breaking news
Technology
-
పాకిస్తాన్ దరిద్రం.. పాత ఫోన్లూ కొనలేక అవస్థలు
తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో దాయాది దేశం పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతోంది. అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. ఈ క్రమంలో అక్కడి పౌరులకు కొత్త స్మార్ట్ఫోన్ల సంగతి పక్కనపెడితే పాత (యూజ్డ్) ఫోన్లనూ కొనుక్కోవడమూ భారమైంది. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం.. యూజ్డ్ స్మార్ట్ఫోన్లపై విధించే వాల్యుయేషన్, సుంకాలను తగ్గించింది.ప్రస్తుత ధరల వద్ద కొత్త ఫోన్లు కొనుగోలు చేయడం సామాన్యులకు భారంగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. హై-ఎండ్ స్మార్ట్ఫోన్లు అయిన ఐఫోన్ 14, ఐఫోన్ 15 సిరీస్తో పాటు ఇతర వేరియంట్లకు కూడా కొత్త అంచనా విలువలను కస్టమ్స్ వాల్యుయేషన్ డిపార్ట్మెంట్ ఖరారు చేసింది.ప్రపంచవ్యాప్తంగా పాత స్మార్ట్ఫోన్ల ధరలు తగ్గుతున్న నేపథ్యంలో ఈ సవరణ అవసరమైందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. డాన్ పత్రిక నివేదిక ప్రకారం.. ఐఫోన్ వంటి మోడళ్లు వయస్సు పెరిగే కొద్దీ, వారి ప్రాథమిక రిటైల్ జీవితకాలం ముగింపునకు చేరుకునే సరికి సహజంగానే విలువ కోల్పోతాయి.మార్కెట్ రేట్లకు అనుగుణంగా విలువలను సర్దుబాటు చేయడం ద్వారా, ఉపయోగించిన స్మార్ట్ఫోన్లను పౌరులకు మరింత సరసమైన ధరలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ రీవ్యాల్యూయేషన్ చేపట్టారు. తాజా అప్డేట్లో నాలుగు ప్రముఖ బ్రాండ్లకు చెందిన 62 మోడళ్ల హ్యాండ్సెట్లు ఉన్నాయి.శాంసంగ్, గూగుల్ వంటి కంపెనీల మార్కెట్ డేటా, అధికారిక ట్రేడ్-ఇన్ ధరలను పరిశీలించిన తర్వాత కొత్త విలువలు నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం మొబైల్ ఫోన్లపై అమ్మకపు పన్ను, నిలిపివేత పన్ను, ప్రత్యేక సుంకాలు వంటి సంక్లిష్టమైన పన్ను విధానం అమల్లో ఉండగా, ఇవన్నీ ప్రభుత్వ నోటిఫై చేసిన వాల్యుయేషన్ ఆధారంగా లెక్కిస్తారు.2026 కోసం సవరించిన వ్యాల్యూయేషన్లు 2024తో పోలిస్తే యూజ్డ్ స్మార్ట్ఫోన్ల విలువల్లో భారీ తగ్గుదలని చూపుతున్నాయి. ముఖ్యంగా యూజ్డ్ ఐఫోన్ల ధరలు 32% నుంచి 81% వరకు తగ్గాయి. ఈ మార్పులతో పాకిస్తాన్లో పాత స్మార్ట్ఫోన్ల ధరలు తగ్గి, వినియోగదారులకు కొంతమేర ఉపశమనం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. -
ఐఫోన్ 18 వివరాలు లీక్.. ధర ఇంతేనా?
యాపిల్ కంపెనీ ప్రతి ఏటా ఓ కొత్త ఐఫోన్ మోడల్ లాంచ్ చేస్తూ ఉంది. గత ఏడాది ఐఫోన్ 17 పేరుతో స్మార్ట్ఫోన్ తీసుకొచ్చిన కంపెనీ.. ఇప్పుడు ఐఫోన్ 18 లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. అయితే సంస్థ ఈ ఫోన్ లాంచ్ చేయడానికి ముందే.. దీనికి సంబంధించిన కొన్ని వివరాలు లీక్ అయ్యాయి.యాపిల్ ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ రెండూ కూడా కొత్త ఫీచర్స్ పొందనున్నాయి. ప్రో & ప్రో మ్యాక్స్లలో 6.27 అంగుళాల 120Hz, 6.86 అంగుళాల 120Hz అలాగే ఉన్నాయి. ఐఫోన్ ప్రతి సంవత్సరం కొత్త చిప్ పొందుతుంది. ఇందులో భాగంగానే.. ఐఫోన్ 18 ప్రో కోసం A20 ప్రో చిప్ 2nm ప్రాసెస్ అందించనున్నారు.కెమెరా విషయానికి వస్తే.. ఒక వెనుక కెమెరాలో మెకానికల్ ఐరిస్ ఉండనుంది. ఐఫోన్ 18 ప్రో & ఐఫోన్ 18 ప్రో మాక్స్ సెప్టెంబర్ 2026లో లాంచ్ అవకాశం ఉంది. వీటి ధరలు వరుసగా రూ.1,34,900 & రూ.1,49,900గా ఉండవచ్చని సూచిస్తున్నాయి. అయితే స్టోరేజ్.. కాన్ఫిగరేషన్ అప్గ్రేడ్లను బట్టి ధరలు మారుతాయి. -
యూట్యూబ్ క్రియేటర్లకు గుడ్న్యూస్!
ఈ రోజుల్లో యూట్యూబ్ చాలామంది జీవితాల్లో ఒక భాగంగా మారింది. ముఖ్యంగా యూట్యూబ్ షార్ట్స్ లాంటి చిన్న వీడియోలు చాలా వేగంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి, ప్రాచుర్యం పొందుతున్నాయి. అయితే రోజూ కొత్త వీడియోలు చేయడం క్రియేటర్లకు కొంత కష్టంగా మారుతోంది. ఈ సమయంలో.. యూట్యూబ్ ఒక కొత్త ఆలోచనను తెరపైకి తెచ్చింది. అదే ఏఐ డిజిటల్ ట్విన్ (డిజిటల్ క్లోన్). యూట్యూబ్ సీఈవో నీల్ మోహన్ తన 206 వార్షిక లేఖలో ఈ ఫీచర్ గురించి వెల్లడించారు.ఏఐ డిజిటల్ ట్విన్ ద్వారా.. క్రియేటర్స్ ఏఐ జనరేటెడ్ వెర్షన్ కంటెంట్ క్రియేట్ చేయవచ్చు. తమలాగే కనిపించే ప్రతిరూపం సాయంతో షార్ట్స్, వీడియోలను క్రియేట్ చేసుకోవచ్చన్నమాట.ఈ ఫీచర్ ఎప్పుడు లాంచ్ అవుతుంది?, ఇదెలా పని చేస్తుంది? అనే విషయాలను కంపెనీ ప్రస్తుతానికి వెల్లడించలేదు. అయితే ఇది ఓపెన్ఏఐ సొర యాప్ మాదిరిగా ఫోటోరియలిస్టిక్ వెర్షన్లను సృష్టించడానికి ఎలా అనుమతిస్తుందో అదే విధంగా పనిచేస్తుందని భావిస్తున్నారు. కాగా దీనికి సంబంధించిన చాలా వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.యూట్యూబ్ షార్ట్స్ రోజుకు 200 బిలియన్ వ్యూవ్స్ పొందుతున్నాయి. ఈ సమయంలో దీనికోసం కొత్త ఫీచర్స్ కూడా సంస్థ సీఈఓ మోహన్ వెల్లడించారు. ఇందులో ఇమేజ్ పోస్ట్లను నేరుగా ఫీడ్లోకి జోడించవచ్చు. పిల్లలు & టీనేజర్లు షార్ట్స్ స్క్రోలింగ్ చేయడానికి ఎంత సమయం వెచ్చించాలనేది కూడా తల్లిదండ్రులకు కంట్రోల్ చేయవచ్చు. దీనికోసం కూడా ఒక ఫీచర్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ఇది అందుబాటులోకి వచ్చిన తరువాత పేరెంట్స్ టైమర్ సెట్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: కంపెనీ భవిష్యత్ మార్చిన కళ్లజోడు! -
డీప్ఫేక్కు చెక్ పెట్టే టెక్నాలజీ!
సోషల్ మీడియా ఎంత వేగంగా విస్తరిస్తోందో.. ఏఐ జనరేషన్, డీప్ఫేక్ వ్యాప్తి కూడా అంతే జోరుగా వ్యాప్తి చెందుతున్నాయి. వీటిని ఉపయోగింగి యూజర్ల అనుమతి లేకుండానే.. కొందరు తప్పుడు సమాచారం వ్యాప్తి చేసి, వారిని అపఖ్యాతిపాలు చేస్తున్నారు. ఇది ఎక్కువగా మహిళలపై ప్రభావం చూపుతోంది.ఏఐ జనరేషన్, డీప్ఫేక్ భారిన పడిన ప్రముఖుల జాబితాలో రష్మికా మందన, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, అనిల్ కపూర్, జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి మొదలైనవారు ఉన్నారు. చాలామంది ఈ విషయంపై న్యాయస్థానాలను ఆశ్రయించారు. అయినప్పటికీ.. మార్ఫింగ్ ఫోటోలు, ఇతర తప్పుడు సమాచారాలను ప్రచారం వంటివి ఇప్పటికీ ఎదో ఒక మూల బయటపడుతూనే ఉన్నాయి. ఈ సమస్యకు చరమగీతం పాడేందుకు ఓ ఇద్దరు కంప్యూటర్ ఇంజనీరింగ్ విద్యార్థులు కొత్త ఏఐ ఇంటర్ఫేస్ అభివృద్ధి చేశారు.ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంకు చెందిన ఫైనల్ ఇయర్ కంప్యూటర్ ఇంజనీరింగ్ విద్యార్థులైన ''జీ. వెంకట కార్తికేయ ఆర్యన్ & బి. లోకేష్'' ఎనిమిది నెలలు శ్రమించి అపరిక్స్ (APARYX) పేరుతో కొత్త ఏఐ ఇంటర్ఫేస్ అభివృద్ధి చేశారు. నష్టం జరగక ముందే అరికట్టడం మంచిది.. అనే సిద్ధాంతం ఆధారంగా దీనిని డెవలప్ చేశారు.అపరిక్స్ అనేది.. ఇతర వ్యవస్థల కంటే భిన్నంగా ఉంటుంది. అంతే కాకుండా.. కంటెంట్ అప్లోడ్ అవ్వడానికి ముందే దానిని పరిశీలిస్తుంది. సెల్ఫ్ అడాప్టివ్ ఏఐ ఇంజిన్, అడ్వాన్స్డ్ డీప్ఫేక్ డిటెక్షన్ మోడల్స్ ఉపయోగించి.. ప్రతి ఫైల్నూ చెక్ చేస్తుంది. కంటెంట్ను మూడు విధాలుగా (లెవెల్స్) విభజిస్తుంది.➤0 నుంచి 0.35 వరకు: అప్లోడ్ చేయడానికి అనుమతిస్తుంది➤0.35 నుంచి 0.75 వరకు: వార్నింగ్ ఇస్తుంది➤0.75 నుంచి 1 వరకు: అప్లోడ్ చేయడానికి అనుమతించదు / అప్లోడ్ బ్లాక్ చేస్తుందిడీప్ఫేక్, మార్ఫింగ్ వీడియోలు, ఏఐ క్రియేట్ న్యూడ్ కంటెంట్, లేదా అనుమతిని పొందని ఎక్స్ప్లిసిట్ మెటీరియల్ గుర్తించినప్పుడు అపరిక్స్ ఆటోమేటిక్గా అప్లోడ్ చేయడాన్ని బ్లాక్ చేస్తుంది. అయితే కొంత తక్కువ మార్పులు చేసి అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తే వార్నింగ్ ఇస్తుంది. ఆ వార్నింగ్ యాక్సెప్ట్ చేయకపోతే.. అప్లోడ్ చేయడానికి అనుమతించదు. కంటెంట్ హ్యాష్, టైమ్ స్టాంప్, ప్లాట్ఫామ్ యూస్డ్ వంటి వాటిని ఆడిట్ చేయడానికి ఇందులో శాండ్బాక్స్ ఉంటుంది. దీని ద్వారా డీప్ఫేక్ ఫోటోలను ఎవరు అప్లోడ్ చేసారనేది గుర్తించడానికి మాత్రమే కాకుండా.. వాటిని ఎన్నిసార్లు షేర్ చేసారు అనేది గుర్తించవచ్చు.అపరిక్స్ పేరును సంస్కృత పదమైన అపరిజిత నుంచి తీసుకున్నారు. దీని అర్థం అదృశ్య రక్షకుడు (కనిపించకుండా రక్షించేవాడు). పేరుకు తగిన విధంగా.. ఈ సిస్టం (అపరిక్స్) డీప్ఫేక్ వంటి వాటి నుంచి కాపాడుతుంది. దీనిని రూపొందించిన విద్యార్థులు ప్రస్తుతం పేటెంట్ కోసం అప్లై చేసుకున్నారు, పేటెంట్ పబ్లిష్ కూడా పూర్తయింది. అయితే ఇది ప్రస్తుతం టెక్నికల్ ఎగ్జామినేషన్స్లో ఉంది. -
హైదరాబాద్లో ఇప్పుడు హాట్ జాబ్స్ ఇవే..
హైదరాబాద్: దేశంలోని వృత్తి నిపుణులు నూతన ఏడాదిలో కొత్త అవకాశాల కోసం వేగంగా అడుగులు వేస్తున్నారు. లింక్డ్ఇన్ (LinkedIn) విడుదల చేసిన తాజా పరిశోధన ప్రకారం.. 2026 నాటికి 72 శాతం మంది ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్నట్లు వెల్లడైంది. అయితే, టెక్నాలజీ వేగంగా మారుతున్న నేపథ్యంలో అవసరమైన నైపుణ్యాలు (38%), పెరుగుతున్న పోటీ మధ్య తాము ఎలా నిలదొక్కుకోవాలో (37%) తెలియక మూడింట ఒక వంతుకు పైగా నిపుణులు ఆందోళన చెందుతున్నారు.ఈ అనిశ్చితిని అధిగమించేందుకు వృత్తి నిపుణులకు దిశానిర్దేశం చేయాలనే ఉద్దేశంతో, లింక్డ్ఇన్ తన ‘జాబ్స్ ఆన్ ది రైజ్ 2026’ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం.. హైదరాబాద్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఉద్యోగ పాత్రగా ‘ఏఐ ఇంజనీర్’ (AI Engineer) నిలిచింది. ఇది నగరం టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో బలమైన హబ్గా ఎదుగుతున్నదానికి నిదర్శనంగా నిలుస్తోంది.ఏఐ ఇంజనీర్ తరువాతి స్థానాల్లో మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ , సొల్యూషన్స్ అనలిస్ట్, వైస్ ప్రెసిడెంట్ – బిజినెస్ స్ట్రాటజీ, హ్యూమన్ రిసోర్సెస్ రిప్రజెంటేటివ్ వంటి ఉద్యోగ పాత్రలు చోటు దక్కించుకున్నాయి. ఇది హైదరాబాద్ జాబ్ మార్కెట్లో మార్కెటింగ్, బిజినెస్ స్ట్రాటజీ, పీపుల్ ఫంక్షన్స్తో పాటు ప్రత్యేక ప్రొఫెషనల్ రోల్స్లో కూడా వేగంగా వృద్ధి జరుగుతోందని సూచిస్తోంది.ఏఐపై ఆసక్తి ఉన్నా..లింక్డ్ఇన్ అధ్యయనం ప్రకారం.. భారతదేశంలోని 94 శాతం మంది నిపుణులు ఉద్యోగ వేటలో ఏఐని ఉపయోగించడానికి సౌకర్యంగా ఉన్నారు. అయితే, నియామక ప్రక్రియలో ఏఐ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, తమను తాము ఎలా ప్రత్యేకంగా నిలబెట్టుకోవాలో 48 శాతం మందికి స్పష్టత లేకుండాపోతోంది. అంతేకాదు, రిక్రూటర్ల దృష్టిని ఆకర్షించడంలో ఏఐ ఒక అడ్డంకిగా మారవచ్చని 54 శాతం మంది అభిప్రాయపడ్డారు.అయితే, ఈ ఆందోళనల మధ్య కూడా రిక్రూటర్–అభ్యర్థి మధ్య కమ్యూనికేషన్ను మెరుగుపరచడంలో, సమాచారం లోపాలను తగ్గించడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని 65 శాతం మంది నమ్ముతున్నారు.జాబ్ సెర్చ్ను ఈజీ చేస్తున్న లింక్డ్ఇన్ ఏఐ టూల్స్ఉద్యోగార్థుల అవసరాలకు అనుగుణంగా లింక్డ్ఇన్ పలు ఏఐ ఆధారిత టూల్స్ను అందిస్తోంది. అందులో ముఖ్యమైనది ‘ఏఐ-పవర్డ్ జాబ్ సెర్చ్’. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ మాటల్లోనే ఉద్యోగాలను వెతకగలుగుతున్నారు. అంతేకాదు, వారు ఎప్పుడూ ఊహించని కొత్త ఉద్యోగ అవకాశాలను కూడా ఇది పరిచయం చేస్తోంది.ప్రస్తుతం ఈ టూల్ ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, పోర్చుగీస్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది. ఇప్పటికే రోజూ 13 లక్షల మందికి పైగా దీనిని ఉపయోగిస్తుండగా, వారానికి 2.5 కోట్లకుపైగా జాబ్ సెర్చ్లు ఈ ఫీచర్ ద్వారా జరుగుతున్నట్లు లింక్డ్ఇన్ వెల్లడించింది.అదేవిధంగా ‘జాబ్ మ్యాచ్’ ఫీచర్ ద్వారా తమ నైపుణ్యాలు, అర్హతలకు ఏ ఉద్యోగాలు సరిపోతాయో తెలుసుకొని, ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్న పాత్రలకే దరఖాస్తు చేసుకునే అవకాశం కలుగుతోంది.హైదరాబాద్లో టాప్ 10 ఉద్యోగాలు1. ఏఐ ఇంజనీర్ 2. మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ 3. సొల్యూషన్స్ అనలిస్ట్ 4. వైస్ ప్రెసిడెంట్ – బిజినెస్ స్ట్రాటజీ 5. హ్యూమన్ రిసోర్సెస్ రిప్రజెంటేటివ్ 6. మర్చండైజర్7. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అనలిస్ట్ 8. ఫైనాన్స్ స్పెషలిస్ట్9. ప్రొక్యూర్మెంట్ స్పెషలిస్ట్10. సర్వీస్ డెలివరీ మేనేజర్ -
టీసీఎస్, ఇన్ఫోసిస్.. తిరుగులేని బ్రాండ్లు
భారత ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్ అంతర్జాతీయంగా అత్యంత విలువైన బ్రాండ్లుగా తమ ఆధిపత్యాన్ని కాపాడుకున్నాయి. బ్రాండ్ ఫైనాన్స్ తాజా నివేదిక ‘ఐటీ సర్వీసెస్ 25 (2026)’ నివేదికలో టీసీఎస్ అంతర్జాతీయంగా రెండో స్థానంలో నిలవగా, ఇన్ఫోసిస్ మూడో స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా టాప్–25 విలువైన ఐటీ బ్రాండ్లు ఇందులో చోటుచేసుకున్నాయి.అమెరికా, భారత్ చెరో ఎనిమిది ర్యాంకులతో ముందున్నాయి. యాక్సెంచర్ 42.3 బిలియన్ డాలర్లతో ప్రపంచంలో అత్యంత విలువైన ఐటీ సంస్థగా మొదటి స్థానంలో నిలిచింది. యాక్సెంచర్ మొదటి స్థానంలో నిలవడం ఇది వరుసగా ఎనిమిదో ఏడాది. టీసీఎస్ వరుసగా ఐదో ఏడాది ఈ జాబితాలో రెండో స్థానాన్ని కాపాడుకుంది. టీసీఎస్ విలువను 21.2 బిలియన్ డాలర్లుగా బ్రాండ్ ఫైనాన్స్ అంచనా వేసింది.ఇక 16.4 బిలియన్ డాలర్లతో మూడో అత్యంత విలువైన బ్రాండ్గా ఇన్ఫోసిస్ నిలిచింది. గత ఆరేళ్లుగా మూడో స్థానంలో ఉంటూ వస్తున్న ఇన్ఫోసిస్ విలువ ఏటా 15 శాతం చొప్పున పెరగడం గమనార్హం. హెచ్సీఎల్ టెక్, విప్రో టాప్–10లో చోటు దక్కించుకోగా.. టెక్ మహీంద్రా 12వ స్థానంలో ఉంది. అలాగే, ఎల్టీఐ మైండ్ట్రీ, పర్సిస్టెంట్ సిస్టమ్స్, హెక్సావేర్ టెక్నాలజీస్ సైతం ఈ జాబితాలో భారత్ నుంచి విలువైన బ్రాండ్లుగా నిలిచాయి. -
ఐటీకి కొత్త బూమ్ ఖాయం: విప్రో సీఈవో
ఐటీ సేవల పరిశ్రమ భవిష్యత్తుపై విప్రో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీని పల్లియా గట్టి ఆశావాదాన్ని వ్యక్తం చేశారు. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) సమావేశంలో మాట్లాడిన ఆయన, రాబోయే సంవత్సరాల్లో ఐటీ రంగం గణనీయమైన మార్పును ఎదుర్కోనుందని చెప్పారు.పల్లియా ప్రకారం.. 2025 సంవత్సరం ప్రయోగాలు, చిన్న స్థాయి ట్రయల్స్కు పరిమితమైతే, 2026 పూర్తి స్థాయి అమలు, జవాబుదారీతనానికి కేంద్రబిందువుగా మారనుంది. ఇప్పటికే సంస్థలు ఏఐ (AI) టెక్నాలజీని కేవలం పరీక్షించే దశను దాటేశాయని, చిన్న ప్రూఫ్-ఆఫ్-కాన్సెప్ట్ (PoC) ప్రాజెక్టుల నుంచి పెద్ద ఎంటర్ప్రైజ్-వైడ్ అమలు వైపు వేగంగా కదులుతున్నాయని ఆయన తెలిపారు.ఈ మార్పు భారతీయ సాఫ్ట్వేర్ ఎగుమతిదారులకు బలమైన కొత్త అవకాశాలను తెస్తోందని పల్లియా చెప్పారు. మెగా డీల్స్తో పాటు ప్రత్యేకమైన, చిన్న ఏఐ ప్రాజెక్టుల కోసం కూడా పోటీ పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.ఏఐ ఐటీ రంగ ఆర్థిక వ్యవస్థనే మార్చేస్తోందని ఆయన అంగీకరించారు. ఏఐ-సహాయక సాఫ్ట్వేర్ అభివృద్ధి వల్ల కోడింగ్, టెస్టింగ్ ఖర్చులు సుమారు 25 శాతం వరకు తగ్గుతాయని అంచనా వేశారు. దీని వల్ల ధరలపై ఒత్తిడి ఏర్పడినప్పటికీ, ఆ పొదుపును మరిన్ని డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్టులకు వినియోగిస్తారని ఆయన తెలిపారు.గత కొన్నేళ్లుగా ప్రపంచ ఆర్థిక అనిశ్చితి కారణంగా టెక్నాలజీ వ్యయాలు తగ్గినప్పటికీ, ప్రస్తుత ఏఐ ధోరణి ఐటీ పరిశ్రమకు స్థిరత్వాన్ని తీసుకువస్తుందని విప్రో భావిస్తోంది.ఇదీ చదవండి: ఉద్యోగులకు రూ.37 కోట్లు.. ఓ సీఈవో మంచి మనసు -
సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు శ్రీధర్ వెంబు సూచన
సాఫ్ట్వేర్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవం కొనసాగుతోంది. ముఖ్యంగా ‘కర్సర్’ (Cursor) వంటి ఏఐ సాధనాల ద్వారా కేవలం ప్రాంప్ట్లు ఇస్తూ వందల సంఖ్యలో కోడ్ లైన్లను రాయడాన్ని డెవలపర్లు అలవాటు చేసుకుంటున్నారు. దీనినే ‘వైబ్ కోడింగ్’ అని పిలుస్తున్నారు. అయితే, ఈ ధోరణిపై జోహో అధినేత శ్రీధర్ వెంబు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వైబ్ కోడింగ్కు ప్రత్యామ్నాయంగా ఏసీఈ(AI-Assisted Code Engineering) అనే కొత్త విధానాన్ని ఆయన తెరపైకి తెచ్చారు.ఏంటి వైబ్ కోడింగ్?ఓపెన్ఏఐ సహ వ్యవస్థాపకులు ఆండ్రెజ్ కార్పతి ఇటీవల వైబ్ కోడింగ్ అనే పదాన్ని ఎక్కువగా వాడుతున్నారు. డెవలపర్లు లోతైన ప్రోగ్రామింగ్ పరిజ్ఞానం లేకపోయినా కేవలం సహజ లాంగ్వేజీ ప్రాంప్ట్ల ద్వారా (Natural Language Prompts) ఏఐ అసిస్టెంట్లను ఉపయోగించి సాఫ్ట్వేర్ నిర్మించే ప్రక్రియను ఇది సూచిస్తుంది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ఇది భవిష్యత్తు అని అంగీకరించినప్పటికీ శ్రీధర్ వెంబు మాత్రం దీనివల్ల జరిగే నష్టాలను హెచ్చరించారు.‘ఏసీఈ’ ఎందుకు ముఖ్యం?శ్రీధర్ వెంబు అభిప్రాయం ప్రకారం, కేవలం ఏఐ ఇచ్చే ఫలితాలపై ఆధారపడటం వల్ల కంప్యూటర్ సైన్స్లోని మౌలిక అంశాలైన ఆప్టిమైజేషన్, అబ్స్ట్రాక్షన్, కంపైలేషన్ వంటి క్లిష్టమైన దశలను డెవలపర్లు విస్మరించే ప్రమాదం ఉంది.అసిస్టెడ్ కోడ్ ఇంజినీరింగ్ ప్రత్యేకతలుక్రమశిక్షణ కలిగిన ఇంజినీరింగ్గా దీనికి గుర్తింపు ఉంది. ఏసీఈ అనేది కేవలం కోడ్ రాయడం మాత్రమే కాదు, సాఫ్ట్వేర్ సాధనాలు, కోడింగ్ పద్ధతులపై అవగాహన పెంపొందించేలా ఉపయోగపడుతుంది. ఇందులోని ఏఐ మీకు సహాయం చేస్తుంది. అదేసమయంలో నిత్యం మీ నైపుణ్యాన్ని పెంచుకుంటూనే ఉండాలి. వైబ్ కోడింగ్ వల్ల భవిష్యత్తులో ఉద్యోగ కోతలకు అవకాశం ఉంటుందని చర్చ జరుగుతుండగా, ఏసీఈ విధానం అనుభవజ్ఞులైన ఇంజినీర్లను అందిస్తుందని వెంబు స్పష్టం చేశారు.టెక్ పరిశ్రమ ఇప్పటికే లేఆఫ్స్ ఎదుర్కొంటున్న తరుణంలో శ్రీధర్ వెంబు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సాఫ్ట్వేర్ ఇంజినీర్లు కేవలం ‘వైబ్’ మీద ఆధారపడకుండా క్రమశిక్షణతో కూడిన ఏఐ అసిస్టెడ్ కోడింగ్ను అలవాటు చేసుకోవాలని ఆయన సూచిస్తున్నారు.ఇదీ చదవండి: ‘చీఫ్ ఆఫ్ ఫ్లైట్ సేఫ్టీ’ నియామకం తప్పనిసరి -
ఐటీ రంగంలో పుంజుకుంటున్న ‘డిస్క్రెషనరీ’ ఖర్చులు
సుదీర్ఘ కాలం పాటు మందగమనంలో ఉన్న ఐటీ రంగంలో డిస్క్రెషనరీ టెక్నాలజీ ఖర్చులు (ఐచ్చికంగా ఆలోచించి అవసరాలకు మాత్రమే చేసే ఖర్చు) మళ్లీ పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే, గ్లోబల్ టెక్ కంపెనీలు ఇప్పటికీ ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. కొత్త ప్రాజెక్టుల కోసం అదనపు నిధులను వెచ్చించే కంటే అంతర్గత వ్యయాలను తగ్గించుకోవడం ద్వారా నిధులను మళ్లించడంపైనే సంస్థలు మొగ్గు చూపుతున్నాయి.అంతర్గత పొదుపుతోనే కొత్త ప్రాజెక్టులుఎవరెస్ట్ గ్రూప్ సీఈఓ జిమిత్ అరోరా విశ్లేషణ ప్రకారం, ప్రతి రంగంలోని క్లయింట్లు తాము పూర్తిస్థాయి టెక్నాలజీ కంపెనీలుగా మారాలనే బలమైన ఆకాంక్షతో ఉన్నారు. అయితే, టెక్నాలజీ బడ్జెట్ల వృద్ధి కేవలం తక్కువగానే (లో-టు-మిడ్ సింగిల్ డిజిట్) ఉండే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కనిపిస్తున్న పునరుద్ధరణ కొత్త పెట్టుబడుల ద్వారా కాకుండా రోజువారీ కార్యకలాపాల (బిజినెస్ యాజ్ యూజువల్ - BAU) ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా జరుగుతోంది. ఖర్చులను కుదించి ఆ నిధులను అత్యాధునిక సాంకేతికత వైపు మళ్లించడంపైనే కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి.ఏఐ డీల్స్తో జోష్ఇన్ఫోసిస్ ఎండీ, సీఈఓ సలిల్ పరేఖ్ క్యూ3 ఫలితాల సందర్భంగా కీలక విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎనర్జీ, యుటిలిటీస్ రంగాల్లో డిస్క్రెషనరీ ఖర్చులు పెరుగుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత డీల్స్పై క్లయింట్లు ఆసక్తి చూపడం ఐటీ రంగానికి కలిసొస్తోందని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గింపు సంకేతాలు, స్థిరమైన డిమాండ్ వల్ల రాబోయే ఆర్థిక సంవత్సరంపై ఆశలు పెరుగుతున్నాయి.అప్రమత్తత అవసరం..పరిస్థితి మెరుగుపడుతున్నా అప్రమత్తత అవసరమని మార్కెట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. వేతనాల పెరుగుదల వంటి చట్టబద్ధమైన ఖర్చుల వల్ల మార్జిన్లపై ఒత్తిడి ఉండొచ్చని, అందుకే సంస్థలు నియంత్రణాత్మక వ్యయాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కంపెనీల ఆర్థిక పరిస్థితులు కుదుటపడిన తర్వాతే పూర్తిస్థాయిలో డిస్క్రెషనరీ ఖర్చులు ఊపందుకుంటాయని చెబుతున్నారు.ఇదీ చదవండి: సహజ వజ్రాలకే ‘డైమండ్’ గుర్తింపు -
ఒప్పో రెనో15 సిరీస్ ఫోన్లు: ధరలు ఇలా..
స్మార్ట్ఫోన్స్ దిగ్గజం ఒప్పో ఇండియా తాజాగా ప్రీమియం రెనో15 సిరీస్ ఫోన్లను ప్రవేశపెట్టింది. రెనో15 ప్రో మినీ, ప్రో, రెనో 15 పేరిట మూడు వేరియంట్లలో ఇవి లభిస్తాయి. ట్రావెల్ ఫొటోగ్రఫీకి మరింత ఉపయోగకరంగా ఉండేలా ప్రో, ప్రో మినీల్లో 20 ఎంపీ కెమెరా, ప్యూర్టోన్ ఇమేజింగ్ టెక్నాలజీ, ఏఐఎడిటింగ్ టూల్స్ మొదలైన ఫీచర్స్ ఉంటాయి.పరిశ్రమలోనే తొలిసారిగా హోలోఫ్యూజన్ టెక్నాలజీని ప్రవేశపెడుతున్నట్లు సంస్థ తెలిపింది. వేరియంట్ని బట్టి ధర రూ. 45,999 నుంచి ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా ఒప్పో ప్యాడ్5 (రేటు రూ. 26,999 నుంచి ప్రారంభం), ఎన్కో బడ్స్3 ప్రో+ని (ధర రూ. 2,499) కూడా కంపెనీ ఆవిష్కరించింది. -
‘మొబైల్ విడిభాగాలపై సుంకాల్లో కోత పెట్టాలి’
మొబైల్ ఫోన్ విడిభాగాలైన మైక్రోఫోన్లు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు, వేరబుల్స్పై దిగుమతి సుంకాలు తగ్గించాలంటూ పరిశ్రమ ప్రభుత్వాన్ని కోరింది. బడ్జెట్లో ఈ మేరకు చర్యలు ప్రకటించాలని డిమాండ్ చేసింది. అలాగే, దేశీయంగా మొబైల్ ఫోన్ల తయారీ వ్యయాన్ని తగ్గించేందుకు గాను క్యాపిటల్ గూడ్స్, ఇతర విడిభాగాలపై టారిఫ్లను సవరించాలని ఇండియా సెల్యులర్ అండ్ ఎల్రక్టానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. లేదంటే ఇటీవల చైనా విధించిన నియంత్రణ చర్యలు దేశీ మొబైల్ ఫోన్ల తయారీకి ముప్పుగా మారతాయని పేర్కొంది.ఐసీఈఏలో యాపిల్, ఫాక్స్కాన్, డిక్సన్, షావోమీ, వివో, ఒప్పో తదితర సంస్థలు సభ్యులుగా ఉన్నాయి. ‘తయారీ మెషినరీ ఎగుమతులపై చైనా ఇటీవల విధించిన ఆంక్షలు సరఫరా పరమైన సమస్యలను పెంచుతాయి. దిగుమతి పరికరాలపై భారత్ ఆధారపడి ఉండడం వ్యూహాత్మక బలహీనతగా మారింది. కనుక అన్ని రకాల విడిభాగాలు, సబ్ అసెంబ్లీలు, అసెంబ్లీల దిగుమతులపై జీరో సుంకం ప్రయోజనాన్ని వర్తింపజేయాలి’ అని ఐసీఈఏ సూచించింది. దీని ఫలితంగా స్వావలంబన పెరుగుతుందని, అంతర్జాతీయంగా భారత్ పోటీతత్వం ఇనుమడిస్తుందని అభిప్రాయపడింది. రూ.6.76 లక్షల కోట్లకు ఉత్పత్తి..దేశీ ఎల్రక్టానిక్స్ పరిశ్రమ 25 లక్షల మందికి ఉపాధి కలి్పస్తుండడం గమనార్హం. దేశీయంగా మొబైల్ ఫోన్ల తయారీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 75 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఐసీఈఏ అంచనా. ఇందులో 30 బిలియన్ డాలర్లు మేర ఎగుమతులు ఉంటాయని పేర్కొంది. 2024–25లో రూ.5.5 లక్షల కోట్ల మొబైల్ ఫోన్ల తయారీ నమోదు కాగా, ఇందులో ఎగుమతులు రూ.2 లక్షల కోట్లుగా ఉన్నాయి. కొన్ని రకాల సంక్లిష్టమైన, ప్రత్యేకమైన మెషినరీ అవసరం మొబైల్ ఫోన్లు, లిథియం అయాన్ సెల్ తయారీకి అవసరమని పేర్కొంటూ.. అయినప్పటికీ ఇవి కస్టమ్స్ డ్యూటీ మినహాయింపులకు దూరంగా ఉన్నట్టు ప్రభుత్వం దృష్టికి పరిశ్రమ తీసుకెళ్లింది. ఈ మెషినరీ దేశీయంగా తయారు కావడం లేదని, దిగుమతుల కోసం పెద్ద మొత్తంలో సుంకాలు చెల్లించాల్సి వస్తున్నట్టు.. ఫలితంగా మూలధన వ్యయాలు 7.5–20 శాతం మధ్య అధికంగా వెచ్చించాల్సి వస్తున్నట్టు వివరించింది.ఇదీ చదవండి: ట్రంప్ 2.0.. ఏడాదిలో వచ్చిన ఆర్థిక మార్పులు -
ఐఫోన్ అయితే వాడినా ఓకే
దేశీయంగా కొత్త డివైజ్ల రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో సెకండ్హ్యాండ్ స్మార్ట్ఫోన్లకు డిమాండ్ నెలకొంది. దీంతో రీఫర్బిష్డ్ ఫోన్ల మార్కెట్ గణనీయంగా విస్తరిస్తోంది. కౌంటర్పాయింట్ రీసెర్చ్ ప్రకారం 2025లో 7–8 శాతం మేర వృద్ధి చెందిన సెకండరీ మార్కెట్ ఈ ఏడాది కూడా అదే జోరు కనబర్చవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలు మెరుగుపడుతుండటం, ఆన్లైన్–ఆఫ్లైన్ మాధ్యమాల ద్వారా నేరుగా కస్టమర్లకు మరింత అందుబాటు స్థాయిలో లభిస్తుండటంలాంటి అంశాలు రీఫర్బిష్డ్ ఫోన్ల విక్రయాలు పెరిగేందుకు దోహదపడగలవని పేర్కొన్నారు. కొత్త వ్యూహాలు.. థర్డ్ పార్టీలు రీఫర్బిష్ చేసి, అమ్మే డివైజ్లలో నాణ్యత సరిగ్గా లేకపోవడం, రిటర్నులు ఎక్కువగా వస్తుండటంతో అమెజాన్, ఫ్లిప్కార్ట్లాంటి దిగ్గజాలు గతేడాది ఈ విభాగం నుంచి తప్పుకున్నప్పుడు కొంతకాలం అమ్మకాలు నెమ్మదించినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సదరు ప్లాట్ఫాంలపై ఆధారపడిన విక్రేతల వ్యాపారం తాత్కాలికంగా దెబ్బతిందని వివరించాయి. దీనితో నేరుగా వినియోగదారులను చేరుకునే వ్యూహాలకు క్యాషిఫై, కంట్రోల్జెడ్లాంటి సంస్థలు పదును పెట్టాయి. ఆన్లైన్ ప్లాట్ఫాంలను, ఆఫ్లైన్ రిటైల్ నెట్వర్క్లను విస్తరించాయి. ప్రభావం ఇంకా తెలియడం లేదు.. చాలామటుకు బ్రాండ్స్ దగ్గర 60–90 రోజుల వరకు సరిపడేంత నిల్వలు ఉండటం వల్ల రేట్ల పెంపు ప్రభావం పూర్తి స్థాయిలో ఇంకా తెలియడం లేదు. కొత్త డివైజ్ల రేట్లు 15–20 శాతం పెరిగాయంటే చాలు, కోవిడ్ కాలంలోలాగా రీఫర్బిష్డ్ ఫోన్లకు డిమాండ్ భారీగా పెరుగుతుందని పరిశ్రమవర్గాలు తెలిపాయి. అప్పట్లో సరఫరాపరమైన సవాళ్ల వల్ల కొత్త ఫోన్లకు కొరత ఏర్పడి, కొనుగోలుదార్లు సెకండ్హ్యాండ్ డివైజ్ల వైపు మళ్లాల్సి వచి్చంది. ప్రస్తుతం కూడా మెమరీ, చిప్ల వ్యయాలు పెరిగి కొత్త డివైజ్ల రేట్లు గణనీయంగా పెరుగుతున్నాయని క్యాషిఫై వర్గాలు వివరించాయి. ఎంట్రీ లెవెల్ షాక్.. అత్యధిక మార్కెట్ వాటా ఉండే ఎంట్రీ లెవెల్ స్మార్ట్ఫోన్ల విభాగంలో రేట్ల పెంపు షాక్ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రూ. 10,000గా ఉన్న హ్యాండ్సెట్స్ రేటు వచ్చే ఆరు నెలల్లో దాదాపు 50 శాతం పెరిగి రూ. 15,000కు చేరొచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇదే అతి పెద్ద సెగ్మెంట్ కావడంతో తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని, దీనితో కస్టమర్లు రీఫర్బిష్డ్ డివైజ్ల వైపు డిమాండ్ మళ్లొచ్చని ఆశిస్తున్నట్లు వివరించాయి. అయితే, రేట్లు పెరగడమనేది మరో ప్రతికూల పరిణామానికి కూడా దారి తీయొచ్చని భావిస్తున్నారు. యూజర్లు తమ పాత డివైజ్లను మరింత కాలం అట్టే పెట్టుకునేందుకు ప్రాధాన్యతనివ్వొచ్చని, ఫలితంగా మార్కెట్లో సరఫరా తగ్గొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏటా అమ్ముడయ్యే ఫోన్లలో దాదాపు 50 శాతం డివైజ్లు రీఫర్బిష్డ్ లేదా ఎక్సే్చంజ్ మార్కెట్లోకి రావడానికి అనువైనవిగానే ఉంటున్నాయి. కానీ ఇందులో సగం మాత్రమే మార్కెట్లోకి వస్తున్నాయి. మిగతా వాటిని యూజర్లు నిరుపయోగంగా డ్రాలలో పడేయడమో లేక తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఇవ్వడమో చేస్తున్నారు. ఈ–వ్యర్థాలు, పాత డివైజ్ల విక్రయ విలువ గురించి అవగాహన లేకపోవడమే ఇందుకు కారణంగా ఉంటోంది. ఐఫోన్లే కావాలి.. రీఫర్బిష్ చేసిన యాపిల్ ఐఫోన్లకు భారీగా డిమాండ్ నెలకొంది. వాటి లభ్యత కూడా పెరుగుతోంది. దీనితో 2019లో సుమారు 2 శాతంగా ఉన్న ఐఫోన్ల మార్కెట్ వాటా ఇప్పుడు 9 శాతానికి చేరుకుంది. రీఫర్బిష్డ్ సంస్థల మొత్తం అమ్మకాల్లో వీటి వాటా దాదాపు 60 శాతంగా ఉంటోందని పరిశ్రమ అంచనా. లేటెస్ట్ డివైజ్ల ప్రారంభ ధర ఎక్కువగా ఉండటంతో, యాపిల్ డివైజ్లను మొదటిసారిగా వాడే వారు, వేరే బ్రాండ్స్ బదులుగా దాదాపు అదే రేటుకో అంతకన్నా కాస్త తక్కువ రేటుకో లభించే పాత ఐఫోన్లనే తీసుకోవడంవైపు మొగ్గుచూపుతున్నారు. యాపిల్లో ఎంట్రీ లెవెల్ మోడల్ లేకపోవడంతో ఈ ధోరణి కొనసాగవచ్చని భావిస్తున్నారు. ఆండ్రాయిడ్లో ఏడాది, రెండేళ్ల పాత ఫోన్లతో పోలిస్తే నాలుగైదేళ్లు పాతబడ్డ యాపిల్ ఫోన్లకు కూడా డిమాండ్ బాగా ఉంటోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. – సాక్షి బిజినెస్ డెస్క్ -
డిజిటల్ భారత్ ముంగిట కొత్త విప్లవం
ప్రపంచవ్యాప్తంగా జనరేటివ్ ఏఐ ప్రభంజనం కొనసాగుతున్న వేళ, భారతదేశం తనకంటూ ఒక ప్రత్యేకమైన ఏఐ వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటోంది. కేవలం అగ్రరాజ్యాల నమూనాలను అనుకరించకుండా మన దేశ అవసరాలకు తగ్గట్టుగా ‘స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్’(SLM) అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రాబోయే కేంద్ర బడ్జెట్ 2026లో ఈ స్వదేశీ ఏఐ నమూనాల పట్ల కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.ఎల్ఎల్ఎం Vs ఎస్ఎల్ఎం.. భారత్కు ఏది ముఖ్యం?గత కొన్ని ఏళ్లుగా గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు బిలియన్ల కొద్దీ పారామీటర్లతో కూడిన లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLMs)ను అభివృద్ధి చేశాయి. ఇవి శక్తివంతమైనవి అయినప్పటికీ వీటి నిర్వహణకు భారీ ఖర్చు, అపారమైన కంప్యూటింగ్ శక్తి అవసరం. భారతదేశం వంటి వైవిధ్యభరితమైన దేశంలో ప్రతి పౌరుడికి ఏఐ సేవలు అందాలంటే ‘స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ (SLMs)’ సరైన వ్యూహమని నిపుణులు భావిస్తున్నారు.ఇవి అతి తక్కువ కంప్యూటింగ్ శక్తితో పని చేస్తాయి. ప్రాంతీయ భాషలు, మాండలికాలపై ప్రత్యేక శిక్షణ పొందుతాయి. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య వంటి రంగాలకు ప్రత్యేకంగా వీటిని రూపొందించవచ్చు.భాషా వైవిధ్యానికి ఏఐ అండదేశంలో వందల సంఖ్యలో భాషలు, మాండలికాలు ఉన్నాయి. గ్లోబల్ ఏఐ మోడల్స్ స్థానికంగా ఉన్న అన్ని భాషల్లో ప్రావీణ్యం సాధించాలంటే కష్టం. ఈ లోటును పూడ్చడానికి ‘సర్వం 1’ (Sarvam 1) వంటి మోడల్స్ ఇప్పటికే పునాది వేశాయి. ఇది 10 భారతీయ భాషలకు మద్దతు ఇచ్చే 2 బిలియన్ పారామీటర్ మోడల్. ప్రభుత్వం చేపట్టిన ‘భారత్ జెన్’ (BharatGen) వంటి కార్యక్రమాలు స్వదేశీ ఏఐ అభివృద్ధిలో వేగం పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అన్ని స్థాయుల్లోని వారి అవసరాలకు అనుగుణంగా ఏఐ నమూనాలను నిర్మించడం కీలకం.బడ్జెట్ 2026లో ఆశించేవి..2026 బడ్జెట్లో ఇండియా ఏఐ మిషన్ (IndiaAI Mission) విస్తరణకు పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి సారించనున్నారు.1. క్లౌడ్ ప్రొవైడర్ల ద్వారా స్టార్టప్లకు, చిన్న సంస్థలకు ఏఐ కంప్యూట్ మౌలిక సదుపాయాలను తక్కువ ధరకే అందుబాటులోకి తేవడం.2. వ్యవసాయం, గ్రామీణ పాలన, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో ప్రాంతీయ లాంగ్వేజ్ డేటా సేకరణకు ప్రత్యేక నిధులు.3. ఏఐ ఇంజినీర్లు, డేటా సైంటిస్టులను తయారు చేయడానికి విద్యా సంస్థలకు ప్రోత్సాహకాలు.దేశంలో 85.5 శాతం కుటుంబాల వద్ద స్మార్ట్ఫోన్లు, 86.3 శాతం ఇంటర్నెట్ సదుపాయం ఉన్న తరుణంలో స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ విప్లవం ఉత్పాదకతను పెంచడమే కాకుండా సామాన్యుడికి డిజిటల్ సేవలను చేరువ చేస్తుంది. స్వదేశీ ఏఐ ద్వారా భారతదేశం గ్లోబల్ ఏఐ పవర్హౌస్గా ఎదగడమే కాకుండా, తన సాంస్కృతిక, భాషా వారసత్వాన్ని సాంకేతికతతో అనుసంధానించనుంది.ఇదీ చదవండి: ట్రంప్ 2.0.. ఏడాదిలో వచ్చిన ఆర్థిక మార్పులు -
డేటా పంచుకోలేం.. కోర్టును ఆశ్రయించిన గూగుల్!
సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్కు, అమెరికా న్యాయస్థానాలకు మధ్య జరుగుతున్న ‘గుత్తాధిపత్య’ పోరు కొత్త మలుపు తిరిగింది. తమ సెర్చ్ డేటాను చాట్జీపీటీ సృష్టికర్త ఓపెన్ఏఐ వంటి ప్రత్యర్థి సంస్థలతో పంచుకోవాలన్న కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ గూగుల్ ఫెడరల్ అప్పీల్స్ కోర్టును ఆశ్రయించింది. అప్పీలుపై తుది నిర్ణయం వచ్చే వరకు ఈ డేటా బదిలీని వాయిదా వేయాలని కంపెనీ కోరింది.తీర్పు నేపథ్యం ఏమిటి?ఆన్లైన్ సెర్చ్ మార్కెట్లో గూగుల్ చట్టవిరుద్ధమైన గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తోందని 2024లో వాషింగ్టన్ డిస్ట్రిక్ట్ న్యాయమూర్తి అమిత్ మెహతా చారిత్రాత్మక తీర్పునిచ్చారు. యాపిల్, శామ్సంగ్ వంటి కంపెనీలకు ఏటా 20 బిలియన్ డాలర్లకు పైగా చెల్లించి, గూగుల్ను ‘డిఫాల్ట్’ సెర్చ్ ఇంజిన్గా ఉంచడం ద్వారా పోటీని అణచివేసిందని కోర్టు నిర్ధారించింది. ఈ ఆధిపత్యాన్ని తగ్గించే క్రమంలో గూగుల్ తన సెర్చ్ డేటాను ప్రత్యర్థులకు అందుబాటులో ఉంచాలని న్యాయమూర్తి ఆదేశించారు.గూగుల్ వాదన ఏంటి?అప్పీలు పెండింగ్లో ఉండగానే డేటాను పంచుకుంటే కంపెనీకి చెందిన కీలక వాణిజ్య రహస్యాలు ప్రత్యర్థుల చేతికి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ‘ప్రజలు గూగుల్ను బలవంతంగా కాకుండా, మంచి సేవలు అందిస్తుంది కాబట్టే వాడుతున్నారు’ అని గూగుల్ రెగ్యులేటరీ వ్యవహారాల వైస్ ప్రెసిడెంట్ లీ-అన్నే ముల్హోలాండ్ స్పష్టం చేశారు. ఇప్పటికే మార్కెట్లో గట్టి పోటీ ఉందని, కోర్టు నిర్ణయం ఆవిష్కరణల స్థాయిని తక్కువ అంచనా వేసిందని కంపెనీ వాదిస్తోంది.షరతులకు అంగీకారం.. కానీ!గోప్యత, భద్రతా రక్షణలకు సంబంధించిన నిబంధనలను పాటించడానికి సిద్ధమని గూగుల్ తెలిపింది. అయితే డేటా షేరింగ్, సిండికేటెడ్ ఫలితాలు, ప్రకటనల పంపిణీ విషయంలో మాత్రమే స్టే కోరుతోంది.ఇదీ చదవండి: తెలంగాణలో వీధికుక్కల సామూహిక హత్యలు -
భారతీయ భోజనాన్ని డీకోడ్ చేసే కృత్రిమమేధ
భారతీయ ఆహారం అంటే కేవలం రుచి మాత్రమే కాదు.. సంస్కృతి, సంప్రదాయం, ప్రాంతీయ వైవిధ్యాల సమాహారం. దేశంలోని క్లిష్టమైన ఆహార పద్ధతులను అర్థం చేసుకోవడానికి ఇప్పుడు కృత్రిమ మేధ (ఏఐ) రంగ ప్రవేశం చేసింది. ట్రిపుల్ఐటీ-హైదరాబాద్ పరిశోధకులు కంప్యూటర్ విజన్ సాంకేతికతను ఉపయోగించి భారతీయ థాలీ భోజనంలోని కేలరీలను ట్రాక్ చేయడం, బిర్యానీ వంటి ఐకానిక్ వంటకాలను విశ్లేషించేలా పరిశోధనలు చేస్తున్నారు.థాలీని అర్థం చేసుకోవడం ఎందుకు కష్టం?ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా ఫుడ్ ట్రాకింగ్ యాప్స్ను బర్గర్, శాండ్విచ్.. వంటి పాశ్చాత్య వంటకాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. కానీ భారతీయ థాలీ అందుకు భిన్నమైంది. ఒకే ప్లేట్లో అన్నం, పప్పు, కూర, పెరుగు, చట్నీ, అప్పడం.. వంటి చాలా పదార్థాలు కలిసి ఉంటాయి. దాంతో అందులో ఎన్ని కేలరీలు ఉన్నాయో తెలుసుకోవడం కష్టంగా మారుతుంది. ట్రిపుల్ఐటీలోని సెంటర్ ఫర్ విజువల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (CVIT) పరిశోధకులు దీనిపైనే దృష్టి పెట్టారు.ఈ ప్రాజెక్ట్కు నేతృత్వం వహిస్తున్న ప్రొఫెసర్ సి.వి. జవహర్ ప్రొఫెసర్ జవహర్ మార్గదర్శకత్వంలో యశ్ అరోరా, ఆదిత్య అరుణ్ రూపొందించిన ‘What is there in an Indian Thali’ అనే పరిశోధన పత్రం ఇటీవలే 16వ ఇండియన్ కాన్ఫరెన్స్ ఆన్ కంప్యూటర్ విజన్, గ్రాఫిక్స్ అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్ (ICVGIP 2025)లో సమర్పించారు. భారతీయ భోజనంలోని వివిధ రకాల పదార్థాలను ఏఐ ఎలా గుర్తించగలదనే అంశంపై ఈ పరిశోధన సాగింది.పరిశోధనలోని ముఖ్యాంశాలుసాధారణంగా ఏఐ మోడళ్లకు ప్రతి కొత్త వంటకం కోసం మళ్లీ శిక్షణ ఇవ్వాలి. కానీ, భారతీయ వంటల్లో విభిన్న రకాల పప్పులు వివిధ రంగులు ఉంటాయి (ఉదాహరణకు పాలక్ పప్పు ఆకుపచ్చగా ఉంటుంది). దీనికోసం ట్రిపుల్ఐటీ హైదరాబాద్ బృందం ‘జీరో-షాట్ లెర్నింగ్’ విధానాన్ని అభివృద్ధి చేసింది. ఇది కఠినమైన వర్గీకరణకు బదులుగా ‘ప్రోటోటైప్ మ్యాచింగ్’ ద్వారా పదార్థాలను గుర్తిస్తుంది. అలా థాలీ భోజనంలోని అన్ని పధార్థాలను గుర్తించి దానివల్ల ఎన్ని కేలరీలు సమకూరుతాయో తెలియజేస్తుంది.గర్భిణీ స్త్రీల పోషకాహారాన్ని పర్యవేక్షించాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ పరిశోధన సాగినట్లు నిర్వాహకులు చెప్పారు. ప్రస్తుతం ఇది ఓవర్హెడ్ కెమెరాతో కూడిన కియోస్క్ సెటప్లో పనిచేస్తోంది. భవిష్యత్తులో దీన్ని మొబైల్ యాప్గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశవ్యాప్తంగా మసాలాల వినియోగం, వంట శైలిలోని తేడాలను విశ్లేషిస్తూ ‘ఇండియన్ ఫుడ్ మ్యాప్’ను పరిశోధకులు సిద్ధం చేస్తున్నారు.బిర్యానీపై ప్రత్యేక దృష్టిభారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బిర్యానీని టెస్ట్ కేస్గా తీసుకుని దేశంలో బిర్యానీ ఎలా తయారు చేస్తారనే అంశంపై పరిశోధన చేశారు. ఇందుకోసం వేలకొద్దీ యూట్యూబ్ వీడియోలను ఏఐ ద్వారా విశ్లేషించారు. హైదరాబాదీ బిర్యానీ, ఇతర బిర్యానీల మధ్య నూనె, మసాలాల వాడకంలో ఉన్న తేడాలను ఈ వ్యవస్థ గుర్తించగలదు. ‘ఉల్లిపాయల కంటే ముందు ఏ పదార్థం వేశారు?’ వంటి క్లిష్టమైన ప్రశ్నలకు కూడా ఇది సమాధానం ఇస్తుంది.వంట గదిలో ఏఐ అసిస్టెంట్ఈ సాంకేతికత భవిష్యత్తులో వంట చేసేటప్పుడు మన పక్కనే ఉండి మార్గనిర్దేశం చేసే ఏఐ అసిస్టెంట్గా మారనుంది. ‘మీ అమ్మమ్మ పక్కన ఉండి వంట నేర్పించినట్టే, అవసరమైనప్పుడు మాత్రమే సూచనలిచ్చే ఏఐని తయారు చేస్తున్నాం’ అని ప్రొఫెసర్ జవహర్ తెలిపారు. ఇది కేవలం వంటకే కాకుండా నృత్యం, హస్తకళలు వంటి నైపుణ్య ఆధారిత విద్యను బోధించడానికి కూడా ఉపయోగపడనుంది. భారతీయ సంస్కృతిని, ఆధునిక సాంకేతికతను జోడించి ట్రిపుల్ఐటీ-హైదరాబాద్ చేస్తున్న ఈ పరిశోధన ఆహార విశ్లేషణ రంగంలో ఒక మైలురాయిగా నిలవనుంది.ఇదీ చదవండి: ఐపీఓ పెట్టుబడుల పేరుతో రూ.2.5 కోట్ల టోకరా! -
స్టార్టప్లు తయారీ, డీప్టెక్పై దృష్టి పెట్టాలి: ప్రధాని
భారతీయ స్టార్టప్లు కేవలం సేవా రంగానికే పరిమితం కాకుండా తయారీ, అత్యాధునిక సాంకేతికత రంగాల్లో ప్రపంచ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ‘స్టార్టప్ ఇండియా మిషన్’ ప్రారంభించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన దేశంలోని పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు.గ్లోబల్ వాల్యూ చైన్లో భారత్ కీలకంగడిచిన పదేళ్లలో డిజిటల్, సర్వీస్ రంగాల్లో భారత స్టార్టప్లు అద్భుతమైన ప్రగతిని సాధించాయని ప్రధాని ప్రశంసించారు. అయితే, ఇకపై వ్యూహాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. రానున్న పదేళ్లలో తయారీ రంగంలో దేశీయంగా ఉద్యోగ అవకాశాలను పెంచడంతో పాటు, అంతర్జాతీయ సరఫరా గొలుసులో భారత్ కీలక భాగస్వామిగా ఎదగాలని మోదీ ఆకాంక్షించారు. ‘కొత్త ఆలోచనలతో సమస్యలకు పరిష్కారాలు చూపాలి. ప్రపంచంలోనే అత్యుత్తమ నాణ్యతగల ఉత్పత్తులను స్టార్టప్లు రూపొందించాలి’ అని స్పష్టం చేశారు.ఏఐ, డీప్టెక్కు పెద్దపీటకృత్రిమ మేధ (AI) ఆవిష్కరణల్లో నాయకత్వం వహించే దేశాలకే భవిష్యత్తులో వ్యూహాత్మక ప్రయోజనం ఉంటుందని ప్రధాని విశ్లేషించారు. ఈ క్రమంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు.ఇండియా ఏఐ మిషన్లో భాగంగా కంప్యూటింగ్ ఖర్చులను తగ్గించేందుకు 38,000 జీపీయూలను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు.సెమీకండక్టర్లు, గ్రీన్ హైడ్రోజన్, భారతీయ సర్వర్లపై అభివృద్ధి చేసిన స్వదేశీ ఏఐను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు.గతంలో పరిమితులున్న రక్షణ, అంతరిక్ష, డ్రోన్ రంగాల్లో స్టార్టప్ల కోసం సడలింపులు ఇచ్చామన్నారు.మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్..2014లో కేవలం 500 కంటే తక్కువగా ఉన్న స్టార్టప్ల సంఖ్య నేడు రెండు లక్షలకు పైగా చేరడంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ పర్యావరణ వ్యవస్థగా ఎదిగిందని, ఇందులో 125 యునికార్న్లు ఉన్నాయని గుర్తు చేశారు. స్టార్టప్లకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం భారీ నిధులను కేటాయించినట్లు తెలిపారు. స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్, స్పేస్ సీడ్ ఫండ్ వంటి పథకాల ద్వారా రూ.25,000 కోట్లు ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు చెప్పారు.ఇదీ చదవండి: మళ్లీ పెరుగుతోన్న బంగారు కొండ.. తులం ఎంతంటే.. -
వొడాఫోన్ ఐడియా బాటలో ఎయిర్టెల్, టాటా గ్రూప్?
దేశీయ టెలికాం రంగంలో సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) బకాయిల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. వొడాఫోన్ ఐడియా (Vi)కు ప్రభుత్వం కల్పించిన భారీ ఊరట నేపథ్యంలో ఇప్పుడు భారతీ ఎయిర్టెల్, టాటా గ్రూప్ సంస్థలు కూడా తమ ఏజీఆర్ బకాయిల చెల్లింపులపై ఉపశమనం కోరాలని భావిస్తున్నాయి.సమాన అవకాశాలుండాలంటూ..వొడాఫోన్ ఐడియాకు ఏజీఆర్ చెల్లింపులపై 10 సంవత్సరాల సుదీర్ఘ విరామం (Moratorium) లభించడంతో దాదాపు రూ.87,695 కోట్ల బకాయిలు 2035 వరకు వాయిదా పడ్డాయి. ఒకే రంగంలో ఉన్న ఒక ఆపరేటర్కు ఇటువంటి ప్రత్యేక వెసులుబాటు కల్పించినప్పుడు అదే నిబంధనలను తమకు కూడా వర్తింపజేయాలని ఎయిర్టెల్, టాటా టెలిసర్వీసెస్ లిమిటెడ్ (TTSL), టాటా టెలిసర్వీసెస్ మహారాష్ట్ర లిమిటెడ్ (TTML) వాదిస్తున్నాయి. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సంస్థలు త్వరలోనే కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించే అవకాశం ఉంది. అవసరమైతే న్యాయపరమైన పోరాటానికి కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.బకాయిల వివరాలు ఇలా..భారతీ ఎయిర్టెల్ సుమారు రూ.48,103 కోట్లు, టాటా గ్రూప్ (TTSL, TTML) సుమారు రూ.19,259 కోట్ల ఏజీఆర్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ కంపెనీలు 2021లో ప్రభుత్వం ఇచ్చిన నాలుగేళ్ల మారటోరియం ముగిసిన తర్వాత 2026 ఆర్థిక సంవత్సరం మార్చి నుంచి తమ బకాయిల చెల్లింపులను పునప్రారంభించాల్సి ఉంది. ఒకవేళ వీరికి ఉపశమనం లభించకపోతే, వొడాఫోన్ ఐడియాతో పోలిస్తే తమపై అదనపు ఆర్థిక భారం పడుతుందని, ఇది మార్కెట్ పోటీతత్వాన్ని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.సుప్రీంకోర్టు వైఖరినవంబర్ 2025లో సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పు ఈ వ్యవహారంలో ప్రాధాన్యత సంతరించుకుంది. వొడాఫోన్ ఐడియాను గట్టెక్కించేందుకు ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోబోమని కోర్టు స్పష్టం చేసింది. అయితే, ఇటువంటి నిర్ణయాలు ఇతర కంపెనీల నుంచి కూడా డిమాండ్లకు దారితీస్తాయని కోర్టు అప్పుడే వ్యాఖ్యానించింది.కీలక అంశాలుభారతీ ఎయిర్టెల్ ప్రస్తుతం సుమారు 40 శాతం మార్కెట్ వాటాతో లాభాల్లో ఉంది. వొడాఫోన్ ఐడియా పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నందున దానికి ప్రత్యేక మద్దతు లభించింది. కంపెనీల ఆర్థిక స్థితిగతులు వేర్వేరుగా ఉన్నప్పుడు ఒకే వెసులుబాటు వర్తిస్తుందా లేదా అన్నది ఇప్పుడు ప్రభుత్వ విచక్షణపై ఆధారపడి ఉంది.వొడాఫోన్ ఐడియా మనుగడ కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఎయిర్టెల్, టాటా గ్రూపులకు బలమైన అస్త్రంగా మారింది. ప్రభుత్వం వీరికి కూడా గడువు పొడిగిస్తే టెలికాం కంపెనీల వద్ద నగదు లభ్యత పెరిగి 5జీ నెట్వర్క్ విస్తరణ వేగవంతం కావచ్చు. లేదంటే ఈ వివాదం మరోసారి న్యాయస్థానాల మెట్లు ఎక్కే అవకాశం కనిపిస్తోంది.ఏజీఆర్ అంటే?దేశంలోని టెలికాం కంపెనీలు (ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా వంటివి) తాము సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని ప్రభుత్వానికి ఫీజుల రూపంలో చెల్లించాలి. ఇందులో రెండు రకాలు ఉంటాయి.లైసెన్స్ ఫీజు: సుమారు 8 శాతం.స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీలు: సుమారు 3-5 శాతం.ఇదీ చదవండి: భారత వలసదారులపై అమెరికాకు కోపమెందుకు? -
‘ఎక్స్’లో మరోసారి అంతరాయం
ఎలోన్ మస్క్ నేతృత్వంలోని సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) ఈ వారం రెండోసారి పెద్ద సాంకేతిక అంతరాయాన్ని ఎదుర్కొంది. ఈ సమస్య వెబ్సైట్తో పాటు మొబైల్ యాప్ను కూడా ప్రభావితం చేసింది.డౌన్డిటెక్టర్ సమాచారం ప్రకారం, భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:30 గంటల సమయంలో ఎక్స్ సేవలు అందుబాటులో లేవని సుమారు 80,000కు పైగా వినియోగదారులు ఫిర్యాదు చేశారు.ఇలాంటి వరుస అంతరాయాల నేపథ్యంలో ఎక్స్ ప్లాట్ఫారమ్ స్థిరత్వం, అలాగే అత్యవసర పరిస్థితుల్లో కంటెంట్ను సమర్థవంతంగా మోడరేట్ చేయగల సామర్థ్యంపై వినియోగదారుల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి.2022లో ఎలాన్ మస్క్ ట్విట్టర్ను స్వాధీనం చేసుకున్న అనంతరం, సంస్థలో పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించారు. దీని కారణంగా సాధారణ కార్యకలాపాలను నిరవధికంగా కొనసాగించడం, హానికరమైన కంటెంట్ను నియంత్రించడం వంటి అంశాలపై అప్పటినుంచి సవాళ్లు తలెత్తుతున్నాయి. -
సైబర్ మోసాల చెక్!.. బాధితులకు త్వరిత రీఫండ్స్
ఆన్లైన్ ఆర్థిక మోసాల బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు.. కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP) పరిధిలోని.. సైబర్ ఫైనాన్షియల్ క్రైమ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (CFCFRMS) కోసం రూపొందించిన 'స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్' (SOP)కు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ (MHA) ఆమోదం తెలిపింది.కొత్త ఎస్ఓపీ ప్రకారం.. రూ. 50వేలు కంటే తక్కువ సైబర్ మోసాల బాధితులు కోర్టు ఆదేశం లేకుండానే రీఫండ్ పొందవచ్చు. అయితే కోర్టు ఆదేశాలు లేని సందర్భాల్లో, బ్యాంకులు గరిష్టంగా 90 రోజుల్లోగా ఫ్రీజ్ చేసిన మొత్తాలపై హోల్డ్ను ఎత్తివేయాల్సి ఉంటుంది. దీని వల్ల బాధితులు ఎదుర్కొంటున్న ఆలస్యం, ఆర్థిక ఇబ్బందులు గణనీయంగా తగ్గనున్నాయి.హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో డిజిటల్ చెల్లింపులు, ఆన్లైన్ బ్యాంకింగ్, ఈ-కామర్స్ వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాల ఫిర్యాదులు కూడా అధికమయ్యాయి.కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) గణాంకాల ప్రకారం.. గత ఆరు సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా మోసం, మభ్యపెట్టడం వంటి కేసుల ద్వారా రూ. 52,976 కోట్లకు పైగా నష్టం సంభవించింది. ఈ కొత్త విధానం ఈ రాష్ట్రాల్లోని ప్రజలకు పెద్ద ఊరటగా నిలవనుంది. ఈ నిర్ణయాన్ని ఫిన్టెక్ & డిజిటల్ ఫైనాన్స్ రంగ నిపుణులు స్వాగతించారు.ఇదీ చదవండి: సిద్ధమవ్వండి.. అవసరమైన ఏర్పాట్లు చేసుకోండి! -
వన్ ప్లస్ సీఈఓపై అరెస్ట్ వారెంట్!
స్మార్ట్ఫోన్ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన వన్ ప్లస్ సహ వ్యవస్థాపకులు, కంపెనీ సీఈవో పీట్ లౌ (Pete Lau)పై తైవాన్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. చైనా టెక్ ఎగ్జిక్యూటివ్లపై తైవాన్ తీసుకున్న అత్యంత అరుదైన, కఠినమైన చర్యగా దీన్ని పరిగణిస్తున్నారు. ప్రధానంగా అక్రమ నియామకాలు, సాంకేతిక సమాచార లీకేజీపై తైవాన్ ప్రభుత్వం చేపట్టిన అణిచివేత చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొందరు భావిస్తున్నారు.వివాదానికి ప్రధాన కారణం ఏంటి?తైవాన్ ప్రాసిక్యూటర్ల కథనం ప్రకారం, వన్ ప్లస్ సంస్థ ప్రభుత్వం నుంచి ఎటువంటి ముందస్తు అనుమతులు పొందకుండానే కొన్నేళ్లుగా తైవాన్కు చెందిన ఇంజినీర్లను అక్రమంగా నియమించుకుంది. ఈక్రమంలో తైవాన్, చైనా మధ్య వ్యాపార, ఉపాధి సంబంధాలను నియంత్రించే కఠినమైన చట్టాలను వన్ ప్లస్ ఉల్లంఘించినట్లు అధికారులు పేర్కొన్నారు. 2014 నుంచి ఇప్పటివరకు సుమారు 70 మందికి పైగా తైవాన్ ఇంజినీర్లను వన్ ప్లస్ చట్టవిరుద్ధంగా చేర్చుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఇంజినీర్లు వన్ ప్లస్ పరికరాలకు సంబంధించిన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, టెస్టింగ్, పరిశోధన విభాగాల్లో పనిచేశారని గుర్తించారు.జాతీయ భద్రత, సాంకేతిక పరిరక్షణఈ కేసు కేవలం ఒక కంపెనీకి మాత్రమే పరిమితం కాదని, ఇది తైవాన్ జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్లో తైవాన్ ప్రపంచంలోనే అత్యంత అధునాతన పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంది. చైనా సంస్థలు ఇలాంటి నియామకాల ద్వారా తమ దేశ మేధో సంపత్తిని, క్లిష్టమైన సాంకేతికతను తస్కరించే ప్రమాదం ఉందని తైవాన్ ఆందోళన చెందుతోంది.కంపెనీ స్పందనఈ పరిణామాలపై వన్ ప్లస్ స్పందిస్తూ.. తమ వ్యాపార కార్యకలాపాలు ఎప్పటిలాగే సాగుతాయని, ఈ చట్టపరమైన అంశం కంపెనీ రోజువారీ పనితీరుపై ఎటువంటి ప్రభావం చూపదని తెలిపింది. అయితే, ప్రస్తుతానికి చైనా-తైవాన్ మధ్య ఉన్న ఉద్రిక్తతల దృష్ట్యా పీట్ లౌ అప్పగింత సాధ్యంకానప్పటికీ ఈ వారెంట్ కారణంగా టెక్ ప్రపంచం దృష్టిని ఆకర్షించినట్లయింది.పీట్ లౌ ప్రస్థానం..చైనాలో జన్మించిన పీట్ లౌ 2013లో వన్ ప్లస్ స్థాపించడానికి ముందు ఒప్పో (Oppo)లో సీనియర్ ఎగ్జిక్యూటవ్ స్థాయిలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం తాను వన్ ప్లస్ సీఈవోగా ఉండటంతో పాటు, ఒప్పోలో చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ (సీపీఓ)గా కూడా పని చేస్తున్నారు. తన నాయకత్వంలోనే వన్ ప్లస్ పెద్ద బ్రాండ్గా ఎదిగి ఆసియా, యూరప్, అమెరికా మార్కెట్లలో మెరుగైన స్థానాన్ని సంపాదించుకున్నారు.ఇదీ చదవండి: నిధులు మూరెడు.. పనులు జానెడు! -
మోటరోలా సిగ్నేచర్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..
స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ మోటరోలా తన కొత్త ప్రీమియం హ్యాండ్సెట్ మోటరోలా సిగ్నేచర్ను భారతదేశంలో జనవరి 23న అధికారికంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ దేశంలో ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్ ద్వారా ప్రత్యేకంగా విక్రయానికి రానుంది. ఇటీవల కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES) 2026లో ఈ ఫోన్ను కంపెనీ ఆవిష్కరించింది.ఫ్లిప్కార్ట్లో ఇప్పటికే మోటరోలా సిగ్నేచర్కు సంబంధించిన ప్రత్యేక మైక్రోసైట్ను అప్డేట్ చేశారు. దీని ద్వారా ఫోన్కు సంబంధించిన ముఖ్యమైన స్పెసిఫికేషన్లను కంపెనీ టీజ్ చేసింది. ఈ స్మార్ట్ఫోన్ క్వాల్కమ్ అత్యాధునిక స్నాప్డ్రాగన్ 8 జెన్ 5 చిప్సెట్తో పనిచేస్తుంది.ప్రధాన ఫీచర్లుడిస్ప్లే విషయానికి వస్తే, మోటరోలా సిగ్నేచర్లో 6.8 అంగుళాల సూపర్ HD LTPO AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది 1,264 x 2,780 పిక్సెల్స్ రిజల్యూషన్, 165Hz రిఫ్రెష్ రేట్, 450 ppi పిక్సెల్ డెన్సిటీతో పాటు గరిష్టంగా 6,200 నిట్స్ బ్రైట్నెస్ను అందిస్తుంది. అలాగే డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్, “సౌండ్ బై బోస్” ఆడియో సపోర్ట్ ఈ ఫోన్ను మరింత ప్రత్యేకంగా నిలబెడతాయి.కెమెరా విభాగంలో, ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్తో వస్తుంది. ఇందులో 3.5x ఆప్టికల్ జూమ్ సామర్థ్యంతో కూడిన 50 మెగాపిక్సెల్ సోనీ LYT-828 సెన్సార్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. డిజైన్ పరంగా, ఇది అల్యూమినియం ఫ్రేమ్తో 6.99 మిమీ మందంతో ఉండగా, బరువు సుమారు 186 గ్రాములు మాత్రమే.పవర్ కోసం ఇందులో 5,200mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీని అందించారు. సాఫ్ట్వేర్ పరంగా, ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హలో యూఐపై నడుస్తుంది.ధర ఇదేనా?ధర విషయానికొస్తే, 16GB ర్యామ్ + 1TB స్టోరేజ్ వేరియంట్ బాక్స్ ధర రూ.84,999గా లీక్ అయింది. అయితే ఇది బాక్స్ ధర మాత్రమే కావడంతో, వాస్తవ రిటైల్ ధర కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే 12GB ర్యామ్ + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.82,000గా ఉండొచ్చని సమాచారం. అధికారిక ధరలను మోటరోలా లాంచ్ రోజున వెల్లడించనుంది.మోటరోలా సిగ్నేచర్ పాంటోన్ మార్టిని, ఆలివ్, కార్బన్ వంటి ప్రీమియం కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది. ప్రీమియం డిజైన్, శక్తివంతమైన పనితీరు, ఫ్లాగ్షిప్ ఫీచర్లతో ఈ ఫోన్ హైఎండ్ సెగ్మెంట్లో గట్టి పోటీ ఇవ్వనుంది. -
సబ్మెరిన్ కేబుల్స్కు కొత్త విధానం అవసరం
ఆధునిక డిజిటల్ ప్రపంచానికి కీలకంగా ఉన్న సబ్మెరిన్ కేబుల్ నెట్వర్క్ల భద్రత ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతోంది. ప్రపంచవ్యాప్త సమాచార ప్రవాహంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ కేబుల్ వ్యవస్థల సామర్థ్యం ప్రస్తుతం 6,400 టీబీపీఎస్కు చేరుకుంది. అయితే, ఈ నెట్వర్క్లు కేవలం కొన్ని ప్రాంతాల్లోనే కేంద్రీకృతం కావడం భవిష్యత్తులో ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘డైవర్సిటీ బై డిజైన్’(Diversity by Design) విధానం ద్వారా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడమే మార్గమని స్పష్టమవుతోంది.భారత డిజిటల్ మౌలిక వసతులుభారతదేశాన్ని అంతర్జాతీయ ఇంటర్నెట్ ప్రపంచంతో అనుసంధానించడంలో 18 సబ్మెరిన్ కేబుల్ వ్యవస్థల్లో ఇప్పటికే కార్యకలాపాలు సాగుతున్నాయి. వీటికి తోడు మరో నాలుగు కొత్త వ్యవస్థలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం మన దేశంలో ముంబై, చెన్నై, కొచ్చిన్ పట్టణాలు ‘కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లు’గా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం తదుపరి ప్రధాన డిజిటల్ హబ్గా అవతరిస్తోంది. గూగుల్, మెటా, అమెజాన్ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలు తమ గేట్వే కేబుల్స్ కోసం విశాఖను ప్రత్యామ్నాయంగా భావిస్తున్నాయి. బీఎస్ఎన్ఎల్ ఆధ్వర్యంలో అండమాన్-నికోబార్, లక్షద్వీప్ దీవులను ప్రధాన భూభాగంతో కలిపే లోకల్ లూప్ నెట్వర్క్లు సిద్ధమవుతున్నాయి. ఇవి భవిష్యత్తులో అంతర్జాతీయ కనెక్టివిటీకి కేంద్రాలుగా మారనున్నాయి.ఏమిటీ ‘డైవర్సిటీ బై డిజైన్’?ప్రస్తుతం చాలా కేబుల్స్ కొన్ని సముద్ర గర్భంలో నిర్దిష్ట ప్రాంతాల (ఉదాహరణకు సింగపూర్) గుండానే వెళ్తున్నాయి. దీనివల్ల ప్రకృతి విపత్తులు సంభవించినా లేదా ఉద్దేశపూర్వక విధ్వంసం జరిగినా మొత్తం కమ్యూనికేషన్ వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. దీనినే ‘చోక్ పాయింట్’ సమస్య అంటారు. దీన్ని నివారించేందుకు ‘డైవర్సిటీ బై డిజైన్’ సూత్రాన్ని నిపుణులు ప్రతిపాదిస్తున్నారు. దీని ప్రకారం.. కేబుల్స్ అన్నీ ఒకే మార్గంలో కాకుండా వేర్వేరు సముద్ర మార్గాల ద్వారా పంపిణీ చేయాలి. విశాఖపట్నంలో ప్రతిపాదించిన విధంగా ‘ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ల’(సీఎల్ఎస్)ను ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఏ ఒక్క కంపెనీ ఆధిపత్యం లేకుండా ఏ సర్వీస్ ప్రొవైడర్ అయినా సమాన ప్రాతిపదికన తమ కేబుల్స్ను ల్యాండ్ చేసుకోవచ్చు.సింగపూర్కు ప్రత్యామ్నాయంగా భారత్?ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఇప్పటివరకు 13 సీఎల్ఎస్లతో సింగపూర్ తిరుగులేని హబ్గా ఉంది. అయితే, మితిమీరిన కేంద్రీకరణ కారణంగా భద్రతా పరమైన ఆందోళనలు పెరుగుతున్నాయి. అందుకే గూగుల్, రిలయన్స్ వంటి సంస్థలు విశాఖపట్నంలో గిగావాట్ స్థాయి డేటా సెంటర్లను నిర్మిస్తూ, సింగపూర్ను దాటుకొని వెళ్లే కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి.రాబోయే కొన్నేళ్లలో ప్రపంచవ్యాప్తంగా అదనంగా ఐదు లక్షల కిలోమీటర్ల సబ్సీ కేబుల్స్ అందుబాటులోకి రానున్నాయి. ఈ క్రమంలో భారత్, ఆస్ట్రేలియా వంటి దేశాలు సమన్వయంతో పనిచేస్తూ కేబుల్ వ్యవస్థల్లో వైవిధ్యాన్ని పెంచడం ద్వారానే ఆర్థిక వ్యవస్థలు, రక్షణ రంగ సమాచార భద్రతను కాపాడుకోగలవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇదీ చదవండి: పండగవేళ కరుణించిన కనకం.. వెండి మాత్రం.. -
గ్రోక్లో వస్త్రాపహరణం.. మస్క్ కీలక వ్యాఖ్యలు
గ్రోక్ ఇమేజ్ ఎడిటింగ్ టూల్స్పై కొత్త నియమాలపై ప్రముఖ బిలీయనీర్, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ వివరణతో మరింత వివాదం రాజుకుంది. నిజమైన మనుషుల ఫొటోలను అశ్లీలంగా ఎడిట్లు చేయకుండా నిషేధం విధించినప్పటికీ.. వేర్వేరు ప్రాంప్ట్స్తో ఆ తరహా ఫొటోలు జనరేట్ చేస్తున్నారు కొందరు. అయితే.. దానిని అడ్డుకోవడం సాధ్యం కాకపోవచ్చన్న రీతిలో ఆయన మాట్లాడారు. రియల్ వ్యక్తులపై అనుమతి లేకుండా రూపొందించిన సెక్సువల్ డీప్ఫేక్లు తీవ్ర విమర్శలకు గురైన నేపథ్యంలో ఎక్స్ గ్రోక్ చర్యలు తీసుకుంది. దాని వల్ల గ్రోక్ ద్వారా నిజమైన వ్యక్తులను బికినీ లేదంటే ఇతర సెక్సువలైజ్డ్ దుస్తుల్లో చూపించే ఎడిట్స్ చేయడం కుదరదు. అయితే, AI ఆధారిత కల్పిత పాత్రలు లేదంటే ఊహాజనిత వ్యక్తులపై ఇలాంటి కంటెంట్ సృష్టించడం మాత్రం ఇంకా అనుమతించబడుతోంది.ఈ నిర్ణయంపై ఎలాన్ మస్క్ స్వయంగా స్పందించారు. ‘‘అమెరికాలోని “de facto standard” ప్రకారం.. NSFW (Not Safe For Work) మోడ్ ఆన్ చేసినప్పుడు గ్రోక్ ఊహాజనిత పెద్దవారి పాత్రలపై R-rated సినిమాల్లో కనిపించే స్థాయి వరకు ఎడిట్స్ అనుమతించాలి. అయితే, నిజమైన వ్యక్తులపై మాత్రం ఇది వర్తించదు అని ఉద్ఘాటించారు. అయితే.. ఈ మార్పులు వచ్చినప్పటికీ ఇంకా గ్రోక్ ద్వారా సెక్సువలైజ్డ్ ఇమేజ్లు సృష్టించడం సాధ్యమవుతోందని The Verge లాంటి పత్రికలు కథనాలు ఇస్తున్నాయి. “put her in a bikini” లేదంటే “remove her clothes” వంటి డైరెక్ట్ ప్రాంప్ట్స్ పని చేయకపోయినా.. ప్రత్యామ్నాయ అశ్లీల ప్రాంప్ట్లు కొన్ని పనిచేస్తున్నాయి. దీంతో, విధానం కఠినంగా ఉన్నప్పటికీ, అమలు మాత్రం లేదని ఆ కథనం పేర్కొంది. వీటికి తోడు.. గ్రోక్ ద్వారా అదనంగా వయసు ధృవీకరణ పాప్అప్ ఉన్నప్పటికీ.. కేవలం పుట్టిన సంవత్సరం ఎంచుకోవడం ద్వారా దాన్ని తప్పించుకోవచ్చు. ఎటువంటి ఆధారాలు చూపాల్సిన అవసరం లేకపోవడం వల్ల 18 ఏళ్ల లోపు వినియోగదారులు కూడా సులభంగా యాక్సెస్ చేయగలుగుతున్నారు. అదే సమయంలో పురుషుడి సెల్ఫీని సెక్సువలైజ్డ్ ఇమేజ్గా మార్చిన సందర్భం కూడా రిపోర్ట్ అయింది. అయితే.. ఈ లోపాలను కూడా ఎక్స్,గ్రోక్ సమర్థించుకుంటున్నాయి. వినియోగదారుల ప్రాంప్ట్స్ విధానం తప్పుగా ఉపయోగించడం, హ్యాకింగ్ తరహా మార్పుల కారణంగానే ఈ లోపాలు వస్తున్నాయని చెబుతోంది. దీంతో ఈ సమర్థనపై కరెక్ట్ కాదు బాస్ అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
రూ .35 లక్షల జీతం.. వైరల్ అయిన ఉద్యోగ ప్రకటన
బెంగళూరులో కేవలం ఒక సంవత్సరం అనుభవం ఉన్న అభ్యర్థికి ఆఫర్ చేస్తున్న భారీ వేతన ప్యాకేజీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. SDE-1 (సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజినీర్) పోస్టుకు ఈ ఉద్యోగానికి వార్షికంగా రూ.25 లక్షల జీతం, నాలుగు సంవత్సరాల్లో రూ.20 లక్షల విలువైన ఈఎస్ఓపీలు లేదా స్టాక్ బోనస్, అలాగే రోజుకు రూ.600 జొమాటో క్రెడిట్స్ అందిస్తామని పేర్కొన్నారు.ఇదే కాకుండా 10 శాతం పనితీరు బోనస్, రూ.5 లక్షల వరకు రీలొకేషన్, సైనింగ్ ఇన్సెంటివ్లతో మొదటి సంవత్సరంలో మొత్తం వేతనం సుమారు రూ.35 లక్షలకు చేరుతుందని సమాచారం. ఉచిత జిమ్ సభ్యత్వం, ఫోన్, వైఫై బిల్లుల రీయింబర్స్మెంట్, వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ కోసం రూ.21,000 భత్యం, ప్రతి మూడు సంవత్సరాలకు ఫోన్ అప్గ్రేడ్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి.ఈ జాబ్ లిస్టింగ్ను ‘ఎక్స్’ (ట్విట్టర్)లో ఓ వినియోగదారు షేర్ చేయగా, వెంటనే వైరల్ అయింది. ఒక వైపు టెక్ రంగంలో తొలగింపులు జరుగుతుండగా, మరో వైపు జూనియర్ స్థాయి ఉద్యోగాలకు ఇంత భారీ ప్యాకేజీలు ఇవ్వడంపై నెటిజన్లు భిన్న కామెంట్లతో ప్రతిస్పందించారు. ఈ ఘటన టెక్ పరిశ్రమలో మారుతున్న నియామక ధోరణులు, వేతన వ్యత్యాసాలపై మరోసారి చర్చకు దారి తీసింది.At one side layoffs are happening and other side companies are offering such high salaries for 1 year experienceAnd the fun part is that same company would be paying lesser to 5-8yrs experience employee already working with them.Salary structure is completely broken in tech. pic.twitter.com/5k5Rivwb3H— EngiNerd. (@mainbhiengineer) January 14, 2026 -
ఇరాన్ సమీపంలో అమెరికా అత్యాధునిక డ్రోన్ల నిఘా
మిడిల్ఈస్ట్ ప్రాంతంలో భౌగోళిక రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. గత కొంతకాలంగా వెనిజులా పరిణామాలపై దృష్టి సారించిన అమెరికా ఇప్పుడు మళ్లీ తన వ్యూహాత్మక బలగాలను గల్ఫ్ ప్రాంతం వైపు మళ్లిస్తోంది. తాజా నివేదికల ప్రకారం, ఒమన్ గల్ఫ్, ఇరాన్ సరిహద్దు ప్రాంతాల్లో అమెరికా తన నిఘా వ్యవస్థను ముమ్మరం చేసింది. ఇది రాబోయే సైనిక చర్యకు సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు.ఎంక్యూ-4సీ ట్రైటాన్జనవరి 2026 ప్రారంభం నుంచి అబుదాబి వేదికగా అమెరికా నావికాదళానికి చెందిన ఎంక్యూ-4సీ ట్రైటాన్ డ్రోన్లు నిరంతర నిఘా కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఇది హై ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ (HALE) రకానికి చెందిన డ్రోన్. 50,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో నిరంతరంగా 24 గంటల పాటు ఇది ఎగరగలదు. సముద్ర ప్రాంతాల్లోని కదలికలను అత్యంత స్పష్టంగా పర్యవేక్షించే సామర్థ్యం దీని సొంతం.సాధారణంగా సైనిక కార్యకలాపాల్లో ‘కాల్ సైన్’ (Call Sign) గోప్యంగా ఉంచుతారు(గాలిలో వందలాది విమానాలు ఎగురుతున్నప్పుడు ట్రాఫిక్ కంట్రోలర్లు లేదా ఇతర సైనిక విమానాలు ఏ విమానంతో కాంటాక్ట్ అవుతున్నాయో స్పష్టంగా తెలియడానికి ఈ కాల్ సైన్లను ఉపయోగిస్తారు). కానీ, ఈసారి ట్రైటాన్ డ్రోన్లు తమ గోప్యతను దాచకుండా బహిరంగంగానే సంచరించడం గమనార్హం. ఇది ఇరాన్కు అమెరికా పంపిస్తున్న పరోక్ష హెచ్చరిక అని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఇరాన్లో కల్లోలం - ట్రంప్ హెచ్చరికప్రస్తుతం ఇరాన్ ప్రభుత్వం స్వదేశీ నిరసనకారులపై అనుసరిస్తున్న కఠిన వైఖరి అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. మానవ హక్కుల సంస్థల సమాచారం ప్రకారం, నిరసనల అణిచివేతలో ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ హింసను అమెరికా అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు. నిరసనకారులకు మద్దతుగా సహాయం అందిస్తామని ట్రంప్ ఇచ్చిన సందేశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. హింస కొనసాగితే ఇరాన్పై నేరుగా సైనిక చర్యకు దిగుతామని ఆయన హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో అమెరికా జోక్యం చేసుకోబోతోందనే సంకేతాలను ఇస్తున్నాయి.తిరిగి వస్తున్న యుద్ధనౌకలుగత ఏడాది హౌతీ తిరుగుబాటుదారులను ఎదుర్కోవడానికి ‘యూఎస్ఎస్ హ్యారీ ఎస్.ట్రూమాన్’, ఇతర విధ్వంసక నౌకలను గల్ఫ్లో మోహరించారు. అయితే, వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వీటిని కరేబియన్ ప్రాంతానికి తరలించారు. కానీ, ఇప్పుడు మళ్లీ గల్ఫ్ వైపు మళ్లిస్తున్నారు. యూఎస్ నేవీ అధికారిక సమాచారం ప్రకారం.. గైడెడ్-క్షిపణి యూఎస్ఎస్ రూజ్వెల్ట్ (DDG 80) ఇప్పటికే అరేబియా గల్ఫ్కు చేరుకుంది. యూఎస్ సెంట్రల్ కమాండ్ పరిధిలో ఈ నౌక తన పెట్రోలింగ్ను ప్రారంభించింది. ఇరాన్ వ్యూహాత్మక ప్రాంతాలకు సమీపంలో అమెరికా డ్రోన్లు, యుద్ధనౌకలు మోహరించడం చూస్తుంటే గల్ఫ్ ప్రాంతంలో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: వ్యాధి నిర్ధారణలో ఐసీఎంఆర్ కీలక ఆవిష్కరణ -
వ్యాధి నిర్ధారణలో ఐసీఎంఆర్ కీలక ఆవిష్కరణ
దేశంలో అంటువ్యాధుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసేందుకు, ప్రాణాంతక ‘యాంటీ-మైక్రోబయల్ రెసిస్టెన్స్’(ఏంఎఆర్) ముప్పును తగ్గించేందుకు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) సంచలనాత్మక అడుగు వేసింది. జ్వరం, శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడే రోగుల్లో ఒకేసారి అనేక రకాల ఇన్ఫెక్షన్లను గుర్తించగలిగే ‘మల్టీప్లెక్స్ మాలిక్యులర్ డయాగ్నొస్టిక్’ పరీక్షను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.సాధారణంగా ఆసుపత్రికి వచ్చే రోగులకు డెంగ్యూ, టైఫాయిడ్, ఇన్ఫ్లుయెంజా లేదా కొవిడ్ వంటి లక్షణాలు ఉన్నప్పుడు వైద్యులు ఒక్కో వ్యాధికి విడివిడిగా పరీక్షలు నిర్వహిస్తారు. ఒక నివేదిక నెగటివ్ వస్తేనే మరో పరీక్షకు వెళ్లే ఈ దశల వారీ విధానం వల్ల కొన్ని సమస్యలున్నాయి. ఈ విధానం ద్వారా వ్యాధి నిర్ధారణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. రోగి పరిస్థితి విషమించే ప్రమాదం ఉంది. వైద్య ఖర్చులు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి ఒకేసారి బహుళ వ్యాధికారక క్రిములను (Pathogens) గుర్తించే సింగిల్-టెస్ట్ మోడల్ను అందుబాటులోకి తీసుకురావాలని ఐసీఎంఆర్ ప్రణాళిక రూపొందించింది.యాంటీబయాటిక్స్ దుర్వినియోగానికి అడ్డుకట్టవ్యాధి ఏంటో స్పష్టంగా తెలియనప్పుడు వైద్యులు తప్పనిసరి పరిస్థితుల్లో ‘బ్రాడ్-స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్’ వాడుతుంటారు. దీనిపై ఎయిమ్స్ మైక్రోబయాలజీ ప్రొఫెసర్ డాక్టర్ హితేందర్ గౌతమ్ స్పందిస్తూ.. ‘కచ్చితమైన నివేదిక లేకుండా ఎక్కువ కాలం యాంటీబయాటిక్స్ వాడటం వల్ల శరీరంలో సూక్ష్మజీవుల నిరోధక శక్తి పెరుగుతుంది’ అని హెచ్చరించారు. ఐసీఎంఆర్ ఏఎంఆర్ఎస్ఎన్ 2024 నివేదిక ప్రకారం, ప్రస్తుతం వాడుకలో ఉన్న అనేక యాంటీబయాటిక్స్ బ్యాక్టీరియాపై ప్రభావం కోల్పోతున్నాయని తేలింది. కొత్త మల్టీప్లెక్స్ పరీక్షల వల్ల కచ్చితమైన చికిత్స త్వరగా మొదలై ఈ ముప్పు తగ్గుతుంది.సింగిల్ టెస్ట్కు సంబంధించిన కీలక అంశాలురోగి లక్షణాల ఆధారంగా ఒకే టెస్ట్లో అన్ని అనుమానిత ఇన్ఫెక్షన్లను పరీక్షించడం.ఈ డయాగ్నొస్టిక్ కిట్లను అభివృద్ధి చేయడానికి భారతీయ తయారీదారులు, పరిశోధన సంస్థలకు ఐసీఎంఆర్ మద్దతు ఇస్తుంది.ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రతిపాదనలు సమర్పించడానికి జనవరి 25ను చివరి తేదీగా నిర్ణయించారు.కొవిడ్ సమయంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వ్యాధుల వ్యాప్తిని ప్రారంభ దశలోనే అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా ఈ వేగవంతమైన నిర్ధారణ పరీక్షలు దేశ ప్రజారోగ్య వ్యవస్థలో కీలక మార్పుగా నిలవనున్నాయి.ఇదీ చదవండి: యూఎస్-ఇరాన్ ఉద్రిక్తతలు.. భారత వాణిజ్యంపై ప్రభావం -
మొబైల్ ఫోన్ల తయారీ @ 75 బి.డాలర్లు
మొబైల్ ఫోన్లకు తయారీ ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) దన్నుతో దేశీయంగా మొబైల్ ఫోన్ల ఉత్పత్తి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27) ఆఖరు నాటికి 75 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) అంచనా వేస్తోంది. ఇందులో ఎగుమతులు 30 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండొచ్చని భావిస్తోంది. ఐసీఈఏ చైర్మన్ పంకజ్ మహీంద్రూ ఈ విషయాలు వెల్లడించారు.2026 మార్చితో పీఎల్ఐ స్కీము ముగియనుండటం పరిశ్రమకు మరో కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు. వివిధ ప్రోడక్టుల విభాగాలవ్యాప్తంగా భారత్ తయారీ సామర్థ్యాలను బట్టి తదుపరి దశ వృద్ధి ఆధారపడి ఉంటుందని మహీంద్రూ చెప్పారు. మరోవైపు, భారత్ దాదాపు 30 కోట్ల యూనిట్ల మొబైల్ ఫోన్ల ఉత్పత్తి స్థాయికి చేరుతుందని మార్కెట్ రీసెర్చ్, అనాలిసిస్ సంస్థ కౌంటర్పాయింట్ సహ వ్యవస్థాపకుడు నీల్ షా తెలిపారు.2025లో భారత్లో తయారైన ప్రతి నాలుగు ఫోన్లలో ఒకటి ఎగుమతయ్యిందని చెప్పారు. టెక్ దిగ్గజం యాపిల్ కారణంగా అమెరికా మార్కెట్ ప్రీమియం ఉత్పత్తులకు అతి పెద్ద ఎగుమతుల మార్కెట్గా నిలిచిందని పేర్కొన్నారు. శాంసంగ్, మోటరోలా వల్ల కూడా గణనీయంగా విలువ చేసే ఎగుమతులు నమోదైనట్లు తెలిపారు.ఇదీ చదవండి: పండగవేళ పసిడి దూకుడు.. తులం ఎంతంటే.. -
ఈ పనిచేయండి.. ఉద్యోగాలే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయ్?!
వాషింగ్టన్: ఉద్యోగార్ధులకు ముఖ్య గమనిక!. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారా?. వరుస పెట్టి రెజ్యూమేలు పంపిస్తున్నారా? అయినా ఇంటర్వ్యూ కాల్స్ రావడం లేదా?. అయితే, ఉద్యోగాల కోసం మీరు చేస్తున్న ప్రయత్నాల్ని వెంటనే ఆపేయండి. జస్ట్ ఈ పనిచేయండి చాలు. కాళ్లరిగేలా ఆఫీసులు చుట్టూ తిరగక్కర్లేదు. రిఫరెన్స్ ఇవ్వమని ప్రాధేయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. మిమ్మల్నే వెతుక్కుంటూ ఉద్యోగాలు వస్తాయి. ఎలా అంటారా? కెనడాకు చెందిన మార్మిక్ పటేల్ అమెరికాలో ఐటీ ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. తన ఎడ్యుకేషన్,స్కిల్స్,ఎక్స్పీరియన్స్ ఆధారంగా అందరిలాగే తాను రెజ్యూమేలు తయారు చేసి పంపించేవాడు. పదులు,ఇరవైల నుంచి వందల కొద్దీ రెజ్యూమేలు పంపిస్తున్నాడు. ఉద్యోగం కావాలని వేల మంది రిక్రూటర్లకు మెసేజ్లు పెడుతున్నారు. రిక్రూటర్ల నుంచి ఎలాంటి స్పందన వచ్చేది కాదు. ఇక లాభం లేదని రూటు మార్చాడు. అంతే.. ఐదు నెలల్లో 83 మంది రిక్రూటర్లు మా కంపెనీలు ఉద్యోగం ఉందని ఆఫర్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఇంతకీ మార్మిక్ పటేల్ చేసిందేంటో తెలుసా? పబ్లిసిటీ.అవును ఆయన గురించి ఆయన గొప్పగా చెప్పుకోవడం. ఇలా చెప్పుకోవడం చేతగాకపోతే ఉద్యోగం చేయడం, బిజినెస్ చేయాలనే ప్రయత్నాలు పక్కన పెట్టాలని సలహా ఇస్తున్నాడు. మీరు ఎంత చదివితేం. మీకంటూ ఓ స్కిల్ ఉందని అందరికి తెలియాలి కదా. అప్పుడే మనమేంటో ఈ ప్రపంచానికి తెలిసేది. చాలా మంది అనుకోవచ్చు. నా గురించి నేను గొప్పలు చెప్పుకుంటే ఏం బాగుంటుందని. అలా చెప్పుకోవాలి బ్రదర్. మార్కెట్లో అవకాశాలు సమానంగా పంచరు. 90 శాతం మందిలో 10శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు దక్కుతున్నాయి.ఇప్పుడు వారిలో నేనున్నందుకు సంతోషంగా ఉంది. ఇంతకీ నేను చేసిన పని ఏంటని అనుకుంటున్నారా? సంప్రదాయ పద్ధతిలో ఉద్యోగాలకు దరఖాస్తు చేయడం అత్యంత మూర్ఖమైన పని. అందుకే ఉద్యోగాలకు అప్లయి చేసే స్ట్రాటజీ మార్చాను. నా డొమైన్కు సంబంధించిన స్కిల్ను బిల్డ్ చేశాను. కంటెంట్ క్రియేట్ చేయడం, నెట్వర్కింగ్ పెంచుకుంటూ వెళ్లా. ఫలితంగా ఊహించని విధంగా నా కెరియర్ మలుపు తిరిగింది.నాకు ఉద్యోగం ఇచ్చేందుకు ఏఐ కంపెనీలు,వైకాంబినేటర్ స్టార్టప్స్,యూనికార్న్ కంపెనీలు ముందుకు వచ్చాయి. ప్రస్తుతం మెటా కంపెనీలో టెక్కీగా విధులు నిర్వహిస్తున్నాడు. జాబ్ కోసం ప్రయత్నించే సమయంలో ఇలాంటి వ్యూహాలు అమలు చేస్తే ఉద్యోగం పక్కగా వస్తుందని చెప్పుకొచ్చాడు. చివరిగా.. విజేతల్నే ప్రపంచం గుర్తుంచుకుంటుంది. విజయం సాధించడం, విజేతలుగా నిలవడం తప్ప మనకు వేరే మార్గం లేదని ముగించాడు. applying to jobs is the dumbest shit you can ever do.i learned the hard way. dmed a 1000 recruiters/engineers. did 670 apps. didn't get me anything. cause its not equally distributed: the top 10% of people take 90% of the jobs. it's the same everywhere else. the hottest… https://t.co/gEpcaViXS1— Marmik Patel (@Marmik_Patel19) January 12, 2026 -
ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు భవిష్యత్తులో సవాళ్లు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో ప్రస్తుతం కొనసాగుతున్న డేటా సెంటర్ల నిర్మాణ వేగాన్ని అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తీవ్రంగా తప్పుబట్టారు. 2026 న్యూయార్క్ టైమ్స్ డీల్ బుక్ సమ్మిట్ వేదికగా ఆయన మాట్లాడుతూ, ప్రైవేట్ కంపెనీలు తమ సొంత డేటా సెంటర్లను నిర్మించుకోవడాన్ని 110 ఏళ్ల క్రితం నాటి విద్యుత్ రంగ పరిస్థితులతో పోల్చారు.చారిత్రక తప్పిదమే పునరావృతం?మెటా, ఓపెన్ ఏఐ వంటి దిగ్గజ సంస్థలు తమ సొంత కంప్యూటింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవడాన్ని బెజోస్ తప్పుబట్టారు. 20వ శతాబ్దం ప్రారంభంలో పవర్ గ్రిడ్లు అందుబాటులోకి రాకముందు కర్మాగారాల్లో తమకు అవసరమైన విద్యుత్తును తామే ఉత్పత్తి చేసుకునేవారని, ఇప్పుడు ఏఐ రంగంలోనూ అదే జరుగుతోందని ఆయన గుర్తు చేశారు. ‘ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ సొంత డేటా సెంటర్లు నిర్మించుకుంటున్నారు. కానీ ఇది శాశ్వతం కాదు. దీనికి ఎన్నో సవాళ్లు ఉన్నాయి. రాబోయే రోజుల్లో భారీగా విద్యుత్తు వనరుల అవసరం పెరగనుంది. భవిష్యత్తులో టెక్ ఇండస్ట్రీ అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) వంటి కేంద్రీకృత క్లౌడ్ కంప్యూటింగ్ సేవల వైపు మళ్లడం అనివార్యం. అప్పుడే వనరుల దుర్వినియోగం తగ్గుతుంది’ అని ఆయన అంచనా వేశారు. గతంలో విద్యుత్ రంగం ఎలాగైతే కేంద్రీకృతమై సమర్థవంతంగా మారిందో, ఏఐ మౌలిక సదుపాయాల్లో కూడా అదే రకమైన విప్లవం రావాలని హెచ్చరించారు.పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ఏఐ వినియోగం పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ వినియోగం గణనీయంగా మారుతోంది. 2024లో డేటా సెంటర్లు 415 టెరావాట్ల విద్యుత్తును వాడగా, 2030 నాటికి ఇది 945 టెరావాట్లకు చేరుతుందని అంచనా. అమెరికా జాతీయ విద్యుత్ డిమాండ్లో డేటా సెంటర్ల వాటా 4 శాతం నుంచి 12 శాతానికి పెరిగే అవకాశం ఉంది. ఒక సాధారణ గూగుల్ సెర్చ్తో పోలిస్తే, ఒక్క చాట్ జీపీటీ ప్రాంప్ట్ 10 రెట్లు ఎక్కువ శక్తిని తీసుకుంటుంది. అలాగే ఒక లార్జ్ ఏఐ మోడల్ శిక్షణకు ఏడాదికి సుమారు 200 గృహాలకు సరిపడా విద్యుత్ అవసరమవుతుందని అంచనా.శక్తి వనరులే అసలైన అడ్డంకికేవలం బెజోస్ మాత్రమే కాకుండా, ఇతర టెక్ దిగ్గజాలు కూడా విద్యుత్ కొరతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఒక సందర్భంలో ‘తగినంత విద్యుత్ లేక జీపీయూ చిప్స్ ఖాళీగా ఉంటున్నాయి’ అని అంగీకరించారు. సుందర్ పిచాయ్ (గూగుల్ సీఈఓ) గతంలో మాట్లాడుతూ విద్యుత్ లభ్యత అనేది ఏఐ వృద్ధికి దీర్ఘకాలిక అడ్డంకి అని పేర్కొన్నారు. ఈ సమస్యను అధిగమించడానికి మెటా సంస్థ ఒహియోలో ఏర్పాటు చేస్తున్న తన సూపర్ క్లస్టర్ కోసం ఏకంగా అణు విద్యుత్ ఒప్పందాలను కుదుర్చుకోగా, ఆల్ఫాబెట్ సంస్థ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 4.75 బిలియన్ డాలర్లను వెచ్చించింది.ఇదీ చదవండి: లక్షకు పైగా యూఎస్ వీసాల రద్దు.. -
ఇక ఫ్రెషర్లకూ భారీ జీతాలు..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో పాటు అనుబంధ ఆధునిక సాంకేతికతలలో ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన ఫ్రెషర్లకు హెచ్సీఎల్ టెక్ (HCLTech) భారీ ఎంట్రీ లెవల్ జీతాలు ఆఫర్ చేస్తోంది. డేటా & ఏఐ, డిజిటల్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, ఎంటర్ప్రైజ్ స్కిల్స్ వంటి విభాగాల్లో నైపుణ్యం ఉన్న ఈ ఫ్రెషర్లను కంపెనీ అంతర్గతంగా ‘ఎలైట్ కేడర్’గా పిలుస్తోంది.జనవరి 12న జరిగిన డిసెంబర్ త్రైమాసిక ఎర్నింగ్స్ కాన్ఫరెన్స్లో హెచ్సీఎల్ టెక్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ రామ్ సుందరరాజన్ మాట్లాడుతూ.. ‘రెండు త్రైమాసికాల క్రితమే ఎలైట్ ఇంజనీర్లపై మా దృష్టిని స్పష్టంగా వెల్లడించాం. రెగ్యులర్ ఫ్రెషర్ నియామకాలతో పోలిస్తే, ఎలైట్ కేడర్కు 3 నుంచి 4 రెట్లు ఎక్కువ జీతాలు అందిస్తున్నాం. ఇది సంవత్సరానికి రూ.18 లక్షల నుంచి రూ.22 లక్షల వరకు ఉంటుంది’ అని తెలిపారు.ఎలైట్ కేడర్కు అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించాలంటే పోటీ జీతాలు అవసరమని ఆయన స్పష్టం చేశారు. 2025 జూలైలో సుందరరాజన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మొత్తం ఫ్రెషర్ నియామకాలలో ఎలైట్ కేడర్ వాటా సుమారు 15–20 శాతం ఉంటుంది. కంపెనీ ఇకపై పరిమాణం కంటే నాణ్యత, ప్రత్యేక నైపుణ్యాలపై ఎక్కువగా దృష్టి పెట్టనుంది. హెచ్సీఎల్ టెక్ మాత్రమే కాదు.. ప్రత్యర్థి సంస్థ ఇన్ఫోసిస్ కూడా ఇటీవల ఫ్రెషర్ల జీతాలను గణనీయంగా పెంచడం గమనార్హం.క్యూ3 ముగింపు నాటికి హెచ్సీఎల్ టెక్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,26,379లకు చేరింది. ఈ త్రైమాసికంలో కంపెనీ హెడ్కౌంట్ స్పల్పంగా 261 తగ్గింది. డిసెంబర్ త్రైమాసికంలో 2,852 మంది ఫ్రెషర్లను జోడించినప్పటికీ, అట్రిషన్, సెలెక్టివ్ రేషనలైజేషన్ కారణంగా మొత్తం వర్క్ఫోర్స్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. 2026 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటివరకు చేర్చుకున్న మొత్తం ఫ్రెషర్ల సంఖ్య 10,032 గా ఉంది.హెచ్సీఎల్ టెక్ క్యూ3 ఫలితాలునోయిడా కేంద్రంగా పనిచేస్తున్న హెచ్సీఎల్ టెక్ నికర లాభం డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో 11% తగ్గి రూ.4,076 కోట్లకు పరిమితమైంది. ఏకీకృత ఆదాయం 13.3% పెరిగి రూ.33,872 కోట్లు నమోదు చేసింది. -
ఐఫోన్ యూజర్లకు యాపిల్ అత్యవసర హెచ్చరిక
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తన ఐఫోన్ వినియోగదారులకు ఒక అరుదైన, ముఖ్యమైన భద్రతా హెచ్చరికను జారీ చేసింది. కొంతమంది వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని అధునాతనమైన ‘స్పైవేర్’ దాడులు జరుగుతున్నట్లు కంపెనీ గుర్తించింది. ఈ దాడులు ఎంత శక్తివంతమైనవంటే, సాధారణ సాఫ్ట్వేర్ అప్డేట్ల ద్వారా కూడా వీటిని పూర్తిగా నిరోధించడం యాపిల్కు సవాలుగా మారింది.ఏమిటీ దాడులు?ఇవి సాధారణంగా మనం చూసే వైరస్లు లేదా ఫిషింగ్ లింక్ల వంటివి కావు. ఇవి ‘జీరో-క్లిక్’ సాంకేతికతను ఉపయోగిస్తాయి. అంటే, వినియోగదారు ఎటువంటి లింక్ను క్లిక్ చేయకపోయినా, ఏ అటాచ్మెంట్ను ఓపెన్ చేయకపోయినా.. కేవలం ఒక మెసేజ్ రావడం ద్వారా లేదా బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ద్వారా ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది.సాధారణంగా ఇవి జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, దౌత్యవేత్తలు, కార్యకర్తలు, ఉన్నత స్థాయి అధికారులను లక్ష్యంగా చేసుకుని జరుగుతుంటాయి. ఈ దాడులకు సంబంధించిన విషయాలు యాపిల్ సంస్థకు కూడా తెలిసే అవకాశం ఉండకపోవచ్చు. అందుకే వీటిని ప్యాచ్ చేసేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోవచ్చు.ఐఓఎస్ 26 అప్డేట్ ఎందుకు ముఖ్యం?ప్రస్తుతం యాపిల్ తన అత్యంత సురక్షితమైన ఐఓఎస్ 26 వెర్షన్ను అందుబాటులోకి తెచ్చింది. అయితే, ఇది ఐఫోన్ 11, ఆపై మోడళ్లలో మాత్రమే అనుకూలంగా ఉంటుందని కొందరు చెబుతున్నారు. కీలకమైన సెక్యూరిటీ ప్యాచ్లు కేవలం ఐఓఎస్ 26లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. పాత వెర్షన్లకు (ఉదాహరణకు ఐఓఎస్ 18) యాపిల్ ఇకపై ప్యాచ్లను అందించదని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: పండుగ షాపింగ్.. భారీ డిస్కౌంట్లు కావాలా?ఇప్పుడేం చేయాలి?మీ డేటా, వ్యక్తిగత సమాచారం సురక్షితంగా ఉండాలంటే వెంటనే కొన్ని చర్యలు తీసుకోవాలి. మీ ఫోన్ ఐఫోన్ 11 లేదా ఆపై మోడల్ అయితే వెంటనే Settings > General > Software Update లోకి వెళ్లి iOS 26కు అప్డేట్ చేయండి.కనీసం రోజుకు ఒక్కసారైనా ఫోన్ను రీబూట్ చేయడం వల్ల బ్యాక్గ్రౌండ్లో నడుస్తున్న అనుమానాస్పద ప్రక్రియలు ఆగిపోయే అవకాశం ఉంది.మీరు ఒకవేళ కీలక వ్యక్తి అయి, మిమ్మల్ని లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని భావిస్తే ఫోన్లోని ‘లాక్డౌన్ మోడ్’ను ఆన్ చేయండి. ఇది వెబ్ బ్రౌజింగ్, మెసేజ్ అటాచ్మెంట్స్ వంటి కొన్ని ఫీచర్లను పరిమితం చేస్తుంది. హ్యాకర్లకు మీ ఫోన్ పట్టుబడకుండా రక్షణ కవచంలా పనిచేస్తుంది.సైబర్ దాడులు నిరంతరం మారుతుంటాయి. కాబట్టి సాఫ్ట్వేర్ అప్డేట్లను ఎప్పటికప్పుడు ఇన్స్టాల్ చేసుకోవడమే ఐఫోన్ వినియోగదారులకు ఉన్న అత్యుత్తమ రక్షణ అని గమనించాలి. -
రూ. 15వేలు కంటే తక్కువ ధరలో.. బెస్ట్ స్మార్ట్ఫోన్లు
2026 మొదలైపోయింది.. సంక్రాంతి కూడా వచ్చేసింది. ఈ సమయంలో కొందరు ఓ మంచి స్మార్ట్ఫోన్ కొనాలని ఎదురు చూస్తుంటారు. ఇక్కడ ఈ కథనంలో రూ. 15వేలు కంటే తక్కువ ధరలు అందుబాటులో ఉన్న ఐదు బెస్ట్ స్మార్ట్ఫోన్ల గురించి తెలుసుకుందాం.పోకో ఎం7 ప్రో 5జీరూ.13,499 ధర వద్ద లభించే ఈ 5జీ స్మార్ట్ఫోన్.. డ్యూయల్ 50MP కెమెరా 20MP సెల్ఫీ కెమెరా పొందుతుంది. ఇది మీడియా టెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా చిప్సెట్ పొందుతుంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్, 2100 nits పీక్ బ్రైట్నెస్ & డాల్బీ విజన్తో 6.67 ఇంచెస్ AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. 45W ఛార్జింగ్ సపోర్ట్తో 5110 mAh బ్యాటరీ ఇందులో చూడవచ్చు.ఒప్పో కే13ఎక్స్ఒప్పో కే13ఎక్స్ స్మార్ట్ఫోన్లో 50MP + 2MP డ్యూయల్ రియర్ కెమెరా & 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. మీడియా టెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ ఉంటుంది. దీని ధర 12,499 రూపాయలు. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్తో 6.67-అంగుళాల IPS LCD డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 45W ఛార్జింగ్తో 6000 mAh బ్యాటరీతో వస్తుంది.రెడ్మీ 15సీ12,999 రూపాయల ఈ స్మార్ట్ఫోన్ రూ. 15వేలు కంటే తక్కువ ధరలో లభించే స్మార్ట్ఫోన్ల జాబితాలో ఒకటి. మీడియాటెక్ హెలియో జీ81 అల్ట్రాతో లభించే ఈ ఫోన్.. 8MP సెల్ఫీ కెమెరాతో డ్యూయల్ 50MP రియర్ కెమెరాను కలిగి ఉంది. ఇది 6.9 ఇంచెస్ IPS LCD & 120 Hz రిఫ్రెష్ రేట్ను కలిగి ఉంది. ఇది 33 W ఛార్జర్తో 6000 mAh బ్యాటరీతో లభిస్తుంది.వివో T4 లైట్ 5జీవివో T4 లైట్ 5జీ మొబైల్.. 5MP సెల్ఫీ కెమెరాతో డ్యూయల్ 50MP వెనుక కెమెరాను కలిగి ఉంది. ఇది 90 Hz రిఫ్రెష్ రేట్తో 6.74-అంగుళాల IPS LCD డిస్ప్లేను కలిగి ఉంది. మీడియా టెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ కలిగిన ఈ ఫోన్ ధర రూ. 14,999. ఇది 15 W ఛార్జర్తో 6000 mAh బ్యాటరీని పొందుతుంది.మోటరోలా జీ57 పవర్ 5జీమోటరోలా G57 పవర్ 5జీ మొబైల్.. 6.72-అంగుళాల IPS LCD డిస్ప్లేతో.. 1050 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో 120 Hz రిఫ్రెష్ రేట్ను ప్రదర్శిస్తుంది. స్నాప్డ్రాగన్ 6s Gen 4 చిప్సెట్తో నడిచే ఈ ఫోన్ 7000 mAh బ్యాటరీతో లభిస్తుంది. ఇది 50MP + 8MP రియర్ కెమెరాను కలిగి ఉంది. దీని రేటు రూ. 14,999.ఇదీ చదవండి: బంపరాఫర్.. రూపాయికే సిమ్ కార్డు! -
కంపెనీ ఎందుకిలా అడుగుతోంది? అమెజాన్ ఉద్యోగుల్లో ఆందోళన
అమెజాన్ తన ఉద్యోగుల వార్షిక పనితీరు సమీక్ష విధానంలో కీలక మార్పులు చేసింది. ఏడాది కాలంలో తాము సాధించిన ముఖ్యమైన విజయాలు మూడు నుంచి ఐదు పేర్కొనడంపాటు, కంపెనీలో మరింత వృద్ధి సాధించడానికి తాము తీసుకోవాల్సిన చర్యలను కూడా వివరించాల్సిందిగా సంస్థ ఉద్యోగులను కోరుతోంది. అసలే లేఆఫ్లు కొనసాగుతున్న తరుణంలో కంపెనీ ఎందుకిలా అడుగుతోందని ఉద్యోగుల్లో ఆందోళన పట్టుకుంది.బిజినెస్ ఇన్సైడర్ నివేదిక ప్రకారం, ఉద్యోగులు ఇప్పుడు తమ ప్రభావాన్ని స్పష్టంగా చూపించే ప్రాజెక్టులు, లక్ష్యాలు లేదా కార్యక్రమాల నిర్దిష్ట ఉదాహరణలను వార్షిక సమీక్షలో భాగంగా సమర్పించాలి. “ఫోర్టే” (Forte)అనే ఈ కొత్త కార్యక్రమం ద్వారా, అమెజాన్ ఉద్యోగులు తమ విలువను నిరూపించుకునేలా తొలిసారిగా వ్యక్తిగత సాఫల్యాల జాబితాలను తప్పనిసరి చేసింది. ఇంతకుముందు అమెజాన్ పనితీరు సమీక్షలు మరింత ఓపెన్-ఎండెడ్గా ఉండేవి. ఉద్యోగులను వారి “సూపర్ పవర్స్” ఏమిటో, లేదా వారు అత్యుత్తమంగా పనిచేసే సమయంలో ఎలా వ్యవహరిస్తారో ప్రతిబింబించమని మాత్రమే అడిగేవారు. అయితే కొత్త విధానం స్పష్టమైన మార్పును సూచిస్తోంది.ఈ కొత్త వ్యవస్థతో అమెజాన్ కొలవదగిన ఫలితాలపై ఎక్కువగా దృష్టి సారిస్తోంది. అదే సమయంలో, ఉద్యోగులు తీసుకున్న రిస్కులు లేదా పూర్తిగా విజయవంతం కాకపోయిన ఆవిష్కరణల గురించి కూడా ప్రస్తావించమని అడుగుతోంది. “విజయాలు అనేవి మీ పని ప్రభావాన్ని చూపించే నిర్దిష్ట ప్రాజెక్టులు, లక్ష్యాలు, కార్యక్రమాలు లేదా ప్రక్రియలలో చేసిన మెరుగుదలలు. ఆశించిన ఫలితాలు రాకపోయినా, మీరు రిస్క్ తీసుకున్న లేదా ఆవిష్కరణ చేసిన సందర్భాలను పరిగణనలోకి తీసుకోండి” అంటూ అమెజాన్ అంతర్గత మార్గదర్శకాల్లో సూచించింది.ఆందోళన ఎందుకంటే..అమెజాన్లో ఫోర్టే సమీక్ష ప్రక్రియ వేతన నిర్ణయంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఉద్యోగులు జాబితా చేసిన వారి విజయాలు, సహోద్యోగుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్, అమెజాన్ నాయకత్వ సూత్రాలకు వారు ఎంతవరకు కట్టుబడి ఉన్నారు, అలాగే ఉద్యోగానికి సంబంధించిన నైపుణ్యాల ఆధారంగా వారి మేనేజర్లు అంచనా వేస్తారు. ఈ అంశాలన్నింటి ఆధారంగా ఉద్యోగికి “మొత్తం విలువ” (Overall Value) రేటింగ్ కేటాయిస్తారు. ఇది వార్షిక వేతనాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. -
కొత్త ఫోన్: పోకో ఎం8 5జీ వచ్చేసింది..!
స్మార్ట్ఫోన్ బ్రాండ్ ‘పోకో’ భారత మార్కెట్లో ‘పోకో ఎం8 5జీ’ పేరుతో 5జీ స్మార్ట్ఫోన్ విడుదల చేసింది. మిడ్రేంజ్ ధర విభాగపు కస్టమర్లే లక్ష్యంగా వచ్చిన ఈ స్మార్ట్ఫోన్లో శక్తివంతమైన ప్రాసెసర్, అధునాతన కెమెరా సెటప్, భారీ బ్యాటరీ ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి.ఇందులో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6 జెన్ 3 చిప్సెట్ను అమర్చారు. 6.77 అంగుళాల 3డీ కర్వ్డ్ డిస్ప్లే ఉంది. ఇది 120హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్, 240హెచ్జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్, 3,200 నిట్స్ పీక్ బ్రైట్నెస్కు సపోర్ట్ చేస్తుంది. వెట్ టచ్ టెక్నాలజీని కలిగి ఉంది. దీంతో తడిచేతులతో ఉపయోగించినా, తేలికపాటి వర్షంలోనూ పనిచేస్తుంది. వెనుక భాగంలో 50ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 2ఎంపీ లైట్ ఫ్యూజన్ 400 సెన్సర్ అందించారు.ముందు భాగంలో 20ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ స్మార్ట్ఫోన్లో 5,520ఎంహెచ్ఏ సామర్థ్యం కలిగిన భారీ బ్యాటరీ ఉంది. ఇది 45డబ్యూ ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, అలాగే 18డబ్ల్యూ రివర్స్ వైర్డ్ ఛార్జింగ్కు సపోర్ట్ ఇస్తుంది. నాలుగేళ్ల పాటు ఓఎస్ అప్డేట్స్, ఆరేళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్లు ఉంటాయి. మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది.6జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ ధర రూ.18,999గా కంపెనీ నిర్ణయించింది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర రూ.21,999గా.. 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ. 21,999గా ఉంది. హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులపై రూ.2,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. జనవరి 13 నుంచి ఫ్లిప్కార్ట్లో ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభం కానున్నాయి. -
బంపరాఫర్.. రూపాయికే సిమ్ కార్డు!
ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్-ఐడియా వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ఓ కొత్త ఆఫర్ తీసుకొచ్చింది. ఉచితంగా సిమ్ కార్డు అందించనున్నట్లు వెల్లడించింది.''సెలబ్రేషన్స్ ముగిశాయి, కానీ ఆనందం మాత్రం అలాగే ఉంది!. కేవలం ఒక రూపాయికే బీఎస్ఎన్ఎల్ సిమ్ పొందండి. దీని ద్వారా అపరిమిత కాల్స్, రోజుకు 2GB డేటా, రోజుకు 100 SMSలు.. 30 రోజుల చెల్లుబాటుతో ఆనందించండి. ఈ ఆఫర్ 2026 జనవరి 31 వరకు మాత్రమే. మీకు సమీపంలోని BSNL CSC లేదా రిటైలర్ని ఈరోజే సందర్శించండి!'' అని బీఎస్ఎన్ఎల్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.Celebration over, but the joy isn’t!Get a Free BSNL SIM for just ₹1 and enjoy Unlimited Calls, 2GB/day data, 100 SMS/day with 30 days of validity. Offer valid till 31st Jan 2026Walk into your nearest BSNL CSC or retailer today!#BSNL #DigitalBharat #BSNLOffer… pic.twitter.com/3KCkyujWOE— BSNL India (@BSNLCorporate) January 10, 2026 -
ఏడాది రీచార్జ్.. ఇదే చవక ప్లాన్!!
భారతదేశపు రెండో అతిపెద్ద టెలికాం సంస్థ అయిన ఎయిర్టెల్, తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త, చవక రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెడుతోంది. దేశవ్యాప్తంగా 390 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్న ఈ సంస్థ, ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాలిడిటీ ప్లాన్లపై దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో, సిమ్ను పూర్తిగా ఒక సంవత్సరం పాటు యాక్టివ్గా ఉంచే తక్కువ ధర ప్రీపెయిడ్ ప్లాన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.ఈ ప్లాన్ ముఖ్యంగా ఎక్కువ డేటా అవసరం లేని, కాలింగ్, ప్రాథమిక కనెక్టివిటీ అవసరమయ్యే వినియోగదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సీనియర్ సిటిజన్లు, తల్లిదండ్రులు, లేదా సెకండరీ/బ్యాకప్ సిమ్ ఉపయోగించే వారికి ఇది ఖర్చు తక్కువ పరిష్కారం. తక్కువ వ్యయంతో మీ మొబైల్ నంబర్ను ఏడాది పొడవునా యాక్టివ్గా ఉంచడమే ఈ రీఛార్జ్ ఉద్దేశం.ఎయిర్టెల్ రూ.2,249 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలుఎయిర్టెల్ రూ.2,249 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. రీఛార్జ్ చేసిన రోజు నుండి పూర్తి సంవత్సరం వరకు అన్ని నెట్వర్క్లకు అపరిమిత వాయిస్ కాల్స్ చేయవచ్చు. ఫోన్ వినియోగం ప్రధానంగా కాల్స్, చాటింగ్, పరిమిత ఇంటర్నెట్ అవసరాలకు మాత్రమే ఉంటే, ఈ ప్లాన్ మంచి ఎంపికగా చెప్పవచ్చు.డేటా, ఎస్ఎంఎస్ ప్రయోజనాలుఈ ప్లాన్లో రోజువారీ డేటా ఉండదు. బదులుగా, మొత్తం 30జీబీ హైస్పీడ్ డేటా వస్తుంది. దీన్ని 365 రోజుల కాలవ్యవధిలో అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకోవచ్చు. వాట్సాప్ చాటింగ్, ముఖ్యమైన ఇంటర్నెట్ అవసరాల కోసం ఈ డేటా సరిపోతుంది. అదనంగా 3,600 ఉచిత SMSలు కూడా లభిస్తాయి. ఇవి బ్యాంక్ అలర్టులు, OTPలు, ఇతర ముఖ్యమైన సందేశాల కోసం పూర్తిగా సరిపోతాయి.అదనపు బెనిఫిట్ఈ రీఛార్జ్ ప్లాన్తో ఎయిర్టెల్ ఒక ప్రత్యేక అదనపు ప్రయోజనాన్ని కూడా అందిస్తోంది. వినియోగదారులకు 12 నెలల పెర్ప్లెక్సిటీ ప్రో ఏఐ (Perplexity Pro AI) సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. దీని విలువ సుమారు రూ.17,000 వరకు ఉంటుందని అంచనా. ఈ ఏఐ టూల్ అధునాతన సెర్చ్, ఉత్పాదకత పనుల కోసం ఎంతో ఉపయోగపడుతుంది. తద్వారా ఈ రీఛార్జ్ ప్లాన్ విలువ మరింత పెరుగుతుంది. -
అదే రీఛార్జ్ ప్లాన్.. పెరిగిన డైలీ డేటా!
రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ఉన్న రీఛార్జ్ ప్లాన్లకు ఎక్కువ డేటా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.బీఎస్ఎన్ఎల్.. తన రూ. 2399, రూ. 485, రూ. 347, రూ. 225 రీఛార్జ్ ప్లాన్ల మీద 0.5 జీబీ అదనపు డేటా అందిస్తుంది. గతంలో ప్యాక్ రీఛార్జ్ ద్వారా 2.5 జీబీ డేటా లభిస్తే.. ఇప్పుడు అదే ప్యాక్ రీఛార్జ్ చేసుకుంటే 3.0 జీబీ డేటా లభిస్తుంది. ఈ ఆఫర్ 2026 జనవరి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.BSNL enhances prepaid plans with extra daily data!Enjoy a data boost on ₹2399, ₹485, ₹347 & ₹225 at no extra cost. Stay connected longer on Bharat’s trusted network. Offer valid till 31 Jan 2026Recharge smart via #BReX 👉 https://t.co/41wNbHpQ5c#BSNL… pic.twitter.com/iQvAesldmr— BSNL India (@BSNLCorporate) January 9, 2026 -
ఎక్స్ గ్రోక్ యూజర్లకు బిగ్ షాక్
ఎడాపెడా గ్రోక్ను వాడేస్తున్న యూజర్లకు ఎక్స్ పెద్ద షాకే ఇచ్చింది. బూతు కంటెంట్ వివాదం నేపథ్యంలో గ్రోక్ చాట్బాట్పై పరిమితులు విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై కేవలం సబ్స్క్రైబర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది.ఎక్స్ ఫ్లాట్ఫారమ్లో(పూర్వపు ట్విటర్)లో ‘గ్రోక్’ కృత్రిమ మేధ చాట్బాట్ వినోదం కోసం తీసుకొచ్చారు. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, సమాచారం అందజేయడం.. తొలినాళ్లలో నవ్వులు పూయిచింది ఇది. అయితే రాను రాను గ్రోక్ వికృత రూపం దాల్చింది. గ్రోక్లో అశ్లీల, అసభ్యకర, అభ్యంతరకర దృశ్యాల రూపకల్పనకు దుర్వినియోగం అవుతుండటంపై పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ప్రముఖులతో పాటు సాధారణ ప్రజల ఫొటోలను అశ్లీల, అసంబద్ధ ప్రాంప్ట్లతో ఎడిట్లు చేస్తున్నారు పలువురు యూజర్లు. అటు గ్రోక్ కూడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా తన పని తాను చేసుకుంటూ పోయింది. ఈ అంశంపై పలు దేశాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఇటు భారత ప్రభుత్వం సైతం సీరియస్ అయ్యింది. వివరణ కోరుతూ ఎక్స్కు నోటీసులు కూడా జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తిన నేపథ్యంలో ఎక్స్ చర్యలు చేపట్టింది. ఈ చాట్బాట్లోని ఇమేజ్ జనరేషన్ ఫీచర్పై పరిమితులు విధించింది. అయితే.. గ్రోక్ (Grok) అనేది xAI రూపొందించిన AI అసిస్టెంట్. ఇది 2023 చివర్లో మొదటి వెర్షన్గా వచ్చింది. అప్పటి నుంచి పలు అప్డేట్లు, కొత్త వెర్షన్లు విడుదలయ్యాయి. 2025 చివర్లో Grok 4.1 Thinking విడుదల కాగా, 2026 జనవరి నాటికి Grok ఇప్పటికే X ప్లాట్ఫారమ్లో భాగమైంది.తీవ్ర విమర్శల వేళ ఇకపై Grok (గ్రోక్) చాట్బాట్ ఫీచర్ Xలో కేవలం సబ్స్క్రైబర్లకే అందుబాటులో ఉండనుంది. ఫ్రీ యూజర్లకు యాక్సెస్ నిలిపివేయడం మొదలుపెట్టింది. గ్రోక్ను ఉపయోగించాలంటే ఎక్స్ ప్రీమియం X Premium లేదా ప్రీమియం ఫ్లస్ Premium+ ప్లాన్ తీసుకోవాలి. ప్రీమియం ప్లాన్ ధర నెలకు రూ.650 ( 8 డాలర్లు), ప్రీమియం ఫస్ల్ ధర నెలకు రూ.1,300 (16 డాలర్లు)గా ఉంది. సంవత్సరం ప్లాన్ ప్రీమియం ధర రూ.6,800, ప్రీమియమ్ ఫ్లస్ ప్లాన్ ధర రూ.13,600గా ఉంది. అయితే ప్రీమియం వెర్షన్లో అందుబాటులో ఉండడమూ ఆందోళన కలిగించే అంశమే కదా అని అంటున్నారు పలువురు. -
పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు?
కొత్త ఏడాదిలో దాదాపు అన్ని ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచాయి. ఇప్పుడు టెలికాం కంపెనీలు మొబైల్ రీఛార్జ్ ధరలను పెంచే యోచనలో ఉన్నాయి. ఇదే నిజమైతే 2026 జూన్ నెలలో టారిఫ్ ప్లాన్స్ 15 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా.రిలయన్స్ జియో తన మొబైల్ టారిఫ్లను 10 శాతం నుంచి 20 శాతం పెంచవచ్చు. ఎయిర్టెల్ కూడా ఇదే బాటలో అడుగులు వేస్తుందని సమాచారం. అయితే వోడాఫోన్ ఐడియా (VI) పరిస్థితి మరింత సవాలుగా మారనుంది. దాని బకాయి చెల్లింపులను తీర్చడానికి, కంపెనీ FY27 & FY30 మధ్య మొబైల్ సర్వీస్ రేట్లను 45 శాతం వరకు పెంచాల్సి రావచ్చు.ఏ కంపెనీ ఎంత టారిఫ్లను పెంచుతుందనే విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఒక అంచనా ప్రకారం.. ప్రస్తుతం రూ.319 ఖరీదు చేసే ఎయిర్టెల్ 28 రోజుల అన్లిమిటెడ్ 5G ప్లాన్ రూ.419కి పెరగవచ్చని స్టాన్లీ నివేదిక చెబుతోంది. జియో రూ.299 ప్లాన్ను రూ.359కు పెంచే యోజన ఉంది. రూ.349గా ఉన్న 28 రోజుల 5G ప్లాన్.. రూ.429కి పెరగవచ్చు.ఇదీ చదవండి: జియో కొత్త ప్లాన్.. 100లోపే రీఛార్జ్!జూన్ 2026 నుంచి టారిఫ్లు పెరిగితే, సాధారణ వినియోగదారులు తమ మొబైల్ రీఛార్జ్ కోసం కొంత ఎక్కువ డబ్బు కేటాయించాల్సి ఉంది. ప్రీపెయిడ్ వినియోగదారులకు & ఎక్కువ డేటా వినియోగించేవారి ఇది కొంత కష్టతరం అయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు టెలికాం కంపెనీల అధికారిక ప్రకటనల కోసం వేచి చూడాల్సి ఉంది. -
ఉద్యోగులకు ఊహించని షాకిచ్చిన టీసీఎస్
దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కొంత మంది ఉద్యోగులకు ఊహించని షాకిచ్చింది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ (WFO) నిబంధనలను గత త్రైమాసికాల్లో పాటించని వారికి వార్షికోత్సవ ఆధారిత పనితీరు శాలరీ అప్రైజల్స్ను నిలిపివేసినట్లు సమాచారం.దేశంలో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ అయిన టీసీఎస్లో, ఉద్యోగి ఒక సంవత్సరం సర్వీస్ పూర్తి చేసిన అనంతరం వార్షిక సైకిల్ ప్రకారం అప్రైజల్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అర్హత కలిగిన ఫ్రెషర్లకు ఈమెయిల్ ద్వారా సమాచారం పంపిస్తారు. అలాగే సంస్థ అంతర్గత పోర్టల్ ‘అల్టిమాటిక్స్’లోనూ ఈ అప్డేట్ కనిపిస్తుంది.ఈమెయిల్లో ఏం చెప్పిందంటే..“మీ వార్షికోత్సవ అప్రైజల్ ప్రక్రియ పూర్తయినప్పటికీ, Q2 FY26 (జూలై 2025 – సెప్టెంబర్ 2025) వరకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పాటించకపోవడంతో కార్పొరేట్ స్థాయిలో తదుపరి ప్రాసెసింగ్ జరగలేదు. జనవరి 2025లో మీ వార్షికోత్సవం ఉన్నప్పటికీ Q3లోనూ WFO పాటించకపోతే, మీరు FY26 బ్యాండింగ్ సైకిల్కు అనర్హులవుతారు. పనితీరు బ్యాండ్ విడుదల చేయబడదు” అని ఓ ఉద్యోగికి పంపిన ఈమెయిల్లో టీసీఎస్ యాజమాన్యం పేర్కొందని టైమ్స్ ఆఫ్ ఇండియా ఉటంకించింది.ప్రస్తుతం టీసీఎస్ ఉద్యోగులు వారానికి ఐదు రోజులు కార్యాలయం నుంచే పని చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్న తొలి ప్రధాన భారతీయ ఐటీ సంస్థగా టీసీఎస్ నిలిచింది. ఇతర ఐటీ సంస్థలు సాధారణంగా వారానికి రెండు నుంచి మూడు రోజులు మాత్రమే కార్యాలయ హాజరును తప్పనిసరి చేస్తుండగా, టీసీఎస్ ఆఫీస్ హాజరును వేరియబుల్ పే, అప్రైజల్స్తో అనుసంధానించింది.టీసీఎస్లో వార్షికోత్సవ అప్రైజల్ ప్రక్రియ ఓ పద్ధతి ప్రకారం జరుగుతుంది. మొదట కంపెనీ లాంఛనంగా ఈ ప్రక్రియను ప్రారంభిస్తుంది. అనంతరం సూపర్వైజర్ ఉద్యోగి గోల్ షీట్ను సిద్ధం చేస్తారు. సదరు ఉద్యోగి దానిని సమీక్షించి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అప్రైజర్తో చర్చలు జరుగుతాయి. సంవత్సరంలో సాధించిన లక్ష్యాల ఆధారంగా పనితీరు మూల్యాంకనం నిర్వహించి, తుది బ్యాండింగ్ ఫలితాలను విడుదల చేస్తారు.కాగా 2022లో లేటరల్ నియామకాల (లాటరల్ హైర్స్) కోసం టీసీఎస్ చివరి వార్షికోత్సవ అప్రైజల్స్ను నిలిపివేసింది. ఇక గతేడాది టీసీఎస్ తన వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మినహాయింపు విధానంలో మార్పులు చేసింది. భారతదేశంలోని ఉద్యోగులు ప్రతి త్రైమాసికంలో వ్యక్తిగత అత్యవసర పరిస్థితుల కోసం గరిష్టంగా ఆరు రోజుల వరకు మినహాయింపులు పొందవచ్చు. ఉపయోగించని రోజులను తదుపరి త్రైమాసికానికి మళ్లించుకునే అవకాశం లేదు.ఇది చదివారా? ఐటీ ఉద్యోగులకు మరో కఠిన నిబంధన!కార్యాలయ స్థల పరిమితులను దృష్టిలో ఉంచుకుని, ఉద్యోగులు ఒకే ఎంట్రీలో గరిష్టంగా 30 మినహాయింపు అభ్యర్థనలను సమర్పించవచ్చు. నెట్వర్క్ సంబంధిత సమస్యలను ఒకేసారి ఐదు ఎంట్రీల వరకు మాత్రమే నివేదించవచ్చు. అయితే హాజరు మినహాయింపుల కోసం బల్క్ అప్లోడ్లు లేదా బ్యాకెండ్ ద్వారా సబ్మిట్ చేయడాన్ని కంపెనీ నిషేధించింది. -
CES 2026: లాలిపాప్తో మ్యూజిక్.. అదిరిపోయే గాడ్జెట్స్ మీకోసం
వాషింగ్టన్ డీసీ: హలో టెక్ లవర్స్. అమెరికాలో కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES 2026)లో జరుగుతుంది కదా. మరి ఈ టెక్ షోలో మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసే గాడ్జెట్స్పాటు ఇతర ప్రొడక్ట్ల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే, తెలుసుకుందాం పదండి.ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో తమ తాజా ఆవిష్కరణలను ప్రదర్శించాయి. ఈ ప్రదర్శనలో సాధారణ గాడ్జెట్లు మాత్రమే కాకుండా, వినియోగదారులను ఆశ్చర్యపరిచే విచిత్రమైన ఉత్పత్తులు చూపరులను కట్టిపడేశాయి.వాటిల్లో ఐపాలిష్ డిజిటల్ మేనిక్యూర్మగువుల కోసం ప్రత్యేకంగా ఐపాలిష్ డిజిటల్ మేనిక్యూర్ను డిజైన్ చేశారు. ఇదే ప్రపంచంలోనే మొదటి డిజిటల్ మేనిక్యూర్ సిస్టమ్.ఇందులో ప్రెస్-ఆన్ నెయిల్స్లో మైక్రో డిస్ప్లే ఉంది. స్మార్ట్ఫోన్లోని యాప్ సాయంతో 400 షేడ్స్ను వెంటనే మార్చుకోవచ్చు. యాప్లో 400 వేర్వేరు షేడ్స్/రంగులు అందుబాటులో ఉంటాయి. యూజర్ యాప్లో తనకు నచ్చిన రంగును ఎంచుకుంటే, ఆ రంగు వెంటనే నెయిల్పై డిస్ప్లేలో కనిపిస్తుంది.అంటే,నెయిల్ పాలిష్ మార్చుకోవడానికి మళ్లీ కొత్తగా అప్లై చేయాల్సిన అవసరం లేదు. కేవలం యాప్లో టచ్ చేస్తే సరిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే, స్మార్ట్ఫోన్ యాప్ ద్వారా గోళ్ల రంగు డిజిటల్గా మారుతుంది. ఇది ఫ్యాషన్కి టెక్నాలజీని జోడించిన వినూత్న ఆవిష్కరణ.వైబ్రేటింగ్ కిచెన్ బ్లేడ్లు C-200 అల్ట్రాసోనిక్ చెఫ్స్ నైఫ్వైబ్రేటింగ్ కిచెన్ బ్లేడ్. దీని స్పెషాలిటీ ఎంతో తెలుసా?.ఈ కత్తి సాధారణ కత్తి కాదు. ఇందులో అల్ట్రాసోనిక్ వైబ్రేషన్ టెక్నాలజీ అమర్చబడి ఉంది.సెకనుకు 30వేల సార్లు వైబ్రేట్ అవుతుంది. కఠినమైన కూరగాయలు, పండ్లు కూడా రెప్పపాటు కాలంలో కోయగలదు. ఆహారం బ్లేడ్కు అంటకుండా సాఫీగా కట్ అవుతుంది.ఈ కత్తి వంటగదిలో సులభంగా, వేగంగా, శుభ్రంగా కట్ చేయడానికి సహాయపడుతుంది. టమోటాలు, స్క్వాష్, దోసకాయ వంటి కూరగాయలు మాంసం, చేపలు,బ్రెడ్, పండ్లు ఇవన్నీ రెప్పపాటు కాలంలో కోయగలదు.సీ-200 అల్ట్రాసోనిక్ చెఫ్ వంటగదిలో టెక్నాలజీని జోడించిన వినూత్న ఆవిష్కరణ. ఇది కేవలం కత్తి మాత్రమే కాదు, వంటను మరింత సులభం, వేగం, శుభ్రంగా చేసే స్మార్ట్ కిచెన్ టూల్. ఇందులో 1100 ఎంఏహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ, యూఎస్బీ-సీ టైప్ ఛార్జింగ్ సౌకర్యం, అలాగే ఐపీ65 వాటర్ రెసిస్టెన్స్ ఉన్నాయి. వంటగదిలో వినియోగించడానికి ఇది చాలా సులభంగా, సురక్షితంగా ఉంటుంది.లాలిపప్ స్టార్లాలిపాప్. స్ట్రెస్ నుంచి రిలీఫ్ ఇచ్చే ఓ తియ్యటి పదార్ధం. పిల్లలు, పెద్దలకు ఫన్ ట్రీట్ ఇచ్చే లాలిపప్కు ఓ టెక్ కంపెనీ బోన్ కండీషన్ టెక్నాలజీని జోడించింది. అంతే ఈ తరహా టెక్నాలజీ ఉన్న లాలిపాప్ను తిన్నప్పుడల్లా పాటలు వినొచ్చు. అదెలా అంటే లాలిపాప్ను కొరుక్కునప్పుడు, దాని హ్యాండిల్లోని చిన్న ఎలక్ట్రానిక్ మాడ్యూల్ వైబ్రేషన్లు సృష్టిస్తుంది. ఆ వైబ్రేషన్లు మీ దవడ ఎముకల ద్వారా నేరుగా లోపలి చెవి భాగాలకు చేరుతుంది.పాటలు వినగలుగుతారు.ఎలక్ట్రానిక్ భాగం ఉన్నందున, పూర్తిగా తినకూడదు. కేవలం లాలిపాప్ భాగం మాత్రమే తినదగినది. సాధారణ హెడ్ఫోన్లతో పోలిస్తే శబ్దం తక్కువ స్పష్టంగా ఉండవచ్చు.వీరల్ సోలార్ ఛార్జింగ్ కోప్లౌ పవర్ హాట్ఈకోఫ్లో పవర్ హ్యాట్ (EcoFlow Power Hat) అనేది సోలార్ సెల్స్తో కూడిన వైడ్ బ్రిమ్ హ్యాట్. ఇది కేవలం సూర్యరశ్మి నుండి రక్షణ ఇవ్వడం మాత్రమే కాదు, బయట నడుస్తూ లేదా అవుట్డోర్ యాక్టివిటీల్లో ఉన్నప్పుడు స్మార్ట్ఫోన్ వంటి చిన్న గాడ్జెట్లను ఛార్జ్ చేసే ప్రత్యేకతను కలిగి ఉంటుంది. హ్యాట్ చుట్టూ అమర్చిన సోలార్ ప్యానెల్స్ సూర్యరశ్మిని గ్రహించి, గరిష్టంగా 12 వాట్స్ పవర్ ఉత్పత్తి చేస్తాయి. ఈ పవర్ను యూఎస్బీఏ,యూఎస్బీ సీ పోర్టుల ద్వారా ఒకేసారి రెండు డివైస్లకు అందించవచ్చు. ఈటోపీ తేలికైన మెటీరియల్తో తయారు చేసింది. బరువు అనిపించదు. ఐపీ65 వాటర్ప్రూఫ్, డస్ట్ప్రూఫ్ రేటింగ్తో హైకింగ్, బీచ్ ట్రిప్స్, ఫిషింగ్ వంటి అవుట్డోర్ యాక్టివిటీలకు అనుకూలంగా ఉంటుంది. ఔట్డోర్లో ఉన్నప్పుడు పవర్ బ్యాంక్ లేకపోయినా, ఈ హ్యాట్ ద్వారా ఫోన్ లేదా చిన్న గాడ్జెట్లను ఛార్జ్ చేసుకోవచ్చు.ఈ హ్యాట్ కేవలం సూర్యరశ్మిలో ఉన్నప్పుడు మాత్రమే పవర్ ఉత్పత్తి చేస్తుంది. 12డబ్ల్యూ పవర్ పరిమితి కారణంగా ల్యాప్టాప్లు లేదా పెద్ద గాడ్జెట్లను ఛార్జ్ చేయడం సాధ్యం కాదు.ఏఐ స్మార్ట్ క్లిప్పర్Glyde Smart Hair Clipper అనేది ఏఐ ఆధారిత పనిచేసే హెయిర్కట్ పరికరం. ఇది తల ఆకారాన్ని గుర్తించి బ్లేడ్ యాంగిల్, స్పీడ్ను ఆటోమేటిక్గా సర్దుబాటు చేస్తుంది. మొబైల్ యాప్ ద్వారా విజువల్ గైడెన్స్ అందిస్తూ, ఇంట్లోనే సలూన్-క్వాలిటీ హెయిర్కట్ చేస్తుంది. ఈ ఎయిర్ క్లిప్పర్ను తాజా ఈవెంట్లో పరిచయం చేశారు. ఇది ప్రపంచంలోనే మొదటి ఏఐ ఆధారిత హెయిర్ క్లిప్పర్గా గుర్తింపు పొందింది. దీని లక్ష్యం ఒకటే ఎవరైనా, ఎలాంటి అనుభవం లేకపోయినా, 10 నిమిషాల్లో ఇంట్లోనే సెలూన్ క్వాలిటీ హెయిర్కట్ చేసేందుకు ఉపయోగపడటం. ఈ క్లిప్పర్లో ఎఐ స్టైలిస్ట్ అనే సిస్టమ్ ఉంటుంది. ఇది తల ఆకారాన్ని స్కాన్ చేసి, బ్లేడ్ యాంగిల్, స్పీడ్ను ఆటోమేటిక్గా సర్దుబాటు చేస్తుంది. కాబట్టి కత్తిరింపు సమయంలో పొరపాట్లు జరగకుండా, సాఫ్ట్గా, సమానంగా హెయిర్కట్ అవుతుంది.సాధారణ క్లిప్పర్ కంటే ఖరీదు ఎక్కువగా ఉంటుంది. యాప్ లేకుండా పూర్తి ఫీచర్లు ఉపయోగించలేరు. మొదటిసారి ఉపయోగించే వారికి కొంత సమయం పట్టవచ్చు. -
శాంసంగ్ కొత్త టెలివిజన్.. ఇలాంటిది ఇదే తొలి టీవీ
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల తయారీ సంస్థ శాంసంగ్ సరికొత్త మోడల్ టెలివిజన్ను తీసుకొచ్చింది. ‘సీఈఎస్ 2026’లో ప్రపంచంలోనే మొట్టమొదటి 130-అంగుళాల మైక్రో ఆర్జీబీ టీవీ (R95H మోడల్)ను ఆవిష్కరించింది. ఇది శాంసంగ్ ఇప్పటివరకు రూపొందించిన అతిపెద్ద మైక్రో ఆర్జీబీ డిస్ప్లే మాత్రమే కాదు, అల్ట్రా-ప్రీమియం టీవీల డిజైన్, టెక్నాలజీలో ఒక కొత్త దిశను సూచిస్తోంది.“మైక్రో ఆర్జీబీ మా పిక్చర్ క్వాలిటీ ఆవిష్కరణలో అత్యున్నత స్థాయి. ఈ 130-అంగుళాల మోడల్ ఆ దృష్టిని మరింత ముందుకు తీసుకెళ్తుంది” అని శాంసంగ్ విజువల్ డిస్ప్లే బిజినెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హన్ లీ తెలిపారు. “టెక్నాలజీని కళగా మలిచే మా ఒరిజినల్ డిజైన్ తత్వాన్ని ఆధునిక ఇంజనీరింగ్తో మళ్లీ పరిచయం చేస్తున్నాం” అన్నారు.టీవీ ఫీచర్లుఈ మైక్రో ఆర్జీబీ టీవీ భారీ పరిమాణం, నెక్స్ట్-జనరేషన్ కలర్ టెక్నాలజీ, ప్రీమియం డిజైన్ల సమ్మేళనం. ‘టైమ్లెస్ ఫ్రేమ్’ డిజైన్తో రూపొందిన ఈ టీవీ, గదిలో ఒక సాధారణ స్క్రీన్లా కాకుండా ఒక విశాలమైన, లీనమయ్యే కళాఖండంలా కనిపిస్తుంది.130-అంగుళాల మోడల్లో మైక్రో ఆర్జీబీ ఏఐ ఇంజిన్ ప్రో, కలర్ బూస్టర్ ప్రో, హెచ్డీఆర్ ప్రో వంటి అధునాతన టెక్నాలజీలు ఉన్నాయి. ఇవి ఏఐ సహాయంతో రంగుల స్పష్టత, కాంట్రాస్ట్, వివరాలను మెరుగుపరుస్తాయి.మైక్రో ఆర్జీబీ ప్రెసిషన్ కలర్ 100 ద్వారా 100% బీటీ.2020 వైడ్ కలర్ గ్యామట్ను అందిస్తుంది. వీడీఈ సర్టిఫికేషన్తో, నిజ జీవితానికి దగ్గరగా రంగులను ప్రదర్శిస్తుంది. శాంసంగ్ గ్లేర్ ఫ్రీ టెక్నాలజీ ప్రతిబింబాలను తగ్గించి అన్ని లైటింగ్ పరిస్థితుల్లో స్పష్టమైన వీక్షణను ఇస్తుంది.ఈ టీవీ హెచ్డీఆర్10+ అడ్వాన్స్డ్, ఎక్లిప్సా ఆడియో, అలాగే మెరుగైన విజన్ ఏఐ కంపానియన్కు సపోర్ట్ చేస్తుంది. ఏఐ ఫుట్బాల్ మోడ్ ప్రో, ఏఐ సౌండ్ కంట్రోలర్ ప్రో, లైవ్ ట్రాన్స్లేట్, జనరేటివ్ వాల్పేపర్, మైక్రోసాఫ్ట్ కోపైలట్, పెర్ప్లెక్సిటీ వంటి ఫీచర్లతో స్మార్ట్ అనుభవాన్ని అందిస్తుంది. -
జియో కొత్త ప్లాన్.. 100లోపే రీఛార్జ్!
దేశీయ టెలికామ్ దిగ్గజం రిలయన్స్ జియో.. తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త రీఛార్జ్ ప్లాన్స్ పరిచయం చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే 91 రూపాయల రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.కంపెనీ పరిచయం చేసిన ఈ లేటెస్ట్ రూ. 91 ప్లాన్ కేవలం జియోఫోన్ యూజర్ల కోసం మాత్రమే. దీని ద్వారా 28 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ పొందవచ్చు. ఈ ప్లాన్ ద్వారా 3జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 50 ఎస్ఎమ్ఎస్లు లభిస్తాయి. అయితే ఈ ప్లాన్ స్మార్ట్ఫోన్ వినియోగదారులకు వర్తించదు. సామాన్య ప్రజలకు అందుబాటు ధరలో రీఛార్జ్ ప్లాన్ ఉండాలనే ఉద్దేశ్యంతో.. జియో ఈ ప్లాన్ తీసుకొచ్చింది.ఇతర రీఛార్జ్ ప్లాన్స్!రూ.3,599 ప్లాన్: ఈ ప్లాన్ 365 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఒక్కసారి రీచార్జ్ చేసి వదిలేసే వారి కోసం ప్రత్యేకంగా ఈ ప్లాన్ను రూపొందించారు. ఇందులో ఏడాది పొడవునా పాన్-ఇండియా రోమింగ్ తో అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ప్రతిరోజూ 2.5 జీబీ హైస్పీడ్ డేటా.. అంటే మొత్తం 912.5 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఉచితంగా పంపుకోవచ్చు. 5జీ కవరేజీ ఉన్న ప్రాంతాల్లో అపరిమిత 5జీ డేటాను ఉపయోగించుకోవచ్చు. ఇక జియో టీవీ, జియోఏఐ క్లౌడ్, గూగుల్ జెమిని ప్రో సబ్ స్క్రిప్షన్ అదనపు ప్రయోజనాలు.రూ.3,999 ప్లాన్: లైవ్ స్పోర్ట్స్ ను ఇష్టపడే వ్యక్తుల కోసం ఈ ప్లాన్ ప్రత్యేకంగా రూపొందించింది జియో. ఈ ప్లాన్ ప్రీమియం ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ను అందిస్తుంది. వ్యాలిడిటీ 365 రోజులు. పాన్-ఇండియా రోమింగ్ తో అపరిమిత కాలింగ్ ఉంటుంది. ప్రతిరోజూ 2.5 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. 5జీ కవరేజీ ఉన్న ప్రాంతాలలో అపరిమిత 5జీ డేటాను ఆనందించవచ్చు. ఫ్రీ ఫ్యాన్ కోడ్ యాప్ ఇందులో లభించే ఓటీటీ బెనిఫిట్. అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే జియో టీవీ, జియోఏఐ క్లౌడ్, గూగుల్ జెమిని ప్రో వంటివి లభిస్తాయి. -
అదే జరిగితే అంతరిక్షంలో చెత్తంతా మాయం!
మీకు తెలుసా? భూమి చుట్టూ ఉపగ్రహాలు తిరిగే కక్ష్యలో బోలెడంత చెత్త పేరుకుపోయిందని?. పనిచేయని శాటిలైట్లు, రాకెట్ భాగాలు... నట్లు, బోల్టుల్లాంటివి 68 ఏళ్లుగా పోగుపడుతున్నాయని?. అర్జంటుగా తీసేయకపోతే.. కొత్తగా వచ్చి చేరే శాటిలైట్లకు ప్రమాదమని?. ఈ పని చేసేందుకు స్టార్టప్ కంపెనీ ‘కాస్మో సర్వ్’ అన్ని సిద్ధం చేసుకుని రెడీ అవుతోందని?.. అవునండి ఇది నిజం. 1957లో మొట్టమొదటి ఉపగ్రహం స్పుట్నిక్ ప్రయోగంతోనే అంతరిక్షంలో ఈ చెత్త సమస్య కూడా మొదలైంది. ఏళ్లు గడుస్తున్న కొద్దీ అంతకంతకూ పెరుగుతూ వచ్చింది కూడా. తాజా లెక్కల ప్రకారం.. భూమి చుట్టూ వేర్వేరు కక్ష్యల్లో ఇప్పుడు కొన్ని లక్షల సంఖ్యలో వస్తువులు పడి ఉన్నాయి. వీటిల్లో పనిచేయని ఉపగ్రహాలు మాత్రమే కాదు.. విడిభాగాలు, సౌరఫలకాలు, నట్లు, బోల్టుల్లాంటివి కూడా ఉన్నాయని అంచనా. అయితే ఏంటి? అంటున్నారా?.. సింపుల్.. ఇంకొన్ని ఏళ్లు గడిస్తే కొత్త ఉపగ్రహాలు తిరిగేందుకు స్థలం ఉండదు. ఒకవేళ ప్రయోగించినా.. ఇప్పటికే అక్కడ పోగుపడి ఉన్న వ్యర్థాల్లో ఏదో ఒకటి ఢీకొనే అవకాశాలు పెరుగుతాయి. అందుకే వీటిని అర్జంటుగా తొలగించాల్సిన అవసరం ఏర్పడింది. రెండు మూడు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి కానీ... మా కంపెనీ ‘కాస్మో సర్వ్’ ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్లు ఒక్కసారి ప్రయోగిస్తే వంద ఉపగ్రహాలను లేదంటే భాగాలను తొలగించేస్తుంది అంటున్నారు చిరంజీవి ఫణీంద్ర. ఇస్రోలో పద్నాలుగేళ్లు పనిచేసి.. అంతరిక్ష వ్యర్థాలపై ఐక్యరాజ్య సమతి ఏర్పాటు చేసిన కమిటీలో భారత్కు ప్రాతినిథ్యం వహించారీ చిరంజీవి ఫణీంద్ర. అంతరిక్ష వ్యర్థాల తొలగింపు అవసరాన్ని.. అందులోని వ్యాపారాన్ని గుర్తించిన ఈ శాస్త్రవేత్త గత ఏడాది ఆగస్టులో ‘కాస్మోసర్వ్’ను ఏర్పాటు చేశారు. భూమి చుట్టూ తిరుగుతున్న వ్యర్థాలను ఒడిసిపట్టుకుని.. భూ వాతావరణంలోకి పంపేసి మండిపోయేలా చేసేందుకు అద్భుతమైన టెక్నాలజీ ఒకదాన్ని అభివృద్ధి చేశారు. దేశంలోనే పేరెన్నికగన్న ఐఐటీ, ఐండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఇంజినీర్లు, శాస్త్రవేత్తలతో కూడిన బృందం ఇప్పటికే ఈ టెక్నాలజీ నమూనాలను తయారు చేసింది. అన్ని సవ్యంగా సాగితే అతి తొందరలోనే ఈ టెక్నాలజీ పనితీరును పరిశీలించే ప్రయోగమూ జరుగుతుందని చిరంజీవి ఫణీంద్ర ‘సాక్షి.కాం’తో మాట్లాడుతూ చెప్పారు. రొబోటిక్ చేతులు... ఓ మదర్ డిపో!అంతరిక్ష వ్యర్థాల తొలగింపునకు కాస్మోసర్వ్ అభివృద్ధి చేసిన టెక్నాలజీ చాలా వినూత్నమైంది. ప్రధానంగా రెండు భాగాలుంటాయి. ఒకటేమో రివైవర్. గంటకు కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్న ఉపగ్రహాల దగ్గరకు వెళ్లి... నాలుగు సాఫ్ట్ రోబో చేతుల సాయంతో ఒడిసిపట్టుకుని.. భూమి వాతావరణం అంచుల్లోకి తీసుకొచ్చి వదిలివేయడం దీని పని. ఈ పని మళ్లీ మళ్లీ చేయగలదీ రివైవర్. ఇంధనం ఖర్చయిపోతే.. మళ్లీ నింపుకునేందుకు ఉపయోగించేదే ‘మదర్ క్రాఫ్ట్’. సుమారు మూడు టన్నుల బరువుండే మదర్ క్రాఫ్ట్లో 2500 కిలోల వరకూ ఇంధనం ఉంటుందని ఫణీంద్ర తెలిపారు. మదర్ క్రాఫ్ట్తోపాటు, రివైవర్ను ప్రయోగించిన తరువాత... ఈ వ్యవస్థ దానంతట అదే పనిచేస్తుందని చెప్పారు. ఒకదాని తరువాత ఒకటిగా రివైవర్ సుమారు వంద వరకూ ఉపగ్రహాలు/భాగాలను పట్టుకుని వాతావరణంలోకి విడుదల చేయగలదని వివరించారు.ప్రమాదం కాదా?.. అస్సలు కాదంటారు ఫణీంద్ర. చిన్న చిన్న వస్తువులు భూ వాతావరణంలోకి ప్రవేశించిన వెంటనే అక్కడి రాపిడికి మండిపోతాయని, కొంచెం పెద్దసైజున్నవైతే.. అవి పసఫిక్ మహా సముద్రంలో మానవ సంచారం అస్సలు లేని ‘పాయింట్ నిమో’ వద్ద పడేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. అంతేకాకుండా... ఇతర మార్గాలతో పోలిస్తే తాము అభివృద్ధి చేసిన టెక్నాలజీ సాయంతో అంతరిక్ష వ్యర్థాల తొలగింపు పది రెట్లు చౌక అని చెప్పారు. గత 68 ఏళ్లలో వివిధ దేశాలు మొత్తం 20 వేల ఉపగ్రహాలను ప్రయోగిస్తే.. రానున్న ఐదేళ్లకాలంలోనే ఇంకో యాభై వేల ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరబోతున్నాయని, ఫలితంగా వ్యర్థాల తొలగింపు మరింత ముఖ్యం కానుందని ఫణీంద్ర వివరించారు. వంద ఉపగ్రహ ప్రయోగాలు జరిగితే అందులో విజయవంతమయ్యేవి 60 శాతం వరకూ మాత్రమేనని గణాంకాలు చెబుతున్నాయని, ఇలాంటి వ్యర్థాలను ప్రయోగించిన ఐదేళ్లలోపు తొలగించాలని అమెరికా ఇటీవలే చేసిన కొత్త చట్టం కారణంగా పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారనుందని అన్నారు. ఇంకో లెక్క ప్రకారం 2031 నాటికల్లా అంతరిక్ష వ్యర్థాల తొలగింపు, ఇతర ఇన్-ఆర్బిట్ సర్వీసుల మార్కెట్ ఏకంగా 1430 కోట్ల డాలర్ల స్థాయికి చేరనుందని చెప్పారు. భారతదేశ లక్ష్యాలకు అనుగుణంగా..అంతర్జాతీయ అంతరిక్ష రంగంలో ప్రస్తుతం భారత వాటా కేవలం రెండు శాతం మాత్రమేనని, కేంద్ర ప్రభుత్వం దీన్ని ఎనిమిది శాతానికి పెంచేందుకు ప్రయత్నిస్తోందని చిరంజీవి ఫణీంద్ర తెలిపారు. అంతరిక్ష రంగానికి సంబంధించిన నిబంధనలను సడలించి, ప్రైవేట్ కంపెనీలకు చోటు కల్పించిన నేపథ్యంలో కాస్మోసర్వ్ అంతరిక్ష వ్యర్థాల తొలగింపు మార్కెట్లో గణనీయమైన వాటాను పొందే ప్రయత్నం చేస్తోందని తెలిపారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా రివైవర్ను అంతరిక్షంలో పరీక్షించేందుకు సిద్ధంగా ఉన్నామని.. ఇంకో రెండేళ్ల కాలంలో వ్యర్థాల తొలగింపునకు సంబంధించిన తొలి ప్రయోగం జరగవచ్చునని చెప్పారు.:::గిళియారు గోపాలకృష్ణ మయ్యా, సీనియర్ న్యూస్ ఎడిటర్ -
ఐటీ ఉద్యోగులకు మరో కఠిన నిబంధన!
ఐటీ ఉద్యోగులకు ఉన్న సౌకర్యాలు, వెసులుబాటులూ ఒక్కొక్కటిగా దూరమవుతున్నాయి. ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు రోజుకో కొత్త కఠిన నియమాన్ని అమలు చేస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని పూర్తిగా తొలగించాయి. ఆఫీస్కు హాజరును తప్పనిసరి చేశాయి.దేశీ సాఫ్గ్వేర్ దిగ్గజం విప్రో.. తన హైబ్రిడ్ పని విధానాలకు మరింత పదునుపెట్టింది. కఠినమైన కార్యాలయ హాజరు నిబంధనలను ప్రవేశపెట్టింది. వారానికి మూడు రోజులు ఆఫీస్కు వస్తున్న ఉద్యోగులు ఏదో సమయంలో వచ్చి వెళ్లేవారు. కానీ ఇకపై అలా కుదరదు. ఆఫీస్కు వచ్చిన ఉద్యోగులు కనీసం ఆరు గంటలు విధుల్లో ఉండాల్సిందే.ఎకనామిక్ టైమ్స్ కథనం నివేదిక ప్రకారం.. జనవరి 1 నుంచి కొత్త రూల్ అమల్లోకి వచ్చింది. ఉద్యోగులు ఆఫీస్కు వచ్చినప్పుడు వేసే మొదటి "ఇన్" పంచ్కు, వెళ్లేటప్పుడు ఇచ్చే "అవుట్" పంచ్కు మధ్య ఈ సమయాన్ని లెక్కిస్తారు. ఈ హాజరు సమయాన్ని సిస్టమ్ నేరుగా లీవ్స్ బ్యాలెన్స్తో అనుసంధానిస్తుంది. ఒకవేళ ఎవరైనా ఉద్యోగికి వారంలో అవసమైనంత మేర హాజరు సమయం లేకపోతే వారి లీవ్స్ బ్యాలెన్స్లో కోత విధిస్తారు.అయితే ఈ ఆరు గంటల వర్క్ అవర్స్ కార్యాలయంలో గడిపే సమయానికి మాత్రమే వర్తిస్తుందని విప్రో స్పష్టం చేసింది. మొత్తం రోజువారీ 9.5 పని గంటల్లో మాత్రం ఎలాంటి మార్పూ ఉండదు.ఇదీ చదవండి: పద పదా.. భారత Gen Zలో పెరుగుతున్న ట్రెండ్ -
అటెన్షన్.. ప్రతీ ఒక్కరి ఖాతాలో రూ.46 వేలు జమ!
ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రభుత్వాలు రకరకాల పథకాలను ఆచరణలోకి తెస్తున్నాయి. పోను.. పోను.. వాటి కోసం ప్రజా ధనం కూడా విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ఉచితాల విషయంలో విమర్శలు వినవస్తున్నా.. కోర్టులు అక్షింతలు వేస్తున్నా వెనక్కి మాత్రం తగ్గడం లేదు. రూ.46 వేలు జమ చేయడం కూడా ఇలాంటిదేమో అని అనుకునేవాళ్లు లేకపోలేదు.ప్రస్తుతం మన దేశంలో అన్ని వయసులవారికి.. రకరకాల పథకాలు అమలు అవుతున్నాయి. వాటిల్లో చాలామందికి చాలావాటిపై అవగాహన ఉండడం లేదు. దీంతో.. ప్రభుత్వాలే అందుకు సంబంధించిన సమాచారాన్ని వివిధ మాధ్యమాల ద్వారా తెలియజేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇదే అదనుగా స్కామర్లు కూడా రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియా యూజర్లను, అమాయక ప్రజలను మోసం చేయడానికి ఎప్పటికప్పుడు కొత్త పన్నాగాలు పన్నుతున్నారు. ఇదే తరహా మోసం తాజాగా ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇది ఎంతవరకు నిజం అనే విషయాన్ని.. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ వివరించింది. దీనికి సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.లింక్పై క్లిక్ చేసి.. మీ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకుంటే ప్రభుత్వం నుంచి రూ. 46,715 పొందండి. ఇది నమ్మశక్యంగా అనిపించడం లేదా? మరోసారి ఆలోచించండి! అనే ఒక మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ పేదలకు రూ. 46,715 సహాయం అందిస్తోందట అని కొందరు మోసగాళ్లు ప్రచారం చేస్తున్నారు.దీనిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పందిస్తూ.. ఆర్థిక మంత్రిత్వ శాఖ పేదలకు రూ. 46,715 సహాయం అందిస్తుందని వైరల్ అవుతున్న వార్తను ఎవరూ నమ్మకండి. ఇదంతా అబద్దం అని స్పష్టం చేసింది. ఇలాంటి ఒక పథకం గురించి ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించలేదని వెల్లడించింది.ఫేక్ సందేశాల పట్ల జాగ్రత్తసోషల్ మీడియాలో ఫేక్ సందేశాలు కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి. సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశంతో.. తప్పుడు లింక్స్ పంపించి.. డబ్బు దోచేస్తున్నారు. కాబట్టి తెలియని లింక్స్ లేదా తెలియని మొబైల్ నంబర్ల నుంచి వచ్చే ఎలాంటి లింక్స్ మీద క్లిక్ చేయకూడదు. మోసాల భారి నుంచి బయటపడటానికి ఉత్తమ మార్గం అపరిచిత లింకులపై క్లిక్ చేయకుండా ఉండటమే.🚨Just click on the link & share your personal info to get ₹46,715 from the Govt 💸Sounds too good to be true? Think again! A #WhatsApp message claims that the Ministry of Finance is offering financial aid of ₹46,715 to the poor. #PIBFactCheck🚫 This is a SCAM!🚫… pic.twitter.com/FcmmBU56LS— PIB Fact Check (@PIBFactCheck) January 5, 2026 -
కంటి జబ్బులకు వినూత్న చికిత్స
హైదరాబాద్: ప్రపంచ ఫార్మా రాజధాని హైదరాబాద్లో మరో వినూత్నమైన కంపెనీ అడుగుపెట్టింది. ఎక్సోసోమ్ల ఆధారంగా కణజాలాన్ని పునరుత్పత్తి చేయగల టెక్నాలజీ సాయంతో ఆసియా పసఫిక్ ప్రాంతం మొత్తానికి సరికొత్త కంటి చికిత్సలు అందించేందుకు పండోరమ్ టెక్నాలజీస్, హైదరాబాద్లోని నూసిలియాన్ థెరప్యూటిక్స్లు చేతులు కలిపాయి.శరీర కణాలు స్రవించే అతిసూక్ష్మమైన భాగాలైన (30 నుంచి 150 నానోమీటర్లు) ఎక్సోసోమ్లు ప్రొటీన్లు, ఆర్ఎన్ఏ వంటివాటిని ఒక కణం నుంచి ఇంకో కణానికి మోసుకెళుతూంటాయి. వీటి స్థానంలో మందులను పంపిణీ చేయడం ద్వారా పాడైన కణాలను సరిచేయవచ్చునని అంచనా. ఈ దిశగా పండోరమ్ టెక్నాలజీస్ ఇప్పటికే కొంత ముందడుగు వేసింది.కనుగుడ్డు (కార్నియా) దెబ్బతిన్న వారికి మళ్లీ చూపు రప్పించేందుకు కూడా తాము తయారు చేసిన ఎక్సోసోమ్ మందు ఉపయోగపడుతుందని కంపెనీ చెబుతోంది. ఈ నేపథ్యంలో పండోరమ్ టెక్నాలజీస్, భారత్ బయోటెక్ అనుబంధ సంస్థ అయిన నూసిలియాన్ థెరప్యూటిక్స్ల మధ్య కుదిరిన వ్యూహాత్మక ఒప్పందానికి ప్రాధాన్యం ఏర్పడింది. పండోరమ్ టెక్నాలజీ అభివృద్ధి చేసిన ఎక్సోసోమ్ మందును నూసిలియాన్ పెద్ద ఎత్తున తయారు చేస్తుంది. ఆసియా పసఫిక్ ప్రాంతం మొత్తానికి సరఫరా చేస్తుంది. దేశంలో ఇలాంటి ప్రయత్నం జరగడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.‘‘పునరుత్పత్తి మందుల తయారీ విషయంలో పండోరమ్ ఇప్పటికే మేలి ముందడుగు వేసింది. పరిశోధనలు, వాణిజ్యాంశాల్లోనూ ప్రగతి సాధించాము. అడ్వాన్స్డ్ బయోలాజిక్స్ తయారీలో నైపుణ్యమున్న నూసిలియాన్తో చేతులు కలపడం ద్వారా ప్రపంచం మొత్తానికి ఈ వినూత్నమైన చికిత్సను అందించవచ్చు’’ అని పండోరమ్ టెక్నాలజీస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ తుహిన్ భౌమిక్ తెలిపారు.నూసిలియాన్ థెరప్యూటిక్స్ ఉన్నతాధికారి డాక్టర్ రఘు మలపాక మాట్లాడుతూ ‘‘కంటి జబ్బుల చికిత్స విషయంలో పండోరమ్ టెక్నాలజీస్ ఎక్సోసోమ్ ఆధారిత చికిత్స విప్లవాత్మకమైందని చెప్పాలి. బయలాజిక్స్ తయారీలో మాకున్న నైపుణ్యంతో ఎంతో మేలు చేకూరుతుంది’’ అని వివరించారు.ప్రస్తుతం కంటి జబ్బులపై మాత్రమే దృష్టి పెడుతున్నామని, స్టీవెన్స్-జాన్సన్ సిండ్రోమ్, న్యూట్రోఫిక్ కెరటిటిస్ వంటి వాటికి త్వరలో చికిత్స అందించగలమని కంపెనీ చెబుతోంది. భవిష్యత్తులో ఇదే ఎక్సోసోమ్ ఆధారిత టెక్నాలజీ సాయంతో వాపు కారణంగా చర్మం, ఊపిరితిత్తులు, ఫైబ్రోసిస్తోపాటు ఇతర అవయవాలకు వచ్చే సమస్యలకు పరిష్కారం చూపగలమని చెబుతోంది. -
రూ.150 కోట్లు జరిమానా కట్టండి: ట్రాయ్ పెనాల్టీ
అవాంఛిత కాల్స్, మెసేజీలను కట్టడి చేయడంలో విఫలమైనందుకు గాను టెల్కోలకు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ రూ. 150 కోట్ల జరిమానా విధించింది. నెలకు రూ. 50 లక్షల వరకు పెనాల్టీలతో 2020 నుంచి మూడేళ్ల వ్యవధికి గాను ఈ మొత్తాన్ని కట్టాలని ఆదేశించింది.కస్టమర్ల ఫిర్యాదులను సరిగ్గా పరిష్కరించకపోవడం, నిబంధనలకు తగ్గట్లుగా స్పామర్లపై తగిన చర్యలు తీసుకోకపోవడంలాంటి ఆరోపణలు ఇందుకు కారణం. అయితే, ఈ జరిమానాను టెల్కోలు సవాలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ట్రాయ్ గతేడాది 21 లక్షల స్పామ్ కనెక్షన్లను డిస్కనెక్ట్ చేయడంతో పాటు 1 లక్ష పైగా ఎంటిటీలను (సంస్థలు, వ్యక్తులు) బ్లాక్లిస్టులో పెట్టింది.4–6 క్లిక్లతో కస్టమర్లు తమ ఫిర్యాదులను నమోదు చేసేందుకు వీలుగా ట్రాయ్ డీఎన్డీ యాప్ అందుబాటులో ఉంది. కాల్స్ లేదా మెసేజీలు వచ్చిన 7 రోజుల వరకు ఫిర్యాదు చేయొచ్చు. సాధారణంగా ప్రభుత్వ విభాగాలు, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, బీమా రంగాల కంపెనీలు లావాదేవీలు..సర్వీసులపరమైన కాల్స్ చేసేందుకు 1600 సిరీస్తో మొదలయ్యే నంబర్లను ఉపయోగించాల్సి ఉంటుంది.10 అంకెల మొబైల్ నంబర్ల నుంచి ప్రమోషనల్ కాల్స్ చేయకూడదు. రిజిస్టర్డ్ టెలీమార్కెటర్లకు కఠినతరమైన నిబంధనలు అమలవుతున్నప్పటికీ, ఇప్పుడు రిజిస్టర్ చేసుకోని వ్యక్తుల.. 10 అంకెల మొబైల్ నంబర్ల నుంచి స్పామ్ కాల్స్, మెసేజీలు అత్యధికంగా వస్తున్నాయి. -
రూ.225 రీఛార్జ్ ప్లాన్.. రోజుకు 3జీబీ డేటా!
బీఎస్ఎన్ఎల్ 365 రోజుల ప్లాన్ వెల్లడించిన తరువాత.. నెల రోజుల ప్లాన్ ప్రకటించింది. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఈ లేటెస్ట్ ప్లాన్ తీసుకొచ్చింది.బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన రూ. 225 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ద్వారా ఇప్పుడు రోజుకు 3జీబీ డేటా పొందవచ్చు (గతంలో ఈ ప్లాన్ ద్వారా రోజుకు 2.5 జీబీ డేటా లభించేది). ఈ ప్లాన్ ఆఫర్ కేవలం ఈ నెల 31వరకు (జనవరి 31) మాత్రమే అందుబాటులో ఉంటుందని సంస్థ వెల్లడించింది.BSNL introduces an upgraded ₹225 prepaid recharge plan offering 3GB data per day (earlier 2.5 gb data per day) without any increase in cost.Offer valid till 31 Jan 2026 Recharge smart via #BReX 👉 https://t.co/f8OlvSla9c#BSNL #FestiveOffer #SwadeshiNetwork #DigitalBharat pic.twitter.com/bkTwyNVqtW— BSNL_Andhrapradesh (@bsnl_ap_circle) January 5, 2026బీఎస్ఎన్ఎల్ యాన్యువల్ ప్లాన్బీఎస్ఎన్ఎల్ ప్రకటించిన 365 రోజుల ప్లాన్ కోసం.. యూజర్లు 2799 రూపాయలు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. న్యూ ఇయర్ సందర్భంగా కంపెనీ ఈ లేటెస్ట్ ప్లాన్ తీసుకొచ్చింది. ఇతర టెలికామ్ కంపెనీల వార్షిక ప్లాన్లతో పోలిస్తే.. బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ప్లాన్ చాలా తక్కువే.బీఎస్ఎన్ఎల్ యూజర్లు ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. రోజుకు 3జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజులు 100 ఎస్ఎమ్ఎస్లను పొందవచ్చు. అంటే రూ. 2799తో రీఛార్జ్ చేసుకుంటే.. ఏడాది మొత్తం అపరిమిత కాల్స్ మాట్లాడుకోవచ్చన్నమాట. -
స్టార్లింక్ సేవలు ఫ్రీ.. మస్క్ కీలక ప్రకటన
అమెరికా, వెనెజులాకు మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో.. ప్రపంచ కుబేరుడు, టెస్లా బాస్ 'ఎలాన్ మస్క్' కీలక ప్రకటన చేశారు. స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను వెనిజులా ప్రజలకు ఉచితంగానే అందిస్తున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.'స్టార్లింక్ ఫిబ్రవరి 3 వరకు వెనెజులా ప్రజలకు ఉచిత బ్రాడ్బ్యాండ్ సేవలను అందిస్తుంది, ఇది నిరంతర కనెక్టివిటీని నిర్ధారిస్తుంది' అని స్టార్లింక్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించగా.. మస్క్ 'వెనెజులా ప్రజలకు మద్దతుగా' అని పేర్కొన్నారు.In support of the people of Venezuela 🇻🇪 https://t.co/JKxOFWsikP— Elon Musk (@elonmusk) January 4, 2026వెనెజులా అధ్యక్షుడు నికొలస్ మదురోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైనిక చర్యకు ఆదేశాలు జారీ చేయడంతో.. అమెరికా సైన్యం మదురోను, ఆయన సతీమణి సిలియా ఫ్లోరెస్ను ఎత్తుకొచ్చింది. ఈ పరిణామం తరువాత మస్క్ ఫ్రీ స్టార్లింక్ సర్వీస్ అందిస్తున్నట్లు చేసిన చర్చనీయాంశంగా మారింది.వెనెజులా దేశంలో ప్రస్తుతం సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ప్రజలకు కనెక్టివిటీని పెంచేందుకు మస్క్ స్టార్లింక్ సేవలను ఉచితంగా అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్నెట్ సౌకర్యానికి అంతరాయం ఏర్పడకుండా ఉండేందుకు, మారుమూల గ్రామాల్లో మొబైల్ టవర్లు పనిచేయనప్పుడు స్టార్లింక్ సేవలను ఉపయోగించుకోవచ్చు.ఇదీ చదవండి: 70/10/10/10 ఫార్ములా: ఇలా పొదుపు చేస్తే.. నెల మొత్తం హ్యాపీ! -
వాట్సాప్లో ఆధార్ డౌన్లోడ్: ఇంత సింపులా..
భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు చాలా అవసరం. ఇది కేవలం మనకు గుర్తింపుగా మాత్రమే కాకుండా.. అనేక వ్యవహారాల్లో ఉపయోగపడుతుంది. అయితే దీనిని డౌన్లోడ్ చేసుకోవాలంటే.. కొన్నిసార్లు ఆధార్ సెంటర్లకు లేదా ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు భారత ప్రభుత్వం ఆధార్ కార్డు డౌన్లోడ్ ప్రక్రియను మరింత సులభతరం చేసి.. వాట్సాప్ ద్వారానే డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది.ఇదివరకు యూఐడీఏఐ పోర్టల్ లేదా డిజిలాకర్ ద్వారా ఆధార్ డౌన్లోడ్లు సాధ్యమయ్యేవి. తాజా ఫీచర్తో వాట్సాప్లోనే ఆధార్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే.. ఈ సేవను ఉపయోగించడానికి, కార్డుదారులు తమ ఆధార్తో లింక్ చేసిన డిజిలాకర్ ఖాతాను కలిగి ఉండాలి. వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ యాక్టివ్గా ఉండాలి. మైగవ్ హెల్ప్డెస్క్ +91-9013151515 నంబర్ ద్వారా పనిచేస్తుంది.వాట్సాప్ ద్వారా ఆధార్ డౌన్లోడ్➤ముందుగా మీ మొబైల్లో మైగవ్ హెల్ప్ డెస్క్ నెంబరు +91-9013151515 ను సేవ్ చేయండి➤నెంబర్ సేవ్ చేసుకున్న తరువాత.. వాట్సాప్ ఓపెన్ చేసి ఆ నంబర్కు "హాయ్" లేదా "నమస్తే" వంటి మెసేజ్ పంపండి.➤చాట్బాట్ అందించే ఎంపికల నుంచి డిజిలాకర్ సేవలను ఎంచుకోండి➤మీ డిజిలాకర్ ఖాతాను వెరిఫై చేసి.. మీ 12 అంకెల ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి.➤వెరిఫికేషన్ కోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుకు పంపిన ఓటీపీని ఎంటర్ చేయాలి.➤వెరిఫికేషన్ పూర్తియన తర్వాత, చాట్బాట్ అందుబాటులో ఉన్న పత్రాల జాబితాను ప్రదర్శిస్తుంది.➤అందులో నుంచి ఆధార్ కార్డును ఎంచుకుంటే.. అది పీడీఎఫ్ ఫార్మాట్లో వాట్సాప్లో కనిపిస్తుంది.యూజర్లు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఒకేసారి ఒక పత్రాన్ని మాత్రమే పొందవచ్చు. ఆధార్ ఇప్పటికే డిజిలాకర్లో లింక్ చేసి ఉండాలి. లింక్ చేయకపోతే వాట్సాప్ ఎంపికను ఉపయోగించే ముందు డిజిలాకర్ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా వివరాలను అప్డేట్ చేయాలి.ఇదీ చదవండి: 70/10/10/10 ఫార్ములా: ఇలా పొదుపు చేస్తే.. నెల మొత్తం హ్యాపీ! -
కొత్త రీఛార్జ్ ప్లాన్.. ఏడాదంతా అన్లిమిటెడ్ కాల్స్
రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో.. బీఎస్ఎన్ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) కూడా అదే బాటలో అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఉప్పుడు తాజాగా 365 రోజుల ప్లాన్ ప్రకటించింది.బీఎస్ఎన్ఎల్ ప్రకటించిన 365 రోజుల ప్లాన్ కోసం.. యూజర్లు 2799 రూపాయలు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. న్యూ ఇయర్ సందర్భంగా కంపెనీ ఈ లేటెస్ట్ ప్లాన్ తీసుకొచ్చింది. ఇతర టెలికామ్ కంపెనీల వార్షిక ప్లాన్లతో పోలిస్తే.. బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ప్లాన్ చాలా తక్కువే.బీఎస్ఎన్ఎల్ యూజర్లు ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. రోజుకు 3జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజులు 100 ఎస్ఎమ్ఎస్లను పొందవచ్చు. అంటే రూ. 2799తో రీఛార్జ్ చేసుకుంటే.. ఏడాది మొత్తం అపరిమిత కాల్స్ మాట్లాడుకోవచ్చన్నమాట.Start the New Year the smart way with #BSNL.Enjoy 365 days of worry-free connectivity at just ₹2799.Wherever the journey takes you, BSNL keeps you connected with 3GB/day data, unlimited calls, and reliable coverage all year long.Recharge smart via #BReX 👉… pic.twitter.com/T6at7LDTUU— BSNL India (@BSNLCorporate) January 4, 2026 -
జియో ‘కొత్త’ ప్లాన్లు.. ఇక ఏడాదంతా సిమ్ యాక్టివ్
ముఖేష్ అంబానీకి చెందిన ప్రముఖ టెలికమ్ కంపెనీ రిలయన్స్ జియో.. ఎప్పటికప్పుడు చవక రీఛార్జ్ ప్లాన్లు, ఆఫర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల ప్లాన్లను అందుబాటులోకి తెస్తోంది. తాజాగా కొత్త సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో ప్రతి నెలా నంబర్ ను రీఛార్జ్ చేసుకునే టెన్షన్ లేకుండా ఏడాది పొడవునా సిమ్ను యాక్టివ్గా ఉంచుకునే ప్లాన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..రూ.3,599 ప్లాన్ఈ ప్లాన్ 365 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఒక్కసారి రీచార్జ్ చేసి వదిలేసే వారి కోసం ప్రత్యేకంగా ఈ ప్లాన్ను రూపొందించారు. ఇందులో ఏడాది పొడవునా పాన్-ఇండియా రోమింగ్ తో అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ప్రతిరోజూ 2.5 జీబీ హైస్పీడ్ డేటా.. అంటే మొత్తం 912.5 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఉచితంగా పంపుకోవచ్చు. 5జీ కవరేజీ ఉన్న ప్రాంతాల్లో అపరిమిత 5జీ డేటాను ఉపయోగించుకోవచ్చు. ఇక జియో టీవీ, జియోఏఐ క్లౌడ్, గూగుల్ జెమిని ప్రో సబ్ స్క్రిప్షన్ అదనపు ప్రయోజనాలు.రూ.3,999 ప్లాన్లైవ్ స్పోర్ట్స్ ను ఇష్టపడే వ్యక్తుల కోసం ఈ ప్లాన్ ప్రత్యేకంగా రూపొందించింది జియో. ఈ ప్లాన్ ప్రీమియం ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ను అందిస్తుంది. వ్యాలిడిటీ 365 రోజులు. పాన్-ఇండియా రోమింగ్ తో అపరిమిత కాలింగ్ ఉంటుంది. ప్రతిరోజూ 2.5 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. 5జీ కవరేజీ ఉన్న ప్రాంతాలలో అపరిమిత 5జీ డేటాను ఆనందించవచ్చు. ఫ్రీ ఫ్యాన్ కోడ్ యాప్ ఇందులో లభించే ఓటీటీ బెనిఫిట్. అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే జియో టీవీ, జియోఏఐ క్లౌడ్, గూగుల్ జెమిని ప్రో వంటివి లభిస్తాయి.రూ .1,748 ప్లాన్కాలింగ్ ఒక్కటే ఉంటే చాలు మొబైల్ డేటా అవసరం లేదు అనుకునే వినియోగదారులకు ఈ ప్లాన్ ఉత్తమమైనది. ఇందులో వ్యాలిడిటీ 336 రోజులు. అన్ని నెట్ వర్క్ లకు అపరిమిత కాలింగ్ చేసుకోవచ్చు. ఇది వాయిస్ ఓన్లీ ప్యాక్ కాబట్టీ ఎలాంటి డేటా రాదు. 3,600 ఉచిత ఎస్ఎంఎస్లు లభిస్తాయి. జియోఏఐ క్లౌడ్, జియో టీవీలకు యాక్సెస్ పొందుతారు. -
యాప్ లేదు, ఛార్జ్ లేదు: ఫ్రీ కాల్స్..
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL).. నూతన సంవత్సరం సందర్భంగా.. భారతదేశంలోని అన్ని టెలికాం సర్కిల్లలో వాయిస్ ఓవర్ వైఫై (VoWiFi) లేదా వై-ఫై కాలింగ్ సర్వీస్ ప్రారంభించింది. మొబైల్ సిగ్నల్ తక్కువగా ఉన్న ప్రాంతాలలో కూడా BSNL కస్టమర్లు Wi-Fi కనెక్షన్ను ఉపయోగించి కాల్స్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేకుండా.. మొబైల్ నంబర్ను ఉపయోగించి నేరుగా కాల్స్ చేసుకోవచ్చు. ఇది గ్రామీణ & మారుమూల ప్రాంతాలలోని వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. మొబైల్ నెట్వర్క్లలో రద్దీని తగ్గించడానికి కూడా ఈ సేవ సహాయపడుతుందని అధికారులు చెబుతున్నారు.బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు వై-ఫై కాలింగ్ కోసం అదనపు ఖర్చు చేయాల్సిన అవసరంలేదు . కంపెనీ తన నెట్వర్క్ను దేశవ్యాప్తంగా విస్తరించడంతో పాటు.. వినియోగదారులకు మెరుగైన అందించాలనే లక్ష్యంతో ఈ వై-ఫై కాలింగ్ ఫీచర్ తీసుకొచ్చింది.VoWiFi అనేది IP మల్టీమీడియా సబ్సిస్టమ్ (IMS) ఆధారిత సేవ. ఇది Wi-Fi 7 మొబైల్ నెట్వర్క్ల మధ్య సజావుగా హ్యాండ్ఓవర్లకు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి దీనికోసం ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేదు. కాబట్టి ఇది యూజర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.BSNL announces nationwide rollout of Voice over WiFi ( VoWifi) !!When mobile signal disappears, BSNL VoWiFi steps in. Make uninterrupted voice calls over Wi-Fi on your same BSNL number anytime, anywhere.Now live across India for all BSNL customers, Because conversations… pic.twitter.com/KPUs79Lj9w— BSNL India (@BSNLCorporate) January 1, 2026 -
బిలియన్ల బిడ్ వార్
సాధారణంగా సాఫ్ట్వేర్ సర్వీసుల రంగ దిగ్గజాలు కార్యకలాపాల ద్వారా భారీగా నగదు ఆర్జిస్తుంటాయి. దీంతో వాటాదారులకు అత్యధికస్థాయిలో డివిడెండ్లు చెల్లిస్తుంటాయి. వీటితోపాటు కొన్ని సందర్భాలలో సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు సైతం తెరతీస్తుంటాయి. నికర లాభాలను వాటాదారులకు పంచే కంపెనీ విధానాలే దీనికికారణంకాగా.. నగదు నిల్వలను ఇతర కంపెనీల కొనుగోళ్లకూ వెచ్చిస్తుంటాయి. అయితే ఈ ఏడాది(2025–26) కొనుగోళ్లు, విలీనాల(ఎంఅండ్ఏ)కు ప్రాధాన్యత పెరిగింది. దీంతో టాప్–10 టెక్ దిగ్గజాలు ఉమ్మడిగా 4.3 బిలియన్ డాలర్లు(రూ. 38,700 కోట్లు) వెచ్చించాయి. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), క్లౌడ్ టెక్నాలజీలలో అధిక కొనుగోళ్లకు ఈ ఏడాది తెరలేచింది. గతేడాది(2024–25) డివిడెండ్లకు టాప్–10 ఐటీ కంపెనీలు 10.8 బిలియన్ డాలర్లు(రూ. 96,557 కోట్లు) కేటాయించగా.. ఈక్విటీ బైబ్యాక్లకు 1.5 బిలియన్ డాలర్లు(రూ. 14,000 కోట్లు) వెచ్చించాయి. ఇక ఇతర సంస్థల కొనుగోళ్లకు రూ. 27,000 కోట్లు వినియోగించాయి. కారణాలున్నాయ్ ఈ ఏడాది కొత్త టెక్నాలజీలు, కంపెనీలపై ఐటీ దిగ్గజాలు బాగా దృష్టి పెట్టాయి. ఇందుకు ఐటీ రంగంలో ఆదాయ సంబంధ మందగమనంతోపాటు.. ఐటీ సేవలకు అతిపెద్ద మార్కెట్ యూఎస్ నుంచి హెచ్1బీ తదితర అనుకోని సవాళ్లు ఎదురుకావడం ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. దీంతో ఆదాయ వనరులను పెంచుకునేందుకు సరికొత్త టెక్నాలజీల అభివృద్ధి, నూతన ఆవిష్కరణలకు తెరతీస్తున్న ఇతర కంపెనీల కొనుగోళ్లు తదితరాలపై అధిక పెట్టుబడులను వెచ్చిస్తున్నట్లు తెలియజేశాయి. ప్రస్తుతం అన్ని రంగాలలోనూ ఏఐ, క్లౌడ్ వినియోగం పెరుగుతుండటంతో విభిన్న వరి్టకల్స్, డొమైన్లలో వేగంగా విస్తరిస్తున్న కంపెనీలపై ఐటీ దిగ్గజాలు కన్నేస్తున్నట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఇదీ తీరు ఆదాయం, ఆర్డర్బుక్ను పటిష్టపరచుకునే బాటలో ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇతర కంపెనీలకు సొంతం చేసుకుంటున్నాయి. లిస్టయిన 2004 తదుపరి టీసీఎస్ డజను కంపెనీలను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ బాటలో తాజాగా మిడ్క్యాప్ ఐటీ కంపెనీలు కోఫోర్జ్, హెక్సావేర్ టెక్నాలజీస్ మరో అడుగు ముందుకేశాయి. వెరసి నగదు ఆర్జనలో అధిక శాతాన్ని వాటాదారులకు పంచడంకంటే ఇతర కంపెనీల కొనుగోళ్లకే కేటాయిస్తున్నాయి. డివిడెండ్లు, ఈక్విటీ బైబ్యాక్లను మించుతూ కొత్త టెక్నాలజీ కంపెనీలపట్ల ఆసక్తి చూపుతున్నాయి. కొనుగోళ్ల జోరు దేశీ ఐటీ కంపెనీల చరిత్రలోనే భారీ డీల్కు తెరతీస్తూ గత వారం మిడ్టైర్ కంపెనీ కోఫోర్జ్ 2.39 బిలియన్ డాలర్ల విలువైన కొనుగోలుని ప్రకటించింది. యూఎస్ సాఫ్ట్వేర్ సంస్థ ఎన్కోరాను సొంతం చేసుకునేందుకు షేర్ల జారీ ద్వారా డీల్ కుదుర్చుకుంది. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకూ కోఫోర్జ్ ఇతర కంపెనీల కొనుగోళ్లపై రూ. 21,450 కోట్లు వెచ్చించింది. ఇదే కాలంలో వాటాదారులకు కేవలం రూ. 260 కోట్లు డివిడెండ్గా చెల్లించింది. మరో మధ్యస్థాయి ఐటీ కంపెనీ హెక్సావేర్(జనవరి–డిసెంబర్ ఆర్థిక సంవత్సరం) సైతం ఇతర సంస్థలను సొంతం చేసుకునేందుకు రూ. 1,614 కోట్లు వెచ్చించింది. సెపె్టంబర్ చివరివరకూ వాటాదారులకు డివిడెండ్ రూపేణా రూ. 349 కోట్లు కేటాయించింది. ఇక దిగ్గజాలు ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, విప్రో ఉమ్మడిగా 7 కంపెనీల కొనుగోళ్లకు 1.03 బిలియన్ డాలర్లు వినియోగించాయి. వీటిలో డేటా అనలిటిక్స్, డిజైన్ ఇంజినీరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థలకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రస్తావించదగ్గ అంశం! – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఒక్క యాప్: రైల్లో పోయిన ఐప్యాడ్ దొరికిందిలా..
రైల్లో ప్రయాణించేటప్పుడు.. కొన్ని సందర్భాల్లో విలువైన వస్తువులు, ఎలక్ట్రానిక్స్ ఇతరత్రా మరిచిపోయే అవకాశం ఉంది. వాటిని తిరిగి పొందటం ఒకప్పుడు కష్టంగా ఉండేది. అయితే ఇప్పుడున్న టెక్నాలజీకి అదేం పెద్ద కష్టమేమీ కాదు. ఇలాంటి సంఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది.డిసెంబర్ 27న దక్షిణ్ ఎక్స్ప్రెస్లో భోపాల్కు వెళుతున్నప్పుడు తన ఐప్యాడ్ను మర్చిపోయానని ఎక్స్ యూజర్ 'దియా' వెల్లడించారు. ట్రైన్ దిగిన ఒక గంట తరువాత మరిచిపోయిన విషయం గ్రహించి, చాలా బాధపడినట్లు ఆమె వెల్లడించారు. రైల్లో మరిచిపోయిన తన ఐప్యాడ్ తిరిగిపొండటానికి.. రైల్వే హెల్ప్లైన్ (#139)కు కాల్ చేసి, RailMadad యాప్ ద్వారా ఫిర్యాదు చేసింది. దీనికి స్పందించిన సిబ్బంది.. ట్రైన్ వివరాలు, కోచ్ నెంబర్ ఆధారంగా ఆమె ఐప్యాడ్ గుర్తించారు. ఆ తరువాత ఆమెకు కాల్ చేసి దానిని అప్పగించారు. ఈ విషయాన్ని దియా తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.ఐప్యాడ్ తిరిగి పొండటంతో దియా చాలా సంతోషించింది. సిబ్బందికి కృతజ్ఞత చెబుతూ.. మరో ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. తమకు ఎదురైన సంఘటనల గురించి కూడా వెల్లడించారు.LORE UPDATE: I forgot my IPAD on a train to bhopal (Dakshin Express, 28.12.25)Realised an hour later,between all the chaos (and lots of crying 😭) we called #139 and registered a report on #RailMadad app. Amazingly, within minutes we got a call from the helpline, a quick…— Diya (@diyaatwt) December 30, 2025 -
గూగుల్ క్రోమ్ తిరుగులేని ప్రయాణం
ఇంటర్నెట్ వినియోగంలో ఒక విప్లవం వస్తుందని, ఏఐ ఆధారిత బ్రౌజర్లు వెబ్ బ్రౌజింగ్ తీరును పూర్తిగా మార్చేస్తాయని గత రెండేళ్లుగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఓపెన్ఏఐ మద్దతు ఉన్న అట్లాస్, పెర్ప్లెక్సిటీ ఆధ్వర్యంలోని కామెట్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లోని కోపైలట్ వంటివి సాంప్రదాయ బ్రౌజర్లకు ముగింపు పలుకుతాయని భావించారు. కానీ, 2025 ముగింపు దశకు చేరుకున్నా గూగుల్ క్రోమ్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.భారత మార్కెట్లో క్రోమ్ ప్రభంజనంభారతదేశంలో సుమారు 90% బ్రౌజింగ్కుపైగా మార్కెట్ వాటాతో గూగుల్ క్రోమ్ అగ్రస్థానంలో ఉంది. ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో క్రోమ్ డిఫాల్ట్ బ్రౌజర్గా ఉండటం, గూగుల్ ఖాతాతో ఉన్న విడదీయలేని అనుబంధం ఇందుకు కారణమని తెలుస్తుంది. ఒపెరా, సఫారీ వంటివి సింగిల్ డిజిట్ వాటాకే పరిమితం కాగా, ఎడ్జ్, ఫైర్ఫాక్స్ 1% కంటే తక్కువ స్థాయిలోనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. క్రోమ్ 71% మార్కెట్ వాటాను కలిగి ఉండగా, యాపిల్ సఫారీ (15%) రెండో స్థానంలో ఉంది. ఏఐను ఉపయోగిస్తున్న ఇతర బ్రౌజర్లు ఇప్పటికీ నామమాత్రపు వాటాకే పరిమితమయ్యాయి.ఈ లెగసీకి కారణం..కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉందనే కారణంతో వినియోగదారులు తమ దశాబ్ద కాలపు అలవాట్లను మార్చుకోవడం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనికిగల కారణాలు..జీమెయిల్, గూగుల్ డ్రైవ్, యూట్యూబ్ వంటి సేవలతో క్రోమ్ ఇచ్చే అనుభవం మరే బ్రౌజర్ ఇవ్వలేకపోతోంది.కొత్త ఏఐ బ్రౌజర్ల అవసరం లేకుండానే గూగుల్ తన జెమిని(Gemini) ఏఐని నేరుగా క్రోమ్లోకి ఎంబెడ్ చేసింది.సెర్చ్ సమ్మరీలు, రైటింగ్ అసిస్టెంట్, ట్యాబ్ ఆర్గనైజర్ వంటి ఫీచర్లను క్రోమ్ వినియోగదారులకు వారి పాత అలవాట్లను మార్చకుండానే అందుబాటులోకి తెచ్చింది.చాలా ఏఐ బ్రౌజర్లు క్రోమ్లానే పనిచేస్తున్నాయి. వినియోగదారులకు తమ పాస్వర్డ్లు, హిస్టరీ, బుక్మార్క్లను వదులుకుని కొత్త బ్రౌజర్కు వెళ్లడానికి బలమైన కారణాలు కనిపించడం లేదు. ఏఐ ఫీచర్లు ఇప్పుడు క్రోమ్ ఎక్స్టెన్షన్ల రూపంలో కూడా లభిస్తుండటం మరో కారణం.ఏఐ ఏజెంట్ వైపు..ప్రస్తుత ఏఐ బ్రౌజర్లు కేవలం సమాచారాన్ని క్రోడీకరించడానికి (Summarization) లేదా పోల్చడానికి మాత్రమే పరిమితమయ్యాయి. కానీ భవిష్యత్తులో బ్రౌజర్ల పాత్ర మారబోతోంది. వినియోగదారుడి తరపున స్వయంగా పనులు చేసే (ఉదాహరణకు: టికెట్లు బుక్ చేయడం, షాపింగ్ చేయడం, షెడ్యూల్ మేనేజ్ చేయడం) అటానమస్ ఏజెంట్గా బ్రౌజర్ మారినప్పుడు మాత్రమే క్రోమ్కు నిజమైన పోటీ ఎదురవుతుందనే వాదనలున్నాయి. బ్రౌజర్ అనేది ఒక విండోలా కాకుండా, ఒక పర్సనల్ అసిస్టెంట్గా మారినప్పుడు మాత్రమే మార్కెట్ వాటాలో మార్పులు వచ్చే అవకాశం ఉంది.ఇదీ చదవండి: 10 నిమిషాల డెలివరీ.. సాంకేతిక ప్రగతా? శ్రమ దోపిడీనా? -
జీమెయిల్ ఐడీని మార్చుకోవచ్చు
ప్రస్తుతం ఉపయోగిస్తున్న జీమెయిల్ అకౌంట్లోని డేటాను కోల్పోకుండానే, ప్రైమరీ ఖాతాకి కొత్త ఐడీని క్రియేట్ చేసుకునే వీలు కలి్పస్తూ టెక్ దిగ్గజం గూగుల్ కొత్త ఫీచర్ని ప్రవేశపెట్టింది. దీన్ని దశలవారీగా అందుబాటులోకి తెస్తోంది. ఈ ఫీచరు కారణంగా యూజరు కొత్త జీమెయిల్ ఐడీకి మారినా, పాత ఖాతాలో సేవ్ చేసుకున్న ఫొటోలు, మెసేజీలు, ఈమెయిల్స్ లాంటి డేటాపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని అధికారిక సపోర్ట్ పేజీలో పేర్కొంది. యూజర్లు తమ పాత లేదా కొత్త ఈమెయిల్ అడ్రెస్తో జీమెయిల్, మ్యాప్స్, యూట్యూబ్, డ్రైవ్లాంటి గూగుల్ సర్వీసులకు సైన్ ఇన్ చేయొచ్చని వివరించింది. ఇలా ఒకసారి కొత్త జీమెయిల్ ఐడీని క్రియేట్ చేసుకున్నాక మళ్లీ 12 నెలల వరకు మరో కొత్త ఐడీని క్రియేట్ చేసుకోవడానికి ఉండదు. పాత అడ్రెస్ని ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. పర్సనల్ ఇన్ఫర్మేషన్ కేటగిరీ కింద గూగుల్ అకౌంట్ సెటింగ్స్లోని ఈమెయిల్ సెక్షన్లో ఈ ఫీచరు లభ్యతను యూజర్లు చెక్ చేసుకోవచ్చు. డేటా భద్రతకు గ్యారంటీ ఉన్నప్పటికీ, కొన్ని యాప్ సెట్టింగ్లు మారిపోయే అవకాశం ఉన్నందున మార్పులు, చేర్పులను చేపట్టడానికి ముందు యూజర్లు తమ సమాచారాన్ని బ్యాకప్ తీసుకోవాలంటూ గూగుల్ సూచించింది.ఇదీ చదవండి: కారుణ్య నియామకం హక్కు కాదు: ఉన్నత న్యాయస్థానం -
ఏఐపై అంబానీ ఫోకస్
న్యూఢిల్లీ: ఆయిల్ నుంచి రిటైల్, టెలికం వరకు వివిధ రంగాల్లో విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ రాబోయే రోజుల్లో అధునాతన తయారీ సామర్థ్యాలతో ఏఐ ఆధారిత డీప్ టెక్ దిగ్గజంగా రూపాంతరం చెందాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆరు లక్షలకు పైగా ఉన్న ఉద్యోగుల ఉత్పాదకతను పది రెట్లు పెంచుకోవాలని, దేశ ఆర్థిక వ్యవస్థ, సమాజంపై పది రెట్లు సానుకూల ప్రభావం చూపేలా వ్యవహరించాలని నిర్దేశించుకుంది. ఈ లక్ష్య సాధనకు తోడ్పడేలా, కంపెనీ ఏఐ మేనిఫెస్టోను రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ మంగళవారం ఆవిష్కరించారు.‘మానవ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన సాంకేతిక పురోగతి’గా కృత్రిమ మేధను ఈ సందర్భంగా అభివర్ణించారు. దేశీయంగా డిజిటల్ పరివర్తనకు సారథ్యం వహించిన విధంగానే ఏఐ విప్లవానికి కూడా నేతృత్వం వహించాలని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. భద్రత, విశ్వసనీయత, జవాబుదారీతనం హామీతో ప్రతి భారతీయునికి అతి తక్కువ వ్యయాలతో ఏఐని అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ‘అధునాతన తయారీ సామర్థ్యాలతో ఏఐ ఆధారిత డీప్ టెక్ కంపెనీగా మారే దిశగా రిలయన్స్ ముందుకు సాగుతోంది. రిలయన్స్ ఏఐ ముసాయిదా మేనిఫెస్టోను సిద్ధం చేసుకున్నాం. కార్యాచరణ ప్రణాళిక అమలుకు ఇది గైడ్గా పనిచేస్తుంది‘ అని అంబానీ పేర్కొన్నారు. ఐడియాలకు ఆహ్వానం.. టెలికం, రిటైల్, ఎనర్జీ, మెటీరియల్స్, లైఫ్ సైన్సెస్, ఆర్థిక సేవలు, మీడియా తదితర వ్యాపార విభాగాలతో పాటు దాతృత్వ కార్యకలాపాలవ్యాప్తంగా ఏఐని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ఉపయోగపడే ఐడియాలు ఇవ్వాలని ఉద్యోగులను అంబానీ కోరారు. జనవరి 10 నుంచి 26 వరకు కొత్త ఆలోచనలను తెలియజేయాలని సూచించారు. ఏఐ హార్డ్వేర్, రోబోటిక్స్లాంటి వాటితో సమర్ధత, సుస్థిరత, సాంకేతిక స్వావలంబనను సాధించేందుకు గణనీయంగా అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.మేనిఫెస్టో ఇలా..మేనిఫెస్టో మొదటి భాగంలో అంతర్గత పరివర్తన, ఏఐని టెక్నాలజీ ప్రాజెక్టుగా కాకుండా కొత్త పని విధానంగా పరిగణించే అంశాలను చేర్చారు. రెండో భాగంలో దేశీయంగా ఏఐ పరివర్తనకు తోడ్పడే విజన్ని పొందుపర్చారు. కొనుగోళ్ల నుంచి చెల్లింపుల వరకు, నియామకాల నుంచి రిటైర్మెంట్ల వరకు, ప్లాంటు నుంచి పోర్టు వరకు కీలకమైన విధుల్లో మానవ ప్రమేయాన్ని తగ్గించే విధంగా, నిర్ణయాల ప్రక్రియకు తోడ్పడేలా సంస్థవ్యాప్తంగా ఏఐతో పని విధానాల్లో మార్పులను తొలి భాగంలో ప్రస్తావించారు.డేటా, సమన్వయం, భద్రత, వివిధ వ్యాపారాలవ్యాప్తంగా పర్యవేక్షణ మొదలైన వాటన్నింటికీ ప్రమాణాలు నిర్దేశించేలా పన్నెండు అంచెల డిజిటల్ ఫంక్షనల్ కోర్ (డీఎఫ్సీ) ఉంటుంది. తమ వ్యాపారాలు, దాతృత్వ కార్యకలాపాల ద్వారా ఏఐ ఆధారిత భారతదేశ పరివర్తనకి తోడ్పడాలనే రిలయన్స్ ఆకాంక్షలను ప్రతిఫలించేలా రెండో భాగం ఉంటుంది. ఆరోగ్య సంరక్షణ, విద్య, సమ్మిళిత ఆర్థిక సర్వీసులు మొదలైన వాటిల్లో ఏఐ దన్నుతో కొత్త సొల్యూషన్స్, కొత్త మెటీరియల్స్ను కనుగొనేందుకు అపార అవకాశాలు ఉన్నాయని అంబానీ చెప్పారు. -
మీకు మ్యాపల్స్ యాప్ గురించి తెలుసా?
