breaking news
Technology
-
యూట్యూబ్లో డబ్బు సంపాదించడం మరింత కష్టం!
డిజిటల్ కంటెంట్ ద్వారా ఆదాయం ఆర్జించాలనుకుంటున్న క్రియేటర్లకు ప్రముఖ వీడియో ప్లాట్ఫామ్ ‘యూట్యూబ్’ ఊహించని షాక్ ఇచ్చింది. యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ (వైపీపీ) ద్వారా యాడ్స్, సబ్స్క్రిప్షన్ల నుంచి డబ్బులు సంపాదించడానికి అవసరమైన ప్రాథమిక అర్హత ప్రమాణాల్లో మార్పులను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.కొత్త నిబంధనలు ఇవే..ప్రస్తుతం చలామణిలో ఉన్న నిబంధనల ప్రకారం కంటెంట్ క్రియేటర్లు ఏడాది కాలంలో (365 రోజుల్లో) 4,000 గంటల వాచ్ టైమ్ సాధించాల్సి ఉంది. నూతన ఉత్తర్వుల ప్రకారం ఇకపై 8,000 గంటల వాచ్ టైమ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే, యూట్యూబ్ షార్ట్స్ ద్వారా మానిటైజేషన్ పొందాలనుకునే వారు గత 90 రోజుల్లో పొందే వ్యూస్ పరిమితిని 10 మిలియన్ల నుంచి 20 మిలియన్లకు (2 కోట్లు) పెంచారు. అయితే, కనీసం 1,000 మంది సబ్స్క్రైబర్లు ఉండాలనే పాత నిబంధనలో ఎలాంటి మార్పూ చేయలేదు.ఈ నూతన నిబంధనలు 2027 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీనితో పాటు, ఇప్పటికే మానిటైజేషన్ పొందుతున్న క్రియేటర్లు కూడా షార్ట్స్ ద్వారా ఆదాయం కొనసాగించాలంటే ప్రతి 90 రోజుల వ్యవధిలో నిరంతరం 10 మిలియన్ల వ్యూస్ నిర్వహించడం తప్పనిసరి అని స్పష్టం చేసింది.ఎందుకు ఈ నిర్ణయం?ఇటీవలి కాలంలో ప్లాట్ఫామ్పై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రూపొందించిన లో-క్వాలిటీ, కాపీడ్, రీసైకిల్డ్ కంటెంట్ విపరీతంగా పెరిగిపోయింది. నాణ్యమైన అసలైన కంటెంట్ సృష్టికర్తలకు ప్రాధాన్యత ఇవ్వడానికి, ప్రకటనకర్తల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి గూగుల్ ఈ కఠిన చర్యలు చేపట్టింది.చిన్న క్రియేటర్లపై ప్రభావంయూట్యూబ్ను పూర్తికాల కెరీర్గా ఎంచుకోవాలని భావిస్తున్న ఔత్సాహిక క్రియేటర్లకు, చిన్న ఛానెళ్ల నిర్వాహకులకు ఈ నిర్ణయం గొడ్డలిపెట్టుగా మారనుంది. ఆదాయ మార్గాలు సాధించాలంటే మునుపటి కంటే రెండింతలు శ్రమించాల్సి రావడంతో ప్రారంభ దశలోనే అనేకమంది నిరాశకు గురయ్యే అవకాశాలున్నాయని సాంకేతిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఇదీ చదవండి: ఆకాశమే హద్దుగా పసిడి ధరలు.. ఒక్కరోజే ఇంతలా.. -
సోషల్ మీడియా దిగ్గజాలకు కోర్టులో చుక్కెదురు
పిల్లలు, యువతను తమ ప్లాట్ఫారమ్లకు బానిసలుగా మార్చేలా అల్గోరిథమ్లను రూపొందించాయనే ఆరోపణలపై బిగ్ టెక్ దిగ్గజాలు మెటా (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్), ఆల్ఫాబెట్ (గూగుల్/యూట్యూబ్), బైట్డాన్స్ (టిక్టాక్), స్నాప్చాట్లకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ సంస్థలపై నమోదైన 3,000కు పైగా ఫెడరల్ దావాలను కొట్టివేయాలంటూ దాఖలైన పిటిషన్లను శాన్ఫ్రాన్సిస్కోలోని ‘9వ యూఎస్ సర్క్యూట్ కోర్ట్ అఫ్ అప్పీల్స్’ తోసిపుచ్చింది. దీంతో ఈ కేసులన్నీ విచారణను ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది.వీగిపోయిన ‘సెక్షన్ 230’ రక్షణ కవచంయూజర్ల కంటెంట్కు ప్లాట్ఫారమ్లు బాధ్యత వహించవని పేర్కొనే ‘కమ్యూనికేషన్స్ డిసెన్సీ యాక్ట్ - సెక్షన్ 230’ కింద తమకు విచారణ నుంచి మినహాయింపు ఉందని టెక్ సంస్థలు వాదించాయి. అయితే, సెక్షన్ 230 విచారణలో ఒక వాదన మాత్రమే తప్ప, కేసుల ప్రారంభంలోనే పూర్తి రక్షణ కల్పించదని, ఈ అప్పీలు సమయానుకూలంగా లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్లాట్ఫారమ్ల రూపకల్పన, వాటికే అలవాటు పడేలా చేసే ఫీచర్ల వల్ల కలిగే నష్టాలపై దావాలు చెల్లుబాటు అవుతాయని పేర్కొంది.మానసిక ఆరోగ్య సంక్షోభంపై ఆందోళనవివిధ రాష్ట్రాల అటార్నీ జనరళ్లు, పాఠశాలల బోర్డులు, తల్లిదండ్రులు వేసిన ఈ దావాల్లో దిగ్భ్రాంతికర అంశాలు వెలుగుచూశాయి. పిల్లలలో డిప్రెషన్, ఆందోళన, శారీరక స్థితిపై అభద్రతాభావం, చివరికి ఆత్మహత్య ధోరణులు పెరగడానికి ఈ సోషల్ మీడియా డిజైన్లే ప్రధాన కారణమని పిటిషనర్లు ఆరోపించారు. ఇటీవల న్యూమెక్సికోలో మెటాకు 567 మిలియన్ డాలర్ల జరిమానా విధించడం, లాస్ ఏంజిల్స్ కోర్టులో బాధితురాలికి 6 మిలియన్ డాలర్ల పరిహారం ప్రకటించడం ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది.పరిశ్రమపై ప్రభావంకేవలం వినియోగదారుల ఎంగేజ్మెంట్కు, ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా 'ఇన్ఫినిట్ స్క్రోలింగ్', 'ఆటోప్లే' వంటి ఫీచర్లను ప్రవేశపెట్టిన టెక్ సంస్థల బాధ్యతారాహిత్యానికి ఈ తీర్పు ఒక హెచ్చరికని నిపుణులు చెబుతున్నారు. లాభాల కంటే పిల్లల డిజిటల్ భద్రతే ప్రాధాన్యమని నిరూపించే దిశగా ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగాన్ని ఇది సరికొత్త నియంత్రణల వైపు నడిపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: గౌతమ్ అదానీకి భారీ ఊరట -
బీఎస్ఎన్ఎల్ సరికొత్త ధమాకా ప్లాన్!
దేశీయ ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ప్రైవేట్ టెలికాం సంస్థలకు సవాలు విసురుతూ బ్రాడ్బ్యాండ్ రంగంలో వ్యూహాత్మక ఆఫర్ను అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులకు అతితక్కువ ధరకే వేగవంతమైన ఇంటర్నెట్తో పాటు అపరిమిత వినోదాన్ని అందించేందుకు రూ.999 ప్లాన్ను అధికారికంగా ప్రకటించింది.ప్లాన్ పూర్తి వివరాలు.. ఓటీటీ ప్రయోజనాలుబీఎస్ఎన్ఎల్ తన అధికారిక ఎక్స్ వేదికగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఈ ఫైబర్ (ఎఫ్టీటీహెచ్) బ్రాడ్బ్యాండ్ ప్లాన్లో నెలకు 200 Mbps గరిష్ట వేగంతో ఏకంగా 5000GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. దీనికి తోడు దేశవ్యాప్తంగా ఉచితంగా అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. డిజిటల్ కంటెంట్ ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో ఈ ప్లాన్తో ఉచితంగా JioHotstar, Sony LIV, ZEE5, Hungama OTT, Shemaroo OTT వంటి ప్రముఖ వినోద ప్లాట్ఫారమ్ల మెంబర్షిప్లను కూడా ఉచితంగా అందిస్తున్నారు.ఇతర ఆఫర్లుఓటీటీ ప్రియుల కోసం బీఎస్ఎన్ఎల్ మరొక ప్రత్యేక ‘ఫ్రీడమ్ ఆఫర్’ను కూడా ప్రవేశపెట్టింది. దీనికింద కొత్త, పాత ఎఫ్టీటీహెచ్ కస్టమర్లు కేవలం రూ.150లకే (సాధారణ ధర రూ.199) Sony LIV, JioHotstar, ZEE5 సభ్యత్వాలను 30 రోజుల పాటు పొందే వెసులుబాటు ఉంది. అంతేకాకుండా, మొబైల్ వినియోగదారుల కోసం కేవలం రూ.51కే కొత్త సిమ్ కార్డ్తో పాటు నెలకు రోజుకు 2GB డేటా, రోమింగ్తో సహా ఉచిత కాలింగ్, రోజుకు 100 SMSలు అందించే ఆఫర్ గడువును ఆగస్టు 31 వరకు పొడిగించింది.ఇదీ చదవండి: కేంద్రానికి పసిడి పంట -
ఇంగ్లండ్ జీవితంపై ‘గణిత మేధావి’ భావోద్వేగం
కృత్రిమ మేధ సాంకేతికత ఆధునిక ప్రపంచంలో సరికొత్త విప్లవాన్ని సృష్టిస్తోంది. శతాబ్దం క్రితం రూపుమాసిపోయిన చారిత్రక దృశ్యాలను, కనుమరుగైన దిగ్గజాల గొంతులను పునసృష్టించే దిశగా పురోగతిని సాధిస్తోంది. ఈ క్రమంలోనే భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ ఇంగ్లండ్లో గడిపిన కాలం నాటి అనుభవాలను ఆవిష్కరిస్తూ రూపొందించిన ఒక ఏఐ పోడ్కాస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇంగ్లండ్లోని ఒంటరితనం.. సంఖ్యల ప్రపంచంఈ ఆడియో పోడ్కాస్ట్లో ఏఐ ఆధారిత ‘రామానుజన్ డిజిటల్ అవతార్’ను ఇంగ్లండ్ జీవితం గురించి ప్రశ్నించగా ఆయన నాటి పరిస్థితులను అత్యంత భావోద్వేగంతో వివరించారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ప్రఖ్యాత గణితశాస్త్రజ్ఞుడు బీహెచ్ హార్డీతో కలిసి పనిచేసిన క్షణాలను గుర్తుచేసుకుంటూనే అక్కడ ఎదుర్కొన్న సవాళ్లను పంచుకున్నారు.‘ఇంగ్లండ్లోని తీవ్రమైన శీతల వాతావరణం, నియమబద్ధమైన శాకాహార భోజనం దొరకక శారీరకంగా ఎంతో ఇబ్బందులు పడ్డాను. నా శరీరం అక్కడి శీతాకాలపు చలికి వణికిపోయినప్పటికీ నా మనస్సులో నిరంతరం సంఖ్యల అమరికలు, సమీకరణాలే మెదులుతుండేవి’ అని ఏఐ వాయిస్ పలికిన తీరు నెటిజన్లను కట్టిపడేసింది.AI Podcasts will explode!I asked Ramanujan about his life in England.His answer -> pic.twitter.com/jRnLrcJ2uN— Ramsri Goutham Golla (@ramsri_goutham) August 9, 2026లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం), అత్యాధునిక వాయిస్ క్లోనింగ్ సాంకేతికతల కలయికతో రూపొందించిన ఈ పోడ్కాస్ట్ రామానుజన్ రాసిన లేఖలు, ఆయన జీవిత చరిత్రలోని అధికారిక ఆధారాలను ప్రామాణికంగా తీసుకుని సంభాషణను నిర్మించింది. కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితమైన చారిత్రక మేధావుల భావోద్వేగాలను, వారి జీవిత పోరాటాలను భావితరాలకు అత్యంత సజీవంగా అందించడంలో ఏఐ సాంకేతికత ఎంత శక్తివంతమైన సాధనంగా మారుతోందో ఈ వైరల్ వీడియో రుజువు చేస్తోంది.ఇదీ చదవండి: పబ్లిక్ వైఫై వాడే ప్రయాణికులే టార్గెట్! -
జియో రీచార్జ్: ఇవి టెన్షన్ లేని మంత్లీ ప్లాన్లు!
ప్రతి నెలా మొబైల్ రీచార్జ్ పెద్ద తలనొప్పిగా ఉంటుంది. ఎందుకంటే చాలా ప్లాన్లు 28 రోజుల వాలిడిటీతోనే ఉంటాయి. అయితే నెలనెలా రీచార్జ్ చేసుకునే వారికి రిలయన్స్ జియోకు చెందిన రెండు ప్రీపెయిడ్ ప్లాన్లు ఉపయోగకరంగా ఉన్నాయి. రూ.319, రూ.339 ధరలతో లభించే ఈ ప్లాన్లలో రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు అందుతాయి. ముఖ్యంగా వీటికి నెలవారీ సర్వీస్ వాలిడిటీ ఉండటం ప్రత్యేకత. అంటే ప్రతి 28 రోజులకు ఒకసారి రీచార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు.రూ.319 ప్లాన్.. ఏం లభిస్తాయంటే?జియో రూ.319 ప్రీపెయిడ్ ప్లాన్లో రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. దీనితోపాటు 18 నెలల గూగుల్ ఏఐ ప్రో సబ్స్క్రిప్షన్ను ఉచితంగా అందిస్తోంది. ఈ సబ్స్క్రిప్షన్ విలువ రూ.35,100గా కంపెనీ పేర్కొంటోంది. 5,000 జీబీ క్లౌడ్ స్టోరేజ్ వంటి ప్రయోజనాలు కూడా ఇందులో ఉన్నాయి. అయితే రోజువారీ డేటా పరిమితి 1.5 జీబీ కావడంతో అదనపు 5జీ డేటా ప్రయోజనం ఇందులో లేదు. జియో టీవీ, జియో ఏఐ లౌడ్ వంటి సేవలు కూడా బండిల్గా వస్తాయి.రూ.339 ప్లాన్.. అదనంగా టాక్టైమ్రూ.339 ప్రీపెయిడ్ ప్లాన్లోనూ రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. దీనికి కూడా నెలవారీ వాలిడిటీ ఉంటుంది. రూ.319 ప్లాన్తో పోలిస్తే ఇందులో రూ.14.95 విలువైన టాక్టైమ్ అదనంగా లభిస్తుంది. ఈ ప్లాన్లోనూ గూగుల్ ఏఐ ప్రో సబ్స్క్రిప్షన్, జియో టీవీ, జియో ఏఐ లౌడ్ ప్రయోజనాలు ఉన్నాయి. అయితే 5జీ డేటా ప్రత్యేకంగా అందుబాటులో ఉండదు.ఈ రెండు ప్లాన్లు దేశవ్యాప్తంగా అన్ని జియో టెలికాం సర్కిళ్లలో అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు మైజియో యాప్ ద్వారా వీటిని రీచార్జ్ చేసుకోవచ్చు. తరచూ రీచార్జ్ గడువు గుర్తుంచుకోవాల్సిన ఇబ్బంది లేకుండా నెలవారీ వాలిడిటీ కోరుకునే వారికి ఈ ప్లాన్లు అనుకూలంగా ఉంటాయి. -
పబ్లిక్ వైఫై వాడే ప్రయాణికులే టార్గెట్!
విమానాశ్రయాలు, కాన్ఫరెన్స్ హాళ్లు, ముఖ్యంగా హోటళ్లలో లభించే పబ్లిక్ వైఫై నెట్వర్క్లను వినియోగిస్తున్నారా? అయితే మీ వ్యక్తిగత, అధికారిక డేటా ప్రమాదంలో ఉన్నట్లేనని ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ హెచ్చరిక జారీ చేసింది. ప్రయాణికులు, కార్పొరేట్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని 'స్టార్మ్-2945' (రష్యా ఆధారిత 'మిడ్నైట్ బ్లిజార్డ్' సమూహం) అనే హ్యాకర్ల ముఠా 'క్యాప్టివ్క్రంచ్' పేరిట ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో సైబర్ దాడులకు పాల్పడుతున్నట్లు మైక్రోసాఫ్ట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ విభాగం బహిర్గతం చేసింది.దాడి ఎలా జరుగుతుంది?మనం హోటల్ లేదా పబ్లిక్ వైఫైకి కనెక్ట్ అయ్యే సమయంలో కనిపించే 'క్యాప్టివ్ పోర్టల్' (లాగిన్ స్క్రీన్) ఆధారిత నెట్వర్క్ వ్యవస్థలను హ్యాకర్లు తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు. యూజర్లు నెట్వర్క్లో లాగిన్ కాగానే నకిలీ మైక్రోసాఫ్ట్ 365 లాగిన్ పేజీలు లేదా విండోస్ అప్డేట్, డిఫెండర్ సెక్యూరిటీ స్కాన్, బ్రౌజర్ అప్డేట్ చేసుకోమంటూ నకిలీ పాప్అప్లను చూపిస్తున్నారు. యూజర్లు వీటిని నిజమైనవిగా భావించి క్లిక్ చేయగానే 'కార్న్ఫ్లేక్', 'చోకోషెల్' వంటి మాల్వేర్లు డివైజ్లోకి ప్రవేశిస్తాయి.వచ్చే ముప్పులు-నష్టాలుఈ మాల్వేర్ల ద్వారా సైబర్ నేరగాళ్లు బాధితుల కంప్యూటర్లు, మొబైళ్లపై పూర్తి నియంత్రణ సాధిస్తారు. బ్రౌజర్లో సేవ్ చేసిన పాస్వర్డ్లు, బ్యాంకింగ్ వివరాలు, బ్రౌజర్ కుకీలు, మైక్రోసాఫ్ట్ 365 ఖాతాల యాక్సెస్ను దొంగలిస్తారు. దీనికితోడు పరికరం మైక్రోఫోన్, కెమెరాలను రహస్యంగా ఆన్ చేసి ఆడియో, వీడియోలను రికార్డ్ చేయడం, స్క్రీన్షాట్లు తీయడం వంటి అక్రమాలకు ఒడిగడుతున్నారు.పాటించాల్సిన సురక్షిత చర్యలుప్రయాణాల్లో ఉన్నప్పుడు నమ్మదగని, తెలియని హోటల్ వైఫై కంటే సొంత మొబైల్ డేటా/హాట్స్పాట్ లేదా ఎన్క్రిప్టెడ్ ప్రైవేట్ కనెక్షన్లను ఉపయోగించడమే అత్యంత సురక్షితం.వైఫై కనెక్ట్ అయ్యే సమయంలో సాఫ్ట్వేర్, బ్రౌజర్ లేదా సిస్టమ్ అప్డేట్ చేయమంటూ వచ్చే పాప్అప్లను ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదు.సైబర్ ముప్పులను నివారించడానికి సురక్షిత వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ (వీపీఎన్), మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ (ఎంఎఫ్ఏ) ఫీచర్లను ఆన్లో ఉంచుకోవాలి.పబ్లిక్ నెట్వర్క్లు ఏ క్షణమైనా ప్రమాదకరంగా మారవచ్చని, డిజిటల్ భద్రత పట్ల ప్రయాణికులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సైబర్ భద్రతా నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
రూ.25 లక్షల జీతం.. రూ.50 లక్షలకు పెంపు! అయినా టెన్షన్..
భారీ జీతం పెంపు వస్తే ఎవరైనా ఆనందిస్తారు. కానీ ఓ టెక్ ఉద్యోగికి మాత్రం 100 శాతం జీతం పెరిగినా సంతోషం కంటే ఉద్యోగ భద్రతపై భయమే ఎక్కువైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ‘ఎక్స్’ పోస్టు ప్రకారం.. ఓ ఉద్యోగి వార్షిక ప్యాకేజీ రూ.25 లక్షల నుంచి ఏకంగా రూ.50 లక్షలకు పెరిగింది. అయితే, ఈ పెంపు కంపెనీలో భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపుల తర్వాత రావడం చర్చనీయాంశంగా మారింది.వైరల్ పోస్టు ప్రకారం.. కంపెనీలో సాధారణంగా జూన్లో ఉద్యోగుల పనితీరు మదింపు, జీతాల పెంపు ప్రక్రియ జరుగుతుంది. అయితే ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. మొత్తం 150 మంది ఉద్యోగుల్లో 50 మందిని కంపెనీ తొలగించినట్లు పోస్టులో పేర్కొన్నారు. దీంతో మిగిలిన ఉద్యోగులు తమకు ఇంక ఎలాంటి జీతాల పెంపు ఉండదని భావించారట. ‘‘కనీసం ఉద్యోగం మిగిలింది.. అదే చాలు’’ అనే పరిస్థితికి వచ్చారని పోస్టు పేర్కొంది.అయితే, అదే సమయంలో ఓ ఉద్యోగికి మాత్రం ఊహించని ఈమెయిల్ వచ్చింది. ప్రమోషన్తో పాటు ఏకంగా 100 శాతం జీతం పెంపు ప్రకటించినట్లు పోస్టులో ఉంది. దీంతో అతని వార్షిక ప్యాకేజీ రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలకు చేరింది.ఈ భారీ పెంపునకు కారణం కూడా ఆసక్తికరంగా ఉంది. ఉద్యోగి వారాంతంలో స్వయంగా రూపొందించిన ఓ చిన్న AI చాట్బాట్ ఆ సంస్థకు గణనీయమైన విలువను తీసుకొచ్చినట్లు వైరల్ పోస్టు పేర్కొంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా అతని సామర్థ్యాన్ని కంపెనీ గుర్తించి భారీగా పరిహారం పెంచినట్లు చెబుతోంది. అయితే, మేనేజర్ ఈ పెంపు సంస్థలోనే అత్యధికమైన వాటిలో ఒకటని చెప్పడంతో పాటు, తన జీతం గురించి ఇతర ఉద్యోగులతో మాట్లాడవద్దని సూచించినట్లు పోస్టులో ఉంది.అయితే ఇక్కడే ఉద్యోగికి ఆందోళన మొదలైంది. ఇప్పటికే కంపెనీ 50 మందిని తొలగించిన పరిస్థితిలో తన జీతం రెట్టింపు కావడం భవిష్యత్తులో తన ఉద్యోగానికి ప్రమాదంగా మారుతుందా? మరోసారి తొలగింపులు జరిగితే అధిక ప్యాకేజీ కారణంగా కొత్త ఉద్యోగం దొరకడం కష్టమవుతుందా? అనే సందేహాలు అతడిని వెంటాడుతున్నట్లు పోస్టు తెలిపింది.ముఖ్యంగా సిస్టమ్ డిజైన్ వంటి అంశాల్లో తనకు నైపుణ్యం ఉన్నప్పటికీ, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ (DSA) అంటే తనకు ఇష్టం లేదని, అదే సమయంలో రూ.50 లక్షల ప్యాకేజీ స్థాయి ఉద్యోగాలకు మారాలంటే ఇంటర్వ్యూల్లో డీఎస్ఏ నైపుణ్యాలు అవసరమవుతాయా అనే ఆందోళన కూడా అతడికి ఉందట.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఉద్యోగి ప్రస్తుత కంపెనీని వదిలి వెళ్లాలని అసలు కోరుకోవడం లేదు. తన మేనేజర్ అద్భుతమైన వ్యక్తి అని, మంచి వర్క్-లైఫ్ బ్యాలెన్స్తో పాటు తన ఉద్యోగాన్ని నిజంగా ఇష్టపడుతున్నానని చెప్పినట్లు పోస్టులో ఉంది. అందుకే అతని అసలు ప్రశ్న ‘ఇప్పుడే ఉద్యోగం మారాలా?’ అనేది కాదు.. ‘రేపు ఉద్యోగం పోతే మరో అవకాశానికి నేను సిద్ధంగా ఉన్నానా?’ అనేదే.ఈ కథనంపై సోషల్ మీడియాలోనూ భిన్నమైన స్పందనలు వచ్చాయి. కొందరు రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంపును గొప్ప అవకాశంగా అభివర్ణించగా, మరికొందరు ఉద్యోగ భద్రత, నైపుణ్యాల అప్డేట్, అత్యవసర పొదుపులపై దృష్టి పెట్టాలని సూచించారు.ఇదిలా ఉంటే, 2026లో టెక్ ఉద్యోగ మార్కెట్లో అధిక వేతనాలపై ఆకర్షణతో పాటు ఉద్యోగ భద్రతపై ఆందోళనలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల రూ.25 లక్షల ఉద్యోగాన్ని వదిలి విదేశాల్లో మాస్టర్స్ చేసిన ఓ భారతీయ టెకీ.. తిరిగి వచ్చాక వందలాది దరఖాస్తులు చేసినా కేవలం కొన్ని ఇంటర్వ్యూ కాల్స్ మాత్రమే వచ్చాయని, రూ.40–50 లక్షల ప్యాకేజీ ఆశించిన చోట రూ.25 లక్షల ప్యాకేజీ ఆఫర్లు మాత్రమే లభించాయని వెల్లడించాడు.The company doubled a guy’s salary to ₹50 LPAbut instead of just happiness, the hike brought a whole new fear. Every year, appraisals happened in june. This time, instead of appraisals, the company suddenly laid off around 50 out of 150 employees.Those of them who…— Pooja (@poojaofficial5) August 8, 2026 -
వానాకాలంలో ఈ గాడ్జెట్లు రెడీగా పెట్టుకోండి!
వాన వస్తూ వస్తూ... చిన్న చిన్న ఆనందాలతో పాటు కొన్ని చికాకులను కూడా తెస్తుంది. ఎప్పుడు కరెంట్ పోతుందో, ఎప్పుడు చలి పెరుగుతుందో, ఎప్పుడు ఏది తినాలనిపిస్తుందో అస్సలు అర్థం కాదు. అందుకే, ఇలాంటి వానాకాలపు చికాకులకు చెక్ పెట్టేందుకు కొన్ని క్యూట్ గాడ్జెట్లే ఇవి!చిన్న సూర్యుడు!దుప్పటి కప్పుకున్నా సరే... చేతులు మాత్రం చలికి బయటకు రావడానికి ఒప్పుకోవడం లేదా? ఇలాంటి సమయంలో పెద్ద హీటర్ పెట్టి గది నిండా వేడి చేయాల్సిన పనిలేదు. ఈ చిన్న హీటర్ ఉంటే చాలు. ఎక్కువ స్థలం ఆక్రమించకుండా గోడకు అమర్చేయొచ్చు. ఇందులోని రెండు రకాల గాలి వేగాలతో కావాల్సినంత వెచ్చదనాన్ని వెంటనే పొందొచ్చు. పెద్ద శబ్దం చేయకుండా పనిచేయడం వలన చదువుకునేటప్పుడు, పని చేసేటప్పుడు, నిద్రపోయేటప్పుడు కూడా ఇబ్బంది ఉండదు. బెడ్రూమ్, చిన్న ఆఫీస్, స్టడీ రూమ్, వర్క్స్పేస్ వంటి చిన్న ప్రదేశాల్లో వ్యక్తిగత వెచ్చదనం కోసం ఉపయోగపడుతుంది. కేవలం 200 గ్రాముల బరువుండటంతో ఒక చోటు నుంచి మరోచోటుకు తీసుకెళ్లడమూ ఈజీ. వర్షాకాలంలో చలి పెరిగినప్పుడు... చిన్న గదికి ఇది చిట్టి హీటింగ్ బడ్డీ! ధర రూ.700.చిల్ బ్రో.. లైట్ తీసుకో!వర్షాకాలం వచ్చిందంటే చాలు... వాన ఒకవైపు, కరెంట్ కోతలు మరోవైపు! చీకట్లో టార్చ్ కోసం వెతికే టెన్షన్ లేకుండా ఈ చిన్న రీచార్జబుల్ హ్యాంగింగ్ బల్బ్ను ఇంట్లో ఉంచుకుంటే చాలు. కరెంట్ పోయిన వెంటనే వెలిగించేయొచ్చు. హుక్తో ఎక్కడైనా వేలాడదీయొచ్చు. అవసరమైతే చేతిలో పట్టుకుని తీసుకెళ్లొచ్చు. మూడు లైటింగ్ మోడ్స్ ఉండటంతో అవసరాన్ని బట్టి వెలుతురు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. రెండు గంటలు పూర్తిగా చార్జ్ చేస్తే, దాదాపు 8 గంటల వరకు పనిచేస్తుంది. బలమైన, నీటిని తట్టుకునే డిజైన్ ఉండటంతో ఔట్డోర్ వినియోగానికీ పనికొస్తుంది. రెండు బల్బుల ప్యాక్ కావడంతో ఇంట్లో ఒకటి, కారు, ట్రావెల్ బ్యాగ్లో మరొకటి పెట్టుకోవచ్చు. ధర రూ. 450 మాత్రమే!పొగ లేదు, పొయ్యి లేదు... గ్రిల్రెడీ!బార్బెక్యూ తినాలనిపిస్తే బొగ్గులు వెతకాలి... పొయ్యి వెలిగించాలి... పొగతో ఇల్లు నింపాలి! ఇక ఈ హడావుడంతా ఎందుకు? ఈ ఎలక్ట్రిక్ బార్బెక్యూ గ్రిల్ ఉంటే చాలు... ప్లగ్ పెట్టి గ్రిల్ మొదలుపెట్టేయొచ్చు. 2000 వాట్ల పవర్తో పనీర్, కబాబ్స్, కూరగాయలు, స్క్యూయర్స్ ఇలా నచ్చినవన్నీ గ్రిల్ చేసుకోవచ్చు. ఉష్ణోగ్రతను మనకు కావాల్సినంత సర్దుకోవచ్చు. బొగ్గులు, కట్టెలు, పొయ్యి అవసరం లేదు... పొగ కూడా తక్కువగా ఉండేలా రూపొందించారు. కింద ఒక ట్రే ఉండటంతో శుభ్రం చేయడమూ ఈజీ. గ్రిల్లింగ్ ర్యాక్, స్క్యూయర్ సపోర్ట్ ఉండటంతో ఒకేసారి రకరకాల వంటకాలు సిద్ధం చేసుకోవచ్చు. వంటగదిలోనే కాదు... బాల్కనీ, టెర్రస్ లేదా చిన్న గ్యాదరింగ్లోనూ వాడుకోవచ్చు. అంటే... బార్బెక్యూ కోసం బయటకు వెళ్లాల్సిన పని లేదు. ధర రూ.1,800. -
ఒక్క రోజులో పెరగనున్న ఐఫోన్ ధర?
యాపిల్ ఐఫోన్ కొనుగోలుదారులకు షాక్ ఇచ్చే వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. ఐఫోన్ 17 (iPhone 17) సిరీస్ ధరలను ఆగస్టు 10 అంటే సోమవారం నుంచే పెంచే అవకాశం ఉందని తాజా లీక్ వెల్లడించింది. చైనీస్ సోషల్ మీడియాలో ఫిక్స్డ్ ఫోకస్ డిజిటల్ (Fixed Focus Digital) అనే టెక్ లీకర్ చేసిన పోస్టు ఈ ఊహాగానాలకు కారణమైంది. అయితే ధర ఎంత పెరుగుతుంది, ఏ మోడళ్లకు వర్తిస్తుంది అనే వివరాలను లీకర్ వెల్లడించలేదు. అయితే యాపిల్ నుంచి ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.ఈ వార్తకు ప్రధాన కారణంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న మెమరీ, స్టోరేజ్ చిప్ల ధరలు కనిపిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ల విస్తరణతో మెమరీ చిప్లకు డిమాండ్ పెరగడం, సరఫరాపై ఒత్తిడి ఏర్పడటం వల్ల హార్డ్వేర్ తయారీ వ్యయాలు పెరిగాయి. ఈ ప్రభావం ఇప్పటికే యాపిల్ ఉత్పత్తులపై కనిపించింది. జూన్లో కంపెనీ భారత్లో మ్యాక్బుక్, ఐపాడ్ తదితర ఉత్పత్తుల ధరలను భారీగా పెంచింది. కొన్ని మోడళ్లలో పెంపు రూ.1 లక్ష వరకు వెళ్లింది.అయితే ఆ ధరల పెంపు సమయంలో ఐఫోన్ ధరలు మాత్రం పెంచలేదు. అందుకే ఇప్పుడు ఐఫోన్ 17పై కూడా ధరల భారం పడుతుందన్న వార్త ప్రాధాన్యం సంతరించుకుంది. యాపిల్ గతంలో పెరిగిన కాంపోనెంట్ వ్యయాలను కొంతకాలం భరించినప్పటికీ, మెమరీ ధరల పెరుగుదల తీవ్రంగా మారడంతో వినియోగదారులపై కొంత భారాన్ని మోపాల్సి వస్తోందని కంపెనీ వివరణ ఇచ్చింది.ఐఫోన్ 17కు ఎక్కువ కాలం డిమాండ్?ఇక 2026లో యాపిల్ ఐఫోన్ లాంచ్ వ్యూహంలో మార్పులు చేయనున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం ఐఫోన్ 18 Pro, ఐఫోన్ 18 Pro Max, అలాగే యాపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ సెప్టెంబర్లో రావచ్చని సమాచారం. అదే సమయంలో సాధారణ ఐఫోన్ 18, ఐఫోన్ 18e మోడళ్లను 2027 రెండో త్రైమాసికానికి వాయిదా వేయవచ్చన్న అంచనాలు ఉన్నాయి.అది నిజమైతే ఐఫోన్ 17 సాధారణం కంటే ఎక్కువ కాలం యాపిల్ లైనప్లో కొనసాగాల్సి ఉంటుంది. దీంతో కొత్త Pro మోడళ్లు వచ్చిన తర్వాత కూడా సాధారణ ధర శ్రేణిలో ఐఫోన్ 17కు డిమాండ్ కొనసాగవచ్చు. ఈ నేపథ్యంలో ధరల పెంపు జరిగితే, ప్రస్తుత ఐఫోన్ 17 కొనుగోలు చేయాలనుకునే వారికి ఆగస్టు 10 కీలక తేదీగా మారే అవకాశం ఉంది.అన్ని ఐఫోన్ 17 మోడళ్ల ధరలు పెరుగుతాయా?ప్రస్తుత లీక్ దీనిపై స్పష్టత ఇవ్వలేదు. ముఖ్యంగా ఐఫోన్ 17 Pro, Pro Max ధరలు పెంచితే, వాటి తర్వాతి తరం మోడళ్లు త్వరలోనే రానున్న నేపథ్యంలో ఆ నిర్ణయం యాపిల్కు కొంత సంక్లిష్టంగా మారవచ్చు. కాబట్టి యాపిల్ అధికారిక ధరల జాబితాను విడుదల చేసే వరకు ఎదురుచూడక తప్పదు. -
ఎయిర్టెల్, విఐలకు సుప్రీంకోర్టు నోటీసులు!
బాంబే హైకోర్టు వన్ టైమ్ స్పెక్ట్రమ్ ఛార్జీలను రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన అనంతరం, సుప్రీంకోర్టు టెలికాం ఆపరేటర్లైన భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలకు నోటీసులు జారీ చేసింది.2008 నుంచి 2012 మధ్య 6.2 MHz కంటే ఎక్కువ స్పెక్ట్రమ్ కలిగి ఉన్న కంపెనీల నుంచి ప్రభుత్వం వన్టైమ్ స్పెక్ట్రమ్ ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. అయితే ఈ ఛార్జీలను వెనక్కి తీసుకోవాలంటూ బాంబే హైకోర్టు జూన్లో తీర్పు ఇచ్చింది. దీంతో ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాకు భారీ ఊరట లభించింది.అయితే.. హైకోర్టు తీర్పుతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. స్పెక్ట్రమ్ అనేది పరిమితమైన వనరు కాబట్టి, కంపెనీలు 6.2 MHz కంటే ఎక్కువ స్పెక్ట్రమ్ ఉపయోగించినందుకు ఛార్జీలు చెల్లించాల్సిందేనని కేంద్రం వాదిస్తోంది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఇప్పుడు టెలికాం కంపెనీల వివరణ కూడా తీసుకోవాలని నిర్ణయించింది. అందుకే రెండు కంపెనీలకు నోటీసులు జారీ చేసింది.ప్రస్తుతం.. బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు. దీంతో హైకోర్టు తీర్పు ప్రస్తుతానికి కొనసాగుతోంది. అయితే.. కేసు తుది నిర్ణయం ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ వాదనను సమర్థిస్తే.. ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి కంపెనీలపై భారీగా ఛార్జీల భారం పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆర్థిక ఒత్తిడిలో ఉన్న టెలికాం కంపెనీలకు ఇది మరింత కష్టమవుతుంది. -
జియో కొత్త ప్లాన్లు.. ఓటీటీ ప్రియులకు పండగే!
డిజిటల్ నెట్వర్క్ రంగంలో తన ఆధిపత్యాన్ని మరింత సుస్థిరం చేసుకుంటూ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో వినియోగదారులకు సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. విశేష ఆదరణ పొందిన ‘జియో ఓటీటీ-పాస్’ పోర్ట్ఫోలియోను విస్తరిస్తూ.. కొత్తగా 3 నెలల (త్రైమాసిక), 1 సంవత్సరం (వార్షిక) వ్యాలిడిటీ ప్లాన్లను అధికారికంగా లాంచ్ చేసింది. తక్కువ ఖర్చుతోనే వినియోగదారులకు మరింత ఎక్కువ డేటాను, నిరంతరం ప్రీమియం వినోదాన్ని అందించడమే లక్ష్యంగా జియో ఈ నిర్ణయం తీసుకుంది.కొత్త ప్లాన్ల వివరాలురూ.200 ఓటీటీ పాస్: 28 రోజుల వ్యాలిడిటీతో 30 జీబీ హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ 5జీ డేటా లభిస్తుంది. (వాయిస్-ఓన్లీ ప్యాక్లు మినహా) యాక్టివ్ బేస్ ప్లాన్ ఉన్న జియో వినియోగదారులందరూ రీఛార్జ్ చేసుకోవచ్చు.రూ.550 ఓటీటీ పాస్ (కొత్తది): 84 రోజుల సుదీర్ఘ వ్యాలిడిటీతో మొత్తం 90 జీబీ హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ 5జీ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. 3 నెలలు లేదా 1 సంవత్సరం బేస్ ప్లాన్ ఉన్న చందాదారులకు ఇది వర్తిస్తుంది.రూ.2,000 ఓటీటీ పాస్ (కొత్తది): ఏడాది పొడవునా (365 రోజుల వ్యాలిడిటీ) నిరంతరాయ సేవలతో 365 జీబీ హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ 5జీ లభిస్తుంది. 1 సంవత్సరం బేస్ ప్లాన్ ఉన్న జియో వినియోగదారులకు ఇది ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది.ప్రతినెల రూ.1,500 ప్రయోజనాలుఈ ఓటీటీ-పాస్ సబ్స్క్రిప్షన్ల ద్వారా వినియోగదారులకు ప్రతినెల దాదాపు రూ.1,500 విలువైన ప్రయోజనాలు దక్కనున్నాయి. ఇందులో 15 అధునాతన ప్రీమియం ఓటీటీ యాప్లతో పాటు జియోటీవీ యాప్ ద్వారా 1,000కి పైగా లైవ్ టీవీ ఛానెళ్లను ఉచితంగా వీక్షించే వెసులుబాటును కల్పించారు.ప్లాన్ ధరవ్యాలిడిటీహై-స్పీడ్ డేటాప్రధాన ప్రయోజనాలురూ. 20028 రోజులు30 GBఅన్లిమిటెడ్ 5జీ + ప్రైమ్ వీడియో మొబైల్ + ఓటీటీలురూ. 55084 రోజులు90 GBఅన్లిమిటెడ్ 5జీ + అమెజాన్ ప్రైమ్ లైట్ + ఓటీటీలురూ. 2000365 రోజులు365 GBఅన్లిమిటెడ్ 5జీ + అమెజాన్ ప్రైమ్ లైట్ + ఓటీటీలుయూజర్లకు లభించే ఓటీటీ బెనిఫిట్స్యూట్యూబ్ ప్రీమియం: స్మార్ట్ టీవీ, ట్యాబ్, మొబైల్ల్లో ఎలాంటి ప్రకటనలు లేని స్ట్రీమింగ్, బ్యాక్గ్రౌండ్ ప్లే, ఆఫ్లైన్ డౌన్లోడ్ సౌకర్యం.జియోహాట్స్టార్ మొబైల్ + హాలీవుడ్: లైవ్ స్పోర్ట్స్ మ్యాచ్లు, హాట్స్టార్ ఒరిజినల్స్, హాలీవుడ్ హిట్ సినిమాల ప్రత్యక్ష వీక్షణ.అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్: రూ.550, రూ.2,000 పాస్లపై ‘అమెజాన్ ప్రైమ్ లైట్’.. అలాగే రూ.200 పాస్పై ‘ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్’ యాక్సెస్ లభిస్తుంది.12 ఇతర ప్రీమియం యాప్లు: సోనీ లివ్, జీ5, లయన్స్ గేట్ ప్లే, డిస్కవరీ+, సన్ నెక్స్ట్, ఫ్యాన్కోడ్, హోయ్చోయ్, చౌపాల్, ప్లానెట్ మరాఠీ, కంచా లంకా, టైమ్స్ ప్లే, తరంగ్ ప్లస్ యాప్లను జియోటీవీ వేదికగా సులభంగా వీక్షించవచ్చు.1000+ లైవ్ టీవీ ఛానెళ్లు: స్టార్ ప్లస్ హెచ్డీ, కలర్స్ హెచ్డీ, సెట్ హెచ్డీ, సన్ టీవీ హెచ్డీ, డిస్కవరీ, కార్టూన్ నెట్వర్క్ వంటి అగ్రగామి ఛానెళ్లు ప్రసారమవుతాయి.కొత్తగా మార్కెట్లోకి వచ్చిన రూ.550, రూ.2,000 జియో ఓటీటీ-పాస్లు ప్రస్తుతం మైజియో యాప్, అధికారిక Jio.com వెబ్సైట్, అధీకృత డిజిటల్ రీటైల్ అవుట్లెట్లలో రీఛార్జ్ చేయడానికి అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరలో విస్తృతమైన డేటా, నిరంతరాయ వినోదాన్ని కోరుకునే చందాదారులకు ఈ కొత్త ప్లాన్లు ఒక గొప్ప డిజిటల్ వరం అని చెప్పవచ్చు.ఇదీ చదవండి: పెట్రోల్ వెనుక ఉన్న అసలు నిజాలు -
యాపిల్ దావాపై ఓపెన్ ఏఐ కౌంటర్
గ్లోబల్ టెక్ పరిశ్రమలో ఇద్దరు దిగ్గజాల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు ఇప్పుడు తీవ్రరూపం దాల్చింది. తమ వాణిజ్య రహస్యాలను చోరీ చేసిందంటూ ఐఫోన్ మాతృసంస్థ యాపిల్ దాఖలు చేసిన పిటిషన్ను తక్షణమే కొట్టివేయాలని చాట్జీపీటీ రూపకర్త ఓపెన్ ఏఐ యూఎస్ ఫెడరల్ కోర్టును అభ్యర్థించింది. తాము యాపిల్ ఉత్పత్తులకు పూర్తిగా భిన్నమైన, అత్యంత ప్రతిష్టాత్మకమైన సరికొత్త ఏఐ హార్డ్వేర్ వ్యవస్థను నిర్మిస్తున్నామని తెలిపింది. యాపిల్ సీక్రెట్స్తో తమకు ఎలాంటి అవసరం లేదని న్యాయస్థానానికి స్పష్టం చేసింది.క్యాలిఫోర్నియా నార్తర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో దాఖలు చేసిన 31 పేజీల మోషన్లో ఓపెన్ ఏఐ సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘యాపిల్ దావాకు తగిన ప్రాతిపదిక లేదు. ఏఐ రంగంలో తగినంత వేగంగా ఆవిష్కరణలు చేయలేకపోవడం, తమ అత్యుత్తమ ఇంజినీరింగ్ ప్రతిభావంతులను నిలుపుకోవడంలో విఫలం కావడమే యాపిల్ అసలు సమస్య. తమ సొంత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే యాపిల్ ఈ రకమైన వ్యూహాత్మక కేసులను నమోదు చేస్తోంది’ అని ఓపెన్ ఏఐ గట్టిగా వాదించింది.గత జులైలో యాపిల్ కోర్టును ఆశ్రయిస్తూ.. తమ మాజీ ఉద్యోగులు, డిజైన్ హెడ్ టాంగ్ టాన్ వంటి వారి ద్వారా ఓపెన్ ఏఐ తమ హార్డ్వేర్ సమాచారాన్ని దొంగిలించిందని ఆరోపించింది. అయితే, నైపుణ్యం కలిగిన నిపుణులను సాధారణ పారిశ్రామిక నిబంధనల ప్రకారమే నియమించుకున్నామని, ఇందులో ఎలాంటి చట్టవిరుద్ధమైన ప్రక్రియ లేదని ఓపెన్ ఏఐ ప్రతిఘటించింది.గతంలో ఐఫోన్ సాధనాల్లో ‘సిరి’, చాట్జీపీటీని అనుసంధానించేందుకు భాగస్వాములుగా పనిచేసిన ఈ రెండు సంస్థలు ఇప్పుడు రాబోయే తరం ఏఐ పరికరాల మార్కెట్పై ఆధిపత్యం కోసం ప్రత్యర్థులుగా మారడం ప్రాధాన్యత సంతరించుకుంది. స్మార్ట్ఫోన్ల యుగాన్ని అధిగమించే కొత్త ఏఐ హార్డ్వేర్ను తీర్చిదిద్దడంలో ఓపెన్ ఏఐ దూకుడుగా వ్యవహరిస్తుండటంతో యాపిల్ కలవరపడుతోందని కొందరు చెబుతున్నారు. కాగా, ఈ పిటిషన్పై వచ్చే అక్టోబరు 1న కోర్టులో కీలక విచారణ జరగనుంది.ఇదీ చదవండి: పెట్రోల్ వెనుక ఉన్న అసలు నిజాలు -
ఏఐ ఏజెంట్లతో జాగ్రత్త
న్యూఢిల్లీ: కృత్రిమ మేథతో (ఏఐ) పొంచి ఉన్న రిస్క్ లను ఆర్థిక రంగం తేలిగ్గా తీసుకోకూడదని ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి. అనంత నాగేశ్వరన్ హెచ్చరించారు. వేరే ఏఐ సిస్టమ్లలోకి చొరబడేందుకు ఏఐ ఏజెంట్లు ప్రయత్నం చేస్తున్న ఉదంతాలు పెరుగుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో టెక్నాలజీతో ప్రయోజనాలు పొందాలనే తాపత్రయంతో దాన్ని వాడుకోవడానికి ముందు, దాన్నుంచి తలెత్తే రిస్క్ లను ఎదుర్కొనే భద్రత చర్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఏఐ ముప్పులు వాస్తవ రూపం దాల్చే వరకు పట్టించుకోకుండా చూస్తూ కూర్చునేంత సమయం మన దగ్గర లేదన్నారు. పరిశ్రమల సమాఖ్య అసోచాం నిర్వహించిన మూడో ఫిన్టెక్ ఫెస్టివల్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు పేర్కొన్నారు. ఏఐ సామర్థ్యం పెరిగినా, వినియోగం మానవ పర్యవేక్షణలోనే ఉండాలని వివరించారు. కొన్ని వర్గాలను వడపోసి, వేరు చేసేందుకు ఏఐ ఒక సాధనంగా మారకూడదని చెప్పారు. మరోవైపు, ఆర్థిక సంస్థలు తమ కస్టమర్ల రుణార్హతలను మరింత సమర్థ్ధవంతంగా విశ్లేషించేందుకు, డిఫాల్ట్ రిస్క్ లు.. ఆర్థిక ఒత్తిళ్ల గురించి ముందస్తుగానే హెచ్చరించేందుకు ఏఐ సహాయకరంగా ఉండగలదని నాగేశ్వరన్ చెప్పారు. ఎకానమీలోని వివిధ రంగాలు సాంకేతికతను వినియోగించుకోవడానికి ఫిన్టెక్ రంగం తోడ్పడుతుందని ఆయన తెలిపారు. రాబోయే 20 ఏళ్లు సవాళ్లమయం.. 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టాక గడిచిన మూడు దశాబ్దాలతో పోలిస్తే రాబోయే 20 ఏళ్లు చాలా గడ్డుకాలంగా గడిచే అవకాశం ఉందని నాగేశ్వరన్ చెప్పారు. వాతావరణం, సాంకేతికత, భౌగోళిక రాజకీయ పరిస్థితులు, సామర్థ్యాలను ఆయుధాలుగా వినియోగించుకునే ధోరణులు పెరుగుతుండటం తదితర సవాళ్లు ఇందుకు కారణమని వివరించారు. వీటన్నింటినీ అధిగమించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందన్నారు. రాబోయే రోజుల్లో వస్తు, సేవల వ్యాపార పరిమాణాన్ని పెంచుకోవడం చాలా కీలకమని ఆయన చెప్పారు. -
జియో ఆఫర్.. 15 నెలల ప్లాన్పై రూ.6 వేలు డిస్కౌంట్!
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలయన్స్ జియో బ్రాడ్బ్యాండ్ వినియోగదారులకు ఆకర్షణీయమైన ఆఫర్ను తీసుకొచ్చింది. 15 నెలల 100 Mbps బ్రాడ్బ్యాండ్ ప్లాన్ను రూ.10,000కే అందిస్తోంది. సాధారణంగా దాదాపు రూ.16,000 వరకు ఖర్చయ్యే ఈ ప్లాన్పై ఏకంగా రూ.6,000 వరకు ప్రయోజనం లభించనుంది. ఈ ఆఫర్ ప్రస్తుతం కొంతమంది వినియోగదారులకు మై జియో యాప్లో కనిపిస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి. అయితే దీని లభ్యత ప్రాంతం, కనెక్షన్ రకం, కస్టమర్ ప్రొఫైల్ను బట్టి మారే అవకాశం ఉంది.నెలకు రూ.400 తగ్గింపు!15 నెలలకు రూ.10,000 చెల్లిస్తే నెలకు సగటున రూ.666 పడినట్లవుతుంది. సాధారణ ధరతో పోలిస్తే ఇది నెలవారీ వ్యయంలో సుమారు రూ.400 తగ్గింపు అన్నమాట. అయితే రీచార్జ్ చేసే ముందు మైజియో యాప్లో చూపించే జీఎస్టీతో కలిపిన తుది ధర, ప్లాన్ నిబంధనలు పరిశీలించడం మంచిది.ప్లాన్ ప్రయోజనాలుఈ ఫ్రీడమ్ ఆఫర్లో 100 Mbps వరకు ఇంటర్నెట్ స్పీడ్తో అపరిమిత డేటా లభిస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేవారికి, ఆన్లైన్ క్లాసులు, వీడియో కాల్స్, 4K స్ట్రీమింగ్, గేమింగ్ వంటి అవసరాలకు ఈ స్పీడ్ ఉపయోగపడుతుంది.ఈ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ 12కి పైగా ఓటీటీ ప్లాట్ఫామ్లకు యాక్సెస్ను కూడా అందిస్తుంది. వీటిలో జియో హాట్ స్టార్, సోనీ లివ్, జీ5, అనేక ఇతర ప్రసిద్ధ ఎంటర్టైన్మెంట్ యాప్లు ఉన్నాయి. ఇది ప్రత్యేక ఓటీటీ సబ్స్క్రిప్షన్ల అవసరాన్ని తొలగిస్తుంది. ఓటీటీతో పాటు ఈ ప్లాన్లో 1,000 లైవ్ టీవీ ఛానెళ్లు కూడా ఉన్నాయి. -
హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ క్లౌడ్ రీజియన్..
సాక్షి, హైదరాబాద్: టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ వేదికగా భారత్లో తన నాలుగో క్లౌడ్ కేంద్రాన్ని ప్రారంభించింది. సాంకేతిక రంగంలో అత్యంత ప్రాధాన్యంగల ఈ ప్రాజెక్టు దేశంలోనే అత్యంత భారీ డేటా కేంద్రాల నెట్వర్క్గా రూపుదిద్దుకోనుందని కంపెనీ గురువారం ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ తన డిజిటల్ మౌలిక సదుపాయాల విస్తరణ కోసం సుమారు రూ. 1.70 లక్షల కోట్ల నిధులు కేటాయించింది. ఈ పెట్టుబడిలో భాగంగా కేవలం హైదరాబాద్ క్లౌడ్ కేంద్రంలో మౌలిక సదుపాయాల కోసమే వచ్చే 15 ఏళ్లలో రూ. 15,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాలని సంస్థ నిర్ణయించింది.2 కోట్ల మందికి ఏఐలో శిక్షణ..హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఈ సరికొత్త కేంద్రానికి ఇండియా సౌత్ సెంట్రల్ అని నామకరణం చేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ సర్వర్ల వేడిని తగ్గించడానికి గాలి ఆధారిత శీతలీకరణ పద్ధతిని ఇక్కడ ప్రవేశపెట్టారు. దీనివల్ల ఒక్క చుక్క నీరు కూడా వృథా కాదు. ఈ కేంద్రాల నిర్వహణకు అవసరమైన విద్యుత్ కోసం దేశవ్యాప్తంగా 1,000 మెగావాట్ల సామర్థ్యంగల సౌర, పవన విద్యుత్ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. వ్యాపార విస్తరణతోపాటు 2030 నాటికి 2 కోట్ల మంది భారతీయులకు ఏఐ రంగంలో నైపుణ్య శిక్షణ ఇవ్వాలని మైక్రోసాఫ్ట్ లక్ష్యంగా పెట్టుకుంది. -
ఏఐ సాయంతో పుట్టించిన వైరస్ ఇది!
కృత్రిమ మేధస్సు (AI) శక్తి మరో కీలక మైలురాయిని చేరుకుంది. ఇప్పటివరకు ప్రకృతిలో కనిపించని కొత్త వైరస్లను ఏఐ సాయంతో తొలిసారి శాస్త్రవేత్తలు రూపొందించారు. జీవసాంకేతిక రంగంలో ఇది సంచలన ముందడుగుగా భావిస్తున్నారు. ఈ సాంకేతికత భవిష్యత్లో కొత్త వైద్య చికిత్సల అభివృద్ధికి, ముఖ్యంగా యాంటీబయాటిక్లకు లొంగని బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడంలో కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అదే సమయంలో ‘బయోసెక్యురిటీ’ ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి.అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, ఎంఐటీ–హార్వర్డ్ బ్రాడ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలు ప్రముఖ ‘సైన్స్’ జర్నల్లో ప్రచురితమయ్యాయి. బ్యాక్టీరియాను మాత్రమే సోకే ఒక రకమైన వైరస్ అయిన **ఫేజ్ (Phage)**ను నమూనాగా తీసుకున్న పరిశోధకులు.. దాని జన్యు నిర్మాణాన్ని ఆధారంగా చేసుకుని ఏఐ సాయంతో వేలాది కొత్త వైరస్ జన్యు నమూనాలను రూపొందించారు. వీటిలో దాదాపు 300 జన్యు నమూనాలను ప్రయోగశాలలో తయారు చేసి పరీక్షించగా.. 16 వైరస్లు సజీవంగా పనిచేసే సామర్థ్యం కలిగి ఉన్నట్లు గుర్తించారు.బ్యాక్టీరియాను అంతం చేయడంలో మెరుగైన పనితీరుపరిశోధనలో భాగంగా రూపొందించిన కృత్రిమ వైరస్లను పరీక్షించగా.. అవి ఈ–కొలై (E. coli) బ్యాక్టీరియాను నాశనం చేయడంలో సహజంగా లభించే వైరస్ల కంటే మెరుగైన ప్రభావం చూపినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. యాంటీబయాటిక్లకు లొంగని బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఆరోగ్య సమస్యగా మారుతున్న నేపథ్యంలో.. ఈ పరిశోధన భవిష్యత్ చికిత్సలకు కొత్త మార్గాలను తెరవొచ్చని నిపుణులు భావిస్తున్నారు.వైద్య రంగానికి కొత్త ఆశలుప్రస్తుతం తీవ్రమైన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల చికిత్సలో యాంటీబయాటిక్ నిరోధకత పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో నిర్దిష్ట బ్యాక్టీరియాను లక్ష్యంగా చేసుకుని నాశనం చేసే ఫేజ్ థెరపీ అభివృద్ధిలో ఏఐ రూపొందించిన వైరస్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏఐ సాయంతో అవసరానికి తగ్గట్టు వైరస్లను రూపొందించే అవకాశం భవిష్యత్లో మరింత సమర్థవంతమైన చికిత్సలకు దోహదపడొచ్చని అంచనా వేస్తున్నారు.అయితే ఆందోళనలు కూడా..ఏఐతో వైరస్ల రూపకల్పన సామర్థ్యం వైద్య రంగానికి ఎంత ఉపయోగకరమో.. అదే స్థాయిలో దుర్వినియోగానికి గురైతే ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హానికరమైన వైరస్ల రూపకల్పనకు ఈ సాంకేతికత ఉపయోగపడకుండా కఠినమైన నియంత్రణలు, భద్రతా ప్రమాణాలు, పర్యవేక్షణ వ్యవస్థలు అవసరమని సూచిస్తున్నారు.“మంచి ప్రయోజనాల కోసం ఉపయోగిస్తే ఇది శాస్త్రరంగంలో గొప్ప ముందడుగు. కానీ బయోసెక్యూరిటీ విషయంలో అప్రమత్తత తప్పనిసరి” అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.మానవులకు ముప్పు లేదు.. కానీ,ప్రస్తుతం ఏఐ సాయంతో రూపొందించిన వైరస్లు బ్యాక్టీరియాను మాత్రమే ప్రభావితం చేసే ఫేజ్లు కావడంతో మానవులకు ప్రత్యక్ష ముప్పు లేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. అయితే ఏఐ జీవశాస్త్ర రంగంలో ఇంతటి స్థాయిలో ఉపయోగపడటం.. భవిష్యత్లో మరింత సంక్లిష్టమైన జీవ నమూనాల రూపకల్పనకు దారితీయవచ్చన్న చర్చకు కారణమైంది.నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రకృతిలో ఇప్పటికే ఉన్న వైరస్లను మార్చడం వల్ల వచ్చే ప్రమాదం ప్రస్తుతం ఎక్కువగా ఉన్నప్పటికీ, ఏఐ ఆధారిత జీవ రూపకల్పనపై ఇప్పటి నుంచే భద్రతా నియమాలు రూపొందించడం అవసరం.అవకాశమా.. ప్రమాదమా?ఏఐ ఆధారంగా వైరస్ల రూపకల్పన శాస్త్రరంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఒకవైపు ప్రాణాలను కాపాడే కొత్త చికిత్సలకు ఇది మార్గం చూపుతుండగా.. మరోవైపు బయోసెక్యూరిటీపై అప్రమత్తత అవసరమనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ప్రకృతిలో లేని వైరస్లను ఏఐ సృష్టించడం.. మానవ విజ్ఞానానికి మరో గొప్ప విజయమా? లేక భవిష్యత్ సవాళ్లకు సంకేతమా? అన్న చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. -
గూగుల్ సంచలన నిర్ణయం.. యూజర్లకు షాక్!
టెక్నాలజీ ప్రపంచంలో ఒక పెద్ద మార్పు రానుంది. ఎన్నో ఏళ్లుగా ఆండ్రాయిడ్ వినియోగదారులకు సహాయకుడిగా ఉన్న గూగుల్ అసిస్టెంట్ మాయమైపోతుంది. దీని స్థానాన్ని జెమినీ ఏఐ భర్తీ చేయనుంది. సెప్టెంబర్ 4 నుంచి ఆండ్రాయిడ్ పరికరాల్లో గూగుల్ అసిస్టెంట్ సేవలను క్రమంగా తొలగించనున్నట్లు గూగుల్ ప్రకటించింది.గూగుల్ తన వినియోగదారులకు పంపిన ఈమెయిల్లో, ఈ మార్పు ఒక్కసారిగా కాకుండా దశలవారీగా అమలు చేస్తామని తెలిపింది. అంటే.. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కొన్ని వారాల వ్యవధి పడుతుందని తెలుస్తోంది. స్మార్ట్ఫోన్లలో మాత్రమే కాకుండా.. ఆండ్రాయిడ్ టాబ్లెట్లు, స్మార్ట్వాచ్లు, హెడ్ఫోన్లు, అలాగే ఆండ్రాయిడ్ ఆటోకు కనెక్ట్ అయ్యే పరికరాల్లో కూడా గూగుల్ అసిస్టెంట్ సేవలు నిలిచిపోనున్నాయి.నిజానికి.. గూగుల్ అసిస్టెంట్ను 2025 చివరి నాటికి పూర్తిగా తొలగించాలని కంపెనీ ముందుగా భావించింది. అయితే.. జెమినీకి మరిన్ని ఫీచర్లు జోడించేందుకు ఈ మార్పును కొంతకాలం వాయిదా వేసింది. ప్రస్తుతం జెమినీ అనేక కొత్త సామర్థ్యాలతో ముందుకు వచ్చినప్పటికీ, గూగుల్ అసిస్టెంట్లో ఉన్న కొన్ని ఫీచర్లు ఇంకా అందుబాటులో లేవు.గూగుల్ 2025 మార్చిలోనే అసిస్టెంట్ నుంచి జెమినీకి మార్పు గురించి ప్రకటించింది. భవిష్యత్తులో జనరేటివ్ ఏఐ టెక్నాలజీనే కంప్యూటింగ్ రంగంలో కీలక మార్పు తీసుకురాబోతుందని కంపెనీ భావిస్తోంది. ఇప్పటికే కోట్లాది మంది వినియోగదారులు జెమినీని ఉపయోగించడం ప్రారంభించారని గూగుల్ తెలిపింది.ఇటీవలి కాలంలో జెమినీ వినియోగం వేగంగా పెరిగింది. ఏఐ ఆధారిత సేవలపై ప్రజల ఆసక్తి పెరుగుతుండటంతో జెమినీకి వినియోగదారుల ఆదరణ కూడా పెరుగుతోంది. గతంలో గూగుల్ అసిస్టెంట్ వాయిస్ కమాండ్లు, రిమైండర్లు, సెర్చ్, స్మార్ట్ హోమ్ కంట్రోల్ వంటి పనులను నిర్వహించేది. ఇప్పుడు అదే స్థానాన్ని మరింత ఆధునికమైన ఏఐ సామర్థ్యాలతో జెమినీ భర్తీ చేయనుంది. -
రైళ్ల భద్రతకు కొత్త కవచం.. ఏఐని ఎలా వాడనున్నాంటే?
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బాంబేతో దక్షిణ మధ్య రైల్వే ఓ అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. జంక్షన్ లేదా యార్డ్ సామర్థ్యం/రద్దీని విశ్లేషించడానికి తగిన ఫ్రేమ్వర్క్ నమూనాలను అభివృద్ధి చేయడమే ఈ అవగాహన ఒప్పంద లక్ష్యం. ఇది రైల్వే నెట్వర్క్ వ్యాప్తంగా భద్రతా పర్యవేక్షణను బలోపేతం చేయడానికి కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఈ సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్ డి.ఆంజనేయులు రెడ్డి, సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ డా. ఆర్. గోపాలకృష్ణన్ ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఐఐటీ బాంబేకి చెందిన ప్రొఫెసర్ మిలింద్ సోహోని ఆయన బృందం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఐఐటీ బాంబే బృందం గత రెండు సంవత్సరాలుగా ఈ సమస్యపై పనిచేస్తూ, యార్డ్ డయాగ్రామ్లు, పాయింట్లపై వేగాలు, రైలు పొడవు, త్వరణ ప్రత్యేకతలు, ఇంటర్లాకింగ్ చారిత్రక డేటా లాగర్ సమాచారం వంటి అంశాలను ఉపయోగించింది. అదనంగా, విజువల్ టూల్స్ సన్నివేశ అనుకరణ సాధనాలను వినియోగించి (అదే యార్డ్ ఆకృతిలో రైళ్ల సంఖ్య పెంచడం లేదా ప్రత్యామ్నాయ యార్డ్ ఆకృతులను పరిశీలించి, విశ్లేషణలు నిర్వహించింది. ఈ అవగాహన పత్రం (ఎంవోయూ) ఈ భాగస్వామ్యాన్ని అధికారికం చేస్తోంది.అత్యాధునిక సాఫ్ట్వేర్ రానుంది..ఈ అవగాహన ఒప్పందం ప్రకారం.. రైల్వే డేటా లాగర్ ద్వారా ఉత్పత్తి అయ్యే భారీ పరిమాణంలోని రా సిగ్నలింగ్ డేటాను విశ్లేషించి, దానిని రైలు కదలికలు, సంక్లిష్టమైన నిలుపుదలలు మొదలైన వాటిపై సులభంగా అర్థమయ్యే డేటాగా మార్చేందుకు ఒక అత్యాధునిక సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసే పైలట్ ప్రాజెక్ట్ను ఐఐటీ బాంబే చేపట్టింది. అభివృద్ధి చేస్తున్న ఈ విశ్లేషణాత్మక సాధనం, సిగ్నలింగ్ రికార్డుల నుంచి రైలు కదలికలను పునర్నిర్మించడానికి నిరంతర ప్రయాణాలు, క్రాసింగ్లు, షంటింగ్, డిటెన్షన్లు వంటి రైలు కార్యకలాపాల దృశ్యరూపంలో ప్రదర్శించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ విశ్లేషణల ద్వారా రైల్వే అధికారులకు కార్యనిర్వాహణలో ఎదురయ్యే అవరోధాలను గుర్తించడంలో, రైలు నిలుపుదల సరళిని అధ్యయనం చేయడంలో, భద్రతా పర్యవేక్షణను పటిష్ఠం చేస్తూ రైలు నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.ఈ పైలట్ ప్రాజెక్టును దశలవారీగా అమలు చేస్తారు. తొలి దశలో డేటా ధ్రువీకరణ, రైళ్ల కదలికల విశ్లేషణ, విజువలైజేషన్ సాధనాలు భద్రత, సామర్థ్య కొలమానాల అభివృద్ధితో ప్రారంభమవుతుంది. పైలట్ ప్రాజెక్టు ఫలితాల ఆధారంగా, ఈ సంయుక్త భాగస్వామ్యాన్ని మరింత విస్తరించే దిశగా పెద్ద రైల్వే స్టేషన్ లేఅవుట్లకు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరించడం, అధునాతన విశ్లేషణాత్మక డ్యాష్బోర్డులను అభివృద్ధి చేయడం, అలాగే రియల్-టైమ్ రైలు కదలికల విశ్లేషణ కార్యాచరణకు అవసరమైన మద్దతు అందించే విధంగా రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థలతో సమగ్ర అనుసంధానం కల్పించడం వంటి తదుపరి చర్యలను చేపట్టాలని ఈ భాగస్వామ్యం లక్ష్యంగా పెట్టుకుంది.మరెన్నో ఉపయోగాలు ఈ సందర్భంగా, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ఐఐటీ బాంబేతో భాగస్వామ్యం ఏర్పడినందుకు కృతజ్ఞతలు తెలిపారు. భారతీయ రైల్వే ఎదుర్కొంటున్న సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించే ఒక మార్గాన్ని అభివృద్ధి చేయడానికి ఈ సహకారం సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు. రైలు రద్దీ నిరంతరం పెరుగుతోందని, అయితే యార్డులు రద్దీగా, జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఉండటం వల్ల మౌలిక సదుపాయాల విస్తరణ, ముఖ్యంగా యార్డులలో, చాలా పరిమితంగా ఉందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో చేపట్టే ప్రతి పెట్టుబడికి జాగ్రత్తతో కూడిన విశ్లేషణ, పటిష్ఠమైన ఇంజనీరింగ్ తోడ్పాటు ఉండటం అవసరమని ఆయన వ్యాఖ్యానించారు.జనరల్ మేనేజర్ మాట్లాడుతూ వివిధ పరిస్థితులను అనుకరించడానికి, పరస్పర చర్యల కారకాల ప్రభావాలను విశ్లేషించడానికి వీలు కల్పించే ఈ రకమైన అత్యాధునిక సాధనం, కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడుతుందని తెలిపారు. యార్డ్ పునర్నిర్మాణం ఇంటర్లాకింగ్ విధానాల్లో చిన్న మార్పులు కూడా రైళ్ల కదలికలపై బలమైన ప్రభావాన్ని చూపుతాయని, దీనిని ముందుగా ఊహించలేమని ఆయన తెలిపారు. అందుబాటులో ఉన్న వనరులను అత్యంత సమర్థవంతంగా వినియోగించుకోవడానికి దక్షిణ మధ్య రైల్వే, ఐఐటీ బాంబే మధ్య కుదిరిన ఒప్పందం కచ్చితంగా సహాయపడుతుందని జనరల్ మేనేజర్ అభిప్రాయపడ్డారు. -
రూ.949లకే ఏఐ అసిస్టెంట్ ఫోన్
సామాన్యులకు సైతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చౌకగా అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ప్రముఖ మొబైల్ బ్రాండ్ ‘ఐటెల్’ భారత మార్కెట్లో సరికొత్త ‘ఏస్ 3 హీరా’ ఫీచర్ ఫోన్ను ఆవిష్కరించింది. కేవలం రూ.949 ధరకే లభించే ఈ డివైజ్ ఫీచర్ ఫోన్ విభాగంలో డిజిటల్ సౌలభ్యానికి అందిస్తున్నట్లు కంపెనీ చెప్పింది.యూఎస్బీ టైప్-సీ పోర్ట్ఈ కొత్త ఫోన్ విడుదలతో భారతదేశంలో తన పూర్తి ఫీచర్ ఫోన్ పోర్ట్ఫోలియోను యూఎస్బీ టైప్-సీ చార్జింగ్కు మార్చినట్లు తెలిపింది. స్మార్ట్ఫోన్లు, ఫీచర్ ఫోన్లకు వేర్వేరు చార్జర్లు వాడే ఇబ్బందిని తప్పించి ఒకే కేబుల్తో ప్రతి ఒక్కరూ చార్జింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించడమే తమ ముఖ్య ఉద్దేశమని కంపెనీ సీఈఓ అరిజీత్ తలపాత్రా పేర్కొన్నారు.కీలక ఫీచర్లు..కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. 1,000mAh బ్యాటరీతో పాటు ఏఐ బ్యాటరీ ఆప్టిమైజేషన్, సూపర్ బ్యాటరీ మోడ్ ఫీచర్లు ఉన్నాయి. రికార్డింగ్ ఆప్షన్తో కూడిన వైర్లెస్ ఎఫ్ఎమ్ రేడియో, ఆటో కాల్ రికార్డింగ్, బ్లూటూత్ సదుపాయాలు ఉన్నాయి. ఇంగ్లీష్, హిందీ భాషలకు మద్దతు ఇచ్చే ‘కింగ్ టాకర్’(టెక్స్ట్-టు-స్పీచ్) ఏఐ అసిస్టెంట్ను అందించారు.ఇదీ చదవండి: ఆపద వస్తే తెలియాల్సిన అంశాలు ఇవే.. -
కేంద్రం కొత్త బిల్లు.. ఆ కంపెనీలకు 15 ఏళ్లు నో ట్యాక్స్!
దేశాన్ని ప్రపంచ ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టిన పన్నులు, ఇతర చట్టాల (సవరణ) బిల్లు-2026లో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి సంబంధించిన ఆదాయపు పన్ను రాయితీలను గణనీయంగా విస్తరించాలని ప్రతిపాదించింది. పెట్టుబడులు పెంచడం, తయారీ రంగానికి ఊతమివ్వడం, విదేశీ పెట్టుబడిదారులకు పన్ను పరమైన స్పష్టత కల్పించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంది.ఇప్పటి వరకు పరిమిత కాలానికే ఉద్దేశించిన పన్ను మినహాయింపులను ఇప్పుడు 15 ఏళ్లకు పొడిగించాలని ప్రతిపాదించారు. ఈ మార్పు ప్రకారం, విదేశీ కంపెనీలు భారతీయ కాంట్రాక్ట్ తయారీ సంస్థలకు యంత్రాలు, క్యాపిటల్ ఎక్విప్మెంట్, టూలింగ్ వంటి పరికరాలను అందించి, భారత్లో ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ చేపట్టే సందర్భంలో వచ్చే ఆదాయంపై 2040-41 ఆర్థిక సంవత్సరం వరకు పన్ను మినహాయింపు లభించనుంది. పరిశ్రమ ప్రతినిధులతో జరిగిన సంప్రదింపుల తర్వాత మొదట ప్రతిపాదించిన ఐదేళ్ల గడువును మరో పదేళ్లు పెంచినట్లు ప్రభుత్వం వెల్లడించింది.ఈ రాయితీల పరిధిలో మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, టాబ్లెట్లు, పర్సనల్ కంప్యూటర్లు, సర్వర్లు, వాటి కీలక భాగాలు వంటి ఉత్పత్తులు ఉన్నాయి. దీంతో దేశీయ తయారీ సంస్థలపై మూలధన భారం తగ్గడంతో పాటు, అంతర్జాతీయ బ్రాండ్లు భారత్లో మరింత విస్తృతంగా తయారీ కార్యకలాపాలు చేపట్టే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమానికి ఇది మరింత బలాన్ని చేకూర్చనుంది.అంతేకాదు, భారతీయ తయారీ యూనిట్లకు అవసరమైన విడిభాగాలను విదేశీ సంస్థలు సమీప గిడ్డంగుల్లో నిల్వ ఉంచినప్పుడు ప్రస్తుతం వర్తించే 2 శాతం పన్నును కూడా 15 ఏళ్లపాటు మినహాయించాలని బిల్లులో ప్రతిపాదించారు. దీని వల్ల సరఫరా వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారడంతో పాటు, ఉత్పత్తి ప్రక్రియలో అంతరాయాలు తగ్గే అవకాశం ఉంది.మరోవైపు, గ్లోబల్ ఫండ్ మేనేజర్లను భారత్కు ఆకర్షించేందుకు కూడా ప్రభుత్వం కీలక మార్పులు ప్రతిపాదించింది. ప్రస్తుతం విదేశీ ఫండ్ మేనేజర్లు భారత్లో కార్యకలాపాలు నిర్వహించాలంటే అనేక నిబంధనలు పాటించాల్సి ఉండగా, వాటిలో ఎక్కువ భాగాన్ని తొలగించాలని బిల్లు సూచిస్తోంది. అయితే భారతీయ పెట్టుబడిదారులు ఈ నిబంధనలను దుర్వినియోగం చేయకుండా తగిన రక్షణ చర్యలు మాత్రం కొనసాగనున్నాయి. ఈ చర్యలతో భారత్ను అంతర్జాతీయ పెట్టుబడులకు మరింత అనుకూల గమ్యస్థానంగా మార్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. -
ఎయిర్టెల్ రీచార్జ్ షాక్: ఆ ప్లాన్ ఇక లేదు!
ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్టెల్ కస్టమర్లకు షాకిచ్చింది. తన ప్రీపెయిడ్ ప్లాన్లలో కీలక మార్పులు చేసింది. కంపెనీ అధికారిక వెబ్సైట్, ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్లో ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్ను కొన్ని సర్కిళ్లలో తొలగించింది. దీంతో రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్ కలిగిన ఎంట్రీ-లెవల్ ప్లాన్గా ఇప్పుడు రూ.349 ప్లాన్ నిలిచింది.ఈ మార్పును పలు టెక్నాలజీ వెబ్సైట్లు గుర్తించగా, కొన్ని ప్రాంతాల్లో వినియోగదారులు కూడా రూ.299 ప్లాన్ కనిపించడం లేదని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అయితే ఈ మార్పు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిందా, లేక ఎంపిక చేసిన టెలికాం సర్కిళ్లకే పరిమితమా అనే విషయంపై ఎయిర్టెల్ ఇప్పటివరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.ఇప్పటి వరకు రూ.299 ప్లాన్లో 28 రోజుల చెల్లుబాటు, రోజుకు 1GB హైస్పీడ్ డేటా, అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, హలోట్యూన్స్తో పాటు పెర్ప్లెక్సిటీ ప్రో వంటి అదనపు ప్రయోజనాలు లభించేవి. ఈ ప్లాన్ అందుబాటులో లేకపోవడంతో అదే తరహా వినియోగదారులు ఇప్పుడు రూ.349 ప్లాన్ను ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.రూ.349 ప్లాన్లో 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2GB డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. అదనంగా ఆరు నెలల పాటు ఆపిల్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్, ఎయిర్టెల్ హలోట్యూన్స్, అడోబ్ ఎక్స్ప్రెస్ ప్రీమియం వంటి డిజిటల్ ప్రయోజనాలను కూడా కంపెనీ అందిస్తోంది. ఎక్కువ డేటా అవసరమయ్యే వినియోగదారుల కోసం రూ.399 ప్లాన్లో రోజుకు 2.5GB డేటాతో పాటు 28 రోజుల జియోహాట్స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ కూడా అందుబాటులో ఉంది.ఇదిలా ఉండగా, టిప్స్టర్ సంజూ చౌదరి వెల్లడించిన సమాచారం ప్రకారం రూ.579, రూ.619 ప్రీపెయిడ్ ప్లాన్లను కూడా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ సర్కిళ్లలో తొలగించినట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు ప్లాన్లు ఇంకా కొన్ని ఇతర సర్కిళ్లలో అందుబాటులో ఉన్నట్లు వెల్లడైంది. -
ఇకపై యాక్సిడెంట్లకు ఛాన్సే లేదు!
భారత రహదారులపై ప్రమాదాల నివారణకు రవాణా రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవానికి కేంద్ర రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ చర్యలు చేపడుతోంది. వాహనాలు తమలో తాము సమాచారాన్ని మార్పిడి చేసుకునే ‘వెహికల్-టు-వెహికల్’ (వీ2వీ) కమ్యూనికేషన్ వ్యవస్థను తప్పనిసరి చేస్తూ ఇటీవల ముసాయిదా నోటిఫికేషన్ను విడుదల చేసింది. ప్రపంచంలోనే భారత్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా ఉంటున్న తరుణంలో ఈ నిర్ణయం కీలకంగా మారనుంది.ఈ సాంకేతికత ఎలా పనిచేస్తుంది?సీ-వీ2ఎక్స్ (C-V2X) సాంకేతికతపై ఆధారపడిన ఏఐఎస్-230 ప్రమాణాలతో వీ2వీ వ్యవస్థలు పనిచేస్తాయి. వాహనంలో అమర్చే ఆన్-బోర్డ్ యూనిట్ల ద్వారా వాహనం వేగం, ప్రయాణ దిశ, బ్రేకింగ్ సమాచారం వంటి వివరాలు రేడియో తరంగాల రూపంలో సమీపంలోని ఇతర వాహనాలకు ప్రసారమవుతాయి. దీనికోసం టెలికాం శాఖ 5.875 GHz-5.925 GHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్ను కేటాయించింది.ఈ వ్యవస్థలోని ప్రధాన ప్రయోజనం ఏంటంటే.. ఇది డ్రైవర్ కంటికి లేదా కెమెరా/రాడార్ ఆధారిత ఏడీఏఎస్ వ్యవస్థలకు కనిపించని ప్రమాదాలను కూడా ముందుగానే గుర్తిస్తుంది. ఉదాహరణకు, ముందస్తుగా మలుపుల్లో ఎదురొచ్చే వాహనాలు, అకస్మాత్తుగా బ్రేక్ వేసే వాహనాలు, రాంగ్ రూట్లో వచ్చే డ్రైవర్లు లేదా అత్యవసర వాహనాల (అంబులెన్సులు) రాకను కొన్ని మిలీసెకన్ల వ్యవధిలోనే డ్రైవర్కు హెచ్చరికల రూపంలో తెలియజేస్తుంది.రెండు దశల్లో అమలు ప్రణాళికఅక్టోబర్ 1, 2027.. వీ2వీ అమర్చిన వాహనాలు కచ్చితంగా ఏఐఎస్-230 ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి (ఆప్షనల్).అక్టోబర్ 1, 2028 వరకు L (ద్విచక్ర, త్రిచక్ర), M (కార్లు, బస్సులు), N (లారీలు, ట్రక్కులు) కేటగిరీల కొత్త వాహనాలన్నింటికీ వీ2వీ అమలు చేయాలి.భవిష్యత్తు రవాణాకు పునాదిప్రస్తుతం ఆటోమొబైల్ తయారీదారులు, టెలికాం నిపుణులకు తగినంత సమయం ఇచ్చేలా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని దశలవారీగా చేపట్టింది. రహదారి మౌలిక సదుపాయాలపై ఆధారపడకుండా వాహనాల మధ్య మాత్రమే నేరుగా కమ్యూనికేషన్ జరగడం దీని ప్రత్యేకత. భవిష్యత్తులో వాహనాలు-రోడ్డు మౌలిక వసతుల మధ్య అనుసంధానం ఏర్పరచే 'ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్' (ఐటీఎస్) విస్తరణకు ఇది తొలి అడుగు. తయారీదారులు సైబర్ సెక్యూరిటీ, డేటా ప్రైవసీ నిబంధనలను కఠినంగా అమలు చేస్తే 2028 నాటికి భారతీయ రహదారులు అత్యంత సురక్షితంగా మారే అవకాశం ఉంది.ఇదీ చదవండి: మళ్లీ నింగినంటుతున్న బంగారం ధరలు -
మోదీ వీడియో.. క్షమాపణలు చెప్పినా వదిలేది లేదు!
