breaking news
Bigg Boss
-
‘బిగ్బాస్’లోకి ‘రాను బొంబాయికి రాను’ రాము.. ప్రభాస్ హీరోయిన్.. లిస్ట్ ఇదే?
బుల్లితెరపై బిగ్బాస్ రియాల్టీ షోకి ఉన్న క్రేజీ గురించి అందరికి తెలిసిందే. హిందీతో పాటు అన్ని భాషల్లోనూ ఈ షోకి మంచి ఆదరణ ఉంది. ఇక తెలుగులో అయితే బిగ్బాస్ షో కోసం ఎదురు చూసే బుల్లితెర ప్రేక్షకులు చాలా మందే ఉన్నారు. ఇప్పటి వరకు ఎనిమిది సీజన్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. త్వరలోనే సీజన్ 9(Bigg Boss 9 Telugu) ప్రారంభం కానుంది. ఈ సారి ఈ గేమ్ షోని సరికొత్త ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రతి సీజన్కి కంటెస్టెంట్లను డైరెక్ట్గా హౌస్లోకి పంపేవారు. ఈ సారి మాత్రం షో ప్రారంభానికి ముందే కొంతమందికి ‘అగ్ని పరీక్ష’ పెట్టారు. ఇందులో పాల్గొని గెలిచిన ఐదు లేదా ఆరుగురిని హౌస్లోకి పంపుతారు. వీరితో పాటు మరికొంతమంది డైరెక్ట్గా బిగ్బాస్ ఇంట్లోకి వెళ్లబోతున్నారు.సరికొత్తగాబిగ్బాస్ సీజన్ 9ని కొత్తగా ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. ఇప్పటి వరకు బిగ్బాస్ కంటెస్టెంట్స్ అంతా ఒకే హౌస్లో ఉండేవాళ్లు. కానీ సీజన్ 9లో మాత్రం కంటెస్టెంట్స్ రెండు గ్రూపులుగా విడిపోయి..వేరు వేరు హౌస్లో ఉండబోతున్నారు. ఈ సీజన్లో 15 మంది కంటే ఎక్కువే హౌస్లోకి వెళ్లబోతున్నారు. వారిలో సగం ఒక హౌస్లో ఉంటే..మరో సగం మంది వేరే హౌస్లో ఉంటారు. ఆట తీరుని బట్టి కంటెస్టెంట్ ఏ ఇంట్లో ఉండాలో డిసైడ్ చేస్తారట. వీరికి పెట్టే టాస్క్లు కూడా కొత్తగా ఉండబోతున్నాయట. ఈ సారి మైండ్ గేమ్తో పాటు ఫిజికల్ టాస్క్లు కూడా కాస్త కఠినంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.కంటెస్టెంట్స్ వీరే?ఎప్పటి మాదిరే ఈ సారి కూడా బిగ్బాస్ షో ప్రారంభానికి ముందే కంటెస్టెంట్ల లిస్ట్ బయటకు వచ్చింది. సీజన్ 9లో పాల్గొనేది వీళ్లే అంటూ సోషల్ మీడియాలో ఓ లిస్ట్ చక్కర్లు కొడుతోంది. వారిలో ‘రాను బొంబాయికి రాను’ సాంగ్ సింగర్, డ్యాన్సర్ రాము రాథోడ్, ప్రభాస్ ‘బుజ్జిగాడు’ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించిన సంజన గల్రానీ, కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ, సీనియర్ హీరోయిన్ ఆశా షైనీ, జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్, అలేఖ్య చిట్టి పికిల్స్ నుంచి రమ్య మోక్ష, యంగ్ హీరో హర్షిత్ రెడ్డి, కమెడియన్ సుమన్ శెట్టి, కన్నడ నటి తనూజ పుట్టస్వామి, సీరియల్ నటుడు భరణి, ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కామనర్స్గా శ్రీజ, పవన్ కల్యాణ్, నాగ ప్రశాంత్, మాస్క్ మ్యాన్ హరీశ్ వెళ్లే అవకాశం ఉంది. మరి వీరిలో నిజంగానే ఎంతమంది బిగ్బాస్ షోలోకి వెళ్తున్నారనే విషయం తెలియాలంటే సెప్టెంబర్ 7 వరకు ఆగాల్సిందే. -
బిగ్బాస్ నుంచి ఇద్దరు అవుట్.. ఈ షోకి పనికిరావంటూ రెడ్ కార్డ్!
మరో నాలుగు రోజుల్లో బిగ్బాస్ 9 తెలుగు (Bigg Boss 9 Telugu) ప్రారంభం కాబోతోంది. ఈసారి ఇంకా కంటెస్టెంట్ల ఎంపికపై టీమ్ తర్జనభర్జన పడుతూనే ఉంది. మొదటినుంచి నేను రెడీ అంటూ ముల్లెమూట సర్దేసుకున్నవారు పారితోషికం, నెగెటివిటీ గురించి ఆలోచించి ఓ అడుగు వెనక్కు వేస్తున్నారు. మరికొందరేమే ఓసారి ట్రై చేస్తే పోలా అని షోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు.ఇద్దరు ఎలిమినేట్ఇదిలా ఉంటే కామన్ మ్యాన్ కోసం బిగ్బాస్ అగ్నిపరీక్ష అనే షో నిర్వహిస్తున్నారు. ఈ షోలో 15 మందిని సెలక్ట్ చేశారు. వారిలో ఐదుగురిని హౌస్కు పంపించనున్నారు. జడ్జిలు బిందుమాధవి, నవదీప్, అభిజిత్.. వారిని సానబెట్టి రాటుదేలుస్తున్నారు. అలాగే సరిగా పర్ఫామెన్స్ ఇవ్వనివారిని బయటకు పంపించేస్తున్నారు. అలా లేటెస్ట్ ఎపిసోడ్లో ప్రసన్నకుమార్, శ్వేతను ఎలిమినేట్ చేశారు. ఈ పంచాయితీ సెట్టవదుఅయితే ప్రసన్నకు రెడ్ కార్డ్ ఇవ్వగానే అతడు నా జర్నీ ఇంతటితో ఆగిపోదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక్కడున్న అందరికంటే నువ్వు వెయ్యి రెట్లు స్ట్రాంగ్.. నిన్ను చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యా.. కానీ, ఈ షో నీ వల్ల కాదు, ఈ లొల్లి, ఈ పంచాయితీ నీతో కాదు.. అని నవదీప్ చెప్పాడు. అభిజిత్ సైతం.. నేను రియాలిటీ షో గెలిచుండొచ్చు, కానీ నువ్వు రియాలిటీలో గెలిచావు అని అభినందించాడు.చదవండి: మర్యాదగా నా ఫోటోలను డిలీట్ చేయండి: హీరోయిన్ వార్నింగ్ -
బిగ్బాస్లోకి పాపులర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్
కామెడీ షో జబర్దస్త్ నటి రీతూ చౌదరి బిగ్బాస్-9లో ఎంట్రీ ఇవ్వనుంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఆమెకు భారీగానే ఫాలోవర్స్ ఉన్నారు. ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ను షేక్ చేస్తుంది ఈ బ్యూటీ.. బిగ్బాస్ సెప్టెంబర్ 7న ప్రారంభం కానుంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ లిస్ట్ రెడీ అయిపోయింది. అందులో రీతూ చౌదరి ఉందని దాదాపు ఖాయమైంది.రీతూ చౌదరి గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి పోలీసుల విచారణ కూడా ఎదుర్కొంది. ఆపై ఏకంగా రూ. 700 కోట్ల ల్యాండ్ స్కామ్లో ఆమె పాత్ర కూడా ఉందంటూ రూమర్స్ వచ్చాయి. అయితే, అందులో ఎలాంటి నిజం లేదని కావాలనే కొందరు తన పేరును ఇందులోకి లాగుతున్నారని చెప్పుకొచ్చింది. అంతడబ్బులు తన వద్ద ఉంటే ఇలాంటి కష్టాలు ఎందుకు పడుతానంటూ పేర్కొంది. అయితే, బిగ్బాస్ ద్వారా తనపై వచ్చిన నెగటివిటిని కాస్త అయినా తగ్గించుకోవచ్చని ఆమె హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం.సుమారు రెండేళ్ల క్రితం తన తండ్రి మరణంతో రితూ చౌదరినే తన కుటంబానికి పెద్ద దిక్కు అయింది. పలు టీవీ కార్యక్రమాల్లో పాల్గొంటూ సంపాదన మొదలుపెట్టింది. ఆపై సోషల్మీడియా ద్వారా కూడా తన ఫ్యామిలీ కోసం కష్టపడుతుండటంతో ఆమె గురించి తెలిసినవాళ్లు మాత్రం ఫ్యాన్స్ అయిపోయారు. అయితే, బిగ్బాస్9 ద్వారా మరికొందరి ప్రేక్షకుల ప్రేమను గెలవచ్చు అనే రితూ చౌదరి ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) -
అలా చేయలేను.. అందుకే ‘షో’ కి నన్ను పిలవరు : బిగ్బాస్ ఫేం కీర్తి భట్
బుల్లితెరపై రోజూ రకరకాల షోలు ప్రసారం అవుతుంటాయి. ఒక చానల్లో కామెడీ షో..మరో చానల్లో డ్యాన్స్ షో.. ఇంకో చానల్లో సింగింగ్ షో.. ఇలా నిత్యం పదుల సంఖ్యల్లో షోలు టెలికాస్ట్ అవుతుంటాయి. అయితే ఈ షోలలో ఎక్కువగా సీరియల్ నటీనటులలతో పాటు ‘బిగ్బాస్’ మాజీ కంటెస్టెంట్స్ కనిపిస్తుంటారు. యాంకర్గానో..జడ్జిగానో..టీమ్ లీడర్గానో..లేదా స్పెషల్ గెస్ట్ గానో ఏదో ఒకరకంగా వాళ్లు టీవీల్లో సందడి చేస్తుంటారు. శ్రీముఖి, లాస్య, శివజ్యోతి, అరియానా, శోభా శెట్టి, విష్ణుప్రియ..ఇలా చాలామంది బిగ్బాస్ ప్లేయర్స్ ఇప్పుడు వరుస షోలతో బిజీ అయిపోయారు. కానీ బిగ్బాస్తో ఎంతో పేరు సంపాదించున్న కీర్తి భట్ మాత్రం ఎలాంటి షోలలో కనిపించడం లేదు. బిగ్బాస్ షో టెలికాస్ట్ అయ్యే చానల్లో సైతం ఆమె కనిపించడం లేదు. తాజాగా దీనికి గల కారణాన్ని బయటపెట్టింది కీర్తి భట్. అందరిలానే తాను గ్లామర్ షో చేయనని..వాళ్లు చెప్పినట్లుగా చిన్న చిన్న దుస్తులు ధరించలేనని..అందుకే తనని ఏ షోకి పిలవరని అంటోంది. అడుక్కోవడం నచ్చదునేను గతంలో ఒక ఇంటర్వ్యూలో ‘అమ్మాయిలు గ్లామర్గా ఉంటేనే బుల్లితెర షోలకు పిలుస్తారు. వాళ్లు చెప్పినట్లుగా మోకాళ్ల వరకు దుస్తులు వేసుకునే వాళ్లకే అవకాశం ఇస్తారు. నేను అలా చేయలేను. అందుకే నాకు అవకాశాలు రావు’ అని చెబితే కొంతమంది పర్సనల్గా తీసుకొని ఫీలయ్యారు. నా ఫ్రెండ్స్ అపార్థం చేసుకున్నారు. కానీ నేను చెప్పింది నిజం. అలా అని వాళ్ల డ్రెసింగ్పై కామెంట్స్ చేయడం సరికాదు. నేను అలా వేసుకోలేను. చలాకీగా మాట్లాడలేను. అందుకే నాకు అవకాశాలు ఇవ్వరు. చాన్స్ ఇవ్వమని నేను ఎవరిని అడిగే రకం కూడా కాదు. అలా అడిగితే ఛీప్ అయిపోతాం. ఎంత కష్టం వచ్చినా ఇంకొకరి సహాయం తీసుకోకూడదనే వ్యక్తిత్వం నాది.ఎవరూ సపోర్ట్ చేయలేదుబిగ్బాస్ వల్ల నా కెరీర్కి ఎలాంటి ప్రయోజనం జరగలేదు. ఆ షో వల్ల నేను జనాలకు దగ్గరైన మాట నిజమే. కానీ కెరీర్ పరంగా మాత్రం ఏం యూజ్ కాలేదు. షో ద్వారా వచ్చిన ఫేంతో నాకు అవకాశాలు రాలేదు. టాప్ 5, 10లో ఉన్నవాళ్లను ఆఫర్స్ వచ్చాయి. అలా కొంతమందికి బిగ్బాస్ షో కలిసొచ్చింది. నా వరకు అయితే ఈ షోతో నా కెరీర్లో ఎలాంటి మార్పులు రాలేదు. అయితే షో నుంచి బయటకు వచ్చిన తర్వాత నా ప్రవర్తను మార్చుకున్నా. బిగ్బాస్కి వెళ్లే ముందు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. బిగ్బాస్లోకి వెళ్లిన తర్వాత ఎవరూ సపోర్ట్ చేయలేదు. ఎవరు ఎవరికీ లేరు. మనం దగ్గర ఉన్నంత వరకు మాత్రమే మాట్లాడారు. నేను చాలా త్వరగా మనుషులను నమ్మేస్తాను. కొంచెం మంచిగా మాట్లాడితే నా వాళ్లే అనుకుంటాను. అన్ని చెప్పేస్తా. ఇప్పుడు నమ్మకం అనే పదంపైనే నాకు నమ్మకం పోయింది’ అని కీర్తి భట్ చెప్పుకొచ్చింది. కాగా కార్తీకదీపం, మనసిచ్చిచూడు వంటి సీరియళ్లతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కీర్తి..బిగ్బాస్ సీజన్ 6లో పాల్గొని.. తనదైన ఆటతీరుతో టాప్ 3 లో స్థానం సంపాదించుకుంది. సింగర్ రేవంత్ ఆ సీజన్ విన్నర్గా నిలిచాడు. -
బట్టలు చించుకుంటున్నారు.. ఎవడ్రా బిగ్బాస్? కట్ చేస్తే షోలో కన్నీళ్లు!
మరికొద్దిరోజుల్లో బిగ్బాస్ తొమ్మిదో సీజన్ (Bigg Boss 9 Telugu) ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను కన్ఫార్మ్ చేసేశారు. అయితే తారలు మాత్రమే ఉంటే ఎలా? సామాన్యులు కూడా ఉండాలని ఆలోచించారు. ఎవరో ఒకర్ని కాకుండా అగ్నిపరీక్ష అనే షో పెట్టి అందులో తమ సత్తా చూపించినవారికే రియాలిటీ షోలో అడుగుపెట్టే ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఈ అగ్నిపరీక్ష మొదలైంది. 15 మంది మధ్య పోటీ జరుగుతోంది.ఓటేయండి ప్లీజ్వీరిలో ఇన్ఫ్లుయెన్సర్ అనూష రత్నం (Anusha Ratnam) కూడా ఉంది. తాజాగా హాట్స్టార్ ఆమె ఓట్ అప్పీల్ చేసిన వీడియో రిలీజ్ చేసింది. అందులో అనూష మాట్లాడుతూ.. ఉద్యోగం చేశా, ట్యూషన్ టీచర్గా చేశా.. కంటెంట్ క్రియేటర్గానూ పని చేశాను. మీలో ఒకరిగా సోషల్ మీడియాలో ఎంటరయ్యాను. ప్రతి తెలుగింటికి నా గొంతు వినిపించాలంటే నన్ను బిగ్బాస్లోకి పంపించాలి. బిగ్బాస్కు నన్ను పంపించాలంటే ఓటింగ్ ముఖ్యం. కాబట్టి నాకు ఓటు వేసి పంపించండి.గర్వపడేలా చేస్తా..ఈమెను ఎందుకురా పంపించాం? అని నిరాశ చెందకుండా గర్వపడేలా చేస్తానని మాటిస్తున్నా.. మీ ఇంటి ఆడపిల్ల అని గర్వంగా చెప్పుకునేలా చేస్తాను అంటూ తనకు ఓటేయమని వేడుకుంది. అనూష రత్నం వరంగల్ అమ్మాయి. తండ్రి మరణించడంతో చెల్లి చదువు బాధ్యతను తనే భుజాన వేసుకుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన ఆమె తర్వాత ఇన్ఫ్లుయెన్సర్గా మారింది. ఇటీవల వర్జిన్ బాయ్స్ మూవీ ఈవెంట్లో యాంకరింగ్ కూడా చేసింది. ఎవడ్రా బిగ్బాస్?బిగ్బాస్కు వెళ్లాలని తహతహలాడుతున్న ఈమె గతంలో ఈ షోపై చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్గా మారాయి. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో ఏదంటే? అందరూ బిగ్బాస్, బిగ్బాస్ అని బట్టలు చించేసుకుంటున్నారు. ఎవడ్రా బిగ్బాస్ అని హేళన చేసింది. కట్ చేస్తే అదే షోకి వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంది. తన లైఫ్ స్టోరీ చెప్తూ ఎమోషనల్ కావడంతో ఆమెను నేరుగా టాప్ 15కి పంపించారు. అప్పుడు విష్ణుప్రియ.. ఇప్పుడు అనూషఅక్కడినుంచి నేరుగా బిగ్బాస్ 9కి పంపమని వీడియోలు చేస్తోంది అనూష. మరి తను బిగ్బాస్ 9లో ఉంటుందా? లేదా? అనేది చూడాలి! గతంలో విష్ణుప్రియ కూడా.. షోకి వెళ్లేదే లేదని తెగేసి చెప్పింది. కట్ చేస్తే గత సీజన్లో ప్రత్యక్షమైంది. ఆట ఆడకుండా పిక్నిక్కు వచ్చినట్లు కూర్చుంది. మరి ఈ అనూష షోకి వెళ్తుందా? వెళ్తే ఎలా ఆడుతుంది? అన్నది చూడాలి! View this post on Instagram A post shared by Telugu Heartful (@telugu_heartful) చదవండి: కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ యంగ్ హీరో.. టీజర్ రిలీజ్ -
అఫీషియల్: వచ్చేవారమే బిగ్బాస్ 9 ప్రారంభం
బుల్లితెర ప్రేక్షకుల ఎదురుచూపులకు శుభం కార్డు పడనుంది. తెలుగు బిగ్బాస్ 9 షో (Bigg Boss 9 Telugu) కి రంగం సిద్ధమైంది. వచ్చేవారమే బిగ్బాస్ ప్రారంభం కానుంది. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. సెప్టెంబర్ 7న బిగ్బాస్ 9 ప్రారంభం కాబోతుందని ప్రకటించింది. ఈసారి కూడా కింగ్ నాగార్జునే ఈ రియాలిటీ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. 9వ సీజన్ కావడంతో ప్రోమోలో నవగ్రహాలను చూపించారు. అలాగే ఈసారి రెండు హౌస్లు ఉంటాయన్నారు. ఒకటి సెలబ్రిటీల కోసం.. మరొకటి కామన్ మ్యాన్ కోసం అని తెలుస్తోంది. అలాగే బిగ్బాస్నే మారుస్తున్నట్లు చెప్పాడు నాగ్. అంటే బిగ్బాస్ వాయిస్ మారొచ్చని తెలుస్తోంది. అగ్నిపరీక్షఇప్పటికే కామన్ మ్యాన్ కోసం సెలక్షన్ జరుగుతోంది. హాట్స్టార్లో అగ్నిపరీక్ష అనే షో నిర్వహిస్తున్నారు. ఇందులో దాదాపు 15 మంది సెలక్టయ్యారు. వారికి రకరకాల గేమ్స్ పెడుతున్నారు. నచ్చినవారికి ఓట్లేసుకోమని ఆప్షన్ కూడా ఇచ్చారు. ఓట్లు ఎక్కువ వచ్చిన ఒకరిద్దరు కంటెస్టెంట్లను హౌస్లోకి పంపించవచ్చని తెలుస్తోంది. అలాగే అగ్నిపరీక్ష షో జడ్జిలైన బిందు మాధవి, నవదీప్, అభిజిత్.. ఇద్దరు, ముగ్గురు కంటెస్టెంట్లను సెలక్ట్ చేసి డైరెక్ట్గా పంపించవచ్చని భోగట్టా! మరి హౌస్లోకి ఎవరెవరు వెళ్తారో తెలియాలంటే వచ్చేవారం దాకా ఆగాల్సిందే! -
పడ్డచోటే నిలబడ్డ కల్కి, కంటతడి పెట్టుకున్న జవాన్.. రెండోసారి బంపరాఫర్!
బిగ్బాస్ అగ్నిపరీక్ష షో (Bigg Boss 9 Agnipariksha)లో 15 మంది మిగిలారు. వీరిమధ్య రకరకాల పోటీలు పెడుతూ ఏరోజుకారోజు ఫలానా కంటెస్టెంట్ బెస్ట్, ఫలానా కంటెస్టెంట్ వరస్ట్ అని ప్రకటిస్తున్నారు. మీకు నచ్చిన వ్యక్తికి ఓటేసుకోమని జియోహాట్స్టార్లో ఓటింగ్ వెసులుబాటు కల్పించారు. నిన్నటి ఎపిసోడ్లో శ్రీజ బెస్ట్ అయితే కల్కిని వరస్ట్ పర్ఫామర్గా ప్రకటించారు. మరి ఈ రోజు ఏం జరిగిందనేది నేటి (ఆగస్టు 28) ఎపిసోడ్ రివ్యూలో చూసేద్దాం..లీడర్గా దాలియాఇప్పటికే నిన్న గేమ్ గెలిచిన ప్రియ.. నేడు కూడా లీడర్గానే కొనసాగింది. మరో లీడర్ కోసం టైమ్ గేమ్ ఆడించారు. అందరినీ బాక్సుల్లో కూర్చోబెట్టి సరిగ్గా రెండు నిమిషాల్లో లేవాలన్నారు. అయితే ఫస్ట్, లాస్ట్ లేచినవారు ఆటలో ఎలిమినేట్ అవుతారని ట్విస్ట్ ఇచ్చారు. తొమ్మిదో స్థానంలో నిలబడ్డవారికి టీమ్ లీడర్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నారు. అలా దాలియా గెలిచి లీడర్ అవగా.. షాకిబ్, మనీష్ తొలి, చివరి స్థానాల్లో లేచి ఆటలో లేకుండా పోయారు.