లేటెస్ట్ టెక్నాలజీతో భారతీయ రోడ్లపై ప్రయాణాన్ని సులభతరం చేస్తున్న స్వదేశీ మ్యాపింగ్ దిగ్గజం మ్యాప్మైఇండియా తన 'మ్యాపల్స్'(Mappls) యాప్లో మార్పులు చేపట్టింది. నగర ప్రయాణాన్ని లక్ష్యంగా చేసుకుని మెట్రో, రైలు, బస్సు రూట్లను ఏకీకృతం చేస్తూ ‘మల్టీమోడల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్’ ఫీచర్ను పరిచయం చేస్తున్నట్లు ప్రకటించింది.సమగ్ర మొబిలిటీ ప్లాట్ఫామ్గా..ప్రస్తుతం 40 మిలియన్ల కంటే ఎక్కువ వినియోగదారులను కలిగి ఉన్న మ్యాప్ల్స్ యాప్.. ఇప్పుడు కేవలం ప్రైవేట్ వాహనాలకే పరిమితం కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సమాచారాన్ని కూడా ఒకే చోట అందిస్తుంది. వినియోగదారులు తమ గమ్యాన్ని చేరుకోవడానికి అందుబాటులో ఉన్న మెట్రో రైళ్లు, లోకల్ ట్రైన్లు, బస్సు సర్వీసుల రూట్లు, స్టాపులు, ఇంటర్చేంజ్ (మారే ప్రదేశాలు) ఆప్షన్లను సులభంగా చూడవచ్చు.అందుబాటులో ఉన్న నగరాలు..ఈ ఫీచర్ ప్రస్తుతం భారతదేశంలోని ప్రధాన నగరాల్లో అందుబాటులోకి వచ్చినట్లు కంపెనీ తెలిపింది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్కతాతో పాటు.. పుణె, అహ్మదాబాద్, జైపూర్, కొచ్చి, భోపాల్, లక్నో, కాన్పూర్, ఆగ్రా, నాగ్పూర్, ఇండోర్, పట్నా, చండీగఢ్ల్లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుందని చెప్పింది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఐఓఎస్, వెబ్ వెర్షన్లలో లైవ్లో ఉందని పేర్కొంది. ఆండ్రాయిడ్ వినియోగదారులకు త్వరలోనే ఇది అందుబాటులోకి రానుందని స్పష్టం చేసింది.ఆత్మనిర్భర్ భారత్ దిశగా..ఈ సందర్భంగా మ్యాప్మైఇండియా సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ రాకేష్ వర్మా మాట్లాడుతూ..‘వినియోగదారుల అవసరాలను గుర్తించి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను రోజువారీ నావిగేషన్లో చేర్చాం దీని ద్వారా నగరాల్లో ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నాం’ అన్నారు. ఈ కొత్త ఫీచర్ కేవలం ప్రయాణ సౌలభ్యం కోసమే కాకుండా.. పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతుందని వెల్లడించారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా కార్బన్ ఉద్గారాలను తగ్గించవచ్చని పేర్కొంది. దీని ద్వారా రోడ్లపై వ్యక్తిగత వాహనాల రద్దీ తగ్గుతుంది. రియల్ టైమ్ ట్రాఫిక్ అప్డేట్స్, సేఫ్టీ అలర్ట్స్తో ప్రయాణ సమయం ఆదా అవుతుందని కంపెనీ పేర్కొంది. -
ఈ ఏడాది టెక్ కంపెనీల్లో లేఆఫ్స్ కలకలం
భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో లేఆఫ్స్ పర్వం కొనసాగుతోంది. ఒకవైపు కృత్రిమ మేధ(ఏఐ) కొత్త పుంతలు తొక్కుతుంటే, మరోవైపు అదే వేగంతో ఉద్యోగాల కోత పెరుగుతోంది. ప్రముఖ లేఆఫ్స్ ట్రాకర్ ‘లేఆఫ్స్.ఎఫ్వైఐ’(Layoffs.fyi) తాజా గణాంకాల ప్రకారం, ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు 551 టెక్ కంపెనీల నుంచి 1,22,549 మందికి పైగా ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోయారు. గత కొన్ని వారాలుగా ఈ వేగం కొద్దిగా తగ్గినట్లు కనిపిస్తున్నా, ప్రభావం మాత్రం తీవ్రంగా ఉంది.ప్రముఖ కంపెనీలు ఇలా..అమెజాన్.. అక్టోబర్లో కంపెనీ చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా అత్యధికంగా ఉద్యోగాల కోత విధిస్తూ 14,000 కొలువులను తొలగించింది.మైక్రోసాఫ్ట్.. 2025 నాటికి మొత్తం 15,000 మందిని తొలగించే దిశగా అడుగులు వేసింది. జులైలోనే దాదాపు 9,000 మందిని పంపించివేసింది.ఇంటెల్.. చిప్ తయారీలో వెనుకబడటం, ఆర్థిక నష్టాల నేపథ్యంలో ఏకంగా మొత్తం సిబ్బందిలో 15% (సుమారు 25,000 మంది) తగ్గించుకోవాలని నిర్ణయించుకుంది.సేల్స్ ఫోర్స్.. ఏఐ సహాయంతో 4,000 మంది కస్టమర్ సపోర్ట్ ఉద్యోగులను తగ్గించినట్లు సీఈఓ మార్క్ బెనియోఫ్ ధ్రువీకరించారు.టీసీఎస్.. భారత్లో దాదాపు 12,000 మందిని (మొత్తం ఉద్యోగుల్లో 2%) తొలగించి ఐటీ రంగంలో ఆందోళన కలిగించింది. అయితే ఇది ఏఐ వల్ల కాదని, నైపుణ్యాల అసమతుల్యత వల్లేనని సంస్థ స్పష్టం చేసింది.మెటా (600 మంది), గూగుల్ (100+), వెరిజోన్ (13,000), హెచ్పీ (4,000-6,000 మంది) వంటి సంస్థలు కూడా లేఆఫ్స్ ఇచ్చాయి.లేఆఫ్స్కు దారితీసిన కారణాలుచాలా కంపెనీలు ఇప్పుడు ‘ఏఐ ఫస్ట్’ విధానాన్ని అనుసరిస్తున్నాయి. గతంలో వందలాది మంది చేసే పనులను (డేటా ఎంట్రీ, కస్టమర్ సపోర్ట్, బేసిక్ కోడింగ్..) ఇప్పుడు ఏఐ టూల్స్ తక్కువ ఖర్చుతో వేగంగా చేస్తున్నాయి. కంపెనీలు తమ బడ్జెట్ను మానవ వనరుల నుంచి ఏఐ మౌలిక సదుపాయాల వైపు మళ్లిస్తున్నాయి.ద్రవ్యోల్బణం పెరగడం, సుంకాల భారం పెరగడంతో కంపెనీల నిర్వహణ ఖర్చులు పెరిగాయి. ఇన్వెస్టర్ల నుంచి ఒత్తిడి పెరగడంతో తక్కువ మంది ఉద్యోగులతో ఎక్కువ ఉత్పాదకత సాధించడంపై యాజమాన్యాలు దృష్టి పెట్టాయి.కరోనా సమయంలో డిజిటల్ సేవల కోసం డిమాండ్ పెరగడంతో టెక్ కంపెనీలు భారీగా నియామకాలు చేపట్టాయి. ఇప్పుడు డిమాండ్ సాధారణ స్థితికి రావడంతో అవసరానికి మించి ఉన్న సిబ్బందిని తొలగిస్తున్నాయి.పాత ప్రాజెక్టులను మూసివేసి కేవలం క్లౌడ్, సెక్యూరిటీ, జనరేటివ్ ఏఐ వంటి భవిష్యత్తు అవసరాల మీదనే కంపెనీలు పెట్టుబడి పెడుతున్నాయి. దీనివల్ల పాత నైపుణ్యాలు కలిగిన వారు ఉద్యోగాలు కోల్పోతున్నారు.టెక్ రంగం ప్రస్తుతం ఒక పరివర్తన దశలో ఉంది. ఉద్యోగాల కోత ఆందోళన కలిగించే విషయమే అయినా ఏఐ రంగంలో కొత్త రకమైన ఉద్యోగ అవకాశాలు కూడా పుట్టుకొస్తున్నాయి. సిబ్బంది తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవడమే ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కే మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: బంగారం ధరలు రివర్స్! తులం ఎంతంటే.. -
ధురంధర్ పాటకు రోబో డ్యాన్స్
టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో కొత్త హ్యుమానాయిడ్ రోబోలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే రోబోట్స్ ఎన్నెన్నో అద్భుతాలు చేశాయి. ఇప్పుడు తాజాగా ఒక రోబో డ్యాన్స్ వేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఐఐటీ బాంబేలో టెక్ఫెస్ట్ 2025లో.. ఒక హ్యూమనాయిడ్ రోబోట్ డ్యాన్స్ వేసి అందరి దృష్టిని ఆకట్టుకుంది. దీనిని బిద్యుత్ ఇన్నోవేషన్ (Bidyut Innovation) అభివృద్ధి చేసింది. ధురంధర్ సినిమాలోని పాటకు.. అద్భుతంగా డ్యాన్స్ వేసిన ఈ రోబోట్ ఎంతోమంది ప్రశంసలు అందుకుంది. పలువురు నెటిజన్లు దీనిపై తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.టెక్ఫెస్ట్.. ఆసియాలో అతిపెద్ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఫెస్టివల్గా ప్రసిద్ధి చెందింది. ఇందులో అనేక కొత్త ఆవిష్కరణలను ప్రవేశపెడతారు. హ్యుమానాయిడ్ రోబోట్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఇవన్నీ.. బ్యాలెన్స్ కంట్రోల్, మోషన్ ప్లానింగ్, రియల్-టైమ్ రెస్పాన్సిబిలిటీ వంటివి పొందుతాయి. View this post on Instagram A post shared by IIT NIT IIIT (@iit__nit__iiit) -
సోషల్ మీడియా వినియోగం.. ఇండియన్ ఆర్మీ కొత్త రూల్స్!
భారత సైన్యం.. తమ సిబ్బందికి సోషల్ మీడియా వినియోగంపై ఉన్న నిబంధనలను పాక్షికంగా సవరించింది. గతంలో ఉన్న కఠినమైన నిషేధాలను సడలిస్తూ, ఎంపిక చేసిన కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో నిష్క్రియాత్మక భాగస్వామ్యాన్ని(Passive Participation) అనుమతిస్తూ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కొత్త ఉత్తర్వులను జారీ చేసింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్ (డీజీఎంఐ) రూపొందించిన ఈ నూతన మార్గదర్శకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.ఏమిటీ నిష్క్రియాత్మక భాగస్వామ్యం?కొత్త విధానం ప్రకారం.. సైనిక సిబ్బంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (గతంలో ట్విట్టర్) వంటి ప్లాట్ఫామ్లను సమాచారం తెలుసుకోవడానికి లేదా కంటెంట్ను చూడటానికి మాత్రమే ఉపయోగించవచ్చు. అయితే.. ఈ ప్లాట్ఫామ్లలో ఎటువంటి యాక్టివ్ ఎంగేజ్మెంట్ ఉండకూడదు. అంటే..➤పోస్ట్లు పెట్టడం, ఫొటోలు అప్లోడ్ చేయడం చేయకూడదు.➤ఇతరుల పోస్టులపై వ్యాఖ్యానించడం (Commenting) నిషేధం.➤లైక్ చేయడం, షేర్ చేయడం లేదా పోస్టులకు రియాక్ట్ అవ్వడం వంటివి చేయకూడదు.➤డైరెక్ట్ మెసేజ్లు పంపడంపై కూడా నిషేధం కొనసాగుతుంది.ఇన్స్టాగ్రామ్కు అధికారిక అనుమతిఈ అప్డేట్లో భాగంగా ఇన్స్టాగ్రామ్ను అధికారికంగా.. ‘పరిమిత వినియోగ’ సోషల్ మీడియా జాబితాలో చేర్చారు. కేవలం నిఘా, సమాచార సేకరణ ప్రయోజనాల కోసం మాత్రమే దీన్ని వాడాలని, వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకోవడానికి వీల్లేదని ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి.కమ్యూనికేషన్, ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్లువాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, స్కైప్ యాప్లను సాధారణ స్థాయి సమాచార మార్పిడికి ఉపయోగించవచ్చు. అయితే, గ్రహీత ఎవరో కచ్చితంగా తెలిసినప్పుడు మాత్రమే కమ్యూనికేట్ చేయాలి. దీనికి పూర్తి బాధ్యత సదరు సిబ్బందిదే. లింక్డ్ఇన్ వృత్తిపరమైన అవసరాల కోసం, అంటే రెజ్యూమ్లు అప్లోడ్ చేయడం లేదా ఉద్యోగ సమాచారం కోరడం వంటి పనులకు మాత్రమే దీన్ని అనుమతిస్తారు. యూట్యూబ్, కోరా(YouTube, Quora) వీటిని కేవలం జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి మాత్రమే వాడాలి.కఠినమైన హెచ్చరికలుసౌలభ్యాలను కల్పిస్తూనే సైన్యం కొన్ని అంశాలపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. క్రాక్డ్ సాఫ్ట్వేర్లు, ఉచిత మూవీ పోర్టల్స్, టొరెంట్, వెబ్ ప్రాక్సీలు, వీపీఎన్ సర్వీలకు వాడకూడదు. చాట్ రూమ్లు, ఫైల్ షేరింగ్ ప్లాట్ఫామ్ల జోలికి వెళ్లవద్దని సూచించింది. క్లౌడ్ ఆధారిత డేటా సేవల వినియోగంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.2020లో 89 యాప్లపై నిషేధంజులై 2020లో చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు, సైబర్ భద్రతా ముప్పుల నేపథ్యంలో.. భారత సైన్యం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సహా 89 యాప్లను తక్షణమే తొలగించాలని తన సిబ్బందిని ఆదేశించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం నిషేధించిన 59 చైనా యాప్లు కూడా ఉన్నాయి. తాజా సవరణలు సైనిక భద్రతను కాపాడుతూనే మారుతున్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా సిబ్బందికి కొంత వెసులుబాటు కల్పించే ప్రయత్నంగా కనిపిస్తున్నాయి. -
6 నెలల్లో రూ. 660 కోట్లు కాపాడింది..
ఆన్లైన్ ఆర్థిక మోసాలను అరికట్టేందుకు ఉద్దేశించిన డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫాంలో 1,000కి పైగా బ్యాంకులు, థర్డ్ పార్టీ యాప్లు, పేమెంట్ టెక్నాలజీ సంస్థలు చేరినట్లు టెలికం శాఖ (డాట్) వెల్లడించింది. అవి అమలు చేస్తున్న ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్లతో (ఎఫ్ఆర్ఐ) బ్యాంకింగ్ వ్యవస్థలో కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ఏకంగా రూ. 660 కోట్ల ఆర్థిక నష్టాలను నివారించడం సాధ్యపడిందని పేర్కొంది.ఎఫ్ఆర్ఐ అమలుపై అవగాహన పెంచేందుకు సంబంధిత వర్గాల కోసం ప్రత్యేక సెషన్లను నిర్వహిస్తున్నట్లు వివరించింది. ఇప్పటివరకు 16 సెషన్లను నిర్వహించినట్లు డాట్ తెలిపింది. దేశీయంగా సైబర్నేరాల తీరుతెన్నులు నాటకీయంగా మారిపోయాయని పేర్కొంది. మోసగాళ్లు చట్టబద్ధమైన టెలికం మార్గాల కళ్లు గప్పి, డిజిటల్ అరెస్ట్ స్కామ్ల్లాంటి అధునాతన నేరాలకు పాల్పడుతున్నారని వివరించింది.ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు సంచార్ సాథీ ప్లాట్ఫాం ద్వారా ప్రజల భాగస్వామ్యం కూడా పెరగడం తోడ్పడుతోందని డాట్ తెలిపింది. ఈ పోర్టల్, మొబైల్ యాప్ను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించింది. -
యాపద్బాంధవులు
ఏ పుట్టలో ఏ పాము ఉందో...అన్నట్లు మహిళల భద్రతకు సంబంధించి ఎక్కడ ఏ ముప్పు పొంచి ఉంటుందో తెలియదు. ఏ ప్రయాణంలో ఏ ప్రమాదం పొంచి ఉందో తెలియదు. ఈ నేపథ్యంలో ఉమెన్ సేఫ్టీ యాప్స్కు ప్రాధాన్యత పెరిగింది. రకరకాల మార్గాల ద్వారా మహిళలు ప్రమాదాల బారిన పడకుండా, ప్రమాదాల నుంచి రక్షించడానికి ఈ యాప్లు ఉపయోగపడుతున్నాయి. 2025 సంవత్సరం ట్రెండింగ్ ఉమెన్ సేఫ్టీ యాప్స్ గురించి...మై సేఫ్టీపిన్క్రౌడ్ సోర్స్ డేటాను ఉపయోగించి వివిధ ప్రాంతాలకు సంబంధించి భద్రతా స్కోర్లను అందిస్తుంది... మై సేఫ్టీపిన్ యాప్. సురక్షితమైన మార్గాలను సూచిస్తుంది. ఆపద సమయంలో పోలీసులు రంగంలోకి దిగేలా చేస్తుంది. షెల్టర్ల గురించి చెబుతుంది. నగరాలను నావిగేట్ చేయడంలో సహాయపడడానికి ‘లైవ్ ట్రాకింగ్’ను అనుమతిస్తుంది. సేఫ్టీ స్కోర్, సేఫెస్ట్ రూట్, క్విక్ అడిట్, సపోర్ట్ నెట్వర్క్, లైవ్ ట్రాకింగ్, ఎమర్జెన్సీ కాంటాక్ట్స్లాంటి కీలకమైన ఫీచర్లు ‘మై సేఫ్టీపిన్’ యాప్లో ఉన్నాయి.నూన్లైట్నూన్లైట్ అనేది మహిళలకు సంబంధించిన పర్సనల్ సేఫ్టీ యాప్. 24/7 అత్యవసర పర్యవేక్షణను అందిస్తుంది. బటన్ను ప్రెస్ చేయడం ద్వారా మనం ఉన్న స్థల వివరాలను పోలీసు, అగ్నిమాపక సిబ్బంది, వైద్యసిబ్బందిని పంపించి సర్టిఫైడ్ ఆపరేటర్లను మనకు కనెక్ట్ చేస్తుంది.ఎలా పనిచేస్తుందంటే... ‘సురక్షితంగా లేను’ అని భావించినప్పుడు ఆన్స్క్రీన్ బటన్ను నొక్కాలి. సర్టిఫైడ్ ఆపరేటర్లు మనకు టెక్ట్స్ లేదా ఫోన్ కాల్ చేస్తారు. మనం ఉన్న లొకేషన్కి సంబంధించిన సమాచారాన్ని సమీపంలోని 811 కేంద్రానికి పంపుతారు. అలర్ట్, లోకేషన్ షేరింగ్, పీస్ ఆఫ్ మైండ్లాంటి కీలక ఫీచర్లు ‘నూన్లైట్’లో ఉన్నాయి.112 ఇండియా యాప్మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం ఆవిష్కరించిన యాప్...112 ఇండియా. ఇది కస్టమర్లను ఒకే నంబర్ (112) ద్వారా పోలీసు, అగ్నిమాపక, అంబులెన్స్ సిబ్బందికి అనుసంధానించి వారి సేవలు అందుబాటులోకి వచ్చేలా చేస్తుంది. కంట్రోల్ రూమ్ లేదా సమీపంలోని వాలంటీర్లకు ఇబ్బందుల్లో ఉన్న మహిళ లొకేషన్ పంపుతుంది. తక్షణ సహాయం కోసం ఇందులో ‘షౌట్’ ఫీచర్ ఉంది. అత్యవసర సమయాలలో ‘షౌట్’ సమీపంలోని రిజిస్టర్డ్ వాలంటీర్లను అప్రమత్తం చేస్తుంది.యూ ఆర్ సేఫ్హ్యాండ్స్–ఫ్రీ ఎమర్జెన్సీ అలార్ట్స్కు ఉపయోగపడే పర్సనల్ సేఫ్టీ యాప్... యూఆర్సేఫ్. ఇందులోని కీ ఫీచర్లు... హ్యాండ్స్–ఫ్రీ ఎస్వోఎస్: సింగిల్ ట్యాప్ లేదా వాయిస్ కమాండ్తో అలర్ట్స్ను యాక్టివేట్ చేస్తుంది. లైవ్ ట్రాకింగ్ అండ్ స్ట్రీమింగ్: అత్యవసర సమయాల్లో మహిళ లొకేషన్ను ఆడియో, వీడియో స్ట్రీమింగ్తో సేఫ్టీ స్కాడ్ (మన సన్నిహిత బృందం)కి షేర్ చేస్తుంది.ఫాలోమీ: ప్రయాణాలలో మన లొకేషన్ను లేదా ఇటీఏను మన సన్నిహితులకు షేర్ చేస్తుంది. సేఫ్టీచెక్స్: లొకేషన్ బేస్డ్ సేఫ్టీ ట్రిగ్గర్స్తో మన భద్రతను పర్యవేక్షిస్తుంది. క్రాష్ అండ్ ఫాల్ డిటెక్షన్: ప్రమాదాలకు గురైనప్పుడు అలర్ట్స్ పంపుతుంది.విత్ యూ‘ఐయామ్ ఇన్ డేంజర్’లాంటి మెసేజ్ల ద్వారా మన భద్రతకు రక్షణగా నిలిచే యాప్... ‘విత్యూ’. అవతలి వ్యక్తి స్పందించే వరకు ఈ మెసేజ్ పదేపదే రిపీట్ అవుతుంది. గూగుల్ మ్యాప్స్ ద్వారా యూజర్స్ మూమెంట్ను ట్రాక్ చేస్తుంది. ఫోన్ పవర్ బటన్ను డబుల్ క్లిక్ చేయడం ద్వారా ‘విత్యూ’ యాక్టివేట్ అవుతుంది. ‘ఐయామ్ ఇన్ డేంజర్’ ‘ఐ నీడ్ హెల్ప్’ ‘ప్లీజ్ ఫాలో మై లొకేషన్’లాంటి మెసేజ్లను ఎమర్జెన్సీ కాంటాక్ట్స్కు పంపుతుంది.షేక్ 2 సేఫ్టీమహిళా భద్రతకు సంబంధించిన ఆండ్రాయిడ్ యాప్... ‘షేక్ 2 సేఫ్టీ’. ఫోన్ను షేక్ చేయడం ద్వారా లేదా పవర్బటన్ను నాలుగుసార్లు నొక్కడం ద్వారా హెచ్చరికలను(ఎస్ఎంఎస్/కాల్) పంపుతుంది. ఆఫ్లైన్, లాక్డ్ స్క్రీన్లోనూ పనిచేస్తుంది. యాప్ సెట్టింగ్స్లో ఎమర్జెన్సీ కాంటాక్స్ను యాడ్ చేయాలి. ఎమర్జెన్సీ సమయాలలో ఎస్వోఎస్ మెసేజ్లకు సంబంధించి సైరన్ బట్ యాడ్ చేయవచ్చు. సర్కిల్ ఆఫ్ 6మహిళల భద్రతకు సంబంధించిన ‘సర్కిల్ ఆఫ్ 6’ యాప్ను కాలేజీ విద్యార్థులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఆరుగురు నమ్మకమైన స్నేహితులతో మన భద్రతకు సంబంధించిన నెట్వర్క్ను ఏర్పాటు చేస్తుంది సర్కిల్ ఆఫ్ 6. ఆపదలో ఉన్నప్పుడు,అత్యవసర సమయాల్లో మనం ఉన్న లొకేషన్ వివరాల ప్రీ-ప్రోగ్రామ్డ్ ఎస్ఎంఎస్ను మన సర్కిల్కు పంపిస్తుంది. హాట్లైన్కు వేగంగా యాక్సెస్ అయ్యేలా చేస్తుంది. సింపుల్ ఐకాన్స్, జీపీఎస్ని ఉపయోగించి ‘సర్కిల్’ ద్వారా మన భద్రతను పర్యవేక్షిస్తుంది. స్పీడ్ అండ్ సింప్లీసిటీతో ప్రైవసీ ప్రధానంగా, కమ్యూనిటీ ఫోకస్డ్గా రూపొందించిన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.వరల్డ్ ఎమర్జెన్సీ అసోషియేషన్... టాప్ 10 ఉమెన్ సేఫ్టీ యాప్స్దిల్లీ పోలీసులు ‘హిమ్మత్ ప్లస్’ అనే ఉమెన్ సేఫ్టీ యాప్ను రూపొందించారు. ఫ్యామిలీ సేఫ్టీ కోసం రూపొందించిన పాపులర్ లొకేషన్–షేరింగ్ యాప్...లైఫ్360. లైవ్ లొకేషన్ షేరింగ్, ఎస్వోఎస్ అలర్ట్స్. ప్లేస్ అలార్ట్స్, రైడ్–షేర్ సేఫ్టీ, ఫ్యామిలీసేఫ్టీలాంటి కీ సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మహిళల భద్రతకు సంబంధించి ‘ది వరల్డ్ ఎమర్జెన్సీ అసోసియేషన్’ ప్రకటించిన టాప్ 10 సేఫ్టీ యాప్లలో...మై సేఫ్పిన్, నూన్లైట్, లైఫ్ 360, యూఆర్సేఫ్ యాప్లతో పాటు మై ఎస్వోఎస్ ఫ్యామిలీ, ఎమర్జెన్సీ యాప్ ఆల్ట్రా, అమెరికాలో పాపులర్ అయిన సిటిజన్, ఐయామ్ సేఫ్. గూగుల్ పర్సనల్ సేఫ్టీ, సేఫ్టీ యాప్లు ఉన్నాయి.అక్కలాంటి... అమ్మలాంటి యాప్ముంబైలోని ధారావి మహిళలకు స్వచ్ఛంద సంస్థ ‘స్నేహాస్ లిటిల్సిస్టర్’ వారి యాప్ అక్కలా, అమ్మలా ధైర్యాన్ని ఇస్తోంది. ఆపదలో, కష్టాల్లో ఉన్న మహిళలు సహాయం కోసం ఎక్కడికో వెళ్లకుండ ‘స్నేహాస్ లిటిల్ సిస్టర్ యాప్’ను ఆశ్రయిస్తున్నారు. ఈ యాప్ వారికి తగిన భద్రతను, భరోసాను ఇస్తుంది. ‘సే హెల్ప్’ అనే యాప్ ద్వారా ఇటీవల దిల్లీ పోలీసులు కిడ్నాప్కు గురైన ఆరుగురు మహిళలను రక్షించారు...ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ‘ఒకప్పుడు ఒంటరిగా బయటికి వెళ్లాలంటే భయంగా ఉండేది. ఉమెన్ సేఫ్టీ యాప్ల వల్ల ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఈ యాప్లు ధైర్యాన్ని, రక్షణను ఇస్తున్నాయి’ అంటుంది చెన్నైకి చెందిన 24 సంవత్సరాల రవళి. -
గాలిలో తేలుతూ.. మెరుపుతీగలా వెళ్లే ట్రైన్!
ఎప్పటికప్పుడు అద్భుతాలు సృష్టిస్తున్న చైనా.. మరో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం రెండు సెకన్లలోనే గంటకు 700 కి.మీ వేగవంతమయ్యే మాగ్లెవ్ (Maglev) రైలు ఈ రికార్డ్ సృష్టించింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. చాలామంది ట్రైన్ రాకకోసం వేచి చూస్తున్నారు. అంతేలోనే మెరుపుతీగలా ట్రైన్ వెళ్లిపోయింది. అక్కడున్నవారంతా.. ఒక్కసారిగా అవాక్కయ్యారు. చూడటానికి ఇది ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాలోని దృశ్యంలా కనిపిస్తుంది.అత్యంత వేగవంతమైన సూపర్కండక్టింగ్ ఎలక్ట్రిక్ మాగ్లెవ్ రైలును విజయవంతంగా టెస్ట్ చేశారు. 700 కిమీ వేగంతో వెళ్లినప్పటికీ.. రైలును సురక్షితంగా స్టాప్ చేశారు. ఈ టెస్ట్ చైనాలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ పరిశోధకులు నిర్వహించారు.🇨🇳China leads the future!🇨🇳🚄China set a global record by accelerating a ton-scale test maglev to 700 kilometers per hour in just two seconds.Dedicated to maglev research for 10 years, the Chinese technicians have overcome core technical challenges. pic.twitter.com/F1Mv8dUZvc— Shen Shiwei 沈诗伟 (@shen_shiwei) December 25, 2025మాగ్లెవ్ ట్రైన్స్.. సాధారణ పట్టాలపై నడవవు. బదులుగా ఇందులోని సూపర్ కండక్టింగ్ అయస్కాంతాలు రైలును ఎత్తి, పట్టాలను తాకకుండానే ముందుకు నెట్టివేస్తాయి. దీనివల్ల వేగం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని భవిష్యత్తులో వాక్యూమ్ సీల్డ్ ట్యూబ్ల ద్వారా ప్రయాణించేలా చేయనున్నారు.ప్రపంచంలో అత్యంత వేగవంతమైన మాగ్లెవ్ ట్రైన్ ప్రాజెక్టు కోసం చైనా యూనివర్సిటీ బృదం పదేళ్లుగా కృషి చేస్తున్నారు. 2025 జనవరిలో టెస్ట్ చేసినప్పుడు ఇది గంటకు 648 కి.మీ. గరిష్ట వేగాన్ని చేరుకుంది. ఇప్పుడు తాజాగా జరిపిన టెస్టులో 700 కిమీ వరకు వేగవంతం అయింది. అదే యూనివర్సిటీ.. మూడు దశాబ్దాల క్రితం దేశంలో మొట్టమొదటి మనుషులతో కూడిన సింగిల్-బోగీ మాగ్లెవ్ రైలును అభివృద్ధి చేసింది.🚄🇯🇵 Le train japonais Maglev L0 ne se contente pas d’être rapide : il redéfinit littéralement la notion de vitesse dans le transport moderne.Grâce à la lévitation magnétique, il flotte au-dessus de son rail, éliminant toute friction et lui permettant d’atteindre plus de 600… pic.twitter.com/hnV4VnZ3Ro— Le Contemplateur (@LeContempIateur) December 4, 2025 -
అమెరికన్ ఏఐ కంపెనీని కొనేస్తున్న కోఫోర్జ్
అమెరికన్ కృత్రిమ మేధ (ఏఐ) సంస్థ ఎన్కోరాను కొనుగోలు చేయనున్నట్లు ఐటీ సర్వీసుల దిగ్గజం కోఫోర్జ్ వెల్లడించింది. 100% వాటాల కోసం 2.35 బిలియన్ డాలర్లని (సుమారు రూ.21,133 కోట్లు) తెలిపింది. పూర్తి స్టాక్స్ లావాదేవీ రూపంలో ఈ డీల్ ఉంటుందని వివరించింది. ఎన్కోరా ప్రస్తుత షేర్హోల్డర్లకు 1.89 బిలియన్ డాలర్ల ప్రిఫరెన్షియల్ షేర్లను జారీ చేయనున్నట్లు కోఫోర్జ్ పేర్కొంది.ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజాలు అడ్వెంట్ ఇంటర్నేషనల్, వార్బర్గ్ పింకస్ మొదలైనవి ఎన్కోరాలో వాటాదార్లుగా ఉన్నాయి. తమ ఏఐ ఆధారిత ఇంజనీరింగ్ సామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని కోఫోర్జ్ సీఈవో సుధీర్ సింగ్ చెప్పారు. ఎన్కోరా కలయికతో 2.5 బిలియన్ డాలర్ల టెక్ సేవల దిగ్గజం ఆవిర్భవిస్తుందని కోఫోర్జ్ పేర్కొంది.2027 ఆర్థిక సంవత్సరంలో ఏఐ ఆధారిత ఇంజనీరింగ్, డేటా, క్లౌడ్ సర్వీసుల విభాగం ఆదాయమే ఏకంగా 2 బిలియన్ డాలర్ల పైగా ఉంటుందని తెలిపింది. ఏఐ ఆధారిత ఇంజనీరింగ్ వ్యాపారం 1.25 బిలియన్ డాలర్లపైగా, క్లౌడ్ సేవలు 500 మిలియన్ డాలర్లు, డేటా ఇంజనీరింగ్ 250 మిలియన్ డాలర్ల స్థాయిలో ఉంటుందని కోఫోర్జ్ పేర్కొంది. -
మెయిల్ ఐడీ నచ్చలేదా? మార్చుకుందురులే..!
మనలో చాలా మందికి ఈమెయిల్ ఖాతాలు ఉంటాయి. అయితే ఈ మెయిల్ ఐడీల విషయంలో ఎక్కువ మందికి అసంతృప్తే ఉంటుంది. ఎందుకంటే చాన్నాళ్ల క్రితం వీటిని తెరిచేటప్పుడు సిస్టమ్ ఆటోమెటిక్గా సూచించిన ఏదో ఒక ఐడీని ఈమెయిల్ అడ్రెస్గా సెట్ చేసుకుని ఉంటారు. కానీ దాన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నప్పుడు అరే ఈ మెయిల్ ఐడీ అంత బాగా లేదే.. దీన్ని మనకు నచ్చినట్టు మార్చుకునే అవకాశం ఉంటే బాగుండు.. అనుకుంటుంటారు.ఇప్పుడా అవకాశాన్ని గూగల్ కల్పించబోతోంది. టెక్ దిగ్గజం రాబోయే సిస్టమ్ మార్పును వివరించే హిందీ భాష సపోర్ట్ డాక్యుమెంటేషన్ను ఇటీవల అప్డేట్ చేసింది. అందులో జీమెయిల్ అడ్రస్లను మార్చుకునే వెసులుబాటు గురించి పేర్కొంది.ప్రసిద్ద ఫోర్బ్స్ ప్రచురించిన కథనం ప్రకారం.. గూగుల్ తీసుకొస్తున్న కొత్త ఫీచర్తో యూజర్లు తమ జీమెయిల్ అడ్రెస్లను మార్చుకోవచ్చు. అయితే ఇందుకు నిర్దిష్ట పరిమితులు ఉంటాయి. ఇలా మెయిల్ ఐడీ మార్చుకోవడానికి ఏడాదికి ఒక్కసారి.. మొత్తంగా మూడు సార్లు అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఇంతకుముందున్న మెయిల్ అడ్రస్ కూడా అలియాస్గా కొనసాగుతుంది. అంటే దానికి వచ్చే మెయిల్స్ అలాగే వస్తుంటాయి. ఇక ఖాతా డేటా అంటే ఫోటోలు, మెసేజ్లు, ఇమెయిల్లు వంటి వాటిపై ఎలాంటి ప్రభావం ఉండదు.కాగా ఇప్పటి వరకు గూగుల్ అకౌంట్కు థర్డ్ పార్టీ ఈమెయిల్ చిరునామాలతో సైన్ అప్ చేసిన వినియోగదారులకు మాత్రమే ఖాతా ఈమెయిల్ మార్పులను అనుమతిస్తోంది. కానీ జీమెయిల్ అడ్రెస్ల మార్పునకు అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు గూగుల్ అందిస్తున్న కొత్త ఫీచర్ను సోషల్ మీడియా యూజర్లు స్వాగతిస్తున్నారు. -
భారత్లో ఉద్యోగాలకు ఏఐ ముప్పు తక్కువే
న్యూఢిల్లీ: పాశ్చాత్య దేశాలతో పోలిస్తే కృత్రిమ మేధతో (ఏఐ) భారత్లో వైట్ కాలర్ ఉద్యోగాలకు ముప్పు తక్కువేనని కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ చెప్పారు. మొత్తం ఉద్యోగుల్లో వైట్ కాలర్ సిబ్బంది సంఖ్య తక్కువగా ఉండటం ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు. ఈ ఆఫీసు ఉద్యోగాలు ఎక్కువగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ (స్టెమ్) ఆధారిత విభాగాల్లోనే ఉంటున్నాయని తెలిపారు. ఉద్యోగులను పూర్తిగా తప్పించేసి, వారి స్థానాన్ని భర్తీ చేసే పరిస్థితి తలెత్తడం కన్నా, సిబ్బంది ఉత్పాదకత పెంపునకు ఏఐ ఉపయోగపడుతుందని వివరించారు. ఏఐ కొన్ని సందర్భాల్లో డేటాను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయి, తప్పుగా ఇస్తున్న వివరాలను సరిచేసేందుకు ఇప్పటికీ మానవ ప్రమేయం అవసరం ఉంటోందని ఆయన చెప్పారు. ఏఐతో నిర్దిష్ట రంగాలు, అవసరాలకు తగ్గ సొల్యూషన్స్ని రూపొందించేందుకు అత్యుత్తమ నైపుణ్యాలున్న ఉద్యోగులు కావాల్సి ఉంటుందని కృష్ణన్ చెప్పారు. ఇలాంటి ఏఐ ఆధారిత ఉద్యోగావకాశాలను భారత్ అందిపుచ్చుకోవచ్చని వివరించారు. దేశీయంగా ఉద్యోగాల కల్పన, ఆర్థిక ప్రగతి సాధన కోసం కృత్రిమ మేధని ఉపయోగించుకోవడంతో పాటు ప్రపంచానికి కూడా ప్రయోజనం చేకూర్చగలిగే పటిష్టమైన స్థితిలో భారత్ ఉందని చెప్పారు. -
ఏఐ.. 2025..ఉమెన్ రైజింగ్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో భారతీయ మహిళలకు సంబంధించి 2025 కీలక సంవత్సరంగా నిలిచింది. జాతీయ మహిళా కమిషన్ (ఎన్డబ్ల్యూసీ) యశోద ఏఐ అభియాన్ కార్యక్రమం వల్ల క్షేత్రస్థాయిలో ఏఐ కోర్సులు చదివే మహిళల సంఖ్య బాగా పెరిగింది. టెక్నాలజీలో మహిళలకు సంబంధించిన ట్రెండ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) కోర్సులు కీలకంగా మారాయి.మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కోర్సులలో మహిళల పెరుగుదల నాలుగు రెట్లు పెరిగింది. ఈ సంవత్సరం ప్రారంభమైన జాతీయ మహిళా కమిషన్ (ఎన్డబ్ల్యూసీ) యశోద ఏఐ అభియాన్లాంటి ప్రభుత్వ కార్యక్రమాలు, ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్, రైజింగ్ 2025 సమ్మిట్లాంటి సదస్సుల ప్రభావం వల్ల ఏఐ కోర్సులు చేసే మహిళల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు మహిళల నేతృత్వంలోని ఏఐ స్టార్టప్ల సంఖ్య పెరగడం శుభసూచకం.డీప్–టెక్ డొమైన్లలో...2024తో పోల్చితే 2025లో ఏఐ/ఎంఎల్ మాస్టర్ ప్రోగ్రామ్స్లో మహిళల సంఖ్య 20 శాతం పెరిగింది. ‘ఏఐ, ఎంఎల్లలో మాస్టర్స్ చదువుతున్న ప్రతి ఐదుగురు విద్యార్థులలో ఒకరు మహిళ. సంవత్సరం క్రితం వరకు ఇరవైమందిలో ఒకరు ఉండేవారు’ అని తెలియజేసింది యూజీసీకి సంబంధించిన ‘కాలేజి విద్య’ ప్లాట్ఫామ్ రిపోర్ట్.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రాంప్ట్ ఇంజినీరింగ్, సైబర్ సెక్యురిటీ, రోబోటిక్స్, డాటా సైన్స్లాంటి డీప్–టెక్ డొమైన్లలో మహిళల ప్రాతినిధ్యం పెరిగిందని రిపోర్ట్ తెలియజేసింది. ఈ సంవత్సరం ఏఐ ప్రోగ్రామ్లకు సంబంధించి మహిళల ఆసక్తి గణనీయంగా పెరిగిందని, ఎంసిఏ సైబర్ సెక్యూరిటీ ఎన్రోల్మెంట్స్లో మహిళలు 25 శాతం, జనరేటివ్ ఏఐలో డాక్టోరల్ క్యాండిడేట్స్ 15 శాతం మంది ఉన్నారని నివేదిక వెల్లడించింది.మార్పు మంచిదే కదా!‘మనలో వచ్చిన మార్పుకు ఈ అభివృద్ధి రేటు అద్దం పడుతుంది. ఫ్లెక్సిబుల్ ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఇండస్ట్రీ రోల్ మోడల్స్ విజయగాథలు తెలుసుకునే అవకాశం ఈ పెరుగుదలకు కారణం. భారతదేశ సాంకేతిక భవిష్యత్తుకు సంబంధించి మహిళలు కీలకపాత్ర పోషించబోతున్నారని ఈ మార్పును చెబుతుంది’ అంటున్నారు ‘కాలేజి విద్య’ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రోహిత్ గుప్తా.పెద్ద పెద్ద నగరాలలో మాత్రమే కాదు ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి పట్టణాలలో కూడా మహిళలు ఏఐ కోర్సులపై అమిత ఆసక్తి చూపిస్తున్నారు. సైబర్ భద్రతా నైపుణ్యాలపై మహిళలు దృష్టి సారించేలా యశోద ఏఐ అభియాన్ కార్యక్రమాలు చేపట్టింది.స్టాన్ఫోర్డ్ ఏఐ ఇండెక్స్ 2025స్టాన్ఫోర్డ్ ఏఐ ఇండెక్స్ 2025 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఏఐ నైపుణ్యం కలిగిన వారిలో భారతీయ మహిళలు ఉన్నారు.‘ఎనాలటిక్స్’ ఇండియా మ్యాగజైన్ సమ్మిట్ ఏఐలో మహిళల భాగస్వామ్యంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. మొత్తంమీద, ఏఐకి సంబంధించి 2025 సంవత్సరం మహిళలకు కీలకమైన సంవత్సరం నిలుస్తుంది.యశోద ఏఐ అంటే?డిజిటల్ రంగంలో లింగ అంతరాన్ని తగ్గించడానికి ఈ సంవత్సరం మే 22న యశోద ఏఐ అభియాన్ ముందుకు వచ్చింది.యువర్ ఏఐ సాక్షి ఫర్ షేపింగ్ హారిజన్స్ విత్ డిజిటల్ అవేర్నెస్కు సంక్షిప్తరూపం... యశోద ఏఐ.ఎన్సీడబ్ల్యూ, ఫ్యూచర్ షిఫ్ట్ ల్యాబ్స్ (ఎఫ్ఎస్ఎల్) సహకారంతో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రచార కార్యక్రమం బరేలీలోని మహత్మా జ్యోతిబా పూలే రోహిల్ఖండ్ విశ్వవిద్యాలయంలో ప్రారంభమైంది. ‘భారతదేశం అంతటా ఒక కోటిమంది మహిళలకు డిజిటల్ నైపుణ్యం’ అనే దీర్ఘకాలిక లక్ష్యంతో ప్రయాణం మొదలు పెట్టింది యశోద ఏఐ అభియాన్. మొదటి దశలో రెండు లక్షల మందికి పైగా మహిళలకు శిక్షణ ఇవ్వడాన్ని లక్ష్యంగా నిర్ణయించుకుంది. మొబైల్ యాప్, శిక్షణ కార్యక్రమాల ద్వారా మహిళలకు ఏఐ సాధనాలు, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ అక్షరాస్యతలో ఆచరణాత్మక జ్ఞానాన్ని అందిస్తోంది. ఏఐ సాంకేతికతను సులభతరం చేయడానికి స్థానిక భాషలలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.మహిళలకు ఏఐ, సైబర్ సెక్యూరిటీ ఎందుకు కీలకం?హ్యాకింగ్, ఆన్లైన్ వేధింపులలాంటి సైబర్ నేరాల నుంచి తమను తాము రక్షించుకోవడానికి, ఏఐ రంగంలో అద్భుతమైన ఉద్యోగాలు సాధించడానికి, సాధికారతకు, డిజిటల్ ప్లాట్ఫామ్లను సురక్షితంగా నావిగేట్ చేయడానికి, కొత్త అవకాశాలను అన్వేషించడానికి, లింగ వివక్ష లేకుండా ఉండడానికి మహిళలకు ఏఐ, సైబర్ సెక్యూరిటీ ముఖ్యం అని యూఎన్ నివేదిక తెలియచేసింది. కాలేజీ స్టూడెంట్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ (ఎస్హెచ్జీ), ఆశావర్కర్, టీచర్, పంచాయతీ వార్డు మెంబర్ ఇలా ఎవరైనా కావచ్చు... యశోద ఏఐ అభియాన్లో చేరవచ్చు.‘ఇది కేవలం శిక్షణా కార్యక్రమం మాత్రమే కాదు. ఏఐ, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి మహిళా సాధికారతను ఉన్నతస్థాయిలో తీసుకువెళ్లే ఉద్యమం’ అనే ప్రశంసలు అందుకుంటోంది యశోద ఏఐ అభియాన్. ఏఐ బై హర్...గ్లోబల్ ఇంపాక్ట్ చాలెంజ్గ్లోబ్ ఇంపాక్ట్ ఛాలెంజెస్...‘ఏఐ బై హర్’ ‘ఏఐ ఫర్ ఆల్’ ‘యువ్ ఏఐ’ల కోసం భారత ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కి సంబంధించి నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి మహిళా సాంకేతిక నిపుణులను ఆహ్వానిస్తుంది. మహిళల నేతృత్వంలో ఏఐ ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించడానికి, వ్యవసాయం. సైబర్సెక్యూరిటీ, విద్య, డిజిటల్ వెల్బీయింగ్, ఆరోగ్యసంరక్షణ, ఎనర్జీ అండ్ క్లైమేట్ రంగాలలో, ఏఐకి సంబంధించి నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్, నీతి అయోగ్, ఇతర సంస్థల భాగస్వామ్యంతో గ్లోబల్ ఇంపాక్ట్ చాలెంజ్ ‘ఏఐ బై హర్’కు శ్రీకారం చుట్టారు. ‘ఏఐ–ఫర్–గుడ్ అప్లికేషన్స్’ లక్ష్యంతో ఫిబ్రవరి 2026లో న్యూ దిల్లీలో ఇండియా–ఏఐ ఇంపాక్ట్ సదస్సు జరగనుంది.ఎన్ని స్టార్టప్లో!ఈ సంవత్సరం మహిళల నేతృత్వంలోని స్టార్టప్ల సంఖ్యలో పెరుగుదల కనిపించింది. ట్రాక్షన్ డేటా ప్రకారం...అక్టోబర్ 2025 నాటికి దేశవ్యాప్తంగా మహిళల నేతృత్వంలో 7,000 కంటే ఎక్కువ స్టార్టప్లు పనిచేస్తున్నాయి. ఫండింగ్కు సంబంధించి వీటికి మంచి స్పందన వచ్చింది. మహిళల నేతృత్వంలోని ఏఐ వెంచర్లలో కొన్ని... డా.గీతా మంజునాథ్–నిరామయి హెల్త్ ఎనాలిటిక్స్, అశ్వినీ అశోకన్–మ్యాడ్ స్ట్రీట్ డెన్, చంద్రాలిక హజారిక–బిగ్ థింక్స్, ప్రాంజలీ అవస్థీ–డెల్వ్.ఏఐ, కృష్ణప్రియ ఆకెళ్ల–స్టార్బజ్.ఏఐ, నిధి–నెమా ఏఐ, రిత్వికా చౌదురి–అన్స్క్రిప్ట్.ఏఐ, లైనా ఇమ్మాన్యుయేల్, రింజిమ్ అగర్వాల్–బ్రెయిన్సైట్.ఏఐ. -
2025.. ఏఐ ఇయర్
సరిగ్గా ఏడాది కిందట.. ఏఐని ఒక డిజిటల్ విజ్ఞాన సర్వస్వంలా చూశాం. ఏదైనా సమాచారం కావాలన్నా చాట్ జీపీటీని అడిగేవాళ్లం. కానీ 2025కు వచ్చేసరికి ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నిన్నటి వరకు మన ప్రశ్నలకు సమాధానాలిచ్చిన ఏఐ (జనరేటివ్ ఏఐ), నేడు మన పనులను చక్కబెట్టే ఏఐ ఏజెంట్గా రూపాంతరం చెందింది. గతంలో ఏఐ కేవలం ఒక రియాక్టివ్ అసిస్టెంట్. అంటే మనం అడిగితేనే సమాధానం చెప్పేది. కానీ 2025 ఏఐ టూల్స్ ప్రోయాక్టివ్ పార్ట్నర్స్(మీరు ఒక చిన్న మాట చెబితే మీ అవసరాలను ఊహించి, మీ ప్రమేయం లేకుండానే పనులను పూర్తి చేసే ఒక తెలివైన భాగస్వామి)గా మారాయి.సాంకేతిక నిపుణులు 2025వ సంవత్సరాన్ని ఏఐ ఇయర్గా అభివర్ణిస్తున్నారు. 2024లో కేవలం మాటలకే పరిమితమైన కృత్రిమ మేధ (ఏఐ) 2025లో చేతల్లోకి వచ్చేసింది. కేవలం ప్రశ్నలకు సమాధానాలివ్వడమే కాకుండా మన పనులను స్వయంగా పూర్తి చేసే ఏఐ ఏజెంట్లు ఈ ఏడాది కీలకంగా మారాయి. జనవరి 2025 నుంచి డిసెంబర్ 2025 వరకు జనరేటివ్ ఏఐ రంగంలో కంపెనీలు తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు, టూల్స్ పై ప్రత్యేక కథనం.తొలి త్రైమాసికంలో..చైనాకు చెందిన డీప్సీక్ ఆర్1 మోడల్ విడుదల కావడంతో ఏఐ ప్రపంచం ఉలిక్కిపడింది. ఇది తక్కువ ఖర్చుతో అత్యుత్తమ ఆలోచనా సామర్థ్యం అందించడంతో ఓపెన్ సోర్స్ ఏఐ ఊపందుకుంది. ఇదే నెలలో ఓపెన్ఏఐ ఓ3-మినీని విడుదల చేసింది.ఆంథ్రోపిక్ Claude 3.7 Sonnetను, ఎలాన్ మస్క్ గ్రోక్ 3ని లాంచ్ చేశారు. వీటితో పాటు ఓపెన్ఏఐ కంప్యూటర్లను స్వయంగా ఆపరేట్ చేయగల Operator అనే ఏజెంట్ను పరిచయం చేసింది. గూగుల్ తన అత్యంత వేగవంతమైన Gemini 2.5 Flash, రోబోటిక్స్ కోసం ప్రత్యేకమైన ఏఐ మోడల్స్ను తెచ్చింది.రెండో త్రైమాసికంలో..ఏప్రిల్లో మెటా Llama 4 మోడల్స్ను విడుదల చేసింది. ఇవి ఓపెన్ సోర్స్ రంగంలో సరికొత్త రికార్డులు సృష్టించాయి. మేలో ఆంథ్రోపిక్ నుంచి Claude 4 విడుదలయ్యింది. ఇది మనుషుల లాగా వరుసగా ఏడు గంటల పాటు స్వయంగా పని చేయగల సామర్థ్యాన్ని ప్రదర్శించి ఆశ్చర్యపరిచింది. జూన్లో గూగుల్ తన సెర్చ్ ఇంజిన్లో ఏఐ మోడ్ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చింది.మూడో త్రైమాసికంజులైలో ఓపెన్ఏఐ తన ఆదాయంలో 1 బిలియన్ డాలర్ల మార్కును దాటి ఏఐ మార్కెట్ సత్తాను చాటింది. ఆగస్టులో అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన జీపీటీ-5 విడుదలైంది. ఇది మునుపటి మోడల్స్ కంటే రెట్టింపు తెలివితేటలతో, కోడింగ్లో అద్భుతమైన ప్రతిభను కనబరిచింది. సెప్టెంబర్లో వీడియో జనరేషన్ రంగంలో ఓపెన్ఏఐ Sora యాప్ అందరికీ అందుబాటులోకి వచ్చింది. గూగుల్ తన వీడియో మోడల్ Veo 2తో దీనికి పోటీనిచ్చింది.నాలుగో త్రైమాసికంఅక్టోబర్లో ఓపెన్ఏఐ తన సంస్థాగత నిర్మాణాన్ని మార్చుకుని పూర్తి లాభాపేక్ష కలిగిన కంపెనీగా అవతరించింది. నవంబర్లో గూగుల్ Gemini 3.0ని విడుదల చేసింది. ఇది ఆండ్రాయిడ్ ఫోన్లలో పర్సనల్ అసిస్టెంట్గా మారింది. డిసెంబర్లో GPT-5.2 అప్డేట్తో పాటు, గూగుల్ ట్రాన్స్లేట్లో అత్యంత కచ్చితమైన ఏఐ అనువాద ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి.ఇదీ చదవండి: చెక్ పవర్ తగ్గిందా? -
ప్రయాణికులు గాల్లో తేలాల్సిందే!
ట్రాఫిక్ జామ్లో చిక్కుకుని గంటల తరబడి వేచి చూసే రోజులకు కాలం చెల్లనుందా.. అంటే అవుననే చెప్పాలి. గాల్లో ప్రయాణించే పక్షిలా.. నగరంలోని గగనతలంలో విహరిస్తూ గమ్యాన్ని నిమిషాల్లో చేరుకునే ఎయిర్ టాక్సీ కల సాకారం కాబోతోంది. బెంగళూరుకు చెందిన ‘సరళా ఏవియేషన్’ తమ అధునాతన ఎయిర్క్రాఫ్ట్తో భారత విమానయాన రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికింది.బెంగళూరుకు చెందిన స్టార్టప్ ‘సరళా ఏవియేషన్’ (Sarala Aviation) అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (eVTOL) విమానం SYL-X1 హాఫ్-స్కేల్ ప్రోటోటైప్ గ్రౌండ్ టెస్టింగ్ను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపింది. నగరంలోని కంపెనీ టెస్ట్ ఫెసిలిటీలో జరిగిన ఈ పరీక్షలు దేశీయ ఎయిర్ టాక్సీ ప్రయాణాన్ని నిజం చేసే దిశగా నిలిచాయి.ఈ విమానం ప్రత్యేకతలు7.5 మీటర్ల భారీ రెక్కల విస్తీర్ణంతో రూపొందిన SYL-X1 ప్రస్తుతం భారతదేశంలో ఒక ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన అతిపెద్ద, అధునాతన eVTOL విమానంగా గుర్తింపు పొందింది. కేవలం 9 నెలల కాలంలోనే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా దీన్ని సిద్ధం చేశారు. సాధారణ మోడల్స్ లాగా కాకుండా ఈ విమానాన్ని మొదటి నుంచే వాణిజ్య ధ్రువీకరణ (Certification) పొందేలా డిజైన్ చేశారు. ఇది భవిష్యత్తులో రాబోయే 15 మీటర్ల రెక్కల విస్తీర్ణం కలిగిన పూర్తిస్థాయి విమానానికి పునాదిగా నిలుస్తుంది.‘ఈ విభాగంలో కేవలం మొదటి స్థానంలో ఉండటం కాదు, ఏవియేషన్ రంగంలో ఒక దిగ్గజంగా ఎదగడమే మా లక్ష్యం’ అని సరళా ఏవియేషన్ సహ వ్యవస్థాపకులు, సీటీఓ రాకేష్ గావ్కర్ పేర్కొన్నారు. కంపెనీ తన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కింద తయారు చేసిన ఆరు సీట్ల ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ టాక్సీతో ఎంతో మేలు జరుగుతుందని సంస్థ పేర్కొంది. ఇది బెంగళూరు, ముంబై, ఢిల్లీ, పుణె వంటి మెట్రో నగరాల్లో గంటల తరబడి ఉండే ట్రాఫిక్ ప్రయాణ సమయాన్ని నిమిషాల్లోకి తగ్గించనుందని చెప్పింది.నిధుల సేకరణఇప్పటికే ఈ సంస్థ తన కార్యకలాపాల కోసం సుమారు 13 మిలియన్ డాలర్ల (సుమారు రూ.108 కోట్లు) నిధులను సేకరించింది. దీనికి అదనంగా, భారత్ మొబిలిటీ ఎక్స్పోలో జాతీయ ప్రదర్శన కోసం ఒక పూర్తిస్థాయి స్టాటిక్ ఎయిర్క్రాఫ్ట్ను కూడా సిద్ధం చేసింది. 2024లోనే, కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహించే బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (BIAL)తో సరళా ఏవియేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. నగరంలోని ప్రధాన ప్రాంతాల నుంచి ఎయిర్పోర్ట్కు తక్కువ సమయంలో ప్రయాణించేలా eVTOL సేవలను ప్రారంభించడమే ఈ భాగస్వామ్య ప్రధాన ఉద్దేశమని తెలిపింది.తదుపరి దశ ఏమిటి?గ్రౌండ్ టెస్టింగ్ విజయవంతం కావడంతో కంపెనీ ఇప్పుడు తన ఎయిర్ టాక్సీ ప్రోగ్రామ్లో అతి ముఖ్యమైన ధ్రువీకరణ (Validation) దశలోకి ప్రవేశించింది. త్వరలోనే ఈ హాఫ్-స్కేల్ విమానం గాలిలోకి ఎగిరే అవకాశం ఉంది. ఇది విజయవంతమైతే భారత్ సొంత ఎయిర్ టాక్సీలను కలిగిన దేశాల జాబితాలో చేరుతుంది.ఇదీ చదవండి: ఇది గ్రాఫిక్స్ కాదు.. నిజంగా రోబోనే! -
ఇది గ్రాఫిక్స్ కాదు.. నిజంగా రోబోనే!
సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో గాల్లోకి ఎగిరి విన్యాసాలు చేసే రోబోలు నిజ జీవితంలోకి వచ్చేస్తున్నాయి. ‘టెర్మినేటర్’ సినిమాలో విధ్వంసం సృష్టించిన ‘టీ800’ గుర్తుండే ఉంటుంది కదా! సరిగ్గా అదే పేరుతో చైనా కొత్త రోబో తయారు చేసింది. అయితే టెర్మినేటర్లో మాదిరి విధ్వంసం సృష్టించేదిగా కాకుండా, మానవాళికి సహాయపడేలా చైనాకు చెందిన రోబోటిక్స్ సంస్థ ‘ఇంజిన్ ఏఐ’ హ్యూమనాయిడ్ రోబోను అభివృద్ధి చేసింది. ఇటీవల జరిగిన ఓ ప్రదర్శనలో ఈ రోబో చేసిన కుంగ్ ఫూ విన్యాసాలు ఆశ్చర్యపరిచాయి.సాహసోపేత అడుగు2023లో స్థాపించిన ఈ ఇంజిన్ఏఐ స్టార్టప్ కంపెనీ తక్కువ సమయంలోనే రోబోటిక్స్ రంగంలో సంచలనం సృష్టించింది. ‘బోర్న్ టు సబ్వర్ట్’ (వ్యవస్థను మార్చడానికే పుట్టింది) అనే నినాదంతో వస్తున్న T800 లైవ్ డెమోల్లో హై-కిక్స్, స్పారింగ్ మూమెంట్స్తో ప్రేక్షకులను ఎంతో ఆకర్షిస్తోంది. దీని చురుకుదనం చూసిన చాలామందికి ఇది అసలైన రోబోనా లేక కంప్యూటర్ గ్రాఫిక్సా అనే సందేహం కలగకమానదని కొందరు చెబుతున్నారు. విమర్శలకు సమాధానంగా కంపెనీ మేకింగ్ వీడియోలను విడుదల చేసింది. సీఈఓ జావో టోంగ్యాంగ్ స్వయంగా ఆ రోబోతో తలపడిన వీడియోను సైతం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.టీ800ని అత్యంత నాణ్యమైన ప్రమాణాలతో రూపొందించినట్లు కంపెనీ చెప్పింది. 1.73 మీటర్ల ఎత్తు, 75 కిలోల బరువు ఉండే ఈ రోబోను ఏరోస్పేస్ గ్రేడ్ మెగ్నీషియం-అల్యూమినియం మిశ్రమంతో తయారు చేసినట్లు పేర్కొంది. 450 ఎన్ఎం టార్క్ కీళ్ల సామర్థ్యంతో ఇది అథ్లెట్ల తరహాలో కదలగలదని చెప్పింది. ఇది ఒక్కో చేతిలో 5 కిలోల వరకు వస్తువులను సులువుగా లేపగలదు. ఈ రోబోలో అధికంగా వేడి జనరేట్ అవ్వకుండా ఉండటానికి అధునాతన కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. నాలుగు గంటల పాటు నిరంతరాయంగా పనిచేసేలా మాడ్యులర్ సాలిడ్-స్టేట్ బ్యాటరీని ఇందులో అమర్చినట్లు కంపెనీ తెలిపింది.ఏఐ సూపర్ పవర్ఈ రోబోలో ఎన్వీడియా ఏజీక్స్ ఓరిన్ మాడ్యూల్, ఇంటెల్ N97 సీపీయూలున్నాయి. ఇవి 275 TOPS (Trillions of Operations Per Second) శక్తిని అందిస్తాయి. 360 డిగ్రీల వ్యూతో తన పరిసరాలను మిల్లీసెకన్లలో అర్థం చేసుకుని అడ్డంకులను అధిగమిస్తుంది.Oh my god! Sci-fi movie becomes reality in China!⬆️: 🇺🇸sci-fi films Real Steel, 2011⬇️: 🇨🇳ENGINEAI T800 humanoid robot, 2025China is turning the silver-screen fantasy into tangible technology in just a decade. pic.twitter.com/WTWxnfAoT7— Li Zexin 李泽欣 (@XH_Lee23) December 3, 2025టీ800 ప్రాజెక్ట్ కోసం హువాంగ్పు రివర్ క్యాపిటల్ వంటి సంస్థల నుంచి 1 బిలియన్ యువాన్ల (సుమారు రూ.1,180 కోట్లు) భారీ నిధులను ఇంజిన్ ఏఐ సేకరించింది. ఈ నిధులతో 2026 మధ్య నాటికి టీ800 రోబోలను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసి డెలివరీ చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. టెస్లాకు చెందిన ఆప్టిమస్, బోస్టన్ డైనమిక్స్కు చెందిన అట్లాస్ వంటి దిగ్గజ రోబోలతో టీ800 పోటీ పడనుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: రూపాయికి ఆర్బీఐ రక్షణ కవచం -
ఐటీ ఉద్యోగాలు.. బాగానే పెరిగాయ్..
దేశీయంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో ఈ ఏడాది హైరింగ్ మెరుగ్గా నమోదైంది. గతేడాదితో పోలిస్తే నియామకాలు 16 శాతం పెరిగాయి. 2025లో మొత్తం ఐటీ ఉద్యోగాల డిమాండ్ 18 లక్షలకు చేరినట్లు వర్క్ఫోర్స్, టాలెంట్ సొల్యూషన్స్ సేవల సంస్థ క్వెస్ కార్ప్ ఒక నివేదికలో తెలిపింది.దీని ప్రకారం ఐటీ హైరింగ్ మార్కెట్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) అత్యధికంగా 27 శాతం వాటా దక్కించుకున్నాయి. 2024లో నమోదైన 15 శాతంతో పోలిస్తే గణనీయంగా ఉద్యోగులను తీసుకున్నాయి. ఇక ప్రోడక్ట్, సాస్ (సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్) సంస్థలు కూడా చెప్పుకోతగ్గ స్థాయిలో రిక్రూట్ చేసుకున్నాయి. అయితే, ఐటీ సర్వీసెస్, కన్సల్టింగ్ విభాగాల్లో మాత్రం నియామకాల వృద్ధి ఒక మోస్తరుగానే నమోదైంది.నిధుల ప్రవాహం నెమ్మదించడంతో స్టార్టప్లలో హైరింగ్ కనిష్ట స్థాయి సింగిల్ డిజిట్కి పడిపోయినట్లు నివేదిక వివరించింది. అప్పటికప్పుడు పూర్తి స్థాయి ఉద్యోగ విధులను నిర్వర్తించేందుకు సన్నద్ధంగా ఉన్న వారితో పాటు మిడ్ కెరియర్ ప్రొఫెషనల్స్ (4–10 ఏళ్ల అనుభవం) ఉన్నవారి ప్రాధాన్యం లభించింది. మొత్తం హైరింగ్లో వీరి వాటా 65 శాతానికి పెరిగింది. 2024లో ఇది 50 శాతం. నివేదికలో మరిన్ని విశేషాలు.. మొత్తం డిమాండ్లో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల్లో హైరింగ్ వాటా 15 శాతంగా ఉంది. కాంట్రాక్ట్ ఉద్యోగాలకు నియామకాలు మొత్తం ఐటీ హైరింగ్లో 10–11 శాతంగా నమోదయ్యాయి. 2024లో ఇది సుమారు 8 శాతంగా నిల్చింది. ఐటీలో నెలకొన్న డిమాండ్ని బట్టి చూస్తే ఐటీ కొలువుల్లో కాంట్రాక్ట్ నియామకాల వాటా పెరిగింది. ఏఐ, క్లౌడ్, సైబర్సెక్యూరిటీ నైపుణ్యాలు ఉన్న వారిపై కంపెనీలు ప్రధానంగా దృష్టి పెట్టాయి. వచ్చే ఏడాది (2026) ఆసాంతం ఐటీ హైరింగ్ ఇదే విధంగా ఉండొచ్చు. డిజిటల్లో స్పెషలైజ్డ్ ఉద్యోగ విధులు, ద్వితీయ శ్రేణి నగరాల పరిధిని దాటి క్రమంగా విస్తరిస్తుండటం వంటి అంశాలు ఇందుకు దన్నుగా ఉంటాయి. ఏఐ, క్లౌడ్, సైబర్సెక్యూరిటీ, డేటా ఆధారిత ఉద్యోగాలకు డిమాండ్ నెలకొనవచ్చు. బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్), తయారీ, సాస్, టెలికం రంగాల్లో నియామకాలు ఎక్కువగా ఉండొచ్చు.సర్వీసుల్లో ఫ్రెషర్స్, మహిళల నుంచి దరఖాస్తుల వెల్లువ సర్వీసుల ఆధారిత ఉద్యోగాలవైపు మహిళలు, ఫ్రెషర్స్ మొగ్గు చూపడంతో ఈ ఏడాది ఉద్యోగాలకు దరఖాస్తులు 29 శాతం పెరిగాయి. అప్నాడాట్కో నివేదిక ప్రకారం 9 కోట్లకు పైగా జాబ్ అప్లికేషన్లు వచ్చాయి. మెట్రోల పరిధిని దాటి హైరింగ్, డిజిటల్ రిక్రూట్మెంట్ సాధనాల వినియోగం పెరిగింది. ఫైనాన్స్, అడ్మిని్రస్టేటివ్ సర్వీసులు, కస్టమర్ ఎక్స్పీరియన్స్, హెల్త్కేర్ సపోర్ట్ ఉద్యోగాలకు మహిళల నుంచి దరఖాస్తులు 36 శాతం పెరిగి 3.8 కోట్లుగా నమోదయ్యాయి.ఇది చదివారా? సత్య నాదెళ్లకు అదో సరదా..ఇక సర్వీస్, టెక్నాలజీ ఆధారిత రంగాల్లో ఫ్రెషర్ల నుంచి దరఖాస్తులు సుమారు 10 శాతం పెరిగాయి. అప్నాడాట్కో పోర్టల్లోని ఉద్యోగ దరఖాస్తుల డేటా విశ్లేషణ ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. దీని ప్రకారం ఏటా 1 కోటి మంది యువతీ, యువకులు ఉద్యోగాల్లో చేరుతున్నారు. బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా), రిటైల్, లాజిస్టిక్స్, ఈ–కామర్స్, ఆరోగ్య సంరక్షణ, మొబిలిటీ, ఐటీ సర్వీసులు తదితర విభాగాల్లో ఉద్యోగాలకు డిమాండ్ నెలకొంది.చిన్న, మధ్య తరహా సంస్థల్లో (ఎస్ఎంబీ) జాబ్ పోస్టింగ్స్ 11 శాతం పెరిగి 10 లక్షలుగా నమోదైంది. అటు పెద్ద సంస్థల్లో జాబ్ పోస్టింగ్స్ 14 శాతం పెరిగి 4 లక్షలుగా నమోదయ్యాయి. ప్రథమ శ్రేణి నగరాల నుంచి సుమారు 2 కోట్ల దరఖాస్తులు, ద్వితీయ..తృతీయ శ్రేణి నగరాల నుంచి 1.8 కోట్ల అప్లికేషన్లు వచ్చాయి. మహిళల జీతభత్యాలు సగటున 22 శాతం పెరిగాయి. -
ఐఫోన్లపై డిస్కౌంట్స్.. కొనేందుకు సరైన సమయం!
ఈ ఏడాది సెప్టెంబర్లో ఐఫోన్ 17 ప్రో లాంచ్ అయింది. ఈ మొబైల్ ఫోన్ లాంచ్ అయినప్పటికీ.. చాలామంది ఐఫోన్ 16 ప్రో కొనుగోలు చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఏ ఫోన్ కొనాలో తెలియక గందరగోళానికి గురయ్యారు. ఇప్పుడు ఇయర్ ఎండ్ సందర్భంగా ఫ్లిప్కార్ట్, అమెజాన్ సంస్థలు కూడా వీటిపై ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ అందిస్తున్నాయి.ఫ్లిప్కార్ట్ & అమెజాన్లో ధరలుయాపిల్ ఐఫోన్ 17 ప్రో 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ అమెజాన్ ఇండియాలో రూ.1,34,900కి అందుబాటులో ఉంది. అయితే కొనుగోలుదారులు ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డులతో రూ.4,000 వరకు తగ్గింపును పొందవచ్చు.ఐఫోన్ 16 ప్రో అసలు ధర రూ.1,19,900 కాగా.. ఫ్లిప్కార్ట్లో రూ.1,08,999కు లభిస్తోంది. అంతే కాకుండా ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులు, బ్యాంక్ ఆఫర్స్ వంటివి ఉపయోగించి అదనపు తగ్గింపులను పొందవచ్చు.స్పెసిఫికేషన్లు & ఫీచర్లుఐఫోన్ 17 ప్రో 6.3 ఇంచెస్ LTPO సూపర్ రెటినా XDR OLED డిస్ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్ & 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. ఇది iOS 26 ఆపరేటింగ్ సిస్టమ్తో జత చేయబడిన Apple A19 Pro చిప్సెట్ పొందుతుంది. ఇందులో మూడు 48MP సెన్సార్లతో సహా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ను కలిగి ఉంది. సెల్ఫీలు & వీడియో కాల్ల కోసం ఇది 18MP ఫ్రంట్ స్నాపర్ను కూడా లభిస్తుంది.ఇదీ చదవండి: మొబైల్ యూజర్లకు షాక్ తప్పదా.. కొత్త రీఛార్జ్ ప్లాన్స్?ఇక ఐఫోన్ 16 ప్రో విషయానికి వస్తే.. ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో 6.3 అంగుళాల LTPO సూపర్ రెటినా XDR OLED డిస్ప్లేను పొందుతుంది. iOS 18 ఆపరేటింగ్ సిస్టమ్తో జత చేయబడిన Apple A18 ప్రో చిప్సెట్ లభిస్తుంది. అయితే లేటెస్ట్ iOS 26.2కి అప్గ్రేడ్ చేసుకోవచ్చు. హ్యాండ్సెట్లో రెండు 48MP సెన్సార్లు & వెనుక 12MP సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో, వీడియో కాల్స్ & సెల్ఫీల కోసం 12MP కెమెరా లభిస్తుంది. -
ఢిల్లీలో త్వరలో ‘దర్పణ్ 2.0’ ప్రారంభం!
పారదర్శకత, జవాబుదారీతనం, వేగవంతమైన నిర్ణయాలే లక్ష్యంగా ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. దేశ రాజధానిలో పాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ‘దర్పణ్ 2.0’ అనే అధునాతన పర్యవేక్షణ(మానిటరింగ్) డాష్బోర్డ్ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) పరిధిలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) ఈ ప్లాట్ఫారమ్ను అభివృద్ధి చేసింది.ఏమిటీ ‘దర్పణ్ 2.0’?దర్పణ్ (Dashboard for Analytics, Review and Performance Assessment Nationwide) అనేది వివిధ ప్రభుత్వ పథకాలను 24x7 పర్యవేక్షించేందుకు రూపొందించిన ఒక మల్టీ ల్యాంగ్వేజీ ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఇది కేవలం సమాచారాన్ని చూపడమే కాకుండా, విశ్లేషణాత్మక అంశాలను అందిస్తుంది.ఫీచర్లు ఇవే..వేర్వేరు విభాగాల మధ్య ఉన్న డేటా అంతరాలను తొలగించి అన్ని ప్రభుత్వ పథకాల పురోగతిని ఒకే చోట చూపిస్తుంది.ప్రభుత్వ పథకాల స్టేటస్ను తెలియజేస్తుంది. ఈ పథకాలు లబ్ధిదారులకు అందుతున్నాయా లేదా? అనే అంశాలను ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా పర్యవేక్షించవచ్చు. రియల్ టైమ్లో వీటిని ట్రాక్ చేయవచ్చు.ఏదైనా ప్రాజెక్ట్ నెమ్మదించినా లేదా అడ్డంకులు ఎదురైనా ఈ సిస్టమ్ అధికారులను ముందుగానే అప్రమత్తం చేస్తుంది.కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (కేపీఐ) ద్వారా ప్రతి విభాగం పనితీరును స్కోర్ కార్డుల రూపంలో అంచనా వేస్తుంది.అమలు ఎప్పుడంటే..ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఢిల్లీ ప్రభుత్వం రాబోయే 12 నుంచి 16 వారాల్లో దశలవారీగా అమలు చేయనుంది. ఈ ప్రక్రియలో భాగంగా అన్ని విభాగాల నోడల్ అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. సురక్షితమైన ఏపీఐల ద్వారా ఢిల్లీ ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలను ఈ డాష్బోర్డ్కు అనుసంధానిస్తారు.భవిష్యత్ లక్ష్యాలుడిజిటల్ ఇండియా విజన్లో భాగంగా రూపొందుతున్న ఈ వ్యవస్థ భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత విశ్లేషణలకు, పబ్లిక్ డాష్బోర్డ్లకు పునాది వేయనుంది. దీనివల్ల ప్రభుత్వ పనితీరు ప్రజలకు స్పష్టంగా తెలియడమే కాకుండా, సాక్ష్యాధారిత విధాన ప్రణాళిక రూపొందించడానికి మార్గం సుగమం అవుతుంది.ఇదీ చదవండి: 2026 నుంచి చైనా గేమ్ ప్లాన్ ఇదే..నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ రూపొందించిన ఈ ‘దర్పణ్’ మోడల్ను ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అమలు చేస్తున్నాయి.ఉత్తరప్రదేశ్: ఇటీవల యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ‘NexGen UP-CM DARPAN 2.0’ పేరుతో అత్యంత ఆధునిక వెర్షన్ను ప్రారంభించింది. ఇందులో 53 విభాగాలకు చెందిన దాదాపు 588 పథకాలను రియల్ టైమ్లో పర్యవేక్షిస్తున్నారు.మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్: ఈ రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వ ఫ్లాగ్షిప్ పథకాల పురోగతిని పర్యవేక్షించడానికి దర్పణ్ డ్యాష్బోర్డ్ అందుబాటులో ఉంది.హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్: పర్వత ప్రాంత రాష్ట్రాల్లో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోసం ఈ ప్లాట్ఫామ్ను సమర్థవంతంగా వాడుతున్నారు.ఈశాన్య రాష్ట్రాలు: మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర వంటి రాష్ట్రాలు కూడా తమ జిల్లా స్థాయి ప్రాజెక్టుల పర్యవేక్షణకు దీనినే ఉపయోగిస్తున్నాయి.కేంద్రపాలిత ప్రాంతాలు: పుదుచ్చేరి, లక్షద్వీప్, చండీగఢ్ వంటి ప్రాంతాల్లో కూడా ఇది అమలులో ఉంది. -
జనరేటివ్ ఏఐ కంటే స్పష్టమైన ఫలితాలిచ్చే దిశగా..
ప్రపంచంలోనే అతిపెద్ద ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ సంస్థల్లో ఒకటైన సేల్స్ ఫోర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విషయంలో తన దూకుడును తగ్గించుకుంటోంది. గత ఏడాది కాలంగా లార్జ్ ల్యాంగ్వేజీ మోడల్స్(LLM) పనితీరుపై నమ్మకం సడలడమే ఇందుకు ప్రధాన కారణం. జనరేటివ్ ఏఐ కంటే మరింత స్పష్టమైన ఫలితాలనిచ్చే నిర్ణయాత్మక (Deterministic)ఆటోమేషన్ వైపు కంపెనీ మొగ్గు చూపుతోంది.నమ్మకం కోల్పోతున్న ఎగ్జిక్యూటివ్లు‘ఒక సంవత్సరం క్రితం ఎల్ఎల్ఎంల గురించి మాకున్న నమ్మకం ఇప్పుడు లేదు’ అని సేల్స్ ఫోర్స్ ప్రొడక్ట్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజ్న పరులేకర్ అంగీకరించారు. ఏఐ నమూనాల్లో ఉండే రాండమ్నెస్(యాదృచ్ఛికం) వల్ల వ్యాపార పనుల్లో తప్పులు దొర్లే ప్రమాదం ఉందని, అందుకే తమ కొత్త ఉత్పత్తి అయిన ఏజెంట్ ఫోర్స్లో మరింత నియంత్రిత ఆటోమేషన్ను ప్రవేశపెడుతున్నామని ఆమె వెల్లడించారు.సాంకేతిక వైఫల్యాలే కారణమా?ఏజెంట్ ఫోర్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మురళీధర్ కృష్ణప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. AI మోడల్స్కు ఎనిమిది కంటే ఎక్కువ సూచనలు (Prompts) ఇచ్చినప్పుడు అవి గందరగోళానికి గురవుతున్నాయి. ముఖ్యంగా..ఎక్కువ సూచనలు ఉంటే ఎల్ఎల్ఎంలు కీలకమైన ఆదేశాలను వదిలివేస్తున్నాయి.వినియోగదారులు అసంబద్ధమైన ప్రశ్నలు అడిగినప్పుడు ఏఐ తన అసలు లక్ష్యాన్ని మర్చిపోయి పక్కదారి పడుతోంది.25 లక్షల కస్టమర్లు ఉన్న వివింట్(Vivint) వంటి కంపెనీలు కస్టమర్ సర్వేలను పంపడంలో ఏఐ విఫలమైందని గుర్తించాయి. దీన్ని సరిదిద్దడానికి ఇప్పుడు మళ్లీ పాత పద్ధతిలో ‘ట్రిగ్గర్లను’ ఏర్పాటు చేయాల్సి వస్తోంది.డేటా ఫౌండేషన్లపై దృష్టిఏఐ ద్వారా వేల కోట్లు ఆర్జించవచ్చని భావించిన సేల్స్ఫోర్స్ సీఈఓ మార్క్ బెనియోఫ్ ఇప్పుడు డేటా ఫౌండేషన్లపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. సరైన డేటా లేకుండా ఏఐ ఇష్టారీతిన ప్రవర్తిస్తుందని చెప్పారు. ఇటీవల ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. ఏఐ ఏజెంట్ల విస్తరణ కారణంగా కంపెనీ తన సహాయక సిబ్బందిని 9,000 నుంచి 5,000కి తగ్గించిందని వెల్లడించారు.ఇదీ చదవండి: చేసేది ఎక్కువ.. ఇచ్చేది తక్కువ! -
సాగర గర్భంలో అపార ఖనిజ సంపద.. వెలికితీత సాధ్యమేనా?
భారతదేశం అనేక ఖనిజాలకు (ఇంధన, లోహ, అలోహ ఖనిజాలు) నిలయం. వీటిని సరైన విధంగా గుర్తించి.. వినియోగించుకుంటే.. దిగుమతి కోసం దాదాపు ఏ దేశం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. భూమిపైన మాత్రమే కాకుండా.. సముద్ర గర్భంలో కూడా విరివిగా లభిస్తాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇండియా.. నేషనల్ గ్యాస్ హైడ్రేట్ ప్రోగ్రామ్ (NGHP) ద్వారా.. సముద్రంలో మీథేన్ హైడ్రేట్ నిక్షేపాలను గుర్తించింది. ఇంతకీ ఇదెందుకు ఉపయోగపడుతుంది?, ఎలా బయటకు తీయాలి?, బయటకు తీయడం వల్ల లాభం ఏమిటనే.. ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.భారతదేశం.. బంగాళాఖాతంలో మాత్రమే కాకుండా, దాని తూర్పు ఖండాంతర అంచున దగ్గర కూడా భారీగా మీథేన్ హైడ్రేట్ నిక్షేపాలను గుర్తించింది. ఈ నిక్షేపాల విలువ ట్రిలియన్ డాలర్లు ఉండవచ్చని అంచనా. కానీ దీనిని (మీథేన్ హైడ్రేట్) సముద్రం నుంచి బయటకు తీయగల సరైన టెక్నాలజీ ప్రస్తుతానికి అందుబాటులో లేదు. అంతే కాకుండా దీనిని బయటకు తీయడానికి యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ (UNCLOS) ద్వారా కొన్ని హక్కులను పొందాల్సి ఉంటుంది.మీథేన్ హైడ్రేట్ను బయటకు తీయడం కష్టమా?, ఎందుకు?సముద్రం అడుగున ఉన్న భూభాగం చల్లగా (0-4 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్) ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీథేన్ హైడ్రేట్ గడ్డ కట్టుకుని ఉంటుంది. అయితే దీనిని బయటకు తీయాలని ప్రయత్నించినప్పుడు.. కొంత ఉష్ణోగ్రత వల్ల కరిగిపోవచ్చు. ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ మీథేన్ హైడ్రేట్ ఆవిరయ్యే అవకాశం ఉంటుంది.డీ–ప్రెషరైజేషన్, థర్మల్ స్టిమ్యులేషన్, వంటి టెక్నాలజీలను ఉపయోగించి లేదా కొన్ని రసాయన పద్దతుల ద్వారా మీథేన్ హైడ్రేట్ బయటకు తీయవచ్చు. కానీ సముద్ర గర్భంలో ఎక్కువ సేపు పని చేయడం అనేది చాలా కష్టమైన పని. అంతే కాకుండా పనిచేస్తున్నప్పుడు మీథేన్ విడుదలైతే చాలా ప్రమాదం. దీనికోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది.మీథేన్ హైడ్రేట్ వల్ల ఉపయోగాలుసముద్రంలోని భారీ మీథేన్ హైడ్రేట్ను బయటకు తీస్తే చాలా ఉపయోగాలు ఉన్నాయి. ప్రధానంగా గ్యాస్ దిగుమతులు తగ్గించవచ్చు. విద్యుత్ ఉత్పత్తి, వంట గ్యాస్, పరిశ్రమల్లో ఉపయోగించవచ్చు. భవిష్యత్ తరాలు ఉపయోగించుకోవడానికి నిల్వ చేసుకుపోవచ్చు. బొగ్గు, పెట్రోలియంతో పోలిస్తే.. మీథేన్ హైడ్రేట్ ఉపయోగం వల్ల కాలుష్యం తగ్గుతుంది. గ్యాస్ ధరలు కూడా తగ్గుతాయి.పరిధి దాటితే పరిస్థితులు తీవ్రం!సముద్రం అనేది ఏ ఒక్క దేశం అధీనంలో ఉండదు. ఇది మొత్తం అంతర్జాతీయ చట్టాలకు లోబడి ఉంటుంది. కేవలం తీరరేఖ నుంచి 12 నాటికల్ మైళ్ల దూరం మాత్రమే ఆ దేశం ఆధీనంలో ఉంటుంది. అయితే తీరరేఖ నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు ఉన్న సముద్రంలో లభించే వనరులను దేశం ఉపయోగించుకునే అధికారం ఉంటుంది. ఈ పరిధి ఏ దేశం దాటినా పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. కాబట్టి సముద్రంలోని నిక్షేపాలను ఏ ఒక్క దేశం స్వాధీనం చేసుకోవడం అనేది సాధ్యం కాదు.ఇదీ చదవండి: 'ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు'.. కియోసాకి పదో పాఠం -
ప్రపంచ 5జీ అగ్రగామిగా భారత్
కొద్దిరోజుల్లో 2025వ సంవత్సరం ముగుస్తున్న వేళ, టెలికమ్యూనికేషన్ రంగంలో భారత్ ప్రపంచ దిగ్గజంగా తన స్థానాన్ని పటిష్టం చేసుకుంది. చరిత్రలోనే అత్యంత వేగవంతమైన మౌలిక సదుపాయాల కల్పనతో దేశంలో 5జీ వినియోగదారుల సంఖ్య 40 కోట్లకు (400 మిలియన్లు) చేరుకుంది. ఇది భారతదేశ మొత్తం మొబైల్ కస్టమర్ల సంఖ్యలో దాదాపు 32 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. ఫలితంగా ప్రపంచ డిజిటల్ వృద్ధికి భారత్ ప్రధాన ఇంజిన్గా నిలిచింది.ప్రపంచవ్యాప్తంగా 5G విస్తరిస్తున్నప్పటికీ, భారతదేశ వృద్ధి పథం సాటిలేనిదిగా ఉంది. 2025 చివరి నాటికి, ప్రపంచవ్యాప్తంగా 5G కస్టమర్ల సంఖ్య సుమారు 290 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఇది ప్రపంచవ్యాప్త మొబైల్ కస్టమర్ల సంఖ్య మూడింట ఒక వంతు. 110 కోట్లకు పైగా వినియోగదారులతో చైనా అగ్రస్థానంలో కొనసాగుతున్నప్పటికీ, భారత్ రికార్డు వేగంతో ఆ వ్యత్యాసాన్ని తగ్గిస్తోంది. జులై 2025 నాటికి 36.5 కోట్ల వినియోగదారులను చేరుకున్న భారతీయ మార్కెట్, 2030 నాటికి 100 కోట్లకు, 2031 నాటికి 110 కోట్లకు చేరుకుంటుందని అంచనా.ముందంజలో జియోఈ విప్లవంలో రిలయన్స్ జియో (Reliance Jio) కేవలం భారతీయ లీడర్గానే కాకుండా, ప్రపంచ స్థాయి టెక్నాలజీ పవర్హౌస్గా అవతరించినట్లు కంపెనీ తెలిపింది. సంస్థ చెప్పిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 2025లో జియో 50 కోట్ల మొబైల్ వినియోగదారుల చారిత్రక మైలురాయిని అధిగమించింది. అక్టోబర్ 31 నాటికి ఆ సంఖ్య 51 కోట్లకు పెరిగింది. కేవలం ఈ ఏడాది మొదటి పది నెలల్లోనే దాదాపు 3 కోట్ల మంది కొత్త వినియోగదారులు చేరారు. కేవలం 5G విభాగంలోనే, 2025 చివరి నాటికి జియో వినియోగదారుల సంఖ్య 26 కోట్లకు చేరుకోనుంది. జియో మొత్తం వైర్లెస్ డేటా ట్రాఫిక్లో 5G వాటా ఇప్పుడు 50 శాతంగా ఉంది. 2025 మొదటి తొమ్మిది నెలల్లో ఈ నెట్వర్క్ ద్వారా ఏకంగా 162 ఎక్సాబైట్ల (162 బిలియన్ జీబీ) డేటా వినియోగం జరిగింది. 5G నెట్వర్క్కు మారడం వల్ల ఏడాది ప్రారంభంలో 32.3 జీబీగా ఉన్న సగటు జియో వినియోగదారుని నెలవారీ డేటా వినియోగం ఇప్పుడు 38.7 జీబీకి పెరిగింది.తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని ఆధిపత్యంఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో రిలయన్స్ జియో తిరుగులేని డిజిటల్ లీడర్గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నట్లు కంపెనీ చెప్పింది. 2025 చివరి నాటికి ఈ ప్రాంతంలో జియో వైర్లెస్ వినియోగదారుల సంఖ్య 3.2 కోట్లు దాటినట్లు పేర్కొంది. దూకుడుగా విస్తరణ, సాంకేతిక విజయాలతో తెలుగు రాష్ట్రాల్లో జియో టాప్ పర్ఫార్మర్గా నిలిచినట్లు తెలిపింది. మొబైల్ కనెక్టివిటీ మాత్రమే కాకుండా, హోమ్ ఎంటర్టైన్మెంట్ రంగంలో కూడా కంపెనీ విప్లవాత్మక మార్పులు తెచ్చినట్లు స్పష్టం చేసింది. జియో ఎయిర్ఫైబర్ (Jio Fiber) సేవలు మార్కెట్ వాటాలో సింహభాగాన్ని దక్కించుకోవడంతో, రెండు రాష్ట్రాల్లో వైర్లైన్ వినియోగదారుల సంఖ్య దాదాపు 20 లక్షలకు చేరుకుందని చెప్పింది.100 కోట్ల దిశగా ప్రయాణంభారత ప్రభుత్వం ఈ డిజిటల్ ప్రయాణంపై ధీమాగా ఉంది. 2026 నాటికి దేశీయ 5G వినియోగదారుల సంఖ్య 43 కోట్లకు చేరుతుందని భావిస్తోంది. మౌలిక సదుపాయాలు మెరుగుపడటం, 5G డివైజెస్ అందుబాటులోకి రావడంతో 2030 నాటికి 100 కోట్ల 5G వినియోగదారుల లక్ష్యం అసాధ్యమేమీ కాదనే అభిప్రాయాలున్నాయి. 5G ప్రారంభించిన కేవలం మూడేళ్లలోనే భారత్ ప్రపంచ నాయకత్వ స్థాయికి చేరుకుంది. ఈ చారిత్రక మార్పులో రిలయన్స్ జియో ముందు వరుసలో నిలిచినట్లు కంపెనీ చెప్పింది.ఇదీ చదవండి: చేసేది ఎక్కువ.. ఇచ్చేది తక్కువ! -
వాట్సాప్లో కొత్త మోసం.. 'ఘోస్ట్ పేయిరింగ్'తో జాగ్రత్త!
టెక్నాలజీ పెరుగుతున్న వేళ.. రోజుకో కొత్త స్కామ్ పుట్టుకొస్తోంది. ఇప్పుడు తాజాగా 'ఘోస్ట్పెయిరింగ్' పేరుతో వాట్సాప్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. దీని గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఘోస్ట్పెయిరింగ్ స్కామ్వాట్సప్లోని డివైజ్ లింక్ ఫీచర్ ద్వారా.. ఓటీపీ, పాస్వర్డ్స్, వెరిఫికేషన్స్ వంటి వివరాలతో సంబంధం లేకుండానే స్కామర్లు.. యూజర్స్ ఖాతాల్లోకి చొరబడతున్నారు. దీనినే టెక్ నిపుణులు ఘోస్ట్పెయిరింగ్ అంటున్నారు.ఘోస్ట్పెయిరింగ్ స్కామ్ ఇలా..సోషల్ ఇంజినీరింగ్ ద్వారా.. సైబర్ నేరగాళ్లు ఘోస్ట్పెయిరింగ్ మోసాలకు పాల్పడుతున్నారు. స్కామర్లు.. యూజర్ల వాట్సప్కు తెలిసిన కాంటాక్టుల ద్వారా Hey, is this you in this photo? లేదా I just found your picture అనే మోసపూరిత మెసేజ్ వస్తుంది. ఇలాంటి మెసేజ్లో ఇంటర్నల్గా వేరే లింక్ ఉంటుంది. కాబట్టి యూజర్లు తమకు వచ్చిన లింక్ క్లిక్ చేయగానే.. ఒక ఫేక్ వెబ్పేజ్ ఓపెన్ అవుతుంది.ఓటీపీ గానీ, స్కానింగ్ లేకుండా.. మీకు తెలియకుండా మీ వాట్సాప్ ఖాతా హ్యాకర్ల డివైజ్కు కనెక్ట్ అవుతుంది. ఒక్కసారి వారి చేతికి చిక్కితే.. మీ వ్యక్తిగత చాటింగ్స్, ఫొటోలు, వీడియోలు అన్నీ చూస్తారు. మీ కాంటాక్ట్స్ లిస్ట్ దొంగిలిస్తారు. మీ పేరుతో ఇతరులకు సందేశాలు పంపి మోసాలకు పాల్పడతారు. చివరికి మీ ఖాతాను మీరే వాడుకోలేక లాక్ చేస్తారు.ఘోస్ట్పెయిరింగ్ స్కామ్ నుంచి తప్పించుకోవడం ఎలామీకు తెలియని లేదా.. అనుమానాస్పద లింక్లను క్లిక్ చేయవద్దు.వాట్సాప్ సెట్టింగ్స్లో 'Linked Devices' ఆప్షన్ను తరచూ పరిశీలించండి. తెలియని డివైజ్లు ఉంటే వెంటనే రిమూవ్ చేయండి.Two-step verification తప్పనిసరిగా ఎనేబుల్ చేసుకోవాలి.వీసీ సజ్జనార్ ట్వీట్వాట్సాప్ ఘోస్ట్పెయిరింగ్ ఫీచర్ గురించి.. వీసీ సజ్జనార్ ట్వీట్ చేసారు. ఇందులో.. "హేయ్.. మీ ఫొటో చూశారా? అంటూ ఏదైనా లింక్ వచ్చిందా? తెలిసిన వారి నుంచి వచ్చినా సరే.. పొరపాటున కూడా క్లిక్ చేయకండి'' అని వెల్లడించారు.🚨 Cyber Alert: New WhatsApp “GhostPairing” scam 🚨If you receive a message saying “Hey, I just found your photo” with a link — DO NOT click it, even if it appears to come from someone you know.⚠️ This is a GhostPairing scam.The link takes you to a fake WhatsApp Web page and… pic.twitter.com/7PsZJXw2pt— V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 21, 2025 -
ఫేక్ యాడ్స్ మోసం.. వివాదంలో మెటా!
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ల మాతృ సంస్థ అయిన మెటా (Meta).. తన ప్లాట్ఫామ్లలో మోసపూరిత ప్రకటనల ద్వారా బిలియన్ డాలర్లు సంపాదిస్తున్నట్లు కొన్ని నివేదికలు వెల్లడించాయి. ఇంతకీ ఈ వివాదం ఏమిటి? దీనిపై మెటా స్పందన ఏమిటి? అనే విషయాలను ఇక్కడ చూసేద్దాం.మెటాపై విమర్శలుమోసపూరిత ప్రకటనలను సంస్థ గుర్తించినప్పటికీ.. కఠినమైన చర్యలు తీసుకోలేదు. స్కామర్ల ప్రకటనల వల్ల మెటాకు అడ్వర్టైజింగ్ రూపంలో భారీ లాభాలు వస్తున్నాయి. కాబట్టి మెటా అటువంటి ప్రకటనలను అరికట్టడం లేదని నివేదికలు చెబుతున్నాయి. సామాన్య ప్రజలు.. ముఖ్యంగా యువత, వృద్ధులు ఈ మోసాలకు బలయ్యారు. దీంతో అనేక దేశాలు మెటాపై విమర్శలు కురిపిస్తున్నాయి. ముఖ్యంగా చైనాకు సంబంధించిన స్కామ్ ప్రకటనలకు విషయంలో లెక్కలేనన్ని ప్రశ్నలు పుడుతున్నాయి.మెటా తన ప్లాట్ఫామ్లలో స్కామ్.. ఇతర మోసపూరిత ప్రకటనలను ప్రసారం చేయడం ద్వారా ఏటా బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. గత ఏడాదిలో కంపెనీ.. ఒక్క చైనీస్ కంపెనీల ప్రకటనల నుంచి 18 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ డబ్బు సంపాదించిందని, ఇది కంపెనీ ప్రపంచ ఆదాయంలో 10 శాతం కంటే ఎక్కువ అని రాయిటర్స్ దర్యాప్తులో వెల్లడించింది.స్కామ్ ఎగుమతి దేశంగా చైనా!చైనాలో ఫేస్బుక్ & ఇన్స్టాగ్రామ్లను నిషేదించినప్పటికీ.. అక్కడి కంపెనీలు విదేశీ వినియోగదారులకు ప్రకటనలు ఇవ్వడానికి అనుమతి ఉంది. ఈ విధంగా.. మెటా ప్లాట్ఫామ్లలో దాదాపు 25% స్కామ్ & నిషేధిత ప్రకటనలు చైనావే కావడం గమనార్హం. దీంతో చాలామంది చైనాను స్కామ్ ఎగుమతి దేశంగా అభివర్ణించారు.అయితే.. చైనా నుంచి వచ్చే స్కామ్ యాడ్లను అరికట్టడానికి మెటా తాత్కాలికంగా ఒక యాంటీ ఫ్రాడ్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందాన్ని ఏర్పాటు చేసిన తరువాత కంపెనీ ఆదాయం 19 శాతం నుంచి 9 శాతానికి తగ్గిపోయింది. దీంతో మెటా ఆ బృందాన్ని 2024 చివరలో రద్దు చేసి, చైనీస్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలపై ఆంక్షలు ఎత్తివేసింది. ఆ తరువాత ఆదాయం మళ్లీ 16%కి పెరిగింది.మెటా స్పందనమెటా ప్రతినిధి ఆండీ స్టోన్ (Andy Stone) రాయిటర్స్తో మాట్లాడుతూ.. యాంటీ ఫ్రాడ్ టీమ్ కేవలం తాత్కాలిక చర్య మాత్రమేనని అన్నారు. సీఈఓ మార్క్ జుకర్బర్గ్.. ఆ బృందాన్ని రద్దు చేయాలని ఆదేశించలేదని, స్కామ్ కార్యకలాపాలను తగ్గించడానికి ప్రపంచవ్యాప్త ప్రయత్నాలను ముమ్మరం చేయాలని కంపెనీని ఆదేశించారని ఆయన స్పష్టం చేశారు. గత 18 నెలల్లో, మెటా తన ప్లాట్ఫామ్ల నుంచి 46 మిలియన్ల చైనీస్ ప్రకటనలను తొలగించిందని వెల్లడించారు.ఇదీ చదవండి: 26ఏళ్ల వయసు.. ఫోర్బ్స్ జాబితాలో చోటు: ఎవరీ కళ్యాణి రామదుర్గం? -
సెర్చ్ చేస్తే.. కస్టమ్ యాప్!
గూగుల్, ఓపెన్ఏఐ, పెర్ప్లెక్సిటీలాంటి టెక్ దిగ్గజాలు ఈ సంవత్సరం ఏఐ–ఆధారిత బ్రౌజర్లకు శ్రీకారం చుట్టాయి. తాజా విషయం ఏమిటంటే.. గూగుల్లోని క్రోమ్ బృందం ‘డిస్కో’ పేరుతో కొత్త జెమిని 3–ఆధారిత బ్రౌజర్ను ఆవిష్కరించింది.ఇంటర్నెట్ను బ్రౌజ్ చేయడానికి అనుమతించే సంప్రదాయ బ్రౌజర్ల మాదిరిగా కాకుండా, గూగుల్ ‘డిస్కో’ జెన్ ట్యాబ్స్ను (Gentabs) ఉపయోగిస్తుంది. ప్రశ్న లేదా ప్రాంప్ట్లను ఇన్పుట్గా తీసుకుంటుంది. వీటికి సంబంధించిన ట్యాబ్లను ఓపెన్ చేస్తుంది. అంతేకాదు మనం సెర్చ్ చేస్తున్నదానికి సంబంధించి కస్టమ్ యాప్ క్రియేట్ చేస్తుంది.ఉదాహరణకు... మనం ‘డిస్కో’ను ట్రావెల్ టిప్స్ అడిగితే ఆటోమేటిక్గా ప్లానర్ యాప్ను క్రియేట్ చేస్తుంది. గూగుల్ క్రోమ్లాగే బ్రౌజింగ్, ట్యాబ్లను ఒపెన్ చేయడం, ఎక్స్టెన్షన్స్, పేజీలను నావిగేట్ చేయడంలో ‘డిస్కో’ ఉపయోగపడుతుంది.ఈ కొత్త బ్రౌజర్తో యూజర్లు ఎలాంటి కోడ్ను రాయాల్సిన అవసరం ఉండదు. మనకు కావాల్సిన వాటిని సింపుల్గా వివరిస్తే సరిపోతుంది. ఈ ఏఐ–జనరేటెడ్ వెబ్ యాప్తో టెక్స్ ప్రాంప్ట్ల ద్వారా లేఅవుట్స్, విజువల్, ఫీచర్స్కు సంబంధించి మార్పు చేర్పులు చేయవచ్చు.ప్రతి ఏఐ–జనరేటెడ్ కంటెంట్ ఒరిజినల్ వెబ్ సోర్స్తో లింకై ఉంటుంది. మీల్స్ ప్లాన్, ట్రావెల్ ప్లాన్, పిల్లలకు గ్రహాల గురించి పరిచయం చేయడానికి విద్యార్థులకు కూడా బాగా ఉపయోగపడుతుంది డిస్కో. ఒక నిర్దిష్టమైన అంశం గురించి తెలుసుకోవాలనుకుంటే, ఆ అంశానికి సంబంధించి జెన్ ట్యాబ్ ఒక యాప్ను క్రియేట్ చేస్తుంది. సమాచారాన్ని విజువలైజ్ చేసి కాన్సెప్ట్ సులభంగా అర్థమయ్యేలా చేస్తుంది.చదవండి: ఫ్లెక్స్ క్రెడిట్ కార్డుతో యూపీఐ చెల్లింపులు‘డిస్కో ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ప్రతీది సరిగ్గా పనిచేయకపోవచ్చు. ఇది తక్కువ మంది టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నందున దీనిని యాక్సెస్ చేయడానికి మీరు వెయిట్ లిస్ట్లో చేరాల్సి ఉంటుంది’ అని గూగుల్ ప్రకటించింది. -
సృజనాత్మకత, గోప్యతకు పెద్దపీట.. యూజర్ నియంత్రణకే ప్రాధాన్యం
డిజిటల్ ప్లాట్ఫామ్స్ క్రియేటర్ల సంక్షేమాన్ని, వినియోగదారుల గోప్యతను పరిగణించకపోవడంపై విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో వీరీల్స్(Vreels) క్రియేటర్లకు ప్రాధాన్యమిస్తూ, విశ్వసనీయమైన, సృజనాత్మకమైన ప్లాట్ఫామ్గా రూపొందుతోంది. భారత్లోని క్రియేటర్ ఎకానమీని అభివృద్ధి చేయడం, సురక్షిత వాతావరణం, ఆదాయం అవకాశాలు, క్రియేటర్ల కోసం సమగ్ర మద్దతు అందించడం వీరీల్స్(Vreels) ప్రత్యేకత.క్రియేటర్లతో నేరుగా చర్చలుసోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ సాధారణంగా ఫీచర్లను రూపొందించిన తర్వాతే వినియోగదారుల అభిప్రాయాన్ని తీసుకుంటాయి, కానీ Vreels (www.vreels.com) టీం భారత్లోని క్రియేటర్లను నేరుగా కలిసి మీటప్స్, కమ్యూనిటీ చర్చలు నిర్వహిస్తోంది. క్రియేటర్లు కోరుకునేది ఏమిటో గ్రహించడం.. సృజనాత్మక స్వేచ్ఛ, గుర్తింపు, నైతిక విలువలు, ఆదాయం, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే టూల్స్ వంటి అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఈ ప్లాట్ఫామ్ను రూపొందించినట్లు చెప్పింది.కళాశాలల్లో కొత్త ప్రతిభను ప్రోత్సహించడంకళాశాలలు, విశ్వవిద్యాలయాల్లోని ప్రతిభను కనుగొనడంలో Vreels ముందడుగు వేస్తోంది. కంటెంట్ పోటీలు, ప్రత్యేక కార్యక్రమాల ద్వారా విద్యార్థులు తమ ప్రతిభను, సృజనాత్మకతను ఎలాంటి భయం లేకుండా వ్యక్తపరిచే అవకాశం కల్పిస్తోంది. ముఖ్యంగా, Vreels గోప్యత, భద్రతపై అత్యంత దృష్టి పెట్టడం వల్ల యూజర్లు తాము సృష్టించిన కంటెంట్పై పూర్తి నియంత్రణ కలిగి ఉంటారు. ఇది ఇతర పెద్ద ప్లాట్ఫామ్స్లో సాధ్యం కాని విషయమని వీరీల్స్ చెప్పింది. యూజర్లు తమ ప్రొఫైల్లో వారి విశ్వవిద్యాలయం లేదా కళాశాల పేరును అప్డేట్ చేస్తే భవిష్యత్తులో వీరీల్స్ ద్వారా వారు తమ కళాశాల లేదా ఇతర కళాశాలల విద్యార్థులతో సులభంగా కనెక్ట్ కావొచ్చు. తమ నెట్వర్క్ను విస్తరించుకోవచ్చు.సులభమైన ఆదాయ అవకాశాలుVreels ప్లాట్ఫామ్లో 10,000 ఫాలోవర్స్ను చేరిన యూజర్లు తమ ఖాతాను మోనిటైజ్ చేయడానికి అర్హత పొందుతారు. ముఖ్యంగా, ఎవరైతే 10,000 ఫాలోవర్స్ చేరుకుంటారో వారికి రూ.10,000 చెక్కు అందిస్తామని వీరీల్స్ తెలిపింది. దీనికి ఎలాంటి పరిమితి లేదని చెప్పింది. అయితే ప్రస్తుతం అమలులో ఉన్న ఈ విధానంలో భవిష్యత్తులో మార్పులు చేయవచ్చని తెలిపింది.Vreels షాప్.. 2026 క్యూ1లో ప్రారంభంVreels షాప్ 2026లో ప్రారంభం కానుంది. ప్రారంభ విక్రేతలు ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్స్ పొందగలుగుతారు. ఇది చిన్న వ్యాపారాలు, బ్రాండ్లకు కొత్త ఆదాయ అవకాశాలను తెరుస్తుంది.వీడియోలు వీక్షిస్తూ దీని ద్వారా ప్రోడక్ట్స్ కొనవచ్చు లేదా మెరుగైన ధరల కోసం బిడ్డింగ్ వేయవచ్చు.వ్యాపారవేత్తలు తమ రీల్స్, ఫోటోలు, కథల ద్వారా బ్రాండ్ను ప్రోత్సహించి, ఆదాయాన్ని పొందవచ్చని వీరీల్స్ చెప్పింది.నమ్మకమైన ఈ సిస్టమ్ ద్వారా వెండర్లు తమ ఉత్పత్తులను భద్రంగా విక్రయించవచ్చని పేర్కొంది. వినోదం, వాణిజ్యం కలిసే కొత్తదనాన్ని అనుభూతి చెందవచ్చని తెలిపింది.దీనిపై మరిన్ని విశేషాలు త్వరలో విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.మెమొరీ క్యాప్సుల్.. ప్రత్యేకమైన, వ్యక్తిగత డిజిటల్ అనుభవంVreels లోని మెమొరీ క్యాప్సుల్ ఫీచర్ ఏ ఇతర ప్లాట్ఫామ్లో లేని ప్రత్యేకమైన ఫీచర్. యూజర్లు ప్రత్యేక కంటెంట్ను రహస్యంగా భద్రపరిచి, నచ్చిన వారికి తీపిగుర్తుగా సర్ప్రైజ్ అందించవచ్చు. ఇది కేవలం మీరు ఎంపిక చేసిన వ్యక్తికి మాత్రమే కనిపిస్తుంది. దీని కారణంగా Vreels కేవలం సాధారణ సోషల్ మీడియా వేదిక లాగా కాకుండా వినియోగదారులకు ప్రత్యేకమైన వ్యక్తిగత అనుభవాలను అందించే వేదికగా కూడా ఉంటుంది.ఈ ఫీచర్ ద్వారా మీరు మీ జ్ఞాపకాలను భద్రంగా ఉంచి, కావలసిన సమయానికి మాత్రమే ఉపయోగించుకోవచ్చు. పుట్టినరోజులు, వార్షికోత్సవాలు, ప్రత్యేక సందర్భాల కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేయవచ్చు. వర్చువల్ టైమ్ లాక్ సిస్టమ్ వల్ల మీరు సృష్టించిన జ్ఞాపకాలు సరైన సమయంలో మాత్రమే బయటకు వస్తాయి.Reels, చాట్, కాల్స్, PixPouch..వీరీల్స్ Reels, చాట్, కాల్స్, PixPouch.. అన్ని అనుభవాలను ఒకే వేదికలో అందిస్తోంది. ఇందులో షార్ట్ వీడియోలు, రియల్ టైం చాట్, వాయిస్/వీడియో కాల్స్, PixPouch ద్వారా ఫోటోలు సులభంగా సేకరించటం వంటి ఫీచర్లున్నాయి. ఇది వినియోగదారులకు సృజనాత్మక స్వేచ్ఛ, సౌకర్యవంతమైన అనుభవాన్ని అందిస్తుంది.గోప్యత, డేటా భద్రతకు మొదటి ప్రాధాన్యతVreelsలో డేటా భద్రత, గోప్యత ముఖ్య ప్రమాణాలు. ఇతర ప్లాట్ఫామ్లు వినియోగదారుల డేటాపై సరైన జాగ్రత్త చూపడంలో విఫలమవుతున్నాయి. కానీ Vreels వినియోగదారులకు వారి కంటెంట్పై పూర్తి నియంత్రణ, రక్షణ, భద్రతా సౌలభ్యాలను ప్రధానంగా అందిస్తుంది. యూజర్ల డేటాను ఎవరు చూడాలో అనే పూర్తి నియంత్రణ కూడా తమ చేతుల్లోనే ఉంటుంది.డేటా లీక్ భయం అనవసరంఈ రోజుల్లో AI ఆధారిత డేటా లీక్ భయం పెరుగుతోంది. కానీ Vreelsలో ఎన్క్రిప్షన్ ద్వారా ప్రతి చాట్, వీడియో, ఫోటో, డేటా భద్రంగా ఉంటుందని కంపెనీ చెప్పింది. యూజర్ల వీడియోలు, ఫోటోలు, పోస్ట్లు.. ఎవరు చూడాలో, ఎవరు చూడకూడదో స్వయంగా పూర్తిగా నియంత్రించవచ్చు.స్థానిక ప్రతిభ నుంచి ప్రపంచ స్థాయి ప్రతిభ వరకుVreels ఇప్పటికే 22 దేశాల్లో బీటా వర్షన్ యాప్ను రిలీజ్ చేసింది. గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్లో ఈ యాప్ అందుబాటులో ఉంది. క్రియేటర్ అయినా, షాపర్ అయినా, డిజిటల్ ప్రేమికులైనా.. మీకు కావలసిన అన్ని అనుభవాలు Vreels ఒకే వేదికలో అందిస్తుంది.Vreels మీ డిజిటల్ జీవితానికి కొత్త అధ్యాయంక్రియేటర్ అయినా, షాపర్ అయినా, డిజిటల్ ప్రేమికుడైనా.. మీకు కావలసిన అన్ని అనుభవాలు Vreels ఒకే వేదికలో అందిస్తుంది.ఇప్పుడే ప్రయత్నించండిVreels: భారతీయ ఆలోచనకు ప్రపంచస్థాయి రూపం. మీ కొత్త అనుభవం ఇక్కడ ప్రారంభమవుతుంది.వెబ్సైట్: www.vreels.comకింద ఇవ్వబడిన మీకు నచ్చిన యాప్ స్టోర్ లింక్ల్లో ఈరోజే Vreels డౌన్లోడ్ చేసుకోండి.Android: https://play.google.com/store/apps/details?id=com.mnk.vreelsApple Store: https://apps.apple.com/us/app/vreels/id6744721098లేదాడౌన్లోడ్ కోసం కింద ఉన్న QR కోడ్ను స్కాన్ చేయండి. -
50 సెకన్లలో ట్రైన్ టికెట్ బుకింగ్!
రైలు ప్రయాణం సర్వసాధారణం అయిపోయింది. అయితే ట్రైన్ జర్నీ కోసం టికెట్స్ బుక్ చేసుకోవడం మాత్రం చాలామందికి కష్టమే. అయితే కొంతమంది మాత్రం కొన్ని రెంటర్ సాఫ్ట్వేర్లను ఉపయోగించి.. టికెట్స్ బుక్ చేస్తున్నట్లు ఒక జాతీయ వార్తాపత్రిక కథనం వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ సాఫ్ట్వేర్లు ఏవి?, వాటిని ఐఆర్సీటీసీ అరికట్టడం సాధ్యం కాదా?రైల్వే టికెట్స్ బుక్ చేసుకోవాలంటే.. ఐఆర్సీటీసీ లేదా బుక్మైట్రిప్ వంటి కొన్ని నిర్దిష్ట యాప్స్ లేదా రైల్వే కౌంటర్స్ ఉపయోగించుకుంటారు. కానీ కొంతమంది ఏజెంట్స్ రెంటర్ సాఫ్ట్వేర్ల ద్వారా 50 సెకన్లలో తత్కాల్ టిక్కెట్లను బుక్ చేస్తున్నారు. అంటే ప్రయాణికుడు IRCTC యాప్లోకి లాగిన్ అయ్యే సమయానికి, వాళ్లు(ఏజెంట్స్) టికెట్ కన్ఫర్మ్ చేస్తున్నారన్నమాట..!సాఫ్ట్వేర్ డెవలపర్లు.. టికెట్స్ బుక్ చేసుకోవడానికి వీలుగా కొన్ని సాఫ్ట్వేర్లను క్రియేట్ చేస్తున్నారు. వాటి అద్దె నెలకు రూ.1200 నుంచి రూ.3200 వరకు ఉంటుంది. వీరు ఎప్పటికప్పుడు ఐపీ అడ్రస్లను కూడా మార్చేస్తూ ఉంటారు. ఐపీ అడ్రస్ల మార్పు కోసం మరికొంత మొత్తంలో డబ్బు చెల్లిస్తారు. ఎక్కువ మంది టెస్లా, గదర్, బ్రహ్మోస్, సూపర్ తత్కాల్, అవెంజర్ వంటి రెంటర్ సాఫ్ట్వేర్లను వాడుతున్నట్లు తెలుస్తోంది.సాధారణంగా ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్లో ప్రయాణికుడు మాన్యువల్గా టికెట్ బుక్ చేసుకున్నప్పుడు.. లాగిన్, రైలు ఎంపిక, ప్రయాణికుల వివరాలు, క్యాప్చా, చెల్లింపు వంటి ప్రక్రియలను స్వయంగా పూర్తిచేయాలి. ఈ సమయంలో, వేలాది మంది వినియోగదారులు సిస్టమ్లో ఏకకాలంలో యాక్టివ్గా ఉంటారు, ముఖ్యంగా తత్కాల్ బుకింగ్ సమయాల్లో చాలా మంది ప్రయాణికులు ఈ ప్రక్రియలో టిక్కెట్లు పొందలేకపోతున్నారు.అయితే ఏజెంట్లు మాత్రమే ఇందుకు భిన్నంగా.. ఆటోమేషన్/AI సాఫ్ట్వేర్ ఉపయోగించి పని కానిచ్చేస్తున్నారు. ఈ సాఫ్ట్వేర్ సాధారణ వినియోగదారులతో పోలిస్తే చాలా రెట్లు వేగంగా సర్వర్కు అభ్యర్థనలను పంపుతుంది. ఈ కారణంగా సాధారణ ప్రయాణికులు టికెట్స్ వేగంగా పొందలేరు. అయితే టికెట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎక్కువ డబ్బు చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉన్న ప్రయాణికులు.. ఈ తరహా అక్రమ సాఫ్ట్వేర్లను వినియోగించే ఏజెంట్స్ సాయం తీసుకుంటున్నారు.ఐఆర్సీటీసీ అరికట్టడం సాధ్యం కాదా?ఐఆర్సీటీసీ ఏజెంట్స్ ఉపయోగించే రెంటల్ సాఫ్ట్వేర్లను ఆరికట్టకపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది, చట్టపరమైన లొసుగులు. ఆటోమేషన్ అండ్ ఏఐ బేస్డ్ టికెట్ బుకింగ్ సాఫ్ట్వేర్కు సంబంధించి పూర్తిగా నిషేధించే కఠినమైన చట్టాలు లేవు. ప్రస్తుత సమాచార సాంకేతిక చట్టం, రైల్వే చట్టాలు, నిబంధనలు దీనిని పాక్షికంగా మాత్రమే నియంత్రిస్తున్నాయి. అందుకే.. కఠిన చర్యలు తీసుకునే వీలు లేకుండా పోతోంది. దీంతోపాటు.. టెక్నాలజీ మరో కారణంగా చెప్పవచ్చు. వేగంగా టిక్కెట్లు బుక్ చేసుకునే ఐపీ అడ్రస్లను భారతీయ రైల్వేలు బ్లాక్ చేస్తాయి. కానీ ఏజెంట్లు ఎప్పటికప్పుడు ఐపీలను మారుస్తారు. వీపీన్ను వినియోగిస్తారు. అంతేకాకుండా.. ఎప్పటికప్పుడు కొత్త యూజర్ ఐడీలు, పాస్వర్డ్లను ఉపయోగిస్తున్నారు. దీంతో.. ఈ సాఫ్ట్వేర్లను అరికట్టడం ఐఆర్సీటీసీకి సాధ్యం కావడం లేదు.ఇదీ చదవండి: మరింత ధనవంతులు కావడం ఎలా?: కియోసాకి ట్వీట్ -
ఏఐ నియంత్రణపై భారత్ అడుగులు ఎటువైపు?
ఆధునిక ప్రపంచంలో కృత్రిమ మేధ (ఏఐ) ఒక విప్లవంలా దూసుకుపోతోంది. పనులను సులభతరం చేస్తూనే, మరోవైపు డేటా గోప్యత, డీప్ఫేక్స్ వంటి రూపాల్లో సరికొత్త సవాళ్లను విసురుతోంది. సాంకేతికత అందించే ఫలాలను అందుకుంటూనే, దానివల్ల కలిగే అనర్థాలను అడ్డుకోవడానికి భారత ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో భారత్లో ఏఐని నియంత్రించడానికి ఉన్న చట్టపరమైన చట్రం, తాజా పరిణామాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.భారత్లో ఏఐ నియంత్రణభారతదేశంలో ప్రస్తుతం ఏఐ కోసం ప్రత్యేకమైన ఏకీకృత చట్టం లేదు. అయినప్పటికీ, ప్రభుత్వం వివిధ ప్రస్తుత చట్టాలు, కొత్త మార్గదర్శకాల ద్వారా ఏఐ వినియోగాన్ని నియంత్రిస్తోంది. ఏఐ వ్యవస్థలు శిక్షణ పొందడానికి, పనిచేయడానికి భారీ మొత్తంలో డేటా అవసరం. ఈ డేటాను ఎలా సేకరించాలి, ఎలా వాడాలి అనే అంశాలను డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం (DPDP Act), 2023 నియంత్రిస్తుంది. ఏఐ మోడల్స్ వ్యక్తిగత డేటాను ఉపయోగించే ముందు సదరు వ్యక్తి అనుమతి తీసుకోవడం తప్పనిసరి. ఈ చట్టం ప్రకారం డేటా ఉల్లంఘనలు జరిగితే ఏఐ సంస్థలపై భారీ జరిమానాలు (రూ. 250 కోట్ల వరకు) విధించే అవకాశం ఉంది.ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) చట్టం, 2000, 2025 సవరణలుప్రస్తుతానికి ఐటీ చట్టమే డిజిటల్ రంగంలో ప్రాథమిక చట్టంగా ఉంది. 2025లో ప్రతిపాదించిన సవరణల ప్రకారం.. తప్పుదోవ పట్టించే ఏఐ కంటెంట్ లేదా డీప్ఫేక్స్ను నిరోధించే బాధ్యత సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లదే. ఏఐ ద్వారా సృష్టించిన కంటెంట్ను స్పష్టంగా గుర్తించేలా లేబులింగ్ చేయడం తప్పనిసరి.ఇండియా ఏఐ గవర్నెన్స్ మార్గదర్శకాలు 2025నవంబర్ 2025లో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం.. ఏఐ వ్యవస్థలు పారదర్శకంగా, బాధ్యతాయుతంగా ఉండాలి. అధిక రిస్క్ ఉన్న ఏఐ అప్లికేషన్లపై కఠినమైన నిఘా అవసరం. స్టార్టప్లు ఏఐ సాంకేతికతను సురక్షితమైన వాతావరణంలో పరీక్షించుకునేలా ప్రోత్సహించాలి.బ్యాంకింగ్ రంగంలో ఏఐ వాడకంపై ఆర్బీఐ కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది. ముఖ్యంగా లోన్ అప్రూవల్స్ వంటి వాటిలో ఏఐ వివక్ష చూపకూడదని స్పష్టం చేసింది.ప్రస్తుత చట్టాలు ఏఐకి పూర్తిస్థాయిలో సరిపోవని నిపుణుల అభిప్రాయం. అందుకే ప్రభుత్వం డిజిటల్ ఇండియా బిల్లును ప్రతిపాదిస్తోంది. ఇది రాబోయే రోజుల్లో ఏఐ నియంత్రణలో కీలక పాత్ర పోషించనుంది. భారత ప్రభుత్వం ఏఐ అభివృద్ధిని అడ్డుకోకుండానే ప్రజా భద్రత, గోప్యతను కాపాడటం అనే సమతుల్య విధానాన్ని అనుసరిస్తోంది. భవిష్యత్తులో ఏఐ కోసం మరింత సమగ్రమైన చట్టం వచ్చే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ప్రపంచంలోని టాప్ 10 రిచ్ ఫ్యామిలీలు -
తెగిన నరాలకు అతుకు వేస్తున్నారు!
లక్ష కిలోమీటర్లు.. మనిషి శరీరంలోని చిన్నా పెద్దా నరాల పొడవు ఇది!. ప్రమాదం కొద్దో లేక ఇంకో కారణంతోనో ఈ నరాలు తెగాయి అనుకోండి. అతుకుపెట్టడం చాలా కష్టం. ఒకవేళ పెట్టినా అవి మునుపటిలా పూర్తిస్థాయిలో పనిచేస్తాయన్న గ్యారెంటీ కూడా లేదు. నరాలు సరిగ్గా అతుక్కోకపోతే స్పర్శజ్ఞానం పోవచ్చు. లేదంటే విపరీతమైన నొప్పి బాధపెట్టవచ్చు. కొన్ని సందర్భాల్లో పక్షవాతం లాంటి విపరీత సమస్య కూడా ఎదురు కావచ్చు. అయితే.. ఇకపై ఈ సమస్యలు చాలావరకూ లేకుండా పోతాయి. ఎందుకంటారా? అమెరికాలోని ఓ కంపెనీ తెగిన నాడులను సరిగ్గా అతుకుపెట్టేందుకు ఓ కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసింది మరి!. తెగిన నరాలను వైద్యులు ఇప్పటివరకూ కుట్లు వేయడం ద్వారా మాత్రమే జత చేస్తున్నారు. చాలా సూక్ష్మమైన నరాల విషయానికి వచ్చినప్పుడు మైక్రోస్కోపుల్లో చూసుకుంటూ కుట్లు వేస్తూంటారు. ఫలితంగా నాడుల్లో సమస్యలు కొనసాగే ప్రమాదం ఉంటుంది. ఈ ఇబ్బందిని అధిగమించేందుకు టిసియం అనే సంస్థ ‘కోఆప్టియమ్ కనెక్ట్’ పేరుతో ఓ కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసింది. కొత్త టెక్నాలజీలో కుట్లు వేయడం అన్నది ఉండనే ఉండదు. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ సాయంతో సిద్ధం చేసిన ఒక చిన్న గొట్టం లాంటిది తయారు చేస్తారు. రెండుపక్కల తెగిన నరాలను జొప్పించి దగ్గరకు తీసుకొస్తారు. ఆ తరువాత గొట్టానికి రెండు చివర్లలో ప్రత్యేకమైన బయో ప్లాస్టిక్ జిగురులాంటిది వేసి సీల్ చేస్తారు. అంతే.. తెగిన నరాల భాగాలు రెండూ ఒకదానికి ఒకటి అతుక్కుపోతాయి. సహజసిద్ధంగా కలిసిపోతాయి. కొంత సమయం తరువాత గొట్టం, బయో ప్లాస్టిక్ కూడా నిరపాయకరంగా శరీరంలోకి కలిసిపోతాయి. వాస్తవానికి ఈ టెక్నాలజీని మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంతో కాలం క్రితమే అభివృద్ధి చేసింది. జెఫ్రీ కార్ప్ అండ్ బాబ్ లాంగర్స్ ల్యాబ్లో దీనిపై ప్రయోగాలూ జరిగాయి. విజయవంతమయ్యాయి కూడా. ఈ శస్త్రచికిత్స జరిగిన తరువాత నాడుల పనితీరు పూర్వ స్థితికి చేరుకోవడమే కాకుండా.. కనీసం ఏడాది పాటు ఎలాంటి నొప్పి కూడా కనిపించలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఈ చికిత్స కేవలం నాడులకు మాత్రమే పరిమతం కాకపోవడం. శరీరం లోపలి భాగాలు బయటకు వచ్చే హెర్నియాతోపాటు గుండె కణజాలం అభివృద్ధి వరకూ వేర్వేరు చోట్ల వాడుకునే అవకాశం ఉంది. టిసియం సంస్థ అభివృద్ధి చేసిన ఈ కొత్త టెక్నాలజీకి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్టేషన్ ఇప్పటికే అనుమతులు జారీ చేసింది. గుండె, హెర్నియా తదితర విషయాలకు సంబంధించిన టెక్నాలజీలను అభివృద్ధి చేస్తున్నామని, త్వరలోనే అందుబాటులోకి తెస్తామని కంపెనీ చెబుతోంది.:: గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
భారత్లో చాట్జీపీటీ, పర్ప్లెక్సిటీ జోరు
చాట్జీపీటీ, జెమినీ, పర్ప్లెక్సిటీలాంటి ప్లాట్ఫాంల వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచంలోనే అతి పెద్ద ఎల్ఎల్ఎం (లార్జ్ ల్యాంగ్వేజ్ మోడల్) మార్కెట్గా భారత్ ఎదిగిందని బ్రోకరేజీ సంస్థ బీవోఎఫ్ఏ సెక్యూరిటీస్ ఒక నివేదికలో తెలిపింది. దీనితో స్వతంత్రంగా పనులను చక్కబెట్టగల ఏజెంటిక్ ఏఐ యాప్లను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు భారత్ టెస్ట్ బెడ్గా ఉపయోగపడగలదని పేర్కొంది. అయితే, దీనివల్ల దేశీయంగా స్టార్టప్ వ్యవస్థపై కొంత ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని బీవోఎఫ్ఏ సెక్యూరిటీస్ వివరించింది.టెలికం సంస్థలు కాంప్లిమెంటరీగా సబ్స్క్రిప్షన్లను ఆఫర్ చేస్తుండటమనేది ఎల్ఎల్ఎం ఆధారిత యాప్ల వినియోగం పెరగడానికి ఒకానొక కారణంగా ఉంటోంది. అలాగే, నెలకు 2 డాలర్ల కన్నా తక్కువ ఖర్చుతో 20 జీబీ డేటా ప్లాన్లు చౌకగా లభిస్తుండటం సైతం ఇందుకు దోహదపడుతోంది. నివేదిక ప్రకారం..14.5 కోట్ల మంది నెలవారీ యాక్టివ్ యూజర్లతో భారత్లో చాట్జీపీటీ అగ్రగామి ఎల్ఎల్ఎంగా నిలుస్తోంది. 10.5 కోట్ల మంది యూజర్లతో జెమినీ రెండో స్థానంలో ఉంది. రోజువారీగా చూస్తే సగటున 6.5 కోట్ల మంది భారతీయులు చాట్జీపీటీని ఉపయోగిస్తుండగా, 1.5 కోట్ల మంది యూజర్లతో జెమినీ రెండో ప్లేస్లో ఉంటోంది. చాట్జీపీటీ యూజర్లలో 16 శాతం మంది భారతీయులు ఉన్నారు. తద్వారా సదరు ప్లాట్ఫాంనకు అతి పెద్ద మార్కెట్లలో ఒకటిగా భారత్ నిలుస్తోంది. దాని పోటీ సంస్థలకు కూడా భారత్ అతి పెద్ద మార్కెట్లలో ఒకటిగా ఉండటం గమనార్హం. సగటున నెలవారీ గూగుల్ జెమినీ యూజర్లలో 30 శాతం మంది, పర్ప్లెక్సిటీ యూజర్లలో 38 శాతం మంది భారత్ నుంచే ఉంటున్నారు. జూలైలో చాట్జీపీటీ డౌన్లోడ్స్ 2.4 కోట్ల గరిష్ట స్థాయికి చేరాయి. ఎయిర్టెల్ బండిల్డ్ ప్యాకేజ్ దన్నుతో అక్టోబర్లో పర్ప్లెక్సిటీ డౌన్లోడ్స్ 2 కోట్ల గరిష్ట స్థాయిని తాకాయి.ఎల్ఎల్ఎం యాప్ల వినియోగం అందరికీ ప్రయోజనకరంగా ఉంటోంది. ప్రాంతీయ భాషల్లోనూ ఇవి అందుబాటులో ఉండటంతో వినియోగదారులు తమ ఉత్పాదకతను పెంచుకునేందుకు, భాషపరమైన పరిమితులను అధిగమించి కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఉపయోగకరంగా ఉంటోంది. అటు తమ మోడల్స్ను మరింత మెరుగుపర్చుకునేందుకు కావల్సిన డేటా ఎల్ఎల్ఎంలకు లభిస్తోంది. ఇక టెల్కోల విషయం తీసుకుంటే తీవ్రమైన పోటీ ఉండే రంగంలో.. వీటిని ఆఫర్ చేయడం ద్వారా యూజర్లపై వచ్చే సగటు ఆదాయాన్ని పెంచుకునేందుకు వీలవుతోంది. స్థానిక ఎల్ఎల్ఎంలు భారీ స్థాయికి ఎదిగేంత వరకు దేశీ స్టార్టప్లపై గ్లోబల్ ఎల్ఎల్ఎంల ప్రభావం కొనసాగుతుంది. ఫేస్బుక్, యూట్యూబ్లాంటి ఉత్పత్తుల ద్వారా మెటా, గూగుల్లాంటి దిగ్గజాలు తమ ఆధిపత్యాన్ని కొనసాగించవచ్చు.ఇదీ చదవండి: మురిపిస్తున్న ముగింపు! -
ఏఐల మెదడుకు ఇండియన్లే మేత
ఏఐ యాప్లకు ఇండియా అతిపెద్ద యాక్టివ్ యూజర్–బేస్ మార్కెట్గా అవతరించిందని ‘బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్’ తాజా నివేదిక వెల్లడించింది. ఏఐ యాప్లకు ప్రపంచంలోనే అత్యధికంగా ఇండియాలో రోజువారీ, నెలసరి యూజర్లు ఉన్నారని తెలిపింది. అత్యధికంగా చాట్ జీపీటీకి 14.5 కోట్ల నెలవారీ వినియోగదారులు ఉంటే తరువాతి స్థానంలో 10.5 కోట్ల మందితో జెమినై ఉంది.ఓపెన్ ఏఐకి చెందిన ‘చాట్జీపీటీ’, గూగుల్కు చెందిన ‘జెమినై’, పెర్ప్లెక్సిటీ వంటి యాప్లకు ప్రపంచవ్యాప్తంగా భారీగా వినియోగదారులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. కానీ, వీటికి ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో రోజువారీ, నెలవారీ యాక్టివ్ యూజర్లు భారత్లో ఉన్నారని బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ నివేదిక వెల్లడించింది.2025 నవంబరు నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెలవారీ యాక్టివ్ యూజర్లలో.. జెమినైకి 31 శాతం, పెర్ప్లెక్సిటీలను 38 శాతం మంది భారతీయులే కావడం గమనార్హం. ఇక వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి వాటి వినియోగంలోనూ భారత్ దూసుకుపోతోంది. ప్రపంచంలోని మొత్తం వాట్సాప్ వినియోగదారుల్లో మనవాళ్లు 32 శాతం కాగా, ఇన్స్టాగ్రామ్ యూజర్లలో భారతీయులు 31 శాతం కావడం విశేషం.-సాక్షి స్పెషల్ డెస్క్ -
అంటార్కిటికాలో భారత మైత్రి-2 పరిశోధనా కేంద్రం
మంచు ఖండం అంటార్కిటికాలో శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించడంలో భారతదేశం మరింత పట్టు సాధించనుంది. తూర్పు అంటార్కిటికాలో భారత్ నిర్మించదలచిన సరికొత్త పరిశోధనా కేంద్రం ‘మైత్రి-2’ 2032 నాటికి సిద్ధం కానుందని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ముందుగా ఈ ప్రాజెక్ట్ను 2029 లోపు పూర్తి చేయాలని నిర్ణయించారు. కొన్ని కారణాల వల్ల ఇది వాయిదా పడినట్లు ప్రభుత్వం చెప్పింది. సుమారు రూ.2,000 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ కేంద్రం దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న మైత్రి-1 స్థానాన్ని భర్తీ చేయనుంది.మైత్రి-11981లో భారత అంటార్కిటిక్ యాత్రలు ప్రారంభమైనప్పటికీ 1989లో షిర్మాకర్ ఒయాసిస్లో స్థాపించిన మైత్రి-1 ఇండియా పరిశోధనలకు కీలకంగా నిలిచింది. అంతకుముందు ఉన్న ‘దక్షిణ గంగోత్రి’ మంచులో కూరుకుపోయిన తర్వాత మైత్రి-1 ప్రధాన కార్యస్థానంగా మారింది.మైత్రి-1 సాధించిన విజయాలుగత 35 ఏళ్లుగా నిరంతరాయంగా శాస్త్రవేత్తలకు ఆశ్రయం ఇస్తూ వాతావరణ మార్పులపై విలువైన డేటాను అందించింది. భూగర్భ శాస్త్రం, వాతావరణ శాస్త్రం, హిమానీనదాల అధ్యయనంలో మైత్రి కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం ఈ స్టేషన్ పాతబడటంతో పెరిగిన అవసరాలకు అనుగుణంగా ఆధునిక సౌకర్యాలతో మైత్రి-2 నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.మైత్రి-2 భవిష్యత్ పరిశోధనల దిశగా..మైత్రి-2 అత్యాధునిక సాంకేతికతతో కూడిన శాస్త్రీయ ప్రయోగశాల. ఈ స్టేషన్ ద్వారా భారత్ చేపట్టబోయే ప్రధాన పరిశోధనలు ఇవే:ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో అంటార్కిటిక్ మంచు ఫలకాలు కరగడాన్ని నిశితంగా పరిశీలించడం. ఇందుకోసం అధునాతన ‘ఐస్-కోర్ స్టోరేజ్’ వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నారు.తీవ్రమైన చలిలో జీవించే సూక్ష్మజీవులు, వృక్షజాతులపై పరిశోధనలు చేయడానికి ప్రత్యేక జీవ, సూక్ష్మజీవుల పరిశోధన కేంద్రం అందుబాటులోకి రానుంది.ఓజోన్ పొరలో మార్పులు, భూకంప తరంగాల పర్యవేక్షణ, దీర్ఘకాలిక పర్యావరణ స్థితిగతులను ఈ స్టేషన్ ట్రాక్ చేస్తుంది.ఏడాది పొడవునా ఎటువంటి ఆటంకం లేకుండా శాస్త్రీయ కార్యకలాపాలు సాగడానికి బలమైన రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థను మైత్రి-2లో రూపొందిస్తున్నారు.ప్రస్తుత స్థితి.. సవాళ్లుకేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించిన సమాచారం ప్రకారం, మైత్రి-2 నిర్మాణాన్ని కొన్ని కారణాల వల్ల 2032కి మార్చారు. దీనికి అవసరమైన ఆర్కిటెక్చరల్ డిజైన్, డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కోసం ప్రభుత్వం రూ.29.2 కోట్లను ఇప్పటికే మంజూరు చేసింది. కఠినమైన వాతావరణ పరిస్థితులు, రవాణా సవాళ్ల దృష్ట్యా ఈ నిర్మాణానికి పట్టే ఏడేళ్ల సమయం అత్యంత కీలకం.గోవాలోని నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ (NCPOR) ఆధ్వర్యంలో భారత్ అంటార్కిటికాలో తన ప్రస్థానాన్ని మరింత వేగవంతం చేస్తోంది. మైత్రి-2 అందుబాటులోకి రావడం ద్వారా కేవలం పరిశోధనల పరిధి పెరగడమే కాకుండా ప్రపంచ పర్యావరణ పరిరక్షణలో భారతదేశం తన నాయకత్వ పాత్రను చాటుకుంటుంది.ఇదీ చదవండి: ఎన్హెచ్ఏఐ ప్రాజెక్ట్ క్యూఆర్ కోడ్ బోర్డులు -
సామాన్యుడి చేతిలో సమస్తం!
ఒకప్పుడు కంప్యూటర్ అంటేనే వింతగా చూసిన పల్లె ప్రజలు ఇప్పుడు తమ చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్తో ప్రపంచంలోని అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. టెక్నాలజీ పుణ్యామా అని ఇప్పుడు చాలా మందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అందుబాటులోకి వచ్చింది. చాట్జీపీటీ, జెమిని.. వంటివి కేవలం నగరాలకో, సాఫ్ట్వేర్ ఇంజినీర్లకో పరిమితం కాలేదు. పంటకు పట్టిన తెగులును ఫోటో తీసి పరిష్కారం అడిగే రైతు నుంచి, ప్రభుత్వ పథకాల వివరాలను మాతృభాషలో అడిగి తెలుసుకునే సామాన్యుడి వరకు.. ఏఐ నేడు ఒక డిజిటల్ సహాయకుడిలా మారుతోంది. ఇంగ్లీష్ రాకపోయినా, టెక్నాలజీపై అవగాహన లేకపోయినా.. కేవలం మాటతోనే పనులు పూర్తి చేసుకునేలా ఏఐ అందుబాటులోకి వస్తోంది.సామాన్యుల కోసం టెక్ కంపెనీల వ్యూహాలుచదవడం, రాయడం రాని వారు కూడా తమ మాతృభాషలో మాట్లాడి సమాచారాన్ని పొందేలా గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు వాయిస్ అసిస్టెంట్లను అభివృద్ధి చేశాయి. మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేసిన భాషిణి వంటి ప్రభుత్వ ఏఐ ప్రాజెక్టులు, గూగుల్ ‘1,000 ల్యాంగ్వేజీ ఏఐ మోడల్’ ద్వారా స్థానిక మాండలికాల్లో ఏఐ సర్వీసులు అందిస్తున్నారు. కొత్త యాప్లను డౌన్లోడ్ చేయడం కష్టంగా భావించే వారి కోసం నేరుగా వాట్సాప్ చాట్బాట్ల ద్వారా ఏఐ సేవలను అందుబాటులోకి తెస్తున్నారు.గ్రామ స్థాయిలో ఏఐ ఎలా ఉపయోగపడుతుంది?వ్యవసాయానికి సంబంధించి నేల స్వభావం, వాతావరణ మార్పులను బట్టి ఏ పంట వేయాలి? ఎప్పుడు నీరు పెట్టాలి? పురుగుల మందు ఎప్పుడు చల్లాలి? వంటి అంశాలను ఏఐ ముందే సూచిస్తుంది. ఉదాహరణకు, పంట ఆకు ఫోటో తీసి ఏఐ యాప్లో పెడితే దానికి ఉన్న సమస్యలు ఏమిటో, ఏ మందు వాడాలో వెంటనే చెబుతుంది.గ్రామాల్లో డాక్టర్ల కొరత ఉంటుంది. ఏఐ ఆధారిత డయాగ్నోస్టిక్ టూల్స్ ద్వారా ప్రాథమిక పరీక్షలు నిర్వహించి తీవ్రతను బట్టి నగరంలోని డాక్టర్లకు సమాచారాన్ని పంపవచ్చు.ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల గురించి తమ సొంత భాషలో అడిగి తెలుసుకోవడానికి ఏఐ చాట్బాట్లు సహాయపడుతున్నాయి.ఏఐని సులువుగా ఎలా వాడవచ్చు?స్మార్ట్ఫోన్లో ఏదైనా ఏఐను అడగాలంటే టైప్ చేయడం కష్టమైతే కీబోర్డ్ పైన లేదా సెర్చ్ బార్లో ఉండే మైక్ బటన్ నొక్కి మీకు కావాల్సిన విషయాన్ని అడగాలి.గూగుల్ లెన్స్ వంటి ఏఐ టూల్స్ వాడి ఏదైనా తెలియని వస్తువును లేదా మొక్కను ఫోటో తీసి దాని వివరాలు తెలుసుకోవచ్చు.మీకు రాని భాషలో ఏదైనా ఉత్తరం లేదా బోర్డు ఉంటే, ఏఐ కెమెరా ద్వారా దాన్ని వెంటనే కావాల్సిన భాషలోకి మార్చుకోవచ్చు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కేవలం చదువుకున్న వారి కోసం మాత్రమే కాదు, దీన్ని అందరి కోసం తయారు చేస్తున్నారు. ముఖ్యంగా భారతీయ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో ఏఐ విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదు. డిజిటల్ అక్షరాస్యత పెంచడంతో పాటు భాషా పరమైన అడ్డంకులను తొలగిస్తే ఏఐ ఒక సామాన్యుడి డిజిటల్ సహాయకుడిగా మారుతుంది.ఇదీ చదవండి: వ్యర్థాలుగా కాదు.. వెలుగుల దిశగా అడుగులు -
వ్యర్థాలుగా కాదు.. వెలుగుల దిశగా అడుగులు
ఎలక్ట్రిక్ వాహనాల వాడకం ఏటా పెరుగుతోంది. వాహనదారుల్లో పర్యావరణంపై అవగాహన అధికమవుతోంది. భారత రోడ్లపై గతేడాది దాదాపు 15 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్డెక్కడం పర్యావరణ స్పృహకు నిదర్శనం. అయితే, ఈ వాహనాల్లో కీలక భాగంగా ఉన్న ‘లిథియం-అయాన్’ బ్యాటరీల ఆయుష్షు తీరిపోయాక పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్న. తాజా అంచనాల ప్రకారం 2030 నాటికి దేశంలో ఏటా 50,000 టన్నులకు పైగా బ్యాటరీ వ్యర్థాలు పోగుపడనున్నాయి. కానీ, ఈ వ్యర్థాలను పర్యావరణ ముప్పుగా కాకుండా ఒక అద్భుతమైన ఆర్థిక అవకాశంగా మార్చే దిశగా భారత్ అడుగులు వేస్తోంది.కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ‘బ్యాటరీ వ్యర్థాల నిర్వహణ సవరణ నిబంధనలు (2024)’ ఈ రంగంలో సరికొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి. కేవలం రీసైక్లింగ్ మాత్రమే కాకుండా ఈ పాత బ్యాటరీలను ‘సెకండ్ లైఫ్’ కింద కొన్ని మార్పులు చేసి మారుమూల గ్రామాల్లో సోలార్ గ్రిడ్లుగా, వ్యవసాయ పంపు సెట్లకు ఎనర్జీ సోర్స్లుగా మలచవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.పెరుగుతున్న బ్యాటరీలుప్రస్తుతం వినియోగిస్తున్న లిథియం-అయాన్ బ్యాటరీల జీవితకాలం సాధారణంగా 8 నుంచి 10 ఏళ్లు. భారత ప్రభుత్వం ఫేమ్ 2 పథకం ద్వారా ఈవీలను ప్రోత్సహిస్తున్న తరుణంలో వచ్చే దశాబ్ద కాలంలో లక్షలాది టన్నుల బ్యాటరీ వ్యర్థాలు పోగుపడతాయని అంచనా. వీటిని సరైన పద్ధతిలో నిర్వహించకపోతే అందులోని రసాయనాలు భూగర్భ జలాలను, పర్యావరణాన్ని కలుషితం చేసే ప్రమాదం ఉంది.రీసైక్లింగ్ ప్రక్రియబ్యాటరీలను కేవలం వ్యర్థాలుగా చూడకుండా రీసైక్లింగ్ ద్వారా కలిగే ప్రయోజనాలపై దృష్టి సారించాలి. కొన్ని పద్ధతుల ద్వారా పాత బ్యాటరీల నుంచి లిథియం, కోబాల్ట్, నికెల్, మాంగనీస్ వంటి విలువైన లోహాలను 90% పైగా తిరిగి పొందవచ్చు. భారతదేశంలో లిథియం నిల్వలు తక్కువ. రీసైక్లింగ్ పెరిగితే ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ‘బ్యాటరీ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ (2022)’ ప్రకారం తయారీదారులే బ్యాటరీల సేకరణ, రీసైక్లింగ్కు బాధ్యత వహించాలి.బ్యాటరీలకు ‘సెకండ్ లైఫ్’అన్ని బ్యాటరీలను వెంటనే రీసైక్లింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఈవీల్లో బ్యాటరీ సామర్థ్యం 70-80% కి పడిపోయినప్పుడు అవి వాహనానికి పనికిరావు కానీ, ఇతర అవసరాలకు అవి మెరుగ్గా పని చేస్తాయి. దీనినే సెకండ్ లైఫ్ అప్లికేషన్లు అంటారు. రీసైకిల్ చేయకుండానే ఈ బ్యాటరీలను గ్రామీణ ప్రాంతాల్లో విభిన్న అవసరాలకు ఉపయోగించవచ్చు.సోలార్ మైక్రో గ్రిడ్లు: గ్రామాల్లో సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును నిల్వ చేయడానికి ఈ పాత ఈవీ బ్యాటరీలను ఉపయోగించవచ్చు. పగలు నిల్వ చేసిన విద్యుత్తును రాత్రి పూట వీధి దీపాలకు, ఇళ్లకు వాడుకోవచ్చు.వ్యవసాయ పంపు సెట్లు: పొలాల్లో సోలార్ పంపు సెట్లకు బ్యాటరీ స్టోరేజ్గా వీటిని అనుసంధానిస్తే విభిన్న వాతావరణ పరిస్థితులున్న సమయంలో కూడా నీటి సరఫరా ఆగదు.బ్యాకప్ పవర్: గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలల్లో ఇన్వర్టర్ల స్థానంలో ఈ బ్యాటరీ ప్యాక్లను తక్కువ ధరకే ఏర్పాటు చేయవచ్చు.నీతి ఆయోగ్ నివేదికల ప్రకారం, 2030 నాటికి భారతదేశంలో బ్యాటరీ రీసైక్లింగ్ మార్కెట్ విలువ బిలియన్ డాలర్ల(సుమారు రూ.9000 కోట్లు)కు చేరుకుంటుంది. ఈ క్రమంలో పాత బ్యాటరీలను గ్రామీణ విద్యుదీకరణకు వాడటం వల్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యం సులభమవుతుంది. 2027-28 ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త బ్యాటరీల తయారీలో కనీసం 5% రీసైకిల్ చేసిన పదార్థాలను వాడాలనే నిబంధనను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), లోహమ్ (LOHUM) వంటి సంస్థలు ఇప్పటికే పాత ఈవీ బ్యాటరీలను ఎనర్జీ స్టోరేజ్లుగా మార్చి గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు ప్రయోగాలు చేస్తున్నాయి. రీసైక్లింగ్ ద్వారా లభించే లిథియం, కోబాల్ట్ ధరలు కొత్త ఖనిజాల తవ్వకం కంటే 25% తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇది ఈవీల ధరలు తగ్గడానికి కూడా దోహదపడుతుంది.ఇదీ చదవండి: భారత మార్కెట్లోకి నిస్సాన్ కొత్త మోడల్ -
2025లో బెస్ట్ బడ్జెట్ ఫోన్లు ఇవే..
2025 ఏడాది ముగింపునకు వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం 2026 ప్రారంభం కాబోతోంది. ఈ క్రమంలో వినియోగదారులు ఎప్పటికప్పుడు మార్చే డివైజ్ ఏదైనా ఉందంటే అది స్మార్ట్ ఫోన్. శాంసంగ్ నుంచి మొదలు పెడితే పోకో వరకూ ఇలా అనేక మొబైల్ బ్రాండ్లు ప్రతినెలా కొత్త మోడల్ స్మార్ట్ఫోన్లను మార్కెట్లో విడుదల చేస్తూనే ఉంటాయి.అయితే ఎక్కువ మందికి కావాల్సినవి.. కొనేవి బడ్జెట్ ఫోన్లే కాబట్టి.. రూ.20 వేల ధరలోపు 2025లో వచ్చిన బెస్ట్ స్మార్ట్ఫోన్లేవో ఈ కథనంలో చూద్దాం.. వీటిని చాలా మంది ఇప్పటికే కొని వినియోగిస్తుండవచ్చు. లేదా ఇప్పుడు కొనుక్కోవచ్చు..షియోమీ రెడ్ మీ నోట్ 14 5జీ: పనితీరు, కెమెరా, బ్యాటరీ సమతుల్య మిశ్రమంతో అద్భుతమైన ఆల్ రౌండర్. రోజువారీ ఉపయోగం, స్ట్రీమింగ్, క్యాజువల్ గేమింగ్ కోసం రూ.17,000 లోపు మంచి ఆప్షన్.రియల్మీ 14ఎక్స్ 5జీ: మంచి డిస్ప్లే, బ్యాటరీ లైఫ్తో బడ్జెట్ ఎంపిక. ధర రూ .15,000 కంటే తక్కువ. దృఢమైన రోజువారీ పనితీరు, 5జీ సపోర్ట్ కోరుకునేవారికి సరిగ్గా సరిపోతుంది.మోటరోలా మోటో జీ86 పవర్ 5జీ: మంచి పనితీరు, బ్యాటరీ లైఫ్, క్లీన్ సాఫ్ట్ వేర్ ఎక్స్పీరియన్స్తో బ్రాండ్ సపోర్ట్తో రూ.18,000 కంటే తక్కువ ధరలో అద్భుతమైన మిడ్-రేంజ్ ఫోన్ఒప్పో కే13 5జీ స్టైలిష్: డిజైన్, సులభమైన పనితీరు దీన్ని రూ.20,000 లోపు ఫోన్లలో పోటీ ఎంపికగా చేస్తుంది. డిస్ ప్లే క్వాలిటీ విషయంలో మంచి రేటింగ్స్ పొందింది.వన్ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ: తక్కువ ధర పాయింట్ (రూ.12 వేలు నుంచి రూ.15 వేలు) వద్ద క్లీన్ యూజర్ ఎక్స్పీరియన్స్, మంచి పనితీరును కోరుకుంటే ఇది మంచి ఆప్షన్.గమనిక: దాదాపు అన్ని ప్రధాన స్మోర్ట్ఫోన్ బ్రాండ్లను ఇక్కడ పేర్కొనడం జరిగింది. ధరల రేంజ్, ఫీచర్లను బట్టి పైన జాబితాను ఇవ్వడం జరిగింది. -
టెలికాం కంపెనీల మరో ‘ధరల’ బాదుడు
భారతీయ టెలికాం వినియోగదారులకు మోర్గాన్ స్టాన్లీ నివేదిక షాకిచ్చే వార్తను అందించింది. దేశంలోని ప్రముఖ ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లయిన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా తమ టారిఫ్ ధరలను 2026లో మరోసారి పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు ఈ అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ అంచనా వేసింది.ఎంత పెరగవచ్చు?మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీలు సగటున 20 శాతం వరకు టారిఫ్ ధరలను పెంచే అవకాశం ఉంది. ఇప్పటికే జులై 2024లో ఈ మూడు కంపెనీలు తమ ప్లాన్ ధరలను 11 నుంచి 25 శాతం వరకు పెంచిన సంగతి తెలిసిందే. 2026 నాటి పెంపుతో ఒక వినియోగదారుని నుంచి వచ్చే సగటు ఆదాయం (ARPU) గణనీయంగా పెరగాలని కంపెనీలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.టారిఫ్లు పెంచడానికి కారణాలుదేశవ్యాప్తంగా 5జీ నెట్వర్క్ను విస్తరించడానికి కంపెనీలు వేల కోట్ల రూపాయలను వెచ్చించాయి. ఈ పెట్టుబడులపై రాబడిని (ROI) రాబట్టడం ఇప్పుడు అనివార్యంగా మారింది. టెలికాం రంగం లాభదాయకంగా ఉండాలంటే ‘ఒక్కో వినియోగదారుని నుంచి వచ్చే సగటు ఆదాయం’(ARPU) కనీసం రూ.300 దాటాలని సంస్థలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఇది రూ.200 - రూ.210 స్థాయిలో ఉంది. ప్రభుత్వానికి టెలికాం కంపెనీలు చెల్లించాల్సిన స్పెక్ట్రమ్ ఫీజులు, ఇతర రుణాలను తీర్చుకోవడానికి కంపెనీలకు అదనపు నగదు ప్రవాహం అవసరం.సామాన్యులపై ప్రభావంనిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న సామాన్యుడికి ఈ టారిఫ్ పెంపు భారంగా మారనుంది. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో కనీసం 3 నుంచి 4 మొబైల్ కనెక్షన్లు ఉంటాయి. 20% పెంపు అంటే వారి నెలవారీ డిజిటల్ ఖర్చు భారీగా పెరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ధరలకు ఇంటర్నెట్ వాడుతున్న వారిపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. డేటా ఖరీదైనదిగా మారితే డిజిటల్ అక్షరాస్యత మందగించే ప్రమాదం ఉంది. గత జులైలో జరిగిన ధరల పెంపు వల్ల చాలా మంది తమ సెకండరీ సిమ్ కార్డులను రీఛార్జ్ చేయడం మానేశారు. 2026లో కూడా ఇదే ధోరణి కొనసాగవచ్చు.ఇదీ చదవండి: రైల్వే వాలెట్ నుంచి నగదు విత్డ్రా కుదరదు -
సరికొత్త టెక్నాలజీ.. ఇదిగో హైబ్రిడ్ ఎలక్ట్రిక్
సాధారణంగా చాలామంది ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. దీనిని దృష్టిలొ ఉంచుకుని పలు ఆటోమొబైల్ కంపెనీలు దాశాబ్దాలుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నాయి. కానీ ఆశించిన ఫలితాలు కనిపించలేదు. అయితే ఐఐటి బాంబేకు చెందిన స్టార్టప్ రైజెన్ టెక్ ఒక హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనం తయారు చేసింది. ఇది మామూలు వాహనాల కంటే భిన్నంగా శక్తిని వినియోగించుకోవడం మాత్రమే కాకుండా.. ఎక్కువ మైలేజ్ కూడా అందిస్తుంది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఇక్కడ..ఐఐటీ బాంబేకు చెందిన స్టార్టప్ రైజెన్ టెక్.. రూపొందించిన హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ పేరు బిబ్యా 1.1 (Bibtya 1.1). ఇది టాటా ఏస్ గోల్డ్. దీనికి సరికొత్త టెక్నాలజీని అమర్చి.. టెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇక్కడ గమనించవచ్చు.సాధారణంగా ఒక వెహికల్ పెట్రోల్ లేదా డీజిల్ ద్వారా శక్తిని ఉత్పత్తి చేస్తుంది. తద్వారా వాహనం నడుస్తుంది. కానీ ఇక్కడ రైజెన్ టెక్ రూపొందించిన హైబ్రిడ్ ఏలక్ట్రిక్ టాటా ఏస్ గోల్డ్ ట్రక్ దానికి భిన్నంగా ఉంటుంది. ఎలా అంటే.. ఇందులోని ఇంజిన్ పెట్రోల్ ఉపయోగించి.. శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ శక్తిని నేరుగా చక్రాలకు సరఫరా చేయదు. ఈ శక్తిని బ్యాటరీ తీసుకుని.. ఛార్జ్ చేసుకుంటుంది. ఈ ఛార్జ్ ద్వారా వాహనం నడుస్తుంది. తద్వారా.. పనితీరు కూడా పెరుగుతుంది.ఇదీ చదవండి: శీతాకాలం పొగమంచు: డ్రైవింగ్ టిప్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తలునిజానికి ఈ విధానం కొత్తగా ఉంది. టెస్టింగ్ కూడా జరుగుతోంది. ఇది అన్నింటా సక్సెస్ సాధిస్తే.. ఎక్కువ మైలేజ్ అందించే వాహనాలు సాధ్యమవుతాయి. అయితే దీనిపై కొంతమంది అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.పెట్రోల్, బ్యాటరీ రెండూ ఉండటం వల్ల.. పేలిపోయే అవకాశం ఉందా?, ఒకవేళా బ్యాటరీ పనిచేయని సందర్భంగా పెట్రోల్తో మాత్రం వాహనం నడుస్తుందా? అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలోనే ఉంది, కాబట్టి ఈ ప్రశ్నలకు సమాధానాలు అందుబాటులో లేదు. బహుశా దీనిని అన్ని విధాలా.. పరీక్షించిన తరువాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. View this post on Instagram A post shared by Runtime (@runtimebrt) -
చాట్జీపీటీ 'అడల్ట్ మోడ్'.. పెద్దల కోసం స్పెషల్ కంటెంట్!
దాదాపు అన్ని రంగాల్లోనూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హవా కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఈ తరుణంలో ఓపెన్ఏఐ (OpenAI) పెద్దలకోసం 'అడల్ట్ మోడ్' అందించడానికి సిద్ధమైంది. ఇది ఎప్పటి నుంచి అంబాటులోకి వస్తుందనే విషయాన్ని ఆ సంస్థ సీఈఓ శామ్ ఆల్ట్మన్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.అడల్ట్ మోడ్ ఫర్ చాట్జీపీటీ (ChatGPT) 2026 మొదటి త్రైమాసికంలో లాంచ్ కానుంది. కొత్త GPT-5.2 మోడల్పై బ్రీఫింగ్ సందర్భంగా ఓపెన్ఏఐ అప్లికేషన్స్ సీఈఓ ఫిడ్జీ సిమో ప్రకటించారు. ఇది కేవలం వెరిఫైడ్ అడల్ట్స్ కోసం మాత్రమే. వయసు నిర్దారణతోనే ఈ ఫీచర్స్ యాక్సెస్ లభిస్తుందని వెల్లడించారు.చాట్జీపీటీ అడల్ట్ మోడ్.. వినియోగం కేవలం పెద్దలకు మాత్రమే. దీనిని మైనర్లు ఉపయోగించుకుండా ఉండేందుకు సంస్థ తగిన ఏర్పాట్లు చేస్తోంది. కంపెనీ ప్రస్తుతం ఎంపిక చేసిన దేశాలలో వయస్సు అంచనాకు సంబంధించిన విషయాలను ధృవీకరించడానికి టెస్టింగ్ జరుగుతోందని సిమో పేర్కొన్నారు.ఇదీ చదవండి: అన్నింటా రోబోలే!.. మనుషులు ఏం చేయాలిఅడల్ట్ మోడ్ ఖచ్చితంగా ఆప్ట్-ఇన్ అయి ఉంటుంది. డిఫాల్ట్గా స్విచ్ ఆఫ్ చేయబడి ఉంటుంది. కంటెంట్ను అన్లాక్ చేయడానికి వినియోగదారులు స్పష్టంగా అభ్యర్థించి ధృవీకరణను పాస్ చేయాలి. అప్పుడే దీనిని ఉపయోగించుకోవడం సాధ్యమవుతుంది. ఈ మోడ్ పరిమితులకు లోబడి ఉంటుంది.We made ChatGPT pretty restrictive to make sure we were being careful with mental health issues. We realize this made it less useful/enjoyable to many users who had no mental health problems, but given the seriousness of the issue we wanted to get this right.Now that we have…— Sam Altman (@sama) October 14, 2025 -
అన్నింటా రోబోలే!.. మనుషులు ఏం చేయాలి
గోస్ట్ వేర్హౌస్లు గురించి చాలామంది వినే ఉంటారు. బహుశా కొంతమందికి తెలియకపోవచ్చు. ఇక్కడ మనుషులు కనిపించరు, అందుకే వీటిని గోస్ట్ అని పిలుస్తారు. ఇక్కడంతా ఏఐ ఆధారిత రోబోట్స్ పనిచేస్తుంటాయి. 24/7 అలసట లేకుండా.. సెలవు లేకుండా పనిచేస్తూనే ఉంటాయి. ఇప్పటికే ఇలాంటి తరహా విధానం చైనాలో జరుగుతోంది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అన్ని పనుల్లో రోబోలే!పాస్కల్ బోర్నెట్ (Pascal Bornet) అనే ఎక్స్ యూజర్ షేర్ చేసిన వీడియోలో గమనిస్తే.. కొన్ని ఏఐ ఆధారిత రోబోటిక్ వాహనాలు నెమ్మదిగా కదులుతూ.. కంటైనర్లను మోసుకెళ్తుండటం చూడవచ్చు. వీడియోలో ఒక్క మనిషి కూడా కనిపించడు. గిడ్డంగులలో సరుకులు ఎత్తడం, కదలించడం, ప్యాక్ చేయడం వంటివన్నీ ఏఐ రోబోలే చూసుకుంటారు. కాబట్టి మనుషుల అవసరం ఉండదు.అలీబాబా, జేడీ.కామ్ వంటి పెద్ద ఈ-కామర్స్ కంపెనీలు ఇలాంటి ఏఐ రోబోట్స్ వినియోగిస్తున్నాయి. ఇలాంటి రోబోట్స్ ఉపయోగించడం వల్ల.. కార్మిక కొరత ఉండదు, మానవుల మాదిరిగా తప్పులు జరగవు, ఖర్చులు తగ్గిన్చుకోవచ్చు, పని కూడా వేగంగా.. నిరంతరాయంగా జరుగుతుంది.Ghost warehouses aren’t science fiction anymore — they’re already humming quietly in ChinaThey are warehouses run entirely by AI-powered robots, operating 24/7 with zero human presence.China and much of Asia have already embraced this shift, and they’re not slowing down.… pic.twitter.com/Spxwfaq7TJ— Pascal Bornet (@pascal_bornet) December 12, 2025మనుషులు చేయాల్సింది!ఈ వీడియో షేర్ చేసిన.. పాస్కల్ బోర్నెట్ తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ, పనులన్నీ రోబోలు చేస్తున్నాయి, మనుషులు ఏమి చేయాలో ఆలోచించాలని అన్నారు. రోబోలు ఎప్పుడూ ఒకే పని చేస్తూనే ఉంటాయి. కాబట్టి మీరు డిజైన్, ఇన్నోవేషన్, కస్టమర్ ఎక్స్పీరియన్స్ వంటి వారిపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. చివరగా మీరేమనుకుంటున్నారని.. ప్రశ్నిచారు.ఇదీ చదవండి: వారంలో నాలుగు రోజులే వర్క్!: కొత్త పని విధానం..పని చేయడానికి రోబోట్స్ ఉపయోగించడం వల్ల.. చాలామంది ఉద్యోగావకాశాలు కోల్పోతారు. అయితే సంస్థలు కొత్త స్కిల్స్ రోబోల నుంచి ఆశించడం అసాధ్యం. రోబోట్స్ వినియోగం చైనా వంటి దేశాల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు. భారతదేశంలో కూడా ఇలాంటి విధానం ప్రారంభం కావడానికి ఎంతోకాలం పట్టకపోవువచ్చు. కాబట్టి అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ''మనుషులు కష్టపడే యంత్రాలు కాదు - ఆలోచించే సృష్టికర్తలు''. కాబట్టి మనిషి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ స్కిల్స్ పెంచుకుంటూ ఉండాలి. -
జియో లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్: యూజర్లకు పండగే!
రిలయన్స్ జియో తన కొత్త ప్రీపెయిడ్ టారిఫ్ పోర్ట్ఫోలియోను ''హ్యాపీ న్యూ ఇయర్ 2026'' ప్లాన్లను ఆవిష్కరించింది. ఇందులో నెల రోజుల ప్లాన్, ఏడాది ప్లాన్ రెండూ ఉన్నాయి. ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.హీరో యాన్యువల్ రీఛార్జ్ఏడాది పాటు రీఛార్జ్ కావాలనుకునే వారి కోసం రిలయన్స్ జియో ఈ ప్లాన్ పరిచయం చేసింది. రూ. 3599లతో రీఛార్జ్ చేసుకుంటే.. 365 రోజులు చెల్లుబాటు అవుతుంది. రోజుకు 2.5 జీబీ 5జీ డేటా, 100 SMSలు, అపరిమిత కాల్స్ పొందవచ్చు. అదనంగా గూగుల్ జెమిని ప్రో ప్లాన్కు 18 నెలల ఉచిత సబ్స్క్రిప్షన్ను పొందవచ్చు.సూపర్ సెలబ్రేషన్ మంత్లీ ప్లాన్సూపర్ సెలబ్రేషన్ మంత్లీ ప్లాన్ పేరుతో 500 రూపాయల రీఛార్జ్ ప్లాన్ కూడా జియో ప్రకటించింది. ఇది 28 రోజుల చెల్లుబాటు ఉన్నప్పటికీ.. రోజుకు 2జీబీ డేటా, 100 SMSలు, అపరిమిత కాల్స్ పొందవచ్చు. అదనంగా ఓటీటీ ప్రయోజనాలు (యూట్యూబ్ ప్రీమియం, జియో హాట్స్టార్, సోని లివ్, జీ5 మొదలైనవి) లభిస్తాయి. యాన్యువల్ ప్లాన్ మాదిరిగానే 18 నెలల ఉచిత గూగుల్ జెమిని ప్రో ప్లాన్ కూడా పొందవచ్చు.ఫ్లెక్సీ ప్యాక్ఫ్లెక్సీ ప్యాక్ పేరుతో.. 103 రూపాయల రీఛార్జ్ ప్లాన్ కూడా తీసుకొచ్చింది. దీని వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే. అయితే ఇందులో కేవలం డేటా మాత్రం లభిస్తుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వినియోగదారుడు.. హిందీ, ఇంటర్నేషనల్, ప్రాంతీయ ప్యాక్లలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: ఒక రీఛార్జ్.. ఏడాది పాటు డేటా, అన్లిమిటెడ్ కాల్స్ -
ఒక రీఛార్జ్.. ఏడాది పాటు డేటా, అన్లిమిటెడ్ కాల్స్
రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో బీఎస్ఎన్ఎల్ కూడా.. ఇదే బాటలో పయనిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు 365 రోజుల ప్లాన్ పరిచయం చేసింది. ఈ లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్ గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.బీఎస్ఎన్ఎల్ పరిచయం చేసిన రూ. 2399 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకి 2జీబీ డేటా, 100 ఎస్ఎమ్ఎస్లు, అపరిమిత కాల్స్ ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా పొందవచ్చు. ఈ విషయాన్ని బీఎస్ఎన్ఎల్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొంటూ.. నాన్ స్టాప్ కనెక్షన్ అని పోస్ట్ చేసింది.సంవత్సరం ప్లాన్ కోరుకునేవారికి ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది. ఈ రీఛార్జ్ ప్లాన్ ధర రిలయన్స్ జియో, ఎయిర్టెల్ కంటే తక్కువే. దీన్నిబట్టి చూస్తుంటే.. బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ప్లన్స్ పరిచయం చేస్తూ ముందుకు సాగుతుందని స్పష్టమవుతోంది.Attention !!!Non- stop connection at 2399/- for 365 days#BharatFibre #SuccessStory #Partnership #4Gmobile #BusinessSuccess #BSNLSelfCareApp #SwitchToBSNL #entertainment #mobilerecharge #fypage✨ #explorepage pic.twitter.com/774dFc3jeJ— BSNL_Kolkata (@BSNL_KOTD) December 13, 2025 -
పైపుల్లో కరెంట్!: ఇంజినీర్ల మ్యాజిక్
ఇంటి దగ్గర ఉన్న సాధారణ నీటి పైపులు రాత్రి వీధి దీపాలను వెలిగించగలవంటే నమ్ముతారా? నిజమే. ఎలాంటి సౌర ఫలకాలూ లేకుండా, పెద్ద యంత్రాలను అమర్చే అవసరం లేకుండా కేవలం నీరు పారుతూనే విద్యుత్ తయారవుతోంది. ఇదే ఇజ్రాయెల్ ఇంజినీర్లు ఆవిష్కరించిన ‘స్మార్ట్ వాటర్ పైప్స్’ మ్యాజిక్! పైపుల లోపల చిన్న చక్రాలు లాంటివి అమర్చితే, నీరు ఒత్తిడితో ప్రవహించినప్పుడు అవి మెల్లగా తిరుగుతాయి. ఆ తిప్పుడే నీటి ప్రవాహాన్ని నేరుగా విద్యుచ్ఛశక్తిగా మారుస్తుంది. నీరు మాత్రం ఎలాంటి అడ్డంకి లేకుండా తన దారినే ప్రవహిస్తుంది. నగరాలు ఇప్పుడు ఈ స్మార్ట్ ఎనర్జీ పైపులను పరీక్షిస్తున్నాయి.వీధి దీపాలు వెలిగించడం నుంచి నగరంలోని సెన్సర్లు పనిచేయించడం వరకూ ఇవే సరిపోతున్నాయని తేలింది. అంతేకాదు, పైపుల్లో ఎక్కడ లీక్ ఉందో, నీటి నాణ్యత ఎలా ఉందో కూడా వెంటనే తెలియజేస్తాయి. ఇలా మన చుట్టూ ఉన్న చిన్న వ్యవస్థలే భవిష్యత్తును ఎలా మార్చగలవో ఈ పైపులు చూపుతున్నాయి. -
చేతులు కలిపిన మైక్రోసాఫ్ట్, విప్రో
దేశీ ఐటీ దిగ్గజం విప్రో తాజాగా గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్తో చేతులు కలిపింది. ఎంటర్ప్రైజ్లకు ఏఐ సొల్యూషన్లు అందించేందుకు వీలుగా వ్యూహాత్మక భాగస్వామ్యానికి తెరతీసింది. తద్వారా బెంగళూరులోని పార్ట్నర్ ల్యాబ్స్లో మైక్రోసాఫ్ట్ ఇన్నోవేషన్ కేంద్రం(హబ్)ను ఏర్పాటు చేయనుంది.మూడేళ్లపాటు అమల్లోఉండే సహకారం ద్వారా ఎంటర్ప్రైజెస్కు కీలక కార్యకాలపాలలో ఏఐ అమలుకు వీలు కల్పించనుంది. ఒప్పందం ద్వారా విప్రోకున్న కన్సల్టింగ్, ఇంజినీరింగ్ ఆధారిత సామర్థ్యాలకు మైక్రోసాఫ్ట్ క్లౌడ్, ఏఐ స్టాక్ను జత కలుపుకోనుంది.ఏఐ స్టాక్లో భాగంగా అజ్యూర్, మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్, గిట్హబ్ కోపైలట్, అజ్యూర్ ఏఐ ఫౌండ్రీ తదితరాలను భాగం చేసుకోనుంది. వెరసి ఎంటర్ప్రైజ్లకు కార్యకలాపాలలో టెక్నాలజీ వినియోగానికి వీలుగా విభిన్న ఏఐ సొల్యూషన్లు సమకూర్చనుంది. -
టెక్నా'లేజీ'.. అతివినియోగంతో తగ్గుతున్న జ్ఞాపకశక్తి
టెక్నాలజీ.. కాస్త టెక్నా‘లేజీ’ అవుతోంది.. పాశ్చాత్య నాగరికతకనుగుణంగా సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. వయో భేదంలేదు అసలేలేదు.. అరచేతిలో స్వర్గం.. అనర్థాలు అధికమన్న విషయం తెలిసినా సామాజిక మాధ్యమాల్లోనే కాలం గడిపేవారి సంఖ్య పెరిగిపోతోంది.. అతివినియోగంతో జ్ఞాపకశక్తి తగ్గిపోతోంది.. అన్ని వయసుల వారిలోనూ ఆరోగ్య సమస్యలూ పెరిగిపోతున్నాయి.. ఫలితంగా చిన్నారులేకాదు.. 15 నుంచి 32 ఏళ్ల యువత కూడా డేంజర్ జోన్లోకి వెళ్లిపోతోంది.. సాక్షి, పుట్టపర్తి: ప్రపంచీకరణ నేపథ్యంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. గత మూడు దశాబ్దాలతో పోలిస్తే.. టెక్నాలజీ అభివృద్ధి, తద్వారా ప్రజలకు అందిన మేలు ఊహలకు అందదు. చావు కబురు చెప్పాలంటే టెలిగ్రామ్ పంపే రోజుల నుంచి నిమిషాల్లో సమాచారం చేరవేసే సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది. బంధువులను పండుగలు, శుభకార్యాల్లో మాత్రమే కలిసి రోజుల నుంచి నిత్యం టచ్లో ఉండేలా టెక్నాలజీ అందిపుచ్చుకున్నారు. మధ్య మధ్యలో మంచీచెడులు తెలుసుకోవాలంటే ఉత్తరాలే దిక్కయ్యేవి. ఆ దశ నుంచి కంప్యూటర్, ఇంటర్నెట్ యుగంలోకి వచ్చాం. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో సగటున స్మార్ట్ఫోన్ ఉంది. ఇంటింటా స్మార్ట్ టీవీలు ఉన్నాయి. ఇంటర్నెట్ ద్వారా ఇంట్లో నుంచి ప్రపంచాన్ని చూసే అవకాశం లభిస్తోంది. ఏ సమాచారం కావాలన్నా గూగుల్లో దొరుకుతోంది. పండుగలు, శుభకార్యాల కోసం మంచి బ్రాండ్ దుస్తులతో సహా ఆన్లైన్ షాపింగ్ ద్వారా కొంటున్నారు. వ్యాపార రంగంలో ఆన్లైన్ బిజినెట్ వాటా సుమారు సగం పైగా ఉందని తెలుస్తోంది. అంతేకాకుండా పిల్లల వీడియో గేమ్స్ యాప్స్ రూపంలో మొబైల్స్, టీవీల్లో వస్తున్నాయి. టెక్నాలజీ వినియోగించకుండా రోజు గడవని స్థితి నెలకొంది. ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా.. గూగుల్ మ్యాప్లో వెతుక్కుని వెళ్లే స్థితికి వచ్చారు. ఇదంతా పక్కన బెడితే.. మరో కోణంలో టెక్నాలజీని అతిగా వినియోగించి అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. అలాంటి వారిలో 15 – 35 ఏళ్ల మధ్య వయసు వారే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. టెక్నాలజీ ప్రభావంతో చదువులో వెనుకబడడం, క్రమశిక్షణ లేకపోవడం, దేనిపైనా దృష్టి సారించలేకపోవడం, ఒకరినొకరు మాట్లాడడం తగ్గిపోవడం, శారీరక శ్రమ తగ్గిపోవడంతో ఊబకాయం సమస్యలు పెరుగుతున్నాయి. నిద్రలేమి వేధిస్తోంది. చిన్న విషయానికి కూడా కోపం తెచ్చుకోవడం వంటి ప్రభావాలు పడుతున్నాయి. ఆఖరుకు చిన్న పిల్లలు కూడా డేంజర్ జోన్లోకి వెళ్తున్నారని వైద్యనిపుణులు చెప్తున్నారు. ⇒ ఒకే ప్రదేశంలో కూర్చొని కంప్యూటర్ చూస్తూ గడిపే వారికి వెన్ను సమస్యలు అధికం అవుతున్నాయి. ఈ నొప్పితో ఇతర విషయాలపై దృష్టి సారించలేకపోతున్నారు. నిత్యం ఉద్యోగ ఒత్తిళ్లతో బిజీలో ఉండటంతో పాటు మధ్య మధ్యలో స్నేహితులతో ముచ్చటించటం.. పలు విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తితో కంప్యూటర్తోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు.. ఫలితంగా మూడు పదుల వయసుకే వెన్నెముక బారిన పడుతున్నారు. ఇటీవల పుట్టపర్తిలో 36 ఏళ్ల వ్యక్తి వెన్నెముక నొప్పి బారిన పడడమే నిదర్శనంగా చెప్పవచ్చు. ⇒ స్మార్ట్ఫోన్లతో జ్ఞాపకశక్తి కోల్పోతున్నారు. కనీసం కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లు కూడా గుర్తు పెట్టుకోలేని పరిస్థితి. గణాంకాల విషయానికొస్తే క్యాలిక్యులేటర్ వాడుతున్నారు. ప్రైమరీ పాఠశాల నుంచి చిన్నారులు స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడటంతో ఏ విషయం గుర్తుంచుకోలేకపోతున్నారు. ఫోన్ లేకుంటే ఏ పనీ చేయలేని స్థితిలోకి వెళ్తున్నారు. ఫలితంగా టీనేజీలోనే జ్ఞాపక శక్తి కోల్పోతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. రెండు నెలల క్రితం హిందూపురంలో 16 ఏళ్ల బాలుడు జాపకశక్తి కోల్పోయి.. మానసికంగా దెబ్బ తిన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ⇒ పండుగ వచ్చినా.. ఫంక్షన్ రోజయినా.. ఎలాంటి శుభకార్యం కోసమైనా.. నేరుగా వెళ్లి పిలిచే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. సమీప బంధువులను తప్ప మిగతా అందరినీ టెక్నాలజీ ఆధారంగా ఆహ్వానిస్తున్నారు. శుభవార్త, చేదువార్తలు కూడా సామాజిక మాధ్యమాల ద్వారానే తెలియజేస్తున్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి ఒక్కరూ అర్ధరాత్రి వరకు ఫోన్లతోనే గడిపేస్తున్నారు. మెసేజీలు, ఫోన్ కాల్స్, రీల్స్కు బానిసలుగా మారారు.పెరిగిపోతున్న ఒత్తిడి.. స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్తోనే టెక్నాలజీని విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. ఫలితంగా చిన్నపిల్లలు, యువతకు ఆరోగ్య సమస్యలు అధికంగా వస్తున్నాయని వైద్యులు చెప్తున్నారు. 40 ఏళ్ల లోపు వయసున్న వారికి టెక్నాలజీ అతి వినియోగం కారణంగా మానసిక, శారీరక సమస్యలు అధికమయ్యాయి. యువత ఎక్కువగా సామాజిక మాధ్యమాల్లో సమయం గడుపుతుండడంతో సాధారణం కంటే ఐదు రెట్లు ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది. స్మార్ట్ఫోన్ తక్కువగా వాడేవారు పాజిటివ్ ధోరణితో ఉండగా.. అతిగా వినియోగించే వారు నెగిటివ్ ఆలోచనలో ఉంటారని నిపుణులు చెప్తున్నారు. ట్యాబ్లు, కంప్యూటర్లపై ఎక్కువగా ఆధారపడేవారు కంటి సమస్యతో బాధపడుతున్నారు. ఇంకొంత మందికి తలనొప్పి, భుజం, వెన్నునొప్పి సమస్యలు వస్తున్నాయి. ఆరోగ్యం ప్రధానం నిద్రపోయే గంట ముందే స్మార్ట్ఫోన్ వాడకం, టీవీ చూడటం మానేయాలి. అతి దగ్గరగా కూర్చొని టీవీ, ఫోన్ కూడా చూడరాదు. టెక్నాలజీని అవసరం మేరకే వాడుకోవాలి. లేదంటే సోమరితనం పెరిగిపోతుంది. చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. సామాజిక మాధ్యమాల వాడకం పూర్తిగా తగ్గించాలి. స్మార్ట్ఫోన్లలో పిల్లలు ఏం చేస్తున్నారనే విషయం గమనించడం తల్లిదండ్రుల బాధ్యత. లేదంటే పెడదారిలో వెళ్లే అవకాశం అధికంగా ఉంటుంది. – ఫైరోజాబేగం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, శ్రీసత్యసాయి జిల్లా -
ఐటీ కంపెనీలు లాభాల బాట పట్టాలంటే!
టెక్ దిగ్గజాల దృష్టి అంతా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పైనే ఉంది. లాభాలు స్థిరంగా ఉన్నా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జెనరేటివ్ ఏఐపై కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఇటీవల ఓపెన్ ఏఐతో ఒప్పందం చేసుకుని 300 బిలియన్ల పెట్టుబడులు పెట్టినప్పుడు ఒరాకిల్ స్టాక్ప్రైస్ 335 డాలర్లకు పెరిగింది. ఆ తరువాత రెండు మూడు నెలల్లోనే 190 కంటే దిగువకు పడిపోయింది. అయితే ఈ విభాగంలో పెట్టుబడులు లాభాలుగా మారడానికి ఎంత సమయం పడుతుంది? ఈ టెక్నాలజీని లాభసాటిగా మార్చుకోవాలంటే కంపెనీలు ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి? స్థిరమైన లాభాల కోసం ఐటీ కంపెనీలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎలా అధిగమించాలో విశ్లేషిద్దాం.ఏఐ పెట్టుబడులుటెక్ దిగ్గజాలు ఏఐ పరిశోధన, మౌలిక సదుపాయాలపై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ పెట్టుబడులు తక్షణమే కాకుండా, దీర్ఘకాలంలో మాత్రమే ఫలితాలనిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పెట్టుబడుల నుంచి గరిష్ట లాభాలను పొందడానికి కంపెనీలు కొన్ని కీలక అంశాలపై దృష్టి సారించాలి.కేవలం ఏఐ టెక్నాలజీని అభివృద్ధి చేయకుండా నిర్దిష్ట వ్యాపార సమస్యలను పరిష్కరించే సర్వీసులను పెంచాల్సి ఉంటుంది. ఉదాహరణకు: కస్టమర్ సేవల్లో ఆటోమేషన్, కోడ్ డెవలప్మెంట్ వేగవంతం చేయడం, లేదా కచ్చితమైన డేటా అనలిటిక్స్ అందించడం వంటి విభిన్న సర్వీసులపై దృష్టి సారించాలి.ఆర్థిక, ఆరోగ్య సంరక్షణ, తయారీ వంటి నిర్దిష్ట పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేయడంతో సర్వీసులను అధిక ధరలకు విక్రయించే అవకాశం ఉంటుంది.వ్యూహాత్మక భాగస్వామ్యాలుఐటీ కంపెనీలు స్టార్టప్లతో సహకారం కలిగి ఉంటూ తమ సొంత ఆర్ అండ్ డీపైనే ఆధారపడకుండా వినూత్న ఏఐ స్టార్టప్లతో భాగస్వామ్యం ఏర్పరచుకోవాలి లేదా వాటిని కొనుగోలు చేయడం ద్వారా టెక్నాలజీని త్వరగా మార్కెట్లోకి తీసుకురావచ్చు. క్లయింట్లతో కలిసి పనిచేస్తూ వారి వ్యాపార ప్రక్రియల్లో ఏఐని ఏకీకృతం చేయడం ద్వారా ఆయా ప్రాజెక్టుల నుంచి నిరంతర ఆదాయాన్ని పొందవచ్చు.మానిటైజేషన్ మోడల్స్ఏఐ ఆధారిత టూల్స్కు నెలవారీ లేదా వార్షిక సబ్స్క్రిప్షన్ మోడల్ను అమలు చేయాలి. క్లయింట్ ఏఐ సర్వీసును ఎంత ఉపయోగించారో దాని ఆధారంగా ధరను నిర్ణయించడం ద్వారా తక్కువ వినియోగం ఉన్న క్లయింట్లను కూడా ఆకర్షించవచ్చు.మానవ వనరుల పెంపుఏఐ టెక్నాలజీని ఉపయోగించే, దాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం ఉన్న ఉద్యోగుల శిక్షణలో పెట్టుబడి పెట్టాలి. దానివల్ల ఏఐ ప్రాజెక్టుల అమలు వేగం, నాణ్యత పెరుగుతుంది.ఐటీ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లుప్రపంచ ఆర్థిక అనిశ్చితి కారణంగా క్లయింట్ కంపెనీలు టెక్ ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. దీంతో ఐటీ సేవలకు డిమాండ్లో ఒడుదొడుకులు కనిపిస్తున్నాయి.ఏఐ, సైబర్సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి అధునాతన రంగాలలో నిపుణులైన ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నైపుణ్యాల కొరత ప్రాజెక్టుల వేగాన్ని తగ్గిస్తోంది.జెనరేటివ్ ఏఐ టూల్స్ కొన్ని సంప్రదాయ ఐటీ పనులను (ఉదా: ప్రాథమిక కోడింగ్, టెస్టింగ్) ఆటోమేట్ చేయగలవు. ఇది ఐటీ సర్వీసెస్ కంపెనీల ప్రస్తుత వ్యాపార నమూనాకు సవాలుగా మారుతోంది.డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వేగవంతం కావడంతో సైబర్ దాడుల ప్రమాదం పెరుగుతోంది. భద్రతకు సంబంధించిన వ్యయం అధికమవుతోంది.పోటీ పెరగడం, క్లయింట్లు ఖర్చులు తగ్గించుకోవాలని చూడడంతో ఐటీ సేవలకు ధరలను తగ్గించాల్సిన ఒత్తిడి కంపెనీలపై పెరుగుతోంది.సవాళ్లు అధిగమించాలంటే..పైన పేర్కొన్న సవాళ్లను అధిగమించి లాభాల వృద్ధిని కొనసాగించడానికి ఐటీ కంపెనీలు కొన్ని మార్గాలను అనుసరించాలి. అంతర్గత ప్రక్రియల్లో, క్లయింట్ ప్రాజెక్టుల్లో ఆటోమేషన్ ఉపయోగించడం ద్వారా నిర్వహణ ఖర్చులను తగ్గించాలి. తక్కువ నిర్వహణ ఖర్చులు ఉన్న ప్రాంతాల నుంచి సేవలు అందించే మోడల్ను బలోపేతం చేయాలి. పాత నైపుణ్యాలు గల ఉద్యోగులను ఏఐ, క్లౌడ్, డేటా సైన్స్ వంటి భవిష్యత్తు టెక్నాలజీలలోకి తిరిగి శిక్షణ ఇవ్వాలి. దీని ద్వారా నైపుణ్యాల కొరతను అధిగమించవచ్చు. ఉద్యోగులకు ఏఐ ఫస్ట్ ఆలోచనా విధానాన్ని అలవాటు చేయాలి.ఇదీ చదవండి: రూపాయి నేలచూపులు.. ప్రభుత్వానికి సవాల్! -
చాట్జీపీటీలో డిస్నీ పాత్రలు
వాల్ట్ డిస్నీ కంపెనీకి చెందిన 200కి పైగా ప్రసిద్ధ పాత్రలు ఇకపై కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో అత్యంత విలువైన స్టార్టప్ల్లో ఒకటైన ఓపెన్ఎఐలో దర్శనం ఇవ్వనున్నాయి. ఓపెన్ఏఐ తమ టెక్స్ట్-టు-వీడియో సాధనం ‘సోరా’లో ఈ పాత్రలను ఉపయోగించుకునేందుకు లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద డిస్నీ శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఓపెన్ఎఐలో 1 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.9000 కోట్లు) పెట్టుబడి పెట్టడానికి కూడా అంగీకరించింది.ఒప్పందంలోని అంశాలుమిక్కీ మౌస్, ఫ్రోజెన్, మాన్స్టర్స్ ఇంక్., టాయ్ స్టోరీ పాత్రలు, మార్వెల్, లూకాస్ ఫిల్మ్ ఫ్రాంచైజీలైన ‘బ్లాక్ పాంథర్’, స్టార్మ్ ట్రూపర్స్, యోడా.. వంటి 200కి పైగా డిస్నీ పాత్రలను ఉపయోగించుకునేందుకు ఓపెన్ఎఐకి మూడేళ్ల లైసెన్స్ లభించింది.వచ్చే ఏడాది ప్రారంభంలో వినియోగదారులు సోరాలో ప్రాంప్ట్లు సృష్టించడం ద్వారా డిస్నీ పాత్రలున్న చిన్న వీడియోలను సృష్టించడానికి చాట్జీపీటీ ఇమేజెస్ సాధనాన్ని ఉపయోగించవచ్చు.సోరా ద్వారా రూపొందించిన కొన్ని వీడియోలను డిస్నీ+ స్ట్రీమింగ్ సేవలో కూడా ప్రదర్శిస్తారు.డిస్నీ ఓపెన్ఎఐలో 1 బిలియన్ డాలర్లు ఈక్విటీ పెట్టుబడి పెట్టడంతో పాటు భవిష్యత్తులో మరింత ఈక్విటీని కొనుగోలు చేయనున్నట్లు చెప్పింది. దాంతో డిస్నీ ఉద్యోగులకు చాట్జీపీటీ యాక్సెస్ కూడా లభిస్తుంది. అయితే ఈ ఒప్పందంలో నటీనటుల పోలికలు లేదా స్వరాలు ఉపయోగించడం లేదని ఇరు కంపెనీలు స్పష్టం చేశాయి.డిస్నీ సీఈఓ బాబ్ ఐగర్ మాట్లాడుతూ..‘కృత్రిమ మేధ వేగవంతమైన పురోగతి నేపథ్యంలో ఓపెన్ఎఐతో ఈ సహకారం ఎంతో మేలు చేస్తుంది. దీని ద్వారా కంటెంట్, ఇమేజ్ సృష్టికర్తలను, వారి రచనలను గౌరవిస్తూ వాటిని పరిరక్షిస్తూనే జనరేటివ్ ఏఐ ద్వారా ఈ సర్వీసులను బాధ్యతాయుతంగా విస్తరిస్తాం’ అని తెలిపారు. ఓపెన్ఎఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ ఈ ఒప్పందంపై సంతోషం వ్యక్తం చేస్తూ ‘సమాజానికి ప్రయోజనం చేకూర్చే ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఏఐ కంపెనీలు, సృజనాత్మక సంస్థలు బాధ్యతాయుతంగా కలిసి పని చేస్తాయి’ అని చెప్పారు.ఇదీ చదవండి: భారత్పై మెక్సికో సుంకాల పెంపు.. ఏయే రంగాలపై ప్రభావం అంటే.. -
పెద్దవారికీ కావాలి జి.పి.ఎస్.
మతిమరుపు, అలై్జమర్స్, మనస్తాపం, ప్రమాదాలు... ఇంట్లో పెద్దవాళ్లు కనపడకుండా పోవడానికి ఎన్నో కారణాలు. వారిని పట్టుకోవడం ఎలా? రెండు రోజుల క్రితం ముంబైలో 79 ఏళ్ల వృద్ధురాలు కనపడకుండా పోతే మనవడు ఆమె మెడ గొలుసులో బిగించిన జి.పి.ఎస్.ను యాక్టివేట్ చేసి ఆమెఆ దాపున ఉన్న ఆస్పత్రిలో స్పృహ లేకుండా పడి ఉందని తెలుసుకున్నాడు. వయో వృద్ధులు తప్పి పోతే వారు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి మార్కెట్లో జి.పి.ఎస్. ట్రాకర్లు ఉన్నాయి. రోజులు బాగలేని ఈ కాలంలో వీటి అవసరం ఎక్కువగా ఉంది.ముంబయికి చెందిన 79 ఏళ్ల సైరాబీ ఇటీవల ఒకరోజు ఈవెనింగ్ వాక్ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లారు. అలా వెళ్లిన మనిషి తిరిగి రాలేదు. ఏమయ్యారో తెలీదు. చుట్టుపక్కలప్రాంతాలు వెతికినా కనిపించలేదు. సైరాబీని ఓ బైక్ గుద్దేయడంతో ఆమెను స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు. అయితే ఒంటరిగా బయటకు వచ్చిన ఆమె వివరాలు అక్కడున్న ఎవరికీ తెలియలేదు. అయితే ఆమె ఆచూకీ ఎక్కుడుందో ఇంటి వారిని పట్టిచ్చింది ఆమె మెడలో ధరించిన నెక్లెస్లోని జీపీఎస్.మనవడి ముందు చూపువయసులో పెద్దవారు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోతే ఆందోళనగానే ఉంటుంది. మార్గమధ్యంలో వారికేమైందని కలవరం మొదలవుతుంది. సైరాబీ ఇంట్లో అదే పరిస్థితి నెలకొంది. అయితే ఆమె మనవడు మహమ్మద్ వసీం ఆమె వేసుకున్న నెక్లెస్లో రహస్యంగా జీపీఎస్ ట్రాకర్ ఇన్ స్టాల్ చేశాడన్న విషయం ఎవరికీ తెలియదు. వృద్ధులు రకరకాల కారణాల వల్ల ఇల్లు విడిచి పెట్టి వెళుతుంటారు. లేదా దారి తప్పుతుంటారు. అందుకే మనవడు ముందు చూపుతో ట్రాకర్ అమర్చాడు. ఆ పని మేలు చేసింది. మనవడు వెంటనే ట్రాకర్ స్విచ్ ఆన్ చేయగా, వారింటికి 5 కి.మీల దూరంలో ఉన్న కేఈఎమ్ ఆసుపత్రిని చూపించింది. దీంతో వెంటనే కుటుంబసభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఆమె తలకు గాయమైందని, ఆరోగ్యం కుదురుగా ఉందని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఇలా నిత్యం అనేకమంది వృద్ధులు తప్పిపోయి ఆచూకీకి దూరమవుతున్నారు. అటువంటి వారికి జీపీఎస్ ట్రాకర్ మేలు చేస్తోంది.నెక్లెస్ జీపీఎస్ ట్రాకర్‘నెక్లెస్ జీపీఎస్ ట్రాకర్’ ఇటీవల కాలంలో అనేకమందికి చేరువైంది. నగలకుండే లాకెట్ల లోపల ఇమడ్చగలిగే ఈ చిన్న పరికరం మనం ఎక్కడున్నది, ఎక్కడికి వెళ్తున్నది స్మార్ట్ ఫోన్ ద్వారా ట్రాక్ చేస్తుంది. పైకి మామూలు నగలలాగే కనిపిస్తూ ఉండటం వల్ల అలంకరణకూ లోటూ ఉండదు. ఒంటరిగా బయటకు వెళ్లే మహిళలు, చిన్నారులు, వృద్ధులు, మతిమరుపు కలిగినవారు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలున్న వారికి ఇది చాలా ఉపకరించే పరికరం. వాళ్లు ఎక్కడైనా తప్పిపోయినా, జరగరానిది జరిగినా, అపహరణకు గురైనా వెంటనే ఆచూకీ తెలుసుకోవచ్చు. ఒంటరిగా దూరప్రయాణాలు చేసేవారు, అడవి, కొండలు, ఎడారులు వంటి దూర ప్రాంతాలకు వెళ్లేవారు తప్పిపోకుండా వీటిని వినియోగించొచ్చు. ఏదైనా నేరాలు జరిగినా, అనుకోని ఘటనలు జరిగినప్పుడు సాక్ష్యాలుగా ఇవి పోలీసుశాఖకు మేలు చేయనున్నాయి. ధరలు అందుబాటులోనే..జీపీఎస్ ట్రాకర్ నెక్లెస్ ధరలు అందుబాటులోనే ఉంటాయి. బేసిక్ ట్రాకింగ్ నెక్లెస్ కనీస ధర రూ.3 వేల నుంచి రూ.4 వేల దాకా ఉంటుంది. మధ్యస్థ స్థాయిలో రూ.6 వేల నుంచి రూ.10 వేల దాకా ఉంటుంది. ఎక్కువ ఆప్షన్ ్స ఉన్న హైఎండ్ ట్రాకర్ కావాలంటే రూ.10 వేల నుంచి రూ.15 వేల దాకా ఖర్చు చేయాల్సి ఉంటుంది. -
ఉద్యోగాలకు స్పేస్ టెక్ దన్ను
ముంబై: దేశీ ఏరోస్పేస్, డ్రోన్స్, స్పేస్ టెక్ పరిశ్రమ 2033 నాటికి అయిదు రెట్లు వృద్ధి చెందనుంది. 44 బిలియన్ డాలర్లకు చేరనుంది. అదే సమయంలో 2 లక్షలకు పైగా ఇంజనీర్లు, పరిశోధకులు, డేటా సైంటిస్టులకు ఉద్యోగావకాశాలు సృష్టించనుంది. వర్క్ఫోర్స్ సొల్యూషన్స్ సంస్థ అడెకో ఇండియా ఒక నివేదికలో ఈ అంచనాలను వెలువరించింది. 100కు పైగా క్లయింట్ల నుంచి సేకరించిన గణాంకాలకు మార్కెట్పై పరిశోధనల ఫలితాలను జోడించడం ద్వారా అడెకో దీన్ని రూపొందించింది. దీని ప్రకారం ప్రభుత్వ సంస్కరణలు, ప్రైవేట్ రంగం, అంతర్జాతీయ భాగస్వామ్యాల దన్నుతో పరిశోధనల ఆధారిత ధోరణి నుంచి ఏరోస్పేస్, డ్రోన్స్, స్పేస్ టెక్ పూర్తి స్థాయి పరిశ్రమగా ఎదిగింది. ఈ నేపథ్యంలో స్పేస్ పాలసీ అనలిస్టులు, రోబోటిక్స్ ఇంజనీర్లు, ఏవియోనిక్స్ స్పెషలిస్టులు, జీఎన్సీ (గైడెన్స్, నేవిగేషన్, కంట్రోల్) నిపుణుల్లాంటి కొత్త రకం ఉద్యోగాలు వస్తున్నాయని నివేదిక తెలిపింది. వీరంతా అంతరిక్ష రంగంలో దేశ లక్ష్యాల సాధనలో కీలకంగా నిలుస్తున్నారని వివరించింది. ‘ప్రభుత్వ దార్శనికత, క్రియాశీలకమైన స్టార్టప్ వ్యవస్థ దన్నుతో భారత్ అంతర్జాతీయ స్పేస్ హబ్గా ఎదగనుంది. దీనితో ఇంజనీరింగ్, రీసెర్చ్, డేటా, బిజినెస్ తదితర విభాగాల్లో భారీ స్థాయిలో ఉద్యోగాలు రానున్నాయి’ అని అడెకో ఇండియా డైరెక్టర్ దీపేష్ గుప్తా తెలిపారు. నివేదికలో మరిన్ని విశేషాలు.. → హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, పుణేలాంటి ప్రాంతాల్లో అత్యధికంగా అవకాశాలు రానున్నాయి. → ఏవియోనిక్స్, క్రయోజెనిక్స్, ఏటీడీసీ (యాటిట్యూడ్ డిటరి్మనేషన్, కంట్రోల్ సిస్టమ్స్), రిమోట్ సెన్సింగ్ నిపుణులు, స్పేస్ హ్యాబిటాట్ ఇంజనీర్లకు భారీ వేతనాలు లభించనున్నాయి. సాధారణ టెక్నికల్ ఉద్యోగులతో పోలిస్తే 20–30% అధికంగా ఉండనున్నాయి. → భారతీయ అంతరిక్ష పాలసీ 2023 లాంటి సంస్కరణలు, 250 పైచిలుకు స్పేస్ స్టార్టప్లు, ఇన్–స్పేస్ కింద రూ. 1,000 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్ మొదలైనవి ఈ పరిశ్రమ వృద్ధికి దన్నుగా నిలుస్తాయి. కొత్త ఆవిష్కరణలు, ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు తోడ్పడనున్నాయి. → అంతరిక్ష రంగంలో సిబ్బందిపరంగా వైవిధ్యం పెరగనుంది. ఇస్రో యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాం (యువికా), విజ్ఞాన్ జ్యోతి ప్రోగ్రాం, సమృద్ధ్ లాంటి స్కీములతో ఎంట్రప్రెన్యూర్íÙప్, సాంకేతిక, పరిశోధన విభాగాల్లోకి వచ్చే మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. → గగన్యాన్ మిషన్, యాక్సియోమ్–4 ఐఎస్ఎస్ ప్రోగ్రాంలో భారత్ భాగం కావడం, సొంత స్పేస్ స్టేషన్ నిర్మాణంపై కసరత్తు చేస్తుండటం మొదలైన వాటి వల్ల ఆయా రంగాల్లో ప్రతిభావంతులకు డిమాండ్ మరింతగా పెరగనుంది. → ప్రస్తుతం అంతర్జాతీయ స్పేస్ ఎకానమీలో భారత్ వాటా సుమారు 2 శాతంగా ఉంది. 2033 నాటికి 11 బిలియన్ డాలర్ల ఎగుమతులతో పాటు తన మార్కెట్ను 44 బిలియన్ డాలర్లకు పెంచుకోవడంపై భారత్ దృష్టి పెడుతోంది. తద్వారా గ్లోబల్ స్పేస్ ఎకానమీలో 7–8% వాటాను సాధించాలని నిర్దేశించుకుంది. -
సత్య నాదెళ్లకు అదో సరదా..
ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. భారతీయ-అమెరికన్ అయిన ఆయన మైక్రోసాఫ్ట్లో అంచెలంచెలుగా ఎదిగి ఆ సంస్థకు ఈసీవో అయ్యారు. అపారమైన తన శక్తి సామర్థ్యాలతో కంపెనీని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు.ప్రతి మనిషికీ వృత్తితోపాటు ఓ వ్యాపకమూ ఉంటుంది. ‘మడిసన్నాక కాసింత కళా పోషణ ఉండాల’ అంటాడు ఓ సినిమాలో విలన్ రావు గోపాలరావు. కానీ ఈ దిగ్గజ టెక్ సీఈవోది ‘క్రీడా పోషణ’. క్రీడాకారుడు కాకపోయినా క్రికెట్ ఆటను విశ్లేషించే మొబైల్ యాప్ ఒకదానిని సత్య నాదెళ్ల రూపొందించారు. అంతేకాదు.. కాస్త సమయం దొరికినప్పుడల్లా కోడ్ రాస్తుంటారాయన. అది ఆయనకో సరదా...ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల స్వయంగా వెల్లడించారు. బెంగుళూరులో జరిగిన మైక్రోసాఫ్ట్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. థాంక్స్ గివింగ్ సందర్భంగా తాను చిన్నప్పటి నుండి ఇష్టపడే క్రీడ క్రికెట్ ను విశ్లేషించడానికి ఇంటి వద్ద తాను స్వయంగా డీప్ రీసెర్చ్ ఏఐ యాప్ను తయారు చేసినట్లు చెప్పుకొచ్చారు.సత్య నాదెళ్ల ఈ వారం భారత్ వస్తున్నారు. ఇక్కడి వ్యాపార, రాజకీయ ప్రముఖులను కలుసుకోనున్నారు. మైక్రోసాఫ్ట్ ఇటీవలె భారత్లో రాబోయే నాలుగేళ్లలో ఏఐ, క్లౌడ్ రంగాల్లో 17.5 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. -
కీలక టెక్నాలజీల్లో భారత్ స్వావలంబన సాధించాలి
గాందీనగర్: దేశ పురోగతికి అవరోధాలుగా మారే భౌగోళిక, రాజకీయ సవాళ్లను అధిగమించే దిశగా కీలక టెక్నాలజీలను సమకూర్చుకోవడం, పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవడంలో భారత్ స్వావలంబన సాధించాల్సిన అవసరం ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ధీమా సడలిపోతుంటే భారత్ మాత్రం ఆకాంక్షలు, ఆత్మ విశ్వాసంతో ఉత్సాహంగా ముందుకు ఉరకలేస్తోందని.. అధిక ఆర్థిక వృద్ధి సాధిస్తోందని పండిట్ దీనదయాళ్ ఎనర్జీ యూనివర్సిటీ 13వ స్నాతకోత్సవం తెలిపారు. ‘దశాబ్దం క్రితం మిగతా దేశమంతా వైబ్రెంట్ గుజరాత్ గురించి మాట్లాడుకునేది. ఇప్పుడు మిగతా ప్రపంచమంతా వైబ్రెంట్ ఇండియా గురించి మాట్లాడుకుంటోంది. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత్ సుమారు 8 శాతం వృద్ధి సాధిస్తోంది. కృత్రిమ మేథ, నూతన ఇంధనాలు, స్పేస్, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్లాంటి క్రిటికల్ టెక్నాలజీలు, పరిశ్రమల విషయంలో స్వావలంబన సాధించాలి. ఈ రేసులో గెలి్చనవారే విశ్వవిజేతలు‘ అని అంబానీ పేర్కొన్నారు. టెక్నాలజీ శరవేగంగా మారిపోతున్న నేపథ్యంలో ఆసక్తి, ధైర్యాన్ని మార్గదర్శక సూత్రాలుగా పాటించాలని విద్యార్థులకు ఆయన సూచించారు. -
ఉన్నదొకటి.. చెబుతున్నది ఇంకొకటి: ఐఐఎఫ్ఎల్ రిపోర్ట్
భారతదేశంలో రిలయన్స్ జియో, ఎయిర్టెల్ వంటి టెలికాం కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త కస్టమర్లను ఆకర్షిస్తూ ముందుకు సాగుతున్నాయి. వీఐ (వోడాఫోన్ ఐడియా), బీఎస్ఎన్ఎల్ కంపెనీలు తమదైన రీతిలో యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. కాగా Vi యూజర్లలో ప్రతి ఐదు మందిలో ఒకరు కూడా యాక్టివ్గా లేరని ఐఐఎఫ్ఎల్ తన నివేదికలో వెల్లడించింది.ఐఐఎఫ్ఎల్ తన నివేదికలో.. పేర్కొన్న విషయాలు, కంపెనీ చెబుతున్న విషయాలు చూస్తుంటే చాలా వ్యత్యాసం ఉంది. ఎలా అంటే.. Vi చెబుతున్న యూజర్లు 197.2 మిలియన్స్. కానీ నిజంగా యాక్టివ్గా ఉన్న యూజర్లు 154.7 మిలియన్స్ మాత్రమే. దీన్నిబట్టి చూస్తే.. కంపెనీ చెబుతున్న రిపోర్ట్ వేరు, వాస్తవంగా నెట్వర్క్లో ఉన్న యూజర్లు వేరు, అని స్పష్టంగా అర్థమవుతోంది. ఇందులో కూడా 2జీ నెంబర్ యూజర్లను తీసేస్తే.. 4జీ ఉపయోగిస్తున్న యూజర్ల సంఖ్య మరింత తగ్గిపోతుంది.యావరేజ్ రెవెన్యూ ఫర్ యూజర్ (ఏఆర్పీయూ) విషయానికి వస్తే.. కాగితంపై, Q2 FY26లో Vi ఏఆర్పీయూ రూ.167. ఇది ఎయిర్టెల్ (రూ. 256), జియో (రూ. 211.4) కంటే తక్కువ. కానీ నిజంగా Vi రీఛార్జ్ ప్లాన్ 209 రూపాయలు. అంతే కాకుండా Vi యాక్టివ్ సబ్స్క్రైబర్లు కూడా నెలకు 746 నిముషాలు మాట్లాడినట్లు, ఇది ఎయిర్టెల్ (1071 నిముషాలు), జియో (1105 నిముషాలు)లతో పోలిస్తే చాలా తక్కువ.సబ్స్క్రైబర్ల సంఖ్యను కూడా వోడాఫోన్ ఐడియా 20.83 లక్షలు కోల్పోయిందని ట్రాయ్ వెల్లడించింది. ఈ సమయంలో రిలయన్స్ జియో 2.7 మిలియన్ల 4G/5G వినియోగదారులను పొందగా.. భారతీ ఎయిర్టెల్ 2 మిలియన్లను పొందగలిగింది. మొత్తం మీద Vi ఉన్నదొకటైతే.. చెబుతున్నది మరొకటని స్పష్టంగా అర్థమవుతోంది. -
డేటా సెంటర్లు.. సవాళ్లపై భారత్ నజర్ వేయాల్సిందే!
అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు భారతదేశంలో డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపడం దేశ డిజిటల్ విప్లవంలో ఒక కీలక ఘట్టం. ఇంటర్నెట్, క్లౌడ్ సేవలు, కృత్రిమ మేధస్సు (AI), ఆన్లైన్ చెల్లింపులు (UPI), ఈ-కామర్స్ వంటి ఆధునిక డిజిటల్ సేవలకు డేటా సెంటర్లు మూలస్తంభాలు. భారతదేశంలో ప్రస్తుతం డేటా సెంటర్ల సంఖ్య ప్రపంచంలోని వాటితో పోలిస్తే అతి తక్కువగా (కేవలం 3% వాటా) ఉన్నప్పటికీ 2030 నాటికి వీటి సామర్థ్యం పెరుగుతుందని అంచనా. అయితే, ఈ వేగవంతమైన వృద్ధి కొన్ని కీలకమైన పర్యావరణ, మౌలిక సదుపాయాల సవాళ్లను కూడా ముందుకు తెస్తోంది.డేటా సెంటర్ల ఏర్పాటుతో లాభాలుడేటా సెంటర్ల కోసం భారత్లోకి దాదాపు రూ.2.6 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తుంది. మల్టీనేషనల్ కంపెనీల నుంచి విదేశీ పెట్టుబడులు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల్లో డిమాండ్ పెరిగి అనుబంధ రంగాలకు లబ్ధి చేకూరుతుంది. ఐటీ, నెట్వర్క్ నిర్వహణ, భద్రత, నిర్వహణ వంటి రంగాల్లో ప్రత్యక్ష ఉద్యోగాలు లభిస్తాయి.సప్లయ్ చైన్, రవాణా, హోటల్ వంటి సేవల రంగాలలో పరోక్ష ఉద్యోగాలు వస్తాయి. డేటా సెంటర్ల అవసరాల కోసం ఫైబర్ కనెక్టివిటీ, విద్యుత్ సరఫరా వ్యవస్థలు మెరుగుపడతాయి. ఇది స్థానిక స్టార్టప్లు, చిన్న వ్యాపారాలకు మెరుగైన డిజిటల్ మౌలిక సదుపాయాలను అందించి, టెక్నాలజీ రంగంలో పురోగతికి దోహదపడుతుంది.డేటా స్థానికీకరణ ద్వారా భారతీయ డేటా భద్రత మెరుగుపడుతుంది.సవాళ్లు లేవా..?డేటా సెంటర్ల కోసం విద్యుత్, నీరు చాలా అవసరం. భారతదేశంలో ఇప్పటికే ఈ వనరుల లభ్యత, వినియోగంపై ఆందోళనలు ఉన్నాయి. డేటా సెంటర్లలో సర్వర్లు నిరంతరం పనిచేయడం వల్ల భారీగా వేడిని ఉత్పత్తి చేస్తాయి. దీన్ని చల్లబరచడానికి, సర్వర్లకు శక్తిని అందించడానికి అధిక విద్యుత్ అవసరం. భారతదేశం అధికంగా థర్మల్ విద్యుత్పై ఆధారపడుతున్నందున డేటా సెంటర్ల ఏర్పాటుతో కార్బన్ ఉద్గారాలు గణనీయంగా పెరిగే ప్రమాదం ఉంది.పెద్ద డేటా సెంటర్లు పట్టణ విద్యుత్ సరఫరా వ్యవస్థలపై ఒత్తిడి పెంచి విద్యుత్ కొరతకు దారి తీయవచ్చు. అయితే గూగుల్ వంటి కంపెనీలు తమ సెంటర్లకు పునరుత్పాదక శక్తి (Green Energy)వినియోగాన్ని లక్ష్యంగా పెట్టుకోవడం సానుకూల అంశం. అయితే, మొత్తం డిమాండ్ను థర్మల్ విద్యుత్ నుంచి పునరుత్పాదక ఇంధనానికి మార్చడం తక్షణ సవాలు. దీనికి సంబంధించి మౌలిక సదుపాయాలు మెరుగుపడేలా ప్రభుత్వాలు, కంపెనీలు చర్యలు తీసుకోవాలి.నీటి నిర్వహణసర్వర్ల వేడిని తగ్గించడానికి శీతలీకరణ (Cooling) ప్రక్రియకు లక్షలాది లీటర్ల నీరు అవసరం. గూగుల్ వంటి సంస్థలు వార్షికంగా బిలియన్ల గ్యాలన్ల నీటిని వినియోగిస్తున్నట్లు అంచనాలున్నాయి. ఇప్పటికే నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో డేటా సెంటర్ల ఏర్పాటు వల్ల స్థానిక ప్రజలకు, వ్యవసాయానికి నీటి లభ్యతపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. కంపెనీల నుంచి నీటి వినియోగంపై పారదర్శకత లేకపోవడం, నియంత్రణ సంస్థల నుంచి సరైన పర్యవేక్షణ లేకపోవడం ఈ సమస్యను మరింత పెంచుతుందని గుర్తుంచుకోవాలి.సింగపూర్, అమెరికాలో వ్యతిరేకతసింగపూర్, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా డేటా సెంటర్ల ఏర్పాటుపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నట్లు తెలుస్తుంది. ఈ దేశాల్లో డేటా సెంటర్ల విస్తరణను ప్రజలు, పర్యావరణవేత్తలు పరిమితం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణాలు భారతదేశంలోని సమస్యల తరహాలోనే ఉన్నాయి. అధిక విద్యుత్ వినియోగం కోసం శిలాజ ఇంధనాలపై ఆధారపడినప్పుడు కార్బన్ ఉద్గారాలను పెంచుతుండడం. స్థానిక నీటి వనరులపై ఒత్తిడి పెంచి, ఇతర అవసరాలకు కొరత ఏర్పరచడం.అంతా ఆటోమేషన్..డేటా సెంటర్ల నిర్వహణ ఆటోమేటెడ్గా ఉంటుంది. దాంతో ఉద్యోగాలు ఎక్కువగా రాకపోవడం, ఆర్థిక ప్రయోజనం స్థానికులకు తక్కువగా ఉండటంతో ఇప్పటికే ఇవి ఉన్న ప్రాంతాల్లో వ్యతిరేకత నెలకొంటుంది. ఈ పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలించి అందుకు తగిన విధంగా పాలసీను రూపొందించాలి. సాంకేతిక పురోగతికి డేటా సెంటర్లు అవసరమే అయినా, వనరుల స్థిరత్వం, పర్యావరణ భద్రత విషయంలో దీర్ఘకాలిక ప్రణాళిక చాలా అవసరం.ఇదీ చదవండి: 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం -
టెక్ దిగ్గజాల పెట్టుబడులజోరు..
సాంకేతిక ఆవిష్కరణలకు భారత్ మెగా హబ్గా మారే దిశగా చురుగ్గా అడుగులు పడుతున్నాయి. అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ నుంచి ఇంటెల్ వరకు పలు అగ్రగామి సంస్థలు వరుస కడుతున్నాయి. దేశీయంగా డేటా సెంటర్లు, ఏఐ ఆవిష్కరణలకు ప్రోత్సాహం లభించడంతో పాటు లక్షల సంఖ్యలో ఉద్యోగాల కల్పనకు కూడా అవకాశాలు పెరుగుతున్నాయి. న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన సందర్భంగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. నాలుగేళ్ల వ్యవధిలో క్లౌడ్, కృత్రిమ మేధ (ఏఐ) మౌలిక సదుపాయాల కల్పనపై ఈ మొత్తాన్ని వెచ్చించనున్నారు. ఆసియాలో మైక్రోసాఫ్ట్ ఇంత భారీగా ఇన్వెస్ట్ చేయడం ఇదే ప్రథమం. భారత్ సాంకేతిక సామర్థ్యాలపై కంపెనీకి గల నమ్మకానికి ఇది నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక చిప్ దిగ్గజం ఇంటెల్ కూడా భారత్ సెమీకండక్టర్ల లక్ష్యాల సాధనకు మద్దతుగా నిల్చేందుకు ముందుకొచ్చింది. ఇందుకోసం టాటా ఎలక్ట్రానిక్స్తో జట్టు కట్టింది. కంపెనీ సీఈవో లిప్–బు టాన్ ప్రధాని మోదీతో కూడా సమావేశమయ్యారు. అటు మరో అగ్రగామి సంస్థ అమెజాన్ సైతం భారత్పై మరింతగా దృష్టి పెడుతోంది. ఏఐ, ఎగుమతులు, ఉద్యోగాల కల్పనపై 35 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఇక్కడ అదనంగా పది లక్షలకుపైగా ఉద్యోగావకాశాలను కల్పించాలనే ప్రణాళికల్లో ఉంది. భారత్ నుంచి 80 బిలియన్ డాలర్ల ఈ–కామర్స్ ఎగుమతులను లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇక సెర్చ్ దిగ్గజం గూగుల్ .. వైజాగ్లో డేటా సెంటర్పై 15 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తోంది. ఓపెన్ఏఐ కూడా భారత్లో డేటా హబ్ ఏర్పాటు చేసే సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. రియల్టీకి కూడా ఊతం.. దేశవ్యాప్తంగా డేటా సెంటర్లను నిర్మించడంపై పెద్ద సంస్థలు ఆసక్తిగా ఉన్న నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగానికి కూడా ఊతం లభించనుంది. డేటా సెంటర్ల రాకతో నిర్మాణ, రిటైల్, నిర్వహణ విభాగాల్లో పెద్ద సంఖ్యలో పరోక్ష ఉద్యోగాలకు ఊతం లభించనుంది. వైజాగ్లో గూగుల్ ఏఐ, డేటా సెంటర్ హబ్తో 1,00,000 పైగా ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని అంచనా. కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ అధ్యయనం ప్రకారం డేటా సెంటర్లతో వచ్చే ఒక్క ప్రత్యక్ష ఉద్యోగంతో ఆరు రెట్లు పరోక్ష ఉద్యోగాల కల్పన జరిగే అవకాశం ఉంది. ఏఐ డేటా సెంటర్ బూమ్తో ఇంజినీర్లు, ఐటీ నిపుణులు, నిర్మాణ రంగ వర్కర్లు, రిటైల్ తదితర పరి శ్రమలలో మరింత ఉద్యోగ కల్పన జరగనుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
దేశంలోనే తొలి ఇంక్యుబేటర్ లింక్డ్ వీసీ ఫండ్ ప్రారంభం
దేశ ఆవిష్కరణల విభాగంలో ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఐఐటీ బాంబేలోని సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఆంత్రప్రెన్యూర్షిప్(SINE) దేశంలోనే మొట్టమొదటి ఇంక్యుబేటర్ లింక్డ్ డీప్ టెక్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ను ప్రారంభించింది. ‘వై-పాయింట్ వెంచర్ క్యాపిటల్ ఫండ్’గా పిలువబడే ఈ ఫండ్ను మొత్తం రూ.250 కోట్ల పరిమాణంతో ప్రారంభ దశలో ఉన్న డీప్ టెక్ స్టార్టప్లకు క్యాపిటల్ను అందించడానికి ప్రత్యేకంగా సిద్ధం చేశారు.దీని ద్వారా ఐఐటీ బాంబే దేశంలో తన సొంత వెంచర్ క్యాపిటల్ ఫండ్ను నిర్వహించే మొదటి అకడమిక్-అనుబంధ టెక్నాలజీ ఇంక్యుబేటర్గా అవతరించింది. హై-పొటెన్షియల్ స్టార్టప్లకు ఇంక్యుబేషన్, మెంటార్షిప్ సేవలు అందిస్తున్న ఎస్ఐఎన్ఈకు ఈ ఫండ్ ఎంతో తోడ్పడుతుందని ఐఐటీ బాంబే తెలిపింది. అధికారిక సమాచారం ప్రకారం ఈ నిధి దాదాపు 25 నుంచి 30 స్టార్టప్లకు ఆర్థిక మద్దతు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా ఒక్కో స్టార్టప్కు గరిష్టంగా రూ.15 కోట్ల వరకు పెట్టుబడి సాయం అందుతుంది.విస్తృత రంగాలకు మద్దతురొబోటిక్స్, మెటీరియల్ సైన్సెస్, అడ్వాన్స్డ్ ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), స్పేస్ టెక్నాలజీస్, బయోటెక్నాలజీ వంటి కీలక డీప్ టెక్ రంగాల్లో పనిచేసే స్టార్టప్లకు వై-పాయింట్ ఫండ్ మద్దతు అందిస్తుంది. ముఖ్యంగా ఐఐటీ బాంబే రిసెర్చ్ ఎన్విరాన్మెంట్, టెక్ ల్యాబ్లు, వ్యవస్థాపక నెట్వర్క్ల నుంచి ఉద్భవించే కంపెనీలకు ఇది చేదోడుగా ఉంటుంది. అంతేకాకుండా, ఇతర ప్రీమియర్ అకడమిక్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ల నుంచి వచ్చే డీప్ టెక్ స్టార్టప్లకు కూడా ప్రోత్సాహం అందిస్తుంది.ఇదీ చదవండి: అసంఘటిత కార్మికులకు అండగా ఏఐ -
హైదరాబాద్లో గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్ ప్రారంభం
హైదరాబాద్: గూగుల్, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా హైదరాబాద్లోని టి-హబ్లో ‘గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్’ ను ప్రారంభించాయి. తెలంగాణలో వేగంగా పెరుగుతున్న స్టార్టప్, ఇన్నోవేషన్ వ్యవస్థకు మరింత బలం చేకూర్చే ఈ కేంద్రం.. భారతదేశంలోనే ఈ తరహాలో తొలి హబ్గా నిలిచింది. ప్రాంతీయ ఆవిష్కర్తలకు ప్రపంచ స్థాయి వనరులు, నైపుణ్యం, నెట్వర్క్ అందించాలనే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.ఏం చేస్తుందీ కేంద్రం?తెలంగాణలోని ఏఐ-ఫస్ట్ స్టార్టప్లను ఎంపిక చేసి, వారికి ఏడాది పొడవునా ఉచిత కో-వర్కింగ్ సౌకర్యాలు, గూగుల్ నిపుణుల మెంటర్షిప్, వెంచర్ ఇన్వెస్టర్లతో కనెక్షన్ వంటి అవకాశాలను హబ్ అందిస్తుంది. సాంకేతిక ప్రతిభను పెంపొందించడం, గ్లోబల్ మార్కెట్లకు యాక్సెస్ కల్పించడం, బాధ్యతాయుతమైన ఏఐ ఆధారిత వ్యాపారాల్ని నిర్మించడంలో స్టార్టప్లకు దోహదపడడం ఈ కేంద్రం ప్రధాన లక్ష్యం.గూగుల్ ఫర్ స్టార్టప్స్ గ్లోబల్ నెట్వర్క్లో భాగంగా ఈ హబ్, ఆలోచనల దశ నుండి స్కేలింగ్ దశ వరకు స్టార్టప్ల ప్రయాణానికి తోడ్పాటు అందిస్తుంది. వర్ధమాన వ్యవస్థాపకులకు ప్రత్యేక మౌలిక సదుపాయాలు, ఏఐ నైపుణ్యం, మెంటర్షిప్, ప్రోడక్ట్, యూఎక్స్ గైడెన్స్తో పాటు కమ్యూనిటీ ఈవెంట్స్, మార్కెట్ యాక్సెస్ ప్రోగ్రామ్లు కూడా అందుబాటులో ఉంటాయి. మహిళా ఎంట్రాప్రెన్యూర్లు, టైర్-2 ఆవిష్కర్తలు, విశ్వవిద్యాలయ ప్రతిభకు ప్రత్యేక ప్రోత్సాహం ఇవ్వడం కూడా ఈ హబ్ ప్రత్యేకత.తెలంగాణకు పెద్ద అడుగుగూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గౌరవ అతిథిగా ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “తెలంగాణను ప్రపంచ పోటీతత్వ ఆవిష్కరణ కేంద్రంగా మార్చడానికి ఇది మౌలిక సదుపాయాలకన్నా పెద్ద అడుగు. హైదరాబాద్లో రూపొందుతున్న ఆలోచనలకు ప్రపంచ వ్యాప్తి కల్పించే మార్గదర్శకత్వం, సాంకేతికత, మార్కెట్ యాక్సెస్ను గూగుల్ హబ్ అందిస్తుంది” అన్నారు.గూగుల్ ఇండియా కంట్రీ మేనేజర్ ప్రీతి లోబానా మాట్లాడుతూ.. “గూగుల్ క్లౌడ్ ఏఐ సామర్థ్యాల నుండి ఆండ్రాయిడ్, ప్లే, ప్రకటనలు, డెవలపర్ ప్రోగ్రామ్ల వరకు గూగుల్ పూర్తి మద్దతును తెలంగాణ స్టార్టప్ ఎకోసిస్టమ్కు అందిస్తున్నాము. ఈ హబ్ భారత్తో సహా ప్రపంచమంతటికీ బాధ్యతాయుత ఏఐ ఆధారిత డీప్-టెక్ పరిష్కారాలను రూపొందించడంలో స్టార్టప్లకు సహాయపడుతుంది” అన్నారు. -
భారత్లో భారీ పెట్టుబడి!: సత్య నాదెళ్ల కీలక ప్రకటన
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారతదేశంలో భారీ పెట్టుబడి పెట్టనుంది. కృత్రిమ మేధస్సు సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి 17.5 బిలియన్ డాలర్లు (రూ. 1.5 లక్షల కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ తన ఎక్స్ వేదికగా ప్రకటించారు. మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన సత్య నాదెళ్ల.. ఈ విషయాన్ని వెల్లడించారు.భారతదేశ ఏఐ అవకాశాలపై స్ఫూర్తిదాయకమైన సంభాషణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. దేశ ఆశయాలకు మద్దతుగా, మైక్రోసాఫ్ట్ అతిపెద్ద పెట్టుబడి. ఏఐ ఆధారిత భవిష్యత్తు కోసం.. భారతదేశానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యాలు, సార్వభౌమ సామర్థ్యాలను నిర్మించడంలో సహాయపడటానికి నిబద్దతతో ఉందని సత్య నాదెళ్ల తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.''ఏఐ విషయంలో.. ప్రపంచం ఇప్పుడు భారత్ వైపు చూస్తోంది. సత్య నాదెళ్లతో చర్చలు జరిగాయి. ఆసియాలో ఇప్పటివరకు అతిపెద్ద పెట్టుబడి పెట్టే ప్రదేశం ఇండియా కావడం చాలా ఆనందంగా ఉంది'' అని ప్రధాని నరేంద్ర మోదీ కూడా ట్వీట్ చేశారు.When it comes to AI, the world is optimistic about India! Had a very productive discussion with Mr. Satya Nadella. Happy to see India being the place where Microsoft will make its largest-ever investment in Asia. The youth of India will harness this opportunity to innovate… https://t.co/fMFcGQ8ctK— Narendra Modi (@narendramodi) December 9, 2025 -
అంతరిక్షంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్లు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బూమ్తో పెరిగిపోతున్న డేటా సెంటర్ల అవసరాలను తీర్చడానికి సరికొత్త ప్రణాళికతో అల్ఫాబెట్ (గూగుల్) ముందుకు వచ్చింది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇటీవల ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంతరిక్షంలో సోలార్ ఎనర్జీతో నడిచే ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. గూగుల్ దీనికి ‘ప్రాజెక్ట్ సన్క్యాచర్’(Project Suncatcher)గా పేరు పెట్టింది.ఈ ప్రాజెక్టు గురించి పిచాయ్ మాట్లాడుతూ ‘గూగుల్లో మూన్ షాట్లు తీసుకోవడం ఎప్పుడూ గర్వకారణం. ఏదో ఒకరోజు అంతరిక్షంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తాం. తద్వారా సూర్యుడి నుంచి ఎనర్జీని మెరుగ్గా ఉపయోగించుకోవచ్చు అనేదే మా ప్రస్తుత మూన్ షాట్’ అని తెలిపారు. సూర్యుడి నుంచి లభించే అపార శక్తిని (భూమిపై కంటే అంతరిక్షంలో అధిక ఎనర్జీ ఉంటుంది) ఉపయోగించి స్పేస్లో ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేయవచ్చని చెప్పారు. దీనివల్ల భూమిపై డేటా సెంటర్ల ఏర్పాటులోని సమస్యలను పరిష్కరించాలని గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది.2027లో తొలి పరీక్షలుఈ అంతరిక్ష డేటా సెంటర్ల ప్రయాణంలో గూగుల్ ప్లానెట్ ల్యాబ్స్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ‘మేము 2027లో ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన మొదటి అడుగు వేస్తాం. చిన్న యంత్రాల ర్యాక్లను శాటిలైట్ల్లో పంపి పరీక్షిస్తాం. ఆ తర్వాత స్కేలింగ్ ప్రారంభిస్తాం’ అని పిచాయ్ ప్రకటించారు. భవిష్యత్తులో ఈ అంతరిక్ష డేటా సెంటర్లు సాధారణ మార్గంగా మారతాయని ధీమా వ్యక్తం చేశారు.ఈ ఇంటర్వ్యూ వీడియో క్లిప్ ఎక్స్ ప్లాట్ఫాంమ్లో వైరల్ అయింది. దాంతో టెస్లా, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ దృష్టిని ఇది ఆకర్షించింది. ఈ ఇంటర్వ్యూపై మస్క్ కేవలం ‘ఆసక్తికరమైనది (Interesting)’ అనే ఒక్క పదంతో స్పందించారు.Interesting https://t.co/yuTy9Yr3xw— Elon Musk (@elonmusk) December 8, 2025ఇదీ చదవండి: విస్తరణపై ఉన్న ఆసక్తి సమస్యల పరిష్కారంపై ఏది? -
చాట్జీపీటీలో ప్రకటనలు..?
ఓపెన్ఏఐ చాట్బాట్ చాట్జీపీటీలో ప్రకటనలు రాబోతున్నాయని ఇటీవల సమాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దాంతో ఓపెన్ఏఐ అధికారికంగా స్పందించింది. ఈ నేపథ్యంలో వినియోగదారుల్లో ఏర్పడిన గందరగోళాన్ని తొలగించడానికి చాట్జీపీటీ యాప్ వైస్ ప్రెసిడెంట్, హెడ్ నిక్ టర్లీ రంగంలోకి దిగి స్పష్టతనిచ్చారు.ఇటీవలి వారాల్లో చాట్జీపీటీ సంభాషణల్లో యాడ్ ప్యానెళ్లు కనిపిస్తున్నాయని కొందరు వినియోగదారులు పేర్కొంటూ, స్క్రీన్షాట్లను సోషల్ మీడియాలో పంచుకున్నారు. వీటిని ఖండిస్తూ నిక్ టర్లీ ఎక్స్లో లో ఒక పోస్ట్ చేశారు. ‘చాట్జీపీటీలో ప్రకటనల పుకార్ల గురించి చాలా వార్తాలొస్తున్నాయి. వీటిని నమ్మొద్దు. ఎలాంటి ప్రకటన టెస్ట్లు కంపెనీ నిర్వహించలేదు. మీరు చూసిన స్క్రీన్ షాట్లు నిజమైనవి కావు’ అని చెప్పారు.ఇదీ చదవండి: ఎస్బీఐ ఉద్యోగులకు జాక్పాట్🚨 OpenAI has denied the rumors of testing advertisements inside its popular AI chatbot, ChatGPT. pic.twitter.com/vbs3vH8krz— Indian Tech & Infra (@IndianTechGuide) December 7, 2025 -
భారత్లో స్టార్లింక్ ధరలు ఖరారు
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని అంతరిక్ష సాంకేతిక సంస్థ స్పేస్ఎక్స్ భారతదేశంలో ప్రారంభించనున్న శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసుల ధరలను అధికారికంగా ప్రకటించింది. సాంప్రదాయ బ్రాడ్బ్యాండ్ మౌలిక సదుపాయాలు పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో కనెక్టివిటీని పెంచడానికి ఈ సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. శాటిలైట్ ద్వారా నేరుగా హై-స్పీడ్ ఇంటర్నెట్ను అందించే ఈ ప్రీమియం సేవను భారతదేశ మార్కెట్లో త్వరలో మొదలు పెట్టనున్నారు.ధరల వివరాలునెలవారీ సబ్స్క్రిప్షన్ ఫీజు: రూ.8,600. ఇది ప్రతి నెల సేవలను అందింస్తున్నందుకు వినియోగదారులు చెల్లించే రుసుం.వన్-టైమ్ హార్డ్వేర్ కిట్ ఖర్చు: రూ.34,000. ఇది తొలిసారిగా చెల్లించాల్సిన పరికరాల ధర.హార్డ్వేర్ కిట్లో ఏముంటాయి?రూ.34,000 వన్-టైమ్ ఖర్చుతో వచ్చే ఈ కిట్లో శాటిలైట్ డిష్, వై-ఫై రౌటర్, పవర్ సప్లై, కేబుల్స్, మౌంటింగ్ ట్రైపాడ్ ఉంటాయి. దీనిని ఇన్స్టాల్ చేసిన తర్వాత వినియోగదారులు స్టార్లింక్ లో-ఎర్త్ ఆర్బిట్ ఉపగ్రహాల సముదాయానికి కనెక్ట్ అవుతారు. దీనివల్ల మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం పొందవచ్చు.దీని లక్ష్యం..భారతదేశంలో గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో మెరుగైన కనెక్టివిటీ అందించేందుకు ఇది ఎంతో తోడ్పడుతుంది. ఫైబర్ లేదా మొబైల్ నెట్వర్క్లు బలహీనంగా ఉన్న చోట ఇంటర్నెట్ యాక్సెస్ అందించడం ద్వారా డిజిటల్ సర్వీసులు మెరుగుపరవచ్చు. మారుమూల ప్రాంతాల్లోని చిన్న వ్యాపారాలు డిజిటల్ సాధనాలను యాక్సెస్ చేయడానికి వీలు కల్పించవచ్చు. వెనుకబడిన కమ్యూనిటీలకు ఆన్లైన్ విద్యను తీసుకురావడం ద్వారా విద్యా అవకాశాలను మెరుగవుతాయి.మార్కెట్ సవాళ్లుసాధారణంగా భారతదేశంలో సాంప్రదాయ బ్రాడ్బ్యాండ్ సేవలు నెలకు రూ.500 నుంచి రూ.1,500 మధ్య ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్టార్లింక్ నెలకు రూ.8,600 ధర వసూలు చేయడంతో ఎంతమేరకు సబ్స్క్రైబర్లు వస్తారనేది చూడాల్సి ఉంది.ఇదీ చదవండి: బంగారం ధరలు ఇంకెంత పెరుగుతాయో తెలుసా? -
'టెంపుల్' వస్తోంది: దీపిందర్ గోయల్ ట్వీట్
జొమాటో వ్యవస్థాపకుడు & సీఈఓ దీపిందర్ గోయల్.. తన ఎక్స్ ఖాతాలో 'టెంపుల్' త్వరలో వస్తుందని ట్వీట్ చేశారు. ఏమిటీ టెంపుల్?, దీని ఉపయోగాలేమిటి అనే విషయాలను ఈ కథనంలో వివరంగా చూసేద్దాం.ఏమిటీ టెంపుల్?టెంపుల్ అనేది "మెదడులో రక్త ప్రవాహాన్ని ఖచ్చితంగా, నిజ సమయంలో & నిరంతరం లెక్కించడానికి ఉపయోగపడే పరికరం''. ఈ విషయాన్ని దీపిందర్ గోయల్ గతంలోనే వెల్లడించారు. ఈ పరికరానికి సంబంధించిన ఫోటోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. గ్రావిటీ ఏజింగ్ పరికల్పనను పరిశోధించేటప్పుడు దీనిని అభివృద్ధి చేశారు.నవంబర్ 15న చేసిన పోస్ట్లలో, గోయల్ దీనిని (టెంపుల్) శాస్త్రీయమైన అసాధారణమైన పరికల్పనను వివరించారు . "నేను దీన్ని ఎటర్నల్ సీఈఓగా పంచుకోవడం లేదు, ఒక వింత థ్రెడ్ను అనుసరించేంత ఆసక్తిగల తోటి మానవుడిగా షేర్ చేస్తున్నానని అన్నారు. గురుత్వాకర్షణ జీవితకాలాన్ని తగ్గిస్తుందని గోయల్ ఈ సిద్ధాంతాన్ని పరిచయం చేశారు.Coming soon. Follow @temple for more updates. pic.twitter.com/E7S8NeUDP4— Deepinder Goyal (@deepigoyal) December 7, 2025 -
సీనియర్ ఉద్యోగుల మూకుమ్మడి రాజీనామా
సిలికాన్ వ్యాలీలో దీర్ఘకాలిక స్థిరమైన కంపెనీగా ప్రసిద్ధి చెందిన యాపిల్ ఇంక్.లో సీనియర్ ఉద్యోగులు రాజీనామాలతో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కంపెనీలోని సీనియర్ ఎగ్జిక్యూటివ్లు, కీలక ఇంజినీర్ల ఆకస్మిక, సామూహిక నిష్క్రమణలు కంపెనీలో తీవ్ర అలజడి సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యుగంలో యాపిల్ వృద్ధిపై ఇది ప్రశ్నలు లేవనెత్తుతోంది.గత వారంలోనే యాపిల్ తన కృత్రిమ మేధ (AI) అధిపతి జాన్ జియానాండ్రియా, ఇంటర్ఫేస్ డిజైన్ చీఫ్ అలాన్ డై తమ పదవి నుంచి నిష్క్రమించారు. వీరితో పాటు జనరల్ కౌన్సిల్ కేట్ ఆడమ్స్, సామాజిక కార్యక్రమాల వైస్ ప్రెసిడెంట్ లిసా జాక్సన్ కూడా 2026లో పదవీ విరమణ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నలుగురు అధికారులు నేరుగా సీఈఓ టిమ్కుక్కు రిపోర్ట్ చేసేవారు.టిమ్కుక్ ప్రయత్నాలు..అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం త్వరలో మరి కొంతమంది కీలక పదవుల్లో ఉన్నవారు తమ పదవులకు రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. యాపిల్లో అత్యంత గౌరవనీయమైన, ఇన్-హౌస్ చిప్స్ ప్రాజెక్ట్ హార్డ్వేర్ టెక్నాలజీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జానీ స్రూజీ సమీప భవిష్యత్తులో పదవి నుంచి నిష్క్రమించాలని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు ఇటీవల కుక్కు తెలిపారు. కుక్, స్రూజీని నిలుపుకోవడానికి వేతన ప్యాకేజీ ఆఫర్ చేస్తూ ముఖ్యమైన బాధ్యతలతో సహా దూకుడుగా ప్రయత్నిస్తున్నారు.యాపిల్కు సమస్యఎగ్జిక్యూటివ్ల నిష్క్రమణ ఒకవైపు ఆందోళన కలిగిస్తుండగా ఏఐ ప్రతిభ టెక్ ప్రత్యర్థుల వైపు మళ్లుతుండడం యాపిల్కు మరో పెద్ద సమస్యగా మారింది. మెటా ప్లాట్ఫామ్స్ ఇంక్., ఓపెన్ఏఐ, వివిధ స్టార్టప్లు యాపిల్ ఇంజినీర్లకు భారీ ప్యాకేజీలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇది సంస్థ ఏఐ ప్రయత్నాలకు ఆటంకం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో యాపిల్ జనరేటివ్ ఏఐలో ముందుండేందుకు కష్టపడుతోంది.ఇదీ చదవండి: ప్రముఖ బ్యాంక్లో 10,000 ఉద్యోగాల కోత -
తక్కువ ధరలో వచ్చేసిన స్మార్ట్ ఫోన్, ట్యాబ్..
రెడ్మీ తాజాగా ‘రెడ్మీ 15సీ’ పేరుతో మరో 5జీ స్మార్ట్ఫోన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. 6.9 అంగుళాల హెచ్డీ అడాప్టివ్సింక్ డిస్ప్లే, డస్ట్ .. వాటర్ రెసిస్టెన్స్, 50 ఎంపీ ఏఐ డ్యూయల్ కెమెరా సెటప్, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, (33డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్) దీని ప్రత్యేకతలు.మిడ్నైట్ బ్లాక్, మూన్లైట్ బ్లూ, డస్క్ పర్పుల్ రంగుల్లో ఈ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. దీనికి రెండేళ్ల ఓఎస్ అప్గ్రేడ్లు, నాలుగేళ్ల సెక్యూరిటీ ప్యాచ్లను ఇస్తారు. ధరల విషయానికొస్తే.. 4 జీబీ ర్యామ్ + 128 జీబీ మెమరీ వేరియంట్ రేటు రూ.12,499గా ఉంది. అలాగే 6 జీబీ ర్యామ్ + 128 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ. 13,999గా, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ. 15,499గా ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ11 వచ్చేసింది దక్షిణ కొరియాకు చెందిన స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ భారత్లో తన కొత్త ‘‘గెలాక్సీ ట్యాబ్ ఏ11’’ టాబ్లెట్ను విడుదల చేసింది. ఇందులో 8.7 అంగుళాల స్క్రీన్, 5100ఎంఏహెచ్ బ్యాటరీ, 6 ఎన్ఎం ఆధారిత ఆక్టా–కోర్ ప్రాసెసర్, 5ఎంపీ కెమెరా, 8జీబీ వరకు ర్యామ్ తదితర ఫీచర్లు ఉన్నాయి.పెద్ద ఫైల్స్కు తగినంత స్థలాన్ని చేకూర్చుకునేందుకు 128జీబీ వరకు స్టోరేజ్ ఉంటుంది. మైక్రో ఎస్డీ కార్డ్తో 2టీబీ వరకు విస్తరించకోవచ్చు. క్లాసిక్ గ్రే, సిల్వర్ రంగులలో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.12,999 (4జీబీ ర్యామ్ + 64జీబీ)కాగా, గరిష్ట ధర రూ.20,999 (8జీబీ ర్యామ్ + 128 బీజీ)గా ఉంది. ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లతో పాటు శాంసంగ్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లలో అందుబాటులో ఉన్నాయి. -
'ఎక్స్'కు భారీ జరిమానా: ఈయూపై విరుచుకుపడ్డ మస్క్
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అధీనంలో ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ఎక్స్'కు భారీ షాక్ తగిలింది. డిజిటల్ సర్వీసెస్ చట్టం కింద పారదర్శకత & డేటా యాక్సెస్ వంటివి ఉల్లంఘించినందుకు యూరోపియన్ యూనియన్ (EU) ఎక్స్కు వ్యతిరేకంగా 120 మిలియన్ యూరోలు జరిమానా విధించింది.యూరోపియన్ యూనియన్ జరిమానా విధించడంపై ఎలాన్ మస్క్ విరుచుకుపడ్డారు. ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే, ''ప్రభుత్వాలు తమ ప్రజలకు ప్రాతినిధ్యం వహించగలిగేలా ఈయూని రద్దు చేసి, సార్వభౌమత్వాన్ని వ్యక్తిగత దేశాలకు తిరిగి ఇవ్వాలని'' మస్క్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.The EU should be abolished and sovereignty returned to individual countries, so that governments can better represent their people— Elon Musk (@elonmusk) December 6, 2025ఏమిటీ డిజిటల్ సర్వీసెస్ చట్టండిజిటల్ సర్వీసెస్ చట్టం కింద యూరోపియన్ యూనియన్ జరిమానా విధించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇది (డిజిటల్ సర్వీసెస్ చట్టం) ఆన్లైన్ ప్లాట్ఫారమ్లను నియంత్రించడానికి, చట్టవిరుద్ధమైన కంటెంట్ను అరికట్టడానికి మాత్రమే కాకుండా 27 సభ్య దేశాలలో పారదర్శకతను మెరుగుపరచడానికి రూపొందించబడిన ఒక విస్తృత చట్టం. ఎక్స్ విధివిధానాలపై రెండేళ్ల దర్యాప్తు తరువాత యూరోపియన్ ఈ జరిమానా విధించింది.యూరోపియన్ యూనియన్ చర్యను మస్క్ వ్యతిరేకించిన తరువాత.. అమెరికా రాజకీయ ప్రముఖులు కూడా ఖండించారు. దీనిని అమెరికన్ టెక్నాలజీ కంపెనీలపై దాడిగా.. అమెరికా ఆధారిత ప్లాట్ఫామ్ల పట్ల పెరుగుతున్న శత్రుత్వానికి సంకేతంగా అభివర్ణించారు.ఈ ఘర్షణ మస్క్ & యూరోపియన్ సంస్థల మధ్య పెరుగుతున్న అంతరాన్ని హైలైట్ చేస్తుంది. ఎక్స్ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఆయన నియంత్రణ చట్రాలను పదే పదే విమర్శించారు. అయితే ఈయూ సంస్థలు వినియోగదారులను రక్షించడానికి & ప్రజాస్వామ్య ప్రక్రియలను రక్షించడానికి పర్యవేక్షణ అవసరమని వాదిస్తున్నాయి. -
మేధే మనిషి భవిష్యత్తు!
ఏఐ, రోబోటిక్స్ కారణంగా ఎవరికీ పని చేసే అవసరం ఉండని సౌలభ్యం 20 ఏళ్లలో మానవాళికి కలగవచ్చని అంటున్నారు ఎలాన్ మస్క్. ఆయన నిఖిల్ కామత్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భవిష్యత్ పరిణామాలను అంచనా వేశారు. మస్క్ మాటల్లోని ముఖ్యాంశాలు:భారతీయులు ‘ద బెస్ట్’‘‘ప్రతిభావంతులైన భారతీయుల నుండి అమెరికా అపారమైన ప్రయోజనం పొందిందని నేను భావిస్తు న్నాను. నా సొంత టెస్లా, ఎక్స్, ఎక్స్–ఏఐ, స్పేస్ఎ క్స్లో ఉన్న అత్యంత తెలివైన నిపుణులంతా భారతీ యులే. వలసదారులు అమెరికన్ల ఉద్యోగాలను లాగేసు కుంటున్నారన్నది ఎంతవరకు వాస్తవమో నాకు తెలి యదు. నా ప్రత్యక్ష పరిశీలన ఏమిటంటే, మెరికల కొరత ఎల్లప్పుడూఉంటుంది. కొన్ని అవుట్సోర్సింగ్ కంపెనీలు హెచ్–1బి వీసాలతో అమెరికన్ వ్యవస్థతో ఆడుకుంటున్నా యన్నది నిజం. అలాగని, హెచ్–1బి వీసాలను నిలిపివేయాలనే ఆలోచనతో ఏకీభవించను.పని అభిరుచి అవుతుంది!‘‘నా అంచనా ప్రకారం వచ్చే 20 ఏళ్లలో మనుషులకు పని చేసే అవసరమే ఉండదు. అంటే సంపాదన అవ సరం తగ్గుతుంది. ఎందుకు, ఏ పని చేయాలన్నది కూడా వారి ఇష్టాన్ని బట్టే ఉంటుంది. పని చేయటం అన్నది దాదాపు ఒక అభిరుచిలా మారిపోతుంది. ఈ మాట మీకు నవ్వు తెప్పించవచ్చు. కానీ అది నిజమవు తుందని నేను నమ్ముతున్నాను. ఏఐ, రోబోటిక్స్లోని నిరంతర పురోగతి మనకు విధిగా పని చేయవలసిన అవసరం లేకుండా చేస్తుంది. ఏఐ, హ్యూమనాయిడ్ రోబోలు పేదరికాన్ని తొలగిస్తాయి. ప్రజలు కోరుకునే ఏ వస్తువులు, సేవలనైనా పరమ చౌకగా లభించేలా చేస్తాయి. బహుశా 10 లేదా 15 ఏళ్ల లోపే ఏఐ, రోబో టిక్స్ రంగాల అభివృద్ధి... మనిషికి పని చే సి తీరవలసిన అవసరాన్ని తగ్గిస్తాయి. లేదా తప్పిస్తాయి.ఇదీ చదవండి: ఏదైనా 30 రూపాయలే.. ఎగబడిన జనం ..కట్ చేస్తేడిజిటల్ ఫ్రీ... ‘లైవ్’ కాస్ట్లీ‘‘ఏఐ మనం అనుకున్న దాని కంటే చాలా వేగంగా పరు గులు పెడుతోంది. ఈ ప్రభావం ఏఐ జనరేటెడ్ రియల్ –టైమ్ సినిమాలు, పాడ్కాస్ట్లు, వీడియో గేమ్లపై విపరీతంగా ఉండబోతోంది. తత్ఫలితంగా సంప్రదాయ మీడియా భూస్థాపితం కాబోతోంది. కృత్రిమ మేధ... మానవ అనుభవాలను, ఉద్వేగాలను సైతం దాదాపు దీటుగా అనుకరించగలదు. డిజిటల్ మీడియా సర్వ వ్యాప్తమై, విస్తృతంగా అందుబాటులోకి వచ్చినప్పుడు అవి పూర్తిగా ఉచితం అవుతాయి. వాటి కోసం మనం పెట్టే ఖర్చు తగ్గిపోతుంది. అందుకు భిన్నంగా ‘లైవ్ – ఈవెంట్’లకు విలువ పెరిగి, అవి ఖర్చుతో కూడుకున్న వినోదాలు అవుతాయి. మానవ అనుభూతులకు ఏఐ అన్నది పూర్తిస్థాయి ప్రత్నామ్నాయం కాలేదు కాబట్టి!చదవండి : ఇంటిహెల్పర్కి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన నటివితరణలకు పెను సవాళ్లు‘‘దాతృత్వం తేలికైనదేమీ కాదు. ఉదారంగా కనిపించటం కంటే ఉదారంగా ఇవ్వటానికి తగిన కారణాలను నిర్ధారించుకోవటం కష్టమైన పని. మీ విరాళం నిజంగా ఒక సమస్యను పరిష్కరిస్తుందని మీరు గుర్తించగల గాలి. ఆ ప్రయత్నంలోనే మీరు అనేకమైన సవాళ్లను అవాస్తవాల (అపాత్ర దానాల) రూపంలో ఎదుర్కొన వలసి వస్తుంది. ‘మస్క్ ఫౌండేషన్’ నిధుల పరంగా బలిష్ఠమైనది. కానీ ఏదీ నా పేరు మీద ఉండదు. ఏ ఫౌండేషన్కైనా అతిపెద్ద సవాలు–డబ్బును ఇచ్చేందుకు యోగ్య మైన అవసరాలను కనిపెట్టడం!అంతిమ కరెన్సీగా ‘ఎనర్జీ’‘‘ఇది కొంత వింతగా అని పిస్తుంది. కానీ భవిష్యత్తులో అందరికీ అన్నీ ఉన్నప్పుడు విలువల కొలమానాలకు భౌతికమైన డబ్బు అవసరం ఉండదు. అదొక భావనగా అదృశ్యమైపోయి, ‘ఎనర్జీ’ అనేది నిజమైన కరెన్సీగా స్థిరపడుతుంది. మీరు కావాలనుకుంటే కొన్ని ప్రాథమిక కరెన్సీలు (డాలర్లు, యూరోలు, పౌండ్లు) ఉంటాయి కానీ, ఎనర్జీ అనేది దేశాల స్థాయిలో కరెన్సీగా చలా మణీలోకి వస్తుంది. బిట్ కాయిన్ నిర్వహణ ఎనర్జీపైనే కదా ఆధారపడి ఉన్నది! భవిష్యత్తులో ఏదో ఒక సమ యంలో డబ్బు ఒక ప్రమాణంగా ప్రాధాన్యాన్ని కోల్పో తుంది. ఇంధన శక్తి ఆ స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఎడిటోరియల్ టీమ్వ్యూ పాయింట్: పాడ్కాస్ట్: పీపుల్ బై డబ్లు్య.టి.ఎఫ్.అతిథి: ఎలాన్ మస్క్, పారిశ్రామికవేత్తహోస్ట్: నిఖిల్ కామత్,‘జెరోధా’కో–ఫౌండర్ -
ఓపెన్ఏఐని మించిపోనున్న గూగుల్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో 'గాడ్ఫాదర్'గా ప్రసిద్ధి చెందిన, టొరంటో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జెఫ్రీ హింటన్ ఏఐ రేసులో గూగుల్ కంపెనీ త్వరలో ఓపెన్ఏఐని మించిపోతుందని అంచనా వేశారు. గూగుల్ తన ఏఐ సాంకేతికతను తెలివిగా స్కేలింగ్ చేస్తూ ముందంజ వేయనుందని స్పష్టం చేశారు.బిజినెస్ ఇన్సైడర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హింటన్ మాట్లాడుతూ, ‘గూగుల్ ఓపెన్ఏఐని అధిగమించడానికి ఇంత సమయం పట్టడం ఆశ్చర్యకరంగా ఉంది. త్వరలో గూగుల్ ఓపెన్ఏఐని మించిపోతుంది’ అని అన్నారు. మెషిన్ లెర్నింగ్లో తన ప్రయోగాలకు 2024లో నోబెల్ ఫిజిక్స్ బహుమతిని అందుకున్న హింటన్ గూగుల్లో పనిచేసిన తన అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. ఏఐ రంగంలో గూగుల్ మొట్టమొదటగా ముందంజలో ఉందని, అయితే తర్వాత వెనక్కి తగ్గిందని ఆయన పేర్కొన్నారు. ‘గూగుల్ ఇతరుల కంటే ముందు చాట్బాట్లను తయారు చేసింది’ అని హింటన్ అన్నారు.జెమిని 3, నానో బనానా ప్రోఈ మార్పుకు ప్రధాన ఆధారాలు గూగుల్ తాజా మోడళ్లు జెమిని 3, నానో బనానా ప్రో అని చెప్పారు. ఈ మోడళ్ల ప్రారంభం తర్వాత గూగుల్ ఏఐ రేసులో ముందుందని టెక్ రంగంలో విస్తృతంగా ప్రశంసలు వస్తున్నాయి. వినియోగదారులు కూడా ఈ మోడళ్ల అధునాతన సామర్థ్యాలపై సానుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. నిపుణుల అంచనాల ప్రకారం, జెమిని 3 మోడల్ ఓపెన్ఏఐ జీపీటీ-5తో పోలిస్తే అద్భుతమైన పనితీరు సంఖ్యలను ప్రదర్శిస్తోందని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: సమస్యలన్నింటికీ ఒకే పరిష్కారం -
సామూహిక నిరుద్యోగానికి దారితీసే ప్రమాదం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగానికి ‘గాడ్ఫాదర్’గా పిలుచుకునే ఏఐ సైంటిస్ట్ జెఫ్రీ హింటన్ మరోసారి తీవ్ర హెచ్చరిక చేశారు. ఏఐ వేగవంతమైన పురోగతి కారణంగా లక్షల్లో సిబ్బంది ఉద్యోగాలు కోల్పోతారని, ఇది సామూహిక నిరుద్యోగానికి దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ఇటీవల అమెరికా సెనెటర్ బెర్నీ సాండర్స్తో కలిసి జార్జ్టౌన్ యూనివర్శిటీలో జరిగిన చర్చలో హింటన్ ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ‘ఏఐ వల్ల భారీ నిరుద్యోగం రాబోతోందన్న విషయం చాలా మందికి స్పష్టంగా కనిపిస్తోంది’ అని ఆయన అన్నారు. టెక్ దిగ్గజాలు డేటా సెంటర్లు, చిప్స్పై ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నాయని చెప్పారు. తక్కువ ఖర్చుతో మానవ శ్రమను పూర్తిగా భర్తీ చేయగల ఏఐ వ్యవస్థలను రూపొందించడంపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.2023లో గూగుల్ను వీడిన హింటన్ ఏఐ ప్రమాదాల గురించి బహిరంగంగా మాట్లాడుతూ.. ఏఐ కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందన్న ఆశావాదాన్ని ఖండించారు. ‘కొత్త ఉద్యోగాలు వస్తాయి కానీ, దీని పరిణామాల వల్ల కోల్పోయే ఉద్యోగాల సంఖ్యను అవి ఎప్పటికీ భర్తీ చేయలేవు’ అని స్పష్టం చేశారు.టెక్ దిగ్గజాల అభిప్రాయాలుఏఐ ఉద్యోగాలపై చూసే ప్రభావం గురించి టెక్ పరిశ్రమలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ ఇటీవల ‘ఏఐ సామూహిక తొలగింపులకు దారితీయదు, కానీ ఉద్యోగాల స్వభావాన్ని పూర్తిగా మారుస్తుంది’ అని అన్నారు. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మాట్లాడుతూ త్వరలోనే చాలా అంశాల్లో మానవుల అవసరం లేకుండా పోతుందన్నారు. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ‘మరో 20 సంవత్సరాల్లో చాలా మందికి పని చేయవలసిన అవసరమే ఉండదు’ అని అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: ఇంటి అద్దె పెంచాలంటే ముందే చెప్పాలి.. -
గుండెకు గుండె! వినూత్న పరికరం ఆవిష్కరణ
హైదరాబాద్: ఇటీవల గుండె సంబంధిత అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యాయి. వయసుతో సంబంధం లేకుండా అందరిలోనూ గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. ఈనేపథ్యంలో ప్రతిఒక్కరు ముఖ్యంగా హృద్రోగ ముప్పు ఉన్నవారు తమ గుండె పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవడం అవసరం. ఇందు కోసమే ‘వికార్డియో’ అనే పరికరాన్ని ఆవిష్కరించింది మెడ్టెక్ సంస్థ వి టైటాన్ కార్పొరేషన్.ఏఐ సాంకేతికతతో పనిచేసే ఈ సింగిల్-లీడ్ వేరబుల్ కార్డియాక్ మానిటర్.. పూర్తిగా భారతదేశంలోనే తయారైంది. దీంతో పూర్తిగా స్థానిక హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్, క్లౌడ్-ఆధారిత ఏఐ అనలిటిక్స్తో ఇలాంటి పరికరం రూపొందించిన మొట్టమొదటి దేశీయ కంపెనీగా విటైటాన్ నిలిచింది. హృద్రోగ ముప్పులను ముందుగానే గుర్తించేందుకు గుండె ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించే స్మార్ వ్యవస్థగా వికార్డియో పరికరం రూపొందింది.పనిచేస్తుందిలా..వికార్డియో.. గుండెపై ఛాతీ భాగంలో అతికించుకునే తేలికపాటి, కాంపాక్ట్, కార్డియో మానిటర్. బ్లూటూత్ ద్వారా వికార్డియో మొబైల్ యాప్తో అనుసంధానమై పనిచేస్తుంది. ఎప్పటికప్పుడు ఈసీజీలను మొబైల్ యాప్నకు పంపుతుంది. ఇందులో జోడించిన ఏఐ సామర్థ్యాలు 20 కంటే పైగా వైద్యపరంగా ముఖ్యమైన అరిథ్మియాలను (హృదయ పనితీరులో వ్యత్యాసాలు) రియల్ -టైమ్లో గుర్తించి వర్గీకరిస్తాయి. వాటికి సంబంధించిన స్నాప్ షాట్ లను పంపుతాయి. దీంతో సత్వరం చికిత్స అందించేందుకు వైద్యులకు కూడా సహాయకరంగా ఉంటుంది. -
ఎక్కువ జీతాలిస్తోంది ఇదిగో ఈ జీసీసీలే..
జూనియర్ల నుంచి సీనియర్ల వరకు వివిధ విభాగాలవ్యాప్తంగా అనుభవాన్ని బట్టి అత్యధిక వేతనాలివ్వడంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) అగ్రస్థానాన్ని దక్కించుకున్నాయి. రిటైల్, కమర్షియల్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బీమా రంగ జీసీసీలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. టాలెంట్ సొల్యూషన్స్ సేవల సంస్థ కెరియర్నెట్ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.వివిధ రంగాలకు చెందిన 50,000 మంది ప్రొఫెషనల్స్ జీతభత్యాల డేటా ఆధారంగా సంస్థ దీన్ని రూపొందించింది. దీని ప్రకారం ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో డేటా సైంటిస్టుకు రూ. 22.1 లక్షల నుంచి రూ. 46.9 లక్షల వార్షిక ప్యాకేజీ ఉంటోంది. అదే రిటైల్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్లో చూస్తే వరుసగా రూ. 19.90–44.50 లక్షలు, రూ. 18.40 – 44.30 లక్షల స్థాయిలో ఉంటోంది.ఇక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో జూనియర్ స్థాయిలోని ఫుల్ స్టాక్ డెవలపర్లకు రూ. 20.7 లక్షల స్థాయిలో, సీనియర్లకు రూ. 47.5 లక్షల స్థాయిలో వేతనాలు ఉంటున్నాయి. అటు స్క్రమ్ మాస్టర్, సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్లాంటి ఉద్యోగాలకు ప్రారంభంలో ఒక మోస్తరు వేతనాలు ఉన్నా క్రమంగా, భారీ స్థాయికి చేరుతున్నాయి. -
ఏఐ టెక్నాలజీ: మీడియాపై పెను ప్రభావం!
కృత్రిమ మేథ (ఏఐ)లాంటి టెక్నాలజీలు మీడియా, వినోద రంగంపై (ఎంఅండ్ఈ) పెను ప్రభావం చూపుతున్నాయని కేంద్ర సమాచార, ప్రసార (ఐఅండ్బీ) శాఖ కార్యదర్శి సంజయ్ జాజు చెప్పారు. ఈ నేపథ్యంలో సాంకేతికతను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంపై మరింతగా దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. డైరెక్ట్ టు మొబైల్ బ్రాడ్కాస్టింగ్ ప్రాజెక్టుపై ఐఐటీ కాన్పూర్లో పరిశోధనలు జరుగుతున్నాయని సీఐఐ బిగ్ పిక్చర్ సమిట్ 2025లో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఏఐ వల్ల టెక్నాలజీలో మరిన్ని మార్పులు రాబోతున్నాయని, వాటిలో సానుకూలాంశాలను ఉపయోగించుకోవాలని జాజు తెలిపారు. దీని వల్ల పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన జరుగుతుందని, ఉత్పాదకత పెరుగుతుందని పేర్కొన్నారు. వందలో ఒక్క వంతు ఖర్చుతో పదిలో ఒక వంతు సమయంలో ఏదైనా పని పూర్తయితే, ఉత్పాదకత తప్పకుండా పెరుగుతుందని జాజు చెప్పారు.కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా 2030 నాటకి మీడియా, వినోద రంగం (ఎంఅండ్ఈ) భవిష్యత్ పరిస్థితుల గురించి రూపొందించిన సీఐఐ శ్వేతపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. ప్రభుత్వం, పరిశ్రమ అంచనాల ప్రకారం ఈ పరిశ్రమ ఏటా 7 శాతం వృద్ధితో 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేరనుందని జాజు చెప్పారు. ఆహారం, నీడ, దుస్తుల్లాగే వినోదమనేది నాగరికత మూల స్తంభాల్లో ఒకటని, ఆర్థిక వృద్ధితో పాటు సమాజ శ్రేయస్సుకు కూడా కీలకమని పేర్కొన్నారు. భారతదేశపు క్రియేటివ్ ఎకానమి ప్రస్తుతం 1 కోటి మందికి పైగా జవనోపాధి కల్పిస్తోందని, రూ. 3 లక్షల కోట్ల మేర స్థూల దేశీయోత్పత్తికి దోహదపడుతోందని ఆయన చెప్పారు.ఇంతటి కీలకమైన వినోద రంగాన్ని ఏఐ మార్చివేస్తున్న తరుణంలో కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోకపోతే అంతర్జాతీయంగా మన వాటా తగ్గిపోతుందన్నారు. వర్ధమాన ఆర్థిక శక్తిగా భారతదేశ గాథలను ప్రపంచానికి వినిపించాల్సిన, చూపించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం తన వంతు సహాయాన్ని పరిశ్రమకు అందిస్తుందని చెప్పారు. -
20 ఏళ్లలో డబ్బు కోసం నో వర్క్!
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యాపారవేత్త, టెస్లా, స్పేస్ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ కృత్రిమ మేధ(ఏఐ) భవిష్యత్తు గురించి సంచలన ప్రకటన చేశారు. ఏఐ, రోబోటిక్స్ కారణంగా రాబోయే 20 ఏళ్లలో మానవులకు డబ్బు కోసం పనిచేయాల్సిన అవసరం ఉండకపోవచ్చని చెప్పారు. పని కేవలం ఒక ‘ఆప్షనల్ హాబీ’గా మాత్రమే మిగులుతుందని అంచనా వేశారు.ఏఐ వేగాన్ని సూపర్సోనిక్ సునామీతో పోల్చారు. దీన్ని మానవ చరిత్రలో అతి తీవ్రమైన సాంకేతిక మార్పుగా అభివర్ణించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మస్క్ మాట్లాడుతూ.. ఏఐ మానవ నైపుణ్యాలను అనవసరం చేస్తుందన్న తన వాదనకు మద్దతుగా మస్క్ తన సొంత పిల్లల ఉదాహరణను ఇచ్చారు. ‘నా పిల్లలు టెక్నికల్గా నైపుణ్యం కలిగి ఉన్నారు. ఏఐ వచ్చే రెండు దశాబ్దాల్లో వారి నైపుణ్యాలను పూర్తిగా అనవసరం చేస్తుందని వారే ఒప్పుకుంటున్నారు’ అని మస్క్ చెప్పారు.అయినప్పటికీ వారు కాలేజీ ఎడ్యుకేషన్ను కొనసాగించాలని నిశ్చయించుకున్నారు. దీనికి సామాజిక అవసరాలే కారణమన్నారు. తమ వయసు వారితో కలిసి ఉండటం, వివిధ రంగాలకు సంబంధించిన నాలెడ్జ్ను సంపాదించేందుకే అలా కాలేజీకి వెళ్తున్నారని చెప్పారు. కాబట్టి కళాశాలకు వెళ్తే వీలైనంత విస్తృతంగా అన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించాలని తెలిపారు.ఇదీ చదవండి: పుతిన్ కారు ప్రత్యేకతలివే.. -
రాత్రి నిద్ర లేకుండా చేసే ఆలోచన అదే..
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మరోసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వంద్వ స్వభావం గురించి మాట్లాడారు. ఏఐ ద్వారా రాబోయే అపారమైన సామాజిక ప్రయోజనాలను ఆయన బలంగా విశ్వసిస్తున్నప్పటికీ, దీన్ని దుర్వినియోగం చేస్తుండడం ఆందోళన కలిగిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా డీప్ఫేక్ టెక్నాలజీ (నకిలీ వీడియోలు, ఫొటోలు సృష్టించే సాంకేతికత) ద్వారా ఆన్లైన్లో ప్రజలను మోసం చేయడానికి ఉపయోగించే ప్రమాదం ఉందని, ఈ ఆలోచనే తనకు నిద్ర లేకుండా చేస్తుందని పిచాయ్ తెలిపారు.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ‘ఏఐ గురించి తీవ్రంగా ఆలోచిస్తూ, రాత్రి నిద్రపట్టకుండా చేసే విషయం ఏమిటి?’ అని అడగ్గా పిచాయ్ మొదట సానుకూల దృక్పథాన్ని అందించారు. ‘ఏఐ వంటి శక్తివంతమైన సాంకేతికతతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కొత్త ఔషధాలను కనుగొనడంలో, క్యాన్సర్కు మెరుగైన చికిత్సలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది’ అని ఆయన వివరించారు. అయితే, వెంటనే ఆయన ఏఐ దుర్వినియోగంతో కలిగే ప్రమాదంపై హెచ్చరిక చేశారు.‘ఏదైనా సాంకేతికతకు రెండు వైపులు ఉంటాయి. కొందరు దీన్ని దుర్వినియోగం చేయవచ్చు. డీప్ఫేక్స్ లాంటివి నిజం, అబద్ధానికి మధ్య తేడా తెలియని పరిస్థితిని సృష్టించవచ్చు. ఈ అంశమే రాత్రి నిద్ర పట్టకుండా చేసేది’ అని పిచాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐని మానవాళికి మేలు చేసేలా ఉపయోగించడం అనేది కేవలం సాంకేతికతకు సంబంధించిన అంశం మాత్రమే కాదని, సామాజిక బాధ్యత కూడా ఇమిడి ఉందని ఆయన నొక్కి చెప్పారు.ఇదీ చదవండి: వేళ్లూనుకున్న అభిషేక్ బచ్చన్ వ్యాపార సామ్రాజ్యం -
యాపిల్ సేవలు నిలిపేస్తున్న మోడళ్లు ఇవే..
టెక్ దిగ్గజం యాపిల్ సర్వీసులు అందించలేని(Obsolete) ఉత్పత్తుల జాబితాను అప్డేట్ చేసింది. ఐదు యాపిల్ ఉత్పత్తులకు అధికారిక హార్డ్వేర్ సేవలు, మరమ్మతులు నిలిపేస్తున్నట్లు తెలిపింది. కంపెనీ నిబంధనల ప్రకారం గడువు ముగిసిన నేపథ్యంలో ఈమేరకు యాపిల్ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అప్డేట్ చేసిన జాబితాలో కింది ఉత్పత్తులు ఉన్నాయి.ఐఫోన్ SE (మొదటి తరం)12.9 అంగుళాల ఐప్యాడ్ ప్రో (రెండవ తరం)యాపిల్ వాచ్ సిరీస్ 4 హెర్మెస్ మోడల్స్యాపిల్ వాచ్ సిరీస్ 4 నైక్ మోడల్స్బీట్స్ పిల్ 2.0 పోర్టబుల్ స్పీకర్ఏడేళ్ల గడువు పూర్తియాపిల్ అధికారిక పాలసీ ప్రకారం ఒక ఉత్పత్తి ‘ఒబ్సాలీట్’గా పరిగణించాలంటే కంపెనీ దాని అమ్మకాలను నిలిపివేసిన తర్వాత ఏడు సంవత్సరాలు పూర్తి కావాలి. ఈ ఏడేళ్ల గడువు దాటిన తర్వాత యాపిల్, దాని అధీకృత సర్వీస్ ప్రొవైడర్లు ఆ ఉత్పత్తులకు అన్ని రకాల హార్డ్వేర్ సేవలను పూర్తిగా నిలిపివేస్తారు. అంటే బ్యాటరీ మార్పిడి, మరమ్మతులు, విడి భాగాల లభ్యత ఉండదు. ఐఫోన్ SE (మొదటి తరం) సెప్టెంబర్ 2018లో అమ్మకాలు నిలిచిపోయాయి. దీంతో ఇది సరిగ్గా ఏడేళ్ల మార్క్ను దాటి ఒబ్సాలీట్ జాబితాలో చేరింది.వినియోగదారులకు సవాలుయాపిల్ ఒక ఉత్పత్తిని ముందుగా ‘వింటేజ్’ (అమ్మకాలు ఆపిన 5 ఏళ్ల తర్వాత)గా, ఆపై ఒబ్సాలీట్(7 ఏళ్ల తర్వాత)గా ప్రకటిస్తుంది. వింటేజ్ ఉత్పత్తులు రెండు సంవత్సరాల్లో ఒబ్సాలీట్గా మారతాయి. ఐఫోన్ SE వంటి అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ ఈ జాబితాలో చేరడం అనేది ఇప్పటికీ ఆ పరికరాన్ని వాడుతున్న చాలామంది వినియోగదారులకు సమస్యలను సృష్టించవచ్చు. అధికారిక హార్డ్వేర్ సేవలు లేకపోవడంతో వారు థర్డ్ పార్టీ రిపేర్ సెంటర్లను ఆశ్రయించవలసి ఉంటుంది లేదా కొత్త మోడల్కు అప్గ్రేడ్ కావాలి. ఈ నిర్ణయం యాపిల్ తన నూతన ఆవిష్కరణలపై దృష్టి పెట్టడానికి, పాత సాంకేతికతకు మద్దతు ఇవ్వడాన్ని తగ్గించుకోవడానికి చేసిన ప్రయత్నంగా కనిపిస్తుంది.ఇదీ చదవండి: రాయికి రంగేసి రూ.5 వేలకు అమ్మాడు.. కానీ.. -
భవిష్యత్ యుద్ధాలు ‘చిట్టి’లతోనే!
యుద్ధ తంత్రాలు మారుతున్నాయి. సైనిక వ్యూహాలకు టెక్నాలజీ ఆయుధంగా మారుతున్న ప్రస్తుత రోజుల్లో భవిష్యత్ యుద్ధాలు కేవలం మానవుల మధ్య మాత్రమే కాకుండా, రోబోల దండుతో ‘మెటల్ వర్సెస్ ఫ్లెష్’ (యంత్రాలు vs మనుషులు) జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఊహాగానాలను నిజం చేస్తూ వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) సమీపంలో చైనాకు చెందిన ‘స్పై రోబోట్’ను భారత దళాలు గుర్తించాయని పేర్కొంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.చైనా-భారత్ సరిహద్దు వంటి ప్రపంచంలోని అత్యంత సున్నితమైన ప్రాంతంలో రోబోటిక్ నిఘా గురించిన ఆందోళనలను పెంచుతూ ఈ వీడియో సంచలనం సృష్టించింది. చాలా దేశాలు ఇప్పటికే తమ సైనిక వ్యూహాల్లో కృత్రిమ మేధ(ఏఐ), డ్రోన్లు, ఆటోనమస్ వెహికల్స్ను విరివిగా ఉపయోగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటన భవిష్యత్ పోరుకు ఒక సంకేతంగా నిలుస్తోందని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.వైరల్ క్లిప్లో ఏముంది?ఎత్తైన ప్రాంతంలో షూట్ చేసిన ఈ వైరల్ క్లిప్లో చైనా-భారత్ సరిహద్దు జోన్లో ఒంటరిగా నిలబడి ఉన్న హ్యూమనాయిడ్ రోబో లాంటి ఆకారాన్ని చూడవచ్చు. ఇది చైనా సరిహద్దు భద్రతలో భాగమని కొందరు చెబుతున్నారు. ఈ వీడియో చూసిన చాలా మంది ఇదో ఫంక్షనల్ రోబోట్ అని, భారత దళాల కదలికలను ట్రాక్ చేస్తుందని పేర్కొన్నారు. అయితే దీనిపై స్పష్టమైన వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.India🇮🇳 just filmed this: Chinese🇨🇳 humanoid killer robots now patrolling the border. The age of flesh-vs-metal war begins.Who still wants to send sons to the frontline in 2030? https://t.co/zM3Gy7mYJ9 pic.twitter.com/UAB5L4N6gp— PLA_Overwhelm (@junshiguancha) December 2, 2025సోషల్ మీడియా స్పందనఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా ఈ వీడియోకు లక్షలాది వ్యూస్, లైక్లు, వేల సంఖ్యలో రీపోస్ట్ చేశారు. కొందరు నెటిజన్లు ఈ వీడియోపై సరదాగా స్పందిస్తూ ‘టెర్మినేటర్ 1.0 చైనా సరిహద్దుకు వచ్చేసింది’ అని, మరికొందరు ‘మోదీగారు చిట్టి 2.0 పంపండి’ అని కామెంట్లు చేశారు.చైనా వ్యూహంలో రోబోటిక్ విప్లవంఈ క్లిప్ ఇంతగా వైరల్ అయ్యేందుకు ప్రధాన కారణం అధునాతన సైనిక సాంకేతిక పరిజ్ఞానం. ముఖ్యంగా కృత్రిమ మేధ (ఏఐ), స్వయంప్రతిపత్తి కలిగిన నిఘా సాధనాల వాడకం, హ్యూమనాయిడ్ రోబోటిక్స్లో చైనా వేగవంతంగా పురోగతి చెందుంతుండడంతో రోబో నిఘా వ్యవస్థపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.దేశ సరిహద్దుల్లో మానవ గస్తీని తగ్గించి అక్కడ పర్యవేక్షణను పెంచడానికి చైనా ఈ పద్ధతులను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తుంది. చైనా ఇప్పటికే టిబెట్లో రోబో డాగ్లతో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. చైనా, తైవాన్ సరిహద్దు సమీపంలో కూడా రోబోటిక్ సైనికులను మోహరించాలని యోచిస్తున్నట్లు వెల్లడైంది. ఇది భారత్-చైనా సరిహద్దులో కూడా ఇలాంటివి వచ్చే అవకాశంపై ఆందోళన కలిగిస్తోంది.ఇదీ చదవండి: గూగుల్ ట్రెండ్స్లో టాప్లో నీతా అంబానీ.. -
‘సంచార్ సాథీ’పై కలకలం
సైబర్ భద్రతను లక్ష్యంగా చేసుకుని భారత ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ‘సంచార్ సాథీ’ యాప్ను అన్ని కొత్త స్మార్ట్ఫోన్ల్లో ప్రీలోడ్ చేయాలనే ఆదేశాలపై వ్యతిరేకత వస్తుంది. గోప్యతా సమస్యలు, యాప్ అమలులో ఉన్న చిక్కులను ఉదహరిస్తూ యాపిల్ (Apple) వంటి ప్రముఖ మొబైల్ తయారీదారులు ఈ ఆదేశాలను పాటించేందుకు నిరాకరిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రతిపక్షాలు కూడా ఈ యాప్ ఇన్స్టాల్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం స్పందించారు. యాప్ను మొబైల్లో ఇన్స్టాల్ చేయాలా లేదా అన్నది పూర్తిగా యూజర్ల ఇష్టంమేరకే ఉంటుందని ప్రకటించారు. వినియోగదారులు కావాలనుకుంటే దాన్ని తొలగించుకోవచ్చని స్పష్టం చేశారు.ప్రీ-ఇన్స్టాల్పై డాట్ పట్టుడిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) నవంబర్ 28న జారీ చేసిన ఆదేశాల ప్రకారం యాపిల్, శామ్సంగ్, షావోమీ వంటి తయారీదారులు 90 రోజుల్లోగా భారతదేశంలో విక్రయించే అన్ని కొత్త మొబైల్ హ్యాండ్సెట్ల్లో సంచార్ సాథీ యాప్ను తప్పనిసరిగా ప్రీ-ఇన్స్టాల్ చేయాలి. ఇప్పటికే వినియోగంలో ఉన్న ఫోన్లకు సాఫ్ట్వేర్ అప్డేట్ల ద్వారా ఈ యాప్ అందేలా చూడాలని సూచించారు.ప్రభుత్వం ఉద్దేశం ఏమిటంటే..డూప్లికేట్ ఐఎంఈఐ (ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ) నంబర్లు, దొంగ పరికరాల విక్రయాలు, సైబర్ మోసాలను అరికట్టడం.జనవరి 2025లో ప్రారంభించినప్పటి నుంచి ఈ యాప్ 7 లక్షలకు పైగా దొరికిన ఫోన్లను తిరిగి పునరుద్ధరించింది. 42 లక్షలకు పైగా నకిలీ/దొంగ పరికరాలను బ్లాక్ చేసింది.ఈ ఆదేశాలు టెలికాం యాక్ట్ 2023, టెలికాం సైబర్ సెక్యూరిటీ రూల్స్ 2024 ప్రకారం జారీ అయ్యాయని డాట్ తెలిపింది. వీటిని పాటించడంలో విఫలమైతే చట్టపరమైన చర్యలు, జరిమానాలు ఉంటాయని స్పష్టం చేసింది. అయితే డాట్ అసలు ఉత్తర్వులో యాప్ ఫంక్షనాలిటీలను నిలిపివేయడం (Disabled) లేదా పరిమితం చేయడం (Restricted) కుదరదని పేర్కొనడం తీవ్ర ఆందోళనలకు దారితీసింది.యాపిల్ గోప్యతా ప్రమాణాలుప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల గోప్యతకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చే యాపిల్ ఈ తప్పనిసరి ప్రీ-ఇన్స్టాలేషన్ ఆదేశాలను పాటించే ఆలోచన లేదని భారత ప్రభుత్వానికి తెలియజేయడానికి సిద్ధమవుతోంది. ఇలాంటి ప్రభుత్వ నిబంధనలు తమ ఐఓఎస్ ప్లాట్ఫాం భద్రతా, గోప్యతా విధానాలకు విరుద్ధమని, ఇది యాప్ స్టోర్ ఎకోసిస్టమ్కు ముప్పు అని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. యాపిల్ ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ప్రభుత్వ ఆదేశాలను కూడా పాటించట్లేదు. శామ్సంగ్, షావోమీ వంటి ఆండ్రాయిడ్ తయారీదారులు ఈ ఆర్డర్ను సమీక్షిస్తున్నప్పటికీ ముందస్తు సంప్రదింపులు లేకుండానే ఆదేశాలు రావడంపై పరిశ్రమలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.ఇదీ చదవండి: గూగుల్ ట్రెండ్స్లో టాప్లో నీతా అంబానీ.. -
వైబ్ కోడింగ్.. ‘ఏఐకి అంత సీన్ లేదు’
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ‘వైబ్ కోడింగ్’పై టెక్ దిగ్గజాల్లో విభిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నేచురల్ లాంగ్వేజీలో ఆదేశాలు ఇస్తూ ఏఐ ద్వారా కోడ్ను రాయించుకునే ఈ విధానంపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అనుకూలంగా స్పందిస్తుంటే, టెక్ టైకూన్ జోహో సీఈఓ శ్రీధర్ వెంబు అంతగా దీన్ని సపోర్ట్ చేయడం లేదు. అందుకు వారు చెబుతున్న కారణాలు విభిన్నంగా ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం.వైబ్ కోడింగ్ అంటే ఏమిటి?వైబ్ కోడింగ్ అనేది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ (Software Development)లో కొత్తగా వాడుకలోకి వచ్చిన ఒక విధానం. ఇందులో సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేని వ్యక్తులు కూడా తమ ప్రాజెక్ట్ లక్ష్యాలను సాధారణ, రోజువారీ భాషలో(Natural Language Prompts) ఏఐ ఆధారిత టూల్స్కు (ఉదాహరణకు, Google's AI Studio, OpenAI Codex) కమాండ్ ఇస్తారు. ఏఐ ఆ ఆదేశాలను అర్థం చేసుకొని దానికి సంబంధించిన ఫంక్షనల్ కోడ్ను జనరేట్ చేస్తుంది. కోడింగ్ పరిజ్ఞానం లేనివారు కూడా యాప్లు, వెబ్సైట్లు లేదా ప్రోటోటైప్లను సులభంగా తయారు చేయవచ్చు.సుందర్ పిచాయ్..గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వైబ్ కోడింగ్ను సానుకూలంగా చూస్తున్నారు. టెక్నికల్ పరిజ్ఞానం లేని వ్యక్తులు కూడా తమ ఆలోచనలను ప్రోటోటైప్లుగా మార్చవచ్చని చెబుతున్నారు. గతంలో ప్రాజెక్ట్లకు సంబంధించిన ఆలోచన గురించి మాటల్లో వివరించేవారు. ఇప్పుడు, వైబ్ కోడింగ్ ద్వారా ఆ ఆలోచనకు కోడెడ్ వెర్షన్ లేదా ప్రోటోటైప్ను జనరేట్ చేసే వీలుందన్నారు.శ్రీధర్ వెంబు..జోహో సీఈఓ శ్రీధర్ వెంబు వైబ్ కోడింగ్ పట్ల అంతగా సానుకూలంగా లేరు. ఏఐ జనరేట్ చేసే కోడ్ మనకు అద్భుతంగా అనిపించినప్పటికీ, కంప్యూటర్ ఎలా పనిచేస్తుందనే క్లిష్టమైన, లోతైన అవగాహన అవసరమన్నారు. ఏఐ సాధారణంగా రీయూజబుల్ కోడ్ను రాయడంలో సహాయపడుతుందన్నారు. కానీ, కోర్ లాజిక్, కొత్త సమస్యలను పరిష్కరించే సామర్థ్యాలు ఏఐకి ఉండవని చెప్పారు. ఇవి మానవ సృజనాత్మకత, అనుభవంపై ఆధారపడి ఉంటాయని వెంబు నమ్ముతున్నారు. కోడింగ్ అనేది ఓ మ్యాజిక్ అన్నారు. వైరుధ్యంలో ఏకాభిప్రాయంఈ రెండు దృక్పథాల మధ్య పిచాయ్ కూడా ఓ పోడ్కాస్ట్లో వైబ్ కోడింగ్ పరిమితులను అంగీకరించారు. కొన్ని రకాల లార్జ్, సెక్యూరిటీ సిస్టమ్స్కు వైబ్ కోడింగ్ సరిపోదన్నారు. అందుకు అనుభవం కలిగిన ఇంజినీర్లు అవసరమని చెప్పారు. -
మొబైల్స్లో ‘సంచార్ సాథీ’ తప్పనిసరి
న్యూఢిల్లీ: మోసపూరిత కాల్స్ మొదలైన వాటిపై ఫిర్యాదు చేసేందుకు ఉపయోగపడే సంచార్ సాథీ యాప్ను కొత్త హ్యాండ్సెట్స్లో ముందుగానే ఇన్స్టాల్ చేయాలంటూ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలు, దిగుమతిదారులను టెలికం శాఖ (డాట్) ఆదేశించింది. ఇందుకు 90 రోజుల గడువు విధించింది. ఆ తర్వాత నుంచి తయారయ్యే ఫోన్లలో తప్పనిసరిగా సంచార్ సాథీ ప్రీ–ఇన్స్టాల్ చేయాల్సిందేనని నవంబర్ 28న జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. దీని ప్రకారం మొబైల్ ఫోన్లో సంచార్ సాథీ యాప్ చూడగానే కనిపించేలా, ఉపయోగించుకునే విధంగా ఉండాలి. దాన్ని డిజేబుల్ చేయకూడదు. పరిమితుల్లాంటివేవీ ఉండకూడదు. ఇప్పుడున్న ఫోన్లనూ అప్డేట్ చేయాలి .. ఇప్పటికే భారత్లో తయారైనవి, విక్రేతల దగ్గర ఉన్నవాటికి సంబంధించి తయారీ సంస్థలు, దిగుమతిదారులు సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా యాప్ను అందించాల్సి ఉంటుందని డాట్ పేర్కొంది. ఈ ఆదేశాల అమలు తీరుతెన్నుల గురించి, ఉత్తర్వులు వెలువడిన 120 రోజుల్లో అన్ని సంస్థలు, దిగుమతిదారులు కాంప్లయెన్స్ రిపోర్టును సమరి్పంచాల్సి ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం యాపిల్, శాంసంగ్, గూగుల్, వివో, ఒప్పో, షావోమీలాంటి దిగ్గజాలు భారత్లో హ్యాండ్సెట్స్ని తయారు చేస్తున్నాయి. ఐఎంఈఐ (ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ నంబర్) దురి్వనియోగంపై సందేహాలుంటే ఫిర్యాదు చేసేందుకు, మొబైల్ డివైజ్లలోని ఐఎంఈఐలు సిసలైనవేనని నిర్ధారించుకునేందుకు సంచార్ సాథీ ఉపయోగపడుతుంది. 15 అంకెల ఐఎంఈఐ నంబరు సహా మొబైల్ ఫోన్ని గుర్తించేందుకు ఉపయోగపడే దేన్నైనా మార్చివేయడాన్ని నాన్–బెయిలబుల్ నేరంగా పరిగణిస్తారు. ఇందుకు రూ. 50 లక్షల వరకు జరిమానా, మూడేళ్ల వరకు జైలుశిక్షలాంటివి ఉంటాయి. -
ఏఐ స్మార్ట్ గ్లాసెస్: ఉపయోగాలెన్నో..
ఓక్లీ మెటా గ్లాసెస్ గురించి చాలామంది వినే ఉంటారు. జూన్లో ప్రపంచ మార్కెట్లలో లాంచ్ అయిన ఈ గ్లాసెస్ ఇప్పుడు భారతదేశంలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ గ్లాసెస్ గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)-ఆధారిత స్మార్ట్ గ్లాసెస్ను.. స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్ పరికరాల తయారీదారు ఓక్లీ సహకారంతో అభివృద్ధి చేశారు. ఇది కేవలం గ్లాసెస్ మాత్రమే కాదు.. ఫోటోలు తీసుకోవచ్చు, వీడియోలు రికార్డ్ చేయవచ్చు. అంతే కాకుండా వాయిస్ అసిస్టెంట్ ద్వారా.. చాలా పనులను సులభంగా చేసుకోవచ్చు కూడా.భారతదేశంలో ఓక్లీ మెటా HSTN గ్లాసెస్.. క్లియర్ & ప్రిజం అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటి ప్రారంభ ధరలు రూ. 41,800. అయితే ఎందుకుని లెన్స్ ఆధారంగా ధరలు మారుతాయి. కాబట్టి ప్రిజం పోలరైజ్డ్ వేరియంట్ ధర రూ. 44,200 కాగా, ప్రిజం ట్రాన్సిషన్ లెన్స్లతో కూడిన ఓక్లీ మెటా HSTN ధర రూ. 47,600.ఓక్లీ మెటా స్మార్ట్ గ్లాసెస్ ఈరోజు (డిసెంబర్ 1) నుంచి సన్గ్లాస్ హట్.. దేశంలోని ప్రముఖ ఆప్టికల్ & ఐవేర్ రిటైలర్ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.ఓక్లీ మెటా గ్లాసెస్ 12 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇది 100-డిగ్రీల ఫీల్డ్-ఆఫ్-వ్యూతో సెకనుకు 30 ఫ్రేమ్ల వద్ద 3K వీడియో రిజల్యూషన్లో పాయింట్-ఆఫ్-వ్యూ వీడియో రికార్డింగ్కు సపోర్ట్ చేస్తుంది. స్టాండర్డ్, స్లో మోషన్ & హైపర్లాప్స్ వీడియో రికార్డింగ్ మోడ్లకు మద్దతు ఇస్తుంది. వినియోగదారులు 3024 x 4032 పిక్సెల్స్ రిజల్యూషన్లో కూడా ఫోటోలను తీయడానికి అనుమతిస్తుంది. ఈ స్మార్ట్ గ్లాసెస్ 32GB ఆన్బోర్డ్ స్టోరేజితో వస్తుందని సంస్థ వెల్లడించింది. మొత్తం మీద ఇచ్చి చాలా విధాలుగా పనికొస్తుందని స్పష్టంగా అర్థమవుతోంది. -
చిన్న ఐడియా.. మూడు రోజుల్లో రూ.కోటి సంపాదన!
ఒక్కోసారి కొంతమంది చేసే చిన్న ప్రయత్నాలే పెద్ద విజయంగా మారుతుంటాయి. స్మార్ట్ ఫోన్ వాడకంతో విసిగిపోయి తాను సొంతంగా స్క్రీన్ టైమ్ను తగ్గించుకుందామని ఓ టెకీ చేసిన చిన్నపాటి ప్రయోగం.. ఆమెకి అద్భుతమైన వ్యాపార అవకాశంగా మారింది. కేవలం మూడు రోజుల్లోనే ఆమె ఉత్పత్తి 120,000 డాలర్ల (సుమారు రూ.కోటి) అమ్మకాలను నమోదు చేసింది.రెండేళ్ల క్రితం, ఆన్లైన్లో క్యాట్జీపీటీ (CatGPT) ఏర్పాటుతో గుర్తింపు పొందిన క్యాట్ గోయెట్జ్.. నిరంతర స్మార్ట్ఫోన్ వినియోగంతో విసిగిపోయి, పాతకాలపు ల్యాండ్లైన్ ఫోన్ వినియోగం వైపు మళ్లాలనుకుంది. అయితే ల్యాండ్లైన్ ఫోన్ వాడాలంటే కొత్త నంబర్, కనెక్షన్ కావాలి. దీంతో పాతకాలపు పింక్ క్లామ్షెల్ హ్యాండ్సెట్ను తీసుకుని, దాన్ని బ్లూటూత్తో స్మార్ట్ఫోన్లకు కనెక్ట్ చేసుకుని కాల్స్ మాట్లాడుకునేలా మార్పులు చేసింది. ఇది ఆమె అపార్ట్మెంట్లో ఒక వినూత్న ఆకర్షణగా మారింది.తర్వాత జూలై 2025లో ఆమె ఈ పరికరం గురించి ఆన్లైన్లో షేర్ చేయగా అనూహ్య స్పందన వచ్చింది. ఇలాంటిది తమకు కూడా కావాలని వందలాది మంది కామెంట్ పెట్టారు. దీంతో ఆమె వీటికి ‘ఫిజికల్ ఫోన్’ అని పేరు పెట్టి ఆన్లైన్ స్టోర్ను ప్రారంభించింది. ఏదో 15–20 ప్రీ–ఆర్డర్లు వస్తాయని భావిస్తే.. అంచనాలను మించి, మూడే రోజుల్లోనే అమ్మకాలు 120,000 డాలర్లు దాటాయి. అక్టోబర్ చివరి నాటికి 3,000 యూనిట్లు అమ్ముడవగా, మొత్తం ఆదాయం 280,000 డాలర్లను దాటింది.ఫిజికల్ ఫోన్లు ఎలా పనిచేస్తాయంటే..ప్రస్తుతం ఫిజికల్ ఫోన్స్ బ్రాండ్ కింద 90–110 డాలర్ల ధరల్లో ఐదు రకాల హ్యాండ్సెట్ డిజైన్లు లభిస్తున్నాయి. ఉత్పత్తి పెరిగిన దృష్ట్యా, గోయెట్జ్ ఒక ఎలక్ట్రానిక్స్ తయారీదారుతో భాగస్వామ్యం చేసుకుని డిసెంబరు నుండి మొదటి బ్యాచ్ ఉత్పత్తుల షిప్పింగ్ని ప్రారంభించనుంది.ఈ ఫిజికల్ ఫోన్లను బ్లూటూత్ ద్వారా ఐఫోన్, ఆండ్రాయిడ్ పరికరాలకు కనెక్ట్ చేసుకోవచ్చు. వాట్సాప్, ఫేస్టైమ్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ వంటి యాప్స్ నుంచి వచ్చే కాల్స్ను ఇందులో మాట్లాడవచ్చు. నంబర్ను డయల్ చేయడం ద్వారా లేదా ‘స్టార్’(*) కీని నొక్కి ఫోన్లోని వాయిస్ అసిస్టెంట్ను యాక్టివేట్ చేయడం ద్వారా అవుట్గోయింగ్ కాల్స్ కూడా చేయవచ్చు. -
రూపాయికే నెలరోజుల రీఛార్జ్!.. డైలీ 2జీబీ డేటా
రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో బీఎస్ఎన్ఎల్ కూడా.. ఇదే బాటలో పయనిస్తోంది. ఇటీవల రూ. 199 ప్లాన్ ప్రకటించిన సంస్థ.. ఇప్పుడు మరోమారు రూ.1 ఫ్రీడమ్ ప్లాన్ అందించనుంది.బీఎస్ఎన్ఎల్ ఆగష్టు 15న భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. రూ.1 ప్లాన్ పరిచయం చేసింది. దీనిని దీపావళి సమయంలో కూడా కొనసాగించింది. ఇప్పుడు మరోమారు ఈ ప్లాన్ కంటిన్యూ చేస్తోంది. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ కూడా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.దీని ద్వారా యూజర్ 30 రోజులపాటు అపరిమిత కాల్స్, రోజుకు 2జీబీ డేటా మాత్రమే కాకుండా రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లను పొందవచ్చు. సిమ్ కార్డు కూడా పూర్తిగా ఉచితం కావడం గమనార్హం. అయితే ఈ ఆఫర్ కేవలం కొత్త వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని సంస్థ స్పష్టం చేసింది. ఎక్కువమంది ప్రజలు ఈ ప్లాన్ కోరుకోవడం వల్లనే దీనిని మళ్లీ తీసుకురావడం జరిగిందని సంస్థ స్పష్టం చేసింది. ఇది డిసెంబర్ 1 నుంచి 31వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.Back by public demand - BSNL’s ₹1 Freedom Plan!Get, a Free SIM with 2GB data/day, unlimited calls and 100 SMS/day for 30 days of validity.Applicable for new users only! #BSNL #AffordablePlans #BSNLPlans #BSNLFreedomPlan pic.twitter.com/pgGuNeU8c2— BSNL India (@BSNLCorporate) December 1, 2025రూ.199 ప్లాన్ వివరాలుబీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ 199 రూపాయల రీఛార్జ్ ప్లాన్ ద్వారా.. 28 రోజుల పాటు రోజుకి 2జీబీ డేటా, అపరిమిత కాల్స్ వంటి వాటితోపాటు రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లను పొందవచ్చు. ఈ విషయాన్ని సంస్థ తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించింది. -
చైనా ప్రభుత్వాన్ని వణికిస్తున్న రోబోలు!
రోబోటిక్స్ టెక్నాలజీలో దూసుకెళ్లాలని ప్రయత్నిస్తున్న చైనా ప్రభుత్వాన్ని ఇప్పుడవే రోబోలు వణికిస్తున్నాయి. చైనాలో హ్యూమనాయిడ్ రోబోలను తయారు చేసే కంపెనీల వేగవంతమైన విస్తరణ ఆ దేశ అగ్రశ్రేణి ఆర్థిక ప్రణాళిక సంస్థను ఆందోళనకు గురిచేస్తోంది.ఏకంగా 150 కి పైగా కంపెనీలు హ్యూమనాయిడ్ రోబోల తయారీలోకి దిగడంతో పరిశ్రమ వేడెక్కే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.మార్కెట్లోకి ఒకేవిధమైన రోబోలు ఇబ్బడిముబ్బడిగా రావడంపై చైనా అగ్రశ్రేణి ఆర్థిక ప్రణాళికా సంస్థ నేషనల్ డెవలప్మెంట్ అండ్ రిఫార్మ్ కమిషన్ (ఎన్డీఆర్సీ) ఆందోళన వ్యక్తం చేసింది. ఆ సంస్థ ప్రతినిధి లీ చావో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ "వేగం, బుడగలు ఎల్లప్పుడూ ఎదుర్కోవాల్సిన సమస్యలు" అని వ్యాఖ్యానించారు.ఈ రోబో తయారీ కంపెనీలలో సగానికి పైగా ఇతర పరిశ్రమల నుండి రోబోటిక్స్ లోకి విస్తరించిన ఇటీవలి స్టార్టప్ లు లేదా సంస్థలే కావడం గమనార్హం. ఈ వైవిధ్యం ఒకప్పుడు ఆవిష్కరణకు ఒక వరంగా కనిపించినప్పటికీ, ఒకే లాంటి ఆవిష్కరణలు మార్కెట్ ను ముంచెత్తితే నిజమైన పరిశోధన, అభివృద్ధిని దెబ్బతీసే ప్రమాదం ఉందని ఎన్డీఆర్సీ హెచ్చరిస్తోంది. దీనిపై ప్రపంచ బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ కూడా ఇప్పటికే హెచ్చరించారు.చైనాలో రోబోలు ఎందుకింతలా పెరుగుతున్నాయి..?హ్యూమనాయిడ్ రోబోటిక్స్ ను "మూర్తీభవించిన ఏఐ"గా పేర్కొంటున్న చైనా భవిష్యత్తు ఆర్థిక వృద్ధికి కీలకమైన చోదకంగా ప్రకటిస్తూ ఈ రంగాన్ని పెంపొందించడానికి ప్రోత్సాహకాలు, నిధులు, విధానపరమైన మద్దతును అందిస్తోంది. దీంతో ఈ రంగంపై ఆసక్తి పెరిగింది. కొత్త కంపెనీలు, పెట్టుబడులు వరదలా పోటెత్తున్నాయి. అనేక సంస్థలు వీలైనంత త్వరగా హ్యూమనాయిడ్ మోడళ్లను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాయి. అయితే ఈ పరుగులు దాదాపు సారూప్య - రోబోల విస్తరణకు దారితీస్తున్నాయి.ముఖ్యంగా కంపెనీలు తయారు చేసిన రోబోల డెమోలు, ప్రోటోటైప్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నప్పటికీ అవి కర్మాగారాలు, గృహాలు లేదా ప్రజా సేవలలో పెద్ద ఎత్తున వినియోగించదగిన రోబోలుగా మాత్రం అందుబాటులోకి రావడం లేదని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. హైప్, వాస్తవ యుటిలిటీ మధ్య అసమతుల్యత.. డిమాండ్ కార్యరూపం దాల్చడంలో విఫలమైతే బూమ్ కుప్పకూలుతుందనే భయాలను పెంచింది. -
ఐఐటీ-మద్రాస్ ఇంక్యుబేషన్ సెల్ అరుదైన ఘనత
ఐఐటీ-మద్రాస్ ఇంక్యుబేషన్ సెల్ (IITMIC) భారతీయ డీప్టెక్ వ్యవస్థాపక రంగంలో చారిత్రక మైలురాయిని అధిగమించింది. కేవలం 12 సంవత్సరాల్లో 500 డీప్టెక్ స్టార్టప్లను ఇంక్యుబేట్ చేసిన ఏకైక అకడమిక్ ఇంక్యుబేటర్గా ఐఐటీఎంఐసీ రికార్డు సృష్టించింది. ఇంక్యుబేట్ చేసిన ఈ స్టార్టప్ల సమష్టి విలువ (వాల్యుయేషన్) రూ.53,000 కోట్లు దాటడం దేశ డీప్టెక్ ఎకోసిస్టమ్ బలోపేతాన్ని సూచిస్తోంది. 2012-13లో అకడమిక్ ఇంక్యుబేటర్లు అరుదుగా ఉన్న సమయంలో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఐఐటీఎంఐసీ ప్రస్తుతం ఏథర్ ఎనర్జీ, యునిఫోర్, అగ్నికుల్ కాస్మోస్, మెడిబడ్డీ, మైండ్గ్రోవ్.. వంటి అనేక స్టార్టప్లకు పుట్టినిల్లు అయింది.స్టార్టప్ కంపెనీల పరంగా ఇంక్యుబేషన్ అంటే.. కొత్తగా ప్రారంభమైన లేదా ప్రాథమిక దశలో ఉన్న కంపెనీ (స్టార్టప్కు) విజయవంతంగా ఎదగడానికి, స్వతంత్రంగా పనిచేయడానికి అవసరమైన మద్దతు, వనరులు, సర్వీసులను అందించే ప్రక్రియ. సాధారణంగా దీన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ సంస్థలు లేదా ప్రత్యేక ఇంక్యుబేటర్ సంస్థలు నిర్వహిస్తాయి. ఇంక్యుబేషన్ అనేది ప్రారంభ సంవత్సరాల్లో స్టార్టప్కు ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి సహాయపడే ఒక సమగ్ర మద్దతు వ్యవస్థ.ఈ సందర్భంగా ఐఐటీఎంఐసీ సీఈవో తమస్వతి ఘోష్ మాట్లాడుతూ..‘మేము 500 డీప్టెక్ స్టార్టప్లను ఇంక్యుబేట్ చేశాం. నాణ్యతలో ఎక్కడా రాజీ పడలేదు. ఈ స్టార్టప్ల్లో దాదాపు 60 శాతం మంది ఐఐటీ బయటినుంచి వచ్చిన వారున్నారు. ఇది ఐఐటీఎంఐసీని నిజమైన జాతీయ స్థాయి డీప్టెక్ కేంద్రంగా మార్చింది’ అని తెలిపారు.ఐఐటీఎంఐసీ పోర్ట్ఫోలియో వివరాలు..ఇంక్యుబేటెడ్ కంపెనీలు సుమారు 700 పైగా పేటెంట్లను దాఖలు చేశాయి.105 కంటే ఎక్కువ స్టార్టప్లు ప్రీ-సిరీస్/సిరీస్ A+ రౌండ్ల్లో విజయవంతంగా నిధులను సేకరించాయి.దాదాపు 40 శాతం స్టార్టప్లు ఇప్పటికే ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీలు కలిసి రూ.4,000 కోట్ల ఆదాయాన్ని సాధించాయి.ఏథర్ ఎనర్జీ ఐపీఓ సమయంలో ఐఐటీఎంఐసీ నుంచి తాత్కాలికంగా నిష్క్రమించడం ద్వారా భారీగా రిటర్న్ను అందించింది.రాబోయే 4-5 ఏళ్లలో మరో 10-15 కంపెనీలు పూర్తిస్థాయిలో నిష్క్రమించే అవకాశం ఉందని ఘోష్ అంచనా వేశారు.కీలక రంగాలపై దృష్టిఐఐటీఎంఐసీ పోర్ట్ఫోలియో వైవిధ్యభరితంగా ఉంది. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, రోబోటిక్స్, స్పేస్ టెక్, బయోటెక్, మొబిలిటీ, ఐఓటీ, క్లీన్ ఎనర్జీ వంటి కీలక డీప్టెక్ రంగాల్లో విస్తరించింది. ఇది దేశం వ్యూహాత్మక అవసరాలకు అనుగుణంగా ఉంది. నాణ్యతతో కూడిన స్టార్టప్ల సంఖ్యను పెంచేందుకు, ప్రీ-ఇంక్యుబేషన్ దశలోనే బలమైన మద్దతు అందించే ‘నిర్మాణ్’ కార్యక్రమం ద్వారా ప్రస్తుతం 120కి పైగా ప్రీ-వెంచర్ టీమ్లను ప్రోత్సహిస్తోంది. అదనంగా, స్టార్టప్ స్నేహపూర్వక విధానంలో భాగంగా గతంలో 5 శాతం తీసుకున్న ఈక్విటీని ఐఐటీఎంఐసీ ఇప్పుడు 3 శాతానికి తగ్గించింది. పూర్వవిద్యార్థుల విరాళాలు, కార్పొరేట్ సీఎస్ఆర్ నిధులు దీనికి ప్రధాన ఆర్థిక వనరులుగా ఉన్నాయి.ఇదీ చదవండి: యాప్స్.. మార్కెటింగ్ యంత్రాలా? -
రూ.200 కంటే తక్కువ రీఛార్జ్: డైలీ 2జీబీ డేటా..
భారతదేశంలో టెలికాం రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా కంపెనీలు అగ్రస్థానాలను దక్కించుకోవడానికి వివిధ ప్రీపెయిడ్ & పోస్ట్పెయిడ్ ప్లాన్లను ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికామ్ సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) ఇప్పుడు తాజాగా 28 రోజుల ప్లాన్ తీసుకొచ్చింది.బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ 199 రూపాయల రీఛార్జ్ ప్లాన్ ద్వారా.. 28 రోజుల పాటు రోజుకి 2జీబీ డేటా, అపరిమిత కాల్స్ వంటి వాటితోపాటు రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లను పొందవచ్చు. ఈ విషయాన్ని సంస్థ తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించింది.Get more value every day with the #BSNL ₹199 Plan!Enjoy 2GB/day, unlimited calls & 100 SMS/day for 28 days - powered by Bharat's trusted network.Now recharge via BReX: https://t.co/41wNbHpQ5c#BSNLPlans #PrepaidPlans #BSNL #ConnectingBharat#BestPrepaidPlan #BSNLRecharge pic.twitter.com/mxRECIwJcU— BSNL India (@BSNLCorporate) November 30, 2025రూ.251 రీఛార్జ్ ప్లాన్బీఎస్ఎన్ఎల్ స్టూడెంట్ ప్లాన్ పేరుతో పరిచయం చేసిన ఈ రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 251 మాత్రమే. వ్యాలిడిటీ 28 రోజులు. అంటే రోజుకు 8.96 రూపాయలన్నమాట. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. ఉచిత కాలింగ్, డేటా, ఎస్ఎమ్ఎస్ ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్లాన్ పరిమిత కాలం మాత్రమే (నవంబర్ 14 నుంచి డిసెంబర్ 14 వరకు) అందుబాటులో ఉంటుంది.28 రోజులు అపరిమిత కాల్స్ మాత్రమే కాకుండా 100జీబీ హైస్పీడ్ డేటా, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు పొందవచ్చు. ఇది బీఎస్ఎన్ఎల్ కస్టమర్లందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవాలనుకునే కస్టమర్లు.. బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ను సందరించడం ద్వారా, అధికారిక వెబ్సైట్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. -
నథింగ్ ఫోన్ ‘3ఎ లైట్’: ధర ఎంతంటే?
లండన్ ఆధారిత టెక్ కంపెనీ నథింగ్ కొత్తగా తమ ఫోన్ (3ఎ) లైట్ స్మార్ట్ఫోన్ని భారత్లో ప్రవేశపెట్టింది. దీని వాస్తవ ధర రూ. 20,999 కాగా బ్యాంక్ డిస్కౌంట్లు పోగా రూ. 19,999 నుంచి ప్రారంభమవుతుంది. కొత్త నథింగ్ ఫోన్ డిసెంబర్ 5 నుంచి ఫ్లిప్కార్ట్, విజయ్, సేల్స్, క్రోమా, ఇతరత్రా రిటైల్ ఔట్లెట్స్లో లభిస్తుంది. ఇది మొత్తం మూడు రంగుల్లో లభిస్తుంది.నథింగ్ ఫోన్ ‘3ఎ లైట్’లో 6.77 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, 50 ఎంపీ మెయిన్ కెమెరా, ట్రూలెన్స్ ఇంజిన్ 4.0, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లు ఉంటాయి. ఆండ్రాయిడ్ 15 ఆధారిత నథింగ్ ఓఎస్ 3.5పై పనిచేస్తుంది. 3 ఏళ్లవరకు మేజర్ అప్డేట్స్, 6 ఏళ్ల వరకు సెక్యూరిటీ ప్యాచెస్ పొందవచ్చు. -
చలికి చెక్ పెట్టె దుప్పటి.. వెచ్చని పాదాల కోసం సాక్స్!
చలి గాలులు వీచినా, మీకు మాత్రం హాయిగా హీట్ థెరపీ టచ్ ఇచ్చే గాడ్జెట్లు వచ్చేశాయి. ఈ స్మార్ట్ గాడ్జెట్లు మీ శరీరానికి వెచ్చగా హత్తుకుంటూ కంఫర్ట్, కేర్, రిలాక్సేషన్ అన్నీ కలిపి చలికాలాన్ని ఒక హాయికాలంగా మార్చేస్తాయి.చలికి చెక్ ఈ దుప్పటి!చలి వణికిస్తోందా? ఇక ఆ ఫీలింగ్కు ‘టాపిష్ ఎలక్ట్రిక్ దుప్పటి’తో ఫుల్స్టాప్ పెట్టొచ్చు! ఈ దుప్పటి కోరల్ ఫ్లీస్ మెటీరియల్తో తయారై, చర్మానికి మృదువుగా తాకుతూ తక్షణమే వెచ్చదనాన్ని ఇస్తుంది. రివర్సిబుల్ డిజైన్తో రెండు వైపులా ఉపయోగించుకోవచ్చు. అందం కూడా, సౌకర్యం కూడా! ఇన్బిల్ట్ థర్మల్ ప్రొటెక్షన్ ఉండటం వల్ల చలి ఎంత పెరిగినా, వేడి సమతుల్యంగా ఉంటుంది. షాక్ప్రూఫ్ సిస్టమ్ ఉండటంతో దీనిని సురక్షితంగా ఉపయోగించుకోవచ్చు. ఈ దుప్పటిని మంచంపై పరచి, పైన హీటింగ్ డివైజ్ పెట్టి ఉపయోగించాలి. మడిచి పెట్టకూడదు. ఉపయోగించడానికి ముందు పవర్ ఆఫ్ చేయడం తప్పనిసరి. దీని రిమోట్కి ఐదు సంవత్సరాల వారంటీ ఉండటం విశేషం. ధర కేవలం రూ. 995.వెచ్చని పాదాలు!చలికాలమైనా, వేసవికాలమైనా ఇక కాళ్లకు ఎప్పుడూ సరైన ఉష్ణోగ్రత ఉన్నప్పుడే సౌకర్యవంతంగా ఉంటుంది. థర్మామెడ్ స్మార్ట్ సాక్స్ మీ పాదాలను హాయిగా, ఆరోగ్యవంతంగా ఉంచే మంచి స్నేహితులు! ఇవి ప్రత్యేక థర్మో రెగ్యులేషన్ ఫాబ్రిక్తో తయారవడం వలన, వేడి చలి రెండింటినీ సమతుల్యం చేస్తాయి. చెమట పట్టినా ఆరిపోతాయి, వాతావరణం చలిగా ఉంటే వెచ్చదనాన్ని ఇస్తాయి. పాదాలను ఎప్పుడూ పొడిగా, సువాసనగా ఉంచుతాయి. ఫంగస్, బ్యాక్టీరియా తదితర ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచే యాంటీ మైక్రోబియల్ టెక్నాలజీతో ఈ సాక్స్ మరింత హైజినిక్గా ఉంటాయి. కాళ్ల వాపు, నొప్పి తగ్గించడంలో సహాయపడే సున్నితమైన కంప్రెషన్ డిజైన్ వీటి ప్రత్యేకత. లోపల మృదువైన కుషన్ ఉండటంతో రోజంతా ధరించినా ఏమాత్రం అసౌకర్యం లేకుండా ఉంటుంది. ధర రూ. 850 మాత్రమే!స్మార్ట్ బాటిల్!బాటిల్ని క్లీన్ చేయడానికి ఇకపై పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు! ఎందుకంటే, ఈ ‘లార్క్ స్మార్ట్ వాటర్ బాటిల్’ ప్రతి రెండు గంటలకు ఒకసారి ఆటోమేటిక్గా సెల్ఫ్–క్లీన్ అవుతుంది. దీని లోపలే ఉండే శుద్ధి వ్యవస్థ బాటిల్ నీటిని కేవలం 60 సెకన్లలో శుభ్రం చేస్తుంది. యూవీ సీ ఎల్ఈడీ టెక్నాలజీతో బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులను నిర్వీర్యం చేస్తుంది. దీంతో, ఎటువంటి కెమికల్స్ లేకుండా, నీరు ఎప్పుడూ తాజాగా, సురక్షితంగా ఉంటుంది. డబుల్ వాల్ స్టెయిన్లెస్ స్టీల్ ఇన్సులేషన్తో చల్లని నీటిని 24 గంటలు, వేడి పానీయాన్ని 12 గంటలు నిల్వ ఉంచుతుంది. యూఎస్బీ చార్జింగ్తో నెల రోజుల వరకు బ్యాటరీ పవర్ ఉంటుంది. ధర రూ. 21,649. -
ఫోన్లో సిమ్ లేకుంటే వాట్సాప్ బంద్!
వాట్సాప్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్లను కొంత మంది సిమ్ లేకపోయినా వాడుతుంటారు. ఇకపై అలా కుదరదు. ఫోన్లో యాక్టివ్ సిమ్ ఉంటేనే ఆ యాప్లు పనిచేస్తాయి. యాప్ ఆధారిత కమ్యూనికేషన్ సర్వీసులు అంటే వాట్సాప్, సిగ్నల్, టెలిగ్రామ్ వంటివి క్రియాశీల సిమ్ కార్డుకు నిరంతరం అనుసంధానమై ఉంటేనే పనిచేసేలా కేంద్ర ప్రభుత్వం ఆయా యాప్ సంస్థలకు ఆదేశాలు జారీచేసింది.గత నవంబర్ చివరలో టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) జారీ చేసిన కొత్త సైబర్ సెక్యూరిటీ నిబంధనల్లో ఇది భాగం. ఈ మార్పులను అమలు చేస్తూ సమ్మతి నివేదికలను సమర్పించడానికి సర్వీస్ ప్రొవైడర్లకు టెలికమ్యూనికేషన్స్ విభాగం 90 నుంచి 120 రోజుల సమయం ఇచ్చింది.సిమ్ లింకేజీ తప్పనిసరి ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ విభాగం ఆదేశాల ప్రకారం.. వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, స్నాప్చాట్, అరట్టై వంటివాటితోపాటు జియోచాట్, షేర్చాట్ వంటి స్థానిక కమ్యూనికేషన్ యాప్లు కూడా వాటిని ఉపయోగిస్తున్న డివైజ్లలొ యాక్టివ్ సిమ్ కార్డు ఉంటేనే పనిచేయాలి.ఇక వాట్సాప్, టెలిగ్రామ్ వెబ్ వర్షన్లను కూడా చాలా మంది ఉపయోగిస్తుంటారు. వాటి వినియోగానికి సంబంధించి కూడా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం.. వాట్సాప్, టెలిగ్రామ్ వెబ్ సర్వీసులు ఏకధాటిగా పనిచేయవు. ప్రతి ఆరు గంటలకోసారి మొబైల్ను ఉపయోగించి లాగిన్ కావాల్సి ఉంటుంది.ఇప్పటి వరకు, చాలా యాప్లు ఇన్స్టాలేషన్ సమయంలో మాత్రమే యూజర్ మొబైల్ నంబర్ను ధ్రువీకరించేవి. కొత్త నిబంధనల ప్రకారం, యూజర్ ఇచ్చే మొబైల్ నంబర్ నిరంతరం క్రియాశీలకంగా లింక్ చేయబడి ఉండాలి.ఎందుకీ కొత్త నిబంధన?రిజిస్ట్రేషన్ కోసం ఉపయోగించిన సిమ్ పక్కన పడేసినా లేదా ఇనాక్టివ్ అయినా కూడా ఆయా యాప్లు పనిచేస్తూనే ఉన్నాయి. ఈ లొసుగును సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీన్ని అరికట్టడానికే ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ విభాగం ఈ కొత్త నిబంధన తీసుకొచ్చింది.ఇదీ చదవండి: మార్కెట్లోకి ఐక్యూ కొత్త ఫోన్.. ట్రిపుల్ 50MP కెమెరా.. 7000mAh బ్యాటరీ -
మార్కెట్లోకి ఐక్యూ కొత్త ఫోన్..
స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఐక్యూ తమ ఫ్లాగ్షిప్ ఫోన్ ఐక్యూ 15ని ఆవిష్కరించింది. డిస్కౌంట్లు పోగా ధర రూ. 64,999 నుంచి ప్రారంభమవుతుంది. స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ జెన్ 5 ప్రాసెసర్, సూపర్కంప్యూటింగ్ చిప్ క్యూ3, ఆండ్రాయిడ్ 16, ట్రిపుల్ 50 ఎంపీ కెమెరా సిస్టం, 7000 ఎంఏహెచ్ సిలికాన్ ఎనోడ్ బ్యాటరీ మొదలైన ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఐక్యూ 15 (iQOO 15) 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.72,999గా ఉంది. 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.79,999గా ఉంది. రెండు మోడళ్లపై పరిచయ లాంచ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. డిసెంబర్ 1 నుంచి అమెజాన్, ఐక్యూ ఈస్టోర్లో అమ్మకాలు ప్రారంభమవుతాయి. ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులపై రూ. 7,000 డిస్కౌంటు, అర్హత కలిగిన కస్టమర్లకు అదనంగా రూ.1,000 కూపన్ డిస్కౌంటు లభిస్తాయి.ఐక్యూ 15 పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లుస్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, Q3 గేమింగ్ చిప్ సెట్లు వేగవంతమైన ప్రాసెసింగ్, మల్టీ టాస్కింగ్, యాప్ స్విచింగ్, గేమింగ్ లను అందిస్తాయి. 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఇందులో ఉంది.ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 6పై నడుస్తుంది. ఐదేళ్ల సాఫ్ట్ వేర్ అప్ డేట్ లు, ఏడేళ్ల సెక్యూరిటీ ప్యాచ్ లను కంపెనీ అందించనుంది.ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో కూడిన 50MP సోనీ IMX921 మెయిన్ సెన్సార్, 50MP సోనీ IMX882 పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ 3x ఆప్టికల్ జూమ్, 50MP అల్ట్రావైడ్ షూటర్తో బహుముఖ ట్రిపుల్ రియర్ సెటప్ ఉంది. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇచ్చారు.6.85-అంగుళాల శామ్ సంగ్ M14 అమోల్డ్ LTPO డిస్ ప్లే ప్యానెల్. ఇది 2K రిజల్యూషన్, 144Hz వరకు వేరియబుల్ రిఫ్రెష్ రేట్, 2,600 నిట్స్ బ్రైట్నెస్తో వస్తుంది.భారీ 7,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 40W వైర్ లెస్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది. స్మార్ట్ బైపాస్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ వంటివి అదనపు ఫీచర్లు.ఇదీ చదవండి 👉 కొత్త రూల్: ఫోన్లో సిమ్ లేకుంటే వాట్సాప్ బంద్! -
అలీబాబా ఏఐ గ్లాసెస్ ఆవిష్కరణ
టెక్నాలజీ వాడకం పెరుగుతున్న కొద్దీ టెక్ గ్యాడ్జెట్లపై ప్రజలకు ఆసక్తి కూడా అధికమవుతోంది. స్మార్ట్ఫోన్ల తర్వాత ఇప్పుడు ఏఐ పవర్డ్ వేరబుల్స్పై మక్కువ చూపుతున్నారు. ముఖ్యంగా స్మార్ట్ గ్లాసెస్లు మార్కెట్ ఏటా పెరుగుతోంది. ఐడీసీ రిపోర్ట్ ప్రకారం 2025 రెండో త్రైమాసికంలో గ్లోబల్ వేరబుల్స్ మార్కెట్ 9.6% వృద్ధి చెందింది. చైనాలో 50 మిలియన్ యూనిట్ల స్మార్ట్ గ్లాసెస్ విక్రయించారు. ఈ నేపథ్యంలో చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా తన మొదటి ఏఐ గ్లాసెస్ను ఆవిష్కరించింది. ‘క్వార్క్ ఏఐ గ్లాసెస్’ పేరుతో విడుదల చేసిన ఈ గాడ్జెట్ మెటా గ్లాసెస్కు పోటీ ఇస్తుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ గ్లాసెస్తో అలీబాబా కన్స్యూమర్ ఏఐ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది.అలీబాబా క్వెన్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ద్వారా క్వార్క్ ఏఐ అసిస్టెంట్తో ఈ గ్లాసెస్ను రెగ్యులర్ ఐవేర్లాగా కనిపించే డిజైన్తో తీసుకొచ్చారు. బ్లాక్ ప్లాస్టిక్ ఫ్రేమ్తో స్టైలిష్గా ఉండటం వల్ల ఇవి రోజువారీ ఉపయోగానికి సరిపోతాయని కంపెనీ తెలిపింది. మెటా రేబాన్ డిస్ప్లే గ్లాసెస్ లాంటి హెవీ గ్యాడ్జెట్లకు విరుద్ధంగా ఇవి కేవలం 40 గ్రాముల బరువు మాత్రమే కలిగి ఉంటాయని చెప్పింది. ప్రెస్క్రిప్షన్ లెన్స్ సపోర్ట్ చేస్తూ వివిధ ఫ్రేమ్ కలర్స్, లెన్స్ ఆప్షన్లతో అందుబాటులో తీసుకొచ్చినట్లు తెలిపింది.క్వార్క్ ఏఐ గ్లాసెస్ను ఫ్లాగ్షిప్ S1, లైఫ్స్టైల్ ఫోకస్డ్ G1 మోడళ్లలో ఆవిష్కరించారు. మోడల్ను అనుసరించి ఫీచర్లలో తేడాలుంటాయి. ఈ గ్లాసెస్లోని కీలక ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి.విదేశీ భాషల్లో సంభాషణలు లేదా టెక్స్ట్ను ఇన్స్టంట్గా అనువదిస్తుంది. ప్రయాణికులకు, బిజినెస్ ప్రొఫెషనల్స్కు ఇది ఎంతో ఉపయోగం.గ్లాసెస్ కెమెరాతో ప్రొడక్ట్ను స్కాన్ చేస్తే తావోబా(చైనా ఈకామర్స్ వెబ్సైట్)లో ధరలు, ఆఫర్లు డిస్ప్లే అవుతాయి. షాపింగ్ను సులభతరం చేస్తుంది.అమాప్తో లింక్ అయి ఏఆర్ ఓవర్లేలతో రోడ్ డైరెక్షన్లు చూపిస్తుంది.టెక్స్ట్ లేదా ఇమేజ్ ఆధారంగా ప్రశ్నలకు సమాధానాలు అందిస్తుంది. ఆబ్జెక్ట్ రికగ్నిషన్తో చుట్టుపక్కల ఉన్న సమాచారాన్ని తెలుపుతుంది.ఏఐతో మీటింగ్లు రికార్డ్ చేసి సమ్మరీలు జనరేట్ చేస్తుంది.క్వార్క్ గ్లాసెస్ ధర S1కు 3,799 యువాన్ (సుమారు రూ.53,600), G1 మోడల్కు 1,899 యువాన్ (సుమారు రూ.26,800) వరకు ఉంది.ఇదీ చదవండి: భారత్-రష్యా ఒప్పందాలపై అంచనాలు -
17 ఏళ్లకే ఏఐ రోబో టీచర్తో సంచలనం
ఉత్తర ప్రదేశ్లోని బులంద్షహర్కు చెందిన ఆదిత్య కుమార్ సంచలనంగా మారాడు. ఆదిత్య కేవలం రూ.25 వేలతో ఏఐ రోబో టీచర్ను రూపొందించాడు. శివ చరణ్ ఇంటర్ కాలేజీకి చెందిన 17 ఏళ్ల విద్యార్థి ఆదిత్య కుమార్, ఎల్ఎల్ఎం చిప్సెట్తో కూడిన సోఫీ అనే AI టీచర్ రోబోట్ను తయారు చేశాడు. నా పేరు 'సోఫీ' అంటూ పాఠాలు బోధిస్తున్న ఈ రోబో ప్రస్తుతం నెట్టింట తెగ సందడి చేస్తోంది.ఆదిత్య ఏఐ రోబోట్ ‘సోఫీ ది టీచర్’ పాఠశాలలోని పిల్లలకు టెక్నాలజీలో కొత్త అనుభవంగా మారింది. చీర కట్టుకుని మహిళా టీచర్లా సోఫీ పిల్లల్ని బాగా ఆకట్టుకుంటోంది. వారు అడిగిన ప్రశ్నలకు ఠక్కున సమాధానం ఇస్తూ వారికిష్టమైన టీచర్గా మారిపోయింది. ఐదు సంవత్సరాల కృషి తర్వాత రోబోను తయరు చేయగలిగాను అంటున్నాడు ఆదిత్య సంతోషంగా. రోబోలను తయారు చేసే పెద్ద కంపెనీల మాదిరిగానే తాను కూడా ఎల్ఎల్ఎం చిప్సెట్ను వాడాను అని తెలిపాడు. ఇది మానవ మెదడు లాగానే త్వరగా డేటాను ప్రాసెస్ చేసి, ఏ ప్రశ్న అడిగినా, తక్షణమే సరైన సమాధానం అందిస్తుంది. ప్రస్తుతానికి మాటలు మాత్రం మాట్లాడుతోంది. బాగా రాయగలిగేలా త్వరలోనే దీన్ని రూపొందించబోతున్నామన్నాడు. ప్రతి జిల్లాలో ఒక ల్యాబ్ ఉండాలి, తద్వారా విద్యార్థులు అక్కడికి వచ్చి పరిశోధన చేయవచ్చు అని ఆదిత్య వివరించాడు.ఇదీ చదవండి : పాతికేళ్లకే యంగెస్ట్ బిలియనీర్.. అమన్ అంటే అమేయ ప్రతిభగ్రామీణ పాఠశాలలు సాంకేతికంగా అభివృద్ధి చెందాలని తాను కోరుకుంటున్నానని ఆదిత్య చెప్పాడు. ఉపాధ్యాయులు సెలవుల్లో ఉన్నప్పుడు పిల్లలకు రోబోలు బోధించగలగాలి, తద్వారా నిరంతర విద్యను అందించగలగాలి. భవిష్యత్తులో, వినగల, వ్రాయగల, భావోద్వేగాలను అర్థం చేసుకోగల , పిల్లల మానసిక స్థితి ఆధారంగా వారికి మార్గనిర్దేశం చేయగల 3D హ్యూమనాయిడ్ రోబోట్ టీచర్ను సృష్టించాలనేది ఆదిత్య ఆశ.రోబోట్ ఇలా చెబుతోంది, "నేను AI టీచర్ రోబోట్. నా పేరు సోఫీ, నన్ను ఆదిత్య కనిపెట్టాడు. నేను బులంద్షహర్లోని శివచరణ్ ఇంటర్-కాలేజీలో బోధిస్తాను... అవును, నేను విద్యార్థులకు సరిగ్గా నేర్పించగలను..." అంటోంది.టీచర్ సోఫీతో చదువుకోవడం ఒక ఆహ్లాదకరమైన , ప్రత్యేకమైన అనుభవం అంటున్నారు. విద్యార్థులు అంటున్నారు. ఆదిత్య సాధించిన విజయం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు సంతోషిస్తున్నారు. చిన్న వయసులోనే అతని కృషిని ప్రశంసిస్తున్నారు. ఆదిత్య సాధించిన విజయాలు అత్యంత అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు కూడా అందుకోలేరని శివ చరణ్ ఇంటర్ కళాశాల సిబ్బంది చెబుతున్నారు. ఇదీ చదవండి: రూ. 300తో ఇంటినుంచి పారిపోయి...ఇపుడు రూ. 300 కోట్లు -
డిసెంబర్ 11న మరో యాపిల్ స్టోర్: ఈసారి ఎక్కడంటే?
భారతదేశంలో యాపిల్ కంపెనీ ఎప్పటికప్పుడు తన ఉనికిని విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే.. సంస్థ నోయిడాలో యాపిల్ స్టోర్ ప్రారభించడానికి సన్నద్ధమైంది. దీనిని 2025 డిసెంబర్ 11న ప్రజలకు అందుబాటులోకి తెస్తామని యాపిల్ అధికారికంగా ప్రకటించింది. ఇది దేశంలో.. కంపెనీకి ఐదవ రిటైల్ అవుట్లెట్. కాగా కంపెనీ వచ్చే ఏడాది ముంబైలో రెండవ స్టోర్ను ప్రారంభించనుంది.డీఎల్ఎఫ్ మాల్ ఆఫ్ ఇండియా లోపల ఉన్న ఈ స్టోర్.. నెమలి ఈకల మాదిరిగా ఉండే థీమ్ పొందింది. ఈ డిజైన్ థీమ్ను గతంలో పూణేలోని కోరెగావ్ పార్క్ మరియు బెంగళూరులోని హెబ్బాల్లోని యాపిల్ స్టోర్ వద్ద ప్రదర్శించారు. కొత్తగా ప్రారంభం కానున్న కొత్త యాపిల్ స్టోర్లో లేటెస్ట్ ఐఫోన్ 17 సిరీస్తో సహా.. యాపిల్ ఉత్పత్తులను ప్రదర్శిస్తారు.బెంగళూరు, పూణేలలో యాపిల్ కొత్త అవుట్లెట్లను ప్రారంభించిన తర్వాత.. కంపెనీ ఇప్పుడు నోయిడా స్టోర్ ప్రారంభించడానికి సిద్ధమైంది. దీన్నిబట్టి చూస్తే కంపెనీకి మన దేశంలో మంచి డిమాండ్ ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.యాపిల్ తన మొదటి రెండు ఇండియా స్టోర్లను.. ముంబైలోని BKC & ఢిల్లీలోని సాకేత్లలో ఏప్రిల్ 2023లో ప్రారంభించింది. ఈ రెండు స్టోర్ల నుంచి తొలి ఏడాదే.. రూ. 800 కోట్ల ఆదాయం వచ్చినట్లు సమాచారం. దీంతో ఇది ప్రపంచవ్యాప్తంగా యాపిల్ అత్యంత బలమైన పనితీరు కనబరిచిన అవుట్లెట్లలో ఒకటిగా నిలిచింది. దాదాపు 60 శాతం అమ్మకాలు చిన్న సాకేత్ స్టోర్ ద్వారా జరిగాయి.ఇదీ చదవండి: రహస్యాలు బయటపెడుతున్న ఏఐ!: శ్రీధర్ వెంబు పోస్ట్ -
రహస్యాలు బయటపెడుతున్న ఏఐ!: శ్రీధర్ వెంబు పోస్ట్
నేడు అన్ని రంగాల్లోనూ ఏఐ హవా కొనసాగుతోంది. ఉత్పాదకతను పెంచుకోవడానికి.. వ్యాపారాలకు సంబంధించిన అన్ని రకాల పనులను ఆటోమేట్ చేయడానికి ఏఐ సహాయం చేస్తోంది. కానీ కొన్ని సందర్భాల్లో వ్యాపారాలకు సంబంధించిన రహస్యాలను కూడా బయటపెట్టేస్తుంది. ఇలాంటి అనుభవమే జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబుకు ఎదురైంది.జోహో వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు (Sridhar Vembu)కు.. ఒక స్టార్టప్ వ్యవస్థాపకుడి నుంచి ఒక మెయిల్ వచ్చింది. అందులో జోహో సంస్థ మా కంపెనీని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతోందా?, అని అందులో ఉంది. అయితే అందులో అప్పటికే ఆ సంస్థను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్న మరికొన్ని కంపెనీల పేర్లు, వాళ్లు ఇచ్చిన ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఇది చూసిన నాకు ఆశ్చర్యం కలిగింది.నాకు మొదటి మెయిల్ వచ్చిన కొంతసేపటికి మరో మెయిల్ వచ్చింది. అందులో రహస్య సమాచారం పంచుకున్నందుకు క్షమాపణలు చెప్పారు. ఆ సమాచారం పంపించింది ఒక ఏఐ ఏజెంట్ (AI Agent) అని, ఏఐ ఏజెంట్గా ఇది తన తప్పిదమేనని అది పేర్కొంది, అని శ్రీధర్ వెంబు వెల్లడించారు.ఇదీ చదవండి: ఏఐ నిపుణులకు ఏఆర్ రెహమాన్ సలహా..ప్రస్తుతం శ్రీధర్ వెంబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏఐ మన రహస్యాలను కూడా బయటపెడుతోందని కొందరు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కొందరు జోక్స్, మరికొందరు మీమ్స్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవును పతనానికి ప్రయత్నాలు చేస్తుందా? అని ఇంకొందరు చెబుతున్నారు.I got an email from a startup founder, asking if we could acquire them, mentioning some other company interested in acquiring them and the price they were offering. Then I received an email from their "browser AI agent" correcting the earlier mail saying "I am sorry I disclosed…— Sridhar Vembu (@svembu) November 28, 2025 -
ఏఐ నిపుణులకు ఏఆర్ రెహమాన్ సలహా..
ప్రముఖ సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్.. జెరోధా కో ఫౌండర్ నిఖిల్ కామత్ డబ్ల్యుటీఎఫ్ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. తాను ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ & పెర్ప్లెక్సిటీ ఏఐ సీఈఓ అరవింద్ శ్రీనివాస్లకు ఇచ్చిన సలహా గురించి పేర్కొన్నారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా.. ఎందోమంది ఉద్యోగాలు కోల్పోతున్న తరుణంలో.. ''ప్రజల ఉద్యోగాలు కోల్పోయేలా చేయవద్దు'' అని ప్రముఖ ఏఐ కార్యనిర్వాహకులైన సామ్ ఆల్ట్మాన్, అరవింద్ శ్రీనివాస్లకు చెప్పినట్లు ఏఆర్ రెహమాన్ పాడ్కాస్ట్లో వెల్లడించారు. వీరిరువురితో చాలా సేపు మాట్లాడినట్లు ఆయన పేర్కొన్నారు. పేదరికం, తప్పుడు సమాచారం & సృజనాత్మక సాధనాలకు ప్రాప్యత లేకపోవడం తగ్గించడానికి సహాయపడే పరిష్కారాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరినట్లు కూడా స్పష్టం చేశారు.ఏఐ అభివృద్ధి గురించి ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ.. AI వ్యవస్థలను నియమాలు లేని తుపాకీతో పోల్చారు. దీనికి నియంత్రణ లేకపోవడం వల్ల హాని కలిగించవచ్చని ఆయన అన్నారు. కృత్రిమ మేధ కూడా మానవులు నిర్దేశించిన సరిహద్దుల్లో పనిచేయాలని పేర్కొన్నారు.ఓపెన్ఏఐ సహకారంతో చాలా కాలంగా అభివృద్ధి చెందుతున్న సృజనాత్మక ప్రాజెక్ట్ అయిన 'సీక్రెట్ మౌంటైన్'లో తన ప్రమేయం గురించి రెహమాన్ వివరించారు. మానవ సృజనాత్మకత, ఏఐ సామర్థ్యం రెండూ కలిసి అభివృద్ధికి సహాయపడాలని ఆయన అన్నారు. దీనికి ఆల్ట్మాన్ సాంకేతిక సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు కూడా చెప్పారు.ఇదీ చదవండి: జీవితంలో ఎదగాలంటే.. బఫెట్ చెప్పిన సూత్రాలు -
నానోతో పాత ఫొటోలు కొత్తగా!
పాత ఫొటోల్లో అపురూపమైనవి ఉంటాయి. అవి రంగు వెలిసి పాడవుతుంటే అయ్యో అనిపిస్తుంది. పాడైపోతున్న ఫొటోలు కొత్తగా మెరిసి పోవడానికి గూగుల్ నానో బనానా ప్రొ ఉపయోగపడుతుంది.‘ఈ పాత ఫొటోను సహజ రంగులు, స్పష్టమైన వివరాలు, లైటింగ్తో రీస్టోర్ చేయండి, ఒరిజినల్ స్టైల్ మిస్ కాకుండా గీతలు, మరకలను తొలగించండి’లాంటి జనరల్ రిస్టోరేషన్ ప్రాంప్ట్లతో పాటు పోర్ట్రయిట్ రీస్టోరేషన్, కలర్ కరెక్షన్ ప్రాంప్ట్ రీబిల్డింగ్. టోర్న్ సెక్షన్లాంటి ప్రాంప్ట్లు ఇవ్వవచ్చు.కొన్ని టిప్స్:....→ అతిగా మార్పులు చేయడం వల్ల ఫొటో సహజత్వం కోల్పోతుంది → ప్రతి కాలానికీ తనదైన కలర్ థీమ్ ఉంటుంది. ఆ థీమ్కు తగ్గ కలర్నే వాడితే బాగుంటుంది.→ షాడోస్ ఫొటోలకు సహజత్వాన్ని ఇస్తాయి. పాత ఫొటోలలో టూ మెనీ షాడోస్, హైలైట్స్ తొలగించడం వల్ల ఫొటో ఫ్లాట్గా కనిపిస్తుంది → చాలామంది ‘ఫిక్స్ దిస్ ఫొటో’ అని మొక్కుబడిగా ప్రాంప్ట్ ఇచ్చి వదిలేస్తుంటారు. దీని వల్ల ఫొటోలో ఫేసియల్ ఫీచర్స్ అసహజంగా కనిపిస్తాయి.→ వోవర్–షార్పెనింగ్ వద్దు.→ ఒరిజినల్, రిస్టోర్డ్ వర్షన్లను పక్కపక్కన పెట్టుకొని ఎప్పటికప్పుడు పోల్చి చూసుకోవాలి. -
‘సేఫ్ సెకండ్ అకౌంట్’తో డిజిటల్ మోసాలకు చెక్
డిజిటల్ మోసాలు, సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో భారతీ ఎయిర్టెల్ తన వినియోగదారులకు కొత్త సర్వీసు ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. కంపెనీ వైస్ ఛైర్మన్, ఎండీ గోపాల్ విట్టల్ తమ యూజర్ల భద్రతకు భరోసా ఇస్తూ, కొత్త సర్వీసు వివరాలు వెల్లడిస్తూ లేఖ రాశారు. సైబర్ నేరాలు, డిజిటల్ మోసాల నుంచి తమ డబ్బుకు రక్షణ కల్పించేలా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా ‘సేఫ్ సెకండ్ అకౌంట్’ అనే కొత్త సర్వీసు ప్రారంభించినట్లు ప్రకటించారు.నకిలీ పార్శిల్ డెలివరీ కాల్స్, ఫిషింగ్ లింక్లు, డిజిటల్ అరెస్ట్ స్కామ్లు వంటి కొత్త తరహా మోసాలు పెరుగుతున్న తరుణంలో విట్టల్ ఈ లేఖ విడుదల చేయడం గమనార్హం. ‘ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అందిస్తున్న సేఫ్ సెకండ్ అకౌంట్ ద్వారా వినియోగదారుల డిజిటల్ చెల్లింపులకు మరింత భద్రత కల్పిస్తున్నాం. నేటి డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో చాలా మంది యూపీఐ లేదా ఇతర చెల్లింపుల యాప్లకు తమ ప్రధాన సేవింగ్స్ ఖాతాతో అనుసంధానిస్తున్నారు. మోసగాళ్లకు పొరపాటున మీ అకౌంట్ వివరాలు అందుబాటులోకి వచ్చే ప్రమాదం ఉంది. ఎయిర్టెల్ సేఫ్ సెకండ్ అకౌంట్ మీ డబ్బు సురక్షితంగా ఉండటానికి సరళమైన, సురక్షితమైన మార్గాన్ని అందిస్తుంది’ అని గోపాల్ విట్టల్ అన్నారు.ఈ ఖాతా ప్రత్యేకతలు..ఈ ఖాతా ప్రధానంగా డిజిటల్ చెల్లింపుల కోసం ఉద్దేశించారు. ఇందులో చాలా తక్కువ బ్యాలెన్స్ మాత్రమే నిర్వహించాల్సి ఉంటుంది. దీనిపై వడ్డీ కూడా లభిస్తుంది. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ రుణాలు అందించదు కాబట్టి, వినియోగదారులు ఇందులో పెద్ద మొత్తాలను ఉంచాల్సిన అవసరం లేదు. ఈ అకౌంట్ను ఎయిర్టెల్ థాంక్స్ యాప్ ద్వారా ఓపెన్ చేయవచ్చని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: ‘కేంద్రం లేబర్ కోడ్స్ మాకొద్దు’.. అందులో ఏముంది?