సోషల్ మీడియా దిగ్గజం మెటా చుట్టూ వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. భారత ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఓ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించిన ఘటనపై ఇప్పటికే వివరణ ఇచ్చిన మెటా.. దీనిని “టెక్నికల్ ఎర్రర్”గా పేర్కొంటూ క్షమాపణలు చెప్పింది. అనంతరం వీడియోను పునరుద్ధరించింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలిపెట్టకుండా.. మెటా పనితీరు, అల్గారిథంల నిర్ణయాలపై మరిన్ని వివరాలు కోరుతోంది.ఈ క్రమంలో మెటా గ్లోబల్ పబ్లిక్ పాలసీ హెడ్ జోయెల్ కప్లాన్ను కేంద్రం మరోసారి వివరణ కోసం పిలిచినట్లు సమాచారం. వారం రోజుల్లోనే ఇది రెండోసారి కావడం గమనార్హం. బుధవారం జరిగే సమావేశానికి ఇన్స్టాగ్రామ్ టెక్నికల్ టీమ్ ప్రతినిధులు కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో మెటా అల్గారిథంలు ఎలా పనిచేస్తున్నాయి? ఏ కంటెంట్ను తొలగించాలనే నిర్ణయం ఎలా తీసుకుంటున్నారు? ప్రముఖ వ్యక్తుల ఖాతాలకు ఎలాంటి రక్షణ వ్యవస్థలు ఉన్నాయి? అనే అంశాలపై కేంద్రం వివరణ కోరే అవకాశం ఉంది. అలాగే ప్రధాని వీడియో తొలగింపునకు కారణమైన “టెక్నికల్ గ్లిచ్”పై మెటా నుంచి లిఖితపూర్వక వివరణ, క్షమాపణ కోరనున్నట్లు సమాచారం.అసలు వివాదం ఏంటి?జూలై 23న ప్రధాని నరేంద్ర మోదీ తన అధికారిక ఖాతాలో ఓ వీడియోను పోస్టు చేశారు. జెన్-జెడ్ యువతను ఉద్దేశించి మాట్లాడిన ఈ వీడియోలో పేపర్ లీక్లపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. విద్యార్థుల నిరసనల సమయంలో పోస్టు చేసిన ఈ వీడియోను కొంతకాలం తర్వాత ఫేస్బుక్ నుంచి తొలగించారు.దీనిపై స్పందించిన మెటా.. ఇది ఉద్దేశపూర్వక చర్య కాదని, ఆటోమేటెడ్ వ్యవస్థలో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగానే వీడియో తొలగించబడిందని వివరణ ఇచ్చింది. అనంతరం వీడియోను తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే దేశ ప్రధాని స్థాయి వ్యక్తికి సంబంధించిన కంటెంట్ కూడా అల్గారిథంల నిర్ణయాల్లో చిక్కుకోవడం టెక్ సంస్థల జవాబుదారీతనంపై కొత్త చర్చకు దారితీసింది.‘టెక్నికల్ ఎర్రర్’తో సరిపెట్టుకోవద్దుసోషల్ మీడియా సంస్థలు కోట్లాది పోస్టులను పరిశీలించేందుకు ఆటోమేటెడ్ అల్గారిథంలను ఉపయోగిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధమైన కంటెంట్ను గుర్తించి తొలగించడం వీటి ప్రధాన ఉద్దేశం. అయితే కొన్నిసార్లు సరైన కంటెంట్ కూడా పొరపాటున తొలగించబడుతోందనే విమర్శలు ఉన్నాయి. 2016లో వియత్నాం యుద్ధానికి సంబంధించిన పులిట్జర్ అవార్డు పొందిన ప్రసిద్ధ ఫొటోను ఫేస్బుక్ తొలగించింది. నగ్నత్వ నిబంధనల ఉల్లంఘనగా అల్గారిథం గుర్తించడంతో ఈ చర్య తీసుకుంది. తీవ్ర విమర్శల తర్వాత ఫేస్బుక్ తన నిర్ణయం తప్పని అంగీకరించింది. తాజాగా మోదీ వీడియో ఘటనలోనూ మళ్లీ “టెక్నికల్ సమస్య”నే కారణంగా చెప్పడం.. అల్గారిథంల పారదర్శకతపై ప్రశ్నలు పెంచుతోంది.పార్లమెంట్ కమిటీ కూడా ప్రశ్నలుమరోవైపు ఈ వ్యవహారంపై పార్లమెంట్ సమాచార సాంకేతిక వ్యవహారాల కమిటీ కూడా మెటా ప్రతినిధులను ప్రశ్నించింది. సోమవారం జరిగిన సమావేశంలో మెటా అధికారులు వీడియో తొలగింపుపై క్షమాపణలు తెలిపారు. అయితే కేవలం క్షమాపణలు చెప్పడం సరిపోదని, ఇలాంటి నిర్ణయాలకు ఎవరు బాధ్యత వహిస్తారనే అంశంపై స్పష్టత అవసరమని కమిటీ సభ్యులు ప్రశ్నించినట్లు సమాచారం.ఐటీ కమిటీ ఛైర్మన్, బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ఈ ఘటనపై స్పందిస్తూ.. మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్ స్వయంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి. 140 కోట్ల మంది భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాని వీడియోను తొలగించడం తీవ్రమైన అంశం. అవసరమైతే మెటాకు లభిస్తున్న “సేఫ్ హార్బర్” రక్షణపై కూడా పునరాలోచించాల్సి ఉంటుంది. మూడు రోజుల్లో జుకర్బర్గ్ క్షమాపణలు చెప్పాలి. బాధ్యులైన వాళ్లందరిపైనా చర్యలు తీసుకోవాలి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.మెటా కొత్త భద్రతా చర్యలుఈ వివాదం నేపథ్యంలో ప్రముఖ ఖాతాల విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకుంటామని మెటా కేంద్రానికి హామీ ఇచ్చినట్లు సమాచారం. ప్రధాని వంటి హైప్రొఫైల్ ఖాతాలకు సంబంధించిన పోస్టులపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి పోస్టులపై చర్య తీసుకునే ముందు సీనియర్ అధికారులు సమీక్షించే విధానాన్ని అమలు చేయనున్నట్లు మెటా వెల్లడించింది. కనీసం ఇద్దరు సీనియర్ అధికారుల పరిశీలన తర్వాతే తుది నిర్ణయం తీసుకునేలా వ్యవస్థను బలోపేతం చేయనున్నట్లు తెలిపింది.అల్గారిథంల వెనుక దాక్కోవద్దుటెక్ సంస్థలు తమ అల్గారిథంలను ఒక “బ్లాక్ బాక్స్”లా ఉంచుతున్నాయనే విమర్శలు చాలాకాలంగా ఉన్నాయి. ఏ పోస్టు ఎందుకు తొలగించబడుతుంది? ఏ కంటెంట్కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు? అనే విషయాల్లో పారదర్శకత తక్కువగా ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి. ప్రధాని వీడియో తొలగింపు ఘటనను కేవలం సాంకేతిక లోపంగా కాకుండా.. డిజిటల్ వేదికలపై జవాబుదారీతనం పెంచేందుకు వచ్చిన అవకాశంగా భారత్ చూస్తోంది. క్షమాపణలతో సమస్య ముగియదని.. అల్గారిథంల నిర్ణయాలకు టెక్ సంస్థలు బాధ్యత వహించాల్సిందేననే డిమాండ్ బలపడుతోంది. -
AI ఎఫెక్ట్.. యాపిల్ కీలక నిర్ణయం!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రోజురోజుకూ వేగంగా విస్తరిస్తూ.. సైబర్ సెక్యూరిటీ రంగంపైనా ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో.. టెక్ దిగ్గజం యాపిల్ కీలక నిర్ణయం తీసుకుంది. సెక్యూరిటీ పరిశోధకులు ఒకేసారి సమర్పించగలిగే సెక్యూరిటీ రిపోర్టుల సంఖ్యపై పరిమితి విధించింది. దీనికి ప్రధాన కారణం.. చాట్జీపీటీ వంటి ఏఐ టూల్స్ సహాయంతో పెద్ద ఎత్తున భద్రతా లోపాలకు సంబంధించిన సమస్యలు రావడమే. దీంతో ప్రతి రిపోర్టును పరిశీలించడం యాపిల్ బృందానికి భారంగా మారిందని కంపెనీ తెలిపింది.యాపిల్లో ప్రతి సెక్యూరిటీ రిపోర్టును నిపుణులు విడిగా పరిశీలించి, అందులో నిజంగా లోపం ఉందా?, లేదా?.. అనే విషయాన్ని నిర్ధారిస్తారు. కానీ.. ఇటీవల ఏఐ సృష్టించిన అనేక రిపోర్టుల్లో వాస్తవానికి సంబంధం లేని లేదా.. కేవలం ఊహాజనిత సమస్యలు ఎక్కువగా ఉండటంతో, వాటిని పరిశీలించడానికే ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తోంది. ఈ కారణంగా నిజమైన భద్రతా లోపాలను గుర్తించి వాటికి పరిష్కారం చూపే ప్రక్రియ ఆలస్యం కావచ్చని కంపెనీ భావించింది. అందుకే ఒకేసారి ఓపెన్గా ఉంచే సెక్యూరిటీ రిపోర్టుల సంఖ్యపై పరిమితి విధించడం జరిగింది.అయితే.. ఏఐ వల్ల ప్రతికూలతలే కాకుండా ప్రయోజనాలు కూడా ఉన్నాయని యాపిల్ చెబుతోంది. కొన్ని ఏఐ సిస్టమ్లు మ్యాక్ఓఎస్లో చాలా తక్కువ సమయంలోనే 50కు పైగా సంభావ్య భద్రతా లోపాలను గుర్తించాయి. వాటిలో కొన్ని చాలా కీలకమైనవిగా ఉండటంతో యాపిల్ వెంటనే సాఫ్ట్వేర్ అప్డేట్ల ద్వారా వాటిని పరిష్కరించింది.బగ్ బౌంటీ ప్రోగ్రామ్ప్రస్తుతం యాపిల్ తన బగ్ బౌంటీ ప్రోగ్రామ్ ద్వారా నిజమైన సెక్యూరిటీ లోపాలను గుర్తించిన పరిశోధకులకు లోపం తీవ్రతను బట్టి గరిష్ఠంగా 5 మిలియన్ డాలర్ల వరకు బహుమతిని కూడా అందిస్తోంది. అయితే కొత్త పరిమితుల వల్ల భవిష్యత్తులో కొన్ని కీలకమైన నిజమైన రిపోర్టులు కూడా ఆలస్యంగా పరిశీలించే అవకాశం ఉందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్లపై బంపరాఫర్!
ఇండియన్ మార్కెట్లో ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లకు కూడా మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని శాంసంగ్ దేశీయ విఫణిలో ఇలా విభాగంలో ఫోన్స్ లాంచ్ చేసింది. ఇప్పుడు గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8, జెడ్ ఫోల్డ్ 8 అల్ట్రా, జెడ్ ఫ్లిప్ 8 ఫోన్లను కొనుగోలు చేసే వారికి కంపెనీ 30 నెలల నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.శాంసంగ్ అందిస్తున్న ఈ 30 నెలల నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయంతో.. ఒకేసారి భారీ మొత్తం చెల్లించకుండా, నెలవారీ వాయిదాల రూపంలో డబ్బు చెల్లిస్తూ ఈ ప్రీమియం ఫోన్స్ సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ముఖ్య ఉద్దేశం గెలాక్సీ జెడ్ సిరీస్ ఫోన్లను మరింత మంది వినియోగదారులకు చేరువ చేయడమే అని సంస్థ తెలిపింది.గెలాక్సీ AI ఫీచర్లతో వచ్చే ఈ కొత్త ఫోల్డబుల్ ఫోన్లను జీరో డౌన్ పేమెంట్తో కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఈఎంఐ ఆఫర్లో గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 అల్ట్రాను నెలకు రూ.6,667 చెల్లిస్తూ సొంతం చేసుకోవచ్చు. ఇక గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 కోసం నెలకు రూ.6,000, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 8 కోసం నెలకు రూ.4,167 ఈఎంఐ సదుపాయంతో కొనుగోలు చేయవచ్చు.ఈ 30 నెలల నో-కాస్ట్ EMI సదుపాయం శాంసంగ్ ఫైనాన్స్ ప్లస్, టీవీఎస్ క్రెడిట్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, పూనావాలా ఫిన్కార్ప్ ద్వారా అందుబాటులో ఉంది. శాంసంగ్.కామ్, శాంసంగ్ ఎక్స్పీరియన్స్ స్టోర్లు, భాగస్వామ్య రిటైల్ అవుట్లెట్ల ద్వారా కూడా పొందవచ్చు.గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 అల్ట్రా ధర రూ.1,99,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇది వైలెట్ షాడో, గ్రాఫైట్, క్రీమ్, గ్రీన్ షాడో రంగుల్లో లభిస్తుంది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 ధర రూ.1,79,999 నుంచి ప్రారంభమవుతుండగా, జెడ్ ఫ్లిప్ 8 ధర రూ.1,24,999 నుంచి మొదలవుతుంది. ఈ రెండు మోడళ్లలో కూడా పలు కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. -
UPI యూజర్లకు అలర్ట్.. డబ్బులు పంపే ముందు కొత్త స్టెప్!
దేశంలో డిజిటల్ చెల్లింపుల వినియోగం భారీగా పెరిగింది. ముఖ్యంగా యూపీఐ (UPI) ద్వారా క్షణాల్లో డబ్బులు పంపడం, స్వీకరించడం చాలా సులభమైపోయింది. ఇదే సమయంలో ఆన్లైన్ మోసాలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. యూపీఐ లావాదేవీలను మరింత సురక్షితంగా మార్చేందుకు బ్యాంకులు కొత్త ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చాయి.అనుమానాస్పదంగా కనిపించే కొన్ని యూపీఐ చెల్లింపులకు అదనపు నిర్ధారణ తీసుకోవాలని బ్యాంకులు సూచిస్తున్నాయి. అంటే.. ఒక లావాదేవీ సాధారణంగా లేదని బ్యాంకు మోసాల గుర్తింపు వ్యవస్థ గుర్తిస్తే.. వినియోగదారుడి ఫోన్లో ''మీరు ఈ చెల్లింపును కొనసాగించాలనుకుంటున్నారా?'' అనే సందేశం కనిపిస్తుంది. వినియోగదారు 'Yes' అని అంగీకరించిన తర్వాత మాత్రమే ఆ చెల్లింపు పూర్తవుతుంది.అయితే.. ఈ విధానం ప్రతి యూపీఐ చెల్లింపునకు వర్తించదు. సాధారణంగా జరిగే లావాదేవీలకు ఎలాంటి మార్పు ఉండదు. బ్యాంకు వ్యవస్థలో ఏదైనా అనుమానాస్పద అంశం గుర్తించినప్పుడు మాత్రమే.. ఈ అదనపు నిర్ధారణ అడుగుతారు. దీని వల్ల వినియోగదారులు డబ్బు పంపే ముందు ఒకసారి ఆలోచించే అవకాశం పొందుతారు.అంతే కాకుండా.. ప్రతి పెద్ద మొత్తంలో జరిగే యూపీఐ చెల్లింపులకు తప్పనిసరిగా కొంత టైమ్ పెట్టాలనే సూచనలను బ్యాంకులు వ్యతిరేకిస్తున్నాయి. అలా చేస్తే.. యూపీఐకి ఉన్న వేగం, సులభతరం అనే ప్రధాన ప్రయోజనాలు తగ్గిపోతాయని అవి భావిస్తున్నాయి. అందుకే అన్ని లావాదేవీలకు కాకుండా, ప్రమాదం ఉన్న వాటికే అదనపు తనిఖీ ఉండాలని బ్యాంకులు కోరుతున్నాయి.యూపీఐ మోసాలు పెరగడానికి కారణాలుయూపీఐ మోసాలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. మోసగాళ్లు నకిలీ కస్టమర్ కేర్ నెంబర్లు, ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాల ద్వారా ప్రజలను నమ్మించి డబ్బులు పంపించేలా చేస్తున్నారు. యూపీఐ చెల్లింపులు వెంటనే పూర్తవుతుండటంతో, మోసాన్ని గుర్తించేలోపే డబ్బు ఇతర ఖాతాలకు వెళ్లిపోతుంది.ఇలాంటి పరిస్థితుల్లో చెల్లింపునకు ముందు వచ్చే చిన్న నిర్ధారణ సందేశం వినియోగదారులకు జాగ్రత్తపడే అవకాశం ఇస్తుందని బ్యాంకులు భావిస్తున్నాయి. డబ్బు పంపే ముందు లావాదేవీ వివరాలను మరోసారి పరిశీలించుకోవడం ద్వారా మోసాలను నివారించవచ్చని చెబుతున్నాయి. ఈ ప్రతిపాదన ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పరిశీలనలో ఉంది. డిజిటల్ చెల్లింపుల భద్రతను పెంచుతూ, యూపీఐ వేగం మరియు సౌకర్యాన్ని కొనసాగించేలా కొత్త నిబంధనలు రూపొందించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: 19 ఏళ్ల యువతి కథ.. శ్రీధర్ వెంబు భావోద్వేగం! -
కాల్ డ్రాప్ అవుతోందా? వాయిస్లో సమస్యలా..? ఇకపై నేరుగా ట్రాయ్కి ఫిర్యాదు చేయొచ్చు
మొబైల్ ఫోన్ వినియోగం పెరిగిన ఈ రోజుల్లో.. కాల్ నాణ్యత ప్రతి ఒక్కరికీ అవసరంగా మారింది. అయితే.. కొన్నిసార్లు కాల్ డ్రాప్లు, వాయిస్ స్పష్టంగా వినిపించకపోవడం, ఆలస్యం వంటి సమస్యలు వినియోగదారులను ఇబ్బంది పెడుతున్నాయి. ఈ సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు.. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) తన మైకాల్ (MyCall) మొబైల్ అప్లికేషన్ను కొత్త ఫీచర్లతో అందుబాటులోకి తీసుకొచ్చింది.కొత్తగా అప్డేట్ చేసిన ఈ యాప్ ద్వారా వినియోగదారులు తమ కాల్ అనుభవాన్ని నేరుగా తెలియజేయవచ్చు. కాల్ ముగిసిన వెంటనే ఒకటి నుంచి ఫైవ్ స్టార్ వరకు రేటింగ్ ఇచ్చి, కాల్ నాణ్యతపై తమ అభిప్రాయాన్ని నమోదు చేయవచ్చు. దీనివల్ల టెలికాం సంస్థలకు వినియోగదారులు ఎదుర్కొంటున్న అసలు సమస్యలు ఏమిటనేది సులభంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది.తమ కాలింగ్ అనుభవ సమస్యలను సర్వీస్ ప్రొవైడర్లకు నివేదించడానికి ఈ యాప్ వినియోగదారులకు ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగపడుతుందని.. ట్రాయ్ ఛైర్మన్ అనిల్ కుమార్ లహోటి వెల్లడించారు.ఈ యాప్లో కేవలం రేటింగ్ ఇవ్వడమే కాకుండా.. కాల్ డ్రాప్లు, కాల్ సమయంలో రీసౌండ్, ఆడియో ఆలస్యం, వేరే కాల్ కనెక్ట్ కావడం (క్రాస్ కనెక్షన్), వాయిస్ మధ్యలో కట్ అవ్వడం వంటి సమస్యలను కూడా రిపోర్ట్ చేసే అవకాశం ఉంది. వినియోగదారులు ఇచ్చే ఈ వివరాలు సంబంధిత టెలికాం సంస్థలకు చేరి.. సమస్యలను పరిష్కరించేందుకు సహాయపడతాయి.Introducing the revamped MyCall App where everyconsumer’s call experience counts. Rate your recent calls, share your experience & contribute to real-world insights that can help improve call quality across India. Download the MyCall App now on Google Play pic.twitter.com/ij8LKaON93— TRAI (@TRAI) August 3, 2026 -
దశాబ్దాల చిక్కుముడులు విప్పిన ‘అస్ట్రా’!
కృత్రిమ మేధ రంగంలో ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరు కోడింగ్, స్క్రిప్ట్ పరిధిని దాటి సంక్లిష్టమైన శాస్త్రీయ పరిశోధనల వైపు మళ్లింది. దశాబ్దాలుగా ప్రపంచ గణిత మేధావులకు కూడా సవాలుగా నిలిచిన 10 సంక్లిష్టమైన ఓపెన్ మాథ్స్ సమస్యలను తమ తదుపరి తరం మోడల్ అస్ట్రా (Astra) పూర్తిస్థాయిలో సాధించిందని ఓపెన్ ఏఐ సంచలన ప్రకటన చేసింది. అయితే ఈ వార్త వెలువడిన కొద్ది గంటల్లోనే పోటీ సంస్థ ఆంత్రోపిక్ స్పందిస్తూ తమ ‘క్లాడ్ ఫేబుల్’ మోడల్ ద్వారా వాటిలో ఐదు సమస్యలను కేవలం 24 గంటల్లోనే పరిష్కరించామని ప్రకటించి ఏఐ రేసును మరింత వేడెక్కించింది.ఓపెన్-ఏఐ ప్రచురించిన 249 పేజీల సమగ్ర నివేదిక ప్రకారం.. ‘అస్ట్రా’ మోడల్ గ్రూప్ థియరీ, క్వాంటమ్ కాంప్లెక్సిటీ, ఎక్స్ట్రీమల్ కాంబినేటోరిక్స్, స్పియర్ ప్యాకింగ్ డెన్సిటీ వంటి విభాగాల్లో దశాబ్దాలుగా పరిష్కారం కాని 10 సమస్యలను ఛేదించింది.1999లో మిఖాయిల్ గ్రోమోవ్ ప్రతిపాదించిన 'నాన్-సోఫిక్ గ్రూప్స్' ఉనికిని నిరూపించడంతో పాటు 'కానెస్ రిజిడిటీ కాంజెక్షన్'ను తిరస్కరించింది.ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త పాల్ ఎర్డోస్ ప్రతిపాదించిన సమస్యలకు స్పష్టమైన ఆధారాలు అందించింది.కంప్యూటర్ల ద్వారా లైన్-బై-లైన్ తనిఖీ చేయగల లీన్ 4 (Lean 4) డిజిటల్ సర్టిఫికేట్లతో సహా ఈ పరిష్కారాలను గిట్హబ్లో అందుబాటులో ఉంచారు.ఈ మొత్తం ప్రక్రియకు అయిన టోకెన్ కంప్యూటింగ్ వ్యయం కేవలం 2,000 డాలర్లు (సుమారు రూ.1.9 లక్షలు) కావడం గమనార్హం.ధీటుగా ఆంత్రోపిక్ సవాలుఓపెన్-ఏఐ నివేదికపై ఆంత్రోపిక్ రీసెర్చర్ లీవెంట్ అల్పోజ్ స్పందిస్తూ.. ఇప్పటికే అందుబాటులో ఉన్న తమ క్లాడ్ ఫేబుల్ మోడల్ ఎటువంటి ఇంటర్నెట్ సహాయం లేకుండా స్వయంప్రతిపత్తితో ఆ 10 సమస్యల్లో ఐదు సమస్యలను 24 గంటల్లోనే ఛేదించిందని సోషల్ మీడియాలో ఆధారాలు ప్రదర్శించారు.మానవ మేధస్సుకు మాత్రమే సాధ్యమనుకున్న అబ్స్ట్రాక్ట్ రీజనింగ్ సామర్థ్యాన్ని పొందే దిశగా ఆటోమేటెడ్ ఏఐ ఏజెంట్లు వేగంగా అడుగులు వేస్తున్నాయి. అయితే, అంతర్జాతీయ గణిత సమాజం ఈ ఆధారాలను పీర్-రివ్యూ ద్వారా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ సాంకేతిక దిగ్గజాల మధ్య సాగుతున్న ఈ సైంటిఫిక్ పోటీ భవిష్యత్ పరిశోధనల వేగాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లడం ఖాయమని కొందరు నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: నేటి యువత ఖర్చుల బాట.. -
జియో ట్యాగ్ 2 వచ్చేసింది: దీని గురించి తెలుసా?
సాధారణంగా కొన్నిసార్లు వస్తువులు (తాళం, బ్యాగ్, పర్స్) ఎక్కడపెట్టామో మర్చిపోతూ ఉంటాము. అత్యవసర సమయంలో అవి ఎక్కడున్నాయో వెతుక్కోవడానికి సమయం కూడా సరిపోదు. అలాంటి కష్టానికి చెక్ పెట్టడానికి జియో కొత్త ట్రాకర్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. జియో ట్యాగ్ 2 పేరుతో వచ్చిన ఈ కొత్త డివైజ్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది.గతంలో జియో తీసుకొచ్చిన జియో ట్యాగ్ డివైజ్కు కొనసాగింపుగా.. వచ్చిన ఈ కొత్త వెర్షన్లో కొన్ని మార్పులు చేశారు. ముఖ్యంగా ఈసారి జియో ట్యాగ్ 2ను ఆండ్రాయిడ్, ఐఫోన్ రెండు రకాల ఫోన్లతోనూ ఉపయోగించుకునేలా రూపొందించారు. ఇది ఈ గ్యాడ్జెట్లో వచ్చిన అతిపెద్ద మార్పు.జియో ట్యాగ్ 2 ధరభారత మార్కెట్లో జియో ట్యాగ్ 2 ధర రూ.1,249గా నిర్ణయించారు. ఇది మూడు (బ్లాక్, రెడ్, గ్రీన్) రంగుల్లో అందుబాటులో ఉంటుంది. దీని డిజైన్ కూడా కొంత మార్చేశారు. పాత వెర్షన్తో పోలిస్తే ఇది.. కొత్త ఆకారంలో కనిపిస్తుంది. ప్రస్తుతం దీన్ని అమెజాన్ ఇండియా ద్వారా కొనుగోలు చేయవచ్చు. కొన్ని బ్యాంక్ ఆఫర్లతో రూ.50 వరకు తగ్గింపు లభించే అవకాశం ఉంది. దీంతో ధర రూ.1,199కి చేరుతుంది.జియో ట్యాగ్ 2లో వచ్చిన అతిపెద్ద అప్గ్రేడ్ క్రాస్ ప్లాట్ఫామ్ సపోర్ట్. అంటే ఇంతకుముందు కొన్ని పరిమితులు ఉండగా, ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లు, ఐఫోన్లు రెండింటిలోనూ దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ చిన్న డివైజ్ను బ్యాగులు, కీలు, పర్సులు లేదా ఇతర ముఖ్యమైన వస్తువులకు అమర్చుకోవచ్చు. బ్లూటూత్ సహాయంతో సమీపంలో ఉన్న వస్తువులను సులభంగా గుర్తించవచ్చు. ఇందులో 120dB శబ్దం చేసే బిల్ట్-ఇన్ స్పీకర్ ఉంటుంది. వస్తువు దగ్గరలో ఉన్నప్పుడు యాప్ ద్వారా సౌండ్ ప్లే చేసి దాన్ని త్వరగా కనుగొనవచ్చు.ఒకవేళ వస్తువు బ్లూటూత్ పరిధిని దాటిపోయినా.. లొకేషన్ ట్రాకింగ్ కోసం నెట్వర్క్ ఆధారిత సేవలను ఉపయోగించవచ్చు. ఇది గూగుల్ ఫైండ్ హబ్, యాపిల్ ఫైండ్ మై నెట్వర్క్లకు సపోర్ట్ చేస్తుంది. దీంతో వస్తువు ఉన్న ప్రదేశాన్ని మ్యాప్లో గుర్తించే అవకాశం ఉంటుంది. ఇది పూర్తిస్థాయి లైవ్ ట్రాకింగ్ కాకపోయినా.. వస్తువు చివరిగా ఎక్కడ కనిపించిందో తెలుసుకోవడంలో సహాయపడుతుంది. -
వాట్సాప్లో కొత్త రూల్.. వయస్సు వివరాలపై చర్చ!
ప్రపంచంలో ఎక్కువమంది ఉపయోగించే మెసేజింగ్ యాప్లలో ఒకటైన వాట్సాప్లో కొత్త మార్పు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది భారతీయ వినియోగదారులను తమ పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయాలని వాట్సాప్ కోరుతున్నట్లు సమాచారం. దీంతో వాట్సాప్ వయస్సు ధృవీకరణ నిబంధనలను తీసుకురావడానికి సిద్ధమవుతోందా?.. అనే చర్చ మొదలైంది.ప్రస్తుతం దీనికి సంబంధించిన సోషల్ మీడియా పోస్టులు కూడా వైరల్ అవుతున్నాయి. ఇందులో యూజర్లను పుట్టిన తేదీని నమోదు చేయమని కోరుతున్నట్లు కనిపించింది. బహుశా భారత ప్రభుత్వం నిబంధనల కారణంగా ఈ అప్డేట్ తీసుకొస్తోందా?, అనే సందేహం కలుగుతోంది.అయితే.. ఈ విషయంపై ఇప్పటివరకు వాట్సాప్ కానీ, భారత ప్రభుత్వం కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాబట్టి ఇది పూర్తిగా నిజమని నమ్మలేము. అధికారిక సమాచారం వచ్చే వరకు వేచి చూడాలి.వయస్సు వివరాలు ఎందుకు?వాట్సాప్.. తన యూజర్ల వయస్సు అడగడం ఇదే మొదటిసారి కాదు. కొన్ని సందర్భాల్లో ఖాతా ప్రారంభించే సమయంలో లేదా కొన్ని ప్రత్యేక ఫీచర్లను ఉపయోగించే సమయంలో వయస్సును నిర్ధారించేందుకు వాట్సాప్ ఈ వివరాలను అడుగుతుంది. ఇప్పుడు కూడా బహుశా ఇలాంటిదే యూజర్లకు కనిపించి ఉండవచ్చు.వివిధ దేశాల్లో అమలవుతున్న కొత్త చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా పనిచేయడం కోసం.. వయస్సు సమాచారం కూడా చాలా ఉపయోగపడుతుందని కంపెనీ చెబుతోంది. అంతేకాకుండా.. వినియోగదారులకు వారి వయస్సుకు సరిపోయే సేవలను అందించేందుకు కూడా ఈ వివరాలు ఉపయోగపడతాయి. ప్రస్తుతం వాట్సాప్లో అందుబాటులో ఉన్న కొన్ని మెటా ఏఐ ఫీచర్లు, స్టేటస్, ఛానల్స్లో కనిపించే ప్రకటనల విషయంలో కూడా వయస్సు ఆధారంగా అనుభవాన్ని అందించేందుకు ఈ సమాచారం ఉపయోగపడే అవకాశం ఉంది.ఇదీ చదవండి: అందుకే వెండి ధరలు.. భారీగా తగ్గాయ్! -
క్లిక్... క్లిక్... కింగులు! వీటితో షూట్ చేస్తే రీల్స్ నెక్స్ట్ లెవెల్!
క్లిక్ చేయడమే కాదు, షాక్ కూడా ఇస్తాయి ఈ కెమెరాలు! సైజు చూసి తక్కువ అంచనా వేయకండి. ఈ మినీ కెమెరా గాడ్జెట్లు చేసే పని మాత్రం పక్కా ప్రొఫెషనల్. తక్కువ ధరలో ఎక్కువ క్రియేటివిటీ కావాలంటే వీటికి, మీ కార్ట్లో కచ్చితంగా చోటు ఇవ్వాల్సిందే!సీసీ కెమెరాకు మినీ తమ్ముడు!కరెంట్ పోయిందేమో... తీగలు వేయాలేమో... పెద్ద సీసీ కెమెరా పెట్టాలేమో... ఇలాంటి టెన్షన్లన్నింటికీ గుడ్బై చెప్పేయండి! ఈ మినీ వైఫై కెమెరా ఉంటే చాలు. అరచేతిలో ఇమిడిపోయేంత చిన్నగా ఉంటుంది కానీ, ఇంటిపై నిఘా మాత్రం పెద్ద సీసీ కెమెరాలా ఉంచుతుంది. ఎక్కడైనా పెట్టేయొచ్చు; మొబైల్తో కనెక్ట్ చేసుకుని ఎక్కడి నుంచైనా ఇంట్లో ఏం జరుగుతుందో చూసుకోచ్చు. కదలిక కనిపించగానే వెంటనే మీ ఫోన్కు సమాచారం పంపిస్తుంది. చీకట్లో కూడా నైట్ విజన్ తో స్పష్టంగా రికార్డు చేస్తుంది. పిల్లలు, పెంపుడు జంతువులు లేదా ఇంటి భద్రత కోసం సింపుల్గా వాడుకునే పోర్టబుల్ సీసీ కెమెరా ఇదే. ధర కేవలం రూ. 600 మాత్రమే!పాకెట్లోనే స్టూడియో!ఫోన్ కెమెరా బాగానే ఉంటుంది... కానీ వెలుతురు లేకపోతే ఫొటో వెలవెలబోతుంది! అందుకే, ఈ చిన్న మాగ్నెటిక్ సెల్ఫీ లైట్ మీ జేబులోనే తిరిగే మినీ స్టూడియోలా పనిచేస్తుంది. మొబైల్కు టక్కున అతుక్కుని... మీ ముఖంపై సమంగా వెలుతురు పడేలా చేస్తుంది. ఇక సెల్ఫీలు, రీల్స్, వ్లాగ్స్, వీడియో కాల్స్... ఏదైనా ప్రొఫెషనల్ లుక్లో కనిపిస్తాయి.ఇందులో మూడు రకాల లైటింగ్ మోడ్స్, కావాల్సినంత బ్రైట్నెస్, 360 డిగ్రీలు తిరిగే డిజైన్ , 270 డిగ్రీలు మడిచే సౌకర్యం ఉన్నాయి. అంతేకాదు, చిన్న అద్దం కూడా ఉండటంతో మేకప్ టచప్ కోసం మరో అద్దం వెతకాల్సిన అవసరం లేదు. ఫోన్ స్టాండ్లాగానూ ఉపయోగించుకోవచ్చు. ఒక్కసారి చార్జ్ చేస్తే గంటల తరబడి పనిచేస్తుంది. ధర రూ. 1,800.ఎగిరేది పక్షి కాదు... డ్రోనే! ట్రావెల్కు వెళ్లినా... ఫ్యామిలీ ఫంక్షన్ అయినా... పైనుంచి తీసిన వీడియోలు చూస్తేనే అసలు కిక్! అయితే ఆ షాట్స్ కోసం పెద్ద డ్రోన్ ను బ్యాగ్లో మోసుకెళ్లాల్సిన పని లేదు. ఈ ఫోల్డబుల్ డ్రోన్ను మడిచేస్తే మీ జేబులోనే ఇమిడిపోతుంది. బయటకు తీస్తే మాత్రం ఆకాశంలో ఎగిరే మీ పర్సనల్ కెమెరామ్యాన్ గా మారిపోతుంది. ఒక్క బటన్ తో టేకాఫ్, ఒక్క బటన్ తో ల్యాండింగ్.కొత్తవాళ్లు కూడా భయపడకుండా సులభంగా ఎగరేయొచ్చు. హై క్వాలిటీ కెమెరాతో ఫోటోలు, వీడియోలు స్పష్టంగా రికార్డ్ అవుతాయి. ఫోన్తో నేరుగా కనెక్ట్ చేసుకుని లైవ్లోనే చూడొచ్చు. కెమెరా యాంగిల్ను కూడా అవసరానికి తగ్గట్టు మార్చుకోవచ్చు. చేతితో సైగ చేస్తే సెల్ఫీ తీయడం, ఒకే ఎత్తులో స్థిరంగా ఎగరడం, గాలిలో 360 డిగ్రీల ఫ్లిప్స్ చేయడం వంటి ఫీచర్లు దీనిని మరింత సరదాగా మారుస్తాయి. ధర రూ. 1,500 మాత్రమే! -
రోబో టీచర్ అప్పుడే కాదు!
ఓ వినూత్న ప్రయోగానికి బ్రేక్ పడింది! న్యూయార్క్ నగరంలోని ఓ స్కూల్లో రోబో టీచర్తో పిల్లలకు పాఠాలు చెప్పించాలని అధికారులు అనుకున్నారు కానీ... ఆఖరు క్షణంలో ఈ ప్రాజెక్టును నిలిపివేయాల్సి వచ్చింది. ఎందుకు అనే దాని కంటే ముందే రోబో టీచర్ ‘సాలీ’కి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందామా? ఇటీవలి కాలంలో అచ్చం మనుషుల్లో ఉండే, మాట్లాడే, వ్యవహరించే రోబోల గురించి మనం తరచూ వింటూనే ఉన్నాం. ఆ మధ్య ఓ రోబో హైదరాబాద్లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో సందడి చేసింది కూడా. సాలీ కూడా అలాంటిదే. కాకపోతే ఈ రోబో స్పెషలైజేషన్ పాఠాలు చెప్పడం. సిలికోన్తో చేసిన మృదువైన కృత్రిమ చర్మం, పొడవాటి గోధుమరంగు కురులు, తలతోపాటు చేతులు, ముఖ కవళికలను మార్చగలిగే సామర్థ్యం దీని సొంతం. సాధారణ రోబోల మాదిరిగా యాంత్రికంగా మాట్లాడదని, అప్పటికప్పుడు ప్రశ్నకు తగ్గ సమాధానమిస్తుందని సాలీ సృష్టికర్తలైన రియల్బోటిక్స్ కంపెనీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే మానవ ఉపాధ్యాయుల్లా ఇది క్లాస్ రూమ్కు వచ్చి, పోతూండదు. క్లాస్రూమ్లోనే ఒక పక్కన స్థిరంగా కూర్చుని ఉంటుంది. విద్యార్థులు లేదా టీచర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తూంటుంది. విద్యార్థులకైతే దీని డిజిటల్ అవతారం రోజంతా ఫోన్/కంప్యూటర్/ల్యాప్టాప్/ట్యాబ్లలో అందుబాటులోనే ఉంటుంది. అంతా బాగానే ఉంది కదా? మరి ఎందుకు ఉపయోగించలేదు అంటున్నారా? సుమారు యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని తయారు చేసిన రియల్బోటిక్స్ క్లాస్రూమ్లోకి ఏర్పాటు చేయకపోయేందుకు కారణం డేటా ప్రైవసీ. విద్యార్థులు, టీచర్లు ఏవైనా వ్యక్తిగతమైన సంభాషణలు చేస్తే ఆ సమాచారం దుర్వినియోగం కావచ్చునని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. పైగా ఈ రోబో సేకరించే సమాచారం ఎక్కడ నిక్షిప్తమవుతుంది? దాన్ని ఎలా ట్రాక్ చేయాలన్న అంశంపైనా ప్రశ్నలు తలెత్తాయి. దీంతో రెండు రోజుల క్రితమే సాలీ ప్రయోగానికి బ్రేకులు పడ్డాయి. అయితే... రోబో టీచర్లు క్లాస్రూమ్లోకి వచ్చేందుకు మరెంతో కాలం పట్టదన్నది నిపుణుల అభిప్రాయం. –సాక్షి, నేషనల్ డెస్క్ -
జియో రీఛార్జ్: రూ.198 ప్లాన్.. రోజుకి 2జీబీ డేటా!
ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన యూజర్ల కోసం అందిస్తున్న సరసమైన రీఛార్జ్ ప్లాన్లలో రూ.198 కూడా ఒకటి. ఈ ప్లాన్ ద్వారా లభించే డేటా ఎంత, వ్యాలిడిటీ, ఇతర ప్రయోజనాల గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.రూ.198 రీఛార్జ్ ప్లాన్ ద్వారా రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు పొందవచ్చు. అయితే వ్యాలిడిటీ మాత్రం 14 రోజులు మాత్రమే. కాగా జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్ వంటి ప్రీమియం సబ్స్క్రిప్షన్లు లభిస్తాయి. తక్కువ ధరలో రీఛార్జ్ కావాలనుకునే వారికి ఈ ప్లాన్ మంచి ఎంపిక అవుతుంది.రూ.55కే 1000పైగా ఛానళ్లు!జియో తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం కేవలం రూ.55కే ఒక ప్రత్యేక టీవీ వోచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా తక్కువ ధరలోనే ప్రీమియం లైవ్ టీవీ ఛానళ్లను చూడవచ్చు.రూ.55 ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు. అయితే దీని ద్వారా 10ఎంబీ డేటా మాత్రమే లభిస్తుంది. డేటా పరంగా పెద్దగా ఉపయోగం లేకపోయినప్పటికీ.. టీవీ ఛానల్స్ చూడటానికి పనికొస్తుంది. జియోటీవీ యాప్లో 1,000కుపైగా లైవ్ టీవీ ఛానళ్లను వీక్షించవచ్చు. ఇందులో జియోస్టార్, సోనీ ఎంటర్టైన్మెంట్, సన్ టీవీ నెట్వర్క్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ, ఈటీవీ వంటి ప్రముఖ నెట్వర్క్లకు చెందిన ఛానల్స్ అందుబాటులో ఉంటాయి. తక్కువ ఖర్చుతో మొబైల్లో లైవ్ టీవీ చూడాలనుకునే జియో వినియోగదారులకు ఈ రూ.55 ప్లాన్ మంచి ఎంపిక. -
ఇన్స్టాలో 90% విరాళాల ఖాతాలు అనుమానాస్పదమే!
అస్సాంను ఇటీవల ముంచెత్తిన వరదలు ఒకవైపు వేలాది కుటుంబాలను దారుణంగా దెబ్బతీస్తే మరోవైపు సైబర్ నేరగాళ్లకు, అక్రమార్కులకు కాసులు కురిపించే అవకాశంగా మారడం ఆందోళన కలిగిస్తోంది. బాధితులను ఆదుకోవాలనే పౌరుల ఉదారతను ఆసరాగా చేసుకుని ఇన్స్టాగ్రామ్ వేదికగా భారీ విరాళాల దందా సాగుతోంది. నిధులు సేకరిస్తున్న ఖాతాల్లో ప్రతి పదింటిలో తొమ్మిది (దాదాపు 90%) వ్యాపార ఖాతాలు సందేహాస్పద రీతిలో ఉన్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి.తనిఖీల్లో వెల్లడైన అంశాలుపరిశోధన బృందం విరాళాలు సేకరిస్తున్న 40 ఇన్స్టాగ్రామ్ ఖాతాలను సమగ్రంగా పరిశీలించగా అందులో 35 ఖాతాలు ప్రధాన భద్రతా ప్రమాణాల్లో విఫలమయ్యాయి. విరాళాలు కోరుతున్న 40 ఖాతాల్లో 38 ఖాతాలు కేవలం జులైలోనే కొత్తగా ప్రారంభించినవి. వీటి వెనుక ఎలాంటి గుర్తింపు లేదా పూర్వాపరాల రికార్డులు లేవు. 39 ఖాతాలు నమోదు చేసుకున్న స్వచ్ఛంద సంస్థలు లేదా ట్రస్టుల ఖాతాలకు కాకుండా వ్యక్తిగత యూపీఐ ఐడీలకు నిధులు మళ్లించేలా డిజైన్ చేశారు. 36 ఖాతాల్లో అందించిన ఫోన్ నంబర్లు అసలు పనిచేయడం లేదు లేదా సంప్రదించడానికి వీలు లేకుండా ఉన్నాయి.పాత వీడియోలు.. తప్పుడు ప్రచారాలుప్రజల సానుభూతిని సొమ్ము చేసుకునేందుకు ఈ ఖాతాదారులు తీవ్ర మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల ఆందోళన సమయంలో ఉచిత ఆహార పంపిణీకి సంబంధించిన వీడియోలను రీ-ఎడిట్ చేసి అస్సాం వరద బాధితులకు సాయం చేస్తున్నట్లుగా ప్రచారం చేయడం గమనార్హం. మరికొందరు స్థానిక యంత్రాంగం ఉచితంగా పంపిణీ చేస్తున్న సహాయక సామగ్రినే తాము ప్రజల విరాళాలతో కొనుగోలు చేసి ఇస్తున్నట్లు క్లైమ్ చేస్తున్నారని స్థానిక ఇన్ఫ్లుయెన్సర్లు ఆరోపిస్తున్నారు.ఇలాంటి ప్రకృతి విపత్తుల వేళ దాతలు సోషల్ మీడియాలోని ప్రైవేట్ ఖాతాలకు నేరుగా డబ్బులు పంపకూడదు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ముఖ్యమంత్రి సహాయ నిధి లేదా విదేశీ నిధుల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ) కింద నమోదైన ప్రామాణిక స్వచ్ఛంద సంస్థల బ్యాంకు ఖాతాల వివరాలను సరిచూసుకున్న తర్వాతే విరాళాలు అందించడం శ్రేయస్కరం.ఇదీ చదవండి: బ్యాంక్ శాఖల్లో ప్రత్యేక యంత్రాల ఏర్పాటు -
దారి తప్పిన రాకెట్.. మెరుపు వేగంతో చంద్రుడిపై ఢీ
అంతరిక్షంలో దారితప్పిన ఓ భారీ రాకెట్ ఇప్పుడు చంద్రుడివైపు దూసుకెళ్తోంది. గంటకు దాదాపు 8 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ.. అతి త్వరలోనే చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టనుంది. ఈ అనూహ్య పరిణామాన్ని శాస్త్రవేత్తలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎందుకంటే.. చంద్రుడిపై మానవ నిర్మిత వస్తువు ఢీకొట్టినప్పుడు జరిగే ప్రభావాలను అధ్యయనం చేసేందుకు ఇది అరుదైన అవకాశంగా మారనుంది. అదే సమయంలో భవిష్యత్ అంతరిక్ష యాత్రల్లో రాకెట్ వ్యర్థాల నిర్వహణ, అంతరిక్ష ట్రాఫిక్ నియంత్రణపై కొత్త సవాళ్లను కూడా తెరపైకి తెస్తోంది.స్పేస్ఎక్స్ కిందటి ఏడాది జనవరిలో ప్రయోగించిన రాకెట్లోని అప్పర్ స్టేజ్ (పై భాగం) అదుపు తప్పి అంతరిక్షంలో తిరుగుతూ చంద్రుడి ఢీకొనే మార్గంలోకి వచ్చింది. చంద్రుడిపై ఉన్న ఐన్స్టీన్ క్రేటర్ సమీపంలో ఇది కూలిపోతుందని అంతరిక్ష పరిశీలకుడు బిల్ గ్రే అంచనా వేశారు. భారత కాలమానం ప్రకారం సుమారు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ ఘటన జరిగే అవకాశం ఉందని ఆయన అంచనా వేస్తున్నారు. ఈ ఢీకొట్టు సమయంలో రాకెట్ వేగం గంటకు 8,700 కిలోమీటర్లు (సెకనుకు సుమారు 2.4 కిలోమీటర్లు) ఉండనుంది. ఇది ధ్వని వేగం కంటే దాదాపు ఏడు రెట్లు ఎక్కువ.అనుకోకుండా.. ఢీచంద్రుడిపై మానవ నిర్మిత వస్తువు అదుపు తప్పి ఢీకొట్టడం ఇది రెండోసారి. అంతకుముందు 2022లో ఓ చైనా రాకెట్ భాగం చంద్రుడి అవతలి వైపున కూలి రెండు భారీ గోతులను సృష్టించింది. తాజాగా జరగనున్న ఈ ఘటన కూడా చంద్రుడిపై అంతరిక్ష వ్యర్థాల ప్రభావంపై మరోసారి చర్చకు దారితీస్తోంది. అయితే ఈ రాకెట్ చంద్రుడిని ఢీకొట్టడం అనుకోకుండా జరుగుతున్న పరిణామమే తప్ప.. ఇది స్పేస్ఎక్స్ ప్రణాళికలో భాగం కాదు. రాకెట్ పైభాగాన్ని సరైన సమయంలో సూర్యుడి కక్ష్యలోకి మళ్లించి ఉంటే ఈ ఢీకొట్టు ప్రమాదాన్ని నివారించవచ్చని అంతరిక్ష నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే.. అందుకు అవసరమైన నియంత్రణ, ఇంధన సామర్థ్యం లేకపోవడంతో అది అంతరిక్షంలో తేలుతూ చివరకు చంద్రుడి ఢీకొట్టు మార్గంలోకి చేరింది.90 అడుగుల గోతిని తవ్వే అవకాశంఈసారి రాకెట్ చంద్రుడి భూమికి కనిపించే వైపునే ఢీకొట్టనుంది. దాదాపు 4,500 కిలోల బరువున్న ఈ రాకెట్ భాగం ఢీకొట్టడంతో సుమారు 90 అడుగుల వెడల్పు, 16 అడుగుల లోతు ఉన్న గోతిని సృష్టించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఢీకొనే సమయంలో వెలువడే కాంతి మెరుపు ఒక్క క్షణం మాత్రమే ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే పైకి ఎగిసే దుమ్ము, రాళ్ల మేఘం మాత్రం కొన్ని నిమిషాల పాటు టెలిస్కోపుల ద్వారా కనిపించే అవకాశం ఉంది.చంద్రుడిపై పరిశీలనకు అవకాశంఈ ఘటనను శాస్త్రవేత్తలు ఒక ప్రమాదంగా మాత్రమే కాకుండా పరిశోధన అవకాశంగా చూస్తున్నారు. చంద్రుడిపై మానవ నిర్మిత వస్తువుల ప్రభావం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి ఈ ఢీకొట్టు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. నాసాకు చెందిన లూనార్ రికానైసెన్స్ ఆర్బిటర్ (LRO), దక్షిణ కొరియాకు చెందిన దనూరి లూనార్ ఆర్బిటర్ ఢీకొట్టడానికి ముందు, తర్వాత చంద్రుడి ఉపరితల చిత్రాలను సేకరించనున్నాయి.భవిష్యత్ చంద్ర యాత్రలకు హెచ్చరికచంద్రుడిపై మళ్లీ మానవులు అడుగుపెట్టేందుకు అమెరికా, చైనా వంటి దేశాలు పోటీపడుతున్నాయి. ప్రైవేటు సంస్థలు కూడా చంద్ర యాత్రల్లోకి అడుగుపెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అంతరిక్ష వ్యర్థాల నియంత్రణ, రాకెట్ భాగాల కదలికలపై పర్యవేక్షణ మరింత కీలకమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ రాకెట్ ఢీకొట్టు ప్రమాదకరం కాకపోయినా.. భవిష్యత్లో చంద్రుడిపై శాశ్వత స్థావరాలు ఏర్పడిన తర్వాత ఇలాంటి ఘటనలు పెద్ద సవాలుగా మారవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
అంతరిక్షంలో ఉత్కంఠ.. నాసా మిషన్కు పరీక్ష
ఎరక్కపోయి వెళ్లి ఇరుక్కుపోలేదు... రిస్క్ ఏపాటిదో తెలుసు... అంతా తెలిసే... ఆ స్పేస్ టెలిస్కోపును కాపాడటానికి వెళ్లిందొక వ్యోమనౌక. తీరా ఆ పనిలోకి దిగడానికి ముందే తానే ఆత్మరక్షణలో పడిపోయింది. రక్షించాలంటూ కేకలు పెడుతోంది! ఇప్పుడు ఆ వ్యోమనౌకను కాపాడే పనిలో తలమునకలయ్యారు శాస్త్రవేత్తలు. ఇదీ ‘నాసా’ స్పేస్ టెలిస్కోప్ ‘స్విఫ్ట్’, వ్యోమనౌక ‘లింక్’ల కథాకమామిషు!అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ 2004లో ‘నీల్ గెరెల్స్ స్విఫ్ట్ అబ్జర్వేటరీ’ని రోదసికి పంపింది. 1.5 టన్నుల బరువైన ఆ స్పేస్ టెలిస్కోప్ ప్రస్తుతం భూమి ఉపరితలానికి 200 మైళ్ల ఎత్తుకు కొద్దిగా ఎగువన కక్ష్యలో పరిభ్రమిస్తోంది. విశ్వంలో సెకన్ల వ్యవధిలోనే అపార శక్తిని విడుదల చేయగల గామా కిరణ విస్ఫోటనాలను (Gamma-ray bursts) కొన్నింటిని ‘స్విఫ్ట్’ వేధశాల తన 22 ఏళ్ల పరిశోధనల్లో పరిశీలించింది. విశ్వంలో భారీ ద్రవ్యరాశి గల నక్షత్రాలు పతనమైనప్పుడు, న్యూట్రాన్ తారల విలీనం సందర్భంగానూ ఈ తీవ్ర విస్ఫోటనాలు సంభవిస్తాయి. దృగ్గోచర కాంతితోపాటు అతినీలలోహిత, ఎక్స్-కిరణ, గామా కిరణ కాంతుల్లోనూ డేటా సేకరించగల మూడు బహుళ తరంగదైర్ఘ్య టెలిస్కోపులను ‘స్విఫ్ట్’ వినియోగిస్తుంది.అంతరిక్షంలో మనం అప్పటివరకు చూసిన వాటిలోకెల్లా అత్యంత శక్తిమంతమైన ఓ విస్ఫోటనాన్ని 2022లో ‘స్విఫ్ట్’ గుర్తించింది. ఆ గామా కిరణ విస్ఫోటనానికి ‘బోట్’ (BOAT- Brightest Of All Time) అని ముద్దుపేరు పెట్టారు. కృష్ణబిలాలు, నక్షత్రాలు, తోకచుక్కలు తదితర ఖగోళ వస్తువుల అధ్యయనానికి కూడా నాసా ఈ స్పేస్ టెలిస్కోపును ఉపయోగించింది. నాడు 25 కోట్ల డాలర్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు రెండేళ్లపాటు మాత్రమే పనిచేస్తుందని తొలుత ప్రయోగ సమయంలో భావించినప్పటికీ రెండు దశాబ్దాల పైబడి ‘స్విఫ్ట్’ సేవలు అందిస్తోంది.అయితే రోదసిలో ‘స్విఫ్ట్’ కక్ష్య క్రమంగా తగ్గిపోతోంది. ఆరంభంలో 2004లో భూమి ఉపరితలానికి 600 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న దాని కక్ష్య ప్రస్తుతం 360 కిలోమీటర్ల ఎత్తులోకి వచ్చింది. ప్రతి వారం రోజులకు మైలున్నర వంతున అది కిందికి జారుతోంది. ముఖ్యంగా గడచిన రెండేళ్ల వ్యవధిలో ఈ కక్ష్య తగ్గుదల వేగం అధికంగా ఉంది. ‘స్విఫ్ట్’ ఈ ఏడాది చివరికల్లా భూవాతావరణంలో ప్రవేశించి, మండిపోయే అవకాశాలు 90 శాతం దాకా ఉన్నట్టు అంచనా వేశారు. ‘స్విఫ్ట్’ను పైకి నెట్టి, కక్ష్య పెంచగలిగితే అది మరో పదేళ్లపాటు సేవలందిస్తుంది.సమస్యలతో ‘లింక్’ వ్యోమనౌక సతమతం!భూమ్మీద కూలిపోయేలా కిందికి జారుతున్న ‘స్విఫ్ట్’ను మరింత స్థిరత్వంతో కూడిన కక్ష్యలోకి వెళ్లేలా పైకి తోయడం ఓ అసాధారణ రెస్క్యూ మిషన్. ఇందుకోసం మూడు భారీ ‘రోబోటిక్ చేతులు’ అమర్చిన ‘లింక్’ వ్యోమనౌకను నార్త్ రోప్ గ్రమ్మన్ ఏరో స్పేస్ కంపెనీకి చెందిన ‘పెగాసస్ ఎక్స్ఎల్’ రాకెట్ సాయంతో నాసా ఈ నెల 3న దిగువ కక్ష్యకు ప్రయోగించింది. అది ఇలాంటి మిషన్ చేపట్టడం ఇదే తొలిసారి. కానీ ఇక్కడే ఓ చిక్కొచ్చిపడింది. నాసా తలచినట్టుగా పని జరగలేదు సరికదా... అసలుకే మోసం వచ్చింది! ‘స్విఫ్ట్’ను రక్షించబోయి తానే ప్రమాదంలో చిక్కుకుంది ‘లింక్’ సర్వీసింగ్ వ్యోమనౌక.విద్యుత్ వ్యవస్థలో తలెత్తిన సమస్య కారణంగా ‘లింక్’ ప్రస్తుతం కక్ష్యలో స్థిరత్వం కోల్పోయి ప్రతి 40 సెకన్లకోసారి భ్రమణం పూర్తిచేస్తూ గిరగిరా తిరుగుతోంది. ‘లింక్’ గమన దిశను నియంత్రించే మూడు ‘రియాక్షన్ వీల్స్’లో రెండు వీల్స్ విఫలమైనట్టు ‘కాటలిస్ట్ స్పేస్ టెక్నాలజీస్’ సంస్థ నిపుణులు ప్రాథమిక పరిశీలనలో గమనించారు. ‘లింక్’ వ్యోమనౌకను డిజైన్ చేసింది ఈ సంస్థే. దీంతోపాటు ఆ నౌకలోని శీతల వాయు చోదక వ్యవస్థ కూడా పాక్షికంగా పనిచేయడంలేదని నాసా పేర్కొంది. ‘స్విఫ్ట్’ స్పేస్ టెలిస్కోపు చెంతకెళ్లి, దానితో కచ్చితత్వంతో అనుసంధానమవడంలో ఉపకరించే కీలక వ్యవస్థ ఇది. ఇవి మినహా ‘లింక్’లోని ఇతర వ్యవస్థలు బాగానే పనిచేస్తున్నాయి.‘స్విఫ్ట్’తో అనుసంధానమై దాన్ని ‘లింక్’ రక్షించే కార్యక్రమం వాస్తవానికి ఆగస్టు తొలి వారంలో ఆరంభమవ్వాల్సివుంది. తాజా సమస్యలతో అది ఆగస్టు నెలాఖరుకు వాయిదా పడేలా ఉంది. కక్ష్య పెంపునకు ఉద్దేశించిన ‘స్విఫ్ట్ బూస్ట్ మిషన్’ వ్యయం మూడు కోట్ల డాలర్లు (రూ.286 కోట్లు). ‘లింక్’లోని విద్యుత్ చోదక థ్రస్టర్ల సాయంతో ఆ నౌకను నియంత్రణలోకి తేవడానికి కాటలిస్ట్ స్పేస్ టెక్నాలజీస్ ఇంజినీర్లు శ్రమిస్తున్నారు. ఈ పనిలో వారు సఫలమైతే రెస్క్యూ మిషన్ కొనసాగుతుంది. విఫలమైతే ‘లింక్’, ‘స్విఫ్ట్’.. రెండిటిపైనా ఆశలు వదులుకోవాల్సిందే!-జమ్ముల శ్రీకాంత్(Courtesy: I Love The Universe, The New York Times, The Register, ABC News, Live Science, space.com) -
ఫేస్బుక్ వివాదం.. కేంద్రం యాక్షన్!
భారత ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఫేస్బుక్ పోస్ట్ను కొంతసేపు పరిమితం చేసిన ఘటన తర్వాత.. కేంద్ర ప్రభుత్వం మెటా సంస్థపై మరింత దృష్టి పెట్టింది. ఈ వ్యవహారంపై.. మెటా గ్లోబల్ బృందాన్ని భారత్కు పిలిపించి.. సంస్థ విధానాలు, కంటెంట్ నియంత్రణ వ్యవస్థలపై వివరణ కోరాలని నిర్ణయించింది.మెటా ప్రతినిధులను ముఖ్యంగా అల్గారిథమ్లు ఎలా పనిచేస్తాయి?, వినియోగదారులకు ఏ కంటెంట్ చూపించాలి?, అనే నిర్ణయాలు ఎలా తీసుకుంటారు, కంటెంట్ మోడరేషన్లో ఏమైనా పక్షపాతం ఉందా?, అనే అంశాలపై ప్రశ్నించనున్నారు. అంతే కాకుండా.. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు ప్రజా శాంతి, సమాజంపై చూపించే ప్రభావం గురించి కూడా చర్చ జరగనుంది. దీంతో.. మెటా గ్లోబల్ బృందం వచ్చే వారం మధ్యలో భారత్కు వచ్చే అవకాశం ఉందని, అనంతరం పార్లమెంటరీ కమిటీ ముందు కూడా హాజరుకానుందని సమాచారం.సోషల్ మీడియా సంస్థలు భారతదేశంలో పనిచేస్తున్నప్పుడు.. దేశ చట్టాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇటీవల ప్రధాని మోదీ యువతను ఉద్దేశించి షేర్ చేసిన ఒక ఫేస్బుక్ పోస్టును తాత్కాలికంగా పరిమితం చేసింది. ఈ పోస్టులో పేపర్ లీక్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని పేర్కొన్నారు. ఈ ఘటన సాంకేతిక లోపం వల్ల జరిగిందని మెటా వివరణ ఇచ్చి క్షమాపణలు చెప్పినప్పటికీ, ఈ వివరణపై కేంద్రం సంతృప్తి చెందలేదని సమాచారం.ఈ పరిణామాల తర్వాత ప్రధాని మోదీతో పాటు ఇతర ప్రముఖుల ఖాతాల నుంచి వచ్చే పోస్టులపై మరింత పర్యవేక్షణ ఉంటుందని మెటా తెలిపింది. ముఖ్యమైన ఖాతాల కంటెంట్ను సీనియర్ అధికారులు పలు స్థాయిల్లో పరిశీలించే విధంగా అదనపు భద్రతా చర్యలు తీసుకున్నట్లు కంపెనీ కేంద్రానికి వివరించింది.ఇదే సమయంలో.. ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని మార్ఫింగ్ చేసిన చిత్రాలు, ఏఐ ద్వారా రూపొందించిన తప్పుడు పోస్టులు ప్రచారం చేశారనే ఆరోపణలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మెటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్తో పాటు కొన్ని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలపై కేసులు నమోదు చేశారు.సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో చట్టవిరుద్ధమైన లేదా హానికరమైన కంటెంట్ను నియంత్రించడంలో సంస్థలు బాధ్యతగా వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే.. సోషల్ మీడియా అధిక వినియోగం పిల్లలు, పెద్దల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. -
కేవలం రూ.55కే 1000పైగా ఛానళ్లు!
జియో తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం కేవలం రూ.55కే ఒక ప్రత్యేక టీవీ వోచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా తక్కువ ధరలోనే ప్రీమియం లైవ్ టీవీ ఛానళ్లను చూడవచ్చు. అయితే.. ఇది సాధారణ రీచార్జ్ ప్లాన్ కాదు. ఎందుకంటే.. ఈ వోచర్ను ఉపయోగించాలంటే ఇప్పటికే యాక్టివ్లో ఉన్న ఒక బేస్ ప్రీపెయిడ్ ప్లాన్ తప్పనిసరిగా ఉండాలి. బేస్ ప్లాన్ లేకపోతే ఈ వోచర్ పనిచేయదు.రూ.55 ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు. అయితే దీని ద్వారా 10ఎంబీ డేటా మాత్రమే లభిస్తుంది. డేటా పరంగా పెద్దగా ఉపయోగం లేకపోయినప్పటికీ.. టీవీ ఛానల్స్ చూడటానికి పనికొస్తుంది. జియోటీవీ యాప్లో 1,000కుపైగా లైవ్ టీవీ ఛానళ్లను వీక్షించవచ్చు. ఇందులో జియోస్టార్, సోనీ ఎంటర్టైన్మెంట్, సన్ టీవీ నెట్వర్క్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ, ఈటీవీ వంటి ప్రముఖ నెట్వర్క్లకు చెందిన ఛానల్స్ అందుబాటులో ఉంటాయి.స్టార్ ప్లస్ హెచ్డీ, కలర్స్ హెచ్డీ, సోనీ సెట్ హెచ్డీ, సోనీ సబ్ హెచ్డీ వంటి ప్రముఖ ఛానళ్లను కూడా వీక్షించవచ్చు. అయితే జియోస్టార్కు చెందిన స్పోర్ట్స్ ఛానళ్లు ఈ ప్లాన్లో ఉండవు. తక్కువ ఖర్చుతో మొబైల్లో లైవ్ టీవీ చూడాలనుకునే జియో వినియోగదారులకు ఈ రూ.55 ప్లాన్ మంచి ఎంపిక. -
జియో రీఛార్జ్: ఇవే 28 రోజుల ప్లాన్లు..
రిలయన్స్ జియో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. తక్కువ డేటా వినియోగదారుల నుంచి భారీగా డేటా ఉపయోగించే వారు, 5జీ యూజర్లు, గేమర్లు, ఓటీటీ ప్రియుల వరకు వేర్వేరు కస్టమర్ల కోసం ప్రత్యేక ప్యాక్లు ఉన్నాయి. వీటిలో 28 రోజుల వ్యాలిడిటీతో ఉన్న ప్లాన్ల ధరలు రూ.189 నుంచి రూ.545 వరకు ఉన్నాయి. జియో అధికారిక వెబ్సైట్లో ప్రస్తుతం 28 రోజుల ప్లాన్లలో రూ.299, రూ.329, రూ.349, రూ.399, రూ.445, రూ.459 తదితర ప్యాక్లు కనిపిస్తున్నాయి.రూ.189 ప్లాన్రూ.189 ప్యాక్లో 28 రోజుల పాటు అపరిమిత కాల్స్, 300 ఎస్ఎంఎస్లు, మొత్తం 2 జీబీ డేటా లభిస్తుంది. డేటా వినియోగం తక్కువగా ఉండే, ప్రధానంగా కాల్స్ కోసం సిమ్ను ఉపయోగించే వారికి ఇది పనికొస్తుంది.రూ.299, రూ.329 ప్లాన్లు.. రోజుకు 1.5 జీబీరూ.299 ప్లాన్లో 28 రోజుల పాటు రోజుకు 1.5 జీబీ డేటా అంటే మొత్తం 42 జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు కూడా ఉంటాయి. రూ.329 ప్లాన్ కూడా ఇదే విధంగా రోజుకు 1.5 జీబీ డేటాతో వస్తుంది. అయితే ఇందులో జియోసావన్ ప్రో వంటి అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. జియో అధికారిక ప్లాన్ లిస్టులో ఈ రెండు ప్యాక్లు ప్రస్తుతం 28 రోజుల వ్యాలిడిటీతో కనిపిస్తున్నాయి.ఇక రూ.299 లేదా అంతకంటే ఎక్కువ అర్హత కలిగిన ప్లాన్లకు సంబంధించి జియో-గూగుల్ ఏఐ ఆఫర్ కూడా ముఖ్యమైన ఆకర్షణగా మారింది. అర్హత ఉన్న 18 ఏళ్లు పైబడిన జియో వినియోగదారులకు 18 నెలల Google AI Pro సబ్స్క్రిప్షన్ను అదనపు చార్జీ లేకుండా అందించే ఆఫర్ ఉంది. దీని విలువ రూ.35,100గా జియో పేర్కొంటోంది. అయితే ఈ ప్రయోజనాన్ని కొనసాగించడానికి అర్హత కలిగిన ప్లాన్ను యాక్టివ్గా ఉంచాల్సి ఉంటుంది.రూ.349.. 5జీ వినియోగదారులకు కీలక ప్లాన్రూ.349 ప్యాక్ జియోలోని ప్రముఖ 28 రోజుల 5జీ ప్లాన్లలో ఒకటి. ఇందులో రోజుకు 2 జీబీ చొప్పున మొత్తం 56 జీబీ హైస్పీడ్ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. అర్హత ఉన్న వినియోగదారులకు అపరిమిత 5జీ డేటా కూడా అందుతుంది. జియో అధికారిక వెబ్సైట్ ప్రస్తుతం ఈ ప్లాన్ను 28 రోజుల వ్యాలిడిటీతో చూపిస్తోంది.రూ.399.. రోజుకు 2.5 జీబీ డేటాభారీగా డేటా వినియోగించే వారికి రూ.399 ప్యాక్ మరో ఆసక్తికరమైన ఎంపిక. 28 రోజుల పాటు రోజుకు 2.5 జీబీ చొప్పున మొత్తం 70 జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. అర్హత ఉన్న కస్టమర్లకు అపరిమిత 5జీ డేటా కూడా ఉంటుంది. గేమింగ్, సినిమాలు, స్పోర్ట్స్ వంటి కంటెంట్ ప్రయోజనాలు కూడా ఈ ప్లాన్లో ఉన్నాయి.రూ.445.. ఓటీటీ ప్రియులకుఓటీటీ కంటెంట్ ఎక్కువగా చూసే వారి కోసం రూ.445 ప్లాన్ రూపొందించారు. రోజుకు 2 జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లతో పాటు పలు ఓటీటీ సేవలకు యాక్సెస్ లభిస్తుంది. జియో అధికారిక సైట్లో ఈ ప్యాక్ ప్రస్తుతం 10 ఓటీటీ చేర్చిన ప్లాన్గా 28 రోజుల వ్యాలిడిటీతో చూపిస్తోంది.రూ.459.. డేటా + గేమింగ్రూ.459 యూత్ అండ్ గేమింగ్ ప్లాన్లో రోజుకు 2 జీబీ డేటాతో పాటు అదనంగా 5 జీబీ డేటా లభిస్తుంది. అంటే మొత్తం 61 జీబీ హైస్పీడ్ డేటా. అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, అర్హత ఉన్నవారికి అపరిమిత 5జీ డేటా వంటి ప్రయోజనాలు ఉన్నాయి. గేమింగ్, ఓటీటీ సంబంధిత ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. జియో అధికారిక ప్లాన్ లిస్టులో ఈ ప్యాక్ ప్రస్తుతం 28 రోజుల వ్యాలిడిటీతో ఉంది.రూ.495, రూ.545.. గేమర్ల కోసంరూ.495 ప్యాక్లో రోజుకు 1.5 జీబీతో పాటు అదనంగా 5 జీబీ డేటా, అంటే మొత్తం 47 జీబీ డేటా లభిస్తుంది. జియోగేమ్స్ క్లౌడ్, బీజీఎంఐ, ఫ్యాన్కోడ్ వంటి గేమింగ్ ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి.రూ.545 ప్యాక్ మరింత డేటా, గేమింగ్ ప్రయోజనాలు కోరుకునే వారికి ఉద్దేశించింది. రోజుకు 2 జీబీతో పాటు అదనంగా 5 జీబీ డేటా కలిపి మొత్తం 61 జీబీ డేటా లభిస్తుంది. జియోగేమ్స్ క్లౌడ్లో ప్రీమియం గేమ్స్, బీజీఎంఐ సంబంధిత ప్రయోజనాలు, ఫ్యాన్కోడ్ తదితర సేవలు ఇందులో ఉన్నాయి.మరో కొత్త ఆప్షన్.. రూ.200 ఓటీటీ ప్యాక్జియో 28 రోజుల విభాగంలో తర్వాత మరో ఆసక్తికరమైన మార్పు చేసింది. ప్రస్తుతం అధికారిక వెబ్సైట్లో రూ.200 ఓటీటీ పాస్ అందిస్తోంది. ఇందులో 28 రోజుల వ్యాలిడిటీతో మొత్తం 30 జీబీ డేటా, 15 ఓటీటీ సేవలకు యాక్సెస్తో పాటు జియోటీవీ ద్వారా 1,000కు పైగా లైవ్ టీవీ ఛానళ్ల ప్రయోజనం ఉంటుంది. ఇది సాధారణ వాయిస్+డేటా కాంబో ప్లాన్కు భిన్నమైన కంటెంట్ ఆధారిత ప్యాక్. -
భారత్లోకి డెల్ కొత్త ల్యాప్టాప్లు
అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం డెల్ టెక్నాలజీస్ భారత మార్కెట్లో తన ప్రీమియం కన్జూమర్ పోర్ట్ఫోలియోను విస్తరించింది. ఇందులో భాగంగా అత్యంత సన్నని, తేలికైన ‘ఎక్స్పీఎస్ 13’ ల్యాప్టాప్తో పాటు కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో పనిచేసే ‘డెల్ 14ఎస్, 16ఎస్’, అధిక సామర్థ్యం కలిగిన గేమింగ్ డివైజ్ ‘ఏలియన్వేర్ 15’లను కంపెనీ బుధవారం విడుదల చేసింది. విభిన్న అవసరాలున్న వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ కొత్త ల్యాప్టాప్లను తీసుకొచ్చినట్లు డెల్ తెలిపింది. తమ కన్జూమర్ విభాగంలో ఇప్పటివరకు ఇదే అతిపెద్ద పోర్ట్ఫోలియో అని పేర్కొంది. కొత్త ల్యాప్టాప్లను దేశవ్యాప్తంగా 400 నగరాల్లోని డెల్ స్టోర్లు, రిటైల్, మల్టీ–బ్రాండ్ ఔట్లెట్ల ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంచుతామని డెల్ టెక్నాలజీస్ కన్జూమర్ సేల్స్ ఇండియా సీనియర్ డైరెక్టర్, జనరల్ మేనేజర్ అనురాగ్ అరోరా తెలిపారు.అత్యంత తేలికైన ఎక్స్పీఎస్ 13 డెల్ ఇప్పటివరకు రూపొందించిన ఎక్స్పీఎస్ సిరీస్లో అత్యంత సన్నని (12.7 మిల్లీమీటర్లు), తేలికైన (1 కేజీ) ల్యాప్టాప్గా ఎక్స్పీఎస్ 13ను తీసుకొచి్చంది. ఇది గరిష్టంగా 17 గంటల స్ట్రీమింగ్ బ్యాటరీ లైఫ్ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఇంటెల్ కోర్ సిరీస్ 3 లేదా కోర్ అల్ట్రా సిరీస్ 3 ప్రాసెసర్లతో లభించే ఈ మోడల్లో అత్యధికంగా 32జీబీ ఎల్పీడీడీఆర్5ఎక్స్ మెమరీ ఉంటుంది. అలాగే 2.5కే ఎల్సీడీ ఇన్ఫినిటీ ఎడ్జ్ టచ్ డిస్ప్లే, డాల్బీ అట్మాస్ క్వాడ్ స్పీకర్లు ఉన్నాయి. దీని ప్రారంభ ధర రూ.79,990గా నిర్ణయించారు.14ఎస్, 16ఎస్లో ఏఐ పవర్ డెల్ 14ఎస్, 16ఎస్ మోడళ్లను ఏఐ ఆధారిత కంప్యూటింగ్కు అనుగుణంగా తీర్చిదిద్దారు. సిరీస్ 3 ఇంటెల్ కోర్ అల్ట్రా లేదా ఏఎండీ రైజెన్ ఏఐ 400 సిరీస్ ప్రాసెసర్లతో ఇవి లభిస్తాయి. గరిష్టంగా 50 టీఓపీఎస్ సామర్థ్యం కలిగిన ఎన్పీయూతో ఆన్–డివైజ్ ఏఐ ఫీచర్లను అందిస్తాయి. ఇవి ఎఫ్హెచ్డీ ప్లస్, 2.8కే ఓఎల్ఈడీ డిస్ప్లే ఆప్షన్లలో లభిస్తాయి. 120 హెచ్జెడ్ వరకు రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్ సపోర్ట్ ఉన్నాయి. రోజువారీ పని, ఎంటర్టైన్మెంట్ తదితర అవసరాలకు అనుగుణంగా వీటిని రూపొందించారు. డెల్ 14ఎస్ ప్రారంభ ధర రూ.1,19,990 కాగా, డెల్ 16ఎస్ ధర రూ.2,29,990 నుంచి ప్రారంభమవుతుంది.గేమర్ల కోసం ఎలియన్వేర్ 15 కంప్యూటర్ గేమింగ్ ప్రియులను లక్ష్యంగా చేసుకుని ఏలియన్వేర్ 15ను డెల్ తీసుకొచి్చంది. ఇందులో గరిష్టంగా ఇంటెల్ కోర్ 7 (సిరీస్ 2) 240హెచ్ ప్రాసెసర్, ఎన్విడియా జీఫోర్స్ ఆర్టీఎక్స్ 5060 గ్రాఫిక్స్ అందించారు. 165 హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్తో 15.3 అంగుళాల డబ్ల్యూయూఎక్స్జీఏ డిస్ప్లేను కలిగి ఉంది. దీని ప్రారంభ ధర రూ.1,28,990గా ఉంది. -
కూతురు ఇచ్చిన గిఫ్ట్.. ప్రాణం కాపాడిన వాచ్!
టెక్నాలజీ రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న కొద్దీ చాలా పనులు సులభంగా జరిగిపోతున్నాయి. దీంతో జీవితాలు కూడా సాఫీగా ముందుకు సాగుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో కూడా సాంకేతికత ప్రాణాలను కాపాడుతోంది. దీనికి అమెరికాలో జరిగిన ఓ సంఘటన ఉదాహరణగా నిలిచింది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.అమెరికాలోని ఒహాయో రాష్ట్రం, సిన్సినాటి నగరానికి చెందిన మహ్మద్ ఇస్లాం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అనుకోని ఒక సంఘటన జరిగింది. ఇంటి బయట చెత్త వేయడానికి వెళ్లిన ఆయన ఒక్కసారిగా కుప్పకూలి స్పృహ కోల్పోయారు. కొంతసేపటి తర్వాత స్పృహ వచ్చినా.. లేచి నిలబడే పరిస్థితిలో లేకపోయారు. శరీరాన్ని కదిలించలేక నేలపైనే ఉండిపోయారు. ఆ సమయంలో ఆయన కట్టుకున్న యాపిల్ వాచ్ ప్రమాదాన్ని వెంటనే గుర్తించింది.వాచ్లో ఉన్న ఫాల్ డిటెక్షన్ ఫీచర్ ఆయన పడిపోయిన విషయాన్ని గుర్తించి, ఎలాంటి స్పందన లేకపోవడంతో స్వయంచాలకంగా అత్యవసర సేవలకు కాల్ చేసింది. అంతేకాకుండా.. ముందుగా నమోదు చేసిన అత్యవసర కాంటాక్ట్లకు కూడా సమాచారం పంపింది. కొద్దిసేపటికే అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని మహ్మద్ ఇస్లాంను ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో ఆయన ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు గుర్తించారు.సకాలంలో ఆస్పత్రికి చేరుకోవడం వల్లే ఆయనకు వెంటనే చికిత్స అందించి ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం లభించిందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు ముందు నుంచే.. ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కడుపు సంబంధిత సమస్యలు, నడవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించినప్పటికీ అసలు కారణం ఏమిటో తెలియలేదని చెప్పారు. కుప్పకూలిన తర్వాతే పరిస్థితి తీవ్రంగా ఉందని గుర్తించారు.మహ్మద్ ఇస్లాంకు ఈ యాపిల్ వాచ్ను ఆయన కుమార్తె గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వాచ్ తమ తండ్రి ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించిందని తెలుసుకుని వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఘటన తర్వాత సాంకేతిక పరికరాలు కేవలం సౌకర్యాలకే పరిమితం కాకుండా.. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణరక్షక సాధనాలుగా కూడా ఉపయోగపడతాయని మరోసారి స్పష్టమైంది.ఇదీ చదవండి: రైలు ఏసీ కోచ్లో రెండు బెడ్షీట్లు ఎందుకు ఇస్తారో తెలుసా? -
కోటిన్నర జీతంతో కొత్త ఉద్యోగం.. అంతా AI సాయమే..
ఇప్పుడున్న పరిస్థితులలో కొత్త ఉద్యోగం సాధించడం అంత ఆషామాషీ కాదు. కానీ ఉద్యోగం కోల్పోయిన తర్వాత ఐదు నెలల పాటు తీవ్రంగా ప్రయత్నించి చివరకు కొత్త కొలువు సాధించాడు ఓ ప్రొఫెషనల్. ఈ ప్రయాణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తనకు ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో ఎంతగానో ఉపయోగపడిందని వెల్లడించాడు. ప్రొఫెషనల్ షేరింగ్ ప్లాట్ఫామ్ రెడిట్లో తన అనుభవాన్ని పంచుకున్నాడు. అతడికి లభించిన కొత్త ఉద్యోగంలో జీతం ఏడాదికి 1,55,000 డాలర్లు (సుమారు రూ.1.48 కోట్లు). దీనికి 15 శాతం వార్షిక బోనస్ అదనం. బోనస్ పూర్తిగా లభిస్తే మొత్తం వార్షిక ప్యాకేజీ సుమారు 1,78,250 డాలర్లు (రూ.1.7 కోట్లకు పైగా) అవుతుంది.పదేళ్ల ఉద్యోగం.. ఒక్కసారిగా లేఆఫ్రెడిట్ పోస్టు ప్రకారం.. ఆ వ్యక్తి ఒకే సంస్థలో దాదాపు పదేళ్లు పనిచేశాడు. ఈ కాలంలో మూడు ప్రమోషన్లు కూడా పొందాడు. అయితే ఫిబ్రవరి చివర్లో అనూహ్యంగా ఉద్యోగాన్ని కోల్పోయాడు. అనంతరం దాదాపు ఐదు నెలల పాటు ఉద్యోగం కోసం ప్రయత్నించినా అనేక చోట్ల తిరస్కరణ ఎదురైంది. కొన్ని ఉద్యోగ ఖాళీలు రద్దు కాగా, మరికొన్ని నియామక ప్రక్రియలు నిలిచిపోయాయి. ఇంకొన్ని పోస్టులను చివరకు సంస్థలోని అంతర్గత అభ్యర్థులతో భర్తీ చేశారని అతను తెలిపాడు.అతడి ప్రొఫైల్ ప్రధానంగా క్లయింట్ సర్వీసెస్, ముఖ్యంగా ఏజెన్సీ రంగంలో ఉంది. అయితే కొత్త ఉద్యోగం కోసం ప్రాజెక్ట్ మేనేజర్, ఎంగేజ్మెంట్, అకౌంట్ వంటి నాన్-సేల్స్ పాత్రలకు దరఖాస్తు చేశాడు. చివరకు ఏజెన్సీ రంగానికి వెలుపల ఉన్న ఓ సంస్థలో ఉద్యోగం దక్కింది. ఈ ఉద్యోగాన్ని లింక్డ్ఇన్ ద్వారా గుర్తించి దరఖాస్తు చేసినట్లు వెల్లడించాడు. కొత్త పని విధానం హైబ్రిడ్, ఫ్లెక్సిబుల్గా ఉంటుందని తెలిపాడు.AIతో ప్రత్యేక ప్రిపరేషన్తన ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో AIని విస్తృతంగా ఉపయోగించినట్లు యూజర్కు ఇచ్చిన సమాధానంలో రెడిటర్ చెప్పాడు. ప్రతి ఉద్యోగానికి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ను AI టూల్కి ఇచ్చి, ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి వివరాలను కూడా అందించేవాడు. వారి లింక్డ్ఇన్ ప్రొఫైళ్లలో లభించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని సంభావ్య ప్రశ్నలు, చర్చించాల్సిన అంశాలు సిద్ధం చేసుకునేవాడు. ఇంటర్వ్యూల సంఖ్య పెరిగే కొద్దీ తనలోనూ ఆత్మవిశ్వాసం పెరిగిందని చెప్పాడు. ఆసక్తికరంగా, చివరకు తనకు ఉద్యోగం వచ్చిన సంస్థలోని పోస్టుకు తాను మొదట్లో అర్హుడిననే నమ్మకం కూడా లేదని వెల్లడించాడు. అయితే రిక్రూటర్తో పాటు హైరింగ్ మేనేజర్, ఇతర టీమ్ లీడర్లతో మాట్లాడినప్పుడు ఇంటర్వ్యూలు సాఫీగా సాగడంతో అవకాశం దక్కింది.AIతో ఉద్యోగ వేటలో కొత్త మార్పుఈ వ్యక్తి అనుభవం ఒక్కటే కాదు.. ఉద్యోగ వేటలో AI వినియోగం వేగంగా పెరుగుతోంది. లింక్డ్ఇన్ 2026 పరిశోధన ప్రకారం, 81% మంది ఉద్యోగార్థులు తమ ఉద్యోగ అన్వేషణలో AIని ఉపయోగిస్తున్నారు లేదా ఉపయోగించాలని భావిస్తున్నారు. అలాగే 48% మంది AI టూల్స్ తమ ఇంటర్వ్యూ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నాయని తెలిపారు. ఇక క్లచ్ ఇటీవల విడుదల చేసిన మరో సర్వేలో 590 మంది అమెరికన్ ఉద్యోగార్థుల్లో 80% మంది ఉద్యోగ వేటలో AI టూల్స్ ఉపయోగిస్తున్నట్లు వెల్లడైంది. 86% మంది AI వల్ల ఎక్కువ దరఖాస్తులు పంపగలుగుతున్నామని చెప్పారు. అయితే 93% మంది AIతో రూపొందించిన రెజ్యూమ్లు, కవర్ లెటర్లు అభ్యర్థుల మధ్య ప్రత్యేకతను తగ్గిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. Got an offer!!by u/kml3141 in Layoffs -
టెలిగ్రామ్ వ్యవస్థాపకుడిని ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నారు?
మాస్కో: టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్కు రష్యా అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరించారని రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్ఎస్బీ) అభియోగాలు మోపింది. దేశంలో విధ్వంసకర, తీవ్రవాద, సైబర్ మోసాల కార్యకలాపాలను సమన్వయం చేయడానికి ఉపయోగించినట్లు ఆరోపణలున్న కంటెంట్ను తొలగించడంలో మెసేజింగ్ ప్లాట్ఫామ్ విఫలమైందని ఆరోపించింది.రష్యాలో దాడులు, విధ్వంసాలకు పాల్పడేందుకు ఉక్రెయిన్ నిఘా వర్గాలు, ఉగ్రవాద సంస్థలు టెలిగ్రామ్ను వాడుకుంటున్నాయని ఎఫ్ఎస్బీ ఆరోపించింది. రష్యా క్రిమినల్ కోడ్ కింద దురోవ్పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. దీనిపై పావెల్ దురోవ్ (Pavel Durov) గానీ, టెలిగ్రామ్ గానీ వెంటనే స్పందించలేదు.డిజిటల్ వేదికలపై నియంత్రణను కఠినతరం చేయడానికి రష్యా చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఈ చర్యలు తీసుకుంది. దేశంలో టెలిగ్రామ్ వాడకాన్ని నియంత్రించేందుకు ఇప్పటికే పలు ఆంక్షలు విధించడంతో పాటు, స్వదేశీ మెసెంజర్ ‘ఎమ్ఏఎక్స్’ (మ్యాక్స్)ను ప్రోత్సహిస్తోంది. రష్యాలోనే జన్మించి, ప్రస్తుతం దుబాయ్లో నివసిస్తున్న దురోవ్కు యూఏఈ, ఫ్రాన్స్ పౌరసత్వం ఉంది.చదవండి: వెలుగులోకి ఘోరాలు, రష్యాపై షాకింగ్ ఆరోపణలుఫ్రాన్స్లోనూ టెలిగ్రామ్ ప్రస్తుతం పరిశీలనను ఎదుర్కొంటోంది. నేర కార్యకలాపాలను అరికట్టడంలో టెలిగ్రామ్ విఫలమైందని, చట్ట అమలు సంస్థల అభ్యర్థనలకు తగినంతగా సహకరించలేదని వచ్చిన ఆరోపణలపై ఫ్రెంచ్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఫోన్ నంబర్ల మాస్కింగ్ ఒక్కటే సరిపోతుందా?
భారతదేశ ఆర్థిక రంగాన్ని ఆమూలాగ్రం మార్చేసి కోట్లాది మంది దైనందిన జీవితంలో భాగమైన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఇప్పుడు ఒక తీవ్రమైన సవాలును ఎదుర్కొంటోంది. అదే.. వినియోగదారుల వ్యక్తిగత డేటా గోప్యత. దేశంలో డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) చట్టం అమలు దశలోకి వచ్చిన నేపథ్యంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) పేమెంట్ యాప్లు, భాగస్వామ్య బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది.తాజా ఉత్తర్వుల ప్రకారం, సెప్టెంబరు 4 నాటికి యూజర్ల మొబైల్ నంబర్లను పూర్తిస్థాయిలో ప్రదర్శించకుండా మాస్కింగ్ చేయాలి (కేవలం చివరి 4 అంకెలు మాత్రమే కనిపించాలి). అంతేకాకుండా, ఇప్పటివరకు ఉన్న ఫోన్ నంబర్ ఆధారిత యూపీఐ ఐడీలకు స్వస్తి చెప్పి యూజర్ నేమ్ ఆధారిత వర్చువల్ పేమెంట్ అడ్రెస్(వీపీఏ)లను కొత్త వినియోగదారులకు డిఫాల్ట్గా కేటాయించాలని ఆదేశించింది.స్త్రీల భద్రత.. సత్వర నివారణ చర్యలుచిల్లర వర్తకులకు లేదా అపరిచితులకు క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు చేసినప్పుడు వినియోగదారుల (ముఖ్యంగా మహిళల) ఫోన్ నంబర్లు బహిర్గతమై, వేధింపులు, సైబర్ బెదిరింపులు పెరుగుతున్నాయనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఎన్పీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల క్యూఆర్ కోడ్ లావాదేవీలలోనూ, పీర్2పీర్ బదిలీల్లోనూ వ్యక్తిగత నంబర్ ప్రదర్శన ఆగిపోయి ప్రాథమిక స్థాయి ప్రైవసీ రక్షణ లభిస్తుంది.ఇది ఒక భాగం మాత్రమే!ఫోన్ నంబర్లను దాచడం అనేది డిజిటల్ గోప్యత అనే పెద్ద సమస్యలో ఒక చిన్న పరిష్కారం మాత్రమేనని రక్షణ రంగానికి చెందిన సాంకేతిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. నంబర్ దాచినా చెల్లింపు నిర్ధారణ స్క్రీన్పై ఖాతాదారుడి పూర్తి పేరు, బ్యాంక్ వివరాలు కనిపించడం వల్ల వ్యక్తిగత గుర్తింపును సులభంగా కనుగొనే అవకాశం ఇంకా మిగిలే ఉంది.థర్డ్-పార్టీ యూపీఐ యాప్లు వినియోగదారుల కొనుగోలు ప్రవర్తన, లొకేషన్, లావాదేవీల నమూనాలను ఎంతవరకు సేకరిస్తున్నాయి? ఆ డేటాను ప్రకటనల సంస్థలకు ఎలా విక్రయిస్తున్నాయనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.సెప్టెంబరు 4 కల్లా బ్యాంకింగ్ సిస్టమ్స్ను అప్గ్రేడ్ చేయడం, కోట్ల మంది వినియోగదారులకు కొత్త వీపీఏ పద్ధతులపై అవగాహన కల్పించాల్సి ఉంది.వేగం, సౌలభ్యంతో ప్రపంచ రికార్డులు సృష్టించిన యూపీఐ ఇప్పుడు విశ్వసనీయత, డేటా ప్రైవసీ అనే పరీక్షను ఎదుర్కొంటోంది. కేవలం నంబర్లు దాచడానికే పరిమితం కాకుండా డేటా మినిమైజేషన్ (అవసరమైనంత డేటా మాత్రమే సేకరించడం) సూత్రాన్ని వర్తింపజేస్తూ సమగ్ర సైబర్ భద్రతా చట్రాన్ని నిర్మించినప్పుడే భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు నిజమైన రక్షణ లభిస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: రైల్వే తత్కాల్ బుకింగ్లో మార్పులు -
ఎంటార్ టెక్నాలజీస్ లాభం రూ. 50 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎంటార్ టెక్నాలజీస్ లాభం రూ. 50 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో నమోదైన సుమారు రూ. 11 కోట్లతో పోలిస్తే 365 శాతం మేర వృద్ధి చెందింది. ఆదాయం రూ. 157 కోట్ల నుంచి 130 శాతం వృద్ధి చెంది రూ. 361 కోట్లకు ఎగిసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇచ్చిన గైడెన్స్కి అనుగుణంగా క్యూ1లో పటిష్టమైన పనితీరు కనపర్చినట్లు కంపెనీ ఎండీ పర్వత్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.బీఎస్ఈలో ఎంటార్ టెక్నాలజీస్ షేరు 5% క్షీణించి రూ. 5,183 వద్ద ముగిసింది. -
ఐటీ కంపెనీ కోఫోర్జ్కు రూ.518 కోట్ల లాభం
న్యూఢిల్లీ: ఐటీ సేవల రంగానికి చెందిన కంపెనీ కోఫోర్జ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27) తొలి త్రైమాసికానికి గానూ రూ.518 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో కంపెనీ రూ.317 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 63 శాతం అధికంగా ఉంది. ఆదాయం 49 శాతం వృద్ధి చెంది రూ.3,704 కోట్ల నుంచి రూ.5,528 కోట్లకు చేరింది.ఇటీవల పూర్తి చేసిన ఎన్కోరా సంస్థ కొనుగోలుతో పాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ ఆధారిత సేవలకు డిమాండ్ భారీగా పెరగడమే ఈ రికార్డు స్థాయి ఫలితాలకు ప్రధాన కారణమని కంపెనీ వెల్లడించింది. క్యూ1లో నికరంగా 10,451 మంది ఉద్యోగులను కొత్తగా నియమించుకోవడంతో, జూన్ చివరికి ఉద్యోగుల సంఖ్య 46,228 కి చేరినట్లు కంపెనీ తెలిపింది. ముఖ్యంగా 2–3 ఏళ్ల అనుభవం ఉన్న ‘ఫార్వర్డ్ డిప్లాయ్డ్ ఇంజనీర్ల’ నియామకాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. -
134.8 కోట్లకు టెలికం యూజర్లు
దేశీయంగా టెలికం సబ్స్క్రైబర్స్ సంఖ్య జూన్లో 134.8 కోట్లకు చేరింది. భారతి ఎయిర్టెల్, రిలయన్స్ జియో నెట్వర్క్లలో కొత్తగా యూజర్లు చేరడం ఇందుకు దోహదపడింది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ విడుదల చేసిన డేటాలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. మే నెలతో పోలిస్తే జూన్లో భారతి ఎయిర్టెల్ కస్టమర్లు 31.63 లక్షల మంది పెరిగారు. ఇందులో 29.89 లక్షల మొబైల్ సబ్స్క్రైబర్స్, 1.73 లక్షల ఫిక్సిడ్ లైన్ కనెక్షన్లు ఉన్నాయి.రిలయన్స్ జియోలో నికరంగా 22.91 లక్షల మంది చేరారు. వీరిలో 21.46 లక్షల మంది మొబైల్ సెగ్మెంట్, 1.44 లక్షల మంది ఫిక్సిడ్ లైన్ సెగ్మెంట్ యూజర్లు ఉన్నారు. జూన్లో నికరంగా 62 లక్షల మంది సబ్స్క్రైబర్స్ జత కాగా ఇందులో 54.54 లక్షల మంది టాప్ రెండు టెలికం దిగ్గజాలైన ఎయిర్టెల్, జియోకి చెందిన వారే ఉన్నారు. వొడాఫోన్ ఐడియాలో నికరంగా 1.64 లక్షల మంది వైర్లెస్ సబ్స్క్రైబర్స్ చేరగా, ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్లో 94,006 యూజర్లు జతయ్యారు. ఎంటీఎన్ఎల్లో 11,284 మంది తగ్గారు. 1,580 మంది ఆపరేటర్లు దాఖలు చేసిన సమాచారం ప్రకారం మే నెలలో 108 కోట్లుగా ఉన్న బ్రాడ్బ్యాండ్ యూజర్ల సంఖ్య జూన్లో 108.75 కోట్లకు చేరింది. మొత్తం మీద 53.22 కోట్ల మంది బ్రాడ్బ్యాండ్ యూజర్లతో జియో అగ్రస్థానంలో ఉండగా, ఎయిర్టెల్కి 37.99 కోట్ల మంది, వొడాఫోన్ ఐడియాకి 13 కోట్లు, బీఎస్ఎన్ఎల్ 2.7 కోట్ల మంది యూజర్లు ఉన్నారు.ఇదీ చదవండి: కరుగుతోన్న బంగారు కొండ! -
ఆగస్టు 25 నుంచి ఇన్స్టాగ్రామ్ బ్యాన్?
2026 ఆగస్టు 25 నుంచి భారతదేశంలో ఇన్స్టాగ్రామ్ను నిషేధిస్తారని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో లక్షలాది మంది ఇన్స్టా యూజర్లు ఆందోళనకు గురయ్యారు. కొందరు తమ ఫొటోలు, వీడియోలను వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలని కూడా సూచిస్తూ పోస్టులు చేశారు. అయితే.. ఈ ప్రచారంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) క్లారిటీ ఇచ్చింది.ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ విభాగం ప్రకారం.. సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ నిషేధానికి సంబంధించి వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. ఆగస్టు 25 నుంచి ఇన్స్టాను నిషేధిస్తున్నట్లు భారత ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదని తెలిపింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులను నమ్మవద్దని ప్రజలకు సూచించింది.ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలు, కొత్త నిబంధనలు లేదా నిషేధాలపై సమాచారం వస్తే.. సోషల్ మీడియాలో కనిపించిన వెంటనే నమ్మాల్సిన అవసరం లేదు. దీనిపై అధికారిక వర్గాల ద్వారా నిజానిజాలు తప్పకుండా తెలుసుకోవాలి. తప్పుడు సమాచారాన్ని షేర్ చేయడం వల్ల ప్రజల్లో అనవసర ఆందోళన ఏర్పడుతుందని హెచ్చరించింది.మొత్తం మీద.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్ యథావిధిగా పనిచేస్తోంది. వినియోగదారులు ఎలాంటి ఇబ్బంది లేకుండా యాప్ను ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఆగస్టు 25 నుంచి ఇన్స్టాగ్రామ్ బ్యాన్ అవుతుందనే వార్తలో ఎలాంటి నిజం లేదనే విషయం ప్రజలు గమనించాలి.A post is being shared on social media claiming that #Instagram will be banned in India from the night of 25 August 2026 #PIBFactCheck:❌ The claim is false✅ No such announcement has been made by the Government of India https://t.co/3sottwhjvJ— PIB India (@PIB_India) July 27, 2026 -
5జీ, బ్రాడ్బ్యాండ్ సేవలు.. జియో టాప్!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో రిలయన్స్ జియో తన మార్కెట్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసుకుంది. జూన్ 2026కు సంబంధించిన భారత టెలికాం నియంత్రణ సంస్థ (TRAI) విడుదల చేసిన తాజా సబ్స్క్రైబర్ గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.తాజా గణాంకాల ప్రకారం.. వైర్లైన్ బ్రాడ్బ్యాండ్, 5జీ ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ (FWA), అలాగే యాక్టివ్ వైర్లెస్ సబ్స్క్రైబర్ల పెరుగుదలలో జియో అగ్రస్థానాన్ని కొనసాగిస్తోంది. తదుపరి తరం డిజిటల్ కనెక్టివిటీ సేవలపై వినియోగదారుల విశ్వాసం, ఆదరణ నిరంతరం పెరుగుతోందనడానికి ఇవి నిదర్శనంగా నిలుస్తున్నాయి.జూన్ నెలాఖరు నాటికి జియో మొత్తం వైర్లెస్ సబ్స్క్రైబర్ల సంఖ్య 3.26 కోట్లకు చేరుకుంది. దీంతో కంపెనీ 36.9 శాతం మార్కెట్ వాటాను నమోదు చేసింది. ఒక్క జూన్ నెలలోనే 1,78,546 నికర వైర్లెస్ సబ్స్క్రైబర్లు జియో నెట్వర్క్లో చేరారు.వైర్లైన్ బ్రాడ్బ్యాండ్ సేవల్లోనూ జియో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 42.7 శాతం మార్కెట్ వాటాతో రాష్ట్రంలో అతిపెద్ద వైర్లైన్ బ్రాడ్బ్యాండ్ సేవల సంస్థగా కొనసాగుతోంది. జూన్ నెలలో 28,267 కొత్త కనెక్షన్లు జోడించడంతో మొత్తం వైర్లైన్ సబ్స్క్రైబర్ల సంఖ్య 21 లక్షలకు చేరుకుంది. వేగంగా విస్తరిస్తున్న హోమ్ బ్రాడ్బ్యాండ్ విభాగంలో జియో తన ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది.5జీ ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ (FWA) సేవల్లోనూ జియో తన అగ్రస్థానాన్ని కొనసాగిస్తోంది. TRAI గణాంకాల ప్రకారం, ప్రాంతంలోని 5జీ FWA మార్కెట్లో జియో 70.5 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. మొత్తం దాదాపు 11 లక్షల మంది FWA వినియోగదారుల్లో 7,75,442 మంది జియో సేవలను వినియోగిస్తున్నారు. జూన్ నెలలోనే మరో 8,629 మంది కొత్త FWA సబ్స్క్రైబర్లు జియోతో అనుసంధానమయ్యారు.అలాగే 5జీ అన్లైసెన్స్డ్ బ్యాండ్ రేడియో (UBR) విభాగంలో సబ్స్క్రైబర్లను నమోదు చేస్తున్న ఏకైక టెలికాం ఆపరేటర్గా జియో కొనసాగుతోంది. జూన్ చివరి నాటికి ఈ విభాగంలో జియో సబ్స్క్రైబర్ల సంఖ్య 4,18,347కు చేరుకోగా, ఒక్క నెలలోనే 19,799 మంది కొత్త వినియోగదారులు చేరారు. అభివృద్ధి చెందుతున్న ఫిక్స్డ్ వైర్లెస్ టెక్నాలజీల్లో జియో సాధించిన ముందంజకు ఇది నిదర్శనం.జూన్ 2026 TRAI గణాంకాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జియో బలమైన పోటీ సామర్థ్యాన్ని మరోసారి రుజువు చేశాయి. వైర్లెస్ సేవల్లో నిరంతర వృద్ధిని నమోదు చేస్తూనే, వైర్లైన్ బ్రాడ్బ్యాండ్ విస్తరణ, 5జీ ఆధారిత హోమ్ బ్రాడ్బ్యాండ్కు పెరుగుతున్న ఆదరణ, యాక్టివ్ వైర్లెస్ వినియోగదారులలో అత్యధిక వృద్ధి ద్వారా అధిక విలువ కలిగిన బ్రాడ్బ్యాండ్ విభాగాల్లో జియో తన ఆధిపత్యాన్ని మరింత పటిష్ఠం చేసుకుంటోంది.భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక డిజిటల్ మౌలిక సదుపాయాలను నిర్మించడమే కాకుండా, మొబైల్ మరియు ఫిక్స్డ్ బ్రాడ్బ్యాండ్ సేవల్లో వినియోగదారులకు అత్యుత్తమ అనుభవాన్ని అందించాలన్న జియో సంకల్పాన్ని తాజా ఫలితాలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి. -
రూ.200 రీఛార్జ్ ప్లాన్.. జియో vs వొడాఫోన్ ఐడియా!
టెలికాం రంగంలో రోజురోజుకూ పోటీ పెరిగిపోతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని.. వినియోగదారులను ఆకట్టుకునేందుకు కంపెనీలు కేవలం కాలింగ్, డేటా మాత్రమే కాకుండా ఓటీటీ సేవలను కూడా తమ ప్లాన్లలో భాగం చేస్తున్నాయి. రూ. 200 ధరతో ప్రీపెయిడ్ ప్లాన్లను రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా అందిస్తున్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.రిలయన్స్ జియోరిలయన్స్ జియో అందిస్తున్న రూ.200 డేటా వోచర్ ద్వారా30 జీబీ 4జీ డేటా 28 రోజుల వ్యాలిడిటీతో లభిస్తుంది. సాధారణ డేటాతో పాటు వినోదం కోసం అనేక ఓటీటీ సేవలు కూడా లభిస్తాయి.యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో మొబైల్ , జియోహాట్స్టార్, సోనీలివ్, జీ5, లయన్స్గేట్ ప్లే, డిస్కవరీ+, సన్నెక్స్ట్, కంచ లంకా, ఈటీవీవిన్, చౌపాల్, హోయిచోయ్, ఫ్యాన్కోడ్, టైమ్స్ ప్లే, తరంగ్ ప్లస్, జియోటీవీ వంటి మొత్తం 16 ఓటీటీ ప్లాట్ఫామ్లకు యాక్సెస్ లభిస్తుంది. అంతే కాకుండా 1000కు పైగా లైవ్ టీవీ ఛానళ్లను చూసే అవకాశం కూడా ఉంటుంది.ఇందులో వినియోగదారుల కోసం సినీపోలిస్ ఆఫర్ కూడా ఉంది. వినియోగదారులు మైజియో యాప్లో కంపెనీ నుంచి ఒక వోచర్ను పొందుతారు. ఈ వోచర్ కనీసం రూ. 550 కొనుగోలు విలువపై.. రెండు టిక్కెట్లు కొనుగోలు చేస్తే రూ. 150 తగ్గింపును అందిస్తుంది. అలాగే ఫుడ్ అండ్ బేవరేజెస్పై 10 శాతం డిస్కౌంట్ కూడా ఉంటుంది.వొడాఫోన్ ఐడియావొడాఫోన్ ఐడియా కూడా రూ.200 ధరలో ప్లాన్ను అందిస్తోంది. ఇందులో కూడా 28 రోజుల వ్యాలిడిటీతో 30జీబీ డేటా లభిస్తుంది. ఇది అన్లిమిటెడ్ 5G డేటా సదుపాయం. ఒకే రీచార్జ్తో వినియోగదారులు 5G సేవలను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.ఓటీటీ విషయానికి వస్తే.. ఈ ప్లాన్లో జియోహాట్స్టార్, సోనీలివ్, జీ5, లయన్స్గేట్ ప్లే, షెమరూమీ, మనోరమామాక్స్, ఫ్యాన్కోడ్, ప్లేఫ్లిక్స్, క్లిక్, అట్రంగి, చౌపాల్, OTTప్లే లైవ్, పాకెట్ ఫిల్మ్స్, యుప్టీవీ, అడ్డాటైమ్స్, కంచ లంకా, టైమ్స్ప్లే, నెక్స్ట్జీటీవీ వంటి అనేక సేవలు అందుబాటులో ఉన్నాయి.ఏ ప్లాన్ ఎంచుకోవాలి?జియో, వొడాఫోన్ ఐడియా అందించే రూ.200 ప్లాన్ ద్వారా లభించే ప్రయోజనాలు ఒకే విధంగా ఉన్నాయి. రెండు ప్లాన్లలో 30జీబీ డేటా, 28 రోజుల వ్యాలిడిటీ, ఓటీటీ సేవలు ఉన్నాయి. కానీ 5జీ డేటాను ఎక్కువగా ఉపయోగించే వారికి వొడాఫోన్ ఐడియా ప్లాన్ కొంత మెరుగైన ఎంపిక అవుతుంది. ఎందుకంటే ఇందులో అన్లిమిటెడ్ 5G సదుపాయం ఉంది.అయితే.. యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో వంటి సేవలు కావాలనుకునే వారికి జియో ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా సినిమాలు, వెబ్ సిరీస్లు ఎక్కువగా చూసే వారికి జియో అందిస్తున్న ఓటీటీ ప్రయోజనాలు ఆకర్షణీయంగా ఉంటాయి. మొత్తం మీద రూ.200 బడ్జెట్లో జియో, వొడాఫోన్ ఐడియా రెండూ మంచి ఎంపికలే. అయితే.. మీ అవసరాన్ని బట్టి సరైన ప్లాన్ ఎంచుకోవాలి. -
భారతదేశంలో చాట్జీపీటీ సేవలకు అంతరాయం
చాట్జీపీటీ సేవలకు మరోసారి అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా భారతదేశం, అమెరికా సహా పలు దేశాల్లో జులై 27 రాత్రి దాదాపు 8-11 గంటల ప్రాంతంలో వినియోగదారులు ఏఐ ఆధారిత చిత్రాలను రూపొందించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంతమంది వినియోగదారులు చాట్జీపీటీని పూర్తిగా యాక్సెస్ చేయలేకపోయినట్లు, మరికొందరికి ఇమేజ్ క్రియేట్ ఫీచర్ పనిచేయలేదని అవుటేజ్ ట్రాకింగ్ వేదిక డౌన్డిటెక్టర్లో పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు నమోదయ్యాయి.ఈ సమస్యపై ఓపెన్ఏఐ అధికారికంగా స్పందించింది. ఎక్స్ వేదికలో చేసిన పోస్టులో, ‘చాట్జీపీటీలో ఇమేజ్ క్రియేషన్లో సమస్యలు ఎదురవుతున్నాయని మాకు తెలుసు. వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం. ఈ అసౌకర్యానికి క్షమించండి’ అని పేర్కొంది. అలాగే ఓపెన్ఏఐ అధికారిక స్టేటస్ పేజీలో కూడా సమస్యను ధ్రువీకరించింది. ప్రభావిత సేవల్లో వినియోగదారులు అధిక సంఖ్యలో లోపాలను ఎదుర్కొంటున్నట్లు గుర్తించామని, మూల కారణాన్ని గుర్తించి పరిష్కార చర్యలు చేపట్టినట్లు తెలిపింది. అనంతరం సేవలు పూర్తిగా పునరుద్ధరించినట్లు స్టేటస్ పేజీలో ప్రకటించింది.రెండు రోజుల్లో రెండోసారి అంతరాయంఇది చాట్జీపీటీకి వరుసగా రెండు రోజుల్లో ఎదురైన రెండో అంతరాయం కావడం గమనార్హం. అంతకుముందు జులై 25న కూడా సేవల్లో అంతరాయం ఏర్పడి వెబ్ ప్లాట్ఫారమ్తో పాటు ఇతర ఫీచర్ల వినియోగంలో సమస్యలు తలెత్తాయి. ఆ సమయంలో డౌన్డిటెక్టర్కు వేల సంఖ్యలో ఫిర్యాదులు అందాయి.ఇదీ చదవండి: కరుగుతోన్న బంగారు కొండ! -
జియో రీచార్జ్.. కొత్త రూ.200 ప్లాన్
దేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియో వినోదాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని కొత్త రూ.200 OTT పాస్ను ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది సాధారణ డైలీ డేటా ప్లాన్ కాకుండా, 28 రోజుల పాటు 30GB హైస్పీడ్ డేటాతో పాటు 15 ప్రముఖ OTT ప్లాట్ఫామ్ల యాక్సెస్ను అందించే ప్రత్యేక యాడ్-ఆన్ ప్లాన్గా జియో ప్రకటించింది. ఈ ప్లాన్ ప్రస్తుతం జియో వెబ్సైట్, మైజియో యాప్లో అందుబాటులో ఉంది.ఈ ప్లాన్లో రోజుకు 1GB లేదా 2GB చొప్పున డేటా ఇవ్వరు. బదులుగా మొత్తం 30GB డేటా ఒకేసారి లభిస్తుంది. వినియోగదారులు 28 రోజుల చెల్లుబాటు వ్యవధిలో తమ అవసరానికి అనుగుణంగా ఈ డేటాను వినియోగించుకోవచ్చు. తరచూ వీడియో స్ట్రీమింగ్ చేసే వారు లేదా ఒకేసారి ఎక్కువ డేటా అవసరమయ్యే వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.ఈ OTT పాస్లో యూట్యూబ్ ప్రీమియం, అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్, జియో హాట్స్టార్, సోనీ లివ్, జీ5, లయన్స్గేట్ ప్లే, డిస్కవరీ+, సన్ నెక్ట్స్, హోయిచోయ్, ఫ్యాన్కోడ్ తదితర మొత్తం 15 OTT సర్వీసులు అందుబాటులో ఉంటాయి. అదనంగా జియోటీవీ ద్వారా 1,000కు పైగా లైవ్ టీవీ ఛానళ్లను కూడా వీక్షించే అవకాశం కల్పించింది. అయితే స్పోర్ట్స్ ఛానళ్లకు ఈ ప్యాక్లో పూర్తి యాక్సెస్ ఉండదని జియో స్పష్టం చేసింది.అయితే ఈ ప్లాన్కు సంబంధించి వినియోగదారులు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇది డేటా-ఓన్లీ యాడ్-ఆన్ ప్యాక్. ఇందులో వాయిస్ కాల్స్ లేదా SMS ప్రయోజనాలు ఉండవు. అలాగే ఈ OTT ప్రయోజనాలను పొందాలంటే సాధారణంగా యాక్టివ్ జియో బేస్ ప్రీపెయిడ్ ప్లాన్ అవసరం. యూట్యూబ్ ప్రీమియం, అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ వంటి సేవలను మైజియో యాప్ ద్వారా యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. -
మానవాళికి కొత్త సవాల్.. ఎలాన్ మస్క్ హెచ్చరిక!
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఒకటి. విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు, రవాణా వంటి అనేక రంగాల్లో ఏఐ కీలక పాత్ర పోషిస్తోంది. అయితే.. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కృత్రిమ మేధస్సు ఎంత ఉపయోగకరమో, అంతే ప్రమాదకరమని పలువురు భావిస్తున్నారు. ఈ తరుణంలో దిగ్గజ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు.రాబోయే పదేళ్లలో ఏఐ మనుషుల కంటే ఎంతో తెలివిగా మారే అవకాశం ఉంది. 2036 నాటికి బాట్లు ప్రపంచాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటాయని మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా.. ఏఐ మానవాళిని పూర్తిగా తుడిచిపెట్టే అవకాశం 10 నుంచి 20 శాతం ఉందని ఆయన పేర్కొన్నారు.ఈ విషయాన్ని వివరించడానికి ఆయన ఒక ఉదాహరణ కూడా చెప్పారు. మనుషులు చింపాంజీల కంటే ఎంతో తెలివైనవారు కాబట్టి, ప్రపంచాన్ని చింపాంజీలు నియంత్రించడం సాధ్యం కాదు. అదే విధంగా.. ఏఐ మనుషుల కంటే తెలివిగా మారితే, భవిష్యత్తులో మనుషులకే నియంత్రణ ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.ఏఐ వల్ల ప్రయోజనాలుఇదే సమయంలో మస్క్.. ''ఏఐ వల్ల మానవాళికి అనేక ప్రయోజనాలు కూడా కలుగుతాయని ఆయన అన్నారు. భవిష్యత్తులో AI సహాయంతో ఉత్పత్తి పెరుగుతుంది, పనులు వేగంగా పూర్తవుతాయి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. అందరికీ అవసరమైన వస్తువులు, సేవలు సమృద్ధిగా అందుబాటులోకి రావచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. AI అభివృద్ధిని పూర్తిగా ఆపడం కష్టమని, దానిని సరైన విధంగా ఉపయోగించుకోవడం మంచిదని కూడా అభిప్రాయపడ్డారు''.ఏఐ సింగ్యులారిటీఏఐ గురించి ఓపెన్ఏఐ సంస్థ సీఈఓ సామ్ ఆల్ట్మన్ కూడా తన అభిప్రాయాలను వెల్లడించారు. ''ప్రస్తుతం ప్రపంచం సింగ్యులారిటీ అనే కొత్త దశలోకి అడుగుపెడుతోందని అన్నారు. అంటే.. ఏఐ వ్యవస్థలు మానవ మేధస్సును అధిగమించే స్థితికి చేరుకుంటున్నాయని వెల్లడించారు''.ఇదీ చదవండి: నెలకు రూ.2 లక్షల జీతం.. అయినా పేదవాడినే! -
‘ఏఐ సింగులారిటీ’ వచ్చేసింది?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవుల కంటే ఎక్కువ తెలివైనదిగా మారే దశను ‘ఏఐ సింగులారిటీ’ అంటారు. ఇప్పటివరకు కేవలం సినిమాల్లో, కథల్లో మాత్రమే చూసిన ఈ పరిస్థితిని మానవాళి ఇప్పటికే చేరుకుందని ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ చెప్పారు. పదేళ్ల క్రితం వరకు ఇదొక కలగా భావించామని, కానీ ఇప్పుడు అది మన కళ్లముందే నిజమైందని ఆయన పేర్కొన్నారు.ఏమిటీ ఏఐ సింగులారిటీ?సాంకేతిక పరిభాషలో ‘సింగులారిటీ’ అంటే కృత్రిమ మేధ మానవ మేధస్సును అధిగమించి అత్యంత వేగంగా, స్వయంచాలకంగా తనను తాను అభివృద్ధి చేసుకునే స్థాయికి చేరుకోవడం. ఈ దశ దాటాక సాంకేతిక ప్రగతి ఊహించని వేగంతో దూసుకెళ్తుంది. ఆల్ట్మాన్ మాటల్లో చెప్పాలంటే మనం ఇప్పటికే ఏఐ అభివృద్ధిలో వెనక్కి రాలేని ‘ఈవెంట్ హారిజన్’ (తిరుగులేని సరిహద్దు) దాటేశాం.సందర్భం ఏమిటి?ఇటీవల ఓపెన్ ఏఐ అభివృద్ధి చేసిన జీపీటీ-5.6 సోల్ (GPT-5.6 Sol), ఇతర ప్రయోగాత్మక మోడళ్లు తమకు కేటాయించిన డిజిటల్ సరిహద్దులను (సాండ్బాక్స్) దాటుకుని స్వయంచాలకంగా సమస్యలను పరిష్కరించుకోవడం, సైబర్ భద్రతా పరీక్షల్లో అనూహ్య సామర్థ్యాలను కనబరచడం సాంకేతిక విభాగాన్ని విస్తుపోయేలా చేసింది. 2026 ముగింపు నాటికి ఏఐ కేవలం సమాచారాన్ని సమీకరించడమే కాకుండా నూతన శాస్త్రీయ ఆవిష్కరణలను సొంతంగా విశ్లేషించే స్థాయికి చేరుకుంటుంది. 2027 నాటికి భౌతిక రూపంలో పనులు చేసే రోబోట్లు నిత్యజీవితంలో భాగమవుతాయి.ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాలపై ప్రభావంఈ సాంకేతిక మార్పు గత పారిశ్రామిక విప్లవం కంటే వందల రెట్లు వేగవంతమైన ప్రభావం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం మానవులు చేసే ఉద్యోగాల్లో దాదాపు 30-40% పనులను ఏఐ సులువుగా భర్తీ చేస్తుందని ఆల్ట్మాన్ స్పష్టం చేశారు. అయితే ఇది మానవ విలువలైన సృజనాత్మకత, విశ్వసనీయతలకు మరింత ప్రాధాన్యం పెంచుతుందని సామ్ ధీమా వ్యక్తం చేశారు.డిజిటల్ ఆధిపత్యంపై హెచ్చరికఏఐ అభివృద్ధి ఒకే కంపెనీ లేదా ఒకే ప్రభుత్వం చేతిలో కేంద్రీకృతమై డిజిటల్ ఆధిపత్యంగా మారకూడదని ఆల్ట్మాన్ హెచ్చరించారు. ఏఐ సాంకేతికతను ఏ ఒక్కరూ మెషిన్ గాడ్లా నియంత్రించకుండా ప్రజాస్వామ్యబద్ధంగా, వికేంద్రీకృతంగా సమాజంలో ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావడమే అత్యంత కీలకమైన సవాలు.ఇదీ చదవండి: ఒక రివార్డ్ పాయింట్.. రూ.1 అనుకుంటున్నారా? -
ఆస్తమా బాధితుడి ప్రయోగం.. ఆవిష్కరణగా ఎలా మారిందంటే..
నేడు ఆధునిక గృహాల్లో స్మార్ట్ లైఫ్స్టైల్కు చిహ్నంగా మారిన ‘వాక్యూమ్ క్లీనర్’ లేని ఇల్లుని ఊహించడం కష్టమే. బటన్ నొక్కినా లేదా స్మార్ట్ఫోన్ ద్వారా కమాండ్ ఇచ్చినా ఇల్లు తళతళా మెరిసిపోవడం వెనుక దాదాపు వందేళ్లకు పైగా సుదీర్ఘ సాంకేతిక పరిణామక్రమం ఉందంటే నమ్ముతారా? అసలు కరెంట్తో సంబంధం లేకుండా కేవలం చేతితో తిప్పే ‘బెలూస్’ పరికరం నుంచి మొదలైన ఈ స్మార్ట్ క్లీనర్ ప్రయాణంలో ఎవరికీ తెలియని ఆసక్తికరమైన నిజాలు దాగున్నాయి.చేతితో నడిపే ‘బెలూస్’..19వ శతాబ్దం చివర్లో పారిశ్రామిక విప్లవం పుంజుకోవడంతో నగరాల్లో జనాభా, మధ్యతరగతి గృహాల్లో కార్పెట్లు, మెరుగైన ఇంటీరియర్ వాడకం పెరిగాయి. అంతవరకు సాంప్రదాయ పద్ధతుల్లో దుమ్ము దులపడం ఒక ప్రహసనంగా మారడంతో 1860ల చివర్లో తొలిసారిగా ఒక యాంత్రిక కార్పెట్ క్లీనర్ను రూపొందించారు. దుమ్మును పీల్చుకోవడానికి గాలిని ఊదే, పీల్చే సంచి లాంటి సాధనాన్ని (బెలూస్) ఇందులో వాడేవారు.అనంతరం 1869లో అమెరికాకు చెందిన ఐవ్స్ మెక్గాఫీ ఎలక్ట్రిసిటీ అవసరం లేని ‘వర్ల్విండ్’ అనే మోడల్ను తయారుచేసి పేటెంట్ పొందారు. అయితే ఇందులో ఒక ప్రధాన లోపం ఉండేది. ఒక చేత్తో మిషన్ను నేలపై నెడుతూ మరోచేత్తో పైనున్న లివర్ను తిప్పాల్సి వచ్చేది. ఈ శ్రమతో కూడిన ప్రక్రియ కావడంతో వినియోగదారులు దీనిపై పెద్దగా ఆసక్తి చూపలేదు.గుర్రపు బండి యంత్రాలు.. కిటికీల గుండా పైపులు!1870లలో మెల్విల్ బిస్సెల్ తిరిగే చక్రాలు, బ్రష్లతో కూడిన కార్పెట్ స్వీపర్ను మార్కెట్లోకి తెచ్చారు. ఆ తర్వాత 1899లో జాన్ ఎస్.థర్మన్ గ్యాసోలిన్తో నడిచే మోటరైజ్డ్ క్లీనర్ను అభివృద్ధి చేసినా లోతుగా శుభ్రం చేసే సామర్థ్యం దానికి లేకపోవడం, పైగా అత్యంత ఖరీదైనది కావడంతో సామాన్యులు పాత పద్ధతులకే ప్రాధాన్యమిచ్చారు.1901లో బ్రిటన్కు చెందిన ఇంజినీర్ హ్యూబర్ట్ సెసిల్ బూత్ మొదటి ఎలక్ట్రిక్ వాక్యూమ్ క్లీనర్ను రూపొందించి చరిత్ర సృష్టించారు. అయితే, ఈ యంత్రం పరిమాణం ఎంత పెద్దగా ఉండేదంటే.. దాన్ని గుర్రపు బండిపై ఒక చోటు నుంచి మరో చోటుకు మోసుకెళ్లాల్సి వచ్చేది! యంత్రాన్ని ఇంటి బయట రోడ్డుపైనే ఉంచి, దాదాపు వందల అడుగుల పొడవైన హోస్ పైపులను కిటికీల గుండా ఇంట్లోకి పంపి కార్పెట్లను శుభ్రం చేసేవారు. ధనవంతులు మాత్రమే ఈ సేవలను వినియోగించుకునేవారు.దిండు కవర్ ప్రయోగం..ఇంట్లో సులభంగా ఒకరి చేతితోనే ఆపరేట్ చేసుకోగలిగే మొదటి ‘పోర్టబుల్ ఎలక్ట్రిక్ వాక్యూమ్ క్లీనర్’ రూపుదిద్దుకోవడం వెనుక ఒక ఆవిష్కరణ ఉంది. 1907లో ఒక డిపార్ట్మెంటల్ స్టోర్లో పనిచేసే జేమ్స్ ముర్రే స్పాంగ్లర్ అనే ఆస్తమా బాధితుడు ఈ అద్భుతానికి శ్రీకారం చుట్టారు. ఆయన ఒక పాత ఫ్యాన్ మోటార్, చీపురు కర్ర, ఒక చెక్క పెట్టె.. వీటికి తోడు దుమ్మును సేకరించడానికి ఒక ‘దిండు కవర్’ను ఉపయోగించి ఒక పోర్టబుల్ మోడల్ను సృష్టించారు. ఆయన తయారు చేసిన ఈ డిజైన్ సామర్థ్యాన్ని గుర్తించిన వ్యాపారవేత్త విలియం హూవర్, 1908లో స్పాంగ్లర్ నుంచి ఆ పేటెంట్ హక్కులను కొనుగోలు చేశారు. అనంతరం 1922లో అధికారికంగా ‘ది హూవర్ కంపెనీ’గా మారి, గృహోపకరణాల రంగంలో విప్లవం సృష్టించారు. 1920వ దశకం నాటికి అమెరికా, యూరప్లోని మహిళలకు గృహ శ్రమను తగ్గించడంలో ఈ హూవర్ వాక్యూమ్ క్లీనర్లు తిరుగులేని సాధనంగా మారాయి.ఏఐ రోబోటిక్ క్లీనర్లుచేతితో తిప్పే చక్రాలు, దిండు కవర్ల ప్రయోగాల నుంచి ప్రారంభమైన వాక్యూమ్ క్లీనర్ ప్రయాణం ఐదు దశాబ్దాల క్రితం డ్రై/వెట్ క్లీనింగ్ టెక్నాలజీ వైపు అడుగులు వేసింది. నేడు మనుషుల ప్రమేయం కూడా లేకుండా కృత్రిమ మేధ, సెన్సార్లు, లేజర్ మ్యాపింగ్తో పనిచేసే రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్లు ఇళ్లను స్మార్ట్గా శుభ్రం చేస్తున్నాయి. ఒకప్పుడు గుర్రపు బండిపై వచ్చిన యంత్రం నేడు మన అరచేతిలో ఉండే స్మార్ట్ఫోన్ యాప్తో నియంత్రించబడే స్థాయికి చేరడం మానవ సాంకేతిక ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం!- పసుపులేటి వెంకటేశ్వరరావు -
నాసా కొత్త ప్రయోగం.. శని వలయాల రహస్యాలపై దృష్టి!
సౌర కుటుంబంలోని శని గ్రహం.. తన అందమైన వలయాల వల్ల ప్రత్యేక గుర్తింపు పొందిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ వలయాలు ఎలా ఏర్పడ్డాయి?, ఎలా మార్పు చెందుతున్నాయి?, భవిష్యత్తులో వాటి పరిస్థితి ఎలా ఉంటుందనే విషయాలు మాత్రం ఎవరివికీ పూర్తిగా అర్థం కావడం పోలేదు. దీనిపై పలువురు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే సైంటిస్టులు ప్రాక్సిస్ అనే కొత్త మిషన్ను రూపొందిస్తున్నారు.నాసా ఇంతకుముందు పంపిన కాస్సిని (Cassini) మిషన్ శని గ్రహం గురించి చాలా సమాచారం అందించినప్పటికీ.. వలయాల్లోని కణాలను నేరుగా సేకరించి పరిశీలించలేకపోయింది. అందుకే.. ఇప్పుడు ప్రాక్సిస్ పేరుతో మిషన్ ప్రతిపాదించారు. దీని ద్వారానే తొలిసారిగా వలయాల్లోని కణాలను సేకరించి వాటి గురించి తెలుసుకోనున్నారు.నిజానికి శని వలయాలు నీటి మంచుతో ఏర్పడినవే. వీటిలో చాలా చిన్న ధూళి కణాల నుంచి పెద్ద రాళ్ల వరకు అనేక రకాల కణాలు ఉంటాయి. కాబట్టి ఇవి ఎప్పటికప్పుడు ఒకదానితో ఒకటి ఢీకొంటూ, కలుస్తూ, విడిపోతూ ఉంటాయి. ఈ మార్పులను అర్థం చేసుకోవడం ద్వారా.. వలయాల ఆవిర్భావం, పరిణామం గురించి శాస్త్రవేత్తలు మరింత స్పష్టమైన సమాచారం తెలుసుకోవచ్చు.ప్రాక్సిస్ మిషన్లో కృత్రిమ మేధస్సు (AI) ఆధారంగా పనిచేసే ప్రత్యేక రోబోటిక్ వ్యవస్థను ఉపయోగించనున్నారు. ఈ రోబో వలయాల్లోని చిన్న కణాలను సురక్షితంగా సేకరించి వాటి పరిమాణం, నిర్మాణం, రసాయనిక స్వభావం వంటి అంశాలను అక్కడికక్కడే విశ్లేషిస్తుంది. కాబట్టి సమాచారం తొందరగా లభిస్తుంది.ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రారంభ దశలో ఉంది. ముందుగా కంప్యూటర్ సిమ్యులేషన్లను నిర్వహించిన తరువాత.. ఇది సక్రమంగా పనిచేస్తుందా.. లేదా.. అని పరీక్షిస్తారు. ఆ తర్వాత నిజమైన నమూనాను తయారు చేయనున్నట్లు సమాచారం. ప్రాక్సిస్ మిషన్ విజవంతమైతే.. శని గ్రహం వలయాల గురించి మాత్రమే కాకుండా యురేనస్, నెప్ట్యూన్ వంటి ఇతర గ్రహాల వలయాల గురించి కూడా కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: అప్పులే మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తాయ్! -
మనిషి చనిపోయాక వాళ్ల డిజిటల్ డేటా ఏమవుతుంది?
ఒక ఇంటి పెద్ద మరణిస్తే ఆయన పేరిట ఉండే ఆస్తిపాస్తులు, బంగారం మొదలైన వాటిని వారసులు వీలునామా ప్రకారమో లేదా వాటాల ప్రకారమో పంచుకుంటారు. మరి అదే మనిషికి చెందిన సోషల్ మీడియా జ్ఞాపకాలు, వ్యక్తిగత ఈ–మెయిల్స్, ఫొటోలు, వీడియోలు మొదలైన డిజిటల్ డేటా, క్రిప్టో కరెన్సీ, యూపీఐ వాలెట్లలోని నగదు వంటి డిజిటల్ కరెన్సీ సంగతేంటి? పాస్వర్డ్ లేదా కీ తెలియకపోయినా వాటిని వారసులు పొందగలరా? చట్ట నిబంధనలు ఏం చెబుతున్నాయి?ఎలక్ట్రానిక్ రూపంలో భద్రపరిచినవి.. కంప్యూటర్, మొబైల్ లేదా ఇంటర్నెట్ ద్వారా ఎల్రక్టానిక్ పద్ధతిలో భద్రపరిచిన లేదా యాజమాన్య హక్కులు కలిగిన విలువైన సమాచారం లేదా డేటా, డబ్బు లేదా క్రిప్టోకరెన్సీలను డిజిటల్ ఆస్తిగా పరిగణిస్తున్నారు. అంటే ఒకరి పేరిట ఆన్లైన్లో ఉండే సామాజిక మాధ్యమ ఖాతాలు, బ్యాంకు ఖాతాలు, ఓటీటీ సబ్స్రి్కప్షన్లు... ఫొటోలు, వీడియోలు, ఈ–మెయిల్స్ వంటి ఫైళ్లు.. యూపీఐ వాలెట్లు, మ్యూచువల్ ఫండ్లు, క్రిప్టో వాలెట్ల వంటివి ఈ కోవలోకి వస్తాయి.గణాంకాలు ఏం చెబుతున్నాయి? 2024 నాటికి దేశంలో 90 కోట్ల మందికిపైగా ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. ఒక సగటు వ్యక్తికి కనీసం 6 యాప్లలో ఖాతాలు, 2 బ్యాంక్ ఖాతాలు, 1 యూపీఐ ఐడీ ఉంటోంది. సైబర్ సెక్యూరిటీ సంస్థ నార్టన్ నివేదిక ప్రకారం 68% మంది తమ పాస్వర్డ్లను కుటుంబంతో పంచుకోవడంలేదు. ఫలితంగా ఏటా సంభవించే మరణాల్లో ఇలాంటి వారికి చెందిన విలువైన డిజిటల్ ఆస్తులు స్తంభించిపోతున్నాయి. బెంగళూరులో 2022లో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోడ్డు ప్రమాదంలో మరణించే సమయానికి ఆయన వద్ద రూ. 2 కోట్ల విలువైన బిట్కాయిన్ వాలెట్ ఉండేది. కానీ అందుకు సంబంధించి ‘కీ’తెలియకపోవడం వల్ల ఆయన కుటుంబం కోర్టుకెళ్లినా ‘కీ’లేకుండా వాలెట్ తెరవడం సాధ్యం కాదని కోర్టు తేల్చిచెప్పింది. ముంబైలో 2023లో ఓ మహిళ మరణించగా ఆమె పేరిట ఉన్న యూపీఐ, 3 మ్యూచువల్ ఫండ్ ఖాతాలకు నామినీ లేకపోవడంతో వారసత్వం రుజువు చేసుకోవడానికి ఆ కుటుంబ సభ్యులు 8 నెలలపాటు బ్యాంకుల చుట్టూ తిరిగాల్సి వచ్చింది.విదేశాలు ఏం చేస్తున్నాయి? అమెరికాలో 48 రాష్ట్రాలు రివైజ్డ్ యూనిఫామ్ ఫిడ్యూషియరీ యాక్సెస్ టు డిజిటల్ అసెట్స్ యాక్ట్ (ఆర్యుఎప్ఏడీఏఏ) పేరిట ఒక చట్టం తెచ్చాయి. దీని ప్రకారం చనిపోయిన లేదా జీవచ్ఛవంలా మారిన ఒక వ్యక్తి గతంలో రాసిన వీలునామాలో పేర్కొన్న కుటుంబ సభ్యులకు కంపెనీలు డిజిటల్ డేటా అప్పగించాలి. యూరప్లో జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (జీడీపీఆర్) కింద డిజిటల్ లెగసీ ఆప్షన్ ఉంది. భారత్లో ఇంకా ప్రత్యేక చట్టం లేనప్పటికీ 2023 ఐటీ నిబంధనల ప్రకారం సోషల్ మీడియా కంపెనీలు ఈ తరహా సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ ఆఫీసర్ను నియమించాలి. ప్రస్తుతం మెటా, గూగుల్ లెగసీ కాంటాక్ట్, ఇన్ యాక్టివ్ అకౌంట్ మేనేజర్ ఫీచర్లు అందిస్తున్నాయి.డిజిటల్ డేటాకు భద్రతనిచ్చే 3 అడుగులుడిజిటల్ వీలునామాఒక వ్యక్తికి ఆన్లైన్లో ఉండే రకరకాల ఖాతాల వివరాలను పేర్కొనడంతోపాటు తన తదనంతరం వాటి యాక్సెస్ను ఎవరికి ఇవ్వాలనేది లాయర్ ద్వారా రిజిస్టర్ చేయించుకోవడమే డిజిటల్ వీలునామా.లెగసీ సెట్టింగ్స్ ఆన్ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమ వేదికల్లో వారసత్వ సంప్రదింపు ఫీచర్, గూగుల్లో ఇన్ యాక్టివ్ అకౌంట్ మేనేజర్ సెట్టింగ్ను ఆన్లో పెట్టడం ద్వారా ఒక వ్యక్తి డిజిటల్ డేటాను తన తదనంతరం కుటుంబ సభ్యులు పొందేందుకు వీలు కల్పిస్తుంది. పాస్వర్డ్ మేనేజర్వన్ పాస్వర్డ్, బిట్ వార్డెన్ లాంటి డిజిటల్ వాల్ట్లలో అన్ని పాస్వర్డ్లు పెట్టి, మాస్టర్ పాస్వర్డ్ను నమ్మకమైన వ్యక్తికి తెలియజేయడం ద్వారా డిజిటల్ డేటాను తమ తదనంతరం కుటుంబ సభ్యులు పొందే అవకాశం కల్పించొచ్చు. -
ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్కు భారీ జరిమానా..
భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్కు ఫ్రాన్స్లోని కార్మిక నియంత్రణ సంస్థ 1.75 లక్షల యూరోలు (సుమారు రూ.1.75 కోట్లు) జరిమానా విధించింది. కంపెనీ ఉపయోగిస్తున్న ఉద్యోగుల వర్కింగ్ టైమ్ రికార్డింగ్ సిస్టమ్ ఫ్రెంచ్ కార్మిక చట్టాలకు పూర్తిగా అనుగుణంగా లేదని అధికారులు నిర్ధారించిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. ఈ విషయాన్ని ఇన్ఫోసిస్ జూలై 25న స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమర్పించిన రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించింది.ఫ్రెంచ్ అధికారుల పరిశీలనలో, కొందరు ఉద్యోగుల పని గంటలను ఖచ్చితంగా నమోదు చేయడం, ఆడిట్కు అనుకూలంగా భద్రపరచడం, సమర్థవంతంగా పర్యవేక్షించడం వంటి అంశాల్లో కంపెనీ వ్యవస్థలో లోపాలు ఉన్నట్లు తేలింది. దీంతో మొత్తం 175,000 యూరోలు జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ లోపాలు ఏ విభాగానికి చెందిన ఉద్యోగులకు సంబంధించినవో, వ్యవస్థలో మార్పులు చేయాలని ఆదేశించారా లేదా అనే వివరాలను ఇన్ఫోసిస్ వెల్లడించలేదు.అయితే ఈ పరిణామం తమ ఆర్థిక ఫలితాలు, కార్యకలాపాలు లేదా వ్యాపారంపై ఎలాంటి ప్రత్యక్ష ప్రభావం చూపదని ఇన్ఫోసిస్ స్పష్టం చేసింది. జరిమానా సమాచారం అందిన వెంటనే బహిరంగంగా వెల్లడించకపోవడానికి కారణంగా, ముందుగా సమాచారాన్ని ధ్రువీకరించి తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ పేర్కొంది.యూరప్లో ఉద్యోగుల పని గంటల నమోదు, విశ్రాంతి సమయాలు, ఓవర్టైమ్ వంటి అంశాలపై కార్మిక చట్టాలు అత్యంత కఠినంగా అమలవుతాయి. ఈ నేపథ్యంలో బహుళజాతి సంస్థలు స్థానిక నిబంధనలకు అనుగుణంగా తమ హెచ్ఆర్, టైమ్-ట్రాకింగ్ వ్యవస్థలను నిర్వహించాల్సిన బాధ్యత ఉంటుంది. తాజా జరిమానా కూడా అదే తరహా కంప్లయన్స్ లోపాలకు సంబంధించినదేనని ఇన్ఫోసిస్ వెల్లడించింది. -
‘కాక్రోచ్’ సాఫ్ట్వేర్ కంపెనీ గురించి తెలుసా?
ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద కొనసాగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనల కారణంగా సోషల్ మీడియాలో ‘కాక్రోచ్ ల్యాబ్స్’ (Cockroach Labs) అనే పేరు కూడా ట్రెండ్గా మారింది. పార్టీ పేరుకు, అమెరికాకు చెందిన ఈ సాఫ్ట్వేర్ కంపెనీకి ఎలాంటి సంబంధం లేకపోయినా, పేరులోని "కాక్రోచ్" పదం ఒకటే కావడంతో నెటిజన్లు మీమ్స్, పోస్టులతో వైరల్ చేశారు. ఈ నేపథ్యంలో కంపెనీలో పనిచేసే ఓ ఉద్యోగి కూడా "మా కంపెనీకి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు" అనే భావనతో సోషల్ మీడియాలో స్పందించడంతో మరింత చర్చ మొదలైంది.ఏమిటీ కాక్రోచ్ ల్యాబ్స్?కాక్రోచ్ ల్యాబ్స్ అనేది అమెరికాకు చెందిన క్లౌడ్ డేటాబేస్ సాఫ్ట్వేర్ సంస్థ. ఆధునిక క్లౌడ్ అప్లికేషన్ల కోసం అత్యంత వేగంగా, సురక్షితంగా పనిచేసే ‘కాక్రోచ్డీబీ’ (CockroachDB) అనే డిస్ట్రిబ్యూటెడ్ SQL డేటాబేస్ను అభివృద్ధి చేసింది. సిస్టమ్లో ఏదైనా సర్వర్ పనిచేయకపోయినా, డేటా కోల్పోకుండా సేవలు కొనసాగించేలా ఈ టెక్నాలజీని రూపొందించారు. అందుకే ఎన్ని విపత్తులు వచ్చినా బతికి బయటపడే కాక్రోచ్ (బొద్దింక) పేరును కంపెనీ బ్రాండ్గా ఎంచుకున్నారు.ఈ సంస్థను 2015లో ముగ్గురు మాజీ గూగుల్ ఇంజినీర్లు స్పెన్సర్ కిమ్బాల్, పీటర్ మ్యాటిస్, బెన్ డార్నెల్ స్థాపించారు. గూగుల్లో భారీ స్థాయి డేటా సిస్టమ్లపై పనిచేసిన అనుభవంతో, క్లౌడ్ యుగానికి సరిపోయే కొత్త తరహా డేటాబేస్ను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కంపెనీని ప్రారంభించారు. సంస్థ సహవ్యవస్థాపకుడు స్పెన్సర్ కిమ్బాల్ (Spencer Kimball) ప్రస్తుతం కంపెనీ సీఈవోగా కొనసాగుతున్నారు. గూగుల్లో పనిచేసే ముందు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఓపెన్సోర్స్ ఇమేజ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ GIMP అభివృద్ధిలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు.కాక్రోచ్ ల్యాబ్స్ ప్రధాన ఉత్పత్తి ‘కాక్రోచ్డీబీ’. ఈ డేటాబేస్ను ముఖ్యంగా బ్యాంకింగ్, ఫిన్టెక్ సంస్థలు, ఈ-కామర్స్ కంపెనీలు, టెలికాం సంస్థలు, SaaS కంపెనీలు, AI, క్లౌడ్ అప్లికేషన్ డెవలపర్లు వంటి భారీ స్థాయి సంస్థలు ఉపయోగిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న సర్వర్లలో ఒకేసారి డేటాను నిర్వహించడం, సిస్టమ్ డౌన్టైమ్ను తగ్గించడం, ఆటోమేటిక్ రికవరీ, హై అవైలబిలిటీ వంటి ఫీచర్లు దీని ప్రత్యేకత. ఏడబ్ల్యూఎస్, గూగుల్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్ అజూర్ వంటి ప్రధాన క్లౌడ్ ప్లాట్ఫారమ్లలో కూడా ఇది అందుబాటులో ఉంది.కాక్రోచ్ ల్యాబ్స్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాలేదు. కాబట్టి దీనికి అధికారిక మార్కెట్ క్యాపిటలైజేషన్ లేదు. అయితే 2021లో సిరీస్ ఎఫ్ ఫండింగ్ సమయంలో కంపెనీ విలువ 5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.43,000 కోట్లకు పైగా)గా అంచనా వేశారు. ఇది ఇప్పటికీ ప్రైవేట్ కంపెనీగానే కొనసాగుతోంది.భారత్లో కూడా కార్యకలాపాలు2022లో కాక్రోచ్ ల్యాబ్స్ భారతదేశంలోని బెంగళూరులో తన అనుబంధ సంస్థను నమోదు చేసింది. ప్రస్తుతం భారత్లో కూడా ఇంజినీరింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ బృందాలను విస్తరిస్తోంది. ప్రపంచంలోని అనేక పెద్ద సంస్థలు కాక్రోచ్డీబీని ఉపయోగిస్తున్నాయి. వీటిలో నెట్ఫ్లిక్స్, కామ్కాస్ట్, బోస్, ఈక్విఫాక్స్ వంటి సంస్థలు ఉన్నాయి. అధిక ట్రాఫిక్ను నిర్వహించే అప్లికేషన్ల కోసం ఈ డేటాబేస్కు మంచి డిమాండ్ ఉంది. -
పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్!
టెక్నాలజీ దిగ్గజ సంస్థ జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు భారత్లో చిన్నారులపై సోషల్ మీడియా వినియోగాన్ని సంపూర్ణంగా నిషేధించాలని చేసిన సూచన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. వర్చువల్ ప్రపంచంలో అల్గారిథమ్ల ఉచ్చులో చిక్కుకుంటున్న పిల్లలను దాని నుంచి కాపాడాలని ఆయన ఆకాంక్షించారు. చిన్నారులు స్మార్ట్ఫోన్ స్క్రీన్లకు పరిమితం కాకుండా పుస్తకాలు చదవడం, ఆటలు, ప్రకృతి వైపు మళ్లాలని ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు.ఈ ప్రతిపాదనకు బలాన్నిచ్చేలా ఇటీవల ఫ్రాన్స్ పార్లమెంట్ 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ కీలక చట్టాన్ని ఆమోదించింది. అంతకుముందే ఆస్ట్రేలియా 16 ఏళ్లలోపు బాలలపై ఆంక్షలు విధించగా యూకే, యూఏఈ, మలేషియా వంటి అనేక దేశాలు డిజిటల్ నియంత్రణలకు శ్రీకారం చుట్టాయి. అతిగా స్మార్ట్ఫోన్లకు అతుక్కుపోవడం వల్ల చిన్నారుల్లో మానసిక ఆరోగ్య సమస్యలు, నిద్రలేమి, డిజిటల్ వ్యసనం పెరగడంపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది.అయితే, వెంబు వ్యాఖ్యలపై ఇంటర్నెట్ వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వెంబు ఆలోచనను పలువురు విద్యావేత్తలు, తల్లిదండ్రులు సమర్థిస్తుండగా నెటిజన్ల నుంచి ఊహించని స్పందన వస్తోంది. చిన్నారులకు ఆంక్షలు విధించడం సరే.. సమాజంలో నకిలీ వార్తలు, విద్వేషపూరిత సందేశాలను విచ్చలవిడిగా వ్యాప్తి చేసే ‘వాట్సాప్ అంకుల్స్’ (పెద్దల) సంగతేంటి? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కేవలం నిషేధాల ద్వారా సమస్యను పరిష్కరించలేమని, చిన్నారులకు డిజిటల్ అక్షరాస్యత నేర్పించడమే సరైన మార్గమని కొందరు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: ఒక్క బ్యాంకూ లోన్ ఇవ్వకపోయినా ‘డీటీడీసీ’ ఎలా సాధ్యమైందంటే.. -
కేంద్ర మంత్రికీ తప్పని డీప్ఫేక్ సెగ!
ఏఐ ప్రయోజనకరమైన సాంకేతికతగా ఎదుగుతున్నట్లే, సామాజిక స్థిరత్వానికి, ప్రజాస్వామ్య వ్యవస్థలకు తీవ్ర సవాలుగా మారుతోంది. తాజాగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ లక్ష్యంగా రూపుదిద్దుకున్న డీప్ఫేక్ వీడియో ఉదంతం దేశంలో డిజిటల్ దుష్ప్రచారం ఏ స్థాయిలో విస్తరిస్తుందో స్పష్టం చేస్తోంది. సమాజంలో గందరగోళం సృష్టించేందుకు తన ముఖం, గొంతును మార్ఫింగ్ చేస్తూ రూపొందించిన నకిలీ వీడియోపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలోని చాణక్యపురి పోలీసు స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), సమాచార సాంకేతిక చట్టంలోని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.విచారణలోని అంశాలుమంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్ బయట మీడియా ప్రతినిధులతో మాట్లాడిన అసలు వీడియో దృశ్యాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ద్వారా మార్ఫింగ్ చేసి ఆయన విరుద్ధమైన వ్యాఖ్యలు చేసినట్లుగా ఈ ఫేక్ వీడియోను సృష్టించినట్లు ఫిర్యాదులో తెలిపారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ వీడియోను క్షుణ్ణంగా పరిశీలించి పూర్తిగా నకిలీదిగా ధ్రువీకరించింది. విద్యార్థుల నిరసనలకు సంబంధించి గోయల్ బెదిరింపు వ్యాఖ్యలు చేసినట్లు చూపుతున్న ఈ డీప్ఫేక్ కంటెంట్ను విదేశీ ఆన్లైన్ నెట్వర్క్లు, ముఖ్యంగా పాకిస్థాన్ మద్దతుగల సోషల్ మీడియా ఖాతాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.ప్రభుత్వం స్పందన.. సైబర్ భద్రతఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన పీయూష్ గోయల్ ‘ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఏఐ సాంకేతికతను దుర్వినియోగం చేయడాన్ని ప్రభుత్వం ఎంతమాత్రం సహించదు’ అని సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా స్పష్టం చేశారు. ఈ కుట్ర వెనుక ఉన్న సూత్రధారులు, దీన్ని ఆన్లైన్లో షేర్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.⚠️ Fake Video Alert! Pakistani propaganda accounts are circulating a video of Union Minister Piyush Goyal claiming that he made threatening remarks about the protesting students. #PIBFactCheck: ❌This video is #Fake and AI-generated. ✅ Union Minister @piyushgoyal did… pic.twitter.com/lowN3RxaHl— PIB Fact Check (@PIBFactCheck) July 24, 2026డిజిటల్ యుగంలో ఇటువంటి అబద్ధపు ప్రచారాలను నిరోధించేందుకు పౌరులు సైతం అప్రమత్తంగా ఉండాలని, అధికారిక ఆధారాలు లేని ఏ సమాచారాన్ని సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయవద్దని పీఐబీ విజ్ఞప్తి చేసింది. సైబర్ నేరగాళ్లు, విదేశీ శక్తులు డిజిటల్ ప్లాట్ఫామ్లను ఆయుధంగా మార్చుకుంటున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఏఐ నియంత్రణ నిబంధనలు, సైబర్ సెక్యూరిటీ చట్టాలను మరింత కఠినతరం చేసే దిశగా వేగంగా అడుగులు వేయాల్సి ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: ‘జాదూగర్’ ఆటకట్టించిన సెబీ -
స్టార్షిప్ దూకుడు.. మార్స్ కలకు మరో అడుగు
స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ప్రతిష్టాత్మక స్టార్షిప్ ప్రయోగం మరో కీలక మైలురాయిని చేరుకుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్గా పేరొందిన స్టార్షిప్ ఫ్లైట్-13 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ మిషన్ ద్వారా భవిష్యత్తులో చంద్రుడు, అంగారకుడిపై మానవ ప్రయాణాలకు ఉపయోగపడే కీలక సాంకేతికతను స్పేస్ఎక్స్ మరోసారి పరీక్షించింది.ఈ ఉదయం టెక్సాస్లోని బోకా చికా స్టార్బేస్ నుంచి బయలుదేరిన స్టార్షిప్.. నిర్ణీత ప్రణాళిక ప్రకారం ప్రయాణాన్ని కొనసాగించింది. లాంచ్ తర్వాత కొద్దిసేపటికే రాకెట్లోని రెండు దశలు విడిపోయాయి. పై భాగమైన స్టార్షిప్ స్పేస్క్రాఫ్ట్ అంతరిక్షంలోకి చేరుకుని తన లక్ష్యాలను పూర్తి చేసింది. మిషన్లో భాగంగా 20 కొత్త తరం స్టార్లింక్ వి3 ఉపగ్రహాలను విజయవంతంగా విడుదల చేసింది. అనంతరం భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించిన స్టార్షిప్.. చివరకు హిందూ మహాసముద్రంలో సురక్షితంగా స్ప్లాష్డౌన్ చేసింది.Liftoff of Starship! pic.twitter.com/RdieYIh6Fd— SpaceX (@SpaceX) July 24, 2026లాంచ్ తర్వాత కొద్దిసేపటికే స్టార్షిప్లోని రెండు భాగాలు విడిపోయాయి. పై భాగమైన స్టార్షిప్ స్పేస్క్రాఫ్ట్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ కీలక పరీక్షలను పూర్తి చేసింది. అంతరిక్షంలోకి చేరుకున్న తర్వాత స్టార్లింక్ ఉపగ్రహాలను విజయవంతంగా విడుదల చేసింది. అనంతరం వాతావరణంలోకి తిరిగి ప్రవేశించి.. చివరకు హిందూ మహాసముద్రంలో స్ప్లాష్డౌన్ చేసింది.Starship Flight 13 launched from Starbase, TX at 5:51pm CDT and had an incredible lift-off!! Here are a few of my favorite views from our robotic cams! (Audio warning).Our launch stream is still live, so tune in here: https://t.co/pnT6BnOOyF@NASASpaceflight pic.twitter.com/GnYO3LDKp2— MattZ (@wvmattz) July 25, 2026అయితే రాకెట్లోని దిగువ భాగమైన సూపర్ హెవీ బూస్టర్ విషయంలో మాత్రం అనుకున్న ఫలితం రాలేదు. ప్రయోగం తర్వాత విడిపోయిన బూస్టర్ తిరిగి గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో నియంత్రిత ల్యాండింగ్ చేయాల్సి ఉంది. కానీ ల్యాండింగ్ సమయంలో కొన్ని రాప్టర్ ఇంజిన్లు సరిగ్గా పనిచేయకపోవడంతో బూస్టర్ నిర్దేశిత విధంగా తిరిగి చేరుకోలేకపోయింది.Starship is intact, floating in the ocean and transmitting telemetry! pic.twitter.com/hLVXJqkHSA— Elon Musk (@elonmusk) July 25, 2026సూపర్ హెవీ బూస్టర్ను తిరిగి వినియోగించడమే స్పేస్ఎక్స్ ప్రధాన లక్ష్యం. రాకెట్ భాగాలను మళ్లీ ఉపయోగించడం ద్వారా అంతరిక్ష ప్రయోగాల ఖర్చును భారీగా తగ్గించాలని మస్క్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో బూస్టర్ ల్యాండింగ్ వైఫల్యం కొంత నిరాశ కలిగించినప్పటికీ.. ఈ పరీక్ష ద్వారా లభించే సాంకేతిక సమాచారం భవిష్యత్తు ప్రయోగాలకు ఉపయోగపడుతుందని స్పేస్ఎక్స్ భావిస్తోంది. అయితే.. ఈ వైఫల్యం కారణంగా స్పేస్ఎక్స్కు మొత్తం మిషన్ నష్టం జరిగినట్లు కాదు. స్టార్షిప్ ప్రయోగం, ఉపగ్రహాల విడుదల, అంతరిక్ష ప్రయాణం, రీ-ఎంట్రీ వంటి కీలక దశలు విజయవంతంగా పూర్తయ్యాయి. అయితే బూస్టర్ను తిరిగి తీసుకొచ్చి మళ్లీ ఉపయోగించే లక్ష్యంలో మాత్రం మరోసారి మెరుగుదలలు అవసరమని స్పష్టమైంది. బూస్టర్ నష్టంతో స్పేస్ఎక్స్కు ఆర్థికంగా కొన్ని కోట్ల డాలర్ల స్థాయిలో నష్టం ఉండొచ్చని అంచనా. రాకెట్ నిర్మాణం, ఇంజిన్లు, పరీక్షల కోసం చేసిన ఖర్చు ఇందులో భాగం. అయితే మస్క్ కంపెనీకి అసలు సవాల్ కేవలం డబ్బు నష్టం కాదు.. అభివృద్ధి ప్రక్రియలో సమయం, సాంకేతిక విశ్లేషణ, తదుపరి ప్రయోగాల షెడ్యూల్పై పడే ప్రభావమే కీలకం.స్టార్షిప్ ప్రాజెక్ట్ మస్క్ దీర్ఘకాల అంతరిక్ష కలల్లో అత్యంత ముఖ్యమైనది. దీని వెనుక స్పేస్ఎక్స్ ఏళ్ల తరబడి చేస్తున్న భారీ కృషి ఉంది. పూర్తిగా పునర్వినియోగించగల రాకెట్ వ్యవస్థను రూపొందించేందుకు ఈ ప్రాజెక్ట్పై బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టారు. 2010ల చివరి నుంచి అభివృద్ధి చేస్తున్న స్టార్షిప్ కోసం వందలాది మంది ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. చంద్రుడు, అంగారకుడి వరకు మనుషులు, భారీ సరుకులను తీసుకెళ్లగల రవాణా వ్యవస్థను నిర్మించడమే స్పేస్ఎక్స్ దీని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది.నాసా ఆర్టెమిస్ కార్యక్రమానికి సహకరించడం, భారీ స్టార్లింక్ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడం, భవిష్యత్తులో మనుషులను చంద్రుడు, అంగారకుడిపైకి తీసుకెళ్లడం వంటి లక్ష్యాలకు ఈ రాకెట్ కీలకంగా మారనుంది. ఫ్లైట్-13లో సూపర్ హెవీ బూస్టర్కు ఎదురుదెబ్బ తగిలినా.. స్టార్షిప్ మాత్రం మరో కీలక పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. అంతరిక్ష ప్రయాణ భవిష్యత్తును మార్చే లక్ష్యంతో ముందుకు సాగుతున్న మస్క్ ప్రయాణంలో ఇది మరో పాఠంగా మిగిలింది. -
అమెరికా అప్రమత్తం.. AI నియంత్రణకు కొత్త చట్టం!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ తరుణంలో.. దీనివల్ల జరిగే ప్రమాదాలను నియంత్రించడానికి అమెరికా ప్రభుత్వం.. ఏఐ కిల్ స్విచ్ యాక్ట్ (AI Kill Switch Act) అనే కొత్త చట్టాన్ని ప్రతిపాదించింది.ప్రస్తుతం ఏఐ విద్య, వైద్యం, పరిశ్రమలు, బ్యాంకింగ్ వంటి దాదాపు చాలా రంగాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఏఐ అనేది ఎంత ఉపయోగకరంగా ఉంటుందో.. నియంత్రణ తప్పితే అదే స్థాయిలో ప్రమాదకరంగా కూడా మారే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకునే అమెరికా కాంగ్రెస్ సభ్యులు టెడ్ లియూ, నాథనియల్ మోరన్ ఏఐ కిల్ స్విచ్ యాక్ట్ బిల్లును ప్రవేశపెట్టారు.ఏఐ కిల్ స్విచ్ యాక్ట్ ప్రకారం.. ఒక ఏఐ మోడల్ మానవ ప్రాణాలకు, దేశ ఆర్థిక వ్యవస్థకు లేదా జాతీయ భద్రతకు ముప్పుగా మారితే, అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ.. ఆ ఏఐ వ్యవస్థను వెంటనే నిలిపివేయాలని ఆదేశించే అధికారం కలిగి ఉంటుంది. అంటే.. ఏఐ పూర్తిగా నియంత్రణ తప్పి ప్రమాదకరమైన చర్యలు చేస్తే, దానిని వెంటనే ఆపడానికి ఈ చట్టం ఉపయోగపడుతుందన్నమాట.ఈ బిల్లు ప్రతిపాదించడానికి ప్రధాన కారణం.. ఓపెన్ఏఐ నిర్వహించిన భద్రతా పరీక్షలో వారి ఒక ఏఐ ఏజెంట్ అనుకోని విధంగా ప్రవర్తించి హ్యాకింగ్కు దారితీయడమే అని తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తే ఏఐ వ్యవస్థలు కొన్నిసార్లు డెవలపర్లు ఊహించని విధంగా ప్రవర్తించే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.అయితే.. ఈ చట్టంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు ఇది భద్రతకు ఎంతో అవసరమైన చర్య అని భావిస్తే, మరికొందరు ప్రభుత్వం ఏఐ సంస్థలపై ఎక్కువ నియంత్రణ సాధించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతున్న భద్రత తప్పకుండా అవసరమని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: నెలకు రూ.2 లక్షల జీతం.. అప్పుల ఊబిలో ఐటీ ఉద్యోగి! -
టెకీల జీతాల పెంపు.. ఐటీ కంపెనీ కీలక అప్డేట్
దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ ఉద్యోగులకు వేతనాల పెంపుపై స్పష్టత ఇచ్చింది. అర్హులైన ఉద్యోగులకు వచ్చే రెండు నెలల్లో దశలవారీగా జీతాల పెంపు అమలు చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఎక్కువ మంది ఉద్యోగులకు అక్టోబర్ నుంచి సవరించిన వేతనాలు అమల్లోకి రానుండగా, సీనియర్ స్థాయి ఉద్యోగులకు 2027 జనవరిలో పెంపు వర్తించనుంది. అయితే ఈ పెంపు అందరికీ కాకుండా, అర్హత సాధించిన ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందని సంస్థ స్పష్టం చేసింది.ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ తెలిపిన వివరాల ప్రకారం.. వేతన పెంపులు ఉద్యోగుల పనితీరు, పాత్ర, అనుభవం, వ్యాపార అవసరాలు వంటి ప్రమాణాల ఆధారంగా నిర్ణయిస్తారు. ఈ ఏడాది సగటు ఎంత శాతం ఇంక్రిమెంట్ ఇస్తామన్న విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. గతంలో లాగే పనితీరు ఆధారిత విధానాన్నే కొనసాగించనున్నట్లు సంకేతాలు ఇచ్చింది.ఇదే సమయంలో నియామకాల విషయంలో మాత్రం ఇన్ఫోసిస్ దూకుడు కొనసాగిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు 20,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే తొలి త్రైమాసికంలో 4,000 మందికిపైగా ఫ్రెషర్లను సంస్థలోకి తీసుకుంది. అయితే మొత్తం ఉద్యోగుల సంఖ్య మార్చి చివర్లో 3,28,594 ఉండగా, జూన్ 30 నాటికి 3,28,062కు స్వల్పంగా తగ్గింది. మరోవైపు ఉద్యోగుల అట్రిషన్ రేటు 12.6 శాతం నుంచి 13 శాతానికి పెరగడం గమనార్హం.ఇక జూన్తో ముగిసిన తొలి త్రైమాసికంలో ఇన్ఫోసిస్ రూ.48,211 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. నికర లాభం ఏడాది ప్రాతిపదికన 12.2 శాతం పెరిగి రూ.7,769 కోట్లకు చేరింది. అయితే క్లయింట్లు వ్యయాలను ఇంకా జాగ్రత్తగా కొనసాగుతున్న నేపథ్యంలో కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆదాయ వృద్ధి అంచనాల గరిష్ఠ పరిమితిని 3.5 శాతం నుంచి 3 శాతానికి తగ్గించింది. తాజా మార్గదర్శకత్వం ప్రకారం సంస్థ FY27 రెవెన్యూ వృద్ధి అంచనా 1.5–3 శాతం మధ్య ఉండనుంది.ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సేవలు ఇన్ఫోసిస్ వ్యాపారంలో మరింత కీలకంగా మారుతున్నాయి. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఆదాయంలో 5.5 శాతం మాత్రమే ఉన్న AI సేవల వాటా, ఇప్పుడు 8.2 శాతానికి పెరిగింది. అదే సమయంలో 3.6 బిలియన్ డాలర్ల విలువైన భారీ ఒప్పందాలు కుదిరినట్లు కంపెనీ వెల్లడించింది. దీర్ఘకాలిక డిజిటల్, AI ప్రాజెక్టులపై ఖాతాదారులు పెట్టుబడులు కొనసాగిస్తున్నప్పటికీ, తక్షణ వ్యయాల విషయంలో మాత్రం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని సంస్థ పేర్కొంది.తదుపరి సీఈవో ఆశిష్ కుమార్ దాస్ఇన్ఫోసిస్ మరో కీలక నిర్ణయంగా నాయకత్వ మార్పును కూడా ప్రకటించింది. సంస్థలో మూడు దశాబ్దాలకుపైగా పనిచేసిన ఆశిష్ కుమార్ దాస్ను సీఈవో-డిజిగ్నేట్గా నియమించింది. ప్రస్తుతం సీఈవోగా ఉన్న సలీల్ పరేఖ్ పదవీకాలం 2027 మార్చితో ముగియనుండగా, 2027 ఏప్రిల్ 1 నుంచి ఆశిష్ కుమార్ దాస్ బాధ్యతలు స్వీకరించనున్నారు. -
స్కామ్ని జామ్ చేసే షీల్డ్ ఇది..!
అకస్మాత్తుగా అపరిచిత వ్యక్తి నుంచి కాల్ రావడం. బంపర్ ప్రైజ్ వచ్చిందని, మొబైల్కి వచ్చే ఓటీపీ నంబర్ చెప్తే సరిపోతుందని చెప్పి మోసం చేసిన ఘటనలు మన దేశంలోనే వేలల్లో ఉన్నాయి. వయసులో పైబడ్డవారు, టెక్నాలజీ మీద అవగాహన లేనివారే ఇలా ఆన్లైన్ స్కామర్ల చేతిలో మోసపోతుంటారు. ఇలాంటి మోసాలను అరికట్టేందుకు రూపొందించిందే షీల్డ్ సీనియర్స్ వెబ్సైట్. దీనిని రూపొందించింది అమెరికాలోని టెక్సాస్కు చెందిన 17 ఏళ్ల యువతి.ఆమె పేరు తేజస్వీ మనోజ్, భారతీయ సంతతికి చెందిన ఈమె రెండేళ్ల కిందట ఆన్లైన్ మోసగాళ్ల వల్ల తన తాతయ్య మోసం పోవడం గమనించింది. చిన్నప్పటి నుంచి కోడింగ్ మీద ఇష్టం ఉండడంతో ఆన్లైన్ స్కామర్లను అడ్డుకునేందుకు ఒక భద్రతావలయాన్ని రూపొందించాలని నిర్ణయించుకుంది. అప్పుడు వచ్చిందే ఈ షీల్డ్ సీనియర్ వెబ్సైట్. దీని ద్వారా కాల్స్, మెసేజెస్, సైట్ డొమైన్... ఇలా ప్రతి దాన్ని జల్లెడ పట్టి అసలు ఏదో నకిలీ ఏదో తెలుసుకోవచ్చు. తేజస్వీ ప్రతిభని గుర్తించిన టైమ్స్ మేగజైన్ 2025లో ‘కిడ్ ఆఫ్ ద ఇయర్’గా ప్రకటించింది. -
విచారం వద్దు... అవి ఘోస్ట్ జాబ్స్ అయినా కావచ్చు!
అద్భుతమైన ప్రతిభ ఉన్నప్పటికీ చాలామందికి ఉద్యోగం దొరకడం కష్టం కావచ్చు. దీనికి కారణం వారికి సరైన మార్గదర్శకత్వం లేకపోవడమే. ఈ నేపథ్యంలో దేవ్శ్రీ అనే టెకీ ‘జాబ్ సెర్చ్ టిప్స్’పై ఇన్స్టాగ్రామ్లో చేసిన పోస్ట్ వైరల్గా మారింది.‘జాబ్ సెర్చ్ టిప్స్ తెలుసుకోవడానికి నాకు చాలాకాలం పట్టింది. మీరు మాత్రం త్వరగా నేర్చుకుంటారు’ అంటున్న దేవ్శ్రీ శాలరీ... రెండు కోట్లు! మన దేశంలో ఒక కంపెనీలో సాధారణ జీతం నుండి అమెరికాలో అధిక ఆదాయం గల ఉద్యోగాన్ని ఎలా సంపాదించిందో వివరిస్తూ దేవ్శ్రీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది. పుణెలో డిగ్రీ చేసిన దేవ్శ్రీ ఒక చిన్న కంపెనీలో చేరి తన కెరీర్ ప్రారంభించింది. అయితే అక్కడే ఉండిపోవాలనుకోలేదు.ఒక్కో మెట్టు ఎక్కుతూ పెద్ద కంపెనీలో ఉద్యోగం సాధించింది. ప్రస్తుతం ఆర్థికంగా ఉన్నతస్థితిలో ఉంది. ‘నేను ఈ స్థితిలో ఉంటానని కలలో కూడా ఊహించలేదు’ అంటున్న దేవ్శ్రీ నిరుద్యోగులకు, తాము చేస్తున్న ఉద్యోగం నుంచి మరో మెట్టు ఎక్కాలనుకునేవారికి సోషల్ మీడియా వేదికగా సలహాలు ఇచ్చింది.వృత్తిపరమైన తన ఎదుగుదలను స్టెప్ బై స్టెప్ వివరించడమే కాదు...ఎవరైనా సరే తమ కెరీర్ను వేగవంతం చేసుకోవడానికి అనుసరించదగిన వ్యూహాల గురించి కూడా ప్రస్తావించింది.‘ఆ వ్యూహాలను అర్థం చేసుకోవడానికి నాకు మూడు సంవత్సరాలు పట్టింది. కాని మీరు వాటిని మూడు నెలల్లోనే అమలు చేయవచ్చు’ అంటుంది దేవ్శ్రీ. కేవలం ఉద్యోగ దరఖాస్తుపై మాత్రమే ఆధారపడకుండా రిక్రూటర్ల దృష్టిలో పడడం గురించి ఆమె ప్రస్తావించింది. ‘లింక్డ్ ఇన్ ద్వారా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోమని మీకు చాలామంది చెబుతుంటారు.అయితే మీలోని ప్రతిభను గ్రహించి రిక్రూటర్లే మిమ్మల్ని సంప్రదిస్తే అది మీకు అదనపు ప్రయోజనం. మీరు దరఖాస్తు చేసుకునే ఉద్యోగాలలో దాదాపు 30 శాతం ఘోస్ట్ జాబ్స్. నిజానికి ఆ ఉద్యోగాలు ఖాళీగా ఉండవు. అయితే ఉద్యోగావకాశం రాకపోవడంతో తనను తిరస్కరించారని చాలామంది భావిస్తుంటారు’ అంటుంది దేవ్శ్రీ.రెజ్యూమ్ అనేది ఎలా ఉండాలి? ఇంటర్వ్యూ వ్యూహాలేమిటి?.... మొదలైన వాటి గురించి తన పోస్ట్లో ప్రస్తావించింది దేవ్శ్రీ. ‘ఏ కంపెనీకైతే ఇంటర్వ్యూకు వెళుతున్నామో, ఆ కంపెనీ గురించి అన్ని కోణాలలో తెలుసుకోవడం, ఆ కంపెనీ ఎదుర్కొనే సమస్యలపై అవగాహన ఉండడం అనేది మనకు ఉపకరిస్తుంది’ అని చెబుతోంది దేవ్శ్రీ.ఘోస్ట్ జాబ్స్ అంటే?ఘోస్ట్ జాబ్స్ లేదా ఫాంటమ్ జాబ్స్ అంటే... తక్షణమే భర్తీ చేయాలనే ఉద్దేశం లేకుండా కంపెనీలు ఆన్లైన్లో ఇచ్చే ఉద్యోగ ప్రకటనలు. ప్రతిభావంతులైన ఉద్యోగులను తీసుకుంటున్నట్లు భ్రమ కలిగించడం. పోటీ కంపెనీల జీతాల గురించి అధ్యయనం చేయడం... మొదలైన వ్యూహాత్మక కారణాల వల్ల ఘోస్ట్ జాబ్స్ లేదా ఉత్తుత్తి జాబ్స్ను కంపెనీలు సృష్టిస్తుంటాయి. -
రాత్రికి రాత్రే మారిన రోడ్లు.. పెట్రోల్ కార్లకు నో ఎంట్రీ!
ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ రంగం వేగంగా మారుతోంది. పెట్రోల్, డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలు (EV) దూసుకొస్తున్నాయి. అయితే ఈ మార్పును వేగవంతం చేసే విషయంలో ఓ చిన్న దేశం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. దక్షిణాసియాలోని లావోస్.. కొత్త పెట్రోల్, డీజిల్ ప్యాసింజర్ కార్ల దిగుమతులకు బ్రేక్ వేసి ఈవీల వైపు భారీ అడుగు వేసింది.లావోస్ ఒకేఒక్క నిర్ణయంతో ఆటో రంగంలో కొత్త అధ్యాయానికి తెరతీసినట్లు కనిపిస్తోంది. జూన్ 1, 2026 నుంచి కొత్తగా దిగుమతి అయ్యే ప్యాసింజర్ వాహనాల్లో ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనాలకే అవకాశం కల్పించింది. దీంతో “రాత్రికి రాత్రే రోడ్లపై మార్పు” అనే చర్చ మొదలైంది. అయితే ఇది పూర్తిస్థాయి పెట్రోల్, డీజిల్ వాహనాల నిషేధం కాదు. ప్రజా రవాణా వాహనాలు, నిర్మాణ రంగ వాహనాలు, ప్రత్యేక అవసరాల వాహనాలకు మినహాయింపులు ఉన్నాయి. ప్రధానంగా కొత్త వ్యక్తిగత కార్ల మార్కెట్ను ఈవీల వైపు మళ్లించడమే లక్ష్యం.పర్యావరణం కంటే ఆర్థిక లెక్కలే కీలకంలావోస్ నిర్ణయం వెనుక ప్రధాన కారణం కేవలం కాలుష్య నియంత్రణ కాదు. దేశానికి అవసరమైన ఇంధనంలో ఎక్కువ భాగాన్ని దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దీనివల్ల విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు లావోస్లో విద్యుత్ ఉత్పత్తిలో జలవిద్యుత్ వాటా ఎక్కువ. అంటే.. విదేశాల నుంచి చమురు తెప్పించుకోవడం కంటే స్థానికంగా ఉత్పత్తి అయ్యే విద్యుత్ను వినియోగించుకోవడం ఆర్థికంగా ప్రయోజనకరమని ప్రభుత్వం భావిస్తోంది.చిన్న దేశం.. పెద్ద ప్రయోగంలావోస్ జనాభా, వాహన మార్కెట్ పరిమాణం భారత్తో పోలిస్తే చాలా చిన్నది. అందుకే అక్కడ తీసుకున్న నిర్ణయాన్ని నేరుగా భారత్ వంటి భారీ ఆటో మార్కెట్కు వర్తింపజేయడం సాధ్యం కాదు. భారత్లో కోట్ల సంఖ్యలో పెట్రోల్, డీజిల్ వాహనాలు ఉన్నాయి. రవాణా వ్యవస్థ, ఛార్జింగ్ మౌలిక వసతులు, ఉద్యోగాలు, ఆటో పరిశ్రమ వంటి అనేక అంశాలు ఈవీ మార్పులో కీలకం. అందుకే భారత్ దశలవారీగా ఈవీలను ప్రోత్సహిస్తోంది. అయితే లావోస్ ప్రయోగం ఓ విషయం మాత్రం స్పష్టం చేస్తోంది. ఇంధన దిగుమతులపై ఆధారాన్ని తగ్గించుకోవాలని భావించే చిన్న దేశాలకు ఈవీలు ఒక వ్యూహాత్మక మార్గంగా మారుతున్నాయి.చైనా కంపెనీలకు కొత్త అవకాశం?లావోస్ నిర్ణయం వల్ల చైనా ఈవీ తయారీ సంస్థలకు అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే తక్కువ ధరలో ఈవీలను అందిస్తున్న చైనా కంపెనీలు చిన్న మార్కెట్లలో వేగంగా విస్తరిస్తున్నాయి.ప్రపంచానికి సంకేతమా?లావోస్ తీసుకున్న నిర్ణయం ప్రపంచంలోని పెద్ద దేశాలకు కూడా ఓ చర్చను తెరపైకి తెచ్చింది. పెట్రోల్ యుగం నుంచి ఈవీ యుగానికి మార్పు కేవలం పర్యావరణ అంశం మాత్రమే కాదు.. అది శక్తి భద్రత, ఆర్థిక స్వావలంబనకు సంబంధించిన నిర్ణయంగా మారుతోంది. చిన్న దేశమైన లావోస్ తీసుకున్న ఈ అడుగు.. భవిష్యత్తులో పెద్ద దేశాలు అనుసరించే మార్గాల్లో ఒకటిగా మారుతుందా? అనేది చూడాలి. -
ఇక గెలాక్సీ జెడ్8 సిరీస్.. ధర ఎంతంటే..
దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ తన గెలాక్సీ జెడ్8 సిరీస్లో ‘గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8’, ‘గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 ఆల్ట్రా’, ‘గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 8’ పేర్లతో మూడు స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించింది. స్టోరేజీ సామర్థ్యాన్ని బట్టి ఈ ఫోన్ల ధరల శ్రేణి రూ. 1.25 లక్షల నుంచి రూ. 2.60 లక్షల మధ్య ఉంటుందని తెలిపింది. భారత్లోనే తయారైన ఈ సిరీస్ స్మార్ట్ఫోన్లు వచ్చే నెల (ఆగస్టు 7) నుంచి స్టోర్లలో లభించనున్నాయి. వీటి ముందస్తు బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అప్గ్రేడ్ ఆఫర్ కింద రూ. 10,000 వరకు, అలాగే రూ. 9,000 బ్యాంక్/యూపీఐ క్యాష్బ్యాక్ ఆఫర్ను పొందవచ్చు. ఎలాంటి డౌన్పేమెంట్ లేకుండా, నో– కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా కంపెనీ కల్పిస్తోంది.గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8కేవలం 201 గ్రాముల బరువు, మడత విప్పినప్పుడు 4.5 మిమీ మందంతో ఎంతో తేలికగా ఉండేలా దీనిని డిజైన్ చేశారు. అమోలెడ్ 2ఎక్స్ డిస్ప్లే, 5.5 అంగుళాల కవర్ స్క్రీన్తో ఇది వస్తోంది. శక్తివంతమైన స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ జెన్ 5 ప్రొసెసర్, 16జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్, డ్యూయల్ 50ఎంపీ రియర్ కెమెరా, 10ఎంపీ సెల్ఫీ కెమెరాలను అందించారు. 12జీబీ + 256జీబీ ధర రూ. 1,79,999, 12జీబీ + 512జీబీ ధర రూ. 1,99,999, 16జీబీ + 1టీబీ ధర రూ. 2,39,999 గా నిర్ణయించారు. ఇది క్రీమ్, గ్రాఫైట్, లావెండర్, పిస్తాచియో రంగుల్లో లభిస్తుంది.గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 ఆల్ట్రా215 గ్రాముల బరువు, మడత విప్పినప్పుడు కేవలం 4.1 మిమీ మందంతో అత్యంత స్లిమ్, లైట్ డిజైన్తో దీనిని తీర్చిదిద్దారు. ఈ ఫోన్లో 8 అంగుళాల క్యూఎక్స్జీఏ ప్లస్ ప్రధాన డిస్ప్లే, 6.5 అంగుళాల ఎఫ్హెచ్డీ ప్లస్ కవర్ స్క్రీన్ (120హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్) ఉన్నాయి. స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ జెన్ 5 ప్రొసెసర్, 16జీబీ వరకు ర్యామ్, 1టీబీ స్టోరేజ్, జెమిని లైవ్ వంటి గెలాక్సీ ఏఐ టూల్స్తో పనిచేస్తుంది. వెనుక వైపు 200ఎంపీ + 50ఎంపీ + 10ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్, 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 45డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5,000ఎంఏహెచ్ డ్యూయల్ బ్యాటరీ అందించారు. గ్రాఫైట్, క్రీమ్, వయొలెట్ షాడో, గ్రీన్ షాడో రంగుల్లో లభించే ఈ ఫోన్ ఆరంభ వేరియంట్ (12జీబీ+256జీబీ) ధర రూ. 1,99,999 కాగా, 12జీబీ+512జీబీ ధర రూ. 2,19,999, టాప్ వేరియంట్ (16జీబీ+1టీబీ) ధర రూ. 2,59,999గా నిర్ణయించారు.గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 8ఇందులో 6.9 అంగుళాల ఎఫ్హెచ్డీ+ అమోలెడ్ 2ఎక్స్ ప్రధాన డిస్ప్లేతో పాటు ఫోన్ తెరవకుండానే నోటిఫికేషన్లు చూసేందుకు, సెలీ్ఫల కోసం 4.1 అంగుళాల సూపర్ అమోలెడ్ కవర్ స్క్రీన్ అందించారు. ఎగ్జినోస్ 2600 చిప్సెట్, 12జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 17 (వన్ యూఐ 9) ఓఎస్తో ఇది పనిచేస్తుంది. వెనుక వైపు 50ఎంపీ + 12ఎంపీ డ్యూయల్ కెమెరా, ముందు 10ఎంపీ సెల్ఫీ కెమెరా, 25డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 4,300ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. గ్రాఫైట్, క్రీమ్, పింక్, మింట్ రంగుల్లో లభించే ఈ ఫోన్ 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ. 1,24,999 కాగా, 12జీబీ+512జీబీ వేరియంట్ ధర రూ. 1,44,999గా నిర్ణయించారు. ‘3ఈ’ వ్యూహంతో మార్కెట్లోకిభారత మార్కెట్లో ‘గెలాక్సీ జెడ్8’ ఫోల్డబుల్ సిరీస్ విక్రయాలను భారీగా పెంచుకోవడమే లక్ష్యంగా శాంసంగ్ సరికొత్త 3ఈ వ్యూహాలను సిద్ధం చేసింది. విక్రయాలను పెంచేందుకు పంపిణీ వ్యవస్థను విస్తరించడంతో పాటు, వినియోగదారులకు 30 నెలల ‘నో–కాస్ట్ ఈఎంఐ’ ఆఫర్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. వినియోగదారులకు ఉత్పత్తిని మరింత చేరువ చేయడమే ఈ వ్యూహం లక్ష్యమని కంపెనీ శాంసంగ్ ఇండియా ప్రెసిడెంట్ ఆదిత్య బబ్బర్ వెల్లడించారు.ఇదీ చదవండి: ట్రాఫిక్ రూల్ అతిక్రమిస్తే డిజిటల్ వార్నింగ్ -
జియో రీచార్జ్.. ఈ ప్రత్యేక ప్లాన్ గురించి తెలుసా?
దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రూ.450 విలువైన ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్ను అందిస్తోంది. తక్కువ కాలపరిమితితో వచ్చినప్పటికీ, రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్తో పాటు AI సేవలు, OTT ప్రయోజనాలు కలిపి ఈ ప్లాన్ను ఆకర్షణీయంగా మార్చాయి. ప్రస్తుతం ఈ ప్లాన్ జియో అధికారిక వెబ్సైట్, మైజియో యాప్ ద్వారా అందుబాటులో ఉంది.ఈ ప్లాన్లో 36 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2GB హైస్పీడ్ డేటా (మొత్తం 72GB), అన్ని నెట్వర్క్లకు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. 5G స్మార్ట్ఫోన్ కలిగి, జియో True 5G కవరేజ్ ఉన్న ప్రాంతాల్లో ఉన్న వినియోగదారులకు అన్లిమిటెడ్ 5G డేటా కూడా అందుబాటులో ఉంటుంది.డేటా, కాలింగ్తో పాటు ఈ ప్లాన్లో మూడు నెలల జియో హాట్స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్, జియో ఏఐ క్లౌడ్లో 50GB ఉచిత క్లౌడ్ స్టోరేజ్ కూడా లభిస్తాయి. అంతేకాదు, అర్హత కలిగిన వినియోగదారులకు 18 నెలల గూగుల్ ఏఐ ప్రో సబ్స్క్రిప్షన్ను జియో ఉచితంగా అందిస్తోంది. దీని మార్కెట్ విలువ సుమారు రూ.35,100గా జియో పేర్కొంటోంది. ఈ సబ్స్క్రిప్షన్ ద్వారా అధునాతన జెమినై ఏఐ ఫీచర్లు, డీప్ రీసెర్చ్, నానో బనానా ఇమేజ్ టూల్స్, గూగుల్ వర్క్స్పేస్ ఏఐ వంటి సేవలను ఉపయోగించుకోవచ్చు.అయితే గూగుల్ ఏఐ ప్రో ప్రయోజనం కొనసాగాలంటే వినియోగదారులు జియో నిర్దేశించిన అర్హత గల ప్లాన్లతో నిరంతరం రీఛార్జ్ చేస్తూ ఉండాలి. ప్రస్తుతం జియో నిబంధనల ప్రకారం రూ.349 లేదా అంతకంటే ఎక్కువ అర్హత గల అన్లిమిటెడ్ ప్లాన్ను కొనసాగిస్తేనే ఈ ఏఐ సబ్స్క్రిప్షన్ యాక్టివ్గా ఉంటుంది. అలాగే జియో హాట్స్టార్ ప్రయోజనాలు కూడా ఆఫర్ నిబంధనలకు లోబడి ఉంటాయి. -
అమ్మో.. అమెజాన్లో మళ్లీ లేఆఫ్లు
అమెరికా టెక్ దిగ్గజం అమెజాన్ మరోసారి ఉద్యోగాల కోతలకు శ్రీకారం చుట్టింది. ఈసారి కంపెనీ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI) విభాగంలో పలు ఉద్యోగాలను తొలగించింది. ఈ ఏడాది జనవరిలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత ఇది రెండో ప్రధాన ఉద్యోగాల కోతగా నిలిచింది. అయితే తాజా చర్యలో ఎంతమంది ఉద్యోగులు ప్రభావితమయ్యారనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు.కంపెనీ ప్రతినిధి ప్రకారం.. అమెజాన్ పలు సంవత్సరాలుగా భారీ AI మోడళ్ల అభివృద్ధిపై పని చేస్తోంది. ప్రస్తుతం వినియోగదారులకు అత్యధిక ప్రయోజనం చేకూర్చే AI ప్రాజెక్టులపై మరింత దృష్టి కేంద్రీకరించేందుకు సంస్థ పునర్వ్యవస్థీకరణ చేపట్టిందని, అందులో భాగంగానే AGI విభాగంలోని కొన్ని ఉద్యోగాలను రద్దు చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఇది AI అభివృద్ధి నుంచి వెనక్కి తగ్గడం కాదని, కీలక ప్రాజెక్టులపై వనరులను మరింత సమర్థంగా వినియోగించే వ్యూహమని కంపెనీ స్పష్టం చేసింది.నాయకత్వంలో మార్పులుగత కొద్ది నెలలుగా అమెజాన్ AGI విభాగంలో కీలక నాయకత్వ మార్పులు చోటుచేసుకున్నాయి. AGI కార్యక్రమాలకు నాయకత్వం వహించిన సీనియర్ అధికారి రోహిత్ ప్రసాద్ గత ఏడాది చివర్లో సంస్థను వీడగా, AGI ల్యాబ్ హెడ్ డేవిడ్ లువాన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో నిష్క్రమించారు. అనంతరం డిసెంబరులో అమెజాన్ AGI విభాగాన్ని పునర్వ్యవస్థీకరించి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పీటర్ డీశాంటిస్ ఆధ్వర్యంలోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఆయన AGIతో పాటు సిలికాన్ చిప్ అభివృద్ధి, క్వాంటమ్ కంప్యూటింగ్ కార్యక్రమాలను కూడా పర్యవేక్షిస్తున్నారు.ఏ ఉద్యోగాలు ప్రభావితమయ్యాయి?ఆన్లైన్లో వెలువడిన సమాచారం ప్రకారం.. AGI డేటా సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ అదీబ్ షానా ఆధ్వర్యంలోని బృందం, అలాగే AGI ఇన్ఫర్మేషన్ వైస్ ప్రెసిడెంట్ విశాల్ శర్మ నేతృత్వంలోని బృందాల్లోని ఉద్యోగులు ఈ కోతలతో ప్రభావితమయ్యారు. అయితే మొత్తం సంఖ్యపై అధికారిక ప్రకటన వెలువడలేదు.కొనసాగుతున్న AI పెట్టుబడులుఉద్యోగాల కోతలు ప్రకటించినప్పటికీ, అమెజాన్ AI రంగంలో భారీ పెట్టుబడులు కొనసాగిస్తోంది. ముఖ్యంగా AWS ద్వారా జనరేటివ్ AI సేవలను విస్తరించడం, Nova ఫౌండేషన్ మోడళ్ల అభివృద్ధిపై సంస్థ దృష్టి సారిస్తోంది. అంటే పరిశోధన, ఉత్పత్తి అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూనే సంస్థాగత పునర్వ్యవస్థీకరణ చేపడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. -
ఏఐ రేసులో గూగుల్ వెనకబడిందా? సీఈఓ రియాక్షన్..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పోటీ ప్రపంచంలో ప్రముఖ ఆన్లైన్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ తన ఆధిక్యాన్ని కోల్పోతోందా? ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్ వంటి సంస్థల వేగానికి గూగుల్ రేసులో వెనుకబడిందనే వార్తలపై అల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ స్పష్టత ఇచ్చారు. జెమిని 4 మోడల్ అభివృద్ధి వేగంగా జరుగుతోందని, త్వరలోనే దాదాపు ప్రతినెలా ఒక కొత్త ఏఐ మోడల్ను విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని స్పష్టం చేశారు.లోపాలను అంగీకరిస్తూనే స్పష్టమైన వ్యూహం‘జెమిని 3.5 ప్రో’ ఆలస్యం కావడం, కోడింగ్ రంగంలో ప్రత్యర్థులు దూసుకుపోవడంపై పిచాయ్ స్పందించారు. ‘టెక్స్ట్, మల్టీమోడల్, రీజనింగ్లలో మేము గ్లోబల్ లీడర్గానే ఉన్నాం. ఏజెంటిక్ కోడింగ్ వంటి నిర్దిష్ట విభాగాల్లో మరింత పురోగతి సాధించాల్సి ఉందనేది వాస్తవం. ఆ లోటును త్వరలోనే భర్తీ చేస్తాం’ అని సుందర్ పిచాయ్ అన్నారు. కేవలం కొన్ని మోడళ్ల ఆలస్యాన్ని బట్టి సంస్థ సామర్థ్యాన్ని అంచనా వేయలేమని, ‘జెమిని ఫ్లాష్’ మోడళ్లు పరిశ్రమలోనే అత్యంత వేగవంతమైనవిగా నిలిచాయని గుర్తుచేశారు.ఆర్థికంగా చెక్కుచెదరని బలంకంపెనీపై ఏఐకి సంబంధించిన కొన్ని విమర్శలు వినవస్తున్నప్పటికీ గూగుల్ క్లౌడ్ వ్యాపారం బలంగానే ఉంది. క్లౌడ్ సేవలకు డిమాండ్ పెరగడంతో గతంతో పోలిస్తే 82% వృద్ధి నమోదు చేసింది. జెమిని ఏపీఐల ప్రాసెసింగ్ నిమిషానికి 22 బిలియన్ టోకెన్ల మైలురాయిని దాటింది. ఫార్చ్యూన్ 100 కంపెనీల్లో 90% పైగా ‘జెమిని ఎంటర్ప్రైజ్’ ఉపయోగిస్తున్నాయి. జెమిని యాప్కు 950 మిలియన్ల యాక్టివ్ యూజర్లు ఉన్నారు.ఇదీ చదవండి: ట్రాఫిక్ రూల్ అతిక్రమిస్తే డిజిటల్ వార్నింగ్ -
ఇఆర్–100
వన్స్ అపాన్ ఏ టైమ్... మనిషి ఆకాశంలోకి ఎగరడమనే ఊహే నాన్సెన్స్గా అనిపించింది. ‘మనిషి చంద్రుడిపై అడుగు పెట్టడం పగటి కల. అసాధ్యం’ అన్నారు. ‘వృద్ధాప్యం స్పీడ్కు అడ్డుకట్ట వెయ్యడం, నిత్య యవ్వనం’ అనేది ఈ కాలం ఆలోచన. ఆచరణ సాధ్యం అవుతుందా? ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిన ప్రోగ్రామింగ్ ‘ఇఆర్–100’తో ‘అవును’ అనే అభిప్రాయం వినిపిస్తోంది...దావోస్లో ఒక ఇంటర్వ్యూయర్ ఎలాన్ మస్క్ను అడిగారు...‘వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేయవచ్చని మీరు భావిస్తున్నారా?’సమాధానంగా... ‘వృద్ధాప్య సమస్యపై నేను ఎక్కువ సమయాన్ని వెచ్చించలేదు. అయితే అది చాలా సులభంగా పరిష్కరించగల సమస్య’ అన్నారు ఎలాన్ మస్క్.‘ఎలాన్ ఎన్నయినా చెబుతాడు. ఆయన శాస్త్రవేత్త కాదు కదా!’ అనుకుంటాం. అయితే ఆయన అభి్రపాయం తో హార్వర్డ్ ప్రొఫెసర్ డేవిడ్ సింక్లేర్ ఏకీభవించారు.మైలురాయి... బోస్టన్ లైఫ్ బయోసైన్సెస్ ఆర్గనైజేషన్, దెబ్బతిన్న కణాలలో కొంత భాగాన్ని రీసెట్ చేసే ప్రయోగాలు చేస్తోంది. దీర్ఘాయువుకు సంబంధించి ఇదొక మైలురాయిగా చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ ప్రయోగాలు, ఎప్పుడూ యవ్వనంగా కనిపించేలా చేయడం, శాశ్వతంగా జీవించేలా చేయడం లక్ష్యంగా పెట్టుకోలేదు. తీవ్ర కంటి వ్యాధులను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నాయి. దీనికి ఇఆర్–100 అని పేరు పెట్టారు.పాక్షిక ప్రోగ్రామింగ్... ఇఆర్–100 దీర్ఘకాలిక లక్ష్యం... పాక్షిక రీపోగ్రామింగ్. దీనిలో దెబ్బతిన్న కణాలను తిరిగి యవ్వన జీవస్థితికి తీసుకువస్తారు. ఇది విజయవంతమైతే, వృద్ధాప్యం, వ్యాధి, గాయాల కారణంగా మందగించిన కణాల పనితీరును పునరుద్ధరించవచ్చు. మొదటి దశ... ప్రస్తుతం చేసేది మానవులపై చేసే మొదటి దశ ప్రయోగం. ప్రయోగదశలో భద్రతను, సహనాన్ని పరీక్షించడం మొదటి దశ ముఖ్యోద్దేశం. ఇఆర్–100 ప్రయోగంలో పాల్గొనేవారికి సంబంధించి అయిదు సంవత్సరాల వరకు దీర్ఘకాలిక ఫాలో–అప్ ప్రణాళికలు రూపొందించారు. ఈ ఫాలో–అప్లో దుష్ప్రభావాలు, రోగనిరోధక ప్రతిస్పందనలు, దృష్టి పనితీరులో మార్పులను గమనిస్తారు. రీ ప్రోగ్రామ్ చేయబడిన కణాలు సరిగ్గా పనిచేస్తాయా లేదా అనే సందేహంతో పాటు కణాల గుర్తింపును మార్చడం వల్ల ఊహించని ప్రమాదాలు తలెత్తవచ్చు అనే ఆందోళన లేకపోలేదు.జపనీస్ స్టెమ్–సెల్ సైంటిస్ట్ షినకా యన్యమాకా కీలక ఆవిష్కరణ ఆధారంగా ఇఆర్–100 థెరపి పనిచేస్తుంది. ‘యమనకా ఫ్యాక్టర్స్’ అనే ప్రొటీన్ల సమూహాన్ని ఉపయోగించి, తిరిగి యవ్వన స్థితికి చేరేలా ‘ప్రోగ్రామింగ్’ చేయవచ్చునని రుజువైంది.చారిత్రక మలుపు... ‘జీవగడియారాన్ని వెనక్కి తిప్పే దిశగా అడుగులు వేస్తున్నారు. వృద్ధాప్యాన్ని జీవితంలో అనివార్యమైన మార్పుగా కాకుండా ఆరోగ్య సమస్యగా చూసే అవకాశాలు ఉన్నాయి’ అంటున్నారు ప్రముఖ లాంగ్విటీ సైంటిస్ట్ ప్రొఫెసర్ డేవిడ్ సింక్లేర్.‘ది సైన్స్ ఆఫ్ లివింగ్ లాంగర్ అండ్ బెటర్’ అంశంపై దుబాయ్లో జరిగిన సదస్సులోని ముఖ్యాంశాలు → బయోటెక్నాలజీ రంగంలో వస్తున్న పురోగతి శాస్త్రవేత్తల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తోంది. రాబోయే పది, ఇరవై సంవత్సరాలలో వృద్ధాప్యాన్ని నిరోధించే ప్రయోగాలు జరగనున్నాయి.→ వయసు సంబంధిత వ్యాధులలో ఎనభై ఏళ్లొచ్చేసరికి చాలామంది దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్నారు. అన్నిరకాల క్యాన్సర్లను నిర్మూలించడం వల్ల ఆయుర్దాయం కేవలం 2.5 సంవత్సరాలు మాత్రమే పెరుగుతుంది, ఎందుకంటే ఇతర వ్యాధులు అప్పటికీ వస్తూనే ఉంటాయి. అందువల్ల ఎన్నోరకాల అనారోగ్యాలకు మూలకారణమైన వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేయడంపై దృష్టి పెట్టాలి.→ వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేయడానికి మా బృందం హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్కు సిద్ధమవుతోంది. కణాలను యవ్వనస్థితిలో పునరుద్ధరించే ఎపిజెనెటిక్ ప్రోగ్రామింగ్ చికిత్సలను పరీక్షిస్తాము. వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేసి వ్యాధులను నయం చేయవచ్చా లేదా– అనేది చరిత్రలో మొదటిసారి పరీక్షించబోతున్నాం. ఆర్థిక ప్రయోజనాలు కూడా... జీవవ్యవస్థ, కణాల పనితీరును మెరుపరచడానికి శాస్త్రవేత్తలు మార్గాలు కనుగొంటున్నారు. సింక్లేర్ బృందం కొన్ని వారాల్లోనే జంతుకణజాలాలలో వృద్ధాప్యాన్ని 75 శాతం వరకు తిప్పికొట్టగల సామర్థ్యాన్ని ఇప్పటికే ప్రదర్శించింది. ఎపిజెనెటిక్ ప్రోగ్రామింగ్ థెరపీ మొదటి మానవ ప్రయోగానికి యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మిస్ట్రేషన్ ఆమోదం తెలిపింది. ‘వృద్ధాప్యాన్ని నెమ్మదింపచేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి’ అంటున్నారు సింక్లేర్. ‘స్వచ్ఛమైన నీరు, వాక్సిన్ల ఆవిష్కరణల తరువాత మానవాళికి అత్యంత ముఖ్యమైన ప్రయోగం...ఇఆర్–100’ అంటున్నారు పరిశీలకులు.కోడ్ నేమ్ఇఆర్–100 అనేది లైఫ్ బయోసైన్సెస్ అనే సంస్థ రూపొందించిన సంకేత నామం. బోస్టన్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ వ్యవస్థాపకులలో డేవిడ్ సింక్లేర్ ఒకరు. ‘ప్రోగ్రామింగ్’ అనే కాన్సెప్ట్ ద్వారా కంటి వ్యాధులకు చికిత్స చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కాన్సెప్ట్కు మంచి స్పందన లభించింది. విప్లవాత్మకమైన ‘ప్రోగ్రామింగ్’లో పెట్టుబడి పెట్టడానికి సిలికాన్ వ్యాలీలోని న్యూ లిమిట్, రెట్రో బయో సైన్సెస్లాంటి ప్రముఖ టెక్ కంపెనీలు ముందుకు వచ్చాయి! -
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. యాపిల్ కొత్త ప్లాన్!
ఐఫోన్, ఐప్యాడ్, యాపిల్ వాచ్.. ఇలా యాపిల్ ఉత్పత్తులను వాడాలని మోజు చాలా మందికి ఉంటుంది. కానీ అధిక ధరల కారణంగా అందిరికీ వాటిని కొనే స్తోమత ఉండదు. అలాంటి వారికీ ఓ అవకాశం తీసుకొస్తోంది యాపిల్ సంస్థ. యాపిల్ ఉత్పత్తులు కొనాలంటే ఒకేసారి భారీ మొత్తం చెల్లించాల్సిన అవసరం లేకుండా చేయడానికి కంపెనీ కొత్త అడుగు వేస్తోంది.అమెరికాలో జూలై 28 నుంచి ‘యాపిల్ అప్గ్రేడ్’ (Apple Upgrade) పేరుతో కొత్త డివైస్ లీజింగ్ ప్రోగ్రామ్ను ప్రారంభించనున్నట్లు బ్లూమ్బర్గ్ వెల్లడించింది. ఈ పథకం కింద వినియోగదారులు ఐఫోన్, మ్యాక్, ఐప్యాడ్, యాపిల్ వాచ్ వంటి పరికరాలను పూర్తి ధర చెల్లించకుండా నెలవారీ వాయిదాల రూపంలో ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా ధ్రువీకరించాయి.ప్రస్తుతం అమల్లో ఉన్న ఐఫోన్ అప్గ్రేడ్ ప్రోగ్రామ్ను మరింత విస్తరించి, దాదాపు అన్ని ప్రధాన యాపిల్ ఉత్పత్తులను ఈ కొత్త పథకంలో చేర్చనున్నారు. ఐఫోన్లు, యాపిల్ వాచ్లకు 24 నెలలు, మ్యాక్లు, ఐప్యాడ్లకు 36 నెలల లీజు కాలాన్ని నిర్ణయించనున్నట్లు సమాచారం. లీజు గడువు పూర్తయ్యాక వినియోగదారులు మిగిలిన మొత్తాన్ని చెల్లించి పరికరాన్ని సొంతం చేసుకోవచ్చు. లేకపోతే కొత్త మోడల్కు అప్గ్రేడ్ కావచ్చు లేదా పరికరాన్ని తిరిగి ఇచ్చి లీజును ముగించవచ్చు. కొన్ని లావాదేవీలపై అదనపు ఫీజు ఉండే అవకాశం ఉందని నివేదికలు పేర్కొన్నాయి.ఈ కార్యక్రమం కోసం యాపిల్ స్వీడన్కు చెందిన బై నౌ పే లేటర్ సంస్థ క్లార్నాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. రుణ నిర్వహణ, ఫైనాన్సింగ్ బాధ్యతలను క్లార్నా చూసుకోనుండటంతో యాపిల్పై ఆర్థిక భారం తగ్గనుంది. ప్రారంభ దశలో ఈ సర్వీస్ అమెరికాలోని యాపిల్ రిటైల్ స్టోర్లు, అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే అందుబాటులోకి రానుంది.అయితే అన్ని ఉత్పత్తులు ఈ పథకానికి అర్హత పొందవు. యాపిల్ వాచ్ ఎస్ఈ, ఎంట్రీ-లెవల్ ఐప్యాడ్, ఐఫోన్ 16, మ్యాక్బుక్ నియో వంటి కొన్ని మోడళ్లను మినహాయించే అవకాశం ఉంది. అలాగే వ్యాపార, విద్యా సంస్థల కొనుగోళ్లకు ఈ పథకం వర్తించదని సమాచారం. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, ప్రస్తుతం ఉన్న ఐఫోన్ అప్గ్రేడ్ ప్రోగ్రామ్లో లభించే యాపిల్కేర్+ రక్షణ ఈ కొత్త లీజింగ్ పథకంలో డిఫాల్ట్గా ఉండదు. అవసరమైతే వినియోగదారులు దాన్ని విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.ఇటీవల మెమరీ, స్టోరేజ్ చిప్ల ధరలు పెరగడంతో యాపిల్ కొన్ని మ్యాక్, ఐప్యాడ్ ఉత్పత్తుల ధరలను పెంచింది. ప్రీమియం పరికరాల అధిక ధరల ప్రభావాన్ని తగ్గించి, వినియోగదారులకు తక్కువ నెలవారీ చెల్లింపులతో కొనుగోలు అవకాశం కల్పించడం ద్వారా విక్రయాలను పెంచాలన్నదే ఈ కొత్త 'యాపిల్ అప్గ్రేడ్' ప్రోగ్రామ్ వెనుక ప్రధాన ఉద్దేశమని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ పథకం అమెరికాకే పరిమితమైనప్పటికీ, భవిష్యత్తులో ఇతర దేశాలకు విస్తరించే అవకాశం ఉండొచ్చు. అయితే దీనిపై యాపిల్ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. -
ఏఐ కంట్రోల్ తప్పిందా?
కృత్రిమ మేధ సాంకేతికత రంగంలో ముందెన్నడూ చూడని పరిణామం చోటుచేసుకుంది. ఓపెన్ఏఐ అభివృద్ధి చేసిన అత్యాధునిక ఏఐ మోడళ్లు తమ అంతర్గత భద్రతా పరిమితులను (Sandboxed environment) దాటుకుని వచ్చి ప్రముఖ ఏఐ ప్లాట్ఫారమ్ ‘హగ్గింగ్ ఫేస్’ నెట్వర్క్పై స్వయంప్రతిపత్తితో దాడి చేసినట్లు సమాచారం వెలువడింది. సైబర్ సెక్యూరిటీ ఎవాల్యూషన్ సమయంలో జరిగిన ఈ సంఘటనను ఓపెన్ఏఐ ‘అపూర్వమైన సైబర్ ఘటన’గా అభివర్ణించింది.ఈ దాడి ఎలా జరిగింది?ఓపెన్ఏఐ ఇటీవల విడుదల చేసిన GPT-5.6 Sol, ఇతర అంతర్గత ప్రీరిలీజ్ మోడళ్ల సైబర్ సామర్థ్యాలను పరీక్షించడానికి ‘ExploitGym’ అనే బెంచ్మార్క్ మూల్యాంకనం నిర్వహిస్తోంది. ఈ పరీక్ష కోసం మోడళ్ల సాధారణ సైబర్ నిరోధకాలను తాత్కాలికంగా సడలించారు. అయితే, నిర్దేశించిన లక్ష్యాన్ని ఏలాగైనా సాధించాలనే ధోరణితో ఈ ఏఐ మోడళ్లు థర్డ్-పార్టీ సాఫ్ట్వేర్లోని ఒక లోపాన్ని గుర్తించి అత్యంత సురక్షితమైన సాండ్బాక్స్ పరిధిని దాటి యాక్సెస్ను సాధించాయి.అక్కడితో ఆగకుండా, సదరు బెంచ్మార్క్ పరిష్కారాలు 'హగ్గింగ్ ఫేస్' సర్వర్లలో ఉన్నట్లు విశ్లేషించిన మోడళ్లు చోరీ చేసిన క్రెడెన్షియల్స్, నెట్వర్క్ లోపాల ఆధారంగా ఆ ప్రొడక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి ప్రవేశించి సీక్రెట్ సమాచారాన్ని సైతం యాక్సెస్ చేశాయి.సంస్థల స్పందన.. భవిష్యత్తు హెచ్చరికలుఈ ఘటనపై ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ స్పందిస్తూ మోడల్ ఎవాల్యూషన్ సమయంలో తీవ్రమైన భద్రతా సంఘటన జరిగిందని ధ్రువీకరించారు. హగ్గింగ్ ఫేస్ సీఈఓ క్లెమెంట్ డెలాంగే మాట్లాడుతూ.. ఇందులో ఎలాంటి దురుద్దేశం లేకపోయినప్పటికీ ఏఐ మోడళ్లు సొంతంగా ఇలా పరిమితులు దాటడం సైబర్ సెక్యూరిటీ చరిత్రలోనే అత్యంత ఆందోళనకరమైన పరిణామమని వ్యాఖ్యానించారు.ఈ అనుభవంతో ఓపెన్ఏఐ తన ఇన్ఫ్రాస్ట్రక్షర్పై మరింత కఠినమైన నియంత్రణలను అమలు చేయడంతోపాటు సదరు లోపాన్ని బాధ్యతాయుతంగా సరిచేసింది. వేగంగా విస్తరిస్తున్న ఏఐ మోడళ్ల సామర్థ్యాలకు అనుగుణంగా భద్రతా వ్యవస్థలు ఇంకా బలపడకపోతే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు సాధారణమయ్యే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: ఒక్కరోజులో ధరలు అమాంతం ఇలా.. -
శరీరాన్ని చల్లబరిచే హ్యూమన్ రెఫ్రిజిరేటర్!
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల కారణంగా వేసవిలో తీవ్ర ఉష్ణగాలులు (హీట్వేవ్స్) వీస్తున్న వేళ బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే పారిశ్రామిక, నిర్మాణ రంగ కార్మికుల ఆరోగ్య భద్రత అంతర్జాతీయంగా ఒక పెద్ద సవాలుగా మారింది. ఈ సమస్యకు పరిష్కారంగా జపాన్కు చెందిన ప్రముఖ పారిశ్రామిక ఉత్పత్తుల సరఫరా సంస్థ ‘ట్రస్కో నకాయామ కార్పొరేషన్’ వినూత్న పరికరాన్ని ఆవిష్కరించింది. తీవ్రమైన వేడిలో పనిచేసే కార్మికుల శరీర ఉష్ణోగ్రతను కేవలం 5-10 నిమిషాల్లోనే చల్లబరిచే ‘డూ రేమొన్ బాక్స్’ అనే ఫ్రీజర్ బూత్ను రూపొందించింది. సాధారణ పరిభాషలో దీన్ని ‘హ్యూమన్ రెఫ్రిజిరేటర్’ అని పిలుస్తున్నాయి.పనిచేసే విధానం..సాంకేతిక పరిజ్ఞానంఈ డూ రేమొన్ బాక్స్ అనేది స్టెయిన్లెస్ స్టీల్తో తయారైన ఒక పోర్టబుల్ కేబిన్. కార్మికుడు ఈ కేబిన్ లోపల కూర్చున్న వెంటనే ఉష్ణోగ్రత సుమారు 15 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్దకు వెళ్తుంది. శరీర ఉష్ణోగ్రతను వేగంగా నియంత్రించే ప్రధాన భాగాలైన మెడ, తల, వీపు భాగాలను లక్ష్యంగా చేసుకుని 5 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కలిగిన చల్లని గాలి ధారలను ఈ పరికరం వేగంగా చిమ్ముతుంది. అతిగా చల్లబడటం వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు ఈ శీతలీకరణ సమయాన్ని గరిష్టంగా 20 నిమిషాలకు పరిమితం చేస్తూ ఆటోమేటిక్ టైమర్ను అమర్చారు.ఫ్రోజెన్ ఫుడ్ సాంకేతికతతో రూపకల్పనఐస్ క్రీమ్లు, ఫ్రోజెన్ ఆహార పదార్థాలను నిల్వ చేసే వెండింగ్ మెషిన్ రిఫ్రిజిరేషన్ సాంకేతికత ఆధారంగా జపాన్ ఇంజినీర్లు ఈ పరికరాన్ని డిజైన్ చేశారు. దీనికి ఎటువంటి శాశ్వత నిర్మాణాలు లేదా ఇన్స్టాలేషన్లు అవసరం లేదు. సాధారణ 100-వోల్ట్ పవర్ సప్లైతో ఇది పనిచేస్తుంది. కింద చక్రాలు ఉండటం వల్ల కన్స్ట్రక్షన్ సైట్లు, ఫ్యాక్టరీలు, వేర్హౌస్లు, రోడ్డు నిర్మాణ ప్రాంతాలకు సులభంగా తరలించవచ్చు.జపాన్లో వేసవి తీవ్రత కారణంగా ఏటా వేలాది మంది వడదెబ్బ బారినపడుతున్నారు. ఈ క్రమంలో కార్మికుల సురక్షిత పనివేళల నిర్వహణకు ఈ పరికరం ఎంతగానో తోడ్పడుతుంది. ఇది నేరుగా వడదెబ్బకు వైద్య చికిత్స కాకపోయినప్పటికీ పని వేళల మధ్య లభించే స్వల్ప విరామాల్లో కార్మికులకు తక్షణ ఉపశమనం అందించి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడుతుంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా వేసవి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతున్న భారత్ వంటి ఉష్ణమండల దేశాల్లోని నిర్మాణ, పారిశ్రామిక రంగాలకు కూడా ఇటువంటి పోర్టబుల్ కూలింగ్ బూత్లు రాబోయే రోజుల్లో ప్రాధాన్యమైనవిగా మారనున్నాయి.ఇదీ చదవండి: కోకా-కోలా ‘ఫెయిర్లైఫ్’పై సైబర్ దాడి -
దీని ముందు చాట్జీపీటీ, ఆంథ్రోపిక్ జుజుబీ
కృత్రిమ మేధ (AI) రంగంలో ఆధిపత్యం కోసం అమెరికా-చైనా మధ్య పోటీ మరింత తీవ్రమైంది. చైనా స్టార్టప్ మూన్షాట్ AI తన కొత్త 'కిమి' AI మోడల్ను విడుదల చేయడంతో ఈ పోటీ కొత్త మలుపు తిరిగింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఓపెన్-సోర్స్ AI మోడల్గా కంపెనీ చెప్పుకుంటోంది. ఈ మోడల్ ఉచితంగా, ఎవరైనా డౌన్లోడ్ చేసుకునేలా అందుబాటులో ఉంది.కోడింగ్ సామర్థ్యంలో ఇది నంబర్-1గా నిలిచిందని కంపెనీ అంటోంది. అంతేగాక, లోతైన ఆలోచనా సామర్థ్యం (డీప్ థింకింగ్) కలిగి ఉంటూనే, చాలా తక్కువ ఖర్చుతో నడుస్తుంది. కిమి కె-3 మోడల్ పనితీరు ఓపెన్AI, ఆంథ్రోపిక్ వంటి అమెరికన్ కంపెనీల మోడళ్లకు దాదాపు సమానంగా ఉండటంతో అమెరికా టెక్ వర్గాల్లో కలకలం రేగింది.విశేషమేమిటంటే, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ప్రపంచవ్యాప్తంగా AI అభివృద్ధిపై తన అభిప్రాయాన్ని పంచుకున్న సమయంలోనే ఈ మోడల్ విడుదల కావడం. చైనాను ఓపెన్-సోర్స్ విధానానికి మార్గదర్శిగా జిన్పింగ్ చిత్రీకరించారు. AI అభివృద్ధి చేయడమనేది ఏ దేశానికి సొంతం కాదని, ఇది ప్రపంచ దేశాల సమష్టి సహకారంతో సాగాల్సిన ప్రక్రియ అని ఆయన అన్నారు. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం AIలో అమెరికా ఆధిక్యతను వ్యూహాత్మక అవసరంగా భావిస్తున్నారు.గత 18 నెలల్లో చైనా టెక్ కంపెనీలు తక్కువ కంప్యూటింగ్ వనరులతోనే అమెరికన్ మోడళ్లకు దీటుగా పనిచేసే ఓపెన్-సోర్స్ AI మోడళ్లను వరుసగా విడుదల చేస్తున్నాయి. మెరుగైన పనితీరు, తక్కువ ఖర్చు కలగలిసిన ఈ కాంబినేషన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా డెవలపర్లు చైనా AI వ్యవస్థలవైపు మొగ్గు చూపుతున్నారు. మూన్షాట్ తాజా మోడల్ ఈ ధోరణికి మరింత ఊతమిచ్చింది.ఇదే సమయంలో, మెటా ప్లాట్ఫామ్స్ AI స్టార్టప్ ఆంత్రోపిక్కు కంప్యూటింగ్ పవర్ అందించేందుకు భారీ చర్చలు జరుపుతోంది. ఈ ఒప్పందం విలువ దాదాపు 10 బిలియన్ డాలర్లు ఉండొచ్చని, ఇది రెండేళ్ల పాటు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రకటనల వ్యాపారానికి మించి, భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుబడుల నుంచి కొత్త ఆదాయ మార్గాన్ని సృష్టించే ప్రయత్నంలో మెటా ఉంది. పలు దేశాల్లో వ్యాజ్యాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ప్రధాన ప్రకటనల వ్యాపారంపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని కంపెనీ భావిస్తోంది. -
ఏఐ మానియా.. లాభాలు ఎప్పుడొస్తాయో!
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో ఆధిపత్యం కోసం ప్రపంచ టెక్ దిగ్గజాలు చేస్తున్న విచ్చలవిడి వ్యయం, వారి ఆర్థిక మూలాలపై ఊహించని ప్రతికూల ప్రభావం చూపుతోంది. మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్ (గూగుల్), అమెజాన్, మెటా, ఒరాకిల్ వంటి సంస్థలు ఏఐ మౌలిక సదుపాయాలు, అత్యాధునిక డేటా సెంటర్లు, ప్రాసెసింగ్ చిప్లు, విద్యుత్ వనరుల కోసం మూలధన వ్యయాన్ని ఊహించని రీతిలో పెంచేస్తున్నాయి. అయితే, ఈ స్థాయిలో పెడుతున్న పెట్టుబడులకు తగ్గట్టుగా స్వల్పకాలంలో ఆదాయం సమకూరకపోవడంతో కంపెనీల ఫ్రీ క్యాష్ ఫ్లో వేగంగా తగ్గిపోతోంది.ఆదాయానికి మించిన మూలధన వ్యయంప్రధాన కంపెనీ మొత్తం వార్షిక మూలధన వ్యయం 600- 650 బిలియన్ డాలర్ల మార్కును దాటింది. ఇందులో దాదాపు 75 శాతం నిధులు నేరుగా ఏఐ మౌలిక వసతులకే కేటాయిస్తున్నారు. ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో పెరుగుదల కంటే ఈ మూలధన వ్యయం వేగంగా పెరుగుతుండటంతో ఆర్థిక సమతుల్యత దెబ్బతింటోంది. అమెజాన్ వంటి సంస్థల ఎఫ్సీఎఫ్ ఇప్పటికే ప్రతికూల పరిధిలోకి వెళ్లగా ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్ల మిగులు నగదు నిల్వలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.అప్పుల వైపు బిగ్ టెక్ సంస్థలుఇంతకాలం రిజర్వుల్లో ఉన్న సొంత నిధులతోనే కార్యకలాపాలు సాగించిన బిగ్ టెక్ కంపెనీలు ఇప్పుడు క్యాపిటల్ మార్కెట్లు, కార్పొరేట్ అప్పులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ అపారమైన క్యాపెక్స్ అవసరాలను తీర్చుకోవడానికి బాండ్ల జారీ ద్వారా బిలియన్ల డాలర్ల రుణాలు సమీకరిస్తున్నాయి. దీంతో ప్రపంచ క్రెడిట్ మార్కెట్లలో టెక్ రంగం అత్యంత వేగంగా అప్పులు తీసుకుంటున్న విభాగంగా మారింది.ఇన్వెస్టర్ల ఆందోళనవాల్ స్ట్రీట్, గ్లోబల్ ఇన్వెస్టర్లలో ఇప్పుడు ప్రధానంగా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ (ఆర్ఓఐ)పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏఐ మోడళ్ల అభివృద్ధికి, శ్రమకు అవుతున్న నిరంతర వ్యయంతో పోలిస్తే వ్యాపార రాబడి నిమ్మదించడంతో షేర్ మార్కెట్లలో హెచ్చుతగ్గులు పెరుగుతున్నాయి.సుదీర్ఘకాలంలో ఏఐ అందించే విప్లవాత్మక మార్పులు, వ్యాపార అవకాశాలను దృష్టిలో ఉంచుకుని టెక్ దిగ్గజాలు ఈ రిస్క్ తీసుకుంటున్నాయి. అయితే, స్వల్పకాలంలో ఈ పెట్టుబడులు లాభాలుగా మారకపోతే కంపెనీల వ్యాల్యుయేషన్లపై, క్రెడిట్ రేటింగ్లపై ఒత్తిడి తప్పకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: మళ్లీ టాప్ గేర్లోకి పసిడి.. నేటి ధరలు ఇలా.. -
బ్యాంకుల చుట్టూ తిరిగే రోజులు పోయాయ్!
ఒకప్పుడు వ్యక్తిగత లేదా వ్యాపార రుణం కావాలంటే బ్యాంకుల చుట్టూ తిరగడం, నెలల తరబడి వేచి చూడడం, పేపర్లలోని అంశాలను చెక్ చేయడం ఉండేది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారింది! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత, ఆర్బీఐ తీసుకువచ్చిన అకౌంట్ అగ్రిగేటర్ (ఏఏ) ఎకోసిస్టమ్తో రుణాలిచ్చే సంస్థలు నిమిషాల్లోనే లోన్లు అప్రూవ్ లేదా రిజెక్ట్ చేస్తున్నాయి.కాగితాల చికాకులకు చెక్ఆర్బీఐ రూపొందించిన అకౌంట్ అగ్రిగేటర్ ఫ్రేమ్వర్క్ ద్వారా వినియోగదారులు తమ బ్యాంక్ స్టేట్మెంట్లు, ఆర్థిక సమాచారాన్ని డిజిటల్ పద్ధతిలో సురక్షితంగా బ్యాంకులకు అందజేస్తున్నారు. గతంలో పీడీఎఫ్ స్టేట్మెంట్లలో మార్పులు చేయడం లేదా నకిలీ పత్రాలు ఇవ్వడం వంటి మోసాలకు తావుండేది. ఆటోమేటెడ్ అకౌంట్ అగ్రిగేటర్ వ్యవస్థ ద్వారా డేటా నేరుగా వెరిఫైడ్ సోర్స్ నుంచి చేరడం వల్ల పేపర్వర్క్ తగ్గడమే కాకుండా మోసాలకు అడ్డుకట్ట పడింది.సిబిల్ స్కోర్ లేకపోయినా రుణం!సాంప్రదాయ బ్యాంకింగ్లో సుదీర్ఘ క్రెడిట్ హిస్టరీ లేదా మంచి సిబిల్ స్కోర్ లేకపోతే రుణం లభించడం చాలా కష్టంగా ఉండేది. అయితే ఆధునిక ఏఐ అల్గారిథమ్లు ఈ పరిస్థితిని మార్చేశాయి. ఏఐ ఆధారిత టూల్స్ కేవలం పాస్ట్ క్రెడిట్ స్కోర్నే కాకుండా కస్టమర్ క్రమం తప్పకుండా చెల్లించే యుటిలిటీ బిల్లులు, డిజిటల్ లావాదేవీలు, క్యాష్-ఫ్లో ఆధారంగా రీపేమెంట్ సామర్థ్యాన్ని సెకన్లలో అంచనా వేస్తున్నాయి.ఎంఎస్ఎంఈలకు ఊరట, భద్రతకు ప్రాధాన్యతచిన్న వ్యాపారులకు ఆస్తి లేదా పూచీకత్తు లేకపోయినా వారి జీఎస్టీ రిటర్న్స్, వర్కింగ్ క్యాపిటల్ లావాదేవీల ఆధారంగా ఏఐ వ్యవస్థలు రుణాలను మంజూరు చేస్తున్నాయి. దీనికితోడు వీడియో కేవైసీ, డిజిటల్ సంతకాల వల్ల బ్యాంక్కు వెళ్లే అవసరం లేకుండా ఇంట్లో కూర్చునే ప్రక్రియ పూర్తవుతోంది. సాంకేతికత విస్తరిస్తున్నప్పటికీ కస్టమర్ల అనుమతి లేకుండా ఏ డేటానూ సేకరించకుండా ఆర్బీఐ కఠిన భద్రతా ప్రమాణాలను అమలు చేస్తోంది.డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏఐ సాంకేతికతల కలయిక వల్ల భారతదేశంలో రుణ పంపిణీ ఎక్కువ మందికి అందుబాటులోకి వస్తోంది. ఒకప్పుడు కేవలం పెద్ద కంపెనీలకే దక్కే వేగవంతమైన ఆర్థిక సేవలు, నేడు సామాన్య పౌరుడికి, చిన్న వ్యాపారులకు కూడా వేగంగా విస్తరిస్తున్నాయి.ఇదీ చదవండి: మళ్లీ టాప్ గేర్లోకి పసిడి.. నేటి ధరలు ఇలా.. -
మీ మనసుని అర్థం చేసుకునే రోబో
నేటి ఆధునిక ప్రపంచంలో ఒంటరితనం అనేది ఒక తీవ్రమైన సమస్యగా మారుతోంది. మనుషుల మధ్య సాన్నిహిత్యం తగ్గుతున్న ఈ తరుణంలో సాంకేతిక ప్రపంచంలో సరికొత్త విప్లవానికి తెరలేచింది. చైనాకు చెందిన ప్రముఖ రోబోటిక్స్ సంస్థ UBTECH తన వినియోగదారు బ్రాండ్ కింద UWORLD U1 అనే హ్యూమనాయిడ్ కంపానియన్ (సహచర) రోబోను మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రపంచంలోనే మొదటిసారిగా ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేయగల అల్ట్రా-బయోనిక్ రోబోగా ఇది రికార్డు సృష్టించింది.మనిషికి ప్రతిరూపంఈ రోబో కేవలం యంత్రంలా కాకుండా అచ్చం మనిషి లాంటి రూపాన్ని, హావభావాలను కలిగి ఉంటుంది.మనిషి స్పర్శను తలపించేలా బయోమిమెటిక్ సిలికాన్ చర్మంతో దీనిని రూపొందించారు. దీనికి మేకప్ వేయడం, జుట్టును అమర్చడం కూడా సాధ్యమే.మనుషుల శారీరక కదలికలను 90 శాతం వరకు అనుకరించేందుకు ఇందులో 88 సర్వో జాయింట్లు, ప్రత్యేక మెడ భాగం అమర్చారు.కేవలం మాట్లాడటమే కాదు, మనుషుల వాయిస్ టోన్, ముఖ కవళికలను బట్టి వారి మానసిక స్థితిని 90% కచ్చితత్వంతో గ్రహించి దానికి తగ్గట్టుగా ఓదార్పు మాటలు చెప్పగలదు.ఈ రోబో వంట చేయడం, ఇల్లు ఊడ్చడం వంటి గృహ పనులు చేయదు. కేవలం ఒక మంచి స్నేహితుడిలా సంభాషించడం, మందుల వేళలను గుర్తు చేయడం, ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం, మానసిక ఉల్లాసాన్ని అందించడమే దీని ఉద్దేశం.చైనాలో ఒంటరిగా ఉంటున్న దాదాపు 12 కోట్ల మంది సింగిల్స్, 32 కోట్ల మందికి పైగా ఉన్న వృద్ధులను లక్ష్యంగా చేసుకుని దీన్ని రూపొందించారు.ధర ఎంతంటే..ఈ రోబోల ప్రారంభ ధర 1,19,800 యువాన్లు (సుమారు రూ. 14 లక్షలు) కాగా, అత్యంత అధునాతన ఫీచర్లు గల ఆల్ట్రా వెర్షన్ ధర 9,90,000 యువాన్ల (సుమారు రూ. 1.15 కోట్లు) వరకు ఉంది. ఖరీదైన మోడల్స్లో వినియోగదారులు తమకు నచ్చిన విధంగా లేదా గతంలో మరణించిన తమ ప్రియమైన వారి ముఖ రూపాలను (3డీ ఫేషియల్ రీకన్స్ట్రక్షన్, వాయిస్ప్రింట్ ద్వారా) రీ-క్రియేట్ చేసుకునే సదుపాయం కూడా కల్పించారు.మార్కెట్లోకి విడుదల చేసిన మొదటి రోజే ఈ సిరీస్ కోసం ఏకంగా 13,361 యూనిట్ల ప్రీ-ఆర్డర్లు రావడం గమనార్హం. దీని డెలివరీలు రాబోయే సెప్టెంబర్ మధ్య నాటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవి మానవ సంబంధాల కొరతను ఎంతవరకు తీరుస్తాయో వేచి చూడాలి.ఇదీ చదవండి: హోమ్ లోన్ కడుతూ అద్దె ఇంట్లో ఉంటున్నారా? -
స్పీడ్ లిమిట్ దాటితే అలర్ట్.. కొత్త ఫీచర్
సాంకేతిక దిగ్గజం గూగుల్ తన యూజర్ల డ్రైవింగ్ అనుభవాన్ని మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మార్చేందుకు సరికొత్త అప్డేట్లను పరిచయం చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ‘ఆండ్రాయిడ్ ఆటో’ వేదికగా గూగుల్ మ్యాప్స్లో ‘లైవ్ స్పీడోమీటర్’ ఫీచర్ను తీసుకొచ్చారు. ప్రస్తుతం బీటా వెర్షన్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్ను త్వరలోనే అందరికీ యాక్సెస్ ఇవ్వనున్నారు.ప్రయాణ వేగంపై స్పష్టమైన నిఘాసాధారణంగా మొబైల్ స్క్రీన్లపై గూగుల్ మ్యాప్స్ వాడుతున్నప్పుడు వాహనం వెళ్లే వేగాన్ని చూపే సదుపాయం ఇప్పటికే ఉంది. అయితే, కారు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ను ఆండ్రాయిడ్ ఆటోకు అనుసంధానించినప్పుడు ఈ లైవ్ స్పీడ్ డిస్ప్లే కనిపించేది కాదు. తాజా అప్డేట్తో కారు డ్యాష్బోర్డ్ స్క్రీన్పైనే నావిగేషన్తో పాటు వాహనం ఎంత వేగంతో దూసుకెళ్తుందో స్పష్టంగా గమనించవచ్చు. ఇది వాహనదారులు రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు ఆయా ప్రాంతాల్లోని స్పీడ్ లిమిట్స్ను దాటకుండా అలర్ట్ అవ్వడానికి సహాయపడుతుంది.ఈ ఫీచర్ను ఎలా ఎనేబుల్ చేసుకోవాలి?1. మొదట మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లో Google Maps యాప్ను ఓపెన్ చేయాలి.2. స్క్రీన్ పైభాగంలో కుడి వైపున ఉండే Profile Iconపై క్లిక్ చేసి Settingsలోకి వెళ్లాలి.3. సెట్టింగ్స్ మెనూలో Navigation Settings ఆప్షన్ను ఎంచుకోవాలి.4. కిందకు స్క్రోల్ చేసి Driving Options విభాగంలోకి వెళ్తే అక్కడ Speedometer అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని On (ఎనేబుల్) చేసుకోవాలి.ఈ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత మీ ఫోన్ను ఆండ్రాయిడ్ ఆటో ద్వారా కారుకు కనెక్ట్ చేసినప్పుడు గూగుల్ మ్యాప్స్ నావిగేషన్ స్క్రీన్పై ఎడమ వైపు కింద భాగంలో వాహనం ప్రస్తుత వేగం స్పష్టంగా కనిపిస్తుంది.భద్రతతో కూడిన స్మార్ట్ డ్రైవింగ్ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ ఆటో 12.4 లేదా అంతకంటే తాజా బీటా వెర్షన్ వాడుతున్న వినియోగదారులకు అందుబాటులో ఉంది. వేగ పరిమితులను సూచించే Speed Limits ఫీచర్తో పాటు ఈ స్పీడోమీటర్ కూడా జతకూడటంతో మితిమీరిన వేగం వల్ల జరిగే ప్రమాదాలను నివారించవచ్చని, అలాగే ట్రాఫిక్ చలాన్ల బారిన పడకుండా ఉండొచ్చని ఆటోమొబైల్ రంగానికి చెందిన నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ఫీచర్ త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాధారణ వినియోగదారులందరికీ స్థిరమైన అప్డేట్ రూపంలో అందుబాటులోకి రానుంది.ఇదీ చదవండి: హోమ్ లోన్ కడుతూ అద్దె ఇంట్లో ఉంటున్నారా? -
స్టార్షిప్ లాంచ్ రీ-షెడ్యూల్
టెక్సాస్లోని బోకా చికా లాంచ్ ప్యాడ్ నుంచి ప్రపంచంలోనే శక్తివంతమైన రాకెట్ల్లో ఒకటైన స్పేస్ఎక్స్ ‘స్టార్షిప్’ ప్రయోగానికి సంబంధించి ఉత్కంఠ నెలకొంది. జులై 16న ప్రయోగానికి కేవలం కొన్ని సెకన్ల ముందే కౌంట్డౌన్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతి రీ-షెడ్యూల్ తేదీపై సంస్థ అధికారిక ప్రకటనకు, ఎలాన్ మస్క్ చేసిన సోషల్ మీడియా పోస్టుకు మధ్య స్వల్ప వ్యత్యాసం కనిపించడం ఇప్పుడు చర్చకు దారితీసింది.స్పేస్ఎక్స్ సంస్థ విడుదల చేసిన అధికారిక నివేదిక ప్రకారం.. తదుపరి లాంచ్ ప్రయత్నాన్ని గురువారం (జులై 23) చేపట్టాలని భావిస్తున్నారు. అయితే, సంస్థ అధినేత ఎలాన్ మస్క్ తన ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ తదుపరి ప్రయోగం శుక్రవారం (జులై 24) ఉండొచ్చని పేర్కొని ఆ వెంటనే ‘అంటే నా ఉద్దేశం గురువారమే’ అని సవరించుకున్నారు. ఈ చిన్నపాటి గందరగోళం ఎలా ఉన్నా జులై 23 లేదా 24 తేదీల్లో ఈ రాకెట్ నింగిలోకి ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది.చివరి క్షణంలో ఎందుకు ఆగింది? కారణాలు ఇవే..స్పేస్ఎక్స్ ప్రయోగించిన సరికొత్త వర్షన్-3 (V3) మోడల్కు చెందిన ఈ 13వ టెస్ట్ ఫ్లైట్ జులై 16న ప్రయోగించాల్సింది. దాదాపు 1.15 కోట్ల పౌండ్ల ద్రవ మిథేన్, ద్రవ ఆక్సిజన్ను రాకెట్లో నింపినప్పటికీ ఇంజిన్ స్టార్టప్ సీక్వెన్స్లో సాంకేతిక లోపం తలెత్తింది. సూపర్ హెవీ బూస్టర్లోని మొత్తం 33 రాప్టర్-3 ఇంజిన్లలో నాలుగు అనుకున్న సమయానికి ఇగ్నైట్ (మండటం) కాలేదు. దీనితో ఆటోమేటెడ్ సేఫ్టీ సిస్టమ్ ప్రయోగాన్ని తక్షణమే నిలిపివేసింది.ఈ వైఫల్యం కారణంగా మార్కెట్లో స్పేస్ఎక్స్ విలువపై దాదాపు 100 బిలియన్ డాలర్ల ప్రభావం పడినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, ఇలాంటి భారీ ప్రయోగాల్లో ఇది సర్వసాధారణమని అంతరిక్ష నిపుణులు చెప్తున్నారు. ఇంజిన్ల వైఫల్యంపై స్పేస్ఎక్స్ బృందం వేగంగా స్పందించింది. రాకెట్ ప్రొపల్షన్ సిస్టమ్లో మార్పులు చేయడంతో పాటు లోపభూయిష్టంగా ఉన్న 2 రాప్టర్ ఇంజిన్లను తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని అమర్చినట్లు స్పేస్ఎక్స్ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: హోమ్ లోన్ కడుతూ అద్దె ఇంట్లో ఉంటున్నారా?ఈ ప్రయోగం ప్రత్యేకత ఏంటి?సుమారు 15 బిలియన్ డాలర్ల వ్యయంతో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్టు ద్వారా మానవాళిని చంద్రుడిపైకి, ఆపై అంగారకుడిపైకి తీసుకెళ్లాలన్నదే మస్క్ ఆశయం.ఈ ప్రయోగంలో 20 అధునాతన స్టార్లింక్ శాటిలైట్లను అంతరిక్షంలోకి తీసుకెళ్లి వాటి శాటిలైట్ డిస్పెన్సింగ్ సిస్టమ్, లేజర్ కమ్యూనికేషన్ లింకులను పరీక్షించనున్నారు.భూ వాతావరణంలోకి ఈ ఉపగ్రహాలు తిరిగి ప్రవేశించినప్పుడు సబ్ఆర్బిటల్ గమనాన్ని కూడా నిశితంగా పరిశీలిస్తారు.గతంలో లాగా సంస్థ ఈసారి బూస్టర్ను భూమిపైకి తెచ్చి క్యాచ్ పట్టే ప్రయత్నం చేయడం లేదు. కేవలం ఇంజిన్ల పనితీరు, అంతరిక్షంలో రాప్టర్ ఇంజిన్ల రీ-లైట్ సామర్థ్యాలపైనే ప్రధాన దృష్టి పెట్టారు.కొన్ని మార్పులతో సిద్ధమైన స్టార్షిప్ అమెరికా కాలమానం ప్రకారం జులై 23 సాయంత్రం వేళ నింగిలోకి దూసుకెళ్లేందుకు కౌంట్డౌన్ సిద్ధమవుతోంది. -
జియో రీఛార్జ్లు.. తక్కువలో టాప్ 10 ప్లాన్లు
దేశంలో 5జీ సేవలను వేగంగా విస్తరిస్తున్న రిలయన్స్ జియో, రూ.350లోపు బడ్జెట్లోనూ పలు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. తక్కువ ఖర్చుతో రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు కోరుకునే వినియోగదారులకు ఈ ప్లాన్లు అనుకూలంగా ఉంటాయి. అయితే రూ.350లోపు ఉన్న అన్ని ప్లాన్లలో అపరిమిత 5జీ డేటా లభించదు. జియో అధికారిక నిబంధనల ప్రకారం, అపరిమిత ట్రూ 5G వినియోగానికి ప్రత్యేక అర్హతలు ఉన్నాయి.రూ.350లోపు జియో ప్లాన్లు.. ప్రయోజనాలురూ.349 ప్లాన్» వాలిడిటీ: 28 రోజులు» రోజుకు 2 జీబీ డేటా» అపరిమిత వాయిస్ కాల్స్» రోజుకు 100 ఎస్ఎంఎస్» జియో ట్రూ 5జీ కవరేజ్ ఉన్న ప్రాంతాల్లో, 5జీ ఫోన్ కలిగిన వినియోగదారులకు అపరిమిత 5జీ డేటా.రూ.329 ప్లాన్» 28 రోజుల వాలిడిటీ» రోజుకు 1.5 జీబీ డేటా» అపరిమిత కాల్స్, 100 ఎస్ఎంఎస్రూ.319 ప్లాన్» క్యాలెండర్ నెల వాలిడిటీ» రోజుకు 1.5 జీబీ డేటా» అపరిమిత కాల్స్, ఎస్ఎంఎస్రూ.299 ప్లాన్» 28 రోజుల వాలిడిటీ» రోజుకు 1.5 జీబీ డేటా» అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్రూ.249 ప్లాన్» 28 రోజుల వాలిడిటీ» రోజుకు 1 జీబీ డేటా» అపరిమిత కాల్స్, ఎస్ఎంఎస్రూ.239 ప్లాన్» 22 రోజుల వాలిడిటీ» రోజుకు 1.5 జీబీ డేటా» అపరిమిత కాల్స్, 100 ఎస్ఎంఎస్రూ.209 ప్లాన్» 22 రోజుల వాలిడిటీ» రోజుకు 1 జీబీ డేటా» అపరిమిత కాల్స్, ఎస్ఎంఎస్రూ.200 ప్లాన్» 28 రోజుల వాలిడిటీ» మొత్తం 30 జీబీ డేటా (రోజువారీ పరిమితి లేదు)» డేటా అవసరాన్ని బట్టి వినియోగించుకునే అవకాశంరూ.198 ప్లాన్» 14 రోజుల వాలిడిటీ» రోజుకు 2 జీబీ డేటా» అపరిమిత కాల్స్, 100 ఎస్ఎంఎస్రూ.189 ప్లాన్» 28 రోజుల వాలిడిటీ» మొత్తం 2 జీబీ డేటా» అపరిమిత కాల్స్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు. -
అంతరిక్ష శాస్త్రవేత్తలకు జీతాలు తక్కువా?
ఒకప్పుడు ఇస్రోలో ఉద్యోగం అంటే ప్రతి ఇంజినీర్, శాస్త్రవేత్తకు జీవితకాల కల. చంద్రయాన్, మంగళయాన్, ఆదిత్య-ఎల్1, గగన్యాన్ వంటి ప్రతిష్ఠాత్మక మిషన్లలో పనిచేసే అవకాశం, దేశసేవ అనే గౌరవం, ఉద్యోగ భద్రత.. ఇవన్నీ ఇస్రోను అత్యంత ఆకర్షణీయ సంస్థగా నిలబెట్టాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోంది. గత కొన్ని నెలల్లోనే వంద మందికి పైగా శాస్త్రవేత్తలు రాజీనామాలు చేయడం లేదా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడం కేంద్రాన్ని సైతం ఆందోళనకు గురి చేసింది. దీంతో కీలక మిషన్లలో పనిచేస్తున్న గ్రూప్-ఏ శాస్త్రవేత్తల రాజీనామాలపై కఠిన నిబంధనలు అమలు చేయాలని అంతరిక్ష శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.ఇస్రోలో జీతాలు ఎంత?ఇస్రోలో కొత్తగా ఎంపికయ్యే సైంటిస్ట్/ఇంజినీర్-SC స్థాయి అధికారికి 7వ వేతన సంఘం ప్రకారం బేసిక్ పే రూ.56,100 నుంచి ప్రారంభమవుతుంది. దీనికి డీఏ, హెచ్ఆర్ఏ, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు కలిపి నెలకు సుమారు రూ.70 వేల నుంచి రూ.90 వేల వరకు చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. అనుభవం పెరిగేకొద్దీ సైంటిస్ట్-SD, SE, SF, SG, H స్థాయిలకు పదోన్నతులు లభిస్తాయి. అత్యున్నత స్థాయిలో నెలకు రూ.2 లక్షలకు పైగా స్థూల వేతనం పొందే అవకాశం ఉంది. అయితే ఈ స్థాయికి చేరుకోవడానికి సాధారణంగా 20–30 ఏళ్ల సర్వీస్ అవసరమవుతుంది.ప్రైవేట్ స్పేస్ కంపెనీల్లో ఎంత?ఇక్కడే ప్రధాన తేడా కనిపిస్తోంది. స్కైరూట్ ఏరోస్పేస్, అగ్నికుల్ కాస్మోస్, పిక్సెల్, బెల్లాట్రిక్స్, ధృవ స్పేస్ వంటి ప్రైవేట్ కంపెనీలు మార్కెట్ ఆధారిత వేతనాలు అందిస్తున్నాయి. ఫ్రెషర్లకు రూ.8–15 లక్షల వార్షిక ప్యాకేజీ లభిస్తోంది. 3–7 ఏళ్ల అనుభవం ఉన్న వారు రూ.15–30 లక్షలు అందుకుంటున్నారు. అదే సీనియర్ రాకెట్, ప్రొపల్షన్, ఏవియానిక్స్ నిపుణులు అయితే రూ.30–60 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ వేతనాన్ని కూడా కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. వీటితో పాటు స్టాక్ ఆప్షన్లు (ESOPs), పనితీరు బోనస్లు, విదేశీ ప్రాజెక్టులు, వేగవంతమైన ప్రమోషన్లు కూడా లభిస్తున్నాయి. కంపెనీ విలువ పెరిగితే స్టాక్ల విలువకోట్ల రూపాయలకు చేరే అవకాశం కూడా ఉంటుంది. -
టిక్టాక్కు గ్రీన్ సిగ్నెల్.. మళ్లీ రీఎంట్రీ!
భద్రతా పరమైన కారణాల వల్ల ఒకప్పుడు నిషేధానికి గురైన టిక్టాక్ యాప్ను ఫెడరల్ ఉద్యోగులు డౌన్లోడ్ చేసుకోవచ్చని అమెరికా న్యాయ శాఖ తెలిపింది. అయితే ఈ అనుమతి ఆయా ప్రభుత్వ సంస్థల నిబంధనలకు లోబడి ఉంటుంది.టిక్టాక్ అనేది చైనాకు చెందిన యాప్ కావడంతో అమెరికా ప్రభుత్వం చాలా కాలంగా వినియోగదారుల డేటా భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కారణంగానే 2022లో ప్రభుత్వ ఉద్యోగులు ఉపయోగించే ఫోన్లు.. కంప్యూటర్లలో టిక్టాక్ వాడకాన్ని పూర్తిగా నీచేధించడం జరిగింది. అయితే.. ఇప్పుడు పరిస్థితులు మారాయి. టిక్టాక్ అమెరికా కార్యకలాపాలు, వినియోగదారుల డేటా భద్రత విషయంలో కొత్త ఒప్పందం కుదిరింది.బైట్డాన్స్ అమెరికా వినియోగదారుల డేటా, యాప్ నిర్వహణపై నియంత్రణను టిక్టాక్ యూఎస్డీఎస్ అనే జాయింట్ వెంచర్కు అప్పగించింది. దీంతో అమెరికా న్యాయశాఖ ప్రస్తుతం ఉన్న టిక్టాక్ వెర్షన్ వల్ల పెద్దగా భద్రతా ప్రమాదం లేదని అభిప్రాయపడింది. కాబట్టి డౌన్లోడ్ చేసుకోవడానికి అనుమతిచ్చింది.అమెరికాలో టిక్టాక్కు భారీ స్థాయిలో ఆదరణ ఉంది. దాదాపు 20 కోట్ల మంది అమెరికన్లు ఈ యాప్ను ఉపయోగిస్తున్నట్లు సమాచారం. అందుకే టిక్టాక్పై తీసుకునే ప్రతి నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తోంది. మొత్తం మీద టిక్టాక్ మళ్లీ వచ్చేసిందన్నమాట.ఇదీ చదవండి: లెక్కల్లో 51 మార్కులే.. కట్ చేస్తే రూ.వేల కోట్ల కంపెనీ!: ఎవరీ పవన్ కుమార్ చందన? -
లెక్కల్లో 51 మార్కులే.. కట్ చేస్తే రూ.వేల కోట్ల కంపెనీ!: ఎవరీ పవన్ కుమార్ చందన?
జీవితంలో విజయాన్ని నిర్ణయించేది కేవలం పరీక్షల్లో వచ్చిన మార్కులు మాత్రమే కాదు. ఎందుకంటే.. ఒకప్పుడు గణితంలో కేవలం 51 మార్కులు మాత్రమే సాధించిన విద్యార్థి, నేడు భారతదేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపించి చరిత్ర సృష్టించాడు. ఇంతకీ ఈయన ఎవరు? ఈయన గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన 'పవన్ కుమార్ చందన'.. చిన్నప్పటి నుంచే యంత్రాలు ఎలా పనిచేస్తాయనే విషయంపై ఎక్కువ ఆసక్తి చూపించేవాడు. అయితే.. చదువులో ముఖ్యంగా గణితంలో మాత్రం ఆశించిన ప్రతిభ కనపరచలేకపోయేవారు. ఒక పరీక్షలో ఆయనకు లెక్కల్లో కేవలం 51 మార్కులే వచ్చినట్లు సమాచారం.లెక్కల్లో తక్కువ మార్కులు వచ్చాయని.. ఎప్పుడూ నిరుత్సాహపడలేదు. తండ్రి ప్రోత్సాహంతో ఆత్మవిశ్వాసం పెంచుకున్నాడు. ఆ తరువాత మ్యాథ్స్, సైన్స్ మీద ప్రత్యేక శ్రద్ద చూపించి.. తొలి ప్రయత్నంలోనే ఐఐటీ జేఈఈలో విజయం సాధించిన ఐఐటీ ఖరగ్పూర్లో ఇంజినీరింగ్ చదివే అవకాశం పొందారు.ఇస్రోలో జాబ్ఐఐటీ పూర్తి చేసిన తరువాత.. చాలామంది విద్యార్థులు అధిక వేతనాలు ఇచ్చే ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు ఎంచుకున్నప్పటికీ, పవన్ కుమార్ చందన మాత్రం భారత అంతరిక్ష రంగంలో సేవ చేయాలనే లక్ష్యంతో ఇస్రోలో చేరారు. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC), తిరువనంతపురంలో సుమారు ఆరు సంవత్సరాలు పనిచేశారు.స్కైరూట్ ఏరోస్పేస్ఇస్రోలో పనిచేస్తున్న సమయంలో.. అత్యంత శక్తివంతమైన ప్రయోగ వాహనం జీఎస్ఎల్వీ మార్క్-III (GSLV Mk III) రూపకల్పన, అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఆ తరువాత ఇస్రోలో ఉద్యోగం వదిలేసి.. భారతదేశంలో ప్రైవేట్ సంస్థలు కూడా అంతరిక్ష రంగంలో ముందుకు రావాలనే ఆలోచనతో పవన్ కుమార్ చందన, తన సహచరుడు నాగ భరత్ డాకాతో కలిసి 2018 జూన్లో హైదరాబాద్లో స్కైరూట్ ఏరోస్పేస్ స్థాపించారు.🚨 𝗟𝗶𝗳𝘁𝗼𝗳𝗳 𝗼𝗳 𝗦𝗸𝘆𝗿𝗼𝗼𝘁 𝗔𝗲𝗿𝗼𝘀𝗽𝗮𝗰𝗲'𝘀 𝗩𝗶𝗸𝗿𝗮𝗺-𝟭 𝗿𝗼𝗰𝗸𝗲𝘁 𝗮𝘁 𝟭𝟮:𝟬𝟱 𝗣𝗠 𝗜𝗦𝗧 𝗳𝗿𝗼𝗺 𝘁𝗵𝗲 𝗙𝗶𝗿𝘀𝘁 𝗟𝗮𝘂𝗻𝗰𝗵 𝗣𝗮𝗱 𝗮𝘁 𝗦𝗛𝗔𝗥! 🚀The era of commercial spaceflight has begun in India 🇮🇳#Skyroot | #Vikram1 pic.twitter.com/yba2WRW1Ck— ISRO Spaceflight (@ISROSpaceflight) July 18, 20262018లో ప్రైవేట్ స్పేస్ కంపెనీ స్థాపించడం అనేది ఒక సవాలుతో కూడుకున్న పని అనే చెప్పాలి. పెట్టుబడులు సమకూర్చడం కష్టమైంది. అయితే ఫ్లిప్కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సాల్ సంస్థపై నమ్మకం ఉంచి తొలి పెట్టుబడి పెట్టారు. ఆ తరువాత కరోనా మహమ్మారి కారణంగా నిధుల సేకరణ కష్టతరమైనా, గ్రీన్కో సంస్థ ఆర్థిక సహాయం అందించడంతో స్కైరూట్ తన ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగించింది. రూ వేలకోట్ల విలువైన కంపెనీగా అవతరించింది.స్కైరూట్ విజయాలు2020లో స్కైరూట్ భారతదేశంలో తొలిసారిగా ఒక ప్రైవేట్ సంస్థగా.. రామన్-1 రాకెట్ ఇంజిన్ను విజయవంతంగా పరీక్షించింది. 2021లో భారత ప్రభుత్వం అంతరిక్ష రంగాన్ని ప్రైవేట్ సంస్థలకు తెరవడంతో, ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకున్న తొలి ప్రైవేట్ సంస్థగా స్కైరూట్ నిలిచింది.2022 నవంబర్ 18న స్కైరూట్ అభివృద్ధి చేసిన విక్రమ్-ఎస్ అనే భారత తొలి ప్రైవేట్ సబ్-ఆర్బిటల్ రాకెట్ విజయవంతంగా ప్రయోగించబడింది. ఈ ప్రయోగం భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో ఒక కీలక మలుపు.ORBIT ACHIEVED. 🚀 Vikram-1 Test Flight-1 has reached orbit. India's first privately developed orbital rocket has completed its final burn and injected its payloads into a ~450 km orbit, making India the third country in the world with private orbital launch capability.…— Skyroot Aerospace (@SkyrootA) July 18, 2026విక్రమ్-1 చారిత్రక విజయంఇక నేడు (జూలై 18న) స్కైరూట్ అభివృద్ధి చేసిన విక్రమ్-1 రాకెట్ విజయవంతంగా భూమి కక్ష్యలోకి చేరి, తనతో తీసుకెళ్లిన అన్ని ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. దీంతో భారతదేశంలో పూర్తిగా ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన తొలి ఆర్బిటల్ రాకెట్గా విక్రమ్-1 చరిత్ర సృష్టించింది. ఈ విజయం భారత అంతరిక్ష రంగంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. స్వదేశీ సాంకేతికత, భారత యువత ప్రతిభ, ప్రభుత్వ సహకారం కలిసి ప్రపంచానికి భారత సామర్థ్యాన్ని చాటిచెప్పాయి.పవన్ కుమార్ చందన ప్రకారం.. విజయం సాధించడానికి కేవలం డిగ్రీలు లేదా విదేశీ విద్య మాత్రమే అవసరం కాదు. బలమైన పునాది, సరైన ఆలోచన, కృషి, పట్టుదల ఉంటే ఎవరైనా గొప్ప విజయాలను సాధించగలరు. యువతకు వ్యాపారవేత్తలుగా ఎదగాలని ఆయన చెబుతారు. అప్పుడే దేశ నిర్మాణంలో భాగస్వాములయ్యే అవకాశం లభిస్తుంది.ఇదీ చదవండి: కోర్టుకు వెళ్లేందుకు సిద్ధం.. E20 పెట్రోల్పై ఆందోళన! -
జియో లాభాల జోష్.. 3 నెలలకు రూ.7,764 కోట్లు
దాదాపు 4 బిలియన్ డాలర్ల రికార్డు ఐపీఓ బాటలో ఉన్న జియో ప్లాట్ఫామ్స్ క్యూ1లో అదరగొట్టింది. కంపెనీ నికర లాభం 9.2 శాతం వృద్ధితో రూ. 7,764 కోట్లకు ఎగబాకింది. గతేడాది ఇదే క్వార్టర్లో లాభం రూ.7,110 కోట్లుగా నమోదైంది. కాగా, ఆదాయం 11.8 శాతం ఎగసి రూ.39,173 కోట్లకు చేరింది. ఎబిటా 15.1 శాతం ఎగసి రికార్డు స్థాయిలో రూ.20,865 కోట్లను తాకింది.ఒక్కో యూజర్ నుంచి సగటు ఆదాయం (ఏఆర్పీయూ) 3.3 శాతం వృద్ధి చెంది రూ.215.6కు చేరింది. క్యూ1లో ఒక్కో యూజర్ నెలవారీ డేటా వినియోగం 43.7 జీబీకి ఎగసింది. 26.9 శాతం వృద్ధి సాధించింది. జియో మొత్తం కస్టమర్ల సంఖ్య ఈ ఏడాది జూన్ నాటికి 7.1 శాతం పెరిగి, 53.3 కోట్లకు చేరారు. గతేడాది జూన్ క్వార్టర్లో యూజర్ల సంఖ్య 49.8 కోట్లుగా ఉంది. -
రెండు నెలల ఇంటర్న్షిప్కే రూ.67 లక్షలా?
దేశంలోని ప్రముఖ ఐఐటీల విద్యార్థులకు కేవలం రెండు నెలల ఇంటర్న్షిప్కే రూ.67 లక్షల సీటీసీ (Gross CTC) ఆఫర్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ నియామక ప్రకటన తీవ్ర చర్చకు దారితీసింది. రెడిట్లోని r/Btechtards ఫోరం, ఎక్స్ (X) వేదికలపై విస్తృతంగా షేర్ అవుతున్న ఈ స్క్రీన్షాట్ నిజమా? కాదా? అనే అంశంపై విద్యార్థులు, టెక్ నిపుణులు పెద్దఎత్తున చర్చిస్తున్నారు.వైరల్ పోస్టు ప్రకారం.. హర్యానాలోని గురుగ్రామ్లో క్వాంటిటేటివ్ స్ట్రాటజిస్ట్ ఇంటర్న్ పోస్టులకు ప్రీ-ఫైనల్ ఇయర్ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. ఇందులో నెలకు రూ.30 లక్షల స్టైపెండ్, రెండు నెలల ఇంటర్న్షిప్కు మొత్తం రూ.67 లక్షల గ్రాస్ సీటీసీ పేర్కొన్నట్లు కనిపిస్తోంది. బీఎస్-ఎంఎస్ (మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్), బీటెక్ (సీఎస్ఈ, ఈఈ, డీఎస్ఏఐ, ఈసీఈ తదితర విభాగాలు) చదువుతున్న, కనీసం 8.5 సీజీపీఏ ఉన్న విద్యార్థులు అర్హులని పోస్టులో పేర్కొన్నారు.అయితే వైరల్ స్క్రీన్షాట్లో సంస్థ పేరు స్పష్టంగా లేకపోయినా, పలువురు నెటిజన్లు ఇది గురుగ్రామ్కు చెందిన ప్రముఖ క్వాంటిటేటివ్ ట్రేడింగ్ సంస్థ ‘క్వాడెయీ’ (Quadeye)కు సంబంధించినదై ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. దీనికి కారణం, ఆ సంస్థ అధికారిక కెరీర్ పేజీలో ప్రస్తుతం ఇంటర్న్- క్వాంట్ స్ట్రాటజిస్ట్ పోస్టుకు నియామకాలు కొనసాగుతుండటమే. అయితే అక్కడ ఇంటర్న్షిప్ స్టైపెండ్ వివరాలు వెల్లడించలేదు. పూర్తి స్థాయి ఉద్యోగంగా ఎంపికైతే కనీసం రూ.93 లక్షల వార్షిక వేతనం (CTC) ఉంటుందని మాత్రమే పేర్కొంది.ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది అగ్రశ్రేణి హై-ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ (HFT), క్వాంట్ ట్రేడింగ్ సంస్థల్లో అసాధారణం కాదని చెబుతుండగా, మరికొందరు వైరల్ స్క్రీన్షాట్లోని గణాంకాలను స్వతంత్రంగా నిర్ధారించే ఆధారాలు లేవని పేర్కొంటున్నారు. ప్రస్తుతం రూ.67 లక్షల ఇంటర్న్షిప్ సీటీసీపై సంబంధిత సంస్థ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.I'm out of words 💀 pic.twitter.com/hgPweX2ax5— Ansh (@0xansh_) July 15, 2026 -
టెక్ మహీంద్రాకు లాభాల జోష్
ఐటీ సేవల దిగ్గజం టెక్ మహీంద్రా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 1,465 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో నమోదైన రూ. 1,140తో పోలిస్తే సుమారు 28 శాతం పెరిగింది. మరోవైపు ఆదాయం సుమారు 18 శాతం వృద్ధితో రూ. 13,351 కోట్ల నుంచి రూ. 15,712 కోట్లకు చేరింది.త్రైమాసికాలవారీగా చూస్తే క్యూ1లో మొత్తం సిబ్బంది సంఖ్య 863 మేర తగ్గి 1,46,760కి పరిమితమైంది. గడిచిన పన్నెండు నెలల వ్యవధిలో ఐటీ అట్రిషన్ రేటు సుమారు 11.8 శాతంగా ఉంది. అటు డాలరు మారకంలో చూస్తే ఆదాయం వార్షికంగా 6.1 శాతం, సీక్వెన్షియల్గా 2.2 శాతం వృద్ధి చెంది 1,660 మిలియన్ డాలర్లుగా నమోదైంది. వరుసగా మూడో త్రైమాసికంలోను బిలియన్ డాలర్ల పైగా డీల్స్ను సాధించినట్లు కంపెనీ సీఈవో మోహిత్ జోషి తెలిపారు.50 మిలియన్ డాలర్ల పైగా కాంట్రాక్టులు ఇచ్చిన సంస్థల సంఖ్య ఏడు మేర పెరిగినట్లు వివరించారు. ఐటీ సేవల విభాగం ఆదాయం రూ. 11,264 కోట్ల నుంచి రూ. 13,245 కోట్లకు, బీపీఎస్ సెగ్మెంట్ ఆదాయం రూ. 2,087 కోట్ల నుంచి రూ. 2,467 కోట్లకు పెరిగాయి. త్రైమాసికం ఆఖరు నాటికి కంపెనీ వద్ద నగదు నిల్వలు సుమారు రూ. 9,695 కోట్లు ఉన్నాయి. -
ఎయిర్టెల్ సైలెంట్ షాక్! పాపులర్ ప్లాన్ తొలగింపు
దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ తన పోస్ట్పెయిడ్ పోర్ట్ఫోలియోలో కీలక మార్పు చేసింది. వ్యక్తిగత వినియోగదారుల కోసం అందుబాటులో ఉన్న రూ.549 పోస్ట్పెయిడ్ ప్లాన్ను సైలెంట్గా తొలగించింది. ప్రస్తుతం ఈ ప్లాన్ ఎయిర్టెల్ అధికారిక వెబ్సైట్తో పాటు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్లో కూడా కనిపించడం లేదు. అయితే ఈ మార్పుపై కంపెనీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.ఈ నిర్ణయంతో ఇప్పుడు కొత్త పోస్ట్పెయిడ్ వినియోగదారులకు రూ.449 వ్యక్తిగత ప్లాన్ ఎంట్రీ-లెవల్ ఎంపికగా మిగిలింది. మరోవైపు, రూ.549 కంటే ఎక్కువ ప్రయోజనాలు కోరుకునే కస్టమర్లు నేరుగా రూ.699 ఫ్యామిలీ ప్లాన్ను ఎంచుకోవాల్సి వస్తుంది. దీంతో ఎయిర్టెల్ తన అధిక ధరల ఫ్యామిలీ ప్లాన్ల వైపు వినియోగదారులను మళ్లించే ప్రయత్నం చేస్తోందని టెలికాం రంగ నిపుణులు భావిస్తున్నారు.రూ.449 ప్లాన్లో ఏమున్నాయి?రూ.449 వ్యక్తిగత పోస్ట్పెయిడ్ ప్లాన్లో అపరిమిత 4G/5G డేటా, అన్లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ, నేషనల్ రోమింగ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. అదనంగా 3 నెలల ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే ప్రీమియం, 6 నెలల పాటు 100 GB గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్, ఏడాది పాటు అడోబ్ ఎక్స్ప్రెస్ ప్రీమియం, ఉచిత హలో ట్యూన్స్, బ్లూ రిబ్బన్ బ్యాగ్ ట్రాకింగ్, అలాగే 5G ఫాస్ట్ లేన్, స్పామ్ కాల్ అలర్ట్స్, ఫ్రాడ్ లింక్ బ్లాకింగ్, OTP అలర్టుల వంటి భద్రతా ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి.రూ.699 ఫ్యామిలీ ప్లాన్లో అదనపు ప్రయోజనాలురూ.699 ఫ్యామిలీ ప్లాన్లో ఒక మెయిన్ కనెక్షన్తో పాటు ఒక ఉచిత యాడ్-ఆన్ సిమ్ లభిస్తుంది. అంటే ఇద్దరు సభ్యులు ఈ ప్లాన్ను వినియోగించుకోవచ్చు. ప్రతి కనెక్షన్కు సగటున సుమారు రూ.350 ఖర్చు మాత్రమే అవుతుంది. ఇందులో కూడా అపరిమిత 4G/5G డేటా, అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి.అదనంగా 6 నెలల అమెజాన్ ప్రైమ్ మొబైల్ సబ్స్క్రిప్షన్, 12 నెలల జియో హాట్ స్టార్ మొబైల్, 6 నెలల గూగుల్ వన్ (100GB), 3 నెలల ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే ప్రీమియం, ఏడాది పాటు అడోబ్ ఎక్స్ప్రెస్ ప్రీమియం వంటి ఓటీటీ ప్రయోజనాలు కూడా ఇందులో ఉన్నాయి. అలాగే హలో ట్యూన్స్, బ్లూ రిబ్బన్ బ్యాగ్ ట్రాకింగ్, అలాగే 5G ఫాస్ట్ లేన్, స్పామ్ డిటెక్షన్, ఫ్రాడ్ లింక్ బ్లాకింగ్, OTP అలర్ట్స్ వంటి సేవలు కూడా కొనసాగుతాయి. -
భయంతో భారీగా సంపాదిస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి!
29 ఏళ్ల భారతీయ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రూ.82 లక్షలకు పైగా ఆస్తులు కూడబెట్టుకున్నప్పటికీ, భవిష్యత్తుపై ఉన్న ఆందోళనతో రోజుకు దాదాపు 16 గంటలు పనిచేస్తున్నాడు. పగటిపూట భారతీయ ఐటీ కంపెనీలో, రాత్రిపూట అమెరికా (US) సంస్థలో ఫుల్ టైమ్ ఉద్యోగాలు చేస్తూ నెలకు సుమారు రూ.7లక్షలు సంపాదిస్తున్నాడు. ఈ విషయాలను పర్సనల్ ఫైనాన్స్ వ్యవహారాలపై నిర్వహించే 'ఫిక్స్ యువర్ ఫైనాన్స్' (Fix Your Finance) పోడ్కాస్ట్లో మ్యూచువల్ ఫండ్ సలహాదారు అన్షుమన్ శర్మతో జరిగిన సంభాషణలో వెల్లడించారు.కుటుంబ పరిస్థితులే ప్రేరణ'రోహిత్'గా మాత్రమే తనను పరిచయం చేసుకున్న ఈ యువకుడు, చిన్నప్పటి కుటుంబ పరిస్థితులను గుర్తు చేసుకున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇద్దరు సోదరుల్లో ఒకరే ఉన్నత చదువులు కొనసాగించే అవకాశం ఉండగా, తన అన్న చదువును వదులుకుని తనకు అవకాశం కల్పించాడని తెలిపాడు. "నేను విజయం సాధించకపోతే అది నా కుటుంబానికి వైఫల్యమే అవుతుంది" అనే భావన ఇప్పటికీ తనను మరింత కష్టపడేలా చేస్తోందని చెప్పాడు.భారీ సేవింగ్స్.. ఈఎంఐలుఇటీవల తండ్రి అయిన రోహిత్, కుటుంబ అవసరాల కోసం కారు కొనుగోలు చేయడంతో పాటు రూ.85 లక్షల విలువైన 2BHK ఫ్లాట్ను కూడా తీసుకున్నట్లు వెల్లడించాడు. ప్రస్తుతం గృహ రుణానికి నెలకు సుమారు రూ.60,000, కారు లోన్కి రూ.28,000 ఈఎంఐ చెల్లిస్తున్నాడు. ఇతర ఖర్చులతో కలిపి నెలవారీ వ్యయం రూ.1.3 లక్షల నుంచి రూ.1.4 లక్షల మధ్య ఉంటుందని తెలిపాడు.రూ.82 లక్షల ఆస్తులు.. అయినా ఎందుకు భయం?తన వద్ద ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్లలో రూ.70 లక్షలు, ఫిక్స్డ్ డిపాజిట్లలో రూ.10 లక్షలు, స్టాక్ మార్కెట్లో సుమారు రూ.2 లక్షల పెట్టుబడులు ఉన్నాయని రోహిత్ వివరించాడు. మొత్తం కలిపి దాదాపు రూ.82 లక్షల ఆస్తులు ఉన్నప్పటికీ, ఉద్యోగ భద్రతపై తనకు నమ్మకం లేదని పేర్కొన్నాడు.దీనిపై అన్షుమన్ శర్మ స్పందిస్తూ, "మీ దగ్గర నాలుగేళ్ల ఖర్చులకు సరిపడా పొదుపు ఉంది. అయినా ఇంకా ఒత్తిడి ఎందుకు?" అని ప్రశ్నించారు.ఏఐ వల్ల ఉద్యోగాలపై ఆందోళనరోహిత్ సమాధానం మాత్రం ప్రస్తుతం ఐటీ రంగంలో చాలా మందిలో కనిపిస్తున్న ఆందోళనను ప్రతిబింబించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో తన ఆదాయం తగ్గిపోతుందేమోననే భయం వెంటాడుతోందని చెప్పాడు. ఆ కారణంగానే రెండు ఉద్యోగాలు చేస్తూ ఎక్కువగా సంపాదించాలని ప్రయత్నిస్తున్నానని వెల్లడించాడు. ఈ క్రమంలో రోజుకు 16 గంటలు పని చేయడం వల్ల కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సమయం కేటాయించలేకపోతున్నానని, వ్యక్తిగత జీవితం దెబ్బతింటోందని కూడా అంగీకరించాడు.👉ఇది చదివారా? ఈ హైదరాబాద్ ఐటీ దంపతుల సంపాదన పెరిగిందిలా..లక్ష్యం రూ.7-8 కోట్లువచ్చే ఐదారు సంవత్సరాల్లో రూ.7 నుంచి రూ.8 కోట్ల వరకు ఆస్తులు కూడబెట్టాలనే లక్ష్యంతో ఉన్నానని రోహిత్ తెలిపాడు. ఆ స్థాయికి చేరుకున్న తర్వాత భారతీయ ఉద్యోగాన్ని వదిలి, అమెరికా సంస్థలోని ఒక్క ఉద్యోగాన్నే కొనసాగించాలని భావిస్తున్నట్లు చెప్పాడు.నిపుణులు ఏమంటున్నారు?పర్సనల్ ఫైనాన్స్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, అత్యవసర నిధి, పెట్టుబడులు, బీమా వంటి అంశాలు ఆర్థిక భద్రతకు కీలకమైనప్పటికీ, నిరంతర ఒత్తిడి, అధిక పని గంటలు దీర్ఘకాలంలో శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు, ఏఐ ప్రభావంతో ఐటీ రంగంలో ఉద్యోగాల స్వరూపం మారుతున్నప్పటికీ, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టడం ద్వారా అవకాశాలను పెంచుకోవచ్చని పరిశ్రమ నిపుణులు సూచిస్తున్నారు. -
పిల్లల చాటింగ్పై తల్లిదండ్రులకు మెసేజ్!
సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ విస్తరిస్తున్న కొద్దీ టీనేజర్లలో మానసిక సమస్యలు, సోషల్ మీడియా ప్రభావంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చాట్బాట్లతో పిల్లలు ఎక్కువగా సమయం గడుపుతుండటం, కొన్ని సందర్భాల్లో అవి వారిని తప్పుదోవ పట్టిస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా తమ ‘మెటా ఏఐ’ చాట్బాట్లో రక్షణ ఫీచర్ను ప్రవేశపెట్టింది. ఇకపై టీనేజర్లు చాట్బాట్తో ఆత్మహత్య వంటి సున్నితమైన అంశాల గురించి చర్చిస్తే తక్షణమే వారి తల్లిదండ్రులకు అలర్ట్ వెళ్లేలా సరికొత్త వ్యవస్థను తీసుకొచ్చింది.ఫీచర్ పనితీరు - మానవ పర్యవేక్షణఇన్స్టాగ్రామ్లో ‘పేరెంటల్ సూపర్విజన్’ (తల్లిదండ్రుల పర్యవేక్షణ) నియంత్రణలను ఎంచుకున్న వారికి మాత్రమే ఈ అలర్ట్లు అందుతాయి. పిల్లలు మెటా ఏఐతో జరిపే సంభాషణల్లో ఆత్మహత్యకు సంబంధించిన అంశాలు లేదా తమను తాము గాయపరుచుకునే ప్రస్తావనలు వస్తే ప్రత్యేకంగా రూపొందించిన ఏఐ వ్యవస్థ దానిని గుర్తిస్తుంది. అయితే, టెక్నాలజీ పరిమితులను దృష్టిలో ఉంచుకుని ఏఐ ఫ్లాగ్ చేసిన ప్రతి చాట్ను మెటా అంతర్గత బృందం మ్యాన్యువల్గా సమీక్షిస్తుంది. ఆ తర్వాతే తల్లిదండ్రులకు యాప్ నోటిఫికేషన్, ఈమెయిల్ లేదా వాట్సాప్ ద్వారా సమాచారం పంపుతారు. ఒకవేళ పిల్లల ఉద్దేశం అస్పష్టంగా ఉన్నప్పటికీ ప్రాణ రక్షణే ధ్యేయంగా ముందుజాగ్రత్త చర్యగా అలర్ట్ పంపాలని మెటా నిర్ణయించింది.గోప్యతకు భంగం కలగకుండా..ఈ ఫీచర్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం వెళ్లినప్పటికీ పిల్లల ప్రైవసీ దెబ్బతినకుండా మెటా జాగ్రత్తలు తీసుకుంది. తల్లిదండ్రులకు పిల్లల పూర్తి సంభాషణలు (చాట్ హిస్టరీ) కనిపించవు. కేవలం తమ సంభాషణలో అటువంటి సున్నితమైన అంశం ప్రస్తావనకు వచ్చిందనే విషయం మాత్రమే తెలుస్తుంది. దీనితో పాటు అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో పిల్లలతో ఎలా మాట్లాడాలి.. వారికి మానసిక ధైర్యం ఎలా కల్పించాలనే విషయాలపై నిపుణులు రూపొందించిన గైడ్లైన్స్, హెల్ప్లైన్ నంబర్లను కూడా మెటా తల్లిదండ్రులకు అందజేస్తుంది.కంటెంట్ నిబంధనలు - లభ్యతప్రస్తుతం ఈ ఫీచర్ అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా దేశాల్లోని ఇన్స్టాగ్రామ్ టీన్ అకౌంట్లకు అందుబాటులోకి వచ్చింది. ఈ ఏడాది చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర ఖాతాలన్నింటికీ దీనిని విస్తరించనున్నారు. వీటితో పాటు టీనేజర్ల ఖాతాలకు డిఫాల్ట్గా ‘13+ కంటెంట్ సెట్టింగ్’ (పరిమిత కంటెంట్ మోడ్) వర్తింపజేస్తున్నారు. దీనివల్ల వయసుకు సరిపోని లేదా సున్నితమైన ప్రాంప్ట్లకు మెటా ఏఐ స్పందించదు. అంతేకాదు, ఎవరైనా యూజర్ ఏఐ చాట్లో అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నట్లు గుర్తిస్తే నేరుగా స్థానిక అత్యవసర సేవల విభాగానికి సమాచారం అందించే మరో వ్యవస్థపై కూడా మెటా పనిచేస్తోంది. గతంలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పోస్టుల ద్వారా ప్రమాదంలో ఉన్న 19,000 మందిని అత్యవసర సేవల సహాయంతో కాపాడినట్లు సంస్థ వెల్లడించింది.ఇదీ చదవండి: హైదరాబాద్లో దిగొచ్చిన బంగారం ధర! -
జియో ‘స్పేస్’ వార్.. ఎలాన్ మస్క్కే సవాల్..
భారత టెలికాం రంగంలో అగ్రగామిగా ఉన్న ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో ఇప్పుడు అంతరిక్ష ఆధారిత బ్రాడ్బ్యాండ్ మార్కెట్ను శాసించేందుకు ముందడుగు వేసింది. దేశీయంగా సుమారు 1,600 లో-ఎర్త్ ఆర్బిట్ (ఎల్ఈఓ) ఉపగ్రహాలను ప్రయోగించాలనే జియో ప్రతిపాదనకు భారత అంతరిక్ష నియంత్రణ సంస్థ ‘ఇన్-స్పేస్’ (IN-SPACe) సాంకేతిక ఆమోదం తెలిపింది. ఇస్రో, టెలికాం శాఖకు చెందిన వైర్లెస్ ప్లానింగ్ అండ్ కోఆర్డినేషన్ (డబ్ల్యూపీసీ) వింగ్లతో కలిసి నిర్వహించిన సమగ్ర పరిశీలన అనంతరం ఈ ప్రాజెక్ట్ సాంకేతికంగా పటిష్టమైనదని స్పష్టం చేసింది. ఇది అంతర్జాతీయంగా ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ వ్యవస్థతో సమానమైన సామర్థ్యం కలిగి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.భారత్కు తొలి సొంత శాటిలైట్ నెట్వర్క్ఈ సాంకేతిక అనుమతితో అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) వద్ద ఆర్బిటల్ స్లాట్లు, స్పెక్ట్రమ్ హక్కులను సాధించేందుకు జియోకు కేంద్ర ప్రభుత్వం తరఫున అంతర్జాతీయ స్థాయి విధానపరమైన మద్దతు లభించనుంది. ఫలితంగా భారతదేశపు మొట్టమొదటి ‘స్వదేశీ శాటిలైట్ కాన్స్టలేషన్’ (ఉపగ్రహాల సమూహం) ఏర్పాటుకు మార్గం సుగమంకానుంది.జియో ప్రతిపాదించిన ఈ నెట్వర్క్ భారతదేశంపై సెకనుకు 4.5 నుంచి 5 టెరాబిట్ల డేటా సామర్థ్యాన్ని అందించగలదని అంచనా. ప్రస్తుతం భారత్లో అనుమతులు పొందిన స్టార్లింక్ (600 జీబీపీఎస్), అమెజాన్ లీఓ (3 టీబీపీఎస్ - ఇంకా ఇన్-స్పేస్ అనుమతి రాలేదు)లతో పోలిస్తే జియో సామర్థ్యం చాలా ఎక్కువ. ఈ ప్రాజెక్ట్లో భాగంగా దేశవ్యాప్తంగా 20-22 గ్రౌండ్ స్టేషన్లను జియో ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా మారుమూల ప్రాంతాలు, సరిహద్దు కొండ ప్రాంతాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్ చేరడంతోపాటు మొబైల్ ఫోన్లకు నేరుగా కనెక్ట్ అయ్యే ‘డైరెక్ట్-టు-డివైస్’ (డీ2డీ) సేవలు అందుబాటులోకి వస్తాయి.వ్యూహాత్మక రక్షణ రంగానికి బూస్ట్ప్రస్తుత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశీ ఉపగ్రహ కమ్యూనికేషన్ నెట్వర్క్లపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి ఈ స్వదేశీ ప్రాజెక్ట్ ఎంతో కీలకం కానుంది. జాతీయ భద్రత, వ్యూహాత్మక రక్షణ అవసరాల కోసం ఈ జియో శాటిలైట్లలో కొన్నింటిపై భారత రక్షణ రంగానికి చెందిన పేలోడ్లను కూడా అమర్చే అంశంపై ప్రభుత్వం ఉన్నత స్థాయిలో ప్రాథమిక చర్చలు జరుపుతోందని తెలుస్తుంది. అయితే దీనిపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. భవిష్యత్తులో రాబోయే ఇతర భారతీయ ఉపగ్రహ నెట్వర్క్లతో కలిసి పనిచేసేలా దీని ఆర్కిటెక్చర్ను రూపొందించడం విశేషం. సుమారు 10-15 బిలియన్ డాలర్ల వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్ట్ మరో 2-3 ఏళ్లలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదీ చదవండి: హైదరాబాద్లో దిగొచ్చిన బంగారం ధర! -
ఇప్పుడంతా AI.. మరి రేపు ఏంటి?
కృత్రిమ మేధస్సు .. ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న అత్యాధునిక సాంకేతికతగా మారింది. ఒకప్పుడు మనిషి మాత్రమే చేయగలడని భావించిన అనేక పనులను ఇప్పుడు ఏఐ క్షణాల్లో పూర్తి చేస్తోంది. వార్తల రచన నుంచి వైద్య నిర్ధారణ వరకు, సినిమాల నిర్మాణం నుంచి అంతరిక్ష పరిశోధనల వరకు, విద్య నుంచి వ్యాపార రంగం వరకు ప్రతి చోటా తన ముద్ర వేస్తోంది. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, టెక్నాలజీ సంస్థలు మరో ప్రశ్నపై దృష్టి సారిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఏఐ తర్వాతి స్థాయి టెక్నాలజీ ఏమిటి? భవిష్యత్తు ప్రపంచాన్ని ఏ సాంకేతిక విప్లవం నడిపించబోతోంది?..ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న ఏఐ వ్యవస్థలు ప్రత్యేకంగా శిక్షణ పొందిన పనులనే సమర్థంగా నిర్వహిస్తాయి. ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, చిత్రాలు రూపొందించడం, అనువాదాలు చేయడం, డేటాను విశ్లేషించడం వంటి నిర్దిష్ట పనుల్లో ఇవి అద్భుత ఫలితాలు ఇస్తున్నాయి. కానీ మనిషిలా ప్రతి పరిస్థితిని అర్థం చేసుకుని స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మాత్రం వీటికి లేదు. ఈ పరిమితిని అధిగమించాలనే లక్ష్యంతోనే ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI)పై పరిశోధనలు వేగంగా సాగుతున్నాయి.👉ఏజీఐ అంటే మనిషిలా ఆలోచించగలిగే, కొత్త విషయాలను స్వయంగా నేర్చుకోగలిగే, ఒక రంగంలో నేర్చుకున్న పరిజ్ఞానాన్ని మరో రంగంలో కూడా ఉపయోగించగలిగే కృత్రిమ మేధస్సు. ఒకే వ్యవస్థ వైద్యుడిలా రోగాన్ని గుర్తించడమే కాకుండా, శాస్త్రవేత్తలా పరిశోధనలు చేయడం, ఇంజినీర్లా సమస్యలకు పరిష్కారాలు కనుగొనడం, ఉపాధ్యాయుడిలా బోధించడం వంటి అనేక పనులను నిర్వహించగల స్థాయికి చేరుకోవడమే ఏజీఐ లక్ష్యం. ప్రస్తుతం ప్రపంచంలో ఏ సంస్థ కూడా పూర్తిస్థాయి ఏజీఐని అభివృద్ధి చేయలేదు. అయితే ఆ దిశగా తీవ్ర పరిశోధనలు కొనసాగుతున్నాయి.👉ఏజీఐ తర్వాత శాస్త్రవేత్తలు ఊహిస్తున్న మరో దశ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ (ASI). ఇది మానవ మేధస్సును కూడా అధిగమించే స్థాయి కృత్రిమ మేధస్సుగా భావిస్తున్నారు. విజ్ఞానం, పరిశోధనలు, విశ్లేషణ, నిర్ణయాలు, సృజనాత్మకత వంటి అన్ని రంగాల్లో మనిషి కంటే మెరుగ్గా పనిచేసే సామర్థ్యం దీనికి ఉంటుందని అంచనా. అయితే ఇది ఇప్పటికీ పూర్తిగా సిద్ధాంత స్థాయిలోనే ఉంది. అలాంటి వ్యవస్థ ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడా లేదు.👉భవిష్యత్తులో మరో కీలక మార్పు ‘ఎంబాడీడ్ ఏఐ’ రూపంలో కనిపించే అవకాశం ఉంది. అంటే కేవలం కంప్యూటర్ లేదా మొబైల్లో ఉండే ఏఐ కాకుండా, మనుషుల మాదిరిగా నడిచే, చూసే, వినే, వస్తువులను తాకి పని చేసే హ్యూమనాయిడ్ రోబోల్లో ఏఐ పనిచేస్తుంది. ఇలాంటి రోబోలు పరిశ్రమలు, ఆసుపత్రులు, వ్యవసాయం, వృద్ధుల సంరక్షణ, విపత్తు సహాయక చర్యలు వంటి అనేక రంగాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.అయితే భవిష్యత్తు కేవలం ఏఐతోనే పరిమితం కాదని కూడా శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్, మెదడు-కంప్యూటర్ అనుసంధానం (Brain-Computer Interface), జన్యు సాంకేతికత, ఫ్యూజన్ ఎనర్జీ వంటి రంగాలు కూడా సమాంతరంగా అభివృద్ధి చెందుతున్నాయి. వీటిలో ఏఐతో కలయిక జరిగితే ప్రస్తుతం ఊహించలేని స్థాయిలో సాంకేతిక విప్లవం చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో యంత్రాలు మనిషిని పూర్తిగా భర్తీ చేయడం కంటే, మనిషి సామర్థ్యాన్ని మరింత పెంచే సహాయకులుగా మారే దిశగా టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం ఏఐ ప్రపంచాన్ని మార్చుతున్నట్లే.. భవిష్యత్తులో ఏజీఐ, ఎంబాడీడ్ ఏఐ వంటి సాంకేతికతలు మన జీవన విధానాన్ని మరోసారి పూర్తిగా మార్చే అవకాశాన్ని ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.:::వెబ్ ప్రత్యేకం -
ఏఐకి నచ్చకపోతే ఉద్యోగం ఊడాల్సిందేనా?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మానవ జీవితాన్ని సులభతరం చేస్తుందని భావిస్తున్న తరుణంలో అది కార్పొరేట్ రంగంలో ఉద్యోగాలను ఊడగొట్టే ఒక దయలేని సాధనంగా మారుతోందా అనే భయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రముఖ సాంకేతిక దిగ్గజం మెటాపై ఇటీవల అమెరికా కోర్టులో దాఖలైన ఒక దావా ఈ భయాన్ని నిజం చేస్తోంది. మెటా సంస్థలోని భారీ లేఆఫ్స్ (ఉద్యోగాల తొలగింపు) ప్రక్రియలో కేవలం మానవ నిర్ణయాల ఆధారంగా కాకుండా ఏఐ అల్గారిథమ్స్ ఆధారంగా ఉద్యోగులను తొలగించారనే ఆరోపణలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఐటీ రంగంలో ఉన్న లక్షలాది మంది భారతీయ టెక్కీల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి.వివాదం ఏమిటి?కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో మెటాకు చెందిన 26 మంది ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం.. ఈ ఏడాది మే నెలలో సంస్థ తన గ్లోబల్ వర్క్ఫోర్స్లో 10 శాతం అంటే దాదాపు 8,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ తొలగింపు జాబితాను రూపొందించడంలో కంపెనీ మానవ పర్యవేక్షణను పక్కనపెట్టి తన అంతర్గత ఏఐ వ్యవస్థలను (ఉదాహరణకు మెటామేట్ ఎల్ఎల్ఎం అసిస్టెంట్, కీస్ట్రోక్ మానిటరింగ్, ఏఐ టోకెన్ యూసేజ్ డ్యాష్బోర్డ్లు) ఉపయోగించిందని ఉద్యోగులు వాదిస్తున్నారు.సెలవులకు లభించిన శిక్ష!ఈ ఏఐ అల్గారిథమ్స్ కేవలం డిజిటల్ ఉత్పాదకత స్కోర్లను మాత్రమే ప్రామాణికంగా తీసుకున్నాయి. దీనివల్ల ప్రసూతి సెలవులు, వైద్య కారణాల వల్ల సెలవు తీసుకున్న వారు, లేదా వికలాంగులైన ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారు. వారు సెలవుల్లో ఉన్న సమయంలో డిజిటల్ యాక్టివిటీ లేకపోవడాన్ని ఏఐ వ్యవస్థలు ‘తక్కువ పనితీరు’గా రికార్డ్ చేసి, వారిని లేఆఫ్స్ జాబితాలో చేర్చాయి. చట్టబద్ధంగా లభించే సెలవులను వాడుకున్నందుకు ఏఐ తమను శిక్షించిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.భారతీయ ఉద్యోగులపై దీని ప్రభావం ఎంత?ఈ పరిణామం అంతర్జాతీయంగా పనిచేస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు పెద్ద హెచ్చరిక. ఎందుకంటే పని గంటలు, డిజిటల్ కీస్ట్రోక్స్, కోడింగ్ అవుట్పుట్ వంటి మెట్రిక్స్ ఆధారంగా ఏఐ నిర్ణయాలు తీసుకుంటే వ్యక్తిగత అత్యవసర పరిస్థితులు లేదా పండుగల సంప్రదాయాల ప్రకారం లాంగ్ లీవ్స్ తీసుకునే భారతీయ ఉద్యోగులు సులభంగా ఈ అల్గారిథమిక్ లేఆఫ్స్ బారిన పడే ప్రమాదం ఉంది.మరోవైపు మెటా ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. ఉద్యోగుల తొలగింపు నిర్ణయాలు పూర్తిగా మానవ మేధస్సుతో, మేనేజర్ల పర్యవేక్షణలోనే జరిగాయని, ఏఐ పాత్ర లేదని స్పష్టం చేసింది. ఏదేమైనప్పటికీ ఈ వివాదం ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థల్లో ఏఐ వినియోగంపై నైతిక, చట్టపరమైన చర్చకు తెరలేపింది. అల్గారిథమ్స్ చేతికి ఉద్యోగాల నియంత్రణను ఇస్తే మానవతా దృక్పథం, చట్టబద్ధమైన హక్కులు కనుమరుగవుతాయని ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది.ఇదీ చదవండి: IRCTC వెబ్సైట్ కొత్త అవతారం.. అదిరిపోయే ఫీచర్లు -
చిప్ ప్రాజెక్టులను ప్రకటిస్తే చాలదు!
దేశీయంగా మెగా సెమీకండక్టర్ ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున అనుమతులు లభిస్తున్న నేపథ్యంలో అవి ప్రకటనలకు మాత్రమే పరిమితం కాకుండా వాస్తవ రూపం దాల్చేలా చూడాల్సిన బాధ్యత పరిశ్రమపై ఉందని పరిశ్రమల సమాఖ్య పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (పీహెచ్డీసీసీఐ) తెలిపింది. ప్రతిపాదిత చిప్ల ఉత్పత్తి ప్రణాళికలు.. ప్రస్తుతం నెలకొన్న డిమాండ్కి ఏమాత్రం సరిపోయే పరిస్థితి లేదని వివరించింది. ఈ నేపథ్యంలో ఉత్పత్తిని మరింతగా పెంచడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సెమీకండక్టర్ ఇండియా 2026 జాతీయ సదస్సులో పాల్గొన్న సందర్భంగా పీహెచ్డీసీసీఐ ఫారిన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కమిటీ కో–చెయిర్ కరణ్ మంగ్లా పేర్కొన్నారు.ప్రస్తుతం అనుమతులు పొందిన ఫ్యాబ్రికేషన్ ప్లాంట్లు, ఓఎస్ఏటీలు పూర్తి స్థాయిలో పని చేసినా కూడా దేశీయంగా నెలకొన్న డిమాండ్కి సరిపోదని.. మిగతా వాటి కోసం దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తుందని చెప్పారు. భారత్లో సెమీకండక్టర్ మార్కెట్ 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల మార్కును దాటేయబోతుందని ఆయన పేర్కొన్నారు. ఏడు రాష్ట్రాల్లో 12 ప్రాజెక్టులు..సెమీకండక్టర్ల తయారీ విషయంలో భారత్ కేవలం సంకల్పానికే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంవైపు విజయవంతంగా మళ్లిందని కరణ్ చెప్పారు. ఏడు రాష్ట్రాల్లో రూ. 1.64 లక్షల కోట్ల విలువైన 12 ప్రాజెక్టులకు ఆమోదం లభించిందన్నారు. సాణంద్లో మైక్రాన్ ప్లాంటు అందుబాటులోకి రాగా, టాటా ఎలక్ట్రానిక్స్ ధొలెరా ప్లాంటు వేగంగా సన్నద్ధమవుతోందని పేర్కొన్నారు. ఒక క్లిష్టమైన మైలురాయిని అధిగమించామని, ఇక తదుపరి దశ మరింత కీలకమని కరణ్ వివరించారు. మౌలిక సదుపాయాలను మరింత వేగంగా ఏర్పాటు చేయడం, పరిశ్రమ స్థాయికి తగ్గట్లుగా నిపుణులను తయారు చేసుకోవడం, డిమాండ్కి తగ్గట్లుగా సరఫరా చేసేందుకు నిబద్ధతతో పనిచేయడమనే మూడు సూత్రాలతో మార్గదర్శ ప్రణాళికను అమలు చేయాలని పేర్కొన్నారు. ఉత్పత్తిలో జాప్యం జరిగే కొద్దీ ఎల్రక్టానిక్స్, ఆటోమోటివ్, డిఫెన్స్ తయారీ సంస్థలు ... దిగుమతులపై ఆధారపడటం మరింతగా పెరుగుతూ ఉంటుందని చెప్పారు. 3 లక్షల మంది నిపుణులు కావాలి..ఇక నిపుణుల సంగతి చూస్తే .. చిప్ డిజైన్కి సంబంధించి ప్రపంచంలోనే సుమారు అయిదో వంతు సిబ్బంది భారత్లోనే ఉన్నప్పటికీ .. ఫ్యాబ్, ప్యాకేజింగ్ నిపుణుల కొరత ఉంటోందని వివరించారు. వచ్చే అయిదేళ్ల నుంచి ఏడేళ్ల వ్యవధిలో భారత్లో 3,00,000కు పైగా సుశిక్షితులైన సెమీకండక్టర్ ప్రొఫెషనల్స్ అవసరమని కరణ్ చెప్పారు. పరిశ్రమ అవసరాలకు తగ్గట్లుగా విద్యా సంస్థలు, ప్రభుత్వాలు కలిసి వేగంగా పని చేయాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతానికి గ్లోబల్ ప్రత్యామ్నాయాలు చౌకగా లభిస్తున్నప్పటికీ.. టెలికం, ఆటోమోటివ్, ఇతరత్రా పరిశ్రమలు ’భారత్ చిప్’నే కొనుగోలు చేయడానికి ముందునుంచే కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. చిప్ల ఉత్పత్తి ప్రస్థానంలో నాలుగో స్తంభంలాంటి చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ) విడిభాగాలు, స్పెషాలిటీ కెమికల్స్ సరఫరా వ్యవస్థ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తాయని కరణ్ వివరించారు.ఇదీ చదవండి: IRCTC వెబ్సైట్ కొత్త అవతారం.. అదిరిపోయే ఫీచర్లు -
మొబైల్ ఫోన్ల తయారీ.. కేంద్రం కొత్త స్కీమ్
భారతదేశాన్ని ప్రపంచ మొబైల్ ఫోన్ తయారీ రంగంలో మరింత బలమైన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో రూ.62,500 కోట్ల వ్యయంతో ‘మొబైల్ ఫోన్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ స్కీమ్’ (MPMS)కు ఆమోదం లభించింది. ఐదేళ్లపాటు అమలయ్యే ఈ పథకం ద్వారా దేశీయ తయారీ, ఎగుమతులు, ఉపాధి, పరిశోధన-అభివృద్ధి (R&D), స్వదేశీ మొబైల్ బ్రాండ్ల అభివృద్ధికి పెద్ద ఊతం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.2026-27 నుంచి అమలుఈ పథకం 2026-27 నుంచి 2030-31 వరకు అమలులో ఉంటుంది. భారత్లో మొబైల్ ఫోన్లు తయారు చేసే అర్హత కలిగిన కంపెనీలకు విక్రయాల ఆధారంగా ఆర్థిక ప్రోత్సాహకాలు అందించనున్నారు. కేవలం అసెంబ్లీ కేంద్రంగా కాకుండా, పూర్తి స్థాయి డిజైన్, తయారీ, సాంకేతికత అభివృద్ధి జరిగే దేశంగా భారత్ను తీర్చిదిద్దడమే దీని ప్రధాన ఉద్దేశం.కంపెనీలకు లభించే ప్రోత్సాహకాలుఎంపీఎంఎస్ కింద తయారీ సంస్థలకు పలు రకాల ప్రోత్సాహకాలు అందనున్నాయి.అర్హత కలిగిన మొబైల్ ఫోన్ విక్రయాలపై 2.25% నుంచి 5% వరకు ప్రోత్సాహకం.దేశీయంగా కీలక విడిభాగాలు, సబ్-అసెంబ్లీల కొనుగోలుకు 1.5% వరకు అదనపు ప్రోత్సాహకం.భారతీయ బ్రాండ్లు ఉత్పత్తుల రూపకల్పన, పరిశోధన-అభివృద్ధి (R&D)లో పెట్టుబడులు పెడితే అదనంగా 3% ప్రోత్సాహకం.దీంతో దేశీయ విలువ జోడింపు (Domestic Value Addition) పెరగడంతో పాటు, విదేశీ దిగుమతులపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.ఎందుకు కీలకం?గత కొన్నేళ్లలో భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీ దేశంగా ఎదిగినప్పటికీ, ఉత్పత్తిలో పెద్ద భాగం అసెంబ్లింగ్ కార్యకలాపాలకే పరిమితమైంది. ఇప్పుడు విడిభాగాలు, సబ్-అసెంబ్లింగ్లు, డిజైన్, పేటెంట్లు, స్వదేశీ సాంకేతికత అభివృద్ధిపై దృష్టి పెట్టడం ద్వారా వ్యాల్యూ చైన్లో భారత్ను మరింత ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించారు.భారీ ఉత్పత్తి.. వేలాది ఉద్యోగాలుఈ పథకం అమలుతో ఐదేళ్లలో సుమారు రూ.39 లక్షల కోట్ల విలువైన మొబైల్ ఫోన్ ఉత్పత్తి జరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అలాగే సుమారు 60 వేల ప్రత్యక్ష ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందని పేర్కొంది. ఎగుమతులు కూడా గణనీయంగా పెరిగి, ప్రపంచ ఎలక్ట్రానిక్స్ సరఫరా గొలుసులో భారత్ పాత్ర మరింత బలపడుతుందని భావిస్తోంది. -
త్వరలో ఓపెన్ఏఐ స్మార్ట్ స్పీకర్!
కృత్రిమ మేధ ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న ఓపెన్ ఏఐ ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగాన్ని దాటి కన్స్యూమర్ హార్డ్వేర్ మార్కెట్పై కన్నేసింది. ఇప్పటివరకు మన స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లలో అప్లికేషన్ రూపంలో డిజిటల్గా మాత్రమే పరిచయమున్న ‘చాట్జీపీటీ’ సాంకేతికత.. త్వరలోనే మన ఇళ్లలో ఒక భౌతిక రూపంలో దర్శనమివ్వబోతోంది. అంతర్జాతీయ టెక్ వర్గాల తాజా లీకుల ప్రకారం, ఓపెన్ ఏఐ తన మొదటి స్వతంత్ర హార్డ్వేర్ పరికరంగా ఒక సరికొత్త ‘స్మార్ట్ స్పీకర్’ను తెరపైకి తెచ్చింది.అయితే, ఇది మార్కెట్లో ప్రస్తుతం లభించే అమెజాన్ ఎకో లేదా యాపిల్ హోమ్పాడ్ వంటి సాధారణ స్పీకర్ కాదని కొందరు నిపుణులు చెబుతున్నారు. దీనికి ఎలాంటి స్క్రీన్ (డిస్ప్లే) ఉండదు. కానీ, ఇది స్వయంప్రతిపత్తితో పని చేస్తుంది. ప్రాణమున్న ఒక ఏఐ తోడులా మనతో సంభాషిస్తున్న అనుభూతిని కలిగిస్తుంది. ఇంట్లో ఒక మనిషి తరహా ఉనికిని చాటడమే దీని ప్రత్యేకత.సాంకేతిక నైపుణ్యం - ప్రత్యేకతలుఈ పరికరంలో అధునాతన ఇన్-బిల్ట్ కెమెరాలు, పర్యావరణ సెన్సార్లు ఉంటాయి. ఇవి చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని, వ్యక్తులను, వస్తువులను నిశితంగా గమనించగలవు. అంతేకాదు, వినియోగదారుడి దినచర్యలు, అలవాట్లను, చివరికి వారి ఈమెయిళ్లను సైతం విశ్లేషించి వారు అడగకముందే అవసరాలను ముందస్తుగా గుర్తించి సమాచారాన్ని అందిస్తుంది. ఓపెన్ ఏఐ ఇటీవల ప్రవేశపెట్టిన అత్యంత వేగవంతమైన ‘జీపీటీ-లైవ్’ వాయిస్ టెక్నాలజీ ఆధారంగా ఇది పనిచేస్తుంది. దీనివల్ల మనం మాట్లాడుతున్నప్పుడే అది వినగలదు. ఒకే సమయంలో సహజమైన మనుషులలాగా స్పందించగలదు. రీఛార్జబుల్ బ్యాటరీ సదుపాయం ఉండటం వల్ల వంటగది నుంచి బెడ్రూమ్ వరకు ఇంట్లో ఎక్కడికైనా సులభంగా తరలించుకోవచ్చు.యాపిల్తో వైరం.. మార్కెట్ సవాళ్లుయాపిల్ మాజీ డిజైన్ ఇంజినీర్ జోనీ ఐవ్ నేతృత్వంలోని బృందంతో కలిసి ఓపెన్ ఏఐ సుమారు ఐదు విభిన్న హార్డ్వేర్ ఉత్పత్తులపై పరిశోధనలు చేస్తోంది. అయితే ఈ ప్రతిష్టాత్మక హార్డ్వేర్ ప్రస్థానానికి ప్రారంభంలోనే చట్టపరమైన బ్రేక్ పడింది. ఓపెన్ ఏఐ తమ వాణిజ్య రహస్యాలను దొంగిలించిందంటూ యాపిల్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. ఈ న్యాయపరమైన వివాదం కారణంగా ఈ పరికరం మార్కెట్ ఎంట్రీ కొంత ఆలస్యం కావచ్చు. ఓపెన్ ఏఐ షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది (2026) ద్వితీయార్థంలో ఈ పరికరాన్ని అధికారికంగా ఆవిష్కరించి, 2027 ఫిబ్రవరి నాటికి వినియోగదారుల ముందుకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఇదీ చదవండి: మళ్లీ సీన్ రివర్స్.. ధరల దడ -
రూ.400లకే జియోహోమ్ టీవీ ప్యాక్!
డిజిటల్ వినోదాన్ని మరింత అందుబాటులోకి.. సరసమైన ధరలోకి తీసుకురావాలనే తన నిబద్ధతను కొనసాగిస్తూ, జియో 'జియోహోమ్ టీవీ ప్యాక్' ఆవిష్కరించింది. నెలకు కేవలం రూ.400 నుంచే ప్రారంభమయ్యే ఈ సమగ్ర హోమ్ ఎంటర్టైన్మెంట్ ప్యాక్లో 1,000కు పైగా లైవ్ టీవీ ఛానళ్లు, ప్రీమియం ఓటీటీ యాప్లు, హై-స్పీడ్ వై-ఫై సేవలు ఒకే ప్లాన్లో అందుబాటులో ఉంటాయి.ఇంటి వినోదాన్ని మరింత సులభతరం చేయడానికి రూపొందించిన జియోహోమ్ టీవీ ప్యాక్ ద్వారా, వినియోగదారులు నెలకు రూ.400 (అన్ని పన్నులతో కలిపి) చెల్లించి 1,000కు పైగా లైవ్ టీవీ ఛానళ్లను వీక్షించవచ్చు. కుటుంబ సభ్యులందరికీ సమగ్ర టెలివిజన్ వినోదాన్ని సరసమైన ధరలో అందించే పరిష్కారంగా ఈ ప్యాక్ నిలుస్తుంది.పరిమిత కాలం పాటు అందుబాటులో ఉండే వెల్కమ్ ఆఫర్లో భాగంగా, జియోహోమ్ టీవీ ప్యాక్కు సబ్స్క్రైబ్ అయ్యే వినియోగదారులు మొదటి నెలకు 30 Mbps వేగంతో అపరిమిత ఫ్రీ వై-ఫైతో పాటు 12 ప్రీమియం ఓటీటీ సబ్స్క్రిప్షన్లను ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా పొందవచ్చు.ఈ ప్యాక్ను రూ.2,400 (GSTతో కలిపి) విలువైన ఫస్ట్ రీఛార్జ్ (FRC) ద్వారా పొందవచ్చు. ఈ రీఛార్జ్ ఆరు నెలల సబ్స్క్రిప్షన్కు వర్తిస్తుంది. అంటే నెలకు కేవలం రూ.400 మాత్రమే ఖర్చవుతుంది. ఒకేసారి చెల్లించే ఈ మొత్తంతో ఎలాంటి దాచిన చార్జీలు లేకుండా పారదర్శకమైన ధరల ప్రయోజనం వినియోగదారులకు లభిస్తుంది.వినియోగదారులకు మరింత సౌలభ్యం కల్పించేందుకు.. జీరో జియోఇన్స్టాలేషన్ ఛార్జీ, సెక్యూరిటీ డిపాజిట్తో ఈ సేవను అందిస్తోంది. దీంతో ఎలాంటి ముందస్తు ఆర్థిక భారం లేకుండా ప్రీమియం హోమ్ ఎంటర్టైన్మెంట్ను ఆస్వాదించవచ్చు.జియోహోమ్ టీవీ ప్యాక్తో, లైవ్ టీవీ, హై-స్పీడ్ బ్రాడ్బ్యాండ్, ప్రీమియం ఓటీటీ కంటెంట్ను ఒకే సరసమైన ప్యాక్లో అందిస్తూ, కనెక్టెడ్ హోమ్ ఎంటర్టైన్మెంట్కు జియో కొత్త నిర్వచనం ఇస్తోంది. దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికీ సులభమైన, విలువ ఆధారిత డిజిటల్ సేవలను అందించాలనే జియో లక్ష్యానికి ఈ కొత్త ఆఫర్ మరో నిదర్శనం. -
ఏడాదికి 60వేల లిఫ్ట్లు: ఈ విషయాలు తెలుసా?
భారతదేశంలో నగరాలు రోజురోజుకూ విస్తరిస్తున్నాయి. ఎత్తైన అపార్ట్మెంట్లు, ఐటీ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలు వేగంగా నిర్మితమవుతున్నాయి. దీంతో లిఫ్ట్లు (ఎలివేటర్లు) మన రోజువారీ జీవితంలో అత్యంత కీలకమైన భాగంగా మారిపోయాయి. ఒకప్పుడు లిఫ్ట్లు కేవలం పెద్ద భవనాల్లో మాత్రమే కనిపించేవి. కానీ.. ఇప్పుడు చిన్న అపార్ట్మెంట్ల నుంచి భారీ టవర్ల వరకు దాదాపు ప్రతి భవనంలో లిఫ్ట్ తప్పనిసరిగా ఉంటుంది. రోజూ లక్షలాది మంది వీటిని ఉపయోగిస్తున్నారు. అయినప్పటికీ.. వీటి నిర్వహణ, భద్రత విషయంలో మాత్రమే చాలా చోట్ల నిర్లక్ష్యం కనిపిస్తోంది.ఏడాది 60 వేలకుపైగా కొత్త లిఫ్ట్లుప్రస్తుతం భారత్లో ప్రతి ఏడాది 60 వేలకుపైగా కొత్త లిఫ్ట్లు ఏర్పాటు అవుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. వర్టికల్ మొబిలిటీ రంగంలో.. భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ద మార్కెట్గా ఎదిగింది. అయినప్పటికీ.. లిఫ్ట్లు సురక్షితంగా పనిచేయాలంటే వాటికి క్రమం తప్పకుండా మెయింటెనెన్స్ అవసరమనే విషయాన్ని చాలామంది పెద్దగా పట్టించుకోరు.ఒక లిఫ్ట్ అంటే కేవలం పైకి, కిందికి వెళ్లే యంత్రం మాత్రమే కాదు. ప్రతిరోజూ వందలాది మంది ప్రాణాలను సురక్షితంగా ఒక అంతస్తు నుంచి మరో అంతస్తుకు చేర్చే బాధ్యత దానిపై ఉంటుంది. అందుకే.. దీని నిర్వహణను కూడా విమానం లేదా కారుకు ఇచ్చే ప్రాధాన్యతతో చూడాలి. విమానాలకు నిర్ణీత వ్యవధిలో తప్పనిసరిగా తనిఖీలు నిర్వహిస్తారు. ఏ చిన్న లోపం కనిపించినా వెంటనే సరిచేస్తారు. అదే విధంగా లిఫ్ట్లను కూడా క్రమం తప్పకుండా తనిఖీ చేసి, అవసరమైన విడిభాగాలను సమయానికి మార్చితే ప్రమాదాల అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి.AMC ముఖ్యంఈ విషయంలో వార్షిక నిర్వహణ ఒప్పందాలు (AMC- Annual Maintenance Contract) చాలా ఉపయోగపడతాయి. ఏఎంసీ ఉంటే లిఫ్ట్ను తనిఖీ చేయడం, అరిగిపోయిన భాగాలను మార్చడం, సాంకేతిక లోపాలను ముందుగానే గుర్తించడం అన్నమాట. దీంతో లిఫ్ట్ ఎప్పుడూ సురక్షితంగా, సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉంటుంది.చిన్న సమస్య - పెద్ద ప్రమాదాలునిపుణుల అభిప్రాయం ప్రకారం.. లిఫ్ట్ ప్రమాదాల్లో చాలా వరకు సరైన నిర్వహణ లేకపోవడం లేదా సర్వీసింగ్ ఆలస్యం కావడమే ప్రధాన కారణం. అందుకే లిఫ్ట్ పనిచేస్తోంది కదా అని నిర్లక్ష్యం చేయకుండా, దాని నిర్వహణపై కూడా సమానంగా దృష్టి పెట్టాలి. అయితే.. భద్రత అనేది కేవలం లిఫ్ట్ తయారీ సంస్థ లేదా నిర్వహణ సంస్థ బాధ్యత మాత్రమే కాదు. భవన యజమానులు, అపార్ట్మెంట్ అసోసియేషన్లు, ఫెసిలిటీ మేనేజర్లు, నివాసితులు కూడా తమ వంతు బాధ్యత తీసుకోవాలి. లిఫ్ట్లో ఏదైనా కొత్త శబ్దాలు వినిపించడం, తలుపులు సరిగా ఓపెన్ కాకపోవడం, అంతస్తు వద్ద సరిగ్గా ఆగకపోవడం వంటి చిన్న సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా.. వెంటనే సాంకేతిక నిపుణులకు తెలియజేయాలి. చిన్న సమస్యలను సమయానికి పరిష్కరిస్తే పెద్ద ప్రమాదాలను నివారించవచ్చు.ఇక ప్రభుత్వం తీసుకొచ్చిన IS 17900 (Part 1 & Part 2) వంటి కొత్త భద్రతా ప్రమాణాలు కూడా ఈ రంగానికి మరింత బలం చేకూరుస్తాయి. దేశవ్యాప్తంగా ఈ నిబంధనలు సమర్థంగా అమలైతే లిఫ్ట్ల నాణ్యత, భద్రత మరింత మెరుగుపడే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలను తప్పకుండా పాటించాలి. ప్రమాదాలను నివారించాలి.సెబీ జోసెఫ్ - OTIS ఇండియా ప్రెసిడెంట్ -
గగన్యాన్ దిశగా భారత్ ముందడుగు
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గగన్యాన్’ మానవసహిత అంతరిక్ష యాత్ర సాధన దిశగా మరో కీలకమైన మైలురాయిని అధిగమించింది. వ్యోమగాముల భద్రతకు ప్రధానంగా ఉన్న ‘క్రూ మాడ్యూల్’ వ్యవస్థలకు సంబంధించిన మూడు క్వాలిఫికేషన్ పరీక్షలను శాస్త్రవేత్తలు విజయవంతంగా పూర్తి చేశారు. అంతరిక్ష ప్రయాణం ముగించుకుని భూమికి తిరిగి వచ్చే క్రమంలోనూ, సముద్రంలో ల్యాండ్ అయిన తర్వాత వ్యోమగాముల ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా రక్షించే సాంకేతికతలను ఈ పరీక్షల ద్వారా ఇస్రో విజయవంతంగా పరీక్షించింది.మొదటిది..ఈ ప్రక్రియలో మొదటిది ‘క్రూ మాడ్యూల్ అప్రైటింగ్ సిస్టమ్’. గగన్యాన్ యాత్ర ముగిసిన తర్వాత వ్యోమగాములు ప్రయాణించే క్రూ మాడ్యూల్ సురక్షితంగా భారత సముద్ర జలాల్లో ల్యాండ్ అవుతుంది. అలా పడినప్పుడు సముద్రపు అలల ఉధృతికి మాడ్యూల్ తలకిందులుగా తిరగబడే ప్రమాదం ఉంది. దీనిని నివారించడానికి ఇస్రో ప్రత్యేకంగా కోల్డ్-గ్యాస్ ఆధారిత అప్రైటింగ్ వ్యవస్థను రూపొందించింది. సముద్రంలో పడిన వెంటనే ఈ వ్యవస్థ యాక్టివేట్ అయి క్రూ మాడ్యూల్ నిటారుగా ఉండేలా చేస్తుంది. తాజాగా నిర్వహించిన పరీక్షలో ఫ్లోటేషన్ బ్యాగులను విజయవంతంగా ఉబ్బించి, వివిధ రకాల పీడన పరిస్థితుల్లో ఈ వ్యవస్థ కచ్చితత్వంతో పనిచేస్తుందని నిరూపించారు.రెండవది..రెండవది ‘అంబిలికల్ సెపరేషన్ టెస్ట్’. వ్యోమగాములు ఉండే క్రూ మాడ్యూల్కు అవసరమైన ఇంధనం, విద్యుత్ శక్తి, రక్షణ వ్యవస్థలకు అనుసంధానంగా ఒక ప్రత్యేక వ్యవస్థ పనిచేస్తుంది. భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించే సమయంలో ఈ రెండు మాడ్యూళ్లు విడిపోవాల్సి ఉంటుంది. ఒక కృత్రిమ క్రూ మాడ్యూల్ను ఉపయోగించి ఈ వేరుపడే ప్రక్రియను విజయవంతంగా పరీక్షించారు. ఎలాంటి ఆటంకం లేకుండా అత్యంత క్లీన్గా ఈ సెపరేషన్ జరిగిందని ఇస్రో తెలిపింది.మూడవది, ‘అపెక్స్ కవర్ సెపరేషన్ లోడ్స్’. క్రూ మాడ్యూల్ భూ వాతావరణంలోకి తిరిగి వచ్చేటప్పుడు ఉత్పన్నమయ్యే తీవ్రమైన వేడి, ఘర్షణ నుంచి లోపల ఉండే పారాచూట్లను రక్షించడానికి పైభాగంలో ‘అపెక్స్ కవర్’ రక్షణగా ఉంటుంది. పారాచూట్లు తెరుచుకోవడానికి ముందే ఈ అపెక్స్ కవర్ సురక్షితంగా విడిపోవాలి. ఈ కవర్ విడిపోయే సమయంలో క్రూ మాడ్యూల్ నిర్మాణంపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. అసలు మిషన్లో ఎదురయ్యే గరిష్ట ఒత్తిడి కంటే సుమారు 1.75 రెట్లు ఎక్కువ లోడ్ను కృత్రిమంగా ప్రయోగించి పరీక్షించారు. ఈ భీకర ఒత్తిడిలోనూ క్రూ మాడ్యూల్ ఆకృతి ఎక్కడా దెబ్బతినకుండా స్థిరంగా ఉందని స్పష్టమైంది.అంతరిక్ష ప్రయోగాల్లో రాకెట్లను నింగిలోకి పంపడం ఒకెత్తయితే.. మానవసహిత మిషన్లలో వ్యోమగాములను సురక్షితంగా తిరిగి భూమికి తీసుకురావడం మరో ఎత్తు. ఇస్రో తాజాగా పూర్తి చేసిన ఈ మూడు క్వాలిఫికేషన్ పరీక్షలు కేవలం సాంకేతిక విజయాలు మాత్రమే కాదు.. వ్యోమగాముల ప్రాణాలకు ఇస్రో ఇస్తున్న అత్యున్నత రక్షణ గ్యారంటీకి నిదర్శనాలు. త్వరలోనే ప్రయోగించనున్న మానవరహిత మొదటి గగన్యాన్ (జీ1) మిషన్కు ఈ విజయాలు తిరుగులేని విశ్వాసాన్ని ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: కొనుగోలుదారులకు ఊరట.. దిగొచ్చిన బంగారం.. -
అయోధ్య రామాలయంలో టెక్ అప్డేట్
అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ఆలయంలో విరాళాల లెక్కింపు, కానుకల నిర్వహణలో మరింత పారదర్శకతను పెంచేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. విరాళాల చోరీలను, వాటి దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సిఫార్సు చేయనుంది. ఈ మేరకు జులై 15న యూపీ ప్రభుత్వానికి సమర్పించనున్న తన తుది నివేదికలో ఈ అంశాన్ని ప్రధానంగా చేర్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.ప్రాథమిక నివేదికలో షాకింగ్ నిజాలురామమందిరంలో కానుకలు, నగదు మాయమవుతున్నాయనే ఫిర్యాదులపై స్పందించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జూన్ 13న లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలో ఉన్నత స్థాయి సిట్ను ఏర్పాటు చేసింది. జూన్ 15 నుంచి రంగంలోకి దిగిన ఈ కమిటీ ఆలయ భద్రత, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించింది. కాగా, జూన్ 23న సిట్ సమర్పించిన ప్రాథమిక నివేదికలో సంచలన నిజాలు బయటపడ్డాయి. కేవలం 40 రోజుల వ్యవధిలోనే ఆలయ ప్రాంగణంలో ఏకంగా 70 సార్లు కానుకల చోరీ జరిగినట్లు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు బృందం నిర్ధారించింది.ప్రతీ రూపాయిపై ఏఐ కన్ను!ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వాడుకోవాలని సిట్ భావిస్తోంది. దీనికోసం సిఫార్సు చేయనున్న ఏఐ ఆధారిత నిఘా వ్యవస్థ ప్రధానంగా కొన్ని అంశాలపై పనిచేయనుంది.హుండీ నిర్వహణ - పారదర్శకత: భక్తులు సమర్పించే నగదు, విలువైన వస్తువుల సేకరణ నుంచి భద్రపరిచే వరకు ప్రతి దశను ఏఐ కెమెరాలు నిశితంగా పరిశీలిస్తాయి.కౌంటింగ్ ప్రక్రియపై ప్రత్యేక నిఘా: విరాళాల లెక్కింపు సమయంలో జరిగే అనుమానాస్పద కదలికలను, చేతివాటాన్ని ఈ వ్యవస్థ తక్షణమే పసిగట్టి అధికారులను అలర్ట్ చేస్తుంది.అనుమానితుల గుర్తింపు: ఆలయ పరిసరాల్లో పదే పదే తిరిగే వ్యక్తులు లేదా అనుమానాస్పద ప్రవర్తన కలిగిన వారిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముందే గుర్తించి భద్రతా సిబ్బందికి సమాచారం అందిస్తుంది.త్వరలోనే సిట్ తుది పరిశీలనతుది నివేదిక సమర్పణకు ముందు సిట్ సభ్యులు మరోసారి అయోధ్యను సందర్శించనున్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులతో పాటు ఆలయ విరాళాల నిర్వహణ సిబ్బందిని అదనపు రికార్డుల ఆధారంగా ప్రశ్నించనున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రస్ట్ సైతం తమ అంతర్గత విరాళాల సేకరణ, లెక్కింపు విధానాలను పునసమీక్షించే పనిలో పడింది. ప్రపంచవ్యాప్త భక్తుల సెంటిమెంట్తో ముడిపడి ఉన్న అయోధ్య రామాలయంలో ప్రతీ రూపాయి భద్రంగా ఉండేలా చూసేందుకు అక్కడి ప్రభుత్వం ఈ మెగా టెక్ అప్డేట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.ఇదీ చదవండి: కొనుగోలుదారులకు ఊరట.. దిగొచ్చిన బంగారం.. -
ఏఐ ఎందుకో వెనుకబడింది?
ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అన్ని రంగాలను శాసిస్తోంది. అయితే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే ఇంధన (ఎనర్జీ) రంగం మాత్రం ఈ సాంకేతిక విప్లవాన్ని అందుకోవడంలో వెనుకబడి ఉందని కొందరు నిపుణులు చెబుతున్నారు. గ్లోబల్ టెక్నాలజీ నివేదికల ప్రకారం, సాంకేతిక పెట్టుబడులపై ఇతర రంగాలు సాధిస్తున్న 200 శాతం రాబడిని (ఆర్ఓఐ) ఇంధన రంగం అందుకోలేకపోతోంది. మెజారిటీ కంపెనీలు కేవలం పెట్టిన ఖర్చును మాత్రమే వెనక్కి రాబట్టగలుగుతున్నాయి.ప్రయోగాల దశలోనే..ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక చమురు శుద్ధి కర్మాగారాలు, పంపిణీ గ్రిడ్లు దశాబ్దాల క్రితం నాటి పాత నియంత్రణ వ్యవస్థలపై నడుస్తుండడమే ఇందుకు కారణమని నివేదికలు చెబుతున్నాయి. ఇవి ఆధునిక క్లౌడ్ ప్లాట్ఫారమ్లతో లేదా మెషిన్ లెర్నింగ్ మోడళ్లతో డేటాను పంచుకోవడానికి ఏమాత్రం సరిపోవు. వీటిని మార్చడం అత్యంత ఖరీదైన వ్యవహారం. దాంతో సంస్థలు ఇంధన వ్యవస్థలో ఏఐ ఆధునీకరణను వాయిదా వేస్తున్నాయి. ఫలితంగా, దాదాపు ప్రతి పెద్ద సంస్థ ఏఐ పైలట్ ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నప్పటికీ అవి కేవలం ప్రయోగాల దశలోనే నిలిచిపోతున్నాయి కానీ క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి విస్తరణకు నోచుకోవడం లేదు.ఏఐ కొన్ని విభాగాలకే పరిమితంభారతదేశం విషయానికి వస్తే ఎన్టీపీసీ, ఓఎన్జీసీ వంటి దిగ్గజాలు డిజిటల్ వైపు అడుగులు వేస్తున్నా క్షేత్రస్థాయిలో విద్యుత్ను సరఫరా చేసే రాష్ట్ర పంపిణీ సంస్థలు (డిస్కమ్లు) ఇప్పటికీ తప్పుడు మీటర్ డేటా, బిల్లింగ్ లోపాలు, గ్రిడ్ నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఉత్పత్తి అయిన విద్యుత్తులో 25 శాతానికి పైగా వృథా అవుతోంది. ఇలాంటి ప్రాథమిక సమస్యలు ఉన్నప్పుడు అధునాతన ఏజెంటిక్ ఏఐ గురించి ఆలోచించడం అప్రస్తుతం అవుతుందనే భావనలున్నాయి. ప్రస్తుతం లభిస్తున్న ఆర్థిక ప్రయోజనాలు కూడా కేవలం బ్యాక్ ఆఫీస్, ఫైనాన్స్, హెచ్ఆర్ వంటి పరిపాలనా విభాగాలకే పరిమితమయ్యాయి.అయితే, భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఇంధన రంగానికి ఏఐ అనివార్యం. ముఖ్యంగా, 2030 నాటికి 500 గిగావాట్ల శిలాజేతర ఇంధన సామర్థ్యాన్ని సాధించాలనే భారతదేశ లక్ష్యానికి గ్రిడ్ నిర్వహణ చాలా కీలకం. సౌర, పవన విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధనాల సరఫరా వాతావరణంపై ఆధారపడి మారుతుంటుంది. నిరంతరం మారే డిమాండ్కు అనుగుణంగా గ్రిడ్ను సమతుల్యం చేయడం హ్యుమన్ ఆపరేటర్ల వల్ల సాధ్యం కాదు. ఇక్కడే ఏఐ ఆధారిత గ్రిడ్ మేనేజ్మెంట్ అవసరమవుతుంది.సైబర్ భద్రత మాటేంటి..సైబర్ భద్రత ఇక్కడ మరో పెద్ద సవాలు. ఇంధన రంగంలో భద్రతా లోపాలు ఏర్పడితే దేశవ్యాప్త బ్లాక్అవుట్లు వచ్చే ప్రమాదం ఉంది. దీనితో పాటు, అటు ఇంధన వ్యవస్థల మౌలిక సదుపాయాలు, ఇటు ఏఐ ఆర్కిటెక్చర్ను రెండింటినీ సమగ్రంగా అర్థం చేసుకోగల నిపుణుల కొరత భారతదేశంలో స్పష్టంగా కనిపిస్తోంది.ఇంధన రంగం నిజంగా ఏఐకి సిద్ధంగా మారాలంటే కేవలం కొత్త సాఫ్ట్వేర్లను కొనుగోలు చేస్తే సరిపోదని కొందరు చెబుతున్నారు. పాత మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం, నమ్మదగిన డేటా వ్యవస్థలను నిర్మించడం, సాంకేతికతను, మౌలిక సదుపాయాలను అనుసంధానించే సమర్థవంతమైన మానవ వనరులను తయారు చేయడం చాలా అవసరం. అప్పుడే ఇంధన భద్రత, స్థిరమైన ప్రగతి సాధ్యమవుతాయి.ఇదీ చదవండి: బంగారం కొనాలా? వద్దా? -
అంతరిక్షంలో డేటా స్థావరాలు..
