-
సూర్యాపేట
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్గా.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్గా నేరేడుచర్ల పట్టణానికి చెందిన వనపర్తి నేహ ఉద్యోగం సాధించింది. వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.7తిరుగు పయనం ఎన్నికలకు ఏపీకి వెళ్లినవారు తిరుగుపయనమయ్యారు. దీంతో హైవేలన్నీ వాహనాలతో బారులుదీరాయి. - 8లోబుధవారం శ్రీ 15 శ్రీ మే శ్రీ 2024గరిష్టం / కనిష్టం -
ఆర్టీసీకి ‘ఎన్నికల’ ఆదాయం
నల్లగొండ రూరల్ : పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నల్లగొండ రీజియన్లో ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరింది. ఉమ్మడి జిల్లాలోని నల్లగొండ, దేవరకొండ, నార్కట్పల్లి, మిర్యాలగూడ, యాదగిరిగుట్ట, కోదాడ, సూర్యాపేట డిపోల పరిధిలో శుక్రవారం నుంచి సోమవారం వరకు నాలుగు రోజుల పాటు మొత్తం 643 బస్సులను 9.28 లక్షల కిలోమీటర్ల దూరం తిప్పారు. దీంతో ఆర్టీసీకి మొత్తం రూ.6,64,63,000 ఆదాయం సమకూరింది. సాధారణ రోజుల్లో రూ.కోటి వరకు ఆదాయం వస్తుండగా.. ఎన్నికల సందర్భంగా ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో రాకపోకలు సాగించడంతో ఈ నాలుగు రోజుల్లో ఆదాయం పెరిగిందని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.డిపోల వారీగా ఆదాయం ఇలా.. డిపో ఆదాయం దేవరకొండ 1,28,40,000 నల్లగొండ 1,15,91,000 నార్కట్పల్లి 1,04,67,000 మిర్యాలగూడ 1,05,29,000 యాదగిరిగుట్ట 97,00,000 కోదాడ 89,40,000 సూర్యాపేట 1,13,97,000 ఫ నాలుగు రోజుల్లో రూ.6.64 కోట్లు -
ఎన్నికల నిర్వహణ సంతృప్తికరం
భానుపురి (సూర్యాపేట) : లోక్సభ ఎన్నికల నిర్వహణపై కలెక్టర్ ఎస్. వెంకటరావు మంగళవారం ఒక ప్రకటనలో సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడం పట్ల హర్షం వ్యక్తంచేశారు. షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి పోలింగ్ ముగిసే వరకు జిల్లా ప్రజల సహాయ సహకారాలు, భాగస్వామ్యం మరవలేనిదని పేర్కొన్నారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. ఓటు హక్కు వినియోగించుకోవడంలో చైతన్యం చాటారని, దీంతో గత పార్లమెంటు ఎన్నికల కంటే అధికంగా పోలింగ్ నమోదైందని తెలిపారు. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని హుజూర్నగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో 1,91,945 ఓట్లు పోల్ కాగా 76.34 శాతం పోలింగ్ నమోదైంది, కోదాడలో 1,84,415ఓట్లు పోల్ కాగా 75.21 శాతం, సూర్యాపేటలో 1,78,378 ఓట్లు పోల్ కాగా 73.07 శాతం, భువనగిరి లోక్సభ నియోజకవర్గంలోని తుంగతుర్తి అసెంబ్లీ సెగ్మెంట్లో 1,92,005ఓట్లు పోల్ కాగా 74.06 శాతం పోలింగ్ నమోదైనట్లు వివరించారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 3,70,026మంది పురుషులు, 3,76,686 మంది మహిళలు, 31 మంది ట్రాన్స్ జెండర్లు ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 1,000,012 ఓట్లకు 7,46,743 పోలయ్యాయని, 74.67 శాతం పోలింగ్ నమోదైందని పేర్కొన్నారు. ఫ కలెక్టర్ వెంకటరావు -
ఆదరించేదెవరినో..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పోలింగ్ ప్రక్రియ సోమవారం పూర్తయింది. పోలింగ్ బూత్లలో వేసిన ఓట్లు 74.02 శాతం, పోస్టల్ ఓట్లు 1.02 శాతం కలుపుకొని మొత్తంగా 75.04 శాతం పోలింగ్ నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఉత్సాహంగా పోలింగ్లో పాల్గొని ఓటు వేశారు. పట్టణ ప్రాంతాల్లో కాస్త తగ్గినప్పటికీ సాయంత్రం వేళ ఓటింగ్ పెరిగింది. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు ఇతర పార్టీలు, స్వతంత్రులు మొత్తంగా 22 మంది బరిలో ఉన్నారు. ఇందులో మూడు ప్రధాన పార్టీల మధ్యే పోటీ నెలకొంది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఈవీఎంలను నల్లగొండ సమీపంలో అనిశెటి్ుట్దప్పలపల్లి పరిధిలోని వేర్ హౌజింగ్ కార్పొరేషన్ గోదాముల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ల్లో భద్రపరిచారు. జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. ఆ రోజునే వారి భవితవ్యం తేలనుంది. దేవరకొండలో తక్కువ.. హుజూర్నగర్లో ఎక్కువ నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా.. ఈ ఎన్నికల్లో హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కువ శాతం పోలింగ్ నమోదు కాగా, దేవరకొండలో తక్కువగా నమోదైంది. హుజూర్నగర్లో అత్యధికంగా 76.34 శాతం మంది ఓట్లు వేయగా, దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో 70.60 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎవరి అంచనాలు వారివే.. నల్లగొండ లోక్సభ స్థానాన్ని తాము గెలుస్తామంటే.. తమకే అనుకూలంగా ఓట్లు వేశారంటూ ప్రధాన పార్టీల అభ్యర్థులు, పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఏ నియోజకవర్గంలో ఏయే మండలాలు, గ్రామాలు, పోలింగ్ బూత్లలో తమకు ఓట్లు పడ్డాయన్న వివరాలపై ఆరా తీస్తున్నాయి. తమకు అనుకూలమైన ఓటు పడిందని, తమ గెలుపు ఎప్పుడో ఖాయమైందని, దేశంలోనే అధిక మెజార్టీ వస్తుందంటూ కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు. బీజేపీ మాత్రం మోదీ చరిష్మాపైనే నమ్మకంతో ఉంది. బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామలను అమలు చేయకపోవడంతో ఆ పార్టీపై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ బీఆర్ఎస్ పార్టీకే పడ్డాయని చెప్పుకుంటోంది. మూడంచెల భద్రత నల్లగొండ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలను అనిశెట్టిదుప్పలపల్లి వద్ద స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారు. అక్కడ మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ విధించడంతో పాటు స్థానిక పోలీసులతోపాటు ఆర్మ్డ్ రిజర్వుడ్, కేంద్ర బలగాలు, స్ట్రాంగ్ రూమ్ల వద్ద పహారా కాస్తున్నాయి. 24 గంటలు సాయుధ బలగాలు, సీసీ కెమెరాల పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.నల్లగొండ లోక్సభ నియోజకవర్గంలో మొత్తం పోలైన ఓట్ల వివరాలు.. నియోజకవర్గం పురుషులు సీ్త్రలు ట్రాన్స్జెండర్ మొత్తం దేవరకొండ 94,896 90,405 9 1,85,310 నాగార్జునసాగర్ 87,949 88,231 10 1,76,190 మిర్యాలగూడ 85,811 87,513 10 1,73,334 హుజూర్నగర్ 94,065 97,871 9 1,91,945 కోదాడ 90,604 93,801 10 1,84,415 సూర్యాపేట 88,069 90,301 8 1,78,378 నల్లగొండ 92,203 95,328 34 1,87,565 మొత్తం 6,33,597 6,43,450 90 12,77,137పోలింగ్ ప్రశాంతంగా సాగింది ఫ రిటర్నింగ్ అధికారి హరిచందన నల్లగొండ : నల్లగొండ లోక్సభ స్థానానికి నిర్వహించిన పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన తెలిపారు. ఇందుకు సహకరించిన రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు, ప్రజలు, ఓటర్లు, అధికారులు, మీడియా ప్రతినిధులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరిని కలెక్టర్ అభినందించారు. ఫ ముగిసిన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఫ పోస్టల్ ఓట్లు కలుపుకొని 75.04 శాతం ఓటింగ్ నమోదు ఫ ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం ఫ అంచనాల్లో అభ్యర్థులు, పార్టీలు ఫ జూన్ 4న తేలనున్న ఫలితం2019 కంటే స్పల్పంగా పెరుగుదల నల్లగొండ పార్లమెంట్ నియోజకర్గం పరిధిలో 2019 లోక్సభ ఎన్నికలతో పోల్చితే ఈసారి పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగింది. 2019 ఎన్నికల్లో పోస్టల్, ఎన్ఆర్ఐ ఓట్లు కలుపుకొని మొత్తంగా 74.13 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈ సారి 75.04 శాతానికి పెరిగింది. ఇక 2014 ఎన్నికలో 79.75 శాతం పోలింగ్ నమోదైంది. దాంతో పోల్చితే మాత్రం ఈ ఎన్నికల్లో తక్కువ పోలింగ్ శాతం నమోదైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే తక్కువ.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 84.51 శాతం ఓట్లు నమోదు కాగా.. లోక్సభ ఎన్నికల్లో 74.13 శాతం ఓట్లు నమోదయ్యాయి. అప్పటి కంటే 10.38 శాతం ఓటింగ్ తగ్గింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ హుజూర్నగర్ నియోజకవర్గంలోనే అధికంగా పోలింగ్ శాతం నమోదైంది. నల్లగొండలో అతి తక్కువ పోలింగ్ నమోదైంది. నల్లగొండ లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2023 అసెంబ్లీ, 2024 లోక్సభ ఎన్నికల పోలింగ్ శాతం ఇలా.. అసెంబ్లీ సెగ్మెంట్ అసెంబ్లీ లోక్సభ దేవరకొండ 84.49 70.60 నాగార్జునసాగర్ 85.79 74.50 మిర్యాలగూడ 83.49 73.34 హుజూర్నగర్ 86.44 76.34 కోదాడ 85.56 75.21 సూర్యాపేట 84.21 73.07 నల్లగొండ 81.60 75.20 (2024) (2023) పోలైన పోస్టల్ ఓట్ల వివరాలు నియోజకవర్గం పోలైన ఓట్లు శాతం దేవరకొండ 1137 0.43 నాగార్జునసాగర్ 1349 0.58 మిర్యాలగూడ 2410 1.02 హుజూర్నగర్ 1696 0.67 కోదాడ 2269 0.93 సూర్యాపేట 2979 1.22 నల్లగొండ 4135 1.66 ఇతర ప్రాంతాలనుంచి 1676 0.09 మొత్తం 17651 1.02 -
‘కూల్ రూఫ్’ నామమాత్రమే!
అవగాహన కల్పిస్తున్నాం వేసవి వేడి, ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం పొందేలా కూల్ రూఫ్ పఽథకం అమలు చేయాలని ప్రభుత్వం నుంచి గతేడాది ఏప్రిల్లోనే ఆదేశాలు వచ్చాయి. ఈ ఆదేశాలు అమలు చేస్తున్నాం. కొత్తగా భవనం నిర్మించుకునే వారికి కూల్ రూఫ్ నిర్మించుకుంటేనే అనుమతి పత్రాలు జారీ చేస్తున్నాం. ఈ విషయమై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఈ పథకాన్ని భవన యజమానులు సద్వినియోగం చేసుకోవాలి. – కె.శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కమిషనర్, హుజూర్నగర్ ఫ ఇళ్లలో వేడిని తగ్గించేందుకు కొత్త పథకం ఫ స్లాబ్లపై కూల్ పెయింట్ వేసుకునేలా ప్రభుత్వం చర్యలు ఫ 600 గజాలపైబడిన భవనాలకు తప్పనిసరి ఫ మున్సిపాలిటీల్లో ఏడాది నుంచి అమలు ఫ అవగాహన లేక ఆసక్తిచూపని భవన యజమానులు హుజూర్నగర్: వేసవిలో ఎండలు మండుతున్నాయి. జిల్లాలో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 24 డిగ్రీలు ఉండాల్సిన గది సాధారణ ఉష్ణోగ్రత 38 డిగ్రీలకు చేరుతోంది. ఈ నేపథ్యంలో ఇళ్లలో వేడి ప్రభావాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. మున్సిపాలిటీల్లోని భవనాల స్లాబ్లపై కూల్ పెయింట్ వేసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తెలంగాణ చలువ పైకప్పు (కూల్ రూఫ్) పేరిట గతేడాది ఏప్రిల్ 1 నుంచి కొత్త పథకాన్ని అమల్లోకి తెచ్చింది. అయినప్పటికీ జిల్లాలో కూల్ రూఫ్ చేయించుకునేందుకు భవనాల యజమానులు ముందుకు రాకపోవడంతో ఈ విధానానికి స్పందన అంతంత మాత్రంగానే ఉంది. నివాసయోగ్య భవనాలకు తప్పనిసరి.. ప్రతి మున్సిపాలిటీలో దాని స్థాయిని బట్టి 5 లక్షల చదరపు అడుగుల వరకు వైట్ పెయింట్ వేసేలా లక్ష్యం నిర్దేశించారు. 600 చదరపు గజాలు, అంతకన్నా ఎక్కువ విస్తీర్ణం కలిగిన నివాసయోగ్య భననాలకు ఈ చలువ పైకప్పు విధానం తప్పనిసరి చేసింది. అపార్ట్మెంట్ నిర్మాణాలు, భారీ భవంతులు దీని పరిధిలోకి వస్తాయి. కోరిన వారందరికీ నిర్ణీత రుసుం స్వీకరించి ప్రక్రియను అమలు చేయాలి. సర్కారు భవనాలు, వాణిజ్య సముదాయాలకు తప్పనిసరి చలువు విధానం వర్తింపజేయాలి. సూర్యకిరణాలు పరావర్తనం చెందేలా.. భారీ భవనాలను సిమెంట్ కాంక్రీట్తో నిర్మించడంతో పైకప్పులు ఎండకు వేడెక్కుతాయి. చలువ పైకప్పు విధానంలో సూర్యకిరణాలు పరావర్తనం చెందేలా పైకప్పునకు ప్రత్యేక పూత పూస్తారు. ఇందులో మూడు పద్ధతులు ఉన్నాయి. మొదటి పద్ధతిలో లైమ్వాష్/పాలిమర్/ప్లాస్టిక్ సాంకేతికతను వినియోగిస్తారు. రెండో పద్ధతిలో పాలివినీల్ క్లోరైడ్ ఆధారంగా పైకప్పును తీర్చిదిద్దుతారు. మూడో పద్ధతిలో ఆల్బిడో సిరామిక్ మొజూయిక్ టైల్స్ను పైకప్పులో అమరుస్తారు. మూడింటిలో ఏ పద్ధతినైనా ఎంచుకోవచ్చు. పైకప్పులో వినియోగించే సామగ్రి వేడిని తగ్గిస్తాయి. సాధారణ ఇళ్లతో పోలిస్తే చలువ పైకప్పు ఉన్న నిర్మాణాలు 80 శాతం వేడి ప్రభావం లేకుండా చేస్తాయి. సర్కారు ఆమోదించిన ఏజెన్సీలు, ప్రైవేట్ సంస్థలు ఈ పనులను నిర్వహిస్తాయి. కూల్ రూఫ్ విధానంపై అవగాహన కల్పిస్తున్నా ఇళ్ల యజమానులు ముందుకు రావడంలేదు. -
క్షేత్రపాలకుడికి ఆకుపూజ
