breaking news
Suryapet District News
-
వర్షపు నీటిని ఒడిసి పట్టాలి
సూర్యాపేట అర్బన్ : వర్షపు నీటిని సంరక్షించడం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించవచ్చని సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, కమిషనర్ హన్మంతరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన శ్రీవర్షాన్ని పట్టుకోండిశ్రీ ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని మున్సిపల్ చైర్పర్సన్తో పాటు కమిషనర్ ప్రారంభించి మాట్లాడారు. ప్రతి ఇంట్లో, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వర్షపు నీటిని వృథాగా వదిలేయకుండా భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకుంటే భూగర్భ జలాలు పెరిగి, భవిష్యత్తులో తాగునీటి కొరతను అధిగమించవచ్చని అన్నారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ ఇంజనీర్లు, వార్డు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, అధిక సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు. -
పాత పెన్షన్ అమలయ్యే దాకా పోరాటం
హుజూర్నగర్, సూర్యాపేట టౌన్ : ప్రస్తుతం ఉన్న సీపీఎస్ స్కీంను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్(టీఎస్ సీపీఎస్ ఈయూ) రాష్ట్ర అధ్యక్షుడు గంగారపు స్థిత ప్రజ్ఞ అన్నారు. సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన జన జాగరణ యాత్ర మంగళవారం హుజూర్నగర్కు ఆ తరువాత సూర్యాపేటకు చేరుకుంది. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 11న ప్రారంభమైన జనజాగరణ యాత్ర 33 జిల్లాలు, 119 నియోజకవర్గాల్లో కొనసాగుతోందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు హిమాచల్ ప్రదేశ్లో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించినట్లే తెలంగాణలో కూడా అమలు చేయాలని కోరారు. సుమారు 2.6 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు రాష్ట్రవ్యాప్తంగా శాసనసభ్యులకు వినతిపత్రాలు అందజేస్తున్నామన్నారు. హుజూర్నగర్లో ర్యాలీగా వెళ్లి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో టీఎస్ సీపీఎస్ ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శ్రీకాంత్, రాష్ట్ర కోశాధికారి మల్లికార్జున్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రకాంత్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఓరుగంటి నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బడుగుల సైదులు, అంజయ్య, మణి, నాయకులు పాల్గొన్నారు. సూర్యాపేటలో బైక్ ర్యాలీసీపీఎస్ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు లక్కపాక ప్రవీణ్కుమార్ ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. సంఘం జిల్లా కోశాధికారి గుయ్యాని ప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ యూసుఫ్, సంయుక్త కార్యదర్శి నారాయణదాసు సతీష్కుమార్, మామిడి సురేందర్, చిట్యాల సతీష్, సురభి శేఖర్, వీరారెడ్డి, షఫీ పాల్గొన్నారు. టీఎస్ సీపీఎస్ ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ -
‘సర్’ ప్రక్రియను వేగవంతం చేయాలి
తుంగతుర్తి : ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ(సర్)ను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ హరిసింగ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఎన్యుమరేషన్ పత్రాల ఆన్లైన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఎన్యుమరేషన్ ఫారం అందుకున్న ప్రతి ఒక్కరూ దానిని వెంటనే నింపి బీఎల్ఓలకు అందించాలన్నారు. ఫారం అందించని వారి ఓట్లు జాబితా నుంచి తొలగించబడతాయని పేర్కొన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ చలపతి, పంచాయతీ కార్యదర్శి మడిపెద్ది శ్రీను, బీఎల్ఓలు స్థానికులు ఉన్నారు.ఫ అదనపు కలెక్టర్ హరిసింగ్ -
‘భూభారతి’ సర్వర్ డౌన్
15 రోజులుగా మొరాయిస్తున్న సర్వర్భానుపురి (సూర్యాపేట) : వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ కోసం తహసీల్దార్ ఆఫీసుకు వెళ్లిన రైతులు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. 15 రోజులుగా భూ భారతి సర్వర్ మొరాయిస్తున్నది. దాంతో స్లాట్ బుక్ చేసుకున్న సమయానికి రిజిస్ట్రేషన్లు పూర్తి కావడం లేదు. జిల్లాలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రిజిస్ట్రేషన్లు గంటల తరబడి ఆలస్యం అవుతుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తహసీల్దార్ కార్యాలయాల్లో నిలువ నీడ, తాగునీరు కరువవడంతో రైతులు చెట్ల కిందే పడిగాపులు కాయాల్సి వస్తున్నది. రోజుకు వందకు పైగానే రిజిస్ట్రేషన్లు..గతంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే చేసేవారు. ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం వ్యవసాయేతర భూములను రిజిస్ట్రార్ కార్యాలయాల్లో, వ్యవసాయ భూములను తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసేలా మార్పులు చేశారు. ధరణి పోర్టల్ ద్వారా తహసీల్దార్ కార్యాలయంలోనే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ చేసి పాస్బుక్లు జారీచేస్తున్నారు. ఈ ప్రక్రియ మొదట్లో స్లాట్ బుక్ చేసుకున్న సమయానికి పూర్తి అయ్యేది. జిల్లాలోని 23 మండలాల్లో ఈ ప్రక్రియ సాగుతుండగా.. రోజుకు సరాసరి 100కు పైగా రిజిస్ట్రేషన్లు జరిగేవి. సర్వర్తో సమస్యలుకాంగ్రెస్ ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతి పోర్టల్ను తీసుకొచ్చింది. ధరణి పోర్టర్ ఉన్న సమయంలో పలు చోట్ల అక్రమాలు జరిగినట్లు వెలుగులోకి రావడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. దీనిపై విచారణ చేస్తూ ఈ పోర్టల్లోకి వెళ్లి వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని పలు మండలాల్లో భూముల రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్న రైతులకు సేవల్లో అంతరాయం కలుగుతోంది. 15 రోజులుగా సర్వర్ సతాయిస్తుండడంతో రిజిస్ట్రేషన్లు రోజురోజుకు తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండి పడుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. భూముల రిజిస్ట్రేషన్లకు గంటల తరబడి పడిగాపులు ఉదయం నుంచి సాయంత్రం దాకా చెట్ల కిందే అన్నదాతల అవస్థలు ప్రభుత్వ ఆదాయానికి గండి -
ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనే లక్ష్యం
భానుపురి (సూర్యాపేట) : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంతో పాటు మెరుగైన మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు పనిచేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. మంగళవారం పాఠశాలల ఆధునికీకరణపై ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులతో వెబ్ ఎక్స్ కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ప్రతి తరగతి గదిలో సరిపడా గాలి, వెలుతురు ఉండేలా చూడాలన్నారు. విద్యార్థులు కూర్చునే బెంచీలు సౌకర్యవంతంగా ఉండాలన్నారు. సమావేశంలో జిల్లా కోఆర్డినేటర్ శ్రావణ్ కుమార్, డీఈ రమేష్, ఏఈ ఓబులేష్, తదితరులు పాల్గొన్నారు.ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
జాబ్మేళాలో 340 మంది ఎంపిక
నల్లగొండ : నల్లగొండలోని కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో మంగళవారం అప్రెంటిస్షిప్–ఉద్యోగ మేళాను నిర్వహించారు. ఈ మేళాలో 25 సంస్థలకు చెందిన ప్రతినిధులు, అధికారులు పాల్గొని సుమారు 500 మంది విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇందులో 340 మంది విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు పొందారు. ఈ సందర్భంగా డీఐఈఓ దస్రూనాయక్ మాట్లాడుతూ విద్యార్థులు త్వరగా ఉద్యోగ రంగంలో అడుగు పెట్టాలంటే అప్రెంటిస్ పూర్తి చేయడం ఎంతో అవసరమన్నారు. ఇందుకు ఉద్యోగ మేళాలు మంచి వేదికగా నిలుస్తాయని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఇంటర్మీడియట్ విద్యామండలి ఉద్యోగ మేళాల సమన్వయకర్త నండూరి శ్రీనివాస్, కళాశాల ప్రధానాచార్యులు ఎ.ఉపేందర్, సూర్యాపేట డీఐఈఓ బి.సులోచన రాణి, యాదాద్రి భువనగిరి జిల్లా నోడల్ అధికారి డి.సురేష్ రెడ్డి, వివిధ కళాశాలల ప్రధానాచార్యులు, అధ్యాపకులు, ఉమ్మడి జిల్లా నుంచి వచ్చిన నిరుద్యోగులు పాల్గొన్నారు. -
సాగు భూముల్లో రక్తం చల్లి రైతుల నిరసన
చివ్వెంల(సూర్యాపేట) : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మండలంలోని సేవాలాల్ తండాలో మంగళవారం రైతులు వ్యవసాయ భూమిలో తమ రక్తం చల్లి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తంతో పంటలు పండించ వచ్చని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. తమ రక్తాన్ని తీయించుకుని చేనులో చల్లుతున్నామని, మా రక్తతో పంటలు ఎలా పండుతాయో సీఎం చెప్పాలన్నారు. ఉన్నత హోదాలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడటం బాధాకరమన్నారు. సీఎం వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలని, సాగు నీరందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుగులోతు కవిత అనిల్నాయక్, రైతులు గుగులోతు వెంకన్న, గుగులోతు పాశ్చ్యా, గుగులోతు లాలు, గుగులోతు మాన్సింగ్, గుగులోతు నర్సింహ, వీరమ్మ, బుజ్జి, మస్రూ పాల్గొన్నారు. వెట్టి నుంచి ముగ్గురు బాలకార్మికులకు విముక్తికోదాడరూరల్ : ఆపరేషన్ స్మైల్లో భాగంగా పోలీసులు మంగళవారం మండలంలోని చిమిర్యాల, నల్లబండగూడెం పరిశ్రమల్లో తనిఖీలు నిర్వహించారు. పరిశ్రమల్లో పనిచేస్తున్న బీహార్కు చెందిన ముగ్గురు బాల కార్మికులను గుర్తించి వారిని వెట్టి నుంచి విముక్తి కల్పించారు. పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రూరల్ ఎస్ఐ ఎస్కే. యాకూబ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల, బాలికలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.సీనియర్ కబడ్డీ క్రీడాకారులకు ఆహ్వానంసూర్యాపేటటౌన్ : కోదాడ కేఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కబడ్డీ ఖేలో ఇండియా సెంటర్లో క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పాల్గొన్న సీనియర్ కబడ్డీ క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా క్రీడలశాఖ అధికారి వెంకట్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు చెందిన సీనియర్ కబడ్డీ క్రీడాకారులు తమ బయోడేటా, వివిధ స్థాయిలో వారు సాధించిన మెడల్స్, సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో ఈ నెల 22లోగా జిల్లా యువజన, క్రీడల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు సెల్: 9100949979 నంబర్లను సంప్రదించాలని కోరారు. మెట్ట పంటల విత్తనాలు అందించాలిహుజూర్నగర్ : మెట్ట పంటలకు అవసరమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొప్పోజు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. వరికి ప్రత్యామ్నాయంగా మెట్ట పంటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.8 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం హుజూర్నగర్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం ఆర్డీఓ శ్రీనివాసులుకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలోని 17 జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. దాంతో రైతులు వానకాలం పంటలు సాగు చేసే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రైతులకు ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సంఘం పట్టణ అధ్యక్షుడు జక్కుల రమేష్, నాయకులు ఇందిరాల వెంకటేశ్వర్లు, దొంతగాని సత్యనారాయణ, ఎల్లావుల రమేష్, జడ వెంకన్న, వీరయ్య, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి స్టేషన్లో ‘పోలీస్ అక్క’
సూర్యాపేటటౌన్ : మహిళలు, బాలికలు, విద్యార్థినుల సమస్యలను పోలీసులతో పంచుకునేందుకు.. వారికి అండగా ఉండేందుకు పోలీస్శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్కు ఈ బాధ్యతలు అప్పగించారు. ఆమెను ‘పోలీస్ అక్క’గా నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ‘పోలీస్ అక్క’ కార్యక్రమాన్ని సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహ ప్రారంభించారు. బాధితులకు అండగా..మహిళల రక్షణ కోసం ఇప్పటికే షీ టీమ్స్, భరోసా సెంటర్లు, సఖీ కేంద్రాలు, పోక్సో చట్టం వంటివి అమలులో ఉన్నాయి. కానీ బాధితులు పోలీసులను నేరుగా సంప్రదించడంలో వెనుకంజ వేస్తున్నారు. అలా కాకుండా ప్రతి పోలీస్ స్టేషన్లో స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించేందుకే ‘పోలీస్ అక్క’ కార్యక్రమం ప్రారంభించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. పోలీస్ స్టేషన్న్కు వచ్చే ప్రతి మహిళా ఫిర్యాదికి భరోసా కల్పించడంతో పాటు, వారి సమస్యలను విని చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు ఈ వ్యవస్థ దోహదపడనుంది. మహిళలు పోలీసులకు భయపడకుండా, కుటుంబ సభ్యురాలితో మాట్లాడినంత ఆత్మీయంగా తమ సమస్యలను వెల్లడించే వేదికగా పోలీసు అక్క నిలుస్తుందని పోలీసులు భావిస్తున్నారు. మహిళలకు అవగాహనపోలీస్ అక్క తమ పరిధిలోని పాఠశాలలు, కళాశాలలు, బాలికల హాస్టళ్లు, మహిళా సంఘాలను తరచూ సందర్శించి మహిళల రక్షణ చట్టాలు, షీ టీమ్స్ సేవలు, భరోసా కేంద్రాలు, పోక్సో చట్టం, సైబర్ నేరాలపై అవగాహన కల్పించనున్నారు. విద్యార్థినులతో స్నేహపూర్వకంగా ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు, నెలకు ఒక రోజు బాలికల హాస్టళ్లలో బస చేసి వారి భద్రత, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. సామాజిక రుగ్మతలపై ఉక్కుపాదంఈ కార్యక్రమం ద్వారా ఆకతాయిల వేధింపులు, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, బాల్య వివాహాలు, లైంగిక వేధింపుల వంటి వాటిని ముందుగానే గుర్తించి నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతూ.. అవసరమైన కౌన్సెలింగ్తో పాటు చట్టపరమైన రక్షణ కల్పించనున్నారు. మహిళలు, బాలికలు తమకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే డయల్ 100 లేదా 112కు సమాచారం ఇచ్చి పోలీసు సేవలు పొందాలని అధికారులు సూచిస్తున్నారు.మహిళా కానిస్టేబుల్కు ప్రత్యేక బాధ్యతలు సూర్యాపేట జిల్లాలో పోలీస్శాఖ వినూత్న కార్యక్రమం పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో అవగాహన వేధింపులు, ర్యాగింగ్, బాల్య వివాహాల నివారణే లక్ష్యం -
ట్రై సైకిల్ కోసం నాలుగు నెలలుగా..
చివ్వెంల మండలానికి చెందిన గుగులోతు కృష్ణ, మోతె మండలం మేకపాటి తండాకు చెందిన బానోత్ శంకర్ దివ్యాంగులు. తమకు ట్రై సైకిల్ ఇవ్వాలని కోరుతూ నాలుగు నెలల క్రితం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ప్రజావాణిలోనూ వినతిపత్రాలు సమర్పించారు. ఇప్పటి వరకు వారి సమస్య పరిష్కారం కాక పోవడంతో సోమవారం కలెక్టరేట్కు వచ్చి మళ్లీ అధికారులకు సమస్యను విన్నవించుకున్నారు. త్వరితగతిన మూడు చక్రాల వాహనాలు అందించాలని కోరుతున్నారు. –సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సూర్యాపేట -
నులిపురుగుల నివారణకు ‘ఆల్బెండజోల్’
సూర్యాపేటటౌన్ : పిల్లల్లో అనారోగ్యానికి కారణమైన నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు అందిస్తున్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ అన్నారు. సూర్యాపేట మండలం బాలెంలలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలలో నులి పురుగుల నిర్మూలనలో భాగంగా ఆల్బెండజోల్ మాత్రల పంపిణీని సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. సంవత్సరం నుంచి 19 ఏళ్లలోపు వారందరూ మాత్రలు వేసుకోవాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలలో సంబంధిత ఉపాధ్యాయులతో, బడిబయట పిల్లలకు ఆశా కార్యకర్తలతో మాత్రలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మాత్రలు పొందని వారికి ఈ నెల 20న అందించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ నీలా, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ కోటిరత్నం, డాక్టర్లు ప్రసిద్ద్, నాజియా తబస్సుమ్, స్రవంతి పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ వెంకటరమణ -
న్యాయవాద వృత్తిలో రాణించాలి
చివ్వెంల(సూర్యాపేట) : సీనియర్ల సహకారంతో జూనియర్లు న్యాయవాద వృత్తిలో రాణించాలని న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షుడు బాగాల నర్సింహ, సూర్యాపేట బార్ అసోషియేషన్ అధ్యక్షుడు నూకల సుదర్శన్రెడ్డి అన్నారు. సోమవారం బార్ అసోసియేషన్ హాల్లో నిర్వహించిన గురుపౌర్ణమి వేడుకల్లో సీనియర్ న్యాయవాదులను సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వృత్తిలో నిబద్ధత ముఖ్యమన్నారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు టి.భిక్షమయ్య గౌడ్, ఉమ్మెంతల వెంకటేశ్వర్రావు, టి.వేణుగోపాల్రావు, అనంతకుమార్. ఎస్. రామరాజు. తదితరులు పాల్గొన్నారు. -
27న కలెక్టరేట్ ఎదుట ధర్నా
సూర్యాపేట అర్బన్ : ప్రభుత్వ విద్య, వైద్య రంగాలను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎంవీఎన్ భవన్లో నిర్వహించిన పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలను నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, వసతుల లేమి వంటి అనేక సమస్యలు పేరుకుపోయాయన్నారు. పీహెచ్సీల్లో వైద్యులు, సిబ్బంది ఖాళీలు, మందుల కొరత, 24 గంటల వైద్య సేవలు అందకపోవడంతో ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ ఎదుట ధర్నాను జయప్రదం చేయాని కోరారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు, నాగారపు పాండు, మట్టి పెళ్లి సైదులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నాగార్జునరెడ్డి -
ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యం
భానుపురి (సూర్యాపేట) : ప్రజల సమస్యల పరిష్కారమే వేదికగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా, డివిజన్ స్థాయి ప్రజావాణి దరఖాస్తులను తప్పనిసరిగా ఆన్న్ లైన్ పోర్టల్లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. ప్రజావాణిలో మొత్తం 107 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, డీఆర్ఓ ప్రేమ్రాజ్, జడ్పీ సీఈఓ శిరీష, డీఆర్డీఓ సన్యాసయ్య, డీపీఓ యాదగిరి, డీఏఓ శ్రీధర్రెడ్డి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
లక్ష్మీనరసింహస్వామికి నిత్య కల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో సోమవారం స్వామివారి నిత్య కల్యాణాన్ని అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయంలో మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేశారు. కల్యాణోత్సవంలో భాగంగా ముందుగా ఎదుర్కోళ్ల మహోత్సవం, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్ కుమార్, దేవాలయ అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభా చార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. ఆర్ఎంపీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా రవిబాబుమునగాల : రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా మండలంలోని కలకోవ గ్రామానికి చెందిన దొంతగాని రవిబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చివ్వెంల మండలం దురాజ్పల్లి గట్టు వద్ద సోమవారం సంఘం వ్యవస్థాపకుడు తన్నీరు సత్యనారా యణ సమక్షంలో జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు గట్ట రమాశంకర్, పొనుగోటి భుజంగరావు తదితరులు పాల్గొన్నారు. నేడు నల్లగొండలో జాబ్ మేళాసూర్యాపేటటౌన్ : నల్లగొండలోని ప్రభుత్వ వృత్తి విద్య జూనియర్ కళాశాలలో మంగళవారం అప్రెంటిస్–కమ్–ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు సూర్యాపేట ప్రభుత్వ జూని యర్ కళాశాల ప్రిన్సిపాల్ పెరుమాళ్ల యాదయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ విద్యాశాఖ, ప్రాంతీయ నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత సంచాలక కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే ఉద్యోగ మేళాలో పారా మెడికల్, నాన్ పారా మెడికల్ విభాగాలకు చెందిన పలు ప్రముఖ సంస్థలు పాల్గొంటున్నాయని పేర్కొన్నారు. అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసి నెలకు రూ.9,600 స్టైపెండ్ అందిస్తారని తెలిపారు. 2023 నుంచి 2026 మధ్య వృత్తి విద్య పూర్తిచేసిన విద్యార్థులు, ఇటీవల ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారు ఈ మేళాలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ బయోడేటా, విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలు, ఆధార్ కార్డు వెంట తీసుకు రావాలని సూచించారు. శివాలయంలో పూజలుమేళ్లచెరువు: మండల కేంద్రంలోని ఇష్టకామేశ్వరీ సమేత స్వయంభు శంభులింగేశ్వర స్వామి దేవాయలంలో సోమవారం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఈఓ శంభిరెడ్డి, అర్చకులు విష్ణువర్దన్శర్మ, ధనుంజయశర్మ పాల్గొన్నారు. -
బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు
సూర్యాపేటటౌన్ : పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదు దారులకు త్వరిగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ నరసింహ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. బాధితులు తమ ఎస్పీని ప్రత్యక్షంగా కలిసి వినతులు సమర్పించారు. ఎస్పీ వారితో మాట్లాడి సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
గడువు సమీపిస్తోంది.. సర్
ఎన్యుమరేషన్ పత్రాలు అందించాలి అర్హులకు మాత్రమే ఓటు హక్కు కల్పించడం, డబుల్ ఓట్లు తొలగించడమే ధ్యేయంగా సర్ ప్రక్రియ నిర్వహిస్తున్నాం. ఓటర్లు అందరూ తప్పనిసరిగా ఎన్యుమరేషన్ ఫారాలు సరిగా నింపి బీఎల్ఓలకు అందించాలి. పత్రాలు ఇవ్వక పోతే ఓటు కోల్పోతారు. – జాన్ మమ్మద్, డీటీ తిరుమలగిరితిరుమలగిరి ( తుంగతుర్తి ) : కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ తుది గడువు సమీపిస్తోంది. బీఎల్ఓలు, బీఎల్ఏలు ఇంటింటికీ తిరిగి ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ చేశారు. ప్రస్తుతం ఫారాల్లో వివరాలు నింపి తిరిగి సేకరించే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ నెల 24 వరకే గడువు ఉండడంతో ప్రక్రియను వేగవంతం చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు సూర్యాపేట జిల్లాలో ఎన్యుమరేషన్ పత్రాల సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియ 50 శాతం పూర్తయ్యింది. ఫారాలు నింపేందుకు అవస్థలుఎన్యుమరేషన్ ఫారాలు నింపేందుకు గ్రామస్థాయి ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. 2002 తర్వాత వివాహమై తమ అత్తగారింటికి వచ్చిన మహిళలు ఇక్కడే ఓటరుగా నమోదై ఉన్నారు. ప్రస్తుతం వారు తమ తల్లిదండ్రుల ఓటరుతో మ్యాపింగ్ చేయాల్సి రావడం, ఎన్యుమరేషన్ పత్రాల్లో వారి తల్లి లేదా తండ్రి ఓటరు వివరాలు నింపాల్సి రావడంతో ఇబ్బందులు పడుతున్నారు. తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన కొందరు ఉపాధి కోసం హైదరాబాద్, కరీంనగర్తో పాటు ఇతర నగరాలకు వలస వెళ్లారు. ప్రస్తుతం తమ గ్రామంలో ఎన్యుమరేషన్ పత్రాలు నింపి ఇచ్చేందుకు సొంతూళ్లకు వచ్చేందుకు వీలు పడడం లేదని చెబుతున్నారు. గడువు ముగుస్తోందంటూ బీఎల్ఓలు, స్థానికులు వారికి ఫోన్ ద్వారా సమాచారం ఇస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. గ్రామాల్లో ఆటోలకు మైకులు అమర్చి మరీ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్యుమరేషన్ ఫారం ఇవ్వక పోతే ఓటు పోతుందంటూ హెచ్చరిస్తున్నారు. గడువు మరో 11 రోజుల మాత్రమే ఉండటంతో ఈ ప్రక్రియ వందశాతం పూర్తవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పత్రాలు ఇచ్చింది సగం మందే సూర్యాపేట జిల్లాలో 10,08,252 మంది ఓటర్లు ఉండగా ఎన్యుమరేషన్ పత్రాల పంపిణీని బీఎల్ఓలు దాదాపుగా పూర్తి చేశారు. ఇప్పటి వరకు 5,01,651 మంది ఓటర్లు తమ ఎన్యుమరేషన్ పత్రాలను నింపి బీఎల్ఓలకు అందించారు. వాటిని బీఎల్ఓలు వెంటనే డిజిటలైజేషన్ కూడా పూర్తి చేశారు. జిల్లాలోని 23 మండలాల్లో అత్యధికంగా నడిగూడెం మండలంలో 68.15 శాతం, మఠంపల్లిలో 68.06 శాతం, అత్యల్పంగా సూర్యాపేటలో 28.32 శాతం ఎన్యుమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ పూర్తయింది.జిల్లాలో 50 శాతం ఎన్యుమరేషన్ పత్రాల స్వీకరణ పూర్తి వెంటనే డిజిటలైజేషన్ చేస్తున్న బీఎల్ఓలు ప్రక్రియను వేగవంతం చేసేందుకు గ్రామాల్లో విస్తృత ప్రచారం -
కేసీఆర్పై సీఎం వ్యాఖ్యలు సరికాదు
కోదాడ: తన ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, వెంటనే సీఎం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో పాటు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ డిమాండ్ చేశారు. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా ఆదివారం కోదాడ బస్టాండ్ సెంటర్లో గాంధీ విగ్రహం ఎదుట ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు సహజమని, ప్రజా సమస్యలపై విమర్శలు, చర్చలు జరగడం సహజమన్నారు. అలాంటి వాటికి దీటుగా స్పందించాల్సింది పోయి సీఎం వ్యక్తిగత విమర్శలకు దిగడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెపుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎస్కే. నయీం, చీమ నరేష్, కక్కడపు బాబు, చలిగంటి వెంకట్, పిట్టల భాగ్యమ్మ, రమేష్, తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే బొల్లం -
తీరనున్న శిథిల భవనాల కష్టాలు
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : శిథిల భవనాలు, ఇరుకు గదుల్లో రెవెన్యూ సిబ్బంది పడుతున్న కష్టాలు తీరనున్నాయి. జిల్లాలో నాలుగు మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాలకు కొత్త భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఆత్మకూర్ ఎస్, మద్దిరాల, మోతే మండలాలతో పాటు మట్టంపల్లి మండలంలో నూతన తాహసీల్దార్ కార్యాలయాలకు రూ.2.25 కోట్లను విడుదల చేసింది. ఇరుకు గదులతో అవస్థలు గతంలో నిర్మించిన భవనాలు, నేటి అవసరాలకు అనుకూలంగా లేకపోవడంతో అధికారులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రికార్డులు భద్రపరిచేందుకు, కంప్యూటర్లు, సిబ్బంది సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు స్థలం లేక అవస్థలు పడుతున్నారు. దానికి తోడు పాత భవనాలు కావడంతో శిథిలావస్థకు చేరి వర్షం వస్తే కురుస్తున్నాయి. దాంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని అధికారులు, కార్యాలయాలకు వచ్చే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆయా మండలాల్లో కొత్త భవనాలకు నిధులు మంజూరైనందున వెంటనే పనులు ప్రారంభించేలా అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.ఫ రెవెన్యూ కార్యాలయాలకు పక్కా భవనాలు ఫ నాలుగు మండలాలకు రూ.2.25 కోట్లు మంజూరు -
ఎన్యుమరేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలి
సూర్యాపేట అర్బన్ : ఎన్యుమరేషన్ ఫారాల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని 29వ వార్డులో సర్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేసి, వివరాలను సక్రమంగా నమోదు చేయాలని సూచించారు. ప్రతి రోజు కనీసం 2500 ఫారాలు సేకరించే లక్ష్యంతో పని చేయాలన్నారు. నిర్దేశిత గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఓటర్లు సకాలంలో ఫారాలు పూర్తి చేసి అందించేలా చర్యలు తీసుకోవాలని, ఎక్కడా నిర్లక్ష్యం లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఫారాలు నింపే విషయంలో బీఎల్ఓలు ఓటర్లకు సహకారం అందించాలని, మ్యాపింగ్ ప్రక్రియను కరెక్ట్గా చేయాలన్నారు. ఆయన వెంట ఆర్డీఓ వేణు మాధవరావు, తహసీల్దార్ సాయిగౌడ్, బీఎల్ఓలు, తదితరులు ఉన్నారు.ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
యువ వికాసం ఏదీ.?
నాగారం : నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘రాజీవ్ యువ వికాస్’ పథకానికి శ్రీకారం చుట్టింది. దీని కింద వ్యవసాయ రంగం, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుతో యువత ఆర్థిక పురోగతి పొందేలా కార్యాచరణ రూపొందించింది. ఈ పథకానికి గతేడాది వేలాది మంది యువత దరఖాస్తు చేసుకున్నారు. అర్హులైన వారిని ఎంపిక చేసి గతేడాది జూన్ 2 నుంచి దశల వారీగా రుణాలు అందించాలని పథకం ప్రకటించిన సందర్భంలో ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఏడాది గడిచినా ఇంతవరకు ఒక్కరికి కూడా రుణం మంజూరు చేయలేదు. ప్రభుత్వం కేవలం దరఖాస్తులు స్వీకరించి వదిలేయడంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. 60,304 దరఖాస్తులు రాజీవ్ యువ వికాస్ పథకంలో భాగంగా ఎస్టీ, ఎస్సీ బీసీ, మైనార్టీ సామాజిక వర్గాల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. దాంతో ఆయా సామాజిక వర్గాల నుంచి దరఖాస్తులు పోటెత్తాయి. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా వివిధ సామాజికవర్గాలకు చెందిన 60,304 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొదటగా ప్రభుత్వం దరఖాస్తు దారులకు మండల పరిషత్ కార్యాలయాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించి, అర్హులైన వారికి యూనిట్ విలువ ప్రకారం అయిదు విడతల్లో మంజూరు పత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది రాయితీ రుణాల కోసం.. రాజీవ్ యువ వికాసం పథకం కింద ఎంపికై న వారికి రూ.50వేల నుంచి రూ.4లక్షల వరకు ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.50 వేల యూనిట్కు వందశాతం రాయితీ, రూ.లక్ష లోపు రుణానికి 80 శాతం రాయితీ, రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు 70 శాతం, రూ.4 లక్షలకు 60 శాతం రాయితీ ఇచ్చేలా పథకాన్ని రూపొందించింది. మొదటి విడత కింద రుణాలు అందించడం కోసం అధికారులు దరఖాస్తులను పరిశీలించి కొందరిని ఎంపిక చేశారు. ఎదురు చూపులే.. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి మొదటగా రూ. లక్షకు సంబంధించిన యూనిట్లను గతేడాది జూన్ 2 తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం నుంచి పంపిణీ చేయాలని ప్రభుత్వం భావించింది. చివరి క్షణంలో పలు ఆరోపణలు రావడంతో రుణాల పంపిణీ వాయిదా వేసింది. అప్పటి నుంచి నేటి వరకు కూడా ఒక్క యూనిట్ కూడా మంజూరు చేయలేదు. రుణాలు మంజూరు చేస్తే వాటితో స్వయం ఉపాధి ఏరా్పాటు చేసుకొని జీవనం సాగించాలని నిరుద్యోగ యువత ఆశగా ఎదురుచూస్తోంది. ప్రభుత్వం రుణాల మంజూరుపై ఇంకా స్పష్టత ఇవ్వకపోవడంతో వారు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఎస్సీ 16,376 ఎస్టీ 8947 బీసీ 29,112 ఈబీసీ 1838 ముస్లిం మైనార్టీ 3935 క్రిస్టియన్ మైనార్టీ 96 మొత్తం 60,304 ఫ ఏడాది గడిచినా యువతకు అందని రుణాలు ఫ జిల్లా వ్యాప్తంగా 60,304 దరఖాస్తులు ఫ తీవ్ర నిరాశలో నిరుద్యోగులు -
స్లాబ్ పరిమితి 750 అడుగులే..
