breaking news
Suryapet
-
ఇరుకు దారులు.. వాహనాల బారులు
సూర్యాపేట అర్బన్: సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని పాత మార్కెట్ ప్రాంతంలో సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ సమస్య తీవ్ర రూపం దాల్చుతోంది. ఇరుకై న రోడ్లు, అక్రమ పార్కింగ్లు, రోడ్లపైనే వ్యాపారాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుడకుడ రోడ్డు నుంచి పాత మార్కెట్ వరకు, కొత్త బస్టాండ్ ఫ్లైఓవర్ ప్రాంతంలో సాయంత్రం అయ్యిందంటే వాహనాలు బారులు కడుతున్నాయి. ఆటోలు, ద్విచక్ర వాహనాలతో పాటు లారీలు, ప్రైవేట్ స్కూల్ బస్సులు సైతం రోడ్లపైనే గంటల తరబడి నిలుపుతుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. అత్యవసర సేవలకూ తప్పని తిప్పలు ప్రధాన రహదారులతోపాటు కాలనీ రోడ్లలోనూ వాహనాలను ఇష్టానుసారంగా పార్కింగ్ చేస్తున్నారు. అంబులెన్సులు కూడా రాలేని పరిస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్కు వెళ్లాలంటే భయం పాత మార్కెట్ చుట్టూ రోడ్డుకు ఇరువైపులా కూరగాయల దుకాణాలు, తోపుడు బండ్లు రోడ్డుపైకి విస్తరించడంతో నడిచి వెళ్లడమే కష్టంగా మారింది. సాయంత్రం వేళల్లో ఇక్కడకు వచ్చే మహిళలు, వృద్ధులు తీవ్ర నరకయాతన అనుభవిస్తున్నారు. వాహనాల యజమానులను ప్రశ్నిస్తే గొడవలకు దిగుతున్నారని వాపోతున్నారు. రోడ్లను ఆక్రమించి వాహనాలు నిలుపుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. పోలీసులు వచ్చి తొలగించినా, ఆ తర్వాత పరిస్థితి మళ్లీ మొదటికే వస్తోందని పట్టణ వాసులు పేర్కొంటున్నారు. సూర్యాపేట పాత మార్కెట్లో ట్రాఫిక్ అవస్థలు -
బుల్లెట్ రైల్ సాధనకు ప్రభాత ర్యాలీ
సూర్యాపేట : శంషాబాద్ నుంచి చైన్నె వెళ్లే బుల్లెట్ రైల్ అలైన్మెంట్ను సూర్యాపేట మీదుగా కొనసాగించే వరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని సూర్యాపేట పట్టణ వర్తక, వ్యాపార, వాణిజ్య, విద్య, వైద్య, వృత్తి సంఘాల ప్రతినిధులు ప్రకటించారు. ఈమేరకు గురువారం సూర్యాపేటలో ప్రభాత భేరీ మోగించాయి. పట్టణంలోని సద్దల చెరువు బతుకమ్మ ఘాట్ దీక్షా శిబిరం నుంచి శంకర్ విలాస్, ఎంజీ రోడ్డు మీదుగా కొత్త బస్టాండ్ వరకు బుల్లెట్ ట్రైన్ సాధన లక్ష్యంగా భారీ ర్యాలీ నిర్వహించారు. బుల్లెట్ ట్రైన్ సాధనకు మరెన్నో ఉద్యమాలు కొనసాగిస్తామన్నారు. అవసరమైతే పట్టణ బంద్కు కూడా వెనకాడబోమని ప్రకటించారు. అనంతరం కొత్త బస్టాండ్ ఫ్లైఓవర్ వద్ద మానవహారం నిర్వహించారు. ర్యాలీలో పట్టణ వర్తక వాణిజ్య వ్యాపార సంఘాలతో పాటు ప్రైవేట్ విద్యాసంస్థలు, వైద్యులు, వృత్తి సంఘాల నాయకులు, బుల్లెట్ ట్రైన్ సాధన ఉద్యమ నేతలు పాల్గొన్నారు. -
ఆయిల్ పామ్ రైతులకు సహకారం అందిస్తాం
సూర్యాపేట : ఆయిల్ పామ్ తోటలను సాగు చేసే రైతులకు ప్రభుత్వం ద్వారా అన్ని రకాల వసతులు, రాయితీలు కల్పిస్తామని జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి తీగల నాగయ్య అన్నారు. గురువారం కలెక్టరేట్లో ఆయిల్ పామ్ రైతు సంఘం ప్రతినిధులు, ఆయిల్ ఫెడ్ అధికారులు, ఉద్యాన శాఖ అధికారులు, డ్రిప్ కంపెనీ సిబ్బందితో సంయుక్తంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయిల్ పామ్ సాగు చేసే రైతులు పలు డిమాండ్లను జిల్లా ఉద్యాన అధికారికి విన్నవించారు. సమావేశంలో ఉద్యాన సాంకేతిక అధికారి ముత్తినేని మహేష్, ఉద్యాన అధికారులు కట్ట స్వాతి, అనిత, ప్రదీప్తి, ప్రమిత, ఆయిల్ ఫెడ్ జిల్లా మేనేజర్ అలీమ్, ఎంఈ ఇంజనీర్ నరేష్, ఆయిల్ పామ్ రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. ఫ జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి నాగయ్య -
ముడుపుల మాయ!
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో కొందరు అధికారుల తీరు విస్తూ పోయేలా ఉంది. అక్రమ సంపాదన ధ్యేయంగా పనిచేస్తున్నారు. భూములు ఏవైనా జేబు నింపితే చాలు అనుమతులు ఇచ్చేద్దాం అన్న తీరుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ జీఓలు, చట్టాలను ఆసరాగా చేసుకుని కబ్జాకు పాల్పడిన ప్రభుత్వ భూములు, నిషిద్ధ భూములను సైతం దర్జాగా పట్టాలు చేస్తున్నారు. ఇదే సమయంలో సామాన్య జనం చిన్నచిన్న కారణాలతో కార్యాలయాల చుట్టూ తిరిగిన వారికి మాత్రం పనులు చేయడం లేదు. ఇలా అక్రమాలకు పాల్పడుతూ ఏదో ఒక సమయంలో ఏసీబీకి అడ్డంగా దొరికిపోతున్నారు. వీరే కాకుండా చాలామంది అధికారులు దొరికితే దొంగ లేదంటే దొరలా జిల్లాలో తమ పనులు కానిస్తున్నారు. అక్రమంగా అనుమతులు.. సూర్యాపేట జిల్లా కేంద్రంతో పాటు మున్సిపాలిటీలైన కోదాడ, హుజూర్నగర్, తిరుమలగిరి, నేరేడుచర్లలో ప్రభుత్వ నిబంధన ప్రకారం ఇళ్ల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. అయితే మున్సిపాలిటీ అధికారులు మాత్రం తమ చేయి తడిపితే అనుమతులు ఇచ్చేసి వారు ఏ విధంగా ఇంటి నిర్మాణాలు చేపట్టినా కూడా అటువైపు కన్నెత్తి చూడని పరిస్థితి నెలకొంటుంది. మున్సిపాలిటీల పరిధిలో వ్యవసాయ భూములుగా ఉండి, వ్యవసాయేతర భూములుగా కన్వర్ట్ కానప్పటికీ ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేస్తున్నారు. వీటికి ప్రభుత్వం నిబంధనలు అనుమతించకపోయినప్పటికీ పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రెవెన్యూ విభాగంలోనూ.. కోర్టు కేసులు, వివాదాస్పద భూములకు సైతం సంబంధిత అధికారులు పెద్ద ఎత్తున ముడుపులు తీసుకుంటూ ఏకపక్షంగా అనుమతులు ఇచ్చేస్తున్నారు. అక్రమంగా పట్టా చేసే వ్యవసాయ భూములు ఎన్ని ఎకరాల్లో ఉంది.. ఎంత వసూలు చేయాలన్నది ఒక్కోదానికి ఒక్కో రేటు కట్టి వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున లావాదేవీలు జరుగుతుండగా కొన్ని కొన్ని సందర్భాల్లో అధికారులు, మధ్యవర్తులు, వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకునే వారి మధ్య తలెత్తే వివాదాల కారణంగా బయటికి పొక్కుతున్నాయి. లేదంటే జేబులు నింపుకుంటూ అక్రమ పట్టాలను సైతం దర్జాగా కానిచ్చేస్తున్నారు. ఈ క్రమంలో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లి కొందరు సస్పెండ్ అవుతుండగా మరికొందరు ఏసీబీకి చిక్కుతున్నారు. ఫ డబ్బులిస్తే ప్రభుత్వ నిషేధ భూముల్లో నిర్మాణాలకు అనుమతులు ఫ కబ్జాకు పాల్పడిన భూములు, నిషిద్ధ భూములకు సైతం దర్జాగా పట్టాలు ఫ అన్ని అనుమతులు ఉన్న వారికి మాత్రం కొర్రీలతో సతాయింపు జిల్లాలోని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖలు, పోలీస్ శాఖలో ఉన్న అధికారులు సైతం ఇదేవిధంగా పనిచేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక అన్ని శాఖల్లోనూ ప్లానింగ్ అధికారులు ఒక్కో పనికి ఒక్కో రేట్లు ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నారు. జిల్లా ప్లానింగ్ కార్యాలయం, ట్రెజరీ కార్యాలయంలో చేయితడపనిది పనులు కావట్లేదన్న విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. -
పాలిటెక్నిక్ విద్యలో శక్తి ప్రోగ్రామ్ను కలపొద్దు
రామగిరి(నల్లగొండ) : పాలిటెక్నిక్ విద్యలో శక్తి ప్రోగ్రామ్ను కలపవద్దని, తక్షణమే జీవో నంబర్ 97ను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ పాలిటెక్నిక్ విద్యార్థులు మండిపడ్డారు. గురువారం నల్లగొండలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు మహాధర్నా, భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. విద్యార్థుల ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ప్లకార్డులతో నినాదాలు చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఐదు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన విద్యార్థులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. శక్తి విధానం వల్ల పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు ఇంజనీరింగ్కు దూరమయ్యే ప్రమాదం ఉందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 97 విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసేలా ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ జీవోను రద్దు చేయకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఫ నల్లగొండలో పాలిటెక్నిక్ విద్యార్థుల మహా ధర్నా, ర్యాలీ -
ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకోవాలి
భానుపురి (సూర్యాపేట) : పోరాటంలో చాకలి ఐలమ్మ చూపిన ధైర్యం, పోరాట పటిమ తరతరాలకు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా గురువారం కలెక్టరేట్లో ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ వంటి మహానాయకుల చరిత్రను నేటి తరానికి అందిస్తూ, యువత చదువుతో పాటు అన్ని రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో ఎస్పీ నరసింహ, అదనపు కలెక్టర్ హరిసింగ్, డీఆర్ఓ ప్రేమ్ రాజ్, బీసీ వెల్ఫేర్ అధికారి విశాల్, నాయకులు ఊరా రామ్మూర్తి యాదవ్, బొమ్మగాని శ్రీనివాస్, చింతలపాటి చిన్న శ్రీరాములు, మట్టిపల్లి సైదులు, పోతుగంటి వీరాచారి, చల్లమల నరసింహ, తల్లమల్ల హసేన్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి
చివ్వెంల(సూర్యాపేట) : జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి శివరాం ప్రసాద్ అన్నారు. గురువారం జల్లా కోర్టు ప్రాంగణంలో పీపీలు, కోర్టు కానిస్టేబుల్స్కు ఈ నెల 12న నిర్వహించే లోక్ అదాలత్పై సమీక్షా సమావేశం నిర్వహించారు. సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్న సివిల్, క్రిమినల్, విద్యుత్, మోటార్ వెహికల్, బ్యాంకు, గృహహింస, ఎకై ్సజ్ వంటి కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. దీంతో ఇరువర్గాల వారు గెలిచిన వారవుతారని, అప్పీల్కు వెళ్లే అవకాశం ఉండదన్నారు. సమావేశంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి భవ్య, పీపీలు, కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
తిరిగి.. తిరిగి అక్కడికే!
కోదాడ పట్టణ పరిధిలోని తమ్మరకు చెందిన కనగాల జనార్దన్రావు తమ్మర చెరువు ఆక్రమణ జరిగిందని, దీనిపై విచారణ చేయాలని తహసీల్దార్, ఆర్డీఓకు ఫిర్యాదు చేశాడు. వారు పట్టించుకోకపోవడంతో గత నెల 29న కలెక్టరేట్కు వెళ్లి ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని మరుసటి రోజు సదరు ఫిర్యాదును కోదాడ ఆర్డీఓకు పంపారు. ఆర్డీఓ ఈ నెల 6న అదే దరఖాస్తును తిరిగి కోదాడ తహసీల్దార్కు పంపి చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీరంగాపురానికి చెందిన పల్లా సీతరామాంజనేయులకు వంశపారపర్యంగా వస్తున్న భూమి ఉంది. ఇతని పాలివాళ్లు ఇదే సర్వేనెంబర్లో భూమి అమ్మగా ఇతరులు కొనుగోలు చేశారు. వారు కొనుగోలు చేసిన భూమి కన్నా ఎక్కువగా అక్రమంగా పట్టా చేసుకున్నారు. దీనిపై సీతరామాంజనేయులు తహసీల్దార్, ఆర్డీవోలపై ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుపై విచారణ చేయాల్సిన అధికారులు తిరిగి ఆర్డీవోకే పంపించారు. మండల, డివిజన్ స్థాయి అధికారులు పట్టించుకోవడం లేదనే కలెక్టర్కు విన్నవించుకునేందుకు సూర్యాపేటకు వెళ్తున్నాం. తీరా అక్కడ అర్జీ ఇస్తే, మళ్లీ ఆ దరఖాస్తును విచారణ పేరుతో అదే అధికారులకు పంపితే ఏం ప్రయోజనం. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులపై ప్రత్యేక అధికారితో విచారణ జరిపించాలి. లేకపోతే ప్రజావాణి అనేది కేవలం ఒక ప్రహసనంగా మారే ప్రమాదం ఉంది. – కుదరవెల్లి బసవయ్య, కోదాడ కోదాడ: కిందిస్థాయి అధికారులు స్పందించడం లేదని.. జిల్లా కేంద్రంలోని ప్రజావాణికి వెళ్తే, ఆ అర్జీలు మళ్లీ కిందిస్థాయి అధికారుల వద్దకే తిరిగొస్తున్నాయి. కలెక్టర్ స్పందిస్తారన్న ఆశతో వెళ్లిన సామాన్యులకు నిరాశే మిగులుతోంది. సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న ప్రజావాణి తీరుపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్కు ఇచ్చే అర్జీల దుస్థితే ఇలా ఉంటే.. డివిజన్, మండల స్థాయిల్లో జరిగే ప్రజావాణి పరిస్థితి ఏంటని బాధితులు వాపోతున్నారు. ఆర్టీఐ ద్వారా సమాచారం అడిగినా.. ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, ఎన్ఎస్పీ భూముల ఆక్రమణలపై వస్తున్న ఫిర్యాదులు బుట్టదాఖలవుతున్నాయి. కోదాడ ప్రభుత్వ వైద్యశాల భూమి ఆక్రమణపై పలుమార్లు కలెక్టరేట్లో ఫిర్యాదులు ఇచ్చినా ఏళ్లు గడుస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఆర్టీఐ ద్వారా సమాచారం అడిగినా అధికారులు సమాధానం దాటవేస్తున్నారు. తప్పు తేలినా... చర్యలు శూన్యం కోదాడ పరిధిలోని ఎన్ఎస్పీ భూములున్న సర్వే నంబర్ 148లో ఆక్రమణలు నిజమేనని కలెక్టర్ చేయించిన సర్వేలో తేలింది. ప్రభుత్వం కొనుగోలు చేసిన భూమి కంటే అక్కడ 10 గుంటలు తక్కువగా ఉందని సర్వేయర్ నివేదిక ఇచ్చారు. అలాగే ప్రభుత్వ ఆస్పత్రికి దాత ఇచ్చిన రెండెకరాల్లో 20 గుంటల భూమి తక్కువగా ఉన్నట్లు స్పష్టమైంది. ఆక్రమణలు నిరూపితమైనా అధికారులు ఆ భూములను రికవరీ చేయకుండా కాలయాపన చేస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఫ ప్రజావాణిపై ప్రజల పెదవిరుపు ఫ కిందిస్థాయి అధికారులు స్పందించక పోవడంతో కలెక్టరేట్లో ఫిర్యాదు ఫ ఆ అర్జీలను పరిష్కరించాలని తిరిగి వారికే పంపిస్తున్న ఉన్నతాధికారులు -
తహసీల్దార్ కార్యాలయానికి తాళం
పాలకవీడు: రెండేళ్లుగా అద్దె బకాయి చెల్లించకపోవడంతో భవన యజమాని తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేశాడు. ఈ ఘటన పాలకవీడు మండలంలో గురువారం చోటుచేసుకుంది. తన కుటుంబ ఆర్థిక అవసరాలకు ఆసరాగా ఉంటుందనే ఉద్దేశంతో తాను నివసిస్తున్న ఇంటిని తహసీల్దార్ కార్యాలయానికి అద్దెకు ఇచ్చాడు. నెలకు రూ.13,800 చొప్పున 24 నెలలకు రూ.3,31,000 అద్దె బకాయి రావాల్సి ఉందని భవన యజమాని తెలిపాడు. ఉన్న అద్దైపె ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి 5 శాతం చొప్పున అద్దె పెంచుతామని 2016లో ఒప్పదం కుదుర్చుకున్నట్లు చెప్పాడు. గత రెండేళ్లుగా అద్దె చెల్లించకపోవడంతో కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యలయాల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాలేదని, గత్యంతరం లేక కార్యాలయానికి తాళం వేయాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. దీనిపై తహసీల్దార్ను వివరణ కోరగా ఉన్నతాధికారులతో మాట్లాడి, బకాయిలో 50 శాతం అద్దె చెల్లించినట్లు, మిగిలిన అద్దె త్వరలో చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో యజమాని గేటుకు తాళం తీసినట్లు పేర్కొన్నారు. -
‘19న కోదాడలో మెగా జాబ్మేళా.. సద్వినియోగం చేసుకోవాలి’
సాక్షి, సూర్యాపేట జిల్లా: ఈ నెల 19న కోదాడలో మెగా జాబ్మేళా నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కోదాడ సీసీ రెడ్డి కన్వెన్షన్ హాల్లో జాబ్మేళా నిర్వహించనున్నారు. కోదాడ మెగా జాబ్మేళా ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షలో కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతీ రెడ్డి, సూర్యాపేట కలెక్టర్, ఎస్పీ, సింగరేణి, పరిశ్రమల శాఖ అధికారుల హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు నిరంతర కృషి చేయాలని పిలుపునిచ్చారు. అర్హులైన యువత జాబ్మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఒక్క ఉద్యోగం యువత జీవితాన్నే కాదు. కుటుంబ భవిష్యత్తునూ మారుస్తుంది. అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు యువత ముందుకు రావాలి. యువత ప్రతిభకు, నైపుణ్యానికి తగిన అవకాశాలు కల్పించడమే లక్ష్యమన్నారు.ప్రతి నిరుద్యోగ యువతకు జాబ్మేళా సమాచారం చేరేలా ప్రచారం చేపట్టాలి. హుజూర్నగర్ మెగా జాబ్మేళా స్ఫూర్తితో కోదాడలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాం. హుజూర్నగర్ జాబ్మేళాకు దాదాపు 40 వేల మంది నమోదు చేసుకున్నారు. 20,463 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. కోదాడ జాబ్మేళా యువత కలలకు కొలువు దారి కావాలి. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించి జాబ్మేళాకు పంపాలి’’ అని ఉత్తమ్ పేర్కొన్నారు. -
నియంతలా వ్యవహరిస్తున్న రేవంత్రెడ్డి
కోదాడ: ప్రజాస్వామ్య దేశంలో నియంతలకు చోటు లేదని, నియంతలా వ్యవహరిస్తున్న సీఎం రేవంత్రెడ్డి ఎక్కువ రోజులు పాలన సాగించలేరని, ఆయన ఇంటికి పోయే రోజులు దగ్గర పడ్డాయని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. బుధవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షాల నోరు నొక్కడానికి ప్రయతించడాన్ని ప్రజాస్వామ్య వాదులు తీవ్రంగా ఖండించాలన్నారు. ఈ నెల 2 నుంచి 8 వరకు ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. ఇదే స్ఫూర్తితో కోదాడ నియోజకవర్గంలోని ప్రజా సమస్యలపై ఉద్యమిస్తామన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు ఎస్కే. నయీం, సంపెట ఉపేందర్, ఇమ్రాన్ఖాన్, అబ్బు, తదితరులు పాల్గొన్నారు. ఫ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ -
మట్టి వినాయక విగ్రహాలను పూజించాలి
భానుపురి (సూర్యాపేట) : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి, పూజించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పిలుపునిచ్చారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రూపొందించి వాల్ పోస్టర్ను బుధవారం కలెక్టర్ చాంబర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ విగ్రహాలు, కృత్రిమ రంగుల వినియోగంతో నీటి వనరులు కలుషితమయ్యే ప్రమాదం ఉందన్నారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి ఏఈఎస్ పురుషోత్తంరెడ్డి, వీరస్వామి, తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
రైల్వే లైన్ సాధకు కలిసి పోరాడుదాం
సూర్యాపేట : సూర్యాపేటకు రైల్వేలైన్ సాధనకు అందరం కలిసి పోరాడుదామని, అందుకు వాసవి సేవా సమితి మద్దతు ప్రకటిస్తుందని వాసవి సేవా సమితి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బచ్చు పురుషోత్తం, దేవరశెట్టి నాగరాజు అన్నారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట రైల్వే సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లక్ష పోస్టు కార్డుల ఉద్యమంలో వారు పాల్గొని ప్రధానమంత్రికి రాసిన 1000 పోస్ట్ కార్డులను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాకు రైల్వే మార్గం వస్తే మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ప్రకటించిన బుల్లెట్ రైలు మార్గాన్ని కొంతమంది తమ స్వార్ధం కోసం ఇతర మార్గాలకు మళ్లించారన్నారు. రైల్వేలైన్ సాధించే వరకు పోరాట సమితి వారితో తాము కలిసి ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో రైల్వే సాధన సమితి కన్వీనర్ డేగల జనార్దన్, సభ్యులు బిక్కుమల్ల ఉపేందర్, రాచూరి ప్రతాప్, నల్లపాటి అప్పారావు, భద్రయ్య, మంజుల, అంజయ్య, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత గుండా రమేష్, వాసవి సేవా సమితి కోశాధికారి సోమ ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షులు మిరియాల సుధాకర్, రాచకొండ శ్రీనివాస్, మహంకాళి ప్రణీత్, కలకోటి నరసయ్య, సహాయ కార్యదర్శిలు కర్నాటి కృష్ణ, బచ్చు శ్రీనివాస్, తప్సి అనిల్, ధనుంజయ్ పాల్గొన్నారు. 27వ రోజు కొనసాగిన దీక్షలు బుల్లెట్ ట్రైన్ సాధన రిలే నిరాహార దీక్షలు 27వ రోజు కొనసాగాయి. దీక్షలో తెలంగాణ రైతాంగ సమితి నాయకులు నల్లెడ రాంరెడ్డి, అబ్దుల్ కరీం, వెంకన్న యాదవ్, నరేశ్, సురేందర్, మాధవరెడ్డి యార్కచర్ల శోభ, సుధాకర్, క్రాంతికుమార్, మహేష్, తదితరులు కూర్చున్నారు. దీక్షలకు ధర్మార్జున్, రామనాచారి, చల్లమల్ల నరసింహ, పేర్ల నాగయ్య, విజయశ్రీ, మల్లయ్య, వనిత మద్దతు తెలిపారు.ఫ ప్రధానికి వాసవి సేవాసమితి పోస్టు కార్డులు -
13న కబడ్డీ జిల్లా జట్ల ఎంపిక పోటీలు
మునగాల: ఈ నెల 26 నుంచి 29 వరకు వేములవాడలో జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్లను ఈ నెల 13న ఎంపిక చేయనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లం ప్రభాకర్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. జూనియర్ బాలుర విభాగంలో 20 సంవత్సరాల లోపు, 75 కిలోల లోపు బరువు ఉండాలని, సబ్ జూనియర్ బాలికల విభాగంలో 16 ఏళ్ల లోపు వయస్సు, 55 కిలోలలోపు బరువు కలిగి ఉండాలని సూచించారు. ఎంపికకు హాజరయ్యే క్రీడాకారులు ఆధార్కార్డు, టెన్త్ మెమో జిరాక్స్ను వెంట తీసుకొని రావాలని, వివరాలకు సెల్ : 9573962957, 9704095937 నంబర్లను సంప్రదించాలని కోరారు. అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కుతుంగతుర్తి : అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడమే ప్రధాన లక్ష్యమని అదనపు కలెక్టర్ హరిసింగ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ఓటరు జాబితాపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా నియోజకవర్గంలో 50 వేల ఓటర్లకుపైగా వివరాలు సరిగా లేకపోవడంతో నోటీసులు అందించినట్లు తెలిపారు. నోటీసులు అందుకున్న వారు ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన 13 పత్రాల్లో ఏదైనా ఒకటి చూపించి వివరాలను సరి చేసుకోవాలని సూచించారు. నవంబర్ 5 వరకు వివరాలను సరి చేసుకోవాలని. నవంబర్ 9న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో తహసీల్దార్ దయానందం పాల్గొన్నారు. శివపార్వతుల కల్యాణం మఠంపల్లి: మండలంలోని మట్టపల్లి క్షేత్రంలో గల శివాలయంలో బుధవారం పార్వతీ పరమేశ్వరుల కల్యాణాన్ని, శ్రీవల్లీ, దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కల్యాణోత్సవం అనంతరం మహానివేదన చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ చలపతి, అర్చకులు పాల్గొన్నారు. లక్ష్మీనరసింహునికి నిత్యకల్యాణం మఠంపల్లి: మట్టపల్లిలోని రాజ్యలక్ష్మీ, చెంచులక్ష్మీ సమేత లక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని బుధవారం అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వా మి వారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, మూలవిరాట్కు పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం కల్యాణోత్సవంలో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, రుత్విగ్వరణం, పంచగవ్యప్రాశన, మధుఫర్కపూజ, మాంగల్యధారణ, తలంబ్రాలు ఘనంగా నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు. ఉచితంగా పోలీస్ ఫిజికల్ ట్రైనింగ్రామగిరి(నల్లగొండ) : నల్లగొండలోని జై జవాన్ ట్రైనింగ్ సెంటర్లో పోలీస్ ఉద్యోగార్థులకు ఉచితంగా ఫిజకల్ ఈవెంట్స్ ట్రైనింగ్ ఇస్తున్నట్లు సెంటర్ నిర్వాహకుడు ఎక్స్ ఆర్మీ కొండోజు సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 17 నుంచి శిక్షణ ప్రారంభం అవుతుందని పేర్కొ న్నారు. ఆసక్తి గల వారు సెంటర్ను లేదా 9010471756 ఫోన్ నంబర్ను సంప్రదించాలని కోరారు. -
లక్ష్యం 750.. వచ్చింది 373
ప్రతి ఏడాది నిర్వహించే ఇన్స్పైర్ మనక్తో విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతతో పాటు మేథస్సుకు పదును పెట్టేందుకు వీలుంటుంది. తమకు రాదని కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు దరఖాస్తు చేసుకోవడం లేదు. అలాంటి అపోహలు వీడి అందరూ దరఖాస్తులు చేసుకోవాలి. ఇప్పటి వరకు జిల్లాలో 101 ప్రభుత్వ పాఠశాలల నుంచే దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 15తో గడువు ముగియనుంది. వెంటనే అన్ని పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు దరఖాస్తు చేసుకోవాలి. –దేవరాజ్, జిల్లా సైన్స్ అధికారి సూర్యాపేటటౌన్ : విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆలోచనా విధానాన్ని పెంపొందించడంతో పాటు వారిలో సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇన్స్పైర్ మనక్కు ఈ ఏడాది జిల్లాలో ఆదరణ అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. 6 నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులు ఇన్స్పైర్ మనక్కు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు వినూత్న ఆలోచనతో రూపొందించే ప్రాజెక్టులతో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. ఇందుకు పాఠశాలలు, కళాశాలల నుంచి ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రావడం లేదు. గతేడాది కంటే తక్కువే.. ఇన్స్పైర్ మనక్కు జూలైలో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా జిల్లాలో ఇప్పటి వరకు 373 దరఖాస్తులు మాత్రమే నమోదయ్యాయి. గతేడాది మొత్తం 654 దరఖాస్తులు వచ్చాయి. ఈ ఏడాది 750 దరఖాస్తులు లక్ష్యంగా విద్యాశాఖ నిర్ణయించగా అందులో సగం దరఖాస్తులే వచ్చాయి. ఈ ఏడాది దరఖాస్తుల సంఖ్య గణనీయంగా తగ్గడం విద్యాశాఖ, పాఠశాలల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శలు వినవస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఇన్స్పైర్ మనక్పై పెద్దగా ఆసక్తి చూపడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దరఖాస్తు గడువు మరో ఆరు రోజులే ఉంది. ప్రోత్సాహం అవసరం విద్యార్థుల్లో వినూత్న ఆలోచనలను ప్రోత్సహించి, వాటిని శాసీ్త్రయ నమూనాలుగా అభివృద్ధి చేసేందుకు ఇన్న్స్పైర్ మనక్ దోహదపడుతుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు తమ ప్రతిభను చాటుకునే అవకాశం కల్పించే ఈ కార్యక్రమంపై పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉండటంతో, ఈ అవకాశాన్ని వినియోగించుకొని మరింత మంది దరఖాస్తు చేసుకునేలా విద్యాశాఖ అధికారులు అవగాహన కల్పించాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. విద్యార్థుల్లో ఆసక్తి కలిగేలా వారిని ప్రోత్సహిస్తే జిల్లాకు మరిన్ని ఇన్స్పైర్ మనక్ ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది. ఎంపికై న వారికి రూ. 10వేలు విద్యార్థి ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత ప్రాజెక్టు నమూనా ప్రతిపాదన కూడా ఆన్లైన్ ద్వారానే పంపించాల్సి ఉంటుంది. ఎంపికై న ప్రతి ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ.10వేలు అందిస్తుంది. ఈ డబ్బులు నేరుగా విద్యార్థి ఖాతాలో జమ అవుతాయి. వీటితో విద్యార్థులు తమ ప్రాజెక్టును రూపొందించి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రదర్శనల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. గతేడాది జిల్లా నుంచి 58 ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాయి. జిల్లాలో పాఠశాలల వివరాలు.. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు : 375 ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు : 74 మోడల్ స్కూళ్లు : 09 కేజీబీవీలు : 18ఇన్స్పైర్ మనక్ దరఖాస్తుల్లో కనిపించని పురోగతి ఫ బాల శాస్త్రవేత్తలకు ప్రోత్సాహం కరువు ఫ ఆసక్తి చూపని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఫ గతేడాది 654 దరఖాస్తులు ఫ 15తో ముగియనున్న గడువు -
నిత్యావసరాల ధరల నియంత్రణలో విఫలం
భానుపురి (సూర్యాపేట) : దేశంలో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక అన్నారు. నిత్యావసరాల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ బుధవారం కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్పొరేటు శక్తులకు ఆర్థిక వనరులు చేకూరే విధంగా ప్రభుత్వాలు విధానపర నిర్ణయాలు తీసుకోవడం వల్లే నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలనంటుతున్నాయన్నారు. 14 రకాల నిత్యవసర వస్తువులను రేషన్ షాపుల ద్వారా సామాన్యులకు అందించాలన్నారు. అనంతరం డీఆర్వోకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షురాలు సూరం రేణుక, సహాయ కార్యదర్శి సంతోషిమాత, జిల్లా కమిటీ సభ్యులు ఐతరాజు పద్మ, కట్ట కల్పన, జయమ్మ, రేణుక, అనసూయ, గౌరమ్మ, మమత, రహమతి, మీనాక్షి, రాధా, కుమారి పాల్గొన్నారు. -
నిధులున్నా.. ఖర్చు చేయలేం
భానుపురి (సూర్యాపేట) : గ్రామ పంచాయతీల్లో నిధుల వినియోగంపై ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. దాంతో గ్రామాల్లో చిన్నచిన్న సమస్యల పరిష్కారానికి, అత్యవసర పనులకు సమయానికి నిధులు అందని పరిస్థితి నెలకొంది. పంచాయతీలు సొంతంగా సమకూర్చుకునే నిధులను సైతం ఖర్చు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఏ చిన్న పని చేయాలన్న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే 16వ ఆర్థిక సంఘం నిధుల పైనే ఆధార పడాల్సి వస్తుంది. రాష్ట్ర ఆర్థిక సంఘం కేవలం పారిశుద్ధ్య సిబ్బంది వేతనాలు చెల్లించి చేతులు దులుపుకుంటోంది. ఫలితంగా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు సైతం వీలులేకుండా పోతోందని సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాత పనులకే అధిక భాగం.. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 486 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వీటికి జనాభా ప్రాతిపదికన ఒక్కో గ్రామపంచాయతీకి రూ.10 లక్షల నుంచి 35 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తోంది. ఇందులో ఎక్కువ భాగం తాగునీరు, పారిశుద్ధ్య పనులకు మాత్రమే వీటిని వినియోగిస్తున్నారు. తరచూ పైప్ లైన్ల లీకేజీ, గేట్ వాల్స్ చెడిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతుండడంతో మరమ్మతులకు ఈ నిధులను ఖర్చు చేస్తున్నారు. బోరు మోటర్ల కొనుగోలు, వీధి దీపాల ఖర్చు గ్రామపంచాయతీలకు భారంగా మారుతోంది. కేంద్ర ఆర్థిక సంఘం నిధులు వీటికే ఖర్చవుతుండడంతో మిగతా వసతుల కల్పనకు దిక్కులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆంక్షలతో సమస్యలు..! గ్రామపంచాయతీలు సొంతంగా సమకూర్చుకున్న నిధుల ఖర్చుపై ఆంక్షలు ప్రధాన సమస్యగా మారాయి. ఇంటి పన్నులు, ఇతర అనుమతుల కోసం ప్రజలు గ్రామపంచాయతీలకు చెల్లించే నిధులు అత్యవసర పనులకు వినియోగించుకునే విషయంలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్టం ద్వారా ఆంక్షలు విధించారు. ఈ నిధులను మొదట గ్రామపంచాయతీ అకౌంట్లో జమ చేసి తిరిగి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నెలల తరబడి బిల్లులు చేతికి రాని పరిస్థితి ఉంది. దాంతో అత్యవసర పనులకు నిధులు లేక గ్రామపంచాయతీలు ఇబ్బందులు పడుతున్నాయి. గతంలో ఇలా సమకూరిన నిధులను అత్యవసర పనులకు ఖర్చు చేసి వాటికి బిల్లులు సమర్పిస్తే సరిపోయేది. పంచాయతీరాజ్ చట్ట ప్రకారం గ్రామపంచాయతీలు వసూలు చేసే పన్నులు పంచాయతీ అకౌంట్లలో జమచేయాలి. నిబంధనల ప్రకారం పంచాయతీలు ఖర్చు చేసే నిధులకు బిల్లులు సమర్పించాలి. గతంలో జనరల్ నిధులపై ఫ్రీజింగ్ ఉండేది కాదు. – యాదగిరి, డీపీఓ పంచాయతీ ఖజానాకు ఆంక్షల తాళం ఫ జనరల్ ఫండ్స్ ‘ఫ్రీజింగ్’తో నిధుల సమస్య ఫ కేవలం 16వ ఆర్థిక సంఘం నిధులపైనే ఆధారం ఫ అత్యవసర, చిన్న పనులకు నిధులు కరువు జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు కొత్త పాలక వర్గాలు ఎన్నికై ఏడాది కావొస్తుంది. గతంలో ఉన్న పెండింగ్ నిధులను ప్రభుత్వం విడుదల చేయగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొద్ది మొత్తంలోనే గ్రామపంచాయతీలకు నిధులు అందాయి. కొత్తగా ఎన్నికై న సర్పంచ్లు ఇప్పటికే ఎన్నికల్లో ఖర్చు చేసి తిరిగి పంచాయతీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సొంతంగా ఖర్చు చేసేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. దాంతో పలు గ్రామపంచాయతీలో సమస్యలు పేరుకుపోయాయి. -
ఉద్యోగుల హక్కుల సాధనకు పోరాటం
హుజూర్నగర్ : ఉద్యోగుల హక్కులు సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని టీజేఏసీ జిల్లా చైర్మన్ దున్న శ్యామ్, కో–చైర్మన్ అంజయ్య అన్నారు. ఉద్యోగుల హక్కుల సాధన సభకు సంబంధించిన వాల్ పోస్టర్ను బుధవారం హుజూర్నగర్లో తహసీల్దార్ కవిత, ఉద్యోగులతో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు. సభకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు. కార్యక్రమంలో ఎస్టీఓ రమేష్, డీటీలు శ్రీనివాస్, నాగేందర్, డీవైఎస్ఓ అశోక్ బాబు, ఆర్ఐలు శ్రీనివాస్, షరీఫ్, సిబ్బంది, టీఎన్జీఓ నాయకులు పాల్గొన్నారు. -
తుది దశకు నియామకాలు
ఇంటర్మీడియట్ మార్కుల మెరిట్ (70 మార్కులు), ప్రత్యేక కేటగిరీల ప్రాధాన్యత (వితంతువులకు 10 మార్కులు, అనాథలకు 5 మార్కులు, దివ్యాంగులకు 5 మార్కులు), జిల్లా సెలక్షన్ కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూలు (10 మార్కులు) ప్రాతిపదికగా, రోస్టర్ నిబంధనలను పాటిస్తూ ఈ తాత్కాలిక జాబితాను సిద్ధం చేశారు. పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయితే అంగన్వాడీల్లో చిన్నపిల్లలు, బాలింతలు, గర్భిణులకు సేవలు మరింత మెరుగ్గా అందుతాయని, అలాగే ప్రస్తుత సిబ్బందిపై ఉన్న పనిభారం తప్పుతుందని భావిస్తున్నారు. భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో అంగన్వాడీ పోస్టుల భర్తీ ప్రక్రియ తుది ఘట్టానికి చేరింది. ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో జిల్లా యంత్రాంగం వేగంగా కసరత్తు పూర్తిచేసి తాత్కాలిక ఎంపిక జాబితాను విడుదల చేసింది. దాదాపు మూడు నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్న 131 ఖాళీల భర్తీకి ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో, జిల్లా యంత్రాంగం ఈ ఏడాది జూలై 9న నోటిఫికేషన్ విడుదల చేసింది. పారదర్శకంగా దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసిన అధికారులు తాజాగా తాత్కాలిక ఎంపిక జాబితాను రూపొందించారు. ఈ జాబితాను సంబంధిత అంగన్వాడీ కేంద్రాలు, సీడీపీఓ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు. జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే తగిన ఆధారాలతో ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు సంబంధిత సీడీపీఓ కార్యాలయాల్లో రాతపూర్వకంగా అందజేయాలని జిల్లా అధికారులు సూచించారు. గడువు ముగిసిన తర్వాత వచ్చే ఫిర్యాదులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణనలోకి తీసుకోమని స్పష్టం చేశారు. అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం తుది జాబితాను వెల్లడించనున్నారు. జిల్లాలో 1,209 అంగన్వాడీ కేంద్రాలు జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ పరిధిలో సూర్యాపేట అర్బన్, చివ్వెంల, తుంగతుర్తి, హుజూర్నగర్, కోదాడ ప్రాజెక్టుల కింద మొత్తం 1,209 అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. ఉద్యోగుల రిటైర్మెంట్తో పాటు ఇతర కారణాల వల్ల 67 టీచర్, 64 ఆయా పోస్టులు ఖాళీగా మారాయి. గతంలో పలుమార్లు నియామక ప్రక్రియ వేగవంతమైనట్లే కనిపించి వాయిదా పడుతూ వచ్చింది. కాగా.. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రక్రియ వేగం అందుకుంది. ఫ అంగన్వాడీ పోస్టుల తాత్కాలిక జాబితా విడుదల చేసిన అధికారులు ఫ ఈ నెల 11వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ ఫ అనంతరం తుది జాబితా వెల్లడి ఫ భర్తీతో తీరనున్న సిబ్బంది కొరత -
ఓటు హక్కును పరిరక్షించడమే లక్ష్యం
భానుపురి (సూర్యాపేట) : అర్హత కలిగిన ప్రతి పౌరుడి ఓటు హక్కును పరిరక్షించడమే ప్రధాన లక్ష్యమని ‘సర్’ జిల్లా పరిశీలకురాలు ఎ. దేవసేన తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో, కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆధ్వర్యంలో ‘ఎస్ఐఆర్’ కార్యక్రమంపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ప్రధాన సమస్యలు గుర్తించలేదని తెలిపారు. అర్హత లేని వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడంతో పాటు, అర్హత కలిగిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు లభించేలా చూడటమే ఎస్ఐఆర్ ప్రధాన ఉద్దేశమని వివరించారు. వివాహిత మహిళల పేర్ల మార్పులు, పేర్లలోని అక్షర దోషాలను స్వీయ ప్రకటన ద్వారా సరిచేసుకునే అవకాశం ఉందన్నారు. మిగిలిన అంశాలకు సంబంధించి ఎన్నికల సంఘం సూచించిన ధ్రువపత్రాల్లో ఏదో ఒకదాన్ని తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ.. మ్యాపింగ్ కాని వారు, అలాగే ఓటరు జాబితాలో చిరునామా, వయస్సు తదితర వివరాల్లో తేడాలున్న 1,94,106 మంది ఓటర్లను గుర్తించి వారికి నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి.హరి సింగ్, డీఆర్ఓ ప్రేమ్రాజ్, సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్ ఆర్డీఓలు వేణుమాధవ్ రావు, సూర్యనారాయణ, శ్రీనివాసులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. ఫ ‘సర్’ జిల్లా పరిశీలకురాలు దేవసేన -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
భానుపురి (సూర్యాపేట) : విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ హెచ్చరించారు. మంగళవారం తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై ఆయన ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ఎంపీడీఓలు, ఎంపీఓలు, వీబీజీ రాం జీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బంది, అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వీబీజీ రాం జీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని రోజువారీ కూలీలకు నిరంతరం పని కల్పించాలని, ప్రతి కూలీకి రోజుకు కనీసం రూ.300 ఉపాధి వేతనం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) పథకం కింద మంజూరైన ఇందిరమ్మ మరుగుదొడ్ల నిర్మాణాలు, వాటికి సంబంధించిన పేమెంట్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. వీటితో పాటు డ్రెయిన్ ఎండ్ సోక్ పిట్లు, వీఓ కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. పనుల్లో అలసత్వాన్ని ప్రదర్శించిన 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డీఆర్డీఓను కలెక్టర్ ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏపీఓ, కంప్యూటర్ ఆపరేటర్, ఈసీలపై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ సన్యాసయ్య, జెడ్పీ సీఈఓ డి.శిరీష, డీపీఓ యాదగిరి. ఇతర అధికారులు పాల్గొన్నారు. ఫ 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు ఫ ముగ్గురు ఉపాధి సిబ్బందిపై చర్యలకు కలెక్టర్ ఆదేశం -
సూర్యాపేట అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
సూర్యాపేట అర్బన్ : సూర్యాపేట పట్టణంలో మౌలిక వసతుల కల్పన, ప్రత్యేక అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామని, తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్ష్మాది అన్నారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. భవిష్యత్లో నీటి సమస్య తలెత్తకుండా దోసపహాడ్ ప్రాజెక్టును పునరుద్ధరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం మిషన్ భగీరథ ద్వారా 9 నుంచి 10 వాటర్ ట్యాంకులను నింపి పట్టణంలోని వివిధ వార్డులకు నీటిని సరఫరా చేస్తున్నామని చెప్పారు. వర్షాలు లేకపోవడంతో బోర్లు ఎండిపోవడం వల్ల కూడా కొన్ని ప్రాంతాల్లో నీటి సమస్య ఏర్పడిందని, ఈ విషయమై మూసీ అధికారులతో మాట్లాడి సద్దుల చెరువును నింపినట్లు చెప్పారు. సూర్యాపేట పట్టణ సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన కొత్త మాస్టర్ ప్లాన్కు జనరల్ బాడీ సమావేశంలో ఆమోదం తెలిపారు. బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ అంగిరేకుల నాగార్జున మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు గెలిచిన వార్డుల్లో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులు పెత్తనం చేస్తున్నారని, అలాంటి జోక్యాన్ని అడ్డుకోవాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సీహెచ్.హనుమంతరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీవుల్లా, ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ ఈఈ కిరణ్, పబ్లిక్ హెల్త్ డీఈలు రమాదేవి, అనిల్, ప్రణయ్ రెడ్డి, మేనేజర్ బుచ్చిబాబు, ఆర్వో జ్ఞానేశ్వరి, గౌస్, ప్రసాద్ పాల్గొన్నారు.ఫ 60 ఫీట్ల రోడ్డు నుంచి కలెక్టరేట్కు అనుసంధాన రహదారి నిర్మాణం ఫ దోసపహాడ్ ప్రాజెక్టు పునరుద్ధరణకు కసరత్తు ఫ మిషన్ భగీరథ నీటి సరఫరా లోపాల సవరణ ఫ పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి పెద్దపీట -
ఎంఈఎఫ్ వైస్చైర్మన్గా కత్తి వెంకటేశ్వర్లు
మునగాల : మాదిగ ఉద్యోగ సమాఖ్య(ఎంఈఎఫ్)జాతీయ కోర్కమిటీ వైస్ చైర్మన్గా మునగాల మండలంలోని విజయరాఘవపురం గ్రామానికి చెందిన డాక్టర్ కత్తి వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ఈ మేరకు హైదరాబాద్లో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నట్లు వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. వీబీజీ రామ్జీ పనుల పరిశీలననడిగూడెం : నడిగూడెం మండల పరిధిలోని బృందావనపురం, వేణుగోపాలపురం గ్రామాల్లో జరుగుతున్న వీబీజీ రామ్జీ పనులను మంగళవారం జెడ్పీ సీఈఓ డి.శిరీష ఆకస్మికంగా పరిశీలించారు. గ్రామాల్లో జరుగుతున్న పనులతో పాటు పండ్ల తోటలు, ఫామ్పాండ్ తదితర వాటిని ఆమె పరిశీలించారు. సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఆమె వెంట ఎంపీడీఓ ఎల్.మల్సూర్, ఎంపీఓ వీరాంజనేయులు, ఏపీఓ శ్రీనివాసరావు, ఈసీ శ్రీనివాస్, టీఏ అంజిరెడ్డి తదితరులు ఉన్నారు. కేసీఆర్ క్షమాపణ చెప్పాలి భానుపురి (సూర్యాపేట): దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్పై బీఆర్ఎస్ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలకు గానూ ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య అన్నారు. మంగళవారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కు మొదటి నుంచి దళితులను అవమానించడం, మోసం చేయడం అలవాటేనని విమర్శించారు. ప్రజా సమస్యలను ప్రస్తావించని ప్రతిపక్ష నాయకుడు ఆ పదవిలో కొనసాగడం ఎందుకని ప్రశ్నించారు. స్పీకర్పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీవుల్లా, సూర్యాపేట పట్టణ అధ్యక్షుడు వెలుగు వెంకన్న, చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వీరన్న నాయక్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్ తదితరులు ఉన్నారు. బుల్లెట్ ట్రైన్ సాధనే లక్ష్యంగా ఉద్యమిద్దాంసూర్యాపేట: బుల్లెట్ ట్రైన్ సూర్యాపేట మీదుగా వెళ్లే వరకు అన్ని వర్గాల ప్రజలు ముక్తకంఠంతో ఉద్యమించాలని ప్రముఖ పారిశ్రామికవేత్త మీలా మహదేవ్, రైలు ఉద్యమ నేత మంచాల రంగయ్య పిలుపునిచ్చారు. బుల్లెట్ ట్రైన్ సాధన అఖిలపక్ష పోరాట కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నాటికి 26వ రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్షల్లో పట్టణ ఆర్యవైశ్యులు పాల్గొన్నారు. వారికి వీరు సంఘీభావం తెలిపి మాట్లాడారు. సూర్యాపేట రైల్వే సాధన సమితి చేపట్టిన ‘లక్ష పోస్ట్కార్డుల ఉద్యమానికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పూర్వఅధ్యక్షుడు తీకుళ్ల సాయిరెడ్డి మద్దతు ప్రకటించారు. వైభవంగా నారసింహుడి నిత్యకల్యాణంమఠంపల్లి : మట్టపల్లి ఆలయంలో శ్రీరాజ్యలక్ష్మీ, చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని మంగళవారం అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. కల్యాణ తంతులో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, రుత్విగ్వరణం, పంచగవ్యప్రాశన, మధుపర్కపూజ, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుకలను ఘనంగా జరిపారు. క్షేత్రపాలకుడైన శ్రీవీరాంజనేయస్వామికి నాగవల్లీ దళార్చన చేశారు. -
అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకోవడం సరికాదు
సూర్యాపేట టౌన్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం సరైనది కాదని బీఆర్ఎస్ మహిళా నాయకులు అన్నారు. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల తీరును ఖండిస్తూ బీఆర్ఎస్ మహిళలు, నాయకులు జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద మంగళవారం భారీ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మహిళా నాయకురాలు మాట్లాడుతూ.. నల్ల దుస్తులతో నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసులు ప్రవర్తించిన తీరు సరికాదన్నారు. అసెంబ్లీ వద్ద పోలీసుల తోపులాటలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గాయపడడం ప్రభుత్వ దుర్మార్గ పాలనకు నిదర్శనమన్నారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని, లేకుంటే భవిష్యత్లో తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, నిమ్మల శ్రీనివాస్ గౌడ్, అంగిరేకుల నాగార్జున, వై.వి.గండూరి పావని కృపాకర్, కల్లెపల్లి మహేశ్వరి, సల్మా, గండూరి కృపాకర్, ఆకుల లవకుశ, రాజా తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేపై ఫిర్యాదు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ను వెంటనే అరెస్టు చేసి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ ఆధ్వర్యంలో మహిళలతో కలిసి పట్టణ సీఐకి ఫిర్యాదు చేశారు. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం
అసెంబ్లీలో దళితుల సమస్యలపై చర్చించాలిసూర్యాపేట అర్బన్ : శాసనసభ సమావేశాల్లో చేవెళ్ల డిక్లరేషన్ ఆధారంగా దళితుల సమస్యలను ప్రధాన ఎజెండాగా చర్చించాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు డిమాండ్ చేశారు. మంగళవారం సూర్యాపేట పట్టణంలోని ఎంవీఎన్ భవన్లో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు మర్రి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన జిల్లా సమావేశానికి స్కైలాబ్ బాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్పీకర్పై పరుష పదజాలంతో మాట్లాడిన ఎమ్మెల్సీ తాతా మధుపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యుడు రెమిడాల పరశురాములు, జిల్లా ఉపాధ్యక్షుడు టేకుల సుధాకర్, ఇరుగు రమణ, నందిగామ సైదులు, డి. దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. -
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలోని 302 చిత్తడి నేలల క్షేత్రస్థాయి పరిశీలన, సరిహద్దుల నిర్ధారణను ఆయాశాఖల అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో చిత్తడి నేలల కమిటీ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి చిత్తడి నేలల నోటిఫికేషన్ ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి, వేగవంతం చేయడానికి అధికారులు కృషి చేయాలన్నారు. చిత్తడి నేలలు ఆక్రమణలకు గురికాకుండా చూడాలని, పులిచింతల రిజర్వాయర్, మూసీ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ల పరిధిలో ఉన్న చిత్తడి నేలలను కూడా నోటిఫై చేయాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ బి.హరిసింగ్, డీఆర్ఓ ప్రేమ్రాజ్, జిల్లా అటవీ అధికారి దామోదర్రెడ్డి, డీఏఓ శ్రీధర్రెడ్డి, డీఆర్డీఓ సన్యాసయ్య, ఆర్డీఓ వేణుమాధవ్, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
సమస్య పరిష్కారం కావడం లేదు
నాకు ఎంజీనగర్ శివారులో 148/ఆ సర్వే నెంబర్లో వారసత్వంగా వచ్చిన 12 గుంటల భూమి ఉంది. కొందరు ఆ భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నన్ను భూమిలోకి రానివ్వడం లేదు. రోడ్డు వెంట ఉండటంతో నీ భూమి రోడ్డుకు పోయిందని, నీకు ఇక్కడ లేదని భయ పెడుతున్నారు. రోడ్డుకు పోతే నాకు నోటీస్ రావాలి. అలాంటిదేమీ రాలేదు. సమస్యను వివరించేందుకు కలెక్టరేట్లో జరుగుతున్న గ్రీవెన్స్ డేకు వచ్చాను. సమస్యను త్వరగా పరిష్కరించాలి. –రత్నావత్ నాగరాజు, ఎంజీనగర్ తండా, చివ్వెంల మండలం -
ప్రజావాణి పట్టదా..
సూర్యాపేట : ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు కలెక్టరేట్లో ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నారు. ప్రతి వారం వందలాది మంది బాధితులు గ్రీవెన్స్కు వచ్చి తమ ఇబ్బందులు అధికారులకు తెలిపి, వాటిని పరిష్కరించాలని వేడుకుంటున్నారు. అయినా బాధితులకు ఆశించిన స్థాయిలో ప్రయోజనం కలగడం లేదు. సమస్య పరిష్కారం కోసం అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరుగుతూ పలుమార్లు దరఖాస్తులు సమర్పిస్తున్నా కొన్ని సమస్యలు మాత్రం పెండింగ్లోనే ఉంటున్నాయి. సోమవారం నిర్వహించిన గ్రీవెన్న్స్డేకు 66 మంది బాధితులు దరఖాస్తులు అందించారు. నాలుగైదు సార్లు దరఖాస్తులు తమ సమస్య పరిష్కారం అవుతుందన్న ఆశతో బాధితులు ఇప్పటికే నాలుగైదు సార్లు కలెక్టరేట్కు వచ్చి గ్రీవెన్స్లో దరఖాస్తులు సమర్పించినట్లు చెబుతున్నారు. ప్రతిసారి దరఖాస్తు స్వీకరించి సంబంధిత శాఖకు పంపుతున్నప్పటికీ సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూ సమస్యలు, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ పథకాలు, ఇతర వ్యక్తిగత సమస్యలపై ప్రజలు వినతిపత్రాలు అందిస్తున్నారు. అయితే గ్రీవెన్స్లో వచ్చిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖలకు పంపడంతో పాటు సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని బాధితులు కోరుతున్నారు. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, నిర్ణీత గడువులో సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ పెట్టకుండా పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్లో ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కి జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని, ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా, మండల స్థాయి ప్రజావాణి దరఖాస్తులను తప్పనిసరిగా ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. ప్రజావాణిలో మొత్తం 66 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, డీఆర్ఓ ప్రేమ్రాజ్, జిల్లా పరిషత్ సీఈఓ శిరీష, డీఆర్డీఓ పీడీ సన్యాసయ్య, డీఎంహెచ్ఓ వెంకటరమణ, డీఏఓ శ్రీధర్రెడ్డి, డీఎస్ఓ మోహన్ బాబు, డీడబ్ల్యూఓ నరసింహారావు, మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు. ఫ పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా పరిష్కారం కాని సమస్యలు ఫ తరచూ కలెక్టరేట్కు వస్తున్న బాధితులు ఫ సోమవారం 66 దరఖాస్తులు.. -
మేళ్లచెరువులో తెలంగాణ పబ్లిక్ స్కూల్కు అనుమతి
మేళ్లచెరువు : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తెలంగాణ పబ్లిక్ స్కూల్గా మార్చేందుకు ప్రభుత్వం నుంచి పరిపాలన అనుమతి లభించినట్లు పాఠశాల హెచ్ఎం పొనగండ్ల నారపరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో 73 తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటుకు గాను నిధులు, పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా మేళ్లచెరువు పాఠశాలలో వసతుల కల్పన, అభివృద్ధి పనులకు రూ. 9.95 కోట్లు మంజూరైనట్లు హెచ్ఎం తెలిపారు. శివాలయంలో ప్రత్యేక పూజలుమేళ్లచెరువు: మండల కేంద్రంలోని ఇష్టకామేశ్వరీ సమేత స్వయంభు శంభులింగేశ్వర స్వామి దేవాయలంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతిపూజ, పుణ్యాహవచనం, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సహస్రనామార్చన, మహాలింగార్చన, పుష్పార్చన, గోపూజ నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేపట్టారు. కార్యక్రమంలో ఈఓ శంభిరెడ్డి, అర్చకులు పాల్గొన్నారు. 19న కోదాడలో మెగా జాబ్మేళాకోదాడ: ఈ నెల 19న కోదాడ పట్టణంలోని సీసీరెడ్డి కాన్వెంట్లో మెగా జాబ్మేళా నిర్వహించనున్నట్లు రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు జాబ్మేళా కొనసాగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి కాలరీస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాకు కోదాడ ఎమ్మెల్యే పద్మావతి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశామని, ఈ కమిటీ సమావేశం ఈ నెల 10న హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో జరుగుతుందని మంత్రి తెలిపారు. కమిటీలో నల్లగొండ ఎంపీ రఘువీర్రెడ్డి, జిల్లా కలెక్టర్, ఎస్పీ, కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమ, వైస్చైర్మన్ మల్లీశ్వరి, ఫ్లోర్ లీడర్ కందుల కోటేశ్వరరావు సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. కోదాడ, హుజూర్నగర్ ప్రాంత నిరుద్యోగులు జాబ్మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యుత్ శాఖ నూతన ఎస్ఈగా యాదగిరిసూర్యాపేట : సూర్యాపేట జిల్లా విద్యుత్ శాఖ నూతన సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్ఈ)గా పెరికేటి యాదగిరి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ నుంచి బదిలీపై వచ్చిన ఆయన జిల్లా కేంద్రంలోని విద్యుత్ కార్యాలయంలో విధుల్లో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యుత్ శాఖ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన ఎస్ఈని ఘనంగా సన్మానించారు. అసోసియేషన్ ప్రతినిధులు ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ విద్యుత్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ముత్యం వెంకన్న గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ బ్రహ్మేంద్రరావు, కంపెనీ సెక్రటరీ బొబ్బిలి మురళి, జిల్లా అధ్యక్షుడు గుండు పరుశురాం, కార్యదర్శి బెల్లంకొండ భరత్ కుమార్, డివిజన్ అధ్యక్షుడు ఉపేందర్, డివిజన్ కార్యదర్శి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎంగా నరసింహ రామగిరి(నల్లగొండ) : టీజీఎస్ఆర్టీసీ నల్లగొండ రీజియన్ డిప్యూటీ రీజినల్ మేనేజర్గా (ఆపరేషన్స్ అండ్ మెకానికల్) నరసింహ, నల్లగొండ డిపో మేనేజర్గా మేరీ లావణ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఆర్ఎం నరసింహ మాట్లాడుతూ నల్లగొండ ఆర్టీసీ రీజియన్ పరిధిలోని ఏడు డిపోల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేస్తూ రీజియన్ను ప్రగతి పథంలో రాష్ట్రంలోనే ముందుకు తీసుకెళ్తానని ధీమా వ్యక్తం చేశారు. -
పాలన చేతకాక ప్రతిపక్షాలపై దాడులు
కోదాడ: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతకాక ప్రతిపక్షాలపై దాడులకు దిగుతోందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శించారు, అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ప్రభుత్వం దౌర్జన్యానికి పాల్పడిందని ఆరోపిస్తూ సోమవారం కోదాడ బస్టాండ్ సెంటర్లో బీఆర్ఎస్ నాయకులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతియుతంగా అసెంబ్లీకి వెళ్తున్న తమ పార్టీ ఎమ్మెల్యేలను పోలీసులతో అడ్డుకోవడంతో పాటు వారిపై భౌతిక దాడులకు దిగడం సరికాదన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజని పేర్కొన్నారు. పాలన చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎస్కే. నయీం, చీమ నరేష్, కరీముల్లాబాబా, పిట్టల భాగ్యమ్మ, చలిగంటి వెంకట్, కాసాని మల్లయ్యగౌడ్, సంపెట ఉపేందర్, అల్వాల వెంకట్, మజహర్, ఎస్కే. అబ్బు, తదితరులు పాల్గొన్నారు. జాతీయరహదారిపై రాస్తారోకో సూర్యాపేటటౌన్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ సోమవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సూర్యాపేటలోని అంజనాపురి చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ తీరు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకొని రాస్తారోకోను విరమింప జేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్, నాయకులు వైవీ, నిమ్మల శ్రీనివాస్గౌడ్, అన్నపూర్ణ, భిక్షం, తదితరులు పాల్గొన్నారు. ఫ మాజీ ఎమ్మెల్యే బొల్లం -
12న జాతీయ మెగా లోక్ అదాలత్
చివ్వెంల(సూర్యాపేట) : ఈ నెల 12న సూర్యాపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో జరిగే జాతీయ మెగా లోక్అదాలత్ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద కోరారు. సోమవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో పోలీసులు, పీపీలతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించుకునే విధంగా కక్షిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. సూర్యాపేట, కోదాడ, హూజూర్నగర్, తుంగతుర్తి కోర్టుల్లోనూ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి శివరాంప్రసాద్, సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.భవ్య. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి అపూర్వ రవళి, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మంచాల మమత, అడిషనల్ ఎస్పీ రవీందర్రెడ్డి, డీఎస్పీ, సీఐలు పాల్గొన్నారు. ఫ జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద -
పునరుద్ధరణపై ఆశలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చివరిసారి 2010లో సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండానే వాటి పాలనను 2014 వరకు పొడిగించారు. ప్రత్యేక రాష్ట్రంలో చిన్న నీటి పారుదల వ్యవస్థలు, చెరువులు, జలాశయాలు డిస్ట్రిబ్యూటరీ కాలువలను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చారు. ఇరిగేషన్ శాఖ అధికారులే వీటి నిర్వహణ బాధ్యతలు చూడడంతో రైతుల ప్రమేయం లేకుండా పోయింది. దాంతో జిల్లాలోని పలు ఎత్తిపోతల పథకాలు, డిస్ట్రిబ్యూటరీ కాలువలు, చెరువుల పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. కొన్ని ఎత్తిపోతల పథకాలు మూలన పడ్డాయి. భానుపురి (సూర్యాపేట) : చెరువులు, డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్వహణ బాధ్యతలు చూసే సాగునీటి సంఘాల పునరుద్ధరణపై అయోమయం నెలకొంది. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించి వీటి నిర్వహణ బాధ్యతలకు నిధులు సైతం విడుదల చేసేవారు. క్షేత్రస్థాయిలో ఉండే రైతులే వీటి బాధ్యతలను నిర్వహించడంతో సమస్యలు పరిష్కారమయ్యేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత సాగునీటి సంఘాలను తొలగించి ఇరిగేషన్ శాఖలో విలీనం చేయడంతో తిరిగి సమస్యలు మొదలయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సాగునీటి సంఘాలను పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వగా.. ఈ మేరకు ఇటీవల రైతు కమిషన్ సీఎం రేవంత్రెడ్డికి సైతం విన్నవించింది. దాంతో తిరిగి సాగునీటి సంఘాల పునరుద్ధరణ జరిగే అవకాశం ఉందనే ఆశతో రైతులు ఎదురుచూస్తున్నారు. గతంలో 100కు పైగా సంఘాలు జిల్లాలో 1100కు పైగా చెరువులు, రిజర్వాయర్లు, డిస్ట్రిబ్యూటరీ కాలువలతో పాటు కొంత ఆయకట్టు కలుపుకొని 100కు పైగా సాగునీటి సంఘాలు ఉండేవి. ఈ పదేళ్లలో డిస్ట్రిబ్యూటరీ కాలువల ద్వారా సాగయ్యే ఆయకట్టు కూడా భారీగా పెరిగింది. రైతుల సంఖ్య కూడా 2.80 లక్షల వరకు ఉంది. గతంలో ఉన్న సాగునీటి సంఘాలకు తోడుగా కొత్తగా సంఘాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. పునరుద్ధరించాలని సూచన.. సాగునీటి సంఘాలను తిరిగి పునరుద్ధరిస్తే గ్రామీణ ప్రాంతాల్లో రైతుల కష్టాలు చాలా వరకు తీరుతాయని ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర రైతు కమిషన్ ప్రభుత్వానికి సూచించింది. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసిన కమిషన్ తమ అధ్యయనంలో దృష్టికి వచ్చిన సమస్యలతోపాటు వాటి పరిష్కారానికి చేయాల్సిన వాటిని సైతం వివరించింది. ఈ సూచనలు అమలు చేస్తే తిరిగి సాగునీటి సంఘాలు మనుగడలోకి రానున్నాయి. దాంతో రైతులు సభ్యులుగా ఉండే సంఘాలు, అధికారులు సమన్వయంతో జిల్లాలో అస్తవ్యస్తంగా మారిన సాగునీటి వ్యవస్థలను గాడిలో పెట్టే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం సాగునీటి సంఘాలను పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు.ఫ ఎన్నికలు లేక నిస్తేజంగా సాగునీటి సంఘాలు ఫ మరమ్మతుకు నోచక అస్తవ్యస్తంగా కాలువలు, చెరువులు ఫ పునరుద్ధరించాలని రైతు కమిషన్ సిఫారసు -
ప్రమోషన్తో బాధ్యత మరింత పెరుగుతుంది
సూర్యాపేటటౌన్ : ప్రమోషన్తో బాధ్యత మరింత పెరుగుతుందని జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. జిల్లా ఆర్ముడ్ రిజర్వ్లో ఆర్ఎస్ఐలుగా విధులు నిర్వర్తిస్తున్న టి. రాజశేఖర్, కె.అశోక్ లు రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్గా ఉద్యోగోన్నతి పొందారు. ప్రమోషన్ పొందిన అధికారులు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ ఆ ఇరువురిని అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారికి స్టార్స్ ధరింపజేసి ప్రమోషన్ ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. శాంతి భద్రతలను పరిరక్షించడమే లక్ష్యం సూర్యాపేటటౌన్ : శాంతి భద్రతలను పరిరక్షించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తోందని ఎస్పీ నరసింహ పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీప మాట్లాడారు. ఫిర్యాదుదారుల సమస్యలను చట్టప్రకారం పరిష్కరించాలన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదు దారుల నుంచి వచ్చిన అర్జీల తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ కి సూచనలు చేశారు. ఫ ఎస్పీ నరసింహ -
ఇప్పటికి ఆరు సార్లు వచ్చా
నాకు చౌటపల్లి శివారులో రెండు ఎకరాల భూమి ఉంది. గతంలో ఉన్న పాత పాస్బుక్లో పట్టా అయి ఉంది. అది మళ్లీ కొత్త పాస్బుక్లోకి ట్రాన్స్ఫర్ చేయమంటే అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికి ఆరు సార్లు కలెక్టరేట్కు వచ్చి గ్రీవెన్స్ డేలో దరఖాస్తు చేసుకున్న. తహసీల్దార్ కార్యాలయానికి వెళితే అధికారి తన చాంబర్లోకి కూడా రానివ్వడం లేదు. కలెక్టర్ సార్ నా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నా. –వెంకట్రెడ్డి, చౌటపల్లి, మఠంపల్లి మండలం -
బుల్లెట్ రైలు వచ్చే వరకు ఉద్యమం ఆగదు
సూర్యాపేట : సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ వచ్చేంత వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని సూర్యాపేట మెకానిక్ సంఘం అధ్యక్షుడు రాదేని ఆదినారాయణ అన్నారు. సోమవారం సూర్యాపేట ఆటోనగర్లోని అన్ని యూనియన్ల నాయకులు కలిసి బుల్లెట్ ట్రైన్ సాధన ఉద్యమంలో భాగంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కేంద్రం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో బుల్లెట్ ట్రైన్ మార్గాన్ని సూర్యాపేట మీదుగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. బుల్లెట్ ట్రైన్ వస్తే జిల్లాలో రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు వ్యాపార, పారిశ్రామిక, విద్యా రంగాల అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు యాదగిరి, ప్రధాన కార్యదర్శి సోమ్లనాయక్, కోశాధికారి సలీం, కడారి వెంకన్న, బాలయ్య, నాగిరెడ్డి, మల్లయ్య, రాంబాబు, జానిమియా, తదితరులు పాల్గొన్నారు. ప్రధానికి పోస్టు కార్డులు సూర్యాపేట : సూర్యాపేటకు రైలు మార్గం ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లక్ష పోస్ట్కార్డులు పంపాలన్న లక్ష్యంతో రైల్వే సాధన సమితి ఆధ్వర్యంలో సోమవారం శ్రీపోస్ట్కార్డు ఉద్యమంశ్రీ చేపట్టారు. వాణిజ్య భవన్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో వివిధ వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి కార్డులపై సంతకాలు చేశారు. రైల్వే ఉద్యమానికి సుదీర్ఘకాలంగా గొంతుకగా నిలిచిన 90 ఏళ్ల మంచాల రంగయ్య కార్యక్రమాన్ని ప్రారంభించగా.. మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత తొలి పోస్ట్కార్డుపై సంతకం చేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్, నాయకులు సంఘీభావం తెలి పారు. తొలి రోజే 2 వేల పోస్ట్కార్డులు ప్రధానమంత్రి కార్యాలయానికి పంపించారు. కార్యక్రమంలో రైల్వే సాధన సమితి కన్వీనర్ డేగల జనార్దన్, జేఏసీ చైర్మన్ చింతలపాటి చిన్న శ్రీరాములు, కో–కన్వీనర్ రాచూరి ప్రతాప్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.ఫ అఖిలపక్షం ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలు -
‘నువ్వంటే నాకిష్టం..నా కోరిక తీర్చు’
సూర్యాపేట జిల్లా: వివాహితను ఓ వ్యక్తి లైంగికంగా వేధిస్తుండగా.. అతడిపై బాధితురాలి కుటుంబ సభ్యులు దాడి చేశారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం బక్కమంతులగూడెం గ్రామానికి చెందిన చింతారెడ్డి భాస్కర్రెడ్డి ఏడాది కాలంగా మేళ్లచెరువు మండలం వెంకట్రామాపురం గ్రామానికి చెందిన బేత మౌనిక వెంటపడుతూ ‘నువ్వంటే నాకిష్టం..నా కోరిక తీర్చు’అంటూ వేధింపులకు గురిచేస్తున్నాడు. ఎన్నిసార్లు మందలించినా అతడి పద్ధతిలో మార్పు రాలేదు. దీంతో ఈ నెల 4న మౌనిక తన తల్లిగారి ఊరైన బక్కమంతులగూడేనికి వచ్చింది. ఆదివారం ఉదయం తన తల్లిగారింటి ముందు ఆమె వాకిలి ఊడుస్తుండగా భాస్కర్రెడ్డి ఒక్కసారిగా మౌనిక వద్దకు వచ్చి బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్లడంతో ఆమె కేకలు వేసింది. దీంతో భాస్కర్రెడ్డి కొడవలితో ఆమె కుడిచేతిపై కొట్టి.. ‘నా కోరిక తీర్చు, లేకపోతే నిన్ను చంపేస్తాను, నీ ఫొటోలు సోషల్ మీడియాలో పెడతాను’అంటూ బెదిరించాడు. భాస్కర్రెడ్డి ఇంటిపై దాడి.. అనంతరం బేత మౌనికతోపాటు బేత రామాంజిరెడ్డి, బోగాల పద్మ, కుందూరు సంధ్య, బోగాల మధుసూదన్రెడ్డి కలిసి భాస్కర్రెడ్డి ఇంట్లోకి ప్రవేశించి కర్రలు, రాడ్లతో అతడిపై దాడిచేసి తల పగులగొట్టారు. దీంతో భాస్కర్రెడ్డిని చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భాస్కర్రెడ్డి భార్య శివనాగిని మెడలోని నాలుగున్నర తులాల బంగారు గొలుసు కూడా పోయింది. ఇదంతా భాస్కర్రెడ్డి ఇంట్లోని సీసీ కెమెరాల్లో రికార్డయింది. భాస్కర్రెడ్డి తనను లైంగికంగా వేధించడంతోపాటు అతడి భార్య శివనాగిని, కొడుకు మంజూనాథరెడ్డి కూడా అసభ్య పదజాలంతో తనను తిట్టి బెదిరించారని మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పాత పంచాయితీలు మనసులో పెట్టుకొని తమ ఇంటిపై దాడి చేసి తన భర్త తల పగులగొట్టారని భాస్కర్రెడ్డి భార్య శివనాగిని కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మొత్తం 8 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. చదవండి: పబ్లో అర్ధరాత్రి ఘర్షణ -
హైవేపై వాహనాల రద్దీ
కేతేపల్లి : హైదరాబాద్–విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం వాహనాల రద్దీ నెలకొంది. వారాంతపు సెలవులతో పాటు వివాహాలు, శుభకార్యాలు ఎక్కువగా ఉండటంతో చాలామంది రెండు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి స్వగ్రామాలకు వెళ్లారు. వారంతా ఆదివారం తిరుగు పయనమయ్యారు. దీంతో ఆదివారం సాయంత్రం జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగింది. కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్ టోల్ప్లాజా వద్ద హైదరాబాద్ వైపు వాహనాలు బారులుదీరాయి. టోల్ప్లాజాను దాటి వెళ్లేంత వరకు వాహనాలు నెమ్మదిగా కదిలాయి. టోల్ప్లాజాను దాటేందుకు వాహనదారులకు ఒక్కో సమయంలో ఇరవై నిమిషాలకు పైగా సమయం పట్టింది. -
ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి : ఎస్పీ
సూర్యాపేటటౌన్ : వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకోవాలని ఎస్పీ నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. గణేష్ మండపాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తీసుకోవాలని, సమాచారం ఇవ్వాలని, రోడ్లపై మండపాలు ఏర్పాటు చేయవద్దని ఉత్సవ కమిటీలకు, భక్తులకు విజ్ఞప్తి చేశారు. వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించే ఉత్సవ కమిటీలు, భక్తులు పోలీసుల సూచనలు పాటించాలని కోరారు. మండపాలను రోడ్లపై ఏర్పాటు చేయవద్దని, అలా చేస్తే వాహనదారులు, ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. అత్యవసర సేవలు అందించే వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా మండపాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అవసరమైన చోట పగలు, రాత్రి పోలీస్ బీట్లు, పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఉత్సవ కమిటీలు పోలీసులతో సమన్వయం చేసుకొని, నిబంధనలను పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో నవరాత్రి వేడుకలు నిర్వహించాలని కోరారు. లక్ష్మీనరసింహుని నిత్యకల్యాణంమఠంపల్లి : మట్టపల్లిలోని రాజ్యలక్ష్మీ, చెంచులక్ష్మీ సమేత లక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని ఆదివారం అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. మూలవిరాట్కు పంచామృతాభిషేకం నిర్వహించారు. కల్యాణతంతులో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, రుత్విగ్వరణం, పంచగవ్య ప్రాశన, మధు ఫర్కపూజ, మాంగల్య ధారణ, తలంబ్రాలతో నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ చలపతి, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, బ్రహ్మాచార్యులు పాల్గొన్నారు. పశు ఔషధ బ్యాంక్కు అధునాతన యంత్రంకోదాడరూరల్ : కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలలో ఏర్పాటు చేసిన పశుఔషధ్ బ్యాంక్కు ఎన్ఆర్ఐ, పశువైద్యుడు డాక్టర్ వై.వెంకటరమణారెడ్డి రూ.40 వేల విలువైన ఎలక్ట్రో సర్జికల్ జనరేటర్ను ఆదివారం విరాళంగా అందించినట్లు వైద్యశాల డాక్టర్ పెంటయ్య తెలిపారు. ఈ యంత్రం శస్త్రచికిత్స సమయంలో పశువుల్లో రక్తస్రావాన్ని ఆపేందుకు దోహద పడుతుందని పేర్కొన్నారు. వెంకటరమణారెడ్డి ఇప్పటికే ఖనిజ లవణ మిశ్రమానికి రూ.50 వేలను విరాళంగా అందించినట్లు తెలిపారు. టీయూజేఏసీ జిల్లా కార్యవర్గంసూర్యాపేట : తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) జిల్లా అధ్యక్షుడిగా మీర్ సికందర్ అలీ మదనీ, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలిగా దారా నళిని నియమితులయ్యారు. ఆదివారం హైదరాబాదులో నిర్వహించిన సంఘం రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ మేరకు వారికి నియామక పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమపై నమ్మకంతో జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన జేఏసీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. -
హుజూర్నగర్లో ‘అగ్రి’ విద్య
హుజూర్నగర్ : హుజూర్నగర్ వాసుల దశాబ్దాల కల ఎట్టకేలకు నెరవేరింది. స్థానిక విద్యార్థులతో పాటు జిల్లా రైతాంగానికి ఎంతో మేలు చేకూర్చే ప్రభుత్వ బీఎస్సీ వ్యవసాయ కళాశాల హుజూర్నగర్ పట్టణంలో లాంఛనంగా ప్రారంభమైంది. రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ప్రత్యేక చొరవతో ప్రభుత్వం ఈ కళాశాలను మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే, సొంత భవనాలు అందుబాటులో లేకపోవడంతో గతేడాది (2024–25) బీఎస్సీ అగ్రికల్చర్లో చేరిన 37 మంది విద్యార్థులకు హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మొదటి సంవత్సరం తరగతులు నిర్వహించారు. వారంతా ఇప్పుడు హుజూర్నగర్లోని తాత్కాలిక ప్రాంగణంలో ద్వితీయ సంవత్సరం అభ్యసించనున్నారు. మొదలైన తరగతులు ఈ వ్యవసాయ కళాశాలలో మొత్తం 120 సీట్లు అందుబాటులో ఉన్నాయి. తాజాగా నిర్వహించిన తొలి విడత కౌన్సిలింగ్లో 33 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. వీరికి ఈనెల 1వ తేదీ నుంచే మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం కళాశాలలో 24 మంది బోధన, బోధనేతర సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో 8 మంది శాశ్వత అధ్యాపకులు, ఐదుగురు టీచింగ్ అసోసియేట్లు, ఒక శాశ్వత బోధనేతర ఉద్యోగితో పాటు 10 మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. రెండేళ్లలో శాశ్వత భవనాలు హుజూర్నగర్ శివారులోని మగ్దూంనగర్లో కళాశాల శాశ్వత భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వం ఇప్పటికే 100 ఎకరాల భూమిని సేకరించింది. రెండేళ్లలో భవన నిర్మాణాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భవిష్యత్తులో ఈ సువిశాల స్థలాన్ని విద్యార్థుల శిక్షణ తరగతులు, విత్తనోత్పత్తి, రైతు సాధికారత కార్యక్రమాలకు వినియోగించనున్నారు.ఫ మగ్దూంనగర్ శివారులో తాత్కాలిక భవనంలో కళాశాల ఫ శాశ్వత భవనాలకు 100 ఎకరాల భూమి కేటాయింపు ఫ 120 సీట్లకు తొలి విడత 33 మంది విద్యార్థుల చేరిక ఫ ఈ నెల 1నుంచే ప్రారంభమైన తరగతులు -
కార్డులకు ఎదురు చూపులు
భానుపురి (సూర్యాపేట) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల కోసం మెజార్టీ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల స్థానంలో కుటుంబ సభ్యుల వివరాలతో కూడిన స్మార్ట్ కార్డులను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 15 ఆగస్టున జిల్లాలోని కొంతమంది లబ్ధిదారులకు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చేతుల మీదుగా అందించారు. ఆ తరువాత మండలాల్లో స్మార్ట్ కార్డుల పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. జిల్లాలో 3,71,783 రేషన్ కార్డులుసూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 3,71,783 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో 9 లక్షలకు పైగా లబ్ధిదారులు కార్డుల ద్వారా రేషన్ పొందుతున్నారు. వీరందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే జిల్లాలో ఇప్పటి వరకు కేవలం 10వేలలోపు వరకు మాత్రమే స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. మిగతా వారు స్మార్ట్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. కార్డులు మండలాలకు చేరినప్పటికీ వాటి పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సాంకేతికతను జోడించి..ఇప్పటి వరకు రేషన్ కార్డులు కేవలం కాగితంపైనే ప్రింట్తీసి ఇచ్చారు. కార్డులు పోతే తిరిగి ఆన్లైన్ సెంటర్లకు వెళ్లి కాగితాలపైనే ప్రింట్ తీసుకునే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సాంకేతికతను ఉపయోగించి స్మార్ట్ కార్డులను రూపొందించి లబ్ధిదారులకు అందించాలని నిర్ణయించింది. పాన్ కార్డును పోలి ఉండి క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ కార్డులను అందుబాటులోకి తెచ్చారు. కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే లబ్ధిదారుడి కుటుంబ సభ్యుల వివరాలు తెలుస్తాయి. ఇప్పటివరకు ఈ–పాస్ మిషన్ల ద్వారా ఐరిష్, బయోమెట్రిక్, ఓటీపీ సాయంతో లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేస్తున్నారు. కొత్తగా అందించిన స్మార్ట్ కార్డులతో బియ్యం పంపిణీ ఎలా ఉంటుందోననే లబ్ధిదారుల్లో ఆసక్తి నెలకొంది. ఫ లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో తీవ్ర జాప్యం ఫ జిల్లాలో 3,71,783 రేషన్ కార్డులు ఫ ఇప్పటి వరకు 10వేల లోపే పంపిణీ ఫ మిగతా వారికి అందని కార్డులునత్త నడకన పంపిణీ..! జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ నత్తనడకన సాగుతుంది. 15 ఆగస్టున ప్రారంభించినప్పటికీ నేటికీ పూర్తికాలేదు. పౌరసరఫరాలశాఖ నుంచి తహసీల్దార్లకు స్మార్ట్ కార్డులను అందించగా వారు రేషన్ డీలర్లకు అప్పజెప్పారు. లబ్ధిదారులు రేషన్ డీలర్ల వద్ద నుంచి వీటిని తీసుకోవాల్సి ఉంది. కానీ ఈ ప్రక్రియ జరగక పోవడంతో లబ్ధిదారులకు నేటికీ రేషన్ కార్డులు అందలేదు. ఈ స్మార్ట్ రేషన్ కార్డులోనూ చాలా తప్పులు ఉండగా, వాటిని ఎలా సరి చేయాలనే విషయం అధికారులకు సైతం తెలియకపోవడం గమనార్హం. -
ఎడ్యుకేషన్ హబ్గా కోదాడ నియోజకవర్గం
కోదాడ: కోదాడ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దడంతో పాటు అభివృద్ధిలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలుపుతామని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాలశాఖ మంత్రి ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. ఆదివారం కోదాడ పట్టణ పరిధిలోని బాలాజీనగర్ వద్ద రూ. 50 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న నవోదయ పాఠశాల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పనులు వెంటనే ప్రారంభించి వచ్చే విద్యా సంవత్సరానికి భవనాలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కోదాడ సమీపంలోని ఆకుపాముల వద్ద రూ. 10 కోట్ల వ్యయంతో న్యాక్ భవన పనులు కూడ వేగంగా జరుగుతున్నాయని, ఇందులో నిరుద్యోగులకు వివిధ రకాల వృత్తుల్లో స్కిల్స్ నేర్పిస్తామని చెప్పారు. చిలుకూరు మండల పరిధిలో రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల పనులు కూడా వేగంగా పూర్తి చేసి వచ్చే విద్యాసంవత్సరానికి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కోదాడ, హుజూర్నగర్ ప్రాంత నిరుద్యోగులకు ఈ నెల 19న కోదాడలోని సీసీ రెడ్డి విద్యానిలయంలో మెగా జాబ్మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిని ఆరు లేన్లుగా విస్తరించేందుకు అనుమతి వచ్చిందని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని అన్నారు. నియోజకవర్గ పరిఽ దిలో శాంతినగర్, రెడ్లకుంట వద్ద రూ. 100 కోట్లతో చేపట్టిన లిఫ్ట్ పనులు డిసెంబర్ వరకు పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్సీ నరసింహ, సీఈ నాగభూషణం, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. లిఫ్ట్ పనుల పరిశీలనకోదాడరూరల్ : మండలంలోని రెడ్లకుంట వద్ద పాలేరు వాగుపై రూ.55 కోట్లతో నిర్మిస్తున్న లిఫ్ట్ పనులను మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతితో కలిసి పరిశీలించారు. ఈ లిఫ్ట్ నిర్మాణం పూర్తయితే 5వేల ఎకరాల బీడు భూములకు సాగునీరందుతుందన్నారు.అభివృద్ధి పనులు వేగవంతం చేయాలిమునగాల: కోదాడ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం మండలంలోని ఆకుపాములలో రూ.10 కోట్లతో నిర్మిస్తున్న ఎన్ఏసీ భవనం, కృష్ణానగర్ శివారులో ఆర్–9 ఎత్తిపోతల పథకంలో రూ.28కోట్లతో చేపడుతున్న పనులను ఆయన పరిశీలించారు. ఆయన వెంట ఎమ్మెల్యే పద్మావతి, కలెక్టర్, ఎస్పీతో పాటు మండల స్థాయి అధికారులు, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. 19న కోదాడలో మెగాజాబ్ మేళా మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
ప్రపంచ శాంతికోసం ఐక్య ఉద్యమం
సూర్యాపేట అర్బన్ : ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న యుద్ధ వాతావరణం, హింస, సామ్రాజ్యవాద దురాక్రమణకు వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కేవీఎల్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ధర్మ భిక్షం భవన్లో నిర్వహించిన ఏఐపీఎస్ఓ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. యుద్ధాల వల్ల సాధారణ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని, ముఖ్యంగా మహిళలు, పిల్లలు, పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఆయుధ పోటీకి, యుద్ధాలకు వెచ్చిస్తున్న భారీ నిధులను ప్రజల సంక్షేమం, విద్య, వైద్యం, ఉపాధి రంగాలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. మతం, కులం, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏఐపీఎస్ఓ జిల్లా అధ్యక్షుడు తొగిట్టి మురళి, గౌరవ అధ్యక్షుడు బొమ్మగాని శ్రీనివాస్, కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు అనంతల మల్లేశ్వరి, సహాయ కార్యదర్శి సారెడ్డి వెంకట్రెడ్డి, గాలి రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
కరాటే పోటీల్లో కోదాడ విద్యార్థుల ప్రతిభ
కోదాడరూరల్ : ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా దాచేపల్లిలో జరిగిన సెకండ్ ఇన్విటేషన్ షోటో కాన్ కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో కోదాడ పట్టణం శ్రీమన్నారాయణ కాలనీకి చెందిన స్టూడెంట్ షోటో కాన్ కరాటే క్లబ్ విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. వారు పలు విభాగాల్లో పతకాలు సాధించినట్లు కోచ్ ఆరే మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. క్లబ్ విద్యార్థుల్లో భవ్య బంగారు పతకం, మాన్యభరత్ సిల్వర్, లోకేష్ బ్రాంజ్ మెడల్ సాధించినట్లు పేర్కొన్నారు. విజేతలకు మెడల్స్, ప్రశంసా పత్రాలను అందించినట్లు తెలిపారు. -
హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
అనంతగిరి : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడిచినా ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. అనంతగిరి మండలం త్రిపురవరం గ్రామంలో ‘పల్లెల విధ్వంసం–పడకేసిన పారిశుధ్యం’ పేరుతో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ధ్య వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని, మురుగు, దోమలు, అపరిశుభ్రతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణను ఉద్ధరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రస్తుతం ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందన్నారు. సీఎం రేవంత్రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. ఆసరా పింఛన్ రూ.2 వేల నుంచి రూ.4 వేలకు, రైతు భరోసాను రూ.15 వేల చొప్పున ఇస్తామని ఇచ్చిన హామీలు నేటికీ అమలు కాలేదన్నారు. హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలే తగిన శాస్తి చేస్తారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు నల్ల భూపాల్రెడ్డి, త్రిపురవరం సర్పంచ్ మాదాసు జ్యోతి, నాయకులు మామిడి నరసింహారావు, పాపిరెడ్డి, నవీన్రెడ్డి, సాయి, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.ఫ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ -
ఇరుకు బ్రిడ్జితో అవస్థలు
ఫ మర్రికుంట బ్రిడ్జిపై ఆగిన లారీ ఫ గంటపాటు ట్రాఫిక్జామ్ గరిడేపల్లి : మండలంలోని మర్రికుంట బ్రిడ్జి వద్ద నిత్యం ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పురాతన బ్రిడ్జి కావడం, ఇరుకుగా ఉండడం, భారీ వాహనాలు సైతం ఈ బ్రిడ్జ్జి మీది నుంచే వెళ్తుండడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. ఆదివారం మర్రికుంట బ్రిడ్జిపై వెళ్తున్న లారీ మరమ్మతులకు గురై మధ్యలో ఆగిపోయింది. బ్రిడ్జి ఇరుకుగా ఉండడంతో నిలిచిపోయిన లారీ పక్క నుంచి మరో వాహనం వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. దాంతో ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సుమారు గంటపాటు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచి పోవడంతో కిలోమీటరు మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అత్యవసరంగా ప్రయాణించే వారు సైతం గంటపాటు నిరీక్షించాల్సి వచ్చింది. బ్రిడ్జ్జిపై నిత్యం ఇలాంటి పరిస్థితే నెలకొంటున్నది. రాకపోకలకు కీలక మార్గంలో ఉన్న మర్రికుంట బ్రిడ్జి స్థానంలో విశాలమైన నూతన బ్రిడ్జిని నిర్మించాలని స్థానిక ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు. -
బుల్లెట్ రైలు మొదటి అలైన్మెంట్నే కొనసాగాలి
సూర్యాపేట : సూర్యాపేటకు కేంద్రం ప్రకటించిన బుల్లెట్ ట్రైన్ మొదటి అలైన్మెంట్నే కొనసాగించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ అన్నారు. శనివారం బుల్లెట్ ట్రైన్ సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన 23వ రోజు రిలే దీక్షలో కూర్చున్న మలిదశ ఉద్యమకారులకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. దీక్షలో తెలంగాణ మలిదశ ఉద్యమకారులు సట్టు నాగయ్య, వెలుగు వనితక్క, చకిలం రవి ప్రసాద్, మామిడి శెట్టి అంజయ్య, దొండ శ్రీను, లింగంపల్లి మురళి, ఎస్ కే సలీం, గొనె విజయ, వీరమనేని సత్యనారాయణరావు, నోముల ఉమాదేవి, అయూబ్ పాషా, దువ్వగిరి మేడబోయిన గంగయ్య,సికిందర్, దారా నిలిని, మాచర్ల రామ లక్షమ్మ,సట్టు మహేశ్వరి,కే సుజాత కూర్చోగా న్యాయవాది సత్యనారాయణ పిళ్ళై, జర్నలిస్టులు కందుకూరు యాదగిరి, ఉయ్యాల నర్సయ్య, కరాటే మాస్టర్ సయ్యద్, భయ్యా మల్లికార్జున్, చీకూరు శ్రీనివాస్ సంఘీభావం తెలిపారు. బుల్లెట్ ట్రైన్ సాధన కమిటీ నేతల అరెస్టు అప్రజాస్వామికంసీఎం రేవంత్రెడ్డి నకిరేకల్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో శనివారం సూర్యాపేటలో బుల్లెట్ ట్రైన్ సాధన అఖిలపక్ష పోరాట కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ ఆరుట్ల జానకిరెడ్డి, కోకన్వీనర్ చల్లమల్ల నరసింహను పట్టణ పోలీసులు ముందస్తు అరెస్టు చేయడం అప్రజాస్వామికమని మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావుతోపాటు ప్రజా, సామాజిక సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు తీవ్రంగా ఖండించారు. బుల్లెట్ ట్రైన్ సాధన కోసం శాంతియుతంగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న వారిని ముందస్తుగా అరెస్టు అన్యాయమని వారు ముక్తకంఠంతో ఖండించారు. -
మట్టపల్లి క్షేత్రంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు
మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం శ్రీస్వామివారికి పంచామృతాభిషేకం, విశేష పూజలు, మధ్యాహ్నం 12గంటలకు తీర్థప్రసాదాలు. సాయంత్రం 6 గంటలకు శ్రీకృష్ణుడికి పొన్నవాహన సేవతోపాటు పెదవీడుకు చెందిన యాదవుల ఆధ్వర్యంలో ఉట్లోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం మహా నివేదన గావించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ చలపతిరావు, అర్చకులు పాల్గొన్నారు. -
అదనపు అభ్యసనానికి వర్క్ బుక్స్
సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో అదనపు అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు ప్రభుత్వం వర్క్బుక్స్ అందుబాటులోకి తెచ్చింది. గతేడాది 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు మాత్రమే వర్క్బుక్స్ అందించగా.. ఈ విద్యా సంవత్సరం నుంచి 6 నుంచి 10వ తరగతి వారికి కూడా పంపిణీ చేశారు. అన్ని ప్రధాన సబ్జెక్టులకు సంబంధించిన వర్క్బుక్స్ అందడంతో తరగతిలో నేర్చుకున్న అంశాలను విద్యార్థులు ఇంటి వద్ద చిత్రాలు, ప్రశ్నలు, అభ్యాస కార్యక్రమాల ద్వారా పాఠ్యాంశాలను మరింత ఆసక్తిగా నేర్చుకునే అవకాశం కలుగుతోంది. 950 పాఠశాలలు జిల్లాలో 950 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ వర్క్బుక్స్ను విద్యార్థులకు అందిస్తున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రంలోని పాఠశాలలకు వర్క్బుక్స్ చేరాయి. 1 నుంచి 5వ తరగతి వరకు 69,015 వర్క్బుక్స్, 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 1,29,590 వర్క్బుక్స్ వచ్చాయి. పాఠ్యాంశాలను కేవలం చదవడానికే పరిమితం కాకుండా ప్రశ్నలకు సమాధానాలు రాయడం, అభ్యాసాలు చేయడం ద్వారా 1 నుంచి పదవ తరగతి విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానం పెరగనుంది. అభ్యాసమే లక్ష్యంగా.. వర్క్ బుక్స్లో పాఠ్యాంశాలకు అనుగుణంగా అభ్యాసాలు ఉండడంతో విద్యార్థుల అవగాహన స్థాయిని ఉపాధ్యాయులు సులభంగా అంచనా వేయగలుగుతారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేకంగా సాధన చేయించేందుకు ఇవి ఉపయోగపడుతున్నాయి. ఫలితంగా విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపడే అవకాశం ఉందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఫ గతేడాది నుంచే ప్రాథమిక స్థాయి విద్యార్థులకు అందజేత ఫ ఈ విద్యాసంవత్సరం 6 నుంచి 10వ తరగతుల వారికి.. ఫ విద్యా ప్రమాణాల మెరుగునకు దోహదంతరగతిలో బోధించిన అంశాలను ఇంటి వద్ద సాధన చేసుకోవచ్చు. ప్రశ్నలకు స్వయంగా సమాధానాలు రాయడం ద్వారా ఆలోచన సామర్థ్యం పెరుగుతుంది. విద్యార్థులకు తమ అభ్యస సామర్థ్యాలను పెంచుకునేందుకు ఈ వర్క్బుక్స్ ఉపయోగపడతాయి. – అశోక్, జిల్లా విద్యా శాఖ అధికారి -
ఉపాధ్యాయులతోనే ఉత్తమ సమాజం
సూర్యాపేటటౌన్ : ఉత్తమ సమాజ నిర్మాణం ఉపాధ్యాయులతోనే సాధ్యమని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జరిగిన గురుపూజోత్సవంలో జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకులకు అవార్డులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. తన జీవిత ప్రయాణంలో గురువుల పాత్రను గుర్తుచేసుకుని, ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేను పుట్టి పెరిగింది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా మాలేగావ్ తాలూకా సౌందనే గ్రామంలో నా తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులే కావడంతో నా బడి ప్రయాణం నేను పుట్టిన రోజు నుంచే మొదలైందన్నారు. సాతారాలోని సైనిక్ స్కూల్, ఇంజనీరింగ్, ఆపై యూపీఎస్సీ ప్రస్థానంలో తనకు మార్గదర్శనం చేసిన ప్రతిఒక్క గురువును ఆయన పేరుపేరునా స్మరించుకున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పాఠశాలల్లోనూ విద్యాబోధన పద్ధతులు మారాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఎంత సాంకేతికత వచ్చినా, కృత్రిమ మేధ పెరిగినా విద్యార్థిని వ్యక్తిగతంగా సరైన మార్గంలో నడిపించే గురువు స్థానాన్ని ఏ యంత్రమూ భర్తీ చేయలేదని స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా చైతన్యవంతమైన జిల్లా అని, ఇక్కడి విద్యా రంగం ప్రస్తుతం ఒక సరికొత్త టేకాఫ్ దశలో ఉందన్నారు. ఈ సందర్భంగా భారతదేశ తొలి ఉప రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి ప్రేమ్రాజ్, డీఐఈఓ సులోచనరాణి, ఆర్సీఓలు, పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు. ఫ గురుపూజోత్సవంలో కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఫ కలెక్టరేట్లో ఉత్తమ టీచర్లకు జిల్లాస్థాయి అవార్డులు ప్రదానం -
విద్యారంగాన్ని విస్మరించిన ప్రభుత్వం
ఫ మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ఫ సూర్యాపేటలో బీఆర్ఎస్ నిరసన ర్యాలీసూర్యాపేటటౌన్ : కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేయడంతోపాటు విద్యార్థులను, విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల పాలనకు వ్యతిరేకంగా విద్యార్థులకు ఇచ్చిన హామీలను మరిచిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో శనివారం సూర్యాపేట పట్టణంలో విద్యార్థులతో కలిసి నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ ఇచ్చిన మోసపూరిత హామీలు, జాబ్ క్యాలెండర్, స్కూటీలు, యూత్ డిక్లరేషన్, 2లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా భరోసా కార్డు ఇంకెప్పుడిస్తారని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో వై.వెంకటేశ్వర్లు, నిమ్మల శ్రీనివాస్గౌడ్, అంగిరేకుల నాగార్జున, అన్నపూర్ణ, బంటు సందీప్, అనిల్రెడ్డి, బీఆర్ఎస్వీ ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. హామీల అమలులో కాంగ్రెస్ విఫలం కోదాడ : విద్యార్థులకు, యువతకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ఆరోపించారు. వెయ్యి రోజులు కాంగ్రెస్ వైఫల్య పాలనపై శనివారం కోదాడ బస్టాండ్ సెంటర్లో విద్యార్థులతో కలిసి చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. బాలికలకు స్కూటీలను ఇస్తానని హామీ ఇచ్చి మూడేళ్లవుతున్నా నేటి వరకు అందించలేదన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులతోపాటు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, మహిళలకు తులం బంగారం ఇచ్చి హామీలు నిలబెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చీమ నరేష్, పలువురు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
నేడు హుజూర్నగర్కు మంత్రి ఉత్తమ్ రాక
హుజూర్నగర్ : రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఆదివారం హుజూర్నగర్ రానున్నారని మంత్రి కార్యాలయ సిబ్బంది శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం పట్టణ శివారులోని ఫణిగిరి గుట్టవద్ద నిర్మాణంలో ఉన్న మోడల్ కాలనీ వద్ద జరగుతున్న పనులతోపాటు ఆర్అండ్బీ, ఇరిగేష్ కార్యాలయ భవన నిర్మాణాలను మంత్రి పరిశీలిస్తారని పేర్కొన్నారు. అనంతరం ముత్యాలమ్మ జాతరలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి జూనియర్, డిగ్రీ కళాశాలల భవనాలను ఆయన పరిశీలిస్తారని తెలిపారు.విద్యార్థులు డ్రగ్స్ జోలికి వెళ్లొద్దుచివ్వెంల(సూర్యాపేట) : విద్యార్థులు డ్రగ్స్ జోలికి వెళ్లొద్దని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.భవ్య అన్నారు. శనివారం సూర్యాపేట పట్టణంలోని జీజేఎం ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన డ్రగ్స్ ఫ్రీ ఇండియా–2025 కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం డ్రగ్స్ చాక్లెట్ల రూపంలో వస్తున్నాయని, విద్యార్థులు బయట తినే ఆహార పదార్థాల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని హెచ్ఎంను ఆదేశించారు. కార్యక్రమంలో డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, కె.ప్రియదర్శిని, హెచ్ఎం వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ప్రజా ఉద్యమాలను కొనసాగిద్దాంసూర్యాపేట అర్బన్ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను కొనసాగిద్దామని సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. శని వారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ధర్మభిక్షం భవనంలో ఉస్తెల నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు జరిగే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. నిజాం నిరంకుశ పాలన, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం సాగించిన వీరోచిత పోరాటం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. సమావేశంలో యాల్లావుల రాములు, ఎల్లంల యాదగిరి, బద్దం కృష్ణారెడ్డి, బూర వెంకటేశ్వర్లు, నంద్యాల రాంరెడ్డి పాల్గొన్నారు. -
ఎడమ కాలువకు గండి పడలేదు
హుజూర్నగర్ : హుజూర్నగర్ మండలం కరక్కాయలగూడెం శివారులో సాగర్ ఎడమ కాలువకు గండి పడలేదని నీటిపారుదల శాఖ డీఈలు రామకృష్ణ, వెంకటేశ్వర్లు తెలిపారు. కాలువకు గండి పడినట్లు, కాలువ కట్ట తెగినట్లు పత్రికల్లో వచ్చిన వార్తలపై వారు స్పందించి శనివారం సదరు కాలువ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అది గండి కాదని, కరక్కాయలగూడెం శివారులో యూటీ వద్ద చిన్న రంధ్రం ఉందని తెలిపారు. దాని ద్వారా వచ్చే లీకేజీ నీటితో రైతులు చెరువులు నింపుకుంటున్నారని వారు తెలిపారు. కాలువలో నీరు తగ్గిన తర్వాత ఆ రంధ్రాన్ని పూడ్చివేస్తామని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో నీటిపారుదల ఏఈ మానస, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ కోతలపై రైతుల ఆందోళన
కోదాడరూరల్ : వ్యవసాయాని కోతలు లేకుండా 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం నాయకులు శుక్రవారం పట్టణంలోని ఖమ్మం క్రాస్రోడ్లో గల సబ్స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం ఉపాధ్యక్షుడు బొల్లు ప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే దానికి తోడు ప్రభుత్వం కరెంట్ కోతలు పెడుతూ రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తుందన్నారు. బావులు, బోర్ల కింద సాగు చేసిన పంటలు విద్యుత్ కోతలతో ఎండిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, పాలకులు స్పందించి వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని కోరారు. అనంతరం ఏడీఈకి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో రైతులు బొల్లు రామకృష్ణ, పోటు నరేష్, సామినేని సుబ్బారావు, శేషయ్య, వెంకటేశ్వర్లు, పూర్ణచందర్రావు, వెంకట్రామయ్య, బొల్లు నరేష్ తదితరులు పాల్గొన్నారు. అథ్లెటిక్స్లో మోతె వాసికి బంగారు పతకం మోతె : పంజాబ్ రాష్ట్రం లుథియానాలో ఈ నెల ఒకటో తేదీ నుంచి 3 వరకు జరిగిన జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో మోతె మండల కేంద్రానికి చెందిన అప్పల వరుణ్ సత్తా చాటాడు. 1000 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించాడు. దాంతో పాటు 400 మీటర్ల రన్నింగ్ రేస్లో ఏడో స్థానంలో నిలిచాడు. వరుణ్ ప్రస్తుతం సూర్యాపేటలోని జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. జాతీయ స్థాయిలో పతకం సాధించిన వరుణ్ను కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, కళాశాల అధ్యాపకులు అభినందించారు. రేపటి నుంచి ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలుతుంగతుర్తి : ఈ నెల 6, 7, 8 తేదీల్లో కరీంనగర్లో ఏఐటీయూసీ రాష్ట్ర నాలుగో మహాసభలు జరుగనున్నట్లు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గుగులోతు రాజారాం నాయక్ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 6న భారీ కార్మిక ప్రదర్శన, 7, 8 తేదీల్లో ప్రతినిధుల మహాసభలు ఉంటాయన్నారు. మహా సభలకు కార్మికులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు బొంకూరు శ్యాంసుందర్, నియోజకవర్గ గౌరవ అధ్యక్షుడు కోట రామస్వామి, నర్సయ్య, నజీర్, వెంకన్న, ఆంధ్రయ్య, హైమద్, ఖదీర్, శ్రీనివాస్, సత్యం, భిక్షపతి, యాకుబ్, సైదులు పాల్గొన్నారు. రాజవరం మేజర్కు గండితిరుమలగిరి (సాగర్) : నాగార్జునసాగర్ ఎడమ కాలువ మొదటి మేజర్ రాజవరం కాలువకు అల్వాల గ్రామ సమీపంలో శుక్రవారం భారీ గండి పడింది. దీంతో కాలువ నీరంతా వృథాగా పొలాల్లో పారుతోంది. సాగర్ ఆయకట్టు పరిధిలో తాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు, భూగర్భ జలాలు పెంచేందుకు ప్రభుత్వం ఇటీవల నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసింది. ఈ క్రమంలో అల్వాల సమీపంలో మేజర్ కాలువకు భారీ గండి పడడంతో నీళ్లన్నీ వృథా అవుతున్నాయి. సాగర్జలాలు విడుదలైన నాటినుంచి ఇప్పటివరకు చెరువుల్లోకి సగం నీరు కూడా చేరలేదని, ఇప్పుడు గండి పడి నీరంతా వృథా అవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి మేజర్కు నీటిని బంద్ చేశారు. గండిని పూడ్చి, చెరువులు నింపాలని రైతులు కోరుతున్నారు. -
నాగార్జునసాగర్ జలాలు కలుషితం
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ జలాశయంలోని నీరు కులషితమైంది. సాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువ పైభాగంలోని దయ్యాలగండి సమీపంలో జలాశయం నీరు పచ్చగా మారడంతో పాటు నీటి పైభాగంలో ఆయిల్ తెట్టు ఏర్పడినట్లు ఉంది. అంతే కాకుండా నీటి ఒడ్డునగల పచ్చని గడ్డి మాడిపోయినట్లు కనిపించడంతో నీటిలో ఏదో రసాయనం కలిసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి కలుషిత నీరు వచ్చి జలాశయంలో కలిసిందా? లేక జలాశయంలో తిరిగే మరపడవల నుంచి డీజిల్, పెట్రోల్, గ్రీజు తదితర వ్యర్థాలు నీటిలో కలిశాయా? లేక చేపల వేట కోసం నీటిలో ఏవైనా కలిపారా? అనే అనే అనుమానలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు వెంటనే దయ్యాలగండి ప్రాంతాన్ని సందర్శించి నీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించాలని రైతులు, స్థానికులు కోరుతున్నారు. నీటిలో ఏ పదార్థాలు కలిశాయో గుర్తించి ప్రజలకు పశువులు, జలచరాలకు ఏమైనా నష్టజరిగే ప్రమాదం ఉందా అనే విషయాన్ని స్పష్టం చేయాలని కోరుతున్నారు. -
డిపాజిట్ గల్లంతు!
పంచాయతీ ఎన్నికల్లో డిపాజిట్ దక్కించుకున్న వారికి తిరిగిరాని సొమ్ముఫ ఎన్నికలు ముగిసి సంవత్సరం కావస్తున్నా ఇదే పరిస్థితి ఫ అవగాహనలేక అటువైపు వెళ్లని అభ్యర్థులు ఫ అడిగిన వారికి మాత్రమే ఇస్తున్న అధికారులు ఫ మిగతా సొమ్ముకు లెక్కలు కరువు భానుపురి (సూర్యాపేట) : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు చెల్లించిన ధరావతు (డిపాజిట్) సొమ్ము అధికారుల నిర్లక్ష్య, అభ్యర్థుల అవగాహనా రాహిత్యంతో గల్లంతవుతోంది. నిబంధనల ప్రకారం ఎన్నికల అనంతరం అర్హులైన అభ్యర్థులకు తిరిగి చెల్లించాల్సిన రూ.లక్షలాది డిపాజిట్ సొమ్ముకు అధికారులు లెక్కలు చూపడం లేదు. దీనిపై పోటీ చేసిన అభ్యర్థులకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఈ డబ్బంతా ఎటు పోయిందో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లాలో 1,346 మంది పోటీ జిల్లాలో 2025 డిసెంబర్లో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలను అధికారులు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 486 గ్రామపంచాయతీలు, 4,388 వార్డులకు గాను.. సర్పంచ్ అభ్యర్థులుగా 1,346 మంది, వార్డు మెంబర్లుగా 15,000 మందికి పైగా పోటీ చేశారు. వీరంతా ఎన్నికల సంఘం సూచించిన మేరకు డిపాజిట్ సొమ్ము చెల్లించారు. అయితే ఈ డబ్బులు తిరిగి వస్తాయన్న కనీస అవగాహన అభ్యర్థులకు లేకపోవడం, అధికారులు కూడా ఆ విషయమై స్పందించకపోవడంతో గెలిచిన వారితో పాటు, డిపాజిట్ దక్కించుకున్న ఓడిపోయిన అభ్యర్థులు కూడా సొమ్మును తిరిగి పొందేందుకు ముందుకు రాలేదు. డిపాజిట్ సోమ్మును అధికారులు సొంతానికి వాడుకుంటున్నట్లు ఆరోపణలు కూడా వస్తున్నాయి. అడిగిన వారికి మాత్రమే.. ఎన్నికల నిబంధనల ప్రకారం సర్పంచ్గా పోటీచేసే జనరల్ అభ్యర్థులు రూ.2వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.వెయ్యి చొప్పున డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. వార్డు సభ్యులుగా పోటీ చేసే జనరల్ అభ్యర్థులు రూ.500, నియోజకవర్గ రిజర్వుడ్ అభ్యర్థులు రూ.250 చెల్లించారు. ఒక్కో అభ్యర్థి చేసే చిన్న మొత్తాలను జిల్లా వ్యాప్తంగా లెక్కగడితే రూ.50 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు అవుతున్నాయి. ఈ నిధులన్నీ ప్రస్తుతం ఎంపీడీఓల పరిధిలో ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం అవగాహన ఉండి, ఎన్నికల ఖర్చుల లెక్కలు చూపించి అడిగిన వారికి మాత్రమే అధికారులు డిపాజిట్ తిరిగి ఇస్తున్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో చెల్లుబాటైన ఓట్లలో డిపాజిట్ దక్కించుకున్న వారికి, విజయం సాధించిన అభ్యర్థులకు మాత్రమే డిపాజిట్ డబ్బులు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఎంపీడీఓ కార్యాలయంలో అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చుల లెక్కలను నిబంధనల ప్రకారం సమర్పించి, తమ ధరావతు సొమ్మును తిరిగి పొందవచ్చు. –యాదగిరి, డీపీఓ -
ఆరు గ్యారంటీలు గాలికొదిలేసిన కాంగ్రెస్
చిలుకూరు: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులైనా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ శుక్రవారం మండలంలోని బేతవోలు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వంటా – వార్పు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచేందుకు ఆరు గ్యారంటీలు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వాటిని గాలికొదిలేసిందన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు పింఛన్లు పెంచుతామని ఇచ్చిన హామీ నెరవేర్చక పోగా సదరం క్యాంపులో సర్టిఫికెట్లు పొందాలంటే దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి పెరిగిందని, నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగి సామాన్యులు బతికే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలను గాలికొదిలేసిన మంత్రులు హెలికాప్టర్లలో చక్కర్లు కొడుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు అక్కినపల్లి జానకీరామాచారి, మాజీ జడ్పీటీసీ భట్టు శివాజీనాయర్, చిలుకూరు ఫ్యాక్స్ చైర్మన్ అలసకాని జనార్దన్, పార్టీ జిల్లా నాయకుడు తాళ్లూరి శ్రీను పాల్గొన్నారు. ఫ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ -
ప్రజలకు అందుబాటులో పోలీసు సేవలు
సూర్యాపేటటౌన్ : ప్రతి పౌరుడికి పోలీసు సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ నరసింహ అన్నారు. జిల్లా పోలీస్ అధికారులతో శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న కేసుల తీరుతెన్నులు, దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, కోర్టు కేసుల పరిస్థితి, అట్రాసిటీ కేసులు, సెంటర్ కంప్లైంట్ సెల్ ఫిర్యాదులు, 30 రోజుల్లో చార్జ్ షీట్ దాఖలు, పొక్సో కేసుల దర్యాప్తు వంటి అంశాలపై సమీక్షించారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రానున్న వినాయక చవితి ఉత్సవాలు, విగ్రహాల నిమజ్జనం సందర్భంగా జిల్లాలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు ప్రణాళికతో భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. వినాయక మండపాల ఏర్పాటు విషయంలో నిర్వాహకులు నిబంధనలు పాటించేలా అవగాహన కల్పించాలని సూచించారు. మండపాల వద్ద భద్రతా చర్యలు, విద్యుత్ సౌకర్యం, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకునేలా అధికా రులు చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ రవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, పోలీస్ టెక్నికల్, కమ్యూనికేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఫ ఎస్పీ నరసింహ -
బుల్లెట్ రైలు సాధనే లక్ష్యంగా ఉద్యమాలు
సూర్యాపేట : బుల్లెట్ రైలు అలైన్మెంట్ మార్చే కుట్రపై అఖిలపక్షాల ఆధ్వర్యంలో తిరుగుబాటు కొనసాగిస్తామని, జాతీయ రహదారి వెంట బుల్లెట్ ట్రైన్ కారిడార్ లక్ష్యంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని బుల్లెట్ ట్రైన్ సాధన అఖిలపక్షాల పోరాట సమితి కన్వీనర్ ప్రొఫెసర్ జానకిరెడ్డి అన్నారు. పోరాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సద్ద్దులచెరువులో సామూహిక జలదీక్ష నిర్వహించారు. సుమారు 200 మంది దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం సూర్యాపేటకు వచ్చే బుల్లెట్ ట్రైన్ను దారి మళ్లించేందుకు చేస్తున్న కుట్రలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెంటనే కేంద్రం ప్రకటించిన విధంగా బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ను జాతీయ రహదారి 65కు సమాంతరంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అఖిలపక్షాల నాయకులు పెద్దిరెడ్డి రాజా, డాక్టర్ రామ్మూర్తి, జుట్టు కొండ సత్యనారాయణ, ధర్మార్జున్, డేవిడ్ కుమార్, మట్టిపెల్లి సైదులు, చల్లమల్ల నరసింహ, భూపతి రాములు, బూర మల్సూర్గౌడ్, యాదగిరిరావు, పెద్దిరెడ్డి కళ్యాణ్ చక్రవర్తి, వీరేంద్ర, సట్టు నాగయ్య, వెలుగు వనిత, కృష్ణ పాల్గొన్నారు. బుల్లెట్ ట్రైన్తోనే అభివృద్ధి సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ వస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ప్రజల ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు వస్తాయని మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూర నర్సయ్యగౌడ్ అన్నారు. బుల్లెట్ ట్రైన్ సాధన అఖిలపక్ష పోరాట కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారం 22వ రోజు కొనసాగాయి. దీక్షకు ఆయన మద్దతు తెలిపి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అలైన్మెంట్లో మార్పు చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. ఆయన వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, బూర మల్సూర్గౌడ్, చల్లమల్ల నరసింహ, కర్నాటి కిషన్, తదితరులు ఉన్నారు. దీక్షకు జిల్లా పాస్టర్ల సంఘం అధ్యక్షుడు దుర్గం ప్రభాకర్ ఆధ్వర్యంలో మద్దతు తెలిపారు. దీక్షలో సిఐటీయూ నాయకులు నెమ్మాది వెంకటేశ్వర్లు, ఏకలక్ష్మి, వెంకటనారాయణ శివకృష్ణ, నవీన్, ధనియాకుల శ్రీనివాస్, ముత్తయ్య, సోమయ్య, సాయికుమార్, సురేష్, మార్క్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఫ పోరాట సమితి ఆధ్వర్యంలో జలదీక్ష -
వానాకాలంలోనూ నీటి తిప్పలు
మున్సిపాలిటీలోని అన్ని వార్డులకు నీటి సమస్య రాకుండా చూస్తాం. సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటాం. నీటి సమస్య ఉన్న ప్రాంత ప్రజలు నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావాలి. – సీహెచ్.హనుమంతరెడ్డి, మున్సిపల్ కమిషనర్, సూర్యాపేట మున్సిపాలిటీ నీరు ఇవ్వాల్సిన సమయం కంటే తక్కువగా ఇస్తున్నారు. నీటి సరఫరా సమయాన్ని పెంచాలి. ఎంత పొదుపుగా వాడుకున్నా నీరు సరిపోవడం లేదు. అధికారులు స్పందించి నీటి సరఫరాలో జాప్యం లేకుండా చూడాలి. – సరగం వెంకటమ్మ, స్నేహనగర్ వాసి సూర్యాపేట అర్బన్ : వానాకాలంలోనూ సూర్యాపేట పట్టణ ప్రజల తాగునీటి కోసం తిప్పలు పడుతున్నారు. ఎల్నినో ప్రభావంతో వరుణుడు కరుణించకపోవడం, భూగర్భ జలాలు అడుగంటడం, ఇళ్లల్లోని బోర్లు సైతం వట్టిపోయాయి. దీనికి తోడు మున్సిపల్ నీటి సరఫరాలోనూ తరచూ అంతరాయం ఏర్పడుతుండడంతో పట్టణ వాసులు గుక్కెడు నీటి కోసం అల్లాడుతున్నారు. ఏ వార్డులో ఎప్పుడు, ఎంతసేపు నీళ్లు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొందని ప్రజలు వాపోతున్నారు. ఫలితంగా తాగునీటి కోసం సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తేనే.. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో 48 వార్డులు, సుమారు 39వేల నివాసాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 17,500 ఇళ్లకు మున్సిపల్ నల్లా కనెక్షన్లు ఉండగా, మిగతా కుటుంబాలు బోర్ల మీదే ఆధారపడుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం బోర్లు ఎండిపోవడంతో ఆయా కుటుంబాల వారు సైతం మున్సిపాలిటీ నీటిపైనే ఆధార పడుతున్నారు. ఎల్నినో పరిస్థితి నేపథ్యంలో మున్సిపాలిటీ వారు ఎక్కువ సమయం నీటిని సరఫరా చేయలేకపోతున్నారు. దీనికి పైప్లైన్ల లీకేజీలు కూడా తోడవడంతో ప్రజల నీటి కష్టాలు రెట్టింపయ్యాయి. వచ్చే ఆ కాస్త నీటిని ఎంత పొదుపుగా వాడుకున్నా సరిపోవడం లేదని, సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా అయినా నీటిని సరఫరా చేయాలని పట్టణవాసులు కోరుతున్నారు. తరచూ లీకేజీ సమస్యలు మిర్యాలగూడ సమీపంలోని అవంతీపురం మిషన్ భగీరథ ప్రాజెక్టు నుంచి పైప్లైన్ల ద్వారా ఇమాంపేటకు, అక్కడి నుంచి సూర్యాపేట పట్టణానికి కృష్ణా జలాలు సరఫరా అవుతున్నాయి. అవంతీపురం పంప్హౌస్లో మోటార్ల సమస్యలు, విద్యుత్ అంతరాయం, పైప్లైన్ల లీకేజీలు, వాల్వ్ పైపు వద్ద గ్యాస్కెట్ ఫెయిల్ వంటి సాంకేతిక సమస్యలు తలెత్తిన ప్రతిసారి సూర్యాపేటకు నీటి సరఫరా నిలిచిపోతోంది. ఇమాంపేట ప్రాజెక్టు వద్ద కూడా తరచూ ఇలాంటి సమస్యలే తలెత్తుతున్నాయి. పైప్లైన్ల లీకేజీల సమయంలో అధికారులు నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తేనే.. కేవలం మిషన్ భగీరథపైనే ఆధారపడకుండా పట్టణానికి ప్రత్యామ్నాయ నీటి వనరులను సిద్ధం చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. గతంలో సూర్యాపేటకు నీటిని అందించిన దోసపహాడ్, మూసీ ప్రాజెక్టులను పునరుద్ధరించి అవసరమైన మేరకు వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. ఫ సూర్యాపేటలో తాగు నీటికి అల్లాడుతున్న ప్రజలు ఫ వర్షాభావంతో అడుగంటిన బోర్లు ఫ మున్సిపల్ నీటి సరఫరాలోనూ తరచూ అంతరాయం ఫ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రజల వేడుకోలు -
కరెంట్ కోతలపై అన్నదాతల ఆగ్రహం
మోతె : వ్యవసాయానికి కోతలు లేని విద్యుత్ను అందించాని డిమాండ్ చేస్తూ మోతె, బీక్యతండా గ్రామాలకు చెందిన రైతులు మంగళవారం లాల్తండా సబ్స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురువలేదని, కరెంట్ కూడా సక్రమంగా సరఫరా చేయక పోవడంతో తాము సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లోఓల్టేజీ సమస్యతో విద్యుత్ మోటర్లు కాలిపోతున్నాయన్నారు. సక్రమంగా విద్యుత్ సరఫరా చేయాలని, మోతె మండల కేంద్రంలో సబ్స్టేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతులు కొమ్ము లింగరాజు, ఇండ్ల వెంకటేశ్వర్లు, సురేష్, గణేష్, ఉపేందర్, దేవుల, ఇండ్ల శ్రీను, రామోజీ, తదితరులు పాల్గొన్నారు. -
సర్లో గందరగోళం
భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేట జిల్లాలో ‘సర్’ ప్రక్రియ గందరగోళంగా మారింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా ఓటర్లు ఇచ్చిన ఎన్యుమరేషన్ ఫారంలో చిన్న పాటి తప్పులు ఉన్నా సరే అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. కానీ నోటీసులు ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో చాలామంది ఓటర్లకు అందలేదు. నోటీసులు అందుకున్న వారు సైతం ఏ తప్పులకు.. ఏ ఆధారం ఇవ్వాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ విషయమై అధికారులు సైతం అవగాహన కల్పించకపోవడం వల్ల ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు. అందని నోటీసులు..! జిల్లా వ్యాప్తంగా సర్లో భాగంగా ఎన్యుమరేషన్ ప్రక్రియ తర్వాత 9,11,945 మంది ఓటర్లకు ముసాయిదా ఓటరు జాబితాలో చోటు దక్కింది. ఈ ప్రక్రియలో మ్యాపింగ్ కాని ఓటర్లతో పాటు అనామలీస్ (స్పష్టమైన గుర్తింపు లేని ఓటర్లు) కింద 1,90,676 మందికి ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేశారు. గత నెల 27న జిల్లాలో చేపట్టిన గ్రామ, వార్డు సభలలో 4,796 మంది ఓటర్లకు నోటీసులు ఇవ్వగా మిగతా వారికి సైతం నోటీసులు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. నోటీసులు జారీ అయిన చాలా మందికి బీఎల్ఓలు నోటీసులు అందించలేదని తెలుస్తోంది. తమ పేరు నోటీసుల లిస్ట్లో ఉన్నట్లు తెలుసుకున్న కొందరు ఓటర్లు తమకు ఇంకా నోటీసులు రాలేదంటూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అవగాహన లేని ఓటర్లు తాము ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చామని, ముసాయిదా జాబితాలో తమ పేరు ఉన్నందున తమ ఓటు ఎటూ పోదన్న భరోసాతో ఉన్నారు. సమాధానం ఎలా ఇవ్వాలో తెలియక.. ఎస్ఐఆర్కు సంబంధించి ఎన్యుమరేషన్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టిన జిల్లా అధికారులు నోటీసులు జారీ తర్వాత అంతగా పట్టించుకోవడం లేదు. చాలామందికి అక్షర దోషాలు, వయసు, చిరునామా, కుటుంబ సభ్యుల వివరాల్లో పొరపాట్లు వంటి చిన్న చిన్న కారణాలు ఉన్నప్పటికీ నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. వాటిని ఎలా సరిచేయాలి, ఏ యే పత్రాలు సమర్పించాలన్న దానిపై ఓటర్లకు స్పష్టత లేదు. వాటిపై అధికారులు సైతం అవగాహన కల్పించడం లేదు. ఈ నేపథ్యంలో ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు. ప్రధానంగా అసలు నోటీసులు ఎందుకు ఇస్తున్నారు, ఓటర్లు ఏం చేయాలి, ఏ యే పత్రాలు సమర్పించాలి, విచారణకు ఎక్కడికి హాజరు కావాలనే విషయం కూడా చాలా మంది ఓటర్లకు తెలియని పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చాలామంది ఓటర్లు మరింత అభద్రతా భావంతో ఉన్నారు. వీరందరికీ అవగాహన కల్పించడంతో పాటు, నోటీసులను సకాలంలో ఓటర్లకు అందించడంతో పాటు వాటికి సరైన ఆధారాలు సమర్పించేలా జిల్లా యంత్రాంగం అవగాహన కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. ఫ చిన్నపాటి తప్పులున్నప్పటికీ ఓటర్లకు నోటీసులు ఫ వచ్చిన నోటీసులకు సమాధానం ఎలా చెప్పాలో తెలియక అయోమయం ఫ నోటీసులు వచ్చినా ఓటర్ల వరకు చేరని వైనం ఫ గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లకు అవగాహన కరువు -
పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపునకు ఉపాధ్యాయులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంఈఓలు, కాంప్లెక్స్ హెచ్ఎంలు, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడం, డిజిటల్ విద్యా విధానం, పాఠశాలల పర్యవేక్షణ వంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు. రాబోయే మిడ్లైన్ పరీక్షల్లో ప్రతి విద్యార్థి కనీసం 70 శాతం అభ్యాసన సామర్థ్యాలను సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎంఈఓలు, కాంప్లెక్స్ హెచ్ఎంలు పాఠశాలల తనిఖీకి వెళ్లినప్పుడు తప్పనిసరిగా శ్రీఅకాడమిక్ గైడెన్స్ రిజిస్టర్శ్రీలో తమ పరిశీలనలను, సూచనలను నమోదు చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఈఓ అశోక్, వివిధ విభాగాల సెక్టోరల్ అధికారులు, డీఆర్డీఓ సన్యాసయ్య, ట్రైనీ కలెక్టర్లు రవితేజ, అనూష, ఎఫ్ఎల్ఎన్ రాష్ట్ర కోఆర్డినేటర్ అభిషేక్ శ్రావణ్కుమార్, హరికృష్ణ పూలన్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
మూల్యాంకనంలో మార్పుపై..టీచర్ల ఆగ్రహం
ఎస్ఏ– 1, ఎస్ఏ–2 పరీక్ష పత్రాలను ఇతర పాఠశాలల ఉపాధ్యాయులతో మూల్యాంకనం చేయించడం అసంబద్ధమైన అంశం. ఇది సీసీఈ నిబంధనలకు విరుద్ధం. దీనిని మేము వ్యతిరేకిస్తున్నాం. ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాలలో ఉంచుతూ స్వేచ్ఛగా పాఠ్యాంశాలు బోధించకుండా చేసే విధంగా ఉన్న కార్యక్రమంగా మేము భావిస్తున్నాం. ఉపాధ్యాయులను బోధనకు పరిమితం చేసేలా చూడాలి. –పుప్పాల వీరన్న, టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్రంలో విద్యారంగ సంస్కరణలపేరుతో అధికారులు కేవలం ప్రయోగాలకు పరిమితమైన విధానాలను రూపొందిస్తూ విద్యారంగాన్ని దిగజారుస్తున్నారు. అధికారుల ఏకపక్ష నిర్ణయం ఫలితంగా అసంబద్ధమైన నిర్ణయాలు చేస్తూ ఉత్తర్వులు ఇస్తున్నారు. బాహ్యమూల్యాంకనం కూడా ఇలాంటి నిర్ణయమే. విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించి ఈ విధానంపై స్పష్టత ఇవ్వాలి. –సోంబాబు, టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సంస్కరణల పేరుతో డబ్బులు వృథా చేయడం, ఉపాధ్యాయులను బోధనకు దూరం చేయడం సరికాదు. తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని, జీఓ 25 సవరించాలని కొన్నేళ్లుగా ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నా పట్టించుకోని అధికారులు, స్వచ్ఛంద సంస్థలు చెప్పిన సలహాలు పాటిస్తూ విద్యారంగంలో ప్రయోగాలు చేస్తున్నారు. ఇలాంటి నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. – కోటమర్తి వీరయ్య, టీఎస్ యూటీఎఫ్ నాయకుడుఫ బోధనకు విఘాతం కలుగుతుందని ఆందోళన ఫ ఎమ్మార్సీల్లోనే జవాబు పత్రాల దిద్దాలంటున్న విద్యాశాఖసూర్యాపేటటౌన్ : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల పరీక్ష పత్రాల మూల్యాంకన విధానంలో పాఠశాల విద్యాశాఖ తెచ్చిన నూతన మార్పులు ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీశాయి. ఇప్పటివరకు సంబంధిత పాఠశాలల్లోనే జరుగుతున్న ఎస్ఏ–1, ఎస్ఏ–2 జవాబు పత్రాల దిద్దుబాటును ఇకపై మండల విద్యా వనరుల కేంద్రాల్లో (ఎమ్మార్సీ) నిర్వహించేలా శ్రీఎక్స్టర్నల్ ఎవాల్యుయేషన్ సిస్టమ్శ్రీను ప్రవేశపెట్టడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ నిర్ణయం వల్ల టీచర్లపై తీవ్ర పనిభారం పడి నిత్య బోధనకు విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. క్షేత్రస్థాయి అభిప్రాయాలను సేకరించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఒకరి పేపర్లు మరొకరు.. గతంలో విద్యార్థులు రాసిన ఎస్ఏ–1, ఎస్ఏ–2 జవాబు పత్రాలను ఆయా పాఠశాలల్లోనే ఉపాధ్యాయులు దిద్దేవారు. కొత్త విధానం అమల్లోకి వస్తే ఈ పరిస్థితి ఉండదు. మండలంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సంబంధించిన పరీక్ష పాత్రలను మండల కేంద్రంలోని ఎమ్మార్సీలకు చేరుస్తారు. అక్కడ ఒక పాఠశాలకు చెందిన పరీక్ష పత్రాలను వేరే పాఠశాల ఉపాధ్యాయులతో మూల్యాంకనం చేయించనున్నారు. విద్యార్థుల ప్రతిభను నిష్పక్షపాతంగా అంచనా వేయడం, మూల్యాంకనంలో పారదర్శకత తీసుకురావడం లక్ష్యంగా ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అనేక అభ్యంతరాలు.. ఈ కొత్త విధానంపై కొన్ని ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. జవాబు పత్రాలను ఎమ్మార్సీలకు తరలించడం, అక్కడ మూల్యాంకనం చేయడం వల్ల ఉపాధ్యాయులపై అదనపు భారం పడుతుందని పేర్కొంటున్నాయి. పాఠశాలల నుంచి ఎమ్మార్సీలకు జవాబు పత్రాల తరలింపు, భద్రత, మూల్యాంకనం అనంతరం వాటి నిర్వహణ వంటి అంశాలపై మరింత స్పష్టత అవసరమని ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు. జిల్లాలో 950 పాఠశాలలు జిల్లాలో 950 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, వాటిలో సుమారు 70 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి బోధన అందించేందుకు 4,118 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. కొత్త ఎక్స్టర్నల్ ఎవాల్యుయేషన్ విధానం ఈ విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి రానుంది. దాంతో కొత్త విధానం అమలు తీరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొత్త ఎక్స్టర్నల్ ఎవాల్యుయేషన్ విధానం త్వరలోనే అమల్లోకి రానుంది. పాఠశాలల్లో నిర్వహించే ఎస్ఏ– 1, ఎస్ఏ– 2 పరీక్షలకు సంబంధించిన మూల్యాంకనాన్ని ఎమ్మార్సీల్లో చేసేలా ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చింది. నూతన విధానం ద్వారా పారదర్శకత పెరుగుతుంది. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులపై మరింత శ్రద్ధ పెట్టే అవకాశం ఉంటుంది. – అశోక్, డీఈవో -
కాంగ్రెస్ వైఫల్యాలపై నేటి నుంచి పోరుబాట
సూర్యాపేటటౌన్ : కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో అన్ని రంగాల్లో విఫలమైందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఈ నెల 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతాంగ సమస్యలు, సాగునీటి ఇబ్బందులు, వ్యవసాయ సంక్షోభంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. కేసీఆర్ ప్రస్తావన లేకుండా సీఎం రేవంత్రెడ్డి ఒక్క సమావేశమైనా నిర్వహించారా అని ప్రశ్నించారు. కేసీఆర్ను అత్యధికంగా తలుచుకునేది రేవంత్రెడ్డే అన్నారు. నల్లగొండ జిల్లాలో సాగునీటి సమస్యలు నెలకొన్నా స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధులు స్పందించడం లేదని విమర్శించారు. ఎడమ కాలువకు నీటిని విడుదల చేయాలని అడిగే ఎమ్మెల్యే కూడా లేకపోవడం దురదృష్టకరమన్నారు. పల్లెల్లో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మిర్యాలగూడలో కేటీఆర్ ఆధ్వర్యంలో రైతు ధర్నా నిర్వహించి తీరుతామన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని స్పష్టం చేశారు. సమావేశంలో మాజీ ఎంపీ బడుగు లింగయ్య యాదవ్, నాయకులు వై.వెంకటేశ్వర్లు, నిమ్మల శ్రీనివాస్గౌడ్, పెరుమాళ్ల అన్నపూర్ణ, మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. ఫ మాజీ మంత్రి జగదీష్రెడ్డి -
బీజేపీ కార్యాలయంపై దాడి ప్రజాస్వామ్యానికి మచ్చ
సూర్యాపేట : బీజేపీ పార్టీ కార్యాలయం, నాయకులపై కాంగ్రెస్ శ్రేణులు దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతరెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయం, నల్లగొండలో నాగం వర్షిత్రెడ్డి ఇంటిపై దాడి చేయడాన్ని మంగళవారం ఆమె ఒక ప్రకటనలో ఖండించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని అరాచకాలకు పాల్పడుతున్న తీరు స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. ప్రతిపక్షాలను రాజకీయంగా ఎదుర్కోలేక, ప్రశ్నించే వారిని భయపెట్టేందుకు దాడులు, దౌర్జన్యాలు, విధ్వంసాలకు పాల్పడటం కాంగ్రెస్ పార్టీకి అలవాటైందని పేర్కొన్నారు. సైబర్ బాధితులకు అండగా పోలీస్శాఖసూర్యాపేటటౌన్ : సైబర్ మోసాల బారిన పడిన బాధితులకు పోలీస్శాఖ అండగా ఉంటుందని ఎస్పీ నరసింహ అన్నారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పని చేస్తున్న పోలీస్ సైబర్ వారియర్స్కు మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో సైబర్ నేరాల నియంత్రణ, బాధితులకు తక్షణ న్యాయం అందించడంపై వారికి సలహాలు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆన్లైన్లో పెట్టుబడులను ప్రజలు నమ్మవద్దని, అలాంటి పెట్టుబడులకు ఎలాంటి రక్షణ ఉండదన్నారు. పెట్టుబడి వెబ్సైట్లు, యాప్లు నకిలీవనే విషయాన్ని ప్రజలు గ్రహించాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ రవి, సైబర్ సెక్యూరిటీ డీఎస్పీ వెంకటయ్య, సైబర్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్లు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఖైదీల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలిచివ్వెంల(సూర్యాపేట) : ఖైదీల ఆరోగ్యం, ఆహారం, భద్రతపై జైలు సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.భవ్య సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సబ్జైల్ను ఆమె సందర్శించారు. జైలు పరిసరాలను, ఖైదీల గదులను తనిఖీ చేశారు. మధ్యహ్న భోజనాన్ని పరిశీలించారు. న్యాయవాదులను పెట్టుకునే స్థోమత లేని ఖైదీలు డీఎల్ఎస్ఏలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆమె వెంట డీఎల్ఎస్ఏ సూపరిండెంట్ పద్మజ, జైలు సిబ్బంది ఉన్నారు. జిల్లా స్థాయి సైన్స్ డ్రామా పోటీలుసూర్యాపేటటౌన్ : జిల్లా స్థాయి సైన్స్ డ్రామా పోటీలు జిల్లా కేంద్రంలోని బాలభవన్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు నిర్వహించిన డ్రామాలు ఆకట్టుకున్నాయి. ‘శాస్త్రం –సమాజం’ ప్రధాన ఇతివృత్తంగా నిర్వహించిన పోటీల్లో కృత్రిమ మేథస్సు – స్నేహితుడా, సాధనమా ముప్పా, విద్యుత్ వాహనాలు – భవిష్యత్ వైపు ముందడుగు, అంతరిక్ష నివాసాలు, సముద్రాల పునరుద్ధరణ – భవిష్యత్ తరాల పరిరక్షణ అనే ఉప అంశాలపై విద్యార్థులు నాటికలను ప్రదర్శించారు. అనంతరం విజేతలకు జిల్లా సైన్స్ అధికారి దేవరాజ్ బహుమతులు అందించారు. కార్యక్రమంలో బాలభవన్ సూపరింటెండెంట్ బండి రాధాకృష్ణారెడ్డి, కె.సత్యనారాయణసింగ్ పాల్గొన్నారు. -
ప్రభుత్వాలను కదిలించే స్థాయికి ఉద్యమం
సూర్యాపేట : బుల్లెట్ రైలు సాధనే లక్ష్యంగా సూర్యాపేటలో జరుగుతున్న ఉద్యమం ప్రభుత్వాలను కదిలించే స్థాయికి చేరిందని మున్సిపల్ మాజీ చైర్మన్లు జుట్టుకొండ సత్యనారాయణ, పెరుమాళ్ల అన్నపూర్ణ అన్నారు. సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ కారిడార్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని రైతుబజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు మంగళవారం 19వ రోజు కొనసాగాయి. దీక్షను వారు ప్రారంభించి మాట్లాడారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఉద్యమం బుల్లెట్ ట్రైన్ వచ్చే వరకు కొనసాగుతుందన్నారు. దీక్షల్లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు బొమ్మిడి లక్ష్మీనారాయణ, చల్లమల్ల నరసింహ, పేర్ల నాగయ్య, సలిగంటి వీరేంద్ర, పిండిగ నాగమణి, కందాల శంకర్రెడ్డి, వేల్పుల వెంకన్న, ఎల్లంల నరేష్, వల్లపుదాసు సాయికుమార్, వీరబోయిన రవి, షేక్ జహంగీర్, భయ్యా మల్లికార్జున్ యాదవ్, వజ్జా వీరయ్య, వెంకట్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు. ఫ మున్సిపల్ మాజీ చైర్మన్లు సత్యనారాయణ, పెరుమాళ్ల అన్నపూర్ణ -
బీజేపీది కక్ష సాధింపు రాజకీయం
భానుపురి (సూర్యాపేట) : బీజేపీ కక్షసాధింపు రాజకీయాలను మానుకోవాలని, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య డిమాండ్ చేశారు. రాహుల్గాంధీపై అక్రమ కేసులకు నిరసనగా మంగళవారం జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీపై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగం, సామాజిక న్యాయం, దళితుల ఆత్మగౌరవంపై ప్రశ్నిస్తే కేసు పెట్టడం బీజేపీ మార్కు ప్రజాస్వామ్యంగా మారిందన్నారు. కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు వెలుగు వెంకన్న, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫ డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య -
ఏసీబీ వలలో టౌన్ ప్లానింగ్ అధికారి
సూర్యాపేట: ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి వి.సోమయ్యపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. నల్లగొండ రేంజ్ ఏసీబీ అధికారులు గురువారం సూర్యాపేటలోని సోమయ్య నివాసం, కార్యాలయంతోపాటు ఆయన బంధువులు, సహచరులకు సంబంధించిన ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో పలు ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలను ఏసీబీ అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. సూర్యాపేట జిల్లాలో 3 ఎకరాల 3 గుంటల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. అలాగే సూర్యాపేట, రంగారెడ్డి జిల్లా హయత్నగర్ పరిధిలో ఐదు నివాస ఆస్తులున్నట్లు తేల్చారు. వీటిలో ఒక జీ+1, ఒక జీ+2, ఒక జీ+4 భవనాలతో పాటు ఒక పెంట్హౌస్, రెండు గ్రౌండ్ ఫ్లోర్ ఇళ్లున్నాయి. వీటితోపాటు సూర్యాపేట పరిధిలో మరో ఎనిమిది ఓపెన్ ప్లాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సోదాల్లో భాగంగా రూ.4,63,990 నగదు, బ్యాంకు ఖాతాల్లో రూ.13 లక్షల నగదున్నట్లు అధికారులు గుర్తించారు. అదేవిధంగా సుమారు రూ.20 లక్షల విలువ చేసే 709 గ్రాముల బంగారు, 1,750 గ్రాముల వెండి ఆభరణాలు లభించాయి. సోమ య్యకు చెందిన రెండు కార్లు, మూడు ద్విచక్ర వాహనాలను కూడా గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.25.20 లక్షలుగా అధికారులు పేర్కొన్నారు. ఇంట్లోని గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల విలువ సుమారు రూ.11 లక్షలుగా అంచనా వేశారు. బంగారాన్ని తాకట్టు పెట్టి బ్యాంకు ద్వారా సోమయ్య సుమారు రూ.49 లక్షల రుణం పొందినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు గుర్తించిన స్థిరాస్తులు, నగదు, బంగారం, వాహనాలు తదితరాలను కలిపి సోమయ్యకు సంబంధించిన ఆస్తుల మొత్తం విలువను రూ.3,54,36,490గా ఏసీబీ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. మరిన్ని ఆస్తుల వివరాలపై విచారణ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. -
ఆంగ్ల భాషపై పట్టు పెంచి.. అవార్డు సాధించి
ఆలేరురూరల్ : వృత్తి పట్ల అంకితభావం, సేవాదృక్పథంతో పనిచేస్తూ విద్యార్థులు ఆంగ్లభాషలో మంచి నైపుణ్య సాధించేలా కృషిచేసిన ఆలేరు మండలం గొలనుకొండ ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లిష్ టీచర్ జ్యోతిర్మయి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉద్యాధ్యాయురాలుగా ఎంపికయ్యారు. విద్యార్థులకు ఫోనెటిక్స్, అక్షరాలు సౌండ్స్తో బోధన, టీఎల్ఎం, ఎచ్టీఎంఎల్ పద్ధతి, ప్లైబేసిడ్, పేంటింగ్ ద్వారా బోధన, సొంతంగా రాయడం, చదవడం ఆటాపాటలతో విద్యాబోధన అందించారు. 2001 సంవత్సరంలో రాజాపేట మండలం రేణుకుంట ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయులిగా చేరిన ఆమె అక్కడే 10 సంవత్సరాలు పనిచేశారు. అనంతరం చిన్నకందుకూరు, పటేల్గూడెం నుంచి గొలనుకొండ ప్రాథమిక పాఠశాలలో 2014 సంవత్సరం నుంచి పనిచేస్తున్నారు. తనకు వచ్చే జీతంలో ప్రతినెలా విద్యార్థుల అవసరాలకు, విద్యాబోధనలకు ఖర్చు చేస్తూ వస్తున్నారు. పని చేసిన ప్రతి పాఠశాలలో ఇంగ్లిష్ భాషపై విద్యార్థులు పట్టు సాధించేలా బోధన అందించారు. క్రమశిక్షణ సమయపాలన పాటిస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతుండడం వల్లే తనకు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు వరించిందని జ్యోతిర్మయి పేర్కొన్నారు. పెద్దవూర: మండలంలోని ఏనేమీదిగూడెం ప్రభుత్వ పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తూడి వెంకట్రెడ్డికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. విద్యారంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును పొందుతూ ఉపాధ్యాయ లోకానికి ఆదర్శంగా నిలుస్తున్నారు వెంకట్రెడ్డి. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రీసోర్స్ పర్సన్గా, పాఠ్య పుస్తకాలు, కరదీపికల రూపకల్పన, వినూత్న బోధన నైపుణ్యాలు, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పొందిన అవార్డుల ఆధారంగా తూడి వెంకట్రెడ్డిని ఏప్రిల్ నెల 18 నుంచి 26వ తేదీ వరకు ఫిన్లాండ్ దేశ పర్యటనకు ఎంపిక చేశారు. -
జెడ్పీ సీఈఓ ఆకస్మిక తనిఖీ
మోతె : మోతె మండల పరిధిలోని రాఘవాపురం గ్రామంలో జిల్లా పరిషత్ సీఈఓ శిరీష గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసి, వీబీ జీ రామ్జీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ రికార్డులు, వీఓ భవనాన్ని ఆమె పరిశీలించారు. మండలంలోని ప్రతి గ్రామానికి అనుగుణంగా లేబర్ బడ్జెట్ను సిద్ధం చేయాలని పంచాయతీ కార్యదర్శులను, ఫీల్డ్ అసిస్టెంట్లను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సందీప్ కుమార్, సర్పంచ్ మంజుల, పంచాయతీ కార్యదర్శి రేణుక, ఏపీఓ నగేష్, ఈసీ శ్రీహరి, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. పంట పొలాల పరిశీలన నేరేడుచర్ల : నేరేడుచర్ల మండలం పెంచికల్దిన్న గ్రామంలోని రైతు వల్లంశెట్ల కృష్ణయ్యకు చెందిన వరి పొలాన్ని గురువారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరి విత్తనాలు వెదజల్లిన 15 నుంచి 20 రోజుల వ్యవధిలో మొలకలు ఎండిపోతున్నాయని రైతు కృష్ణయ్య ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పొలాన్ని పరిశీలించినట్లు తెలిపారు. విత్తనాల్లో ఏమైనా లోపాలు ఉన్నాయా అని నిర్ధారించుకోవడానికి పంట నమూనాలను పరి శీలన నిమిత్తం ల్యాబ్కు పంపించినట్లు వెల్లడించారు. అలాగే విత్తనాలు విక్రయించిన దుకా ణదారుడు, కంపెనీ ప్రతినిధులు పంటలను పరిశీలించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఆయన వెంట ఏఓ జావీద్ ఉన్నారు. -
నియామక ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి
సూర్యాపేట టౌన్ : మెడికల్ కళాశాలల్లో కాంట్రాక్ట్ పద్ధతిన జరుగుతున్న నియామకాలను పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆదేశాల ప్రకారం కాంట్రాక్టు పద్ధతిన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్ల నియామకాల కోసం గురువారం నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. కౌన్సెలింగ్కు అభ్యర్థులు హాజరుకాని విభాగాల్లో వాక్–ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ జె.వి.డి.ఎస్.ప్రసాద్, జీజీహెచ్. సూపరింటెండెంట్ శ్రవణ్ కుమార్, వివిధ విభాగాల హెచ్ఓడీలు, ఆర్ఎంఓలు పాల్గొన్నారు. -
తీరు మారడం లేదు
భానుపురి (సూర్యాపేట): జిల్లాలో ఏసీబీ తనిఖీలు కలకలం రేపుతున్నాయి. వివిధ శాఖలకు చెందిన అధికారులు పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ వరుసగా పట్టుబడుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం పనిచేస్తున్న వారే కాకుండా, గతంలో ఇక్కడ పనిచేసి ప్రస్తుతం ఇతర జిల్లాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారులు సైతం ఏసీబీకి చిక్కుతుండడం గమనార్హం. తాజాగా సూర్యాపేట టౌన్ ప్లానింగ్ అధికారిగా, కోదాడ ఇన్చార్జ్గా పనిచేస్తున్న సోమయ్య ఏసీబీకి చిక్కడం జిల్లాలోని అవినీతి, అక్రమ వసూళ్లకు నిదర్శనంగా నిలుస్తోంది. ఏ శాఖలోనైనా, ఏ పనైనా చేయాలంటే చేయి తడపనిదే కావడం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. చిన్నచిన్న అనుమతులకు సైతం అధికారులు పెద్ద మొత్తంలో లంచం డిమాండ్ చేయడం, డబ్బులు ఇస్తేనే ఫైలు ముందుకు కదల్చడంతో బాధితులు తీవ్ర విసుగు చెందుతున్నారు. జిల్లావ్యాప్తంగా రెండు, మూడేళ్లుగా ఏసీబీ అధికారులు లంచగొండుల ఆటకట్టిస్తున్నప్పటికీ, అధికారుల ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రావడం లేదు. ఏసీబీకి పట్టుబడిన వారి వివరాలు.. ఫ తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో ఒక బియ్యం వ్యాపారి పేరును కేసు నుంచి తొలగించడానికి రూ.70 వేలు లంచం తీసుకుంటూ 2025 జనవరి 28న తిరుమలగిరి ఎస్ఐ సురేష్, కానిస్టేబుల్ నాగరాజు ఏసీబీకి దొరికారు. ఫ హుజూర్ నగర్ నియోజకవర్గంలోని చింతలపాలెం మండలంలో రేషన్ బియ్యం కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు 2025 ఏప్రిల్ 9న అప్పటి ఎస్ఐ అంతిరెడ్డి రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఫ సూర్యాపేట జిల్లా భూగర్భ జల శాఖ అధికారి బాలు, ఒక బోరుబండి యజమాని నుంచి అనుమతి పత్రాల కోసం రూ.లక్ష డిమాండ్ చేశారు. ఈ క్రమంలో 2025 జూలై 15న కార్యాలయంలో పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగి (డేటా ఎంట్రీ ఆపరేటర్) వెంకటేశ్వర్లు ద్వారా రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. సోమయ్యపై గతంలో పలు ఆరోపణలు తిరుమలగిరి (తుంగతుర్తి): ఏసీబీకి పట్టుబడిన సూర్యాపేట టౌన్ ప్లానింగ్ అధికారి సోమయ్య తిరుమలగిరి మున్సిపాలిటీలో 2018 నుంచి 2023 వరకు ఇన్చార్జ్ టౌన్ ప్లానింగ్ అధికారిగా పనిచేశారు. మున్సిపాలిటీలో పనిచేసిన కాలంలో ఆయన ప్రతి పనికి ఒక రేటు చొప్పున లంచాలు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. వివాదాస్పద భూములు, కోర్టు పరిధిలో ఉన్న స్థలాల్లో కూడా ఇళ్ల నిర్మాణాలకు పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని అనుమతులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే నూతనంగా వేసిన వెంచర్లలో ప్లాట్ను బట్టి వసూళ్లకు పాల్ప డినట్లు సమాచారం. మున్సిపాలిటీలో పనిచేసే ఔట్సోర్సింగ్ సిబ్బందిని మధ్యవర్తులుగా పెట్టుకొని డబ్బులు దండుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నూతన వెంచర్లలో ఎకరానికి ఇంత అని లెక్కకట్టి వసూలు చేయడమే కాకుండా, డబ్బులు ఇవ్వని పక్షంలో తనకు తెలిసిన వ్యక్తుల పేరిట ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. విధులకు మున్సిపల్ అధికారులు డుమ్మా కోదాడ: కోదాడ మున్సిపాలిటీలో ఇన్చార్జ్ టీపీఓగా పనిచేస్తున్న సోమయ్య గురువారం సూర్యాపేటలో ఏసీబీ అధికారులకు చిక్కడంతో భయపడిపోయిన కోదాడ మున్సిపల్ అధికారులు ఉదయం 11 గంటల వరకు కార్యాలయానికి రాకుండా డుమ్మా కొట్టారు. ముఖ్యంగా సోమయ్యతో సంబంధం ఉన్న టౌన్ ప్లానింగ్, అకౌంట్స్ సెక్షన్ అధికారులు విధులకు రాకపోవడంతో వివిధ పనుల కోసం వచ్చిన ప్రజలు ఇబ్బంది పడ్డారు. మధ్యాహ్నం తర్వాత కొంతమంది అధికారులు నెమ్మదిగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఏసీబీకి పట్టుబడిన టీపీఓ సోమయ్య ఫ ఏసీబీకి వరుసగా చిక్కుతున్న అధికారులు ఫ లంచం ఇవ్వనిదే పని కావడం లేదని గగ్గోలు పెడుతున్న ప్రజలు -
బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి
సూర్యాపేట టౌన్ : వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. గురువారం ఆయన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పురుషుల, మహిళల ఓపీ గదులను సందర్శించి అవుట్పేషెంట్ రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం ఏఎమ్సీ వార్డు, పీఎమ్జేఏవై, ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ పేషెంట్ రిజిస్ట్రేషన్ కౌంటర్, డ్రగ్ స్టోర్ రూమ్, జనరల్ మెడిసిన్ డాక్టర్ గదిని తనిఖీ చేశారు. డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, మెడికల్ వార్డులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. మందుల కొరత లేకుండా బఫర్ స్టాక్ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్లు వాణి, జనార్దన్, అనిత, శ్రీలత, ఉపేందర్, యశ్వంత్, వినయ్ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ -
సాగునీటికి ఉద్యమం
మిర్యాలగూడ : నాగార్జునసాగర్ ఎడమకాల్వ పరిధిలోని సాగు భూములకు సాగునీటి విడుదల కోసం మరో పోరాటం తప్పదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నల్లగొండ జిల్లా పచ్చని పొలాలతో సస్యశ్యామలంగా వెలుగొందిందని, రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణగా పేరుగాంచిన మిర్యాలగూడ ప్రాంతం ఎడారిగా మారే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు ఆధ్వర్యంలో మిర్యాలగూడలో చేపట్టిన రైతు మహా ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. సాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రా ప్రాంతం వారు నీటిని తరలించుకుపోతున్నా జిల్లా మంత్రులు పట్టించుకున్న పాపానపోలేదన్నారు. ఆయకట్టు రైతుల కళ్లల్లో కన్నీళ్లు తెప్పించిన జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు దద్దమ్మలుగా మిగిలిపోయారన్నారు. సాగునీటి విషయంలో జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఎడమకాల్వకు నీటి విడుదల చేసేది లేదని ప్రకటించడం సిగ్గుచేటన్నారు. రైతు మహా ధర్నాను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నిందని, అయినా రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారని అన్నారు. పదేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో సాగర్ ఎడమ కాలువ ద్వారా నీళ్లిస్తే రైతులు ఆనందంగా పండించుకున్నారని, అలాంటి ఇప్పుడు ఈ ప్రాంత రైతుల కళ్లల్లో కన్నీళ్లు చూడాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందని ప్రశ్నించారు. మిర్యాలగూడ, కోదాడ, హుజూర్నగర్, సూర్యాపేట, నాగార్జునసాగర్, నల్లగొండ, నకిరేకల్ తదితర ఎడమ కాలువ పరిధిలో రైతులు వ్యవసాయం చేసే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. బీఆర్ఎస్లో జోష్.. మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంప్గ్రౌండ్లో నిర్వహించిన రైతు మహా ధర్నా విజయవంతమైంది. పట్టణంలోని సాగర్రోడ్డు, నల్లగొండ రోడ్డు, కోదాడ రోడ్డు గులాబీ శ్రేణులతో నిండిపోయింది. నాయకులు ఊహించిన దానికంటే అధికంగా రైతులు, గులాబీ శ్రేణులు తరలిరావడంతో మిర్యాలగూడ బీఆర్ఎస్ పార్టీలో జోష్ వచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాయంత్రం 4.30గంటలకు హనుమాన్పేట ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్దకు చేరుకోగా వేలాది మంది పలు వాహనాల్లో వచ్చి స్వాగతం పలికి ర్యాలిగా ఎన్ఎస్పీ క్యాంప్ గ్రౌండ్ వరకు చేరుకున్నారు. కాబోయే సీఎం కేటీఆర్ అంటూ ప్రజలు, రైతులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, గాదరి కిశోర్కుమార్, నోముల భగత్కుమార్, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, తిప్పన విజయసింహారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్.ప్రవీణ్కుమార్, మాజీ జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, నాయకులు అలుగుబెల్లి అమరేందర్రెడ్డి, దూదిమెట్ల బాలరాజు, ఎర్రోళ్ల శ్రీనివాస్, దుర్గంపూడి నారాయణరెడ్డి, పాలుట్ల బాబయ్య, నామిరెడ్డి కరుణాకర్రెడ్డి, కడారి అంజయ్య, ఎండి.యూసుఫ్, నిమ్మల నవీన్రెడ్డి, ధనావత్ చిట్టిబాబునాయక్, ఫహీమొద్దిన్, ఇలియాస్,మట్టపల్లి సైదులుయాదవ్, నాగార్జునచారి, యడవెల్లి శ్రీనివాస్రెడ్డి, హాతీరాంనాయక్, ఎండి.షోయబ్, మల్లయ్యయాదవ్, రాములుగౌడ్, మగ్ధుంపాషా, షహనాజ్బేగం పాల్గొన్నారు. ఫ సాగర్ నీటి విడుదల కోసం పోరాటం చేస్తాం ఫ ‘రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ’.. ఇప్పుడు ఎడారిగా మారింది ఫ నల్లగొండ జిల్లా మంత్రులు దద్దమ్మలు ఫ సాగునీరు తరలించుకుపోతున్నా పట్టించుకోవట్లేదు ఫ రైతు మహాధర్నాలో కేటీఆర్ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి మాట్లాడుతూ.. సాగర్ గేట్లను బద్దలు కొటైనా నీటిని తీసుకుంటామన్నారు. కృష్ణా జలాల హక్కుల ప్రకారం తెలంగాణకు రావాల్సిన నికర జలాలను వాడుకొని 17 పర్యాయాలు రైతుల శ్రేయస్సు కోసం నీటిని విడుదల చేసిన ఘనత నాటి సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. గతంలో సాగర్ ప్రాజెక్టులో తక్కువ స్థాయిలో నీరు నిల్వ ఉన్నప్పటికీ సాగర్ నుంచి నీటిని విడుదల చేసి రైతులను ఆదుకున్నామని గుర్తుచేశారు. జిల్లాలో ఉన్న మంత్రులు పదవుల కోసం ఢిల్లీ చుట్టు తిరుగుతున్నారే తప్ప రైతుల గోసను పట్టించుకోవడం లేదని విమర్శించారు. నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల నుంచి కళ్ల ముందే నీరు తరలిపోతున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. మిర్యాలగూడలో మహా ధర్నా జరుగుతుందనే విషయం తెలుసుకోని ప్రభుత్వం ముందస్తుగా నీటిని విడుదల చేశారని చెప్పారు. మిర్యాలగూడలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి చేసిన నిరసన దీక్ష.. నీటి విడుదల చేయడంలో నిర్లక్ష్యం వహించిన ముఖ్యమంత్రి, మంత్రుల ఇళ్ల ముందు చేస్తే బాగుండేదన్నారు. మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు మాట్లాడుతూ.. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోనే మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమైందన్నారు. రైతులకు సాగునీటి కష్టాలు రాకుండా నియోజకవర్గంలో ఆరు ఎత్తిపోతల పథకాలను మంజూరు చేయించామని చెప్పారు. దేశంలోనే అతి పెద్ద యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని వీర్లపాలెంలో ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. -
అధ్యాపకులకు అవార్డులు
కోదాడ : మూడేళ్లుగా వందల సంఖ్య విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెంచుతూ వినూత్న కార్యక్రమాల ద్వారా కోదాడ ప్రభుత్వ బాలుర పాఠశాలను అగ్రస్థానంలో నిలిపిన ప్రధానోపాధ్యాయుడు, కోదాడ మండల ఇన్చార్జి ఎంఈఓ సలీంషరీఫ్ రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రధానోపాధ్యాయుడి అవార్డు వరించింది. 1996 డీఎస్పీ ద్వారా ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన సలీంషరీఫ్ 1998లో మేళ్లచెరువు మండల ఉత్తమ ఉపాధ్యాయుడిగా, 2005లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా నిలిచారు. 2014–2024 వరకు కోదాడ నియోజకవర్గ పరిధిలోని 5 మండలాలకు ఇన్చార్జి ఎంఈఓగా పనిచేశారు. 2023 నుంచి కోదాడ బాలుర పాఠశాల హెచ్ఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను గడిచిన మూడేళ్లుగా 500 దాటించి స్కూల్ను టెన్త్ ఉత్తీర్ణతలోనూ అగ్రస్థానంలో నిలిపారు. –8లో -
శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం
సూర్యాపేట టౌన్ : శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీస్ యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నరసింహ అన్నారు. గురువారం సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను నిశితంగా పరిశీలించి సిబ్బంది విధి నిర్వహణ తీరును, బాధితులకు అందుతున్న సేవలపై సమీక్షించారు. వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని ఉత్సవ కమిటీలతో శాంతి సమావేశాలు నిర్వహించాలన్నారు. ఈ తనిఖీలో పట్టణ సీఐ వెంకటయ్య, సీసీఎస్ ఇన్స్పెక్టర్ శివ కుమార్, ఎస్ఐలు సాయిరాం, రామచందర్, రహీముద్దీన్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సైబర్ భద్రతపై వినూత్న అవగాహన సూర్యాపేట టౌన్ : గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవడంతో పాటు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నరసింహ సూచించారు. గణేశ్ నవరాత్రుల సందర్భంగా జిల్లా ప్రజల్లో సైబర్ నేరాలపై మరింత అవగాహన కల్పించేందుకు ‘వినాయకుడు మనకు నేర్పే పాఠాలు–సైబర్ విజ్ఞానం కలిగి ఉండండి’ అనే సందేశంతో రూపొందించిన ప్రత్యేక సైబర్ అవగాహన పోస్టర్ను ఆయన గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆవిష్కరించి మాట్లాడారు. ఫ ఎస్పీ నరసింహ -
42 ఏళ్లుగా అంకితభావంతో..
నకిరేకల్ : నలభై రెండేళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో అంకితభావంతో పనిచేస్తూ పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెంపునకు ఎంతగానో శ్రమించిన నకిరేకల్ మండలం నోముల జెడ్పీ హైస్కుల్లో బయో సైన్స్ స్కూల్ అసిస్టెంట్ ముస్కు కవిత రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపికయ్యారు. కవిత 1985లో ఎస్జీటీగా ఉద్యోగం సాధించి శాలిగౌరారం మండలం రామగిరి ప్రాథమిక పాఠశాలలో మొదటి పోస్టింగ్ తీసుకున్నారు. ఆ తరువాత నకిరేకల్ మండలం నడిగూడెం, చందుపట్ల పాఠశాలల్లో పనిచేశారు. 2005 స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి రావడంతో సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి జెడ్పీ హైస్కూల్కు బదిలీ అయ్యారు. 2009లో అక్కడ నుంచి నకిరేకల్ జెడ్పీ హైస్కూల్కు బదిలీపై వచ్చారు. 2018లో స్వగ్రామైన నకిరేకల్ మండలం నోముల జెడ్పీ హైస్కూల్లో చేరారు. మరో రెండు నెలల్లో పదవి విరమణ పొందనున్న సమయంలో తనకు రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. -
డి అడిక్షన్ సెంటర్ ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
భానుపురి (సూర్యాపేట) : మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగాన్ని కట్టడి చేసేందుకు జాతీయ కార్యాచరణ పథకం కింద జిల్లాలో 2026–27 సంవత్సవానికి జిల్లా డిస్ట్రిక్ట్ డి అడిక్షన్ సెంటర్ ఏర్పాటుకు ఆసక్తి, అర్హత కలిగిన స్వచ్ఛంద, ప్రభుత్వేతర సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి కె.నరసింహారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు జిల్లా సంక్షేమాధికారి కార్యాలయం కలెక్టరేట్లో సంప్రదించాలని కోరారు. ఆడిట్ అధికారుల విచారణమఠంపల్లి : మఠంపల్లి మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన నిధుల దుర్వినియోగంపై బుధవారం ఆడిట్ అధికారులు (విజిలెన్స్ విభాగం) విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా సీనియర్ ఆడిటర్ రాంప్రసాద్ విలేకరులతో మాట్లాడారు. మండల పరిషత్ కార్యాలయంలో అక్రమంగా నిధులు డ్రా చేశారంటూ వస్తున్న ఆరోపణలపై కలెక్టర్ ఆదేశాలతో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. దానిలో భాగంగా మండల పరిషత్ కార్యాలయ రికార్డులను తనిఖీలు చేశామని, పూర్తిస్తాయి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ ఆడిట్ అధికారి శ్రీనివాస్, ఎంపీడీఓ సుమంత్రెడ్డి, ఎంపీఓ జగదీష్, సూపరింటెండెంట్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి దండుమైసమ్మ ఆలయ వార్షికోత్సవాలుఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : మండల పరిధిలోని నెమ్మికల్ దండు మైసమ్మ ఆలయ తృతీయ వార్షికోత్సవాలు గురువారం నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ శ్రీనివాస్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం గణపతి పూజ, వేదపఠనం, గోపూజ, 4న కళాశాలభిషేకం, హోమాలు, కుంభస్థాపన, 5న దండు మైసమ్మ దీక్ష విరమణ, చివరి రోజు 6న బోనాల సమర్పణ, అన్నదానం ఉంటుందని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి ఆలయ వార్షిక ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. -
కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదు
సూర్యాపేటటౌన్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి ఆదేశాలతో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల వైఫల్య పాలనపై బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. రేవంత్రెడ్డి ఇచ్చిన మోసపూరిత హామీలతో రూపొందించిన 420 ఫీట్ల ఫ్లెక్సీతో పట్టణంలో వినూత్న రీతిలో ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ శంకర్ విలాస్ సెంటర్ మీదుగా రాఘవ ప్లాజా, పీఎస్ఆర్ సెంటర్, పూల సెంటర్ మీదుగా, గాంధీ చౌరస్తా, తెలంగాణ తల్లి చౌరస్తా, మీదుగా కొత్త బస్టాండ్ వరకు కొనసాగింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్కు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆపార్టీ నాయకులు వై.వి, నిమ్మల శ్రీనివాస్గౌడ్, గోపగాని వెంకటనారాయణ, అన్నపూర్ణ, జీడి భిక్షం, మహిళలు పాల్గొన్నారు. ఫ బీఆస్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ ఫ కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల వైఫల్య పాలనపై సూర్యాపేట పట్టణంలో నిరసన ఫ 420 ఫీట్ల ఫ్లెక్సీతో వినూత్న రీతిలో భారీ ర్యాలీ -
హైవేలపై అంధకారం
తిరుమలగిరి ( తుంగతుర్తి) : తిరుమలగిరి క్రాస్ రోడ్డు వద్ద తొర్రూర్–మోత్కూరు, సూర్యాపేటకు వెళ్లే జాతీయ రహదారుల్లో అంధకారం నెలకొంది. ఆ యా రోడ్లకు మధ్యలోగాని, ఇరువైపులా కాని వీధిలైట్లు ఏర్పాటు చేయలేదు. దీనికితోడు రోడ్లు గుంతలమయంగా ఉండడంతో రాత్రి వేళల్లో ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారినపడుతున్నారు.అధికారులు స్పందించి వీధిలైట్లు వేయాల ని ప్రయాణికులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు. సూర్యాపేట వైపు వెళ్లే రహదారి ఇలా.. తొర్రూర్ రోడ్డులో కనిపించని లైట్లు -
పట్టుదలతో శ్రమిస్తేనే లక్ష్య సాధన సులువు
సూర్యాపేటటౌన్ : విద్యార్థులు పట్టుదలతో శ్రమిస్తేనే లక్ష్య సాధన సులువని ఎస్పీ నరసింహ అన్నారు. పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలెంల గ్రామ సమీపంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ గురుకుల బాలికల డిగ్రీ కళాశాలలో సామాజిక అంశాలు, సైబర్ జాగృక్త్పై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. విజయానికి మధ్య మార్గాలు ఉండవని, నిరంతర కృషి, సాధన చేయాలన్నారు. ఉన్నత లక్ష్యాలతో యువత, విద్యార్థులు ముందుకు సాగుతూ జీవితంలో గొప్పస్థాయిలో స్థిరపడాలన్నారు. సమాజానికి సేవ చేసే వ్యక్తులుగా ఎదగాలని ఆకాంక్షించారు. సైబర్ జాగృక్త్ కార్యక్రమం ద్వారా సైబర్ మోసాల పట్ల ప్రజలను చైతన్యవంతం చేస్తున్నామని తెలిపారు. సాంకేతిక, ఇంటర్నెట్ వినియోగం వల్ల బ్యాంకింగ్ వివరాలు సెల్ఫోన్ ద్వారానే నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, రూరల్ ఎస్సై అనిల్రెడ్డి, షీ టీమ్స్ ఎస్ఐ నీలిమ, పోలీస్ సిబ్బంది, కళాశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఫ ఎస్పీ నరసింహ -
కుటుంబానికో కుట్టు మిషన్
బీసీ మహిళలకు ఉచితంగా పంపిణీకి నిర్ణయం ఫ స్వయం ఉపాధే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త పథకం ఫ నియోజకవర్గానికి వెయ్యి చొప్పున కేటాయింపు ఫ 15వ తేదీ వరకు దరఖాస్తు గడువునాగారం : మహిళల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇందిర మహిళా శక్తి ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. అందులో భాగంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన నిరుద్యోగ మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్’ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద వంద శాతం సబ్సిడీతో ఉచితంగా అర్హులైన మహిళలకు తొలి విడతగా రూ.12 వేల విలువైన ఆటోమేటిక్ కుట్టు మిషన్లు పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో బీసీ మహిళల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మహిళల స్వయం ఉపాధికి.. కుట్టు మిషన్ల ద్వారా బీసీ మహిళలు స్వయం ఉపాధి పొందే అవకాశం ఉంది. వంద శాతం సబ్సిడీతో ఇస్తున్న ఈ మిషన్లను సద్వినియోగం చేసుకుంటే టైలరింగ్ చేసి ఆర్థికంగా బలోపేతమయ్యే అవకాశం ఉంటుంది. చాలా మంది మహిళలు సెర్ప్, మెప్మా, ఇతర శిక్షణ సంస్థల ద్వారా కుట్టు మిషన్ పనిలో శిక్షణ పొంది జీవనోపాధి పొందుతున్నారు. ఈ ఆటోమేటిక్ మిషన్లతో పనిభారం తగ్గి మహిళలకు మేలు చేకూరనుంది. అర్హులైన బీసీ మహిళలు ఈనెల 15వ తేదీ లోపు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకొని సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో గ్రామీణులు ఎంపీడీఓలకు, పట్టణ వాసులు మున్సిపల్ కమిషనర్లకు సమర్పించాలి. మండలస్థాయి కమిటీలు.. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు కన్వీనర్లుగా ఉండగా, దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హుల జాబితాను జిల్లాస్థాయి కమిటీకి పంపిస్తారు. జిల్లా స్థాయి కమిటీ ఆమోదం పొందిన అనంతరం బీసీ మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందజేస్తారు. నాలుగు వేల మందికి కుట్టు మిషన్లు... ప్రతి నియోజకవర్గానికి వెయ్యి కుట్టు మిషన్లు అం దించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్ మొత్తం నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో వెయ్యి మంది చొప్పున మొత్తం నాలుగు వేల మంది బీసీ మహిళలను ఎంపిక చేయనున్నారు. ఫ దరఖాస్తుదారులు బీసీ వర్గానికి చెందిన నిరుద్యోగ మహిళలు అయి ఉండాలి. ఫ 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ఫ నిరాశ్రయులు, వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథలు, టైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉన్నవారికి, మేర/మేరు కమ్యూనిటీ మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. ఫ కనీస అక్షరాస్యత తప్పనిసరి. 5వ తరగతి పాసైన వారికి అవకాశం. ఫ గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదు. ఫ తెల్లరేషన్ కార్డు కలిగి ఉండి కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. ఫ ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఫ 2023–24 ఆర్థిక సంవత్సరంలో స్వయం ఉపాధి పథకం కింద ఆర్థిక లబ్ధిపొందిన వారు అర్హులు కారు. -
బియ్యానికి దూరం
18శాతం మంది..భానుపురి (సూర్యాపేట) : మూడు నెలల సన్నబియ్యం కోటా ఇంకా మిగిలే ఉంది. ఇప్పటి వరకు 82 శాతం లబ్ధిదారులు తమకోటాకు సంబంధించి మూడు నెలల రేషన్ బియ్యాన్ని తీసుకెళ్లారు. కానీ వివిధ కారణాలతో 18 శాతం రేషన్ కార్డుదారులు బియ్యాన్ని తీసుకోలేదు. అయితే రేషన్ బియ్యం పంపిణీకి ఈనెల 5వ తేదీ వరకు గడువు ఉంది. ప్రతినెలా 75 నుంచి 80 శాతం మేర మాత్రమే రేషన్ పంపిణీ జరుగుతోంది. మూడు నెలలకు గాను మొదటగా నెలరోజుల పాటు, తదనంతరం ఈనెల 5వ తేదీ వరకు రేషన్ బియ్యం తీసుకెళ్లేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీలు కల్పించాయి. అయినా 82 శాతమే రేషన్ బియ్యాన్ని తీసుకోవడంతో మిగతా రేషన్ కార్డుదారులు కేవలం కార్డు కోసమే ఉన్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. 3.72 లక్షల కార్డులు జిల్లావ్యాప్తంగా 612 రేషన్ దుకాణాల పరిధిలో 3,72,658 రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ కార్డుల ద్వారా 10,84,469 మంది లబ్ధిదారులు ప్రతినెలా రేషన్ బియ్యం పొందుతున్నారు. ఈ రేషన్ షాపుల ద్వారా గతంలో దొడ్డుబియ్యాన్ని పంపిణీ చేయగా.. కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యాన్ని అందిస్తుండడంతో పేదలు ఈ బియ్యాన్ని తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. జిల్లాలో ఉన్న రేషన్కార్డులు, లబ్ధిదారుల ఆధారంగా ప్రతినెలా 6,500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం మూడు నెలల (ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్) బియ్యాన్ని ఒకేసారి ఇవ్వాలని నిర్ణయించింది. ప్రతినెలా 1 నుంచి 15వ తేదీ వరకే రేషన్ తీసుకెళ్లేందుకు వీలుంటుంది. అయితే మూడు నెలల రేషన్ కావడంతో ఆగస్టు నెలంతా లబ్ధిదారులకు డీలర్లు బియ్యం ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. మూడు నెలల రేషన్ బియ్యం తీసుకెళ్లింది 82 శాతమే.. ఫ అన్ని రేషన్ దుకాణాల్లోనూ నిల్వ ఉన్న బియ్యం ఫ పంపిణీకి 5వ తేదీ వరకు గడువునెలరోజుల పాటు లబ్ధిదారులకు అవకాశం కల్పించినా.. ఇప్పటి వరకు 82 శాతం మాత్రమే పంపిణీ జరిగింది. జిల్లాలో ఉన్న 3.72 లక్షల మంది రేషన్కార్డు దారులకు గాను 3.12 లక్షల మంది రేషన్ కార్డుదారులు తమ మూడునెలల బియ్యాన్ని తీసుకెళ్లారు. జిల్లాలో రేషన్ కార్డు కలిగి ఇతర ప్రాంతాల్లో పోర్టబుల్ విధానంలో బియ్యాన్ని తీసుకున్న వారున్న.. ఇతర ప్రాంతాల్లో కార్డులు ఉండి.. ఇక్కడ రేషన్ తీసుకున్న వారితో సమానంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో మూడు నెలలకు సంబంధించి 20,642 మెట్రిక్ టన్నుల బియ్యం జిల్లాలోని 610 రేషన్ షాపులకు వెళ్లగా.. 60 వేల కార్డుదారులకు సంబంధించిన బియ్యం రేషన్ దుకాణాల్లోనే ఉంది. అయితే మిగిలిన రేషన్ కార్డుదారులు ఈనెల 5వ తేదీ వరకు తమ కోటా బియ్యాన్ని తీసుకెళ్లే వెసులుబాటు ఉండగా.. ఈ గడువును మరింత పొడిగించే సూచనలు ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. -
12న జాతీయ మెగా లోక్ అదాలత్
చివ్వెంల(సూర్యాపేట) : సూర్యాపేట జిల్లా కోర్టు పాంగణంలో ఈనెల 12న జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీ శారద అన్నారు. బుధవారం సూర్యాపేటలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పెండింగ్లో ఉన్న సివిల్, క్రిమినల్, వెహికల్ యాక్టు, బ్యాంకు, విద్యుత్ వంటి కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. దీనిద్వారా ఇరుపక్షాల కక్షిదారులు గెలిచిన వారవుతారన్నారు. సమయం, డబ్బు వృథా కాకుండా ఉంటాయన్నారు. సూర్యాపేటతోపాటు, కోదాడ, హుజూర్నగర్, తుంగతుర్తి కోర్టుల్లో లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి శివరాం ప్రసాద్, సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.భవ్య, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి అపూర్వ రవళి, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మంచాల మమత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నూకల సుదర్శన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి తల్లమళ్ల హస్సేన్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. ఫ జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద -
బుల్లెట్ రైలు సాధించేదాకా ఉద్యమం
సూర్యాపేట : బుల్లెట్ రైలు సాధించేదాకా మరో తెలంగాణ పోరును తలపించేలా సూర్యాపేటలో ఉద్యమం కొనసాగుతుందని వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా, డాక్టర్ రామ్మూర్తి అన్నారు. సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ కారిడార్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన నిలే నిరాహార దీక్ష బుధవారం 20వ రోజు తెలంగాణ మహిళా వేదిక సభ్యులు పాల్గొనగా వారు సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఉద్యమాలతో ఏదైనా సాధించవచ్చన్నారు. సూర్యాపేట పట్టణ వ్యాపారులు, నాయకులు ధర్మార్జున్, పెద్దిరెడ్డి భారతమ్మ, రమణాచారి, మాజీ కౌన్సిలర్ ఊర గాయత్రి, చల్ల మల్ల నరసింహ, జర్నలిస్టు కందుకూరి యాదగిరి, పేర్ల నాగయ్య, బాలస్వామి, దేవయ్య, మహేశ్వరి, పగుళ్ల, వెంకన్న, తన్నీరు వాసు, రవి, పూల మాలలు వేసి దీక్షను ప్రారంభించారు. దీక్షలో తెలంగాణ మహిళా వేదిక మహిళలు వెలుగు వనిత, విజయమ్మ, చంద్రకళ, సుగుణ షామియా, జకిరా, ముంతాజ్ హలంబి లక్ష్మి, సుజాత , ధనమ్మ, రామలక్ష్మి, శ్యామల, శాహనాజ్, వనమ్మ, లక్ష్మమ్మ, ఉమాదేవి కూర్చున్నారు. -
ప్రజావాణికి అత్యధిక ప్రాధాన్యం
భానుపురి(సూర్యాపేట): ప్రజావాణి కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజల నుంచి వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ప్రజావాణికి జిల్లా అధికారులు తప్పక హాజరు కావాలని, జిల్లా, మండల స్థాయి ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను తప్పనిసరిగా ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో భూ సమస్యలకు సంబంధించి 36 దరఖాస్తులు, డీపీఓకు 7, మున్సిపాలిటీకి 5, డీఎంహెచ్ఓకు 3, ఇతర శాఖలకు 19 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. హరిసింగ్, జడ్పీ సీఈఓ శిరీష, సీపీఓ కిషన్, డీఏఓ శ్రీధర్రెడ్డి, డీఎంహెచ్ఓ వెంకటరమణ, డీపీఓ యాదగిరి, డీడబ్ల్యూఓ నరసింహారావు, అధికారులు పాల్గొన్నారు. విముక్త జాతుల అభ్యున్నతికి ప్రాధాన్యం సమాజంలో అత్యంత వెనుకబడిన విముక్త జాతుల సమగ్ర అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. సోమవారం విముక్త జాతుల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. విముక్త జాతుల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి గ్రామీణ స్థాయి నుంచి సమగ్ర సమాచారాన్ని సేకరించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులైన వారికి విడతల వారీగా లబ్ధి చేకూర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో జిల్లా అధికారులతో పాటు బీసీ అభివృద్ధి అధికారి విశాల్, మాజీ ఎమ్మెల్యేలు దోసపాటి గోపాల్, కౌన్సిలర్ ఊరా రామ్మూర్తి, టీఎన్జీఓ జిల్లా కార్యదర్శి దున్న శ్యామ్, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
లక్ష్మీనరసింహుని నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని సోమవారం అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు, అర్చనలు చేసి మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేశారు. శివాలయంలో పార్వతీరామలింగేశ్వరస్వామికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు, ఈఓ, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. ప్రజల భద్రతే పోలీసుల కర్తవ్యం : ఎస్పీ సూర్యాపేటటౌన్ : శాంతి భద్రతలను పరిరక్షించడం, ప్రజలకు భద్రత కల్పించడమే పోలీస్ శాఖ ప్రథమ కర్తవ్యమని ఎస్పీ నరసింహ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వారి సమస్యలను విని చట్టప్రకారం పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. డీఎస్పీ కార్యాలయం తనిఖీ పోలీసు కార్యాలయాల వార్షిక తనిఖీల్లో భాగంగా సూర్యాపేట డీఎస్పీ కార్యాలయాన్ని ఎస్పీ నరసింహ సోమవారం తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో సిబ్బందితో కలిసి మొక్క నాటారు. ఆయన వెంట డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐలు రాజశేఖర్, వెంకటయ్య, డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు ఉన్నారు.శివాలయంలో ప్రత్యేక పూజలుమేళ్లచెరువు: మండలకేంద్రంలోని ఇష్టకామేశ్వరీ సమేత స్వయంభు శంభులింగేశ్వర స్వామి దేవాయలంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామి వారికి గణపతిపూజ, పుణ్యాహవచనం, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సహస్రనామార్చన, మహలింగార్చన, పుష్పార్చన చేపట్టారు. ఈఓ శంభిరెడ్డి, అర్చకులు విష్ణువరర్ధన్శర్మ, ధనుంజయశర్మ, భక్తులు పాల్గొన్నారు. నెలరోజుల పాటు పోలీస్ యాక్ట్ అమలుసూర్యాపేటటౌన్ : శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఈ నెల ఒకటో తేదీ నుంచి 30 వరకు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ నరసింహ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో డీఎస్పీ లేదా ఆ పైస్థాయి అధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా ప్రజా సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు, ప్రజలు గుమి కూడి ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. నిషేధిత ఆయుధాలు, కత్తులు, కరల్రు, దుడ్డు కరల్రు, తుపాకులు, పేలుడు పదార్థాలు, దురుద్దేశంతో నేరాలను ఉసిగొలిపే ఆయుధాలు కలిగి ఉండరాదని హెచ్చరించారు. నేడు ఉపాధ్యాయుల ధర్నామోతె : సీపీఎస్ రద్దు, పీఆర్సీ అమలు కోరు తూ సూర్యాపేటలోని ఇందిరా పార్కు వద్ద మంగళవారం ధర్నా చేపట్టనున్నట్లు పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు తంగెళ్ల జితెందర్రెడ్డి తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో సంఘం సభ్యులతో సమావేశమై మాట్లాడారు. -
మబ్బులే.. చినుకు కురువలే..
భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేట జిల్లాపై వరుణుడు కరుణ చూపడం లేదు. ఎల్నినో పరిస్థితులతో తీవ్ర వర్షాభావం నెలకొంది. రెండు రోజులుగా ఆకాశం మేఘావృతమై ఉన్నా.. చినుకు జాడ మాత్రం లేకుండా పోయింది. జిల్లాలోని ఒక్క మండలంలోనూ మోస్తరు వర్షం పడిన దాఖలాలు లేవు. వానకాలం సీజన్ ప్రారంభం నుంచి నేటి వరకు సరైన వర్షాలు లేకపోవడంతో రోజు రోజుకు చెరువులు, కుంటల్లో నీటిమట్టం తగ్గి పోతోంది. ఇప్పటి వరకు 422.4 మిల్లీ మీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా 279.8 మి.మీ మాత్రమే కురిసింది. వర్షాన్ని నమ్ముకొని వరి సాగు చేసిన రైతులు ఇప్పటి వరకు చెరువుల్లోకి చుక్క నీరు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. చినుకులే దిక్కుసూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్లో మోస్తరు వర్షాలు పడిన దాఖలాలు లేవు. రెండు రోజుల క్రితం ఎండ తీవ్రత పెరిగి వేసవిని తలపించడంతో రైతులు ఆందోళన చెందారు. ఇంతలో వాతావరణంలో మార్పులు సంభవించాయి. మబ్బులు పట్టి వాతావరణం చల్లబడింది. దాంతో ఒక్క వర్షమైనా రాకుండా పోతుందా.. చెరువులు, కుంటల్లోకి కొద్ది మేర అయినా నీరు చేరక పోతాయా అని రైతులు అత్రుతగా ఎదురు చూశారు. ఆదివారం రోజంతా చల్లబడి ఉన్నప్పటికీ అక్కడక్కడా చినుకులు తప్ప మోస్తరు వర్షమైనా కురవలేదు. సోమవారం కూడా చినుకులే తప్ప వరుణ దేవుడు కరుణించలేదు. లోటు వర్షపాతమేవానాకాలం సీజన్లో ఇప్పటి వరకు జిల్లాలో 422.4 మిల్లీ మీటర్ల వర్షాపాతం కురవాల్సి ఉండగా 279.8 మి.మీ వర్షపాతమే నమోదైంది. కేవలం తుంగతుర్తి, ఆత్మకూర్ (ఎస్), మోతె, మఠంపల్లి మండలాల్లో మాత్రమే ఈ సీజన్లో సాధారణ వర్షపాతం కురిసింది. మిగతా 19 మండలాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. సాధారణ వర్షపాతం నమోదైన నాలుగు మండలాల్లోనూ మోస్తరుకు మించి వర్షాలు లేకపోవడంతో చెరువులు, కుంటల్లోకి నీరు చేరలేదు. దాంతో జిల్లా వ్యాప్తంగా 1,100కి పైగా చెరువుల్లో నీటిమట్టాలు తగ్గిపోయి అడుగంటుతున్నాయి.కురవాల్సింది 422.4 మి.మీ.. కురిసింది 279.8 మి.మీ ఆకాశం మేఘావృతమైనా.. కురవని వర్షాలు జిల్లాలోని 19 మండలాల్లో తీవ్ర లోటు వర్షపాతం అడుగంటుతున్న చెరువులు.. ఆందోళనలో రైతులుఆందోళనలో రైతాంగం నైరుతి ప్రారంభం నుంచి సరైన వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలో రెండు రోజులుగా తుపాన్ ప్రభావంతోనైనా వర్షాలు కురుస్తాయని భావించిన రైతాంగానికి నిరాళే మిగిలింది. నైరుతి సీజన్ ముగిసే సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అసలు వర్షాలు కురుస్తాయా.. చెరువుల్లోకి కొద్దిమేర అయినా నీరు వస్తుందా.. లేదా అనే అయోమయంలో రైతులు ఉన్నారు. చెరువుల్లో సగంమేర నీరు వచ్చి చేరినా.. వానాకాలం సీజన్లో సాగు చేసిన వరి పొలాలు చేతికి వస్తాయని, లేదంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని రైతులు భావిస్తున్నారు. -
ఆశే పెట్టుబడి..సైబర్ దోపిడీ
సూర్యాపేటటౌన్ : ప్రజలను వివిధ అంశాలపై ఆశ పెడుతూ సైబర్ నేరగాళ్లు వారిని మోసం చేస్తున్నారు. తక్కువ సమయంలో భారీగా లాభాలు వస్తాయంటూ నమ్మించి ప్రజల ఖాతాల్లోని డబ్బును కొల్లగొడుతున్నారు. ముఖ్యంగా ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్లు, షేర్ మార్కెట్ ట్రేడింగ్, అధిక లాభాల పేరుతో సైబర్ మోసగాళ్లు విసురుతున్న వలలో పలువురు చిక్కుకుంటున్నారు. అపరిచితుల మాటలు నమ్మి డబ్బులు పెట్టుబడి పెట్టి లక్షలు పోగొట్టుకున్న బాధితుల సంఖ్య జిల్లాలో పెరుగుతోంది. పెరుగుతున్న కేసులుఈ ఏడాది ఇప్పటి వరకు జిల్లాలో ఎన్సీఆర్పీ (నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్) ద్వారా 939 సైబర్ నేర కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో బాధితులు మొత్తం రూ.3,58,01,222 కోల్పోయారు. సైబర్ నేరాలపై సకాలంలో స్పందిస్తున్న పోలీసులు ఇప్పటివరకు రూ. 1,03,81,060ను ఫ్రీజ్ చేశారు. ఇందులో రూ.23,13,450ను బాధితులకు రీఫండ్ చేశారు. వాట్సప్ ద్వారా లింకులుమొబైల్ ఫోన్కు వచ్చే మెసేజ్లు, వాట్సప్ గ్రూపులు, సోషల్ మీడియా ప్రకటనల ద్వారా సైబర్ నేరగాళ్లు ప్రజలను ఆకర్షిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని చెప్పి మొదట కొంత మొత్తానికి లాభాలు చూపిస్తారు. వారికి నమ్మకం పెరిగిన తర్వాత భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టేలా ప్రేరేపించి, చివరకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. డబ్బు విత్డ్రా చేసుకునే సమయంలో అదనపు రుసుములు, పన్నులు, ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో మరింత డబ్బు వసూలు చేస్తున్నారు. తక్కువ సమయంలో రెట్టింపు లాభం, రోజుకు వేల రూపాయల ఆదాయం, గ్యారంటీడ్ రిటర్స్న్స్ వంటి మాటలకు ఆకర్షితులై పెట్టుబడులు పెట్టొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వెంటనే ఫిర్యాదు చేస్తేనే ఫలితంసైబర్ మోసానికి గురైన వారు ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్లైన్న్కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు. వీలైనంత త్వరగా ఫిర్యాదు చేస్తే మోసగాళ్ల ఖాతాల్లోకి వెళ్లిన డబ్బును ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఆలస్యం చేస్తే డబ్బును ఇతర ఖాతాలకు బదిలీ చేయడం, లేదా నగదుగా మార్చుకోవడంతో తిరిగి రాబట్టడం మరింత కష్టమవుతుంది. పెరుగుతున్న సైబర్ మోసాలు ఫ ఈ ఏడాది 939 కేసులు.. రూ.3.58 కోట్ల మోసం ఫ రూ.1.03 కోట్లు ఫ్రీజ్ చేసిన పోలీసులు ఫ రూ.23.13 లక్షలు బాధితులకు రిఫండ్ ఫ ఇన్వెస్ట్మెంట్ యాప్లను నమ్మొద్దంటున్న పోలీసులుసూర్యాపేట మండలానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్కు ఇటీవల వాట్సప్లో ఇన్వెస్ట్మెంట్ పేరుతో లింక్ వచ్చింది. అతను ఆ లింక్ను ఓపెన్ చేయగానే ట్రేడింగ్ యాప్ తరహాలో కనిపించే ప్లాట్ఫామ్ ప్రత్యక్షమైంది. అందులో పెట్టుబడి పెడితే తక్కువ సమయంలోనే భారీగా లాభాలు వస్తాయని చూపించారు. దాంతో మొదటగా రూ. 5, 10వేలు పెట్టుబడి పెట్టాడు. కొద్దిసేపటికే యాప్లో రూ. 20 వేలు క్రెడిట్ అయినట్లు కనిపించింది. దాంతో యాప్ను నమ్మిన అతను దశలవారీగా రూ. 21 లక్షలను పెట్టుబడిగా పెట్టాడు. భారీ మొత్తం జమ చేసిన వెంటనే సైబర్ మోసగాళ్లు అతని ఫోన్ నంబర్ను బ్లాక్ చేశారు. దాంతో తాను మోసపోయానని గ్రహించిన సదరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.ఆన్లైన్లో పెట్టుబడులు పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. గుర్తుతెలియని వ్యక్తుల హామీలను నమ్మకుండా అప్రమత్తంగా ఉండటమే సైబర్ మోసాల నుంచి రక్షణకు ప్రధాన మార్గం. సైబర్ మోసానికి గురైతె వెంటనే 1930 టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేయాలి. లోన్యాప్లు, ఇన్వెస్ట్మెంట్ యాప్లకు స్పందించవద్దు. –వెంకటయ్య, సైబర్ క్రైం డీఎస్పీ, సూర్యాపేట -
కోదాడలో పోలీసుల రాజ్యం
కోదాడ: కోదాడలో పోలీస్రాజ్యం నడుస్తుందని, సామాన్యులను వేధింపులకు గురిచేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆరోపించారు. రాజకీయ కక్షతో నిరుపేదరాలి డబ్బాకొట్టును అక్రమంగా తొలగించారని, ప్రశ్నించిన వారిపై పట్టణ సీఐ దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ సోమవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కోదాడ పట్టణ బంద్ నిర్వహించారు. ఉదయం నుంచే పార్టీ నాయకులతో కలిసి మల్లయ్యయాదవ్ మోటార్ సైకిల్పై తిరుగుతూ దుకాణాలను బంద్ చేయించారు. మధ్యాహ్నం 11 గంటల వరకు దుకాణాలు మూసి వేసినప్పటికీ ఆ తరువాత వ్యాపారస్తులు వాటిని తెరిచారు. పాఠశాలలు, కళాశాలలు ముందస్తుగా సెలవులు ప్రకటించాయి. ఈ సదర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కోదాడలో పోలీస్ అధికారుల వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ జరిపించాలని, పేదలను వేధింపులకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకొనే వరకు ఉద్యమం ఆగదన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎస్కే.నయీం, తుమ్మలపల్లి భాస్కర్, చీమ నరేష్, నల్లా భూపాల్రెడ్డి, బట్టు శివాజీ, కరీముల్లా బాబా, సంగిశెట్టి గోపాల్, బత్తుల ఉపేందర్, గట్ల కోటేశ్వరరావు, సంపెట ఉపేందర్, అబ్బు, మర్ల వీరబాబు, కాసాని మల్లయ్యగౌడ్ వివిధ మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కోదాడ పట్టణ బంద్ -
బుల్లెట్ రైలు వచ్చే వరకు దీక్షలు
రిలే దీక్ష లో అఖిలపక్ష నాయకులుసూర్యాపేట : కేంద్రం ప్రకటించిన బుల్లెట్ రైలు అలైన్మెంట్ను జాతీయ రహదారి వెంట సూర్యాపేట మీదుగా కొనసాగించే వరకు దీక్షలను, ఉద్యమాన్ని కొనసాగిస్తామని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ అన్నారు. బుల్లెట్ రైలు సాధన, అఖిలపక్ష పోరాట కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు సోమవారం 18వ రోజు కొనసాగాయి. దీక్షలలో సూర్యాపేట రజక జేఏసీ నాయకుడు సట్టు నాగ య్య ఆధ్వర్యంలో రజకులు పాల్గొన్నారు. దీక్షలో రాచకొండ దేవయ్య, దామెర్ల లక్ష్మయ్య, ఏనుగంటి లింగయ్య, రాచకొండ హుస్సేన్, గుండారపు శ్రీను, పగిళ్ల వెంకన్న, తాడూరి పద్మ, కొండ్రాసు ఎల్లమ్మ, రేణుక, సంధ్య, గంగరాజు, శ్రీను, సైదులు, అక్కినపల్లి నరసయ్య కూర్చున్నారు. దీక్షలకు అఖిలపక్ష నాయకులు, నేరెళ్ల మధుగౌడ్, సీపీఎం నాయకుడు మట్టిపల్లి సైదులు, ఆటో యూనియన్ అధ్యక్షుడు కుర్ర సైదులు, రెడ్డిసంఘం అధ్యక్షుడు వెంకటరెడ్డి, పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, వివిధ సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి వినతి సూర్యాపేట : బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ మార్పు వల్ల సూర్యాపేటకు జరుగుతున్న అన్యాయంపై బుల్లెట్ ట్రైన్ సాధన సమితి, అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావుతో కలిసి సోమవారం హైదరాబాదులో బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేష్రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును కలిసి వినతిపత్రం అందించారు. కేంద్ర ప్రభుత్వం బుల్లెట్ రైలు మంజూరు చేసింది ప్రజల కోసమని, బుల్లెట్ ట్రైన్ జాతీయ రహదారి 65 వెంట సూర్యాపేట మీదుగా వెళ్లాల్సిందేని వారు హామీ ఇచ్చినట్లు కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ ఆరుట్ల జానకిరెడ్డి తెలిపారు. వినతిపత్రం వచ్చిన వారిలో అఖిలపక్ష నాయకులు రమణాచారి, మల్లు నాగార్జునరెడ్డి, ధర్మార్జున్, చల్లమల్ల నరసింహ, మండాది డేవిడ్ కుమార్, కొత్తపల్లి శివకుమార్,జీడి బిక్షం, జర్నలిస్టు భూపతి రాములు, మాజీ కౌన్సిలర్ వీరేందర్, వెలుగు వనిత, తదితరులు ఉన్నారు. -
వ్యవసాయ కళాశాలతో రైతులకు ప్రయోజనం
హుజూర్నగర్ : హుజూర్నగర్లో వ్యవసాయ కళాశాల ఏర్పాటుతో ఈ ప్రాంత విద్యార్థులతో పాటు జిల్లా రైతాంగానికి ప్రయోజనం కలుగుతుందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్, డీన్ ఆఫ్ స్టూడెంట్ ఆఫైర్స్ డాక్టర్ చల్లా వేణు గోపాలరెడ్డి, డీన్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ డాక్టర్ రమణారావు అన్నారు. సోమవారం హుజూర్నగర్లో ఏర్పాటు చేసిన వ్యవసాయ కళాశాలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాలలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కళాశాలకు చెందిన 37 మంది విద్యార్థులు గత విద్యాసంవత్సరం హైదరాబాద్ రాజేందర్నగర్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించినట్లు తెలి పారు. ఈ విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరానికి జరుగుతున్న కౌన్సెలింగ్లో 120 మంది విద్యార్థులు చేరే అవకాశం ఉందన్నారు. వ్యవసాయ కళాశాలకు హుజూర్నగర్లో ప్రభుత్వం కేటాయించిన 100 ఎకరాలలో విద్యార్థులకు వ్యవసాయంపై, విత్తనోత్పత్తిపై రైతులకు శిక్షణ కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎన్. లింగయ్య, అధ్యాపకులు జి.కిరణ్రెడ్డి, సీహెచ్ రమేష్, పద్మశ్రీ, రవి, రాంబాబు, సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. ఫ పీజేటీఎస్ఏయూ రిజిస్ట్రార్ వేణుగోపాలరెడ్డి ఫ హుజూర్నగర్లో అగ్రికల్చర్ కళాశాల ప్రారంభం -
రెండున్నరేళ్లు నూతన అధ్యక్షులే కొనసాగింపు
అర్వపల్లి : తుంగతుర్తి నియోజకవర్గంలోని 9 మండలాల్లో నూతనంగా నియమించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రెండున్నర ఏళ్లు కొనసాగుతారని, అందులో ఎలాంటి సందేహం అవసరం లేదని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. అర్వపల్లిలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కొందరు సీనియర్లమంటూ పార్టీలో కిరికిరి చేస్తున్నారని, అలా చేస్తే కుదరదని చెప్పారు. వారంతా తనతో కలిసి వచ్చి అభివృద్ధికి సహకరించాలని కోరారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఏచిన్న సమస్య వచ్చినా తనను కలువవచ్చని చెప్పారు. 70 ఏళ్లుగా పరిష్కారం కాని సీలింగ్ భూముల సమస్యను సీఎంతో మాట్లాడి పరిష్కరించి 2వేల ఎకరాల భూములకు పట్టాలిప్పించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు రూ.5వేల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్లు తెలిపారు. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుడిపల్లి మధుకర్రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యేను గజమాలతో సన్మానించారు. సభలో డీసీసీ కార్యదర్శులు ఇందుర్తి వెంకట్రెడ్డి, వేల్పుల రమేష్, బీరవోలు విక్రంరెడ్డి, మాజీ జడ్పీటీసీ అవిలయ్య, దాసరి సోమయ్య, జీడి వీరస్వామి, మూసీ ప్రాజెక్టు చైర్మన్ అలువాల వెంకటస్వామి, ఏఎంసీ డైరెక్టర్లు సైదులు, జలేంధర్, దల్వాయి శ్రీధర్, చిక్కుల శేఖర్, విక్రం, సర్పంచ్లు, పార్టీ మండల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. సీనియర్లమంటూ కిరికిరి చేస్తే కుదరదు ఎమ్మెల్యే మందుల సామేల్ -
జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిగా భవ్య
చివ్వెంల(సూర్యాపేట) : సూర్యాపేట జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిగా కె.భవ్య సోమవారం బాధ్యతలు చేపట్టారు. కొదాడ కోర్టు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్న ఆమెకు పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్ని రోజుల పాటు సూర్యాపేట జిల్లా కోర్టు సీనియర్ సివిల్ జడ్జీ ఫర్హీన్ కౌసర్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు చేపట్టారు. నూతన కార్యదర్శికి డీఎల్ఎస్ఏ సిబ్బంది స్వాగతం పలికారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జీ ఫర్హీన్ కౌసర్, తదితరులు పాల్గొన్నారు. -
సూర్యక్షేత్రంలో సౌరహోమం
అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. అనంతరం యజ్ఞశాలలో మహాసౌరహోమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితజనార్దన్స్వామి, గణపురం నరేష్, ఇంద్రారెడ్డి, అర్చకులు భీంపాండే, అంకిత్పాండే తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతంగా నీట్ పీజీ నల్లగొండ : నల్లగొండలోని ఎస్పీఆర్ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన నీట్ పీజీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగిన ఈ పరీక్షకు మొత్తం 180 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 179 మంది హాజరుకాగా ఒకేఒక్క అభ్యర్థి గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ బి.చంద్రశేఖర్ తనిఖీ చేశారు. సెంటర్ ఇన్చార్జితో పరీక్ష నిర్వహణకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బందులు, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పరీక్షను నిర్వహించినట్లు తెలిపారు. కలెక్టర్ వెంట అదనపు సూపరింటెండెంట్ రమేష్, ఆర్డీఓ వై.అశోక్రెడ్డి, డీఎస్పీ శివరాంరెడ్డి, సీఐ ఆదిరెడ్డి, పరీక్షల ఇన్చార్జి, ప్రొఫెసర్ ఉపేందర్ ఉన్నారు. యాదగిరీశుడి క్షేత్రంలో నిత్యకల్యాణ వేడుకయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో ఆదివారం నిత్య కల్యాణ వేడుకతో పాటు సంప్రదాయ పూజలు కొనసాగాయి. గర్భాలయంలోని స్వయంభూలకు నిజాభిషేకం, బిందె తీర్థం, ఆరాధన, అర్చన వంటి పూజలను చేపట్టారు. ముఖ మండపంలోని సువర్ణ ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తరం పూజ జరిపించారు. సాయంత్రం ఆలయ తిరు మాఢ వీధిలో స్వామి అమ్మవార్ల జోడు సేవను ఊరేగించారు. -
టీపీసీసీ నిర్ణయం వచ్చే వరకు కమిటీలు వద్దు
తుంగతుర్తి : టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్గౌడ్ నిర్ణయం వచ్చే వరకు తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీలు వేయవద్దని డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. తుంగతుర్తి నియోజకవర్గంలో ఈ మధ్యకాలంలో మండల, పార్టీ నియామకాల కారణంగా సొంత పార్టీలో భేదాభిప్రాయాలు వచ్చాయన్నారు. నూతన అధ్యక్షుల ఎంపిక ప్రక్రియపై తుది నిర్ణయం వచ్చే వరకు నియోజకవర్గంలో గ్రామ కమిటీలు వేయవద్దని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. కమిటీలు వేసి, మళ్లీ పార్టీలో గందరగోళం సృష్టించవద్దని, పార్టీ నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని హితవు పలికారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు దొంగరి గోవర్ధన్, మడ్డి కృష్ణమూర్తి పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య -
కబడ్డీ పోటీల విజేత కరివిరాల జట్టు
హుజూర్నగర్ : జిల్లా మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మోర్తాల నాగిరెడి ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి అండర్–17 బాలికల కబడ్డీ పోటీలు ఆదివారం ముగిసాయి. పోటీల్లో మొత్తం 18 జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో మొదటి బహుమతి కరివిరాల మోడల్ స్కూల్ కై వసం చేసుకోగా రెండవ బహుమతి ఏంజేపీ అనంతగిరి, మూడవ బహుమతి జడ్పీహెచ్ఎస్ గరిడేపల్లి, నాల్గవ బహుమతి హైదరాబాద్ జూనియర్ కళాశాల కోదాడ జట్టు గెలుచుకుంది. విజేతలకు జిల్లా మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మోర్తాల నాగిరెడ్డి బహుమతులు అందించారు. కార్యక్రమంలో జిల్లా మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ సభ్యులు మట్టపల్లి సతీష్గౌడ్, సీహెచ్ వీరయ్య, లెనిన్, పీఈటీలు కొండ నాగయ్య, బండారు సురేష్, వీరస్వామి, హుస్సేన్, గురవయ్య, కబడ్డీ క్రీడాకారుడు యాదగిరి, క్రీడాకారులు పాల్గొన్నారు. -
పాత అలైన్మెంట్ కొనసాగించే వరకు పోరాటం
సూర్యాపేట : బుల్లెట్ రైలు పాత అలైన్మెంట్ను కొనసాగించే వరకు పోరాటం ఆగదని బుల్లెట్ ట్రైన్ సాధన సమితి కన్వీనర్ ప్రొఫెసర్ ఆరుట్ల జానకిరెడ్డి అన్నారు. బుల్లెట్ ట్రైన్ సాధన సమితి, అఖిలపక్ష పోరాట కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం 17వ రోజు కొనసాగాయి. దీక్షలో అంగన్వాడీ కేంద్రాల సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రాష్ట్రాల రాజధానుల మధ్యలో ఉన్న సూర్యాపేట అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నప్పటికీ పాలకుల నిర్లక్ష్యం కారణంగానే రైలు మార్గం లేకుండా పోతుందన్నారు. కేంద్రం మంజూరు చేసిన బుల్లెట్ ట్రైన్ను సూర్యాపేట మీదుగా కాకుండా పక్కదోవ పట్టిస్తున్న పాలకులపై పోరాటం నిర్వహిస్తమన్నారు. దీక్షలో అంగన్వాడీ సిబ్బంది భాస్కరమ్మ, వసంత, ఏకలక్ష్మి, సంతోషకుమారి, వెలుగు వనిత, తదితరులు పాల్గొన్నారు. దీక్షలకు అఖిలపక్ష నాయకులు రమణాచారి, ధర్మార్జున్, డేవిడ్ కుమార్, సీఐటీయూ నాయకులు కోటగిరి వెంకటనారాయణ, నెమ్మాది వెంకటేశ్వర్లు, మట్టిపెల్లి సైదులు, జీడి భిక్షం, నవిలే ఉపేందర్, విద్యాసాగర్ రావు, నారబోయిన వెంకట్యాదవ్, యాదయ్య, సట్టు నాగయ్య సంఘీభావం తెలిపారు. బుల్లెట్ రైలు సాధనకు కొనసాగుతున్న రిలే దీక్షలు -
ఆసరా కు నేడు ఆఖరు
భానుపురి (సూర్యాపేట) : చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. చాలాకాలం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు అందించేందుకు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ప్రస్తుతం వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికుల నుంచే దరఖాస్తులు తీసుకుంటోంది. 58 ఏళ్లు నిండిన వారికి అవకాశం ఇవ్వకపోవడంతో చాలా మంది నిరాశ చెందారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 17,334 దరఖాస్తులు ఆన్లైన్లో సమర్పించారు. దరఖాస్తులు సమర్పించేందుకు ప్రభుత్వం ఇచ్చిన గడువు సోమవారంతో ముగియనుంది. ఇప్పటి వరకు దాఖలైన దరఖాస్తులు ఇలా..జిల్లాలోని 23 మండలాలు, ఐదు మున్సిపాలిటీల నుంచి మొత్తం 17,334 దరఖాస్తులు అధికారులకు ఆన్లైన్లో అందాయి. ఇందులో అత్యధికంగా సూర్యాపేట మున్సిపాలిటీ నుంచి 2,038 రాగా అత్యల్పంగా పాలకవీడు మండలం నుంచి 260 దరఖాస్తులు వచ్చాయి. ఆన్లైన్లో అందిన దరఖాస్తుల్లో అత్యధికంగా వితంతు పెన్షకు 9,302 ఉన్నాయి. దివ్యాంగ కేటగిరి నుంచి 4,110 దరఖాస్తులు, కల్లుగీత కార్మికుల నుంచి 2,424, ఒంటరి మహిళల నుంచి 1,171, చేనేత పెన్షన్ల కోసం 327 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరిశీలన తర్వాతే మంజూరుకొత్త పింఛన్ల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నప్పటికీ ఆన్లైన్లో దరఖాస్తుకు ఆప్షన్ అందుబాటులో లేకపోవడంతో చాలామంది అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా ప్రభుత్వం కొత్త పింఛన్ల ప్రక్రియను ప్రారంభించడంతో ఆయా కేటగిరీలకు చెందిన వారు దరఖాస్తు చేసుకున్నారు. గతంలో దరఖాస్తు చేసి అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించిన వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. వచ్చిన దరఖాస్తులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. దరఖాస్తుదారుల అర్హత, ధ్రువపత్రాలు, కుటుంబ పరిస్థితులు వంటి అంశాలను పరిశీలించి అర్హుల జాబితాను రూపొందిస్తారు. అనంతరం సంబంధిత డేటాబేస్లతో వివరాలను ధ్రువీకరించి జిల్లా కలెక్టర్ ఆమోదంతో పింఛన్లు మంజూరు చేయనున్నారు. దరఖాస్తుల గడువు సోమవారంతో ముగియనుండగా.. ఇంకా దరఖాస్తు చేసుకోని వారు వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.ఇప్పటి వరకు 17,334 దరఖాస్తులు ఐదు కేటగిరీలకే అవకాశం వితంతు పెన్షన్లకు అత్యధికంగా దరఖాస్తులు -
నిషేధమున్నా.. వినియోగం ఆగట్లే!
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధ అమలుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. విక్రయదారులకు నోటీసులు జారీ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తున్నాం. ఈ నిషేధం పూర్తిస్థాయిలో అమల కావడానికి ప్రజలు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది అందరి సహకారం ఎంతో అవసరం. – కత్తి సతీష్కుమార్, మున్సిపల్ కమిషనర్, హుజూర్నగర్హుజూర్నగర్ : పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తున్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణలో అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 120 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న పాలిథిన్ కవర్లు, గ్లాసులు, ప్లేట్లు, స్ట్రాల తయారీ, విక్రయం, వినియోగంపై పూర్తి నిషేధం ఉంది. ఉల్లంఘిస్తే రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు జరిమానాతోపాటు వ్యాపారుల లైసెన్సులు రద్దు చేయాల్సి ఉంది. అయితే అధికారుల తనిఖీలు మొక్కుబడిగా మారడంతో ప్లాస్టిక్ విక్రయాలు, వినియోగం యథేచ్ఛగా జరుగుతోంది. ఫలితంగా ప్రభుత్వ లక్ష్యం నెరవేరకపోగా పర్యావరణానికి తీవ్రమైన హాని కలుగుతోంది. రోజూ పది మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు..జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో నిత్యం సుమారు 100 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా, అందులో 10 మెట్రిక్ టన్నుల వరకు ప్లాస్టిక్ వ్యర్థాలే ఉంటున్నాయి. షాపింగ్ మాల్స్ నుంచి రోడ్డు పక్కన విక్రయించే దుకాణాల వరకు పాలిథిన్ కవర్ల వాడకం విచ్చలవిడిగా సాగుతోంది. పట్టణాల్లోనే అధికంగా..జిల్లాలో ఎక్కువ శాతం పట్టణాల్లో ఎక్కడ చూసినా రోడ్ల పక్కన ప్లాస్టిక్ వ్యర్థాలు కనిపిస్తున్నాయి. మున్సిపల్ సిబ్బంది ఎక్కువగా వ్యాపార సముదాయాల నుంచి నిత్యం ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తున్నారు. చిరు వ్యాపారుల నుంచి పెద్ద దుకాణాల వరకు ప్రతిఒక్కరూ ప్లాస్టిక్ను వినియోగిస్తున్నారు. పండుగల నేపథ్యంలో వీటి వినియోగం మరింత పెరుగుతూ పోతోంది. నిబంధనల ప్రకారం పాలిథీన్ వ్యర్ధాలను ప్రత్యేక డబ్బల్లోనే వేయాల్సి ఉన్నా దానిని విస్మరిస్తున్నారు. రోడ్డు వెంబడి ప్లాస్టిక్ కవర్లలో వివిధ ఆహార పదార్థాలను పడేస్తుండటం వల్ల రోడ్లపై తిరిగే మూగజీవులు వాటిని తింటూ తీవ్ర అస్వస్థతకు గురవుతూ చనిపోతున్నాయి. ఇప్పటికై నా అధికారులు నామమాత్రపు చర్యలు వీడి, ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, పట్టణాల్లో ప్లాస్టిక్ విక్రయాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.మున్సిపాలిటీ వార్డులు చెత్త ఉత్పత్తి ప్లాస్టిక్ వ్యర్థాలుసూర్యాపేట 48 50 05 కోదాడ 35 23 03 హుజూర్నగర్ 28 16 01 నేరేడుచర్ల 15 05 0.7 తిరుమలగిరి 15 0.3యథేచ్ఛగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయాలు నియంత్రణలో యంత్రాంగం విఫలం మున్సిపాలిటీల్లో పేరుకుపోతున్న వ్యర్థాలు అమలుకు నోచుకోని నిషేధాజ్ఞలు పర్యావరణానికి, మూగజీవుల ప్రాణాలకు ముప్పురోజువారీగా సేకరించే చెత్త, వెలువడే ప్లాస్టిక్ వ్యర్థాలు (మెట్రిక్ టన్నుల్లో..) -
నేరాల నియంత్రణలో టాప్
సూర్యాపేటటౌన్ : నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తులో పురోగతి, నిందితులకు శిక్షలు పడేలా పకడ్బందీ చర్యలు, ట్రాఫిక్ నిబంధనల అమలులో కఠిన వైఖరి, ప్రజలకు మెరుగైన సేవలు వంటి అంశాల్లో సూర్యాపేట జిల్లా పోలీసులు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకత చాటుకున్నారు. పోలీసుశాఖ పనితీరులో సూర్యాపేట జిల్లా క్లస్టర్–4లో ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. దాంతో డీజీపీ సీవీ ఆనంద్ ఎస్పీ నరసింహకు ప్రశంసాపత్రం అందించి అభినందించారు. ఎనిమిది అంశాల్లో సత్తాజిల్లా పోలీసుల పనితీరును ఎనిమిది కీలక సూచికల ఆధారంగా అంచనా వేశారు. చార్జ్షీట్, నేరాల గుర్తింపు రేటు, కేసుల్లో శిక్షల శాతం, దర్యాప్తునకు పట్టే సగటు సమయం, బాధితుల ఇంటి వద్ద కేసుల నమోదు, ఈ–పెట్టీ కేసులు, ఈ–చలాన్ల జారీ, డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను పరిగణనలోకి తీసుకున్నారు. ఆయా విభాగాల్లో మెరుగైన పనితీరు కనబరచడంతో సూర్యాపేట పోలీసులు అగ్రస్థానంలో నిలిచారు. ఆధారాల సేకరణపై ప్రత్యేక దృష్టికేసుల దర్యాప్తులో సాంకేతికతను వినియోగించడంతో పాటు నేరాలకు సంబంధించిన బలమైన ఆధారాలు, సాక్ష్యాలను సేకరించడంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. నేరం జరిగిన వెంటనే దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను గుర్తించడం, కేసులలో సాక్షాలను పకడ్బందీగా సేకరించి కోర్టులో ప్రవేశపెట్టడం ద్వారా నేరస్థులకు శిక్షలు పడేలా చర్యలు చేపడుతున్నారు. ట్రాఫిక్పై ఉక్కుపాదంరోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ఈ–చలాన్ల ద్వారా చర్యలు తీసుకుంటున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై డ్రంకెన్న్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆయా అంశాల్లో అంకితభావం, నైపుణ్యం ప్రదర్శించిన సిబ్బందిని డీజీపీ సీవీ ఆనంద్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ గుర్తింపు జిల్లా పోలీసుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.ప్రజలకు మరింత మెరుగైన సేవలు సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం. నేరాల నియంత్రణకు నిరంతరం పనిచేస్తున్నాం, కేసుల దర్యాప్తును వేగవంతం చేసి నేరస్థులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రస్థాయిలో లభించిన ఈ గుర్తింపు జిల్లా పోలీసు సిబ్బంది సమిష్టి కృషికి దక్కిన గౌరవం, ఇదే స్ఫూర్తితో మరింత సమర్థవంతంగా పనిచేస్తాం. – ఎస్పీ నరసింహ పోలీసుల పనితీరుకు రాష్ట్రస్థాయి గుర్తింపు క్లస్టర్–4లో సూర్యాపేట జిల్లాకు ప్రథమ ర్యాంక్ ఎస్పీ నరసింహకు డీజీపీ ప్రశంసాపత్రం -
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి
● నూతనకల్లో పట్టాలు అందజేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి నూతనకల్, తిరుమలగిరి : రాష్ట్రంలోని ప్రజాప్రభుత్వం రెండున్నర సంవత్సరాలుగా పేదల పక్షంగా పనిచేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో నూతనకల్, మద్దిరాల మండలాల్లోని 15 గ్రామాలకు చెందిన 1921 మంది రైతులకు 2,091 ఎకరాల సీలింగ్ భూముల పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమానికి రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ రైతులను జైలుకు పంపిన గత ప్రభుత్వంలోని పెద్దలు నేడు కారుకూతలు కూస్తు ప్రజా ప్రభుత్వంపై విషాన్ని చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు. వీరు తలకిందులుగా తపస్సు చేసినా మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సేనన్నారు. ప్రభుత్వ విజయం : ఎమ్మెల్యే మందుల సామేల్ దశాబ్ధాల తరబడి పరిష్కారానికి నోచుకోని భూ సమస్యలను పరిష్కరించి రైతులను భూమి హక్కులు కల్పిండం కాంగ్రెస్ ప్రభుత్వ విజయమని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. భూమిపై హక్కులేని రైతులకు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పహాణీలపై బ్యాంకు రుణాలు అందించి సరైన గౌరవం ఇచ్చారని గుర్తు చేశారు. నేటి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందించి వారి ఆత్మగౌరవాన్ని కాపాడారన్నారు. ఈ కార్యక్రమంలో రైతు కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్న యాదవ్, డీసీసీ అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య, రెవెన్యూ సీసీఎల్ఏ సెక్రటరీ లోకేష్కుమార్, ల్యాండ్ సర్వీస్ సెటిల్మెంట్ కమీషనర్ రాజీవ్గాంధీ హన్మంతు షిండే, కలెక్టర్ తేజస్ నంద్లాల్పవార్, ఆర్డీఓ వేణుమాధవ్రావు, తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎల్సోజు చామంతినరేష్, తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మందుల సూర్యకిరణ్, జెన్నారెడ్డి వివేక్రెడ్డి, మందుల భాను, మండల పార్టీ అధ్యక్షులు కట్టా మల్లారెడ్డి, పచ్చిపాల వెంకన్న, గుడిపాటి సైదులు, పీఏసీఎస్ చైర్మన్ నాగం జయసుధసుధాకర్రెడ్డి, సుంకరి జనార్దన్, పాల్వాయి నాగరాజు, రేగటి రవిగౌడ్, మండల పార్టీల అధ్యక్షులు, సర్పంచ్లు, అధికారులు పాల్గొన్నారు. -
ఆర్టీసీకి కలిసొచ్చిన రాఖీ పండుగ
● రెండు రోజుల్లో రూ.4.93 కోట్ల ఆదాయం రామగిరి(నల్లగొండ): రాఖీ పండుగ ఆర్టీసీకి అధిక ఆదాయం తెచ్చిపెట్టింది. నల్లగొండ రీజియన్లో ఏడు డిపోల ద్వారా నడిపిన ప్రత్యేక బస్సులకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పండుగ ప్రయాణాలను సురక్షితంగా, సులభతరం చేసేందుకు అన్ని డిపోల నుంచి ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తేగా, ఆయా మార్గాల్లో రద్దీ పెరిగి ఆర్టీసీకి బంపర్ కలెక్షన్లు సమకూరాయి. ఈ నెల 27, 28 తేదీలలో ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులను నడిపింది. ఏడు డిపోల నుంచి పండుగ ముందు రోజు 27న రూ.2,05,96,310 ఆదాయం రాగా.. పండుగ రోజు 28న రూ.2,87,43,647 వచ్చాయి. గత సంవత్సరం రాఖీ పండుగ కంటే ఈసారి రాబడి గణనీయంగా పెరిగింది. గత ఏడాది కంటే ఈ ఏడాది రాఖీకి రూ.45 లక్షలు ఎక్కువ వచ్చాయి. రాష్ట్రంలోనే నల్లగొండ రీజియన్ టాప్ పండుగ రోజు వచ్చిన ఆదాయం, ఆక్యుపెన్సీ రేషియో ఆధారంగా నల్లగొండ రీజియన్ రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆక్యుపెన్సీ రేషియో 147.44%గా నమోదైంది. నల్లగొండ రీజియన్ అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా సేవలను నిర్వహించడం, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా బస్సులను అందుబాటులో ఉంచడం వల్లనే ఈ స్థాయిలో ఫలితాలు సాధించగలిగామని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. -
సెప్టెంబర్ 1న ఉమ్మడి జిల్లా ఫుట్బాల్ జట్టు ఎంపిక
నల్లగొండ టూటౌన్ : నిజామాబాద్లో సెప్టెంబర్ 4 నుంచి 7వ తేదీ వరకు జూనియర్ బాలికల రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ ఛాంపియన్షిప్ జరగనుంది. ఈ ఛాంపియన్షిప్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా జట్టును ఎంపిక చేసేందుకు సెప్టెంబర్ 1న నల్లగొండ సమీపంలోని చర్లపల్లిలో గల విపస్యా స్కూల్లో పోటీలు నిర్వహించనున్నట్లు ఫుట్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బండారు ప్రసాద్, కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 01–01–2011 నుంచి 31–12–2012 మధ్య జన్మించిన బాలికలు అర్హులని వారు పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఆధార్ కార్డు, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలతో హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 82470 45667, 94403 74027 నంబర్లను సంప్రదించాలన్నారు. సీపీఎం పోరాట ఫలితంగానే రైతులకు భూ పట్టాలుతుంగతుర్తి : సీపీఎం పోరాట ఫలితంగానే నేడు నూతనకల్లో రైతులకు ప్రభుత్వం భూమి హక్కులు కల్పిస్తూ పట్టాలు పంపిణీ చేసిందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి అన్నారు. తుంగతుర్తిలో శనివారం జరిగిన ఆ పార్టీ నియోజకవర్గస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఎం అగ్ర నాయకులైన భీంరెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, మల్లు వెంకటనరసింహారెడ్డి, తొట్ల మన్సూర్ లాంటి మహనీయులు ఎర్రపహాడ్ దొరల వద్ద ఉన్న భూములను పేదలకు పంచాలని ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఆ పోరాటాలకు ప్రజల మద్దతు కూడగొట్టుకొని అనేకసార్లు కలెక్టరేట్ వద్ద ధర్నాలు, తహసీల్దార్ కార్యాలయాల ముందు ఆందోళనలు చేశారన్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కమిటీ సభ్యులు బుర్ర శ్రీనివాస్, కందాల శంకర్రెడ్డి, మండల కార్యదర్శులు వజ్జే శ్రీనివాస్, పోలోజు సైదులు, దేవరకొండ యాదగిరి, నాయకులు తాటి విజయమ్మ, సుదర్శన్, బూర్గుల ప్రభాకర్, గజ్జల శ్రీనివాస్రెడ్డి, కూసు సైదులు, గుడిపూడి వెంకటేశ్వర్లు, శివ, వెంకన్న, భాస్కర్, అవిలయ్య పాల్గొన్నారు. యాదగిరి క్షేత్రంలో జోడు సేవోత్సవంయాదగిరిగుట్ట: శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వెండి జోడు సేవ వైభవంగా నిర్వహించారు. శనివారం వేకువజామునే ఆలయాన్ని తెరచిన అర్చకులు శ్రీస్వామి వారికి సుప్రభాతం, అభిషేకం, బాలభోగం, ఆరాధన, సహస్ర నామార్చన పూజలను జరిపించారు. ఇక ముఖ మండపంలో ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలను నిర్వహించారు. ప్రథమ ప్రాకార మండపంలో ముందుగా శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, శ్రీస్వామి అమ్మవార్ల నిత్యకల్యాణం ఆలయ ఆచార వ్యవహారాలతో చేపట్టారు. సాయంత్రం వేళ భక్తుల నడుమ వెండి జోడు సేవలను మంగళ వాయిద్యాల మధ్య తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. బుద్ధవనాన్ని సందర్శించండినాగార్జునసాగర్ : నాగార్జునసాగర్లోని బుద్ధవనాన్ని సందర్శించాలని అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలోని బౌద్ధాచార్యులను బౌద్ధ పరిశోధకుడు, బుద్ధవనం నిర్మాణ సలహాదారుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ ఈమని శివనాగిరెడ్డి కోరారు. స్థానిక బౌద్ధాభిమాని రవికుమార్రెడ్డి లట్టుపల్లి సహకారంతో శనివారం ఫిలడెల్ఫియా నగరంలోని పలు బౌద్ధ విహారాలు, ఆలయాలను శివనాగిరెడ్డి సందర్శించి అక్కడి బౌద్ధాచార్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాగార్జునకొండ, బుద్ధవనం ప్రత్యేకతలతో పాటు తెలంగాణలోని ప్రసిద్ధ బౌద్ధారామాలు, బౌద్ధ వారసత్వ ప్రదేశాల విశిష్టతలను వారికి వివరించినట్లు శివనాగిరెడ్డి తెలిపారు. భారతదేశ పర్యటనకు వచ్చినప్పుడు బుద్ధవనాన్ని తప్పక సందర్శిస్తానని ఫిలడెల్ఫియా బౌద్ధాచార్యలు హామీ ఇచ్చినట్లు శివనాగిరెడ్డి పేర్కొన్నారు. -
కాంగ్రెస్ పాలనలో రైతులకు అన్యాయం
సూర్యాపేటటౌన్ : కాంగ్రెస్ పాలనలో రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల విఫల పాలనను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టనున్న కార్యక్రమాలపై శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు కాలమో, ఎల్నినో ప్రభావమో కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన కరువేనని ఆరోపించారు. రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. కృష్ణా, గోదావరి జలాలు ఎలా వృథాగా పోతున్నాయో బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపించారన్నారు. 75 రోజుల్లో గోదావరి నుంచి 150 టీఎంసీల నీటిని సముద్రం పాలు చేశారని ఆరోపించారు. కృష్ణా జలాల్లోనూ 150 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్కు తరలించారని విమర్శించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు నీటితో నిండుతున్నా తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ బడుగు లింగయ్య యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, నిమ్మల శ్రీనివాస్గౌడ్, గోపగాని వెంకటనారాయణగౌడ్, అన్నపూర్ణ, అంగిరేకుల నాగార్జున, ఆ పార్టీ నియోజకవర్గ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు, ఇతర నాయకులు పాల్గొన్నారు. వెయ్యి రోజుల విఫల పాలనపై నిరసనలు చేపడతాం మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి -
పట్టణ పేదలకు అందని ఇళ్లు
తిరుమలగిరి (తుంగతుర్తి) : పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం పట్టణ పేదలకు అందకుండా పోతోంది. జిల్లాలోని మిగతా మున్సిపాలీటీలతో పాటు అన్ని గ్రామాల్లో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తయ్యాయి. గృహ ప్రవేశాలు కూడా జరిగాయి. కానీ తిరుమలగిరి మున్సిపాలిటీలో మాత్రం మొదటి విడత లబ్ధిదారుల జాబితా నేటికీ ప్రకటించలేదు. దాంతో పేదలు తమకు ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడిస్తారంటూ మున్సిపాలిటీ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయినా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించడం లేదు. 225 ఇళ్లు మంజూరురాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను 2025 జూన్ 2న ప్రారంభించింది. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. అటు తరువాత పలు గ్రామాలలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు పనులు పూర్తి చేసుకొని గృహ ప్రవేశాలు కూడా చేశారు. తిరుమలగిరి మండలంలో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికై న ఖోక్యానాయక్ తండాలో 65 ఇళ్లు వివిధ గ్రామాలలో 195 ఇళ్లతో పాటు మున్సిపాలిటీలో 225 ఇళ్లు మంజూరయ్యాయి. దరఖాస్తు చేసుకొని 14 నెలలు..తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం సుమారు వెయ్యి మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులు సమావేశమై ప్రతి వార్డులో లబ్ధిదారులను కూడా ఎంపిక చేశారు. ఈ ప్రక్రియ పూర్తయి 14 నెలలు గడిచినా నేటికీ మొదటి విడత అర్హుల జాబితాను వెల్లడించలేదు. లబ్ధిదారుల ఎంపిక విషయంలో స్థానిక నాయకుల మధ్య సమన్వయం లేక పోవడంతో ఆలస్యమవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో నిరుపేదలు తమకు ఇల్లు మంజూరవుతుందో లేదోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో మొదటి విడుత ఇళ్లు పూర్తయి రెండవ విడత ఎంపిక కోసం గుడిసెల్లో ఉన్న పేదలను అధికారులు గుర్తించే పనిలో ఉన్నారు. కానీ మున్సిపాలిటీలో మాత్రం మొదటి విడత లబ్ధిదారులు ఎంపిక పూర్తికాకపోవడంపై పట్టణ పేదలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.తిరుమలగిరిలో ఇందిరమ్మ ఇళ్లకు కలగని మోక్షం నేటికీ వెలువడని మొదటి విడత జాబితా మున్సిపల్ కార్యాలయం చుట్టూ అర్హుల ప్రదక్షిణలుమా ఇల్లు శిథిలావస్థకు చేరింది. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకుని సంవత్సరం దాటినా మంజూరు కాలేదు. అధికారులు స్పందించి ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలి. – గుగులోతు సత్తి, ఈదులపర్రె తండా తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో చాలా మంది పేదలు ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో లబ్ధిదారుల ఎంపిక చేనప్పటికీ ఇప్పటి వరకు జాబితా ప్రకటించ లేదు. అధికారులు స్పందించి అర్హులైన వారందరికీ ఇళ్లు మంజూరు చేయాలి. – కడెం లింగయ్య, తిరుమలగిరి ఇతర ప్రాంతాల్లో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణం పూర్తయింది. రాజకీయ కారణాలతోనే తిరుమలగిరి మున్సిపాలిటీలో లబ్ధిదా రుల ఎంపిక జరగలేదు. అధికారులు విచారణ జరిపి అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వాలి. – ఎం.యాదగిరి, తిరుమలగిరి -
బుల్లెట్ రైలు సాధనకు పోరాడుతాం
సూర్యాపేట : బుల్లెట్ ట్రైన్ సాధనకు తమ వంతుగా పోరాడుతామని పీఓడబ్ల్యూ జిల్లా కమిటీ పేర్కొంది. బుల్లెట్ ట్రైన్ సాధన సమితి ఆధ్వర్యంలో శనివారం 16వ రోజు దీక్షలో ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ జిల్లా కమిటీ ప్రతినిధులు పాల్గొని మాట్లాడారు. ఈ దీక్షలో ఆ సంఘం సభ్యులు కంచర్ల నర్సమ్మ, గుణగంటి నీలమ్మ, అలుగుబెల్లి వాణిశ్రీ,, సామ ఉపేంద్ర, వెంకటమ్మ,ఎల్లమ్మ, సుప్రియ, జయసుధ పాల్గొన్నారు. దీక్షకు మాజీ కౌన్సిలర్ ఆనంతుల మల్లేశ్వరి,బుల్లెట్ ట్రైన్ సాధన అఖిలపక్ష పోరాట కమిటీ నాయకులు సంఘీభావం తెలిపారు. దీక్షకు సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం నాయకులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు బెలిదె శ్రీనివా సులు, నాయకులు కర్నాటి కిషన్, జిల్లా ఆర్యవైశ్య సంఘం కోశాధికారి చల్లా లక్ష్మీకాంత్, పట్టణ ఆర్యవైశ్య సంఘం గౌరవ సలహాదారులు మిట్టపల్లి రమేష్, ఉపాధ్యక్షులు గుండా శ్రీధర్, సోమ వెంకటేశ్వర్లు, కోశాధికారి ఉప్పల శ్రవణ్ కుమార్, సోమ ప్రవీణ్, ప్రవీణ్, కలకోట లక్ష్మయ్య పాల్గొన్నారు. -
సూర్యాపేటలో రక్తం చిందించిన వేప చెట్టు
సాక్షి, సూర్యాపేట: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వేప చెట్టు విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య మొదలైన వివాదం రక్తం చిందించింది. గొడ్డలతో పరస్పరం దాడులు చేసుకునేదాకా వెళ్లింది. ఈ దాడుల్లో ఇద్దరూ మృతి చెందగా.. ఘర్షణను అదుపు చేయడానికి ప్రయత్నించిన ఎస్సైకి సైతం తీవ్ర గాయాలయ్యాయి.మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డ తండాలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. వేప చెట్టు విషయంలో భుక్యా సైదా, వెంకటేశ్వర్లు మధ్య వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో ఈ ఉదయం దాని చెట్టు కొమ్మలు నరికేందుకు వెంకటేశ్వర్లు ప్రయత్నించాడు. అది గమనించిన సైదా అడ్డు చెప్పాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన సైదా కొడుకు రాము.. అదే గొడ్డలితో వెంకటేశ్వర్లును నరికాడు. దీంతో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు. దీంతో కోపోద్రిక్తులైన వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు, కొందరు స్థానికులు సైదా, సైదా కొడుకు రాముపై దాడికి యత్నించాడు. అది గమనించిన మరికొందరు స్థానికులు సైదా తరఫున కొట్లాటకు వచ్చారు. ఇరు వర్గాల ఘర్షణలో కొందరికి గాయాలు కాగా.. అక్కడ పరిస్థితి రణరంగాన్ని తలపించింది. ఇదే అదనుగా తన కుమారుడిని ఘటనా స్థలం నుంచి తప్పించే ప్రయత్నం చేశాడు సైదా. అయితే.. పట్టరాని కోపంతో రాము తన తండ్రి సైదాపై గొడ్డలితో దాడి చేశాడు. ఆపై భయంతో ఓ ఇంట్లో దూరి దాక్కున్నాడు. సైదాను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా అడ్డుకున్న స్థానికులు.. రామును అప్పగిస్తేనే ముందుకు కదలిస్తామని ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఈలోపు.. రామును పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించే ప్రయత్నం చేయగా స్థానికులు కొందరు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఎస్సై నవీన్కు గాయాలయ్యాయి. సైదాను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆలస్యం కావడంతో మార్గం మధ్యలోనే మరణించాడు. ఎస్సై నవీన్ సహా గాయపడిన వాళ్లను ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. వెంకటేశ్వర్లు, సైదా మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ డబుల్ మర్డర్తో ఆ తండాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ఇదీ చదవండి: జిమ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు -
ఆధారాలు చూపిస్తేనే ఓటు
భానుపురి (సూర్యాపేట) : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)కు సంబంధించి తుదిదశ ప్రక్రియ జిల్లాలో వేగవంతమైంది. జిల్లావ్యాప్తంగా గురువారం నిర్వహించిన గ్రామసభల్లో ఓటర్ల జాబితాను, తొలగించిన ఓటర్ల వివరాలను, నోటీసులు అందుకోనున్న ఓటర్ల జాబితాను అందుబాటులో ఉంచడమే కాకుండా చదివి వినిపించారు. ఇప్పటికే మ్యాపింగ్ కాని వారితో పాటు అనామలీస్ (స్పష్టమైన గుర్తింపు లేని ఓటర్లు) జాబితాలో చేరిన ఓటర్లకు బీఎల్ఓల ద్వారా నోటీసుల జారీ ప్రక్రియ చేపట్టారు. నోటీసులు అందుకునే వారంతా నిర్ణీత గడువులోగా తగిన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో సుమారు 1,90,676 మంది ఓటర్లకు నోటీసులు అందించనున్నారు. నో మ్యాపింగ్, ఎనామలీ కేటగిరీలకు.. జిల్లావ్యాప్తంగా ఎస్ఐఆర్కు ముందు 10,08,252 మంది ఓటర్లు ఉండగా, డిజిటలైజేషన్ అనంతరం 9,11,945 మంది ఓటర్లతో కూడిన ముసాయిదా జాబితాను అధికారులు ప్రకటించారు. మిగతా వారిలో మృతిచెందిన వారు 26,059 మంది, శాశ్వతంగా వలస వెళ్లిన వారు 48,310 మంది కాగా, ఇతర కారణాలతో మొత్తంగా 96,307 ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. ముసాయిదా జాబితాలో పేరున్న ఓటర్లలో వివిధ రకాల తప్పుల కారణంగా ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లా యంత్రాంగం నోటీసులు అందించనుంది. ఎస్ఐఆర్ ప్రక్రియలో నో మ్యాపింగ్గా గుర్తించిన ఓటర్లకు, అలాగే సరైన వివరాలు అందించకపోవడం వల్ల ఎనామలీ కింద నమోదైన వారికి ఈ నోటీసులు అందనున్నాయి. తొలిరోజు 4,796 మందికి.. జిల్లావ్యాప్తంగా నో మ్యాపింగ్ కింద 22,997 మందికి, ఎనామలీ కేటగిరీ కింద 1,70,463 మందికి కలిపి మొత్తంగా 1,90,676 మందికి నోటీసులు అందించాల్సి ఉంది. గురువారం చేపట్టిన గ్రామసభల్లో హుజూర్నగర్ నియోజకవర్గంలో 1,896 మందికి, కోదాడలో 1,468 మందికి, సూర్యాపేటలో 1,318 మందికి, తుంగతుర్తిలో 114 మందికి మొత్తంగా 4,796 మందికి అధికారులు నోటీసులు అందజేశారు. ఇంకా 1,85,880 మంది ఓటర్లకు నోటీసులు అందించాల్సి ఉంది. నోటీసులు అందుకున్న వారంతా అందులో పేర్కొన్న తేదీ, ప్రాంతంలో ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకదానిని బీఎల్ఓకు చూపించి తమ ఓటు హక్కును కాపాడుకోవాల్సి ఉంటుంది. నియోజకవర్గం ఓటర్లు మొత్తం నోటీసులు ఇంకా నోటీసులు అందించినవి ఇవ్వాల్సింది హుజూర్నగర్ 2,27,398 43,204 1,896 41,308 కోదాడ 2,21,879 44,598 1,468 43,130 సూర్యాపేట 2,20,335 55,665 1,318 54,347 తుంగతుర్తి 2,42,333 47,209 114 47,095 ఫ జిల్లావ్యాప్తంగా ముగిసిన గ్రామసభలు ఫ ఓటరు జాబితాతోపాటు నోటీసులు అందే ఓటర్ల వివరాలు వెల్లడి ఫ జిల్లాలో సుమారు 1,90,676 మంది ఓటర్లకు నోటీసులు ఫ రేపటి నుంచి ఆధారాల స్వీకరణ -
ప్రణాళికతో నేరాల అదుపు
కోదాడ రూరల్ : నేరాల అదుపు, ప్రమాదాల నివారణకు పోలీసులు ప్రణాళికతో పనిచేయాలని ఎస్పీ నరసింహ సూచించారు. గురువారం కోదాడ పట్టణంలోని డీఎస్పీ, ట్రాఫిక్ పోలీసు కార్యాలయాల్లో వార్షిక తనిఖీలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. సబ్ డివిజన్ పరిధిలో ఉన్న పోలీసు స్టేషన్ల పనితీరుపై పర్యవేక్షణ చేస్తూ సిబ్బందిని అప్రమత్తంగా ఉంచాలని డీఎస్పీకి తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని, రహదారుల వెంట ఉన్న హోటళ్లు, వ్యాపారులకు అవగాహన కల్పించాలన్నారు. అన్ని చోట్లా సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని, అవి నేరాల నియంత్రణకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. సబ్ డివిజన్ పరిధిలో ఎక్కువ భాగం అంతర్ రాష్ట్ర సరిహద్దు ఉందని, ఆయా ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి అక్రమ రవాణా జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. వరకట్నం, అట్రాసిటీ, మైనర్లపై వేధింపులు, తీవ్రమైన చీటింగ్ కేసులకు డీఎస్పీయే దర్యాప్తు అధికారిగా ఉంటారని, ఇలాంటి కేసుల్లో పురోగతి సాధించాలన్నారు. అనంతరం రికార్డులను పరిశీలించి కార్యాలయ ఆవరణలో మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి, డివిజన్ పరిధిలోని సీఐలు కె.శివశంకర్, చరమందరాజు, రామకృష్ణారెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐ అంజిరెడ్డి, ఎస్ఐలు నవీన్, మోహన్, స్టోర్ ఆర్ఎస్ఐ అఖిల్, సిబ్బంది అంజన్రెడ్డి, శేఖర్రెడ్డి, సీసీ సందీప్ తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ స్టేషన్ తనిఖీ పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా సిబ్బంది తగు చర్యలు చేపట్టాలని ఎస్పీ సూచించారు. డ్రంకెన్ డ్రైవ్, ఎన్ఫోర్స్మెంట్ రిజిస్టర్లను పరిశీలించారు. ‘ఆపరేషన్ రోప్’ కార్యక్రమాన్ని సమర్థవంతంగా చేపట్టాలని ఆదేశించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై, మైనర్ల డ్రైవింగ్పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు.ఫ ఎస్పీ నరసింహ -
సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి
భానుపురి (సూర్యాపేట): ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చొరవ చూపి, తమను చర్చలకు ఆహ్వానించాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్య వేదిక (టీజీఈజేఏసీ) జిల్లా సెక్రటరీ జనరల్ భూపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండో పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న ఆరు డీఏలను ప్రభుత్వం తక్షణమే మంజూరు చేయాలని కోరారు. అలాగే సీపీఎస్ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు హెల్త్ కార్డులను సక్రమంగా వర్తింపజేయడంతో పాటు ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేసి జీఓ 25ను సవరించాలని ప్రభుత్వాన్ని కోరారు. సెప్టెంబర్ 10వ తేదీన ఇందిరాపార్క్ వద్ద జరగనున్న మహాధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అడిషనల్ సెక్రటరీ జనరల్ తంగెళ్ల జితేందర్ రెడ్డి, రాధాకృష్ణ, కో చైర్మన్లు ఎన్.సోంబాబు, పి.వీరన్న, షేక్ ఉమర్, నిమ్మల శ్రీనివాస్, సీతారామయ్య, నాగేశ్వరరావు, మన్నెం యాదగిరి, పాండు నాయక్, నాగేందర్, లక్కపాక ప్రవీణ్కుమార్, ఎస్.రవికుమార్, ఆకాష్ వర్మ, సైదులు, డి.బాలు నాయక్, బంధం వెంకటేశ్వర్లు, అనిత, పద్మావతి, పి.శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.ఫ సీపీఎస్ రద్దుచేసి ఓపీఎస్ పునరుద్ధరించాలి ఫ కలెక్టరేట్ ఎదుట టీజీఈజేఏసీ ధర్నా -
మెడికోలకు ప్రత్యేక ప్రయాణం
సూర్యాపేట టౌన్ : గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వెళ్లే మెడికల్ కళాశాల విద్యార్థులకు ప్రత్యేక బస్సు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఫ్యామిలీ అడాప్షన్ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లోని కుటుంబాలను దత్తత తీసుకున్న మొదటి సంవత్సరం వైద్య విద్యార్థులు ప్రతినెలా ఆయా గ్రామాలకు వెళ్లేందుకు కలెక్టర్ ప్రత్యేక నిధులతో ఈ బస్సును ఏర్పాటు చేశారు. 51 మంది ప్రయాణించే సామర్థ్యం ఉన్న ఈ బస్సును ఇటీవల మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రారంభించారు. ఒక్కో విద్యార్థికి మూడు నుంచి ఐదు కుటుంబాలు.. నేషనల్ మెడికల్ కమిషన్ సూచనల మేరకు ‘ఫ్యామిలీ అడాప్షన్’ కార్యక్రమాన్ని గత సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ప్రతి వైద్య విద్యార్థి మూడు నుంచి ఐదు కుటుంబాలను దత్తత తీసుకుని, ఆయా కుటుంబాల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాల్సి ఉంటుంది. గత విద్యాసంవత్సరంలో విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో గ్రామాలకు వెళ్లి ఎంపిక చేసుకున్న కుటుంబాలను సందర్శించారు. విద్యార్థులకు అవగాహన కోసం.. కుటుంబాలను సందర్శించే సమయంలో విద్యార్థులు ఆయా కుటుంబాల్లోని అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులు, జీవనశైలి, ఆహార అలవాట్లు తదితర అంశాలను తెలుసుకుంటారు. వ్యాధులు ఎందుకు వస్తున్నాయి.. వాటిని ఎలా నివారించాలి.. చికిత్స ఎలా పొందాలి.. అనే అంశాలపై కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తారు. ఫ కుటుంబాలను దత్తత తీసుకున్న మెడికల్ విద్యార్థులకు బస్సు సౌకర్యం ఫ కలెక్టర్ ప్రత్యేక నిధులతో ఏర్పాటు ఫ ప్రతినెలా బ్యాచ్లవారీగా వెళ్లనున్న విద్యార్థులు -
చిన్న నిర్లక్ష్యం.. ఘోర ప్రమాదం!
కోదాడ రూరల్ : హైవే అథారిటీ, లారీ డ్రైవర్, పోలీసుల చిన్న నిర్లక్ష్యం కోదాడ మండల పరిధిలోని దోరకుంట వద్ద జరిగిన ఘోర ప్రమాదానికి కారణమైంది. హైదరాబాద్లోని జీడిమెట్ల నుంచి ఐరన్ స్తంభాల లోడ్తో విజయవాడ వైపు వెళ్తున్న లారీ కోదాడ దాటిన తర్వాత బుధవారం తెల్లవారుజామున 3.36 గంటల సమయంలో ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో బ్రేకులు ఫెయిల్ కావడంతో డివైడర్ను ఎక్కినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. లారీ సంగం డివైడర్పై, సగం రోడ్డుపై ఉండి నిలిచిపోయింది. 3.45 గంటలకు హైదరాబాద్ నుంచి విజయవాడవైపు వెళ్తున్న ఓ ట్రావెల్స్ బస్సు డ్రైవర్.. ఈ లారీ దగ్గరకు వచ్చి తృటిలో తప్పించడంతో బస్సుకు గీతలు పడ్డాయి. దీంతో ఆ బస్సులో ఉన్న ఇద్దరు డ్రైవర్లు లారీ డ్రైవర్తో గొడవకు దిగారు. బస్సు డ్యామేజీకి డబ్బులు చెల్లించాలని ఒక డ్రైవర్ అక్కడే ఉండిపోగా మరో డ్రైవర్ బస్సును తీసుకొని వెళ్లిపోయారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ఉంటే.. తెల్లవారుజామూన 3.36 గంటలకు లారీ డివైడర్ ఎక్కి నిలిచిపోతే.. బస్సు 4.45 గంటలకు ఆ లారీని ఢీకొట్టగా ఆరుగురు మృతిచెందారు. 15 మంది గాయపడ్డారు. లారీ డివైడర్ ఎక్కిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. కనీసం, తొలుత ఒక బస్సు వచ్చి స్వల్పంగా ఢీకొట్టిన వెంటనే గానీ ఇండికేటర్లు ఏర్పాటు చేసినా ఘోర ప్రమాదం తప్పేదని పేర్కొంటున్నారు. లారీ డివైడర్ ఎక్కిన గంట సమయం తర్వాత.. ఘోర ప్రమాదానికి గురైన బస్సు వచ్చి ఢీకొట్టింది. అంటే గంటకు పైగా అక్కడ రోడ్డుపై ప్రమాదకరంగా కంటైనర్ ఉందనే విషయాన్ని హైవే పెట్రోలింగ్ సిబ్బంది గానీ, పోలీసులు గానీ గుర్తించలేకపోయారు. ఆ సమయంలో ఆ రెండు శాఖల వారు ఎక్కడ ఉన్నారనేది ప్రశ్న. సంఘటన స్థలం పరిశీలన ప్రమాదానికి గురైన బస్సును, కారణమైన లారీని ప్రమాద స్థలం నుంచి కొద్దిదూరంలో రోడ్డు పక్కన ఫంక్షన్హాల్ వెంట పెట్టారు. రోడ్డు ప్రమాదం జరిగిన స్థలాన్ని గురువారం ఉమ్మడి నల్లగొండ జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ ఎన్.వాణి పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను స్థానిక పోలీసులు, రవాణాశాఖ, రెవెన్యూ, హైవే అథారిటీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. హైవే అథారిటీ అధికారులు 60 కిలో మీటర్లకు ఒక పెట్రోలింగ్ వాహనం నడిపితే ఎలా అన్ని ఆమె ప్రశ్నించారు. దీనిపై పూర్తి వివరాలను ఇవ్వాలని ఆయా శాఖ అధికారులను ఆదేశించారు. వారి వెంట ఆర్టీఓ పురుష్తోమరెడ్డి, ఆర్డీఓ సూర్యనారాయణ, డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి, ఎంవీఐ జిలానీ, హైవే అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఉన్నారు. నికలడగా క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి ప్రమాదంలో గాయడిన 15 మంది ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని కోదాడ రూరల్ పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన ఫ్రెష్ బస్సు డ్రైవర్ మల్లికార్జున్ హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఫ 3.36 గంటలకు లారీ డివైడర్ ఎక్కి నిలిచిపోయినట్లు గుర్తించిన అధికారులు ఫ 4.45 గంటలకు బస్సు వచ్చి లారీని ఢీకొట్టింది ఫ గంటకు పైగా లారీ హైవేపై నిలిచిపోయినా గుర్తించని పెట్రోలింగ్ సిబ్బంది ఫ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తే ప్రమాదం తప్పేదంటున్న స్థానికులు ఫ సంఘటన స్థలాన్ని పరిశీలించిన రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ -
అలైన్మెంట్ మార్చడం సరికాదు
సూర్యాపేట అర్బన్ : ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పని చేయాలని, నాయకుల స్వప్రయోజనాల కోసం అలైన్మెంట్ మార్చడం సరికాదని ఐద్వా రాష్ట్ర జనరల్ సెక్రటరీ మల్లు లక్ష్మి అన్నారు. బుల్లెట్ ట్రైన్ సాధన కోసం అఖిలపక్ష పోరాట కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలో నిర్వహిస్తున్న దీక్షలు గురువారం 14వ రోజుకు చేరుకున్నాయి. ఐద్వా ఆధ్వర్యంలో మహిళలతో కలిసి ఆమె ఈ దీక్షలో పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మొదటి అలైన్మెంట్ ప్రకారం జాతీయ రహదారి వెంట బుల్లెట్ ట్రైన్ను ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించే వరకు ఉద్యమం కొనసాగుతుంద న్నారు. 40 రోజులుగా సూర్యాపేట, నకిరేకల్, కోదాడ, చౌటుప్పల్ ప్రాంతాల్లో జరుగుతున్న బుల్లెట్ ట్రైన్ దారిమళ్లింపు వ్యతిరేక ఉద్యమాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ప్రజా ఉద్యమం తీవ్రరూపం దాలుస్తుందని హెచ్చరించారు. బుల్లెట్ ట్రైన్ను హైవే వెంటే ఏర్పాటు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జ్యోతి, వెంకటమ్మ, సైదమ్మ, రజిత, రమాదేవి, విజయలక్ష్మి, నాగమణి, కిజాబీ, లక్ష్మమ్మ, సుభద్ర, అమృతమ్మ, జానమ్మ పాల్గొన్నారు. -
ఆధారాలు చూపించి ఓటు హక్కు పొందాలి
సర్పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లాలో గ్రామసభలు నిర్వహించాం. నో మ్యాపింగ్, ఎనామలీ కేసులను గుర్తించి వారికి నోటీసులు అందించాం. తొలిరోజు 4 వేలమందికి పైగా నోటీసులు ఇచ్చాం. రెండు మూడు రోజుల్లోనే మిగతావారికి ఇస్తాం. ఈ నోటీసులు అందుకున్న వారంతా 12 రకాల ఎన్నికల సంఘం సూచించిన గుర్తింపు కార్డులను ఆధారంగా చూపించి తిరిగి ఓటు హక్కును పొందాలి. కొత్తగా నమోదు చేసుకునే వారు సైతం సంబంధిత ఫారాలతో దరఖాస్తులు అందించాలి. –తేజస్ నంద్లాల్ పవార్, కలెక్టర్ -
బుల్లెట్ రైలు వచ్చేంత వరకు ఉద్యమం
సూర్యాపేట : సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ వచ్చే వరకు ఉద్యమం కొనసాగుతుందని బుల్లెట్ ట్రైన్ సాధన సమితి నాయకులు పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని రైతుబజార్ వద్ద అంబేద్కర్ విగ్రహం ఎదుట నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలో దివ్యాంగుల ఐక్య సంఘాల నాయకులు పాల్గొన్నారు. దీక్షలను సమితి నాయకులు ప్రారంభించి మాట్లాడారు. జిల్లా కేంద్రం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో బుల్లెట్ ట్రైన్ మార్గాన్ని సూర్యాపేట మీదుగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దాంతో రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు వ్యాపార, పారిశ్రామిక, విద్యా రంగాల అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందన్నారు. దీక్షల్లో పాల్గొన్న వారికి బీసీ ఉద్యమ నాయకుడు వట్టె జానయ్య యాదవ్తో పాటు పలువురు నాయకులు మద్దతు తెలిపారు. దీక్షలో పాల్గొన్న వారిలో షేక్ నయీమ్. జహీర్ బాబా, కొరివి సైదులు, మిద్దె సైదులు, స్నేహలత, భిక్షపతి, మాధవ్రెడ్డి, జయకృష్ణ, యాదగిరి, సుశీల, సునీత, వీరమ్మ, రమేష్, ఏలె జానయ్య, రుక్సానా, కుర్రి నాగయ్య, వెంకట్రెడ్డి, రాంకుమార్, సంతోష, లింగయ్య, తదితరులు పాల్గొన్నారు. -
గమ్యం చేరకుండానే తెల్లారిన బతుకులు
ఫ కోదాడ మండలం దోరకుంట వద్ద డివైడర్పై ఆగిన లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఫ గాలిలో కలిసిన ఆరుగురి ప్రాణాలు ఫ రాఖీ పండుగ వేళ విషాదంకోదాడ: స్వగ్రామంలో రాఖీ పండుగను ఆనందంగా జరుపుకోవాలని అనుకున్న వారి ఆశలు.. జాతీయ రహదారిపైనే రక్తమోడాయి. కష్టపడి చదువుకుని, ఇప్పుడిప్పుడే సాఫ్ట్వేర్ కొలువుల్లో స్థిరపడుతూ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్న ఐరుగురితో పాటు మరో మహిళను.. ఒకరి నిర్లక్ష్యం బలితీసుకుంది. గమ్యం చేరడానికి మరో రెండు గంటల సమయం ఉందనగా, గాఢ నిద్రలో ఉన్న వారు అనంతలోకాలకు వెళ్లిపోయారు. పండుగ పూట ఆ ఇళ్లలో మిగిలిన కడుపుకోత ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేస్తోంది. బుధవారం తెల్లవారుజామున సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని దోరకుంట వద్ద విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రమాదానికి గురై ఆగి ఉన్న ట్రాలీ లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఆరుగురు మృత్యువాత పడగా 15మంది గాయాలపాలయ్యారు. మృతుల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెదిన యాసరపు చిన్ని, బొల్లిపోగు మేరిజ్యోష్నా, సురవరపు షకీన, చెన్నకేశవుల నాగేంద్రబాబు, పిడికిడి లక్ష్మీతేజ, కొండురు భావనవర్ష ఉన్నారు. -
సంతోషిమాత ఆలయంలో కలశ స్థాపన
సూర్యాపేట : జిల్లా కేంద్రంలోని సంతోషి మాత ఆలయంలో బుధవారం కలశ స్థాపన పూజలతో సంతోషిమాత జన్మదిన వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అర్చకుడు బట్టారం వంశీకృష్ణ ఆధ్వర్యంలో గణపతి పూజ పుణ్యాహవాచనం, మంటపారాధన, కంకణ ధారణ, దీక్ష వస్త్రధారణ నిర్వహించారు. అనంతరం రుద్రహోమం, లలిత హోమం చేపట్టారు. కార్యక్రమంలో దేవాలయ అధ్యక్షుడు బ్రాహ్మడ్లపల్లి మురళీధర్, ప్రధాన కార్యదర్శి పబ్బ ప్రకాష్, కోశాధికారి కొత్త మల్లికార్జున్, సహాయ అర్చకుడు అశోక్ మిశ్రా, భక్తులు పాల్గొన్నారు. లక్ష్మీనరసింహుని నిత్యకల్యాణంమఠంపల్లి : మట్టపల్లిలోని రాజ్యలక్ష్మీ, చెంచులక్ష్మీ సమేత లక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని బుధవారం అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. కల్యాణతంతులో భాగంగా స్వామి, అమ్మవార్లకు ఎదుర్కోళ్ల మహోత్సవం నిర్వహించారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ, తలంబ్రాలతో కల్యాణం జరిపించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ చలపతిరావు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. 12వ బెటాలియన్ కమాండెంట్గా రామకృష్ణరామగిరి(నల్లగొండ): నల్లగొండ మండల పరిధిలోని అన్నెపర్తిలో గల 12వ తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ బెటాలియన్ కమాండెంట్గా బి.రామకృష్ణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది సమన్వయంతో బాధ్యతలు నిర్వర్తిస్తూ బెటాలియన్కు పేరు ప్రఖ్యాతులు తేవాలన్నారు. -
ఉద్యోగ సంఘాల ఉద్యమ బాట
సూర్యాపేటటౌన్ : ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో ఉద్యోగ సంఘాలు పోరుబాట పట్టాలని నిర్ణయించాయి. ప్రతి ఆరు నెలలకు మంజూరు కావాల్సిన డీఏలు అందకపోవడం, వారికి రావాల్సిన బిల్లులు, జీపీఎఫ్ రుణాలు వంటివి సంవత్సరాలుగా పెండింగ్లో ఉండడంతో చాలా మంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సంఘాల నాయకులు చెబుతున్నారు. వాటి సాధనకు ఉద్యమించాలని అన్ని సంఘాల జేఏసీ నిర్ణయించిది. పీఆర్సీ, పెండింగ్ బిల్లులపై .. ప్రతి ఐదేళ్లకు ఒక సారి పే రివిజన్ కమిషన్(పీఆర్సీ) సిఫార్సుల ఆధారంగా ఉద్యోగుల వేతనాలను సవరించాల్సి ఉంటుంది. 2023 జూలైలో అమల్లోకి రావాల్సిన పీఆర్సీ ఇప్పటికీ అమలు కాలేదని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. దాంతో ఒక్కో ఉద్యోగి నెలకు సుమారు రూ.20 వేల వరకు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీఏలను ఎప్పటి కప్పుడు పెంచకుండా పెండింగ్లో ఉంచుతున్నారని, ఇప్పటి వరకు ఆరు డీఏలు పెండింగ్లో ఉన్నాయని, ఉద్యోగుల జీపీఎఫ్ రుణాలు, పార్ట్ ఫైనల్ బిల్లులు ఏడాది దాటినా మంజూ కావడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేడు మహా ధర్నా. సమస్యల పరిష్కారం కోసం ఇప్పటి వరకు అర్జీలు, వినతిపత్రాలు, నిరసనలు చేపట్టినా ప్రభుత్వం సానుకూలంగాా స్పందించడం లేదని, దాంతో 206 ఉద్యోగ సంఘాలతో ఏర్పడిన తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్లు ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం 10 గంటలకు సూర్యాపేట వద్ద మహా ధర్నా నిర్వహించనున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరై ధర్నాను విజయవంతం చేయాలని జేఏసీ పిలుపునిచ్చింది. ఫ వచ్చే నెల 30లోపు రెండో పీఆర్సీ నివేదకను తెప్పించుకుని వెంటనే అమలు చేయాలి. ఫ పెండింగ్లో ఉన్న ఆరు డీఏలను వెంటనే విడుదల చేయాలి. ఫ ఈహెచ్ఎస్ పథకాన్ని సక్రమంగా అమలు చేయాలి. ఫ పెండింగ్లో ఉన్న బిల్లుల క్లియరెన్స్ కోసం నెలకు రూ.రెండు వేల కోట్లు విడుదల చేయాలి. ఫ ఓపీఎస్ విధానాన్ని అమలు చేసి సీపీఎస్ను రద్దు చేయాలి. ఫ దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉంటున్న సమస్యలను పరిష్కరించాలి. నేడు కలెక్టరేట్ ఎదుట టీజీఈ జేఏసీ మహాధర్నాఫ పెండింగ్ బిల్లులు, పీఆర్సీపై తప్పని నిరీక్షణ ఫ డీఏలు, జీపీఎఫ్ రుణాలు, సరెండర్ లీవ్ బిల్లులకు కలగని మోక్షం -
డెత్ హైవే!
జాతీయ రహదారిపై ప్రమాదాలకు ప్రధాన కారణాలివే..అతివేగం.. అడ్డగోలుగా పార్కింగ్సాక్షి ప్రతినిధి, నల్లగొండ : హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి ప్రయాణికుల పాలిట మృత్యుమార్గంగా మారుతోంది. అతివేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం, రోడ్డు పక్కన ప్రమాదకరంగా భారీ వాహనాలు నిలిపివేయడం, వీటికి తోడు హైవే పెట్రోలింగ్ వ్యవస్థ పర్యవేక్షణ లోపాలు వెరసి నిత్యం ఏదో ఒకచోట ప్రమాదం జరుగుతూనే ఉంది. తాజాగా బుధవారం తెల్లవారుజామున కోదాడ మండలం దోరకుంట వద్ద జరిగిన ఘోర ప్రమాదం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది. ఉమ్మడి జిల్లా పరిధిలో ఏడాది కాలంలో.. ఈ ఏడాది కాలంలో ఉమ్మడి జిల్లా పరిధిలోని హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి పొడవునా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 200 మందికిపైగా మరణించారు. ఈ మూడు నెలల్లోనే 20 మందికిపైగా మృతిచెందారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూఫ్రాన్పేట నుంచి మొదలుకొని కోదాడ వరకు హైవేపై ప్రమాదాలు నిత్యకృత్యం అయ్యాయి. తూఫ్రాన్పేట, మల్కాపురం జంక్షన్, బొర్రోళ్లగూడెం స్టేజీ, కై తాపురం స్టేజీ, ధర్మోజిగూడెం స్టేజీ, దివీస్ పరిశ్రమ ముందు, పంతంగి గ్రామ స్టేజీ, ఆరెగూడెం క్రాస్రోడ్డు వరకు ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. అలాగే నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు, నార్కట్పల్లి మండలం ఏపీ లింగోటం, సూర్యాపేట జిల్లా దురాజ్పల్లి, ఖాసీంపేట, వల్లభాపురం, గుంజలూరు, మునగాల, కోదాడ ప్రాంతాల్లో తరచుగా ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. గతేడాది జూలై 26న చౌటుప్పల్ మండల పరిధిలోని కై తాపురం స్టేజీ వద్ద జరిగిన ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు పోలీసు అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఇష్టారీతిన పార్కింగ్తో సమస్యలు హైవే వెంట వాహనాలు ఇష్టానుసారంగా పార్కింగ్ చేస్తున్నారు. ఎలాంటి హెచ్చరికలు, సూచికలు ఏర్పాటు చేయకుండా నిలుపుతున్నారు. దీంతో రాత్రి సమయాల్లో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వెనుక నుంచి వచ్చే వాహనదారులు అయోమయానికి గురై ప్రమాదాల బారిన పడుతున్నారు. వాహనం ఆగిపోయినా, డ్రైవర్ విశ్రాంతి తీసుకుంటున్నా.. వెనుక నుంచి వచ్చే వాహనాలకు ముందస్తు హెచ్చరికలు, తగిన భద్రతా ఏర్పాట్లు ఉండాల్సి ఉంటుంది. ఇవి సక్రమంగా లేకపోతే చిన్నపాటి పొరపాటు కూడా ప్రాణాంతకంగా మారుతోంది. ఏటా వందల మంది మృత్యువాత హైదరాబాద్–విజయవాడ హైవేపై ఒక్క చౌటుప్పల్ప్పల్ మండల పరిధిలోని 28 కిలోమీటర్ల హైవే పరిధిలోనే గతేడాది 129మంది చనిపోయారు. ఈ ఏడాది 8 నెలల్లోనే 156 మంది మరణించారు. నార్కట్పల్లి మండలంలో 17 మంది, చిట్యాల మండలంలో ఏడుగురు మృతిచెందారు. మొత్తంగా చౌటుప్పల్ నుంచి కోదాడ వరకు హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో గతేడాది 200 మందికిపైగా, ఈ ఏడాది ఇప్పటివరకు మరో 200 మందికిపైగా మరణించారు. ఇతర జాతీయ, రాష్ట్ర రహదారుల్లోనూ పెద్ద మొత్తంలో మరణాలు సంభవించాయి. రహదారులపై డేంజర్ స్పాట్లు–జోన్ పేజీలోఫ ఎక్కడపడితే అక్కడ లారీల నిలుపుదల ఫ పట్టించుకోని హైవే పెట్రోలింగ్ ఫ గాల్లో కలుస్తున్న ప్రాణాలు ఫ గత ఏడాది కాలంలో 200 మందికిపైగా బలి ఫ ఈ ఎనిమిది నెలల్లోనే అంతకంటే ఎక్కువ మంది మృత్యువాత -
సూర్యాపేట రోడ్డు ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి
సాక్షి, హైదరాబాద్: సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజును ఆదేశించారు. బుధవారం ఉదయం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో కంటైనర్ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.మంత్రుల సంతాపంసూర్యాపేట బస్సు ప్రమాద ఘటనపై మంత్రులు దామోదర్ రాజనర్సింహ, ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కోరారు. మృతదేహాలకు త్వరగా పోస్టుమార్టం నిర్వహించాలని అధికారులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. పోస్టుమార్టం కోసం రెండు బృందాల ఏర్పాటు చేయాలని, మృతదేహాలను కుటుంబ సభ్యులకు త్వరగా అప్పగించాలని సూచించారు. కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా ప్రమాదంపై దిగ్భ్రాంతి తెలిపారు.ప్రభుత్వం ఆదుకోవాలిసూర్యాపేట రోడ్డు ప్రమాదంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందడం అత్యంత బాధాకరమని అన్నారు. కోదాడ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు ప్రభుత్వం తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. గాయపడిన వారు త్వరగా పూర్తిస్థాయిలో కోలుకోవాలని ఆకాంక్షించారు. ఊహించని ఈ ప్రమాదంలో ఆత్మీయులను కోల్పోయి శోకసంద్రంలో ఉన్న బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.చదవండి: బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదంఘటనా స్థలంలో కలెక్టర్కోదాడ మండలం ద్వారకుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పరిశీలించారు. ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య పరామర్శించారు. డ్రైవర్ మారిన మరుక్షణమే.. తాను డ్యూటీ మారిన తర్వాతనే ప్రమాదం జరిగిందని రెండో డ్రైవర్ మీడియాతో చెప్పారు. సూర్యాపేటలో తాను డ్రైవింగ్ను మరో డ్రైవర్కు అప్పగించి, పడుకున్నానని వెల్లడించారు. తర్వాత కొద్దిసేపటికే ప్రమాదం సంభవించిందని తెలిపారు. బస్సులో 42 మంది ఉన్నారని చెప్పారు.కొద్దిలో బతికిపోయావెనుక సీటులో కూర్చోవడం వల్ల ప్రమాదం నుంచి కొద్దిలో ప్రాణాలతో బయటపడ్డానని ఓ ప్రయాణికుడు తెలిపారు. రాఖీ పండుగ కోసం చెల్లెలు దగ్గరికి వెళుతుండగా ప్రమాదం బారిన పడ్డానని చెప్పారు. ఇనుప రాడ్ తన ముఖం వరకు వచ్చి ఆగడంతో బతికిపోయానని వెల్లడించారు. బస్సు సూర్యాపేటలో ఆగి.. మళ్లీ స్టార్ట్ అయిన 15 నిమిషాల్లోనే ఈ యాక్సిడెంట్ జరిగిందని తెలిపారు. -
సూర్యాపేట: ప్రాణాలు తీసిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం
సాక్షి, సూర్యాపేట: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఐరన్ లోడ్తో వెళ్తున్న కంటైనర్ లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 14 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని క్షతగాత్రులు చెబుతున్నారు.బుధవారం వేకువ జామున హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రెష్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు.. కోదాడ మండలం ద్వారకుంట శివారులో ఈ ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో డివైడర్ మధ్యలో ఐరన్ లోడ్ లారీ ఆగిపోయింది. అయితే వేగంగా వెళ్లిన బస్సు.. లారీ కంటైనర్ను ఢీ కొట్టింది. దీంతో ఐరన్ దిమ్మెలు బస్సులోకి దూసుకెళ్లాయి. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సాయంతో గాయపడిన వాళ్లను హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.అతివేగం.. ముందు ఆగిఉన్న లారీని బస్సు డ్రైవర్ గమనించకపోవడమే ప్రమాదానికి కారణమై ఉంటుందని ఎస్సీ నరసింహ తెలిపారు. డ్రైవర్ అందుబాటులో లేడని(పరారీ?).. ఉదయం 4గం. సమయంలో ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. మృతుల్లో.. చిన్ని, మేరీ, నాగేంద్రబాబులను గుర్తించినట్లు తెలిపారు. మిగతా మృతుల పేర్లు.. వివరాలు అందాల్సి ఉంది. ఈ ప్రమాదంతో హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో పోలీసులు రంగంలకి దిగి క్లియర్ చేశారు.టీ విరామం తర్వాత బస్సు ప్రారంభమైన గంటకు ప్రమాదం జరిగిందని.. బస్సు బలంగా ఢీ కొట్టాక ఐరన్ దిమ్మెలు వచ్చి పడ్డాయని క్షతగాత్రుడొకరు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని బాధితులు చెబుతున్నారు. ప్రమాదం తర్వాత 20 మందిని ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చినట్లు కోదాడ ఆస్పత్రి సూపరిండెంట్ తెలిపారు. వాళ్లలో ముగ్గురిని సూర్యాపేటకు తరలించినట్లు వెల్లడించారు. -
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
భానుపురి (సూర్యాపేట) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ట్రైకార్–గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ఉఫాది పొందాలని కల్లెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ కోరారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన వారు, ఇతర కోర్సులను మధ్యలో ఆపివేసిన వారు అర్హులని పేర్కొన్నారు. ఉచిత భోజన, వసతి సౌకర్యాలతో వివిధ కోర్సుల్లో 3 నుంచి 6 నెలల పాటు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించబడతాయని తెలిపారు. ఆసక్తి గల వారు ఈనెల 25 వరకు ప్రభుత్వ గిరిజన బాలుర కళాశాల వసతి గృహం కోదాడ(ఎ) (సెల్ : 9912739723), ప్రభుత్వ గిరిజన బాలుర కళాశాల వసతి గృహం సూర్యాపేట (సెల్:9505767833)లో తమ పేర్లు రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. 22ఏ జాబితా నుంచి భూములు తొలగించాలిభానుపురి (సూర్యాపేట) : 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న అర్హులైన రైతుల భూములను తొలగించి న్యాయం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతారెడ్డి కోరారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో డీఆర్ఓ ప్రేమ్రాజ్ను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూములపై హక్కులు ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్లు, క్రయవిక్రయాలు, ఇతర లావాదేవీలు జరగక జిల్లాలో వేలాది మంది రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రంగినేని రుక్మారావు, రాష్ట్ర టీచర్స్ సెల్ కన్వీనర్ తీకుళ్ల సాయిరెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు చలమల్ల నరసింహ, దోసకాయల పని నాయుడు, ఉపాధ్యక్షుడు బండపల్లి పాండురంగాచారి, బీజేవైఎం మోర్చా జిల్లా అధ్యక్షుడు గునుగంటి పృథ్వీగౌడ్, నాయకులు మన్మథరెడ్డి, బాలాజీ నాయక్, దాసరి వెంకన్న, రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణమ్మకు హారతిమఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు పవిత్ర కృష్ణానదికి పసుపు, కుంకుమ, గాజులు, చీరె సారెతో హారతి ఇచ్చారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. అనతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ చలపతిరావు, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు భక్తులు పాల్గొన్నారు. -
రూపారెడ్డి హత్యను ఖండిస్తూ ర్యాలీ
సూర్యాపేట : నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలోని నాగార్జున పాఠశాల ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్యను ఖండిస్తూ యునైటెడ్ ట్రస్మా, తెలంగాణ ప్రైవేట్ టీచర్ అండ్ లెక్చరర్స్ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తల్లిదండ్రుల తరువాతి స్థానం గురువదని, అలాంటి గురువును హత్య చేయడం దారుణమన్నారు. ఉపాధ్యాయులకు రక్షణకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ట్రస్మా ప్రతినిధులు హరి, ఆర్.ప్రకాష్రెడ్డి, ఉపేందర్రెడ్డి, శ్రీనివాసనాయుడు, భిక్షపతి, రమేష్, లింగారెడ్డి, అజయ్కుమార్, ఉపేందర్రావు, నరసింహారావు, సోమరాజు, బాలకృష్ణ, రాజశేఖర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
గంజాయిని కట్టడి చేద్దాం
సూర్యాపేటటౌన్ : గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం నిరంతరం కృషిచేస్తోంది. గంజాయి వినియోగం యువత, విద్యార్థుల భవిష్యత్పై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఈ అంశాన్ని అత్యంత సీరియస్గా తీసుకుంటున్నాం. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు జిల్లాలోనూ డ్రగ్స్ నియంత్రణ, గంజాయి అక్రమ రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపేందుకు ప్రత్యేక బృందాలతో నిరంతరం నిఘా కొనసాగిస్తున్నామని ఎస్పీ నరసింహ వెల్లడించారు. శుక్రవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించిన పలు విషయాలు ఆయన మాటల్లోనే.. అన్ని శాఖల సమన్వయంతో.. ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రాంతాల నుంచి జిల్లాలోకి గంజాయి రవాణా కాకుండా అంతర్రాష్ట్ర మార్గాల్లో తనిఖీలు పెంచడంతోపాటు అనుమానాస్పద వాహనాలు, వ్యక్తుల కదలికలను నిశితంగా పరిశీలిస్తూ నిఘా పెట్టాం. ఇతర శాఖలు, సంబంధిత ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ గంజాయి సరఫరా గొలుసును ఛేదించేలా చర్యలు చేపడుతున్నాం. ఈ ఏడాది 23 కేసులు నమోదు ఇటీవల కోదాడ, హుజూర్నగర్ ప్రాంతాల్లో భారీగా గంజాయి పట్టుబడిన ఘటనల్లో కేసులు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశాం. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు గంజాయికి సంబంధించి 23 కేసులు నమోదు చేసి, 40 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నాం, మొత్తం 91 మందిని అరెస్టు చేసి జైలు పంపించాం. అనుమానితులకు పరీక్షలు గంజాయి వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. అనుమానం ఉన్న వ్యక్తులను పోలీస్ స్టేషన్లకు పిలిపించి అవసరమైన సందర్భాల్లో యూరిన్, బ్లడ్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. వారు గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నారా లేదా అన్నది పరీక్షల ద్వారా నిర్ధారించుకుని తదనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. గంజాయి విక్రేతలపై మాత్రమే కాకుండా వినియోగదారులపైనా నిఘా కొనసాగుతుంది. ముఖ్యంగా యువత, విద్యార్థులు డ్రగ్స్కు దూరంగా ఉండేలా జిల్లాలో పోలీస్ భరోసా కార్యక్రమం ద్వారా విద్యాసంస్థల్లో విద్యార్థులకు గంజాయి, డ్రగ్స్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన, స్నేహితుల వర్గం, కదలికలపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నాం. టోల్ ఫ్రీ నంబర్ 1933 స్పెషల్ బ్రాంచ్ కంట్రోల్ రూమ్ 8712686026ఫ సరఫరా, వినియోగంపై ప్రత్యేక నిఘా ఫ అనుమానితులకు డ్రగ్ పరీక్షలు ఫ ఈ ఏడాదిలో 40 కిలోల గంజాయి స్వాధీనం ఫ 23 కేసులు..91 మంది అరెస్ట్ ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఎస్పీ నరసింహ గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగానికి సంబంధించి సమాచారం తెలిసిన ప్రజలు వెంటనే పోలీసులకు తెలియపర్చాలి. తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. జిల్లాలో గంజాయి, డ్రగ్స్ ఆనవాళ్లు లేకుండా చేయడమే పోలీసుల లక్ష్యం. గంజాయి, డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతిఒక్కరూ తమ సహకారం అందించాలి. -
ఆటో కార్మికులను ప్రభుత్వమే ఆదుకోవాలి
సూర్యాపేట : ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేసి వారిని ఆదుకోవాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ నెల 24న నిర్వహించనున్న ఆటో కార్మికుల బంద్కు సంబంధించిన పోస్టర్ను శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఆర్టీసీ యాజమాన్యా నికి ఈ–ఆటోలను అందించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలన్నారు. ఆటో రవాణా రంగ కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఆటో మీటర్ చార్జీలను పెంచాలని కోరారు. అక్రమంగా యాప్ల ద్వారా నడుస్తున్న ద్విచక్ర వాహనాలను నియంత్రించి ఆటో కార్మికులకు న్యాయం చేయాలన్నారు. ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ.12 వేల ఆర్థిక సహాయం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, డిఆర్టియు యూనియన్ అధ్యక్షులు సైదులు, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ అహ్మద్, పట్టణ అధ్యక్షుడు ఖుషి వెంకన్న, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకన్న, మట్టయ్య, నరేష్, సొందు, వేణు, రాజు, వెంకన్న, మాంగళ్య వెంకన్న, అనాసపురం యూసుఫ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.ఫ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి -
కొందరికే యూనిఫాం
సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత యూనిఫాం పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేదు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తోంది. జిల్లాలో సగం మందికే యూనిఫాం అందగా మిగతా సగం మంది విద్యార్థులు యూనిఫాం కోసం ఎదురుచూస్తున్నారు. సగం మందికిపైగా అందలే.. జిల్లాలో మొత్తం 950 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వీటిల్లో ఈ ఏడాది 50వేల మంది విద్యార్థులు నమోదయ్యారు. ఇందులో ఇప్పటి వరకు సుమారు 21 వేల మంది విద్యార్థులకు మాత్రమే యూనిఫాం అందింది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్లు అందించాల్సి ఉంది. ఇందుకోసం సంబంధిత అధికారులు మహిళా సంఘాలకు యూనిఫామ్ల కుట్టే బాధ్యతలు అప్పగించారు. వస్త్రాల సరఫరా, కొలతలు తీసుకోవడం, కుట్టించడం, పంపిణీ లో జాప్యం జరిగింది. దీంతో ఇప్పటికీ మిగిలిన సగానికిపైగా విద్యార్థులకు యూనిఫాం అందలేదు. కొలతల్లో హెచ్చుతగ్గులు యూనిఫామ్ల కొలతలు తీసుకునే సమయంలోనూ పలుచోట్ల సమస్యలు ఎదురవుతున్నాయి. విద్యార్థుల వయసు, శరీరాకృతికి అనుగుణంగా సరైన కొలతలు తీసుకోకపోవడంతో కొందరికి దుస్తులు బిగుతుగా, మరికొందరికి వదులుగా వస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సరైన కొలతలు లేకుండా కుట్టించిన యూనిఫాంను తిరిగి సరిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో విద్యార్థులకు యూనిఫాంలు అందించే ప్రక్రియ మరింత ఆలస్యమవుతోంది. పాఠశాలలకు వెళ్తున్నా.. యూనిఫాం లేదు విద్యార్థులందరికీ ఒకే విధమైన యూనిఫాం ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులందరికీ ఒకేసారి యూనిఫాం అందకపోవడంతో పాఠశాలల్లో అసమాన పరిస్థితి కనిపిస్తోంది. యూనిఫాం అందిన విద్యార్థులు కొత్త దుస్తులతో వస్తుండగా, అందని విద్యార్థులు సాధారణ దుస్తులతోనే పాఠశాలలకు హాజరవుతున్నారు. ఫ మఠంపల్లి మండలంలో 32 ప్రభుత్వ పాఠశాలల్లో 2,596 మంది విద్యార్థులున్నారు. 23 పాఠశాలలకు చెందిన 1,210 మంది విద్యార్థులకే యూనిఫాం అందింది. తొమ్మిది పాఠశాలలకు చెందిన 1,386 మంది విద్యార్థులకు యూనిఫాం అందజేయాల్సి ఉంది ఫ పెన్పహాడ్ మండల కేంద్రంలోని సీతారాంపురం ప్రాథమిక పాఠశాలలో యూనిఫాం కొలతలు తేడాతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మండలంలోని హైస్కూల్ విద్యార్థులకు యూనిఫాం అందలేదు. ఫ ఆత్మకూర్(ఎస్) మండలంలో 2,694 మంది విద్యార్థులకు గాను 1,450 మందికే ఒక్కో జత యూనిఫాం అందింది. ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆ ఒక్క జత కూడా అందలేదు. అందిన దుస్తులు సైతం నాణ్యత లేకుండా ఉన్నాయని విద్యార్థులు తల్లిదండ్రులు అంటున్నారు. ఫ హుజూర్నగర్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు ఇంతవరకు యూనిఫాం అందజేయలేదు. ఫ గరిడేపల్లి మండలంలో మొత్తం 49 పాఠశాలలు ఉండగా కొందరికే యూనిఫాం ఇచ్చారు. ఇంకా 4,120 మంది విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ చేయాల్సి ఉంది. ఫ ఇప్పటి వరకు 21 వేల మంది విద్యార్థులకు పంపిణీ ఫ ఈ ఏడాది అన్ని స్కూళ్లలో 50 వేల మంది నమోదు ఫ మిగతా వారికి తప్పని ఎదురుచూపులు ఫ యూనిఫాం ఇచ్చిన చోట కొలతల్లో హెచ్చుతగ్గులతో ఇబ్బందులు -
బుల్లెట్ ట్రైన్ను సాధించి తీరుతాం
సూర్యాపేట : సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ వచ్చేంత వరకు తమ పోరాటం ఆగదని మున్సిపల్ మాజీ చైర్మన్ జుట్టు కొండ సత్యనారాయణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద బుల్లెట్ ట్రైన్ సాధన అఖిలపక్ష కమిటీ చేపట్టిన రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపి మాట్లాడారు. సూర్యాపేటకు రైలుమార్గం సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ దీక్షలో పాల్గొన్న తెలంగాణ ఆడబిడ్డల వేదిక నాయకురాలు వెలుగు వనిత ఆధ్వర్యంలో మహిళలు దీక్షలో కూర్చున్నారు. ఈ దీక్షకు ప్రైవేట్ విద్యా సంస్థల సంఘం ఆధ్వర్యంలో 40 మంది విద్యా సంస్థల యజమానులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ జనరల్ సెక్రెటరీ పెద్దిరెడ్డి కళ్యాణ్ చక్రవర్తి, కార్యదర్శి నేరెళ్ల మధు, సీపీఎం నేత మట్టిపల్లిసైదులు, మైబు, షామియా సుగుణ శాంత మలాంబ, పద్మ, సహేనా తదితరులు పాల్గొన్నారు. -
400 ధాన్యం బుక్కారు!
కోట్ల కోదాడ : రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన కష్టమ్ మిల్లింగ్ ధాన్యాన్ని జిల్లాలో పలువురు రైస్ మిల్లర్లు భారీగా పక్కదారి పట్టించారు. కొద్దిరోజులుగా జిల్లా వ్యాప్తంగా విజిలెన్స్ అధికారులు జరుపుతున్న దాడుల్లో మిల్లర్ల అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా కేవలం 15 మిల్లుల్లో అధికారులు తనిఖీలు చేయగా సీఎంఆర్ ధాన్యంలో భారీ తేడాలు ఉన్నట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈ 15 మిల్లుల వద్ద 1,81,667 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు ఉండాల్సి ఉండగా కేవలం 72,171 మెట్రిక్ టన్నులఽ ధాన్యమే ఉంది. 1,29,292 మెట్రిక్ టన్నులు మాయం చేశారు. దీని విలువ రూ.400 కోట్లుగా అధికారులు తేల్చారు. ఇంకా జిల్లా వ్యాప్తంగా సీఎంఆర్ ధాన్యం కేటాయించిన అన్ని మిల్లుల్లో తనిఖీలు చేస్తే ఈ కుంభకోణం మరో రూ.400 కోట్ల వరకు విస్తరించే అవకాశం ఉందని, మొత్తంగా దాదాపు రూ.800 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టి ఉండొచ్చని అధికారుల అంచనా. కోర్టుకు వెళ్లారని..ప్రభుత్వం నుంచి సీఎంఆర్ ధాన్యం తీసుకుంటున్న సమయంలోనే ముందస్తుగా మిల్లర్లు పక్కా ప్రణాళికతో ఈ ధాన్యం మాయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ధాన్యం మిల్లులకు తరలించిన తరువాత ధాన్యం దిగుమతి చేసుకున్న మిల్లర్లు కొద్దిరోజుల వ్యవధిలోనే తమకు కేటాయించిన ధాన్యం నాణ్యత లేదని... దీన్ని వెనక్కి తీసుకోవాలని అధికారులకు వినతిపత్రాలు ఇచ్చి వారి నుంచి రిసీవ్డ్ కాపీ తీసుకుంటున్నారు. అధికారులు దీనిపై విచారణ చేయకుండా మిల్లర్లకు లోపాయికారీగా సహకరిస్తూ ఆ విషయాన్ని పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. సీఎంఆర్ బియ్యం ఇవ్వమని సదరు మిల్లర్లను అధికారులు అడిగినప్పుడు.. గతంలో తమకు నాణ్యత లేని ధాన్యం ఇచ్చారని.. దీనిపై తాము ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పి కోర్టులను ఆశ్రయించి స్టే తెచ్చుకుంటున్నారు. సంవత్సరాల కొద్ది దీన్ని పొడిగించుకుంటూ దందా కొనసాగిస్తున్నారు. ఒకవేళ అధికారులు మిల్లులకు ధాన్యం కేటాయించడం ఆపివేస్తే ఇతర ప్రాంతాల్లో మిల్లులను లీజుకు తీసుకొని బినామీల పేరుతో అక్కడ తిరిగి తమ దందా కొనసాగిస్తున్నారు. అధికారులు, మిల్లర్లు కలిసి ముందస్తు ప్రణాళికతో ఈ దందా చేస్తున్నారని పలువురు మిల్లర్లే అంటున్నారు. ఈ వ్యవహారంలో సివిల్ సప్లయ్ అధికారుల పాత్రపై కూడా ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేయాలని వారు అంటున్నారు. నిద్రావస్థలో జిల్లా యంత్రాంగం సీఎంఆర్ ధాన్యం మిల్లులకు కేటాయించిన తరువాత వారు బియ్యం ఇచ్చేవరకు తరచూ తనిఖీలు చేయాల్సిన స్థానిక సివిల్ సప్లయ్ అధికారులు మిల్లర్లతో కుమ్మక్కవుతున్నారు. వేల టన్నుల ధాన్యం బయటకు తరలిస్తున్నా వారు పట్టించుకోవడం లేదు. జిల్లా నుంచి విజిలెన్స్ అధికారులు వచ్చి దాడులు చేసే వరకు అక్రమాలు బయటకుయ రాకుండా కాపాడుతున్నారని పలువురు అంటున్నారు. అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. 15 మిల్లుల్లో లెక్క తేల్చిన విజిలెన్స్ అధికారులు ఫ సీఎంఆర్ ధాన్యంలో భారీ తేడాలు ఫ మిగతా మిల్లుల్లో మరో రూ.400 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టినట్లు అనుమానాలు ఇది కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండ వద్ద ఉన్న ఓ పారబాయిల్డ్ రైస్ మిల్లు. ఈ మిల్లు యజమాని సీఎంఆర్ ఇవ్వకుండా ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం పక్కదారి పట్టించాడు. ప్రభుత్వానికి రూ.34 కోట్ల మేర బాకీ పడ్డాడు. ప్రభుత్వం ఈ మిల్లుకు ధాన్యం కేటాయించకుండా మిల్లు యజమానిపై కేసులు పెట్టింది. ఇది జరిగి నాలుగేళ్లవుతున్నా నేటి వరకు ఈ మిల్లర్పై చర్యలు తీసుకోలేదు. ఒక్క రూపాయి వసూలు చేయలేదు. అధికారులను విషయమై అడిగితే మిల్లర్ కోర్టుకు వెళ్లారని తాపీగా సమాధానం ఇస్తున్నారు. ఇలా కోట్ల రూపాయల ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన మిల్లర్లతో అధికారులు కుమ్మకై ్క కోర్టుల బూచి చూపుతూ పరోక్షంగా మిల్లర్లకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. -
‘సర్’ విజయవంతానికి కృషి చేయాలి
హుజూర్నగర్ : బీజేపీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ఓటరు జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్)–2 ప్రక్రియ విజయవంతానికి కృషి చేయాలని బీజేపీ ఎన్ఆర్ఐ సెల్ రాష్ట్ర కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి అన్నారు. గురువారం హుజూర్నగర్లో బీజేపీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్–2పై నిర్వహించిన నియోజక వర్గ స్థాయి కార్యశాలలో వారు మాట్లాడారు. ఎస్ఐఆర్ రెండవ భాగం ప్రారంభమైనందున బీఎల్ఏలు, పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం బీజేపీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యశాలలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొండా హరీష్ గౌడ్, అసెంబ్లీ బీఎల్ఏ తాళ్ల నరేందర్రెడ్డి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు భూక్య సీత, రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు ఉమామహేశ్వరరావు, కుందూరు కోటిరెడ్డి, ఎం.లక్ష్మీనారాయణ, బి.వెంకట శివ, జి.వీరబాబు, కె.వెంకటేశ్వర్లు, కె.నాగిరెడ్డి, నరీ నాయక్, ఎ.భిక్షమయ్య, బి.నరేష్, ఎస్.ప్రదీప్, కె.లక్ష్మీనారాయణ, పి.చంద్రయ్య, గోపి, రామారావు, నాగరాజు, విజయ్, సోమయ్య, శ్రీనివాస్, వివిధ మోర్చాల ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. -
బుల్లెట్ ట్రైన్ సాధించేవరకూ పోరాటం
సూర్యాపేట : బుల్లెట్ ట్రైన్, రైల్వే కారిడార్ సాధించే వరకూ పోరాటం ఆగదని రైతు కూలి సంఘం జిల్లా నాయకుడు బోడ బాలస్వామి అన్నారు. బుల్లెట్ ట్రైన్ సాధన అఖిలపక్ష పోరాట సమితి కొనసాగిస్తున్న దీక్షలో గురువారం ఏడవ రోజు రైతు కూలి సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుల్లెట్ ట్రైన్ దారి మళ్లింపు చర్యను ఖండిస్తున్నామన్నారు. మొదటి అలైన్మెంట్నే కొనసాగేలా ప్రతిపాదనలు పంపాలన్నారు. ఈ దీక్షలో రైతు కూలి సంఘం నాయకులు బయ్య రామచంద్రు, బెల్లి నాగరాజు, కుంచం వెంకన్న, బయ్య సతీష్ కోడి బాబు, ఇరుగు వెంకటేశ్, బయ్య లింగయ్య, గుర్వయ్య, గంగయ్య, సత్తుపల్లి రాములు, ఇరుగు నాగయ్య, వెంకన్న రమేష్, కష్ణయ్య శ్రీనివాస్ రెడ్డి పుల్లారెడ్డి, కొమురయ్య సత్తయ్య పన్నీరు వాసుదేవరావు, పాల్గొన్నారు. దీక్షకు అఖిలపక్ష నేతలు, ఉపాధి కోసం వచ్చి పట్టణంలో స్థిరపడ్డ పంజాబ్ యువకులు సంఘీభావం తెలిపారు. -
కాంగ్రెస్తోనే విప్లవాత్మక మార్పులు
భానుపురి(సూర్యాపేట) : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పాలనతోనే ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో లబ్ధిదారులకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రేషన్ కార్డులు అందక అర్హులైన ఎందరో పేదలు ఇబ్బంది పడ్డారన్నారు. తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి పౌరసరఫరాల శాఖను ప్రజల చెంతకు చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా తెల్ల రేషన్ కార్డుదారులందరికీ ఉచితంగా నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేసే చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.06 కోట్ల కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ఆహార భద్రత కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ఎస్పీ నరసింహ, పేరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. పంటల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించాలి హుజూర్నగర్ : ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు పంటల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి సూచించారు. గురువారం హుజూర్నగర్లోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసి మాట్లాడారు. ఎల్నినో ప్రభావంతో నాగార్జున సాగర్ నిండలేదని, రాష్ట్రంలో 31 శాతం వర్షాలు తక్కువగా పడి తీవ్ర వర్షాభావం కొనసాగుతోందన్నారు. ఈ నేపథ్యలో రైతులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ పంటలు వేసుకోవాలన్నారు. హుజూర్నగర్లోని మోడల్ కాలనీని సెప్టెంబర్లో ప్రారంభించి లబ్ధిదారులకు ఇళ్ల కేటాయిస్తామన్నారు. అనంతరం ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న ఆధ్వర్యంలో మంత్రి ఉత్తమ్ను గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్, కొణతం వెంకటరెడ్డి, వైస్ చైర్మన్ తన్నీరు మల్లిఖార్జున్, రాష్ట్ర పెరక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు, ఏఎంసీ చైర్పర్సన్ డి.రాధిక, ఏఎంసీ మాజీ చైర్మన్లు సాముల శివారెడ్డి, యరగాని నాగన్న గౌడ్, ఆర్డీఓ శ్రీనివాసులు, కౌన్సిలర్ కోతి సంపత్రెడ్డి, ఈడ్పుగంటి సుబ్బారావు, రామరాజు, గురవయ్య, ముక్కంటి, నాగేందర్, అమర్నాధ్రెడ్డి, అజీజ్ పాషా తదితరులు పాల్గొన్నారు. పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
కేంద్ర ప్రభుత్వానికి బీ టీమ్గా ఎలక్షన్ కమిషన్
భానుపురి (సూర్యాపేట) : కేంద్ర ప్రభుత్వానికి బీ టీమ్గా ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తూ ఓట్లను తొలగించే కుట్రలకు పాల్పడుతోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. గురువారం సూర్యాపేటలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సర్ రెండో దశ కార్యక్రమంపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఎల్ఏలు, కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉంటూ ప్రతి ఓటును కాపాడుకోవాలన్నారు. ఓటరు జాబితాలో పేర్లలో అక్షర దోషాలు, వ్యత్యాసాలు ఉంటే ఫామ్ 8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన నూతన ఓటర్లు కూడా ఫామ్ సిక్స్ ద్వారా తమ ఓటు నమోదు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట నియోజకవర్గ సమన్వయకర్త కుసుబా శ్రీనివాస్, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్రెడ్డి, టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, పీసీసీ ప్రధాన కార్యదర్శి, సర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ చకిలం రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ -
విద్యార్థుల జీవితాలతో ఆటలొద్దు
సూర్యాపేటటౌన్ : పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి విభాగంలో విలీనం చేసి విద్యార్థుల జీవితాలతో ఆటలాడొద్దని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు దనియాకుల శ్రీకాంత్వర్మ అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మహిళా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. పాలిటెక్నిక్ డిప్లమా కోర్సులను ఇతర శిక్షణ కోర్సులతో అనుసంధానం చేయడం సరికాదన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు ఆకారపు సాయి, నవీన్, మహేష్, గోపికృష్ణ, రిషిత ఇరుగు ఇందు,స్నేహ, అమత వర్షిణి, నవీన,శ్రీవాణి, హాసిని, గాయత్రి, లహరి పాల్గొన్నారు. -
అవును.. దొంగలనే దోచుకునా్నరు!
కోదాడ : దొంగలను పట్టుకుని వారికి శిక్షలు పడేలా చూడాల్సిన పోలీసులే వారిని కేసుల నుంచి తప్పించడానికి లంచం పుచ్చుకున్నారనే ఆరోపణలు కోదాడ డివిజన్ పరిధిలో వెల్లువెత్తుతున్నాయి. రైతుల పశువులను రాత్రి సమయాల్లో దొంగతనం చేసి ఇతర ప్రాంతాల్లో అమ్ముతున్న దొంగలను నాలుగు నెలల క్రితం చిలుకూరు, అనంతగిరి పోలీసులు పట్టుకున్నారు. శిక్ష పడకుండా కాపాడుతానని, పోలీసులకు డబ్బులు ఇవ్వాలని అధికార పార్టీ నాయకుడు ఓ బాధితుడి నుంచి డబ్బులు వసూలు చేశాడనే ఆరోపణలు న్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించిన ఆడియో గురువారం కోదాడలోని వివిధ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండడం చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగిందంటే..కోదాడ మున్సిపల్ పరిధిలోని శ్రీరంగాపురంలో నివాసం ఉండే కొందరు చిలుకూరు, అనంతగిరి మండలాల పరిధిలో రాత్రి సమయంలో ఆరుబయట ఉండే గేదెలను వాహనంలో ఎక్కించుకొని ఇతర ప్రాంతాల్లోని సంతల్లో అమ్ముతున్నారని ఫిర్యాదులు రావడంతో పోలీసులు నిఘా పెట్టారు. కోదాడ డివిజన్లోని రెండు పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీసులు ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. గేదెలను అప్పటికే అమ్మివేయడంతో రికవరీగా సదరు నిందితుడి నుంచి సుమారు రూ.3 లక్షల వరకు కోర్టులో డిపాజిట్ చేయించినట్లు సమాచారం. ఇదే సమయంలో రంగ ప్రవేశం చేసిన కోదాడ పట్టణ పరిధిలోని లక్ష్మీపురానికి చెందిన అధికార పార్టీ నాయకుడు పోలీసులతో మాట్లాడి శిక్ష పడకుండా చూస్తానని చెప్పి తమ వద్ద దశల వారీగా రూ.18 లక్షలు తీసుకున్నాడని ప్రధాన నిందితుడు ఆరోపిస్తున్నాడు. ఈ నెల 6న అనంతగిరి పోలీసులు తనను అరెస్ట్ చేసి జైలుకు పంపారని ప్రధాన నిందితుడు తెలిపాడు. మధ్యవర్తిని డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా తాను పోలీసులకు డబ్బులు ఇచ్చానని, మళ్లీ అడిగితే కేసులు పెట్టిస్తానని సదరు నాయకుడు తమను బెదిరిస్తున్నాడని బాధితుడితో పాటు అతని తల్లి ఆరోపిస్తున్నారు. ఈ మేరకు గురువారం వారు పట్టణ పోలీసులను ఆశ్రయించడంతో వారు తమ ఫిర్యాదును తీసుకోలేదని, తాము ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.రెండు స్టేషన్ల పరిధిలో రూ.లక్షలు లంచంగా వసూలు దొంగలకు పోలీసులకు మధ్యవర్తులుగా రాజకీయ నాయకులు డబ్బులు తీసుకొని రిమాండ్ చేయడంతో అడ్డం తిరిగిన నేరస్తులు కోదాడలో చర్చనీయాంశంగా మారిన ఆడియో ఫిర్యాదు స్వీకరణకు పట్టణ పోలీసుల నిరాకరణ -
సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి
గరిడేపల్లి : సీజనల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ పెండెం వెంకటరమణ సూచించారు. గరిడేపల్లి మండలం కల్మల్చెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆయన తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. పలు వివరాలు తెలుసుకున్నా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమల వ్యాప్తి పెరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, మలేరియా, డెంగీ వంటి వ్యాధుల నివారణకు ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డాక్టర్ అఖిల్ కిషోర్, హెచ్ఈఓ సురేంద్ర, పీహెచ్ఎస్ జయమ్మ, నర్సింగ్ ఆఫీసర్లు జానకి, కళ్యాణి, ఏఎన్ఎంలు సుజాత, రాంబాయి, సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలితుంగతుర్తి : విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగేలా నాణ్యమైన విద్యనందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని తెలంగాణ గురుకుల పాఠశాలల కార్యదర్శి ఉషారాణి అన్నారు. గురువారం తుంగతుర్తిలోని తెలంగాణ గురుకులాన్ని తనిఖీ చేశారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించి సమాజంలో ఎలా ఉండాలో లక్ష సాధనకు ఎలా ముందుకు వెళ్లాలో వివరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గురుకులంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఆమె వెంట డిప్యూటీ కార్యదర్శి వేణుగోపాల్రెడ్డి, ప్రిన్సిపాల్ సతీష్ ఉన్నారు. సీపీఎస్ విధానం రద్దుచేయాలినేరేడుచర్ల : సీపీఎస్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించి టీచర్ల సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకుడు డిమాండ్ చేశారు. గురువారం నేరేడుచర్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో భాగంగా ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ఆరు డీఏలను తక్షణమే విడుదల చేయడంతోపాటు 2వ పీఆర్సీని అమలు చేయాలన్నారు. సెప్టెంబర్ 10న హైదరాబాద్లో చేపట్టే మహా ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో వివిధ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతలు, పాఠశాల హెచ్ఎం బట్టు మధు, ఉపాధ్యాయులు శ్రీనయ్య, నరసింహారావు, వెంకటేశ్వర్రావు, వెంకటేశ్వర్లు, సైదులు, వెంకట్రెడ్డి, సత్యనారాయణరెడ్డి, వెంకన్న, అక్కయ్య బాబు పాల్గొన్నారు. -
రాజీవ్గాంధీ సేవలు చిరస్మరణీయం
● డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్యసూర్యాపేట అర్బన్ : దేశంలో సాంకేతిక విప్లవం తీసుకొచ్చిన మాజీ ప్రధాని, దివంగత నేత రాజీవ్ గాంధీ స్ఫూర్తితో దేశ సమగ్రతను కాపాడుకునేందుకు ముందుకెళ్దామని డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, మున్సిపల్ వైస్ చైర్మన్ యండి. షఫీ ఉల్లా అన్నారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సూర్యాపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెలుగు వెంకన్న, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్ ఆధ్వర్యంలో జమ్మిగడ్డలో రాజీవ్ విగ్రహనికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు. దేశానికి రాజీవ్గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ప్రతిఒక్కరూ రాజీవ్ గాంధీ ఆశయాల సాధనకు కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు నాగుల వాసు, చిలుముల సునీల్ రెడ్డి, తన్వీర్ హుసేన్, ఎస్కె.జహీర్, ఎలిమినేటి అభినయ్, వీరన్న నాయక్, పారూక్, పోలగాని బాలు గౌడ్, కమ్మరికుంట్ల లింగయ్య, కోడి శివ, బండారు వెంకన్న, గడ్డం వెంకన్న, సాజిద్, అక్కినపల్లి జానయ్య, రుద్రంగి రవి, కరుణాకర్రెడ్డి, పడిదల రవి తదితరులు పాల్గొన్నారు. -
30 వేల ఎకరాల్లోనే ఆరుతడి
ఆదాయం రూ.3.52 కోట్లు యాదగిరిగుట్ట ఆలయ హుండీలు లెక్కించగా రూ.3.52కోట్ల ఆదాయం వచ్చినట్లు ఈఓ వెల్లడించారు.- 8లోభానుపురి (సూర్యాపేట) : ఎల్నినో పరిస్థితుల కారణంగా జిల్లా రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. కానీ సీజన్ ముగుస్తున్నా ఇప్పటివరకు రైతులు కేవలం 30 వేల ఎకరాల్లోనే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేశారు. అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా జిల్లాలో వరిసాగు చేయకుండా రైతాంగం ఉండని పరిస్థితి నెలకొంది. అయితే గతంలో 4.70 లక్షల ఎకరాల్లో సాగైన వరి ఈసారి 3 లక్షల ఎకరాలకే పరిమితమైంది. ఇంకా వర్షాలు కురుస్తాయన్న ఆశతోనే రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపడం లేదని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రత్యామ్నాయ సాగు అంచనా ఇలా..జిల్లాలో 5.80 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని జిల్లా వ్యవసాయ శాఖ వానాకాలం పంటల సాగు అంచనాలను రూపొందించింది. ఇందులో 4.80 వేల ఎకరాల్లో వరి, 90 వేల ఎకరాల్లో పత్తి ఉండగా కేవలం 68 52 ఎకరాల్లో మాత్రమే పెసర, కందులు, మినుములు వంటి ఆరుతడి పంటలు ఉంటాయని పేర్కొంది. అయితే ఎల్నినో పరిస్థితుల కారణంగా ఈ అంచనాలు తారుమారయ్యాయి. వరిసాగు విస్తీర్ణం భారీగా తగ్గుతుందని, ఈ మేరకు ఆరుతడి పంటలు 1.40లక్షల ఎకరాల్లో సాగు చేయాలని అధికారులు లక్ష్యం పెట్టుకుని రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. 22 శాతం కూడా మించలే..సీజన్ ప్రారంభమైన నాటినుంచి వాతావరణ పరిస్థితులు వరిసాగుకు అనుకూలంగా ఉండవని రైతులు అరుతడి పంటలను సాగు చేయాలని జిల్లా యంత్రాంగం చెబుతూ వస్తోంది. అయినా చాలామంది రైతులు ఈ పంటల సాగుకు ఏమాత్రం ముందుకు రావడం లేదు. అధికారులు నిర్దేశించుకున్న 1.40 లక్షల ఎకరాల లక్ష్యానికి గాను ఇప్పటివరకు కేవలం 30 వేల ఎకరాల్లో (21 శాతం) మాత్రమే ఆరుతడి పంటలు సాగు చేశారు. వర్షాలపై ఇంకా ఆశలుజిల్లాలో ఇంకా 1.20 లక్షల ఎకరాల నుంచి 1.40లక్షల ఎకరాల వరకు పంటల సాగుకు భూములు అనుకూలంగా ఉన్నాయి. వీటిల్లోనూ కేవలం ఆరుతడి పంటలు అయితేనే ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు తట్టుకొని రైతుల చేతికి వచ్చే పరిస్థితి ఉంది. కానీ రైతులు ఇంకా ఈ నెలాఖరు వరకు వర్షాలు కురుస్తాయని వరిసాగు చేసుకోవచ్చనే ఆశతోనే ఆరుతడి పంటలను వేసేందుకు ముందుకు రావడం లేదు. అయితే జిల్లా వ్యవసాయ శాఖ మాత్రం ఎలాగైనా మిగిలిపోయిన భూమిలో ఆరుతడి పంటల విస్తీర్ణాన్ని పెంచాలని, ఇందుకు కావాల్సిన విత్తనాలను సిద్ధం చేసే పనిలో ఉంది.ప్రత్యామ్నాయ పంటల సాగు లక్ష్యం 1.40 లక్షల ఎకరాలు తలకిందులైన అధికారుల అంచనా వ్యవసాయ శాఖ అవగాహన కల్పిస్తున్నా ముందుకురాని రైతులు ఈ నెలాఖరు వరకు సాగుకు అవకాశం సెల్ఫీ పంపాల్సిన వాట్సప్ నంబర్99489 38922ప్రత్యామ్నాయ పంటల సాగు ఇలా.. పంట విస్తీర్ణం (ఎకరాల్లో..)పెసర 10,000కందులు 10,000మినుము, జొన్న, వేరుశనగ, కూరగాయలు 20,000 -
బుల్లెట్ ట్రైన్ ఉద్యమ బాటలో ఆర్యవైశ్యులు
సూర్యాపేట : సూర్యాపేట మీదుగా బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ కొనసాగించాలంటూ బుధవారం ఆర్య వైశ్య సంఘం నాయకులు జిల్లా కేంద్రంలో రిలే నిరాహార దీక్ష బాట పట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బుల్లెట్ ట్రైన్ మార్గాన్ని శంషాబాద్ నుంచి సూర్యాపేట మీదుగా అమరావతి, చైన్నెకి వెళ్లే విధంగా ప్రతిపాదన చేసిన రాష్ట్ర ప్రభుత్వం అలైన్మెంట్ మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ముందుగా ప్రకటించిన అలైన్మెంట్ను మార్చొద్దన్నారు. ఆర్యవైశ్యుల రిలే నిరాహార దీక్షకు సూర్యాపేట పట్టణ ప్రముఖులతో పాటు వివిధ సంఘాలు సంఘీభావం తెలిపాయి. జాతీయ రహదారి 65కు సమాంతరంగా బుల్లెట్ ట్రైన్, రైల్వే కారిడార్ సాధనకు చేపట్టిన 6వ రోజు రిలే నిరాహార దీక్షలో ప్రముఖ పారిశ్రామిక వేత్త మీలా మహదేవ్, బండారు రాజా, తోట శ్యామ్ ప్రసాద్, పోతుగంటి వెంకటేశ్వర్లు, కలకోట లక్ష్మయ్య, వెంపటి శబరినాథ్, కర్నాటి కిషన్, ఈగ దయాకర్ గుప్త, ఈగ వెంకటేశ్వర్లు, బొమ్మిడి లక్ష్మీనారాయణ, వెంపటి సురేష్, గుండా శ్రీధర్, వెంపటి పురుషోత్తం, తప్సి గాంధీ, గోండ్రాల అశోక్, వంగవేటి రమేష్, బజ్జూరి శ్రీనివాస్, నవిలిపురి నరేందర్ పాల్గొన్నారు. మున్సిపల్ పాలకవర్గం తీర్మానం చేయాలి కేంద్ర ప్రభుత్వం ముందుగా ప్రకటించిన బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ను కొనసాగించాలని సూర్యాపేట మున్సిపల్ పాలకవర్గం ప్రత్యేక తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని బుల్లెట్ ట్రైన్ సాధన అఖిల పక్ష కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదితకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నివేదిత మాట్లాడుతూ పాలక వర్గ సభ్యుల అనుమతితో తీర్మానం చేసి ప్రభుత్వానికి అందజేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అఖిలపక్షాల నాయకులు కన్వీనర్ ఆరుట్ల జానకిరెడ్డి, కుంట్ల ధర్మార్జున్, మండాది డేవిడ్ కుమార్, జీడి భిక్షం, కర్ణాటి కిషన్, కొత్తపల్లి శివకుమార్ రేణుక, పేర్ల నాగయ్య, బూర వెంకటేశ్వర్లు, వీరేంద్ర, నేరెళ్ల మధు, ఎర్ర అఖిల్, భయ్యా మల్లికార్జున్, సట్టు నాగయ్య,సాయి అజయ్ తదితరులు పాల్గొన్నారు. 6వ రోజు కొనసాగిన రిలే నిరాహార దీక్ష -
ఆటో డ్రైవర్లు బాధ్యతగా వ్యవహరించాలి : ఎస్పీ
కోదాడరూరల్ : ప్రతి ఆటో డ్రైవర్ బాధ్యతగా వ్యవహరిస్తూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యం స్థానాలకు చేర్చాలని ఎస్పీ కె.నరసింహ అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో ప్రజల భద్రత కోసం మై ఆటో ఈజ్ సేఫ్ కార్యక్రమంలో భాగంగా ఆటో డ్రైవర్లకు పట్టణ, ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలో ఉన్న ప్రతి ఆటోకు క్యూఆర్ కోడ్తో కూడిన రక్షణ సర్టిఫైడ్ కాపీ, స్టిక్కర్ను అతికించే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. దీంతో ఆటోలో ప్రయాణించే ప్రయాణికులకు ఏమైనా ఇబ్బందులకు గురైనట్లైతే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఆటో ఎక్కడ ఉందనే సమాచారాన్ని పోలీసులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు చేరవేయొచ్చన్నారు. దీనిలో టీ సేఫ్ యాప్ కూడా ఉందని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఎమర్జెన్సీ బటన్ నొక్కితే పోలీసులకు సమాచార చేరి వారు ప్రయాణికులకు రక్షణ కల్పిస్తారన్నారు. విద్యార్థులు కూడా దీనిపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన విద్యార్థినులు ఎస్పీకి ర్యాఖీ కట్టారు. యాప్ రూపొందించిన రమేష్రెడ్డిని ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, పట్టణ సీఐ కె.శివశంకర్, ట్రాఫిక్ ఎస్ఐ బైరెడ్డి అంజిరెడ్డి, పోలీసు సిబ్బంది, ఆటో డ్రైవర్లు విద్యార్థులు పాల్గొన్నారు. -
బాల్యం.. మత్తుకు బానిస
సూర్యాపేటటౌన్ : గంజాయి మత్తు పాఠశాలల విద్యార్థుల వరకు చేరింది. మత్తు పదార్థాల విక్రయదారులు మైనర్లు, ముఖ్యంగా స్కూల్, కాలేజీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గంజాయితో విద్యార్థులను ఆకర్షించడం, అలవాటు పడిన వారినే ఇతరులకు సరఫరా చేసేలా ప్రోత్సహించడం లాంటివి జిల్లాలో చోటుచేసుకుంటున్నాయి. కొండమల్లేపల్లి ఘటనతో కలకలం..నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో మైనర్లు గంజాయి మత్తులో ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ను హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మత్తు పదార్థాల ప్రభావం మైనర్ల ఆలోచనా విధానంపై ఎంతటి ప్రభావం చూపుతుందో ఈ ఘటనే నిదర్శనం. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో గంజాయి విక్రయాలు, వినియోగంపై పోలీసులు మరింత దృష్టి సారించాల్సి ఉంది. మైనర్లు కావడంతో కేసుల పెట్టకుండానే..గంజాయి సేవిస్తూ పట్టుబడుతున్న మైనర్లపై కేసులు పెట్టకుండా పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగిస్తున్న సందర్భాలు ఉన్నాయి. మత్తుకు బానిసైన కొందరిని డీఅడిక్షన్ కేంద్రాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే అసలు సరఫరాదారులు, విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోకపోతే సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విద్యార్థులే టార్గెట్..పాఠశాలలు, కళాశాలల పరిసర ప్రాంతాలు, నిర్మానుష్య ప్రదేశాలు, శివారు ప్రాంతాల్లో విద్యార్థులకు గంజాయి చేరుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మొదట సరదాగా ప్రయత్నించేలా చేసి.. ఆ తర్వాత మత్తుకు బానిసలుగా మార్చుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్నేహితుల ద్వారా గంజాయి పరిచయం తాగడం, సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వ్యక్తుల నుంచి మత్తు పదార్థాలు పొందడం వంటి మార్గాలు కూడా ప్రమాదకరంగా మారుతున్నాయి. గంజాయి మత్తులో స్కూల్ విద్యార్థులు దారితప్పుతున్న మైనర్లు స్కూల్, కాలేజీ విద్యార్థులే లక్ష్యంగా గంజాయి విక్రయాలు తరచూ పోలీసులకు పట్టుబడుతున్న కొందరు మైనర్లు కావడంతో కౌన్సెలింగ్కే పరిమితం కట్టడి చేయకుంటే ప్రమాదరక పరిణామాలే అంటున్న నిపుణులుతల్లిదండ్రులు అప్రమత్తంగా ఉంటేనే.. విద్యార్థుల ప్రవర్తనలో ఆకస్మిక మార్పులు, చదువుపై ఆసక్తి తగ్గడం, కొత్త స్నేహాలు, ఇంట్లో ఎక్కువ డబ్బు అడగడం, ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నించడం వంటి అంశాలను తల్లిదండ్రులు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. తమ పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు కూడా విద్యార్థులపై ప్రత్యేక నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది.జిల్లాలో ఈ ఏడాది కేసులు ఇలా.. గంజాయి కేసులు 20కౌన్సిలింగ్ పొందిన గంజాయి బాధితుల సంఖ్య 15 -
నేడు జిల్లాలో మంత్రి ఉత్తమ్ పర్యటన
హుజూర్నగర్ : రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్రెడ్డి గురువారం హుజూర్నగర్, కోదాడ నియోజవవర్గాల్లో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 8.45 గంటలకు చింతలపాలెం మండలం పాత వెల్లటూరుకు చేరుకుంటారు. అక్కడ ఎంబీసీ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించి సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధిలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. పలు నూతన భవనాలను ప్రారంభిస్తారు. సాయంత్రం 5 గంటలకు సూర్యాపేటలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. సాయంత్రం 6 గంటలకు సూర్యాపేట కలెక్టరేట్లో స్మార్ట్ రేషన్ కార్డులు, అర్హులైన కుటుంబ సభ్యులకు కారుణ్య నియామక పత్రాలను పంపిణీ చేస్తారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్కు వెళతారని మంత్రి పీఆర్ఓ వెంకట్రెడ్డి బుధవారం తెలిపారు. నారసింహుడికి గరుడ వాహన సేవమఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో బుధవారం అర్చకులు శ్రీలక్ష్మీనారసింహస్వామి నిత్య కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో మూలవిరాట్ స్వామికి పంచామతాభిషేకం నిత్యహోమం నిర్వహించారు. అనంతరం నిత్య కల్యాణం చేపట్టి స్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ మాడ వీధుల్లో వైభవంగా ఊరేగించారు. క్షేత్రపాలకుడైన శ్రీ వీరాంజనేయ స్వామికి నాగవల్లి దళాలతో ప్రత్యేక అర్చనలు చేశారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ గావించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయకుమార్, ఈఓ చలపతిరావు, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయచార్యులు, భక్తులు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులపై అవగాహన ఉండాలి తుంగతుర్తి : సీజనల్ వ్యాధులపై విద్యార్థులకు అవగాహన ఉండాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) పెండెం వెంకటరమణ అన్నారు. తుంగతుర్తిలోని ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో బుధవారం సీజనల్ వ్యాధులపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. వర్షాకాలంలో ఇళ్ల పరిసరాలలో నీరునిల్వ లేకుండా చూసుకోవా లన్నారు. నీరు నిల్వ ఉంటే దోమలు వ్యాప్తిచెంది మలేరియా, డెంగీ, చికున్ గున్యావ్యాధుల బారిన పడతామన్నారు. కార్యక్రమంలో జిల్లా కీటక జనిత నియంత్రణ అధికారి డాక్టర్ నాగరాజు, వైద్యాధికారి డాక్టర్ లింగమూర్తి, సామాజిక ఆరోగ్య అధికారి మాలోతు బిచ్చునాయక్, మాణిక్యమ్మ, రాజల్ బీ, ప్రిన్సిపాల్ సంధ్యారాణి వైస్ ప్రిన్సిపాల్ ఆశా జ్యోతి, జేవీపీ అబ్జలున్నిసా బేగం, సోమన్న, యాదగిరి, నరసింహాచారి పాల్గొన్నారు. -
ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి : జూలకంటి
సూర్యాపేట అర్బన్ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీలక్ష్మీ ఫంక్షన్ హాల్లో జరిగిన సీపీఎం జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజా సమస్యలపై స్పందించాలన్నారు. సాగర్ ఎడమ కాలువ ద్వారా వెంటనే నీటిని విడుదల చేసి ఆయకట్టులో సాగవుతున్న లక్షలాది ఎకరాల వరి పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నవంబర్ 15 నుంచి 18 వరకు నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగే అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభల విజయవంతానికి కృషిచేయాలన్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు, నాగారపు పాండు, మట్టి పెల్లిసైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయ పార్టీలు సహకరించాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ తేజస్నంద్ లాల్ పవార్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ వీసీ హాల్లో రాజకీయ పార్టీల నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఓటరు లిస్టులో ఏమైనా సందేహాలు, ఫిర్యాదులు ఉంటే దరఖాస్తు చేసుకోవాలన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులకు డ్రాఫ్ట్ రోల్ అందించామన్నారు. ఎన్నికల నిబంధనలపై రాజకీయ పార్టీ ప్రతినిధులు.. ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, డీఆర్ఓ ప్రేమ్రాజ్, సి సెక్షన్ సూపరింటెండెంటట్ రాజేందర్ రెడ్డి, రాజేశ్వరరావు, చల్లమల్ల నరసింహ, ఎండి హాబిద్, ఎం.స్టాలిన్, సత్యనారాయణ, డి.రమేష్ తదితరులు పాల్గొన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలి మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఉద్దేశంతో ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తోందని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. బుధవారం సూర్యాపేటల కలెక్టరేట్లో జిల్లా మహిళా శక్తి ఉత్సవంలో భాగంగా వియ్ హబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బూట్ క్యాంప్ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. మహిళామణులు అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. సూర్యాపేటలో చేపట్టిన మహిళా శక్తి భవనాన్ని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ సన్యాసయ్య, సీఈఓ సీతా, డీడబ్ల్యూఓ నరసింహారావు, అడిషనల్ డీఆర్డీఓ సురేష్, డీపీఎం అరుణ్ కుమార్, ఏపీఎంలు, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు స్వయం సహాయక మహిళలు, వియ్ హబ్ అసోసియేట్ డైరెక్టర్ జహీర్ అక్తర్ షేక్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
పద్మశాలి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
సూర్యాపేట : పద్మశాలి సేవా సమాజ ట్రస్ట్ ఆధ్వర్యంలో పద్మశాలి విద్యార్థులకు ప్రతిభా పురస్కారములు, నోట్ పుస్తకములు పంపిణీ చేయనున్నట్లు ట్రస్ట్ అధ్యక్షుడు పెండెం చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి పెండెం వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు గానూ అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 2025–26 విద్యా సంవత్సరంలో 10 తరగతి, సీనియర్ ఇంటర్లో ఉత్తమ మార్కులు సాధించిన 20 మంది విద్యార్థులకు రూ.1500 చొప్పున నగదు బహుమతి అందిస్తామని పేర్కొన్నారు. 6వ తరగతి నుంచి ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, బ్యాగులు అందించనున్నట్లు తెలిపారు. వీటిని ఈ నెల 23న ఆదివారం ఉదయం10 గంటలకు పద్మశాలి భవన్లో అందిస్తామని చెప్పారు. ఆసక్తిగల విద్యార్థులు తమ పేర్లను పద్మశాలి భవన్లో లేదా సెల్: 7893661102 నంబర్కు ఫోన్ చేసి నమోదు చేసుకోవాలని సూచించారు.అభివృద్ధి పనులు వేగవంతం చేయాలిపెన్పహాడ్ : పామ్ పాండ్స్ పనులను వేగవంతం చేయాలని జడ్పీ సీఈఓ శిరీష ఆదేశించారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించారు. మండలంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో పామ్ పాండ్స్ల నిర్మాణంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇంటిగ్రేటెడ్ పామ్ పాండ్స్ ప్రాధాన్యతపై అవగాహన కల్పించాలని సూచించారు. వీటి ద్వారా వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, వ్యవసాయానికి నీటి లభ్యత వంటి ప్రయోజనాలు కలుగుతాయన్నారు. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలను సమగ్రంగా అభివృద్ధి చేసే విధంగా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. సమావేశంలో డీపీఓ యాదగిరి, ఎంపీడీఓ జానయ్య, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలిసూర్యాపేటటౌన్ : విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని, వాటి సాధనకు కష్టపడి చదవాలని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ వనం సత్యేందర్, ట్రెజర్ జయరాజ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కళాశాలలో నూతన విద్యార్థులకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో వారు వాట్లాడారు. రెండు దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తోందన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల భవిష్యత్కు ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో హెచ్ఓడీలు సీహెచ్. సురేష్కుమార్, డి.నాగరాజు, జి.వెంకటేష్, ఆర్.శివశంకర్, బి.గాంధీ, పి.వెంకటేష్, సూపరింటెండెంట్లు కె. జానకిరాములు, బి.శ్రీనివాస్, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
పీఆర్టీయూ అధ్యక్ష కార్యదర్శుల ఎన్నిక
పీఆర్టీయూ టీఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా తంగెళ్ల జితేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా తీగల నరేష్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం రాత్రి పట్టణంలో జరిగిన సంఘం జిల్లా కౌన్సిల్ సమావేశంలో 23 మండలాల కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా వీరిని ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి కట్ట శేఖర్రావు ప్రకటించారు. అనంతరం వారితో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు.తీగల నరేష్ ప్రధాన కార్యదర్శితంగెళ్ల జితేందర్రెడ్డి (అధ్యక్షుడు) -
అందుబాటులోకి మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్ : ఎస్పీ
సూర్యాపేటటౌన్ : సాంకేతిక పరిజ్ఞానంతో కేసుల దర్యాప్తును మరింత వేగవంతం చేసేందుకు సూర్యాపేట జిల్లా పోలీసు శాఖకు అత్యాధునిక మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్ అందుబాటులోకి వచ్చిందని ఎస్పీ నరసింహ అన్నారు. రాష్ట్ర పోలీసుశాఖ కేటాయించిన మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్న్ను మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ప్రారంభించి మాట్లాడారు. నేర పరిశోధనలో ఫోరెన్సిక్ ఆధారం అత్యంత కీలకమైనదన్నారు. ఈ వాహనం ద్వారా ఘటనా స్థలం నుంచే నేరుగా ఫోరెన్సిక్ ఆధారాలను వేగంగా సేకరించవచ్చన్నారు. సాంకేతిక పద్ధతులను ఉపయోగించి కేసుల దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను త్వరగా గుర్తించవచ్చని వివరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ రవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ప్రవీణ్ కుమార్, జానయ్య, ఆర్ఎస్ఐలు సురేష్, అశోక్, రాజశేఖర్, సాయిరాం పాల్గొన్నారు. -
బుల్లెట్ ట్రైన్ సాధించే వరకు ఉద్యమం
సూర్యాపేట : కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ మార్చడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేసిన కుట్రను భగ్నం చేసే వరకు, సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ వచ్చే వరకు ఉద్యమం కొనసాగుతుందని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్ అన్నారు. జాతీయ రహదారి 65కి సమాంతరంగా బుల్లెట్ ట్రైన్ కారిడార్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14 నుంచి అఖిలపక్షాల ఆధ్వర్యంలో పట్టణంలోని వాణిజ్య భవన్ సెంటర్లో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు మంగళవారం కొనసాగాయి. దీక్షల్లో సీపీఐ అనుబంధ జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు ఉత్సల సృజనతో పాటు 16 మంది మహిలు కూర్చున్నారు. దీక్షలను సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, అనంతుల మల్లేశ్వరి, దంతాల రాంబాబు, ఏడేళ్ల శ్రీకాంత్ ప్రారంభించారు. దీక్షలకు బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం తెలిపి మాట్లాడారు. సంఘీభావం తెలిపిన వారిలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అంగిరేకుల నాగార్జున, నాయకులు బండారు రాజా, జీడి భిక్షం, బొమ్మగాని శ్రీనివాస్, గండూరి కృపాకర్, రేణుబాబు, సయ్యద్, నాగమణి, అఖిలపక్ష నాయకులు, స్థానికులు ఉన్నారు. ఐదో రోజు కొనసాగిన రిలే నిరాహార దీక్షలు -
విద్యార్థుల భవిష్యత్తో చెలగాటం వద్దు
సూర్యాపేట అర్బన్ : పాలిటెక్నిక్ను శక్తి పథకానికి అనుసంధానం చేయడం వల్ల విద్యార్థుల భవిష్యత్ను కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టవద్దని, ప్రస్తుతం అమలులో ఉన్న ఎస్బీటీఈటీ విధానాన్ని కొనసాగించాలని, జీఓ 97ను రద్దు చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్ర అఖిల్కుమార్ డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ను శక్తిలో విలీనం చేయాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల నుంచి కల్నల్ సంతోష్ చౌరస్తా, ఎస్వీ కాలేజి వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అఖిల్కుమార్ మాట్లాడుతూ డిప్లోమా పూర్తిచేసిన అనంతరం బీటెక్లో చేరేందుకు ప్రస్తుతం ఉన్న విధానం ద్వారా ప్రవేశ పరీక్షలు, లాటరల్ ఎంట్రీ ద్వారా అవకాశం ఉందన్నారు. శక్తి పథకం అమలుతో ఈ అవకాశాలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జీఓ 97ను రద్దు చేసి, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రిషిత, సాహితి, హాసిని, రక్షణ, నవీన, గాయత్రి, సుహాని, సిరివెన్నెల, మనీషా, రుచిత, బ్లెస్సీ పాల్గొన్నారు. తిరుమలగిరిలో రాస్తారోకో..తిరుమలగిరి (తుంగతుర్తి) : పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి విభాగంలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ తిరుమలగిరిలో పీడీఎస్యూ, పీవైఎల్ ఆధ్వర్యంలో విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు పి.వైష్ణవ్, పోలబోయిన కిరణ్, జక్కుల సుధాకర్ వంశీ, నిఖిల్, సన్ని, రవితేజ, తనూష్, ఛత్రపతి, శ్రీనాథ్, అవినాష్, విష్ణు, చరణ్, గీత, రక్షిత పాల్గొన్నారు. పాలిటెక్నిక్ను శక్తిలో విలీనంపై విద్యార్థుల నిరసన -
పీఆర్సీ కోసం పోరాటానికి సిద్ధం
సూర్యాపేట : రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు నూతన పీఆర్సీ కోసం పోరుబాటకు సిద్ధం కావాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం రాత్రి జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు తంగెళ్ల జితేందర్రెడ్డి అధ్యక్షతన జరిగిన సంఘం జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పీఆర్సీ కమిటీ వేసి మూడు సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఎటువంటి పురోగతి లేదన్నారు. 30 శాతం ఫిట్మెంట్ కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. పెండింగ్ డీఏలు, బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని, వెంటనే ఈహెచ్ఎస్ కార్డులు అమలులోకి వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ప్రధానమైన డిమాండ్లతో సెప్టెంబర్ ఒకటో తేదీన హైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్ద వేలాది మంది ఉపాధ్యాయులతో మహాధర్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్, పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పేరి వెంకటరెడ్డి, ఆడిట్ కమిటీ చైర్మన్ సోమిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, జిల్లాశాఖ మాజీ అధ్యక్షుడు కొండేటి రవీందర్రెడ్డి, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్మన్ బొల్లికొండ కోటయ్య, అకాడమిక్ కమిటీ వైస్ చైర్మన్ చల్ల ప్రభాకర్రెడ్డి, మాసపత్రిక సంపాదక వర్గ సభ్యుడు పప్పుల వీరబాబు, క్రమశిక్షణ కమిటీ సభ్యుడు కందుకూరి శివశంకర్, అకడమిక్ కమిటీ సభ్యుడు రాపర్తి వీరేష్, జిల్లా గౌరవాధ్యక్షుడు కొనతం వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి తీగల నరేష్, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు కట్టా శేఖర్రావు, ఏఐఎఫ్టీఓ ఉపాధ్యక్షుడు చిత్తలూరి ప్రసాద్, మేడ్చల్ అధ్యక్షుడు రామేశ్వర్గౌడ్, తదితరులు పాల్గొన్నారు.ఫ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి