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో మంగళవారం ఆంజనేయస్వామికి అర్చకులు ఆకుపూజను విశేషంగా నిర్వహించారు. అంజనీపుత్రుడికి ఇష్టమైన రోజు కావడంతో ప్రధానాలయంతో పాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయంలో ఆంజనేయస్వామిని సింధూరం, పాలతో అర్చకులు అభిషేకించారు. అనంతరం తమలపాకులతో అర్చించారు. హనుమంతుడికి ఇష్టమైన నైవేద్యం సమర్పించి, భక్తులకు ప్రసాదంగా అందజేశారు. ఇక ప్రధానాలయంలో నిత్య పూజలు సంప్రదాయంగా కొనసాగించారు. శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం జరిపించి, సాయంత్రం వెండి జోడు సేవ పూజలు నిర్వహించారు. -
ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి నల్లగొండ పబ్లిక్ స్కూల్లోని పోలింగ్ స్టేషన్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కోదాడలోని నయానగర్ పోలింగ్ కేంద్రంలో రాష్ట్ర పౌర సరఫరాలు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి, ఆయన సతీమణి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి నల్లగొండలోని ఎన్జీ కాలనీ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్రెడ్డి నాగార్జునసాగర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపుడి సైదిరెడ్డి తన తల్లితో కలిసి హుజూర్నగర్లో ఓటు వేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి చిట్యాల మండలం ఉరుమడ్లలో ఓటు హక్కు వేశారు. కలెక్టర్ వెంకటరావు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కృష్ణానగర్లో గల 66వ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
సజావుగా ఓటింగ్ ప్రక్రియ
ఫ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటరావు సూర్యాపేట, భానుపురి : లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకటరావు అన్నారు. సోమవారం సూర్యాపేటలోని కృష్ణానగర్ పోలింగ్ కేంద్రంలో కలెక్టర్ వెంకటరావు, అదనవు కలెక్టర్ సీహెచ్.ప్రియాంక, రామన్ కాన్సెప్ట్ హైస్కూల్లో అదనపు కలెక్టర్ బీఎస్.లత, తాళ్లగడ్డలోని 50వ పోలింగ్ బూత్లో జిల్లా ఎస్పీ రాహుల్హెగ్డే, ట్రైనీ ఐపీఎస్ అధికారి రాజేష్మీనాలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పలు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి పోలింగ్ సరళిని పరిశీలించి మాట్లాడారు. జిల్లాలోని నల్లగొండ, భువనగిరి లోక్సభ నియోజకవర్గాల పరిధిలో 10,00, 012 లక్షల మంది ఓటర్లు ఉండగా 7,46,163 మంది తమ ఓటుహక్కు వినియోగించుకోగా మొత్తంగా 74.61 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. ఈవీఎంలను పోలీస్ బందోబస్తు నడుమ నల్లగొండ, భువనగిరిలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలకు తరలించి భద్రపర్చనున్నట్టు పేర్కొన్నారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ కంట్రోల్ రూమ్ను జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డేతో కలిసి పోలింగ్ సరళిని పరిశీలించారు. అంతకుముందు సాధారణ పరిశీలకుడు మనోజ్ కుమార్ మణిక్యరావు సూర్యవంశీ, అదనపు కలెక్టర్ సీహెచ్.ప్రియాంకతో కలిసి పోలింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ కంట్రోల్ రూమ్ ద్వారా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ అప్పారావు, డీఆర్డీఓ మధుసూదన్రాజు, డీపీఓ సురేష్కుమార్, సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవ్, తహసీల్దార్ శ్యామ్ సుందర్రెడ్డి, కలెక్టరేట్ ఏఓ సుదర్శన్రెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు శ్రీనివాసరాజు, సిబ్బంది పాల్గొన్నారు. పోలింగ్కు పటిష్ట భద్రత కల్పించాం ఫ ఎస్పీ రాహుల్ హెగ్డే సూర్యాపేట: జిల్లాలో లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని, పటిష్టమైన పోలీసు భద్రత కల్పించామని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం సోమవారం రాత్రి సూర్యాపేటలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ ముగిసిందన్నారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన నాటి నుంచి జిల్లా యంత్రాంగం, పోలీసు, ఇతర అన్ని శాఖల అధికారులమంతా సమన్వయంతో పని చేశామన్నారు. లోక్సభ ఎన్నికల ప్రక్రియ విజయవంతం కావడానికి సహకరించిన సిబ్బంది, ఓటర్లకు ధన్యవాదాలు తెలుపుతున్నామని ఎస్పీ పేర్కొన్నారు. బందోబస్తు నిర్వహించిన పోలీసు సిబ్బందికి, పోలింగ్ విధులు నిర్వర్తించిన ప్రత్యేక, ఇతర అధికారులకు అభినందనలు తెలిపారు. మట్టపల్లిలో నిత్యకల్యాణం మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో సోమవారం శ్రీరాజ్యలక్ష్మీ, చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరపింహ స్వామి నిత్య, శాశ్వత కల్యాణాన్ని అర్చకులు వేద మంత్రాల నడుమ వైభవంగా నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు గరుడవాహన సేవ నిర్వహించారు. చివరగా మహానివేదనతో భక్తులను తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనర్సింహమూర్తి, ఆంజనేయచార్యులు, భక్తులు పాల్గొన్నారు. -
హైవేలపై వాహనాల బారులు
చౌటుప్పల్, కేతేపల్లి, బీబీనగర్ : హైదరాబాద్– విజయవాడ, హైదరాబాద్– వరంగల్ జాతీయ రహదారులపై సోమవారం వానహనాలు బారులుదీరాయి. తెలంగాణలో పార్లమెంట్, ఆంధ్రప్రదేశ్లో లోక్సభతోపాటు అసెంబ్లీ ఎన్నికలకు హైదరాబాద్తోపాటు పరిసర ప్రాంతాల్లో నివాసం ఉన్నవారు ఓటు వేసేందుకు సొంతూర్లకు వెళ్లి సోమవారం తిరుగుప్రయాణమయ్యారు. దీంతో చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ప్లాజా, కేతేపల్లి మండలం కొర్లపహాడ్ శివారులోని టోల్ప్లాజా, బీబీనగర్ మండలంలోని గూడూరు టోల్ప్లాజాల వద్ద సాయంత్రం నుంచి వాహనాలు క్యూ కడుతున్నాయి. పంతంగిటోల్ప్లాజా వద్ద మొత్తం 16టోల్బూత్లు ఉండగా హైదరాబాద్ మార్గంలో తొమ్మిది బూత్లను కేటాయించి వాహనాలు వదులుతున్నారు. అదనంగా సిబ్బందిని నియమించారు. హ్యాండ్ స్కానర్లను అందుబాటులో ఉంచారు. సాధారణ రోజుల్లో టోల్ప్లాజా మీదుగా 30 నుంచి 35 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే మంగళవారం ఉదయం వరకు అదనంగా మరో 20వేల వాహనాలు ప్రయాణించే అవకాశాలు ఉన్నాయి. అదనపు కౌంటర్లు కేటాయించి.. వాహనాల రద్దీకి అనుగుణంగా కొర్లపహాడ్లోని టోల్ప్లాజా నిర్వాహకులు హైదరాబాద్ వైపు వెళ్లే వాహనదారులు టోల్ చెల్లించేందుకు అదనపు కౌంటర్లు కేటాయించారు. టోల్ప్లాజాలోని 12 కౌంటర్లలో ఏడింటిని హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలకు కేటాయించారు. దీంతో రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు వస్తున్నా టోల్ప్లాజా వద్ద ఎలాంటి ఇబ్బందులు ఏర్పడలేదు. గూడూరు టోల్ప్లాజా వద్ద వాహనాలు భారీగా తరలి రావడంతో ఫాస్టాగ్ స్కానింగ్ ఆలస్యం అవుతోంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సరిపడా బస్సులు లేక ఓటు వేసిన తర్వాత గ్రామాల నుంచి వివిధ ప్రాంతాలకు తిరుగు ప్రయాణం అయ్యేందుకు ప్రజలు నానా అవస్థలు పడ్డారు. ఆర్టీసీ బస్సులు సరిపడా అందుబాటులో లేకతిప్పలు తప్పలేదు. చౌటుప్పల్ ఆర్టీసీ బస్స్టేషన్తోపాటు ప్రధాన రహదారులపై ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల కోసం గంటలపాటు నిరీక్షించారు. అదే విధంగా హోటళ్లు, రెస్టారెంట్లు సైతం జనంతో కిటకిటలాడాయి. మహిళలు, వృద్ధులు, చిన్నారులు చాలా అవస్థలకు గురయ్యారు. ఫ పంతంగి, కొర్లపహాడ్, గూడూరు టోల్ప్లాజాల వద్ద రద్దీ ఫ ఓటేసి హైదరాబాద్ వైపు పయనమవుతున్న ప్రజానీకం -
భువనగిరిలో 80 శాతం పోలింగ్
సాక్షి, యాదాద్రి : భువనగిరి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. సోమవారం జరిగిన ఎన్నికల్లో రికార్డ్ స్థాయిలో 80 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులుదీరారు. పోలింగ్ సమయం అదనంగా గంట పెంచడం, ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల కమిషన్ చేపట్టిన కార్యక్రమాలు ఫలించాయి. ఎండ తీవ్రత తగ్గడం కూడా పోలింగ్ శాతం పెరగడానికి దోహదపడింది. పట్టణాలు, గ్రామాల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో అధికారులు వాటిని సరి చేసి పోలింగ్ కొనసాగించారు. ఓటింగ్ సరళిని పరిశీలించిన అభ్యర్థులు బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్, కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి, బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటింగ్ సరళిని పరి శీలించారు. తమ పార్టీ నాయకుల ద్వారా ఓటింగ్ జరుగుతున్న తీరును తెలుసుకున్నారు. -
ఈవీఎంలు మొరాయించిన ప్రాంతాలు ఇవే..
● కోదాడ నియోజకవర్గంలోని మునగాల మండలం 74వ పోలింగ్ కేంద్రంలో మాక్ పోలింగ్ పూర్తయ్యాక ఈవీఎం మొరాయించింది. దీంతో అరగంటపాటు పోలింగ్ ఆగిపోయింది. తరువాత సరిచేయడంతో పోలింగ్ కొనసాగింది. మునగాల మండలంలోని 81వ బూత్లో కూడా ఈవీఎం మొరాయించడంతో కాసేపు పోలింగ్ ఆగిపోయింది. ● సాగర్ నియోజకవర్గంలోని హాలియాలోని 162వ పోలింగ్ స్టేషన్లో ఉదయం 7.30 గంటలకు ఈవీఎం కొద్దిసేపు మొరాయించింది. దీంతో ఈవీఎంను మార్చేసి పోలింగ్ను కొనసాగించారు. పెద్దవూరలోని 81వ పోలింగ్ స్టేషన్లో ఈవీఎం మొరాయించడంతో 20 నిమిషాల పాటు పోలింగ్ నిలిచిపోయింది. నిడమనూరు మండలం బంకాపురంలో ఈవీఎం మొరాయించడంతో పోలింగ్ అరగంట పాటు ఆలస్యమైంది. ● దేవరకొండ నియోజకవర్గంలోని చింతపల్లి మండలం కుర్మేడులోని 11వ బూత్లో వీవీ ప్యాట్ పనిచేయకపోవడంతో దానిని మార్చారు. ● హుజూర్నగర్ నియోజకవర్గంలోని చింతలపాలెం మండలం వజినేపల్లిలో ఈవీఎం మొరాయించడంతో కొద్దిసేపు పోలింగ్ ఆగిపోయింది. చింతలపాలెం, నక్కగూడెం గ్రామాల్లో వీవీ ప్యాట్స్ పనిచేయకపోవడంతో వాటిస్థానంలో కొత్తవి అమర్చారు. ● మిర్యాలగూడ మండలం జైత్యతండాలో ఈవీఎం నిర్వహణపై అవగాహన లేకపోవడంతో పోలింగ్ ఆరగంట పాటు నిలిచిపోయింది. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో సెక్టోరియల్ అధికారి వచ్చి దాన్ని ప్రారంభించడంతో పోలింగ్ కొనసాగింది. ● సూర్యాపేట మండలం పిల్లలమర్రిలోని 21వ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం కాసేపు మోరాయించింది. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో టెక్నికల్ సిబ్బంది వచ్చి సరిచేశారు. ● పెన్పహాడ్ మండలం జలమాలకుంటతండా పోలింగ్ స్టేషన్లో వీవీ ప్యాట్ పనిచేయలేదు. దీంతో పోలింగ్ కొద్దిసేపు ఆగింది. అధికారులకు సమాచారం ఇవ్వడంతో దాని మరొకటి ఏర్పాటు చేశారు. -
ఎన్నికల నిబంధనలు పాటించాలి
ఫ ఎస్పీ రాహుల్ హెగ్డే సూర్యాపేట: ఓట్లతో పాటు సిబ్బంది సైతం ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ రాహుల్ హెగ్డే సూచించారు. ఆదివారం ఆయన సూర్యాపేటలో విలేకరులతో మాట్లాడారు. లోక్సభ ఎన్నికల పోలింగ్కు సంబంధించి పోలీసు భద్రతా నడుమ సామగ్రి అంతా పోలింగ్ కేంద్రాలకు చేర్చామని పేర్కొన్నారు. ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున బయట ఎక్కడ కూడా గుంపులుగా చేరవద్దని, మద్యం అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలింగ్ బూత్ల వద్దకు కేవలం పోల్ చిట్టి, గుర్తింపు కార్డు మాత్రమే తెచ్చుకోవాలని సూచించారు. లైన్లో నిలబడి ఇతరులకు సైగలు చేయవద్దని, ఓటు వేసిన వెంటనే ఆ ప్రదేశం నుంచి వెళ్లిపోవాలన్నారు. ఇతరులను కించపరిచేలా రెచ్చగొట్టెలా ప్రవర్తించవద్దని, మద్యం తాగి ఓటు వేయడానికి రాకూడదన్నారు. ఘర్షణలకు దిగొద్దని, పోలింగ్ కేంద్రాల వద్ద ఉండే పోలీసు సిబ్బందికి సహకరించాలని కోరారు. శాస్త్రోక్తంగా నిత్యకల్యాణంమఠంపల్లి: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన మట్టపల్లి మహాక్షేత్రంలో ఆదివారం శ్రీరాజ్యలక్ష్మీ, చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరపింహ స్వామి నిత్య, శాశ్వత కల్యాణాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయంలో ఉదయం సుప్రభాత సేవ, నిత్యాగ్నిహోత్రి, పంచామృతాలతో అభిషేకం, అష్టోత్తర సహస్రనామార్చన, అమ్మవార్లకు సహస్ర కుంమార్చనలు, ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం స్వామి అమమవార్లకు ఎదుర్కోలు మహోత్సవం చేపట్టి కల్యాణతంతు పూర్తిచేశారు. ఆ తర్వాత మహానివేదనతో భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనర్సింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. -