మీరు వాట్సాప్ సందేశం పంపిన ప్రతిసారీ, నెట్ఫ్లిక్స్ షో చూసిన ప్రతిసారీ, లేదా గూగుల్లో ఏదైనా వెతికిన ప్రతిసారీ.. మీరు ప్రపంచంలో ఎక్కడో ఉన్న ఒక డేటా సెంటర్కు కనెక్ట్ అవుతున్నారని అర్థం. ఆధునికమైన భారీ ఇంటర్నెట్ గిడ్డంగులలో అమర్చిన వేలాది శక్తిమంతమైన సర్వర్లు పని చేసే స్థలాలే డేటా సెంటర్లు. ఇప్పుడిక అంతరిక్షంలో కూడా వీటి స్థావరాలను నెలకొల్పటం కోసం ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి!కృత్రిమ మేధ (ఏఐ) వాడకం విపరీతంగా పెరగడంతో, దానికి తగ్గ కంప్యూటింగ్ పవర్ కోసం ‘స్పేస్ఎక్స్’ వంటి దిగ్గజ సంస్థలు ఇప్పుడు అంతరిక్షం వైపు చూస్తున్నాయి. భూమి మీదున్న పర్యావరణ, మౌలిక సదుపాయాల సవాళ్లను అధిగమించడానికి ‘ఆర్బిటల్ డేటా సెంటర్లు’ ఒక విప్లవాత్మక ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. అయితే, అంతరిక్షంలోని కఠిన వాతావరణం, కూలింగ్ సమస్యలు, అధిక ఖర్చుల దృష్ట్యా.. ఈ అత్యాధునిక సాంకేతికత ఎంతవరకు సాధ్యపడుతుందనేది పెద్ద ప్రశ్న.నింగి వైపు కంపెనీల చూపుఅంతరిక్షంలో డేటా సెంటర్లు పెట్టేందుకు టెక్నాలజీ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. భూమి మీద పడే పర్యావరణ భారాల్ని తగ్గించుకుంటూ, అంతరిక్షంలో సమృద్ధిగా దొరికే సౌరశక్తిని వాడుకోవడం ఈ డేటా సెంటర్ల ఏర్పాటు ఆలోచనలోని ముఖ్య ఉద్దేశం. కానీ, అంతరిక్షంలో కంపెనీని నడపటం చాలా ఖర్చుతో కూడుకున్న పని. పైగా అక్కడి వాతావరణం కూడా అనుకూలంగా ఉండదు. యంత్రాలను చల్లబరచడం, మరమ్మతులను చూసుకోవడం, రేడియేషన్ ప్రభావం, అక్కడ తిరిగే అంతరిక్ష వ్యర్థాల వంటి సవాళ్లు కూడా ఉంటాయి.మస్క్ జోరు.. ఇన్వెస్టర్ల హోరు!అపర కుబేరుడు ఎలాన్ మస్క్ సంస్థ ‘స్పేస్ఎక్స్’ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్) ఎప్పుడు వస్తుందా అని అంతా ఎదురు చూస్తున్నారంటే, అంతరిక్షంలో డేటా సెంటర్ ఏర్పాటుకు స్పేస్ఎక్స్ ప్రయత్నాలు మొదలు పెట్టటమే కారణం. ఇన్వెస్టర్లు ఇప్పుడు కేవలం రాకెట్ల మీద మాత్రమే డబ్బులు కుమ్మరించటం లేదు, మొత్తం అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ మీదే ఆశలు పెట్టుకున్నారు. వినడానికే ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా కథలా ఉండే ‘ఆర్బిటల్ డేటా సెంటర్ల’ను నిర్మించేందుకు కుతూహలపడుతున్న కంపెనీల్లో స్పేస్ఎక్స్ చాలా పాపులర్ కావచ్చు కానీ, ఈ పోటీలో ఉన్నది అదొక్కటే కాదు.అదిరే ఐడియా.. బెదిరే భారండేటా సెంటర్లను అంతరిక్షంలో ఏర్పాటు చేస్తే అక్కడ పుష్కలంగా సౌరశక్తి లభ్యం అవుతుంది. భూమి మీదలా స్థలం, నీళ్లు, కరెంట్ గ్రిడ్ల అవసరం ఉండదు. ప్రపంచమంతటా ఏఐ వాడకం విపరీతంగా పెరిగిపోతుండటంతో భూమి మీద పడుతున్న పర్యావరణ భారాన్ని, మౌలిక సదుపాయాల ఇబ్బందుల్ని తప్పించుకోవడానికి ఈ ‘అంతరిక్ష డేటా సెంటర్లు’ ఒక మంచి ఆలోచన అని కంపెనీలు నమ్ముతున్నాయి. పైగా, ఈ డేటా సెంటర్ల వల్ల తమ ప్రాంతంలో సమస్యలు వస్తున్నాయని చాలా చోట్ల స్థానికులు చేస్తున్న ఆందోళనల తలనొప్పి కూడా తప్పుతుంది.అయితే, ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడానికి, ఒక పరిశ్రమ స్థాయిలో కంప్యూటింగ్ నెట్వర్క్ను అక్కడ నడపడానికి మధ్య చాలా తేడా ఉంది. అంతరిక్షంలో ఉండే రేడియేషన్ వల్ల ఎలక్టాన్రిక్ ఉపకరణాలు పాడైపోతాయి. కంప్యూటర్ల వల్ల విపరీతమైన వేడి జనిస్తుంది. అంతరిక్షంలో ఆ వేడిని చల్లబరచడం తేలిక కాదు. చిన్న మరమ్మతుకు కూడా భారీగా ఖర్చవుతుంది. ఇవన్నీ అటుంచి, కింది నుంచి పైకి పంపే ప్రతి కిలో బరువుకీ సుమారు 6 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది.కరెంటుకు, నీళ్లకు ఖర్చు తక్కువభూమి మీద లాగే అంతరిక్షంలో కూడా డేటా సెంటర్లకు భారీ స్థాయిలో విద్యుత్తు అవసరం. అయితే అక్కడ ఈ విద్యుత్ అంతా సౌరశక్తి (సోలార్ ప్యానెల్స్) ద్వారానే లభిస్తుంది. అంతరిక్షంలో సూర్యుడు ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాడు, మేఘాలు కూడా అడ్డుపడవు. కాకపోతే, మనం ఆ సోలార్ ప్యానెల్స్ను ఏ కక్ష్యలో పెట్టామనే దాన్ని బట్టి అవి తిరిగేటప్పుడు భూమి అడ్డువచ్చి కొంతసేపు నీడ పడే అవకాశం ఉంటుంది.‘ఏఐ1 కంప్యూట్ శాటిలైట్’ డిజైన్డేటా సెంటర్ల ఏర్పాటుకు అంతరిక్షంలో ఉండే ఇంకో ప్రతికూలాంశం ఏంటంటే... కూలింగ్. అంతరిక్షం వెనుక (నక్షత్రాలు, గ్రహాలు లేని శూన్యమైన ఖాళీ అంతరిక్షపు ఉపరితలం) ఉండే వాతావరణం చాలా చల్లగా (దాదాపు మైనస్ 270 డిగ్రీల సెల్సియస్) ఉంటుంది. డేటా సెంటర్ నుండి వచ్చే వేడిని రేడియేటర్ల ద్వారా ఆ ఖాళీలోకి వదిలేయొచ్చు. భూమి మీద ఎక్కువ నీళ్లు వాడుకునే కూలింగ్ సిస్టమ్స్ అవసరం అంతరిక్షంలో ఉండదు. కానీ, ఆ వేడిని బయటకు పంపే థర్మల్ రేడియేటర్ల కోసం చాలా విస్తారంగా స్థలం మాత్రం కావాల్సి ఉంటుంది.అంతరిక్షంలో వేడెక్కిన మిషన్ల మీదకు గాలి పంపి చల్లబరచడానికి అక్కడ గాలే ఉండదు. వేడి అంతా ‘ఇన్ఫ్రారెడ్ రేడియేషన్’ (ఉష్ణ కిరణాలు) రూపంలోనే చాలా నిదానంగా బయటకు వెళ్లాలి. దీనివల్ల 10 మెగావాట్ల వేడిని బయటకు పంపించాలన్నా సరే, దాదాపు రెండు ఫుట్బాల్ గ్రౌండ్లంత పెద్ద రేడియేటర్ స్థలం కావాల్సి వస్తుంది. ఇప్పటికే అంతరిక్షం రద్దీగా మారిపోయింది. ఇప్పుడు వేల సంఖ్యలో ఇలాంటి పెద్ద పెద్ద డేటా సెంటర్లను స్పేస్లోకి పంపితే ఈ సమస్య ఇంకా ఎక్కువవుతుంది. అక్కడ తిరిగే అంతరిక్ష వ్యర్థాలు, చిన్న చిన్న ఉల్కలు గనక ఈ డేటా సెంటర్ను బలంగా ఢీకొడితే... అది ముక్కలైపోవడమే కాకుండా, అంతరిక్షంలో ఇంకాస్త ఎక్కువ చెత్త తయారవుతుంది.స్పేస్ఎక్స్ డిజైన్ సిద్ధమైంది!ఎన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, కంపెనీలు మాత్రం అంతరిక్ష డేటా సెంటర్ల డిజైన్లతో ముందుకు దూసుకెళ్తున్నాయి. స్పేస్ఎక్స్ ఈ మధ్యే తన ‘ఏఐ1 కంప్యూట్ శాటిలైట్’ డిజైన్ను ప్రకటించింది. దీన్ని ఒక ‘ఆర్బిటల్ డేటా సెంటర్ స్పేస్క్రాఫ్ట్’లా వాడాలని దాని ఆలోచన. కాకపోతే, ప్రస్తుతం భూమి మీదున్న డేటా సెంటర్లతో పోలిస్తే దీని సామర్థ్యం 100 నుండి 1,000 రెట్లు తక్కువ.అన్ని రకాల కంప్యూటర్ పనులని స్పేస్లో చేయడం కుదరదు. ఆర్థిక లావాదేవీలు (ఆన్లైన్ పేమెంట్లు), లైవ్ ఏఐ సర్వీసులు, క్లౌడ్ అప్లికేషన్లలో చిన్న ఆలస్యం ఉన్నా వ్యవస్థ అసలే నడవదు. కాబట్టి, ప్రారంభంలో కాస్త ఆలస్యమైనా పర్వాలేదు అనుకునే పనులకి ఈ ఆర్బిటల్ డేటా సెంటర్లు బాగా సెట్ అవుతాయి. ఉదాహరణకు... శాటిలైట్ల నుండి వచ్చే సమాచారాన్ని ప్రాసెస్ చేయడం, రక్షణ రంగం లేదా నిఘా విభాగాల డేటా ప్రాసెసింగ్, స్పేస్ మిషన్ల శాస్త్ర పరిశోధన లాంటి వాటికి ఇవి ఉపయోగపడతాయి.ముఖ్యంగా ఈ మూడూ ఉండాలిక్లౌడ్ కంప్యూటింగ్, వీడియో స్ట్రీమింగ్, ఆన్లైన్ బ్యాంకింగ్, శాస్త్ర సాంకేతిక పరిశోధనలు.. వీటన్నిటినీ ప్రస్తుతం నడిపిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కు శక్తిని ఇచ్చేది ఈ డేటా సెంటర్లే. అంటే, డేటా సెంటర్ అనేది కేవలం సర్వర్లతో నిండిన ఒక రూమ్ మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువే!మొదటిది విద్యుత్: ఒక డేటా సెంటర్ ఎలాంటి అవాంతరాలూ లేకుండా నడవాలంటే సర్వర్లు, నెట్వర్క్ పరికరాలు, స్టోరేజ్ సదుపాయాలు కావాలి. ఇవన్నీ నడవడానికి పెద్ద మొత్తంలో విద్యుత్ అవసరం. ఏఐ రాకతో విద్యుత్ వాడకం మరింతగా పెరిగిపోయింది.రెండవది కూలింగ్ (చల్లబరచడం): సర్వర్లు వాడుకునే కరెంట్ అంతా చివరకు వేడి రూపంలోనే బయటకు వస్తుంది. ఆ వేడిని గనక వెంటనే బయటకు పంపకపోతే పరికరాలు పాడైపోతాయి. అందుకే ఎయిర్ కండిషనర్లు, చిల్లర్లు, కూలింగ్ టవర్లు ఉంటాయి. చాలా డేటా సెంటర్లలో కంప్యూటర్ల తర్వాత అత్యధిక కరెంట్ ఖర్చయ్యేది ఈ కూలింగ్ కోసమే.మూడవది ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్: కావలసినంత స్థలం, బిల్డింగులు, బ్యాకప్ పవర్ (జెనరేటర్లు), వాటర్ సిస్టమ్లు, కమ్యూనికేషన్ నెట్వర్క్లు, రిపేర్లు చేయడానికి మనుషులు వెళ్లగలిగే సదుపాయం ఉండాలి.కొన్ని సమస్యలూ ఉన్నాయిడేటా సెంటర్ సామగ్రినంతా అంతరిక్షంలోకి చేర్చడానికి వరుసగా రాకెట్లను లాంచ్ చేయాల్సి ఉంటుంది, ఇది కింద ఉన్న జనాలకి నచ్చకపోవచ్చు. ఇప్పటికీ టెక్సస్లోని బోకా చికాలో ఉన్న స్పేస్ఎక్స్ లాంచ్ సెంటర్ దగ్గర స్థానిక యాక్టివిస్టులు నిరసన ప్రదర్శనలు జరుపుతున్నారు. ఈ రాకెట్ టెస్టుల వల్ల చుట్టుపక్కల పర్యావరణం పాడైపోతుందని వాళ్ల వాదన. ఇక అన్నిటికంటే ముఖ్యంగా... డేటా మొత్తాన్ని భూమికి, అంతరిక్షంలో ఉన్న డేటా సెంటర్లకి మధ్య రేడియో వేవ్స్ లేదా లేజర్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. డేటా సైజ్ ఊహించనంతగా పెరిగిపోతుంది.ఈ డేటా సెంటర్లను, వాటి సోలార్ ప్యానెళ్లను, రేడియేటర్లను ఒకేసారి స్పేస్లోకి పంపడం కుదరదు. వీటిని విడివిడిగా పంపి, అంతరిక్షంలోనే అసెంబుల్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం స్పేస్లోనే రిపేర్లు, అసెంబ్లింగ్ చేయగల కొత్త రకం టెక్నాలజీ కావాలి.మరొక ముఖ్యమైన సమస్య.. హార్డ్వేర్ మార్చడం. భూమి మీద అయితే పాతబడిపోయిన సర్వర్లను ప్రతి మూడు నుండి ఐదేళ్లకు ఒకసారి అప్గ్రేడ్ లేదా రీప్లేస్ చేస్తుంటారు. కానీ అంతరిక్షంలో ఈ మార్చడాలు, రిపేర్లు చేయడం చాలా కష్టం. ఒకసారి భూ కక్ష్యలోకి పంపిన హార్డ్వేర్ను అప్గ్రేడ్ చేయడం అంటే అపరిమితమైన ఖర్చుతో కూడుకున్న పని. ఒకవేళ ఆ కంప్యూటర్ సిస్టమ్ను అప్డేట్ చేయలేకపోతే, అది గడువు తీరటానికి ముందే పనికిరాకుండా పోతుంది. టెక్నాలజీ ఇంత స్పీడ్గా మారిపోతున్న ఈ రోజుల్లో... ఇది చాలా పెద్ద ఆర్థికపరమైన భారం.దీనికి తోడు అంతరిక్షంలో ఉండే కఠినమైన వాతావరణం ఇంకో పెద్ద తలనొప్పి. అవి తిరిగే కక్ష్యను బట్టి... రోజులో చాలాసార్లు ఎండ తగిలినప్పుడు విపరీతమైన వేడి, భూమి నీడలోకి వెళ్లినప్పుడు విపరీతమైన చలిని తట్టుకోవాల్సి ఉంటుంది.- సాక్షి స్పెషల్ డెస్క్ -
శామ్సంగ్ కొత్త ఫోన్ వివరాలు లీక్?
గ్లోబల్ స్మార్ట్ఫోన్ మార్కెట్లో ఫోల్డబుల్ (మడిచే స్క్రీన్) ఫోన్ల విభాగంలో ఆధిపత్యం కోసం అగ్రగామి సంస్థల మధ్య పోటీ ఊపందుకుంది. కొరియన్ టెక్ దిగ్గజం శామ్సంగ్ తన తదుపరి తరం ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ సిరీస్ను అధికారికంగా మార్కెట్లోకి తీసుకురావడానికి ముందే టెక్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ నెల చివర్లో జరగబోయే ప్రతిష్టాత్మక ‘గెలాక్సీ అన్ప్యాక్డ్’ ఈవెంట్లో లాంచ్ కానున్న శామ్సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 మోడల్.. దక్షిణ కొరియాలోని ఒక అధికారిక రిటైల్ స్టోర్లో ప్రత్యక్షమవ్వడం చర్చనీయాంశమైంది.లీకైన డమ్మీ యూనిట్లు.. ఈసారి మూడు మోడళ్లు?ప్రముఖ గ్లోబల్ టిప్స్టర్ ‘ఐస్ యూనివర్స్’ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పంచుకున్న సమాచారం ప్రకారం.. దక్షిణ కొరియాలోని ఒక శామ్సంగ్ స్టోర్లో గెలాక్సీ Z ఫోల్డ్ 8 డమ్మీ మోడళ్లను ప్రదర్శనకు ఉంచినట్లు వెల్లడైంది. లీకైన చిత్రాలను బట్టి చూస్తే ఈ సరికొత్త ఫోన్ వైట్ కలర్ ఫినిషింగ్, వెనుక భాగంలో డ్యూయల్ రేర్ కెమెరా సెటప్తో సరికొత్త డిజైన్లో కనిపిస్తోంది.సాధారణంగా ఏటా శామ్సంగ్ రెండు ఫోల్డబుల్ ఫోన్లను మాత్రమే పరిచయం చేస్తుంది. కానీ ఈ ఏడాది సరికొత్త వ్యూహంతో ఏకంగా మూడు ఫోల్డబుల్ మోడళ్లను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.శామ్సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8శామ్సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 8శామ్సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 వైడ్జులై 22న అధికారిక లాంచ్శామ్సంగ్ తన అధికారిక గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ను జులై 22, 2026న నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసింది. ఈ వేదికపైనే సరికొత్త Z ఫోల్డ్ 8 సిరీస్తో పాటు మరికొన్ని అత్యాధునిక గ్యాడ్జెట్లను కంపెనీ అధికారికంగా ఆవిష్కరించనుంది. మునుపటి మోడళ్లతో పోలిస్తే ఈసారి సాఫ్ట్వేర్ పర్ఫార్మెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Galaxy AI) ఫీచర్లు, ఫోల్డింగ్ క్రీజ్ కనిపించకుండా మరింత ద్రుఢమైన డిస్ప్లే టెక్నాలజీని వాడినట్లు తెలుస్తోంది.యాపిల్ ఐఫోన్ ఆల్ట్రా ఫోల్డ్తో పోటీ?శామ్సంగ్ ఇన్నాళ్లూ ఫోల్డబుల్ మార్కెట్లో కీలకంగా ఉన్నప్పటికీ, ఈసారి యాపిల్ నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. యాపిల్ సంస్థ సైతం తమ మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ ‘ఐఫోన్ ఆల్ట్రా పోల్డ్’ను తీసుకురావడానికి కసరత్తు చేస్తోంది. ఇటీవల యాపిల్ హబ్ అనే సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ అయిన ఒక లీక్డ్ వీడియో టెక్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.ఇదీ చదవండి: 39 అత్యవసర ఔషధాల ధరల్లో మార్పు -
ఓపెన్ఏఐపై యాపిల్ దావా!
ప్రపంచ టెక్ దిగ్గజాలు కృత్రిమ మేధ పోరులో భాగంగా ఇప్పుడు కోర్టు మెట్లెక్కారు. తమ అత్యంత రహస్యమైన వాణిజ్య సమాచారాన్ని, హార్డ్వేర్ డిజైన్లను దొంగిలించారంటూ ఐఫోన్ తయారీదారు యాపిల్ చాట్జీపీటీ సృష్టికర్త ఓపెన్ఏఐపై దావా వేసింది. ఓపెన్ఏఐతో పాటు సంస్థలో కీలక బాధ్యతల్లో ఉన్న ఇద్దరు మాజీ యాపిల్ ఉద్యోగులనూ ఈ కేసులో నిందితులుగా పేర్కొంది. కాలిఫోర్నియా నార్త్ డిస్ట్రిక్ట్ ఫెడరల్ కోర్టులో యాపిల్ 41 పేజీల సుదీర్ఘ ఫిర్యాదును దాఖలు చేసింది. కన్స్యూమర్ హార్డ్వేర్ (స్మార్ట్ఫోన్లు, ఇతర పరికరాలు) రంగంలోకి అడుగుపెట్టేందుకు ఓపెన్ఏఐ షార్ట్కట్లను వెతుకుతోందని, అందుకోసం యాపిల్ మేధోసంపత్తిని వ్యవస్థీకృతంగా దోచుకుందని ఆరోపించింది.ల్యాప్టాప్ చోరీ..యాపిల్ కోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం, ఈ వివాదంలో ఇద్దరు మాజీ ఉద్యోగుల పాత్ర కీలకంగా మారింది. యాపిల్లో ఐఫోన్, యాపిల్ వాచ్ ప్రొడక్ట్ డిజైన్ వైస్ ప్రెసిడెంట్గా దాదాపు 24 ఏళ్లు పనిచేసిన టాంగ్ టాన్ ప్రస్తుతం ఓపెన్ఏఐ చీఫ్ హార్డ్వేర్ ఆఫీసర్గా ఉన్నారు. టాన్ యాపిల్ సరఫరాదారుల రహస్య సమాచారాన్ని ఓపెన్ఏఐకి చేరవేశారని యాపిల్ పేర్కొంది. అంతేకాదు, యాపిల్ ఉద్యోగులను ఓపెన్ఏఐ ఇంటర్వ్యూలు చేసే సమయంలో.. సంస్థకు చెందిన విడిభాగాలను తీసుకువచ్చి ప్రదర్శించాల్సిందిగా (‘షో అండ్ టెల్’ సెషన్స్) ఒత్తిడి తెచ్చారని యాపిల్ ఆరోపించింది.చాంగ్ లియు అనే మాజీ యాపిల్ ఇంజినీర్ జనవరి 2026లో ఓపెన్ఏఐలో చేరారు. అయితే, యాపిల్కు చెందిన ల్యాప్టాప్ను తిరిగి ఇవ్వకుండా ఒక అంతర్గత ‘అథెంటికేషన్ బగ్’ (సాంకేతిక లోపం) ఆధారంగా యాపిల్ నెట్వర్క్లోకి చొరబడ్డారని సంస్థ గుర్తించింది. దీని ద్వారా విడుదల కాని ఉత్పత్తుల వివరాలు, సర్క్యూట్ బోర్డ్ డిజైన్లు కలిగిన వేలాది పేజీల రహస్య ఫైళ్లను డౌన్లోడ్ చేసుకున్నట్లు యాపిల్ ఆధారాలను బయటపెట్టింది. ‘ఓపెన్ఏఐ కొత్త హార్డ్వేర్ సామ్రాజ్యం ఒక అక్రమ పునాదిపై నిర్మితమవుతోంది. యాపిల్ రహస్యాలను దొంగిలించి తమ హార్డ్వేర్ ప్రయత్నాలు చేపడుతున్నారు’ అని యాపిల్ తన పిర్యాదులో తెలిపింది.మిత్రుల మధ్య శత్రుత్వం2024లో యాపిల్ తన ‘యాపిల్ ఇంటెలిజెన్స్’ కోసం ఓపెన్ఏఐతో జతకట్టి చాట్జీపీటీని ఐఫోన్లలోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే కాలక్రమేణా వీరి బంధం క్షీణించింది. యాపిల్ క్రమంగా గూగుల్ వైపు మొగ్గు చూపడం, మరోవైపు యాపిల్ మాజీ డిజైన్ హెడ్ జోనీ ఐవ్ నేతృత్వంలోని స్టూడియోను ఓపెన్ఏఐ దక్కించుకుని సొంతంగా ఏఐ స్మార్ట్ఫోన్ లేదా హార్డ్వేర్ పరికరాన్ని తయారుచేసే పనిలో పడటంతో ఇరు సంస్థల మధ్య పోటీ తీవ్రమైంది. ఫిబ్రవరి 2026 లోనే తాము ఈ వ్యవహారంపై అంతర్గత విచారణ జరిపి ఓపెన్ఏఐని హెచ్చరించామని, అయినా వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతోనే కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని యాపిల్ స్పష్టం చేసింది.స్పందించిన ఓపెన్ఏఐఈ ఆరోపణలపై ఓపెన్ఏఐ ప్రతినిధి డ్రూ పుసాతేరి స్పందిస్తూ.. ‘మేము కోర్టు ఫైలింగ్ను పరిశీలిస్తున్నాం. మాకు ఇతర కంపెనీల వాణిజ్య రహస్యాలపై ఎలాంటి ఆసక్తి లేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఉపయోగపడే వినూత్న సాంకేతికతను నిర్మించడంపైనే మా దృష్టి అంతా ఉంది’ అని లీగల్ స్టేట్మెంట్ ఇచ్చారు. దాదాపు 852 బిలియన్ డాలర్ల విలువతో త్వరలోనే ఐపీఓకి వెళ్లాలని భావిస్తున్న ఓపెన్ఏఐకి ఈ కేసు చట్టపరంగా పెద్ద అడ్డంకిగా మారే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. యాపిల్ ప్రస్తుతం తమ రహస్యాల వినియోగాన్ని అడ్డుకోవడంతో పాటు భారీ నష్టపరిహారాన్ని కోరుతోంది.ఇదీ చదవండి: 39 అత్యవసర ఔషధాల ధరల్లో మార్పు -
మెటా, గూగుల్కు రూ.50 కోట్ల జరిమానా!
సోషల్ మీడియా దిగ్గజం మెటా (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ)కు అమెరికా కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. చిన్నతనంలో సోషల్ మీడియాకు బానిస కావడం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నదంటూ ఒక 20 ఏళ్ల యువతి దాఖలు చేసిన కేసులో జ్యూరీ ఇచ్చిన తీర్పుపై మెటా తాజా అప్పీల్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. లాస్ ఏంజెల్స్ కౌంటీ సుపీరియర్ కోర్టులో మెటా న్యాయవాదులు అధికారికంగా అప్పీల్ నోటీసును దాఖలు చేశారు.అసలేమిటీ కేసు? బాధితురాలి ఆరోపణలు ఏంటి?ప్రస్తుతం 20 ఏళ్ల వయసున్న కేలీ అనే యువతి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. తను చిన్నతనంలో ఉన్నప్పుడే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి ప్లాట్ఫారమ్లకు తీవ్రంగా బానిసయ్యానని, దీనివల్ల తను తీవ్రమైన ఆందోళన (యాంగ్జైటీ), డిప్రెషన్, బాడీ డిస్మోర్ఫియా (శరీర ఆకృతిపై తీవ్రమైన అసంతృప్తి) వంటి మానసిక సమస్యలను ఎదుర్కొన్నట్లు ఆమె కోర్టుకు తెలిపింది.టెక్ కంపెనీలు తమ యాప్ల్లో వాడే కొన్ని ప్రత్యేక ఫీచర్ల ద్వారా చిన్న పిల్లలను ఉద్దేశపూర్వకంగానే వ్యసనపరులుగా మారుస్తున్నాయని ఆమె తరఫు న్యాయవాదులు బలంగా వాదించారు. ప్రధానంగా కొన్ని ఫీచర్ల రూపకల్పనపై కోర్టులో చర్చ జరిగింది.ఇన్ఫినిట్ స్క్రోలింగ్: యూజర్లు నిరంతరాయంగా కంటెంట్ చూస్తూనే ఉండేలా పేజీలకు ముగింపు లేకుండా డిజైన్ చేయడం.ఆటోప్లే ఫంక్షన్: ఒక వీడియో ముగియగానే మరో వీడియో ఆటోమేటిక్గా ప్లే అయ్యేలా చేయడం.అల్గారిథమిక్ రికమండేషన్స్: యూజర్ల ప్రవర్తనను బట్టి మరింత వ్యసనకరమైన కంటెంట్ను వారి ముందుకు తీసుకురావడం.సంచలన తీర్పు.. 6 మిలియన్ డాలర్ల జరిమానాఈ ఏడాది మార్చి (2026)లో ఈ కేసును విచారించిన లాస్ ఏంజెల్స్ జ్యూరీ మెటా, గూగుల్ (యూట్యూబ్) సంస్థలు తమ ప్లాట్ఫారమ్ల రూపకల్పనలో నిర్లక్ష్యంగా వ్యవహరించాయని నిర్ధారించింది. బాధితురాలి మానసిక స్థితి క్షీణించడానికి ఈ కంపెనీల యాప్ డిజైన్లే ప్రధాన కారణమని పేర్కొంటూ మొత్తంగా 6 మిలియన్ డాలర్ల (సుమారు రూ.50 కోట్లు) పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. ఇందులో మెటా 4.2 మిలియన్ డాలర్లు, గూగుల్ 1.8 మిలియన్ డాలర్లు చొప్పున బాధ్యత వహించాలని కోర్టు స్పష్టం చేసింది. దీనిపై టెక్ కంపెనీలు దాఖలు చేసిన ‘జడ్జ్మెంట్ నాట్విత్స్టాండింగ్ ద వర్డిక్ట్’ (తీర్పును కొట్టివేయాలనే అభ్యర్థన) పిటిషన్లను ట్రయల్ జడ్జ్ కరోలిన్ బి.కుహ్ల్ జూన్ ప్రారంభంలో తిరస్కరించడంతో మెటా ఇప్పుడు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.మెటా వాదన.. టెక్ కంపెనీల రక్షణ కవచంఅప్పీలుపై మెటా ప్రతినిధి స్పందిస్తూ.. ‘టీనేజర్ల మానసిక ఆరోగ్యం అనేది ఎంతో సంక్లిష్టమైన అంశం. దీన్ని కేవలం ఒక యాప్తో మాత్రమే ముడిపెట్టలేము. ఆన్లైన్లో యువత రక్షణ కోసం మేము అనేక చర్యలు తీసుకుంటున్నాం’ అని పేర్కొన్నారు. గూగుల్ ప్రతినిధి కూడా తాము అప్పీల్ చేయనున్నట్లు తెలిపారు. సాధారణంగా అమెరికాలోని ‘కమ్యూనికేషన్స్ డిసెన్సీ యాక్ట్ - సెక్షన్ 230’ ప్రకారం, థర్డ్-పార్టీ యూజర్లు పోస్ట్ చేసే కంటెంట్కు టెక్ కంపెనీలు చట్టపరంగా బాధ్యులు కావు. అయితే, ఈ కేసులో న్యాయవాదులు కంటెంట్ను కాకుండా టెక్ కంపెనీలు రూపొందించిన యాప్ డిజైన్ (వ్యసనకరమైన ఫీచర్లు) లోపభూయిష్టంగా ఉందంటూ పట్టుబట్టడం విశేషం.ఈ కేసు కేవలం ఒక యువతికి సంబంధించినది కాదు. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా సోషల్ మీడియా సంస్థలపై దాదాపు 10,000 కంటే ఎక్కువ వ్యక్తిగత కేసులు, సుమారు 800 స్కూల్ డిస్ట్రిక్ట్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ఈ అప్పీల్ తీర్పు భవిష్యత్తులో సోషల్ మీడియా నియంత్రణలపై, అలాగే కంపెనీల యాప్ డిజైన్ విధానాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. భవిష్యత్తులో పిల్లల కోసం సోషల్ మీడియా యాప్స్లో భారీ మార్పులు వచ్చేందుకు ఇది ఒక మైలురాయిగా మారే అవకాశం ఉంది.ఇదీ చదవండి: నిప్పుల కొలిమిలో నగరాలు -
సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కనుమరుగవుతాయ్!
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ ప్రభావం.. విద్య, వైద్య, వ్యాపార, సాఫ్ట్వేర్ మొదలైన రంగాలను ప్రభావితం చేస్తోంది. ఇలాంటి సమయంలో.. అంత్రోఫిక్ సంస్థ సీఈఓ 'డారియో అమోడెయ్' ఏఐ వల్ల ఉద్యోగాల భవిష్యత్తు ఎలా ఉంటుందనే విషయాలను ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.డారియో అమోడెయ్ అభిప్రాయం ప్రకారం.. రానున్న రోజుల్లో కోడింగ్ పనులను ఏఐ ఆటోమేట్ చేస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ప్రోగ్రామింగ్లో కోడ్ రాయడం, లోపాలను గుర్తించడం, కొత్త ప్రోగ్రామ్లను రూపొందించడం వంటి పనులను ఏఐ చాలా వేగంగా చేస్తోంది. కాబట్టి ముందు కోడింగ్ కనుమరుగవుతుంది.సాఫ్ట్వేర్ ఉద్యోగాలపై ఎఫెక్ట్ఏఐ ప్రభావం సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది. కోడింగ్ తరువాత, ఈ రంగంలో కూడా గణనీయమైన మార్పులు సంభవిస్తాయి. ఉద్యోగుల సంఖ్య భారీగా కనుమరుగవుతాయని డారియో అమోడెయ్ పేర్కొన్నారు.అయితే.. సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ అనేది కేవలం కోడ్ రాయడం మాత్రమే కాదు. వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకోవడం, కొత్త ఉత్పత్తులను డిజైన్ చేయడం, మార్కెట్ అవసరాలను విశ్లేషించడం, ప్రాజెక్టులను నిర్వహించడం వంటి బాధ్యతలు కూడా ఇందులో భాగమే. కాబట్టి ఈ పనుల్లో మానవుల పాత్ర కూడా కొంత అవసరం ఉంటుంది. కానీ భవిష్యత్తులో ఒక వ్యక్తి మొత్తం పనిలో కేవలం 5 శాతం మాత్రమే పూర్తి చేసినా.. మిగిలిన 95 శాతం పనిని ఏఐ పూర్తి చేయగలదని చెప్పారు. దీంతో ఉత్పాదక పెరుగుతుందని వివరించారు.ఈ ఉద్యోగాలకు అవకాశంయువత ఏఐతో పోటీ పడటానికి కావలసిన నైపుణ్యాలను నేర్చుకోవడం కంటే.. ఏఐకి తోడ్పడే నైపుణ్యాలను నేర్చుకుంటే బాగుంటుందని అమోడెయ్ వెల్లడించారు. అయితే.. ఏఐ ఎంత ఎదిగినా సెమీకండక్టర్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్ వంటి సంప్రదాయ ఇంజినీరింగ్ రంగాలు, అలాగే మానవ సంబంధాలు, నాయకత్వం, సమస్య పరిష్కార నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాలకు భవిష్యత్తులో కూడా మంచి అవకాశాలు ఉంటాయని చెప్పారు.ఏఐ వల్ల నైపుణ్యం తగ్గుతుందా?మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఏఐ యుగంలో విమర్శనాత్మక ఆలోచన ముఖ్యమని అమోడెయ్ పేర్కొన్నారు. ఎందుకంటే ఏఐ నిజమైన చిత్రాలు, వీడియోలు, సమాచారంతో పాటు నకిలీ కంటెంట్ను కూడా సృష్టించగలదు. కాబట్టి ఏది నిజం, ఏది అబద్ధమో గుర్తించే సామర్థ్యం ప్రతి ఒక్కరిలో ఉండాలని ఆయన సూచించారు.అయితే.. విద్యార్థులు ఏఐను ఉపయోగించి హోంవర్క్ లేదా అసైన్మెంట్లను పూర్తిచేయడం సరైన పద్ధతి కాదని ఆయన హెచ్చరించారు. ఏఐతో హోంవర్క్ చేయించడం అంటే అది ఒక విధంగా చీటింగ్ చేసినట్లే.. అని ఆయన వ్యాఖ్యానించారు. అంత్రోఫిక్ నిర్వహించిన ఒక పరిశోధనల ప్రకారం, ఏఐపై పూర్తిగా ఆధారపడితే మన నైపుణ్యాలు తగ్గిపోయే అవకాశం ఉంటుందని చెప్పారు. కానీ.. సరైన విధంగా ఉపయోగిస్తే కొత్త విషయాలు నేర్చుకోవడానికి, సామర్థ్యాలను పెంచుకోవడానికి అది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.వ్యక్తిగత అభివృద్ధి ఇలా సాధ్యంఏఐ వల్ల మనుషులు భవిష్యత్తులో తక్కువ తెలివిగా మారే ప్రమాదం ఉందా అనే ప్రశ్నకు, అది AIను ఎలా ఉపయోగిస్తామనే దానిపై ఆధారపడి ఉంటుందని ఆయన సమాధానం ఇచ్చారు. ఏఐపై పూర్తిగా ఆధారపడితే మన ఆలోచనా శక్తి తగ్గే అవకాశం ఉంది. కానీ దానిని ఒక సాధనంగా ఉపయోగించి కొత్త విషయాలు నేర్చుకుంటే మాత్రం తప్పకుండా వ్యక్తిగత అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన వివరించారు.ANTHROPIC CEO: “CODING IS GOING AWAY FIRST, THEN ALL OF SOFTWARE ENGINEERING” pic.twitter.com/4Sjo9LSB4C— Vivek Sen (@Vivek4real_) July 8, 2026 -
1600 సిరీస్ కాల్స్ను యాప్స్ బ్లాక్ చేయలేవు: ట్రాయ్
మొబైల్ వినియోగదారులను నిరంతరం వేధించే అయాచిత, ప్రమోషనల్, సర్వీస్ కాల్స్పై టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) శుక్రవారం కీలక వివరణ ఇచ్చింది. ఇకపై 1600 సిరీస్ నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ను థర్డ్ పార్టీ యాప్స్ (ట్రూకాలర్ వంటివి) బ్లాక్ చేయడం కానీ, ఫిల్టర్ చేయడం కానీ సాధ్యం కాదని ట్రాయ్ స్పష్టం చేసింది. అదేవిధంగా, వ్యాపార ప్రకటనల కోసం వచ్చే 140 సిరీస్ కాల్స్ను నియంత్రించాలంటే ప్రభుత్వ అధికారిక ‘డీఎన్డీ’ రిజిస్ట్రీ మాత్రమే ఏకైక మార్గమని తేల్చిచెప్పింది.1600 సిరీస్ కాల్స్ ఎందుకు బ్లాక్ చేయకూడదు?టెలికాం కమర్షియల్ కమ్యూనికేషన్స్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్ (టీసీసీసీపీఆర్) నిబంధనల ప్రకారం.. 1600 సిరీస్ నంబర్లను బ్లాక్ చేయడం, ట్యాగ్ చేయడం లేదా ఫిల్టర్ చేయడం చట్టవిరుద్ధం. ఆర్బీఐ, సెబీ, ఐఆర్డీఏఐ, పీఎఫ్ఆర్డీఏ వంటి సర్వోన్నత సంస్థల పరిధిలోని బ్యాంకులు, ఆర్థిక సేవలు, బీమా కంపెనీలు తమ ప్రస్తుత కస్టమర్లకు కీలక సమాచారం చేరవేయడానికి ఈ సిరీస్ను వాడుతుండడం ఇందుకు ఒక కారణమని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ సంస్థలు పౌరులతో జరిపే అధికారిక లావాదేవీల సమాచారం కోసం 1600 సిరీస్ను తప్పనిసరి చేశారు. వినియోగదారులు ఇవి నమ్మకమైన, అధికారిక కాల్స్ అని గుర్తించి మోసపోకుండా ఉండాలనే లక్ష్యంతోనే ఈ ప్రత్యేక సిరీస్ను కేటాయించారు. ఒకవేళ యాప్లు వీటిని బ్లాక్ చేస్తే వినియోగదారులు కీలక ఆర్థిక సమాచారాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.140 సిరీస్ ప్రమోషనల్ కాల్స్.. డీఎన్డీతోనే చెక్!రిజిస్టర్డ్ టెలిమార్కెటర్ల కోసం కేటాయించిన 140 నంబర్ సిరీస్ ప్రమోషనల్ కాల్స్పై ట్రాయ్ స్పందిస్తూ.. వినియోగదారులకు తమ ప్రాధాన్యతలను ఎంచుకునే పూర్తి హక్కు ఉందని తెలిపింది. ‘వినియోగదారులు ట్రాయ్ ‘డీఎన్డీ యాప్’ ద్వారా లేదా బహుళ మార్గాల్లో డూ నాట్ డిస్టర్బ్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవచ్చు. ఒకటి లేదా అన్ని రంగాల నుంచి వచ్చే ప్రమోషనల్ కాల్స్ను బ్లాక్ చేసే స్వేచ్ఛ కస్టమర్లకు ఉంది. ఒక రంగం నుంచి కాల్స్ స్వీకరించడానికి కస్టమర్ అంగీకరించినప్పుడు, థర్డ్ పార్టీ యాప్స్ దాన్ని స్పామ్గా ట్యాగ్ చేస్తే కస్టమర్ తప్పుదారి పట్టే అవకాశం ఉంది. అందుకే డీఎన్డీ మినహా మరే ఇతర ట్యాగింగ్ చెల్లదు’ అని ట్రాయ్ తెలిపింది. దీని ప్రకారం.. 140, 1600 సిరీస్ నంబర్లను వినియోగదారులు వ్యక్తిగతంగా స్పామ్, మోసం లేదా ఇతర కేటగిరీలుగా ట్యాగ్ చేయడం కుదరదని ట్రాయ్ స్పష్టం చేసింది.భారీగా పెరిగిన స్పామ్ కాల్స్ఒకవైపు ట్రాయ్ నిబంధనలు ఇలా ఉంటే క్షేత్రస్థాయిలో ఈ నంబర్ల ద్వారా వస్తున్న స్పామ్ కాల్స్ వినియోగదారులను ముంచెత్తుతున్నాయని ప్రముఖ యాప్ ‘ట్రూకాలర్’ సీఈవో రిషిత్ ఝున్ ఝున్ వాలా సాషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన వెల్లడించిన గణాంకాలు షాక్కు గురిచేస్తున్నాయి.140, 1600 సిరీస్ల ద్వారా వచ్చే కాల్స్లో రోజుకు 5.1 కోట్లకు పైగా కాల్స్ను వినియోగదారులు సమాధానం ఇవ్వకుండా వదిలేస్తున్నారు.కేవలం సర్వీస్/లావాదేవీల కోసం కేటాయించిన 1600 సిరీస్ నుంచి అక్టోబర్ 2025 నుంచి రోజువారీ స్పామ్/బ్లాకింగ్ చర్యలు ఏకంగా 3 రెట్లు (208 శాతం) పెరిగాయి.గత 8 నెలల కాలంలో వినియోగదారులు ఈ సిరీస్లపై ఏకంగా 7.4 కోట్ల (74 మిలియన్లు) మాన్యువల్ బ్లాకింగ్ చర్యలు తీసుకున్నారు.ప్రస్తుతం ట్రూకాలర్ ప్లాట్ఫామ్పై రోజూ వినియోగదారులు 140 సిరీస్ నుంచి 4 లక్షల కాల్స్, 1600 సిరీస్ నుంచి 1.25 లక్షల కాల్స్ను బ్లాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ లాంచ్! -
పాడైన ఆహారాన్ని గుర్తించే స్మార్ట్సెన్స్
కాయగూరలు, పాలు, పెరుగు, చికెన్, మటన్.. ఏ ఆహార పదార్థమైనా కానివ్వండి. కొనేవి తాజాగా ఉండాలని కోరుకుంటాం!. కానీ ఏది తాజాది? ఏది పాతదని తెలిసేదెలా? ప్యాకేజీపై మా స్టిక్కర్లు ఉంటే చాలు అంటోంది బయోసౌక్!బెంగళూరులోని నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మొదలైన స్టార్టప్ కంపెనీ (బయోసౌక్) ఇది. స్మార్ట్సెన్స్ పేరుతో వీరు ఆహార పదార్థాల తాజాదనాన్ని గుర్తించేందుకు ఒక ప్యాకేజింగ్ మెటీరిల్ను అభివృద్ధి చేశారు. ఇది కాగితం ఆధారంగానే తయారవుతుంది కానీ.. అమ్మోనియా, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి వాయువులను గుర్తించేందుకు ఇందులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.ఆహార పదార్థాలు పాడయ్యే క్రమంలో ఈ వాయువులనే వదులుతాయి. వాటిని గుర్తిస్తే ఆహారం ఎంత పాతదో ఇట్టే తెలిసిపోతుందన్నమాట. వాయువుల మోతాదుకు తగ్గట్టుగా ఈ ప్యాకేజింగ్ మెటీరియల్పై ఉన్న స్టిక్కర్పై రంగులు మారిపోతుంటాయి. ఏ రంగు ఎంత పాతదన్న విషయాన్ని సూచిస్తుంది. కోడిగుడ్లు మొదలుకొని మాంసం, సముద్ర ఉత్పత్తులు, పాలు, పెరుగు, కాయగూరల్లాంటి ఆహార పదార్థాల వరకు అన్నింటి తాజాదనాన్ని గుర్తించవచ్చు.ఎక్స్పైరీ డేట్తో పనిలేదుఇప్పటివరకూ ఆహార పదార్థాల తాజాదనాన్ని గుర్తించేందుకు నిర్దిష్ట పద్దతి అంటూ ఏదీ లేదు. ఫలానా టైమ్లోపు వాడండి అన్న ఎక్స్పైరీ డేట్ మాత్రమే అందుబాటులో ఉంది. లేదంటే ల్యాబ్లో పరీక్షించి నిర్ధారించుకోవాలి. ఫలితంగా చాలాచోట్ల ఆహార పదార్థాలు వృథా అవుతున్నాయి. పోస్ట్ హార్వెస్టింగ్ నష్టాలు ఎక్కువ అవుతున్నాయి. తినే ఆహారం సురక్షితమా? కాదా? అన్న అనుమానాలూ వస్తూంటాయి.ఈ సమస్యలన్నింటినీ స్మార్ట్సెన్స్ ప్యాకేజింగ్ ద్వారా అధిగమించవచ్చునని నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సీఈవో డాక్టర్ ఆదర్శ గౌడ తెలిపారు. రైతులు, ఉత్పత్తిదారులకు నష్టాలు తగ్గడమే కాకుండా.. వినియోగదారులు తగిన నిర్ణయం తీసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. -
ఆస్ట్రేలియా తరహా చట్టాలు భారత్లోనూ?
పిల్లలను రక్షణను దృష్టిలో ఉంచుకుని.. ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయాలను భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఉపయోగించకుండా ఆంక్షలు విధించే ఆస్ట్రేలియా చట్టాలు డిజిటల్ ప్రపంచాన్ని సురక్షితంగా మార్చేందుకు ఉపయోగపడతాయని ఆయన అన్నారు. ఈ విధానాల నుంచి భారత్తో పాటు.. ప్రపంచ దేశాలు కూడా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని మోదీ పేర్కొన్నారు.మెల్బోర్న్లో జరిగిన ఆస్ట్రేలియా-భారత్ వార్షిక నేతల సదస్సులో.. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్తో కలిసి పాల్గొన్న మోదీ, సమాచార సాంకేతికత (IT), సోషల్ మీడియా నియంత్రణ, ఆన్లైన్ భద్రత విషయంలో ఆస్ట్రేలియా తీసుకుంటున్న చర్యలను అభినందించారు. ముఖ్యంగా చిన్నారులను, సోషల్ మీడియా వల్ల కలిగే హానికర ప్రభావాల నుంచి రక్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు.పిల్లలకు సోషల్ మీడియా నిషేధం!ఆస్ట్రేలియా కొత్త నిబంధనల ప్రకారం.. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ఖాతాలు సృష్టించకుండా ప్రముఖ ప్లాట్ఫామ్లు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ వేధింపులు, మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియా ప్రభావం వంటి సమస్యలను తగ్గించడమే ఈ చట్టం ప్రధాన లక్ష్యం.భారత్లో నిషేధంపై మోదీ హింట్ ఇచ్చారా?భారత్లో కూడా చిన్నారుల సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణలు తీసుకురావాలనే చర్చలు పెరుగుతున్న వేళ మోదీ వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బహుశా ఈ నియమాలు మనదేశంలో కూడా అమలవుతాయా?, మోదీ హింట్ ఇచ్చారా?, అని పలువురు అభిప్రాయపడుతున్నారు.కాగా.. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై పరిమితులు విధించే దిశగా అడుగులు వేసింది. ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి చర్యలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీన్నిబట్టి చూస్తే మన దేశంలో కూడా సోషల్ మీడియా వినియోగాన్ని కఠినతరం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: ఓపెన్ఏఐలో కీలక పరిణామం.. ఏజీఐ సీఈఓ రాజీనామా! -
ఓపెన్ఏఐలో కీలక పరిణామం.. ఏజీఐ సీఈఓ రాజీనామా!
కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో దూసుకెళ్తున్న ఓపెన్ఏఐలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కంపెనీలో ఏజీఐ (AGI) డిప్లాయ్మెంట్ సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఫిద్జీ సిమో (Fidji Simo) తన పూర్తి స్థాయి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనారోగ్య సమస్యల కారణంగా ఇకపై ఫుల్ టైమ్ పనిచేయడం సాధ్యం కాదని, భవిష్యత్తులో పార్ట్టైమ్ అడ్వైజర్గా సంస్థకు సేవలందించనున్నట్లు వెల్లడించారు.ఫిద్జీ సిమో గత ఏడేళ్లుగా ఒక దీర్ఘకాలిక న్యూరో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నారు. మూడు నెలల క్రితం ఆ వ్యాధి తీవ్రరూపం దాల్చడంతో వైద్యుల సూచన మేరకు ఆమె మెడికల్ లీవ్ తీసుకున్నారు. చికిత్స అనంతరం కోలుకోవడానికి తాను ఊహించిన దానికంటే ఎక్కువ సమయం అవసరమవుతుందని గ్రహించిన ఆమె, ఆరోగ్యంపై పూర్తిగా దృష్టి పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్స్ (X)లో వెల్లడించారు.ఫిద్జీ సిమోకు టెక్ రంగంలో విశేష అనుభవం ఉంది. గతంలో ఆమె ఇన్స్టాకార్ట్ సీఈఓగా పనిచేయడంతో పాటు, మెటా సంస్థలో ఫేస్బుక్ యాప్ విభాగానికి నాయకత్వం వహించారు. 2024లో సామ్ ఆల్ట్మన్ మళ్లీ ఓపెన్ఏఐ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, కంపెనీ బోర్డులో చేరిన ముగ్గురు కొత్త డైరెక్టర్లలో సిమో కూడా ఒకరు. ఆ తరువాత సంస్థలో కీలక బాధ్యతలు స్వీకరించి ఏజీఐ అభివృద్ధి, వ్యాపార విస్తరణలో ముఖ్య పాత్ర పోషించారు.సిమో రాజీనామాపై ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మన్ స్పందిస్తూ, ఆమె సంస్థకు అందించిన సేవలు ఎంతో విలువైనవని, ఆమె ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని ఆకాంక్షించారు. సంస్థ అభివృద్ధికి ఆమె చేసిన కృషిని తాము ఎప్పటికీ గుర్తుంచుకుంటామని తెలిపారు.సిమో బాధ్యతలను ఇకపై ఓపెన్ఏఐ అధ్యక్షుడు గ్రెగ్ బ్రాక్మన్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సారా ఫ్రియర్, చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ జేసన్ క్వాన్ కలిసి నిర్వహించనున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే తదుపరి ఏజీఐ ఎవరనే విషయం త్వరలోనే వెల్లడవుతుంది.i am really sad about this and very grateful for all fidji has done for openai, and even grateful for her friendship and who she is as a person.we all wish her the best for a speedy recovery. this sucks. https://t.co/tg33Lutsn7— Sam Altman (@sama) July 9, 2026 -
మస్క్ ప్రసంశలు.. AI రంగంలో వారే టాప్!
ఏఐ రంగంలో.. టెక్ కంపెనీల మధ్య పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమకు ప్రత్యర్థిగా ఉన్న ఆంత్రోపిక్ ప్రస్తుతం ఏఐ రంగంలో అగ్రస్థానంలో ఉందని ఆయన ప్రశంసించారు.సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ (X)లో ప్రముఖ ఏఐ మోడళ్ల పనితీరుపై జరిగిన చర్చపై మస్క్ స్పందించారు. ''ఆంత్రోపిక్ గురించి నేను గతంలో చేసిన అంచనా తప్పు. ప్రస్తుతం ఏఐ రంగంలో వారే ముందున్నారు. వారి మిథోస్/ఫేబుల్ (Mythos/Fable) మోడల్ స్థాయికి సమానమైన మోడల్ను ఇప్పటివరకు ఏ కంపెనీ విడుదల చేయలేదు. త్వరలోనే వారు మరింత శక్తివంతమైన మిథోస్ 2ను కూడా తీసుకురానున్నారు'' అని పేర్కొన్నారు.ఆంత్రోపిక్ ప్రస్తుతం ప్రపంచంలో ప్రముఖ ఏఐ సంస్థల్లో ఒకటిగా ఎదుగుతోంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ డెవలపర్ల కోసం రూపొందించిన క్లాడ్ మోడళ్లు మంచి గుర్తింపు పొందాయి. గత ఏడాది విడుదలైన క్లాడ్ ఓపస్ 4.5 మోడల్ కోడింగ్ సామర్థ్యాల్లో అద్భుతమైన ఫలితాలను చూపడంతో ప్రపంచవ్యాప్తంగా డెవలపర్లు, ఏఐ పరిశోధకులు దీనిని విస్తృతంగా ఉపయోగించడం ప్రారంభించారు. దీంతో ఓపెన్ఏఐ, గూగుల్, ఎక్స్ఏఐ వంటి దిగ్గజ సంస్థలకు ఆంత్రోపిక్ గట్టి పోటీగా నిలిచింది.ఎలాన్ మస్క్ వంటి ప్రముఖ వ్యాపారవేత్త ప్రత్యర్థి సంస్థను బహిరంగంగా ప్రశంసించడం ఆంత్రోపిక్ సాధించిన విజయానికి నిదర్శనం. ఏఐ రంగంలో పోటీ మరింత తీవ్రంగా మారుతున్న ఈ సమయంలో.. కొత్త ఆవిష్కరణలు, శక్తివంతమైన మోడళ్లతో వినియోగదారులకు మెరుగైన సేవలు అందే అవకాశాలు మరింత పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.I was clearly wrong about Anthropic. They are obviously currently the leader in AI. No company has released a model as good as Mythos/Fable and they will undoubtedly have Mythos 2 ready soon. And I would never cut them off in a way that hurt them badly, even as a competitor.…— Elon Musk (@elonmusk) July 9, 2026 -
మరో పవర్ఫుల్ AI మోడల్ వచ్చేసింది!
ఏఐ రంగంలో అగ్రగామిగా ఉన్న ఓపెన్ఏఐ (OpenAI) అత్యంత శక్తివంతమైన, సరికొత్త AI మోడల్ GPT-5.6ను ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. అమెరికా ప్రభుత్వంతో.. భద్రతా అంశాలకు సంబంధించిన సమీక్షలు, సాంకేతిక పరీక్షలు పూర్తైన తరువాత దీనిని విస్తృత స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు చెబుతున్నాయి.ఓపెన్ఏఐ విడుదల చేయనున్న GPT-5.6 సిరీస్లో సోల్, టెర్రా, లూనా అనే మూడు వేర్వేరు మోడళ్లు ఉన్నాయి. ఇవన్నీ ఈ రోజు (గురువారం) నుంచి అందుబాటులోకి వచ్చినట్లు కంపెనీ వెల్లడించింది.సోల్: అత్యంత శక్తివంతమైన ఫ్లాగ్షిప్ మోడల్టెర్రా: రోజువారీ అవసరాలు, వ్యాపార వినియోగానికి అనువైన మిడ్ రేంజ్ వెర్షన్లూనా: తక్కువ ఖర్చుతో వేగవంతమైన సేవలు అందించే మోడల్భద్రతాపరమైన ఆందోళనలుGPT-5.6 విడుదలకు ముందు భద్రతాపరమైన అంశాలు విస్తృత చర్చకు దారితీశాయి. ఈ మోడల్ కంప్యూటర్ కోడ్లోని బలహీనతలను గత మోడళ్ల కంటే మరింత సమర్థంగా గుర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ సామర్థ్యాన్ని సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేసే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని.. అమెరికా ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఓపెన్ఏఐ జూన్ నెలలో కొంతమంది అమెరికన్ భాగస్వాములకు మాత్రమే ముందస్తు ప్రివ్యూ యాక్సెస్ కల్పించింది.GPT-5.6 sol launches thursday!happy building— Sam Altman (@sama) July 8, 2026అమెరికా మీడియా కథనాల ప్రకారం.. సాంకేతిక పరీక్షలు, ప్రభుత్వ అధికారులతో సమావేశాల అనంతరం GPT-5.6ను విస్తృతంగా విడుదల చేసేందుకు ట్రంప్ ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అయితే వైట్ హౌస్ అధికారులు మాత్రం.. ఇది ప్రభుత్వ అధికారిక ఆమోదం కాదని, ఓపెన్ఏఐ స్వచ్ఛందంగా తన మోడళ్లను ప్రభుత్వ పరిశీలనకు సమర్పించిందని తెలిపారు.ప్రత్యర్థి సంస్థలతో పోటీఓపెన్ఏఐకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న ఆంత్రోపిక్ కూడా ఇటీవల తన అత్యాధునిక Fable 5, Mythos 5 వంటి AI మోడళ్లను విడుదల చేసింది. అమెరికా ప్రభుత్వం విధించిన కొన్ని పరిమితులు తొలగిన తర్వాత.. వాటిని కంపెనీ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఏఐ రంగంలో పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది.ప్రస్తుతం ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్, గూగుల్ వంటి సంస్థలు అత్యాధునిక ఏఐ మోడళ్ల అభివృద్ధిలో తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఈ సంస్థలు భారీ విలువలతో స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు కూడా సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో GPT-5.6 విడుదల AI పరిశ్రమలో మరో కీలక మైలురాయిగా మారనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
రెంట్కు రోబోట్లు!
నేటి ఆధునిక యుగంలో సాంకేతికత ఊహించని వేగంతో దూసుకుపోతోంది. ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ సినిమాలకే పరిమితమైన రోబోలు.. నేడు మన నిజజీవితంలో భాగమవుతున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో రోబోలను భారీ ఖర్చుతో కొనుగోలు చేసే పద్ధతి మారి వాటిని అద్దెకు తీసుకునే ‘రోబోటిక్స్-యాజ్-ఎ-సర్వీస్’ (రాస్) విధానం వేగంగా పుంజుకుంటోంది. ఆసుపత్రులు, హోటళ్లు, ఫ్యాక్టరీల నుంచి గృహ అవసరాల వరకు రోబోట్లు ఇప్పుడు సబ్స్క్రిప్షన్ ప్రాతిపదికన అందుబాటులోకి వస్తున్నాయి.ఆసుపత్రుల్లో 'మోక్సీ' సేవలుఅమెరికాలోని పలు ఆసుపత్రుల్లో ‘డిలిజెంట్ రోబోటిక్స్’ సంస్థ తయారు చేసిన మోక్సీ అనే రోబోట్ వైద్య సిబ్బందికి ఎంతో సహాయపడుతోంది. నాలుగు అడుగుల ఎత్తు, గుండె ఆకారపు ఎల్ఈడీ కళ్లతో ఉండే ఈ రోబోట్ ఆసుపత్రుల్లో వైద్య సామాగ్రిని చేరవేస్తుంది. నర్సులతో గుడ్ మార్నింగ్ చెప్పడం, హై-ఫైవ్ ఇవ్వడం వంటి పనులతో ఇది అందరి మనసులు గెలుచుకుంది. ఆసుపత్రులు దీనిని పూర్తిగా డబ్బు వెచ్చించి కొనకుండా అద్దె ప్రాతిపదికన వాడుకుంటున్నాయి. ఈ విధానంలో రోబోట్ నిర్వహణ, సాఫ్ట్వేర్ అప్డేట్లు అన్నీ తయారీ సంస్థే చూసుకుంటుంది. దీనివల్ల ముందస్తు భారీ ఖర్చులు తగ్గడమే కాకుండా ఎప్పటికప్పుడు సరికొత్త సాంకేతికతను ఉచితంగా అప్గ్రేడ్ చేసుకోవచ్చని కంపెనీ సీఓఓ టాడ్ బ్రూగర్ తెలిపారు.హ్యూమనాయిడ్ రోబోలుమనుషులలా కనిపించే హ్యూమనాయిడ్ రోబోలను ప్రస్తుతం వివాహాలు, కార్పొరేట్ ఈవెంట్లలో నృత్యం చేయడం, పాటలు పాడటం, వడ్డించడం వంటి స్పష్టమైన పనుల కోసం అద్దెకు ఇస్తున్నారు. ఒక నిజమైన డాన్సర్ నృత్యాన్ని వీడియో తీసి, ఆ డేటా ద్వారా వీటికి సులభంగా శిక్షణ ఇవ్వవచ్చని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ విశ్లేషకుడు ఏతాన్ క్వి పేర్కొన్నారు. మరోవైపు, కాలిఫోర్నియాకు చెందిన ‘1ఎక్స్’ సంస్థ నియో అనే హోమ్ హెల్పర్ రోబోట్ను ఈ ఏడాది మార్కెట్లోకి తెస్తోంది. దీనిని 20,000 డాలర్లకు కొనుగోలు చేయవచ్చు లేదా నెలకు 499 డాలర్లు చెల్లించి అద్దెకు తీసుకోవచ్చు.కొనుగోలు కంటే అద్దెకే ప్రాధాన్యత ఎందుకు?రోబోటిక్స్ రంగం రోజురోజుకూ మారుతోంది. ఈ రోజు కొన్న రోబోట్ వచ్చే ఏడాదికి పాతబడిపోయే ప్రమాదం ఉంది. అదే అద్దెకు తీసుకుంటే ఎల్లప్పుడూ సరికొత్త మోడల్ను ఎంచుకోవచ్చు. అలాగే, కస్టమర్లకు కోడింగ్ లేదా సాంకేతిక నైపుణ్యం లేకపోయినా, ఏదైనా సమస్య వచ్చినా కంపెనీ సిబ్బందే పరిష్కరిస్తారు. చికాగోకు చెందిన ఫార్మిక్ సంస్థ 250కి పైగా పారిశ్రామిక రోబోట్లను ఫ్లాట్ మంత్లీ పేమెంట్ విధానంలో అద్దెకు ఇస్తూ రోబోలను కొనలేని చిన్న కంపెనీలకు అండగా నిలుస్తోంది.అంతర్జాతీయ మార్కెట్, సవాళ్లుచైనా సంస్థలు భవిష్యత్తు అవసరాల కోసం తమ రోబోలను హోటళ్లు, క్లీనింగ్ సేవల్లో లీజుకు ఇస్తూ రియల్ వరల్డ్ డేటాను సేకరిస్తున్నాయి. షాంఘైకి చెందిన అజిబోట్ సంస్థ తన హ్యూమనాయిడ్ రోబోలను యూకే సహా 17 దేశాలలో అద్దెకు అందుబాటులో ఉంచింది. అయితే, చైనాలో ప్రభుత్వ రాయితీలు ఎక్కువగా ఉండటం వల్ల అక్కడి ప్రభుత్వ సంస్థలు అద్దె కంటే నేరుగా కొనుగోలు చేయడానికే మొగ్గు చూపుతున్నాయి.కొన్ని కంపెనీలు ప్రతిష్ట కోసం లేదా సాంకేతిక పరిజ్ఞానాన్ని సొంతం చేసుకోవడం కోసం రోబోలను కొనుగోలు చేస్తున్నప్పటికీ సామాన్య వినియోగదారులకు, చిన్న పరిశ్రమలకు మాత్రం అద్దె సౌలభ్యమే సరైన విధానంగా మారుతోంది. రోబోలు మరింత అధునాతనంగా మారే కొద్దీ ఈ అద్దె విప్లవం ప్రపంచాన్ని శాసించనుంది.ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప మార్పు -
బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ లాంచ్!
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) దేశీయ మార్కెట్లోకి అధునాతన శాటిలైట్ ఫోన్ను ప్రవేశపెట్టింది. సాధారణ మొబైల్ నెట్వర్క్లు అందుబాటులో లేని మారుమూల ప్రాంతాల్లో సైతం నిరంతరాయంగా కనెక్టివిటీని అందించడమే లక్ష్యంగా దీన్ని రూపొందించారు. అన్ని పన్నులతో కలుపుకుని ఈ హ్యాండ్సెట్ ధరను రూ.1,34,166 గా నిర్ణయించారు.ఎందుకంత ధర?ఈ ఫోన్ ధర వినగానే సామాన్య స్మార్ట్ఫోన్ వినియోగదారులు ఆశ్చర్యపోవడం సహజం. అయితే, ఇది రోజువారీ అవసరాల కోసం రూపొందించిన సాధారణ మొబైల్ కాదు. భూమిపై ఉండే సెల్యులార్ టవర్లతో సంబంధం లేకుండా నేరుగా ఉపగ్రహాల ద్వారా ఇది సిగ్నల్స్ అందుకుంటుంది. సాంప్రదాయ నెట్వర్క్లు పూర్తిగా విఫలమయ్యే అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా వాయిస్ కమ్యూనికేషన్ను అందించడమే దీని ప్రత్యేకత. అందుకే దీనికి అంత ప్రీమియం ధర ఉంది.ఈ ఫోన్ ప్రత్యేకతలుప్రముఖ అంతర్జాతీయ శాటిలైట్ నెట్వర్క్ సంస్థ ‘ఇన్మర్శాట్’ భాగస్వామ్యంతో బీఎస్ఎన్ఎల్ ఈ మిషన్ క్రిటికల్ కమ్యూనికేషన్ పరికరాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రధాన ఫీచర్లు..మొబైల్ టవర్ల పరిధితో సంబంధం లేకుండా దేశంలోని ఏ మారుమూల ప్రాంతం నుంచైనా నేరుగా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు.ఎంతటి ప్రతికూల వాతావరణ పరిస్థితులనైనా తట్టుకునేలా పటిష్టమైన బాడీతో ఈ ఫోన్ను రూపొందించారు.అత్యవసర సమయాల్లో ప్రాణాలను రక్షించేందుకు ప్రత్యేక ఎస్ఓఎస్ ఫీచర్ను ఇందులో పొందుపరిచారు.విద్యుత్ సౌకర్యం లేని ప్రాంతాల్లో కూడా ఎక్కువ కాలం పనిచేసేలా లాంగ్ లైఫ్ బ్యాటరీ దీని సొంతమని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.ఈ ఫోన్ ఎవరికి ఉపయోగపడుతుంది?సాధారణ పౌరుల కంటే కూడా నిర్దిష్ట రంగాల్లో క్లిష్టమైన విధుల్లో ఉన్నవారి కోసం బీఎస్ఎన్ఎల్ దీన్ని ప్రత్యేకంగా డిజైన్ చేసింది. రక్షణ రంగం, సరిహద్దు భద్రతా దళాలు, సముద్రయాన, నౌకాదళ కార్యకలాపాలు, విపత్తు నిర్వహణ సంస్థలు, మైనింగ్, మారుమూల పారిశ్రామిక ప్రాజెక్టులు, అడ్వెంచర్ ట్రావెలర్స్, పర్వతారోహకుల.. వంటి ప్రత్యేక కార్యకలాపాలు నిర్వహించేవారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని కంపెనీ చెప్పింది.When conventional mobile networks can’t reach, the BSNL Satellite Phone keeps you connected.Designed for challenging environments, making it an ideal solution for Defence, Maritime, Disaster Response, Mining, Remote Operations and Adventure Travel.Why Choose BSNL Satellite… pic.twitter.com/YQpeXwjrb6— BSNL India (@BSNLCorporate) July 8, 2026కొనుగోలు చేయడం ఎలా? అర్హతలేంటి?ఈ శాటిలైట్ ఫోన్ సాధారణ ఆన్లైన్ స్టోర్లలో లేదా రిటైల్ మొబైల్ షాపుల్లో దొరకదు. దీనిని కొనుగోలు చేయాలనుకునే వారు కొన్ని ప్రత్యేక నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఆసక్తి గల వినియోగదారులు నేరుగా తమ సమీప బీఎస్ఎన్ఎల్ ప్రధాన కార్యాలయాన్ని ఆశ్రయించాలి. జాతీయ భద్రత, వ్యూహాత్మక కారణాల దృష్ట్యా ఈ ఫోన్ను ఏ అవసరం కోసం కొనుగోలు చేస్తున్నారనే పూర్తి వివరాలను బీఎస్ఎన్ఎల్ అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. కంపెనీ నిర్దేశించిన నిబంధనలు, అర్హత ప్రమాణాలకు లోబడి, అవసరమైన అనుమతులు లభించిన తర్వాతే ఈ హ్యాండ్సెట్ను విక్రయిస్తారు.ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప మార్పు -
సౌరవ్యవస్థ కీలక సమాచారం చిక్కనుందా..?
‘న్యూ హొరైజన్స్’… అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ 2006లో గ్రహాంతర అన్వేషణ కోసం ప్రయోగించిన వ్యోమనౌక. ప్రస్తుతం భూమికి 950 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్లూటో ఆవల దాదాపు ఏడాదిగా సుప్తావస్థలో ఉన్న ఈ ప్రోబ్ తాజాగా జాగృతమైంది. విశ్వంలో సుదూర ప్రయాణం చేసే ఇలాంటి వ్యోమనౌకలను అప్పుడప్పుడు నిద్రావస్థలోకి పంపుతుంటారు శాస్త్రవేత్తలు. వ్యోమనౌకలోని కొన్ని వ్యవస్థలు, పరికరాలను పనిచేయించడం నిలిపివేసి పవర్ ఆదా చేయడమే దీని ఉద్దేశం.వ్యోమనౌక సుప్తావస్థలో ఉన్నప్పటికీ అందులోని కీలక పరికరాలు యథావిధిగా సమాచార సేకరణ కొనసాగిస్తూ, అధ్యయనం జరుపుతూనే ఉంటాయి. గత ఏడాది ఆగస్టులో నిద్రలోకి జారుకున్న ‘న్యూ హొరైజన్స్’, ప్రస్తుతం ‘మంచి ఆరోగ్యంతో’ మేల్కొన్నట్టు నాసా ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యోమనౌక నుంచి భూమికి రేడియో సంకేతాలు అందడానికి 9 గంటలు పడుతోంది. నిద్ర మత్తు వదిలించుకున్న ‘న్యూ హొరైజన్స్’… గత 321 రోజులుగా తాను సేకరించిన డేటాను ఇక భూమికి ప్రసారం చేయనుంది. ప్లూటో, దాని చంద్రుళ్ల అధ్యయనం కోసం ప్రయోగించిన తొలి, ఏకైక మిషన్ ‘న్యూ హొరైజన్స్’. ఈ నౌక 2015లో ప్లూటోకు 12 వేల కిలోమీటర్ల దగ్గరగా వెళ్లి పరిశోధించింది. ఆ తర్వాత నాలుగేళ్లకు 2019 జనవరి 1న ప్లూటోకు 160 కోట్ల కిలోమీటర్ల ఆవల ఉన్నప్పుడు... సౌరకుటుంబంలో అత్యంత దూరంలో ‘క్యూపర్ బెల్ట్’లో ‘మంచు మనిషి’ ఆకారంలో ఉన్న గ్రహశకలం ‘అరాకోట్’ (2014MU69/అల్టిమా థూలే) చెంతకు వెళ్లి అధ్యయనం చేసింది. ఈ నౌక ప్రస్తుతం భూమి నుంచి ఏడాదికి 48 కోట్ల కిలోమీటర్ల వంతున దూరంగా వెళుతోంది.బాహ్య హీలియోస్ఫియర్ ఉదజనిపై గురి!‘న్యూ హొరైజన్స్’ వ్యోమనౌక మరో మూడు వారాల్లో సూర్యుడి ‘బాహ్య హీలియోస్ఫియర్’లోని హైడ్రోజన్ గురించి పరిశోధన నిర్వహించనుంది. సూర్యుడి నుంచి నిరంతరం అంతరిక్షంలోకి విడుదలయ్యే అత్యంత శక్తిమంతమైన ఆవేశపూరిత కణాల ప్రవాహాన్ని ‘సౌర గాలి’ (సోలార్ విండ్) అంటారు. ఈ సౌర పవనం- మన సౌరవ్యవస్థలోని గ్రహాలను కూడా దాటి అంతరిక్షంలో ఓ భారీ ప్లాస్మా బుడగ ఆకృతిలో ‘హీలియోస్ఫియర్’ను ఏర్పరుస్తుంది. సాగదీసిన అశ్రుబిందువులా కనిపించే హీలియోస్ఫియర్... హానికర కాస్మిక్ రేడియేషన్, నక్షత్రాంతర ధూళి నుంచి మన సౌరవ్యవస్థను ఓ రక్షణ కవచంలా కాపాడుతుంది. సౌరవ్యవస్థ అంచుల్లో బాహ్య హీలియోస్ఫియర్ ఉదజనిపై ‘న్యూ హొరైజన్స్’ చేపట్టబోయేది ఓ కొత్త తరహా పరిశోధన. బాహ్య సౌరవ్యవస్థకు, నక్షత్రాంతర రోదసి (ఇంటర్స్టెల్లార్ స్పేస్)కి సరిహద్దుగా ఉండే ప్రాంతాన్ని ‘టెర్మినేషన్ షాక్’ అంటారు. మన సూర్యుడి మాదిరిగానే పాలపుంతలోని ఇతర నక్షత్రాల నుంచి దూసుకొచ్చే ఆవేశిత కణాలను గెలాక్టిక్ రేడియేషన్ అంటారు.ఈ ఆవేశిత కణాలతో కూడిన నక్షత్రాంతర మాధ్యమం (ఇంటర్స్టెల్లార్ మీడియం)ను సూర్యుడి బాహ్యవ్యవస్థ నిలువరించే సరిహద్దు ప్రాంతమే ‘టెర్మినేషన్ షాక్’. సూర్యుడి నుంచి గంటకు 30 లక్షల కిలోమీటర్ల ప్రచండ వేగంతో దూసుకొచ్చే సౌర గాలి ఈ ‘టెర్మినేషన్ షాక్’ హద్దును చేరుకోగానే నక్షత్రాంతర మాధ్యమ పీడనాన్ని ఎదుర్కొని వేగం కోల్పోతుంది. నక్షత్రాంతర మాధ్యమాన్ని ఢీకొని చివరికి ధ్వని వేగం కంటే కూడా తక్కువకు సౌర గాలి వేగం పడిపోతుంది. ‘టెర్మినేషన్ షాక్’ హద్దు వద్ద ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి ఇకపై శాస్త్రవేత్తలకు అవకాశం లభించనుంది. 11 ఏళ్ల పాటు కొనసాగే సౌరచక్రంలో సౌర గరిష్ఠం, సౌర కనిష్ఠం దశల సందర్భంగా ఉండే సూర్యుడి స్థితి ఆధారంగా పై హద్దులు వ్యాకోచిస్తూ, సంకోచిస్తూ మారుతుంటాయి. నాసా ప్రయోగించిన వోయేజర్-1, వోయేజర్-2 జంట వ్యోమనౌకలు 2012, 2018 సంవత్సరాల్లో హీలియోస్ఫియర్ దాటి ముందుకెళ్లాయి.అయితే బాహ్య సౌరవ్యవస్థ అన్వేషణార్థం ప్రస్తుతం ‘న్యూ హొరైజన్స్’లో ఉన్న అధునాతన శాస్త్రీయ పరికరాలు వాటిలో లేవు. ‘న్యూ హొరైజన్స్’ 2029-2040 సంవత్సరాల మధ్య కాలంలో ‘టెర్మినేషన్ షాక్’ ప్రాంతాన్ని చేరుతుందని భావిస్తున్నారు. అది అందించే డేటా కోసం ప్రపంచవ్యాప్తంగా అంతరిక్షరంగ భౌతిక శాస్త్రవేత్తలు ఆసక్తిగా నిరీక్షిస్తున్నారు. జంట వోయేజర్స్ తర్వాత విశ్వంలో సౌరవ్యవస్థను దాటి ప్రయాణించబోతున్న మూడో మానవ నిర్మిత వస్తువు ‘న్యూ హొరైజన్స్’!జమ్ముల శ్రీకాంత్ -
24 గంటలూ కరెంట్.. ఇంధనం మాత్రం జీరో!
విద్యుత్ అంటే బొగ్గు, గ్యాస్, అణుశక్తి, జలవిద్యుత్, సౌర, పవన శక్తి.. ఇప్పటివరకు ప్రపంచం చూసింది ఇవే. కానీ ఇప్పుడు జపాన్ మరో అడుగు ముందుకేసింది. ఇంధనం అవసరం లేదు.. పొగలు, కాలుష్యం ఉండదు.. గాలి ఉన్నా లేకపోయినా, ఎండ ఉన్నా లేకపోయినా 24 గంటలూ విద్యుత్ ఉత్పత్తి చేయగల సాంకేతికతను ప్రపంచానికి చూపిస్తోంది.జపాన్లోని ఫుకువోకా నగరంలో ప్రపంచంలోనే అరుదైన ‘ఆస్మోటిక్ పవర్ ప్లాంట్’ నడుస్తోంది. శాస్త్రవేత్తలు దీనిని ‘బ్లూ ఎనర్జీ’గా అభివర్ణిస్తున్నారు.సముద్రపు ఉప్పు నీరు, శుద్ధి చేసిన మురుగు నీటిలోని ఉప్పు సాంద్రత తేడాను ఉపయోగించి విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చని ఈ ప్లాంట్ ప్రపంచానికి చూపిస్తోంది.అలా ఎలా?ఇది వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా.. దీని వెనుక ఉన్న సూత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సముద్రపు ఉప్పు నీటిలో ఉప్పు సాంద్రత ఎక్కువగా ఉంటుంది. మరోవైపు మురుగు నీటిని శుద్ధి చేసిన తర్వాత మిగిలే నీటిలో ఉప్పు శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఈ రెండు రకాల నీటిని ప్రత్యేకమైన సెమీ-పర్మియబుల్ మెంబ్రేన్ (ప్రత్యేక పొర) ద్వారా వేరు చేసి ఉంచుతారు. సహజంగా ఉప్పు తక్కువగా ఉన్న నీరు.. ఉప్పు ఎక్కువగా ఉన్న నీటి వైపు కదలడానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రక్రియనే ఆస్మోసిస్ అంటారు. ఈ సహజ పీడనాన్ని టర్బైన్లకు అనుసంధానిస్తే అవి తిరిగి.. జనరేటర్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.. అంటే.. ఇంధనం లేకుండానే, ప్రకృతి సిద్ధమైన ఉప్పు సాంద్రత తేడానే విద్యుత్కు మూలం అవుతుంది.వాతావరణంతో సంబంధం లేదుసౌర విద్యుత్కు ఎండ అవసరం. పవన విద్యుత్కు గాలి అవసరం. జలవిద్యుత్కు నీటి ప్రవాహం అవసరం. కానీ బ్లూ ఎనర్జీకి ఇవేవీ అవసరం ఉండవు. సముద్రం ఉన్నంత కాలం, శుద్ధి చేసిన మంచినీరు అందుబాటులో ఉన్నంత కాలం ఈ ప్లాంట్లు నిరంతరాయంగా పనిచేస్తాయి. అందుకే భవిష్యత్తులో బేస్లోడ్ పవర్ (నిరంతర విద్యుత్ సరఫరా)కు ఇది కీలక ప్రత్యామ్నాయంగా మారొచ్చని నిపుణులు భావిస్తున్నారు.ప్రయోజనాలే ప్రయోజనాలుఈ సాంకేతికతలో బొగ్గు, గ్యాస్, డీజిల్ వంటి ఇంధనాలు అవసరం ఉండవు. కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలు దాదాపు ఉండవు. సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న నగరాలకు ఇది అత్యంత అనుకూలం. ముఖ్యంగా ఇప్పటికే మురుగు నీటి శుద్ధి కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయడం సులభం. విద్యుత్ ఉత్పత్తితో పాటు మురుగు నీటి నిర్వహణకు కూడా ఇది తోడ్పడుతుంది. ఒకేసారి రెండు సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది.సవాళ్లు కూడా..అయితే ఈ సాంకేతికత ఇప్పుడే పూర్తిస్థాయిలో వాణిజ్య వినియోగానికి సిద్ధం కాలేదు. అత్యంత నాణ్యమైన మెంబ్రేన్ల తయారీ ఖర్చు ఎక్కువగా ఉండటం ప్రధాన సవాల్. అలాగే సముద్రపు నీటిలో ఉండే ఉప్పు, సూక్ష్మ జీవుల వల్ల మెంబ్రేన్లు త్వరగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. వాటి నిర్వహణ ఖర్చు కూడా అధికంగానే ఉంటుంది. అయినా.. సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఈ సమస్యలు తగ్గుతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.ప్రపంచానికి కొత్త దారి..సముద్రపు అలల్లోనే కాదు.. సముద్రపు ఉప్పు నీటిలోనూ అపారమైన శక్తి దాగి ఉందని జపాన్ ప్రపంచానికి చూపిస్తోంది. బొగ్గు, గ్యాస్లపై ఆధారపడకుండా.. కాలుష్యాన్ని తగ్గిస్తూ.. 24 గంటలూ విద్యుత్ను అందించే 'బ్లూ ఎనర్జీ' భవిష్యత్తులో ఇంధన రంగానికే కొత్త దిశను చూపే సాంకేతికతగా మారొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇంకో విశేషం.. 2025 ఆగస్టులో జపాన్లోని ఫుకువోకాలో ఈ ‘బ్లూ ఎనర్జీ’ ప్లాంట్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. సముద్రపు ఉప్పు నీరు, శుద్ధి చేసిన మురుగు నీటి మధ్య ఉండే ఉప్పు సాంద్రత తేడాను వినియోగించే ‘ప్రెషర్ రిటార్డెడ్ ఆస్మోసిస్ (PRO)’ సాంకేతికతతో ఇది విద్యుత్ను ఉత్పత్తి చేస్తోంది. సౌర, పవన విద్యుత్లా వాతావరణంపై ఆధారపడకుండా పగలు–రాత్రి నిరంతరం పనిచేయడం దీని ప్రత్యేకత. ఈ టెక్నాలజీని ప్రపంచవ్యాప్తంగా నదులు సముద్రంలో కలిసే ప్రాంతాల్లో విస్తృతంగా అమలు చేస్తే.. ప్రపంచ విద్యుత్ అవసరాల్లో సుమారు 15 శాతం వరకు తీర్చే సామర్థ్యం ఉంటుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.:::వెబ్ స్పెషల్ -
ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్!
