర్యాపేటటౌన్ : విద్యార్థులు ఇంటర్నేట్ను విద్య, విజ్ఞానం కోసం ఉపయోగించుకోవాలని ఎస్పీ నరసింహ అన్నారు. బుధవారం సురక్ష కా తిరంగా సైబర్ స్వతంత్ర తెలంగాణ, సైబర్ జాగ్రక్త దివస్ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేటలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు సైబర్ మోసాలు, వాటి నివారణ పట్ల సూర్యాపేట పట్టణ పోలీస్, సూర్యాపేట జిల్లా సైబర్ సెక్యూరిటీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఎస్పీ మాట్లాడారు. ఈ సదస్సులో పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, సైబర్ సెక్యూరిటీ సెల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, ఎస్ఐలు సందీప్, యాదవేందర్రెడ్డి, షీటీమ్ ఎస్ఐ నీలిమ, కళాశాల ప్రిన్సిపాల్ ముత్యాలరాజు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. ఫ ఎస్పీ నరసింహ -
ఆరుతడి పంటల సాగే మేలు
చివ్వెంల(సూర్యాపేట) : వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు ఆరుతడి పంటల సాగు చేయడమే మేలని జిల్లా వ్యవసాయ అధికారి (డీఏఓ) జి.శ్రీధర్రెడ్డి అన్నారు. బుధవారం చివ్వెంల మండలం జి.తిర్మలగిరి గ్రామంలో కూరగాయల పంటల సాగును పరిశీలించి మాట్లాడారు. నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని, వరిసాగును తగ్గించి ఆరుతడి పంటలైన కంది, పెసర, మినుము, జొన్న, చిరుధాన్యాలు, కూరగాయలను పండించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. పంటల సాగు విధానంలో వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవస అధికారి నాగయ్య, తహసీల్దార్ జి.చంద్రశేఖర్, వ్యవసాయ అధికారి డి.వెంకటేశ్వర్లు, ఏఈఓలు మానస. శైలజ, సరిత, ఆర్ఐ శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు. సీపీఎస్ను రద్దు చేయాలిసూర్యాపేటటౌన్ : సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్తో తెలంగాణ సీపీఎస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 23న లక్ష మందితో హైదరాబాద్లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు లక్కపాక ప్రవీణ్కుమార్, జిల్లా కోశాధికారి గుయ్యని ప్రసాద్లు కోరారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో జెడ్పీ డీప్యూటీ సీఈఓ మహాలక్ష్మితో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీపీఎస్ రద్దుకు జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమానికి ఉద్యోగులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ పర్యవేక్షకులు నరేందర్ రెడ్డి, కృష్ణమోహన్, సీనియర్ అసిస్టెంట్ పద్మనాభం, వలియాద్ బేగం, హాసన్ అలీ, మమత, దశరథ, నాగేశ్వరావు, జూనియర్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. ఎన్జీ కళాశాలలో నేడు క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ రామగిరి(నల్లగొండ) : నల్లగొండలోని ఎన్జీ కళాశాలో తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో ఫార్మా, కెమికల్ తయారీ సంస్థ వియాష్ సైంటిఫిక్ లిమిటెడ్ సౌజన్యంతో గురువారం క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఉపేందర్, టీఎస్కేసీ కోఆర్డినేటర్ ఎం.అనిల్కుమార్ తెలిపారు. బీఎస్సీ (కెమిస్ట్రీ), ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ), బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ డ్రైవ్కు హాజరుకావచ్చని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఎన్జీ కళాశాలలోని సెమినార్ హాల్లో ఉదయం 9.30 గంటలకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని వారు తెలిపారు. మట్టపల్లిలో విశేష పూజలు మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో బుధవారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారికి విశేష పూజలు కొనసాగాయి. ముందుగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోలు మహోత్సవం చేపట్టారు. అనంతరం వేద మంత్రాల నడుమ అర్చకులు నిత్య కల్యాణాన్ని వైభవంగా నిర్వహించి గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. చివరగా మహానివేదన గావించి, భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఆలయ ఈఓ టి.చలపతిరావు, అర్చకులు తూమాటి క్రిష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. -
ధరణి.. భవితవ్యమేమి?