పోలింగ్ ప్రక్రియ సజావుగా జరగాలి
భానుపురి (సూర్యాపేట): లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సజావుగా జరిగేలా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకటరావు జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఆదివారం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను సాధారణ పరిశీలకుడు మనోజ్ కుమార్ మణిక్యరావు సూర్యవంశీ, ఎస్పీ రాహుల్ హెగ్డేలతో కలిసి కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. జిల్లాలోని నాలుగు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి పోలింగ్ కేంద్రాలకు రూట్ల వారీగా సెక్టార్ అధికారి పర్యవేక్షణలో పోలీస్ బందోబస్తుతో ఎన్నికల సిబ్బంది, ఈవీఎంలను వాహనాల్లో తరలించామన్నారు. 112 రూట్లలో 1,201 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లావ్యాప్తంగా 10,000, 12 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోన్నారని తెలిపారు. 123 సెక్టార్ అధికారులు, 5,600 మంది పోలింగ్ అధికారులు, 173 మంది మైక్రో అబ్జర్వర్లు, వలంటీర్లు 729 మంది, అంగవైకల్యం ఉన్న వారికోసం 729 ఆటోలు ఏర్పాటు చేశామన్నారు. 229 సమస్యాత్మక కేంద్రాల్లో లోపల, బయట ఉన్న 458 కెమెరాలతో పోలింగ్ ప్రక్రియను పరిశీలిస్తామన్నారు. అన్ని కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ఉంటుందని, ప్రతి సమస్యాత్మక కేంద్రంలో ఐదుగురు పోలీసులు విధులు నిర్వహిస్తారన్నారు. అంతకుముందు కోదాడలోని ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని సాధారణ పరిశీలకునితో కలసి పరిశీలించారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సోమవారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, ఓటర్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ ఎస్.వెంకటరావు అన్నారు. సీ–విజిల్ ద్వారా 69 ఫిర్యాదులు వస్తే 53 పరిష్కరించామని, 16 డ్రాప్ అయ్యాయని తెలిపారు. అన్ని చెక్ పోస్టుల ద్వారా నేటి వరకు రూ.2,92, 07,642 నగదు, బంగారం, వెండి విలువ రూ.1,21,43,767, ఇతర వస్తువులు 1,06,96,801 సీజ్ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవ్, డీఎస్పీ రవి, తహసీల్దార్లు శ్యామ్సుందర్రెడ్డి, కృష్ణయ్య, మహేంద్రరెడ్డి, వినోద్కుమార్ పాల్గొన్నారు. 48 మోడల్ కేంద్రాలు లోక్సభ పోలింగ్ శాతం పెంచేందుకు జిల్లాలో 48 ఆదర్శ(మోడల్) పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కల్టెకర్ ఎస్.వెంకటరావు తెలిపారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు మహిళా, ఐదు ఆదర్శ, వికలాంగులు, యూత్కు ఒక్కొక్కటి చొప్పున 12 కేంద్రాలతో కలిపి నాలుగు నియోజకవర్గాల్లో మొత్తం 48 ఆదర్శ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఫ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటరావు ఫ సూర్యాపేట, కోదాడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల పరిశీలన -
అమ్మ లేనిదే సృష్టిలేదు
భానుపురి(సూర్యాపేట): సృష్టికర్త అమ్మ అని, అమ్మ లేనిదే సృష్టి లేదని అలాంటి అమ్మలను పూజించుకొన్న వారి జీవితం ధన్యమని వాసవీ క్లబ్ గవర్నర్ రాచర్ల కమలాకర్, వాసవీ వనితా క్లబ్ అధ్యక్షురాలు పసుపర్తి జ్యోతి అన్నారు. ఆదివారం మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకొని వాసవీ వనితా క్లబ్, వాసవీ కుసుమాంబ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ భగవద్గీత మందిరంలో మాతృదేవతలకు పాదపూజ నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తల్లికి ఎల్లప్పుడూ రుణపడి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వాసవీవనితా క్లబ్ కార్యదర్శి వెంపటి విజయ, కోశాధికారి నల్లపాటి రమాదేవి, ఓరుగంటి లావణ్య, కార్యదర్శి సంతోషి, కోశాధికారి వాసవి, శ్రీదేవి, గుండా సుధామాధురి పాల్గొన్నారు. -
పోలింగ్ సిబ్బందికి ఉచిత రవాణా సౌకర్యం
సూర్యాపేట: పోలింగ్ విధుల అనంతరం పీఓలు, ఏపీఓలు వారి ప్రాంతాలకు వెళ్లేందుకు ఉచితంగా రవాణా సౌకర్యం ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకటరావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం సూర్యాపేట కలెక్టరేట్లోని ఎన్ఐసీ హాల్లో స్పెషల్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేశాం లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటరావు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ లోక్సభ సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు జిల్లా అదనపు కలెక్టర్లు సీహెచ్.ప్రియాంక, బీఎస్ లతలో కలిసి కలెక్టర్ హాజరై మాట్లాడారు. ఈ సమావేశంలో డీపీఆర్వో రమేష్కుమార్ ఉన్నారు. ఆ 48 గంటలు కీలకం భానుపురి (సూర్యాపేట): లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో ముందు 48 గంటలు చాలా కీలకమని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి వెంకటరావు, జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే శుక్రవారం సంయుక్త ప్రకటనలో తెలిపారు. 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు జిల్లాలో మద్యం విక్రయాలు నిలిపివేయాలని పేర్కొన్నారు. ఫ కలెక్టర్ వెంకటరావు -
పోస్టల్ బ్యాలెట్ ఓటేసిన 8,314 మంది
భానుపురి (సూర్యాపేట): లోక్సభ ఎన్నికల్లో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు ఈనెల 3, 4 తేదీలతోపాటు 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నల్లగొండ లోక్సభ స్థానం పరిధిలో 7,851 మందికి 7,052 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకటరావు తెలిపారు. హుజూర్నగర్లో 1,916 మందికి 1,707 మంది, కోదాడలో 2,629 గాను 2,274 మంది, సూర్యాపేటలో 3,306 మందికి 3,071 మంది వినియోగించుకున్నారని పేర్కొన్నారు. అలాగే భువనగిరి లోక్సభ స్థానం పరిధిలో 1,558 మందికి 1,262 మంది ఓటేసినట్టు తెలిపారు. మొత్తంగా రెండు లోక్సభ స్థానాల పరిధిలో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో మొత్తం 9,409 మందికి 8,314 మంది ఉద్యోగులు ఓటరు ఫెసిలిటేషన్ కేంద్రాల ద్వారా ఓటేశారని, దీంతో జిల్లాలో 88.36 శాతం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నమోదైందని పేర్కొన్నారు. -