కుండ పగిలిందిప్రియ, శ్రీజ, పవన్ కల్యాణ్, నిఖిత, నాగ ప్రశాంత్, శ్రేయ ఒక టీమ్గా; దాలియా.. ప్రసన్న, శ్వేత, పవన్, అనూష, కల్కి మరో టీమ్గా ఏర్పడ్డారు. వీళ్లందరికీ కుండ గేమ్ ఇచ్చారు. వేలితో కుండ కట్టి ఉన్న తాడును పట్టుకోవాలన్నారు. కుండ కింద పడేసినవాళ్లు ఎలిమినేట్ అవడం కాదు కానీ, ఆ కుండలో ఎవరి ఫోటో ఉంటుందో వారు ఎలిమినేట్ అయినట్లు అని మెలిక పెట్టారు. ఈ గేమ్లో ప్రియ టీమ్ నుంచి పవన్ కల్యాణ్, దాలియా టీమ్ నుంచి కల్కి చివరి వరకు ఉన్నారు. కంటతడి పెట్టుకున్న జవాన్తన టీమ్ లీడర్ ప్రియ.. కుండ పడేసేయ్ అని చెప్పడంతో పవన్ తనకు సత్తా ఉన్నా సరే, దాన్ని కిందపడేశాడు. తీరా చూస్తే అందులో ప్రియ ఫోటోనే ఉండటంతో వారి టీమ్ ఓడిపోయింది. చివరి వరకు ఉన్న కల్కి కుండలో తన ఫోటోనే ఉంది. అలా తాను గెలవడంతో పాటు తన టీమ్ను సైతం గెలిపించింది. అయితే చివరి వరకు వచ్చి ఓడిపోయానని సైనికుడు పవన్ కంటతడి పెట్టుకున్నాడు. నా జీవితంలో ఎప్పుడూ ఇంతే.. ఎంత కష్టపడ్డా చివరకు ఇలాగే జరుగుతుందని ఎమోషనల్ అయ్యాడు. రెండోసారి ఓట్ అప్పీల్ఈ ఎపిసోడ్లో పవన్ కల్యాణ్ను మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా ప్రకటించడంతో అతడు ఓట్ అప్పీల్ చేసుకున్నాడు. ఈ బంపరాఫర్ ఇతడికి రెండోసారి రావడం విశేషం! అలాగే తన టీమ్ను గెలిపించిన కల్కికి ఓట్ అప్పీల్ చేసుకునే ఛాన్స్ వచ్చింది. నిన్న వరస్ట్ ప్లేయర్ అన్నవారితోనే సూపర్ అనేలా గేమ్ ఆడింది. మర్యాద మనీష్ను వరస్ట్ ప్లేయర్గా ప్రకటించారు. చదవండి: 17 ఏళ్ల తర్వాత ఇలా.. లేహ్లో చిక్కుకుపోయిన హీరో మాధవన్! -
టాప్ 15లో తనే చెత్త కంటెస్టెంట్.. దమ్మున్న శ్రీజకు సూపర్ పవర్
బిగ్బాస్ అగ్నిపరీక్షలో సామాన్యుల మధ్య పోటీ జరుగుతోంది. వీరిలో టాప్ 15 సెలక్షన్ జరిగిపోయింది. ఈ పదిహనుమంది మధ్యలో గేమ్స్ పెట్టి ఐదు లేదా తొమ్మిది మందిని ఎంపిక చేసి బిగ్బాస్ 9వ సీజన్కు పంపించనున్నారు. మరి ఎలాంటి టాస్కులు పెట్టారు? అసలు టాప్ 15లో ఎవరున్నారనేది నేటి (ఆగస్టు 27) ఎపిసోడ్ రివ్యూలో చూసేద్దాం..టాప్ 15 వీళ్లే..ప్రసన్న కుమార్, ప్రియా శెట్టి, మర్యాద మనీష్, అనూష రత్నం, దమ్ము శ్రీజ, సైనికుడు పవన్ పడాల, దాలియా, కల్కి, షాకిబ్, శ్వేతా శెట్టి, దివ్య వేలమురి, శ్రేయ, డిమాన్ పవన్, నాగ ప్రశాంత్, హరిత హరీశ్ (మాస్క్ మ్యాన్).. వీరందరూ అగ్నిపరీక్ష షో (Bigg Boss 9 Agnipariksha)లో టాప్ 15కి చేరారు. వీరందరికీ నాగార్జున ఆల్ ద బెస్ట్ చెప్పిన వీడియో ప్లే చేయడంతో కంటెస్టెంట్లు సంతోషించారు. ఇక షో అంతా అరగుండుతో ఉండాల్సిందే అని మాస్క్ మ్యాన్కు పెట్టిన కండీషన్ను తీసేశారు. అరగుండు ఎందుకులే అంటూ బిందుమాధవి అతడికి గుండు గీసింది.రెండు టీమ్స్..వీళ్లందరికీ 1 నుంచి 15 వరకు స్టాండ్స్ ఇచ్చి.. మీకు అర్హత ఉన్న స్థానాల్లో నిలబడమన్నారు. దీంతో చాలామంది మొదటి మూడు స్థానాల కోసం పోటీపడ్డారు. నీకంటే నాకే అర్హత ఉంది, నువ్వు ఎమోషనల్గా వీక్.. ఇలా రకరకాల కారణాలు చెప్పుకుంటూ ర్యాంకుల కోసం కొట్లాట జరిగింది. ఎవరికైనా ఫోన్ చేసి డబ్బులు వేయించుకోవాలన్న టాస్క్ను గుర్తు చేసిన మనీష్.. కల్కి ముందే ప్లాన్ చేసి తన ఫ్రెండ్కు అన్నిరకాలుగా సిద్ధంగా ఉండమని చెప్పడంతో ఆ గేమ్ తను గెలిచేసిందన్నాడు. అది నిజం కాదని కల్కి ఎక్కువగా వాదించకపోవడంతో ఒకరకంగా తను దాన్ని ఒప్పుకున్నట్లుగానే కనిపించింది. ఓట్ అప్పీల్ఇక ఈ గేమ్లో మొదటి ఆరు స్థానాల్లో ఉన్న వారిని రెడ్ టీమ్గా, తర్వాతి ఆరు స్థానాల్లో ఉన్నవారిని బ్లూ టీమ్గా విడదీశారు. చిట్టిచివర్లో 15వ స్థానంలో ఉన్న దాలియాను సంచాలక్గా పెట్టారు. ఈ గేమ్లో ప్రసన్నకుమార్ను సంచాలక్ అన్యాయంగా ఎలిమినేట్ చేసింది. దీంతో ఆట యూటర్న్ తిరిగింది. బ్లూ టీమ్ గెలిచి ఓట్ అప్పీల్ చేసుకునే ఛాన్స్ దక్కించుకుంది. టీమ్ లీడర్ ప్రియ.. చివరి వరకు ఆడి గెలిపించిన పవన్ పడాలను సెలక్ట్ చేసింది. దీంతో అతడు ఓట్లేయమని అడిగాడు. చెత్త ప్లేయర్బిందుమాధవి.. వరస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఎపిసోడ్గా కల్కిని ప్రకటించింది. వాల్యుబుల్ ప్లేయర్గా శ్రీజను ప్రకటించగా ఆమె స్టేజీపైకి వచ్చింది. దమ్ము మాటల్లోనే కాదు చేతల్లోనూ ఉంది. నా వాయిస్ చిరాకుగా ఉన్నా ఆట ఇంట్రస్టింగ్గా ఉంటుంది. ఒక్క ఛాన్సిస్తే లేడీ విన్నర్ అయి చూపిస్తా అని తనకు ఓటేయమని అభ్యర్థించింది. ఆమె చలాకీతనం చూసిన అభిజిత్.. నువ్వు షోలో ఉండొద్దని రెడ్ కార్డ్ చూపించా.. కానీ, ఇప్పుడు నా మనసు మారిందన్నాడు. చదవండి: ఒక్కసారిగా కళ్లముందుకు.. మనసంతా సంతోషంగా ఉంది: నిహారిక -
మాట తూలి.. ఇప్పుడు సారీ చెప్పిన నవదీప్
బిగ్బాస్ షో మరో రెండు వారాల్లో మొదలవుతుంది. ఈసారి సామాన్యులకు ఎక్కువమందికి అవకాశం కల్పించేందుకు అగ్నిపరీక్ష పేరుతో ఓ షో ప్లాన్ చేశారు. గత నాలుగైదు రోజుల నుంచి పలు గేమ్స్ పెడుతూ టాప్-15 కంటెస్టెంట్స్ని ఎంపిక చేశారు. అయితే సోమవారం ఎపిసోడ్లో ఈ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్న నవదీప్.. ఓ లేడీ కంటెస్టెంట్పై మాట తూలాడు. ఈ విషయమై విమర్శలు రావడంతో ఇప్పుడు క్షమాపణ చెప్పుకొచ్చాడు.సోమవారం టెలికాస్ట్ చేసిన ఎపిసోడ్లో కల్కి, షాకీబ్ అనే కంటెస్టెంట్స్ మధ్య చిన్న గేమ్ పెట్టారు. ఎవరికైనా ఫోన్ చేసి ఆన్లైన్ ద్వారా డబ్బులు వేయమని చెప్పారు. అయితే ఈ పోటీలో కల్కికి గేమ్ గురించి క్లియర్గా చెప్పారు. షాకీబ్కి మాత్రం సరిగా వివరించలేదు. దీంతో అతడికి తక్కువ డబ్బులు మాత్రమే పడ్డాయి. ఇది ఎవరికైనా అన్ ఫెయిర్ అనిపించిందా? అని కూర్చున్న కంటెస్టెంట్స్ని నవదీప్ అడగ్గా.. శ్రీజ చేయి ఎత్తింది.(ఇదీ చదవండి: అల్లు అర్జున్తో హాలీవుడ్ పవర్ హౌస్.. బిగ్ ప్లాన్ రెడీ)దీంతో శ్రీజని నవదీప్ స్టేజీపై రమ్మన్నాడు. అన్ ఫెయిర్ అని ఎందుకు అనిపించింది? అని ఈమెని అడగ్గా.. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బుంటే వారే గెలుస్తారని కల్కికి వివరంగా చెప్పారు, కానీ, అతడికి ఆ మాట చెప్పలేదని ధైర్యంగా అనేసింది. దాంతో నవదీప్ కోప్పడ్డాడు. నువ్వు అతిగా ఆలోచించొద్దు. బిగ్బాస్ అనేది చాలా భాషల్లో ఎన్నో సీజన్లు జరిగాయి. ఊరు నుంచి ఊపుకుంటూ వచ్చి అన్ఫెయిర్ అని చెప్పడానికి.. నీకంత సీన్ లేదు. ఇంకోసారి ఇలా చేయకు అంటూ ఆమెను చులకన చేసి మాట్లాడాడు.అయితే 'ఊరి నుంచి వచ్చావ్' అని నవదీప్ కామెంట్ చేయడంపై సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో ఇప్పుడు తన ఇన్ స్టాలో స్టోరీ పోస్ట్ చేశాడు. ''ఊరి నుంచి వచ్చి' అన్న మాటకు ఫీలైన సున్నితమైన మనసులకు ప్రేమలో సారీ చెబుతున్నా. కుదిరితే క్షమించండి. ఐ లవ్యూ' అని నవదీప్ రాసుకొచ్చాడు. (ఇదీ చదవండి: ‘బిగ్బాస్’లో ప్రేమాయణం.. పెళ్లి చేసుకున్న జంటలివే) -
బిగ్బాస్ జడ్జీగా అతనెందుకు.. ?: కౌశల్
బిగ్బాస్ అగ్నిపరీక్ష (Bigg Boss Aagnipariksha)పై సీజన్-2 విజేత కౌశల్ విమర్శలు చేశారు. కామన్ ఆడియన్స్ హౌస్లోకి వెళ్లేందుకు వేలాదిమంది అప్లై చేసుకుంటే బిగ్బాస్ టీమ్ వారిని జల్లెడపట్టి 45 మందిని సెలక్ట్ చేసింది. వారి మాట, ఆట తీరు బట్టి తొమ్మిదో సీజన్కు ఎవర్ని సెలక్ట్ చేయాలి..? ఎవర్ని రిజెక్ట్ చేయాలన్నది బిందు మాధవి, నవదీప్, అభిజిత్ చేతిలో పెట్టారు. అయితే, ఈ విధానాన్ని కౌశల్(Kaushal Manda) తప్పుబట్టారు.బిగ్బాస్ అగ్నిపరీక్ష గురించి కౌశల్ ఇలా అన్నారు..' బిగ్బాస్-9 హౌస్లోకి కామన్ ఆడియన్స్ను పంపేందుకు వారు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది. కానీ, జడ్జీలుగా వారిని తీసుకోవడంపై కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. అభిజిత్ బిగ్బాస్- 4 విజేత పర్వాలేదు, బిందు మాధవి ఓటీటీ విజేత కాబట్టి ఓకే... అయితే, నవదీప్ సీజన్-1 సమయంలో మూడో స్థానంలో ఉన్నాడు. ఓడిపోయాన వ్యక్తిని కాకుండా విన్నర్ శివబాలాజీని జడ్జీగా తీసుకుని ఉండుంటే బాగుండేది. అలా చేయడం వల్ల విన్నర్స్కు గుర్తింపు ఇచ్చినట్లు ఉండేది.నన్నెందుకు పిలవరంటే..బిగ్బాస్ సీజన్- 2 తర్వాత కౌశల్ ఎప్పుడూ కూడా హౌస్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. చాలామంది పాత కంటెస్టెంట్స్ అతిథుల రూపంలో బిగ్బాస్ స్టేజీపై సందడి చేసినప్పటికీ కౌశల్ మాత్రం దూరంగానే ఉన్నారు. అందుకు కారణం ఇలా చెప్పారు. 'ఇక నా వరకు వస్తే నేను గెలవడం బిగ్బాస్ టీమ్కు ఇష్టమే లేదు. కేవలం ప్రేక్షకుల అభిమానం వల్ల ట్రోఫీ ఇచ్చారు. ఓట్ల విషయంలో 'నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా' నా తర్వాతి కంటెస్టెంట్స్తో ఉండటంతో తప్పని పరిస్థితిలో మాత్రమే నన్ను విజేతగా ప్రకటించారు. అందుకే బిగ్బాస్ టీమ్ వారు నన్ను ఎప్పుడూ కూడా హౌస్లోకి రమ్మని పిలువలేదు. బిగ్బాస్ చరిత్రలోనే వారికి ఇష్టం లేని కంటెస్టెంట్కు ట్రోఫీ ఇవ్వాల్సి వచ్చింది. సాధారణంగా హౌస్ట్గా వచ్చిన వారు చెయి పట్టుకుని విజేతను ప్రకటిస్తారు. కానీ, మొదటిసారి దానిని బ్రేక్ చేసి స్క్రీన్ మీద విన్నర్ను ప్రకటించారు. దీనిని బట్టే చెప్పవచ్చు.. బిగ్బాస్ టీమ్కు నా విజయం నచ్చలేదు.' అని అయన అన్నారు. View this post on Instagram A post shared by Kaushal Manda (@kaushalmanda) -
బిగ్బాస్లోకి మరో కన్నడ నటి.. హిట్ సీరియల్తో గుర్తింపు
బిగ్బాస్ అగ్నిపరీక్ష (Bigg Boss Aagnipariksha) దాదాపు పూర్తి కావచ్చింది. ఇప్పటికే రేసు నుంచి కొందరిని ఎలిమినేట్ చేశారు. కొందరిని హోల్డ్లో పెట్టారు. మరికొందరిని నేరుగా టాప్ 15లోకి పంపించారు. వీళ్లంతా కామన్ ఆడియన్స్ విభాగంలో బిగ్బాస్9లో ఎంట్రీ ఇవ్వనున్నారు. అయితే, సెలబ్రిటీలు ఎవరు పాల్గొననున్నారు అనే అంశంలో చాలామంది పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ముద్ద మందారం సీరియల్ హీరోయిన్ బిగ్బాస్లోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఆమె పేరు ఫైనల్ అయిపోయినట్లు సమాచారం.బిగ్బాస్ హౌస్లోకి ప్రతి ఏడాది సీరియల్స్లలో గుర్తింపు పొందిన వారిని తీసుకుంటారు. ముఖ్యంగా కన్నడకు చెందిన అమ్మాయిలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారని తెలిసిందే. కర్ణాటకకు చెందిన శోభా శెట్టి, యష్మి గౌడ, నిఖిల్ వంటి వారు బాగా పాపులర్ అయ్యారు. ఇప్పుడు సీజన్-9లోకి 'ముద్ద మందారం' సీరియల్లో పార్వతి పాత్రతో మెప్పించిన 'తనుజా గౌడ' ఎంట్రీ దాదాపు ఖాయం అయిపోయింది. ముద్ద మందారం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ఆమె ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.కన్నడకు చెందిన తనుజా గౌడ కొన్ని చిత్రాల్లో హీరోయిన్గా నటించినా, పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో ఎక్కువగా సీరియల్స్లోనే నటించింది. దాదాపు 5 సంవత్సరాలు ప్రసారమైన ముద్ద మందారంతో ఆమెకు తెలుగులో పాపులారటీ తెచ్చుకుంది. ఆ తర్వాత నాగ భైరవి సీరియల్లోనూ ఆమె నటించింది. ఆమె గ్లామర్తో పాటు మంచి నటనా నైపుణ్యం ఉన్న నటిగా గుర్తింపు పొందింది. బిగ్బాస్లో ఇప్పటికే కన్నడ అమ్మాయిలు బాగా రాణించారు. దీంతో తనుజా గౌడ కూడా మెప్పిస్తుందని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. View this post on Instagram A post shared by Thanuja Puttaswamy (@thanuja_puttaswamy_) -
ఊరు నుంచి ఊపుకుంటూ వచ్చావ్.. నీకంత సీన్ లేదు: నవదీప్ ఓవరాక్షన్
బిగ్బాస్ అగ్నిపరీక్షలో టాప్ 15కి ఆరుగురు సెలక్ట్ అయ్యారు. మిగిలిన తొమ్మిది స్థానాల కోసం 16 మంది పోటీపడుతున్నారు. వీరికి డేర్ ఆర్ డై అంటూ రకరకాల టాస్కులిచ్చారు. గెలిచినవారిని టాప్ 15కి పంపించారు. మరి ఎవరెవరు ఫైనల్స్లో అడుగుపెట్టారో నేటి (ఆగస్టు 25) ఎపిసోడ్లో చూసేద్దాం..అరగుండుతో బిగ్బాస్లోమొదటగా మాస్క్ మ్యాన్ హరీశ్, సాయికృష్ణను పిలిచి అరగుండు చేసుకోవాలని ఛాలెంజ్ విసిరారు. సీజన్ అంతా అరగుండుతోనే ఉండాలని మెలికపెట్టారు. మాస్క్ మ్యాన్ క్షణం ఆలోచించకుండా వెంటనే ట్రిమ్మర్ అందుకుని అరగుండు గీసుకున్నారు. దీంతో అతడిని విజేతగా ప్రకటించి టాప్ 15కి పంపించారు. నెక్స్ట్ దమ్ము శ్రీజ, ఊర్మిళను పిలిచి ఐయామ్ లూజర్ అని నుదుటిపై పచ్చబొట్టు వేసుకోవాలన్నారు. ఊర్మిళ మోడల్ కాబట్టి తాను రిజెక్ట్ చేసింది. శ్రీజ ధైర్యంగా ముందుకు వచ్చింది. అయితే ఐయామ్ లూజర్కు బదులుగా ఐ లవ్ బిగ్బాస్ అని పచ్చబొట్టు వేయించారు.పది నిమిషాల్లో కిలో బరువుతర్వాత సోల్జర్ పవన్ కల్యాణ్, అబూకు 10 నిమిషాల్లో కిలో బరువు పెరగాలని బిర్యానీ, బర్గర్ ముందు పెట్టారు. ఈ గేమ్లో పవన్ గెలిచాడు. ఒంటిచేత్తో బెలూన్ పగలగొట్టాలన్న గేమ్లో ప్రియ రెండు చేతులుపయోగించి దాలియాను ఓడించింది. కానీ, జడ్జిలు దాన్ని గమనించకపోవడంతో ప్రియను విజేతగా ప్రకటించి ఫైనల్స్కు పంపించారు. షాకీబ్, కల్కిలకు శ్రీముఖి ఓ ఛాలెంజ్ ఇచ్చింది. ముందుగా షాకీబ్ను బయటకు పంపేసి.. ఎవరికైనా ఒకరికి కాల్ చేసి అర్జంట్గా డబ్బులు వేయించుకోవాలి. (Bigg Boss Agnipariksha)షాకీబ్కు అన్యాయంఎవరి అకౌంట్లో ఎక్కువ అమౌంట్ పడుతుందో వారు నెక్స్ట్ లెవల్కు వెళ్తారంది. దీంతో కల్కి తన ఫ్రెండ్కు రెండుసార్లు ఫోన్ చేయగా రూ.90 వేలు అకౌంట్లో పడ్డాయి. తర్వాత షాకీబ్ను స్టేజీపైకి పిలిచారు. కానీ మరీ అంత క్లారిటీగా టాస్క్ చెప్పలేదు. ఎవరికైనా కాల్ చేసి వీలైనంత డబ్బు నీ అకౌంట్లో వేయించుకో అంది శ్రీముఖి. కేవలం డబ్బు పడితే చాలేమో అనుకుని రూ.10 వేలు అడిగాడు. అతడి అమాయకత్వం చూసి మరో ఛాన్స్ ఇచ్చారు. అప్పుడు అతడి అకౌంట్లో రూ.50 వేలు పడ్డాయి.దమ్మున్న శ్రీజఎవరి దగ్గర ఎక్కువుంటే వారే విజేత అన్నది స్పష్టంగా షాకీబ్కు చెప్పుంటే బాగుండేది అని అందరికీ అనిపించింది. ఈ గేమ్లో కల్కి గెలిచింది. తనకు క్లియర్గా టాస్క్ వివరించి చెప్పలేదని షాకీబ్ ప్రశ్న లేవనెత్తాడు. దీంతో శ్రీముఖి.. ఎవరికైనా అన్ఫెయిర్ అనిపించిందా? అని అడగ్గా.. దమ్ము శ్రీజ చేయెత్తింది. తన తప్పు గమనించి ప్రశ్నిస్తారని ఊహించని శ్రీముఖి.. అయితే కూర్చో అంటూ శ్రీజను మాట్లాడనివ్వలేదు. నవదీప్, శ్రీముఖి ఓవరాక్షన్కానీ నవదీప్ మాత్రం శ్రీజను స్టేజీపైకి పిలిచాడు. ఎందుకు అన్ఫెయిర్గా అనిపించిందని ప్రశ్నించాడు. అందుకు శ్రీజ.. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బుంటే వారే గెలుస్తారని కల్కికి వివరంగా చెప్పారు, కానీ, అతడికి ఆ మాట చెప్పలేదని ధైర్యంగా అనేసింది. దాంతో నవదీప్ కోప్పడ్డాడు. నువ్వు అతిగా ఆలోచించొద్దు. బిగ్బాస్ అనేది చాలా భాషల్లో ఎన్నో సీజన్లు జరిగాయి. ఊరు నుంచి ఊపుకుంటూ వచ్చి అన్ఫెయిర్ అని చెప్పడానికి.. నీకంత సీన్ లేదు. ఇంకోసారి ఇలా చేయకు అంటూ ఆమెను చులకన చేసి మాట్లాడాడు. మొత్తానికి నాలుగు ఎపిసోడ్లో హరీశ్, శ్రీజ, ప్రియ, కల్కి.. టాప్ 15లో అడుగుపెట్టారు. చదవండి: నారీమణులతో.. ఒకే ఒక్కడు.. ఫోటో వైరల్ -
సిద్దిపేట మోడల్కు షాక్.. 16 మందికి అసలైన అగ్నిపరీక్ష!
బిగ్బాస్ అగ్నిపరీక్ష (Bigg Boss Aagnipariksha)లో చిరాకు తెప్పించిన కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేశారు. కొందరిని హోల్డ్లో పెట్టారు. మరికొందరిని నేరుగా టాప్ 15లోకి పంపించారు. మరి మూడో ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేద్దాం.. మొదటగా ఆర్మీ జవాన్ వచ్చాడు. అతడికి యాక్టింగే ఎక్కువ ఇష్టమన్నాడు. ఒకవేళ బిగ్బాస్ గెలిచి ఆఫర్లు వస్తే ఆర్మీకి రిజైన్ చేస్తానన్నాడు. షో నుంచి ఎలిమినేట్ అయితే ఆర్మీకి వెళ్లిపోతానన్నాడు. అతడికున్న క్లారిటీ జడ్జిలకు నచ్చింది. అలా అని ఇతడిని నేరుగా టాప్ 15కి పంపించలేదు, ఎలిమినేట్ కూడా చేయలేదు. ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టారు.సిద్దిపేట మోడల్కు షాక్సింగర్, డ్యాన్సర్ అంటూ స్టేజీపైకి వచ్చిన షకీం.. స్టేజీపై సరిగా డ్యాన్స్ చేయలేకపోయాడు. అయినా ఇతడికి నవదీప్ గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చి నెక్స్ట్ రౌండ్కు పంపించాడు. సిద్దిపేట మోడల్ స్టేజీపై రాగానే అతడి మాట తీరు జడ్జిలకు నచ్చలేదు. నువ్వు ఆల్రెడీ సెలబ్రిటీవి అంటూ పంపించేశారు. ఇన్ఫ్లుయెన్సర్ అనూష రత్నం తన స్టోరీ చెప్పింది. తండ్రి లేకపోయినా తనే కుటుంబం కోసం నిలబడి అప్పులు తీర్చానని, చెల్లిని విదేశాల్లో చదివించానని పేర్కొంది. 98 మంది ప్రపోజ్అయితే నామినేషన్స్ చేయమంటే మాత్రం తడబడింది. అప్పటికే తన స్టోరీ విని కరిగిపోయిన జడ్జిలు ముగ్గురూ గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చి ఆమెను టాప్ 15లోకి పంపించారు. తనకు 98 మంది ప్రపోజ్ చేశారంటూ స్టేజీపైకి వచ్చిన శ్రీకృష్ణను, డాక్టర్ నిఖితను.. మరికొందరిని హోల్డ్లో పెట్టారు. యూకే నుంచి బిగ్బాస్ కోసమే వచ్చానన్న శ్వేతను టాప్ 15లోకి పంపించారు. ఈమె తల్లికి క్యాన్సర్ కాగా.. ఈ ఎపిసోడ్ వచ్చేకంటే ముందే ఆమె కన్నుమూయడం విషాదం! రివ్యూయర్ ఉత్తర ప్రశాంత్, ఖమ్మం టెడ్డీ బేర్ సహా చాలామందిని నిర్మొహమాటంగా రిజెక్ట్ చేసి పంపించేశారు. 19 ఏళ్ల అబ్బాయికి అన్యాయం?19 ఏళ్ల అమ్మాయి శ్రేయను ఎంకరేజ్ చేసిన జడ్జిలు అదే వయసులో ఉన్న అబ్బాయి జనిత్ను మాత్రం ఎలిమినేట్ చేయడం గమనార్హం! ఒక ప్రమాదంలో తల్లికి 80% గాయాలయ్యానని, అయినా చదువుకుని ప్రభుత్వ ఉద్యోగం సాధించి కుటుంబాన్ని పోషించిందన్నాడు. తండ్రి చనిపోయినా అన్నీ తనే చూసుకుందన్నాడు. ఒకమ్మాయి విదేశాల్లో చదివించి, మరో అమ్మాయికి పెళ్లి చేసి, అతడిని చదివిస్తోంది అని తల్లి గొప్పదనం చెప్పాడు. అది విని జడ్జిలు లేచి చప్పట్లు కొట్టారు. తాను ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలనుకుంటున్నానన్నాడు. జీవితంపై క్లారిటీ ఉన్న ఇతడిని రిజెక్ట్ చేశారు.టాప్ 15 కోసం పోటీఫైనల్గా ఇప్పటివరకు టాప్ 15లో ఆరుగురిని సెలక్ట్ చేశారు. 16 మందిని హోల్డ్లో పెట్టారు. ఈ పదహారు మందికి రకరకాల టాస్కులు పెట్టి వారిలో 9 మందిని టాప్ 15లో చేర్చనున్నారు. మరి ఆ టాస్కులేంటి? ఎవరు సెలక్ట్ అవుతారన్నది రేపటి ఎపిసోడ్ రివ్యూలో చూద్దాం..చదవండి: శ్రీలీల సక్సెస్ వెనుక జూనియర్ ఎన్టీఆర్.. అప్పుడే డిసైడయ్యా! -
అగ్నిపరీక్ష: చిరాకు తెప్పించిన అతడు, బిందు, శ్రీముఖినే ఓడించిన ఆమె
బిగ్బాస్ అగ్నిపరీక్షలో 45 మంది రానున్నారు. వీరిలో ఫైనల్స్కు 15 మందిని సెలక్ట్ చేసి అందులో 5 లేదా 9 మందిని బిగ్బాస్ తొమ్మిదో సీజన్కు పంపించనున్నారు. ఈ ఎంపిక బాధ్యత బిందుమాధవి, నవదీప్, అభిజిత్లపై ఉంది. ఫస్ట్ ఎపిసోడ్లో ఎనిమిది మందిని టెస్ట్ చేశారు. మరి రెండో ఎపిసోడ్లో ఎవరెవరు వచ్చారు? జడ్జిలు ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో చూసేద్దాం..మాటల తుపానుమొదటగా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ డెమాన్ పవన్ స్టేజీపైకి వచ్చాడు. యాక్టింగ్ కోసమే బిగ్బాస్ (Bigg Boss 9 Telugu)కు రావాలనుకుంటున్నానన్న ఇతడు శరీరంపై రెండు టైర్లు పెట్టుకుని 25 పుషప్స్ చేశాడు. ఇతడికి ముగ్గురు జడ్జిలు గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు. దమ్ము శ్రీజ.. రాగానే ఓవర్ చేసింది. ఆమె నోటివాగుడుకు అందరూ బెంబేలిత్తిపోయారు. ఆమెను ఆపడం ఎవరితరం కాలేదు. నీ ఆడపులి టైటిల్ నేను లాగేసుకుంటానని బిందుమాధవితో సవాలు చేసింది. ఆమె మాటలు ఎవరికీ నచ్చలేదు. నవదీప్ ఒక్కడే తనకు గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు.పేడ రుద్దుకోమనగానే..తర్వాత తేజ సజ్జ మిరాయ్ ప్రమోషన్స్ జరిగాయి. తర్వాత వచ్చిన మోడల్ ఊర్మిళ చౌహాన్కు మాస్ టాస్కులిచ్చారు. పిడకలు చేయమనగానే చేసింది. చెంపలకు పేడ రుద్దుకోమనగానే బుగ్గలపై పూసుకుంది. ఈమెక్కూడా నవదీప్ ఒక్కడే గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు. చిదానందశాస్త్రి, గొంగలి కప్పుకుని వచ్చిన నర్సయ్య తాత, మిస్ ఇండియా మాధురిని జడ్జిలు ఎలిమినేట్ చేశారు. అడ్వొకేట్ నాగప్రశాంత్కు నవదీప్ మాత్రమే గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు.అబ్బాయిలే గ్రేట్19 ఏళ్ల శ్రేయకు ముగ్గురు జడ్జిలు గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చి టాప్ 15కి పంపించారు. అబ్బాయిలే గ్రేట్ అంటూ అమ్మాయిలను చులకన చేసిన రవి అనే కంటెస్టెంట్ను ఎలిమినేట్ చేశారు. ఆడవాళ్లు ప్రెగ్నెన్సీలో 30 నిమిషాలు పురిటినొప్పులు భరిస్తారు, అదొక్కటే గ్రేట్ అన్నట్లుగా మాట్లాడాడు. తొమ్మిది నెలల జర్నీ అతడి కళ్లకు కనిపించలేదా? అని అక్కడున్నవాళ్లు షాకయ్యారు. కోపంతో బిందుమాధవి అతడిని గెంటేసినంత పని చేసింది. సింగర్ శ్రీతేజ్కు ఒక ఛాన్సిద్దామంటూ అభిజిత్ గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు. తర్వాత ఎవరూ ఇంట్రస్టింగ్గా లేరంటూ దాదాపు ఏడుగురిని వెంటవెంటనే ఎలిమినేట్ చేశారు (Bigg Boss Agnipariksha).బిందు, శ్రీముఖిని ఓడించిన కల్కిఅనంతరం ఫోర్బ్స్ అండర్ 30లో నిలిచిన మర్యాద మనీష్ స్టేజీపైకి వచ్చాడు. ఇతడికి బిందు మినహా మిగతా ఇద్దరూ గ్రీన్ ఫ్లాగ్తో నెక్స్ట్ లెవల్కు పంపించారు. మిస్ తెలంగాణ రన్నరప్ కల్కి స్టేజీపైకి వచ్చి.. మా నాన్నకు ఆడపిల్లలంటే ఇష్టం లేరు. కానీ మా నాన్నకు ముగ్గురం ఆడపిల్లలమే అంటూ తన స్టోరీ చెప్పింది. హ్యాండ్ రెజ్లింగ్లో బిందు, శ్రీముఖిని ఓడించింది. ఈమెక్కూడా బిందుమినహా మిగతా ఇద్దరూ ఓ ఛాన్సిద్దామని గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు. అలా నేటి ఎపిసోడ్ ముగిసింది.చదవండి: ఎమోషనల్ స్టోరీ మామన్ మూవీ రివ్యూ -
పేడ రుద్దుకున్న కంటెస్టెంట్.. శ్రీముఖికి ఇచ్చిపడేసిందిగా!
బిగ్బాస్ షో (Bigg Boss Reality Show)లో అడుగుపెట్టాలన్నది చాలామంది ఆశ. ఎలాగైనా సరే బిగ్బాస్ టీమ్ కంట్లో పడాలని చిత్రవిచిత్ర పనులు చేసిన జనాలున్నారు. అందులో మల్టీస్టార్ మన్మద రాజా ఒకరు. ఏకంగా అన్నపూర్ణ స్టూడియో ముందు నిరాహార దీక్ష కూడా చేశాడు. ఇతడు అగ్నిపరీక్ష షోకి సెలక్ట్ అవగా.. ఫస్ట్ ఎపిసోడ్లో స్టేజీపై ఎంట్రీ ఇచ్చాడు.పేడ రుద్దుకోమని టాస్క్కానీ ఏడుపొక్కటే ఆయుధం అన్నట్లుగా కేవలం సింపతీ కోసమే ట్రై చేశాడు. ఇది చూసి జడ్జిలు ముగ్గురూ అతడిని రిజెక్ట్ చేశారు. బిగ్బాస్లో ఛాన్స్ కావాలంటూ సోషల్ మీడియాలో పిచ్చిపనులు చేసే వాళ్లందరికీ హౌస్లో ఎంట్రీ ఉండదని అతడి ఎలిమినేషన్తో క్లారిటీ ఇచ్చేశారు. ఇకపోతే తాజాగా సెకండ్ ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో పేడ రుద్దుకోమని చెప్పగానే ఓ లేడీ కంటెస్టెంట్ ఏమాత్రం ఆలోచించకుండా బుగ్గలపై పేడ పూసుకుంది. మరో లేడీ కంటెస్టెంట్ దమ్ము శ్రీజ స్టేజీపై కాస్త అతిగా ప్రవరిస్తూ జడ్జిలకు చిరాకు తెప్పించింది.శ్రీముఖికి కౌంటర్ఆమె అరుపులకు శ్రీముఖి స్పందిస్తూ.. ఇలా మొత్తుకుంటే పిల్ల ఏం అరుస్తుందని టీవీలు బంద్ చేస్తారని సరదాగా అంది. అలాగైతే సీజన్ 3లో నువ్వున్నప్పుడే టీవీలు ఆఫ్ చేసేవారని శ్రీజ కౌంటరిచ్చింది. ఆమెకు అభిజిత్ రెడ్ ఫ్లాగ్ ఇవ్వగానే.. ఓ, పవర్ఫుల్గా ఉండేవాళ్లను హ్యాండిల్ చేయలేక రెడ్ ఇచ్చారా? అని నిలదీసింది. మరో ప్రోమోలో గొంగలి కప్పుకుని వచ్చిన తాత నర్సయ్య తన పాటతో అదరగొట్టాడు. ఈ ఎపిసోడ్లో మిరాయ్ ప్రమోషన్స్ కూడా జరిగాయి. చదవండి: అగ్నిపరీక్ష: బిగ్బాస్ కోసం నిరాహార దీక్ష.. గెంటేసిన జడ్జిలు -
అగ్నిపరీక్ష: బిగ్బాస్ కోసం నిరాహార దీక్ష.. గెంటేసిన జడ్జిలు
బిగ్బాస్ 9వ సీజన్లో సామాన్యుల ఎంట్రీ ఉండబోతోంది. కానీ ఆ సామన్యులెవరన్నది తేల్చేందుకు అగ్నిపరీక్ష (Bigg Boss Agnipariksha) షో మొదలుపెట్టారు. ఇందులో 45 మంది పాల్గొననున్నారు. సామాన్యుల కలను నెరవేర్చడానికే ఈ అగ్నిపరీక్ష అంటూ తొలి ఎపిసోడ్ జియో హాట్స్టార్లో రిలీజ్ చేశారు. మరి ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేద్దాం..రెడ్ ఫ్లాగ్ ఇచ్చారంటే ఎలిమినేట్అగ్నిపరీక్ష స్టేజీపై వచ్చిన సామాన్యులకు బిగ్బాస్ షోలో ఉండే అర్హత ఉందా? లేదా? అన్నది జడ్జిలు నవదీప్, అభిజిత్, బిందుమాధవి తేల్చనున్నారు. ఏ కంటెస్టెంట్కైనా వీరు ముగ్గురూ రెడ్ ఫ్లాగ్ ఇచ్చారంటే మాత్రం అతడు/ఆమె నేరుగా ఎలిమినేట్ అయినట్లు లెక్క! మొదటగా విజయవాడ నుంచి దివ్య నిఖిత నైటీలో వచ్చింది. ఈమె ఎంబీబీఎస్ చదువుతోంది. ఒక సాయిపల్లవి, ఒక శ్రీలీల.. ఒక దివ్య నిఖితలా అందరికీ గుర్తుండిపోవాలన్నదే తన కోరిక అంది.డేర్ అండ్ డాషింగ్అభిజిత్ను నామినేట్ చేయమని టాస్క్ ఇవ్వగా.. ఒకే ఒక మైండ్ టాస్క్ ఆడి గెలిచావు. ఎప్పుడూ సోఫాలోనే కూర్చుంటూ గేమ్ కంటే కూడా వేరేవాళ్లమీదే ఫోకస్ పెట్టావు. నీ ఆట నాకు నచ్చలేదు. గేమ్పై ఫోకస్ లేని నిన్ను నామినేట్ చేస్తానంటూ ధైర్యంగా మాట్లాడింది. తర్వాత నాన్న గురించి చెప్తూ ఎమోషనలైంది. ఆమెకు ముగ్గురు జడ్జిలు గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు.మాస్క్ మ్యాన్ ఎంట్రీతర్వాత మాస్క్ మ్యాన్ ఎంట్రీ ఇచ్చాడు. ఏడేళ్లుగా మాస్క్ వేసుకునే తిరుగుతున్నట్లు చెప్పాడు. ఇతడి పేరు హృదయ్ మానవ్ అని తెలిపాడు. తిక్కగా మాట్లాడుతున్న అతడి వైఖరి నచ్చిక అభిజిత్ రెడ్ ఫ్లాగ్ ఇవ్వడంతో మానవ్ హర్టయ్యాడు. నన్ను చూడగానే జడ్జి చేస్తున్నారు.. బిగ్బాస్ కోసం ఈ మాస్క్ వేసుకోలేదన్నాడు. గత మూడు సీజన్ల నుంచి మంచి కంటెస్టెంట్లే రాలేదు, అందుకే నేనొచ్చానని తన గురించి తాను ఓవర్గా చెప్పుకున్నాడు. పెద్దావిడకు ఛాన్సిచ్చిన అభిజిత్దీంతో బిందుమాధవి.. మాస్క్ మ్యాన్కు లూజర్ అనే బోర్డు వేసింది. అయినా అతడు వెనక్కు తగ్గలేదు, జడ్జిలపై ఫైర్ అయ్యాడు. సరే, నీగురించి ఇంకాస్త తెలుసుకోవాలంటూ నవదీప్ ఒక్కడే.. అతడికి గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు. మూడో కంటెస్టెంట్గా.. ముసలి వయసులో ఉన్న కేతమ్మ వచ్చింది. తనకు ఛాన్సిద్దామని అభిజిత్ ఒక్కడే గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు. నాలుగో కంటెస్టెంట్గా ప్రియా శెట్టి వచ్చింది. ముఖంలోనే కాకుండా తన మాటల్లోనూ క్యూట్నెస్ ఉంది. ఆమెకు అభిజిత్ మినహా ఇద్దరు జడ్జిలు గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు. మల్టీ స్టార్ మన్మధ రాజాకు ఝలక్ఐదో కంటెస్టెంట్గా మల్టీ స్టార్ మన్మధ రాజా వచ్చాడు. బిగ్బాస్లో ఛాన్స్ కోసం నిరాహార దీక్ష చేశానన్నాడు. తనకు ఆస్తులు లేవు, అయినవారు లేరంటూ ఏడుస్తూ సింపతీ పొందే ప్రయత్నం చేశాడు. సింపతీకి చోటు లేదంటూ జడ్జిలు అతడిని బయటకు పంపించేశారు. ఆరో కంటెస్టెంట్గా సయ్యద్ అబూ వచ్చాడు. నవదీప్ ఒక్కడే గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు. ఏడో కంటెస్టెంట్గా దివ్యాంగుడు ప్రసన్నకుమార్ వచ్చాడు. ఒంటికాలుతోనే మారథాన్ చేసినట్లు తెలిపాడు. అతడి టాలెంట్కు అందరూ ఫిదా అయ్యారు. జడ్జిలు ముగ్గురూ గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు. గ్రీన్ ఫ్లాగ్ వచ్చిన కంటెస్టెంట్లు నెక్స్ట్ రౌండ్కు వెళ్తారు.చదవండి: వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్.. చిరుకు అల్లు అర్జున్ బర్త్డే విషెస్