breaking news
Suryapet District News
-
నిరుపయోగం.. నీటిశుది్ధ కేంద్రం
మంచినీటి శుద్ధి కేంద్రంలో ఉపాధిహామీ పనుల్లో భాగంగా నాటిన టేకు మొక్కల సంరక్షణ ఇప్పటి నుంచి గ్రామ పంచాయతీ తీసుకుంటుంది. గ్రామ పంచాయతీ ఆస్తులను చోరీ చేస్తే చర్యలు తీసుకుంటాం. భవనాల్లో ఇతర కార్యాలయాలు నిర్వహించేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. –నందిగామ శ్రీనివాసులు, సర్పంచ్, వాయిలసింగారం మూతబడిన నీటిశుద్ధి కేంద్రంలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలి. ఈ కేంద్రం గ్రామానికి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున భవనాల్లో పేకాట ఆడడం, మద్యం తాగడం వంటివి చేస్తున్నారు. గ్రామ అవసరాలకు భవనాలను వినియోగంలోకి తీసుకురావాలి. –కొల్లు సుబ్బారావు, సామాజిక కార్యకర్త, వాయిలసింగారం అనంతగిరి : నలభై గ్రామాలకు 12 ఏళ్లపాటు తాగునీరు అందించిన నీటిశుద్ధి కేంద్రం నేడు నిరుపయోగంగా మారింది. ప్రస్తుతం ఆ కేంద్రంలోని భవనాలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయ ని ప్రజలు ఆరోపిస్తున్నారు. అయినా నీటిశుద్ధి కేంద్రం కోసం నిర్మించిన భవనాలను వినియోగంలోకి తేవడంపై అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. నీటిశుద్ధి కేంద్రం ఏర్పాటు ఇలా.. గతంలో కోదాడ, హుజూర్నగర్ పరిసర గ్రామాల ప్రజలు ప్రతి వేసవిలోనూ తాగునీటికి ఇబ్బందులు పడుతుండేవారు. ఈ నేపథ్యంలో తీవ్ర నీటి ఎద్దడి ఉన్న 40 గ్రామాలను గుర్తించి ఆయా గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో అనంతగిరి మండలం వాయిలసింగారంలో 2004లో నాటి కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్కుమార్రెడ్డి హయాంలో రూ.19 కోట్ల వ్యయంతో మంచినీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించారు. ఈ కేంద్రం ద్వారా దాదాపు 12 సంవత్సరాల పాటు 40 గ్రామాలకు ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యంలో మంచినీరు అందించారు. దీంతో ఈ ప్రాజెక్టు నలభై గ్రామాల్లో మంచినీటి కొరతను తీర్చింది. ‘భగీరథ’తో మూతపడిన కేంద్రం.. 2016 ఆగస్టు 7న రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం అమలులోకి తీసుకువచ్చిన తరువాత వాయిలసింగారంలో నిర్మించిన నీటిశుద్ధి కేంద్రం పూర్తిగా మూతబడిపోయింది. వినియోగంలో లేకపోవడంతో ప్రాజెక్టుకు సంబంధించి విద్యుత్ మోటార్లు, యంత్ర సామగ్రి చోరీకి గురయ్యాయి. భవనాలు పదిలంగా ఉన్నప్పటికీ ఐరన్ డోర్లు, భవనాలకు అమర్చిన స్విచ్ బోర్డులు, విద్యుత్ వైర్లు చోరీకి గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన మోటార్లు, యంత్ర సామగ్రిని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు స్క్రాప్గా విక్రయించారు. దీంతో ఎటువంటి రక్షణ లేకుండా ఉన్న భవనాలు నేడు పేకాట, మద్యం తాగడం, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. భవనంలో ఎక్కడ చూసినా పేకలు, మద్యం సీసాలు, గుట్కా ప్యాకెట్లు దర్శనమిస్తున్నాయి. మాయమవుతున్న టేకుచెట్లు ఉపాధిహామీ పనుల్లో భాగంగా ఈ నీటిశుద్ధి కేంద్రంలో గతంలో 500 టేకు మొక్కలు నాటారు. అవి ఇప్పుడు పెరిగి పెద్ద చెట్లుగా ఎదిగాయి. వీటిలో ఇప్పటివరకు సుమారు 250 టేకు చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు నరికి అపహరించుకెళ్లారు. గ్రామానికి సుమారు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున ఇక్కడ ఉన్న భవనాలు, టేకు చెట్లకు రక్షణ లేకుండా పోయింది. ప్రస్తుతం మరో 250 టేకు చెట్లు మిగిలి ఉన్నాయి. అధికారులు స్పందించి ఉన్న టేకు చెట్లను కాపాడడంతోపాటు భవనాలను వినియోగంలోకి తేవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఫ 40 గ్రామాలకు పుష్కర కాలం తాగునీరు అందించిన ప్రాజెక్టు ఫ ‘మిషన్ భగీరథ’తో పట్టించుకోని యంత్రాంగం ఫ సామగ్రి, పలు యంత్ర పరికరాలు, టేక కలప అపహరణ ఫ భవనాలను వినియోగంలోకి తేవాలంటున్న వాయిలసింగారం ప్రజలు -
వైభవంగా గరుడ వాహనసేవ
మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో శనివారం విశేష పూజలు కొనసాగాయి. ముందుగా ఆలయంలో శ్రీలక్ష్మీనరసింహస్వామికి సుప్రబాతసేవ, హోమశాలలో నిత్యాగ్నిహోత్రి మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి, అమ్మవార్లను నూతన పట్టు వస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోలు మహోత్సవం నిర్వహించారు. అనంతరం నిత్య కల్యాణతంతు పూర్తిచేసి శ్రీస్వామిఅమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో వైభవంగా ఊరేగించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంచి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు ముందస్తుగా శుక్రవారం రాత్రి ఆలయానికి చేరుకుని వివిధ సత్రాల్లో బసచేశారు. తెల్లవారుజామునే కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి వారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ బి.జ్యోతి, అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఫణిభూషణ మంగాచార్యులు, సాయిగౌతమ్చార్యులు, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు. -
సూర్యాపేటలో స్కానింగ్ సెంటర్ సీజ్
సూర్యాపేట టౌన్ : నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న జిల్లా కేంద్రంలోని ఆఫిల్ డయాగ్నోస్టిక్స్ అండ్ స్కాన్ సెంటర్ను శనివారం వైద్యశాఖ అధికారులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ పెండెం వెంకటరమణ మాట్లాడారు. ఈ సెంటర్లో సోనాలజిస్ట్గా పనిచేస్తున్న డాక్టర్ సోమ కిరణ్ విషయమై హైకోర్టు ఉత్తర్వులు మేరకు కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ పునర్విచారణ చేసినట్టు పేర్కొన్నారు. కమిటీ సమగ్రంగా విచారణ జరిపి డాక్టర్ సోమ కిరణ్ సోనాలజిస్ట్గా ప్రాక్టీస్ చేసేందుకు అర్హులు కాదని తేల్చినట్టు చెప్పారు. కమిటీ నివేదిక ఆధారంగా నిబంధనల ప్రకారం ఆపిల్ డయాగ్నోస్టిక్స్ అండ్ స్కానింగ్ సెంటర్ను సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. జిల్లాలో చట్ట విరుద్ధంగా అల్ట్రాసౌండ్, స్కాన్ సేవలు అందిస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
నేడు ఉచిత మెగా కంటి వైద్య శిబిరం
సూర్యాపేట టౌన్ : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ కల్యాణ మండపంలో ఆదివారం తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్టు అక్షర ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి రుద్రంగి కాళిదాస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కంటి వైద్య శిబిరంలో అన్ని కంటి సమస్యలు చూడబడతాయని, ఉచిత ఆపరేషన్తో పాటు భోజన వసతి, రవాణా సౌకర్యం కల్పించబడుతుందని పేర్కొన్నారు. ఆపరేషన్ చేయించుకున్న వారికి 15 రోజుల తర్వాత చెకప్ కూడా చేయబడుతుందని పేర్కొన్నారు. ఆపరేషన్ అవసరం ఉన్నవారు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు తెచ్చుకోవాలని సూచించారు. ఇతర కంటి సమస్యలు ఉన్నవారికి ఉచితంగా మందులు అందజేస్తామని, పూర్తి వివరాలకు గడ్డం వీరబాబు సెల్ : 7036259911 నంబర్ను సంప్రదించాలని కోరారు. -
నేడు మంత్రి ఉత్తమ్ రాక
హుజూర్నగర్ : రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి ఆదివారం హుజూర్నగర్ రానున్నారు. మంత్రి సాయంత్రం 4 గంటలకు పట్టణానికి చేరుకుని రామస్వామి గుట్ట హౌసింగ్ కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలిస్తారు. అనంతరం పనుల పురోతిపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షిస్తారు. సాయంత్ర 6 గంటలకు హైదరాబాద్కు వెళ్తారు. శ్రమ దోపిడీని అరికట్టాలి సూర్యాపేట అర్బన్ : అదనపు పని గంటలు పెంచుతూ శ్రామిక వర్గ మహిళల శ్రమను దోచుకునే విధానాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం విడనాడాలని ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్ల నర్సమ్మ కోరారు. శనివారం సూర్యాపేటలోని చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం కార్యక్రమాలు జయప్రదం చేయాలని రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. శ్రామిక మహిళల ఉపాధిపై మోదీ ప్రభుత్వం జరుపుతున్న దాడికి వ్యతిరేకంగా ఈ నెల 8న మహిళా దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినాన్ని గ్రామ గ్రామాన జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షురాలు అలుగుబెల్లి వాణి, జిల్లా సహాయ కార్యదర్శి శంగం రామలింగక్క, కోశాధికారి కావ్య, జిల్లా కమిటీ సభ్యులు శాంతమ్మ, సైదమ్మ, నీలమ్మ, కూసు జయసుధ, సామ ఉపేంద్ర, ఎరబ్రోయిన మంగమ్మ పాల్గొన్నారు. ‘ఉపాధి’పై కేంద్ర బృందం సమీక్ష సూర్యాపేట : జిల్లాలోని వివిధ గ్రామాల్లో ఈనెల 26 నుంచి ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించిన కేంద్ర బృందం సభ్యులు శనివారం సూర్యాపేట కలెక్టరేట్లో కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్తో సమావేశమయ్యా రు. ఈ సందర్భంగా తాము పరిశీలించిన ఉపాధి పనుల వివరాలను కేంద్రం సభ్యుల కమిటీలో సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సంజయ్ కుమార్.. కలెక్టర్కు వివరించారు. అనంతరం కేంద్ర బృందం సభ్యులను కలెక్టర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు దిల్ కుష్ మీనా, సంజయ్ పాండే, జాగృతిరాయ్ తదితరులు పాల్గొన్నారు. గోదావరి జలాలు తగ్గింపుఅర్వపల్లి : యాసంగి సీజన్కు గాను వారబందీ విధానంలో జిల్లాకు 1,700 క్యూసెక్కుల గోదావరి జలాలు విడుదల చేస్తుండగా శని వారం వాటిని 1,613 క్యూసెక్కులకు తగ్గించారు. ప్రస్తుతం వస్తున్న నీళ్లను వృథా చేయకుండా పంటలకు వాడుకోవాలని జలవనరుల శాఖ ఈఈ సత్యనారాయణగౌడ్, ఏఈ చంద్రశేఖర్ రైతులకు సూచించారు. ఇంటర్ ప్రశ్నపత్రాల పరిశీలననేరేడుచర్ల : నేరేడుచర్లలోని ప్రభుత్వ, స్పందన జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్ష కేంద్రాలను శనివారం ఇంటర్ బోర్డు రాష్ట్ర అధికారి హేమచందర్ ఆకస్మికంగా తని ఖీ నిర్వహించారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఇంటర్ ప్రశ్నపత్రాలను పరిశీ లించారు. ఆయన వెంట డీఐఈఓ భానునాయక్, డీఈసీ సభ్యులు మోహన్రావు ఉన్నారు. పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి నల్లగొండ టూటౌన్ : విద్యార్థులు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి అన్నారు. శనివారం నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో ఎంబీఏ ఫైనలియర్ విద్యార్థులకు వ్యాపార అభివృద్ధి అవకాశాలపై ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు పరిశ్రమల స్థాపన, ఉపాధి కల్పనపై దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ సతీష్కుమార్, చార్టెడ్ అకౌంటెంట్ పిల్లి మహేష్, ఇండస్ట్రీ ఇనిస్టిట్యూట్ కనెక్ట్ డైరెక్టర్ జక్కా సురేష్రెడ్డి, శ్రీదేవి, సబీనా హెరాల్డ్, విద్యార్థులు పాల్గొన్నారు. -
డ్రైవర్లకు కంటిచూపు బాగుండాలి
సూర్యాపేట టౌన్ : డ్రైవింగ్ వృత్తిలో కంటిచూపు చాలా కీలకమైందని, డ్రైవర్లకు కంటిచూపు బాగుంటేనే వాహనాలు ప్రమాదాలకు గురికాకుండా నడపగలుగుతారని ఎస్పీ నరసింహ అన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలో వివిధ రకాల వాహనాల డ్రైవర్లకు నిర్వహించిన ఉచిత కంటి పరీక్షల వైద్య శిబిరాన్ని ఎస్పీ ప్రారంభించి మాట్లాడారు. ముందు జాగ్రత్తలు పాటించడంతోనే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చన్నారు. మనదేశంలో ఏడాదికి సుమారు 1.5 లక్షల మంది, తెలంగాణలో 7,500 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని తెలిపారు. జిల్లాలో 2024లో 278 మంది రోడ్డు ప్రమాదాలలో మరణించగా 2025లో జిల్లా పోలీస్ శాఖ తీసుకున్న పటిష్ట చర్యల వల్ల మరణాలు 58కి తగ్గించగలిగామని పేర్కొన్నారు. డ్రైవర్ వృత్తి చాలా కష్టతరమైనదని, ఈ వృత్తిని ఎంచుకొని నిర్విరామంగా కష్టపడుతున్న డ్రైవర్లు తమ ఆరోగ్యాలను కూడా కాపాడుకోవాలన్నారు. సామాజిక సేవగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రైవర్లకు కంటి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. స్థానిక లయన్స్ క్లబ్, గ్లోబల్ కంటి ఆసుపత్రి డాక్టర్ల సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో 500 మందికిపైగా డ్రైవర్లకు కంటి పరీ క్షలు చేయించామన్నారు. రోడ్డు భద్రత నిబంధనలు పాలించాలని డ్రైవర్లచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దోసపాటి గోపాల్, కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్, పట్టణ సీఐ వెంకటయ్య, సీఐలు రాజశేఖర్, నరసింహారావు, నాగేశ్వరరావు, ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం పాల్గొన్నారు. ఫ ఎస్పీ నరసింహ -
అమెరికా సామ్రాజ్యవాదంతో భారత్కు ముప్పు
సూర్యాపేట అర్బన్ : కేంద్రప్రభుత్వం చేతకానితనం మూలంగా దేశ మార్కెట్ను అమెరికా కబలించేందుకు కుట్రపన్నుతోందని, అమెరికా సామ్రాజ్యవాదంతో భారత్కు ముప్పు పొంచి ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకటనరసింహారెడ్డి భవన్లో జరిగిన ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సమావేశంలో ఆమె మాట్లాడారు. మోదీ ప్రభుత్వం రైతాంగ ప్రయోజనాలను అమెరికాకు తాకట్టు పెట్టిందని.. విత్తన చట్టంతో అమెరికాకు లాలూచీ పడుతుందన్నారు. ఏళ్ల తరబడిగా కార్మికులు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లు తెచ్చిందని, తద్వారా కార్మికుల హక్కులు కాలరాసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలను ఎండగట్టాలన్నారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు, మట్టిపల్లి సైదులు, కోట గోపి పాల్గొన్నారు -
రైతులకు మేలు జరిగేలా పనులు
భానుపురి (సూర్యాపేట) : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రైతులకు మేలు జరిగే పనులు చేపట్టామని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి సంస్థ బృందం సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలో జరిగిన ఉపాధి హామీ పనులపై కేంద్ర బృందానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఉపాధిహామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం వీబీ జీ రాంజీగా మారుస్తున్న తరుణంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి సంస్థ బృందం సభ్యులు సంజయ్ కుమార్ నేతృత్వంలో ఈనెల 28 వరకు జిల్లాలో పర్యటించనున్నారు. అనంతరం ఈజీఎస్ పథకాల పనులపై జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను కేంద్ర బృందం, కలెక్టర్ తిలకించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, డిప్యూటీ సీఈఓ శిరీష, కేంద్ర బృందం సభ్యులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
సెప్టెంబర్లోగా లిప్టు పనులు ముగించాలి
మేళ్లచెరువు : సెప్టెంబర్ నాటికి మహాత్మాగాంధీ ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లిఫ్టు ఇరిగేషన్ పనులను పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అధికారులను, కాంట్రాక్టర్ ను ఆదేశించారు. గురువారం ఆయన చింతలపాలెం మండలం పాతవెల్లటూరు పరిధిలో నిర్మిస్తున్న లిఫ్టు పనులను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. రూ.1,670 కోట్లతో నిర్మింస్తున్న లిప్టు ద్వారా హుజూర్నగర్ నియోజకవర్గం పరిధిలోని మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం మండలాల్లో 53వేల ఎకరాలకు సాగు నీరు అందనుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ నాగభూషణం, ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ సూరయ్య, డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి, సీఐ రామకృష్ణారెడ్డి, కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి, అంతయ్య, సైదులు నాయక్, మంజీనాయక్, సంస్థ ప్రతినిఽధి హరీష్ పాల్గొన్నారు. -
జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యా
హైదరాబాద్లో జరిగిన పోలీస్ క్రీడల్లో యాదాద్రి జోన్ తరఫున కబడ్డీ, వాలీబాల్ ఆడాను. కబడ్డీ పోటీలో ప్రథమ బహుమతి వచ్చింది. కబడ్డీలో జాతీయ స్థాయి క్రీడలకు ఎంపికయ్యాను. చాలా ఆనందంగా ఉంది. జిల్లాకు మంచిపేరు తీసుకొస్తా. – దీపిక, కానిస్టేబుల్, సూర్యాపేట జిల్లా ఇటీవల రాష్ట్ర స్థాయి కబడ్డీ, వాలీబాల్, ఖోఖో పోలీస్ క్రీడాపోటీల్లో ఆడాను. కబడ్డీ, ఖోఖోలో జాతీయ స్థాయికి ఎంపికయ్యాను. జమ్మూకశ్మీర్లో జరగనున్న జాతీయ స్థాయి కబడ్డీ, ఖోఖో పోటీల్లో పాల్గొని విజయంతో తిరిగి వస్తాం. – అనూష, ఏఆర్ కానిస్టేబుల్, సూర్యాపేట జిల్లా -
మార్చి నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి
హుజూర్నగర్ : హుజూర్నగర్లోని ఫణిగిరిగుట్ట వద్ద చేపట్టిన కాలనీ ఇళ్ల నిర్మాణ పనులను మార్చి మొదటి వారం నాటికి పూర్తి చేస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల, నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. గురువారం హుజూర్నగర్ పట్టణ శివారులో ఇళ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్తో కలిసి పరిశీలించారు. ప్రతి బ్లాకు తిరిగి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నిరుపేదలు, వ్యవసాయ కూలీలు, రైస్ మిల్లు కార్మికులకు ఆశ్రయం కల్పించాలన్న లక్ష్యంతో 110 ఎకరాల దేవాలయ భూములను కొనుగోలు చేసి రూ.125 కోట్లతో 2,160 ఇళ్ల నిర్మిస్తున్నామని తెలిపారు. తొలి విడత పట్టణంలోని నిరుపేదలకు సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేస్తామన్నారు. రెండవ విడతలో నియోజకవర్గంలోని పేదలకు అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్పీ కె.నరసింహ, మున్సిపల్ చైర్పర్సన్ దొంతగాని శ్రీని వాస్, వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్, ఏఎంసీ చైర్మన్ రాధికఅరుణ్కుమార్, హౌసింగ్ పీడీ సిద్ధార్థ, ఆర్టికల్చర్ పీడీ నాగయ్య తదితరులు పాల్గొన్నారు. ఫ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఫ హుజూర్నగర్, మేళ్లచెరువులో మంత్రి పర్యటన -
పోలీస్ సిబ్బంది సంక్షేమానికి కృషి
సూర్యాపేట టౌన్ : పోలీస్ సిబ్బంది సంక్షేమానికి నిరంతరం కృషిచేస్తామని ఎస్పీ నరసింహ అన్నారు. కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మరణించిన కృష్ణయ్య కుటుంబానికి ఆరోగ్య భద్రత ఇన్సూరెన్స్ కింద మంజూరైన నగదు చెక్కును గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అందజేసి మాట్లాడారు. పోలీస్ సిబ్బంది కుటుంబాలకు ఆరోగ్య భద్రత పథకం బాసటగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు రవీందర్రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, పోలీస్ సంఘం అధ్యక్షుడు రామచందర్గౌడ్, సంక్షేమ ఆర్ఎస్ఐ సాయిరాం, సిబ్బంది పాల్గొన్నారు. ఉత్తమ సేవలతో ప్రజల మన్ననలు పొందాలి ఉద్యోగోన్నతి సాధించిన పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని ఎస్పీ నరసింహ అన్నారు. కోదాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పని చేస్తున్న కె.విద్యాసాగర్కు హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి పొందిన సందర్భంగా గురువారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం ఎస్పీ నరసింహ ప్రమోషన్ ఉత్తర్వులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. ఫ ఎస్పీ నరసింహ -
క్రీడల్లో సత్తాచాటారు
సూర్యాపేట టౌన్ : శాంతి భద్రతలే లక్ష్యంగా నిరంతరం పోలీసులుగా విధులు నిర్వహిస్తున్న కొందరు కానిస్టేబుళ్లు కీడ్రాపోటీల్లోనూ రాణిస్తున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే పోలీస్ శాఖ ఇటీవల హైదరాబాద్లో జరిగిన 4వ రాష్ట్ర పోలీస్ క్రీడోత్సవాలు నిర్వహించింది. ఈ పోటీల్లో యాదాద్రి జోన్ తరఫున ఆడిన జిల్లా క్రీడాకారులు వివిధ క్రీడాంశాల్లో బహుమతులు సాధించారు. రాణించిన మహిళా పోలీసులు రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో జిల్లా మహిళా పోలీసులు సత్తాచాటారు. రాష్ట్ర స్థాయి క్రీడల్లో యాదాద్రి జోన్ కబడ్డీ పోటీల్లో మహిళా విభాగంలో ప్రథమ స్థానం, వాలీబాల్ లో మహిళా విభాగంలో తృతీయ స్థానం సాధించారు. బ్యాడ్మింటన్లో మహిళా విభాగంలో తృతీయ స్థానం సాధించి బహుమతులు గెలుచుకున్నారు. కబడ్డీ జట్టులో జిల్లా నుంచి మహిళా కానిస్టేబుళ్లు దీపిక, అనూష, శిరీష, దివ్యభారతి పాల్గొని అత్యత్తుమ ప్రతిభ కనబరిచారు. అలాగే వాలీబాల్ జట్టులో మహిళా కానిస్టేబుళ్లు లావణ్య, ప్రియాంక, దివ్యభారతి, దీపిక, ప్రవళ్లిక, అనూష, శిరీష పాల్గొని జట్టును ద్వితీయ స్థానంలో నిలిపారు. బ్యాడ్మింటన్లో మహిళా కానిస్టేబుల్ అనూష తృతీయ స్థానం సాధించి బహుమతి గెలుచుకుంది. పురుషుల విభాగంలో అథ్లెటిక్స్లో ఆర్ఎస్ఐ మహేష్ 1,500 మీటర్ల విభాగంలో గోల్డ్ మెడల్, ఐదు కిలోమీటర్ల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించారు. అలాగే కానిస్టేబుల్ స్వామి జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించారు. జాతీయ స్థాయి క్రీడలకు ఎంపిక జాతీయ స్థాయి పోలీస్ క్రీడాపోటీలకు పలువురు జిల్లా క్రీడాకారులు ఎంపికయ్యారు. ఆత్మకూరు పోలీస్స్టేషన్కు చెందిన మహిళా కానిస్టేబుల్ దీపిక, జిల్లా ఆర్ముడ్ పోలీస్ కానిస్టేబుళ్లు అనూష, శిరీష జాతీయ స్థాయిలో జరగనున్న కబడ్డీ పోలీస్ క్రీడాపోటీలకు ఎంపికయ్యారు. వాలీబాల్ పోటీలకు జిల్లా ఆర్ముడ్ విభాగం మహిళా కానిస్టేబుల్ లావణ్య ఎంపికయ్యారు. ఖోఖో క్రీడాపోటీలకు జిల్లా ఆర్ముడ్ పోలీస్ విభాగానికి చెందిన మహిళా కానిస్టేబుళ్లు దివ్యభారతి, అనూష ఎంపికయ్యారు.ఫ రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చిన జిల్లా పోలీసులు ఫ కబడ్డీ, ఖోఖో, వాలీవాల్, బాడ్మింటన్ విభాగాల్లో బహుమతులు ఫ జాతీయ స్థాయికి పలువురు మహిళా కానిస్టేబుళ్ల ఎంపిక ఫ అథ్లెటిక్స్, జావెలిన్ త్రోల్లో మరో ఇద్దరు పురుష కానిస్టేబుళ్లకు మెడల్స్ -
ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రారంభం
ఫ మొదటి రోజు 245 మంది గైర్హాజరు సూర్యాపేట టౌన్ : ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. జిల్లాలో 30 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా మొదటి రోజు మొత్తం 7,312 మంది విద్యార్థులను గాను 7,067 మంది హాజరు కాగా 245 మంది గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్ విభాగంలో 5,861 మందికి 5,716 మంది హాజరు కాగా 145 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. అలాగే ఒకేషనల్ విభా గంలో 1,451 మందికి 1,351 మంది పరీక్ష రాయగా 100 మంది గైర్హాజరైనట్టు డీఐఈఓ భానునాయక్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. అలాగే ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు కూడా తనిఖీలు చేశారు. మొదటి రోజు తెలుగు, సంస్కృతం, హిందీ పరీక్ష నిర్వహించారు. విద్యార్థులకు ఉపాధి కల్పనే లక్ష్యం సూర్యాపేట టౌన్ : కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని సూర్యాపేటలోని ఎస్వీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కెప్టెన్ డాక్టర్ వి.వెంకటేషులు అన్నారు. గురువారం కళాశాలలో టాటా క్యాపిటల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్లేస్మెంట్ డ్రైవ్ (జాబ్మేళా) ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కార్యక్రమాన్ని హెచ్ఆర్ స్టేట్ మేనేజర్ ఎం.మాలతీ, విగ్నేశ్వరన్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతున్న 78 మంది విద్యార్థులు పాల్గొనగా 33 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో రీజనల్ స్టేట్ మేనేజర్ వి.శ్రీనివాసరావు, ఏరియా సేల్స్ మేనేజర్ జి.ఉప్పయ్య తదితరులు పాల్గొన్నారు. ఎంజీయూ రిజిస్ట్రార్గా కొప్పుల అంజిరెడ్డి నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ) రిజిస్ట్రార్గా ఆర్థికశాస్త్ర విభాగం ప్రొఫెసర్, ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ డీన్ కొప్పుల అంజిరెడ్డి నియమితులయ్యారు. 2007లో ఎంజీ యూనివర్సిటీలో ఆర్థికశాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరిన అంజిరెడ్డి క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా పేరుంది. అంజిరెడ్డి స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆత్మకూరు(ఎం) మండలం సింగారం గ్రామం. రిజిస్ట్రార్గా నియమితులైన అంజిరెడ్డిని వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అభినందించారు. అంధ విద్యార్థులకు ప్రత్యేక లైబ్రరీరామగిరి(నల్లగొండ) : అంధ విద్యార్థుల కోసం నల్లగొండ జిల్లా గ్రంథాలయంలో ప్రత్యేకంగా డిజిటల్ లైబ్రరీ కార్నర్ను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్ఖాన్ గురువారం ప్రారంభించారు. ఇందులో బ్రెయిలీ పుస్తకాలు, ఆడియో బుక్స్, ఈ బుక్స్, స్క్రీన్ రీడర్ సాఫ్ట్వేర్తో కూడిన కంప్యూటర్లు సదుపాయాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అనంతరం 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో కార్యదర్శి బాలమ్మ, అనిల్కుమార్, కృష్ణమోహన్, నరసింహారెడ్డి పాల్గొన్నారు. -
లిప్టు పనులు పూర్తిచేయాలి
మేళ్లచెరువు : సెప్టెంబరు నాటికి రాజీవ్గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అధికారులను, కాంట్రాక్టర్ను ఆదేశించారు. మంగళవారం చింతలపాలెం మండలం దొండపాడు గ్రామం పరిధిలో గల లిఫ్ట్ పంపును పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. లిప్టు ద్వారా హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధిలోని 5 మండలాల్లో 12 గ్రామాలల్లో ని భూములకు సాగు నీరు అందించడం జరుగుతుందన్నారు. 394 కోట్ల రూపాయలతో నిర్పిస్తున్న లిప్టు పనులు వేగవంతం గా జరుగుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు రమేష్బాబు, ఎస్ఈ నాగభూషణం, దొండపాడు సర్పంచ్ చెన్నకేశి వెంకయ్య యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నరాల కొండారెడ్డి, ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. -
30 పరీక్ష కేంద్రాలు..
16,178 మంది విద్యార్థులునేటి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలుసూర్యాపేటటౌన్ : జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకుగాను మొత్తం జిల్లావ్యాప్తంగా 30 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేలా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, ఇతర సౌకర్యాలు కల్పించారు. ప్రతి సెంటర్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ ఇంటర్ బోర్డు కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్రూం నుంచి అధికారులు పరీక్షల నిర్వహణను పర్యవేక్షించనున్నారు. పకడ్బందీగా పరీక్షల నిర్వహణఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా ప్రతి కేంద్రంలో 8 నుంచి 10 సీసీ కెమెరాలు ఉండే విధంగా పరీక్ష కేంద్రాలను ఎంపిక చేశారు. అలాగే పరీక్షలను పర్యవేక్షణకు ప్రతి సెంటర్కు సీఎస్, డీఓలతో పాటు జిల్లాలో రెండు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు, రెండు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. అదేవిధంగా జిల్లా ఎగ్జామినేషన్ కమిటీ ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 163 బీఎన్ఎస్ఎస్ అమలులో ఉంటుంది. పరీక్ష కేంద్రాల నుంచి 200 మీటర్ల పరిధిలోని అన్ని జీరాక్స్ కేంద్రాలు, ఆన్లైన్ సెంటర్లు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు మూసి ఉంచాలి. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమికూడొద్దు. నిషేధిత వస్తువులతో పరీక్ష కేంద్రాల వద్ద తిరగడం నిషేధం. 86 ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు జిల్లాలో మొత్తం ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు 86 ఉన్నాయి. వీటిలో మొత్తం 16,178 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందులో మొదటి సంత్సరం జనరల్ విభాగంలో 6609 మంది విద్యార్థులు, ఒకేషనల్ విభాగంలో 1579 మంది విద్యార్థులు ఉన్నారు. అలాగే ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో 6479 మంది విద్యార్థులు, ఒకేషనల్ విభాగంలో 1511 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్ష జరగనుంది. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ నరసింహ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిధిలోని పరీక్ష కేంద్రాల వద్ద శాంతిభద్రతల రక్షణలో భాగంగా సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఈ నెల 25 నుంచి మార్చి18వ తేదీ వరకు పరీక్షలు జరుగుతుండగా పరీక్షల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని తెలిపారు. ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ అధికారులు పరీక్ష కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ఎస్ అమలునిమిషం నిబంధన ఎత్తివేతపరీక్ష కేంద్రంలోకి వెళ్లేందుకు నిమిషం నిబంధన ఎత్తివేశారు. పరీక్ష సమయానికి ఐదు నిమిషాల వరకు పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ఉదయం 9గంటలకు పరీక్ష ప్రారంభం కాగా 9.05గంటల వరకు అధికారులు అనుమతించనున్నారు. విద్యార్థులను ఉద యం 8గంటల నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. ఉదయం 8.45గంటలకల్లా ఓఎంఆర్ షీట్పై వివరాలన్నీ సరి చూసుకోవాలి. 9గంటలకు ప్రశ్నపత్రం ఇస్తారు. బార్కోడ్తో ఉన్న 24పేజీల బుక్లెట్ను విద్యార్థులకు అందజేస్తారు. -
3.20 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి
హుజూర్నగర్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల లో రాష్ట్ర వ్యాప్తంగా 3.20 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని, వీటి కోసం రూ.5వేల కోట్లను మంజూరు చేసిందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని రామస్వామి గుట్ట వద్ద నిర్మాణంలో ఉన్న సింగల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్లతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి హౌసింగ్ విషయంలో ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. రామస్వామి గుట్ట వద్ద నిర్మిస్తున్న ఇళ్ల కాలనీని మార్చి మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డితో ప్రారంభించ బోతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రామస్వామి గుట్ట వద్ద ఒకే చోట 110 ఎకరాలలో రూ 125 కోట్లతో హౌసింగ్ కాలనీని నిర్మిస్తున్నామని తెలిపారు. కాలనీలో అంతర్గత రోడ్లు, విద్యుత్, తాగునీరు, డ్రెయినేజీ వ్యవస్థకు ప్రభుత్వం నుంచి రూ.75కోట్లు మంజూరు చేయించి పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయిస్తున్నట్లు వెల్లడించారు. తొలి విడతలో హుజూర్నగర్ పట్టణంలో ఇళ్లు లేని వారికి, తెల్ల రేషన్ కార్డు కలిగిన వెయ్యి మంది లబ్ధిదారులకు ఇళ్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించారు. రెండో విడతలో నియోజక వర్గంలోని పేదలకు అందించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఎస్పీ కే నరసింహ, మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్, వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
సాగు, తాగునీటికి శ్రీశైలమే శరణ్యం!
నాగార్జునసాగర్ : సాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీటితో పాటు హైదరాబాద్ మహానగరానికి, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఫ్లోరిన్ పీడిత పట్టణాలు, గ్రామాలకు తాగునీటికి గాను శ్రీశైలం జలాశయమే శరణ్యమైంది. నాగార్జునసాగర్ జలాశయం నుంచి నీటి వినియోగం అధికంగా జరుగుతుండడంతో నీటిమట్టం వేగంగా తగ్గిపోతోంది. దీంతో ఎగువన శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుదుత్పాదన ద్వారా వచ్చే నీటితోనే సాగు, తాగునీటి అవసరాలు తీర్చుకునే పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడం వల్ల కృష్ణానదికి భారీస్థాయిలో వరదలు వచ్చాయి. లక్షల క్యూసెక్కుల వరదనీరు జలాశయాల్లోకి చేరింది. నవంబర్ నెల వరకు శ్రీశైలం, సాగర్ జలాశయాలు నిండుకుండల్లా ఉన్నాయి. అయితే, గడిచిన 114 రోజుల్లోనే సాగర్ జలాశయం నుంచి 135 టీఎంసీల నీటిని పంటల కోసం వినియోగించారు. సాగర్ జలాశయం గరిష్ట నీటిమట్టం 590 అడుగులు (312.0450టీఎంసీలు) కాగా.. మంగళవారం నాటికి నీటిమట్టం 539 అడుగులు (186.6644 టీఎంసీలు) ఉంది. 45 టీఎంసీల నీరు శ్రీశైలం నుంచి ఇస్తేనే.. సాగర్ ఆయకట్టులో ప్రస్తుతం సాగులో ఉన్న యాసంగి పంట చేతికి రావాలంటే ఏప్రిల్ 7వ తేదీ వరకు అంటే మరో 42 రోజుల వరకు నీటిని విడుదల చేయాలి. నిత్యం పంట కాల్వల ద్వారా 21,500 క్యూసెక్కుల నీరు విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన సుమారు 81 టీఎంసీల నీరు పంటకు అవసరమవుతుంది. ఇది కాకుండా వాతావరణాన్ని బట్టి రోజుకు దాదాపు 240 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టు నుంచి ఆవిరై పోతుంది. కాగా, సాగర్ జలాశయంలో కనిష్ట నీటిమట్టం 510 అడుగులకు పైన ఉన్న నీటినే వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అంటే.. 55 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. సాగునీటికి 81 టీఎంసీలు, తాగునీటికి 19టీఎంసీలు మొత్తం 100 టీఎంసీల నీరు అవరమవుతుంది. దీని ప్రకారం 45 టీఎంసీల నీరు శ్రీశైలం జలాశయం నుంచి వస్తేనే వేసవి గండం నుంచి గట్టెక్కుతాం. తాగు నీటికి రోజూ 2500 క్యూసెక్కులు ఏప్రిల్ 7 వరకు పంటలకు నీటిని నిలిపేసినా.. హైదరాబాద్ మహా నగరానికి, ఫ్లోరైడ్ పీడిత గ్రామాలు, పట్టణాలకు జులై వరకు తాగునీరు పంపాల్సి ఉంటుంది. గతంలోనే రోజుకు కనిష్టంగా 2వేల క్యూసెక్కుల నీటిని తాగునీటి అవసరాలకు అందిచేవారు. హైదరాబాద్ మహానగరంతో పాటు పట్టణాలు ఏడాదికేడాది విస్తరిస్తుండడంతో నివాసాల సంఖ్య పెరుగుతోంది. దీంతో రోజుకు 2500 క్యూసెక్కుల మేరనైనా తాగునీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. శ్రీశైలం జలాశయం నుంచి విద్యుదుత్పాదనతో సాగర్ జలాశయానికి 10,398 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. కుడివైపు(ఆంధ్రప్రదేశ్) విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా 137 క్యూసెక్కులు, ఎడమవైపున గల తెలంగాణ విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా 9,021 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నెల 13వ తేదీ నుంచి శ్రీశైలం నుండి నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం862.90 అడుగులు (114.9952 టీఎంసీలు)గా ఉంది. సాగర్ నుంచి విద్యుదుత్పాదన, కుడి ఎడమ కాల్వలు, ఏఎమ్మార్పీకి 25,123 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది.ఫ నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి 114 రోజుల్లో 135 టీఎంసీల నీటి వినియోగం ఫ శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పాదన ద్వారా సాగర్కు స్వల్పంగా నీటి విడుదల -
ఉగాది నాటికి ఇందిరమ్మ ఇళ్లు పూర్తిచేయాలి
భానుపురి (సూర్యాపేట) : ఉగాది నాటికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేలా చూడాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ అన్నారు. ఇందిరమ్మ ఇళ్లపై మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హౌసింగ్ ఎండీ మాట్లాడుతూ.. జిల్లాలో స్లాబ్ దశలో, సగం వరకు పూర్తయిన 2700 ఇందిరమ్మ ఇళ్లను పూర్తిచేసి ఉగాది నాటికి లబ్ధిదారులకు అందించే విధంగా సిద్ధం చేయాలని సూచించారు. పూర్తయిన ఇళ్లకు బిల్లులు చెల్లించాలన్నారు. పెండింగ్ పనులైన అంతర్గత రోడ్లు, డ్రెయినేజీ, ఎలక్ట్రిసిటి, డ్రింకింగ్ వాటర్ మొదలైన పనులను పూర్తిచేయాలన్నారు. ఆయన వెంట హౌసింగ్ చీఫ్ ఇంజనీర్ చైతన్యకుమార్, హౌసింగ్ పీడీ సిద్ధార్థ, సూర్యాపేట తహసీల్దారు కృష్ణయ్య, హౌసింగ్ ఇన్స్పెక్టర్ అబ్దుల్లా పాల్గొన్నారు. పథకాలను సద్వినియోగం చేసుకోవాలిచివ్వెంల(సూర్యాపేట) : ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హౌసింగ్ ఎండీ గౌతమ్ కోరారు. మంగళవారం కోదాడకు వెళ్లి వస్తూ మార్గమధ్యంలో చివ్వెంల మండల పరిధిలోని గుంపుల గ్రామంలో కొద్దిసేపు ఆగారు. ఇంటి బిల్లులకు సంబంధించి నగదు సకాలంలో వస్తున్నాయా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ఎంపీడీఓ సంతోష్ కుమార్ ఉన్నారు. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ -
అలుగు పారుతున్న కోదాడ పెద్దచెరువు
లక్ష్మీనారసింహుడికి విశేష పూజలుమఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో మంగళవారం అర్చకులు విశేషపూజలు నిర్వహించారు. క్షేత్ర పాలకుడైన ఆంజనేయస్వామికి తమలపాకులతో ప్రత్యేకపూజలు చేశారు. దేవాలయంలో లక్ష్మీనరసింహస్వామికి సుప్రభాత సేవ, హోమశాలలో నిత్యాగ్నిహోత్రి, మూలవిరాట్కు పంచామృతాభిషేకం, జరిపించారు. లక్ష్మీనరసింహస్వామి, అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం చేపట్టారు. నిత్య కల్యాణతంతులో భాగంగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ, తలంబ్రాలతో నిత్య కల్యాణం వైభవంగా నిర్వహించారు. అనంతరం మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కోదాడ : కోదాడ పెద్దచెరువు అలుగు పారుతోంది. మంగళవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి పెద్దచెరువులోకి భారీగా వరద నీరు చేరడంతో ఉదయం నుంచి చెరువు అలుగు పోస్తోంది. -
డిగ్రీ బ్యాక్లాగ్ విద్యార్థులకు చివరి అవకాశం
నల్లగొండ టూటౌన్ : మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలో డిగ్రీ 2019 –20 నుంచి 2020– 21 బ్యాక్లాగ్ విద్యార్థులు పరీక్షలు రాసేందుకు చివరి అవకాశం కల్పించనున్నట్లు సీఓఈ ఉపేందర్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష ఫీజు ఆలస్య రుసుం లేకుండా మార్చి 16వ తేదీ వరకు, రూ.100 ఆలస్య రుసుంతో 17వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. క్రమశిక్షణతో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చుసూర్యాపేటటౌన్ : విద్యార్థులు క్రమశిక్షణగా ఉంటే ఉన్నత స్థానాలకు చేరుకుంటారని ఎస్పీ నరసింహ అన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం సూర్యాపేట పట్టణంలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు రోడ్డుభద్రతపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థులు బాధ్యతగా ఉండాలని, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడంతోపాటు, రోడ్డు ప్రమాదాలు నివారించడంలో ఆదర్శంగా, ప్రచారకర్తలుగా ఉండాలన్నారు. మానవ తప్పిదాల వల్ల అధికంగా రోడ్డు ప్రమాదాలు సంభవించి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఎవరూ రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలో కోల్పోకూడదనేదే పోలీస్ శాఖ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం, కళాశాల ప్రిన్సిపాల్ ముత్యాల రాజు తదితరులు పాల్గొన్నారు.దీన్ దయాల్ సిద్ధాంతాలే బీజేపీకి ప్రేరణాశక్తిసూర్యాపేట : సూర్యాపేటలో మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్పై ఆపార్టీ జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతరెడ్డి అధ్యక్షతన జిల్లా స్థాయి వర్క్షాప్ నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బద్దం మహిపాల్ రెడ్డి, జిల్లా ఇన్చార్జ్ తూటుపల్లి రవికుమార్లు పాల్గొని పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన అంత్యోదయ సిద్ధాంతాలే బీజేపీకి ప్రేరణాశక్తి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కడియం రాంచంద్రయ్య, జిల్లా మాజీ అధ్యక్షులు బొబ్బా భాగ్యారెడ్డి, ప్రోగ్రాం జిల్లా కన్వీనర్ వంగవీటి శ్రీనివాసరావు, కోకన్వీనర్ ఆకుల భిక్షమయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శులు చల్లమల నరసింహ, దోసకాయల ఫణినాయుడు, జిల్లా కమిటీ సభ్యులు, పట్టణ, మండల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. గోదావరి నీటి విడుదల 1750 క్యూసెక్కులకు పెంపు అర్వపల్లి: యాసంగి సీజన్కుగాను జిల్లాకు వారబందీ విధానంలో ఇస్తున్న గోదావరి నీటిని మంగళవారం పెంచారు. నీటిని 1613 క్యూసెక్కుల నుంచి 1750 క్యూసెక్కులకు పెంచినట్లు జలవనరుల శాఖ ఈఈ సత్యనారాయణగౌడ్, బయ్యన్నవాగు ఏఈ చంద్రశేఖర్ తెలిపారు. చివరి భూములకు నీళ్లు చేరేందుకు ఈసారి అవకాశం ఉన్న మేర ఎక్కువ నీటిని వదులుతున్నట్లు పేర్కొన్నారు. రైతులు నీటిని వృథా చేయకుండా పొదుపుగా పంటలకు వాడుకోవాలని కోరారు. పేదల ఇళ్లను కూల్చడం హేయమైన చర్యచివ్వెంల(సూర్యాపేట) : ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామంలో పేదల ఇళ్లను కూల్చివేయడం హేయమైన చర్య అని గ్రామీణ పేదల సంఘం జిల్లా కార్యదర్శి కోణకంచి వీరభద్రయ్య అన్నారు. మంగళవారం చివ్వెంల మండల పరిధిలోని బి.చందుపట్ల గ్రామంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. 12 సంవత్సరాల క్రితం భూదాన్ భూముల్లో హైకోర్టు ఆర్డర్ ద్వారా ఇళ్లు నిర్మించుకున్న పేదల ఇళ్లను కూల్చి వేయడం కోర్టు ధిక్కరణే అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని ఆరోపించారు. యల్లయ్య, భద్రయ్య, వెంకన్న, లింగయ్య, సునిల్ పాల్గొన్నారు. -
సోలాపూర్ నుంచి పట్టువస్త్రాలు
మహారాష్ట్రలోని సోలాపూర్కు చెందిన చాట్లా శారీ సెంటర్కు చెందిన కేశవ్ చాట్లా, ఉమా చాట్లా, కృష్ణాకాంత్ చాట్లా, సోనాలి చాట్లాలు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. సోమవారం యాదగీరిశుడిని దర్శించుకున్న అనంతరం గోవర్ధనగిరిధారి అలంకార సేవ ముందు జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఈఓ భవానీ శంకర్, అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తికి వారు పట్టువస్త్రాలు అందజేశారు. 8 పట్టు చీరలు, 5 పట్టు పంచెలను ఆలయాధికారులకు అందించామని, గత 25 సంవత్సరాలుగా స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పట్టువస్త్రాలు అందిస్తున్నామని కేశవ్ చాట్లా వెల్లడించారు. -
వరిలో తెగుళ్లు – నివారణ చర్యలు
త్రిపురారం : యాసంగి సీజన్లో వరి పంటకు సోకే తెగుళ్లు, చీడపీడలను రైతులు సరైన సమయంలో గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. లేదంటే దిగుబడి తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం రైతులకు సకాలంలో యూరియా దొరక్క వరి చేలు గిడసబారిపోతున్నాయి. సాగర్ ఆయకట్టు కింద వరి చేలు ప్రస్తుతం పొట్ట దశలో ఉండగా.. పలు ప్రాంతాల్లో ఈనిక దశలో ఉన్నాయి. ఈ క్రమంలో వరి పంటకు సోకే చీడపీడలు, వాటి నివారణకు కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) ప్రోగాం కోఆర్డినేటర్ చంద్రశేఖర్ సూచనలు.. ● అగ్గి తెగులు : వరి పంటలో వచ్చే అగ్గి తెగులు నివారణకు ట్రైసైక్లోజోల్ 1.6 గ్రాములు లేదా కాసుగామైసిన్ 2.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. నత్రజని ఎరువులను తగ్గించుకొని, పొలం గట్లపై కలుపును తీసివేయాలి. ● మొగి పురుగు లేదా కాండతొలుచు పురుగు : వరి పంటలో వాతావరణ పరిస్థితులను బట్టి కాండం తొలుచు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 ఎస్పీ 2 గ్రాములు లేదా 0.3 మి.లీ. క్లోరాట్రానిలిపోల్ 18.5 ఎస్పీ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి ● కాండం కుళ్లు తెగులు : కాండం కుళ్లు తెగులు నివారణకు 2 మి.లీ. హెక్సాకోనాజోల్ లేదా 1 గ్రాము కార్బండిజమ్ లేదా 1 మి.లీ. టేబుకో నాజోల్ 15 రోజులు వ్యవధిలో రెండు సార్లు పలకల కింద వరకు తడిచే విధంగా పిచికారీ చేసుకోవాలి. ● ఆకు ముడత తెగులు : వరిలో ఆకు ముడత తెగులు నివారణకు కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు లేదా క్లోరిపైరిపాస్ 2.5 మి.లీ. లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటరు నీటిలో కలిపి చేనుపై పిచికారీ చేసుకోవాలి ● ఉల్లికోడు తెగులు : వరిలో ప్రస్తుత పరిస్థితుల్లో ఉల్లికోడు తెగులు ఎక్కువగా ఆశిస్తున్నందున దీని నివారణకు నాటిన 10 నుంచి 15 రోజుల కార్బోఫ్యూన్ గులికలు ఎకరాకు 10 కిలోలు లేదా ఫోరేట్ గులికలు 5 కిలోలు ఎకరాకు లేదా ఫిప్రోనిల్ 2.5 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ● ఎండాకు తెగులు : నారుమడి దళ నుంచి గింజ పాలు పోసుకునే వరకు ఎండాకు తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. చెట్టు నీడ పడే ప్రదేశంలో ఎక్కువగా ఎండాకు తెగులు ఆశించి మిగిలిన పంటకు వేగంగా వ్యాప్తిస్తుంది. ఈ తెగులు సోకిన ప్రదేశంలో ముదురు ఆకులకు పసుపు రంగు మచ్చలు ఏర్పడి పైనుంచి కింది అంచుల వెంబడి వ్యాప్తించి ఎండుతూ వస్తాయి. ఉదయం సమయంలో ఆకుల మీద పసుపు రంగు జిగురు ముద్దలు కనబడతాయి. ఎండ వేడిమికి గట్టిపడి రాలిపోతాయి. ఈ ఎండిన బాక్టీరియా ముద్దలు నీటి ద్వారా వెళ్లి మిగిలిన పంటకు వ్యాప్తిస్తుంది. నివారణ చర్యలుఎండాకు తెగులు సోకిన మొక్కల నుంచి మిగతా పంటకు నీరు పారకుండా చూసుకోవాలి. ఈ తెగులు ఆశించిన పొలంలో నత్రజని వేయకూడదు. కాపర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రాములు మరియు ప్లాంటోమైసిన్ 4 గ్రాములు లేదా పోషామైసిన్ లేదా స్రైటప్లోసైక్లిన్ 4 గ్రాములు 10 లీటర్ల నీటిలో కలిపి 2 నుంచి 3 సార్లు వారం వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి. కేవీకే కంపాసాగర్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ చంద్రశేఖర్ సూచనలు -
గోవర్ధనగిరిధారిగా అభయమిస్తూ..
● సింహ వాహనంపై ఊరేగిన యాదగిరీశుడు ● నేడు ఎదుర్కోలు ఉత్సవంయాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. సోమవారం ఉదయం ఆలయంలో నిత్య కై ంకర్యాలు పూర్తిచేసి యాగశాలలో హవన పూజలు జరిపించారు. అనంతరం స్వామివారిని గోవర్ధనగిరిధారిగా అలంకరించి ప్రధానాలయం తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ అలంకార సేవను ఆలయ తూర్పు మాడ వీధిలో వేంచేపు చేసి పారాయణాలు, వేద మంత్రాలు పఠించారు. ఈ వేడుకల్లో ఆలయ ఈఓ భవానీ శంకర్, అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి, ఆలయ ప్రధానార్చకులు కాండూరి వెంకటచార్యులు, సురేంద్రాచార్యులు, అర్చకులు, పారాణీకులు, రుత్వికులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సాయంత్రం సింహ వాహనంపై.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం ఆలయంలో అర్చకులు, రుత్వికులు, పారాయణీకులు ప్రబంధ పారాయణం, మూలమంత్ర జపములు, నిత్యారాధనలు కొనసాగించారు. అనంతరం స్వామి వారిని సింహ వాహనంపై ఊరేగించారు. ఆ తర్వాత తూర్పు మాడ వీధిలో వేంచేపు చేసి పారాయణం పఠించి, స్వామి విశిష్టతను వివరించారు. ఏర్పాట్లను పరిశీలించిన డీఎస్పీ మంగళ, బుధవారాల్లో ఎదుర్కోలు మహోత్సవం, తిరు కల్యాణోత్సవం జరగనున్న నేపథ్యంలో ఆలయ పరిసరాలు, తూర్పు మాడ, తిరు వీధులను యాదగిరిగుట్ట డీఎస్పీ శ్రీనివాస్నాయుడు సోమవారం రాత్రి ఆలయాధికారులతో కలిసి పరిశీలించారు. భక్తులు ఇబ్బందులు కల్గకుండా తీసుకోవాల్సిన అంశాలను కొండపైన ఎస్పీఎఫ్ ఆర్ఐ శేషగిరిరావు, యాదగిరిగుట్ట పట్టణ సీఐ భాస్కర్తో ఆయన చర్చించారు. కొనసాగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు స్వామి వారి అలంకార సేవ ముందు వెంకట అన్నమాచార్య సేవా ట్రస్టు ఆధ్వర్యంలో పలువురు కళాకారులు కోలాటం, నృత్యాలు చేశారు. దశావతార వేషధారణలు ఆకట్టుకున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కార్వాన్లోని విశ్వాంజనేయ భక్త సమాజం, మైలార్గూడెంలోని జై శ్రీరామ భక్త భజన మండలి, భూదాన్ పోచంపల్లికి చెందిన మార్కండేశ్వరస్వామి భజన మండలి, రంగారెడ్డికి చెందిన అభ్యుదయ కళా సమితి ఆధ్వర్యంలో భజన, భక్తి సంగీత కార్యక్రమాలు కొనసాగాయి. ఆస్థానపరంగా మంగళవాయిద్యం, వైధిక ప్రార్థన జరిపించారు. హైదరాబాద్కు చెందిన డాక్టర్ మానస చెన్నప్ప నవవిధ భక్తితత్త్వములు, ప్రహ్లాదుని భక్తిపై ఉపన్యసించారు. పురాణం విజయలక్ష్మి రుక్మిణి కల్యాణం, హరికథా గానం చేశారు. మావుడూరు సత్యనారాయణ శర్మ వయోలిన్ వాయిద్యం, హైదరాబాద్లోని మంజుల డాన్స్ అకాడమీ కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చారు. సాయంత్రం వేళ కచ్చపి కళా క్షేత్రం భక్తి సంగీతం, హైదరాబాద్కు చెందిన భరద్వాజ నాట్యాలయం కళాకారులు కూచిపూడి నృత్య ప్రదర్శన, లావణ్య లత భక్తి సంగీతం, ఓలేటి రంగమణి సింహనందిని నృత్యం, హరిప్రియ భక్తి సంగీతం కార్యక్రమాలు కొనసాగాయి.బ్రహ్మోత్సవాల్లో నేడు..మంగళవారం ఉదయం స్వామివారిని జగన్మోహిని అలంకార సేవలో ఊరేగిస్తారు. రాత్రి అశ్వవాహనంపై స్వామివారిని ఊరేగించి ఎదుర్కోలు ఉత్సవం జరిపించనున్నారు. ఆలయ తూర్పు మాడ వీధిలో ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు. -
తైక్వాండో పోటీల్లో బంగారు పతకం
రామగిరి(నల్లగొండ) : హైదరాబాద్ గచ్చి బౌలి స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి తైక్వాండో అండర్–17 విభాగం పోటీల్లో ఎన్జీ కళాశాలకు చెందిన ఎన్.మనోజ్యాదవ్ ఉత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించాడు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ సోమవారం మనోజ్యాదవ్ను అభినందించారు. కార్యక్రమంలో ఫిజికల్ సైన్స్ ఇన్చార్జ్ డాక్టర్ శ్రీనివాస్రెడ్డి, నర్సింగ్ కోటయ్య, వెంకటేశ్, మన్నెం వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. దొంగతనం కేసులో ఏడు నెలల జైలుశిక్ష నకిరేకల్ : దొంగతనం కేసులో నిందితుడికి ఏడు నెలల జైలుశిక్ష విధిస్తూ నకిరేకల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్కే ఆరిఫ్ సోమవారం తీర్పు వెలువరించారు. నకిరేకల్ పట్టణంలోని విద్యానగర్లో నివాసముంటున్న ఎస్కే జాఫర్ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన రమావత్ శంకర్నాయక్పై నేరం రుజువు కావడంతో అతడికి ఏడు నెలల జైలుశిక్షతో పాటు రూ.500 జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు వెలువరించారని నకిరేకల్ సీఐ హరిబాబు పేర్కొన్నారు. సాగర్ కాలువలో పడి వ్యక్తి మృతి తిరుమలగిరి(సాగర్): నాగార్జునసాగర్ ఎడమ కాల్వ మొదటి మేజర్ అయిన రాజవరం మేజర్ కాలువలో ప్రమాదవశాత్తు కాలుజారి పడి వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన సోమవారం రాత్రి జరిగింది. వివరాలు.. అల్వాల గ్రామానికి చెందిన బక్కతట్ల వెంకటేశ్వర్లు(38)తో పాటు అతడి బావ, మామ రాజవరం మేజర్ కాలువ వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో కాలువ వద్దకు మూత్ర విసర్జనకు వెళ్లిన వెంకటేశ్వర్లు కాలు జారి ఒక్కసారిగా కాలువలో పడిపోయాడు. అతని బావ, మామకు ఈత రాకపోవడంతో చుట్టుపక్కల వారిని పిలుచుకొచ్చి వెంకటేశ్వర్లును కాలువ నుంచి బయటకు తీసి చికిత్స నిమిత్తం హాలియాకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. దీంతో పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సాగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
● 5 తులాల బంగారం, రూ.లక్ష నగదు అపహరణదేవరకొండ: తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి 5 తులాల బంగారం, రూ.లక్ష నగదు అపహరించారు. ఈ ఘటన దేవరకొండ మండలం కొండభీమనపల్లి గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండభీమనపల్లి గ్రామానికి బొడ్డుపల్లి శంకరయ్య ఆదివారం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్కు వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన గుర్తుతెలియని వ్యక్తులు శంకరయ్య ఇంటి తాళాలు పగులకొట్టి బీరువాలో ఉన్న 5 తులాల బంగారం, రూ.లక్ష నగదు ఎత్తుకెళ్లారు. సోమవారం శంకరయ్య హైదరాబాద్ నుంచి ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి తాళాలు పగులగొట్టి ఉండడంతో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు పోలీసులు నమోదు చేసి క్లూస్ టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. అనుమానాస్పద ిస్థితిలో వ్యక్తి మృతి చివ్వెంల(సూర్యాపేట) : చివ్వెంల మండలం వల్లభాపురం గ్రామ శివారులోని ఇటుక బట్టీలో సోమవారం అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. విశ్వసనీయ సమాచారం మేరకు.. దురాజ్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని తెల్లబండ కాలనీకి చెందిన పల్లపు రాజు(35) వల్లభాపురం గ్రామ శివారులోని ఇటుక బట్టీలో ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం అతడు ఇటుక బట్టీ వద్ద అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రాజు మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఎస్ఐ వి. మహేశ్వర్ను వివరణ కోరగా తమకు ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు. -
సీతారామంజనేస్వామి ఆలయంలో చోరీ
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట మండలం కుప్పిరెడ్డిగూడెం గ్రామ శివారులోని సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలయ ముఖద్వారానికి వేసిన తాళాన్ని రాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు పగులగొట్టి లోపలికి వెళ్లి సీతమ్మ అమ్మవారి మెడలో ఉన్న రెండు గ్రాముల బంగారం పుస్తెలతాడు, హుండీలోని నగదు ఎత్తుకెళ్లారు. సోమవారం ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బాలునాయక్ తెలిపారు. మద్యం షాపులో.. సూర్యాపేటటౌన్ : సూర్యాపేట మండలం పిల్లలమర్రి గ్రామ శివారులోని కేటీ అన్నారం క్రాస్ రోడ్లోని జీకే వైన్స్లో ఆదివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తుతెలియని వ్యక్తులు షాపు పైకప్పు ఊడదీసి లోపలికి ప్రవేశించి కౌంటర్లో ఉంచిన రూ.14,500 నగదు, ఐదు ఫుల్ బాటిళ్ల మద్యం ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం వైన్స్ క్యాషియర్ నాగరాజు చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ ఎస్ఐ బాలునాయక్ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో పాస్టర్ దుర్మరణం
కోదాడరూరల్ : విజయవాడ– హైదరాబాద్ జాతీయ రహదారిపై కోదాడ మండల పరిధిలోని దోరకుంట గ్రామ శివారులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చర్చి పాస్టర్ మృతిచెందగా.. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. కోదాడ రూరల్ ఎస్ఐ సీహెచ్. గోపాల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ పట్టణంలోని నయానగర్కు చెందిన ఉప్పెల్లి సత్యంబాబు(48) చర్చి పాస్టర్గా పనిచేస్తున్నాడు. పని నిమిత్తం కారులో డ్రైవర్ తిరపయ్యను తీసుకొని చిమిర్యాల గ్రామానికి వెళ్తున్నాడు. మార్గమధ్యలో దోరకుంట గ్రామ శివారులోకి వెళ్లగానే.. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి డివైడర్ను ఢీకొట్టి అవతలి వైపు నుంచి వస్తున్న సత్యంబాబు కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సత్యంబాబు అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవర్ తిరపయ్యకు గాయాలుయ్యాయి. హైదరాబాద్ వైపు వెళ్తున్న కారులో ఉన్న సాయిదుర్గ, గాయత్రి, స్వప్న, మాధవి మురళీకృష్ణతో పాటు డ్రైవర్ నితీష్కు కూడా గాయాలు కావడంతో స్థానికులు వారిని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి భార్య కాంతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మరో ఆరుగురికి గాయాలు -
నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి
నల్లగొండ టౌన్ : కర్ల రాజేష్ మృతిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని ఈ కేసు విచారణ అధికారి, నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ను సోమవారం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంద కృష్ణమాదిగ మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధంగా పోలీసులు పనిచేయకపోవడం వల్లే కర్ల రాజేష్ మృతిచెందాడని ఆవేదన వ్యక్తం చేశారు. స్టేషన్ హౌజ్ ఆఫీసర్గా ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎస్ఐని అరెస్ట్ చేయకుండా ఈ కేసుతో సంబంధం లేని సీఐని సస్పెండ్ చేశారని ఆరోపించారు. ఎస్ఐని కాపాడేందుకు పోలీసు ఉన్నతాధికారులు, కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అన్నారు. గతంలో అడ్డగూడూరు లాకప్ డెత్ జరిగినప్పుడు ఎస్ఐని సస్పెండ్ చేసిన పోలీసులు చిలుకూరులో మాత్రం సీఐని సస్పెండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కర్ల రాజేష్ మృతదేహానికి ఈ నెల 26న బీబీనగర్ ఎయిమ్స్ వైద్య నిపుణులతో రీపోస్టుమార్టం చేయిస్తామని ఎస్పీ హామీ ఇచ్చినట్లు తెలిపారు. రెండు నెలల క్రితమే జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ రీపోస్టుమార్టంకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ సూర్యాపేట జిల్లా పోలీస్ అధికారుల నిర్లక్ష్యం వల్లే అది జరగలేదన్నారు. ఇప్పటికై నా న్యాయబద్ధంగా రీపోస్టుమార్టం చేయించాలని కోరారు. నిజాయితీగా పనిచేసే పోలీసులు అంటే తమకు ఎంతో గౌరవం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు బకరం శ్రీనివాస్ మాదిగ, మాదిగ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు గాదె రమేష్, ఎంఈఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపాక వెంకన్న మాదిగ, లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ జిల్లా నరసింహ, ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు మేడి శంకర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తరి ఏడుకొండలు, నల్లగొండ నియోజకవర్గం ఇన్చార్జి బొజ్జ దేవయ్య మాదిగ, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోలి జనార్దన్గౌడ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఏర్పుల శ్రవణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ -
ప్రత్యేక ఆకర్షణగా డోలు, సన్నాయి కళాకారులు
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో డోలు, సన్నాయి కళాకారులు వాయించే మంగళ వాయిద్యాల శబ్ధం భక్తులకు ఆధ్యాత్మిక భావంలోకి తీసుకెళ్తున్నాయి. ఆలయంలో ఉదయం సుప్రభాతం నుంచి రాత్రి శయనోత్సవం వరకు ప్రతిరోజు దేవుడి సేవలో డోలు, సన్నాయి కళాకారులు పాలుపంచుకుంటున్నారు. అంతేకాకుండా బ్రహ్మోత్సవాల్లో సైతం పూజలు, ఉదయం, రాత్రి జరిగే అలంకార సేవ, వాహన సేవలో ఈ డోలు, సన్నాయి బృందం సభ్యులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. సన్నాయిలో నుంచి వచ్చే సంగీతానికి తగినట్లుగా డోలు వాయిస్తుంటే ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరు భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు.భక్తి భావాన్ని పెరుగుతుంది స్వామికి సంప్రదాయ పద్ధతిలో మంగళకరమైన వాయిద్యాన్ని మోగిస్తుంటే భక్తి భావం పెరుగుతుంది. బ్రహ్మోత్సవాలతో పాటు ప్రత్యేక రోజుల్లో ఏఏ పాటలను సన్నాయిలో నుంచి తీసుకురావాలనే అంశాన్ని ఆలోచిస్తాం. బ్రహ్మోత్సవాలు వచ్చాయంటే కచ్చితంగా ప్రతిరోజు ఏ సేవ ఉంటుందో ఆ సేవకు తగిన పాటను సన్నాయిలో నుంచి తీసుకురావడం ఎంతో సంతోషాన్నిస్తుంది. – తిరుపతయ్య, సన్నాయి కళాకారుడు స్వామి సేవకు అంకితమయ్యాను గత 16 ఏళ్లుగా యాదగిరి లక్ష్మీనరసింహస్వామి సేవకు అంకితమయ్యాను. దేవుడికి ఆలపించే పాటకు తగ్గట్లుగా డోలు వాయించడం ఎంతో అనుభూతిని కలిగిస్తుంది. బ్రహ్మోత్సవాలు వస్తే ఆలయానికి వచ్చే భక్తులకు భక్తిని పెంపొందించే విధంగా మా సభ్యులమంతా కృషి చేస్తున్నాం. డోలు వాయిస్తున్నంత సేపు మేము కూడా ఆ స్వామిని ధ్యానిస్తూ ఆధ్యాత్మిక లోకంలో ముగినిపోతాం. – రాము తిరుపాలి, డోలు కళాకారుడు -
ముగిసిన సీఎం కప్ ఖోఖో పోటీలు
నల్లగొండ టూ టౌన్ : నల్లగొండ జిల్లా కేంద్రంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న సీఎం కప్ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు సోమవారంతో ముగిశాయి. చివరి రోజు పోటీలు హోరాహోరీగా జరిగాయి. బాలుర విభాగంలో ఆదిలాబాద్ జిల్లా జట్టు, బాలికల విభాగంలో ఆసిఫాబాద్ జిల్లా జట్టు విజేతలుగా నిలిచాయి. బాలికల విభాగంలో నల్ల గొండ జట్టు ద్వితీయ బహుమతి, బాలుర విభాగంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జట్టు ద్వితీయ బహుమతులు కై వసం చేసుకున్నాయి. ముగింపు కార్యక్రమానికి నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్రెడ్డి ముఖ్యఅతిథిగా మాట్లాడారు. 33 జిల్లాల నుంచి 450 మంది బాలికలు, 450 మంది బాలురు ఈ ఖోఖో పోటీల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. సీఎం కప్ క్రీడాపోటీలతో గ్రామీణ క్రీడాకారులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. అనంతరం విజేతలకు మేయర్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ హఫీజ్ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, తెలంగాణ ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, డీవైఎస్ఓ అక్బర్ అలీ తదితరులు పాల్గొన్నారు. బాలుర విభాగంలో విజేతగా ఆదిలాబాద్ జట్టు బాలికల విభాగంలో ఆసిఫాబాద్ జట్టుకు ప్రథమ బహుమతి -
హక్కుల సాధనకు ఏకం కావాలి
తిరుమలగిరి ( తుంగతుర్తి) : గిరిజనుల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహారాజ్ స్ఫూర్తితో లంబాడీలు ఐక్యంగా ఉండి హక్కులను సాధించుకోవాలని ఆల్ ఇండియా బంజార సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు లూనావత్ పాండునాయక్, కార్యదర్శి ధరావత్ వీరన్ననాయక్ అన్నారు. ఆదివారం మండలంలోని మొండిచింత తండాలో సర్పంచ్ లావుడ్యా శ్రీలతబాలాజీ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలో వారు పాల్గొన్నారు. ముందుగా భోగ్ బండార్ నిర్వహించి సేవాలాల్కు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బంజారలకు సంక్షేమ పథకాలను అందించాలని కోరారు. అంతకు ముందు లంబాడీల వేషధారణలో మహిళలు చేసిన నృత్యాలు, కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. ఏఐబీఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు గుగులోతు నాగునాయక్, యూత్ జిల్లా అధ్యక్షుడు లావుడ్యా బాలాజీ నాయక్, ఉప సర్పంచ్ జాటోత్ శిరీష శీను, మాజీ సర్పంచ్ లావుడ్యా మోహన్ బాబు, గుగులోతు వెంకన్న నాయక్ పాల్గొన్నారు. -
26 నుంచి బ్రహ్మోత్సవాలు
మునగాల : రెండవ యాదగిరిగుట్టగా పేరున్న మునగాల మండలం రేపాల గ్రామంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్నాయి. పది రోజుల పాటు జరిగే ఉత్సవాలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రకృతి నిలయంలో ఉన్న లక్ష్మీనరసింహుడి ఆలయ పరిసర ప్రాంతంలో విశాలమైన కల్యాణ మండపం, చింతచెట్లు, దగ్గరలో పెద్ద కోనేరు ఉండడం ఇక్కడి ప్రత్యేకత. 10రోజులపాటు ఉత్సవాలు రాజ్యలక్ష్మీ సమేత లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 26 నుంచి మార్చి7 వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ సారిక రామయ్యయాదవ్ తెలిపారు. పది రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు స్వామివారు సిరిపురం నుంచి ఆలయానికి రాక, 27న అధ్యయనోత్సవం, 28న పరమపదోత్సవం, మార్చి ఒకటో తేదీన ద్వజారోహణం(గరుడముద్ద), 2న సాయంత్రం 6 గంటలకు డోలోత్సవం, అదే రోజు రాత్రి 10 గంటలకు స్వామి వారి కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మార్చి 3న ఉదయం 10 గంటలకు లక్ష కుంకుమార్చన, 4న రాత్రి ఎనిమిది గంటలకు గరుడోత్సవం, రథోత్సవం, 5న ఉదయం చక్రతీర్ధం, రాత్రికి పూర్ణాహుతి, ధ్వజారోహణం, దోపు, 6న రాత్రి 10 గంటలకు గాంధోళి(వసంతోత్సవం), 7న రాత్రి 9గంటలకు స్వామి పవళింపు సేవ, రాత్రి 12 గంటలకు స్వామి వారు సిరిపురం వేంచేయడంతో ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయన్నారు. ఉత్సవాలకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు చైర్మన్ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఫ పది రోజుల పాటు రేపాల లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ఉత్సవాలు ఫ ఏర్పాట్లు చేస్తున్న ఆలయ కమిటీ -
నేటి నుంచి ప్రజావాణి
భానుపురి (సూర్యాపేట) : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 23 నుంచి యథావిధిగా కొనసాగిస్తామని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజలు, దరఖాస్తుదారుల నుంచి వినతులు స్వీకరించి పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి సద్విని యోగం చేసుకోవాలని కోరారు. సూర్యక్షేత్రంలో సౌరహోమంఅర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారు జామున ఉషాపద్మిని ఛాయాసమేత సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. యజ్ఞశాలలో మహా సౌరహోమం నిర్వహించారు. క్షేత్ర ఆవరణలోని కార్యసిద్ధి వీరహనుమాన్, రామకోటి స్తూపాలను భక్తులు దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితాజనార్ధన్, గణపురం నరేష్, ఇంద్రారెడ్డి, యాదగిరి, అర్చకులు భీంపాండే, అంకిత్పాండే, శ్రీరాంపాండే పాల్గొన్నారు. లక్ష్మీనరసింహుడికి విశేష పూజలుమఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో ఆదివారం స్వామివారికి అర్చకులు విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనరసింహస్వామికి సుప్రభాతసేవ, హోమశాలలో నిత్యఅగ్నిహోత్రి, మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం గోదాదేవికి, ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. లక్ష్మీనరసింహస్వామి, అమ్మవార్లలను పట్టు వస్త్రాలంకరణతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవం నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవారి నిత్య కల్యాణాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా స్వామి వారికి నీరాజన మంత్ర పుష్పాలతో మహానివేదన చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ బి.జ్యోతి, అర్చకులు పాల్గొన్నారు. యువత భవిష్యత్ కోసం ఉపాధ్యాయుడి ఆరాటంసూర్యాపేటటౌన్ : యువత బంగారు భవిష్యత్ కోసం మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరుతూ ప్రభుత్వ ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ ప్రతి ఆదివారం వివిధ రూపాలలో ప్రచారం నిర్వహిస్తున్నాడు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శంకర్విలాస్ సెంటర్, కూరగాయల మార్కెట్ రోడ్డులో ఆదివారం సాయంత్రం కోయదొర వేషధారణలో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా, రోడ్డు భద్రతపై యువతకు అవగాహన కల్పించారు. గంజాయి, డ్రగ్గ్స్కు బానిసలై యువత భవిష్యత్ నాశనం చేసుకోవద్దని కోరారు -
పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి
గరిడేపల్లి : ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.దామోదర్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని పొనుగోడు గ్రామంలో నిర్మించిన సంఘం భవన సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విధంగానే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఉద్యోగ విరమణ పొందిన వారికి నేటికీ పెన్షన్ అందక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్ల మంజూరు కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని, ఈ వయసులో వారు తిరిగే పరిస్థితి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల భవనాన్ని నిర్మించిన సంఘం మండల కమిటీని ఆయన అభినందించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు సుందరి నాగయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీతారామయ్య, సభ్యులు వెంకటమ్మ, చంద్రయ్య, బొట్ల రాంబాబు, శ్యాంసుందర్రెడ్డి, శ్రీనివాసరావు, కోటయ్య పాల్గొన్నారు. ఫ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్రెడ్డి -
వారం రోజులు అరైవ్– అలైవ్
ఫ రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన ఫ ఎస్పీ నరసింహ సూర్యాపేటటౌన్ : రోడ్డు ప్రమాదాల నుంచి ప్రజలను కాపాడేందుకు సోమవారం నుంచి జిల్లాలో వారం రోజుల పాటు రెండవ దశ అరైవ్–అలైవ్ (రోడ్డు భద్రత అవగాహన) కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ప్రతి ఒక్కరూ సురక్షితంగా గమ్యం చేరడం, ట్రాఫిక్ నియమాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఈ మేరకు సిబ్బందికి ఆదేశాలు, ప్రణాళిక జారీ చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా ప్రచారం చేస్తామని, ప్రజలకు ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. ద్విచక్రజు వాహనం నడిపే వారు హెల్మెట్ ధరించడం, కారు నడిపే వారు సీట్బెల్ట్ వినియోగం, వాహనాల మితిమీరిన వేగంతో నడ పకుండా ఉండడం, మద్యం సేవించి వాహనం నడపకూడదనే అంశాలపై ప్రతి రోజు ఒక కార్యక్రమం నిర్వహించి ప్రజలు, విద్యార్థులు, యువ కులతో పాటు వాహనాల డ్రైవర్లను చైతన్యవంతం చేస్తామని ఆయన పేర్కొన్నారు. గోదావరి జలాల పునరుద్ధరణఅర్వపల్లి : యాసంగి సీజన్కు వారబందీ విధానంద్వారా విడుదల చేస్తున్న గోదావరి జలాలను అధికారులు ఆదివారం రాత్రి పునరుద్ధరించారు. వారం రోజులపాటు నీళ్లు రానున్నాయి. ప్రస్తుతం 1200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని, ఇవి జిల్లాలోని 69,70,71 డిస్ట్రిబ్యూటరీలకు వెళ్తాయని జలవనరుల శాఖ ఈఈ ఎం.సత్యనారాయణగౌడ్, బయ్యన్నవాగు ఏఈ చంద్రశేఖర్ తెలిపారు. జిల్లాలోని రైతులు సాగు నీటి పొదుపుగా వాడుకోవాలని వారు కోరారు. -
ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్ష
తుంగతుర్తి : గురుకుల ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. 2026–27 విద్యా సంవత్సరానికి గాను గురుకులాల్లో చేరే విద్యార్థులకు ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. మండల కేంద్రంలో రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో 360 మంది ప్రవేశపరీక్ష రాయాల్సి ఉండగా 338 మంది పరీక్షకు హాజరయ్యారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 504 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావలసి ఉండగా 471 మంది విద్యార్థులు హాజరయ్యారు. -
పేదలకు గృహలక్ష్మి యోగం
భానుపురి (సూర్యాపేట) : గత బీఆర్ఎస్ ప్రభుత్వ జాగా ఉన్న నిరుపేదలు ఇల్లు నిర్మించుకునేందుకు రూ.3లక్షల ఆర్ధిక సాయం అందించేలా గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. అయితే పథకం ప్రారంభించిన కొద్దిరోజులకే ప్రభుత్వం మారడంతో లబ్ధిదారులు ప్రయోజనం పొందలేక పోయారు. అటువంటి వారికి కూడా ఇందిరమ్మ ఇళ్ల కింద ప్రయోజనం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం అధికారులు లబ్ధిదారులను గుర్తించే పనుల్లో ఉన్నారు. బేస్మెంట్ లెవల్లోనే.. గత ప్రభుత్వం జాగా ఉండి ఇల్లు నిర్మించుకునే ఆర్థిక స్థోమత లేని పేదలకు గృహలక్ష్మి పథకం ద్వారా రూ.3లక్షలు అందిస్తామని ప్రకటించింది. ఇందుకు గానూ లబ్ధిదారులను ఎంపిక చేసింది. చాలా మంది ఇంటి నిర్మాణాలను ప్రారంభించారు. అయితే ప్రభుత్వం మారడంతో ఈ పథకం నిలిచి పోయింది. ఈ పథకం కింద ఇల్లు మంజూరై, పనులు ప్రారంభించిన లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా ప్రస్తుత ప్రభుత్వం వారికి శుభవార్త అందించింది. బేస్మెంట్ దశ దాటి నిలిచిపోయిన ఇళ్లను పరిగణనలోకి తీసుకుంటూ మిగతా పనులు కొనసాగించేందుకు లబ్ధిదారులకు రూ.4 లక్షలు విడతల వారీగా అందించేలా ప్రభుత్వం జీఓ జారీ చేసింది. వీటిని ఇందిరమ్మ ఇళ్లుగా పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. నియోజకవర్గానికి 3వేల చొప్పున సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం రూ.3లక్షల ఆర్థిక సాయం అందించేలా 2023లో శాసనసభ ఎన్నికలకు నాలుగు నెలల ముందు అప్పటి ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని ప్రకటించింది. దాంతో పెద్ద ఎత్తున నిరుపేదలు దరఖాస్తు చేసుకోగా.. నియోజకవర్గానికి 3వేల చొప్పున ఇళ్లను ప్రకటించి లబ్ధిదారులను సైతం ఎంపిక చేసి మంజూరు పత్రాలను అందించిది. కొందరు నిర్మాణ పనులు చేపట్టగా.. ఇంకా కొందరు ఇళ్లు నిర్మించుకోవాలా..? వద్దా..? అన్న మీమాసంలో పడ్డారు. ఈ క్రమంలోనే ఎన్నికల కోడ్ కావడం, ప్రభుత్వం మారిపోవడంతో ఇళ్లు ప్రారంభించిన లబ్ధిదారులు వాటిని కొనసాగించలేక పోయారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసి ఇందిరమ్మ ఇళ్లను ప్రకటించి వాటి అమలుకు శ్రీకారం చుట్టింది. తాజాగా గృహలక్ష్మి లబ్ధిదారులను సైతం ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో చేరుస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం ఇటీవల జీఓ ఆర్టీ 936 తీసుకొచ్చింది. ఈ జీఓ మార్గదర్శకాల మేరకు ఉన్నవారిని గుర్తిస్తాం. జిల్లాలో ఈ విధంగా ఉన్న లబ్ధిదారులు ఎవరూ ఉండకపోవచ్చు. –సిద్ధార్థనాయక్, హౌసింగ్ పీడీఫ ఇందిరమ్మ ఇళ్లుగా పరిగణనలోకి తీసుకోనున్న ప్రభుత్వం ఫ బేస్మెంట్ స్థాయిలో నిలిచిన వాటికి వర్తింపు ఫ లబ్ధిదారుల గుర్తింపు పనిలో అధికారులు అప్పట్లో మంజూరైన గృహలక్ష్మి ఇల్లు ప్రారంభించిన లబ్ధిదారులు మొదటగా సొంత ఖర్చుతో కొంత మేర నిర్మించుకున్నారు. ఎలాంటి నిబంధనలు లేకపోవడంతో ఇష్టానుసారంగా స్థామతను బట్టి నిర్మాణాలు చేపట్టారు. అయితే ఇందిరమ్మ ఇళ్ల మార్గదర్శకాలు మాత్రం వేరుగా ఉన్నాయి. గృహలక్ష్మి పథకంలో నిలిచిన ఇళ్లు కూడా 400 నుంచి 600 చదరపు అడుగుల మధ్యలోనే ఉండాలి. బేస్మెంట్ను ఆ రకంగా పునరుద్ధరించుకోవాలి. బేస్మెంట్ నిర్మించుకున్నందున దశలవారీగా రూ.4 లక్షలు అందిస్తారు.(రూ్ఫ్స్థాయి రూ.లక్ష, స్లాబ్ పూర్తయితే రూ.లక్ష పనులు పూర్తయ్యాక రూ. 2 లక్షలు) -
ఖోఖో సంబురం
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ ఔట్డోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న సీఎం కప్ రాష్ట్ర స్థాయి బాలబాలికల ఖోఖో పోటీలు కొనసాగుతున్నాయి. ఆదివారం పోటీలను జిల్లా యువజన, క్రీడల అధికారి అక్బర్ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని మాట్లాడారు. విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో సత్తాచాటి తెలంగాణకు మంచిపేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని పిలుపునిచ్చారు. వివిధ జిల్లాల జట్లు నువ్వా నేనా అనే రీతిలో తలపడ్డాయి. ఈ కార్యక్రమంలో కోచ్లు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ పాలనలో దళితులపై దాడులు
మునగాల : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితులపై దాడులు పెరిగాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. ఆదివారం మండలంలోని నారాయణగూడెం గ్రామంలో ఎమ్మార్పీఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నారాయణగూడెంలో అగ్ర వర్ణాలకు చెందిన వారు మాలలపై విపరీతంగా దాడి చేశారన్నారు. తన స్వగ్రామమైన వరంగల్ జిల్లా శాయంపేటలో మాలబిడ్డపై దాడి జరిగితే దానిని తీవ్రంగా ఖండించి ఆ బిడ్డకు న్యాయం చేకూర్చినట్లు తెలిపారు. కారంచెడు, చుండూరు, ఈ మధ్య మరియమ్మపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించి వారికి న్యాయం చేసేంత వరకు ఎమ్మార్పీఎస్ పోరాడిందన్నారు. కోదాడ పట్టణానికి చెందిన కర్ల రాజేష్ పోలీసుల చిత్రహింసలతో మృతిచెందితే దానిని తీవ్రంగా ఖండించడంతో పాటు దోషులను శిక్షించాలని నాలుగు నెలలుగా పోరాటం చేస్తున్నామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సంఘటితమై పోరాడాలని పిలుపు నిచ్చారు. గడ్డం లింగయ్య యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మార్పీఎస్ సూర్యాపేట జిల్లా కన్వీనర్ ఏపూరి రాజుమాదిగ, జిల్లా ప్రధాన కార్యదర్శి పాతకొట్ల నాగరాజు మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు యాతాకుల రాజన్న మాదిగ, రాష్ట్ర నాయకుడు కొండపల్లి ఆంజనేయులు మాదిగ, జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి అంజయ్య మాదిగ, మండలాధ్యక్షుడు లంజేపల్లి శ్రీనుమాదిగ, సంఘం మండలాధ్యక్షుడు గుడిపాటి కనయ్య మాదిగ, మిట్టగణుపుల వీరబాబు తదితరులపాల్గొన్నారు. ఫ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ -
భూసేకరణ పనులు వేగవంతం చేయాలి
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో నిర్మించనున్న వివిధ ప్రాజెక్టులకు కావాల్సిన భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. శనివారం కలెక్టర్లోని సమావేశ మందిరంలో ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఆర్అండ్బీ, ఇరిగేషన్, టీజీ ఐఐసీ, రైల్వే శాఖ, పంచాయతీరాజ్ అధికారులతో భూ సేకరణ పనులపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇరిగేషన్ ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టులు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులతో పాటు వివిధ అభివృద్ధి పనులకు అవసరమైన భూసేకరణ, పెండింగ్లో ఉన్న భూసేకరణ పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవ్, సూపరింటెండెంట్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
విరామం.. వినియోగించుకుంటే విజయం
సూర్యాపేటటౌన్ : పదో తరగతి వార్షిక పరీక్షలు మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 13 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలు ప్రతి ఏడాది వారం, పది రోజుల్లో పూర్తవుతుంటాయి. ఈ ఏడాది రాష్ట్ర విద్యాశాఖ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. పేపర్, పేపర్కు కనీసం మూడు రోజుల విరామం ఉండేవిధంగా టైం టేబుల్ సిద్ధం చేశారు. ఈ సమయంలో విద్యాశాఖ రూపొందించిన ప్రణాళిక ప్రకారం విద్యార్థులను సన్నద్ధం చేయనున్నారు. ప్రస్తుతం విద్యార్థులకు ప్రీఫైనల్ పరీక్షలు జరుగుతున్నాయి. ఇవి 24వ తేదీన పూర్తి కానున్నాయి. విద్యార్థుల సన్నద్ధతకు ప్రత్యేక ప్రణాళిక ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేశారు. సమాధాన పత్రాలను ఆలస్యం చేయకుండా మూల్యాంకనం చేపట్టి విశ్లేషణ చేయడం, ప్రశ్నల వారీగా అంచనా, సమాధాన పత్రాలను రాసే సరైన విధానం, విద్యార్థులు సాధారణంగా చేసే తప్పులను ఉపాధ్యాయులు వివరించడం, మూల్యాంకనం చేసిన సమాధాన పత్రాలను విద్యార్థుల తల్లిదండ్రులను పంపించడం, విద్యార్థి ప్రగతిపై అవగాహన కల్పించడం వంటివి చేయనున్నారు. ప్రీఫైనల్ పరీక్షల అనంతరం ఉత్తీర్ణత కాని, సగటు మార్కులు తెచ్చుకున్న, మంచి ప్రగతిని చూపిన విద్యార్థులకు అనుగుణంగా విద్యా వ్యూహాలను అమలు చేయనున్నారు. జిల్లాలో 7205 మంది పదో తరగతి విద్యార్థులు జిల్లాలో 171 జెడ్పీ పాఠశాలలు, ఏడు ప్రభుత్వ ఉన్నత, రెండు ఎయిడెడ్, 18 కేజీబీవీ, 9 గురుకులాలు, మూడు రెసిడెన్షియల్స్, ఎనిమిది సోషల్ వెల్ఫేర్, తొమ్మిది మోడల్ స్కూల్స్, ఏడు ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 7,205 మంది పదో తరగతి విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నవంబర్ నుంచే ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నిర్వహించే ప్రత్యేక తరగతుల్లో రెండు నుంచి మూడు ముఖ్యమైన భావనలను వివరిస్తున్నారు. అలా. స్వయంగా చదవడం, రాత సాధన చేసేలా ఉపాధ్యాయులు మార్గనిర్దేశం చేస్తున్నారు. భానుపురి (సూర్యాపేట) : పదో తరగతి వార్షిక పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు పూర్తి అవగాహనతో పనిచేయాలని కలెక్టర్ తేజస్నంద్లాల్ పవార్ అన్నారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులతో ఒరియంటేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రశ్నపత్రాల భద్రత, రవాణా, సీలింగ్– అన్ సీలింగ్ విధానం, పరీక్షా కేంద్రాల్లో పర్యవేక్షణ, ఫ్లయింగ్ స్క్వాడ్ల సమన్వయం వంటి అంశాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రంలో తాగునీరు, విద్యుత్, ఫర్నిచర్, ఫస్ట్ ఎయిడ్ వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసం స్క్రైబ్ సౌకర్యం, అవసరమైన చోట వీల్చైర్లు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, ప్రభుత్వ పరీక్ష విభాగం అసిస్టెంట్ కమిషనర్ సీనయ్య పాల్గొన్నారు. ఫ మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు ఫ ఒక్కో పేపర్కు కనీసం మూడు రోజుల సమయం ఫ విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించాలన్న ఆలోచనతో నూతన విధానం పదో తరగతి పరీక్షలకు విద్యార్థులను ప్రణాళిక ప్రకారం సిద్ధం చేస్తున్నాం. ఇప్పటికే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుండగా అందులో విద్యార్థులకు ఏదైనా సందేహాలు ఉంటే సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయులు వివరిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పరీక్షకు, పరీక్షకు మధ్యలో మూడు రోజులు విరామ సమయం ఉంది. ఇది పరీక్ష ప్రిఫరేషన్కు దోహదపడుతుంది. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలి. – అశోక్, డీఈఓ -
పెన్షనర్ల సమస్యలపై నిరంతర పోరాటం
నేరేడుచర్ల : నేరేడుచర్ల మండల కేంద్రంలోని పెన్షనర్ల భవనంలో శనివారం సామూహిక జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ నెలలో జన్మించిన భువనగిరి లక్ష్మమ్మ, గుంపుల విజయతో కేక్ కట్ చేయించి సత్కరించారు. ఈ సందర్భంగా పెన్షనర్ల సంఘం నేరేడుచర్ల అధ్యక్షుడు చింతకుంట్ల పూర్ణచంద్రారెడ్డి మాట్లాడుతూ.. పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేస్తున్నామని తెలిపారు. హెల్త్కార్డులు లేని వారికి ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలన్నారు. 2024 ఏప్రిల్లో ఉద్యోగ విరమణ పొందిన పెన్షనర్లకు రావాల్సి న గ్రాట్యూటీ, ఏరియర్స్ చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో లక్ష్మారెడ్డి, రంగారెడ్డి, లక్ష్మీకాంతమ్మ, సత్యనారాయణ, వీరభద్రారావు, వెంకటేశ్వర్లు, బుద్దారెడ్డి, సుందరయ్య, వీరారెడ్డి, మంగ్య, శ్రీరామ్రెడ్డి, జయసుందర్రావు, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
సీ్త్రల అభ్యుదయానికి బీఆర్ అంబేద్కర్ విశేష కృషి
సూర్యాపేట : సీ్త్రల అభ్యుదయం, మహిళా సాధికారతకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చేసిన సేవలు మరవలేనివని జిల్లా కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాతి సవేందర్ కుమార్, జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంపెల్లి లింగయ్య యాదవ్ అన్నారు. శనివారం సంఘమిత్ర ఎడ్యుకేషనల్ చారిటబుల్ సొసైటీ అధ్యక్షుడు, న్యాయవాది తల్లమల్ల హసేన్ ఆధ్వర్యంలో స్పందన డిగ్రీ కళాశాలలో మాత రమాబాయి అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మహిళా సాధికారికతపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కుల, మత వర్గాలకు అతీతంగా అన్ని వర్గాల మహిళల హక్కుల కోసం ప్రథమ న్యాయ శాఖ మంత్రిగా ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెట్టారని, ఆ బిల్లును తిరస్కరించిన ప్రభుత్వానికి నిరసనగా తన న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేసిన గొప్ప త్యాగశీలి అని కొనియాడారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తీసుకొచ్చిన మహిళా విముక్తి ప్రదాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో తల్లమల్ల యాదమ్మ, రచయిత డి.నటరాజ్ అదనపు జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శశిధర్, డాక్టర్ కె.రంగారెడ్డి సీనియర్ సీనియర్ న్యాయవాదులు వసంత సత్యనారాయణ పిళ్లే యాదవ్, రమాదేవి, అశోక్, కళాశాల కరస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి, లీల, అఖిల్ పాల్గొన్నారు. -
అమెరికా సామ్రాజ్యవాద విధానాలను ఎండగట్టాలి
సూర్యాపేట అర్బన్: ఆధిపత్యం పేరుతో అమెరికా సామ్రాజ్యవాదం చేస్తున్న దురాగతాలను ఎండగట్టాలని, ప్రజలను చైతన్యం చేసి పోరాటాలు ఉధృతం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండీ అబ్బాస్ పిలుపునిచ్చారు. రెడ్ బుక్ డే సందర్భంగా శనివారం సూర్యాపేటలో సీపీఎం జిల్లా కార్యాలయంలో ‘బరితెగించిన అమెరికా సామ్రాజ్యవాదం’ పుస్తకాన్ని సామూహిక పఠనం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా దోపిడీని కొనసాగించేందుకు అమెరికా అంతర్జాతీయ మానవ హక్కులను, న్యాయ సూత్రాలను ఉల్లంఘిస్తుందన్నారు. గతంలో ఇజ్రాయిల్ను ప్రోత్సహించి పాలస్తీనాపై దాడులు చేసి మానవ హననం చేసిందన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు, కోట గోపి, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రతినెలా వంద సెల్ఫోన్లు రికవరీ చేస్తున్నాం
సూర్యాపేటటౌన్ : ప్రతి నెలా వందకు పైగా సెల్ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేస్తున్నామని ఎస్పీ నరసింహ తెలిపారు. పొగొట్టుకున్న 107 మొబైల్స్ను శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధితులకు అందజేశారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మొబైల్ రికవరీ చేసేందుకు సైబర్ వారియర్స్ పోలీస్, టెక్నికల్ టీం పోలీసు సిబ్బంది కృషి చేస్తున్నారన్నారు. బిహార్, ఒడిశా, జార్ఖండ్ ఇతర రాష్ట్రాల నుంచి కూడా మొబైల్స్ను రికవరీ చేసినట్లు తెలిపారు. ఎవరైనా మొబైల్ పోగొట్టుకున్నా, చోరీకి గురైనా వెంటనే సీఈఐఆర్ పోర్టల్లో నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, ఐటీ కోర్ ఆర్ఎస్ఐ రాజశేఖర్ పాల్గొన్నారు. ఫ ఎస్పీ నరసింహ -
అరుణోదయ సమాఖ్య జిల్లా కార్యవర్గం ఎన్నిక
అర్వపల్లి: అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక శనివారం అర్వపల్లిలో నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడిగా ఉదయగిరి, ఉపాధ్యక్షుడిగా బొల్లె వెంకన్న, ప్రధాన కార్యదర్శిగా కంచెనపల్లి సైదులు, సహాయ కార్యదర్శిగా ఎర్ర ఉమేష్, కోశాధికారిగా గుండు నాగేష్, కార్యవర్గ సభ్యులుగా తడకమళ్ల సంజీవ్, సామ నర్సిరెడ్డి, బోల్క పవన్ను ఎన్నుకున్నారు. సీపీఆర్పై అవగాహనసూర్యాపేటటౌన్ : కార్డియో పల్మోనరీ రిససిటేషన్ (సీపీఆర్)పై శనివారం జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఆర్బీఎస్కె టీం సభ్యులకు అవగాహన కల్పించారు. శిక్షకులు డాక్టర్ లక్ష్మీప్రసన్న, డాక్టర్ నాగరాజు, డాక్టర్ శ్రీకాంత్వర్మ సీపీఆర్ గురించి వివరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ పెండెం వెంకటరమణ, ఆర్బీఎస్కే టీం సభ్యులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్కు చేరిన ఇంటర్ ప్రశ్నపత్రాలు సూర్యాపేటటౌన్ : ఇంటర్ పరీక్షలు ఈ నెల 25 జరగనుండడంతో ప్రశ్న పత్రాలు శనివారం సూర్యాపేట పోలీస్స్టేషన్కు చేరాయి. సూర్యాపేట డిస్ట్రిక్ బల్క్ నుంచి ఇన్చార్జి పెరుమాళ్ల యాదయ్య ఆధ్వర్యంలో మూడు రూట్ల ద్వారా ప్రశ్నపత్రాలను తరలించారు. సూర్యాపేట పట్టణంలోని 12 పరీక్షా కేంద్రాలకు సంబంధించిన ప్రశ్న పత్రాలను పట్టణ పోలీస్ స్టేషన్లోని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. స్ట్రాంగ్ రూంను డీఐఈఓ భానునాయక్, డీఈసీ సభ్యులు రాజమోహన్, దుర్గాప్రసాద్ సందర్శించారు. ఎమ్మార్పీఎస్ జిల్లా కమిటీ రద్దు కోదాడ: ఎమ్మార్పీఎస్ జిల్లా కమిటీని రద్దు చేస్తున్నట్లు జిల్లా కన్వీనర్ బచ్చలకూరి వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం కోదాడలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కోదాడకు చెందిన కర్ల రాజేష్ మృతిపై ఎమ్మార్పీఎస్ మూడు నెలలుగా తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తున్నా జిల్లా కమిటీ కనీస స్థాయిలో స్పందించలేదన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాలతో జిల్లా కమిటీని రద్దు చేస్తున్నామని తెలిపారు. అదే విధంగా ఎమ్మార్పీఎస్ జిల్లా నూతన కన్వీనర్గా కోదాడకు చెందిన ఏపూరి రాజును నియమిస్తున్నట్లు ప్రకటించారు. సమావేశంలో కొండపల్లి ఆంజనేయులు, యలమర్తి రాము, కోటేష్, రవి, కుటుంబరావు, చిన్న వెంకట్రావ్, సైదులు, కొండలు, శ్రీకాంత్, సూర్యప్రకాశ్ పాల్గొన్నారు. 27వరకు పత్తి కొనుగోళ్లు భానుపురి (సూర్యాపేట) : సీసీఐ ఆధ్వర్యంలో ఈనెల 27వ తేదీ వరకు జిల్లాలోని రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేయనున్నట్లు జిల్లా మార్కెటింగ్ అధికారి నాగేశ్వరశర్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సీసీఐ ఈనెల 20వ తేదీ వరకే గడువు ఇవ్వగా రైతుల విజ్ఞప్తి మేరకు 27 వరకు పొడిగించించినట్లు పేర్కొన్నారు. రైతులు గమనించి తమ వద్ద ఉన్న పత్తిని విక్రయించేందుకు స్లాట్ బుక్ చేసుకుని రావాలని సూచించారు. మట్టపల్లిలో విశేష పూజలు మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో శనివారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. దేవాలయంలో శ్రీలక్ష్మీనరసింహస్వామికి సుప్రభాతసేవ, నిత్యహోమం మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి, అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం జరిపించారు. అనంతరం రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ పూర్తిగావించారు. -
మున్సిపాలిటీల్లో ఆదాయ వనరులపై పాలకవర్గాలు దృష్టి సారించాలి
సూర్యాపేట అర్బన్: మున్సిపాలిటీల్లో కొత్తగా ఏర్పడిన పాలకవర్గాలు వివిధ ఆర్థిక నిధులతో పట్టణ ప్రగతికి ప్రణాళిక తయారు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ఆర్థిక నిధులతో పాటు స్థానికంగా వచ్చే ఆదాయ వనరులపై దృష్టి సారించాల్సి ఉంటుంది. ప్రభుత్వాల నుంచి, స్థానికంగా వచ్చే నిధులపై సమగ్ర వివరాలు. పన్నుల ద్వారా ఆదాయం ముఖ్యంగా ఆస్తి పన్నుతో మున్సిపాలిటీలకు ఆదాయం సమకూరుతుంది. అలాగే పబ్లిసిటీకి సంబంధించి విద్య తదితర సంస్థల హోర్డింగ్ లు, సైన్ బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుంటారు. వాటి నుంచి వచ్చే ప్రకటన పన్నులపై ప్రత్యేక దృష్టి సారించాలి. నీటి పన్ను రాబట్టాలి. దుకాణాల లైసెన్స్లు, ట్రేడ్ లైసెన్సులు, హోటళ్లు, సినిమా థియేటర్ల అనుమతులకు రుసుం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కొత్తగా ఇంటి నిర్మాణాలు, షాపింగ్ కాంప్లెక్స్ సముదాయాలు, నిర్మాణ ప్లాన్ల ఆమోదానికి పన్నులు వసూలు చేస్తారు. మున్సిపాలిటీ నుంచి నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాల అద్దెలు, సంతలు, మాంసం దుకాణాలు, తైబజార్ లాంటి వాటితో మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది. 14వ ఆర్థిక సంఘం నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏటా రెండు విడతలుగా మున్సిపాలిటీ జనాభాకు అనుగుణంగా 14వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తుంది. ఇవి ప్రతి ఏటా ఏప్రిల్ మొదటి వారం, డిసెంబర్ చివరి వారంలో నేరుగా మున్సిపాలిటీ ఖాతాల్లో జమవుతాయి. వీటితో వివిధ వార్డుల్లో సీసీరోడ్లు నిర్మించే అవకాశం ఉంది ప్లానింగ్, నాన్ ప్లానింగ్ మున్సిపాలిటీల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాల కార్యక్రమాలు అమలు చేస్తాయి. ముఖ్యంగా స్వచ్ఛభారత్, మన పట్టణ ప్రణాళిక కార్యక్రమాలు విజయవంతం చేసి ఆయా వార్డులో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడానికి వినియోగిస్తారు. స్టేట్ ఫైనాన్స్ నిధులు జనాభా ప్రతిపాదికన మున్సిపాలిటీలకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా స్టేట్ ఫైనాన్స్ నిధులు విడుదల చేస్తుంది. అయితే రెండు మూడేళ్లుగా ఇవి సక్రమంగా రావడం లేదు. తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ పేరుతో డబ్బులు విడుదల చేస్తుంది. వీటిని పారిశుద్ధ్యానికి వివిధ రకాల పరికరాల కొనుగోలు చేసేందుకు ఖర్చు చేస్తారు. కౌన్సిల్ సమావేశంలో సభ్యుల తీర్మానం చేసిన తర్వాత ఈ నిధులను ఖర్చు చేయాలి. అడిషనల్ స్టేట్ ఫైనాన్స్ పేరుతో వచ్చే నిధులతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. మున్సిపాలిటీల్లోని ఎస్సీ, ఎస్టీ వార్డుల్లో సీసీ రోడ్లు, ములుగు కాలువల నిర్మాణాలు తదితర అభివృద్ధి పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు మంజూరు చేస్తుంది. వీటిని ఆయా వర్గానికి చెందిన వార్డుల్లో మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. కొత్తగా ఎన్నికై న పాలకవర్గం మున్సిపాలిటీ ఆదాయ వనరులు పెంచుకొని ప్రజలకు మౌలిక వసతులతో పాటు మెరుగైన పాలన అందించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపాలిటీ ప్రజలు కోరుతున్నారు. -
ప్రత్యేక బృందాలతో పరీక్షల పర్యవేక్షణ
ఇంటర్మీడియట్ పరీక్షలకు జిల్లాలో మొత్తం 30 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఎలాంటి అవకతవకలు జరగకుండా ప్రతి కేంద్రంలో 8 నుంచి 10 సీసీ కెమెరాలు ఉండే విధంగా చర్యలు తీసుకున్నాం. పరీక్షలను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రతి సెంటర్కు సీఎస్, డీఓలతో పాటు జిల్లాలో రెండు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు, రెండు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించాం. దాంతో పాటు ప్రిన్సిపల్, లెక్చరర్తో కూడిన ఎగ్జామినేషన్ కమిటీ కూడా ఏర్పాటు చేశాం. వీరు పరీక్షల తీరును నిరంతరం పర్యవేక్షిస్తారు. జిల్లా కలెక్టర్ తేజస్నంద్లాల్ పవార్ చైర్మన్గా, ఎస్పీ నరసింహ కో చైర్మన్గా, ఎ.గోపాల్ ఎక్స్అఫిషియో మెంబర్గా, డీఐఈవో భానునాయక్ మెంబర్గా ఉన్న హైపర్ కమిటీ కూడా పరీక్షలను పర్యవేక్షిస్తుంది. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. 16178 మంది విద్యార్థులు జిల్లాలో మొత్తం 86 ప్రభుత్వ, ప్రైవేట్ జూని యర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 16178 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందులో మొదటి సంత్సరం జనరల్ విభాగంలో 6,609 మంది, ఒకేషనల్ విభాగంలో 1579 మంది ఉన్నారు. అలాగే ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో 6,479 మంది, ఒకేషనల్ విభాగంలో 1511 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగనున్నాయి. మెరుగైన ఫలితాలు సాధించేలా.. గత ఏడాది కంటే మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రణాళికలు రూపొందించి విద్యార్థులను సిద్ధం చేశాం. ఈ విద్యా సంవత్సరం మూడు సా ర్లు తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాం. పిల్లల ప్రగతిపై వారికి వివరించాం. గ్రామీణ ప్రాంత విద్యార్థులు సత్ఫలితాలు సాధించేలా దిశానిర్దేశం చేశాం. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించాం. సూర్యాపేటటౌన్ : ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని, సీసీ కెమెరాలు ఉండే సెంటర్లను ఎంపిక చేశామని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి(డీఐఈఓ) భానునాయక్ తెలిపారు. ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఈ ఏడాది ఒక్క నిమిషం నిబంధన లేదని, ఐదు నిమిషాల్లోపు వచ్చిన వారికి కూడా అనుమతి ఉంటుందని వెల్లడించారు. శుక్రవారం డీఐఈఓ సాక్షి ఇంటర్వ్యూలో వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లోనే.. విద్యార్థులకు సంబంధించిన హాల్టికెట్లు ఆన్లైన్లో ఉంచాం. ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలు విద్యార్థులు ఫీజులు చెల్లించలేదని హాల్టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తే నేరుగా ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వెబ్సైట్లో ప్రథమ సంవత్సరం విద్యార్థులు పదో తరగతి హాల్టికెట్ నంబర్, పుట్టిన తేదీ, సెకండ్ ఇయర్ విద్యార్థులు మొదటి సంవత్సరం హాల్టికెట్, పుట్టిన తేదీ నమోదు చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ ఇంటర్ పరీక్షల్లో నిమిషం నిబంధన ఎత్తివేత ఫ ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతి ఫ సీసీ కెమెరాలతో నిఘా ఫ డీఐఈఓ భానునాయక్ -
వారం రోజులే గడువు
భానుపురి (సూర్యాపేట) : ఫార్మర్ రిజిస్ట్రీకి మరో వారం రోజులే మిగిలి ఉంది. ప్రతి రైతుకు గుర్తింపు సంఖ్యతో కూడిన కార్డులను మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ రిజిసీ్ట్ర ప్రక్రియను ప్రారంభించింది. అయితే ఇందుకోసం ఎలాంటి గడువు విధించకపోవడంతో రైతులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దాంతో ఈ ప్రక్రియ నత్తనడకన సాగింది. కానీ ప్రస్తుతం రైతుల గుర్తింపును ఈ నెల 28తో ముగించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందడంతో అధికారులు ప్రక్రియను వేగవంతం చేశారు. కేంద్ర పథకాలకు గుర్తింపు తప్పనిసరి కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న వ్యవసాయ పథకాల లబ్ధికి ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి చేసింది. నమోదుకు కూడా ఈ నెలాఖరు వరకే చివరి గడువుగా విధించింది. ఈ లోగా తమ పేర్లను నమోదు చేసుకోని రైతులకు ఇకపై కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలకు అర్హులుగా గుర్తించదు. జిలా రైతులు నష్టపోకుండా ఉండేందుకు అధికారులు ప్రత్యేక శిబిరాలతో ఈ ప్రక్రియను వేగవంతం చేశారు. ప్రారంభంలో రైతుల అనాసక్తి వ్యవసాయ రంగంలో రైతుల వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో నమోదు చేసుకున్న రైతులకు ఆధార్ కార్డులాగా 11 అంకెలతో కూడిన ఐడీని అందించనుంది. ఈ ప్రక్రియను జిల్లాలో 2025 మే 5న జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ప్రారంభించారు. ఈ సమయంలో వ్యవసాయ పనులు లేకపోవడంతో నెలరోజుల్లో 28.93 శాతం నమోదు చేసుకున్నారు. ఆ తరువాత వానాకాలం సీజన్ వ్యవసాయ పనులు మొదలు కావడంతో ఈ ప్రక్రియ అంతంత మాత్రంగానే కొనసాగుతూ వస్తోంది. మండలాల వారీగా నమోదు వివరాలుమండలం మొత్తం నమోదు శాతం రైతులు చేసుకున్నవారు అనంతగిరి 11,576 7127 61.57 ఆత్మకూర్ (ఎస్) 17,689 10,716 60.58 చిలుకూరు 12,820 7000 54.60 చింతలపాలెం 9759 6314 64.70 చివ్వెంల 15,8777 9,993 62.94 గరిడేపల్లి 19,807 11,329 57.20 హుజూర్నగర్ 12,372 6646 53.72 జాజిరెడ్డిగూడెం 10,630 7308 68.75 కోదాడ 16,271 10,040 61.70 మద్దిరాల 9,286 5209 56.10 మఠంపల్లి 13,456 7930 58.93 మేళ్లచెర్వు 11,367 6189 54.45 మోతె 14,455 9068 62.73 మునగాల 12,980 7893 60.81 నడిగూడెం 11,005 6810 61.88 నాగారం 11,103 6890 62.06 నేరేడుచర్ల 13,055 8122 62.21 నూతనకల్ 9,614 6650 69.17 పాలకీడు 8,947 5682 63.51 పెన్పహాడ్ 16,670 9670 58.01 సూర్యాపేట 19,082 10957 57.42 తిరుమలగిరి 11,869 6861 57.81 తుంగతుర్తి 12,873 7878 61.20 3,02,563 1,82,282 60.25వ్యవసాయ శాఖ అధికారులతో పాటు రెవెన్యూ, మండల పరిషత్, సహకార సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. గ్రామంలో ఫార్మర్ రిజిస్ట్రీ చేపట్టనున్నట్లు ముందుగానే ప్రచారం చేసి ఆయా శాఖల అధికారులు క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో 100 శాతం ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేయాలంటూ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అధికారులను ఆదేశించడంతో మూడు రోజులుగా ప్రక్రియ వేగవంతమైంది. ఈ ప్రక్రియ ఇప్పటి వరకు 60.25 శాతానికి చేరుకుంది. జిల్లావ్యాప్తంగా 3,02,563 మంది పాస్ పుస్తకాలు కలిగిన రైతులు ఉండగా.. 1,82,282 మంది రైతులు రిజిస్ట్రీ చేసుకున్నారు. నూతనకల్ 69.17 శాతంతో మొదటి స్థానంలో, 53.72 శాతంతో హుజూర్నగర్ మండలం చివరి స్థానంలో ఉంది.ఫ ఈ నెల 28తో ముగియనున్న ఫార్మర్ రిజిస్ట్రీ గడువు ఫ ఇప్పటి వరకు 60.25 శాతం నమోదు ఫ గ్రామాలల్లో ప్రత్యేక క్యాంపుల ఏర్పాటు -
అయ్యయ్యో..
సూర్యాపేట అర్బన్ : మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థుల కుటుంబాల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఎన్నికల్లో పోటీ కోసం చేసిన ఖర్చు ప్రస్తుతం భారంగా మారింది. తాము గెలుస్తామనే ఆశతో అందిన కాడికి అప్పులు తెచ్చిన అభ్యర్థులు ఇప్పుడు వాటిని తీర్చేదెలా అంటూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆస్తులు విక్రయించి మరీ.. సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, తిరుమలగిరి, నేరేడుచర్ల మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో ఒక్కో వార్డులో ముగ్గురు నుంచి నలుగురు అభ్యర్థులు పోటీ చేశారు. రిజర్వేషన్లు తమకు అనుకూలంగా రావడంతో గెలుస్తామనే ఆశతో తాహతుకు మించి ఖర్చుపెట్టినా ఫలితం లేకపోవడంతో ఓడిన అభ్యర్థులు దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. చాలా మంది ఎన్నికల ఖర్చు కోసం పొలాలు, ప్లాట్లు, ఇల్లు, బంగారం కుదువ పెట్టి అప్పులు తీసుకున్నారు. మరికొందరైతే ఏకంగా ఆస్తులను అమ్మి డబ్బులు తీసుకున్నారు. రూ.50 లక్షలకు పైగా విలువ ఉన్న ప్లాట్లను, పొలాలను కేవలం రూ. 20 నుంచి 30 లక్షలకే అమ్ముకున్నట్లు కొందరు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మరికొందరు తమకు నమ్మకం ఉన్నచోట, బంధువుల నుంచి లక్షల్లో అప్పులు తెచ్చి ఖర్చు పెట్టారు. తీరా ఫలితాలు విరుద్ధంగా రావడంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. 612 మంది పోటీ జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలలో ఉన్న 141 వార్డుల్లో 612 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఇందులో సూర్యాపేటలోని 48 వార్డుల్లో 264 మంది, కోదాడలోని 35 వార్డుల్లో 127 మంది, హుజూర్నగర్లోని 28 వార్డుల్లో 111 మంది, తిరుమలగిరిలోని 15 వార్డుల్లో 56 మంది, నేరేడుచర్లలోని 15 వార్డుల్లో 54 మంది అభ్యర్థులు వివిధ పార్టీల తరఫున పోటీ చేశారు. పోటాపోటీగా ఖర్చు సూర్యాపేట మున్సిపాలిటీతో పాటు మిగతా మున్సిపాలిటీలలో కూడా అభ్యర్థులు పోటీపడి మరీ భారీ ఎత్తున ఖర్చు పెట్టారు. పట్టణాలకు దగ్గరగా ఉన్న వార్డులు, రాజకీయంగా పలుకబడి ఉన్న వారు పట్టణాల్లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో పోటాపోటీగా ఖర్చు చేశారు. చాలామంది అభ్యర్థులు రూ. 50 లక్షల నుంచి రూ. 80 లక్షల వరకు ఖర్చ చేయగా మరికొందరు రూ. కోటికి పైగా ఖర్చు చేసి ఓడిపోయారు. లక్షల రూపాయలు ఖర్చుపెట్టినా గెలవకపోవడంతో ఓడిపోయిన అభ్యర్థులు, వారి కుటుంబాలు ఇంకా షాక్ నుంచి కోలుకోలేక పోతున్నారు. చివరకు బంధువులు ధైర్యం చెబుతూ ఓదారుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.భారీగా ఖర్చుపెట్టి గెలిచిన మున్సిపల్ వార్డు కౌన్సిలర్ల పరిస్థితి కూడా దయనీయంగానే ఉంది. పోటీ అధికంగా ఉన్న వార్డుల్లో రూ.50 లక్షల నుంచి కోటి వరకు ఖర్చు పెట్టారు. లక్షలు పెట్టి గెలిచాం ఇప్పుడు అప్పులు ఎలా తీర్చాలి అంటూ వారు తల పట్టుకుంటున్నారు. ఫ ఇంకా షాక్లోనే ఓడిన అభ్యర్థులు ఫ ఒక్కొక్కరు.. రూ.50 లక్షల నుంచి 60 లక్షలకు పైగా ఖర్చు ఫ గెలుస్తామనే ఆశతో భూములు, ప్లాట్లు, బంగారం తాకట్టు -
ప్రజల పక్షాన కళాకారుల పోరాటం
అర్వపల్లి : కళాకారులు పీడిత ప్రజల పక్షాన గళం విప్పాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం అర్వపల్లి మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య 9వ జిల్లా మహాసభలు నిర్వహించారు. సభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. మతోన్మాద ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ప్రజాకళాకారులు ఉద్యమించాలన్నారు. కళ కాసులకోసం కాదని, ప్రజల కోసమని చాటి చెబుతూ పోరాడుతున్న క్రమంలో అనేక మంది కళాకారులు నిర్భందాలను ఎదుర్కొన్నారని, ఈ పోరాటంలో మరెందరో అమరులయ్యారని తెలిపారు. అంతకు ముందు అర్వపల్లి వై జంక్షన్ నుంచి ఫంక్షన్హాల్ వరకు కళాకారులు వివిధ కళారూపాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. అరుణోదయ సమాఖ్య జిల్లా అధ్యక్షుడు ఉదయగిరి అధ్యక్షతన జరిగిన సభలో జిల్లా ప్రధాన కార్యదర్శి కంచనపల్లి సైదులు, ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గంట నాగయ్య, ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్, పీడీఎస్యూ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు పోలెబోయిన కిరణ్, నాయకులు తడకమల్ల సంజీవ్, ఎర్ర ఉమేశ్, బొల్లి వెంకన్న, గుండు నగేశ్, తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి పనుల్లో పారదర్శకత తప్పనిసరి
మునగాల : ఉపాధి హామీ పనుల్లో పారదర్శకత పాటించాలని డీఆర్డీఓ డి.శీరీష అన్నారు. శుక్రవారం మునగాల ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో 2024–25 ఆర్థిక సంవత్సరంలో మండలంలో నిర్వహించిన ఉపాధిహామీ పనులపై నిర్వహించిన ఓపెన్ఫోరంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఉపాధి పనుల నిర్వాహణను పారదర్శకంగా పూర్తి చేయాలని, పనిగంటలు వృథాకాకుండా ప్రతి పేద కుటుంబానికి పని కల్పించాలని సూచించారు. కూలీలకు రోజువారి వేతనం అందేలా క్షేత్రస్థాయిలో ఉపాఽధిహామీ పథకం సిబ్బంది, ఫీల్డు అసిస్టెంట్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా గ్రామాల వారీగా రెండు సంవత్సరాలుగా చేసిన పనులకు సంబంధించిన ఆడిట్ సిబ్బంది నివేదికలను ఓపెన్ఫోరంలో చదివి వినిపించారు. ఈ నివేదికపై సమావేశంలో చర్చించి ఖర్చుల్లో తేడా ఉన్న రూ.74,950 రికవరీ చేయాలని, రూ.11వేలు జరిమానా చెల్లించాలని ఆయా గ్రామాల ఫీల్డు అసిస్టెంట్లకు ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీడీలు పవన్కుమార్, యామిని, అంబుడ్స్మెన్ లచ్చిరామ్నాయిక్, ఏవీఓ ఆశాలత, ఎంపీడీఓ రమేష్దీనదయాళ్, ఎంపీఓ నరేష్, ఏపీఓ శైలజ, పలు గ్రామాల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
ఎడ్ల పందేల విజేత హుజూర్నగర్
మేళ్లచెరువు : మండల కేంద్రంలోని ఇష్టకామేశ్వరీ సమేత స్వయంభు శంభులింగేశ్వర స్వామి కల్యాణోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన జాతీయస్థాయి ఎడ్ల పందేలు గురువారం రాత్రి ముగిసాయి. ఈ పందేల్లో హుజూర్నగర్కు చెందిన సుంకి సురేందర్రెడ్డికి చెందిన ఎద్దుల జత 25 క్వింటాళ్ల బండను 25 నిమిషాల్లో 2,533 అడుగుల దూరం లాగి మొదటి బహుమతిగా ట్రాక్టర్ను గెలుచుకున్నాయి. కడప జిల్లాకు చెందిన పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామానికి చెందిన శివకృష్ణ యాదవ్కు చెందిన గిత్తలు 25 క్వింటాళ్ల బరువును 2,250 అడుగల దూరం లాగి ద్వితీయ బహుమతిగా రూ.1.50 లక్షలు గెలుచుకున్నాయి. మట్టపల్లి ఆలయంలో విశేషపూజలుమఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో శుక్రవారం లక్ష్మీనరసింహస్వామికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, పంచామృతాభిషేకం చేపట్టారు. లక్ష్మీనరసింహస్వామి, అమ్మవార్లలను పట్టు వస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవారి నిత్య కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. నీరాజన మంత్ర పుష్పాలతో మహానివేదన గావించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ బి.జ్యోతి, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. సైన్స్తోనే నూతన ఆవిష్కరణలు హుజూర్నగర్ : నూతన ఆవిష్కరణలో సైన్స్ పాత్ర గొప్పదని కళాశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పి. బాల భాస్కర్ అన్నారు. గురువారం హుజూర్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘మాలిక్యులార్ డాకింగ్’ అంశంపై ఒక రోజు జాతీయ వర్క్షాప్ నిర్వహించారు. కార్యక్రమాన్ని విద్యాశాఖ జేడీ ప్రారంభించి మాట్లాడారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థులలో పరిశోధన, పరిశీలన, నూతన ఆవిష్కరణలపై అవగాహన ఏర్పడుతుందన్నారు. తాను పుట్టి పెరిగిన ప్రాంతానికి గెస్ట్గా రావడం సంతోషంగా ఉందని, కళాశాలలోని పేద విద్యార్థులకు సా యం అందిస్తానని, కళాశాల అభివృద్ధికి సహకరిస్తానని అన్నారు. సమావేశంలో హుజూర్నగర్, కోదాడ డిగ్రీ కళాశాలల ప్రిన్సి పాల్స్ ఎస్. రామారావు, డాక్టర్ జి హాదసరాణి, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఎస్. సునంద, కన్వీనర్ ఎస్. ప్రియాంక, రిసోర్స్ పర్సన్ డాక్టర్ యు. పురుషోత్తం, అధ్యాపకులు, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన రీసెర్చ్ స్కాలర్స్, విద్యార్థులు పాల్గొన్నారు. పోస్టల్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలినడిగూడెం : పోస్టల్ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పోస్టల్ బ్యాంకు మేనేజర్ లక్ష్మణ్ కోరారు. శుక్రవారం నడిగూడెం పోస్టాఫీస్ వద్ద నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వ్యక్తిగత బీమా, ప్రమాద బీమా, పలు పథకాలపై అవగాహన కల్పించారు. స్థానిక పోస్టు మాస్టర్ నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు. -
రైతు భరోసా ఏమాయే!