భానుపురి (సూర్యాపేట) : ధరణి ఆపరేటర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. భూ భారతి అమలుతో వారి ఉద్యోగాలపై అనిశ్చితి నెలకొంది. తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల బాధ్యతలను జూనియర్ అసిస్టెంట్లకు అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీంతో ఔట్సోర్సింగ్ విధానంలో ఇప్పటివరకు పనిచేస్తున్న ధరణి ఆపరేటర్లను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. జిల్లాలో 19 మంది ఆపరేటర్లు జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 19 మంది ధరణి ఆపరేటర్లు పనిచేస్తున్నారు. ప్రభుత్వం 2018 సంవత్సరంలో ధరణి పోర్టర్ను అందుబాటులోకి తీసుకొచ్చి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల కోసం మండల తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రతి కార్యాలయానికి ఒక ధరణి ఆపరేటర్ చొప్పున నియమించారు. ఈ లెక్కన జిల్లాలో 23 మండలాలకు 23 మందిని నియమించారు. అయితే పలు సందర్భాల్లో అవినీతి అక్రమాలు, నిర్లక్ష్యం తదితర కారణాలతో నలుగురు ధరణి ఆపరేటర్లను తొలగించగా ప్రస్తుతం జిల్లాలో 19 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. భూ భారతి అమలుతో.. కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ స్థానంలో భూ భారతి విధానాన్ని తీసుకొచ్చింది. అయితే గతంలో ధరణి పోర్టల్ ద్వారా చాలా అవినీతి అక్రమాలు జరిగినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. దీనికి ప్రధానంగా ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేసే ధరణి ఆపరేటర్లుగా పనిచేసే ఉద్యోగుల ద్వారానే ప్రభుత్వ అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్లు తేలడంతో ఈ విధానాన్ని చెక్ పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఎంతో ప్రతిష్టాత్మకమైన రైతుల వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ చేపట్టే ఆపరేటర్లు బాధ్యతగా వ్యవహరించాల్సి ఉండడంతో వీరంతా ప్రభుత్వం ఉద్యోగులుగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించి తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్లకు ఈ బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. ఆపరేటర్లను తొలగించాలని ప్రభుత్వ నిర్ణయం ఫ జూనియర్ అసిస్టెంట్లకు బాధ్యతలు అప్పగించే యోచన ఫ వివరాల సేకరణలో యంత్రాంగం ఫ ఆందోళనలో కంప్యూటర్ ఆపరేటర్లు రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ధరణి ఆపరేటర్ల సేవలను రద్దు చేయకుండా సగానికి పైగా తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే జిల్లాలో 19 మంది ధరణి ఆపరేటర్లు పనిచేస్తుండగా వీరిలో కేవలం 7 నుంచి 8 మంది ధరణి ఆపరేటర్లను మాత్రమే కొనసాగించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమచారం. మిగతా వారి భవిష్యత్తు ప్రశ్నార్థంకంగా మారగా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న 19 మంది ధరణి ఆపరేటర్లలో ఎవరు ఉంటారు..? ఎవరు తమ ఉద్యోగాలను వదులుకోవాల్సి వస్తుందన్న ఆందోళనలో పడ్డారు. -
‘నవోదయ’కు గడువు పెంపు
ఫ సూర్యాపేట జిల్లాకు కొత్తగా గతేడాది నవోదయ విద్యాలయం మంజూరు ఫ 2027–28 విద్యాసంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఫ రేపటి వరకు గడువు ఫ నవంబర్ 28న ప్రవేశ పరీక్ష ప్రవేశం పొందిన విద్యార్థులకు ఇంటర్మీడియట్ వరకు పూర్తిగా ఉచిత విద్య, వసతి, పోషకాహారం, యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, క్రీడలు, కంప్యూటర్ విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను జాతీయ స్థాయి పోటీలకు సిద్ధం చేసే విద్యాసంస్థగా నవోదయ విద్యాలయాలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. సూర్యాపేటటౌన్ : అత్యున్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జవహర్ నవోదయ విద్యాలయా (జేఎన్వీ)లు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాయి. 2027–28 విద్యా సంవత్సరం ఆరో తరగతిలో ప్రవేశాల కోసం నవోదయ విద్యాలయ సమితి ఇది వరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే దరఖాస్తుల గడువును ఈ నెల 7వ తేదీ వరకు పొడిగించింది. ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారికి ప్రవేశం కల్పించి ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్యను అందిస్తారు. జిల్లాకు తొలి నవోదయ స్కూల్.. సూర్యాపేట జిల్లాకు తొలిసారిగా గత ఏడాది మొదటి జవహర్ నవోదయ విద్యాలయం మంజూరైంది. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని రెడ్డి హాస్టల్ భవనంలో తాత్కాలికంగా తరగతులు నిర్వహిస్తున్నారు. శాశ్వత భవనం నిర్మాణానికి కోదాడ పట్టణంలో అన్ని వసతులతో కూడిన స్థలాన్ని ఎంపిక చేశారు. అక్కడ భవన నిర్మాణ పనులు కూడా ప్రారంభించారు. పనులు పూర్తయిన తర్వాత విద్యార్థులకు సొంత భవనంలో ఆహ్లాదకర వాతావరణంలో విద్యాబోధన జరగనుంది. ప్రస్తుతం సూర్యాపేటలో కొనసాగుతున్న నవోదయంలో రెండు బ్యాచ్లు కొనసాగుతుండగా మూడో బ్యాచ్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించారు. అర్హులు ఎవరంటే.. 2026–27 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత నవోదయ విద్యాలయం ఉన్న ఉమ్మడి జిల్లా పరిధిలో నివాసితులై ఉండాలి. 2015 మే 1 నుంచి 2017 జూలై 31 మధ్య జన్మించిన విద్యార్థులు మాత్రమే అర్హులు. గ్రామీణ విద్యార్థులకు తొలి ప్రాధాన్యం నవోదయ విద్యాలయం ప్రవేశాల్లో 75 శాతం సీట్లు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కేటాయించారు. ఇందుకు వారు మూడో, నాలుగో, ఐదో తరగతులను గ్రామీణ పాఠశాలల్లోనే అభ్యసించి ఉండాలి. మొత్తం సీట్లలో కనీసం మూడో వంతు బాలికలకు కేటాయించగా, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్లు వర్తింపుజేస్తారు. 100 మార్కులకు ప్రవేశ పరీక్ష మొత్తం 40 సీట్ల భర్తీ కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షలో ఆర్థమెటిక్, లాంగ్వేజ్, మెంటల్ ఎబిలిటీ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అంశాల నుంచి 100 మార్కులకు 80 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు. ప్రశ్నపత్రం తెలుగు, ఆంగ్లం, ఉర్దూ, మరాఠీ, కన్నడ మాధ్యమాల్లో ఉంటుంది. ప్రతిభ ఆధారంగానే ప్రవేశాలు కల్పిస్తారు. ఆన్లైన్లో దరఖాస్తులు విద్యార్థి ఫొటో, విద్యార్థి సంతకం, తల్లిదండ్రుల సంతకం, ఆధార్ వివరాలు, నివాస ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం తదితర పత్రాలతో ఈనెల 7వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు ఎలాంటి ఫీజు లేదు. ప్రవేశ పరీక్ష నవంబర్ 28న నిర్వహించనున్నారు. ఫలితాలను 2027 మార్చి లేదా ఏప్రిల్లో ప్రకటిస్తారు. -
గీతన్నలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
సూర్యాపేట : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు కల్లుగీత కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈనెల 2న అమరవీరుల యాదిలో పేరిట మహబూబాబాద్లో ప్రారంభమైన గీతన్నల చైతన్య యాత్ర బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రానికి చేరుకున్న సందర్భంగా ఖమ్మం క్రాస్ రోడ్లో యాత్ర బృందానికి కార్మికులు ఘనస్వాగతం పలికారు. అనంతరం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పీఎస్ఆర్ సెంటర్ నుంచి పాత బస్టాండ్ మీదుగా పబ్లిక్ ఆడిటోరియం వరకు మోకు, ముస్తాదులు, తాటి, ఈత కొమ్మలు చేత పట్టుకొని మోటారు సైకిళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ జీవో ప్రకారం 50 సంవత్సరాలు పైబడిన గీత కార్మికులందరికీ పింఛన్ ఇవ్వాలన్నారు. ప్రతి సొసైటీకి ఐదు ఎకరాల భూమి ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో ఉన్న కోటి తాటి, ఈత చెట్లకు ప్రభుత్వం నంబర్లు వేసి సంరక్షించాలని కోరారు. కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.రమణ మాట్లాడుతూ నీరాకు రాష్ట్ర బడ్జెట్లో కేటాయించిన రూ.25 కోట్లు, కార్మికుల సంక్షేమానికి కేటాయించిన రూ.67 కోట్లు వెంటనే విడుదల చేయాలన్నారు. ఆగస్టు 18న సర్దార్ సర్వాయి పాపన్న జయంతి రోజు హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై పాపన్న విగ్రహాన్ని ప్రతిష్టించి రాష్ట్ర ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్గూరి గోవిందు అధ్యక్షతన జరిగిన ఈ సభలో నాయకులు చౌగాని సీతారాములు, గౌని వెంకన్న, కొండం కరుణాకర్, మడ్డి అంజిబాబు, గౌని సాంబయ్య, తుమ్మల సైదయ్య, ఉయ్యాల నగేష్, గుణగంటి కృష్ణ, బత్తుల జనార్దన్, బోడపట్ల జయమ్మ, కృష్ణ, నాగ మల్లయ్య, బోడపట్ల సుదర్శన్, సుధాకర్, నరసయ్య, రాజేష్ గౌడ్, శ్రీను, సోమయ్య తదితరులు పాల్గొన్నారు. ఫ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు