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం 600 చదరపు అడుగుల గరిష్ఠ విస్తీర్ణానికి పరిమితమైనప్పటికీ స్లాబ్ విషయంలో ఎలాంటి నిబంధనలు లేవు. దాంతో కొందరు లబ్ధిదారులు స్లాబ్ ఏరియాను వెయ్యి నుంచి 1200 చదరపు అడుగుల వరకు నిర్మిస్తున్నారు. విశాలంగా ఉండాలని, తలుపులు, కిటికీలు తడవకుండా ఉండేలా ఈ విధంగా నిర్మాణాలు చేస్తున్నారు. మరికొందరు మేసీ్త్రలు స్లాబ్ ఏరియా ఎక్కువగా ఉంటేనే ఇంటికి రక్షణ ఉంటుందని చెప్పడంతో లబ్ధిదారులు కూడా అలానే నిర్మించుకుంటున్నారు. దాంతో ప్రభుత్వం అందించే రూ.5 లక్షలు సరిపోక లబ్ధిదారులు ఇళ్లను మధ్యలోనే నిలిపివేస్తున్నారు. ఈ విషయం అధికారుల దృష్టికి రావడం, ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడంతో ఇళ్ల పైకప్పు విషయంలో నిబంధనలు తీసుకొచ్చింది. దాంతో లబ్ధిదారులపై ఆర్ధిక భారం తగ్గనుంది. భానుపురి (సూర్యాపేట) : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం విషయంలో ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. లబ్ధిదారులపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇకపై ఇంటి పైకప్పు విస్తీర్ణానికి గరిష్ట పరిమితి విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 600 చదరపు అడుగుల ప్లింత్ ఏరియా ఉన్న ఇంటికి, గరిష్టంగా 750 చదరపు అడుగుల మించి స్లాబ్ నిర్మించవద్దని నిబంధనల్లో పేర్కొంది. ఇంతకు మించి నిర్మిస్తే బిల్లులు నిలుపుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇంటి నిర్మాణంలో లబ్ధిదారులు స్లాబ్ ఏరియా పెంచుకోవడంతో ఖర్చు అధికంగా వస్తుందన్న సమాచారంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మొదట్లో ప్లింత్ ఏరియాకు..! సూర్యాపేట జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున మొత్తం 12,868 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిల్లో ఇప్పటికే 2వేల ఇళ్ల వరకు నిర్మాణం పూర్తయి గృహ ప్రవేశాలయ్యాయి. మరో 5500 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. రెండో విడత ఇళ్లను సైతం ఇటీవల ప్రకటించినప్పటికీ అర్హుల ఎంపిక జరగలేదు. కేవలం పూరి గుడిసెల సర్వే మాత్రమే చేపట్టారు. ఇందిరమ్మ ఇళ్లను ప్రకటించిన సమయంలో 400 నుంచి 600 చదరపు అడుగుల్లోనే ఇళ్లను నిర్మించాలని చెప్పారు. అయితే ఈ ఇళ్లు చిన్నగా ఉంటాయని, రానున్న రోజుల్లో ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన లబ్ధిదారులు నిర్మాణానికి ముందుకు రాలేదు. ప్రభుత్వం ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్ట్గా ఎంచుకొని నిర్మించిన ఇళ్లను చూసి లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను మొదలు పెట్టారు. ఇందిరమ్మ ఇళ్లకు కొత్త నిబంధనఫ ఎక్కువ విస్తీర్ణంలో నిర్మిస్తే బిల్లుల నిలిపివేత ఫ లబ్ధిదారులపై భారం తగ్గించేందుకు ప్రభుత్వ నిర్ణయం ఫ రూఫ్ లెవల్లో ఉన్న ప్రతి ఇంటికి వర్తింపు -
సూర్యక్షేత్రంలో సౌరహోమం
అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. యజ్ఞశాలలో మహా సౌరహోమాన్ని చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితాజనార్దన్స్వామి, గణపురం నరేష్, అర్చకుడు భీంపాండే, భక్తులు పాల్గొన్నారు. పుస్తకంలో సమాజాన్ని మార్చే శక్తి సూర్యాపేటటౌన్ : పుస్తకం అమ్మ వంటిదని, సమాజాన్ని, వ్యక్తిత్వాన్ని మార్చే శక్తి దానికి ఉందని ప్రొఫెసర్ బెల్లి యాదయ్య కొనియాడారు. కవి, రచయిత డాక్టర్ మెంతబోయిన సైదులు రచించిన ‘కోటి రతనాల సాహిత్య వీణ’ పుస్తకావిష్కరణ సభ ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాల సెమినార్ హాల్లో నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ పుస్తకం.. నేటి యువతను ప్రభావితం చేస్తుందని, వర్ధమాన కవి రచయితలకు స్ఫూర్తిగా నిలుస్తుందని అభినందించారు. అంతకు ముందు ప్రొఫెసర్ దాశరథుల నర్సయ్యతో కలిసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ పున్నయ్య, మనం వికాస వేదిక అధ్యక్షుడు పెద్దిరెడ్డి గణేష్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మహమ్మద్ హసేన్, తుంగతుర్తి సాహితీ వేదిక అధ్యక్షుడు గుండగాని శ్రీనివాస్, సీహెచ్ రామలింగారెడ్డి, డాక్టర్ రజిని, రాచకొండ ప్రభాకర్, మెంతబోయిన సింహాద్రి, మేడల రమేష్, మట్టపల్లి శ్రీశైలం, రామ్మూర్తి పాల్గొన్నారు. లక్ష్మీనరసింహునికి విశేష పూజలు మఠంపల్లి: మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఆదివారం అర్చకులు స్వామివారికి విశేషపూజలు, నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం స్వామి అమ్మవార్లలను పట్టు వస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం నిర్వహించారు. అనంతరం విశ్వక్సేనపూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ, తలంబ్రాలతో వైభవంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ టి.చలపతిరావు, అర్చకులు తూమాటి కృష్ణమాచా ర్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహ మూర్తి, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు. -
నులి పురుగులను నలిపేద్దాం
సూర్యాపేటటౌన్ : పిల్లల ఆరోగ్యానికి మంచి ఆహారంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యం. లేకపోతే వారు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుంది. అపరిశుభ్రత కారణంగా కడుపులో నులిపురుగులు తయారవుతాయి. వీటి బారిన పడిన పిల్లల్లో అనారోగ్య సమస్యలు తలెత్తి శారీరక, మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడుతుంది. పిల్లలు నులిపురుగుల బారిన పడకుండా ఉండేందుకు వైద్యారోగ్యశాఖ ప్రతి సంవత్సరం ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తుంది. 1 నుంచి 18 ఏళ్లలోపు ఉన్న వారందరికీ ఈ నెల 13 నుంచి మాత్రలు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 1,82,000 మంది పిల్లలకు..సూర్యాపేట జిల్లాలోని 1209 అంగన్వాడీ కేంద్రాలు, అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో మాత్రల పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా విద్యా సంస్థలలో మొత్తం 1,82,000 మంది పిల్లలకు మాత్రలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సూర్యాపేట మండలం బాలెంల గ్రామంలో జిల్లా కలెక్టర్ తేజస్నంద్లాల్ పవార్ సోమవారం ఉదయం నులిపురుగుల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ మాత్రలను ఈ నెల 13న మొదటి విడతగా, మిగిలిన పిల్లలకు 20న రెండో విడతగా పంపిణీ చేయనున్నట్టు జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ తెలిపారు. మాత్రలు ఇలా వేయాలిఒకటి నుంచి రెండు సంవత్సరాలలోపు వయస్సు గల పిల్లలకు అల్బెండజోల్ సగం మాత్రను, రెండు నుంచి మూడేళ్ల లోపు వారికి ఒక మాత్రను పొడి చేసి, మూడేళ్ల నుంచి 18 ఏళ్ల పిల్లలకు ఒక మాత్రను చంపరించి, నమిలి మింగాలి. మాత్రల పంపిణీకి జిల్లాలోని ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది, ఏఎన్ఎంలు, వైద్య సిబ్బందిని నియమించారు. వీరు ప్రతి ఇంటిని, పాఠశాలను సందర్శించి మాత్రలు పంపిణీ చేస్తారు. నేటి నుంచి ఆల్బెండ జోల్ మాత్రల పంపిణీ 1 నుంచి 18 ఏళ్ల లోపు వయస్సు గల పిల్లలకు -
‘మీ సేవ’లో యూరియా బుకింగ్
మునగాల: రాష్ట్రంలోని రైతులకు యూరియా లభ్యతను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పారదర్శకతను పెంపొందిస్తూ, సకాలంలో యూరియా పంపిణీ చేసే లక్ష్యంతో వ్యవసాయ శాఖ సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. స్మార్ట్ఫోన్ యాప్లలో యూరియా బుకింగ్ చేసుకోలేని రైతుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మీసేవ కేంద్రాల్లో నేటి నుంచి బుకింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. బుకింగ్ చేసుకునే విధానం రైతులు తమ పట్టాదారు పాస్బుక్ (పీపీబీ) నంబర్తో సమీపంలోని మీసేవ కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. మీసేవ ఆపరేటర్ రైతు వివరాల ఆధారంగా సాగు విస్తీర్ణం, పంట వివరాలను సిస్టమ్లో నమోదు చేస్తారు. అనంతరం రైతు ఎంపిక చేసుకున్న ఎరువుల డీలరు వద్దకు అవసరమైన యూరియా పరిమాణాన్ని బుక్ చేస్తారు. రైతు నమోదిత మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీని ధ్రువీకరించిన వెంటనే ‘బుకింగ్ ఐడీ’ జారీ అవుతుంది. కేవలం రూ.10ల నామమాత్రపు సేవా రుసుముతో రైతులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.ముఖ్యమైన సూచనలు ఇవీ.. మీసేవ ద్వారా పొందిన బుకింగ్ ఐడి బుకింగ్ చేసిన తేదీని మినహాయించి 48గంటల పాటు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. బుకింగ్ గడువు ముగిసేలోపు రైతులు ఎంపిక చేసిన ఎరువుల డీలర్ను సంప్రదించి యూరి యాను కొనుగోలు చేయాలి. సబ్సిడీ యూరియా బుకింగ్ను అధికారిక ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ లేదా మీసేవ కేంద్రాల ద్వారానే చేయాలని వ్యవసాయ శాఖ సూచిస్తుంది. ఓటీపీ అందుకోవడానికి రైతులు తమ పట్టాదారు పాస్బుక్తో అనుసంధానమైన మొబైల్ నంబర్ యాక్టివ్లో ఉండేలా చూసుకోవాలి. మీసేవ కేంద్రాలకు లాగిన్ సౌకర్యం కల్పించిన ప్రభుత్వం నేటి నుంచి అందుబాటులోకి బుకింగ్ -
నలుగురు ఎస్సైలు బదిలీ
సూర్యాపేటటౌన్ : జిల్లాలో వివిధ పోలీస్స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న నలుగురు ఎస్ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ నరసింహ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పెన్పహాడ్ పోలీస్స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న గోపికృష్ణ సూర్యాపేటటౌన్ 2కు, సూర్యాపేట టౌన్ – 2లో పనిచేస్తున్న శివతేజను వీఆర్ నల్లగొండకు, వీఆర్ సూర్యాపేటలో ఉన్న బాలునాయక్ను పెన్పహాడ్ ఎస్ఐగా బదిలీ చేశారు. అదేవిధంగా మునగాలకు నల్లగొండ జిల్లా గట్టుప్పల్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఎం.సంజీవ్రెడ్డి బదిలీపై వచ్చారు. 12న ‘యంగ్ ఇండియా’ ప్రవేశపరీక్షసూర్యాపేటటౌన్ : యంగ్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్లో 2026–27 విద్యా సంవత్సరానికిగాను 6వ తరగతి ప్రవేశాలకు ఈనెల 12న పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ గురువారం తెలిపారు. చింతలపాలెం, గరిడేపల్లి, పెన్పహాడ్ కేజీబీవీల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఉదయం 10 గంటలకే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పంట సాగులో జాగ్రత్తలపై రైతులకు అవగాహన పెన్పహాడ్ : వ్యవసాయ పరిశోధన స్థానం కంపాసాగర్ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు చంద్రశేఖర్, సంధ్యారాణి గురువారం పెన్పహాడ్ మండల పరిధిలోని మాచారం, పొట్లపహాడ్ గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా పత్తి, కంది, వరి సాగులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. వరి నారు మడులను పరిశీలించి పోషక లోపాలున్న చోట, గడ్డి తుంగ జాతి నారుమడిలో పెరిగిన చోట సరైన కలుపు మందుల వాడకాన్ని వివరించారు. పత్తి, కంది, వరి, కూరగాయల పంటలను పరిశీలించారు. పత్తి పంటలో ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులకు అధికమవుతున్న చీడపీడలను సమూలంగా నిర్మూలించేందుకు కావలసిన పురుగు మందుల విషయంలో జాగ్రత్తలను వివరించారు. వారి వెంట మండల వ్యవసాయ అధికారి అనిల్కుమార్, ఏఈఓ ప్రియాంక తదితరులున్నారు. కనీస వేతనాలు అమలు చేయాలిసూర్యాపేట అర్బన్: ప్రైవేట్ బస్సు డ్రైవర్లకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని ప్రైవేట్ పాఠశాల బస్సు డ్రైవర్ల వర్కర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు కోరారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం అధ్యక్షుడు శ్రీ హరిబాబుకు గురువారం వినతిపత్రం అందజేసి మాట్లాడారు. పెరిగిన ధరలకు అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలల, కళాశాల బస్సు డ్రైవర్లు అండ్ వర్కర్స్కు వేతనాలను రెండు సంవత్సరాలకు ఒకసారి సవరించాల్సి ఉండగా అతి తక్కువ వేతనాలతో పని చేయించుకోవడం అన్యాయమన్నారు. వినతిపత్రం అందించిన వారిలో ప్రైవేట్ బస్సు డ్రైవర్ల వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు నాగేంద్ర బాబు, ఉపాధ్యక్షుడు కొత్తపల్లి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి శ్రీ మామిడి సైదులు గౌడ్, సహాయ కార్యదర్శి పొన్నం మురళి, కోశాధికారి షేక్ ఖాదర్, ప్రచార కార్యదర్శి సిగ సైదులు, గౌరవ సలహా దారులు వెంకట రెడ్డి, సైదులు పాల్గొన్నారు. అందుబాటులో కూరగాయల, పూల నారుగరిడేపల్లి: మండల పరిధిలోని గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో నాణ్యమైన కూరగాయలు, పూల నారు అందుబాటులో ఉందని, ఆసక్తి కల్గిన రైతులు బుకింగ్ చేసుకోవచ్చని కేవీకే సిబ్బంది కృష్ణ, సతీష్ గురువారం తెలిపారు. టమాటా, వంగ, పచ్చి మిరప, బంతి నారు, పెరటి తోట కూరగాయల కిట్టు, కోకో పీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు 90102 12711, 95420 77114 సంప్రదించాలని కోరారు. -
అంగన్వాడీ పోస్టులకు నేడు నోటిఫికేషన్
భానుపురి (సూర్యాపేట) : అంగన్వాడీ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభించింది. దాదాపు మూడు, నాలుగేళ్లుగా జిల్లాలో వివిధ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేకపోవడంతో టీచర్లు, ఆయాలు లేకుండానే అంగన్వాడీలు నడుస్తున్నాయి. పిల్లల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఖాళీగా ఉన్న అంగన్వాడీ, ఆయాల పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రకటన విడుదల కావడంతో అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆశ పడుతున్నారు. 1,209 అంగన్వాడీ కేంద్రాలుసూర్యాపేట అర్బన్, చివ్వెంల, తుంగతుర్తి, హుజూర్నగర్, కోదాడ ప్రాజెక్టుల పరిధిలో 1,209 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. 67 టీచర్, 64 ఆయాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో చివ్వెంల అర్బన్ ప్రాజెక్టు పరిధిలో 15 టీచర్లు, 20 ఆయాలు, తుంగతుర్తి ప్రాజెక్టు పరిధిలో 8 టీచర్లు, 19 ఆయాలు, హుజూర్నగర్ ప్రాజెక్టు పరిధిలో 17 టీచర్లు, 14 ఆయాలు, సూర్యాపేట అర్బన్ పరిధిలో టీచర్లు 8, ఆయాలు 9, కోదాడ పరిధిలో 19 టీచర్లు, 2 ఆయాల పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. 24 వరకు దరఖాస్తుల స్వీకరణమొత్తం 131 పోస్టుల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే ఈనెల 13 నుంచి 24వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా కనీస విద్యార్హత ఇంటర్మీడియట్గా నిర్ణయించింది. ఆయా పోస్టులకు గిరిజన ప్రాంతాల్లో ఇంటర్ అభ్యర్థులు లేకుంటే ఎస్ఎస్సీ చదివిన వారిని పరిశీలించనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల లోపు వయస్సులో ఉండాలి. అభ్యర్థిని ఏ అంగన్వాడీ కేంద్రానికై తే దరఖాస్తు చేసుకుంటున్నారో.. ఆ గ్రామం, హాబిటేషన్, వార్డు నివాసై ఉండాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపిక విధానంలో ఇంటర్మీడియట్ మార్కుల మెరిట్, జిల్లా సెలక్షన్ కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూలకు రోస్టర్ నిబంధనలను పాటించనున్నారు.ఫ భర్తీ కానున్న 131 టీచర్, ఆయా పోస్టులు ఫ ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ -
అవసరమయ్యే విత్తనాలు అందుబాటులో ఉంచాలి
హుజూర్నగర్ : పంటల మార్పిడి విధానాన్ని అమలు చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల అనుకూల చర్యలను ప్రకటించాలని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ డిమాండ్ చేశారు. గురువారం హుజూర్నగర్లోని సీపీఐ కార్యాలయంలో జిల్లా విస్తృత కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావం వల్ల 17 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైందని అన్నారు. పంటల మార్పిడి విధానంలో భాగంగా మెట్ట పంటలకు అవసరమయ్యే విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని కోరారు. వరికి ప్రత్యామ్నాయ మెట్ట పంటలను సాగు చేసే రైతులకు ప్రోత్సాహకంగా ఎకరాకు రూ 8 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో 13, 14, 15 తేదీల్లో నిర్వహించే ధర్నాలను విజయవంతం చేయాలని కోరారు. అదే విధంగా ఈనెల 18, 19, 20 తేదీల్లో యాదగిరిగుట్టలో రైతులకు రాష్ట్రస్థాయి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మేళ్లచెరువు పరిధిలో బ్యాంకులు పరిమితులను దాటి రుణాలు ఇవ్వడంపై ప్రభుత్వం విచారణ చేయాలని డిమాండ్ చేశారు. 1057 సర్వే నంబరుపై భూ సమగ్ర సర్వే చేసి 20 ఏళ్లకు పైగా పోరాడుతున్న రైతులకు న్యాయం చేయాలని, వారి భూమి హక్కును కాపాడాలని డిమాండ్ చేశారు. దొడ్డ వెంకటయ్య అధ్యక్ష వహించిన సమావేశంలో రైతు సంఘం సీనియర్ నాయకులు వెంకటేశ్వర్లు, కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కొప్పోజు సూర్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి కంబాల శ్రీనివాస్, సహాయ కార్యదర్శి మామిడి నరసయ్య, జిల్లా ఉపాధ్యక్షులు తిపిరాల శ్రీకాంత్ కౌలు రైతుల జిల్లా అధ్యక్షులు అన్నెం పాపిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు జక్కుల రమేష్, కౌన్సిలర్ చెన్నగాని సైదులు, మండల నాయకులు పాల్గొన్నారు. ఫ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ -
అక్రమాలపై మాట్లాడితే కేసులు పెడుతున్నారు
చిలుకూరు: కోదాడ మట్టి, ఇసుక మాఫియాకు అడ్డాగా మారిందని, ఇలాంటి అక్రమాలపై మాట్లాడితే కేసులు పెడుతున్నారని కోదాడ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ కోదాడ అసెంబ్లీ నియోజవర్గ ఇన్చార్జి బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. గురువారం చిలుకూరులోని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బెల్లంకొండ సైదులు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోదాడ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెబుతున్న ఉత్తమ్ దంపతులు అక్రమాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్, మైనింగ్ అధికారుల అండదండలతో కొంత మంది బినామీల ద్వారా వారు కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని మండిపడ్డారు. కోదాడను కాపాడుకునే సమయం వచ్చిందన్నారు. అక్రమలపై తాను బహిరంగ చర్చకు సిద్ధమని పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు అక్కినపల్లి జానకిరామాచారి, ఉప సర్పంచ్ బెల్లంకొండ నాగయ్య, చిలుకూరు ఫ్యాక్స్ చైర్మన్ అలసకాని జనార్దన్, మాజీ జెడ్పీటీసీ భట్టు శివాజీ నాయక్, మాజీ జెడ్పీ కోఆప్షన్ సభ్యులు జానిమియా, మైనార్టీ నాయకులు షేక్ పాషా, బెల్లంకొండ సైదులు, తాళ్ళూరి శ్రీను, మేకపోతుల శ్రీను, మాదవరపు శ్రీను, రాధాకృష్ణ, నిగిడాల వీరయ్య, అల్లి ఉపేందర్, అమరగాని లింగరాజు, షాకీర్, రాజు, నర్సయ్య, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ -
ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి : కలెక్టర్
భానుపురి (సూర్యాపేట) : గ్రామ పంచాయతీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. గ్రామ పంచాయతీ –సమగ్ర అభివృద్ధి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చెందిన సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు గురువారం జిల్లా కేంద్రంలోని రవి మహల్లో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుని పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ తమ పరిధిలో ఉన్న సహజ వనరులు, స్థానిక ఆదాయ మార్గాలను గుర్తించి పంచాయతీ ఆదాయాన్ని పెంచుకునే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయతీ రాబోయే మూడు సంవత్సరాల కాలానికి గ్రామ పంచాయతీ–సమగ్ర అభివద్ధి ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. ఘన వ్యర్థాల నిర్వహణ ప్రతి ఇంటి నుంచి ప్రారంభం కావాలని తెలిపారు. జీ రామ్ జీ పథకంలో భాగంగా జాబ్ కార్డు కలిగిన వారికి 125 రోజుల పని దినాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హరిసింగ్, జెడ్పీసీఈఓ శిరీష, డీఆర్డీఓ సన్యాసయ్య, డీపీఓ యాదగిరి పాల్గొన్నారు. -
నేడే చేనేత ఎన్నికలు
భూదాన్పోచంపల్లి: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చేనేత సహకార సంఘాలకు శుక్రవారం ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి 3 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లాలో ఏకగ్రీవమైన సంఘాలు పోను మిగిలిన 28 సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా 725 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందులో యాదాద్రి భువనగిరి జిల్లాలో 18 సంఘాలకు 539 మంది, నల్లగొండ జిల్లాలోని 9 సంఘాలకు 175 మంది, సూర్యాపేట జిల్లాలో 1 సంఘానికి 11 మంది బరిలో ఉన్నారు. యాదాద్రి జిల్లాలో ఎన్నికలు జరిగే సంఘాల్లో మొత్తం 5818 మంది ఓటర్లు, నల్లగొండ జిల్లాలో 2,851 మంది ఓటర్లు, సూర్యాపేట జిల్లాలో 230 మంది ఓటర్లు మొత్తం 8,899 మంది ఓటర్లు ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఓటు హక్కు కలిగిన ఓటర్లకు సంఘం గుర్తింపు కార్డులు, ఓటరు స్లిప్పులను పంపిణీ చేశారు. ఎన్నికలు జరిగే సంఘాలు ఇవే.. భూదాన్పోచంపల్లి , భువనగిరి, బండసోమారం, ఆత్మకూర్ (ఎం) మండలం రహీంఖాన్పేట మార్కండేయ సొసైటీ, యాదగిరిగుట్ట ఎస్ఎల్ఎన్ఎస్ సిల్క్ సొసైటీ, వలిగొండ మండలం వెల్వర్తి సంఘం, చౌటుప్పల్, కొయ్యలగూడెం, కుంట్లగూడెం, నేలపట్ల, నారాయణపురం, పుట్టపాక శ్రీభావనారుషి సొసైటీ, పుట్టపాక సిల్క్సొసైటీ, రామన్నపేట మండలం భోగారం, సిరిపురం, జనంపల్లి, వెంకటరమణ సొసైటీ, వెల్లంకి, మోత్కూర్, నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని చర్లపల్లి, నార్కట్పల్లి మండలం మాండ్ర, గట్టుప్పల్, గట్టుప్పల్ ధనలక్ష్మి సొసైటీ, మునుగోడు, పలివెల, పలివెల బాలాజీ సిల్క్ సొసైటీ , చండూర్, మర్రిగూడ మండలం వట్టిపల్లి, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి. రహస్య పద్ధతిలో ఎన్నికలు ప్రతి చేనేత సంఘంలోని 7 జనరల్, 2 మహిళా రిజర్వు మొత్తం 9 డైరెక్టర్ స్థానాలకు రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగనున్నాయి. జనరల్ అభ్యర్థులకు తెలుపు రంగు, మహిళా రిజర్వు అభ్యర్థులకై తే పింక్ రంగు బ్యాలెట్ పత్రం ఇస్తారు. పోలింగ్ ముగిసిన అనంతరం అదేరోజు ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. కోరం ఉంటే పోలింగ్ జరిగిన 3 రోజుల లోపు ఎప్పుడైనా ఎన్నికై న 9 మంది డైరెక్టర్ల నుంచి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధానకార్యదర్శి, కోశాధికారిని చేతులెత్తే పద్ధతిలో ఎన్నుకుంటారు. మిగిలిన వారు సభ్యులుగా ఉంటారు. ఒక్క ఓటు ఎక్కువైనా చెల్లదు జనరల్ స్థానాలలో పోటీ చేస్తున్న డైరెక్టర్ల అభ్యర్థుల బ్యాలెట్ పత్రంలో గరిష్టంగా 7, లేదా అంతకంటే తక్కువ మందికి ఓటు వేసినా చెల్లుబాటు అవుతుంది. కానీ ఏడుగురి ఓట్ల కంటే ఒక్క ఓటు ఎక్కువ వేసినా అది రద్దవుతుంది. అలాగే రెండు మహిళా స్థానాల బ్యాలెట్లో రెండు, లేదా ఒకరికి ఓటు వేసినా చెల్లుతుంది. కానీ రెండుకంటే ఒక్క ఓటు ఎక్కువైనా చెల్లదు. ఫ ఉమ్మడి జిల్లాలో 28 సంఘాలకు ఎన్నికలు ఫ ఉదయం 7నుంచి 3గంటల వరకు పోలింగ్ ఫ పోలింగ్ ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు.. ఫలితాల వెల్లడి -
కాంగ్రెస్లో కమిటీల చిచ్చు!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ మండల కమిటీల అధ్యక్షుల నియామకాలు ఆ పార్టీలో వర్గ పోరుకు తెరలేపాయి. పాత, కొత్త కాంగ్రెస్ నాయకులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతల అనుచరుల మధ్య ఉన్న విభేదాలు.. ఈ నియామకాలతో బహిర్గతమయ్యాయి. పలు మండలాల్లో బహిరంగంగానే నిరసనలు, ఘర్షణలు చోటు చేసుకోగా మరికొన్ని మండలాల్లో అంతర్గతగా అసంతృప్తి తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి, తుంగతుర్తి, నూతనకల్, మద్దిరాల, నాగారం, జాజిరెడ్డిగూడెం, అడ్డగూడూర్, మోత్కూర్ మండలాలకు నియమించిన పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే మందుల సామేల్ వర్గానికే చెందిన వారని సీనియర్ నాయకులు ఆరోపించారు. ఎమ్మెల్యే వైఖరిని అధిష్టానానికి వివరించేందుకు కొందరు నాయకులు, కార్యకర్తలు బుధవారం గాంఽధీభవన్కు వెళ్తుండగా అర్వపల్లిలో ఎమ్మెల్యే అనుచరులు, సీనియర్ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అనంతరం గాంఽధీ భవన్ వెళ్లి అక్కడ నిరసన వ్యక్తం చేశారు. పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసిన వారిని కాకుండా ఇటీవల తనతోపాటు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేసి మండల అధ్యక్షులుగా నియమించారని ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, మాజీ మంత్రి, దివంగత దామోదర్రెడ్డి వర్గీయులు ఎమ్మెల్యేపై నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు ఎంపీ మాత్రం.. మండల అధ్యక్షుల నియామక విషయంలో ఏకాభిప్రాయం కుదిరాకే ప్రకటించాల్సి ఉందని ఇటీవల టీపీసీసీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. మంత్రి ఉత్తంకుమార్రెడ్డి సూచించిన వ్యక్తికి కూడా మండల అధ్యక్ష పదవి ఇవ్వకపోవడంతో కూడా ఆందోళనకు కారణమైంది. ● మద్దిరాల మండలంలో గతంలో అధ్యక్షుడిగా ఉన్న ముక్కాముల అవిలమల్లుయాదవ్ స్థానంలో పచ్చిపాల వెంకన్నయాదవ్ను నియమించారు. వెంకన్న యాదవ్.. ఎమ్మెల్యే సామేల్తో గతంలో బీఆర్ఎస్తో కలిసి పనిచేసిన వ్యక్తి కావడంతో ఎమ్మెల్యే తన అనుచరుడికే పదవి కట్టబెట్టాడని సీనియర్లు ఆరోపిస్తున్నారు. సీనియర్ నాయకుడు మార్త కృష్ణమూర్తిని అధ్యక్షుడిగా చేయాలని కోరినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● మోత్కూర్ మండల అధ్యక్షుడిగా రాచకొండ బాలరాజు నియామకాన్ని ముసిపట్ల గ్రామానికి చెందిన తండ సత్తయ్య తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీ శ్రేణుల అభిప్రాయాన్ని తీసుకోకుండా ఎమ్మెల్యే ఏకపక్షంగా అధ్యక్షుడిని నియమించారని ఆరోపించారు. మునుగోడు మండలంలో బహిరంగంగా ఎలాంటి నిరసనలు వ్యక్తం కాకపోయినా.. మండల అధ్యక్షుడి ఎంపికపై కొందరు నాయకులు అసంతృప్తితో ఉన్నారు. ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కోసం పని చేసిన నాయకుడికే పదవి ఇవ్వడంతో.. రాజగోపాల్రెడ్డి వెంట బీజేపికి వెళ్లి తిరిగి వచ్చిన వారికి అవకాశం లేకపోవడం కొందరికి నచ్చ లేదని తెలుస్తోంది. కోదాడ నియోజకవర్గంలో ఒకేసారి నాలుగు మండలాల అధ్యక్షులను మార్చడం పార్టీలో చర్చనీయాంశమైంది. కనీస సమాచారం ఇవ్వకుండా మార్చడంతో సీనియర్ నాయకులు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అదే విధంగా హైదరాబాద్లో నివాసం ఉంటున్న ఒంటిపులి వెంకటేష్ను కోదాడ పట్టణ అధ్యక్షుడిగా నియమించడం కూడా పార్టీలో చర్చకు దారితీసింది. బయటకు ఎవరు స్పందించకపోయినా లోలోపల అసంతృప్తి వ్యక్తమవుతోంది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నిడమనూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా నర్సింగ్ విజయ్కుమార్గౌడ్ను నియమించడంతో అక్కడ వర్గపోరు బయటపడింది. మొదట మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు నందికొండ రామేశ్వరి మట్టారెడ్డి పేరును మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి ప్రతిపాదించినప్పటికీ మార్కెట్ కమిటీ చైర్మన్ అంకతి సత్యం చొరవతో ఊట్కూరు గ్రామానికి చెందిన విజయ్కుమార్కు పదవి దక్కింది. పార్టీ నిబంధనల ప్రకారం ప్రతి నియోజకవర్గంలో ఒక మహిళకు మండల అధ్యక్ష పదవి ఇవ్వాలని ఉన్నప్పటికి విస్మరించారని రామేశ్వరి మట్టారెడ్డి వర్గం అసంతృప్తి వ్యక్తం చేసింది. పార్టీలో విభేదాల కారణంగా ఎమ్మెల్యే జైవీర్రెడ్డి కూడా నిడమనూరు మండల కార్యకర్తలకు దూరంగా ఉంటున్నారని ప్రచారం సాగుతోంది. ఫ కొత్త అధ్యక్షుల నియామకంతో వర్గపోరు బహిర్గతం ఫ అర్వపల్లిలో కొట్టుకున్న కార్యకర్తలు ఫ మిగతా మండలాల్లోనూ అంతర్గత అసంతృప్తి ఫ ఎమ్మెల్యేల ఆధిపత్యంపై నిరసనలు మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్నాయక్ వర్గాల మధ్య విభేదాల కారణంగా ఇప్పటికీ కొన్ని మండల కమిటీల ఏర్పాటు కొలిక్కి రాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దామరచర్ల, మిర్యాలగూడ రూరల్, టౌన్ కమిటీలో ఇరువర్గాలు పోటీపడుతున్నాయి. దేవరకొండ నియోజకవర్గంలోని కొండమల్లేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి నియామకంలో రెండు వర్గాల మధ్య చర్చలు జరిగినప్పటికీ ఎమ్మెల్యే నిర్ణయంతో మాజీ ఎంపీపీ దూదిపాల రేఖశ్రీధర్రెడ్డి వర్గానికి చెందిన నేతలకు పదవి కేటాయించినట్లు చర్చ జరగుతోంది. దీంతో పార్టీలో పలువురు నాయకులు అసంతృప్తిగా ఉన్నప్పటికీ బహిరంగంగా స్పందించడం లేదు. -
సాండ్ ట్యాక్సీకి మళ్లీ అంతరాయం
అర్వపల్లి : గృహ నిర్మాణదారులకు తక్కువ ధరకే ఇళ్ల వద్దకు ఇసుక సరఫరా చేసేందుకు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ చొరవతో రెండేళ్ల నుంచి అమలు చేస్తున్న ‘మన ఇసుక–మన వాహనం’ సాండ్ ట్యాక్సీ విధానానికి మళ్లీ అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం మూసీనదిలో జాజిరెడ్డిగూడెం మండలం తుంగగూడెం, నాగారం మండలం పేరబోయినగూడెం గ్రామాలకు చెందిన రెండు ఇసుక క్వారీలు నడుస్తున్నాయి. అయితే రోడ్లు, ఇసుక లోడింగ్ వద్ద సమస్యలు ఏర్పడి మళ్లీ క్వారీలు బందయ్యాయి. రెండు రోజుల నుంచి ఇసుక సరఫరా నిలిచిపోయింది. పేరబోయినగూడెంలోని వాగులో ఇసుక నిల్వ లేక అక్కడి ట్రాక్టర్లు మండల హద్దుదాటి జాజిరెడ్డిగూడెం శివారులోని తుంగగూడెం రీచ్కు వచ్చి ఇసుకను లోడ్ చేసుకుంటున్నాయని ఇరు గ్రామాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. దీంతో రెండు మండలాల తహసీల్దార్లు, ఎస్ఐలు, సీఐ, మైనింగ్ అధికారులు సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించినా ఫలించలేదు. దీంతో క్వారీలు బందై ఇసుక రవాణా నిలిచిపోయింది. ఇక్కడి నుంచే రెండు నియోజకవర్గాలకు.. నాగారం మండలం పేరబోయినగూడెం క్వారీ నుంచి 225, తుంగగూడెం క్వారీ నుంచి 420 చొప్పున ట్రాక్టర్లలో రోజూ సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలకు ఇసుక సరఫరా జరుగుతుంది. ప్రస్తుతం ఈ రెండు క్వారీల పరిధిలో సుమారు 1,800 ట్రాక్టర్లకుపైగానే ఇసుక కావాల్సిన వారు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు. అయితే పేరబోయినగూడెం క్వారీలో ఇసుక లేకపోవడంతో అక్కడి ట్రాక్టర్లు తుంగగూడెంలోని తమ క్వారీకి వస్తుండడంతో గొడవలు జరుగుతున్నాయని జాజిరెడ్డిగూడెం మండల ట్రాక్టర్ యజమానులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందదించి క్వారీల మధ్య హద్దులు నిర్ణయించి, రోడ్లను మరమ్మతు చేయించి జాజిరెడ్డిగూడెం నుంచి ఇసుక ట్రాక్టర్లు రాకుండా వేరేదారుల గుండా ఇసుక రవాణాను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. ట్రాక్టర్లు వెళ్లకుండా బందు చేసిన తుంగగూడెం ఇసుక క్వారీ దారి క్వారీ నుంచి ఇసుక లోడ్తో వస్తున్న ట్రాక్టర్లు (ఫైల్)మూసీనదిలోని ఇసుక క్వారీల వద్ద ఎదురవుతున్న సమస్యలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. పేరబోయినగూడెం వద్ద రోడ్డును తవ్వడంతో ఇసుక రవాణాకు అంతరాయం ఏర్పడింది. దీంతో రెండు క్వారీలు తాత్కాలికంగా బందయ్యాయి. త్వరలో సమస్యలను పరిష్కరించి ఇసుక రవాణా పునరుద్ధరిస్తాం. – బాషపాక శ్రీకాంత్ తహసీల్దార్, జాజిరెడ్డిగూడెం మండలం ఫ పేరబోయినగూడెం క్వారీలో ఇసుక నిల్వలు నిల్ ఫ ఇక్కడి ట్రాక్టర్లు తుంగగూడెం క్వారీకి.. ఫ ట్రాక్టర్ యజమానుల మధ్య ఘర్షణతో బందైన క్వారీలు ఫ రెండు రోజులుగా నిలిచిన ఇసుక రవాణా -
అమ్మ పేరుతో ఓ మొక్క
15 నుంచి ‘ఏక్ పేడ్ మా కే నామ్–సోయింగ్ టు గ్రోయింగ్’ సూర్యాపేటటౌన్ : పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా ‘ఏక్ పేడ్ మా కే నామ్ (అమ్మ పేరుతో ఓ మొక్క)–సోయింగ్ టు గ్రోయింగ్–2026’ జాతీయ విద్యార్థి పర్యావరణ పోటీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 15 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పర్యావరణ పరిరక్షణలో పాలు పంచుకోవడమే కాకుండా ఆకర్షణీయమై బహుమతులు గెలుచుకోవచ్చు. తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్స్ (టీఎన్జీసీ), జిల్లా విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమం పోస్టర్ను సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆవిష్కరించారు. పర్యావరణంపై అవగాహన పెంచడమే లక్ష్యం విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడంతో పాటు మొక్కల పెంపకాన్ని జీవనశైలిలో భాగంగా మార్చడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ప్రతి విద్యార్థి తన తల్లి పేరుతో ఒక మొక్కను నాటి సంరక్షించేలా కార్యక్రమాన్ని రూపొందించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఒక్కోదాంట్లో కనీసం పది పండ్ల మొక్కలు, ఇతర మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతిఒక్కరూ భాగస్వాములే.. ఈ పోటీలో పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో పాటు పరిశోధకులు, స్వచ్ఛంద సంస్థలు, సాధారణ పౌరులూ పాల్గొనే అవకాశం కల్పించారు. మొక్కలు నాటడం, సీడ్ బాల్స్ తయారీ, పర్యావరణపై అవగాహన వంటి కార్యకలాపాల్లో పాల్గొని వాటికి సంబంధించిన ఫొటోలను అప్లోడ్ చేయడం ద్వారా పోటీలో అన్ని విద్యాసంస్థల విద్యార్థులు భాగస్వాములు కావచ్చు. ఫొటో అప్లోడ్ ఇలా.. ఈ కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థులు తమ తల్లి పేరు మీద ఒక మొక్కను నాటి ఈ సెల్ఫీని నేషనల్ గ్రీన్ కార్స్(ఎన్జీసీ) పోర్టల్లో అప్లోడ్ చేయాలి. ఫొటో అప్లోడ్ చేయగానే వెంటనే మీ సెల్ఫీతో కూడిన ఈ సర్టిఫికెట్ జనరేట్ అవుతుంది. ఎక్కడైతే ఎక్కువగా సర్టిఫికెట్లు అయ్యాయో వాటిని గుర్తించి నగదు ప్రోత్సాహకాలు అందిస్తారు. సీడ్ బాల్స్(విత్తన బంతులు) తయారీలోనూ చురుగ్గా వ్యవహరించే వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి విద్యార్థి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అన్ని ప్రభు త్వ, ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలలు భాగస్వామ్యం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. పర్యావరణ పరిక్షణను విద్యార్థుల దైనందిన జీవితంలో భాగంగా మార్చేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. – ఎల్.దేవరాజు, ఎన్జీసీ జిల్లా కోఆర్డినేటర్ ఫ జాతీయ విద్యార్థి పర్యావరణ పోటీ పేరుతో కార్యక్రమం ఫ సెప్టెంబర్ 15 వరకు నిర్వహణ ఫ ప్రతి పాఠశాలలో కనీసం పది పండ్ల మొక్కలు నాటేలా కార్యాచరణ ఫ అధిక స్కోర్ సాధించే వారికి ప్రోత్సాహకాలు అందజేతజిల్లాలో పాఠశాలలు, కళాశాలలు అన్ని కలిపి 1,200కుపైగా విద్యాసంస్థలు ఉంటే వీటిల్లో లక్షకుపైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ నెల 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఈ పోటీలు జరగుతాయి. దీంతోపాటు పర్యావరణంపై క్విజ్పోటీలు నిర్వహిస్తారు. పాల్గొన్న వారందరికీ సర్టిఫికెట్ జనరేట్ అవుతుంది. సెప్టెంబర్ 20న ఫలితాలు వెల్లడిస్తారు. జిల్లాల వారీగా అత్యధిక స్కోర్ సాధించిన ఐదుగురు విద్యార్థులకు, ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొనేలా కృషి చేసిన హెచ్ఎంలు, ఉపాధ్యాయులకు ప్రశంసా పత్రాలు అందజేస్తారు. తద్వారా జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి పచ్చదనాన్ని విస్తరింపజేసి ‘హరిత సూర్యాపేట’ లక్ష్య సాధనకు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని అధికారులు భావిస్తున్నారు. -
ఓటర్ల సందేహాల నివృత్తికి హెల్ప్డెస్క్
భానుపురి (సూర్యాపేట) : ఓటరు జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్)–2026 ప్రక్రియలో సందేహాల నివృత్తికి కలెక్టరేట్లో ప్రత్యేక హెల్ప్డెస్క్ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. 2002 ఓటరు జాబితాలో వివరాల పరిశీలనతో పాటు ఇతర సాంకేతిక ఇబ్బందుల పరిష్కారానికి ఈ కేంద్రం నిరంతరం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్ధికి శిక్షణ ఎస్సీ సహకార అభివృద్ధి సంస్థ ప్రతిపాదన మేరకు జిల్లాలో ఎస్సీ అభ్యర్థుల కోసం వ్యవస్థాపకతతో కూడిన నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆగ్రో ఆధారిత ఉత్పత్తులు, హెర్బల్ కాస్మెటిక్స్, ఫ్యాషన్ గార్మెంట్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, ఇతర స్వయం ఉపాధి రంగాలకు సంబంధించిన అంశాలపై నిపుణులతో శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. శిక్షణ కాలవ్యవధి ఎనిమిది రోజుల పాటు ఉంటుందని, శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు శిక్షణలో పాల్గొనేందుకు తమ పేర్లను tgsc bhhavitha. cgg.gov.inపోర్టల్లో నమోదు చేసుకోవాలని కోరారు. సంప్రదించాల్సిన నంబర్లు కలెక్టరేట్ ఆఫీస్ హెల్ప్డెస్క్ : 6281492368 బి.భరత్ (డీటీ ఎలక్షన్ సెల్) : 9573085943 కె.రణదీప్ (ఐటీ సపోర్ట్) 9059170790 ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
సైబర్ బాధితులకు అండగా ఉందాం
సూర్యాపేటటౌన్ : సైబర్ నేరగాళ్ల పడి నష్టపోతున్న బాధితులకు పోలీస్ సిబ్బంది మానవతాదృక్పథంతో సేవలు అందిస్తూ అండగా ఉందామని ఎస్పీ నరసింహ అన్నారు. సూర్యాపేటలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం సైబర్ వారియర్ పోలీస్ సిబ్బందికి సైబర్ క్రైమ్ వర్టికల్ ట్రైనింగ్ పేరుతో నిర్వహించిన ప్రత్యేక శిక్షణలో ఆయన మాట్లాడారు. బాధితులు ఆర్థికంగా నష్టపోయిన డబ్బును వీలైనంత త్వరగా తిరిగి వారికి అందేలా కృషి చేయాలన్నారు. జిల్లా సైబర్ సెక్యూరిటీ సెల్ సిబ్బందితోసమన్వయం చేసుకుంటూ, సాంకేతికత సహాయంతో సైబర్ మోసగాళ్లను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 జాతీయ హెల్ప్లైన్ నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్రెడ్డి, సైబర్ సెక్యూరిటీ సెల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ,సైబర్ వారియర్స్ పాల్గొన్నారు. హైవేపై నిరంతరం పెట్రోలింగ్మునగాల : రహదారి భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణకు జాతీయ రహదారిపై నిరంతరం పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ కె.నరసింహ తెలిపారు. మంగళవారం ఆయన మునగాల పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేశారు. రిసెప్షన్ సెంటర్లో ఫిర్యాదుల స్వీకరణ, స్టేషన్ రికార్డులు, సీసీ కెమెరాల నిర్వహణ, కేసుల స్థితిగతులతోపాటు స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి బాధితుడికి భరోసా కల్పించేలా రిసెప్షన్ సెంటర్ సిబ్బంది పనిచేయాలని ఆదేశించారు. చట్టాన్ని ఉల్లంఘించే వ్యక్తులను జైలుకు పంపుతామన్నారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి, ఏఎస్ఐ వెంకటరత్నం, పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఎస్పీ నరసింహ -
డీఏపీని అధిక ధరకు విక్రయించొద్దు
నేరేడుచర్ల : డీఏపీని అధిక ధరకు విక్రయిస్తే షాపుల లైసెన్స్లను రద్దు చేస్తామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి (డీఏఓ) జి.శ్రీధర్రెడ్డి హెచ్చరించారు. మంగళవారం నేరేడుచర్లలోని జయలక్ష్మి ఫర్టిలైజర్స్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి మాట్లాడారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో ఎరువులను బ్లాక్ మార్కెట్కు తరలిస్తూ అధిక ధరలకు విక్రయించే వారిపై కేసులను నమెదు చేస్తామన్నారు. ఇటీవల మద్దిరాలలో స్వర్ణ ఫర్టిలైజర్స్ లైసెన్స్ను రద్దు చేశామని గుర్తు చేశారు. జిల్లా వ్యాప్తంగా 797 మెట్రిక్ టన్నుల డీఏపీ డీలర్లు, సొసైటీల వద్ద అందుబాటులో ఉందని, ఈ సీజన్కు గాను యూరియా 10,981 మెట్రిక్ టన్నులు, పొటాష్ 844 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 15,712 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్బీ 1,063 టన్నులతో కలిపి మొత్తం 29,399 మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 600 మంది లైసెన్స్లు కలిగిన డీలర్లు ఉన్నందున లైసెన్స్ కలిగిన డీలర్ల వద్దనే ఎరువులు కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు. జిల్లాలో సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి జావీద్ ఉన్నారు.ఫ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్రెడ్డి -
విత్తనాల ఎంపికే కీలకం
హుజూర్నగర్ : వరి సాగులో విత్తనాల ఎంపికే కీలమని ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట మండలం గరికపాడు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు విజయ భాస్కర్రెడ్డి, రవి కిషోర్, పామ్ మేనేజర్ నాగశ్రీ అన్నారు. మంగళవారం హుజూర్నగర్ మండలం వేపల సింగారంలో రైతులు పోసిన వరినారు మడులు, విత్తనాల సంచులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గరికపాడు నుంచి దాదాపు వంద మంది రైతులు 300 కట్టల బీపీటీ 5204 రకం విత్తనాలు తెచ్చి నారు పోస్తే సరిగా మొలక రాలేదని తెలిపారు. అనంతరం శాస్త్రవేత్తలు మాట్లాడుతూ అన్నిరకాల పరీక్షల తర్వాతనే విత్తనాలను విక్రయించామని, ప్రస్తుతం ఈ విత్తనాలను జర్మినేషన్ టెస్ట్కు పంపుతామన్నారు. కార్యక్రమంలో రైతులు సీహెచ్.రారెడ్డి, జి.వెంకటరెడ్డి, సీతారాంరెడ్డి, వీరమోహన్రెడ్డి, రాంరెడ్డి, కాశిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, సైదులు, రాంమోహన్రెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలినేరేడుచర్ల : అధ్యాపకులు చెప్పే పాఠాలను విద్యార్థులు అర్థం చేసుకుని పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (డీఐఈఓ) బి.సులోచన అన్నారు. మంగళవారం నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థులంతా క్రమశిక్షణతో ఉండాలని, సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ ఏడాది కళాశాల ప్రారంభం నుంచే ప్రాక్టికల్ జరుగుతున్నాయన్నారు. అడ్మిషన్లు పెంచాలని అధ్యాపకులను కోరారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నీరజ, అధ్యాపకులు వెంకటరమణ, సైదులు, ప్రణతి, కేఎల్ఎన్.రావు, జానకిరాంరెడ్డి, శ్రీనివాసులు, వెంకన్న, నరేందర్, నర్సింహాచారి, అంజయ్య, ప్రసాద్, గణేష్, అపర్ణ, వీరేష్ పాల్గొన్నారు. మట్టపల్లిలో నిత్య కల్యాణంమఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో మంగళవారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి నిత్య కల్యాణాన్ని అర్చకులు విశేషంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్కు పంచామృతాభిషేకం జరిపారు. శ్రీస్వామి అమ్మవార్ల ఎదుర్కోలు, కల్యాణం చేపట్టి గరుడ వాహనంపై ఊరేగించారు. క్షేత్రపాలకుడైన శ్రీవీరాంజనేయస్వామికి ఆకు పూజ చేశారు. భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ టి.చలపతిరావు, అర్చకులు తూమాటి క్రిష్ణమాచార్యులు, శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు. -
తుదిశ్వాస వరకు ప్రజల కోసమే..
సాక్షి, యాదాద్రి : నమ్మిన సిద్ధాంతాన్ని జీవితాంతం ఆచరించారు.. తెలంగాణ తొలి, మలి ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకు ఎదిగినా సాధారణ జీవితమే గడిపారు. పదవులు లేకున్నా ప్రజల పక్షాన పనిచేసిన భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి (82) అనా రోగ్యంతో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2గంటలకు మరణించారు. ఆయన 1962– 1970 వరకు తొలుత స్వగ్రామం బీబీనగర్ మండలం బ్రా హ్మ ణపల్లికి సర్పంచ్గా, రెండుసార్లు భువనగిరి తాలుకా సమితి ప్రెసిడెంట్గా పనిచేశారు. రెండు పర్యాయాలు విజయం 1978లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నర్సింహారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో మాజీ మంత్రి కొండాలక్ష్మణ్ బాపూజీపై గెలిచారు. 1983 ఎన్నికల్లో రాష్ట్రమంతటా ఎన్టీ రామారావు ప్రభంజనం కనిపించినా, భువనగిరి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెండవ సారి కొమ్మిడి గెలుపొందారు. 1985లో అసెంబ్లీకి వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు. అప్పట్లో ఎన్టీ రామారావు స్వయంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించినా కూడా నర్సింహారెడ్డి వెళ్లలేదు. స్కూటర్పై అసెంబ్లీకి.. రెండు సార్లు ఎమ్మెల్యే, సర్పంచ్గా పనిచేసిన నర్సింహరెడ్డికి సొంత ఇల్లులేదు. భూస్వామ్య కు టుంబంలో జన్మించిన ఆయన నిస్వార్థ ప్రజా సేవ చేశారు. స్వగ్రామం బ్రాహ్మణపల్లిలో తండ్రి నిర్మించిన ఇంట్లో ఉంటూనే ఆయన ప్రజలకు సేవలందించారు. ఆయన ఆర్టీసీ బస్సులలోనే తిరిగేవా రు. స్కూటర్ పైనే అసెంబ్లీకి వెళ్లేవారు. కొద్ది రో జులు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్న ఆయన.. ఆ తర్వాత ఘట్కేసర్ సమీపంలోని సంస్కృతి టౌన్షిప్ (సింగపూర్ సిటీ)లో చాలారోజులు అద్దెకున్నారు. రామంతాపూర్లో నివాసముంటున్న పెద్ద కూతురు రజినిరెడ్డి ఇంట్లోనే చివరి రోజులు గడిపారు. గోదావరి – మూసీ అనుసంధానం కోసం... ● భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, చౌటుప్పల్ ప్రాంతాలకు గోదావరి జలాలు రప్పించాలని, గోదావరి–మూసీనదుల అనుసంధానం కోసం కొమ్మిడి సుదీర్ఘ పోరాటం చేశారు. గోదావరి జలా లను మూసీ నదిలోకి మళ్లించడం ద్వారా లక్ష ఎకరాలను ఏ విధంగా సశ్యశ్యామలం చేయవచ్చో ఒక బ్లూప్రింట్ తయారు చేశారు. ఆ బ్లూప్రింటును ఒక పెద్ద ఫ్లెక్సీపై ప్రింట్ చేయించి, ఆయన వద్దకు ఎవరు వెళ్లినా ఒక ఇంజనీర్లా వివరించేవారు. మూసీ జల కాలుష్యం నివారణకు, మానవ వ్యర్థాలతో పాటు రసాయన వ్యర్థాలను మూసీ నదిలో కలుపొద్దని అనేక పోరాటాలు చేశారు. ● ప్రాణహిత – చేవేళ్ల కోసం రంగారెడ్డి జిల్లా శామీర్పేట చెరువును రిజర్వాయర్ చేయాలని పోరాడారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు ఆమోద యోగ్యం కాదని నిక్కచ్చిగా స్పష్టం చేశారు. ● 2013 మర్చి నెలలో బీబీనగర్లో నిమ్స్ (ప్రస్తుతం ఎయిమ్స్) ఏర్పాటు కోసం కోసం ఆమరణ దీక్ష చేశారు. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి సూచన మేరకు సీనియర్ నేత జానారెడ్డి బీబీనగర్కు వచ్చి నర్సింహారెడ్డి చేత దీక్ష విరమింపజేశారు. కొమ్మిడి నర్సింహారెడ్డి భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి బుధవారం ఉదయం స్వగ్రామం బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లికి తీసుకువస్తారు. ప్రజల సందర్శనార్థం కొద్దిసేపు ఉంచి అనంతరం అంత్యక్రియలు నిర్వహిస్తారు. అందుకు గ్రామంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఫ భువనగిరి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం ఫ అద్దె ఇంట్లోనే నివసించిన ఆదర్శ నేత ఫ మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి అనారోగ్యంతో కన్నుమూత -
ప్రజావాణి దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రజావాణి కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడారు. జిల్లా, డివిజన్ స్థాయి ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను తప్పనిసరిగా ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. అధికారులు ప్రజలు పెట్టుకున్న అర్జీలను పెండింగ్లో ఉంచకుండా, నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డివిజన్ స్థాయి ప్రజావాణికి అన్ని శాఖల డివిజనల్ అధికారులు హాజరు కావాలని, జిల్లా అధికారులు పర్యవేక్షించాలన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజా వాణిలో మొత్తం 76 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, డీఆర్ఓ ప్రేమ్రాజు, జడ్పీ సీఈఓ శిరీష, డీపీఓ యాదగిరి, డీఎంహెచ్ఓ వెంకటరమణ, హౌసింగ్ పీడీ సిద్ధార్థ్, డీఎఫ్ఓ దామోదర్ రెడ్డి, సీపీఓ కిషన్, డీఈఓ అశోక్, అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ -
ధాన్యం అప్పగించారు.. రికవరీ మరిచారు!
ఉమ్మడి జిల్లాలో రూ.553.42 కోట్ల విలువైన ధాన్యం మింగిన మిల్లర్లు సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మిల్లర్లకు ఇచ్చిన ధాన్యానికి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) రాబట్టుకోవాల్సిన పౌర సరఫరాల విభాగంలోని కొందరు అధికారులు అడ్డగోలు తీరుతో ప్రభుత్వానికి తీరని నష్టం వాటిల్లింది. మిల్లర్లు ఒక్క నల్లగొండ జిల్లాలోనే 248.61 కోట్ల విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించగా, సూర్యాపేట జిల్లాలో రూ.252 కోట్ల విలువైన ధాన్యాన్ని, యాదాద్రి జిల్లాలో రూ.52.80 కోట్ల విలువైన ధాన్యాన్ని దిగమింగారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.553.42 కోట్ల విలువైన ధాన్యం బకాయిలు పెండింగ్లో పడ్డాయి. ఇదంతా ఒక్క 2022–23 యాసంగి సీజన్కు సంబంధించిందే కావడం గమనార్హం. మిల్లర్లతో కుమ్మక్కు అయి అమ్యామ్యాలకు అలవాటుపడిన కొందరు అధికారులు వాటి రికవరీ చేయడంలో అంతులేని నిర్లక్ష్యం చూపుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. గత్యంతరం లేక వేలం వేసిన ప్రభుత్వం రైతులనుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకు సీఎంఆర్ కోసం కేటాయించింది. మిల్లర్లు మరాడించి బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. ఏ సీజన్లో ధాన్యం కేటాయిస్తే గరిష్టంగా మూడు నెలల్లోగా బియ్యంగా మార్చి మిల్లర్లు ఇవ్వాలి. 2022–23 యాసంగిలో కేటాయించిన ధాన్యానికి సంబంధించిన బియ్యాన్ని ఉమ్మడి జిల్లాలోని దాదాపు 200 మిల్లుల నుంచి 2,47,416.47 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించిన సీఎంఆర్ బియ్యం ఇవ్వలేదు. అయినా అప్పట్లో అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ప్రభుత్వం మిల్లులోని ఆ ధాన్యాన్ని 2024లో వేలం వేసింది. దాంతో వేలం దక్కించుకున్న వారికి మిల్లర్లు అప్పగించింది కేవలం 9 శాతం లోపే. మిగతా ధాన్యం ఎందుకు ఇవ్వడం లేదన్న విషయాన్ని సీరియస్గా తీసుకొని మిల్లుల్లో తనిఖీలు చేయించింది. మిగిలిన ఆ ధాన్యం చాలా మిల్లుల్లో లేదని తనిఖీ బృందాలు గుర్తించాయి. మిల్లర్లు పక్కదారి పట్టించినట్లు తేల్చాయి. ప్రభుత్వం రికవరీకి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఏడు మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది. రికవరీ చేసింది అంతంతే.. ధాన్యం పక్కదారి పట్టించిన మిల్లర్లపై ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. అంతేకాదు రెవెన్యూ రికవరీ యాక్ట్ (ఆర్ఆర్ యాక్ట్) అమలుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో కొందరు మిల్లర్లు ధాన్యానికి బదులుగా డబ్బు చెల్లిస్తామని ముందుకొచ్చారు. మిల్లర్ల తరఫున కొందరు రాజకీయ నేతలు రంగంలోకి దిగడంతో వివాదం లేకుండా ధాన్యం రికవరీ కోసం ప్రభుత్వం రెండు నెలల క్రితం కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. ఆ సబ్ కమిటీ ఇటు మిల్లర్లు, పౌరసరఫరాల సంస్థ, ధాన్యం కొనుగోలు చేసేందుకు వేలంలో పాల్గొన్న సంస్థలతో చర్చించింది. మూడు నెలల్లో ధాన్యానికి సంబంధించి అంతే విలువైన డబ్బు చెల్లించాలని మిల్లర్లకు సూచించింది. ఇది జరిగి రెండు నెలలు గడిచినా ఇప్పటివరకు 5 శాతం కూడా చెల్లించలేదు. మొత్తంగా రూ.553.42 కోట్లు రావాల్సి ఉండగా.. మిల్లర్లలో కొందరు మాత్రమే రూ.15 కోట్లలోపే చెల్లించారు. ఇప్పుడు మిల్లర్లు ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారని, ధాన్యం డబ్బులు చెల్లించాల్సిన గడువు ఆగస్టు 5వ తేదీతో ముగుస్తుందని, ఆలోగా చెల్లించాలని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లా వారీగా రికవరీ ఇలా.. నల్లగొండ జిల్లాలో 58 మిల్లుల నుంచి 1,11,146.43 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి రూ.248.61 కోట్లు రావాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.9 కోట్లు మాత్రమే వచ్చింది. ఇంకా రూ.239.61 కోట్లు రికవరీ కావాల్సి ఉంది. సూర్యాపేట జిల్లాలో దాదాపు 70 మిల్లుల నుంచి 1,12,661.26 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి రూ.252 కోట్లు రావాల్సి ఉండగా, ఏమీ రాలేదని పౌరసరఫరాల విభాగం వర్గాలు పేర్కొన్నాయి. యాదాద్రి జిల్లాలో దాదాపు 40 మిల్లుల నుంచి 23,608.78 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి రూ.52.80 కోట్లు రావాల్సి ఉండగా, రూ.2 కోట్లు మాత్రమే వచ్చిందని, ఇంకా రూ.50 కోట్లు రావాల్సి ఉందని పేర్కొన్నారు. ఫ 90 రోజుల్లో రికవరీ చేయాలని కేబినెట్ సబ్కమిటీ ఆదేశం ఫ రెండు నెలల్లో చెల్లించింది రూ.15 కోట్లలోపే.. ఫ అధికారుల తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు -
ప్రజలకు అందుబాటులో పోలీస్శాఖ : ఎస్పీ
సూర్యాపేటటౌన్ : పోలీస్శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఎస్పీ నరసింహ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహించారు. వివిధ మండలాల నుంచి బాధితులు తరలివచ్చి తమ సమస్యలపై ఎస్పీకి వినతులు అందించారు. వారి నుంచి వినతులు స్వీకరించిన ఎస్పీ సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందేలా, వారి ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెంపుడు జంతువులకు ఉచితంగా టీకాలుకోదాడరూరల్: ప్రపంచ జంతు సాంక్రమిక వ్యాధుల దినోత్సవం సందర్భంగా సోమవారం పెంపుడు జంతువులకు ఉచితంగా రేబీస్ నిరోధక టీకాలు వేశారు. కోదాడలోని పశువైద్యశాలలో వైద్యాధికారి డాక్టర్ పి.పెంటయ్య ఆధ్వర్యంలో టీకాలు వేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమ మాట్లాడుతూ పెంపుడు జంతువులకు టీకాలు వేయిస్తేనే యజమానులు సురక్షితంగా ఉండగలుగుతారన్నారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో త్వరలో కుక్కల పునరావాస కేంద్రం ఏర్పాటు చేస్తామని, వీధి కుక్కలకు టీకాలు వేయిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమాదేవి, వైస్ ఛైర్మన్ దేవరపల్లి మల్లీశ్వరి, వార్డు కౌన్సిలర్లు కారింగుల ఉమ, క్షేత్రయ్య పశువైద్యుడు సిరిపురం సురేంద్ర పాల్గొన్నారు. విస్తరణతోనే పెన్షనర్ల సంఘాలు బలోపేతం భానుపురి (సూర్యాపేట) : ప్రభుత్వ పెన్షనర్ల సంఘాలు ఎంత విస్తరిస్తే అంత బలంగా ఉంటాయని ప్రభుత్వ పెన్షనర్ల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య అన్నారు. సోమవారం సూర్యాపేట సంఘం కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. హెల్త్ కార్డులు ఈ నెల 15 నుంచి అమలు అయ్యేందుకు, వచ్చే దసరా, దీపావళి నాటికి పీఆర్సీ ఇప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. 2024 తర్వాత ఉద్యోగ విరమణ చేసిన వారి బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం రూ.4వేల కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు బొల్లు రాంబాబు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యాంసుందర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
కాస్త ఎక్కువే కురిసింది
భానుపురి (సూర్యాపేట) : ప్రస్తుతం ఎల్నినో పరిస్థితుల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కానీ సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా జూన్లో సాధారణానికి మించి వర్షపాతం నమోదైంది. జిల్లాలోనూ వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని వాతావారణ శాఖ అంచనా వేసినప్పటికీ ఇప్పటి వరకు మాత్రం సరిపోను వర్షాలు కురిశాయి. జిల్లాలోని ఒకటి రెండు మండలాలు మినహా మిగతా ప్రాంతాల్లో కురిసిన వర్షాలు మెట్ట పంటల సాగుకు అనుకూలంగా మారాయి. దాంతో అంచనాలకు మేరకు పత్తి సాగైనట్లు వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. 120.3 మి.మీ వర్షపాతంసూర్యాపేట జిల్లాలో జూన్లో సాధారణంగా 95.5 మి.మీ వర్షపాతం కురవాల్సి ఉండగా 120.3 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. కొన్ని మండలాల్లో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. చింతలపాలెం మండలంలో 80.4 మి.మీ వర్షపాతం కురవాల్సి ఉండగా కేవలం 42.4 మి.మీ మాత్రమే కురిసింది. సూర్యాపేట మండలంలో 107.7 మి.మీలకు 94.7 మి.మీ, మునగాల మండలంలో 103.3 మి.మీలకు 96.1, పాలకవీడు మండలంలో 88.4 మి.మీ. కురవాల్సి ఉండగా 64.8 మాత్రమే కురిసింది. మిగతా మండలాల్లో మాత్రం కురవాల్సిన దానికంటే కాస్త ఎక్కువగానే కురవడంతో రైతులు మెట్ట పంటల సాగును ముమ్మరం చేశారు. గతేడాది కన్నా అధికమే..జూన్లో నైరుతి రుతుపవనాలు జిల్లాలోకి ప్రవేశించాక ఏడాది మంచి వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ లెక్కల ప్రకారం తెలుస్తోంది. గతేడాది జూన్లో సాధారణం కంటే తక్కువే కురిసింది. గతేడాది జూన్లో సగటున కేవలం 53.2 మి.మీటర్ల వర్షపాతమే కురియగా.. ఈ సంవత్సరం జూన్లో మాత్రం 120.3 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. జూన్లో కురిసిన వర్షపాతం (మి.మీ)మండలం కురవాల్సింది కురిసిందినాగారం 121 157.7 తిరుమలగిరి 121.4 130.9 తుంగతుర్తి 122.7 221.5 మద్దిరాల 106.9 175.2 నూతనకల్ 103.1 179.4 జాజిరెడ్డిగూడెం 112.2 175.2 సూర్యాపేట 107.7 94.7 ఆత్మకూర్ (ఎస్) 97.8 105.3 మోతె 66.3 108.7 చివ్వెంల 85 92 పెన్పహాడ్ 87.6 97.6 మునగాల 103.3 96.1 నడిగూడెం 95.8 94.3 అనంతగిరి 91 151 కోదాడ 94.6 106.2 చిలుకూరు 87.5 106.2 గరిడేపల్లి 89.4 102.7 నేరేడుచర్ల 86.8 87.1 పాలకీడు 88.4 64.8 మఠంపల్లి 68.8 168.9 హుజూర్నగర్ 93.7 122.2 మేళ్లచెర్వు 84.4 89.7 చింతలపాలెం 80.4 42.4సరాసరి 95.5 120.3జూన్లో సాధారణానికి మించి వర్షాలు సగటున 95.5 మి.మీటర్లకు.. 120.3 మి.మీ నమోదు మెట్ట పంటలకు అనుకూలం ఇప్పటికే అంచనాల మేరకు పత్తి సాగు -
ఇంటింటికీ ఆరు మొక్కల పంపిణీ
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో వన మహోత్సవం కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలని, ప్రతి ఇంటికీ ఆరు మొక్కల పంపిణీని వేగవంతం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని రకాల మొక్కలు అందించి ప్రజలు నాటి సంరక్షించేలా ప్రోత్సహించాలని సూచించారు. పంచాయతీ రాజ్, మున్సిపాలిటీలు, అటవీశాఖ, వ్యవసాయ, నీటి పారుదల శాఖలు సమన్వయంతో ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు. మొక్కలు నాటడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, డీఆర్ఓ ప్రేమ్రాజ్, జడ్పీ సీఈఓ శిరీష, హౌసింగ్ పీడీ సిద్ధార్థ్, డీఎంహెచ్ఓ వెంకటరమణ, డీపీఓ యాదగిరి, సీపీఓ కిషన్, డీఏఓ శ్రీధర్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. ప్రతి విద్యార్థి తల్లి పేరుతో మొక్క నాటాలిప్రతి విద్యార్థి తన తల్లి పేరుతో మొక్కను నాటి, సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వామి కావాలని కలెక్టర్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లో ‘ఏక్ పేడ్ మా కే నామ్’ వాల్ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. తెలంగాణ నేషనల్ గ్రీన్ క్రాప్స్, జిల్లా విద్యాశాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాయని తెలిపారు. జాతీయ విద్యార్థి పర్యావరణ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు, పరిశోధకులు, సాధారణ పౌరులు మొక్కలు నాటడం, సీడ్ బాల్స్ తయారీ, పర్యావరణంపై అవగాహన కార్యక్రమాల్లో పాల్గొని తమ ఫొటోలను అప్లోడ్ చేయడం ద్వారా పోటీలో పాల్గొనవచ్చని వివరించారు. -
మండల అధ్యక్ష నియామకాల్లో మార్పు లేదు
తుంగతుర్తి: నియోజకవర్గంలోని తొమ్మిది మండలాల అధ్యక్షుల నియామకాల్లో ఎలాంటి మార్పు లేదని ఇదే ఫైనల్ అని ఎమ్మెల్యే మందుల సామేలు స్పష్టం చేశారు. సోమవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అందరి అభిష్టం మేరకే ఏఐసీసీ అధిష్టానం, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్, డీసీసీ అధ్యక్షుడి ఆమోదంతో మండల అధ్యక్షుల నియామకాలు జరిగాయన్నారు. తనకు నియోజకవర్గంలో 52 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించిన ప్రజలందరికీ రుణపడి ఉంటానన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.2వేల కోట్ల అభివృద్ధి పనులు చేసినట్లు చెప్పారు. రోడ్ల కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో మొత్తం పనులు ఆగిపోయాయని, ఈ విషయంపై సంబంధిత మంత్రి కోమటిరెడ్డి, అధికారులతో మాట్లాడి అతడిపై చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు చెప్పారు. కేంద్రం తెచ్చిన సర్తో ఓట్లు కోల్పోయే ప్రమాదం ఉందని, ఈ విషయమై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేగటి రవి, మార్కెట్ కమిటీ చైర్మన్ గిరిధర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, సర్పంచులు మల్లేష్, ఝాన్సీ, కార్యకర్తలు పాల్గొన్నారు.ఎమ్మెల్యే మందుల సామేల్ -
ప్రాణాలు తీస్తున్న నిర్లక్ష్యం
అలాగే వదిలేస్తూ..పంటను కాపాడుకోవాలనే ఆత్రుతలో రూ.లక్షలు వెచ్చించి బోర్లు వేస్తున్న రైతులు నీరు పడక పోవడంతో వాటిని అలాగే వదిలేస్తున్నారు. దాంతో బోరు గుంతలు ప్రమాదకరంగా మారుతున్నాయి. చేలల్లో మేతకు తిరిగే జీవాలతో పాటు వాటిని కాసే వారి పిల్లలు, రైతుల పిల్లలు బోరుగుంతలో పడే ప్రమాదం ఉంది. ఇటీవల మిర్యాలగూడ మండలంలో బోరు గుంతలో పడిన బాలుడిని రక్షించేందుకు యత్నించిన తాత కూడా అందులోనే పడి మృతి చెందాడు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే నీరు పడని బోరు గుంతలను వెంటనే పూడ్చి వేయాలని, అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : వానాకాలం సీజన్ ప్రారంభమైనా పెద్దగా వర్షాలు లేక పోవడం, కాల్వల ద్వారా సాగునీరు వచ్చే అంచనాలు లేక పోవడంతో రైతులు తమ పొలాల్లో బోర్లు వేయిస్తున్నారు. నాన్ ఆయకట్టు మండలమైన ఆత్మకూరు ఎస్లో ఎక్కువ మంది రైతులు బోర్ల బాట పట్టారు. ఒక బోరులో నీరు పడకుంటే వేరే చోట ఇంకో బోరు వేస్తున్నారు. నీరు పడని బోరు గుంతలోని కేసింగ్ సైతం తొలగించి అలాగే వదిలేస్తున్నారు. దాంతో అవి ప్రమాదకరంగా మారుతున్నాయి. రెండు నెలల్లో 5వేల బోర్లుఆత్మకూర్ ఎస్ మండలానికి గతంలో ఎస్ఆర్ఎస్పీ కాల్వల ద్వారా సాగునీరు వచ్చేవి. దాంతో ఎక్కువ మంది రైతులు మెట్ట పంటలు వదిలేసి తమ భూములను వరి సాగుకు అనుకూలంగా తయారు చేసుకున్నారు. రెండు సంవత్సరాలుగా ఎస్సారెస్పీ నీళ్లు సక్రమంగా రాకపోవడంతో రైతులు బోర్లపై ఆధార పడుతున్నారు. మండల వ్యాప్తంగా మే, జూన్లో దాదాపు 5 వేలకు పైగా బోర్లు వేసినట్లు సమాచారం. అందులో కేవలం 500 బోర్లలో మాత్రమే నీళ్లు పడ్డాయని రైతులు చెబుతున్నారు. మండల కేంద్రానికి చెందిన రైతు ఉప్పుల పాపయ్య తన మూడెకరాల భూమిలో ఈ సంవత్సరం 8 బోర్లు వేయగా ఒక్క దాంట్లో కూడా నీళ్లు రాలేదు.ప్రమాదకరంగా బోరు గుంతలు వానాకాలం సాగు కోసం బోర్లు వేస్తున్న రైతులు నీరు పడకుంటే పూడ్చకుండా వదిలేస్తున్న వైనం -
హైవేపై మృత్యు వేగం!
జాతీయ రహదారిపై జరుగుతున్న వరుస ప్రమాదాలకు ప్రధాన కారణం మితిమీరిన వేగమే. నిబంధనలను బేఖాతరు చేస్తూ వాహనాలు నడుపుతుండటంతోనే ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. హైవేపై బ్లాక్ స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాలు, మూల మలుపుల వద్ద నిబంధనల మేరకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణించాలి. కానీ, చాలా వాహనాలు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకుపోతున్నాయి. రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము సమయాల్లో డ్రైవర్లు నిద్రమత్తులో ఉండటం, దానికి తోడు అతివేగం తోడవడంతోనే ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు ప్రధానంగా ఇతర రాష్ట్రాల రిజిస్ట్రేషన్లతో ఉన్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులే కారణమవుతున్నాయి. ఇవి నిబంధనలకు విరుద్ధంగా అతివేగంగా దూసుకొస్తూ.. ముందు వెళ్తున్న వాహనాలను వెనుక నుంచి ఢీకొడుతుండటం వల్లే వరుస దుర్ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. చిట్యాల : 65వ నంబర్ జాతీయ రహదారిపై మితిమీరిన వేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం ప్రాణాలను బలితీసుకుంటోంది. నిబంధనలను తుంగలో తొక్కుతూ.. ముఖ్యంగా అర్ధరాత్రి దాటాక ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు సృష్టిస్తున్న బీభత్సంతో జాతీయ రహదారి నెత్తురోడుతోంది. వారం రోజుల వ్యవధిలోనే మూడు ఘోర ప్రమాదాలు జరిగాయి. తాజాగా ఆదివారం తెల్లవారుజామున చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో జరిగిన దుర్ఘటన అందరినీ కలచివేసింది. కూతురి వైద్య చికిత్స కోసం చైన్నె వెళ్లి ఇంటికి తిరుగు పయనమైన ఆ కుటుంబం ప్రయాణిస్తున్న కారును.. ఓ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి అతివేగంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో కళ్లెదుటే భార్య, ఇద్దరు పిల్లలతో పాటు స్నేహితుడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కుటుంబ పెద్ద ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. గమ్యానికి మరో గంటలో చేరుకుంటారనగా ఈ విషాదం చోటుచేసుకుంది. ఫ హైదరాబాద్లోని మధురానగర్లో నివాసముంటున్న మలిరెడ్డి వీర వెంకట నాగ వరప్రసాద్బాబు తన కూతురు వైద్యం కోసం భార్య విజయలక్ష్మి, కుమార్తె శ్రియ, కుమారుడు ప్రభవ్, స్నేహితుడు కట్టా శ్రీకర్ ప్రసాద్ (62)తో కలిసి చైన్నెకి వెళ్లారు. శనివారం రాత్రి చైన్నె నుంచి కారులో హైదరాాబాద్కు తిరుగు పయనమయ్యారు. ఆదివారం తెల్లవారుజామున చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులో విజయవాడ–హైదరాబాద్ హైవేపై గల యూటర్న్ వద్దకు చేరుకోగానే.. వెనుక నుంచి అతివేగంగా వస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వారి కారును బలంగా ఢీకొట్టింది. దీంతో కారు చుట్టూ తిరుగుతూ డివైడర్ను ఢీకొట్టి నుజ్జునుజ్జుగా మారింది. దీంతో జేసీబీలు, కట్టర్ల సహాయంలో కారు టాప్ను కత్తిరించి విజయలక్ష్మి, శ్రియ, ప్రభవ్, శ్రీకర్ప్రసాద్ మృతదేహాలను బయటకు తీశారు. ఈ ప్రమాదంతో దాదాపు గంటపాటు జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఫ జూన్ 30న చిట్యాల మండలం గుండ్రాంపల్లి శివారులో జాతీయ రహదారిపై ఓ వాహనం అతివేగంగా దూసుకొచ్చి ముందున్న వాహనాన్ని ఢీకొట్టింది. అదుపుతప్పిన ఆ వాహనం డివైడర్ను దాటి అవతలి వైపు వెళ్తున్న మరో కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ఘటనలో నార్కట్పల్లి మండలం అక్కెనపల్లికి చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఫ ఈనెల 2న కట్టంగూర్ మండలం ముత్యాలమ్మగూడెం శివారులో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో వచ్చిన ఆ బస్సు ముందు వెళుతున్న సిమెంట్ ట్యాంకర్ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.పెద్ద చెరువువిజయవాడహైదరాబాద్ గాంధీగుడిప్రమాదం జరిగిన స్థలంఫ ప్రమాదపు ఊహా చిత్రంపెద్దకాపర్తి శివారులో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాద ఊహాచిత్రంఫ 65వ నంబర్ జాతీయ రహదారిపై వరుస ప్రమాదాలు ఫ ట్రావెల్స్ బస్సుల అతివేగం, నిర్లక్ష్యంతోనే అనర్థాలు ఫ వారం వ్యవధిలో మూడు ఘటనలు.. ఫ తాజాగా పెద్దకాపర్తి శివారులో కారును ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు ఫ ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు పిల్లలు సహా నలుగురి దుర్మరణం ఫ కూతురి వైద్యం కోసం వెళ్లి వస్తుండగా కాటేసిన మృత్యువు -
లక్ష్మీనరసింహునికి నిత్య కల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఆదివారం అర్చకులు స్వామివారి నిత్య కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. విశ్వక్సేనపూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మాంగల్యధారణ, తలంబ్రాలతో స్వామివారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఆలయ అనువంశిక ధర్మకర్తలు, ఈఓ, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
విద్యతో పాటు ఉపాధి నైపుణ్య శిక్షణ
సూర్యాపేటటౌన్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు విద్యతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు పొందడానికి వీలుగా నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని వర్సిటీ విద్యార్థి సేవా విభాగం డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాల సార్వత్రిక అధ్యయన కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు బేసిక్ కంప్యూటర్స్, జీఎస్టీ అసిస్టెంట్ అకౌంట్, సోలార్ టెక్నీషియన్, సీసీ కెమెరాల ఇన్స్టాలేషన్ వంటి విభాగాలలో శిక్షణ ఇస్తున్నామని, ఈ మేరకు స్వామీ రామానంద తీర్థ గ్రామీణ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. విద్యార్థినులకు టైలరింగ్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నామని, బీఎస్సీ ఎంపీసీ, బీజెడ్సీ, బీకాం కంప్యూటర్స్ విద్యార్థులకు సైన్స్ ప్రాక్టికల్స్ ల్యాబ్ను ఈ సంవత్సరం నుంచి ఎస్వీ కళాశాల కేంద్రంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కోయ, చెంచు, ఆదివాసి గిరిజన విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నామన్నారు. ఓపెన్ వర్సిటీలో అడ్మిషన్ పొందడానికి ఆగస్టు 7 చివరి తేదీగా ఉందని తెలిపారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ వి.వెంకటేషులు, అధ్యాపకులు కిషోర్రెడ్డి, డాక్టర్ అనిల్, మల్లయ్య, సార్వత్రిక అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్ ఎన్ఎస్ఆర్ శాస్త్రి, కౌన్సిలర్లు బుక్క ఉపేందర్, వడ్డానం శ్రీనివాస్, మధు, సుఖేష్ పాల్గొన్నారు. ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థి సేవావిభాగం డైరెక్టర్ వెంకటేశ్వర్లు -
విద్యానైపుణ్యాలు మెరుగు పడేలా..
సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను మెరుగు పరిచేందుకు విద్యాశాఖ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 2 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 18 నుంచి ఎఫ్ఎల్ఎన్ పరీక్షలు నిర్వహించనుంది. వాటి ఫలితాల ఆధారంగా విద్యార్థుల ప్రస్తుత అభ్యాసన స్థాయిని గుర్తించి, వెనుక బడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించనున్నారు. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో బేస్లైన్ టెస్ట్, తర్వాత మిడ్లైన్ టెస్ట్, చివరలో ఎండ్లైన్ టెస్ట్లు నిర్వహిస్తారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి గానూ ఈ నెల 18, 19, 20 తేదీల్లో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ బేస్లైన్ పరీక్షలు నిర్వహించనున్నారు. కనీస విద్యా నైపుణ్యాలు ఉండేలా.. జాతీయ విద్యా విధానం–2020లో భాగంగా ప్రతి విద్యార్థికి ప్రాథమిక స్థాయిలో చదవడం, రాయడం, గణితంలో కనీస నైపుణ్యాలు ఉండేలా విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. అందులో భాగంగా నిర్వహించే బేస్లైన్ పరీక్షల ద్వారా విద్యార్థులు పాఠ్యాంశాలను ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు, చదివే సామర్థ్యం, రాత నైపుణ్యం, సంఖ్యలపై అవగాహన, ప్రాథమిక గణిత ప్రక్రియల్లో వారి ప్రావీ ణ్యం వంటి అంశాలను పరిశీలించనున్నారు. పరీ క్షల అనంతరం ప్రతి విద్యార్థి పనితీరును విశ్లేషించి, అవసరమైన వారిపై ఉపాధ్యాయులు మరింత శ్రద్ధ వహించనున్నారు. 840 పాఠశాలల్లో.. జిల్లాలో 670 ప్రాథమిక, 70 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 2 నుంచి 5వ తరగతి వరకు 24,543 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ బేస్లైన్ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షలను తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ మొబైల్ యాప్ద్వారా ఆన్లైన్లో నిర్వహిస్తారు. పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాల సాఫ్ట్ కాపీలను ముందుగానే జిల్లా విద్యాశాఖ అధికారికి పంపిస్తారు. వాటిని సంబంధిత ప్రధానోపాధ్యాయులకు అందజేసి పరీ క్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బేస్లైన్ పరీక్షలు వాటి ఫలితాల ఆధారంగా వెనుకబడిన వారిపై శ్రద్ధ 18 నుంచి 20 వరకు ఎఫ్ఎల్ఎన్ టెస్ట్లు -
రికార్డులు గల్లంతు!
మాయమైన ప్లాట్లు..కోదాడ: కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు కుమ్మకై ్క గ్రామ పంచాయతీ ప్లాట్లను స్వాహా చేశారు. సామాజిక అవసరాల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ్మర పంచాయతీకి ఇచ్చిన విలువైన భూములను అమ్మి సొమ్ము చేసుకున్నారు. మొత్తం 43 ప్లాట్లకు చెందిన 10,100 గజాల స్థలాన్ని మాయం చేశారు. ఈ విషయాన్ని సమాచారహక్కు చట్టం ద్వారా వెలికితీసిన గ్రామస్తులు పదేళ్లుగా పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. అసలు విషయం ఇదే..కోదాడకు సమీపంలో ఉన్న తమ్మర గ్రామ పంచాయతీ రెవెన్యూ భూములు విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిని ఆనుకొని ఉండడంతో మంచి డిమాండ్ ఉంది. దాంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగింది. 2005 నుంచి 2012 వరకు ఎనిమిది మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు గ్రామ పంచాయతీ పరిధిలోని 42 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమిని వెంచర్లుగా ఏర్పాటు చేశారు. నిబంధనల మేరకు రియల్ వ్యాపారులు సామాజిక అవసరాల కోసం గ్రామపంచాయతీకి 10 శాతం భూమిని ఇచ్చారు. దీని కింద మొత్తం 43 ప్లాట్లు వచ్చాయి. వీటి విస్తీర్ణం 10,100 చదరపు గజాలుగా రికార్డులలో అధికారులు నమోదు చేశారు. గ్రామస్తుల ఫిర్యాదుతమ్మర పంచాయతీలో సర్పంచ్లుగా, కార్యదర్శులుగా పనిచేసిన వారు పంచాయతీకి వచ్చిన ప్లాట్లను గుట్టచప్పుడు కాకుండా అమ్మేశారు. గ్రామ పంచాయతీ 2011లో కోదాడ మున్సిపాలిటీలో కలిసింది. ఆ సమయంలో గ్రామ పంచాయతీకి వచ్చిన భూములకు సంబంధించిన రికార్డులను అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి మాయం చేశారు. దాంతో తమ్మర గ్రామానికి చెందిన కొందరు సమాచార హక్కు చట్టం కింద లే అవుట్ మ్యాప్లను సేకరించారు. కాగితాల మీద ఉన్న ప్లాట్లు క్షేత్ర స్థాయిలో లేకపోవడంతో గ్రామానికి చెందిన పలువురు ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఈ విషయమై కనీస విచారణ చేపట్టడం లేదని స్థానికులు వాపోతున్నారు. మున్సిపాలిటీ అధికారులు కూడా ఈ ప్లాట్ల విషయం తమకు సంబంధం లేదని తప్పించుకుంటున్నారు. గతంలో పోలీసు కేసు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పంచాయతీలలో జరిగిన లేఅవుట్ భూముల అమ్మకాలపై అప్పటి జిల్లా కలెక్టర్ రిజ్వీ టాస్క్ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేయించారు. తమ్మర గ్రామ పంచాయతీలో కూడా భారీగా అవకతవకలు జరిగనట్లు కమిటీ నిర్ధారించింది. ఈ విషయమై కోదాడకు చెందిన సామాజిక కార్యకర్త పొడుగు హుస్సేన్ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అనంతగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఆ తరువాత దాని గురించి పట్టించుకున్న వారు లేకుండా పోయారు. ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ భూములు అమ్ముకున్న వారిపై చర్యలు తీసుకొని వాటిని స్వాధీనం చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. తమ్మర పంచాయతీలో రూ.20 కోట్ల ప్రభుత్వ స్థలాలు స్వాహా 10 వేల గజాల లేఅవుట్ భూమిని అమ్మేసిన ఘనులు పదేళ్లుగా గ్రామస్తులు పోరాడుతున్నా పట్టని అధికారులు -
ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ సాధిస్తాం
సూర్యాపేటటౌన్ : ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ రూల్స్ను త్వరలోనే సాధిస్తామని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎస్వీ కళాశాల ఆడిటోరియంలో జరిగిన తూము శ్రీనివాస్రావు ఉద్యోగ విరమణ సన్మాన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ముఖ్యమంత్రి, అధికారులతో సర్వీస్ రూల్స్ విషయమై చర్చించామన్నారు. సర్వీస్ రూల్స్ లేకపోడంతో విద్యాశాఖలో పర్యవేక్షణ అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, దాంతో విద్యా ప్రమాణాలు కుంటు పడుతున్నాయని చెప్పారు. లోకల్ బాడీ ఎన్నికలు పూర్తి కాగానే సర్వీస్ రూల్స్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కొల్లు మధుసూదన్ రావు, ఎంఈఓ శేషగాని శ్రీనివాస్గౌడ్, దేవరశెట్టి జనార్దన్, సోమిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, తంగెళ్ల జితేందర్రెడ్డి, తీగల నరేష్, బొల్లికొండ కోటయ్య, శివశంకర్, వెంకటయ్య, దండుగుల ఎల్లయ్య, సుంకర లింగమూర్తి, జమాల్ షరీఫ్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి -
చేనేత ఐక్యవేదిక రాష్ట్ర సహాయ కార్యదర్శిగా వేణు
కోదాడరూరల్ : చేనేత ఐక్యవేదిక రాష్ట్ర సహాయ కార్యదర్శిగా కోదాడ చెందిన అన్నబత్తుల వేణు నియమితులయ్యారు. ఆదివారం చౌటప్పల్లో జరిగిన రాష్ట్ర చేనేత సహకార సభ్యుల సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీరమోహన్ సమక్షంలో కమిటీని ఎంపిక చేశారు. అనంతరం వేణుకు నియామక పత్రాన్ని అందించారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలునూతనకల్ : ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని మైనింగ్ ఏడీ రఘుబాబు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని గుండ్లసింగారం గ్రామ శివారులోని పాలేరు వాగులో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న 3 ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజల అవసరాల నిమిత్తం ప్రభుత్వ అనుమతులు తీసుకొని ఇసుకను పొందాలని ఆయన సూచించారు. అక్రమంగా ఇసుక నిల్వలు చేసి విక్రయించే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ఓలు బాబు, రవి, రాంబాబు, లింగస్వామి, తదితరులు పాల్గొన్నారు. మహిళల భద్రతలో ప్రభుత్వాలు విఫలంచిలుకూరు : మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయని మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తెల సృజన విమర్శించారు. ఆదివారం మండల పరిధిలోని జెర్రిపోతులగూడెం గ్రామంలో నిర్వహించిన మహిళా సమాఖ్య మండల సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళల భద్రతా చట్టాలను కఠినంగా అమలు చేయాలని, వారిపై జరుగుతున్న అన్యాయాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అర్హులైన మహిళలందరికీ ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. అనంతరం మహిళా సమాఖ్య మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షురాలిగా నంధ్యాల ఉషాలక్ష్మి, ఉపాధ్యక్షురాలిగా రణబోతు అనిత, ప్రధాన కార్యదర్శిగా అనంతు పుష్పలత, సహాయ కార్యదర్శిగా కాంపాటి నాగమణి, కోషాధికారిగా మజ్రపు స్వప్న, కార్యవర్గ సభ్యులుగా శైలజ, యశోద, హైమావతి, గౌరవ సలహాదారులుగా గ్రామ సర్పంచ్ గుగులోతు లలిత, ఉప సర్పంచ్ ఉద్దండు దుర్గను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి దేవరం మల్లేశ్వరి, వర్కింగ్ అధ్యక్షురాలు లక్ష్మి, మాజీ సర్పంచ్ రెమిడాల జయసుధ పాల్గొన్నారు. సూర్యక్షేత్రంలో ప్రత్యేక పూజలుఅర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారు జామున స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. యజ్ఞశాలలో మహా సౌరహోమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజిత జనార్దన్స్వామి, గణపురం నరేష్, అర్చకుడు భీంపాండే పాల్గొన్నారు. -
రౌడీ షీటర్స్పై నిరంతర నిఘా
కోదాడ రూరల్ : రౌడీ షీటర్స్పై నిరంతర నిఘా ఉంచి వారు తిరిగి నేరాలకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించి బాధితులకు భరోసా కల్పించాలని ఎస్పీ నరసింహ ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఆదివారం కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. పోలీసుల కవాతు, వారికి డిపార్ట్మెంట్ నుంచి అందించిన సామగ్రిని పరిశీలించి పలు సూచనలు చేశారు. బాధితులు అందించే ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా దర్యాప్తును వేగవంతం చేయాలని సూచించారు. కోదాడ పట్టణంలోని ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా ఆపరేషన్ రోప్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. పట్టణాన్ని సెక్టార్లుగా విభజించి నిరంతరం పోలీసు గస్తీ, పెట్రోలింగ్ నిర్వహించాలని, సీసీ కెమెరాల ఏర్పాటుకు స్థానికులను ప్రోత్సహించాలని సూచించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో మొక్కను నాటారు. ఆయన వెంట డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ రవి, సీఐ మగ్దూంఅలీ, పట్టణ సీఐ శివశంకర్, ఎస్ఐలు అంజిరెడ్డి, సుధీర్, ఉపేందర్రెడ్డి, మల్సూర్, ఆర్ఎస్ఐ అశోక్, అంజన్రెడ్డి, శేఖర్రెడ్డి, సందీప్, ఆబేద్ ఉన్నారు. ఎస్పీ నరసింహ -
మండలానికో జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయాలి
మేళ్లచెరువు : ప్రతి మండలకేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ డిమాండ్ చేశారు. శనివారం మేళ్లచెరువులో నిర్వహించిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి సంవత్సరం ఉమ్మడి మేళ్లచెరువు మండలంలో వెయ్యి మంది విద్యార్థులు 10వ తరగతి పూర్తి చేసి ఇంటర్ విద్యకోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందన్నారు. కొంత మంది దూర ప్రాంతాలకు వెళ్లలేక మధ్యలోనే చదువు ఆపుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో సంఘం నాయకులు నవీన్, ఆదినారాయణ, వీరబాబు, అనిల్, న రేష్, అభిరామ్, సతీష్, వినోద్ పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుడి ప్రోత్సాహంతో..
మాది పేద వ్యవసాయ కుటుంబం. నల్లగొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ విద్యాలయంలో చదువుతున్నప్పుడు పాఠశాల ప్రిన్సిపాల్ సోమయ్య ప్రోత్సాహంతో పాఠశాల విద్య పూర్తి చేయగానే వ్యవసాయ శాఖ డిప్లోమాను 2011లో పూర్తి చేశాను. 2012లో వ్యవసాయ విస్తరణ అధికారిగా ఉద్యోగం లభించింది. 14 ఏళ్లుగా వివిధ మండలాల్లో రైతులకు సేవ చేస్తున్నాను. వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు రైతలకు పలు అంశాలపై అవగాహన కల్పిస్తున్నాను. – గండూరి నిర్మల ఏఈఓ నేరేడుచర్ల -
విద్యార్థులకు చట్టాలపై అవగాహన అవసరం
చివ్వెంల(సూర్యాపేట) : విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూర్యాపేట జిల్లా కోర్టు మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎన్. అపూర్వ రవళి అన్నారు. శనివారం సూర్యాపేట పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోక్సో చట్టంపై విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. 18 సంవత్సరాలలోపు విద్యార్థులు మోబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలన్నారు. గుర్తు తెలియని వ్యక్తులతో ఆన్లైన్ స్నేహం మంచిది కాదన్నారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్లపై విద్యార్థినులకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో బార్ అసోషియేషన్ ప్రధాన కార్యదర్శి తల్లమళ్ల హస్సేన్, డీఎల్ఎస్ఏ నామినేటెడ్ సభ్యుడు గుంటూరు మధు, డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు బొల్లెద్దు వెంకటరత్నం, ప్రవీణ్కుమార్, ఎస్ఐ కె.వెంకటరత్నం, ప్రిన్సిపాల్ గోలి పద్మ పాల్గొన్నారు. -
వ్యవసాయంపై మక్కువతోనే..
మాది సన్నకారు రైతు కుటుంబం. మానాన్న కేవలం ఎకరంన్నర భూమిలో వ్యవసాయం చేసేవారు. తర్వాత సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో ఎల్డీసీగా చిన్నపాటి ఉద్యోగం పొందారు. అయినా వ్యవసాయాన్ని వీడలేదు. నాన్న వ్యవసాయంపై చూపుతున్న ఆసక్తిని గమనించి నేను కూడా ఈ రంగంపై మక్కువ పెంచుకున్నాను. రైతులకు ఏదోవిధంగా సహాయ పడాలని, అగ్రికల్చర్ బీఎస్సీలో చేరాను. 2011లో అగ్రికల్చర్ బీఎస్సీ ఖమ్మంలో పూర్తి చేశాను. ఆ వెంటనే ప్రభుత్వం నోటిఫికేషన్ వేయడం, మొదటి ప్రయత్నంలోనే 2012 జూలైలో మండల వ్యవసాయ అధికారిగా ఉద్యోగం పొందాను. మద్దిరాల ఏఓగా ఉన్న సమయంలో ఉత్తమ వ్యవసాయ అధికారిగా అవార్డు పొందాను. – దివ్య, ఆత్మకూర్ (ఎస్) మండల వ్యవసాయ అధికారి -
నాన్న కోరిక మేరకే వ్యవసాయ అధికారిగా..
మాది మహబూబ్నగర్ జిల్లా. మానాన్న వ్యవసాయం చేసేవాడు. చదువులో చురుకుగా ఉండే నన్ను ఆయన ఎంతో ప్రోత్సహించేవాడు. వివిధ పనులపై వ్యవసాయశాఖ అధికారుల వద్దకు వెళ్లే ఆయన నన్ను కూడా వ్యవసాయ అధికారిగా చూడాలనుకునేవాడు. ఆయన కోరిక మేరకు నేను తిరుపతిలో ఏజీ బీయస్సీ పూర్తిచేశాను. 2005లో ఏఓగా ఎంపికై మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలలో పనిచేశాను. ప్రమోషన్పై ఏడీఏగా ప్రస్తుతం కోదాడలో పనిచేస్తున్నాను. – పి. ప్రశాంతి, ఏడీఏ, కోదాడ మాది ఆత్మకూర్ మండలం మిడతనపల్లి. మానాన్న రైతు కావడంతో చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే ఇష్టం. ఈ రంగంపై ఇష్టంతోనే మధ్యప్రదేశ్లో బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేశాను. 2020లో ఏఈఓగా ఉద్యోగం లభించింది. వ్యవసాయ రంగంలో రైతులకు సలహాలు, సూచనలు లతో సేవలు అందిస్తున్నాను. రైతులకు సాగులో మెళకువలు, ఆధునిక పద్దతులు, సేంద్రీయ విధానాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాము. –ఎ.మహిత, ఏఈఓ తిరుమలగిరి -
అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీరాజ్ ఏఈలు, ఏపీఎంలతో వెబ్ ఎక్స్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లోని ముఖ్య అంశాలను అధికారులకు వివరించారు. వానాకాలంలో వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున, రైతులు నీటి వినియోగం తక్కువగా ఉండే ఆరుతడి పంటలు వేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. వ్యవసాయం, తాగునీరు, విద్య, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి అంశాల్లో నిర్లక్ష్యం వహించవద్దని స్పష్టం చేశారు. వీబీ జీరాంజీ పథకం కింద కూలీలకు పనిదినాలను 125 రోజులకు పెంచినట్లు తెలిపారు. పెంచిన పనిదినాలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటడం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, పాఠశాలల్లో టాయిలెట్ల నిర్వహణ, ఇంకుడు గుంతల నిర్మాణంపై శ్రద్ధ వహించాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ బి. హరిసింగ్, డీఆర్డీఓ సన్యాసయ్య, జెడ్పీ సీఈఓ శిరీష, డీపీఓ యాదగిరి, హౌసింగ్ పీడీ సిద్ధార్థ, డీఈఓ అశోక్, డీఎంహెచ్ఓ వెంకటరమణ, మిషన్ భగీరథ ఈఈ అరుణాకర్రెడ్డి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు రవితేజ, అనూష, తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
బియ్యం ఎగుమతులకు ఇన్సెంటివ్
మిర్యాలగూడ : ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే బియ్యానికి ఇన్సెంటివ్ విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. శనివారం ఆయన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నిర్మాణంలో ఉన్న ఎత్తిపోతల పథకాలను పరిశీలించారు. రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతో రైస్ మిల్లు నిర్మించడం సంతోషకరమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సైలో గోదాములను మహిళలే నిర్వహించే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. రెండున్నరేళ్లలో పెండింగ్లో ఉన్న ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. వాతావరణంలో ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు తగ్గే ప్రమాదం ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకుని రైతులు పంటలను సాగు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, వేముల వీరేశం, ఎమ్మెల్సీ శంకర్నాయక్, డీసీసీ అధ్యక్షుడు కై లాష్నేత, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, ఆలిండియా రైస్ ఇండస్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశం, మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధాబాలకృష్ణ, వైస్ చైర్మన్ గుడిపాటి శిరీషనవీన్, మిల్లర్లు కర్నాటి రమేష్, గౌరు శ్రీనివాస్, గుండా మల్లయ్య, చకిలం రామయ్య, చిన్నపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ రాష్ట్రంలో త్వరలో ప్రవేశ పెడతాం ఫ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
రైతులకు అండగా ఉండాలనే..
మాది వ్యవసాయ కుటుంబం. అమ్మానాన్నలు వ్యవసాయదారులు కావడంతో అందులో ఉన్న కష్టాలు తెలుసుకొన్నాను. వ్యవసాయ రంగంలో నూతన విధానాలు అమలు చేయాలనే ఉద్దేశంతో రాజేంద్రనగర్లో అగ్రికల్చర్ ఇంజనీరింగ్ డిప్లోమా చదివాను. 2017లో వ్యవసాయ విస్తరణ అధికారి ఉద్యోగాల నోటిఫికేషన్ రాగా పరీక్ష రాశాను. నాకు ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత బీటెక్ అగ్రికల్చర్ సంగారెడ్డిలో పూర్తి చేశాను. 2025 ఆగస్టులో జిల్లా ఉత్తమ వ్యవసాయ విస్తరణ అధికారిగా అవార్డు లభించింది. నేను ఖాళీగా ఉన్న సమయంలో అమ్మా నాన్నలకు తోడుగా వ్యవసాయ పనులు చేస్తుంటాను. శాసీ్త్రయ వ్యవసాయ విధానం గురించి రైతులకు తెలియజేస్తున్నాను. –సాయి శ్రీజన, ఏఈఓ తుంగతుర్తి -
కోర్టు కేసులు త్వరితగతిన పరిష్కారం
సూర్యాపేటటౌన్ : కేసులు పెండింగ్ లేకుండా, అవి త్వరగా విచారణ పూర్తి అయ్యేలా చూడాలని ఎస్పీ కె. నరసింహ పోలీసు సిబ్బందిని ఆదేశించారు. జిల్లాలోని పోలీస్ స్టేషన్ల నుంచి కోర్టు డ్యూటీ విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందితో శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. కోర్టు విధుల నిర్వహణకు సంబంధించి సలహాలు, సూచనలు అందించారు. పనిలో నాణ్యత, పారదర్శకత ఉండాలని, పెండింగ్ ఉండకుండా కోర్టు వారెంట్, సమన్లు సకాలంలో అందజేయాలని సూచించారు. సిబ్బంది కోర్టులలో సమన్వయంగా, సమయపాలనతో పనిచేయాలని, ఎప్పటికప్పుడు కేసుల స్థితిగతులను రికార్డులలో, ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. బాధితులను, సాక్షులను, నిందితులను సకాలంలో కోర్టులలో ప్రవేశపెట్టి కేసులు త్వరతగతిన పరిష్కారం అయ్యేలా సిబ్బంది పనిచేయాలని ఆదేశించారు. కోర్టుల్లో విచారణలో ఉన్న కేసుల్లో త్వరితగతిన నేరస్తులకు శిక్షలు అమలు అయితేనే క్షేత్రస్థాయిలో నేరాలను అదుపు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది కోర్టు అధికారులతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని పరస్పరం చేరవేసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీ రవీందర్రెడ్డి, డీసీఆర్పీ డీఎస్పీ రవి, ఇన్స్పెక్టర్ మగ్దూం అలీ, సైబర్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, కోర్టు డ్యూటీ సిబ్బంది పాల్గొన్నారు. ఫ కోర్టు డ్యూటీ సిబ్బంది సమావేశంలో ఎస్పీ నరసింహ -
6న గురుకులాల్లో ఇంటర్ స్పాట్ అడ్మిషన్లు
నడిగూడెం : జిల్లాలోని ఆరు సాంఘీక సంక్షేమ బాలుర, బాలికల గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 6న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం సంస్థ జిల్లా కోఆర్డినేటర్ సీహెచ్.పద్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు సోమవారం ఇమాంపేట సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. అనంతరం మెరిట్ లిస్ట్ తయారు చేసి, నోటీసు బోర్డులో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. లక్ష్మీనరసింహునికి నిత్య కల్యాణంమఠంపల్లి: మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శనివారం అర్చకులు స్వామివారి నిత్య కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం స్వామి అమ్మవార్లలను పట్టు వస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం నిర్వహించారు. కల్యాణోత్సవం అనంతరం స్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ టి.చలపతిరావు, అర్చకులు తూమాటి కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు. పీఆర్సీ ప్రకటించి అమలు చేయాలిఆత్మకూరు (ఎస్)(సూర్యాపేట) : రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు నూతన పీఆర్సీ ప్రకటించి జూలై 2023 నుంచి అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కోశాధికారి గుల్ల వెంకటయ్య డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని కోటినాయక్ తండా, దుబ్బతండా, పాత సూర్యాపేట, ఏనుబాముల, ఆత్మకూరు పాఠశాలల్లో సంఘం సభ్యత్వ నమోదును ఆయన ప్రారంభించి మాట్లాడారు. పెండింగ్లో ఉన్న డీఏలను, బిల్లులను వెంటనే విడుదల చేయాలని, ఆరోగ్య కార్డులను విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి చిలుక రమేష్, మండల అధ్యక్షుడు జటంగి లింగస్వామి, జిల్లా కమిటీ సభ్యుడు నునావత్ సైదానాయక్, కడారి రాఘవులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు డ్రెస్కోడ్ పాటించాల్సిందేఫ గరిడేపల్లి ఎంఈఓ ఆదేశాలు గరిడేపల్లి : మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఫార్మల్ డ్రెస్కోడ్ పాటించాలని మండల విద్యాశాఖ అధికారి చత్రునాయక్ ఆదేశాలు జారీ చేశారు. శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయులు టీ షర్ట్, జీన్స్, టోపీలు ధరించి విధులకు హాజరు కావద్దన్నారు. మహిళా ఉపాధ్యాయులు సంప్రదాయ చీరల్లోనే విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఉపాధ్యాయుడి వ్యక్తిత్వమే విద్యార్థికి తొలి పాఠం అనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, భారతీయ సంస్కృతి, వృత్తి గౌరవాన్ని పెంచే దిశగా డ్రెస్కోడ్ అమలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. యాదగిరి క్షేత్రంలో విశేష పూజలు యాదగిరిగుట్ట : శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. శనివారం వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి వారికి సుప్రభాతం, అభిషేకం, బాలభోగం, ఆరాధన, సహస్ర నామార్చన పూజలను జరిపించారు. -
నిధులు లేక నిర్వహణ భారం
గ్రామాల్లో రైతు వేదికల నిర్వహణ నిధుల విషయంలో ప్రభుత్వానికి నివేదికలు పంపించాం. రైతు వేదికలకు నిధులు రాక ఏఈఓలు ఇబ్బందులు పడుతున్న విషయం నా దృష్టికి వచ్చింది. డబ్బులు విడుదల కాగానే ఏఈఓల ఖాతాల్లో జమ చేస్తాం. ఆ దిశగా చర్యలు తీసుకుంటాం. జి.శ్రీధర్రెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, సూర్యాపేట. ఫ నాలుగేళ్లుగా రైతు వేదికలకు అందని నిధులు ఫ కనీస వసతులు లేక రైతులు, అధికారులకు ఇబ్బందులు ఫ పేరుకు పోతున్న విద్యుత్ బిల్లులు ఫ కొన్ని చోట్ల సొంతడబ్బులు వెచ్చిస్తున్న అధికారులు నాగారం : రైతు వేదికల నిర్వహణ సంబంధిత అధికారులకు భారంగా మారింది. నాలుగేళ్లుగా నిధులు రాకపోవడంతో వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈఓల) సొంతంగా పెట్టుకోవాల్సి వస్తోంది. రైతులకు సాగులో శిక్షణతో పాటు సలహాలు అందించేందుకు ప్రభుత్వం 2021లో క్లస్టర్ల వారీగా రైతు వేదికలను నిర్మించింది. రైతు సమావేశాలు, శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన వసతులు, సాంకేతిక హంగులను కల్పించింది. కానీ, నిర్వహణ, నిధుల లేమితో వాటి లక్ష్యం నీరుగారుతోంది. ప్రతి క్లస్టర్కు ఒక రైతువేదిక సూర్యాపేట జిల్లాలో 86 క్లస్టర్లు ఉన్నాయి. 2021లో అప్పటి ప్రభుత్వం ప్రతి క్లస్టర్కు ఒక రైతు వేదికను నిర్మించింది. ఒక్కో రైతువేదికకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు రూ.10 లక్షలు, వ్యవసాయశాఖ నుంచి రూ.12 లక్షలు సమకూర్చి మొత్తం రూ.22 లక్షలు వెచ్చించి ఒకే నమునాలో నిర్మించింది. జిల్లాలో 2.81లక్షల మంది రైతులు ఉండగా, 82 రైతు వేదికలు అందుబాటులోకి వచ్చాయి. ఒక్కో వేదికలో రెండు గదులు, విశాలమైన సమావేశ మందిరాన్ని నిర్మించారు. వీటి నిర్వహణ బాధ్యతలను ఏఈఓలకు అప్పగించారు. రైతులతో సమావేశాలు నిర్వహించడం, సాగులో మెళకువలను నేర్పించడం, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభ్యుదయ, ఆదర్శ రైతుల అనుభవాలను పంచుకోవడం, శాస్త్రవేత్తల సూచనలు అందజేయడం ఈ వేదికల ప్రధాన ఉద్దేశం. సదుపాయాలు కరువు ఒక్కో రైతు వేదిక నిర్వహణకు మొదట ప్రతినెలా రూ.3వేలు కేటాయించగా అవి సరిపోవడం లేదని అధికారులు తెలపడంతో రూ.9వేలకు పెంచింది. 2022 డిసెంబర్ నుంచి 2023 ఏప్రిల్ వరకు మాత్రమే నిర్వహణ నిధులు వచ్చాయి. ఆ తర్వాత నిధులు నిలిచిపోయాయి. దాంతో వేదికల్లో కనీస సదుపాయాలు లేకుండా పోయాయి. చాలా చోట్ల తాగునీటి సదుపాయం లేదు. వేదికలను శుభ్రం చేసేందుకు, మరుగుదొడ్ల నిర్వహణకు నిధులు లేక దారుణంగా మారాయి. కొందరు ఏఈఓలు సొంత డబ్బులు వెచ్చించి కార్యాలయాలను శుభ్రం చేయించుకుంటున్నారు. కార్యాలయాల్లో విద్యుత్ బిల్లులు పేరుకుపోతున్నాయని, కరెంట్ కట్ చేస్తే విధుల నిర్వహణకు ఆటంకం కలుగుతుందని పలువురు ఏఈఓ ఆందోళన చెందుతున్నారు. -
రైతుల సేవలో వనితలు
భానుపురి, ఆత్మకూర్ (ఎస్), తిరుమలగిరి, కోదాడ రూరల్, తుంగతుర్తి, నేరేడుచర్ల : అత్యధిక మంది వ్యవసాయంపై ఆధారపడి జీవించే వారున్న ప్రాంతం సూర్యాపేట. జిల్లాలో సుమారు 6 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతుండగా.. 3 లక్షలకు పైగా రైతులు సాగుపైనా ఆధారపడ్డారు. రైతన్నల కుటుంబాల్లోంచి ఎంతో మంది అధికారులుగా, ప్రజా ప్రతినిధులుగా, రాజకీయ నాయకులుగా ఎదిగారు. రైతుల పిల్లల్లో చాలా మంది తమ తల్లిదండ్రుల కాయకష్టం చూసి.. వ్యవసాయంలో వారికి ఎంతో కొంత సాయం చేద్దామని సాగు రంగాన్ని ఎంచుకొని ఉన్నత స్థానానికి ఎదిగారు. అందులోనూ మహిళలే అధికంగా ఉన్నారు. సూర్యాపేట జిల్లాలోని 23 మండలాల్లో సుమారు 53 మంది మహిళా వ్యవసాయ అధికారులు ఉన్నారు. ఇందులో ముగ్గురు ఏడీఏలు, ఏడుగురు ఏఓలు కాగా 43 మంది ఏఈఓలు ఉన్నారు. వ్యవసాయ కుటుంబంలోంచి వచ్చిన ఈ వనితలు సాగులో రైతన్నలకు ప్రణాళికలు, మెళకువలు అందిస్తున్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను వారికందేలా చేస్తూనే.. చీడపీడల నుంచి పంటలను కాపాడుకునేందుకు సలహాలు ఇస్తున్నారు. నిరంతరం క్షేత్రస్ధాయిలో పర్యటించి అవగాహన కల్పిస్తున్నారు. ఫ వ్యవసాయ శాఖలో 53 మంది మహిళా అధికారులు ఫ రైతులుగా తల్లిదండ్రుల కష్టం చూసి సాగు రంగంలో ఉద్యోగ ప్రస్థానం -
ముంపు ముప్పు తప్పించాలని..
కోదాడ పట్టణ అభివృద్ధియే లక్ష్యంగా పనిచేస్తున్నాం. గతంలో వరదలకు పట్టణంలో కొన్ని ప్రాంతాలు నీట మునిగాయి. అలా జరగకుండా ముందస్తుగా వాగులో పూడికను తొలగిస్తున్నాం. వాగు ఆక్రమణలను గుర్తించి వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం. –ఎర్నేని కుసుమ, మున్సిపల్ చైర్పర్సన్ కోదాడ ఫ కోదాడ పట్టణంలో వాగుల్లో పూడికతీత పనులు ప్రారంభం ఫ ఆక్రమణలను కూడా తొలగించాలని ప్రజల డిమాండ్ ఫ గతంలో ముంపునకు గురైన పలు కాలనీలుకోదాడ రూరల్ : కోదాడ పట్టణంలో గతంలో భారీ వర్షాలు కురిసి వరదలు సంభవించినప్పుడు వాగులు ఆక్రమణకు గురికావడంతోపాటు పూడిక పేరుకుపోవడంతో కొన్ని కాలనీలు ముంపునకు గురయ్యాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, వర్షాకాలంలో భారీ వర్షాలు, వరదల వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా కోదాడ మున్సిపల్ అధికారులు, పాలకవర్గం ముందస్తు చర్యలు చేపట్టింది. పట్టణంలోని పెద్దచెరువు అలుగువాగు, ఎర్రకుంట వాగుల్లో పూడికతీత పనులను ముమ్మరంగా ప్రారంభించారు. వాగుల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, మట్టిని జేసీబీల సహాయంతో తొలగిస్తున్నారు. వాగులు ఆక్రమణలకు గురికావడం, పూడిక పేరుకుపోవడంతో గతంలో భారీ వర్షాలు కురిసినప్పుడు పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి. ఆయా ప్రాంతాల ప్రజలను అధికారులు వారం రోజులపాటు ఖాళీ చేయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ముందస్తుగా చేపట్టిన ఈ పనులు ఎంతవరకు ముంపును నివారిస్తాయనేది వేచి చూడాలి. కుంచించుకుపోయిన వాగులు.. భారీ వర్షాలు పడినప్పుడు కోదాడ పెద్దచెరువు అలుగు పోస్తుంది. ఈ అలుగువాగు నీరు అనంతగిరి రోడ్డు నుంచి నయనగర్ను ఆనుకుని, తమ్మర బ్రిడ్జి మీదుగా షిర్డీ సాయినగర్ వెంట అల్వాలపురం వైపుగా ప్రవహించి పాలేరు వాగులో కలుస్తుంది. అయితే నయనగర్ నుంచి షిర్డీ సాయినగర్ వరకు ఈ వాగు ఆక్రమణలకు గురికావడంతో వెడల్పు బాగా తగ్గింది. దీనికితోడు వాగులో చెత్తాచెదారం వేయడంతో పూడిక పేరుకుపోయింది. ఇక తమ్మర బ్రిడ్జి వద్ద, షిర్డీ సాయినగర్ శివారు అల్వాలపురం వద్ద పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాగును ఆక్రమించారు. మరోవైపు ఉత్తమ్ పద్మావతి నగర్ నుంచి శ్రీమన్నారాయణ కాలనీ మీదుగా ఎర్రకుంట వాగు ప్రవహిస్తుంది. ఈ వాగును కూడా ఆక్రమించి ఇళ్లు నిర్మించుకోవడంతో దీని వెడల్పు కూడా కుంచించుకుపోయింది. ఫలితంగా వరదలు వచ్చినప్పుడు నీరు కిందకు ప్రవహించే మార్గం సరిపోక కాలనీలు నీటి ముంపునకు గురవుతున్నాయి. ప్రాణాలు తీసిన వరదలు వరుసగా గత రెండేళ్లుగా వచ్చిన వరదలకు ఖమ్మం రోడ్డులోని షిర్డీ సాయినగర్ పూర్తిగా నీట మునగడంతో అధికారులు అక్కడ నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అదేవిధంగా శ్రీమన్నారాయణ కాలనీలోని హెచ్పీ గ్యాస్ గోడౌన్ ఎదురుగా ఉన్న వీధులు, భవానీ నగర్లోని కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి భారీగా నీరు చేరింది. అంతేకాకుండా, రెండేళ్ల కిందట వచ్చిన వరద ఉధృతికి హుజూర్నగర్ సర్వీస్ రోడ్డు వెంట వాగులో పడి ఒకరు, భారత్ పబ్లిక్ స్కూల్ సమీపంలో వాగులో పడి మరొకరు మృతి చెందడం పట్టణ ప్రజలను ఇప్పటికీ భయాందోళనలకు గురిచేస్తోంది. ఆక్రమణలను తొలగిస్తేనే.. పెద్దచెరువు వాగు, ఎర్రకుంట వాగుల్లో కేవలం పూడిక తీస్తే సరిపోదని, ఆక్రమణలను కూడా పూర్తిగా తొలగిస్తేనే పట్టణానికి వరద ముంపు ముప్పు తప్పుతుందని స్థానికులు పేర్కొంటున్నారు. వాగులను ఆక్రమించి నిర్మించిన ఇళ్లను, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏర్పాటు చేసిన ప్లాట్లను తక్షణమే గుర్తించి కూల్చివేయాలని డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్లో సైతం వాగులు ఆక్రమణలకు గురికాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఎర్రకుంట వాగులో పూడిక తీస్తున్న జేసీబీగత ఏడాది షిర్డీసాయి నగర్లో నీటమునిగిన ఇళ్లు (ఫైల్) -
వైద్యరంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్
మోతె : వైద్య ఆరోగ్య రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం చేస్తోందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. గురువారం మోతె మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, అక్కడ వైద్య సౌకర్యాలను పరిశీలించడంతోపాటు ఆరోగ్య సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం బదిలీపై వెళ్లిన వైద్యాధికారి సంతకాలు, సంబంధిత అనుమతులు ఇంకా ఎలా కొనసాగుతున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ కిట్ పేరు మార్చి పేదింటి ఆడబిడ్డలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ప్రభుత్వ అత్యవసర మందులు సరిపడా అందుబాటులో ఉంచాలన్నారు. ఎంతో ఉపయోగకరమైన కంటి వెలుగు పథకాన్ని అటకెక్కించారని విమర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల బలోపేతానికి వైద్య, ఆరోగ్య సిబ్బంది పోస్టులను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శీలం సైదులు, ఆరె లింగారెడ్డి, ఏలూరి వెంకటేశ్వరరావు, బానోతు శంకర్నాయక్, ఇండ్ల వెంకటేశ్వర్లు, గాంధీ తదితరులు ఉన్నారు. -
భవనాల నిర్మాణం త్వరగా పూర్తి చేయించండి
అర్వపల్లి : మహిళా సమాఖ్య భవనాల నిర్మాణ పనులను సర్పంచుల సమన్వయంతో త్వరితగతిన పూర్తిచేయించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి (డీఆర్డీఓ) సన్యాసయ్య సూచించారు. అర్వపల్లిలోని మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో గురువారం తుంగతుర్తి నియోజకవర్గంలోని తుంగతుర్తి, తిరుమలగిరి, నాగారం, జాజిరెడ్డిగూడెం మండలాల ఏపీఎంలు, సీసీలతో సెర్ప్ కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సీ్త్రనిధి, బ్యాంక్ రుణాలను టార్గెట్ ప్రకారం మంజూరు చేయించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు డీఆర్డీఓ సురేష్, డీపీఎంలు లక్ష్మీనా రాయణ, అరుణ్, ఏపీఎంలు రాంబాబు, వినోద్, మల్లేష్, యాదమ్మ, లక్ష్మి, వెంకట్రెడ్డి పాల్గొన్నారు. ఫ డీఆర్డీఓ సన్యాసయ్య -
శ్రీచందులాల్ స్వామికి జలాభిషేకం
చివ్వెంల : వర్షాలు సమృద్ధిగా కురిసి, పాడి పంటలు బాగా పండాలని కోరుతూ గురువారం చివ్వెంల మండల పరిధిలోని పాండ్యానాయక్ తండాలో గిరిజనులు తమ ఆరాధ్యదైవం శ్రీచందులాల్ స్వామికి జలాభిషేకం చేశారు నీళ్ల బిందెలతో ఊరేగింపుగా గ్రామ శివారులోని ఆలయం వద్దకు వెళ్లి ప్రదక్షిణలు నిర్వహించారు. స్వామివారికి జలాభిషేకం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ధరావతు భద్రమ్మ హనుమానాయక్, పంచాయతీ కార్యదర్శి మంగ, ఉప సర్పంచ్ లాలునాయక్, మంగ్యనాయక్, చందునాయక్, వార్డు సభ్యులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. -
నేడు మంత్రి ఉత్తమ్ పర్యటన
హుజూర్నగర్ : రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి శుక్రవారం హుజూర్నగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం 10:30 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 11:20 గంటలకు హుజూర్నగర్లోని డిగ్రీ కాలేజీలో గల హెలీప్యాడ్లో దిగుతారు. అక్కడ నుంచి రోడ్డుమార్గం ద్వారా గరిడేపల్లి మండలంలోని కల్మలచెరువు చేరుకుని.. అక్కడ వివిధ గ్రామాల రోడ్డు పనులను మంత్రి ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం గడ్డిపల్లిలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను మంత్రి పరిశీలిస్తారు. తదుపరి హుజూర్నగర్ పరిధిలో నిర్మాణంలో ఉన్న మోడల్ కాలనీ, జూనియర్, డిగ్రీ, కాలేజీల పనులను పరిశీలిస్తారు. సాయంత్రం మంత్రి చిలుకూరు మండలం జెర్రిపోతులగూడెం వెళతారు. జెర్రిపోతుల గూడెంలో రూ.8 కోట్ల నిధులతో నిర్మించిన బీటీ రోడ్డును మంత్రి ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కోదాడకు చేరుకుని కోదాడ పట్టణంలో రూ.26 కోట్లతో నిర్మిస్తున్న 100 పడకల హాస్పిటల్ పనులను పరిశీలిస్తారు. తదుపరి అనంతగిరి మండలం శాంతినగర్లో రూ.50 కోట్లతో నిర్మిస్తున్న రాజీవ్ శాంతినగర్ లిఫ్ట్ పనులను పరిశీలిస్తారు. అదేవిధంగా మునగాల మండలం, కృష్ణానగర్లో రూ.28.12 కోట్లతో నిర్మిస్తున్న లిఫ్ట్ పనులను పరిశీలిస్తారు. నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురంలో రూ.20 కోట్లతో బరాఖత్గూడెం నుంచి కాగిత రామచంద్రాపురం వరకు నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభిస్తారు. డీఈఓపై చర్యలు తీసుకోవాలని వినతిభానుపురి (సూర్యాపేట) : ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీకి సహకరిస్తున్న డీఈఓ అశోక్పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్కు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గురువారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ ఉత్తర్వులను, కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ లక్షల రూపాయల ఫీజులు దండుకుంటున్నాయని ఆరోపించారు. పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, బెల్టు, టై, షూ, బ్యాగ్లను పాఠశాలల్లోనే విక్రయిస్తూ వేలాది రూపాయలను విద్యార్థుల తల్లిదండ్రులకు నుంచి బలవంతంగా వసూలు చేస్తున్నారని అన్నారు. ఏ ఒక్కరోజు కూడా పాఠశాలలను తనిఖీ చేయకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ అవినీతికి పాల్పడుతున్న డీఈఓపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. వినతిపత్రం అందజేసినవారిలో పీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల నాగరాజు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంత్ వర్మ, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి, జనసేవా సమితి అధ్యక్షుడు తగుళ్ల జనార్దన్, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి పిడమర్తి భరత్ ఉన్నారు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలిసూర్యాపేటటౌన్ : పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నిద్ర సంపత్నాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ పిలుపు మేరకు సంపత్ నాయుడు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని జూనియర్, డిగ్రీ కళాశాలల బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా సంపత్నాయుడు మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో వేలాది మంది పేద, బీసీ విద్యార్థులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ తమ చదువులను కొనసాగించలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా నాయకులు సురేష్ నాయక్, గుండ బాచి వర్మ, అనిల్, నరేష్, మౌనిక, సంధ్య, నవ్య, స్వాతి తదితరులు పాల్గొన్నారు. -
ఆయిల్పామ్ సాగుకు ప్రోత్సాహం
సూర్యాపేట : రైతులు వరి సాగుకు స్వస్తి పలికి, లాభసాటిగా ఉండే ఆయిల్పామ్ తోటల సాగువైపు మళ్లాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పిలుపునిచ్చారు. సూర్యాపేట మండలంలోని కాసరాబాద్లో ఆయిల్పామ్ తోటను కలెక్టర్ పరిశీలించి మల్లేష్ అనే రైతుతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వరి సాగుతో పోలిస్తే ఆయిల్పామ్లో పెట్టుబడి భారం చాలా తక్కువని తెలిపారు. ఒక్కసారి ఈ తోటను నాటితే నాలుగు సంవత్సరాల నుంచి మొదలై ఏకంగా 30 సంవత్సరాల వరకు రైతులకు స్థిరమైన, అధిక ఆదాయం లభిస్తుందని వివరించారు. ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతులకు 70 శాతం నుంచి 90 శాతం వరకు సబ్సిడీని అందిస్తున్నాయని తెలిపారు. తోట నాటిన మొదటి నాలుగు సంవత్సరాల వరకు పెట్టుబడి సహాయం కింద ఎకరానికి రూ.4,200 చొప్పున ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఆయిల్పామ్ తోటల్లో మొదటి మూడు సంవత్సరాల వరకు అంతర పంటలను సాగు చేసుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణయ్య, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి తీగల నాగయ్య, వ్యవసాయ అధికారి కృష్ణ సందీప్, వ్యవసాయ విస్తరణ అధికారి ముత్తయ్య, సూర్యాపేట డివిజన్ ఉద్యాన అధికారి కట్ట స్వాతి, ఉద్యాన విస్తరణ అధికారులు యారాల సుధాకర్ రెడ్డి, రంగు ముత్యం రాజు, వంగూరి అనిల్, ఆయిల్ ఫెడ్ డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ నిమ్మ గోపికృష్ణ, ఫీల్డ్ ఆఫీసర్ భవిష్య, రైతులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ -
ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన అడ్మిషన్లు
ఫ గతేడాదితో పోలిస్తే విద్యార్థుల సంఖ్య అధికం ఫ నాణ్యమైన విద్య, మెరుగైన వసతులే కారణం ఫ సత్ఫలితాలు ఇచ్చిన బడిబాట కార్యక్రమం సూర్యాపేట టౌన్ : సర్కారు బడులపై తల్లిదండ్రుల్లో నమ్మకం రోజురోజుకూ బలపడుతోంది. కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపడడం, నాణ్యమైన విద్య అందుతుండడంతో ఈ విద్యాసంవత్సరంలో అడ్మిషన్లు భారీగా పెరిగాయి. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలతోపాటు మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. దీనికి తోడు ఉపాధ్యాయులు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీబడిబాటశ్రీ కార్యక్రమం క్షేత్రస్థాయిలో అద్భుతమైన సత్ఫలితాలను ఇచ్చింది. ఈ సానుకూల మార్పుల వల్ల జిల్లాలో గతంలో మూతబడిన 15 పాఠశాలలు ఈ ఏడాది తిరిగి తెరుచుకోవడం విశేషం. అదనంగా చేరింది 3306 మంది గత విద్యాసంవత్సరంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమం ద్వారా మొత్తం 5,272 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరగా, ఈ విద్యా సంవత్సరంలో జూన్ 19 నాటికే ఆ సంఖ్య ఏకంగా 8,578 కి చేరింది. గతేడాదితో పోలిస్తే ఈసారి 3306 మంది విద్యార్థులు అదనంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పొందారు. ప్రభుత్వ విద్యపై ప్రజల్లో వస్తున్న సానుకూల మార్పునకు ఈ గణాంకాలే నిదర్శనం. మెరుగైన వసతులు.. ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక వసతులు కల్పించడం, ఆంగ్ల మాధ్యమ బోధన, డిజిటల్ తరగతుల నిర్వహణ, పరిశుభ్రమైన వాతావరణం, నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులతో నాణ్యమైన బోధన అందించడం వంటి చర్యలు తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని పెంచాయి. ప్రైవేట్ పాఠశాలల్లో ఏటా ఫీజుల భారం పెరుగుతుండడంతో.. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా లభిస్తున్న నాణ్యమైన విద్య వైపు పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. కోదాడ మండలంలో అత్యధికంగా.. జిల్లాలో మొత్తం 950 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వీటిలో 182 ఉన్నత, 78 ప్రాథమికోన్నత, 690 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. దాంతో పాటు తొమ్మిది మోడల్ స్కూల్స్, 18 కేజీబీవీలు ఉన్నాయి. బడిబాట కార్యక్రమంలో భాగంగా అత్యధికంగా కోదాడ మండలంలో 1,016 అడ్మిషన్లు వచ్చాయి. అత్యల్పంగా మఠంపల్లి మండలంలో 53 అడ్మిషన్లు మాత్రమే వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా ఒకటవ తరగతిలో 2150 అడ్మిషన్లు అయ్యాయి. ప్రైవేట్ పాఠశాలల నుంచి 1,584 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. అడ్మిషన్లు ఇలా.. గత ఏడాది బడిబాటలో అడ్మిషన్లు: 5,272ఈ ఏడాది ఇప్పటివరకు అడ్మిషన్లు: 8578అదనంగా చేరిన విద్యార్థులు : 3306ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, ఇతర వసతులు కల్పించడంతో విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరిగింది. ఈ ఏడాది అడ్మిషన్లు గత ఏడాది కంటే ఎక్కువగా వచ్చాయి. బడిబాటలో ఉపాధ్యాయులు ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న వసతులపై వివరించారు. –అశోక్, డీఈఓ -
యూరియా సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూస్తాం
చిలుకూరు : రైతులకు యూరియా సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూస్తామని జిల్లా సహకార అధికారి శ్రీరాం అన్నారు. గురువారం చిలుకూరు ప్రాథమిక సహకార సంఘం కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిలుకూరు సహకార సంఘం ఎఫ్పీఓకు ఎంపికై నందున ఈక్విటీ గ్రాంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రూ.ఆరు లక్షలు సొసైటీ అకౌంట్లో జమయ్యాయని తెలిపారు. సంఘంలో 300 మంది సభ్యత్వం తీసుకున్నారని, ఇంకా 450 మంది రైతులకు అవకాశం ఉందని తెలిపారు. చిలుకూరు సహకార సంఘానికి కామన్ సర్వీస్ సెంటర్ను వెంటనే ఓపెన్ చేయాలని సూచించారు. అనంతరం డీసీఓను చైర్మన్, సిబ్బంది ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎఫ్ఈఓ అధికారి రాజు, సంఘం చైర్మన్ అ లసకాని జనార్దన్, వైస్ చైర్మన్ పద్మావతి, సంఘం సీఈఓ లక్ష్మీనారాయణ, డైరెక్టర్లు, పాల్గొన్నారు. ఫ జిల్లా సహకార అధికారి శ్రీరాం -
గంజాయి చాక్లెట్ల పట్టివేత
గంజాయి చాక్లెట్లు కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తులను గురువారం చౌటుప్పల్ పోలీసులు పట్టుకున్నారు. - 8లోకోచింగ్ లేకుండానే రెండు ఉద్యోగాలు ..హుజూర్నగర్ : హుజూర్నగర్కు చెందిన పోటు ప్రణయ్ రెండు నెలల్లో రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. బీటెక్ పూర్తి చేసిన ప్రణయ్ స్థానిక గ్రంథాలయంలో సొంతంగా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యాడు. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో ఆర్టీసీ సూపర్వైజర్గా ఎంపికై న ఆయన.. తాజాగా రీజినల్ రూరల్ బ్యాంక్ (ఆర్ఆర్బీ) క్లర్క్ ఉద్యోగానికి కూడా ఎంపికయ్యారు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే ఇంటి నుంచి పుస్తకాలు తీసుకెళ్లి గ్రంథాలయంలో కూర్చొని చదువుకుని ఉద్యోగం సాధించినట్లు ఉదయ్ తెలిపారు. తన విజయానికి యూట్యూబ్లో క్లాసులు, విద్యా వీడియోలు దోహదపడినట్లు పేర్కొన్నారు. -
‘సర్’లో తప్పులు దొర్లకుండా చూడాలి
అర్వపల్లి : ఎన్యుమరేషన్న్పత్రాలు ఆన్లైన్లో అప్లోడ్ చేసే సమయంలో బీఎల్ఓలు తప్పులు దొర్లకుండా చూడాలని అదనపు కలెక్టర్ హరిసింగ్ సూచించారు. గురువారం అర్వపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో సర్ కార్యక్రమంపై బీఎల్ఓలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఓటర్లు ఎన్యుమరేషన్ పత్రాలను నింపి ఇస్తున్నందున వాటిని యాప్లో అప్లోడ్ చేసే విషయంలో జాగ్రత్త వహించాలన్నారు. అనంతరం బీఎల్ఓలకు పవర్బ్యాంక్లు, టీషర్టులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ బాషపాక శ్రీకాంత్, నాయబ్ తహసీల్దార్ సమ్మెట అశ్వని, గిర్ధావర్ పాటి వెంకట్రెడ్డి, శిక్షకులు సైదులు, ధనలక్ష్మి పాల్గొన్నారు. సమగ్ర సమాచారం తీసుకోవాలి తిరుమలగిరి (తుంగతుర్తి) : ఓటరు జాబితాపై బీఎల్ఓలు సమగ్ర సమాచారం తీసుకోవాలని అదనపు కలెక్టర్ బి.హరిసింగ్ సూచించారు. గురువారం తిరుమలగిరి మండలం తొండ గ్రామంలోని రైతు వేదికలో ఎన్యుమరేషన్ ఫారాలపై బీఎల్ఓలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడుతూ.. బూత్ లెవల్ అధికారులు ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారాలు అందించిన తరువాత వాటిని సమగ్ర సమాచారంతో నింపేవిధంగా ప్రజలకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో తిరుమలగిరి మండల ఇన్చార్జ్ తహసీల్దార్ ఎస్.పుష్ప, డిప్యూటీ తహసీల్దార్ జాన్ మహ్మద్, సిబ్బంది పాల్గొన్నారు. ఫ అదనపు కలెక్టర్ హరిసింగ్ -
ఒక వ్యక్తికి ఒక దగ్గరే ఓటు
హుజూర్నగర్ : ఎవరికై నా ఒకే చోట ఓటు ఉండాలని రెండు చోట్ల ఉంటే ఒక చోట ఓటు తొలగిస్తారని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ స్పష్టం చేశారు. బుధవారం హుజూర్నగర్లో నిర్వహిస్తున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను ఆయన క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బీఎల్ఓలకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎవరికై నా రెండు చోట్ల ఓటు ఉంటే ఎక్కడ ఓటు ఉండాలో ముందే నిర్ణయించుకోవాలన్నారు. లేదా అధికారులే ఒక చోట తొలగిస్తారని చెప్పారు. కొత్త ఓట్ల నమోదు, తప్పుల సవరణ కోసం ప్రజలు సరైన వివరాలు అందించి సహకరించాలని కోరారు. ఎన్యుమరేషన్ ఫారాలను తప్పులు లేకుండా నమోదు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ కవిత, బీఎల్ఓలు, తదితరులు ఉన్నారు. ఇళ్ల నిర్మాణం పరిశీలన హుజూర్నగర్ శివారులోని రామస్వామిగుట్టవద్ద 110 ఎకరాలలో నిర్మిస్తున్న 2,160 ఇందిరమ్మ ఇళ్ల మోడల్ హౌసింగ్ కాలనీని కలెక్టర్ పరిశీలించారు. కాలనీలో మిగిలిన పనులను త్వరితగతిన నాణ్యతతో పూర్తి చేయాలన్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీఓ శ్రీనివాసులు, మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కోతి సంపత్రెడ్డి, హౌసింగ్ పీడీ సిద్ధార్థ, హార్టి కల్చర్ పీడీ నాగయ్య, మిషన్ భగీరథ ఈఈ అరుణాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సతీష్కుమార్, తహసీల్దార్ కవిత, వివిద శాఖల అధికారులు, కాంటారక్టర్లు, తదితరులు ఉన్నారు. ఫ రెండు చోట్ల ఉంటే ఒకటి తొలగింపు ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
చదువుపై ఆసక్తి కలిగేలా బోధన
నల్లగొండ (సూర్యాపేటటౌన్): విద్యార్థులకు చదువుపై ఆసక్తి కలిగేలా ఉపాధ్యాయులు విద్యాబోధన చేయాలని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేష్ సూచించారు. బుధవారం సూర్యాపేట మండలంలోని ఎంపీపీఎస్ టేకుమట్ల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రత్నపురం ఎంపీయూపీఎస్ను ఆయన సందర్శించారు. టేకుమట్ల పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. పదో తరగతి విద్యార్థులు క్లిష్టమైన సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. రత్నపురం ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రీ ప్రైమరీ విభాగం అమలు తీరును పరిశీలించారు. కలెక్టరేట్లో ఎంఈఓలు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన వెంట డీఈఓ కె.అశోక్, సెక్టోరియల్ అధికారులు హరికృష్ణ, శేషగాని శ్రీనివాసగౌడ్, శ్రవణ్ కుమార్, రేణుక సూర్యనారాయణ ఉన్నారు. ఆయిల్ పామ్తో నిరంతర ఆదాయంనల్లగొండ (ఆత్మకూర్ (ఎస్)) : దీర్ఘకాల పంట అయిన ఆయిల్ పామ్ తోటలను సాగుచేసి ప్రతి నెలా ఆదాయం పొందవచ్చని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి తీగల నాగయ్య అన్నారు. బుధవారం మండలంలోని పాత సూర్యాపేట గ్రామంలో హఫీజ్ వ్యవసాయ క్షేత్రంలో మేఘ ప్లాంటేషన్ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మార్కెట్లో ఆయిల్పామ్కు మంచి డిమాండ్ ఉందన్నారు. తోట నాటిన నాలుగో సంవత్సరం నుంచే దిగుబడి ప్రారంభమవుతుందని తెలిపారు. కార్యక్ర మంలో ప్రాంతీయ ఉద్యాన అధికారి కట్ట స్వాతి, జిల్లా మేనేజర్ అలీమ్, విస్తరణ అధి కారి యానాల సుధాకర్రెడ్డి, ఆయిల్ఫెడ్ ఫీల్డ్ ఆఫీసర్ ఎన్.గోపి రైతులు పాల్గొన్నారు. అక్రమ వెంచర్లో హద్దు రాళ్లు తొలగింపుచిలుకూరు: మండల కేంద్రం శివారులో అనుమతులు లేకుండా అక్రమంగా ఏర్పాటు చేసిన వెంచర్లోని హద్దు రాళ్లను బుధవారం గ్రామ పంచాయతీ అధికారులు, సిబ్బంది తొలగించారు. సోమవారం ‘సాక్షి’లో ‘గజాల్లో అమ్మకం.. గుంటల్లో రిజిస్ట్రేషన్’ శిర్షీకతో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. డీటీసీపీ అనుమతి లేకుండా వెంచర్ ఏర్పాటు చేసి రాళ్లు పాతినట్లుగా గుర్తించారు. ఎంపీడీఓ ముక్కపాటి నరసింహారావు ఆదేశాల మేరకు పంచాయతీ అధికారులు వెంచర్లో ఏర్పాటు చేసిన రాళ్లను సిబ్బందితో తొలగింపజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య, ఉప సర్పంచ్ బెల్లంకొండ నాగయ్య, పంచాయతీ కార్యదర్శి షరీఫొద్దీన్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. నల్లగొండ పాలిటెక్నిక్లో స్పాట్ అడ్మిషన్లు రామగిరి(నల్లగొండ) : నల్గొండలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరానికి వివిధ డిప్లొమా కోర్సుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్.నరసింహారావు తెలిపారు. ఈ నెల 3వ తేదీ వరకు విద్యార్థులు నేరుగా కళాశాలకు వచ్చి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మెకానికల్ ఇంజనీరింగ్ 26, సివిల్ 17, ఎలక్ట్రికల్ వెహికల్ ఇంజనీరింగ్ 11, కంప్యూటర్స్లో 2 సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. -
చెట్ల కిందే చదువులు
నల్లగొండ(సూర్యాపేటటౌన్) : సూర్యాపేట హరిజనవాడ ప్రాథమిక పాఠశాలకు సొంత భవనం లేకపోవడంతో అద్దె భవనంలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 35 మంది విద్యార్థులు చదువుతున్నారు. అద్దె భవనంలో మౌలిక వసతులు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు గదులు మాత్రమే అందుబాటులో ఉన్నప్పటికీ అవి కూడా శిథిలావస్థకు చేరి పై కప్పు నుంచి వర్షపు నీరు కారుతుండడంతో తరగతుల నిర్వహణ కష్టంగా మారుతోంది. దాంతో చెట్ల కిందే పాఠాలు చెప్పాల్సి వస్తోంది. -
ఎన్నికల హామీలు అమలు చేయాలి
నల్లగొండ (భానుపురి) : ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. బుధవారం సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడిలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వాలు మారినా ప్రజల బతుకుల్లో మార్పు రావడం లేదన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో బీసీలకు 21 హామీలు ఇచ్చారని, అందులో ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒక్క ఫ్రీ బస్సు మినహా మిగతా వాటిని అమలు చేయడం లేదన్నారు. రైతు భరోసా పూర్తిస్థాయిలో రైతులకు అందడం లేదన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ధూళిపాళ ధనుంజయ నాయుడు, నాయకులు ఉస్తేల సృజన, మేకల శ్రీనివాస్, కంబాల శ్రీనివాస్, బద్దం కృష్ణారెడ్డి, పోకల వెంకటేశ్వర్లు, బూర వెంకటేశ్వర్లు బత్తినేని హనుమంతరావు, కొప్పోజు సూర్యనారాయణ, దేవరం మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి హామీకి బ్రేక్
ఉపాధిహామీ పథకం కార్యాలయాల్లో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్లు, ఏపీఓలు, ఇంజనీరింగ్, టెక్నికల్, ఫీల్డ్అసిస్టెంట్లు వీబీ జీరామ్జీ పరిధిలోకి వస్తారు. ఉద్యోగుల హోదాలు కూడా మారుతాయి. ఉపాధిహామీ పథకంలో పని చేసిన సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించారు. కంప్యూటర్ ఆపరేటర్లు, అకౌంట్స్ అసిస్టెంట్లు ఇకపై డిజిటల్ అడ్మినిస్ట్రేషన్అసిస్టెంట్లుగా మారనున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లను గ్రామీణ రోజ్గార్ సహాయక లేదా గ్రామ కాయకల్ప సహాయక్గా, టెక్నికల్ అసిస్టెంట్లను రూరల్ ఈన్ఫ్రాస్ట్రక్చర్ అసోసియేట్గా పిలుస్తారు. ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు మిషన్న్ఇంజనీరింగ్ అసోసియేట్గా మారనున్నారు. అడిషనల్ ప్రోగ్రాం ఆఫీసర్ల హోదా అసిస్టెంట్ మిషన్ మేనేజర్గా మారుతుంది. నల్లగొండ (భానుపురి) : గ్రామాల్లో ఉపాధి లభించక వలస వెళ్తున్న కూలీలకు సొంతూళ్లోనే ఉపాధి కల్పించేందుకు రెండు దశాబ్దాలుగా కొనసాగుతన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఎన్ఆర్ఈజీఎస్ చట్టం స్థానంలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవికా మిషన్ (వీబీ జీరామ్జీ) తీసుకు వచ్చింది. ఈ పథకం బుధవారం నుంచి అమల్లోకి వస్తోంది. జిల్లాలో 2,61,192 జాబ్ కార్డులు జిల్లాలో 2,61,192 జాబ్ కార్డులు, 5,69,350 మంది కూలీలు ఉన్నారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త పథకంలో ఉపాధిహామీ పథకంలో కూలీలకు కలిగిన ఇబ్బందులను తొలగించడంతో పాటు అనేక మార్పులు, చేర్పులు చేసింది. ఇప్పటివరకు ఉపాధిహామీ పథకానికి అవసరమైన నిధుల్లో కేంద్ర ప్రభుత్వం 75 నుంచి 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10 నుంచి 25 శాతం వెచ్చించేవి. వీబీ జీరామ్జీ పథకంలో కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వ 40 శాతం నిధులను సమకూర్చేలా మార్పులు చేశారు. పనిదినాలు 125కు పెంపు కేంద్ర ప్రభుత్వం 2025లో వీబీ జీరామ్జీ చట్టం రూపొందించి చట్టసభల్లో ఆమోదించింది. దీని ప్రకారం గతంలో కూలీలకు 100 రోజుల పని దినాలను కల్పిస్తే కొత్త చట్టంలో వాటిని 125 రోజులకు పెంచారు. కూలీలకు సమయానికి వేతనాలు చెల్లింపు, ఒకవేళ ఆలస్యమైతే వేతనంతో పాటు పరిహారం చెల్లిస్తారు. కూలీలకు 15 రోజుల్లో పనులు చూపకపోయినా నిరుద్యోగ భృతి వారి ఖాతాల్లో జమ అవుతుంది. పనుల విభజన ఈ పథకంలో పనులను నాలుగు విభాగాలుగా విభజించారు. వీబీ జీరామ్జీ ద్వారా గ్రామాల్లో చేపట్టే అన్ని పనులను గ్రామపంచాయతీ ప్రణాళికలో నమోదు చేస్తారు. దాంతో చేసిన పనులు మళ్లీ మళ్లీ చేసే అవకాశం ఉండదు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం మెరుగుపడుతుంది. గతంలో జరిగిన అక్రమాలు తొలగిపోతాయని చెబుతున్నారు. వ్యవసాయంలో 50 శాతం పనులు చేపట్టే వీలు ఉంది. పంటల సాగులో విత్తనాలు వేయడం, పంట కోతల పని దినాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకునే వీలుంది. 60 రోజులపాటు వ్యవసాయ పనులు సజావుగా సాగే వీలు కల్పించారు. కొన్ని వర్గాలకు ప్రత్యేక కార్డులు..! వీబీ జీరామ్జీ పథకంలో భాగంగా కొన్ని వర్గాలకు ప్రత్యేక కార్డులు జారీ చేసేలా నిబంధనలు పొందుపరిచారు. ఒంటరి మహిళలు, దివ్యాంగులు, 60 ఏళ్లు పైబడిన వారికి, ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక గ్రామీణ రోజ్గార్ గ్యారెంటీ కార్డులను అందిస్తారు. ఆరు నెలలకు ఒకసారి సామాజిక తనిఖీలు నిర్వహిస్తారు. ఉపాధి పథకం జాబ్కార్డ్ స్థానంలో గ్రామీణ రోజ్గార్ గ్యారెంటీ కార్డును ఇవ్వనున్నారు. కార్డు కాలపరిమితి మూడేళ్లుగా ఉంటుంది. ప్రత్యేక వర్గాలకు స్పెషల్ కార్డులు మంజూరు చేస్తారు. ప్లానింగ్ విధానంలో మార్పులతో రాష్ట్రాలకు లేబర్ బడ్జెట్ ఉండదు. కేంద్రం నుంచే నిధులు నిర్దేశిస్తారు. డిమాండ్ పెరిగితే అదనపు ఖర్చును రాష్ట్రాలే భరించాల్సి ఉంటుంది. ఉపాధి పథకం నిర్వహణలో ఏదైనా లోపాలు జరిగితే గతంలో రూ.వేయ్యి జరిమానా విధించేవారు. కొత్త పథకం ద్వారా జరిమానాను రూ.10 వేలకు పెంచారు. ఈ పథకం నిధులపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనే విషయమై కూలీల్లో అయోమయం నెలకొంది. వీబీ జీరామ్జీ పేరుతో అమలు ఫ 125 రోజులకు పెరిగిన పని దినాలు ఫ గ్రామీణ రోజ్గార్ గ్యారెంటీ కార్డులు అందజేత -
ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండాలి
ఫ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ మోతె : ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, కోదాడ ఎమ్మెల్యే మాత్రం ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. బుధవారం మోతె మండలం హుస్సేన్బాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలు స్థానిక ఎమ్మెల్యేకు చెప్పుకోవాలంటే కారు కిరాయికి తీసుకొని హైదరాబాద్ వెళ్లాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఎమ్మెల్యే స్థానికంగా ఉండి నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని సూచించారు. కోదాడ నియోజవర్గంలో పలు పోలీస్ స్టేషన్లలో ఎస్ఐ పోస్టులు ఖాళీగా ఉండడంతో ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం జరుగుతోందన్నారు. వెంటనే ఖాళీ పోస్టులను భర్తీ చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శీలం సైదులు, మాజీ ఎంపీపీ ఆరె లింగారెడ్డి, మాజీ ఎంపీటీసీ కట్కూరి ఉషి సంజీవరెడ్డి, సర్పంచ్ అక్కినపల్లి శ్రీరాములు, నిమ్మల రవి, జాన్రెడ్డి, సంజీవరెడ్డి, దేవ్లానాయక్, తదితరులు ఉన్నారు. -
ఒకే గదిలో విద్యాబోధన
చిలుకూరు: మండలంలోని కొండాపురం ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి వరకు 20 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం మూడు గదులు ఉండగా రెండు శిథిలావస్థకు చేరగా ఒక గది మాత్రమే అందుబాటులో ఉంది. గత ప్రభుత్వ హయాంలో మన ఊరు– మన బడి పథకం కింద పాఠశాలకు మూడు తరగతి గదులు, మరుగుదొడ్లుకు నిధులు మంజూరయ్యాయి. మూడేళ్ల క్రితం పనులు ప్రారంభించారు. తరువాత మధ్యలో వదిలేశారు. తరగతి గదులు పిల్లర్ల దశలో నిలిచిపోగా రెండు మరుగుదొడ్లు కొంత వరకు నిర్మించి వదిలేశారు. పాఠశాలలో వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. -
ట్రాఫిక్ నియంత్రణకు పటిష్ట ప్రణాళిక : ఎస్పీ
నల్లగొండ (సూర్యాపేటటౌన్) : జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ నియంత్రణకు పటిష్ట ప్రణాళిక రూపొందించినట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ చౌరస్తా, ఖమ్మం ఎక్స్ రోడ్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్, పోలీస్ సిబ్బంది పనితీరును బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఉండేలా ఆధునిక పద్ధతుల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలు, వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. రోడ్లను, ఫుట్పాత్లను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిని సర్దుబాటు చేయడానికి ‘ఆపరేషన్ రోప్’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. వ్యాపారులు రోడ్లను ఆక్రమించి వ్యాపారం నిర్వహించవద్దని సూచించారు. ఆయన వెంట డీఎస్పీ ప్రసన్నకుమార్, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఆర్టీసీ మేనేజర్, ట్రాఫిక్ ఎస్ఐ ఉన్నారు. -
పాల సంఘం ఎన్నికల్లో ఉద్రిక్తత
అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలో సోమవారం పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకుల మధ్య ఘర్షణతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో కొందరు బ్యాలెట్ బాక్స్లు ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్, నాగారం సీఐ నాగేశ్వరరావు, అర్వపల్లి ఎస్ఐ పి.మధు ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు. ఎన్నికలు అయ్యాక కౌంటింగ్కు ఏజెంట్లు రాకపోవడంతో మంగళవారానికి కౌంటింగ్ను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి మల్లయ్య ప్రకటించారు. కాగా ఈ ఎన్నికల్లో 55 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ వైస్ ఎంపీపీ మారిపెద్ది భవాణి శ్రీనివా్స్గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుండగాని సోమేష్గౌడ్, సర్పంచ్ బొడ్డు ఇందిరసోమరాజ్ మాట్లాడుతూ ఓడిపోతామనే భయంతో అధికార పార్టీ నాయకులు బ్యాలెట్ బాక్స్లను తీసుకెళ్లడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఈ విషయంలో కలెక్టర్ జోక్యం చేసుకొని ఘర్షణకు కారణమైన వారి చర్యలు తీసుకోవాలని వారు కోరారు. తిమ్మాపురంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ ఏజెంట్లు రాకపోవడంతో వాయిదా పడిన ఓట్ల లెక్కింపు -
మహనీయుడు మహలనోబిస్
దేశంలో ఆధునిక గణాంక వ్యవస్థకు పునాది వేసిన మహనీయుడు ప్రొఫెసర్ పీసీ మహలనోబిస్ అని కలెక్టర్ తేజస్నంద్లాల్ పవార్ అన్నారు. సోమవారం భారతదేశ ప్రఖ్యాత గణాంక శాస్త్రవేత్త, పద్మ విభూషణ్ ప్రొఫెసర్ ప్రసాంత చంద్ర మహలనోబిస్ జయంతిని పురస్కరించుకొని 20వ జాతీయ గణాంక దినోత్సవం – 2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పీసీ మహలనోబిస్ చిత్రపటానికి పూలమాల వేసి మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ హరిసింగ్, జిల్లా రెవెన్యూ అధికారి డి.ప్రేమరాజు, ముఖ్య ప్రణాళిక అధికారి ఎల్.కిషన్, డీటీడబ్లూఓ శంకర్, డీఎంహెచ్ఓ వెంకటరమణ, డీపీఓ యాదగిరి, గణాంక అధికారులు పి.రమేష్, వి.రామారావు, ఉపగణాంక అధికారులు రాజేష్, కోటేశ్వరరావు, నరేందర్, లింగయ్య, అశోక్, పర్యవేక్షకులు దున్న శ్యామ్, మండల ప్రణాళికా, గణాంక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఏరువాక పౌర్ణమి
హుజూర్నగర్ (మేళ్లచెరువు) : మండలంలోని పలు గ్రామాల్లో రైతులు సోమవారం ఏరువాక పౌర్ణమిని వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మేళ్లచెరువులో రైతులు తమ ఎద్దులను పుసుపు కుంకుమలతో అందంగా అలంకరించి అరకలు కట్టి ‘ఏరువాకా సాగారో అన్నో చిన్నన్న.. నీ కష్టమంతాతీరునురో అన్నో రైతన్న’ అంటూ పాటలు పాడుకుంటూ డప్పు చప్పుళ్ల నడుమ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం వినాయకుడి దేవా లయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంచిరోజు కావడంతో వ్యవసాయ పనులు మొదలుపెట్టారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు. -
గుంటల్లో రిజిస్ట్రేషన్ !
గజాల్లో అమ్మకం.. మంగళవారం శ్రీ 30 శ్రీ జూన్ శ్రీ 2026చిలుకూరు : కోదాడ–హుజూర్నగర్ రహదారి వెంట చిలుకూరు మండల కేంద్రం పరిధిలో అనుమతి లేకుండానే అక్రమ వెంచర్లు వెలుస్తున్నాయి. చిలుకూరు సమీపంలోని జానకీనగర్ స్టేజీ దగ్గర సుమారుగా రెండు ఎకరాల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే ఇటీవల ఓ వెంచర్ ఏర్పాటు చేశారు. వెంచర్ను 15 ప్లాట్లుగా మార్చి యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. ప్లాట్లను గజాల్లో అమ్ముతూ.. రిజిస్ట్రేషన్ మాత్రం గుంటల్లో చేస్తున్నారు. ఇక, ప్లాట్లు కొనుగోలు చేసిన వారు మాత్రం గ్రామ పంచాయతీ అనుమతులు తీసుకోకుండానే నిర్మాణాలకు సిద్ధమవుతున్నారు. నిబంధనలు ఇలా..నిబంధనల ప్రకారం వెంచర్ ఏర్పాటు చేయాలంటే ముందస్తుగా గ్రామ పంచాయతీ (జీపీ) అనుమతి తీసుకోవాలి. ఆ తరువాత గ్రామ పంచాయతీ అవసరాల కోసం 10 శాతం భూమి కేటాయించాలి, జీపీ తీర్మానం ప్రకారం డిస్ట్రిక్ట్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) అనుమతి తీసుకున్న తరువాతనే భూమిని ప్లాట్లుగా చేసి విక్రయాలు మొదలుపెట్టాలి. ఆ తరువాత కూడా జీపీ అనుమతితోనే నిర్మాణాలు చేపట్టాల్సి ఉన్నా ఇక్కడ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా అక్రమ వెంచర్లు ఏర్పాటు చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవట్లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎకరా భూమి అంటే 4,840 గజాలుగా లెక్కిస్తారు. అంటే ఇందులో ఎకరాకు పది శాతం (484 గజాలు) పంచాయతీకి అప్పగించాల్సి ఉంది. ఈ చొప్పున రెండు ఎకరాల వెంచర్లో మొత్తం 968 గజాలు అప్పగించాల్సి ఉంటుంది. సుమారు ఇక్కడ గజం ధర తక్కువలో తక్కువగా రూ.10 వేలు పలుకుతోంది. ఈ ప్రకారంగా రూ.10 లక్షల వరకు ఆదాయం పంచాయతీ కోల్పోనుంది. అమ్మకం ఒకలా.. రిజిస్ట్రేషన్ మరోలా..వెంచర్లు ఏర్పాటు చేసేవారు భూమి యాజమాని వద్ద నుంచి భూమిని కొనుగోలు చేయడం కొంత డబ్బు కట్టడం ఆ తరువాత రైతు పేరు మీదనే నాలా (వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా) మార్పు చేస్తారు. వెంటనే ఆ భూమిని ప్లాట్లుగా చేసి రోడ్లు వేసి, ప్లాట్ల హద్దురాళ్లు పాతి అమ్ముతున్నారు. ఇదిలా ఉంటే ప్లాట్లను గజాల లెక్కన అమ్ముతున్న వెంచర్ నిర్వాహకులు రిజిస్టేషన్ మాత్రం గుంటల్లో చేస్తున్నారు. దీంతో గ్రామ పంచాయతీకి వచ్చే లక్షల రూపాయల ఆదాయంతో పాటు ప్రజావసరాలు కేటాయించాల్సిన పది శాతం భూమి దక్కకుండా పోతోంది. ఈ విషయంపై ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి అనుమతి లేకుండా ఉన్న వెంచర్లపై తక్షణమే చర్యలు తీసుకుని అక్రమ నిర్మాణాలను ఆపాలని గ్రామస్తులు పలువురు డిమాండ్ చేస్తున్నారు.ఫ చిలుకూరు మండల కేంద్రం శివారులో అక్రమ వెంచర్దారుల నిర్వాకం ఫ అనుమతి లేకుండానే ప్లాట్ల విక్రయాలు ఫ ప్రభుత్వ నిబంధనలకు పాతర ఫ రూ.లక్షల్లో ఆదాయం కోల్పోతున్న గ్రామ పంచాయతీ -
చేనేత ఎన్నికలకు నోటిఫికేషన్
చేసేత సహకార సంఘాలలో ఫొటోతో కూడిన ఓటరు జాబితా సిద్ధంగా ఉంది. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సంఘాల సభ్యులంతా సహకరించాలి. – శ్రీనివాసరావు, యాదాద్రి జిల్లా చేనేత, జౌళిశాఖ ఏడీభూదాన్పోచంపల్లి: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చేనేత సహకార సంఘాలకు ఎన్నికల నగారా మోగింది. సోమవారం రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ ఆధ్వర్యంలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం 72 సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 15,022 మంది ఓటర్లు ఉన్నారు. కాగా యాదాద్రి జిల్లాలో 37 చేనేత సంఘాలు, 4 పవర్లూమ్ సంఘాలున్నాయి. వీటి పరిధిలో 5,495 మంది పురుషులు, 3,156 మహిళా ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా యాదాద్రి జిల్లాలో పోచంపల్లి చేనేత సహకార సంఘంలో 644 మంది, చౌటుప్పల్ 549 మంది, కొయ్యలగూడెం 518 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర సహకార ఎన్నికల ఆఽథారిటీతో పాటు యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల్లోని సహకార సంఘాల్లో వివిధ హోదాలో పనిచేస్తున్న అధికారులను నియమించారు. రహస్య బ్యాలెట్ పద్ధతిలో.. జూలై 2 నుంచి 4 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 5న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 6న నామినేషన్ల ఉపసంహరణ, అదే రోజు బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. 10న ఉదయం 8 గంటల నుంచి 2 గంటలకు వరకు రహస్య బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ నిర్వహిస్తారు. ఇదే రోజు 3 గంటల నుంచి ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. నామినేషన్ ఫీజు ఇలా... నామినేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకై తే రూ.500, బీసీ అభ్యర్థులకు రూ.750, ఇతరులకు రూ.1000గా అధికారులు నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు తమ కులధ్రువీకరణ పత్రాన్ని జతపర్చాల్సి ఉంటుంది. అలాగే నామినేషన్ పత్రంతో పాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు జతపర్చాలి. ఒక్క ఓటరు పోటీ చేసే ఒక వ్యక్తిని మాత్రమే బలపర్చాల్సి ఉంటుంది. ప్రతి సంఘంలో 9 మంది డైరెక్టర్లు.. కాగా ఎన్నికలు రహస్య బ్యాలెట్ పద్ధతిలో నిర్వహిస్తారు. ప్రతి సంఘంలో 9 మంది డైరెక్టర్లను ఎన్నుకుంటారు. ఇందులో జనరల్ స్థానాలు 7, మహిళకు 3 స్థానాలు రిజర్వు చేశారు.ఫ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 72 సంఘాలకు ఎన్నికలు ఫ 2నుంచి నామినేషన్ల స్వీకరణ ఫ 10వ తేదీన పోలింగ్ చేనేత సహకార సంఘాలు, ఓటర్ల వివరాలు జిల్లా సంఘాలు ఓటర్ల సంఖ్య యాదాద్రి 41 8,651 నల్లగొండ 28 5,723 సూర్యాపేట 03 648 -
వానాకాలానికి ‘భరోసా’
కొత్తవారికీ అవకాశం..! జిల్లాలో ఈనెల 15వ తేదీ నాటికి రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకోవడం, లేదంటే పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రైతులు ఎంఈఓల వద్ద దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వగా.. జిల్లాలో ఇప్పటి వరకు 3వేల మంది కొత్త రైతుల వివరాలను ఆన్లైన్లో వ్యవసాయ అధికారులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. జూలై 5వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశముంది.● నేడు విడుదల కానున్న పెట్టుబడి సాయం● కొత్తగా భూ పట్టా చేసుకున్న వారికీ రైతు భరోసా పథకం వర్తింపు ● బ్యాంకు ఖాతాల్లో డబ్బుల జమ తీరుపై రైతుల్లో అయోమయంనల్లగొండ (భానుపురి) : వానాకాలం పంటల సాగు ముమ్మరమైంది. జిల్లా రైతులు సాగు పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద పంటల సాగుకు కావాల్సిన పెట్టుబడి సాయం అందించేందుకు సిద్ధమైంది. ఏటా రెండు విడతల్లో ఇచ్చే ఈ సాయాన్ని వానాకాలం సీజన్కు మంగళవారం రైతుల అకౌంట్లలో జమ చేసేందుకు కార్యాచరణ రూపొందించింది. ఎకరానికి రూ.6వేల చొప్పున ఇవ్వనుండగా.. ప్రభుత్వం ఏవిధంగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుందో స్పష్టత లేదు. రెండేళ్లుగా ఒక్కో సీజన్లో ఒక్కో విధంగా రైతులకు ఈ రైతు భరోసా నిధులను ఇస్తూ వస్తోంది. ఈ సీజన్లో కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులకూ ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. 3.03 లక్షల మందికి రైతుభరోసా నిధులు అందనున్నాయి. సరిగ్గా సాగు సమయంలో..రైతుబంధు పథకం ప్రారంభమైన సమయంలో సరిగ్గా రైతులకు పెట్టుబడికి అవసరమైనప్పుడూ ఈ డబ్బులు అందాయి. రానురాను నిధుల కొరత కారణంగా ఏటేటా ఆలస్యం అవుతూ.. కొన్నిసార్లు సీజన్ చివరి దశలో రైతులకు రైతుబంధు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రైతుభరోసా కింద ఎకరానికి ఇచ్చే రూ.5వేలను రూ.6వేలకు పెంచగా.. నిధులను మాత్రం సరైన సమయంలో అందించలేదు. ఈ వానాకాలం సీజన్లో మాత్రం గతంలో ఎన్నడూ లేనివిధంగా జూలై చివరి తేదీ నాటికే నిధులను జమ చేయనున్నారు. 15 రోజుల్లోనే చివరి రైతు వరకు ఈ నిధులను జమ చేయనున్నట్లు ప్రకటించడంతో రైతుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. అందని మార్గదర్శకాలు..జిల్లావ్యాప్తంగా 6 లక్షల ఎకరాలకుపైగా వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి 3.03 లక్షల మందికి పట్టాలు జారీ అయి ఉండగా రైతుభరోసా కింద దాదాపు రూ.300 కోట్ల వరకు నిధులు అవసరం కానున్నాయి. ఈ సీజన్లో ఏవిధంగా రైతుల అకౌంట్లలో జమ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో రైతులు ప్రభుత్వం విడుదల చేసే రైతుభరోసా నిధులు తమకు వస్తాయో.. రావోనని అయోమయంలో ఉన్నారు. పదెకరాల వరకే రైతుభరోసా ఇస్తారని, సాగు భూములకేనని.. ఇలా రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. నిధుల జమపై ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాకపోవడంతో అధికారుల్లో సందిగ్ధత నెలకొంది.సాగు భూమి 6లక్షల ఎకరాలు రైతులు 3.03 లక్షలు అవసరమున్న నిధులు రూ.300 కోట్లు కొత్తగా నమోదైన రైతులు 3,000 -
బాధితులకు న్యాయం జరిగేలా కృషి
నల్లగొండ (సూర్యాపేటటౌన్) : బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా పోలీస్ అధికారులు కృషిచేయాలని ఎస్పీ నరసింహ ఆదేశించారు. సోమవారం సూర్యాపేటలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్డే కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్క బాధితుడి సమస్యను విని, వాటి పరిష్కారం వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఫిర్యాదును చట్టప్రకారం క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు అన్యాయం జరగకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. ప్రజ రక్షణ కోసం ప్రతి పోలీస్ అంకిత భావంతో పనిచేయాలని కోరారు. ఆపదలో స్టేషన్కు వచ్చే వారికి పోలీసులం ఉన్నామంటూ భరోసానివ్వాలని ఆదేశించారు. పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలిపదోన్నతి పొందిన సిబ్బంది పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాని ఎస్పీ నరసింహ సూచించారు. ఆర్ముడ్ రిజర్వ్లో కానిస్టేబుళ్లుగా పని చేస్తూ ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన నంద కిషోర్, నాగరాజు, షేక్ రఫీ, రమేష్, కె.సతీష్, ఎం.సతీశ్, క్రాంతి, రవినాయక్లకు సోమవారం ఎస్పీ తన కార్యాలయంలో ప్రమోషన్ ఉత్తర్వులు అందజేసి శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. బాధ్యతగా విధులు నిర్వహించాలని కోరారు. క్రమశిక్షణతో మెలగాలని, తోటి సిబ్బందిని గౌరవించాలని సూచించారు. విధుల నిర్వహిణలో సమన్వయంతో ముందుకెళ్తూ ఆరోగ్యాన్ని, కుటుంబాలను కూడా కాపాడుకోవాలని కోరారు. ఫ ఎస్పీ నరసింహ -
పెండింగ్ అర్జీలను పరిష్కరించండి
నల్లగొండ (భానుపురి) : ప్రజావాణి పెండింగ్ అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 98 అర్జీలు స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడారు. ప్రజావాణిలో కొత్తగా అందుతున్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు. వానాకాలం వన మహోత్సవానికి శాఖల వారీగా నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిచేయాలన్నారు. ప్రతి కాలేజీ, స్కూళ్లలో డ్రగ్స్ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. రోడ్డు భద్రతపై సంక్షేమ హాస్టల్స్లో, కాలేజీ, పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన సమావేశాలు నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, డీఆర్ఓ ప్రేమ్రాజు, డీఆర్డీఓ సన్యాసయ్య, జెడ్పీ సీఈఓ శిరీష, డీఎంహెచ్ఓ వెంకటరమణ, హౌసింగ్ పీడీ సిద్ధార్థ్, సీపీఓ కిషన్ నాయక్, డీఈఓ అశోక్ తదితరులు పాల్గొన్నారు. ‘సర్’ను వేగవంతంగా పూర్తి చేయాలిఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్)ను వేగవంతంగా, పారదర్శకంగా పూర్తిచేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు (ఈఆర్వోలు), సహాయ రిటర్నింగ్ అధికారులు (ఏఈ ఆర్వోలు)తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఇప్పటి వరకు 70 శాతం ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశామని పేర్కొన్నారు. బీఎల్ఓలు, సూపర్వైజర్లు ఇంటింటికీవెళ్లి ఫారాలు అందజేస్తున్నానిరి మిగతా ప్రక్రియను త్వరలో పూర్తిచేస్తామన్నారు. కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, డీఆర్ఓ ప్రేమ్రాజు, సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్ ఆర్డీఓలు వేణు మాధవరావు, శ్రీనివాసులు, సూర్యనారాయణ, సూర్యాపేట తహసీల్దార్ కృష్ణయ్య, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు రవితేజ, అనూష, సెక్షన్ సూపరింటెండెంట్ రాజేందర్రెడ్డి పాల్గొన్నారు. ప్రజావాణిలో కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
మట్టపల్లిలో నిత్య కల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో సోమవారం రాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి నిత్య కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో పూజలు, అభిషేకం చేపట్టారు. ఆ తర్వాత శ్రీస్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. శివాలయంలో శ్రీరామలింగేశ్వర స్వామికి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ చలపతిరావు, అర్చకులు తూమాటి క్రిష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, సాయిచార్యులు, నాగభూషణశర్మ పాల్గొన్నారు. సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు సరికావు● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ నల్లగొండ (సూర్యాపేటటౌన్) : నల్లగొండ సభలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డిపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు చేయడం సరైంది కావని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బూతు పురాణంతో సీఎం హోదాను దిగార్చుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ మంత్రివర్గంలో పదేళ్లు మంత్రిగా జగదీష్రెడ్డి చేసిన అభివృద్ధి కళ్ల ముందే కనిపిస్తుందన్నారు. కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి ఏందో చెప్తరా అని ప్రశ్నించారు. మరోమారు మాజీమంత్రి జగదీష్రెడ్డి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. నానో ఎరువులతో చాలా ప్రయోజనాలుగరిడేపల్లి : రసాయన ఎరువుల కంటే నానో ఎరువుల వినియోగంతో అధిక దిగుబడి, ఎక్కువ లాభాలు, భూసారం పెరగడం లాంటి చాలా ప్రయోజనాలు చేకూరుతాయని కేవీకే గడ్డిపల్లి సీనియర్ శాస్త్రవేత్త, ప్రోగ్రామ్ ఇన్చార్జి డి.నరేష్ అన్నారు. గరిడేపల్లి మండలం గారకుంటతండాలో ఖేత్ బచావో అభియాన్ఙ్ (నేలలను రక్షించుకుందాం) కార్యక్రమంలో భాగంగా నానో ఎరువుల వాడకంపై సోమవారం రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రతి రైతు భూసార పరీక్షలు చేయించుకొని, భూమికి అవసరమైన పోషకాలను అందించాలన్నారు. పలు విషయాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు ఎ.కిరణ్, ప్రోగ్రామ్ అసిస్టెంట్ ఎన్.సుగంధి, ఇఫ్కో మేనేజర్ ఎ.వెంకటేశ్వర్లు, సర్పంచ్ బానోతు అరుణ, ఉపసర్పంచ్ గౌతమి, సుధాకర్, బి.హేమ్లా నాయక్, నరేందర్ నాయక్, రైతులు పాల్గొన్నారు. శివాలయంలో విశేష పూజలు హుజూర్నగర్ (మేళ్లచెరువు) : మండల కేంద్రంలోని శ్రీఇష్టకామేశ్వరి సమేత శ్రీ స్వయంభూ శంభులింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం విశేషపూజలు నిర్వహించారు. స్వామి వారికి గణపతి పూజ, పుణ్యాహవచనం, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సహస్ర నామార్చన, మహా లింగార్చన, పుష్పార్చన అనంతరం గోపూజ కార్యక్రమం చేపట్టారు. భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఈఓ శంభిరెడ్డి, అర్చకులు విష్ణువర్ధన్శర్మ, ధనుంజయశర్మ, భక్తులు పాల్గొన్నారు. -
చిన్నారుల నిండు జీవితానికి రెండు చుక్కలు
సూర్యాపేట, అర్వపల్లి : ఐదేళ్లలోపు చిన్నారులకు తల్లిదండ్రులు విధిగా పోలియో చుక్కలు వేయించాలని జిల్లా వైద్యాశాఖ అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ అన్నారు. ఆదివారం సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని మాతా–శిశు ఆరోగ్య కేంద్రంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అర్వపల్లిలోని పోలియో బూత్ను సందర్శించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 95,281 మంది ఐదేళ్లలోపు పిల్లలను గుర్తించినట్లు, జిల్లాలో 575 కేంద్రాలను ఏర్పాటు చేసి ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నట్లు చెప్పారు. తొలి రోజు పోలియో చుక్కలు వేయించని వారి ఇళ్లకు ఈ నెల 29, 30 తేదీలలో సిబ్బంది వెళ్లి చిన్నారులకు చుక్కలు వేస్తారన్నారు. మొదటిరోజు చుక్కలు వేయించని తల్లిదండ్రులు మిగిలిన రెండు రోజుల్లో వేయించి పోలియో రహిత సమాజం కోసం పాటు పడాలని కోరారు. కార్యక్రమంలో సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ నివేదిత, వైస్ చైర్మన్ షఫీఉల్లా, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ కోటిరత్నం, డాక్టర్ వాసవి, స్టాటిస్టికల్ ఆఫీసర్ బాసిత్, ఆరోగ్యశాఖ అధికారులు, అర్వపల్లిలో మండల వైద్యాధికారి డాక్టర్ బి.నగేష్నాయక్, సీహెచ్ఓ ఎం.బిచ్చునాయక్, సూపర్వైజర్ లలిత, కుంభం వీరయ్య, జ్యోతి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.ఫ డీఎంహెచ్ఓ వెంకటరమణ -
సూర్యక్షేత్రంలో సౌరహోమం
అర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారు జామున ఉషాపద్మినీ ఛాయాసమేత సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. అనంతరం యజ్ఞశాలలో మహా సౌరహోమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితజనార్ధన్స్వామి, గణపురం నరేష్, అర్చకుడు భీంపాండే పాల్గొన్నారు. జూలై 1న కలెక్టరేట్ ముట్టడినేరేడుచర్ల : ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 1న కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి నిర్వహించనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన సీపీఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై మూడేళ్లు కావస్తున్నప్పటికీ పేద ప్రజలందరికీ ఇందిరమ్మ ఇళ్లు రాలేదని ఆరోపించారు. జిల్లాలోని అనేక గ్రామాల్లో ప్రభుత్వ భూములలో నిరుపేదలు గుడిసెలు వేసేకుంటే నేటికీ పట్టాలు ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. ఇటీవల వరంగల్ జిల్లా గుండ్ల సింగారంలో సీపీఐ ఆధ్వర్యంలో వేలాది మంది పేదలకు గుడిసెలు వేసుకుంటే ప్రభుత్వం బుల్డోజర్లతో నేలమట్టం చేసిందన్నారు. సీపీఐ కార్యాలయాన్ని కూడా కూల్చివేయడం బాధాకరమన్నారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు ధనుంజయనాయుడు, మహిళా సమాఖ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మి, నాయకులు చిలకరాజు శ్రీను, భరత్ తదితరులు పాల్గొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్గా రాజమల్లయ్యసూర్యాపేట : ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్గా సూర్యాపేటకు చెందిన న్యాయవాది ఇందారపు రాజ మల్లయ్య ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కన్వీనర్ హేమ సుదర్శన్ తనకు నియామక పత్రం అందించినట్లు చెప్పారు. పార్టీ జిల్లా కో–కన్వీనర్గా తన్నీరు వెంకన్న, వర్కింగ్ కన్వీనర్గా తక్కలపల్లి శ్యామ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా మారగాని సైదులు, సంయుక్త కార్యదర్శిగా రింగు ఐలయ్య, కోశాధికారిగా గ్యార అంజయ్య, సలహాదారులుగా మెరుగు విక్రమేందుకుమార్ను నియమించినట్లు తెలిపారు. లక్ష్మీనరసింహునికి నిత్యకల్యాణంమఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఆదివారం అర్చకులు స్వామి వారి నిత్య కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం స్వామి అమ్మవార్లలను పట్టు వస్త్రాలంకరణతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం నిర్వహించారు. కల్యాణోత్సవం అనంతరం స్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ టి.చలపతిరావు, అర్చకులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
యూరియా బుకింగ్ సులభం
నాగారం: రైతులకు సకాలంలో యూరియా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది అందుబాటులోకి తెచ్చిన ‘ఫర్టి లైజర్ బుకింగ్ యాప్’ను ప్రస్తుతం ఆధునీకరించింది. ఇంటి నుంచే యూరియా బుక్ చేసుకొని, నేరుగా దుకాణాలకు వెళ్లి తెచ్చుకునేలా పలు కీలక మార్పులు చేసింది. దాంతో రైతుల ఇబ్బందులు తీరనున్నాయి. స్థానిక రైతులకే ప్రాధాన్యంగతంలో ఏ ప్రాంతానికి చెందిన రైతైనా.. ఎక్కడైనా బుక్ చేసుకునే అవకాశం ఉండేది. దీనివల్ల స్థానిక రైతులకు యూరియా దొరక్క ఇబ్బంది పడేవారు. ఈ సమస్యను దూరం చేస్తూ, ప్రస్తుత వానాకాలం సీజన్ నుంచి మండల యూనిట్గా యూరియా బుక్ చేసుకునేలా మార్పులు చేశారు. దీంతో ఏ మండలానికి చెందిన రైతులు ఆ మండలంలోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. డీలర్ల ఇష్టారాజ్యానికి చెక్..గతంలో కొందరు యూరియా డీలర్లు తమకు తెలిసిన వారికి ముందే సమాచారం ఇచ్చి, ఆన్లైన్ కోటాను ఆఫ్లైన్లో దారి మళ్లించేవారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం యాప్లో కొత్తగా టైమ్ స్లాట్లను జోడించింది. దీని ద్వారా డీలర్లు మధ్యాహ్నం 3 గంటల తర్వాత యూరియా స్టాక్ను ఆన్లైన్లో నమోదు చేస్తే.. అది మరుసటి రోజు ఉదయం 6 గంటలకే రైతులకు కనిపిస్తుంది. ఉదయం 6 గంటల తర్వాత ఆన్లైన్లో పెడితే.. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకే రైతులకు కనిపిస్తుంది. రైతులు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు యాప్లో లాగిన్ అయి యూరియా బుక్ చేసుకోవచ్చు. ఎక్కడ, ఎంత స్టాక్ ఉందో కూడా తెలుసుకోవచ్చు. ఎకరానికి రెండు బస్తాలేగతంలో కొందరు యూరియా కొరతను దృష్టిలో పెట్టుకొని ఎక్కువ కోటా కోసం పంటల నమోదు సమయంలో ‘మొక్కజొన్న’ను ఎంపిక చేసుకునేవారు. మొక్కజొన్నకు ఎకరానికి 5 బస్తాలు ఇచ్చేవారు. కానీ ఈ సారి యూరియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం నిబంధనలు మార్చింది. ఏ పంట సాగు చేసినా ఎకరానికి రెండు బస్తాలు మాత్రమే బుక్ అవుతుంది. ఓటీపీల ఇబ్బంది లేదుయాప్ను అధికారులు పూర్తిగా అప్డేట్ చేశారు. గతంలో యాప్లోకి లాగిన్ అయిన ప్రతిసారీ ఫోన్ నంబర్కు ఓటీపీ వచ్చేది. ఓటీపీ ఎంటర్ చేస్తేనే యూరియా బుక్ అయ్యేది. ఇప్పుడు ప్రతిసారీ ఓటీపీ అవసరం లేకుండా, నేరుగా యాప్లోకి వెళ్లి సులభంగా బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.ఫ యాప్లో మార్పులు చేసిన ప్రభుత్వం ఫ మండల యూనిట్గా బుకింగ్కు అవకాశం ఫ ఓటీపీతో పనిలేదు ఫ ఎకరానికి 2 బస్తాలకే చాన్స్ -
ప్రాజెక్టులు పూర్తిచేసి నీళ్లు పారిస్తాం : సీఎం రేవంత్రెడ్డి
వచ్చే ఎన్నికల నాటికి...ఎస్ఎల్బీసీ, డిండినల్లగొండ : ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని వచ్చే ఎన్నికల నాటికి పూర్తి చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. ఆ బాధ్యత భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఆర్థిక మంత్రి చూస్తారన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా కనగల్ మండల కేంద్రంలో రూ.13 వేల కోట్లతో చేపట్టిన హ్యామ్ రోడ్ల పథకానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం నల్లగొండలోని ఎన్జీ కళాశాల బహిరంగ సభ ప్రాంగణం వద్ద రూ.83 కోట్లతో మంచి నీటి పథకానికి శంకుస్థాపన చేశారు. అనంతరం సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఎస్ఎల్బీసీ పూర్తిచేసి కృష్ణాజలాలను నల్లగొండ గడ్డపై పారిస్తానని, ప్రతి ఎకరాకు సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. డిండి ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. మూసీ కంపు, కాలుష్యం నుంచి జిల్లా ప్రజలకు విముక్తి కల్పిస్తానని చెప్పారు. మూసీ కంపు వల్ల జిల్లాలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మా ప్రభుత్వం ఎందుకు పోవాలి ‘నేను నడుచుకుంటూ వస్తున్న సమయంలో కొందరు యువకులు నాకు ఇలా చెప్పారు. సూర్యాపేటలో తులసివనంలో గంజాయి మొక్క ఉందన్న. ఆ మూడు జానలాయన కోమటిరెడ్డిని విమర్శిస్తుండు. ఈ సారి ఆ గంజాయి మొక్కను గెలువనివ్వమని నాకు చెప్పారు. నేను కూడా మీకు చెబుతున్నా ఆ ఒక్క మొక్కను కూడా పీకేయాలి’ అని సీఎం పిలుపునిచ్చారు. ‘ప్రజాపాలన పోవాలని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మా ఆడపడుచులంతా.. కళ్ల సంబురంగా నేను పెట్టిన చీరనుకట్టుకుని వచ్చిండ్రు. నేను అడుగుతున్నా.. వడ్డీలేని రుణాలు ఇచ్చినందుకు ప్రజా ప్రభుత్వం పోవల్నా.. గ్యాస్, సన్న బియ్యం, రైతుభరోసా వంటి సంక్షేమ పథకాలు ఇచ్చినందుకు మా ప్రభుత్వం పోవాల్నా’ అంటూ ముఖ్యమంత్రి వేదిక నుంచి ప్రశ్నించారు. మిగతా నియోజకవర్గాలకు నిధులివ్వాలి జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉంటే వారి నియోజకవర్గంలో అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారని నల్లగొండ ఎంపీ రఘువీర్రెడ్డి అన్నారు. తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మిగతా నియోజకవర్గాల అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి ఆలోచించి నిధులు మంజూరు చేయాలని కోరారు. సాగర్ నియోజకవర్గంలో హైలెవల్, లోలెవల్ కెనాల్ పూర్తిచేసి లింక్ కలపాలని, డిండి, ఎదుల్ల ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ వేగవంతం చేయాలన్నారు. మిర్యాలగూడ నియోజక వర్గ పరిధిలోని నాలుగు ఎత్తిపోతల పథకాలను త్వరగా పూర్తి చేయాలన్నారు.75వేల రేషన్ కార్డులు ఇచ్చాం ధాన్యం దిగుబడిలో రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా మొదటి స్థానంలో ఉందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. దేశంలో ధాన్యం దిగుమతి కొనుగోళ్లలో తెలంగాణ ముందుంటే.. తెలంగాణలో నల్లగొండ జిల్లా ముందుందన్నారు. జిల్లాలో కొత్తగా 75 వేల రేషన్ కార్డులు మంజూరు చేశామన్నారు. ఏఎమ్మార్పీ, సాగర్ కాల్వల ఆదునీకరణ పనులు చేపట్టామన్నారు. నా జీవితంలో ఇంత పెద్ద రోడ్ల ప్రాజెక్టు ఎక్కడా ఒకేసారి చేపట్టిన దాఖలాలు లేవన్నారు. ఫ మూసీ కంపు, కాలుష్యం నుంచి నల్లగొండకు విముక్తి కల్పిస్తాం ఫ సంక్షేమ పథకాలు ఇస్తున్నందుకు మా ప్రభుత్వం పోవాల్నా ఫ నల్లగొండ బహిరంగ సభలో ముఖ్యమంత్రిసొరంగం పూర్తయితే నాలుగు లక్షల ఎకరాలకు నీరు మూసీ కాలుష్యంతో ఇబ్బందుల్లో ఉన్న మన జీవితాలను మార్చేందుకు సీఎం రేవంత్రెడ్డి మూసీ ప్రక్షాళనకు పూనుకున్నాడని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. మూసీ ప్రక్షాలనను అడ్డుకోవాలని బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారని, ‘కేసీ ఆర్, కేటీఆర్ మీరు ఒకసారి నకిరేకల్ ప్రాంతంలో రాత్రి నిద్రపోయి చూడండి, ఇక్కడి ప్రజలు దోమలతో, మూసీ కంపుతో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అర్థమవుతుంది’ అన్నారు కుర్చీ వేసుకుని కూర్చొని ఎస్ఎల్బీసీ పూర్తి చేయిస్తానని కేసీఆర్ ఎన్నికల్లో ప్రకటించి ఒక్కసారి కూడా అక్కడికి పోలేదన్నారు. సొరంగం పూర్తయితే 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండున్నరేళ్లలో నల్లగొండలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు సాగుతున్నాయన్నారు. నల్లగొండను కార్పొరేషన్ చేసినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. -
నెలాఖరే గడువు..!
సూర్యాపేట (భానుపురి) : రాయితీ దుర్వినియోగం, అక్రమ కనెక్షన్లకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా.. కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు ఈ– కేవైసీ విధానాన్ని తప్పనిసరి చేసింది. ఇందుకు గానూ ఈ నెలాఖరుతో గడువు ముగియనుంది. 2023లో కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకు రాగా లబ్ధిదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పలుమార్లు పొడిగిస్తూ వచ్చింది. అయినా ఇప్పటి వరకు సూర్యాపేట జిల్లాలో 89.2శాతం గ్యాస్ కనెక్షన్లకే ఈ–కేవైసీ చేయించారు. ఈ నెల 30లోగా చేయించుకోని లబ్ధిదారులు రాయితీ పొందే అవకాశం లేకుండా పోనుంది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా గ్యాస్ కొరత, ధరల పెరుగులకు తోడు రాయితీ కూడా అందకుంటే లబ్ధిదారులకు మరింత భారం కానుంది. జిల్లాలో 4,15,509 గ్యాస్ కనెక్షన్లు సూర్యాపేట జిల్లాలో 28 గ్యాస్ ఏజెన్సీ ఇండేన్, భారత్, హెచ్పీ గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తున్నారు. పౌరసరఫరాలశాఖ లెక్కల ప్రకారం జిల్లాలో మొత్తం 4,15,509 యాక్టివ్ కనెక్షన్లు ఉన్నాయి. గృహ వినియోగ గ్యాస్ను కమర్షియల్గా వాడుకోవడం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీ సొమ్మును పక్కదారి పట్టించడం వంటి ఘటనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ–కేవైసీ విధానాన్ని తీసుకు వచ్చింది. ఈ విధానంలో లబ్ధిదారుని గ్యాస్ కనెక్షన్కు ఆధార్ వివరాలు జత చేయడమే కాకుండా వేలిముద్రలు, ఐరిష్ ద్వారా అనుసంధానం చేస్తారు. నిలిచిపోనున్న సబ్సిడీ ఈ–కేవైసీ నమోదు ప్రక్రియ మూడేళ్ల నుంచి కొనసాగుతోంది. అయినా జిల్లాలో పూర్తిస్థాయిలో నమోదు కాలేదు. ఈ నేపథ్యంలో ఈనెల 30లోపు వినియోగదారులు ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వినియోగదారుల ఫోన్లకు మేసెజ్లు పంపిస్తున్నారు. ఈ లోగా ఈ–కేవైసీ చేయించుకోకుంటే రాయితీ డబ్బులు నిలిచి పోవడంతో పాటు గ్యాస్ బుకింగ్ సమయంలోనూ ఇబ్బందులు తప్పవని అధికారులు చెబుతున్నారు. ఫ ఎల్పీజీ ఈ–కేవైసీకి మరో రెండు రోజులే అవకాశం ఫ ఇప్పటి వరకు 89.2 శాతం కనెక్షన్లకే ఈ–కేవైసీ ఫ చేయించకుంటే రాయితీ కట్ -
అందరికీ సమన్యాయం అందించాలి
మఠంపల్లి: ఎస్సీలు కూడా సమాజంలో భాగమేనని, వారిపై వివక్ష చూపకుండా అందరికీ సమన్యాయం చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. మఠంపల్లిలో ఇటీవల ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకోగా ఇరు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయమై మండల కేంద్రానికి చెందిన తుపాకుల జ్యోతి ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేసింది. తన కుమారుడు మహేష్పై కొందరు దాడి చేసి గాయపర్చారని, అయినా అతడిపైనే పోలీసులు కేసు నమోదు చేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు స్పందించిన కమిషన్ చైర్మన్ ఆదివారం బాధిత కుటుంబాలను పరామర్శించారు. జరిగిన ఘటనపై విచారించారు. అనంతరం వెంకటయ్య స్థానిక విలేకరులతో మాట్లాడారు. దళిత యువకుడు మహేష్పై దాడి జరిగినప్పుడు పోలీసుశాఖ సమస్యలను గుర్తించి చర్యలు తీసుకుంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదన్నారు. దెబ్బలుతిన్న ఎస్సీ వారిపై 307 కేసు నమోదుచేసి, అవతలి వారిపై సాధారణ కేసు నమోదు చేయడం సరికాదన్నారు. దాడికి పాల్పడిన వారిపై కూడా 307 కేసు నమోదు చేయాలని కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డికి సూచించారు. బాధితులకు జరిగిన అన్యాయంపై ఎస్పీతో మాట్లాడతానని, అవసరమైతే జిల్లా మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, సీఎం రేవంత్రెడ్డితో చర్చిస్తానని తెలిపారు. ప్రతి నెల చివరి వారంలో పోలీసు, రెవెన్యూ అధికారులు అన్ని సంఘాల నాయకులను పిలిచి సివిల్ రైట్ డే నిర్వహించి ఎస్సీ ఎస్టీ చట్టాలపై అవగాహన కల్పించాలని సూచించారు, ఆయన వెంట బాధిత కుటుంబాలతో పార్టీ ఆర్డీఓ శ్రీనివాసులు, తాహసీల్దార్ కె.హిమబిందు, డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ ప్రవీణ్కుమార్, డీటీ బాలరాజు, ఎంపీఓ నవీన్, ఎమ్మార్పీఎస్ నాయకులు ఇరుగు పిచ్చయ్య, చిలక దేవభిక్షం, దేవపంగు ప్రసాదు, ఆరాల నాగరాజు, బచ్చలకూరి ప్రసాద్, భూక్యా బాలునాయక్ ఉన్నారు.ఫ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య -
హ్యామ్ రోడ్ల పైలాన్ ఆవిష్కరణ
కనగల్ : కనగల్ మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డ్ వద్ద సీఎం రేవంత్రెడ్డి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డివెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్తో కలిసి హ్యామ్ రోడ్ల పైలా న్ను ఆవిష్కరించారు. రూ.13,006.27 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 6,092.37 కిలోమీటర్ల పరిధిలో 441 రహదారులను విస్తరించి, పటిష్టపరచేందుకు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడనుందని సీఎంతో పాటు మంత్రులు వెల్లడించారు. మెరుగైన రహదారుల నిర్మాణం ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడటమే కాకుండా వాణిజ్య, వ్యవసాయ రంగాల పురోగతికి ఊతమిస్తుందని చెప్పారు. ప్రజలకు సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణ సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. -
మూత‘బడి’.. తెరచుకుంది
మునగాల: మండలంలోని నర్సింహులగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని నాగార్జుననగర్లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కొంతకాలంగా విద్యార్థులు లేక మూతబడింది. ఈ విద్యాసంవత్సరం పాఠశాలను తెరిపించేందుకు గ్రామపంచాయతీ పాలకవర్గం, ఎంఈఓ పిడతల వెంకటేశ్వర్లు గ్రామంలోని విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి మాట్లాడారు. 25 మంది విద్యార్థులను పాఠశాలకు పంపేందుకు తల్లిదండ్రులు అంగీకరించారు. దాంతో సోమవారం నుంచి పాఠశాలను పునరుద్ధరించనున్నట్లు ఎంఈఓ తెలిపారు. కార్యక్రమంలో గ్రామసర్పంచ్ కుంచం ఇందిర, ఉప సర్పంచ్ మొగిలిచెర్ల సీతారాములు, గ్రామపెద్దలు పాల్గొన్నారు. -
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
సూర్యాపేట (చివ్వెంల) : విద్యార్థులు చట్టాలపై అవగహన కలిగి ఉండాలని సూర్యాపేట జిల్లా కోర్టు మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎన్. అపూర్వ రవళి అన్నారు. శనివారం జ్లిలా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల–2లో కార్మిక చట్టా లు, వెట్టిచాకిరిపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థానానికి చేరుకోవాలని సూచించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, బాగా చదివి పాఠశాలకు, తల్లిదండ్రులకు పేరు తేవాలని సూచించారు. కార్యక్రమంలో డీఎల్ఎస్ఏ నామినేటెడ్ సభ్యుడు గుంటూరు మధు, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్కుమార్, కె.ప్రియదర్శిని, న్యాయవాదులు టేకులపల్లి శ్రీనివాస్రావు, సుధాకర్ పాల్గొన్నారు. ఫ మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి అపూర్వ రవళి -
పథకాలు అర్హులకు అందేలా చూడాలి
సూర్యాపేట (భానుపురి) : ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అందేలా చూడాలని రాష్ట్ర అగ్రికల్చర్ కోఆపరేటివ్ సెక్రటరీ, ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక జిల్లా ప్రత్యేకాధికారి కె.సురేంద్రమోహన్ అన్నారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంపై కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, వైద్యం, ఆరోగ్యం వంటి రంగాలలో ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కరించడం, లబ్ధిదారుల నుంచి వినతులు స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు కృషి చేయడం, ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం వంటివి అధికారులు చేయాలన్నారు. జిల్లాలో ప్రజాపాలన –ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంపై జిల్లా కలెక్టర్తో పాటు, అధికారులను అభినందించారు. రైతులకు వ్యవసాయశాఖ యాప్లపై, ఎరువులు, విత్తనాలపై అవగాహన కల్పించాలని, ఆర్గానిక్ పంటలు పండించే విధంగా ప్రోత్సహించాలని సూచించారు. రైతు వేదికలలో రైతులకు సన్న వడ్ల విత్తనాలు, ఫర్టిలైజర్స్ అందించాలని, ఇందుకు నోడల్ ఆఫీసర్గా అదనపు కలెక్టర్ ఉంటారని తెలిపారు. సంక్షేమ హాస్టల్స్ను అధికారులు వారానికి ఒక సారి సందర్శించి విద్యార్థుల సమస్యలు తీర్చాలని సూచించారు. అనంతరం ఆయా శాఖలకు సంబంధించి చేపట్టిన కార్యక్రమాలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. హరిసింగ్, జెడ్పీ సీఈఓ శిరీష, డీఆర్ఓ ప్రేమ్రాజ్, డీఆర్డీఏ సన్యాసయ్య, డీఈఓ అశోక్, సీపీఓ కిషన్ నాయక్, డీఏఓ శ్రీధర్రెడ్డి పాల్గొన్నారు. ఫ జిల్లా ప్రత్యేకాధికారి సురేంద్రమోహన్ -
30న కళాశాలల బంద్
సూర్యాపేట : ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30న కళాశాలల బంద్ నిర్వహించనున్నట్లు బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ వీరబోయిన లింగయ్య యాదవ్ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలో సంఘం నాయకులతో కలిసి బంద్ పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. పెండింగ్లో ఉన్న రూ.8వేల కోట్ల ఫీజు బకాయిలను విడుదల చేయాలని, సంక్షేమ హాస్టళ్లకు పక్కా భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. బంద్కు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు బోనగిరి సతీష్, నాయకులు నారబోయిన లోకేష్, అజయ్, వంశీ, ధనుష్, జీవన్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్గా అనిత సూర్యాపేట : ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్శాఖ జిల్లా సూపరింటెండెంట్గా అనిత శనివారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు విధులు నిర్వహించిన లక్ష్మణ్నాయక్ ఆసిఫాబాద్ జిల్లాకు బదిలీ కాగా జనగాంలో పని చేస్తున్న అనిత సూర్యాపేటకు వచ్చారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. జాతీయ కార్యదర్శిగా సైదాబాబు సూర్యాపేట(పెన్పహాడ్) : బీసీ యువజన సంఘం జాతీయ కార్యదర్శిగా మండలంలోని తంగెళ్లగూడెం గ్రామానికి చెందిన చందా సైదా బాబును నియమించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ర్యాగ అరుణ్కుమార్ శనివారం హైదరాబాద్లో సైదాబాబుకు నియామక పత్రం అందించారు. పోలీసుల తనిఖీలుసూర్యాపేట : డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలను అరికట్టడంలో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలో పట్టణ పోలీసులు యాంటి నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. 60 ఫీట్లరోడ్, బస్టాండ్ వద్ద దుకాణాలు, పాన్ షాపులు, హోటల్స్, లాడ్జీలు, హాస్టళ్లలో తనిఖీలు చేపట్టారు. పట్టణ సీఐ వెంకటయ్య పాల్గొన్నారు. తహసీల్దార్ కార్యాలయ భవనాలకు నిధులుసూర్యిపేట (భానుపురి) : సూర్యాపేట జిల్లాలో కార్యాలయాలు లేని, శిథిలావస్థలో ఉన్న తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి ప్రభుత్వం శనివారం నిధులు విడుదల చేసింది. జిల్లాలోని మద్దిరాల, కోదాడ, మోతె, మఠంపల్లి, ఆత్మకూర్ (ఎస్)లో భవనాలకు ప్రాధాన్యత ఇస్తూ ఒక్కో భవన నిర్మాణానికి రూ.2.25 కోట్లను విడుదల చేసింది. పీహెచ్సీ వైద్యాధికారిపై బదిలీ వేటుమునగాల: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ పి.రవీందర్పై బదిలీవేటు పడింది. అదే పీహెచ్సీలో పని చేస్తున్న మహిళా సిబ్బందిని సదరు వైద్యాధికారి వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తూ మహిళా సిబ్బంది డీఎంహెచ్ఓకు ఫిర్యా దు చేశారు. దాంతో పాటు ఎల్ఈసీకి, స్థానిక పోలీస్ స్టేషన్లోనూ ఫిర్యాదు చేశారు. దాంతో వైద్యశాఖ అధికారులు ఈ విషయమై క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించారు. ఆమేరకు వైద్యాధికారిపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా హైదరాబాద్లోని రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకులకు సరేండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. లక్ష్మీనరసింహునికి నిత్య కల్యాణంమఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శనివారం అర్చకులు స్వామి వారి నిత్య కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాఢ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. ఆలయ అనువంశిక ధర్మకర్తలు, అర్చకులు, ఈఓ పాల్గొన్నారు. -
అక్రమ కేసులు ఎత్తివేసే వరకు పోరాటం
చివ్వెంల(సూర్యాపేట) : ప్రైవేటు పాఠశాలల్లో జరుగుతున్న అక్రమాలపై పోరాడుతున్న విద్యార్థి సంఘాల నాయకులపై పోలీసులు పెట్టిన తప్పుడు కేసులు ఎత్తి వేయాలని బీసీ హక్కుల సాధన సమతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ్నాయుడు డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లా విద్యాశాఖ అధికారి తనిఖీలు చేయక పోవడం వల్లే ప్రైవేట్ పాఠశాలలు నర్సరీ విద్యార్థులకు కూడా రూ.50 వేల ఫీజు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. బాధ్యత కలిగిన డీఈఓ తనిఖీ చేయకపోవడం వల్లే, పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే ఫీజుల దోపిడీని అరికట్టాలని, విద్యార్థి సంఘాల నాయకులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తు పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఆయన వెంట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లుట్ల కనకయ్య, సీపీఐ మండల కార్యదర్శి రాము, తదితరులు ఉన్నారు. -
వర్షం పడితే జంక్షన్ జామ్
తిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి పట్టణం నుంచి వెళ్తున్న నేషనల్ హైవే 930 పనులు నత్తనడకన సాగుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గౌరెళ్లి నుంచి భద్రాచలం వరకు నిర్మిస్తున్న ఈ రోడ్డు పనులు అసంపూర్తిగా ఉండడంతో కొద్దిపాటి వర్షానికే జలమయమవుతున్నాయి. స్థానిక చౌరస్తాలో డ్రెయినేజీ పనులు పూర్తి చేయక పోవడంతో మురుగు ముందుకు పారక కంపు కొడుతుంది. రోడ్డు పనులు ప్రారంభమై 5 సంవత్సరాలైనా నేటికీ పూర్తి చేయక పోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొలతలు తీసుకొని వదిలేశారు నేషనల్ హైవే 930 పీ పనుల్లో భాగంగా తిరుమలగిరి పట్టణం మోత్కూరు–తొర్రూరు రోడ్డు వైపు చౌరస్తాలో ఫ్లై ఓవర్ నిర్మాణానికి అధికారులు ప్రతిపాదించారు. ఫ్లై ఓవర్ నిర్మిస్తే తమ వ్యాపారాలు దెబ్బ తింటాయని స్థానికులు పనులను అడ్డుకున్నారు. దాంతో రోడ్డు వెడల్పు చేస్తామని చెప్పిన అధికారులు ఆమేరకు కొలతలు తీసుకున్నారు. కానీ ఇప్పటి వరకు పనులు చేపట్ట లేదు. రోడ్డుతో పాటు సైడ్ డ్రెయిన్ నిర్మించక పోవడంతో కొద్దిపాటి వర్షానికే డ్రెయినేజీ నీరంతా రోడ్లపైకి చేరుతోంది. దానికి తోడు వర్షపు నీరు పోయే మార్గం లేక రోడ్లపైనే నిలిచి వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డు పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఫ కొద్దిపాటి వర్షానికే రోడ్లు జలమయం ఫ నత్తనడకన జాతీయరహదారి 930 పనులు ఫ ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు -
కోర్టు భవన నిర్మాణానికి స్థల పరిశీలన
సూర్యాపేట (చివ్వెంల) : మండలంలోని ఐలాపురం గ్రామ శివారులో నూతనంగా నిర్మించనున్న జిల్లా కోర్టు భవన నిర్మాణ స్థలాన్ని శనివారం ఆర్అండ్బీ అధికారులు, బిల్డింగ్ డిజైనింగ్, ప్లానింగ్ ప్రైవేట్ కన్సల్టెన్సీ సభ్యులు, న్యాయవాదులు సందర్శించారు. స్థలాన్ని పరిశీలించి భవన డిజైన్పై చర్చించారు. సందర్శించిన వారిలో ఆర్అండ్బీ ఏఈ యుగంధర్, బార్ అసోషియేషన్ అధ్యక్షుడు నూకల సుదర్శన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి తల్లమళ్ల హస్సెన్, కోర్టు నాజర్ సంజయ్, న్యాయవాదులు ఉన్నారు. -
నేడు పల్్స పోలియో
సూర్యాపేట : ఐదేళ్లలోపు చిన్నారులకు ఈ నెల 28న పోలియో చుక్కలు వేసేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ సన్నద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా 95,281 మంది ఐదేళ్లలోపు చిన్నారులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దాంతో పాటు ఇటుకల బట్టీలు, సంచార జాతులు, స్లమ్, ఇతర ప్రాంతాల్లో మరో 809 మంది ఉంటారని భావిస్తున్నారు. వారందరికీ పోలియో చుక్కలు వేసేందుకు వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. పర్యవేక్షణకు ప్రత్యేకాధికారులను నియమించారు. 28న చుక్కలు వేయించని పిల్లలకు 29, 30 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి వేయనున్నారు. ఉదయం 7 గంటల నుంచి జిల్లాలోని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు 575 కేంద్రాలను వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసింది. ఆయా కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సిబ్బంది ఉండి డ్రాప్స్ వేయనున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, బస్ షెల్టర్ల వద్ద 11 ట్రాన్సిట్ కేంద్రాలను, 103 హైరిస్క్ ప్రాంతాలలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటితో పాటు 27 మొబైల్ బృందాలను నియమించారు. 2300 మంది సిబ్బంది జిల్లా వ్యాప్తంగా ఆదివారం పోలియో చుక్కలు వేసేందుకు 2300 మంది ఉద్యోగుల సేవలను వినయోగించనున్నారు. ఈ విధుల్లో ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు, ఏఎన్ఎంలు, ప్రోగ్రాం అధికారులు, డిప్యూటీ డీఎంహెచ్ఓలు, మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు, సూపర్వైజర్లు, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్లును నియమించారు. ఫ జిల్లాలో 575 పల్స్ పోలియో బూత్లు ఫ 2300 మంది సిబ్బంది సేవలు ఫ అన్ని ఆస్పత్రులకు వ్యాక్సిన్న్పంపిణీ చేసిన వైద్య ఆర్యోగ్య శాఖ జిల్లాలో ఈ నెల 28 నుంచి 30 వరకు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తాం. దీని ద్వారా వైద్య సిబ్బంది 5 సంవత్సరాల లోపు 95,281 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. మొదటి రోజు పోలియో కేంద్రాల్లో, మిగతా రెండు రోజుల్లో ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేయనున్నారు. జిల్లాలోని ప్రతి చిన్నారి పోలియో చుక్కలు వేసేందుకు తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు సహకరించాలి. –పెండెం వెంకటరమణ, డీఎంహెచ్ఓ, సూర్యాపేట -
పదవీ విరమణ చేశాను.. ‘పెదవి విరమణ’ చేయలేదు
కోదాడ : ‘నేను పదవి విరమణ చేశాను.. కానీ పెదవి విరమణ చేయలేదు.. వయస్సు సహకరించినంత వరకు ప్రజల మధ్య ఉండడానికి ఇష్టపడతాను.. ప్రజలకు ఉపయోగపడే నాలుగు మాటలు చెప్పాలని ఇక్కడకు వచ్చాను’ అని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. కోదాడలో కాకతీయ కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మించిన కల్యాణ మండపానికి గురువారం ఆయన ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మంచి పనులు చేయడం, సేవా కార్యక్రమాలు చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. కులం ఉండాలి.. కానీ కులతత్వం ఉండవద్దని హితువు చెప్పారు. తోటి వారి పట్ల సోదరభావం కలిగి ఉండాలని.. ప్రకృతిని కాపాడుకోవాలన్నారు. మానవ తప్పిదాల వల్ల ప్రస్తుతం ప్రకృతి ప్రకోపిస్తుందన్నారు. తాను న్యాయవాదిని కావాలకున్నానని.. ఎమర్జెన్సీ వల్ల రాజకీయాల్లోకి రావాల్సివచ్చిందన్నారు. రాజకీయ నాయకులు తక్కువ మాట్లాడి ఎక్కువ పనులు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థచైర్మన్ రాయల నాగేశ్వరరావు, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్, పెదనాటి వెంకటేశ్వరరావు, బొడ్డు రవిశంకర్, ఎమ్మెల్సీ తాత మధు, మాజీ మంత్రి వీరేపల్లి లక్ష్మీనారాయణరావు, రఘురాం, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, మున్సిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమకుమారి, ముత్తవరపు పాండురంగారావు, వేమూరి సురేష్, పోటు రంగారావు, మాధవరావు, కనగాల నాగేశ్వరరావు, ప్రసాద్, రత్నాకర్రావు పాల్గొన్నారు.ఫ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు -
విత్తన మేళాను సద్వినియోగం చేసుకోండి
కోదాడ : వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్రెడ్డి కోరారు. గురువారం కోదాడ మండలం అల్వాలపురం, గుడిబండ రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన విత్తన మేళాలో ఆయన మాట్లాడారు. రైతులు వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. యాప్ ద్వారానే రైతులు యూరియా కొనుగోలు చేయాలని, డీలర్లు బ్లాక్లో యూరియా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోదాడ ఏడీఏ ప్రశాంతి, కోదాడ మండల వ్యవసాయ అధికారి రజని, విస్తరణ అధికారి నగేష్, పిచ్చయ్య, మహేష్, రైతులు తదితరులు పాల్గొన్నారు. కరాటే మాస్టర్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానంసూర్యాపేటటౌన్ : జిల్లాలోని 24 పీఎంశ్రీ స్కూళ్లలో విద్యనభ్యసిస్తున్న బాలికలకు స్వీయ రక్షణలో భాగంగా కరాటే, కుంగ్ఫూ, జూడో, ఇతర మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఇచ్చేందుకు మార్షల్ ఆర్ట్స్లో బ్లాక్ బెల్ట్ కలిగిన మాస్టర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా క్రీడల, యువజన సర్వీసుల శాఖ అధికారి వెంకట్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మహిళా మాస్టార్ల (శిక్షకుల)కు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. శిక్షణ ఇచ్చే మాస్టార్లు వారి పూర్తి వివరాలను బయోడేటా ఫామ్లో పొందుపరచాలని తెలిపారు. జూలై 2వ తేదీలోగా అర్హులైన మాస్టార్లు జిల్లా యువజన, క్రీడల కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని, ఇతర వివరాలకు జిల్లా యువజన, క్రీడల అధికారి సెల్ 91009 49979 నంబర్ కు సంప్రదించాలని కోరారు. రైతు భరోసా నిధులు విడుదల చేయాలిభానుపురి (సూర్యాపేట) : పెండింగ్లో ఉన్న యాసంగి రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సూర్యాపేట కలెక్టరేట్లో జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు కంచర్ల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులతో కలిసి జిల్లా రెవెన్యూ అధికారికి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను నకిలీ విత్తనాల బారినుంచి రక్షించడానికి వెంటనే విజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. ప్రధానమంత్రి తీసుకొచ్చిన కేతి బచావో ప్రోగ్రామ్లో భాగంగా రైతులు ప్రకృతి వైపరీత్యాల నుంచి పంటలు నష్టపోకుండా ఫసల్ బీమా యోజన పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. కార్యక్రమంలో నాయకులు రంగరాజు రుక్మారావు, పాండురంగ చారి, బైరెడ్డి సంజీవరెడ్డి, బొజ్జ పరశురాం, సంతోష్ నాయక్, మాలోత్ షాంకనాయక్, సత్యనారాయణ, రవి, దిలీప్ పాల్గొన్నారు. -
యువత స్వీయ నియంత్రణ కలిగి ఉండాలి
సూర్యాపేటటౌన్ : యువత స్వీయ నియంత్రణ కలిగి ఉండాలని ఎస్పీ నరసింహ అన్నారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రగ్స్ నిర్మూలన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. నేటి యువత, బాలలే దేశానికి రేపటి భవిష్యత్ అన్నారు. ఇలాంటి భవితవ్యం ఉన్న యువత, విద్యార్థులు డ్రగ్స్ మహమ్మారికి బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. డ్రగ్స్ తీసుకున్న మైకంలో నేరాలకు పాల్పడుతూ జైలు పాలవుతున్నారని, తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలను, కలలను నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాలని, వేగంగా వెళ్లవద్దన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు, సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. -
పారదర్శకంగా నిర్వహించాలి
తిరుమలగిరి (తుంగతుర్తి), అర్వపల్లి, తుంగతుర్తి: ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను ఎలాంటి తప్పుల్లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ హరిసింగ్ కోరారు. గురువారం తిరుమలగిరి మండల కేంద్రంతోపాటు జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం, తుంగతుర్తి మండల కేంద్రంలో సర్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించి అర్హులైన ఓటర్ల వివరాలను నమోదు చేయాలన్నారు. ఫారాలు పూరించే సమయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఓటర్ల నుంచి పూర్తి సమాచారం సేకరించాలని తెలిపారు. ఎన్నికల సంఘం నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం ద్వారా పారదర్శక ఓటరు జాబితా రూపకల్పనకు ప్రజలు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమాల్లో తిరుమలగిరి మున్సిపల్ 5వ వార్డు కౌన్సిలర్ తిరుమని యాదగిరి, అర్వపల్లి, తుంగతుర్తి తహసీల్దార్లు బాషపాక శ్రీకాంత్, దయానందం, డిప్యూటీ తహసీల్దార్లు జాన్ మహ్మద్, పాటి వెంకట్రెడ్డి, కంఠమయ్య, సిబ్బంది పరశురాములు, ఉమేష్, ఉప్పలయ్య, రాధ, పరమేశ్వరి, అరుణ, రేణుక తదితరులు పాల్గొన్నారు. -
స్నేహితుడి మరణం.. సమాజ సేవకు ప్రేరణ
సూర్యాపేటటౌన్ : ఎక్కడ జనసందోహం ఉన్నా.. ఎక్కడ పెద్ద జాతరలు, వారసంతలు ఉన్నా నల్లటి దుస్తులు ధరించి మెడలో పుర్రెల దండ వేసుకొని నో డ్రగ్స్.. సేవ్ లైఫ్ అంటూ ఫ్లెక్సీని పట్టుకొని అక్కడ కనిపిస్తారు ఆ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. సమాజంలో కనీసం ఒక్కరినో.. ఇద్దరినో మత్తు పదార్థాల బారి నుంచి విముక్తి కల్పించడమే తన కర్తవ్యంగా భావించి పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు బోధించడానికే పరిమితం కాకుండా సమాజాన్ని చైతన్యపరిచేందుకు యాత్ర ప్రారంభించారు సూర్యాపేటకు చెందిన ప్రభుత్వ పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గోరెంట్ల ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న ఆయన రెండేళ్లుగా మత్తు పదార్థాల వ్యతిరేక ప్రచారకర్తగా ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. శుక్రవారం అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. మూడేళ్ల క్రితం మద్యానికి బానిసైన తన ప్రాణ స్నేహితుడు అనారోగ్యంతో మృతి చెందడం ప్రభాకర్ను తీవ్రంగా కలిచివేసింది. మద్యం, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు యువత బానిసై ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ఆయనను ఆలోచింపజేశాయి. సమాజంలో అవగాహన పెంచాలని సంకల్పించిన ఆయన అప్పటి నుంచి మత్తు పదార్థాల వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించారు. ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రభాకర్ ప్రత్యేక వేషధారణను ఎంచుకున్నారు. నల్లటి దుస్తులు ధరించి, మెడలో పుర్రెల బొమ్మలతో చేసిన దండ వేసుకుని నో డ్రగ్స్..సేవ్ లైఫ్ అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. సంప్రదాయ పండగలు, హిందూ, ముస్లిం, క్రైస్తవుల పండుగల సమయంలో ఆయా మతస్తుల వేషధారణతో మత్తు జోలికి వెళ్లొదని వినూత్నంగా అవగాహన కల్పిస్తున్నారు. ఆయన వేషధారణ చూసిన వారంతా ఆసక్తిగా దగ్గరకు రావడంతో మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. సెలవు దొరికిన ప్రతిసారి ప్రభాకర్ ప్రజలు ఎక్కువగా గుమికూడే ప్రదేశాలను ఎంచుకుంటారు. వారసంతలు, జాతరలు, సభలు, ప్రత్యేక కార్యక్రమాలు, బహిరంగ ప్రదేశాల్లో తన వినూత్న ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. యువతతోపాటు పెద్దలకు కూడా మత్తు పదార్థాల దుష్పరిణామాలను వివరిస్తూ చైతన్యం తీసుకొస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో బైక్ యాత్రతో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో కూడా మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయన చేస్తున్న ఈ సేవకు ప్రజలు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫ పుర్రె దండతో మత్తుపై యుద్ధం ఫ నల్లటి దుస్తుల్లో మత్తు వ్యతిరేక సందేశం ఫ నో డ్రగ్స్.. సేవ్ లైఫ్ అంటూ చైతన్య యాత్ర ఫ మత్తు రహిత సమాజానికి ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్ కృషినేడు అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం ప్రతి ఏడాది జూన్ 26న నిర్వహించే అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినో త్సవం సందర్భంగా ప్రభాకర్ చేస్తున్న సేవ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడడమే తన లక్ష్యమని, మత్తు రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని ఆయన పిలుపునిస్తున్నారు. -
ప్రశాంతంగా మూసీ మత్స్య సంఘం ఎన్నికలు
నకిరేకల్ : నల్లగొండ, సూర్యాపేట జిల్లా పరిధిలోని మూసీ ప్రాజెక్టు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. మూసీ మత్స్య సంఘానికి తొమ్మిదేళ్ల తర్వాత నిర్వహిస్తున్న ఈ ఎన్నికలు పంచాయతీ పోరును తలంపించాయి. నకిరేకల్ మండలం ఓగోడు గ్రామంలోని ఏవీకే ఫంక్షన్ హాల్లో బ్యాలెట్ పద్ధతిన పోలింగ్ నిర్వహించారు. ఓటు వేసేందుకు ఓటర్లు పెదసంఖ్యలో బారులుదీరారు. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియలో మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఓటర్లను హాల్లోకి అనుమతి ఇచ్చారు. మొత్తం 13 డైరెక్టర్ల పదవులకు గాను 44 మంది పోటీ పడుతున్నారు. ప్రతి ఓటరు 13 మందికి ఓటు వేయాల్సి ఉండడంతో పోలింగ్ ప్రక్రియ గంట అలస్యంగా ముగిసింది. మొత్తం 3,557 మంది ఓటర్లకుగాను, 3,118 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 87.35 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు వెల్లడించారు. కౌంటింగ్ ప్రక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగింది.బరిలో 44 మంది అభ్యర్థులుమూసీ మత్స్య సంఘం ఎన్నికల నిర్వహణతో ఓగోడు గ్రామంలో సందడి నెలకొంది. పోటీలో ఉన్న 44 మంది అభ్యర్థులు తమకు ఓటు వేయాలని పోలింగ్ కేంద్రం ఎదుట ప్రచారం నిర్వహించారు. దీంతో మాధారం – ఓగోడు రహదారి మొత్తం జనంతో కిక్కిరిసిపోయింది. ఎన్నికలు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఎన్నికల సెంటర్ను డీసీఆర్బీ డీఎస్పీ రవి సందర్శించి పర్యవేక్షించారు. నకిరేకల్, శాలిగౌరారం సీఐలు హరిబాబు, రాజశేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.87.65 శాతం పోలింగ్ నమోదు ఫ అర్ధరాత్రి వరకు కొనసాగిన ఓట్ల లెక్కింపు -
ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యం
సూర్యాపేటటౌన్ : నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా జాబ్మేళాలు నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి అధికారి ఎండి జానీపాషా, సూర్యాపేటలోని ఎస్వీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వి.వెంకటేశులు అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాల పాలకమండలి జిల్లా ఉపాధి కల్పన సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాకు నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చింది. మొత్తం 237 అభ్యర్థులు పాల్గొనగా 57 మంది ఎంపికయ్యారు. అనంతరం అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నైపుణ్యంతోఉద్యోగాలు పొందవచ్చన్నారు. ఎస్వీ కళాశాలలో టాస్క్ ద్వారా ఏటా జాబ్మేళా నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఎన్ఎస్ఆర్ శాస్త్రి ప్రోగ్రామ్ ఆఫీసర్ అశోక్, వివిధ కంపెనీల హెచ్ఆర్లు పాల్గొన్నారు. -
7 కళాశాలలు.. 873 అడ్మిషన్లు
నాణ్యమైన విద్య అందుతుంది తిరుమలగిరి (తుంగతుర్తి) : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని, మెరుగైన ఫలితాలు వస్తున్నాయని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సులోచనారాణి అన్నారు. బుధవారం తిరుమలగిరి ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ త్వరలోనే కళాశాలకు నూతన బిల్డింగ్ పనులకు శంకుస్థాపన జరుగుతుందని తెలిపారు. ఆమె వెంట ప్రిన్సిపాల్ మృత్యుంజయ్ ఉన్నారు.తిరుమలగిరి (తుంగతుర్తి) : జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ల సందడి నెలకొంది. కాలేజీల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు అధ్యాపకులు క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. జిల్లాలోని 7 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం (2026–27) ఇంటర్ ప్రథమ సంవత్సరానికి సంబంధించి మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ గత నెల 12 నుంచి ప్రారంభం కాగా ఈనెల 30న ముగియనుంది. ఈ సంవత్సరం ప్రవేశాల పెంపు కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు వేసవిని సైతం లెక్క చేయకుండా ప్రచార బాట నిర్వహించారు. పట్టణ ప్రాంతాలు, గ్రామాలు, తండాల్లో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల వద్దకు వెళ్లి వారిని కలుస్తూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరడం వల్ల నాణ్యమైన విద్యతో పాటు అందనున్న సౌకర్యాల గురించి వివరిస్తున్నారు. ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పిస్తున్నారు. 873 మంది చేరిక ఈ విద్యా సంవత్సరంలో జిల్లాలో ఉన్న ఏడు కళాశాలల్లో ఇప్పటికే 873 ప్రవేశాలు జరిగాయి. ఈ విద్యా సంవత్సరంలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకం మొదటి విడత కింద పలు కళాశాలల్లో ప్రారంభమయ్యాయి. రెండో విడత కింద మరికొన్ని కళాశాలల్లో ఈ పథకం ప్రారంభం కానున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఉచిత పాఠ్య పుస్తకాలు, బస్పాస్ సౌకర్యం, డిజిటల్ తరగతుల నిర్వహణ, నీట్, ఐఐటి ప్రవేశాలకు ఆన్లైన్ శిక్షణ ఇస్తున్నారు. అంతేకాకుండా బైపీసీ, ఎంపీసీ, సీఈసీ, హెచ్ఈసీ కోర్సులతో పాటు ఏసీఈ కోర్సును కూడా ప్రవేశ పెడుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో ప్రవేశాలు పెరగడానికి అవకాశం ఉందని అధ్యాపకులు చెబుతున్నారు.ఫ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు విస్తృత ప్రచారం చేస్తున్న అధ్యాపకులు -
సంక్షేమ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలి
సూర్యాపేటటౌన్ : మహిళలు, బాలల భద్రత, రక్షణకు ప్రభుత్వ సంక్షేమ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ నరసింహ అన్నారు. బుధవారం జిల్లా పోలీస్ భరోసా టీమ్ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లాలోని పోలీస్ అధికారులు, శిశు సంక్షేమ శాఖ, మహిళా సంక్షేమ శాఖ, జిల్లా చైల్డ్ లైన్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులతో ఎస్పీ ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా, బాల బాధితుల పట్ల అధికారులు మానవతాదృక్పథంతో వ్యవహరించాలన్నారు. మహిళలు, బాలలపై దాడులు, వేధింపులు, లైంగిక దాడుల వంటి ఫిర్యాదులు వస్తే తక్షణమే స్పందించి బాధితులకు అండగా నిలవాలన్నారు. మహిళలు, బాలల పట్ల వేధింపులు జరిగితే డయల్ 100, 112, హెల్ప్ లైన్ నంబర్ 1098కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ రమణారావు, జిల్లా జువైనల్ ప్రొహిబిషన్ అధికారి, డీసీపీఓ రవి కుమార్ పాల్గొన్నారు. ఎస్పీ నరసింహ -
హెచ్పీవీ వ్యాక్సినేషన్ పూర్తిచేయాలి
అర్వపల్లి: 14 ఏళ్లు నిండిన బాలికలందరికీ గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ జిల్లా పీఓ డాక్టర్ ప్రసిద్ధ, జిల్లా క్వాలిటీ మేనేజర్ డాక్టర్ భార్గవ్ కోరారు. జాజిరెడ్డిగూడెంలోని పల్లె దవాఖానను బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హెచ్పీవీ వ్యాక్సినేషన్ రికార్డులను, కోల్డ్ ఛైన్ నివారణ, ఎంసీపీ రికార్డులను పరిశీలించారు. అనంతరం గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మిస్తున్న పల్లె దవాఖాన నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ నగేష్నాయక్, సీహెచ్ఓ బిచ్చునాయక్, హెల్త్ అసిస్టెంట్ సైదమ్మ, ఆశా కార్యకర్త నాగమ్మ పాల్గొన్నారు. లక్ష్మీనారసింహుడి నిత్యకల్యాణం మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో రాజ్యలక్ష్మిచెంచులక్ష్మి సమేత లక్ష్మీనరసింహస్వామికి బుధవారం అర్చకులు నిత్యకల్యాణం నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్లలను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవం జరిపించారు. కల్యాణ వేడుకలో భాగంగా విశ్వక్సేనపూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ పూర్తిగావించారు. అనంతరం నీరాజన మంత్ర పుష్పాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ చలపతిరావు, అర్చకులు పాల్గొన్నారు. నేడు మూసీ మత్స్య సంఘం ఎన్నికలు నకిరేకల్ : నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో వేలాది మంది మత్స్య కార్మికులకు జీవనోపాధి కల్పిస్తున్న మూసీ ప్రాజెక్టు మత్స్య పారిశ్రామిక మార్కెంటింగ్ సహకార సొసైటీ ఎన్నికలు గురువారం జరగనున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సొసైటీకి చివరగా 2012లో ఎన్నికలు జరిగాయి. ఆ పాలకవర్గం గడువు 2017లో ముగిసింది. నాటి నుంచి ఎన్నికలు నిర్వహించలేదు. తొమ్మిదేళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 13 డైరెక్టర్ పదవులకు గాను 43 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ సంఘం పరిధిలో నకిరేకల్, శాలిగౌరారం, కేతేపల్లి, జాజిరెడ్డి గూడెం, సూర్యాపేట మండలాల్లోని 12 గ్రామాల్లో 3,557 మంది మత్స్యకారులు ఓటర్లుగా ఉన్నారు. గురువారం నకిరేకల్ మండలం ఓగోడు గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2.30గంటల వరకు బ్యాలెట్ పద్ధతిన పోలింగ్ నిర్వహించి.. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు. -
పల్స్ పోలియోను విజయవంతం చేయాలి
పెన్పహాడ్ : మండల పరిధిలోని సింగారెడ్డిపాలెం ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని డిప్యూటీ డీఎంహెచ్ఓ చంద్రశేఖర్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ ఆరోగ్య కార్యక్రమాలను, వాటికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. వ్యాధి నిరోధక, అసంక్రమిత వ్యాధుల నివారణ కార్యక్రమానికి సంబంధించిన స్క్రీనింగ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. రికార్డుల నిర్వహణ, ఆన్లైన్ నమోదు ప్రక్రియను నిరంతరం అప్డేట్ చేయాలని సిబ్బందికి సూచించారు. పల్స్ పోలియో కార్యక్రమ ఏర్పాట్లపై ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ నెల 28న జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పోలియో కార్యక్రమానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ వివరాలను పరిశీలించి, ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు అందేలా చూడాలన్నారు. ఈ విషయంలో ఎలాంటి అజాగ్రత్త వహించొద్దని సూచించారు. క్షేత్రస్థాయిలో మైక్రో యాక్షన్ ప్లాన్ ప్రకారం పనిచేయాలని సూచించారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయన వెంట హెల్త్ అసిస్టెంట్లు జయశ్రీ, నాగలక్ష్మి, ఆశా కార్యకర్తలు ఇందిర, నాగలక్ష్మి, నాగమ్మ, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ చంద్రశేఖర్ -
సహకారం అందించాలి: కలెక్టర్
భానుపురి (సూర్యాపేట) : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ్ఙ(ఎస్ఐఆర్)కు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కోరారు. బుధవారం కలెక్టరేట్లో ఎస్ఐఆర్పై నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా గురువారం నుంచి వచ్చేనెల 24 వరకు బీఎల్ఓ లు ఇంటింటికీ తిరిగి ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇస్తారని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ హరిసింగ్, డీఆర్ఓ ప్రేమ్ రాజ్, సీ సెక్షన్ సూపరింటెండెంట్ రాజేందర్ రెడ్డి, నాయకులు చల్లమల్ల నరసింహ, చకిలం రాజేశ్వరరావు, స్టాలిన్, కోట గోపి, రమేష్ పాల్గొన్నారు. అదేవిధంగా శిక్షణ పొందిన బీఎల్ఓలకు సర్వే నిర్వహణకు అవసరమైన కిట్లు, ఇతర సామగ్రిని అందించారు. -
లెక్కల్లోనే మొక్కలు !
యాక్షన్ ప్లాన్ రూపొందించాలి మున్సిపాలిటీలో కొత్తగా కొలువుదీరిన నూతన పాలకవర్గమైనా ఈ సమస్యపై సీరియస్గా దృష్టి పెట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుత వర్షాకాల సీజన్లో ప్రారంభం కానున్న ‘వనమహోత్సవం’ కార్యక్రమంలో కేవలం ఫోటోలకు పరిమితం కాకుండా.. అధికారులు, స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేసి, నాటిన ప్రతి మొక్కను దత్తత తీసుకుని సంరక్షించేలా పటిష్ట చర్యలు చేపట్టాలి. అలాగే, రోడ్డు వెంట ఉన్న చెట్లను తొలగించే షాపు యజమానులపై భారీగా జరిమానాలు విధించేలా పాలకవర్గం కఠిన తీర్మానం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.కోదాడరూరల్ : అడవుల శాతాన్ని పెంచి పర్యావరణాన్ని కాపాడాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం హరితహారం నిర్వహించగా.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వన మహోత్సవం పేరిట మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా కోదాడ పట్టణంలో గత 11 ఏళ్లుగా ఏడాదికి 2 లక్షల చొప్పున.. పట్టణంలో ఏకంగా 22 లక్షల మొక్కలు నాటినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. కానీ, అందులో కనీసం ఒక్క శాతం మొక్కలు కూడా నేడు పట్టణంలో లేకపోవడం గమనార్హం. మున్సిపల్ అధికారులు చూపిస్తున్న లెక్కలకు, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలకు ఎక్కడా పొంతన లేకుండా పోయింది. కోట్ల రూపాయల బిల్లులు చెల్లింపు 22 లక్షల మొక్కల నిర్వహణ, ట్రీగార్డుల కొనుగోలు, నర్సరీల పెంపకం, నీటి వసతి కల్పన పేరుతో మున్సిపల్ అధికారులు కోట్ల రూపాయల బిల్లులు అధికారులు చెల్లించారు. నాటిన మొక్కల్లో కనీసం 10 శాతం బతికినా పట్టణం ఎంతో పచ్చగా ఉండేదని స్థానికులు పేర్కొంటున్నారు. 60 ఏళ్ల నాటి వృక్షాలే దిక్కు..పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట ఎక్కడా చెట్లు లేకపోవడంతో బాటసారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హుజూర్నగర్ రోడ్డు మూలమలుపులో ఉన్న రెండు చెట్లు మినహాయిస్తే, ఎల్ఐసీ కార్యాలయం వరకు ఒక్క మొక్క కూడా కనిపించదు. రంగా థియేటర్ నుంచి కొమరబండ వరకు కేవలం ఐదారు చెట్లు మాత్రమే మిగిలాయి. హైదరాబాద్–విజయవాడ పాత జాతీయ రహదారి వెంట దాదాపు 60 ఏళ్ల కిందట నాటిన చెట్లే నేటికీ ప్రజలకు ఆసరాగా నిలుస్తున్నాయి. పట్టణంలో ప్రస్తుతం మిగిలి ఉన్న సుమారు 25 మహావృక్షాల నీడలోనే బాటసారులు సేదతీరుతున్నారు. షాపుల బోర్డుల కోసం చెట్ల నరికివేత!పట్టణంలోని ప్రధాన రహదారులైన హుజూర్నగర్రోడ్, సూర్యాపేటరోడ్, ఖమ్మంరోడ్, విజయవాడ రోడ్ల వెంట ‘లోకహిత’ అనే స్వచ్ఛంద సంస్థ సొంత ఖర్చులతో వందలాది మొక్కలు నాటగా.. అవి చెట్లుగా మారాయి. అయితే, రోడ్డు పక్కన ఉన్న షాపుల యజమానులు తమ వ్యాపార బోర్డులు కనిపించడం లేదనే సాకుతో చెట్ల కొమ్మలను నరికివేస్తూ, చివరకు వేర్లతో సహా తొలగిస్తున్నారు.ఫ కోదాడ మున్సిపాలిటీలో కాగితాలకే పరిమితమైన పచ్చదనం ఫ 11 ఏళ్లలో 22 లక్షల మొక్కలు నాటినట్లు రికార్డులు ఫ నేటికీ 60 ఏళ్ల నాటి చెట్లే దిక్కు -
ప్రజా రక్షణకే అత్యాధునిక ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ
సూర్యాపేటటౌన్ : ప్రజల రక్షణ కోసమే అత్యాధునిక ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ పని చేస్తుందని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ నియంత్రణ పునరుద్ధరణలో భాగంగా స్థానిక పోలీస్ అధికారులు, మున్సిపల్ అధికారుల సమన్వయంతో పట్టణంలోని బస్టాండ్ చౌరస్తా, ఖమ్మం క్రాస్ రోడ్ చౌరస్తాలో అత్యాధునిక ట్రాఫిక్ సిగ్నల్స్ వ్యవస్థ, ముఖ్యమైన 9 కూడళ్లలో 20 ఆటోమేటిక్ సీసీటీవీ కెమెరాలను బుధవారం ఎస్పీ నరసింహతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అత్యంత శాసీ్త్రయంగా నూతన సిగ్నలింగ్ వ్యవస్థ రూపొందించినట్లు తెలిపారు. జంక్షన్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్లను గుర్తించే ప్రత్యేక సామర్థ్యాన్ని కలిగి ఉంటాయన్నారు. సిగ్నల్ జంపింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, సెల్ఫోన్ డ్రైవింగ్, ఇతర ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వాహనదారులను ఈ కెమెరాల ద్వారా సులభంగా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. ఎస్పీ నరసింహ మాట్లాడుతూ.. ప్రజా భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో సరికొత్త ట్రాఫిక్ సిగ్నల్స్, సీసీటీవీ కెమెరాల వ్యవస్థను ప్రారంభించినట్లు తెలిపారు. ట్రాఫిక్పై అవగాహన పెంచడానికి ప్రతి రోజూ ప్రతి షిఫ్ట్ లో 8 మంది సిబ్బందిని విధుల్లో ఉంచుతామన్నారు. కార్యక్రమంలో సూర్యాపేట డివిజన్ డీఎస్పీ ప్రసన్నకుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ నివేదిత, వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, కమిషనర్ హన్మంతరెడ్డి, ఇన్స్పెక్టర్ వెంకటయ్య, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
సేంద్రియ వ్యవసాయంతో భూసారం పెంపు
గరిడేపల్లి : సేంద్రియ వ్యవసాయం చేయడం ద్వారా భూసారం పెరుగుతుందని గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త కిరణ్ అన్నారు. మండలంలోని కాల్వపల్లి గ్రామంలో బుధవారం శ్రీఖేత్ బచావో అభియాన్శ్రీ కార్యక్రమంలో భాగంగా రైతులకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూసారాన్ని రక్షించేందుకు రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని సూచించారు. ప్రతి రైతు తన పొలంలో భూసార పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఆ పరీక్షల ఫలితాల ఆధారంగా భూమికి అవసరమైన పోషకాలు, ఎరువులను మాత్రమే వాడాలన్నారు. దాంతో సాగు ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ప్రీతంకుమార్, సర్పంచ్ ఎస్. వెంకన్న, పంచాయతీ కార్యదర్శి ఇంద్ర, రైతులు పాల్గొన్నారు.ఫ గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త కిరణ్ -
ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయాలి
అనంతగిరి: యువత ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటి సాధన దిశగా అడుగులు వేయాలని ఎస్పీ నరసింహ సూచించారు. డ్రగ్స్ నిర్మూలన, సైబర్ మోసాల నివారణ, రోడ్డు ప్రమాదాల నియంత్రణపై మంగళవారం స్థానిక అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఎస్పీ మాట్లాడారు. యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలన్నారు. మహిళల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. అనంతరం అనంతగిరి పోలీస్ స్టేషన్న్ను సందర్శించారు. రికార్డులను పరిశీలించి సిబ్బందికి సూచనలిచ్చారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాల నివారణపై దృష్టి సారించాలని సిబ్బందికి సూచించారు. కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. ఆయన వెంట డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి, మునగాల సీఐ రామకష్ణారెడ్డి, ఎస్ఐ నవీన్న్కుమార్, సిబ్బంది ఉన్నారు. ఫ ఎస్పీ నరసింహ -
ఓపెన్ డిగ్రీలో అడ్మిషన్లు
సూర్యాపేటటౌన్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరానికి బీఏ, బీకాం, బీఎస్సీ, ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీలో అడ్మిషన్లు ప్రారంభమైనట్లు యూనివర్సిటీ విద్యార్థి సేవా విభాగం డైరెక్టర్ వై. వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియేట్ రెండు సంవత్సరాలు, ఐటీఐ, ఓపెన్న్ఇంటర్, పాలిటెక్నిక్ ఉత్తీర్ణులైన విద్యార్థులు డిగ్రీలో చేరవచ్చని పేర్కొన్నారు. పీజీ కోర్సుల్లో చేరేందుకు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. విద్యార్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, కమ్యూనిటీ సర్టిఫికెట్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోతో సూర్యాపేట ఎస్వీ డిగ్రీ కళాశాలలోని ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని సూచించారు. అడ్మిషన్ల గడువు ఆగస్టు 7 వరకు ఉందని తెలిపారు. ఇతర వివరాలకు 18005990101, 04023680333, 04023680444, 04023680555 నంబర్లను సంప్రదించాలని సూచించారు. మునగాలలో తెలంగాణ పబ్లిక్స్కూల్మునగాల: పేద విద్యార్థులకు సైతం కార్పొరేట్ స్థాయి విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా కోదాడ నియోజకవర్గానికి సంబంధించిన పాఠశాలను మునగాలలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మంగళవారం టీపీఎస్ ఆర్జేడీ లింగయ్య, టీఎస్ఈడబ్ల్యూ ఐడీసీ ఎస్పీ బాలప్రసాద్, డీఈ రమేష్, ఏఈ ఓబులేష్, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ మునగాలలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. డ్రోన్ ద్వారా పాఠశాల ఆవరణలో ఉన్న స్థలాన్ని కొలతలు వేశారు. వారి వెంట ఎంఈఓ పిడతల వెంకటేశ్వర్లు, పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రకృతి వ్యవసాయంతో రైతులకు మేలు గరిడేపల్లి : ప్రకృతి వ్యవసాయం రైతులకు లాభసాటిగా ఉంటుందని కేవీకే గడ్డిపల్లి సీనియర్ శాస్త్రవేత్త డి.నరేష్ అన్నారు. కేవీకే, బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మంగళవారం ‘ఖేత్ బచావ్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పొలం సంరక్షణ, మిశ్రమ పంటల సాగు, జీవన ఎరువుల వినియోగం, ప్రకతి వ్యవసాయ పద్ధతులపై దృష్టి సారించాలని సూచించారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతారెడ్డి, కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ పథకాలను వివరించారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కోశాధికారి కన్వత అశోక్రెడ్డి, శాస్త్రవేత్తలు సీహెచ్ నరేష్, ఎ.కిరణ్, పి.అక్షిత్, ఎన్.సుగంధి, బీజేపీ నాయకులు కంచర్ల నరసింహారెడ్డి, కన్వంతరెడ్డి అశోక్రెడ్డి, జుట్టుకొండ సత్యనారాయణ, చిలు కూరు రమేష్, చిట్టిబాబు, మంజూల, కుంకడ వెంకటేశ్వర్లు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు, తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీనరసింహుడికి నిత్యకల్యాణంమఠంపల్లి: మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో మంగళవారం స్వామివారి నిత్య కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్లలను పట్టు వస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం నిర్వహించారు. అనంతరం విశ్వక్సేనపూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ, తలంబ్రాలను వైభవంగా నిర్వహించారు. క్షేత్రపాలకుడైన వీరాంజనేయస్వామికి నాగవల్లీ దళాలతో ప్రత్యేక అర్చనలు చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ టి.చలపతిరావు, అర్చకులు పాల్గొన్నారు. -
ధర్మేంద్ర ప్రధాన్ను బర్తరఫ్ చేయాలి
తుంగతుర్తి: నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యతగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను బర్తరఫ్ చేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని మాజీమంత్రి ఆర్డీఆర్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. దేశంలోని ప్రతి వేయి మందిలో కేవలం 12 మందికే ఉద్యోగాలు వస్తున్నాయని పేర్కొన్నారు. రెండు కోట్ల మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వక పోగా పేపర్ లీకేజీలతో విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని విమర్శించారు. పోటీ పరీక్షల పేపర్ లీకేజీ వల్ల తమ భవిష్యత్ ఆగమవుతుందనే ఆవేదనతో స్నేహ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. రాహుల్ గాంధీ విద్యార్థుల పక్షాన చేపట్టిన ‘ఛాత్రోకి గూంజ్’ కార్యక్రమానికి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. సమావేశంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కొమ్ము జోహార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంగరి గోవర్ధన్, సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ రామడుగు నవీన్చారి, కోరుకుప్పల నరేష్గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, నాయకులు పాల్గొన్నారు. -
ఇక..ఇంటింటికీ బీఎల్ఓలు
చిలుకూరు: కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ(సర్)కు క్షేత్రస్థాయి సిబ్బంది సిద్ధమయ్యారు. జిల్లాలో గురువారం నుంచి ఎన్యూమరేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకు గానూ బీఎల్ఓల శిక్షణ కార్యక్రమం పూర్తయింది. శిక్షణ పూర్తి చేసుకున్న సిబ్బందికి అవసరమైన సామగ్రిని అధికారులు మంగళవారం నుంచి తహసీల్దార్ కార్యాలయాల్లో పంపిణీ చేస్తున్నారు. బీఎల్ఓలు ఈ నెల 25 నుంచి ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను అందించనున్నారు. ఇప్పటికే బీఎల్ఓలు క్షేత్ర స్థాయిలో మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. బోగస్, డబుల్ ఓట్లను, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి ఓట్లను తొలగించడంతో పాటు అర్హులైన వారి పేర్లు చేర్చనున్నారు. పంపిణీ చేసిన సామగ్రి ఇదే.. క్షేత్ర స్థాయిలో ఓటర్ల ఇంటికి వెళ్లే బీఎల్ఓలకు ఎన్నికల సంఘం పలు రకాల సామగ్రి అందించింది. ఒక్కో బీఎల్ఓకు ఎన్యూమరేషన్ ఫారాలు, ప్రత్యేక బ్యాగ్, ఎన్యూరేషన్ ప్రక్రియ పూర్తియిన తరువాత ఇంటికి అంటించేందుకు క్యూఆర్కోడ్తో కూడిన స్టిక్కర్ అందిస్తున్నారు. బీఎల్ఓ బ్యాగ్లో గొడుగు, మినిట్స్ రిజిస్టర్, వాటర్ బాటిల్, ఫారమ్ –6తో పాటు మరో 15 వస్తువులు ఉన్నాయి. ఫ రేపటి నుంచి ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ ఫ సిబ్బందికి సామగ్రి పంపిణీ చేస్తున్న అధికారులు -
సోలార్ విద్యుత్కు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం
మోతె : రాష్ట్ర ప్రభుత్వం సోలార్ విద్యుత్ తయారీకి సన్నాహాలు చేస్తుందని, అందులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసేందుకు ఆలోచన చేస్తుందని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి.పాటిల్ అన్నారు. మోతె మండలంలోని సిరికొండ విద్యుత్ సబ్స్టేషన్ ఆవరణలో సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. పది రోజుల క్రితం మండలంలోని సిరికొండ, రావిపహాడ్, నామవరం, మోతెతో పాటు పలు గ్రామాల్లో ఈదురు గాలుకు విద్యుత్ స్తంభాలు, లైన్లు విరిగి పోయిన పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో విద్యుత్ లైన్ల మరమ్మతులు త్వరతగతిన పూర్తి చేసి రైతులకు త్రిఫేజ్ విద్యుత్ను అందించాలని ఆదేశించారు. వ్యవసాయ సీజన్లో రైతులకు ప్రధానంగా విద్యుత్ కొరత లేకుండా చూడాలన్నారు. ఏవైనా సమస్యలు ఏర్పడితే వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఆయన వెంట సీజేఎం బాలస్వామి, ఎస్ఈ శ్రీనివాస్, హుజూర్నగర్ డీఈ నిమ్మ వెంకటకృష్ణ, ఏఈ శాంతి, లైన్ ఇన్స్పెక్టర్లు, జేఎల్ఎంలు, కార్మికులు ఉన్నారు. ఫ టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి.పాటిల్ -
పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలి
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో పెండింగ్లో ఉన్న సాదా బైనామా, భూ భారతి, రెవెన్యూ సదస్సుల దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని భూ పరిపాలనశాఖ కమిషనర్ డీఎస్.లోకేష్కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు, జీపీఓలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో స్టాంప్స్ అండ్ సెంటర్ రిజిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాజీవ్గాంధీ హన్మంత్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్దిరాల, నూతకల్లు మండలాలలో భూ పరిమితి చట్టం 1973 కంటే ముందుగానే భూములను కొనుగోలు చేసి అప్పటి నుంచి నిరంతరంగా సాగు చేస్తున్న వ్యవసాయ భూములకు త్వరలోనే పట్టాలను పంపిణీ చేస్తామన్నారు. అర్హులైన లబ్ధిదారులందరికీ రికార్డు హక్కులను కల్పించి పట్టాలు ఇచ్చేందుకు వీలుగా ప్రొసీడింగ్స్ సిద్ధం చేయాలని ఆదేశించారు. లైసెన్స్ సర్వేయర్ల ద్వారా సర్వే చేయించాలని సర్వే పూర్తి అయిన తర్వాత నివేదికలను ప్రభుత్వానికి సమర్పిస్తే వారికి పట్టాదారు పాస్ పుస్తకాలు అందించేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. ఆర్డీఓలు, తహసీల్దార్లు జీపీఓల సహకారంతో పకడ్బందీగా సర్వే చేయాలని, అభ్యంతరాలు ఉన్న వాటిని పెండింగ్లో పెట్టాలని సూచించారు. సమావేశంలో కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, అదనపు కలెక్టర్ హరి సింగ్, డీఆర్వో ప్రేమ్రాజు, ఆర్డీఓలు వేణుమాధవ్, సూర్యనారాయణ, శ్రీనివాసులు, తహసీల్దార్లు, సెక్షన్ సూపరింటెండెట్లు, తదితరులు పాల్గొన్నారు.ఫ భూ పరిపాలనశాఖ కమిషనర్ డీఎస్.లోకేష్కుమార్ -
పీర్ల ఊరేగింపు
గరిడేపల్లి : మొహర్రం వేడుకల్లో భాగంగా గరిడేపల్లిలోని ఆషుర్ఖానాలో ముజావర్లు సవార్లను నిలబెట్టారు. మంగళవారం ఉద యం మండల కేంద్రంలో పీర్లతో ఊరేగింపు నిర్వహించారు. డప్పుచప్పుళ్లు, భక్తుల పూనకాల మధ్య అన్ని వీధులలో ఊరేగింపు కొనసాగింది. భక్తులు తమ ఇంటి వద్దకు వచ్చిన సవార్లకు భక్తిశ్రద్ధలతో దట్టీలు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో కానుగు రాములు, ఎడవెల్లి రామకృష్ణ, తిరుమలగిరి వీరస్వామి, చామకూరి ఉదయ్, షేక్ బురాన్, ముజావర్లు గ్రామస్తులు పాల్గొన్నారు. -
ఏడు రకాలే సాగు చేయాలి
ఫ ‘ఆత్మ’ ప్రాజెక్ట్ డైరెక్టర్ నివేదిత మునగాల: ప్రభుత్వం సూచించిన వరి రకాలనే వానాకాలం సీజన్లో రైతులు సాగుచేయాలని ఆత్మ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ నివేదిత సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతువేదికలో నిర్వహించిన విత్తన మేళాలో భాగంగా వరి విత్తనాల ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఏడు సన్న రకాల వరి విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రస్తుతం వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున రైతులు ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలన్నారు. నానో ఎరువులను వినియోగించడం ద్వారా పంట పెట్టుబడి తగ్గించుకొని దిగుబడి పెంచుకోవాలన్నారు. పశువుల మేతకు సంబంధించిన గడ్డి రకాలు, సబ్సిడీ విత్తనాలపై రేపాల పశువైద్యాధికారి డాక్టర్ మమత రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి బుంగా రాజు, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. -
యూరియా యాప్ను రద్దు చేయాలి
హుజూర్నగర్ : యాప్ను రద్దు చేసి, పాత పద్ధతిలోనే రైతులకు యూరియా అందించాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కంబాల శ్రీనివాస్, కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కొప్పోజు సూర్యనారాయణ, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు యల్లావుల రాములు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం హుజూర్నగర్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాప్ ద్వారా యూరియా అందిస్తుండడంతో స్మార్ట్ ఫోన్ అంటే ఏమీ తెలియని రైతులకు యూరియా అందడం లేదని వాపోయారు. దీంతో ఆయా రైతులు బ్లాక్ మార్కెట్ను ఆశ్రయించి అధిక ధరలకు యూరియా కొని తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు దేవరం మల్లేశ్వరి, జడ శ్రీనివాస్, రమేష్, వెంకన్న, నర్సయ్య, పి.వాసుదేవరావు, నాగమణి, పున్నయ్య, చారి, శ్రీనివాస్, రమణ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ పాలనలో అన్నదాతకు కష్టాలు
మేళ్లచెరువు : అన్నదాతను కష్టాల పాలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆరోపించారు. మేళ్లచెరువు మండలం కప్పలకుంటతండాలో నూతనంగా నిర్మిస్తున్న రామాలయ పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కార్యకర్తలతో మాట్లాడుతూ పదేళ్ల కేసీఆర్ పాలనలో రైతుల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. అనేక చెరువులు పూడికలు తీయించడమే గాక కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి మండు వేసవిలో సైతం చెరువులను నీటితో నింపి అలుగులు పారించిన చరిత్ర బీఆర్ఎస్కే దక్కుతుందన్నారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం రైతులను వరి పండించకుండా ఆంక్షలు విధిస్తూ ఇస్తానన్న బోనస్కు మంగళం పాడిందన్నారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని చెప్పి కొనుగోలు చేయకుండా కేంద్రం కొంటేనే కొంటామని మెలిక పెట్టడం ఏంటని ప్రశ్నించారు. యూరియా కోసం మళ్లీ రైతులు క్యూలైన్లు కట్టే పరిస్థితిని తీసుకొస్తున్నారన్నారు. రైతు బీమా పథకానికి ప్రభుత్వం ప్రీమియం చెల్లించేస్థితిలో లేకపోవడం సిగ్గుచేటన్నారు. రైతు భరోసా సక్రమంగా అందించకుండా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థ పాలనతో ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారని ఎద్దేవా చేశారు. సమావేశంలో సర్పంచ్ శ్రీను నాయక్, కాటెబోయిన వెంకటేశ్వర్లు, బానోతు బాబు నాయక్, లావూరి శ్రీను, వినయ్, నాగరాజు పాల్గొన్నారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ -
ఫణిగిరి బౌద్ధక్షేత్ర అభివృద్ధికి రూ.5కోట్లు
నాగారం : ఫణిగిరి బౌద్ధక్షేత్ర సమగ్రాభివృద్ధికి రూ.5కోట్లు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర పురావస్తు, సాంస్కృతిక, పర్యాటక, ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. నాగారం మండలం ఫణిగిరి, గాజులబండ బౌద్ధక్షేత్రాల పరిరక్షణ, పునరుద్ధరణ పనులకు సోమవారం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలుతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఎమ్మెల్యే సామేలు వినతి మేరకు మంజూరు చేసిన ఈ నిధులతో ఫణిగిరి రహదారి నుంచి బౌద్ధ క్షేత్రానికి చేరుకొనే అప్రోచ్ రోడ్డు అభివృద్ధి, కొండపైకి వెళ్లే మెట్ల దారి నిర్మాణం, సందర్శకులకు మౌలిక సదుపాయాల కల్పన పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. తెలంగాణలోని ప్రాచీన బౌద్ధ వారసత్వ సంపద పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోందని పేర్కొన్నారు. అంతకు ముందు ఇక్కడి బౌద్ధక్షేత్ర పురావస్తు ప్రదర్శనశాలలో భద్రపరచిన చారిత్రక శిల్పను సందర్శించారు. ఈ సందర్భంగా పురావస్తుశాఖ డైరెక్టర్, ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర ప్రొఫెసర్ డాక్టర్ అర్జునరావు, పురావస్తుశాఖ ఏడీ నాగలక్ష్మిలు బౌద్ధ శిల్ప సంపద ప్రాముఖ్యతను మంత్రికి వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మందుల సామేలు మాట్లాడుతూ ఫణిగిరి బౌద్ధ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తుంగతుర్తి నియోజకవర్గం అన్ని రంగాల్లో వెనకబడి ఉందని.. నిధులు మంజూరు చేయించి అభివృద్ధికి సహకరించాలని మంత్రిని కోరారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ మాట్లాడుతూ ఫణిగిరి చరిత్ర ఎంతో గొప్పదని అన్నారు. భవిష్యత్తులో సూర్యాపేట జిల్లాను పర్యటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె.నరసింహ, పురావస్తుశాఖ డైరెక్టర్ అర్జునరావు, డిప్యూటీ డైరెక్టర్లు పగడం నాగరాజు, నర్సింగ నాయక్, ఓఎస్డీ రాజు, ఏడీలు నాగలక్ష్మి, మల్లునాయక్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్న, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, ఫణిగిరి, ఈటూరు గ్రామాల సర్పంచ్లు ఎర్ర సావిత్రియాదగిరి, వంగూరి దామోదర్, నాయకులు పానుగంటి నర్సింహారెడ్డి, నాతి వీరమల్లు, పులిగిళ్ల వీరమల్లు, ఆలకుంట్ల బాలకృష్ణ పాల్గొన్నారు. పురావస్తు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి ఫణిగిరి, గాజులబండ బౌద్ధ క్షేత్రాల్లో పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన -
అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
భానుపురి (సూర్యాపేట) : వివిధ సమస్యలపై ప్రజావాణిలో ప్రజలు అందించిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ బి.హరిసింగ్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులతో ఆయన మాట్లాడారు. ప్రజలు సమర్పించిన దరఖాస్తులకు ఆయా శాఖలు కచ్చితమైన సమాచారాన్ని సంబంధిత ఫార్మాట్లో అందించాలన్నారు. ప్రజావాణికి అన్ని శాఖల డివిజనల్ అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా జిల్లా అధికారులు పర్యవేక్షించాలన్నారు. స్థానిక సమస్యలు స్థానికంగానే పరిష్కారమైతే ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయని పేర్కొన్నారు. ప్రజావాణిలో మొత్తం 114 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఓ సన్యాసయ్య, సీపీఓ కిషన్ నాయక్, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్రెడ్డి, డీఈఓ అశోక్, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ అధికారి నరసింహారావు, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ హరిసింగ్ -
డ్రగ్స్ నిర్మూలన అందరి బాధ్యత : ఎస్పీ
సూర్యాపేటటౌన్ : మాదకద్రవ్యాల (డ్రగ్స్) నిర్మూలనకు ప్రతి పౌరుడూ బాధ్యతగా పోరాడాలని ఎస్పీ నరసింహ అన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలన అవగాహన కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో తెలంగాణ ఈగల్ పోలీస్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘యాంటీ డ్రగ్ సోల్జర్’ పౌరుల నమోదు ప్రక్రియను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతి పౌరుడు యాంటీ డ్రగ్స్ సోల్జర్గా పేరు నమోదు చేసుకోవాలన్నారు. సూర్యాపేట జిల్లాను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు పోలీస్ శాఖతో ప్రజలు చేతులు కలపాలన్నారు. సే నో టు డ్రగ్స్–సే ఎస్ టు లైఫ్ అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు. డ్రగ్స్ వినియోగం రవాణాకు సంబంధించిన సమాచారాన్ని 100, 112, 1908 నంబర్ల ఫోన్చేసి తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రవీందర్రెడ్డి, డీఎస్పీలు రవి, నరసింహాచారి, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ మగ్దూం అలీ, ఎస్ఐ యాకూబ్, సిబ్బంది పాల్గొన్నారు. బాధితులకు భరోసా కల్పించాలివివిధ మండలాల నుంచి వచ్చిన బాధితుల సమస్యలను వెంటనే పరిష్కరించి భరోసా కల్పించాలని ఎస్పీ కె.నరసింహ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్డే కార్యక్రమంలో బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. బాధితులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా కృషిచేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. -
వైభవంగా మహాలింగార్చన
మేళ్లచెరువు : మండలకేంద్రంలోని శ్రీ ఇష్టకామేశ్వరీ సమేత శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహాలింగార్చనతోపాటు పుష్పార్చన, గణపతిపూజ, పుణ్యాహవచనం, మహా న్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సహస్రనామార్చన, గోపూజ కార్యక్రమాలను వైభవంగా చేపట్టారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఈఓ శంభిరెడ్డి, అర్చకులు విష్ణువర్ధన్శర్మ, ధనుంజయశర్మ తదితరులు పాల్గొన్నారు. గురుకుల జూనియర్ కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్లురామగిరి(నల్లగొండ) : మహాత్మా జ్యోతిరావు ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లోని జూనియర్ కళాశాలల్లో ఖాళీ సీట్లలో ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ బి.సంధ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలోని కళాశాలల్లో బైపీసీలో మిగిలిన నాలుగు సీట్లను స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపారు. టెన్త్లో కనీసం 70శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన బాలురు ఈ స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అర్హత గల విద్యార్థులు మిర్యాలగూడ రోడ్డులోని ప్రాంతీయ సమన్వయ అధికారి కార్యాలయంలో నెల 24, 25 తేదీల్లో నిర్వహించే స్పాట్ అడ్మిషన్లకు హాజరుకావాలని సూచించారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు జిరాక్స్ కాపీలను వెంట తీసుకురావాలని పేర్కొన్నారు. ఏఐకేఎంఎస్ జిల్లా నూతన కమిటీ ఎన్నికకోదాడ రూరల్ : కోదాడ పట్టణంలోని లాల్బంగ్లాలో సోమవారం జరిగిన అఖిల భారత రైతుకూలీ సంఘం (ఏఐకేఎంఎస్) జిల్లా రెండో మహాసభలో ఆ సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కునుకుంట్ల సైదులు, ఉపాధ్యక్షులుగా అలుగుబెల్లి వెంకట్రెడ్డి, కాశయ్య, ప్రధాన కార్యదర్శిగా బొడ్డు శంకర్, సహాయ కార్యదర్శులుగా దాసరి శ్రీనివాస్, కోట మధుసూదన్రెడ్డి, కోశాధికారిగా మేకల కనకారావు, మరో పది మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. అనంతరం నూతన కమిటీ సభ్యులతో రాష్ట్ర సహాయ కార్యదర్శి మండారి డేవిడ్కుమార్ ప్రమాణస్వీకారం చేయించారు. కేజీబీవీలో అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులుపెన్పహాడ్ : మండల కేంద్రంలోని కేజీబీవీ కళాశాల యంగ్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్స్లెన్స్లో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ తరగతులు బోధించేందుకు తాత్కాలిక పద్ధతిలో అధ్యాపకుల నియామకానికి అర్హుల నుంచి ఈ నెల 23 నుంచి 25 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఆసియా జబిన్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఐఐటీ, జేఈఈ మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు రోజూ బోధించుటకు గంటకు రూ.650లు రెమ్యునరేషన్ చెల్లించనున్నట్టు పేర్కొన్నారు. ఆసక్తి గల వారు 77020 76193 నంబర్ను సంప్రదించాలని కోరారు. -
అభివృద్ధి పనులు నాణ్యతగా ఉండాలి
హుజూర్నగర్ : అభివృద్ధి పనుల్లో నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్రెడ్డి ఆదేశించారు. హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై సోమవారం రాష్ట్ర సచివాలయంలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్తో కలిసి ఎండీఎఫ్ నిధులతో మొత్తం 16 కీలక మౌలిక వసతుల నిర్మాణాలపై మంత్రి వివిధ శాఖల అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పనుల నాణ్యత విషయంలో రాజీకి తావులేదన్నారు. ప్రభుత్వ నిధులతో చేపట్టే ప్రతి పని ప్రజలకు దశాబ్దాల పాటు ఉపయోగపడేలా ఉండాలని అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు. ప్రతి పనిని నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు. హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాలను రాష్ట్రంలోనే ఆదర్శ అభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోందన్నారు. అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాల నిర్మాణమే కాదని, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడం అన్నారు. సమావేశంలో హుజూర్నగర్ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్, వైస్ చైర్మన్ మల్లికార్జున్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గెల్లి రవి, రోడ్లు, భవనాలు, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ శాఖల అధికారులు, ఆయా నియోజకవర్గాలకు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి -
నేడు ఫణిగిరిలో మంత్రి జూపల్లి పర్యటన
భానుపురి (సూర్యాపేట) : రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఉదయం 10.30 గంటలకు నాగారం మండలంలోని ప్రసిద్ధ ఫణిగిరి బౌద్ధక్షేత్రంలో సంరక్షణ, పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్టు ఆ శాఖ జిల్లా అధికారులు తెలిపారు. సూర్యక్షేత్రంలో విశేష పూజలుఅర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో భక్తులు ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఉషాపద్మిని చాయాసమేత సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. అనంతరం యజ్ఞశాలలో మహాసౌరహోమాన్ని నిర్వహించారు. అలాగే క్షేత్ర ఆవరణలోని కార్యసిద్ధి వీరహనుమాన్, శ్రీరామకోటి స్థూపాలను కూడా భక్తులు దర్శించుకున్నారు. స్వామి క్షేత్రానికి తరలివచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి అన్నప్రసాద వితరణ జరిపారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితజనార్దన్స్వామి, గణపురం నరేష్, గిరి, అర్చకుడు భీంపాండే, భక్తులు పాల్గొన్నారు. వికలాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలినూతనకల్ : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి(వీహెచ్పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ కోరారు. ఆదివారం నూతనకల్ మండల కేంద్రంలో నిర్వహించిన ఆ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెన్షన్ను రూ.6వేలకు పెంచడంతో పాటు వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయనున్నట్లు హామీ ఇచ్చి విస్మరించారన్నారు. వికలాంగులకు ఆర్టీసీ బస్సుల్లో వందశాతం రాయితీ కల్పించడంతో పాటు వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా గుర్తించి వికలాంగుల బ్లాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. త్వరలోనే వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం గాంధీ భవన్ను ముట్టడించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఆ సమితి మండల అధ్యక్షులు బాణాల వీరారెడ్డి, కొల్లూరి ఈదయ్య, కొణతం కృష్ణారెడ్డి, నగేష్, ఇమ్మారెడ్డి నవీన్రెడ్డి పాల్గొన్నారు. 440 అడుగులకు మూసీ నీటిమట్టంకేతేపల్లి : మూసీ ప్రాజెక్టులో నీటిమట్టం ఆదివారం 440.90 (పూర్తిస్థాయి నీటిమట్టం 445) అడుగులకు చేరకుంది. వారం రోజులుగా హైదరాబాద్తో పాటు మూసీ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద వచ్చి చేరుతోంది. ఆదివారం ఎగువ నుంచి మూసీకి 100 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.40 టీఎంసీల నీరు ఉందని పేర్కొన్నారు. ప్రాజెక్టులో మరో నాలుగు అడుగుల నీరు చేరితే పూర్తిస్థాయిలో నిండనుంది. -
రైతు కూలీల సంక్షేమం పట్టని పాలకులు
కోదాడరూరల్ : రైతు కూలీల సంక్షేమంతోపాటు వారిని ఆదుకోవడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారని అఖిల భారత రైతు కూలీ సంఘం(ఏఐఎంఎస్) రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వి.కోటేశ్వరరావు అన్నారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని లాల్బంగ్లాలో జరిగిన ఆ సంఘం జిల్లా 2వ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడాన్ని పాలకులు విస్మరించారని విమర్శించారు. వ్యవసాయ పనిముట్లు, ఎరువులు, పురుగు మందుల ధరలు విపరీతంగా పెరుగుతున్నా.. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర దక్కకపోవడం శోచనీయమన్నారు. కాంగ్రెస్ హయాంలో పేదల కోసం ఉపాధిహామీ పథకాన్ని తెచ్చి 16 కోట్ల మంది కూలీలకు పనులు కలిస్తుంటే నేడు బీజేపీ ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకొచ్చి కూలీలను మోసం చేసిందని ఆరోపించారు. పేదల శ్రమను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టే నరేంద్రమోదీ ప్రభుత్వ దివాలాకోరు విధానాలపై రైతులు, కూలీలు, కార్మికులు ఉద్యమాలను తీవ్రతరం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ సభలో సంఘం జిల్లా అధ్యక్షుడు పోటు లక్ష్మయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శంకర్, రాష్ట్ర సహాయ కార్యదర్శి డేవిడ్కుమార్, నాయకులు అలుగుబెల్లి వెంకటరెడ్డి, కాకి మోహన్రెడ్డి, దశరథ, కునుగుంట్ల సైదులు, దాసరి శ్రీను, కనకరావు, పారెల్లి నాగయ్య, నగేష్, అజయ్, ఉదయగిరి, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. ఫ ఏఐకేఎంఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కోటేశ్వరరావు -
‘నీట్’కు 145 మంది గైర్హాజరు
సూర్యాపేటటౌన్ : జిల్లా పరిధిలో మొత్తం ఐదు సెంటర్లలో ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, సాంఘిక సంక్షేమ బాలుర కళాశాల, చివ్వెంల మండలం దురాజ్పల్లిలోని మైనారిటీ గురుకులంతోపాటు సూర్యాపేట మండల పరిధిలోని ఇమాంపేట ప్రభుత్వ మోడల్ స్కూల్, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పరీక్ష నిర్వహించారు. ఆయా సెంటర్లలో మొత్తం 908 మంది విద్యార్థులకు 763 మంది హాజరు కాగా 145 మంది గైర్హాజరయ్యారు. ఉదయం 11.30గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. మధ్యాహ్నం 1.30గంటల వరకే అనుమతించారు. మధ్యాహ్నం 2గంటల నుంచి పరీక్ష ప్రారంభమైంది. పరీక్ష కేంద్రంలోకి వెళ్లే ముందు విద్యార్థులను చెకింగ్ చేసి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, బాలికలకు చెవుల దిద్దులు, పట్టీలు, దండలు ఏమి ఉన్నా తీయించారు. బందోబస్తును పరిశీలించిన ఎస్పీసూర్యాపేట పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని ఎస్పీ నరసింహ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రం వద్ద పోలీస్ బందోబస్త్ ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులతో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు. బందోబస్తు వివరాలు, విద్యార్థుల హాజరు వివరాలను డీఎస్పీ ప్రసన్న కుమార్ను అడిగి తెలుసుకున్నారు. పరీక్ష అనంతరం పరీక్ష పత్రాలను తరలించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ముగిసిన ‘నీట్’ భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. జిల్లాలో 5 సెంటర్లలో 908 మంది విద్యార్థులకు 763 మంది హాజరు కాగా 145 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. పరీక్ష నేపథ్యంలో అన్ని సెంటర్ల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఐదు సెంటర్లలో ప్రశాంతంగా పరీక్ష మొత్తం 763 మంది విద్యార్థులు హాజరు సూర్యాపేటలో పరీక్ష కేంద్రం తనిఖీ చేసిన ఎస్పీ నరసింహ -
ఫీజుల నియంత్రణ చట్టం తేవాలి
సూర్యాపేటటౌన్ : రాష్ట్రంలోని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీ అరికట్టేందుకు ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, ప్రొఫెసర్ కె.లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ యూనియన్ ఉమ్మడి నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర పాఠశాలలో పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల నాగరాజు అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విద్యను కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ముఖ్యమంత్రి 27 వేల పాఠశాలను 4 వేలకు తగ్గించాలని ప్రకటించడం ఖండించదగిన విషయమన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల సంఖ్య నేడు 65శాతంకి పైగా పెరిగిందన్నారు. తక్షణమే ఫీజుల నియంత్రణ చట్టం చేసి అమలు పరచాలన్నారు. తెలంగాణలో జరుగుతున్న ప్రైవేటీకరణ మరి ఎక్కడా లేదన్నారు. ఈ సమావేశంలో సీనియర్ జర్నలిస్టు రమణాచారి, రేపాక లింగయ్య, రాచూరి ప్రతాప్, తల్లమల్ల హస్సేన్, యోగానంద,షేక్ ఉమర్, అబ్దుల్కరీం, మాధవరెడ్డి, వెంకట్ యాదవ్, బుద్ధ సత్యనారాయణ, జనార్దన్, వీరబోయిన లింగయ్య తదితరులు పాల్గొన్నారు.ఫ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ -
కూరగాయల ధరలు కుతకుత!
తిరుమలగిరి (తుంగతుర్తి) : కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. గతంలో ఎన్నడూలేని విధంగా కూరగాయలు ధరలు మండిపోతున్నాయి. ఒక్కో రకం కూరగాయల ధర 20 శాతం నుంచి 30 శాతం వరకు పెరగడంతో మార్కెట్కు వెళ్లిన వినియోగదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇదేమంటే మార్కెట్కు కూరగాయలు రావడం లేదని, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని వ్యాపారులు చెబుతున్నారు. స్థానికంగా ఉత్పత్తి తగ్గడమే కారణంనెల రోజుల క్రితం వరకు గ్రామీణ ప్రాంతాల్లో కూరగాయల ఉత్పత్తి అధికంగా ఉండేది. దీంతో వారసంతలు, దుకాణాల్లో కూరగాయలను వినియోగదారులు విరివిగా తక్కువ ధరకు కొనుగోలు చేసేవారు. కానీ ఇటీవల స్థానికంగా కూరగాయల సాగు తగ్గి దిగుబడి పడిపోయింది. ఫలితంగా వ్యాపారులు హైదరాబాద్, కర్నూల్ వంటి ప్రాంతాలకు వెళ్లి తీసుక రావాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో దళారులు ధరలు పెంచేశారు. వారి నుంచి కొనుగోలు చేసే చిన్న వ్యాపారులు సైతం ధరలను మరింత పెంచడంతో వినియోగదారులకు పెనుభారంగా మారింది. కూరగాయలు కొనుగోలు చేయడానికి మార్కెట్కు వచ్చిన మహిళలు ధరలు చూసి బెంబేలెత్తుతున్నారు. రైతుకు దక్కని గిట్టుబాటు!కిలో కాకరకాయ ధర గతంలో రూ.30 నుంచి రూ.40 ఉండేది. ప్రస్తుతం కిలో రూ.60 పలుకుతోంది. చాలా రోజుల పాటు రూ.25 ధర పలికిన టమాట ప్రస్తుతం రూ.40కి చేరింది. సొరకాయ, పాలకూర, మెంతికూర వంటి ఆకుకూరల ధరలు కూడా భారీగా పెరిగాయి. మార్కెట్లకు కనీసం రూ.500 తీసుకొని వెళ్తేనే వారానికి సరిపడా కూరగాయలు వచ్చేది కష్టమని మహిళలు వాపోతున్నారు. దళారులు తమకు తక్కువ ధర చెల్లించి కూరగాయలు కొంటున్నారని, తమకు ఏమాత్రం గిట్టుబాటు అందక నష్టపోతున్నామని కూరగాయలు పండించే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయల ధరలు భారీగా పెరగడంతో పేద, మధ్య తరగతి కుటుంబాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధరలను నియంత్రించాలని కోరుతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న రేట్లు కిలో రూ.80కి చేరిన మిర్చి, బీర, క్యారెట్ కాకర, చిక్కుడు రూ.60పైమాటే.. బెంబేలెత్తుతున్న పేద కుటుంబాలు మా కుటుంబంలో ఏడుగురం ఉన్నాము. నెల క్రితం రూ.150 నుంచి రూ.200 వరకు ఖర్చు పెడితే వారానికి సరిపడా కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు రూ.400 ఖర్చు చేసినా వారానికి సరిపడా రాని పరిస్థితి. కూరగాయల ధరలు భారీగా పెరగడంతో ఖర్చు రెండింతలయ్యింది. – రమ, తిరుమలగిరి ప్రతి కూరగాయ ధర కిలో రూ.50కి పైగానే పలుకుతుంది. సామాన్యులు ఏమీ కొనలేని పరిస్థితి నెలకొంది. కూరగాయల పంటల సాగు పెంచేలా చర్యలు తీసుకోవాలి. రైతులకు వంద శాతం సబ్సిడీలు ఇచ్చి పంటల సాగు పెంచితేనే ధరలు తగ్గుముఖం పడతాయి. – శ్రీనివాస్, తిరుమలగిరి -
ఇల్లు మంజూరు చేయండి సారూ..
మఠంపల్లి : ఇందిరమ్మ పథకం కింద ఇల్లు మంజూరు చేసి ఆదుకోండి సారూ.. అంటూ నిరుపేద ఒంటరి మహిళ వేడుకుంటోంది. వివరాల ప్రకారం.. మఠంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామాన్ని ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద పైలట్ గ్రామంగా ఎంపిక చేసింది. జాబితాలో గ్రామానికి చెందిన మహిళ షేక్మౌలాబి పేరు రాలేదు. దీంతో సదరు మహిళ తాను నివసిస్తున్న రేకుల కప్పు ఇల్లు వర్షం వస్తే కురుస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. చేతులెత్తి మొక్కుతున్నా కలెక్టర్ సార్.. తనకు ఇల్లు మంజూరు చేయండి అంటూ ఆదివారం విలేకరుల ఎదుట తన గూడు గోడు వినిపించింది. ఫ రఘునాథపాలెంలో నిరుపేద ఒంటరి మహిళ వేడుకోలు -
మట్టపల్లిలో నిత్య కల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో ఆదివారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి నిత్య కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేపట్టారు. శ్రీస్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం అనంతరం నిత్య కల్యాణం చేపట్టారు. నీరాజన మంత్ర పుష్పాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేసి అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్కుమార్, ఈఓ టి.చలపతిరావు, అర్చకులు తూమాటి రామాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు. ఆలయ ఈఓగా చలపతిరావు మట్టపల్లి దేవస్థానం ఈఓగా టీవీ చలపతిరావు ఆదివారం ఆల య ధర్మకర్తల సమక్షంలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇన్చార్జి ఈఓ పనిచేసిన జ్యోతి బదిలీకాగా జనగాంలో గల శ్రీచెన్నకేశవస్వామి ఆలయ ఈఓగా పనిచేస్తున్న చలపతిరావును ఇక్కడకు బదిలీచేస్తూ దేవాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీచేసింది. -
కేసుల సత్వర పరిష్కారానికే లోక్ అదాలత్
చివ్వెంల(సూర్యాపేట) : పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికే జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీ శారద అన్నారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో ఆమె మాట్లాడారు. గ్రామాలు, పట్టణాలలో చిన్న పాటి ఘర్షణలకే పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకొని కోర్టు మెట్లు ఎక్కుతున్నారన్నారు. ఇలాంటి వాటిని గ్రామాల్లోనే పెద్ద మనుషుల సమక్షంలో పరిష్కరించుకోవాలని సూచించారు. కింది కోర్టులో పరి ష్కారం కాని కేసులు సుప్రీం కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులను సైతం జిల్లా కోర్టులో రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా మొత్తం 5,868 కేసులు పరిష్కారమయ్యాయి. కక్షిదారులకు సీనియర్ న్యాయవాది వెంకటేశ్వర్రావు పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా మొదటి అదనపు జడ్జి పి.శివరామ్ ప్రసాద్, సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి నాగూరి అపూర్వ రవళి, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మంచాల మమత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుదర్శన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి తల్లమళ్ల హస్సేన్, న్యాయవాదులు పాల్గొన్నారు. ఫ జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద -
మీ ఓటు.. మీ చేతుల్లోనే
భానుపురి (సూర్యాపేట) : ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించడంతో పాటు, ప్రజలే స్వయంగా ఆన్లైన్లో తమ వివరాలను నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఇందుకు గానూ ప్రత్యేక వెబ్లింక్ను అందుబాటులో ఉంచింది. కుటుంబం సభ్యుల తరఫున ఒకరు వివరాలను నమోదు చేసి, అవసరమైన ఫారాలను సమర్పించినా సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. దాంతో వృద్ధులు, ఉద్యోగులు, విద్యార్థులు సహా వివిధ కారణాలతో ఇంటి వద్ద అందుబాటులో లేని వారికి ఊరట కలుగ నుంది. 25 నుంచి ప్రారంభం వలసల కారణంగా కొందరికి ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓట్లు ఉండటం, మరణించిన వారి పేర్లను తొలగించకపోవడం వంటి వాటిని సరి చేసేందుకు ఎన్నికల సంఘం శ్రీసర్శ్రీకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 25 నుంచి ‘సర్’ ఎన్యుమరేషన్ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ప్రజలు తమ ఓటు వివరాలను సరిచూసుకోవాలని అధికారు సూచిస్తున్నారు. ఓటరు జాబితాలో పేర్లు చేర్చుకోవడం, మార్పులు–చేర్పులు చేయడం వంటివి కూడా చేసుకోవచ్చని పేర్కొంటున్నారు. జిల్లాలో 10.01 లక్షల ఓటర్లు సూర్యాపేట జిల్లాలో ప్రస్తుతం 10 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. 2002 ఓటర్ల జాబితాలోని వివరాలతో పోల్చితే జిల్లాలో ఓటర్ల సంఖ్య తారుమారు అయినట్లు తెలుస్తుంది. గతంలో ఉమ్మడి జిల్లాగా ఉండటం, 2016లో జిల్లాల విభజన కారణంగా ఓటర్ల వివరాల నమోదులో తేడాలు ఉన్నాయి. సూర్యాపేటతో పాటు యాదాద్రి జిల్లాలోని కొన్ని మండలాలు కలిసి ఒకే నియోజకవర్గం పరిధిలో ఉండడంతో ఓటర్ల సంఖ్యలో తేడాలు ఉన్నాయి. అధికారులు చేపట్టిన మ్యాపింగ్ ప్రక్రియ సమయంలో ఓటర్ల వివరాల్లో తప్పులు ఉన్నట్లుగా గుర్తించారు. వాటిల్లో ఇంటి పేరు, ఓటరు పేరు, తండ్రి పేరు లాంటి వాటిల్లో తప్పులు దొర్లినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలోని 2 లక్షలకు పైగా ఓటర్లకు సంబంధించిన వివరాల్లో తప్పులు దొర్లినట్లు గుర్తించారు. సర్లో భాగంగా ఎన్యుమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు తప్పులను సరి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆన్లైన్లోనూ ఎన్యుమరేషన్ నమోదుకు అవకాశం ఫ వెబ్ లింక్ను అందుబాటులో ఉంచిన ఎన్నికల సంఘం ఫ కుటుంబంలో ఒకరు ఫారాలు నింపినా ఓకే ఫ వివరాలు సరిచూసి ఓట్లు ఖరారు చేయనున్న బీఎల్ఓలు ఎన్నికల సంఘం ఆన్లైన్లో ఎన్యుమరేషన్ (ఓటర్ల నమోదు/ వివరాల సేకరణ) చేసుకునే అవకాశం కల్పించింది. బీఎల్ఓలు ఇంటికి రాకముందే ఆన్లైన్లో ఎన్యుమరేషన్ ఫారం పూరించాలి. ఆ వివరాలను బీఎల్ఏలు సరిపోల్చుకొని ఓట్లను ఖరారు చేస్తారు. కుటుంబంలోని ఎవరైనా అధికారిక వెబ్సైట్ https://voters.eci.gov.in ద్వారా ఆన్లైన్లో ఎన్యుమరేషన్ చేసుకోవచ్చని ఎన్నికల సంఘం పేర్కొంది. ఓటర్లు తమ మొబైల్ నంబర్ లేదా ఓటరు కార్డు నంబర్ను ఉపయోగించి, ఫోనుకు వచ్చే ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత ‘ఈ–సైన్’ చేసి, వివరాలను నమోదు చేయవచ్చు. ఎన్యుమరేషన్ సమయంలో ఇంటి వద్ద అందుబాటులో లేని ఓటర్లు ఈ విధానం ద్వారా తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. -
యోగానంద ఆలయ ఆవరణలో గెస్ట్హౌస్
పది మంది ఎస్ఐల బదిలీసూర్యాపేటటౌన్ : జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో పని చేస్తున్న పది మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ నరసింహ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సీసీఎల్ సూర్యాపేట ఎస్ఐ ఎం.అనిల్రెడ్డి సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్కు, ఎన్.బాలునాయక్ సూర్యాపేట రూరల్ నుంచి వీఆర్కు, ఎం.ఐలయ్య వీఆర్ నుంచి ఆత్మకూర్.ఎస్కు, ఎన్.సందీప్రెడ్డి వీఆర్ నుంచి సూర్యాపేట వన్ టౌన్కు, బి.మోహన్బాబు వీఆర్ సూర్యాపేట నుంచి సూర్యాపేటటౌన్–2కు, ఏడుకొండలు సూర్యాపేట వన్టౌన్ నుంచి వీఆర్కు, మహేంద్రనాథ్ సూర్యాపేట వన్టౌన్ నుంచి వీఆర్కు, ఎస్కే.రహీమొద్దీన్ వీఆర్ నుంచి సూర్యాపేట వన్టౌన్కు, ఆర్.కనకరత్నం వీఆర్ నుంచి సూర్యాపేట టౌన్– 2, వి.వెంకన్న వీఆర్ సూర్యాపేట నుంచి చివ్వెంల పోలీస్ స్టేషన్లకు బదిలీ చేశారు. లక్ష్మీనరసింహునికి నిత్య కల్యాణం మఠంపల్లి: మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో శనివారం స్వామివారి నిత్య కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారి మూల విరాట్కు పంచామృతాభిషేకం చేశారు. ఎదుర్కోళ్ల మహోత్సవం అనంతరం విశ్వక్సేనారాధన, పుణ్యహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుపర్కపూజ, మాంగల్యాధారణ, తలంబ్రాలు వైభవంగా నిర్వహించారు. అనంతరం ఆలయ మాడ వీధులలో స్వామివారి గరుడ వాహన సేవ చేపట్టారు. కార్యక్రమాలలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయ ఆచార్యులు, భక్తులు పాల్గొన్నారు. అర్వపల్లి: అర్వపల్లిలోని శ్రీయోగానంద లక్ష్మీనర్సింహస్వామి ఆలయ ఆవరణలో పర్యాటక సంస్థకు సంబంధించిన అతిథిగృహ భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని శనివారం సంస్థ ఇంజినీరింగ్ అధికారులు పరిశీలించారు. ఇటీవల ఆలయాన్ని సందర్శించిన రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి భక్తుల సౌకర్యార్థం ఆలయ ఆవరణలో గెస్ట్హౌస్ నిర్మించడానికి నిధులు మంజూరు చేయిస్తానని ఇచ్చిన హామీ మేరకు రూ.60 లక్షలు మంజూరు చేయించారు. దాంతో భవన నిర్మాణానికి అనువైన స్థలాన్ని పర్యాటక అభివృద్ధి సంస్థ ఇంజినీరింగ్ ఉమ్మడి జిల్లా డీఈ విద్యాసాగర్, ఏఈఈ మణికంఠ, ఆలయ చైర్మన్ అనిరెడ్డి రాజేందర్రెడ్డితో కలిసి పరిశీలించారు. త్వరలో పనులు ప్రారంభిస్తామని వారు చెప్పారు. వారి వెంట అధికారులు, ఆలయ అర్చకులు ఉన్నారు.ఫ స్థలాన్ని పరిశీలించిన అధికారులు -
రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం
సూర్యాపేటటౌన్ : రాష్ట్రంలో జరుగనున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందని, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని మన్నెం సదాశివారెడ్డి ఫంక్షన్హాల్లో శనివారం సర్ పై నియోజకవర్గ నాయకులు, కార్యకర్తకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం అత్యంత దుర్మార్గమైన ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. కేబినెట్ సమావేశం నిర్వహించి మరీ ధాన్యం కొనబోమని ప్రకటించింది ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వంమే అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించినప్పుడు కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేశారని, చివరకు రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేసిందని గుర్తుచేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సన్నధాన్యానికి బోనస్ ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసిందన్నారు. కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసే వరకు పార్టీ కార్యకర్తలు విశ్రమించవద్దని పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్, నాయకులు రాంచందర్నాయక్, వై.వెంకటేశ్వర్లు, నిమ్మల శ్రీనివాస్గౌడ్, మారిపెద్ది శ్రీనివాస్గౌడ్, నాయ కులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఫ మాజీ మంత్రి జగదీష్రెడ్డి -
ఏఐతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్
కోదాడరూరల్ : ఏఐ కోర్సుల్లో నైపుణ్యం సాధిస్తే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. పట్టణంలోని పీఎంశ్రీ బాలుర ఉన్నత పాఠశాలలో 9, 10వ తరగతి విద్యార్థులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక డిజిటల్ లిటరసీ, ఏఐ కోర్సు శిక్షణ శనివారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కంప్యూటర్ ఆపరేటింగ్, చాట్ జీపీటీ, ఏఐ స్కిల్స్ అప్లికేషన్, డిజైన్ థింకింగ్, మేకింగ్ ఆఫ్ కోడింగ్, పెయింటిగ్ వంటి విషయాలను నేర్చుకోవడం వల్ల సాఫ్ట్వేర్ రంగంలో రాణించవచ్చన్నారు. అనంతరం పాఠశాలలో జరుగుతున్న అడ్మిషన్ల ప్రక్రియను పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీఓ సూర్యనారాయణ, తహసీల్దార్ సంతోష్కిరణ్, ఎంఈఓ సలీంషరీఫ్, హెచ్ఎం మార్కేండేయ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుడిగా ఎస్పీసూర్యాపేటటౌన్ : ఎస్పీ నరసింహ బడిపంతులుగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. సూర్యాపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలను శనివారం ఆయన సందర్శించారు. 8వ తరగతి విద్యార్థులతో కొంతసేపు ముచ్చటించారు. వారికి సాంఘిక శాస్త్రం పాఠాలను బోధించారు. ‘ఉత్తర ధృవం – దక్షిణ ధృవం’ అంశాన్ని విద్యార్థులకు వివరించారు. ఆయన బోధనతో విద్యార్థులను ఆకట్టుకోగా, ఉపాధ్యాయులు సైతం ఆసక్తిగా తిలకించారు. తాను పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాలలోనే కుమారుడిని చదివిస్తున్న జూనియర్ అసిస్టెంట్ హరితను ఎస్పీ సన్మానించారు. ఆయన వెంట అదనపు ఎస్పీ రవీందర్రెడ్డి, సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్, పట్టణ సీఐ వెంకటయ్య, ఎస్ఐలు, ఉపాధ్యాయులు ఉన్నారు. ఎరువుల షాపు సీజ్మద్దిరాల : యూరియాను అధిక ధరలకు విక్రయిస్తున్న మండల కేంద్రంలోని ఫెర్టిలైజర్ షాపును జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్రెడ్డి సీజ్ చేశారు. మద్దిరాలలోని స్వర్ణ ఫెర్టిలైజర్ షాపు యజమాని యూరియాను అధిక ధరకు విక్రయిస్తున్నారని రైతులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దాంతో కలెక్టర్ ఆదేశానుసారం షాప్ను సీజ్ చేసి, లైసెన్స్ను రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. ఆయన వెంట ఏడీఏ రమేష్బాబు, ఏఓ అనిషారూహి, సిబ్బంది ఉన్నారు. నీట్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతసూర్యాపేటటౌన్ : పట్టణంలో ఆదివారం జరిగే రీ–నీట్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత కల్పిస్తున్నట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. శనివారం సూర్యాపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 144 (163 బీఎన్ఎస్ఎస్–2023) అమల్లో ఉంటుందన్నారు. పరీక్ష కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో గుంపులుగా చేర రాదన్నారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, మైకులు, డీజేలతో ఊరేగింపులపై నిషేధం ఉంటుందని చెప్పారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఆయన వెంట అదనపు ఎస్పీ రవీందర్రెడ్డి, డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ వెంకటయ్య, కళాశాల ప్రిన్సి పాల్ పెరుమాళ్ల యాదయ్య, సిబ్బంది ఉన్నారు. -
సదుపాయాల కల్పనలో రాజీ లేదు
హుజూర్నగర్ : ప్రజలకు మెరుగైన మౌళిక సదుపాయాల కల్పనలో రాజీ పడబోమని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. హుజూర్నగర్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల పురోగతిపై శనివారం రాత్రి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో నీటిపారుదలశాఖ సీఈ నాగభూషణరావు, ఈఈ రామకిషోర్, ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ కవిత, డీఈ చంద్రశేఖర్, ఏఈలు సరిత, ప్రసన్న, నాయకులు పాల్గొన్నారు. ఘనంగా మంత్రి పుట్టినరోజు వేడుక మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పట్టణంలో కాంగ్రెస్ నాయకులు ఏర్పా టు చేసిన కేక్ను మంత్రి కట్ చేశారు. నాయకులు మంత్రిని గజమాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్, వైస్ చైర్మన్ తన్నీరు మల్లిఖార్జున్, రాష్ట్ర పెరికకార్పొరేషన్ చైర్మన్ దొంగరి సత్యనారాయణ, ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి యరగాని నాగన్నగౌడ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గెల్లి రవి, మాజీ ఎంపీపీలు గూడెపు శ్రీనివాస్, భూక్యా గోపాల్, శిరాంయాదవ్, సంపత్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.


