భూసేకరణ పనులు వేగవంతం చేయాలి
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో నిర్మించనున్న వివిధ ప్రాజెక్టులకు కావాల్సిన భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. శనివారం కలెక్టర్లోని సమావేశ మందిరంలో ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఆర్అండ్బీ, ఇరిగేషన్, టీజీ ఐఐసీ, రైల్వే శాఖ, పంచాయతీరాజ్ అధికారులతో భూ సేకరణ పనులపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇరిగేషన్ ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టులు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులతో పాటు వివిధ అభివృద్ధి పనులకు అవసరమైన భూసేకరణ, పెండింగ్లో ఉన్న భూసేకరణ పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవ్, సూపరింటెండెంట్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్


