breaking news
Suryapet
-
గ్యాస్ కొరతపై ఆర్డీఓ సమీక్ష
మోత్కూరు : మోత్కూరులో గ్యాస్ సిలిండర్ల కోసం బారులు తీరిన వినియోగదారుల అంశంపై ‘వంటింటి యుద్ధం’ శీర్షికతో సాక్షిలో ప్రచురితమైన ఫొటో స్టోరీకి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి స్పందించారు. ఆర్డీవోను క్షేత్ర స్థాయి పరిశీలన చేయాలని ఆదేశించడంతో శనివారం ఆర్డీఓ మోత్కూరుకు చేరుకొని తహసిల్దార్ కార్యాలయంలో వంట గ్యాస్ సిలిండర్లపై సమీక్షించారు. అనంతరం ఆర్డీవో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వంట గ్యాస్ సిలిండర్ల కొరత అపోహ మాత్రమేనని, సరిపడు నిల్వలు ఉన్నాయని తెలిపారు. భువనగిరి జిల్లాలో గ్యాస్ సిలిండర్ల పంపిణీ కోసం 20 ఏజెన్సీలు ఉన్నాయని, వాటిల్లో సరిపడా నిల్వలు ఉన్నాయని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాలలో 45 రోజులకు ఒకసారి గ్యాస్ సిలిండర్లు డెలివరి చేయబడతాయని తెలిపారు. బుకింగ్ చేసుకున్న వారికి కచ్చితంగా డెలివరి చేస్తామని తెలిపారు. ప్రభుత్వ విద్యార్థి వసతి గృహాలు, పాఠశాలలకు, అంగన్వాడి కేంద్రాలకు ఎలాంటి కొరత లేకుండా గ్యాస్ సిలిండర్లను అందజేస్తున్నామని తెలిపారు. మరణించినా.. ఐదుగురికి ప్రాణదానంవేములపల్లి : వేములపల్లి మండల కేంద్రానికి చెందిన మల్లికంటి వెంకటయ్య(52) మరణానంతరం తన అవయవాలను దానం చేసి ఐదుగురికి ప్రాణదానం చేశారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటయ్య ఈ నెల 8న ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంకటయ్యను చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. శుక్రవారం ఆయన బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. అయినప్పటికీ వెంకటయ్య భార్య ఎల్లమ్మ, కుమారుడు సురేష్ సామాజిక బాధ్యతతో ఆయన అవయవాలు దానం చేయడానికి ముందుకొచ్చారు. వెంకటయ్య నుంచి సేకరించిన రెండు కిడ్నీలను హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రికి, కళ్లను సరోజినీదేవి కంటి ఆస్పత్రికి, కాలేయాన్ని అపోలో ఆస్పత్రికి దానం చేశారు. వెంకటయ్య కుటుంబ సభ్యుల నిర్ణయాన్ని గ్రామస్తులు, ఆస్పత్రి సిబ్బంది అభినందించారు. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి తిప్పర్తి : కాలినడకన వెళ్తున్న మహిళను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతిచెందింది. ఈ ఘటన ఘటన తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశరాజుపల్లి గ్రామ సమీపంలో శనివారం జరిగింది. తిప్పర్తి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చండూరు పట్టణానికి చెందిన జొర్రిగల జ్ఞానేశ్వరి(38) శివుడి దీక్షలో భాగంగా చండూరు నుంచి వాడపల్లిలోని గుడికి కాలినడకన బయల్దేరింది. రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న ఆమెను శనివారం తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశరాజుపల్లి గ్రామ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో జ్ఞానేశ్వరి తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి అన్న జొర్రిగల వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసినట్లు ఏఎస్ఐ లింగయ్య తెలిపారు. మృతురాలికి వివాహం కాలేదు. -
పురాతన శివాలయాన్ని కాపాడుకోవాలి
మిర్యాలగూడ : దామరచర్ల మండలం బొత్తలపాలెం గ్రామ శివారులో నందిబోడు పైన గల కాకతీయుల కాలం(13వ శతాబ్దం) నాటి శివాలయం శిథిలావస్థలకు చేరుకుందని, దానిని కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. శనివారం ఆయన బొత్తలపాలెం గ్రామాన్ని సందర్శించి నందిబోడు పైన గల శివాలయాన్ని, భిన్నమైన శివలింగం, నంది, చెన్నకేశవ శిల్పాలను పరిశీలించారు. శివాలయం గోడలు పడిపోయాయని, ఆలయ వెనుక నిర్మించిన తాత్కాలిక రేకుల షెడ్డు కింద కాకతీయుల కాలం నాటి శివలింగం, పానపట్టం, ముట్టె, చెవులు, భిన్నమైన నంది, తల, కాళ్లు లేని శ్రీదేవి, భూదేవి సహిత చెన్నకేశవ విగ్రహాలు ఉన్నాయని తెలిపారు. ఇవి బొత్తలపాలెం గ్రామ చరిత్రకు ఆనవాళ్లని, వాటిని కాపాడుకుని భవిష్యత్తు తరాలకు అందించాలని ఆయన గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట సర్పంచ్ ఇంజం నర్సిరెడ్డి, ఉప సర్పంచ్ నర్సింగ్ అనిల్, నాయకులు పడిగపాటి శ్రీనివాస్రెడ్డి, వీరారెడ్డి, రవీందర్రెడ్డి, కందుల భిక్షారెడ్డి తదితరులు ఉన్నారు. ఫ పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి -
లారీ, ఆర్టీసీ బస్సు ఢీ.. పలువురికి గాయాలు
తిరుమలగిరి (తుంగతుర్తి) : లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామం వద్ద శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హన్మకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తిరుమలగిరికి వస్తుండగా.. తిరుమలగిరి నుంచి తొర్రూరు వైపు వెళ్తున్న లారీ వెలిశాల వద్ద బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ సంతోష్గౌడ్కు కడుపులో గాయాలయ్యాయి. ప్రయాణికురాలు బోళ్ల అంజమ్మకు చెయ్యి విరిగింది. మరో పది మందికి గాయాలు కావడంతో వారిని 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ దీపక్ క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో స్థానికులు అతడిని అతికష్టం మీద బయటకు తీయగా.. అతడి కుడి కాలు విరిగింది. ఘటనా స్థలాన్ని ఎస్ఐ వెంకట్రెడ్డి సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
వృద్ధాప్యం.. ఉల్లాసం
ఫ వయోవృద్ధుల విజ్ఞాన, వినోద కేంద్రంలో సీనియర్ సిటిజన్ల ఆటవిడుపు ఫ క్యారం, చెస్ ఆడుతూ కాలక్షేపం నల్లగొండ టౌన్ : నల్లగొండ జిల్లా కేంద్రంలోని రెడ్క్రాస్ భవన్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వయోవృద్ధుల విజ్ఞాన, వినోద కేంద్రం (ప్రణమ్ డే కేర్ సెంటర్) 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఆటవిడుపుగా మారింది. ఈ సెంటర్ను జనవరి 12న ప్రారంభించగా.. కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగులే కాకుండా 60 ఏళ్లు పైబడిన ప్రతిఒక్కరూ ఈ సెంటర్లో ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు సేద తీరవచ్చు. ఇంట్లో ఉండలేక ఇబ్బందులు పడే వయోవృద్ధులు ఈ కేంద్రానికి వచ్చి వార్తాపత్రికలు చదువుకోవడంతో పాటు క్యారం, చెస్ ఆటలు ఆడుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ యోగా, ఆరోగ్య శిబిరాలను కూడా నిర్వహిస్తారు. ఇక్కడకు వచ్చే వయోవృద్ధులకు ఈ సెంటర్ నిర్వాహకులు ఉచితంగా టీ, స్నాక్స్ అందజేస్తారు. ప్రతిరోజు సుమారు 50 మంది వరకు వయోవృద్ధులు ఈ సెంటర్కు వచ్చి కాలక్షేపం చేయడంతో పాటు వివిధ ఆటలు ఆడుతూ ఉల్లాసంగా గడుపుతున్నారు. -
పదో తరగతి విద్యార్థికి తీవ్ర గాయాలు
ఫ పరీక్ష కేంద్రానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఢీకొట్టిన ఆటో వలిగొండ : పదో తరగతి పరీక్ష రాసేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న విద్యార్థిని ఆటో ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన వలిగొండ మండలం రెడ్లరేపాక గ్రామ సమీపంలో శనివారం జరిగింది. 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. వలిగొండ మండలం పహిల్వాన్పురం గ్రామానికి చెందిన వనగంటి శివరాం స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. శనివారం నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభంకావడంతో తెలుగు పరీక్ష రాసేందుకు అతడు వలిగొండలోని పరీక్ష కేంద్రానికి ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. మార్గమధ్యలో రెడ్లరేపాక గ్రామ సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న ఆటో ద్విచక్ర వాహనానని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శివరాంను స్థానికులు 108 వాహనంలో భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సహాయకురాలితో ‘పది’ పరీక్షకు హాజరుమిర్యాలగూడ : మండలంలోని యాద్గార్పల్లి జెడ్పీహెచ్ఎస్ పదో తరగతి విద్యార్థిని వెన్నెలకు పుట్టుకతోనే పోలియో వలన కాళ్లు, చేతులు సరిగా పనిచేయవు. దీంతో ఆమె పదో తరగతి పరీక్షలు రాసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారి అనుమతితో అదే పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థినిని సహాయకురాలి(స్క్రైబ్)గా నియమించారు. శనివారం వెన్నెల సహాయకురాలి సహాయంతో మిర్యాలగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రానికి వచ్చి తెలుగు పరీక్ష రాసింది. పదో తరగతి పరీక్షల్లో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వెన్నెలతో కలిపి 13 మంది విద్యార్థులకు స్క్రైబ్లను అనుమతించారు. పదో తరగతిలో మొత్తం ఏడు పరీక్షలు రాయాల్సి ఉండగా.. ఇలాంటి వారికి ఏదో ఒక పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది. వెన్నెలకు ఇంగ్లిష్ పరీక్ష నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెలిసింది. -
ఇరువురి మధ్య ఘర్షణ.. కేసు నమోదు
భువనగిరి : మండల పరిధిలోని జమ్మాపురం గ్రామంలో శనివారం ఇద్దరి మధ్య ఘర్షణ జరగగా.. ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అనిల్కుమార్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ లూర్థయ్య, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు మాదాను మొహిజు వ్యక్తిగత కక్షలతో శనివారం ఘర్షణకు దిగారు. దీంతో ఇద్దరికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని స్థానికులు భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోగా.. ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి చౌటుప్పల్ : బైక్పై వెళ్తున్న యువకుడిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండల పరిధిలోని దండుమల్కాపురం గ్రామ శివారులో శనివారం రాత్రి జరిగింది. చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన వీరబోయిన కమలహాసన్ యాదవ్(28) హైదరాబాద్లోని కాచిగూడలో నివాసముంటూ ఓ ఆస్పత్రిలో ఫార్మసిస్టుగా పనిచేస్తున్నాడు. శనివారం స్వగ్రామానికి వెళ్లేందుకు ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. మార్గమధ్యలో చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ శివా రులోని చెరువుకట్ట సమీపంలోకి రాగానే వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం వచ్చి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కమలహాసన్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలసుకున్న పోలీసుల ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తాళం వేసిన ఇంట్లో చోరీకోదాడరూరల్ : తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన కోదాడ పట్టణంలోని శ్రీమన్నారాయణ కాలనీలో శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీమన్నారాయణ కాలనీకి చెందిన బి. బాబుకి ఆరోగ్యం బాగోలేకపోవడంతో చికిత్స నిమిత్తం స్థానిక వైద్యశాలకు వెళ్లాడు. ఇది గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడి బీరువాలో దాచిన రూ.70వేల నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై బాధితుడు కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
బాధితుడి వద్దకే వెళ్లి కేసు నమోదు
గరిడేపల్లి : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఎఫ్ఐఆర్ ఎట్ డోర్ స్టెప్ కార్యక్రమంలో భాగంగా శనివారం పోలీసులే ఆస్పత్రికి వెళ్లి కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీ అందజేశారు. గరిడేపల్లి ఎస్ఐ చలికంటి నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. గరిడేపల్లి మండలంసర్వారం గ్రామానికి చెందిన కాంతయ్య రెండు రోజుల క్రితం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. కీతవారిగూడెం గ్రామం వద్ద మరో బైక్ను ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన కాంతయ్యను పోలీసులు హుజూర్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా శనివారం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాంతయ్య వద్ధకే పోలీసులు వెళ్లి అతడిచ్చిన ఫిర్యాదు స్వీకరించి అక్కడికక్కడే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం ఎఫ్ఐఆర్ కాపీని కాంతయ్య కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎఫ్ఐఆర్ ఎట్ డోర్ స్టెప్ కార్యక్రమం ద్వారా బాధితులకు సత్వర పోలీసు సేవలు అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని ఎస్ఐ తెలిపారు. -
నలుగురు దొంగల అరెస్ట్
సూర్యాపేటటౌన్ : చోరీలకు పాల్పడుతున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. శనివారం సూర్యాపేట ఎస్పీ నరసింహ విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడలోని రాజీవ్నగర్కు చెందిన కంచుకొమ్ముల సంతోష్, కంచుకొమ్ముల గణేష్, కంచుకొమ్ముల సాయికిరణ్, సూర్యాపేటకు చెందిన షేక్ నస్రీన్ కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వీరు ఆటోలను దొంగిలించి అదే ఆటోలో ప్రయాణిస్తూ ఒంటరిగా ప్రయాణిస్తున్న వృద్ధ మహిళలను బెదిరించి ఆభరణాలు ఎత్తుకెళ్లడంతో పాటు రాత్రివేళ తాళాలు వేసిన ఇళ్లలో చోరీలు చేస్తుండేవారు. ఈ నెల 6న ఆత్మకూరు(ఎస్) మండలం కోటినాయక్తండా శివారులో ఓ వృద్ధురాలిని వీరు ఆటోలో ఎక్కించుకుని కొంతదూరం తీసుకెళ్లి ఆమెను బెదిరించి ఆమె మెడలోని వెండి గొలుసు లాక్కోని పారిపోయారు. బాధితురాలు ఈ నెల 10న ఆత్మకూరు(ఎస్) పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం ఉదయం ఆత్మకూరు(ఎస్) మండలం ఎనుబాముల గ్రామ స్టేజీ వద్ద సీసీఎస్ ఇన్స్పెక్టర్, ఆత్మకూరు ఎస్ఐ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా.. వీరి నలుగురితో పాటు మరో బాలుడు ఆటోలో నెమ్మికల్ వైపు వెళ్తూ అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా సూర్యాపేట జిల్లాలోని మునగాల, సూర్యాపేట టౌన్, కోదాడ టౌన్, మేళ్లచెరువు, నల్లగొండ జిల్లాలోని తిప్పర్తి, ఏపీలోని పల్నాడు జిల్లా పిడుగురాళ్ల, హైదరాబాద్లోని ఫిల్మ్నగర్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు చోరీలకు పాల్పడినట్లు నిజం ఒప్పుకున్నారు. వారి నుంచి 18 గ్రాముల బంగారం, 1.5 కేజీల వెండి, 3 ఆటోలు, ట్యాబ్, ల్యాప్టాప్, బైక్, టీవీ, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితులపై గతంలో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఫ 18 గ్రాముల బంగారం, 1.5 కేజీల వెండి, మూడు ఆటోలు, బైక్ స్వాధీనం చేసుకున్న పోలీసులు ఫ వివరాలు వెల్లడించిన సూర్యాపేట ఎస్పీ నరసింహ -
బుద్ధవనం సందర్శించిన బుద్ధిస్ట్ స్కాలర్లు
నాగార్జునసాగర్ : సాగర్లోని బుద్ధవనాన్ని శనివారం ఏపీలోని నాగార్జున విశ్వవిద్యాలయంలో బౌద్ధంపై పీహెచ్డీ చేస్తున్న మయన్మార్తో పాటు పలు దేశాలకు చెందిన బుద్ధిస్ట్ స్కాలర్లు సందర్శించారు. బుద్ధచరిత వనంలోని గౌతమ బుద్ధుడి పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం బుద్ధచరితవనం, జాతక వనం, ధ్యాన వనం, స్థూప వనం సందర్శించారు. మహాస్థూపంలోని సమావేశ మందిరంలో బుద్ధవనం లఘుచిత్రాన్ని వీక్షించారు. ధ్యాన మందిరంలో ధ్యానం చేశారు. అష్ట బుద్ధుల వద్ధ బుద్ధజ్యోతి వెలిగించి హారతి ఇచ్చారు. అదేవిధంగా నాగార్జునకొండకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో నాగార్జున విశ్వవిద్యాలయం బౌద్ధ అధ్యయన విభాగం పూర్వ విద్యార్థి, బుద్ధవనం ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర, ప్రశాంత్, బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, బుద్ధభూమి, బౌద్ధమాస పత్రిక అధ్యక్షుడు, ఎడిటర్ సీతారామయ్య, స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ పాల్గొన్నారు. -
దర్శనానికి మూడు గంటలకు పైనే..
యాదగిరిగుట్ట : ఇంటర్ పరీక్షలు ముగియడంతో యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు శని వారం భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, మాడ వీధులు, ప్రసాద విక్రయశాల, శివాలయం, లక్ష్మీ పుష్కరిణి, కల్యాణ కట్ట, సత్యనారాయణస్వామి వ్రత మండపాలు భక్తులతో సందడిగా మారాయి. స్వామివారి ధర్మ దర్శనానికి 3గంటలకు పైగా, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. స్వామివారిని 40వేల మంది దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ పూజలతో నిత్యాదాయం రూ.34,24,189 వచ్చి నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఫ యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ -
నిమ్మ.. బస్తా రూ.2500
నేను రెండు ఎకరాల్లో నిమ్మ సాగు చేశాను. వంద చెట్లు ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో నిమ్మకు మంచి ధర ఉన్నప్పటికీ దిగుబడులు రాకపోవడంతో నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. నాకున్న వంద చెట్లకు గాను ఈ సీజన్లో 100 బస్తాల దిగుబడులు రావాల్సి ఉండగా 20 బస్తాలకు మించి రాలేదు. దీర్ఘకాలిక పంట అయిన నిమ్మకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిలడక ధరను నిర్ణయించి కొనుగోలు చేయాలి. – యానాల శ్రీనివాస్రెడ్డి, నిమ్మ రైతు నెల్లిబండ, నకిరేకల్ మండలం నకిరేకల్ : నిమ్మకాయల రేటు ఒక్కసారిగా పెరిగింది. వేసవికాలం ప్రారంభం కావడంతో నిమ్మకాయలను ప్రజలు ఎక్కవగా వాడుతుండడంతో నిమ్మకు మంచి ధర వస్తోంది.. తెలంగాణలో ఏకై క నిమ్మ మార్కెట్ ఉన్న నకిరేకల్లో రోజూ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11గంటల వరకు నిమ్మ వ్యాపారం సాగుతుంది. ఇక్కడి నుంచి హైదరాబాద్, ఢిల్లీ, ముంబయి, గుజరాత్, ఉత్తరప్రదేశ్, చైన్నె, కలకత్తా ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. ప్రస్తుతం నకిరేకల్మార్కెట్లో నిమ్మ బస్తా (23 కేజీల టిక్కి) రూ.2000 నుంచి రూ.2500 పలుకుతోంది. కానీ నిమ్మ తోటలను తెగులు ఆశించడంతో దిగుబడి తగ్గింది. ఇప్పుడు రేటు పెరిగినా రైతులకు ప్రయోజనం ఉండడం లేదు. ఉమ్మడి జిల్లాలో 30 వేల ఎకరాల్లో సాగు.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సూమారు 30 వేల ఎకారాల్లో నిమ్మ తోటలు సాగువుతున్నాయి. దాదాపు 20 వేల రైతు, కౌలుదారు కుటుంబాలు నిమ్మ తోటలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఈ ఏడాది వర్షాలు, మంచుతో పాటు చెట్లకు ఎర్ర తెగులు వ్యాపించాయి. దీంతో నిమ్మ చెట్లపైన పూత రాలిపోవడంతోపాటు పిందె కూడా లేకపోవడంతో దిగుబడులు తగ్గిపోయాయి. ఏటా మార్చి నుంచి మే వరకు నిమ్మకు మొదటి విడత మంచి సీజన్ ఆ తరువాత ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు రెండో విడత సీజన్ ఉంటుంది. ఈ ఏడాది వేసవి ప్రారంభంలోనే నిమ్మ ధరలు పెరుగుతున్నప్పటికీ రైతులకు లాభం లేకుండా పోయింది. ప్రసుత్తం మార్కెట్ వచ్చేది 5 వేల బస్తాలే.. రెండు నెలల క్రితం నకిరేకల్ మార్కెట్కు రోజూ 10 వేల నుంచి 15 వేల బస్తాల దిగుమతులు వచ్చేవి. అప్పట్లో బస్తా ధర రూ.500 నుంచి రూ.700 ధర పలికింది. ఇప్పుడు 5 వేల బస్తాలకు మించి నిమ్మ దిగుమతులు రావడం లేదు. ప్రస్తుతం బస్తా నిమ్మకాయల ధర రూ.2000 నుంచి రూ.2500 వరకు పలుకుతోంది. మార్కెట్లో నిమ్మకు మంచి ధర ఉన్నప్పటికీ దిగుబడులు రాకపోడంతో తోటలు సాగు చేసిన రైతులు దిగాలు చెందుతున్నారు. గతంలో ఒక్క చెట్టు నుంచి 3 నుంచి 4 బస్తాల దిగుబడులు రాగా.. ప్రస్తుతం ఒక్క బస్తాకు మించి రావడం లేదని నిమ్మ రైతులు వాపోతున్నారు. వేసవి నేపథ్యంలో భారీగా పెరిగిన నిమ్మ ధర ఫ వాతావరణం అనుకూలించక తగ్గిన దిగుబడులు ఫ ధర పెరిగినా రైతులకు దక్కని ప్రయోజనం -
రిటైర్డ్ ఉద్యోగులు సమాజసేవలో పాల్గొనాలి
మునగాల: రిటైర్డ్ ఉద్యోగులు సమాజసేవలో పాల్గొనాలని ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పేరి వెంకటరెడ్డి కోరారు. శనివారం మునగాల మండల కేంద్రంలో ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం మునగాల యూనిట్ ఆధ్వర్యంలో రూ.40లక్షల వ్యయంతో నిర్మించిన భవనాన్ని ఆయన రాష్ట్ర, జిల్లా నాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం మునగాల యూనిట్ అధ్యక్షుడు శాకమూడి అప్పారావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఈనెల చివరి నాటికి ఈహెచ్ఎస్ కార్డులు ఇప్పించే బాధ్యత చేపడతానని హామీ ఇచ్చారు. రిటైర్డ్ ఉద్యోగుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని మంచి భావజాలాన్ని ప్రజల్లో కలిగించేందుకు నడుం బిగించాలని ఆకాంక్షించారు. మునగాలలో భవన నిర్మాణానికి రూ.10లక్షల విరాళాన్ని అందజేసిన విశ్రాంత ఉపాధ్యాయురాలు లక్ష్మి తులిసమ్మను అభినందించి పూలమాల, శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రటరీ లింగయ్య, అసొసియేట్ ప్రెసిడెంట్ రావెళ్ల సీతరామయ్య, పత్రికా సంపాదకుడు శరత్బాబు, రాష్ట్ర సెక్రటరీ అక్కిరాజు లక్ష్మీనరసింహారావు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బొల్లు రాంబాబు, శ్యాంసుందర్ రెడ్డి, మండల బాధ్యులు, వివిధ మండలాల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఫ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరెడ్డి -
వర్గరహిత సమాజాన్ని నిర్మించేది మార్క్సిజమే
సూర్యాపేట అర్బన్: దోపిడీ నుంచి కార్మిక వర్గం విముక్తి చెందాలంటే పెట్టుబడిదారీ వ్యవస్థ రద్దవ్వాలని, సోషలిస్ట్ సమాజాన్ని నిర్మించాలని చెప్పిన సిద్ధాంతకర్త కార్ల్మార్క్స్ అని సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రంగారావు అన్నారు. సూర్యాపేట పట్టణంలో నిర్వహించిన కార్ల్మార్క్స్ వర్ధంతిలో ఆయన మాట్లాడారు. ఉన్నవారే లాభాల పేరుతో అనుభవిస్తున్నారని , కార్మిక వర్గం శ్రమజీవులుగా, దోపిడీకి గురయ్యే వారుగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంపద సృష్టికి కారణం శ్రమజీవులే అన్నారు. శ్రమ దోపిడీ విముక్తి సిద్ధాంతాన్ని మార్క్స్ తన పెట్టుబడి గ్రంథం ద్వారా సమాజం ముందు పెట్టారన్నారు. కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్, టీయూసీఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కే సూర్యం, ఎస్ఎల్ పద్మ, జాతీయ ఉపాధ్యక్షుడు కృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరేందర్, పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్ర అఖిల్ కుమార్, సీపీఐ(ఎం.ఎల్) మాస్లైన్ పార్టీ జిల్లా నాయకుడు పేర్ల నాగయ్య, సూర్యాపేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నరసయ్య పాల్గొన్నారు. -
నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి
సూర్యాపేట అర్బన్: ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం పోరాడుతున్న నిరుద్యోగ యువతపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు ప్రయోగిస్తున్న అక్రమ నిర్బంధాన్ని ఆపాలని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రగతిశీల యువజన సంఘం(పీవైఎల్) రాష్ట్ర కోశాధికారి రవి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తానని చెప్పి నేటి వరకు ఇవ్వకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరైంది కాదన్నారు. సమావేశంలో పీవైఎల్ జిల్లా అధ్యక్షుడు నల్గొండ నాగయ్య, జిల్లా సహాయ కార్యదర్శి వీరబోయిన రమేష్, కోశాధికారి బండి రవి తదితరులు పాల్గొన్నారు. -
ఎండుతున్న ఆశలు
భానుపురి (సూర్యాపేట) : ముదిరిన ఎండలు, అడుగంటుతున్న జలాలు, మొదలైన కరెంటు కష్టాలతో జిల్లా రైతాంగం తిప్పలు పడుతోంది. ప్రధానంగా వరి పంట ఎండుతోంది. చివరి దశలో ఉన్న పంటను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. జిల్లాలో ఎస్సారెస్పీ నీటిని నమ్ముకుని చాలావరకు సాగు చేసిన పొలాలు కూడా ఎండిపోయాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే మరో వారం రోజుల్లో మరిన్ని పొలాలు ఎండిపోనున్నాయి. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంట చేతికి రాకుండా పోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. 4.82లక్షల ఎకరాల్లో వరి సాగు జిల్లావ్యాప్తంగా ఈ యాసంగి సీజన్లో 4.86 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. ఇందులో వరి సాగే 4.82 లక్షల ఎకరాలు ఉంది. సాగర్, మూసీ ఆయకట్టుతో పాటు ఎస్సారెస్సీ రెండోదశకు నీటిని విడుదల చేశారు. అలాగే బోరుబావుల కింద రైతులు వరినే అధికంగా సాగు చేశారు. ఆరుతడి పంటలు రైతులు పెద్దగా సాగు చేయలేదు. ప్రాజెక్టుల నుంచి నీళ్లు వస్తాయని, బోరుబావుల్లో నీరు సమృద్ధిగానే ఉండడంతో మొదట్లో పెద్దగా సమస్యలు రాలేదు. అయితే ఫిబ్రవరి చివరి వారం నుంచి వరి సాగు చేసిన రైతులకు కష్టాలు మొదలయ్యాయి. వరి పంటకు నీటి వాడకం పెరగడమే ఇందుకు కారణం. భూగర్భ జలాలు కూడా వేగంగా పడిపోయి బోరుబావులు సగానికి తగ్గాయి. సాగుకు కరెంట్ కష్టాలు రైతాంగానికి కరెంటు కష్టాలు మొదలయ్యాయి. గతంలో 15 గంటలకు పైగానే వ్యవసాయానికి కరెంటు అందగా.. ప్రస్తుతం ఒకట్రెండు గంటల పాటు విద్యుత్ కోతలు విధిస్తున్నట్లు తెలుస్తోంది. విద్యుత్ వినియోగం కాస్త పెరగడంతో ఓవర్లోడ్ కారణంగా తరచూ ట్రాన్స్ఫార్మర్లు ఫీజులు కొట్టివేస్తున్నాయి. దీంతో రైతులు సాగు చేసిన వరి పొలాలకు నీటిని అందించడం గగనంగా మారింది. దీనికి తోడుగా చాలామంది రైతులు బోర్లు వేసినా కరెంటు డీడీలు కట్టకుండానే ట్రాన్స్ఫార్మర్కు కనెక్షన్ ఇచ్చి నడిపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి చాలాచోట్ల ఉండడంతో ఓవర్లోడ్ కారణంగా గంటకోసారి ఫీజులు పోవడంతో రైతులు తిప్పలు పడుతున్నారు. ఫ ఎండల తీవ్రతకు అడుగంటుతున్న భూగర్భ జలాలు ఫ కరెంట్ కోతలతో నీరందక ఎండిపోతున్న వరి చేలు ఫ చివరి దశలో ఉన్న వరి పంట దక్కకుండా పోతుండడంతో ఆవేదన చెందుతున్న రైతులు సూర్యాపేట నియోజకవర్గ పరిధిలో వరి పంట అధికంగా ఎండిపోయే పరిస్థితి ఉంది. ఇక్కడ బోరుబావులతో పాటు ఎస్సారెస్పీ రెండోదశ నీళ్లు వస్తాయన్న ఆశతో చాలామంది రైతులు వరి సాగు చేశారు. కరెంటు ఇబ్బందులు, ఎండలు ఉన్నప్పటికీ ఈ నీళ్లు వస్తే తమకు కొంత ఆసరాగా ఉంటుందని భావించినా.. ఆయకట్టు రైతాంగాన్ని జిల్లా యంత్రాంగం మర్చిపోయినట్లుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం మేజర్ కాలువలను దాటలేని పరిస్థితి ఉన్నప్పటికీ నీటి సరఫరాలో మిన్నకుండిపోవడం గమనార్హం. గతంలో ఆయకట్టు భూములకు నీళ్లు అందగా.. చెరువులు, కుంటల్లోకి నీళ్లు వెళ్లాయి. ప్రస్తుతం ఎండలతో పాటు కరెంటు కోతలు, ఎస్సారెస్పీ నీళ్లు రాకుండా పోతే దాదాపు 10వేల ఎకరాలకు పైగా వరి పంట ఎండిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలి
భానుపురి (సూర్యాపేట) : కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ హైదరాబాద్ 2026– 27 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులు అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ శనివారం ప్రకటనలో తెలిపారు. హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ టెక్నాలజీలో మూడేళ్ల డిప్లొమా కోర్సుకు సంబంధించి 6 సెమిస్టర్లు ఉంటాయని, మొత్తం సీట్లు 60 ఉన్నాయని పేర్కొన్నారు. 10వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా ఉత్తీర్ణులై ఉండాలని, ప్రవేశం పూర్తిగా 10వ తరగతి మార్కుల మెరిట్ ఆధారంగా ఉంటుందని తెలిపారు. 10+2 పూర్తి చేసిన వారు నేరుగా రెండో సంవత్సరంలో చేరవచ్చని, గరిష్టంగా 23 ఏళ్లు ఉండాలని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 25 ఏళ్ల అర్హత ఉండాలని తెలిపారు. ఎంపికై న ప్రతి విద్యార్థికి నెలకు రూ. 2,500 స్టైఫండ్ తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు klbiiht.telangana.gov.in, ఈమెయిల్ iihthyderabad@gmail.com, 040–29367009 నంబర్ను సంప్రదించాలని కోరారు. దరఖాస్తుల స్వీకరణభానుపురి (సూర్యాపేట) : 2025–26 సంవత్సరానికి షెడ్యూల్డ్ కులాల కార్యాచరణ ప్రణాళిక ను ప్రభుత్వం ఆమోదించిందని, వివిధ పథకాలు నెలకొల్పేందుకు ఆర్థిక సాయం నిమిత్తం అర్హులైన షెడ్యూల్డ్ కులాల వారు ఆన్లైన్ ద్వారా http://tgobmms.cgg.gov.in/ దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యాచరణ ప్రణాళిక ద్వారా రూ.50 వేల నుంచి రూ.లక్ష యూనిట్లకు (90) శాతం సబ్సిడీ, రూ.లక్ష నుంచి రూ.2లక్షల యూనిట్లకు (80) శాతం సబ్సిడీ, రూ.2లక్షల నుంచి రూ.4 లక్షల వరకు విలువ చేసే యూనిట్లకు (70) శాతం సబ్సిడీ, రూ.4లక్షలకు పైచిలుకు విలువ చేసే యూనిట్లకు (60) శాతం సబ్సిడీ (గరిష్టంగా రూ.5 లక్షలు) ఉంటుందని తెలిపారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలకు (100) శాతం సబ్సిడీ వర్తిస్తుందని వివరించారు. మిగిలిన శాతం బ్యాంక్ లోన్ ద్వారా పొందాలని పేర్కొన్నారు. విశేషంగా లక్ష్మీనారసింహుడి నిత్యకల్యాణంమఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామికి, శ్రీఆంజనేయస్వామి, గోదాదేవి అమ్మవారికి శనివారం ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. శనివారం తెల్లవారుజామునే కృష్ణానదిలో పుణ్యస్నాణాలు ఆచరించి స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆలయంలో ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు, నిత్యహోమం జరిపించారు. నిత్య కల్యాణంలో భాగంగా ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం రక్తిగట్టించారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ పూర్తిగావించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఆలయ అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలి సూర్యాపేటటౌన్ : వచ్చే బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి బడ్జెట్ లో 30 శాతం నిధులు కేటాయించాలని డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో విద్యకు 15 శాతం నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారని, కానీ కేటాయించింది మాత్రం 7 శాతం లోపే అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు పెరగాలంటే బడ్జెట్ పెంచాలన్నారు. సమావేశంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి రేపాక లింగయ్య, సుదర్శన్, వెంకటయ్య, దేవేందర్, షేక్ ఉమర్, నాగన్న పాల్గొన్నారు. -
మొదటి రోజు 12,342 మంది హాజరు
ఫ ప్రారంభమైన పదో తరగతి వార్షిక పరీక్షలు సూర్యాపేటటౌన్ : పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు కావడంతో విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. జిల్లాలో మొత్తం 69 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్ష కొనసాగింది. మొదటి రోజు తెలుగు పరీక్షకు 12355 మంది విద్యార్థులకు 12342 మంది హాజరయ్యారు. 13 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. తొమ్మిది మంది ప్రైవేట్ విద్యార్థులకు ఆరుగురు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్, అడిషనల్ కలెక్టర్, డీఈఓ తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల పరిశీలన పదో తరగతి పరీక్షలకు సంబంధించి జిల్లా కేంద్రంలోని పలు కేంద్రాలను ఎస్పీ నరసింహ పరిశీలించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాట్లు, పరీక్షా సరళిని పరిశీలించి విధులు నిర్వహిస్తున్న ఎగ్జామినేషన్ సెంటర్ సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి సూచనలు చేశారు. విద్యార్థులను తనిఖీ చేస్తున్న సిబ్బంది పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ నరసింహ -
అమెరికాకు వత్తాసు పలకడం సిగ్గుచేటు
సూర్యాపేట అర్బన్: ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధం ప్రపంచ దేశాలపై గుత్తాధిపత్యం కోసం అమెరికా చేస్తున్న కుట్రలో భాగమేనని, దానికి మోదీ సర్కార్ వత్తాసు పలకడం సిగ్గుచేటని టీయూసీఐ జాతీయ ఉపాధ్యక్షుడు వనమాల కృష్ణ అన్నారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర శిక్షణ తరగతులు శనివారం సూర్యాపేటలో కే సూర్యం అధ్యక్షతన ప్రారంభించారు. ఈ సందర్భంగా వనమాల కృష్ణ మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తోందని ఆరోపించారు. అదానీ, అంబానీలకు ఏజెంట్ గా వ్యవహరిస్తున్నదని, కేంద్ర ప్రభుత్వ విధానాలన్నీ కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసేలా ఉన్నాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు నరేందర్, రాజన్న, రామయ్య, హన్మేష్, వెంకటేష్, రాష్ట్ర సహాయ కార్యదర్శులు ముత్తెన్న, యాకుబ్ షావలి, ప్రవీణ్ రాష్ట్ర కోశాధికారి కిరణ్, రాష్ట్ర నాయకులు రాజేశ్వర్, సుధాకర్, రాము, మధుసూదన్, పుల్లన్న, నరసింహ, రామ్ లక్ష్మణ్, సూర్యాపేట జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గొడ్డలి నర్సన్న, సయ్యద్ హుస్సేన్, లింగన్న తదితరులు పాల్గొన్నారు. -
సుధా బ్యాంకుకు పురస్కారం.. గర్వకారణం
సూర్యాపేట : అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ.. సుధా బ్యాంకుకు ఫైవ్ స్టార్ రేటింగ్ పురస్కారం ప్రదానం చేయడం తెలంగాణకే గర్వకారణమని ప్రముఖ మోటివేషనల్ ట్రైనర్ ఆకెళ్ల రాఘవేంద్ర అన్నారు. శుక్రవారం సూర్యాపేటలోని త్రివేణి ఫంక్షన్ హాల్లో సుధా బ్యాంకు 52వ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సుధా బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్ పర్యవేక్షణలో కొనసాగుతున్న సుధా బ్యాంకు అగ్రశ్రేణి బ్యాంకుగా ఎదగాలని ఆకాంక్షించారు. బ్యాంకు చైర్మన్ మీలా మహదేవ్ అధ్యక్షతన జరిగిన ఈ సర్వసభ్య సమావేశానికి బ్యాంకు పాలకవర్గ సభ్యులు, బ్యాంకు మేనేజ్మెంట్ బోర్డ్ సభ్యులు వైస్ చైర్మన్ కక్కిరేణిచంద్రశేఖర్, డైరెక్టర్స్ ఏపూరి శ్రవణ్కుమార్, డాక్టర్ మీలా సందీప్, అప్పం శ్రీనివాస్ తోట శ్యాంప్రసాద్, డాక్టర్ మిన్న విజయలక్ష్మి, అనంతుల శారద, బాణావత్ సుజాత, స్వామి వెంకటేశ్వర్లు ఇరుకుల్లా చెన్నకేశవ రావు వెంపటి వెంకటరమణ, రింగు లక్ష్మీనారాయణ, భువనగిరి భాస్కర్, గండూరి శంకర్, పెద్దిరెడ్డి రాజా తదితరులు పాల్గొన్నారు. -
గృహ అవసరాలకు గ్యాస్ కొరత లేదు
భానుపురి(సూర్యాపేట) : జిల్లాలో గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, వినియోగదారులు ఆందోళన చెందొద్దని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్లో గ్యాస్ ఏజెన్సీలు, పౌరసరఫరాల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 4,15,509 డొమెస్టిక్ కనెక్షన్లు ఉన్నాయని, ప్రస్తుతం 17,647 డొమెస్టిక్ సిలిండర్లు, 552 కమర్షియల్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. గ్యాస్ బుక్ చేసుకున్న రెండు మూడు రోజుల్లోనే వినియోగదారులకు డెలివరీ చేస్తున్నట్లు వివరించారు. కమర్షియల్ సరఫరాలో ఏర్పడిన కొరతను అధిగమించేందుకు చర్యలు చేపట్టామన్నారు. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ను ఎవరైనా కమర్షియల్గా వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఆందోళనకు గురై అనవసరంగా గ్యాస్ బుక్ చేసుకోవద్దని కోరారు. సీనియారిటీ ప్రకారం ఏజెన్సీలు గ్యాస్ను సరఫరా చేయడం జరుగుతుందన్నారు. గ్యాస్ బుకింగ్కు సంబంధించి సర్వర్ సమస్యలు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ విషయమై సంబంధిత గ్యాస్ ఏజెన్సీలతో మాట్లాడామని, త్వరలోనే సర్వర్ సమస్య పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, జిల్లా పౌర సరఫరాల అధికారి మోహన్ బాబు, జిల్లా మేనేజర్ రాము పాల్గొన్నారు. గ్యాస్ సరఫరాను పర్యవేక్షిస్తున్నాం గ్యాస్ సిలిండర్ సరఫరాపై మానిటరింగ్ కమిటీ ద్వారా పర్యవేక్షిస్తున్నామని, వినియోగదారులకు గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఇరిగేషన్, సివిల్ సప్లయీస్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ మాట్లాడారు. కమర్షియల్ సప్లయ్ కొరత నేపథ్యంలో డొమెస్టిక్ సిలిండర్లు పక్కదారి పట్టకుండా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. డొమెస్టిక్ సిలిండర్ల వినియోగంపై గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని వివరించారు. అలాగే జిల్లాలోని సాగునీటి అవసరాల కోసం సాగర్, మూసీ, ఎస్సారెస్పీ స్టేజ్–2 నుంచి నీటిని విడుదల చేస్తామన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ సీతారామారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్రెడ్డి, మార్కెటింగ్ శాఖ అధికారి నాగేశ్వరశర్మ, జిల్లా పౌర సరఫరాల అధికారి మోహన్బాబు, డీఎం రాము తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
సౌండ్ బాక్స్లు పెడితే కేసులే..
అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తుంగగూడెం, నాగారం మండలం పేరబోయినగూడెంలలో మూసీనది ఇసుక క్వారీల నుంచి ప్రతిరోజు దాదాపు 500 ట్రాక్టర్ల ద్వారా ఇసుక సరఫరా జరుగుతోంది. ఇక్కడి క్వారీల నుంచి సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలకు ఇసుక సరఫరా చేస్తున్నారు. ఇసుక సరఫరా చేసే ట్రాక్టర్లకు సౌండ్ బాక్స్లు ఏర్పాటు చేయడం, అతివేగంగా నడపడం, కొన్ని ట్రాక్టర్లకు సరైన పత్రాలు లేకపోవడం, రోడ్డు నిబంధనలు పాటించకపోవడం మూలంగా పలు సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో నాగారం సీఐ నాగేఽశ్వరరావు, అర్వపల్లి ఎస్ఐ సైదులు ఆధ్వర్యంలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ట్రాక్టర్ల సౌండ్బాక్స్లను తొలగించి డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. కొన్ని ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లను అంటించారు. ట్రాక్టర్ డ్రైవర్లు రోడ్డు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రాత్రి వేళల్లో ప్రమాదాలు జరగకుండా ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు వేసుకోవాలన్నారు. -
గోదావరి జలాల పెంపు
అర్వపల్లి : గోదావరి జలాలను 1200 క్యూసెక్కుల నుంచి 1600 క్యూసెక్కులకు పెంచినట్లు జలవనరుల శాఖ ఈఈ సత్యనారాయణగౌడ్, బయ్యన్నవాగు ఏఈ చంద్రశేఖర్ తెలిపారు. చివరి భూములకు నీటిని అందించడానికి పెంచినట్లు చెప్పారు. రైతులు నీటిని వృథా చేయకుండా వాడుకోవాలని కోరారు. కల్తీ నూనె దందాపై కదిలిన యంత్రాంగం కోదాడ: పట్టణంలో కల్తీ నూనె దందాపై జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు విచారణ ప్రారంభించారు. శుక్రవారం ఉదయం కోదాడకు వచ్చిన అధికారులు స్తానికి పోలీస్ అధికారులతో కలిసి.. అయిల్ ట్యాంకర్ నుంచి నమూనాలు తీసుకున్నారు. పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపుతున్నట్లు తెలిపారు. లారీలో రవాణా అవుతున్నది రైస్బ్రాన్ అయిల్గా గుర్తించామని, లారీ డ్రైవర్ అక్రమంగా ట్యాంకర్ సీలు తొలగించి చిన్న డబ్బాలలో నింపి ఆటోలో తరలిస్తున్నట్లు గుర్తించామని, కోదాడలో దీన్ని ఎవరి వద్దకు తరలిస్తున్నారన్న విషయం తేలాల్సి ఉందన్నారు. ట్యాంకర్కు లైసెన్స్ ఉన్నప్పటికి రవాణా సమయంలో సీల్ పటిష్టంగా లేకపోవడాన్ని గుర్తించామని అధికారులు పేర్కొన్నారు. ల్యాబ్ నుంచి రిపోర్టు వచ్చిన తరువాత నూనెలో కల్తీ జరిగినట్లు నిర్ధారణ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని సూర్యాపేట పుడ్ సేప్టీ అధికారి బి.ప్రభాకర్ తెలిపారు. సమర్థవంతంగా సేవలందించాలిసూర్యాపేటటౌన్ : గర్భిణులు, తల్లులకు ఆరోగ్య కార్యకర్తలు సమర్థవంతంగా సేవలందించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ సూచించారు. జిల్లాలో పనిచేస్తున్న 301 మంది ఆరోగ్య కార్యకర్తలకు శుక్రవారం డీఎంహెచ్వో కార్యాలయంలో శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫీల్డ్ స్థాయి ఆరోగ్య సిబ్బంది.. గర్భిణుల నమోదు, ప్రసవానికి ముందు పరీక్షలు, శిశు టీకాలు, నవజాత శిశు సంరక్షణపై మరింత శ్రద్ధ వహించాలన్నారు. ఈ శిక్షణ ద్వారా తల్లి, శిశు ఆరోగ్య సేవలు గ్రామ స్థాయిలో మరింత మెరుగుపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ నాజియా తబస్సుమ్, జిల్లా శిక్షణ నిర్వహణ అధికారి డాక్టర్ శ్రీశైలం పాల్గొన్నారు. శ్రీలక్ష్మీనరసింహునికి నిత్య కల్యాణంమఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో స్వామివారికి శుక్రవారం విశేషంగా ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. నిత్య కళ్యాణంలో భాగంగా ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లను అలంకరించి ఎదుర్కోళ్లు, కల్యాణం వైభవంగా నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఆలయ అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహ మూర్తి, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు. -
నేటి నుంచి పది పరీక్షలు
69 కేంద్రాలు.. 12,403 మంది విద్యార్థులుసూర్యాపేట టౌన్ : పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు జిల్లాలో 69 కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు పరీక్షలు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం జిల్లాలోని పరీక్ష కేంద్రాల్లో సిబ్బంది విద్యార్థుల హాల్ టికెట్ నంబర్లు వేశారు. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం కానుండగా ఐదు నిమిషాలు(9.35గంటల) వరకు హాల్లోకి అనుమతిస్తారు. ఆ తర్వాత అనుమతించరు. జిల్లాలో 357 పాఠశాలలు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 357 ఉన్నాయి. వీటిలో 12,403 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. మొత్తం ఆరు సబ్జెక్టులకు ఏడు పరీక్షలు జరగనున్నాయి. ఐదు పరీక్షలు ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్ష జరగుతాయి. భౌతిక, జీవశాస్త్రం రెండు పేపర్లు ఉదయం 9.30గంటల నుంచి 11.30గంటల వరకు ఉంటాయి. ఫీజు చెల్లించలేదని ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులకు హాల్టికెట్లు ఇవ్వకున్నా.. విద్యార్థులకు ఇచ్చిన హాల్ టికెట్లను పోగొట్టుకున్నా బీఎస్ఈ తెలంగాణ వెబ్సైట్లో విద్యార్థుల పుట్టిన తేదీ నమోదుచేసి హాల్ టికెట్ పొందవచ్చు. పకడ్బందీగా పరీక్షల నిర్వహణ.. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఆయా సెంటర్లకు సీఎస్, డీఓలతో పాటు ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక సిట్టింగ్ స్క్వాడ్ను నియమించారు. నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి 20మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలెటర్ను నియమించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఉంటుంది. సీసీ కెమెరాల నిఘాలో సంబంధిత సీఎస్, డీఓలు ప్రశ్నపత్రాల సీల్ తీసి, పరీక్ష ముగిసిన తర్వాత అదే చోట జవాబు పత్రాలను సీల్ చేసి తపాలా కార్యాలయం ద్వారా కేటాయించిన చిరునామాకు రిజిస్టర్ పోస్ట్ చేయనున్నారు. -
ఇంటర్ ముగిసింది
సూర్యాపేట టౌన్ : ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు శుక్రవారంతో ముగిశాయి. ఫిబ్రవరి 26 న పరీక్షలు ప్రారంభమయ్యాయి. చివరి రోజు జరిగిన పరీక్షలకు మొత్తం 7,224 మంది విద్యార్థులకు 6,951 మంది హాజరు కాగా 273 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విభాగంలో 5,960 మందికి 5,800 మంది హాజరు కాగా 160 గైర్హాజరయ్యారు. అలాగే ఒకేషనల్ విభాగంలో 1,264 మందికి 1,151 మంది హాజరు కాగా 113 మంది హాజరు కాలేదని డీఐఈఓ భానునాయక్ తెలిపారు. కాగా పరీక్షలు ముగియడంతో హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు ఇంటిబాట పట్టారు. దీంతో బస్టాండ్లు, ఆటో స్టాండ్లు సందడిగా కనిపించాయి. -
కష్టసుఖాల్లో దైవమార్గాన్ని వీడొద్దు
మేళ్లచెరువు: మండల కేంద్రంలోని భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం స్వామివారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. దేవాలయం నుంచి కల్యాణ మండపం వరకు స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చారు. స్వామి, అమ్మవారిని పట్టువస్త్రాలతో అలంకరించి ముస్తాబు చేశారు. అనంతరం గణపతిపూజ, పుణ్యాహవాచనం, విశ్వక్సేన పూజలు చేసి మాంగల్యధారణ నిర్వహించారు. అనంతరం శ్రీత్రిదండి చినజీయర్స్వామి భక్తులనుద్దేశించి ప్రవచించారు. కష్టసుఖాల్లో దైవమార్గాన్ని వీడొద్దని, ఆహారంలో షడ్రుచుల వల్లే జీవితంలో అన్ని ఎదుర్కొనే విధంగా మనసును స్థిరత్వం చేసుకోవాలన్నారు. దేవుడు గుడిలో, మనసులో రెండు రూపాల్లో కొలువై ఉన్నాడని రెండుచోట్లా దైవాన్ని స్మరించాలని తెలిపారు. అనంతరం తెలుగు సంవత్సరాది క్యాలెండర్, పంచాంగం ఆవిష్కరించారు. కార్యక్రమంలో మై హోం సంస్థ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, శ్రీకుమారి దంపతులు, రామ్మోహన్రావు, అరుణ దంపతులు, వినోద్రావు, రామురావు, శ్యాంరావు, జగపతిరావు, యూనిట్ హెడ్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.ఫ శ్రీత్రిదండి చినజీయర్స్వామి -
సుధా బ్యాంకుకు 5 స్టార్ క్వాలిటీ రేటింగ్ పురస్కారం
సూర్యాపేట : సుధా బ్యాంకు అత్యుత్తమ నిర్వహణ, పనితీరు ఆధారంగా అంతర్జాతీయ హై క్వాలిటీ హైమ్ రేటింగ్ సంస్థ 5స్టార్ రేటింగ్ పురస్కారం ప్రకటించినట్లు సుధాబ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం త్రివేణి గార్డెన్లో సంస్థ ప్రతినిధులు ఈ పురస్కారాన్ని అందజేయనున్నట్లు పేర్కొన్నారు. బ్యాంకు చైర్మన్ మీలామహదేవ్ అధ్యక్షతన నిర్వహించే సమావేశానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ ఐఏఎస్ ట్రైనర్ ఆకెళ్ల రాఘవేంద్ర హాజరవుతారని తెలిపారు. ఖాతాదారులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యం కోదాడరూరల్ : బ్యాంకు ఖాతాదారులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సుధా బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్ అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఖాతాదారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 26 ఏళ్లుగా రూ.300 కోట్ల టర్నోవర్తో తమ 9శాఖల ఖాతాదారులకు నమ్మకంగా సేవలందిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సైతం రుణాలు అందజేస్తూ వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్నామన్నారు. కమర్షియల్ బ్యాంకులకు దీటుగా బంగారం, గృహ, వ్యాపార , వ్యక్తిగత రుణాలను తక్కువ వడ్డీకి ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బ్యాంకు చైర్మన్ మీలా మహాదేవ్, వైస్ చైర్మన్ కక్కిరేణి చంద్రశేఖర్, డైరెక్టర్లు తోట శ్యామ్, స్వామి వెంకటేశ్వర్లు, ఇరుకుళ్ల చెన్నకేశవరావు, వెంపటి వెంకటరమణ, బ్యాంకు మేనేజర్ చెన్నూరి రవికుమార్, సిబ్బంది ఉన్నారు. -
ప్రజల మన్ననలు పొందేలా పనిచేయాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రజాప్రతినిధులు ప్రజల మన్ననలు పొందేలా పనిచేయాలని రాష్ట్ర ఇరిగేషన్, సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. గురువారం ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా సూర్యాపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో సర్పంచులు, మున్సిపల్ చైర్పర్సన్లు, వార్డు కౌన్సిలర్లు, ఇతర ప్రజా ప్రతినిధులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ తేజస్నంద్ లాల్ పవార్, ఎస్పీ నరసింహతో కలిసి ప్రారంభించారు. వేసవిలో తాగునీటి సమస్య రాకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలన్నారు. దేవాదుల ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను తుంగతుర్తి నియోజకవర్గానికి తీసుకురావడానికి పనులు జరుగుతున్నాయని తెలిపారు. మార్చి 6 నుంచి ప్రారంభించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని జూన్ 12 వరకు 99 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించడంతో పాటు అర్హులైన లబ్ధిదారులకు అవి చేరేలా చూడాలని తెలిపారు. రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్లో 148 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిందని, రైతుల నుంచి 72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.20వేల కోట్లు చెల్లించామన్నారు. కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, అదనపు కలెక్టర్ సీతారామారావు, జెడ్పీ సీఈఓ శిరీష, డీపీఓ యాదగిరి, సీపీఓ కిషన్, డీవైఎస్ఓ వెంకటరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. హుజూర్నగర్ : హుజూర్నగర్లోని మోడల్ హౌసింగ్ కాలనీని అన్ని హంగులతో ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని రామస్వామి గుట్ట వద్ద 110 ఎకరాలలో నిర్మిస్తున్న 2,160 ఇందిరమ్మ ఇళ్ల మోడల్ హౌసింగ్ కాలనీని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా హిళ్ల బ్లాక్లు, అంతర్గత రోడ్లు, సభాస్థలి, మొక్కలు, పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు. మంత్రి వెంట హౌసింగ్ పీడీ సిద్ధార్థ, హార్టికల్చర్ పీడీ నాగయ్య, ఆర్డీఓ శ్రీనివాసులు, మిషన్ భగీరథ ఈఈ కరుణాకర్ రెడ్డి, విద్యుత్ డీఈ వెంకట కిష్టయ్య, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, తహసీల్దార్ కవిత, మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్, వైస్ చైర్మన్ తన్నీరు మల్లిఖార్జున్ రావు తదితరులున్నారు. ఫ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి -
వంట నూనె అక్రమ దందా!
కోదాడ: కోదాడ కేంద్రంగా వంట నూనె అక్రమ దందా సాగుతోంది. రెండు రోజుల క్రితం విజయవాడ– హైదరాబాద్ రోడ్డుపై ఆయిల్ ట్యాంకర్ నుంచి నూనె తీసి డబ్బాల్లో నింపి ఆటోల్లో తరలిస్తుండగా స్ధానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించడంతో ఈ వ్యవహారం బయటపడింది. ప్రస్తుతం ఆయిల్ ట్యాంకర్తో పాటు నూనెను తరలిస్తున్న ఆటో పోలీసుల అదుపులో ఉన్నాయి. వీటిపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ట్యాంకర్ల సీల్ తీసి 20 లీటర్ల డబ్బాల ద్వారా తరలింపు విజయవాడ నుంచి కోదాడ మీదుగా ప్రతిరోజు హైదరాబాద్కు వంటల్లో వాడే నూనెను ట్యాంకర్లలో తరలిస్తుంటారు. ఈ క్రమంలో కోదాడలోని ఓ నూనె డిపో వ్యాపారి ట్యాంకర్ల డ్రైవర్లతో కుమ్మకై ్క ప్రతిరోజు కోదాడ బైపాస్ వద్ద, సమీపంలోని వెంచర్లలో ఈ ట్యాంకర్లను నిలిపి వాటికి వేసిన సీల్ తీసి ఆయిల్ను 20 లీటర్ల డబ్బాల్లో నింపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఆయిల్ను ఆటోల్లో డిపోకు తరలించి అక్కడ ఇతర నూనెలు కలిపి కల్తీ చేసి, వివిధ హోటళ్లు, రెస్టారెంట్లకు నేరుగా సరఫరా చేస్తున్నారని సమాచారం. మార్కెట్లో ధర ఉన్న సన్ప్లవర్, రైస్బ్రాన్, పామాయిల్ను ఇలా తక్కువ రేట్కు డ్రైవర్ల వద్ద కొనుగోలు చేసి ఇతర నూనెల్లో కలిపి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని పలువురు పేర్కొంటున్నారు. కోదాడ కేంద్రంగా సంవత్సరాల తరబడి వంట నూనె అక్రమ దందా జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయిల్ డిపోల్లో లూజ్ ఆయిల్ అమ్మకూడదు. కానీ కోదాడలో మాత్రం లూజ్ ఆయిల్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. తూనికల కొలతల శాఖ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు గాని పట్టించుకున్న దాఖలాలు లేవని పట్టణవాసులు అంటున్నారు. పట్టణంలోని పలు హోటళ్లకు ఈ కల్తీ నూనెను సరఫరా చేస్తుండడంతో ప్రజల ఆరోగ్యాలు గాలిలో దీపంలా మారాయని పేర్కొంటున్నారు. ఈ కల్తీ దందాపై పూర్తిస్థాయిలో విచారణ చేసి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఫ ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లతో వంట నూనె డిపో వ్యాపారుల కుమ్మక్కు ఫ ట్యాంకర్ల నుంచి ఆయిల్ తీసి ఆటోల్లో డిపోకు తరలింపు ఫ ఈ నూనెను నేరుగా హోటళ్లకు సరఫరా చేసి సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు ఫ ఇటీవల ఆయిల్ రవాణా చేస్తుండగా స్థానికులు పట్టుకోవడంతో బయటపడిన వ్యవహారం -
15న కోదాడ పబ్లిక్ క్లబ్ ఎన్నికలు
కోదాడ: కోదాడ పబ్లిక్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకోనున్నారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. పట్టణంలోని వివిధ వర్గాలకు చెందిన 200 మంది ప్రముఖులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. ప్రతిసారి ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా జరుగుతుండగా ఈ సారి పలువురు పోటీ పడుతుండడంతో ఎన్నిక అనివార్యంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. కోదాడ పబ్లిక్ క్లబ్కు చెందిన కొత్త భవనం అమ్మడంతో రూ.మూడున్నర కోట్ల నిధులు క్లబ్ ఖాతాలో ఉండడంతో పోటీ తీవ్రంగా ఉందని పలువురు క్లబ్ సభ్యులు పేర్కొంటున్నారు. అధ్యక్ష, కార్యదర్శి పదవులకు ప్రస్తుత అధ్యక్షుడు పట్టాభిరెడ్డితో పాటు ముడియాల భరత్రెడ్డి, రావెళ్ల సీతారామయ్య, మేకల వెంకట్రావ్, పారా సీతయ్య, పయిడిమర్రిత్య బాబు, తీగల కరుణాకర్ పోటీపడుతున్నట్లు సమాచారం. కాగా.. అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నికలో కోదాడ ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యేల నిర్ణయం కీలకం కానున్నట్లు తెలుస్తోంది. శాసీ్త్రయ పద్ధతులు అవలంబించాలికోదాడరూరల్ : భూసారాన్ని కాపాడుకునేందుకు శాసీ్త్రయ పద్ధతులు అవలంబించాలని ఆత్మ డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ నివేదిత రైతులకు సూచించారు. గురువారం కోదాడ మండల పరిధిలోని అల్వాలపురంలో ఆత్మ (వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ) పథకం కింద ఏర్పాటు చేసిన ఆర్పీఎల్ శిక్షాణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రైతులు సాగులో రసాయన ఎరువులు ఎక్కువగా వాడటం వల్ల భూమి సారాన్ని కోల్పోయి భవిష్యత్ తరాలకు ఉపయోగం లేకుండా పోతుందన్నారు. రైతులు వ్యవసాయ అధికారుల సూచనల మేరకే ఎరువులను వాడాలన్నారు. పంటల సాగుకు ముందు పచ్చిరొట్చె సాగు చేసుకొని దుక్కిలో కలిపి దున్నుకోవాలన్నారు. పశువుల ఎరువుల తప్పకుండా భూమిలో తోలుకోవాలన్నారు. నానో యూరియా, డీఏపీని పంటలకు స్ప్రే చేసుకోవాలని రైతులకు సూచించారు. వరికి ప్రత్యామ్నాయంగా రైతులు ఆయిల్పామ్ సాగు చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త, ఏడీఏ ప్రశాంతి, ఏఓ రజిని, ఆత్మ చైర్మన్ లింగయ్య, దేవప్రసాద్, ఏఈఓలు నగేష్, ఝూన్సీ, వినోద్, అన్వేష్, సల్మా ఉన్నారు. -
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
హుజూర్నగర్ : మహిళలు విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ తదితర అన్ని రంగాల్లో రాణించాలని ప్రభుత్వ పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బొల్లు రాంబాబు అన్నారు. గురువారం హుజూర్నగర్లోని ప్రభుత్వ పెన్షనర్ల కార్యాలయంలో పెన్షనర్ ఎస్.రాధాదుర్గా అధ్యక్షతన నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సమాజంలో మహిళలకు మరింత గౌరవం పెరగాలన్నారు. మహిళల పట్ల అక్కడక్కడ చూపుతున్న వివక్షను రూపుమాపాలని కోరారు. మహిళల సాధికారతకు పురుషులు సహకరించాలన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించినప్పుడే వివక్ష రూపుమాపబడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తొలుత మహిళా పెన్షనర్లు జ్యోతి ప్రజ్వలన చేసి కేక్ కట్ చేశారు. నకార విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం మహిళా పెన్షనర్లను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా పెన్షనర్ల సంఘం ఉపాధ్యక్షుడు విద్యాసాగర్ రావు, మహిళా పెన్షనర్లు ఎస్.లలిత, టి.విజయ మేరీ, చెన్న సౌభాగ్య, ఏ.సుధారాణి, బి.రామలక్ష్మి, థెరిసా, శ్రీలత, అంకతి అప్పయ్య, రఘునాథ్, వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్, ఎంఎస్ఎన్ రాజు, సైదులు, లక్ష్మయ్య, చంద్రయ్య, దేవదానం పాల్గొన్నారు. -
విద్యార్థులకు ‘రవాణా’ భరోసా
చిలుకూరు: మారుమూల గ్రామాల్లో పాఠశాలలు అందుబాటులో లేవు. ఇక్కడి విద్యార్థులు ఆటోలు, బస్సులు, సైకిళ్లపై ఇతర గ్రామాల్లో ఉన్న పాఠశాలలకు వెళ్తుంటారు. కొన్ని గ్రామాలకు కనీసం బస్సు సౌకర్యం కూడా ఉండదు. ఉన్న గ్రామంలో చదువుకొనే అవకాశం లేక, ఇతర ప్రాంతాల్లోని పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రవాణా భత్యం అందజేస్తోంది. ఇందుకుగాను ప్రభుత్వం రవాణా చార్జీల కింద ఈ ఏడాదికి సంబంధించి రూ.62.52 లక్షలు మంజూరు చేసింది. జిల్లాలో 950 పాఠశాలలు జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు 950 ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఒక కిలోమీటరు దూరం, 6 నుంచి 10వ తరగతికి సంబంధించి 3 కిలోమీటర్లు దూరంలో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. ఈ చొప్పున అందుబాటులో పాఠశాలలు లేని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలకు చెందిన మొత్తం 1042 మంది విద్యార్థులు ఉన్నట్లు విద్యాశాఖ తేల్చింది. వీరందరూ రవాణా చార్జీలు పొందేందుకు అర్హులుగా నిర్ణయించింది. వీరందరికీ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యూకేషన్ నుంచి ఒక్కక్కరికి నెలకు రూ.600 చొప్పున 10 నెలలకు రవాణా చార్జీలు మంజూరయ్యాయి. ఈ చొప్పున జిల్లావ్యాప్తంగా మొత్తం 1042 మంది విద్యార్థులకు రూ.62 లక్షల 52 వేలు విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఫ 1,042 మందికి రూ.62.52 లక్షల రవాణా చార్జీలు మంజూరు ఫ ఒక్కో విద్యార్థి ఖాతాలో నెలకు రూ.600 చొప్పున 10 నెలలకుగాను నగదు జమ -
బ్లాక్ మార్కెట్కు తరలిస్తే డీలర్షిప్ రద్దు చేస్తాం
సూర్యాపేట: ఎల్పీజీ సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు తరలిస్తే సదరు గ్యాస్ ఏజెన్సీల డీలర్షిప్లు రద్దు చేస్తామని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరతపై మీడియాతో మాట్లాడారు ఉత్తమ్,. ‘ గ్యాస్ కొరతపై రేపు ఆయిల్ కంపెనీలతో జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహిస్తాం. కేంద్ర ప్రభుత్వంతోపాటు ఆయిల్ కంపెనీలకు రెఫరెన్స్ చేసి సామాన్య జన జీవనానికి ఇబ్బంది కలగకుండా ఎల్పీజీ గ్యాస్ కోసం మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఎల్పీజీ గ్యాస్ విషయంలో ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుంది. ఎల్పీజీ డీలర్లు సామాజిక సామాన్య ప్రజానికం వద్ద అక్రమాలకు బ్లాక్ మార్కెట్లకు తరలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుని డీలర్ షిప్ రద్దు చేస్తాం’ అని వార్నింగ్ ఇచ్చారు. -
సరిపడా నీళ్లొదలాలని రైతుల ఆందోళన
గోదావరి జలాల విడుదలలో ఆలస్యం కారణంగా పంటలు ఎండిపోతున్నాయని, వెంటనే సరిపడా నీళ్లొదలాలని ఆత్మకూర్(ఎస్) మండల రైతులు మండలంలోని రామోజీతండా వద్ద బుధవారం ఆందోళనకు దిగారు. రామోజీతండా ఎస్సారెస్పీ 22–ఎల్ కాలువ వద్ద ఏపూర్ ప్రధాన రహదారిపై 8 గ్రామాలకు చెందిన రైతులు సుమారు రెండు గంటలు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ చివరి పంటలకు నీళ్లు ఇస్తామంటూ చెబుతున్నా.. కనీసం కాలువల వెంట ఉన్న పంట పొలాలకు కూడా నీరందక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం రెండు వారాలకు ఒకసారైనా నీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కలగజేసుకొని ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తామని తెలపడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో రామోజీ తండా, పుప్పాలగూడెం, కోటపాడ్, ఆత్మకూరు, నసీంపేట, రామన్నగూడెం, తేట్టకుంట తండా, కాశీగూడెం గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. -
పెండింగ్ సీఎంఆర్ సకాలంలో ఇవ్వాలి
భానుపురి (సూర్యాపేట) : యాసంగి 2024–25, వానాకాలం 2025–26 సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ డెలివరీ సకాలంలో పూర్తిచేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ చాంబర్లో 2025–26 యాసంగి సీజన్కు సంబంధించి జిల్లాలోని రైస్ మిల్లర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2025–26 యాసంగి సీజన్లో సుమారు 4,10,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అందుకు అనుగుణంగా మిల్లర్లు తమ రైస్ మిల్లులు, అవసరమైతే బయట ప్రదేశాల్లో కూడా ధాన్యం నిల్వ చేయడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. బ్యాంక్ గ్యారంటీ, అగ్రిమెంట్, అవసరమైన ధాన్యం పరిమాణాన్ని లేఖ రూపంలో సమర్పించిన మిల్లర్లకే ధాన్యం కేటాయించబడుతుందన్నారు. ఈ సీజన్కు అవసరమైన గన్నీలను మిల్లర్లు రిపేర్ చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలని కోరారు. గత సీజన్ సీఎంఆర్ డెలివరీ కొంతమేర పెండింగ్లో ఉన్నందున వాటిని వెంటనే పూర్తిచేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, జిల్లా సివిల్ సప్లయ్ అధికారి మోహన్బాబు, జిల్లా మేనేజర్ రాము, సివిల్ సప్లయ్ శాఖ సిబ్బంది, 40 మంది రైస్ మిల్లర్లు పాల్గొన్నారు. నాణ్యమైన భోజనం అందించాలిసూర్యాపేట : అంగన్వాడీలు, ప్రీప్రైమరీ స్కూళ్లలో చిన్నారులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. సూర్యాపేట మండలం రామన్నగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో గల ప్రైమరీ పాఠశాలను బుధవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. తరగతి గదుల్లో జరుగుతున్న బోధన తీరు గమనించి, అభిరామ్, నాగశ్రీ, లాస్య, శివకుమార్, శృతి అనే విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. చిన్నారుల హాజరు, పౌష్టికాహార పంపిణీ, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. వంట గదిని పరిశీలించి, పిల్లలకు అందిస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించి మాట్లాడారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయం వంటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. పంచాయతీ సిబ్బంది పారిశుద్ధ్య పనులను క్రమం తప్పకుండా చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఓ యాదగిరి, తహసీల్దార్ కృష్ణయ్య, అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
అందని ఎస్సారెస్పీ నీళ్లు
అర్వపల్లి : ప్రస్తుత యాసంగి సీజన్కు గాను జిల్లాకు వారబందీ విధానంలో గోదావరి జలాలను బుధవారం సాయంత్రం పునరుద్ధరించారు. అయితే వారబందీ విధానంలో ఈనెల 8న నీటిని వదలాల్సి ఉండగా వివిధ కారణాలతో నాలుగు రోజులు ఆలస్యంగా విడుదల చేశారు. తొలిరోజు జిల్లాకు 1,200 క్యూసెక్కుల నీటిని వదిలారు. గురువారం నీటిని పెంచనున్నట్లు జలవనరుల శాఖ ఈఈ సత్యనారాయణగౌడ్, బయ్యన్నవాగు ఏఈ చంద్రశేఖర్ తెలిపారు. ఆత్మకూర్ (ఎస్) : మండలంలో వరిసాగు చేసిన రైతులు అరిగోస పెడుతున్నారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి వరిసాగు చేసిన రైతులు నిన్నటి వరకు యూరియా కోసం నానా తిప్పలు పడగా ఇప్పడు పంట చేతికొచ్చే సమయంలో నీళ్లందక తమ వరిపొలాలు ఎండిపోతున్నాయని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వేసవి ప్రారంభమై భూగర్భ జలాలు తగ్గడంతోపాటు శ్రీరాంసాగర్ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) నీళ్లు రాకపోవడంతో చేతికందేపంట కళ్లెదుటే ఎండిపోతుందని మండల రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే నీటిని విడుదల చేసి తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. 33 వేల ఎకరాల్లో వరిసాగు మండల వ్యాప్తంగా ప్రస్తుత యాసంగి సీజన్లో 33 వేల ఎకరాల్లో వరిసాగు చేశారు. ప్రధానంగా బోరు బావులు చెరువుల ఆధారంతోపాటు ఎస్సారెస్పీ నీటిపై ఆధారపడి వరిపంట సాగు చేపట్టారు. కాగా ఎస్సారెస్పీ నీరు సక్రమంగా రాకపోవడంతో రైతుల ఆశలు గల్లంతవుతున్నాయి. వారబందీతో చివరికి చేరని నీరు మండల వ్యాప్తంగా 69, 71 డీబీఎంలతోపాటు దాని ఉపకాల్వలు ఉన్నప్పటికీ ఎస్సారెస్పీ నీరు మండలంలోని పలు గ్రామాలకు చేరడం లేదు. దీనికి తోడు ప్రభుత్వం వారాబంధి ద్వారా సాగునీరు వదులుతుండటంతో మధ్యలోనే నీరు ఆగిపోతుందని తాము ఎస్సారెస్పీ నీటిని నమ్ముకొని సాగు చేయడంతో వేల రూపాయలు ఖర్చుపెట్టి నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. పొట్ట దశలో వరిపొలాలు మండలంలో సాగుచేసిన వరి పొలాలు ప్రస్తుతం పొట్ట దశలోకి వచ్చాయి. మరో 20 రోజులు నీటిని అందిస్తే పంట చేతికి వస్తుందని అధికారులు స్పందించి ఎస్సారెస్పీ నీటిని ఎక్కువ మోతాదులో విడుదల చేయాలని మండల రైతులు కోరుతున్నారు. ఫ ఎండుతున్న వరిపొలాలు ఫ వారబందీ విధానంతో ఇబ్బందులు ఫ ఆందోళనలో అన్నదాతలు -
2027 జనాభా లెక్కలు దేశాభివృద్ధికి కీలకం: కలెక్టర్
2027 జనాభా లెక్కలు ప్రభుత్వ పథకాల అమలు, దేశాభివృద్ధికి కీలకమని, జనగణన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కలెక్టర్, ప్రధాన జనాభా గణన అధికారి తేజస్ నంద్లాల్ పవార్ పేర్కొన్నారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలో జనాభా గణన–2027 సమర్థంగా నిర్వహించేందుకు జిల్లా, మండల, మున్సిపల్ స్థాయి అధికారులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాస్థాయిలో జనాభా గణనను సమర్థమంతంగా నిర్వహించేందుకు అవసరమైన విధానాలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. అనంతరం శిక్షణ నిర్వాహకులు, సీపీఓ కిషన్ నాయక్ మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనాభా గణాంక అధికారులు యువేందర్ బాబు, రవీంద్ర నాయక్, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, ఆర్డీఓలు వేణుమాధవరావు, సూర్యనారాయణ, శ్రీనివాసు, మాస్టర్ ట్రైనర్ రమేష్, వివిధ మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు. -
నేర రహిత సమాజాన్ని నిర్మిద్దాం
మునగాల : నేరరహిత సమాజ నిర్మాణానికి ప్రతిఒక్కరూ కృషిచేయాలని ఎస్పీ నరసింహ పిలుపునిచ్చారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మునగాల మండలం ఆకుపాములలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బినాన్స్, క్రిఫ్టో కరెన్సీ లాంటి డిజిటల్ మనీ మార్పిడిలో జాగ్రత్తగా ఉండాలన్నారు. అత్యాశతో సైబర్ మోసగాళ్ల వలలో చిక్కి ఆర్థికంగా నష్టపోవద్దన్నారు. ప్రస్తుత సమాజాన్ని డ్రగ్స్ అనే చీడపీడ పట్టి పీడిస్తుందని.. డ్రగ్స్ను నిర్మూలించకపోతే సమాజంలో నేరప్రవత్తి పెరిగిపోతునుందన్నారు. యువత డ్రగ్స్, గంజాయి మత్తుకు బానిసలై జీవితాన్ని అంధకారం చేసుకోవద్దన్నారు. వాహనదారులు రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో కోదాడ డీఎస్పీ రణబోతు శ్రీనివాస్రెడ్డి, గ్రామ సర్పంచ్ విలాసకవి ఇందిర, సైబర్ సెక్యూరిటీ సెల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, మునగాల, కోదాడ టౌన్, సూర్యాపేట టౌన్ సీఐలు డి.రామకృష్ణారెడ్డి, శివశంకర్, వెంకటయ్య, మునగాల ఎస్ఐ ప్రవీణ్కుమార్, రవీందర్, ఏడుకొండలు, కోదాడ ట్రాన్స్పోర్ట్ ఇన్స్పెక్టర్ రామాచారి, పోలీస్ సిబ్బంది, గ్రామపెద్దలు, యువకులు పాల్గొన్నారు. మహిళల భద్రతకు ప్రాధాన్యం నడిగూడెం : మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తున్నట్లు జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. బుధవారం నడిగూడెం మండలం వల్లాపురంలో పోలీస్ శాఖ ఆద్వర్యంలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సైబర్ నేరాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తప్పుడు మార్గంలో నడిచే పిల్లలను తల్లిదండ్రులు హెచ్చరించాలన్నారు. అనంతరం వల్లాపురం గ్రామ సర్పంచ్ కేశగాని సరిత ఎస్పీని సన్మానించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులతోపాటు ఎస్ఐ గందమళ్ల అజయ్ కుమార్, వల్లాపురం సర్పంచ్ కేశగాని సరిత పాల్గొన్నారు. ఫ ఎస్పీ నరసింహ -
చర్చా వేదికలు.. భవిష్యత్కు పునాదులు
సూర్యాపేట టౌన్ : విద్యార్థులకు చర్చా వేదికలు నిర్వహించడం ద్వారా వారి భవిష్యత్కు పునాదులు వేయవచ్చని జిల్లా విద్యా శాఖ అధికారి (డీఈఓ) అశోక్ అన్నారు. సర్వశిక్ష అభియాన్, తెలంగాణ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం ఆధ్వర్యంలో బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో విద్యార్థులకు నిర్వహించిన తెలంగాణ మోడల్ యునైటెడ్ నేషన్స్ చర్చా కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఇందులో జిల్లాలోని 24 పీఎం శ్రీ పాఠశాలల విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఒక్కో పీఎం శ్రీ పాఠశాల నుంచి విద్యార్థులు ఒక్కో దేశానికి ప్రాతినిధ్య వహిస్తూ పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. విజేతలుగా 11 మంది విద్యార్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా డీఈఓ అశోక్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలకు పిల్లలను దేశ రాయబారులుగా, దౌత్యవేత్తలుగా తయారు చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు ఏలె హరికృష్ణ, శ్రవణ్ కుమార్, సోషల్ ఫోరం అధ్యక్షుడు వేముల సైదులు, ప్రధాన కార్యదర్శి కొప్పుల కిరణ్, న్యాయ నిర్ణేతలుగా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అక్కినపల్లి నాగమణి, డీఆర్పీ ఎ.సుదర్శన్రావు, కాకి సీనయ్య తదితరులు పాల్గొన్నారు. -
నేడు మంత్రి ఉత్తమ్ రాక
హుజూర్నగర్ : రాష్ట్ర సాగునీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం హుజూర్నగర్ రానున్నారు. మంత్రి సాయంత్రం 6 గంటలకు పట్టణానికి చేరుకుని స్థానిక రామస్వామి గుట్ట వద్ద హౌసింగ్ కాలనీ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించి పనుల పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్షిస్తారు. అనంతరం సాయంత్ర 6.30 గంటలకు మంత్రి ఉత్తమ్ కోదాడ వెళతారు. ‘దక్కన్ సిమెంట్స్’లో కొనసాగుతున్న విచారణపాలకవీడు : మండల పరిధిలోని దక్కన్ సిమెంట్స్ కర్మాగార యాజమాన్యం అటవీ భూమిని ఆక్రమించినట్టు ఓ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరపాల్సిందిగా సుప్రీం కోర్టు కేంద్ర సాధికార కమిటీని ఆదేశించింది. కమిటీ ఆదేశాలతో సర్కిల్, జిల్లా అటవీ అధికారులు మూడు రోజులుగా విచారణ చేపడుతున్నారు. విచారణలో భాగంగా హైదరా బాద్ సర్కిల్ అటవీ ముఖ్య సంరక్షణ అధికారి (సీసీఎఫ్) శర్వానంద్ బుధవారం జిల్లా అటవీశాఖ అధికారి (డీఎఫ్ఓ) సతీష్కుమార్తో కలిసి దక్కన్ సిమెంట్స్ కర్మాగారం, సైదులునామా రిజర్వ్ ఫారెస్ట్ భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పరిశ్రమకు కేటాయించిన భూములు, అటవీ భూముల హద్దులు గుర్తించారు. త్వరలో నివేదికను తయారు చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని అధి కారులు వెల్లడించారు. ఈ విచారణలో ఫారెస్ట్ రేంజ్ ఆదిత్య, పాలకవీడు సెక్షన్ అధికారి నవీన్, బీట్, సిబ్బంది పాల్గొన్నారు. ఉద్యాన పంటల సాగుతో అధిక ఆదాయంచిలుకూరు : ఉద్యాన పంటల సాగుతో స్వల్వ కాలంలో తక్కువ పెట్టుబడితో అధిక ఆదా యం వస్తుందని జిల్లా ఉద్యాన వన అధికారి తీగల నాగయ్య అన్నారు. బుధవారం చిలు కూరు మండలం చెన్నారిగూడెంలో తీగ పందిరి ద్వారా కూరగాయలు సాగు చేస్తున్న రైతుల వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యాన సాగుకు అందించే సబ్సిడీలను ఉపయోగించుకోవాలన్నా రు. కార్యక్రమంలో ప్రాంతీయ ఉద్యాన అధికారి అనిత, విస్తరణాధికారి రంగు ముత్యం రాజు, శ్రీనివాస్, బ్రహ్మం పాల్గొన్నారు. నోడల్ బృందం తనిఖీగరిడేపల్లి : మండల కేంద్రలోని ప్రాథమిక పాఠశాలను బుధవారం జిల్లా నోడల్ బృందం సభ్యులు తనిఖీ చేశారు. పాఠశాలలోని రికార్డులు, మధ్యాహ్న భోజనం, గ్రంథాలయం, ఫార్మేటివ్, సమ్మెటివ్ పరీక్షా ఫలితాలు, సీసీఈ రిపోర్టులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నోడల్ టీమ్ అధికారి కె.గోపిరెడ్డి, నోడల్ సభ్యులు చారుగుండ్ల రాజశేఖర్, రఘునాయక్, మండల విద్యాధికారి చత్రునాయక్, ప్రధానోపాధ్యాయులు హైమావతి, ఉపాధ్యాయులు కిషోర్బాబు, దీప్తి తదితరులు పాల్గొన్నారు. -
రెండు దశల్లో జనగణన
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో జనగణన ప్రక్రియ ప్రారంభమైంది. 2011లో చివరిసారి జిల్లాలో జనగణన జరిగింది. మళ్లీ 2027లో జరగనున్న జనాభా లెక్కల కోసం ఇప్పటి నుంచే జిల్లా యంత్రాంగం కసరత్తు మొదలుపెట్టింది. మొదటగా జిల్లాలోని ఇళ్లను లెక్కించి.. అనంతరం సిబ్బంది నియామకం పూర్తి చేసి జనాభా లెక్కలను తీయనున్నారు. ఈ సారి జనగణనను డిజిటల్ విధానంలోనే చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ప్రజల నుంచి సేకరించాల్సిన సమాచారంతో పాటు వివరాల నమోదు, తదితర విషయాలపై స్పష్టత కోసం జిల్లా నుంచి మండల స్థాయి అధికారుల వరకు శిక్షణ కార్యక్రమాలను జిల్లా యంత్రాంగం బుధవారం ప్రారంభించింది. ఈ శిక్షణ మూడు రోజుల పాటు జరగనుంది. మొదటి దశలో ఇళ్లు.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల ప్రణాళికలు రూపొందించడానికి జనాభా గణన ఎంతగానో దోహదపడుతోంది. ప్రతి పదేళ్లకోసారి కేంద్ర ప్రభుత్వం ఈ జనగణన నిర్వహిస్తుండగా.. చివరిసారిగా 2011లో చేపట్టింది. అయితే 2021లో జనాభా లెక్కలు తీయాల్సి ఉన్నా.. కరోనా కారణంగా సాధ్యపడలేదు. ఈ క్రమంలో 2027లో దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు చేయనున్నారు. జిల్లాలో ఈ గణన రెండు దశల్లో జరగనుంది. మొదటగా ఈ ఏడాది మే 11వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు ఇళ్ల లెక్కింపు చేపట్టనున్నారు. రెండో దశలో జనాభా గణన 2027 ఫిబ్రవరిలో జరగనుంది. ప్రత్యేక పోర్టల్ ద్వారా.. ఈసారి జరగనున్న జనాభా గణనను దేశంలో తొలిసారిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నారు. మొబైల్ యాప్లు, వెబ్ పోర్టర్లను ఉపయోగించి గణన ప్రక్రియ ఉండనుంది. అలాగే ప్రజలు తమ వివరాలను తామే స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నారు. ఈ ప్రత్యేక పోర్టల్ను గణన ప్రారంభానికి సుమారు 15 రోజుల ముందు ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. కాగా ప్రతి మండలంలోని రెవెన్యూ గ్రామాలు, పట్టణాల్లోని వార్డులను గణన బ్లాకులుగా ఎలా విభజించాలి..? గణన ప్రక్రియను ఎలా నిర్వహించాలన్న.. ? అనే అంశాలపై అధికారులకు శిక్షణతో అవగాహన కల్పిస్తున్నారు. ఈ శిక్షణ అనంతరం అధికారులు బ్లాక్లను గుర్తించి ఎంపిక చేసిన ఎన్యూమరేటర్ల ద్వారా ఇళ్ల లెక్కింపు చేపట్టనున్నారు. మొత్తం జనాభా 10,99,560 పురుషులు 5,49,560 మహిళలు 5,50,000 ఇళ్ల సంఖ్య 3 లక్షలకుపైగా.. ఫ మే 11 నుంచి ఇళ్ల లెక్కింపు ఫ 2027 ఫిబ్రవరిలో జనగణన షురూ ఫ ఈసారి డిజిటల్ విధానంలో వివరాల సేకరణ ఫ సిబ్బందికి శిక్షణ ప్రారంభం ఫ నేరుగా వివరాల నమోదుకు ప్రజలకూ అవకాశం -
మహిళలు అన్ని రంగాలలో రాణించాలి
భానుపురి (సూర్యాపేట) : మహిళలు అన్ని రంగాలలో రాణించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ కే. నరసింహ, అదనపు కలెక్టర్ సీతారామారావుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు. ప్రతి మహిళ తోటి మహిళకు అండగా నిలువాలని సూచించారు. మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని, అందుకే వారు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. ప్రస్తుతం మహిళలు విద్య, విజ్ఞానం, సాంకేతికత, ఉద్యోగం, వ్యాపారం వంటి అన్ని రంగాలలో ప్రతిభను చాటుతూ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం మహిళా ఉద్యోగులు, అధికారులు, ప్రజాప్రతినిధులను సన్మానించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రవీందర్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత, కోదాడ మున్సిపాలిటీ డిప్యూటీ చైర్పర్సన్ మల్లీశ్వరి, డిప్యూటీ సీఈఓ శిరీష, పంచాయతీరాజ్ ఈఈ రమాదేవి, ఎస్సీ సంక్షేమ అధికారి దయానంద రాణి, డీఎంహెచ్ఓ వెంకటరమణ, డీటీఓ రవికుమార్, సీడబ్ల్యూసీ సభ్యులు, సీడీపీఓలు, సూపర్వైజర్లు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
పతా్తలేని..చేయూత
భానుపురి (సూర్యాపేట) : చేయూత పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. ప్రభుత్వం కొత్త పెన్షన్లను మంజూరు చేయక పోవడంతో లబ్ధిదారులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 27 నెలలు కావస్తున్నా దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోవడం లేదు. చేయూత గ్యారెంటీ అమల్లోకి వస్తే పెండింగ్ దరఖాస్తులతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకునే నిరుపేద వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, కల్లుగీత, బీడీ, చేనేత కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్ బాధితులకు ప్రయోజనం చేకూరనుంది. నాలుగేళ్లుగా ఒక్కటీ లేదు..! గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2022, ఆగస్టులో 57 నుంచి 64 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారికి కొత్తగా ఆసరా పింఛన్లు మంజూరు చేసింది. అప్పటి వరకు పెండింగ్లో ఉన్న దరఖాస్తులతో పాటు అర్హులైన వారికి ఒకేసారి అప్పటి ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేసింది. ఆ తరువాత కొత్త ఆసరా పెన్షన్లు మంజూరు చేయలేదు. కొత్త పెన్షన్ల కోసం వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, కల్లు గీత, బీడీ, చేనేత కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్ బాధితులు దరఖాస్తు చేసుకుంటూనే ఉన్నారు. ప్రస్తుతం పెన్షన్లు తీసుకుంటున్న వారిలో ఎవరైనా మృతి చెందితే వారి పెన్షన్లు నిలిపేస్తున్నారే తప్పా కొత్తవి మంజూరు చేయడం లేదు. జిల్లాలో కొత్తగా అన్ని రకాల చేయూత పింఛన్ల కోసం 20వేల వరకు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. ఇందులో వృద్ధ్దాప్య, వితంతు పెన్షన్ల దరఖాస్తులు అధికంగా ఉన్నాయి. పెంపు కోసం నిరీక్షణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలలో భాగంగా చేయూత పెన్షన్లను పెంచుతామంటూ హామీ ఇచ్చింది. అయితే ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇక తమ పింఛన్లు పెరుగుతాయని లబ్ధిదారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చేయూత పథకం కింద వృద్ధాప్య, వితంతు, ఇతర పెన్షన్లు రూ.4 వేలకు, దివ్యాంగుల పెన్షన్లు రూ.4వేల నుంచి రూ.6వేలకు పెంచుతామని ప్రకటించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఆ ఊసే లేదు. ప్రభుత్వం పెన్షన్లు పెంచితే లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది.ఫ కొత్త పెన్షన్ల మంజూరు కోసం ఎదురు చూపులే ఫ నాలుగేళ్లుగా నిలిచిన పెన్షన్ల మంజూరు ఫ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ బాధితుల ప్రదక్షిణలు ఫ జిల్లాలో సుమారు 20వేల దరఖాస్తులు పెండింగ్ -
ఐదు నిమిషాలు దాటితే నో ఎంట్రీ
సూర్యాపేటటౌన్ : ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కె.అశోక్ తెలిపారు. విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలు ప్రశాంతంగా రాయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి పరీక్షకు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై మంగళవారం సాక్షికి ఆయన ఇచ్చిన ఇంటర్ూయ్వలో పలు అంశాలపై మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 357 ఉన్నాయి. పదో తరగతి పరీక్షకు 12,403 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వారి కోసం జిల్లాలో 69 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశాం. ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరా ఉండేలా చర్యలు తీసుకున్నాం. పరీక్ష కేంద్రాలలో తాగునీరు, విద్యుత్, ప్రథమ చికిత్స కోసం సిబ్బంది ఇలా అన్ని మౌళిక వసతులు కల్పించాం. ప్రశ్నపత్రాలు ఇప్పటికే జిల్లాకు రాగా వాటిని ఆయా పరీక్ష కేంద్రాల పరిధిలోని పోలీస్ స్టేషన్ల్లో భద్రపరిచాం. సీసీ కెమెరాల నిఘాలోనే సీఎస్, డీఓలు పరీక్ష పత్రాల సీల్ తీస్తారు. పరీక్ష ముగిసిన తర్వాత కూడా అదే చోట జవాబు పత్రాలను సీల్ చేసి పోస్టాఫీస్ ద్వారా వారికి కేటాయించిన చిరునామాకు రిజిస్టర్ పోస్ట్ చేస్తారు. లేటుగా వస్తే నో ఎంట్రీ పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు జరుగుతాయి. విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. పరీక్ష సమయం కంటే ఐదు నిమిషాల వరకు మాత్రమే (9:35) పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ఐదు నిమిషాల దాటితే ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు. పరీక్ష కేంద్రంలోకి మొబైల్స్, ఎలక్ట్రానిక్ వస్తవులు అనుమతించరు. పర్యవేక్షణకు ప్రత్యేకాధికారులు పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు సీఎస్, డీఓతో పాటు ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక సిట్టింగ్ స్క్వాడ్ను నియమించాము. దాంతో పాటు నాలుగు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను కూడా ఏర్పాటు చేశాం. ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలెటర్ చొప్పున నియమించాం. పరీక్ష కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు ఉంటుంది. 144 సెక్షన్ అమలులో ఉంటుంది. పరీక్ష కేంద్రాలకు సమీపంలో ఉన్న జిరాక్స్, ఆన్లైన్ సెంటర్లు మూసివేసి ఉంచాలి. ఆరు సబ్జెక్టులు.. ఏడు పరీక్షలు పదో తరగతిలో మొత్తం ఆరు సబ్జ్క్టులు ఉండగా ఏడు పరీక్షలు జరుగుతాయి. భౌతిక, జీవశాస్త్రం రెండు పేపర్లు ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు జరుగుతాయి. ప్రతి పరీక్షకు మూడు నుంచి నాలుగు రోజులు విరామం ఉంటుంది. ఈ విషయమై విద్యార్థులకు ముందుగానే అవగాహన కల్పించాం. ప్రైవేట్ పాఠశాలలు ఫీజుల పేరుతో విద్యార్థులకు హాల్ టికెట్ ఇవ్వకున్నా.. లేదా విద్యార్థులు హాల్ టికెట్ పోగొట్టుకున్నా బీఎస్ఈ తెలంగాణ వెబ్సైట్లో తమ పుట్టిన తేదీ నమోదు చేసి హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో గతేడాది నవంబర్ నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. జనవరి నుంచి ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించి ప్రతి సబ్జెక్టుపై పట్టు సాధించేలా అవగాహన కల్పించి పరీక్షకు సిద్ధం చేశాం. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాం. కలెక్టర్ నేతృత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదో తరగతి విద్యార్థులకు పరీక్ష కిట్ను కూడా అందించాం. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలి. ఫ పదో తరగతి పరీక్షలకు జిల్లాలో 69 కేంద్రాలు ఫ పకడ్బందీగా నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి ఫ జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ -
ఖైదీల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
చివ్వెంల(సూర్యాపేట) : ఖైదీల ఆరోగ్యం విషయంలో జైలు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూర్యాపేట జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ సూచించారు. మంగళవారం సూర్యాపేట సబ్ జైలును ఆమె సందర్శించారు. జైలు పరిసరాలు, మధ్యహ్న భోజనం, వంట గదులు, ఖైదీల గదులను పరిశీలించారు. ఖైదీలను ఆరోగ్యం విషయమై అడిగి తెలుసుకున్నారు. ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలని, క్షణికావేశంలో చేసిన తప్పిదా ల వల్ల, కుటుంబాలకు దూరంగా జైలులో ఉండాల్సి వస్తుందని అన్నారు. న్యాయవాదులను పెట్టుకోలేని ఖైదీలు డీఎల్ఎస్ఏలో దరఖాస్తు చేసుకుంటే ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆమె వెంట జైలు సూపరిండెంట్ సుధాకర్రెడ్డి, సిబ్బంది ఉన్నారు. ప్రగతి ప్రణాళికలో భాగస్వాములు కావాలిఅర్వపల్లి : ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో ప్రజలు భాగస్వాములు కావాలని జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య కోరారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నాగారం మండలం ఫణిగిరిలో మంగళవారం నిర్వహించిన పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎర్ర సావిత్రియాదగిరి, పంచాయతీ కార్యదర్శి సురేష్, సిబ్బంది పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ ఎన్నికల నామినేషన్లు షురూచివ్వెంల(సూర్యాపేట) : ఈ నెల 26న జరుగునున్న బార్ అసోసియేషన్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. మొదటి రోజు ఐదు నామినేషన్లు వేసినట్లు ఎన్నికల అధికారి తోగటి మురళి తెలిపారు. అధ్యక్ష , ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యాక్షుడు, గేమ్స్ అండ్ కల్చరల్, ఈసీ సభ్యుడు స్థానాలకు ఒక్కో నామినేషన్ వచ్చినట్లు పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికతపై రైతులను ప్రోత్సహించాలి గరిడేపల్లి : సాగులో వస్తున్న నూతన సాంకేతిక అంశాలపై శాస్త్రవేత్తలు రైతులను ప్రోత్సహించాలని దక్షిణ తెలంగాణ మండల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలెం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ ఎల్. కృష్ణ అన్నారు. మంగళవారం మండలంలోని గడ్డిపల్లి కేవీకేలో నిర్వహించిన శాసీ్త్రయ సలహా సంఘం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అనుసరించాల్సిన విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలను ప్రోత్సహించాలన్నారు. కేవీకే సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ ఇన్చార్జి డి. నరేష్, సీహెచ్ నరేష్, కిరణ్, ఆదర్శ్, అక్షిత్సాయి, సుగంధి 2025–26 సంవత్సరంలో నిర్వహించిన వివిధ కార్యక్రమాలను వివరించారు. సమావేశంలో నాబార్డ్ డీడీఎం డి.రవీందర్, ప్రొఫెసర్ ఎన్.ప్రవీణ్, జిల్లా వ్యవసాయ అధికారి జి.శ్రీధర్రెడ్డి, కంపసాగర్ కేవీకే హెడ్ పి. చంద్రశేఖర్, ఉద్యాన అధికారి ఎం. మహేష్, మండల వ్యవసాయ అధికారి ప్రీతంకుమార్, రైతులు పాల్గొన్నారు. -
వైన్స్ నిర్వాహకుల ఆధిపత్యపోరు
కోదాడ : కోదాడ నియోజకవర్గంలో మద్యం దుకాణాల నిర్వాహకుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. పట్టణం, రూరల్ పరిధిలోని బెల్ట్షాపులకు మద్యం సరఫరా చేసే విషయంలో పొత్తులు కుదరక పోవడంతో రగడ కొనసాగుతోంది. ఏకంగా ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని తనిఖీలు చేస్తున్నారు. ఒకరి వ్యాపారాన్ని దెబ్బతీయడానికి మరొకరు ప్రయత్నం చేస్తుండగా.. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రూరల్ వర్సెస్ టౌన్ కోదాడ నియోజకవర్గలోని ప్రతి గ్రామంలో పది చొప్పున బెల్ట్ దుకాణాలు నడుస్తున్నాయి. వాటికి సమీపంలోని వైన్స్ల నుంచి మద్యం సరఫరా అవుతోంది. కోదాడ మండలంలోని తెలంగాణ–ఏపీ సరిహద్దు ప్రాంతమైన నల్లబండగూడెం వద్ద మూడు మద్యం దుకాణాలకు ఎకై ్సజ్ అధికారులు అనుమతులు ఇచ్చారు. అయితే అక్కడ వ్యాపారం సరిగా సాగడం లేదని గతంలోనే అధికారుల అనుమతితో ఓ దుకాణాన్ని తాత్కాలికంగా గుడిబండకు మార్చారు. కొత్త దుకాణాలకు వేలం నిర్వహించినపుడు నల్లబండగూడెంలో రెండు, గుడిబండలో ఒక దుకాణాన్ని గుర్తించి నోటిఫికేషన్ ఇచ్చారు. తమ వద్దకు రాకుంటే సమాచారం లీక్ కోదాడ రూరల్ పరిధిలోని వైన్స్లు ఏడు గ్రామాలకు, కోదాడ పట్టణంలోని దుకాణాలు ఇతర గ్రామాలకు మద్యం సరఫరా చేయాలని అప్పట్లో నిర్ణయించారు. గతంలో గుడిబండ గ్రామానికి సమీపంలో ఉన్న పలు గ్రామాల బెల్ట్ దుకాణాల వారు కోదాడ నుంచి మద్యాన్ని తీసుకొని వెళ్లేవారు. ప్రస్తుతం గుడిబండలో వైన్స్ ఏర్పాటు చేసిన తరువాత ఇక్కడి నుంచే మద్యం తీసుకెళ్లాలని, రూరల్ పరిధిలోని గ్రామాల వారు టౌన్ నుంచి మద్యం తీసుకెళ్లవద్దని రూరల్ షాపుల వారు షరతు పెట్టారు. వారి మాటలను బేఖాతరు చేస్తూ ఇటీవల కొందరు గ్రామాల వారు కోదాడ నుంచి మద్యాన్ని తెచ్చుకోవడంతో రూరల్ పరిధి షాపుల నిర్వాహ కులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో ఆటోలో తీసుకెళ్తున్న మద్యాన్ని రూరల్ పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేశారు. ఈ విషయమై పట్టణంలోని వైన్స్ల యజమానులు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఇరువర్గాలు ఒకరిపై మరొకరు ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నించడం పోలీసులు, ఎకై ్సజ్ అధికారులను ఇరకాటం పెడుతోంది. ఇంతలా మద్యం అక్రమ వ్యాపారం జరుగుతుంటే పోలీసులు, ఎకై ్సజ్ అధికారులు ఏమి చేస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గుడిబండ రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తుండగా మద్యంతో వెళ్తున్న వాహనం దొరకడంతో పట్టుకొని కేసు నమోదు చేశాం. మద్యాన్ని ఎకై ్సజ్ అధికారులకు అప్పగించాం. – గోపాల్రెడ్డి, కోదాడ రూరల్ ఎస్ఐ ఫ బెల్ట్ షాపులకు మద్యం సరఫరాపై రగడ ఫ తమ అనుచరులతో తనిఖీలు ఫ కోదాడలో హాట్ టాపిక్గా మద్యం వ్యవహారం -
గ్యాస్ ధర పెంపుతో ప్రజలపై ఆర్థిక భారం
నూతనకల్ : కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచి ప్రజలపై ఆర్థిక భారం మోపుతోందని, పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందె మంగ డిమాండ్ చేశారు. గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ మంగళవారం సూర్యాపేట–దంతాలపల్లి ప్రధాన రహదారిపై సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్పై రూ.60లు పెంచడం సరికాదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధరలను నియంత్రించడంలో విఫలమైందని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం.డేవిడ్కుమార్, ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా నాగయ్య, పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మేకల రాజేశ్వరి, కంచర్ల నర్సమ్మ, నాయకులు కునుకుంట్ల సైదులు, దేసోజు మధు, దగ్గుల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
మోడల్ కాలనీ పనులు పూర్తి చేయాలి
హుజూర్నగర్ : మోడల్ హౌసింగ్ కాలనీలో పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. మంగళవారం హుజూర్నగర్ పరిధిలోని రామస్వామి గుట్టవద్ద నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల మోడల్ హౌసింగ్ కాలనీని ఆయన పరిశీలించారు. ఇళ్ల బ్లాకులు, అంతర్గత రోడ్లు, సభాస్థలి, మొక్కలు నాటింపు, పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు. ఈ నెల రెండవ వారంలో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా కాలనీని ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, అర్హతలేని వారి పేరు జాబితాలో ఉండకూడదని స్పష్టం చేశారు. జాబితాను సూక్ష్మంగా పరిశీలించి అవకతవకలకు తావు లేకుండా ఎంపిక ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. ఆయన వెంట హౌసింగ్ పీడీ సిద్ధార్థ, హార్టికల్చర్ పీడీ నాగయ్య, ఆర్డీఓ శ్రీనివాసులు, మిషన్ భగీరథ ఈఈ కరుణాకర్రెడ్డి, ట్రాన్స్కో డీఈ వెంకటకృష్టయ్య, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, తహసీల్దార్ కవిత పాల్గొన్నారు -
రైతు భరోసా నిధులు విడుదల చేయాలి
సూర్యాపేట అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం యాసంగి రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లు నాగార్జునరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం సూర్యాపేటలోని సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.15వేలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు వాగ్దానం చేసిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత శూన్య హస్తం చూపిస్తుందని విమర్శించారు. రైతు భరోసా నిధుల కోసం ఈ నెల 12న సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు కందాల శంకర్రెడ్డి, కొలిశెట్టి యాదగిరిరావు, రజిత, అప్పయ్య పాల్గొన్నారు. -
ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రజావాణి ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఆయన ఆర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. ప్రజా వాణిలో వివిధ సమస్యలకు సంబంధించి 80కిపైగా అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ, డీఈఓ శ్రీధర్రెడ్డి, డీఈఓ అశోక్, సంక్షేమ అధికారులు నర్సింహారావు, నరసింహ, శంకర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
అసమానతలు లేని సమాజం కావాలి
సూర్యాపేట అర్బన్ : అసమానతలు లేని సమాజ నిర్మాణానికి పోరాడుదామని ప్రగతిశీల మహిళా సంఘం(పీఓడబ్ల్యూ) జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక అన్నారు. సోమవారం ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం సందర్భంగా సూర్యాపేటలోని కొత్త బస్టాండ్ నుంచి లయన్స్ క్లబ్ వరకు మహిళలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. మహిళల పట్ల వివక్ష పోవాలన్నారుఉ. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు మారసాని చంద్రకళ, జిల్లా ఉపాధ్యక్షురాలు సూరం రేణుక, సహాయ కార్యదర్శి సంతోషిమాత, కట్టా కల్పన, చందనబోయిన లక్ష్మి, ఐతరాజు పద్మ,పేర్ల బయ్యక్క, వేమనూరు పావని, శ్యామల, ఎల్లమ్మ,గౌరమ్మ, సత్తెమ్మ మాలంబి, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. -
భూ ఆక్రమణపై ‘డెక్కన్’ లో విచారణ
పాలకవీడు : మండలంలోని రావిపహాడ్ గ్రామం భవానీపురంలో గల డెక్కన్ సిమెంట్స్ కంపెనీ యాజమాన్యం అటవీ భూముల ఆక్రమణపై వచ్చిన ఫిర్యాదుతో సోమవారం జిల్లా అటవీశాఖ అధికారి (డీఎఫ్ఓ) సతీష్కుమార్ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. కేంద్ర సాధికారత కమిటీ (సీఈసీ) ఆదేశాల మేరకు విచారణ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అటవీ భూమి ఆక్రమిత స్థలంలో ఉన్న శాశ్వత నిర్మాణా లను పరిశీలించామని డీఎఫ్ఓ తెలిపారు. వీటి ఫొటోలు, వీడియోలు, పత్రాలతో కూడిన పూర్తి స్థాయి నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారు పసుపులేటి సురేష్ మీడియాతో మాట్లాడారు. అటవీ, మైనింగ్ భూముల మధ్య హద్దురాళ్లు ఏర్పాటు చే యలేదని ఆరోపించారు. డీఎఫ్ఓ నివేదికపై తనకు విశ్వాసం లేదని.. ఈ అంశాన్ని కోర్టులోనే తేల్చుకుంటానని వెల్లడించారు. విచారణలో అటవీశాఖ, రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది, డెక్కన్ సిమెంట్ కంపెనీ ప్రతినిధులు, ఫిర్యాదుదారుడు పాల్గొన్నారు. వివాద నేపథ్యం ఇదీ..డెక్కన్ సిమెంట్ కంపెనీ అటవీ భూముల ఆక్రమణకు పాల్పడినట్లు గతంలో వచ్చిన ఫిర్యాదులతో కలెక్టర్ ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేసి విచారించింది. సదరు పరిశ్రమ 8.02 హెక్టార్ల అటవీ భూమిని ఆక్రమించి రైల్వేలైన్తో పాటు ఇతర శాశ్వత నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించింది. అయితే ఆ భూమిని తాము పట్టాదారుల నుంచే కొనుగోలు చేశామని కంపెనీ ప్రతినిధులు వాదించారు. చివరకు 2023లో కేంద్ర అటవీ శాఖకు రూ.8 కోట్లు చెల్లించి ఆ భూమిని పరిశ్రమ క్రమబద్ధీకరించుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఉన్నతాధికారులకు నివేదిస్తాం జిల్లా అటవీశాఖ అధికారి సతీష్కుమార్ -
ముస్లింలకు అండగా ఉంటాం
భానుపురి (సూర్యాపేట) : ఢిల్లీ నుంచి గల్లీ దాకా ముస్లింలకు అండగా నిలబడేది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్రెడ్డి పేర్కొన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని సోమవారం సూర్యాపేట జిల్లాకేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ముస్లింలు పవిత్ర మాసంగా భావించే రంజాన్ ఇఫ్తార్ విందులో పాల్గొనడడం సంతోషంగా ఉందన్నారు. సూర్యాపేటలో షాదీఖానా, కమ్యూనిటీ హాల్, ఖబరస్తాన్ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదితా లక్షాది, పీసీసీ కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆర్అండ్బీ గెస్ట్హౌస్కు శంకుస్థాపనరహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో సూర్యాపేటలో నూతనంగా రూ.10 కోట్లతో నిర్మించనున్న రోడ్లు, భవనాల అతిథి గృహానికి (గెస్ట్హౌస్) మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ఆర్డీఓ వేణు మాధవరావు పాల్గొన్నారు. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
మహిళలు.. ఉన్నతస్థాయికి ఎదగాలి
చివ్వెంల (సూర్యాపేట) : మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఉన్నతస్థాయికి ఎదగాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా న్యాయవాదులకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు ఉన్నత విద్యను అభ్యసించి మంచి ఉద్యోగాలు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎన్.అపూర్వ రవళి, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మంచాల మమత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, మహిళా న్యాయవాదులు గాయత్రి, నెండెం వాణి, కాసం సరిత, శశిరేఖ, జుష్మిత, ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు. అగ్ని ప్రమాదాలతో అప్రమత్తంగా ఉండాలి పెన్పహాడ్ : అగ్ని ప్రమాదాల నివారణపై విద్యార్థులకు అవగాహన కల్పించడంతోపాటు ప్రమాదాలు సంభవించినప్పుడు అప్రమత్తంగా ఉండేలా జాగ్రత్తలు చెప్పాలని జిల్లా అగ్నిమాపక అధికారి జానయ్య అన్నారు. సోమవారం పెన్పహాడ్ మండలం అనాజీపురంలోని ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాలలో విద్యార్థుల భద్రత దృష్ట్యా అగ్ని ప్రమాదాలు, భద్రతా చర్యలపై పాఠశాల ప్రిన్సిపాల్ కోడి లింగయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, ఉపాధ్యాయులు, అగ్ని మాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. వరలక్ష్మి ఆశయాలు సాధిద్దాం మునగాల : మండల కేంద్రానికి చెందిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు చిల్లంచర్ల రఘునాథం సతీమణి చిల్లంచర్ల వరలక్ష్మి ఆశయసాధనకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. సోమవారం మునగాలలోలోని రఘునాథం మిల్లు ఆవరణలో ప్రముఖ విద్యావేత్త అర్వపల్లి శంకర్ అధ్యక్షతన జరిగిన వరలక్ష్మి సంతాప సభలో ఆయన మాట్లాడారు. వరలక్ష్మి కుటుంబ సభ్యులు.. విద్యార్థులకు పాఠశాల డ్రెస్, పేద మహిళలకు చీరల పంపిణీ చేశారు. ఈ సభలో సీపీఐ, సీపీఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు నంద్యాల రామిరెడ్డి, మామిడి వెంకటేశ్వర్లు, గుండు వెంకటేశ్వర్లు, బద్ధం భద్రారెడ్డి, పైడిమర్రి వెంకటనారాయణ, సీహెచ్ .సీతారామ్, మామిడి చినరామయ్య, ములకలపల్లి రాములు, బుర్రి శ్రీరాములు, సుంకర అజయ్కుమార్, ఉప్పుల యుగంధర్రెడ్డి, కందిబండ సత్యనారాయణ పాల్గొన్నారు. నారసింహుడికి నిత్యారాధనలు మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో సోమవారం నిత్యారాధనలు కొనసాగాయి. ముందుగా ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోలు మహోత్సవం జరిపారు. అనంతరం విష్వక్సేనారా ధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలతో నిత్యకల్యాణం వైభవంగా నిర్వహించారు. అదేవిధంగా క్షేత్రంలోగల శివాలయంలోని శ్రీపార్వతీరామలింగేశ్వరస్వామికి మహా న్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిపా రు. ఆంజనేయస్వామికి, గోదాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు, ఈఓ, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
నిధుల ‘పంచాయితీ’!
మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలిభానుపురి (సూర్యాపేట) : జిల్లాలో నిధుల పంచాయితీ కొనసాగుతోంది. గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఇటీవల రెండు విడతల్లో విడుదల చేసింది. వచ్చిన నిధులు తమవేనంటూ ఇటు మాజీ సర్పంచ్లు, అటు గ్రామ పంచాయతీ కార్యదర్శులు పట్టుబడుతున్నారు. అక్కడక్కడా మాజీ సర్పంచ్లకు తెలియకుండానే గ్రామ కార్యదర్శులు డ్రా చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. దీంతో నిధుల పంచాయితీ రచ్చకెక్కింది. సందట్లో సడేమియాగా కొందరు అధికారులు రానున్న వేసవిలో మంచినీటి ఎద్దడి నివారణకు ఈ నిధులను ఖర్చు చేయాల్సి ఉందని, ఈ నిధులు ఎవరికీ ఇవ్వొద్దని ఆదేశించడమేంటని మాజీ సర్పంచ్లు ఆందోళన చెందుతున్నారు. ఎంబీలు కాక.. నిధులు ఆలస్యం జిల్లావ్యాప్తంగా 475 గ్రామ పంచాయతీలకు 2019లో జరిగిన ఎన్నికల్లో సర్పంచ్లుగా గెలిచిన వారంతా గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను చేపట్టారు. ప్రధానంగా క్రీడా ప్రాంగణాలు, వైకుంఠధామాలు, వీధిలైట్లు, సీసీ రోడ్లు నిర్మాణం, రైతు వేదికలు, బతుకమ్మ ఘాట్లు, పల్లె ప్రకృతి వనాలు.. ఇలా పలు రకాల పనులు చేశారు. ఈ సర్పంచ్ల పదవీకాలం దగ్గర పడిన సమయంలో చేసిన పనులకు ఎంబీలు వెంటనే కాకపోవడం, ఇతర కారణాలతో ఈ 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల ఆలస్యమైంది. సర్పంచ్ల పదవీకాలం ముగియడం, తిరిగి ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారుల పాలనతో నెట్టుకొచ్చింది. దీంతో పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయలేదు. సర్పంచ్లు పదవీకాలం ముగిసే సమయానికి దాదాపు జిల్లాలో రూ.70 కోట్ల నుంచి రూ.80 కోట్ల నిధులు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. నిధుల విడుదలతో కొత్త పంచాయితీ!జిల్లాలోని 486 గ్రామ పంచాయతీలకు ఇటీవల ఎన్నికలు జరిగి సర్పంచ్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నుంచి ఇప్పటి వరకు జిల్లాకు రెండు విడతల్లో నిధులు విడుదల చేసింది. మొదటి విడత 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.11.45 కోట్లు, రెండో విడతలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.10 కోట్లు విడుదల చేసింది. ఇందులో 2023–24 నిధులు మాజీ సర్పంచ్లు చేసిన పనులకు సంబంధించిన నిధులు రాగా.. 2024–25 నిధులు కార్యదర్శులకు రావాల్సి ఉంది. అయితే కొందరు నిధుల విషయంలో స్పష్టత లేకుండా కార్యదర్శులు, ప్రస్తుత సర్పంచ్లు కొన్నిచోట్ల డ్రాలు చేసుకుంటూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు మాజీ సర్పంచ్లు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లిన విషయాలను సరిచేస్తుండగా.. కొందరు ఇంకా అలాగే చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నిధుల విషయంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి తమకు నిధుల వచ్చేలా చూడాలని మాజీ సర్పంచ్లు కోరుకుంటున్నారు.జిల్లాకు విడుదలైన 15వ ఆర్థిక సంఘం నిధులు..విడత నిధులు ఏ సంవత్సరానివి (రూ.కోట్లలో..)మొదటి 11.45 2023 – 24 రెండవ 10 2024 – 25ఇటీవలే 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల ఈ నిధులు తమయేనంటున్న మాజీ సర్పంచ్లు, కార్యదర్శులు అక్కడక్కడా డ్రా చేస్తున్న కార్యదర్శులు అధికారులకు సమస్యగా మారిన నిధుల కేటాయింపుసర్పంచ్లు లేకపోవడంతో.. పంచాయతీలకు సర్పంచ్లు లేకపోవడంతో కార్యదర్శులే దాదాపు రెండేళ్ల పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి నిధులు ఖర్చు చేయాల్సి వచ్చింది. ప్రధానంగా వేసవిలో మంచినీటి ఎద్దడికి, ట్రాక్టర్ల డీజిల్, పారిశుద్ధ్యం, వీధిలైట్ల కోసం ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో అప్పులు తెచ్చి పెట్టారు. ఒక్కో గ్రామ కార్యదర్శి రూ.4లక్షల నుంచి రూ.6లక్షల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఒకట్రెండు చోట్ల నిధుల పంచాయితీలు వచ్చాయి. ఈ విషయంలో స్పష్టత ఇచ్చి వివాదాలు లేకుండా చూస్తున్నాం. త్వరలోనే మరికొన్ని నిధులు రావాల్సి ఉంది. ఎవరికి రావాల్సిన బిల్లులు వారికే వస్తాయి. – యాదగిరి, జిల్లా పంచాయతీ అధికారిమాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లు చెల్లించాలని సర్పంచ్ల సంఘం జేఏసీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ అన్నారు. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లింపులపై వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తూ సోమవారం సూర్యాపేట కలెక్టరేట్ ముందు సంఘం ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన 2023–24, 2024–25 సంవత్సరాలకు సంబంధించి 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.247 కోట్ల నిధులను విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకుండా మాజీ సర్పంచ్లను మోసం చేసేలా ప్రకటనలు చేస్తోందన్నారు. మాజీ సర్పంచ్లు అప్పులు చేసి అభివృద్ధి పనులు చేశామన్నారు. అనంతరం కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, కేశబోయిన మల్ల య్య, నూతనకల్ సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు చూడి లింగారెడ్డి, తుంగతుర్తి మండల ఫోరం ఉపాధ్యక్షులు లాకావత్ యాకు నాయక్, రామన్నగూడెం మాజీ సర్పంచ్ గంధం మల్లారెడ్డి, వెలుగుపల్లి మాజీ సర్పంచ్ మామిడి వెంకన్న, గోవింద్ రెడ్డి, మాజీ సర్పంచ్లు శ్రీను, వీరన్న, పుణ్యనాయక్, శంకర్, పాముల ఉపేందర్, రమేష్, శ్రీను, నవీన్ రెడ్డి, నర్సింహ, జగపతి తదితరులు పాల్గొన్నారు. -
15న పీఎన్ఎం మహాసభ
చివ్వెంల(సూర్యాపేట) : ప్రజానాట్యమండలి జిల్లా మహా సభలను ఈ నెల 15న సూర్యాపేట పట్టణంలో నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు బచ్చలకూరి రాంబాబు తెలిపారు. ఆదివారం మండలంలోని బి.చందుపట్ల గ్రామంలో సభలకు సంబంధించిన కరపత్రాలను ఆయన విష్కరించి మాట్లాడారు. మహాసభలకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ట నర్సింహారావు, ఉపాధ్యక్షుడు సాంబరాజు యాదగిరి హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. కవులు, కళాకారులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు పిడమర్తి అశోక్, ధరావతు చిరంజీవి, బచ్చలకూరి వెంకటేశ్, ప్రియాంక, నవీన్, కల్యాణ్, ఉప్పమ్మ, అలివేలు, దేవమ్మ, కోలాటం మాస్టర్, శంకర్ నాయక్, శ్వేత, ప్రమీల, సతీష్ పాల్గొన్నారు. సూర్యక్షేత్రంలో సౌరహోమంఅర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని సూర్యనారాయణస్వామి క్షేత్రంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. యజ్ఞశాలలో మహాసౌరహోమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితజనార్దన్, గణపురం నరేష్, ఇంద్రారెడ్డి, బాలమురళీకృష్ణ, అర్చకులు భీంపాండే, అంకిత్పాండే పాల్గొన్నారు. -
విద్యార్థులపై ఫీజుల పిడుగు
కోదాడ : తల్లి దండ్రుల నుంచి ఫీజులు దండుకునేందుకు జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు సరి కొత్త విద్యా వ్యాపారానికి తెర తేశాయి. 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల వార్షిక పరీక్షలు పూర్తి కాక ముందే శ్రీజూనియర్ టెన్త్శ్రీ పేరుతో పదో తరగతి పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. స్టడీ మెటీరియల్, ఫీజుల పేరుతో వారి వద్ద నుంచి వేల రూపాయలు ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. విద్యాశాఖ అధికారులు పట్టించుకోక పోవడంతో వారి ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. నిబంధనలకు వ్యతిరేకంగా9వ తరగతి చదివే విద్యార్థులు వార్షిక పరీక్షలు రాశాక, వారి ప్రగతిని పరీశీలించాకే పదో తరగతిలో ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. కానీ అకడమిక్ ఇయర్ పూర్తి కాక ముందు వారికి జూనియర్ టెన్త్ అంటూ పేరు పెట్టి ఏకంగా తరగతులే బోధిస్తున్నారు. దీని కోసం ప్రైవేట్ పబ్లికేషన్ల మెటీరియల్ను విద్యార్థులకు అంట గడుతూ తల్లిదండ్రలు నుంచి రూ. 15 వేల నుంచి 20 వేల వరకు తీసుకుంటున్నారు. మరి కొన్ని పాఠశాలలు పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక యూనిఫాం అంటూ అందుకు రూ. 2 నుంచి 3 వేలు వసూలు చేస్తున్నారు. తల్లిదండ్రుల ఆతృతే పెట్టుబడిసంక్రాంతి సెలవుల అనంతరం జిల్లాలోని కోదాడ, సూర్యాపేట, హుజూర్నగర్లో ఉన్న పలు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం తమ వద్ద 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆ పాఠాలు బోధించడం ఆపేశారు. జూనియర్ టెన్త్ పేరుతో వారికి 10వ తరగతి పాఠాలు చెప్పడం మొదలు పెట్టారు. 9వ తరగతి అంత ముఖ్యం కాదని పదో తరగతి పబ్లిక్ పరీక్షలలో మీ పిల్లలు మంచి మార్కులు సాధించాడానికే ముందుగా పాఠాలు బోధిస్తున్నామని చెబుతూ తల్లిదండ్రులు, పిల్లలలో ఆతృత కలిగిస్తున్నారు. తమ పిల్లలు ఎక్కడ వెనుకబడి పోతారో అనే ఆందోళనతో తల్లిదండ్రులు నిర్వాహకులు చెప్పిన విధంగా తలూపుతున్నారు. భారమైనప్పటికీ వేల రూపాయలను ముందస్తుగా చెల్లిస్తున్నారు. బయటి మార్కెట్లో రూ.100కు దొరికే పుస్తకం అట్టలపై తమ సంస్థ పేరు ముద్రించి రూ.4 వందలకు అంటగడుతున్నారని పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చదివిస్తున్న విద్యా వంతులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు కూడా 9వ తరగతి పూర్తి కాక ముందే 10వ తరగతి పాఠాలు ఎలా మొదలు పెడతారని అడిగిన పాపాన పోలేదు. ఆర్థిక భారంసూర్యాపేట జిల్లాలో ప్రస్తుతం 9వ తరగతిలో 10 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 4 వేల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతుండగా 6 వేల మంది ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారు. 90 శాతం ప్రైవేట్ పాఠశాలలు ఇదే రీతిని అనుసరిస్తుండడంతో సుమారు 5వేల మంది విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతోంది. ఒక్కరి నుంచి పుస్తకాలకే రూ.15 వేల వరకూ వసూలు చేస్తున్నారు. దీనికి తోడు వచ్చే సంవత్సరం చెల్లించాల్సి మొత్తం ఫీజులో సగం ఇప్పుడే చెల్లించాలని శరతు విధిస్తుండడంతో తల్లిదండ్రులకు తలకు మించిన భారంగా మారుతోంది. పట్టించుకోని అధికారులుజిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు ఆవరణలోనే దుకాణాలు తెరిచి పుస్తకాలు, నోట్బుక్స్, పెన్నులు, బ్యాగ్లు, యూనిఫాం విక్రయిస్తూ వేల రూపాయల వ్యాపారం చేస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. తల్లిదండ్రులు ఫిర్యాదులు చేస్తున్నా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. జిల్లా కలెక్టర్ తరచూ ప్రభుత్వ పాఠశాలలను తనఖీ చేస్తున్నా ప్రైవేట్ వైపు వెళ్లక పోవడంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా కలెక్టర్ ప్రైవేట్ పాఠశాలలను కూడ తనిఖీ చేయాలని విద్యార్థుల తల్లి దండ్రులు కోరుతున్నారు.నిబంధనల ప్రకారం 9వ తరగతి విద్యార్థులకు జూనియర్ టెన్త్ పేరుతో తరగతులు నిర్వహించ కూడదు. అలా చేస్తున్నట్లు మాకు ఫిర్యాదులు రాలేదు. ప్రైవేట్ పాఠశాలలను తనిఖీ చేసి తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటాము. – సలీం షరీఫ్, ఎంఈఓ కోదాడ జూనియర్ ‘టెన్త్’ పేరుతో సరికొత్త విద్యా వ్యాపారం మెటీరియల్ కొనుగోలు చేసేందుకు రూ.15 వేల నుంచి 20 వేలు మొత్తం ఫీజులో సగం అడ్వాన్స్గా చెల్లించాలని డిమాండ్ జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల ముందస్తు వసూళ్లుకోదాడలో కార్పొరేట్ దందా.. కోదాడలో ఉన్న ఓ కార్పొరేట్ పాఠశాల జూనియర్ టెన్త్ పేరుతో నెల రోజుల నుంచి 10వ తరగతి పాఠాలు బోధిస్తున్నారు. తమ మూడు బ్రాంచ్లలో ఉన్న సుమారు 150 మంది విద్యార్థులకు తమ సంస్థకు చెందిన ప్రత్యేక మెటీరియల్ అంట గడుతున్నారు. ఇందుకోసం ఒక్కో విద్యార్థి నుంచి రూ.18 వేల వసూలు చేస్తున్నారు. తమ సంస్థలో చదివే వారు ఈ పుస్తకాలు కొనాల్సిందేనని చెప్పడంతో తల్లిదండ్రులు విధిలేక కొంటున్నారు. దీంతో పాటు ఐపీఎల్, టెక్నో పేరుతో సెక్షన్లను ఏర్పాటు చేసి మరికొన్ని అదనపు పుస్తకాలను అంటగడుతున్నారు. ఇందుకోసం పట్టణంలో ఓ దుకాణాన్ని అద్దెకు తీసుకొని లారీల్లో పుస్తకాలను తీసుకొచ్చి అమ్మకాలు చేస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వీరిని చూసి మిగిలిన ప్రైవేటు పాఠశాలలు తామేమి తక్కువ కాదన్నట్లు విద్యార్థుల నుంచి వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. -
యాదగిరిగుట్ట క్షేత్రంలో భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి యాదగిరీశుడిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో ఆలయ మాడవీధులతో పాటుగా, క్యూలైన్లు, క్యూ కాంప్లెక్స్, ప్రసాద విక్రయశాల, ప్రధానాలయం క్యూలైన్లు వంటి ప్రాంతాల్లో భక్తజనం సందోహం కనిపించింది. శ్రీస్వామి వారి దర్శనానికి 3 గంటల సమయం పట్టగా, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. శ్రీస్వామి వారిని 35 వేలమందికి పైగా భక్తులు దర్శించుకోగా, వివిధ విభాగాల ద్వారా స్వామి వారికి రూ.45,46811 నిత్యాదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. -
25 శాతం పెనాల్టీని ఎత్తివేయాలి
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలోని డీఫాల్ట్ రైస్ మిల్లర్లపై ప్రభుత్వం విధించిన 25 శాతం పెనాల్టీతో పాటు 12 శాతం వడ్డీని ఎత్తివేయాలని రా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొండమీది గోవింద రావు కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేకపోవడంతో జిల్లాలోని కొందరు మిల్లర్లు ప్రభుత్వానికి సీఎంఆర్ రైస్ తగిన సమయంలో ఇవ్వలేక పోయారన్నారు. దాంతో అధికారులు వారిని డీఫాల్ట్ లిస్టులో ఉంచడంతో పాటు కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల బెదిరింపులకు భయపడి ఇటీవల కరీంనగర్ జిల్లాకు చెందిన మిల్లర్ తణుకు సురేష్ భార్య స్వప్న ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా మిల్లర్ వ్యవస్థ ఉందన్నారు. ప్రభుత్వం మరోసారి పెనాల్టీని ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. 12 ఏళ్లుగా మిల్లర్లకు ఇవ్వాల్సిన కస్టోడియన్ చార్జీలు, డ్రైయేజ్, మిల్లింగ్, ట్రాన్స్పోర్ట్, ఎఫ్ఆర్కే మిక్సింగ్ చార్జీలు పెండింగ్లో ఉన్నాయన్నారు. ప్రభుత్వం కూడా ఇవ్వాల్సిన బకాయిలను పెనాల్టీతో కలిపి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం ఉపాధ్యక్షుడు అనూప్ రెడ్డి, శంకర్రావు, సైదులు, రంగిశెట్టి నరసింహా రావు, శంకర్, కె.రాజేష్ పాల్గొన్నారు. -
ఆర్టీసీని కార్పొరేట్ పరం చేస్తున్న ప్రభుత్వం
భానుపురి : పర్యావరణ పరిరక్షణ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థ ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ చేతుల్లో పెడుతోందని టీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రీజియన్ కార్యదర్శి బత్తుల సుధాకర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ఈ నెల 12న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే రాష్ట్ర సదస్సులో ఆర్టీసీ కార్మికులు, విద్యార్థులు, మేథావులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఆదివారం సూర్యాపేట డిపో ఎదుట రాష్ట్ర సదస్సు కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. విద్యుత్ బస్సుల విధానంతో ఆర్టీసీ, ప్రజలు తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైందన్నారు. కార్మికులు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉద్యోగులు పిచ్చయ్య, రవి, భాను, పూర్ణచందర్, సైదులు, నరసింహ, మధుసూదన్, శ్రీలత తదితరులు పాల్గొన్నారు. -
పనులు నాసిరకంగా చేస్తున్నారంటూ..
నడిగూడెం : మండలంలోని కరివిరాలలో రూ.10 లక్షలతో నిర్మిస్తున్న మహిళా సమాఖ్య భవనం పనులు నాసిరకంగా చేస్తున్నారని ఆరోపిస్తూ అదే గ్రామానికి చెందిన డీవైఎఫ్ఐ నాయకుడు కేశగాని భద్రయ్య ఆదివారం పనులను అడ్డుకున్నాడు. సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. అధికారులెవరూ రాకపోగా పనులు అడ్డుకున్న తనపైనే కొందరు సిమెంట్ కాంక్రీటు పోశారని భద్రయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ సూర్యాపేటటౌన్ : గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ నుంచి రక్షణ కోసం 14 నుంచి 15 సంవత్సరాలలోపు బాలికలకు హెచ్పీవీ వ్యాక్సి న్ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని డీఎంహెచ్ఓ డాక్టర్ పెండెం వెంకటరమణ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెచ్పీవీ టీకా కార్యక్రమాన్ని ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షెడ్యూల్ ప్రకారం వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ కోటిరత్నం, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణలో కూచిపూడి నృత్య ప్రదర్శనయాదగిరిగుట్ట రూరల్ : హైదరాబాద్కు చెందిన 12 ఏళ్ల కూచిపూడి నర్తకి పి.వైష్ణోదేవి యాదగిరీశుడి కొండ చుట్టూ కూచిపూడి నృత్యం చేస్తూ గిరి ప్రదక్షిణ చేసింది. సంస్కృతి, ఆధ్యాత్మికతను సమ్మిళితం చేస్తూ, 3 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ మార్గమంతా నృత్యం చేస్తూ భక్తులను ఆకట్టుకుంది. జ్యోతి కళాక్షేత్రం స్కూల్ఆఫ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో వైష్ణోదేవి ఈ ప్రదర్శన ఇచ్చారు. ఆమెను ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అభినందించారు. -
దేశంలో మహిళలకు ప్రత్యక స్థానం
అనంతగిరి : భారతదేశ సంస్కృతిలో మహిళలకు ప్రత్యేక స్థానం ఉందని, దానిని పునికి పుచ్చుకున్న వారంతా మహిళలను గౌరవించాలని ‘మా ఊరు– మహాలక్ష్మి’ కార్యక్రమ వ్యవస్థాపకుడు నెల్లూరి సత్యనారాయణ అన్నారు. ఆదివారం అనంతగిరి మండలం గోండ్రియాల గ్రామంలో నిర్వహించిన ‘మా ఊరు– మహాలక్ష్మి’ వార్షికోత్సవ సభలో ఐదుగురు ఆడశిశువులకు ఒక్కొక్కరికి రూ.15వేల చొప్పున అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డకు మా ఊరు మహాలక్ష్మి కానులను అందిస్తున్నట్లు తెలిపారు. కుల, మతాలకు అతీతంగా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న గ్రామ ప్రజలకు, ఎన్ఆర్ఐలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గ్రామంలో పుట్టిపెరిగి వివిధ రంగాల్లో రాణిస్తున్న 40 మందిని ఘనంగా సన్మానించారు. షూటింగ్ బాల్ క్రిడలో అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకాన్ని సాధించిన గోండ్రియాల గ్రామానికి చెందిన గార్లపాటి శిరీషను గ్రామస్తులు సన్మానించారు. చుంచులక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంఈఓ తల్లాడ శ్రీనివాస్, మా ఊరు మహాలక్ష్మి కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, వివిధ రంగాలలో పని చేస్తున్న మహిళలు పాల్గొన్నారు. -
పశు ఔషధ బ్యాంక్ ఏర్పాటు ప్రశంసనీయం
కోదాడరూరల్ : కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలలో పశు ఔషధ బ్యాంక్ ఏర్పాటు చేసి దాని ద్వారా పశుపోషకులకు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ బోడెపూడి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం ఆయన కోదాడ పశువైద్యశాలను సందర్శించి మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పశుఔషధ బ్యాంక్ ఏర్పాటు చేసి రూ.1.55 లక్షల రివాల్వింగ్ ఫండ్తో రూ.9.43కోట్ల సంపదను సృష్టించడం గొప్ప విషయమన్నారు. 20 ఏళ్ల క్రితం కోదాడ పశువైద్యశాలలో తాను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పెంటయ్య, కాపుగల్లు పశువైద్యాధికారి డాక్టర్ సిరిపురపు సురేంద్ర, పశువైద్య కేంద్రం సిబ్బంది ఉన్నారు. జిల్లా పశువైద్యాధికారి శ్రీనివాసరావు -
పది పరీక్షలకు 69 కేంద్రాలు
చిలుకూరు : పదవ తరగతి పరీక్షలు ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలోని 357 ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలలు, గురుకులాలు, మోడల్ స్కూళ్లలో చదువుకుంటున్న 12,630 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. వారి కోసం విద్యాశాఖ జిల్లా వ్యాప్తంగా 69 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. విద్యాశాఖ ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్ చొప్పున నియమించింది. పకడ్బందీగా పర్యవేక్షణపదో తరగతి పరీక్షల నిర్వహణకు జిల్లాలో 69 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా ప్రతి కేంద్రంలో ఒక సీఎస్ను, ఒక డీఓ చొప్పున 138 మందిని నియమించారు. సీఎస్, డీఓలకు ఇప్పటికే పరీక్షల నిర్వహణపై శిక్షణ కూడ ఇచ్చారు. వీరితో పాటు నలుగురిని ఫ్లయింగ్ స్కాడ్స్గా నియమించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. దానికి తోడు పరీక్ష కేంద్రం పరిధిలోని అన్ని జిరాక్స్ షాపులను మూసి ఉంచాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని పరీక్ష కేంద్రాలలో వసతులు ఏర్పాటు చేస్తున్నారు. తాగునీరు, విద్యుత్ సరఫరా, వైద్య సిబ్బందితో కూడిన క్యాంప్ను ఏర్పాటు చేస్తున్నారు. ఉత్తీర్ణత పెంచేందుకు చర్యలుజిల్లాలో పదోతరగతి పరీక్షలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్ నిర్వహింస్తున్నారు. గతేడాది పదవ తరగతి ఉత్తీర్ణత శాతం 96.81గా ఉండగా.. ఈ ఏడాది 100 శాతం సాధించేలా జిల్లా కలెక్టర్, డీఈఓ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వారు నిత్యం పర్యవేక్షణ చేస్తూ ఉపాధ్యాయులకు తగిన సూచనలు, సలహాలు అందిస్తున్నారు.పోలీస్ స్టేషన్కు చేరిన ప్రశ్నపత్రాలు పదో తరగతి వార్షిక పరీక్ష పేపర్లు రాష్ట్ర విద్యాశాఖ నుంచి జిల్లా కేంద్రానికి చేరాయి. పరీక్ష పేపర్లను రూట్ ఆఫీసర్ల ద్వారా మండల కేంద్రాల్లోని పోలీస్ స్టేషన్లలో భద్ర పరిచారు. పోలీస్ సిబ్బంది పర్యవేక్షణలో పెట్టల్లో భద్రపర్చి సీలు వేశారు. ఈ నెల 14 నుంచి పరీక్షలు హాజరు కానున్న 12,630 మంది విద్యార్థులు పర్యవేక్షణకు 138 మంది అధికారులు, సిబ్బంది -
నేడు హుజూర్నగర్లో మంత్రి ఉత్తమ్ పర్యటన
హుజూర్నగర్ : రాష్ట్ర సాగునీటిపారుదల, పౌర సరఫరాలశాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్రెడ్డి శనివారం హుజూర్నగర్లో పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు హుజూర్నగర్కు చేరుకొని స్థానిక రామస్వామి గుట్ట హౌసింగ్ కాలనీ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలిస్తారు. పనుల పురోగతిపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షిస్తారు. అనంతరం సాయంత్ర 5 గంటలకు చింతలపాలెం మండలంలోని దొండపాడులో జరుగుతున్న తిరుపతమ్మ జాతరలో మంత్రి పాల్గొంటారు. అనంతరం గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో జరిగే వివాహ వేడుకలో పాల్గొన్న అనంతరం హైదరాబాద్కు వెళతారు. నిత్యకల్యాణంమఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని శుక్రవారం అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి, అమ్మవార్లకు అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. కల్యాణోత్సవం అనంతరం ఆలయ తిరుమాడ వీధుల్లో స్వామి వారిని గరుడ వాహనంపై ఊరేగింపు చేశారు. కార్య క్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు, భక్తలు పాల్గొన్నారు. రివర్షన్తో ఎస్జీటీలకు తీవ్ర అన్యాయం మద్దిరాల : రివర్షన్ పొందిన, క్రమశిక్షణ చర్యలకు గురైన ఉపాధ్యాయులకు హెచ్ఆర్ఏ స్థానాలు కేటాయించకుండా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రేపాక లింగయ్య కోరారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందిన వారిలో కొందరు అనివార్య కారణాలతో రివర్షన్ తీసుకున్నారన్నారు. ప్రమోషన్ ఇష్టం లేకపోతే ముందే నాట్ విల్లింగా అని ఇస్తే మరో 30 మంది ఎస్జీటీలకు ప్రమోషన్ అవకాశం వచ్చేదన్నారు. అధికారులు ఈ విషయమై సమీక్ష జరిపి ఎస్జీటీలకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో సంఘం మండలాధ్యక్షులు జి.రాములు, కె.ఉమేష్రెడ్డి, సభ్యులు జి.శివప్రసాద్, పి.సురేష్, ఎండీ.అలీమొద్దీన్, షరీఫ్ పాల్గొన్నారు. ఇరాన్పై దాడులను నిలిపివేయాలి సూర్యాపేట అర్బన్ : ఇరాన్పై అమెరికా –ఇజ్రాయిల్ దేశాల దాడులను వెంటనే నిలిపివేయాలని సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ డిమాండ్ చేశారు. అమెరికన్ సామ్రాజ్యవాద దాడులను నిరసిస్తూ శుక్రవారం సూర్యాపేట కొత్త బస్టాండ్ వద్ద ట్రంప్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అరబ్ దేశాలలో ఉన్న ఆయిల్, సహజ వాయువులను దోచుకోవడం ట్రంప్కు అలవాటై పోయిందన్నారు. అంతర్జాతీయ న్యాయ సూత్రాలను మరచి, కనీసం పాఠశాలలను కూడా వదిలిపెట్టకుండా మిస్సైల్స్తో దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కారింగుల వెంకన్న, పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పీడీఎస్యూ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు ఎర్ర అఖిల్ కుమార్, పార్టీ డివిజన్ కార్యదర్శి పేర్ల నాగయ్య, టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు గొడ్డలి నరసయ్య, నాయకులు పాల్గొన్నారు. నకిలీ మందులు విక్రయిస్తే కఠిన చర్యలుగరిడేపల్లి : నకిలీ మందులు విక్రయించే మెడికల్ షాపు యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని డ్రగ్ ఇన్స్పెక్టర్ సురేందర్ హెచ్చరించారు. శుక్రవారం మండలంలోని పొనుగోడు గ్రామంలోని మెడికల్ స్టోర్ను ఆయన తనిఖీ చేశారు. షాపులో నిల్వ ఉంచిన ఔషధాలను పరిశీలించి నివేదికను ఉన్నతాధికారులకు పంపినట్లు చెప్పారు. మెడికల్ షాపులో నకిలీ మందులు, ప్రభుత్వం నిషేధించిన చిన్నపిల్లల దగ్గు టానిక్స్ విక్రయిస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో షాపును తనిఖీ చేపట్టినట్లు ఆయన తెలిపారు. -
రోడ్ల విస్తరణకు మోక్షం
కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలకు రూ.130 కోట్లు మంజూరుకోదాడ : కోదాడ నియోజకవర్గంలోని పలు రోడ్ల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. మొత్తం మూడు ఆర్అండ్బీ రోడ్ల విస్తరణకు మేజర్ డిస్ట్రిక్ రోడ్ ప్లాన్ (ఎండీఆర్) కింద రూ.68 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు రోడ్లు, భవనాలశాఖ ప్రత్యేక కార్యదర్శి వికాస్రాజ్ గురువారం పాలనాపరమైన జీఓ జారీ చేశారు. వెంటనే టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. మొత్తం 22.60 కిలోమీటర్ల రహదారులను విస్తరించనున్నారు. కోదాడ పట్టణంలోని జాతీయ రహదారి నుంచి అనంతగిరి వరకు 6.60 కిలోమీటర్ల రహదారి ప్రస్తుతం 7 మీటర్ల వెడల్పు ఉండగా 10 మీటర్లకు విస్తరించనున్నారు. మునగాల మండలంలోని జాతీయ రహదారి నుంచి నేలమర్రి వరకు పది కిలోమీటర్ల సింగిల్ రోడ్డును రూ.24 కోట్లతో డబుల్ రోడ్డుగా మార్చనున్నారు. కోదాడ మండలం దోరకుంట నుంచి కాపుగల్లు వరకు 6 కిలోమీటర్ల సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా విస్తరించనున్నారు. అనంతగిరి రోడ్డుకు మోక్షంకోదాడ నుంచి అనంతగిరి వెళ్లే రోడ్డు పట్టణ పరిధిలో అర కిలోమీటర్ మేర ఇరుకుగా ఉంది. దాంతో నిత్యం ట్రాఫిక్ జాంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మంత్రి ఉత్తమ్ ఆదేశాలతో ఈ రోడ్డు విస్తరణకు నిధులు మంజూరు కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారి పక్కన ఉన్న నాగార్జున లాడ్జి నుంచి పెద్దచెరువు అలుగు వరకు రోడ్డుకు ఇరువైపులా భవనాలు ఉన్నాయి. రోడ్డు విస్తరించాలంటే వీటిని పాక్షికంగా తొలగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం 6 మీటర్లు ఉన్న రోడ్డును 10 మీటర్ల మేర విస్తరించాలంటే రోడ్డుకు ఇరు వైపులా ఐదు అడుగుల మేర నిర్మాణాలను తొలగించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.హుజూర్నగర్ : నియోజకవర్గంలో రహదారుల విస్తరణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి చేసిన కృషి ఫలితంగా నియోజకవర్గంలో 26.5 కిలో మీటర్ల సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చేందుకు ప్రభుత్వం పాలనా పరమైన అనుమతులతో పాటు మేజర్ డిస్ట్రిక్ రోడ్ ప్లాన్ కింద రూ. 62 కోట్లు మంజూరు చేసింది. తక్షణమే టెండర్లు పిలిచి యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలు పెట్టాలని మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. -
పెద్దిరెడ్డి గణేష్కు సాహితీ పురస్కారం
సూర్యాపేట : తెలంగాణ సారస్వత పరిషత్ ప్రతి సంవత్సరం వివిధ రంగాలలో ప్రముఖులకు అందించే ధర్మనిధి సాహితీ పురస్కారానికి సూర్యాపేట జిల్లాకు చెందిన కవి, రచయిత, సాంస్కృతిక కార్యకర్త పెద్దిరెడ్డి గణేష్ను ఎంపిక చేసింది. తెలంగాణ సాంస్కతిక వైభవానికి పాటుపడిన ప్రముఖుల పేరు మీద ఇచ్చే ఈ అవార్డును బూర్గుల రంగనాథరావు పేరున పెద్దిరెడ్డి గణేష్కు ఇస్తున్నట్లు తెలంగాణ సారస్వత పరిషత్ కార్యదర్శి జె. చెన్నయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉగాది పురస్కారాల్లో భాగంగా ఈ నెల 17న హైదరాబాద్లో అవార్డును అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
‘ఉద్యమం’ రిజిస్ట్రేషన్తో అనేక ప్రయోజనాలు
సూర్యాపేట : ఉద్యమం రిజిస్ట్రేషన్ ద్వారా చిన్న వ్యాపారులకు సులభంగా రుణాలు లభిస్తాయని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ సురేష్, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ బెనర్జీ తెలిపారు. ఉద్యమం రిజిస్ట్రేషన్పై అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం మండలంలోని బాలెంల గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యమం రిజిస్ట్రేషన్ ప్రాముఖ్యతను వివరించారు. దీని ద్వారా ప్రభుత్వ సబ్సిడీలు, వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందవచ్చన్నారు. దాంతో పాటు శిక్షణ, మార్కెటింగ్ సహాయం వంటి ప్రయోజనాలు లభిస్తాయని చెప్పారు. గ్రామీణ యువత, మహిళలు, చిన్న వ్యాపారుల అభివృద్ధికి ఇది ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బాలెంల కెనరా బ్యాంక్ మేనేజర్ వీరేంద్ర, రైతులు, యువత, మహిళలు పాల్గొన్నారు. -
రేపటి నుంచి హెచ్పీవీ టీకా
సూర్యాపేటటౌన్ : మహిళల ఆరోగ్యాన్ని కబళిస్తున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు అడ్డుకట్ట వేసేందుకు టీకాలు వేసే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనికి కారణమైన హ్యూమన్ పాపిలోమా వైరస్(హెచ్పీవీ)ను నియంత్రించేందుకు 14 నుంచి 15 ఏళ్లలోపు బాలికలకు టీకాలు వేసే కార్యాక్రమాన్ని జిల్లాలో ఈ నెల 8 నుంచి ప్రారంభించనున్నారు. ఇప్పటికే సిబ్బందికి శిక్షణహెచ్పీవీ టీకాను వేసేందుకు ఇప్పటికే ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, సూపర్వైజర్లతో పాటు వైద్యులకు శిక్షణ ఇచ్చారు. టీకాలు వేసే కార్యక్రమాన్ని మొదట సూర్యాపేట జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, కోదాడ, హుజూర్నగర్, తుంగతుర్తి ఏరియా ఆసుపత్రులలో నడిగూడెంలో సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రారంభించనున్నారు. వచ్చే నెల నుంచి అన్ని గ్రామీణ, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా కూడా వ్యాక్సిన్ను అందిస్తారు. ఈ వ్యాక్సిన్పై ఏమైనా అపోహలు, సందేహాలు ఉంటే వాటిని సంబంధిత పీహెచ్సీ వైద్యధికారులు నివృత్తి చేయనున్నారు. బాలికల గుర్తింపు..జిల్లాలో 14 సంవత్సరాలు నిండి 15 సంవత్సరాల లోపు ఉన్న బాలికలు 11,964 మంది ఉంటారని అధికారులు గుర్తించారు. వీరికి హెచ్పీవీ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఏప్రిల్ 01, 2011 నుంచి మార్చి 31, 2012 మధ్య పుట్టిన ఆడపిల్లలకు తలిదండ్రులు బాధ్యతాయుతంగా వ్యాక్సిన్ వేయించాలని వైద్యాధికారులు కోరుతున్నారు. వారు తమ పరిధిలోని పీహెచ్సీకి ఏదైనా గుర్తింపు కార్డును తీసుకుని తల్లి లేదా తండ్రిని వెంట తీసుకొని రావాలని సూచిస్తున్నారు.100 శాతం పూర్తి చేస్తాం ఈ నెల 8వ తేదీ నుంచి బాలికలకు టీకా వేసే కార్యక్రమం ప్రారంభమవుతుంది. వచ్చే నెల నుంచి అన్ని పీహెచ్సీల్లో టీకాలు వేస్తాం. అందరూ సహకరించి 100 శాతం వాక్సినేషన్ పూర్తి చేసేలా చూడాలి. 14 నుంచి 15ఏళ్ల లోపు బాలికలు టీకా వేయించుకొని క్యాన్సర్ను పారదోలాలి. –డాక్టర్ వెంకటరమణ, డీఎంహెచ్ఓ 14–15 ఏళ్ల బాలికలకు ఉచితంగా జిల్లాలో 11964 మంది గుర్తింపు -
శ్మశాన వాటికలో టేకు చెట్లు మాయం
చిలుకూరు : మండలంలోని బేతవోలు గ్రామ శ్మశాన వాటికలో టేకు చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికి దుంగలను మాయం చేశారు. బేతవోలు శ్మశాన వాటికలో 15 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం పచ్చదనం పెంపొందించడం కోసం సుమారు 50 టేకుతో పాటు వివిధ రకాల మొక్కలను నాటింది. ప్రస్తుతం అవన్నీ పెద్ద చెట్లుగా ఎదిగాయి. ఇందులో నుంచి 30కి పైగా టేకు చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు నరికి దుంగలను తరలించారు. టేకు చెట్లు మాయమైనట్లు తెలియకుండా ఉండేందుకు చెట్ల మొదలు భాగాన్ని మట్టితో కప్పివేశారు. లావుగా ఉన్న దుంగలను తరలించి అనుమానం రాకుండా ఉండేందుకు మిగిలిన చెట్ల కొమ్మలను నరికి అక్కడే పడేశారు. దాంతో పాటు మరి కొన్ని చెట్లను కూడా నరికారు. అయితే, శ్మశాన వాటికలోని టేకు చెట్లు మాయమైనట్లు అనుమానం వచ్చిన కొంత మంది గ్రామస్తులు శుక్రవారం లోపలికి వెళ్లి పరిశీలించారు. టేకు చెట్లను నరికి మొద్దులను తీసుకెళ్లి, కొమ్మలు అక్కడే పడేసినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై గ్రామపంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ స్పందిస్తూ.. శ్మశాన వాటికలో టేకు చెట్లు నరికిన విషయం తన దృష్టికి వచ్చిందని, విచారణ చేస్తున్నామని తెలిపారు. 30 చెట్లను నరికిన గుర్తుతెలియని వ్యక్తులు -
‘పరిశుభ్రత’లో భాగస్వాములవ్వాలి
సూర్యాపేట అర్బన్ : ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా సూర్యాపేట మున్సిపాలిటీలో మార్చి 15 వరకు నిర్వహించే పరిశుభ్రత కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములై విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పిలుపు నిచ్చారు. ప్రజా పాలన– ప్రగతి కార్యాచరణలో మొదటి థీమ్గా చేపట్టిన ‘పరిశుభ్రత’ కార్యక్రమాన్ని శుక్రవారం స్థానిక మున్సిపాలిటీ వద్ద మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదితతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం నుంచి కల్నల్ సంతోష్ బాబు చౌరస్తా వరకు అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్పై దృష్టి సారించాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ హన్మంతరెడ్డి పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, ఈఈ కిరణ్, సానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, అధికారులు, కౌన్సిలర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. విజయవంతం చేయాలిసూర్యాపేట : 99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కోరారు. శుక్రవారం మండలంలోని బాలెంల గ్రామపంచాయతీ కార్యాలయంలో 99 రోజుల కార్యక్రమం అమలుపై నిర్వహించిన సన్నాహక కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కిచెన్ షెడ్డు, స్టోర్ రూమ్, వంటశాల, కంప్యూటర్ రూమ్ ల్యాబ్ పరిశీలించారు. 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా పంచాయతీ అధికారి యాదగిరి, ఆర్డీఓ వేణు మాధవరావు, తహసీల్దార్ కృష్ణయ్య, ఎంపీడీఓ బాలకృష్ణ, ఎంపీఓ లింగారెడ్డి, హెచ్ఎం ప్రసాద్, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
టమాటా రైతు దిగాలు
చివ్వెంల(సూర్యాపేట) : టమాటా రైతులు దిగాలు చెందుతున్నారు. పండించిన పంటకు సరైన మద్దతు ధర లేక నష్టాల పాలవుతున్నారు. చివ్వెంల మండల వ్యాప్తంగా సుమారు 100 ఎకరాల వరకు రైతులు టమాటా సాగు చేస్తున్నారు. మండలంలోని లక్ష్మణ్ నాయక్తండా, పాశ్చ్యానాయక్తండా, జయరాం గుడితండా, సేవాలాల్ తండా వట్టిఖమ్మంపహాడ్,, రోళ్లబండ తండా, పిల్లలజెగ్గు తండాల్లో సాగు చేస్తున్నారు. వరి స్థానంలో టమాటా పండిస్తున్నా ప్రస్తుతం ధర లేకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడి అధికమే..రైతులు ఎకరా టమాటా సాగుకు పెట్టుబడి ఖర్చు రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. మూడు నెలల 15లకు పంటకాలం పూర్తవుతుంది. నారు పెట్టిన సమయం నుంచి కాత సమయం వరకు పంటను పురుగు, తెగుళ్లు, ఆశిస్తుంది. వీటి నివారణకు మందులు పిచికారీ చేయాల్సి వస్తుంది. కాత కాసిన మొదటి వారంలో రెండు రోజులకు ఒకసారి పంట సుమారు 2.5 క్వింటాళ్లకు పైగా వస్తుంది. చిన్న సైజు టమాటా 25 కిలోల పెట్టె రూ.120, పెద్ద సైజు వాటికి 25 కిలోల పెట్టెకు రూ.160 పలుకుతుందని రైతులు పేర్కొంటున్నారు. చిన్న సైజు టమాటా ధర కిలో రూ.5, ఉండగా, పెద్ద సైజు టమాటా కిలో రూ.6 మాత్రమే ఉందని, ధర ఇలాగే కొనసాగితే తాము నష్టాలు చవిచూడాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. మద్దతు ధర లేక నష్టాలు ఆందోళనలో అన్నదాతలు -
దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం కీలకం
రామగిరి(నల్లగొండ) : భారతదేశ అభివృద్ధిలో యువత భాగస్వామ్యం కీలకమని ఎంజీ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ మారం రమణారెడ్డి అన్నారు. నల్లగొండలోని ఎన్జీ కాలేజీలో శ్రీ50 సంవత్సరాలకు ముందుగా అత్యవసర పరిస్థితి – భారత ప్రజాస్వామ్యానికి పాఠాలుశ్రీ అనే అంశంపై విద్యార్థులకు నిర్వహించిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ – 2026 కార్యక్రమం గురువారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే నాలుగో ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే లక్ష్యమన్నారు. ప్రిన్సిపాల్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే యువత వినూత్న ఆలోచనలతో ముందు సాగాలన్నారు. కార్యక్రమంలో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ నోడల్ కో ఆర్డినేటర్ కోటయ్య, జ్యూరీ మెంబెర్స్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ భగవంత్రెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్ శీలం యాదగిరి, సీనియర్ జర్నలిస్ట్ మంజుల చకిలం, కన్జ్యూమర్ ఫోరం అధ్యక్షుడు గురవయ్య, పర్యావరణ శాస్త్రవేత్త సురేష్ గుప్తా, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పరంగి రవికుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ పాల్గొన్నారు. -
వైద్యశిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
కోదాడరూరల్ : కోదాడ పట్టణంలోని పెన్షనర్స్ భవన్లో శనివారం నిర్వహించనున్న మెగా ఉచిత వైద్యశిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పెన్షనర్ల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య అన్నారు. గురువారం పట్టణంలోని సంఘం భవనంలో వైద్యశిబిరం కరపత్రాన్ని సంఘ సభ్యులతో కలిసి ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. హైదరాబాద్లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రి వారి సౌజన్యంతో నిపుణులైన వైద్యం బృందంతో ఈ వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. శిబిరంలో న్యూరో, గుండె, ఆర్థోపెడిక్ వైద్యులు ఉంటారని, ఈసీజీ, టూడీ ఎకో, ఎముకల సాంద్రత పరీక్షలు ఉచితంగా చేస్తారన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు సామాన్య ప్రజలు కూడా ఈ వైద్యశిబిరానికి హాజరు కావచ్చని తెలిపారు. కార్యక్రమంలో యూనిట్ అధ్యక్షుడు వేనేపల్లి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు బొల్లు రాంబాబు, శ్యాంసుందర్రెడ్డి, రఘువరప్రసాద్, జానయ్య, విద్యాసాగర్, భ్రమరాంబ ఉన్నారు. -
పందెం గిత్తల జోరు
మేళ్లచెరువు : చింతలపాలెం మండలం దొండపాడు గ్రామంలో తిరుపతమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవం సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి ఎద్దుల పందేలు గురువారం రెండవ రోజు కొనసాగాయి. ఈ పోటీలను, అన్నదాన కార్యక్రమాలను సర్పంచ్ చెన్నకేశి వెంకయ్య, ఉప సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, అన్నపురెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నరాల కొండారెడ్డి, కలగొట్ల వెంకటేశ్వరరెడ్డి, చెన్నకేశి రామారావు, లక్ష్మీనారాయణ భక్తులు పాల్గొన్నారు. బండ లాగుతున్న గిత్తలు -
ధర పెరిగితే లాభం
ప్రస్తుతం మార్కెట్లో టమాటా ధర పడిపోయింది ధర పెరిగితే లాభం వస్తుంది. లేదంటే నష్టపోతాం. ప్రస్తుతం వస్తున్న రేటు ఆటో కిరాయికి కూడ సరిపోవడం లేదు. – ధరావతు రవి, రైతు, లక్ష్మణ్ నాయక్ తండా, ఎకరంలో సాగు చేశానుఎకరం వ్యవసాయ భూమిలో టమాటా సాగు చేశా. ఇప్పటి వరకు రూ.60 వేలు పెట్టుబడి ఖర్చు అయింది. ప్రస్తుతం టమాటా ధర పడిపోయింది. ధర ఇలాగే కొనసాగితే నష్టాల పోవాల్సి వస్తుంది. – కొండ వెంకన్న, రైతు, వట్టిఖమ్మంపహాడ్, -
అంధుల గ్రంథాలయంప్రారంభం
సూర్యాపేట : అంధుల గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ వంగవీటి రామారావు కోరారు. గురువారం సూర్యాపేటలోని జిల్లా గ్రంథాలయంలో అంధుల గ్రంథాలయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రంథాలయంలో అంధులు బ్రెయిలీ లిపితో చదువుకునేందుకు సుమారు 50మందికి సరి పోయే విధంగా స్పీకర్లు, రెండు కంప్యూటర్లు, రామాయణం, భాగవతం, 5నుంచి 10 తరగతుల పుస్తకాలు, ఇతర పుస్తకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. సూర్యాపేటలో అంధుల గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడంతో సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ కార్యదర్శి బి బాలమ్మ, అసిస్టెంట్ లైబ్రేరియన్ శ్యాంసుందర్ రెడ్డి, శ్రవణ్, సిబ్బంది సజన, భవాని, నిర్మల తదితరులు పాల్గొన్నారు. రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలిసూర్యాపేట అర్బన్: జిల్లా కేంద్రంలోని కిరాణా మర్చంట్ హాల్లో ఈ నెల 14, 15వ తేదీల్లో నిర్వహించనున్న ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) రాష్ట్ర రాజకీయ శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు గొడ్డలి నర్సయ్య కోరారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విక్రమ్ భవన్లో టీయూసీఐ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతుల కరపత్రాలు ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా సహాయ కార్యదర్శి గోగుల వీరబాబు, కుమ్మరి వెంకట్ నారాయణ, మూడ్ వీరన్న, పవన్, సాయి, నరేష్, సాయిబాబా, కిషోర్ పాల్గొన్నారు. ఇంటర్న్షిప్ పూర్తిచేసిన విద్యార్థులకు అభినందన నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీకి చెందిన మేనేజ్మెంట్ విద్యార్థులు ఇండియా పేమెంట్స్ బ్యాంకులో 45 రోజుల ఇంటర్న్షిప్ పూర్తిచేసి రావడం అభినందనీయమని ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. ఇంటర్న్షిప్ పూర్తి చేసిన విద్యార్థులను గురువారం యూనివర్సిటీలో ఆయన అభినందించి మాట్లాడారు. బ్యాంకింగ్ సేవలను వినియోగదారులకు అందించడం, మార్కెటింగ్, డిజిటల్ బ్యాంకింగ్, అవగాహన కార్యక్రమాలు, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్లు, వీధి వ్యాపారుల రుణ సదుపాయాలు తదితర అంశాలపై విద్యార్థులు శిక్షణ పొందారని పేర్కొన్నారు. సబీనా హెరాల్డ్, విద్యార్థులు ఉప్పరి మహేష్, నవీన్ పాల్గొన్నారు. -
కాల్వలకు లష్కర్ల కొరత
ఉన్న కొద్దిపాటి సిబ్బందిపైనే పనిభారంనడిగూడెం : నడిగూడెం మండల పరిధిలోని నాగార్జునసాగర్ ఎడమ కాల్వ పరిధిలో గల పలు మేజరు కాల్వలకు ఏళ్ల తరబడి సిబ్బంది కొరత ఏర్పడింది. దీంతో సంబంధిత అధికారులకు కాల్వల నిర్వహణ భారంగా మారింది. నీటి విడుదల, పలు చోట్ల కంపచెట్లు తొలగింపు, రాళ్ల తొలగింపు పనుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నడిగూడెం, అనంతగిరి, కోదాడ మండలాల పరిధిలోని పలు గ్రామాలకు నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ద్వారానే వేలాది ఎకరాలకు నీరు అందిస్తున్నారు. లష్కర్ల కొరత కారణంగా ఉన్న కొద్దిపాటి సిబ్బందిపైనే పని ఒత్తిడి పడుతుందని వాపోతున్నారు. అధ్వానంగా కొమరబండ మేజరు కాల్వనడిగూడెం మండల పరిధిలోని రామాపురం గ్రామ సమీపంలో గల నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు అనుబంధంగా 121 కిలోమీటరు వద్ద కొమరబండ మేజరు కాల్వ ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి దాదాపు 2520 ఎకరాల ఆయకట్టుకు మేజరు, మైనరు కాల్వల ద్వారా 40 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ కాల్వ రామాపురం, యఖలాస్ఖాన్పేట, తెల్ల బల్లి గ్రామాల మీదుగా కొమరబండ వరకు దాదాపు 8.50 కిలో మీటర్ల వరకు వెళ్తుంది. ఈ కాల్వపై పలు చోట్ల మైనరు కాల్వలున్నాయి. పలు చోట్ల కంపచెట్లమయంగా, నాచు, పిచ్చిచెట్లు పెరిగి ఉండడంతో చివరి భూములకు నీరందడంలేదని రైతులు వాపోతున్నారు. ఈ కాల్వపై ఇద్దరు లష్కర్లు, ఒక వర్క్ ఇన్స్పెక్టర్ ఉండగా ఒక ఏఈ ఉన్నారు. ఈ కాల్వపై కనీసం ముగ్గురు లష్కర్లు ఉండాలి, కానీ ఇద్దరు మాత్రమే ఉన్నారు. బలహీనంగా కాల్వ కట్టలుమండల పరిధిలోని చాకిరాల 123 కిలోమీటరు వద్ద ఉన్న నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు అనుబంధంగా ఉన్న కొమరబండ మేజరు కాల్వ శ్రీరంగాపురం, రత్నవరం, వసంతాపురం, వాయిలసింగారం, గోల్తండా, అనంతగిరి, శాంతినగర్, గోండ్రియాల, కొత్తగూడెం, మంగళితండా వరకు 26.81 కిలో మీటర్లు దూరం ఉన్న ఈ కాల్వ కింద 16,896 ఎకరాల ఆయకట్టు ఉంది. దీని ద్వారా 270 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ కాల్వకు కనీసం 5 నుంచి 8 మంది లష్కర్లు ఉండాలి. కానీ ముగ్గురు లష్కర్లు, ఇద్దరు వర్క్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. చివరి భూములకు నీరందని పాలారం మేజరు కాల్వసిరిపురం సమీపంలోని నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు అనుబంధంగా 128.40 కిలో మీటరు వద్ద పాలారం మేజరు కాల్వ ఏర్పాటు చేశారు. ఈ కాల్వ కింద సిరిపురం, వల్లాపురం, త్రిపురవరం, పాలారం, చనుపల్లి గ్రామాల పరిధిలో 4967 ఎకరాల ఆయకట్టు ఉంది. 13 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ కాల్వ నిత్యం సమస్యల వలయంగా మారింది. లైనింగ్ సరిగ్గా లేకపోవడం, కాల్వ కట్టల బలహీనంగా ఉండడం, మేజరు, మైనరు కాల్వల్లో నిత్యం నాచు, కంపచెట్లు పెరుగుతుండడంతో నిర్వహణ ఇబ్బందికరంగా మారింది. ఈ కాల్వకు ఇద్దరు లష్కర్లు, ఒక వర్క్ ఇన్స్పెక్టర్ మాత్రమే ఉన్నారు. సంబంధిత నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు స్పందించి మేజరు కాల్వకు సరిపడా సిబ్బందిని నియమించి, చివరి భూములకు నీరందించేలా చూడాలని రైతులు కోరుతున్నారు.సిబ్బందిని నియమించాలి రత్నవరం వద్ద ఉన్న కొత్తగూడెం మేజరు కాల్వ కట్టలు, మైనరు కాల్వ కట్టలు బలహీనంగా ఉన్నాయి. గతంలో పలుసార్లు కాల్వకు గండ్లు పడ్డాయి. తక్షణమే మరమ్మతులు చేపట్టాలి. కాల్వలను పర్యవేక్షించేందుకు సరిపడా సిబ్బందిని నియమించి చివరి భూములకు నీరందేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. – కురాకుల కృష్ణమూర్తి, రైతు, రత్నవరం -
వికసిత్ భారత్ మనందరి లక్ష్యం
సూర్యాపేటటౌన్ : వికసిత్ భారత్ ప్రతిఒక్కరి లక్ష్యమని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ జాతీయ సేవ పథకం కోఆర్డినేటర్ ఆర్.వెంకటనారాయణ రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాల క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వికసిత్ భారత్ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలోని 163 ఎన్ఎస్ఎస్ యూనిట్ సెల్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వికసిత్ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 102 మంది విద్యార్థులు పాల్గొనగా ఐదుగురు విద్యార్థులను వికసిత్ భారత్ కార్యక్రమానికి ఎంపిక చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కెప్టెన్ డాక్టర్ వెంకటేశులు, కళాశాల వైస్ చైర్మన్ కే.రాజేందర్ రెడ్డి, జిల్లా ట్రెజరీ అధికారి ఎస్.రవికుమార్, ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీవాణి, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఎల్ఎస్ఆర్ కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు. -
సమర్థవంతంగా అమలు చేయాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టనున్న 99 రోజుల కార్యాచరణను సమర్థవంతంగా, సమన్వయంతో అమలు చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ సీతారామారావుతో కలిసి జిల్లా అధికారులతో దిశానిర్దేశం నిర్వహించారు. అనంతరం ఆర్డీఓలు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఎంపీఓలు, మున్సిపల్ కమిషనర్లు, వార్డు అధికారులతో వీడియో కాన్ఫరెనన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 6 నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు వివిధ అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 99 రోజుల కార్యాచరణ గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఐదు దశల్లో అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ శిరీష, సీపీఓ యాదగిరి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలి హుజూర్నగర్ : హుజూర్నగర్లోని మోడల్ హౌసింగ్ కాలనీలో ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక రామస్వామి గుట్ట వద్ద 110 ఎకరాల్లో నిర్మిస్తున్న మోడల్ హౌసింగ్ కాలనీలోని ఇళ్ల బ్లాకులు, అంతర్గత రోడ్లు, సీఎం సభాస్థలిని, పార్కింగ్ సౌకర్యం తదితరాలను ఆయన పరిశీలించారు. పెండింగ్ పనులను వారంలో పూర్తి చేయాలని సూచించారు. ఈ నెల రెండవ వారంలో సీఎం రేవంత్ రెడ్డి కాలనీని ప్రారంభిస్తారని తెలిపారు. ఆయన వెంట హౌసింగ్ పీడీ సిద్ధార్థ, ఆర్డీఓ శ్రీనివాసులు, మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ తన్నీరు మల్లిఖార్జున్ రావు, తహసీల్దార్ కవిత, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఉన్నారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
సీఎంఆర్ ధాన్యంతో
కోదాడ : మిల్లులకు కేటాయించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)తో పలువురు మిల్లర్లు కొత్త దందాకు తెరలేపారు. మిల్లుల ఆవరణలో ఉన్న ధాన్యం తమదే అని చెప్పి పలు బ్యాంకుల నుంచి ఓపెన్ క్యాష్ క్రెడిట్ (ఓసీసీ) రుణాలను కోట్లలో తీసుకుంటున్నారు. విశ్వసనీయంగా తెలిసిన సమచారం ప్రకారం.. ఒక్క సూర్యాపేట జిల్లాలోనే మిల్లర్లు సీఎంఆర్ ధాన్యం హామీగా చూపి పలు జాతీయ బ్యాంకుల నుంచి రు.100 కోట్ల వరకు రుణాలు ఈ విధంగా తీసుకున్నారు. బ్యాంకులు కూడా ఈ ధాన్యం ఎవరిదన్న విషయాన్ని పట్టించుకోకుండా కోట్ల రూపాయల రుణాలను సులువుగా ఇస్తున్నాయి. ప్రభుత్వం కేటాయించిన సీఎంఆర్ ధాన్యాన్ని మరాడించి.. బియ్యం తిరిగి అప్పగించాల్సిన మిల్లర్లు సంవత్సరాల తరబడి బియ్యం ఇవ్వకుండా వాటిని బహిరంగ మార్కెట్లో అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. మరోపక్క ఈ ధాన్యం హామీగా చూపి బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సైతం ఎగవేతకు పాల్పడుతున్నారు. పౌరసరఫరాల శాఖ అధికారులు మిల్లులో ధాన్యం ఉందా లేదా అని నిత్యం పరిశీలించాలి. కానీ, వేల టన్నుల ధాన్యం మిల్లుల నుంచి బహిరంగ మార్కెట్కి తరలి వెళ్లినా ధాన్యం కేటాయించిన అధికారులు గానీ, కోట్ల రూపాయల రుణాలు ఇచ్చిన బ్యాంకులు గానీ పట్టించుకున్న దాఖలాలు లేవనే విమర్శలున్నాయి. ఒక జిల్లా మిల్లుకు మరో జిల్లాలోని బ్యాంకు రుణం..జనగామ జిల్లాలో ఉన్న ఓ మిల్లుకు 2022–23 యాసంగి, 2024–25 వానాకాలం సీజన్లకు సంబందించిన ధాన్యం సీఎంఆర్ కింద కేటాయించింది. దీన్ని హామీగా చూపి సదరు మిల్లు యాజమాన్యం యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్ ఇండియన్ బ్యాంక్ నుంచి రూ.3 కోట్ల రుణం పొందింది. ఈ మిల్లు యాజమాన్యం ప్రభుత్వానికి సీఎంఆర్ ఎగవేతకు పాల్పడడంతో పాటు, బ్యాంకు నుంచి తీసుక్ను రుణాన్ని కూడా చెల్లించలేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 15 మిల్లులపై అధికారులు ఆర్.ఆర్ యాక్ట్, బ్యాంకులు సెక్యూరిటైజేషన్ యాక్ట్ ప్రయోగించినప్పటికీ.. ఏ ఒక్కరి వద్ద నుంచి ఒక్క రూపాయి కూడా తిరిగి వసూలు చేయలేకపోయారు. మిల్లర్లు ముందస్తుగానే తమ ఆస్తులను బినామీల పేరుతో ఉంచడంతో ఈ చట్టాలు వారిని ఏమీ చేయలేకపోతున్నాయి.మాఫియాగా మారిన ముఠా.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో మిల్లులు సీఎంఆర్ ధాన్యం తీసుకుంటున్నప్పటికి వారిలో కేవలం 15 మంది మిల్లర్లే ప్రతి సంవత్సరం అవకతవకలకు పాల్పడుతున్నారు. కోదాడ, నల్లగొండ ప్రాంతాల్లోని వీరంతా ముఠాగా ఏర్పడి ఇబ్బందులున్న మిల్లు యాజమాన్యాలకు రుణాలిప్పిస్తామని దానిలో భాగస్వాములుగా చేరుతారు. అధికారులతో తమకు ఉన్న సంబంధాలతో భారీ మొత్తలో సీఎంఆర్ ధాన్యం కేటాయింపజేసుకొంటారు. దీనిపై బ్యాంకుల నుంచి రుణాలు కూడా తీసుకుంటారు. ఇక తమ ప్లాన్ ప్రకారం సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తారు. దీంతో మిల్లును అధికారులు బ్లాక్లిస్ట్లో పెడతారు. బ్యాంకులు మిల్లును బహిరంగ వేలం వేస్తారు. విచిత్రంగా ఈ ముఠానే వేలంలో మిల్లును తమ అనుచరులతో కొనిపించి కొత్త ఫర్మ్ పేరుతో మళ్లీ ధాన్యం కేటాయింపజేసుకుంటారు. ఇక.. మిల్లు అసలు యజమానులు రోడ్డున పడుతున్నారు. దీనిపై పూర్తి స్ధాయిలో విచారణ జరపాలని పలువురు మిల్లర్లు కోరుతున్నారు. వీరి వల్ల తమందరికి చెడ్డపేరు వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ధాన్యాన్ని హామీగా చూపి రుణాలు తీసుకున్న మిల్లర్లు సూర్యాపేట జిల్లాలో ఈ విధంగా రూ.100 కోట్ల రుణాలు ధాన్యం పక్కదారి పట్టించి రుణాలు ఎగవేత రికవరీ చట్టాలున్నా ఏమీచేయలేకపోతున్న బ్యాంకులు -
ఒకేసారి మూడు నెలల రేషన్
భానుపురి (సూర్యాపేట) : రేషన్ కార్డు దారులకు మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకే సారి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వేసవితో పాటు గోదాంలలో బియ్యం నిల్వలను తగ్గించేందుకు ఏప్రిల్లోనే మే, జూన్కు సంబంధించిన కోటాను కూడా పంపిణీ చేయాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో బియ్యం రవాణాకు సంబంధించిన ఖర్చులు కొంత మేర ఆదా కానున్నాయి. గత జూన్లోనూ మూడు నెలల రేషన్ ఒకేసారి ఇచ్చారు. జిల్లాలో 3,55,057 రేషన్ కార్డులుసూర్యాపేట జిల్లాలో 610 రేషన్ దుకాణాలు ఉన్నాయి. గతంలో 3.26 వేల రేషన్ కార్డులు ఉండగా ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం మరో 30వేల కార్డులను మంజూరు చేసింది. ప్రస్తుతం 3,55,057 రేషన్ కార్డులు ఉన్నాయి. వీరికి ప్రతినెలా సుమారు 6 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం సన్నబియ్యాన్ని అందిస్తోంది. గత ఉగాది నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. నిల్వలు పేరుకు పోవడంతో..కేంద్ర ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన బియ్యాన్ని ఎఫ్సీఐ ద్వారా తిరిగి ఆహార భద్రత కార్డు దారులకు అందిస్తోంది. ప్రస్తుతం ఎఫ్సీఐ గోదాంలలో పెద్ద ఎత్తున బియ్యం నిల్వలు పేరుకుపోయాయి. బియ్యం ముక్కి పోకుండా ఉండేందుకు లబ్ధిదారులకు ఇవ్వడమే మేలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఒకేసారి మూడు నెలలకు సంబంధించిన రేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. గతేడాది కూడా జూన్, జూలై, ఆగస్టులకు సంబంధించి బియ్యం కోటాను జూన్లోనే పంపిణీ చేసింది. ఈ సమయంలో లబ్ధిదారుల నుంచి మూడుసార్లు వేలిముద్రలు తీసుకున్నారు. దుకాణాల వద్ద రద్దీ కారణంగా సర్వర్ సమస్యలు తలెత్తడంతో డీలర్లు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. బియ్యం క్వాలిటీలోనూ తేడాలు వచ్చాయి.బియ్యం నిల్వలపై ఆరా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. జిల్లాలో బియ్యం నిల్వలపై జిల్లా అధికారుల నుంచి రాష్ట్ర ఉన్నతాధికారులు సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది. జిల్లాకు సీఎంఆర్ కేటాయింపులు ఉండడంతో మూడు నెలలకు సరిపడా బియ్యం పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. ఏప్రిల్, మే, జూన్ కోటా ఏప్రిల్ నెలలోనే.. ఆదేశాలు జారీచేసిన కేంద్ర ప్రభుత్వం వేసవితో పాటు గోదాముల్లో నిల్వలు తగ్గించేందుకే ముందస్తుగా పంపిణీ సర్వర్ సమస్యలు రాకుండా చూడాలంటున్న లబ్ధిదారులు -
ఉగాదికి వేపపూత కరువే
కోదాడ : ఆకులు, కాయలు, కాండం, బెరడు ఇలా అన్నిట్లో ఔషధ గుణాలు కలిగిన వేప చెట్లకు సుస్తి చేసింది. ఇండియన్ హెర్బల్ డాక్టర్గా పిలుచుకునే వేప చెట్లు నిలువునా ఎండిపోతున్నాయి. శిలింధ్ర వ్యాధి కారణంగానే చెట్లు ఎండిపోతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వేసవిలో పచ్చటి ఆకులు, పూతతో కనిపించాల్సిన వేపచెట్లు ప్రస్తుతం ఎండిపోయి, ఆకురాలి మోడువారి దర్శన మిస్తున్నాయి. డైబ్యాక్ తెగులువేపచెట్లు ఎండిపోవడానికి డైబ్యాక్ అనే శిళీంధ్ర వల్ల కలిగిన తెగులు కారణమని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వ్యాధి శీతాకాలం నుంచి ఎండకాలంలోకి మారే సమయంలో సోకుతుందని తెలుపుతున్నారు. వేపచెట్లకు ‘ఫోమోప్సిస్ అజాడిరక్టే’ అనే శిలీంధ్రం సోకడంతో చెట్టు చివరి భాగాల నుంచి ఎండిపోవడం ప్రారంభమై కొద్ది రోజుల్లోనే మొత్తం వ్యాపిస్తుంది. వ్యాధి తీవ్రత ఎక్కువైతే చెట్టుమొత్తం ఎండిపోతుందని, గాలి వల్ల ఈ వ్యాధి ఒక చెట్టు నుంచి మిగతా వాటికి వ్యాపిస్తుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. మూడు సంవత్సరాల క్రితం కనిపించిన ఈ వ్యాధి ఆ తరువాత కొంత తగ్గుముఖం పట్టింది. మళ్లీ మూడు నెలలుగా మళ్లీ విజృంభిస్తోంది. దాంతో ఈ సంవత్సరం ఉగాది పచ్చడికి వేపపూత దొరకడం కష్టమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తీవ్ర నష్టంవేపచెట్లు వ్యాధి బారిన పడడంతో పూత, కాత పూర్తిగా తగ్గిపోతోంది. వేప కాయలు, దాని నుంచి వచ్చే నూనెను వ్యవసాయరంగంలో విరివిగా ఉపయోగిస్తారు. సేంద్రియ వ్యవసాయంలో వేపనూనే, వేప పిట్టుకు అధిక ప్రాధాన్యత ఉంది. కూరగాయలు, పండ్లమొక్కలకు వచ్చే వ్యాధుల నివారణలో వేప కాయలు ఉపయోగపడతాయి. ప్రస్తుతం వేపచెట్లు వ్యాధి బారిన పడడంతో దిగుబడి 80 నుంచి 90 శాతం వరకు తగ్గిపోతుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. నివారణ చేపట్టాలివేపచెట్లకు వచ్చిన ఈ వ్యాధి నివారణకు ఎవరు చర్యలు తీసుకోవాలన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ప్రభుత్వం, వ్యవసాయశాఖ అధికారులు ఈ విషయమై పట్టించుకోవడం లేదు. గాలి ద్వారా ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ఒకటి, రెండు చెట్లకు మందులు పిచికారీ చేయడం వల్ల ప్రయోజనం ఉండదని, ప్రభుత్వమే సామూహిక నివారణ చర్యలు చేపట్టాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. చిన్న చెట్లు వ్యాధి బారిన పడినట్లు గుర్తిస్తే ఆ కొమ్మలను కత్తిరించి కాల్చివేయాలని, శిలీంధ్రనాశక ఔషఽధమైన కార్బెండజిమ్ పిచికారీ చేయాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పెద్ద చెట్లకు మందు పిచికారీ చేయడం కష్టమైతే శిలీంధ్ర నాశక ఔషధాన్ని నీటిలో కలిపి చెట్ల మొదళ్లలో పోయాలి. వేసవిలో చెట్లకు నీరు పెట్టడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధి నుంచి బయటపడతాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.ఆపదలో ఔషధి ఎండిపోతున్న వేపచెట్లు శిలీంధ్ర తెగులే కారణమంటున్న శాస్త్రవేత్తలు నివారణ చర్యలు చేపట్టాలంటున్న పర్యావరణ వేత్తలు -
నేడు వాహనాలకు వేలం
సూర్యాపేటటౌన్ : ఎకై ్సజ్ అధికారులు వివిధ కేసులలో సీజ్ చేసిన 24 వాహనాలను గురువారం సూర్యాపేట ఎకై ్సజ్ స్టేషన్లో జిల్లా ఎకై ్సజ్ అధికారి లక్ష్మణ్నాయక్ ఆధ్వర్యంలో వేలం వేయనున్నట్లు ఎకై ్సజ్ సీఐ మల్లయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాహనాల వేలంలో పాల్గొన దల్చిన వారు ఉదయం 9 గంటలకు ముందుగా ధరావతు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇంటర్ పరీక్షలకు 264 మంది గైర్హాజరుసూర్యాపేటటౌన్ : ఇంటర్మీడియట్ పరీక్షలు కొనసాగుతున్నాయి. బుధవారం జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షలకు జనరల్ విభాగంలో 5,927 మంది విద్యార్థులకు 5,764 మంది హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 1,467 మంది విద్యార్థులకు 1,366 మంది హాజరయ్యారు. మొత్తం 264 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ భానునాయక్ తెలిపారు. రాష్ట్రంలో అరాచకం తప్ప అభివృద్ధి లేదుసూర్యాపేటటౌన్ : రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో అరాచకాలు తప్ప అభివృద్ధి ఏమీ లేదని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతోందని ఆరోపించారు. అరాచక శక్తులను ప్రోత్సహించడం సరికాదని, బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. స్థానిక మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు సరైన విచారణ చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడులు ఆపకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తానన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, ఉప్పల ఆనంద్, పెరుమాళ్ల అన్నపూర్ణ, నెమ్మాది భిక్ష, జీడీ భిక్షం, సవరాల సత్యనారాయణ, బూర బాలసైదులు గౌడ్, తదితరులు పాల్గొన్నారు. మట్టపల్లి ఆలయంలో సంప్రోక్షణమఠంపల్లి : మట్టపల్లి క్షేత్రలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, పార్వతీ రామలింగేశ్వర ఆలయాల ద్వారాలను అర్చకులు బుధవారం ఉదయం 10 గంటలకు తెరిచారు. అనంతరం ఆలయాలలో సంప్రోక్షణ నిర్వహించారు. పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతించారు. ఆర్జిత సేవలు, నిత్యకల్యాణం మాత్రం గురువారం వరకు నిలుపుదల చేశామని, 6వ తేదీ నుంచి యథావిధిగా కొనసాగుతాయని ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్ట పల్లిరావు, విజయ్కుమార్, ఇన్చార్జి ఈఓ జ్యోతి తెలిపారు. -
14న హుజూర్నగర్కు సీఎం రేవంత్రెడ్డి
హుజూర్నగర్ : రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా ఈ నెల 14న మోడల్ హౌసింగ్ కాలనీ ప్రారంభించనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖమంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం హుజూర్నగర్ శివారులోని రామస్వామి గుట్ట వద్ద నిర్మించిన మోడల్ హౌసింగ్ కాలనీ పనులను ఎమ్మెల్సీ శంకర్నాయక్, కలెక్టర్ తేజస్ నందలాల్ పవాలతో కలిసి పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఆదర్శ గృహ కాలనీ ప్రారంభానికి సీఎం రేవంత్రెడ్డిని ఆహ్వానించినట్లు చెప్పారు. సీఎం ప్రసంగించేందుకు ప్రత్యేక సభా వేదికను సిద్ధం చేస్తున్నామన్నారు. వారంలోగా అన్ని పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తాను గృహనిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. 110 ఎకరాల విస్తీర్ణంలో రూ.125 కోట్ల వ్యయంతో 2,160 కుటుంబాలకు సింగిల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించినట్లు తెలిపారు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ను నిర్లక్ష్యం చేశారని, ఈ ప్రాంతాన్ని చెత్త మైదానంగా మార్చారని ఆరోపించారు. అదృష్ట వశాత్తు 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చి ఈ ప్రాజెక్ట్కు కొత్త ఊపిరి పోసిందని మంత్రి తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన, అత్యంత పేద కుటుంబాల కోసం ఉద్దేశించిన ఈ ప్రాజెక్ట్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలనే ఆర్డీఓ ఆధ్వర్యంలో అధికారుల బృందానికి బాధ్యత అప్పగించినట్లు తెలిపారు. మొదటి విడతలో వేయి మంది లబ్ధిదారులను ఖరారు చేస్తున్నామని చెప్పారు. లబ్ధిదారుల ఎంపిక పకడ్బందీగా, నిజమైన లబ్ధిదారులకు అందేలా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట ఎస్పీ కె. నరసింహ, హౌసింగ్ పీడీ సిద్ధార్థ, హార్టికల్చర్ పీడీ నాగయ్య, ఆర్డీఓ శ్రీనివాసులు, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్రావు, మున్సిపల్ ఫోర్ల్ లీడర్ కోతి సపంత్రెడ్డి, తహసీల్దార్ కవిత, డీసీసీ అధ్యక్షుడు జి నరసయ్య, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గెల్లి రవి, అధికారులు, నాయకులు, స్థానిక ప్రజలు ఉన్నారు. మోడల్ హౌసింగ్ కాలనీ ప్రారంభించనున్న ముఖ్యమంత్రి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వెల్లడి -
పకడ్బందీగా ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక
భానుపురి (సూర్యాపేట) : ఈ నెల 6 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ, పంచాయతీరాజ్, ప్రణాళిక, ఇరిగేషన్, వ్యవసాయం, ఉద్యానవన, విద్య, వైద్య, సంక్షేమ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలను పరిష్కరించడం, సేవలను సమర్ధవంతంగా అందించడం ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యత అన్నారు. యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు యూత్ వీక్ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లా స్థాయి టెలి కమ్యూనికేషన్ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక నుంచి అన్ని ఫైళ్లు ఈ–ఆఫీస్ ద్వారానే పంపాలని స్పష్టం చేశారు. ప్రత్యేకాధికారులు సంక్షేమ గృహాలను తనిఖీ చేసి నివేదికలు సమర్పించాలని, టాస్క్ ద్వారా యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ప్రణాళిక అధికారి ఈ కార్యక్రమానికి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు. మున్సిపాలిటీలు, పంచాయతీలలో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. డ్రగ్స్ నివారణ, పిల్లల రక్షణ, భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాను గ్రామసభల్లో చదివి వినిపించాలని సూచించారు. భూ సేకరణ, అటవీ అనుమతులపై వేగవంతమైన చర్యలు తీసుకోవాలన్నారు. మన ఊరు – మనబడి పెండింగ్ బిల్లులపై నివేదిక సమర్పించాలని డీఈఓను ఆదేశించారు. సమావేశంలో ఎస్పీ నరసింహ, అదనపు కలెక్టర్ కె సీతారామారావు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ -
ఇక్కడ సీఎంఆర్ ఎగ్గొట్టి.. మరో జిల్లాలో పాగా
ముందే ఎగవేతకు ప్లాన్.. సాధారణంగా వ్యాపారం చేసిన తరువాత నష్టం వస్తే దాన్ని తప్పించుకోవడానికి వివిధ మార్గాలను అనుసరిస్తారు. జిల్లాలో సీఎంఆర్ దందాకు పాల్పడుతున్న మిల్లర్లు ప్రభుత్వం తమకు ధాన్యం కేటాయించే సమయంలోనే ఎగవేతకు ప్లాన్ సిద్ధం చేసుకుంటారని తోటి మిల్లర్లు అంటున్నారు. ప్రభుత్వం ధాన్యం కేటాయించిన సమయంలోనే మిల్లర్లు ధాన్యం బాగాలేదని.. దీనివల్ల తాము నష్టపోయే అవకాశం ఉందని అధికారులకు ఓ వినతిపత్రం ఇస్తారు. దానిమీద వారి సంతకం తీసుకుంటారు. ఈ విధంగా రెండు, మూడు వినతి పత్రాలు ఇచ్చి అధికారుల చేత వాటిమీద రిసీవ్డ్ సంతకం తీసుకుంటారు. ఇక వెంటనే తమ ప్లాన్ అమలు చేస్తారు. ఈ ధాన్యం మొత్తం బ్లాక్ మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకుంటారు. ప్రభుత్వం సీఎంఆర్ ఇవ్వమని అడిగిన సమయంలో గతంలో తాము ఇచ్చిన వినతిపత్రాలను బయటకు తీస్తారు ‘మాకు మంచి ధాన్యం కేటాయించలేదు.. దీనిపై మీకు చెప్పినా పట్టించుకోలేదు.. దీంతో ఆ ధాన్యం మొత్తం పాడైపోయింది. కాబట్టి మేము సీఎంఆర్ ఇవ్వలేము’ అని చెబుతారు. ఇదే కాకుండా అధికారులు ఆర్ఆర్ యాక్ట్ ప్రయోగించినప్పుడు ఈ వినతిపత్రాలను కోర్టుకు సమర్పించి ఊరట పొందుతున్నారని అధికారులు అంటున్నారు. దీనికి తమలో కొందరు అధికారులు సహకరించడం వల్ల సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టించిన మిల్లర్లపై చర్యలు తీసుకోలేక పోతున్నామని, వారు దొడ్డిదారిని మళ్లీ ఇదే దందాకు పాల్పడుతున్నారని వారు అంటున్నారు. కోదాడ : కష్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)కు సంబంధించిన ధాన్యం పక్కదారి పట్టించి ప్రభుత్వానికి కోట్ల రూపాయలకు కుచ్చుటోపీ పెట్టిన మిల్లర్లు తమ దందాను కొనసాగించడానికి సరికొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఒక జిల్లాలో సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టించిన మిల్లును అధికారులు బ్లాక్ లిస్ట్లో పెడుతున్నప్పటికీ అదే మిల్లర్ మరో జిల్లాకు వెళి్ల్ అక్కడ మూతపడిన రైస్ మిల్లులను లీజుకు తీసుకోవడం, కొనుగోలు చేయడం లాంటివి చేస్తున్నారు. ఈ క్రమంలో గతంలో తమకు అండగా ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులతో పైరవీలు చేయించి భారీగా సీఎంఆర్ ధాన్యం కేటాయింప చేసుకుంటున్నారని ఇతర మిల్లర్లే ఆరోపిస్తున్నారు. మిల్లర్ల దందా ఇలా..● కోదాడలో సుమారు రూ.60 కోట్లకుపైగా విలువైన సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టించిన మిల్లును అధికారులు బ్లాక్ లిస్ట్లో పెట్టారు. ప్రభుత్వం కేటాయించిన ధాన్యం బయట అమ్ముకోవడంతో సదరు మిల్లుపై ప్రభుత్వం ఆర్ఆర్ యాక్ట్ ప్రయోగించడంతో, మిల్లర్ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడంతోపాటు ఆస్తులను ఇతరుల పేర్లపై బదలాయించారు. దీంతో ప్రభుత్వం సదరు మిల్లరు నుంచి పైసా కూడా వసూలు చేయలేక పోయింది. ఇదే మిల్లర్ యాదాద్రి భువనగిరి జిల్లాలో మూతపడిన ఓ మిల్లును కొనుగోలు చేసి గతంలో సూర్యాపేట జిల్లాలో పనిచేసి ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో పనిచేస్తున్న ఓ అధికారి సాయంతో తాజాగా రూ.కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యం తన మిల్లుకు కేటాయింపజేసుకొని దందా కొనసాగిస్తున్నాడని సమాచారం. ● కోదాడ మండల పరిధిలోని ఓ మిల్లర్ రూ.34 కోట్ల సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టించడంతో ఆయన మిల్లును అధికారులు బ్లాక్లిస్ట్లో పెట్టారు. ఇతను కూడా తమ కుటుంబ సభ్యుల పేరుమీద ఆస్తులను భారీగా కొనుగోలు చేశాడని సమాచారం. ఇక ఈ మిల్లుకు రుణం ఇచ్చిన బ్యాంక్ బకాయి రాబట్టుకోవడానికి మిల్లును వేలం వేయగా గరిడేపల్లి, నేరేడుచర్ల, తుంగతుర్తిలో సీఎంఆర్ ఎగవేతకు పాల్పడిన మిల్లర్లు ఓ ఫోరం పేరుతో వేలంలో దక్కించుకొని సదరు మిల్లుపై మరో బ్యాంక్లో రుణం తీసుకొని సీఎంఆర్ దందాకు సిద్ధమమవుతున్నట్టు తెలిసింది. తెర వెనుక ఉండి..గత ప్రభుత్వ హయాంలో కోట్ల రూపాయల సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టించిన మిల్లర్లు వాటి ఎగవేతకు పాల్పడి తాజాగా తెర వెనుక ఉండి ఈ దందాను సాగిస్తున్నారు. జిల్లాను దాటి పక్క జిల్లాలో మూత పడిన మిల్లులను, వ్యాపారం సరిగా చేయని మిల్లులను తమ బంధువులు లేదా గుమస్తాల పేరుతో కొనుగోలు చేస్తూ మళ్లీ అదే దందా సాగిస్తున్నారు. ఎక్కడ తమ పేరు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టిన మిల్లర్ల ఎత్తుగడ అక్కడ మూతపడిన మిల్లులను బంధువుల పేర్లతో కొనుగోలు మళ్లీ సీఎంఆర్ దందా కొనసాగింపు -
అర్జీలు సత్వరమే పరిష్కరించాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రజావాణిలో వచ్చిన అర్జీలను అధికారులు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి మాట్లాడారు. ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కే.సీతారామారావు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇళ్ల పనులు త్వరగా పూర్తిచేయాలిహుజూర్నగర్ : హుజూర్నగర్ పట్ట ణ పరిధిలోని రామస్వామి గుట్ట వద్ద కాలనీ ఇళ్ల పెండింగ్ పనులను త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం హుజూర్నగర్ పట్టణ శివారులోని రామస్వామి గుట్ట వద్ద నిర్మాణంలో ఉన్న సింగల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వారంలోనే సీఎం చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇళ్లను అందించడానికి సిద్ధం చేయాలన్నారు. బ్లాక్ల మధ్య గల అంతర్గత రోడ్లు, డ్రెయినేజీ వ్యవస్థ, విద్యుత్ సరఫరా, తాగునీరు, మొక్కలు నాటడం, పెయింటింగ్ పనులు, స్ట్రీట్ లైట్స్ మొదలైన అన్ని రకముల పెండింగ్ పనులు ఎలాంటి లోటుపాట్లకు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస్, హౌసింగ్ పీడీ సిద్ధార్థ, మిషన్ భగీరథ ఈఈ కరుణాకర్ రెడ్డి, హార్టికల్చర్ పీడీ నాగయ్య, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, తహసీల్దార్ కవిత, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
కొడుకు గెంటేశాడు.. న్యాయం చేయండి
సూర్యాపేట : కన్న కొడుకే తనను ఇంటి నుంచి గెంటేశాడు. తనకు న్యాయం చేయాలని 76 ఏళ్ల వృద్ధురాలు అధికారులను వేడుకుంటోంది. ఈ మేరకు ఆమె సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రైతుబజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగింది. వివరాల ప్రకారం.. మద్దిరాల మండలం జి.కొత్తపల్లికి చెందిన వృద్ధురాలు గంగుల రమణమ్మకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. రమణమ్మకు గ్రామంలో 3.10 ఎకరాల వ్యవసాయ భూమితోపాటు ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు ఉంది. కుమారుడు ప్రభాకర్ ఎస్బీఐలో మేనేజర్గా ఉద్యోగం చేస్తూనే రమణమ్మ పేరుమీద ఉన్న భూమిలో రెండెకరాలు తన పేరుపై రాయించుకున్నాడని పేర్కొంది. మిగతా 1.10 ఎకరాలను తన ఆడపిల్లకు ఇవ్వకుండానే ఇచ్చానని తనను ఇబ్బందుల పాలు చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. భర్తలేని నా బిడ్డ నా వద్ద ప్రభుత్వం ఇచ్చిన ఇంట్లో ఉంటుంటే నన్ను, నా బిడ్డను ఇంటి నుంచి గెంటేసి తాళం వేశాడని తెలిపింది. గ్రామంలో కరువు పనికి వెళ్తూ నేను నా బిడ్డ బతుకీడుస్తున్నామని పేర్కొంది. ప్రభుత్వం ఉద్యోగం చేస్తూ కూడా తన కుమారుడు తమను పట్టించుకోకుండా ఇంటి నుంచి గెంటేశాడని, కోడలు కూడా దుర్భాషలాడుతోందని కన్నీటి పర్యంతమైంది. అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని వృద్ధురాలు కోరుతోంది. -
ఇసుక సరఫరా పునరుద్ధరణ
అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తుంగగూడెం,నాగారం మండలం పేరబోయినగూడెంలోని మూసీనది క్వారీల నుంచి మూడు రోజుల క్రితం మళ్లీ ఇసుక సరఫరా ప్రారంభమైంది. ట్రాక్టర్ల యజమానులకు సుమారు నెలన్నరకు సంబంధించిన బిల్లులు ఇవ్వాల్సి ఉండడంతో వారు తమ ట్రాక్టర్లను క్వారీల వద్దకు తీసుకెళ్లడం లేదు. పైగా క్వారీల వద్ద నిఘా లేకపోవడంతో రెవెన్యూ అధికారులు అవకతవకలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు రావడంతో నెల రోజుల క్రితం ఈ రెండు క్వారీల నుంచి ఇసుక సరఫరాను నిలిపివేశారు. దీంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, ప్రభుత్వ, ప్రైవేట్ నిర్మాణ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కాగా 45 రోజుల నుంచి ట్రాక్టర్ యజమానులకు రావాల్సిన బిల్లులు ఎట్టకేలకు విడుదల చేయడంతోపాటు గతంలో ఇసుక సరఫరా బాధ్యతలు రెవెన్యూ శాఖకు ఉండగా ప్రస్తుతం మైనింగ్ శాఖకు అప్పగించారు. దీంతో మైనింగ్ శాఖ ఈ రెండు క్వారీల నుంచి ఇసుక సరఫరాను పునరుద్ధరించింది. ఈ రెండు క్వారీల వద్ద ఎలాంటి అవకతవకలు జరగకుండా తగిన ఏర్పాట్లు చేసింది. ఆ శాఖ అధికారులు ఆ రెండు క్వారీల చుట్టూ సీసీ కెమెరాలను బిగించి సాండ్ టాక్సీ విధానంలో ఇసుక సరఫరా చేయిస్తున్నారు. మూడువేల ట్రిప్పులకు పైగానే బుకింగ్తుంగగూడెం, పేరబోయినగడెంలోని రెండు క్వారీల పరిధిలో ఇప్పటి వరకు 3 వేల ట్రాక్టర్ ట్రిప్పులకు పైగానే ఇందిరమ్మ ఇళ్లు, ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ నిర్మాణాలకు ఆన్లైన్లో ఇసుకను బుకింగ్ చేసుకున్నారు. హోలీ పండుగ సందర్భంగా మంగళవారం క్వారీలకు సెలవు ప్రకటించారు. తిరిగి బుధవారం క్వారీల నుంచి ఇసుక సరఫరా ప్రారంభంకానుంది. రెండు క్వారీల నందు రిజిస్టరైన సుమారు 500 ట్రాక్టర్ల ద్వారా ఇసుక సరఫరా మొదలుకానుంది. అయితే ఈ రెండు క్వారీల నుంచి తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలకు ఇసుక తరలించనున్నారు. ఇందుకుగాను స్థానిక రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేశారు. తుంగగూడెం, పేరబోయినగూడెం క్వారీల నుంచి మళ్లీ మొదలు పలు కారణాలతో నెలక్రితం నిలిపివేత బిల్లుల విడుదలతో యథావిధిగా సరఫరా మైనింగ్ శాఖకు బాధ్యతలు అప్పగింత ఓటీపీ వచ్చాకే ట్రాక్టర్లతో క్వారీల వ ద్దకు రావాలంటున్న అధికారులుఅక్రమాలకు పాల్పడొద్దుజిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మన ఇసుక–మన వాహనం పథకంలో ట్రాక్టర్ యజమానులు అవకతవకలకు పాల్పడొద్దు. ఓటీపీ వచ్చాకే ట్రాక్టర్లను క్వారీల వద్దకు తీసుకెళ్లాలి. అక్రమాలకు పాల్పడితే ట్రాక్టర్లను సీజ్ చేసి రిజిస్ట్రేషన్ రద్దుచేస్తాం. – బాషపాక శ్రీకాంత్, తహసీల్దార్, జాజిరెడ్డిగూడెం -
బాల్య వివాహం నిలిపివేత
కేతేపల్లి : కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన బాలికకు బాల్య వివాహం చేస్తున్నట్లు సమాచారం అందుకున్న ఐసీడీఎస్, రెవెన్యూ, పోలీసు అధికా రులు సోమవారం బాలిక ఇంటికి వెళ్లారు. అక్కడ పెళ్లి పనులు జరుగుతుండటంతో అధికా రులు బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చా రు. బాల్య వివాహం చేయడం నేరమని, అవగాహన కల్పించారు. దీంతో బాలిక తల్లిదండ్రులు వివాహాన్ని రద్దు చేస్తున్నట్లు అంగీకరించి రాత పూర్వకంగా హామీ ఇచ్చారు. కౌన్సెలింగ్ ఇచ్చిన వారిలో తహసీల్దార్ రమాదేవి, ఐసీడీఎస్ సూపర్వైజర్ కళావతి, అశ్రిత, లక్ష్మణ్, శోభారాణి ఉన్నారు. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్నకిరేకల్ : నకిరేకల్ పట్ట ణంలో ఆదివారం రాత్రి సంతకు వచ్చిన ఓ వ్యక్తి గుండెపోటుతో రోడ్డుపై కుప్పకూలిపోయాడు. అక్కడే డ్యూటీలో ఉన్న నకిరేకల్ పోలీస్ స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ సుధాకర్ యువకుల సహాయంతో సదరు వ్యక్తికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు. అనంతరం ప్రైవేట్ వాహనంలో నకిరేకల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. షార్ట్ సర్క్యూట్తో పాన్షాపు దగ్ధంసూర్యాపేటటౌన్ : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విజేత పాన్షాపులో సోమవారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగామంటలు, పొగ రావడంతో స్థానికులు గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలా నికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. అప్పటికే పాన్షాపులోని సామాను కాలిబూడిదైంది. సుమారు రూ.5 లక్షల విలువైన సామగ్రి, ఫర్నీచర్, రూ.35వేల నగదు దగ్ధమైనట్లు షాపు యజమాని తెలిపాడు. -
బ్యాంకులో దోపిడీకి యత్నం
చౌటుప్పల్ : మండల పరిధిలోని ఎల్లంబావి గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో సోమవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు దోపిడీకి యత్నించారు. గ్యాస్ కట్టర్తో బ్యాంకు షట్టర్ను కట్ చేస్తుండగా అలారం మోగడంతో అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లంబావి(పాత కొయ్యలగూడెం) గ్రామంలో హైదరాబాద్–విజయవాడ హైవే సర్వీసు రోడ్డులో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంకు వైపు సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ వైపు నుంచి ముగ్గురు వ్యక్తులు ముఖానికి ముసుగులు ధరించి బైక్పై వచ్చారు. అదే సమయంలో మరో ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు కూడా బ్యాంకు వైపు వచ్చారు. ఈ దృశ్యాలు రోడ్డు వెంట ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సీసీ కెమెరాకు నలుపు రంగు స్ప్రే చేసి.. అయితే బ్యాంకు వద్దకు మాత్రం ఒకే వ్యక్తి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాకు నలుపు రంగు స్ప్రే చేశాడు. మిగతా వారు రెక్కీ నిర్వహిస్తుండగా.. ఒక వ్యక్తి మాత్రం బ్యాంకు ప్రధాన ద్వారం వద్ద ఇనుప గ్రిల్ తాళం పగులగొట్టాడు. అనంతరం షట్టర్ను గ్యాస్ కట్టర్తో కట్ చేస్తుండగా.. ఒక్కసారిగా అలారం మోగింది. దీంతో చుట్టుపక్కల నివాసముండేవారు ఇళ్ల నుంచి బయటకు రావడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికులు బ్యాంకు వద్దకు చేరుకుని.. దుండగులు దోపిడీకి యత్నించినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే బ్యాంకు వద్దకు చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ పటోళ్ల మధుసూదన్రెడ్డి, సీఐ మన్మథకుమార్ సందర్శించారు. క్లూస్ టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. అయితే ఈ దోపిడీకి యత్నించింది ఎంత మంది అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ముసుగులు ధరించి బైక్లపై వచ్చిన దుండగులు గ్యాస్ కట్టర్తో షట్టర్ కట్ చేస్తుండగా మోగిన అలారం స్థానికులు అప్రమత్తమవ్వడంతో పారిపోయిన దొంగలు చౌటుప్పల్ మండలం ఎల్లంబావిలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఘటన -
మరణంలోనూ వీడని స్నేహం
శాలిగౌరారం : చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్న ఇద్దరు స్నేహితులు ఒకేసారి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామానికి చెందిన గుడిసె సైదులు, సరోజన దంపతులకు కుమార్తె, కుమారుడు రవి(20) ఉన్నారు. కుమార్తె వివాహం చేశారు. సైదులు నిమ్మ తోటలు కౌలుకు తీసుకొని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సైదులు అనారోగ్యానికి గురికావడంతో భార్య సరోజన, కొడుకు రవి కుటుంబ బాధ్యతలు తీసుకున్నారు. నార్కట్పల్లి మండలం నక్కలపల్లి గ్రామంలో ఓ రైతుకు చెందిన నిమ్మ తోట కౌలుకు తీసుకున్నారు. ప్రస్తుతం కౌలు పూర్తి కావడంతో ఇటీవలే ఊట్కూరు గ్రామానికి వచ్చారు. 7వ తరగతి నుంచి క్లాస్మేట్స్ సూర్యాపేట జిల్లా నాగారం మండలం డి. కొత్తపల్లి గ్రామానికి చెందిన గైగుళ్ల వంశీ(20) అమ్మమ్మ ఊరు ఊట్కూరు పక్కనే ఉన్న బండమీదిగూడెం. దీంతో వంశీ 7వ తరగతి నుంచి అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ ఊట్కూరు జెడ్పీహెచ్ఎస్లో రవితో కలిసి చదివాడు. ఇంటర్మీడియట్ కూడా రవి, వంశీ కలిసే చదివారు. ఇద్దరూ ఇంటర్లో ఫెయిల్ అయ్యారు. దీంతో రవి తల్లిదండ్రులతో కలిసి నిమ్మ తోటలు కౌలు చేస్తుండగా, వంశీ హైదరాబాద్లో ఉంటున్నాడు.సప్లమెంటరీ పరీక్షల కోసం వచ్చి..హైదరాబాద్లో ఉంటున్న వంశీ ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు రాసేందుకు రెండు రోజుల క్రితం డి. కొత్తపల్లికి వచ్చాడు. ఈ క్రమంలో సోమవారం వంశీ బైక్పై ఊట్కూరుకు వచ్చి రవిని వెంట తీసుకుని నల్లగొండలో పరీక్ష రాసేందుకు బయల్దేరాడు. మార్గమధ్యలో నల్ల గొండ మండలం చందనపల్లి వద్ద స్కూల్ బస్సును ఢీకొని ఇద్దరూ మృతిచెందారు. సోమవారం రాత్రి ఊట్కూరులో రవి అంత్యక్రియలు జరిగాయి. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో రవి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనతో ఊట్కూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు దుర్మరణం శాలిగౌరారం మండలం ఊట్కూరులో విషాదఛాయలు -
గంజాయి పట్టివేత
యాదగిరిగుట్ట రూరల్ : యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామంలో ఆదివారం రాత్రి పోలీసులు గంజాయి పట్టుకున్నారు. జిల్లా ఎకై ్సజ్ అధికారి ఎం. విష్ణుమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. సైదాపురం గ్రామంలోని పీర్ల గుట్ట, ప్రెసిడెన్షియల్ స్కూల్ సమీపంలో కొంతమంది వ్యక్తులు ఆదివారం రాత్రి గంజాయి సేవిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులను చూసి గంజాయిని సేవిస్తున్న వ్యక్తులు గంజాయి ప్యాకెట్లు, బైక్లను అక్కడే వదిలి పారిపోయారు. 60 గ్రాముల గంజాయి, రెండు బైక్లను ఎకై ్సజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా ఎకై ్సజ్ అధికారి తెలిపారు. పారిపోయిన వ్యక్తుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. -
వినూత్న ఆలోచనలే ఆవిష్కరణలకు దోహదం
భూదాన్పోచంపల్లి : వినూత్న ఆలోచనలే నూతన ఆవిష్కరణలకు దోహదపడతాయని 30ఎం జెనోమిక్స్ కో ఫౌండర్ డాక్టర్ బి. బెనెట్ బోస్కోదాస్ అన్నారు. సోమవారం పోచంపల్లి మండలం దేశ్ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ఎంట్రప్రెన్యూర్షిప్ సెల్(ఈ–సెల్)ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ–సెల్ వేదికలు విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు అద్భుతమైన అవకాశమన్నారు. ఎంట్రప్రెన్యూర్షిప్ అంటే కేవలం వ్యాపారం మాత్రమే కాదని, సమాజంలోని సమస్యలకు పరిష్కారం కనిపెట్టడమన్నారు. అలాగే ఈ–సెల్ విద్యార్థులకు సొంతంగా స్టార్టప్లు స్థాపించడానికి అవసరమైన నైపుణ్యాలు, ప్రోత్సహాన్ని అందించే కేంద్రంగా కూడా పనిచేస్తుందని చెప్పారు. స్టార్టప్ ప్రయాణంలో సమస్యలను ఆధిగమిస్తూ ముందుకు సాగాలని అన్నారు. అనంతరం యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ దాసేశ్వర్రావు మాట్లాడుతూ.. నూతన ఆవిష్కరణలు సమాజానికి దోహదపడేలా ఉండాలన్నారు. ఆ దిశగా విద్యార్థులు తమ ఆలోచనలకు పదును పెట్టాలని సూచించారు. అనంతరం ఈ–సెల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీలోని ఆయా విభాగాల డీన్లు, డైరెక్టర్లు, హెచ్ఓడీలు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. 30ఎం జెనోమిక్స్ కో ఫౌండర్ బెనెట్ బోస్కోదాస్ -
మదర్ డెయిరీకి పూర్వ వైభవం తీసుకొస్తాం
హయత్నగర్ : నష్టాల్లో ఉన్న నల్లగొండ–రంగారెడ్డి జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం(నార్ముల్– మదర్ డెయిరీ)కి పూర్వ వైభవం తీసుకొస్తామని, రైతులు ఎలాంటి అపోహలకు గురికావద్దని చైర్మన్ గుడిపాటి మధుసూదన్రెడ్డి తెలిపారు. సోమవారం రంగారెడ్డి జిల్లా హయత్నగర్లోని మదర్ డెయిరీ కార్యాలయంలో ఆయన డైరెక్టర్లతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మదర్ డెయిరీలో నెలకొన్న సరిస్థితులను, పదేళ్లుగా వస్తున్న నష్టాలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి వివరించామని, సమస్యల పరిష్కారానికి తగిన సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారని పేర్కొన్నారు. మదర్ డెయిరీ మాక్స్ చట్టం పరిధిలో ఉన్నందున ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వలేమని, ఎన్డీడీబీ (నేషనల్ డెయిరీ డవలప్మెంట్ బోర్డు)తో ఒప్పందం కుదిర్చేందుకు కృషిచేస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఈ మేరకు మంత్రి వాకిటి శ్రీహరి, భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, రాష్ట్ర డెయిరీ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి, నార్ముల్ ప్రతినిధి సామ మహిపాల్రెడ్డితో కూడిన బృందం ఎన్డీడీబీ ప్రతినిధులతో చర్చించినట్లు వెల్లడించారు. రైతులకు పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు తక్షణ సహాయంగా రూ.10 కోట్లు ఇచ్చేందుకు ఎన్డీడీబీ అంగీకరించిందన్నారు. పాల సేకరణను మదర్ డెయిరీ పాలకవర్గం చూసుకోవాలని, ఉత్పత్తుల విక్రయాలు, మార్కెటింగ్ ఎన్డీడీబీ చూసుకునేలా ఒప్పందం చేసుకున్నట్లు వివరించారు. మదర్ డెయిరీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఎండీ కాటెపల్లి లింగారెడ్డి, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. చైర్మన్ మధుసూదన్రెడ్డి -
బైక్ను ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి
మిర్యాలగూడ టౌన్ : బైక్పై వెళ్తున్న వ్యక్తి యూటర్న్ తీసుకుంటుండగా కారు ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన మిర్యాలగూడ మండలం తుంగపాడు గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. సోమవారం మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. తుంగపాడు గ్రామానికి చెందిన పగడాల మధుసూదన్ (36) ఆదివారం రాత్రి బైక్పై గ్రామంలోని కిరాణ దుకాణానికి వెళ్లి సరుకులు తీసుకుని తిరిగి ఇంటికి వస్తూ.. జడ్చర్ల–కోదాడ జాతీయ రహదారిపై యూట ర్న్ తీసుకుంటుండగా త్రిపురారం నుంచి మిర్యాలగూడ వైపు వస్తున్న కారు బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మధుసూదన్కు తీవ్ర గాయాలు కాగా మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతిచెందాడు. సోమవారం మృతుడి భార్య పగడాల సంధ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. తాళం వేసిన ఇంట్లో చోరీ ● 5 తులాల బంగారు ఆభరణాలు, 35 తులాల వెండి వస్తువుల అపహరణ గరిడేపల్లి : తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడి బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు అపహరించారు. ఈ ఘటన గరిడేపల్లి మండలం అప్పన్నపేట గ్రామంలో జరిగింది. వివరాలు.. అప్పన్నపేట గ్రామానికి చెందిన బత్తిని సైదమ్మ నాలుగు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లింది. సోమవారం తిరిగి వచ్చేసరికి ఇంటికి వేసిన తాళం పగులగొట్టి ఉండటంతో లోపలికి వెళ్లి చూడగా.. వస్తువులు, చీరలు చిందరవందరగా పడేసి ఉన్నాయి. చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఐదు తులాల బంగారం, 35 తులాల వెండి వస్తువులు, రూ.1,30,000 నగదు చోరీకి గురైనట్లు బాధితురాలు తెలిపింది. నేరేడుచర్ల ఎస్ఐ రవీందర్నాయక్, ఏఎస్ఐ జగన్మోహన్ చోరీ జరిగిన ఇంటిని పరిశీలించి వివరాలను సేకరించారు. -
చికిత్స పొందుతూ మృతి
చందంపేట : ఓ వ్యక్తితో ఘర్షణలో తీవ్రంగా గాయపడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. వివరాలు.. నేరెడుగొమ్ము మండలం జోడుబాయితండాకు చెందిన కేతావత్ లచ్చు(30) చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో కూలీ పనితో పాటు ఊళ్లో చిన్న కిరాణ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. వారం క్రితం అదే గ్రామానికి చెందిన కేతావత్ శ్రీకాంత్తో లచ్చుకు ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో శ్రీకాంత్ కర్రతో దాడి చేయగా లచ్చు, అతడి భార్య అరుణకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరిని కుటుంబ సభ్యులు దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం లచ్చును నల్లగొండ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగేంద్రబాబు తెలిపారు. ఈ ఘటనతో జోడుబాయితండాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ బీసన్న ఆధ్వర్యంలో చందంపేట ఎస్ఐ లోకేష్, డిండి ఎస్ఐ బాలకృష్ణ, నేరెడుగొమ్ము ఎస్ఐ నాగేంద్రబాబు, నాంపల్లి, మర్రిగూడ ఎస్ఐలు, దేవరకొండ సీఐ వెంకట్రెడ్డి బందోబస్తు చేపట్టారు. మృతుడికి ఒక కుమారుడు ఉన్నారు. డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలుశిక్ష ● మరో నలుగురికి జరిమానా సూర్యాపేటటౌన్ : సూర్యాపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన ఐదుగురిని సోమవారం సూర్యాపేట కోర్టులో హాజరుపర్చినట్లు ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం తెలిపారు. వారిలో ఒకరికి రెండు రోజుల జైలుశిక్ష,, రూ.2300 జరిమానా, మరో నలుగురికి కలిపి రూ.4 వేలు జరిమానా విధిస్తూ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ గోపు రజిత తీర్పు వెలువరించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. మట్టపల్లిలో నిత్య కల్యాణంమఠంపల్లి : మట్టపల్లిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో సోమవారం స్వామివారి నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయంలో సుప్రభాతసేవ, హోమశాలలో నిత్యాగ్నిహోత్రి, మూలవిరాట్కు పంచామృతాభిషేకం అర్చకులు చేపట్టారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి, అమ్మవార్లను నూతన పట్టు వస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం నిర్వహించారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబందనం, రుత్విగ్వరణం, మదుఫర్కపూజ, మాంగల్యధారణ, తలంబ్రాలతో నిత్య కల్యాణాన్ని జరిపారు. అనంతరం నీరాజన మంత్ర పుష్పాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కాగా, క్షేత్రంలోని శివాలయంలో గల శ్రీపార్వతీరామలింగేశ్వరస్వామికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. ఆలయంలో భక్తులకు అన్నదానం చేశారు. -
పెట్రోల్ బాటిల్తో రైతు హల్చల్
కొండమల్లేపల్లి : తన తల్లి పేరున ఉన్న భూమిని మరో వ్యక్తి పేరన చేస్తున్నారని ఓ రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకొని హల్చల్ చేశారు. సోమవారం కొండమల్లేపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. మండలంలోని కొత్తబావి గ్రామానికి చెందిన పిల్లి లింగయ్య తల్లి లక్ష్మమ్మ పేరున సర్వే నంబర్ 151లో 24 గుంటల భూమి ఉంది. 2013లో అదే గ్రామానికి చెందిన పిల్లి యాదయ్యకు అందులో నుంచి 12 గుంటల భూమిని వ్రికయించారు. కానీ.. యాదయ్యకు నాలుగు గుంటలు మాత్రమే రికార్డుల్లో ఎక్కింది. లక్ష్మమ్మ పేరుమీద ఇంకా 20 గుంటల భూమి ఉంది. అయితే.. ఆ 8 గుంటల భూమిని తనకు తెలియకుండా రైతు యాదయ్య పేరున చేస్తున్నారని భావించిన రైతుల లింగయ్య తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. గమనించిన సిబ్బంది, అతని భార్య, కూతురు అడ్డుకున్నారు. ఈ విషయమై తహసీల్దార్ నరేందర్ను వివరణ కోరగా.. కొన్నేళ్ల క్రితం జరిగిన భూమి క్రయ, విక్రయంలో భాగంగా యాదయ్యకు 8 గంటల భూమి రావాల్సి ఉందని తెలిపారు. అదే విధంగా రైతు లింగయ్యకు.. మరో రైతు రాములు నుంచి 8 గుంటలు రావాల్సి ఉండడంతో.. ఆ భూములకు సంబంధించి ఎవరికి వారు స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించామని తహసీల్దార్ పేర్కొన్నారు. అవగాహన లోపంతో రైతు లింగయ్య ఇలా చేయడం సరికాదన్నారు. కొండమల్లేపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఘటన -
అక్రమంగా భూమి పట్టా చేయించుకున్నారని..
కొండమల్లేపల్లి : తన పేరిట ఉన్న భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని మనస్తాపానికి గురైన వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కొండమల్లేపల్లి మండల కేంద్రంలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండమల్లేపల్లి మండల కేంద్రానికి చెందిన బొమ్ము వెంకటయ్య(49) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మూడేళ్ల క్రితం చింతచెట్టుతండా గ్రామ పంచాయతీ పరిధిలో పూల్సింగ్తండాకు చెందిన నేనావత్ శ్రీనుకు మూడు గుంటల భూమిని వెంకటయ్య విక్రయించాడు. తన పేరిట ఉన్న మరో 17 గుంటల భూమిని కూడా శ్రీను, మరో నలుగురు కలిసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, ఆ భూమిని తిరిగి తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమని కోరితే బెదిరిస్తున్నారని, దీంతో విసుగు చెంది ఆత్మహత్య చేసుకుంటున్నానని వెంకటయ్య ఓ పేపర్లో రాసి సోమవారం తన ఇంటి సమీపంలో పురుగుల మందు తాగాడు. చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి కుమార్తె శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మనస్తాపంతో బలన్మరణం -
ట్రాక్టర్ చోరీ చేసిన నిందితుల అరెస్టు
పెద్దవూర: ట్రాక్టర్ చోరీ చేసిన నిందితులను పెద్దవూర పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సాగర్ సీఐ శ్రీనునాయక్, పెద్దవూర ఎస్ఐ వై. ప్రసాద్తో విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దఅడిశర్లపల్లి మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన దున్న శ్రీను గత రెండేళ్ల నుంచి పెద్దవూర మండలం పోతునూరు గ్రామ శివారులో దొడ్డి నర్సింహారావు పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. గత నెల 12న దున్న శ్రీను ట్రాక్టర్తో పొలం దున్ని దానిని అక్కడే వదిలి ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు వచ్చి చూడగా ట్రాక్టర్ కనిపించలేదు. దీంతో పెద్దవూర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సోమవారం పెద్దవూర ఎస్ఐ ప్రసాద్ తన సిబ్బందితో కలిసి మండలంలోని పొట్టిచెల్మ వై జంక్షన్ సమ్మక్క–సారలమ్మ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా.. అనుముల గ్రామానికి చెందిన మంద శంకర్, కావేటి భరత్ ట్రాక్టర్పై హాలియా నుంచి సాగర్ వైపు వెళ్తుండగా ఆపారు. ట్రాక్టర్కు సంబంధించిన పత్రాలు చూపించాలని కోరగా అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. పోతునూరు సమీపంలో పొలంలో ఉన్న ట్రాక్టర్ను చోరీ చేసినట్లు నిజం ఒప్పుకున్నారు. వారి నుంచి ట్రాక్టర్, బైక్, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. నిందితులను నిడమనూరు కోర్టులో రిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు. -
అమరుల పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణ
సూర్యాపేట అర్బన్ : మాదిగ అమరవీరులు పోరాటాల ఫలితంగానే ఎస్సీ వర్గీకరణ అమలు సాధ్యమైందని ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు యాతాకుల రాజన్నమాదిగ అన్నారు. జిల్లా కేంద్రంలోని డాక్టర్ బాబు జగ్జీవన్రామ్ భవనంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ సీనియర్ నాయకుడు ములకలపల్లి రవిమాదిగ అధ్యక్షతన ఆదివారం మాదిగ అమరవీరుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా యాతాకుల రాజన్న మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ సమాన పంపిణీ కోసం మంద కృష్ణమాదిగ నాయకత్వంలో అలుపెరుగని పోరాటం చేసి అనేక మంది మాదిగలు వీరమరణం పొందారని అన్నారు. పొన్నాల సురేంద్ర మాదిగ, దామోదర్ మాదిగ మహేష్ మాదిగ, భారతి మాదిగ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాదిగ ఉద్యోగుల సమైక్య రాష్ట్ర కోశాధికారి చింత జాన్ విల్సన్, ములకలపల్లి రవి మాదిగ. ప్రభాకర్, ఎర్ర వీరన్న మాదిగ, గంట భిక్షపతి, ములకలపల్లి మల్లేష్ మాదిగ, మండల అధ్యక్షుడు మేడి కృష్ణ మాదిగ, పాలడుగు శ్రీనివాస్ మాదిగ, కత్తుల రవి మాదిగ, చెరుకుపల్లి కిరణ్కుమార్, మొండికత్తి మనోజ్కుమార్, గోపీచంద్, ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు యాతాకుల రాజన్న మాదిగ -
బుద్ధవనానికి దమ్మ పాదయాత్ర
నాగార్జునసాగర్ : గౌతమ బుద్ధుడి శాంతి సందేశాన్ని ప్రజల్లో వ్యాప్తిచేస్తూ సాగిన మూడవ దమ్మ పాదయాత్ర ఆదివారం నాగార్జునసాగర్లోని బుద్ధవనానికి చేరుకుంది. 29 రోజుల పాటు సుమారు 403 కిలోమీటర్లు సాగిన ఈ పాదయాత్రకు బుద్ధవనం వద్ద ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డి, బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య.. స్థానిక నాయకులతో కలిసి ఘన స్వాగతం పలికారు. బంజారా నృత్యాలు, కోలాటాలు, ఒగ్గు కళాకారుల ప్రదర్శనలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ధర్మచక్రం వద్ద వారి పాదాలను కడిగి గౌరవించారు. థాయిలాండ్ నుంచి తీసుకొచ్చిన బుద్ధధాతువులను మహాస్థూపంలోని ధ్యానమందిరంలో ఉంచారు. బౌద్ధ భిక్షువులంతా జ్యోతులను వెలిగించి ధ్యానం చేశారు. ఈ సందర్భంగా మల్లేపల్లి లక్ష్మ య్య మాట్లాడుతూ థాయిలాండ్, భారతదేశంలోని భిక్షువులతో కలిసి 403 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించి బుద్ధవనం చేరుకున్నారని తెలిపారు. పాదయాత్ర ప్రారంభం నుంచి గగన్మాలిక్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గగన్మాలిక్ ముందుండి నడిపించారని తెలిపారు. అక్షయ ఫౌండేషన్ అధ్యక్షుడు కేకే రాజా దమ్మయాత్ర విజయవంత కావడంలో భాగస్వాములయ్యారని చెప్పారు. బీఎస్ఐ తెలంగాణ అధ్యక్షుడు పరంధాములు ఆధ్వర్యంలో యాత్రకు సేవలుందించారని తెలిపారు. 29 రోజుల పాటు సాగిన ఈ దమ్మ యాత్రలో ‘సాతి’ అనే శునకం భిక్షువులతో పాటు నడుస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో మున్సి పల్ చైర్పర్సన్ మనస స్వర్ణ, బుద్ధవనం ఆర్ట్స్ అండ్ ప్రమోషన్స్ మేనేజర్ శ్యాంసుందర్రావు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ రాజాప్రసాద్, సీఐ శ్రీనునాయక్, ఎస్ఐ మత్తుయ్య పాల్గొన్నారు. -
ఆధునిక హంగులతో ఇందిరమ్మ ఇళ్లు
కోదాడ రూరల్ : ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం అందజేస్తున్న రూ.5 లక్షలకు తోడు లబ్ధిదారులు మరికొంత నగదు సమకూర్చుకుని ఇళ్లను అద్భుతంగా తీర్చిదిద్దుకుని తమ సొంతింటి కల నెరవేర్చుకుంటున్నారు. 579 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభంకోదాడ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఒక్కో గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేసి మొదటి విడతలో మొత్తం 1,030 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వాటిలో 579 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అనంతగిరి మండలంలోని లక్కరవం గ్రామంలో 142 ఇళ్లు మంజూరు కాగా.. 100 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. అదేవిధంగా చిలుకూరు మండలంలోని ఆర్లెగూడెంలో 156 ఇళ్లకుగాను 45 ఇళ్లు, కోదాడ మండలం గుడిబండలో 196 ఇళ్లకుగాను 98, మోతె మండలంలోని విభాళాపురంలో 156 ఇళ్లకుగాను 97, మునగాల మండలంలో తాడ్వాయిలో 156 ఇళ్లకుగాను 86, నడిగూడెం మండలంలోని కెఆర్సీపురంలో 224 ఇళ్లకుగాను 153 ఇళ్లను లబ్ధిదారులు నిర్మించుకుంటున్నారు. వీటిలో 90 శాతం ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి కాగా వారికి చివరి విడత రూ.లక్ష బిల్లు రావాల్సి ఉంది. అన్ని హంగులతో..ప్రభుత్వం అందజేసే నగదుతోపాటు లబ్ధిదారులు కొంత నగదు కలుపుకుని సకల సౌకర్యాలతో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటిని నిర్మించుకుంటున్నారు. కానీ అధికారుల అనుమతితో ఇంటీరియల్ వర్క్, మార్బుల్, టైల్స్, గ్రానైట్, గోడలకు వాల్పుట్టి, సీలింగ్, ఎలివేషన్ డిజైన్లు, రంగులతోపాటు కిచెన్లను మహిళలు తమకు నచ్చినట్లుగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆరు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా 1030 మంజూరు ముమ్మరంగా ఇళ్ల నిర్మాణాలు ఇంటీరియర్ డిజైన్ కోసం అదనంగా వెచ్చిస్తున్న లబ్ధిదారులు -
హోలీ పండుగను సంతోషంగా జరుపుకోవాలి
● ఎస్పీ నరసింహ సూర్యాపేటటౌన్ : హోలీ వేడుకలను ప్రమాదాలకు దూరంగా ఉంటూ సంతోషకర వాతావరణంలో కలిసిమెలిసి జరుపుకోవాలని ఎస్పీ నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. రంగులు చల్లుకునే సమయంలో పరిసరాలను గమనించాలని కోరారు. రంగులు ఇష్టపడని వ్యక్తులపై బలవంతంగా చల్లవద్దన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించవద్దని, మద్యం మత్తులో వాహనాలు నడపకూడదని సూచించారు. రసాయన రంగులు ఉపయోగిస్తే అనారోగ్యం బారినపడే అవకాశం ఉందని, సంప్రదాయ రంగులతో హోలీ జరుపుకోవాలని కోరారు.విద్యా కమిషన్ సిఫార్సులను ఖండిస్తున్నాంసూర్యాపేట టౌన్ : ఉపాధ్యాయుల వేతనాలపై విద్యా కమిషన్ సిఫార్సులను ఖండిస్తున్నామని టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల వీరన్న అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బాలాజీ నగర్లో టీపీటీఎఫ్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రైవేట్ విద్యా వ్యవస్థ రద్దుకు సిఫార్సు లేకపోవడం బాధాకరమన్నారు. కమిషన్ సిఫార్సులపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు శ్రీనివాస్, యాకయ్య, చంద్రారెడ్డి, రమేష్, రవికుమార్, లాలయ్య, మహేష్, రాములు, మల్లయ్య, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతంగా ఎస్సీ స్టడీ సర్కిల్ అర్హత పరీక్షసూర్యాపేటటౌన్ : జిల్లా కేంద్రంలోని ఎస్సీ స్టడీ సర్కిల్లో పోటీ పరీక్షల కోసం ఐదు నెలల ఉచిత రెసిడెన్షియల్ ఫౌండేషన్ కోర్సు శిక్షణకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆదివారం స్థానిక ఎస్వీ డిగ్రీ కళాశాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించారు. మొత్తం 267 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 144 మంది హాజరై పరీక్ష రాశారు. పరీక్ష కేంద్రాన్ని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కె.దయానందరాణి పరిశీలించారు. విద్యాధికారిగా అదనపు బాధ్యతలు ఇవ్వాలిసూర్యాపేట : రాష్ట్రంలోని సీనియర్ ప్రధానోపాధ్యాయులకు ఎంఈఓలుగా అదనపు బాధ్యతలు ఇచ్చి తిరుమలగిరి మండలంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు దామెర శ్రీనివాస్ ఇవ్వకపోవడం దుర్మార్గమని తెలంగాణ రజక ఉద్యోగ సమాఖ్య సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాలను సాకుగా చూపి అదనపు బాధ్యతలు ఇవ్వకపోవడం సరికాదన్నారు. దామెర శ్రీనివాస్కు ఎంఈఓగా అదనపు బాధ్యతలు ఇచ్చి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
సర్పంచులకు కొత్త అధికారాలు
భానుపురి (సూర్యాపేట) : పల్లెల్లో ఇటీవల కొలువుదీరిన సర్పంచులకు కొత్త అధికారాలను కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి గ్రామాల్లోని అంగన్న్వాడీ కేంద్రాలను తనిఖీ చేసి వాటి బాగోగులను పర్యవేక్షించే బాధ్యతలను సర్పంచ్లకు అప్పగించింది. ఈ మేరకు సర్పంచులకు అధికారాలు అప్పగిస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్ వాడీ కేంద్రాలను పటిష్టం చేయడం, విద్యార్థులకు పౌష్టికాహారం సక్రమంగా అందేలా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్రాలపై నిరంతర పర్యవేక్షణ..అంగన్వాడీ కేంద్రాలపై ఇకనుంచి సర్పంచుల పర్యవేక్షణ నిరంతరం కొనసాగనుంది. ప్రభుత్వం నుంచి కేంద్రాలకు సరఫరా అవుతున్న సరుకులు ప్రతినెలా వచ్చేలా పర్యవేక్షించడంతోపాటు చిన్నారులకు సకాలంలో పౌష్టికాహారం అందేలా సర్పంచులు చర్యలు తీసుకోనున్నారు. అలాగే ఆరోగ్యలక్ష్మీ పథకం ద్వారా గర్భిణులు, బాలింతలకు అందించే భోజనం నాణ్యతనూ తనిఖీ చేస్తారు. పిల్లలు, గర్భిణులతోపాటు అంగన్వాడీ కేంద్రాలకు వచ్చేవారికి ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తారు. ప్రతి అంగన్వాడీ కేంద్రానికి లక్షల రూపాయల విలువ చేసే సరుకులు నెలనెలా సరఫరా అవుతున్నాయి. అవి పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. సరుకులు పక్కదారి పట్టకుండా సర్పంచులు పకడ్బందీ చర్యలు చేపట్టనున్నారు. బాలామృతం, పాలు, గుడ్లు, బియ్యం, కందిపప్పు, తదితర పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను లబ్ధిదారులకు సక్రమంగా అందేలా చూస్తారు. అంగనన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల భద్రత, పరిశుభ్రత, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం వంటి బాధ్యతలను సర్పంచ్లు నిర్వర్తిస్తారు. ప్రస్తుతం చాలా గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల ద్వారా సరుకులు లబ్ధిదారులకు సక్రమంగా అందడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇకమీదట అలా జరగకుండా పర్యవేక్షణ కమిటీలు గుర్తించి, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం ద్వారా అవినీతికి అడ్డుకట్ట వేయాల్సి ఉంటుంది. ఇందుకు నెలకోసారి సమావేశాలు నిర్వహించడంతోపాటు రికార్డుల్లో సంతకాలు చేయాల్సి ఉంటుంది.సర్పంచ్ చైర్మన్ గా..అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసే కమిటీలకు చైర్మన్గా సర్పంచ్ వ్యవహరిస్తారు. కమిటీలో మొత్తం 11 మంది సభ్యులు ఉంటారు. కన్వీనర్గా అంగన్వాడీ టీచర్, సామాన్య శాస్త్రం బోధించే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు, విశ్రాంత ఉద్యోగి ఒకరు, ఏఎన్ఎం, చిన్నారుల తల్లులు సభ్యులుగా ఉంటారు. మున్సిపాలిటీల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలను మినహాయించి, అన్ని గ్రామ పంచాయతీల పరిధిలోని కేంద్రాలకు సర్పంచ్ చైర్మన్గా ఉంటారు.జిల్లాలో 1,209 సెంటర్లు.. సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ, హుజూర్నగర్, చివ్వెంల ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 1,209 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వాటి పరిధిలో మొత్తం 42,036 మంది విద్యార్థులు నమోదై ఉన్నారు. వాటిలో సుమారు 40 శాతం మేర అంగన్వాడీ సెంటర్లు పట్టణాల పరిధిలో ఉండగా, 60 శాతం వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాలను సర్పంచులు పర్యవేక్షించనున్నారు. అంగన్వాడీల పర్యవేక్షణ, పటిష్టం చేసే బాధ్యత సర్పంచ్ చైర్మన్గా కమిటీల ఏర్పాటు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం -
సొంతింటి కల నెరవేరింది..
చాలాకాలంగా ఇంటిని నిర్మించుకోవాలని ఆలోచన చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టడంతో మాకు ఇల్లు మంజూరైంది. దీంతో ఇంటి నిర్మాణ పనులు చేపట్టాం. నా భర్త తాపీ మేసీ్త్ర కావడంతో ప్రభుత్వం అందజేసిన నగదుకుతోడు మరికొంత సమకూర్చుకుని మేము అనుకున్నవిధంగా ఇంటిని నిర్మించుకుని సొంతింటి కళ నెరవేర్చుకుంటున్నాం. – చిక్కుళ్ల సుజాత, కెఆర్సీపురంప్రభుత్వానికి రుణపడి ఉంటాం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మేము ఇల్లు నిర్మించుకున్నాం. ప్రభుత్వం అందజేసిన రూ.5లక్షల నగదు మాకు ఎంతో ఉపయోగపడింది. ఆ నగదుతోపాటు కొంత కలుపుకుని ఇంటిని నిర్మించుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేసిన సహాయానికి మేము రుణపడి ఉంటాం. – చింత విజయ, గుడిబండ -
వైభవంగా గరుడ వాహనసేవ
మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో శనివారం విశేష పూజలు కొనసాగాయి. ముందుగా ఆలయంలో శ్రీలక్ష్మీనరసింహస్వామికి సుప్రబాతసేవ, హోమశాలలో నిత్యాగ్నిహోత్రి మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి, అమ్మవార్లను నూతన పట్టు వస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోలు మహోత్సవం నిర్వహించారు. అనంతరం నిత్య కల్యాణతంతు పూర్తిచేసి శ్రీస్వామిఅమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో వైభవంగా ఊరేగించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంచి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు ముందస్తుగా శుక్రవారం రాత్రి ఆలయానికి చేరుకుని వివిధ సత్రాల్లో బసచేశారు. తెల్లవారుజామునే కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి వారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ బి.జ్యోతి, అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఫణిభూషణ మంగాచార్యులు, సాయిగౌతమ్చార్యులు, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు. -
నేడు మంత్రి ఉత్తమ్ రాక
హుజూర్నగర్ : రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి ఆదివారం హుజూర్నగర్ రానున్నారు. మంత్రి సాయంత్రం 4 గంటలకు పట్టణానికి చేరుకుని రామస్వామి గుట్ట హౌసింగ్ కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలిస్తారు. అనంతరం పనుల పురోతిపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షిస్తారు. సాయంత్ర 6 గంటలకు హైదరాబాద్కు వెళ్తారు. శ్రమ దోపిడీని అరికట్టాలి సూర్యాపేట అర్బన్ : అదనపు పని గంటలు పెంచుతూ శ్రామిక వర్గ మహిళల శ్రమను దోచుకునే విధానాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం విడనాడాలని ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్ల నర్సమ్మ కోరారు. శనివారం సూర్యాపేటలోని చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం కార్యక్రమాలు జయప్రదం చేయాలని రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. శ్రామిక మహిళల ఉపాధిపై మోదీ ప్రభుత్వం జరుపుతున్న దాడికి వ్యతిరేకంగా ఈ నెల 8న మహిళా దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినాన్ని గ్రామ గ్రామాన జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షురాలు అలుగుబెల్లి వాణి, జిల్లా సహాయ కార్యదర్శి శంగం రామలింగక్క, కోశాధికారి కావ్య, జిల్లా కమిటీ సభ్యులు శాంతమ్మ, సైదమ్మ, నీలమ్మ, కూసు జయసుధ, సామ ఉపేంద్ర, ఎరబ్రోయిన మంగమ్మ పాల్గొన్నారు. ‘ఉపాధి’పై కేంద్ర బృందం సమీక్ష సూర్యాపేట : జిల్లాలోని వివిధ గ్రామాల్లో ఈనెల 26 నుంచి ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించిన కేంద్ర బృందం సభ్యులు శనివారం సూర్యాపేట కలెక్టరేట్లో కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్తో సమావేశమయ్యా రు. ఈ సందర్భంగా తాము పరిశీలించిన ఉపాధి పనుల వివరాలను కేంద్రం సభ్యుల కమిటీలో సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సంజయ్ కుమార్.. కలెక్టర్కు వివరించారు. అనంతరం కేంద్ర బృందం సభ్యులను కలెక్టర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు దిల్ కుష్ మీనా, సంజయ్ పాండే, జాగృతిరాయ్ తదితరులు పాల్గొన్నారు. గోదావరి జలాలు తగ్గింపుఅర్వపల్లి : యాసంగి సీజన్కు గాను వారబందీ విధానంలో జిల్లాకు 1,700 క్యూసెక్కుల గోదావరి జలాలు విడుదల చేస్తుండగా శని వారం వాటిని 1,613 క్యూసెక్కులకు తగ్గించారు. ప్రస్తుతం వస్తున్న నీళ్లను వృథా చేయకుండా పంటలకు వాడుకోవాలని జలవనరుల శాఖ ఈఈ సత్యనారాయణగౌడ్, ఏఈ చంద్రశేఖర్ రైతులకు సూచించారు. ఇంటర్ ప్రశ్నపత్రాల పరిశీలననేరేడుచర్ల : నేరేడుచర్లలోని ప్రభుత్వ, స్పందన జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్ష కేంద్రాలను శనివారం ఇంటర్ బోర్డు రాష్ట్ర అధికారి హేమచందర్ ఆకస్మికంగా తని ఖీ నిర్వహించారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఇంటర్ ప్రశ్నపత్రాలను పరిశీ లించారు. ఆయన వెంట డీఐఈఓ భానునాయక్, డీఈసీ సభ్యులు మోహన్రావు ఉన్నారు. పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి నల్లగొండ టూటౌన్ : విద్యార్థులు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి అన్నారు. శనివారం నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో ఎంబీఏ ఫైనలియర్ విద్యార్థులకు వ్యాపార అభివృద్ధి అవకాశాలపై ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు పరిశ్రమల స్థాపన, ఉపాధి కల్పనపై దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ సతీష్కుమార్, చార్టెడ్ అకౌంటెంట్ పిల్లి మహేష్, ఇండస్ట్రీ ఇనిస్టిట్యూట్ కనెక్ట్ డైరెక్టర్ జక్కా సురేష్రెడ్డి, శ్రీదేవి, సబీనా హెరాల్డ్, విద్యార్థులు పాల్గొన్నారు. -
సూర్యాపేటలో స్కానింగ్ సెంటర్ సీజ్
సూర్యాపేట టౌన్ : నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న జిల్లా కేంద్రంలోని ఆఫిల్ డయాగ్నోస్టిక్స్ అండ్ స్కాన్ సెంటర్ను శనివారం వైద్యశాఖ అధికారులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ పెండెం వెంకటరమణ మాట్లాడారు. ఈ సెంటర్లో సోనాలజిస్ట్గా పనిచేస్తున్న డాక్టర్ సోమ కిరణ్ విషయమై హైకోర్టు ఉత్తర్వులు మేరకు కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ పునర్విచారణ చేసినట్టు పేర్కొన్నారు. కమిటీ సమగ్రంగా విచారణ జరిపి డాక్టర్ సోమ కిరణ్ సోనాలజిస్ట్గా ప్రాక్టీస్ చేసేందుకు అర్హులు కాదని తేల్చినట్టు చెప్పారు. కమిటీ నివేదిక ఆధారంగా నిబంధనల ప్రకారం ఆపిల్ డయాగ్నోస్టిక్స్ అండ్ స్కానింగ్ సెంటర్ను సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. జిల్లాలో చట్ట విరుద్ధంగా అల్ట్రాసౌండ్, స్కాన్ సేవలు అందిస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
నిరుపయోగం.. నీటిశుది్ధ కేంద్రం
మంచినీటి శుద్ధి కేంద్రంలో ఉపాధిహామీ పనుల్లో భాగంగా నాటిన టేకు మొక్కల సంరక్షణ ఇప్పటి నుంచి గ్రామ పంచాయతీ తీసుకుంటుంది. గ్రామ పంచాయతీ ఆస్తులను చోరీ చేస్తే చర్యలు తీసుకుంటాం. భవనాల్లో ఇతర కార్యాలయాలు నిర్వహించేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. –నందిగామ శ్రీనివాసులు, సర్పంచ్, వాయిలసింగారం మూతబడిన నీటిశుద్ధి కేంద్రంలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలి. ఈ కేంద్రం గ్రామానికి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున భవనాల్లో పేకాట ఆడడం, మద్యం తాగడం వంటివి చేస్తున్నారు. గ్రామ అవసరాలకు భవనాలను వినియోగంలోకి తీసుకురావాలి. –కొల్లు సుబ్బారావు, సామాజిక కార్యకర్త, వాయిలసింగారం అనంతగిరి : నలభై గ్రామాలకు 12 ఏళ్లపాటు తాగునీరు అందించిన నీటిశుద్ధి కేంద్రం నేడు నిరుపయోగంగా మారింది. ప్రస్తుతం ఆ కేంద్రంలోని భవనాలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయ ని ప్రజలు ఆరోపిస్తున్నారు. అయినా నీటిశుద్ధి కేంద్రం కోసం నిర్మించిన భవనాలను వినియోగంలోకి తేవడంపై అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. నీటిశుద్ధి కేంద్రం ఏర్పాటు ఇలా.. గతంలో కోదాడ, హుజూర్నగర్ పరిసర గ్రామాల ప్రజలు ప్రతి వేసవిలోనూ తాగునీటికి ఇబ్బందులు పడుతుండేవారు. ఈ నేపథ్యంలో తీవ్ర నీటి ఎద్దడి ఉన్న 40 గ్రామాలను గుర్తించి ఆయా గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో అనంతగిరి మండలం వాయిలసింగారంలో 2004లో నాటి కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్కుమార్రెడ్డి హయాంలో రూ.19 కోట్ల వ్యయంతో మంచినీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించారు. ఈ కేంద్రం ద్వారా దాదాపు 12 సంవత్సరాల పాటు 40 గ్రామాలకు ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యంలో మంచినీరు అందించారు. దీంతో ఈ ప్రాజెక్టు నలభై గ్రామాల్లో మంచినీటి కొరతను తీర్చింది. ‘భగీరథ’తో మూతపడిన కేంద్రం.. 2016 ఆగస్టు 7న రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం అమలులోకి తీసుకువచ్చిన తరువాత వాయిలసింగారంలో నిర్మించిన నీటిశుద్ధి కేంద్రం పూర్తిగా మూతబడిపోయింది. వినియోగంలో లేకపోవడంతో ప్రాజెక్టుకు సంబంధించి విద్యుత్ మోటార్లు, యంత్ర సామగ్రి చోరీకి గురయ్యాయి. భవనాలు పదిలంగా ఉన్నప్పటికీ ఐరన్ డోర్లు, భవనాలకు అమర్చిన స్విచ్ బోర్డులు, విద్యుత్ వైర్లు చోరీకి గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన మోటార్లు, యంత్ర సామగ్రిని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు స్క్రాప్గా విక్రయించారు. దీంతో ఎటువంటి రక్షణ లేకుండా ఉన్న భవనాలు నేడు పేకాట, మద్యం తాగడం, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. భవనంలో ఎక్కడ చూసినా పేకలు, మద్యం సీసాలు, గుట్కా ప్యాకెట్లు దర్శనమిస్తున్నాయి. మాయమవుతున్న టేకుచెట్లు ఉపాధిహామీ పనుల్లో భాగంగా ఈ నీటిశుద్ధి కేంద్రంలో గతంలో 500 టేకు మొక్కలు నాటారు. అవి ఇప్పుడు పెరిగి పెద్ద చెట్లుగా ఎదిగాయి. వీటిలో ఇప్పటివరకు సుమారు 250 టేకు చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు నరికి అపహరించుకెళ్లారు. గ్రామానికి సుమారు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున ఇక్కడ ఉన్న భవనాలు, టేకు చెట్లకు రక్షణ లేకుండా పోయింది. ప్రస్తుతం మరో 250 టేకు చెట్లు మిగిలి ఉన్నాయి. అధికారులు స్పందించి ఉన్న టేకు చెట్లను కాపాడడంతోపాటు భవనాలను వినియోగంలోకి తేవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఫ 40 గ్రామాలకు పుష్కర కాలం తాగునీరు అందించిన ప్రాజెక్టు ఫ ‘మిషన్ భగీరథ’తో పట్టించుకోని యంత్రాంగం ఫ సామగ్రి, పలు యంత్ర పరికరాలు, టేక కలప అపహరణ ఫ భవనాలను వినియోగంలోకి తేవాలంటున్న వాయిలసింగారం ప్రజలు -
నేడు ఉచిత మెగా కంటి వైద్య శిబిరం
సూర్యాపేట టౌన్ : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ కల్యాణ మండపంలో ఆదివారం తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్టు అక్షర ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి రుద్రంగి కాళిదాస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కంటి వైద్య శిబిరంలో అన్ని కంటి సమస్యలు చూడబడతాయని, ఉచిత ఆపరేషన్తో పాటు భోజన వసతి, రవాణా సౌకర్యం కల్పించబడుతుందని పేర్కొన్నారు. ఆపరేషన్ చేయించుకున్న వారికి 15 రోజుల తర్వాత చెకప్ కూడా చేయబడుతుందని పేర్కొన్నారు. ఆపరేషన్ అవసరం ఉన్నవారు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు తెచ్చుకోవాలని సూచించారు. ఇతర కంటి సమస్యలు ఉన్నవారికి ఉచితంగా మందులు అందజేస్తామని, పూర్తి వివరాలకు గడ్డం వీరబాబు సెల్ : 7036259911 నంబర్ను సంప్రదించాలని కోరారు. -
డ్రైవర్లకు కంటిచూపు బాగుండాలి
సూర్యాపేట టౌన్ : డ్రైవింగ్ వృత్తిలో కంటిచూపు చాలా కీలకమైందని, డ్రైవర్లకు కంటిచూపు బాగుంటేనే వాహనాలు ప్రమాదాలకు గురికాకుండా నడపగలుగుతారని ఎస్పీ నరసింహ అన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలో వివిధ రకాల వాహనాల డ్రైవర్లకు నిర్వహించిన ఉచిత కంటి పరీక్షల వైద్య శిబిరాన్ని ఎస్పీ ప్రారంభించి మాట్లాడారు. ముందు జాగ్రత్తలు పాటించడంతోనే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చన్నారు. మనదేశంలో ఏడాదికి సుమారు 1.5 లక్షల మంది, తెలంగాణలో 7,500 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని తెలిపారు. జిల్లాలో 2024లో 278 మంది రోడ్డు ప్రమాదాలలో మరణించగా 2025లో జిల్లా పోలీస్ శాఖ తీసుకున్న పటిష్ట చర్యల వల్ల మరణాలు 58కి తగ్గించగలిగామని పేర్కొన్నారు. డ్రైవర్ వృత్తి చాలా కష్టతరమైనదని, ఈ వృత్తిని ఎంచుకొని నిర్విరామంగా కష్టపడుతున్న డ్రైవర్లు తమ ఆరోగ్యాలను కూడా కాపాడుకోవాలన్నారు. సామాజిక సేవగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రైవర్లకు కంటి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. స్థానిక లయన్స్ క్లబ్, గ్లోబల్ కంటి ఆసుపత్రి డాక్టర్ల సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో 500 మందికిపైగా డ్రైవర్లకు కంటి పరీ క్షలు చేయించామన్నారు. రోడ్డు భద్రత నిబంధనలు పాలించాలని డ్రైవర్లచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దోసపాటి గోపాల్, కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్, పట్టణ సీఐ వెంకటయ్య, సీఐలు రాజశేఖర్, నరసింహారావు, నాగేశ్వరరావు, ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం పాల్గొన్నారు. ఫ ఎస్పీ నరసింహ -
అమెరికా సామ్రాజ్యవాదంతో భారత్కు ముప్పు
సూర్యాపేట అర్బన్ : కేంద్రప్రభుత్వం చేతకానితనం మూలంగా దేశ మార్కెట్ను అమెరికా కబలించేందుకు కుట్రపన్నుతోందని, అమెరికా సామ్రాజ్యవాదంతో భారత్కు ముప్పు పొంచి ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకటనరసింహారెడ్డి భవన్లో జరిగిన ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సమావేశంలో ఆమె మాట్లాడారు. మోదీ ప్రభుత్వం రైతాంగ ప్రయోజనాలను అమెరికాకు తాకట్టు పెట్టిందని.. విత్తన చట్టంతో అమెరికాకు లాలూచీ పడుతుందన్నారు. ఏళ్ల తరబడిగా కార్మికులు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లు తెచ్చిందని, తద్వారా కార్మికుల హక్కులు కాలరాసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలను ఎండగట్టాలన్నారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు, మట్టిపల్లి సైదులు, కోట గోపి పాల్గొన్నారు -
రైతులకు మేలు జరిగేలా పనులు
భానుపురి (సూర్యాపేట) : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రైతులకు మేలు జరిగే పనులు చేపట్టామని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి సంస్థ బృందం సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలో జరిగిన ఉపాధి హామీ పనులపై కేంద్ర బృందానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఉపాధిహామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం వీబీ జీ రాంజీగా మారుస్తున్న తరుణంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి సంస్థ బృందం సభ్యులు సంజయ్ కుమార్ నేతృత్వంలో ఈనెల 28 వరకు జిల్లాలో పర్యటించనున్నారు. అనంతరం ఈజీఎస్ పథకాల పనులపై జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను కేంద్ర బృందం, కలెక్టర్ తిలకించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, డిప్యూటీ సీఈఓ శిరీష, కేంద్ర బృందం సభ్యులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రారంభం
ఫ మొదటి రోజు 245 మంది గైర్హాజరు సూర్యాపేట టౌన్ : ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. జిల్లాలో 30 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా మొదటి రోజు మొత్తం 7,312 మంది విద్యార్థులను గాను 7,067 మంది హాజరు కాగా 245 మంది గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్ విభాగంలో 5,861 మందికి 5,716 మంది హాజరు కాగా 145 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. అలాగే ఒకేషనల్ విభా గంలో 1,451 మందికి 1,351 మంది పరీక్ష రాయగా 100 మంది గైర్హాజరైనట్టు డీఐఈఓ భానునాయక్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. అలాగే ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు కూడా తనిఖీలు చేశారు. మొదటి రోజు తెలుగు, సంస్కృతం, హిందీ పరీక్ష నిర్వహించారు. విద్యార్థులకు ఉపాధి కల్పనే లక్ష్యం సూర్యాపేట టౌన్ : కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని సూర్యాపేటలోని ఎస్వీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కెప్టెన్ డాక్టర్ వి.వెంకటేషులు అన్నారు. గురువారం కళాశాలలో టాటా క్యాపిటల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్లేస్మెంట్ డ్రైవ్ (జాబ్మేళా) ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కార్యక్రమాన్ని హెచ్ఆర్ స్టేట్ మేనేజర్ ఎం.మాలతీ, విగ్నేశ్వరన్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతున్న 78 మంది విద్యార్థులు పాల్గొనగా 33 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో రీజనల్ స్టేట్ మేనేజర్ వి.శ్రీనివాసరావు, ఏరియా సేల్స్ మేనేజర్ జి.ఉప్పయ్య తదితరులు పాల్గొన్నారు. ఎంజీయూ రిజిస్ట్రార్గా కొప్పుల అంజిరెడ్డి నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ) రిజిస్ట్రార్గా ఆర్థికశాస్త్ర విభాగం ప్రొఫెసర్, ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ డీన్ కొప్పుల అంజిరెడ్డి నియమితులయ్యారు. 2007లో ఎంజీ యూనివర్సిటీలో ఆర్థికశాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరిన అంజిరెడ్డి క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా పేరుంది. అంజిరెడ్డి స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆత్మకూరు(ఎం) మండలం సింగారం గ్రామం. రిజిస్ట్రార్గా నియమితులైన అంజిరెడ్డిని వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అభినందించారు. అంధ విద్యార్థులకు ప్రత్యేక లైబ్రరీరామగిరి(నల్లగొండ) : అంధ విద్యార్థుల కోసం నల్లగొండ జిల్లా గ్రంథాలయంలో ప్రత్యేకంగా డిజిటల్ లైబ్రరీ కార్నర్ను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్ఖాన్ గురువారం ప్రారంభించారు. ఇందులో బ్రెయిలీ పుస్తకాలు, ఆడియో బుక్స్, ఈ బుక్స్, స్క్రీన్ రీడర్ సాఫ్ట్వేర్తో కూడిన కంప్యూటర్లు సదుపాయాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అనంతరం 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో కార్యదర్శి బాలమ్మ, అనిల్కుమార్, కృష్ణమోహన్, నరసింహారెడ్డి పాల్గొన్నారు. -
సెప్టెంబర్లోగా లిప్టు పనులు ముగించాలి
మేళ్లచెరువు : సెప్టెంబర్ నాటికి మహాత్మాగాంధీ ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లిఫ్టు ఇరిగేషన్ పనులను పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అధికారులను, కాంట్రాక్టర్ ను ఆదేశించారు. గురువారం ఆయన చింతలపాలెం మండలం పాతవెల్లటూరు పరిధిలో నిర్మిస్తున్న లిఫ్టు పనులను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. రూ.1,670 కోట్లతో నిర్మింస్తున్న లిప్టు ద్వారా హుజూర్నగర్ నియోజకవర్గం పరిధిలోని మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం మండలాల్లో 53వేల ఎకరాలకు సాగు నీరు అందనుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ నాగభూషణం, ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ సూరయ్య, డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి, సీఐ రామకృష్ణారెడ్డి, కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి, అంతయ్య, సైదులు నాయక్, మంజీనాయక్, సంస్థ ప్రతినిఽధి హరీష్ పాల్గొన్నారు. -
క్రీడల్లో సత్తాచాటారు
సూర్యాపేట టౌన్ : శాంతి భద్రతలే లక్ష్యంగా నిరంతరం పోలీసులుగా విధులు నిర్వహిస్తున్న కొందరు కానిస్టేబుళ్లు కీడ్రాపోటీల్లోనూ రాణిస్తున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే పోలీస్ శాఖ ఇటీవల హైదరాబాద్లో జరిగిన 4వ రాష్ట్ర పోలీస్ క్రీడోత్సవాలు నిర్వహించింది. ఈ పోటీల్లో యాదాద్రి జోన్ తరఫున ఆడిన జిల్లా క్రీడాకారులు వివిధ క్రీడాంశాల్లో బహుమతులు సాధించారు. రాణించిన మహిళా పోలీసులు రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో జిల్లా మహిళా పోలీసులు సత్తాచాటారు. రాష్ట్ర స్థాయి క్రీడల్లో యాదాద్రి జోన్ కబడ్డీ పోటీల్లో మహిళా విభాగంలో ప్రథమ స్థానం, వాలీబాల్ లో మహిళా విభాగంలో తృతీయ స్థానం సాధించారు. బ్యాడ్మింటన్లో మహిళా విభాగంలో తృతీయ స్థానం సాధించి బహుమతులు గెలుచుకున్నారు. కబడ్డీ జట్టులో జిల్లా నుంచి మహిళా కానిస్టేబుళ్లు దీపిక, అనూష, శిరీష, దివ్యభారతి పాల్గొని అత్యత్తుమ ప్రతిభ కనబరిచారు. అలాగే వాలీబాల్ జట్టులో మహిళా కానిస్టేబుళ్లు లావణ్య, ప్రియాంక, దివ్యభారతి, దీపిక, ప్రవళ్లిక, అనూష, శిరీష పాల్గొని జట్టును ద్వితీయ స్థానంలో నిలిపారు. బ్యాడ్మింటన్లో మహిళా కానిస్టేబుల్ అనూష తృతీయ స్థానం సాధించి బహుమతి గెలుచుకుంది. పురుషుల విభాగంలో అథ్లెటిక్స్లో ఆర్ఎస్ఐ మహేష్ 1,500 మీటర్ల విభాగంలో గోల్డ్ మెడల్, ఐదు కిలోమీటర్ల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించారు. అలాగే కానిస్టేబుల్ స్వామి జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించారు. జాతీయ స్థాయి క్రీడలకు ఎంపిక జాతీయ స్థాయి పోలీస్ క్రీడాపోటీలకు పలువురు జిల్లా క్రీడాకారులు ఎంపికయ్యారు. ఆత్మకూరు పోలీస్స్టేషన్కు చెందిన మహిళా కానిస్టేబుల్ దీపిక, జిల్లా ఆర్ముడ్ పోలీస్ కానిస్టేబుళ్లు అనూష, శిరీష జాతీయ స్థాయిలో జరగనున్న కబడ్డీ పోలీస్ క్రీడాపోటీలకు ఎంపికయ్యారు. వాలీబాల్ పోటీలకు జిల్లా ఆర్ముడ్ విభాగం మహిళా కానిస్టేబుల్ లావణ్య ఎంపికయ్యారు. ఖోఖో క్రీడాపోటీలకు జిల్లా ఆర్ముడ్ పోలీస్ విభాగానికి చెందిన మహిళా కానిస్టేబుళ్లు దివ్యభారతి, అనూష ఎంపికయ్యారు.ఫ రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చిన జిల్లా పోలీసులు ఫ కబడ్డీ, ఖోఖో, వాలీవాల్, బాడ్మింటన్ విభాగాల్లో బహుమతులు ఫ జాతీయ స్థాయికి పలువురు మహిళా కానిస్టేబుళ్ల ఎంపిక ఫ అథ్లెటిక్స్, జావెలిన్ త్రోల్లో మరో ఇద్దరు పురుష కానిస్టేబుళ్లకు మెడల్స్ -
జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యా
హైదరాబాద్లో జరిగిన పోలీస్ క్రీడల్లో యాదాద్రి జోన్ తరఫున కబడ్డీ, వాలీబాల్ ఆడాను. కబడ్డీ పోటీలో ప్రథమ బహుమతి వచ్చింది. కబడ్డీలో జాతీయ స్థాయి క్రీడలకు ఎంపికయ్యాను. చాలా ఆనందంగా ఉంది. జిల్లాకు మంచిపేరు తీసుకొస్తా. – దీపిక, కానిస్టేబుల్, సూర్యాపేట జిల్లా ఇటీవల రాష్ట్ర స్థాయి కబడ్డీ, వాలీబాల్, ఖోఖో పోలీస్ క్రీడాపోటీల్లో ఆడాను. కబడ్డీ, ఖోఖోలో జాతీయ స్థాయికి ఎంపికయ్యాను. జమ్మూకశ్మీర్లో జరగనున్న జాతీయ స్థాయి కబడ్డీ, ఖోఖో పోటీల్లో పాల్గొని విజయంతో తిరిగి వస్తాం. – అనూష, ఏఆర్ కానిస్టేబుల్, సూర్యాపేట జిల్లా -
మార్చి నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి
హుజూర్నగర్ : హుజూర్నగర్లోని ఫణిగిరిగుట్ట వద్ద చేపట్టిన కాలనీ ఇళ్ల నిర్మాణ పనులను మార్చి మొదటి వారం నాటికి పూర్తి చేస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల, నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. గురువారం హుజూర్నగర్ పట్టణ శివారులో ఇళ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్తో కలిసి పరిశీలించారు. ప్రతి బ్లాకు తిరిగి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నిరుపేదలు, వ్యవసాయ కూలీలు, రైస్ మిల్లు కార్మికులకు ఆశ్రయం కల్పించాలన్న లక్ష్యంతో 110 ఎకరాల దేవాలయ భూములను కొనుగోలు చేసి రూ.125 కోట్లతో 2,160 ఇళ్ల నిర్మిస్తున్నామని తెలిపారు. తొలి విడత పట్టణంలోని నిరుపేదలకు సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేస్తామన్నారు. రెండవ విడతలో నియోజకవర్గంలోని పేదలకు అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్పీ కె.నరసింహ, మున్సిపల్ చైర్పర్సన్ దొంతగాని శ్రీని వాస్, వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్, ఏఎంసీ చైర్మన్ రాధికఅరుణ్కుమార్, హౌసింగ్ పీడీ సిద్ధార్థ, ఆర్టికల్చర్ పీడీ నాగయ్య తదితరులు పాల్గొన్నారు. ఫ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఫ హుజూర్నగర్, మేళ్లచెరువులో మంత్రి పర్యటన -
పోలీస్ సిబ్బంది సంక్షేమానికి కృషి
సూర్యాపేట టౌన్ : పోలీస్ సిబ్బంది సంక్షేమానికి నిరంతరం కృషిచేస్తామని ఎస్పీ నరసింహ అన్నారు. కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మరణించిన కృష్ణయ్య కుటుంబానికి ఆరోగ్య భద్రత ఇన్సూరెన్స్ కింద మంజూరైన నగదు చెక్కును గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అందజేసి మాట్లాడారు. పోలీస్ సిబ్బంది కుటుంబాలకు ఆరోగ్య భద్రత పథకం బాసటగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు రవీందర్రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, పోలీస్ సంఘం అధ్యక్షుడు రామచందర్గౌడ్, సంక్షేమ ఆర్ఎస్ఐ సాయిరాం, సిబ్బంది పాల్గొన్నారు. ఉత్తమ సేవలతో ప్రజల మన్ననలు పొందాలి ఉద్యోగోన్నతి సాధించిన పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని ఎస్పీ నరసింహ అన్నారు. కోదాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పని చేస్తున్న కె.విద్యాసాగర్కు హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి పొందిన సందర్భంగా గురువారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం ఎస్పీ నరసింహ ప్రమోషన్ ఉత్తర్వులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. ఫ ఎస్పీ నరసింహ -
ఉగాది నాటికి ఇందిరమ్మ ఇళ్లు పూర్తిచేయాలి
భానుపురి (సూర్యాపేట) : ఉగాది నాటికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేలా చూడాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ అన్నారు. ఇందిరమ్మ ఇళ్లపై మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హౌసింగ్ ఎండీ మాట్లాడుతూ.. జిల్లాలో స్లాబ్ దశలో, సగం వరకు పూర్తయిన 2700 ఇందిరమ్మ ఇళ్లను పూర్తిచేసి ఉగాది నాటికి లబ్ధిదారులకు అందించే విధంగా సిద్ధం చేయాలని సూచించారు. పూర్తయిన ఇళ్లకు బిల్లులు చెల్లించాలన్నారు. పెండింగ్ పనులైన అంతర్గత రోడ్లు, డ్రెయినేజీ, ఎలక్ట్రిసిటి, డ్రింకింగ్ వాటర్ మొదలైన పనులను పూర్తిచేయాలన్నారు. ఆయన వెంట హౌసింగ్ చీఫ్ ఇంజనీర్ చైతన్యకుమార్, హౌసింగ్ పీడీ సిద్ధార్థ, సూర్యాపేట తహసీల్దారు కృష్ణయ్య, హౌసింగ్ ఇన్స్పెక్టర్ అబ్దుల్లా పాల్గొన్నారు. పథకాలను సద్వినియోగం చేసుకోవాలిచివ్వెంల(సూర్యాపేట) : ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హౌసింగ్ ఎండీ గౌతమ్ కోరారు. మంగళవారం కోదాడకు వెళ్లి వస్తూ మార్గమధ్యంలో చివ్వెంల మండల పరిధిలోని గుంపుల గ్రామంలో కొద్దిసేపు ఆగారు. ఇంటి బిల్లులకు సంబంధించి నగదు సకాలంలో వస్తున్నాయా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ఎంపీడీఓ సంతోష్ కుమార్ ఉన్నారు. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ -
30 పరీక్ష కేంద్రాలు..
16,178 మంది విద్యార్థులునేటి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలుసూర్యాపేటటౌన్ : జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకుగాను మొత్తం జిల్లావ్యాప్తంగా 30 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేలా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, ఇతర సౌకర్యాలు కల్పించారు. ప్రతి సెంటర్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ ఇంటర్ బోర్డు కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్రూం నుంచి అధికారులు పరీక్షల నిర్వహణను పర్యవేక్షించనున్నారు. పకడ్బందీగా పరీక్షల నిర్వహణఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా ప్రతి కేంద్రంలో 8 నుంచి 10 సీసీ కెమెరాలు ఉండే విధంగా పరీక్ష కేంద్రాలను ఎంపిక చేశారు. అలాగే పరీక్షలను పర్యవేక్షణకు ప్రతి సెంటర్కు సీఎస్, డీఓలతో పాటు జిల్లాలో రెండు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు, రెండు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. అదేవిధంగా జిల్లా ఎగ్జామినేషన్ కమిటీ ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 163 బీఎన్ఎస్ఎస్ అమలులో ఉంటుంది. పరీక్ష కేంద్రాల నుంచి 200 మీటర్ల పరిధిలోని అన్ని జీరాక్స్ కేంద్రాలు, ఆన్లైన్ సెంటర్లు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు మూసి ఉంచాలి. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమికూడొద్దు. నిషేధిత వస్తువులతో పరీక్ష కేంద్రాల వద్ద తిరగడం నిషేధం. 86 ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు జిల్లాలో మొత్తం ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు 86 ఉన్నాయి. వీటిలో మొత్తం 16,178 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందులో మొదటి సంత్సరం జనరల్ విభాగంలో 6609 మంది విద్యార్థులు, ఒకేషనల్ విభాగంలో 1579 మంది విద్యార్థులు ఉన్నారు. అలాగే ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో 6479 మంది విద్యార్థులు, ఒకేషనల్ విభాగంలో 1511 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్ష జరగనుంది. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ నరసింహ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిధిలోని పరీక్ష కేంద్రాల వద్ద శాంతిభద్రతల రక్షణలో భాగంగా సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఈ నెల 25 నుంచి మార్చి18వ తేదీ వరకు పరీక్షలు జరుగుతుండగా పరీక్షల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని తెలిపారు. ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ అధికారులు పరీక్ష కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ఎస్ అమలునిమిషం నిబంధన ఎత్తివేతపరీక్ష కేంద్రంలోకి వెళ్లేందుకు నిమిషం నిబంధన ఎత్తివేశారు. పరీక్ష సమయానికి ఐదు నిమిషాల వరకు పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ఉదయం 9గంటలకు పరీక్ష ప్రారంభం కాగా 9.05గంటల వరకు అధికారులు అనుమతించనున్నారు. విద్యార్థులను ఉద యం 8గంటల నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. ఉదయం 8.45గంటలకల్లా ఓఎంఆర్ షీట్పై వివరాలన్నీ సరి చూసుకోవాలి. 9గంటలకు ప్రశ్నపత్రం ఇస్తారు. బార్కోడ్తో ఉన్న 24పేజీల బుక్లెట్ను విద్యార్థులకు అందజేస్తారు. -
3.20 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి
హుజూర్నగర్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల లో రాష్ట్ర వ్యాప్తంగా 3.20 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని, వీటి కోసం రూ.5వేల కోట్లను మంజూరు చేసిందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని రామస్వామి గుట్ట వద్ద నిర్మాణంలో ఉన్న సింగల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్లతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి హౌసింగ్ విషయంలో ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. రామస్వామి గుట్ట వద్ద నిర్మిస్తున్న ఇళ్ల కాలనీని మార్చి మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డితో ప్రారంభించ బోతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రామస్వామి గుట్ట వద్ద ఒకే చోట 110 ఎకరాలలో రూ 125 కోట్లతో హౌసింగ్ కాలనీని నిర్మిస్తున్నామని తెలిపారు. కాలనీలో అంతర్గత రోడ్లు, విద్యుత్, తాగునీరు, డ్రెయినేజీ వ్యవస్థకు ప్రభుత్వం నుంచి రూ.75కోట్లు మంజూరు చేయించి పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయిస్తున్నట్లు వెల్లడించారు. తొలి విడతలో హుజూర్నగర్ పట్టణంలో ఇళ్లు లేని వారికి, తెల్ల రేషన్ కార్డు కలిగిన వెయ్యి మంది లబ్ధిదారులకు ఇళ్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించారు. రెండో విడతలో నియోజక వర్గంలోని పేదలకు అందించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఎస్పీ కే నరసింహ, మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్, వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
సాగు, తాగునీటికి శ్రీశైలమే శరణ్యం!
నాగార్జునసాగర్ : సాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీటితో పాటు హైదరాబాద్ మహానగరానికి, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఫ్లోరిన్ పీడిత పట్టణాలు, గ్రామాలకు తాగునీటికి గాను శ్రీశైలం జలాశయమే శరణ్యమైంది. నాగార్జునసాగర్ జలాశయం నుంచి నీటి వినియోగం అధికంగా జరుగుతుండడంతో నీటిమట్టం వేగంగా తగ్గిపోతోంది. దీంతో ఎగువన శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుదుత్పాదన ద్వారా వచ్చే నీటితోనే సాగు, తాగునీటి అవసరాలు తీర్చుకునే పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడం వల్ల కృష్ణానదికి భారీస్థాయిలో వరదలు వచ్చాయి. లక్షల క్యూసెక్కుల వరదనీరు జలాశయాల్లోకి చేరింది. నవంబర్ నెల వరకు శ్రీశైలం, సాగర్ జలాశయాలు నిండుకుండల్లా ఉన్నాయి. అయితే, గడిచిన 114 రోజుల్లోనే సాగర్ జలాశయం నుంచి 135 టీఎంసీల నీటిని పంటల కోసం వినియోగించారు. సాగర్ జలాశయం గరిష్ట నీటిమట్టం 590 అడుగులు (312.0450టీఎంసీలు) కాగా.. మంగళవారం నాటికి నీటిమట్టం 539 అడుగులు (186.6644 టీఎంసీలు) ఉంది. 45 టీఎంసీల నీరు శ్రీశైలం నుంచి ఇస్తేనే.. సాగర్ ఆయకట్టులో ప్రస్తుతం సాగులో ఉన్న యాసంగి పంట చేతికి రావాలంటే ఏప్రిల్ 7వ తేదీ వరకు అంటే మరో 42 రోజుల వరకు నీటిని విడుదల చేయాలి. నిత్యం పంట కాల్వల ద్వారా 21,500 క్యూసెక్కుల నీరు విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన సుమారు 81 టీఎంసీల నీరు పంటకు అవసరమవుతుంది. ఇది కాకుండా వాతావరణాన్ని బట్టి రోజుకు దాదాపు 240 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టు నుంచి ఆవిరై పోతుంది. కాగా, సాగర్ జలాశయంలో కనిష్ట నీటిమట్టం 510 అడుగులకు పైన ఉన్న నీటినే వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అంటే.. 55 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. సాగునీటికి 81 టీఎంసీలు, తాగునీటికి 19టీఎంసీలు మొత్తం 100 టీఎంసీల నీరు అవరమవుతుంది. దీని ప్రకారం 45 టీఎంసీల నీరు శ్రీశైలం జలాశయం నుంచి వస్తేనే వేసవి గండం నుంచి గట్టెక్కుతాం. తాగు నీటికి రోజూ 2500 క్యూసెక్కులు ఏప్రిల్ 7 వరకు పంటలకు నీటిని నిలిపేసినా.. హైదరాబాద్ మహా నగరానికి, ఫ్లోరైడ్ పీడిత గ్రామాలు, పట్టణాలకు జులై వరకు తాగునీరు పంపాల్సి ఉంటుంది. గతంలోనే రోజుకు కనిష్టంగా 2వేల క్యూసెక్కుల నీటిని తాగునీటి అవసరాలకు అందిచేవారు. హైదరాబాద్ మహానగరంతో పాటు పట్టణాలు ఏడాదికేడాది విస్తరిస్తుండడంతో నివాసాల సంఖ్య పెరుగుతోంది. దీంతో రోజుకు 2500 క్యూసెక్కుల మేరనైనా తాగునీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. శ్రీశైలం జలాశయం నుంచి విద్యుదుత్పాదనతో సాగర్ జలాశయానికి 10,398 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. కుడివైపు(ఆంధ్రప్రదేశ్) విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా 137 క్యూసెక్కులు, ఎడమవైపున గల తెలంగాణ విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా 9,021 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నెల 13వ తేదీ నుంచి శ్రీశైలం నుండి నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం862.90 అడుగులు (114.9952 టీఎంసీలు)గా ఉంది. సాగర్ నుంచి విద్యుదుత్పాదన, కుడి ఎడమ కాల్వలు, ఏఎమ్మార్పీకి 25,123 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది.ఫ నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి 114 రోజుల్లో 135 టీఎంసీల నీటి వినియోగం ఫ శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పాదన ద్వారా సాగర్కు స్వల్పంగా నీటి విడుదల -
డిగ్రీ బ్యాక్లాగ్ విద్యార్థులకు చివరి అవకాశం
నల్లగొండ టూటౌన్ : మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలో డిగ్రీ 2019 –20 నుంచి 2020– 21 బ్యాక్లాగ్ విద్యార్థులు పరీక్షలు రాసేందుకు చివరి అవకాశం కల్పించనున్నట్లు సీఓఈ ఉపేందర్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష ఫీజు ఆలస్య రుసుం లేకుండా మార్చి 16వ తేదీ వరకు, రూ.100 ఆలస్య రుసుంతో 17వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. క్రమశిక్షణతో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చుసూర్యాపేటటౌన్ : విద్యార్థులు క్రమశిక్షణగా ఉంటే ఉన్నత స్థానాలకు చేరుకుంటారని ఎస్పీ నరసింహ అన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం సూర్యాపేట పట్టణంలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు రోడ్డుభద్రతపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థులు బాధ్యతగా ఉండాలని, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడంతోపాటు, రోడ్డు ప్రమాదాలు నివారించడంలో ఆదర్శంగా, ప్రచారకర్తలుగా ఉండాలన్నారు. మానవ తప్పిదాల వల్ల అధికంగా రోడ్డు ప్రమాదాలు సంభవించి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఎవరూ రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలో కోల్పోకూడదనేదే పోలీస్ శాఖ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం, కళాశాల ప్రిన్సిపాల్ ముత్యాల రాజు తదితరులు పాల్గొన్నారు.దీన్ దయాల్ సిద్ధాంతాలే బీజేపీకి ప్రేరణాశక్తిసూర్యాపేట : సూర్యాపేటలో మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్పై ఆపార్టీ జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతరెడ్డి అధ్యక్షతన జిల్లా స్థాయి వర్క్షాప్ నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బద్దం మహిపాల్ రెడ్డి, జిల్లా ఇన్చార్జ్ తూటుపల్లి రవికుమార్లు పాల్గొని పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన అంత్యోదయ సిద్ధాంతాలే బీజేపీకి ప్రేరణాశక్తి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కడియం రాంచంద్రయ్య, జిల్లా మాజీ అధ్యక్షులు బొబ్బా భాగ్యారెడ్డి, ప్రోగ్రాం జిల్లా కన్వీనర్ వంగవీటి శ్రీనివాసరావు, కోకన్వీనర్ ఆకుల భిక్షమయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శులు చల్లమల నరసింహ, దోసకాయల ఫణినాయుడు, జిల్లా కమిటీ సభ్యులు, పట్టణ, మండల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. గోదావరి నీటి విడుదల 1750 క్యూసెక్కులకు పెంపు అర్వపల్లి: యాసంగి సీజన్కుగాను జిల్లాకు వారబందీ విధానంలో ఇస్తున్న గోదావరి నీటిని మంగళవారం పెంచారు. నీటిని 1613 క్యూసెక్కుల నుంచి 1750 క్యూసెక్కులకు పెంచినట్లు జలవనరుల శాఖ ఈఈ సత్యనారాయణగౌడ్, బయ్యన్నవాగు ఏఈ చంద్రశేఖర్ తెలిపారు. చివరి భూములకు నీళ్లు చేరేందుకు ఈసారి అవకాశం ఉన్న మేర ఎక్కువ నీటిని వదులుతున్నట్లు పేర్కొన్నారు. రైతులు నీటిని వృథా చేయకుండా పొదుపుగా పంటలకు వాడుకోవాలని కోరారు. పేదల ఇళ్లను కూల్చడం హేయమైన చర్యచివ్వెంల(సూర్యాపేట) : ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామంలో పేదల ఇళ్లను కూల్చివేయడం హేయమైన చర్య అని గ్రామీణ పేదల సంఘం జిల్లా కార్యదర్శి కోణకంచి వీరభద్రయ్య అన్నారు. మంగళవారం చివ్వెంల మండల పరిధిలోని బి.చందుపట్ల గ్రామంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. 12 సంవత్సరాల క్రితం భూదాన్ భూముల్లో హైకోర్టు ఆర్డర్ ద్వారా ఇళ్లు నిర్మించుకున్న పేదల ఇళ్లను కూల్చి వేయడం కోర్టు ధిక్కరణే అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని ఆరోపించారు. యల్లయ్య, భద్రయ్య, వెంకన్న, లింగయ్య, సునిల్ పాల్గొన్నారు. -
అలుగు పారుతున్న కోదాడ పెద్దచెరువు
లక్ష్మీనారసింహుడికి విశేష పూజలుమఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో మంగళవారం అర్చకులు విశేషపూజలు నిర్వహించారు. క్షేత్ర పాలకుడైన ఆంజనేయస్వామికి తమలపాకులతో ప్రత్యేకపూజలు చేశారు. దేవాలయంలో లక్ష్మీనరసింహస్వామికి సుప్రభాత సేవ, హోమశాలలో నిత్యాగ్నిహోత్రి, మూలవిరాట్కు పంచామృతాభిషేకం, జరిపించారు. లక్ష్మీనరసింహస్వామి, అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం చేపట్టారు. నిత్య కల్యాణతంతులో భాగంగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ, తలంబ్రాలతో నిత్య కల్యాణం వైభవంగా నిర్వహించారు. అనంతరం మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కోదాడ : కోదాడ పెద్దచెరువు అలుగు పారుతోంది. మంగళవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి పెద్దచెరువులోకి భారీగా వరద నీరు చేరడంతో ఉదయం నుంచి చెరువు అలుగు పోస్తోంది. -
లిప్టు పనులు పూర్తిచేయాలి
మేళ్లచెరువు : సెప్టెంబరు నాటికి రాజీవ్గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అధికారులను, కాంట్రాక్టర్ను ఆదేశించారు. మంగళవారం చింతలపాలెం మండలం దొండపాడు గ్రామం పరిధిలో గల లిఫ్ట్ పంపును పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. లిప్టు ద్వారా హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధిలోని 5 మండలాల్లో 12 గ్రామాలల్లో ని భూములకు సాగు నీరు అందించడం జరుగుతుందన్నారు. 394 కోట్ల రూపాయలతో నిర్పిస్తున్న లిప్టు పనులు వేగవంతం గా జరుగుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు రమేష్బాబు, ఎస్ఈ నాగభూషణం, దొండపాడు సర్పంచ్ చెన్నకేశి వెంకయ్య యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నరాల కొండారెడ్డి, ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
● 5 తులాల బంగారం, రూ.లక్ష నగదు అపహరణదేవరకొండ: తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి 5 తులాల బంగారం, రూ.లక్ష నగదు అపహరించారు. ఈ ఘటన దేవరకొండ మండలం కొండభీమనపల్లి గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండభీమనపల్లి గ్రామానికి బొడ్డుపల్లి శంకరయ్య ఆదివారం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్కు వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన గుర్తుతెలియని వ్యక్తులు శంకరయ్య ఇంటి తాళాలు పగులకొట్టి బీరువాలో ఉన్న 5 తులాల బంగారం, రూ.లక్ష నగదు ఎత్తుకెళ్లారు. సోమవారం శంకరయ్య హైదరాబాద్ నుంచి ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి తాళాలు పగులగొట్టి ఉండడంతో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు పోలీసులు నమోదు చేసి క్లూస్ టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. అనుమానాస్పద ిస్థితిలో వ్యక్తి మృతి చివ్వెంల(సూర్యాపేట) : చివ్వెంల మండలం వల్లభాపురం గ్రామ శివారులోని ఇటుక బట్టీలో సోమవారం అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. విశ్వసనీయ సమాచారం మేరకు.. దురాజ్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని తెల్లబండ కాలనీకి చెందిన పల్లపు రాజు(35) వల్లభాపురం గ్రామ శివారులోని ఇటుక బట్టీలో ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం అతడు ఇటుక బట్టీ వద్ద అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రాజు మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఎస్ఐ వి. మహేశ్వర్ను వివరణ కోరగా తమకు ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు. -
గోవర్ధనగిరిధారిగా అభయమిస్తూ..
● సింహ వాహనంపై ఊరేగిన యాదగిరీశుడు ● నేడు ఎదుర్కోలు ఉత్సవంయాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. సోమవారం ఉదయం ఆలయంలో నిత్య కై ంకర్యాలు పూర్తిచేసి యాగశాలలో హవన పూజలు జరిపించారు. అనంతరం స్వామివారిని గోవర్ధనగిరిధారిగా అలంకరించి ప్రధానాలయం తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ అలంకార సేవను ఆలయ తూర్పు మాడ వీధిలో వేంచేపు చేసి పారాయణాలు, వేద మంత్రాలు పఠించారు. ఈ వేడుకల్లో ఆలయ ఈఓ భవానీ శంకర్, అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి, ఆలయ ప్రధానార్చకులు కాండూరి వెంకటచార్యులు, సురేంద్రాచార్యులు, అర్చకులు, పారాణీకులు, రుత్వికులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సాయంత్రం సింహ వాహనంపై.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం ఆలయంలో అర్చకులు, రుత్వికులు, పారాయణీకులు ప్రబంధ పారాయణం, మూలమంత్ర జపములు, నిత్యారాధనలు కొనసాగించారు. అనంతరం స్వామి వారిని సింహ వాహనంపై ఊరేగించారు. ఆ తర్వాత తూర్పు మాడ వీధిలో వేంచేపు చేసి పారాయణం పఠించి, స్వామి విశిష్టతను వివరించారు. ఏర్పాట్లను పరిశీలించిన డీఎస్పీ మంగళ, బుధవారాల్లో ఎదుర్కోలు మహోత్సవం, తిరు కల్యాణోత్సవం జరగనున్న నేపథ్యంలో ఆలయ పరిసరాలు, తూర్పు మాడ, తిరు వీధులను యాదగిరిగుట్ట డీఎస్పీ శ్రీనివాస్నాయుడు సోమవారం రాత్రి ఆలయాధికారులతో కలిసి పరిశీలించారు. భక్తులు ఇబ్బందులు కల్గకుండా తీసుకోవాల్సిన అంశాలను కొండపైన ఎస్పీఎఫ్ ఆర్ఐ శేషగిరిరావు, యాదగిరిగుట్ట పట్టణ సీఐ భాస్కర్తో ఆయన చర్చించారు. కొనసాగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు స్వామి వారి అలంకార సేవ ముందు వెంకట అన్నమాచార్య సేవా ట్రస్టు ఆధ్వర్యంలో పలువురు కళాకారులు కోలాటం, నృత్యాలు చేశారు. దశావతార వేషధారణలు ఆకట్టుకున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కార్వాన్లోని విశ్వాంజనేయ భక్త సమాజం, మైలార్గూడెంలోని జై శ్రీరామ భక్త భజన మండలి, భూదాన్ పోచంపల్లికి చెందిన మార్కండేశ్వరస్వామి భజన మండలి, రంగారెడ్డికి చెందిన అభ్యుదయ కళా సమితి ఆధ్వర్యంలో భజన, భక్తి సంగీత కార్యక్రమాలు కొనసాగాయి. ఆస్థానపరంగా మంగళవాయిద్యం, వైధిక ప్రార్థన జరిపించారు. హైదరాబాద్కు చెందిన డాక్టర్ మానస చెన్నప్ప నవవిధ భక్తితత్త్వములు, ప్రహ్లాదుని భక్తిపై ఉపన్యసించారు. పురాణం విజయలక్ష్మి రుక్మిణి కల్యాణం, హరికథా గానం చేశారు. మావుడూరు సత్యనారాయణ శర్మ వయోలిన్ వాయిద్యం, హైదరాబాద్లోని మంజుల డాన్స్ అకాడమీ కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చారు. సాయంత్రం వేళ కచ్చపి కళా క్షేత్రం భక్తి సంగీతం, హైదరాబాద్కు చెందిన భరద్వాజ నాట్యాలయం కళాకారులు కూచిపూడి నృత్య ప్రదర్శన, లావణ్య లత భక్తి సంగీతం, ఓలేటి రంగమణి సింహనందిని నృత్యం, హరిప్రియ భక్తి సంగీతం కార్యక్రమాలు కొనసాగాయి.బ్రహ్మోత్సవాల్లో నేడు..మంగళవారం ఉదయం స్వామివారిని జగన్మోహిని అలంకార సేవలో ఊరేగిస్తారు. రాత్రి అశ్వవాహనంపై స్వామివారిని ఊరేగించి ఎదుర్కోలు ఉత్సవం జరిపించనున్నారు. ఆలయ తూర్పు మాడ వీధిలో ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు. -
ప్రత్యేక ఆకర్షణగా డోలు, సన్నాయి కళాకారులు
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో డోలు, సన్నాయి కళాకారులు వాయించే మంగళ వాయిద్యాల శబ్ధం భక్తులకు ఆధ్యాత్మిక భావంలోకి తీసుకెళ్తున్నాయి. ఆలయంలో ఉదయం సుప్రభాతం నుంచి రాత్రి శయనోత్సవం వరకు ప్రతిరోజు దేవుడి సేవలో డోలు, సన్నాయి కళాకారులు పాలుపంచుకుంటున్నారు. అంతేకాకుండా బ్రహ్మోత్సవాల్లో సైతం పూజలు, ఉదయం, రాత్రి జరిగే అలంకార సేవ, వాహన సేవలో ఈ డోలు, సన్నాయి బృందం సభ్యులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. సన్నాయిలో నుంచి వచ్చే సంగీతానికి తగినట్లుగా డోలు వాయిస్తుంటే ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరు భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు.భక్తి భావాన్ని పెరుగుతుంది స్వామికి సంప్రదాయ పద్ధతిలో మంగళకరమైన వాయిద్యాన్ని మోగిస్తుంటే భక్తి భావం పెరుగుతుంది. బ్రహ్మోత్సవాలతో పాటు ప్రత్యేక రోజుల్లో ఏఏ పాటలను సన్నాయిలో నుంచి తీసుకురావాలనే అంశాన్ని ఆలోచిస్తాం. బ్రహ్మోత్సవాలు వచ్చాయంటే కచ్చితంగా ప్రతిరోజు ఏ సేవ ఉంటుందో ఆ సేవకు తగిన పాటను సన్నాయిలో నుంచి తీసుకురావడం ఎంతో సంతోషాన్నిస్తుంది. – తిరుపతయ్య, సన్నాయి కళాకారుడు స్వామి సేవకు అంకితమయ్యాను గత 16 ఏళ్లుగా యాదగిరి లక్ష్మీనరసింహస్వామి సేవకు అంకితమయ్యాను. దేవుడికి ఆలపించే పాటకు తగ్గట్లుగా డోలు వాయించడం ఎంతో అనుభూతిని కలిగిస్తుంది. బ్రహ్మోత్సవాలు వస్తే ఆలయానికి వచ్చే భక్తులకు భక్తిని పెంపొందించే విధంగా మా సభ్యులమంతా కృషి చేస్తున్నాం. డోలు వాయిస్తున్నంత సేపు మేము కూడా ఆ స్వామిని ధ్యానిస్తూ ఆధ్యాత్మిక లోకంలో ముగినిపోతాం. – రాము తిరుపాలి, డోలు కళాకారుడు -
సోలాపూర్ నుంచి పట్టువస్త్రాలు
మహారాష్ట్రలోని సోలాపూర్కు చెందిన చాట్లా శారీ సెంటర్కు చెందిన కేశవ్ చాట్లా, ఉమా చాట్లా, కృష్ణాకాంత్ చాట్లా, సోనాలి చాట్లాలు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. సోమవారం యాదగీరిశుడిని దర్శించుకున్న అనంతరం గోవర్ధనగిరిధారి అలంకార సేవ ముందు జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఈఓ భవానీ శంకర్, అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తికి వారు పట్టువస్త్రాలు అందజేశారు. 8 పట్టు చీరలు, 5 పట్టు పంచెలను ఆలయాధికారులకు అందించామని, గత 25 సంవత్సరాలుగా స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పట్టువస్త్రాలు అందిస్తున్నామని కేశవ్ చాట్లా వెల్లడించారు. -
సీతారామంజనేస్వామి ఆలయంలో చోరీ
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట మండలం కుప్పిరెడ్డిగూడెం గ్రామ శివారులోని సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలయ ముఖద్వారానికి వేసిన తాళాన్ని రాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు పగులగొట్టి లోపలికి వెళ్లి సీతమ్మ అమ్మవారి మెడలో ఉన్న రెండు గ్రాముల బంగారం పుస్తెలతాడు, హుండీలోని నగదు ఎత్తుకెళ్లారు. సోమవారం ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బాలునాయక్ తెలిపారు. మద్యం షాపులో.. సూర్యాపేటటౌన్ : సూర్యాపేట మండలం పిల్లలమర్రి గ్రామ శివారులోని కేటీ అన్నారం క్రాస్ రోడ్లోని జీకే వైన్స్లో ఆదివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తుతెలియని వ్యక్తులు షాపు పైకప్పు ఊడదీసి లోపలికి ప్రవేశించి కౌంటర్లో ఉంచిన రూ.14,500 నగదు, ఐదు ఫుల్ బాటిళ్ల మద్యం ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం వైన్స్ క్యాషియర్ నాగరాజు చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ ఎస్ఐ బాలునాయక్ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో పాస్టర్ దుర్మరణం
కోదాడరూరల్ : విజయవాడ– హైదరాబాద్ జాతీయ రహదారిపై కోదాడ మండల పరిధిలోని దోరకుంట గ్రామ శివారులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చర్చి పాస్టర్ మృతిచెందగా.. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. కోదాడ రూరల్ ఎస్ఐ సీహెచ్. గోపాల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ పట్టణంలోని నయానగర్కు చెందిన ఉప్పెల్లి సత్యంబాబు(48) చర్చి పాస్టర్గా పనిచేస్తున్నాడు. పని నిమిత్తం కారులో డ్రైవర్ తిరపయ్యను తీసుకొని చిమిర్యాల గ్రామానికి వెళ్తున్నాడు. మార్గమధ్యలో దోరకుంట గ్రామ శివారులోకి వెళ్లగానే.. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి డివైడర్ను ఢీకొట్టి అవతలి వైపు నుంచి వస్తున్న సత్యంబాబు కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సత్యంబాబు అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవర్ తిరపయ్యకు గాయాలుయ్యాయి. హైదరాబాద్ వైపు వెళ్తున్న కారులో ఉన్న సాయిదుర్గ, గాయత్రి, స్వప్న, మాధవి మురళీకృష్ణతో పాటు డ్రైవర్ నితీష్కు కూడా గాయాలు కావడంతో స్థానికులు వారిని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి భార్య కాంతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మరో ఆరుగురికి గాయాలు -
నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి
నల్లగొండ టౌన్ : కర్ల రాజేష్ మృతిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని ఈ కేసు విచారణ అధికారి, నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ను సోమవారం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంద కృష్ణమాదిగ మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధంగా పోలీసులు పనిచేయకపోవడం వల్లే కర్ల రాజేష్ మృతిచెందాడని ఆవేదన వ్యక్తం చేశారు. స్టేషన్ హౌజ్ ఆఫీసర్గా ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎస్ఐని అరెస్ట్ చేయకుండా ఈ కేసుతో సంబంధం లేని సీఐని సస్పెండ్ చేశారని ఆరోపించారు. ఎస్ఐని కాపాడేందుకు పోలీసు ఉన్నతాధికారులు, కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అన్నారు. గతంలో అడ్డగూడూరు లాకప్ డెత్ జరిగినప్పుడు ఎస్ఐని సస్పెండ్ చేసిన పోలీసులు చిలుకూరులో మాత్రం సీఐని సస్పెండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కర్ల రాజేష్ మృతదేహానికి ఈ నెల 26న బీబీనగర్ ఎయిమ్స్ వైద్య నిపుణులతో రీపోస్టుమార్టం చేయిస్తామని ఎస్పీ హామీ ఇచ్చినట్లు తెలిపారు. రెండు నెలల క్రితమే జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ రీపోస్టుమార్టంకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ సూర్యాపేట జిల్లా పోలీస్ అధికారుల నిర్లక్ష్యం వల్లే అది జరగలేదన్నారు. ఇప్పటికై నా న్యాయబద్ధంగా రీపోస్టుమార్టం చేయించాలని కోరారు. నిజాయితీగా పనిచేసే పోలీసులు అంటే తమకు ఎంతో గౌరవం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు బకరం శ్రీనివాస్ మాదిగ, మాదిగ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు గాదె రమేష్, ఎంఈఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపాక వెంకన్న మాదిగ, లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ జిల్లా నరసింహ, ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు మేడి శంకర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తరి ఏడుకొండలు, నల్లగొండ నియోజకవర్గం ఇన్చార్జి బొజ్జ దేవయ్య మాదిగ, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోలి జనార్దన్గౌడ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఏర్పుల శ్రవణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ -
ముగిసిన సీఎం కప్ ఖోఖో పోటీలు
నల్లగొండ టూ టౌన్ : నల్లగొండ జిల్లా కేంద్రంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న సీఎం కప్ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు సోమవారంతో ముగిశాయి. చివరి రోజు పోటీలు హోరాహోరీగా జరిగాయి. బాలుర విభాగంలో ఆదిలాబాద్ జిల్లా జట్టు, బాలికల విభాగంలో ఆసిఫాబాద్ జిల్లా జట్టు విజేతలుగా నిలిచాయి. బాలికల విభాగంలో నల్ల గొండ జట్టు ద్వితీయ బహుమతి, బాలుర విభాగంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జట్టు ద్వితీయ బహుమతులు కై వసం చేసుకున్నాయి. ముగింపు కార్యక్రమానికి నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్రెడ్డి ముఖ్యఅతిథిగా మాట్లాడారు. 33 జిల్లాల నుంచి 450 మంది బాలికలు, 450 మంది బాలురు ఈ ఖోఖో పోటీల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. సీఎం కప్ క్రీడాపోటీలతో గ్రామీణ క్రీడాకారులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. అనంతరం విజేతలకు మేయర్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ హఫీజ్ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, తెలంగాణ ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, డీవైఎస్ఓ అక్బర్ అలీ తదితరులు పాల్గొన్నారు. బాలుర విభాగంలో విజేతగా ఆదిలాబాద్ జట్టు బాలికల విభాగంలో ఆసిఫాబాద్ జట్టుకు ప్రథమ బహుమతి -
వరిలో తెగుళ్లు – నివారణ చర్యలు
త్రిపురారం : యాసంగి సీజన్లో వరి పంటకు సోకే తెగుళ్లు, చీడపీడలను రైతులు సరైన సమయంలో గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. లేదంటే దిగుబడి తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం రైతులకు సకాలంలో యూరియా దొరక్క వరి చేలు గిడసబారిపోతున్నాయి. సాగర్ ఆయకట్టు కింద వరి చేలు ప్రస్తుతం పొట్ట దశలో ఉండగా.. పలు ప్రాంతాల్లో ఈనిక దశలో ఉన్నాయి. ఈ క్రమంలో వరి పంటకు సోకే చీడపీడలు, వాటి నివారణకు కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) ప్రోగాం కోఆర్డినేటర్ చంద్రశేఖర్ సూచనలు.. ● అగ్గి తెగులు : వరి పంటలో వచ్చే అగ్గి తెగులు నివారణకు ట్రైసైక్లోజోల్ 1.6 గ్రాములు లేదా కాసుగామైసిన్ 2.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. నత్రజని ఎరువులను తగ్గించుకొని, పొలం గట్లపై కలుపును తీసివేయాలి. ● మొగి పురుగు లేదా కాండతొలుచు పురుగు : వరి పంటలో వాతావరణ పరిస్థితులను బట్టి కాండం తొలుచు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 ఎస్పీ 2 గ్రాములు లేదా 0.3 మి.లీ. క్లోరాట్రానిలిపోల్ 18.5 ఎస్పీ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి ● కాండం కుళ్లు తెగులు : కాండం కుళ్లు తెగులు నివారణకు 2 మి.లీ. హెక్సాకోనాజోల్ లేదా 1 గ్రాము కార్బండిజమ్ లేదా 1 మి.లీ. టేబుకో నాజోల్ 15 రోజులు వ్యవధిలో రెండు సార్లు పలకల కింద వరకు తడిచే విధంగా పిచికారీ చేసుకోవాలి. ● ఆకు ముడత తెగులు : వరిలో ఆకు ముడత తెగులు నివారణకు కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు లేదా క్లోరిపైరిపాస్ 2.5 మి.లీ. లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటరు నీటిలో కలిపి చేనుపై పిచికారీ చేసుకోవాలి ● ఉల్లికోడు తెగులు : వరిలో ప్రస్తుత పరిస్థితుల్లో ఉల్లికోడు తెగులు ఎక్కువగా ఆశిస్తున్నందున దీని నివారణకు నాటిన 10 నుంచి 15 రోజుల కార్బోఫ్యూన్ గులికలు ఎకరాకు 10 కిలోలు లేదా ఫోరేట్ గులికలు 5 కిలోలు ఎకరాకు లేదా ఫిప్రోనిల్ 2.5 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ● ఎండాకు తెగులు : నారుమడి దళ నుంచి గింజ పాలు పోసుకునే వరకు ఎండాకు తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. చెట్టు నీడ పడే ప్రదేశంలో ఎక్కువగా ఎండాకు తెగులు ఆశించి మిగిలిన పంటకు వేగంగా వ్యాప్తిస్తుంది. ఈ తెగులు సోకిన ప్రదేశంలో ముదురు ఆకులకు పసుపు రంగు మచ్చలు ఏర్పడి పైనుంచి కింది అంచుల వెంబడి వ్యాప్తించి ఎండుతూ వస్తాయి. ఉదయం సమయంలో ఆకుల మీద పసుపు రంగు జిగురు ముద్దలు కనబడతాయి. ఎండ వేడిమికి గట్టిపడి రాలిపోతాయి. ఈ ఎండిన బాక్టీరియా ముద్దలు నీటి ద్వారా వెళ్లి మిగిలిన పంటకు వ్యాప్తిస్తుంది. నివారణ చర్యలుఎండాకు తెగులు సోకిన మొక్కల నుంచి మిగతా పంటకు నీరు పారకుండా చూసుకోవాలి. ఈ తెగులు ఆశించిన పొలంలో నత్రజని వేయకూడదు. కాపర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రాములు మరియు ప్లాంటోమైసిన్ 4 గ్రాములు లేదా పోషామైసిన్ లేదా స్రైటప్లోసైక్లిన్ 4 గ్రాములు 10 లీటర్ల నీటిలో కలిపి 2 నుంచి 3 సార్లు వారం వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి. కేవీకే కంపాసాగర్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ చంద్రశేఖర్ సూచనలు -
తైక్వాండో పోటీల్లో బంగారు పతకం
రామగిరి(నల్లగొండ) : హైదరాబాద్ గచ్చి బౌలి స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి తైక్వాండో అండర్–17 విభాగం పోటీల్లో ఎన్జీ కళాశాలకు చెందిన ఎన్.మనోజ్యాదవ్ ఉత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించాడు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ సోమవారం మనోజ్యాదవ్ను అభినందించారు. కార్యక్రమంలో ఫిజికల్ సైన్స్ ఇన్చార్జ్ డాక్టర్ శ్రీనివాస్రెడ్డి, నర్సింగ్ కోటయ్య, వెంకటేశ్, మన్నెం వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. దొంగతనం కేసులో ఏడు నెలల జైలుశిక్ష నకిరేకల్ : దొంగతనం కేసులో నిందితుడికి ఏడు నెలల జైలుశిక్ష విధిస్తూ నకిరేకల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్కే ఆరిఫ్ సోమవారం తీర్పు వెలువరించారు. నకిరేకల్ పట్టణంలోని విద్యానగర్లో నివాసముంటున్న ఎస్కే జాఫర్ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన రమావత్ శంకర్నాయక్పై నేరం రుజువు కావడంతో అతడికి ఏడు నెలల జైలుశిక్షతో పాటు రూ.500 జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు వెలువరించారని నకిరేకల్ సీఐ హరిబాబు పేర్కొన్నారు. సాగర్ కాలువలో పడి వ్యక్తి మృతి తిరుమలగిరి(సాగర్): నాగార్జునసాగర్ ఎడమ కాల్వ మొదటి మేజర్ అయిన రాజవరం మేజర్ కాలువలో ప్రమాదవశాత్తు కాలుజారి పడి వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన సోమవారం రాత్రి జరిగింది. వివరాలు.. అల్వాల గ్రామానికి చెందిన బక్కతట్ల వెంకటేశ్వర్లు(38)తో పాటు అతడి బావ, మామ రాజవరం మేజర్ కాలువ వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో కాలువ వద్దకు మూత్ర విసర్జనకు వెళ్లిన వెంకటేశ్వర్లు కాలు జారి ఒక్కసారిగా కాలువలో పడిపోయాడు. అతని బావ, మామకు ఈత రాకపోవడంతో చుట్టుపక్కల వారిని పిలుచుకొచ్చి వెంకటేశ్వర్లును కాలువ నుంచి బయటకు తీసి చికిత్స నిమిత్తం హాలియాకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. దీంతో పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సాగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
26 నుంచి బ్రహ్మోత్సవాలు
మునగాల : రెండవ యాదగిరిగుట్టగా పేరున్న మునగాల మండలం రేపాల గ్రామంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్నాయి. పది రోజుల పాటు జరిగే ఉత్సవాలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రకృతి నిలయంలో ఉన్న లక్ష్మీనరసింహుడి ఆలయ పరిసర ప్రాంతంలో విశాలమైన కల్యాణ మండపం, చింతచెట్లు, దగ్గరలో పెద్ద కోనేరు ఉండడం ఇక్కడి ప్రత్యేకత. 10రోజులపాటు ఉత్సవాలు రాజ్యలక్ష్మీ సమేత లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 26 నుంచి మార్చి7 వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ సారిక రామయ్యయాదవ్ తెలిపారు. పది రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు స్వామివారు సిరిపురం నుంచి ఆలయానికి రాక, 27న అధ్యయనోత్సవం, 28న పరమపదోత్సవం, మార్చి ఒకటో తేదీన ద్వజారోహణం(గరుడముద్ద), 2న సాయంత్రం 6 గంటలకు డోలోత్సవం, అదే రోజు రాత్రి 10 గంటలకు స్వామి వారి కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మార్చి 3న ఉదయం 10 గంటలకు లక్ష కుంకుమార్చన, 4న రాత్రి ఎనిమిది గంటలకు గరుడోత్సవం, రథోత్సవం, 5న ఉదయం చక్రతీర్ధం, రాత్రికి పూర్ణాహుతి, ధ్వజారోహణం, దోపు, 6న రాత్రి 10 గంటలకు గాంధోళి(వసంతోత్సవం), 7న రాత్రి 9గంటలకు స్వామి పవళింపు సేవ, రాత్రి 12 గంటలకు స్వామి వారు సిరిపురం వేంచేయడంతో ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయన్నారు. ఉత్సవాలకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు చైర్మన్ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఫ పది రోజుల పాటు రేపాల లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ఉత్సవాలు ఫ ఏర్పాట్లు చేస్తున్న ఆలయ కమిటీ -
ఖోఖో సంబురం
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ ఔట్డోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న సీఎం కప్ రాష్ట్ర స్థాయి బాలబాలికల ఖోఖో పోటీలు కొనసాగుతున్నాయి. ఆదివారం పోటీలను జిల్లా యువజన, క్రీడల అధికారి అక్బర్ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని మాట్లాడారు. విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో సత్తాచాటి తెలంగాణకు మంచిపేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని పిలుపునిచ్చారు. వివిధ జిల్లాల జట్లు నువ్వా నేనా అనే రీతిలో తలపడ్డాయి. ఈ కార్యక్రమంలో కోచ్లు పాల్గొన్నారు. -
వారం రోజులు అరైవ్– అలైవ్
ఫ రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన ఫ ఎస్పీ నరసింహ సూర్యాపేటటౌన్ : రోడ్డు ప్రమాదాల నుంచి ప్రజలను కాపాడేందుకు సోమవారం నుంచి జిల్లాలో వారం రోజుల పాటు రెండవ దశ అరైవ్–అలైవ్ (రోడ్డు భద్రత అవగాహన) కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ప్రతి ఒక్కరూ సురక్షితంగా గమ్యం చేరడం, ట్రాఫిక్ నియమాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఈ మేరకు సిబ్బందికి ఆదేశాలు, ప్రణాళిక జారీ చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా ప్రచారం చేస్తామని, ప్రజలకు ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. ద్విచక్రజు వాహనం నడిపే వారు హెల్మెట్ ధరించడం, కారు నడిపే వారు సీట్బెల్ట్ వినియోగం, వాహనాల మితిమీరిన వేగంతో నడ పకుండా ఉండడం, మద్యం సేవించి వాహనం నడపకూడదనే అంశాలపై ప్రతి రోజు ఒక కార్యక్రమం నిర్వహించి ప్రజలు, విద్యార్థులు, యువ కులతో పాటు వాహనాల డ్రైవర్లను చైతన్యవంతం చేస్తామని ఆయన పేర్కొన్నారు. గోదావరి జలాల పునరుద్ధరణఅర్వపల్లి : యాసంగి సీజన్కు వారబందీ విధానంద్వారా విడుదల చేస్తున్న గోదావరి జలాలను అధికారులు ఆదివారం రాత్రి పునరుద్ధరించారు. వారం రోజులపాటు నీళ్లు రానున్నాయి. ప్రస్తుతం 1200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని, ఇవి జిల్లాలోని 69,70,71 డిస్ట్రిబ్యూటరీలకు వెళ్తాయని జలవనరుల శాఖ ఈఈ ఎం.సత్యనారాయణగౌడ్, బయ్యన్నవాగు ఏఈ చంద్రశేఖర్ తెలిపారు. జిల్లాలోని రైతులు సాగు నీటి పొదుపుగా వాడుకోవాలని వారు కోరారు. -
ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్ష
తుంగతుర్తి : గురుకుల ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. 2026–27 విద్యా సంవత్సరానికి గాను గురుకులాల్లో చేరే విద్యార్థులకు ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. మండల కేంద్రంలో రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో 360 మంది ప్రవేశపరీక్ష రాయాల్సి ఉండగా 338 మంది పరీక్షకు హాజరయ్యారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 504 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావలసి ఉండగా 471 మంది విద్యార్థులు హాజరయ్యారు. -
కాంగ్రెస్ పాలనలో దళితులపై దాడులు
మునగాల : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితులపై దాడులు పెరిగాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. ఆదివారం మండలంలోని నారాయణగూడెం గ్రామంలో ఎమ్మార్పీఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నారాయణగూడెంలో అగ్ర వర్ణాలకు చెందిన వారు మాలలపై విపరీతంగా దాడి చేశారన్నారు. తన స్వగ్రామమైన వరంగల్ జిల్లా శాయంపేటలో మాలబిడ్డపై దాడి జరిగితే దానిని తీవ్రంగా ఖండించి ఆ బిడ్డకు న్యాయం చేకూర్చినట్లు తెలిపారు. కారంచెడు, చుండూరు, ఈ మధ్య మరియమ్మపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించి వారికి న్యాయం చేసేంత వరకు ఎమ్మార్పీఎస్ పోరాడిందన్నారు. కోదాడ పట్టణానికి చెందిన కర్ల రాజేష్ పోలీసుల చిత్రహింసలతో మృతిచెందితే దానిని తీవ్రంగా ఖండించడంతో పాటు దోషులను శిక్షించాలని నాలుగు నెలలుగా పోరాటం చేస్తున్నామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సంఘటితమై పోరాడాలని పిలుపు నిచ్చారు. గడ్డం లింగయ్య యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మార్పీఎస్ సూర్యాపేట జిల్లా కన్వీనర్ ఏపూరి రాజుమాదిగ, జిల్లా ప్రధాన కార్యదర్శి పాతకొట్ల నాగరాజు మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు యాతాకుల రాజన్న మాదిగ, రాష్ట్ర నాయకుడు కొండపల్లి ఆంజనేయులు మాదిగ, జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి అంజయ్య మాదిగ, మండలాధ్యక్షుడు లంజేపల్లి శ్రీనుమాదిగ, సంఘం మండలాధ్యక్షుడు గుడిపాటి కనయ్య మాదిగ, మిట్టగణుపుల వీరబాబు తదితరులపాల్గొన్నారు. ఫ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ -
పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి
గరిడేపల్లి : ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.దామోదర్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని పొనుగోడు గ్రామంలో నిర్మించిన సంఘం భవన సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విధంగానే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఉద్యోగ విరమణ పొందిన వారికి నేటికీ పెన్షన్ అందక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్ల మంజూరు కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని, ఈ వయసులో వారు తిరిగే పరిస్థితి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల భవనాన్ని నిర్మించిన సంఘం మండల కమిటీని ఆయన అభినందించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు సుందరి నాగయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీతారామయ్య, సభ్యులు వెంకటమ్మ, చంద్రయ్య, బొట్ల రాంబాబు, శ్యాంసుందర్రెడ్డి, శ్రీనివాసరావు, కోటయ్య పాల్గొన్నారు. ఫ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్రెడ్డి -
నేటి నుంచి ప్రజావాణి
భానుపురి (సూర్యాపేట) : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 23 నుంచి యథావిధిగా కొనసాగిస్తామని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజలు, దరఖాస్తుదారుల నుంచి వినతులు స్వీకరించి పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి సద్విని యోగం చేసుకోవాలని కోరారు. సూర్యక్షేత్రంలో సౌరహోమంఅర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారు జామున ఉషాపద్మిని ఛాయాసమేత సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. యజ్ఞశాలలో మహా సౌరహోమం నిర్వహించారు. క్షేత్ర ఆవరణలోని కార్యసిద్ధి వీరహనుమాన్, రామకోటి స్తూపాలను భక్తులు దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితాజనార్ధన్, గణపురం నరేష్, ఇంద్రారెడ్డి, యాదగిరి, అర్చకులు భీంపాండే, అంకిత్పాండే, శ్రీరాంపాండే పాల్గొన్నారు. లక్ష్మీనరసింహుడికి విశేష పూజలుమఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో ఆదివారం స్వామివారికి అర్చకులు విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనరసింహస్వామికి సుప్రభాతసేవ, హోమశాలలో నిత్యఅగ్నిహోత్రి, మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం గోదాదేవికి, ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. లక్ష్మీనరసింహస్వామి, అమ్మవార్లలను పట్టు వస్త్రాలంకరణతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవం నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవారి నిత్య కల్యాణాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా స్వామి వారికి నీరాజన మంత్ర పుష్పాలతో మహానివేదన చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ బి.జ్యోతి, అర్చకులు పాల్గొన్నారు. యువత భవిష్యత్ కోసం ఉపాధ్యాయుడి ఆరాటంసూర్యాపేటటౌన్ : యువత బంగారు భవిష్యత్ కోసం మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరుతూ ప్రభుత్వ ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ ప్రతి ఆదివారం వివిధ రూపాలలో ప్రచారం నిర్వహిస్తున్నాడు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శంకర్విలాస్ సెంటర్, కూరగాయల మార్కెట్ రోడ్డులో ఆదివారం సాయంత్రం కోయదొర వేషధారణలో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా, రోడ్డు భద్రతపై యువతకు అవగాహన కల్పించారు. గంజాయి, డ్రగ్గ్స్కు బానిసలై యువత భవిష్యత్ నాశనం చేసుకోవద్దని కోరారు -
హక్కుల సాధనకు ఏకం కావాలి
తిరుమలగిరి ( తుంగతుర్తి) : గిరిజనుల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహారాజ్ స్ఫూర్తితో లంబాడీలు ఐక్యంగా ఉండి హక్కులను సాధించుకోవాలని ఆల్ ఇండియా బంజార సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు లూనావత్ పాండునాయక్, కార్యదర్శి ధరావత్ వీరన్ననాయక్ అన్నారు. ఆదివారం మండలంలోని మొండిచింత తండాలో సర్పంచ్ లావుడ్యా శ్రీలతబాలాజీ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలో వారు పాల్గొన్నారు. ముందుగా భోగ్ బండార్ నిర్వహించి సేవాలాల్కు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బంజారలకు సంక్షేమ పథకాలను అందించాలని కోరారు. అంతకు ముందు లంబాడీల వేషధారణలో మహిళలు చేసిన నృత్యాలు, కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. ఏఐబీఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు గుగులోతు నాగునాయక్, యూత్ జిల్లా అధ్యక్షుడు లావుడ్యా బాలాజీ నాయక్, ఉప సర్పంచ్ జాటోత్ శిరీష శీను, మాజీ సర్పంచ్ లావుడ్యా మోహన్ బాబు, గుగులోతు వెంకన్న నాయక్ పాల్గొన్నారు. -
పేదలకు గృహలక్ష్మి యోగం
భానుపురి (సూర్యాపేట) : గత బీఆర్ఎస్ ప్రభుత్వ జాగా ఉన్న నిరుపేదలు ఇల్లు నిర్మించుకునేందుకు రూ.3లక్షల ఆర్ధిక సాయం అందించేలా గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. అయితే పథకం ప్రారంభించిన కొద్దిరోజులకే ప్రభుత్వం మారడంతో లబ్ధిదారులు ప్రయోజనం పొందలేక పోయారు. అటువంటి వారికి కూడా ఇందిరమ్మ ఇళ్ల కింద ప్రయోజనం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం అధికారులు లబ్ధిదారులను గుర్తించే పనుల్లో ఉన్నారు. బేస్మెంట్ లెవల్లోనే.. గత ప్రభుత్వం జాగా ఉండి ఇల్లు నిర్మించుకునే ఆర్థిక స్థోమత లేని పేదలకు గృహలక్ష్మి పథకం ద్వారా రూ.3లక్షలు అందిస్తామని ప్రకటించింది. ఇందుకు గానూ లబ్ధిదారులను ఎంపిక చేసింది. చాలా మంది ఇంటి నిర్మాణాలను ప్రారంభించారు. అయితే ప్రభుత్వం మారడంతో ఈ పథకం నిలిచి పోయింది. ఈ పథకం కింద ఇల్లు మంజూరై, పనులు ప్రారంభించిన లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా ప్రస్తుత ప్రభుత్వం వారికి శుభవార్త అందించింది. బేస్మెంట్ దశ దాటి నిలిచిపోయిన ఇళ్లను పరిగణనలోకి తీసుకుంటూ మిగతా పనులు కొనసాగించేందుకు లబ్ధిదారులకు రూ.4 లక్షలు విడతల వారీగా అందించేలా ప్రభుత్వం జీఓ జారీ చేసింది. వీటిని ఇందిరమ్మ ఇళ్లుగా పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. నియోజకవర్గానికి 3వేల చొప్పున సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం రూ.3లక్షల ఆర్థిక సాయం అందించేలా 2023లో శాసనసభ ఎన్నికలకు నాలుగు నెలల ముందు అప్పటి ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని ప్రకటించింది. దాంతో పెద్ద ఎత్తున నిరుపేదలు దరఖాస్తు చేసుకోగా.. నియోజకవర్గానికి 3వేల చొప్పున ఇళ్లను ప్రకటించి లబ్ధిదారులను సైతం ఎంపిక చేసి మంజూరు పత్రాలను అందించిది. కొందరు నిర్మాణ పనులు చేపట్టగా.. ఇంకా కొందరు ఇళ్లు నిర్మించుకోవాలా..? వద్దా..? అన్న మీమాసంలో పడ్డారు. ఈ క్రమంలోనే ఎన్నికల కోడ్ కావడం, ప్రభుత్వం మారిపోవడంతో ఇళ్లు ప్రారంభించిన లబ్ధిదారులు వాటిని కొనసాగించలేక పోయారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసి ఇందిరమ్మ ఇళ్లను ప్రకటించి వాటి అమలుకు శ్రీకారం చుట్టింది. తాజాగా గృహలక్ష్మి లబ్ధిదారులను సైతం ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో చేరుస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం ఇటీవల జీఓ ఆర్టీ 936 తీసుకొచ్చింది. ఈ జీఓ మార్గదర్శకాల మేరకు ఉన్నవారిని గుర్తిస్తాం. జిల్లాలో ఈ విధంగా ఉన్న లబ్ధిదారులు ఎవరూ ఉండకపోవచ్చు. –సిద్ధార్థనాయక్, హౌసింగ్ పీడీఫ ఇందిరమ్మ ఇళ్లుగా పరిగణనలోకి తీసుకోనున్న ప్రభుత్వం ఫ బేస్మెంట్ స్థాయిలో నిలిచిన వాటికి వర్తింపు ఫ లబ్ధిదారుల గుర్తింపు పనిలో అధికారులు అప్పట్లో మంజూరైన గృహలక్ష్మి ఇల్లు ప్రారంభించిన లబ్ధిదారులు మొదటగా సొంత ఖర్చుతో కొంత మేర నిర్మించుకున్నారు. ఎలాంటి నిబంధనలు లేకపోవడంతో ఇష్టానుసారంగా స్థామతను బట్టి నిర్మాణాలు చేపట్టారు. అయితే ఇందిరమ్మ ఇళ్ల మార్గదర్శకాలు మాత్రం వేరుగా ఉన్నాయి. గృహలక్ష్మి పథకంలో నిలిచిన ఇళ్లు కూడా 400 నుంచి 600 చదరపు అడుగుల మధ్యలోనే ఉండాలి. బేస్మెంట్ను ఆ రకంగా పునరుద్ధరించుకోవాలి. బేస్మెంట్ నిర్మించుకున్నందున దశలవారీగా రూ.4 లక్షలు అందిస్తారు.(రూ్ఫ్స్థాయి రూ.లక్ష, స్లాబ్ పూర్తయితే రూ.లక్ష పనులు పూర్తయ్యాక రూ. 2 లక్షలు) -
అరుణోదయ సమాఖ్య జిల్లా కార్యవర్గం ఎన్నిక
అర్వపల్లి: అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక శనివారం అర్వపల్లిలో నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడిగా ఉదయగిరి, ఉపాధ్యక్షుడిగా బొల్లె వెంకన్న, ప్రధాన కార్యదర్శిగా కంచెనపల్లి సైదులు, సహాయ కార్యదర్శిగా ఎర్ర ఉమేష్, కోశాధికారిగా గుండు నాగేష్, కార్యవర్గ సభ్యులుగా తడకమళ్ల సంజీవ్, సామ నర్సిరెడ్డి, బోల్క పవన్ను ఎన్నుకున్నారు. సీపీఆర్పై అవగాహనసూర్యాపేటటౌన్ : కార్డియో పల్మోనరీ రిససిటేషన్ (సీపీఆర్)పై శనివారం జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఆర్బీఎస్కె టీం సభ్యులకు అవగాహన కల్పించారు. శిక్షకులు డాక్టర్ లక్ష్మీప్రసన్న, డాక్టర్ నాగరాజు, డాక్టర్ శ్రీకాంత్వర్మ సీపీఆర్ గురించి వివరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ పెండెం వెంకటరమణ, ఆర్బీఎస్కే టీం సభ్యులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్కు చేరిన ఇంటర్ ప్రశ్నపత్రాలు సూర్యాపేటటౌన్ : ఇంటర్ పరీక్షలు ఈ నెల 25 జరగనుండడంతో ప్రశ్న పత్రాలు శనివారం సూర్యాపేట పోలీస్స్టేషన్కు చేరాయి. సూర్యాపేట డిస్ట్రిక్ బల్క్ నుంచి ఇన్చార్జి పెరుమాళ్ల యాదయ్య ఆధ్వర్యంలో మూడు రూట్ల ద్వారా ప్రశ్నపత్రాలను తరలించారు. సూర్యాపేట పట్టణంలోని 12 పరీక్షా కేంద్రాలకు సంబంధించిన ప్రశ్న పత్రాలను పట్టణ పోలీస్ స్టేషన్లోని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. స్ట్రాంగ్ రూంను డీఐఈఓ భానునాయక్, డీఈసీ సభ్యులు రాజమోహన్, దుర్గాప్రసాద్ సందర్శించారు. ఎమ్మార్పీఎస్ జిల్లా కమిటీ రద్దు కోదాడ: ఎమ్మార్పీఎస్ జిల్లా కమిటీని రద్దు చేస్తున్నట్లు జిల్లా కన్వీనర్ బచ్చలకూరి వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం కోదాడలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కోదాడకు చెందిన కర్ల రాజేష్ మృతిపై ఎమ్మార్పీఎస్ మూడు నెలలుగా తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తున్నా జిల్లా కమిటీ కనీస స్థాయిలో స్పందించలేదన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాలతో జిల్లా కమిటీని రద్దు చేస్తున్నామని తెలిపారు. అదే విధంగా ఎమ్మార్పీఎస్ జిల్లా నూతన కన్వీనర్గా కోదాడకు చెందిన ఏపూరి రాజును నియమిస్తున్నట్లు ప్రకటించారు. సమావేశంలో కొండపల్లి ఆంజనేయులు, యలమర్తి రాము, కోటేష్, రవి, కుటుంబరావు, చిన్న వెంకట్రావ్, సైదులు, కొండలు, శ్రీకాంత్, సూర్యప్రకాశ్ పాల్గొన్నారు. 27వరకు పత్తి కొనుగోళ్లు భానుపురి (సూర్యాపేట) : సీసీఐ ఆధ్వర్యంలో ఈనెల 27వ తేదీ వరకు జిల్లాలోని రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేయనున్నట్లు జిల్లా మార్కెటింగ్ అధికారి నాగేశ్వరశర్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సీసీఐ ఈనెల 20వ తేదీ వరకే గడువు ఇవ్వగా రైతుల విజ్ఞప్తి మేరకు 27 వరకు పొడిగించించినట్లు పేర్కొన్నారు. రైతులు గమనించి తమ వద్ద ఉన్న పత్తిని విక్రయించేందుకు స్లాట్ బుక్ చేసుకుని రావాలని సూచించారు. మట్టపల్లిలో విశేష పూజలు మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో శనివారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. దేవాలయంలో శ్రీలక్ష్మీనరసింహస్వామికి సుప్రభాతసేవ, నిత్యహోమం మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి, అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం జరిపించారు. అనంతరం రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ పూర్తిగావించారు. -
భూసేకరణ పనులు వేగవంతం చేయాలి
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో నిర్మించనున్న వివిధ ప్రాజెక్టులకు కావాల్సిన భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. శనివారం కలెక్టర్లోని సమావేశ మందిరంలో ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఆర్అండ్బీ, ఇరిగేషన్, టీజీ ఐఐసీ, రైల్వే శాఖ, పంచాయతీరాజ్ అధికారులతో భూ సేకరణ పనులపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇరిగేషన్ ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టులు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులతో పాటు వివిధ అభివృద్ధి పనులకు అవసరమైన భూసేకరణ, పెండింగ్లో ఉన్న భూసేకరణ పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవ్, సూపరింటెండెంట్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
మున్సిపాలిటీల్లో ఆదాయ వనరులపై పాలకవర్గాలు దృష్టి సారించాలి
సూర్యాపేట అర్బన్: మున్సిపాలిటీల్లో కొత్తగా ఏర్పడిన పాలకవర్గాలు వివిధ ఆర్థిక నిధులతో పట్టణ ప్రగతికి ప్రణాళిక తయారు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ఆర్థిక నిధులతో పాటు స్థానికంగా వచ్చే ఆదాయ వనరులపై దృష్టి సారించాల్సి ఉంటుంది. ప్రభుత్వాల నుంచి, స్థానికంగా వచ్చే నిధులపై సమగ్ర వివరాలు. పన్నుల ద్వారా ఆదాయం ముఖ్యంగా ఆస్తి పన్నుతో మున్సిపాలిటీలకు ఆదాయం సమకూరుతుంది. అలాగే పబ్లిసిటీకి సంబంధించి విద్య తదితర సంస్థల హోర్డింగ్ లు, సైన్ బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుంటారు. వాటి నుంచి వచ్చే ప్రకటన పన్నులపై ప్రత్యేక దృష్టి సారించాలి. నీటి పన్ను రాబట్టాలి. దుకాణాల లైసెన్స్లు, ట్రేడ్ లైసెన్సులు, హోటళ్లు, సినిమా థియేటర్ల అనుమతులకు రుసుం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కొత్తగా ఇంటి నిర్మాణాలు, షాపింగ్ కాంప్లెక్స్ సముదాయాలు, నిర్మాణ ప్లాన్ల ఆమోదానికి పన్నులు వసూలు చేస్తారు. మున్సిపాలిటీ నుంచి నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాల అద్దెలు, సంతలు, మాంసం దుకాణాలు, తైబజార్ లాంటి వాటితో మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది. 14వ ఆర్థిక సంఘం నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏటా రెండు విడతలుగా మున్సిపాలిటీ జనాభాకు అనుగుణంగా 14వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తుంది. ఇవి ప్రతి ఏటా ఏప్రిల్ మొదటి వారం, డిసెంబర్ చివరి వారంలో నేరుగా మున్సిపాలిటీ ఖాతాల్లో జమవుతాయి. వీటితో వివిధ వార్డుల్లో సీసీరోడ్లు నిర్మించే అవకాశం ఉంది ప్లానింగ్, నాన్ ప్లానింగ్ మున్సిపాలిటీల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాల కార్యక్రమాలు అమలు చేస్తాయి. ముఖ్యంగా స్వచ్ఛభారత్, మన పట్టణ ప్రణాళిక కార్యక్రమాలు విజయవంతం చేసి ఆయా వార్డులో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడానికి వినియోగిస్తారు. స్టేట్ ఫైనాన్స్ నిధులు జనాభా ప్రతిపాదికన మున్సిపాలిటీలకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా స్టేట్ ఫైనాన్స్ నిధులు విడుదల చేస్తుంది. అయితే రెండు మూడేళ్లుగా ఇవి సక్రమంగా రావడం లేదు. తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ పేరుతో డబ్బులు విడుదల చేస్తుంది. వీటిని పారిశుద్ధ్యానికి వివిధ రకాల పరికరాల కొనుగోలు చేసేందుకు ఖర్చు చేస్తారు. కౌన్సిల్ సమావేశంలో సభ్యుల తీర్మానం చేసిన తర్వాత ఈ నిధులను ఖర్చు చేయాలి. అడిషనల్ స్టేట్ ఫైనాన్స్ పేరుతో వచ్చే నిధులతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. మున్సిపాలిటీల్లోని ఎస్సీ, ఎస్టీ వార్డుల్లో సీసీ రోడ్లు, ములుగు కాలువల నిర్మాణాలు తదితర అభివృద్ధి పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు మంజూరు చేస్తుంది. వీటిని ఆయా వర్గానికి చెందిన వార్డుల్లో మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. కొత్తగా ఎన్నికై న పాలకవర్గం మున్సిపాలిటీ ఆదాయ వనరులు పెంచుకొని ప్రజలకు మౌలిక వసతులతో పాటు మెరుగైన పాలన అందించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపాలిటీ ప్రజలు కోరుతున్నారు. -
పెన్షనర్ల సమస్యలపై నిరంతర పోరాటం
నేరేడుచర్ల : నేరేడుచర్ల మండల కేంద్రంలోని పెన్షనర్ల భవనంలో శనివారం సామూహిక జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ నెలలో జన్మించిన భువనగిరి లక్ష్మమ్మ, గుంపుల విజయతో కేక్ కట్ చేయించి సత్కరించారు. ఈ సందర్భంగా పెన్షనర్ల సంఘం నేరేడుచర్ల అధ్యక్షుడు చింతకుంట్ల పూర్ణచంద్రారెడ్డి మాట్లాడుతూ.. పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేస్తున్నామని తెలిపారు. హెల్త్కార్డులు లేని వారికి ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలన్నారు. 2024 ఏప్రిల్లో ఉద్యోగ విరమణ పొందిన పెన్షనర్లకు రావాల్సి న గ్రాట్యూటీ, ఏరియర్స్ చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో లక్ష్మారెడ్డి, రంగారెడ్డి, లక్ష్మీకాంతమ్మ, సత్యనారాయణ, వీరభద్రారావు, వెంకటేశ్వర్లు, బుద్దారెడ్డి, సుందరయ్య, వీరారెడ్డి, మంగ్య, శ్రీరామ్రెడ్డి, జయసుందర్రావు, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.