భానుపురి (సూర్యాపేట) : రైతుభరోసా నిధుల కోసం జిల్లా రైతాంగం ఎదురు చూస్తోంది. ఏటా వానాకాలం, యాసంగి పంట పెట్టుబడికి అందించే నిధులు ప్రతి సీజన్లోనూ ఆలస్యమవుతున్నాయి. ఇటీవల రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల బహిరంగ సభల్లో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎన్నికలు ముగియగానే రైతుభరోసా నిధులు ఇస్తామని ప్రకటించారు. ఎన్నికలు పూర్తయ్యాయి. పాలకవర్గాలు సైతం కొలువుదీరాయి. అయినా ముఖ్యమంత్రి ప్రకటన మేరకు ఇంతవరకూ నిధులు జమకాలేదు. ఈనెల 17న నిధులు రైతుల అకౌంట్లలో జమ చేయనుందని ప్రచారం జరిగినా.. దీనిపై స్పష్టమైన ప్రకటన రాలేదు. దీంతో రైతు భరోసా నిధుల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. జిల్లాలో 2,79,853 మంది రైతులు.. జిల్లావ్యాప్తంగా 8,95,680 ఎకరాలు సాగవుతోంది. ఈ భూమిని 2,79,853 మంది రైతులు సాగు చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పేరుతో ఎకరానికి రూ.5వేల చొప్పున రెండు విడతల్లో అందించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎకరానికి రూ.15వేలను రెండుసార్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఆర్థిక ఇబ్బందులతో ఈ నిధులను ప్రతిఏటా పెంచుతామని మొదటగా ఎకరానికి రూ.6వేలుగా రెండు విడతల్లో రూ.12 వేలను రైతుల ఖాతాల్లో జమచేస్తామని చెప్పి గత యాసంగిలో జిల్లావ్యాప్తంగా 2,44,423 మంది రైతుల అకౌంట్లలో రూ.232.92 కోట్లను జమ చేసింది. ఈ సమయంలో పది ఎకరాల పైబడి ఉన్న రైతుల అకౌంట్లలో డబ్బులను ప్రభుత్వం జమచేయలేదు. వివిధ కారణాలతో పది ఎకరాల లోపు ఉన్న రైతులకు కొందరికి ఈ పథకం కింద నిధులు జమ కాలేదు. ఈ వానాకాలం సీజన్లో పంటలను సాగు చేసిన ప్రతి రైతును ఈ పథకాన్ని వర్తింప జేయగా.. 2,87,234 మంది రైతులకు రూ.366.50 కోట్లను అందించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో.. రాష్ట్రంలో వరసగా ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటగా గ్రామపంచాయతీ ఎన్నికలు జరగగా.. ఇటీవల మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యాయి. త్వరలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సముఖంగా ఉంది. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా ఉండేందుకు గాను ఈ యాసంగి సీజన్లో ఇవ్వాల్సిన రైతుభరోసా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. యాసంగి సీజన్ ప్రారంభమై రెండు నెలలు దాటినా నిధుల విడుదలలో ఆలస్యమైంది. అయితే గతంలో మాదిరిగానే డిజిటల్ సర్వే చేసి పంటలు సాగు చేసిన రైతులకే కాకుండా జిల్లాలో ఉన్న ప్రతి రైతుకు నిధులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఫ ప్రతి సీజన్లో ఆలస్యమవుతున్న పంట పెట్టుబడి సాయం ఫ మున్సిపల్ ఎన్నికలు ముగిశాక ఇస్తామని ప్రకటించినా ఇప్పటివరకు జమ కాని నిధులు ఫ పెట్టుబడి సాయానికి రైతుల ఎదురుచూపు -
శంభులింగేశ్వరాలయంలో పూర్ణాహుతి
మేళ్లచెరువు : మండల కేంద్రంలోని ఇష్టకామేశ్వరీ సమేత స్వయంభూ శంభులింగేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఐదవ రోజైన గురువారం ఆలయ అర్చకులు పూర్ణాహుతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. తొలుత ఉదయం సుప్రభాతం, అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చన అనంతరం పూర్ణాహుతి నిర్వహించారు. అదేవిధంగా వసంతోత్సవం, త్రిశూల తీర్థం ఆశీర్వచనాలు, మహానివేదన, మంగళనీరాజన మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం వంటి కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పెండ్లి లచ్చయ్య, ఈఓ శంభిరెడ్డి, అర్చకులు కొంకపాక రాధాకృష్ణమూర్తిశర్మ, విష్ణువర్దన్శర్మ, ధనంజయశర్మ తదితరులు పాల్గొన్నారు. -
ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి
నేరేడుచర్ల : పట్టా పాస్ పుస్తకాలు ఉన్న రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, అప్పుడే ప్రభుత్వం రైతులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్రెడ్డి అన్నారు. గురువారం నేరేడుచర్లలోని మన గ్రోమెర్ సెంటర్ను ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఫార్మర్ రిజిస్ట్రేషన్ క్యాంపెయిన్లో పాల్గొని మాట్లాడారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలతో పాటు భవిష్యత్లో ప్రవేశపెట్టబోయే కొత్త పథకాల లబ్ధిపొందవచ్చన్నారు. ప్రతి రైతు వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సూచనల మేరకు యూరియాను వినియోగించాలన్నారు. అధికంగా ఉపయోగిస్తే పంటలకు తెగులు, చీడ పురుగులు వచ్చే అవకాశం ఉందన్నారు. భూమిలో సముతుల్యత, భూసారం పూర్తిగా దెబ్బతింటుందన్నారు. రైతులు అవసరం ఉన్నంత వరకు మాత్రమే యూరియా బుక్ చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫర్టిలైజర్స్ యాప్పై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రైతులకు కల్టివేటర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొణతం చిన వెంకట్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తాళ్ల సురేష్రెడ్డి, ఏఓ జావీద్, ఏఈఓ అవినాశ్ తదితరులున్నారు. ఫ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్రెడ్డి -
గోదావరి నీటి విడుదల నిలిపివేత
అర్వపల్లి: రైతుల అభ్యర్థన మేరకు అదనంగా మూడు రోజులపాటు విడుదల చేసిన గోదావరి నీటిని గురువారం నిలిపివేశారు. వారబంధీ విధానంలో తిరిగి గోదావరి జలాలను ఈనెల 21న పునరుద్ధరించి 28వ తేదీ వరకు విడుదల చేయనున్నట్లు జలవనరుల శాఖ ఈఈ సత్యనారాయణగౌడ్, బయ్యన్నవాగు ఏఈ చంద్రశేఖర్ తెలిపారు. రెడ్బుక్ డేను జయప్రదం చేయాలిసూర్యాపేట అర్బన్: సీపీఎం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించనున్న రెడ్ బుక్ డేను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి కోరారు. గురువారం మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బరితెగించిన అమెరికా సామ్రాజ్యవాదం అనే అంశంపై చర్చించనున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలపై అధ్యయనం చేసి రెడ్ బుక్ డే సందర్భంగా చర్చిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండీ అబ్బాస్ హాజరవుతారని చెప్పారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మట్టిపల్లి సైదులు పాల్గొన్నారు. మార్చి 26న బార్ అసోసియేషన్ ఎన్నికలు చివ్వెంల(సూర్యాపేట) : బార్ అసోసియేషన్ ఎన్నికలు మార్చి 26న నిర్వహించనున్నట్లు తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల అయినట్లు పేర్కొన్నారు. మార్చి 9 నుంచి 11 వరకు నామినేషన్ల స్వీకరణ, 12న పరిశీలన, 16న ఉపసంహరణ, 27న ఎన్నికలు ఉంటాయని తెలిపారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం 30 శాతం మహిళా రిజర్వేషన్ ఉంటుందని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పోలింగ్, అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. పీహెచ్సీల్లో సకల వసతుల కల్పన అర్వపల్లి : గర్భిణులకు సాధారణ ప్రసవాల కోసం పీహెచ్సీలలో అన్ని వసతులు కల్పించినట్లు డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ గాజుల చంద్రశేఖర్ తెలిపారు. అర్వపల్లిలోని పీహెచ్సీలో గురువారం సామూహిక సీమంతం నిర్వహించారు. సహజ కాన్పుల వలన కలిగే ప్రయోజనాలను మహిళలకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ప్రసిద్ధ, డాక్టర్ నజియ, మండల వైద్యాధికారి బి. నగేష్నాయక్, ప్రోగ్రాం అధికారి ఉమ, డెమో సంజీవరెడ్డి, సీహెచ్ఓ ఎం. బిచ్చునాయక్, మంగ, సర్పంచ్లు చిల్లంచర్ల విద్యాసాగర్, బింగి కృష్ణమూర్తి, ఎల్. కృష్ణానాయక్, సూపర్వైజర్ లలిత, ఐసీడీఎస్ సూపర్వైజర్ అనిత, నర్సింగ్ ఆఫీసర్లు, వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, గర్భిణులు తదితరులు పాల్గొన్నారు. -
నిధులు విడుదల చేయాలి
రైతుభరోసా నిధులు వెంటనే విడుదల చేయాలి. ప్రతి సీజన్లోనూ ప్రభుత్వం ఆలస్యంగా నిధులు ఇ స్తోంది. దీంతో పంట పెట్టుబడి కోసం ప్రైవేట్ వ్యాపారులు, దుకాణాల వద్ద ఖాతాలు తేవాల్సి వస్తోంది. ప్రభుత్వ హామీ మేరకు ఎకరానికి రూ.7500ల చొప్పున నిధులు విడుదల చేయాలి. – జాన్రెడ్డి, రైతు, ఆత్మకూర్(ఎస్) రైతుభరోసా నిధుల జమ విషయంలో ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. త్వరలోనే జమ అయ్యే అవకాశముంది. గతంలో జిల్లాలో రైతుభరోసా అందిన డేటా సిద్ధంగానే ఉంది. కొత్తవారి నుంచి ప్రభుత్వం ఆదేశిస్తే దరఖాస్తులు స్వీకరించి అప్లోడ్ చేస్తాం. – శ్రీధర్రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి -
మున్సిపల్ ఎన్నికల్లో అద్భుత విజయం
భానుపురి (సూర్యాపేట) : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా అద్భుతమైన విజయాన్ని సాధించిందని రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేటలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పట్టణ ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసం ఉందని, అందుకే రాష్ట్రంలో మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగగా దాదాపు 95కి పైగా మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినట్లు తెలిపారు. సూర్యాపేట మున్సిపాలిటీలో మొత్తం 48 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 31 వార్డుల్లో ఘనవిజయం సాధించిందన్నారు. కాంగ్రెస్ రెబల్స్గా గెలిచిన నలుగురు స్వతంత్ర సభ్యులతో కలిపి దాదాపు 35 స్థానాల్లో కాంగ్రెస్ బలంగా నిలిచిందన్నారు. ఈ విజయానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ రఘువీరా రెడ్డి, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య సహా నాయకులందరూ ఐక్యంగా పనిచేయడమే కారణమన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ షఫి వుల్లా, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, కౌన్సిలర్లు జ్యోతి కరుణాకర్, శ్రీనివాస్, భవాని పాల్గొన్నారు. ఫ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి ఆర్థికసాయం అందజేత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ధరావత్ ధర్మా నాయక్ సతీమణి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందింది. వారి కుమార్తెల భవిష్యత్ విద్యా అవసరాల కోసం రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి రూ.లక్ష ఆర్థిక సాయాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, భవిష్యత్లో ఎలాంటి అవసరం వచ్చినా సాయం చేయడానికి సిద్ధంగా ఉంటామని హామీ ఇచ్చారు. -
సేంద్రియ సాగుకు ప్రోత్సాహం
గుర్రంపోడు, కొండమల్లేపల్లి : సేంద్రియ, జీవన ఎరువులు వినియోగిస్తూ పంటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని రాష్ట్ర ఉద్యాన శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. గురువారం ఆమె.. కలెక్టర్ చంద్రశేఖర్తో కలిసి గుర్రంపోడు మండలం బ్రాహ్మణగూడెం గ్రామంలో జీవన ఎరువులతో అధిక దిగుబడులు సాధిస్తున్న రైతు కట్టెబోయిన శ్రీనివాస్ బత్తాయి తోటను పరిశీలించారు. అనంతరం జరిగిన సమావేశానికి హాజరయ్యారు. అలాగే జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో కొండమల్లేపల్లి ఉద్యాన పరిశోధన కేంద్రంలో బత్తాయి రైతులతో నాబార్డు సహకారంతో ఏర్పాటు చేయనున్న రైతు ఉత్పాదక సంస్థలపై నిర్వహించిన సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా సమావేశాల్లో ఆమె మాట్లాడారు. సేంద్రియ, జీవన పద్ధతుల్లో పంట సాగు వల్ల నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చని, కొందరు రైతులు ప్రత్యక్షంగా నిరూపిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. రాష్ట్రంలో కేవలం 143 మంది ఉద్యానవన అధికారులు మాత్రమే ఉన్నారని, క్షేత్రస్ధాయిలో రైతులకు మరింతగా సేవలందించేందుకు వలంటీర్లను నియమించాలనే ప్రతిపాదన ఉందని తెలిపారు. రైతులకు శిక్షణ ఇప్పించాలి : ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ రాజిరెడ్డి అనంతరం కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ (వీసీ) రాజిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 2011లో లక్షపైగా ఎకరాల్లో బత్తాయి పంట సాగైతే ఇప్పుడు 41వేల ఎకరాలకు పడిపోయిందని గుర్తు చేశారు. విచక్షణారహితంగా పురుగుల మందు వాడకుండా సేంద్రియ ఎరువుల వాడకంతో అధిక దిగుబడులు సాధిస్తున్న రైతులతో ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేయించి మిగతా వారికి శిక్షణ ఇప్పించాలన్నారు. ఆయా సమావేశాల్లో ఆ శాఖ జాయింట్ డైరెక్టర్ బాబు, ఆర్గానిక్ ఫర్టిలైజింగ్ సర్టిఫికేషన్ డైరెక్టర్ కిరణ్, నాబార్డు సీజీఎం ఆరిఫ్, డీడీఎం వినయ్కుమార్, ఉద్యాన శాఖ శాస్త్రవేత్త రాజాగౌడ్, సుభాషిణి పాల్గొన్నారు. ఫ రాష్ట్ర ఉద్యాన శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా -
ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్య
నేరేడుచర్ల : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నాణ్యతతో కూడిన విద్యాబోధన ఉంటుందని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి భానుప్రకాశ్ అన్నారు. గురువారం నేరేడుచర్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవం, వీడ్కోలు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ కళాశాలల్లో అన్ని వసతులు, సౌకర్యాలు ఉన్నాయని, ఉచితంగా పుస్తకాలు కూడా అందిస్తూ ప్రభుత్వం విద్యను ప్రోత్సహిస్తోందన్నారు. పిల్లల తల్లిదండ్రులు విద్యార్థులను ప్రతి రోజు కళాశాలలకు పంపించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గత విద్యా సంవత్సరం ఉత్తమ ఫలితాలు సాధించామని, ఈ విద్యాసంవత్సరం కూడా అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు అధ్యాపకులు కృషి చేయాలన్నారు. అడ్మిషన్లు మరింత పెంచాలన్నారు. ఇటీవల కళాశాలలో నిర్వహించిన టాలెంట్ టెస్టుల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన గరిడేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి బ్రహ్మచారికి రూ.2016, ద్వితీయ బహుమతి పొందిన శ్రీవాణి, పినాకిల్ పాఠశాల విద్యార్థులకు రూ.1016, తృతీయ బహుమతి జెడ్పీ ఉన్నత పాఠశాల నేరేడుచర్ల విద్యార్థులకు రూ.516 చొప్పున బహుమతులు అందించారు. కళాశాల ప్రిన్సిపాల్ వెంకటరమణ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మండల విద్యాధికారి సత్యనారాయణరెడ్డి, ఎస్ఐ రవీందర్నాయక్, ఆయా పాఠశాలల ఇన్చార్జ్ ఉపాధ్యాయులు సత్యనారాయణ, కోటేశ్వర్రావు, హరికృష్ణ, జగదీష్, శ్రవణ్కుమార్, సూపరింటెండెంట్ నర్సింహ, కళాశాల అధ్యాపకులు డాక్టర్ మద్దిమడుగు సైదులు, ప్రణతి, కేఎల్ఎన్రావు ఉన్నారు. ఫ ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి భానుప్రకాశ్ -
వలంటీర్లతో పంటల డిజిటల్ సర్వే
భానుపురి (సూర్యాపేట) : వ్యవసాయ రంగంలో పారదర్శకత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పంటల డిజిటల్ సర్వే అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. క్షేత్రస్థాయిలో ఎదురైన అడ్డంకుల కారణంగా ఏడాదిన్నరగా నత్తనడకన సాగుతున్న పంటల సర్వేపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా దృష్టి సారించింది. ఏఈఓలపై పనిభారం ఎక్కువగా ఉండడంతో పంటల డిజిటల్ సర్వేలో వారికి సహాయకులుగా పనిచేసేందుకు ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒకరి చొప్పున వలంటీర్లను నియమించాలని నిర్ణయించింది. ఈ మేరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జిల్లాలో కొనసాగుతుండగా.. ఈ రెండు రోజుల్లోనే వలంటీర్లను ఎంపిక చేసి వెంటనే రెండు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. తదనంతరం 45 రోజుల్లో డిజిటల్ సర్వే పూర్తయ్యేలా కసరత్తు చేస్తోంది. అయితే పంటల సర్వేకు ప్రభుత్వం ఇచ్చే పారితోషికం విషయంలో కొందరు నిరుద్యోగులు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సారైనా పంటల డిజిటల్ సర్వే పట్టాలెక్కేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూనక్షా ఉన్నచోట వలంటీర్లు జిల్లాలో మొత్తం 486 గ్రామ పంచాయతీలకు గాను దాదాపు 269 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వీటిలో భూనక్షా ఉన్న గ్రామాల్లో డిజిటల్ సర్వేను వలంటీర్లు చేయనున్నారు. మొబైల్ యాప్లో భూపటం కనిపిస్తేనే సర్వే నంబర్ల వారీగా ఫొటోలు తీయడం సులభమవుతోంది. దాదాపు 261 మంది వలంటీర్లను ప్రభుత్వం నియమించేందుకు అవకాశం ఇవ్వగా.. భూనక్షాలు లేని గ్రామాల్లో ఏఈఓలే ఈ డిజిటల్ సర్వే చేయాల్సి ఉంటుంది. అయితే భూనక్షాలు లేని చోట తమకు సహాయకులు లేకపోతే పనిభారం ఉంటుందని ఏఈఓలు వాపోతున్నారు. ఏడాదికి పైగా ప్రభుత్వ కార్యక్రమాల కారణంగా ఈ సర్వే చేయడం ఇబ్బందిగా మారిందని, తిరిగి ప్రభుత్వం నక్షాలు లేనిచోటకు తమను పంపడం సరైంది కాదని అంటున్నారు. భారంగానే సర్వే..! డిజిటల్ సర్వేలో ప్రతి రైతు పొలం వద్దకు వెళ్లి ఫొటో తీసి యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా వలంటీర్లు ఆప్లోడ్ చేసే ఒక్కో ఫొటోకు వలంటీర్లకు రూ.7 చొప్పున చెల్లిస్తారు. ఏయే గ్రామాల్లో భూములు విడిపోయి బైనంబర్లు అధికంగా ఉంటాయో అక్కడి వలంటీర్లు ఎక్కువ ఫొటోలు తీస్తారు. ఈ క్రమంలో వారి రోజువారీ సంపాదన ఆశాజనకంగా ఉండొచ్చు. సర్వేనంబర్లు తక్కువగా ఉన్న గ్రామాల్లో పరిస్థితి భిన్నంగా కనిపించనుంది. దీనివల్ల కొన్నిచోట్ల వలంటీర్లుగా పనిచేసేందుకు నిరుద్యోగులు మొగ్గుచూపటం లేదని సమాచారం. వ్యవసాయ క్లస్టర్లు 84 రెవెన్యూ గ్రామాలు 269 పంచాయతీలు 486 అన్ని పంటల సాగు విస్తీర్ణం 5.30 లక్షల ఎకరాలుప్రభుత్వ ఆదేశాల ప్రకా రం పంటల డిజిటల్ సర్వే ను పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రెండు రోజులు వలంటీర్లకు శిక్షణ ఇస్తాం. 45 రోజుల్లో సర్వే పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నాం. – శ్రీధర్రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఫ ఏఈఓలకు పనిభారం తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయం ఫ రెవెన్యూ గ్రామానికి ఒకరి చొప్పున నియామకం ఫ వలంటీర్ల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం ఫ రెండు రోజుల్లో శిక్షణకు ఏర్పాట్లు -
గోదావరి జలాల తగ్గింపు
అర్వపల్లి: మహాశివరాత్రి ఉత్సవాలతోపాటు రైతుల అభ్యర్థన మేరకు జిల్లాకు గోదావరి జలాల విడుదలను కొనసాగిస్తున్నారు. అయితే మంగళవారం వరకు 1,613 క్యూసెక్కుల నీటిని జిల్లాకు వదలగా బుధవారం 723 క్యూసెక్కులకు తగ్గించారు. తిరిగి వారబందీ విధానంలో గోదావరి జలాలను యథావిధిగా కొనసాగిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. గ్రామ పంచాయతీకి భూదానంతుంగతుర్తి : మండల పరిధిలోని గుడితండా గ్రామంలో గ్రామ పంచాయతీ భవనంతోపాటు సీ్త్ర శక్తి భవన నిర్మాణాలకు గాను గ్రామానికి చెందిన లకావత్ హుస్సేన్ 484 గజాల స్థలాన్ని దానం చేశారు. ఇందుకు సంబంధించిన భూమి పత్రాలను బుధవారం గ్రామంలో జరిగిన గ్రామసభలో సర్పంచ్ గుగులోతు ఝాన్సీకి అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అనంతరం భూ దాత లకావత్ హుస్సేన్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి చింత సురేష్, ఉప సర్పంచ్ గుగులోతు పద్మ, వార్డు సభ్యులు ధరావత్ బుజ్జమ్మ, గుగులోతు శ్రీను, గుగులోతు వినోద, పాతులోతు సరోజ, లకావత్ దామోదర్, లకావత్ భద్రమ్మ, గ్రామ పెద్దలు బానోతు వెంకన్న, పాతులోతు సూర్య, బానోతు భగవాన్ పాల్గొన్నారు. క్షయ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలిసూర్యాపేట టౌన్ : జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని, ప్రాథమిక స్థాయిలో వ్యాధి లక్షణాలు గుర్తించాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ పెండెం వెంకటరమణ అన్నారు. క్షయరహిత జిల్లాగా మా ర్చేందుకు బుధవారం జిల్లా కేంద్రంలో వైద్యాధికారులు, ఎంఎల్పీహెచ్పీలు, టీబీ నోడల్ అధికారులకు నిర్వహించిన పునశ్చరణ శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు 52వేల టీబీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని, 1,742 మంది అనుమానితుల్లో 765 మందికి చికిత్స అందజేస్తున్నామని పేర్కొన్నారు.కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ ప్రసిద్ధ్, రాష్ట్ర డబ్ల్యూహెచ్ఓ కన్సల్టెంట్ డాక్టర్ శ్రీగణ, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ జి.చంద్రశేకర్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ కోటిరత్నం, డాక్టర్ నాజియా తబస్సుమ్, డిప్యూటీ డెమో సంజీవ్రెడ్డి పాల్గొన్నారు. -
అంకితభావంతో పనిచేస్తేనే గుర్తింపు
సూర్యాపేట టౌన్ : పోలీస్ సిబ్బంది అంకితభావంతో పనిచేస్తేనే ప్రజల్లో మంచి గుర్తింపు ఉంటుందని ఎస్పీ నరసింహ అన్నారు. జిల్లా ఆర్మూడ్ పోలీస్ విభాగం (ఏఆర్)లో కానిస్టేబు ల్స్ విధులు నిర్వహిస్తున్న నాగేశ్వరరావు, శ్రీధర్, భాస్కర్, వెంకటేశ్వర్లు, సోమయ్య, సు మన్, ఆనందరావులు సివిల్ విభాగానికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా బదిలీ అయిన సిబ్బంది జిల్లా ఎస్పీ నర్సింహను బుధవారం ఆయన చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. బదిలీ అయిన సిబ్బందికి మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడు తూ శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలన్నారు. కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ నేరాలను నివా రించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ జనార్దన్రెడ్డి, డీఎస్పీ నరసింహా చారి, పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రామచందర్గౌడ్, ఆర్ఎస్ఐ అన్వర్ పాల్గొన్నారు. -
పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి
సూర్యాపేట టౌన్ : ప్రతి విద్యార్థి ఇష్టంగా పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా ఇంటర్ ఎడ్యుకేషనల్ అధికారి (డీఐఈఓ) భానునాయక్ అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఫేర్వెల్ డే వేడుకలకు డీఐఈఓ హాజరై మాట్లాడారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. పట్టుదలతో చదివి లక్ష్యాలను చేరుకోవాలన్నారు. విద్యార్థి దశలో ఏకాగ్రతతో చదువుకోవడం వల్ల భవిష్యత్తు సంతోషమయంగా ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా వార్షిక పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. అనంతరం విద్యార్థినీవిద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పెరుమాళ్ల యాదయ్య, అధ్యాపకులు వీడీఎస్ ప్రసాద్, బి.వాసు, ఎస్కె.భాషీరున్నిసాబేగం, జి.సైదులు, ఆర్.గురవయ్య, బి.గోపమని, బి.లలిత, జి శ్రీనివాస్, టి.రమేష్, సీహెచ్ కృష్ణ, ఎం.ప్రతాప్, టి.వెంకటకృష్ణ, నవీన్కుమార్, లక్ష్మయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలి
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలోని ప్రతి కుటుంబంలోని భూమి పట్టాపాస్ బుక్కు కలిగి ఉన్న రైతు ఫార్మర్ రిజిస్ట్రీ (ఫార్మర్ ఐడీ) నమోదు చేసుకునేలా అధికారులు కృషిచేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వెబ్ఎక్స్ కాన్ఫరెనన్స్ మీటింగ్ ద్వారా వ్యవసాయ శాఖ, రెవెన్యూ, మండల పరిషత్, సహకార సంఘం జిల్లా, మండల, గ్రామ అధికారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డీఏఓ శ్రీధర్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. కేంద్రీయ విద్యాలయానికి స్థల పరిశీలన సూర్యాపేట జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేయనున్న కేంద్రీయ విద్యాలయానికి కావాల్సిన స్థలాన్ని బుధవారం సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని కేసారంలో కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పరిశీలించారు. స్థల పరిశీలన బృందంలో కేంద్ర విద్యాలయ సంఘటన్ డిప్యూటీ కమిషనర్ సంతోష్, అసిస్టెంట్ కమిషనర్ ఇజ్రాయిల్, నల్లగొండ కేంద్ర విద్యాలయం ప్రిన్సిపాల్ శ్రీనివాస్, సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవ్, తహసీల్దారు కృష్ణయ్య తదితరులు ఉన్నారు. మాతా శిశు కేంద్రాన్ని వేగంగా పూర్తిచేయాలిసూర్యాపేట టౌన్ : మాతా శిశు కేంద్ర భవన నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేసి వచ్చే నెలలో ప్రారంభానికి సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. బుధవారం సూర్యాపేట మాతా శిశు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోదాడలో నవజాత ఆడ శిశువును పుట్టగానే వదిలేయడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఉయ్యాలను ఏర్పాటు చేశామని, ఎవరైతే పిల్లలను వద్దనుకుంటారో తీసుకొచ్చి ఉయ్యాలలో ఉంచాలని సూచించారు. కోదాడలో నవజాత శిశువును కాపాడిన ఏఎన్ఎంను కలెక్టర్ అభినందించారు. ఆయన వెంట డీఎంహెచ్ఓ వెంకటరమణ, సీఎస్ఆర్ఏంఓ జనార్దన్, వైద్యులు, సిబ్బంది ఉన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
నేడు మేళ్లచెరువుకు మంత్రి ఉత్తమ్ రాక
హుజూర్నగర్ : రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి బుధవారం మేళ్లచెరువుకు రానున్నారు. మధ్యాహ్నం 1.45 గంటలకు మంత్రి హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్లో మేళ్లచెరువుకు చేరుకుంటారు. స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో మంత్రి పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 5.30 గంటలకు హెలికాఫ్టర్లో తిరిగి హైదరాబాద్ వెళ్తారు. రాష్ట్ర స్థాయి పోటీలకు కోదాడ విద్యార్థులుకోదాడ: కోదాడలోని ఈఆర్ఎస్ బ్యాడ్మింటన్ అకాడమీ విద్యార్థులు సీఎంకప్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు కోచ్లు ఫాజిల్, నిస్సార్ తెలిపారు. ఇటీవల కేంద్రంలో జరిగిన సీఎం కప్ జిల్లా స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ ఎంపిక పోటీల్లో జూనియర్, సబ్ జూనియర్ విభాగాల్లో అకాడమీకి చెందిన గౌతమ్, సంతోష్, అనస్, ఆరిజ్, రక్షిత్, జానిభాష పాల్గొని ప్రతిభ కనబర్చి నట్లు పేర్కొన్నారు. ఈ నెల 21 నుంచి 23 వరకు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగే పోటీల్లో వారు పాల్గొననున్నట్లు తెలిపారు. ఎంపికై న విద్యార్థులను మంగళవారం కోచ్లతో పాటు స్థానికులు అభినందించారు. కాల్వకట్ట వద్ద ప్లాస్టిక్ మేనేజ్మెంట్ గోదాంనడిగూడెం : మండల కేంద్రం సమీపంలో సాగర్ ఎడమ కాల్వ కట్ట వద్ద ప్లాస్టిక్ మేనేజ్మెంట్ గోదాం నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించేందుకు కృషి చేస్తామని పంచాయతీరాజ్ డీఈ హర్ష తెలిపారు. మంగళవారం ప్లాస్టిక్ మేనేజ్మెంట్ గోదాం నిర్మించేందుకు ఎంపిక చేసిన స్థలాన్ని ఆయన పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ఆయన వెంట తహసీల్దార్ బుసిరెడ్డి రామకృష్ణారెడ్డి, ఎంపీఓ విజయలక్ష్మి, ఆర్ఐలు గోపాలకృష్ణ, మల్సూర్, పంచాయతీ కార్యదర్శి ఎలకా ఉమారాణి, జీపీఓ కోటయ్య ఉన్నారు. లక్ష్మీనరసింహుడికి నిత్య కల్యాణంమఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో మంగళవారం లక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో రాజ్యలక్ష్మీ, చెంచులక్ష్మీసమేత లక్ష్మీ నరసింహస్వామికి సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి ప్రత్యేకంగా ఆకుపూజ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ బి.జ్యోతి, అర్చకులు పాల్గొన్నారు. గ్రామాల్లో విద్యుత్ సమస్యల పరిష్కారం చిలుకూరు : ప్రజాబాట కార్యక్రమంలో గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తున్నట్లు ట్రాన్స్కో ఎస్ఈ శ్రీని వాస్రావు అన్నారు. మంగళవారం చిలు కూరులో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాబాట కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యుత్ సిబ్బంది ప్రతి ట్రాన్స్ఫార్మర్ను పరిశీలిస్తున్నారని, దాని పరిసరాలను శుభ్రం చేయడంతో పాటు సమస్యలుంటే వెంటనే పరిష్కరిస్తున్నారని తెలిపారు. ప్రజాబాటకు ప్రజలు సహకరించాలన్నారు. అనంతరం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి ప్రజా బాటపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ట్రాన్స్కో డీఈ వెంకటకృష్ణయ్య, ఏఈ శ్రీనివాస్రావు, సబ్ ఇంజనీర్ పరశురాములు, లైన్ఇన్స్పెక్టర్లు విజయ్కుమార్, శాంతకుమార్, సర్పంచ్ పుల్లమ్మ, ఉపసర్పంచ్ బెల్లంకొండ నాగయ్య, వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
ఇంటర్నల్ మార్కుల తనిఖీ
చిలుకూరు : పదో తరగతి వార్షిక పరీక్షలు మార్చి 14 నుంచి ప్రారంభం కానున్నాయి. వారికి పాఠశాలల్లో ఇచ్చిన ఇంటర్నల్ మార్కుల తనిఖీపై జిల్లా విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 34 బృందాలను ఏర్పాటు చేసింది. ఆయా బృందాలు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను సందర్శించి పదవ తరగతి ఇంటర్నల్ మార్కులను తనిఖీ చేస్తున్నారు. రికార్డుల పరిశీలన చదువులో విద్యార్థుల శక్తి సామర్థ్యాలను అంచనా వేసి ఇంటర్నల్ మార్కులు నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ ఇంటర్నల్ మార్కుల నమోదు విషయంతో ఆయా పాఠశాలల ఉపాధ్యాయలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తుడడంతో మార్కులు, రికార్డులను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను విద్యాశాఖ నియమించింది. ఈ బృందాలు జిల్లాలోనిఅన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి విద్యార్థుల రికార్డులను ప్రత్యక్షంగా పరిశీలించనున్నాయి. 20 మార్కులు కేటాయింపు పదో తరగతిలో ప్రతి సబ్జెక్టుకు 100 మార్కులు ఉండగా 80 మార్కులకు వార్షిక పరీక్ష ఉంటుంది. మిగిలిన 20 మార్కులకు సీసీఈ విధానంలో నాలుగు ఫార్మెటివ్ అసైన్మెంట్ పరీక్షల ఫలితాలు, విద్యార్థులు రాసే రికార్డుల ఆధారంగా కేటాయిస్తారు. పదో తరగతి విద్యార్థి భవిష్యత్కు ఈ మార్కులు కీలకంగా మారిన నేపథ్యంలో అధికారుల తనిఖీలకు ప్రాధాన్యత సంతరించుకుంది. విద్యార్థులు చేసిన ప్రాజెక్టు వర్క్స్, చేతి రాత, ఎఫ్ఏల్లో వచ్చిన మార్కులను ఈ బృందాలు సూక్ష్మంగా పరిశీలించనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు ఫార్మెటివ్ పరీక్షల్లో వాస్తవ మార్కులు వేశారా, ఇష్టానుసారంగా నమోదు చేశారా అన్న విషయాన్ని తనిఖీ బృందాలు పరిశీలించనున్నాయి. సూర్యాపేట జిల్లాలో 184 ప్రభుత్వ, 121 ప్రైవేటు పాఠశాలలు, 50 కెజీబీవీ, గురకుల పాఠశాలలు ఉన్నాయి. వాటిలో మొత్తం 10,016 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. వీరి రికార్డులు తనిఖీ చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 34 బృందాలను జిల్లా విద్యాశాఖ ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో జీహెచ్ఎమ్ లేదా ఎఫ్ఏసీ హెచ్ఎం, లాంగ్వేజ్ పండిత్, మరో నాన్ లాంగ్వేజ్ ఉపాధ్యాయుడు, స్కూల్ అసిస్టెంట్తో పాటు మరి కొందరు ఉపాధ్యాయులు కలిపి ఐదు నుంచి ఏడుగురు ఉంటారు. ఒక్కో బృందానికి 7 నుంచి 10 పాఠశాలల బాధ్యతలను అప్పగించారు. ఈ ప్రక్రియను ఈ నెల 20లోగా పూర్తి చేసి ఇంటర్నల్ మార్కులను ఆన్లైన్ నమోదు చేయాల్సి ఉంటుంది. ఫ టెన్త్ విద్యార్థుల ప్రగతి పరిశీన ఫ జిల్లా వ్యాప్తంగా 34 బృందాలు ఫ జిల్లాలో 355 ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలలు ఫ వార్షిక పరీక్షకు హాజరు కానున్న 10,016 మంది విద్యార్థులు -
24న ఆర్టీసీ కార్మికుల చలో సెక్రటేరియట్
భానుపురి (సూర్యాపేట) : ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 24న నిర్వహిస్తున్న చలో సెక్రటేరియట్ను విజయవంతం చేయాలని ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శులు బుడిగె పుల్లయ్య, సుంకరి శ్రీనివాస్ కోరారు. మంగళవారం సూర్యాపేట డిపో ఎదుట నిర్వహించిన కార్మికుల నిరసనలో వారు మాట్లాడారు. ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలని, యూనియన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో టీఎంయూ రాష్ట్ర కార్య దర్శి అంజయ్య, నల్లగొండ రీజియన్ కార్యదర్శి ఎన్ఎస్.గౌడ్, డిపో కార్యదర్శి మాచర్ల భాస్కర్, నాయకులు ఎం.లచ్చయ్య, పుదూరి రమేష్, విజయానంద్, హుస్సేన్, సైదమ్మ, అలివేలు, సుజాత, రాజేశ్వరి, కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
మోడల్ అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాలి
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో మోడల్ అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని మహిళా, శిశు, దివ్యాంగుల, వయో వృద్ధుల శాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల ఎత్తు, బరువును నిత్యం పరిశీలించాలని, పోషకాహారలోపం ఉన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కేంద్రాలకు వచ్చే పిల్లలకు ప్రీ స్కూల్ సిలబస్ ప్రకారం బోధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలను పోషణ్ ట్రాకర్ ద్వారా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. వయో వృద్ధుల మెయింటెనెన్స్ కేసులు, వారి సమస్యలు పరిష్కరించాలన్నారు. మహిళలపై అకృత్యాలు జరగకుండా వారికి రక్షణగా ఉండే చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి కె.నరసింహారావు, సూపరింటెండెంట్ జి.హుస్సేన్, డీసీపీఓ రవి కుమార్, ఏఫ్ఆర్ఓ బి.వినోద్కుమార్, సంకల్ప జిల్లా కోఆర్డినేటర్ చైతన్య పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి
నడిగూడెం : కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మంగళవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను నడిగూడెం మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో ఘనంగా నిరనిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాల్గొని కేక్ కట్చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, మళ్లీ కేసీఆర్ పాలన రావడం ఖాయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పల్లా నర్సిరెడ్డి, కరివిరాల సర్పంచ్ మారోజు పార్వతమ్మ, పార్టీ నడిగూడెం గ్రామశాఖ అధ్యక్షుడు బోనగిరి ఉపేందర్, నాయకులు అనంతుల ఆంజనేయులు, దున్నా సుధాకర్, నూనె నాగన్న, కాసాని సతీష్, మేకల వీరబాబు, దున్నా మనీషా, మహేష్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, కార్యకర్తలు పాల్గొన్నారు. -
యాదగిరీశుడికి బ్రహ్మోత్సవ శోభ
యాదగిరిగుట్ట : అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిగా.. ఏకశిఖరవాసుడిగా.. పంచనారసింహుడిగా.. స్తంభోద్భవుడిగా.. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా విరాజిల్లుతున్న యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫాల్గుణ శుద్ధ పాడ్యమి బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు ఈ నెల 28వ తేదీన ఫాల్గుణ శుద్ధ ద్వాదశి శనివారం రోజున శృంగార డోలోత్సవంతో ముగియనున్నాయి. 11 రోజుల పాటు నవాహ్నిక దీక్షతో పాంచరాత్ర ఆగమ సిద్ధాంతానుసారం, సంప్రదాయ రీతిలో ప్రధానాలయం ఉద్ఘాటన జరిగిన తరువాత బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆలయానికి తాత్కాలికంగా విద్యుత్ దీపాలు, అరటి, మామిడి తోరణాలు, పూలతో ముస్తాబు చేశారు. ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో 100 మంది పారాయణీకులు, రుత్వికులు, ఆచార్యులు పాల్గొననున్నారు. విష్వక్సేన ఆరాధనతో.. యాదగిరీశుడి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ఉదయం 10గంటలకు శ్రీవిశ్వక్సేనారాధన, స్వస్తివాచనం, రక్షాబంధనంతో ప్రారంభమై, ఈ నెల 28వ తేదీన ఉదయం శతఘటాభిషేకం, రాత్రి 9గంటలకు శ్రీస్వామి వారి శృంగార డోలోత్సవంతో సమాప్తం అవుతాయి. 24న శ్రీస్వామి ఎదుర్కోలు ఉత్సవం , 25న తిరు కల్యాణోత్సవం, 26న దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి అలంకార సేవలు, వాహన సేవలకు అర్చకులు శ్రీకారం చుట్టనున్నారు. ఉత్తర మాఢవీధిలో కల్యాణం.. శ్రీస్వామి వారి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ప్రధానాలయ ఉత్తర మాడవీధిలో తిరు కల్యాణ వేడుక నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కల్యాణోత్సవంలో పాల్గొనే భక్తులు రూ.3,000 చెల్లించి శ్రీస్వామి వారి ఆశీస్సులు పొందాలని వారు కోరుతున్నారు. ఈ కల్యాణోత్సవంలో 10వేల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక పట్టణంలో తాత్కాలిక స్వాగత తోరణాలు, విద్యుత్ దీపాలతో కూడిన స్వాగత తోరణాలను సిద్ధం చేశారు. కొండ పైన ఉత్తర మాడ వీధిలో యాగశాలను సిద్ధం చేశారు. ఆలయ ముఖ మండపంతో పాటు ప్రధానాలయం చుట్టూ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రథమ ప్రాకారంలో సేవల అలంకరణలు శ్రీస్వామి వారి ఉత్సవాల్లో ప్రధానమైనవి అలంకార, వాహన సేవలు. ప్రథమ ప్రాకారంలోని మండపంలో స్వామివారి అలంకార, వాహనసేవలను ముస్తాబు చేసిఉత్తర రాజగోపురం నుంచి మాడవీధుల్లో ఊరేగిస్తారు. తూర్పు రాజగోపురం ముందు ఏర్పాటు చేసే వేదిక వద్ద శ్రీస్వామి వారి అలంకార సేవను అధిష్టించి అర్చకులు, పారాయణీకులు, రుత్వికులు పారాయణం చేస్తారు.బ్రహ్మోత్సవాలను దృష్టిలో పెట్టుకొని ఆలయంలో భక్తులచే నిర్వహించే వివిధ ఆర్జిత సేవలను నిలిపివేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యే బుధవారం నుంచి ఈ నెల 28వ తేదీ వరకు ఆలయంలో నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, శాశ్వత కల్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం, మొక్కు సేవలు రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే పేర్కొన్నారు. 24 నుంచి 26 వరకు భక్తులచే సాయంత్రం నిర్వహించే సహస్రనామార్చనలు, భోగములు రద్దు చేశారు. 27న నిర్వహించే లక్ష పుష్పార్చన పూజలను సైతం నిలిపివేస్తారు. 27 నుంచి 28వ తేదీ వరకు భక్తులచే జరిపించే అభిషేకం, అర్చనలు రద్దు చేశారు. ఇక శ్రీస్వామి వారి తిరు కల్యాణోత్సవంలో పాల్గొనే భక్తులు రూ.3వేలు చెల్లించి సంప్రదాయ దుస్తులతో కల్యాణోత్సవంలో పాల్గొనాలని ఆలయాధికారులు వెల్లడించారు. సేవలకు సిద్ధమైన బంగారు వాహనాలుముస్తాబైన యాదగిరిగుట్ట వీధులునేటి నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫ విష్వక్సేన ఆరాధనతో శ్రీకారం చుట్టనున్న అర్చకులు ఫ 24న ఎదుర్కోలు, 25 తిరుకల్యాణం ఫ 28న శృంగార డోలోత్సవంతో ముగింపు ఫ ఏర్పాట్లు పూర్తిచేసిన ఆలయ అధికారులు -
న్యాయవాదుల ఆందోళన
చివ్వెంల : హైదరాబాద్లో న్యాయవాది మహ్మద్ ఖదీర్ హత్యను నిరసిస్తూ సోమవారం సూర్యాపేట బార్ అసోసియేసన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి కోర్టు ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ న్యాయవాదులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాద పరిరక్షణ చట్టాన్ని ప్రవేశపెట్టి అమలు చేయాలని, న్యాయవాదులకు రక్షణ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, తలమల్ల హస్సెన్, అల్లంనేని వెంకటేశ్వర్రావు, మంతసురం కిశోర్, అనుములపురి సైదులు, కుంచం చంద్రకాంత్, మచ్చగోపి, ధరావతు వీరేశ్నాయక్, బొడ్డు అనిల్కుమార్, మీసాల శ్రీనివాస్, జటంగి శ్రీనాథ్ యాదవ్ పాల్గొన్నారు. -
పట్టణ పాలకులు
సూర్యాపేటటౌన్ : మున్సిపాలిటీల నూతన పాలకవర్గాలు సోమవారం కొలువుదీరాయి. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో నూతనంగా గెలుపొందిన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. తిరుమలగిరి మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్లు బీఆర్ఎస్ సభ్యులు ఎన్నిక కాగా.. కోదాడ, సూర్యాపేట, హుజుర్నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ చైర్మన్, వైస్ చైర్మన్లు ఎన్నికయ్యారు. ఉదయం 11గంటలకు ప్రత్యేక సమావేశం ప్రారంభంకాగా.. క్యాంపుల నుంచి కౌన్సిలర్లు ప్రత్యేక బస్సుల్లో మున్సిపల్ కార్యాలయాలకు చేరుకున్నారు. వారు రాగానే మున్సిపల్ ప్రత్యేక అధికారి సభ్యులచే ప్రమాణం స్వీకారం చేయించారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకున్నారు. చైర్మన్, వైస్చైర్మన్లను ఎన్నుకొని వారితో ప్రమాణం స్వీకారం చేయించడంతో చివరి ఘట్టం ముగిసింది. చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికకు ఒక సభ్యుడు ప్రతిపాదించగా, మరొక సభ్యుడు బలపరిచిన అనంతరం సభ్యులతో చేతులు ఎత్తించగా మెజార్టీ ఎవరికి ఉందో వారిని చైర్మన్, వైస్ చైర్మన్లుగా అధికారులు ప్రకటించారు. నూతన చైర్మన్, వైస్ చైర్మన్లు వీరే..సూర్యాపేట మున్సిపాలిటీల్లో మొరిశెట్టి నివేదిత చైర్ పర్సన్గా ఎన్నిక కాగా.. వైస్ చైర్మన్గా ఎండీ.షఫీఉల్లాను ఎన్నుకున్నారు. అలాగే హుజూర్ మున్సిపల్ చైర్మన్గా దొంతగాని శ్రీనివాస్గౌడ్, వైస్ చైర్మన్గా తన్నీరు మల్లికార్జునరావు ఎన్నుకున్నారు. నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్గా కొణతం చిన్న వెంకటరెడ్డిని ఎన్నుకోగా, వైస్ చైర్మన్గా నూకల సందీప్ కుమార్ రెడ్డి ఎన్నికయ్యారు. తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్గా సంకేపల్లి రఘునందన్రెడ్డిని, వైస్ చైర్మన్గా ఎల్సోజు గోవిందమ్మ.. కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్గా ఎర్నేని కుసుమకుమారి, వైస్ చైర్పర్సన్గా దేవరపల్లి మల్లీశ్వరిలను సభ్యులు ఎన్నుకున్నారు. ఎక్స్అఫీషియో అవసరం లేకుండానే..జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ కై వసం చేసుకున్న నాలుగు మున్సిపాలిటీలకు స్పష్టమైన మెజార్టీ రాగా తిరుమలగిరిలో బీఆర్ఎస్కు స్పష్టమైన మెజార్టీ వచ్చింది. దీంతో ఎక్స్అఫీషియో సభ్యుడి అవసరం లేకుండానే ఎన్నిక జరిగింది. సూర్యాపేట మున్సిపాలిటీలో 48 వార్డులకు గాను కాంగ్రెస్కు 31వార్డులు వచ్చాయి. అలాగే కోదాడ మున్సిపాలిటీలో 35 వార్డుల్లో 26 వార్డుల్లో కాంగ్రెస్ గెలవగా హుజుర్నగర్ మున్సిపాలిటీలో 28 వార్డులకు గాను 19 వార్డులు కాంగ్రెస్ గెలుచుకుంది. అలాగే నేరేడుచర్లలో 15వార్డులకుగాను తొమ్మిది వార్డులు కాంగ్రెస్ గెలుచుకోగా తిరుమలగిరి మున్సిపాలిటీలో 15వార్డులకు గాను 10 వార్డులు బీఆర్ఎస్ కై వసం చేసుకుంది.సందడిగా మున్సిపల్ కార్యాలయాలుసుమారు సంవత్సరం తర్వాత మళ్లీ నూతన పాలకవర్గాలతో మున్సిపల్ కార్యాలయాలు సందడిగా మారాయి. సంవత్సరం పైగా పత్యేకాధికారుల పాలన కొనసాగింది. పాలకవర్గాలు లేక కళతప్పిన మున్సిపల్ కార్యాలయాలు నూతన పాలకవర్గాలతో సందడిగా మారాయి. మూడు నెలలకోసారి మున్సిపల్ప్రత్యేక సమావేశాలు జరగడంతో పాటు ప్రజా సమస్యలపై ఇక గళమెత్తనున్నారు.జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ చైర్మన్లే.. ఫ తిరుమలగిరిలో బీఆర్ఎస్ చైర్మన్ ఎన్నిక ఫ కౌన్సిలర్లు క్యాంపుల నుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయాలకు ఫ ఉదయం 11గంటలకు ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులు ఫ మధ్యాహ్నం 12.30గంటలకు చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ఫ కొత్త పాలవర్గాలతో మున్సిపల్ కార్యాలయాల్లో సందడి -
సన్నాల బోనస్ రూ.43.19 కోట్లు
భానుపురి (సూర్యాపేట) : వానాకాలం సీజన్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన సన్నరకం ధాన్యానికి ఇవ్వాల్సిన బోనస్ నిధులను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఇందులోంచి జిల్లాకు చెందిన రైతులకు రూ.43.19 కోట్లు అందాయి. ఈ నిధులు నేరుగా రైతుల అకౌంట్లలో జమ అయ్యాయి. దాంతో ఇప్పటి వరకు రూ.116.67 కోట్ల బోనస్ చెల్లింపులు పూర్తయ్యాయి. బోనస్ కోసం రెండు నెలలుగా ఎదురు చూస్తున్న రైతులు నిధుల విడుదలతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. విడతల వారీగా..వానాకాలం సీజన్లో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 49,100 మంది రైతుల నుంచి 2,36,830 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి ప్రభుత్వం సేకరించింది. రెండేళ్లుగా సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ చెల్లిస్తోంది. బోనస్ కారణంగా సన్నరకం ధాన్యం సాగు రెట్టింపయ్యింది. గతంలో 50 నుంచి 60 వేల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం పండగా.. ఈ వానాకాలం సీజన్లో కొనుగోలు కేంద్రాలకే 2,36,830 మెట్రిక్ టన్నులు వచ్చింది. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు రూ.118.41 కోట్ల బోనస్ చెల్లించాల్సి ఉంది. అయితే మద్దతు ధరతో కాకుండా ప్రత్యేకంగా రైతులకు బోనస్ను ఇస్తోంది. ఈ క్రమంలో జిల్లాలో ఇప్పటి వరకు మూడు విడతల్లో సుమారు రూ.116.67 కోట్లను అందించింది. రూ.1.72 కోట్లు పెండింగ్ రైతుల నుంచి ధాన్యం సేకరించిన నాటి చి రెండు విడతల్లో రూ.73 కోట్ల నిధులను ప్రభుత్వం జమ చేసింది. తర్వాత నెలరోజులుగా ఎలాంటి నిధులను జమ చేయకపోవడంతో రైతులు పంటల సాగుకు పెట్టుబడుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకు రూ.43.19 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులతో కలిపి జిల్లా రైతాంగానికి మొత్తం రూ.116.67 కోట్లు ఇవ్వగా.. ఇంకా రూ.1.72 కోట్ల నిధులు పెండింగ్లో ఉన్నాయి.రైతుల అకౌంట్లో ధాన్యం బోనస్ డబ్బులుఫ మూడు విడతల్లో కలిపి రూ.116.67 కోట్లు చెల్లింపు ఫ పెండింగ్లో మరో రూ.1.72 కోట్లు -
15 సెకన్లలో యూరియా నిల్వలు ఖాళీ
పెన్పహాడ్ : మండలంలోని అనంతారం గ్రామంలోని నారాయణగూడెం పీఏసీఎస్ కార్యాలయానికి 444 బస్తాల యూరియా రావడంతో సిబ్బంది సోమవారం యాప్లో అప్లోడ్ చేశారు. సమయం ప్రారంభమైన 15 సెకన్లలోనే 125 మంది రైతులు యూరియా బస్తాలను బుక్ చేసుకున్నారు. ఆ తర్వాత యాప్లో నిల్వలు అయిపోయినట్లు మెసేజ్ వస్తుండడంతో అక్కడికి వచ్చిన రైతులు ఆందోళన చేపట్టారు. యూరియా యాప్ను రద్దు చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ లాలు అక్కడికి చేరుకొని వారితో మాట్లాడారు. యాప్లో బుక్ చేసుకున్న రైతులకు యూరియాను అందిస్తామని. మిగతా రైతులు నిల్వలు రాగానే యాప్లో బుక్ చేసుకోవాలని రైతులను సముదాయించడంతో వారు శాంతించారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి అనిల్కుమార్, సీఈఓ ఆలయకుంట్ల సైదులు, సిబ్బంది ఉన్నారు.ఫ పీఏసీఎస్ కార్యాలయం ఎదుట రైతుల ఆందోళన -
లక్ష్మీనరసింహుడి నిత్య కల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో సోమవారం స్వామివారి నిత్య కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. కల్యాణోత్సవం అనంతరం స్వామి, అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాఢ వీదుల్లో ఊరేగించారు. పార్వతీ రామలింగేశ్వరాలయంలో ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ బి.జ్యోతి, అర్చకులు పాల్గొన్నారు. ఉచిత శిక్షణకు దరఖాస్తులుభానుపురి (సూర్యాపేట) : రాష్ట్ర ముస్లిం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీ నిరుద్యోగ యువతకు హార్డ్వేర్, నెట్వర్కింగ్ కోర్సులలో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల యువతీ యువకులు అర్హత పత్రాలతో దరఖాస్తులను జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో గానీ, భూమిరెడ్డి హాస్పిటల్ పక్కన గల విన్సోల్ ఎడ్యూకేషన్ సొసైటీలో గానీ ఈ నెల 21లోగా అందించాలని సూచించారు. యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు జిల్లా మైనారిటీ ఆఫీస్లో లేదా మొబైల్ నంబర్ 9492611057, 9666499929ను సంప్రదించాలని కోరారు. బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీసూర్యాపేటటౌన్ : కామారెడ్డి డిక్లరేషన్ను తుంగలో తొక్కి కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తుందని బీసీ విద్యార్థి జేఏసీ రాష్ట్ర చైర్మన్ వీరబోయిన లింగయ్య యాదవ్ అన్నారు. జిల్లాలో మున్సిపల్ చైర్మన్లుగా బీసీలకు అవకాశం కల్పించలేదని ఆరోపిస్తూ సోమవారం సూర్యాపేటలోని 60 ఫీట్ల రోడ్డులో కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్న అగ్రవర్ణాలు, కాంగ్రెస్ పార్టీ తీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికలలో బీసీలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు తగుళ్ల జనార్దన్, చిన్న శ్రీశైలం, రామ్యాదవ్, బయ్యా రాజేశ్, శంకర్, గణేశ్ పాల్గొన్నారు. యాదగిరీశుడి ప్రధానాలయం శుద్ధి యాదగిరిగుట్ట : ఈ నెల 18 నుంచి 28వ తేదీ వరకు యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో ప్రధానాలయాన్ని పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా ఆలయ అర్చకులు వేద మంత్రాల నడుమ ఈఓ భవానీ శంకర్ ఆధ్వర్యంలో ఆలయ పర్యవేక్షకులు, సిబ్బంది శుద్ధి చేశారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యేందుకు తక్కువ సమయం ఉన్నందున సోమవారం మధ్యాహ్నం 2.30 నుంచి 3గంటల వరకు ఆలయాన్ని శుద్ధి చేశారు. ఆ సమయంలో భక్తులకు శ్రీస్వామి దర్శనాలను అధికారులు నిలిపివేశారు. గర్భాలయంతో పాటు ఉప ఆలయాలు, ముఖ మండపం, క్యూలైన్లు, ఆలయ ప్రథమ ప్రాకార మండపాలను సిబ్బంది శుద్ధి చేశారు. అంతకు ముందు గర్భాలయంలోని స్వయంభూలకు ఈఓ భవానీ శంకర్, ప్రధానార్చకులు సురేంద్రచార్యులకు సింధూర లేపనాన్ని అందజేశారు. -
దొంగతనం కేసులో ఇద్దరు అరెస్టు
కేతేపల్లి: దొంగతనం కేసులో ఇద్దరు నిందితులను కేతేపల్లి పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం శాలిగౌరారం సీఐ కొండల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన పసల కరుణ గత నెల 12న ఇంటికి తాళం వేసి పిల్లలతో కలిసి గజ్వేల్లో ఉంటున్న తన భర్త సునీల్కుమార్ దగ్గరకు వెళ్లింది. తిరిగి గత నెల 19న ఇంటికి వచ్చి చూసేసరికి తాళం పగులగొట్టి ఉండటంతో లోపలికి వెళ్లి చూడగా రూ.3లక్షల నగదు, బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేతేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా కేతేపల్లి మండలం చీకటిగూడెం వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా కరుణ ఇంట్లో చోరీకి పాల్పడింది తామేనని నిజం అంగీకరించారు. నిందితులు ఏపీలోని నంద్యాల టౌన్కు చెందిన షేక్ మహబూబ్ పాష, ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లకు చెందిన కుప్పాల నాగవెంకటతిరుపతిరావుగా గుర్తించామని సీఐ తెలిపారు. వీరిద్దరితో పాటు రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం అనాజ్పూర్కు చెందిన బండారి శివ కలిసి చెడు అలవాట్లకు బానిసై దొంగతనాలు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. వీరు చోరీ చేసిన డబ్బులతో గంజాయి వ్యాపారం కూడా చేస్తున్నట్లు తెలిపారు. కరుణ ఇంట్లో చోరీ చేసిన డబ్బును సమానంగా పంచుకుని ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారని, సోమవారం బంగారు ఆభరణాలు అమ్మేందుకు హైదరాబాద్లో ఉంటున్న బండారు శివ వద్దకు మహబూబ్ షాష, నాగవెంకట తిరుపతిరావు బయల్దేరగా.. అరెస్టు చేసినట్లు సీఐ వివరించారు. వారి ఆరు గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు గ్రాముల వెండి ఆభరాణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
కాంగ్రెస్తో బీజేపీ చేతులు కలిపింది
● మాజీ మంత్రి జగదీష్రెడ్డి విమర్శతిరుమలగిరి(తుంగతుర్తి) : బీజేపీ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను చూసి భయపడుతోందని, అందుకే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో బీజేపీ చేతులు కలిపిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన తిరుమలగిరిలో మున్సిపల్ చైర్మన్గా ఎన్నికై న సంకెపల్లి రఘునందన్రెడ్డిని, నూతన కౌన్సిలర్లను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎన్నికల సంఘం ప్రేక్షక పాత్ర పోషించిందని, ఎన్నికల సంఘం కాంగ్రెస్కు బి టీమ్గా వ్యవహరిస్తుందని ఆరోపించారు. అధికార పార్టీ మున్సిపాలిటీలను చేజిక్కించుకోవడానికి కౌన్సిలర్లను కిడ్నాప్ చేశారని విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీదే విజయమని అన్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి దోపిడీలు చూడలేదన్నారు. ఆయన వెంట తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్కుమార్ ఉన్నారు. ఏడుగురిపై కేసు నమోదుభువనగిరి: పట్టణంలోని 1వ వార్డు అర్బన్ కాలనీలో తమకు ఓటు వేయలేదని ఓటర్లను దూషిస్తున్న వారిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సోమవారం ఏడుగురిపై కేసు నమోదు చేశారు. రెండో వార్డు కౌన్సిలర్ పోలిశెట్టి అనిల్కుమార్తో పాటు పోలిశెట్టి ఫౌండేషన్ సభ్యులు అభినయ్, మిట్లు, బాలు, రియాజ్, ఫయాజ్, జావిద్పై కేసు నమోదు చేసినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. -
కర్ల రాజేష్ కుటుంబానికి అండగా ఉంటాం
కోదాడ: కోదాడలో ఇటీవల రిమాండ్లో ఉండగా మృతిచెందిన దళిత యువకుడు కర్ల రాజేష్ కుటుంబానికి అండగా ఉంటామని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్ అన్నారు. సోమవారం ఆయన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని రాజేష్ ఇంటికి అడిషనల్ డీజీపీ డీఎస్ చౌహాన్, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహతో కలిసి వెళ్లి రాజేష్ తల్లిని పరామర్శించారు. అక్కడే ఉన్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆయనకు రాజేష్ మృతికి గల కారణాలను వివరించారు. పోలీసుల వల్లే రాజేష్ మృతిచెందాడని తాను అన్ని ఆధారాలతో డీఎస్పీ నుంచి డీజీపీ వరకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మంద కృష్ణమాదిగ ఆయనకు విన్నవించారు. ఈ సందర్భంగా ఎస్పీపై రాంచందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చే తాత్కాలిక పింఛన్ మంజూరు పత్రాన్ని రాజేష్ తల్లి లలితమ్మకు అందించారు. చార్జిషీట్ దాఖలు చేయాలి..ఈ కేసులో 10 రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించినట్లు వడ్డేపల్లి రాంచందర్ తెలిపారు. కోదాడ ఆర్డీఓ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాజేష్ మృతికి కారణమైన అప్పటి చిలుకూరు ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని డీజీ డీఎస్ చౌహన్కు చెప్పామన్నారు. కర్ల రాజేష్ తల్లికి మూడు రోజుల్లో ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడానికి కలెక్టర్ అంగీకరించారని, రెండు నెలల్లో ఆమెకు మూడెకరాల భూమిని కూడా మంజూరు చేయాని కలెక్టర్ను ఆదేశించామన్నారు. 10 రోజుల్లో రాజేష్ మృతదేహానికి రీపోస్టుమార్టం చేసి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించామన్నారు. కమిషన్ ఆదేశాలను అమలు చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్ -
మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలి
భువనగిరి: పట్టణ శివారులోని మైనార్టీ గురుకుల పాఠశాలకు చెందిన బాలఆకాష్ ఆదివారం తోటి విద్యార్థితో కలిసి పాఠశాల సమీపంలోని ఫాంపాండ్లో ఈతకు వెళ్లి నీట మునిగి మృతిచెందాడు. నకిరేకల్ నియోజకవర్గంలోని కేతేపల్లి మండలానికి చెందిన బాలఆకాష్ మృతదేహాన్ని భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా చిరుమర్తి మాట్లాడుతూ.. విద్యార్థి మృతికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి రూ.2కోట్లు ఎక్స్గ్రేషియా చెల్లించాలని, కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా బాలఆకాష్ కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ధర్నాలో బీఆర్ఎస్ నాయకులు అంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
అంత్యక్రియలకు వస్తూ అనంతలోకాలకు..
ఆలేరురూరల్: అంత్యక్రియలకు వస్తూ క్వాలిస్ వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ఇద్దరు మృతిచెందారు. మరో ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆలేరు మండలం కందిగడ్డతండా శివారులో సోమవారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు మండలం తూర్పుగూడెం గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ తన కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడు రాజధాని చైన్నెలో ఉంటున్నాడు. ఆయన భార్య రాములమ్మ అనారోగ్యంతో ఆదివారం మృతిచెందింది. రాములమ్మ అంత్యక్రియలు స్వగ్రామం తూర్పుగూడెంలో చేసేందుకు గాను ముందుగా మృతదేహాన్ని అంబులెన్స్లో చైన్నె నుంచి ఇక్కడికి పంపించారు. అనంతరం లక్ష్మీనారాయణ తన కుటంబ సభ్యులతో కలిసి చైన్నె నుంచి రైలులో బయల్దేరి సోమవారం ఉదయం వరంగల్ రైల్వే స్టేషన్లో దిగారు. వరంగల్ నుంచి క్వాలిస్ వాహనంలో తూర్పుగూడేనికి వస్తుండగా.. ఆలేరు మండలం కందిగడ్డతండా గ్రామ శివారులో క్వాలిస్ వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు ఢీకొని బోల్తా పడింది. దీంతో క్వాలిస్లో ప్రయాణిస్తున్న మల్లిక(55), లక్ష్మీనారాయణ అత్త లక్ష్మమ్మ(88) ఇద్దరు మృతిచెందారు. మరో ఏడుగురు సత్యనారాయణ, లలిత, ప్రియదర్శిని, బాలాజీ, యశోద, సాయితరుణ్, డ్రైవర్ వంశీకి స్వల్ప గాయాలయ్యాయి. మృతురాలు మల్లిక చైన్నెలో లక్ష్మీనారాయణ నివాసముంటున్న ఇంటి పక్కన ఉంటున్నట్లు తెలిసింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుమారుడు మణిచంద్ర ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ యాలాద్రి తెలిపారు. అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన క్వాలిస్ వాహనం ఇద్దరు మృతి మరో ఏడుగురికి స్వల్ప గాయాలు -
రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టాలి
దేవరకొండ : ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టి 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య కోరారు. సోమవారం దేవరకొండ పట్టణంలో నిర్వహించిన బీసీ సభకు ఆయన హాజరై మాట్లాడారు. బీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీసీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వాలు నిధులు కేటాయించాలని కోరారు. దేవరకొండ నియోజకవర్గంలోని బీసీ సంక్షేమ హాస్టళ్లు, బీసీ గురుకులాలకు పక్కా భవనాలు నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. పెండింగ్లో ఉన్న విద్యార్థుల ఉపకార వేతనాలను విడుదల చేయడంతో పాటు వారి సంక్షేమానికి కొత్త పథకాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. బీసీలు ఐక్యంగా ఉద్యమించి రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలన్నారు. ఈ సందర్భంగా ఇటీవల నూతనంగా ఎన్నికై న సర్పంచ్, ఉప సర్పంచ్లను ఆయన శాలువాలతో సత్కరించారు. అనంతరం ఇటీవల విద్యార్థులకు ప్లాస్టిక్ వినియోగం–దాని పర్యవసనాలు అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి చింతపల్లి శ్రీనివాస్గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆ సంఘం నాయకులు అరుణ్కుమార్, వరికుప్పల శ్రీను, వెంకటయ్య, ఏరుకొండ రాము, భాస్కరాచారి, శివగౌడ్, జయలక్ష్మి, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య -
రియాక్టర్ పేలుడుతో భారీ నష్టం
● బృందావన్ లేబొరేటరీస్ కంపెనీని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ, వివిధ శాఖల అధికారులు ● పూర్తిగా ధ్వంసమైన పరిశ్రమలోని రెండు ప్రొడక్షన్ బ్లాకులు ● రియాక్టర్లో ఒత్తిడి పెరగడంతోనే ప్రమాదం జరిగినట్లు అంచనా ● నలుగురు కార్మికులకు స్వల్ప గాయాలుచౌటుప్పల్: మండల పరిధిలోని ఎల్లగిరి గ్రామ శివారులోని బృందావన్ లేబొరేటరీస్ కంపెనీలో శుక్రవారం రాత్రి రియాక్టర్ పేలుడుతో భారీగానే నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. కంపెనీలోని ఉత్పత్తుల విభాగంలోని రియాక్టర్లో ఒత్తిడి పెరగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పరిశ్రమ నిర్వాహకులు అంచనా వేశారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆయా బ్లాకుల్లో కార్మికులు ఉన్నప్పటికీ ప్రమాదాన్ని ముందే పసిగట్టి దూరంగా పరుగు తీయడంతో ప్రాణనష్టం తప్పింది. ఒక్కో ఉత్పత్తుల విభాగంలో 20 వరకు రియాక్టర్లు ఉండగా.. రెండు విభాగాల్లో మాత్రమే ఈ ప్రమాదం జరిగింది. ఒక ఉత్పత్తుల విభాగంలో మాత్రమే ప్రమాదం చోటుచేసుకోవడంతో అందులోని ఒక రియాక్టర్ భారీ శబ్దంతో పేలిపోయింది. మరో విభాగంలోని రియాక్టర్లకు ఏమీ జరగలేదు. రియాక్టర్ పేలుడుతో ఉత్పత్తుల విభాగం బ్లాక్లతో పాటు కంపెనీలోని పలు భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కొన్ని భవనాలు కూలిపోయాయి. పేలుడు ధాటికి సామగ్రి, శిథిలాలు కంపెనీ పరిసరాల్లో ఎగిరిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది శనివారం తెల్లవారుజాము వరకు శ్రమించి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదం కారణంగా నష్టం కోట్లల్లోనే ఉంటుందని పరిశ్రమ ఎండీ రామయ్య తెలిపారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన అధికారులు బృందావన్ లేబొరేటరీస్ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుసుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఎస్పీ అక్షాంశ్యాదవ్ శుక్రవారం అర్ధరాత్రే ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మంటలను అదుపుచేసి ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కాలుష్యనియంత్రణ మండలి ఈఈ వెంకన్న, పరిశ్రమల విభాగం, రెవెన్యూ, పోలీసులు, ఇతర శాఖల అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. ప్రమాదంపై విచారణ జరిపించాలి ఈ ప్రమాదంపై విచారణ జరిపించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన పరిశ్రమను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శిథిలాలను వెంటనే తొలగించి కార్మికుల వివరాలు ప్రకటించాలని కోరారు. ఆయన వెంట కల్లూరి మల్లేశం, ఆవనగంటి వెంకటేశం, పాష, బూరుగు కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. నలుగురికి గాయాలురియాక్టర్ పేలిన సమయంలో శిథిలాలు ఎగిరిపడడంతో పరిశ్రమలో పనిచేస్తున్న పగడాల సాయి, దుర్గాప్రసాద్, అరుణ్కుమార్, కోమలేష్ అనే కార్మికులకు స్వల్ప గాయాలైనట్లు చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపారు. వారిని శుక్రవారం రాత్రే చౌటుప్పల్లోని ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయించినట్లు పేర్కొన్నారు. క్షతగాత్రుడు పగడాల సాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
ప్రేమికుల రోజున విషాదం
మోటకొండూర్: మైనర్ బాలిక, యువకుడు ప్రేమించుకున్నారు. ఇరువురి తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపంతో ఈ నెల 6వ తేదీన ఇద్దరు పురుగుల మందు తాగగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ప్రేమికుల దినోత్సవం రోజునే యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన మోటకొండూర్ మండలం తేర్యాలలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తేర్యాల గ్రామానికి చెందిన వరికుప్పల రాకేష్(21) ట్రాక్టర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. రాకేష్ అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను ప్రేమించాడు. ఈ విషయం బాలిక కుటుంబ సభ్యులకు తెలియడంతో ఇద్దరినీ మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన రాకేష్, బాలిక ఈ నెల 6న నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం రాళ్లవాగుతండాలోని గుట్ట వద్దకు వెళ్లి పురుగుల మందు తాగారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన వారిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వారిద్దరిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ రాకేష్ శనివారం ఉదయం మృతిచెందాడు. బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు. తల్లిదండ్రులు మందలించారని ఈ నెల 6న పురుగుల మందు తాగిన ప్రేమ జంట ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృతి మైనర్ బాలిక పరిస్థితి విషమం -
మున్సిపల్ చైర్మన్ పదవుల్లో 70 శాతం బీసీలకు ఇవ్వాలి
భువనగిరిటౌన్ : మున్సిపల్ చైర్మన్ సీట్లలో బీసీలకు 70 శాతం ఇవ్వాలని, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవులు మూడు బీసీలకు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం భువనగిరిలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలు 70 శాతం మంది పోటీ చేస్తే 60 శాతం మంది విజయం సాధించారని, ఇది బీసీల రాజకీయ చైతన్యానికి నిదర్శనమని అన్నారు. జనరల్ స్థానాలంటే రెడ్డి, రావులది కాదని, అందులో అందరికీ అవకాశం ఉంటుందన్నారు. బీసీలు అగ్రకులాల మాటలు నమ్మవద్దని, ‘మనమెంతో మనకు అంత’ అనే నినాదంతో పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యంభువనగిరి: మండలంలోని రాయగిరి గ్రామ చెరువు వద్ద శనివారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పెట్రోలింగ్ పోలీసులు గుర్తించి పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి వయస్సు సుమారు 55 నుంచి 60 సంవత్సరాలు ఉంటాయని, భిక్షగాడిలా కనిపిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 87126 62472, 87126 62733 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ సూచించారు. -
తండ్రి కళ్లముందే కుమార్తె మృతి
● బైక్పై వెళ్తుండగా ఢీకొట్టిన లారీ చౌటుప్పల్ : తండ్రి, కుమార్తె బైక్పై వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి కళ్లముందే కుమార్తె మృతిచెందింది. ఈ ఘటన హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం శివారులో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన వడ్డగోని రమేష్, తన కుమార్తె రిహాన్సిక(9)తో కలిసి ద్విచక్ర వాహనంపై చౌటుప్పల్ నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. లింగోజిగూడెం గ్రామ శివారులోకి రాగానే హైదరాబాద్ నుంచి వేగంగా వస్తున్న లారీ వీరి ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో రమేష్, రిహాన్సిక రోడ్డుపై పడిపోయారు. లారీ రిహాన్సిక తలపై నుంచి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. రమేష్కు గాయాలు కాగా.. స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. అదృశ్యమై.. చెరువులో శవమై తేలి..చిట్యాల: చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామ పరిధిలోని చెరువులో శనివారం వృద్ధురాలి మృతదేహం లభ్యమైంది. చిట్యాల ఎస్ఐ ఎం. రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మండలం రెడ్డిబావి గ్రామానికి చెందిన నందగిరి రాములమ్మ(81)కు మతిస్థిమితం సరిగా లేదు. గతేడాది డిసెంబర్ 19 నుంచి ఆమె కనిపించడంలేదు. డిసెంబర్ 22న ఆమె కుటుంబ సభ్యులు చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామ శివారులోని చెరువులో శనివారం గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించిన గొర్రెల కాపరులు వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించారు. గ్రామస్తులు సమాచారం మేరకు చిట్యాల ఎస్ఐ రవికుమార్ చెరువు వద్దకు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. రాములమ్మ కుటుంబ సభ్యులు వచ్చి దుస్తులు, చెప్పులు చూసి మృతదేహం ఆమెదేనని గుర్తించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన బైక్● ఇద్దరు యువకులు దుర్మరణం వలిగొండ : బైక్పై వెళ్తున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొని మృతిచెందారు. ఈ ఘటన వలిగొండ మండలం సుంకిశాల గ్రామంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వలిగొండ మండల కేంద్రానికి చెందిన కళ్లెం పరమేష్(23) డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతడితో పాటు సుంకిశాలకు చెందిన పోలేపెల్లి మనోజ్ (18) కలిసి బైక్పై పని నిమిత్తం రెడ్లరేపాక గ్రామ పరిధిలోని మర్లపాడుకు వెళ్లి వస్తుండగా.. సుంకిశాలలోని ప్రభుత్వ పాఠశాల సమీపంలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే వారు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ యుగంధర్ తెలిపారు. -
నేనున్నాను.. మీరు బాధపడొద్దు
● మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులకు ఎమ్మెల్యే ఐలయ్య భరోసాఆలేరు: ఆలేరు మున్సిపాలిటీలో ఓటమిపాలైన కాంగ్రెస్ అభ్యర్థులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరామర్శించారు. శనివారం రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్రెడ్డితో కలిసి 1, 3, 4, 5, 8 వార్డుల అభ్యర్థులు చింతలఫణి సునీతాశ్రీనివాస్రెడ్డి, సందిల సురేష్, గుత్త శమంతారెడ్డి, చింతకింది మురళి, పాము అనితల నివాసాలకు ఎమ్మెల్యే వెళ్లి పరామర్శించారు. వారు వెళ్లగానే మహిళా అభ్యర్థులు బోరున విలపించారు. నమ్మించి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధపడొద్దని తాను, పార్టీ అండగా ఉంటామని ఎమ్మెల్యే ఓదార్చారు. ఓడిపోయిన అభ్యర్థులు ఆయా వార్డులకు ఇన్ఛార్జిలుగా ఉంటారని, వార్డు ప్రజలకు సంక్షేమ ఫలాలు వారి ద్వారా అందించేలా బాధ్యతలు అప్పగిస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఐదుగురు అభ్యర్థులు తమ ఓటమికి కారణాలను సూచనప్రాయంగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా పరిశీలిస్తానన్నారు. ఆయన వెంట నాయకులు ఇజాజ్, ముదిగొండ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
భూదాన్పోచంపల్లి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. పోచంపల్లి మున్సి పాలిటీ పరిఽధిలోని ముక్తాపూర్కు చెందిన నోముల వెంకట్రెడ్డి(45) ఈ నెల 12న పని మీద బైక్పై పోచంపల్లికి వచ్చి తిరిగి ఇంటికి వెళ్తున్నాడు. ముక్తాపూర్ క్రాస్ రోడ్డు సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న ఆటోను ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వచ్చిన మరో వాహనదారుడిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో వెంకట్రెడ్డి రోడ్డుపై పడిపోవడంతో అతడి తలకు తీవ్రగాయమై కోమాలోకి వెళ్లాడు. విషయం తెలుసుకున్న వెంకట్రెడ్డి కుటుంబ సభ్యులు అతడిని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడు బోర్వెల్ డ్రిల్లర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఎంజీయూ హాస్టల్లో విద్యార్థుల ఆందోళననల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీలోని హాస్టల్లో విద్యార్థులు ఉపయోగించే తాగు నీటి రిఫ్రిజిరేటర్లో శనివారం జెర్రి రావడంతో కలకలం రేగింది. యూనివర్సిటీలో ఇటీవల తరచుగా రిఫ్రిజిరేటర్లో కప్పలు, పురుగులు రావడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రిఫ్రిరేజిరేటర్ పాడైపోయినా దానన్ని మార్చకుండా ఉపయోగించడంతో విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వసస్తోందని ఏబీవీపీ నాయకులు ఆందోళన చేశారు. జెర్రి ఉన్న రిఫ్రిరేజిరేటర్ను అక్కడి నుంచి తీసుకుపోయి బయట పడేశారు. విద్యార్థులంతా పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో హాస్టర్ డైరెక్టర్ రమేష్ వారికి సర్దిచెప్పారు. కొత్త రిఫ్రిజిరేటర్ కొనుగోలు చేసి విద్యార్థులకు నాణ్యమైన తాగునీరు అందించాలని ఏబీవీపీ ఎంజీయూ అధ్యక్షుడు హనుమాన్ డిమాండ్ చేశారు. ఎక్స్గ్రేషియా ఇవ్వాలి భువనగిరిటౌన్ : గీత కార్మికులకు రావాల్సిన ఎక్స్గ్రేషియా నిధులు విడుదల చేయాలని కేజీకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొలగాని జయ రాములు డిమాండ్ చేశారు. శనివారం భువనగిరి పట్టణంలోని ఫంక్షన్ హాల్లో సంఘం జిల్లా అధ్యక్షుడు రాగీరు కృష్ణయ్య అధ్యక్షతన కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాలు కల్లుగీత కార్మికులను ఓటు బ్యాంకుగా చూడకుండా వారి సంక్షేమానికి బడ్జెట్లో రూ.5వేల కోట్లు కేటాయించాలన్నారు. ఈ నెల 17న ఇందిరా పార్క్ వద్ద రాష్ట్ర కమిటీ సభ్యుల సామూహిక నిరాహార దీక్ష కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. -
రామలింగేశ్వరాలయంలో శివపార్వతుల కల్యాణం
యాదగిరిగుట్ట : యాదగిరి క్షేత్రానికి అనుబంధంగా ఉన్న పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. మూడవ రోజైన శనివారం ఉదయం ఆలయంలో నిత్య హవనం, శివపంచాక్షరీ జపం, నందీశ్వర పారాయణం, పంచ సూక్త పఠనం చేశారు. యజ్ఞ బ్రహ్మ ఆధ్వర్యంలో రుద్ర హవనం జరిపించారు. సాయంత్రం స్తోత్ర, వేద, నమక, చమక పారాయణములు, మంత్ర పుష్ప పఠనములు, సోమకుంభార్చనలు, మూలమంత్ర పారాయణాలు యధావిధిగా నిర్వహించారు. మహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శివాలయ ఉత్తర దిశలోని కల్యాణ మండపంలో రాత్రి 8గంటలకు శ్రీపర్వత వర్ధిని రామలింగేశ్వరుడి కల్యాణ మహోత్సవం నిర్వహించారు. అదేవిధంగా శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి కల్యాణం వైభవంగా జరిపించారు. వేడుకల్లో ఆలయ అధికారులు, ఆలయ ప్రధాన పూజారులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆలయంలో నేడు..మహా శివరాత్రిని పురస్కరించుకొని ఆదివారం పర్వత వర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయంలో అభిషేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాత్రి మహాన్యాస పూర్వక శతరుద్రాభిషేకం జరిపించనున్నారు. -
పాలకవర్గం మొత్తం కొత్తవారే..
ఆలేరు మున్సిపాలిటీలో 12 మంది తొలిసారి విజయంఆలేరు : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీలో గెలిచిన అభ్యర్థులందరూ కొత్త వారే. మొత్తం 12 వార్డుల్లో అందరూ మొదటిసారి విజయం సాధించిన వారే. కొందరు తొలి ప్రయత్నంలో, మరికొందరు రెండో ప్రయత్నంలో విజయాన్ని అందుకున్నారు. ఇందులో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన అభ్యర్థులు ఉన్నారు. చండూరులో పదికి పది కొత్త ముఖాలే..చండూరు : నల్లగొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ పాలకవర్గం మొత్తం కొత్త వారితోనే కొలువుతీరనుంది. మున్సిపాలిటీలోని పది వార్డులకు గాను అన్నింట్లో కొత్తవారే ఎన్నికయ్యారు. ఈ పది మందిలో ముగ్గురు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలై.. ఈసారి ఎన్నికల్లో విజయం సాధించారు. మిగతా ఏడుగురు ఈ ఎన్నికల్లోనే మొదటిసారి పోటీ చేసి విజయం సాధించారు. అయితే అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి పది వార్డుల్లో 18 మంది పోటీ చేయగా.. అందులో 11 మంది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే తెర మీదకు రావడం విశేషం. 27 ఏళ్లకే కౌన్సిలర్గా విజయం చండూరు: చండూరు మున్సిపాలిటీలో 5వ వార్డు నుంచి 27 ఏళ్ల యువకుడు కౌన్సిలర్గా గెలుపొందాడు. 5వ వార్డు ఎస్టీ జనరల్కు రిజర్వు కావడంతో కొన్రెడ్డి మధు బీఆర్ఎస్ తరఫున బరిలో నిలిచాడు. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన మధు కాంగ్రెస్ ప్రభంజనంలో కూడా తన సమీప ప్రత్యర్థిపై 358 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. తల్లి పారిశుద్ధ్య కార్మికురాలు.. కుమారుడు కౌన్సిలర్చండూరు : తల్లి పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న మున్సిపాలిటీలోనే కుమారుడు కౌన్సిలర్గా గెలుపొందాడు. నల్లగొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ 2వ వార్డులో కాంగ్రెస్ నుంచి 30 ఏళ్ల బుషిపాక వాసు 51 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. వాసు తల్లి ఎల్లమ్మ చండూరు మున్సిపాలిటీలోనే పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. వాసుకు ఐదేళ్ల వయస్సులో అతడి తండ్రి భిక్షమయ్య మృతిచెందగా.. అప్పట్లో చండూరు గ్రామ పంచాయతీలో, ఇప్పుడు మున్సిపాలిటీలో అతడి తల్లి ఎల్లమ్మ పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తూ వస్తోంది. వాసు డిగ్రీ చదువు మధ్యలోనే ఆపి చిన్నచిన్న పనులు చేస్తూ తల్లికి చేదోడువాదోడుగా ఉంటూ వచ్చాడు. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో అనూహ్యంగా కౌన్సిలర్గా పోటీచేసి విజయం సాధించాడు. -
పీఠంపై ఉత్కంఠ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీకి, తిరుమలగిరిలో బీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది. దీంతో కాంగ్రెస్ పార్టీ వారే సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్లలో పాలకవర్గాలను ఏర్పాటు చేయనుండగా, తిరుమలగిరిలో బీఆర్ఎస్ పాలకవర్గం కొలువుదీరనుంది. ఇప్పటికే సూర్యాపేట చైర్మన్గా నివేదిత లక్ష్యాది పేరును ఖరారు చేయగా.. ఇక్కడ వైస్ చైర్మన్ ఎవరన్న చర్చ సాగుతోంది. మిగతా మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎవరనే విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఫలితాలు వెలువడిన వెంటనే కౌన్సిలర్లను ఆయా పార్టీలు క్యాంపులకు తరలించాయి. అక్కడే చైర్మన్, వైస్ చైర్మన్ ఎవరన్నది చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈనెల 16వ తేదీన నేరుగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సమావేశాలకు హాజరుకానున్నారు. సూర్యాపేటలో లాంఛనమేసూర్యాపేట మున్సిపాలిటీలో చైర్మన్ అభ్యర్థిగా మొరిశెట్టి నివేదిత లక్ష్యాదిని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఆమె చైర్మన్ కానుండగా, వైస్ చైర్మన్ ఎవరన్నది తేలాల్సి ఉంది. క్యాంపునకు తరలివెళ్లిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లతో శనివారం హైదరాబాద్లో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలోనూ వైస్ చైర్మన్ ఎవరన్న దానిపై ప్రాథమికంగా చర్చించినట్లు తెలిసింది. ఆదివారం మరోసారి చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇక్కడ వైస్ చైర్మన్ పదవి కోసం బీసీ సామాజిక వర్గానికి చెందిన గుణగంటి హేమాసతీష్, బైరు శైలేందర్, కుమ్మరికుంట్ల వేణుగోపాల్, వెలుగు వెంకన్న, మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన షేక్ జహీర్, షపీఉల్లా పోటీ పడుతున్నారు. కోదాడలో నలుగురు ఆశావహులుకోదాడ మున్సిపల్ చైర్మన్ పదవి కోసం నలుగురు పోటీ పడుతున్నారు. దేవరపల్లి మల్లేశ్వరి, ఎర్నేని కుసుమ, పార సత్యవతి పదవిని ఆశిస్తున్నారు. వైస్ చైర్మన్ పదవి బీసీలకు ఇస్తే కందుల కోటేశ్వర్రావు రేసులో ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని మోయినాబాద్లోని ఓ రీసార్ట్లో ఉన్న వారితో శనివారం మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి చర్చించారు. తుది నిర్ణయం తీసుకోలేదు. ఆదివారం మరోసారి చర్చించి 16వ తేదీనే నిర్ణయం తీసుకోనున్నారు. నేరేడుచర్లలో ఇద్దరు పోటీ..నేరేడుచర్ల మున్సిపాలిటీ చైర్మన్ జనరల్ కావడంతో కొణతం చిన్నవెంకట్రెడ్డి, నూకల సందీప్రెడ్డి పోటీ పడుతున్నారు. వీరిలో ఒకరికి చైర్మన్ పదవి దక్కితే వైస్ చైర్మన్ ఎవరికి ఇస్తారనే దానిపై చర్చ సాగుతోంది. హుజూర్నగర్లో మంత్రి నిర్ణయమే ఫైనల్హుజూర్నగర్ మున్సిపల్ చైర్మన్ పదవిని తన్నీరు మల్లికార్జునరావు, దొంతగాని శ్రీనివాస్ ఆశిస్తున్నారు. వైస్ చైర్మన్ పదవి కోసం కోతి సంపత్రెడ్డి పోటీ పడుతున్నారు. ఈ విషయంపై మంత్రి ఉత్తమ్ నిర్ణయం తీసుకోనున్నారు. మంత్రి నిర్ణయానికి కట్టుబడి ఉంటామని వారు ముందే ప్రకటించారు. దీంతో మంత్రి 16వ తేదీన చైర్మన్, వైస్ చైర్మన్ పేర్లను ప్రకటించునున్నారు. ఎన్నికలకు ముందురోజు క్యాంపునకు వెళ్లిన వారంతా శుక్రవారమే తిరిగి వచ్చారు. తిరుమలగిరిలో రఘునందన్రెడ్డికే చాన్స్తిరుమలగిరి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ ముందుగానే సంకెపల్లి రఘునందన్రెడ్డి పేరును చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన్నే చైర్మన్గా ఎన్నుకునే అవకాశం ఉంది. ఇక వైస్ చైర్మన్ ఎవరన్నది ఇంతవరకు ప్రకటించలేదు. ప్రస్తుతం క్యాంపులోనే ఉన్న ఆ కౌన్సెలర్లు మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. సూర్యాపేట చైర్మన్గా నివేదిత లక్ష్యాది పేరు ఇప్పటికే ప్రకటన వైస్ చైర్మన్ ఎవరన్న దానిపైనే చర్చ ఇతర మున్సిపాలిటీల్లోనూ ఫైనల్ కాని చైర్మన్, వైస్ చైర్మన్ క్యాంపునకు తరలివెల్లిన కౌన్సిలర్లు 16వ తేదీన నేరుగా సమావేశాలకు ఎక్స్ అఫీషియో ఓటు నమోదుకు యత్నంతిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి మున్సి పాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో ఓటు వేసేందుకు ఎక్స్ అఫీషియోగా నమోదు చేసుకునేందుకు ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి శనివారం మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. తన ఓటు నమోదు చేయాలని మున్సిపల్ కమిషనర్ రామచంద్రరావును ఆయన కోరారు. సర్కులర్ నంబర్ 402 ప్రకారం మున్సిపాలిటీ ఏరియాలో ఉన్న వారికే ఓటు హక్కు ఉంటుందని కమిషనర్ తెలిపారు. ఈ సందర్భంగా కోటిరెడ్డి మాట్లాడుతూ ఓటు నమోదు చేసుకోవడానికి వస్తే గంటల కొద్దీ కూర్చోబెట్టి, చివరకు తన అభ్యర్ధనను తిరస్కరించారని తెలిపారు. -
రాష్ట్రంలో ఉచిత విద్యనందించాలి
మునగాల : కేరళలో అమలు చేసినట్లుగా తెలంగాణలోనూ ఉచిత విద్యను అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ కోరారు. శనివారం మునగాల మండలంలోని జగన్నాధపురంలో తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల స్మారకసభ నిర్వహించారు. ఈ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మునగాల చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతమని, ఆనాటి మునగాల పరగణాలో కలకోవ, జగన్నాధపురం గ్రామాలకు చెందిన ఎందరో యోధులు సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొని అమరులయ్యారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తుందని, కేంద్రం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలనపై సీపీఎం నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. పార్టీ మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు అధ్యక్షతన జరిగిన స్మారక సభలో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లు లక్ష్మి, ములకపల్లి రాములు, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం, షేక్ సైదా, జూలకంటి విజయలక్ష్మి, నాయకులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, చందా చంద్రయ్య, జూలకంటి కొండారెడ్డి, సుందరయ్య, గోపయ్య, శాఖా కార్యదర్శులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ -
20 వరకే పత్తి కొనుగోళ్లు
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో సీసీఐ ద్వారా ఈ నెల 20వ తేదీ వరకే పత్తి కొనుగోలు చేయనున్నట్లు జిల్లా మార్కెటింగ్ అధికారి కోటా నాగేశ్వరశర్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కపాస్ కిసాన్ యాప్లో రిజిస్టర్ అయిన రైతులు స్లాబ్ బుక్ చేసుకుని ఈలోగానే పత్తిని మద్దతు ధరకు విక్రయించుకోవాలని సూచించారు. గోదావరి జలాల నిలిపివేతఅర్వపల్లి : యాసంగి సీజన్కు జిల్లాకు వారబందీ విధానంలో గోదావరి జలాలు విడుదల చేస్తున్నారు. అందులో భాగంగా జిల్లాకు విడుదల చేస్తున్న గోదావరి జలాలను శనివారం అధికారులు నిలిపివేశారు. తిరిగి ఈ నెల 21 నుంచి 28 వరకు నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. నేడు మఠంపల్లికి బిషప్మఠంపల్లి : మండల కేంద్రంలోని శుభవార్త చర్చికి ఆదివారం నల్లగొండ మేత్రాసన పీఠాధిపతి (బిషప్) డాక్టర్ దమన్కుమార్ రానున్నారు. ఈ సందర్భంగా స్థానిక రెవరెండ్ ఫాదర్ రాజారెడ్డి పోగుల విలేకరులతో మాట్లాడారు. బిషప్ శుభవార్త చర్చిని మేరీమాత పుణ్యక్షేత్రంగా ప్రకటించనున్నారని తెలిపారు. దాంతో ఏప్రిల్లో జరిగే చర్చి వార్శికోత్సవాల నుంచి ఈ చర్చి మేరీమాత పుణ్యక్షేత్రంగా వాడుకలోకి వస్తుందన్నారు. బిషప్ చర్చిలో దివ్యబలిపూజ చేసి క్రైస్తవులకు ఆధ్యాత్మిక ప్రసంగం చేయనున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఫాదర్ అశోక్, శుభోదయ యువజన సంఘం అధ్యక్షుడు గాదె జయభారత్రెడ్డి, చర్చి కమిటీ సభ్యులు ఉన్నారు. మట్టపల్లిలో నిత్యారాధనలుమఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో శనివారం నిత్యారాధనలు కొనసాగాయి. ముందుగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం జరిపారు. ఆ తర్వాత రాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీస్వామి అమ్మవార్ల గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. చివరగా నీరాజన మంత్ర పుష్పాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ బి.జ్యోతి, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. మార్కెట్కు మూడు రోజులు సెలవుతిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్కు మూడు రోజుల పాటు సెలవు ప్రకటించినట్లు మార్కెట్ కార్యదర్శి సురేష్ శనివారం ఒక ప్రకటన తెలిపారు. 15న ఆదివారం, 16న శివరాత్రి, 17న అమావాస్య కావడంతో ఈ మూడు రోజులు మార్కెట్ గేటు మూసి ఉంటుందని పేర్కొన్నారు. సెలవు రోజులలో రైతులు మార్కెట్ యార్డుకు వ్యవసాయ ఉత్పత్తులు తీసుకురావద్దని సూచించారు. ఈ నెల 18న మార్కెట్ తెరుచుకుంటుందని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్గా బీసీలకు అవకాశమివ్వాలి సూర్యాపేటటౌన్ : సూర్యాపేట మున్సిపల్ చైర్మన్గా బీసీలకు అవకాశం కల్పించాలని బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ వీరబోయిన లింగయ్య యాదవ్ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిందన్నారు. అయినా ఉమ్మడి నల్ల గొండ జిల్లాలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. సూర్యాపేట జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే స్థానం కూడా బీసీలకు ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. ఆయన వెంట తెలంగాణ స్టూడెంట్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు బారి అశోక్కుమార్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా కన్వీనర్ బయ్యా రాజేశ్, తెలంగాణ స్టూడెంట్ పరిషత్ జిల్లా అధ్యక్షుడు మాదిపల్లి సాయితేజ, బీసీ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పరాల సాయియాదవ్, బీసీ సంఘా నాయకులు పాల్గొన్నారు. -
బుక్ చేసేలోగా నోస్టాక్!
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో యూరియా తిప్పలు మొదలయ్యాయి. వానకాలం సీజన్లో రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఫెర్టిలైజర్ యాప్ను తీసుకు రాగా.. రైతుల నిరక్షరాస్యత, అధికారుల తీరుతో సమస్య మళ్లీ మొదటికే వచ్చింది. సగం మంది రైతులు యూరియాను బుక్ చేసుకునేందుకు అవస్థలు పడుతుండగా.. బుక్ చేసుకునేందుకు సిద్ధమైన రైతులకు నిమిషాల్లోనే నో స్టాక్ అంటూ యాప్ వెక్కిరిస్తోంది. దాంతో యాప్ను రద్దు చేసి పాస్బుక్లపైనే యూరియాను అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. బుక్ చేసేందుకు తిప్పలుసూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఈ యాసంగి సీజన్లో 4.82 లక్షల ఎకరాలలో వరి సాగైంది. అందుకు గానూ 70 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కానుంది. జిల్లాలో ఇప్పటి వరకు 62 వేల మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు సరఫరా చేయగా.. మరో 5,500 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది. రైతులకు యూరియాను పారదర్శకంగా అందించేందుకు ప్రభుత్వం ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ను అమలు చేస్తోంది. ఇప్పటికే జిల్లా రైతాంగానికి కావాల్సిన యూరియాలో 90 శాతం మేరకు అందించినట్లు అధికారులు చెబుతున్నా.. తమకు యూరియా అందడం లేదని రైతులు ఆందోళన చేయడం చూస్తుంటే అసలు యూరియా ఎటు పోతుందనే విషయం అంతు పట్టడం లేదు. ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ వచ్చిన తర్వాత జిల్లాలో దాదాపు 6వేల మెట్రిక్ టన్నుల యూరియాను అందించారు. అయినా యూరియా బుకింగ్ కోసం యాప్ ఓపెన్ చేస్తే తమకు అందుబాటులోకి రావడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు చెప్పిన సమయానికి ఓపెన్ చేసి వివరాలు నమోదు చేసే లోగానే నోస్టాక్గా దర్శనమిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాస్బుక్లతోనే ఇవ్వాలని డిమాండ్జిల్లాలో రైతులు చాలావరకు నిరక్షరాస్యులు ఉన్నారు. స్మార్ట్ ఫోన్ల వినియోగం తెలియని వారు చాలా మందే ఉన్నారు. ఈ నేపథ్యంలో యాప్ ద్వారా యూరియా బుక్ చేయాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. తెలిసిన వారి వద్దకు వెళ్లి బుక్ చేద్దామనే సరికి స్టాక్ అయిపోతుందని వస్తుందని చెబుతున్నారు. పాస్బుక్ల ద్వారా యూరియా పంపిణీ చేస్తే రైతులకు ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు.యూరియా ఎందుకిస్తలేరని పీఏసీఎస్ అధికారులను నిలదీస్తున్న రైతులు యాప్ రద్దు చేయాలని ఆందోళనఆత్మకూర్(ఎస్) : పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులతో కాకుండా ఫర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా కొనుగోలు చేయడం కష్టంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్లైన్ యాప్ను రద్దు చేసి పట్టాదారు పాస్ పుస్తకాలతోనే రైతులకు యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం ఎదుట అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ యూరియా అందక పంట పొలాలు పాడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తంగెళ్ల వీరారెడ్డి, న్యూడెమోక్రసీ నాయకులు డేగల వెంకటకృష్ణ, ప్రభాకర్రెడ్డి, గుణగంటి శ్రీను, మధుసూదన్రెడ్డి సంకలమద్ది వెంకట్రెడ్డి, గిలకట్టుల మల్లయ్య, బట్టిపల్లి లింగయ్య, తదితరులు పాల్గొన్నారు. ఫర్టిలైజర్ యాప్తో రైతులకు ఇబ్బందులు పీఏసీఎస్ సీఈఓల లాగిన్లతో ప్రైవేటు వ్యక్తుల బుకింగ్ నిమిషాల్లోనే రైతులకు యూరియా నోస్టాక్ మెసేజ్ నేరుగా యూరియా ఇవ్వాలని ఆందోళనలునాకున్న ఎకరన్నరతో పాటు మరో 8 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నా. యూరియా కోసం వారం రోజులుగా తిరుగుతున్నాను. యాప్తో బుక్ చేసేందుకు నావద్ద స్మార్ట్ఫోన్ లేదు. ఎవరితోనైనా బుక్ చేయిద్దామంటే నిమిషాల్లోనే అయిపోతున్నాయని చెబుతున్నారు. నెమ్మికల్, ఆత్మకూర్, ఏపూరు పీఏసీఎస్ల వద్దకు వెళ్లినా యూరియా దొరకడం లేదు. పాస్ బుక్ ద్వారానే యూరియా అందించాలి. – బానోతు వెంకన్న, కోటినాయక్తండా, ఆత్మకూర్ (ఎస్)ఇప్పటి వరకు యాప్తో బుకింగ్ ఇలా.. రైతులు : 80,654 బుక్ చేసుకున్న బస్తాలు : 3,07,761 కొనుగోలు చేసిన బస్తాలు : 2,77,901 -
అవినీతి రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలి
భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేట మున్సిపాలిటీని అవినీతి రహితంగా తీర్చి దిద్దాలని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. కొత్తగా ఎన్నికై న సూర్యాపేట మున్సిపల్ కౌన్సిలర్లు, స్థానిక నాయకులు శనివారం హైదరాబాద్లో మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా 31 స్థానాలలో విజయం సాధించిన కౌన్సిలర్లను ఆయన అభినందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జాతీయ రహదారి మీద ఉన్న సూర్యాపేట పట్టణం ఇప్పటివరకు సరైన అభివృద్ధి సాధించలేక పోయిందన్నారు. పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద చూపిన ఆదరణ ఎంతో గొప్పదన్నారు, ప్రజలు అపారమైన నమ్మకంతో ఓటేసి గెలిపించారని, వారి నమ్మకాన్ని నిలబెట్టేలా కౌన్సిలర్లు పని చేయాలన్నారు. సూర్యాపేట పట్టణాభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానన్నారు. ఎప్పటికప్పుడు పట్టణాభివృద్ధిపై సమీక్షించుకొని ప్రత్యేక ప్రణాళికలు రూపొందించేందుకు కార్యాచరణ రూపొందించుకుందామని, అందుకు సరిపడా నిధులు తెచ్చి సూర్యాపేటను అభివృద్ధి పథంలో నడిపిద్దామని అన్నారు. మంత్రిని కలిసిన వారిలో రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి, సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, పీసీసీ కార్యదర్శి చకిలం రాజేశ్వర్ రావు, నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు ఉన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి -
బేతవోలులో ఎడ్ల పందేలు ప్రారంభం
చిలుకూరు : మండలంలోని బేతవోలు గ్రామంలో కనకదుర్గమ్మ జాతర, శివరాత్రి పండుగ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల పందేలను (బండలాగుడు ప్రదర్శన) శుక్రవారం కోదాడ డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎడ్ల పందేలను శాంతి యూతంగా జరుపుకోవాలని సూచించారు. మొదటి రోజు పాలపళ్ల ఎడ్ల పందేలు జరిగాయి. శని, ఆదివారాల్లో నాలుగు, ఆరు పళ్ల ఎడ్ల విభాగాలు, న్యూ కేటగిరీ ఎడ్ల పందేలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ వట్టికూటి నాగయ్య, ఉప సర్పంచ్ ఏడుకొండలు, మాజీ ఎంపీపీ, మాజీ జెడ్పీటీసీలు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, కాంగ్రెస్ నాయకులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
నాలుగు చోట్ల కాంగ్రెస్దే పైచేయి..
జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో 141 వార్డులకు గాను కోదాడలో 3, హుజూర్నగర్లో ఒక వార్డు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 137 వార్డులకు ఎన్నికలు జరిగాయి. హుజుర్నగర్లో 28 వార్డులకు గాను 19 వార్డులను హస్తగతం చేసుకుంది. ఇక నేరేడుచర్లలో 15 వార్డులకు తొమ్మిది చోట్ల, తిరుమలగిరిలో 15 స్థానాలకు ఐదు చోట్ల, కోదాడలో 35 స్థానాలకు 26 వార్డులు, సూర్యాపేటలో 48 వార్డులకు 31 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. తిరుమలగిరి మినహా మిగతా అన్ని మున్సిపాలిటీలను అధికార కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా గెలుచుకుంది. -
పుర కౌంటింగ్పై ఉత్కంఠ
సూర్యాపేట టౌన్, భానుపురి : జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలోని 141 వార్డులకు గాను 4 ఏకగ్రీవం కాగా 137 స్థానాలకు ఈ నెల 11న జరిగిన ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. సూర్యాపేటలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్లు లెక్కించారు. ఫలితాల కోసం జిల్లా ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూశారు. అన్ని మున్సిపాలిటీల ఫలితాలు సజావుగానే వెల్లడి కాగా తిరుమలగిరి మున్సిపాలిటీలోని 10వ వార్డు విషయంలో వివాదం నెలకొంది. దీంతో కౌంటింగ్ కేంద్రం వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. కౌంటింగ్ ఇలా.. జిల్లా కేంద్రంలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలోని రెండో అంతస్తులో సూర్యాపేట, కోదాడ మున్సిపాలిటీల ఓట్లను లెక్కించారు. హుజూర్నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపును మొదటి అంతస్తులో చేపట్టారు. ప్రతి వార్డుకు ఒక టేబుల్ ఏర్పాటు చేసి మొదటగా పోస్టల్ బ్యాలెట్లు, ఆ తర్వాత బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను మొదటగా కట్టలు కట్టారు. ఆ తర్వాత పార్టీల వారీగా ఎన్నిఓట్లు పడ్డాయనేది బుట్టల్లో వేసి లెక్కించారు. ఒక్కో వార్డు ఓట్లను రెండు రౌండ్లలోనే లెక్కించి ఫలితాలు వెల్లడించారు. ఉదయం 8గంటలకు ప్రారంభమైన లెక్కింపు మధ్యాహ్నం 3గంటల వరకు కొనసాగింది. ఆది నుంచి కాంగ్రెస్దే ఆధిక్యం.. ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఉదయం 8గంటలకు ప్రారంభమైన లెక్కింపులో తిరుమలగిరి మినహా అన్ని మున్సిపాలిటీల్లో మొదటి నుంచి ఆధిక్యంలో కొనసాగింది. తిరుమలగిరిలో బీఆర్ఎస్ ఆధిక్యం చూపింది. అక్కడి నుంచి ఏ మున్సిపాలిటీల ఫలితాలు వెల్లడైనా తిరుగులేని విధంగా వార్డులను కై వసం చేసుకుంటూ దూసుకుపోయింది. బీఆర్ఎస్ ఆందోళన.. తిరుమలగిరి మున్సిపల్ ఫలితాల వెల్లడిపై వివాదం నెలకొంది. ఈ మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులు ఉండగా 10 వార్డులను బీఆర్ఎస్, ఐదు వార్డులను కాంగ్రెస్ గెలిచినట్టు ఆర్ఓ ధ్రువీకరించారు. అయితే పదో వార్డు నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన భూక్య యాకుబ్ కాంగ్రెస్ అభ్యర్థిపై రెండు ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ ఫలితంపై బీఆర్ఎస్ అభ్యర్థి రీ కౌంటింగ్ కోరగా మరోసారి లెక్కించి ఇదే ఫలితాలను ఆర్ఓ వెల్లడించారు. గెలిచిన పది మందికి గాను తొమ్మిది మందికే ధ్రువీకరణ పత్రాలు ఇచ్చి 10 వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్కు ఇవ్వకపోవడం, ఓడిపోయిన అభ్యర్థి రెండు గంటల తర్వాత రీ కౌంటింగ్ కోరడం ఏమిటని ఆ పార్టీ కౌన్సిలర్లు అభ్యంతరం తెలిపారు. దీంతో అదనపు కలెక్టర్ కలుగజేసుకొని నిబంధనల మేరకు ఫలితాలు వెల్లడిస్తామని ఎవరూ ఆందోళన చెందవద్దని సర్థిచెప్పారు. చివరకు బీఆర్ఎస్ అభ్యర్థికి గెలుపు ధ్రువీకరణ పత్రం అందజేశారు. కౌంటింగ్ వద్ద మూడంచెల భద్రత ఎన్నికల ఫలితాల విషయంలో ఎలాంటి ఘర్షణలు జరగకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్ట బందోబస్తు చేపట్టింది. కౌంటింగ్ వద్ద మూడంచెల భద్రత చేపట్టింది. కౌంటింగ్ జరిగే ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేసింది. ప్రత్యేక పాస్లు కలిగిన ఎన్నికల సిబ్బంది, రాజకీయ పార్టీల ఏజెంట్లు, అభ్యర్థులను మాత్రమే లోపలికి అనుమతించారు. పటిష్ట బందోబస్తు కోసం 350 మంది పోలీస్ సిబ్బందితో పహారా కాశారు. కౌంటింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు, అడుగడుగన వీడియో గ్రాఫర్తో ఓట్ల లెక్కింపు ప్రక్రియను చిత్రీకరించారు. ఫ మధ్యాహ్నం 3 గంటల వరకు ఫలితాలు వెల్లడి ఫ ఆది నుంచి ఆధిక్యం ప్రదర్శించిన కాంగ్రెస్ ఫ కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఫ తిరుమలగిరి 10వ వార్డు ఫలితంపై వివాదం -
యాప్ వద్దంటూ రైతుల ఆందోళన
పెన్పహాడ్ : ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఫర్టిలైజర్ యాప్ వద్దంటూ..పాత పద్ధతిలోనే యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ గ్రామాల రైతులు శుక్రవారం పెన్పహాడ్ మండల కేంద్రంలోని చీదెళ్ల పీఏసీఎస్ కార్యాలయ వద్ద ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. పీఏసీఎస్ చీదెళ్ల కార్యాలయానికి 444 యూరియా బస్తాలు రావడంతో అధికారులు యాప్లో అప్లోడ్ చేశారు. దీంతో 97మంది రైతులు 444 బస్తాలను 30 సెకన్లలో బుకింగ్ చేసుకోవడంతో యూరియా అయిపోయింది. యాప్లో స్టాక్ చూపించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. ఘటనా స్థలానికి ఏఓ అనిల్కుమార్, పీఏసీఎస్ సిబ్బంది వచ్చి యూరియా మంజూరు కాగానే రైతులకు వెంటనే తెలియజేస్తామని పేర్కొన్నారు. రైతుల ఆందోళనతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు వచ్చి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ఖానాపురం పీఏసీఎస్ వద్ద.. అనంతగిరి : యూరియా బుకింగ్ చేసుకునేందుకు యాప్పై అవగాహన లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని, గతంలో మాదిరిగా పీఏసీఎస్ పరిధిలోని రైతులకే నేరుగా అందించాలని రైతులు డిమాండ్ చేశారు. శుక్రవారం అనంతగిరి మండలం గోండ్రియాల క్లస్టర్లోని ఖానాపురం పీఏసీఎస్కు వచ్చిన యూరియా స్టాక్ను ఆన్లైన్లో అప్లోడ్ చేసిన నిమిషం వ్యవధిలోనే స్టాక్ అయిపోవడంతో రైతులు ఆగ్రహించి పీఏసీఎస్ కార్యాలయానికి తాళం వేసి ఆందోళన చేపట్టారు. దీంతో కార్యాలయ సిబ్బంది యాప్లో బుక్ చేసుకున్న రైతులకు సైతం యూరియా అందించకుండానే వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న అనంతగిరి తహసీల్దార్ హిమబిందు, ఎస్ఐ నవీన్ కుమార్ సాయంత్రం 4 గంటలకు కేంద్రానికి చేరుకుని బుకింగ్ చేసుకున్న 74 మంది రైతులకు యూరియా అందించారు. 20 మంది రైతులకు మరుసటి రోజు ఇస్తామని చెప్పారు. ఈ విషయమై ఏఓ అందె సతీష్ను వివరణ కోరగా యూరియా కొరతపై ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని రైతులకు తెలిపానని పేర్కొన్నారు. -
కాపర్ వైరు దొంగల అరెస్ట్
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలోని కాపర్ వైరు చోరీచేస్తున్న దొంగలను చివ్వెంల పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. పరిశ్రమలో పేలుడు చౌటుప్పల్ మండలం ఎల్లగిరిలోని బృందావన్ లేబొరేటరీస్ పరిశ్రమలో శుక్రవారం రాత్రి రియాక్టర్ పేలింది. శనివారం శ్రీ 14 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026- 10లోఐదింట నాలుగు మున్సిపాలిటీలు ‘హస్త’గతంసూర్యాపేట టౌన్, భానుపురి : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు ఈ నెల 11న ఎన్నికలు నిర్వహించగా శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఐదు మున్సిపాలిటీలకు గాను కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల, సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. తిరుమలగిరి మున్సిపాలిటీని మాత్రం బీఆర్ఎస్ పార్టీ కై వసం చేసుకుంది. బీజేపీ మాత్రం సూర్యాపేటలో ఒకేఒక్క వార్డులో గెలుపొంది ఇతర మున్సిపాలిటీల్లో తమ ప్రభావాన్ని చూపలేకపోయింది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడిన అభ్యర్థులు స్వతంత్రులుగా పోటీ చేసి సత్తాచాటారు. అంచనాలు తలకిందులు.. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసినా హుజూర్నగర్, కోదాడలో పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. నేరేడుచర్లలో కాస్త గట్టిపోటీనే ఇచ్చింది. అయితే సూర్యాపేటలో బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యే జగదీష్రెడ్డి తన రాజకీయ చాణిక్యంతో అధిక స్థానాలు గెలుస్తారని అంతా భావించినా అంచనాలు తలకిందులయ్యాయి. ఇక్కడ 48 వార్డులకు 11 చోట్ల మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. తిరుమలగిరి మున్సిపాలిటీలో మాత్రం బీఆర్ఎస్ ఏకపక్షంగా పది స్థానాలు గెలిచి చైర్మన్ పీఠాన్ని కై వసం చేసుకుంది. కనిపించని బీజేపీ ప్రభావం మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. గతంలో సూర్యాపేట మున్సిపాలిటీలో ఏడెనిమిది స్థానాలు దక్కించుకున్న ఆ పార్టీ ఈ సారికి కేవలం ఒకేఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. నాలుగు మున్సిపాలిటీల్లో ఎక్కడా కూడా ఖాతా తెరవకపోగా రెండో స్థానంలోనూ నిలువలేకపోయింది. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి నియోజకవర్గంలోనూ ఆ పార్టీ పోటీ ఇవ్వలేకపోయింది. సత్తాచాటిన స్వతంత్రులు ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు సత్తాచాటారు. హుజూర్నగర్లో ముగ్గురు, కోదాడలో ఆరుగురు, సూర్యాపేటలో ఐదుగురు చొప్పున స్వతంత్ర అభ్యర్థులు పార్టీలను కాదని తమ సొంత చరిష్మాతో గెలుపొందారు. వీరిలో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థులే ఉన్నారు. అయితే కోదాడ, సూర్యాపేటలో హస్తం పార్టీలకు చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి పూర్తి మెజార్టీ ఉంది. వీరే కాకుండా జనసేన పార్టీ నేరేడుచర్లలో ఒక స్థానాన్ని, హుజూర్నగర్ మున్సిపాలిటీలో సీపీఎం, సీపీఐ చెరొక స్థానాన్ని గెలుపొంది తమ ఉనికిని చాటుకున్నాయి. ఫ ఒక్క తిరుమలగిరి మున్సిపాలిటీలోనే ఎగిరిన గులాబీ జెండా ఫ జిల్లాలో ఒకేఒక్క వార్డు గెలిచిన బీజేపీ ఫ సూర్యాపేట, కోదాడలో స్వతంత్ర అభ్యర్థుల జయకేతనం -
క్యాంపునకు తరలిన కాంగ్రెస్ కౌన్సిలర్లు
కోదాడ : కోదాడ మున్సిపాలిటికి చెందిన 26 మంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు శుక్రవారం క్యాంపునకు తరలి వెళ్లారు. విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థులను శుక్రవారం మధ్యాహ్నమే సూర్యాపేట కౌంటింగ్ కేంద్రం నుంచే నేరుగా హైదరాబాద్లోని ఓ రిసార్టుకు తరలించారు. మంత్రి ఉత్తమ్ ఆదేశాల మేరకు ఈ క్యాంపు రాజకీయం నడుస్తున్నట్లు సమాచారం. మున్సిపాలిటీలో మొత్తం 35 వార్డులకు గాను ఏకగ్రీవాలతో కలుపుకొని కాంగ్రెస్ పార్టీ 26 స్థానాలను గెలుచుకుంది. సీపీఐ అభ్యర్థి ఒకరు, కాంగ్రెస్ రెబల్స్ నలుగురు, బీఆర్ఎస్ నుంచి ముగ్గురు, ఒక స్వతంత్ర అభ్యర్థితో 9మంది కోదాడలోనే ఉన్నారు. -
మంత్రి ఉత్తమ్ను కలిసిన నూతన కౌన్సిలర్లు
హుజూర్నగర్ : హుజూర్నగర్ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీకి చెందిన నూతన కౌన్సిలర్లు శుక్రవారం హైదరాబాద్లో మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా మంత్రి.. గెలిచిన అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల విషయమై నూతన కౌన్సిలర్ల అభిప్రాయాలు సేకరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించొద్దు : ఎస్పీసూర్యాపేట టౌన్ : మున్సిపల్ చైర్మన్లు ఎన్నికయ్యే వరకు ఈ నెల 16న ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని, కౌన్సిలర్లుగా గెలిచిన అభ్యర్థులు కోడ్ ఉల్లంఘించకుండా బాధ్యతగా ఉండాలని జిల్లా ఎస్పీ నరసింహ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. గెలిచిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడానికి అనుమతి లేదని పేర్కొన్నారు. వార్డుల్లో ఎవరు కూ డా గొడవలు పెట్టుకోకూడదని, తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయకూడదని విజ్ఞప్తి చేశారు. మహా యజ్ఞంలా సాగిన మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో అంకితభావంతో విధులు నిర్వహించిన ప్రతి పోలీస్ సిబ్బందికి ఎస్పీ అభినందనలు తెలిపారు. మట్టపల్లిలో నిత్యకల్యాణంమఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో శుక్రవారం రాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. శ్రీస్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం అనంతరం కల్యాణం జరిపి గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. తర్వాత నీరాజన మంత్ర పుష్పాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ బి.జ్యోతి, అర్చకులు పాల్గొన్నారు. యూరియాను నేరుగా పంపిణీ చేయాలిచిలుకూరు : ఫర్టిలైజర్ యాప్ ద్వారా కాకుండా రైతులకు యూరియాను నేరుగా పంపిణీ చేయాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కోరారు. శుక్రవారం చిలుకూరు మండలం బేతవోలులో కనకదుర్గమ్మ జాతరకు హాజరైన ఆయన తిరుగుపయనంలో చిలుకూరులో విలేకరులతో మాట్లాడారు. యూరియా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా సక్రమంగా పంపిణీ చేయకపోవడం వల్ల వేల రూపాయాలు పెట్టుబడుతు పెట్టి సాగుచేస్తున్న వరిపొలాలు ఎర్రబారి దెబ్బ తింటున్నాయన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి యూరియా యాప్ను తొలగించి రైతుల కు నేరుగా అవసరం మేరకు అందించాలన్నారు. ఆయన వెంట సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి, సహాయ కార్యదర్శులు మండవ వెంకటేశ్వర్లు, సాహెబ్అలీ తదితరులు ఉన్నారు. -
రీ పోస్టుమార్టం చేసేందుకు భయం ఎందుకు
సూర్యాపేట : తప్పుడు రికార్డులతో కేసు తారుమారు చేసిన అధికారులను, పోలీస్లను సస్పెండ్ చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. కర్ల రాజేష్ లాకప్ డెత్కు కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం రాత్రి టేకుమట్లలో నిర్వహించిన సంతాప సభలో ఆయన మాట్లాడారు. కోదాడలో జరిగిన కర్ల రాజేష్ లాకప్ డెత్ ఘటనపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి బాధాకరమన్నారు. పోలీసులు ఏ తప్పు చేయకపోతే కర్ల రాజేష్ మృతదేహాన్ని రీ పోస్టుమార్టం చేయించేందుకు భయం ఎందుకని ప్రశ్నించారు. కర్ల రాజేష్ లాకప్ డెత్లో నిందితుడైన ఎస్ఐ సురేష్ రెడ్డిని సస్పెండ్ చేయకుండా కాపాడుతున్నారని, బాధ్యులైన వారిని అరెస్టు చేయాలన్నారు. కార్యక్రమంలో దాసరి శ్రీనివాస్ మాదిగ, మున్నంగి నాగరాజు మాదిగ, రావుగాళ్ల బాబు మాదిగ, రాజు, యాతాకుల ఈశ్వర్ పాల్గొన్నారు. కోదాడరూరల్ : పోలీసులు చిత్రహింసల కారణంగా ప్రాణాలు కోల్పోయిన దళిత యువకుడు కర్ల రాజేష్ మృతదేహానికి రీ పోస్టుమార్టం చేసేందుకు పోలీసుశాఖ ఎందుకు జంకుతుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ప్రశ్నించారు. గురువారం కోదాడ మండల పరిధిలోని గణపవరంలో నిర్వహించిన రాజేష్ సంతాప సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కర్ల రాజేష్ను అప్పటి చిలుకూరు ఎస్ఐ సురేష్రెడ్డి, మరికొందరు పోలీసులు కలిసి తీవ్రంగా కొట్టి చంపారన్నారు. త్వరలోనే హైదరాబాద్లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని, ఈ నెల 28న చలో సూర్యాపేట పేరుతో ప్రజా ఆగ్రహ మహాసభ నిర్వహిస్తామని తెలిపారు. ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు పిడమర్తి చిన్న వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏపూరి రాజుమాదిగ, కొండపల్లి ఆంజనేయులు, యలమర్తి రాము, మాజీ సర్పంచ్ పొట్టా శ్రీవిజయ కిరణ్, పొట్టా జగన్, చంద్రమౌళి, రవి, మధు, శ్రీను, బుచ్చాలు, బండి సత్యం, దుర్గయ్య పాల్గొన్నారు. ఫ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ -
కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలి
సూర్యాపేట అర్బన్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాస్తూ, కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేస్తోందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ ఆరోపించారు. కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన లేబర్ కోడ్స్, జాతీయ విత్తన బిల్లు, విద్యుత్ సవరణ బిల్లులను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్ నుంచి సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, ఐఎన్టీయూసీ, తెలంగాణ రైతు సంఘం, అఖిల భారత రైతు కూలీ సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్, ఎం సీపీఐయూ రాష్ట్ర నాయకులు వరికుప్పల వెంకన్న, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు రాంబాబు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి, ఎల్ఐసీ ఎంప్లాయిస్ యూనియన్ అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
టెన్త్ విద్యార్థులకు అల్పాహారం
పెన్పహాడ్: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే పాఠశాలల్లో సౌకర్యాలకు నిధులు కేటాయిస్తున్నాయి. ఇటీవలే మరుగుదొడ్లు, కిచెన్ షెడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. తాజాగా ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ) పథకం కింద ఎంపికై న పాఠశాలల్లో కేంద్రం మౌలిక వసతులు కల్పిస్తోంది. తరగతి గదులతో పాటు, మూత్రశాలలు, కంప్యూటర్ ల్యాబ్ వంటి సౌకర్యాలను సమకూరుస్తోంది. తాజాగా మోడల్ స్కూళ్లతోపాటు, జెడ్పీ హైస్కూళ్లలో పదో తరగతి చదివే విద్యార్థులకు అల్పాహారం కోసం ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఈమేరకు జెడ్పీహెచ్ఎస్ విద్యార్థుల కోసం రూ.10,08,615, మోడల్ స్కూళ్లలో చదివే పదో తరగతి విద్యార్థుల కోసం రూ.6,38,011 మంజూరయ్యాయి. ప్రత్యేక తరగతుల సమయంలో అందించేలా..జిల్లాలో 17 మోడల్ స్కూళ్లు ఉన్నాయి. 1254 మంది పదో తరగతి విద్యార్థులు చదువుతున్నారు. మార్చి 10 వరకు 34రోజులు రోజుకు ఒక్కో విద్యార్థికి రూ.15చొప్పున రూ. 510లు విలువైన అల్పాహారాన్ని ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతుల సమయంలో అందిస్తారు. ఇప్పటికే మోడల్ పాఠశాలల్లో జనవరి 28 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. వీరితోపాటు జెడ్పీహెచ్ఎస్లో చదివే పదో తరగతి విద్యార్థులకు 19 రోజుల పాటు ఈనెల 16వ తేదీ నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు అల్పాహారం అందజేయనున్నారు. జిల్లాలో 170 జెడ్పీహెచ్ఎస్లు ఉండగా.. వీటిలో చదివే 3539 మంది విద్యార్థులకు అల్పాహారం అందనుంది. ఆకలి బాధలు తప్పాయి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక స్టడీ అవర్స్ సమయంలో అందిస్తున్న అల్పాహారంతో ఆకలి బాధలు తొలగిపోయాయి. చదువుపై మరింత దృష్టి సారించి మంచి ఫలితాలు సాధిస్తాం. – మెర్సీ, పదో తరగతి, ఆదర్శ పాఠశాల, అనాజిపురం విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన స్నాక్స్ అందిస్తున్నాం టెన్త్ విద్యార్థులకు స్టడీ అవర్స్ సమయంలో స్నాక్స్ అందించేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన స్నాక్స్ అందిస్తున్నాం. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలాగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. – కోడి లింగయ్య, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్, అనాజిపురం ఫ ఇప్పటికే మోడల్ స్కూళ్లలో అమలు చేస్తుండగా జెడ్పీ హైస్కూళ్లలోనూ అందించాలని నిర్ణయం ఫ నిధులు విడుదల చేసిన ప్రభుత్వం ఫ జిల్లాలో 4790 మంది విద్యార్థులకు ప్రయోజనం -
యూరియా యాప్ రద్దు చేయాలని రాస్తారోకో
నడిగూడెం : యూరియా యాప్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం నడిగూడెం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట ప్రధాన రహదారిపై స్థానిక రైతులు రాస్తారోకో నిర్వహించారు. పలువురు రైతులు మాట్లాడుతూ.. తమ వద్ద స్మార్ట్ ఫోన్లు లేకపోవడంతో యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోలేపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పాత పద్ధతిలోనే యూరియా అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి బెల్లకొండ సత్యనారాయణ, మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ జలీల్, రైతులు శ్రీను, సైదులు, జానిమియా, చంద్రమోహన్, పోతురాజు, బుచ్చిరాజు, మహేష్, రాజశేఖర్ పాల్గొన్నారు. -
ఓట్ల లెక్కింపులో అప్రమత్తంగా ఉండాలి
భానుపురి (సూర్యాపేట) : మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎన్నికల సంఘం నిబంధనలను కచ్చితంగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ సూపర్ వైజర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓట్లు లెక్కింపు కేంద్రంలో అనుసరించాల్సిన నియమావళి, ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, టేబుల్ వైజ్ కౌంటింగ్ విధానం, బ్యాలెట్ పేపర్లు వేరు చేయడం, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విధానం తదితర అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. ప్రతి రౌండ్ లెక్కింపు పూర్తయ్యే సరికి ఫలితాలను సమగ్రంగా నమోదు చేసి, సంబంధిత అభ్యర్థుల ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలని, తదుపరి పరిశీలకుల అనుమతితో విజేతలను ప్రకటించాలని అధికారులకు సూచించారు. లెక్కింపు కేంద్రాల వద్ద భద్రత ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టినట్లు తెలిపారు. గుర్తింపు కార్డు కలిగిన వ్యక్తులకు మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. సిబ్బంది ఉదయం 7 గంటల వరకు లెక్కింపు కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. జనరల్ అబ్జర్వర్ పాండా దాస్ మాట్లాడుతూ.. కౌంటింగ్ను చాలా పకడ్బందీగా నిర్వహించాలని, వ్యాలిడిటీ, ఇన్ వ్యాలిడిటీ ఓట్ల గురించి ఆర్వోలకు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్ ఆర్డీఓలు వేణు మాధవరావు, సూర్యనారాయణ, శ్రీనివాసులు మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూర్యాపేటటౌన్ : మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. గురువారం మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాట్లను ఎస్పీ నరసింహతో కలిసి పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రంలో అభ్యర్థులు, ఏజెంట్లు క్రమశిక్షణ పాటించాలన్నారు. కేంద్రంలో వార్డులు, బ్యాలెట్ల అధారంగా టేబుళ్లు ఏర్పాటు చేశామన్నారు. గదుల్లో పూర్తి భద్రతతోపాటు, బారికేడ్లు, సీసీకెమెరాలు ఏర్పాటు చేసినట్ల పేర్కొన్నారు. లెక్కింపు కేంద్రం వద్ద ఐదెంచల భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. కళాశాల ప్రాంగణమంతా పోలీసు భద్రతలో ఉంటున్నారు. వారి వెంట ఆర్డీఓ వేణుమాదవ్, డీఎస్పీ ప్రసన్నకుమార్, మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి, సీఐ వెంకటయ్య, తహసిల్దార్ కృష్ణయ్య, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. -
నేడే పుర భవితవ్యం
సూర్యాపేటటౌన్, సూర్యాపేటఅర్బన్ : మున్సిపాలిటీల్లో ఆయా పార్టీల నుంచి, ఇండింపెండెంట్గా పోటీ చేసిన 612 మంది అభ్యర్థుల భవితవ్యం శుక్రవారం తేలనుంది. సూర్యాపేటలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ ప్రక్రియ ఉదయం 8గంటలకు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12గంటల వరకు అన్ని వార్డుల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే అభ్యర్థులు ఉదయం 7గంటల లోపు కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. ఐదు మున్సిపాలిటీల్లో 137 వార్డులకు కౌంటింగ్ జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, హుజుర్నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీలకు సంబంధించి మొత్తం 137 వార్డుల లెక్కింపు జరగనుంది. సూర్యాపేట మున్సిపాలిటీలోని 48వ వార్డులకు గాను ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలోని రెండో అంతస్తులో 425, 525, 627 రూం నంబర్లలో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు. కోదాడ మున్సిపాలిటీలో 35 వార్డులకు గాను మూడు వార్డులు ఏకగ్రీవం కాగా ఎన్నికలు జరిగిన 32 వార్డులకు కౌంటింగ్ జరగనుంది. వీటి కోసం కళాశాలలోని రెండో ఫ్లోర్లో గల 321, 327, 328 రూం నంబర్లలో కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తిచేశారు. హుజూర్నగర్ 28వార్డులకు గాను ఒకటి ఏకగ్రీవం కాగా 27 వార్డులకు ఎన్నికలు జరిగాయి. కళాశాలలోని మొదటి అంతస్తులో 511, 512, 513 రూం నంబర్లలో కౌంటింగ్కు ఏర్పాట్లు చేశారు. నేరేడుచర్ల పరిధిలోని 15 వార్డులకు కళాశాలలోని మొదటి అంతస్తులోని 616, 612 రూం నంబర్లలో ఏర్పాటు చేశారు. తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని 15 వార్డులకు మొదటి అంతస్తులోని 316, 317 రూం నంబర్లను కౌంటింగ్కు కేటాయించారు. అభ్యర్థుల్లో టెన్షన్.. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి ఆశావహులు ప్రచారాలు మొదలుపెట్టారు. మొత్తం 612 మంది అభ్యర్థులు ఆయా పార్టీలు, స్వతంత్రులు పోటీ చేశారు. వీరి భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమై ఉంది. ఫలితం ఎలా ఉండబోతుందోనని వారిలో టెన్షన్ మొదలైంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా 350 మంది పోలీస్లతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రం శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల వద్ద నిషేధ ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మూడంచెల భద్రత నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు కేంద్రం వద్ద 163 బీఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలు ఉంటుందని తెలిపారు. ఓట్ల లెక్కింపునకు హాజరయ్యే అభ్యర్థులు, ఏజెంట్లు, నిషేధిత వస్తువులు అగ్గిపెట్టెలు, లైటర్, ఇంక్ బాటిల్స్, పేలుడుకు కారణమయ్యే ఎలాంటి వస్తువులను లెక్కింపు కేంద్రాల్లోకి తీసుకురాకూడదని సూచించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, బైక్ ర్యాలీలు, డీజేలు, టపాకాయలు కాల్చడానికి అనుమతి లేదని తెలిపారు. ఐదు మున్సిపాలిటీల పరిధిలో 137 వార్డులకు కౌంటింగ్ ఫ ఉదయం 8గంటల నుంచి ప్రక్రియ ప్రారంభం ఫ మధ్యాహ్నం 12గంటల వరకు అన్ని వార్డుల ఫలితాలు వచ్చే అవకాశం ఫ సూర్యాపేటలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాట్లు పూర్తి ఫ లెక్కింపు కేంద్రం వద్ద పోలీసుల పటిష్ట బందోబస్తు -
మెరుగైన అభ్యర్థికి ఓటు వేశా
నేను డిగ్రీ చదువుతున్నాను. నా తొలి ఓటు మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన అభ్యర్థికే వేశాను. ఎవరు గెలిచినా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో పాటు వార్డు అభివృద్ధికి కృషిచేయాలి. – దబ్బెటి వరుణ్ సాయి, మోత్కూరు ఓటు ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. బీటెక్ ఫైనలియర్ చదువుతున్న నేను తొలిసారిగా ఈ ఎన్నికల్లో ఓటు వేశాను. గెలిచిన అభ్యర్థులు ప్రజలకు అందుబాటులో ఉండి మంచి గుర్తింపు పొందాలి. – దబ్బెటి నేహ, జామచెట్లబావి, మోత్కూరు -
ఫ ఓటెయ్.. చికెన్ తీసుకో
మిర్యాలగూడ అర్బన్ : మిర్యాలగూడ మున్సిపాలిటీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ పార్టీల అభ్యర్థులు అనేక ప్రయత్నాలు చేశారు. ఓటర్లకు డబ్బులు, మద్యంతో పాటు చికెన్ టోకెన్లను కూడా అందించారు. బుధవారం ఓటేసి చికెన్ తీసుకెళ్లండి అంటూ ఆఫర్ ప్రకటించారు. ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్న తర్వాత నేరుగా చికెన్ షాపులకు వెళ్లి టోకెన్ ఇచ్చి చికెన్ తీసుకున్నారు. దాంతో చికెన్ షాపులు కిటకిటలాడాయి. షాపుల నిర్వాహకులు ముందుగానే కోళ్లను తెప్పించుకొని, టోకెన్తో వచ్చిన వారికి ప్రత్యేకంగా క్యూలైన్ ఏర్పాటు చేసి చికెన్ అందించారు. -
మిర్యాలగూడలో ఘర్షణలు
మిర్యాలగూడ అర్బన్ : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా బుధవారం మిర్యాలగూడ మున్సిపాలిటీలోని కొన్ని వార్డులు రణరంగాన్ని తలపించాయి. 29వార్డు బంగారుగడ్డలో బీఆర్ఎస్ బలపర్చిన సీపీఎం అభ్యర్థి డబ్బికార్ మల్లేష్ తరఫున షేక్ మస్తాన్న్, షేక్ జమీన్, షేక్ బడేమియా పోలింగ్ బూత్ ఏజెంట్లుగా ఉన్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం బయటకు వచ్చిన వారిపై కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి షేక్ జావెద్, అతడి సోదరులు అనుచరులతో కలిసి ఇనుపరాడ్లు, కర్రలతో దాడిచేశారు. దీంతో మస్తాన్ తలకు గాయమై స్పృహ కోల్పోయాడు జమీన్, బడేమియాకు గాయాలయ్యాయి. ముగ్గురిని స్థానికులు మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. దాడి జరిగిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు తనయుడు నల్లమోతు సిద్దార్ధ చికిత్స పొందుతున్న కార్యకర్తలను పరామర్శించేందుకు ఏరియా ఆస్పత్రికి వచ్చారు. అదే సమయంలో జావెద్ అనుచరులు ఏరియా ఆస్పత్రికి చేరుకొని.. బీఆర్ఎస్ కార్యకర్తలను పరామర్శిస్తున్న నల్లమోతు సిద్దార్ధపై కూడా దాడికి దిగారు. పోలీసులు లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మస్తాన్, జమీన్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం వారిని నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. మరో మూడు వార్డుల్లో ఘర్షణలు.. అదేవిధంగా 6వ వార్డు ఇందిరమ్మ కాలనీ, 32వ వార్డు బంగారుగడ్డలో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య తోపులాట జరిగింది. వారిని పోలీసులు చెదరగొట్టారు. 20వ వార్డు రెడ్డీకాలనీలో బీఆర్ఎస్ పోలింగ్ ఏజెంటుగా కూర్చున్న అశోక్పై ఆ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి భర్త దాడి చేయడంతో అతడికి గాయాలయ్యాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందుగానే ఫిర్యాదు చేశాం.. 29వ వార్డులో ఘర్షణలు జరిగే ఆస్కారం ఉందని డీజీపీ, రాష్ట్ర ఎన్నికల కమిషన్కు తాను ముందుగానే ఫిర్యాదు చేశానని సీపీఎం అభ్యర్ధి డబ్బికార్ మల్లేష్ తెలిపారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న జావెద్పై గతంలో పలు కేసులు ఉన్నాయని, ఓటర్లను భయబ్రాంతులకు గురిచేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నానని, తన ఫిర్యాదుపై స్పందించి ముందస్తు చర్యలు తీసుకొని ఉంటే ఈ దాడులు జరిగేవి కావని, దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఏరియా ఆస్పత్రికి చేరుకుని బీఆర్ఎస్ కార్యకర్తలను పరామర్శించారు. కాంగ్రెస్ నాయకుల దాడిని తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫ 29వ వార్డులో బీఆర్ఎస్ పోలింగ్ ఏజెంట్లపై కాంగ్రెస్ వర్గీయుల దాడి ఫ పోలీసుల లాఠీచార్జి ఫ ముగ్గురికి గాయాలు ఫ మరికొన్ని వార్డుల్లో చెదురుమదురు ఘటనలుఫ మాజీ మంత్రి జగదీష్రెడ్డి నల్లగొండ టూటౌన్ : కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైందని, ఆ పార్టీ నాయకులు చేస్తున్న భౌతిక దాడులే ఇందుకు నిదర్శనమని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. మిర్యాలగూడలో కాంగ్రెస్ కార్యకర్తల దాడుల్లో గాయపడి నల్లగొండలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్, సీపీఎం కార్యకర్తలను ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్రావు, కంచర్ల భూపాల్రెడ్డి, జూలకంటి రంగారెడ్డి, తిప్పన విజయసిహారెడ్డి, నాయకులు నల్లమోతు సిద్ధార్థతో కలిసి బుధవారం సాయంత్రం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్, సీపీఎం కొన్ని చోట్లా కలసి పనిచేశాయని, మిర్యాలగూడలో కాంగ్రెస్ తప్పిదాలను కవర్ చేసుకునేందుకే కాంగ్రెస్ గుండాలు దాడులకు పాల్పడ్డారని అన్నారు. ఇంకా చాలా చోట్ల ఇలాంటి ప్రయత్నం చేసారని, బీఆర్ఎస్ కార్యకర్తలు వారిని ప్రతిఘటించే ప్రయత్నం చేశారని తెలిపారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలుగా మారారని, జిల్లా అధికారులు నిస్సహాయులుగా మారారని ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలు బూత్లను ఆక్రమించే యత్నం చేసినా ఎన్నికల అధికారులు పట్టించు కోలేదన్నారు. మిర్యాలగూడలో జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు. -
తాళం వేసిన ఇళ్లలో చోరీ
పెద్దఅడిశర్లపల్లి : మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న నాలుగు ఇళ్లల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దఅడిశర్లపల్లికి చెందిన జానపాటి లక్ష్మమ్మ సోమవారం తన ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లింది. బుధవారం ఆమె ఇంటికి తాళం లేకపోవడంతో ఇంటిపక్క వారు గమనించి లక్ష్మమ్మకు సమాచారం అందించారు. లక్ష్మమ్మ ఇంటికి వచ్చి తలుపులు తీసేసరికి ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. ఇంట్లోని బీరువాలో ఉంచిన తులం బంగారం, 40 తులాల వెండి ఆభరణాలు, రూ.20 వేల నగదు దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి ఆధారాలు సేకరించారు. మండల కేంద్రానికి చెందిన ఓ రైతు ఇంట్లో కూడా దొంగలు చొరబడి వెండి సామగ్రి మెత్తుకెళ్లారు. తాళం వేసి ఉన్న మరో రెండు ఇళ్లలో కూడా దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆయా ఇళ్ల వారు వచ్చి చూస్తేగానీ ఏమేమి చోరీకి గురయ్యాయనే విషయం తెలుస్తుంది. -
కాంగ్రెస్దే ఘన విజయం
ఫ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కోదాడ : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతున్నదని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. బుధవారం కోదాడ మున్సిపాలిటీలోని 14వ వార్డు పరిధిలో ఓటు వేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. సామాన్యులకు సన్న బియ్యం అందిచండంతో పాటు మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించిందన్నారు. అన్ని మున్సిపాలిటీలలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హమీలను 100శాతం అమలు చేస్తుందని అన్నారు. 1994 నుంచి.. మంత్రి ఉత్తమ్ 1994లో కోదాడ ఎమ్మెల్యేగా పోటీచేసిన సమయంలో ఉత్తమ్ దంపతులు కోదాడలోని నయానగర్లో కాంగ్రెస్ నాయకుడు చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి ఇంట్లో ఉండేవారు. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో వారు ఇక్కడి నుంచే తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. -
షార్ట్ సర్క్యూట్తో సామగ్రి దగ్ధం
డిండి : షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి బుధవారం మండల కేంద్రంలోని ఓ ఇంట్లో ఉన్న సామగ్రి దగ్ధమైంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన మూడావత్ భీముడు నాయక్ స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నివాసం ఉంటున్నాడు. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం చిట్టంకుంట గ్రామంలో జరిగే బంధువుల శుభకార్యానికి బుధవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. అంతకు ముందు భీముడు కుటుంబ సభ్యులు వేడి నీటి కోసం ఇంట్లోని బాత్రూంలో కరంట్ హీటర్ పెట్టి మర్చి పోయి వెళ్లారు. దాంతో బకిట్లోని నీరు అతిగా వేడి కావడంతో హీటర్ కాలిపోయి బాత్రూంతోపాటు బెడ్రూంలో షార్ట్ సర్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. వారి ఇంట్లోంచి పొగలు రావడం గమనించిన చుట్టు పక్కల వారు ఫైరింజన్కు సమాచారం ఇచ్చారు. అచ్చంపేట ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. అప్పటికే ఇంట్లోని ఫర్నీచర్తో పాటు సర్టిఫికెట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాదంలో రూ.3లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు. -
యూరియా కోసం సెల్ టవరెక్కిన రైతు
కోదాడ రూరల్ : ఫర్టిలైజర్ యాప్లో తనకు యూరియా బుకింగ్ కావడం లేదంటూ ఆగ్రహించిన ఓ రైతుల సెల్టవర్ ఎక్కాడు. ఈ ఘటన కోదాడ పట్టణంలో బీఎస్ఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద బుధవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కోదాడ పట్టణానికి చెందిన రైతు ఆకుల శ్రీనుకు నడిగూడెం మండలం ఎక్లాస్గానిపేట, ఖమ్మం జిల్లా చెరువుమాదారంలో నాలుగు ఎకరాల్లో వరిసాగు చేశాడు. అయితే యూరియా కోసం యాప్లో బుకింగ్కు ప్రయత్నిస్తున్నా బుకింగ్ కావడం లేదు. దీంతో విసుగుచెందిన రైతు సెల్టర్ఎక్కి నిరసనకు దిగాడు. యూరియా బుకింగ్ యాప్లో బుక్ కావడంలేదని, ఎరువుల దుకాణాలకు వెళితే స్టాక్ లేదంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడకు చేరుకొని కిందకు దిగమంటే తనకు యూరియా అందేవరకు దిగేదే లేదని నాకు ఐదు యూరియా కట్టలు కావాలని డిమాండ్ చేశాడు. కొద్ది సేపటికి రైతుతో మాట్లాడి యూరియా ఇప్పించే బాధ్యత తమదని నచ్చజెప్పి కిందకు దించి స్టేషన్కు తీసుకెళ్లారు. అక్కడకు వ్యవసాయాధికారులను పిలిపించి యూరియా యాప్పై అవగాహన కలిగించి యూరియా అందే విధంగా చేస్తామని పంపించారు. టవర్ ఎక్కిన రైతు శ్రీను, కిందకు దిగాలని కోరుతున్న పోలీసులు ఫ యాప్లో బుకింగ్ కావడం లేదని ఆవేదన ఫ ఐదు బస్తాల యూరియా ఇవ్వాలని డిమాండ్ -
నేటి సార్వత్రిక సమ్మెకు సీపీఎం సంపూర్ణ మద్దతు
సూర్యాపేట అర్బన్ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను ఖండిస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 12న చేపట్టనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సీపీఎం సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమ్మెలో పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. వైభవంగా నారసింహుడి నిత్యకల్యాణంమఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో బుధవారం రాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృతాభికం చేపట్టారు. శ్రీస్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం, మాంగళ్యధారణ, తలంబ్రాలతో నిత్యకల్యాణం జరిపారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ వీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ బి.జ్యోతి, అర్చకులు పాల్గొన్నారు. మహా శివరాత్రికి ప్రత్యేక బస్సులురామగిరి(నల్లగొండ) : మహా శివరాత్రి పండుగ సందర్భంగా శైవ క్షేత్రాల దర్శనానికి వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ ఈ నెల 14, 15 తేదీల్లో ప్రత్యేక బస్సులు నడుపుతోందని ఆర్ఎం కె.జానిరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేవరకొండ డిపో నుంచి శ్రీశైలం, కోదాడ డిపో నుంచి ముక్త్యాల, మేళ్లచెర్వు, హుజూర్నగర్ నుంచి మేళ్లచెర్వుకు, మిర్యాలగూడ డిపో నుంచి వాడపల్లి, సోమప్ప, సత్రశాలకు బస్సులు నడుపుతామని పేర్కొన్నారు. సూర్యాపేట డిపో నుంచి శ్రీశైలం, కోటప్పకొండ, నల్లగొండ డిపో నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు నడుపుతామని వెల్లడించారు. యాదగిరీశుడికి విశేష పూజలు యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో బుధవారం విశేష పూజలు కొనసాగాయి. వేకువజామునే ఆలయాన్ని తెరిచి సుప్రభాతం నిర్వహించారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు విశేషంగా అభిషేకం జరిపించారు. శ్రీస్వామి అమ్మవార్లకు సహస్రనామార్చన పూజలు చేశారు. ముఖ మండపంలో ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలు నిర్వహించారు. ఇక.. సాయంత్రం జోడు సేవను ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. రాత్రి శయనోత్సవం నిర్వహించి, ఆలయాన్ని ద్వార బంధనం చేశారు. సూర్యాపేటలో జోరుగా నగదు, మద్యం పంపిణీసూర్యాపేట అర్బన్ : సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు మంగళవారం సాయంత్రం నుంచే నగదు, మద్యం, బహుమతులు (తాయిలాలు) జోరుగా పంపిణీ చేశారు. ముందుగా తమకు అనుకూలమైన ఓటర్లకు నగదు, మద్యం పంచారు. కొంతమంది ఓటర్లకు నగదు మద్యం పంపిణీ చేయకపోవడంతో డబ్బులు ఇస్తే కానీ ఓటేయమని భీష్మించుకొని కూర్చున్నారు. దీంతో చేసేదేమీ లేక అభ్యర్థులు ఉదయం పైసలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నట్లు సమాచారం. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఓటర్లకు అభ్యర్థులు పోలింగ్ కేంద్రాల సమీపంలోని నగదు పంపిణీ చేశారు. -
స్వల్పంగా తగ్గిన మున్సిపల్ పోలింగ్
కోదాడ : జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో బుధవారం జరిగిన ఎన్నికల పోలింగ్ శాతం 2020తో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. 2020లో జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 83.85 శాతం పోలింగ్ నమోదు కాగా 2026లో అది 81.38 శాతానికి పడిపోయింది. దీంతో గత ఎన్నికలతో పోలిస్తే 2.47 ఽశాతం పోలింగ్ తగ్గింది. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూర్నగర్ నియోజకవర్గంలోని హుజూర్నగర్ మున్సిపాలిటీలో పోలింగ్ శాతం తగ్గగా, నేరేడుచర్ల మున్సిపాలిటీలో పోలింగ్ శాతం స్పల్పంగా పెరిగింది. కోదాడ, సూర్యాపేట, తిరుమలగిరి మున్సిపాలిటీలలో పోలింగ్ శాతం స్పల్పంగా తగ్గింది. ఫ 2020 ఎన్నికల్లో 83.85 శాతం నమోదు ఫ తాజాగా 81.38 శాతమే పోలింగ్ ఫ గతంలో కన్నా 2.47 శాతం తక్కువ -
కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించాం
హుజూర్నగర్ : మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రత్యేక పోలీస్ బందోబస్త్ నిర్వహించామని ఎస్పీ నరసింహ తెలిపారు. బుధవారం హుజూర్నగర్లో మున్సిపల్ ఎన్నికలలో పోలింగ్ సరళిని తెలుసుకునేందుకు ఆయన సిబ్బందితో కలిసి పోలింగ్ స్టేషన్లను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇద్దరు అదనపు ఎస్పీలు, 4గురు డీఎస్పీలు, 15 మంది సీఐలతో పాటు మొత్తం 1,250 మంది అధికారులు, సిబ్బందితో కలిపి బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా రిజర్వు పోలీస్ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, రెండు ప్లటూన్ల పోలీసులను వినియోగించినట్లు తెలిపారు. ఎన్నికల అనంతరం సీసీ నిఘాలో పటిష్టమైన బందోబస్తు నడుమ స్ట్రాంగ్రూంలో పోలింగ్ బాక్స్లను భద్రపరిచామన్నారు. ఆయన వెంట సీఐ చరమంద రాజు, ఎస్ఐ మోహన్బాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతం సూర్యాపేట టౌన్ : జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, తిరుమలగిరి, హుజూర్నగర్, నేరేడుచర్లలో బుధవారం మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. బుధవారం ఆయన పోలింగ్ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు కల్పించామన్నారు. జిల్లా పోలీస్ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసిందని, ముందస్తు ప్రణాళిక, నిఘా వ్యవస్థ, నిరంతర పర్యవేక్షణ, ఫ్లాగ్ మార్చ్లు, సున్నిత ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు వంటి చర్యలతో ఎన్నికలు శాంతియుతంగా సాగినట్టు చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, మొబైల్ పెట్రోలింగ్, క్విక్ రెస్పాన్స్ టీమ్ల ఏర్పాటు ద్వారా ఎలాంటి అవాంతరాలకు తావులేకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫ ఎస్పీ నరసింహ -
దద్దమ్మ ప్రభుత్వమని మంత్రే ఒప్పుకున్నడు
సూర్యాపేట : కాంగ్రెస్ది దద్దమ్మ ప్రభుత్వమని మంత్రి పొంగులేటి స్వయంగా ఒప్పుకున్నాడని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నాకూడా బీఆర్ఎస్ తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారనడం సిగ్గు చేటన్నారు. అధికారంలో ఉన్నది కాంగ్రెస్సా, బీఆర్ఎస్సా అన్న సోయి కూడా మంత్రులకు లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీసులు, అధికారులకు స్వేచ్ఛ లేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని అపోహ పడుతున్నారని, తమ హయాంలోనూ ట్యాపింగ్ జరుగుతుందని, చేతగాని మాటలు చెబుతున్నారని విమర్శించారు. పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టి బీఆర్ఎస్పై దాడులు చేస్తున్నారన్నారు. మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తున్నది ముఖ్య మంత్రే అని ఆరోపించారు. సీఎం ఉద్యోగులతో టెలికాన్ఫరెన్స్ పెట్టి ఎన్నికలలో సహకరించాలని చెప్పడం సిగ్గు చేటన్నారు. నేరాలను అదుపు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రాత్రి వేళల్లో కాంగ్రెస్ గుండాలు బైక్లపై హల్చల్ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రాబోయేది కేసీఆర్ రాజ్యమేనని పేర్కొన్నారు. ఫ మాజీ మంత్రి జగదీష్రెడ్డి -
పుర పోలింగ్ ప్రశాంతం
సూర్యాపేట టౌన్ : జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో బుధవారం చిన్నచిన్న ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5గంటల వరకు కొనసాగింది. ఉదయం కాస్త మందకొడిగా సాగినప్పటికీ మధ్యాహ్నం తర్వాత ఊపందుకుంది. సాయంత్రం వరకు ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. జిల్లాలో ఐదు మున్సిపాలిటీల పరిధిలో 1,75,759 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా 79.90 శాతం ఓటింగ్ నమోదైంది. తిరుమలగిరిలో అత్యధికం.. కోదాడలో అత్యల్పం.. జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో జరిగిన ఎన్నికలకు సంబంధించి అత్యధికంగా తిరుమలగిరి మున్సిపాలిటీలో పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా కోదాడ మున్సిపాలిటీలో పోలింగ్ నమోదైంది. తిరుమలగిరిలో 13,656 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా 88.36శాతం ఓటింగ్ నమోదైంది. అలాగే కోదాడలో 40,881 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా 77.05 శాతం నమోదైంది. మహిళా ఓటర్లే ఎక్కువ..జిల్లాలో పురుషుల కంటే ఎక్కువగా మహిళలే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హుజూర్నగర్లో పురుషులు 11,287 మంది ఓటు వేయగా మహిళలు 12,633 మంది ఓటు వేశారు. అలాగే కోదాడ లో పురుషులు 21,306 మంది, మహిళలు 19,568 మంది ఓటు వేశారు. నేరేడుచర్లలో పురుషులు 5,142 మంది, మహిళలు 5,750 మంది ఓటేశారు. సూర్యాపేటలో పురుషులు 41,199 మంది, మహిళలు 45192 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. తిరుమలగిరి మున్సిపాలిటీలో పురుషులు 6,760 మంది, మహిళలు 6,896 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 137 వార్డుల్లో 372 కేంద్రాలు.. ఐదు మున్సిపాలిటీల్లోని 137 వార్డుల్లో పోలింగ్కు 372 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతం నిర్వహించేందుకు 446 మంది పోలింగ్ అధికారులు, 446 మంది ఏపీఓలు, 1340 మంది ఓపీఓలు విధుల్లో పాల్గొన్నారు. ఎన్నికల సజావు నిర్వహణకు 51 మంది జోనల్ అధికారులు, 46 మంది రూట్ అధికారులు, 10 ఎస్ఎన్టీ, 15 ఎఫ్ఎస్టీ, 7 వీవీటి, ఏటీ 7 బృందాలు ఎన్నికల విధుల్లో పాల్గొన్నాయి. 55 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. బ్యాలెట్ బాక్సులను 46 బస్సుల్లో పోలీస్ ఎస్కార్ట్ నడుమ భారీ బందోబస్తుతో పోలింగ్ కేంద్రాల నుంచి స్ట్రాంగ్రూమ్కు తరలించారు. పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ పోలింగ్ ప్రక్రియను ఎన్నికల పరిశీలకుడు జీఎస్ పాండాదాస్, కలెక్టర్ తేజస్నంద్లాల్ పవార్, ఎస్పీ నరసింహ పరిశీలించారు. ఎన్నికల పరిశీలకుడు జీఎస్ పాండాదాస్ నేరేడుచర్ల మున్సిపాలిటీలో పరిశీలించారు. అలాగే కలెక్టర్, ఎస్పీలు వేర్వేరుగా సూర్యాపేటతోపాటు ఇతర మున్సిపాలిటీల్లో పోలింగ్ను పరిశీలించారు. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు.. పలువురు ప్రముఖులు తమ మున్సిపాలిటీల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి కోదాడలోని 14వ వార్డులో ఓటేశారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి సూర్పాపేటలోని 44వ వార్డులో ఓటేశారు. అలాగే జిల్లా కలెక్టర్ తేజస్నంద్లాల్ పవార్ 14వ వార్డులో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సూర్యాపేట పట్టణంలోని 25వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి కోడి శిరీష పోలింగ్ బూత్ ముందు ఆందోళన చేపట్టారు. ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన తను పోలీసులు కేంద్రం లోనికి అనుమతించట్లేదని, వేరే పార్టీ అభ్యర్థులను పలుమార్లు లోపలికి బయటకి అనుమతిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు, మద్దతుదారులతో కలిసి పోలింగ్ బూత్ ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. అలాగే సూర్యాపేట మున్సిపల్ పరిధి 13 వార్డు గాంధీనగర్లో టీఆర్పీ, కాంగ్రెస్ వర్గాలు ఘర్షణ పడ్డారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఇరు వర్గాలపై లాఠీచార్జీ చేశారు. దీంతో పోలీ సులు అకారణంగా తమపై దాడి చేశారని నిరసిస్తూ సూర్యాపేట–జనగామ రహదారిపై టీఆర్పీ నాయకులు రాస్తారోకో చేశారు. ఫ తిరుమలగిరిలో అత్యధికంగా 88.36 శాతం ఫ కోదాడలో అత్యల్పంగా 77.05 శాతం ఫ ఓటుహక్కు వినియోగించుకున్న 1,75,759 మంది ఓటర్లు -
రేపటి నుంచి కనకదుర్గమ్మ జాతర
చిలుకూరు : చిలుకూరు మండలంలోని బేతవోలు గ్రామంలో గురువారం నుంచి కనకదుర్గమ్మ జాతర నిర్వహించనున్నారు. ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు జాతరను వైభవంగా జరిపేందుకు ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జాతరలో భాగంగా గురువారం సాయంత్రం గ్రామస్తులు ప్రభ బండ్లను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకెళ్తారు. శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కోలాట ప్రదర్శనలు, రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు, శనివారం ఉదయం కోలాట ప్రదర్శనలు ఉంటాయి. అదేరోజు సాయంత్రం ప్రభ బండ్లను ఆలయం వద్ద నుంచి ఇళ్లకు తీసుకెళ్తారు. వివిధ పార్టీల ఆధ్వర్యంలో.. జాతర సందర్భంగా ప్రతి ఏడాది బేతవోలు గ్రామంలోని వివిధ పార్టీల నాయకులు వారికి కేటాయించిన ప్రదేశాల్లో కోలాటాలు, లైటింగ్ ప్రభలు ఏర్పాటు చేస్తారు. ఈ ఏడాది విభేదాల కారణంగా అధికార కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిసింది. కాంగ్రెస్లో సర్పంచ్ వట్టికూటి నాగయ్య వర్గం ఆధ్వర్యంలో ఉదయం రాష్ట్రస్థాయి ఎద్దుల పందేలు, శుక్రవారం రాత్రి మ్యూజికల్ లైటింగ్ అర్కెస్ట్రాతో పాటల కార్యక్రమాలు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో కాంగ్రెస్ వర్గం ఉదయం కోలాటాలు, రాత్రి లైటింగ్ ప్రభలు ఏర్పాటు చేస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం పార్టీల నాయకులు ఉదయం కోలాటాలు, శుక్రవారం రాత్రి లైటింగ్ ప్రభలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇక సీపీఐ నుంచి బహ్కిరించబడిన మట్టయ్య తన వర్గంతో కోలాటాలు, లైటింగ్ ప్రభలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 7 లైటింగ్ ప్రభల ఏర్పాటుకు పార్టీల నాయకులు సిద్ధం చేసుకుంటున్నారు. 60 మంది బైండోవర్ బేతవోలు జాతరలో రాత్రి జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు పోలీసులు గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా అనుమతులు ఇవ్వడం లేదు. గతంలో జాతరలో పార్టీల మధ్య ఘర్షణలు జరగడంతో పోలీసులు రాత్రి జరిగే కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వడం లేదు. పార్టీల నాయకులు మాత్రం స్థానిక మంత్రి, స్థానిక ఎమ్మెల్యే వద్దకు వెళ్లి అనుమతులకు ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా ఎస్పీ దగ్గర అనుమతి కోసం తిరుగుతున్నారు. అయితే పోలీసులు ముందస్తుగా గ్రామంలోని కాంగ్రెస్, బీఆర్ఎస్ తదితర పార్టీల నుంచి ఇప్పటికే 60 మందికిపైగా కోదాడ ఆర్డీఓ కార్యాలయంలో బైండోవర్ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. చిలుకూరు ఎస్ఐ హనుమాన్నాయక్ ఆధ్వర్యంలో ఏడుగురు ఎస్ఐలు, ప్రత్యేక పోలీస్ బలగాలు, సివిల్ పోలీసులు 70 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఫ బేతవోలు ఆలయంలో వేడుకలకు ఏర్పాట్లు ఫ రాత్రి వేళ సాంస్కృతిక కార్యక్రమాలకు అనుమతి ఇవ్వని పోలీసులు ఫ మంత్రి, అధికారుల చుట్టూ తిరుగుతున్న నిర్వాహకులు -
ఓటు హక్కు వినియోగించుకోనున్న 2,26,646 మంది ఓటర్లు
స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలిఫ ఎస్పీ నరసింహ సూర్యాపేటటౌన్ : జిల్లాలో సూర్యాపేట, తిరుమలగిరి, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా 1250 పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఎస్పీ నరసింహ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే పోలీసుల లక్ష్యమన్నారు. డబ్బు, మద్యం, బహుమతులు అంటూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేయొద్దన్నారు. ఓటర్లు కానివారు ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీల్లో ఉండకూడదని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద గుంపులుగా చేరవద్దని, ఓటు వేయాలని 100 మీటర్ల పరిధిలో అభ్యర్థించవద్దన్నారు. ఎన్నికల సమయంలో కేసులు నమోదైతే భవిష్యత్లో ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. విజయోత్సవ ర్యాలీలు, బాణాసంచా, డీజేలకు అనుమతి లేదన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలకు ఐదంచెల పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఓటర్లు, అభ్యర్థులకు సూచనలు.. ● మీ పేరు తాజా ఓటరు జాబితాలో ఉన్నదా, లేదా అని నిర్ధారించుకోండి. ● పోలింగ్ సెంటర్కు సెల్ఫోన్న్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, మంట ప్రేరేపిత వస్తువులు తేవొద్దు, సెల్ఫీలు దిగొద్దు. ● మీ పోలింగ్ స్టేషన్ వివరాలు ముందుగానే చూసుకోండి. ● ఎన్నికల సంఘం చూపిన 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఒకటైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా పోలింగ్ కేంద్రానికి తీసుకురండి. ● తెలియని వ్యక్తులకు ఓటర్ ఐడీ లేదా ఓటర్ స్లిప్ ఇవ్వొద్దు. ● రహస్య పద్ధతిలో ఓటు వేయాలి. ఫలానా గుర్తుకు ఓటు వేశానని బయటకు చెప్పవద్దు. ● కార్యకర్తలు, అభ్యర్థులు ఓటరు స్లిప్స్ పంచవద్దు. ● పోలింగ్ కేంద్రంలో క్యూలైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకోండి. ● పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేయవద్దు. ● వేరొక ఓటరు పేరు మీద ఓటు వేయడానికి ప్రయత్నించడం చట్టరీత్యా నేరం. ఫ ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు ఫ ఐదు మున్సిపాలిటీల్లో 137 వార్డులకు ఎన్నికలు ఫ ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్సూర్యాపేటటౌన్ : మున్సిపల్ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. బుధవారం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగనుంది. జిల్లాలో మొత్తం ఐదు మున్సిపాలిటీల పరిధిలో 141 వార్డులకుగాను నాలుగు వార్డులు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 137 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల అధికారులు ఇప్పటికే ఆయా పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సామగ్రితో చేరుకున్నారు. మంగళవారం ఉదయం నుంచే జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ద్వారా పోలింగ్ సామగ్రిని తరలించారు. 137 వార్డులు.. 612 మంది అభ్యర్థులు మున్సిపాలిటీ ఎన్నికలకు జనవరి 27న నోటిఫికేషన్ వచ్చింది. వెంటనే నామినేషన్ల స్వీకరణ, అనంతరం ఉపసంహరణ, ఈ నెల 4వ తేదీ నుంచి బరిలో ఉన్న అభ్యర్థులు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలకుగాను 141 వార్డులు ఉండగా.. అందులో కోదాడలో మూడు, హుజూర్నగర్లో ఒకటి ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 137 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఐదు మున్సిపాలిటీల్లో కలిపి 612 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందులో ప్రధాన పార్టీల మధ్యే గట్టి పోటీ ఉంది. కొన్నిచోట్ల రెబల్స్ సైతం గట్టి పోటీ ఇవ్వనున్నారు. పకడ్బందీ ఏర్పాట్లు జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో గల 137 వార్డుల్లో ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. 372 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కట్టుదిట్టంగా నిర్వహించేందుకు 446 మంది పోలింగ్ అధికారులు, 446 మంది ఏపీఓలు, 1340 మంది ఓపీఓలను నియమించారు. అదేవిధంగా 51 మంది జోనల్ అధికారులు, 46 మంది రూట్ అధికారులను నియమించారు. 10 ఎస్ఎస్టీ, 15 ఎఫ్ఎస్టీ, 7 వీవీటీ, 7 ఏటీ బృందాలను ఏర్పాటు చేశారు. 55 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. పోలీస్ ఎస్కార్టుతో ఎన్నికల సామగ్రి పోలింగ్ కేంద్రాలకు, తిరిగి పోలింగ్ కేంద్రాల నుంచి స్ట్రాంగ్ రూమ్కు తరలించేందుకు 46 బస్సులను ఏర్పాటు చేశారు. అత్యధికంగా సూర్యాపేట మున్సిపాలిటీలో.. జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీల్లో మొత్తం 2,26,646 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో మహిళలు 1,17,843 మంది ఉండగా పురుషులు 1,08,763 మంది ఓటర్లు ఉన్నారు. అలాగే ఇతరులు 40 మంది ఉన్నాయి. జిల్లాలో అత్యధికంగా సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో 48 వార్డులకుగాను 1,08,848 మంది ఓటర్లు ఉండగా.. అత్యల్పంగా నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో 15 వార్డులకు గాను 13,746 మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా బుధవారం జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పటిష్ట బందోబస్తు.. ఐదు మున్సిపాలిటీల్లో జరుగనున్న ఎన్నికలకు సంబంధించి ఎస్పీ నరసింహ ఆధ్వర్యంలో పటిష్ట పోలీస్ బందోబస్తు నిర్వహించనున్నారు. జిల్లాలో 1250 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బందోబస్తులో అదనపు ఎస్పీలు ఇద్దరు, డీఎస్పీలు నలుగురు, ఇన్స్పెక్టర్లు 12 మంది, సబ్ ఇన్స్పెక్టర్లు 50, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుళ్లు 265 మంది, కానిస్టేబుళ్లు 760, హహోంగార్డులు 152, మహిళా సిబ్బంది 90 మంది, స్పెషల్ పార్టీ టీమ్స్, బాంబ్ స్క్వాడ్ టీమ్స్, స్టైకింగ్ ఫోర్స్ టీమ్స్ ఐదు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్స్ ఐదు, ప్రతి మున్సిపాలిటీకి 3 ఫ్లయింగ్ స్క్వాడ్ చొప్పున 15 ఫ్లైయింగ్ స్క్వాడ్లు విధులను నిర్వర్తించనున్నారు. ప్రలోభాల పర్వం.. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో బరిలో ఉన్న అభ్యర్థులు మంగళవారం ఉదయం నుంచే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రలోభాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. అలాగే ఒక్కో వార్డులో రూ.1000 నుంచి రూ.5వేల వరకు పంపిణీ చేసినట్టు తెలుస్తోంది. మహిళలకు చీరలు, పురుషులకు ఖరీదైన మద్యం బాటిళ్లను సైతం పంపిణీ చేసి ఓట్లు అభ్యర్థించినట్టు సమాచారం. మున్సిపాలిటీల్లో ఇలా.. మున్సిపాలిటీ వార్డులు ఏకగ్రీవం ఓటర్లు కోదాడ 35 03 8601 హుజూర్నగర్ 28 01 29996 నేరేడుచర్ల 15 00 13746 తిరుమలగిరి 15 00 15455 సూర్యాపేట 48 00 108848 మొత్తం 141 04 2,26,646 -
భక్తుల జేబులకు చిల్లు
ఆత్మకూర్.ఎస్ (సూర్యాపేట) : శ్రీ దండు మైసమ్మ తల్లి ఆలయం వద్ద పూజా సామగ్రి, కొబ్బరికాయలను అధిక ధరలకు విక్రయిస్తుండడంతో భక్తుల జేబులకు చిల్లు పడుతోంది. ప్రతినిత్యం అమ్మవారిని దర్శించుకునేందుకు వేలమంది భక్తులు వస్తుంటారు. విక్రయదారులు పూజా సామగ్రి ధరల రేట్లు ఇష్టానుసారంగా పెంచి భక్తుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ విషయమై పలుమార్లు భక్తులు, గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. దండు మైసమ్మ ఆలయం వద్ద వాహనాల పూజ కోసం ఉపయోగించే సామగ్రి ఐదు నిమ్మకాయలు, మూడు జీడిగింజలు, ఒక కొబ్బరికాయ, ఒక దట్టి రూ.200లకు భక్తులకు విక్రయిస్తున్నారు. భక్తులు అమ్మవారికి సమర్పించే కొబ్బరికాయలను సైతం అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అదేవిధంగా పూజ సమయంలో వాహనాలను రోడ్డుకు అడ్డంగా నిలుపుతుండడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోందని స్థానికులు, భక్తులు పేర్కొంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఆలయ సమీపంలో పూజా సామగ్రి, కొబ్బరికాయల ధరలను నియంత్రించాలని, రోడ్డుపై వాహనాలు నిలపకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.ఫ పూజా సామగ్రి, కొబ్బరికాయలు అధిక ధరలకు విక్రయం ఫ ఇష్టానుసారంగా రేట్లు పెంచి అమ్ముతున్న దుకాణదారులు -
రాజేష్ మృతికి కారకులను శిక్షించాలి
పెన్పహాడ్ : కర్ల రాజేష్ మృతికి కారకులైన పోలీసులను కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. మంగళవారం పెన్పహాడ్ మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజేష్ సంతాప సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎలాంటి తప్పు చేయని రాజేష్ను చిలుకూరు ఎస్ఐ సురేష్రెడ్డి అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు. పోలీసుల దెబ్బలను తట్టుకోలేక రాజేష్ మృతి చెందాడని ఆరోపించారు. రాజేశ్ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయడంతోపాటు బాధ్యులైన పోలీసులను సస్పెండ్ చేసి శిక్షపడే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తప్పుచేసిన పోలీసు అధికారులను ఎమ్మెల్యే పద్మావతి, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కాపాడుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు కొండేటి గోపి, ఎమ్మెస్పీ జిల్లా అధ్యక్షుడు యాతాకుల రాజయ్య, శివకుమార్, నరసింహ, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంగరి యుగేంధర్, దాసరి శ్రీనివాస్, సర్పంచ్ ఒగ్గు కిరణ్, నన్నెపంగ సైదులు, లింగయ్య, కృష్ణ, శ్రావణ్కుమార్, మహేందర్, శ్యాంసన్, గోపి పాల్గొన్నారు. ఫ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ -
ఎన్నికల సిబ్బంది అలసత్వం వహించొద్దు
తిరుమలగిరి (తుంగతుర్తి) : ఎన్నికల విధుల్లో సిబ్బంది అలసత్వం వహించవద్దని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు హుసేన్, అదనపు కలెక్టర్ సీతారామారావు అన్నారు. తిరుమలగిరి మున్సిపాలిటీలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని మంగళవారం వారు పరిశీ లించి మాట్లాడారు. ఈ సందర్భంగా అధికా రులతో మాట్లాడి సామగ్రి పంపిణీ వివరా లను తెలుసుకున్నారు. వారి వెంట డీఎస్పీ నర్సింహాచారి, తహసీల్దార్ హరిప్రసాద్, మున్సిపల్ కమిషనర్ రామచందర్రావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు, తిరుమలగిరి మున్సిపాలిటీ ఎన్నికల వ్యయ పరిశీలకులు బడేసాబ్, ఆనంద్, ఎస్ఐ వెంకట్రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అశోక్రెడ్డి పాల్గొన్నారు. శివరాత్రి జాతరకు మంత్రి ఉత్తమ్కు ఆహ్వానంహుజూర్నగర్ : మేళ్లచెరువు శివాలయ ఉత్సవ కమిటీ సభ్యులు మంగళవారం హుజూర్నగర్లో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిని కలిశారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు జరిగే శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు రావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, ఆలయ పూజారులు, అధికారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఓవర్ లోడ్ సమస్యను పరిష్కరించండిసూర్యాపేట అర్బన్ : విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని, రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా విద్యుత్ ఓవర్ లోడ్ సమస్యలు పరిష్కరించాలని కమర్షియల్ చీఫ్ ఇంజనీర్ రవికుమార్ అన్నారు. జిల్లా సర్కిల్ కార్యాలయంలో మంగళవారం విద్యుత్ అధికారులతో నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. 33 కేవీ, 11 కేవీ ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరాలో ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కొత్తగా ప్రతిపాదించిన సబ్ స్టేషన్ల పనుల పురోగతి, అదనపు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు పురోగతిపై సమీక్షించారు. అనంతరం జిల్లా స్టోర్స్ను పరిశీలించి స్టోర్స్లో అన్ని రకాల మెటీరియల్ అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్చార్జ్ ఎస్ఈ శ్రీనివాస్, డీఈ టెక్నికల్ సీహెచ్ విద్యాసాగర్, డీఈలు వెంకటకృష్ణయ్య, జ్యోతికుమార్, స్వామి, స్టోర్స్ ఏడీఈ సత్యనా రాయణ కమర్షియల్ ఏఓ అశోక్ పాల్గొన్నారు. పిల్లలమర్రి శివాలయంలో సంప్రోక్షణసూర్యాపేట : పిల్లలమర్రి గ్రామంలో కాకతీయుల కాలంలో నిర్మించిన పురాతన శివాలయానికి రిటైర్డ్ ఏఎస్పీ గంగాధర సత్యనారాయణ ఆధ్వర్యంలో ఫైర్ డిపార్ట్మెంట్ సహకారంతో మంగళవారం సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా రిటైర్డ్ ఏఎస్పీ గంగాధర సత్యనారాయణ మాట్లాడుతూ శివరాత్రి సందర్భంగా పిల్లలమర్రి ఏకేశ్వరాలయంలో సంప్రోక్షణ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొండ వెంకన్న డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. -
సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
సూర్యాపేటటౌన్ : మున్సిపాలిటీ ఎన్నికల విధుల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నరసింహ అన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల విధులు నిర్వర్తించనున్న సిబ్బందికి మంగళవారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతలను కాపాడడంలో పోలీస్ సిబ్బంది పాత్ర అత్యంత కీలకమన్నారు. బందోబస్తు విధుల్లో పాల్గొనే ప్రతిఒక్కరూ నిర్లక్ష్యం వహించకుండా, పూర్తి అంకితభావం, క్రమశిక్షణతో తమ బాధ్యతలను నిర్వహించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను క్రమపద్ధతిలో ఉంచాలని, అనుమతిలేని వ్యక్తులను ఓటరు కానీ వారిని పరిసరాల్లోకి రానివ్వొద్దన్నారు. 100 మీటర్ల పరిధిలో ఆంక్షలు పటిష్టంగా అమలు చేయాలన్నారు. ఓటర్లు సెల్ ఫోన్న్, ఎలక్ట్రానిక్ వస్తువులను వెంట తెస్తున్నారా అనేదానిపై నిఘా ఉంచాలన్నారు. ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది ఎన్నికల కోడ్ (ఎంసీసీ) నియమాలను పాటిస్తూ, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ జనార్దన్రెడ్డి, సూర్యాపేట డివిజన్ డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐలు వెంకటయ్య, రాజశేఖర్, రామారావు, శివకుమార్, ప్రవీణ్కుమార్, ఎస్ఐలు, ఏఎస్ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు. ఫ ఎస్పీ నరసింహ -
చివరి రోజు హోరెత్తించారు
భానుపురి, సూర్యాపేట టౌన్ : మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈనెల 4న మొదలైన ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం 5గంటలకు తెరపడింది. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు చివరి రోజు పోటాపోటీగా ఇంటింటి ప్రచారం చేశారు. ఆయా పార్టీల నేతలు రోడ్షోలు, ర్యాలీలు, సభలతో హోరెత్తించారు. ప్రధానంగా మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలను చుట్టివచ్చారు. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి సూర్యాపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇక ఓటర్ల ప్రసన్నానికి మంగళవారం చివరి అవకాశం ఉండడంతో ప్రలోభాలకు తెరలేపనున్నారు. రంగంలోకి కీలక నేతలు మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఈనెల 4వ తేదీన మొదలైంది. అన్ని పార్టీల అభ్యర్ధులు ఇంటింటికి తిరిగి ఓటర్లను ఓటు అభ్యర్థించారు. పార్టీల గుర్తులపై జరిగే ఎన్నికలు కావడంతో అధికార కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఆయా పార్టీల కీలక నేతలు రంగంలోకి దిగి అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. చివరి రోజు ప్రచారం హోరాహోరీగా సాగింది. ఖర్చులకు వెనుకాడకుండా కోలాటాలు, డప్పు వాయిద్యాలతో ర్యాలీలు తీస్తూ భారీ జనసమూహాలతో అభ్యర్థులు బల ప్రదర్శన చేశారు. నేడు పోలింగ్ సామగ్రి పంపిణీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బుధవారం జరగనుండడంతో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఐదు మున్సిపాలిటీల్లో మొత్తం 2,26,646 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించేందుకుగాను 372 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఎన్నికల సామగ్రి పంపిణీ కోసం ఐదు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. హుజూర్నగర్ ఏఎంసీ గోదాంలో 56 పోలింగ్ కేంద్రాల సామగ్రి, కోదాడ సీసీ రెడ్డి కాన్వెంట్లో 91 సెంటర్ల సామగ్రి, నేరేడుచర్ల శ్రీరాచకొండ సీతారామనర్సయ్య ఫంక్షన్ హాల్లో 30 సెంటర్ల సామగ్రి, సూర్యాపేట శ్రీవెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో 165 సెంటర్ల సామగ్రి, తిరుమలగిరి ఎస్ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో 30 సెంటర్లకు సంబంధించిన పోలింగ్ సామగ్రి పంపిణీ చేయనున్నారు. ఎన్నికల విధులు కేటాయించిన అధికారులు మంగళవారం ఉదయం నుంచే ఆయా సెంటర్లకు చేరుకుని తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రానికి సంబంధించి సామగ్రి తీసుకోనున్నారు.పోలింగ్ రోజున స్థానిక సెలవు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, తిరుమలగిరి, నేరేడుచర్ల మున్సిపాలిటీల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు ఓటు హక్కు వినియోగానికి 11వ తేదీన (బుధవారం) స్థానిక సెలవుగా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ప్రకటించారు. అదేవిధంగా ఎన్నికల పోలింగ్కు వినియోగించుకుంటున్న అన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ భవనాలు అన్నింటికి ఈనెల 10వ తేదీతో పాటు 11న స్థానిక సెలవుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం భారీ జనసమూహాలతో అభ్యర్థుల బల ప్రదర్శన ఓటర్లను ఆకర్షించేందుకు నేడు డబ్బు, మద్యం పంపిణీకి సిద్ధం డబ్బుల పంపిణీకి ఏర్పాట్లు ఎన్నికల సంఘం నిబంధనల మేరకు సోమవారం సాయంత్రం 5గంటల నుంచి ప్రచారం ముగియడంతో అభ్యర్ధులు ఎలాగైనా గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచించి ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా మద్యం, డబ్బులు, ఇతర తాయిలాల పంపిణీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కొందరు అభ్యర్ధులు ఇప్పటి వరకు ఖర్చు విషయంలో జాగ్రత్తలు పాటించగా.. ఇకపై వెనుకడుగు వేయకుండా ఖర్చు చేసేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయా మున్సిపాలిటీల్లో ఓటుకు రూ.1000 నుంచి రూ.3000 వరకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
ఆదర్శంగా తీర్చిదిద్దుతా
● డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపరుస్తా ● విలీనమైన గ్రామాల అభివృద్ధికి అధిక నిధులు తీసుకువస్తా ● సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ కాంగ్రెస్ అభ్యర్థి మొరిశెట్టి నివేదితసూర్యాపేట : సూర్యాపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, సూర్యాపేటను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని 46వ వార్డు అభ్యర్థి, సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ కాంగ్రెస్ అభ్యర్థి మొరిశెట్టి నివేదిత అన్నారు. సోమవారం ఆమె సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. వివరాలు ఆమె మాటల్లోనే.. మౌలిక వసతుల కల్పనే ధ్యేయం పట్టణంలో మా వార్డుతో పాటు అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి చేస్తా. ముఖ్యంగా అస్తవ్యస్తంగా ఉన్న డ్రెయినేజీ వ్యవస్థను, అంతర్గత రోడ్లను మెరుగుపరుస్తా. పట్టణంలో మౌలిక వసతులు కల్పిస్తా. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక వసతులు కల్పిస్తా. వార్డుల్లో మా దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తా. పట్టణానికి స్వచ్ఛమైన తాగునీరును అందిస్తా. దోమలు, పందుల నివారణకు కృషి చేస్తా. సూర్యాపేట మున్సిపాలిటీలోని శివారు ప్రాంతాల్లో కొత్త కాలనీలను అభివృద్ధి చేస్తాం. మేనిఫెస్టోను అమలు చేస్తా.. మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల అభివృద్ధికి అధిక నిధులు తీసుకొచ్చేలా కృషి చేస్తా. ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తా. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డిల సహకారంతో సూర్యాపేట పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తా. ఈ ఎన్నికల్లో పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోను అమలు చేస్తాం. -
నేరేడుచర్లను గ్రీన్ సిటీగా మారుస్తా
నేరేడుచర్ల : నేరేడుచర్ల మున్సిపాలిటీని గ్రీన్ సిటీగా మార్చడంతో పాటు రూ.వంద కోట్లతో అభివృద్ధి చేస్తానని రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నేరేడుచర్లలోని పలు వార్డుల్లో ఆయన రోడ్డు షో నిర్వహించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత హైదరాబాద్ మాదిరిగా అన్నీ మున్సిపాలిటీలను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్రెడ్డి ముందుకు వెళ్తున్నారన్నారు. నేరేడుచర్ల మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్నారు. కార్యక్రమంలో మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొణతం చిన వెంకట్రెడ్డి, నూకల సందీప్రెడ్డి, బచ్చలకూరి ప్రకాశ్, యారవ లక్ష్మి, ఇంజమూరి శ్రీకాంత్, వాణి, శంకర్, కొణతం మంజుల, వల్లంశెట్ల జ్యోతి, తాళ్ల లావణ్య, లక్ష్మయ్య, మొగలాబి, శ్రీను, కోటేశ్వరమ్మ, అబ్దుల్ ఖలీం తదితరులున్నారు. ఈ ప్రాంత అభివృద్ధి నా ప్రాణం తిరుమలగిరి (తుంగతుర్తి) : తాటిపాముల తన సొంత గ్రామమని, తిరుమలగిరి, ఈ ప్రాంత అభివృద్ధి తన ప్రాణమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం తిరుమలగిరి మున్సిపాలిటీలోని స్థానిక క్రాస్ రోడ్లో నిర్వహించిన కార్నర్ సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించడానికి ఎన్ని కోట్ల రూపాయలు అయినా మంజూరు చేయిస్తానని తెలిపారు. ఎమ్మెల్యే మందుల సామేల్ మాట్లాడుతూ.. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో 1000 ఇళ్లు ఇస్తామని తెలిపారు. మండలంలోని 8 గ్రామాలకు దేవాదుల ఫేజ్–6 ద్వారా 18 వేల ఎకరాలకు నీరు అందిస్తామని, ఈ పనులకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు. కార్నర్ సమావేశం సందర్భంగా పాత గ్రామం నుంచి క్రాస్ రోడ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య, రైతు కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్న యాదవ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అనురాధ, ఎన్నికల అబ్జర్వర్ రవళిరెడ్డి, వదలపాటి అధ్యక్షులు నరేష్, సంకెపల్లి కొండల్ రెడ్డి, మూల అశోక్ రెడ్డి, జమ్మిలాలు, అభ్యర్థులు పాల్గొన్నారు. భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి బీఆర్ఎస్కు ఓటేస్తే మురుగు కాలువలో వేసినట్లే.. హుజూర్నగర్ : మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేస్తే మురుగు కాలువలో వేసినట్లేనని, ఎవరికీ ఉపయోగపడదని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. సోమవారం హుజూర్నగర్ మున్సిపాలిటీలోని 5, 6 వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పట్టణంలోని జైలు నుంచి వచ్చే మురుగు నీటికి శాశ్వత పరిష్కారం చూపుతానని తెలిపారు. అసంపూర్తి ట్యాంక్ బండ్ నిర్మాణాన్ని పూర్తి చేయిస్తానన్నారు. కమ్యూనిటీ హాల్, సాయిబాబా థియేటర్ వద్ద చిల్ట్రెన్స్ పార్కు, మహిళల వాకింక్ ట్రాక్, జిమ్ సెంటర్ ఏర్పాటు చేయిస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్, సీపీఎం నాయకులు శీలం శ్రీను, కాంగ్రెస్, సీపీఎం అభ్యర్థులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్కు ఓటేస్తే గోస పడతాం
సూర్యాపేటటౌన్ : మరోసారి కాంగ్రెస్కు ఓటేస్తే మరింత గోస పడతామని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం సోమవారం సూర్యాపేట పట్టణంలో అన్ని మున్సిపల్ వార్డుల అభ్యర్థులు, నాయకులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనతో మీకేం లాభం జరిగిందో ఆలోచన చేయాలన్నారు. సీఎం, ఆయన మంత్రి వర్గమంతా దోచుకునే పనిలో పడ్డారని ఆరోపించారు. సూర్యాపేటకు మంజూరైనా నిధులు వెనక్కి పంపిన చరిత్ర కాంగ్రెస్దేనన్నారు. స్పోర్ట్స్ స్కూల్, స్టేడియం ఆధునీకరణకు రూ.25 కోట్లు, మహిళా పాలిటెక్నికల్ కళాశాల హాస్టల్ భవనానికి రూ.25కోట్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కోట్లాది రూపాయలను వెనక్కి పంపారన్నారు. అరాచక కాంగ్రెస్ను నమ్మి.. అభివృద్ధి చేసే కేసీఆర్ను వదులుకున్నారన్నారు. మళ్లీ కాంగ్రెస్ మాయమాటలు నమ్మి ఓటేస్తే ఒరిగేదేమీ లేదని ప్రజలు ఇప్పటికే తెలుసుకున్నారన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుందని, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు సరైన బుద్ధి చెప్పారన్నారు. కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి -
మూడున్నరేళ్లుగా నిధుల్లేక!
రైతు వేదికల నిర్వహణకు సంబంధిచిన నిధులు పెండిగ్లో ఉన్న మాట వాస్తవమే. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఉన్నందున ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి నిధులు రాగానే అందజేస్తాం. – శ్రీధర్రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి అనంతగిరి : పంటల సాగుపై రైతులకు శిక్షణ కార్యక్రమాలు, అవగాహన సదస్సు నిర్వహించేందుకు రెండు మూడు గ్రామాలను ఒక క్లస్టర్గా చేసి గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన రైతు వేదికల నిర్వహణ భారంగా మారింది. జిల్లాకు 82 రైతు వేదికలు మంజూరు చేయగా 79 క్లస్టర్లలో రైతువేధికలు అందుబాటులో ఉన్నాయి. సూర్యాపేట డివిజన్లోని నెమ్మికల్లు, తుంగతుర్తి డివిజన్లోని నాగారం, తుంగతుర్తి క్లస్టర్ రైతువేదికలు వివిధ కారణాల వల్ల అందుబాటులోకి రాలేదు. జిల్లాలో వ్యాప్తంగా 82 మంది ఏఈఓలు రైతులకు సేవలు అందిస్తుండగా ఇందులో 13 మంది కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్నారు. 2022లో ఏప్రిల్ నుంచి వరుసగా ఐదు నెలలకు సంబంధించిన రైతు వేదికల నిర్వహణకు నెలకు రూ.9వేల చొప్పున రూ.36.90 లక్షల నిధులను ప్రభుత్వం మూడు దఫాలుగా విడుదల చేసింది. ఆ తర్వాత నుంచి నేటివరకు దాదాపు 42 నెలలకు (మూడున్నరేళ్లకు) సంబంధించి రైతు వేదికల నిర్వహణకు నిధులు విడుదల కాలేదు. దీంతో వ్యవసాయ విస్తరణ అధికారులు తమ సొంత ఖర్చులతో వాటిని నిర్వహిస్తున్నారు. మౌలిక వసతులూ కరువే..ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో రైతు వేదికల్లో మౌలిక సదుపాయాలు కరువయ్యాయి. రైతు వేదికల్లో నీటి సౌకర్యం కల్పించకపోవడంతో టాయిలెట్స్, మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. దీనికితోడు మంచినీటి సౌకర్యం కూడా లేకపోవడంతో శిక్షణ సమయంలో వచ్చే మహిళా రైతులతోపాటు వేదికల్లో విధులు నిర్వహించే మహిళా ఏఈఓలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా ఏఈఓలకు ఇంటర్నెట్ కోసం ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్లకు రీచార్జి చేయడంలేదని తమ సొంత ఫోన్ల ద్వార నెట్ సర్వీస్లను వినియోగించుకోవాల్సి వస్తుందంటున్నారు. ఔట్సోర్సింగ్ ఏఈఓలకు అందని జీతాలుఇదిలా ఉండగా ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న 13 మంది ఏఈఓలకు 2025 జూన్ నెల నుంచి జీతాలు అందకపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. తమ ఆర్థిక ఇబ్బందులను జిల్లా, రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా పరిష్కరించడం లేదని వారు వాపోతున్నారు. 2022 సెప్టెంబర్ నుంచి రైతువేదికల నిర్వహణకు చేసిన ఖర్చులను వెంటనే విడుదల చేసి తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి ఏఈఓలు విన్నవిస్తున్నారు.భారంగా రైతు వేదికల నిర్వహణ సమకూరని కనీస వసతులు సొంత ఖర్చులతో నెట్టుకొస్తున్న ఏఈఓలు బిల్లులు విడుదల చేయాలని వేడుకోలు జిల్లా వ్యాప్తంగా 79 రైతు వేదికలుఒక్కో రైతు వేదికకు నిర్వహణ ఖర్చు (రూ.లో)విద్యుత్ బిల్లు 1000 తాగునీటితో సహ నీటిబిల్లు 500 హౌస్కీపింగ్, వాచ్ అండ్ వార్డ్ చార్జీలు 3,000 జిరాక్స్, స్టేషనరీ ఖర్ఛులు 1000 శిక్షణ కార్యక్రమాలకు 2,500 ఇతర అవసరాలు 1000 మొత్తం 9,000 -
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలి
భానుపురి (సూర్యాపేట) : మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రతి మున్సిపాలిటీ కేంద్రంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో ఎస్పీ నరసింహ, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రతి మున్సిపల్ కేంద్రంలో జోనల్ ఆఫీసర్, ఆర్ఓల వారీగా డీఆర్సీ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రాల్లో పోలింగ్ సిబ్బందికి మౌలిక సదుపాయాలు కల్పించాలని మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ ఆదేశించారు. డబ్బు, మద్యం పంపిణీ జరిగితే చర్యలు తీసుకోవాలన్నారు. ప్రచారంతో పాటు మున్సిపల్ ఏరియాలో సాయంత్రం 5 గంటల నుండి 11 తారీకు పోలింగ్ ముగిసే వరకు మద్యం షాపులు బంద్ చేయించాలని ఎకై ్సజ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్స్ లను డి జి టి వాహనంలో ముందు, వెనుక ఎస్కార్ట్ వాహనాలతో మాత్రమే స్ట్రాంగ్ రూములకు తరలించాలని, మిగిలిన బ్యాలెట్ పేపర్లను జాగ్రత్తగా కవర్లో పెట్టి సీల్ వేయాలని, పోస్టల్ బ్యాలెట్ పేపర్లను వార్డుల వారిగా విభజించి కౌంటింగ్ కేంద్రాలకు తరలించాలని జోనల్ ఆఫీసర్లు, ఆర్వోలు, ఎన్నికల సిబ్బంది ప్రతి ఒక్కరూ ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి పని చేయాలని, నిబంధనలు అతిక్రమిస్తే ఎన్నికల సంఘం నిబంధన ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్ల్లో అదనపు కలెక్టర్ సీతా రామారావు, డిప్యూటీ సీఈఓ శిరీష, డీపీఓ నారాయణరెడ్డి, ఎస్సీ సంక్షేమ అధికారి దయానంద రాణి, బీసీ సంక్షేమ అధికారి నరసింహ, సి సెక్షన్ సూపరింటెండెంట్ సంతోష్ కిరణ్ పాల్గొన్నారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
గోదావరి జలాలు 1850 క్యూసెక్కులకు పెంపు
అర్వపల్లి: ప్రస్తుత యాసంగి సీజన్కుగాను జిల్లాకు వారబంధీ విధానంలో వస్తున్న గోదావరి జలాలను సోమవారం 1800 క్యూసెక్కుల నుంచి 1850 క్యూసెక్కులకు పెంచినట్లు జలవనరుల శాఖ ఈఈ సత్యనారాయణగౌడ్, బయ్యన్నవాగు ఏఈ చంద్రశేఖర్ తెలిపారు. పంటలకు నీళ్లు చేరేలా రోజురోజుకు నీటిని పెంచుతున్నట్లు పేర్కొన్నారు. రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరారు. తల్లిదండ్రుల పోషణ బాధ్యత పిల్లలదేసూర్యాపేటటౌన్ : వృద్ధ్యాప్యంలో ఉన్న తల్లిదండ్రుల పోషణ బాధ్యత వారి పిల్లలదేనని ఎస్పీ నరసింహ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి పలు సూచనలు చేశారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను విస్మరిస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి సమస్యలు ఉన్న ప్రజలు పైరవీలు లేకుండా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. చట్టబద్ధమైన విధానంలోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని, శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలకు మరింత చేరువగా ఉండడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. వైభవంగా లక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణం మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మిచెంచులక్ష్మిసమేత లక్ష్మీ నరసింహస్వామి నిత్యకల్యాణాన్ని సోమవారం అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. శ్రీస్వామి అమ్మవార్లలను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవం జరిపించారు. అనంతరం విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ నిర్వహించారు. శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అదేవిదంగా క్షేత్రంలోని శివాలయంలో శ్రీపార్వతీ రామలింగేశ్వరస్వామికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ బి.జ్యోతి, అర్చకులు పాల్గొన్నారు. పీఆర్టీయూతోనే ఉపాధ్యాయులకు సౌకర్యాలుసూర్యాపేటటౌన్ : పీఆర్టీయూ స్థాపించిన తరువాతే ప్రభుత్వ ఉపాధ్యాయులకు మెరుగైన సౌకర్యాలు అందాయని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు తంగెళ్ల జితేందర్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో పీఆర్టీయూ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ముందుగా సంఘ వ్యవస్థాపకుడు సామల యాదగిరి చిత్రపటానికి నివాళులర్పించి, పీఆర్టీయూ జెండా ఆవిష్కరించారు. అనంతరం సంఘం అభివృద్ధికి విశేష కృషి చేసిన రిటైర్డ్ ఉపాధ్యాయులు, మాజీ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కాసర్ల వీరారెడ్డి, యగ్గడి వెంకటేశ్వర్లు, పారుపల్లి చంద్రశేఖర్, యర్ర హరికిషనన్ను సన్మానించారు. కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు కొండేటి రవీందర్ రెడ్డి, చింతరెడ్డి రామలింగారెడ్డి, కందుకూరి శివశంకర్, చిప్పలపల్లి ధర్మయ్య, దండుగుల యల్లయ్య, కట్కూరి మధుసూదన్ రెడ్డి, మన్నెం వెంకట్ రెడ్డి, తావీర్య, శంకర్ పాల్గొన్నారు. -
అర్వపల్లి ఆలయ అభివృద్ధికి రూ.లక్ష విరాళం
అర్వపల్లి : రేఖ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ బోయలపల్లి రేఖ తెలిపారు. అర్వపల్లి ఆలయ అభివృద్ధికి సోమవారం దేవాలయ చైర్మన్ అనిరెడ్డి రాజేందర్రెడ్డికి రూ.లక్ష విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఇప్పటికే ఆలయంలో భక్తుల సౌకర్యార్థం సుమారు రూ.2లక్షల వ్యయంతో బోరు వేసి ట్యాంక్ నిర్మించి నీటి సమస్య తీర్చినట్లు చెప్పారు. అలాగే భక్తులకు శుద్ధ జలాలు అందించడం కోసం ఆర్వో ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసి క్రీడా సామగ్రిని ఫౌండేషన్ ఆధ్వర్యంలో సమకూర్చినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది దరూరి యోగానందచారి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మోరపాక సత్యం, యూత్కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శిగ నసీర్గౌడ్, ఆలయ ధర్మకర్తలు జె.సోమయ్య, బి.శ్రీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మిగిలింది.. ఒక్కరోజే
నేటితో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెరభానుపురి, సూర్యాపేట టౌన్ : మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం 5 గంటలకు తెర పడనుంది. ఒక్కరోజు సమయం మిగిలి ఉండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 141 వార్డులకు 612 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరంతా నామినేషన్ వేసిన దగ్గర నుంచి జోరుగా ప్రచారం చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా క్షణం తీరిక లేకుండా రోజంతా ప్రచారంలో నిమగ్నమవుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లను ప్రసన్నం చేసుకునే వ్యూహంతో ముందుకు వెళుతున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను సైతం తమకే ఓటు వేయాలని సెల్ఫోన్, సోషల్ మీడియా ద్వారా, నేరుగా కలిసి అభ్యర్థిస్తున్నారు. ప్రచార రంగంలోకి ముఖ్యులు● కోదాడ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి మూడు రోజులుగా వార్డుల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రచార నిర్వహిస్తున్నారు. ● తిరుమలగిరి మున్సిపాలిటీలో ప్రరచారం హోరాహోరీగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే మందుల సామేల్, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, రైతు కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్న యాదవ్లు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ రంగంలోకి దిగారు. బీజేపీ.. ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కడెం రామచంద్రయ్య, మాజీ ఎమ్మెల్సీ జనార్దన్రెడ్డిలతో ప్రచారం చేయిస్తోంది. ● సూర్యాపేట మున్సిపాలిటీలో పోరు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా మొరిశెట్టి నివేదితను ప్రకటించగా.. రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి, ఏఐసీసీ మెంబర్ రాంరెడ్డి సర్వోత్తమ్రెడ్డిలు ఎలాంటి వివాదాలకు తావులేకుండా కలిసి వార్డుల్లో అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు. ఇక మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే జగదీష్రెడ్డి సూర్యాపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు అన్నీ తానై వ్యూహాలు రచిస్తున్నారు. ఇక్కడే మకాం వేసి వార్డువార్డు ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. బీజేపీ మొదటి నుంచి ఇక్కడ దూకుడుగా వ్యవహరిస్తోంది. మొదటగా అభ్యర్థులను ప్రకటించిన ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు సంకినేని వెంకటేశ్వర్రావు చైర్మన్ అభ్యర్థిని సైతం ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ● నేరేడుచర్లలో 15 వార్డుల్లోనూ అధికార కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్లను నియమించి ఇంటింటికీ వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఆ పార్టీ తరఫున రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య బాధ్యతలు తీసుకున్నారు. ● హుజూర్నగర్ నియోజకవర్గంలో ఇప్పటి వరకూ స్థానిక నాయకత్వమే ప్రచారం చేస్తోంది. బీఆర్ఎస్ తరఫున ఆదివారం మాజీ మంత్రి జగదీష్రెడ్డి ప్రచారం చేయగా మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సైతం ప్రచార రంగంలోకి దిగారు.నేడు మంత్రి ఉత్తమ్ పర్యటనజిల్లాకు చెందిన రాష్ట్ర నీటిపారుదల, సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం సూర్యాపేటలో ఆ పార్టీ అభ్యర్థుల తరఫున రోడ్షో నిర్వహించారు. ఇక సోమవారం జిల్లాలోని తిరుమలగిరి, కోదాడ, నేరేడుచర్ల, హుజూర్నగర్ మున్సిపాలిటీల్లో ప్రచారం చేయనున్నారు.ఫ ఐదు మున్సిపాలిటీల్లో రంగంలోకి అగ్రనాయకులు ఫ బల ప్రదర్శనతో హోరెత్తిస్తున్న రాజకీయ పార్టీలు ఫ గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న అభ్యర్థులు4 నుంచి జోరుగా..జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో అభ్యర్థులు నామినేషన్ వేసిన అనంతరం ప్రచారం మొదలు పెట్టారు. ఈ నెల 4 నుంచి ఆయా ప్రధాన పార్టీల అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహించారు. మైకులు, కరపత్రాలు, సామాజిక మాధ్యమాలు, వాల్ పోస్టర్లతో తమ గెలుపు కోసం వార్డుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ నెల 11న బుధవారం ఎన్నికలు జరగనుండగా 9వ తేదీ సోమవారం సాయంత్రం 5గంటల వరకు ప్రచారం ముగియనుంది. -
కాంగ్రెస్ను నమ్మితే అభివృద్ధి శూన్యం
సూర్యాపేట టౌన్ : కాంగ్రెస్ పార్టీని నమ్మితే అభివృద్ధి శూన్యమని, అడ్డగోలుగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆదివారం సూర్యాపేట పట్టణంలోని పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ అమలు చేసిన పథకాల్లోనే కోతలు పెడుతున్నరు తప్ప కొత్తగా ఏమన్నా ఇచ్చిందా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పింఛన్ల పెంపు, మహిళలకు రూ.2,500, ఆడపిల్ల లకు స్కూటీల హామీలు ఏమయ్యాయన్నారు. జాబ్ క్యాలెండర్తో మొదటి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారని, రూ.పదివేలు ఉన్న రైతు బంధును రూ.పదిహేను వేలకు పెంచుతామని ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. రెండేళ్లుగా తట్టెడు మట్టిపోయని కాంగ్రెసోళ్లు ఏం సాధించారని మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లడుగుతున్నారో నిలదీయాలన్నారు. కాంగ్రెస్కు అధికారం ఇస్తే అవినీతి పెరిగింది తప్ప.. రాష్ట్రానికి ఒరిగిందేమి లేదని ఆరోపించారు. కాంగ్రెస్కు మళ్లీ ఓటేస్తే దొంగ చేతికి తాళం ఇచ్చినట్టేనని ఎద్దేవా చేశారు. అన్ని వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి రాంచందర్నాయక్, ఆయా వార్డుల అభ్యర్థులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్రెడ్డి -
వైభవంగా గరుడ వాహనసేవ
మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో ఆదివారం రాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో కనుల పండువగా ఊరేగించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ బి.జ్యోతి, అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఫణిభూషణ మంగాచార్యులు, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. కార్పొరేట్కు అనుకూలంగా మోదీ ప్రభుత్వంఆత్మకూర్(ఎస్) : మానవ హక్కులను మోదీ ప్రభుత్వం కాలరాస్తూ కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని అఖిల భా రత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వి.కోటేశ్వరరావు అన్నారు. ఆదివారం ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలో ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కునుకుంట్ల సైదులు అధ్యక్షతన నిర్వహించిన ఆ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 12 జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం.డేవిడ్కుమార్, ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శంకర్, నాయకులు అలుగుబెల్లి వెంకట్రెడ్డి, డేగల వెంకటకృష్ణ, అరుణోదయ జిల్లా అధ్యక్షుడు ఉదయగిరి, నరసింహారావు, నల్లగొండ నాగయ్య పాల్గొన్నారు. సూర్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని సూర్యనారాయణస్వామి క్షేత్రంలో భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. యజ్ఞశాలలో మహాసౌరహోమం నిర్వహించారు. అలాగే క్షేత్ర ఆవరణలోని కార్యసిద్ధి వీరహనుమాన్, శ్రీరామకోటి స్థూపాలను భక్తులు దర్శించుకున్నారు. భక్తులకు అన్నప్రసాద వితరణ జరిపారు. కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితాజనార్దన్, గణపురం నరేష్, ఇంద్రారెడ్డి, యాదగిరి, బాలమురళికృష్ణ, రాజేష్, అర్చకులు భీంపాండే, అంకిత్పాండే, శ్రీరాంపాండే పాల్గొన్నారు. -
మత రాజకీయాలు చేస్తున్న రేవంత్రెడ్డి
కోదాడ రూరల్ : సీఎం రేంవత్రెడ్డి ఎన్నికల సమయంలో మత రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రాంచందర్రావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆదివారం కోదాడ పట్టణంలో పార్టీ అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ బైక్ర్యాలీ చేపట్టారు. అనంతరం రంగా థియేటర్ సెంటర్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రధాని మోదీ సహకారంతో తన సొంతగడ్డ అయిన కోదాడ అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. బీజేపీకి పెరుగుతున్న ఆదరణను చూసి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అంతర్గత ఒప్పందాలతోనే పనిచేస్తున్నాయని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీతలరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, జుట్టుకొండ సత్యనారాయణ, నరసింహారెడ్డి, మురళీధర్రెడ్డి, బండారు కవితారెడ్డి,వంగవీటి శ్రీనివాస్, అంజియాదవ్, బొలిశెట్టి కృష్ణయ్య, వెంకట్రామయ్య, నూనె సులోచన, యాదా రమేష్, యశ్వంత్, శ్రీనివాస్, పార్టీ అభ్యర్థులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు -
మున్సిపోల్స్కు పటిష్ట బందోబస్తు
ఎన్నికల సంఘం సూచించిన నియమ నిబంధన ప్రకారం ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికల సామగ్రికి పటిష్ట భద్రత కల్పిస్తాం. ఆయుధ పోలీసుల పహారాలో స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేసి రక్షణ కల్పిస్తున్నాం. అలాగే ఎన్నికల సామగ్రి తరలింపులో ఎన్నికల నిర్వహణ అధికారులతోపాటు రూట్ మొబైల్ సిబ్బంది భద్రతగా ఉంటారు.ఫ 1,250 మంది పోలీస్ సిబ్బందితో ప్రత్యేక నిఘా ఫ ఓటర్లు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకోవాలి ఫ నేటి సాయంత్రం 5గంటలకు ప్రచారం ముగించాలి సాక్షి ఇంటర్వ్యూలో ఎస్పీ నరసింహసూర్యాపేట టౌన్ : జిల్లాలోని సూర్యాపేట, తిరుమలగిరి, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల మున్సి పాలిటీలకు ఈ నెల 11న జరగనున్న 2వ సాధారణ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం. ఇతర శాఖల సమన్వయంతో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట పోలీస్ నిఘా ఉంచాం. ప్రలోభాలను నిర్మూలించి ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా కృషిచేస్తున్నామని జిల్లా ఎస్పీ నరసింహ పేర్కొన్నారు. ఆదివారం ఆయన సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వివరాలు వెల్లడించారు. నిఘా కోసం ప్రత్యేక బృందాలు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక నిఘా బృందాలు పనిచేస్తున్నాయి. అదనపు ఎస్పీలు, డీస్పీల ఆధ్వర్యంలో ప్రత్యేక స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది అప్రమత్తంగా పనిచేస్తున్నారు. ఐదు మున్సిపాలిటీల్లో 1,250 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశాం. ఐదు మున్సిపాలిటీల్లో 141 వార్డులకు గానూ 372 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతుండగా 115 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాం. ఎన్నికల నిర్వహణలో భాగంగా మున్సిపాలిటీ కేంద్రాలలో సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాం. ప్రతి మున్సిపాలిటీ పరిధికి అదనపు ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారి స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అధికారిగా ఉంటారు. అలాగే ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్స్ విధులు నిర్వర్తిస్తుంది. ప్రతి మున్సిపాలిటీకి 3 ఫ్లయింగ్ స్క్వాడ్ చొప్పున 15 ఫ్లైయింగ్ స్క్వాడ్ విధులను నిర్వర్తిస్తాం. ప్రతి మున్సిపాలిటీకి 2 చొప్పున స్టాటిస్టికల్ సర్వే లైన్స్ టీమ్స్ ఉంటాయి. ప్రతి మున్సిపాలిటీకి ఒక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీం ఉంటుంది. సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలను జిల్లా ఎలక్షన్ సెల్ ద్వారా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తాం. బందోబస్తు నిర్వహణ మొదలుకుని ఎన్నికల సామగ్రికి భద్రత కల్పించేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నాం. అలాగే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఈ సీసీ కెమెరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో గల సెంట్రల్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిత్యం నిఘా ఉంటుంది. 1,488 మంది బైండోవర్ అల్లర్లు సృష్టించే అవకాశం ఉన్న వ్యక్తులను గత ఎన్నికల్లో నేరాలకు పాల్పడ్డ వారిని గుర్తించి 311 కేసుల్లో 450 మందిని ముందస్తుగా బైండోవర్ చేశాం. గత స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో 1,488 మందిని బైండోవర్ చేశాం. ఎవరు కూడా బైండోవర్ నిబంధన ఉల్లంగించొద్దు. నిబంధనలు ఉల్లంఘిస్తే అలాంటి వారిని హామీ పూచీకత్తు నగదును రూ.5 లక్షల వరకు జరిమానాగా విధిస్తాం. లైసెన్స్ కలిగిన 71 ఆయుధాలను తాత్కాలికంగా స్వాధీనం చేసుకున్నాం. 47 కేసుల్లో రూ.2.80 లక్షల విలువైన 496 లీటర్ల మద్యం సీజ్ చేశాం.కేటాయించిన సిబ్బంది అదనపు ఎస్పీలు 02 డీఎస్పీలు 04 ఇన్స్పెక్టర్లు 12 సబ్ ఇన్స్పెక్టర్లు 50 ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ 265 కానిస్టేబుల్స్ 760 హోంగార్డులు 152 మహిళా సిబ్బంది 90 స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్స్ 05 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్స్ 05నిబంధనలు పాటించాలిఈ నెల 9న సోమవారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచార సమయం ముగిస్తుంది. ఎన్నికల ప్రచార సమయం ముగిశాక అభ్యర్థులు ఎవరు కూడా ప్రచారం నిర్వహించకూడదు. నిబంధనలు పాటించాలి. ఉల్లంఘించి ప్రచారం నిర్వహిస్తే చర్యలు తీసుకుంటాం. కేసులు నమోదైతే అభ్యర్థిత్వం కోల్పోతారు. సోమవారం సాయంత్రం 5 గంటల తర్వాత నుంచి ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు సైలెన్స్డే గా పరిగణించాలి. ఈ సమయంలో ఓటర్లు కానీవారు, స్థానికేతరులు వార్డుల్లో సంచరించకూడదు. ఉచితాలు, బహుమతులు, డబ్బు మద్యం లాంటి వాటితో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే చర్యలు తప్పవు. -
పేట అభివృద్ధికి అధిక ప్రాధాన్యం
భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేట మున్సిపాలిటీ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చి నిధులు తీసుకురానున్నట్లు రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సూర్యాపేట జిల్లాకేంద్రంలో ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సంతోష్బాబు చౌరస్తా, పీఎస్ఆర్ సెంటర్ మీదుగా శంకర్ విలాస్ నుంచి గాంధీ విగ్రహం వద్దకు చేరుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ క్వీన్ స్వీప్ చేయబోతుందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలకు ఓట్లు వేస్తే మురికి కాలువలో వేసినట్లేనని చెప్పారు. ఈ రెండేళ్ల కాలంలోనే 45 లక్షల మందికి రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ తోనే సామాజిక న్యాయం సాధ్యమన్నారు. టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి పేట అభివృద్ధికి సహకరించాలన్నారు. ఏఐసీసీ మెంబర్ రాంరెడ్డి సర్వోత్తమ్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి మొరిశెట్టి నివేదికను చైర్మన్గా గెలిపించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, రవిబాబు, పెద్దిరెడ్డి రాజా, చకిలం రాజేశ్వర్రావు, శ్రీనివాస్యాదవ్, కౌన్సిలర్ అభ్యర్థులు మొరిశెట్టి నివేదిత, గునగంటి హేమ తదితరులు పాల్గొన్నారు. సామాజిక న్యాయం కాంగ్రెస్తోనే సాధ్యం రాష్ట్ర మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
‘దండు మైసమ్మ’కు భద్రతేదీ?
ఆత్మకూర్(ఎస్) : సూర్యాపేట జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న ఆత్మకూరు (ఎస్) మండలం నెమ్మికల్లు గ్రామంలోని శ్రీదండు మైసమ్మ తల్లి ఆలయానికి భద్రత లోపించింది. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తుండడం వల్ల ఇటీవల ఆలయ హుండీ చోరీకి గురైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ఆలయాన్ని పునర్నిర్మించి అభివృద్ధి చేసింది. అయినప్పటికీ ఆలయ నిర్వహణ, భద్రతా విషయంలో నిర్లక్ష్యం అలుముకుంది. దాతలు పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తుండడంతోపాటు భక్తులు హుండీలలో కానుకలతోపాటు వెండి, బంగారు వస్తువులను మొక్కుబడులుగా చెల్లించుకుంటున్నారు. ప్రతినెల హుండీ కానుకల ద్వారా సుమారు రూ.1.50 లక్షలకుపైగా ఆదాయం సమకూరుతుంది. దీంతో ఈ ఆలయం ఎండోమెంట్ విభాగం పరిధిలోకి వచ్చినప్పటి నుంచి 25 ఏళ్లుగా భక్తులు వెండి, బంగారం వస్తువులు సమర్పిస్తున్నప్పటికీ వాటి వివరాలకు సంబంధించిన రికార్డులు లేవని అధికారులే చెబుతుండడం గమనార్హం. భద్రతా లోపంతోనే చోరీ.. దండు మైసమ్మ ఆలయ దర్శన ప్రారంభం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. సిబ్బంది ఎనిమిది గంటల పనిదినాల చొప్పున డ్యూటీ చేయాల్సి ఉండగా ఆలయ మేనేజర్ అందుబాటులో లేకపోవడంతో సిబ్బంది ఎవరు ఎప్పుడు వస్తున్నారు.. వెళ్తున్నారో అర్థంకాని పరిస్థితి. ఆలయానికి అవసరమైన సిబ్బంది, సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ సీసీ ఫుటేజీ స్టోరేజ్ రికార్డు లేకపోవడంపై సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా తెలుస్తోంది. ఇదే అదునుగా భావించి ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోకి చొరబడి ప్రధాన గర్భగుడి వద్ద ఉన్న హుండీని ఎత్తుకెళ్లి చోరీ చేశారు. ఘటనలో దాదాపు రూ.20 వేల వరకు నగదు అపహరణకు గురైనట్టు పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. అయితే చోరీ జరిగిన రోజు ఆలయంలో ఎవరూ విధుల్లో లేకపోవడంతో దుండగులు ఈ దశ్చర్యకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. వాహన పూజలు మొక్కుబడుల వద్ద మాత్రం సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తుంటారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆలయ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వీడి సక్రమంగా విధులు నిర్వహిస్తూ ఆలయానికి భద్రతాలోపం లేకుండా చూడాలని స్థానికు ప్రజలు, భక్తులు కోరుతున్నారు. ఫ ఆలయ నిర్వహణపై లోపించిన పర్యవేక్షణ ఫ సరిపడా సిబ్బంది ఉన్నా విధుల్లో నిర్లక్ష్యం ఫ నిఘా వైఫల్యంతో ఇటీవల హుండీ చోరీ ఫ భద్రత పెంచాలంటున్న స్థానికులు సూర్యాపేట–దంతాలపల్లి ప్రధాన రహదారిపై నెమ్మికల్లు వద్ద గల దండు మైసమ్మ ఆలయం సుమారు ఐదు దశాబ్దాలుగా భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. 2001లో భక్తుల రద్దీ పెరగడంతో ఈ ఆలయాన్ని ప్రభుత్వం ఎండోమెంట్ పరిధిలోనికి తీసుకుంది. అప్పటినుంచి ఆలయ అభివృద్ధితోపాటు సిబ్బంది నియామకాలు చేపడుతున్నారు. ఈ ఆలయాన్ని ఆది, గురువారాల్లో సూర్యాపేట జిల్లాతోపాటు ఖమ్మం, వరంగల్, మహబూబబాద్, నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన వేల సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు. -
బీఆర్ఎస్ అంటేనే అభివృద్ధి
సూర్యాపేట టౌన్ : కాంగ్రెస్ అంటే కబ్జాలు, కూల్చివేతలని.. బీఆర్ఎస్ అంటే అభివృద్ధి, ప్రశాంత వాతావరణమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట పట్టణంలోని 16వ వార్డుతో పాటు పలు వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్కు ఓటేస్తే అవినీతి, దౌర్జన్యాలను పెంచి పోషించినట్లేనన్నారు. పదేళ్ల పాలనలో అభివృద్ధి, ప్రశాంతతకు బీఆర్ఎస్ పార్టీ కేరాఫ్గా నిలిచిందని తెలిపారు. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప కొత్తగా ఏం చేశారని కాంగ్రెస్ నాయకులను నిలదీయాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో మంత్రులే సిగ్గులేకుండా దోచుకుంటున్నారని, ప్రజలను మోసం చేసి దోచుకోవడం వాళ్లకు కొత్తేమీ కాదని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా పలు వార్డుల్లో జగదీష్రెడ్డి సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున బీఆర్ఎస్లో చేరారు. ప్రచారంలో వార్డుల అభ్యర్థులు పాల్గొన్నారు. ఫ మాజీ మంత్రి జగదీష్రెడ్డి -
దావత్లకు టైమైంది!
సూర్యాపేట : మున్సిపల్ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. గెలుపే లక్ష్యంగా పార్టీలు, బరిలో నిలిచిన అభ్యర్థులు వ్యూహాలు పన్నుతున్నాయి. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా మందు, విందులతో రహస్య సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ఉదయం నుంచే ఓటర్ల వేట ప్రారంభిస్తున్నారు. అన్నా.. కలుస్తాం.. సమయం ఇస్తారా.. ? అని చెప్పి సమయం, ప్రాంతాన్ని నిర్దేశించి రాత్రివేళ సిట్టింగ్లతో ఓటర్లను ప్రసన్నం చేసుకొని తమవైపు తిప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మందు పార్టీలకు ఖరీదైన బ్రాండ్లను ఎంపిక చేస్తున్నారు. ఇవే కాకుండా ఇతర తాయిలాల పంపిణీకి సైతం ఏర్పాట్లు చేసుకుంటున్నా.. పోలింగ్కు ఒకరోజు ముందు అందించే ఏర్పాట్లలో ఉన్నట్లు సమాచారం. మున్సిపాలిటీల్లో ఉదయం ప్రచారం.. రాత్రి మందు విందులు అన్నట్లుగా ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. టౌన్షిప్ల వారీగా.. సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్ మున్సిపాలిటీల్లో ఓటరు జాబితా ఆధారంగా అభ్యర్థులు ఉదయం నుంచే ఓటర్ల సమయాన్ని కోరుతున్నారు. తమకు పరిచయం ఉన్న వ్యక్తుల ద్వారా వార్డుల్లో ఉన్న ఉద్యోగులను రహస్య ప్రాంతాలకు తరలించి మందు, విందు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో అపార్ట్మెంట్లు, టౌన్షిప్ల వారీగా అక్కడ ఉన్న పార్టీ వ్యక్తులు, ముఖ్యులను కలుపుకుని ముందుకు పోతున్నారు. కొందరు అభ్యర్థులు సామాజిక వర్గాల వారీగా ఓటర్లను ఒకచోటకు చేర్చి దావత్లు ఇస్తున్నారు. ఇక రాత్రివేళ బయటకు రాలేని ఉద్యోగులు, ఇతరుల కోసం నేరుగా బాటిళ్లను తీసుకెళ్లి ఇస్తున్నట్లు సమాచారం. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 141 వార్డులకు గాను 612 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దాదాపు 2,26,646 మంది ఓటర్లు ఉన్నారు. ప్రాంతాల వారీగా ఓటర్లను గుర్తించి ఏ వర్గానికి ఏం తాయిలాలు ఇవ్వాలని అభ్యర్థులు ఇప్పటికే గుర్తించారు. ప్రధానంగా మాస్ వార్డుల్లో మహిళా ఓటర్లకు చీరలు పంపిణీ చేసేందుకు వివరాలు సేకరించుకుంటున్నారు. ప్రచారానికి సైతం ఉదయం, సాయంత్రం వేళల్లో అన్ని మున్సిపాలిటీల్లోనూ ప్రజలను పెద్ద ఎత్తున సమీకరిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను ఆయా వార్డుల క్యాంపుల్లో కల్పిస్తున్నారు. టిఫిన్ నుంచి భోజనం వసతి ఇక్కడే చూసుకుంటున్నారు. ఫ మున్సిపాలిటీల్లో విందులు షురూ ఫ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థుల ప్రయత్నాలు ఫ కమ్యూనిటీలు, టౌన్షిప్ల వారీగా సమావేశాలు ఫ తాయిలాలు పంపిణీకి సిద్ధం ఫ జోరందుకున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం -
బాల్య వివాహాలను నిర్మూలించాలి
చివ్వెంల (సూర్యాపేట) : గ్రామాల్లో బాల్య వివాహాలను నిర్మూలించాలని, ఎవరైనా బాల్య వివాహాలు చేస్తున్నట్టు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని జిల్టా కోర్టు మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎన్.అపూర్వ రవళి అన్నారు. శుక్రవారం సూర్యాపేట పట్టణంలోని చివ్వెంల గురుకుల పాఠశాలలో బాల్య వివాహాల నివారణపై విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. బాల్య వివాహాలు చేయడం వల్ల చిన్న వయస్సులోనే అమ్మాయిలు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. బాలికల వయస్సు 18, బాలుర వయస్సు 21 నిండాకే వివాహం జరిపించరాదన్నారు. కార్యక్రమంలో సూర్యాపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ఉపాధ్యక్షుడు గుంటూరు మధు, నామినేటెడ్ సభ్యురాలు నల్లపాటి మమత, డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, కె.ప్రియదర్శిని, ప్రిన్సిపాల్ విద్యాసాగర్, వైస్ ప్రిన్సిపాల్ ఎస్.వెంకటేశ్వర్లు, కె.మోహన్ తదితరులు పాల్గొన్నారు.ఫ జిల్లా కోర్టు మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి అపూర్వ రవళి -
మంత్రి ఉత్తమ్ మాటల్లో వాస్తవం లేదు
కోదాడ : అభివృద్ధిపై మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాద్ అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్లయ్యయాదవ్ మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా పనిచేసిన ఐదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధికి, 30 సంవత్సరాల్లో ఉత్తమ్ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు రావాలని ఆయన సవాల్ చేశారు. ప్రతిపక్ష కౌన్సిలర్లను బెదిరించి, కిడ్నాప్ చేసి తమ పార్టీ గెలిచినట్లు ఉత్తమ్ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కోదాడకు 100 పడకల వైద్యశాలను మంజూరు చేయించింది తానేనని, ఉత్తమ్ తాను చేసినట్లు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. లిప్టుల పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేయడమే ఉత్తమ్కు తెలిసిన విద్యఅని విమర్శించారు. కోదాడ మున్సిపాలిటీకి చెందిన శశ్మానస్థలాన్ని కూడా కబ్జా చేసిన చరిత్ర ఉత్తమ్ అనుచరులదని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ కోదాడ పట్టణ అధ్యక్షుడు ఎస్కె.నయీం, సురేష్నాయుడు, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ చైర్పర్సన్ అభ్యర్థిగా మొరిశెట్టి నివేదితలక్షాది
స్థానిక రైతులకే యూరియా అందించాలి మునగాల : జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో ఆయా సొసైటీల పరిధిలోని రైతులకే యూరియా అందించాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుర్రి శ్రీరాములు డిమాండ్ చేశారు. శుక్రవారం మునగాల మండల కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన రైతు సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. సొసైటీ పరిధిలో రైతులకు కాకుండా ఆన్లైన్లో బుక్ చేసుకున్న ఇతర గ్రామాల రైతులకు యూరియా ఇస్తుండడంతో స్థానిక రైతులకు దొరక్క ఇబ్బందులు పడుతున్నారన్నారు. యూరియా యాప్పై అవగాహన లేక రైతులకు యూరియా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాత పద్ధతిలోనే యూరియా పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. చందా చంద్రయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బచ్చలకూర స్వరాజ్యం, రైతు సంఘం మండల అధ్యక్షుడు చంద్రయ్య, మండల కమిటీ సభ్యులు దేశిరెడ్డి స్టాలిన్రెడ్డి, బోళ్ల కృష్ణారెడ్డి, మండవ వెంకటాద్రి, మల్లారెడ్డి పాల్గొన్నారు. మోతాదుకు మించి యూరియా వాడొద్దు పాలకవీడు : పంట పొలాల్లో యూరియాను మోతాదుకు మించి వాడొద్దని, అలా వాడితే పంటలకు అధికంగా చీడపీడలు ఆశించే ప్రమాదం ఉందని జిల్లా వ్యవసాయాధికారి (డీఏఓ) శ్రీధర్రెడ్డి అన్నారు. శుక్రవారం పాలకవీడు మండలంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లు, విక్రయాల రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ యూరియా విక్రయాలు పారదర్శకంగా ఉండాలని, ఫర్టిలైజర్ యాప్ ద్వారా బుక్ చేసుకున్న రైతులకు మాత్రమే ఎరువులు అందించాలని డీలర్లను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో యూరియా నిల్వలు సరిపడా ఉన్నాయని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మండల కేంద్రంలోని పీఏసీఎస్కు నిరంతరం యూరియా సరఫరా కొనసాగుతందన్నారు. ప్రస్తుతం ఇక్కడ 400 యూరియా బస్తాల యూరియా అందుబాటులో ఉందన్నారు. అవసరమైన రైతులు యాప్లో బుక్ చేసుకోవాలన్నారు. డీలర్లు ఎవరైనా అధిక ధరలకు యూరియా అమ్మినా, రికార్డుల్లో తేడాలు ఉన్నా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట ఏఈఓలు, ఫర్టిలైజర్ డీలర్లు, రైతులు ఉన్నారు. వైభవంగా నిత్యకల్యాణం మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో శుక్రవారం రాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఎదుర్కోలు నిర్వహించి కల్యాణం చేపట్టారు. ఆ తర్వాత శ్రీస్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. నీరాజన మంత్ర పుష్పాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ బి.జ్యోతి, అర్చకులు అద్దేపల్లి లక్ష్మణా చార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఫణిభూషణ మంగాచార్యులు, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. -
మిర్చికి తెగులు.. రైతుకు దిగులు
ఆత్మకూర్ (ఎస్) : జిల్లా వ్యాప్తంగా మిర్చి సాగు చేసిన రైతులకు తెగుళ్ల బెడద తప్పడం లేదు. గతేడాది మాదిరిగానే నల్లి, తామర పురుగు, ఆకు ముడత తెగుళ్లు సోకడంతో మిర్చి తోటలు ఎదుగుదల లోపించి కనిపిస్తున్నాయి. పూత, కాత లేకపోవడంతో దిగుబడులు పూర్తిగా పడిపోయి ఆర్థికంగా నష్టపోతున్నారు. గతంలో దిగుబడులు ఉన్నా పండిన పంటకు ధర లేకపోవడంతో తీవ్రంగా నష్టపోయామని, ఈ ఏడాది దిగుబడి పూర్తిగా తగ్గి ఆర్థికంగా కోలుకోలేని పరిస్థితిలో ఉన్నామని మిర్చి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 4 వేలకుపైగా ఎకరాల్లో సాగు జిల్లాలో ఈ సీజన్లో 6,554 ఎకరాల్లో రైతులు మిర్చిపంట సాగు చేస్తున్నారు. గతంలో 12వేల ఎకరాల వరకు ఎకరాలకుపైగా మిర్చి సాగు చేసినప్పటికీ ధర పడిపోవడంతోపాటు కూలీల రేట్లు పెరగడంతో చాలామంది రైతులు మిర్చి సాగును వదులుకున్నారు. మిర్చి బదులు మొక్కజొన్న, మినుములు, పెసర సాగు చేస్తున్నారు. కానీ కొందరు రైతులు మిర్చినే నమ్ముకుని సాగు చేస్తున్నప్పటికీ మిర్చి పంటకు నల్లి పురుగు, ఆకు ముడత, తామర పురుగు బెడద పట్టుకుంది. ఎన్ని మందులు పిచికారీ చేసినా తెగుళ్లు అదుపులోకి రావడం లేదని రైతులు దిగులు చెందుతున్నారు. ఫ గతేడాది మాదిరిగానే నల్లి, తామర పురుగుల బెడద ఫ ఎన్ని మందులు పిచికారీ చేసినా అదుపులోకిరాని తెగుళ్లు ఫ ఎదుగుదల లోపించి సరిగా కాతలేని చేలు ఫ దిగుబడిపై రైతుల్లో ఆందోళన ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఆత్మకూరు (ఎస్)మండలం రామోజీతండాకు చెందిన రైతు గుగులోతు రవి. ప్రస్తుత సీజన్లో ఈయన 1.15 ఎకరాల్లో దాదాపు రూ.80వేలు పెట్టుబడి పెట్టి మిర్చిపంట సాగు చేశాడు. ఇప్పటి వరకు ఒకేసారి పంట ఏరగా 4 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. ఇదే భూమిలో గతేడాది రూ.50వేలు పెట్టుబడి పెట్టి మిర్చిపంట సాగు చేయగా మొదటిసారి కాయలు కోయగా 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. అప్పట్లో క్వింటా మిర్చి రూ.13వేలు ఉండగా ఖర్చులు పోను లాభసాటిగానే ఉంది. కానీ ఈ సంవత్సరం క్వింటాకు రూ.19వేల ధర పలుకుతున్నప్పటికీ తెగుళ్ల బెడదతో దిగుబడి లేదు. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.మేళ్లచెరువు : మండలకేంద్రంలోని శ్రీ ఇష్టకామేశ్వరీ సమేత శ్రీ స్వయంభుశంభులింగేశ్వర స్వామి ఆలంలో శుక్రవారం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి అన్నాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి గణపతిపూజ, పుణ్యాహవచనం, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సహస్రనామార్చన, మహాలింగార్చన, పుష్పార్చన అనంతరం తీర్థప్రసాద వినియోగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ శంభిరెడ్డి, అర్చకులు విష్ణువర్ధన్శర్మ, ధనుంజయశర్మ పాల్గొన్నారు. మండలాల వారీగా జిల్లాలో మిర్చి సాగు ఇలా.. మండలం ఎకరాలు ఆత్మకూరు(ఎస్) 154 చివ్వెంల 21 పెన్పహాడ్ 12 సూర్యాపేట 2.39 చింతలపాలెం 3,918 మట్టంపల్లి 1,290 పాలకవీడు 2.35 అనంతగిరి 1.16 మోతె 798 మునగాల 70.20 నడిగూడెం 13 జాజిరెడ్డిగూడెం 03 మద్దిరాల 99 నూతనకల్ 111 నాగారం 44 తిరుమలగిరి 1.20 తుంగతుర్తి 14 కౌలుకు తీసుకొని రెండు ఎకరాల్లో మిర్చి సాగు చేశాను. ఈ సంవత్సరం నల్లి పురుగు ప్రభావంతో పైరంతా ముడత వచ్చి పూత రాలిపోతుంది. ఎన్ని మందులు కొట్టిన అదుపులోకి రావడం లేదు. కాపు అసలు లేదు. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. – బానోతు శ్రీను, రామోజీతండా -
నిర్వహణకు నీళ్లొదిలారు
పాలారం వద్ద మూడు ఎకరాలు వరి సాగు చేస్తున్నా. నెల రోజులుగా కాలువ నీళ్లు అందడంలేదు. సాగునీరు అందకపోవడంతో వ్యవసాయం చేయడం కష్టంగా మారింది. ఇప్పటికై నా అధికారులు చివరి భూములకు నీరు అందించేందుకు చర్యలు చేపట్టాలి. – మట్టపల్లి రామకోటయ్య, రైతు, పాలారం పాలారం మేజర్ చివరి భూములకు సాగు నీరు అందకపోవడంపై రైతులు సమస్యను మా దృష్టికి తీసువచ్చారు. కాలువ పూర్తిగా లైనింగ్ చేయాలంటే ఆయకట్టు 10 వేల ఎకరాలకు పైగా ఉంటేనే సాధ్యపడుతుంది. పాలారం మేజర్ కాలువ 4820 ఎకరాల ఆయకట్టు మాత్రమే ఉన్నందున చేయలేకపోతున్నాం. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసువెళ్లడం జరిగింది. – తుమ్మల శ్రీనివాస్గౌడ్, ఇరిగేషన్ ఏఈ కాలువపై ఉన్న యూటీలు పగిలిపోయి నీరు వృథాగా పోతుంది. కాలువకు పూర్తిగా లైనింగ్ చేస్తే చివరి భూములకు నీరు అందుతుంది. అధికారులకు పలుమార్లు వినతిపత్రం ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికై నా కాలువను మరోసారి పరిశీలించి రివిజన్ చేయాలని కోరుతున్నాం. – గుర్రం వెంకట్రెడ్డి, రైతు, త్రిపురవరం అనంతగిరి: పాలారం మేజర్–14బి కాలువలో నీరు ముందుకు కదలడం లేదు. కాలువ నిండా కంపచెట్లు, జమ్ము ఏపుగా పెరగడంతో చివరి భూములకు నీరు చేరడం లేదు. కాలువ ప్రారంభంలో నీటి సరఫరా బాగానే ఉన్నా చివరి వరకు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇరిగేషన్ అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు అందజేసి సమస్య విన్నవించినా పరిష్కారం చూపడం లేదని రైతులు వాపోతున్నారు. 4,820 ఎకరాల ఆయకట్టు పాలారం మేజర్–14బి కాలువ నడిగూడెం మండలం సిరిపురం నుంచి అనంతగిరి మండలం పాలారం గ్రామం వరకు సుమారు 14 కిలో మీటర్ల మేర విస్తరించి 4,820 ఎకరాల ఆయకట్టు కలిగి ఉంది. నడిగూడెం మండలం వల్లాపురం వరకు పొలాలకు నీరు సక్రమంగానే అందుతున్నప్పటికీ అనంతగిరి మండలంలోని చివరి ఆయకట్టు గ్రామం త్రిపురవరం చేరుకునే వరకు నీటి ప్రవాహం మందగించి పోతుంది. సుమారు 2 వేల ఎకరాల ఆయకట్టుకు సరిగా నీరందడం లేదని రైతులు పేర్కొంటున్నారు. యూటీలకు మరమ్మతులేవీ? పాలారం మేజర్–14బి.. కాంటూరి కాలువ (నీరు ప్రవాహం నెమ్మదిగా వెళ్లేందుకు చేసిన కాలువ నిర్మాణం). కాలువలో పూడిక, నాచు, జమ్ము, గుర్రపుడెక్కతో నిండింది. అంతేకాకుండా కాలువ 8 యూటీ(అండర్ టన్నెల్)లను కలిగి ఉంది. యూటీలు పగిలిపోవడంతో పంటలకు అందాల్సిన సాగునీరు వృథాగా పోతుంది. ఇవి మరమ్మతులకు నోచుకోక రైతులకు మరో సమస్యగా మారింది. త్రి పురవరం, చనుపల్లి, పాలారం గ్రామాల పరిధిలో సుమారు 2 వేల ఎకరాలకు నీరందక రైతులు నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. కాలువకు పూర్తిస్థాయిలో లైనింగ్ ఏర్పాటు చేసి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని కోరుతున్నారు. ‘పాలారం మేజర్–14బి’ చివరి భూములకు చేరని నీరు ఫ కాలువ నిండా కంపచెట్లు, జమ్మి ఫ ముందుకు సాగని నీటి ప్రవాహం ఫ పగిలిపోయిన అండర్ టన్నెల్స్..వృథాగా పోతున్న నీరు ఫ దాదాపు 2 వేల ఎకరాలకు ఇబ్బందులు ఫ మరమ్మతులు చేపట్టి, లైనింగ్ ఏర్పాటు చేయాలని రైతుల వేడుకోలు