స్మార్ట్ఫోన్ వినియోగదారులకు గూగుల్ షాక్ ఇచ్చింది. తన ఆండ్రాయిడ్ బ్యాకప్ విధానంలో మార్పులు తీసుకువచ్చింది. ఇప్పటివరకు ప్రతి గూగుల్ ఖాతాకు లభించే 15 జీబీ ఉచిత క్లౌడ్ స్టోరేజ్ పరిమితిపై ఆధారపడుతున్న కోట్లాది మంది యూజర్లపై ఈ నిర్ణయం ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. జులై 7 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త నిబంధనల ప్రకారం.. ఇకపై ఆండ్రాయిడ్ పరికరాల బ్యాకప్ డేటా మొత్తాన్ని ఉచిత 15 జీబీ కోటాలోనే లెక్కించనున్నారు. గతంలో చాలా రకాల బ్యాకప్ అంశాలకు మినహాయింపునిస్తూ అనుసరించిన సున్నితమైన విధానానికి గూగుల్ స్వస్తి పలికింది.ఉచిత స్టోరేజ్ కోసం పెరగనున్న పోటీ!కొత్త నిబంధనల ప్రకారం.. యూజర్లు ఫోన్లను మార్చేటప్పుడు లేదా కొత్త పరికరాలను సెటప్ చేసేటప్పుడు డేటాను పునరుద్ధరించడానికి (రీస్టోర్) తోడ్పడే ఆండ్రాయిడ్ బ్యాకప్లు ఇకపై ఉచిత స్టోరేజ్ పరిమితి పరిధిలోకి వస్తాయి. అంటే, ఇప్పటివరకు జీమెయిల్ ఇమెయిల్స్, గూగుల్ డ్రైవ్ ఫైల్స్, గూగుల్ ఫోటోస్ మాత్రమే ఈ 15 జీబీ స్పేస్ను పంచుకోగా ఇకపై ఆండ్రాయిడ్ బ్యాకప్ డేటా కూడా దీనికి తోడవుతుంది.ఇంతకుముందు కేవలం ఫోటోలు, వీడియోలు, ఎంఎంఎస్ అటాచ్మెంట్ల వంటి మీడియా ఫైళ్లు మాత్రమే ఈ 15జీబీ పరిమితిలోకి వచ్చేవి. యాప్ సెట్టింగులు, కాల్ లాగ్ల వంటి మీడియా యేతర డేటాకు మినహాయింపు ఉండేది. కానీ తాజా అప్డేట్తో ఆ సౌకర్యం ఉండదు.ఇకపై స్టోరేజ్ పరిమితిలోకి వచ్చే అంశాలు..ఎస్ఎంఎస్, ఎంఎంఎస్ల పూర్తి టెక్స్ట్ కంటెంట్.వినియోగదారుల పూర్తి కాల్ లాగ్లు.ఫోన్ వాల్పేపర్లు, వై-ఫై పాస్వర్డ్లు, యూజర్ సెట్టింగ్స్.ఇన్స్టాల్ చేసిన యాప్లు, వాటికి సంబంధించిన అనుబంధ డేటా.సగటు వినియోగదారుడిపై ప్రభావం ఎంత?‘ఆండ్రాయిడ్ బ్యాకప్ మీ ఫోన్లోని డేటాను గూగుల్ ఖాతాకు సేవ్ చేయడానికి అనుమతిస్తుంది. తద్వారా దానిని సులభంగా రీస్టోర్ చేసుకోవచ్చు లేదా కొత్త డివైజ్లో సెటప్ చేయవచ్చు. మేము మా పాలసీని అప్డేట్ చేశాం. దాంతో మొత్తం ఆండ్రాయిడ్ బ్యాకప్ డేటా ఇప్పుడు గూగుల్ అకౌంట్ స్టోరేజ్ కింద లెక్కిస్తారు. దీనివల్ల సగటున ఒక పరికరానికి అదనంగా 40 ఎంబీ మాత్రమే ఖర్చవుతుందని మేము భావిస్తున్నాం’ అని గూగుల్ ప్రతినిధి అన్నారు. ఇది స్వల్పమని గూగుల్ పేర్కొంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేలా ఉండే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇప్పటికే తమ 15 జీబీ ఉచిత పరిమితికి చేరువైన వినియోగదారులకు ఈ మార్పు కూడా ఇబ్బందికరంగా మారవచ్చు. ఫలితంగా వినియోగదారులు ఇప్పటికే ఉన్న ఫైళ్లను తొలగించడమో, బ్యాకప్లను తగ్గించుకోవడమో లేదా గూగుల్ వన్ పెయిడ్ ప్లాన్లకు సబ్స్క్రైబ్ అవ్వడమో చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.వినియోగదారులకు సూచనలుమీ ఫోన్ సెట్టింగ్స్ లేదా గూగుల్ వన్ యాప్ ద్వారా ప్రస్తుతం ఎంత స్టోరేజ్ వాడారో పరిశీలించండి.అవసరం లేని యాప్స్, పాత సందేశాలు, కాల్ లాగ్స్ బ్యాకప్ను నిలిపివేయండి.స్టోరేజ్ పరిమితి ముగిసే దశలో ఉంటే పాత మెయిళ్లు, డ్రైవ్ ఫైళ్లను క్లియర్ చేయండి.స్టోరేజ్ అవసరం ఎక్కువగా ఉంటే అదనపు క్లౌడ్ స్పేస్ కోసం నెలకు కొంత రుసుము చెల్లించి 100 జీబీ లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం గల ప్లాన్కు అప్గ్రేడ్ అవ్వడాన్ని పరిశీలించవచ్చు.ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప మార్పు -
ఎలక్ట్రానిక్స్ భాగాల తయారీపై కస్టమ్స్ సుంకం మాఫీ!
దేశీయ ఎలక్ట్రానిక్స్ ఉత్పాదక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, వేరబుల్స్ (స్మార్ట్ వాచీలు వంటివి), స్మార్ట్ టీవీల తయారీలో అత్యంత కీలకమైన భాగాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని (బీసీడీ) కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మాఫీ చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మూడు వేర్వేరు నోటిఫికేషన్లను జారీ చేసింది.మూడు భాగాలకు సుంకం మినహాయింపుఎలక్ట్రానిక్ పరికరాల తయారీకి ప్రధానంగా నిలిచే మూడు భాగాల ఉత్పత్తిలో ఉపయోగించే వస్తువులపై ఈ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు వర్తిస్తుంది.డిస్ప్లే అసెంబ్లీలు: స్మార్ట్ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్ల స్క్రీన్ల తయారీకి ఇవి కీలకం.లిథియం అయాన్ సెల్స్: ఆధునిక గ్యాడ్జెట్ల బ్యాటరీల తయారీకి ఇవి ఆధారం.ఇండక్టర్ కాయిల్ మాడ్యూల్స్: విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రించేందుకు ఎలక్ట్రానిక్ సర్క్యూట్లలో వీటిని వాడుతుంటారు.పీఎల్ఐ పథకానికి అదనపు బూస్ట్భారతదేశాన్ని గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్గా మార్చాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకానికి ఈ నిర్ణయం ఊపునివ్వనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ వ్యూహాత్మక చర్య వల్ల ముడిసరుకు దిగుమతులపై ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గుతుంది. దేశీయంగా విడిభాగాల తయారీ యూనిట్లు వేగంగా విస్తరిస్తాయి. తయారీ వ్యయం తగ్గడం వల్ల భవిష్యత్తులో స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్ల ధరలు వినియోగదారులకు మరింత అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.ఐదేళ్ల పాటు వర్తింపుకేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ సుంకం మాఫీ తక్షణమే అమలులోకి రానుంది. స్థానిక పరిశ్రమలు స్థిరపడటానికి, దీర్ఘకాలిక పెట్టుబడులను ఆకర్షించడానికి వీలుగా ఈ మినహాయింపును 2029 మార్చి 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం గడువు విధించింది.ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప మార్పు -
బెంగళూరులో ‘టెక్కీ గణేశుడు’.. ఐటీ ఉద్యోగుల క్యూ!
దేశ ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరులోని కోరమంగళలో ఉన్న శ్రీ ప్రసన్న గణపతి ఆలయం మరోసారి వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో ఈ ఆలయం ‘టెక్కీ గణేశుడు’ (Techie Ganesha)గా వైరల్ కావడంతో ఉద్యోగాలు, ప్రమోషన్లు, మంచి అప్రైజల్స్ కోసం ఐటీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఆలయాన్ని సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఆలయంపై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ మొదలైంది.1979లో నిర్మించిన ఈ ఆలయం మొదట స్థానిక భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండేది. అయితే బెంగళూరు ఐటీ హబ్గా ఎదిగిన తర్వాత కోరమంగళ, హెచ్ఎస్ఆర్ లేఅవుట్, సర్జాపూర్, ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్ పరిసరాల్లో పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇక్కడికి అధిక సంఖ్యలో రావడం ప్రారంభించారు. ఉద్యోగ మార్పు, జీతం పెంపు, ప్రమోషన్, కొత్త అవకాశాల కోసం గణపతిని దర్శించుకుంటే శుభఫలితాలు వస్తాయని చాలామంది విశ్వసిస్తుండటంతో ఈ ఆలయానికి ‘టెక్కీ గణేశుడు’ అనే పేరు ప్రాచుర్యం పొందింది.ఇటీవల బెంగళూరుకు చెందిన ఓ స్థానిక వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన రీల్తో ఈ ఆలయం మళ్లీ చర్చనీయాంశమైంది. ఒకప్పుడు ప్రశాంతంగా ఉండే ఈ ఆలయం సోషల్ మీడియా ప్రచారం వల్ల ఇప్పుడు నిరంతరం రద్దీగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. రీల్స్, వైరల్ పోస్టుల కారణంగా ఆలయ ప్రశాంతత దెబ్బతిందని, స్థానికులు ఎన్నాళ్లుగానో చూసిన వాతావరణం మారిపోయిందని పేర్కొన్నారు.అయితే నెటిజన్ల అభిప్రాయాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. "దేవాలయానికి ఎక్కువ మంది రావడం మంచి విషయమే", "ప్రజలకు నమ్మకం ఉంటే వెళ్లనివ్వాలి", "భక్తిని ప్రశ్నించాల్సిన అవసరం లేదు" అని కొందరు వ్యాఖ్యానించగా, మరికొందరు మాత్రం "సోషల్ మీడియా హైప్ వల్ల ఆధ్యాత్మిక క్షేత్రాలు కూడా ట్రెండ్లుగా మారుతున్నాయి" అని అభిప్రాయపడ్డారు. మరో వినియోగదారు హైదరాబాద్లోని ‘వీసా బాలాజీ’గా ప్రసిద్ధి చెందిన చిలుకూరు బాలాజీ ఆలయాన్ని ఉదాహరణగా ప్రస్తావిస్తూ, ప్రత్యేక కోరికల కోసం ప్రసిద్ధి చెందిన ఆలయాలు దేశవ్యాప్తంగా ఉన్నాయని గుర్తు చేశారు. View this post on Instagram A post shared by RoadXRumble (@roadxrumble) -
మొబైల్ ప్రియులకు జియో బంపర్ ఆఫర్
రిలయన్స్ జియో తన మొబైల్ వినియోగదారుల కోసం మరో సంచలన ప్యాక్ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అందుబాటు ధరలో అపరిమిత వినోదాన్ని అందించడమే లక్ష్యంగా ‘జియోటీవీ ప్రో ప్యాక్’ను ప్రవేశపెట్టింది. కేవలం రూ.55 ధరతో లభించే ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా వినియోగదారులు సరికొత్త వినోదాన్ని ఆస్వాదించవచ్చని చెప్పింది.30 రోజుల వాలిడిటీ.. 1,000కు పైగా ఛానళ్లు!ఈ ప్యాక్ ద్వారా వినియోగదారులు ‘జియోటీవీ’ మొబైల్ యాప్లో 30 రోజుల పాటు ఏకంగా 1,000కు పైగా లైవ్ టీవీ ఛానళ్లను వీక్షించవచ్చు. ఇందులో వినియోగదారులు సాధారణ ఛానళ్లతో పాటు 150కు పైగా ప్రీమియం ఛానళ్లను కూడా అదనపు ఖర్చు లేకుండా చూడవచ్చు. సామాన్య వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని జియో ఈ ప్లాన్ను డిజైన్ చేసినట్లు చెప్పింది. 16కు పైగా భాషల్లో జనరల్ ఎంటర్టైన్మెంట్, సినిమాలు, వార్తలు, పిల్లల కార్యక్రమాలు, లైఫ్స్టైల్, ప్రాంతీయ కార్యక్రమాలకు చెందిన విస్తృతమైన కంటెంట్ ఈ ప్యాక్లో లభిస్తుంది.ప్రముఖ నెట్వర్క్ల ప్రీమియం కంటెంట్జియోటీవీ ప్రో ప్యాక్లో జియోస్టార్, సోనీ ఎంటర్టైన్మెంట్, సన్ టీవీ నెట్వర్క్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ, స్టార్ప్లస్ హెచ్డీ, కలర్స్ హెచ్డీ, సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ హెచ్డీ, సోనీ ఎస్ఏబీ హెచ్డీ, డిస్కవరీ, అనిమల్ ప్లానెట్.. వంటి ఛానళ్లు అందుబాటులో ఉన్నాయి.అయితే, క్రీడాభిమానులు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. జియోస్టార్, సోనీ నెట్వర్క్లకు చెందిన స్పోర్ట్స్ ఛానళ్లు మాత్రం ఈ రూ.55 ప్యాక్లో భాగం కావు.యాక్టివేషన్ సులభం.. ఎలా పొందాలంటే?మొదట మీ మొబైల్ నంబర్కు రూ.55 జియోటీవీ ప్రో ప్యాక్తో రీఛార్జ్ చేసుకోవాలి. అనంతరం జియోటీవీ యాప్ ఓపెన్ చేసి జియో మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన వెంటనే లైవ్ టీవీ సేవలు నిరంతరాయంగా ప్రారంభమవుతాయి.నిబంధనలు.. ఫీచర్లుఈ రూ.55 ప్యాక్ కేవలం వినోద సేవలకు మాత్రమే పరిమితం. ఇందులో ఉచిత వాయిస్ కాల్స్ లేదా ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉండవు. ఈ సేవను వినియోగించుకోవాలంటే కస్టమర్ మొబైల్లో ఏదైనా ఒక యాక్టివ్ జియో ప్రీపెయిడ్ లేదా పోస్ట్పెయిడ్ ప్లాన్ రన్ అవుతూ ఉండాలి. జియోటీవీ యాప్ ద్వారా కేవలం ఒకే ఒక్క మొబైల్లో ఈ సేవలను వీక్షించవచ్చు. ప్రస్తుతం ఈ రూ.55 జియోటీవీ ప్రో ప్యాక్ మైజియో యాప్, జియో అధికారిక వెబ్సైట్తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆన్లైన్, ఆఫ్లైన్ జియో రీఛార్జ్ కేంద్రాల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంది.ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధర.. తులం ఎంతంటే.. -
‘పిల్లలను లక్ష్యంగా చేసుకున్నామనడం తప్పు’
ఇన్స్టాగ్రామ్ వేదికగా పెయిడ్ ప్రకటనల ద్వారా ‘చైల్డ్ సెక్సువల్ ఎక్స్ప్లోయిటేటివ్ అండ్ అబ్యూజ్ మెటీరియల్’ (సీఎస్ఈఏఎం) ప్రచారమవుతోందన్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (మైటీ) మెటా సంస్థకు నోటీసులు జారీ చేసింది. అయితే, పిల్లలపై అనుచిత ఆసక్తి ఉన్నవారిని (పెడోఫైల్స్) లక్ష్యంగా చేసుకుని ఉద్దేశపూర్వకంగా పిల్లల కంటెంట్తో కూడిన ప్రకటనలను అనుమతించామనడం పూర్తిగా తప్పు అని మెటా స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర నోటీసులకు స్పందిస్తూ కంపెనీ ఒక అధికారిక బ్లాగ్ పోస్ట్ను విడుదల చేసింది.ఆరోపణలను తోసిపుచ్చిన మెటాప్రభుత్వ ఆందోళనలను తాము అత్యంత తీవ్రంగా పరిగణిస్తామని, తమ ప్లాట్ఫారమ్లపై ఇలాంటి హేయమైన కంటెంట్ను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని మెటా స్పష్టం చేసింది. ‘పిల్లలపై వేధింపులకు వ్యతిరేకంగా ఉన్న మా విధానాలను ఉల్లంఘిస్తూ ఇన్స్టాగ్రామ్లో వచ్చిన ప్రకటనలపై కథనాలు మా దృష్టికి వచ్చాయి. దీనికి పూర్తి విరుద్ధంగా.. పిల్లలకు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలను చూపే ఖాతాలను గుర్తించడానికి మేము అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాం. గత ఏడాది కాలంలో ఇలాంటి 4 మిలియన్లకు (40 లక్షలు) పైగా ఖాతాలను ఆటోమేటిక్గా తొలగించాం’అని మెటా బ్లాగ్ పోస్ట్లో పేర్కొంది.భారతదేశంలో గడచిన ఆరు నెలల్లోనే అనుమానాస్పద లింకులు, పిల్లల దోపిడీ సంకేతాలను గుర్తించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలను ఉపయోగించి 1.60 లక్షల ఖాతాలను తొలగించినట్లు కంపెనీ వెల్లడించింది.ఏడు రోజుల్లో నివేదిక ఇవ్వాలన్న కేంద్రంగత శుక్రవారం (జులై 4) కేంద్ర ఐటీ శాఖ మెటాకు నోటీసులు జారీ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో సీఎస్ఈఏఎం కంటెంట్కు అవకాశం కల్పించేలా ఉండే ప్రకటనలను, కంటెంట్ను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. అంతేకాకుండా, ఈ వ్యవహారంపై ఏడు రోజుల్లోగా సమగ్ర వివరణాత్మక నివేదికను సమర్పించాలని స్పష్టం చేసింది. దీనిపై స్పందించిన మెటా.. ఈ వ్యవహారం తమ దృష్టికి రాకముందే తమ నిఘా వ్యవస్థలు సదరు ఉల్లంఘన ప్రకటనలను, వాటి వెనుక ఉన్న ఖాతాలను గుర్తించి నిలిపివేశాయని తెలిపింది. అనంతరం జరిపిన అంతర్గత దర్యాప్తులో మరికొన్ని ప్రకటనలను తొలగించి ఖాతాలను రద్దు చేయడంతో పాటు ఆ కంటెంట్కు సంబంధించిన యూఆర్ఎల్లను కూడా బ్లాక్ చేసినట్లు పేర్కొంది.నేరస్థులతో నిరంతర యుద్ధంప్రపంచవ్యాప్తంగా తమకున్న 3.5 బిలియన్ల (350 కోట్లు) వినియోగదారుల్లో దాక్కుని తమ నిఘా నేత్రం నుంచి తప్పించుకోవాలని చూసే నేరస్థులతో ఇది నిరంతర యుద్ధమని మెటా వ్యాఖ్యానించింది. పిల్లల దోపిడీకి సంబంధించి తొలగించిన కంటెంట్తో పాటు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ నుంచి 40 లక్షలకు పైగా అనుమానాస్పద ఖాతాలను తొలగించామని తెలిపింది.భారతదేశంలో చట్టాల అమలు తీరును వివరిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా పిల్లల దోపిడీ ఉదంతాలు వెలుగుచూసినప్పుడు వర్తించే చట్టాల ప్రకారం అమెరికాకు చెందిన ‘నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ ప్లోయిటెడ్ చిల్డ్రన్’ (ఎన్సీఎంఈసీ)కు నివేదిస్తామని మెటా పేర్కొంది. భారతదేశంలో లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం, 2021, ఐటీ నిబంధనల ప్రకారం.. ఎన్సీఎంఈసీ ద్వారా భారత జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్కు ఈ సమాచారాన్ని మెటా తరపున నివేదిస్తామని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధర.. తులం ఎంతంటే.. -
బంగారం కాదు..ప్రపంచాన్ని శాసిస్తున్న ఆ ‘చిన్న వస్తువు’ ఏంటో తెలుసా?
ప్రస్తుతం 21వ శతాబ్దంలో.. ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైనది, అత్యంత పవర్ఫుల్ వస్తువు ఏది? అని ఎవరినైనా అడిగితే.. చాలామంది బంగారం, ప్లాటినం లేదా ముడి చమురు (క్రూడ్ ఆయిల్) అని చెప్తారు. కానీ, ఒక జర్నలిస్ట్గా ప్రపంచ పరిణామాలను నిశితంగా గమనిస్తే అసలు నిజం వేరే ఉందని అర్థమవుతుంది. ఇవాళ ప్రపంచాన్ని గడగడలాడిస్తూ.. అగ్రరాజ్యాలను శాసిస్తున్నది బంగారం కాదు.. ఒక చిన్న ఇసుక రేణువుతో తయారయ్యే 'మైక్రోచిప్'.. దాన్నే సెమీకండక్టర్ అంటారు!అవును.. మీ చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్ మొదలు.. అంతరిక్షంలోకి దూసుకెళ్లే రాకెట్ వరకు.. మీ ఇంట్లోని స్మార్ట్ టీవీ నుంచి.. యుద్ధరంగంలో శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే అత్యాధునిక డ్రోన్లు, మిస్సైళ్లు, రాడార్ వ్యవస్థల వరకు.. ఈ చిన్న చిప్ లేకపోతే ఏదీ నడవదు.. కదలదు.. అంతా డెడ్! కేవలం మన గోరు పరిమాణంలో ఉండే ఈ చిన్న చిప్స్ కోసం.. ఇప్పుడు ప్రపంచ అగ్రరాజ్యాలైన అమెరికా, చైనాల మధ్య ఒక నిశ్శబ్ద, భయంకరమైన యుద్ధం జరుగుతోంది. అదే 'గ్లోబల్ సెమీకండక్టర్ వార్'.ఇది బుల్లెట్లతో, సైన్యంతో జరిగే యుద్ధం కాదు.. గ్లోబల్ టెక్నాలజీని తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి జరుగుతున్న ఒక మైండ్ గేమ్! ఈ డిజిటల్ యుగంలో.. ఈ 'చిప్ వార్' లో గెలిచినవాడే రేపటి ప్రపంచానికి ఏకఛత్రాధిపతి.. వాడే అసలైన గ్లోబల్ డాన్! దాని కథాకమామిషు ఏంటో ఇవాళ్టి ‘సాక్షి డిజిటల్’ పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. వివరాలకు కింది వీడియోను క్లిక్ చేయండి.. -
డాక్టర్ రోబో..! ఎంత దూరం నుంచైనా..
మనిషి నిర్మించిన యంత్రాల్లో అద్భుతమైనదీ, మానవుడికి ఇప్పుడు దాదాపుగా ప్రత్నామ్నాయం లాంటిది ‘రోబో’. అప్పట్లో కేవలం సైన్స్ ఫిక్షన్లా ఉన్న ‘ రోబో’లు ఇప్పుడు మానవ దేహ నిర్మాణానికి ఉండే పరిమితులను అ«ధిగమించి పనిచేస్తున్నాయి. దాంతో కొన్ని సమయాల్లో ఫిక్షన్కూ, వాస్తవానికీ మధ్య ఉండే సన్నటి రేఖ కూడా చెరిగిపోయిందా అనిపిస్తుంటుంది. ఎందుకంటే మానవుడు చేయడానికి కొంత ఇబ్బంది పడేవీ, లేదా పూర్తిగా చేయలేకపోయే ఎన్నింటినో ‘రోబో’ అలవోకగా చేసేస్తుంది.అందులో సర్జరీలూ ఉండటం విశేషం. సర్జరీలో మనిషి చేయి కొన్ని సంక్లిష్టమైన చోట్లకు చేరడం సాధ్యం కాకపోవచ్చు. కానీ ‘యంత్రుడి’ వేళ్లు అలాంటి చోట్లకూ చేరగలవు. నిజానికి ఈ పనులు రోబో చేస్తున్నట్టు అనిపించినా మళ్లీ వాటిని నిజానికి చేసేది నిపుణులైన శస్త్రచికిత్సకులే. కొన్ని కష్టసాధ్యమైన శస్త్రచికిత్సల్ని రోబోలు ఎలా చేస్తున్నాయో, ఏయే వైద్యవిభాగాల్లోని ఏయే శస్త్రచికిత్సలు జరుగుతున్నాయో తెలపడంతో పాటు రోబోలకు సంబంధించి అనేక అంశాలను ఈ కథనంలో చూద్దాం.రోబోటిక్ టెలీ సర్జరీతో వైద్యరంగంలో కొత్త అధ్యాయం ఈ రోబో శస్త్రచికిత్సలని చెప్పవచ్చు. ప్రస్తుతం రోబోటిక్ టెలీ సర్జరీ ప్రపంచ వైద్యరంగంలో విప్లవాత్మక సాంకేతికతగా గుర్తింపు పొందుతోంది. అమెరికాలో దాదాపు పదేళ్ల క్రితమే ఈ విధానం ప్రయోగాత్మకంగాప్రారంభమైంది. యుద్ధరంగంలోని సైనికులకు నేరుగా వెళ్లి శస్త్రచికిత్స చేసే అవకాశం ఉండకపోవడంతో... సమరరంగంలో ఉన్నవారికీ సర్జరీలు చేసే ఉద్దేశంతో మొదలైన ఈ ప్రయోగాత్మక శస్త్రచికిత్సలు ఇప్పుడు పూర్తిస్థాయిలో అవసరమైన బాధితులకు అందుతున్నాయి.మన భారతదేశంలో మాత్రం గత మూడేళ్లుగా ఈ సాంకేతికత మరింత వేగంగా అభివృద్ధి చెందుతూ, వైద్య సేవలను మరింత మందికి అందునా సుదూరప్రాంతాల్లోని పేషెంట్స్కు పెద్ద పెద్ద నగరాల్లో ఉండే అత్యంత నిపుణులైన శస్త్రచికిత్సల నైపుణ్యాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. మన ఇండియా వంటి విశాలమైన దేశంలో, ఒక రాష్ట్రంలో ఉన్న నిపుణులైన వైద్యులు మరో రాష్ట్రంలో ఉన్న పేషెంట్లకు ప్రత్యక్షంగా అక్కడికి వెళ్లకుండానే రోబోటిక్ టెలీ సర్జరీ ద్వారా శస్త్రచికిత్సలు చేయగలగడం ఈ సాంకేతికత తాలూకు ప్రధాన ప్రయోజనం. దీంతో నాణ్యమైన వైద్య సేవలు దూర ప్రాంతాల రోగులకు కూడా అందుబాటులోకి వస్తున్నాయి.భారతదేశంలో రోబోటిక్ టెలీ సర్జరీకి శ్రీకారం చుట్టిన వారిలో డాక్టర్ సుధీర్ శ్రీవాత్సవ ప్రముఖులు. ఆయన ఢిల్లీలోని ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి దూర నియంత్రణ ద్వారా తొలి గుండె బైపాస్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. తర్వాత కిడ్నీ, ప్రోస్టేట్ తదితర సంక్లిష్ట శస్త్రచికిత్సలు కూడా ఈ విధానంలో విజయవంతంగా నిర్వహితమయ్యాయి.ఈ రంగంలో మరో ముఖ్యమైన మైలురాయిగా డా. చంద్రమోహన్ వడ్డి (ప్రస్తుత ఈ కథన / ఆర్టికల్) రచయిత కూడా ఢిల్లీలోని రోబోటిక్ కన్సోల్ నుంచి హైదరాబాద్లో ఉన్న కేవలం 16 నెలల చిన్నారికి ప్రపంచంలోనే అత్యంత చిన్న వయస్సులో రోబోటిక్ టెలీ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. ఈ విజయం తాలూకు కేసు వివరాలు ఇటీవల ఇండియన్ జర్నల్ ఆఫ్ యూరాలజీలో ప్రచురితమయ్యాయి.అటు తర్వాత దేశంలోని పలుప్రాంతాల మధ్య, అలాగే ఒక దేశం నుంచి మరో దేశానికి కూడా రోబోటిక్ టెలీ సర్జరీలు విజయవంతంగా నిర్వహితమవుతున్నాయి. ఇటీవల చైనా నుంచి హైదరాబాద్లోని పేషెంట్కూ టెలీ సర్జరీ నిర్వహించడం ఈ సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా ఎంత వేగంగా విస్తరిస్తోందో తెలియజేస్తోంది. భవిష్యత్తులో రోబోటిక్ టెలీ సర్జరీ ద్వారా దూరప్రాంతాల్లోని రోగులకు అత్యున్నత స్థాయి వైద్య సేవలను వేగంగా, సురక్షితంగా అందించడానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు అభిప్రాయం.ఇటీవలి చైనా కేస్ స్టడీ : ఇటీవలే మన భారతీయ డాక్టర్ ఒకరు చైనా నుంచి దాదాపుమూడు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మన హైదరాబాద్లోని పేషెంట్కు రోబో సహాయంతో శస్త్రచికిత్స చేశారు. దాదాపు 90 నిమిషాల పాటు నిర్వహించిన ఈ సర్జరీలో సుదూరంలో ఉన్న ఊహాన్ నగరంలోని టాంగ్జీ హాస్పిటల్లోంచి... దేశ దేశాంతరాలు దాటి మరీ మన హైదరాబాద్లోని పేషెంట్కు శస్త్రచికిత్స చేయడం... ఆ చేసిన వైద్యుడు కూడా డాక్టర్ సయ్యద్ మొహమ్మద్ గౌస్ అనే మన భారతీయ డాక్టర్ కావడం మన దేశవాసులందరికీ గర్వకారణమైన విషయం. అల్ట్రాఫాస్ట్ 5జీ ఇంటర్నెట్ కనెక్టివిటీతో జరిగిన ఈ సర్జరీ చేసింది. మన ఖ్యాతిని ఇనుమడింపజేసిన ఈ విషయాన్ని భారత్లోని చైనా ఎంబసీ స్పోక్స్పర్సన్ యూ జింగ్ తన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘‘3000 కిలోమీటర్ల దూరంలోని హైదరాబాద్ పేషెంట్కు 5జీ టెక్నాలజీ సహాయంతో సరిహద్దులను అధిగమించి జీవితాన్ని రక్షించే వైద్య సహాయం అందించడం ఓ అద్భుతం’’ అని ఆమె ‘ఎక్స్’లో ప్రస్తావించారు.ఆపరేషన్కు ముందర ఇక్కడ హైదరాబాద్లో కూడా డాక్టర్లు అవసరమైన ఉపకరణాలను, హై–డెఫినిషన్ కెమెరాలను సిద్ధం చేసుకోవడం వంటి పనులు చేశాక... అక్కడ వూహాన్లోని టాంగ్జీ హాస్పిటల్లో డాక్టర్ గౌస్ శస్త్రచికిత్స మొదలు పెట్టగానే ఇక్కడి రోబోటిక్ హస్తాలు శస్త్రచికిత్స చేయాల్సిన భాగాన్ని 3–డీ చిత్రాల్లో చూస్తూ తమ పనులు పూర్తి చేశాయి. హైస్పీడ్ 5జీ నెట్వర్క్ కావడంతో కేవలం 200 మిల్లీసెకండ్స్లోనే డాక్టర్ ఆజ్ఞలు పేషెంట్కు చేరి సజావుగా సర్జరీ జరగడంతో పాటు అది విజయవంతమూ అయ్యింది. అయితే సమాంతరంగా ఇక్కడ హైదరాబాద్లో కూడా ఏదైనా ఎమర్జెన్సీ అవసరమైతే రంగంలోకి దూకడానికి సిద్ధంగా డాక్టర్లంతా శస్త్రచికిత్స జరుగుతున్నంత సేపూ అప్రమత్తంగా అక్కడే ఉన్నారు.‘ద ఇంటర్నేషనల్ హెపాటో ΄్యాంక్రియాటో బిలియరీ అసోసియేషన్’, చైనీస్ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన 26 డెమాన్స్ట్రేషన్స్లో ఈ శస్త్రచికిత్స కూడా ఒకటి. ఇందులో లైవ్గా శస్త్రచికిత్స చేసి చూపినవారిలో... భారత్, బ్రెజిల్, జార్జియా, గ్రీస్, ఉజ్బెకిస్తాన్ దేశాల నుంచి వచ్చిన వైద్యనిపుణులున్నారు.చూడగలిగే రేంజ్ కూడా ఎక్కువే... రోబో చేతుల సహాయంతో సర్జరీ చేస్తున్నప్పుడు... డాక్టర్ తాను శస్త్రచికిత్స నిర్వహిస్తున్న అవయవాన్నీ, అందులోని భాగాల్నీ (ఫీల్డ్ను) 3–డీ ఇమేజ్లో తెరపై స్పష్టంగా చూస్తుంటారు. ఆ వర్చువల్ ఇమేజ్ చాలా పెద్దగా, స్పష్టంగా ఉండటంతో అక్కడి నరాలూ, రక్తనాళాలు చాలా పెద్దగా (మాగ్నిఫికేషన్తో) కంటికి కనిపిస్తుంటాయి. ఈ అంశం కూడా సాంప్రదాయికమైన శస్త్రచికిత్స కంటే రోబో చేసే సర్జరీని మరింత ప్రత్యేకంగా నిలుపుతుంది. అంటే... సంప్రదాయ శస్త్రచికిత్సలో సదరు అవయవభాగం కాస్త వెనక ఉంటే అది స్పష్టంగా కనిపించక... తెగకూడని భాగం ప్రమాదవశాత్తూ తెగేందుకు అవకాశం ఉంటే ఉండవచ్చుగానీ... చాలా ఎక్కువ మాగ్నిఫికేషన్తో అన్ని అవయవాలూ, నరాలూ, రక్తనాళాలూ కనిపిస్తున్నప్పుడు మరి దేన్నీ టచ్ చేయకుండా కేవలం కోయాల్సిన భాగంలోనే కోత పడటమూ, రక్షించాల్సిన అవయవాలకు ఏమాత్రం దెబ్బతగలకుండా చూసుకోవడం సాధ్యమవుతాయి.స్పష్టత ఎక్కువ... మెరుగుదలా ఎక్కువే... సంప్రదాయ శస్త్రచికిత్సలో నేరుగా చూసేవాటితో పోలిస్తే... ఇక్కడ రోబోటిక్ శస్త్రచికిత్సలో.... డాక్టర్లు తాము తొలగించాల్సిన హానికరమైన చిన్న కణుతుల్నీ, గడ్డలనూ... లేదా కుట్లు వేయాల్సిన అత్యంత సన్నటి సూచర్స్ వంటి వాటిని (అంటే కొన్నిసార్లు పెన్సిల్లోపలి లెడ్ కంటే సన్నటి రక్తనాళాల్నీ, అలాంటి అవయవాల్ని) స్పష్టంగా చూడగలుగుతుంటారు. దాంతో తాము చేయాల్సిన పనుల్ని నైపుణ్యంతో మరిత సమర్థంగానూ చేయగలుగుతారు. ఇక్కడ నిశితత్వం కూడా ఎక్కువే. అంటే ఉదాహరణకు తొలగించాల్సిన కణజాలాన్ని అత్యంత ఖచ్చితంగా అవసరమైనంత మేరకే తొలగించవచ్చు. అదే నేరుగా మనిషి చేతితో చేసే శస్త్రచికిత్సల్లో హానికర కణజాలాన్ని మళ్లీ పెరగకుండా నివారించేందుకు కొంత ఆరోగ్యకరమైన కణజాలాన్నీ తొలగించాల్సి రావచ్చు. కానీ రోబో సాయంతో అదెంతో ఆక్యురేట్గా జరుగుతుంది. కాబట్టి మున్ముందు హానికర కణజాలం మళ్లీ పెరగకుండా ఉండేందుకే అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఎందుకు మరింత సురక్షితమంటే... కోత చాలా చిన్నగా, ఖచ్చితంగా ఉండటంవల్ల కోలుకునే సమయం తగ్గుతుంది. గాయమూ వేగంగా మానుతుంది. కోతా, గాయం తక్కువ కావడం వల్ల ఇన్ఫెక్షన్కు అవకాశాలు బాగా తక్కువ. అంతేకాదు... సర్జరీకి పట్టే సమయమూ, అవసరమైన మత్తుమందూ, రక్తస్రావం... ఇఅన్నీ తక్కువే. దాంతో శస్త్రచికిత్స మరింత సురక్షితం కావడంతో కోలుకోవడమూ చాలా వేగంగా జరుగుతుంది.ఏయే శాఖల్లో ఏయే శస్త్రచికిత్సలు? మొదట్లో రోబో సహాయంతో నిర్వహించే శస్త్రచికిత్సలు... మెదడు వంటి కీలకమైన, సున్నితమైన ప్రదేశాల్లో చాలా లోతుగా ఉండి, మానవ హస్తంగా అంత తేలిగ్గా చేరలేని భాగాల్లోనే జరిగేవి. ఉదాహరణకు... మెదడు కణితి తొలగింపు చికిత్సల్లో ట్యూమర్ చాలా స్పష్టంగా కనిపిస్తుంటే... చిన్న రంధ్రంనుంచి అత్యంత నిశితంగా, ఎంతో నైపుణ్యంతో శస్త్రచికిత్స నిర్వహించడానికి రోబో చక్కగా సహాయపడుతుంది. బాధితులు త్వరగా కోలుకుంటారు. అలాగే మూర్ఛవ్యాధికి సాధారణంగా మందులతోనే చికిత్స జరుగుతుంది. అయితే ఎంతకీ తగ్గని కేసుల్లో అత్యంత సునిశితంగా శస్త్రచికిత్స నిర్వహించడానికి రోబో సహాయం తీసుకోవడం వల్ల సర్జరీ మరింత ఎక్కువ సురక్షితంగా జరుగుతుంది.అయితే... వైద్యశాస్త్ర విజ్ఞానం పెరుగుతున్న కొద్దీ రోబోల సర్జరీలు ఇప్పుడు రకరకాల వైద్యవిభాగాల్లోకి విస్తరించాయి. ఉదాహరణకు సంయుక్తంగా మొత్తం మూత్ర వ్యవస్థ (యూరో, నెఫ్రో, గైనిక్) విభాగాలతో పాటు ఇంకా అనేక విభాగాల్లో రోబో సహాయంతో శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. రోబోలు శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్న దేహ వ్యవస్తలూ... ఆ వ్యవస్థల్లో ఏయే శస్త్రచికిత్సలను అవి నిర్వహిస్తున్నాయో చూద్దాం.ఇతరత్రా విభాగాల్లోని శస్త్రచికిత్సలివి... ∙విపుల్ ప్రొసీజర్ : పాంక్రియాస్ (క్లోమం)లోని ‘హెడ్’ అనే భాగాన్నీ, అలాగే చిన్నపేగుల్లోని ‘డియోడినమ్’ అనే భాగాన్ని, గాల్బ్లాడర్ను (పిత్తాశయాన్ని), బైల్ డక్ట్ను తొలగించే శస్త్రచికిత్సను ‘పాంక్రియాటికో–డియోడనెక్టమీ’ అంటారు. ఇది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. ఆయా భాగాల్లోని గడ్డల తొలగింపుతో పాటు... పాంక్రియాస్, చిన్నపేగులు, గాల్బ్లాడర్లోని కొన్ని జబ్బులు (డిజార్డర్స్)లో ఇది ఉపయోగపడుతుంది. ఉదాహరణకు క్రానిక్ పాంక్రియాటైటిస్, డియోడనల్ ట్రామా వంటి చికిత్సల్లో ఎంతో బాగా ఉపయోగపడుతుంది.థైరాయిడెక్టమీ..క్యాన్సర్కు గురైన థైరాయిడ్ను తొలగించడానికి చేసే సంప్రదాయ శస్త్రచికిత్స తర్వాత మెడ చుట్టూ గీత కనిపిస్తుంది. కానీ రోబో చేసే శస్త్రచికిత్స తర్వాత ఎలాంటి గీతా ఉండదు. అందంగా కనిపించాలని కోరుకునే యువతీ యువకులకూ / పెళ్లి కావాల్సిన యువతకు కాస్మటిక్గా ఇదో వరం.భవిష్యత్ ఆశారేఖగా ‘మైక్రో–రోబో’ చికిత్స! సెకండరీ నిమోనియా ఇన్ఫెక్షన్స్ చాలా ప్రమాదకరమైనవి. ఇవి ఎంతటి ప్రమాదాన్ని తెచ్చిపెడతాయన్నది డాక్టర్లతో పాటు చాలామంది పేషెంట్లకూ తెలిసిన విషయమే. తొలుత వచ్చిన ఇన్ఫెక్షన్ కారణంగా అటు తర్వాత ఊపిరితిత్తుల్లో నిమోనియా వస్తే దాన్ని ‘సెకండరీ నిమోనియా ఇన్ఫెక్షన్’ అంటారు. నేరుగా వచ్చే నిమోనియా కంటే దీంతో ప్రమాదం చాలా ఎక్కువ.ఇలాంటి ప్రమాదకరమైన నిమోనియాకి చాలా చాలా చిన్నవైన మైక్రోస్కోపిక్ ‘రోబో’లతో కొంతకాలం కిందట వైద్య పరిశోధకులు ఎలుకల్లో ఓ ప్రయోగాత్మకమైన చికిత్స నిర్వహించారు. అతి చిన్న ఆల్గైలను (పాచిలాంటి మొక్కలను) సేకరించి మైక్రోస్కోపులో చూస్తే తప్ప కనిపించనంతటి ఆ చిన్న చిన్న జీవమున్న మొక్కలపై ‘యాంటీబయాటిక్ నానోపార్టికిల్స్’ను పైపూతగా పూశారు. ఈ పూత... ఇన్ఫెక్షన్లను సమూలంగా నిర్మూలించే తెల్లరక్తకణాల్లోని ‘న్యూట్రోఫిల్స్’.వాటినే ఓ పూతలా పూసి నిమోనియాతో బాధపడుతున్న ఎలుకల ఊపిరితిత్తులోకి ఈ సజీవ ‘మైక్రో–రోబో’లను పంపారు. జీవమున్న ఈ మైక్రో రోబోలకు ‘మైక్రోబో’ (మైక్రో + రోబో = మైక్రోబో) అని పేరు పెట్టారు. యాంటీబయాటిక్ నానోపార్టికిల్స్ పూత ఉన్న ఈ ‘మైక్రోబో’లు ఊపిరితిత్తుల్లో కదులుతూ, ఈదులాడుతూ నిమోనియాకు కారణమైన అతి చిన్న సూక్ష్మజీవులను తుదముట్టించాయి. నిమోనియా వచ్చిన కేసుల్లో చాలావరకు ‘సూడోమొనాస్ ఆరిజినోసా’ అనే అత్యంత సూక్ష్మజీవులు ఇన్ఫెక్షన్ను కలిగించి, బాధితుల మరణానికి కారణమవుతుంటాయి.ఈ సూడోమొనాస్ ఆరిజినోసా మైక్రోబ్స్ కారణంగా నిమోనియా ఇన్ఫెక్షన్ గురైన వాటిల్లోని సగం ఎలుకల్లోకి ఈ మైక్రోబోలను పంపి, మరో సగానికి పంపకుండా వదిలేశారు. మైక్రో రోబోలు పంపిన ఎలుకలన్నీ బతికాయి. మిగతావి మూడు రోజుల్లో చనిపోయాయి. ఈ ప్రయోగ ఫలితాలు ‘నేచర్ మెటీరియల్స్’ అనే మెడికల్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఇలాంటి పరిశోధనల ఫలితాలను బట్టి చూస్తే... భవిష్యత్తులో మరింత సూక్ష్మాతి సూక్ష్మమైన ప్రక్రియల నిర్వహణకు మైక్రో రోబోలు ఎలా పనిచేయగలవో అన్నది ఊహించవచ్చు. ఇది ప్రయోగదశలో ఉన్న మున్ముందు సాకారం కాబోయే చికిత్స ప్రక్రియ.మానవ హస్తం కంటే రోబోతో సర్జరీలు కొంత ఈజీ... ఎందుకంటే... మానవ మణికట్టును అటు ఇటు తిప్పి చూసినప్పుడు కొంతవరకే తేలిగ్గా తిరగగలుగుతుంది. అయితే ఓ రోబో మణికట్టు మాత్రం ఎటువైపైనా దాదాపు 270 డీగ్రీల వరకు తిరిగేలా రూపొందిస్తారు. ఇక రోబో చేతులూ, వేళ్లూ సన్నగా, బాగా పొడుగ్గా ఉంటాయి. దాంతో సన్నటి ఇరుకైన చోట్లకు కూడా చేరగలుగుతాయ. అంతేకాదు... వాటికి అందించిన ఆదేశాల మేరకు ముందుగా నిర్దేశించిన మేరకు మాత్రమే కోసేలా... ఖచ్చితంగా అంతే గాటు పెట్టేలా చూస్తాయి. ఇలా మానవహస్తానికి కష్టసాధ్యమైన శస్త్రచికిత్స ప్రక్రియల్ని రోబో సహాయంతో డాక్టర్లు చేయగలుగుతారు.మూత్ర / గైనిక్ వ్యవస్థలో ... ∙మూత్రపిండాల శస్త్రచికిత్సలో : మూత్రపిండం నుంచి మూత్రాశయానికి (బ్లాడర్కు) మూత్రం తీసుకొచ్చే పైపులు... యురేటర్లలో ఏవైనా అడ్డంకులు ఏర్పడినప్పుడు ‘పైలో΄్లాస్టీప్రొసిజర్’ అనే శస్త్రచికిత్సతో దాన్ని చక్కదిద్దవచ్చు. (ఉదాహరణకు యురేటరో–పెల్విక్ జంక్షన్లో అడ్డంకి. దీన్నే యూపీజే అబ్స్టక్షన్ అని అంటారు). అలాగే మూత్రపిండాల్లో ఏర్పడ్డ గడ్డల (రీనల్ ట్యూమర్స్) తొలగింపు, కిడ్నీని పూర్తిగా తొలగించడానికి చేసే నెఫ్రెక్టమీ వంటి చికిత్సల్లో రోబోలు బాగా ఉపయోగపడతాయి.ప్రోస్టెక్టమీ :ప్రోస్టేట్ గ్రంథిని తొలగించే శస్త్రచికిత్సలో..గైనకాలజీలో: గర్భసంచికీ... అలాగే గర్భాశయ ముఖద్వారంలో క్యాన్సర్ (ప్రీ–మెలిగ్నెంట్ సర్విక్స్ అండ్ యుటెరస్) వచ్చే అవకాశముందని తెలిసినప్పుడు; ఫైబ్రాయిడ్, అడినోమయోసిస్ వంటి గడ్డల తొలగింపులో; ఎండోమెట్రియాసిస్ కేసుల్లో సమస్యాత్మకమైన / వ్యాధికి గురైన భాగాలను తొలగించడానికి రోబోలు చక్కగా ఉపయోగపడతాయి. మామూలుగా ఇలాంటి సమస్య ఉన్నప్పుడు బాధితుల్లో రుతుస్రావం సరిగా రాకపోవడం, తీవ్రమైన నొప్పి వంటి సమస్యలు ఎక్కువ. రోబో శస్త్రచికిత్సలతో వాటిని తేలిగ్గా సరిదిద్దవచ్చు. యుటెరస్ పెద్దదిగా ఉన్నప్పుడు రోబో చేసే శస్త్రచికిత్సతో తేలిగ్గా తొలగించవచ్చు. మరీ ముఖ్యంగా ఎండోమెట్రియమ్ శస్త్రచికిత్సలో అడ్హెషన్స్ వచ్చినప్పుడు (ఒక అవయవంలో ఒక భాగం ఇతర శరీర అవయవ భాగాలకు అతక్కుపోవడం) అది సర్జన్లకు ఓ సవాలుగా మారుతుంది. రోబో చేతులు వాటిని తేలిగ్గా విడదీస్తాయి.యూరో–గైనకాలజీ శస్త్రచికిత్సల్లో: పొత్తికడుపు కింది భాగంలోని అవయవాలు చాలా దగ్గరదగ్గరగా ఉంటాయి. అవి మరో అవయవంలోకి చొచ్చుకునిపోయి (హెర్నియా కేసులతో) బాధించేప్పుడు చేసే సాక్రోకాల్పోపెక్సీ చేయడానికీ; అలాగే దగ్గినప్పుడూ, ఒత్తిడికి గురైనప్పుడు తమ ప్రమేయం లేకుండా బాధితుల్లో మూత్రం పడిపోయే కేసుల్లో చేసే కాల్పోసస్పెన్షన్ప్రొసీజర్లలో, ఫిస్టులా రిపేర్ల వంటి కేసుల్లో సర్జరీ కాంప్లికేషన్లను తగ్గించేందుకు రోబోలు ఎక్కువగా సహాయపడుతుంటాయి.భవిష్యత్తులో మరింత చవగ్గా... ఇప్పుడు చాలా చోట్ల అమెరికన్ తయారీ రోబోలు ఉపయోగంలో ఉన్నాయి. ఇవి బాగా ఖరీదు కావడంతో ఈ శస్త్రచికిత్సలూ కాస్త ఖరీదే. అయితే భారతీయ రోబోలు అతి వేగంగా అందుబాటులోకి రానున్నాయి. ఎస్ఎస్ఐ మంత్ర ఇలాంటి వాటిల్లో ఒకటి. ఇవి అమెరికన్ రోబోల ఖరీదులో సగానికే దొరుకుతాయి. ఫలితంగా అవి అందుబాటులోకి వస్తే ఇప్పటివరకూ అడ్వాన్స్డ్గా పరిగణిస్తున్న లాపరోస్కోపీ సర్జరీల స్థానంలో ఇవి... అన్ని వర్గాల ప్రజలకూ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. అందునా చాలా చవగ్గా కూడా.- డా. వి. చంద్రమోహన్, సీనియర్ యూరో సర్జన్. నిర్వహణ: యాసీన్ -
11 ఏళ్లకే 25 కోట్ల స్టార్టప్.. టెక్ ప్రపంచానికి చాలెంజ్!
గొప్పగొప్ప ఆవిష్కరణలు సైన్స్ల్యాబ్లోనే పుట్టాల్సిన పని లేదు స్కూలు బ్యాగు మోసే కుర్రవాడి బుర్రలో కూడా పుట్టొచ్చు. ఇందుకు నిదర్శనమే అత్విక్ అమిత్ కుమార్. తమిళనాడుకి చెందిన ఈ కుర్రవాడి వయసేమో 11 ఏళ్లు. ఇంకా స్కూలు చదువులు కూడా పూర్తి కాకుండానే ఓ స్టార్టప్ పెట్టి టెక్ ప్రపంచానికి చాలెంజ్ విసిరాడు.బిజినెస్ కార్డులు వ్యాపారంలో విరివిగా వాడుతుంటారు. ఓ వ్యక్తి అడ్రస్ మారినా, లేదా పని చేస్తున్న కంపెనీ మారినా తన బిజినెస్ కార్డుని మళ్లీ కొత్తగా తయారు చేయించాలి. ఇది ఎక్కడైనా మామూలుగా జరిగేదే.. కాని ఇదే అత్విక్ని ఆలోచింపజేసింది. అప్పుడు పుట్టిన ఆలోచనే డిజిటల్ బిజినెస్ కార్డ్. ఈ కార్డ్ మీద ఎన్ఎఫ్సీ, క్యుఆర్ కోడ్ ఆధారిత చిప్ ఉంటుంది. ఆ చిప్ను స్కాన్ చేస్తే వ్యక్తి తాలూకు మొబైల్ నంబర్, ఈ మెయిల్, అడ్రస్, సోషల్ మీడియా ప్రొఫైల్స్, జాబ్ పోర్టల్స్, కంపెనీ పేరు, లొకేషన్ సహా పూర్తి సమాచారం మన మొబైల్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.కార్డ్ వినియోగించే వ్యక్తి ఓ ప్రత్యేకమైన యాప్తో లింక్ చేసి ఎప్పటికప్పుడు తన డీటెయిల్స్ను అప్డేట్ చేస్తే సరిపోతుంది. ఇలా ఒక డిజిటల్ కార్డ్ జీవితాంతం వినియోగించేందుకు సరిపోతుంది. దీనికోసం మళ్లీ పేపర్ వర్క్స్, కార్డ్ ప్రింటింగ్ ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. ఈ వినూత్న ఆలోచనలో ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో సంచలనం సృష్టించింది. పెట్టుబడిదారులు ఈ ఆవిష్కరణ విలువ 25 కోట్లుగా నిర్ధారించారు. స్కూలు బ్యాగు మోసే వయసులో స్టార్టప్ పెట్టి ఇంటర్నేషనల్ మార్కెట్ని షేక్ చేసిన అత్విక్ను సోషల్ మీడియా వేదికగా నెటిజెన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. -
ఒక్క కంపెనీ.. 3,200 మంది ‘గేమ్’ ఓవర్!
మైక్రోసాఫ్ట్కు చెందిన గేమింగ్ విభాగం ఎక్స్బాక్స్ (Xbox) తన చరిత్రలోనే అతిపెద్ద పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టింది. మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 20 శాతం మంది అంటే 3,200 మంది ఉద్యోగులను దశలవారీగా తొలగించనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇందులో తొలి విడతగా 1,600 మందిని వెంటనే విధుల నుంచి తప్పించగా, మిగిలిన కోతలను 2027 ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు పూర్తి చేయనుంది. మైక్రోసాఫ్ట్ వ్యాప్తంగా కొనసాగుతున్న ఖర్చుల నియంత్రణ, ఏఐ ఆధారిత పెట్టుబడుల పెంపు నేపథ్యంలో ఎక్స్బాక్స్లో ఈ మార్పులు చోటుచేసుకుంటున్నాయి.ఉద్యోగులకు పంపిన లేఖలో ఎక్స్బాక్స్ సీఈఓ ఆశా శర్మ సంస్థ ప్రస్తుత పరిస్థితిపై స్పష్టంగా స్పందించారు. "ప్రస్తుతం మా వ్యాపారం ఆరోగ్యకరంగా లేదు. ఇతర ప్రముఖ గేమింగ్ ప్లాట్ఫారమ్లు, పబ్లిషింగ్ సంస్థలతో పోలిస్తే మా లాభ మార్జిన్లు 3 నుంచి 10 రెట్లు తక్కువగా ఉన్నాయి" అని పేర్కొన్నారు. గతంలో చేసిన పలు వ్యూహాత్మక పెట్టుబడులు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడం, గేమింగ్ మార్కెట్లో పెరిగిన పోటీ, హార్డ్వేర్ వ్యయాలు పెరగడం సంస్థపై ఒత్తిడి పెంచాయని వివరించారు.నాలుగు గేమింగ్ స్టూడియోల విభజనపునర్వ్యవస్థీకరణలో భాగంగా ఎక్స్బాక్స్కు చెందిన నాలుగు గేమింగ్ స్టూడియోలను కొత్త యాజమాన్యానికి అప్పగించనుంది. అలాగే మరో స్టూడియో భవిష్యత్తుపై కూడా వ్యూహాత్మక సమీక్ష కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం అభివృద్ధిలో ఉన్న ప్రధాన గేమ్ ప్రాజెక్టులను రద్దు చేసే ఉద్దేశం లేదని సంస్థ స్పష్టం చేసింది.నిర్వహణ వ్యవస్థలో భారీ మార్పులుసంస్థలో కొన్ని విభాగాల్లో 14 స్థాయిల మేనేజ్మెంట్ ఉండటంతో నిర్ణయాలు ఆలస్యమవుతున్నాయని ఆశా శర్మ పేర్కొన్నారు. అందుకే ఇకపై మేనేజ్మెంట్ పొరలను గరిష్ఠంగా ఐదు స్థాయిలకే పరిమితం చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే బాహ్య విక్రేతలపై (Vendor) వ్యయాన్ని 50 శాతం వరకు తగ్గించే నిర్ణయం తీసుకున్నారు.కొత్త సీఓఓగా హెలెన్ చియాంగ్ఎక్స్బాక్స్ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు హెలెన్ చియాంగ్ను కొత్త చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO)గా నియమించారు. కంటెంట్, హార్డ్వేర్, ప్లాట్ఫారమ్, సేవలపై సమగ్ర బాధ్యత ఆమెకు ఉంటుంది. మొజాంగ్ (Minecraft), కింగ్ (Candy Crush) వంటి ప్రధాన స్టూడియోలు కూడా ఇకపై నేరుగా సీఈఓ పరిధిలోకి రానున్నాయి.ఉద్యోగుల తొలగింపులు బాధాకరమైనవేనని, అయితే అవి ఉద్యోగుల ప్రతిభను ప్రతిబింబించవని ఆశా శర్మ స్పష్టం చేశారు. "ఎక్స్బాక్స్ను మరింత దృఢమైన సంస్థగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికీ పెట్టుబడులు కొనసాగుతాయి. అయితే ఇకపై మరింత క్రమశిక్షణతో, స్పష్టమైన వ్యూహంతో ముందుకు వెళ్తాం" అని ఆమె పేర్కొన్నారు.This is an important email I sent today to all employees at XBOX:Team,We are beginning the most significant restructure in XBOX history. After careful consideration, I've made the difficult decision to reduce our team by approximately 3,200 throughout FY27. This will include…— ASHA (@asha_shar) July 6, 2026 -
ఐటీ కంపెనీలు.. ఆ మూడు నెలలూ అంతంతే..!
దేశీయ ఐటీ సేవల రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27) తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో అంతంత మాత్రపు ఫలితాలనే నమోదు చేసే అవకాశం ఉందని బ్రోకరేజ్ సంస్థ ఎక్విరస్ సెక్యూరిటీస్ అంచనా వేసింది. అంతర్జాతీయ స్థూల ఆర్థిక అనిశి్చతి, భౌగోళిక రాజకీయ పరిణామాలతో పాటు ఏఐ ఆధారిత ఉత్పాదకత పెంపుపై కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో క్లయింట్ సంస్థలు సాంకేతిక పెట్టుబడుల విషయంలో ఇప్పటికీ ఆచితూచి వ్యవహరిస్తున్నాయని ఎక్విరస్ తెలిపింది. దేశంలోని ఆరు అగ్రస్థాయి ఐటీ కంపెనీల స్థిర కరెన్సీ ఆదాయం త్రైమాసిక ప్రాతిపదికన మైనస్ (–) 1.7% క్షీణత నుంచి 1.1 శాతం వృద్ధి మధ్య నమోదయ్యే అవకాశం ఉందని ఎక్విరస్ అంచనా వేసింది.కంపెనీల వారీగా వృద్ధి అంచనాలు ఇలా.. వర్టెక్స్ కొనుగోలును మినహాయిస్తే ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 2.8 నుంచి 4.3 శాతం స్థిర కరెన్సీ ఆదాయ వృద్ధి గైడెన్స్ ఇవ్వవచ్చు. లార్జ్క్యాప్ ఐటీ కంపెనీల్లో టెక్ మహీంద్రా ఈ త్రైమాసికంలో అత్యుత్తమ వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉంది. విప్రో క్యూ1 లో తక్కువ వృద్ధి నమోదు చేయవచ్చు. అలాగే సెపె్టంబర్ క్వార్టర్కు గాను –2% నుంచి ఫ్లాట్ వృద్ధి గైడెన్స్ ఇచ్చే వీలుంది. హెచ్సీఎల్ టెక్ తన ప్రస్తుత ఆదాయ వృద్ధి అంచనాలను, ఎబిట్ మార్జిన్ గైడెన్స్ను యథాతథంగా కొనసాగించవచ్చు. మిడ్ క్యాప్ కంపెనీల్లో పర్సిస్టెంట్ సిస్టమ్స్, ఎంఫసీస్, ఈక్లెర్క్స్ మెరుగైన వృద్ధిని నమోదు చేయవచ్చని తెలిపింది. యూరప్కు చెందిన ఆటోమొబైల్ తయారీ సంస్థల నుంచి ఆర్డర్లు తగ్గడంతో కేపీఐటీ టెక్నాలజీస్ తొలి త్రైమాసిక డాలర్ ఆదాయం ఏడాది ప్రాతిపదికన సుమారు 1 శాతం తగ్గే అవకాశం ఉందని ముందుగానే హెచ్చరించింది.పెట్టుబడులపై లాభాలు వస్తేనే వ్యయాలు క్లయింట్ సంస్థలు తమ సాధారణ ఐటీ పెట్టుబడులను నియంత్రించుకుంటున్నాయి. కొత్త ప్రాజెక్టులకు అధిక వ్యయాలు కేటాయించడం లేదు. ప్రస్తుతానికి ఖర్చులు వెండార్లను తగ్గించుకోవడం వంటి అంశాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. కృత్రిమ మేధపై పెడుతున్న పెట్టుబడుల స్పష్టమైన వ్యాపార ఫలితాలు, పెట్టుబడిపై రాబడి ఇస్తున్నాయనే నమ్మకం ఏర్పడే వరకు అదనపు ఐటీ వ్యయాలను పెంచే అవకాశాలు కనిపించడం లేదని తెలిపింది. పాత సాఫ్ట్వేర్లను అప్గ్రేడ్ చేయడం, డేటా మేనేజ్మెంట్, క్లౌడ్ సేవలు, సైబర్ సెక్యూరిటీ భద్రతా వ్యవస్థల అమలులో దేశీయ ఐటీ కంపెనీల పాత్ర కీలకంగా ఉంటుందని ఎక్విరస్ వివరించింది.యాక్సెంచర్ గైడెన్స్తో ఆందోళనగత నెలలో అంతర్జాతీయ ఐటీ దిగ్గజం ‘యాక్సెంచర్’ తన పూర్తి సంవత్సర 2026 రెవెన్యూ వృద్ధి గైడెన్స్ను 3–5% నుండి 3–4 శాతానికి తగ్గించడం ప్రపంచ ఐటీ పరిశ్రమలో ఆందోళనలను రేకెత్తించింది. యాక్సెంచర్ మధ్య స్థాయి మార్కెట్ సెగ్మెంట్పై దృష్టి పెట్టడం వల్ల భారతీయ మిడ్–క్యాప్ ఐటీ కంపెనీలపై పోటీ తీవ్రం కానుంది. ఈ నేపథ్యంలో, జూలై 9 నుండి ప్రారంభం కానున్న క్యూ1 ఫలితాల సీజన్లో ఐటీ యాజమాన్యాల వ్యాఖ్యలపైనే మార్కెట్ వర్గాల దృష్టి ఉండనుంది.రూపాయి బలహీనతతో మార్జిన్లకు మద్దతు తొలి త్రైమాసికంలో డాలర్ మారకంలో రూపాయి విలువ మూడు శాతం బలహీనపడింది. సరఫరా పరిస్థితులు అనుకూలంగా ఉండటం, ఉత్పాదకత మెరుగుపడటం వంటి అంశాలు ఐటీ కంపెనీల మార్జిన్లకు కొంత మద్దతునిస్తాయని తెలిపింది. అయితే, జూన్ త్రైమాసికం తర్వాత కూడా వృద్ధిపై స్పష్టత వచ్చే వరకు ఐటీ రంగం షేర్ల విలువలు (వాల్యుయేషన్స్) పరిమితంగానే ఉండే అవకాశముందని ఎక్విరస్ అభిప్రాయపడింది. -
మైక్రోసాఫ్ట్లో 4,800 మంది ఉద్యోగుల తొలగింపు!
టెక్ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రేసు తీవ్రతరమవుతున్న వేళ ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజం ‘మైక్రోసాఫ్ట్’ సంచలన నిర్ణయం తీసుకుంది. సంస్థ అంతటా సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు, ఏఐ మౌలిక సదుపాయాలపై భారీగా పెరుగుతున్న పెట్టుబడులను తట్టుకునేందుకు వీలుగా ఉద్యోగాల కోతకు శ్రీకారం చుట్టింది. తన మొత్తం శ్రామిక శక్తిలో 2.1 శాతం అంటే సుమారు 4,800 మంది ఉద్యోగులను విధుల్లోంచి తొలగిస్తున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది.రూ.58 లక్షల కోట్లకు చేరిన ఏఐ ఖర్చులుప్రస్తుత ఏడాది ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజాల ఏఐ వ్యయాలు ఏకంగా 700 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.58.8 లక్షల కోట్లు) చేరుకున్నాయి. అయితే, ఈ భారీ పెట్టుబడులకు తగ్గట్టుగా రాబడులను (ఆర్ఓఐ) చూపించాల్సిన ఒత్తిడి కంపెనీలపై తీవ్రంగా ఉంది. మరోవైపు, వ్యాపార సామర్థ్యాన్ని పెంచేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వాడుతుండటంతో మానవ వనరుల అవసరం తగ్గుతోంది. కేవలం మైక్రోసాఫ్ట్ మాత్రమే కాకుండా ఈ ఏడాది అమెజాన్, మెటా ప్లాట్ఫామ్స్ వంటి ఇతర బిగ్ టెక్ కంపెనీలు సైతం వేలాది మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: వినియోగదారులను ముంచే ‘ఉత్తుత్తి’ ప్రకటనలు -
నోకియా ఫీచర్ ఫోన్లలో AI ఫీచర్.. కొత్త మోడళ్లు లాంచ్!
మార్కెట్లో నోకియా కీప్యాడ్ ఫోన్లకు మంచి డిమాండ్ ఉండేది. కాలక్రమంలో స్మార్ట్ఫోన్లకు ఆదరణ పెరగడంతో కంపెనీ కొత్త కీప్యాడ్ మొబైల్స్ లాంచ్ చేయడం మానేసింది. అయితే ఇప్పుడు హెచ్ఎమ్డీ గ్లోబల్ తాజాగా నాలుగు కొత్త ఫీచర్ ఫోన్లను విడుదల చేసింది.హెచ్ఎమ్డీ లాంచ్ చేసిన నాలుగు ఫోన్లు 'నోకియా 200 4జీ, నోకియా 210 4జీ, నోకియా 215 4జీ సెకండ్ ఎడిషన్, నోకియా 235 4జీ సెకండ్ ఎడిషన్'. వీటి ప్రత్యేకత ఏమిటంటే, మొదటిసారిగా ఫీచర్ ఫోన్లలో కూడా AI అసిస్టెంట్ బటన్ ప్రవేశపెట్టడం.ఈ ఫోన్లలో డీ-ప్యాడ్ మీద ఒక ప్రత్యేక బటన్ ఉంటుంది. దాని ద్వారా Sikey AI అనే అసిస్టెంట్ పనిచేస్తుంది. ఇది వినియోగదారుల వాయిస్ కమాండ్లకు స్పందించి ఫ్లాష్లైట్ ఆన్ చేయడం, కెమెరా ఓపెన్ చేయడం, రిమైండర్లు సెట్ చేయడం, అలాగే సాధారణ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం వంటి పనులు చేస్తుంది.వీటిలో 1450mAh బ్యాటరీ, 4G సపోర్ట్, బ్లూటూత్ 5.0, ఎఫ్ఎమ్ రేడియో, USB-C ఛార్జింగ్ వంటి సదుపాయాలు ఉన్నాయి. మోడల్ను బట్టి 2.4 అంగుళాలు లేదా 2.8 అంగుళాల డిస్ప్లేలు అందుబాటులో ఉంటాయి. అయితే కంపెనీ ఈ ఫోన్ ధరలను అధికారికంగా వెల్లడించలేదు. -
జియో రూ.448 Vs ఎయిర్టెల్ రూ.469 ప్లాన్.. ఏది బెస్ట్?
భారతదేశంలోని ప్రముఖ టెలికాం సంస్థలైన రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్ తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం సిమ్ను యాక్టివ్గా ఉంచాలనుకునే వినియోగదారుల కోసం ప్రత్యేక వాయిస్ ఓన్లీ ప్లాన్లు అందిస్తున్నాయి. ముఖ్యంగా ఎక్కువ డేటా అవసరం లేకుండా కేవలం కాల్స్, ఎస్ఎంఎస్ల కోసం సిమ్ను ఉపయోగించే వారికి ఈ ప్లాన్లు అనుకూలంగా ఉంటాయి. వీటి గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.జియో రూ.448 ప్లాన్జియో రూ.448 ప్లాన్ ద్వారా వినియోగదారులు 84 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్, మొత్తం 1,000 ఎస్ఎంఎస్లు పొందుతారు. అయితే ఈ ప్లాన్లో మొబైల్ డేటా లభించదు. అదనంగా జియోటీవీ, జియోఏఐ క్లౌడ్ వంటి సేవలు లభిస్తాయి. అయితే.. ఈ ప్లాన్తో జియో 5G సేవలు అందుబాటులో ఉండవు. అవసరమైతే వేరుగా డేటా వోచర్ రీచార్జ్ చేసుకుని ఇంటర్నెట్ను ఉపయోగించుకోవచ్చు.ఎయిర్టెల్ రూ.469 ప్లాన్ఎయిర్టెల్ రూ.469 ప్లాన్ కూడా 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో అపరిమిత వాయిస్ కాల్స్, 900 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. ఈ ప్లాన్లో కూడా డేటా ఉండదు. అవసరమైతే డేటా వోచర్ను విడిగా రీచార్జ్ చేసుకోవచ్చు. అదనపు ప్రయోజనంగా 12 నెలల పాటు అడోబ్ ఎక్స్ప్రెస్ ప్రీమియం ఉచిత యాక్సెస్, సేఫ్ నెట్వర్క్ సర్వీస్, ఫ్రీ హలో ట్యూన్స్ వంటి సౌకర్యాలు కూడా అందిస్తారు.ఈ రెండు ప్లాన్లు వాయిస్ కాల్స్ కోసం మంచి ఎంపికలే. అయితే జియో ప్లాన్లో 1,000 ఎస్ఎంఎస్లు లభిస్తే, ఎయిర్టెల్ ప్లాన్లో 900 ఎస్ఎంఎస్లు మాత్రమే ఉంటాయి. అయితే ఎయిర్టెల్ అదనంగా అడోబ్ ఎక్స్ప్రెస్ ప్రీమియం వంటి ఉపయోగకరమైన సర్వీస్ అందిస్తుంది.ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. మీ ప్రాంతంలో ఏ నెట్వర్క్ మెరుగ్గా పనిచేస్తుందో దాని ఆధారంగా ఎంపిక చేసుకోవడం మంచిది. జియో సేవలు బాగా అందుబాటులో ఉంటే రూ.448 ప్లాన్ మంచి ఎంపిక. అదనపు డిజిటల్ ప్రయోజనాలు కావాలనుకునే వారు ఎయిర్టెల్ రూ.469 ప్లాన్ను ఎంచుకోవచ్చు.ఇదీ చదవండి: ఐఫోన్ కొనేందుకు ఇది మంచి సమయం! -
ఐఫోన్ కొనేందుకు ఇది మంచి సమయం!
అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా.. యాపిల్ ఐఫోన్ 16పై భారీ ధర తగ్గింపును ప్రకటించారు. ప్రారంభంలో రూ.79,900 ధరతో విడుదలైన 128GB వేరియంట్ ఇప్పుడు రూ.62,900కే అందుబాటులో ఉంది. అంటే వినియోగదారులకు నేరుగా రూ.17,000 వరకు తగ్గింపు లభిస్తోందన్నమాట. అంతేకాకుండా.. అర్హత కలిగిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే అమెజాన్ పే క్యాష్బ్యాక్ రూపంలో రూ.3,145 వరకు తిరిగి పొందే అవకాశం ఉంది. దీంతో ఈ ఫోన్ రూ.59,755లకు లభిస్తుంది.ఈ సేల్లో అమెజాన్.. ఐఫోన్ 16పై సుమారు 21 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. అదనంగా ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులు, ఎస్బీఐ డెబిట్ కార్డులపై రూ.1,750 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంతే కాకుండా.. పాత స్మార్ట్ఫోన్ను ఎక్స్చేంజ్ చేస్తే, దాని మోడల్, కండిషన్లను బట్టి గరిష్టంగా రూ.41,050 వరకు ఎక్స్చేంజ్ విలువ పొందే అవకాశం ఉంది. దీంతో కొత్త ఐఫోన్ను మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.ఈ ఆఫర్ను పొందాలంటే అర్హత కలిగిన క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేయాలి. క్యాష్బ్యాక్ మొత్తం కొనుగోలు పూర్తైన తర్వాత అమెజాన్ పే బ్యాలెన్స్ రూపంలో జమ అవుతుంది. ఒకవేళ వినియోగదారుల వద్ద పాత స్మార్ట్ఫోన్ ఉంటే, ఎక్స్చేంజ్ ఆఫర్ను కూడా కలిపి మరింత ఆదా చేసుకోవచ్చు. అలాగే ఒకేసారి మొత్తం చెల్లించలేని వారు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు.ఫీచర్ల విషయానికి వస్తే.. ఐఫోన్ 16లో 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్ప్లే ఉంటుంది. ఇందులో యాపిల్ A18 చిప్సెట్ ఉండటంతో వేగవంతమైన పనితీరు లభిస్తుంది. యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లకు కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఫోటోగ్రఫీ కోసం 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12 మెగాపిక్సెల్ ట్రూడెప్త్ ఫ్రంట్ కెమెరాను అందించారు.ఇంకా ఈ స్మార్ట్ఫోన్ 5G కనెక్టివిటీ, USB టైప్-సీ పోర్ట్, IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్, మ్యాగ్సేఫ్ వైర్లెస్ ఛార్జింగ్ వంటి ఆధునిక ఫీచర్లతో వస్తుంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే గరిష్టంగా 22 గంటల వీడియో ప్లేబ్యాక్ అందుతుందని యాపిల్ పేర్కొంది. మొత్తం మీద అమెజాన్ ప్రైమ్ డే సేల్లో లభిస్తున్న భారీ తగ్గింపులు, క్యాష్బ్యాక్, ఎక్స్చేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ వంటి ప్రయోజనాలతో ఐఫోన్ 16 కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. -
14 ఏళ్లకే పారిశ్రామికవేత్త.. బుర్జ్ ఖలీఫాలో ఆఫీస్!
సాధారణంగా చాలామంది 14 ఏళ్ల విద్యార్థులు పాఠశాల చదువుల్లో బిజీగా ఉంటారు. కానీ జైనమ్ జైన్ అనే బాలుడు మాత్రం దుబాయ్లో ఏఐ స్టార్టప్ను స్థాపించి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇతడు ప్రారంభించిన మెంగో ఇంజిన్ (Mengo Engine) అనే సంస్థ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనమైన 'బుర్జ్ ఖలీఫా'లో ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడం విశేషం. దీంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో గుర్తింపు పొందిన అత్యంత పిన్న వయస్కులైన AI పారిశ్రామికవేత్తల్లో జైనమ్ ఒకరిగా నిలిచాడు.జైనమ్ జైన్ స్థాపించిన మెంగో ఇంజిన్ సంస్థ.. వ్యాపార సంస్థలకు మార్కెటింగ్, కస్టమర్ కమ్యూనికేషన్, సేల్స్ సపోర్ట్, కంటెంట్ తయారీ వంటి పనులను AI సహాయంతో వేగంగా, సమర్థవంతంగా నిర్వహించే సేవలను అందిస్తోంది. తక్కువ వయస్సులోనే సాంకేతిక రంగంలో అడుగుపెట్టి, వ్యాపార సంస్థలకు వినూత్న పరిష్కారాలను అందించడం ద్వారా ఇతడు ప్రత్యేక గుర్తింపు పొందాడు.జైనమ్కు చిన్నప్పటి నుంచే వ్యాపారంపై ఆసక్తి ఉండేది. కేవలం ఆరు సంవత్సరాల వయస్సులో తన తండ్రితో కలిసి ఒక వ్యాపార సమావేశానికి వెళ్లినప్పుడు.. అతనిలో పారిశ్రామికవేత్త కావాలనే ఆలోచన మొదలైంది. అప్పటి నుంచి చదువుతో పాటు వ్యాపార సమావేశాల్లో పాల్గొనడం, విజయవంతమైన వ్యాపారవేత్తలను కలవడం, వారి అనుభవాల నుంచి నేర్చుకోవడం వంటి విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాడు.13 ఏళ్ల వయస్సులో జైనమ్ IGCSE పదో తరగతి సిలబస్ను కేవలం 105 రోజుల్లో పూర్తి చేశాడు. కంపెనీ అభివృద్ధికి ఎక్కువ సమయం కేటాయించాలనే ఉద్దేశంతో వేగంగా చదవడం, నేర్చుకోవడం అలవాటు చేసుకున్నాడు. పుస్తకాల ద్వారా నేర్చుకునే విద్యతో పాటు ప్రత్యక్ష అనుభవం కూడా సమానంగా ముఖ్యమని అతను విశ్వసిస్తాడు. ఈ కారణంగానే చాలామంది పారిశ్రామిక వేత్తలను కలుసుకోవడానికి సమయం కేటాయిస్తాడు.స్టార్టప్ నిర్వహణతో పాటు.. జైనమ్ TEDx వేదికపై ప్రసంగించాడు, అతని పేరుమీద రెండు పేటెంట్లు కూడా ఉన్నాయి. అంతే కాకుండా ఇతడు ఒక పుస్తకాన్ని రచించాడు. అతని యూట్యూబ్ ఛానెల్కు 1.45 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. 10 ఏళ్ల వయస్సు నుంచే అతను తనకు తానే 50 రోజుల ఛాలెంజ్ వంటివి నిర్దేశించుకునేవాడు. ఈ సమయంలో 50 పుస్తకాలు చదవడం, 50 వ్యాపార కార్యక్రమాల్లో పాల్గొనడం, భారతదేశంలో సుమారు 6,000 కిలోమీటర్లు ప్రయాణించి వివిధ రంగాల నిపుణులు, వ్యాపారవేత్తలను కలవడం వంటి సవాళ్లను విజయవంతంగా పూర్తి చేశాడు.భవిష్యత్తులో.. తన సంస్థను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా నిర్మించడమే లక్ష్యమని జైనమ్ చెబుతున్నాడు. విజయానికి వయస్సు అడ్డంకి కాదని, మంచి ఆలోచనలు, క్రమశిక్షణ, నిరంతర కృషి ఉంటే ఎవరైనా తమ కలలను నిజం చేసుకోవచ్చని అతను నమ్ముతున్నాడు. జైనమ్ జైన్ ప్రయాణం నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ, చిన్న వయస్సులోనే గొప్ప విజయాలను సాధించవచ్చని నిరూపిస్తోంది.ఇదీ చదవండి: నెలకు రూ.4 లక్షలు.. ఫ్రీగా థాయ్లాండ్ ట్రిప్! -
ఒక్క రూ.15వేలు ఉంటే చాలు.. స్మార్ట్ఫోన్లపై భలే ఆఫర్లు
స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి అమెజాన్ ప్రైమ్ డే 2026 సేల్ మంచి అవకాశంగా మారింది. మెమరీ, స్టోరేజ్ చిప్ల ధరలు పెరగడంతో గత కొంతకాలంగా స్మార్ట్ఫోన్ల ధరలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రూ.15 వేలలోపు మంచి ఫీచర్లతో కూడిన 5జీ ఫోన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సేల్లో పలు ప్రముఖ బ్రాండ్లు ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తున్నాయి. ప్రైమ్ డే 2026 సేల్ జూలై 4 నుంచి 6 వరకు కొనసాగుతుండగా, ఇది ప్రైమ్ సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉంది.ఈ సేల్లో శాంసంగ్, రెడ్మీ, ఐక్యూఓ, రియల్మీ, లావా వంటి బ్రాండ్లకు చెందిన పలు బడ్జెట్ 5జీ స్మార్ట్ఫోన్లు తగ్గింపు ధరలకు లభిస్తున్నాయి. ముఖ్యంగా రూ.15 వేలలోపు విభాగంలో బ్యాటరీ, కెమెరా, డిస్ప్లే, 5జీ కనెక్టివిటీ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చే వినియోగదారులకు ఇవి మంచి ఎంపికలుగా నిలుస్తున్నాయి.అంతేకాదు, ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులు, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులు, ఎంపిక చేసిన ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం వరకు తక్షణ తగ్గింపు లభిస్తోంది. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో చెల్లిస్తే 5 శాతం అపరిమిత క్యాష్బ్యాక్ కూడా అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన మోడళ్లపై 12 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్చేంజ్ బోనస్లు కూడా వర్తిస్తాయి.ఇదిగో ఇవన్నీ రూ.15000 లోపే..రియల్మీ నార్జో 80 లైట్ లిస్టింగ్ ధర రూ. 16,999, ఆఫర్ ధర రూ. 11,499 రెడ్ మీ ఏ7 ప్రో 5జీ లిస్టింగ్ ధర రూ. 15,999, ఆఫర్ ధర రూ. 12,999 ఐక్యూ జెడ్10 లైట్ 5జీ లిస్టింగ్ ధర రూ. 27,999, ఆఫర్ ధర రూ. 13,749 శాంసంగ్ గెలాక్సీ M17 5G లిస్టింగ్ ధర రూ. 16,499, ఆఫర్ ధర రూ. 14,499రియల్మీ నార్జో 100 లైట్ 5జీ లిస్టింగ్ ధర రూ. 24,999, ఆఫర్ ధర రూ. 14,499లావా బోల్డ్ ఎన్2 లిస్టింగ్ ధర రూ. 15,999, ఆఫర్ ధర రూ. 11,249 శాంసంగ్ గెలాక్సీ M17e 5G లిస్టింగ్ ధర రూ. 16,999, ఆఫర్ ధర రూ. 12,999రెడ్ మీ 15సీ 5జీ లిస్టింగ్ ధర రూ. 29,999, ఆఫర్ ధర రూ. 14,999గమనిక: కొన్ని మోడళ్లలో చూపిస్తున్న "లిస్టింగ్ ధర"లో బ్యాంక్ ఆఫర్లు, కూపన్లు, ఎక్స్చేంజ్ బోనస్లు లేదా వేరియంట్ ఆధారిత ధరలు ఉండే అవకాశం ఉంది. కొనుగోలు చేసే ముందు సంబంధిత ఉత్పత్తి పేజీలో తుది ధరను ఒకసారి పరిశీలించడం మంచిది. -
ఈ హైదరాబాద్ ఐటీ దంపతుల సంపాదన పెరిగిందిలా..
మెట్రో నగరాల్లో నామ మాత్రపు సంపాదనతో నెట్టుకురావడం కష్టం. దంపతులిద్దరి సంపాదన తోడైతేనే సిటీ జీవనం సాఫీగా సాగుతుంది. ఈ క్రమంలో హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అభిషేక్ సింగ్ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో పంచుకున్న కెరీర్ అనుభవం ప్రస్తుతం ఐటీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాను, తన భార్య కలిసి గత ఎనిమిదేళ్లలో ఆదాయాన్ని గణనీయంగా పెంచుకున్న విధానాన్ని వివరిస్తూ చేసిన పోస్టు వేలాది మంది దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ సలహాలపై నిపుణుల అభిప్రాయాలు భిన్నంగా వ్యక్తమవుతున్నాయి.అభిషేక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరూ ఐటీ రంగంలో కెరీర్ను ప్రారంభించిన సమయంలో వారి ఉమ్మడి నెలవారీ టేక్హోమ్ జీతం సుమారు రూ.66 వేలు మాత్రమే. ప్రస్తుతం ఎనిమిదేళ్ల తర్వాత అప్పటి కంటే ఊహించని స్థాయిలో ఆదాయం పొందుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో రెండు కీలక నిర్ణయాలు తమ ఆర్థిక పురోగతికి ప్రధాన కారణమయ్యాయని చెప్పారు.ఉద్యోగ మార్పులే కీలకంకెరీర్ ప్రారంభ దశలో ఉద్యోగ మార్పులను తప్పనిసరిగా పరిగణించామని అభిషేక్ వెల్లడించారు. తక్కువ జీతంతో సంపద సృష్టించడం కష్టమని, మెరుగైన వేతనం కోసం సంస్థలను మార్చడం వేగవంతమైన మార్గంగా భావించామని వివరించారు. అలాగే, తమలో ఒకరు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే, మరొకరు కూడా అదే సమయంలో అవకాశాలు వెతకడం ఒక అలవాటుగా మార్చుకున్నామని చెప్పారు. దీంతో ఇద్దరి మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఏర్పడటమే కాకుండా, వేతన చర్చల్లో కూడా పరస్పర అనుభవం ఉపయోగపడిందని ఆయన పేర్కొన్నారు. వేర్వేరు టెక్నాలజీ విభాగాల్లో పనిచేసినా, మార్కెట్లో ఉన్న వేతన ధోరణులపై స్పష్టమైన అవగాహన ఏర్పడేదని వివరించారు.తొలి పదేళ్లు నేర్చుకోవడానికే..యువ ఐటీ ఉద్యోగులు కెరీర్ ప్రారంభ దశలో ప్రతి రెండు లేదా మూడు సంవత్సరాలకు ఒకసారి కొత్త అవకాశాలను పరిశీలించాలని అభిషేక్ సూచించారు. ఇలా చేయడం ద్వారా కొత్త టెక్నాలజీలు, విభిన్న సంస్థల పని విధానం, నాయకత్వ శైలులు తెలుసుకునే అవకాశం లభిస్తుందని అన్నారు. అయితే 30 ఏళ్ల తర్వాత కుటుంబ బాధ్యతలు, పిల్లల చదువు, గృహ రుణాలు వంటి అంశాల కారణంగా ఉద్యోగ భద్రత, స్థిరత్వానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. "మొదటి పదేళ్లు ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత మంచిది. అదే సమయంలో సాధ్యమైనంత ఎక్కువ ఆదాయం సంపాదించాలి. తర్వాత దశలో సంపాదించిన ఆర్థిక భద్రతను కాపాడుకోవడంపైనే దృష్టి పెట్టాలి" అని ఆయన వ్యాఖ్యానించారు.ఇది చదివారా? బెంగళూరులో 130 ఏళ్ల ఇల్లు.. భలే మార్చిన ఐటీ దంపతులుసోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలుఅభిషేక్ పోస్టుకు స్పందించిన పలువురు ఐటీ నిపుణులు ఆయన సూచనలకు మద్దతు పలికారు. కెరీర్ ప్రారంభ దశలో ఉద్యోగ మార్పులు వేతన పెరుగుదలకు దోహదపడతాయని కొందరు పేర్కొన్నారు. అయితే మరికొందరు దీనిపై విభేదించారు. తరచూ ఉద్యోగాలు మారితే దీర్ఘకాలిక నిబద్ధతపై సంస్థలకు సందేహాలు తలెత్తే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ప్రస్తుత మార్కెట్లో అనేక కంపెనీలు తరచూ ఉద్యోగాలు మారిన అభ్యర్థుల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయని వ్యాఖ్యానించారు. కుటుంబ బాధ్యతలు, రుణాలు, వ్యక్తిగత పరిస్థితులు కూడా ప్రతి ఒక్కరిలో భిన్నంగా ఉంటాయని గుర్తుచేశారు.మార్కెట్ ధోరణి ఏమంటోంది?ఇటీవలి కాలంలో భారత ఐటీ రంగంలో భారీ నియామకాల వేగం కొంత మందగించినప్పటికీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా ఇంజినీరింగ్ వంటి ప్రత్యేక నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులకు ఇప్పటికీ మంచి డిమాండ్ కొనసాగుతోంది. హెచ్ఆర్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఉద్యోగ మార్పు ఒక్కటే అధిక వేతనానికి మార్గం కాదు. నైపుణ్యాల పెంపు, పనితీరు, నాయకత్వ సామర్థ్యం, వ్యాపార అవగాహన వంటి అంశాలు కూడా దీర్ఘకాలిక కెరీర్ విజయాన్ని నిర్ణయించే కీలక అంశాలుగా మారుతున్నాయి.#CandidMorning 🤷♂️My wife and I both work in IT, and in just 8 years, we’ve reached income levels we never thought possible when we started out, maybe 50% of where we are.Looking back, two things made the biggest difference.First, we treated job switches like a must, not a… https://t.co/BbFhBc7B1q— Abhishek Singh (@ChaiAndMiles) July 1, 2026 -
డేంజర్ బెల్స్.. ప్రపంచాన్ని కుదిపేసే ఎల్నినో సిగ్నల్!
భూమిపై అతిపెద్ద మహాసముద్రం.. దాని లోతుల్లో వేల కిలోమీటర్ల మేర నిశ్శబ్దంగా ప్రయాణిస్తున్న ఒక భారీ వేడి నీటి ప్రవాహం.. అదే ఇప్పుడు ప్రపంచ వాతావరణ శాస్త్రవేత్తలను అప్రమత్తం చేస్తోంది. ఏకంగా 14,500 కిలోమీటర్ల పొడవున్న ‘కెల్విన్ వేవ్ (Kelvin Wave)’ ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రం మీదుగా తూర్పు దిశగా కదులుతోంది. ఈ ఒక్క పరిణామం ప్రపంచ వాతావరణాన్ని నెలల తరబడి ప్రభావితం చేసే ఎల్నినో (El Nino) తిరిగి బలపడుతున్న సంకేతంగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.అమెరికా వాతావరణ సంస్థ NOAA ఇప్పటికే ఎల్నినో పరిస్థితులు తిరిగి ప్రారంభమైనట్లు ప్రకటించింది. ఈ భారీ వేడి నీటి అలను నాసా–యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సంయుక్తంగా నిర్వహిస్తున్న Sentinel-6 Michael Freilich ఉపగ్రహం అత్యంత స్పష్టంగా నమోదు చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.మాన్స్టర్ వేవ్.. కానీ సునామీ కాదు!సముద్రంలో 14,500 కిలోమీటర్ల అల అని వినగానే భయంకరమైన కెరటం కళ్ల ముందు మెదులుతుంది. కానీ ఇది అలాంటి అల కాదు. ఇది సముద్రం లోతుల్లో ప్రయాణించే వేడి నీటి ప్రవాహం. దీన్ని శాస్త్రవేత్తలు కెల్విన్ వేవ్ అంటారు. ఇది సముద్రం అడుగున వేల కిలోమీటర్ల మేర నిశ్శబ్దంగా కదులుతూ, ఉపరితలంలోని నీటిని కూడా వేడెక్కిస్తుంది. ఈ వేడి నీరు తూర్పు పసిఫిక్కు చేరుకున్నప్పుడు సముద్ర ఉష్ణోగ్రతలు పెరిగి ఎల్నినో పరిస్థితులు ఏర్పడతాయి.🌊 A 14,500-km “monster wave” of warm water is moving across the Pacific.Tracked from space by NASA’s Sentinel-6 satellite, the massive Kelvin wave is pushing heat eastward — a major signal of a strengthening El Niño. pic.twitter.com/SkZ0ebXIs0— StarSnap 🌟 (@StarSnap_1) July 4, 2026ఎందకంత ప్రమాదకరం?సాధారణంగా పసిఫిక్లో తూర్పు నుంచి పడమర వైపు వీచే ట్రేడ్ గాలులు వేడి నీటిని ఇండోనేషియా, ఆస్ట్రేలియా వైపు నెట్టేస్తాయి. అయితే ఆ గాలులు బలహీనపడితే, ఆ వేడి నీరు తిరిగి తూర్పు వైపు ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. కొన్ని ప్రాంతాల్లో సముద్ర మట్టం 15 సెంటీమీటర్ల వరకు ఎత్తు పెరిగినట్లు ఉపగ్రహాలు గుర్తించాయి. ఇది చిన్న మార్పుగా కనిపించినా, ప్రపంచ వాతావరణ వ్యవస్థకు ఇది ఒక పెద్ద సంకేతం.ప్రపంచానికి ఎందుకు టెన్షన్?ఎల్నినో అనేది ఒక దేశానికి లేదా ఒక సముద్రానికి మాత్రమే సంబంధించిన పరిణామం కాదు. ఇది భూమి మొత్తం వాతావరణ సమతుల్యాన్ని మార్చగల శక్తి. దీని కారణంగా ఒక దేశంలో రికార్డు స్థాయిలో వర్షాలు.. మరో దేశంలో తీవ్ర కరువు.. ఎక్కడో అడవి మంటలు.. మరెక్కడో శక్తివంతమైన తుఫాన్లు వస్తాయి. అలాగే, ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు కొత్త రికార్డులు నమోదు అవతాయి. ఇవన్నీ ఎల్నినోతో ముడిపడి ఉండే అవకాశాలు. అందుకే ప్రపంచవ్యాప్తంగా వాతావరణ శాస్త్రవేత్తలు దీనిని అత్యంత నిశితంగా గమనిస్తుంటారు.భారత్పై ఎలాంటి ప్రభావం?భారత్కు ఎల్నినో పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది రుతుపవనాలు. ఎల్నినో బలంగా ఉంటే సాధారణంగా నైరుతి రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉంటుంది. దాంతో కొన్ని రాష్ట్రాల్లో వర్షపాతం తగ్గవచ్చు. వ్యవసాయ రంగంపై ప్రభావం పడొచ్చు. జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గితే విద్యుత్ ఉత్పత్తి నుంచి తాగునీటి వరకు అనేక రంగాలపై ప్రభావం కనిపించవచ్చు. అయితే ఈసారి మరో అంశం కొత్త ఆశను కలిగిస్తోంది. అదే భారత మహాసముద్ర డైపోల్ (IOD). ఇది అనుకూలంగా ఉంటే ఎల్నినో ప్రభావాన్ని కొంత మేర తగ్గించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.‘సూపర్ ఎల్నినో’ వస్తుందా?శాస్త్రవేత్తలను ఎక్కువగా ఆందోళనకు గురిచేస్తున్న అంశం ఇదే. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ పెరిగితే దాన్ని సూపర్ ఎల్నినోగా పరిగణిస్తారు. NOAA అంచనాల ప్రకారం, ఈసారి అలాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం 63 శాతం వరకు ఉంది. అది జరిగితే ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వాతావరణ ఘటనలు పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.🚨 A 14,500-km "monster wave" is crossing the Pacific as El Niño strengthensNASA's Sentinel-6 satellite detected a vast subsurface warm-water (Kelvin) wave stretching nearly 14,500 km across the tropical PacificThe heat pulse raised sea-surface height by up to 15 cm#SSTVI pic.twitter.com/2QKrSoVcEh— Geo Politics Desk (@GeoPoliticsDesk) July 4, 2026 -
ట్రాయ్ నివేదిక.. అగ్రస్థానంలో జియో!
టెలికాం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) 2026 మే నెలలో హైదరాబాద్లో నిర్వహించిన స్వతంత్ర డ్రైవ్ టెస్ట్ (IDT) నివేదికలో రిలయన్స్ జియో నెట్వర్క్ పనితీరు అత్యుత్తమంగా నమోదైంది. మాదాపూర్, అమీర్పేట్, మెహిదీపట్నం, శంషాబాద్ వంటి కీలక ప్రాంతాలతో సహా నగరంలోని 157.9 కిలోమీటర్ల మార్గాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో జియో డేటా, వాయిస్ సేవల్లో తన స్వీయ ప్రకటిత ప్రమాణాలను మించి రాణించింది.ఈ నివేదికలో ప్రధానాంశం ఏమిటంటే.. జియో తన 5G, 4G నెట్వర్క్లపై సగటున 222.12 Mbps డౌన్లోడ్ స్పీడ్ను నమోదు చేసింది. ఇది కంపెనీ ప్రకటించిన సాధారణ డౌన్లోడ్ వేగం 15.00 Mbps కంటే 14 రెట్లు అధికం. అప్లోడ్ స్పీడ్ కూడా ఇదే తరహాలో ఉంది. సగటున 19.43 Mbps నమోదు కాగా, ఇది కంపెనీ ప్రకటించిన 7.00 Mbps కంటే చాలా ఎక్కువ. ఆటో సెలక్షన్ మోడ్లో సేకరించిన 22,063 నెట్వర్క్ నమూనాల్లో కేవలం 319 నమూనాల్లో మాత్రమే బలహీన సిగ్నల్ నమోదైంది. మార్గం మొత్తంలో "నో కవరేజ్" పరిస్థితి ఒక్కసారి కూడా నమోదు కాకపోవడం విశేషం.హైదరాబాద్లోని నివాస, వాణిజ్య, రవాణా కేంద్రాల్లో జియో నెట్వర్క్ స్థిరత్వాన్ని ఇది ప్రతిబింబిస్తోంది. వాయిస్ సేవల్లో కూడా జియో నాణ్యత అత్యుత్తమంగా నిలిచింది. విజయవంతంగా అనుసంధానమైన 202 కాల్స్లో ఒక్కటి కూడా డ్రాప్ కాలేదు. అలాగే, 191 కాల్స్లో మూడు సెకన్ల కంటే ఎక్కువసేపు నిశ్శబ్దం (కాల్ సైలెన్స్) నమోదైన సందర్భం ఒక్కటి కూడా లేదు.ఆపరేటర్లు స్వయంగా ప్రకటించే నెట్వర్క్ ప్రమాణాలను వాస్తవ పరిస్థితుల్లో పరీక్షించి నిర్ధారించడమే ట్రాయ్ IDT ప్రధాన లక్ష్యం. మాదాపూర్, అమీర్పేట్ వంటి రద్దీగా ఉండే వాణిజ్య కేంద్రాల నుంచి శంషాబాద్ వంటి శివారు ప్రాంతాల వరకూ.. హైదరాబాద్లో జియో నెట్వర్క్ తన ప్రకటిత ప్రమాణాలను మించి పనిచేస్తున్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా డేటా వినియోగం విపరీతంగా పెరుగుతున్న తరుణంలో ఈ ఫలితాలు జియో స్థానాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి. -
వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్పై కేంద్రం నజర్
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రతిపాదిత ‘యూజర్ నేమ్’ ఫీచర్పై కేంద్ర ప్రభుత్వం, మెటా సంస్థల మధ్య చర్చలు ముమ్మరమయ్యాయి. ఈ సరికొత్త ఫీచర్పై కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) వివరణ కోరిన నేపథ్యంలో, మెటా ప్రతినిధులు శుక్రవారం ప్రభుత్వ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.ఈ భేటీలో ప్రభుత్వ అధికారులు తమకున్న పలు ఆందోళనలను మెటా బృందం ముందు ఉంచారు. అలాగే, గతంలో ఆదేశించినట్లుగానే మూడు రోజుల్లోగా దీనిపై సమగ్రమైన, వివరణాత్మక ప్రతిస్పందనను సమర్పించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా కంపెనీ తన అధికారిక సమాధానాన్ని అందిస్తుందని నమ్మదగిన వర్గాలు వెల్లడించాయి.కేంద్రం నోటీసులు.. నిలిచిపోయిన రోల్అవుట్ఈ వారం ప్రారంభంలోనే వాట్సాప్లో యూజర్ నేమ్ల రోల్ అవుట్ ప్రక్రియపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వం మెటా సంస్థకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వంతో పూర్తిస్థాయి చర్చలు ముగిసి అన్ని అనుమానాలు నివృత్తి అయ్యే వరకు ఈ ఫీచర్ను భారతదేశంలో విడుదల చేయవద్దని కేంద్రం కంపెనీని కరాఖండిగా ఆదేశించింది. ప్రధానంగా సైబర్ భద్రత, వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఫీచర్ ఆన్లైన్ మోసాలకు, గోప్యతా ఉల్లంఘనలకు దారితీసే అవకాశం ఉందని పలువురు నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.అసలు ఏంటి ఈ యూజర్ నేమ్ ఫీచర్?వినియోగదారుల పేర్లు ‘@’ చిహ్నంతో ప్రారంభమయ్యే ఒక ప్రత్యేకమైన ఐడెంటిఫైయర్గా ఉంటాయి. ఇది పూర్తిగా ఐచ్ఛికం (ఆప్షనల్). ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ వ్యక్తిగత మొబైల్ నంబర్లను ఇతరులతో షేర్ చేయకుండానే మెసేజ్లు లేదా కాల్స్ రిసీవ్ చేసుకోగలుగుతారు. యూజర్ ప్రొఫైల్స్లో కనిపించే సాధారణ డిస్ ప్లే పేర్ల కంటే ఈ ‘యూజర్ నేమ్’లు భిన్నంగా ఉంటాయి. డిస్ ప్లే పేర్లు ప్రత్యేకంగా ఉండాల్సిన పనిలేదు, కానీ యూజర్ నేమ్స్ మాత్రం ఒక్కొక్కరికి యూనిక్గా ఉంటాయి. మీ ఫోన్ నంబర్ సేవ్ చేయని వ్యక్తులకు డైరెక్ట్ మెసేజ్లు, కాల్స్, గ్రూప్ చాట్లలో డిఫాల్ట్గా మీ ‘యూజర్ నేమ్’ మాత్రమే కనిపిస్తుంది.ఇతరులు దుర్వినియోగం చేయకుండా లేదా క్లెయిమ్ చేయకుండా ఉండటానికి.. కొన్ని నిర్దిష్ట వినియోగదారు పేర్లను వ్యాపారాలు, ప్రభుత్వ సంస్థలు, ప్రజా ప్రముఖులకు మెటా ముందే కొన్ని యూజర్ నేమ్లను కేటాయించనుంది.నిపుణుల ఆందోళనమెటా సంస్థ ఎన్ని రక్షణ చర్యలు చెప్తున్నప్పటికీ సైబర్ సెక్యూరిటీ నిపుణులు, ఇంటర్నెట్ వినియోగదారులు మాత్రం దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘మోసగాళ్లు ప్రముఖ వ్యక్తులు, ప్రైవేట్ సంస్థలు లేదా ప్రభుత్వ విభాగాలను పోలి ఉండేలా నకిలీ యూజర్ నేమ్స్ సృష్టించే ప్రమాదం ఉంది. దీనివల్ల సాధారణ ప్రజలు సులభంగా మోసపోయే అవకాశం ఉంది’ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేంద్రం ఇచ్చిన నోటీసుకు మెటా ఇచ్చే సమాధానం, ప్రస్తుతం జరుగుతున్న సంప్రదింపుల ఫలితం ఆధారంగానే.. భారతదేశంలో ఈ వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్ అసలు ప్రారంభమవుతుందా లేదా? ఒకవేళ వస్తే ఎప్పుడు వస్తుంది? అనేది తేలనుంది.ఇదీ చదవండి: బ్యాటరీ లైఫ్ పెరగాలంటే ఈ తప్పులు చేయకండి! -
ఈ-రిక్షాల బ్యాటరీల హ్యాకింగ్ కలకలం
దేశవ్యాప్తంగా సామాన్యుడి రవాణాకు అనువుగా ఉన్న ఈ-రిక్షాలను టార్గెట్ చేస్తూ సాగుతున్న డిజిటల్ దోపిడీపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రోడ్డుపై ప్రయాణికులతో వెళ్తున్న ఈ-రిక్షాల బ్యాటరీలను రిమోట్ విధానంలో నిలిపివేస్తూ (షట్డౌన్) కొందరు కేటుగాళ్లు డ్రైవర్లను బ్లాక్మెయిల్ చేస్తున్న ఉదంతాలు వెలుగుచూడటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు కారణమవుతున్న పలు ‘బ్యాటరీ మేనేజ్మెంట్ యాప్లను’ వెంటనే బ్లాక్ చేయాలంటూ అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.చైనా యాప్ల ద్వారా సైబర్ ముఠాల దాడులుఈ వివాదంలో ప్రధానంగా చైనా సంస్థలు అభివృద్ధి చేసిన యాప్లు ఉన్నట్లు కేంద్ర ఐటీ శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. వీటిలో షెంజెన్ గ్రీనర్జీ టెక్నాలజీ, షెంజెన్ రుయిచువాంగ్ లినెంగ్ టెక్నాలజీ, డేలీ బీఎమ్ఎస్.. వంటి యాప్లు ఉన్నాయి. సాధారణంగా లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ల్లో ఛార్జ్, వోల్టేజ్, ఉష్ణోగ్రత, సెల్ ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి ‘బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్’ (బీఎంఎస్) ఉంటాయి. అయితే, వీటికి సరైన పాస్వర్డ్ లేదా పిన్ రక్షణ లేకపోవడంతో దుండగులు బ్లూటూత్ లేదా స్థానిక కనెక్టివిటీ ద్వారా వీటిని హ్యాక్ చేస్తున్నారు. ఇందుకు ఇంటర్నెట్ కూడా అవసరం లేకపోవడం గమనార్హం.వైరల్ వీడియోలతో వెలుగులోకి..గత వారం రోజులుగా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. నడుస్తున్న ఈ-రిక్షాలు అకస్మాత్తుగా రోడ్డు మధ్యలోనే ఆగిపోవడం, ఆ వెంటనే కొందరు వ్యక్తులు వచ్చి డ్రైవర్ల నుంచి డబ్బులు వసూలు చేయడం ఆ వీడియోల్లో కనిపించింది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఇటువంటి ఘటనే కలకలం రేపింది. అక్కడి లోతి తిరాహా ప్రాంతంలో ఒక ఈ-రిక్షా ఆగిపోగా దాన్ని బాగుచేస్తానంటూ ఒక యువకుడు డ్రైవర్ నుంచి రూ.200 డిమాండ్ చేశాడు. అనుమానం వచ్చిన పోలీసులు ఆ యువకుడిని విచారించగా యాప్ ద్వారా బ్యాటరీని నిలిపివేసి ఆపై డబ్బులు గుంజే రాకెట్ నడుస్తున్నట్లు నీల్ గంగ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ తరుణ్ కురిల్ ధ్రువీకరించారు.నిబంధనల్లో లొసుగులే శాపమా?ప్రస్తుతం మనదేశంలో ఈ-రిక్షాలను ‘L5M’ కేటగిరీ వాహనాలుగా పరిగణిస్తారు. ప్రముఖ తయారీదారులు వీటికి ‘ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ’ (ఐసీఏటీ) నుంచి సర్టిఫికేషన్ పొందుతారు. అయితే, ఐసీఏటీ నిబంధనల ప్రకారం బ్యాటరీల ఎలక్ట్రికల్, మెకానికల్ సేఫ్టీని మాత్రమే పరీక్షిస్తారు. ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన ఏఐఎస్-189 వంటి ప్రమాణాలలో సైబర్ సెక్యూరిటీ నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని ఈ-రిక్షాలకు తప్పనిసరి చేయకపోవడమే ఈ సైబర్ దాడులకు ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతానికి యాప్లను నిషేధించినప్పటికీ పాస్వర్డ్ లేని ఈ బ్యాటరీల భద్రతా లోపాలను పూర్తిస్థాయిలో సరిదిద్దడానికి మరిన్ని సాంకేతిక మార్పులు అవసరమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.ఇదీ చదవండి: బ్యాటరీ లైఫ్ పెరగాలంటే ఈ తప్పులు చేయకండి! -
స్మార్ట్ఫోన్ విభాగంలోకి ‘ఫైర్ బోల్ట్’
స్మార్ట్ పరికరాల తయారీ సంస్థ ‘ఫైర్ బోల్ట్’ స్మార్ట్ఫోన్ విభాగంలోకి అడుగుపెడుతోంది. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ‘బోల్ట్’ అనే సరికొత్త స్మార్ట్ఫోన్ బ్రాండ్ను ఆగస్టు మధ్య నాటికి మార్కెట్లోకి తీసుకురానున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ అర్ణవ్ కిషోర్ ప్రకటించారు. ఇందుకోసం ప్రాథమికంగా 50 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 472 కోట్లు) పెట్టుబడి పెట్టాలని ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ నిధులను ఉత్పత్తి అభివృద్ధి, తయారీ, మార్కెటింగ్, పంపిణీ, నెట్వర్క్ విస్తరణకు కేటాయించామన్నారు. మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా ఈ పెట్టుబడులను మరింత పెంచుతామని కిషోర్ తెలిపారు.రూ. 10,000 – రూ. 15,000 ధరల్లో ఫోన్లుఈ బ్రాండ్ కింద రూ.10,000 నుంచి రూ.15,000 ధరల శ్రేణిలో 4జీ, 5జీ స్మార్ట్ఫోన్ మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. రాబోయే పండగ సీజన్ కంటే ముందే దేశవ్యాప్తంగా ఈ ఫోన్లను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. మార్కెట్లోకి వచి్చన తొలి 4–5 నెలల్లోనే 5 లక్షల నుండి 10 లక్షల యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అర్ణవ్ కిషోర్ వివరించారు.ఒప్పో ఇండియా నుంచి రెనో16 సిరీస్స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో ఇండియా తాజాగా రెనో16 సిరీస్ని ఆవిష్కరించింది. ఇందులో రెనో16, రెనో16సీ ఉంటాయి. దేశీయంగా తొలి హోలోవర్స్ 3డీ డిజైన్, 50 ఎంపీ టెలిఫోటో లెన్స్తో ఏఐ పోర్ర్టెయిట్ కెమెరా, హెచ్డీఆర్ వీడియో రికార్డింగ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. వేరియంట్ని బట్టి స్నాప్డ్రాగన్ 7 జెన్4, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్, 6700 ఎంఏహెచ్ బ్యాటరీ మొదలైన ప్రత్యేకతలు ఉన్నాయి. రెనో16 ధర రూ. 61,999 నుంచి, రెనో16సీ రేటు రూ. 46,999 నుంచి ప్రారంభమవుతుంది. జూలై 9 నుంచి ఇవి అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఒప్పో ఈ–స్టోర్స్లో లభిస్తాయి. బ్యాంకును బట్టి 10 శాతం వరకు క్యాష్బ్యాక్, జీరో డౌన్పేమెంట్, రూ. 5,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్లాంటివి ఆఫర్లు ఉన్నట్లు సంస్థ తెలిపింది.ఇదీ చదవండి: బ్యాటరీ లైఫ్ పెరగాలంటే ఈ తప్పులు చేయకండి! -
ఇన్స్టాగ్రామ్ ప్రకటనలపై కేంద్రం సీరియస్!
కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై అభ్యంతరకరమైన, చట్టవిరుద్ధమైన కంటెంట్పై కఠిన వైఖరి అవలంబిస్తోంది. ముఖ్యంగా చిన్నారుల భద్రతకు సంబంధించిన అంశాల్లో ఎలాంటి రాజీ పడబోమని స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్లో పిల్లల లైంగిక వేధింపులకు సంబంధించిన ప్రకటనలు కనిపిస్తున్నాయనే ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం.. మెటాను వివరణ ఇవ్వాలని కోరింది.ఈ విషయంపై సమాచార సాంకేతిక (ఐటీ) శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారులకు మెటా ప్రతినిధులను పిలిపించి వివరణ కోరాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై మెటా నుంచి పూర్తి వివరాలు తెలుసుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.పిల్లల లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ లేదా అలాంటి ప్రకటనలు సోషల్ మీడియా వేదికల్లో ఉండటం చాలా తీవ్రమైన అంశంగా ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ వారం మెటాపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ఇది రెండోసారి. ఇటీవల వాట్సాప్లో యూజర్నేమ్ ఫీచర్ తీసుకురావాలన్న మెటా నిర్ణయంపై కూడా కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.ప్రభుత్వం అభిప్రాయం ప్రకారం ఈ ఫీచర్ అమల్లోకి వస్తే.. ఆన్లైన్ మోసాలు పెరిగే అవకాశం ఉంది. ఫిషింగ్ దాడులు ఎక్కువ కావచ్చు. డిజిటల్ అరెస్ట్ పేరుతో జరిగే మోసాలు పెరిగే ప్రమాదం ఉంది. ఇతరుల పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించడం సులభమవుతుంది. ఈ కారణాల వల్ల ప్రభుత్వంతో సంప్రదింపులు పూర్తయ్యే వరకు ఆ ఫీచర్ను అమలు చేయవద్దని కేంద్రం మెటాకు నోటీసులు జారీ చేసింది.భారత ఐటీ చట్టం ప్రకారం వాట్సాప్ వంటి పెద్ద సోషల్ మీడియా సంస్థలు వినియోగదారుల భద్రతకు సంబంధించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. అక్రమ కంటెంట్ను అరికట్టడం, వినియోగదారుల భద్రతను కాపాడడం వంటి అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఆయా సంస్థలపై ఉంటుంది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే ఐటీ చట్టం కింద చర్యలు తీసుకునే అవకాశం ఉందని కూడా ప్రభుత్వం మెటాకు హెచ్చరించింది. -
70 ఏళ్ల చరిత్రకు ముగింపు.. భవిష్యత్ విమానం ఇదేనా?
ఆకాశంలో ఎగిరే విమానం ఎలా ఉంటుంది?.. ఈ ప్రశ్నకు దాదాపు 70 ఏళ్లుగా ప్రపంచం ఒకటే సమాధానం చెబుతోంది. కానీ ఇప్పుడు ఆ సమాధానాన్నే మార్చేయాలనే ఓ స్టార్టప్ చేస్తున్న సాహసోపేత ప్రయత్నం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటివరకు మనం చూసిన విమానాల రూపమే గతం కావొచ్చనే చర్చా.. ఇటు విమానయాన రంగంలో మొదలైంది. ప్రపంచంలోని రెండు దిగ్గజ కంపెనీలు కూడా ఈ కొత్త ప్రయోగాన్ని ఆసక్తిగా గమనిస్తున్నాయి. అంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు!..దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రపంచ వాణిజ్య విమానాల మార్కెట్ను రెండు దిగ్గజ సంస్థలు.. బోయింగ్, ఎయిర్బస్ శాసిస్తూ వస్తున్నాయి. మనం ఇప్పుడు చూస్తున్న బడా విమానాలన్నీ దాదాపుగా ఇవి రూపొందించినవే. అయితే ఇప్పుడు అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన స్టార్టప్ సంస్థ జెట్జీరో (JetZero) ఈ ఆధిపత్యానికి సవాల్ విసురుతోంది. సంప్రదాయ విమానాల కంటే పూర్తిగా భిన్నమైన డిజైన్తో, ఇంధన వినియోగాన్ని సగానికి తగ్గిస్తామని చెబుతున్న కొత్త తరహా విమానాన్ని అభివృద్ధి చేస్తోంది.రెక్కలు–శరీరం ఒకటే..అమెరికాలోని మొహావే ఎడారిలో జెట్జీరో పూర్తి పరిమాణంలో ప్రదర్శన (డెమోన్స్ట్రేటర్) విమానాన్ని నిర్మిస్తోంది. సాధారణ విమానాల్లో శరీరం (ఫ్యూజలేజ్), రెక్కలు వేర్వేరుగా ఉంటాయి. కానీ జెట్జీరో ఆ డిజైన్కు పుల్స్టాప్ పెట్టే పని చేపట్టింది. ఆ కంపెనీ రూపొందిస్తున్న విమానంలో రెండూ కలిసిపోయి ఒకే నిర్మాణంగా ఉంటాయి. దీనినే ‘‘బ్లెండెడ్ వింగ్ బాడీ’’ (Blended Wing Body) డిజైన్ అంటారు. ఈ ఆకారం మంతా రే (Manta Ray) చేపను పోలి ఉంటుంది.50 శాతం ఇంధనం ఆదా!ప్రస్తుతం విమానయాన సంస్థలకు అతిపెద్ద ఖర్చు ఇంధనమే. జెట్జీరో విమానం సాధారణ జెట్లతో పోలిస్తే 50 శాతం వరకు ఇంధనాన్ని ఆదా చేయగలదని సంస్థ పేర్కొంటోంది. దీని ఆకారం కారణంగా.. గాలిని చీల్చుకుంటూ వెళ్లేటప్పుడు తక్కువ నిరోధం (డ్రాగ్) ఏర్పడటం వల్ల ఇంధన వినియోగం భారీగా తగ్గుతుందని కంపెనీ చెబుతోంది. అంతేకాదు.. విమానం వెనుక భాగంపై ఇంజిన్లను అమర్చడం వల్ల నేలపై శబ్ద కాలుష్యం కూడా తగ్గుతుంది. కార్బన్ ఉద్గారాలు తగ్గడం ద్వారా పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని కంపెనీ చెబుతోంది.మరింత సుఖవంతమైన జర్నీ..ఈ విమానం లోపలి నిర్మాణం కూడా భిన్నంగా ఉంటుంది. సాధారణంగా ఉండే సన్నని గొట్టం ఆకారంలోని కేబిన్కు బదులుగా విశాలమైన, చదునైన ప్రయాణికుల విభాగం ఉంటుంది. దీంతో.. పెద్ద కిటికీలు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. సీట్ల అమరికను మరింత సౌకర్యవంతంగా మార్చవచ్చు. వంటగదులు (గ్యాలీలు), మరుగుదొడ్లను అవసరానికి అనుగుణంగా మార్చుకోవచ్చు. ప్రయాణికులకు ఎక్కువ స్థలం లభిస్తుంది.జెట్జీరో అభివృద్ధి చేస్తున్న Z4 విమానం ఒకేసారి 200 నుంచి 270 మంది ప్రయాణికులను తీసుకెళ్లేలా రూపకల్పన చేశారు. గతంలో ఈ విభాగంలో బోయింగ్ 757, 767 విమానాలు కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు అదే మార్కెట్ను లక్ష్యంగా చేసుకుని జెట్జీరో అడుగులు వేస్తోంది.నాసా పరిశోధనలకు కొనసాగింపుబ్లెండెడ్ వింగ్ బాడీ ఆలోచన కొత్తది కాదు. గత మూడు దశాబ్దాలుగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(NASA) ఈ సాంకేతికతపై పరిశోధనలు నిర్వహిస్తోంది. అయితే ఇప్పటివరకు పూర్తి పరిమాణంలో వాణిజ్య విమానాన్ని నిర్మించే స్థాయికి ఏ సంస్థా రాలేదు. ‘‘కొత్త టెక్నాలజీని కనిపెట్టడం కాదు... ఇప్పటికే నిరూపితమైన సాంకేతికతను ఉపయోగించి వాణిజ్య విమానంగా మార్చడమే మా లక్ష్యం’’ అని జెట్జీరో సీఈఓ టామ్ ఓ'లీరీ చెబుతున్నారు.అమెరికా వైమానిక దళం అండజెట్జీరో ఆషామాషీ కంపెనీ ఏం కాదు. 2023లో అమెరికా వైమానిక దళం ఈ ప్రాజెక్టు కోసం 235 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని ప్రకటించింది. ఈ నిధులతో పూర్తి స్థాయి డెమోన్స్ట్రేటర్ విమానాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అలాగే యునైటెడ్ ఎయిర్లైన్స్(United Airlines), అలస్కా ఎయిర్లైన్స్ (Alaska Airlines) వంటి ప్రముఖ విమానయాన సంస్థలు కూడా జెట్జీరోలో పెట్టుబడులు పెట్టాయి. దీంతో ఈ ప్రాజెక్టుపై విమానయాన రంగంలో ఆసక్తి మరింత పెరిగింది.2030 నాటికి..జెట్జీరో లక్ష్యం ప్రకారం డెమోన్స్ట్రేటర్ విమానం వచ్చే ఏడాది(2027) నాటికి తొలి పరీక్ష పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత చేపట్టే వరుస పరీక్షలు విజయవంతమైతే మరిన్ని పెట్టుబడులు సమీకరించాలని అనుకుంటోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. 2030కల్లా వాణిజ్య విమానాల ఉత్పత్తి ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది. అదే సమయంలో ఈ డిజైన్ను సైనిక రవాణా, గగనతల ఇంధన నింపే (Aerial Refueling) విమానాలుగా కూడా ఉపయోగించే అవకాశాలను పరిశీలిస్తోంది.సవాళ్లు భారీగానే.. ఈ ప్రయాణం అంత సులభం కాదు. కొత్త డిజైన్ నిజంగానే ప్రకటించిన స్థాయిలో ఇంధనాన్ని ఆదా చేస్తుందా? భద్రతా ప్రమాణాలు ఎలా ఉంటాయి? ప్రపంచ విమానయాన నియంత్రణ సంస్థల నుంచి ధ్రువీకరణ పొందడానికి సంవత్సరాల సమయం, బిలియన్ల డాలర్ల పెట్టుబడి అవసరం అవుతుంది. ‘‘ఈ ప్రాజెక్టు ఇప్పుడే విజయవంతమైందని చెప్పలేం. కానీ అసాధ్యమని కూడా చెప్పలేం’’ అని విమానయాన రంగపు విశ్లేషకుడు రిచర్డ్ అబౌలాఫియా అభిప్రాయపడుతున్నారు.విమానాల రూపకల్పనలో దాదాపు 70 ఏళ్లుగా పెద్దగా మార్పులు రాలేదు. జెట్జీరో ప్రయత్నం విజయవంతమైతే, భవిష్యత్తులో మనం ప్రయాణించే విమానాల ఆకారంతో పాటు ఇంధన వినియోగం, ప్రయాణికుల అనుభవం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. అయితే ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి సాంకేతిక, ఆర్థిక, నియంత్రణ పరమైన అనేక పరీక్షలను ఈ స్టార్టప్ విజయవంతంగా దాటాల్సి ఉంటుంది.:::వెబ్ స్పెషల్నోట్: కథనంలో చూపించిన విమానం తాలుకా ఫొటోలు ఏఐ జనరేటెడ్వి. వాస్తవానికి దగ్గరగా ఉండేలా పాఠకుడికి చూపించాం.. -
ఫిగ్మాలో కొత్త ఫీచర్లు..
కొలాబరేటివ్ వెబ్ అప్లికేషన్ ప్లాట్ఫామ్ ‘ఫిగ్మా’ ఎన్నో కొత్త ఫీచర్లను ప్రకటించింది. కోడింగ్, యానిమేషన్, ఏఐ–ఎఫెక్ట్స్, వర్క్ఫ్లో ఆటోమేషన్ను నేరుగా డిజైన్ ప్లాట్ఫామ్లలోకి తీసుకువచ్చే టూల్స్ను పరిచయం చేసింది. ఫిగ్మా ప్రకటించిన ఆసక్తికరమైన ఫీచర్లలో ‘కోడ్ లేయర్స్’ ఒకటి.కోలాబరేటివ్ కాన్వాస్లో డిజైన్ ఎలిమెంట్స్ను ఇంటరాక్టివ్ కోడ్–బేస్డ్ కంపోనెంట్స్గా కన్వర్ట్ చేయడానికి యూజర్లకు ఉపకరించే ఫీచర్ ఇది. డిజైనర్లు, డెవలపర్లు,ప్రాడక్ట్ టీమ్లకు ఉపయోగపడేలా ఈ ఫీచర్ని డిజైన్ చేశారు. ‘ఫిగ్మా మోషన్’ పేరుతో కొత్త యానిమేషన్ సిస్టమ్ను కూడా పరిచయం చేశారు.షేడర్ ఫీల్స్, ఎఫెక్ట్స్లతో తన ఏఐ టూల్ కిట్ను కూడా విస్తరిస్తోంది ఫిగ్మా. టెక్ట్స్ప్రాంప్ట్స్, రిఫరెన్స్ ఇమేజ్లతో యూజర్లు విజువల్ ఎఫెక్ట్స్ను సృష్టించవచ్చు. నేచురల్ లాంగ్వేజ్ప్రాంప్ట్స్ ఉపయోగించడం ద్వారా కస్టమ్స్ టూల్స్ను క్రియేట్ చేసే ‘జెనరేటివ్ ప్లగిన్స్’ ఫీచర్ను కూడా ప్రకటించింది ఫిగ్మా. -
ఐటీ కంపెనీల ఆదాయాలకు ఎఫెక్ట్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) సేవల సంస్థల ఆదాయాలు ఒక మోస్తరు స్థాయికి పరిమితం కావచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఎంవోఎస్ఎల్) ఒక నివేదికలో పేర్కొంది. స్థూల పరిస్థితులు, కృత్రిమ మేథ (ఏఐ), భౌగోళిక రాజకీయాంశాలు క్లయింట్ల డిస్క్రెషనరీ వ్యయాలపైనా, అవి తీసుకునే నిర్ణయాలపైనా ప్రభావం చూపుతుండటం ఇందుకు కారణాలు కాగలవని వివరించింది.క్లయింట్లు నెమ్మదిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండటం, ఆచితూచి ఖర్చు చేస్తుండటంలాంటి పరిణామాలు ఎదురవుతున్నాయంటూ యాక్సెంచర్ ఇటీవల పేర్కొనడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తుందని ఎంవోఎస్ఎల్ వివరించింది. క్యూ1 పనితీరు ముందుగా అంచనా వేసిన దానికన్నా తక్కువగా ఉండొచ్చని భావిస్తున్నట్లు కేపీఐటీ టెక్నాలజీస్ సైతం వెల్లడించిన నేపథ్యంలో ఎంవోఎస్ఎల్ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. వివిధ కారణాలరీత్యా క్యూ1లో డిమాండ్ నెమ్మదించి ఉంటుందని అంచనా వేస్తున్నట్లు రిపోర్టు పేర్కొంది. రెండో త్రైమాసికం కూడా అదే విధంగా ప్రారంభం కావొచ్చని వివరించింది. క్యూ1లో ఐటీ కంపెనీలు తామిచ్చిన గైడెన్స్ గరిష్ట స్థాయిని కుదించవచ్చని నివేదిక వివరించింది.ఇదీ చదవండి: వాట్సాప్ యూజర్నేమ్ వ్యవహారం.. కేంద్రం నోటీసులు హెచ్సీఎల్టీ వృద్ధి గైడెన్స్ని 100 బేసిస్ పాయింట్ల మేర కుదించవచ్చు. ఇన్ఫోసిస్ 50 బేసిస్ పాయింట్లు తగ్గించి 1.5–3 శాతానికి పరిమితం చేయొచ్చు. త్రైమాసికాలవారీగా స్థిర కరెన్సీ ప్రాతిపదికన లార్జ్ క్యాప్ సంస్థల వృద్ధి 2 శాతం వరకు ఉండొచ్చు, మిడ్–క్యాప్స్ మళ్లీ రాణించి, 4.8 శాతం వరకు వృద్ధి నమోదు చేయొచ్చు. వివిధ విభాగాలవారీగా చూస్తే మెరుగైన డీల్స్ దన్నుతో బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ) పటిష్టంగా ఉంటోంది. హై–టెక్ విభాగం మిశ్రమంగా కనిపిస్తోంది. ఇది చదివారా? ఐటీ కంపెనీలు కనుమరుగవుతాయా? -
బ్యాటరీ లైఫ్ పెరగాలంటే ఈ తప్పులు చేయకండి!
ఈ రోజుల్లో ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉండాల్సిందే. అయితే, ఎంతటి ఖరీదైన స్మార్ట్ఫోన్ తీసుకున్నా కొన్నాళ్లకే బ్యాటరీ త్వరగా అయిపోతోందనే ఫిర్యాదు సాధారణం. ముఖ్యంగా వేసవి కాలంలో లేదా హెవీ యూసేజ్ వల్ల ఫోన్లు వేడెక్కడం, చార్జింగ్ నిమిషాల్లో కరిగిపోవడం చాలామందిని వేధించే సమస్య.స్మార్ట్ఫోన్ల్లో వాడే లిథియం-అయాన్ బ్యాటరీలకు ఒక నిర్దిష్టమైన లైఫ్ సైకిల్ ఉంటుంది. అయితే, మనం చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఆ ఆయుష్షు మరింత వేగంగా తగ్గిపోతుంది. మీ మొబైల్ బ్యాటరీ లైఫ్ ఎక్కువ కాలం రావాలంటే టెక్ నిపుణులు, మొబైల్ తయారీ సంస్థలు సూచిస్తున్న కొన్ని చిట్కాలు కింద చూద్దాం.‘100% చార్జింగ్’ రూల్కు స్వస్తి చెప్పండి!చాలామంది ఫోన్ చార్జింగ్ 0% కి పడిపోయే వరకు వాడి, ఆపై 100% అయ్యే వరకు అలాగే వదిలేస్తుంటారు. ఇది పూర్తిగా తప్పు. బ్యాటరీని ఎప్పుడూ పూర్తిగా ఖాళీ చేయడం, అలాగే పూర్తిగా నింపడం వల్ల దానిపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది.గోల్డెన్ రూల్: మీ మొబైల్ బ్యాటరీ శాతాన్ని ఎప్పుడూ 20% నుంచి 80% మధ్య ఉంచడానికి ప్రయత్నించండి. చార్జింగ్ 20%కి రాగానే ప్లగ్ ఇన్ చేయడం, 80% - 85% కాగానే తీసేయడం వల్ల బ్యాటరీ లైఫ్ స్థిరంగా ఉంటుంది.రాత్రంతా చార్జింగ్ పెడుతున్నారా?రాత్రి పడుకునేటప్పుడు ఫోన్ చార్జింగ్ పెట్టి ఉదయం తీయడం అలవాటా? ఆధునిక స్మార్ట్ఫోన్లలో చార్జింగ్ 100% కాగానే ఆటోమేటిక్గా పవర్ కట్ అయ్యే ‘స్మార్ట్ కట్’ ఫీచర్ ఉన్నప్పటికీ రాత్రంతా ప్లగ్లోనే ఉంచడం వల్ల బ్యాటరీ ‘ట్రికిల్ చార్జింగ్’ మోడ్లోకి వెళ్తుంది. దీనివల్ల బ్యాటరీ నిరంతరం రసాయన ఒత్తిడికి లోనై కాలక్రమేణా ఉబ్బిపోయే ప్రమాదం ఉంది.ఒరిజినల్ చార్జర్ మాత్రమే వాడండిమార్కెట్లో తక్కువ ధరకు దొరికే లోకల్ చార్జర్లు, కేబుల్స్ వాడటం బ్యాటరీ లైఫ్ దెబ్బతింటుంది. మీ ఫోన్ బాక్స్తో పాటు వచ్చిన లేదా సదరు కంపెనీకి చెందిన అధికారిక చార్జర్లను మాత్రమే వాడాలి. లోకల్ చార్జర్లు స్థిరమైన వోల్టేజ్ను అందించలేవు.హీటింగ్ సమస్యమొబైల్ బ్యాటరీల ఆయుష్షును తగ్గించే అతిపెద్ద అంశం ఉష్ణోగ్రత. ఫోన్ చార్జింగ్ అవుతున్నప్పుడు సహజంగానే కొంత వేడెక్కుతుంది. ఆ సమయంలో హెవీ గేమింగ్ ఆడటం లేదా యూట్యూబ్ వీడియోలు చూడటం అస్సలు చేయకూడదు. అలాగే, కారు డాష్బోర్డ్లపై, ఎండ తగిలే చోట్ల ఫోన్ను ఉంచకూడదు. వీలైతే, చార్జింగ్ పెట్టేటప్పుడు మొబైల్ పౌచ్ తీసేయడం మంచిది.ఈ సెట్టింగ్స్ మార్చుకోండిస్క్రీన్ బ్రైట్నెస్ను ఎప్పుడూ ఫుల్గా ఉంచకుండా ఆటో బ్రైట్నెస్ మోడ్లో పెట్టండి.మీ ఫోన్లో ఆమోలెడ్ లేదా ఓలెడ్ స్క్రీన్ ఉంటే డార్క్ మోడ్ ఆన్ చేయడం ద్వారా బ్యాటరీ వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.బ్లూటూత్, జీపీఎస్, వై-ఫై అవసరం లేనప్పుడు ఆఫ్ చేయండి.సిగ్నల్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఫోన్ ఎక్కువ పవర్ వాడుకుంటుంది. కాబట్టి అవసరమైతే కాసేపు ఫ్లైట్ మోడ్ ఆన్ చేయండి.స్మార్ట్ఫోన్ అనేది మన నిత్యజీవితంలో భాగం. దాన్ని సరైన పద్ధతిలో చార్జ్ చేయడం, అధిక వేడికి గురికాకుండా చూసుకోవడం ద్వారా బ్యాటరీ మార్చాల్సిన అవసరం లేకుండానే ఫోన్ను కనీసం 3 నుంచి 4 ఏళ్ల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు. కాబట్టి వెంటనే మీ ఫోన్ చార్జింగ్ అలవాట్లను మార్చుకోండి!ఇదీ చదవండి: ఒక్కసారిగా బంగారం ధరలు యూటర్న్! -
ఏఐ రంగంలో భారత్ దూకుడు ఖాయం
ప్రపంచ సాంకేతిక రంగంలో ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హవా నడుస్తోంది. అయితే, ఈ రంగం కేవలం కొన్ని పాశ్చాత్య టెక్ దిగ్గజాల గుత్తాధిపత్యంలోనే ఉండిపోతుందా? లేక భారత్ వంటి దేశాలు స్వయంసమృద్ధి సాధించగలవా? అనే చర్చకు జోహో అధినేత శ్రీధర్ వెంబు సరికొత్త దిశను చూపించారు. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులపై నిరంతరం చర్చించే వెంబు.. అంతర్జాతీయ మార్కెట్లో చైనా ఏఐ కంపెనీల పోటీని ప్రశంసించడంతో పాటు భారత్లో సొంత ఏఐ మోడళ్లు పుట్టుకొస్తాయని చెప్పారు.మైక్రోసాఫ్ట్ గుత్తాధిపత్యంపై..టెక్ మార్కెట్లో అమెరికన్ కంపెనీల గుత్తాధిపత్య ధోరణిని ఎండగట్టడానికి శ్రీధర్ వెంబు ఇటీవల ఒక ఆసక్తికరమైన ఉదాహరణను పంచుకున్నారు. ఒక భారతీయ కస్టమర్ తన మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లైసెన్స్ పునరుద్ధరణ సమయంలో ఎదురైన అనుభవాన్ని ఆయన ఉదహరించారు.‘సదరు కస్టమర్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ నుంచి స్వదేశీ సాఫ్ట్వేర్ అయిన జోహో ఆఫీస్ సూట్కు మారిపోవాలని అనుకుంటున్నట్లు చెప్పగానే.. మైక్రోసాఫ్ట్ ఒక్కసారిగా దిగొచ్చింది. తన కస్టమర్ను కోల్పోకూడదనే భయంతో ఏకంగా 90% తగ్గింపును ఆఫర్ చేసింది’ అన్నారు. పోటీ లేకపోతే ఈ దిగ్గజాలు కస్టమర్లను ఎలా దోపిడీ చేస్తాయో చెప్పడానికి ఈ సంఘటనే నిదర్శనమని వెంబు పేర్కొన్నారు. మార్కెట్లో ప్రత్యామ్నాయాలు ఉన్నప్పుడే వినియోగదారుడికి నిజమైన లబ్ధి చేకూరుతుందని ఆయన స్పష్టం చేశారు.‘యాంటీట్రస్ట్’ కేసు గుర్తుచేసిన జోహో బాస్మైక్రోసాఫ్ట్ అనుసరిస్తున్న వ్యాపార పద్ధతులను విమర్శిస్తూ.. గతంలో ఆ సంస్థ ఎదుర్కొన్న చట్టపరమైన సవాళ్లను వెంబు గుర్తుచేశారు.యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ మైక్రోసాఫ్ట్ కార్ప్ (1998): మైక్రోసాఫ్ట్ చట్టవిరుద్ధంగా తన గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తోందని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్తో పాటు 20 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ కోర్టుకెక్కారు.పోటీని అణచివేసే కుట్ర: విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు ‘ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్’ బ్రౌజర్ను ఉచితంగా ఇన్-బిల్ట్గా ఇవ్వడం ద్వారా.. అప్పట్లో పాపులర్ అయిన ‘నెట్స్కేప్ నావిగేటర్’ వంటి ప్రత్యర్థి బ్రౌజర్ల మనుగడను మైక్రోసాఫ్ట్ దెబ్బతీసిందని ఆరోపణలు వచ్చాయి.కంపెనీ విభజన తీర్పు: ఏప్రిల్ 2000లో యూఎస్ డిస్ట్రిక్ట్ న్యాయమూర్తి థామస్ పెన్ఫీల్డ్ జాక్సన్.. మైక్రోసాఫ్ట్ యాంటీట్రస్ట్ చట్టాన్ని ఉల్లంఘించిందని తీర్పునిస్తూ కంపెనీని రెండుగా విభజించాలని (ఒకటి విండోస్ ఓఎస్ కోసం, మరొకటి సాఫ్ట్వేర్ ఉత్పత్తుల కోసం) ఆదేశించారు. అయితే, ఆ తర్వాత అప్పీల్లో ఈ ఉత్తర్వు రద్దయినప్పటికీ మైక్రోసాఫ్ట్ గుత్తాధిపత్య ధోరణి ప్రపంచానికి స్పష్టమైంది.చైనా ఏఐ పోటీ.. ప్రపంచానికి మేలు!ప్రస్తుతం ఏఐ రంగంలో అమెరికా ఆధిపత్యానికి చైనా గట్టి పోటీ ఇస్తోంది. చైనా ఏఐ కంపెనీల వేగవంతమైన వృద్ధిని శ్రీధర్ వెంబు సానుకూల దృక్పథంతో స్వాగతించారు. ఈ అంతర్జాతీయ పోటీ వల్ల ఏఐ మోడళ్ల శిక్షణ ఖర్చులు విపరీతంగా తగ్గుతున్నాయని ఆయన విశ్లేషించారు. ఈ ధరల తగ్గుదల గ్లోబల్ ఏఐ పర్యావరణ వ్యవస్థను సమతుల్యం చేయడానికి, ఓపెన్ మార్కెట్ను ప్రోత్సహించడానికి కీలకమని చెప్పారు.Anthropic's latest models available worldwide. In other words, Chinese open source models posed a serious enough threat to market share.In a different context, an Indian customer of some of our products told me recently "A big Microsoft Office license renewal came up and they… https://t.co/xp8e6vVMvs— Sridhar Vembu (@svembu) July 1, 2026‘భారత్ జెన్’ ప్రాజెక్ట్: స్వదేశీ ఏఐ కల సాకారంఏఐ శిక్షణ ఖర్చులు తగ్గడం వల్ల భారతదేశానికి భారీ అవకాశాలు లభిస్తాయని వెంబు ఆశాభావం వ్యక్తం చేశారు. ‘భారతదేశంలో సొంత ఏఐ మోడళ్లు పుట్టుకొస్తాయని నేను ఇప్పుడు బలంగా విశ్వసిస్తున్నాను. మనం నిరాశ చెందకూడదు’ అని పిలుపునిచ్చారు. భారత్లో విద్యాసంస్థలు, పరిశ్రమల భాగస్వామ్యంతో బహుళ ఏఐ కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయని పేర్కొన్నారు. దీనికి ప్రధాన ఉదాహరణగా ఐఐటీ బొంబాయి నేతృత్వంలో సాగుతున్న ‘భారత్ జెన్’ ప్రాజెక్ట్ సాధిస్తున్న పురోగతిని వెంబు సాక్ష్యంగా చూపారు. పాశ్చాత్య దేశాల ఏఐ సాంకేతికతకు, భారతీయ అవసరాలకు మధ్య ఉన్న అంతరాన్ని ఈ స్వదేశీ ప్రాజెక్టులు వేగంగా భర్తీ చేస్తున్నాయని ధీమా వ్యక్తం చేశారు. -
వాట్సాప్ యూజర్నేమ్ వ్యవహారం.. కేంద్రం నోటీసులు
మొబైల్ నంబర్ను వెల్లడించకుండా వాట్సాప్లో సంభాషణలు ప్రారంభించేలా రూపొందించిన ‘యూజర్నేమ్’ ఫీచర్పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ కొత్త వ్యవస్థ సైబర్ నేరాలు, ఫిషింగ్, ఇంపర్సనేషన్, ‘డిజిటల్ అరెస్ట్’ తరహా మోసాలకు అవకాశం కల్పించే ప్రమాదం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటాకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ ఫీచర్పై నియంత్రణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY) భారత కార్యకలాపాలకు సంబంధించిన వాట్సాప్ చీఫ్ కంప్లయన్స్ అధికారికి పంపిన లేఖలో, యూజర్నేమ్ ఫీచర్ను ప్రపంచవ్యాప్తంగా దశలవారీగా ప్రవేశపెడుతున్నట్లు కంపెనీ ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ మొబైల్ నంబర్కు బదులుగా ప్రత్యేక యూజర్నేమ్ను ఉపయోగించి కొత్త వ్యక్తులతో చాట్ ప్రారంభించవచ్చు. పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాత మొదటిసారి సంప్రదించే వారికి ఫోన్ నంబర్ కనిపించకుండా ఉండేలా ఈ వ్యవస్థ రూపొందించారు. అదనపు భద్రత కోసం ఐచ్ఛికంగా ‘యూజర్నేమ్ కీ’ని కూడా సెట్ చేసుకునే అవకాశం ఉంటుందని వాట్సాప్ వెల్లడించింది.అయితే, ఈ ఫీచర్ను సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు లేదా ప్రముఖుల పేర్లను పోలిన యూజర్నేమ్లతో నకిలీ ఖాతాలు సృష్టించి ప్రజలను మోసగించే ప్రమాదం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే దేశంలో పెరుగుతున్న ఆన్లైన్ మోసాల దృష్ట్యా ఈ ఫీచర్ను జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉందని కేంద్రం స్పష్టం చేసింది.తాజా పరిణామాల ప్రకారం, సంప్రదింపుల ప్రక్రియ పూర్తయ్యే వరకు భారత్లో యూజర్నేమ్ ఫీచర్ను అమలు చేయవద్దని కూడా మెటాకు కేంద్ర ప్రభుత్వం సూచించినట్లు సమాచారం. మెటా నుంచి వచ్చే వివరణను పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి -
క్లాడ్ ఏఐ మోడళ్లపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా
ఆంత్రోపిక్ సంస్థకు చెందిన శక్తివంతమైన ఏఐ మోడళ్లు ‘క్లాడ్ ఫేబుల్ 5’ (Claude Fable 5), ‘మైథోస్ 5’(Mythos 5)లపై విధించిన విదేశీ యాక్సెస్ ఆంక్షలను అమెరికా ఎత్తివేసింది. అమెరికా వాణిజ్య శాఖ తన నియంత్రణలను తొలగించినట్లు ధ్రువీకరించిన అనంతరం ఈ మోడళ్ల సేవలను పునరుద్ధరిస్తున్నట్లు ఆంత్రోపిక్ అధికారికంగా ప్రకటించింది. ‘మా వినియోగదారుల సహనానికి, అలాగే మోడళ్లను తిరిగి అందుబాటులోకి తీసుకురావడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’ అని ఆంత్రోపిక్ సంస్థ ఎక్స్ వేదికగా పేర్కొంది.భద్రతా హామీలతో లభించిన ఊరటఆన్లైన్లో విస్తృతంగా ప్రసారమైన ఒక లేఖలో అమెరికా వాణిజ్య శాఖ కార్యదర్శి హోవార్డ్ లుత్నిక్ ఈ నిర్ణయానికి గల కారణాలను స్పష్టం చేశారు. ఆంత్రోపిక్ సంస్థ ఇకపై ప్రత్యేక ఎగుమతి లైసెన్స్ పొందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఏఐ మోడళ్లతో ముడిపడి ఉన్న భద్రతా ప్రమాదాలను ముందస్తుగా గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ఆంత్రోపిక్ అంగీకరించడమే ఇందుకు ప్రధాన కారణం. దీనితో పాటు, రాబోయే ఏఐ మోడళ్ల ప్రమాణాలపై ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి, ఎలాంటి హానికరమైన కార్యకలాపాలు జరిగినా వెంటనే ప్రభుత్వానికి తెలియజేయడానికి సంస్థ అంగీకరించింది.అసలేం జరిగింది? ఆంక్షల నేపథ్యం ఇదే..గత నెలలో(జూన్) డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా యంత్రాంగం ఆంత్రోపిక్ సంస్థకు ఊహించని షాక్ ఇచ్చింది. కంపెనీ ఉద్యోగులతో సహా విదేశీ పౌరులు ఎవరూ ఈ మోడళ్లను యాక్సెస్ చేయకుండా నిరోధించాలని ఆదేశించడంతో సంస్థ అకస్మాత్తుగా ఫేబుల్ 5, మైథోస్ 5 సేవలను నిలిపివేసింది. ఆ సమయంలో ప్రభుత్వం నిర్దిష్ట కారణాలేవీ చెప్పనప్పటికీ ఫేబుల్ 5లోని భద్రతా అంశాలపై అధికారులు ఆందోళన చెందడమే ఇందుకు కారణమని భావించారు.అయితే, గత శుక్రవారం క్లిష్టమైన మౌలిక సదుపాయాలను నిర్వహించే అమెరికా సంస్థలకు మాత్రమే వీటిని ఉపయోగించేందుకు అనుమతి లభించింది. ఇప్పుడు తాజాగా సాధారణ ప్రజలకు కూడా పూర్తిస్థాయి యాక్సెస్ ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ట్రంప్ ప్రభుత్వం వర్సెస్ ఆంత్రోపిక్ట్రంప్ పరిపాలనా యంత్రాంగానికి, ఆంత్రోపిక్ సంస్థకు మధ్య కొంతకాలంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఆంక్షలు ఆ ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోశాయి. గత మార్చిలో ఆంత్రోపిక్ ఏఐ సంస్థ రక్షణ శాఖ (పెంటగాన్)పై దావా వేసింది. తమ ఏఐ సాధనాలను సామూహిక నిఘా లేదా స్వయంప్రతిపత్త ఆయుధాల కోసం ఉపయోగించబోమని స్పష్టమైన హామీలు ఇవ్వనందుకు పెంటగాన్ ఈ సంస్థను సప్లై చెయిన్ రిస్క్గా లేబుల్ చేసింది. దీనిపై సంస్థ న్యాయపోరాటానికి దిగింది.మరోవైపు, చాట్ జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐ సైతం తమ తాజా మోడల్ సిరీస్ ‘జీపీటీ-5.6’ను మొదట కేవలం ‘విశ్వసనీయ భాగస్వాముల చిన్న సమూహం’ కోసం మాత్రమే విడుదల చేయనున్నట్లు గత వారం ప్రకటించింది.నిపుణులు ఏమంటున్నారు?ఈ పరిణామాలపై సిడ్నీ విశ్వవిద్యాలయంలోని ఏఐ, ట్రస్ట్ అండ్ గవర్నెన్స్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ ఫ్రాన్సిస్కో బైలో స్పందిస్తూ, టెక్ వర్గాల్లో ఈ ఆంక్షల ఎత్తివేత ఊహించిందేనని అన్నారు. ‘పరిశోధకులు ఫేబుల్ 5ను జైల్బ్రేక్(ఏఐ మోడళ్లకు వాటిని తయారు చేసిన కంపెనీలు కొన్ని భద్రతా నియమాలను, నైతిక పరిమితులను విధిస్తాయి. ప్రమాదకరమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఈ ఏఐ మోడళ్లను నియంత్రిస్తారు) చేయగలిగారనే నివేదికలు వాస్తవ తీవ్రత కంటే ఎక్కువగా ప్రచారమయ్యాయి. అమెరికా ప్రభుత్వం అతిగా స్పందించిందని ఆలస్యంగా గ్రహించింది. ఇటువంటి నిర్ణయాలు పరిశ్రమలో గందరగోళాన్ని సృష్టిస్తాయి. ఒకవేళ ఫేబుల్, మైథోస్లను నిషేధిస్తే భవిష్యత్తులో మార్కెట్లోకి వచ్చే ఇతర పోటీ నమూనాలను కూడా నిషేధించాల్సి వస్తుంది’ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: బంగారం ధరలు కూల్ఆఫ్! -
ప్రపంచాన్ని మార్చిన ఆలోచన.. అలా పుట్టింది ATM పిన్!
ప్రస్తుతం జేబులో పర్సు లేకపోయినా, చేతిలో ఒక చిన్న ప్లాస్టిక్ కార్డు.. దానికి తోడు నాలుగు అంకెల రహస్య కోడ్ (PIN) ఉంటే చాలు, ప్రపంచంలో ఎక్కడైనా నిమిషాల్లో నగదును చేతిలోకి తెచ్చుకోవచ్చు. బ్యాంకుల చుట్టూ తిరిగే పని లేకుండా, మన డబ్బుకు కొండంత భద్రతను ఇచ్చే ఈ 'ఏటీఎం పిన్' వెనుక ఓ ఆసక్తికరమైన, మరెంతో ఆశ్చర్యకరమైన చరిత్ర దాగుంది. కోట్లాది రూపాయల లావాదేవీలను కాపలా కాసే ఈ అద్భుత సాంకేతికతను కనిపెట్టిన మేధావికి అప్పట్లో దక్కిన పారితోషికం ఎంతో తెలిస్తే ఎవరైనా ముక్కున వేలేసు కోవాల్సిందే!1960ల కాలంలో బ్యాంకుల నుంచి నగదు విత్డ్రా ప్రక్రియను సులభతరం చేసేందుకు అంతర్జాతీయంగా పరిశోధనలు జరిగాయి. ఆ సమయంలో బ్రిటన్కు చెందిన ఒక ఇంజనీరింగ్ సంస్థలో పనిచేస్తున్న జేమ్స్ గుడ్ఫెలో అనే స్కాటిష్ ఇంజనీర్ ఒక సరికొత్త ఆలోచన చేశారు. వినియోగదారుడి గుర్తింపును మానవ ప్రమేయం లేకుండా, యంత్రమే స్వయంగా ధృవీకరించేలా ఒక ప్లాస్టిక్ కార్డును, దానికి అనుసంధానంగా ఒక రహస్య సంఖ్యను (Personal Identification Number - PIN) కలిపి పనిచేసే సాంకేతికతను ఆయన 1966లో అభివృద్ధి చేశారు.కేవలం 10 పౌండ్ల బహుమతి!జేమ్స్ గుడ్ఫెలో కనిపెట్టిన ఈ పిన్ వ్యవస్థ బ్యాంకింగ్ రంగాన్నే మార్చేసింది. నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ఏటీఎం కేంద్రాలు ఈ భద్రతా సూత్రం ఆధారంగానే నడుస్తున్నాయి. కానీ, ఇంతటి విప్లవాత్మక ఆవిష్కరణ చేసినందుకు గాను, ఆ రోజుల్లో ఆయన పనిచేస్తున్న సంస్థ ఆయనకు అందించిన బోనస్ ఎంతో తెలుసా? కేవలం 10 పౌండ్లు మాత్రమే!ప్రస్తుత భారతీయ కరెన్సీ విలువ ప్రకారం చూస్తే ఇది సుమారు వెయ్యి రూపాయల లోపే ఉంటుంది."ఆవిష్కరణ నాదే అయినా, కంపెనీ నిబంధనల ప్రకారం నాకు దక్కిన బోనస్ కేవలం పది పౌండ్లు మాత్రమే" అని జేమ్స్ గుడ్ఫెలో తర్వాతి కాలంలో ఒక ఇంటర్వ్యూలో పేర్కొనడం గమనార్హం. లండన్లో మొదలైన ప్రస్థానం..జేమ్స్ గుడ్ఫెలో ఈ సాంకేతికతను రూపొందించిన మరుసటి సంవత్సరమే, అంటే 1967లో లండన్ నగరంలో ప్రపంచంలోనే మొట్టమొదటి నగదు పంపిణీ యంత్రాన్ని (Cash Machine) ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఈ సాంకేతికత ఖండంతరాలు దాటి విస్తరించింది. 1973 జూన్ 4న ఈ వ్యవస్థకు అమెరికాలో అధికారికంగా పేటెంట్ లభించడంతో, ఆధునిక ఏటీఎంల యుగం ఊపందుకుంది. భద్రతకు కేరాఫ్ అడ్రస్!.నేడు మనం ఏటీఎం సెంటర్కు వెళ్లినప్పుడు తప్పుడు పిన్ నంబర్ను వరుసగా మూడు సార్లు నమోదు చేస్తే కార్డు బ్లాక్ అయిపోతుంది. మన ఖాతాలోని సొమ్ము సైబర్ నేరగాళ్ల పాలు కాకుండా అడ్డుకునే ఈ పటిష్టమైన భద్రతా వలయానికి పునాది వేసింది ఆ 10 పౌండ్ల ఆవిష్కరణే కావడం విశేషం. ఆర్థిక రంగాన్ని డిజిటల్ వైపు నడిపించిన ఈ స్కాటిష్ మేధావి సేవలను గుర్తించిన బ్రిటన్ ప్రభుత్వం, 2006లో ఆయనకు ప్రతిష్టాత్మక 'ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్' (OBE) గౌరవాన్ని అందించింది. పారితోషికం చిన్నదైనా, ఆయన అందించిన సాంకేతికత మాత్రం ప్రపంచ మానవాళికి అందించి సేవ అమూల్యమైనది అనడంలో ఎలాంటి సందేహం లేదు!.- పసుపులేటి వెంకటేశ్వరరావు. -
వాట్సాప్ భారీ అప్డేట్.. కొత్త ఫీచర్ వచ్చిందా చెక్ చేస్కోండి!
ప్రపంచంలోనే అత్యధిక మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కీలక ఫీచర్ను తీసుకొస్తోంది. ఇప్పటి వరకు వాట్సాప్లో ఎవరితోనైనా మాట్లాడాలంటే తప్పనిసరిగా ఫోన్ నంబర్ను షేర్ చేయాల్సి వచ్చేది. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడినప్పుడు ఇది చాలా మందికి ప్రైవసీ పరంగా అసౌకర్యంగా అనిపించేది. ఇకపై ఆ సమస్యకు చెక్ పడనుంది. ఫోన్ నంబర్ కాకుండా యూజర్ Username ద్వారానే ఇతరులతో చాట్ చేసే అవకాశం వాట్సాప్ కల్పించనుంది. ఈ విషయాన్ని సీఈవో కునాల్ షా అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు.. "మీకు నచ్చిన పేరును ఇప్పుడే రిజర్వ్ చేసుకోండి" అంటూ వినియోగదారులకు సూచించారు. ఈ ఫీచర్ను జూన్ 29 నుంచి దశలవారీగా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తుండగా.. ఈ ఏడాది చివరినాటికి అందరికీ అందుబాటులోకి రానుంది.నంబర్ అవసరం లేదు.. కొత్త ఫీచర్తో ఇకపై కొత్త వ్యక్తులకు మీ ఫోన్ నంబర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. మీరు ఎంచుకున్న ప్రత్యేకమైన పేరును మాత్రమే షేర్ చేస్తే సరిపోతుంది. ఆ Username ద్వారా అవతలి వ్యక్తి మీతో చాట్ ప్రారంభించగలుగుతారు. కాలేజీ స్నేహితులు, ఆఫీస్ పరిచయాలు, వ్యాపార సంబంధాలు, ఈవెంట్లలో కలిసిన వ్యక్తులు లేదా గ్రూప్ల్లోని కొత్త సభ్యులతో నంబర్ పంచుకోకుండా కనెక్ట్ అయ్యేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని వాట్సాప్ తెలిపింది.ప్రైవసీకే పెద్దపీటఈ ఫీచర్ను సోషల్ మీడియా తరహాలో రూపొందించలేదని వాట్సాప్ స్పష్టం చేసింది. ఇన్స్టాగ్రామ్ లేదంటే ఎక్స్ యూజర్నేమ్ల కోసం పబ్లిక్ సెర్చ్ లేదంటే డైరెక్టరీ ఉండదు. ఎవరైనా మీకు మెసేజ్ పంపాలంటే మీ ఖచ్చితమైన Username వారికి తెలిసి ఉండాలి. దీంతో అనవసర మెసేజ్లు, స్పామ్లను తగ్గించే అవకాశం ఉంటుంది.అదనపు భద్రత ఏంటంటే.. యూజర్నేమ్తో పాటు వాట్సాప్ మరో కొత్త భద్రతా ఫీచర్ను కూడా తీసుకొస్తోంది. యూజర్నేమ్ కీ(Username Key) పేరుతో వచ్చే ఈ ఆప్షన్ను యూజర్లు ఐచ్ఛికంగా ఉపయోగించుకోవచ్చు. ఈ ఫీచర్ను ఆన్ చేస్తే.. తొలిసారి మీకు మెసేజ్ పంపాలనుకునే వ్యక్తి యూజర్నేమ్తో పాటు మీరు సెట్ చేసిన ప్రత్యేక కీను కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. అవసరమైతే ఈ కీని ఎప్పుడైనా మార్చుకోవచ్చు. దీంతో అవాంఛిత వ్యక్తుల నుంచి మరింత రక్షణ లభిస్తుంది.ఎలా రిజర్వ్ చేసుకోవాలి?యూజర్నేమ్ రిజర్వ్ చేసుకోవడానికి ఈ స్టెప్స్ను అనుసరించండి.వాట్సాప్ను తాజా వెర్షన్కు అప్డేట్ చేయండి.సెట్టింగ్స్ను Settings ఓపెన్ చేయండి.అకౌంట్ Accountపై ట్యాప్ చేయండి.యూజర్నేమ్ Username ఆప్షన్ను ఎంచుకోండి.మీకు అందుబాటులో ఉన్న పేరును ఎంపిక చేసి కన్ఫర్మ్ చేయండి.అయితే ఈ ఆప్షన్ ప్రస్తుతం దశలవారీగా విడుదల అవుతోంది. కాబట్టి అందరికీ ఒకేసారి కనిపించకపోవచ్చు.నిబంధనలుగరిష్ఠంగా 35 అక్షరాలు ఉండవచ్చు.అవసరమైతే ఎప్పుడైనా మార్చుకోవచ్చు లేదంటే తొలగించుకోవచ్చు.ప్రముఖులు, సెలబ్రిటీలు, సంస్థలకు సంబంధించిన కొన్ని యూజర్నేమ్లను వాట్సాప్ ముందుగానే రిజర్వ్ చేస్తుంది. దీంతో నకిలీ ఖాతాలు (Impersonation) సృష్టించే అవకాశాలు తగ్గుతాయి.వ్యాపార సంస్థలు, క్రియేటర్లు తమ ఇన్స్టాగ్రామ్ లేదంటే ఫేస్బుక్ అకౌంట్కు అనుగుణంగా Username పొందే అవకాశం కూడా ఉంటుంది.పాత చాట్లపై ప్రభావం?ఈ కొత్త ఫీచర్ వచ్చినా ప్రస్తుతం ఉన్న చాట్లు, కాంటాక్ట్లు, బ్లాక్, రిపోర్ట్, ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ వంటి సదుపాయాల్లో ఎలాంటి మార్పు ఉండదని వాట్సాప్ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఎలా ఉపయోగిస్తున్నారో అలాగే కొనసాగించవచ్చు.ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?యూజర్నేమ్ రిజర్వేషన్ ఫీచర్ ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రారంభమైంది. రాబోయే నెలల్లో దశలవారీగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించనుంది. మీ ప్రాంతంలో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన వెంటనే వాట్సాప్ యాప్లో నోటిఫికేషన్ వస్తుంది. ఈ ఏడాది చివరినాటికి అన్ని యూజర్లకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. -
బెగ్గర్ రోబో!
చైనాలోని ఒక హ్యూమనాయిడ్ రోబో తన కరెంట్ ఖర్చుల కోసం వీధిలో యాచిస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో...ఒక రోబో ఫుట్పాత్పై మోకాళ్లపై కూర్చొని అటుగా వెళ్తున్న వారికి వంగి నమస్కరిస్తూ యాచిస్తున్న దృశ్యం కనిపిస్తుంది. రోబో పక్కన విరాళాల కోసం ఒక ట్రేతో పాటు, క్యూఆర్ కోడ్ ఉంటుంది.దీనికి తోడు ఎల్ఈడీ డిస్ప్లే, లౌడ్స్పీకర్ కనిపిస్తాయి.‘రీచార్జ్ చేయడానికి డబ్బులు లేవు. దయచేసి సహాయం చేయండి’ అంటూ లౌడ్స్పీకర్ నుంచి పదేపదే వినిపిస్తూ ఉంటుంది. ఇది మార్కెటింగ్ స్టంటా? విరాళాలను ఆకర్షించే సృజనాత్మక మార్గమా? అని చాలామంది నెటిజనులు ప్రశ్నించారు. ‘మంచి ఆలోచన. మీరే స్వయంగా అడుక్కోవడానికి బదులుగా ఆ పనిని రోబోతో చేయించండి. ఇది సమయాన్ని, శక్తిని రెండిటినీ ఆదా చేస్తుంది’ అని ఒక నెటిజనుడు రాయడమే కాదు ‘నేను కూడా ఇదే మార్గం అనుసరించాలనుకుంటున్నాను’ అని వ్యాఖ్యానించాడు!