గొప్ప సంఘ సంస్కర్త.. బసవేశ్వరుడు
భానుపురి (సూర్యాపేట): కుల మతాలకు అతీతంగా దేశంలో మొదటి మతాంతర వివాహం జరిపించిన గొప్ప సంఘ సంస్కర్త బసవేశ్వరుడని లింగాయత్ లింగబలిజ సంఘం జిల్లా అధ్యక్షుడు వల్లె శేఖర్ అన్నారు. బసవేశ్వరుడి 891వ జయంతి సందర్భంగా శుక్రవారం ఆ సంఘం ఆధ్వర్యంలో సూర్యాపేటలోని మినీట్యాంక్ బండ్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేటలో లింగాయత్ లింగబలిజ సంఘ భవనం కోసం ప్రభుత్వం భూమిని కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లింగాయత్ లింగ బలిజ సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు వల్లెం ఉమామహేశ్వర్రావు, ప్రధాన కార్యదర్శి సంకుర్ణుశెట్టి పరమేష్, కోశాధికారి అల్లం వీరయ్య, మహిళా అధ్యక్షురాలు సూర సోమేశ్వరమ్మ, ఉపాధ్యక్షురాలు తొగరు ఉప్పమ్మ, కోశాధికారి దొడ్డి రాధిక, దొడ్డ నాగలక్ష్మి, శెట్టి శోభ, జిల్లా మీడియా ఇన్చార్జి బత్తుల మల్లికార్జున్, వల్లెం శంకరప్రసాద్, దొడ్డి ఈశ్వరయ్య, బాల్గాని కోటయ్య పాల్గొన్నారు. -
‘కార్పొరేట్’లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలి
భానుపురి (సూర్యాపేట): 2024–25 విద్యా సంవత్సరంలో కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశాల కోసం గిరిజన విద్యార్థిని, విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కె.శంకర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ గిరిజన వసతిగృహం/ ఆశ్రమ పాఠశాలలో వసతి పొంది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించిన గిరిజన విద్యార్థులు, కేజీబీవీ, ప్రభుత్వ, ఎయిడెడ్, మున్సిపల్, జిల్లా పరిషత్, ప్రభుత్వ రెసిడెన్షియల్, జనహర్ నవోదయ విద్యాలయం, బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో విద్యనభ్యసించి 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 7.0 జీపీఏ నుంచి 10 జీపీఏ సాధించిన వారికి కార్పొరేట్ కళాశాలలో ఉచితంగా ప్రవేశం కల్పించనున్నట్టు పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు telanganaepass.gov.in ఆన్లైన్ ద్వారా ఈనెల 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వార్షిక ఆదాయం రూ.2లక్షలకు మించని కుటుంబాలకు చెందిన విద్యార్థులు అర్హులని తెలిపారు. ప్రత్యేక ప్రణాళికతోనే ఉత్తమ ఫలితాలు కోదాడ: జిల్లా యత్రాంగం ప్రత్యేక ప్రణాళిక రూపొందించి పకడ్బందీగా అమలు చేయడంతోనే జిల్లాలో ఈ ఏడాది పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించామని జిల్లా విద్యా శాఖ అధికారి (డీఈఓ) అశోక్ అన్నారు. శుక్రవారం కోదాడలోని కేటీఎస్ పాఠశాలలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలను సాధించిన పాఠశాలల యాజమాన్యాలు, 10 జీపీఏ సాధించిన విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇదే స్ఫూర్తితో వచ్చే విద్యాసంవత్సరం సూర్యాపేట జిల్లాను పది ఫలితాల్లో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలపాలన్నారు. అనంతరం 10 జీపీఏ సాధించిన 161 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సలీం షరీఫ్, శ్రీనయ్య, శ్రావణ్, జనార్దన్, ప్రతాప్, చత్రునాయక్, బాణాల కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అక్షయ తృతీయ సందడి భానుపురి (సూర్యాపేట): సూర్యాపేట పట్టణంలో అక్షయ తృతీయ సందడి నెలకొంది. ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని ప్రజల నమ్మకం. ఈ నేపథ్యంలో శుక్రవారం అక్షయ తృతీయ సందర్భంగా పట్టణంలోని అలంకార్ రోడ్డులోని బంగారం దుకాణాల్లో వివిధ వర్గాల ప్రజలు బంగారు నగలు కొనుగోలు చేశారు. దీంతో దుకాణాల్లో సందడి నెలకొంది. గురువారం పది గ్రాముల కేడీఎం బంగారం ధర రూ.67వేలు, బిస్కట్ బంగారం రూ.73,500లు ఉండగా శుక్రవారం అక్షయ తృతీయ సందర్భంగా రూ.1,500ల వరకు పెరిగి కేడీఎం రూ.68,500, బిస్కట్ రూ.75,300లకు చేరుకుంది. మట్టపల్లిలో వైభవంగా పూర్ణాహుతిమఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో గల టీటీడీ కల్యాణ మండపంలో హైదరాబాద్కు చెందిన సుధీర్శర్మ ఆధ్వర్యంలో కొనసాగుతున్న హోమ కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం యాజ్ఞీకులు, అర్చకులు, రుత్విక్కులు వైభవంగా పూర్ణాహుతి గావించారు. అదేవిధంగా భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా అర్చకులు రాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అనువంశక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు వియ్కుమార్, ఈఓ నవీన్కుమార్, మహదేవశర్మ, సుధీర్శర్మ, అర్చకులు, రుత్విక్కులు ఉన్నారు. -
బీఆర్ఎస్ అభ్యర్థులదే గెలుపు
సూర్యాపేట: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భువనగిరి, నలగొండ పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు ఖాయమని, కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామంలో బీఆర్ఎస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రచారంలో మాకు వస్తున్న అపూర్వ ప్రజాస్పందనే బీఆర్ఎస్ గెలుపునకు నిదర్శనమని సూచించారు. తమ ఓటమి ఖాయం అయిందని భావించే కాంగ్రెస్ నాయకులు. పోలీసులను ఉపయోగించి బీఆర్ఎస్ శ్రేణులను భయపెడుతున్నారన్నారు. జానారెడ్డి, ఉత్తమ్, కోమటిరెడ్డి బ్రదర్స్తో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నేతల ఇళ్లకు వెళ్లి బెదిరించడం దుర్మార్గం అన్నారు. కాంగ్రెస్ నాలుగు నెలల పాలనలోనే నరకం చూశామని ప్రజలే మాకు స్వయంగా చెబుతున్నారన్నారు. మే 13వ తేదీన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రైతుబంధు పేరుతో కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకాలను రైతాంగం గ్రహించారన్నారు. తెలంగానలో సబ్బండ వర్గాలు కేసీఆర్తోనే ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రవీందర్రెడ్డి, జెడ్పీటీసీ జీడి భిక్షం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఫ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి -
పోలింగ్ పూర్తయ్యే వరకు మద్యం దుకాణాలు బంద్
భువనగిరి, ఆలేరు, రామన్నపేట, మోత్కూరు ఎకై ్సజ్ పోలీస్స్టేషన్ల సీఐలు, ఎస్ఐలతో శుక్రవారం భువనగిరిలోని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శెగ్గెం సైదులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈనెల 11న సాయంత్రం నుంచి 13వ తేదీన పోలింగ్ పూర్తి అయ్యే వరకు మద్యం దుకాణాలు, బార్లు బంద్ ఉంటాయని తెలిపారు. పోలింగ్ సందర్భంగా ఎక్కడైనా మద్యం విక్రయించినట్లు, రవాణా చేసినట్లు తెలిస్తే 87126 58939నంబర్కు సమాచారం అందించాలని చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో 581 కేసులు నమోదు చేసి 57మందిని అరెస్ట్ చేశామని, రూ.కోటి 97లక్షల 28వేల విలువ చేసే 1,49,318 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశామని, అదేవిధంగా భువనగిరి, యాదగిరిగుట్టలో రెండు గంజాయి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. -
గుణాత్మక బోధనతో మంచి ఫలితాలు
భానుపురి (సూర్యాపేట) : గుణాత్మకబోధనతో జిల్లాలో మంచి ఫలితాలు సాధించామని కలెక్టర్ ఎస్. వెంకటరావు అన్నారు. పదో తరగతి ఫలితాల్లో 10/10 జీపీఏ సాధించిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు గురువారం కలెక్టరేట్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. జిల్లాలో పదిలో ప్రత్యేక తరగతులు నిర్వహించి నాణ్యమైన విద్యానందించామన్నారు. ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత పొందాలన్నదే ప్రభుత్వ లక్ష్యం కాగా ఆదిశగా ముందస్తు ప్రణాళికతో విద్యాబోధనలో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్నారు. జిల్లాలో అన్ని పాఠశాలలు, వసతి గృహాల్లో మెరుగైన సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. పది ఉత్తీర్ణత విద్యార్థులు తొలి మెట్టుగా గుర్తు పెట్టుకోవాలని సూచించారు. జిల్లాలో 354 మంది విద్యార్థులు 10 /10 జీపీఏ సాధించడం అంటే సాధారణ విషయం కాదని, ప్రభుత్వ పాఠశాలల్లో మున్ముందు ఇదే తరహాలో ఉత్తీర్ణత శాతం సాధించాలంటే ఉపాధ్యాయులు సమష్టి కృషి చేయాలన్నారు. రాష్ట్ర స్థాయిలో జిల్లా 6వ స్థానంలో నిలిచిందని మున్ముందు మొదటి స్థానంలో నిలిచేలా కృషి చేయాలన్నారు. సూర్యాపేట డివిజన్ పరిధిలో మంచి మార్కులు సాధించిన 193 మంది విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో మెమొంటోలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేసిన విద్యాశాఖ అధికారి అశోక్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏడీ శైలజ, ఎంఈఓలు, హెంఎంలు పాల్గొన్నారు.ఫ కలెక్టర్ వెంకటరావు హోం ఓటింగ్ 96.10శాతం భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో 96.10శాతం మంది హోం ఓటింగ్ను వినియోగించుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకటరావు వెల్లడించారు. 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, వికలాంగులు ఈనెల 3, 4,8 తేదీల్లో కలిపి నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 542 మందికి 526 మంది హోం ఓటింగ్ను వినియోగించుకున్నట్లు చెప్పారు. హుజూర్నగర్ లో 232 మందికి 225 మంది, కోదాడలో 150 మందికి 147 మంది, సూర్యాపేటలో 160 మందికి 154 మంది హోం ఓటింగ్లో పాల్గొన్నట్లు వివరించారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 150 మందికి 139 మంది వినియోగించు కున్నారని, జిల్లాలోని నాలుగు నియోజక వర్గాల పరిధిలో మొత్తం 692 మందికి 665 మంది హోం ఓటింగ్ను వినియోగించుకున్నారని చెప్పారు. జిల్లాలో 27 రూట్లలో 29 బృందాలు ఓటింగ్ నిర్వహణ ప్రక్రియ చేపట్టాయన్నారు. -
దేశం కోసం పనిచేసే నాయకుడు మోదీ
సూర్యాపేట : దేశం కోసం నిజాయితీగా పనిచేసే నాయకుడు నరేంద్ర మోదీ అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. గురువారం సూర్యాపేటలో బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావుతో కలిసి ప్రచార ర్యాలీలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ముస్లిం మహిళల కోసం త్రిబుల్ తలాక్ తీసుకురావడం, చేతివృత్తులు చేసుకునే నిరుపేదల కోసం విశ్వకర్మ యోజనతో ఆర్థిక రుణాలు అందించడం, 370 ఆర్టికల్ రద్దుచేసి కశ్మీర్ ను భారతదేశ అంతర్భాగంలో కలిపిన చరిత్ర కూడా ప్రధాని మోదీదేనన్నారు. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో 100శాతం గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుటుంబ పాలన అంతం కావాలంటే మరోసారి మోదీ ప్రధాని కావాలన్నారు. ఫ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ -
సూర్యాపేట
పెరుగుతున్న మూసీ నీటిమట్టం మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.1ప్రమాదంలో ప్రజాస్వామ్యం రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నాయని రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ అన్నారు. శుక్రవారం శ్రీ 10 శ్రీ మే శ్రీ 2024- 4లోగరిష్టం / కనిష్టం -
భీంరెడ్డి పోరాట చరిత్ర మరువలేనిది
సూర్యాపేట : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, ఎంసీపీఐ పొలిట్ బ్యూరో సభ్యుడు భీంరెడ్డి నర్సింహా రెడ్డి చేసిన పోరాట చరిత్ర మరువ లేనిదని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు వరికుప్పల వెంకన్న అన్నారు. గురువారం భీంరెడ్డి నర్సింహారెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని సూర్యాపేట పట్టణంలోని 60 ఫీట్ల రోడ్డులో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. వేలాది ఎకరాల భూములను పేద ప్రజలకు పంచిన చరిత్ర ఆయనకే దక్కిందన్నారు. నేటి యువత బీఎన్ ని ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి షేక్ నజీర్, నాయకులు మోరపాక ఉగ్రయ్య, లింగంపల్లి రాజు, ఓంకార్, బి.ఎల్లమ్మ, ఏపూరి సోమన్న, మీసాల సైదులు తదితరులు పాల్గొన్నారు. ఫాసిస్ట్ బీజేపీని ఓడించాలి సూర్యాపేట : ఫాసిస్ట్ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాకుండా ప్రజలంతా తమ ఓటు హక్కు ద్వారా ఓడించాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మండారి డేవిడ్కుమార్ కోరారు. గురువారం స్థానిక చండ్ర పుల్లారెడ్డి విజ్ఞానకేంద్రంలో నిర్వహించిన ఏఐకేఎంఎస్ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. హిందూత్వం పేరుతో దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందన్నారు. కార్యక్రమంలో ఏఐకేఎమ్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శంకర్, పి.లక్ష్మయ్య, పెద్దింటి రంగారెడ్డి, కనకారావు, సుంకురెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నాగన్న, భయం లింగయ్య, దూదియా పాల్గొన్నారు. ప్రత్యేక మేనిఫెస్టోతో సూర్యాపేటకు ఎంతో మేలు భానుపురి (సూర్యాపేట) : కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసం రూపొందించిన మేనిఫెస్టోతో సూర్యాపేటకు ఎంతో మేలు కలుగుతుందని టీపీసీసీ లీగల్, మానవ హక్కులు, సమాచార హక్కు చట్టం విభాగం జిల్లా చైర్మన్ నూకల సుదర్శన్ రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేటలో న్యాయవాది మారపాక వెంకన్న నివాసంలో కాంగ్రెస్, మిత్రపక్షాలు, ఇతర న్యాయవాదులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు సూర్యాపేట మీదుగా స్పీడ్ రైలు నడుపుతామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు బెంచ్ హైదరాబాద్లో ఏర్పాటు చేస్తామని ప్రకటించడం హర్షణీయమన్నారు. ఈ సమావేశంలో న్యాయవాదులు టేకులపల్లి శ్రీనివాస్ రావు, సోమేశ్వర్, గుంటూరు మధు, పోలేబోయిన నరసయ్య యాదవ్, నరేష్ పిళ్ళై, మంగు నాయక్, కోక రంజిత్ కుమార్, పసల బాలరాజు, అనంతుల సందీప్ ఉన్నారు. వంద శాతం సాధారణ కాన్పులే చేయాలి హుజూర్నగర్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో వందశాతం సాధారణ కాన్పులు చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటాచలం కోరారు. గురువారం హుజూర్నగర్ ఏరియా హాస్పిటల్లో నిర్వహించిన ఆస్పత్రి సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులు, ప్రజారోగ్య విభాగ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సమన్వయంతో పనిచేయూలని ఆయన చెప్పారు. నమోదైన ప్రతి గర్భిణికి పల్లె దవాఖానాలు, పీహెచ్సీల్లో పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ జయ శ్యాంసుందర్, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, డాక్టర్ నాజియా, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కరుణ్ కుమార్, డేమో అంజయ్య, ఎస్ఓ వీరయ్య తదితరులు పాల్గొన్నారు. -
అవగాహన లేమి.. తగ్గుతున్న దిగుబడి!
సూర్యాపేట : రైతుల అవగాహన లేమి పంటల దిగుబడిపై ప్రభావం పడుతోంది. ప్రధానంగా ఏ భూమిలో ఏ రకమైన పంటలు సాగు చేయాలో.. ఏ భూమిలో ఏ పోషకాల స్థాయి ఎలా ఉంది.. ఎలాంటి ఎరువులు, పురుగుల మందులు వాడాలన్నా విషయాలపై రైతులకు అవగాహన ఉండాలంటే తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాల్సి ఉంది. ప్రస్తుతం జిల్లా రైతాంగానికి భూసార పరీక్షలపై ఎలాంటి అవగాహన లేకపోగా.. క్షేత్రస్థాయిలో ఉండే వ్యవసాయ అధికారులు సైతం ఈ దిశగా రైతాంగాన్ని చైతన్యపర్చడంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో 83 క్లస్టర్లు.. జిల్లావ్యాప్తంగా 83 క్లస్టర్లు ఉన్నాయి. వాటి పరిధిలో దాదాపు 6.30 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతుంటాయి. జిల్లాలో 2.70లక్షల మంది రైతులు ఉన్నారు. ఏటా వర్షాకాలం, యాసంగిలో వరితో పాటు పత్తి, వేరుశనగ, కంది, పెసర, మొక్కజొన్న, మినుములు సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో నేలల స్వభావం, అవసరమైన ఎరువులు, మందులు, ఏ నేలలో ఏ పంట వేస్తే అధిక దిగుబడి వస్తుందోనన్నది అవగాహన లేకుండానే ఏటా ఒకేవిధమైన పంటలను రైతాంగం సాగు చేస్తోంది. చాలామంది రైతులు ఏటా పత్తి మినహా ఇతర ఏ పంటలను సాగు చేయడం లేదు. అసలు ఆ నేల పత్తి పంటకు అనుకూలమో కాదో కూడా తెలియని పరిస్థితుల్లో సాగు చేసి నష్టపోతున్నారు. పరీక్షలు చేయించుకుంటేనే .. ప్రధానంగా రైతులు పంటల సాగుపై పెడుతున్న దృష్టి.. ఆ భూమిలో ఉన్న పోషకాల స్థాయి తెలుసుకోవడంలో చూపడం లేదు. దీంతో విచ్చలవిడిగా ఎరువులను వాడడంతో పెట్టుబడి వ్యయం పెరగడం, ఎరువులు ఫలితాన్ని ఇవ్వకపోవడంతో దిగుబడి ఆశించిన మేర రావడం లేదు. రైతులు భూసార పరీక్షలు చేయించుకుంటే వాటి ఫలితాల ఆధారంగా పంటలు సాగు చేస్తే దిగుబడులు పెరుగుతాయని అధికారులు పేర్కొంటున్నారు. భూసార పరీక్షల ద్వారా వ్యవసాయ క్షేత్రాల్లోని ఉదజని, లవణ సూచిక పోషకాలు, నత్రజని, భాస్వరం, పొటాష్ల లభ్యత ఏవిధంగా ఉందో తెలుసుకునే అవకాశముంటుంది. దీంతో ఏ పోషకాలు తక్కువగా.. ఏ పోషకాలు ఎక్కువగా ఉన్నాయో వాటి ఆధారంగా ఎరువులు వినియోగిస్తే సరిపోతోంది. నేల స్వభావాన్ని బట్టి అధికారుల సూచనల మేరకు వంగడాలను సైతం సాగు చేయొచ్చని, దీంతో దిగుబడి పెరగుతుందని అంటున్నారు.ఫ భూసార పరీక్షలు చేయించుకోవడంలో రైతులు వెనుకంజ ఫ ఇష్టానుసారంగా ఒకేరకమైన పంటల సాగు ఫ మొక్కుబడిగానే అధికారుల సూచనలు
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
'ఇడియట్ సిండ్రోమ్' అంటే ఏంటీ..? ప్రమాదకరమా..?
సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో
తెలంగాణలో బీజేపీకి బ్రహ్మాండమైన ఫలితాలు: కిషన్ రెడ్డి
రోహిత్ శర్మతో పాటు షకీబ్!.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు!
ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రాపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు
ఈసీ బదిలీ చేసిన చోటే ఈ దారుణాలు
రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు
కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (15-05-2024)
స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
తప్పక చదవండి
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement