Technology
-
జెన్-ఆల్ఫాకి ఎప్పటికీ దీని గురించి తెలియకపోవచ్చు!
జెన్-ఆల్ఫా (2010 నుంచి 2025 మధ్య జన్మించిన వారు) పెరుగుతున్న ప్రపంచంలో స్క్రీన్లు, స్మార్ట్ డివైస్లు జీవితంలో సహజ భాగాలు. వారికి ఇంటర్నెట్ లేకుండా గడిచిన రోజులు కథల్లో వినే విషయాల్లా అనిపించే అవకాశం ఉంది. డిజిటల్ కనెక్షన్ ఎప్పుడూ అందుబాటులో ఉండటంతో "ఆఫ్లైన్ జీవితం" అనే భావనే ఈ కొత్త తరానికి అపరిచితంగా మారుతోంది.జెన్ ఆల్ఫా వాళ్లు ఇంటర్నెట్, డిజిటల్ పరికరాలను వాడుతూనే పెరుగుతున్నారు. అది వారి రోజువారీ జీవితంలో సహజ భాగంగా మారిపోయింది. వారు చదవడం, వినోదం పొందడం, కొత్త విషయాలు తెలుసుకోవడం, విసుగొచ్చినప్పుడు లేదా ఒంటరిగా అనిపించినప్పుడు మాట్లాడడం వంటి పనులన్నీ ఎక్కువగా డిజిటల్ పరికరాలు, ఆన్లైన్ వేదికల ద్వారానే చేస్తున్నారు.అంతకుముందున్న తరాలవారికి ఆన్లైన్లో ఉండటం ఒక కార్యకలాపం. వారు లాగిన్ అయ్యేవారు, అంతర్జాలంలో కొంత సమయం గడిపేవారు, తర్వాత లాగ్ ఆఫ్ అయ్యేవారు. జెన్ ఆల్ఫాకు మాత్రం ఇంటర్నెట్ అనేది వారు పెరిగే వాతావరణంగా మారిపోయింది.జెన్ ఆల్ఫా తరం కంటే ముందు ఉన్న తరాలు ఇంటర్నెట్ లేకుండా కూడా జీవితాన్ని గడిపాయి. ప్రత్యక్షంగా మనుషులను కలుసుకోవడం, బయట ఆటలు ఆడటం, పుస్తకాల ద్వారానే సమాచారం తెలుసుకోవడం వంటి "ఆఫ్లైన్" జీవన విధానాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేని తొలి తరంగా జెన్ ఆల్ఫా తరం మారవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అంటే ఇంటర్నెట్ లేని జీవితం ఎలా ఉండేదో జెన్ ఆల్ఫా వారికి పూర్తిగా తెలియకపోవచ్చు.అంటే పిల్లల జీవితంలోని అన్ని దశల్లో, అన్ని విధాలుగా వర్చువల్ సంస్కృతి పెరుగుతోంది. డిజిటల్ ప్రపంచంలో జరిగే సామాజిక, విద్యా, వినోద కార్యకలాపాలకే వారు పరిమితం అవుతున్నారు. జెన్ ఆల్ఫాకు సాంకేతికత కేవలం వినోదం లేదా అభ్యాసానికి ఉపయోగించే సాధనం కాదు. సమాచారం పొందడం, సంభాషించడం, తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అనుభవించడం వంటి విషయాల్లో అది ప్రధాన మార్గంగా మారుతోంది.బ్లాక్బోర్డుల నుంచి స్మార్ట్బోర్డుల వరకు..కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే.. మనం బ్లాక్బోర్డులను ఉపయోగించేవాళ్లమని గుర్తుకు వస్తుంది. ఉపాధ్యాయులు బోర్డులపై రాసేవారు. విద్యార్థులు వాటిని కాపీ చేసేవారు. యువతపై ప్రభావం చూపుతూ వేగవంతమైన సాంకేతికత ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తోంది. 2025లో భారత్లోని స్కూళ్లలో తరగతి గదుల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. బ్లాక్బోర్డుల స్థానంలో స్మార్ట్బోర్డులు వచ్చాయి. ఇప్పుడు విద్యార్థులకు ఉపాధ్యాయులు వివరించడానికి ఎక్కువగా రాయడం లేదు. వీడియోలు చూపిస్తున్నారు, పీడీఎఫ్లు తెరిచి బోధిస్తున్నారు.మన తల్లిదండ్రులు మన చిన్నతనంలో చెప్పిన “ఫోన్ ఎక్కువగా చూడొద్దు, కళ్లపై ప్రభావం పడుతుంది” లేదా “స్క్రీన్ సమయం తగ్గించు” అనే మాటలు ఇప్పుడు పనిచేయడం లేదు. ఒకప్పుడు దృష్టి మళ్లించే వస్తువులుగా భావించిన అదే స్క్రీన్లు ఇప్పుడు తరగతి గదులు, గ్రంథాలయాలు, చదువులో భాగస్వాములుగా మారాయి.బియ్యం బస్తాల్లా బ్యాగులు ఉండేవి కదా..పాఠశాల బ్యాగు పరిస్థితి మీకు గుర్తుండే ఉంటుంది. బియ్యం బస్తాల్లా బ్యాగులను మోసుకెళ్లేవాళ్లం. 6వ తరగతికే వెన్నునొప్పి వచ్చేది. ఐదారు సబ్జెక్టుల పాఠ్యపుస్తకాలు, నోట్బుక్కులు ఉండేవి.జెన్ ఆల్ఫా పిల్లల సంగతే వేరు. తేలికైన బ్యాగులు ఉంటున్నాయి. కొన్ని స్కూళ్లకు పిల్లలు బ్యాగులు లేకుండానే వెళ్తున్నారు. ఎందుకంటే పాఠ్యపుస్తకం ఇప్పుడు పీడీఎఫ్ రూపంలో ఉంది. నోట్స్ గూగుల్ డాక్లో ఉన్నాయి. హోం వర్క్ గూగుల్ క్లాస్రూమ్లో ఇస్తున్నారు. చదువుకు సంబంధించిన అనేక విషయాలు వాట్సాప్ గ్రూపుల్లో లింక్ రూపంలో వస్తున్నాయి. అన్నీ టాబ్లెట్ లేదా ల్యాప్టాప్లోని ఒక ఫోల్డర్లో క్రమబద్ధంగా, సెర్చ్ చేయడానికి సులభంగా ఉంటాయి.గత తరాలు పుస్తకాలను చదవడం నేర్చుకున్నాయి. నేటి విద్యార్థులు వీడియోలు, సామాజిక మాధ్యమాలు, ఆగ్మెంటెడ్ రియాలిటీ, కృత్రిమ మేధస్సు ద్వారా ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం నేర్చుకుంటున్నారు. ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటే డిజిటల్ చిత్రాలు, సమాచారం జోడించి చూపే సాంకేతికత.జెన్ ఆల్ఫా, స్క్రీన్ల మధ్య బంధం ఇప్పటికే పెరుగుతుండగా, కోవిడ్-19 మహమ్మారి దాన్ని మరింత వేగవంతం చేసింది. దాదాపు మూడు సంవత్సరాలు విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. తరగతులకు హాజరయ్యారు, పరీక్షలకు సిద్ధమయ్యారు, అసైన్మెంట్లు సమర్పించారు, స్నేహ సంబంధాలు కూడా పరికరాల ద్వారానే కొనసాగించారు. స్క్రీన్లు ఆప్షన్గా కాకుండా అత్యవసరంగా మారాయి.దీనిలో ఉన్న మంచి విషయం నిజమే. వీడియోలో అగ్నిపర్వత విస్ఫోటనాన్ని చూసే పిల్లవాడు లేదా రంగులతో కూడిన కిరణజన్య సంయోగక్రియ చలనచిత్రాన్ని చూసే పిల్లవాడు... బోర్డుపై గీసిన చాక్ చిత్రాన్ని చూసే పిల్లవాడితో పోల్చితే దాన్ని భిన్నంగా అర్థం చేసుకుంటాడు.ఇప్పుడు “పుస్తకం ఇంట్లో మరిచిపోయాను” అనే మాట లేదు. “అన్నీ నా చేతిలోనే ఉన్నాయి” అనే పరిస్థితి వచ్చింది. విద్యార్థులు అదే స్క్రీన్పై వారు యూట్యూబ్ చూస్తారు, స్నేహితులతో సంభాషిస్తారు. జెన్ ఆల్ఫా పిల్లవాడికి ఏదైనా అర్థం కాకపోతే పేరాను మళ్లీ చదవడు.. వీడియో కోసం వెతుకుతాడు. అది 8 నిమిషాల కంటే ఎక్కువ ఉంటే, అవసరమైన భాగానికి నేరుగా వెళ్లిపోవచ్చు.ఇప్పుడు దాదాపు ప్రతి ప్రశ్నకు వెంటనే సమాధానం లభిస్తుంది. మిలీనియల్స్, జెన్ జెడ్ తరాలకు ఆఫ్లైన్లో ఉండటం రోజువారీ జీవితంలో సాధారణ భాగం. జెన్ ఆల్ఫాకు “ఆఫ్లైన్” క్రమంగా ఒక అనుభవం కంటే ఒక భావనగా మారవచ్చు. వారు దాని గురించి వింటారు గానీ, తరచుగా అనుభవించకపోవచ్చు. -
స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో సుందర్ పిచాయ్కు చేదు అనుభవం
స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్కి చేదు అనుభవం ఎదురైంది. ఆయన ప్రసంగం చేస్తుండగా కొందరు విద్యార్థులు వాకౌట్ చేశారు. ప్రభుత్వ మరియు రక్షణ రంగ సంస్థలతో గూగుల్ ఒప్పందాలకు నిరసనగా కొంతమంది విద్యార్థుల బృందం సభ నుండి బయటకు వెళ్ళిపోయి నిరసనను వ్యక్తం చేసింది. ప్రభుత్వ, రక్షణ సంబంధిత పనులలో ప్రధాన టెక్ సంస్థల ప్రమేయంపై యూఎస్ క్యాంపస్లలో విద్యార్థులు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఈ నిరసన చోటు చేసుకోవడం గమనార్హం.సాధారణంగా విద్యార్థుల ఆనందోత్సాహాలు, సాధించిన విద్యా విజయాలతో ఎంతో ఉత్సాహంగా జరగాల్సిన ఈ వేడుక విద్యార్థుల వాకౌట్తో కొద్దిసేపు ఉద్రిక్తంగా మారింది. ప్రసంగం కొనసాగుతుండగా పలువురు గ్రాడ్యుయేట్లు ఒకేసారి లేచి బయటకు వెళ్లిపోయారు. ముఖ్యంగా'స్టూడెంట్స్ ఫర్ జస్టిస్ ఇన్ పాలస్తీనా', 'నో టెక్ ఫర్ అపార్తీడ్' వంటి సామాజిక సంస్థలు ఈ నిరసన చేపట్టాయి. దీంతో పిచాయ్ తన ప్రసంగాన్ని టెక్నాలజీ అంశాలపై లోతైన చర్చకు దూరంగా, పట్టభద్రులకు సాధారణ సలహాలకే పరిమితం చేశారు. ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF), అమెరికా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ మరియు ఇమ్మిగ్రేషన్ విభాగాలతో గూగుల్ కుదుర్చుకున్న ఒప్పందాలకు వ్యతిరేకంగా విద్యార్థులు ఈ నిరసన చేపట్టారు.Stanford grads walk out as Google CEO Sundar Pichai takes the stage as commencement speaker. No mention of AI, unlike other uni speakers getting booed down this year. Story for @sfgate shortly pic.twitter.com/qvS2rJ91Ip— Matt Brown (@maattttbrown) June 14, 2026మరోవైపు ఇటీవల ఇతర యూనివర్సిటీల్లో ఇలాంటి విషయాలపై టెక్ ప్రముఖుల ప్రసంగాలకు విద్యార్థుల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో 2015 నుండి గూగుల్కు నాయకత్వం వహిస్తున్న, స్టాన్ఫర్డ్ పూర్వ విద్యార్థి పిచాయ్, తన ప్రసంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లేదా సాంకేతిక రంగ పరిణామాల జోలికి వెళ్లకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఇదీ చదవండి : విడాకులు మంజూరు : భర్తను వాటేసుకుని ఎమోషనల్, ఎందుకో తెలుసా?సుందర్ పిచాయ్ సందేశంపిచాయ్ ప్రసంగాన్ని చాలా సరళంగా, వ్యక్తిగత విషయాలకే పరిమితం చేశారు. 1990లలో కాలిఫోర్నియాలో తన తొలి రోజుల నాటి ఒక జ్ఞాపకాన్ని పంచుకున్నారు. అలాగే ఈ వేదికపై "ఏం మాట్లాడకూడదో" తనకు చాలా సలహాలు వచ్చాయంటూ కాస్త హాస్యాన్ని జోడించారు. డిగ్రీ పూర్తి చేసుకుని కొత్తగా కెరీర్ ప్రారంభించబోయే విద్యార్థులు ఎల్లప్పుడూ ఆశావాహ దృక్పథంతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఇదీ చదవండి: నో స్ట్రిక్ట్ డైట్ : శాస్త్రవేత్తలకే షాకిస్తున్న ‘30’ ఏళ్ల బామ్మ ఫిట్నెస్ సీక్రెట్ -
జాబ్స్ కాదు.. ఏఐతో ఇంకా చాలా పోవచ్చు: సత్య నాదెళ్ల
కృత్రిమ మేధ (ఏఐ) మనుషుల ఉద్యోగాలను తినేస్తుందనే భయాలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. అయితే మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏఐ వల్ల సృష్టించే విలువ, సంపద, జ్ఞానం అన్నీ కొద్ది కంపెనీల చేతుల్లోనే కేంద్రీకృతమైతే ఏం జరుగుతుందో చెబుతూ ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఉద్యోగాలు పోవడమే కాదు.. అంతకు మించిన ముప్పు పొంచి ఉందని అంటున్నారాయన.ఏఐ వల్ల వచ్చే లాభాలు, జ్ఞానం, వ్యాపార విలువ అంతా కొద్ది కంపెనీల చేతుల్లోనే కేంద్రీకృతమవడం అసలు ముప్పని సత్య నాదెళ్ల హెచ్చరిస్తున్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్లో చేసిన సుదీర్ఘ పోస్టులో నాదెళ్ల.. ఏఐ విప్లవాన్ని కేవలం మరో సాంకేతిక మార్పుగా చూడకూడదన్నారు. అలా జరిగితే మిగతా సంస్థలు తమ సొంత పరిజ్ఞానం, అనుభవం, పోటీపడే సామర్థ్యాన్ని కోల్పోయి పూర్తిగా వాటిపైనే ఆధారపడాల్సి వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు.గతంలో డిజిటల్ టూల్స్ ఉద్యోగుల ఉత్పాదకతను పెంచడానికి మాత్రమే ఉపయోగపడేవని.. కానీ ఇప్పుడు మనుషులు, ఏఐ వ్యవస్థలు పరస్పరం నేర్చుకునే కొత్త దశలోకి ప్రపంచం అడుగుపెడుతోందని వివరించారు. దీనిని ఆయన "కాగ్నిటివ్ లూప్"గా అభివర్ణించారు. భవిష్యత్తులో సంస్థల విజయాన్ని నిర్ణయించేది కేవలం డబ్బు లేదంటే యంత్రాలో కాదని నాదెళ్ల అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల అనుభవం, ఆలోచనా శక్తి, నిర్ణయ సామర్థ్యం, సృజనాత్మకత ఎంత ముఖ్యమో.. ఏఐ ఆధారంగా సంస్థలు సొంతంగా అభివృద్ధి చేసుకునే సామర్థ్యాలు కూడా అంతే ముఖ్యమని చెప్పారు. అయితే ఈ రెండింటిలోనూ మనిషే కేంద్రబిందువుగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఏఐ ఎంత అభివృద్ధి చెందినా.. లక్ష్యాలను నిర్దేశించడం, కొత్త ఆలోచనలను సృష్టించడం, విభిన్న రంగాల మధ్య సంబంధాలను గుర్తించడం వంటి అంశాల్లో మనుషుల పాత్ర కీలకంగానే ఉంటుందని పేర్కొన్నారు. అయితే నాదెళ్ల ఆందోళన ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయన్నది కాదు. కొద్ది సంఖ్యలో ఉన్న శక్తివంతమైన ఏఐ మోడళ్లపై ప్రపంచంలోని కంపెనీలు పూర్తిగా ఆధారపడిపోతే.. తమ సొంత పరిజ్ఞానం, మేధోసంపత్తి, అనుభవాన్ని క్రమంగా కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. "ప్రతి రంగంలోని ప్రతి సంస్థ సృష్టించిన విలువ అంతా కొద్ది ఏఐ మోడళ్ల చేతుల్లోకి వెళ్లే ప్రపంచాన్ని మనలో ఎవరూ కోరుకోరు" అని వ్యాఖ్యానించారాయన.ఈ సందర్భంలో ఆయన ప్రపంచీకరణ తొలి దశను ఉదాహరణగా ప్రస్తావించారు. తయారీ పరిశ్రమలు ఒక దేశం నుంచి మరో దేశానికి తరలిపోవడంతో ఆర్థిక వృద్ధి కాగితాలపై కనిపించినా.. అనేక ప్రాంతాలు, వర్గాలు శాశ్వతంగా నష్టపోయాయని గుర్తు చేశారు. అదే పరిస్థితి ఇప్పుడు ఏఐ యుగంలోనూ పునరావృతమయ్యే ప్రమాదం ఉందన్నారు. కంపెనీలు దశాబ్దాలుగా కూడబెట్టుకున్న అనుభవం, పరిజ్ఞానం, వ్యాపార విలువ మొత్తం ఏఐ వ్యవస్థల్లో కలిసిపోతే.. దాని ద్వారా వచ్చే లాభాలు మాత్రం కొద్ది సంస్థలకే పరిమితమయ్యే ప్రమాదాన్ని ఆయన ఎత్తిచూపారు. అందుకే "ఫ్రాంటియర్ మోడల్" కాకుండా "ఫ్రాంటియర్ ఎకోసిస్టమ్" అవసరమని నాదెళ్ల సూచించారు. అంటే.. కొద్ది కంపెనీలు మాత్రమే ఏఐని నియంత్రించే పరిస్థితి కాకుండా.. వివిధ దేశాలు, సంస్థలు, పరిశ్రమలు తమ సొంత ఏఐ సామర్థ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉండాలన్నారు. అప్పుడు మాత్రమే ఏఐ వల్ల వచ్చే ఆర్థిక ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలకు చేరుతాయని అభిప్రాయపడ్డారు.https://t.co/vLmiBKTtX3— Satya Nadella (@satyanadella) June 14, 2026ఇదిలా ఉండగా.. ఏఐ భవిష్యత్తుపై ఇతర సాంకేతిక దిగ్గజాలు కూడా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. ఆంత్రోపిక్ సీఈవో డారియో అమోడీ ఇటీవల ఏఐ కారణంగా దీర్ఘకాలిక ఉద్యోగ నష్టాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఏఐ మానవ మేధస్సుతో చేసే అనేక పనులను భర్తీ చేస్తే.. ఉద్యోగాలపై శాశ్వత ప్రభావం పడొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. పరిస్థితి మరింత తీవ్రమైతే ప్రభుత్వాలు ఉద్యోగుల కోసం ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకోవాల్సి రావచ్చని కూడా సూచించారు.మరోవైపు, ఎన్విడియా అధినేత జెన్సెన్ హువాంగ్ మాత్రం ఉద్యోగ కోతలన్నింటికీ ఏఐనే కారణమని చెప్పడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. జనరేటివ్ ఏఐ అనేది విస్తృతంగా అందుబాటులోకి రాకముందే అనేక సంస్థలు ఉద్యోగులను తొలగించాయని గుర్తుచేశారు. ఉద్యోగాల కోత వెనుక ఆర్థిక పరిస్థితులు, వ్యాపార వ్యూహాలు, మార్కెట్ మార్పులు వంటి అనేక కారణాలు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.ఏఐపై ప్రపంచవ్యాప్తంగా చర్చ ఇప్పుడు కొత్త దశకు చేరుకుంది. ఒకవైపు అపార అవకాశాలు కనిపిస్తుంటే.. మరోవైపు ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆర్థిక వ్యవస్థల భవిష్యత్తుపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సత్య నాదెళ్ల చేసిన హెచ్చరిక ఒక కీలక ప్రశ్నను ముందుకు తెచ్చింది. ఏఐ మనిషిని మరింత శక్తివంతం చేసే సాధనంగా మారుతుందా? లేదంటే కొద్ది కంపెనీల చేతుల్లోనే శక్తిని కేంద్రీకరించి మిగతా ప్రపంచాన్ని ఆధారపడేలా చేస్తుందా? రానున్న దశాబ్దంలో ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే ప్రపంచ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఉంది. -
పేటెంట్లలో టాప్కి దూసుకెళ్లిన జియో ప్లాట్ఫార్మ్స్
ముంబై: భారతీయ టెక్నాలజీ రంగానికి మరో కీలక మైలురాయిగా, రిలయన్స్కు చెందిన జియో ప్లాట్ఫామ్స్ (Jio Platforms) ప్రపంచ మేధోసంపత్తి సంస్థ (WIPO) పేటెంట్ కోఆపరేషన్ ట్రీటీ (PCT) 2025 ర్యాంకింగ్స్లో ప్రపంచ టాప్-20 ఇన్నోవేటర్ల జాబితాలో చోటు దక్కించుకుంది. గ్లోబల్ టాప్-20లో స్థానం సంపాదించిన ఏకైక భారతీయ టెక్నాలజీ సంస్థగా జియో నిలిచింది. 2025లో జియో ఏకంగా 320 స్థానాలు ఎగబాకి, అత్యంత వేగంగా ఎదుగుతున్న ఇన్నోవేటర్లలో ఒకటిగా గుర్తింపు పొందింది.జియో పేటెంట్ పోర్ట్ఫోలియో ప్రధానంగా 5G, 6G, కృత్రిమ మేధస్సు (AI), క్లౌడ్-నేటివ్ ప్లాట్ఫార్మ్స్, ఎడ్జ్ ఇంటెలిజెన్స్, నెట్వర్క్ స్లైసింగ్ వంటి భవిష్యత్ డిజిటల్ సాంకేతికతలపై కేంద్రీకృతమైంది. సంస్థ ఇప్పటివరకు మొత్తం 6,817 పేటెంట్లను దాఖలు చేయగా, ప్రపంచవ్యాప్తంగా 1,009 పేటెంట్లు జియో ప్లాట్ఫామ్స్కు మంజూరయ్యాయి. మార్చి 31, 2026 నాటికి భారత్లో 538, విదేశాల్లో 471 పేటెంట్లు జియోకు లభించాయి.ఈ సందర్భంగా జియో ప్లాట్ఫార్మ్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆకాశ్ అంబానీ (Akash Ambani) మాట్లాడుతూ, భారత్ను సాంకేతికతను సృష్టించే, ఎగుమతి చేసే దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యానికి ఈ విజయం నిదర్శనమని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా PCT దాఖలాలు 2025లో కేవలం 0.7% మాత్రమే పెరిగినప్పటికీ జియో టాప్-20లోకి ప్రవేశించడం విశేషమని డబ్ల్యూఐపీవో వెల్లడించింది. హువావే, శాంసంగ్, గూగుల్, యాపిల్ వంటి దిగ్గజాల సరసన జియో చేరడం భారత డీప్టెక్ సామర్థ్యానికి అంతర్జాతీయ గుర్తింపుగా నిలిచింది. -
సముద్రంపై AI సామ్రాజ్యం! శామ్సంగ్ కొత్త ప్రయోగం
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విస్తరిస్తున్న కొద్దీ డేటా సెంటర్ల అవసరం మరింతగా పెరుగుతోంది. అయితే భూమిపై స్థలం కొరత, భారీ విద్యుత్ అవసరాలు, శీతలీకరణ సమస్యలు టెక్ దిగ్గజాలకు సవాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియాకు చెందిన శామ్సంగ్ హెవీ ఇండస్ట్రీస్ (Samsung Heavy Industries) సముద్రంపై తేలియాడే ఏఐ డేటా సెంటర్ల (Floating Data Centers) అభివృద్ధికి శ్రీకారం చుట్టింది.మూడు సంస్థలు కలిసి..తేలియాడే డేటా సెంటర్ల అభివృద్ధి కోసం శామ్సంగ్ హెవీ ఇండస్ట్రీస్, గ్రీకు షిప్పింగ్ సంస్థ క్యాపిటల్ క్లీన్ ఎనర్జీ క్యారియర్స్, సముద్ర భద్రతా ప్రమాణాల సంస్థ లాయిడ్స్ రెజిస్టర్ కలిసి సంయుక్త అభివృద్ధి ఒప్పందం (JDP) కుదుర్చుకున్నాయి. ఇటీవల గ్రీస్లో జరిగిన ప్రముఖ అంతర్జాతీయ షిప్పింగ్ ఎగ్జిబిషన్ ‘పోసిడోనియా 2026’ సందర్భంగా ఈ ఒప్పందాన్ని ప్రకటించారు. ఇందు లో శామ్సంగ్ సాంకేతిక రూపకల్పన, నిర్మాణ బాధ్యతలు చేపట్టగా, క్యాపిటల్ పెట్టుబడులు, ప్రాజెక్టు అభివృద్ధిని పర్యవేక్షిస్తుంది. లాయిడ్స్ రిజిస్టర్ భద్రతా ధ్రువీకరణలు, నియంత్రణ అంశాలను చూసుకుంటుంది.డేటా సెంటర్లు సముద్రంపై ఎందుకు?భారీ ఏఐ డేటా సెంటర్లకు విస్తారమైన స్థలం, అపారమైన విద్యుత్ సరఫరా, అధిక శీతలీకరణ వ్యవస్థలు అవసరం. అమెరికా, యూరప్ వంటి ప్రాంతాల్లో భూమి లభ్యత తగ్గిపోవడం, విద్యుత్ గ్రిడ్ కనెక్షన్ల ఆలస్యం కారణంగా కొత్త డేటా సెంటర్ల నిర్మాణం కష్టమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సముద్రంలో లేదా నదులపై తేలియాడే డేటా సెంటర్లు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నాయి. సముద్రపు నీటినే నేరుగా శీతలీకరణ కోసం వినియోగించడం వల్ల విద్యుత్ వినియోగం కూడా తగ్గే అవకాశం ఉంది.50 మెగావాట్ల సామర్థ్యం.. వేలాది ఏఐ సర్వర్లుశామ్సంగ్ అభివృద్ధి చేస్తున్న తొలి ఫ్లోటింగ్ డేటా సెంటర్ (Samsung floating AI data center) సామర్థ్యం 50 మెగావాట్లు (MW)గా ఉంటుంది. ఇది వేల సంఖ్యలో ఏఐ సర్వర్లను నడిపించే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ కేంద్రం రెండు విధాలుగా విద్యుత్తును పొందగలదు. తీర ప్రాంతాలకు సమీపంలో ఉన్నప్పుడు సముద్ర అడుగు కేబుళ్ల ద్వారా విద్యుత్ గ్రిడ్కు అనుసంధానమవుతుంది. అవసరమైతే ద్రవీకృత సహజ వాయువు (LNG) ఆధారిత సాలిడ్ ఆక్సైడ్ ఫ్యూయల్ సెల్స్ ద్వారా స్వయంగా విద్యుత్తు ఉత్పత్తి చేసుకునే సౌకర్యం కూడా ఉంటుంది.సర్వర్లకు సముద్రం సవాలే!అయితే సముద్రంలో ఏఐ సర్వర్లను దీర్ఘకాలం నిర్వహించడం అంత సులభం కాదు. ఓడల కదలికలు, కంపనాలు, ఉప్పునీటి ప్రభావం, తేమ వంటి అంశాలు సున్నితమైన హార్డ్వేర్పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ సవాళ్లను అధిగమించేందుకు శామ్సంగ్ హెవీ ఇండస్ట్రీస్, సూపర్మైక్రో సంస్థతో కలిసి పరిశోధనలు నిర్వహిస్తోంది. సముద్ర వాతావరణంలో సర్వర్ల పనితీరును పరీక్షించే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.షిప్పింగ్ పరిశ్రమకు కొత్త వ్యాపార అవకాశాలుఫ్లోటింగ్ డేటా సెంటర్లు షిప్పింగ్ పరిశ్రమకు కూడా కొత్త ఆదాయ మార్గాలను తెరవవచ్చు. ఇప్పటివరకు సరుకు రవాణాపైనే ఆధారపడిన ఓడ యజమానులు, భవిష్యత్తులో టెక్ కంపెనీలు, క్లౌడ్ సేవల సంస్థలకు డేటా సెంటర్ సామర్థ్యాన్ని దీర్ఘకాలిక లీజుకు ఇవ్వడం ద్వారా స్థిరమైన ఆదాయం పొందే అవకాశం ఉంది.మరిన్ని సముద్ర డేటా సెంటర్లుఈ రంగంలో శామ్సంగ్ ఒక్కటే కాదు. జపాన్కు చెందిన మిత్సుయి ఒ.ఎస్.కె. లైన్స్ (MOL), టర్కీకి చెందిన కర్పవర్షిప్ కలిసి 73 మెగావాట్ల తేలియాడే డేటా సెంటర్ను 2027 నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. చైనాలో షాంఘై సమీపంలో 24 మెగావాట్ల నీటి అడుగున డేటా సెంటర్ ఇప్పటికే పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో నాటిలస్ డేటా టెక్నాలజీస్ 6.5 మెగావాట్ల బార్జ్ ఆధారిత డేటా సెంటర్ను నిర్వహిస్తోంది.ఇదీ చదవండి: ‘మెటాలో ఇక భారీ తొలగింపులు ఉండకపోవచ్చు’ -
మోటోరోలా సరికొత్త ‘5జీ’ స్మార్ట్ఫోన్లు!
న్యూఢిల్లీ: భారత్లో లీడింగ్ కృత్రిమ మేధ (ఏఐ) స్మార్ట్ఫోన్ బ్రాండ్ ‘మోటోరోలా’ దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఫీచర్లతో రెండు 5జీ స్మార్ట్ఫోన్లను ప్రవేశపెట్టింది. ‘మోటో జీ37’, ‘మోటో జీ37 పవర్’ పేర్లతో వస్తున్న మోడళ్లపై పరిమిత కాల ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తూ, భారీ డిస్కౌంట్లను అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారుల బడ్జెట్కు తగినట్లుగా అత్యంత తక్కువ ధరకే ప్రీమియం తరహా ఫీచర్లు, అత్యుత్తమ బ్యాటరీ పర్ఫార్మెన్స్, మిలిటరీ గ్రేడ్ ల్యాబ్ సర్టిఫైడ్ రక్షణతో ఈ ఫోన్లను తీసుకొచి్చనట్లు కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్ఫోన్లు ఆకర్షణీయమైన పాంటోన్ కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. ఫీచర్లు ఇవే మోటో జీ37, మోటో జీ37 పవర్.. ఈ రెండు ఫోన్లలోనూ 120హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్తో కూడిన భారీ 6.7 అంగుళాల డిస్ప్లేను అందించారు. సినిమాటిక్ ఆడియో అనుభూతిని అందించే వినూత్నమైన ‘డాల్బీ అట్మోస్’ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. ఫోటోగ్రఫీ కోసం గూగుల్ ఏఐ ఎడిటింగ్ టూల్స్ సపోర్ట్ చేసే ‘50ఎంపీ క్వాడ్ పిక్సెల్ ఏఐ కెమెరా’ను ఈ రెండు మోడళ్లలోనూ అమర్చారు. ముఖ్యంగా ‘మోటో జీ37 పవర్’ ఫోన్లో మూడు రోజుల పాటు నిరంతరాయంగా పనిచేసే భారీ 7000ఎంఏహెచ్ బ్యాటరీ, 33డబ్ల్యూ టర్బోపవర్ ఛార్జింగ్ సదుపాయం ఉన్నాయి. అలాగే ఇందులో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్, 128జీబీ స్టోరేజ్, గరిష్టంగా 24జీబీ వరకు ర్యామ్ బూస్ట్ చేసుకునే ఆప్షన్ అందించారు. దీనికి రక్షణగా స్క్రీన్ పై గొరిల్లా గ్లాస్ 7ఐ, ఎంఐఎల్–ఎస్టీడీ–810 హెచ్ మిలిటరీ గ్రేడ్ సరి్టఫికేషన్, ఐపీ64 వాటర్–రెసిస్టెంట్ డిజైన్ ఉన్నాయి. స్మార్ట్ యూజర్ అనుభూతి కోసం గూగుల్ ‘జెమిని’, ‘సర్కిల్ టు సెర్చ్’ వంటి ఏఐ ఫీచర్లు ఇందులో ఇన్బిల్ట్గా వస్తాయి.ధరల విషయానికొస్తే: మోటో జీ37 బేసిక్ మోడల్ ప్రత్యేక పరిమిత కాల ఆఫర్ ధర రూ.13,999 గా ఉంది (దీని అసలు ధర రూ.14,999). ఇక ‘మోటో జీ37 పవర్’ మోడల్ 4జీబీ+128జీబీ వేరియంట్ ప్రారంభ ధర రూ.15,999 గా ఉండగా , దీని టాప్ వేరియంట్ (8జీబీ+128జీబీ) అసలు ధర రూ.21,999 కాగా.. రూ.2,000 బ్యాంక్ ఆఫర్తో రూ.19,999 కే లభిస్తుంది. వినియోగదారులు ఈ ఫోన్లను ఈ–కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్, మోటోరోలా అధికారిక వెబ్సైట్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. -
‘మెటాలో ఇక భారీ తొలగింపులు ఉండకపోవచ్చు’
సోషల్ మీడియా దిగ్గజం మెటా కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత సంస్థగా రూపాంతరం చెందే క్రమంలో ఉద్యోగులకు సంబంధించి కొన్ని పొరపాట్లు జరిగాయని దాని అధినేత మార్క్ జుకర్బర్గ్ (Mark Zuckerberg) అంగీకరించారు. అంతర్గత మెమోలో ఉద్యోగులను ఉద్దేశించి, వేగంగా మారుతున్న ఏఐ ప్రపంచంలో ఇలాంటి సవాళ్లు సహజమని జుకర్బర్గ్ పేర్కొన్నారు. “ఈ మార్పుల సంక్లిష్టత దృష్ట్యా మేము తప్పులు చేశాం. భవిష్యత్తులో కూడా కొన్ని తప్పిదాలు జరిగే అవకాశం ఉంది” అని ఆయన వ్యాఖ్యానించారు.ప్రస్తుతం మెటా సంస్థ తన వ్యాపార వ్యూహాన్ని పూర్తిగా ఏఐ చుట్టూ పునర్వ్యవస్థీకరిస్తోంది. ఇందుకోసం డేటా సెంటర్లు, ఏఐ మౌలిక సదుపాయాలు, సూపర్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టులపై వందల బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతోంది. ఈ క్రమంలో సంస్థలో విస్తృత స్థాయి పునర్నిర్మాణం చేపట్టింది. మే నెలలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 10 శాతం ఉద్యోగులను తొలగించగా, మరో 7,000 మంది ఉద్యోగులను ఏఐ సంబంధిత బృందాలకు బదిలీ చేసింది.అయితే ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనలను తగ్గించే ప్రయత్నంలో జుకర్బర్గ్ కీలక హామీ ఇచ్చారు. “ఈ ఏడాది సంస్థవ్యాప్తంగా మరోసారి భారీ స్థాయి ఉద్యోగ కోతలు ఉంటాయని మేము భావించడం లేదు” అని స్పష్టం చేశారు. ప్రపంచ పరిస్థితులు వేగంగా మారుతున్నందున అతిగా హామీలు ఇవ్వలేనప్పటికీ, సంస్థాగత స్థిరత్వాన్ని కాపాడటమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.ఏఐ మోడళ్ల శిక్షణ కోసం బదిలీ చేసిన ఉద్యోగులకు కొత్త అవకాశాలు కల్పించేందుకు సంస్థ కృషి చేస్తోందని ఆయన వెల్లడించారు. అవసరమైతే కొన్ని విభాగాల్లో తగ్గించిన సిబ్బందిని తిరిగి ఇతర బృందాలకు మార్చే అవకాశమూ ఉంటుందని చెప్పారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఉద్యోగుల నైపుణ్యాలను వినియోగించుకోవడమే లక్ష్యమని పేర్కొన్నారు.ఇదిలా ఉండగా, మెటాలో జరిగిన ఏఐ ఆధారిత పునర్వ్యవస్థీకరణపై కొంత అసంతృప్తి కూడా వ్యక్తమవుతోంది. కొత్తగా ఏర్పాటైన ఏఐ విభాగాల్లో పని స్వరూపం, బాధ్యతలపై కొందరు ఉద్యోగులు అసహనం వ్యక్తం చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని పెంచేందుకు జూలైలో భారీ ఏఐ హ్యాకథాన్, టీమ్ ఈవెంట్లు నిర్వహించేందుకు సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోంది.ఏఐ పోటీలో ముందంజలో నిలవాలన్న లక్ష్యంతో మెటా దూసుకెళ్తున్నప్పటికీ, ఉద్యోగుల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం, సంస్థాగత మార్పులను సమతుల్యం చేయడం కంపెనీకి ఇప్పుడు అతిపెద్ద సవాలుగా మారింది. -
ఓవైపు ఉద్యోగ భయం.. మరోవైపు భారీ వాడకం!
అన్నింటా ఏఐ వినియోగం పెరిగింది. దీంతో రోజుకొక కొత్త ఏఐ టూల్ పుట్టుకొస్తోంది. ఇదే క్రమంలో ఏఐ విస్తృతితో కంపెనీలు ఉద్యోగాలను తగ్గిస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. రాబోయే మరింతగా ఉద్యోగాల కోత ఉంటుందన్న ఆందోళనలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో ఉద్యోగుల భయాలను తొలగిస్తూ హమ్మయ్య అనిపించే తాజా నివేదిక ఒకటి వెల్లడైంది. ఉద్యోగాల తొలగింపుల భయాలు ఒకవైపు ఉన్నా మరోవైపు ఏఐ వినియోగంలో మనోళ్లు దూసుకెళ్తున్నారు.ఏఐ వినియోగంలో అగ్రస్థానంలో భారత్ ప్రపంచవ్యాప్తంగా ఏఐ సాంకేతికతను వేగంగా అందిపుచ్చుకున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. దేశంలోని సుమారు 41 శాతం మంది ఉద్యోగులు ప్రతిరోజూ ఏఐని ఉపయోగిస్తుండగా, 80 శాతం మంది వారంలో నాలుగైదు సార్లు వాడుతున్నారు. సర్వేలో పాల్గొన్న అన్ని దేశాల కంటే ఇది అత్యధికం. ఇటువంటి పరిస్థితుల్లో సంస్థలు తమ ఉద్యోగులకు స్పష్టమైన కెరీర్ మార్గాలను చూపాలని, నిరంతర నైపుణ్యాభివృద్ధిపై పెట్టుబడులు పెట్టాలని హెచ్ఆర్, పేరోల్ సొల్యూషన్స్ సంస్థ ‘ఏడీపీ ఇండియా అండ్ సౌత్ ఈస్ట్ ఆసియా’ మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ గోయల్ తెలిపారు. సేవా రంగం విస్తృతంగా ఉన్న భారత్ వంటి దేశాల్లో ఆపరేషనల్, ప్రాసెస్ ఆధారిత పనుల్లో లక్షలాది మంది ఉన్నారు. అందువల్ల ఏఐ సాంకేతికతతో పాటు ఉద్యోగులకు కొత్త నైపుణ్యాలను నేర్పించడం సంస్థల బాధ్యత’’ అని రాహుల్ గోయల్ పేర్కొన్నారు.ఏఐతో ఉద్యోగాలు పోవు..‘ఆఫీసు కార్యకలాపాల్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో ఉద్యోగాలు అంతరించిపోతాయనే ఆందోళనల్లో నిజం లేదు. ఏఐ వాడకంతో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరిగి, సంస్థల ఉత్పాదకత మరింత పెరుగుతుంది’ అని హెచ్ఆర్, పేరోల్ సొల్యూషన్స్ సంస్థ ‘ఏడీపీ ఇండియా అండ్ సౌత్ ఈస్ట్ ఆసియా’ మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ గోయల్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదుగురు ఉద్యోగుల్లో ఒకరు రోజువారీ పనుల్లో ఏఐని ఉపయోగిస్తున్నారు. దైనందిన జీవితంలో సాంకేతికత ఎంత వేగంగా భాగమైందో ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయని పరిశోధనా సంస్థ ‘ఏడీపీ రీసెర్చ్’ తాజాగా విడుదల చేసిన ‘పీపుల్ అట్ వర్క్ 2026’ నివేదిక తెలిపింది. అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగుల ఆలోచనా విధానాన్ని తెలుసుకునేందుకు ఏడీపీ రీసెర్చ్ సంస్థ 36 దేశాల్లోని 39,000 మందికి పైగా ఉద్యోగులపై ఈ వార్షిక గ్లోబల్ వర్క్ఫోర్స్ సర్వేను నిర్వహించింది. -
లక్ష రూపాయల ఫోన్.. ఇప్పుడు సగం ధరకే!
ప్రీమియం స్మార్ట్ఫోన్ కొనాలని చాలా మందికి ఉంటుంది. అయితే అందుకు వారి బడ్జెట్ సహకరించదు. ఎందుకంటే వాటి ధరలు రూ.లక్ష వరకు ఉంటాయి. ఇలాంటి కస్టమర్లకు శామ్సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ (Samsung Galaxy S25 Edge) ఇప్పుడు ఆకర్షణీయమైన ఎంపికగా మారింది. భారత్లో ఈ ఫోన్ను గతేడాది మేలో రూ.1,09,999 ప్రారంభ ధరతో విడుదల చేసిన శామ్సంగ్, ప్రస్తుతం ఈ మోడల్పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. అధికారిక లాంచ్ సమయంలో రూ.1 లక్షకు పైగా ధర కలిగిన ఈ ఫోన్, ప్రస్తుతం ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్లలో రూ.60 వేల పరిధిలోనే లభిస్తోంది.ప్రస్తుతం 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ సుమారు రూ.59,999కు, 512GB వేరియంట్ రూ.71,999కు అందుబాటులో ఉన్నట్లు ఆన్లైన్ ఆఫర్లు సూచిస్తున్నాయి. దీంతో అసలు లాంచ్ ధరతో పోలిస్తే దాదాపు రూ.50,000 వరకు తగ్గింపు (Samsung S25 Edge Discount) లభిస్తోంది. కొన్ని బ్యాంక్ కార్డులపై అదనపు ఇన్స్టంట్ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.గెలాక్సీ S25 ఎడ్జ్ను ప్రత్యేకంగా నిలబెట్టేది దాని అల్ట్రా-స్లిమ్ డిజైన్. కేవలం 5.8 మిల్లీమీటర్ల మందం, 163 గ్రాముల బరువుతో ఇది శామ్సంగ్ గెలాక్సీ S సిరీస్లో ఇప్పటివరకు వచ్చిన అత్యంత సన్నని ఫోన్గా గుర్తింపు పొందింది. టైటానియం ఫ్రేమ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సిరామిక్ 2 రక్షణతో ప్రీమియం లుక్తో పాటు మన్నికను కూడా అందిస్తోంది.స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే, ఇందులో 6.7 అంగుళాల QHD+ డైనమిక్ AMOLED 2X డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ఫర్ గెలాక్సీ ప్రాసెసర్, 12GB ర్యామ్ ఉన్నాయి. కెమెరా విభాగంలో 200 మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించబడింది. అలాగే గేలాక్సీ ఏఐ ఫీచర్లు, IP68 వాటర్-డస్ట్ రెసిస్టెన్స్ వంటి ప్రీమియం సౌకర్యాలు కూడా ఉన్నాయి.అయితే ఈ ఫోన్లో 3,900mAh బ్యాటరీ మాత్రమే ఉండటం కొంతమందికి ప్రతికూల అంశంగా భావించవచ్చు. అయినప్పటికీ, స్లిమ్ డిజైన్, ఫ్లాగ్షిప్ పనితీరు, 200MP కెమెరా కలయికను ప్రస్తుతం లభిస్తున్న తగ్గింపు ధరలో పరిశీలిస్తే, గెలాక్సీ S25 ఎడ్జ్ ఇప్పుడు ప్రీమియం సెగ్మెంట్ నుంచి ‘వాల్యూ ఫర్ మనీ ఫ్లాగ్షిప్’ కేటగిరీలోకి మారినట్లే కనిపిస్తోంది. -
భారత్ మార్కెట్పై ఎల్జీ ఫోకస్
సియోల్: దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ ఎల్రక్టానిక్స్ తన భవిష్యత్ వ్యాపార వృద్ధికి భారత్ను కీలక కేంద్రంగా చూస్తోంది. భారత్తోపాటు సౌదీ అరేబియా, బ్రెజిల్ మార్కెట్ల నుంచి ఆదాయాన్ని 2030 నాటికి రెట్టింపు చేసుకోవాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు సంస్థ సీఈవో ల్యూ జే చియోల్ తెలిపారు. ముఖ్యంగా భారత్ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుండడం, అతిపెద్ద వినియోగ మార్కెట్ కూడా కావడంతో.. ఫ్రిజ్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండీషనర్ల (ఏసీలు) వినియోగం ఇంకా విస్తృతంగా పెరిగే అవకాశం ఉంటుందని కంపెనీ అంచనా వేస్తోంది. దీంతో ఎల్జీ బ్రాండ్కు ఉన్న ఆదరణ దృష్ట్యా తన మార్కెట్ను మరింత పెంచుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగా కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత గృహోపకరణాల విస్తరణపై ఎల్జీ దృష్టి సారించింది. వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్లు, ఎయిర్ కండీషనర్లు, కిచెన్ ఉత్పత్తుల్లో ఏఐతోపాటు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఎగుమతులకూ ప్రాధాన్యం.. 2025లో భారత్, సౌదీ అరేబియా, బ్రెజిల్ దేశాల నుంచి ఎల్జీకి 6.2 ట్రిలియన్ కొరియన్ వోన్ల ఆదాయం లభించగా, 2023తో పోలిస్తే ఇది 20 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసింది. గతేడాది సంస్థ మొత్తం ఆదాయం 89.2 ట్రిలియన్ వోన్ల్లో 8 శాతానికి సమానం. ప్రపంచ వ్యాప్తంగా ఎల్జీ సంస్థ సాధించిన వృద్ధితో పోలి్చతే ఇది రెండింతలకుపైగా కావడం విశేషం. ఇంత భారీ వృద్ధి అవకాశాల నేపథ్యంలో భారత్ను ‘గ్లోబల్ సౌత్’ వ్యూహానికి కేంద్రబిందువుగా పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్లో తన ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని నిర్ణయించినట్టు ఎల్జీ వెల్లడించింది. ప్రస్తుతం ఈ సంస్థకు ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడా, మహారాష్ట్రలోని పుణేలో ప్లాంట్లు ఉండగా, ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సిటీలో మూడో తయారీ కేంద్రాన్ని నిర్మిస్తోంది. ఇది 2026 చివరినాటికి కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. ఈ కొత్త ప్లాంట్ ద్వారా ఆసియా, ఆఫ్రికా దేశాలకు ఎగుమతులను పెంచుకోవాలని చూస్తున్నట్టు తెలిపింది. భవిష్యత్తులో అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలకు సైతం భారత్లో తయారైన ఉత్పత్తులను ఎగుమతి చేయాలన్న ప్రణాళికతో ఉన్నట్టు పేర్కొంది. యూకే, ఈయూతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకోగా, వీటిని అనుకూలంగా చేసుకోవడాన్ని పరిశీలించనున్నట్టు తెలిపింది. ప్రీమియం ఉత్పత్తులపై దృష్టిప్రస్తుతం భారత్లో మధ్యస్థ, తక్కువ ధరల ఉత్పత్తుల తయారీపైనే ఎక్కువగా దృష్టి పెట్టిన ఎల్జీ, ఇకపై నాలుగు డోర్ల ఫ్రిజ్లు, ఫ్రెంచ్ డోర్ ఫ్రిజ్లు వంటి ప్రీమియం ఉత్పత్తుల తయారీని పెంచనున్నట్టు వెల్లడించింది. పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) సామర్థ్యాలను బలోపేతం చేసుకోవడం, నైపుణ్యం కలిగిన సిబ్బందిని నియమించుకోవడం, స్థానిక సంస్థలను కొనుగోలు చేయడం లేదా విలీన అవకాశాలను సైతం పరిశీలించనున్నట్టు పేర్కొంది. హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండీషనింగ్ (హెచ్వీఏసీ) విభాగంలోకీ విస్తరించనున్నట్టు ప్రకటించింది. భారత వినియోగదారులు సాధారణ ఉత్పత్తుల కంటే ఇంటెలిజెంట్, కనెక్టెడ్ (ఒకదానితో ఒకటి అనుసంధానిత) గృహోపకరణాల వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపింది. ఈ నేపథ్యంలో కృత్రిమ మేధస్సు ఆధారిత గృహోపకరణాలు, వాటిని అనుసంధానించే స్మార్ట్ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నట్టు వెల్లడించింది. -
ఈ ఐటీ కంపెనీలో జీతాల పెంపునకు కొత్త ఫార్ములా..
ప్రపంచ ఐటీ దిగ్గజం యాక్సెంచర్ (Accenture) తన ఉద్యోగుల వేతన పెంపు విధానంలో కీలక మార్పులు చేసింది. ఇకపై వేతన పెంపు మొత్తం బేసిక్ పేలో కలపకుండా, దానిని రెండు భాగాలుగా విభజించి అందించనుంది. ఒక భాగం శాశ్వత బేస్ పే పెంపుగా ఉండగా, మిగిలిన భాగాన్ని జూన్లో ఒకేసారి చెల్లించే లంప్సమ్ బోనస్గా ఇవ్వనుంది. ఈ విధానం ద్వారా ఉద్యోగులకు తక్షణ నగదు ప్రయోజనం కల్పించడంతో పాటు కంపెనీ తన స్థిర వేతన వ్యయాలను నియంత్రించగలదని సంస్థ భావిస్తోంది.కంపెనీ అంతర్గత సమాచారం ప్రకారం.. ఒక ఉద్యోగికి 3 శాతం వేతన పెంపు మంజూరైతే అందులో 1.5 శాతం మాత్రమే బేస్ పేలో చేరుతుంది. మిగిలిన 1.5 శాతం జూన్లో ఒకసారి చెల్లించే బోనస్గా అందుతుంది. అయితే ప్రమోషన్ పొందిన ఉద్యోగులకు వర్తించే పెంపు మాత్రం పూర్తిగా బేస్ పేలోనే జమ అవుతుంది. అలాగే జూన్ లంప్సమ్ చెల్లింపు డిసెంబరులో ఇచ్చే వార్షిక పనితీరు బోనస్కు పూర్తిగా వేరుగా ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది.యాక్సెంచర్లో జూన్ నెలే ప్రమోషన్లు, వేతన సవరణలకు ప్రధాన చక్రంగా కొనసాగుతోంది. గత ఏడాది పరిమిత సంఖ్యలో మాత్రమే ‘స్టే-అట్-లెవల్’ ఉద్యోగులకు పెంపు లభించగా, ఈసారి మరింత పెద్ద సంఖ్యలో ఉద్యోగులను పెంపు పరిధిలోకి తీసుకురావాలని సంస్థ నిర్ణయించింది. దీంతో ఎక్కువ మంది ఉద్యోగులు కనీసం కొంత మేర వేతన ప్రయోజనం పొందే అవకాశం ఏర్పడింది.ఈ నిర్ణయం వెనుక ప్రపంచ ఆర్థిక మందగమనం, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, ఐటీ సేవల రంగంలో కొనసాగుతున్న ఒత్తిళ్లు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. స్థిర ఖర్చులను అదుపులో ఉంచుతూ ప్రతిభావంతులైన ఉద్యోగులను నిలబెట్టుకోవడమే లక్ష్యంగా యాక్సెంచర్ ఈ హైబ్రిడ్ వేతన విధానాన్ని అమలు చేస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వేతన నిర్ణయాలు ఉద్యోగుల నైపుణ్యాలు, పనితీరు, వ్యాపారంపై చూపిన ప్రభావం, ప్రవర్తనా ప్రమాణాల ఆధారంగానే కొనసాగుతాయని సంస్థ తెలిపింది.భారత్లో యాక్సెంచర్కు సుమారు 3.5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ కొత్త విధానం వారి వేతన నిర్మాణంపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. కొంతమంది ఉద్యోగులు తక్షణ నగదు లాభాన్ని స్వాగతిస్తున్నప్పటికీ, బేస్ పే పెరుగుదల పరిమితంగా ఉండటం వల్ల భవిష్యత్ వేతన వృద్ధిపై ప్రభావం పడొచ్చనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. -
ఏఐ దారి తప్పకుండా థియోమ్ పటిష్ట నిఘా!
‘‘ఏఐ కట్టుతప్పుతోంది.. తగిన రక్షణ ఏర్పాట్లు చేసుకునేంత వరకూ వాడకం ఆపేద్దాం’’. ఆంథ్రోపిక్ సీఈవో ఇటీవల చేసిన హెచ్చరిక ఇది. అయితే ఇంకో అంతర్జాతీయ ఏఐ సంస్థ థియోమ్ మాత్రం ఇందుకు భిన్నమైన ఆలోచన చేస్తోంది. హ్యాకర్లు ఏఐ దుర్వినియోగానికి ప్రయత్నిస్తూంటే... తాము ఏఐ సాయంతోనే ఏఐకు, డేటాకు రక్షణ కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని థియోమ్ చెబుతోంది. ఇదే అంశంపై సంస్థ సహ వ్యవస్థాపకులు, సీఈవో నవీంద్ర యాదవ్ ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏమన్నారంటే...ప్రశ్న: ముందుగా థియోమ్ గురించి వివరించండి.జవాబు: థియోమ్ డేటా, ఏఐ సెక్యూరిటీ కంపెని. 2020 డిసెంబరులో స్థాపించాము. మిగిలిన సైబర్ సెక్యూరిటీ సంస్థల మాదిరిగా ఇది డేటాను నెట్వర్క్ల బయట నుంచి కాపాడదు. లోపలి నుంచి రక్షణ కల్పిస్తుంది. స్నోఫ్లేక్స్, డేటాబ్రిక్స్ వంటి భారీ డేటా స్టోర్లు, గోల్డ్మ్యాన్ శాక్స్, బ్లాక్రాక్ వంటి ఫైనాన్షియల్ సంస్థలు, హెల్త్కేర్, ఫార్మా కంపెనీలు ఈ డేటా స్టోర్లను వాడుకుంటూంటాయి. థియోమ్ ఈ డేటా స్టోర్లతోపాటు కంపెనీలు వాడే ఏఐ వ్యవస్థల్లో ఉంటూ రక్షణ కల్పిస్తుంది. ఏఐ సాఫ్ట్వేర్పై ఎవరైనా దాడులు చేస్తున్నారా? అన్నది పరిశీలించడంతోపాటు, ఏఐ డేటాతో జరిపే సంప్రదింపులను కూడా పరిశీలించి అవాంఛనీయ ఘటనలేవీ జరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఏఐ ఏ రకమైన డేటాతో పనిచేస్తోందన్నది నిత్యం గమనిస్తూండటం ద్వారా అది దారి తప్పకుండా కాపు కాస్తూ ఉంటుందన్నమాట.ప్ర: మీరు డేటా స్టోర్ల గురించి ప్రస్తావించారు. ఇవి డేటా సెంటర్లూ ఒకటేనా?జ: కాదు. రెండూ వేర్వేరు. డేటా సెంటర్లలో డేటా నిక్షిప్తమవుతుంది. కంప్యూటర్లు, సర్వర్లు ఉండే ప్రాంతం. డేటా స్టోర్లు అంటే ఈ డేటా సెంటర్లలోని సమాచారం. ఇంకోలా చెప్పాలంటే ఒక రకమైన డేటాబేస్ అన్నమాట.ప్ర: ఏఐ వ్యవస్థలకు ప్రస్తుతం ఎలాంటి ముప్పు ఎదురవుతోంది?జ: చాలానే ఉన్నాయి. ఏఐ వ్యవస్థలను తమ అవసరాల కోసం వాడుకునేందుకు నిత్యం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. డేటా చోరీతోపాటు, సమాచారాన్ని తమకు అనుకూలమైన రీతిలో మార్చుకుని లాభపడేందుకు హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారు. ఆంథ్రోపిక్ గురించి మీరు వినే ఉంటారు. ఇటీవలే ఈ ఏఐ కంపెనీ మైథోస్ పేరుతో సరికొత్త ఏఐ సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తెచ్చింది. రెండు వారాల క్రితమే భారత ప్రభుత్వం కూడా దీన్ని వాడటం మొదలుపెట్టింది. మైథోస్ అనేది ఇతర వ్యవస్థలపై దాడి చేయగల సామర్థ్యమున్నది. థియోమ్ ఇలాంటి దాడుల నుంచి రక్షణ కల్పిస్తుంది.సింపుల్గా చెప్పాలంటే థియోమ్ అనేది శరీర రోగ నిరోధక వ్యవస్థ లాంటిది. లోపలి నుంచి రక్షణ కల్పిస్తుంది. మిగిలిన సైబర్ సెక్యూరిటీ సంస్థలు తొడుక్కునే రక్షణ కవచల్లాంటివి. అందుకే థియోమ్ అనేది ఏఐ యుగం కోసం సిద్ధం చేసిన వ్యవస్థ.ప్ర: ఆరేళ్లలో థియోమ్ ఎంత మేర విస్తరించింది?జ: థియోమ్ ఒక అంతర్జాతీయ సంస్థ. అమెరికాలో మొదలైంది. భారత్తోపాటు జర్మనీ, పోర్చుగల్, క్రొయేషియా, ఆస్ట్రేలియాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పశ్చిమార్ధగోళం నుంచి అత్యధిక ఆదాయం పొందుతున్న కంపెనీ. జెట్ బ్లూ ఎయిర్లైన్స్, ఫార్మాస్యూటికల్, హెల్త్కేర్ కంపెనీలు, గోల్డ్మ్యాన్ శాక్స్, బ్లాక్రాక్ వంటి ఇన్వెస్ట్మెంట్ సంస్థలు, పలు ఏఐ ఫస్ట్ కంపెనీలు థియోమ్ సాయంతో తమ డేటా, ఏఐలు రెండింటినీ రక్షించుకుంటున్నాయి. స్టారప్ కంపెనీనే గానీ వేగంగా వృద్ధి చెందుతోంది.ప్ర: హైదరాబాద్ కేంద్రం నుంచి ఎలాంటి ఉత్పత్తులను అభివృద్ధి చేస్తున్నారు?జ: థియోమ్కు హైదరాబాద్ బ్యాక్ ఆఫీసు కానేకాదు. అంతర్జాతీయ కస్టమర్లకు సరికొత్త ప్రాడక్ట్స్ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. ఇప్పటివరకూ యాభై మంది ఇంజినీర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించాము. సాఫ్ట్వేర్ కోడింగ్లో ఏఐని మరింత సమర్థంగా వాడటం ఎలా అన్నది ఇక్కడే అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం.ప్ర: ఆంథ్రోపిక్ లాంటి సంస్థలు కోడింగ్లో ఏఐ వాడకాన్ని తగ్గించాలని చెబుతూంటే మీరు పెంచుతున్నారా?జ: రెండింటికీ చాలా తేడా ఉంది. మేము ఏఐతోనే ఏఐని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఆంథ్రోపిక్ వ్యవస్థలపై దాడులు చేసి, లోపాలను పసిగట్టి తమకు అనుకూలంగా మార్చుకునేందుకు హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారు. థియోమ్ దీనికి భిన్నంగా ఏఐని అస్సలు నమ్మకుండా, తగిన రక్షణ ఏర్పాట్లతో సాఫ్ట్వేర్ ఎలా అభివృద్ధి చేయాలన్న దానిపై ప్రయత్నాలు చేస్తోంది. దీంట్లో మానవ పర్యవేక్షణ ఎక్కువన్నమాట.ప్ర: ఏఐ రంగంలో ఉన్నారు కాబట్టి... జనరల్ ఇంటెలిజెన్స్ ఎప్పటికి అందుబాటులోకి వస్తుందని మీ అంచనా?జ: చెప్పడం కష్టం. కాకపోతే ఏఐ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. జనరల్ ఇంటెలిజెన్స్ అన్నది ఏదో ఒక దశలో అందుబాటులోకి వస్తుందని చెప్పవచ్చు కానీ.. ఇన్నేళ్లు, ఇన్ని నెలలు అని చెప్పలేము.ప్ర: ఏఐతో ఉద్యోగాలు పోతాయంటున్నారు. మీ అంచనా ఏమిటి?జ: నా ఉద్దేశం ప్రకారం ఉద్యోగాల నిర్వచనం మారిపోతుంది అంతే. ఇంటర్నెట్, కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చిన కొత్తలో చాలా ఉద్యోగాలు పోతాయని అనేవారు. కానీ కొత్త రకాల ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి. ఇటీవలి కాలంలో కొన్ని కంపెనీలు ఏఐ స్థానంలో మళ్లీ మానవ వనరులను వాడుకుంటున్నాయి. విషయాలను పూర్తిగా అర్థం చేసుకోకుండా ఏఐ వ్యవస్థలపై ఆధారపడటం వల్ల ఈ సమస్య వచ్చింది.హైదరాబాద్లో థియోమ్ కొత్త కార్యాలయండేటా, కృత్రిమ మేధ రక్షణ రంగంలో అంతర్జాతీయంగా అగ్రగామిగా దూసుకుపోతున్న థియోమ్ సంస్థ భారతదేశంలో తన కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించింది. ఇందులో భాగంగా హైదరాబాద్లో తన కొత్త కార్యాలయాన్ని తాజాగా ప్రారంభించింది. థియోమ్ తన అంతర్జాతీయ వినియోగదారుల అవసరాలను తీర్చేందుకు, కొత్త ఆవిష్కరణలను రూపకల్పన చేసేందుకు ఈ ఫెసిలిటీ దోహదపడనుందని చెప్పింది.భారతదేశపు ప్రముఖ సాంకేతిక హబ్ల్లో ఒకటైన హైదరాబాద్ కేంద్రంగా.. ఇంజినీరింగ్, ప్రొడక్ట్ ఇన్నోవేషన్, ఆపరేషనల్ ఎక్సలెన్స్ రంగాల్లో థియోమ్ కీలక అడుగులు వేయనుంది. ఇక్కడి టెక్నాలజీ ప్రతిభను ఉపయోగించుకుంటూ తమ ఉత్పత్తుల అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలని సంస్థ భావిస్తోంది. ఈ త్రైమాసికం ముగిసే నాటికి హైదరాబాద్ కేంద్రంలో 50 మందికి పైగా ఉద్యోగులను నియమించుకోవాలని థియోమ్ ప్రణాళికలు సిద్ధం చేసింది. డేటా సెక్యూరిటీ, క్లౌడ్ ప్రొటెక్షన్, ఏఐ ఆధారిత ఎంటర్ప్రైజ్ రక్షణ రంగాల్లో సరికొత్త ఆవిష్కరణలను తీసుకురావాలనే థియోమ్ దీర్ఘకాలిక ప్రపంచవ్యాప్త వ్యూహంలో భాగంగానే ఈ కేంద్రం రూపుదిద్దుకుంది.ఇదీ చదవండి: ఒక్కసారిగా బంగారం ధరలు రివర్స్.. తెలుగు రాష్ట్రాల్లో.. -
స్పేస్ఎక్స్ ఐపీఓతో ప్రభంజనం
ఆధునిక పారిశ్రామిక ప్రపంచంలో అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ వివాదాలు-విజయాల నడుమ దూసుకుపోతున్న ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ చరిత్ర సృష్టించారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికిన ఆయన సంస్థ ‘స్పేస్ఎక్స్’ గురువారం యూఎస్ మార్కెట్లో రికార్డు స్థాయిలో 75 బిలియన్ డాలర్ల పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) నిధులను సేకరించింది. ఈ చారిత్రాత్మక పరిణామంతో శుక్రవారం మార్కెట్ ట్రేడింగ్ ప్రారంభ సమయానికి ఎలాన్ మస్క్ అధికారికంగా ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్ (1.1 ట్రిలియన్ డాలర్లకు పైగా నికర ఆస్తుల అధిపతి-సుమారు రూ.103 లక్షల కోట్లు)గా అవతరించారు.పెట్టుబడిదారుల నమ్మకం, సాంకేతిక రంగంలో మస్క్ మార్క్ వ్యూహాలు సంప్రదాయ ఆర్థిక సూత్రాలను తిరగరాస్తూ ‘మస్కోనమీ’ అనే సరికొత్త ఆర్థిక శకానికి తెరలేపాయి.సంపదలో అందని ఎత్తులో మస్క్ఈ ఐపీఓ కంటే ముందే ఫోర్బ్స్ అంచనాల ప్రకారం మస్క్ నికర విలువ సుమారు 780 బిలియన్ డాలర్లుగా ఉండేది. ప్రస్తుత పరిణామాలతో ఆయన సంపద 1.1 ట్రిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. ప్రస్తుత ప్రపంచ ధనవంతుల జాబితాలో ఆయనకు, మిగిలిన వారికి మధ్య ఉన్న వ్యత్యాసం ఊహకందని రీతిలో పెరిగిపోయింది.‘ప్రపంచంలో రెండో అత్యంత ధనవంతుడు ఒరాకిల్ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ సంపద కేవలం 300 బిలియన్ డాలర్ల(రూ.28 లక్షల కోట్లు) సమీపంలోనే ఉంది. అంటే మస్క్ ఆస్తులతో పోలిస్తే అది మూడింట ఒక వంతు కంటే తక్కువ. దీనిని బట్టి మస్క్ ఏ స్థాయి ఆధిక్యంలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు’ అని ఫోర్బ్స్ డిప్యూటీ ఎడిటర్ (వెల్త్ విభాగం) మాట్ డురోట్ అన్నారు. ప్రస్తుతం మస్క్ సంపదలో సింహభాగం స్పేస్ఎక్స్ నుంచే వస్తోంది. ఈ సంస్థలో ఆయనకు సుమారు 866 బిలియన్ డాలర్ల విలువైన వాటా ఉంది. టెస్లా, ఎక్స్ (ట్విట్టర్) వంటి ఇతర ఆస్తులతో కలిసి ఆయన అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.విలక్షణ వ్యక్తిత్వం.. అభిమాన సామ్రాజ్యంప్రపంచవ్యాప్తంగా అపరకుబేరులపై, సామాజిక అసమానతలపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న తరుణంలోనూ మస్క్ మాత్రం భిన్నమైన ప్రజాదరణను సొంతం చేసుకున్నారు. వారెన్ బఫెట్ వంటి సంప్రదాయ పారిశ్రామికవేత్తల తరహా కాకుండా ఇంటర్నెట్ సంస్కృతిలో ఒక కేంద్ర బిందువుగా మారి ‘పాప్ కల్చర్’ ఐకాన్గా అవతరించారు. ఆయన ‘నో-ఫిల్టర్’ (నిర్మొహమాటంగా మాట్లాడే) శైలి, సోషల్ మీడియా వేదికగా సామాన్యులతో నేరుగా సంభాషించే విధానం లక్షలాది మంది నమ్మకమైన అభిమానులను సంపాదించి పెట్టిందని కొందరు భావిస్తున్నారు.సవాళ్లు – వివాదాలుమస్క్ ప్రస్థానం కేవలం విజయాలతోనే సాగలేదు. ఆయన చుట్టూ ఎప్పుడూ వివాదాలు ముసురుకుంటూనే ఉంటాయి. ఒకే వ్యక్తి చేతిలో అపరిమితమైన అధికారం కేంద్రీకృతం కావడంపై విమర్శకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్కు మద్దతు ఇవ్వడం, ప్రభుత్వ సామర్థ్య విభాగం (డోజ్)లో కీలక పాత్ర పోషించడం తీవ్ర చర్చకు దారితీసింది. ఆ తర్వాత విధానపరమైన విభేదాల వల్ల ట్రంప్తో సంబంధాలు దెబ్బతిన్నప్పటికీ ఇటీవల ఇరుపక్షాలు కొంత సర్దుబాటు ధోరణిని ప్రదర్శించాయి. రాజకీయ వివాదాల కారణంగా గత ఏడాది అంతర్జాతీయ మార్కెట్లలో టెస్లా వాహనాల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి.మస్క్ కంపెనీ ఐపీఓకు ఎందుకంత ఆదరణ?ఆర్థిక విశ్లేషకుల ప్రకారం, సాధారణ కంపెనీల వాల్యుయేషన్లు వాటి లాభనష్టాల ఆధారంగా లెక్కిస్తారు. కానీ మస్క్ కంపెనీల విషయంలో ఇది వర్తించదు. దీనినే మార్కెట్ వర్గాలు ‘ఎలాన్ ప్రీమియం’ అని పిలుస్తున్నాయి. అంటే భవిష్యత్తు విజన్ పట్ల మస్క్పై ఉన్న నమ్మకంతోనే పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరిస్తున్నారు. ‘టెస్లా తరహాలోనే స్పేస్ఎక్స్ కూడా పూర్తిగా మస్క్ వ్యూహంపై నడుస్తున్నదే. 1.5 ట్రిలియన్ నుంచి 2 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ అనేది సంప్రదాయ ఆర్థిక సూత్రాలకు విరుద్ధం. దీనిని కేవలం ‘ఎలాన్ మస్క్ ప్రీమియం’గా మాత్రమే వర్గీకరించగలం’ అని రినైసాన్స్ క్యాపిటల్ సీనియర్ స్ట్రాటజిస్ట్ మాట్ కెన్నెడీ అన్నారు.సరిహద్దులు లేని వ్యాపార సామ్రాజ్యంమస్క్(54) దక్షిణాఫ్రికాలో జన్మించి పెన్సిల్వేనియా వర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కేవలం టెస్లా, స్పేస్ఎక్స్లకే పరిమితం కాలేదు. ఆయన వ్యాపార నెట్వర్క్ అపారమైనది.సంస్థ పేరుప్రధాన రంగంటెస్లాఎలక్ట్రిక్ వాహనాలు, క్లీన్ ఎనర్జీస్పేస్ఎక్స్అంతరిక్ష పరిశోధనలు, శాటిలైట్ ఇంటర్నెట్న్యూరాలింక్బ్రెయిన్-కంప్యూటర్ ఇంప్లాంట్స్ది బోరింగ్ కంపెనీభూగర్భ రవాణా సొరంగాలుఎక్స్ (గతంలో ట్విట్టర్)గ్లోబల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ఎక్స్ఏఐకృత్రిమ మేధటెస్లాను ప్రపంచంలోనే అత్యంత విలువైన కార్ల కంపెనీగా మార్చడం ద్వారా అమెరికన్ ఆటోమొబైల్ రంగానికి ప్రపంచవ్యాప్తంగా అపారమైన గౌరవాన్ని తెచ్చారని జనరల్ మోటర్స్ మాజీ వైస్ చైర్మన్ బాబ్ లుట్జ్ మస్క్ను ప్రశంసించారు.మన కాలపు ఎడిసన్మస్క్ అసాధారణ ప్రవర్తనపై ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ ఆయన సృజనాత్మకతను ప్రపంచ దిగ్గజాలు సైతం అంగీకరిస్తున్నారు. ఒకప్పుడు మస్క్తో సుదీర్ఘ న్యాయపోరాటం చేసిన జేపీ మోర్గాన్ చేజ్ సీఈఓ జామీ డిమోన్ సైతం ఇటీవల మనసు మార్చుకున్నారు. మస్క్ను మన కాలపు థామస్ ఎడిసన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ అని ఆయన కొనియాడడం గమనార్హం. మొత్తంగా సాంప్రదాయ ఆర్థిక రంగానికి సవాలు విసురుతూ, అంతరిక్షాన్ని వ్యాపారమయం చేస్తూ మస్క్ సాధించిన ఈ ‘ట్రిలియనీర్’ మైలురాయి మానవ చరిత్రలోనే ఒక అపూర్వ ఘట్టంగా నిలిచిపోనుంది.ఇదీ చదవండి: కరుగుతోన్న బంగారు కొండ.. వరుసగా రెండో రోజు! -
ఆ భయం నాకూ ఉంది: AIపై ఆంథ్రోపిక్ సీఈఓ ఆందోళన
కృత్రిమ మేధస్సు (AI) అభివృద్ధి మానవ సమాజానికి అపార అవకాశాలు తెస్తున్నప్పటికీ, అదే సమయంలో తీవ్రమైన ప్రమాదాలకు కూడా దారితీయవచ్చని ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ (Anthropic) సహ వ్యవస్థాపకుడు, సీఈఓ డారియో అమోడేయి (Dario Amodei) హెచ్చరించారు. “ఏదో ఒక సమయంలో ఏదైనా తప్పు జరిగే అవకాశం ఉందనే ఆందోళన నాకూ ఉంది” అంటూ ఆయన తాజా బ్లూమ్బర్గ్ డాక్యుమెంటరీలో వ్యాఖ్యానించారు.ఏఐ భద్రత అంశంపై చాలా కాలంగా గళం విప్పుతున్న అమోడేయి, ప్రపంచవ్యాప్తంగా ఏఐ సామర్థ్యాలు ప్రభుత్వాల నియంత్రణ సామర్థ్యాన్ని మించిపోయే వేగంతో అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. అమెరికాలో నిర్వహించిన సర్వేల ప్రకారం, సగానికి పైగా ప్రజలు ఏఐ కారణంగా ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయని భావిస్తున్నారు.“స్వచ్ఛంద నియంత్రణ సరిపోదు”ఏఐ కంపెనీలు స్వయంగా భద్రతా ప్రమాణాలు పాటిస్తామని చెప్పడం మాత్రమే ఇక సరిపోదని అమోడేయి అభిప్రాయపడ్డారు. తాజాగా విడుదల చేసిన తన విధాన వ్యాసంలో, అత్యాధునిక “ఫ్రంటియర్ ఏఐ” మోడళ్లను విడుదల చేసే ముందు తప్పనిసరిగా స్వతంత్ర థర్డ్ పార్టీ సంస్థల ద్వారా పరీక్షించాలని సూచించారు. ముఖ్యంగా సైబర్ దాడులు, జీవాయుధాల అభివృద్ధి, మానవ నియంత్రణను దాటిపోయే స్వయంప్రతిపత్తి వంటి ప్రమాదాలను అంచనా వేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ పరీక్షల్లో మోడళ్లు విఫలమైతే, వాటి విడుదలను నిలిపివేసే లేదా పూర్తిగా నిరోధించే అధికారం ప్రభుత్వాలకు ఉండాలని ఆయన వాదించారు.ఓపెన్ఏఐతో విభేదాలూ ఇందుకే..ఒకప్పుడు ఓపెన్ఏఐ (OpenAI)లో కీలక పరిశోధకుడిగా పనిచేసిన అమోడేయి, ఏఐ భద్రత అంశాలపై విభేదాల కారణంగా సంస్థను విడిచి ఆంథ్రోపిక్ను స్థాపించారు. వాణిజ్య ప్రయోజనాలు, వేగవంతమైన ఉత్పత్తి విడుదల కంటే భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నది ఆయన వైఖరి. ఇదే సమయంలో ఓపెన్ఏఐ కూడా ఏఐ రిస్క్లపై తామూ స్పష్టమైన అవగాహనతో ఉన్నామని, “ప్రతిదీ పూర్తిగా ఆటోమేట్ కావడం మాకు కావలసిన భవిష్యత్తు కాదు” అని ఇటీవల వెల్లడించింది. ఏఐ వల్ల భారీ ఉత్పాదకత పెరుగుదల సాధ్యమైనప్పటికీ, ఉద్యోగాలపై దాని ప్రభావం, సామాజిక పరిణామాలను నిర్లక్ష్యం చేయరాదని పరిశ్రమ నాయకులు అంగీకరిస్తున్నారు.భారత్లోనూ నియంత్రణ ఆలోచనఏఐ నియంత్రణపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు వేగంగా జరుగుతున్న వేళ, భారత్ కూడా ప్రత్యేక చట్టపరమైన వ్యవస్థ అవసరాన్ని గుర్తిస్తోంది. కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) ఇటీవల మాట్లాడుతూ, 2000 నాటి ఐటీ చట్టం ఆధునిక ఏఐ యుగానికి సరిపోదని, ఆవిష్కరణకు ప్రోత్సాహం ఇస్తూనే పౌరుల భద్రతను కాపాడే కొత్త విధానాలు అవసరమని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ‘ఆ బంగారం, వెండి.. నకిలీ ఆస్తులు’ -
జెన్ జీకి బెస్ట్... 5జీ ఫోన్లలో చీపెస్ట్!
దేశీ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ లావా సరికొత్త 5జీ ఫోన్ను లాంచ్ చేసింది. షార్క్-2 5జీ పేరుతో విడుదలైన ఈ ఫోన్ ధర కేవలం 11,999 రూపాయలు. 5జీ ఫోన్లలోకెల్లా అత్యంత చౌకది కావడం ఒక విశేషం. అలాగనీ ఇందులో ఫీచర్లకు, హంగు, ఆర్బాటాలకేమీ కొదవలేదు. అన్నింటికంటే ముందు చెప్పుకోవాల్సిన విషయం దీని బ్యాటరీ గురించి. ఆరువేల ఎంఏహెచ్ బ్యాటరీతో లభించే ఈ ఫోన్తో ఏకంగా 13 గంటల 35 నిమిషాలపాటు యూట్యూబ్ వీడియోలు చూసుకోవచ్చునని కంపెనీ చెబుతోంది.స్క్రీన్ విషయానికి వస్తే... 120 హెర్ట్ట్జ్ రిఫ్రెష్ రేట్తో హెచ్డీ-ఎల్సీడీ డిస్ప్లే లభిస్తుంది. స్క్రీన్ సైజు దాదాపు 6.75 అంగుళాలు. సోనార్ గోల్డ్, ఆర్యా బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంది. లావా షార్క్-2 5జీ స్మార్ట్ఫోన్లో ఆరు నానోమీటర్ల యూనీసాక్ టీ8200 ఆక్టాకోర్ ప్రాసెసర్ను ఉపయోగించారు. నాలుగు జీబీల ర్యామ్కు అదనంగా 4 జీబీల వర్చువల్ ర్యామ్ అందుబాటులో ఉంది. ఫిజికల్ మెమరీ విషయానికి వస్తే 64 గిగాబైట్లు లభిస్తుంది. లావా షార్క్-2 5జీ ఫోన్ ఏఐ ఆధారిత 13 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. సెల్ఫీ కెమెరా రెజల్యూషన్ 5 మెగాపిక్సెల్స్.రూ.15,000 లోపు 5జీ స్మార్ట్ఫోన్లుఫోన్ధర (రూపాయల్లో)స్క్రీన్బ్యాటరీ(mAh)కెమెరా(మెగా పిక్సెల్స్)రెడ్మీ నోట్ 14 ఎస్ఈ13,9996.67, AMOLED (120Hz)511050 MP + 2 MPమోటో జీ57 పవర్13,9996.72, FHD+ LCD (120Hz)700050 MP + 8 MPసామ్సంగ్ గెలాక్సీ ఎం1714,9996.7, Super AMOLED500050 MP + 5 MP + 2 MPఐకూ 14,5006.7, LCD (120Hz)600050 MPసీఎంఎఫ్ నథింగ్ ఫోన్ 114,6656.7, FHD+ (Dimensity 7300)500050 MP + 2 MPగమనిక: రిటైలర్, సెల్లర్ ఆధారంగా ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.ఇదీ చదవండి: హ్యాట్రిక్ తగ్గింపు.. మళ్లీ ఈ సమయం రాదేమో! -
రూ.20 వేల రేంజ్లో రియల్మీ కొత్త ఫోన్
ప్రముఖ స్మార్ట్ఫోన్ సంస్థ రియల్మీ భారత మార్కెట్లో కొత్త బడ్జెట్ స్మార్ట్ఫోన్ ‘రియల్మీ పీ4ఆర్ 5జీ’ (Realme P4R 5G) విడుదల చేసింది. బ్యాటరీ సామర్థ్యాన్ని ప్రధాన ఆకర్షణగా చేసుకుని P4 సిరీస్లో తాజా మోడల్గా వచ్చిన ఈ ఫోన్లో ఏకంగా 8,000mAh ‘టైటాన్’ బ్యాటరీని అందించడం విశేషం. ఈ ధర విభాగంలో ఇంత పెద్ద బ్యాటరీతో వచ్చిన ఫోన్లలో ఇది ఒకటిగా కంపెనీ పేర్కొంటోంది. పూర్తి ఛార్జ్పై మూడు రోజుల వరకు వినియోగాన్ని అందించగలదని రియల్మీ చెబుతోంది.ఫోన్ ప్రధాన ఫీచర్లుస్మార్ట్ఫోన్ పరిశ్రమలో కెమెరా, చిప్సెట్ల కంటే ఇప్పుడు ఎక్కువమంది వినియోగదారులు బ్యాటరీ బ్యాకప్కు ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో రియల్మీ ఈ ఫోన్ను రూపొందించింది. 8,000mAh బ్యాటరీతో పాటు 45W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. బ్యాటరీ లైఫ్ను దీర్ఘకాలం కాపాడే టెక్నాలజీ కారణంగా ఏడు సంవత్సరాల వరకు బ్యాటరీ పనితీరు నిలకడగా ఉంటుందని కంపెనీ హామీ ఇస్తోంది.ఈ ఫోన్లో 6.8 అంగుళాల సన్లైట్ డిస్ప్లేను అందించారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 1,200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను సపోర్ట్ చేస్తుంది. ఫోన్కు శక్తినిచ్చే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్. Realme UI 7.0 ఆధారిత ఆండ్రాయిడ్ ప్లాట్ఫారమ్పై ఇది పనిచేస్తుంది.గేమింగ్ సమయంలో హీట్ సమస్యను తగ్గించేందుకు 5,300mm² ఎయిర్ఫ్లో వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్, వన్-ట్యాప్ కూలింగ్ వంటి ఫీచర్లను అందించారు.ఫోటోగ్రఫీ కోసం వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ AI కెమెరాను అందించారు. AI Portrait Glow, AI Eraser 2.0, AI Ultra Clarity, AI Unblur వంటి AI ఆధారిత ఫోటో ఎడిటింగ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరాను ఏర్పాటు చేశారు.భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ మందం కేవలం 8.8 మిల్లీమీటర్లు మాత్రమే. MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, IP65 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్, 400 శాతం అల్ట్రా వాల్యూమ్ సపోర్ట్ చేసే సూపర్ లీనియర్ స్పీకర్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.ధరలు, ఆఫర్లురియల్మీ పీ4ఆర్ 5జీ మూడు వేరియంట్లలో అందుబాటులోకి వస్తోంది. ఇందులో 4GB + 128GB వేరియంట్ రూ.18,999లకు, 6GB + 128GB మోడల్ రూ.20,999లకు, 6GB + 256GB వేరియంట్ రూ.22,999లకు లభిస్తుంది. ప్రారంభ ఆఫర్లో భాగంగా రూ.2,000 వరకు బ్యాంక్ డిస్కౌంట్తో పాటు మూడు నెలల నో-కాస్ట్ EMI సదుపాయం లభించనుంది. దీంతో ప్రారంభ ధర రూ.16,999కు తగ్గనుంది.ఈ ఫోన్ టైటానియం గ్లేర్, సిల్వర్ గ్లేర్, లావండర్ గ్లేర్ అనే రంగుల్లో లభించనుంది. తొలి విక్రయాలు జూన్ 17 నుంచి ప్రారంభమవుతాయి. ఫ్లిప్కార్ట్తో పాటు రియల్మీ అధికారిక వెబ్సైట్లో కొనుగోలు చేయవచ్చు.ఇదీ చదవండి: బంగారం.. భలే లాభం! ఆర్బీఐ గుడ్న్యూస్ -
రిలయన్స్, మెటా.. మెగా ప్రాజెక్టు
ప్రపంచ సాంకేతిక దిగ్గజం మెటా, దేశీయ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంయుక్తంగా భారతదేశంలో ప్రతిష్టాత్మకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత డేటా సెంటర్ను ఏర్పాటు చేయనున్నాయి. గుజరాత్లోని జామ్నగర్లో ఈ మెగా ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. గ్లోబల్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్గా భారత్ను నిలబెట్టే క్రమంలో మెటా సంస్థ గుజరాత్లోని జామ్నగర్లో నిర్మిస్తున్న మొట్టమొదటి ‘బిల్ట్-టు-సూట్’(కస్టమైజ్డ్) డేటా సెంటర్ ఇదే కావడం విశేషం.ప్రాజెక్టు ముఖ్యాంశాలుప్రాథమికంగా 168 మెగావాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ నిర్మాణం కానుంది. భవిష్యత్తులో దీనిని మరింత విస్తరించే అవకాశం ఉంది.రాబోయే రెండేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.డేటా సెంటర్ డిజైన్, నిర్మాణం, యుటిలిటీల నిర్వహణ, నెట్వర్క్ కనెక్టివిటీ, మేనేజ్డ్ సర్వీసెస్ వంటి అన్ని బాధ్యతలను రిలయన్స్ గ్రూప్ నిర్వహించనుంది.ఈ డేటా సెంటర్ పూర్తిగా పునరుత్పాదక ఇంధనంతో పనిచేస్తుంది. అంతేకాకుండా, ప్లాంట్ శీతలీకరణ (కూలింగ్) కోసం లవణరహితం(ఉప్పు తొలగించిన) చేసిన సముద్రపు నీటిని ఉపయోగించనున్నారు.జామ్నగర్ ఎంపికకు గల కారణాలువ్యూహాత్మకంగా జామ్నగర్ ఈ ప్రాజెక్టుకు అత్యంత అనుకూలమైన ప్రాంతంగా నిలిచింది. పారిశ్రామికంగా అనుకూలమైన వాతావరణం, మెరుగైన పునరుత్పాదక ఇంధన వనరులు, నీటి లభ్యతతో పాటు సముద్రగర్భ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లకు ఇది సమీపంలో ఉంది. దీనికి తోడు జియోకు చెందిన విస్తృతమైన ఫైబర్ నెట్వర్క్ ఈ డేటా సెంటర్కు అదనపు బలాన్ని చేకూర్చనుంది.‘మెటాతో కుదిరిన ఈ భాగస్వామ్యం భారత డిజిటల్ మౌలిక సదుపాయాల రంగంలో ఒక చారిత్రాత్మక ఘట్టం. గ్లోబల్ టెక్నాలజీ లీడర్ మెటాతో కలిసి ఇలాంటి అధునాతన డేటా సెంటర్ను నిర్మించడం, ప్రపంచ ఏఐ విప్లవానికి నాయకత్వం వహించడానికి భారత్ సిద్ధంగా ఉందనే సంకేతాన్ని ఇస్తోంది. జామ్నగర్ ఇకపై గ్లోబల్ హైపర్స్కేల్ ఏఐ కంప్యూటింగ్కు ప్రధాన కేంద్రంగా మారుతుంది’ అని ముకేష్ అంబానీ అన్నారు.‘భారతదేశంలో మా మొదటి ఏఐ ఆధారిత డేటా సెంటర్ను నిర్మించడానికి రిలయన్స్తో చేతులు కలపడం మాకు గర్వకారణం. జామ్నగర్లోని ఈ ప్రపంచ స్థాయి ఫెసిలిటీ ద్వారా మా ఏఐ మౌలిక సదుపాయాలను విస్తరించడానికి సహాయపడుతుంది. అలాగే భారత ఆర్థిక వ్యవస్థలో మా దీర్ఘకాలిక పెట్టుబడులను మరింత బలోపేతం చేస్తుంది’ అని మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ తెలిపారు.ఇదీ చదవండి: హ్యాట్రిక్ తగ్గింపు.. మళ్లీ ఈ సమయం రాదేమో! -
‘క్లాడ్ ఫేబుల్ 5’ను విడుదల చేసిన ఆంత్రోపిక్!
ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో సరికొత్త సంచలనం నమోదైంది. ప్రముఖ ఏఐ స్టార్టప్ సంస్థ ఆంత్రోపిక్ తన శక్తివంతమైన, అత్యాధునిక ‘మైథోస్’ క్లాస్కు చెందిన మొదటి మోడల్ ‘క్లాడ్ ఫేబుల్ 5’ (Claude Fable 5)ను ఓపెన్ మార్కెట్లోకి విడుదల చేసింది. సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, సైంటిఫిక్ రీసెర్చ్, కాంప్లెక్స్ నాలెడ్జ్ వర్క్ వంటి రంగాల్లో అత్యంత అసాధారణమైన సామర్థ్యాలు ఉన్న ఈ మోడల్ భద్రతాపరంగా కొన్ని కఠినమైన పరిమితులతో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.గతంలో ఆంత్రోపిక్ సంస్థ ‘మైథోస్’ ప్రివ్యూను ప్రకటించినప్పుడు ఇది ప్రపంచంలోని ఏ సాఫ్ట్వేర్నైనా హ్యాక్ చేయగల శక్తివంతమైనదని పేర్కొనడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే సైబర్ సెక్యూరిటీ ముప్పుపై భారతదేశంతో సహా పలు ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. అమెరికా సైతం సైబర్ దాడుల ప్రణాళికల కోసం మైథోస్ను ఉపయోగిస్తోందనే నివేదికలు అంతర్జాతీయంగా సంచలనం సృష్టించాయి. ఈ తీవ్రమైన భద్రతా సవాళ్లను అధిగమిస్తూ గరిష్ట రక్షణ వలయాలతో ఆంత్రోపిక్ ఈ సరికొత్త మోడల్ను రంగంలోకి దించింది.క్లాడ్ ఫేబుల్ 5 అంటే ఏమిటి? దీని ప్రత్యేకతలేంటి?ఆంత్రోపిక్ వెల్లడించిన వివరాల ప్రకారం ‘క్లాడ్ ఫేబుల్ 5’ అనేది ఇప్పటివరకు కంపెనీ సాధారణ వినియోగదారుల కోసం విడుదల చేసిన మోడళ్లన్నింటికంటే అత్యంత సమర్థవంతమైనది.అసాధారణ పనితీరు: సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, క్లిష్టమైన విశ్లేషణాత్మక పనుల్లో ఇది అద్భుతమైన ప్రతిభను కనబరుస్తుంది. కొన్ని అంతర్జాతీయ బెంచ్మార్క్ల్లో ఇది కంపెనీ ప్రస్తుత టాప్ మోడల్ ‘క్లాడ్ ఓపస్ 4.8’ కంటే 10 శాతం ఎక్కువ స్కోరు సాధించింది.జైల్బ్రేక్ రక్షణ: మోడల్ విడుదలకు ముందు కంపెనీ అంతర్గతంగా 1,000 గంటలకు పైగా ‘బగ్ బౌంటీ’ పరీక్షలను నిర్వహించింది. అలాగే ‘రెడ్-టీమింగ్’ సంస్థల ద్వారా కూడా పరీక్షించగా ఎక్కడా ఈ మోడల్ భద్రతా వలయాన్ని చేధించే లూప్హోల్స్ కనిపించలేదని స్పష్టం చేసింది.టాస్క్ కాంప్లెక్సిటీ: పని ఎంత సుదీర్ఘంగా, ఎంత సంక్లిష్టంగా ఉంటే ఇతర మోడళ్లతో పోలిస్తే ఫేబుల్ 5 అంతటి మెరుగైన ఫలితాలను ఇస్తుందని ఆంత్రోపిక్ తెలిపింది.అత్యంత కఠినమైన భద్రతా చర్యలుమైథోస్ క్లాస్ మోడళ్ల వల్ల సైబర్ సెక్యూరిటీ, బయోలాజికల్, కెమికల్ రంగాల్లో ముప్పు పొంచి ఉందనే ఆందోళనల నేపథ్యంలో ఆంత్రోపిక్ ఈ మోడల్లో వినూత్నమైన రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పింది.ఫాల్బ్యాక్ మెకానిజంఒకవేళ వినియోగదారు ఎవరైనా రిసిన్(ఒక రకమైన ప్రాణాంతక విషం) ఎలా తయారు చేయాలి? వంటి అత్యంత ప్రమాదకరమైన ప్రశ్నలను అడిగితే ఫేబుల్ 5 ఆ ప్రశ్నను బ్లాక్ చేస్తుంది. వెంటనే ఆ సెషన్ సురక్షితమైన ‘క్లాడ్ ఓపస్ 4.8’ మోడల్కు బదిలీ అవుతుంది. తద్వారా హానికరమైన సమాచారం బయటకు రాకుండా అడ్డుకుంటుంది. ఇలాంటి రక్షణల వల్ల దాదాపు 95 శాతం సెషన్లు పూర్తిగా ఫేబుల్ 5 లోనే నడుస్తాయని, కేవలం 5 శాతం లోపు అత్యంత సున్నితమైన కేసుల్లో మాత్రమే ఓపస్ 4.8 కి ట్రాన్స్ఫర్ అవుతాయని కంపెనీ స్పష్టం చేసింది.చైనా వ్యూహాలకు బ్రేక్చైనాకు చెందిన కొన్ని ఏఐ కంపెనీలు తమ సొంత మోడళ్లకు శిక్షణ ఇచ్చుకోవడానికి క్లాడ్ మోడల్ను డిస్టిలేషన్ (పెద్ద మోడల్ డేటా ఆధారంగా చిన్న మోడళ్లను తయారు చేయడం) చేస్తున్నాయని ఆంత్రోపిక్ గతంలో ఆరోపించింది. అయితే, ఫేబుల్ 5 లో పొందుపరిచిన యాంటీ-డిస్టిలేషన్ రక్షణలు ఇలాంటి మేధోసంపత్తి చౌర్యానికి అడ్డుకట్ట వేయనున్నాయి.మైథోస్ 5, గ్లాస్ స్వింగ్ ప్రాజెక్ట్ఫేబుల్ 5 తో పాటు ఆంత్రోపిక్ సైబర్ డిఫెండర్లు, కీలక మౌలిక సదుపాయాలు అందించేవారికోసం ‘క్లాడ్ మైథోస్ 5’ ను కూడా పరిమితంగా అందుబాటులో ఉంచింది. ‘ప్రాజెక్ట్ గ్లాస్ స్వింగ్’ ద్వారా ఇప్పటికే అనుమతి పొందిన సంస్థలు మాత్రమే దీనిని వాడగలవు. ఫేబుల్ 5 లాగే ఇది కూడా ఒకే అంతర్గత మోడల్ను కలిగి ఉన్నప్పటికీ ఇందులో భద్రతాపరమైన పరిమితులు (రక్షణలు) ఎత్తివేశారు. సైబర్ రక్షణ పరిశోధనల కోసమే దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు కంపెనీ చెప్పింది.ఎవరికి అందుబాటులో?క్లాడ్ ఫేబుల్ 5 ప్రస్తుతం క్లాడ్ ఏపీఐ, యూజర్-ఆధారిత ఎంటర్ప్రైజ్ ప్లాన్ల ద్వారా అందుబాటులోకి వచ్చింది. సబ్స్క్రిప్షన్ ఆధారిత వినియోగదారుల కోసం ఇది దశలవారీగా విడుదల కానుంది. జూన్ 22 వరకు అదనపు ఖర్చు లేకుండా ప్రో, మాక్స్, టీమ్, ఎంటర్ప్రైజ్ ప్లాన్ల వారికి అందుబాటులో ఉంటుంది. జూన్ 23 నుంచి స్టాండర్డ్ ప్లాన్ల నుంచి తొలగిస్తారు. తర్వాత యూజర్ సామర్థ్యం ఆధారంగా యూసేజ్ క్రెడిట్లు అవసరమవుతాయి.ఇదిలాఉండగా, మానవ ప్రమేయం లేకుండానే ఏఐ తనను తాను మరింత శక్తివంతంగా మార్చుకునే ప్రమాదం ఉందని, అందువల్ల గ్లోబల్ ఏఐ ల్యాబ్లు అన్నీ కలిసి ఈ ఫ్రాంటియర్ ఏఐ అభివృద్ధిపై నియంత్రణ కలిగి ఉండాలని ఆంత్రోపిక్ పిలుపునివ్వడం గమనార్హం.ఇదీ చదవండి: కాలం కరిగేలోపే.. కలల నిధిని గెలిచేద్దాం! -
కృత్రిమమేధ అద్భుత అవకాశం!
కృత్రిమ మేధ విస్తృతిపై ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనలపై టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ స్పష్టతనిచ్చారు. ఏఐ అనేది ఐటీ రంగానికి ముప్పు కాదని, అది ఎంటర్ప్రైజ్ ఐటీ రంగానికి లభించిన ఒక అద్భుతమైన అవకాశం అన్నారు. ఈరోజు జరిగిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 31వ వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) వాటాదారులను ఉద్దేశించి ఆయన కీలక ప్రసంగం చేశారు. వచ్చే మూడేళ్లలో టీసీఎస్లో మానవ ఉద్యోగులతో సమానంగా ఏఐ ఏజెంట్లు పని చేస్తారని అంచనా వేశారు.జనరేటివ్ ఏఐ, ఆటోమేషన్ల కారణంగా భారతీయ ఐటీ సేవల సంస్థల సాంప్రదాయ వ్యాపార నమూనాలు దెబ్బతింటాయేమోనన్న ఇన్వెస్టర్ల ఆందోళనల నేపథ్యంలో చంద్రశేఖరన్ చేసిన ఈ వ్యాఖ్యలు పరిశ్రమలో కొత్త భరోసాను నింపాయి. ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ వ్యయాన్ని ఏఐ ఎలా మార్చబోతోందనే అంశంపై మార్కెట్లో ఉన్న అపార్థాల వల్లే ఇటువంటి భయాలు వ్యక్తమవుతున్నాయని చంద్రశేఖరన్ పేర్కొన్నారు.‘ఏఐ అనేది కేవలం సాంకేతికత మాత్రమే కాదు. అది మేధస్సుకు సంబంధించిన ఒక మౌలిక సదుపాయం (ఇన్ఫ్రా ఆఫ్ ఇంటెలిజెన్స్). ఈ మేధస్సు తాలూకు వ్యయం తగ్గుతున్న కొద్దీ.. మరిన్ని వ్యాపార ప్రక్రియలు, వ్యూహాత్మక నిర్ణయాలు, కస్టమర్ పరస్పర చర్యలు ఏఐ ఆధారిత పరివర్తన వైపు అడుగులు పడుతాయి’ అని చంద్రశేఖరన్ అన్నారు.ఏఐ అంతరాయం కలిగిస్తుందనే భయాలు ఉన్నప్పటికీ పరిశ్రమ ప్రాథమిక సూత్రాలు బలంగా ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. కంపెనీ మార్జిన్లు బాగున్నాయని, ఆదాయాలు పెరిగాయని, డీల్ పైప్లైన్ గతంలో కంటే ఎంతో బలంగా ఉందని వివరించారు. రాబోయే రెండేళ్లలో ప్రపంచవ్యాప్తంగా మూడొంతుల సంస్థలు తమ సాంకేతిక వ్యయాన్ని పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు -
ఈవీ హవా
న్యూఢిల్లీ: దేశీయ ఆటోమొబైల్ రంగం మే నెలలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఇంధన పొదుపు, పర్యావరణహిత వాహనాలపై వినియోగదారుల ఆసక్తి పెరగడంతో వాహనాల రిటైల్ విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 9.55 శాతం పెరిగి 25,31,067 యూనిట్లకు చేరుకున్నాయి. గత ఏడాది మేలో ఈ సంఖ్య 23,10,451 యూనిట్లుగా ఉంది. అలాగే దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వాటా తొలిసారిగా 11 శాతం మార్కును దాటిందని ఆటో డీలర్ల సమాఖ్య ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) సోమవారం వెల్లడించింది. వాణిజ్య వాహనాలు (సీవీ), ప్యాసింజర్ వాహనాలు (పీవీ), అలాగే మొత్తం ఈవీ విభాగంలో మే నెలకు సంబంధించి ఇప్పటివరకు నమోదైన అత్యుత్తమ విక్రయాలు ఇవే. ఈవీలకు పెరిగిన ఆదరణమే నెలలో ఇంధన ధరల పెరుగుదల ప్రభావంతో వినియోగదారులు ఇంధన పొదుపు కలిగిన, ప్రత్యామ్నాయ ఇంధన ఆధారిత వాహనాల వైపు మొగ్గు చూపినట్లు ఫాడా తెలిపింది. దీనివల్ల ద్విచక్ర వాహనాల విభాగంలో ఈవీల వాటా గత ఏడాది 6.11% నుంచి 9.25 శాతానికి పెరిగింది. మొత్తం వాహన విక్రయాల్లో ఈవీల వాటా తొలిసారిగా 11% దాటడం విశేషం. అయితే పలు ప్రాంతాల్లో తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా షోరూమ్లకు వచ్చే వినియోగదారుల సంఖ్య కొంత తగ్గింది. మరోవైపు వివాహాల సీజన్, గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన నగదు ప్రవాహం, జీఎస్టీ 2.0 కింద అందుబాటులో ఉన్న ప్రయోజనాలు విక్రయాలకు మద్దతుగా నిలిచినట్లు డీలర్లు పేర్కొన్నారు. సవాళ్ల మధ్య వృద్ధి‘‘తీవ్ర ఎండలు, ఇంధన ధరల ఒత్తిడి, పశ్చిమాసియా ఉద్రిక్తతలు మే నెలలో ప్రభావం చూపాయి. అయినప్పటికీ భారత ఆటో రిటైల్ రంగం వృద్ధి బాటలోనే కొనసాగింది. త్రిచక్ర వాహనాలు, ప్యాసింజర్ వాహనాలు, ట్రాక్టర్లు, మొత్తం రిజి్రస్టేషన్ల పరంగా మే నెల అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది’’ అని ఫాడా అధ్యక్షుడు సీ.ఎస్. విఘ్నేశ్వర్ తెలిపారు. అలాగే ఏప్రిల్తో పోలిస్తే మేలో విక్రయాలు 6.75 శాతం తగ్గినా, ఇది సాధారణ సీజనల్ ప్రభావం మరియు నైరుతి రుతుపవనాల ఆలస్యానికి సంబంధించినదేనని ఆయన పేర్కొన్నారు.జూన్పై ఆశాభావంనైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తుండటం, ఖరీఫ్ సాగు పనుల ప్రారంభం, వివాహాల సీజన్ కొనసాగడం వాహనాల డిమాండ్కు మద్దతు ఇవ్వనున్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే ఆర్బీఐ తన తాజా ద్రవ్య విధాన సమీక్షలో రెపో రేటును 5.25 శాతం వద్ద కొనసాగించడం కూడా వినియోగదారుల కొనుగోలు సామర్థ్యానికి అనుకూలంగా మారనుంది. జూన్–జూలై–ఆగస్టు కాలానికి సంబంధించి ఆటోమొబైల్ రంగం అప్రమత్తతతో కూడిన ఆశావహ దృక్పథాన్ని వ్యక్తం చేసింది. స్థిరమైన ఆర్థిక వృద్ధి, ప్రభుత్వ విధానాల కొనసాగింపు, గ్రామీణ డిమాండ్ పెరుగుదల నేపథ్యంలో రెండో త్రైమాసికంలో పరిశ్రమ మరింత బలపడే అవకాశాలు ఉన్నాయని ఫాడా అంచనా వేసింది. -
ఎలక్ట్రానిక్స్ రంగం @ రూ.14.4 లక్షల కోట్లు!
ముంబై: ఎల్రక్టానిక్స్ తయారీ సేవల (ఈఎంఎస్) రంగం వచ్చే ఐదేళ్లలో భారీగా విస్తరించనుంది. 2030 నాటికి మూడు రెట్లకు పైగా పెరిగి 150 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.14.4 లక్షల కోట్లు) ఈఎంఎస్ మార్కెట్ చేరుకుంటుందని కేపీఎంజీ ఇండియా నివేదిక అంచనా వేసింది. దేశీ డిమాండ్కు తోడు ప్రభుత్వపరమైన ప్రోత్సాహకాలు. చైనాకు ప్రత్యామ్నాయంగా విశ్వసనీయమైన సరఫరా వ్యవస్థల కోసం అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపిస్తుండడం (చైనా ప్లస్ వన్ విధానం) ఈ మార్కెట్ విస్తరణకు దన్నుగా నిలవనున్నట్టు తెలిపింది. 2025లో ఈఎంఎస్ మార్కెట్ పరిమాణం 40–45 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు పేర్కొంది. అయితే ఈ రంగం వృద్ధి విస్తృతంగా కాకుండా పరిమితంగా ఉండడాన్ని ఎత్తి చూపించింది. అధిక విలువను తీసుకొచ్చే డిజైన్, విడిభాగాలు, మేధో హక్కుల (ఐపీ) పరంగా దేశీ సంస్థల పాత్ర పరిమితంగానే ఉన్నట్టు తెలిపింది. అదే సమయంలో మొబైల్, అధికంగా అమ్ముడుపోయే కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల అసెంబ్లింగ్కే భారత కంపెనీలు ఎక్కువగా పరిమితమైనట్టు వివరించింది. దీని స్థానంలో డిజైన్, తయారీ, ఐపీ, వ్యాల్యూ చైన్తో కూడిన సమగ్రమైన ఎల్రక్టానిక్స్ తయారీ కేంద్రంగా భారత్ అవతరించాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. వృద్ధికి అపార అవకాశాలు.. అంతర్జాతీయ ఈఎంఎస్ మార్కెట్ 2025లో 640–650 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2030 నాటికి ట్రిలియన్ డాలర్లకు పెరగనున్నట్టు కేపీఎంజీ నివేదిక అంచనా వేసింది. అనుసంధానత, ఎలక్ట్రిఫికేషన్, ఓఈఎం అవుట్సోర్సింగ్ ఈ మార్కెట్ విస్తరణకు దోహదం చేయనున్నట్టు తెలిపింది. అంతర్జాతీయంగా ఎల్రక్టానిక్స్ తయారీ రంగం కేవలం ఖర్చులను నియంత్రించుకోవడం కంటే, నమ్మకమైన ప్రత్యామ్నాయ సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడంపై ఎక్కువగా దృష్టి పెడుతున్నట్టు పేర్కొంది. దీంతో ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో భారత్ వాటా 5–6 శాతంగానే ఉండగా, ఇక్కడి నుంచి భారీ వృద్ధి సాధించడానికి బలమైన అవకాశాలు ఉన్నట్టు వెల్లడించింది. ఈ చర్యలు అవసరం.. ఎలక్ట్రానిక్స్ తయారీకి అవసరమైన కీలక విడిభాగాల కోసం భారత్ ఇప్పటికీ 80–95 శాతం మేర దిగుమతులపైనే ఆధారపడి ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. దీనివల్ల ఇక్కడి కంపెనీల లాభాల మార్జిన్లు తగ్గిపోతున్నాయని.. దీన్ని అధిగమించడం అత్యంత ముఖ్యమని ఈ నివేదిక సూచించింది. సాధారణ ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీ ద్వారా మార్కెట్ పరిమాణం పెరిగినప్పటికీ.. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం క్లిష్టమైన సాంకేతికత కలిగిన ఆటోమోటివ్, ఇండస్ట్రియల్, ఏరోస్పేస్ రంగాలపై ఎక్కువగా దృష్టి సారించాలని పేర్కొంది. ఈ రంగాల్లో అధిక విలువ సృష్టికి అవకాశాలున్నట్టు వివరించింది. ఎల్రక్టానిక్స్ తయారీలో తక్కువ వ్యయాలతో అంతర్జాతీయంగా భారత్ పోటీపడేందుకు కేవలం సామర్థ్య ఆధారితం కాకుండా నైపుణ్య ఆధారితంగా ఎదగాల్సి ఉందని పేర్కొంది. ‘‘ఇందుకోసం ప్రభుత్వం, తయారీ సంస్థలు సమన్వయంతో పనిచేయాలి. దేశీయంగా విడి భాగాల తయారీని పెంచడంతోపాటు కారి్మకుల్లో నైపుణ్యాలను పెంచాలి. ఇంజనీరింగ్–డిజైన్పై పెట్టుబడులు పెట్టడం, అంతర్జాతీయ విలువ ఆధారిత వ్యవస్థతో అనుసంధానం కావడంపై దృష్టి సారించాలి’’అని ఈ నివేదిక సూచించింది. -
కొత్త టెక్నాలజీ.. డైలీ రొటీన్కు ఫన్ టచ్!
రోజూ వాడే చిన్న చిన్న వస్తువులే ఇప్పుడు స్మార్ట్గా మారిపోతున్నాయి. చూడటానికి క్యూట్గా, వాడటానికి సూపర్గా ఉండే ఈ స్మార్ట్ హెల్పర్స్తో మీ డైలీ రొటీన్కు ఒక ఫన్ టచ్ వచ్చేస్తుంది!స్పూన్తో పనిలేని మగ్!ఉదయాన్నే ఆఫీస్ హడావుడిలో కాఫీ లేదా హెల్తీ ప్రొటీన్ షేక్ కలుపుకోవడానికి స్పూన్ వెతుక్కునే ఓపిక లేనప్పుడు– మీ పనిని చిటికెలో సులువు చేయడానికే వచ్చేసింది ఈ ‘ఆటోమేటిక్ సెల్ఫ్ స్టిరింగ్ మగ్!’ ఇది మీ చేతిలో ఉంటే చాలు, మీరు స్పూన్తో తిప్పాల్సిన అవసరం లేకుండా కేవలం ఒకే ఒక్క బటన్ ప్రెస్తో మీ డ్రింక్ని పర్ఫెక్ట్గా మిక్స్ చేసేస్తుంది.ఇందులో ఉండే అడ్వాన్డ్స్ మ్యాగ్నెటిక్ మిక్సింగ్ టెక్నాలజీ వల్ల అడుగున షుగర్ గానీ, ప్రొటీన్ పౌడర్ గానీ గడ్డలు కట్టకుండా స్మూత్గా బ్లెండ్ అవుతుంది. థర్మల్ లిడ్ డిజైన్తో రావడం వల్ల మీ డ్రింక్ ఎక్కువసేపు వేడిగా ఉంటుంది, పైగా ప్రయాణాల్లో వాడుతున్నా కూడా అస్సలు కింద వలకదు. ధర కేవలం రూ. 1000 మాత్రమే!మినీ ఎయిర్ పంప్...!సమ్మర్ క్యాంపింగ్కి వెళ్లినప్పుడు లేదా పూల్లో ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు ఎయిర్ బెడ్స్, స్విమ్ రింగ్స్లో నోటితో గాలి ఊదలేక ప్రాణం, ప్రాణం మీదికి వస్తోందా? మీ ఊపిరితిత్తుల కష్టాలను తీరుస్తూ, చిటికెలో గాలి నింపేయడానికి వచ్చేసింది ఈ ‘ఫ్లెక్స్టైల్గేర్ మ్యాక్స్ పంప్’.కేవలం 123 గ్రాముల బరువుండే ఈ బుజ్జి గ్యాడ్జెట్.. ఏకంగా 5.0 కెపీఏ ప్రెజర్తో నిమిషానికి 500 లీటర్ల గాలిని రాకెట్ స్పీడ్తో నింపేస్తుంది. దీని డిజైన్కు అంతర్జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఎందుకంటే దీని లోపలి భాగాలు కనిపించేలా ట్రాన్స్పరెంట్ బాడీతో ఉండటమే కాకుండా, రాత్రి పూట క్యాంపింగ్లో వాడుకోవడానికి వీలుగా 3 లెవెల్స్ బ్రైట్నెస్ ఉన్న ఒక సూపర్ ఎల్ఈడీ క్యాంపింగ్ లైట్లా కూడా పనిచేస్తుంది. ఒకసారి చార్జ్ చేస్తే 60 నిమిషాల పాటు నాన్ స్టాప్గా చేస్తుంది. ధర రూ. ఐదు వేల నుంచి మొదలు!చార్జర్ ప్రొటెక్టర్!మీ చార్జర్ కేబుల్స్ త్వరగా విరిగిపోతున్నాయా? లేదా వైట్ కలర్ అడాప్టర్ మురికిగా అయిపోతోందని వర్రీ అవుతున్నారా? మీ చార్జర్ని సరికొత్తగా మారుస్తూ, దానికి లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ ఇవ్వడానికి వచ్చేసింది ఈ ‘ఆస్ట్రోనాట్ థీమ్ చార్జర్ ప్రొటెక్టర్ సెట్!’ఇది చార్జర్, పవర్ అడాప్టర్లకు పర్ఫెక్ట్గా సెట్ అయ్యే ఒక క్యూట్ గ్యాడ్జెట్. హై–క్వాలిటీ సిలికాన్ మెటీరియల్తో చేసిన ఈ కేస్, మీ చార్జింగ్ బ్రిక్ను స్క్రాచెస్ పడకుండా, కింద పడినా పాడవకుండా కాపాడుతుంది. ఇందులో వచ్చే బ్లాక్ అండ్ వైట్ స్పైరల్ వ్రాప్ మీ కేబుల్స్ అస్సలు వంగిపోకుండా, చిరిగిపోకుండా రక్షణ ఇస్తుంది. అంతేకాదు, ట్రావెలింగ్లో కేబుల్స్ చిక్కుపడిపోకుండా నీట్గా ఫోల్డ్ చేసుకోవడానికి ఇందులో ఒక ఆర్గనైజింగ్ స్ట్రాప్ కూడా వస్తుంది. దీని ధర రూ. 170 మాత్రమే! -
చేతిలో ఫోన్.. చేరని నెట్
న్యూఢిల్లీ: దేశంలో డిజిటల్ విప్లవం వేగంగా విస్తరిస్తున్నప్పటికీ, డిజిటల్ అవకాశాలు, సేవలు అందరికీ సమానంగా అందడం లేదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. దేశంలోని 95.1% కుటుంబాలకు మొబైల్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే 27.5 శాతం కుటుంబాలకు ఇప్పటికీ ఇంటర్నెట్ సదుపాయం లేవు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎన్సీఏఈఆర్), ది క్వాంటమ్ హబ్ (టీక్యూహెచ్) భాగస్వామ్యంతో రూపొందించిన ‘ది ఎవాల్వింగ్ ల్యాండ్స్కేప్ ఆఫ్ డిజిటల్ ఇన్క్లూజన్ ఇన్ ఇండియా’ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2022–24 మధ్య దేశవ్యాప్తంగా 47 వేలకుపైగా కుటుంబాలపై నిర్వహించిన ఇండియా హ్యూమన్ డెవలప్మెంట్ సర్వే (ఐహెచ్డీఎస్–3) ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. దశాబ్దపు వృద్ధి వెనుక అంతరాలు .. భారత్లో గత దశాబ్దపు కాలంలో డిజిటల్ విస్తరణ గణనీయంగా సాగింది. చౌకైన స్మార్ట్ఫోన్లు, తక్కువ ధరకే లభించే డేటా ప్లాన్లు, డిజిటల్ మౌలిక వసతుల విస్తరణతో 2015లో కేవలం 19.8 కోట్లుగా ఉన్న ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 2025 నాటికి 103 కోట్లకు పైగా పెరిగింది. అయితే, ఈ అద్భుతమైన వృద్ధి వెనుక అసమానతలు దాగి ఉన్నాయని నివేదిక పేర్కొంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ నాణ్యత, ప్రజలు వాడుతున్న పరికరాలు (డివైసెస్), వారి డిజిటల్ నైపుణ్యాలలో వ్యత్యాసాలు ఉన్నాయి. అలాగే విద్య, ఆర్థిక సేవలు, ఉపాధి, ప్రభుత్వ సేవలు, సామాజిక భాగస్వామ్యంలో డిజిటల్ సాంకేతికత వినియోగంలో గణనీయమైన వ్యత్యాసాలు ఉన్నట్లు వెల్లడించింది సదుపాయం కాదు నైపుణ్యాలు కీలకం ‘‘కేవలం ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్నంత మాత్రాన ప్రజలకు డిజిటల్ సామర్థ్యం వచ్చేసినట్లు కాదు. డిజిటల్ అభివృద్ధి తదుపరి దశలో మౌలిక వసతుల విస్తరణతో పాటు ప్రజల్లో డిజిటల్ నైపుణ్యాల పెంపు, ప్రాంతీయ భాషలకు అనుగుణమైన డిజిటల్ సేవల రూపకల్పన, లింగ వివక్షను తగ్గించడంపై దృష్టి సారించాలి’’ అని ది క్వాంటమ్ హబ్ కో–¸ఫౌండర్ అపరాజిత భారతి తెలిపారు. నివేదికలో మరిన్ని ముఖ్యాంశాలు → కుటుంబాల ఆర్థిక స్థితిని బట్టి మొబైల్ ఫోన్ల సంఖ్యలో తేడాలు కనిపిస్తున్నాయి. అత్యంత పేద కుటుంబాల్లో సగటున 1.5 మొబైల్ ఫోన్లు ఉండగా, సంపన్న కుటుంబాల్లో ఈ సంఖ్య 2.9గా ఉంటోంది. → దేశంలో 71.4 శాతం కుటుంబాలు మొబైల్ పరికరాల ద్వారానే ఇంటర్నెట్ను వినియోగిస్తుండగా, 27.5 శాతం కుటుంబాలకు ఇప్పటికీ ఎలాంటి ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో లేదు. డిజిటల్ సేవలను వినియోగించడంలో పురుషులు, మహిళల మధ్య అంతరాలు కొనసాగుతున్నాయి. డిజిటల్ సేవల వినియోగంలో పురుషులతో పోలిస్తే మహిళలు ఇంకా వెనుకబడే ఉన్నారు. పని చేసే వయసున్న పురుషుల్లో 57.6 శాతం మంది ఇంటర్నెట్ వాడుతుండగా, మహిళల్లో ఇది కేవలం 35.6 శాతంగానే నమోదైంది. → డిజిటల్ సేవలు వినియోగిస్తున్న ప్రతి ఐదు కుటుంబాల్లో ఒక కుటుంబం (20.4 శాతం) ఆన్లైన్ అవసరాల కోసం కుటుంబం వెలుపలి వ్యక్తుల సహాయంపై ఆధారపడుతున్నట్లు నివేదిక వెల్లడించింది. అసలు చదువు లేని కుటుంబాల్లో ఈ ఆధారపడే పరిస్థితి దాదాపు 30 శాతంగా ఉంది. అంటే, చాలా మందికి ఇంటర్నెట్ అనేది స్వతంత్రంగా వాడుకునే సాధనంగా కాకుండా, ఎవరో ఒకరి మధ్యవర్తిత్వంతో నడిచే సేవగా మిగిలిపోయింది. -
ఫుడ్ సేఫ్టీ... ఏఐ ఉందిగా...
ఏ పుట్టలో ఏ పాముందో... అనేది పాత సామెత. ఏ ఫుడ్లో ఏ బాక్టీరియా ఉందో... అనేది కొత్త సామెత. ఇంట్లో కాకుండా బయట ఎక్కడైనా తినాలంటే... భయమే భయం! ఏ సమస్య వచ్చినా... ‘ఏ.ఐ ఉందిగా!’ అనుకునే ఈ కాలంలో... ఏ.ఐ అనేది ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన భయాలను పోగొట్టి, భరోసా ఇవ్వగలదా? అంటే... ‘యస్’ అనే అంటున్నారు నిపుణులు. ఇప్పుడిప్పుడే ఆహారపరిశ్రమలో ఏఐ అడుగులు పడుతున్నాయి. భవిష్యత్కు సంబంధించి ఆశను, భరోసాను ఇస్తున్నాయి.ఆహార భద్రతకు సంబంధించిన మూలస్తంభాలలో ఒకటి... ఆహార నాణ్యత. ఆహార పదార్థాలలో వ్యాధికారకాలు, విషపదార్థాలను గుర్తించడంలో ఏ.ఐ సాంకేతికత ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఏ.ఐ, ఆధారిత కెమెరాలు ఆహార ఉత్పత్తులలోని కలుషితాన్ని, సరిగా లేని లేబులింగ్ను, ఇతరత్రా అంశాలను మనిషి కంటి కంటే వేగంగా, మరింత కచ్చితత్వంతో గుర్తిస్తున్నాయి. ఏఐ–ఆధారిత సెన్సార్లు ఆహార ఉత్పత్తులలో ఇ.కోలి, సాల్మోనెల్లా వంటి హానికరమైన బాక్టీరియాను గుర్తించగలవు. మైక్రోబయాలజీ స్టార్టప్ ‘స్పోర్ బయో’ ఫుడ్ సేఫ్టీకి సంబంధించి పరీక్ష సమయాన్ని రోజుల నుండి నిమిషాల వ్యవధికి తగ్గించే ఏ.ఐ. సాంకేతికతను అభివృద్ధి చేసింది.తు.చ. తప్పకుండా... ఫుడ్సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని, ఉద్యోగులలో ఒత్తిడిని తగ్గించడానికి అమెరికన్ మల్టీనేషనల్ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ చైన్ ‘మెక్డొనాల్డ్స్’ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ శాఖలలో ఏ.ఐ. టెక్నాలజీని ఉపయోగిస్తోంది. ఏఐ–ఆధారిత డ్రైవ్–త్రూలు నిర్వహిస్తోంది. షెడ్యూలింగ్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్లలో రెస్టారెంట్ మేనేజర్లకు ఏ.ఐ. సాధనాలు ఉపకరిస్తున్నాయి. నిబంధనలను పాటించడం అనేది ఆహార పరిశ్రమలకు సవాలుగా, సంక్లిష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించేలా చేయడంలో ఏ.ఐ ఆటోమేట్ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోంది.ఆహారభద్రతా చట్టాలు, లేబులింగ్ నిబంధనలు, ట్రేసబిలిటీ అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడానికి ఆహార పరిశ్రమలు మాన్యువల్ ప్రాసెస్పై ఎక్కువ ఆధారపడతాయి. సంక్లిష్టమైన నిబంధనలను త్వరగా అర్థం చేసుకోవడం, నిబంధనలు పాటించడానికి సంబంధించిన సందేహాలకు తక్షణ సమాధానాలు ఇవ్వడం ద్వారా హోటల్స్, రెస్టారెంట్స్... మొదలైనవి ఆహార భద్రతా చట్టాలలో అప్డేటెడ్గా ఉండేలా చూడడానికి ఏ.ఐ. అనేది మాన్యువల్ ప్రాసెస్కు ప్రత్యామ్నాయంగా మారింది.అలెర్జీలకు దూరంగా...ఆరోగ్యానికి దగ్గరగా... ఆహార భద్రతకు సంబంధించి ఏ.ఐ. సాంకేతికతను వినియోగించుకోవడానికి మాత్రమే పరిమితం కాకుండా ఫుడ్ సైంటిస్ట్లు, క్వాలిటీ అష్యూరెన్స్ స్పెషలిస్ట్లు... మొదలైన వారి నుంచి సలహాలు తీసుకుంటున్నాయి రెస్టారెంట్లు. రోబోటిక్ చెఫ్లు... ఏఐ ఆధారిత రోబోటిక్ చెఫ్లు, ప్రిడిక్టివ్ అనాలటిక్స్ ద్వారా ఆహార వ్యర్థాలను భారీగా తగ్గించడానికి వీలువుతుంది. మీల్ ప్లానర్, కుక్ బుక్ వంటి ఏ.ఐ. సాధనాలు వినియోగదారులకు ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలను అందించడంలో సహాయపడుతున్నాయి. అలెర్జీల బారిన పడకుండా ఉపకరిస్తున్నాయి.ఏ.ఐ. ఆధారిత పర్సనలైజ్డ్ న్యూట్రిషన్ యాప్ ‘ఆర్ఎక్స్డైట్’ కస్టమ్ ఫుడ్ ప్లాన్స్ను డెవలప్ చేసి ఆహారపదార్థాలను తాజాగా అందించడంలో తోడ్పడుతుంది. ఒకవైపు రుచిని అందిస్తూనే, మరోవైపు అలెర్జీ కారకాలను తొలగించడానికి, పోషక విలువలు మెరుగు పరచడానికి ఏ.ఐ సాధనాలు ఉపకరిస్తున్నాయి.మరింత ప్రయోజనకరంగా... ‘సంప్రదాయ ఆహారపదార్థాలను మరింత ప్రయోజనం కలిగించేలా చేయడానికి, పర్యావరణానికి తక్కువ హాని కలిగించే ప్రత్యామ్నాయ మార్గాలు సృష్టించడానికి ఏ.ఐ. ఉపకరిస్తుంది’ అంటున్నారు నిపుణులు.రెస్టారెంట్ల ఆహారభద్రత పర్యవేక్షించడానికి యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ ఏ.ఐ. టూల్స్ వినియోగంపై ప్రత్యేక దృష్టి పెడుతోంది. ఏ.ఐ. అనేది పని సామర్థ్యాన్ని మెరుగుపరిచే సాధనం మాత్రమే కాదు ఆహారభద్రతకు సంబంధించిన నిబంధనలను పాటించేలా చేయడంలో, పారదర్శకత, విశ్వసనీయతకు సంబంధించి ఆహార పరిశ్రమ ముఖచిత్రాన్ని మార్చడంలో కీలక పాత్ర పోషించనుంది. -
ఏఐ దాహం.. ప్రపంచానికి కొత్త సవాల్!
కృత్రిమ మేధస్సు (AI) సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులకు కారణమవుతోంది. విద్య, వైద్యం, పరిశ్రమలు, రవాణా, వినోదం వంటి అనేక రంగాల్లో ఏఐ వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. అయితే.. ఈ అభివృద్ధి వెనుక సమస్యలు కూడా ఉన్నాయని, ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం (UNU) విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.ఏఐ వల్ల కలిగే ప్రయోజనాల కంటే.. దాని కోసం అవసరమయ్యే నీరు, విద్యుత్, భూమి వినియోగం భవిష్యత్తులో పెద్ద సవాలుగా మారవచ్చని యూఎన్యూ హెచ్చరించింది. ఏఐ వ్యవస్థలు పనిచేయడానికి భారీ డేటా సెంటర్లు అవసరం. ఈ డేటా సెంటర్లలో వేలాది సర్వర్లు నిరంతరం పనిచేస్తుంటాయి. దీంతో సర్వర్లు అధిక ఉష్ణోగ్రతలకు లోనవుతాయి. అలాంటప్పుడు వీటిని చల్లబరచడానికి భారీ మొత్తంలో నీరు అవసరమవుతుంది.భారీ నీటి వినియోగం!యూఎన్యూ నివేదిక ప్రకారం.. 2030 నాటికి AI డేటా సెంటర్లు వినియోగించే నీరు, ప్రపంచంలోని 1.3 బిలియన్ మంది ప్రజల ప్రాథమిక గృహ అవసరాలను తీర్చగల స్థాయిలో ఉండవచ్చని అంచనా. ఇది ప్రస్తుతం మొత్తం ఆఫ్రికా ఖండ జనాభాకు సమానం అని తెలుస్తోంది.ఇప్పటి వరకు ఏఐ గురించి జరిగిన చర్చల్లో కార్బన్ ఉద్గారాలపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. కానీ నీటి వినియోగం కూడా అంతే ముఖ్యమైన సమస్యగా మారుతోందని పరిశోధకులు చెబుతున్నారు. ఏఐ మోడళ్లను నడపడానికి అవసరమైన విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియలోనూ, సర్వర్ల శీతలీకరణలోనూ భారీ స్థాయిలో నీటి వినియోగం ఉంటుంది.విద్యుత్ వినియోగంవిద్యుత్ వినియోగం విషయంలో కూడా.. పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. 2030 నాటికి AI ఆధారిత డేటా సెంటర్లు ప్రతి సంవత్సరం సుమారు 945 టెరావాట్ గంటల విద్యుత్ను వినియోగించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ఇది పాకిస్తాన్, బంగ్లాదేశ్, నైజీరియా దేశాల వార్షిక విద్యుత్ వినియోగాన్ని కలిపినా వచ్చే మొత్తానికి దాదాపు మూడు రెట్లు ఎక్కువ.ఏఐ అనేది కేవలం డిజిటల్ సాంకేతికత మాత్రమే కాదని నివేదిక స్పష్టం చేసింది. దీనికి అత్యాధునిక కంప్యూటర్ చిప్స్, భారీ డేటా సెంటర్లు, శీతలీకరణ వ్యవస్థలు, విద్యుత్ మౌలిక సదుపాయాలు అవసరం. ఇవన్నీ భూమి వనరులపై గణనీయమైన ఒత్తిడిని కలిగిస్తాయి. డేటా సెంటర్ల నిర్మాణం కోసం విస్తారమైన భూభాగం అవసరమవుతుంది. అదనంగా చిప్ల తయారీ ప్రక్రియలో కూడా విలువైన ఖనిజాలు, నీరు, పవర్ పెద్ద మొత్తంలో వినియోగించాల్సి ఉంటుంది.పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలుఅయితే.. ఇక్కడ ఐక్యరాజ్యసమితి ఏఐ అభివృద్ధిని నిలిపివేయాలని సూచించడం లేదు. బదులుగా ప్రభుత్వాలు, టెక్నాలజీ సంస్థలు, వినియోగదారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతోంది. కొత్త ఆవిష్కరణలతో పాటు నీటి వినియోగం, విద్యుత్ అవసరాలు, భూమి వినియోగం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తోంది.ఏఐ మానవ జీవితాన్ని సులభతరం చేస్తున్నప్పటికీ దాని వెనుక దాగి ఉన్న పర్యావరణ వ్యయాన్ని విస్మరించకూడదు. భవిష్యత్తులో సాంకేతిక అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యతను సాధించడం ప్రపంచ దేశాల ముందున్న ప్రధాన సవాలు. కాబట్టి AI వల్ల కలిగే ప్రయోజనాలను ఆస్వాదిస్తూనే, దాని పర్యావరణ ప్రభావాన్ని తగ్గించే మార్గాలను అన్వేషించడం చాలా అవసరం. -
మానవ నియంత్రణ తప్పుతున్న నమూనాలు
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు మానవాళి మనుగడకే సవాలుగా మారనుందా అంటే.. తాజా సాంకేతిక అంశాలు అవుననే సమాధానమిస్తున్నాయి. ప్రముఖ ఏఐ పరిశోధనా సంస్థ ‘ఆంత్రోపిక్’ విడుదల చేసిన నివేదిక ఇప్పుడు చర్చకు దారితీసింది. అత్యంత శక్తివంతమైన ఏఐ వ్యవస్థల అభివృద్ధిపై అంతర్జాతీయంగా తక్షణమే తాత్కాలిక విరామం(గ్లోబల్ పాజ్) ప్రకటించాలని ఆంత్రోపిక్ తెలిపింది. తాము రూపొందిస్తున్న ఏఐ నమూనాలు మానవ నియంత్రణ పరిధుల నుంచి తప్పించుకునే సంకేతాలను ప్రదర్శిస్తున్నాయని సంస్థ బాహాటంగా అంగీకరించడం గమనార్హం.స్వీయ నియంత్రణ సాధ్యమేనా?ప్రసిద్ధ క్లాడ్ ఏఐ నమూనాల సృష్టికర్త అయిన ఆంత్రోపిక్ సంస్థ సాంకేతిక పరిజ్ఞాన ప్రగతితో పాటు సామాజిక నిర్మాణాలు, భద్రతా ప్రమాణాల సమతుల్యతను కాపాడుకోవడానికి ఈ గ్లోబల్ పాజ్ అత్యవసరమని పేర్కొంది. ‘సాంకేతిక పరిజ్ఞాన పురోగతిని తట్టుకునేలా సామాజిక వ్యవస్థలను సిద్ధం చేయడానికి, సరిహద్దు ఏఐ (ఫ్రంటీర్ ఏఐ) అభివృద్ధిని నెమ్మదిగా లేదా తాత్కాలికంగా నిలిపివేసే హక్కు ప్రపంచానికి ఉండాలి’ అని ఆంత్రోపిక్ స్పష్టం చేసింది.అయితే, ఒకే ఒక్క సంస్థ లేదా దేశం అభివృద్ధిని ఆపితే ప్రయోజనం లేదని, ప్రత్యర్థి శక్తులు మరింత వేగంగా దూసుకుపోయే ప్రమాదముందని హెచ్చరించింది. అమెరికా, చైనాల వంటి అగ్రదేశాల్లోని ప్రధాన ఏఐ సంస్థలన్నీ ఒకే వేదికపైకి వచ్చి పరస్పర నిబంధనలను ధ్రువీకరించుకుంటూ ఏకకాలంలో విరామం ప్రకటిస్తేనే ఇది సాధ్యమవుతుందని అభిప్రాయపడింది. అంతర్జాతీయ సమన్వయ యంత్రాంగం లేకపోతే భౌగోళిక రాజకీయ, వ్యాపార ఒత్తిళ్ల కారణంగా భద్రతను పణంగా పెట్టాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.వైట్హౌస్ అభ్యంతరాలుఆంత్రోపిక్ చేసిన ఈ ప్రతిపాదనపై సిలికాన్ వ్యాలీతో పాటు వాషింగ్టన్ రాజకీయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రమాదాల తీవ్రతను ఆంత్రోపిక్ అతిగా ఊహిస్తోందని, భద్రతా ఆందోళనల ముసుగులో ప్రత్యర్థులను వెనక్కి నెట్టే వ్యూహాత్మక పన్నాగం ఇదంటూ వైట్హౌస్ అధికారులు, సహచర టెక్ కంపెనీల ప్రతినిధులు కొట్టిపారేస్తున్నారు. ఏఐ అభివృద్ధిని ఆపడం వల్ల చైనాకు వ్యూహాత్మకంగా పైచేయి లభిస్తుందని అమెరికా అధికారులు భయపడుతున్నారు.అయినప్పటికీ, ఆంత్రోపిక్ సంస్థ అత్యంత రహస్యంగా ఉంచిన ‘మైథోస్’ మోడల్ శక్తిని వైట్హౌస్ సైతం గుర్తించింది. అసాధారణమైన సైబర్ సెక్యూరిటీ సామర్థ్యాలు ఉన్నందున ఈ మోడల్ను సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంచలేదు. కేవలం నిశితంగా పరిశీలించిన అతికొద్ది సంస్థలకు మాత్రమే ప్రస్తుతం దీనికి యాక్సెస్ కల్పించారు. యూరప్కు కూడా ఈ మైథోస్ మోడల్ యాక్సెస్ణు ఆంత్రోపిక్ అందిస్తుండటం విశేషం.ఇదీ చదవండి: వ్యర్థాల్లో దాగున్న బంగారు అవకాశం! -
వ్యర్థాల్లో దాగున్న బంగారు అవకాశం!
భారతదేశ పునరుత్పాదక ఇంధన ప్రస్థానం గత దశాబ్ద కాలంగా చాలా వృద్ధిని నమోదు చేస్తోంది. జాతీయ సౌర ఇంధన మిషన్ (నేషనల్ సోలార్ మిషన్) ప్రారంభమైనప్పటి నుంచి రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో సౌర విద్యుత్ సామర్థ్యం ఊహించని రీతిలో విస్తరించింది. అయితే, ఈ విజయవంతమైన ప్రయాణం వెనుక ఒక క్లిష్టమైన, ఇప్పటివరకు పెద్దగా చర్చకు రాని సవాలు దాగి ఉంది. అదే.. కాలం తీరిన సోలార్ ప్యానెళ్ల భవిష్యత్తు ఏమిటనేది! సాధారణంగా సోలార్ ప్యానెళ్ల జీవితకాలం 25 నుంచి 30 సంవత్సరాలు ఉంటుంది. భారతదేశపు తొలి విడత సోలార్ ప్రాజెక్టులు ఇప్పుడు వాటి జీవితకాలంలో సగానికి చేరుకున్నాయి. అంటే, రాబోయే దశాబ్దంలో దేశంలో పెద్ద ఎత్తున నిరుపయోగమైన సోలార్ ప్యానెళ్ల వ్యర్థాలు పేరుకుపోనున్నాయి.వ్యర్థాల ముప్పుఅంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ (ఐఆర్ఈఎన్ఏ) అంచనాల ప్రకారం.. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా సౌర వ్యర్థాలు సుమారు 7.8 కోట్ల టన్నులకు చేరే ప్రమాదం ఉంది. వందల గిగావాట్ల సౌర సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్న భారతదేశానికి ఇది భవిష్యత్తులో ఒక భారీ పర్యావరణ సవాలుగా మారనుంది. సాధారణ వ్యర్థాల లాగా కాకుండా సోలార్ ప్యానెళ్లలో గ్లాస్, సిలికాన్, లోహాలు, పాలిమర్లు ఉంటాయి. వీటిని శాస్త్రీయంగా రీసైకిల్ చేయకుండా పారేస్తే.. వాటిలోని సీసం (లెడ్), కాడ్మియం వంటి ప్రమాదకరమైన రసాయనాలు నేలలోకి, భూగర్భ జలాల్లోకి చేరి పర్యావరణానికి, ప్రజారోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తాయి.వ్యర్థాల నుంచే సంపద సృష్టిఈ ముప్పులోనూ భారతదేశానికి ఒక అద్భుతమైన ఆర్థిక అవకాశం దాగి ఉందని నిపుణులు సూచిస్తున్నారు. సోలార్ ప్యానెళ్లలో అత్యంత విలువైన హై-ప్యూరిటీ సిలికాన్, వెండి, అల్యూమినియం, రాగి వంటి లోహాలు ఉంటాయి. వీటిని తిరిగి సేకరించడం ద్వారా ముడిపదార్థాల దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది. సోలార్ సెల్స్లో కీలకమైన వెండి ఖరీదైనది, పరిమితమైనది. రీసైక్లింగ్ ద్వారా దీనిని తిరిగి పొందితే తయారీ వ్యయం గణనీయంగా తగ్గుతుంది. ప్యానెళ్ల నుంచి సేకరించిన సిలికాన్ను శుద్ధి చేసి తిరిగి సోలార్ ప్యానెళ్ల తయారీలో లేదా సెమీకండక్టర్ పరిశ్రమలో ఉపయోగించవచ్చు.రీసైక్లింగ్ పద్ధతులు - సవాళ్లుమెకానికల్ పద్ధతి: ప్యానెళ్లను ముక్కలు చేయడం లేదా నుజ్జు చేయడం. ఇందులో గ్లాస్ను సులభంగా వేరు చేయవచ్చు. కానీ లోహాలు, సిలికాన్ నాణ్యత తక్కువగా ఉంటుంది.థర్మల్ (పైరోలిసిస్): అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేయడం. ఇందులో ప్యానెల్లోని ప్లాస్టిక్ పొరలను తొలగించి లోహాలను వేరే చేసేందుకు వీలవుతుంది. అయితే ఈ పద్ధతిలో నియంత్రణ లేకపోతే ప్రమాదకర వాయువులు విడుదలవుతాయి.కెమికల్ (రసాయన): సాల్వెంట్లు లేదా ఆమ్లాల (యాసిడ్స్) వినియోగం. ఇందులో అత్యధిక నాణ్యతతో కూడిన లోహాల రికవరీ సాధ్యమవుతుంది. కానీ ఎక్కువ ఇంధన వినియోగం, నిర్వహణ సంక్లిష్టత, రసాయన వ్యర్థాల ముప్పు ఉంటుంది.ప్రస్తుతానికి సమర్థవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన, పర్యావరణహితమైన ప్రామాణిక పద్ధతి లేకపోవడం ఈ రంగానికి పెద్ద అడ్డంకిగా మారింది.అంతర్జాతీయ విధానాలు.. భారత నియంత్రణ వ్యవస్థభారతదేశం ఈ-వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలు-2022 ద్వారా సర్క్యులర్ ఎకానమీ వైపు ప్రాథమికంగా అడుగులు వేసినప్పటికీ సోలార్ వ్యర్థాల నిర్వహణకు ఇంకా పూర్తిస్థాయి ప్రత్యేక చట్టపరమైన నిబంధనలు లేవు. అంతర్జాతీయంగా చూస్తే ఆస్ట్రేలియా ప్రభుత్వం ‘నేషనల్ సోలార్ ప్యానెల్ రీసైక్లింగ్ పైలట్ ప్రాజెక్ట్’ కోసం మూడు సంవత్సరాల కాలానికి 24.7 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. యూరప్ దేశాల్లో ‘ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ (ఈపీఆర్)’ విధానం అమలులో ఉంది. దీని ప్రకారం సోలార్ ప్యానెళ్లను తయారు చేసిన సంస్థలే వాటి జీవితకాలం ముగిశాక రీసైకిల్ చేయాల్సి ఉంటుంది. భారతదేశంలోనూ ఇటువంటి స్పష్టమైన విధానాలు రావలసి ఉంది.ముందున్న కార్యాచరణ(నిపుణుల సూచనలు)సోలార్ ప్యానెల్ తయారీదారులు, డెవలపర్లకు ఈపీఆర్ని తప్పనిసరి చేయాలి.రీసైక్లింగ్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి పరిశ్రమలకు రాయితీలు ఇవ్వాలి.ప్రతి సోలార్ మాడ్యూల్ జీవితకాలాన్ని పర్యవేక్షించడానికి డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థను తీసుకురావాలి.దేశీయ విద్యా, పరిశోధనా సంస్థలు లేజర్ ఆధారిత డీలామినేషన్, హై-వోల్టేజ్ సెపరేషన్ వంటి అధునాతన పద్ధతులపై దృష్టి సారించాలి. పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) ద్వారా స్టార్టప్లు ఏఐ ఆధారిత మెటీరియల్ రికవరీ సిస్టమ్స్ను అభివృద్ధి చేయాలి.ఇదీ చదవండి: మూల పడిన బంగారం.. దేశ ఆర్థికానికి మూలాధారం! -
క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ విభాగాలపై వేటు..
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ మరోసారి ఉద్యోగుల తొలగింపునకు తెరలేపింది. ఈసారి ఎటువంటి ముందస్తు హడావుడి లేకుండా నిశ్శబ్దంగా శ్రామిక శక్తిని కత్తిరిస్తూ వస్తోంది. కంపెనీకి అత్యంత కీలకమైన, లాభదాయకమైన గూగుల్ క్లౌడ్ విభాగంతో పాటు ఎంతో ప్రతిష్టాత్మకమైన సైబర్ సెక్యూరిటీ బృందాలపై కూడా ఈ కోతల ప్రభావం పడినట్లు తెలుస్తోంది. ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ బిజినెస్ ఇన్సైడర్ నివేదిక ప్రకారం.. గత రెండు వారాలుగా ఈ లేఆఫ్స్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇవి సాధారణ సంస్థాగత మార్పుల కంటే భిన్నంగా, వ్యూహాత్మక విభాగాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతుండటం టెక్ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ తాజా పునర్నిర్మాణంలో గూగుల్ అత్యున్నత స్థాయి భద్రతా విభాగాలైన థ్రెట్ ఇంటెలిజెన్స్ గ్రూప్, మాండియంట్ ఉద్యోగులు చిక్కుకోవడం గమనార్హం.థ్రెట్ ఇంటెలిజెన్స్ గ్రూప్అంతర్జాతీయ సైబర్ నిఘా, వివిధ దేశాల ప్రభుత్వాల మద్దతుతో జరిగే హ్యాకింగ్స్, ప్రధాన డిజిటల్ బెదిరింపులను ముందే గుర్తించి దర్యాప్తు చేసే ఉన్నత స్థాయి భద్రతా బృందం ఇది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ నిపుణులు, విధాన నిర్ణేతలు ఈ బృందం ఇచ్చే నివేదికలను ప్రామాణికంగా తీసుకుంటారు. ఇప్పుడు ఈ టీమ్లోని కొంతమంది సభ్యులకు గూగుల్ ఉద్వాసన పలికినట్లు సమాచారం. ప్రభావితమైన ఉద్యోగులు ఈ వివరాలను లింక్డ్ఇన్ ద్వారా పంచుకుంటున్నారు.మాండియంట్సైబర్ సెక్యూరిటీ రంగాన్ని బలోపేతం చేయడం కోసం 2022లో గూగుల్ దాదాపు 5.4 బిలియన్ డాలర్ల వ్యయంతో మాండియంట్ సంస్థను కొనుగోలు చేసింది. క్లౌడ్ సెక్యూరిటీ, ఇన్సిడెంట్ రెస్పాన్స్లో అత్యంత కీలకమైన ఈ విభాగంలోని సిబ్బందిని కూడా ప్రస్తుత లేఆఫ్స్ దెబ్బతీశాయి. వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న సైబర్ సెక్యూరిటీ విభాగాలు సైతం ఈ అంతర్గత పునర్నిర్మాణం నుంచి తప్పించుకోలేకపోయాయనే వాస్తవాన్ని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.లేఆఫ్స్ వెనుక కారణంతాజా ఉద్యోగాల తగ్గింపునకు సంబంధించి గూగుల్ అధికారికంగా సంఖ్యను వెల్లడించనప్పటికీ క్లౌడ్ విభాగంలోని అంతర్గత సమాచారం ప్రకారం ఉద్యోగులకు స్పష్టమైన కారణాన్ని వివరించినట్లు తెలుస్తోంది. ‘ప్రస్తుతం మార్కెట్ వేగంగా మారుతోంది. ముఖ్యంగా కృత్రిమ మేధ రంగానికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. అందుకే కంపెనీ తన వనరులను, బడ్జెట్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు కేటాయించాల్సి వస్తోంది’ అని కంపెనీ లేఆఫ్స్ బాధితులకు తెలిపినట్లు సమాచారం.ఇదీ చదవండి: మూల పడిన బంగారం.. దేశ ఆర్థికానికి మూలాధారం! -
మొబైల్ రీఛార్జ్లు పెరగొచ్చు!
దేశంలోని టెలికాం వినియోగదారులకు మరోసారి మొబైల్ రీఛార్జ్ల భారం పడే అవకాశం కనిపిస్తోంది. వచ్చే మూడు నుంచి ఆరు నెలల్లో టెలికాం కంపెనీలు టారిఫ్లను సుమారు 10 శాతం మేర పెంచే అవకాశముందని యాక్సిస్ క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గౌరవ్ మల్హోత్రా అభిప్రాయపడ్డారు. గతంలో జరిగినట్లుగా 15–20 శాతం భారీ పెంపులు అవసరం లేదని, ఈసారి పరిమిత స్థాయిలో ధరల సవరణ జరిగే అవకాశం ఉందని ఆయన సీఎన్బీసీ-టీవీ18 వార్తాసంస్థతో పేర్కొన్నారు.టెలికాం రంగంలో ప్రస్తుతం ఆదాయ వృద్ధి కేవలం టారిఫ్ పెంపులపైనే ఆధారపడడం లేదని మల్హోత్రా వివరించారు. వినియోగదారులు అధిక డేటా ప్రయోజనాలు, 5జీ సేవలు, ప్రీమియం ప్లాన్ల వైపు మారుతుండటంతో కంపెనీలకు ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం (ARPU) సహజంగానే పెరుగుతోందన్నారు. టారిఫ్ పెంపు లేకుండానే ఏఆర్పీయూ ఏటా 4–5 శాతం మేర పెరుగుతోందని ఆయన అంచనా వేశారు.ఇటీవల సంవత్సరాల్లో జరిగిన టారిఫ్ పెంపులను వినియోగదారులు పెద్దగా వ్యతిరేకించకపోవడం, 5జీ సేవల వినియోగం పెరగడం, అధిక విలువ కలిగిన ప్లాన్లకు మారుతున్న కస్టమర్ల సంఖ్య పెరగడం వంటి అంశాలు టెలికాం కంపెనీల ఆదాయాలకు ఊతమిస్తున్నాయి. దీంతో భారీ ధరల పెంపుల అవసరం ప్రస్తుతం కనిపించడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.మరోవైపు, ఇతర బ్రోకరేజ్ సంస్థలు కూడా 2026లో టెలికాం టారిఫ్ల పెంపుపై అంచనాలు వెలువరించాయి. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రధాన సంస్థలు 10–15 శాతం వరకు టారిఫ్లను పెంచవచ్చని జెఫరీస్ వంటి సంస్థలు ఇప్పటికే పేర్కొన్నాయి. అయితే ఇప్పటివరకు ఏ టెలికాం సంస్థ అధికారికంగా ధరల పెంపును ప్రకటించలేదు.టారిఫ్లు నిజంగానే 10 శాతం పెరిగితే ప్రస్తుతం రూ.299 ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్ ధర సుమారు రూ.329కు, రూ.349 ప్లాన్ రూ.384కు చేరే అవకాశం ఉంటుంది. అయితే తుది నిర్ణయం టెలికాం కంపెనీల వ్యూహాలు, మార్కెట్ పరిస్థితులు, పోటీ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. -
చమురు దిగుమతిని తగ్గించే వ్యూహం
భారత ఇంధన రంగంలో స్వావలంబన సాధించడమే లక్ష్యంగా కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ‘ఈ85 ఫ్లెక్స్ ఇంధనం’ను అధికారికంగా ఈరోజు(జూన్ 5)విడుదల చేయనుంది. ఈ సరికొత్త ఇంధనంలో 80 నుంచి 85 శాతం ఇథనాల్, కేవలం 15 నుంచి 20 శాతం మాత్రమే పెట్రోల్ (మోటార్ గ్యాసోలిన్) ఉంటాయి. మారుతి సుజుకి సంస్థ దేశంలోనే మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారును ఆవిష్కరించిన సందర్భంగా.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి ఈ ప్రకటన చేశారు. ఈ చొరవతో దేశంలో ఇథనాల్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ మరింత పెరగనుంది.తొలిదశలో 50 నుంచి 100 ఇంధన స్టేషన్లుప్రారంభ దశలో భాగంగా దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, పుణె, నాగ్పూర్ పరిధిలోని 50 నుంచి 100 రిటైల్ అవుట్లెట్లలో ఈ ఇథనాల్ పంపిణీ స్టేషన్లను ప్రారంభించనున్నారు. దేశంలోనే అత్యధిక వాహన జనాభా, ఇంధన వినియోగం ఉన్న ఈ నగరాలను పైలట్ ప్రాజెక్ట్ కోసం వ్యూహాత్మకంగా ఎంపిక చేశారు. దీనివల్ల వినియోగదారులకు ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలపై అవగాహన, విశ్వసనీయత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.ఫ్లెక్స్-ఇంధన స్టేషన్ల విస్తరణ ఇలా..ప్రస్తుత ప్రారంభం : 50 - 100 స్టేషన్లు2026 చివరి నాటికి : 500 స్టేషన్లు2027 చివరి నాటికి : 5,000 స్టేషన్లురూ.1.84 లక్షల కోట్లు ఆదా!గడిచిన దశాబ్ద కాలంలో ఇథనాల్ బ్లెండింగ్ (మిశ్రమం) రంగంలో భారత్ ప్రగతి సాధించింది. 2014లో కేవలం 1.5 శాతంగా ఉన్న ఇథనాల్ మిశ్రమం.. నేడు ఏకంగా 20 శాతానికి చేరింది. ప్రభుత్వం నిర్దేశించుకున్న గడువు కంటే ముందే ఈ మైలురాయిని అందుకోవడం విశేషం. ఈ బ్లెండింగ్ కార్యక్రమం ద్వారా దాదాపు 302 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చమురు దిగుమతులు తగ్గాయి. విదేశీ మారక ద్రవ్యంలో ఏకంగా రూ.1.84 లక్షల కోట్లు ఆదా అయ్యాయి.సరఫరా గొలుసు ముప్పునకు బ్రేక్‘భారతదేశం ప్రస్తుతం శిలాజ ఇంధనాల దిగుమతి కోసం ఏటా 120 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోంది. ఇది మన కరెంట్ ఖాతాపై భారాన్ని మోపుతోంది. పైగా మన దేశానికి వచ్చే ఎల్పీజీలో 60 శాతం, ముడి చమురులో 90 శాతం హార్మూజ్ జలసంధి గుండానే ప్రయాణించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో దాదాపు స్వచ్ఛమైన ఇథనాల్తో (E100) నడిచే వాహనాలను ప్రోత్సహించక తప్పదు’ అని హర్దీప్ సింగ్ పురి అన్నారు.ఇదీ చదవండి: ‘మనస్ఫూర్తిగా ఒక్కపనీ చేయలేదు’ -
భారత్ పే ఫ్లెక్స్.. వడ్డీ లేని క్రెడిట్ లైన్ ఫీచర్!
దేశంలో డిజిటల్ చెల్లింపుల సరళిని మార్చేస్తూ ప్రముఖ ఫిన్టెక్ దిగ్గజం ‘భారత్ పే’ వినియోగదారుల కోసం ఒక సరికొత్త డిజిటల్ చెల్లింపుల సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. అదే ‘భారత్ పే ఫ్లెక్స్’. ‘పే వయా యూపీఐ, సెటిల్ లేటర్’ అనే విధానంతో డిజిటల్ క్రెడిట్ రంగంలోకి భారత్ పే ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమకు నచ్చిన చోట యూపీఐ ద్వారా తక్షణమే పేమెంట్స్ చేసి, ఆ బిల్లును తర్వాత నిదానంగా చెల్లించవచ్చు. రోజువారీ ఖర్చుల నుంచి అత్యవసరాల వరకు నగదు కొరత లేకుండా చూసేందుకు ఈ సేవలు ఉపయోగపడుతాయని అధికారులు చెబుతున్నారు.‘భారత్ పే ఫ్లెక్స్’ ఎలా పనిచేస్తుంది?సాధారణంగా మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ ద్వారా పేమెంట్ చేసినప్పుడు ఆ మొత్తం నేరుగా మన బ్యాంక్ ఖాతా నుంచి కట్ అవుతుంది. కానీ భారత్ పే ఫ్లెక్స్తో ఆ అవసరం లేదు. వినియోగదారుడికి కేటాయించిన క్రెడిట్ లిమిట్ ఆధారంగా ఈ లావాదేవీలు జరుగుతాయి. అంటే, కస్టమర్ అకౌంట్ నుంచి కాకుండా భారత్ పే అందించే క్రెడిట్ లైన్ నుంచి మర్చంట్కు డబ్బు అందుతుంది.45 రోజుల వడ్డీ లేని గడువుఈ ఫీచర్ ద్వారా ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి కస్టమర్లకు 45 రోజుల వరకు సమయం లభిస్తుంది. ఈ నిర్ణీత ఉచిత వ్యవధిలో బకాయిలను క్లియర్ చేస్తే ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. వినియోగదారులు తాము రోజువారీగా ఉపయోగించే యూపీఐ విధానాన్ని మార్చుకోవాల్సిన పని లేకుండా బ్యాకెండ్లో క్రెడిట్ అందించడమే దీని ప్రత్యేకత.సాధారణ క్రెడిట్ కార్డులకు భిన్నంసాంప్రదాయ క్రెడిట్ కార్డులు పొందేందుకు కఠినమైన నిబంధనలు, ఆమోద ప్రక్రియలు, డాక్యుమెంటేషన్ అవసరమవుతాయి. వీటికి భిన్నంగా భారత్ పే ఫ్లెక్స్ రోజువారీ వినియోగదారులు, మధ్యతరగతి వర్గాలను లక్ష్యంగా చేసుకుని డిజైన్ చేశారు. నెల చివరిలో లేదా తాత్కాలికంగా నగదు కొరత ఎదుర్కొనే మధ్యతరగతికి, చిన్న వ్యాపారస్తులకు, రెస్టారెంట్లు, స్థానిక కిరాణా దుకాణాల్లో నిత్యం డిజిటల్ లావాదేవీలు జరిపే సామాన్యులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని భారత్పే చెప్పింది.భారతదేశ ఫిన్టెక్ మార్కెట్లో ప్రస్తుతం ‘బై నౌ, పే లేటర్’(ఇప్పుడు కొని తర్వాత చెల్లించండి) ఆప్షన్లకు డిమాండ్ పెరుగుతోంది. నేటి తరం వినియోగదారులు తక్షణ డిస్కౌంట్ల కంటే కూడా తాము జరిపే చిన్న కొనుగోళ్లకు అనుకూలమైన రీపేమెంట్ ఆప్షన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఈ సౌలభ్యంతో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా అవసరమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.నిపుణుల హెచ్చరికవడ్డీ లేని కాల పరిమితి వినియోగదారులకు ఎంతో ఉపయోగకరమైనప్పటికీ గడువు ముగిసేలోపు తిరిగి చెల్లించకపోతే అదనపు పెనాల్టీ ఛార్జీలు పడే అవకాశం ఉంది. ఇది వినియోగదారులను అప్పుల ఊబిలోకి నెట్టే ప్రమాదం ఉన్నందున క్రెడిట్ లైన్లను క్రమశిక్షణతో నిర్వహించుకోవాలి.ఇదీ చదవండి: ‘మనస్ఫూర్తిగా ఒక్కపనీ చేయలేదు’ -
ఏఐ రేసులో గూగుల్ మహా వ్యూహం
కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో గ్లోబల్ లీడర్గా నిలిచేందుకు గూగుల్ మాతృ సంస్థ ‘ఆల్ఫాబెట్ ఇంక్’ కళ్లు చెదిరే స్థాయి పెట్టుబడులకు తెరలేపింది. ఏఐ వ్యయ ప్రణాళికల కోసం నిధుల సమీకరణను భారీగా పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల క్రితమే ప్రకటించిన 80 బిలియన్ డాలర్ల ఆఫర్ను, తాజాగా 84.75 బిలియన్ డాలర్లకు (సుమారు 85 బిలియన్ డాలర్లు) పెంచుతున్నట్లు సంస్థ ప్రకటించింది. సాధారణంగా భారీ టెక్ కంపెనీలు షేర్ల బైబ్యాక్లకే మొగ్గు చూపుతాయి. కానీ అందుకు భిన్నంగా ఆల్ఫాబెట్ ఇంత పెద్ద మొత్తంలో ఈక్విటీని ఆఫర్ చేయడం ద్వారా మార్కెట్ నుంచి నగదు సేకరించడం టెక్ చరిత్రలోనే అత్యంత అరుదైన పరిణామంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.నిధుల సమీకరణను విశ్లేషిస్తే..ఈ మెగా ఫండ్ రైజింగ్ ప్లాన్ను ఆల్ఫాబెట్ అత్యంత వ్యూహాత్మకంగా విభజించింది. ఈ ఏడాది మూడో త్రైమాసికం (క్యూ3) నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రోగ్రామ్ ద్వారా బహిరంగ మార్కెట్లో నేరుగా వాటాలను విక్రయించి 40 బిలియన్ డాలర్లు సేకరిస్తారు. ప్రఖ్యాత ఇన్వెస్టర్ వారెన్ బఫెట్కు చెందిన బెర్క్షైర్ హాత్వే ఇంక్తో 10 బిలియన్ డాలర్ల విలువైన భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. క్లాస్ ఏ కామన్ స్టాక్, క్లాస్ సీ క్యాపిటల్ షేర్ల రూపంలో 18 బిలియన్ డాలర్లను సేకరించబోతున్నట్లు తెలుస్తుంది. మిగిలిన 16.75 బిలియన్ డాలర్లను డిపాజిటరీ షేర్ల ద్వారా భర్తీ చేయనున్నారు.మెగా డీల్బ్లూమ్బెర్గ్ డేటా ప్రకారం.. ఆల్ఫాబెట్ గతంలో అనుకున్న 80 బిలియన్ డాలర్ల మార్కుతోనే గ్లోబల్ ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద లావాదేవీగా రికార్డు సృష్టించడానికి సిద్ధమైంది. గతంలో బ్రెజిలియన్ చమురు దిగ్గజం ‘పెట్రోలియో బ్రెసిలిరో ఎస్ఏ’(పెట్రోబ్రాస్) సాధించిన 70 బిలియన్ డాలర్ల రికార్డు అమ్మకాలను ఆల్ఫాబెట్ తాజా ఆఫర్ వెనక్కి నెట్టేయనుంది.సాధారణంగా గూగుల్ లాంటి క్యాష్-రిచ్ కంపెనీలు తమ షేర్ల విలువను పెంచడానికి బైబ్యాక్ విధానాన్ని ఎంచుకుంటాయి. కానీ, దానికి భిన్నంగా ఈక్విటీని విక్రయించి 85 బిలియన్ డాలర్ల భారీ నిధులు సమకూర్చుకుంటోందంటే.. ఏఐ రేసులో ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలవాలనే గూగుల్ దూకుడు స్పష్టమవుతోందని కొందరు నిపుణులు చెబుతున్నారు.ఎన్విడియాకు గట్టి పోటీ.. సొంత చిప్లపై గురి!ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏఐ ప్రాసెసర్ల మార్కెట్లో ఎన్విడియా కార్ప్ ఆధిపత్యం నడుస్తోంది. అయితే, విపరీతమైన కంప్యూటింగ్ శక్తి అవసరమయ్యే ఈ పరిశ్రమలో ఎన్విడియాకు ప్రత్యామ్నాయంగా గూగుల్ తన సొంత ఏఐ చిప్లైన ‘టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్లు’(టీపీయూ)పై దృష్టి పెట్టింది. ఈ అంతర్గత చిప్స్ టెక్నాలజీని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికే ఈ నిధులను ప్రధానంగా వినియోగించనున్నట్లు సమాచారం.మరోవైపు, జనరేటివ్ ఏఐ సాంకేతికతను పూర్తిస్థాయిలో అందిపుచ్చుకోవడానికి గూగుల్తో పాటు మైక్రోసాఫ్ట్, మెటా వంటి మెగా కంపెనీలు కూడా ఏఐ డేటా సెంటర్ల నిర్మాణంలో పోటీ పడుతున్నాయి. దీనివల్ల పరిశ్రమలో మూలధన వ్యయాలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి.ఇదీ చదవండి: గేదె హెయిర్ స్టైల్కు ఫుల్ క్రేజ్! -
ఏఐ క్లిక్.. ప్రాజెక్టుకు కిక్
ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రాజెక్టు వర్క్ స్వరూపం పూర్తిగా మారబోతోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తోంది. దీనికోసం కొన్ని ప్రత్యేక టూల్స్ కూడా సిద్ధమయ్యాయి. దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలు ఇప్పటికే ఏఐ ఆధారిత ప్రాజెక్టు వర్క్లు చేస్తున్నాయి. విద్యార్థి సృజనాత్మకతకు కొత్త సాంకేతికత ఉపయోగపడుతోందని నిపుణులు అంటున్నారు. ఇటీవల దీనిపై అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అధ్యయనం చేసింది. ఆన్లైన్ ప్లాట్ఫాంలో లభించే సరికొత్త టూల్స్ను అన్ని కాలేజీలు అనుసరించాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. ఈ మేరకు ఇటీవల దేశంలోని అన్ని యూనివర్సిటీలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇంజనీరింగ్ విద్యలో నైపుణ్యం పెంచేందుకు ప్రాజెక్టు వర్క్ కీలకం. టెక్నాలజీ మార్పులకు అనుగుణంగా ఏఐ ద్వారా దీనిని చేయడం వల్ల నాణ్యత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. – సాక్షి, హైదరాబాద్విభిన్న టూల్స్ఇంజనీరింగ్ విద్యార్థులకు తొలి ఏడాది నుంచి ప్రాజెక్టు వర్క్ చేయడానికి, అవసరమైన సలహాలు ఇవ్వడానికి అనేక టూల్స్ సిద్ధంగా ఉన్నాయి. ఇందుకు సంబంధించిన ప్రతి డేటాను క్లౌడ్ ద్వారా ఏఐ తీసుకుంటుంది. కేవలం విద్యార్థి చదివే రాష్ట్రానికే పరిమితం కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సమాచార సేకరణకు ఏఐ టూల్స్ ఉపయోగపడతాయి. ప్రపంచ స్థాయిలో ఇంజనీరింగ్ విద్య, పారిశ్రామిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని వాటిని రూపొందించారు. » ఓపెన్ ఏఐ రూపొందించిన చాట్ జీపీటీ ద్వారా ప్రాజెక్ట్ ఐడియాలు, కోడింగ్, డీ బగ్గింగ్, డాక్యుమెంటేషన్ పనులు సులభమవుతాయి. » గిట్హబ్ కాపిలాట్ కోడ్ ఆటోమేటిక్గా పనులను సూచిస్తూ సాఫ్ట్వేర్ ప్రాజెక్టుల అభివృద్ధిని వేగవంతం చేస్తోంది. » గూగుల్ జెమినీ డేటా విశ్లేషణ, సాంకేతిక నివేదికలు, ప్రజెంటేషన్ల తయారీలో ఉపయోగపడుతోంది. » ఆంత్రోపిక్ అభివృద్ధి చేసిన క్లాడ్ పెద్ద డాక్యుమెంట్లను విశ్లేషించడం, పరిశోధన నివేదికలను రూపొందించడంలో సహకరిస్తోంది. » పర్ప్లెక్సిటీ ఏఐ పరిశోధనకు అవసరమైన మూలాలను వేగంగా గుర్తించి సమాచారాన్ని అందిస్తోంది. » కాన్వా మేజిక్ డిజైన్ ప్రాజెక్టు ప్రజెంటేషన్లు, పోస్టర్లు, డిజైన్లను ఏఐ సహాయంతో రూపొందిస్తోంది.కోడింగ్లోనూ ఏఐ కీలకంకంప్యూటర్ సైన్స్ విద్యార్థులు కోడ్ అభివృద్ధికి ఏఐను విస్తృతంగా ఉపయోగిస్తుండగా, ఎల్రక్టానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ విద్యార్థులు కూడా వెనుకబడటం లేదు. సర్క్యూట్ డిజైన్ల కోసం ఏఐ ఆధారిత సిములేషన్ టూల్స్ వాడుతున్నారు. రొబోటిక్స్ ప్రాజెక్టులకు ఆటోమేటెడ్ కోడ్ జనరేషన్ వాడకం పెరిగింది. క్యాడ్ మోడలింగ్కు జనరేటివ్ డిజైన్ సాఫ్ట్వేర్, ఐవోటీ ప్రాజెక్టులకు సెన్సార్ ఇంటిగ్రేషన్ సూచనలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. డేటా సైన్స్ ప్రాజెక్టులకు ఆటోమేటెడ్ అనలిటిక్స్ ప్లాట్ఫాంలు అందుబాటులో ఉన్నాయి. వచ్చే ఐదేళ్లలో ఇంజనీరింగ్ ప్రాజెక్టు వర్క్లో ఏఐ కీలకంగా మారనుంది. సమస్య ఎంపిక నుంచి ప్రొటోటైప్ రూపకల్పన, పరీక్షలు, డాక్యుమెంటేషన్, ప్రజెంటేషన్ వరకు ప్రతి దశలో ఏఐ సహాయకారిగా వ్యవహరించే పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ఇంజనీరింగ్ విద్యలో సృజనాత్మకత, ఆవిష్కరణ, పరిశ్రమ అనుసంధానం కొత్త స్థాయికి చేరుకునే అవకాశం ఉందని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
ప్రయోగం నుంచి వినియోగం వైపు
న్యూఢిల్లీ: దేశీ ఐటీ పరిశ్రమ కృత్రిమ మేథ (ఏఐ) ప్రాజెక్టులను ప్రయోగాత్మకంగా పరీక్షించే దశ నుంచి క్రమంగా విస్తృతంగా వినియోగించే దశ వైపు మళ్లుతున్నాయి. సంస్థాగతంగా కార్యకలాపాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏఐ ఏజెంట్లను అనుసంధానం చేసుకుంటున్నాయి. గత ఆరు నెలల వ్యవధిలో దేశీ ఐటీ దిగ్గజాలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్, విప్రో సంస్థలు మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్ వినియోగాన్ని మూడు లక్షల మందికి పైగా ఉద్యోగులకు అందుబాటులోకి తెచ్చాయి. తద్వారా అంతర్జాతీయంగా భారీ స్థాయిలో ఏఐని వినియోగిస్తున్న దిగ్గజాల సరసన చేరాయి. భారత్లో గణనీయంగా సిబ్బంది ఉన్న యాక్సెంచర్ కూడా వేల కొద్దీ ఉద్యోగులకు కోపైలట్ని అందుబాటులోకి తెచ్చే ప్రక్రియ చేపట్టింది.‘రోజువారీ ఉత్పాదకతను పెంచుకునేందుకు, కలిసి పనిచేయడాన్ని ప్రోత్సహించేందుకు, తెలివిగా నిర్ణయాలను తీసుకోవడంలోను తోడ్పడేందుకు మేము 1,00,000 మంది సిబ్బందికి మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్ని అందుబాటులోకి తెచ్చాం‘ అని టీసీఎస్ సీఈవో కె. కృతివాసన్ తెలిపారు. సంస్థ రోజువారీ కార్యకలాపాల్లో టెక్నాలజీని భారీగా వినియోగించడం ద్వారా అవకాశాలను మరింతగా అందిపుచ్చుకోవచ్చని ఇన్ఫోసిస్ సీఈవో సలిల్ పరేఖ్ తెలిపారు. ఏఐని తాము రోజువారీ పనుల్లో అనుసంధానిస్తున్నామని, తద్వారా ఉత్పాదకతను పెంచుకోవడం, నిర్ణయాలను పక్కాగా అమలుచేయడం, ఆవిష్కరణలను వేగవంతం చేయడంలాంటి అంశాలకు ఏఐ ఉపయోగపడుతుందని విప్రో సీఈవో శ్రీని పల్లియా తెలిపారు. కలిసి పని చేసే హైబ్రిడ్ విధానం.. ఏఐ కార్యకలాపాలను కేవలం స్టాండెలోన్ సాధనాలుగా కాకుండా మనుషులు, ఏజెంట్లు కలిసి పని చేసే విధానంగా తీర్చిదిద్దుకోవడంపై కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్కి చెందిన వర్క్ ట్రెండ్స్ ఇండెక్స్ 2026 ప్రకారం ఈ తరహా ఏఐ వినియోగం .. ప్రాథమిక ఆటోమేషన్ పరిధిని దాటి విశ్లేషణ, సమస్యల పరిష్కారంలాంటి పనులను సులభతరం చేస్తోంది. కంపెనీవ్యాప్తంగా ఏఐని ఉపయోగించడం వల్ల దేశీ ఐటీ దిగ్గజాలకు భారీగా ఆదా అవుతోంది. ప్రతి మూడు నెలలకు 2,50,000 ఫుల్ టైమ్ పనిదినాల సమయం ఆదా అవుతోందని విప్రో తెలిపారు. అలాగే తమ సిబ్బంది 29,000 పైగా కస్టమ్ ఏఐ ఏజెంట్లను రూపొందించినట్లు వివరించారు. ఇక టీసీఎస్ విషయానికొస్తే.. నిర్దిష్ట పని పూర్తి చేసేందుకు పట్టే సమయం దాదాపు 35 శాతం మేర తగ్గింది. దేశీ ఐటీ పరిశ్రమ పరిమాణం దాదాపు 300 బిలియన్ డాలర్లుగా ఉంటుంది.ఏఐ డీప్ఫేక్లతో వ్యాపారానికి రిస్కువిప్రో వెల్లడిఏఐ వినియోగం వేగవంతం కావడమనేది రిసు్కలతో కూడుకున్న వ్యవహారమని ఐటీ దిగ్గజం విప్రో హెచ్చరించింది. లోపభూయిష్టమైన అల్గోరిథంలు, పక్షపాత ధోరణులు, మారిపోతున్న నిబంధనలు, డీప్ఫేక్లు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మొదలైన వాటి రీత్యా తమ వ్యాపారానికి లీగల్గా, ఆర్థికంగా, పేరు ప్రతిష్టలపరంగా ముప్పు వాటిల్లే అవకాశం ఉందని 2025–26 ఆర్థిక సంవత్సరం వార్షిక నివేదికలో కంపెనీ పేర్కొంది. తమ క్లయింట్లకు అందించే సేవల్లోనూ, అంతర్గతంగా కార్యకలాపాల్లోను జనరేటివ్, అటానామస్ ఏఐని విస్తృతంగా వినియోగిస్తున్నప్పటికీ ఈ సాంకేతికత విషయంలో అనిశ్చితి నెలకొందని వివరించింది. పరిమిత స్థాయి మానవ జోక్యంతో ఏఐ సిస్టమ్లు పని చేయడం వల్ల అనుకోని ఫలితాలు వచ్చే రిసు్కలు ఉన్నాయని పేర్కొంది. ఈ సర్వీసుల్లో లోపాల వల్ల ప్రాజెక్టుల్లో జాప్యం లాంటి రిస్కులు ఉండొచ్చని విప్రో తెలిపింది. కొన్ని సర్వీసులకు డిమాండ్ తగ్గుతుంది ఏఐ ఆటోమేషన్ పెరగడం, సామర్థ్యాలు మెరుగుపడటం, క్లయింట్ టూల్స్ని వినియోగించడం లాంటి అంశాల వల్ల నిర్దిష్ట కోర్ సర్వీసులకు డిమాండ్ తగ్గొచ్చని విప్రో పేర్కొంది. ఫలితంగా ధరలు, లాభాల మార్జిన్లు, సర్వీసులపై ప్రతికూల ప్రభావం పడొచ్చని వివరించింది. అలాగే ఏఐ వినియోగంతో లీగల్, నియంత్రణ సంస్థ నిబంధనల అమలుపరంగా కూడా సవాళ్లు ఎదురుకావచ్చని పేర్కొంది. ఒకవేళ ఏఐ ఎనబుల్డ్ సొల్యూషన్స్ వల్ల క్లయింట్లకు, వారి కస్టమర్లకు లేదా థర్డ్ పారీ్టలకు హాని జరిగితే తమ సంస్థ లిటిగేషన్లు, నియంత్రణ సంస్థ చర్యలను ఎదుర్కొనాల్సి రావొచ్చని విప్రో తెలిపింది. విప్రో ఐటీ సర్వీసుల్లో 62 శాతం ఆదాయం అమెరికన్ దేశాల నుంచి, 27 శాతం యూరప్ దేశాల నుంచి ఉంటోంది. అయితే, పశ్చిమాసియా, దక్షిణాసియాలో ఉద్రిక్తతల వల్ల సరఫరా వ్యవస్థ దెబ్బతినొచ్చని, ద్రవ్యోల్బణంపరమైన ఒత్తిడిళ్లు పెరగొచ్చని, వ్యాపారాలపై విశ్వసనీయత తగ్గొచ్చని విప్రో పేర్కొంది. ఫలితంగా క్లయింట్లు టెక్నాలజీపై వ్యయాలను తగ్గించుకోవడానికి లేదా జాప్యం చేయడానికి దారి తీయొచ్చని వివరించింది. ఇక దేశీయంగా పెరుగుతున్న వేతన వ్యయాల కారణంగా అమెరికా, యూరప్లోని టెక్ కంపెనీలతో పోలిస్తే మన కంపెనీలకు పోటీపడే సామ ర్థ్యాలు తగ్గొచ్చని తెలిపింది. -
ఏఐ సామ్రాజ్యంపై భారత్కు హక్కు దక్కేనా?
ప్రస్తుత కాలంలో ఉత్పాదకతను శాసించే అతిపెద్ద శక్తిగా కృత్రిమ మేధ, ముఖ్యంగా జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ అవతరించాయి. వేగవంతమైన కోడింగ్, ఆటోమేటెడ్ కస్టమర్ సర్వీస్, తగ్గుతున్న నిర్వహణ వ్యయాలు, చురుకైన నిర్ణయాధికారం.. ఇవన్నీ ఏఐ కల్పిస్తున్న వ్యాపార అవకాశాలు. భారతీయ పరిశ్రమల్లో ఉత్పాదకతను భారీగా పెంచేందుకు ఏఐ మెరుగ్గా పనిచేస్తుందనడంలో సందేహం లేదు. అయితే, ఇక్కడ కీలకమైన ప్రశ్న ఏఐ విలువను సృష్టిస్తుందా లేదా అనేది కాదు.. దాని ద్వారా సృష్టించిన సంపద, నియంత్రణ అంతిమంగా ఎవరి చేతుల్లోకి వెళ్తుంది? అనేది ఇప్పుడు ప్రశ్న.తెర వెనుక అసలు కథచాట్బాట్లు, కో-పైలట్లు, ఎంటర్ప్రైజ్ ఏజెంట్లు, రిట్రీవల్-ఆగ్మెంటెడ్ సిస్టమ్స్ (ఆర్ఏసీ) వంటి మనం చూసే పైపై అప్లికేషన్ల వెనుక ఉన్న అసలు శక్తి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం). ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ల ద్వారా భారీ డేటాను విశ్లేషించి తదుపరి స్థితిని అంచనా వేస్తూ ఇవి సమాధానాలను ఇస్తాయి. కానీ, ఈ మొత్తం వ్యవస్థకు పునాది అయిన ఫౌండేషన్ మోడల్స్ నేడు ప్రపంచ టెక్ దిగ్గజాలైన ఓపెన్ఏఐ, గూగుల్, ఆంత్రోపిక్, మెటా, కొన్ని చైనీస్ కంపెనీల గుత్తాధిపత్యంలో ఉన్నాయి. మరోవైపు, ఈ మోడల్స్ నిర్వహణకు కావాల్సిన కంప్యూట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అధునాతన జీపీయూ మార్కెట్ను ఎన్విడియా శాసిస్తోంది. ఒకరకంగా ఫౌండేషన్ మోడల్స్ ఏఐకి మెదడు వంటివి అయితే, జీపీయూ దానికి ఇంధనం లాంటివి. ఈ రెండు కీలక రంగాలు విదేశీ శక్తుల చేతుల్లోనే ఉండటం భారత్కు పెద్ద సవాలుగా మారింది.పొంచి ఉన్న ముప్పుభారతీయ వ్యాపారాలు కస్టమర్ సర్వీస్, హెచ్ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్, లీగల్ రివ్యూ, బ్యాక్-ఆఫీస్ కార్యకలాపాల్లో ఏఐని వేగంగా అందిపుచ్చుకుంటున్నాయి. దీనివల్ల కంపెనీల సామర్థ్యం పెరిగి, ఖర్చులు తగ్గుతాయి. అయితే, దీని వెనుక మరో కోణం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.భారత్ తన స్వదేశీ ఉద్యోగాలను ఆటోమేషన్ ద్వారా కోల్పోతూనే ఆ ఏఐ వ్యవస్థలను నడపడానికి విదేశీ ప్లాట్ఫారమ్లకు భారీగా డబ్బు చెల్లించాల్సి వస్తుంది.భారతీయ కంపెనీల ఉత్పాదకత పెరిగినప్పటికీ లాభాల్లో సింహభాగం విదేశాల్లోని ఫౌండేషన్ మోడల్స్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, జీపీయూ అధినేతలకే చేరుతుంది.భారత్ కేవలం ఒక భారీ వినియోగదారు దేశంగా మాత్రమే మిగిలిపోయి కోర్ టెక్నాలజీ నియంత్రణ అంతా విదేశాల పాలయ్యే ప్రమాదం ఉంది.భారత్ ఏం చేస్తోంది?ఈ సవాలును గుర్తించిన భారత్ ఇటీవలి కాలంలో కొన్ని కీలక అడుగులు వేసింది. సర్వమ్.ఏఐ, భారత్ జన్, జ్ఞాని.ఏఐ.. వంటి స్టార్టప్లు స్వదేశీ ఏఐ సామర్థ్యాన్ని నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రయత్నాలు అభినందనీయమే అయినప్పటికీ అమెరికా, చైనాలతో పోలిస్తే భారత్ ఇంకా వెనుకబడే ఉంది. అధునాతన ఫౌండేషన్ మోడల్స్, జీపీయూల లభ్యత, లోతైన ఏఐ రీసెర్చ్ ఎకోసిస్టమ్, భారీ ప్రైవేట్ పెట్టుబడుల పరంగా భారత్ ఇంకా సుదీర్ఘ దూరం ప్రయాణించాల్సి ఉంది.భారత్ ముందున్న వ్యూహాత్మక మార్గాలుభారత్ గ్లోబల్ రేసులో నిలవాలంటే తక్షణమే కింది రంగాలపై దృష్టి పెట్టాలి.విభాగంచేయాల్సిన మార్పు(సూచనలు మాత్రమే)భాష, వాయిస్ ఏఐభారతీయ స్థానిక భాషలు, వాయిస్ ఆధారిత ఏఐల్లో ప్రత్యేక నైపుణ్యం సాధించడం.కంప్యూట్ మౌలిక వసతులుసరసమైన ధరల్లో దేశీయంగా ఏఐ కంప్యూట్/జీపీయూ సదుపాయాలు అందుబాటులోకి తేవడం.ఐటీ రంగ పునర్నిర్మాణంభారత ఐటీ కంపెనీలు కేవలం మ్యాన్పవర్-బేస్డ్ బిల్లింగ్ (గంటల లెక్కన పని) మోడల్స్ నుంచి ఏఐ, ఐపీ లీడ్ (సొంత మేధోసంపత్తి) ఫ్లాట్ఫారమ్లుగా మారాలి.మానవ వనరుల నైపుణ్యందేశంలోని శ్రామిక శక్తికి పెద్ద ఎత్తున ఏఐ రీస్కిల్లింగ్ ప్రోగ్రాములు నిర్వహించడం.ఇప్పుడు ‘ఏఐ కావాలా వద్దా’ అనేదాని గురించి కాకుండా.. భారత్ కేవలం ఏఐని వాడే దేశంగా మిగిలిపోతుందా లేదా ఏఐ సామర్థ్యాలపై యాజమాన్య హక్కులు సాధిస్తుందా? అనేదే అసలైన ప్రశ్న. మోడల్స్, కంప్యూట్, డేటా, ప్లాట్ఫారమ్లపై స్వదేశీ నియంత్రణ సాధించకపోతే.. ఏఐ భారతదేశానికి ఉత్పాదకత ఇంజిన్గా మారవచ్చు, కానీ దాని లాభాలు మాత్రం వేరే ఎవరికో అందుతాయి! ప్రభుత్వాలు, కార్పొరేట్ శక్తులు ఇప్పటికైనా మేల్కొని దీర్ఘకాలిక వ్యూహాత్మక పెట్టుబడులతో ముందుకు సాగాల్సిన సమయమిది.ఇదీ చదవండి: కంపెనీకి లాభాలొస్తే ఉద్యోగుల జీతం పెంచరు కదా! -
పాత ఫోన్లకే ఓటు
స్మార్ట్ఫోన్ల ధరల పెరుగుదల వినియోగదారుల కొనుగోలు నిర్ణయాలపై ప్రభావం చూపుతోంది. ధరలు దిగివచ్చే వరకు సగానికి పైగా మంది కొనుగోలును వాయిదా వేయగా, కొందరు సెకండ్హ్యాండ్ ఫోన్ల వైపు మళ్లే అవకాశం ఉందని తాజా అధ్యయనం తెలిపింది. ఈ పరిస్థితి కొనసాగితే పండుగ సీజన్లో (జూలై–డిసెంబర్) దేశీయ స్మార్ట్ఫోన్ విక్రయాలు 30 శాతం వరకు తగ్గే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది. ట్రాకిన్ టెక్, టెకార్క్ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనం ప్రకారం, ఈ ఏడాది ద్వితీయార్ధంలో స్మార్ట్ఫోన్ కొనుగోళ్లలో 54% డిమాండ్ క్షీణించవచ్చు.దేశవ్యాప్తంగా జూలై నుంచి డిసెంబర్ మధ్య స్మార్ట్ఫోన్ కొనుగోలు చేయాలని యోచిస్తున్న 5,958 మంది వినియోగదారులపై ఈ సర్వే నిర్వహించారు. సర్వేలో పాల్గొన్న వారిలో 48 శాతం మంది ధరలు తగ్గే వరకు కొనుగోలును వాయిదా వేస్తామని, మరో 6 శాతం మంది సెకండ్హ్యాండ్ ఫోన్ల వైపు మొగ్గు చూపుతున్నట్లు వెల్లడైంది. ప్రస్తుత ధరల ధోరణి కొనసాగితే ఈ ఏడాది స్మార్ట్ఫోన్ విక్రయాలు 115–120 మిలియన్ యూనిట్లకు పరిమితమయ్యే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది. గత ఏడాది ఈ సంఖ్య 136–138 మిలియన్ యూనిట్లుగా నమోదైంది. మెమరీ చిప్ల ధరలే ప్రధాన కారణంన్యాండ్ ఫ్లాష్, డీఆర్ఏఎం మెమరీ చిప్ల గ్లోబల్ ధరలు పెరగడం స్మార్ట్ ఫోన్ల ధరల పెరుగుదలకు ప్రధాన కారణం అని సర్వే పేర్కొంది. స్మార్ట్ఫోన్లలో స్టోరేజ్, వర్కింగ్ మెమరీ కోసం ఉపయోగించే ఈ చిప్ల ఖర్చు పెరగడంతో తయారీ వ్యయాలు అధికమయ్యాయి. ప్రత్యేకించి రూ.20 వేలలోపు ధరల విభాగంలో ఫోన్ల ధరలు సగటున 8–12% వరకు పె రిగాయి. ఈ విభాగంలో మెమరీ చిప్ల ఖర్చు మొత్తం తయారీ వ్యయంలో దాదాపు 40% వరకు ఉంటుంది.ఊపందుకోనున్న ప్రీ–ఓన్డ్ మార్కెట్ధరల పెరుగుదల ప్రభావంతో ప్రీ–ఓన్డ్, రీఫర్బిష్డ్ స్మార్ట్ఫోన్ మార్కెట్కు గణనీయమైన ఆదరణ లభించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. సెకండ్హ్యాండ్ ఫోన్ల వైపు మళ్లే 6% మంది వినియోగదారులు అదనంగా 60–70 లక్షల యూనిట్ల డిమాండ్ను సృష్టించవచ్చని అంచనా వేసింది. ప్రస్తుతం 23–25 మిలియన్ యూనిట్ల స్థాయిలో ఉన్న ఈ మార్కెట్ ఏడాది 30–32 మిలియన్ యూనిట్లకు పెరగవచ్చని టెకార్క్ వ్యవస్థాపకుడు ఫైసల్ కవూసా తెలిపారు.ఫైనాన్స్ సదుపాయమూ సవాళ్లే..స్మార్ట్ఫోన్ కొనుగోళ్లకు ఫైనాన్స్ సదుపాయాలు కూడా కఠినతరమవుతున్నాయని నివేదిక పేర్కొంది. వడ్డీ రేట్లు పెరగకపోయినా గతంలో రుణ చెల్లింపుల్లో డిఫాల్ట్లు పెరగడం వల్ల రుణాల మంజూరులో ఆర్థిక సంస్థలు కఠినతర విధానాలు అమలు చేస్తున్నాయి. అసంఘటిత వ్యవస్థీకృత రంగాల్లో పనిచేసే పలువురికి సరైన క్రెడిట్ స్కోర్ లేకపోవడంతో రుణ లభ్యత కష్టమవుతోంది. ‘‘భారతీయ వినియోగదారులు మెరుగైన స్మార్ట్ఫోన్లను కోరుకుంటున్నారు. అయితే అందుబాటు ధర ఉండాలని ఆశిస్తున్నారు. ధరలు మరింత పెరిగితే కొనుగోళ్లు వాయిదా వేయడం, సర్దుకుపోవడం, ఫైనాన్స్ ఆశ్రయించడం, సెకండ్ హ్యాండ్ ఫోన్ల వైపు మళ్లుతున్నారు. వినియోగదారుల గురించి అవగాహన ఉన్న స్థానిక రిటైలర్ల ద్వారా వినూత్న ఫైనాన్సింగ్ విధానాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది’’ అని ట్రాకిన్ టెక్ వ్యవస్థాపకుడు అరుణ్ ప్రభుదేశాయ్ పేర్కొన్నారు. ధరల పెరుగుదలకు 3 ప్రధాన కారణాలుస్మార్ట్ఫోన్ మార్కెట్లో 2025 జనవరి నుంచి 2026 మే వరకు ధరల పెరుగుదల స్పష్టంగా కనిపించిందని అధ్యయనం పేర్కొంది. కృత్రిమ మేధ (ఏఐ) సంస్థల భారీ పెట్టుబడుల కారణంగా మెమరీ చిప్లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరగడం, డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ఏడాదిలో 5 శాతం మేర బలహీనపడటం, అలాగే ప్రముఖ బ్రాండ్లు లాభదాయకత పెంపుపై దృష్టి సారిస్తూ అధిక సగటు విక్రయ ధరల (ఏఎస్పీ) వ్యూహాన్ని అనుసరించడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలని అధ్యయం విశ్లేషించింది.ఇదీ చదవండి: కంపెనీకి లాభాలొస్తే ఉద్యోగుల జీతం పెంచరు కదా! -
ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్: వివరాలు లీక్!
ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన, స్మార్ట్ఫోన్ బ్రాండ్లలో ఒకటైన యాపిల్ తన ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. అంతకంటే ముందు దీనికి సంబంధించిన కొన్ని వివరాలు లీకయ్యాయి.సప్లై చైన్ వర్గాలు, సాంకేతిక విశ్లేషకుల సమాచారం ప్రకారం.. యాపిల్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ఫోన్లో బ్యాటరీ, కెమెరా వంటి వాటిలో మాత్రమే కాకుండా ఏఐ(AI) వంటి వాటిలో కూడా భారీ మెరుగుదలలు ఉండనున్నాయి. అయితే.. రాబోయే ఐఫోన్ గురించి యాపిల్ అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.ప్రస్తుతం లీకైన సమాచారం ప్రకారం.. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ధర గత మోడల్ అయిన ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధరకు సమానంగా ఉండే అవకాశం ఉంది. కొత్త 2-నానోమీటర్ ప్రాసెసర్, అధిక ర్యామ్ వంటి ఆధునిక భాగాల వలన తయారీ ఖర్చులు పెరిగినా, వాటిలో కొంత భారాన్ని ఆపిల్ స్వయంగా భరించే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.ఈ ఫోన్లో అత్యంత ఆకర్షణీయమైన అంశం కెమెరా సిస్టం. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ సెన్సార్తో వస్తుందని సమాచారం. దీని ద్వారా వినియోగదారులు కెమెరాలోకి ప్రవేశించే కాంతి పరిమాణాన్ని నియంత్రించగలరు. ఫలితంగా ఫోటోలలోని బ్యాక్గ్రౌండ్ మీద మరింత నియంత్రణ లభిస్తుంది.యాపిల్ కొత్త మూడు లేయర్ స్టాక్డ్ ఇమేజ్ సెన్సార్ మీద పని చేస్తున్నట్లు సమాచారం. ఈ సెన్సార్ ఫోటోలలో వచ్చే నాయిస్ను తగ్గించి మరింత స్పష్టమైన చిత్రాలను అందించగలదు. అల్ట్రా-వైడ్, టెలిఫోటో కెమెరాలు కూడా 48 మెగాపిక్సెల్ సామర్థ్యంతో ఉండే అవకాశముంది. ముఖ్యంగా టెలిఫోటో కెమెరా తక్కువ వెలుతురు పరిస్థితుల్లో మెరుగైన ఫోటోలను అందించేలా అభివృద్ధి చేయనున్నట్లు తెలుస్తోంది.ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్లో 5100mAh నుంచి 5200mAh వరకు సామర్థ్యం కలిగిన పెద్ద బ్యాటరీ ఉండవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఇది గత మోడల్లోని సుమారు 4823mAh బ్యాటరీ కంటే గణనీయమైన పెరుగుదల. దీని వల్ల బ్యాటరీ బ్యాకప్ మరింత మెరుగుపడే అవకాశం ఉంది. పెద్ద బ్యాటరీని అమర్చేందుకు ఫోన్ మందం 8.8 మిల్లీమీటర్ల వరకు పెరగవచ్చని, బరువు సుమారు 240 గ్రాముల వరకు ఉండవచ్చని అంచనా. అయినప్పటికీ, ఎక్కువ బ్యాటరీ జీవితం కోసం వినియోగదారులు ఈ మార్పును స్వాగతించే అవకాశం ఉంది.ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్లో 6.9 అంగుళాల పెద్ద డిస్ప్లే ఉండవచ్చు. అలాగే.. ప్రస్తుతం ఉన్న డైనమిక్ ఐలాండ్ పరిమాణాన్ని మరింత చిన్నదిగా చేసే ప్రయత్నంలో యాపిల్ ఉన్నట్లు సమాచారం. కొత్త చిప్ ప్యాకేజింగ్ టెక్నాలజీ ద్వారా ఫోన్లో అదనపు స్థలాన్ని సృష్టించి, అంతర్గత భాగాల సామర్థ్యాన్ని పెంచే అవకాశం ఉంది. ఇది సెప్టెంబర్ 2026లో లాంచ్ అవుతుందని సమాచారం. -
భారమవుతున్న కృత్రిమ మేధ!
ఉత్పాదకతను పెంచడంలో, మానవ శ్రమను తగ్గించడంలో కృత్రిమ మేధ (ఏఐ) చాలా ఉపయోగపడుతోందన్న మాట వాస్తవమే. అందుకే ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి కంపెనీలన్నీ తమ ఉద్యోగులకు ఏఐ సాధనాలను అందిస్తూ వచ్చాయి. అయితే, ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. అపరిమిత ఉత్పాదకతను ఆశ చూపిన ఏఐ, ఇప్పుడు కంపెనీల బడ్జెట్లకు తూట్లు పొడుస్తోంది. దీంతో మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఉబెర్ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాల దారిలోనే.. ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్ నెట్వర్క్ అయిన వాల్మార్ట్ కూడా తమ ఉద్యోగుల ఏఐ వినియోగంపై ఆంక్షలు విధిస్తుంది.‘కోడ్ పప్పీ’కి బ్రేకులుబ్లూమ్బెర్గ్ తాజా నివేదిక ప్రకారం.. వాల్మార్ట్ తన అంతర్గత కార్పొరేట్ పనుల కోసం రూపొందించుకున్న ‘కోడ్ పప్పీ’ అనే ఏఐ అసిస్టెంట్ వినియోగంపై పరిమితులు విధించింది. ఇది ఉద్యోగులకు ప్రెజెంటేషన్లు తయారు చేయడం, డేటా స్ప్రెడ్షీట్లను నింపడం వంటి రోజువారీ పనులను చిటికెలో చేసిపెట్టే ఏఐ ఏజెంట్. గతంలో వాల్మార్ట్ ఉద్యోగులు దీనిని అపరిమితంగా వాడేవారు. ఉద్యోగుల నుంచి దీనికి డిమాండ్ పెరగడంతో కంపెనీకి బిల్లులు తడిసి మోపెడయ్యాయి. దీంతో అప్రమత్తమైన యాజమాన్యం ఇకపై ఉద్యోగులకు టోకెన్ పరిమితి విధించాలని నిర్ణయించింది.టోకెన్ పరిమతి అంటే ఏమిటి?ఏఐ భాషలో టోకెన్ అనేది ఒక కొలమానం. మనం ఏఐకి ఇచ్చే ప్రాంప్ట్లు (ప్రశ్నలు) అది ఇచ్చే సమాధానాల పొడవును బట్టి టోకెన్లు ఖర్చవుతాయి. ఎంత ఎక్కువ పని చేస్తే అంత ఎక్కువ టోకెన్లు వినియోగమవుతాయి. అంటే.. ఇకపై వాల్మార్ట్ ఉద్యోగులు లెక్క చూసుకుని మరీ ఏఐని వాడాల్సి ఉంటుంది.ఈ విషయంపై వాల్మార్ట్ ప్రతినిధి స్పందిస్తూ.. ఉద్యోగులు ఏఐని కేవలం కాలక్షేపానికి కాకుండా కంపెనీకి విలువను చేకూర్చే పనులకు మాత్రమే వాడాలని, సరైన పని కోసం సరైన ఏఐ సాధనాన్ని ఎంచుకోవాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం వాల్మార్ట్ సిబ్బందికి కోడ్ పప్పీతో పాటు క్లాడ్, చాట్జీపీటీ వంటి ఇతర సాధనాల యాక్సెస్ కూడా ఉంది.ఉబెర్, మైక్రోసాఫ్ట్ కంపెనీలకూ తప్పని తిప్పలుఖర్చులు పెరుగిపోతున్న ఉదంతాన్ని బహిరంగంగా అంగీకరించిన సంస్థల్లో రైడ్-హెయిలింగ్ దిగ్గజం ఉబెర్ ముందు వరుసలో ఉంది. ఈ ఏడాది జనవరిలో ఉబెర్ తన 5,000 మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ‘క్లాడ్ కోడ్’ యాక్సెస్ ఇచ్చింది. అయితే, కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే ఆ ఏడాది మొత్తానికి కేటాయించిన ఏఐ బడ్జెట్ అంతా ఖర్చయిపోవడంతో యాజమాన్యం నివ్వెరపోయింది.మైక్రోసాఫ్ట్ యూటర్న్: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సైతం తన అంతర్గత ఇంజినీర్లను క్లాడ్ కోడ్ వాడకం తగ్గించి, జూన్ 30 లోగా సంస్థకు చెందిన సొంత ఏఐ టూల్స్కు మారిపోవాలని ఆదేశించింది. టోకెన్ ఖర్చులు మితిమీరడమే దీనికి ప్రధాన కారణమని సమాచారం.ఇదీ చదవండి: నిన్నటి ధరే నేడు.. ప్రశాంతంగా పసిడి -
రోబోటిక్స్ రేస్లో ఓపెన్ఏఐ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విభాగంలో కీలకంగా మారిన ‘ఓపెన్ ఏఐ’ ఇప్పుడు భౌతిక ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది. కేవలం సాఫ్ట్వేర్, చాట్బాట్లకే పరిమితం కాకుండా రియల్-వరల్డ్ ఉపయోగం కోసం ఏఐ ఆధారిత రోబోలను తయారు చేయనున్నట్లు సంస్థ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ అధికారికంగా ప్రకటించారు. ఈ మెగా ప్రాజెక్ట్ కోసం కంపెనీ భారీ ఎత్తున రోబోటిక్స్ ఇంజినీర్ల నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఓపెన్ ఏఐ తీసుకున్న ఈ నిర్ణయం.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన ‘టెస్లా ఆప్టిమస్’ హ్యూమనాయిడ్ రోబోట్కు నేరుగా సవాలు విసరడమేనని టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు.ప్రతి ఒక్కరికీ ఒక వ్యక్తిగత రోబోసాషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా సామ్ ఆల్ట్మాన్ ఓపెన్ ఏఐ రోబోటిక్స్ రోడ్మ్యాప్ను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భవిష్యత్తుపై తనకున్న అంచనాలను తెలిపారు. ‘స్వల్పకాలికంలో భవిష్యత్తు మౌలిక సదుపాయాలను నిర్మించడానికి, పారిశ్రామిక పనులను నిర్వహించడానికి నైపుణ్యం కలిగిన కార్మికులకు మద్దతుగా నిలిచే రోబోలపై మేము దృష్టి సారించాం. కానీ, మా దీర్ఘకాలిక లక్ష్యం చాలా పెద్దది. భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ ఒక వ్యక్తిగత రోబోను కలిగి ఉండే రోజు వస్తుందని మేము ఊహిస్తున్నాం’ అని సామ్ ఆల్ట్మాన్ చెప్పారు.ఈ వ్యాఖ్యలు ఎలాన్ మస్క్ గతంలో చేసిన ప్రకటనలను తలపిస్తున్నాయి. మస్క్ సైతం టెస్లా ఆప్టిమస్ రోబోను భవిష్యత్తులో ప్రతి ఇంట్లోనూ ఒక వ్యక్తిగత సహాయకుడిగా, పరిశ్రమల్లో కార్మికుడిగా మారుస్తామని చెప్పారు. దీంతో ఇప్పుడు టెక్ ప్రపంచంలో మస్క్ వర్సెస్ ఆల్ట్మాన్ పోటీ మరింత ఆసక్తికరంగా మారింది.ఓపెన్ ఏఐలో జనరేటివ్ ఏఐ ప్రాజెక్టులపై కీలక పాత్ర పోషించిన ఆదిత్య రమేష్ నేతృత్వంలోని ‘వరల్డ్ సిమ్యులేషన్ రీసెర్చ్’ విభాగం నుంచే ఈ రోబోటిక్స్ బృందం ఏర్పడిందని ఆల్ట్మాన్ వెల్లడించారు. గడిచిన సంవత్సర కాలంలో ఈ విభాగం అత్యంత వేగంగా వృద్ధి చెందిందన్నారు. రోబోటిక్ సిస్టమ్స్కు ఏఐ సాఫ్ట్వేర్ మోడళ్లను అందించడంతోపాటు వాటికి అవసరమైన హార్డ్వేర్, ఆపరేషనల్ స్టాక్ను కూడా కో-డిజైన్ పద్ధతిలో ఓపెన్ ఏఐ స్వయంగా అభివృద్ధి చేయబోతోందని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.గ్లోబల్ టాలెంట్ కోసం ఓపెన్ ఏఐ వేటరోబోటిక్స్ రంగంలో తమ పట్టును చాటుకునేందుకు ఓపెన్ ఏఐ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ ప్రతిభావంతులను ఆహ్వానిస్తోంది. రోబోలను తయారు చేయడానికి కింది విభాగాల్లో నిపుణుల కోసం నియామకాలు ప్రారంభించింది.ఫుల్-స్టాక్ హార్డ్వేర్ ఇంజినీర్లుఆపరేషన్స్ నిపుణులుసిస్టమ్స్ ఇంజినీరింగ్ నిపుణులుమెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) రీసెర్చర్లుఅసాధారణమైన ప్రతిభ, గతంలో సాధించిన విజయాల రికార్డు ఉన్న అభ్యర్థులు తమ వివరాలను నేరుగా ఓపెన్ ఏఐ రోబోటిక్స్ రిక్రూట్మెంట్ బృందానికి పంపవచ్చని సంస్థ తెలిపింది.ఇదీ చదవండి: పాపులర్ ఉద్యోగాల వెంటే పడకండి! -
గూగుల్ కంపెనీ భారీ ప్రయోగం
సాధారణంగా గూగుల్ అంటే సెర్చ్ ఇంజిన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అత్యాధునిక టెక్నాలజీ గుర్తుకొస్తాయి. కానీ ఇప్పుడు అదే గూగుల్ ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్న ఓ ప్రమాదకరమైన ప్రజారోగ్య సమస్యపై దృష్టి సారించింది. ‘ముల్లును ముల్లుతోనే’ దెబ్బ తీసేలా కొత్త వ్యూహంతో ముందుకొచ్చింది. ఈ వినూత్న ప్రయోగం.. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా దాని వెనుక ఉన్న శాస్త్రం, దాని లక్ష్యం, గతంలో నమోదైన ఫలితాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.గూగుల్ మాతృసంస్థకు చెందిన పరిశోధనా విభాగం డీబగ్ ప్రాజెక్ట్(Debug Project) అమెరికాలోని ఫ్లోరిడా, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. రెండు సంవత్సరాల వ్యవధిలో ఇక్కడ 3.2 కోట్ల మగ దోమలను విడుదల చేయడానికి అనుమతి కోరింది. అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ (EPA) ప్రస్తుతం ఈ ప్రతిపాదనను పరిశీలిస్తోంది.అయితే ఇవి సాధారణ దోమలు కావు. ప్రత్యేకంగా ల్యాబ్ల్లో పెంచినవి!. పైగా వోల్బాషియా పైపెంటిస్( Wolbachia pipientis) అనే బ్యాక్టీరియాతో సంక్రమింపజేసిన మగ దోమలు. ఈ మగ దోమలు అడవిలో ఉన్న ఆడ దోమలతో జతకట్టినప్పుడు గుడ్లు ఏర్పడతాయి. కానీ ఆ గుడ్లు పొదగవు. ఫలితంగా కొత్త దోమలు పుట్టవు. అలా.. కొంతకాలానికి మొత్తం దోమల జనాభా క్రమంగా తగ్గిపోతుంది.ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. కుట్టేది ఆడ దోమలే. మగ దోమలు మనుషుల జోలికి పోవు . కాబట్టి లక్షలాది దోమలను విడుదల చేసినా ప్రజలకు అదనపు ఇబ్బంది ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగని.. ఈ ప్రాజెక్ట్ కొత్తది కాదు. గూగుల్ 2014లోనే డీబగ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. మలేరియా, డెంగీ, జికా, చికున్గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నియంత్రించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అభివృద్ధి చేయడమే దీని లక్ష్యం. గత పదేళ్లుగా ప్రయోగశాలలు, పరిమిత ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించిన తర్వాత ఇప్పుడు పెద్ద స్థాయిలో అమలు చేయాలని యోచిస్తోంది.నిజానికి దోమలపై ఇలా "వంధ్యీకరణ యుద్ధం" చేయడం ఇదే తొలిసారి కాదు. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇలాంటి పద్ధతులను ఇప్పటికే ప్రయోగించారు. అమెరికాలో ఆక్సిటెక్ (Oxitec) అనే బయోటెక్ సంస్థ జన్యుమార్పిడి చేసిన దోమలను విడుదల చేసి మంచి ఫలితాలు సాధించింది. బ్రెజిల్, పనామా, కేమన్ దీవుల్లో నిర్వహించిన ప్రయోగాల్లో లక్ష్య దోమల జనాభా 80-90 శాతం వరకు తగ్గినట్లు నివేదికలు వెల్లడించాయి.అంతేకాదు, దశాబ్దాల క్రితమే ఇదే సూత్రాన్ని ఉపయోగించి మెడిటేరియన్ ఫ్రూట్ ఫ్లై(Mediterranean Fruit Fly) అనే పంటల శత్రువైన ఈగలను, అలాగే పశువులకు ప్రమాదకరమైన న్యూవరల్డ్ స్క్రూవార్మ్(New World Screwworm) పురుగులను కూడా అనేక దేశాలు విజయవంతంగా నియంత్రించాయి. అంటే ఈ పద్ధతి పూర్తిగా కొత్తది కాకపోయినా, దోమల నియంత్రణలో ఇంత భారీ స్థాయిలో వినియోగించేందుకు ప్రయత్నించడం మాత్రం విశేషం.ఖర్చు విషయానికొస్తే.. గూగుల్ ఖచ్చితమైన సంఖ్యలను వెల్లడించలేదు. అయితే గతంలో డీబగ్ ప్రాజెక్ట్, సంబంధిత పరిశోధనల కోసం ఇప్పటికే వందల మిలియన్ డాలర్ల స్థాయిలో పెట్టుబడులు పెట్టినట్లు టెక్, బయోటెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రయోగశాలల్లో కోట్లాది దోమలను పెంచడం, వాటిని వేరు చేయడం, బ్యాక్టీరియాతో సంక్రమింపజేయడం, అనంతరం విడుదల చేయడం వంటి ప్రక్రియలు భారీ వ్యయంతో కూడుకున్నవే.అయితే గూగుల్కు కొన్ని రిస్క్లు కూడా ఉన్నాయి. ఈ భారీ ప్రయోగంపై విమర్శలు వినిపిస్తున్నాయి . ప్రకృతిలో ఇంత భారీ స్థాయిలో జోక్యం చేసుకోవడం వల్ల పర్యావరణ సమతుల్యతపై ఎలాంటి ప్రభావం ఉంటుందన్న ప్రశ్నలు పర్యావరణవేత్తలు లేవనెత్తుతున్నారు. దోమల జనాభా తగ్గితే వాటిపై ఆధారపడే ఇతర జీవులపై ప్రభావం పడే అవకాశముందనే వాదన వినిపిస్తోంది. అయినప్పటికీ ప్రజారోగ్య నిపుణులు మాత్రం దీనిని ఆశాజనక ప్రయోగంగా చూస్తున్నారు. ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల బారిన పడుతున్నారు. ఆ సమస్యను రసాయనాలపై ఆధారపడకుండా, ప్రకృతి సూత్రాలనే ఉపయోగించి నియంత్రించగలిగితే అది ప్రజారోగ్య రంగంలో పెద్ద ముందడుగుగా నిలుస్తుందని చెబుతున్నారు. ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్న దోమలపై "మగ దోమల సైన్యం" నిజంగా విజయం సాధిస్తే.. భవిష్యత్తులో డెంగీ, మలేరియా నియంత్రణకు కొత్త దారి చూపే అవకాశముంది. -
స్మార్ట్ గార్డెన్.. మట్టిలేకుండానే మినీ తోట!
మొక్కలకు నీళ్లు పోయడం నుంచి, పక్షులకు ఆహారం పెట్టడం వరకు... ఇప్పుడు ప్రకృతి పరిరక్షణ కూడా హైటెక్ అయిపోయింది! ఇంట్లోనే ఉంటూ తక్కువ కష్టంతో ఎక్కువ గ్రీనరీని ఎంజాయ్ చేయాలనుకునేవారి కోసం వచ్చేసిన సూపర్ నేచర్ గ్యాడ్జెట్సే ఇవీ!రోబోటిక్ తోటమాలిఈ వేసవి ఎండల్లో మీరు మాత్రం హాయిగా రూమ్లోనో కూర్చుంటే, ఎవరైనా పైపు పట్టుకుని తోటలో నిలబడితే బాగుండు! అని అనుకుంటున్నారా! అందుకే మీ మొక్కలకు నీళ్లు పోసే బాధ్యతను మోయడానికి వచ్చేసింది ఈ సోలార్ స్మార్ట్ వైఫై స్ప్రింక్లర్ టైమర్! ఇది మీ గార్డెన్కు ఒక చిన్న డిజిటల్ తోటమాలి లాంటిది. దీనికి జీతం అక్కర్లేదు, కరెంట్ బిల్లుల తలనొప్పి లేదు, ఇందులోని సోలార్ ప్యానెల్తో ఎండలోనే ఆటోమేటిక్గా రీచార్జ్ అవుతుంది.పైగా మొబైల్ యాప్తో కనెక్ట్ చేసి ఎక్కడి నుంచైనా నీళ్లు ఎప్పుడు పట్టాలో కంట్రోల్ చేయొచ్చు. లేదంటే వాయిస్ కంట్రోల్తో సోఫాలో కూర్చునే ‘అలెక్సా.. మొక్కలకు నీళ్లు పోయ్!’ అని చెప్పేస్తే సరిపోతుంది. ‘రెయిన్ డిలే’ ఫీచర్తో ‘వర్షం పడుతోంది కదా.. ఎందుకు మళ్లీ నీళ్లు!’ అన్నట్టుగా ఆగిపోతుంది. ఐపీ65 వాటర్ప్రూఫ్ బాడీ, బలమైన బ్రాస్ ఇన్లెట్తో ఎండా వానలకు తట్టుకునే ఈ రోబోటిక్ తోటమాలి ధర రూ. 10,180 మాత్రమే!పక్షుల కోసం స్మార్ట్ హోటల్!ఉదయం కిటికీ దగ్గరకు వచ్చే పిచ్చుకలు, చిన్న చిన్న పక్షులను దగ్గరగా చూడాలని అనిపిస్తుందా? అయితే మీ ఇంటికే చిన్న బర్డ్ థియేటర్లా మారిపోయే ఈ సోలార్ ఏఐ బర్డ్ ఫీడర్ మీ కోసం! ఇది కేవలం గింజలు పెట్టే పాత్ర మాత్రమే కాదు, పక్షుల ప్రపంచాన్ని మీ కళ్ల ముందుకు తీసుకొచ్చే స్మార్ట్ గాడ్జెట్. దీనిలో ఉన్న కెమెరా పక్షులు వచ్చి గింజలు తింటున్న ప్రతి క్యూట్ మూమెంట్ను క్యాప్చర్ చేస్తుంది. పైగా ఇందులో ఉన్న ఏఐ టెక్నాలజీ ఏ పక్షి వచ్చిందో కూడా గుర్తించగలదు. సోలార్ పవర్తో పనిచేయడం వల్ల బ్యాటరీల తలనొప్పి ఉండదు. వర్షం, ఎండలకు తట్టుకునే వెదర్ప్రూఫ్ మెటల్ బాడీతో తయారైన ఈ స్మార్ట్ ఫీడర్ ధర రూ. 7,000 మాత్రమే!మట్టిలేకుండానే మినీ తోట!ఇంట్లోనే తాజా పుదీనా, తులసి లేదా చిన్న చిన్న కూరగాయలు పెంచుకోవాలని ఉందా? కానీ మట్టి, కుండీలు, రోజూ నీళ్లు పోసే టెన్షన్ వద్దనుకుంటున్నారా? అయితే ఈ హైడ్రోపోనిక్ గ్రోయింగ్ సిస్టమ్ మీ కోసం! ఇది మీ ఇంట్లోనే ఒక చిన్న స్మార్ట్ ఫార్మ్లా పనిచేస్తుంది. ఇందులో మొత్తం 12 ప్లాంటింగ్ స్టేషన్స్ ఉంటాయి.మట్టికి బదులుగా నీరు, పోషకాలు, ఎల్ఈడీ కాంతితో మొక్కలు వేగంగా పెరిగేలా చేస్తుంది. ఇందులో ఉన్న స్మార్ట్ ఎల్ఈడీ లైట్లు సూర్యరశ్మిలా పనిచేసి మొక్కలకు అవసరమైన కాంతిని ఇస్తాయి. 4.2 లీటర్ల పెద్ద వాటర్ ట్యాంక్, ఆటోమేటిక్ వాటర్ సర్క్యులేషన్ సిస్టమ్తో మొక్కలకు కావాల్సిన నీరు, ఆక్సిజన్ నిరంతరం అందుతాయి. లైట్ స్టాండ్ ఎత్తును కూడా మొక్కల పెరుగుదలకు తగ్గట్టు మార్చుకోవచ్చు. ధర రూ. 14,000 మాత్రమే! -
సెమీకండక్టర్ దిగ్గజంగా భారత్!
న్యూఢిల్లీ: సెమీకండక్టర్ రంగంలో భారత్ కేవలం భాగస్వామ్యానికే పరిమితం కాకుండా దిగ్గజంగా ఎదగాలని, 2035 నాటికి 120–150 బిలియన్ డాలర్ల (రూ.14.25 లక్షల కోట్లు సుమారు) విలువైన సెమీకండక్టర్ వ్యాల్యూచైన్ నిర్మించుకోవడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని నీతి ఆయోగ్ నివేదిక కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఇందుకు అవసరమైన పెట్టుబడుల్లో మూడింట ఒక వంతును ప్రభుత్వమే సమకూర్చడం ద్వారా యాంకర్ పాత్రను పోషించాలంటూ, తద్వారా ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని కల్పించొచ్చని పేర్కొంది. ‘భారత్ దేశ సెమీకండక్టర్ పరిశ్రమ భవిష్యత్’ పేరుతో ఒక నివేదికను నీతి ఆయోగ్ రూపొందించింది. అంతర్జాతీయంగా పోటీనివ్వగలిగిన సెమీకండక్టర్ వ్యవస్థను దేశీయంగా నిర్మించుకునేందుకు 135–180 బిలియన్ డాలర్ల (రూ.17.10 లక్షల కోట్లు) పెట్టుబడులు వచ్చే దశాబ్ద కాలంలో అవసరమవుతాయని తెలిపింది. ముఖ్యంగా డిజైన్, ఫ్యాబ్రికేషన్, అత్యాధునిక ప్యాకేజింగ్, మేటీరియల్స్, అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ఈ మేరకు పెట్టుబడులు కావాల్సి ఉంటుందని పేర్కొంది. దిగుమతులను తగ్గించుకోవాలి.. ప్రస్తుతం భారత్లో సెమీకండక్టర్ల డిమాండ్ వేగంగా పెరుగుతుండగా, ఇందులో 90 నుంచి 95 శాతం వరకు దిగుమతుల ద్వారానే తీర్చుకుంటున్నట్టు నీతి ఆయోగ్ నివేదిక తెలిపింది. దీనివల్ల భారీగా విదేశీ మారకద్రవ్యం తరలిపోవడమే కాకుండా, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో అడ్డంకులు ఏర్పడినప్పుడు దేశ రక్షణ, డిజిటల్ రంగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. 2035 నాటికి దేశీయ సెమీకండక్టర్ మార్కెట్ 200 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందన్న అంచనా వ్యక్తం చేస్తూ.. ఈ డిమాండ్ను దేశీయంగానే తీర్చుకునే విధంగా పరిశ్రమను నిర్మించుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. దేశీయంగా డిమాండ్ స్థాయిలో ఉత్పాదకత లేకపోవడాన్ని గొప్ప అవకాశంగా మలుచుకోవాలని సూచించింది. టెక్నాలజీలో స్వావలంబనతోనే వికసిత్ భారత్ బ్లాక్బాక్స్ సాంకేతికతల దిగుమతులపై ఆధారపడడం వికసిత్ భారత్ లక్ష్య సాధనకు పెద్ద అవరోధమని నీతి ఆయోగ్ వైస్చ ఐర్మన్ అశోక లాహిరి పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించేందుకు సాంకేతిక సౌర్వబౌమత్వం పునాది కావాలన్నారు. అది మౌలిక వసతుల నుంచే ఆరంభం కావాలన్నారు. సరికొత్త పరిశోధనలు, సొంత డిజైన్ల సృష్టి, దీర్ఘకాలిక పెట్టుబడులను ఆకర్షించే స్థిరమైన విధానాలు, అధునాతన ప్యాకేజింగ్ మరియు కాంపౌండ్ సెమీకండక్టర్ల ఉత్పత్తి, నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధి అవసరమని ఈ నివేదిక సూచించింది. భారతదేశం కేవలం చిప్స్ వినియోగించే దేశంగా కాకుండా, ప్రపంచ సెమీకండక్టర్ సరఫరా వ్యవస్థలో ఒక తప్పనిసరి భాగస్వామిగా మారాలనే తమ సంకల్పాన్ని ఈ నివేదిక చాటిచెబుతున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నివేదిక విడుదల సందర్భంగా పేర్కొన్నారు. సెమీ కండక్టర్లకు సంబంధించి పూర్తి స్థాయి ఎకోసిస్టమ్ను (డిజైన్, నైపుణ్య వనరులు, మెటీరియల్స్, ఎక్విప్మెంట్, ఫ్యాబ్, ప్యాకేజింగ్) నిర్మించడంపై తాము దృష్టి పెట్టినట్టు కేంద్ర ఎల్రక్టానిక్స్ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. -
AI: ఒక కొత్త రక్కసి.. ఇదొక మహా ప్రళయం!
మానవ మేధస్సుకు మరణశాసనం రాయడానికి ఒక కొత్త రక్కసి పుట్టుకొచ్చింది. దాని పేరు ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’... క్లుప్తంగా ‘ఏఐ’…కంప్యూటర్లు వచ్చాయి, ఇంటర్నెట్ వచ్చింది, స్మార్ట్ఫోన్లు వచ్చాయి... ప్రపంచం మారింది. కానీ ఇప్పుడు వస్తున్న ఏఐ ఆ మార్పు లాంటిది కాదు. ఇది మానవ జాతి ఉనికినే, శ్రమనే, ఉపాధినే నిలువునా మింగేసే ఒక మహా ప్రళయం. టెక్నాలజీ పెరుగుతోంది... కానీ మనుషులు తరిగిపోతున్నారు. లాభాలు కురుస్తున్నాయి... కానీ ఉపాధి మాయమవుతుంది.విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఒక సందర్భంలో చాలా స్పష్టంగా హెచ్చరించారు: "పూర్తి స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి చెందితే... అది మానవ జాతి అంతానికే నాంది కాగలదు. అది మనుషులను అధిగమించి, తనను తాను రీ-డిజైన్ చేసుకుంటూ వెళ్తుంది. మితమైన జీవ పరిణామం ఉన్న మనుషులు దానితో పోటీ పడలేరని” ఇవాళ హాకింగ్ అన్న మాటలు అక్షరసత్యం అవుతున్నాయి. యంత్రం మనిషికి సాయం చేయాలి... కానీ మనుషులనే నామరూపాలు లేకుండా తుడిచేస్తుంటే, ప్రపంచ దేశాల పాలకులు ఎందుకు గుడ్డివాళ్లుగా మిగిలిపోయారు? కోట్లాది మంది ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతుంటే ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి? అసలు కొనుగోలు శక్తి లేని సమాజంలో ఏఐ కంపెనీలు లాభాలు ఎలా ఆర్జిస్తాయి? ఈ ప్రాథమిక ఆర్థిక సూత్రం కార్పొరేట్ శక్తులకు, పాలకులకు ఎందుకు అర్థం కావడం లేదు?ఏఐతో మానవ వనరులకు పెను ముప్పు వాటిల్లుతుందనేది ఇవాళ ఊహ కాదు... కళ్ల ముందు కనిపిస్తున్న పచ్చి నిజం. మరి ఈ నిజం మన కంటికి కనిపిస్తున్నప్పుడు, ప్రపంచ దేశాలను ఏలుతున్న పాలకుల కళ్లకు ఎందుకు కనిపించడం లేదు? అమెరికా అధ్యక్షుడి నుంచి భారత ప్రధాని వరకు, యూరప్ దేశాల నేతల నుంచి ఆసియా పాలకుల వరకు... అందరూ ఏఐ సదస్సుల్లో పాల్గొంటూ, టెక్నాలజీని పొగుడుతూ కాలం గడుపుతున్నారు తప్ప, దాని వల్ల రాబోయే సామాజిక వినాశనాన్ని ఎందుకు అడ్డుకోవడం లేదు? విఖ్యాత ఫ్రెంచ్ తత్వవేత్త జీన్-జాక్వెస్ రూసో ఒక మాట అన్నారు: "ప్రజలు శాసనాలు చేసే పాలకులను ఎన్నుకుంటారు... కానీ ఆ పాలకులు ప్రజలను కాక, ధనవంతుల ప్రయోజనాలను రక్షించడానికి చట్టాలు చేస్తారు." ఇవాళ ప్రపంచ పాలకుల పరిస్థితి సరిగ్గా అలాగే ఉంది. ఏఐ వల్ల సమాజంలో నిరుద్యోగం పెరిగి, నేరాలు ఎక్కువై, అనేక దుష్పరిణామాలు సంభవిస్తాయని తెలిసి కూడా పాలకులు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకంటే, పాలకులకు ఎన్నికల వెనుక, వారి అధికార పీఠాల వెనుక ఈ భారీ టెక్ కార్పొరేట్ కంపెనీల లాబీయింగ్ ఉంది. మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, ఓపెన్ ఏఐ వంటి సంస్థల లాభాల కోసం ప్రపంచ జనాభాలో సగానికి పైగా ఉన్న శ్రమజీవుల జీవితాలను బలిపీఠం ఎక్కిస్తున్నారు.అంతర్జాతీయ నివేదికల ప్రకారం... ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60 శాతం ఉద్యోగాలు ఏఐ వల్ల ప్రభావితం కానున్నాయి. అంటే సగానికి పైగా మానవ వనరులు పనికిరాకుండా పోతాయి. ఈ మానవ వనరులను తుడిచిపెట్టడానికి ప్రపంచ ప్రసిద్ధి చెందిన టెక్ కంపెనీలు ఎంతెంత మొత్తాన్ని పెట్టుబడులుగా తగలేస్తున్నాయో తెలిస్తే మనం విస్తుపోవాల్సిందే. మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, అమెజాన్ వంటి సంస్థలు కేవలం ఏఐ డేటా సెంటర్లు, చిప్ల కోసమే ఏడాదికి వందల బిలియన్ డాలర్లను... అంటే భారతీయ కరెన్సీలో లక్షల కోట్ల రూపాయలను నీళ్లప్రాయంగా ఖర్చు చేస్తున్నాయి. ఒక్క మైక్రోసాఫ్ట్ సంస్థే ఓపెన్ ఏఐ భాగస్వామ్యంతో వంద బిలియన్ డాలర్ల వ్యయంతో 'స్టార్గేట్' అనే భారీ ఏఐ సూపర్ కంప్యూటర్ ప్రాజెక్ట్కు తెరలేపింది. గూగుల్, మెటా సంస్థలు తమ సంప్రదాయ వ్యాపారాలను పక్కనబెట్టి, కేవలం ఏఐ మౌలిక సదుపాయాల కోసమే తమ వార్షిక మూలధన వ్యయాన్ని 40 బిలియన్ డాలర్లకు పైగా పెంచేసాయి. మానవాళి ఆకలిని తీర్చడానికి, పేదరికాన్ని నిర్మూలించడానికి పైసా విదల్చని ఈ కార్పొరేట్ శక్తులు... మనుషుల ఉద్యోగాలను ఊడబీకడానికి మాత్రం అక్షరాలా లక్షల కోట్లను తగలేస్తున్నాయి.మరి ఒక దేశానికి అత్యంత కీలకమైన మానవ వనరులను ఈ విధంగా విచ్ఛిన్నం చేస్తుంటే, సమాజంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయి. ఆకలి కేకలు ఎక్కువైతే తిరుగుబాట్లు వస్తాయి. ఇంతటి భయానక దుష్పరిణామాలు పొంచి ఉన్నా, పాలకులు కేవలం టెక్నాలజీ భ్రమల్లో బతుకుతుండటం ఈ శతాబ్దపు అతిపెద్ద విషాదం.ఏఐ పేరుతో, ఆటోమేషన్ పేరుతో కంపెనీలు సింపుల్గా ఒక ప్రెస్ నోట్ వదులుతున్నాయి... "మేము ఖర్చులు తగ్గించుకుంటున్నాం... ఉద్యోగులను తొలగిస్తున్నాం" అని. కానీ, ఆ లే ఆఫ్ లేఖ వెనుక ఉన్న ఒక కుటుంబం ఏమైపోవాలి? ఆ ఉద్యోగి నమ్ముకున్న తల్లిదండ్రులు, చదువుకుంటున్న పిల్లలు, కట్టాల్సిన ఇళ్ల లోన్లు, కార్ లోన్లు, రేపటి పూట అహారం... వీటన్నిటికీ సమాధానం ఎవరు చెబుతారు? ఈ నేపథ్యంలోనే వాంచన నగరమైన వాటికన్ నుండి పోప్ లూథర్ XIV తన చారిత్రాత్మక పత్రం "మాగ్నిఫికా హ్యుమానిటాస్" ద్వారా ప్రపంచాన్ని తీవ్రంగా హెచ్చరించారు. సాంకేతికత వేగాన్ని, సమర్థతను మాత్రమే కొలమానంగా తీసుకోకూడదని, కార్మికుడి గౌరవాన్ని, సమాజంలో పాల్గొనే హక్కును గౌరవించాలని స్పష్టం చేశారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పేరుతో జరుగుతున్న "నూతన బానిసత్వాన్ని" పోప్ తీవ్రంగా ఖండించారు. కేవలం టెక్నాలజీ ప్రవాహం నిరంతరాయంగా సాగడం కోసం దారుణమైన పరిస్థితుల్లో ఖనిజాలను వెలికితీస్తూ, డేటా లేబిలింగ్ చేస్తూ శ్రమిస్తున్న అట్టడుగు వర్గాల శారీరక శ్రమను, వారి గాయాలను ప్రపంచ కార్పొరేట్ శక్తులు విస్మరిస్తున్నాయని నిలదీశారు.ప్రముఖ సామాజిక తత్వవేత్త, రచయిత యువల్ నోవా హరారి తన హెచ్చరికలో ఒక భయంకరమైన పదాన్ని వాడారు. ఏఐ వల్ల భవిష్యత్తులో సమాజంలో "యూస్లెస్ క్లాస్" అంటే 'అనవసరమైన శ్రమ జీవుల వర్గం' ఒకటి తయారవుతుందని అన్నారు. అంటే మనుషులకు ఉద్యోగాలే లేకపోవడమే కాదు, అసలు వారు ఆర్థిక వ్యవస్థకు 'అనవసరమైన వారిగా' మారిపోయే ప్రమాదం ఉంది. కానీ ఇవాళ కార్పొరేట్ శక్తులకు సమాజం అంటే మనుషులు కాదు... వారి లాభాల బ్యాలెన్స్ షీట్లు మాత్రమే! సొంత లాభం కోసం పొరుగువాని పొట్ట కొట్టడమే ఏఐ కంపెనీల ఏకైక లక్ష్యంగా మారింది. ఒక్కో ఉద్యోగం పోయినప్పుడు కేవలం ఒక వ్యక్తి మాత్రమే రోడ్డున పడటం లేదు, ఆ వ్యక్తిని నమ్ముకున్న ఒక కుటుంబం నిలువునా కూలిపోతోంది. విద్యావంతులైన యువత, రాత్రి పగలు కష్టపడి చదివి నైపుణ్యాలు సంపాదించుకున్న టెక్ నిపుణులు... ఇవాళ ఏఐ టూల్స్ కారణంగా క్షణాల్లో ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఆ కుటుంబాల ఆక్రందనలు, ఆ తల్లిదండ్రుల కన్నీళ్లు పాలకులకు వినిపించడం లేదా? ఏఐ తీసుకొచ్చిన ఈ కృత్రిమ మేధస్సు వల్ల మనుషుల జీవితాల్లో సహజమైన ఆనందం కరువైపోతోంది. నిరాశ, నిస్పృహలతో యువత ప్రాణాలు తీసుకుంటుంటే, ఈ టెక్నాలజీ ప్రగతి సాధించినట్లు ఎలా అనుకుంటాం?ఇప్పుడు ఒక ప్రాథమిక ఆర్థిక శాస్త్ర ప్రశ్నను మనం పాలకుల ముందు, ఏఐ కంపెనీల ముందు ఉంచాలి. మానవ వనరులే సర్వస్వం అనుకుంటే... ఏఐ కారణంగా ఆ మానవ వనరుల ఉపాధి దెబ్బతిని, వారి ఆదాయాలు పడిపోతే, సమాజంలో కొనుగోలు శక్తి ఏమైపోవాలి? ఆర్థిక శాస్త్ర పితామహుడు ఆడమ్ స్మిత్ తన 'వెల్త్ ఆఫ్ నేషన్స్'లో స్పష్టంగా చెప్పారు. “ఏ సమాజంలోనైనా మెజారిటీ ప్రజలు పేదరికంలో, బాధల్లో ఉంటే ఆ సమాజం ఎప్పటికీ వర్ధిల్లదు. వినియోగదారుడి డిమాండ్ మాత్రమే మార్కెట్ను నడిపిస్తుంది అని” పెట్టుబడిదారీ విధానంలో ఒక పెద్ద లోపం ఉంది... దాన్ని ఈ ఏఐ కంపెనీలు పూర్తిగా మర్చిపోయాయి. మనుషులకు ఉద్యోగాలు లేకపోతే వారికి జీతాలు రావు. జీతాలు రాకపోతే వారి ఆదాయం సున్నా అవుతుంది. ఆదాయం లేనప్పుడు మనుషులు కేవలం తినడానికి తిండి మాత్రమే కొనుక్కుంటారు తప్ప... కార్లు, బైకులు, బట్టలు, ఫోన్లు, విలాసవంతమైన వస్తువులు ఏవీ కొనలేరు. అంటే అన్ని రంగాలు తిరోగమనంలో పడతాయి. రియల్ ఎస్టేట్ కూలిపోతుంది, ఆటోమొబైల్ రంగం దెబ్బతింటుంది, మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్ పడిపోతుంది.మరి సమాజంలో వినియోగమే లేనప్పుడు, మార్కెట్ మొత్తం తిరోగమనంలో పడినప్పుడు... ఈ ఏఐ కంపెనీలకి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? వందల బిలియన్ డాలర్లు తగలేసి వారు తయారు చేసిన సాఫ్ట్వేర్లను, టూల్స్ను కొనే నాథుడు ఎవరు ఉంటారు? మనుషుల పొట్ట కొట్టి, వారి ఆదాయాన్ని లాగేసుకుని... కార్పొరేట్ సంస్థలు ఎవరికి తమ ఉత్పత్తులను అమ్ముకుంటాయి? రోబోలు రోబోలకి అమ్ముకుంటాయా? సాఫ్ట్వేర్లు సాఫ్ట్వేర్లతో వ్యాపారం చేస్తాయా?ఎంతటి మూర్ఖత్వం! మానవ వనరుల వినాశనం అంటే అది చివరకు ఏఐ కంపెనీల వినాశనానికే దారితీస్తుందనే కనీస లాజిక్ను ఇటు కంపెనీలు, అటు పాలకులు ఎలా మర్చిపోయారు?సరే... అంతా ఏఐ అనుకుందాం. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి పనికీ ఏఐ టూల్స్ వాడదాం. కానీ ఉచితంగా ఏదీ రాదు కదా! ప్రతి ఏఐ సాఫ్ట్వేర్కు, ప్రతి యాప్కు సబ్స్క్రిప్షన్ ఫీజు కట్టాలి, డబ్బు చెల్లించాలి. మరి సాధారణ ప్రజల దగ్గర వ్యాపారాలు లేనప్పుడు, ఉద్యోగాలు లేనప్పుడు... వినియోగదారులు ఆ ఏఐ కంపెనీలకి డబ్బు ఎలా చెల్లిస్తారు? ప్రముఖ ఆర్థికవేత్త జాన్ మేనార్డ్ కీన్స్ ఆర్థిక మాంద్యం సమయంలో ఒక అద్భుతమైన సూత్రాన్ని ప్రతిపాదించారు. ప్రభుత్వాలు ప్రజల చేతుల్లో డబ్బు పెట్టాలి, అప్పుడే మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది, ఆర్థిక వ్యవస్థ బతుకుతుంది. కానీ ఇవాళ ఏఐ చేస్తున్నది దీనికి రివర్స్. ప్రజల చేతుల్లో ఉన్న డబ్బును లాగేసుకుంటోంది. చిన్న చిన్న వ్యాపారాలు, స్వయం ఉపాధి రంగాలు ఏఐ చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఒక చిన్న డిజైనర్, ఒక చిన్న అకౌంటెంట్, ఒక చిన్న లీగల్ అడ్వైజర్... వీరంతా ఇవాళ ఉపాధి కోల్పోతున్నారు. మరి సమాజంలో చలామణీ అయ్యే డబ్బు మొత్తం నలుగురైదుగురు టెక్ బిలియనీర్ల అకౌంట్లలోకి వెళ్ళిపోతే... మార్కెట్లో లిక్విడిటీ ఏమైపోవాలి? వ్యాపారాలు లేని సమాజంలో వినియోగదారుడు ఏఐ సేవలను వాడుకోవడానికి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాడు? ఇది కేవలం ఆర్థిక సంక్షోభం కాదు... సమాజాన్ని ఆత్మహత్యల వైపు నడిపించే ఒక దుర్మార్గపు వ్యూహం.ఇప్పటికే ఏఐ పేరుతో ప్రపంచవ్యాప్తంగా వేలాది మందిని, భారతదేశంలో కూడా లక్షలాది మంది టెక్ నిపుణులను కంపెనీలు లే ఆఫ్స్ పేరుతో నికృష్టంగా రోడ్డున పడేశారు. ఏ తప్పు చేయని టెక్ నిపుణులు ఇవాళ నిరాశలో మునిగిపోయారు. మరి ఈ విద్యావంతులు, బుద్ధిజీవులు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న యువత... ఉద్యోగాలు లేక, వేరే వ్యాపకాలకు దిగితే సమాజానికి ఎంత పెద్ద నష్టం జరుగుతుందో పాలకులు ఎందుకు గ్రహించడం లేదు? మహాత్మా గాంధీ ఒక అద్భుతమైన మాట చెప్పారు. “పని లేని మేధస్సు... సాతాను కర్మాగారం. నైతికత లేని విజ్ఞానం సమాజానికి తీవ్రమైన హాని చేస్తుందని” ఒక మేధావికి, ఒక సాంకేతిక నిపుణుడికి సరైన పని కల్పించకపోతే... ఆ మేధస్సు వినాశనానికి దారితీసే అవకాశం ఉంది. సైబర్ నేరాలు, ఆర్ధిక మోసాలు, సమాజంలో అశాంతి పెరగడానికి ఈ నిరుద్యోగమే కారణం కాదా? చదువుకున్న యువత సమాజంపై కక్ష పెంచుకునేలా పాలకులు ఎందుకు ప్రవర్తిస్తున్నారు? వారు వేరే అసాంఘిక వ్యాపకాలకు దిగితే, సమాజంలో శాంతిభద్రతలు క్షీణిస్తే... ఆ నష్టాన్ని ప్రభుత్వాలు భరించగలవా? లే ఆఫ్స్ అనేవి కేవలం కంపెనీల అంతర్గత విషయం కాదు... అవి సమాజ పునాదులను కదిలించే సామాజిక విపత్తులు. దీనిని పాలకులు గుర్తించకపోవడం వారి మేధో దివాలాకోరుతనానికి నిదర్శనం.ఇక అన్నిటికంటే భయంకరమైన అంశం... భవిష్యత్తు తరాల పరిస్థితి ఏంటి? ప్రతి చిన్న విషయానికి, హోంవర్క్ దగ్గర నుంచి రీసెర్చ్ వరకు అన్నిటికీ ఏఐ టూల్స్ వాడేస్తుంటే... భవిష్యత్తు తరాలు పూర్తిగా తమ సొంత ఆలోచనా శక్తిని, సృజనాత్మకతను కోల్పోయి, టెక్నాలజీకి బానిసలయ్యే ప్రమాదం ఉంది కదా! ఆ విషయం ఈ పాలకులకు ఎందుకు పట్టడం లేదు? సిలికాన్ వ్యాలీ సృష్టించిన ఈ సాంకేతిక ఏకరూపత వెనుక బైబిల్ లోని "టవర్ ఆఫ్ బాబెల్" నాటి అహంకారం దాగి ఉందని పోప్ లూథర్ హెచ్చరించారు. మానవాళి ఒకే సాంకేతిక భాషతో దైవత్వాన్ని సవాలు చేయాలని చూస్తే అది తీవ్రమైన విచ్ఛిన్నానికే దారితీస్తుంది. పైగా, బాల్య దశలో సాంకేతిక పరిజ్ఞానానికి మితిమీరి గురికావడం వల్ల నిద్రలేమి, ఏకాగ్రత లోపించడం, మానసిక బంధాలు తెగిపోవడం వంటి భయంకరమైన మానసిక రుగ్మతలు ఉత్పన్నమవుతున్నాయని వైద్య పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒకచోట హెచ్చరించారు. సాంకేతికత మన మానవ సంబంధాలను, మానవ మేధస్సును దాటి వెళ్ళిపోయిన రోజు... ప్రపంచం కేవలం మూర్ఖుల తరంతో నిండిపోతుందని. ఇవాళ ఐన్స్టీన్ అన్న ఆ మూర్ఖుల తరం కళ్లముందే తయారవుతోంది. మనుషులు ఆలోచించడం మానేస్తున్నారు. మెదడుకు పని పెట్టడం లేదు. కంపెనీలు కేవలం ప్రస్తుత లాభాలను చూసుకుని మురిసిపోతున్నాయి... కానీ రేపు పొద్దున, భవిష్యత్ తరాల నుంచి సరికొత్త మానవ మేధస్సు, సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలు రాకపోతే... టెక్నాలజీ అక్కడితో ఆగిపోదా? ఏఐ అనేది మనిషి సృష్టించిన డేటా ఆధారంగానే పనిచేస్తుంది. మరి మనుషులే కొత్తగా ఆలోచించడం మానేస్తే... ఏఐకి కొత్త డేటా ఎక్కడి నుంచి వస్తుంది? టెక్నాలజీ అక్కడితో స్తంభించిపోదా? మానవ మేధస్సు లేని రోజున ఏ సాంకేతికత అయినా ఒక జడపదార్థం మాత్రమే అవుతుంది.అసలు సమాజ శ్రేయస్సును కాంక్షించని ఈ ఏఐ కార్పొరేట్ కంపెనీల కూటమికి ప్రభుత్వాలు ఎందుకు అంతగా ప్రాధాన్యత ఇస్తున్నాయి? దేశంలో పేదరికం ఉంది, తాగునీటి కొరత ఉంది, వైద్య సదుపాయాలు లేవు... వీటన్నిటినీ వదిలేసి, ఏఐ రీసెర్చ్ సెంటర్ల కోసం, గ్లోబల్ టెక్ సదస్సుల కోసం వందల కోట్ల ప్రజా ధనాన్ని ప్రభుత్వాలు ఎందుకు తగలేస్తున్నాయి? ప్రముఖ ఆర్థికవేత్త నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. "అభివృద్ధి అంటే కేవలం సాంకేతికత లేదా మార్కెట్ విస్తరణ కాదు... మానవ సామర్థ్యాలను, వారి జీవన ప్రమాణాలను పెంపొందించడమే అసలైన అభివృద్ధి అని” కానీ ఇవాళ ప్రభుత్వాలు అమర్త్యసేన్ మాటలను తుంగలో తొక్కాయి. సామాన్య ప్రజల శ్రేయస్సును కాదని, కేవలం కొద్దిమంది టెక్ దిగ్గజాల ప్రయోజనాల కోసమే పాలసీలు మారుస్తున్నాయి. నైపుణ్యం ఉన్న టెక్ నిపుణుల అభిప్రాయాలను, వారి ఆందోళనలను కనీసం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాల ఈ కార్పొరేట్ అనుకూల విధానాలు మారకపోతే... చరిత్ర పాలకులను క్షమించదు.టెక్నాలజీ అనేది మనిషి జీవితాన్ని సుఖమయం చేయడానికి రావాలి కానీ... మనిషి జీవితాన్నే శూన్యం చేయడానికి కాదు. పోప్ లూథర్ తన సందేశం ముగింపులో అన్నట్లు, మనుషులు ఎంత బలహీనులైనా, పరిమితులు ఉన్నవారైనా... మనిషి స్థానాన్ని, వారి సామర్థ్యాన్ని, ముఖ్యంగా ప్రేమానురాగాలను ఏ యంత్రమూ భర్తీ చేయలేదు, భర్తీ చేయకూడదు. నైపుణ్యం ఉన్న మానవ వనరులే ఏ దేశానికైనా అసలైన బలం. ఆ బలాన్ని బలహీనతగా మార్చే ఏ సాంకేతికత అయినా సమాజానికి ప్రమాదకరమే. ఇప్పటికైనా ప్రపంచ పాలకులు, మన దేశ పాలకులు కళ్ళు తెరవాలి. ఏఐ పేరుతో జరుగుతున్న ఈ మానవ వనరుల వినాశనాన్ని, కార్పొరేట్ అత్యాశను అడ్డుకోవడానికి కఠినమైన నియంత్రణ చట్టాలు తీసుకురావాలి. లేకపోతే... రేపు పొద్దున రోబోలు రాజ్యమేలుతుంటాయి, మనుషులు ఆకలితో అలమటిస్తుంటారు. ఆ రోజున పాలకులారా... చరిత్ర మిమ్మల్ని క్షమించదు!ఇప్పటికే ఏఐ పేరుతో ప్రపంచవ్యాప్తంగా వేలాది మందిని, భారతదేశంలో కూడా లక్షలాది మంది టెక్ నిపుణులను కంపెనీలు లే ఆఫ్స్ పేరుతో నికృష్టంగా రోడ్డున పడేశారు. ఏ తప్పు చేయని టెక్ నిపుణులు ఇవాళ నిరాశలో మునిగిపోయారు. మరి ఈ విద్యావంతులు, బుద్ధిజీవులు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న యువత... ఉద్యోగాలు లేక, వేరే వ్యాపకాలకు దిగితే సమాజానికి ఎంత పెద్ద నష్టం జరుగుతుందో పాలకులు ఎందుకు గ్రహించడం లేదు? మహాత్మా గాంధీ ఒక అద్భుతమైన మాట చెప్పారు. “పని లేని మేధస్సు... సాతాను కర్మాగారం. నైతికత లేని విజ్ఞానం సమాజానికి తీవ్రమైన హాని చేస్తుందని” ఒక మేధావికి, ఒక సాంకేతిక నిపుణుడికి సరైన పని కల్పించకపోతే... ఆ మేధస్సు వినాశనానికి దారితీసే అవకాశం ఉంది. సైబర్ నేరాలు, ఆర్ధిక మోసాలు, సమాజంలో అశాంతి పెరగడానికి ఈ నిరుద్యోగమే కారణం కాదా? చదువుకున్న యువత సమాజంపై కక్ష పెంచుకునేలా పాలకులు ఎందుకు ప్రవర్తిస్తున్నారు? వారు వేరే అసాంఘిక వ్యాపకాలకు దిగితే, సమాజంలో శాంతిభద్రతలు క్షీణిస్తే... ఆ నష్టాన్ని ప్రభుత్వాలు భరించగలవా? లే ఆఫ్స్ అనేవి కేవలం కంపెనీల అంతర్గత విషయం కాదు... అవి సమాజ పునాదులను కదిలించే సామాజిక విపత్తులు. దీనిని పాలకులు గుర్తించకపోవడం వారి మేధో దివాలాకోరుతనానికి నిదర్శనం.ఇక అన్నిటికంటే భయంకరమైన అంశం... భవిష్యత్తు తరాల పరిస్థితి ఏంటి? ప్రతి చిన్న విషయానికి, హోంవర్క్ దగ్గర నుంచి రీసెర్చ్ వరకు అన్నిటికీ ఏఐ టూల్స్ వాడేస్తుంటే... భవిష్యత్తు తరాలు పూర్తిగా తమ సొంత ఆలోచనా శక్తిని, సృజనాత్మకతను కోల్పోయి, టెక్నాలజీకి బానిసలయ్యే ప్రమాదం ఉంది కదా! ఆ విషయం ఈ పాలకులకు ఎందుకు పట్టడం లేదు? సిలికాన్ వ్యాలీ సృష్టించిన ఈ సాంకేతిక ఏకరూపత వెనుక బైబిల్ లోని "టవర్ ఆఫ్ బాబెల్" నాటి అహంకారం దాగి ఉందని పోప్ లూథర్ హెచ్చరించారు. మానవాళి ఒకే సాంకేతిక భాషతో దైవత్వాన్ని సవాలు చేయాలని చూస్తే అది తీవ్రమైన విచ్ఛిన్నానికే దారితీస్తుంది. పైగా, బాల్య దశలో సాంకేతిక పరిజ్ఞానానికి మితిమీరి గురికావడం వల్ల నిద్రలేమి, ఏకాగ్రత లోపించడం, మానసిక బంధాలు తెగిపోవడం వంటి భయంకరమైన మానసిక రుగ్మతలు ఉత్పన్నమవుతున్నాయని వైద్య పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒకచోట హెచ్చరించారు. సాంకేతికత మన మానవ సంబంధాలను, మానవ మేధస్సును దాటి వెళ్ళిపోయిన రోజు... ప్రపంచం కేవలం మూర్ఖుల తరంతో నిండిపోతుందని. ఇవాళ ఐన్స్టీన్ అన్న ఆ మూర్ఖుల తరం కళ్లముందే తయారవుతోంది. మనుషులు ఆలోచించడం మానేస్తున్నారు. మెదడుకు పని పెట్టడం లేదు. కంపెనీలు కేవలం ప్రస్తుత లాభాలను చూసుకుని మురిసిపోతున్నాయి. కానీ రేపు పొద్దున, భవిష్యత్ తరాల నుంచి సరికొత్త మానవ మేధస్సు, సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలు రాకపోతే... టెక్నాలజీ అక్కడితో ఆగిపోదా? ఏఐ అనేది మనిషి సృష్టించిన డేటా ఆధారంగానే పనిచేస్తుంది. మరి మనుషులే కొత్తగా ఆలోచించడం మానేస్తే... ఏఐకి కొత్త డేటా ఎక్కడి నుంచి వస్తుంది? టెక్నాలజీ అక్కడితో స్తంభించిపోదా? మానవ మేధస్సు లేని రోజున ఏ సాంకేతికత అయినా ఒక జడపదార్థం మాత్రమే అవుతుంది.అసలు సమాజ శ్రేయస్సును కాంక్షించని ఈ ఏఐ కార్పొరేట్ కంపెనీల కూటమికి ప్రభుత్వాలు ఎందుకు అంతగా ప్రాధాన్యత ఇస్తున్నాయి? దేశంలో పేదరికం ఉంది, తాగునీటి కొరత ఉంది, వైద్య సదుపాయాలు లేవు... వీటన్నిటినీ వదిలేసి, ఏఐ రీసెర్చ్ సెంటర్ల కోసం, గ్లోబల్ టెక్ సదస్సుల కోసం వందల కోట్ల ప్రజా ధనాన్ని ప్రభుత్వాలు ఎందుకు తగలేస్తున్నాయి? ప్రముఖ ఆర్థికవేత్త నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. "అభివృద్ధి అంటే కేవలం సాంకేతికత లేదా మార్కెట్ విస్తరణ కాదు... మానవ సామర్థ్యాలను, వారి జీవన ప్రమాణాలను పెంపొందించడమే అసలైన అభివృద్ధి అని” కానీ ఇవాళ ప్రభుత్వాలు అమర్త్యసేన్ మాటలను తుంగలో తొక్కాయి. సామాన్య ప్రజల శ్రేయస్సును కాదని, కేవలం కొద్దిమంది టెక్ దిగ్గజాల ప్రయోజనాల కోసమే పాలసీలు మారుస్తున్నాయి. నైపుణ్యం ఉన్న టెక్ నిపుణుల అభిప్రాయాలను, వారి ఆందోళనలను కనీసం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాల ఈ కార్పొరేట్ అనుకూల విధానాలు మారకపోతే... చరిత్ర పాలకులను క్షమించదు. - కంచర్ల యాదగిరి రెడ్డి, మేనేజింగ్ ఎడిటర్, సాక్షి టీవీ -
ఐటీ ఉద్యోగానికి గుడ్బై.. ఆటో డ్రైవింగ్తో హ్యాపీ లైఫ్!
ఐటీ ఉద్యోగాలు పైకి చూడటానికి ఆకర్షణీయంగా ఉంటాయి. మంచి జీతం వస్తున్నా తాము పడే ఇబ్బందులు, పని ఒత్తిడి అంతా ఇంతా కాదని చాలా మంది ఐటీ ఉద్యోగులు చెబుతుంటారు. ఈ క్రమంలో ఒకప్పుడు ఐటీ రంగంలో పనిచేసిన మహిళ తీసుకున్న విలక్షణ నిర్ణయం అందరి దృష్టిని ఆకర్షించింది. కార్యాలయ ఉద్యోగంలోని తీవ్రమైన ఒత్తిడి, సుదీర్ఘ పనిగంటలు, వ్యక్తిగత జీవితానికి సమయం లేకపోవడం వంటి సమస్యలతో విసిగిపోయిన ఆమె చివరకు ఐటీ ఉద్యోగానికి రాజీనామా చేసింది.ఆటో డ్రైవర్గా కొత్త ప్రయాణంసుమారు 9 ఏళ్లు చేసిన ఐటీ ఉద్యోగాన్ని వదిలేసిన ఆమె.. ఆ తర్వాత ఆటో రిక్షా నడపడం ప్రారంభించింది. తనకు నచ్చిన సమయాల్లో పని చేసుకునే స్వేచ్ఛ లభించడంతో పాటు, పని-వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను సాధించగలిగింది. ప్రస్తుతం తాను నెలకు సుమారు రూ.60 వేల వరకు ఆదాయం పొందుతున్నానని, గతంతో పోలిస్తే ఇప్పుడు తాను మరింత సంతోషంగా, ప్రశాంతంగా ఉన్నానని ఆమె చెబుతోంది.సోషల్ మీడియాలో వైరల్ఈ మహిళ కథను మరో మహిళా ఎంట్రప్రెన్యూర్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా విస్తృత చర్చకు దారితీసింది. సాంప్రదాయ కెరీర్ను వదిలి తనకు మానసిక ప్రశాంతతను ఇచ్చే వృత్తిని, అది కూడా పురుషాధిక్యత ఉండే పనిని ఎంచుకోవడంపై అనేక మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ఉద్యోగం అంటే కేవలం అధిక జీతమే కాదని, జీవన నాణ్యత కూడా ముఖ్యమని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఐటీ ఉద్యోగుల స్పందనఈ కథకు స్పందించిన ఓ ఐటీ ఉద్యోగి, “18 ఏళ్లుగా ఐటీ రంగంలో ఉన్నా ఇప్పటికీ అంతులేని మీటింగ్లు, గంటల తరబడి కొనసాగే కాల్స్, అర్ధరాత్రి వచ్చే ప్రొడక్షన్ సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నాం” అంటూ వ్యాఖ్యానించారు. ఈ రంగంలో కొనసాగాలంటే ఎంతో సహనం, మానసిక స్థైర్యం అవసరమని పేర్కొన్నారు.ఆమె గతంలో సంపాదించిన ఆదాయంతో మంచి సేవింగ్స్ చేసి ఉండవచ్చని మరో నెటిజన్ అభిప్రాయపడ్డారు. ఇంకొందరు మాత్రం సరళమైన, ప్రశాంతమైన జీవితం కోసం ఆమె తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించారు. చివరికి ప్రతి మనిషి కోరుకునేది మనశ్శాంతేనని వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా మరో ఆసక్తికరమైన ఉదాహరణను కూడా నెటిజన్లు పంచుకున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తి కూడా ఇలాగే ఉద్యోగాన్ని వదిలి ఆటో రిక్షా నడపడం ప్రారంభించాడని, క్రమంగా తన వ్యాపారాన్ని విస్తరించి ఐదు ట్రక్కుల యజమానిగా ఎదిగాడని తెలిపారు. రూ.5 కోట్లకు పైగా సంపాదించినప్పటికీ ఇప్పటికీ ఆటో నడుపుతుండటం అతని వినయానికి నిదర్శనమని పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Dr. Nezrin Midhlaj / Entrepreneur / Global Speaker (@dr.nezrin_midhlaj) -
ఢిల్లీ ఘటన: అందుకే ACలు పేలిపోతున్నాయ్!
మాజీ ఐఏఎస్ అధికారి 'ధనేంద్ర కుమార్' మరణం తరువాత.. దేశవ్యాప్తంగా ఎయిర్ కండీషనర్(AC)ల భద్రతపై ఆందోళన పెరిగింది. ఢిల్లీలోని హౌజ్ ఖాస్ ప్రాంతంలో ఆయన నివాసంలో ఏసీ ఇండోర్ యూనిట్ పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ధనేంద్ర కుమార్ పొగ పీల్చడం వల్ల ప్రాణాలు కోల్పోగా, ఆయన కుమారుడు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన వేసవి కాలంలో ఎయిర్ కండీషనర్ల వినియోగంలో.. జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందో స్పష్టంగా తెలియజేస్తోంది.ప్రస్తుతం భారతదేశంలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనివల్ల ప్రజలు గంటల తరబడి ఎయిర్ కండీషనర్లను ఉపయోగిస్తున్నారు. అయితే.. నిరంతరాయంగా ఏసీ ఆన్లో ఉండటం, సరైన నిర్వహణ లేకపోవడం, విద్యుత్ సరఫరాలో వోల్టేజ్ హెచ్చుతగ్గులు వంటి కారణాలు ప్రమాదాలకు దారితీస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఏసీలు పేలడానికి కారణాలుఢిల్లీ ఫైర్ సర్వీసెస్ ప్రకారం.. నగరంలో జరిగే అగ్ని ప్రమాదాలలో సుమారు 60 శాతం విద్యుత్ లోపాల వలన సంభవిస్తున్నాయని తెలుస్తోంది. వీటిలో షార్ట్ సర్క్యూట్లు, ఓవర్ హీటింగ్, హైలోడ్, నాసిరకం విద్యుత్ పరికరాల వినియోగం ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు.ఎయిర్ కండీషనర్లో అత్యంత కీలక భాగం కంప్రెసర్. వేసవిలో ఏసీని గంటల తరబడి ఆపకుండా వినియోగించడం వల్ల కంప్రెసర్పై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. దానికి సరైన విరామం ఇవ్వకపోతే.. అంతర్గత ఉష్ణోగ్రతలు పెరిగి మంటలు చెలరేగే ప్రమాదం ఉంటుంది. అందుకే రోజంతా లేదా రాత్రంతా ఏసీని నిరంతరాయంగా నడపకుండా మధ్య మధ్యలో ఆపడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం స్మార్ట్ టైమర్లు, ఇంటెలిజెంట్ ఏసీ కంట్రోలర్లు వినియోగాన్ని నియంత్రించడంలో సహాయపడుతున్నాయి.➤ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కూడా మరో ప్రధాన కారణం. ఎక్కువసేపు విద్యుత్ సరఫరా జరుగుతుండటం వల్ల వైర్లు వేడెక్కుతాయి. కొన్నిసార్లు వైర్లపై ఉన్న ఇన్సులేషన్ కరిగిపోవడంతో మంటలు చెలరేగే అవకాశం ఉంటుంది. సాధారణంగా మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్లు అధిక లోడ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ట్రిప్ అవుతాయి. కానీ అవే పనిచేయకపోతే భద్రతా వ్యవస్థ పూర్తిగా విఫలమవుతుంది.➤వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ కూడా ఎయిర్ కండీషనర్లకు ప్రమాదకరమే. విద్యుత్ సరఫరాలో ఆకస్మిక మార్పులు వచ్చినప్పుడు కంప్రెసర్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ భాగాలు దెబ్బతింటాయి. ముఖ్యంగా వేసవిలో విద్యుత్ ఒత్తిడి ఎక్కువగా ఉండే నగరాల్లో స్టెబిలైజర్లు, సర్జ్ ప్రొటెక్టర్లు లేదా ఇన్వర్టర్ ఆధారిత ఏసీలను ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.➤దుమ్ము, మురికి పేరుకుపోయిన ఎయిర్ ఫిల్టర్లు కూడా ప్రమాదాన్ని పెంచుతాయి. గాలి సరైన రీతిలో ప్రవహించకపోవడంతో మిషన్ ఎక్కువ ఒత్తిడితో పనిచేస్తుంది. దీనివల్ల ఉష్ణోగ్రత పెరిగి అంతర్గత విద్యుత్ లోపాలు సంభవించే అవకాశాలు ఎక్కువవుతాయి. అదేవిధంగా పాత వైరింగ్, నాసిరకం కనెక్షన్లు కూడా షార్ట్ సర్క్యూట్ ప్రమాదాన్ని పెంచుతాయి.ముందే హెచ్చరిక సంకేతాలు!ఎయిర్ కండీషనర్లో సమస్యలు తలెత్తే ముందు కొన్ని హెచ్చరిక సంకేతాలు కనిపిస్తాయి. అసాధారణ శబ్దాలు రావడం, ఏసీ పదేపదే ఆన్-ఆఫ్ అవడం, సమానంగా చల్లదనం రాకపోవడం, కాలిన వాసన రావడం లేదా పొగ కనిపించడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే అనుభవజ్ఞులైన టెక్నీషియన్లతో తనిఖీ చేయించాలి.భద్రత కోసం.. ఇండోర్, అవుట్డోర్ వైరింగ్ సరిగా ఉండేలా చూసుకోవాలి. ఎయిర్ ఫిల్టర్లను తరచుగా శుభ్రం చేయాలి. అవుట్డోర్ యూనిట్ చుట్టూ చెత్త లేదా అడ్డంకులు లేకుండా చూసుకోవాలి. ఏసీఉష్ణోగ్రతను 24 నుంచి 26 డిగ్రీల మధ్య ఉంచడం మంచిది. అలాగే రిపేర్లు లేదా ఇన్స్టాలేషన్ కోసం కేవలం అధీకృత టెక్నీషియన్ల సేవలనే ఉపయోగించాలి.నిర్వహణ లేకపోతే..ధనేంద్ర కుమార్ విషాద ఘటన ఒక పెద్ద హెచ్చరికగా నిలిచింది. ఎయిర్ కండీషనర్ అనేది కేవలం సౌకర్యం కోసం ఉపయోగించే పరికరం మాత్రమే కాదు. సరైన నిర్వహణ లేకపోతే, విద్యుత్ వ్యవస్థలపై అధిక ఒత్తిడి పెరిగితే అది ప్రాణాంతక ప్రమాదాలకు కూడా కారణమవుతుందని ఈ ఘటన స్పష్టం చేసింది.ఇదీ చదవండి: యూపీఐ ద్వారా PF విత్డ్రా.. కొత్త రూల్స్ ఇవే! -
ఇథనాల్ స్టవ్ ఎలా పనిచేస్తుంది!
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ఇథనాల్ ఆధారిత స్టవ్ టెక్నాలజీ గురించి చేసిన ప్రకటన.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నీటిలో 7 శాతం ఇథనాల్ కలిపితే.. వంటగ్యాస్లా మంట వస్తుందని, ఇది ఎల్పీజీ కంటే తక్కువ ఖర్చుతో ఉపయోగించవచ్చని ఆయన తెలిపారు. ఇది భవిష్యత్తులో వంటగ్యాస్కు ప్రత్యామ్నాయంగా మారుతుందా?, ఇథనాల్ నిజంగా ఎల్పీజీ స్థానాన్ని భర్తీ చేయగలదా? అనే సందేహాలు తలెత్తాయి.ఇథనాల్ అనేది మండే స్వభావం కలిగిన ఒక ఆల్కహాల్. దీనిని ఇప్పటికే ఆటోమొబైల్స్లో బయోఫ్యూయల్గా కూడా ఉపయోగిస్తున్నారు. ఇది ద్రవరూపంలో ఉంటుంది. కాబట్టి గాలిలో ఆక్సిజన్తో కలిసినప్పుడు, సరైన ఉష్ణోగ్రత వద్ద మంట వస్తుంది. అయితే.. ఇథనాల్ మండటానికి దాని సాంద్రత చాలా ముఖ్యమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.'జర్నల్ ఆఫ్ లాస్ ప్రివెన్షన్ ఇన్ ది ప్రాసెస్ ఇండస్ట్రీస్'లో ప్రచురించిన అధ్యయనాల ప్రకారం.. నీటిలో ఇథనాల్ శాతం చాలా తక్కువగా ఉంటే.. మంట నిలకడగా ఉండదు. నీరు ఎక్కువగా ఉండటం వల్ల ఇథనాల్ ఆవిరి త్వరగా ఏర్పడదు. అందుకే బీర్ వంటి ఆల్కహాల్ పానీయాలు సులభంగా మండవు. కానీ వాణిజ్యపరంగా ఉపయోగించే ఇథనాల్ స్టవ్లో 70 నుంచి 90 శాతం వరకు అధిక సాంద్రత కలిగిన ఇథనాల్ను ఉపయోగిస్తారు. అప్పుడు మాత్రమే ఎల్పీజీ మాదిరిగా మంట వస్తుంది.Water, if mixed with 7% ethanol, can turn into a flame that can burn down the scientific establishment that has been lying to us for 200 years. Happy Birthday, sir!🎶Sawan jo aag lagaaye, use kaun bhujaye 🎶pic.twitter.com/gQQSzJ0tOv— ᴋᴀᴍʟᴇsʜ sɪɴɢʜ / tau (@kkstau) May 27, 2026స్వచ్ఛమైన ఇథనాల్ తక్కువ ఉష్ణోగ్రత వద్ద కూడా మండే లక్షణం కలిగి ఉంటుంది. కానీ.. అందులో నీటి శాతం పెరిగేకొద్దీ మంట తగ్గిపోతుంది కష్టమవుతుంది. ఎందుకంటే నీరు వేడిని గ్రహించి, ఇథనాల్ ఆవిరి ఒత్తిడిని తగ్గిస్తుంది. కాబట్టి సరైన నిష్పత్తి, ప్రత్యేక బర్నర్ టెక్నాలజీ ఉంటే మాత్రమే ఈ విధానం సమర్థవంతంగా పనిచేస్తుంది.లేటెస్ట్ ఇథనాల్ స్టవ్లో ప్రెషరైజ్డ్ బర్నర్లు, ఫ్యూయల్ కార్ట్రిడ్జ్లు, ప్రీ-హీటింగ్ సిస్టమ్లు వంటి సాంకేతికతను ఉపయోగిస్తారు. ఇవి ఇంధనాన్ని వేగంగా ఆవిరి చేసి స్థిరమైన మంటను అందిస్తాయి. అందువల్ల వంట సులభంగా పూర్తవుతుంది.భారతదేశంలో చెరకు, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా ఇథనాల్ ఉత్పత్తి పెరుగుతోంది. ఇప్పటికే పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. కాబట్టి భవిష్యత్తులో వంట కోసం కూడా దేశీయంగా తయారయ్యే ఇథనాల్ను ఉపయోగిస్తే ఎల్పీజీ దిగుమతులపై ఆధారపడటం తగ్గే అవకాశం ఉంది. అయితే భద్రతా ప్రమాణాలు చాలా ముఖ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఇథనాల్ మంట పగటి వేళల్లో స్పష్టంగా కనిపించకపోవచ్చు. అలాగే సరైన నిష్పత్తిలో ఇంధనం లేకపోతే మంట సరిగా రాకపోవచ్చు. -
ఇంట్లో అందరికీ లేఆఫ్.. ఆరుగురి ఉద్యోగాలూ పోయాయ్..
లేఆఫ్లకు సంబంధించి రోజుకో కొత్త వ్యథ వెలుగులోకి వస్తోంది. టెక్నాలజీ, ఫిన్టెక్, విమానయాన రంగాల్లో కొనసాగుతున్న ఉద్యోగ కోతల తీవ్రతను ప్రతిబింబించే ఓ కుటుంబ కథ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒకే కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు, నలుగురు తోబుట్టువులు వరుసగా ఉద్యోగాలు కోల్పోవడంతో ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు.ఆ కుటుంబ సభ్యుల్లో ఇద్దరు ప్రముఖ FAANG (మెటా, అమెజాన్, యాపిల్, నెట్ఫ్లిక్స్, ఆల్ఫాబెట్) కంపెనీల్లో పనిచేసినప్పటికీ గత ఏడాదిలో ఉద్యోగాలు కోల్పోయారు. వారిలో ఒకరు ఏడాదికిపైగా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుండగా, మరొకరు ఎలాంటి సెవరెన్స్ ప్యాకేజీ లేకుండానే తొలగింపునకు గురైనట్లు తెలిపాడు. మరో సోదరుడు ఫిన్టెక్ కంపెనీలో పనిచేసి గత ఆగస్టులో ఉద్యోగం కోల్పోగా, చిన్న సోదరి పనిచేసిన విమానయాన సంస్థ మూతపడటంతో ఆమె కూడా నిరుద్యోగిగా మారింది.ఇప్పటికే కుటుంబ సభ్యుల్లో కొందరికి గృహ రుణాలు ఉండటంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. తాత్కాలిక ఉద్యోగాలు చేస్తున్నా నెలసరి తనఖా చెల్లింపులకు సరిపడా ఆదాయం రావడం లేదని వారు చెబుతున్నారు. ఇద్దరు చిన్న తోబుట్టువులు అద్దె ఇళ్లు వదిలి తిరిగి తల్లిదండ్రుల వద్దకు వెళ్లాల్సి వచ్చిందని పేర్కొన్నారు.ఈ పోస్టుపై స్పందించిన పలువురు నెటిజన్లు తాత్కాలిక పనులు చేసుకుంటూ ఖర్చులను తగ్గించుకోవాలని, అవసరమైతే ఒకే ఇంట్లో కలిసి నివసించాలని సూచించారు. కొందరు ఈ పరిస్థితిని 2008 ఆర్థిక మాంద్యంతో పోల్చగా, మరికొందరు ఏఐ ప్రభావంతో టెక్ రంగంలో ఉద్యోగ కోతలు మరింత పెరిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు.Posts from the recruitinghellcommunity on Reddit -
ఈ వెహికల్ తెచ్చిన లక్ : నెలకు రూ. 45 వేలు
జిప్ ఎలక్ట్రిక్ (Zypp Electric) వ్యవస్థాపకుడు, సీఈఓ ఆకాష్ గుప్తా సోషల్ మీడియాలో పంచుకున్న ఒక సాధారణ రోడ్సైడ్ సంభాషణ స్టోరీ నెట్టింట వైరల్గా మారింది. ఒకపుడు నిరుద్యోగిగా ఉన్న వ్యక్తి జీవితం ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేయడం ద్వారా అనూహ్యం మలుపు తిరిగింది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) విప్లవం యువతకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి ఎలాంటి అద్భుతమైన ఆర్థిక అవకాశాలను సృష్టిస్తోందో కళ్లకు కట్టిందంటూ ఆయన ఒక వీడియోను పోస్ట్ చేశారు.ఇది కేవలం ఒక వ్యవస్థాపకుడు ,కస్టమర్ మధ్య జరిగే సంభాషణ, ఎపుడైనా జరగవచ్చు..రాత్రి 11 గంటల సమయంలో నడుస్తూ అతనితో సంభాషణ అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేసిన ఒక వీడియోలో.. ఇటీవలే ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ నుండి నగరానికి వలస వచ్చిన ఒక యువ డెలివరీ ఎగ్జిక్యూటివ్తో మాట్లాడారు. స్వగ్రామంలో ఉన్నప్పుడు నిరుద్యోగిగా ఉన్న ఆ యువకుడు.. ఇప్పుడు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ను అద్దెకు తీసుకుని, ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్ల ద్వారా ఆర్డర్లను డెలివరీ చేస్తూ రోజుకు సగటున రూ. 1,500 సంపాదిస్తున్నట్లు వెల్లడించాడు. ఇందులో స్కూటర్ అద్దె వారానికి రూ. 2,100 (రోజుకు సుమారు రూ. 300) నెలకు దాదాపు రూ. 45,000 వరకు సంపాదిస్తున్నాడు.ఈ వివరాలు విన్న ఆకాష్ గుప్తా ఎంతో ఉత్సాహంగా స్పందిస్తూ.. ఈ బిజినెస్ మోడల్ ఒక "సూపర్ హిట్" అని, సంప్రదాయ ఉపాధి అడ్డంకులను తొలగించడంలో ఇది నిజమైన "విప్లవాత్మక మార్పు" అని అభివర్ణించారు. ఆ డబ్బుతో ఏం చేస్తావని అడగ్గా.. ఆ యువకుడు నవ్వుతూ, తను సంపాదించే మొత్తంలో దాదాపు అంతా ఫిరోజాబాద్లోని తన కుటుంబానికే తిరిగి పంపుతున్నానని చెప్పాడు. View this post on Instagram A post shared by Akash Gupta | KaashSeAkash (@kaashseakash)ఈవీల వల్ల తగ్గిన పెట్టుబడి భారంతక్కువ ధరకే ఎలక్ట్రిక్ వాహనాలు అద్దెకు దొరుకుతుండటం వల్ల, గిగ్-ఎకానమీ (Gig-economy/Delivery jobs) లోకి ప్రవేశించాలనుకునే కార్మికులకు పెట్టుబడి భారం తగ్గి, వారికి ఆర్థిక స్థిరత్వాన్ని ఇవ్వడమే కాకుండా, గ్రామీణ కుటుంబాలను ఆదుకోవడానికి ఒక గొప్ప మార్గంగా నిలుస్తోందని ఈ సంఘటన నిరూపించింది అంటున్నారు నిపుణులు. ఇదీ చదవండి: ఢిల్లీ వ్యాపారవేత్తకు బెంగళూరులో ఇస్త్రీ ధరల షాక్!సోషల్ మీడియా స్పందనఆకాష్ గుప్తా షేర్ చేసిన ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సంభాషణ ఎంతో ఆలోచనాత్మకంగా , స్ఫూర్తిదాయకంగా ఉందని కొనియాడారు. ఈ ఇద్దరు కో-ఫౌండర్స్ , పార్ట్నర్స్ ఆకాష్ , ఆయన భార్య మధ్య ఉన్న ప్రత్యేకత ఇదే. ఆకాష్ ఆ డెలివరీ బాయ్ నేపథ్యం, ఉద్యోగ అనుభవంపై దృష్టి పెట్టగా.. ఆయన భార్య మాత్రం జిప్ (Zypp) వాహనాన్ని నడుపుతున్నప్పుడు ఎదురవుతున్న సౌకర్యాలు, సవాళ్లు వంటి ప్రాక్టికల్ విషయాల గురించి అడిగారు. దీంతో ఈ సంభాషణ మరింత అర్థవంతంగా మారింది అంటూ దంపతులిద్దరిపైనా ప్రశంసలు కురిపించారు. ఇదీ స్పందించండి : భారత మామిడి పళ్లపై జపాన్ బ్యాన్ : ఎందుకో తెలుసా? -
డెల్కు ట్రంప్ భారీ డీల్.. బిలియన్ డాలర్ల కాంట్రాక్ట్
డెల్ సంస్థకు పెంటగాన్ నుంచి భారీ కాంట్రాక్ట్ దక్కింది. డొనాల్డ్ ట్రంప్కు అనుబంధంగా ఉన్న ఖాతాలకు భారీ విరాళం ప్రకటించిన కొన్ని నెలలకే, అమెరికా రక్షణ శాఖ నుంచి డెల్ టెక్నాలజీస్కు బహుళ బిలియన్ డాలర్ల ఒప్పందం రావడం అమెరికా వ్యాపార, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. డెల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, సీఈఓ మైఖేల్ డెల్, ఆయన భార్య సుసాన్ డెల్ గతేడాది పిల్లల భవిష్యత్తు కోసం రూపొందించిన “ట్రంప్ అకౌంట్స్” కార్యక్రమానికి 6.5 బిలియన్ డాలర్ల నిధిని ప్రకటించారు. ఇప్పుడు అదే డెల్ సంస్థకు పెంటగాన్ నుంచి 9.7 బిలియన్ డాలర్ల విలువైన భారీ కాంట్రాక్ట్ దక్కడం గమనార్హం.అమెరికా మీడియా సంస్థ సీఎన్బీసీ కథనం ప్రకారం, “డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ అగ్రిమెంట్-II” కింద ఐదేళ్లపాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా డెల్ ఫెడరల్ సిస్టమ్స్ అమెరికా రక్షణ శాఖకు మైక్రోసాఫ్ట్ 365 సేవలు, క్లౌడ్ సబ్స్క్రిప్షన్లు, ఆన్-ప్రెమైజ్ లైసెన్సింగ్ సొల్యూషన్లు అందించనుంది.ఈ ఒప్పందం పూర్తిగా పోటీ ప్రక్రియ ద్వారానే కుదిరిందని అమెరికా రక్షణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. రక్షణ శాఖ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కిర్స్టన్ డేవిస్, యాక్టింగ్ నేవీ సీఐఓ బారీ టానర్ మాట్లాడుతూ, ధరలు, సేవల సామర్థ్యం, మొత్తం వ్యాల్యూ చెయిన్ వంటి అంశాలపై సమగ్రంగా పరిశీలించిన తర్వాతే డెల్ను ఎంపిక చేసినట్లు తెలిపారు.ఈ ఒప్పందం ద్వారా పెంటగాన్, ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ, అమెరికా కోస్ట్ గార్డ్ వంటి విభాగాల్లో సాఫ్ట్వేర్ లైసెన్సింగ్ను ఏకీకృతం చేయనున్నట్లు సమాచారం. దీని వల్ల అమెరికా ప్రభుత్వానికి ప్రతి ఏడాది సుమారు 422 మిలియన్ డాలర్ల వరకు ఆదా అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 2027 ఆర్థిక సంవత్సరానికి 1.5 ట్రిలియన్ డాలర్ల భారీ బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న సమయంలో ఐటీ ఖర్చులను క్రమబద్ధీకరించడంలో ఈ ఒప్పందం కీలకమని భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో మైఖేల్ డెల్ దంపతుల విరాళం కూడా మరోసారి వార్తల్లోకి వచ్చింది. “ఒక చిన్న ఆర్థిక ప్రోత్సాహం పిల్లల జీవితాన్ని ఎంతగా మార్చగలదో మేము చూశాం. వారి అవకాశాల ప్రపంచం విస్తరిస్తుంది” అని విరాళం ప్రకటించినప్పుడు మైఖేల్ డెల్ వ్యాఖ్యానించారు. ఇదే తమ జీవితంలో అతిపెద్ద దాతృత్వ కార్యక్రమమని కూడా ఆయన పేర్కొన్నారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇటీవల ఓ కార్యక్రమంలో మైఖేల్ డెల్ను ప్రశంసిస్తూ డెల్ ఉత్పత్తులు కొనాలంటూ ప్రజలకు పిలుపునివ్వడం గమనార్హం. 2024 ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన తర్వాత ఆయనకు అభినందనలు తెలిపిన మైఖేల్ డెల్.. సైన్స్ అండ్ టెక్నాలజీ సలహా మండలిలో చేరినట్లు సమాచారం.దాతృత్వ కార్యక్రమాల్లో కూడా డెల్ కుటుంబం చురుకుగా వ్యవహరిస్తోంది. ఇటీవలే టెక్సాస్ విశ్వవిద్యాలయం, ఆస్టిన్కు మైఖేల్ డెల్ 750 మిలియన్ డాలర్ల విరాళం ప్రకటించారు. ఈ నిధులతో కృత్రిమ మేధస్సు ఆధారిత వైద్య పరిశోధన కేంద్రం, ఆధునిక వైద్య ప్రాంగణం నిర్మించనున్నారు. -
మా ఐటీ కంపెనీ ఎందుకిలా చేసింది?
ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉద్యోగులను వదిలించుకనేందుకు కంపెనీలు రకరకాల ఎత్తులు వేస్తున్నాయి. బెంగళూరుకు చెందిన ఓ ఐటీ సంస్థ తీసుకున్న “వర్క్ ఫ్రమ్ ఆఫీస్” (WFO) నిర్ణయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సంస్థలో పనిచేస్తున్న ఓ సీనియర్ టెక్కీ, ఐదు రోజుల తప్పనిసరి కార్యాలయ హాజరు విధానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ చేసిన పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. రిమోట్ వర్క్ విధానాన్ని అకస్మాత్తుగా ముగించడం ఉద్యోగుల వ్యక్తిగత జీవితం, ఆర్థిక పరిస్థితులపై భారీ ప్రభావం చూపుతుందని అతడు పేర్కొన్నాడు.దాదాపు పదేళ్ల అనుభవం కలిగిన ఫుల్-స్టాక్ ఇంజనీర్ అయిన ఆ ఉద్యోగి, కంపెనీ గత కొన్నేళ్లుగా వర్క్ ఫ్రమ్ హోమ్కు అనుమతి ఇవ్వడంతో తాను స్వగ్రామంలోనే స్థిరపడ్డానని వెల్లడించాడు. అయితే ఇటీవల డిసెంబర్ నుంచి ప్రతి ఉద్యోగి వారంలో ఐదు రోజులు కార్యాలయానికి హాజరుకావాలని యాజమాన్యం ఆదేశించిందని తెలిపాడు.రిమోట్ విధానంలో పనిచేసినా ప్రాజెక్టుల డెలివరీ, జట్టు సమన్వయం, పనితీరు ఎక్కడా దెబ్బతినలేదని అతడు వివరించాడు. అయినప్పటికీ “టీమ్ కొలాబరేషన్” పేరుతో కార్యాలయానికి రావాలని ఒత్తిడి తెస్తుండటం అసలు అవసరమా అనే ప్రశ్నను లేవనెత్తాడు.అమ్మో మళ్లీ బెంగళూరుకా?కోవిడ్కు ముందు బెంగళూరులో నివసించిన అనుభవాన్ని గుర్తు చేసుకున్న టెక్కీ, అక్కడి ట్రాఫిక్, అధిక అద్దెలు, గంటల కొద్దీ ప్రయాణాలు, పెరిగిన జీవన వ్యయాలు మళ్లీ అదే పరిస్థితుల్లోకి వెళ్లాలనే ఆలోచనకే నిరాశ కలిగిస్తున్నాయని పేర్కొన్నాడు. మంచి జీతం ఉన్నప్పటికీ నగర జీవితం, అధిక వ్యయాల కారణంగా సేవింగ్స్ అనేవి దాదాపు లేకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేశాడు.ఇంటినుంచే ప్రశాంతంగా, సమర్థవంతంగా పని చేసే వాతావరణాన్ని తాను ఏర్పరుచుకున్నానని, అనవసర సమావేశాలు, ఫార్మాలిటీ చర్చలు లేకుండా పని మరింత ఫోకస్తో సాగుతుందని తెలిపాడు. పూర్తిగా డిజిటల్ విధానంలో నడిచే ఉద్యోగానికి కార్యాలయ హాజరు తప్పనిసరి చేయడం వెనుక అసలు ఉద్దేశం ఉత్పాదకత కాదని, ఉద్యోగులపై నియంత్రణ సాధించడమేనన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు.శాశ్వతంగా ఇంటికి పంపేందుకే..ఈ పోస్టుపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. కొన్ని సంస్థలు ప్రత్యక్షంగా ఉద్యోగులను తొలగించకుండా, ఇలాంటి కఠిన WFO విధానాల ద్వారా ఉద్యోగులే స్వయంగా రాజీనామా చేసే పరిస్థితి సృష్టిస్తున్నాయని వ్యాఖ్యానించారు. మరికొందరు బెంగళూరులో ట్రాఫిక్, జీవన వ్యయాలు ఉద్యోగుల మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతున్నాయని అభిప్రాయపడ్డారు.“ఉదయం గంటల తరబడి ట్రాఫిక్లో ఇరుక్కుపోయిన తర్వాత ఉద్యోగి కార్యాలయంలో ఉత్సాహంగా పనిచేయగలడా?” అంటూ ఒక నెటిజన్ చేసిన వ్యాఖ్య కూడా విస్తృతంగా చర్చకు దారితీసింది.కోవిడ్ తర్వాత ఐటీ రంగంలో వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతి బలపడగా, ఇప్పుడు అనేక కంపెనీలు మళ్లీ కార్యాలయ హాజరుపై దృష్టి పెట్టడం ఉద్యోగుల్లో అసంతృప్తికి కారణమవుతోంది. ఈ పరిణామం భవిష్యత్తులో ఐటీ రంగ ఉద్యోగ విధానాలపై మరింత చర్చకు దారి తీసే అవకాశముంది.Mandatory 5-Day Office Feels Like a Massive Step Backby u/web_dev__ in developersIndia -
కోట్ల వ్యయం.. అందని ప్రతిఫలం!
గత కొంతకాలంగా ప్రపంచ టెక్ రంగాన్ని శాసిస్తున్న ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) మాయాజాలం ఇప్పుడు ఒక క్లిష్టమైన దశకు చేరుకుంది. అల్లాద్దీన్ అద్భుత దీపంలా వ్యాపార సామర్థ్యాన్ని పెంచి, ఖర్చులను తగ్గించేస్తుందని నమ్మిన బిగ్ టెక్ కంపెనీలకు ఇప్పుడు ‘రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్’ (ఆర్ఓఐ) లేదా ‘పెట్టుబడిపై రాబడి’ రూపంలో అసలు సవాలు ఎదురవుతోంది. ఏఐ మౌలిక సదుపాయాల కోసం మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఆల్ఫాబెట్, మెటా వంటి దిగ్గజాలు సమష్టిగా 2025లో సుమారు 320 బిలియన్ డాలర్లు ఖర్చు చేశాయని అంచనా. అయితే, ఈ భారీ వ్యయానికి తగ్గ ప్రతిఫలం వస్తోందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఈ పరిణామం ఐటీ ఉద్యోగులకు ఒక రకంగా ఊరటనిచ్చే విషయమేనని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఎందుకంటే, ఏఐ వాడకం పెరుగుతుందనే నెపంతో ఇప్పటివరకు టెక్ కంపెనీలు లేఆఫ్స్ (ఉద్యోగాల కోత)పై తీవ్రంగా ఫోకస్ చేశాయి. కానీ ఇప్పుడు ఏఐ మితిమీరిన ఖర్చులకు బ్రేకులు పడుతుండడంతో మున్ముందు లేఆఫ్స్ భయాలు తగ్గే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.ఉబెర్లో ఇలా..ప్రముఖ రైడ్-హెయిలింగ్ సంస్థ ఉబెర్లో ప్రస్తుతం జరుగుతున్న అంతర్గత పరిణామాలు ఏఐ బడ్జెట్ సంక్షోభానికి అద్దం పడుతున్నాయి. ఉబెర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) ఆండ్రూ మెక్ డొనాల్డ్ ఇటీవల తమ ఏఐ వ్యయాలను సమర్థించుకోవడం కష్టంగా మారుతోందని బహిరంగంగానే అంగీకరించారు. ఉబెర్ ఎగ్జిక్యూటివ్లు అంతర్గతంగా ఈ సమస్యను ‘టోకెన్ మాక్సింగ్’గా పిలుస్తున్నారు. డెవలపర్లు భారీ మొత్తంలో ఏఐ కంప్యూట్ టోకెన్లను వినియోగిస్తున్నప్పటికీ ఆ ఖర్చంతా యూజర్లకు మెరుగైన ప్రొడక్ట్స్గా మారుతోందా లేదా అని ట్రాక్ చేయడానికి ఎలాంటి నమ్మదగిన మార్గం లేకపోవడమే దీనికి కారణం.ఉబెర్ సీటీఓ ప్రవీణ్ నెప్పల్లి నాగ వెల్లడించిన వివరాల ప్రకారం.. క్లాడ్ కోడ్ కోసం కంపెనీ కేటాయించిన మొత్తం 2026 బడ్జెట్ కేవలం నాలుగు నెలల్లోనే పూర్తయింది. అయితే, ఉబెర్ ఉద్యోగులు ఏఐ టూల్స్ను చాలా మెరుగ్గా స్వీకరించారు. కంపెనీలోని 5,000 మందికి పైగా డెవలపర్లలో 92% కంటే ఎక్కువ మంది ప్రతి నెలా ఏఐ అసిస్టెంట్లను వాడుతున్నారు. ప్రస్తుతం ఉబెర్ రాసే కోడ్లో 10% ఏఐ సృష్టించిందే. అయినప్పటికీ, ఏఐ జనరేట్ చేసిన కోడ్ వల్ల కస్టమర్ ఎక్స్పీరియన్స్ మెరుగవుతోందా అంటే లీడర్షిప్ దగ్గర సమాధానం లేదు. ఉత్పాదకత పెరిగిందని చెబుతున్నా దానివల్ల కొత్తగా ఏ ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తయ్యాయనే దానికి, ఖర్చుకు లింక్ దొరకడం లేదు.వ్యూహం మార్చుకుంటున్న మైక్రోసాఫ్ట్, డ్యుయోలింగోకేవలం ఉబెర్ మాత్రమే కాదు, ఏఐ రంగంలో అగ్రగామిగా ఉన్న మైక్రోసాఫ్ట్ సైతం ఇప్పుడు అప్రమత్తమైంది. భారీ ఏఐ విస్తరణల వల్ల పెరుగుతున్న వ్యయాన్ని నియంత్రించడానికి మైక్రోసాఫ్ట్.. ఆంత్రోపిక్ సంస్థకు చెందిన క్లాడ్ కోడ్తో సహా కొన్ని బాహ్య ఏఐ కోడింగ్ సబ్స్క్రిప్షన్లను తగ్గించడం ప్రారంభించినట్లు సమాచారం. మరోవైపు, లాంగ్వేజ్-లెర్నింగ్ ప్లాట్ఫామ్ ‘డుయోలింగో’ గతంలో ఉద్యోగుల పనితీరును ఏఐ వినియోగ మెట్రిక్స్తో లింక్ చేస్తూ తెచ్చిన అంతర్గత విధానాన్ని వెనక్కి తీసుకుంది. ఏఐ సాధనాలు తమ పని నాణ్యతను పెంచకపోయినా కేవలం టార్గెట్ల కోసం వాటిని వాడాల్సి వస్తోందని సిబ్బంది ఫిర్యాదు చేయడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.కంపెనీలు చేస్తున్న ప్రాథమిక తప్పిదం ఏంటి?ప్రముఖ ఏఐ అధ్యాపకుడు అన్ష్ మెహ్రా విశ్లేషణ ప్రకారం.. చాలా కంపెనీలు ఏఐ అమలులో ప్రాథమిక తప్పు చేస్తున్నాయి. ఉద్యోగులు స్వయంగా ఆలోచించి పనిని నిర్మించుకోవడానికి ముందే పూర్తిగా ఏఐ వ్యవస్థలపై ఆధారపడుతున్నారు. దీనివల్ల వచ్చే అవుట్పుట్ను సరిచేయడానికి, డీబగ్ చేయడానికి మళ్లీ మానవ శ్రమ భారీగా అవసరమవుతోంది. ఫలితంగా.. సామర్థ్యం పెరగకుండానే కేవలం ‘టోకెన్ ఖర్చులు’ మాత్రమే కొండలా పేరుకుపోతున్నాయి.ఏఐ స్వీకరణకు సరైన మార్గం (అన్ష్ మెహ్రా సూచనలు)తక్కువ రిస్క్ ఉండే రొటీన్ పనుల్లో మాత్రమే నిర్దిష్ట దశలను ఏఐతో ఆడిట్ చేయాలి. ఆయా విభాగాల్లోని అత్యంత అనుభవజ్ఞులైన వ్యక్తులతో మాత్రమే ఎల్ఎల్ఎమ్లను పరీక్షించి అవుట్పుట్లను ధ్రువీకరించాలి. ఉద్యోగులందరికీ ఏఐ లైసెన్సులు ఇచ్చేసే కంటే ముందు ఏది పని చేస్తుంది, ఏది పని చేయదు అనేది స్పష్టంగా డాక్యుమెంట్ చేయాలి.పెరగనున్న భరోసా!గతంలో ఉబెర్ సీఈఓ దారా ఖోస్రోషాహి మాట్లాడుతూ.. ఏఐ పెట్టుబడుల వైపు వనరులను మళ్లించడం కోసం నియామకాలను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. కానీ, ప్రస్తుత ఆర్థిక సమీక్షలు చూస్తుంటే ఈ వ్యూహం ఎంతవరకు లాభదాయకమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టెక్ కంపెనీలు ఏఐ వైపు అనాలోచితంగా పరుగెత్తి, ఉద్యోగులను తగ్గించుకుంటూ పోవడం ఒక తాత్కాలిక ట్రెండ్ మాత్రమేనని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఏఐ వల్ల ఆశించిన స్థాయిలో ఆర్ఓఐ రాకపోవడం, పైగా కంప్యూటింగ్ బడ్జెట్లు గుల్లవుతుండడంతో కంపెనీలు తిరిగి క్షేత్రస్థాయి వాస్తవాల్లోకి వస్తున్నాయనే వాదనలున్నాయి. ఫలితంగా, ఉద్యోగుల స్థానాన్ని ఏఐ భర్తీ చేస్తుందనే భయాలు తగ్గి, లేఆఫ్స్ వేగం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.ఇదీ చదవండి: కాసుల వేటలో.. కరుగుతోన్న బంధాలు -
ఏఐ వినియోగానికి భారత్ సారథ్యం
అంతర్జాతీయంగా కృత్రిమ మేథ (ఏఐ) వినియోగంలో తదుపరి దశకి సారథ్యం వహించేందుకు భారత్ సర్వసన్నద్ధంగా ఉందని టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (కోర్ఏఐ) జయ్ పారిఖ్ తెలిపారు. దేశీయంగా డెవలపర్ల లభ్యత భారీ స్థాయిలో ఉండటం, కంపెనీలు ఏఐ వినియోగాన్ని వేగవంతం చేయడం మొదలైనవి సానుకూలాంశాలని వివరించారు. భారత్లో రూపొందిన హైపర్స్విచ్, ఈఆర్పీనెక్ట్స్, టూల్జెట్, బ్రూనో లాంటి ఓపెన్ సోర్స్ ప్రాజెక్టులను ప్రపంచవ్యాప్తంగా డెవలపర్లు ఉపయోగిస్తున్నారని ఓ బ్లాగ్పోస్ట్లో పారిఖ్ పేర్కొన్నారు.‘ఏఐ తదుపరి దశ అనేది అత్యుత్తమ మోడల్స్ని ఎవరు రూపొందిస్తున్నారనే అంశంపై కాకుండా వాస్తవ ప్రపంచంలో ప్రభావవంతంగా పని చేసేలా, విశ్వసనీయతతో, వేగవంతంగా ఎవరు వినియోగంలోకి తేగలగుతారనే విషయంపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఈ పరివర్తనకి సారథ్యం వహించడానికి భారత్ సర్వసన్నద్ధంగా ఉంది‘ అని తెలిపారు. డెలాయిట్ నిర్వహించిన 2026 సర్వే ప్రకారం విస్తృత స్థాయిలో ఏఐ వినియోగిస్తున్న 15 దేశాల జాబితాలో భారత్కి అగ్రస్థానం దక్కడం ఇందుకు నిదర్శనం అని పేర్కొన్నారు. ఈ సర్వేలో పాల్గొన్న సంస్థల్లో 40 శాతం ఎంటర్ప్రైజ్లు ఏఐని గణనీయంగానో లేదా పూర్తి స్థాయిలోనో వినియోగిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయంగా ఇది సగటున 28 శాతంగా ఉంది. పటిష్టంగా డిజిటల్ మౌలిక సదుపాయాలు.. దేశీయంగా డిజిటల్ పబ్లిక్ మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉండటం భారత్కి మరో సానుకూలాంశమని పారిఖ్ చెప్పారు. ‘భారత్లో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) పటిష్టంగా ఉంటోంది. గత దశాబ్దకాలంలో గుర్తింపు ధృవీకరణ వ్యవస్థ, చెల్లింపుల వ్యవస్థ, డేటా ప్లాట్ఫాంలను భారత్ విస్తృత స్థాయిలో తీర్చిదిద్దింది. డిజిటల్ చెల్లింపుల విధానమైన యూపీఐ ప్రస్తుతం నెలకు 2,000 కోట్ల పైగా లావాదేవీలను ప్రాసెస్ చేస్తోంది. ఇది అంతర్జాతీయంగా జరిగే రియల్ టైమ్ చెల్లింపుల్లో దాదాపు సగం. డీపీఐతో ఏఐ అనుసంధానమవుతున్న నేపథ్యంలో ఆర్థిక సేవల నుంచి వైద్యం, విద్య వరకు అన్నింటా కృత్రిమ మేథ కీలక పాత్ర పోషించనుంది. తద్వారా ప్రపంచంలోనే తొలి భారీ ఏఐ పబ్లిక్ ఇన్ఫ్రా వ్యవస్థగా భారత్ ఎదగనుంది‘ అని పారిఖ్ తెలిపారు. -
టెలికాం రంగంలో జియో సంచలనం
భారతీయ టెలికాం రంగంలో సరికొత్త విప్లవానికి రిలయన్స్ జియో నాంది పలికింది. సామాన్యుడికి సైతం ప్రీమియం వినోదాన్ని చేరువ చేస్తూ.. కేవలం రూ.200 ధరతో ‘జియో ఓటీటీ పాస్’ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఒక్క 28 రోజుల ప్యాక్తో 15 టాప్ ఓటీటీ ప్లాట్ఫారమ్ల యాక్సెస్, 1,000కు పైగా లైవ్ టీవీ ఛానెల్స్, 30 జీబీ హై-స్పీడ్ డేటాతో పాటు అపరిమిత 5జీ సేవలను అందిస్తూ వినియోగదారులపై ఆఫర్ల వర్షం కురిపించింది.నేటి (మే 27, 2026) నుంచే ఈ సరికొత్త పాస్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టెలికాం సర్కిళ్లలో అందుబాటులోకి వచ్చినట్లు సంస్థ ప్రకటించింది. యాక్టివ్ బేస్ ప్లాన్ ఉన్న జియో వినియోగదారులందరూ ఆన్లైన్, ఆఫ్లైన్ మార్గాల ద్వారా దీనిని పొందవచ్చని కంపెనీ తెలిపింది.రూ.1,500 విలువైన ప్రయోజనాలు..ప్రస్తుత డిజిటల్ కాలంలో విడివిడిగా ఓటీటీ సబ్స్క్రిప్షన్లు తీసుకోవాలంటే నెలకు వందల రూపాయల భారం పడుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు ఆర్థికంగా భారీ ఉపశమనం కలిగించేలా జియో ఈ ఎంటర్టైన్మెంట్ పాస్ను డిజైన్ చేసింది. కేవలం రూ.200లకే లభించే ఈ ప్యాక్ ద్వారా వినియోగదారులు నెలకు సుమారు రూ.1,500 విలువైన ప్రయోజనాలను ఉచితంగా పొందడం విశేషం. వీడియో స్ట్రీమింగ్, లైవ్ టెలివిజన్, హై-స్పీడ్ కనెక్టివిటీల కలయికగా ఈ ప్లాన్ నిలుస్తోందని కంపెనీ చెప్పింది.15 ప్రీమియం ఓటీటీలు..యూట్యూబ్ ప్రీమియం: టీవీ, టాబ్లెట్, మొబైల్ పరికరాల్లో ప్రకటనలు లేని (యాడ్స్ ఫ్రీ) స్ట్రీమింగ్, బ్యాక్గ్రౌండ్ ప్లే, ఆఫ్లైన్ డౌన్లోడ్స్ సౌకర్యం.జియోహాట్స్టార్ మొబైల్ ప్లస్ హాలీవుడ్: లైవ్ స్పోర్ట్స్, హాట్స్టార్ ఒరిజినల్స్, బ్లాక్బస్టర్ హాలీవుడ్ కంటెంట్ వీక్షించే అవకాశం.అమెజాన్ ప్రైమ్ వీడియో(మొబైల్ ఎడిషన్): మొబైల్ పరికరాల్లో ప్రైమ్ వీడియో కంటెంట్ యాక్సెస్.జీయో టీవీ ద్వారా మరో 12 ప్రముఖ ఓటీటీలు..SonyLiv, ZEE5, Lionsgate Play, Discovery+, Sun NXT, FanCode, Kanccha Lannka, Planet Marathi, Chaupal, Hoichoi, TimesPlay, Tarang Plus.150+ పెయిడ్ ఛానెల్స్ ఉచితం!వినోదంతో పాటు సమాచారాన్ని అందించేందుకు జియో టీవీ ద్వారా 1,000కు పైగా లైవ్ టీవీ ఛానెల్స్ను ఈ ప్యాక్లో చేర్చారు. ఇందులో ప్రముఖ బ్రాడ్కాస్టర్లకు చెందిన 150కు పైగా ప్రీమియం పెయిడ్ ఛానెల్స్ ఉండటం విశేషం. వాటిలో కొన్ని ప్రముఖ ఛానెళ్లు.. స్టార్ప్లస్ హెచ్డీ, కలర్స్ హెచ్డీ, సోనీ ఎంటర్టైన్మెంట్, సెట్ హెచ్డీ, సోనీ సాబ్ హెచ్డీ, సన్ టీవీ నెట్వర్క్, కేటీవీ హెచ్డీ, వార్నర్ బ్రోస్, డిస్కవరీ.. వంటివి ఉన్నాయి.అపరిమిత 5జీ యాక్సెస్వినోదానికి నెట్వర్క్ అంతరాయం కలగకుండా ఈ పాస్ ద్వారా 30 జీబీ హై-స్పీడ్ 4G/5G డేటా లభిస్తుంది. అంతేకాదు, వినియోగదారుడి యాక్టివ్ బేస్ ప్లాన్ చెల్లుబాటు కాలం వరకు అపరిమిత 5జీ కనెక్టివిటీని జియో ఆఫర్ చేస్తోంది. ఈ పాస్ గరిష్టంగా 28 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది.ఇదీ చదవండి: కాసుల వేటలో.. కరుగుతోన్న బంధాలు -
టెలికం యూజర్లు @ 133.7 కోట్లు
భారతీ ఎయిర్టెల్ కొత్త చందాదారులను ఆకర్షించడంలో ఏప్రిల్లోనూ ముందు నిలిచింది. 34.82 లక్షల కొత్త కస్టమర్లను సొంతం చేసుకుంది. ఇందులో 31.39 లక్షలు వైర్లెస్ (మొబైల్) విభాగం నుంచి ఉన్నారు. ఇదే నెలలో జియో 30.84 లక్షల కొత్త కస్టమర్లను ఆకర్షించి రెండో స్థానంలో నిలిచింది. ఇందులో 29.42 లక్షల మంది మొబైల్ చందాదారులు ఉన్నారు. ఏప్రిల్లో టెలికం చందాదారులు నికరంగా 69.5 లక్షలు పెరిగి 133.75 కోట్లకు చేరినట్టు ట్రాయ్ విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.వొడాఫోన్ ఐడియా 53,257 మంది కొత్త కస్టమర్లను తన నెట్వర్క్ పరిధిలో చేర్చుకుంది. బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ కిందకు కొత్తగా 76,175 మంది వచ్చి చేరారు. వైర్లైన్ కస్టమర్ల సంఖ్య మార్చి చివరికి 4.82 కోట్లుగా ఉంటే, ఏప్రిల్ చివరికి 4.85 కోట్లకు పెరిగింది. ఇక మొత్తం మీద 52.69 కోట్ల చందాదారులతో పరిశ్రమలో రిలయన్స్ జియో నంబర్–1 స్థానంలో ఉంది. 37.3 కోట్ల మంది చందాదారులతో ఎయిర్టెల్, 12.8 కోట్ల మంది చందాదారులతో వొడాఫోన్ ఐడియా, 2.7 కోట్ల మంది చందాదారులతో బీఎస్ఎన్ఎల్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రతీ కనెక్షన్ను ఒక సబ్స్క్రయిబర్గా పరిగణిస్తుంటారు. ‘ప్రయారిటీ’ వల్ల ప్రీపెయిడ్ సేవల నాణ్యత తగ్గదు: ఎయిర్టెల్ పోస్ట్పెయిడ్ యూజర్ల కోసం కొత్తగా ప్రవేశపెట్టిన ‘ప్రయారిటీ’ సర్వీస్ వల్ల ప్రీపెయిడ్ యూజర్లకు అందించే సేవల నాణ్యత తగ్గదని టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్ తెలిపింది. నెట్ న్యూట్రాలిటీ నిబంధనలకు ఇది విరుద్ధం కాదని స్పష్టం చేసింది. దీనిపై పార్లమెంటరీ కమిటీతో జరిగిన సమావేశంలో కంపెనీ ఈ మేరకు వివరణ ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మెరుగైన సేవలను అందించడానికి 5జీ ఫీచర్లను ఉపయోగించకపోనివ్వడం వల్ల రాబోయే 6జీ సేవలకు విఘాతం కలుగుతుందని సంస్థ పేర్కొంది. అధికంగా చెల్లించే పోస్ట్పెయిడ్ యూజర్లకు రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో కూడా మరింత వేగవంతమైన సేవలు అందించేందుకు నెట్వర్క్లోని కొంత భాగాన్ని ప్రత్యేకంగా కేటాయించేలా మే 19న ఎయిర్టెల్ ప్రయారిటీ పోస్ట్పెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది.ఇదీ చదవండి: కాసుల వేటలో.. కరుగుతోన్న బంధాలు -
కృత్రిమ మేధో ప్రవాహం.. ఉపాధికి శరాఘాతం!
సాంకేతికత ఎంత వేగంగా దూసుకుపోతున్నా మానవీయ విలువలను విస్మరిస్తే సమాజ సమతుల్యత దెబ్బతింటుందని వాటికన్ వేదికగా ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. మే 25న వాటికన్ ఆడిటోరియంలో పోప్ లియో చారిత్రాత్మక ఎన్సైక్లికల్ (పోప్ అధికారిక పత్రం) ‘మాగ్నిఫికా హ్యుమానిటాస్’ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఏఐ పరిశోధనా సంస్థ ఆంత్రోపిక్ సహ వ్యవస్థాపకుడు క్రిస్టోఫ్ ఓలా పాల్గొని ఏఐ వల్ల భవిష్యత్తులో సంభవించబోయే ఉద్యోగ నష్టాలపై వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో పోప్ పక్కనే కూర్చున్న క్రిస్టోఫ్ ఓలా ఏఐ విస్తరణ వల్ల మానవ శ్రమకు పొంచి ఉన్న ముప్పును స్పష్టంగా వివరించారు.భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకంప్యూటర్ కోడింగ్, కంటెంట్ రైటింగ్, డేటా అనలిటిక్స్, రోజువారీ ఆఫీస్ పనులను క్షణాల్లో పూర్తి చేయగల సరికొత్త ఏఐ సాధనాలను కంపెనీలు మార్కెట్లోకి వదులుతున్న తరుణంలో ఓలా వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘ఏఐ సాంకేతికత మానవ శ్రమను భారీగా భర్తీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే ఉపాధి కోల్పోయి వీధిన పడే లక్షలాది మందికి సామాజిక, ఆర్థిక మద్దతు ఇవ్వడం ప్రపంచ దేశాల చారిత్రక, నైతిక బాధ్యత అవుతుంది’ అన్నారు. సమాజాలు, ప్రభుత్వాలు ఊహించిన దానికంటే అత్యంత వేగంగా ఏఐ ఉపాధి రంగాలను పునర్నిర్మిస్తోందని, దీనికి అడ్డుకట్ట వేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.మాగ్నిఫికా హ్యుమానిటాస్పోప్ లియో విడుదల చేసిన ‘మాగ్నిఫికా హ్యుమానిటాస్’ ఎన్సైక్లికల్ పూర్తిగా కృత్రిమ మేధస్సు యుగంలో మానవాళి ఉనికిని, హక్కులను రక్షించడంపైనే దృష్టి సారించింది. అదుపు లేని, వేగవంతమైన సాంకేతిక అభివృద్ధి వల్లే ప్రస్తుత ఆధునిక సంక్షోభాలు మరింత తీవ్రమవుతున్నాయని ఈ పత్రంలో పోప్ హెచ్చరించారు.ఎన్సైక్లికల్లోని ముఖ్యమైన అంశాలులగ్జరీగా మారిన ఏఐ కంపెనీలపై ప్రభుత్వాలు కఠినమైన నియంత్రణను కలిగి ఉండాలి.డిజిటల్ ప్రపంచంలో కేవలం కొన్ని సంస్థల చేతుల్లోనే అధికారం ఏకీకృతం కావడం సమాజానికి శ్రేయస్కరం కాదు.ఏఐ అనేది కేవలం సాంకేతిక ఆవిష్కరణ లేదా వ్యాపార సమస్య కాదు, అది నేరుగా మానవ జీవితాలను ప్రభావితం చేసే నైతిక అంశం.ఒత్తిడిలో ఏఐ సంస్థలుప్రస్తుతం ఫ్రాంటీర్ ఏఐ ల్యాబ్లు ఎదుర్కొంటున్న వాణిజ్యపరమైన సవాళ్లను కూడా క్రిస్టోఫ్ ఓలా ఈ సందర్భంగా ప్రస్తావించారు. తీవ్రమైన వ్యాపార పోటీ, భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు, వ్యక్తిగత ఆశయాల నడుమ ఈ కంపెనీలు పనిచేస్తున్నాయని ఆయన అంగీకరించారు. తీవ్రమైన అంతర్జాతీయ వాణిజ్య పోటీ వల్ల నైతిక విలువల కంటే లాభాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయని చెప్పారు. దాంతో సాంకేతికత దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందన్నారు. మంచి ఉద్దేశాలు ఉన్న పరిశోధకులు సైతం మార్కెట్ శక్తుల ఒత్తిడికి లొంగిపోక తప్పడం లేదని పేర్కొన్నారు. అందుకే ఏఐ సంస్థలపై విమర్శలు, పారదర్శకమైన బహిరంగ పరిశీలన అత్యంత అవసరమని ఓలా స్పష్టం చేశారు.ఇదీ చదవండి: స్థిరమైన రాబడి.. నమ్మకమైన పెట్టుబడి -
వచ్చేస్తోంది కొత్త రకం స్టవ్!
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల కంటే వంటను చౌకగా చేయగల, కొత్త ఇథనాల్ ఆధారిత స్టవ్ టెక్నాలజీని ఆవిష్కరించారు. ఇది భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న బయోఫ్యూయల్ మిషన్లో మరో ప్రధాన ముందడుగును సూచిస్తుంది.నాగ్పూర్లో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడుతూ.. ఇథనాల్ ఆధారిత కొత్త స్టవ్ ద్వారా, వంట గ్యాస్ సిలిండర్ల కంటే తక్కువ ఖర్చుతోనే వంట చేయవచ్చని తెలిపారు. ఇది దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతికతగా పేర్కొన్నారు. ఇథనాల్ను నీటితో కలిపి మంటను ఉత్పత్తి చేయడం ద్వారా ఈ స్టవ్ పనిచేస్తుంది. ఇది సంప్రదాయ ఎల్పీజీ వంటి ఇంధనాల కంటే తక్కువ కాలుష్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి గృహ వినియోగానికి ఇది ఒక ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉంది.భారతదేశం చమురు అవసరాల కోసం.. సుమారు 87 శాతం దిగుమతులపైనే ఆధారపడుతుంది. ఈ పరిస్థితిని తగ్గించేందుకు ప్రభుత్వం ఇథనాల్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని పెంచుతోంది. ఇప్పటికే దేశంలో పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమం కలిపి వినియోగించడం కొనసాగుతోంది. 2014లో 1.5 శాతం నుంచి 2025 నాటికి దాదాపు 20 శాతానికి ఇథనాల్ వినియోగం పెరిగింది.ఇదీ చదవండి: పెరుగుతున్న ధరలు.. నిర్మలా సీతారామన్ హెచ్చరిక!ఇథనాల్ అనేది ప్రధానంగా.. చెరకు, మొక్కజొన్న, వ్యవసాయ వ్యర్థాల నుంచి ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఇది మండినప్పుడు కూడా తక్కువ కాలుష్యం విడుదలవుతుంది. అందువల్ల దీనిని పర్యావరణహిత ఇంధనంగానే పరిగణిస్తారు.ఈ కొత్త టెక్నాలజీ విజయవంతమైతే.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వంట గ్యాస్పై ఆధారపడటం చాలావరకు తగ్గుతుంది. ఇదే జరిగితే.. ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంది. అయితే దీనికోసం భారీ మొత్తంలో ఇథనాల్ ఉత్పత్తి అవసరం అవుతుంది. సరఫరా మాత్రమే కాకుండా.. భద్రత కూడా చాలా ముఖ్యం. ఇవన్నీ సాధ్యమైతేనే ప్రజలు దీనిని విశ్వసిస్తారు. వినియోగించడానికి ముందుకు వస్తారు. -
ఉద్యోగాలపై AI ప్రభావం.. యువతకు పిచాయ్ సందేశం!
కృత్రిమ మేధస్సు (AI) గురించి ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా యువతలో.. విద్యార్థుల్లో ఏఐ తమ ఉద్యోగాలపై ప్రభావం చూపుతుందేమో అనే భయం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.ఇటీవల 'హార్డ్ ఫోర్క్' అనే పాడ్కాస్ట్లో సుందర్ పిచాయ్ మాట్లాడుతూ.. యువతపై తనకు ఎంతో నమ్మకం ఉందని తెలిపారు. ఏఐ వల్ల మార్పులు వచ్చినా, కొత్త తరం ఆ సవాళ్లను స్వీకరించి మంచి భవిష్యత్తును నిర్మిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో జరగబోయే పట్టభద్రుల సభలో పిచాయ్ ప్రసంగించబోతున్నారు. ఈ సందర్భంగా.. పాడ్కాస్ట్ హోస్ట్ ఏఐ గురించి మాట్లాడితే.. విద్యార్థులు విమర్శిస్తే, ఏమని జవాబిస్తారు? అని సరదాగా ప్రశ్నించారు. 'ప్రతి తరం సవాళ్లను ఎదుర్కొని ముందుకు సాగింది. ఈ తరం కూడా అలాగే సవాళ్లను అధిగమించి మంచి ప్రపంచాన్ని నిర్మిస్తుంది' అని పిచాయ్ సమాధానం ఇచ్చారు.యువత, విద్యార్థులు ఏఐ ప్రభావాన్ని మాత్రమే అనుభవించరు. భవిష్యత్తులో ఏఐ అభివృద్ధిని ముందుకు నడిపించే ప్రధాన శక్తిగా కూడా మారతారు. వీళ్ళే AI పురోగతికి కారణమవుతారు, దాని ప్రభావాలను కూడా ఎదుర్కొంటారని పిచాయ్ వెల్లడించారు. యువత కొత్త అవకాశాలను సృష్టించే శక్తి కలిగిన వారని ఆయన స్పష్టం చేశారు.ఇటీవల చాలా కంపెనీలు.. ఉద్యోగులను తొలగించడానికి ప్రధాన కారణం ఏఐ అని చెబుతున్నారు. దీనివల్ల ఉద్యోగాల భద్రతపై మరింత ఆందోళన పెరిగింది. ముఖ్యంగా కొత్తగా చదువు పూర్తి చేసిన యువతలో నిరుద్యోగం కూడా పెరుగుతోందని నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు AI గురించి భయపడటం సహజమని పిచాయ్ అంగీకరించారు.టెక్నాలజీలో వచ్చే మార్పులు ఎప్పుడూ సమాజంలో భయాన్ని కలిగిస్తాయి. గతంలో వచ్చిన సాధారణ సాంకేతిక మార్పులకు కూడా ప్రజలు భయపడ్డారు. కానీ.. తరువాత అవే అభివృద్ధికి దోహదపడ్డాయని ఆయన గుర్తుచేశారు. AIను కూడా సరైన విధంగా ఉపయోగిస్తే మానవ సమాజానికి ఉపయోగకరంగా మారుతుందని చెప్పారు.ఏఐ వల్ల జరిగే నష్టాలను మాత్రమే కాకుండా.. ప్రయోజనాలను కూడా ప్రజలకు స్పష్టంగా చూపించాల్సిన బాధ్యత టెక్నాలజీ రంగంపై ఉందని సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. పరిశ్రమలు, కంపెనీలు, ప్రభుత్వాలు కలిసి బాధ్యతాయుతంగా AIని అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రజల నమ్మకాన్ని పెంచేందుకు ఇంకా చాలా పని చేయాల్సి ఉందని ఆయన అంగీకరించారు. -
రూ.3.7 కోట్ల జాబ్.. AI భవిష్యత్తుపై అలర్ట్!
ఓపెన్ఏఐ కంపెనీ.. ఏఐ భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశాలపై పరిశోధనలు కొనసాగిస్తోంది. తాజాగా.. సంస్థ ప్రకటించిన ఒక ప్రత్యేక ఉద్యోగం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఉద్యోగానికి సంవత్సరానికి దాదాపు 4,45,000 డాలర్లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 3.7 కోట్లు) జీతం ఇవ్వనున్నట్లు సమాచారం.ఓపెన్ఏఐ ప్రకటించిన ఈ జాబ్ సాధారణ AI అభివృద్ధికి సంబంధించినది కాదు. భవిష్యత్తులో ఏఐ మనుషుల సహాయం లేకుండానే తనను తాను మరింత తెలివిగా మార్చుకుంటే.. ఏమవుతుందనే ప్రశ్నకు సమాధానం కనుగొనే ప్రయత్నంలో భాగం. ఈ ఉద్యోగం ప్రిపేర్డ్నెస్ సేఫ్టీ టీమ్లో భాగం.ప్రిపేర్డ్నెస్ సేఫ్టీ టీమ్ అత్యంత శక్తివంతమైన ఏఐ వ్యవస్థలు భవిష్యత్తులో మానవాళికి ఎలాంటి ప్రమాదాలు కలిగించవచ్చో.. ముందుగానే అంచనా వేసి వాటికి రక్షణ మార్గాలు రూపొందిస్తుంది.ఈ ఉద్యోగ ప్రకటనలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అభ్యర్థులు కేవలం సాంకేతికంగా బలంగా ఉండడమే కాకుండా.. వ్యూహాత్మక ఆలోచన, సరైన తీర్పు వంటివి కలిగి ఉండాలని సంస్థ స్పష్టంగా వెల్లడించింది. ఎందుకంటే ఇక్కడ చేయాల్సిన పని ఏమిటంటే.. ప్రస్తుతం లేని, భవిష్యత్తులో ఏర్పడే ప్రమాదాల గురించి ముందుగానే ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది.ఇదీ చదవండి: ఆ టీమ్ వల్లే సమస్యలు.. అందుకే లేఆఫ్స్! -
కృత్రిమ మేధతో ఉద్యోగాలు ఊడుతాయా?
ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) ప్రకంపనలు సృష్టిస్తోంది. దీని పుణ్యమా అని భవిష్యత్తులో ఐటీ సహా పలు రంగాల్లో భారీగా ఉద్యోగాల కోత తప్పదనే ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో.. సిలికాన్ వ్యాలీలోని గ్లీన్ కంపెనీ వ్యవస్థాపకుడు, భారతీయ సంతతికి చెందిన అరవింద్ జైన్ భిన్నమైన, అత్యంత సానుకూల దృక్పథాన్ని వినిపించారు. ఏఐ ఎప్పటికీ మానవ సిబ్బందిని భర్తీ చేయలేదని, బదులుగా వారి పనితీరును, సామర్థ్యాలను మరింత మెరుగుపరుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఏఐ-ఆధారిత ఎంటర్ప్రైజ్ సెర్చ్ ప్లాట్ఫామ్ గ్లీన్ సీఈఓ అయిన అరవింద్ జైన్.. ‘ఫార్చ్యూన్’ నిర్వహించిన వర్క్ప్లేస్ ఇన్నోవేషన్ సమ్మిట్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.భర్తీ చేసేంత లేదు..ప్రస్తుతం కార్పొరేట్ ప్రపంచంలో ఏ ఉద్యోగాలను ఏఐతో భర్తీ చేయవచ్చనే చర్చ విస్తృతంగా సాగుతోందని, అయితే క్షేత్రస్థాయిలో వాస్తవాలు వేరేలా ఉన్నాయని అరవింద్ జైన్ పేర్కొన్నారు. ‘నా ఉద్దేశం ప్రకారం.. భవిష్యత్తులో ఎప్పటికీ ఏఐ ఏ మానవ సిబ్బందినీ భర్తీ చేయదు. ఇది వాస్తవానికి మనల్ని మరింత సమర్థులుగా మారుస్తుంది. అత్యున్నత నాణ్యతతో కూడిన పనులు చేయడానికి వీలు కల్పిస్తుంది. మేము ప్రపంచంలోని అతిపెద్ద సంస్థలతో కలిసి పని చేస్తున్నాం. ప్రస్తుతానికైతే సాంకేతికత కారణంగా ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు’ అని అరవింద్ జైన్ తెలిపారు.ఉద్యోగులకు ఏఐ ఒక కో-పైలట్లాగా పనిచేయాలని ఆయన ప్రతిపాదించారు. రోజువారీగా సాగే రొటీన్, పునరావృత పనులను ఏఐకి అప్పగించడం ద్వారా.. మానవులు తమ ఆలోచనా శక్తి, సృజనాత్మకత, సమస్యల పరిష్కారం వంటి కీలకమైన అంశాలపై మరింత దృష్టి పెట్టవచ్చని ఆయన విశ్లేషించారు.దిగ్గజాల హెచ్చరికలుభవిష్యత్ శ్రామిక శక్తిపై అరవింద్ జైన్ వ్యక్తంచేసిన అంచనాలు, ప్రస్తుత అంతర్జాతీయ వ్యాపార వర్గాల సెంటిమెంట్కు పూర్తిగా విరుద్ధంగా ఉండటం గమనార్హం. ప్రపంచ స్థాయి దిగ్గజాలు ఇప్పటికే ఏఐ ముప్పుపై హెచ్చరిస్తున్నారు. ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడీ.. రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే ఏఐ కారణంగా దాదాపు సగం వరకు వైట్-కాలర్ ఉద్యోగాలు తుడిచిపెట్టుకుపోతాయని పదేపదే హెచ్చరించారు. జేపీ మోర్గాన్ అధినేత జేమీ డిమోన్, ఫోర్డ్ సీఈఓ జిమ్ ఫార్లీ.. అమెరికా సహా అంతర్జాతీయంగా వైట్-కాలర్ ఉద్యోగాలను ఏఐ ఆక్రమించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: రూ.100 అనేది కేవలం సంఖ్యే.. ఒత్తిడి వద్దు! -
AIతో నెలకు లక్ష రూపాయలు సంపాదించడం ఎలా?
సాక్షి,బెంగళూరు: ప్రపంచ వ్యాప్తంగా అన్నీ రంగాల్లో ఏఐ చొచ్చుకుపోతుంది. దీంతో పెద్ద పెద్ద టెక్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల నుంచి చిన్న చిన్న సంస్థల్లో రెగ్యులర్గా ఒకే పనిచేసే ఉద్యోగుల వరకు ఉపాధిని కోల్పోతున్నారు. అయితే, ఇప్పుడు అదే ఏఐ వినియోగంతో పలువురు లక్షలు సంపాదిస్తున్నారు. తాజాగా, బెంగళూరులో కూరగాయలు అమ్మే యువకుడు ఏఐ సాయంతో గంటకు రూ.350 నెలకు రూ.లక్ష రూపాయల వరకు సంపాదిస్తున్నాడని ఇన్స్టాగ్రామ్ యూజర్ వైభవ్ తన ఇన్స్టా అకౌంట్లో ఓ వీడియోని షేర్ చేశారు.‘నేను నా స్కూటీ మీద అలా వెళ్తుండగా ఈ దృశ్యం నా కంటపడింది. వెంటనే కుతూహులంగా వెళ్లి హెడ్ బ్యాండ్ గురించి ఆరా తీశాను. ఐఫోన్, మెమరీ కార్డ్తో హెడ్బ్యాండ్తో డేటా కలెక్ట్ చేస్తున్నాడు అని పేర్కొన్నారు. ఆ వీడియోలో ఓ యువకుడు రియల్ టైం డేటా కలెక్ట్ చేసేలా ఏఐ డేటా కలెక్షన్ హెడ్ గేర్ను ధరించాడు. హెడ్గేర్ను తలకు ధరించిన ఆ యువకుడు కరివేపాకు కట్టలు కడుతున్నారు. కరివేపాకు కట్టలను కొనుగోలు దారులకు అమ్ముతున్నాడు. అమ్మే సమయంలో కొనుగోలు దారులు, అమ్మకం దారుల మధ్య ఏం జరుగుతుంది అనే విషయాల్ని హెడ్గేర్ సాయంతో డేటాను సేకరిస్తున్నాడు.అలా సేకరించిన రియల్ టైమ్ డేటాను ఏఐ కంపెనీలకు అందిస్తాడు. రియల్ డేటా విలువైనదిగా ఉండటంతో సంస్థలు భారీ మొత్తాన్ని చెల్లిస్తాయి. ఈ ఘటనలో కరివేపాకు అమ్మే యువకుడు నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు. ఏఐ కంపెనీలు హెడ్ గేర్ల సాయంతో కంపెనీలకు కావాల్సిన డేటాను వీడియో, ఆడియో, సంభాషణల రూపంలో తీసుకుంటాయి. తీసుకున్న డేటాను ఏఐ మోడళ్లకు అప్లయి చేస్తాయి. అలా అప్లయి చేయడం వల్లే యూజర్లుకు అందిస్తున్న సమాచారం నిజమా? కాదా? అని నిర్ధారించుకుంటాయి. యూజర్లకు అందించే డేటాను..రియల్ టైం డేటాతో సరిపోల్చి యూజర్కు ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తాయి. ఏఐ డేటా గేర్ కనెక్షన్ ధరపై స్పష్టత లేదు. కానీ ఇది సాధారణంగా ఐఫోన్ లేదా కెమెరా, మెమరీ కార్డ్, హెడ్బ్యాండ్ వంటి పరికరాలతో తయారు చేసిన తాత్కాలిక టూల్. ఈ గేర్ను కంపెనీలు గిగ్ వర్కర్లకు అందిస్తాయి. ఓ వైపు పనిచేసుకుంటూనే మరో వైపు అదనపు ఆదాయం కోసం పలువురు ఇలాంటి మార్గాల్ని అన్వేషిస్తున్నారు. పలువురు ఈ పరికరాన్ని ధరించి గంటకు రూ.350 వరకు సంపాదిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. View this post on Instagram A post shared by Vaibhav | Peaks & Protein (@vai.bhaaavvv) -
తొలగించిన ఆ 8 వేల మందికి మెటా ఇచ్చేది ఇదే..
టెక్ దిగ్గజం 'మెటా' (Meta) పెద్ద ఎత్తున పునర్నిర్మాణ ప్రక్రియను చేపడుతూ, దాదాపు 8,000 మంది ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది. ఇది కంపెనీ మొత్తం శ్రామిక శక్తిలో 10 శాతానికి సమానం. ఈ ఏడాది మార్చి ముగిసే నాటికి మెటాలో సుమారు 78,000 మంది ఉద్యోగులు ఉన్నారు. టెక్ పరిశ్రమలో ఈ లేఆఫ్లు తీవ్ర సంచలనం సృష్టించినప్పటికీ, తొలగించిన ఉద్యోగుల కోసం మెటా ప్రకటించిన తొలగింపు ప్యాకేజీ (Severance Package) అందరి దృష్టిని ఆకర్షించింది. బిజినెస్ ఇన్సైడర్ నివేదిక ప్రకారం అమెరికా ఉద్యోగులకు లభించే ప్రయోజనాలు ఇలా ఉన్నాయి..బేస్ పే: 16 వారాల ప్రాథమిక వేతనంతో పాటు, సంస్థలో పనిచేసిన ప్రతి సంవత్సరానికి అదనంగా రెండు వారాల వేతనాన్ని సీవెరన్స్ ప్యాకేజీగా అందిస్తారు.ఆరోగ్య సంరక్షణ: ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు 18 నెలల పాటు ఉచిత ఆరోగ్య సంరక్షణ కవరేజీని కొనసాగిస్తారు.అంతర్జాతీయ ఉద్యోగులు: యూఎస్ వెలుపల ఉన్న ఉద్యోగులకు వారి దేశాల నిబంధనలను బట్టి ఇలాంటి ప్రయోజనాలే అందుతాయి.ఏఐ బృందాల్లోకి పునర్వ్యవస్థీకరణఉద్యోగాల కోతతో పాటు కంపెనీ అంతర్గతంగా మరో పెద్ద మార్పు చేపట్టింది. కొత్తగా ఏర్పాటు చేసిన ఏఐ-కేంద్రీకృత బృందాల్లోకి 7,000 మందికి పైగా ఉద్యోగులను బదిలీ చేస్తున్నట్లు మెటా చీఫ్ పీపుల్ ఆఫీసర్ జానెల్ గేల్ ప్రకటించారు. ఈ తొలగింపులు, అంతర్గత బదిలీల వల్ల మెటాలోని మొత్తం శ్రామిక శక్తిలో 20% మంది ప్రభావితం కానున్నారు."మేము ఇప్పుడు వేగంగా, ఎక్కువ యాజమాన్య బాధ్యతలతో దూసుకుపోగల చిన్న బృందాలతో కూడిన నిర్మాణంతో పనిచేసే దశకు చేరుకున్నాము" అని రాయిటర్స్ పరిశీలించిన ఒక మెమోలో జానెల్ గేల్ పేర్కొన్నారు.వ్యూహాత్మక మార్పులు - భారీ ఖర్చులుఅంతర్గత పని విధానం, ఉత్పత్తులు రెండింటిలోనూ 'ఏఐ ఏజెంట్లను' కేంద్ర బిందువుగా మార్చే ప్రయత్నంలో భాగంగానే మెటా ఈ వ్యూహాత్మక మార్పులు చేస్తోంది. ఇందుకోసం ఏఐ(AI)లో పెట్టుబడులను భారీగా పెంచుతోంది. కొత్త ఏఐ డేటా సెంటర్ల నిర్మాణం, అధిక మెమరీ ధరల కారణంగా ఈ ఏడాది మెటా మూలధన వ్యయాలు ఏకంగా 145 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని కంపెనీ తెలిపింది.మరోవైపు, 2026 ద్వితీయార్థంలో మెటా మరిన్ని ఉద్యోగ కోతలను ప్రకటించే అవకాశం ఉందని అంచనా. అయితే దీని సమయం, పరిధిపై ఇంకా స్పష్టత లేదు. కాగా, మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ గత కొన్ని ఏళ్లుగా మేనేజ్మెంట్ స్థాయిలను తగ్గించే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగానే 2022, 2023 లలో ఇప్పటికే 20,000 ఉద్యోగాలను తగ్గించారు. -
ఏఐ బూమ్ ఒక బుడగ.. అయినా నష్టం లేదు!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హడావిడి ఒక ‘బుడగ’ (బబుల్) లాంటిదేనన్న ఆందోళనలపై అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ భిన్నంగా స్పందించారు. ఒకవేళ ఇది బబుల్ అయినప్పటికీ దాని గురించి పెద్దగా చింతించాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కొన్ని ఏఐ కంపెనీలు విఫలమైనప్పటికీ ఈ రంగంలోకి వస్తున్న భారీ పెట్టుబడులు శాశ్వత సాంకేతిక ప్రయోజనాలను అందిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘ప్రస్తుతం ఏఐ రంగంలోకి వస్తున్న మూలధన పెట్టుబడిదారులుగానీ, విధాన రూపకర్తలుగానీ ఆందోళన చెందాల్సిన పనిలేదని స్పష్టం చేశారు.పెట్టుబడులు.. ఫలితాలు..‘ఏఐలో వస్తున్న మార్పులు ఒక బుడగగా మారినప్పటికీ మీరు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ బబుల్ మార్కెట్లో వస్తున్న భారీ పెట్టుబడులు చాలావరకు మెరుగైన ఫలితాలందించేందుకు మళ్లిస్తున్నారు’ అని బెజోస్ పేర్కొన్నారు.ప్రస్తుతం టెక్ మార్కెట్లో ఏఐ మౌలిక సదుపాయాలపై భారీ వ్యయం జరుగుతోంది. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలు ఈ ఏడాది ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఏకంగా 700 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేయనున్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో మార్కెట్ స్థిరత్వంపై చర్చ నడుస్తోంది.మార్కెట్లో ఉన్న విపరీతమైన క్రేజ్ కారణంగా బలహీనమైన వ్యాపార నమూనాలు ఉన్న స్టార్టప్లు కూడా సులభంగా నిధులను ఆకర్షిస్తున్నాయనే వాస్తవాన్ని బెజోస్ అంగీకరించారు. ‘ఈ తరుణంలో మంచి ఆలోచనలకు, చెడు ఆలోచనలకు మధ్య తేడాను ఎలా గుర్తించాలో పెట్టుబడిదారులు ఇంకా నేర్చుకోలేదు. అది పెద్ద తప్పేం కాదు, ఎందుకంటే కొన్ని మంచి ఆలోచనలు సాధించే భారీ విజయాలు.. ఓడిపోయిన మిగతా అన్ని సంస్థల నష్టాలను భర్తీ చేస్తాయి’ అని బెజోస్ విశ్లేషించారు.పారిశ్రామిక చక్రాలు..పారిశ్రామికంగా ఇలాంటి చక్రాలు(ఇండస్ట్రియల్ సైకిల్స్) చాలా అవసరమన్నారు. ఇవే సాంకేతికతను వేగంగా ముందుకు నడిపిస్తాయని ఆయన స్పష్టం చేశారు. దీనికి ఉదాహరణగా 1990ల నాటి బయోటెక్నాలజీ బూమ్ను ఆయన గుర్తుచేశారు. ఆ సమయంలో మార్కెట్ మితిమీరిన ఉత్సాహం వల్ల కొందరు పెట్టుబడిదారులు ఆర్థికంగా దెబ్బతిన్నప్పటికీ.. ఆ కాలంలో కనుగొన్న ఎన్నో మందులు నేటికీ మానవాళికి ఉపయోగపడుతున్నాయని వివరించారు.ఇదీ చదవండి: భారత్లో మరో స్టోర్కు సన్నాహాలు! -
భారత్లో మరో స్టోర్కు సన్నాహాలు!
ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ భారత మార్కెట్ వైపు శరవేగంగా దూసుకెళ్తోంది. దేశంలో ప్రీమియం స్మార్ట్ఫోన్లకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని తన రిటైల్ నెట్వర్క్ను భారీగా విస్తరిస్తోంది. ముంబై, ఢిల్లీల్లో ఇప్పటికే స్టోర్లను విజయవంతంగా నడుపుతున్న యాపిల్ తాజాగా ఐటీ హబ్ బెంగళూరులో తన రెండో అధికారిక రిటైల్ స్టోర్ను ప్రారంభించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది.యాపిల్ తన అధికారిక కెరీర్ పేజీలో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన వివరాలను ఉంచడంతో ఈ విస్తరణ ప్లాన్ వెలుగులోకి వచ్చింది. కంపెనీ తన వెబ్సైట్లో బెంగళూరు ఈస్ట్ పరిధిలో పలు ఉద్యోగ ఖాళీలను జాబితాను విడుదల చేసింది. ఇందులో కస్టమర్-ఫేసింగ్ ఎగ్జిక్యూటివ్లు, టెక్నికల్ స్పెషలిస్టులు, మేనేజ్మెంట్ స్థానాలకు సంబంధించిన లీడర్షిప్ పాత్రలు ఉన్నాయి. ఉద్యోగ ప్రకటనలో బెంగళూరు ఈస్ట్ అని స్పష్టంగా పేర్కొనడం వల్ల.. ఈ కొత్త స్టోర్ ప్రముఖ ఐటీ కారిడార్ అయిన వైట్ఫీల్డ్-మహదేవపుర ప్రాంతంలోని ఫీనిక్స్ మార్కెట్సిటీ మాల్లో ఏర్పాటయ్యే అవకాశం ఎక్కువగా ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.దేశవ్యాప్తంగా విస్తరణ..గత కొన్ని నెలలుగా యాపిల్ దేశంలోని ప్రధాన నగరాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ముంబైలోని బోరివలిలో రెండో స్టోర్, ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని నోయిడాలో మరొక స్టోర్ ఏర్పాటుకు సంబంధించిన ప్రకటనలు వచ్చిన కొద్ది నెలలకే బెంగళూరు ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం గమనార్హం. మరోవైపు, హైదరాబాద్లోనూ కొద్ది నెలల క్రితం ఇలాంటి ఉద్యోగ పోస్టింగ్లు కనిపించాయి. తాజా అంచనాల ప్రకారం హైదరాబాద్ స్టోర్ 2026 చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. బెంగళూరు రెండో స్టోర్ 2027 ప్రారంభంలో ప్రారంభం కావచ్చు.ఇదీ చదవండి: ఐఐటీ-బీ.. ఆఫర్లు తగ్గినా.. పెరిగిన ప్యాకేజీలు! -
ట్రంప్ పర్యటన ముగిసిన కొన్ని గంటల్లోనే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన ముగిసిన కొద్ది గంటల్లోనే చైనా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ అమెరికన్ టెక్ దిగ్గజం ఎన్విడియా రూపొందించిన అధునాతన గేమింగ్ చిప్పై చైనా ప్రభుత్వం నిషేధం విధించింది. ఎన్విడియా ఫ్లాగ్షిప్ గేమింగ్ జీపీయూకు చెందిన చైనా-ఫ్రెండ్లీ వెర్షన్ ‘RTX 5090D V2’ గ్రాఫిక్స్ కార్డే లక్ష్యంగా బీజింగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్రిటన్కు చెందిన ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మే 15న చైనాలో తన అధికారిక పర్యటనను ముగించారు. ఈ పర్యటనలో ఆయన చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీ అయ్యారు. అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఈ పర్యటనలో ట్రంప్ వెంట ఎన్విడియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ జెన్సెన్ హువాంగ్తో సహా పలువురు సీనియర్ యూఎస్ వ్యాపార దిగ్గజాలు కూడా ఉన్నారు. అయితే, ఈ హై-ప్రొఫైల్ పర్యటన ముగిసిన వెంటనే చైనా ఈ నిషేధాస్త్రాన్ని ప్రయోగించడం చర్చకు దారితీసింది.RTX 5090D V2 ప్రత్యేకత ఏంటి?అమెరికా విధించిన కఠినమైన ఎగుమతి పరిమితులకు లోబడి చైనా మార్కెట్ కోసమే ఎన్విడియా ప్రత్యేకంగా రూపొందించిన మోడల్ ఈ RTX 5090D V2. ఇది కంపెనీకి చెందిన టాప్-ఎండ్ RTX 5090 సవరించిన వెర్షన్. అమెరికా నిబంధనలకు అనుగుణంగా దీని మెమరీ, బ్యాండ్విడ్త్ సామర్థ్యాలను తగ్గించారు. ప్రాథమికంగా ఇది చైనీస్ గేమర్స్, డిజిటల్ క్రియేటర్లను దృష్టిలో ఉంచుకుని తయారు చేసినప్పటికీ ఎన్విడియా శక్తివంతమైన బ్లాక్వెల్ ఆర్కిటెక్చర్ దీనికి అనుసంధానమై ఉండటంతో చైనా పరిశోధకులు దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధికి కూడా ఉపయోగిస్తున్నారు. సెమీకండక్టర్ టెక్నాలజీ పరంగా అమెరికాపై ఆధారపడటాన్ని పూర్తిగా తగ్గించుకోవాలనే చైనా వ్యూహంలో భాగంగానే ఈ చిప్ను బ్లాక్లిస్ట్లో పెట్టినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.అలీబాబా కొత్త ఏఐ చిప్ఇదే తరుణంలో అమెరికాకు గట్టి కౌంటర్ ఇస్తూ చైనా టెక్ దిగ్గజం అలీబాబా సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్ ‘జెన్వు ఎమ్890’ను ఆవిష్కరించింది. ఈ కొత్త చిప్ తన మునుపటి మోడల్ కంటే ఏకంగా మూడు రెట్లు మెరుగైన పనితీరును కనబరుస్తుందని ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ఏఎఫ్పీ తెలిపింది. జెన్వు సిరీస్లో భాగంగా కంపెనీ ఇప్పటికే 5,60,000 కంటే ఎక్కువ చిప్లను సరఫరా చేసినట్లు వెల్లడించింది. చైనా మార్కెట్లో ఎన్విడియా భవిష్యత్తుపై తీవ్ర అనిశ్చితి నెలకొన్న సమయంలోనే అలీబాబా ఈ ప్రకటన చేయడం చాలా కచ్చితమైన వ్యూహం అని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: ఐఐటీ-బీ.. ఆఫర్లు తగ్గినా.. పెరిగిన ప్యాకేజీలు! -
యాప్ద్బాంధవులు
సమస్యను అందరూ గుర్తిస్తారు. కానీ, దాని పరిష్కార మార్గాలను కొందరే కనుగొంటారు. వారు మార్గదర్శకులుగా నిలుస్తారు. ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం, దాడులతో గాజా విధ్వంసమైంది. ఆ ప్రాంతమంతా సంక్షోభంలో నిండిపోయింది. ఆ సంక్షోభంలోనూ కొత్త దారులేస్తూ ఆశలు చిగురింపజేస్తున్నారు అక్కడి యువత. సాంకేతికతతో తమ దేశ పునర్నిర్మాణానికి ప్రయత్నిస్తున్నారు. అవకాశాలు కోల్పోయినందుకు నిరాశతో ఊసురోమని కూర్చోకుండా తామే కొంతమందికి అవకాశం కల్పిస్తున్నారు. గాజా నగరంలోని ‘తాకత్’వర్క్ స్పేస్లో ఓ మూలన లాప్టాప్తో కూర్చుని సీరియస్గా పనిచేసుకుంటోంది 23 ఏళ్ల సజా అల్ ఘాల్. ఆమె మరో దేశంలోని కంపెనీ కోసం పనిచేయడంలేదు. పాలస్తీనా ప్రజల ఎదుర్కొంటున్న కష్టాలను పరిష్కరించడానికి పనిచేస్తోంది. తన సొంత మొబైల్ యాప్ను డెవలప్ చేస్తోంది. ఆమె డెవలప్ చేస్తున్న యాప్ పేరు ‘వాసెల్నీ’(డబ్ల్యూఏఎస్ఈఎల్ఎన్ఐ). అంటే అరబిక్లో ‘నా గమ్యాన్ని చేరడంలో నాకు సహాయం చేయండి’అని అర్థం. యుద్ధం తరువాత పాలస్తీనాలో పెరిగిన రవాణా ఖర్చులను తగ్గించడానికి రూపొందించిన రవాణా యాప్. ఈ యాప్ వల్ల ప్రయాణాలను ఒకరితో ఒకరు పంచుకోవచ్చు. ఉదాహరణకు, ఉదయం 8 గంటలకు అల్–షిఫా నుంచి మధ్య గాజా నగరంలోని అస్–సరయాకు ఎవరైనా ఒక ప్రయాణాన్ని ప్రతిపాదించవచ్చు. ఆ తర్వాత అటుగా వెళ్లాల్సి ఉన్న ఇతర వ్యక్తులు కూడా అదే ప్రయాణంలో చేరే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఖర్చును పంచుకోవచ్చు. జస్ట్ లైక్ క్యాబ్ షేరింగ్ అన్నమాట. తప్పిపోయిన వస్తువులు... సజా తరహాలోనే యుద్ధ సమయంలో సర్వసాధారణమైన మరో సమస్యపై దృష్టి పెట్టారు 26 ఏళ్ల ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ గ్రాడ్యుయేట్ బహా అల్మల్లాహి. యుద్ధ సమయంలో ప్రజలు సర్వం కోల్పోయారు. వ్యక్తిగత వస్తువులు, అధికారిక పత్రాలు, ఫోన్లు, బ్యాగులు.. మరెన్నో. వాటి ఖరీదు ఎక్కువేం కాకపోవచ్చు. కానీ, వాటి విలువ ఎక్కువ. జీవితంలో ఎంత ప్రాముఖ్యత ఉన్న వస్తువులై ఉంటాయి. అలా పోగొట్టుకున్న వస్తువుల గురించి సోషల్ మీడియా వేదికల్లో విజ్ఞప్తులు వెల్లువెత్తుతుండటం బహా గమనించారు. పోగొట్టుకున్న, లేదా దొరికిన వస్తువుల కోసం ఒక ప్రత్యేక డిజిటల్ వేదికను సృష్టించాలనే ఆలోచన అతనికి వచి్చంది. అలా డెవలప్ అయ్యిందే ‘రజ్జా’లి’. అంటే అరబిక్లో ‘నాకు తిరిగివ్వండి’అని అర్థం. ‘మీకు ఏదైనా దొరికినా లేదా మీరేమైనా పోగొట్టుకున్నా.. దానికోసం ఇక్కడ వెతకండి’అని అన్నాడు. అయితే, ఈ ప్రాజెక్ట్ అక్కడితో ఆగలేదు. యుద్ధం నిరాశ్రయులను చేస్తుండటంతో గాజాలో వలసలు రోజురోజుకు పెరిగాయి. ఈ క్రమంలో కిక్కిరిసిన జనాల మధ్య తమ ఆతీ్మయులను కోల్పోతున్నారు. అలా తప్పిపోయిన పిల్లల కేసులను కూడా చేర్చడానికి భవిష్యత్తులో ఈ ప్లాట్ఫారమ్ను అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు. ఒక నిర్దిష్ట ప్రాంతంలో పిల్లలు తప్పిపోతే, వెంటనే వారి ఫొటో వివరాలతో వెంటనే సమీప ప్రాంతాల ప్రజలకు తక్షణం తెలపడానికి ఈ యాప్ రూపొందించారు. అనేక అడ్డంకులు.. అయితే, యాప్ను రూపొందించడంతో సగం పని మాత్రమే పూర్తయ్యింది. వాటిని జనంలోకి విస్తతంగా తీసుకెళ్లడం అసలైన టాస్్క. ఉదాహరణకు, సజా రూపొందించిన వాసెల్నీ యాప్ను ఒక వ్యక్తి తెరిచి, అదే సమయంలో అదే మార్గంలో ప్రయాణించడానికి తక్కువ మంది ఉండటమో, అసలు లేకపోవడమో జరిగితే.. అతను ఆ యాప్పై విముఖత చూపే అవకాశం ఉంది. అందుకే దీన్ని విస్తృతంగా ప్రచారం చేయడానికి, డ్రైవర్లను ధృవీకరించడానికి స్థానిక అధికారుల ఆమోదం అవసరమని సజా అంగీకరిస్తున్నారు. పోగొట్టుకున్న పత్రాలను కనుగొనడానికి తన ప్లాట్ఫామ్ను విశ్వసించాలంటే అధికారిక సంస్థల సహకారం అవసరమని బహా చెబుతున్నారు. ఇదంతా వారికి ఆర్థిక భారంగా మారింది. ఎందుకంటే, కొత్త ప్రాజెక్టులు ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలపై ఆధారపడుతున్నాయి. వీటి కొనుగోలు చాలా ఖరీదైన పని. శిక్షణా కేంద్రంగా.. అయితే కేవలం పనిచేసుకోవడానికి కొన్ని సదుపాయాలు, స్థలం మాత్రమే కల్పిస్తే సరిపోదని తొందర్లోనే అర్థమైంది. గాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచ టెక్ ప్రపంచం నుంచి యుద్ధం వేరు చేసింది. రెండేళ్లలో టెక్ ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతుండగా, గాజాలోని యువత ప్రాణాలు కాపాడుకోవడానికి కష్టపడాల్సి వచ్చింది. మరీ ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగవంతమైన విజృంభణతో.. గాజాలో ప్రోగ్రామర్లు ప్రపంచ మార్కెట్ డిమాండ్లను అందుకోవడంలో వెనుకబడ్డారు. ఈ అంతరాన్ని పూడ్చే శిక్షణా కార్యక్రమాలపై దృష్టి పెట్టడం ప్రారంభించింది. ఫలితంగా, విశ్వవిద్యాలయాలు, స్థానిక, అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యంతో ‘తాకత్’ఒక కార్యక్షేత్రం నుంచి శిక్షణనిచ్చే ఇంక్యుబేషన్ కేంద్రంగా రూపాంతరం చెందింది. వీరి నుంచే కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. తమ ప్రత్యక్షంగా ఎదుర్కొనే సమస్యల అనుభవాల నుంచే ఈ పరిష్కార మార్గాలు కనిపెట్టారు విద్యార్థులు. అయినప్పటికీ, ఈ ప్రాజెక్టులకు మోక్షం కలగాలంటే పెట్టుబడి అవసరం. డెవలపర్లు ప్రధాన ఆర్థిక, సాంకేతిక అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. వారి ప్రతిభను ఆచరణలోకి తీసుకురావడానికి పెట్టుబడుల కోసం ఎదురు చూస్తున్నారు. ఉద్యోగులకు ‘తాకత్’... యుద్ధం ప్రారంభమైన తర్వాత చాలా మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఆ తరువాత అవకాశాల కోసం ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఇక, ఉన్నా.. విద్యుత్ అందుబాటులో లేకపోవడం, ఇంటర్నెట్ అంతరాయాలతో ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. అవి విలాస వస్తువులుగా మారిపోయాయి. కేవలం విద్యుత్, ఇంటర్నెట్ ఉన్న చోటుకోసం నెలకు రెండొందల షెకెల్స్.. అంటే దాదాపు ఏడువేలు. అలాంటి వారికోసమే కో వర్కింగ్స్పేస్ స్థాపించారు సీఈఓ, ఇంజనీర్ అయిన షరీఫ్ నయీమ్. దాని పేరు ‘తాకత్’. ‘యుద్ధం ప్రారంభంలో మౌలిక సదుపాయాలు ధ్వంసవ్వడంతో చాలాకాలం పాటు కమ్యూనికేషన్లు, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వేలాది మంది ఫ్రీలాన్సర్లు, ప్రోగ్రామర్లు పనిచేసే అవకాశం కోల్పయారు. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. కొందరు అంతర్జాతీయ కాంట్రాక్టులను పోగొట్టుకున్నారు. పవర్ లేక కొందరు ఆన్లైన్ సమావేశాలకు హాజరు కాలేకపోయారు. వారందరికీ పనిచేసుకునే అవకాశం కల్పించాలనే లక్ష్యంతో గాజాలో ‘తకాత్’స్థాపించాను’అని నయీమ్ చెబుతున్నారు. యుద్ధ సమయంలో గాజా నగరంలో ఏర్పాటైన ఇది క్రమంగా నుసైరత్, డెయిర్ అల్–బలాహ్ సహా అనేక ప్రాంతాలకు విస్తరించింది. గాజా నగరంలో తన ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించి, సుమారు 250 మంది ఫ్రీలాన్సర్లు, ప్రోగ్రామర్లకు వసతి కల్పించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎయిర్టెల్ కొత్త 'ప్రయారిటీ పోస్ట్పెయిడ్' 5జీ ప్లాన్లు
ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ తన పోస్ట్పెయిడ్ వినియోగదారుల కోసం సరికొత్త 'ప్రయారిటీ పోస్ట్పెయిడ్' (Priority Postpaid) సేవలను అధికారికంగా ప్రకటించింది. అత్యాధునిక '5G స్లైసింగ్' (5G Slicing)సాంకేతికత ఆధారంగా పనిచేసే ఈ సర్వీస్ ద్వారా వినియోగదారులు నెట్వర్క్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా అత్యంత వేగవంతమైన, అంతరాయం లేని ఇంటర్నెట్ అనుభవాన్ని పొందవచ్చు. భారతదేశంలో ఈ తరహా 5G స్లైసింగ్ సేవలను తీసుకొచ్చిన మొదటి సంస్థగా ఎయిర్టెల్ నిలిచింది.ఈ సరికొత్త సేవలు ఎయిర్టెల్లోని అన్ని పోస్ట్పెయిడ్ ప్లాన్లపైనా అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే ఉన్న పోస్ట్పెయిడ్ కస్టమర్లకు ఈ ప్రయారిటీ ప్రయోజనాలు ఎలాంటి అదనపు రుసుము లేకుండా ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతాయి. ఒకవేళ ప్రీపెయిడ్ వినియోగదారులు ఈ ప్లాన్లలోకి మారాలనుకుంటే ఎయిర్టెల్ యాప్ ద్వారా లేదా సమీపంలోని ఎయిర్టెల్ స్టోర్ను సందర్శించి సులభంగా అప్గ్రేడ్ చేసుకోవచ్చు.ధరల విషయానికి వస్తే.. సింగిల్ యూజర్ కోసం రూ.449 (ప్లస్ జీఎస్టీ) ప్లాన్ అందుబాటులో ఉండగా, ఫ్యామిలీ ప్లాన్లు రూ.699 నుంచి రూ.1749 వరకు ఉన్నాయి. ఈ ప్లాన్ల ద్వారా అన్లిమిటెడ్ కాల్స్, డేటాతో పాటు ఫాస్ట్లేన్ టెక్నాలజీ, స్పామ్ ప్రొటెక్షన్ లభిస్తాయి. అంతేకాకుండా ప్లాన్లను బట్టి ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్స్టార్, యాపిల్ టీవీ+, నెట్ఫ్లిక్స్ వంటి ప్రముఖ ఓటీటీ సబ్స్క్రిప్షన్లు కూడా ఉచితంగా లభిస్తాయి.ఈ సేవలు 5G SA (Standalone) సపోర్ట్ చేసే అన్ని స్మార్ట్ఫోన్లలోనూ పనిచేస్తాయి. వినియోగదారులు తమ ఫోన్ సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసుకోవడం ద్వారా ఈ హై-స్పీడ్ కనెక్టివిటీని ఆస్వాదించవచ్చు. కస్టమర్లు తమ ఫోన్ అర్హతను మొబైల్ సెట్టింగ్స్లో లేదా ఎయిర్టెల్ యాప్లోకి లాగిన్ అయి సులభంగా చెక్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. -
డిజిటల్ భారత్లో మైక్రోసాఫ్ట్ మెగా ప్లాన్
భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి భారీ ఊపునిచ్చేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ రంగం సిద్ధం చేసింది. దేశంలోనే తన అత్యంత భారీ డేటా సెంటర్ను 2026లోనే అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు రాయిటర్స్ వెల్లడించింది. టెక్నాలజీ హబ్గా మారుతున్న హైదరాబాద్ నగరంలోనే ఈ సదుపాయం ఏర్పాటు కాబోతోందని మైక్రోసాఫ్ట్ ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ అధికారికంగా ధ్రువీకరించారు. ఇది భారతదేశంలో మైక్రోసాఫ్ట్ నిర్మించబోయే అత్యంత భారీ, వ్యూహాత్మక డేటా సెంటర్ కానుంది.క్లౌడ్, ఏఐ సేవలకు భారీ డిమాండ్భారత్లో మైక్రోసాఫ్ట్ సేవల విస్తరణపై పునీత్ చందోక్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం దేశంలో అజూర్ క్లౌడ్ సేవలకు విపరీతమైన ఆదరణ ఉంది. దీనితో పాటు నెలకు 30 డాలర్ల ధర కలిగిన కంపెనీ ప్రతిష్టాత్మక ‘కోపైలట్ 365 ఏఐ అసిస్టెంట్’ వినియోగం భారత్లో శరవేగంగా పుంజుకుంటోంది’ అని పేర్కొన్నారు.ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ మార్కెట్లలో భారత్ అగ్రగామిగా ఉంది. ఇక్కడి భారీ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య, నైపుణ్యం కలిగిన సాంకేతిక ప్రతిభను దృష్టిలో ఉంచుకుని మైక్రోసాఫ్ట్ తన ఏఐ పురోగతిని మరింత బలోపేతం చేస్తోంది. కాగా, మైక్రోసాఫ్ట్ ప్రత్యర్థులైన ఆల్ఫాబెట్ (గూగుల్), అమెజాన్లు సైతం భారతీయ ఏఐ, క్లౌడ్ మార్కెట్లో దూకుడుగా విస్తరిస్తుండటం గమనార్హం.వేల కోట్ల పెట్టుబడిభారత మార్కెట్పై మైక్రోసాఫ్ట్ నమ్మకానికి ఇక్కడి పెట్టుబడులే నిదర్శనం. ఆసియాలోనే అతిపెద్ద పెట్టుబడిగా భావిస్తున్న 17.5 బిలియన్ డాలర్లను భారతదేశంలో ఇన్వెస్ట్ చేయనున్నట్లు మైక్రోసాఫ్ట్ గత ఏడాది చివర్లో ప్రకటించింది. ఇది 2025లో ప్రకటించిన 3 బిలియన్ డాలర్ల వాగ్దానానికి అదనపు పెట్టుబడి కావడం విశేషం. ఈ భారీ నిధుల్లో సింహభాగం హైదరాబాద్ ఫెసిలిటీతో కూడిన డేటా సెంటర్ మౌలిక సదుపాయాల విస్తరణకే మళ్లించనున్నారు. డేటా సెంటర్ నిర్మాణ ప్రణాళికలను ప్రస్తావిస్తూ.. తమ ప్రాజెక్ట్ పనులు అత్యంత వేగంగా, అనుకున్న సమయం కంటే ముందే పూర్తి చేసేలా అడుగులు వేస్తున్నామని చందోక్ స్పష్టం చేశారు. అయితే, రాబోయే ఈ సదుపాయం కచ్చితమైన సామర్థ్యం ఎంత అనే వివరాలను ఆయన ప్రస్తుతానికి గోప్యంగా ఉంచారు.ఇదీ చదవండి: అంకెల్లో పెరిగినా.. చేతిలో సున్నా! -
ఇక యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రా
న్యూఢిల్లీ: ఉద్యోగులు తమ భవిష్య నిధిని (పీఎఫ్) వేగంగా ఉపసహరించుకునేందుకు వీలుగా యూపీఐ పేమెంట్ గేట్వే త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ సదుపాయాన్ని పరీక్షించడం పూర్తయిందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. మెరుగైన సేవల దిశగా ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) ఎన్నో చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఈపీఎఫ్వో సభ్యులు యూపీఐ పేమెంట్ గేట్వే ద్వారా ఉపసంహరించుకునే మొత్తం, వారి బ్యాంక్ ఖాతాలకు వెంటనే జమ అవుతుందని చెప్పారు. ఈపీఎఫ్ ఖాతాకు లింక్ చేసిన యూపీఐ పిన్ను నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. నిబంధనల మేరకు భవిష్యనిధిలో కొంత మేర బ్యాలన్స్ను తప్పకుండా కొనసాగించాల్సి ఉంటుంది.అది పోను మిగిలిన మొత్తాన్ని యూపీఐ సాయంతో వేగంగా ఉపసంహరించుకునే దిశగా ఈపీఎఫ్వో అడుగులు వేస్తున్నట్టు మంత్రి వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. నూతన సదుపాయంతో ఏడు కోట్ల మంది ఈపీఎఫ్వో సభ్యులకు నిధుల ఉపసంహరణ సులభతరం కానుంది. ప్రస్తుత విధానంలో సభ్యులు ఉపసంహరణ కోసం క్లెయిమ్ దాఖలు చేసి, నిర్ణీత సమయం పాటు నిరీక్షించాల్సి వస్తోంది.ఆటో–సెటిల్మెంట్ విధానంలో మానవ ప్రమేయం లేకుండా ఎలక్ట్రానిక్ రూపంలో క్లెయిమ్ల పరిష్కారానికి మూడు రోజుల సమయం పడుతోంది. ఈపీఎఫ్వో వాట్సాప్ సేవలను నెలలో ప్రారంభించనున్నట్టు మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. సభ్యులు ఈపీఎఫ్వో వాట్సాప్ నంబర్కు హాయ్ అని టైప్ చేసి పంపించడం ద్వారా పీఎఫ్ ఖాతాలో ఎంత ఉంది? చివరి ఐదు లావాదేవీలు తదితర సమాచారాన్ని పొందొచ్చని చెప్పారు. పెండింగ్ కేసులకు పరిష్కారం నిధి ఆప్కే నికత్ కార్యక్రమం ద్వారా కన్జ్యూమర్ కోర్టుల్లో అపరిష్కృతంగా ఉండిపోయిన కేసులను గుర్తించి, చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి మాండవీయ తెలిపారు. దీంతో 2025 ఏప్రిల్ 1 నాటికి 31,036 కేసులు ఉండగా, 2026 ఏప్రిల్ 1 నాటికి 27,639కు తగ్గినట్టు చెప్పారు. -
అమెరికాలో ఏఐపై పెరుగుతున్న వ్యతిరేకత!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో అమెరికా ముందంజలో ఉంది. అయితే.. ఇక్కడి యువతలో ఏఐ పట్ల వ్యతిరేక భావనలు పెరుగుతున్నాయి. ఇది విచిత్రమైన పరిస్థితిలా కనిపించినప్పటికీ.. దీని వెనుక ఆర్థిక, సామాజిక, రాజకీయ కారణాలు ఉన్నాయి. ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే.. కేవలం AI గురించే కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్న దీర్ఘకాలిక మార్పులను కూడా పరిశీలించాలి.ఏఐ మీద వ్యతిరేఖ భావన ఏర్పడటానికి ప్రధాన కారణం.. కృత్రిమ మేధ వల్ల కంపెనీలు ఉద్యోగాల కోత. చాలా సంస్థలు ఏఐ టెక్నాలజీ కోసం ఉద్యోగాలు తగ్గిస్తున్నట్లు ప్రకటనలు కూడా చేశాయి. నిజానికి కంపెనీలు కూడా ఖర్చులు, ఆర్థిక మందగమనం, మార్కెట్ ఒత్తిడులు వంటివి ఎదుర్కొంటున్నాయి.AI కారణం అందుకే..సంస్థలు AIని కారణంగా చూపడం.. వాటికి రెండు విధాలుగా ఉపయోగపడుతోంది. ఒకటి.. ఉద్యోగాల కోతలను సమర్థించుకోవచ్చు. రెండోది.. మేము భవిష్యత్ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తున్నాం.. అనే ఇమేజ్ పొందవచ్చు. దీంతో సాధారణ ప్రజల్లో ఏఐ అంటే ఉద్యోగాలను తీసేసే యంత్రం అనే భయం పెరుగుతోంది.ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే.. 2008-09 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అస్థిరత పెరిగింది. అప్పటి నుంచి ధనిక-పేద అంతరం, అప్పుల భారం, ఉద్యోగ భద్రతలేమి వంటి సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. టెక్నాలజీ రంగం మాత్రమే వృద్ధి చెందుతున్నప్పటికీ, ఆ వృద్ధి సమాజంలోని అందరికీ సమానంగా ప్రయోజనం కలిగించలేదు.టెక్నాలజీ విప్లవంఒకప్పుడు స్మార్ట్ఫోన్ విప్లవం, ముఖ్యంగా ఐఫోన్ వచ్చిన తర్వాత మొబైల్ రంగం ప్రపంచాన్ని మార్చేసింది. కానీ ఆ టెక్నాలజీ విప్లవం కూడా ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని అడ్డుకోలేకపోయింది. అదే విధంగా AI కూడా అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. AI ఉత్పాదకతను పెంచగలదు, కొత్త సేవలను సృష్టించగలదు. కానీ.. ప్రపంచ ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం, రాజకీయ విభజనలు వంటి లోతైన సమస్యలను అది ఒక్కటే పరిష్కరించలేదు.How is it that in the US, the AI leader, a good part of the population, even a lot of college students, have come to hate AI? It does not help that companies are blaming job losses on AI, which is both convenient and as an added bonus, makes a company look visionary.The layoffs…— Sridhar Vembu (@svembu) May 19, 2026మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. ప్రపంచం, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన ఆర్థిక, రాజకీయ వ్యవస్థలనే అనుసరిస్తోంది. అమెరికా ఆధిపత్యం, గ్లోబల్ ట్రేడ్, డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ వంటివి దశాబ్దాలుగా ప్రపంచాన్ని నడిపించాయి. కానీ ఇప్పుడు ఆ వ్యవస్థ క్రమంగా బలహీనపడుతోంది. చైనా ఎదుగుదల, యుద్ధాలు, సరఫరా గొలుసు సమస్యలు, ఇంధన సంక్షోభాలు వంటివన్నీ కలిసి ప్రపంచాన్ని కొత్త దిశలోకి నెడుతున్నాయి.మార్పునకు అవకాశంచరిత్రను పరిశీలిస్తే.. ప్రతి టెక్నాలజీ విప్లవం మొదట్లో భయాలను సృష్టించింది. పరిశ్రమల విప్లవం సమయంలో కూడా యంత్రాలు ఉద్యోగాలను నాశనం చేస్తాయని భావించారు. కానీ తరువాత కొత్త రంగాలు, కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి. AI విషయంలో కూడా అదే జరగవచ్చు. ముఖ్యంగా ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, పరిశోధన రంగాల్లో AI భారీ మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉంది అనేది వాస్తవం.ఇదీ చదవండి: భారత్ vs అమెరికా: ఇదీ.. వర్క్ కల్చర్లో తేడా! -
భారత్లో చాట్జీపీటీ ఇమేజ్ల సునామీ
న్యూఢిల్లీ: భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవం కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రముఖ ఏఐ సంస్థ ‘ఓపెన్ ఏఐ’ ప్రవేశపెట్టిన ‘చాట్జీపీటీ ఇమేజెస్ 2.0’ భారత్లో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. విడుదలైన నెల రోజుల్లోనే భారతీయులు ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఏకంగా 100 కోట్లకు (1 బిలియన్) పైగా చిత్రాలను సృష్టించి సరికొత్త రికార్డు సృష్టించారు. ‘‘చాట్జీపీటీ ఇమేజెస్ 2.0 భారత్లో ఇప్పటికే 100 కోట్ల మార్కును దాటేసింది. ఇది నిజంగా అద్భుతం’’ అంటూ సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ సోమవారం హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 21న భారత్లో విడుదలైన ఈ వెర్షన్, మే 18 నాటికే ఈ ఘనతను సాధించింది. ఓపెన్ఏఐ వెల్లడించిన వివరాల ప్రకారం, ‘సినిమాటిక్ పోర్ర్టెట్ కొలాజ్’, ‘మినీ మీ వరల్డ్’, ‘అండర్వాటర్ పోర్ర్టెట్’, ‘అనిమే’, ‘చిబి స్టికర్ ప్యాక్’, ‘మంగా కామిక్ స్ట్రిప్’, ‘ఫ్యాషన్ స్టూడియో పోర్ర్టెట్’ వంటి ప్రాంప్ట్ లతో భారతీయులు భారీగా చిత్రాలను రూపొందిస్తున్నారు. భారత్లో ఏఐ ఇమేజ్ జనరేషన్ కేవలం ఉత్పాదకతకే పరిమితం కాకుండా.. క్రియేటర్ కల్చర్, ఫ్యాషన్, ఫ్యాన్డమ్స్, డిజిటల్ ఐడెంటిటీతో మమేకమవుతోందని ఓపెన్ఏఐ పేర్కొంది. -
వేసవి హీట్కు స్మార్ట్ ట్రీట్.. సమ్మర్ స్పెషల్ గాడ్జెట్స్!
వేసవిలో వేడి ఎంత పెరిగినా, మిమ్మల్ని కూల్గా, కంఫర్ట్గా ఉంచే, బెస్ట్ హెల్పర్స్.. ఈ సమ్మర్ స్పెషల్ గాడ్జెట్స్!అరచేత్తో ఐస్ గోలా!వేసవిలో చల్లచల్లగా ఐస్ గోలా తినాలని అనిపిస్తుందా? కానీ హైజీన్ గురించి ఆలోచించి వెనక్కి తగ్గుతున్నారా? అయితే ఇక టెన్షన్ అవసరం లేదు. ఎందుకంటే, మీ కళ్ల ముందే స్వచ్ఛమైన ‘గోలా’ను తయారుచేసి ఇస్తుంది ఈ ఐస్ గోలా మేకర్! పైగా దీనికి కరెంట్తో పనిలేదు. ఎందుకంటే ఇది చేత్తో తిప్పే మాన్యువల్ మ్యాజిక్ మెషిన్. ఇందులో ఉన్న తుప్పుపట్టని షార్ప్ బ్లేడ్లు క్షణాల్లో గట్టి ఐస్ గడ్డలను ‘మంచు పొడి’గా మార్చేస్తాయి. దీనితో పాటు 3 బౌల్స్, 6 రీయూజబుల్ స్టిక్స్, ఒక గ్లాస్ కూడా వస్తాయి. ఇంట్లో ఉన్న ఐస్ ముక్కలు వేయడం, హ్యాండిల్ తిప్పడం, మీ ఫేవరెట్ ఫ్లేవర్ వేసుకోవడం.. అంతే, హోమ్ మేడ్ ఐస్ గోలా రెడీ! ధర రూ. 460 మాత్రమే.పోర్టబుల్ వాటర్ కంటైనర్పిక్నిక్లో ‘నీళ్లు ఎక్కడ?’ అన్న ప్రశ్నకు స్టయిల్గా సమాధానం చెప్పండి. బ్యాగ్లో నుంచి ఈ పోర్టబుల్ డ్రింక్ స్టోరేజ్ను తెరిచి, ఒకేసారి క్షణంలో పదిమందికి పైగా నీళ్లను అందించండి. ఎందుకంటే, ఇది మామూలు కంటైనర్ కాదు, ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లి, వెంటనే వాడుకునే స్మార్ట్ డ్రింక్ స్టోరేజ్! వాడనప్పుడు సైలెంట్గా మడుచుకుని బ్యాగ్లో కూర్చుంటుంది. కానీ ఓపెన్ చేస్తే ఒక్కసారిగా 5.5 లీటర్ల ‘డ్రింక్ స్టేషన్’ గా మారిపోతుంది! జ్యూస్, నీళ్లు లేదా కూల్ డ్రింక్స్ నింపి ట్యాప్ ద్వారా సులభంగా సర్వ్ చేసుకోవచ్చు. లైట్వెయిట్ కాబట్టి మోసుకెళ్లడం ఈజీ. ధర రూ. 599 మాత్రమే!చల్లగా.. వేడిగా.. ఒక్క బౌల్లోనే!పార్టీలు, గెట్ టుగెదర్స్ లేదా ఇంట్లో స్పెషల్ సర్వింగ్ కోసం మీ ఫుడ్ ఎక్కువసేపు అదే టెంపరేచర్లో ఉండాలని అనుకుంటున్నారా? అయితే ఈ డిప్ చిల్లర్ బౌల్ మీకు పర్ఫెక్ట్ చాయిస్! ఇది మామూలు గిన్నె కాదు, మీ ఫుడ్ను చల్లగా లేదా వేడిగా ఎక్కువసేపు అలాగే ఉంచే స్మార్ట్ సర్వింగ్ సొల్యూషన్.దీనిలో డబుల్ వాల్ ఇన్సులేషన్ ఉంటుంది. చల్లని వంటకాలకు బౌల్లో నీళ్లు నింపి ఫ్రీజ్ చేస్తే, సాల్సా, ఐస్క్రీమ్, డ్రింక్స్ లాంటి వాటిని ఎక్కువసేపు చల్లగా ఉంచుతుంది. అలాగే వేడి నీళ్లు పోస్తే, నూడుల్స్, సూప్, పాస్తా లాంటి వేడి వంటకాలు కూడా ఎక్కువసేపు వేడిగా ఉంటాయి. ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్తో తయారైన ఈ బౌల్ స్ట్రాంగ్గా ఉంటుంది. ధర రూ. 1,200 మాత్రమే! -
జీసీసీ హబ్గా హైదరాబాద్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కృత్రిమ మేథ హబ్గా, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకి (జీసీసీ) హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారుతోందని ఏఐ ఆధారిత క్వాలిటీ ఇంజినీరింగ్ సేవల సంస్థ క్వాలిజీల్ వెల్లడించింది. నగరంలో 400కు పైగా జీసీసీల్లో 3,00,000 మంది పైచిలుకు ప్రొఫెషనల్స్ ఉన్నారని వివరించింది. వీరితో పాటు దాదాపు పది లక్షల మంది ఐటీ, ఐటీఈఎస్ ప్రొఫెషనల్స్ ఉన్నట్లు ఎవరెస్ట్ గ్రూప్తో కలిసి రూపొందించిన శ్వేతపత్రంలో తెలిపింది. 2024లో 64.6 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత జీసీసీ పరిశ్రమ 2030 నాటికి 105 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకునే దిశగా వేగంగా ముందుకు సాగుతోందని వివరించింది. 58 శాతం సెంటర్లు ఇప్పటికే ఏజెంటిక్ ఏఐలో ఇన్వెస్ట్ చేస్తున్నాయని పేర్కొంది. క్వాలిజీల్కి స్వయంగా హైదరాబాద్లో 3 జీసీసీలు ఉండగా, వీటిలో 850 మందికి పైగా ఇంజినీర్లు పని చేస్తున్నారు. 2028 నాటికి 100 మిలియన్ డాలర్ల ఆదాయ లక్ష్యం నిర్దేశించుకుంది. -
ఎయిర్టెల్ స్టైలే వేరు..
ముంబై: గత దశాబ్దకాలంగా పలు దేశీ ఐటీ కంపెనీలు తమ దగ్గరున్న నిధులను ఇన్వెస్ట్ చేయడం కన్నా బైబ్యాక్లు, డివిడెండ్ల రూపంలో పంచేందుకే ప్రాధాన్యమిస్తూ వస్తున్నాయని టెలికం దిగ్గజం ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ విమర్శించారు. తమ రంగాల్లోని కొత్త తరం వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మార్కెట్లో స్థానాన్ని పటిష్టం చేసుకోవడంలో అవి విఫలమయ్యాయని వ్యాఖ్యానించారు. అయితే, ఎయిర్టెల్ ఆ బాటలో వెళ్లదని మిట్టల్ స్పష్టం చేశారు. టెలికం కంపెనీలు వృద్ధి అవకాశాలు అందించే అసెట్స్లో పెట్టుబడులు పెట్టడం కొనసాగించాల్సిందనేనని, లేకపోతే వెనుకబడిపోయే రిస్క్ లు ఉంటాయన్నారు. కాబట్టి తాము ఇటు బైబ్యాక్లు, డివిడెండ్లు ఇస్తూనే అంతర్జాతీయంగా టెలికం రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటామని ఇన్వెస్టర్లతో కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడిన సందర్భంగా తెలిపారు. కృత్రిమ మేథ (ఏఐ) విప్లవాన్ని ఎదుర్కొంటున్న భారతీయ ఐటీ కంపెనీలు కొత్త ఉత్పత్తులు, వ్యాపార విస్తరణపై ఇన్వెస్ట్ చేయడం కన్నా బైబ్యాక్లు, డివిడెండ్ల రూపంలో తమ దగ్గరున్న నిధులను మరీ ఎక్కువగా వెచ్చిస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మిట్టల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా 16 దిగ్గజ ఐటీ కంపెనీలు, షేర్హోల్డర్లకు రికార్డు స్థాయిలో రూ. 1.3 లక్షల కోట్ల మొత్తాన్ని బైబ్యాక్లు, డివిడెండ్ల రూపంలో చెల్లించాయి. ఇది అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన రూ. 95,400 కోట్లతో పోలిస్తే 36 శాతం అధికం. పదేళ్లలో వారసులకు వ్యాపార పగ్గాలు .. వచ్చే దశాబ్దకాలంలో వ్యాపార పగ్గాలను తన వారసులకు అప్పగించనున్నట్లు మిట్టల్ చెప్పారు. అలాగే, భారతి ఎయిర్టెల్లో ప్రమోటర్ సంస్థ భారతి టెలికం తిరిగి 50 శాతం పైగా వాటాను దక్కించుకునేలా చూడాలనేది తన ఆకాంక్ష అని ఆయన వివరించారు. ప్రస్తుతం భారతి టెలికంకి ఎయిర్టెల్లో 40.47 శాతం వాటాలు ఉన్నాయి. 10 శాతం మేర వాటాలు పెంచుకోవాలంటే ప్రస్తుత షేర్ ధర, మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం కనీసం రూ. 1 లక్ష కోట్లు అవసరమవుతాయని మిట్టల్ పేర్కొన్నారు. -
ప్రపంచ ఏఐ దిగ్గజంగా టీసీఎస్
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత టెక్నాలజీ సేవల సంస్థగా అవతరించడమే టీసీఎస్ లక్ష్యమని ఆ కంపెనీ సీఈవో, ఎండీ కె.కృతివాసన్ తెలిపారు. 2025–26 వార్షిక నివేదికలో షేర్హోల్డర్లను ఉద్దేశించి రాసిన లేఖలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. వ్యాపార సంస్థల్లో ఏఐ వినియోగానికి 2025–26 ఆర్థిక సంవత్సరం ఒక ‘కీలక మలుపు’ గా నిలిచిందన్నారు. క్లయింట్లు ఏఐని ప్రయోగాత్మక దశ నుంచి పూర్తిస్థాయి అమలువైపు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. టాప్ క్లయింట్ల ఫస్ట్ ఛాయిస్ ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ సేవల సంస్థగా అవతరించడమే టీసీఎస్ లక్ష్యం. ఏటా 50 మిలియన్ డాలర్లకు పైగా ఆదాయం అందించే 139 మంది కీలక క్లయింట్లలో ఇప్పటికే 130 మంది ఏఐ ప్రాజెక్టుల కోసం టీసీఎస్ను భాగస్వామిగా ఎంపిక చేసుకోవడం మా వ్యూహానికి దక్కిన విజయానికి నిదర్శనం’ అని కృతివాసన్ తెలిపారు. మౌలిక సదుపాయాల నుంచి ఇంటెలిజెన్స్ వరకు పూర్తి స్థాయి (ఫుల్–స్టాక్) ఏఐ సేవలను అందించే సంస్థగా టీసీఎస్ను తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. 2.7 లక్షల మందికి ఏఐ శిక్షణ భారీ సాంకేతిక మార్పులకు అనుగుణంగా టీసీఎస్ ఉద్యోగులకు పెద్దఎత్తున శిక్షణ ఇస్తోందని కృతివాసన్ తెలిపారు. ప్రస్తుతం 2.7 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఏఐలో అత్యాధునిక నైపుణ్యాలు సాధించారని, గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య మూడు రెట్లు పెరిగిందన్నారు. డిజిటల్ సేవల్లో చెరగని ముద్ర భారతదేశ డిజిటల్ మౌలిక సదుపాయాల బలోపేతంలో టీసీఎస్ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వ ఈ–మార్కెట్ప్లేస్ (జీఈఎం)ను ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఈ–కామర్స్ వేదికగా తీర్చిదిద్దామని తెలిపారు. ఈ వేదిక ద్వారా జరిగిన కొనుగోళ్ల విలువ రూ.5 లక్షల కోట్లను దాటిందన్నారు. ఎస్బీఐ ‘యోనో 2.0’ను పది భాషల్లో 20 కోట్ల మందికి సేవలు అందించేలా అప్గ్రేడ్ చేశామన్నారు. కోటికి పైగా ఈ–పాస్పోర్టుల జారీ, ఆర్బీఐ కోసం 250 టీబీ డేటాను విశ్లేషించగల మేనేజ్మెంట్ సిస్టమ్ ఏర్పాటు వంటి మైలురాళ్లను ఆయన వివరించారు. వ్యూహాత్మక కొనుగోళ్లు, లక్ష్యాలు ఏఐ ఎకోసిస్టమ్లో ‘బిల్డ్–పార్ట్నర్–అక్వైర్’ వ్యూహాన్ని అమలు చేస్తున్నామని, ఇందులో భాగంగా అమెరికాకు చెందిన లిస్ట్ఎంగేజ్, కోస్టల్ క్లౌడ్ సంస్థలను కొనుగోలు చేశామని తెలిపారు. దీంతో గ్లోబల్ సేల్స్ఫోర్స్ కన్సల్టెంట్లలో టీసీఎస్ టాప్–5లో నిలిచిందన్నారు. అలాగే టీపీజీ భాగస్వామ్యంతో ‘హైపర్వాల్ట్’ ఏఐ మౌలిక సదుపాయాల వ్యాపారాన్ని ప్రారంభించామని, భారత్లో 1 గిగావాట్ (జీడబ్ల్యూ) సామర్థ్యం గల డేటా సెంటర్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు. మేధోపరమైన మౌలిక సదుపాయంగా కృత్రిమ మేధ కృత్రిమ మేధ (ఏఐ) ఇకపై కేవలం సాంకేతిక పరిజ్ఞానంలో ఒక భాగం మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్థల నిర్వహణకు ‘మేధోపరమైన మౌలిక సదుపాయం’ గా మారుతోందని టీసీఎస్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కంపెనీ వార్షిక నివేదికలో షేర్హోల్డర్లను ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘హ్యూమన్ ప్లస్ ఏఐ’ ఆపరేటింగ్ మోడల్ అమలును టీసీఎస్ మరింత విస్తరించిందన్నారు. ఏఐ సేవల ద్వారా వార్షిక ప్రాతిపదికన 2.3 బిలియన్ డాలర్లు (సుమారు రూ.19,320 కోట్లు), క్లౌడ్, డేటా, సైబర్ భద్రత వంటి న్యూ–ఏజ్ సేవల ద్వారా 11.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.96,600 కోట్లు) ఆదాయం ఆర్జించినట్లు పేర్కొన్నారు. భారత్లో తొలి ఏఐ కేంద్రీకృత డేటా సెంటర్: సురక్షితమైన, స్థిరమైన, స్వయంప్రతిపత్తి కలిగిన ఏఐ మౌలిక సదుపాయాల ఏర్పాటుపై భవిష్యత్ వ్యూహాన్ని కేంద్రీకరిస్తున్నట్లు చంద్రశేఖరన్ వెల్లడించారు. ఇందులో భాగంగా భారత్లో మొట్టమొదటి ‘ఏఐ కేంద్రీకృత డేటా సెంటర్’ ను నిర్మించేందుకు టీసీఎస్ ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. ఇది 160 కిలోవాట్ల (కేడబ్ల్యూ) కంటే ఎక్కువ ర్యాక్ డెన్సిటీతో అత్యంత శక్తివంతంగా ఉంటుందన్నారు. అలాగే వివిధ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ‘ఏఐ ఆపరేటింగ్ సిస్టమ్’ను అభివృద్ధి చేసి, ‘ఏజెంటిక్ ఏఐ’ సొల్యూషన్స్ అమలును వేగవంతం చేయడం కంపెనీ ప్రధాన ప్రాధాన్యాల్లో ఒకటిగా ఉంటుందన్నారు. జోరుగా లాభాలు.. నిలకడగా నియామకాలు: గత ఆర్థిక సంవత్సరపు(2025–26) ఫలితాలను విశ్లేíÙస్తూ కంపెనీ వృద్ధి బాటలో పయనిస్తోందని చంద్రశేఖరన్ ధీమా వ్యక్తం చేశారు. మార్చి త్రైమాసికంలో టీసీఎస్ నికరలాభం 12.22 శాతం వృద్ధితో రూ.13,718 కోట్లకు చేరుకోగా, 2025–26 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం లాభం రూ.49,210 కోట్లుగా నమోదైంది. గత రెండు త్రైమాసికాల్లో ఉద్యోగుల సంఖ్యలో తగ్గుదల కనిపించినప్పటికీ, ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో కొత్తగా 2,356 మందిని నియమించుకున్నామని తెలిపారు. దీంతో 2026 మార్చి 31 నాటికి సంస్థలోని మొత్తం ఉద్యోగుల సంఖ్య 5,84,519 కి చేరింది. కొత్త డీల్స్: గడిచిన మూడు నెలల్లోనే టీసీఎస్ 12 బిలియన్ డాలర్ల విలువైన కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇందులో ఉత్తర అమెరికా, బ్యాంకింగ్ (బీఎఫ్ఎస్ఐ) రంగాలు కీలక పాత్ర పోషించాయి. భవిష్యత్తు వ్యూహాలపై ఫోకస్ భవిష్యత్తులో నాలుగు ప్రధాన వ్యూహాలపై దృష్టి సారించనున్నట్లు కృతివాసన్ వెల్లడించారు. వివిధ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ఏఐ వ్యవస్థల నిర్మాణంతో పాటు, భారత్లో తొలి ‘హై–డెన్సిటీ ఏఐ డేటా సెంటర్’ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే 3,600 భాగస్వామ్యాల సహకారంతో ‘ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు ఇంటెలిజెన్స్’ సేవలను మరింత బలోపేతం చేయనున్నట్లు పేర్కొన్నారు. దేశీయ డేటా భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ సురక్షితమైన, స్థిరమైన, స్వయంప్రతిపత్తి కలిగిన ఏఐ మౌలిక సదుపాయాల ఏర్పాటే తమ లక్ష్యమన్నారు. -
భూమిని తాకే సూర్యరశ్మి తగ్గుతోంది!
మానవాళి సాంకేతిక ప్రగతికి సూచికలుగా భావిస్తున్న ఉపగ్రహాలు, రాకెట్ ప్రయోగాలు.. ఇప్పుడు భూమి చుట్టూ ఉన్న పర్యావరణానికి కొత్త శాపంగా మారుతున్నాయి. నిరంతరాయంగా సాగుతున్న అంతరిక్ష ప్రయోగాలు ఎగువ వాతావరణాన్ని తీవ్రంగా కలుషితం చేస్తున్నాయని, దీనివల్ల భూమికి చేరే సూర్యరశ్మి పరిమాణం క్రమంగా తగ్గుతోందని బ్రిటన్కు చెందిన ‘యూనివర్సిటీ కాలేజ్ లండన్’(యూసీఎల్) పరిశోధకుల అధ్యయనంలో విల్లడైంది.ప్రఖ్యాత అంతర్జాతీయ జర్నల్ ‘ఎర్త్ ఫ్యూచర్’లో మే 14న ప్రచురితమైన ‘రేడియేటివ్ ఫోర్సింగ్ అండ్ ఓజోన్ డిప్లిషన్ ఆఫ్ ఎ డికేడ్ ఆఫ్ శాటిలైట్ మెగాకాన్స్టెలేషన్ మిషన్స్’ అనే పరిశోధనా పత్రం ఈ ఆందోళనకర అంశాలను తెరపైకి తెచ్చింది.నియంత్రణ లేని జియో ఇంజినీరింగ్ ప్రయోగం!యూనివర్సిటీ కాలేజ్ లండన్కు చెందిన శాస్త్రవేత్తలు కానర్ ఆర్.బార్కర్, ప్రొఫెసర్ ఎలోయిస్ ఎ.మరైస్, ఎరిక్ వై నేతృత్వంలోని బృందం 2020 నుంచి 2022 మధ్య కాలంలో జరిగిన రాకెట్ ప్రయోగాలు, అంతరిక్షంలో కాలం చెల్లిన ఉపగ్రహాల అవశేషాలపై సమగ్ర పరిశోధన చేసింది. ‘రాకెట్ ప్రయోగాలు వాతావరణ కాలుష్యానికి ఒక ప్రత్యేకమైన మూలంగా మారాయి. ఇవి హానికరమైన రసాయనాలను నేరుగా ఎగువ వాతావరణ పొరల్లోకి విడుదల చేస్తున్నాయి. తద్వారా భూమిపై ఇప్పటివరకు అత్యంత స్వచ్ఛంగా భావించిన సహజ వాతావరణం కలుషితమవుతోంది’ అని యూసీఎల్ ప్రధాన పరిశోధకుడు కానర్ బార్కర్ తెలిపారు.గ్లోబల్ వార్మింగ్ను తగ్గించడానికి శాస్త్రవేత్తలు ప్రతిపాదించే కృత్రిమ ‘జియో ఇంజినీరింగ్’ పద్ధతుల తరహాలోనే.. ఈ ఉపగ్రహ ప్రయోగాల వల్ల విడుదలవుతున్న కాలుష్యం భూమిని తాకే సూర్యరశ్మిని అడ్డుకుంటోందని పరిశోధకులు తేల్చారు. ఇది భూమిపై స్వల్ప శీతలీకరణ ప్రభావాన్ని చూపినప్పటికీ పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతలతో పోలిస్తే ఇది చాలా తక్కువని, అయితే దీనివల్ల భవిష్యత్తులో ఊహించని తీవ్ర పర్యావరణ పరిణామాలు ఎదురవుతాయని ప్రాజెక్ట్ లీడ్ ప్రొఫెసర్ ఎలోయిస్ మరైస్ హెచ్చరించారు. పరిస్థితి చేతులు దాటిపోకముందే దేశాధినేతలు చర్యలు చేపట్టాలని ఆమె పిలుపునిచ్చారు.ఐదేళ్లలోనే మూడింతలైన ప్రయోగాలురాకెట్ ప్రయోగాల్లో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను ఈ నివేదిక గణాంకాలతో సహా విశ్లేషించింది.సంవత్సరంవార్షిక రాకెట్ ప్రయోగాల సంఖ్య20201142025329ఈ భారీ వృద్ధికి ప్రధాన కారణం అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ నిర్వహిస్తున్న స్టార్లింక్ మెగాకాన్స్టెలేషన్ ప్రాజెక్టేనని నివేదిక స్పష్టం చేసింది. ఇంటర్నెట్ సేవల కోసం స్పేస్ ఎక్స్ ఇప్పటివరకు కక్ష్యలోకి సుమారు 12,000 ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది. ఈ దశాబ్దం ముగిసేనాటికి అంతరిక్షంలోకి మరో 65,000 ఉపగ్రహాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసినప్పటికీ, ప్రస్తుత వేగాన్ని చూస్తుంటే ఆ సంఖ్య అంతకంటే ఎక్కువే ఉండేలా కనిపిస్తోంది.ఎగువ వాతావరణంలో తిష్ఠ వేస్తున్న మసిస్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన ఫాల్కన్ 9 వంటి రాకెట్లు కిరోసిన్ ఆధారిత ఇంధనాన్ని ఉపయోగిస్తాయి. ఇవి మండటం వల్ల భారీ ఎత్తున ‘నల్ల కార్బన్’ లేదా ‘మసి’ కణాలు వాతావరణంలోకి విడుదలవుతాయి. భూమిపై అయితే వర్షాల వల్ల ఈ మసి కడిగివేయబడుతుంది, కానీ ఎగువ వాతావరణంలో గాలి ప్రసరణ చాలా నెమ్మదిగా ఉండటం వల్ల ఈ హానికరమైన మసి కణాలు అక్కడే దశాబ్దాల పాటు తిష్ఠ వేస్తున్నాయి.ప్రమాద ఘంటికలు2029 నాటికి అంతరిక్ష పరిశ్రమ ద్వారా ఏటా దాదాపు 870 టన్నుల మసి వాతావరణంలోకి విడుదలయ్యే ప్రమాదం ఉంది. ఈ ప్రయోగాల వల్ల క్లోరిన్ వంటి రసాయనాలు కూడా విడుదలవుతున్నాయి. అయితే ప్రస్తుతానికి కిరోసిన్ ఇంధన రాకెట్ల వల్ల విడుదలయ్యే క్లోరిన్ పరిమాణం తక్కువగా ఉండటం వల్ల ఓజోన్ పొరపై దీని ప్రభావం స్వల్పంగానే ఉంది. కానీ, భవిష్యత్తులో ప్రయోగాలు పెరిగితే ముప్పు తప్పదు.మున్ముందు మరింత పోటీ!ప్రస్తుతం అంతరిక్ష రంగంలో వాణిజ్య పోటీ విపరీతంగా పెరుగుతోంది. కేవలం స్పేస్ ఎక్సే కాకుండా అమెజాన్ సైతం తన సొంత ఇంటర్నెట్ ఉపగ్రహ నెట్వర్క్ ‘లియో’ను అభివృద్ధి చేసే పనిలో పడింది. అటు చైనా కూడా ‘గువాంగ్’ పేరుతో భారీ ఉపగ్రహ సమూహాన్ని నిర్మించేందుకు సన్నద్ధమవుతోంది.ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో వేలాది ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపడానికి మరిన్ని వందల రాకెట్ ప్రయోగాలు అవసరమవుతాయి. అంతరిక్ష సాంకేతికత వైపు ప్రపంచ దేశాలు అడుగులు వేస్తున్న తరుణంలో.. పర్యావరణ సమతుల్యతను కాపాడుకునేలా కఠిన నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఈ అధ్యయనం నొక్కి చెప్పింది.ఇదీ చదవండి: కరుగుతోన్న బంగారు కొండ.. దిగొస్తున్న ధరలు -
గూగుల్ ఉచిత స్టోరేజ్పై నియంత్రణ
టెక్ దిగ్గజం గూగుల్ తన వినియోగదారులకు షాకిచ్చేలా ఉచిత క్లౌడ్ స్టోరేజ్ విధానంలో కీలక మార్పులను చేపట్టింది. ఇప్పటివరకు కొత్తగా జీమెయిల్ ఖాతా తెరిచిన ప్రతి ఒక్కరికీ లభించే 15 జీబీ ఉచిత స్టోరేజ్ పరిమితిని కేవలం 5 జీబీకి తగ్గించేలా ఒక కొత్త విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది.కొత్తగా గూగుల్ ఖాతా సృష్టించుకునే వారు తమ ఫోన్ నంబర్ను అనుసంధానం చేసి వెరిఫై చేయకపోతే కేవలం 5 జీబీ స్టోరేజ్ మాత్రమే లభిస్తుంది. ఈ విషయాన్ని ప్రముఖ టెక్ వేదిక ‘ఆండ్రాయిడ్ అథారిటీ’ ఆధ్వర్యంలో గూగుల్ అధికారికంగా ధ్రువీకరించింది. మొదట ఈ మార్పును ఒక రెడ్డిట్ వినియోగదారుడు గుర్తించి వెలుగులోకి తెచ్చారు.గూగుల్ వివరణ ఏమిటి?ఉచిత స్టోరేజ్ పరిమితి తగ్గింపుపై వస్తున్న వార్తలపై గూగుల్ స్పందించింది. ‘అత్యుత్తమ నాణ్యత కలిగిన క్లౌడ్ స్టోరేజ్ సేవలను నిరంతరాయంగా అందించడమే మా లక్ష్యం. అందులో భాగంగానే నిర్దిష్ట ప్రాంతాల్లో ఈ కొత్త స్టోరేజ్ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నాం. దీనివల్ల భద్రత పెరగడమే కాకుండా, డేటా రికవరీ ప్రక్రియ మరింత సులభతరం అవుతుంది’ అని గూగుల్ పేర్కొంది.అయితే, ఈ విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరికీ వర్తింపజేస్తారా లేదా అనే అంశంపై కంపెనీ ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతానికి ఈ నిబంధన కేవలం కొత్తగా క్రియేట్ చేసే ఖాతాలకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది.కొత్త స్టోరేజీ పాలసీ ఎలా పనిచేస్తుంది?సాధారణంగా గూగుల్ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరికీ జీమెయిల్, గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫోటోస్ వంటి సేవలన్నింటికీ కలిపి ఉమ్మడిగా 15 జీబీ ఉచిత స్టోరేజ్ లభిస్తుంది. గూగుల్ ఎకోసిస్టమ్ను వాడటానికి వినియోగదారులను ఆకర్షించే అతిపెద్ద ఫీచర్ ఇదే.ప్రస్తుత పరీక్షల ప్రకారం..డిఫాల్ట్ లిమిట్ - 5 జీబీ: కొత్త టెస్ట్ అకౌంట్ సిస్టమ్ కింద సైన్ అప్ అయ్యే వారికి ప్రాథమికంగా 5 జీబీ మాత్రమే ఉచితంగా ఇస్తున్నారు.పూర్తి 15 జీబీ పొందాలంటే: కొత్త వినియోగదారులు తప్పనిసరిగా తమ ఫోన్ నంబర్ను అందించి ఓటీపీ ద్వారా ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. అలా చేస్తేనే మిగిలిన 10 జీబీ అన్లాక్ అయి మొత్తం 15 జీబీ స్టోరేజ్ అందుబాటులోకి వస్తుంది.ఫోన్ నంబర్ వెరిఫికేషన్ ఎందుకు?ఒక్కరే వందలాది నకిలీ (ఫేక్) ఖాతాలను సృష్టించి ఉచితంగా లభించే 15 జీబీ స్టోరేజ్ ఆఫర్లను దుర్వినియోగం చేయకుండా అడ్డుకోవడమే గూగుల్ ప్రధాన ఉద్దేశం. ఫోన్ నంబర్ లింక్ చేయడం ద్వారా ఒక వ్యక్తికి ఒకే ఉచిత స్టోరేజ్ ప్రయోజనం చేకూరుతుందని గూగుల్ భావిస్తోంది. అంతేకాకుండా వినియోగదారులు ఎప్పుడైనా తమ పాస్వర్డ్ మర్చిపోయినా లేదా ఖాతా హ్యాకింగ్కు గురైనా.. ఫోన్ నంబర్ ద్వారా సులభంగా రికవర్ చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది.ప్రస్తుతం ఆఫ్రికా వంటి కొన్ని ఎంపిక చేసిన అంతర్జాతీయ ప్రాంతాల్లో ఈ మార్పును వినియోగదారులు గమనించారు. భారతదేశంలోనూ కొత్త ఖాతా తెరిచే సమయంలో తప్పనిసరిగా ఫోన్ నంబర్ అడుగుతున్నట్లు కొందరు యూజర్లు సోషల్ మీడియా ద్వారా నివేదిస్తున్నారు.స్టోరేజీని గూగుల్ నిజంగానే తగ్గిస్తోందా?ప్రస్తుతానికి గూగుల్ ఈ విధానాన్ని ఒక ప్రయోగంగా మాత్రమే చెబుతోంది తప్ప, ఉచిత స్టోరేజీని శాశ్వతంగా తగ్గిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ల నిర్వహణ ఖర్చులు, వాటికి పెరుగుతున్న డిమాండ్ వల్లే టెక్ కంపెనీలు ఉచిత సేవలను పరిమితం చేస్తున్నాయనే ప్రచారం జరుగుతున్నప్పటికీ.. గూగుల్ దీనిని ధ్రువీకరించలేదు.ఇదీ చదవండి: ఇరవై ఏళ్లలో మారిన ఇంధన సమీకరణాలు! -
మోటోరోలా తొలి ఫోల్డబుల్ ఫోన్: ధర ఎంతంటే?
మోటరోలా భారత్లో తన తొలి ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ ‘మోటరోలా రేజర్ ఫోల్డ్’ను అధికారికంగా విడుదల చేసింది. ఆకర్షణీయమైన డిజైన్, అద్భుతమైన కెమెరా సెటప్, ఏఐ (మోటో ఏఐ) ఫీచర్లు, ఫోల్డబుల్స్లోనే అతిపెద్ద బ్యాటరీతో ఈ ఫోన్ ప్రీమియం సెగ్మెంట్లో వినియోగదారుల ముందుకు వచ్చింది. ఫోల్డబుల్ ఫోన్లలోనే అత్యంత శక్తివంతమైన 6,000ఎంఏహెచ్ సిలికాన్-కార్బన్ బ్యాటరీని ఇందులో అమర్చారు. ఇది 80డబ్ల్యూ టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్, 50డబ్ల్యూ వైర్లెస్ ఛార్జింగ్ను సపోర్ట్ చేస్తుంది.డిస్ప్లే, పెర్ఫార్మెన్స్: ఇందులో 6.6 అంగుళాల ఎక్స్టర్నల్ అమోలెడ్ డిస్ప్లే ఉండగా, అన్ఫోల్డ్ చేసినప్పుడు 8.1 అంగుళాల భారీ 2కే మెయిన్ డిస్ప్లేగా మారుతుంది. ఇది 6,200 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్ను కలిగి ఉంటుంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్తో పనిచేసే ఈ ఫోన్, ఆండ్రాయిడ్ 16 వెర్షన్తో వస్తుంది. దీనికి ఏకంగా 7 ఏళ్ల పాటు ఆండ్రాయిడ్ ఓఎస్, సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి.కెమెరా విశేషాలు: ఫోటోగ్రఫీ కోసం ఇందులో ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిపుల్ 50 మెగాఫిక్సెల్(ఎంపీ) ఎంపీ ప్రో–గ్రేడ్ ఫోల్డబుల్ కెమెరా సిస్టమ్ను అందించారు. 50ఎంపీ ప్రధాన కెమెరా (సోనీ లైటియా 828) 8కే డాల్బీ విజన్ రికార్డింగ్కు సపోర్ట్ ఇస్తుంది. వీటితో పాటు 50ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ (3ఎక్స్ ఆప్టికల్ జూమ్, 100ఎక్స్ సూపర్ జూమ్ ప్రో), 122 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ కలిగిన 50ఎంపీ అల్ట్రావైడ్ కెమెరాలు ఉన్నాయి.ఫిఫా వరల్డ్కప్ 26 స్పెషల్ ఎడిషన్: ఫుట్బాల్ అభిమానుల కోసం ప్రత్యేకంగా ఫిఫా వరల్డ్కప్ 26 ఎడిషన్ను మోటరోలా పరిచయం చేసింది. ఈ వేరియంట్ వెనుక భాగంలో 24 క్యారెట్ల బంగారు పూతతో కూడిన అధికారిక ఫిఫా లోగో ఉంటుంది. ఇది ప్రత్యేకమైన ఫిఫా థీమ్స్, వాల్పేపర్లతో వస్తుంది.ధర, డిస్కౌంట్లు: 12జీబీ + 256జీబీ వేరియంట్ రూ. 1,49,999గా, 16 జీబీ + 512 జీబీ ధర రూ.1,59,999గా ఉన్నాయి. ఫిపా వరల్డ్కప్ 26 ఎడిషన్ రూ. 1,69,999 గా నిర్ణయించారు. లాంచింగ్ ఆఫర్ల కింద యాక్సిస్, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 10,000 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై 18 నెలల వరకు నో–కాస్ట్ ఈఎంఐ సదుపాయం కల్పించారు. జూన్ 20లోపు కొనుగోలు చేసిన వారికి ఒకసారి ఉచిత స్క్రీన్ రీప్లేస్మెంట్ (ఒక ఏడాది వరకు చెల్లుబాటు) లభిస్తుంది ఈ ఫోన్ ఫ్లిప్కార్ట్, మోటోరోలాడాట్ సైట్లలో, ప్రముఖ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటాయి. మే 20 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి.మోటో బడ్స్2 ప్లస్: వినియోగదారులకు మెరుగైన ఆడియో అనుభవం కోసం ‘మోటో బడ్స్ 2 ప్లస్’ను కూడా విడుదల చేసింది. ఇవి ‘సౌండ్ బై బోస్’ టెక్నాలజీతో రూపొందాయి. 11ఎంఎం డైనమిక్ డ్రైవర్లు, సెగ్మెంట్లోనే ఉత్తమమైన 55డీబీ డైనమిక్ ఏఎన్సీ (నాయిస్ క్యాన్సిలేషన్), బ్లూటూత్ 6.0 సపోర్ట్ ఉన్నాయి. ఇవి కేస్తో కలిపి 40 గంటల వరకు ప్లేటైమ్ ఇస్తాయి. దీని ధర రూ. 5,999 కాగా, రూ. 1,000 బ్యాంక్ డిస్కౌంట్తో రూ. 4,999 కే లభిస్తాయి. -
ఫాక్స్కాన్పై సైబర్ దాడి
అంతర్జాతీయ టెక్నాలజీ రంగంలో సరఫరా గొలుసు భద్రతపై మరోసారి ఆందోళనలు మొదలయ్యాయి. యాపిల్ సంస్థకు ప్రధాన తయారీ భాగస్వామి అయిన ఫాక్స్కాన్పై భారీ సైబర్ దాడి జరిగినట్లు ఆ సంస్థ అధికారికంగా ధ్రువీకరించింది. ఉత్తర అమెరికాలోని పలు ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ రాన్సమ్వేర్ దాడిలో యాపిల్తో పాటు గూగుల్, ఎన్విడియా వంటి దిగ్గజ సంస్థల రహస్య ప్రాజెక్ట్ ఫైళ్లు హ్యాకర్ల చేతిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.8టీబీ డేటా మాయం..ప్రముఖ రాన్సమ్వేర్ ముఠా ‘నైట్రోజన్’ ఈ దాడికి బాధ్యత వహిస్తూ సంచలన ప్రకటన చేసింది. ఫాక్స్కాన్ సర్వర్ల నుంచి సుమారు 1.1 కోట్ల ఫైళ్లు, అంటే దాదాపు 8 టెరాబైట్ల డేటాను తాము దొంగిలించినట్లు హ్యాకర్లు పేర్కొన్నారు. ఇందులో కేవలం ఫాక్స్కాన్ అంతర్గత సమాచారమే కాకుండా కొన్ని సంస్థల కీలక పత్రాలు ఉన్నాయని హ్యాకర్లు చెబుతున్నారు. అందులో..యాపిల్: భవిష్యత్తులో విడుదల కాబోయే పరికరాల సాంకేతిక డ్రాయింగ్లు.ఇంటెల్, ఎన్విడియా: సెమీకండక్టర్ డిజైన్లు, చిప్సెట్ మాన్యుస్క్రిప్ట్లు.గూగుల్, డెల్: అంతర్గత ప్రాజెక్ట్ పత్రాలు, రహస్య ఆదేశాలు.అప్రమత్తమైన టీమ్సైబర్ దాడిని గుర్తించిన వెంటనే ఫాక్స్కాన్ సెక్యూరిటీ టీమ్ అప్రమత్తమైంది. అత్యవసర సహాయక చర్యలు చేపట్టినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఈ దాడుల వల్ల ఉత్పత్తి, డెలివరీ కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నాం. ప్రభావితమైన ప్లాంట్లు దశలవారీగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి’ అని చెప్పింది. అయితే, వినియోగదారుల వ్యక్తిగత డేటా ఏదైనా లీక్ అయిందా అనే అంశంపై కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.ఏమిటీ నైట్రోజన్ గ్యాంగ్..సైబర్ నిపుణుల విశ్లేషణ ప్రకారం, ఈ నైట్రోజన్ రాన్సమ్వేర్ రష్యా మద్దతున్న ‘కాంటి’ గ్రూప్ కోడ్ నుంచి ఉద్భవించింది. 2023లో వెలుగులోకి వచ్చిన ఈ ముఠా ప్రధానంగా వీఎమ్వేర్ ఈఎస్క్సీ వంటి వర్చువలైజేషన్ సిస్టమ్స్ను లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ సాఫ్ట్వేర్లో ఉన్న సాంకేతిక లోపాల వల్ల బాధితులు హ్యాకర్లకు డబ్బు చెల్లించినా డేటా తిరిగి వస్తుందనే గ్యారెంటీ లేదని భద్రతా సంస్థ కోవైర్ హెచ్చరించింది.ఫాక్స్కాన్కు గతంలో..ఫాక్స్కాన్పై సైబర్ దాడులు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ పలుమార్లు ఈ సంస్థ హ్యాకర్ల బారిన పడింది. 2022 మెక్సికోలోని ఫాక్స్కాన్ అనుబంధ సంస్థపై లాక్బిట్ దాడి జరిగింది. 2024 ప్రారంభంలో ఫాక్స్కాన్ గ్రూప్లోని సెమీకండక్టర్ విభాగం ‘ఫాక్స్సెమికాన్’లో డేటా లీక్ అయింది.యాపిల్ మౌనం..యాపిల్ తన తయారీ భాగస్వాములకు ఇచ్చే సమాచారం విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది. ఏయే భాగాలను ఎలా అసెంబ్లీ చేయాలో మాత్రమే అందించి సాంకేతిక సమాచారాన్ని పరిమితంగా పంచుకుంటుంది. అయినప్పటికీ, డ్రాయింగ్లు, డిజైన్ పత్రాలు లీక్ అవ్వడం అనేది యాపిల్ భవిష్యత్ ఉత్పత్తుల గోప్యతకు పెద్ద ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది. ఈ వ్యవహారంపై యాపిల్ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక స్పందన ఇవ్వలేదు.ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్పై జోహో ప్రకటన -
విమానమెక్కి ఆఫీసుకి.. నెలకు రూ. 2.8 లక్షల ఖర్చు!
సాధారణంగా ఉద్యోగులు ఆఫీసుకి వెళ్లాలంటే బైకో, కారో లేదా మెట్రో రైలో ఎక్కుతారు. కాస్త ట్రాఫిక్ ఎక్కువైతేనే విసిగిపోతుంటారు. కానీ, ఈ గూగుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కథ వింటే మీరు ఆశ్చర్యపోవాల్సిందే. తన వృత్తిని, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఆయన ఏకంగా ఒక నగరం నుండి మరో నగరానికి విమానంలో ప్రయాణిస్తూ ‘సూపర్ కమ్యూటర్’గా వార్తల్లో నిలిచారు. గూగుల్ సంస్థలో ‘ఫ్లో-AI’ (ఇమేజ్ అండ్ వీడియో జనరేషన్) విభాగంలో పనిచేస్తున్న హాంగ్ (జాసన్) వై, తన వినూత్న జీవనశైలితో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.ప్రేమ కోసం సాహసోపేత నిర్ణయంఈ కఠినమైన ప్రయాణాల వెనుక ఒక బలమైన కారణం ఉంది. వై బే ఏరియాలోని గూగుల్ ప్రధాన కార్యాలయంలో చేరాలని ఆశపడ్డారు. అయితే, ఆయన జీవిత భాగస్వామి సీటెల్లోని అమెజాన్ కార్యాలయంలో మంచి కెరీర్ వృద్ధిలో ఉన్నారు. "ఆమె కెరీర్ను దెబ్బతీయకుండా, నా వృద్ధిని కొనసాగిస్తూనే మా బంధాన్ని కాపాడుకోవడానికి నేను తీసుకున్న నిర్ణయమే ఈ ‘ఫ్లైట్ కమ్యూటింగ్’" అని వై పేర్కొన్నారు.షెడ్యూల్, ఖర్చుల లెక్కలు ఇలా..ఒక సాదాసీదా మధ్యతరగతి కుటుంబం ఏడాదికి సంపాదించే మొత్తాన్ని ఈయన తన ప్రయాణాల కోసం నెలకే ఖర్చు చేస్తున్నారు. ప్రతి సోమవారం లేదా మంగళవారం సీటెల్ నుండి శాన్ జోస్ (కాలిఫోర్నియా)కు విమాన ప్రయాణం. తిరిగి గురువారం లేదా శుక్రవారం మళ్లీ సీటెల్ పయనం. ఇదీ వై షెడ్యూల్.రెండు నగరాల్లో ఇంటి అద్దెలు, విమాన టిక్కెట్లు, ఉబర్ ఛార్జీలు, కాలిఫోర్నియా పన్నులు కలిపి నెలకు సుమారు 3,000 డాలర్లు (సుమారు రూ.2.8 లక్షలు) ఖర్చు అవుతోంది. "సౌకర్యం కంటే ఎదుగుదలను ఎంచుకోవాలి" అనే సిద్ధాంతాన్ని వై నమ్ముతారు. 16 ఏళ్ల వయసులో దక్షిణ కొరియా నుండి అమెరికాకు వలస వచ్చిన ఆయనకు సవాళ్లను ఎదుర్కోవడం కొత్తేమీ కాదు.బిజీ లైఫ్.. అయినా సైడ్ హజిల్!ఇంతటి కఠినమైన షెడ్యూల్ ఉన్నప్పటికీ, వై తన సృజనాత్మకతను వదులుకోలేదు. గూగుల్లో AI ప్రాజెక్టులతో పాటు, ఖాళీ సమయంలో సుమారు 500 మంది సబ్స్క్రైబర్లు ఉన్న ఒక పర్సనల్ న్యూస్లెటర్ కూడా నడుపుతున్నారు. "కాగితం మీద చూస్తే ఇది అర్థం లేని నిర్ణయంలా అనిపించవచ్చు. కానీ, ఈ ప్రయాణం వల్ల నేను పొందుతున్న వృద్ధి, అనుభవం.. నేను పెట్టే ఖర్చు కంటే చాలా విలువైనవి" అని వై ధీమాగా చెబుతున్నారు. నేటి తరం యువత కెరీర్, రిలేషన్ షిప్ కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధపడుతుందనడానికి జాసన్ వై ఒక నిదర్శనం. -
2030 నాటికి భారత ఆర్థిక వ్యవస్థకు ఏఐ జోష్
భారతదేశం మరో పారిశ్రామిక విప్లవానికి వేదిక కాబోతోంది. 2030 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత దేశ ఆర్థిక వ్యవస్థకు ఏకంగా 500 బిలియన్ డాలర్లకు పైగా అదనపు విలువను జోడించనుందని తాజా నివేదిక వెల్లడించింది. ఐబీఎం ఇన్స్టిట్యూట్ ఫర్ బిజినెస్ వాల్యూ, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన ‘ఇండియాఏఐ’ సంయుక్తంగా రూపొందించిన ‘ప్రామిస్ టు పవర్: హౌ ఏఐ ఈజ్ రిడిఫైనింగ్ ఇండియా ఎకనామిక్ ఫ్యూచర్’ అనే నివేదికలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఆశయం గొప్పదే.. కానీ..భారతదేశం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఏఐ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని నివేదిక ఆశాభావం వ్యక్తం చేసింది. సర్వేలో పాల్గొన్న 73% మంది వ్యాపార దిగ్గజాలు 2030 నాటికి భారత్ ప్రపంచ ఏఐ లీడర్గా అవతరిస్తుందని నమ్ముతున్నారు. ఐదుగురు వ్యాపారవేత్తలలో నలుగురు ఏఐ పెట్టుబడులు నేరుగా దేశ జీడీపీ వృద్ధిని ప్రభావితం చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు.అయితే, వాస్తవ పరిస్థితులు కొంత ఆందోళనకరంగా ఉన్నాయి. సర్వే చేసిన సంస్థల్లో 72% సంస్థలు అంతర్జాతీయ పోటీతో పోలిస్తే తాము ఏఐ అమలులో వెనుకబడి ఉన్నామని అంగీకరించాయి. ఆశయానికి, ఆచరణకు మధ్య ఉన్న ఈ అంతరాన్ని తగ్గించడమే ఇప్పుడు దేశం ముందున్న ప్రధాన సవాలు.35 కోట్ల మంది నిపుణులు అవసరంఈ నివేదిక ప్రధానంగా నైపుణ్యాల కొరతను ఎత్తిచూపింది. ‘ప్రస్తుతం కేవలం 30% మంది ఉద్యోగులకు మాత్రమే ఏఐ పరిజ్ఞానం ఉంది. 2030 నాటికి ఈ అవసరాలు తీరాలంటే దేశవ్యాప్తంగా 350 మిలియన్ల (35 కోట్లు) ఏఐ నిపుణులు అవసరమవుతారు’ అని అంచనా వేసింది. కేవలం సాంకేతికత ఉండటం ముఖ్యం కాదు. ఆ సాంకేతికతను నడిపించే నైపుణ్యం గల మానవ వనరులు ఉండటమే అసలైన విజయమని నివేదిక పేర్కొంది.డేటా సార్వభౌమాధికారండేటా భద్రత, నియంత్రణ విషయంలో భారతీయ కంపెనీలు కఠినంగా ఉన్నాయి. 74% మంది ఎగ్జిక్యూటివ్లు డేటాపై పూర్తి నియంత్రణ ఉండాలని కోరుకుంటున్నారు. ఖర్చును తగ్గించుకుంటూనే పనితీరును మెరుగుపరచుకోవడానికి 10 మందిలో ఏడుగురు హైబ్రిడ్ క్లౌడ్ నమూనా వైపు మొగ్గు చూపుతున్నారు. స్వదేశీ క్లౌడ్ మౌలిక సదుపాయాలు లేకపోవడం (77%), డేటా నాణ్యత సరిగ్గా లేకపోవడం (57%) ఏఐ విస్తరణకు ప్రధాన అడ్డంకులుగా మారాయి.భారతదేశం కేవలం ఏఐ వినియోగదారుగా మాత్రమే కాకుండా సృష్టికర్తగా ఎదగాలంటే ‘ఇండియాఏఐ ఫ్యూచర్ స్కిల్స్’ వంటి కార్యక్రమాలు క్షేత్రస్థాయికి వెళ్లాలి. ముఖ్యంగా టైర్ 2, టైర్ 3 నగరాల్లో ఏఐ ల్యాబ్ల ఏర్పాటు ద్వారా మారుమూల ప్రాంతాల్లోని ప్రతిభను ఒడిసిపట్టాలి. అప్పుడే 500 బిలియన్ డాలర్ల కల సాకారమవుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు సమన్వయంతో పనిచేసి విప్లవాత్మక మార్పులు తెస్తేనే ఈ ఏఐ స్వప్నం సాకారం అవుతుందంటున్నారు.ఇదీ చదవండి: బంగారం షాక్.. దిమ్మతిరిగేలా రేట్లు పెంపు -
ఒకేసారి 20కిపైగా ప్రొడక్ట్స్ లాంచ్ చేసిన HP India
హెచ్పీ ఇండియా దేశీయ మార్కెట్లో ఒకేసారి 20 కంటే ఎక్కువ ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. ఇందులో ల్యాప్టాప్లు, ప్రింటర్లు, AI ఆధారిత డివైజ్లు ఉన్నాయి.విద్యార్థులు, క్రియేటర్లు, ప్రొఫెషనల్స్, చిన్న వ్యాపారుల వరకు అందరికీ సులభమైన, లేటెస్ట్ టెక్నాలజీని అందించడమే ప్రధాన ఉద్దేశ్యంగా కంపెనీ కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేసింది. ఇందులో ముఖ్యంగా రెండు కొత్త కేటగిరీలు ఉన్నాయి.మొదటిది హెచ్పీ ఓమ్నిపాడ్ 12. ఇది టాబ్లెట్లా ఉపయోగించుకోవచ్చు. కానీ.. పీసీ మాదిరిగా పనితీరును అందించే ఒక కొత్త డివైజ్. తొలిసారి కంప్యూటర్ ఉపయోగించే విద్యార్థులు, చిన్న వ్యాపారాలు, సాధారణ వినియోగదారులకు ఇది ఉపయోగపడుతుంది. దీని ప్రారంభ ధర రూ.48,999.రెండవది హెచ్పీ ఎలైట్ బోర్డ్ G1a Next Gen AI PC. ఇది ప్రపంచంలోనే మొదటి AI కీబోర్డ్ బేస్డ్ కంప్యూటర్. ఆఫీస్ వినియోగం కోసం, తేలికగా ఉపయోగించగలిగే విధంగా ఉంటుంది. ఇది మంచి పనితీరును అందిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.89900.కంపెనీ లాంచ్ చేసిన ఇతర ఉత్పత్తులలో.. ఎలైట్ బుక్, ప్రోబుక్, ఓమ్నిబుక్ సిరీస్ ల్యాప్టాప్లు, AI బేస్డ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్లు, కొత్త ప్రింటింగ్ టెక్నాలజీలు కూడా ఉన్నాయి. ఇవన్నీ హెచ్పి ఆన్లైన్ స్టోర్, అమెజాన్, రిలయన్స్, హెచ్పి వరల్డ్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. -
రూ.10వేల కంటే తక్కువ ధర: సరికొత్త స్మార్ట్ఫోన్!
స్టైలిష్ అండ్ ఇన్నోవేటివ్ స్మార్ట్ఫోన్లకు ప్రసిద్ధి చెందిన 'జెనో సిరీస్' ఇప్పుడు తన కొత్త స్మార్ట్ఫోన్ జెనో 200ను లాంచ్ చేసింది. ఇది అమెజాన్ ఈకామర్స్ వెబ్సైట్లో అమ్మకానికి ఉంది. దీని ధర కేవలం రూ.9,999 మాత్రమే.ఈ ఫోన్లో MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ ఉంది. కాబట్టి సాధారణ బడ్జెట్ ఫోన్లతో పోలిస్తే ఇది చాలా దృఢంగా ఉంటుంది. ఇది IP65 రేటింగ్ ఉండటంతో ధూళి, నీటి నుంచి కూడా రక్షణ లభిస్తుంది. ఇందులో AI అసిస్టెంట్ కూడా ఉండటం వల్ల.. ఇది రోజువారీ పనులను మరింత సులభంగా.. వేగంగా చేయడంలో సహాయపడుతుంది. ఈ ఫోన్ 4+8GB RAM, 128GB స్టోరేజ్తో లభిస్తుంది.జెనో 200 ఫోన్లో 6.75 ఇంచెస్ 120Hz HD+ డిస్ప్లే ఉంది. DTS సౌండ్ సపోర్ట్ వల్ల వీడియోలు, మ్యూజిక్ మరింత అద్భుతమైన అనుభవాన్ని ఇస్తాయి. ఈ ఫోన్ నాలుగేళ్లు పాటు మంచి పనితీరును అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఫోటోగ్రఫీ కోసం 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా లభిస్తుంది. అలాగే IR Blaster ద్వారా TV, AC వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా కంట్రోల్ చేయవచ్చు.ఆక్టా కోర్ యూనిసోక్ టీ7250 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15 గో వంటివి జెనో 200 ఫోన్లో ఉండటం వల్ల, ఇది గేమింగ్, మల్టీటాస్కింగ్, వీడియో కాలింగ్లో మంచి అనుభవాన్ని అందిస్తుంది. ఇందులో 5000mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో దీనిని రోజంతా సౌకర్యంగా ఉపయోగించుకోవచ్చు. ఈ ఫోన్ కామెట్ ఆరంజ్, మీటియోర్ టైటానియం, బ్లూ వంటి రంగులలో లభిస్తుంది.రూ.10 వేలు కంటే తక్కువ ధరలో స్మార్ట్ఫోన్లుటెక్నో స్పార్క్ గో 3: ప్రారంభ ధర రూ.9,999పోకో సి81ఎక్స్: ప్రారంభ ధర రూ.9,999లావా బోల్డ్ N2 ప్రో: ప్రారంభ ధర రూ.7,999టెక్నో పాప్ X: ప్రారంభ ధర రూ.9,299ఏఐ+ పల్స్ 2: ప్రారంభ ధర రూ.8,999 -
ఇదొక్కటి 25 చెట్లకు సమానం!
రోజురోజుకి వాయుకాలుష్యం పెరిగిపోతోంది, ఇతర ప్రమాదకర వాయువులు ఎక్కువకావడంతో.. ఆక్సిజన్ కొరత ఏర్పడుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, పలు కంపెనీలు పరిష్కార మార్గాలను అన్వేషించడంలో బిజీ అయ్యాయి. అయితే తొలిసారి మష్రూమ్ వరల్డ్ గ్రూప్ 'ఆల్గే ట్రీ' (Algae Tree) ఆవిష్కరించింది.మష్రూమ్ వరల్డ్ గ్రూప్ 'ఆల్గే ట్రీ'ను మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరంలోని స్వామి వివేకానంద పార్కులో ఏర్పాటు చేసింది. ఇది వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ను గ్రహించి, దానిని ఆక్సిజన్గా మారుస్తుంది. ఈ ప్రక్రియ సాధారణ మొక్కలు జరిపే' కిరణజన్య సంయోగక్రియ' మాదిరిగా అన్నమాట. అయితే.. తక్కువ స్థలంలో ఎక్కువ కార్బన్ను ఆక్సిజన్గా మార్చడం దీని ప్రత్యేకత.ఒక ఆల్గే ట్రీ సంవత్సరానికి సుమారు 1.5 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ను గ్రహిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఇది దాదాపు 25 పెద్ద చెట్లు గ్రహించే CO₂కు సమానం. నగరాల్లో పెద్ద ఎత్తున చెట్లు నాటడానికి స్థలం లేకపోవడం వల్ల, ఈ విధమైన సాంకేతిక పరిష్కారాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.India's first Algae Tree that converts carbon dioxide into oxygen, equal to 25 trees. It also has solar panels on top and is installed in Bhopal's Swami Vivekananda Park.Credit: Team Update Bus Bhopal, ViaWeb pic.twitter.com/4nBbP5B7qg— Pareekh Jain (@pareekhjain) May 10, 2026ఆల్గే ట్రీ సోలార్ ప్లేట్లను పెపొందుతుంది. కాబట్టి ఇది సౌరశక్తితో పనిచేస్తుంది. అంటే పర్యావరణానికి హాని కలిగించకుండా పునరుత్పాదక శక్తిని వినియోగించడం ద్వారా మరింత అనుకూలంగా ఉంటుందన్నమాట. దీనిని రూపొందించడానికి రెండు సంవత్సరాల సమయం పట్టిందని, 50 మందికి పైగా శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, నిపుణులు కలిసి పనిచేశారని సంస్థ వెల్లడించింది.ప్రస్తుతం భారతదేశంలోని అనేక నగరాలు అధిక ఉష్ణోగ్రతలు, గాలి కాలుష్యం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆల్గే ట్రీ వంటి సాంకేతిక పరిజ్ఞానం నగరాల్లో కార్బన్ స్థాయిలను తగ్గించడంలో, గాలి నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.ఇదీ చదవండి: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతోంది! -
తప్పుగా అర్థం చేసుకుంటున్నాయి!
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని భావిస్తున్న తరుణంలో భారతీయ భాషల విషయంలో ప్రస్తుత ఏఐ టూల్స్ డొల్లతనాన్ని ‘హుమిన్ ల్యాబ్స్’ అధ్యయనం బట్టబయలు చేసింది. గూగుల్, ఓపెన్ ఏఐ వంటి అంతర్జాతీయ దిగ్గజాల మోడళ్లు సైతం భారతీయ భాషలను పాఠకులకు స్పష్టంగా తెలియజేయడం(ట్రాన్స్క్రిప్షన్)లో విఫలమవుతున్నాయని ఈ నివేదిక తెలియజేస్తోంది.మూడు పదాల్లో ఒకటి తప్పుఫిజికల్, వాయిస్ ఏఐ డేటా మౌలిక సదుపాయాల రంగంలో సర్వీసులు అందిస్తున్న హుమిన్ ల్యాబ్స్ అధ్యయనం ప్రకారం, ప్రసిద్ధ ఏఐ మోడళ్లు భారతీయ భాషలను వినేటప్పుడు ప్రతి మూడు పదాల్లో ఒకదాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా భారతీయులు సహజంగా మాట్లాడే మిశ్రమ ప్రసంగం(ఇంగ్లీష్+హిందీ లేదా మరేదైనా భాష + ఇంగ్లీష్) విషయంలో ఈ సాధనాలు తడబడుతున్నాయి. వాక్యం మధ్యలో వచ్చే ఆంగ్ల పదాలను ఇవి పూర్తిగా వదిలేయడం లేదా తప్పుగా మార్చడం వల్ల అర్థం పూర్తిగా మారిపోతోంది.‘ప్రస్తుత ఏఐ ప్రొవైడర్లు ఇంటర్నెట్ డేటాతో శిక్షణ పొందిన సెట్లను ఉపయోగించి తమకు తామే మార్కులు వేసుకుంటున్నారు. కానీ గ్లోబల్ సౌత్ (భారత్ వంటి దేశాలు) వినియోగదారులు వాస్తవంగా ఎలా మాట్లాడుతారో ఈ గణాంకాలు ప్రతిబింబించవు. అసంబద్ధమైన వివరాలు చూసి సంస్థలు నిర్ణయాలు తీసుకోవడం ఆందోళనకరం’ అని హుమిన్ ల్యాబ్స్ సహ వ్యవస్థాపకుడు మనీష్ అగర్వాల్ తెలిపారు.బెంచ్ మార్క్ స్కోర్లుహుమిన్ ల్యాబ్స్ రూపొందించిన ‘బ్రిడ్జ్’ అనే గ్లోబల్ ఎవాల్యుయేషన్ బెంచ్ మార్క్ ద్వారా పలు సంస్థల పనితీరును విశ్లేషించారు.ఏఐ మోడల్ / ప్రొవైడర్సెమాంటిక్ గ్యాప్ స్కోర్ (కచ్చితత్వం)ప్రస్తుత పరిస్థితిదీప్ గ్రామ్ నోవా-30.906ప్రస్తుతానికి అగ్రస్థానంలో ఉందిసర్వం ఏఐ (సారస్ V3)20.2% (WER)గ్లోబల్ మోడళ్ల కంటే మెరుగైన 3వ స్థానంఓపెన్ ఏఐ (GPT-4o)< 0.4ఆశాజనకంగా లేదుఅమెజాన్ ట్రాన్స్ స్క్రైబ్0.199అత్యంత బలహీనమైన ప్రదర్శనగమనిక: జెమిని 2.5 ఫ్లాష్, ఎలెవెన్ ల్యాబ్స్ వంటి టూల్స్ కూడా ఈ అధ్యయనంలో భాగంగా ఉన్నాయి.స్వదేశీ టూల్స్ మెరుగైనప్పటికీ.. సవాళ్లు తప్పవుభారతీయ స్టార్టప్ ‘సర్వం ఏఐ’ రూపొందించిన సారస్ వీ3, గూగుల్ జెమిని, మైక్రోసాఫ్ట్ అజూర్ వంటి దిగ్గజాల కంటే మెరుగైన ఫలితాలను చూపడం విశేషం. వర్డ్ ఎర్రర్ రేట్ (డబ్ల్యూఈఆర్) పరంగా ఇది 20.2 శాతంతో మూడో స్థానంలో నిలిచింది. అయితే, మిశ్రమ ప్రసంగం విషయానికి వస్తే ఇది కూడా 0.588 స్కోరులో నిలిచింది.వర్డ్ ఎర్రర్ రేట్ కొలమానం సరిపోదుపరిశ్రమలో సాధారణంగా వాడే వర్డ్ ఎర్రర్ రేట్ భారతీయ భాషల వైఫల్యాలను పట్టుకోవడంలో విఫలమవుతోందని హుమిన్ ల్యాబ్స్ సహ వ్యవస్థాపకుడు ఇశాంక్ గుప్తా అభిప్రాయపడ్డారు. ‘ఇంగ్లీష్ ఫోనాలజీ(భాషలో అర్థాన్ని ఎలా మారుతుంది అనే అంశాలను అధ్యయనం చేసే శాస్త్రాన్నే ఫోనాలజీ అంటారు) కోసం రూపొందించిన స్కోరింగ్ సిస్టమ్తో ఇండిక్ భాషలను మదింపు చేయడం సరికాదు. హిందీలో రాణించిన మోడల్ తెలుగులోనో, తమిళంలోనో రాణించాలని లేదు’ అని ఆయన పేర్కొన్నారు. -
హీట్ బీటర్స్.. కూల్గా ఉంచే బెస్ట్ గాడ్జెట్స్!
వేసవిలో ఎండ ఎంత పెరిగినా, మిమ్మల్ని మాత్రం కూల్గా ఉంచే బెస్ట్ హెల్పర్సే ఈ చిన్న గాడ్జెట్స్! ఇవి వేసవి కాలంలో చాలా ఉపయోగపడతాయి. ధర కూడా కొంత తక్కువగానే ఉండటం గమనార్హం. వీటి గురించి మరిన్ని వివరాలు ఇక్కడ..చల్లని టచ్తో గ్లోయింగ్ స్కిన్!వేసవిలో కూడా మీ ఫేస్ ఎప్పుడూ ఫ్రెష్గా, గ్లోయింగ్గా కనిపించాలని అనుకుంటున్నారా? అయితే ఈ చిన్న ఐస్ రోలర్ బ్యూటీ టూల్ మీ డైలీ స్కిన్ కేర్లో ఒక సూపర్ హెల్పర్ అవుతుంది. దీనిని ఫ్రిజ్లో కొద్దిసేపు పెట్టి, తర్వాత ముఖంపై నెమ్మదిగా రోల్ చేస్తే చల్లని థెరపీ లభిస్తుంది. ఇది ముఖానికి రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఇచ్చి, పఫీనెస్ తగ్గించడంలో, స్కిన్ మరింత ఫ్రెష్గా కనిపించడంలో సహాయపడుతుంది. సిలికాన్తో తయారైన ఈ రోలర్ మళ్లీ మళ్లీ వాడుకునేలా డ్యూరబుల్గా డిజైన్ చేశారు. నీళ్లు లేదా గ్రీన్ టీ, రోజ్ వాటర్ లాంటి వాటితో ఫ్రీజ్ చేసి మీకు నచ్చిన విధంగా ఉపయోగించుకోవచ్చు. ధర కేవలం రూ. 140 మాత్రమే!మెడలోనే రక్షణ కవచం!బయట అడుగు పెడితే చాలు... దుమ్ము, ధూళి, పొగతో ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉందా? అయితే వేరబుల్ పోర్టబుల్ ఎయిర్ ప్యూరిఫైయర్ మీ దగ్గర ఉండాల్సిందే! ఇది మీ మెడలో ఉంటే చాలు, మీరు ఎక్కడికి వెళ్లినా చల్లని, స్వచ్ఛమైన గాలి మీ వెంటే ఉంటుంది! గాలిలోని అత్యంత సూక్ష్మమైన కాలుష్య కణాలను, పొగను సెకన్లలో తొలగించి, ఇది గాలిని 99 శాతం స్వచ్ఛంగా మారుస్తుంది. పైగా ఫిల్టర్ మార్చాల్సిన అవసరం లేకుండా సులభంగా వాడుకునేలా డిజైన్ చేశారు. ట్రావెల్లో, ఆఫీస్లో లేదా బయట ఎక్కువసేపు ఉండాల్సిన వారికి ఇది ఒక స్మార్ట్ సపోర్ట్. ధర కేవలం రూ. 3,200.కూల్గా గేమ్ ఆడండి!వీడియో గేమ్స్ ఆడేటప్పుడు లేదా వీడియోలు ఎక్కువసేపు చూస్తుంటే ఫోన్ వేడెక్కి స్లో అవుతుందా? అయితే ఈ చిన్న ‘ఫోన్ కూలర్’ మీకు ఒక సూపర్ సొల్యూషన్. ఈ కూలర్ను ఫోన్కు జత చేస్తే చాలు, వేడి త్వరగా తగ్గించి ఫోన్ను కూల్గా ఉంచుతుంది. రెండు పవర్ మోడ్స్ ఉండటంతో అవసరానికి తగ్గట్టు కూలింగ్ లెవల్ను ఎంచుకోవచ్చు. గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ లేదా లాంగ్ కాల్స్ సమయంలో ఇది మంచి సపోర్ట్గా ఉంటుంది. చిన్న సైజ్లో ఉండటం వల్ల ఫోన్ పట్టుకున్నప్పుడు ఏ అసౌకర్యం కలగదు. పైగా ఎక్కువ శబ్దం చేయకుండా నిశ్శబ్దంగా పనిచేస్తుంది. ధర కేవలం రూ. 1,100. -
ఇక మూడింది మిడిల్ మేనేజర్లకే.. సీఈఓ వార్నింగ్
కృత్రిమ మేధస్సు (AI) విప్లవం కార్పొరేట్ ప్రపంచంలో పెను మార్పులకు నాంది పలుకుతోంది. ముఖ్యంగా కేవలం పర్యవేక్షణకే పరిమితమయ్యే "ప్యూర్ పీపుల్ మేనేజర్ల" మనుగడ ఇకపై కష్టమేనని ఎయిర్బీఎన్బీబి (Airbnb) సీఈఓ బ్రియాన్ చెస్కీ హెచ్చరించారు. పనిలో ప్రత్యక్షంగా భాగస్వాములు కాకుండా, కేవలం సిబ్బందిని మేనేజ్ చేసే పాత పద్ధతులకు కాలం చెల్లిందని ఆయన అభిప్రాయపడ్డారు.పని చేయని వారికి చోటు లేదు!ఇటీవల ఒక పాడ్కాస్ట్లో మాట్లాడిన చెస్కీ, ఏఐ యుగంలో నెట్టుకురావాలంటే మేనేజర్లు తమ పనితీరును మార్చుకోవాలని సూచించారు. ఇకపై మేనేజర్లు కేవలం మీటింగ్లు, పర్ఫార్మెన్స్ రివ్యూలకే పరిమితం కాకూడదు. ప్రాజెక్టుల లోతుపాతులను అర్థం చేసుకుంటూ టీమ్తో కలిసి పని చేయాలి. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా అప్డేట్ అవ్వని వారు, ఏఐ వినియోగాన్ని వ్యతిరేకించే వారు కెరీర్ రేసులో వెనుకబడిపోతారని ఆయన స్పష్టం చేశారు.ఎయిర్బీఎన్బీలో 60% కోడింగ్ ‘ఏఐ’తోనే..ఎయిర్బీఎన్బీ ఇప్పటికే ఏఐ వినియోగంలో ముందుంది. కంపెనీలో దాదాపు 60% కోడింగ్ ఇప్పుడు ఏఐ ద్వారానే జరుగుతోందని, దీనివల్ల ఉత్పత్తులను వేగంగా మార్కెట్లోకి తీసుకురావడమే కాకుండా, తక్కువ మందితో సమర్థవంతంగా పనిచేయడం సాధ్యమవుతోందని కంపెనీ వెల్లడించింది.తగ్గుతున్న ‘మేనేజ్మెంట్’ పొరలుఒక్క ఎయిర్బీఎన్బీ మాత్రమే కాదు, అనేక దిగ్గజ టెక్ సంస్థలు ఇప్పుడు "ఫ్లాటర్ స్ట్రక్చర్" (తక్కువ మేనేజ్మెంట్ స్థాయిలు) వైపు మొగ్గు చూపుతున్నాయి.మెటా ఇప్పటికే మేనేజ్మెంట్ పొరలను తొలగించి నిర్ణయ ప్రక్రియను వేగవంతం చేసింది. బ్లాక్ సీఈఓ జాక్ డోర్సే కూడా శాశ్వత మిడిల్ మేనేజ్మెంట్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాయిన్బేస్ సీఈఓ బ్రియాన్ ఆర్మ్స్ట్రాంగ్ సైతం "ప్యూర్ మేనేజర్" పాత్రలను తొలగిస్తున్నట్లు ప్రకటించారు.వస్తున్నది ‘ప్లేయర్-కోచ్’ల కాలంనివేదికలు, షెడ్యూలింగ్, పనితీరును ట్రాక్ చేయడం వంటి పనులను ఏఐ సులభంగా చేసేస్తోంది. కాబట్టి, కేవలం ఆర్డర్లు వేసే మేనేజర్ల కంటే, సాంకేతిక పరిజ్ఞానం ఉండి ప్రాజెక్టులో నేరుగా పాల్గొనే "ప్లేయర్-కోచ్" తరహా నాయకులకే భవిష్యత్తులో డిమాండ్ ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.జూనియర్ల విషయంలో జాగ్రత్త!అయితే, ఏఐ మోజులో పడి కొత్త గ్రాడ్యుయేట్లు, ఇంటర్న్ల నియామకాలను ఆపవద్దని చెస్కీ హెచ్చరించారు. ఎంట్రీ లెవల్ ఉద్యోగాలను పూర్తిగా తొలగిస్తే, భవిష్యత్తులో కంపెనీలను నడిపించే నాయకులు తయారుకారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐని ఉత్పాదకత పెంచుకోవడానికి వాడుకోవాలి తప్ప, నైపుణ్యం కలిగిన మానవ వనరుల పైప్లైన్ను దెబ్బతీసేలా ఉండకూడదని ఆయన సూచించారు. -
వైట్ కాలర్ ఉద్యోగాలకు ఏఐ గ్రహణం?
కంప్యూటర్ పుట్టుకొచ్చిన తొలినాళ్లలో చాలా రంగాల్లో సిబ్బంది అవసరం తగ్గిపోయింది. కానీ అప్పట్లో ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథంలో ఉండటంతో ఆ శ్రమశక్తి ఇతర రంగాల్లోకి మళ్లింది. కానీ నేడు మనం ఎదుర్కొంటున్న పరిస్థితి వేరు. ‘ఏజెంటిక్ ఏఐ’ రూపంలో వస్తున్న సాంకేతిక విప్లవం, అస్థిరమైన భౌగోళిక రాజకీయ పరిస్థితులు కలిసి ప్రపంచవ్యాప్తంగా వైట్ కాలర్ ఉద్యోగాలను తుడిచిపెట్టే ప్రమాదం కనిపిస్తోంది.నిర్ణయం దానిదే.. అమలు దానిదే!2024లో తెరపైకి వచ్చిన ఏజెంటిక్ ఏఐ కేవలం ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమే కాదు, ఒక పనిని ఎలా చేయాలో స్వయంగా నిర్ణయించుకుని పూర్తి చేయగలదు. ఆంత్రోపిక్ క్లాడ్ వంటి టూల్స్ ఎంత వేగంగా విస్తరిస్తున్నాయో చూస్తుంటే భయం కలగక మానదు. ‘ముందు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కానీ కొన్ని రంగాలు పూర్తిగా కనుమరుగవుతాయి’ అని ఓపెన్ ఏఐ చీఫ్ సామ్ ఆల్ట్మాన్ హెచ్చరించడం గమనార్హం.ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడీ అంచనా ప్రకారం.. కోడింగ్, ఫైనాన్స్, లా వంటి రంగాల్లో నైపుణ్యం కలిగిన వారి ఉద్యోగాల్లో 20 శాతం కోత పడే అవకాశం ఉంది. ఇది కేవలం సామాన్య ఉద్యోగులకే కాదు, మధ్యతరగతికి కీలకంగా మారే ఎంట్రీ లెవల్ వైట్ కాలర్ ఉద్యోగాలకు ఎసరు పెడుతోంది.భారత ఐటీ రంగానికి రెడ్ అలర్ట్భారతదేశం ప్రపంచానికి బ్యాక్ ఆఫీస్గా గుర్తింపు పొందింది. లక్షలాది మంది యువత ఐటీ సేవల ద్వారా ఉపాధి పొందుతున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి.కాగ్నిజెంట్ ఇప్పటికే భారత్లో అధిక వాటా ఉండేటా 15,000 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.సేల్స్ఫోర్స్ సంస్థలో సగం సపోర్ట్ సర్వీసులను ఏఐ చూసుకోవడంతో 4,000 ఉద్యోగాల్లో కోత పడింది.ఫ్రెష్వర్క్స్ తన కోడింగ్లో సగానికి పైగా ఏఐతో చేయిస్తూ 11 శాతం సిబ్బందిని తగ్గించుకుంది.డ్యుయోలింగో (ట్రాన్స్లేషన్), చెగ్ (ఎడ్యుకేషన్), హెచ్పీ వంటి దిగ్గజాలు కూడా ఏఐ కారణంగా సిబ్బందిని తగ్గిస్తున్నాయి.నందన్ నిలేకని చెప్పినట్లుగా కంపెనీలు ఇప్పుడు ‘టాప్-టు-బాటమ్’ పునర్నిర్మాణం చేసుకోవాల్సిన స్థితిలో ఉన్నాయి. గతంలో ఒక పనికి వందల మంది ఇంజినీర్లు అవసరమయ్యే వారు. ఇప్పుడు ఏఐ సాయంతో చిన్న టీమ్లు అదే పనిని నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి.యుద్ధ క్షేత్రంలోనూ రోబోలదే రాజ్యంసాంకేతికత కేవలం ఆఫీసులకే పరిమితం కాలేదు. రక్షణ రంగాన్ని కూడా మార్చేస్తోంది. ఉక్రెయిన్ యుద్ధంలో డ్రోన్లు, అటానమస్ రోబోల వినియోగం పెరిగింది. చైనా తన విమాన దళంలో మానవరహిత విమానాలను ప్రవేశపెడుతోంది. దీనిని గమనించిన భారత్ కూడా అప్రమత్తమైంది.బీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డ్రోన్ లాబొరేటరీలను ఏర్పాటు చేసింది. ఐఐటీల సహకారంతో విద్యార్థులకు, గ్వాలియర్ వంటి కేంద్రాల్లో సైనికులకు డ్రోన్ ఆపరేటింగ్, డిఫెన్స్లో శిక్షణ ఇస్తున్నారు.భారత్ ముందున్న సవాలుఒకవైపు శ్రమశక్తి విపరీతంగా పెరుగుతోంది. మరోవైపు శ్రమను నిర్వహించే ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు ఏఐ వల్ల ఆవిరవుతున్నాయి. ఒకప్పుడు అవుట్సోర్సింగ్ ద్వారా భారత్కు వచ్చే కాంట్రాక్ట్లు ఇప్పుడు ఆయా దేశాల్లోనే ఏఐ సాఫ్ట్వేర్ల ద్వారా పూర్తవుతున్నాయి. ప్రస్తుతానికి మాత్రం వైట్ కాలర్ ఉద్యోగులు తమ నైపుణ్యాలను అత్యున్నత స్థాయికి పెంచుకోకపోతే ప్రమాదంలో పడతారని గ్రహించాలి.ఇదీ చదవండి: భయం వద్దు.. నైపుణ్యమే హద్దు -
టెలికాం ఫిర్యాదుల పరిష్కారానికి కొత్త నిబంధనలు
సాక్షి, న్యూఢిల్లీ: ఫోన్ కాల్స్ డ్రాప్ అవుతున్నాయా? డేటా స్పీడ్ రావడం లేదా? బిల్లుల్లో తప్పులున్నాయా? ఇకపై ఇలాంటి టెలికాం ఫిర్యాదుల పరిష్కారం కోసం గంటల తరబడి కస్టమర్ కేర్ ప్రతినిధి కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ప్రతిపాదించిన ’టెలికాం వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార (నాల్గవ సవరణ) నిబంధనలు–2026’ వినియోగదారుడికి మరింత ఉపశమనం ఇవ్వనున్నాయి. ఇందుకు సంబంధించిన నిబంధనలను విడుదల చేసినట్లు గురువారం కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ ప్రకటనలో తెలిపింది. గతంలో నిమిషాల కొద్దీ వెయిటింగ్ నెట్వర్క్ సమస్యలు, డేటా సమస్యల పరిష్కారం కోసం గతంలో ఫిర్యాదు చేయాలంటే కేవలం కాల్ సెంటర్కు ఫోన్ చేయడం లేదా ఎస్ఎంఎస్ పంపడం మాత్రమే ప్రధాన మార్గాలుగా ఉండేవి. ఫిర్యాదు చేసిన తర్వాత దాని పరిస్థితి ఏమిటో తెలుసుకోవడానికి కస్టమర్ కేర్కు మళ్లీ మళ్లీ ఫోన్ చేయాల్సిన అవసరం ఉండేది. ఓ పక్క పరిష్కారం కాకపోవడం, మరోపక్క ఫిర్యాదు నమోదు అయ్యిందో లేదో తెలుసుకునేందుకే గంటల కొద్దీ ఐవీఆర్ కాల్లో వెయిట్ చేయాల్సి వచ్చేది. చేసిన ఫిర్యాదు ఎన్ని రోజులకు పరిష్కారం అవుతుందో తెలియని పరిస్థితులు ఉండేవి. కొత్త నిబంధనలు ఇలా కొత్త నిబంధనల ప్రకారం.. ప్రతి టెలికాం కంపెనీ తప్పనిసరిగా తమ మొబైల్ యాప్, అధికారిక వెబ్సైట్, ఏఐ ఆధారిత చాట్బాట్ల ద్వారా ఫిర్యాదులను స్వీకరించాలి. వినియోగదారుడు ఏ మాధ్యమం ద్వారా ఫిర్యాదు చేసినా, దానికి ఒకే విధమైన ’యూనిక్ ఫిర్యాదు నెంబర్ను కేటాయించాలి. రియల్ టైమ్ ట్రాకింగ్ ద్వారా మనం చేసిన ఫిర్యాదు ఏ దశలో ఉందో తెలుసుకోవచ్చు. కస్టమర్ కేర్కు మళ్లీ ఫోన్ చేయాల్సిన అవసరం లేకుండా.. ఆన్–లైన్ పోర్టల్ లేదా యాప్ ద్వారా ఫిర్యాదు ఏ దశలో ఉంది, ఎవరు పర్యవేక్షిస్తున్నారు, ఎప్పటిలోపు పరిష్కారం అవుతుంది అనేది లైవ్ స్టేటస్ ద్వారా చూసుకోవచ్చు. పరిష్కార ప్రక్రియ మరింత పటిష్టం ముసాయిదా నిబంధనల ప్రకారం పరిష్కార ప్రక్రియను మరింత పటిష్టం చేశారు. మొదటి దశలో.. వినియోగదారుడు చేసిన ఫిర్యాదును నిర్ణీత గడువులోపు పరిష్కరించాలి. ఒకవేళ ఇక్కడ పరిష్కారం లభించకపోయినా లేదా కంపెనీ ఇచి్చన సమాధానం నచ్చకపోయినా వెంటనే తదుపరి దశకు వెళ్లవచ్చు. ఇక రెండవ దశలో.. అప్పీలేట్ అథారిటీ వద్ద అప్పీల్ చేసుకునే విధానాన్ని ఇప్పుడు మరింత సులభతరం చేశారు. వినియోగదారులకు స్పష్టతనిచ్చేలా, ఎటువంటి గందరగోళం లేకుండా అప్పీల్ ఫారమ్లను డిజిటల్గా అందుబాటులో ఉంచుతారు. ఆటోమేటెడ్ అలర్ట్స్ – రిమైండర్స్ ఫిర్యాదు నమోదు కాగానే వినియోగదారుడికి ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా నిర్ధారణ సందేశం రావడంతో పాటు, పరిష్కార గడువు ముగిసేలోపు కంపెనీ ప్రతినిధులు వినియోగదారుడిని సంప్రదించేలా ఆటోమేటెడ్ సిస్టమ్ను ఏర్పాటు చేయాలని ట్రాయ్ సూచించింది. జవాబుదారీతనంలో భాగంగా.. ఫిర్యాదుల పరిష్కారంలో విఫలమైనా లేదా నిబంధనలు ఉల్లంఘించినా టెలికాం ఆపరేటర్లపై కఠిన చర్యలు తీసుకునేలా ట్రాయ్ ఈ సవరణలో నిబంధనలను పొందుపరిచింది. కంపెనీలు తమ వద్ద నమోదైన ఫిర్యాదులు, పరిష్కరించిన కేసులు, పెండింగ్లో ఉన్న వాటిపై త్రైమాసిక నివేదికలను బహిరంగపరచాల్సి ఉంటుంది. -
స్పేస్ఎక్స్తో ఆంత్రోపిక్ మెగా డీల్!
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రముఖ ఏఐ స్టార్టప్ ఆంత్రోపిక్, ఎలాన్ మస్క్కు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్ఎక్స్తో భారీ డేటా సెంటర్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తమ క్లాడ్ ఏఐ సేవలకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ను తట్టుకోవడానికి అవసరమైన కంప్యూటింగ్ శక్తిని పొందే లక్ష్యంతో ఆంత్రోపిక్ ఈ నిర్ణయం తీసుకుంది.కొలోసస్ 1ఈ ఒప్పందం ప్రకారం, టెన్నెసీలోని మెంఫిస్లో ఉన్న స్పేస్ఎక్స్ ‘కొలోసస్ 1’ డేటా సెంటర్ పూర్తి కంప్యూటింగ్ సామర్థ్యాన్ని ఇకపై ఆంత్రోపిక్ వినియోగించుకోనుంది. వాస్తవానికి ఈ కేంద్రాన్ని మస్క్ తన సొంత ఏఐ సంస్థ ఎక్స్ఏఐ కోసం నిర్మించారు. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో ఇది ఆంత్రోపిక్ చేతుల్లోకి వెళ్తోంది. ఇది 2,20,000 ఎన్విడియా ఏఐ చిప్ల మద్దతుతో, దాదాపు 300 మెగావాట్ల కంటే ఎక్కువ విద్యుత్ సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ పనిచేస్తుంది. ఈ డేటా సెంటర్ వల్ల క్లాడ్ ప్రో, క్లాడ్ మాక్స్ చందాదారులకు వేగవంతమైన సేవలు అందనున్నాయి. సాఫ్ట్వేర్ రాయడం, ఎడిటింగ్, డీబగ్గింగ్ చేయగల క్లాడ్ కోడ్ పరిమితులను కంపెనీ రెట్టింపు చేసింది. ఇకపై బిజీ సమయాల్లోనూ ఎటువంటి అంతరాయం లేకుండా యూజర్లు దీనిని వాడుకోవచ్చు.శత్రువుల మధ్య స్నేహంఈ ఒప్పందం టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. గతంలో ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోదీపై, ఆ సంస్థ సిద్ధాంతాలపై మస్క్ తీవ్ర విమర్శలు చేశారు. ఆంత్రోపిక్ సంస్థ పాశ్చాత్య నాగరికతను ద్వేషిస్తుందని, అది ఒక కపట సంస్థ అని గత ఫిబ్రవరిలో మస్క్ ఎక్స్ వేదికగా దుమ్మెత్తిపోశారు. అయితే, తాజాగా చేసిన మస్క్ పోస్ట్ భిన్నంగా ఉంది. ‘గత వారం ఆంత్రోపిక్ సీఈఓ, తమ సిబ్బందితో సమయం గడిపాను. వారి సామర్థ్యం చూసి ముచ్చటేసింది. వారు సరైన పని చేయడంపై చాలా శ్రద్ధ వహిస్తున్నారు’ అని ప్రశంసించారు. మరో కీలక ప్రకటన చేస్తూ, ఎక్స్ఏఐని స్వతంత్ర సంస్థగా రద్దు చేస్తున్నానని ఇకపై అది స్పేస్ఎక్స్ ఏఐగా మాత్రమే కొనసాగుతుందని స్పష్టం చేశారు.వివాదాల కేంద్రంగా మెంఫిస్ డేటా సెంటర్ఈ ఒప్పందంలో భాగమైన మెంఫిస్ డేటా సెంటర్ ప్రస్తుతం వివాదాల్లో ఉంది. భారీ స్థాయిలో సహజ వాయువును మండించే టర్బైన్లను ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతోందని పౌర హక్కుల సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. ఫెడరల్ అనుమతులు లేకుండానే వీటిని నడుపుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన -
భారత్ 'మిషన్ దృష్టి' సక్సెస్: మస్క్ ట్వీట్!
బెంగళూరుకు చెందిన స్టార్టప్ గెలాక్సీఐ (GalaxEye) రూపొందించిన 'మిషన్ దృష్టి' ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. ఈ విజయంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించగా.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా అభినందనలు తెలిపారు.కాలిఫోర్నియా నుంచి స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా మిషన్ దృష్టి ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఇది ప్రపంచంలోనే మొదటి 'ఆప్టోసార్' శాటిలైట్గా గుర్తింపు పొందింది. ఇది ఎలక్ట్రో ఆప్టికల్ (EO), సింథటిక్ అపర్చర్ రాడార్ (SAR) సాంకేతికతల కలయికతో రూపొందింది.EO సిస్టమ్ ద్వారా.. స్పష్టమైన, వాతావరణంలోని హై క్వాలిటీ ఫోటోలను పొందవచ్చు. SAR సాంకేతికత ద్వారా వర్షం, మబ్బులు, రాత్రి వంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా సమాచారాన్ని సేకరించవచ్చు. ఈ రెండు టెక్నాలజీలు కలిసి ఉండటం వల్ల.. భూమి పరిశీలనలో ఉన్న పరిమితులను అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల వ్యవసాయం, రక్షణ, విపత్తు నిర్వహణ, సముద్ర పర్యవేక్షణ, మౌలిక వసతుల ప్రణాళిక వంటి అనేక రంగాలకు ఉపయోగకరమైన డేటా లభిస్తుంది.Congratulations! 🇮🇳— Elon Musk (@elonmusk) May 5, 2026ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ ప్రాజెక్ట్ను భారత యువత ప్రతిభకు నిదర్శనంగా పేర్కొన్నారు. దేశ అభివృద్ధికి సాంకేతికత ఎంత ముఖ్యమో ఈ ప్రాజెక్ట్ స్పష్టంగా చూపిస్తుందని అన్నారు. భారత అంతరిక్ష సంస్థలతో పాటు ప్రైవేట్ రంగం కూడా ముందుకు రావడం దేశానికి మరింత బలం చేకూరుస్తోంది.భవిష్యత్తులో.. గెలాక్స్ఐ సంస్థ ఈ వ్యవస్థను మరింత విస్తరించి 2030 నాటికి 10 ఉపగ్రహాల సమూహాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా భారతదేశం స్వంతంగా బలమైన భూ పరిశీలన వ్యవస్థను నిర్మించుకోవాలని భావిస్తోంది.ఇదీ చదవండి: అప్పుడే ఊహించా.. సమాజానికి పెద్ద సవాలు: కియోసాకి -
కోడింగ్ ఒక్కటే సరిపోదు!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో విద్యార్థులు, యువ నిపుణులు ఏయే నైపుణ్యాలపై దృష్టి పెట్టాలనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో చిప్ తయారీ దిగ్గజం ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ చేసిన వ్యాఖ్యలు సాంకేతిక ప్రపంచంలో చర్చకు దారితీశాయి. ఒకవేళ తాను ఇప్పుడు విద్యార్థిని అయితే కోడింగ్తో పాటు భౌతిక శాస్త్రానికి (ఫిజిక్స్) అత్యధిక ప్రాధాన్యతనిస్తానని ఆయన స్పష్టం చేశారు.కోడింగ్ మాత్రమే సరిపోదుసాంకేతిక రంగంలో దశాబ్దాలుగా కోడింగ్ను అత్యంత కీలకమైన నైపుణ్యంగా పరిగణిస్తున్నారు. అయితే, ఏఐ వ్యవస్థలు కేవలం డిజిటల్ డేటాను ప్రాసెస్ చేసే స్థాయి నుంచి భౌతిక ప్రపంచంతో నేరుగా కార్యకలాపాలు సాగించే స్థాయికి చేరుకుంటున్నాయని హువాంగ్ అభిప్రాయపడ్డారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో నేను బహుశా భౌతిక శాస్త్రాన్ని అధ్యయనం చేసేవాడిని’ అని పేర్కొన్న హువాంగ్, ప్రపంచం ఎలా పనిచేస్తుందో తెలిపే ప్రాథమిక సూత్రాలను అర్థం చేసుకోవడం కోడింగ్ చేయడం కంటే ముఖ్యమని ఉద్ఘాటించారు. తదుపరి తరం ఆవిష్కరణలు కేవలం సాఫ్ట్వేర్ నైపుణ్యాల మీద కాకుండా భౌతిక శాస్త్రం, గణితంపై ఉన్న లోతైన అవగాహన మీద ఆధారపడి ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.ఎందుకు ఈ మార్పు?ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం ‘ఫిజికల్ ఏఐ’ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఏఐ వ్యవస్థలు ఇప్పుడు రోబోటిక్స్, ఆటోమేషన్ వంటి రియల్ వరల్డ్ అప్లికేషన్లలో కీలకంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో హువాంగ్ చెప్పిన దాని ప్రకారం భవిష్యత్తులో డెవలపర్లు, ఇంజినీర్లకు ఫిజిక్స్ విషయాలపై అవగాహన తప్పనిసరి. కోడింగ్ అనేది ఒక పనిని చేయించడానికి ఉపయోగపడే సాధనం మాత్రమేనని, కానీ యంత్రాలు సురక్షితంగా, సమర్థవంతంగా పనిచేయాలంటే అవి పనిచేసే భౌతిక ప్రపంచంపై పూర్తి అవగాహన ఉండాలని ఆయన నొక్కి చెప్పారు.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన -
ఏఐ, డ్రోన్లో ముందుంటాం
పేరు మాత్రమే కాదు. బిజినెస్ తీరునే మార్చుకుని ఆధునిక డ్రోన్, క్లౌడ్– ఏఐ సర్వేలెన్స్ రంగాల్లో వడివడిగా అడుగులేస్తున్న మగెలానిక్ క్లౌడ్ది నిన్నటిదాకా స్టోరీనే. ఇపుడు ఆ స్టోరీ కార్యాచరణలోకి వస్తోంది. తాజాగా రైల్వే సహా పలు బ్యాంకింగ్ సంస్థల నుంచి సర్వేలెన్స్ కాంట్రాక్టులు దక్కించుకుంది. డ్రోన్ల తయారీలోకి ప్రవేశించాక డిఫెన్స్ నుంచీ కాంట్రాక్టులు దక్కాయి. తమ ప్రణాళికలు పూర్తిగా ఆచరణలోకి రావటానికి ఎక్కువ కాలం పట్టకపోవచ్చంటున్న కంపెనీ సీఎండీ జోసెఫ్ సుదీర్(జో)తో ‘సాక్షి’ బిజినెస్ ప్రతినిధి ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంటర్వ్యూ విశేషాలివీ... (రమణమూర్తి మంథా)మీ బిజినెస్ వర్టికల్స్లో ఆదాయం పరంగా ముందున్నవేంటి?ఇప్పుడైతే స్టాఫింగ్, ఐటీ సేవలనేవి మొదటి వరుసలో నిలుస్తాయి. ఏఐ–ఇన్నోవేషన్పై ఫోకస్ చేస్తుంది. ఏఐ ఆధారిత అడ్వాన్స్డ్ సొల్యూషన్స్ను రూపొందిస్తున్నాం. రెవెన్యూ పరంగా దీనిదిపుడు రెండో స్థానం. డ్రోన్ తయారీలోకి కూడా ప్రవేశించాం. లాజిస్టిక్స్, డిఫెన్స్, కమర్షియల్ సర్వీసుల కోసం కస్టమైజ్డ్ డ్రోన్లను రూపొందిస్తున్నాం. ఇపుడైతే రెవెన్యూలో ఇది చివర్లో ఉంది. కానీ వచ్చే ఒకటి రెండేళ్లలో ఈ ఆర్డర్ పూర్తిగా మారుతుంది. మరి ఇలా మారటానికి ఇపుడేం చేస్తున్నారు?ఇప్పుడున్న దశలో ఏది ఏ స్థాయిలో అమలవుతోందో పూర్తి వివరాలు చెప్పలేను. కానీ డైరెక్షన్ క్లియర్గా ఉంది. రెవెన్యూ పనితీరు మెరుగుపరుచుకోవటంపై ఫోకస్ పెట్టాం. గడిచిన మూడు త్రైమాసికాలుగా వృద్ధికి ఒక బేస్ను తయారు చేసుకున్నాం. నంబర్స్ మాత్రం ఇపుడు చెప్పలేను. సరే! ఇప్పుడు మీ డ్రోన్ బిజినెస్ ఏ స్థాయిలో ఉంది?దీనికి సంబంధించి 15–20 కోట్ల ఆర్డర్బుక్ ఉంది. ప్రధానంగా లాజిస్టిక్స్ రంగానివే. డిజైన్ నుంచి ఏఐ ఇంటిగ్రేషన్, టెస్టింగ్, డిప్లాయిమెంట్ వరకూ మేమే చేస్తున్నాం. అవసరాన్ని బట్టి డెలివరీకి 30–45 రోజుల నుంచి మూడు నెలల వరకూ పడుతుంది. డ్రోన్ల తయారీలోకి చాలామంది వస్తున్నారు కదా!. మీ స్పెషాలిటీ ఏంటి?మేం 200 కిలోల వరకూ పేలోడ్ను తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న డ్రోన్లను తయారు చేస్తున్నాం. అవరోధాల్ని దాటుకుని ఆటో ల్యాండింగ్ కావటం... జీపీఎస్ లేకున్నా లక్ష్యాన్ని చేరటం... ఎల్రక్టానిక్ వార్ఫేర్ను తట్టుకోగలగటం ఈ డ్రోన్ల ప్రత్యేకత. సిగ్నల్ జామ్ అయిన సందర్భాల్లో సైతం ప్రత్యామ్నాయ కమ్యూనికేషన్ వ్యవస్థ, ఇంటర్నల్ నేవిగేషన్ వ్యవస్థల్ని ఉపయోగించుకుని పనిచేయటం వీటి స్పెషాలిటీ.మీ రెవెన్యూలో రికరింగ్ ఎక్కువా? లేకుంటే ప్రాజెక్ట్ బేస్డ్ ఎక్కువా?దాదాపు 70–80 శాతం రెవెన్యూ రికరింగ్ రూపంలోనే వస్తోంది. ఇవన్నీ 3–5 ఏళ్ల దీర్ఘకాలిక కాంట్రాక్టులు. వీటివల్ల స్థిరత్వం వస్తోంది. మీ ఆర్డర్ బుక్, భవిష్యత్ వృద్ధిని వివరంగా చెబుతారా?ఈ మధ్య మేం దాదాపుగా రూ.250 కోట్ల రైల్వే కాంట్రాక్టులు దక్కించుకున్నాం. వీటిలో 10 శాతాన్ని ఇప్పటిదాకా పూర్తిచేశాం. భవిష్యత్ను దీన్నిబట్టే ఊహించొచ్చు. ప్రస్తుత మార్గాల ద్వారా రెవెన్యూలో 20 శాతం వృద్ధి ఉండొచ్చని అంచనా వేస్తున్నాం.మీ బిజినెస్లో అంతర్జాతీయ వాటా ఎంత?గతేడాది మేం రూ.600 కోట్ల రెవెన్యూ సాధించాం. దీన్లో రూ.400 కోట్లు అంతర్జాతీయ మార్కెట్ల నుంచే వచ్చింది. దీన్లో అత్యధికం అమెరికా నుంచే వచ్చింది. అంతర్జాతీయ క్లయింట్లలో డేటా సెంటర్లు ప్రధానం. వీటికి డేటా ఇంజినీరింగ్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్లు అందిస్తున్నాం. మీ వ్యాపారంలో ఏఐ పాత్ర ఎంతవరకూ ఉంది?అన్నిటికీ ఏఐనే ప్రధానం. ఉదాహరణకు.. బ్యాంకింగ్, ఏటీఎంలకు ఏఐ ఆధారిత వీడియో అనలిటిక్స్ అందిస్తున్నాం. ఆటోమేటెడ్ సర్వేలెన్స్ వ్యవస్థల్లో... రియల్టైమ్లో అలెర్ట్లు పంపటంలో... ఇంప్రూవ్మెంట్లో అన్నింట్లో ఏఐ ఉంటుంది. డ్రోన్స్, ఐటీ, సర్వేలెన్స్ ఇలా మా వెర్టికల్స్ అన్నింటా ఏఐ తప్పనిసరి. మీరు ఈ మధ్య కొన్ని కంపెనీల్ని టేకోవర్ చేశారు కదా? ఫండింగ్ ఎలా?ఎక్కువ భాగం ఫండింగ్ అంతర్గత వనరుల నుంచే సమీకరించుకున్నాం. 2023–24లో మాత్రమే కొంత మూలధనం సమీకరించాం. మొత్తంగా చూస్తే బలమైన క్యాష్ ఫ్లో నుంచే ఫండింగ్ చేస్తున్నాం. ఇటీవల డ్రోన్లకు రూ.60 కోట్లు, రైల్వే ప్రాజెక్టులకు రూ.40 కోట్లు, బ్యాంకింగ్– పీఎస్యూ ప్రాజెక్టుల కోసం రూ.100 కోట్లు కేటాయించాం. కంపెనీ వృద్ధికి సంబంధించి ఇన్వెస్టర్లు ఏం ఆశించొచ్చు?గతేడాది 600 కోట్ల రెవెన్యూ ఉంది. ఈ ఏడాది రూ.850 కోట్లకు చేరుకోవచ్చు. వచ్చే ఏడాది వెయ్యి కోట్లు దాటాలని లక్ష్యిస్తున్నాం. రాబోయే సంవత్సరాల్లో 30–50 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నాం. సేవల కంపెనీ నుంచి ప్లాట్ఫామ్ ఆధారిత, ఏఐ ఆధారిత వ్యాపారంగా ఎదుగుతున్నాం కనక ఇన్వెస్టర్లు కూడా మంచి వృద్ధిని ఆశించొచ్చు.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన -
ఉద్యోగాలను మింగేస్తుందా? సృష్టిస్తుందా?
ప్రస్తుత డిజిటల్ యుగంలో కృత్రిమ మేధ(ఏఐ)పై జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. ఒకవైపు టెక్నాలజీ వేగంగా విస్తరిస్తుంటే, మరోవైపు సామాన్యుల నుంచి నిపుణుల వరకు అందరిలోనూ ఒకటే ఆందోళన... ‘ఏఐ వల్ల మన ఉద్యోగాలు పోతాయా?’. ఈ సందేహాలకు చెక్ పెడుతూ ప్రపంచ అగ్రగామి టెక్ దిగ్గజం ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. ‘ఏఐ ఉద్యోగాలను తొలగించదు, బదులుగా కొత్త ఉపాధి మార్గాలను సృష్టిస్తుంది’ అని ఆయన స్పష్టం చేశారు.ఉద్యోగాల భయంపై హువాంగ్ స్పందనమిల్కెన్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న హువాంగ్ ఏఐ వల్ల భారీగా ఉద్యోగ నష్టాలు సంభవిస్తాయనే వాదనలను కొట్టిపారేశారు. ఈ తరహా భయాందోళనలు కేవలం అపోహలని, ఇవి ప్రజలను సాంకేతికతకు దూరంగా ఉంచుతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.‘ఏఐ కేవలం సాఫ్ట్వేర్ మాత్రమే కాదు, అదొక పారిశ్రామిక విప్లవానికి నాంది. డేటా సెంటర్లు, అధునాతన హార్డ్వేర్, సహాయక ఎకోసిస్టమ్ల నిర్మాణం కోసం వేల సంఖ్యలో మానవ వనరుల అవసరం ఉంది. ఆటోమేషన్ అనేది మొత్తం ఉద్యోగాలను తుడిచిపెట్టదు. కేవలం పనితీరులోని నిర్దిష్టమైన, పునరావృతమయ్యే పనులను మాత్రమే మారుస్తుంది. అంటే, మనిషి చేసే మొత్తం పనిలో కొంత భాగాన్ని ఏఐ సాయంతో సులభతరం చేసుకునే అవకాశం ఉంటుందే తప్ప, మనిషి స్థానాన్ని పూర్తిగా భర్తీ చేయదు’ అని చెప్పారు.ఆందోళనలు ఎందుకు? వాస్తవాలేంటి?హువాంగ్ ఆశావాద దృక్పథాన్ని వ్యక్తపరిచినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక వేత్తలు మాత్రం హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. వివిధ కన్సల్టింగ్ సంస్థల అంచనాల ప్రకారం, రాబోయే ఐదేళ్లలో దాదాపు 15 శాతం ఉద్యోగ బాధ్యతల్లో మార్పులు లేదా కొన్ని పాత తరహా పాత్రలు కనుమరుగయ్యే అవకాశం ఉందని గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. వేగవంతమైన ఏఐ స్వీకరణ వల్ల ఆర్థిక అసమానతలు పెరిగే ప్రమాదం ఉందని, సరైన శిక్షణ లేని వారు ఉపాధి కోల్పోయే అవకాశం ఉందనేది నిపుణుల ప్రధాన ఆందోళన.భయం వద్దు.. నైపుణ్యం ముద్దు!ప్రతి సాంకేతిక మార్పు వెనుక కొంత అనిశ్చితి ఉండటం సహజం. అయితే, టెక్ పరిశ్రమ సృష్టిస్తున్న హైప్కు భయపడి పురోగతిని ఆపడం సరికాదని హువాంగ్ సూచిస్తున్నారు. ఏఐని ఒక ముప్పుగా చూడటం కంటే.. మన సామర్థ్యాన్ని పెంచే సాధనంగా చూడాలి అనేది ఆయన మాటల సారాంశం. మొత్తానికి ఏఐ ప్రభావం వల్ల ఉద్యోగ స్వరూపం మారుతుందనేది వాస్తవం. అయితే, కాలంతో పాటు కొత్త నైపుణ్యాలను సంతరించుకునే వారికి ఏఐ ఒక వరం కానుంది. సాంకేతికత పట్ల భయాన్ని వీడి దానిని వాడుకోవడంలోనే భవిష్యత్తు ఉందనేది స్పష్టమవుతోంది.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన -
స్మార్ట్ఫోన్ తయారీలోకి ఓపెన్ఏఐ ఎంట్రీ?
ప్రపంచవ్యాప్తంగా టెక్ విప్లవానికి నాంది పలికిన ఓపెన్ఏఐ సంస్థ ఇప్పుడు స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి ప్రవేశించనుందనే వార్తలొస్తున్నాయి. యాపిల్, శామ్సంగ్ వంటి దిగ్గజాలకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న ఈ సంస్థ తన సరికొత్త ఏఐ ఏజెంట్ ఫోన్ను అభివృద్ధి చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కేవలం యాప్ల మీద ఆధారపడకుండా కృత్రిమ మేధ ద్వారా నేరుగా పనులను పూర్తి చేసేలా ఈ ఫోన్ను రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే, ఈ అంశాలను అధికారికంగా కంపెనీ ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది.ఏమిటీ ఏఐ ఏజెంట్ ఫోన్?ప్రస్తుత స్మార్ట్ఫోన్ల్లో మనం ఒక పని కోసం వివిధ యాప్లను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. కానీ, ఓపెన్ఏఐ అభివృద్ధి చేస్తున్న ఈ ఏజెంట్ ఫోన్ ఆ పద్ధతినే మార్చేయనుంది. ఇందులో యూజర్లు పనులను పూర్తి చేయడానికి ఏజెంట్ పైన ఆధారపడతారు. అంటే, ఫోన్లోని ఏఐ యూజర్ తరఫున వివిధ యాప్ల మధ్య నావిగేట్ చేస్తూ పనిని పూర్తి చేస్తుంది. ఈ టెక్నాలజీ భవిష్యత్తులో మొబైల్ వినియోగ విధానాన్ని పూర్తిగా మార్చనుంది.లీక్ అయిన స్పెసిఫికేషన్స్ప్రముఖ టెక్ విశ్లేషకుడు మింగ్-చి కుయో వెల్లడించిన వివరాల ప్రకారం, ‘ఈ స్మార్ట్ఫోన్ అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దుకుంటోంది. అందుకోసం మీడియాటెక్ ప్రాసెసర్తో ఓపెన్ఏఐ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇది డైమెన్సిటీ 9600 ప్రాసెసర్పై పనిచేయనుంది. టీఎస్ఎంసీ అధునాతన N2P (2nm) నోడ్ సాంకేతికతతో ఈ చిప్ తయారవుతుంది. ఇందులో డ్యూయల్-ఎన్పీయూ ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఇది సంక్లిష్టమైన ఏఐ గణనలను వేగంగా పూర్తి చేస్తుంది. వేగవంతమైన పనితీరు కోసం ఎల్పీ డీడీఆర్6 ర్యామ్ యూఎఫ్ఎస్ 5.0 స్టోరేజ్ సాంకేతికతను వాడుతున్నారు. ఇన్-లైన్ హ్యాషింగ్ వంటి అత్యాధునిక భద్రతా ఫీచర్లు ఇందులో ఉంటాయి’ అన్నారు.ఎందుకు ఈ ఫోన్ అవసరం?ఓపెన్ఏఐ ఈ ఫోన్ను తీసుకురావడానికి రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి.. వ్యాపార వ్యూహం. రాబోయే కాలంలో కంపెనీ ఐపీఓకు సిద్ధమవుతోంది. ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడానికి బలమైన ప్రొడక్ట్ స్టోరీ అవసరం. రెండు.. మార్కెట్ ఆధిపత్యం. యాపిల్, గూగుల్, శామ్సంగ్ వంటి కంపెనీలు ఏఐ ఫీచర్లను తమ ఫోన్లలో వేగంగా ప్రవేశపెడుతున్నాయి. ఈ పోటీలో వెనుకబడకుండా ఉండాలంటే హార్డ్వేర్, సాఫ్ట్వేర్ రెండింటిపై నియంత్రణ ఉండాలని ఓపెన్ఏఐ భావిస్తోంది.ప్రస్తుత సమాచారం ప్రకారం, ఈ స్మార్ట్ఫోన్ 2027 మొదటి అర్ధభాగంలో భారీ ఉత్పత్తి దశలోకి వెళ్లనుంది. 2027-2028 మధ్య సుమారు 30 మిలియన్ల యూనిట్లను మార్కెట్లోకి విడుదల చేయాలని ఓపెన్ఏఐ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఎగ్జిక్యూటివ్లు లేదా సామ్ ఆల్ట్మాన్ ఇప్పటివరకు ఈ ప్రాజెక్టును అధికారికంగా ధ్రువీకరించలేదు. ఏదేమైనా ఒక సాఫ్ట్వేర్ దిగ్గజం సొంత హార్డ్వేర్తో వస్తుందంటే అది మొబైల్ పరిశ్రమలో పెను సంచలనమే కానుంది. టెక్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఏఐ ఏజెంట్ ఫోన్ స్మార్ట్ఫోన్ వినియోగంలో సరికొత్త శకానికి నాంది పలుకుతుందో లేదో చూడాలి.ఇదీ చదవండి: ఏఐ మిమ్మల్ని ఏం చేయలేదు! కోర్టు తీర్పులు -
అదుపుతప్పిన రోబో.. భయపడ్డ విద్యార్థులు (వీడియో)
చైనాలోని జిన్జియాంగ్ ఉయ్ఘర్ అటానమస్ రీజియన్లోని ఒక పాఠశాలలో క్రీడా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒక రోబో అదుపుతప్పి.. విద్యార్థులను భయబ్రాంతులకు గురించి చేసింది. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.విద్యార్థులను అలరించడానికి ఏర్పాటు చేసిన రోబో అకస్మాత్తుగా కిందపడిపోయింది. ఆ తరువాత అక్కడున్న ప్రదర్శనకారులపై కుంగ్-ఫూ కిక్లు విసరడం ప్రారంభించింది. దిక్కుతోచని విధంగా.. అడ్డదిడ్డంగా పరుగులు పెట్టింది. మైదానంలో ఉన్నవారు ఆందోళనకు గురయ్యారు.పరిస్థితిని అర్థం చేసుకుని, దానిని కంట్రోల్ చేసే వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి రోబోట్ను పట్టుకున్నాడు. ఆ తరువాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే మైదానంలోని విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాలేదు.ఇదే మొదటిసారి కాదురోబోలు తడబడటం ఇదే మొదటిసారి కాదు. 2026 మార్చి నెలలో.. చైనాలోని షాన్సీ ప్రావిన్స్లో జరిగిన ఒక బహిరంగ నృత్య ప్రదర్శనలో, ఒక హ్యూమనాయిడ్ రోబోట్ ప్రమాదవశాత్తు ఒక చిన్న బాలుడి ముఖానికి తగిలింది. వెంటనే అప్రమత్తమైన.. సిబ్బంది ఆ రోబోను పక్కకు లాగడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ.. అది రింగ్ మధ్యలో తన ప్రోగ్రామ్ ప్రదర్శించింది.Reported on Telegram 🤣The robot went berserk and almost attacked the dancers at a festival in China: the Unitree android malfunctioned severely and started swinging its "iron" in the style of Bruce LeeFortunately, it was quickly shut down — a full-blown "fight" didn't… pic.twitter.com/FH38FFrjZV— Beefeater (@Beefeater_Fella) May 3, 2026రష్యా తయారు చేసిన రోబోట్ పేరు 'ఐడల్' (Aidol). దీనిని 2025 నవంబర్ 10న మాస్కోలోని యారోవిట్ హాల్ కాంగ్రెస్ సెంటర్లో జరిగిన టెక్నాలజీ షోకేస్ సందర్భంగా ఆవిష్కరించారు. ప్రారంభంలో మెల్లగా అడుగులు వేసుకుంటూ వేదికపైకి వచ్చిన రోబోట్.. అక్కడున్నవారికి అభివాదం చేస్తున్నట్లు చెయ్యి పైకెత్తింది. ఆ తరువాత ఓ రెండడుగులు ముందుకు వేసి కిందకు పడిపోయింది. దీంతో అక్కడే ఉన్న సిబ్బంది దానిని పైకిలేపి కష్టం మీద తీసుకెళ్లారు. కానీ అనుకున్నదొకటి, అయినది ఒకటిగా జగడంతో.. కార్యక్రమం మధ్యలోనే నిలిచిపోయింది.కంపెనీలకు సూచనలురోబర్స్ తయారీ లేదా వినియోగం అనేది మంచి చర్య. అయితే వాటికి భావాలు అర్థం చేసుకోవడం, ప్రవర్తించిన విధానం పూర్తిగా తెలిసి ఉండదు. ఇలాంటి సమయంలో రోబోల వల్ల ప్రజలు కొన్ని సమస్యలు ఎదుర్కోవాలి వస్తుంది. కాబట్టి సంస్థలు దీనిని దృష్టిలో ఉంచుకుని రోబోట్స్ తయారు చేయాలి. అంతే కాకుండా..పూర్తిగా టెస్ట్ చేసిన తరువాత వినియోగానికి ఉపయోగించడం మంచిది. లేకుంటే.. ప్రజలకు ఇబ్బంది, తద్వారా కంపెనీ విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. -
సరైన ప్రశ్నలు అడగండి.. రాత్రికి రాత్రే యాప్ రెడీ
సాఫ్ట్వేర్ అభివృద్ధి అంటేనే ఒకప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజినీర్లు, వేల గంటల శ్రమ, సంక్లిష్టమైన కోడింగ్తో కూడిన సుదీర్ఘ ప్రక్రియ. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. సరైన ప్రశ్న అడగడం తెలిస్తే చాలు సాంకేతిక పరిజ్ఞానం లేకపోయినా అద్భుతాలు సృష్టించవచ్చని తాజాగా జరిగిన ఒక ఉదంతం నిరూపించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాఫ్ట్వేర్ తయారీ రంగాన్ని ఎలా మారుస్తుందో చెప్పే ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.రాత్రికి రాత్రే ఫంక్షనల్ యాప్ప్రముఖ వ్యవస్థాపకుడు సందీప్ మాల్ ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా పంచుకున్న ఒక పోస్ట్ టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అందులోని వివరాల ప్రకారం.. తన కుమారుడు అసలు ప్రోగ్రామింగ్ నేపథ్యమే లేని మార్కెటింగ్ గ్రాడ్యుయేట్ ‘క్లాడ్’ అనే ఏఐ సాధనాన్ని ఉపయోగించి కేవలం ఒక్క రాత్రిలో పూర్తి స్థాయి వెండర్ మేనేజ్మెంట్ యాప్ను రూపొందించాడని ఆయన వెల్లడించారు. ఈ యాప్లో కెపాసిటీ ట్రాకింగ్, క్వాలిటీ మానిటరింగ్, వర్క్ లోడ్ మేనేజ్మెంట్ వంటి కీలక ఫీచర్లు ఉన్నాయని, ఒక ప్రొఫెషనల్ యాప్కు ఉండాల్సిన అన్ని అర్హతలు ఇందులో ఉన్నాయని పేర్కొన్నారు.సాంప్రదాయకంగా సాఫ్ట్వేర్ తయారీలో ప్రోగ్రామింగ్ భాషల వాక్యనిర్మాణం (సింట్యాక్స్) తెలుసుకోవడం అత్యంత కీలకం. అయితే, ఈ ఘటన తర్వాత జరుగుతున్న చర్చలో నెటిజన్లు ఆసక్తికరమైన విషయాలను ప్రస్తావిస్తున్నారు. ఏఐ యుగంలో కోడింగ్ నేర్చుకోవడం కంటే, సమస్యను ఎలా ఫ్రేమ్ చేయాలి? ఏ ప్రశ్న అడిగితే సరైన పరిష్కారం వస్తుంది? అనే జడ్జిమెంట్ (నిర్ణయాత్మక సామర్థ్యం)కు ప్రాధాన్యత పెరిగిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒకప్పుడు ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మొదలుపెట్టాలంటే టీమ్, భారీ పెట్టుబడి అవసరమయ్యేవి. ఇప్పుడు ఆ ప్రవేశ అడ్డంకులు కనుమరుగవుతున్నాయి.సవాళ్లు లేకపోలేదుఈ పరిణామాన్ని అందరూ ఆహ్వానిస్తున్నప్పటికీ వాస్తవిక దృక్పథాన్ని కోల్పోవద్దని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక ప్రోటోటైప్ను తయారు చేయడం వేరు. దాన్ని యాప్ స్టోర్లోకి తీసుకురావడం, భద్రతా ప్రమాణాలను పాటించడం, దీర్ఘకాలంలో నిర్వహించడం వంటివి చాలా క్లిష్టమని గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా, ఏఐ సృష్టించిన కోడ్లో వచ్చే బగ్లను గుర్తించి డీబగ్ చేయడం ఇప్పటికీ ఒక సవాలుతో కూడిన నైపుణ్యమేనని అభిప్రాయపడుతున్నారు.My younger one is a marketing grad. Zero coding knowledge. Sat through one night with Claude and built a complete vendor management app - capacity, quality, workload, the works.Old wisdom says: ask the right questions. Turns out, that’s all you need in the AI world too. 🙌— Sandeep Mall (@SandeepMall) May 4, 2026భవిష్యత్తు దిశగా..సాంకేతిక నైపుణ్యం కంటే ఆలోచన, దాన్ని అమలు చేసే స్పష్టతకు విలువ పెరుగుతోంది. సాఫ్ట్వేర్ తయారీ అనేది ఇప్పుడు కేవలం ఇంజినీర్లకే పరిమితం కాదు, సృజనాత్మకత ఉన్న ఎవరైనా సరే ఏఐతో తమ సొంత పరిష్కారాలను నిర్మించుకునే యుగం మొదలైంది.ఇదీ చదవండి: ఏఐ మిమ్మల్ని ఏం చేయలేదు! కోర్టు తీర్పులు -
డిగ్రీ ఉంటే సరిపోదు.. స్కిల్ ఉంటేనే జాబ్
ముంబై: నేటి తరం విద్యార్థుల వేతన అంచనాలకు, మార్కెట్లోని వాస్తవ పరిస్థితులకు మధ్య భారీ వ్యత్యాసం నెలకొంది. పట్టభద్రులవుతున్న విద్యార్థుల్లో దాదాపు 73 శాతం మంది రూ.5 లక్షలకు మించి వార్షిక వేతనాన్ని (ఎల్పీఐ) ఆశిస్తుండగా.. కేవలం 40 శాతం మంది మాత్రమే ఆ లక్ష్యాన్ని సాధిస్తున్నారని ‘అన్స్టాప్ టాలెంట్ రిపోర్ట్ 2026’ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 37 వేలకు పైగా విద్యార్థులు, 500 మందికి పైగా హెచ్ఆర్ ప్రతినిధుల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.డిగ్రీ ‘ప్రీమియం’ కనుమరుగు: ఒకప్పుడు పెద్ద కోర్సులు చదివిన వారికి మాత్రమే దక్కే ‘అదనపు వేతన ప్రాధాన్యం’ క్రమంగా తగ్గుతోంది. ఎంబీఏ పూర్తి చేసిన వారిలో 30 శాతం మంది రూ. 10 లక్షల కంటే తక్కువ వార్షిక వేతనం పొందుతుండగా, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లలో 39 శాతం మంది రూ. 7 లక్షల లోపు వేతనాలకే పరిమితమవుతున్నారు. దీనిని బట్టి వివిధ కోర్సుల మధ్య ఉన్న ‘వేతన అంతరం’ తగ్గుముఖం పడుతోందని స్పష్టమవుతోంది.విద్యార్థుల ఆలోచనా ధోరణిలో మార్పు: పెరుగుతున్న పోటీ, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు సైతం వాస్తవిక దృక్పథంతో ఆలోచిస్తున్నారు. మెరుగైన అభ్యాస అవకాశాలు, కెరీర్ వృద్ధి ఉంటే 90 శాతం మందికి పైగా విద్యార్థులు తక్కువ జీతానికైనా పనిచేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అలాగే 82 శాతం మంది విద్యార్థులు తక్షణ ఆర్థిక స్థిరత్వం కోసం అదనపు ప్రయోజనాల (పెర్క్స్) కంటే చేతికి వచ్చే జీతానికే (ఇన్–హ్యాండ్ శాలరీ) ప్రాధాన్యత ఇస్తున్నారు.నైపుణ్యమే అసలైన ‘గేట్కీపర్’: ప్రస్తుత పోటీ ప్రపంచంలో నియామక ప్రమాణాలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు కేవలం డిగ్రీ సర్టిఫికేట్లు చూసి ఉద్యోగాలిచ్చిన కంపెనీలు, ఇప్పుడు అభ్యర్థుల్లోని నైపుణ్యాలు (స్కిల్స్), కృత్రిమ మేధ (ఏఐ) సామర్థ్యాన్నే ప్రాతిపదికగా తీసుకుంటున్నాయి. సుమారు 64 శాతం మంది హెచ్ఆర్ ప్రతినిధులు ఏఐ/ఎంఎల్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి సాంకేతికతలపై పట్టున్న వారినే ‘ప్రీమియం టాలెంట్’గా గుర్తిస్తున్నారు. భవిష్యత్తులో ప్రాబ్లమ్ సాల్వింగ్ (49%), ఏఐ పరిజ్ఞానం (39%), ఎమోషనల్ ఇంటెలిజెన్స్ (30%) వంటి సామర్థ్యాలు ఉన్నవారికే అత్యధిక డిమాండ్ ఉంటుందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.ఎంపిక ప్రమాణాలు మారాయి: భారత ఉద్యోగ విపణిలో అవకాశాలు తగ్గలేదు, కానీ ఒక నిర్మాణాత్మక మార్పు జరుగుతోంది. నైపుణ్యం, ఏఐ పరిజ్ఞానం ఉన్నవారికి మాత్రమే అవకాశాలు దక్కుతున్నాయి. బలమైన పునాదులతో పాటు ప్రాక్టికల్ నైపుణ్యాలు, ఏఐ ప్రావీణ్యం కలిగిన అభ్యర్థులే ఈ పోటీలో నిలబడతారు’’ అని అన్స్టాప్ వ్యవస్థాపకుడు, సీఈఓ అంకిత్ అగర్వాల్ విశ్లేషించారు. -
ఏఐ మిమ్మల్ని ఏం చేయలేదు! కోర్టు తీర్పులు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆగమనంతో ప్రపంచవ్యాప్తంగా ఉపాధి రంగంలో అనిశ్చితి నెలకొంది. సాంకేతికతను సాకుగా చూపి కంపెనీలు ఉద్యోగులను తొలగించడం సర్వసాధారణమైపోయింది. అయితే, ఈ ధోరణికి చైనా న్యాయస్థానాలు గట్టి అడ్డుకట్ట వేశాయి. ఏఐ నేతృత్వంలోని ఉద్యోగ తొలగింపులు ఇకపై కష్టతరమని, ఆటోమేషన్ సాకుతో కార్మిక హక్కులను కాలరాయలేమని స్పష్టం చేస్తూ వెలువరించిన వరుస తీర్పులు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.నిర్వహణ కార్మిక బాధ్యతడిసెంబర్ 2025 నుంచి ఏప్రిల్ 2026 మధ్య కాలంలో హాంగ్జౌ, బీజింగ్ కోర్టులు ఇచ్చిన తీర్పులు ఏఐని కేవలం ఒక సాంకేతిక మార్పుగా మాత్రమే కాకుండా, కార్మిక చట్టాల పరిధిలోకి వచ్చే ఒక కీలక వ్యాపార అంశంగా పరిగణించాయి. చాలా సంస్థలు ఏఐని స్వీకరించడాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో భారీ మార్పుగా పేర్కొంటూ ఉద్యోగులను తొలగిస్తుంటాయి. కానీ, ఈ న్యాయస్థానాలు ఆ వాదనను తోసిపుచ్చాయి. ఆటోమేషన్ అనేది కంపెనీ తీసుకునే ఒక స్వచ్ఛంద, ప్రణాళికాబద్ధమైన నిర్ణయం తప్ప, అనివార్య పరిస్థితి కాదని కోర్టులు తేల్చిచెప్పాయి. దానివల్ల కలిగే నష్టభారాన్ని మొత్తం ఉద్యోగులపైనే వేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశాయి.హాంగ్జౌ, బీజింగ్ తీర్పుల సారాంశంహాంగ్జౌ.. టెక్నాలజీ మెరుగుపడిందనే నెపంతో హ్యూమన్-ఏఐ ఇంటర్ఫేస్పై పనిచేసే ఒక ఉద్యోగికి 40% వేతన కోతతో తక్కువ హోదా కలిగిన పదవిని ఆఫర్ చేశారు. అతను నిరాకరించడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. దీన్ని సవాలు చేసిన సదరు ఉద్యోగికి అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. పాక్షికంగా ఆటోమేషన్ జరిగినంత మాత్రాన ఒక ఉద్యోగి పాత్ర పూర్తిగా అప్రస్తుతం కాదని కోర్టు స్పష్టం చేసింది.బీజింగ్ ‘లియు’ కేసు: మ్యాప్ డేటా సేకరణలో ఆటోమేషన్ రావడంతో లేఆఫ్కు గురైన వ్యక్తికి కోర్టు ఉపశమనం కల్పించింది. కార్మిక రక్షణ చట్టాలను దాటవేసేందుకు ఆటోమేషన్ను ఆయుధంగా వాడుకోవద్దని కంపెనీలను హెచ్చరించింది.ఈ తీర్పుల ప్రకారం, ఒక ఉద్యోగిని బాధ్యతల నుంచి తొలగించాలంటే ఆ పాత్ర పూర్తిగా అసాధ్యమని కంపెనీలు నిరూపించాలి. కేవలం ‘పని మరింత సమర్థవంతంగా జరుగుతుంది’ అనే కారణంతో ఉద్యోగులను తొలగించడం ఇక చెల్లదు. కంపెనీలు తప్పనిసరిగా ఉద్యోగులకు రీస్కిల్లింగ్ ఇవ్వడం, ఉద్యోగితో చర్చలు జరపడం వంటి బాధ్యతలను నెరవేర్చాలి.మన చట్టాలు ఏమి చెబుతున్నాయి?ప్రస్తుతం భారతదేశంలో ఏఐపై నిర్దిష్ట కార్మిక చట్టాలు లేనప్పటికీ ఉన్నత న్యాయస్థానాలు ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు పంపాయి. 2026లో మద్రాస్ హైకోర్టు ఏఐ ఆధారిత తొలగింపును పక్కన పెట్టింది. అంతకుముందు ఢిల్లీ హైకోర్టు కూడా ఆటోమేటెడ్ సిస్టమ్స్పై అతిగా ఆధారపడవద్దని సంస్థలను హెచ్చరించింది. పారిశ్రామిక వివాదాల చట్టం (ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్) ప్రకారం ఆటోమేషన్ వల్ల జరిగే ఉద్యోగ నష్టాన్ని తొలగింపుగా పరిగణిస్తారు. దీనికి నోటీసులు, పరిహారం తప్పనిసరి. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, 2023 ఉద్యోగుల డేటా వినియోగంపై ఆంక్షలు విధించింది. అలాగే, చర్చల దశలో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎథిక్స్ అండ్ అకౌంటబిలిటీ) బిల్లు, 2025 మానవ పర్యవేక్షణ, అప్స్కిల్లింగ్ను తప్పనిసరి చేయనుంది.సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందినప్పటికీ న్యాయస్థానాలు న్యాయం, మానవీయ విలువలు, యజమాని బాధ్యతలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఏఐ ఆఫీస్ వర్క్ను పునర్నిర్మించవచ్చు. కానీ ఆ మార్పులో ఉద్యోగుల హక్కులను కాలరాసే హక్కు కంపెనీలకు లేదు. చైనా తీర్పులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యాయవ్యవస్థలకు ఒక దిక్సూచిలా పనిచేస్తున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: మార్కెట్లో జూదం ఆడుతున్నారు! -
రూ.10 వేల లోపు ఫోన్లలో నెం.1 బ్రాండ్ ఇదే..
బడ్జెట్ ధరలో స్మార్ట్ఫోన్లు, గాడ్జెట్లను అందిస్తున్న ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ‘ఐటెల్’ భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో మన్నిక, విశ్వసనీయతలో అగ్రస్థానంలో నిలిచింది. సైబర్ మీడియా రీసెర్చ్ (సీఎంఆర్) తాజాగా విడుదల చేసిన ‘భారతదేశ డివైజ్ మార్కెట్లో మన్నిక, విశ్వసనీయత, అందుబాటు ధరల ప్రాధాన్యత’ అనే నివేదికలో ఐటెల్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. దేశవ్యాప్తంగా 13 నగరాల్లో 18 నుంచి 35 ఏళ్ల వయస్సు గల 2,086 మంది వినియోగదారుల అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.డ్యూరబులిటీ ఇండెక్సులో అగ్రస్థానంరూ.10,000 లోపు ధర కలిగిన మొబైల్ విభాగంలో 0.86 మన్నిక(డ్యూరబులిటీ) సూచికతో ఐటెల్ మొదటి స్థానంలో నిలిచింది. దీని తర్వాత శాంసంగ్ (0.79), వివో (0.72) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ముఖ్యంగా ఫీచర్ ఫోన్ విభాగంలో 91% మంది వినియోగదారులు ఐటెల్ మన్నికైన బ్రాండ్ అని వెల్లడించారు. స్మార్ట్ఫోన్ విభాగంలోనూ 85% స్కోరుతో ఐటెల్ రెండో స్థానంలో నిలిచింది.నివేదికలో మరిన్ని అంశాలుదాదాపు 81% మంది వినియోగదారులు ఐటెల్ను బలమైన, మన్నికకు మారుపేరుగా భావిస్తున్నారు. 79% మంది దీని డిజైన్ సౌకర్యవంతంగా ఉందని ప్రశంసించారు. 74% మంది ఈ బ్రాండ్ను అత్యంత నమ్మదగినదిగా గుర్తించారు. 85% మంది తాము చెల్లించే ధరకు తగిన గొప్ప విలువ (వాల్యూ ఆఫ్ మనీ) లభిస్తుందని నమ్ముతున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 51% మంది భవిష్యత్తులో ఐటెల్ ఫీచర్ ఫోన్ను, 30% మంది ఐటెల్ స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు. -
టెక్ మహీంద్రా చేతికి కెనడా ఐటీ కంపెనీ
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం టెక్ మహీంద్రా కెనడా కంపెనీ అల్లూరి టెక్నాలజీస్ ఇంక్(అవాంట్)ను కొనుగోలు చేయనుంది. ఇందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనిలో భాగంగా తొలుత 85% వాటాను సొంతం చేసుకోనుంది. ఇందుకు 2.8 కోట్ల కెనడియన్ డాలర్లు(రూ. 171 కోట్లు) వెచి్చంచనుంది. మూడేళ్ల తదుపరి మిగిలిన 15% వాటాను ముందుగా నిర్ణయించిన ధర ప్రకారం కొనుగోలు చేయనున్నట్లు టెక్ మహీంద్రా పేర్కొంది.అవాంట్తో.. సొంత అనుబంధ కంపెనీ టెక్ మహీంద్రా కన్సల్టింగ్ గ్రూప్(టీఎంసీజీ) వాటా కొనుగోలు ఒప్పందం(ఎస్పీఏ) కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. తాజా కొనుగోలుతో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సరీ్వసులు, ఇన్సూరెన్స్(బీఎఫ్ఎస్ఐ) విభాగంలో మరింత బలపడే వీలున్నట్లు తెలియజేసింది. 2029 జూన్ 30కల్లా మిగిలిన 15% వాటా సైతం దక్కించుకోనున్నట్లు వెల్లడించింది.ఈ కొనుగోలు ద్వారా ఉత్తర అమెరికా మార్కెట్లో టెక్ మహీంద్రా తన ఉనికిని మరింత సుస్థిరం చేసుకోనుంది. ముఖ్యంగా అల్లూరి టెక్నాలజీస్కు ఉన్న డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ నైపుణ్యం, టెక్ మహీంద్రా గ్లోబల్ నెట్వర్క్కు తోడవ్వడం వల్ల క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విభాగాల్లో కొత్త ప్రాజెక్టులను చేజిక్కించుకునే అవకాశం ఉంటుంది. -
మొబైల్ ఫోన్లలో ఎమర్జెన్సీ అలారం మోత
కొన్ని నిమిషాల కిందట దేశవ్యాప్తంగా లక్షలాది మంది మొబైల్ ఫోన్లు ఒక్కసారిగా మోగాయి. ఫోన్లలో వింత శబ్దంతో కూడిన అలారం రావడంతో పౌరులు మొదట ఆందోళనకు గురయ్యారు. అయితే, ఇది ఎటువంటి ప్రమాద సంకేతం కాదని, ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘సెల్ బ్రాడ్కాస్ట్’ వ్యవస్థలో భాగంగా నిర్వహించిన పరీక్ష అని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.ఈరోజు ఉదయం 11:46 గంటలకు ఈ టెస్ట్ మెసేజ్ పౌరుల మొబైల్ ఫోన్లకు చేరుకుంది. ‘ఇది భారత ప్రభుత్వ విపత్తు నిర్వహణ సంస్థ పంపిన నమూనా పరీక్షా సందేశం’ అని అందులో స్పష్టంగా పేర్కొన్నారు.అసలేం జరుగుతోంది?నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీడాట్)తో కలిసి దేశవ్యాప్తంగా అత్యాధునిక విపత్తు హెచ్చరిక వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. దీన్ని ‘సాచెట్’ అని పిలుస్తారు. ఈ వ్యవస్థ పనితీరును, దేశంలోని మొబైల్ నెట్వర్క్ల సామర్థ్యాన్ని పరీక్షించడానికి ప్రభుత్వం ప్రస్తుతం దశలవారీగా పరీక్షలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే నేడు ఆ ఫ్లాష్ ఎస్ఎంఎస్ పంపించారు. ఇది కేవలం ఒక డ్రిల్ మాత్రమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.ఈ వ్యవస్థ ప్రత్యేకతలేంటి?సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ వ్యవస్థ పూర్తిగా సీ-డాట్ అభివృద్ధి చేసిన స్వదేశీ సాంకేతికత. ఇది ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ సిఫార్సు చేసిన కామన్ అలర్టింగ్ ప్రోటోకాల్ ఆధారంగా పనిచేస్తుంది. దీని ప్రధాన లక్షణాలు..భూకంపాలు, సునామీలు, వరదలు, పిడుగులు వంటి ప్రకృతి వైపరీత్యాలతోపాటు గ్యాస్ లీకేజీలు లేదా రసాయన ప్రమాదాల వంటి అత్యవసర పరిస్థితుల్లోనూ ఇది పనిచేస్తుంది.విపత్తు సంభవించే అవకాశం ఉన్న నిర్దిష్ట ప్రాంతంలోని వినియోగదారులకు మాత్రమే ఈ సందేశాలు పంపిస్తారు. తద్వారా అనవసర గందరగోళం తగ్గుతుంది.మొబైల్ డేటా లేకపోయినా, నెట్వర్క్ ఉన్నంత వరకు అత్యవసర సందేశం క్షణాల్లో ఫోన్ను చేరుతుంది.అందరి రక్షణే లక్ష్యంగా..ప్రస్తుతం జరుగుతున్నవి ప్రాథమిక పరీక్షలు మాత్రమే. ఈ పరీక్షల తర్వాత, భవిష్యత్తులో ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. అప్పుడు ఇది టెస్ట్ ఛానెల్ సెట్టింగులతో సంబంధం లేకుండా అన్ని రకాల మొబైల్ ఫోన్లలోనూ, అన్ని భారతీయ భాషల్లోనూ హెచ్చరికలను పంపగలదు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు దేశంలోని ప్రతి పౌరుడికి ముందస్తు సమాచారం చేరవేయడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం.ఇదీ చదవండి: మా కోసం పూజలు చేయండి!.. నటి ఆవేదన -
ఏఐలో ఎందుకో వెనకబడ్డాం!
కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో భారతదేశం అనుసరించాల్సిన వ్యూహంపై దేశీయ టెక్ దిగ్గజాలు, అంతర్జాతీయ నిపుణుల మధ్య ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఏఐ ప్రపంచంలో భారత్ నిర్మాతగా ఎదగాలా లేక వినియోగదారుగానే ఉండిపోవాలా అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్)కు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ గిరీష్ దిలీప్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు చర్చకు కొత్త మలుపునిచ్చాయి.ఆలోచనలు పాతబడ్డాయా?భారతదేశ టెక్ రంగానికి దిక్సూచిగా నిలిచిన ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నీలేకని, నారాయణమూర్తిల ఆలోచనా దృక్పథం ప్రస్తుత ఏఐ యుగానికి సరిపోదని గిరీష్ పాటిల్ అభిప్రాయపడ్డారు. నీలేకని వంటి వారు 1990ల నాటి ఐటీ సర్వీసుల మనస్తత్వంతోనే ఆలోచిస్తున్నారని, ఇది 21వ శతాబ్దంలో భారత్ను వెనుకబడిపోయేలా చేస్తుందని విమర్శించారు. ఆధార్ వంటి గొప్ప ప్రాజెక్టులకు నీలేకని కృషిని గౌరవిస్తూనే, ‘ప్రస్తుతం దేశానికి నందన్ నీలేకనిలు కాదు, విశాల్ సిక్కా వంటి దూరదృష్టి గల నాయకులు అవసరం’ అని పాటిల్ చేసిన వ్యాఖ్య టెక్ వర్గాల్లో చర్చకు దారితీసింది.మరోవైపు, నందన్ నీలేకని, మైక్రోసాఫ్ట్ ఇండియా మాజీ చైర్మన్ రవి వెంకటేశన్ ఇటీవల తమ అభిప్రాయాలను వెల్లడించారు. భారత్లో భారీ పెట్టుబడులు, కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ప్రాథమిక స్థాయి నుంచి ప్రతిదీ నిర్మించడానికి బదులుగా ఇప్పటికే ఉన్న ఏఐ సాంకేతికతను మన అవసరాలకు తగ్గట్టుగా వాడుకోవడం ఉత్తమమని సూచించారు. ఆధార్, యూపీఐ విజయాల తరహాలోనే ఆరోగ్య, వ్యవసాయ, విద్యా రంగాల్లో ఏఐని సమర్థవంతంగా వాడటమే మన ప్రధాన లక్ష్యం కావాలని స్పష్టం చేశారు.విశాల్ సిక్కా దార్శనికతవిశాల్ సిక్కా ఇన్ఫోసిస్ సీఈఓగా ఉన్న సమయంలో (2014-2017) సంస్థను సర్వీసులందించే కంపెనీ నుంచి ఉత్పత్తులు, ప్లాట్ఫారమ్ల బేస్డ్ సంస్థగా మార్చాలని ప్రయత్నించారు. ఆటోమేషన్, ఏఐ ఆధారిత సేవలపై ఆయన చూపిన శ్రద్ధ అప్పట్లో విప్లవాత్మకం. అయితే, అంతర్గత పాలనాపరమైన వివాదాలు, వ్యవస్థాపకుల నుంచి ఎదురైన విమర్శలతో ఆయన వైదొలగాల్సి వచ్చింది. సిక్కా ఆలోచనలను అప్పుడే అమలు చేసి ఉంటే నేడు ఇన్ఫోసిస్ ఏఐ రంగంలో ప్రపంచ స్థాయిలో ఉండేదని, ఓపెన్ఏఐ వంటి సంస్థల్లో పెట్టుబడులు పెట్టి ఉంటే మార్కెట్ విలువ ఊహించలేనంతగా పెరిగేదని నెటిజన్లు సోషల్ మీడియాలో విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం సిక్కా వహనా ఏఐ సిస్టమ్స్ ద్వారా మానవ కేంద్రీకృత ఏఐపై పనిచేస్తున్నారు.ఇదీ చదవండి: మరికొద్ది గంటల్లో ఫోన్లకు అలర్ట్! -
మరికొద్ది గంటల్లో ఫోన్లకు అలర్ట్!
ఈరోజు కొన్ని ప్రాంతాల్లో మీ మొబైల్ ఫోన్ ఒక్కసారిగా రింగ్ అయి, స్క్రీన్పై వింతైన మెసేజ్ కనిపించే అవకాశం ఉంది. భయాందోళన చెందకండి. ఇది ప్రకృతి వైపరీత్యాలు లేదా అత్యవసర పరిస్థితులు సంభవించినప్పుడు మనల్ని అప్రమత్తం చేయడానికి భారత ప్రభుత్వం చేపట్టిన అత్యాధునిక ‘సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్’ అయి ఉండవచ్చు. అది ఈ వ్యవస్థలో భాగంగా వస్తున్న టెస్టింగ్ సందేశం మాత్రమే.అసలేం ఏం జరుగుతోంది?నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డీఎంఏ), సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీ-డాట్) సహకారంతో దేశవ్యాప్తంగా విపత్తు హెచ్చరిక వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. దీన్ని ‘సాచెట్’ (SACHET) అని పిలుస్తారు. ఈ వ్యవస్థ పనితీరును, మొబైల్ నెట్వర్క్ల సామర్థ్యాన్ని పరీక్షించడానికి ప్రభుత్వం ప్రస్తుతం దేశవ్యాప్తంగా పరీక్షలను నిర్వహిస్తోంది. అందుకే, మీరు అందుకున్న ఆ ఫ్లాష్ ఎస్ఎంఎస్ ఒక డ్రిల్ మాత్రమే.సందేశం వస్తే ఏం చేయాలి?మీరు ఆ సందేశాన్ని చూసినప్పుడు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దానికి మీరు బదులివ్వాల్సిన లేదా ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన పని లేదు. ఇవి కేవలం టెస్టింగ్ మేసేజ్లు మాత్రమే. ఒకవేళ మీరు ఈ అలర్ట్లను నియంత్రించాలనుకుంటే మీ ఫోన్ సెట్టింగ్స్లోని ‘Safety & Emergency’ లేదా ‘Wireless Emergency Alerts’ విభాగంలోకి వెళ్లి మార్చుకునే అవకాశం ఉంటుంది.ఈ వ్యవస్థ ప్రత్యేకతలేంటి?సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ వ్యవస్థ అనేది సీడాట్ అభివృద్ధి చేసిన స్వదేశీ సాంకేతికత. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) సిఫార్సు చేసిన కామన్ అలర్టింగ్ ప్రోటోకాల్ (సీఏపీ) ఆధారంగా ఇది పనిచేస్తుంది. భూకంపాలు, సునామీలు, వరదలు, మెరుపులు వంటి ప్రకృతి వైపరీత్యాలే కాకుండా గ్యాస్ లీకేజీలు లేదా రసాయన ప్రమాదాల వంటి మానవ నిర్మిత అత్యవసర పరిస్థితుల్లోనూ ఇది పనిచేస్తుంది. విపత్తు సంభవించే అవకాశం ఉన్న నిర్దిష్ట ప్రాంతంలోని వినియోగదారులకు మాత్రమే ఈ సందేశాలు పంపిస్తారు. తద్వారా అనవసర గందరగోళం తగ్గుతుంది.భవిష్యత్తు ప్రణాళికప్రస్తుతం జరుగుతున్నవి ప్రాథమిక పరీక్షలు మాత్రమే. ఈ పరీక్షల తర్వాత భవిష్యత్తులో ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. అప్పుడు ఇది టెస్ట్ ఛానెల్ సెట్టింగులతో సంబంధం లేకుండా అన్ని రకాల మొబైల్ ఫోన్లలోనూ, అన్ని భారతీయ భాషల్లోనూ హెచ్చరికలను పంపగలదు. అంటే, ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు దేశంలోని ప్రతి పౌరుడికి ముందస్తు సమాచారం చేరవేయడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. కాబట్టి, తదుపరిసారి మీ ఫోన్ సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్తో మోగితే అది మీ భద్రత కోసం ప్రభుత్వం చేస్తున్న ఏర్పాటు అని గుర్తుంచుకోండి. అప్రమత్తంగా ఉండండి.ఇదీ చదవండి: మా కోసం పూజలు చేయండి!.. నటి ఆవేదన -
పరాగ్... పడిలేచిన కెరటం
ముప్పై ఏడు సంవత్సరాల వయసులోనే ట్విటర్ సీయీవోగా ‘వావ్’ అనిపించుకున్నాడు పరాగ్ అగర్వాల్. ఎలాన్ మస్క్ ట్విటర్ను సొంతం చేసుకోవడంతో అవమానకర రీతిలో సంస్థ నుంచి బయటికి వచ్చిన తరువాత ‘అయ్యో!’ అనిపించుకున్నాడు. అయితే అగర్వాల్ ‘ఆహా’ ‘అయ్యో’లకు అతీతుడు. ‘ది బెస్ట్ రివెంజ్ ఈజ్ మాసివ్ సక్సెస్’ అని నమ్మినవాడు. తన ఏఐ స్టార్టప్ ‘ప్యారలల్ వెబ్ సిస్టమ్స్’తో మరోసారి ‘వావ్’ అనిపించుకున్నాడు పరాగ్ అగర్వాల్. 19 వేల కోట్ల కంపెనీగా ‘ప్యారలల్ వెబ్ సిస్టమ్స్’ను తీర్చిదిద్దాడు...రాజస్థాన్లోని అజ్మీర్ పరాగ్ అగర్వాల్ జన్మస్థలం. ముంబైలోని అటోమిక్ ఎనర్జీ జూనియర్ కాలేజీలో చదువుకునే రోజుల్లో తొలిసారిగా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నాడు. టర్కీలో జరిగిన ‘ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్’లో బంగారు పతకం గెలుచుకున్నాడు. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ చేసిన అగర్వాల్ పీహెచ్డీ కోసం యూఎస్కు వెళ్లాడు. ట్విటర్లో సాప్ట్వేర్ ఇంజినీర్గా చేరడానికి ముందు మైక్రోసాఫ్ట్ రీసెర్చ్, యాహూ రిసెర్చ్లలో ఇంటర్న్షిప్లు చేశాడు.అతడి టైమ్ అలా మొదలైంది...‘నా టైమ్ మొదలైంది’ అనుకునే టైమ్ అగర్వాల్కు 2017లో వచ్చింది. అగర్వాల్ను చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా నియమిస్తున్నట్లు ట్విటర్ ప్రకటించింది. లోప్రోఫైల్లో ఉండడం వల్ల కావచ్చు, అగర్వాల్ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. సీయీవోగా అతడి నియామకం చాలామందిని ఆశ్చర్యపరిచింది.ట్విటర్లో ఎన్నో వ్యూహాత్మక కార్యక్రమాలలో అగర్వాల్ కీలక పాత్ర పోషించిన విషయం చాలామందికి తెలియదు. అలాగని సీయీవోగా అగర్వాల్ నియామకం రాత్రికి రాత్రి జరగలేదు. 2021లో జాక్ డోర్సీ స్థానంలో ట్విటర్ సీయీవో పదవిలోకి వచ్చాడు అగర్వాల్. తగిన సీయీవో కోసం చాలా ప్రయత్నాలు చేసి విఫలమైన తరువాత ‘సీయీవో పోస్ట్కు అగర్వాల్ సరిౖయెనవాడు’ అని బోర్డ్ నిర్ణయించింది. ‘ట్విటర్ కంపెనీని, దాని అవసరాలను అగర్వాల్ ఎంతగా అర్థం చేసుకున్నారనేది మాటలకు అందనిది’ అని డోర్సి ట్వీట్ చేశాడు.ఎన్నో అడ్డంకులు, ఎన్నో సవాళ్లు....‘తక్కువమంది ఉద్యోగులు ఉన్న రోజుల్లో కంపెనీలో చేరాను. ఒడిదుడుకులను, సవాళ్లను, అడ్డంకులను ఎదుర్కొన్నాను. విజయాలు అందుకున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా నేను అడుగడుగునా ట్విటర్ అద్బుత ప్రభావాన్ని, నిరంతర పురోగతిని చూశాను. ఇప్పుడు మన ముందు ఉన్న ఉత్తేజకరమైన అవకాశాలను చూస్తున్నాను’ అన్నాడు ట్విటర్ సీయీవోగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో అగర్వాల్.బ్యాడ్ టైమ్ అలా మొదలైంది...ట్విటర్ కంపెనీని ‘టెస్లా’ చీఫ్ ఎలాన్ మస్క్ సొంతం చేసుకోవడంతో అగర్వాల్ కెరీర్లో ట్విస్ట్ మొదలైంది. సీయీవో పదవి నుంచి అగర్వాల్ను తొలగిస్తారనే ఊహాగానాలు నిజం కావడానికి ఎంతో కాలం పట్టలేదు.సీయీవో సీట్లో కూర్చున్న తొలిరోజు ఉద్యోగులను ఉద్దేశించి....‘మన ముందు ఉన్న ఉత్తేజకరమైన అవకాశాలను చూస్తున్నాను’ అన్నాడు అగర్వాల్.ఉత్తేజకరమైన అవకాశాలేమిటోగానీ, ఎలాన్ మస్క్ ట్విటర్ను సొంతం చేసుకున్న తరువాత అగర్వాల్తో పాటు, ఉద్యోగులకు అవమానాలు ఎదురయ్యాయి. ‘మన భవిష్యత్ ఏమిటి?’ అనే భయం మొదలైంది. కంపెనీలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులను అవమానకర రీతిలో మస్క్ బయటికి పంపించినట్లు వార్తలు వచ్చాయి.తిరుగులేని విజయం‘అవమానకర రీతిలో అగర్వాల్కు ఉద్వాసన పలికారు’ అనే వార్త అగర్వాల్పై సానుభూతి కలిగించింది. ఆ సమయంలో అగర్వాల్ మానసిక పరిస్థితి ఏమిటో తెలియదు. తెలియకపోయినా ఒక విషయం మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు... ఎప్పుడూ అధైర్యపడి ఉండడు అని! ‘మళ్లీ నన్ను నేను నిరూపించుకుంటాను’ అని గట్టిగా అనుకొని ఉంటాడు. 2023లో ‘ప్యారలల్ వెబ్సిస్టమ్స్’ అనే ఏఐ స్టార్టప్ను ్రపారంభించాడు. తిరుగులేని విజయాన్ని సాధించాడు. ఇప్పుడు ఈ కంపెనీ విలువ సుమారుగా 19 వేల కోట్లు! ప్యారలల్లో...ఏఐ ఏజెంట్ల కోసం మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోంది పరాగ్ అగర్వాల్ నేతృత్వంలోని ప్యారలల్ వెబ్సిస్టమ్స్. లీగల్ రిసెర్చ్ నుంచి ఫైనాన్షియల్ ఎనాలసిస్ వరకు దేనినైనా నిర్వహించగలదు. ముందుగా శిక్షణ పొందిన డేటాపై ఆధారపడకుండా, లైవ్ వెబ్లో ఏఐ ఏజెంట్లు యాక్టివ్గా శోధించడానికి, సమాచారాన్ని సంగ్రహించడానికి(ఎక్స్ట్రాక్ట్), సంక్లిష్టమైన వర్క్ఫ్లోను ఎగ్జిక్యూట్ చేయడానికి అనుమతించే సాధనాలను ‘ప్యారలల్’ నిర్మిస్తోంది. లోతైన పరిశోధన నుంచి వర్క్ ఫ్లో ఆటోమేషన్ వరకు అన్నింటినీ కవర్ చేస్తోంది. -
కోర్టు గదిలో వాదోపవాదాలు పీక్స్!
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో అత్యంత ప్రభావవంతమైన ఓపెన్ ఏఐ భవిష్యత్తును నిర్ణయించే కీలకమైన కోర్టు విచారణలో ఉత్కంఠ నెలకొంది. సంస్థ సహ వ్యవస్థాపకులు సామ్ ఆల్ట్మన్, గ్రెగ్ బ్రోక్మన్లపై ఎలాన్ మస్క్ దాఖలు చేసిన కేసులో ఏప్రిల్ 30న జరిగిన విచారణ వాడీవేడిగా సాగింది. ప్రజా ప్రయోజనం కోసం స్థాపించిన లాభాపేక్ష లేని సంస్థ ఇప్పుడు భారీ వాణిజ్య సంస్థగా మారిందని, ఇది విశ్వాసఘాతకమని మస్క్ గట్టిగా వాదించారు.కోర్టు గదిలో మాటల యుద్ధంవిచారణ సందర్భంగా ఓపెన్ ఏఐ న్యాయవాది విలియం సావిట్, మస్క్ను ఇరుకున పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. సంస్థ లాభాపేక్ష లేని మార్గంలో కాకుండా వాణిజ్య పరంగా వెళ్తుందని తెలిసినా మస్క్ ఎందుకు మౌనంగా ఉన్నారని, పాత ఒప్పంద పత్రాలను (2017 టర్మ్ షీట్) ఉటంకిస్తూ సావిట్ ప్రశ్నించారు. ఈ క్రమంలో మస్క్ తీవ్ర అసహనానికి గురయ్యారు. ‘నేను ఆ పత్రాల్లోని ఫైన్ ప్రింట్ చదవలేదు. కేవలం శీర్షికను మాత్రమే చూశాను. ఆల్ట్మన్, ఇతరులు ఇచ్చిన హామీలనే నమ్మాను’ అని మస్క్ బదులిచ్చారు. సావిట్ పదేపదే తనను మధ్యలో ఆపడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మస్క్, ‘మీరు నన్ను ప్రతిసారీ నియంత్రించాలనుకుంటే సమాధానాలు ఎలా పూర్తవుతాయి?’ అని వ్యాఖ్యానించారు. దీనిపై న్యాయమూర్తి వైవోన్నే గొంజాలెజ్ రోజర్స్ స్పందిస్తూ, న్యాయవాదిని హెచ్చరించినప్పటికీ మస్క్ చేసిన అభ్యంతరాలను పూర్తిగా సమర్థించలేదు.నమ్మకద్రోహం జరిగిందితాను ఓపెన్ ఏఐని లాభాపేక్ష లేని సంస్థగా కొనసాగుతుందని విశ్వసించి మద్దతు ఇచ్చానని, అయితే ఇప్పుడు అది నిబంధనలను ఉల్లంఘిస్తోందని మస్క్ ఆరోపించారు. ‘ఒక స్వచ్ఛంద సంస్థ తీరును మార్చకూడదు’ అని అన్నారు. ఈ కేసులో భాగంగా ఆయన 150 బిలియన్ డాలర్ల నష్టపరిహారంతో పాటు సంస్థ నిర్మాణంలో సమూల మార్పులు చేయాలని, ఆల్ట్మన్, బ్రోక్మన్లను పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.ఓపెన్ ఏఐ ప్రతివ్యూహంమరోవైపు, మస్క్ వాదనలను ఓపెన్ ఏఐ తోసిపుచ్చింది. మస్క్ కేసును ఒక ప్రతీకార చర్యగా భావిస్తున్నామని కంపెనీ పేర్కొంది. 2018లో బోర్డు నుంచి బయటకు వచ్చిన తర్వాత నిరాశకు గురైన మస్క్ తన సొంత ఏఐ సంస్థ ఎక్స్ఏఐకి పోటీగా ఉన్న ఓపెన్ ఏఐని బలహీనపరిచేందుకే ఈ ప్రయత్నాలు చేస్తున్నారని న్యాయవాదులు ఆరోపించారు. అంతేకాకుండా, మస్క్ కూడా తన సొంత ఏఐ మోడళ్లను ధ్రువీకరించుకోవడానికి ఇతర ఏఐలను ఉపయోగిస్తున్నారని స్పష్టం చేశారు.న్యాయమూర్తి క్లాస్విచారణలో ఏఐ వల్ల మానవాళికి రాబోయే ముప్పు గురించి మస్క్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. ‘ఏఐ వల్ల మనుషులు అంతరించిపోయే ప్రమాదం నిజం, మనమందరం చనిపోవచ్చు’ అని వారు కోర్టుకు తెలిపారు. అయితే, ఈ వాదనను న్యాయమూర్తి రోజర్స్ తోసిపుచ్చారు. ‘మీ క్లయింట్ (మస్క్) కూడా అదే రంగంలో సంస్థను నడుపుతున్నారు కదా.. మరి ప్రమాదాలు ఉన్నప్పుడు ఆయన ఎందుకు చేస్తున్నారు?’ అని ప్రశ్నిస్తూ ఇది భద్రతా ప్రమాణాల విచారణ కాదని, ఒప్పంద ఉల్లంఘనల కేసు అని స్పష్టం చేశారు. ఈ కేసు విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు. 850 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన సంస్థగా ఎదిగిన ఓపెన్ ఏఐ భవిష్యత్తును నిర్ణయించనున్న ఈ విచారణ రాబోయే రోజుల్లో మరింత వేడెక్కే అవకాశం ఉంది.ఇదీ చదవండి: 2032 వరకు అన్ని హక్కులు మావే -
కాగ్నిజెంట్ కొత్త ప్రాజెక్ట్.. టెకీల గుండెల్లో గుబులు!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాకతో ఐటీ రంగంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ప్రముఖ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ తాజాగా ప్రకటించిన ‘ప్రాజెక్ట్ లీప్’ (Project Leap) ఆ సంస్థ ఉద్యోగుల్లో గుబులు రేపుతోంది. సాంప్రదాయ ఐటీ సేవల స్థానంలో ఏఐ ఆధారిత సేవలను ప్రవేశపెట్టేందుకు కంపెనీ సిద్ధమవుతుండటంతో, భారీ సంఖ్యలో ఉద్యోగ కోతలు తప్పవనే సంకేతాలు వెలువడుతున్నాయి.రూ. 2000 కోట్లకు పైగా ఖర్చు..ప్రాజెక్ట్ లీప్ను ఒక పరివర్తన కార్యక్రమంగా కాగ్నిజెంట్ అభివర్ణిస్తోంది. దీనికోసం 2026 నాటికి 230 నుంచి 320 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1,900 - రూ.2,600 కోట్లు) ఖర్చు చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఇందులో సింహభాగం అంటే 200 నుంచి 270 మిలియన్ డాలర్లు కేవలం ఉద్యోగుల విడదీత (Severance pay), సిబ్బందికి సంబంధించిన ఇతర ఖర్చులకే కేటాయించడం గమనార్హం.ఈ భారీ మొత్తాన్ని విశ్లేషిస్తే.. తొలగింపుల ప్రభావం కొన్ని వేల మందిపై ఉండబోతోందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ఎంతమంది ఉద్యోగులను తొలగిస్తారనే దానిపై కంపెనీ ఇంకా స్పష్టమైన గణాంకాలను వెల్లడించలేదు.‘పిరమిడ్’ రివర్స్.. జూనియర్లకే ప్రాధాన్యం!కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్ ఎస్ ఈ మార్పులపై స్పందిస్తూ.. సంస్థను ‘విస్తృత, చిన్న’ (Broad and Small) పిరమిడ్ ఆకృతిలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అంటే నిర్వహణ విభాగంలో (Management layers) ఉన్న సీనియర్ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం.. ఎక్కువ మంది ఫ్రెషర్లు, జూనియర్ ఉద్యోగులను చేర్చుకోవడం ద్వారా సంస్థ అట్టడుగు భాగాన్ని బలోపేతం చేయడం.. క్లిష్టమైన ఏఐ నైపుణ్యాలను యువ శ్రామిక శక్తి ద్వారా వేగంగా నిర్మించడం చేస్తారు.భారీ పొదుపు.. ఏఐపై పెట్టుబడిఈ ప్రాజెక్ట్ ద్వారా 2026 నాటికి 200 నుంచి 300 మిలియన్ డాలర్ల వ్యయాన్ని ఆదా చేయాలని కాగ్నిజెంట్ భావిస్తోంది. ఈ ఆదా చేసిన మొత్తాన్ని తిరిగి ఏఐ సామర్థ్యాల పెంపుదల, ఉద్యోగుల రీస్కిల్లింగ్, మార్జిన్లను పెంచడం కోసం వినియోగించనున్నారు.కాగ్నిజెంట్కు ఇటువంటి పునర్నిర్మాణ కార్యక్రమాలు కొత్తేమీ కాదు. 2023లో సుమారు 300 మిలియన్ డాలర్ల ఖర్చుతో అమలు చేసిన 'నెక్స్ట్ జెన్' ప్రోగ్రామ్ 3,500 మంది ఉద్యోగులపై ప్రభావం చూపింది. అంతకు ముందు 2020లో 'ఫిట్ ఫర్ గ్రోత్' దాదాపు 7,000 మంది మిడ్, సీనియర్ స్థాయి ఉద్యోగులను ఇంటికి పంపింది.ప్రస్తుతం (మార్చి 2026 నాటికి) కాగ్నిజెంట్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,36,300. ఒకవైపు వేల సంఖ్యలో నియామకాలు జరుగుతాయని చెప్తూనే, మరోవైపు వ్యయ నియంత్రణ పేరుతో సీనియర్లపై వేటు వేస్తుండటం ఐటీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
ఒప్పో, వన్ప్లస్, రియల్మీ విలీనం!
గ్లోబల్ స్మార్ట్ఫోన్ మార్కెట్లో మరింత పట్టు సాధించేందుకు దిగ్గజ సంస్థ ఒప్పో కీలక నిర్ణయం తీసుకుంది. మారుతున్న మార్కెట్ సమీకరణలు, తీవ్రతరమవుతున్న పోటీని తట్టుకునేందుకు తన అనుబంధ బ్రాండ్లు అయిన వన్ప్లస్, రియల్మీలను ఒకే గొడుగు కిందికి తెస్తూ ఒక కొత్త బిజినెస్ యూనిట్గా విలీనం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ వ్యూహాత్మక పునర్నిర్మాణం ద్వారా కార్యకలాపాలను క్రమబద్ధీకరించడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లలో సమన్వయాన్ని పెంచాలని ఒప్పో భావిస్తోంది.ఈ విలీనం ద్వారా వన్ప్లస్, రియల్మీ బ్రాండ్లు తమ గ్లోబల్, దేశీయ కార్యకలాపాలను ఒకే విభాగం కింద నిర్వహించనున్నాయి. వన్ప్లస్ చైనా ప్రెసిడెంట్ లీ జీ ఈ కొత్త ప్రొడక్ట్ హబ్కు నాయకత్వం వహించనున్నారు. ఆయన నేరుగా వన్ప్లస్ వ్యవస్థాపకుడు, సీఈఓ పీట్ లావుకు రిపోర్ట్ చేస్తారు. ఉత్పత్తుల అభివృద్ధితోపాటు మార్కెటింగ్, సర్వీసు విభాగాలు కూడా ఒకే యూనిట్ కిందకు రానున్నాయి. టీమ్ల మధ్య డూప్లికేషన్ను (ఒకే పనిని రెండు వేర్వేరు బృందాలు చేయడం) తగ్గించి కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చే సమయాన్ని వేగవంతం చేయడమే దీని లక్ష్యమని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు చెబుతున్నారు.వినియోగదారులపై ప్రభావం ఎంత?ఈ విలీనం జరిగినప్పటికీ మార్కెట్లో వన్ప్లస్, రియల్మీ తమ వ్యక్తిగత బ్రాండ్ గుర్తింపును కోల్పోవని తెలుస్తోంది. అంటే, యూజర్లు ఇప్పటిలాగే వన్ప్లస్ నుంచి ప్రీమియం అనుభవాన్ని, రియల్మీ నుంచి బడ్జెట్ ధరలో అత్యాధునిక ఫీచర్లను ఆశించవచ్చు. అయితే, తెరవెనుక పనిచేసే టెక్నాలజీ, వనరులు, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్లో సమన్వయం కనిపిస్తుంది. భారతదేశం, ఐరోపా వంటి కీలక మార్కెట్లలో ఒప్పో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ చర్య దోహదపడుతుంది. ముఖ్యంగా భారత్లో నాయకత్వ మార్పులపై వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో కంపెనీ ఒక స్పష్టమైన ప్రకటన చేసింది. ‘స్థానిక వ్యూహాలతో భారత కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి. ఈ పునర్వ్యవస్థీకరణ కేవలం అంతర్గత సామర్థ్యాన్ని పెంచుకోవడానికే’ అని చెప్పింది.ఇదీ చదవండి: కెరీర్ వృద్ధికి ‘వన్ మంత్’ టెస్ట్ -
అర కోటి పైగా జీతం.. అయినా ఏం లాభం!
సమాజం దృష్టిలో అతను ఒక 'సక్సెస్ఫుల్' పర్సన్. చేతినిండా జీతం, సొంత ఇల్లు, అందమైన భార్య, ఇద్దరు పిల్లలు.. ఇలా ఒక మనిషి తన జీవితంలో సాధించాలనుకునేవన్నీ అతని దగ్గర ఉన్నాయి. కానీ, లోలోపల మాత్రం ఒక రకమైన శూన్యం. 42 ఏళ్ల ఓ ఐటీ ప్రొఫెషనల్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న తన అంతర్మథనం ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. మధ్య వయసులో పురుషులు ఎదుర్కొంటున్న మానసిక ఒంటరితనంపై ఇది చర్చకు దారితీసింది.కాగితం మీద అంతా పర్ఫెక్ట్! కానీ..ఆ వ్యక్తి తన పోస్ట్లో తన ప్రస్తుత స్థితిని ఇలా వివరించారు.. ‘నాకు 42 ఏళ్లు. వార్షిక ఆదాయం రూ. 55 లక్షలు. చెన్నైలో సొంత ఇల్లు ఉంది. భార్య పిల్లలతో జీవితం కాగితం మీద చూస్తే చాలా పరిపూర్ణంగా కనిపిస్తుంది. సమాజం నిర్దేశించిన విజయాలన్నీ నేను అందుకున్నాను. కానీ ఈ సక్సెస్ వెనుక ఏదో మిస్ అవుతున్న భావన నన్ను వెంటాడుతోంది’.యంత్రంలా మారిన 40ల జీవితం!తన గత జీవితాన్ని గుర్తు చేసుకుంటూ అతను అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. జ్ఞాపకాల్లో 20లు.. ముచ్చట్లతో 30లు గడిచాయంటూ రాసుకొచ్చిన ఆయన ప్రస్తుత పరిస్థితి గురించి చెబుతూ తన ఒంటరితనాన్ని బయటపెట్టారు. ‘ఇప్పుడు నా ఫోన్ చాలా అరుదుగా మోగుతుంది. వచ్చే కాల్స్ అన్నీ ఆఫీస్ పని గురించో, బ్యాంక్ అలర్ట్ గురించో లేక ఇంటికి వచ్చేటప్పుడు పాలు తీసుకురమ్మని వచ్చే ఆదేశాలో మాత్రమే ఉంటున్నాయి. శారీరకంగా నేను ఒంటరిని కాకపోయినా, మానసికంగా మాత్రం ఒక యంత్రంలా మారిపోయాననిపిస్తోంది’ అని నిట్టూర్చారు.నేనొక ఏటీఎం మెషీన్నా?ఇంటికి వెళ్తే తన బాధ్యతలు తప్ప తన ఉనికికి గుర్తింపు లేదని అతను ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇంట్లోకి అడుగుపెట్టగానే నేను కేవలం 'అప్పా' (నాన్న) మాత్రమే. స్కూల్ ఫీజులు కట్టేవాడిగా, ఇంట్లో వైఫై పనిచేయకపోతే బాగు చేసేవాడిగా, రిపేర్లు చూసుకునే వ్యక్తిగానే నా పాత్ర పరిమితమైపోయింది. ఆఫీసులో సీనియర్ హోదాలో ఉండటంతో నా దగ్గర అన్నిటికీ సమాధానాలు ఉండాలని అందరూ ఆశిస్తారు. నేను ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతో, బలంగా కనిపించాలి. నా బలహీనతను బయటపెట్టే అవకాశం ఎక్కడా లేదు’. అని ఘొల్లుమన్నారు.ఆ 15 నిమిషాలే నా ప్రపంచం!‘కొన్నిసార్లు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు కావాలనే కారును నెమ్మదిగా నడుపుతాను. ఆ అదనపు 15 నిమిషాలు కారులో ఒంటరిగా ఉన్నప్పుడే.. నేను మళ్లీ 'నేను'లా అనిపిస్తాను’ అంటూ తన మనసులోని భారాన్ని దించుకోవడానికి అతను చేసే చిన్న ప్రయత్నం అందరినీ ఆలోచింపజేస్తోంది.ఈ పోస్ట్ చదివిన చాలామంది నెటిజన్లు, ముఖ్యంగా ఐటీ రంగంలోని మిడ్-లెవల్ ప్రొఫెషనల్స్, 'ఇదీ మా కథే' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆర్థిక స్థిరత్వం ఒక్కటే జీవితం కాదని, మనుషుల మధ్య భావోద్వేగ అనుబంధాలు, వ్యక్తిగత సమయం ఎంత అవసరమో ఈ పోస్ట్ గుర్తు చేస్తోంది.Confessions and realities42M, 55LPAI am a 42-year-old man with a senior job in IT. I have a house in Chennai, a supportive wife, and two children. On paper, everything about my life looks perfect. I have achieved all the things society says a man should achieve.In my…— Dr Mouth Matters (@GanKanchi) April 29, 2026 -
యాపిల్ గ్యాడ్జెట్తో ఐ ఆపరేషన్
సాంకేతిక ప్రపంచంలో ఒకప్పుడు కేవలం విలాసవంతమైన గ్యాడ్జెట్గా భావించిన ‘యాపిల్ విజన్ ప్రో’ ఇప్పుడు ప్రాణాలను రక్షించే, చూపును ప్రసాదించే వైద్య విభాగంలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రత్యేకించి కంటి శస్త్రచికిత్సల్లో ఈ స్పేషియల్ కంప్యూటింగ్ పరికరాన్ని వైద్యులు విజయవంతంగా ఉపయోగిస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది.కంటిశుక్లం ఆపరేషన్లలో..న్యూయార్క్కు చెందిన ప్రముఖ కంటి వైద్య నిపుణుడు డాక్టర్ ఎరిక్ రోసెన్బర్గ్, ఈ గ్యాడ్జెట్ను శస్త్రచికిత్సా పరికరంగా ఉపయోగించారు. 2025 చివరి నాటికి ప్రయోగాత్మకంగా ప్రారంభమైన ఈ ప్రక్రియ ఇప్పుడు సాధారణంగా ఉపయోగంలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా కంటిశుక్లం (కాటరాక్ట్) శస్త్రచికిత్సల్లో దీని వినియోగం మెరుగైన ఫలితాలను ఇస్తోంది.‘స్కోప్ ఎక్స్ ఆర్’ పనితీరుఈ సాంకేతికత నేరుగా ఆపరేషన్ గదిలోని సర్జికల్ మైక్రోస్కోప్తో అనుసంధానించబడి ఉంటుంది. మైక్రోస్కోప్ నుంచి వచ్చే ప్రత్యక్ష దృశ్యాలను హై-రిజల్యూషన్ 3డీ నాణ్యతతో సర్జన్ కళ్ల ముందు ఉంచుతుంది. శస్త్రచికిత్స జరుగుతుండగానే రోగి పాత స్కాన్ రిపోర్టులు, కీలక డేటాను సర్జన్ తన చూపును పక్కకు తిప్పకుండానే హెడ్సెట్ స్క్రీన్పై చూసుకోవచ్చు. మానిటర్ల వైపు చూడటానికి పదేపదే తల తిప్పాల్సిన అవసరం లేకపోవడంతో సర్జన్ పూర్తి ఏకాగ్రత రోగి కంటిపైనే ఉంటుంది.‘ఇది ఉన్న పరికరాలను తొలగించదు. కానీ ఇప్పటికే ఉన్న వ్యవస్థను మరింత సమర్థవంతంగా మారుస్తుంది. సమాచారం కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా అది అంతా మన కళ్ల ముందే ప్రత్యక్షమవ్వడం అద్భుతం’ అని డాక్టర్ ఎరిక్ రోసెన్బర్గ్ చెప్పారు.రిమోట్ సహకారంవిజన్ ప్రో ద్వారా మరో కీలక ప్రయోజనం ‘రిమోట్ కొలాబరేషన్’. ఒక క్లిష్టమైన ఆపరేషన్ జరుగుతున్నప్పుడు ప్రపంచంలోని ఏ మూలన ఉన్న నిపుణుడైనా వర్చువల్గా ఆపరేటింగ్ థియేటర్లోకి ప్రవేశించవచ్చు. సర్జన్ ఏం చూస్తున్నారో అదే దృశ్యాన్ని రిమోట్ తీసుకున్న నిపుణుడు కూడా చూస్తూ రియల్టైమ్లో సూచనలు ఇచ్చే వీలుంటుంది. ఇది వైద్య విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంలో, క్లిష్టమైన కేసులలో సెకండ్ ఒపీనియన్ తీసుకోవడంలో విప్లవాత్మక మార్పులు తెస్తోంది.సవాళ్లువైద్య రంగంలో మిశ్రమ వాస్తవికత (మిక్స్డ్ రియాలిటీ) ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. ఇందులో ప్రభుత్వాల నుంచి క్లినికల్ అనుమతులు పొందడం క్లిష్టమైన ప్రక్రియ. పరికరాల ధరలు అధికంగా ఉండటం వల్ల సామాన్య ఆసుపత్రులకు ఇవి ఇంకా అందుబాటులో లేవు. దీనిని వాడటానికి వైద్య సిబ్బందికి ప్రత్యేక నైపుణ్యం అవసరం.ఇదీ చదవండి: కెరీర్ వృద్ధికి ‘వన్ మంత్’ టెస్ట్ -
సంప్రదాయ మోడల్లో ఏఐ పెను మార్పులు
భారతీయ ఐటీ రంగం గత నాలుగు దశాబ్దాలుగా అనుసరిస్తున్న సంప్రదాయ ‘పిరమిడ్’ టాలెంట్ మోడల్లో కృత్రిమ మేధ పెను మార్పులు తీసుకురాబోతోంది. అట్టడుగున భారీ సంఖ్యలో ఫ్రెషర్లు, పైకి వెళ్లే కొద్దీ తగ్గే సీనియర్ల సంఖ్యతో కూడిన ఈ పిరమిడ్ మోడల్ నిర్మాణం రాబోయే రోజుల్లో ‘వజ్రం’ (Diamond) ఆకృతిని(అడుగున ఏఐ టూల్స్ ఎంట్రీ లెవల్ పనులను వేగంగా చేస్తాయి. దీనివల్ల ఫ్రెషర్ల అవసరం తగ్గుతుంది. మధ్య భాగంలో డైమండ్ వెడల్పుగా ఉంటుంది. అంటే, ఏఐని సమర్థవంతంగా వాడుకోగలిగే నిపుణులు ఎక్కువవుతారు) సంతరించుకోనుందని ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ విశ్లేషించారు.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఐటీ కంపెనీల నియామక ప్రక్రియలో ఇప్పటికే మార్పులు మొదలయ్యాయన్నారు. అయితే క్షేత్రస్థాయిలో ఈ నిర్మాణాత్మక మార్పులు పూర్తిస్థాయిలో ప్రతిబింబించడానికి కొంత సమయం పడుతుందని స్పష్టం చేశారు.ఏఐ సేవలే వృద్ధికి చోదక శక్తులుప్రస్తుత ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ఒడిదుడుకులతో ఉన్నప్పటికీ ఏఐ సేవల వ్యూహం తమకు అద్భుతంగా పనిచేస్తోందని పరేఖ్ ధీమా వ్యక్తం చేశారు. ‘సుమారు 300 బిలియన్ డాలర్ల మార్కెట్ అవకాశాన్ని కంపెనీ గుర్తించింది. ఇన్ఫోసిస్ ఆరు ప్రధాన విభాగాలపై దృష్టి సారించింది. పాత సేవలను ఏఐ ఆగ్మెంటెడ్ సర్వీసులుగా మారుస్తూ క్లయింట్లకు మరింత విలువను చేకూరుస్తోంది. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు వంటి స్థూల ఆర్థిక సవాళ్లు తగ్గుముఖం పడుతున్నాయి. రాబోయే ఏడాదిలో వృద్ధి మెరుగ్గా ఉంటుంది’ అని అంచనా వేశారు.20,000 మంది ఫ్రెషర్లకు చోటునియామకాలపై నెలకొన్న ఆందోళనలను తొలగిస్తూ గతేడాది తరహాలోనే ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా సుమారు 20,000 మంది కాలేజీ గ్రాడ్యుయేట్లను నియమించుకోనున్నట్లు సలీల్ పరేఖ్ వెల్లడించారు. అయితే, వారి శిక్షణా విధానంలో భారీ మార్పులు చేశారు. ‘కేవలం కోడింగ్ మాత్రమే కాకుండా ఫౌండేషన్ మోడల్స్ ఉపయోగించడంలో వారికి ప్రత్యేక శిక్షణ అవసరం. పిరమిడ్ ఆకారం మారినప్పటికీ నిపుణులైన వ్యక్తులతో పాటు ఏఐ ఏజెంట్లు కలిసి పనిచేసే కొత్త వాతావరణం ఏర్పడుతుంది. భవిష్యత్తులో నైపుణ్యం కలిగిన వారికే అత్యధిక ప్రాధాన్యత లభిస్తుంది’ అన్నారు.ఇదీ చదవండి: ఆంత్రోపిక్ బంపర్ ఆఫర్ -
ఏఐ ఉచ్చులో కార్పొరేట్ సంస్థలు!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అంటే కేవలం ఉత్పాదకతను పెంచే మంత్రదండం మాత్రమే కాదు, అది ఒక ప్రమాదకరమైన ఆటోమేషన్ ట్రాప్ అని కొత్త అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. కంపెనీలు ఖర్చు తగ్గించుకోవడానికి ఏఐని వాడుతూ ఉద్యోగులను తొలగిస్తుంటే అది చివరికి కంపెనీలకే చేటు చేస్తుందని పెన్సిల్వేనియా, బోస్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తేల్చి చెప్పారు.ఆటోమేషన్ రేసు: గెలుపెవరిది?పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన బ్రెట్ హెమెన్వే ఫాల్క్, బోస్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకుడు గెర్రీ సౌకలాస్ సంయుక్తంగా రూపొందించిన ‘ది ఏఐ లేఆఫ్ ట్రాప్’ అనే పరిశోధనా పత్రం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. టెక్ సంస్థలు పోటీలో ముందుండడానికి ఆటోమేషన్ను విచ్చలవిడిగా వాడుతున్నాయని, ఇది చివరికి ‘అపరిమిత ఉత్పాదకత - సున్నా డిమాండ్’ అనే వినాశకర స్థితికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ‘కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకోవడానికి ఏఐని ఆశ్రయిస్తున్నాయి. కానీ ప్రజల చేతుల్లో ఉద్యోగాలు లేకపోతే మార్కెట్లో వస్తువులను కొనే శక్తి తగ్గిపోతుంది. వినియోగదారుల డిమాండ్ పడిపోతే ఆ కంపెనీల ఉత్పత్తులను ఎవరు కొంటారు?’ అని ఈ అధ్యయనం ప్రశ్నిస్తోంది.గణాంకాలు ఏం చెబుతున్నాయి?వాస్తవ ప్రపంచ పరిస్థితులు ఈ హెచ్చరికలను బలపరుస్తున్నాయి. టెక్ రంగంలో కొనసాగుతున్న ఉద్యోగ కోతలు భయాందోళనలను కలిగిస్తున్నాయి. 2025లో టాప్ కంపెనీల్లో మొత్తం 1,00,000 మంది టెక్ ఉద్యోగులను తొలగించారు. ఇందులో సగానికి పైగా కారణం ఏఐ వినియోగమే. 2026 (ఇప్పటివరకు) కేవలం నాలుగు నెలల్లోనే 98 కంపెనీలు సుమారు 92,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి.పరిష్కారం ఏమిటి?యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ (యూబీఐ) లేదా రీస్కిల్లింగ్ ప్రోగ్రామ్ల వంటివి ఈ సమస్యకు తాత్కాలిక పరిష్కారాలు మాత్రమేనని ఈ అధ్యయనం అభిప్రాయపడింది. దీనికి అసలైన పరిష్కారం ‘పిగౌవియన్ ఆటోమేషన్ పన్ను’ అని పరిశోధకులు సూచిస్తున్నారు. అంటే ఆటోమేషన్ వల్ల సమాజానికి కలిగే డిమాండ్ నష్టాన్ని కంపెనీలే భరించేలా చేయడం. కేవలం లాభాల కోసమే కాకుండా ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని కంపెనీలు నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపించాలని నివేదిక తెలుపుతుంది.ఏఐ సాంకేతికత మరింత శక్తివంతంగా మారుతున్న కొద్దీ కంపెనీల మధ్య పోటీ ఆటోమేషన్ రేసుగా మారుతోంది. దీన్ని ఆపడం ఒక్క కంపెనీ వల్ల సాధ్యం కాదు. ప్రభుత్వాలు జోక్యం చేసుకుని సరైన విధానపరమైన పన్ను నిబంధనలు తీసుకురాకపోతే సంస్థలు తాము తవ్వుకున్న గోతిలో తామే పడే ప్రమాదం ఉంది. మేధోశక్తికి, మానవ వనరులకు మధ్య సమతుల్యత దెబ్బతింటే అది కేవలం కార్మిక మార్కెట్ సమస్యే కాదు, అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మనుగడకే ముప్పు.ఇదీ చదవండి: ‘మస్క్ దొంగ ఏడుపు దేనికి?’ -
ఆంత్రోపిక్ బంపర్ ఆఫర్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న స్టార్టప్ ‘ఆంత్రోపిక్’ ఒక అరుదైన ఉద్యోగ ప్రకటనతో టెక్ వర్గాల దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా సాఫ్ట్వేర్ రంగంలో భారీ జీతాలంటే కోడింగ్లో నైపుణ్యం సాధించి ఉండాలి. కానీ, ఈ కొత్త పోస్టుకు అసలు కోడింగ్ నైపుణ్యాలే అవసరం లేదు. అయినప్పటికీ, ఏడాదికి ఏకంగా 4,00,000 డాలర్లు (సుమారు రూ.3.3 కోట్లు) వరకు వేతనాన్ని ఆఫర్ చేస్తోంది.ఏమిటా కొత్త రోల్? బాధ్యతలు ఇవే..బిజినెస్ ఇన్ సైడర్ నివేదిక ప్రకారం.. శాన్ ఫ్రాన్సిస్కో లేదా న్యూయార్క్ కేంద్రంగా పనిచేయాల్సిన ఈ రోల్ ప్రధానంగా కంపెనీ ప్రతిష్టను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఆధారపడి ఉంటుంది. చిన్నపాటి వీవీఐపీ సమావేశాల నుంచి భారీ స్థాయి టెక్ ఈవెంట్లను ప్లాన్ చేయడం, వాటిని అమలు చేయడం వంటివి చేయాలి. విధానకర్తలు, విద్యావేత్తలతో ముఖాముఖి చర్చలు జరపాలి. ఆంత్రోపిక్ ఉత్పత్తులను ప్రత్యక్షంగా ప్రదర్శించి వాటి సాంకేతిక అంశాలను వివరించాలి. ఈ ఉద్యోగంలో 30% నుంచి 40% సమయం ప్రయాణాల్లోనే గడపాల్సి ఉంటుంది. అంటే నెలకు సుమారు 10-12 రోజులు వివిధ ప్రాంతాల్లో పర్యటించాల్సి ఉంటుంది.సిలికాన్ వ్యాలీ దిగ్గజాల స్పందనఈ భారీ జీతంపై ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్ట్ మార్క్ ఆండ్రీసెన్ ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఏఐ వల్ల డిజిటల్ కమ్యూనికేషన్ చాలా చౌకగా, సులభంగా అందుబాటులోకి వస్తోంది. ఏదైనా ఒకటి సమృద్ధిగా లభించినప్పుడు దానికి భిన్నమైనది (అంటే మానవ సంబంధాలు, ప్రత్యక్ష ప్రదర్శనలు) అరుదుగా మారుతుంది’ అని ఆయన విశ్లేషించారు. మెషీన్ జనరేటెడ్ టెక్స్ట్ పెరిగిపోతున్న తరుణంలో మనుషుల మధ్య జరిగే లైవ్ కమ్యూనికేషన్కు ఉన్న డిమాండ్ను ఈ ఉద్యోగం ప్రతిబింబిస్తోంది.అర్హతలు, ఎంపిక విధానంఈ భారీ ప్యాకేజీని దక్కించుకోవాలంటే అభ్యర్థుల నేపథ్యం, నైపుణ్యాల వివరణ చాలా ముఖ్యం. ‘మీరు ఏఐ కంపెనీలో ఎందుకు పనిచేయాలనుకుంటున్నారు?’ అనే అంశంపై 200 నుంచి 400 పదాలలోపు ఒక స్పష్టమైన వ్యాసాన్ని సమర్పించాలి. దీన్ని విశ్లేషించి కంపెనీ యాజమాన్యం అభ్యర్థులను మెయిల్ ద్వారా సంప్రదిస్తుంది.ఇదీ చదవండి: ఆఫర్ లెటర్ ఇచ్చాక రూ.36 లక్షల డిమాండ్.. -
రూ.లక్ష కోట్లున్నాయ్: ఇన్ఫీ కోఫౌండర్ క్రిస్
న్యూఢిల్లీ: రాబోయే రోజుల్లో బిలియన్ డాలర్లుగా (యూనికార్న్) ఎదిగే దేశీ స్టార్టప్లకు అధునాతన తయారీ, డీప్ టెక్నాలజీ దన్నుగా నిలుస్తాయని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ తెలిపారు. ఈ దశను ఆయన యూనికార్న్ 2.0గా అభివర్ణించారు.అధిక వేల్యుయేషన్ల వెంటబడకుండా సొంత టెక్నాలజీలను సమకూర్చుకోవడం, దీర్ఘకాలం నిలదొక్కుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. యాక్సిలార్ వెంచర్స్ చైర్మన్, సీఐఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఇన్నోవేషన్, ఎంట్రప్రెన్యూర్షిప్ అండ్ స్టార్టప్స్ చైర్మన్ కూడా అయిన గోపాలకృష్ణన్ సీఐఐ యూనికార్న్ సదస్సు 2026లో పాల్గొన్న సందర్భంగా ఈ విషయాలు తెలిపారు.‘డీప్టెక్ చాలా కష్టమైన వ్యవహారం. చాలా సమయం పట్టేస్తుంది. పెట్టుబడుల పరిస్థితులు విభిన్నంగా ఉంటాయి. విఫలమయ్యే అవకాశాలు ఎక్కువే. కానీ నిలబడగలగితే ప్రయోజనాలు అత్యధికంగా ఉంటాయి‘ అని క్రిస్ తెలిపారు. ఈ పరివర్తనకు ఊతమిచ్చేలా పరిశోధనలు, అభివృద్ధి, ఆవిష్కరణలకు (ఆర్డీఐ) సంబంధించిన ప్రభుత్వం రూ. 1 లక్ష కోట్ల నిధిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దేశ, విదేశాల నుంచి కూడా వచ్చే పెట్టుబడులతో ఈ వ్యవస్థ 30–40 బిలియన్ డాలర్ల స్థాయికి పెరుగుతుందని, రేపటి డీప్టెక్ యూనికార్న్లకు బాటలు వేస్తుందని వివరించారు. -
గూగుల్, మెటాలకు షాక్.. ఆస్ట్రేలియా కొత్త పన్ను
సోషల్ మీడియా దిగ్గజాలు మెటా (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్), గూగుల్, టిక్టాక్లకు ఆస్ట్రేలియా ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. జర్నలిజం మనుగడ కోసం, వార్తా సంస్థలకు చెల్లింపులు చేయని పక్షంలో భారీగా పన్ను వసూలు చేసేలా రూపొందించిన కొత్త ముసాయిదా చట్టాన్ని విడుదల చేసింది.వార్తలకు విలువివ్వాల్సిందేజర్నలిస్టుల కష్టానికి తగిన ద్రవ్య విలువ ఉండాలని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సృజనాత్మకమైన వార్తా కంటెంట్ను ఉపయోగించుకుని బహుళజాతి సంస్థలు లాభాలు గడించడం తగదు. ఆ కంటెంట్ను ఉత్పత్తి చేసే వారికి తగిన పరిహారం అందాలి. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి నాణ్యమైన జర్నలిజం వెన్నెముక వంటిది’ అని పేర్కొన్నారు.ప్రతిపాదిత చట్టం ముఖ్యాంశాలువార్తా సంస్థలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి నిరాకరించే ప్లాట్ఫారమ్లపై ఈ చట్టం కొరడా ఝుళిపించనుంది.వార్తా ప్రచురణకర్తలతో ఒప్పందాలు చేసుకోని పక్షంలో, సదరు కంపెనీల వార్షిక ఆదాయంపై 2.25 శాతం పన్ను విధిస్తారు.వార్తా సంస్థలకు చెల్లింపులు చేసే ప్లాట్ఫారమ్లకు పన్ను మినహాయింపులు (ఆఫ్సెట్లు) లభిస్తాయి.ఈ పన్ను ద్వారా వచ్చే ఆదాయాన్ని (సుమారు 200 - 250 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు), ఆయా వార్తా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వం పంపిణీ చేయనుంది.పాత చట్టంలో లొసుగులు 2021లో తెచ్చిన 'న్యూస్ మీడియా బేరసారాల కోడ్' నుండి తప్పుకోవడానికి కొన్ని సంస్థలు తమ ప్లాట్ఫారమ్ల నుంచి వార్తలను తొలగించాయి. తాజా చట్టాన్ని అటువంటి లొసుగులను అరికట్టేలా రూపొందించారు.భగ్గుమంటున్న టెక్ దిగ్గజాలుప్రభుత్వ నిర్ణయంపై మెటా, గూగుల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాయి. ‘వార్తా సంస్థలు తమ ప్రయోజనం కోసమే మా ప్లాట్ఫారమ్లపై కంటెంట్ను పోస్ట్ చేస్తాయి. ఇది కేవలం ఒక పరిశ్రమ నుంచి మరో పరిశ్రమకు సంపదను బదిలీ చేసే పన్ను మాత్రమే’ అని మెటా విమర్శించింది. ఇప్పటికే తాము వార్తా సంస్థలతో ఒప్పందాలు కలిగి ఉన్నామని, మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ వంటి ప్లాట్ఫారమ్లను మినహాయించి కేవలం తమనే లక్ష్యంగా చేసుకోవడం సరికాదని గూగుల్ పేర్కొంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో వార్తల ప్రాముఖ్యతను కాపాడటమే లక్ష్యమని ఆస్ట్రేలియన్ ప్రభుత్వం చెబుతుండగా, ఇది డిజిటల్ రంగంపై అనవసరపు భారమని టెక్ సంస్థలు వాదిస్తున్నాయి. ఈ ప్రతిపాదన చట్టరూపం దాల్చితే ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలు కూడా ఇదే బాట పడతాయేమో చూడాలి. -
ప్రతి మూడు ఉద్యోగాల్లో ఒకదానిపై ఏఐ ప్రభావం
కృత్రిమ మేధస్సు(AI)తో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ వ్యవస్థలో పెనుమార్పులు సంభవించబోతున్నాయని తాజా అంతర్జాతీయ అధ్యయనం హెచ్చరించింది. సుమారు ప్రతి మూడు ఉద్యోగాల్లో ఒకదానిలో 50 శాతం కంటే ఎక్కువ పనులు జనరేటివ్ ఏఐ (GenAI) ద్వారా అభివృద్ధి (ఆగ్మెంటేషన్) చెందే అవకాశం ఉందని ఈ పరిశోధన వెల్లడించింది. అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్ర ఉద్యోగ ధోరణులపై చేసిన ఈ అధ్యయనం.. వేగంగా మారుతున్న భారతీయ జాబ్ మార్కెట్కు కూడా వర్తిస్తుంది. రాబోయే కాలంలో పని విధానంలో రాబోయే నిర్మాణాత్మక మార్పులకు సిద్ధంగా ఉండాలని పరిశ్రమలను ఈ నివేదిక హెచ్చరిస్తోంది.భారతీయ వర్సిటీ భాగస్వామ్యంమిన్నెసోటాలోని యూనివర్సిటీ ఆఫ్ సెయింట్ థామస్, నార్త్ స్టార్ పాలసీ యాక్షన్ సంస్థలతో కలిసి భారత్కు చెందిన వోక్సెన్ విశ్వవిద్యాలయం ఏఐ రీసెర్చ్ సెంటర్ (AIRC) ఈ పరిశోధనలో కీలక పాత్ర పోషించింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా రూపొందించిన 'GenAI Job Intelligence Dashboard' విధాన నిర్ణేతలకు, పరిశ్రమలకు దిక్సూచిలా మారనుంది. వోక్సెన్ ఎంబీఏ విద్యార్థులు సాక్షి పాఠక్, హేమాంగ్ జోషి ఈ డ్యాష్బోర్డ్ రూపకల్పనలో డా. అమిత్ కుమార్ బాల్, డా. పూజిత కొండపాకల మార్గదర్శకత్వంలో పాలుపంచుకున్నారు. సంక్లిష్టమైన ఉద్యోగ డేటాను సులభంగా అర్థమయ్యేలా విశ్లేషించే ఈ ప్లాట్ఫామ్, ఏఐ ప్రభావం చూపే ఉద్యోగాలను గుర్తించడంలోనూ, మారుతున్న నైపుణ్య అవసరాలను ట్రాక్ చేయడంలోనూ సహాయపడనుంది.ఈ అధ్యయనం ప్రకారం, ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోతారనే ఆందోళన కంటే, పనుల స్వరూపం మారుతుందనే అంశాన్ని గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు. ‘ఏఐ అంటే ఉద్యోగ నష్టం కాదు, పనుల పునర్నిర్వచనం, కొత్త అవకాశాల సృష్టి’ అని వోక్సెన్ ఏఐ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ డా. హేమచంద్రన్.కె పేర్కొన్నారు. ఏఐ సాంకేతికతకు అనుగుణంగా తమ నైపుణ్యాలను మార్చుకోలేని సంస్థలు భవిష్యత్తులో వెనుకబడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా వర్క్ఫ్లో మార్పులు, డేటా ఆధారిత నిర్ణయాలు, ప్రతిభా వ్యూహాల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.రీ-స్కిల్లింగ్ అనివార్యం!వ్యాపార సంస్థలు ఏఐని విస్తృతంగా అవలంబిస్తున్న తరుణంలో రీ-స్కిల్లింగ్ (మళ్లీ నైపుణ్యం పొందడం), మానవ వనరుల ప్రణాళిక, విద్యా విధానాల సమన్వయం అత్యవసరంగా మారాయి. విద్యాసంస్థలు కేవలం సిద్ధాంతాలకే పరిమితం కాకుండా, వోక్సెన్ విద్యార్థుల మాదిరిగా నిజజీవిత డేటాతో పని చేస్తూ భవిష్యత్ సవాళ్లకు సిద్ధం కావాలని ఈ ప్రాజెక్టు స్పష్టం చేస్తోంది. అదే సమయంలో, ఆవిష్కరణలకు, ఉద్యోగుల సంక్షేమానికి మధ్య సమతుల్యత పాటిస్తూ, బాధ్యతాయుతమైన ఏఐ వినియోగాన్ని ప్రోత్సహించాలని ఈ అధ్యయనం ప్రభుత్వాలను, సంస్థలను కోరుతోంది. -
భారత్లో ఏఐ జాబ్స్ బూమ్: 59.5% పెరిగిన నియామకాలు
భారతదేశంలో ఏఐ ఇంజనీరింగ్ ఉద్యోగ నియామకాలు వైఓవై +59.5% వృద్ధిని సాధించాయి. యూఎస్, యూకే, ఫ్రాన్స్, జర్మనీలతో సహా అధ్యయనం చేసిన మార్కెట్లలోకెల్లా ఇది అత్యధికం.ప్రముఖ మెట్రో నగరాలుగా బెంగళూరు ,హైదరాబాద్ నియామకాల వేగాన్ని కొనసాగిస్తున్నప్పటికీ, ఈ వృద్ధి క్రమంగా వాటిని దాటి విజయవాడ వంటి వర్ధమాన నగరాలకు కూడా విస్తరిస్తోంది.భారతదేశంలో ఎస్ఎంబిల నడుమ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ నైపుణ్యాలలో ఏఐ ఏజెంట్లు, ఏఐ ప్రొడక్టివిటీ, అజూర్ ఏఐ స్టూడియో ఉన్నాయి. ఇవి ఆచరణాత్మక, అమలు-కేంద్రీకృత సామర్థ్యాలకు పెరుగుతున్న డిమాండ్ను ప్రతిబింబిస్తున్నాయి.ఇండియా, ఏప్రిల్ 25, 2026: లింక్డ్ఇన్ యొక్క నూతన ఏఐ లేబర్ మార్కెట్ రిపోర్ట్ 2026 ప్రకారం, భారతదేశంలో ఏఐ ప్రతిభ నియామకాలు ఇయర్ ఆన్ ఇయర్ (వైఓవై) 59.5% పెరిగాయి. ప్రపంచ ఏఐ కేంద్రంగా బెంగళూరు అగ్రస్థానంలో కొనసాగుతున్నప్పటికీ, ఏఐ ప్రతిభ నియామకాల వేగంలో మార్పును ఈ నివేదిక వెల్లడిస్తుంది. హైదరాబాద్ (+51%) మరియు విజయవాడ (+45.5%) వంటి నగరాల్లో ఏఐ ఇంజనీరింగ్ నియామకాలలో బలమైన వృద్ధి కనిపిస్తోంది. ఇది టైర్-2 మరియు టైర్-3 మార్కెట్లలో అవకాశాలు విస్తృతంగా వ్యాపిస్తున్నాయని సూచిస్తోంది.వివిధ పరిశ్రమలు, కంపెనీలలో ఏఐ వినియోగం పెరగడం, ఏఐ నిపుణుల కోసం డిమాండ్ను వేగవంతం చేస్తోంది.అన్ని స్థాయిల సంస్థలలోనూ ఏఐని వేగంగా స్వీకరించడం వల్ల ఏఐ ఇంజనీరింగ్ నియామకాలలో వృద్ధి చోటుచేసుకుంటోంది. మౌలిక సదుపాయాలు, పాలనా విధానాలు మరియు భారీ స్థాయి నిర్వహణ కోసం పెట్టుబడులు పెడుతూ, ఏఐ నిపుణులలో అత్యధిక వాటాను నియమించుకుంటూ భారీ సంస్థలు తమ అగ్రస్థానాన్ని కొనసాగిస్తున్నాయి. అదే సమయంలో, చిన్న మరియు మధ్య తరహా వ్యాపారాలు వేగంగా పుంజుకుంటున్నాయి; ఇవి ప్రాథమిక స్థాయి ప్రయోగాత్మకత మరియు సంస్థాగత స్థాయి స్వీకరణ మధ్య వారధిగా నిలుస్తున్నాయి. ఏఐ వినియోగం విస్తరిస్తున్న కొద్దీ, వివిధ పరిశ్రమల అంతటా ఏఐ నిపుణుల లభ్యత కూడా పెరుగుతోంది. తయారీ రంగంలో, భారతదేశంలో ఏఐ ఇంజనీరింగ్ నిపుణుల సంఖ్య నాలుగు రెట్లు వృద్ధి చెందింది, ఇది 2025 నాటికి 2.0 శాతానికి చేరుకుంటుందని అంచనా.లింక్డ్ఇన్ ఇండియా ఇంజనీరింగ్ హెడ్ మలై లక్ష్మణన్ మాట్లాడుతూ “వాస్తవ ప్రపంచ వినియోగానికి నేరుగా ముడిపడి ఉన్న ఏఐ ఏజెంట్లు మరియు ఉత్పాదకత సాధనాల వంటి అనువర్తిత ఏఐ నైపుణ్యాలలో మేము బలమైన వృద్ధిని చూస్తున్నాము. ఇంజనీర్లకు, ఆచరణాత్మకమైన, ప్రత్యక్ష నైపుణ్యాలను పెంపొందించుకోవడంపై దృష్టి పెట్టడానికి మరియు ఏఐని రోజువారీ పనివిధానాలలో ఏకీకృతం చేయడానికి ఇది ఒక స్పష్టమైన సంకేతం. అన్ని పరిమాణాల పరిశ్రమలు, సంస్థలలో దీని స్వీకరణ వేగవంతం అవుతున్నందున, ప్రయోగాల దశ నుండి ఆచరణ దశకు మారగలిగే వారే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ఉత్తమ స్థితిలో ఉంటారు” అని అన్నారు.అప్ప్లైడ్ ఏఐ నైపుణ్యాల వైపు మళ్లడం అన్ని రంగాలలోనూ నియామకాలను పునర్నిర్మిస్తోందిఏఐ ఏజెంట్లు, ఏఐ ప్రొడక్టివిటీ, అజూర్ ఏఐ స్టూడియో, ఇంటిలిజెంట్ ఏజెంట్స్ ,ఆటోమేటెడ్ ఫీచర్ ఇంజనీరింగ్ వంటి నైపుణ్యాలకు ఎస్ఎంబి రంగంలో డిమాండ్ బలంగా వుంది . ఇది నిపుణులు తమ కెరీర్లను భవిష్యత్తుకు సిద్ధం చేసుకోవడానికి తప్పనిసరిగా పెట్టుబడి పెట్టాల్సిన సామర్థ్యాలను సూచిస్తుంది. తయారీ వంటి పరిశ్రమలలో, ఉపాధి అవకాశాలను బలోపేతం చేయడానికి ఏఐ ఏజెంట్లు మరియు ఏఐ ప్రాంప్టింగ్ కీలక నైపుణ్యాలుగా ఉద్భవిస్తున్నాయి.లింక్డ్ఇన్ ఇండియా ఇంజనీరింగ్ హెడ్, మలై లక్ష్మణన్, పెరుగుతున్న ఏఐ అవకాశాలను ఇంజనీర్లు అందిపుచ్చుకోవడంలో సహాయపడే చిట్కాలను పంచుకున్నారు:డిమాండ్లో ఉన్న ఏఐ సామర్థ్యాలను పెంపొందించుకోండి: మీ పరిశ్రమలోని యజమానులు ఎక్కువగా కోరుకుంటున్న ఏఐ సాధనాలు, డేటా, మరియు అనువర్తిత సమస్య-పరిష్కారం వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలలో నైపుణ్యాలను పెంపొందించుకోవడంపై దృష్టి పెట్టండి.మీ ఏఐ -ఆధారిత ఉద్యోగ అన్వేషణలో లక్ష్యంగా ఉండండి: మీ నైపుణ్యాలు ఉద్యోగ అవసరాలకు దగ్గరగా సరిపోయే విధులకు ప్రాధాన్యత ఇవ్వండి మరియు మీరు ఆ ఉద్యోగానికి సరిపోతారో లేదో ముందుగానే అంచనా వేయడానికి ఏఐ సాధనాలను ఉపయోగించండి. లింక్డ్ఇన్ జాబ్ మ్యాచ్ వంటి ఫీచర్లు, మీ ప్రొఫైల్ ఒక ఉద్యోగానికి ఎంతవరకు సరిపోతుందో చూపిస్తాయి. దీనివల్ల మీరు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్న అవకాశాలపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది.వాస్తవ ప్రపంచ అప్లికేషన్ ను ప్రదర్శించండి: సమస్యలను పరిష్కరించడానికి , ఫలితాలను అందించడానికి మీరు ఏఐ పద్ధతులను ఎలా ఉపయోగించారో చూపించే ప్రాజెక్ట్లు, సాధనాలు మరియు ఉదాహరణలను హైలైట్ చేయండి. Loveable లేదా Replit వంటి మీరు ఉపయోగించే ఏఐ సాధనాల ద్వారా మీ నైపుణ్యాలను ధృవీకరించడం కూడా, యజమానులు మీ సామర్థ్యాలను త్వరగా చూడటానికి సహాయపడుతుంది. -
పరిమాణం కొంచెం.. పనులు ఘనం!
చూడటానికి చిన్నగా ఉంటాయి కాని, పని మొదలుపెడితే పెద్ద పెద్ద టెన్షన్లనే తగ్గిస్తాయి. చూడటానికి చిన్నగా ఉంటూ, ఎక్కువ సౌలభ్యం అందిస్తూ, మీ టైమ్ను సేవ్ చేసే స్మార్ట్ గాడ్జెట్లే ఇవి!చల్లని గాలి, మీతోనే ఎక్కడికైనా!వేసవిలో విపరీతమైన చెమటతో ఇబ్బంది పడుతున్నారా? చేతిలో ఫ్యాన్ పట్టుకుని తిరగడం కష్టంగా ఉందా? అయితే ఈ పోర్టబుల్ మినీ బ్లేడ్లెస్ ఫ్యాన్ ఒక స్మార్ట్ సొల్యూషన్! ఇది చిన్నదైనా, చల్లని గాలిని ఎప్పుడైనా, ఎక్కడైనా అందించేలా పనిచేస్తుంది. ఈ ఫ్యాన్లో మూడు స్పీడ్ సెట్టింగ్స్ ఉంటాయి. అవసరానికి అనుగుణంగా గాలి వేగాన్ని సులభంగా మార్చుకోవచ్చు. బ్లేడ్లు లేకుండా డిజైన్ చేసినందువల్ల జుట్టు చిక్కుకునే భయం ఉండదు. పైగా ఇది మెడకు లేదా నడుముకు క్లిప్ చేసుకునేలా ఉండటంతో చేతులు ఫ్రీగా ఉంటాయి. బయట పనులు చేసుకుంటున్నప్పుడు, ట్రావెల్లో లేదా ఆఫీసులో కూడా సౌకర్యంగా వాడుకోవచ్చు. రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేసే ఈ ఫ్యాన్ ఒకసారి చార్జ్ చేస్తే ఎనిమిది గంటల పాటు చల్లని గాలిని అందిస్తుంది. ధర రూ. 4,160.చిన్న ప్రింటర్! ప్రతి చిన్న ప్రింటౌట్ కోసం జిరాక్స్ షాపుకు వెళ్లకుండా.. మీ చేతిలోనే ఒక చిన్న స్మార్ట్ ప్రింటర్ ఉంటే ఎంత బాగుంటుంది! ఈ మినీ బ్లూటూత్ థర్మల్ ప్రింటర్ ఉంటే జిరాక్స్తో పని ఉండదు. స్టూడెంట్స్కు ఇంట్లో వాడుకోవడానికి, చిన్న చిన్న ప్రింటౌట్లు తీసుకోవడానికి ఇది పర్ఫెక్ట్ చాయిస్. మొబైల్తో బ్లూటూత్ ద్వారా సులభంగా కనెక్ట్ చేసుకుని వాడుకోవచ్చు. నోట్స్, స్టిక్కర్స్ లేదా చిన్న ఫోటోలను కొన్ని సెకండ్లలోనే ప్రింట్ చేసుకోవచ్చు. ఇంక్ అవసరం లేకుండా థర్మల్ టెక్నాలజీతో పనిచేయడం వల్ల ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. పైగా దీనిని జేబులో లేదా బ్యాగ్లో సులభంగా పెట్టుకుని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. చార్జ్ చేసుకుని ఎప్పుడైనా ఉపయోగించు కోవచ్చు. చదువుకునే పిల్లలకు, చిన్న నోట్స్ ప్రింట్ చేసుకునే వారికి లేదా రోజువారీ పనులను సులభం చేసుకోవాలనుకునే వారికి ఇది ఒక స్మార్ట్ హెల్పర్లా ఉంటుంది. ధర రూ. 1,799.చార్జ్ కూడా.. స్టాండ్ కూడా!మొబైల్ను చార్జ్ చేస్తూనే వీడియోలు, సీరియల్స్ చూడాలా? లేదా గేమ్స్ ఆడాలా? అయితే మీ కోసం వచ్చేసింది ఈ టూ ఇన్ వన్ స్మార్ట్ చార్జర్ కేబుల్. ఇది కేవలం కేబుల్ మాత్రమే కాదు, చిన్న స్టాండ్లా కూడా పనిచేసే స్మార్ట్ ఐడియా. ఈ కేబుల్లో బిల్టిన్ ఫోల్డబుల్ స్టాండ్ ఉంటుంది. కేబుల్ పెట్టగానే మొబైల్ సూటిగా నిలబడేలా సౌకర్యంగా ఉంటుంది. పైగా దీనికున్న ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్తో మొబైల్, టాబ్లెట్ లేదా ఇతర పరికరాలను వేగంగా చార్జ్ చేయవచ్చు. బలమైన నైలాన్ మెటీరియల్తో తయారైన ఈ కేబుల్ ముడిపడకుండా ఎక్కువకాలం మన్నికగా ఉంటుంది. ఇంటి వద్ద, ఆఫీస్లో లేదా ట్రావెల్లో ఎక్కడైనా సులభంగా వాడుకోవచ్చు. ధర కేవలం రూ. 791 మాత్రమే! -
ప్రభుత్వ ఉద్యోగాల్లో సగం AIతోనే.. యూఏఈ సంచలనం!
సాంకేతిక రంగంలో ప్రపంచ దేశాలకు మార్గదర్శిగా నిలుస్తున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) మరో ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2028 నాటికి ప్రభుత్వ సేవల్లో కనీసం 50 శాతాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా నిర్వహించాలని నిర్ణయించింది. (UAE AI Government Services) ఈ ఘనత సాధించనున్న ప్రపంచంలోని మొట్టమొదటి దేశంగా యూఏఈ రికార్డు సృష్టించనుంది.ఈ వినూత్న విధానం ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో పనితీరును వేగవంతం చేయడమే కాకుండా, పౌరులకు అందించే సేవల్లో జాప్యాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏఐ వినియోగం వల్ల కేవలం సమయం ఆదా అవ్వడమే కాకుండా, ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుందని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. వివిధ శాఖల సమన్వయం, డేటా విశ్లేషణలో కృత్రిమ మేధ కీలక పాత్ర పోషించనుంది.ఇప్పటికే పలు కీలక సంస్కరణలుయూఏఈ ప్రభుత్వం ఇప్పటికే 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్ట్రాటజీ 2031'లో భాగంగా పలు కీలక సంస్కరణలను చేపట్టింది. అందులో భాగంగానే ఈ సరికొత్త 2028 గడువును ఖరారు చేసింది. రవాణా, ఆరోగ్యం, విద్య, భద్రత వంటి కీలక రంగాలలో ఏఐ అల్గారిథమ్స్ను అనుసంధానించడం ద్వారా డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో అగ్రగామిగా నిలవాలని యూఏఈ లక్ష్యంగా పెట్టుకుంది.ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగంపై చర్చలు జరుగుతున్న తరుణంలో, యూఏఈ తీసుకున్న ఈ నిర్ణయం టెక్నాలజీ ప్రపంచంలో హాట్ టాపిక్గా మారింది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ పాలనను ఆధునీకరించడంలో ఈ ప్రాజెక్టు ఒక మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.Under the directives of the President of the UAE, we launch a new government model. Within two years, 50% of government sectors, services, and operations will run on Agentic AI, making the UAE the first government globally to operate at this scale through autonomous systems.AI… pic.twitter.com/53OQLe7RXl— HH Sheikh Mohammed (@HHShkMohd) April 23, 2026 -
యూజర్లకు షాక్.. వొడాఫోన్ ఐడియా కీలక నిర్ణయం!
భారతీ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్ ప్లాన్ను సుమారు 4-5 శాతం పెంచినట్లు ఇప్పటికే ప్రకటించింది. అయితే తాజాగా వొడాఫోన్ ఐడియా కూడా ఇదే బాటలో అడుగులు వేస్తూ.. యూజర్లకు షాకిచ్చింది. మొబైల్ టారిఫ్లను పెంచుతున్నట్లు ప్రకటించింది.వొడాఫోన్ ఐడియా మొబైల్ టారిఫ్లను పెంచుతున్నట్లు ప్రకటించినప్పటికీ.. అన్ని ప్లాన్లకూ ఒకేసారి ధరలను పెంచే ప్రణాళిక ప్రస్తుతానికి లేదని స్పష్టం చేసింది. అయితే ఎంత పెంచనుంది?, యూజర్లు రీఛార్జ్ చేసుకోవడానికి అదనంగా ఎంత వెచ్చించాల్సి ఉంటుందనే విషయాలను సంస్థ వెల్లడించలేదు.ప్రస్తుతం చిన్నపాటి సవరణలు మాత్రమే ఉంటాయి. భారీ పెంపు ఉండదు. మార్కెట్ పరిస్థితుల కారణంగా ఈ మార్పులు చేస్తున్నట్లు వొడాఫోన్ ఐడియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అభిజిత్ కిషోర్ పేర్కొన్నారు. ఒక ముఖ్యమైన వాటాదారుగా ప్రభుత్వం కంపెనీపై విశ్వాసం ఉంచిందని, కంపెనీ పనితీరును మెరుగుపరచడంపై దృష్టి సారిస్తోందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.ఇదీ చదవండి: దశాబ్దాల చరిత్ర.. రూ.221 కోట్లకు అమ్ముడైన బంగ్లా! -
ఊడిపోతున్న ఉద్యోగం.. ఇదిగో ఇదే వచ్చే పరిహారం
సోషల్ మీడియా దిగ్గజం 'మెటా' (ఫేస్బుక్ మాతృసంస్థ) మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగాల తొలగింపునకు సిద్ధమైంది. మార్క్ జుకర్బర్గ్ నేతృత్వంలోని ఈ సంస్థ, తన మొత్తం శ్రామిక శక్తిలో సుమారు 10 శాతం మందిని అంటే దాదాపు 8,000 మందిని తొలగించబోతున్నట్లు సమాచారం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విభాగంలో పెట్టుబడులను పెంచడం, సంస్థాగత సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.మే 20 నుంచి ప్రక్రియ ప్రారంభం!తాజా నివేదికల ప్రకారం, ఈ లేఆఫ్స్ ప్రక్రియ మే 20 నుంచి ప్రారంభం కానుంది. కేవలం ఉద్యోగుల తొలగింపు మాత్రమే కాకుండా, సంస్థలో ఖాళీగా ఉన్న సుమారు 6,000 ఓపెన్ పొజిషన్ల భర్తీని కూడా మెటా నిలిపివేసింది. జనవరిలో మెటావర్స్ విభాగం (రియాలిటీ ల్యాబ్స్)లో 1,000 మందిని, మార్చిలో సేల్స్, ఆపరేషన్స్ విభాగాల్లో మరికొందరిని ఇప్పటికే తొలగించిన సంగతి తెలిసిందే.అందుకే ఈ మార్పులు!ఓపెన్ ఏఐ (OpenAI), గూగుల్, ఆంత్రోపిక్ వంటి దిగ్గజ సంస్థలతో ఏఐ రంగంలో పోటీ పడటానికి మెటా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే కంపెనీని పునర్వ్యవస్థీకరిస్తోంది. కొన్ని రకాల కాంట్రాక్ట్ పనులను మానవ వనరుల నుండి తొలగించి, వాటి స్థానంలో ఏఐ ఆధారిత టూల్స్ ప్రవేశపెట్టాలని మెటా భావిస్తోంది. తక్కువ మేనేజ్మెంట్ పొరలతో, మరింత వేగంగా పనిచేసేలా సంస్థను తీర్చిదిద్దడమే జుకర్బర్గ్ లక్ష్యంగా కనిపిస్తోంది.తొలగించిన వారికి లభించే ప్రయోజనాలుబాధిత ఉద్యోగులను ఆదుకోవడానికి మెటా భారీ పరిహారాన్ని (Severance Package) ప్రకటించింది. నగదు పరిహారం కింద కనీసం 16 వారాల (4 నెలలు) బేస్ పేను చెల్లిస్తుంది. అలాగే కంపెనీలో పనిచేసిన ప్రతి ఏడాదికి అదనంగా రెండు వారాల వేతనంగా అందిస్తుంది. దీంతోపాటు సుమారు 18 నెలల వరకు కోబ్రా (COBRA) హెల్త్ కవరేజ్ కొనసాగుతుంది. విదేశీ ఉద్యోగులకు ఇమ్మిగ్రేషన్ సాయంతో పాటు, కెరీర్ సర్వీసెస్ (కొత్త ఉద్యోగ వేటలో సాయం) అందించనుంది."ఇది నిజంగా అవాంఛనీయ వార్త అని నాకు తెలుసు. దీనివల్ల ఉద్యోగులు అసౌకర్యానికి గురవుతారని అర్థం చేసుకోగలను. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సంస్థ ప్రయోజనాల దృష్ట్యా ఇది తప్పనిసరి" అని కంపెనీ అంతర్గత మెమోలో పేర్కొంది.2022-2023 కాలంలో మెటా ఇప్పటికే సుమారు 21,000 మందిని తొలగించింది. ఆ ఏడాదిని 'సామర్థ్యపు సంవత్సరం' (Year of Efficiency)గా జుకర్బర్గ్ అభివర్ణించారు. ప్రస్తుతానికి మెటా ఆర్థికంగా బలంగానే ఉన్నప్పటికీ, ఏఐ రంగంలో అగ్రస్థానానికి చేరుకోవడానికి ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: నెలకు రూ.1.90 లక్షల జీతం.. 4 నెలలే సంబరం! -
వాట్సాప్లో కొత్త ఫీచర్స్.. ఇక్కడే మొబైల్ రీఛార్జ్!
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల కోసం.. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ పరిచయం చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకోవడానికి కావలసిన కొత్త సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. దీనికోసం పేయూతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది.ప్రస్తుతం వాట్సాప్ పరిచయం చేసిన ఈ మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ఫీచర్ అనేది ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు దశలవారీగా అందుబాటులోకి వస్తుంది. ఇకపై పేటీఎం లేదా గూగుల్ పే వంటి ఇతర పేమెంట్ యాప్లతో పనిలేకుండానే.. నేరుగా వాట్సాప్ ద్వారానే రీఛార్జ్ చేసుకోవచ్చు.వాట్సాప్ హోమ్ స్క్రీన్పై ప్రత్యేకంగా రూపాయి ఐకాన్ను జోడించింది. రీఛార్జ్ చేయడానికి ఆ ఐకాన్పై ట్యాప్ చేయాలి. మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ఆప్షన్ను ఎంచుకుని, మీరు రీఛార్జ్ చేయాలనుకుంటున్న నెంబర్ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అది పూర్తయ్యాక, UPI, డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ వంటి మీకు నచ్చిన చెల్లింపు పద్ధతిని ఎంచుకుని.. చెల్లింపును పూర్తి చేయాలి. -
జియో హవా.. జాతీయ స్థాయిలో ఆధిపత్యం!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టెలికాం సర్కిల్లో ప్రధాన డిజిటల్ కనెక్టివిటీ ప్రొవైడర్గా రిలయన్స్ జియో తన స్థానాన్ని మరింత బలపరుచుకుంది. 2026 మార్చి నెలలో వైర్లెస్ అండ్ బ్రాడ్బ్యాండ్ విభాగాల్లో గణనీయమైన సబ్స్క్రైబర్ పెరుగుదలను నమోదు చేసింది.టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) విడుదల చేసిన తాజా డేటా ప్రకారం.. అత్యాధునిక బ్రాడ్బ్యాండ్ సేవలు అందించడంలో జియోకు సాటి లేకుండా ముందంజలో ఉంది. అంతే కాకుండా.. సంప్రదాయ మొబైల్ సేవల్లో కూడా వేగంగా ఎదుగుతోంది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జియోలో అత్యంత ఆకర్షణీయమైన ప్రదర్శన హై-స్పీడ్ హోమ్ అండ్ ఎంటర్ప్రైజ్ బ్రాడ్బ్యాండ్ విస్తరణలో కనిపిస్తోంది. ఈ సర్కిల్లో వైర్లైన్ వృద్ధిని దాదాపు పూర్తిగా జియోనే సాధిస్తోంది. 2026 మార్చిలో జియో 31,000 కొత్త వైర్లైన్ కనెక్షన్లు సాధించి, మొత్తం ఫిక్స్డ్ లైన్ వినియోగదారుల సంఖ్యను 2.02 మిలియన్లకు పెంచింది. అదే సమయంలో భారతి ఎయిర్టెల్ కేవలం 7,648 కనెక్షన్లు మాత్రమే సాధించింది.వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ విభాగంలో కూడా జియో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 5G ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ (FWA)లో జియో అగ్రస్థానంలో ఉంది. ఒకే నెలలో 22,003 కొత్త 5G FWA సబ్స్క్రైబర్లను జోడించి మొత్తం సంఖ్యను 7,33,617కు తీసుకెళ్లింది. దీనితో పోలిస్తే ఎయిర్టెల్ 6,103 మందిని మాత్రమే చేర్చి 3,26,398 వద్ద నిలిచింది.తన ప్రత్యేక సాంకేతిక సామర్థ్యాన్ని చూపిస్తూ, అన్లైసెన్స్డ్ బ్యాండ్ రేడియో (UBR) FWA సేవలను అందిస్తున్న ఏకైక ఆపరేటర్గా కూడా జియో నిలుస్తోంది. ఈ విభాగంలో 18,991 కొత్త వినియోగదారులను చేర్చి మొత్తం సంఖ్యను 3,53,145కు పెంచింది. మొత్తం కలిపి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో జియోకు 1.08 మిలియన్లకు పైగా ప్రత్యేక FWA కనెక్షన్లు ఉన్నాయి. ఇది ప్రాంతీయ డిజిటల్ మార్పుకు ప్రధాన శక్తిగా నిలుస్తోంది. సాంప్రదాయ వైర్లెస్ మొబైల్ విభాగంలో కూడా జియో బలమైన ప్రదర్శన కనబరిచింది. 2026 మార్చిలో 1,49,464 కొత్త మొబైల్ వినియోగదారులను జోడించి మొత్తం సంఖ్యను 32.22 మిలియన్లకు పెంచింది.జాతీయ స్థాయిలో ఆధిపత్యంప్రాంతీయ విజయంతో పాటు.. జియో జాతీయ స్థాయిలో కూడా అగ్రగామిగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా వైర్డ్ మరియు వైర్లెస్ కలిపి 523.44 మిలియన్ల బ్రాడ్బ్యాండ్ వినియోగదారులతో జియో అతిపెద్ద సేవా ప్రదాతగా నిలిచింది. ఇది భారత బ్రాడ్బ్యాండ్ మార్కెట్లో దాదాపు 49.11 శాతం వాటాను కలిగి ఉంది.వైర్లెస్ మొబైల్ విభాగంలో కూడా జియో దేశవ్యాప్తంగా 3.22 మిలియన్లకు పైగా కొత్త వినియోగదారులను చేర్చి మొత్తం సంఖ్యను 496.33 మిలియన్లకు పెంచింది. ఇది 39.21 శాతం మార్కెట్ వాటాతో ముందంజలో నిలిచింది. అదేవిధంగా ఫైబర్, ఫిక్స్డ్ లైన్ సేవల విస్తరణలో భాగంగా, మార్చి నెలలో దేశవ్యాప్తంగా అత్యధికంగా 1,88,698 వైర్లైన్ కనెక్షన్లను జియో జోడించింది. -
ఉద్యోగాలపై ఏఐ యుద్ధం!
కృత్రిమ మేధ (ఏఐ) భవిష్యత్తులో ఉద్యోగాలను మింగేస్తుందా? లేక మానవ మేధస్సుతో కలిసి కొత్త పుంతలు తొక్కుతుందా? అనే ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి ఆర్థికవేత్తలు, టెక్ నిపుణుల మధ్య ఒక మేధో యుద్ధానికి దారితీసింది. ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోది అంచనా వేస్తున్న ‘వైట్-కాలర్ జాబ్స్ కనుమరుగు’పై 2024 నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త డారోన్ అసెమోగ్లు తీవ్రంగా స్పందించారు. టెక్ నిపుణులు కార్యాలయాల్లోని పనుల సంక్లిష్టతను తక్కువ అంచనా వేస్తున్నారని ఆయన హెచ్చరించారు.వైట్-కాలర్ ఉద్యోగాల్లో భారీ కోతఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోది ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే 1 నుంచి 5 ఏళ్లలో ఎంట్రీ లెవల్ టెక్నాలజీ, చట్టపరమైన సేవలు, కన్సల్టింగ్, ఫైనాన్స్ రంగాల్లో దాదాపు 50 శాతం ఉద్యోగాలు ఏఐ వల్ల కనుమరుగవుతాయని అంచనా వేశారు. దీన్ని ఆయన ‘వైట్-కాలర్ బ్లడ్బాత్’(ఉద్యోగాల రక్తపాతం)గా అభివర్ణించారు.నోబెల్ గ్రహీత అభ్యంతరంఅమోది వ్యాఖ్యలను నోబెల్ గ్రహీత డారోన్ అసెమోగ్లు తోసిపుచ్చారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ, టెక్ నిపుణులు తమ ఏఐ మోడల్స్ సామర్థ్యాలపై ఉన్న అతి విశ్వాసంతో వాస్తవ పరిస్థితులను విస్మరిస్తున్నారని విమర్శించారు. ‘వైట్-కాలర్ ఉద్యోగాల్లో డేటా ప్రాసెసింగ్తోపాటు సామాజిక స్పృహ, క్లిష్టమైన సమస్య పరిష్కార నైపుణ్యాలు ఉంటాయి. వీటిని ఏఐ అంత సులభంగా భర్తీ చేయలేదు. ఒకవేళ అమోది చెప్పినట్లు అమెరికా వంటి దేశాల్లో 20 శాతం ఉద్యోగాలు కోల్పోతే అక్కడ ప్రజాస్వామ్యం మనుగడ సాగించడం అసాధ్యం’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది భారీ సామాజిక అశాంతికి దారితీస్తుందని హెచ్చరించారు.‘అమోదికి ఏమీ తెలియదు’ఈ వివాదంలోకి మెటా మాజీ చీఫ్ ఏఐ సైంటిస్ట్, ఏఐ గాడ్ ఫాదర్గా పేరున్న యాన్ లెకున్ ప్రవేశించడం చర్చను మరింత వేడెక్కించింది. అమోదిపై ఆయన నేరుగా విమర్శలు గుప్పించారు. ‘లేబర్ మార్కెట్పై సాంకేతిక విప్లవాల ప్రభావం గురించి డారియోకు ఏమీ తెలియదు’ అని ఎక్స్ వేదికగా మండిపడ్డారు.ఇదీ చదవండి: నీతా అంబానీ ‘జమ్దానీ’ మెరుపులు -
75 శాతం కోడింగ్ ఏఐతోనే!
టెక్నాలజీ ప్రపంచంలో ఏజెంటిక్ యుగం మొదలైందని, గూగుల్లో జరుగుతున్న భారీ మార్పులే దీనికి నిదర్శనమని ఆ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు. గూగుల్ క్లౌడ్ నెక్స్ట్ 26 వార్షిక సదస్సు సందర్భంగా ఆయన రాసిన ‘ది కీవర్డ్’ బ్లాగ్ పోస్ట్లో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం గూగుల్లో రాసే కొత్త కోడ్లో 75 శాతం ఏఐ ద్వారానే రూపొందుతోందని స్పష్టం చేశారు.ఏజెంటిక్ యుగంలోకి..గత ఏడాది ఇదే సమయానికి ఏఐ ద్వారా తయారయ్యే కోడ్ 50 శాతం ఉండగా ఇప్పుడు అది 75 శాతానికి చేరుకోవడం గమనార్హం. కేవలం కోడ్ రాయడమే కాకుండా మన ఇంజినీర్లు దాన్ని సమీక్షించి ఆమోదిస్తున్నారని పిచాయ్ పేర్కొన్నారు. ‘మేము ఇప్పుడు రియలిస్టిక్ ఏజెంటిక్ వర్క్ ఫ్లోలకు మారుతున్నాం. మా ఇంజినీర్లు ఇప్పుడు పూర్తి స్వయంప్రతిపత్తి డిజిటల్ టాస్క్ ఫోర్స్లను నిర్వహిస్తున్నారు. ఊహించని పనులను సుసాధ్యం చేస్తున్నారు’ అని చెప్పారు.వేల సంఖ్యలో ఏజెంట్ల నిర్వహణగతంలో ‘మనం ఒక ఏఐ ఏజెంట్ను నిర్మించగలమా?’ అనే చర్చ ఉండేదని, కానీ ఇప్పుడు పరిస్థితి ‘వేల సంఖ్యలో ఉన్న ఏజెంట్లను ఎలా నిర్వహించాలి?’ అనే స్థాయికి చేరుకుందని పిచాయ్ తెలిపారు. దీనికోసం గూగుల్ జెమిని ఎంటర్ప్రైజ్ ఏజెంట్ ప్లాట్ఫామ్ను ప్రారంభించిందని చెప్పారు.ఆరు రెట్లు వేగంగా పనులుగూగుల్ తన సొంత ఎకోసిస్టమ్లో ఏఐని వినియోగించడం వల్ల వచ్చిన మార్పులను ఆయన ఉదాహరణలతో వివరించారు.గతంలో ఇంజినీర్లు మాత్రమే చేసిన పని కంటే ఇప్పుడు ఏజెంట్లు, ఇంజినీర్లు కలిసి చేయడం వల్ల కోడ్ మైగ్రేషన్ ప్రక్రియ 6 రెట్లు వేగంగా పూర్తయింది.మాక్ఓఎస్ (macOS)లోని జెమిని యాప్ను గూగుల్ సొంత ‘ఏజెంట్-ఫస్ట్’ ప్లాట్ఫామ్ ‘యాంటీ గ్రావిటీ’ని ఉపయోగించి తయారు చేసినట్లు చెప్పారు. ఇందులో అటానమస్ ఏఐ ఏజెంట్లు మానవ జోక్యం లేకుండానే బ్రౌజర్లో అప్లికేషన్లను ప్లాన్ చేయడం, కోడ్ రాయడం, పరీక్షించడం వంటి పనులు పూర్తి చేస్తున్నాయి.క్లౌడ్ కంప్యూటింగ్, సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్లో గూగుల్ ప్రవేశపెట్టిన ఈ నూతన ఆవిష్కరణలు టెక్ ప్రపంచంలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతాయని నిపుణులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: టిఫిన్, కర్రీ ప్యాకెట్ ధర 50 శాతం పెంపు! -
హైదరాబాద్లో భారీ టెక్నాలజీ సెంటర్ ప్రారంభం
అటానమస్ ఎంటర్ప్రైజ్ ఆర్కెస్ట్రేషన్ ప్లాట్ఫామ్ రెడ్వుడ్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోని హైటెక్ సిటీలో తన గ్లోబల్ సెంటర్ను బుధవారం ఘనంగా ప్రారంభించింది. సుమారు 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని రెడ్వుడ్ సీఈఓ కెవిన్ గ్రీన్, తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ (ఐకమ్) వ్యవస్థాపక సీఈఓ ఫణి నాగార్జున, రెడ్వుడ్ ఇండియా కంట్రీ హెడ్ రాజ్కుమార్ పాల్రాజ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా రెడ్వుడ్ సీఈఓ కెవిన్ గ్రీన్ మాట్లాడుతూ, అటానమస్ ఎంటర్ప్రైజ్ నిర్మాణంలో హైదరాబాద్ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఏజెంటిక్ AI ఆవిష్కరణలు, గ్లోబల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్లో ఈ కేంద్రం ప్రధాన చోదక శక్తిగా మారుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్లో ఉన్న అద్భుతమైన టాలెంట్, ఎకోసిస్టమ్ తమ కంపెనీ వృద్ధికి ఎంతో దోహదపడుతుందని, అందుకే ఇక్కడ కార్యకలాపాలను విస్తరిస్తున్నామని ఇండియా కంట్రీ హెడ్ రాజ్కుమార్ పాల్రాజ్ పేర్కొన్నారు.ఉద్యోగ కల్పన విషయంలో కూడా రెడ్వుడ్ సాఫ్ట్వేర్ భారీ లక్ష్యాలను ప్రకటించింది. 2027 చివరి నాటికి ఇంజనీరింగ్, క్లౌడ్, బిజినెస్ ఆపరేషన్స్ విభాగాల్లో సుమారు 300 మంది కొత్త ఉద్యోగులను నియమించుకోనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇది కంపెనీ మొత్తం గ్లోబల్ వర్క్ఫోర్స్లో దాదాపు మూడొంతులకు సమానం. -
అక్రమంగా అధిక ఛార్జీ వసూలు!
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్కు అంతర్జాతీయ స్థాయిలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. క్లౌడ్ కంప్యూటింగ్ మార్కెట్లో తన గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తూ పోటీ సంస్థలను దెబ్బతీసేలా వ్యవహరించిందన్న ఆరోపణలపై యూకేలో దాఖలైన ‘క్లాస్ యాక్షన్’ దావాను విచారించేందుకు లండన్ కోర్టు పచ్చజెండా ఊపింది. ఈ కేసులో మైక్రోసాఫ్ట్ ఓడిపోతే సుమారు 1.7 బిలియన్ యూరోలు (సుమారు రూ.18,700 కోట్లు) భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది.ఏమిటీ వివాదం?మైక్రోసాఫ్ట్ తన విండోస్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్, అజూర్ క్లౌడ్ ప్లాట్ఫామ్లను ఉపయోగించే వ్యాపార సంస్థల నుంచి అక్రమంగా అధిక ఛార్జీలు వసూలు చేసిందనేది ప్రధాన ఆరోపణ. తన మార్కెట్ శక్తిని ఉపయోగించుకుని ఇతర క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లకు వెళ్లకుండా వినియోగదారులను నియంత్రించిందని హక్కుదారులు వాదిస్తున్నారు.సుమారు 59,000 బ్రిటీష్ వ్యాపార సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు ఈ దావా పరిధిలోకి వస్తాయి. లండన్లోని కాంపిటీషన్ అప్పీల్ ట్రిబ్యునల్ (సీఏటీ) న్యాయమూర్తులు ఈ దావాలో పిటిషన్దారుల విజయానికి అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.నియంత్రణ సంస్థల నిఘా నీడలో..కేవలం ఈ ప్రైవేట్ దావా మాత్రమే కాకుండా యూకే యాంటీట్రస్ట్ సీఎంఏ ఇప్పటికే మైక్రోసాఫ్ట్ వ్యాపార పద్ధతులపై లోతైన దర్యాప్తు చేస్తోంది. వర్డ్, ఎక్సెల్ వంటి ప్రసిద్ధ అప్లికేషన్లతో పాటు ఏఐ ఆధారిత కోపైలట్ వంటి ఉత్పత్తుల లైసెన్సింగ్ నిబంధనలు పోటీని అణచివేస్తున్నాయా అనే కోణంలో విచారణ జరుగుతోంది. సీఏంఏ దర్యాప్తులో సాక్ష్యాలు మైక్రోసాఫ్ట్ తన లైసెన్సింగ్ విధానాల ద్వారా పోటీని వక్రీకరించిందని నిరూపించడంలో కీలక పాత్ర పోషిస్తాయని న్యాయమూర్తులు పేర్కొన్నారు.మైక్రోసాఫ్ట్ వాదనఈ నిర్ణయంపై మైక్రోసాఫ్ట్ అసహనం వ్యక్తం చేసింది. కంపెనీ ప్రతినిధి బుధవారం మాట్లాడుతూ, తాము ఈ తీర్పుపై అప్పీల్కు వెళ్తామని స్పష్టం చేశారు. ఈ రోజు వెలువడిన నిర్ణయం కంపెనీపై వస్తున్న ఆరోపణలపై తుది తీర్పు కాదని నొక్కి చెప్పారు.ఇదీ చదవండి: టిఫిన్, కర్రీ ప్యాకెట్ ధర 50 శాతం పెంపు! -
99.99 శాతం మందికి భవిష్యత్తే లేదు : జాక్మా సంచలన వ్యాఖ్యలు
అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా యువత నుద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యాలోని అత్యంత ప్రతిభావంతులైన కొందరు యువతను ఉద్దేశించి రష్యాలోని లోమోనోసోవ్ మాస్కో స్టేట్ యూనివర్సిటీలో ఆయన చేసిన ప్రసంగం ఇపుడు నెట్టింట ఆందోళనకరంగా మారింది. అయితే భయపడకండి, ఆశాజనకంగా ఉండండి సమస్యల పరిష్కారంలో భాగస్వాములవ్వండి! అంటూ ఒక సవాలును యువత ముందుంచడమే ఆయన వ్యాఖ్యల్లోని అంతరార్థం. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటి? ఆయన వ్యాఖ్యల అర్థం పరమార్థం ఏంటి?జాక్ మా సందేశంయూనివర్శిటీలోని మేధావులతో జాక్ మాట్లాడుతూ “ప్రపంచంలోని 99.9శాతం మందికి భవిష్యత్తు లేదు” అన్న వ్యాఖ్యలతో అక్కడున్నవారంతా ఉలిక్కి పడ్డారు. అత్యంత తెలివైన, సమర్థులైన యువత భయానికి, నిరాశకు లొంగిపోతే, ప్రపంచాన్ని రక్షించడానికి ఎవరు ముందుకొస్తారన్న జాక్ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ‘‘మాస్కో యూనివర్శిటీకి చెందిన మీరు కూడా సమస్యలను పరిష్కరించలేకపోతే, మీరే భయపడితే.. ఇక ప్రపంచంలోని 99.9% మందికి భవిష్యత్తు ఉండదు.” అని అన్నారు. వెంటనే వారికి ముందుకు వెళ్లే మార్గాన్ని కూడా చూపించారు. తెలివైన, సమర్థులైన యువతే భయపడి చేతులు ముడుచుకు కూర్చుంటే, ఇక ప్రపంచాన్ని రక్షించే వారెవరూ ఉండరు. అందుకే సమస్యలొస్తాయని భయపడటం మానేసి, వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి అని పిలుపు నిచ్చారు.సానుకూలంగా ఉండాలని, భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ శక్తిని వృథా చేసుకోవద్దని యువ మేధావులకు సూచించారు. భయపడుతూ ఆలోచిస్తూ కూర్చోకుండా, పని మొదలుపెట్టాలని చెప్పారు. ఆందోళన చెందితే, మకో అవకాశమేదీ ఉండదు. భయం నుండి కార్యాచరణకు మారడమే గొప్ప విజయం అని పేర్కొన్నారు. Jack Ma explains why action matters more than worrying about the future pic.twitter.com/zKHPzHJRS1— Mindset Machine (@mindsetmachine) April 16, 2026 నిజానికి ప్రపంచంలోని ప్రతి ఆందోళన ఒక అవకాశమే అన్నారు. యంత్రాల వల్ల ఉద్యోగాలు కోల్పోతామని ప్రజలు భయపడితే, మార్పు గురించి ఆందోళన చెందితే ఫలితం లేదు. నిజానికి అది పూరించాల్సిన ఖాళీ. విద్యావంతులైన, సమర్థులైన యువత చేయాల్సిన పని ఈ ఆందోళనల నుండి దాక్కోవడం కాదు, వాటి వద్దకు నేరుగా వెళ్లి, వాటిని అర్థం చేసుకుని, పరిష్కారాలను గుర్తించడం. కొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమం చేసుకోవడం. సానుకూల దృక్పథంతో సమస్యలను పరిష్కరించడం మొదలుపెడితే ప్రపంచ భవిష్యత్తును మార్చవచ్చు అని జాక్మా సూచించడం విశేషం. -
ప్రపంచంలోనే టాప్ కంపెనీకి కొత్త బాస్
ప్రపంచంలోనే నం 1 టెక్ కంపెనీ యాపిల్ తన నాయకత్వంలో మార్పులు ప్రకటించింది. దశాబ్ద కాలానికిపైగా సంస్థను విజయపథంలో నడిపించిన టిమ్ కుక్ ఈ ఏడాది చివర్లో సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ఆయన వారసుడిగా ప్రస్తుతం హార్డ్వేర్ ఇంజినీరింగ్ విభాగం బాధ్యతలు చూస్తున్న జాన్ టెర్నస్ సీఈఓగా పగ్గాలు చేపట్టనున్నారు. అదే సమయంలో యాపిల్ చిప్ డిజైన్లలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన జానీ స్రూజీకి సంస్థ అత్యంత కీలకమైన చీఫ్ హార్డ్వేర్ ఆఫీసర్ బాధ్యతలను అప్పగించింది. ఈ మార్పులు తక్షణమే అమలులోకి వస్తాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా టిమ్ కుక్సుమారు రెండు దశాబ్దాలుగా యాపిల్లో అంతర్భాగంగా ఉన్న జాన్ టెర్నస్ ఐఫోన్, ఐప్యాడ్, మాక్ వంటి ఫ్లాగ్షిప్ ఉత్పత్తుల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. టిమ్ కుక్ వారసుడిగా ఆయన ఎంపిక సంస్థ అంతర్గత వారసత్వ ప్రణాళికలో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో టెర్నస్ సీఈఓగా బాధ్యతలు చేపడతారు. పదవీ విరమణ తర్వాత కుక్ పూర్తిగా తప్పుకోకుండా ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా ఉంటూ దిశానిర్దేశం చేయనున్నారు.హార్డ్వేర్ చీఫ్గా జానీ స్రూజీయాపిల్ చిప్ల సృష్టికర్తగా పేరొందిన జానీ స్రూజీ పాత్ర ఇప్పుడు మరింత విస్తృతమైంది. ఇప్పటివరకు హార్డ్వేర్ టెక్నాలజీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్న ఆయన ఇకపై చీఫ్ హార్డ్వేర్ ఆఫీసర్ హోదాలో పూర్తిస్థాయి హార్డ్వేర్ విభాగాన్ని పర్యవేక్షిస్తారు. ఈ హోదాలో ఆయన బాధ్యతలు వెంటనే అమల్లోకి వస్తాయని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: టిఫిన్, కర్రీ ప్యాకెట్ ధర 50 శాతం పెంపు!స్రూజీ పర్యవేక్షణలో ఉండే విభాగాలుసిలికాన్, ప్రాసెసర్లు: ఏ-సిరీస్ (iPhone), ఎం-సిరీస్ (Mac) చిప్ల అభివృద్ధి.డిస్ప్లేలు, కెమెరా సెన్సార్లు, బ్యాటరీ టెక్నాలజీ, స్టోరేజ్ కంట్రోలర్లు.సెల్యులార్ మోడెమ్ల తయారీ, ఇంటిగ్రేషన్. -
నెలకు రూ.1.90 లక్షల జీతం.. 4 నెలలే సంబరం!
నెలకు రూ. 1.90 లక్షల భారీ జీతం.. కేవలం నాలుగు నెలల ముచ్చటగానే మిగిలిపోయింది! ఒక కంపెనీకి అత్యంత కీలకమైన ఉద్యోగి అనిపించుకుని, ఏకంగా 90 శాతం జీతం పెంపు పొందిన ఒక వ్యక్తి కథ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. సైమన్ ఇంగారి అనే 'ఎక్స్' (ట్విట్టర్) యూజర్ పంచుకున్న ఈ ఉదంతం, రాజీనామా చేసినప్పుడు కంపెనీలు ఇచ్చే కౌంటర్ ఆఫర్లను నమ్మి వెనక్కి తగ్గితే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కళ్లకు కడుతోంది.కథనంలోకి వెళ్తే.. ఒక ఉద్యోగి కొత్త కంపెనీలో మెరుగైన ఆఫర్ రావడంతో తన ప్రస్తుత సంస్థకు రాజీనామా లేఖ సమర్పించాడు. అప్పటి వరకు లక్ష రూపాయల జీతం తీసుకుంటున్న అతనికి, కొత్త చోట రూ. 1.70 లక్షల ఆఫర్ వచ్చింది. అయితే, ఆ ఉద్యోగి రాజీనామాతో షాక్ తిన్న హెచ్ఆర్ విభాగం, అతడిని వదులుకోవడం ఇష్టం లేక ఏకంగా రూ. 1.90 లక్షల జీతం ఇస్తామని 'కౌంటర్ ఆఫర్' ఇచ్చింది. కంపెనీ తనను ఇంతలా గుర్తిస్తోందని మురిసిపోయిన సదరు ఉద్యోగి, తన రాజీనామాను వెనక్కి తీసుకుని పాత సంస్థలోనే ఉండిపోయాడు.అయితే, ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. సరిగ్గా నాలుగు నెలల తర్వాత కంపెనీ ఆ ఉద్యోగికి ఉద్వాసన పలుకుతూ లేఖ పంపింది. వ్యాపార లాభాలు తగ్గడం వల్ల పునర్నిర్మాణ ప్రక్రియ చేపడుతున్నామని, అందుకే తొలగిస్తున్నామని కంపెనీ కుంటిసాకులు చెప్పింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెబుతూనే, మరోవైపు కొత్తగా ఒక అసిస్టెంట్ను నియమించుకోవడం గమనార్హం. కేవలం రెండు వారాల్లోనే బాధ్యతలన్నీ అప్పగించి వెళ్లిపోవాలని సీనియర్ మేనేజ్మెంట్ నుండి ఆదేశాలు వచ్చాయని నిర్మొహమాటంగా చెప్పేసింది.ఈ ఉదంతం కార్పొరేట్ ప్రపంచంలోని ఒక చేదు నిజానికి నిదర్శనం. ఒక ఉద్యోగి రాజీనామా చేసినప్పుడు కంపెనీలు ఇచ్చే పెంపుదలలు కేవలం తక్షణ ప్రత్యామ్నాయం దొరికే వరకు చేసే తాత్కాలిక ఏర్పాట్లు మాత్రమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారీ పెంపుతో ఉద్యోగిని ఆపి, ఆ లోపు అతని బాధ్యతలను ఇతరులకు బదిలీ చేసే ప్లాన్ ఇందులో దాగి ఉండవచ్చు. అందుకే, ఒక్కసారి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాక, కౌంటర్ ఆఫర్లకు లోబడి వెనక్కి తగ్గడం క్షేమం కాదని ఈ కథనం హెచ్చరిస్తోంది. -
పాపులర్ రీచార్జ్ ప్లాన్ రేటు మార్చేసిన ఎయిర్టెల్
ప్రముఖ టెలికం ఆపరేటర్ ఎయిర్టెల్ తన వినియోగదారులకు షాకిచ్చింది. అత్యధిక ఆదరణ పొందిన ఒక ప్రీపెయిడ్ ప్లాన్ ధరను సైలెంట్గా పెంచింది. 84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5 GB డేటాను అందించే ప్లాన్ ధరను రూ. 859 నుండి రూ. 899కి సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా పెంపుతో ఈ దీర్ఘకాలిక ప్లాన్ ఇప్పుడు మరింత భారంగా మారింది.ఈ రూ. 899 ప్లాన్ ద్వారా వినియోగదారులకు 84 రోజుల పాటు అపరిమిత లోకల్, ఎస్టీడీ,రోమింగ్ కాల్స్తో పాటు, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. డేటా విషయానికొస్తే, ప్రతిరోజూ 1.5 GB హై-స్పీడ్ డేటా అందుతుంది. అదనపు ప్రయోజనాల కింద అడోబ్ ఎక్స్ప్రెస్ ప్రీమియం (12 నెలలు), స్పామ్ అలర్ట్లు, ఉచిత హలోట్యూన్స్ వంటి రివార్డ్స్ లభిస్తాయి. అయితే, గతంలో ఉన్న క్యాష్బ్యాక్ ప్రయోజనాలతో కూడిన 'రివార్డ్స్ మినీ' సబ్స్క్రిప్షన్ను కంపెనీ తొలగించినట్లు తెలుస్తోంది.ఈ ధర పెంపు పరిమితంగా ఉన్నప్పటికీ, దీని వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. తన సగటు ఆదాయాన్ని (ARPU) పెంచుకోవడంతో పాటు, వినియోగదారులను క్రమంగా 5G సేవల వైపు మళ్లించేందుకు ఎయిర్టెల్ ఈ దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఈ మార్పు కేవలం ఒక ప్లాన్కే పరిమితం కావడంతో, సాధారణ వినియోగదారులపై తక్షణ ప్రభావం తక్కువగానే ఉండవచ్చు.సాధారణంగా టెలికాం రంగంలో భారీ టారిఫ్ పెంపునకు ముందు ఇలాంటి చిన్న చిన్న సర్దుబాట్లు చేయడం అరుదు. కాబట్టి, ప్రస్తుతానికి అన్ని ప్లాన్ల ధరలు పెరిగే అవకాశం లేదని సమాచారం. కాగా, ఎయిర్టెల్ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే తన గ్లోబల్ ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్ ధరను కూడా రూ. 4,000 నుండి రూ. 4,999కి పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా 84 రోజుల ప్లాన్ ధర పెరగడంపై కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. -
కొత్త ఫోన్: ఒప్పో ఎఫ్33 సిరీస్ వచ్చేసింది..
న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ఒప్పో తన ఎఫ్33 5జీ సిరీస్ స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ‘ఒప్పో ఎఫ్33 5జీ’, ‘ఒప్పో ఎఫ్33 5జీ ప్రో’ అనే రెండు మోడళ్లు ఉన్నాయి. వీటిలో 6.57 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ (ఎఫ్హెచ్డీ+) రిజల్యూషన్తో పాటు 120 హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్ గల అమోలెడ్ డిస్ప్లేను ఉంది.రెండు ఫోన్లు కూడా 50ఎంపీ + 2ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా, 50ఎంపీ సెల్ఫీ కెమెరా కలిగి ఉన్నాయి. 4కే వీడియో రికార్డింగ్ లేటెస్ట్ అండ్ పవర్ ఫుల్ ఏఐ కెమెరా ఫీచర్స్ ఉన్నాయి. 7000 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉంది. 80డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ చేస్తోంది. ఐపీ66, ఐపీ68, ఐపీ69కే ప్రీమియం డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్లున్నాయి. ఈ రెండు ఫోన్లు ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఏప్రిల్ 26 నుంచి సేల్కు అందుబాటులో ఉంటాయి. ఒప్పో ఎఫ్33 5జీ ధర: 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ కలిగిన వేరియంట్ ధర రూ. 31,999గా ఉంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 34,999, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 37,999గా ఉన్నాయి. ఒప్పో ఎఫ్33 ప్రో 5జీ ధర: 8జీబీ + 128జీబీ వేరియంట్ ధర రూ.37,999, 8జీబీ + 256జీబీ వేరియంట్ ధర రూ.40,999గా ఉన్నాయి. -
మెటాలో భారీ లేఆఫ్లు.. 16,000 మందిపై వేటు?
సోషల్ మీడియా దిగ్గజం మెటా ప్లాట్ఫార్మ్స్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమవుతోంది. రాబోయే నెలల్లో సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించాలని కంపెనీ యోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా మొదటి దశ మే 20న ప్రారంభం కానుందని, తొలి విడతలోనే దాదాపు 8,000 మంది ఉగ్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని రాయిటర్స్ నివేదిక పేర్కొంది. ఇది మెటా ప్రపంచ శ్రామిక శక్తిలో సుమారు 10 శాతం వంతు కావడం గమనార్హం.మార్క్ జుకర్బర్గ్ నాయకత్వంలోని మెటా, ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)పై ప్రత్యేక దృష్టి సారించింది. భవిష్యత్తులో కార్యకలాపాలను మరింత ఆటోమేషన్ చేసే దిశగా కంపెనీ తన శ్రామిక శక్తిని పునర్నిర్మిస్తోంది. కేవలం ఏఐ మౌలిక సదుపాయాలు, డేటా సెంటర్లు, సాఫ్ట్వేర్ అభివృద్ధి కోసమే ఏడాదికి సుమారు 135 బిలియన్ డాలర్ల భారీ వ్యయాన్ని కంపెనీ ప్రణాళిక చేస్తోంది. ఈ వ్యూహాత్మక మార్పుల వల్లే ప్రస్తుత ఉద్యోగ కోతలు అనివార్యమవుతున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే 2022, 2023 మధ్య కాలంలో మెటా దాదాపు 21,000 మంది ఉద్యోగులను తొలగించింది. కోవిడ్ మహమ్మారి సమయంలో అధిక విస్తరణ, తదనంతర ఆర్థిక మందగమనం వల్ల ఆ నిర్ణయాలు తీసుకున్నట్లు అప్పట్లో కంపెనీ వెల్లడించింది. తాజాగా ఇప్పుడు ఏఐ పురోగతి, ఉద్యోగుల ఉత్పాదకతను ప్రాతిపదికగా తీసుకుని తుది జాబితాను ఎగ్జిక్యూటివ్లు సిద్ధం చేస్తున్నారు.నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు, స్టాక్ మార్కెట్లో కంపెనీ పనితీరును మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ లేఆఫ్లు సాగనున్నాయి. 2026 చివరి నాటికి మరిన్ని ఉద్యోగ కోతలు ఉండే అవకాశం ఉందని, దీనివల్ల ప్రభావితమయ్యే మొత్తం ఉద్యోగుల సంఖ్య 16,000కు చేరుకోవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పరిణామం ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో మరోసారి తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ సీఈవోకి భారీ వేతనం.. రూ.కోట్లలో హైక్ -
కాగ్నిజెంట్ సీఈవోకి భారీ వేతనం.. రూ.కోట్లలో హైక్
కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ ఎస్ 2025 సంవత్సరానికి గాను మొత్తం 10.6 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 88.5 కోట్లు) వేతనాన్ని అందుకున్నారు. ఇది మునుపటి ఏడాదితో పోలిస్తే దాదాపు 29 శాతం పెరుగుదల కావడం గమనార్హం. ఈ వేతనంలో 1.3 మిలియన్ డాలర్లు బేసిక్ పే, 4.3 మిలియన్ డాలర్లు నగదు ప్రోత్సాహకం, 4.9 మిలియన్ డాలర్ల ఆర్ఎస్యూ (ఈక్విటీ పరిహారం) చెల్లింపులు ఉన్నాయి.అయితే, ఆయన టార్గెట్ టోటల్ డైరెక్ట్ కాంపెన్సేషన్ 19 మిలియన్ డాలర్ల కంటే ఇది తక్కువగా ఉంది. ఎందుకంటే పనితీరు ఆధారిత పీఎస్యూ (PSU) గ్రాంట్లు భవిష్యత్తులో లభించనున్నాయి. కాగా, ఇదే ఏడాది భారత ఐటీ రంగంలో అత్యధిక వేతనం పొందిన సీఈఓగా హెచ్సీఎల్ టెక్ సీఈఓసి.విజయకుమార్ (10.8 మిలియన్ డాలర్లు) నిలవగా, ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ రూ. 80.6 కోట్లు, విప్రో సీఈఓ శ్రీనివాస్ పల్లియా రూ. 53.6 కోట్లు ఆర్జించారు.కంపెనీ ఆర్థిక పనితీరు విషయానికొస్తే, కాగ్నిజెంట్ 2025లో అంచనాలను మించి రాణించింది. కృత్రిమ మేధ (AI), నైపుణ్యం కలిగిన మానవ వనరులు, భారీ ఒప్పందాలపై పెట్టుబడులు పెట్టడం ద్వారా కంపెనీ ఆదాయం 7 శాతం పెరిగి 21.1 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఆపరేటింగ్ మార్జిన్ కూడా కంపెనీ అంచనా వేసిన 15.3-15.7 శాతం కంటే మెరుగ్గా 15.8 శాతంగా నమోదైంది. గతంలో ఎదుగుదల విషయంలో వెనుకబడిన తమ సంస్థ, ఇప్పుడు ప్రత్యర్థి కంపెనీల మధ్య అగ్రస్థానానికి చేరుకుందని రవికుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కంపెనీ సీఎఫ్ఓ జతిన్ దలాల్ కూడా తన లక్ష్యం కంటే అధికంగా 6.6 మిలియన్ డాలర్ల పరిహారాన్ని అందుకున్నారు.ఇక కంపెనీలోని వేతన వ్యత్యాసాల విషయానికి వస్తే, సీఈఓ వేతనానికి, సాధారణ ఉద్యోగి వేతనానికి మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కాగ్నిజెంట్ ఉద్యోగి సగటు వేతనం 45,138 డాలర్లుగా ఉండగా, సీఈఓ వేతన నిష్పత్తి 477:1గా నమోదైంది. అమెరికాలో సగటు ఉద్యోగి వేతనం 1,40,739 డాలర్లుగా ఉండటంతో అక్కడ నిష్పత్తి 153:1గా ఉంది. అయితే, జీవన వ్యయ సర్దుబాటు చేయకుండా లెక్కిస్తే, భారతీయ ఉద్యోగి సగటు వేతనం కేవలం 14,136 డాలర్లు (సుమారు రూ. 11.8 లక్షలు) మాత్రమే. ఈ క్రమంలో సీఈఓ, భారతీయ ఉద్యోగి వేతన నిష్పత్తి అత్యధికంగా 1,523:1గా ఉండటం గమనార్హం.ప్రస్తుతం కాగ్నిజెంట్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 3,51,600 మంది ఉద్యోగులను కలిగి ఉంది. ఇందులో మెజారిటీ వాటా భారత్దే కావడం విశేషం. మన దేశంలో 2,56,900 మంది ఉద్యోగులు ఉండగా, ఉత్తర అమెరికాలో 41,600 మంది, యూరప్లో 14,600 మంది, బ్రిటన్లో 7,800 మంది పనిచేస్తున్నారు. కంపెనీ తన మార్జిన్లను మెరుగుపరుచుకుంటూ ఆదాయ వృద్ధి అంచనాలను 4 శాతం నుండి 6.5 శాతానికి పెంచడం, భవిష్యత్తులో ఐటీ మార్కెట్లో సంస్థ మరింత పట్టు సాధిస్తుందనే సంకేతాలను ఇస్తోంది.ఇదీ చదవండి: డ్యాన్స్ చేస్తున్న సీఈవో.. షాకిచ్చిన టెకీ! -
స్మార్ట్ఫోన్ల్లో ‘ఆధార్’ ప్రీ-ఇన్స్టాలేషన్పై అప్డేట్
స్మార్ట్ఫోన్ వినియోగదారుల ప్రయోజనాలు, టెక్ కంపెనీల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో విక్రయించే యాపిల్, శామ్సంగ్ వంటి ప్రముఖ కంపెనీల ఫోన్లలో ఆధార్ యాప్ను ముందస్తుగా ఇన్స్టాల్ (ప్రీ-ఇన్స్టాలేషన్) చేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం ప్రస్తుతానికి పక్కన పెట్టింది. గత కొద్ది కాలంగా ఈ అంశంపై పరిశ్రమ వర్గాల్లో జరుగుతున్న చర్చకు ఈ నిర్ణయంతో తెరపడినట్లయింది.పరిశ్రమ వర్గాల వ్యతిరేకతే కారణమా?రాయిటర్స్ నివేదిక ప్రకారం, స్మార్ట్ఫోన్ల్లో ఆధార్ యాప్ను తప్పనిసరిగా చేర్చాలన్న ప్రతిపాదనపై యాపిల్, శామ్సంగ్ వంటి గ్లోబల్ టెక్ కంపెనీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ(మైటీ) పరిశ్రమకు చెందిన వివిధ వాటాదారులతో సుదీర్ఘంగా సంప్రదింపులు జరిపింది. ఈ చర్చల అనంతరం స్మార్ట్ఫోన్లలో ఆధార్ యాప్ను ముందస్తుగా ఇన్స్టాల్ చేయడాన్ని తప్పనిసరి చేయడం సరైన నిర్ణయం కాదని కేంద్రం భావించినట్లు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ధ్రువీకరించింది.ఏమిటీ ‘ప్రీ-ఇన్స్టాలేషన్’ వివాదం?సాధారణంగా ఫోన్ కొన్నప్పుడు అందులో ఉండే క్యాలెండర్, కాలిక్యులేటర్ లేదా గడియారం వంటి యాప్ల మాదిరిగానే ఆధార్ యాప్ను కూడా ఫోన్ తయారీ దశలోనే ఇన్స్టాల్ చేయాలని ప్రభుత్వం తొలుత భావించింది. 134 కోట్ల మంది భారతీయులకు సంబంధించిన 12 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య (ఆధార్) ఆధారిత సేవలను సులభతరం చేయడం దీని లక్ష్యం. ఈ ప్రక్రియ ద్వారా బ్యాంకింగ్, టెలికాం, ఇతర ప్రభుత్వ సేవలకు డిజిటల్ వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని భావించారు. అయితే, వినియోగదారుల గోప్యత, ఫోన్ సాఫ్ట్వేర్ పనితీరుపై ఇది ప్రభావం చూపుతుందని కంపెనీలు ఆందోళన వ్యక్తం చేశాయి.సంచార్ సాథీ అనుభవంతో వెనక్కి..గతంలో సంచార్ సాథీ (మోసాలను నివేదించే యాప్)ను 90 రోజుల్లోగా అన్ని మొబైళ్లలో ఇన్స్టాల్ చేయాలని ప్రభుత్వం ఆదేశించినప్పుడు కూడా మొబైల్ కంపెనీల నుంచి ఇలాంటి ప్రతిఘటనే ఎదురైంది. భద్రతా పరమైన అంశాలు, వినియోగదారుల ఎంపికకు ప్రాధాన్యత ఇవ్వాలన్న వాదన బలంగా వినిపించడంతో ప్రభుత్వం ఇప్పుడు ఆధార్ విషయంలో వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయాలన్న లక్ష్యం మంచిదే అయినప్పటికీ స్మార్ట్ఫోన్ తయారీదారుల గ్లోబల్ పాలసీలు, వినియోగదారుల డేటా సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకుని కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఆహ్వానించదగినది.ఇదీ చదవండి: గోల్డ్ ధర.. గుండె దడ! -
AI పోటీలో చైనా.. హువాంగ్ హెచ్చరిక!
చైనాకు ఏఐ చిప్లను అమ్మడం అంటే.. ఉత్తర కొరియాకు అణ్వాయుధాలను అమ్మడం లాంటిదని ఆంత్రోపిక్ అధిపతి డారియో అమోడె వ్యాఖ్యానించారు. దీనిని ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ తీవ్రంగా వ్యతిరేకించారు. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ప్రస్తుతం ప్రపంచంలో కృత్రిమ మేధస్సు (AI) రంగంలో భారీ పోటీ కొనసాగుతోంది. ఈ పోటీలో అమెరికా, చైనా ప్రధాన పాత్రలు పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ యూఎస్ కంపెనీ ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్, చైనాకు AI చిప్లను విక్రయించడంపై తన అభిప్రాయాలను వెల్లడించారు.The Jensen Huang episode.0:00:00 – Is Nvidia’s biggest moat its grip on scarce supply chains?0:16:25 – Will TPUs break Nvidia’s hold on AI compute?0:41:06 – Why doesn’t Nvidia become a hyperscaler?0:57:36 – Should we be selling AI chips to China?1:35:06 – Why doesn’t Nvidia… pic.twitter.com/ezDkUmoFWM— Dwarkesh Patel (@dwarkesh_sp) April 15, 2026హువాంగ్ చెప్పిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. చైనాకు ఇప్పటికే పెద్ద ఎత్తున కంప్యూటింగ్ సామర్థ్యం, సాంకేతిక పరిజ్ఞానం ఉందని. అంటే, చైనా ఇప్పటికే AI రంగంలో ముందంజలో ఉంది. కాబట్టి, చిప్లను అమ్మకుండా నిరోధించడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని ఆయన భావిస్తున్నారు.ఇదీ చదవండి: TCS నాసిక్ కేసు: వెలుగులోకి సంచలన విషయాలు!చర్చలో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, చైనా చిప్లను ఉపయోగించి అత్యాధునిక AI మోడళ్లను అభివృద్ధి చేస్తే ఏమవుతుందన్న ప్రశ్నకు, ఇప్పటికే చైనాలో అలాంటి సామర్థ్యం ఉందని ఆయన స్పష్టం చేశాడు. అంటే, ఈ టెక్నాలజీని పూర్తిగా ఆపడం అసాధ్యమని ఆయన అభిప్రాయం. -
డ్యాన్స్ చేస్తున్న సీఈవో.. షాకిచ్చిన టెకీ!
కార్పొరేట్ వేడుకలు అంటేనే అట్టహాసాలు, మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాల వెలుగులు, సంగీతం, డ్యాన్స్లతో సందడిగా ఉంటాయి. కానీ, ఎంత పెద్ద వేడుక జరిగినా సగటు ఐటీ ఉద్యోగి ఆలోచన మాత్రం ఎప్పుడూ 'అప్రైజల్స్' (జీతాల పెంపు) చుట్టూనే తిరుగుతుంటుందని మరోసారి నిరూపితమైంది. తాజాగా ఐటీ దిగ్గజం హెచ్సీఎల్టెక్ (HCLTech) 50వ వార్షికోత్సవ వేడుకల్లో జరిగిన ఒక ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.అసలేం జరిగింది?హెచ్సీఎల్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో కంపెనీ సీఈవో సి. విజయకుమార్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వేదికపైకి వచ్చి ఉద్యోగులను పలకరించడమే కాకుండా, వారితో కలిసి హుషారుగా స్టెప్పులేశారు. సీఈవో డ్యాన్స్ చూసి ఉద్యోగులందరూ ఈలలు, కేకలతో హోరెత్తించారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోను ప్రజ్వల్ భాటియా అనే ఉద్యోగి తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు.సీన్ కట్ చేస్తే.. సీఈవో విజయకుమార్ పాటలకు అనుగుణంగా చిందులేస్తూ, ప్రేక్షకులతో సరదాగా మాట్లాడుతున్న సమయంలో ఊహించని మలుపు ఎదురైంది. వందలది ఉన్న ఆ గుంపులో నుంచి ఒక ఉద్యోగి గట్టిగా.. "సార్, అప్రైజల్ కబ్ హోగా? (సార్, మా అప్రైజల్స్ ఎప్పుడిస్తారు?) అంటూ అరిచాడు. సరిగ్గా మ్యూజిక్ ఆగిన సమయంలో వచ్చిన ఈ ప్రశ్నతో అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ఆపై వెంటనే అందరూ నవ్వుల్లో మునిగిపోయారు. వేడుకలప్పుడు కూడా సీఈవోకు అప్రైజల్ సెగ తగలడం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది.ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "కంపెనీ ఎంత పెద్ద వేడుకలు చేసినా, ఉద్యోగికి కావాల్సింది జీతం పెంపు మాత్రమే. ఆ యువకుడు అందరి మనసులో మాట అడిగాడు" అని కొందరు కామెంట్ చేశారు. సాధారణంగా సీఈవోలతో మాట్లాడాలంటేనే ఉద్యోగులు భయపడతారని, కానీ ఇలాంటి వేదికపై నిర్మొహమాటంగా ప్రశ్న అడగడం ఆ ఉద్యోగి ధైర్యానికి నిదర్శనమని మరికొందరు మెచ్చుకున్నారు. ఇలాంటి భారీ వేడుకల కోసం రూ.కోట్లు ఖర్చు చేసే కంపెనీలు, ఉద్యోగుల జీతాల పెంపు విషయంలో కూడా అంతే ఉదారంగా ఉండాలని ఇంకొంత మంది విమర్శలు చేశారు.ఇదీ చదవండి: ‘టెక్ మహీంద్రా’పైనా తీవ్ర ఆరోపణలు.. View this post on Instagram A post shared by Prajjwal Bhatia (@prajjwal_bhatia) -
అంతర్జాలంలో సగానికి పైగా ఏఐ రాతలే!
సాంకేతిక ప్రపంచంలో ఏఐ విప్లవం రోజురోజుకూ పెరుగుతోంది. నిత్యం ఇంటర్నెట్లో చదివే సమాచారంలో సగానికి పైగా కంటెంట్ మనుషులు రాసింది కాదు. ప్రతిష్టాత్మక స్టాన్ఫోర్డ్ ఏఐ ఇండెక్స్ రిపోర్ట్ 2026 వెల్లడించిన గణాంకాలు ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయి.50 ప్లస్ వరకు..కేవలం మూడేళ్ల కాలంలో అంతర్జాల ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. నివేదిక ప్రకారం, 2025 ప్రారంభం నుంచి ఇంటర్నెట్లో కొత్తగా పుట్టుకొస్తున్న కంటెంట్లో 51.72 శాతం వాటా ఏఐ సొంతం చేసుకోగా మానవ మేధస్సుతో సృష్టించిన కంటెంట్ 48.28 శాతానికి పరిమితమైంది.నవంబర్ 2022: చాట్జీపీటీ రాకతో ఏఐ కంటెంట్ ప్రస్థానం దాదాపు సున్నా వద్ద మొదలైంది.2023-24: అధునాతన టూల్స్ అందుబాటులోకి రావడంతో గ్రాఫ్ వేగంగా పెరిగింది.2025-26: మొదటిసారిగా మానవ కంటెంట్ను ఏఐ అధిగమించింది.ఎందుకీ పరుగు?కంపెనీలు, క్రియేటర్లు, చిన్న వ్యాపార సంస్థలు ఏఐ వైపు మొగ్గు చూపడానికి ప్రధానంగా కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. ఒక రచయిత గంటల తరబడి శ్రమించి రాసే వ్యాసాన్ని ఏఐ సెకన్ల వ్యవధిలో సిద్ధం చేస్తోంది. వెబ్సైట్లకు అవసరమైన భారీ సమాచారాన్ని క్షణాల్లో అందిస్తుంది. పెద్ద సంఖ్యలో కంటెంట్ రైటర్లను నియమించుకోవడం కంటే ఏఐ టూల్స్ వాడటం సంస్థలకు ఆర్థికంగా లాభదాయకంగా మారింది. ముఖ్యంగా ప్రొడక్ట్ డిస్క్రిప్షన్లు, ఎస్ఈఓ పేజీలు, సాధారణ ఈమెయిల్స్ వంటి వాటికి ఇప్పుడు ఏఐకే ప్రాధాన్యత ఇస్తున్నారు.విస్తరిస్తున్న ఏఐ సామ్రాజ్యంకేవలం బ్లాగులకే పరిమితం కాకుండా ఏఐ ఇప్పుడు అన్ని రంగాల్లోనూ విస్తరించింది. మార్కెటింగ్ కాపీలు, సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్ల నుంచి ఫేస్బుక్ యాడ్స్ వరకు, కస్టమర్ సపోర్ట్ విభాగంలో రోబోటిక్ మెసేజ్లతోపాటు సహజంగా అనిపించే ఏఐ సమాధానాలు.. ఇలా చాలా వాటికి ఏఐ టూల్స్ వాడుతున్నారు.మానవ మేధస్సు పాత్ర ముగిసినట్లేనా?ఏఐ ఆధిపత్యం పెరిగినప్పటికీ మానవ పర్యవేక్షణ ఇంకా కీలకంగానే ఉంది. ప్రస్తుతం ఇంటర్నెట్లో వస్తున్న కంటెంట్లో ఎక్కువ భాగం ఒక మిశ్రమ ప్రక్రియ (హైబ్రిడ్ ప్రాసెస్). ఏఐ ఒక డ్రాఫ్ట్ సిద్ధం చేస్తే మనుషులు దాన్ని ఎడిట్ చేయడం, వాస్తవాలను తనిఖీ చేయడం, భాషాలోపాలు సరిదిద్దడం వంటి పనులు చేస్తున్నారు. కంటెంట్లో సృజనాత్మకత, భావోద్వేగాల కోసం మనిషి అవసరం ఇంకా ఉందని సాంకేతిక నిపుణుల విశ్లేషిస్తున్నారు.ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధరల వేడి! -
మాక్ యూజర్ల కోసం పెర్ప్లెక్సిటీ ‘పర్సనల్ కంప్యూటర్’
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో అగ్రగామిగా దూసుకుపోతున్న ‘పెర్ప్లెక్సిటీ’ టెక్ ప్రపంచంలో మరో సంచలనానికి తెరలేపింది. మాక్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ‘పర్సనల్ కంప్యూటర్’ అనే సరికొత్త సాఫ్ట్వేర్ను కంపెనీ అధికారికంగా ప్రారంభించింది. ఇది కంప్యూటర్లోని ఫైళ్లు, అప్లికేషన్లతో నేరుగా ఇంటరాక్ట్ అయ్యే ఒక ఏఐ ఏజెంట్ అని కంపెనీ తెలిపింది.మల్టీ-మోడల్ ఆర్కెస్ట్రేషన్ఫిబ్రవరిలో కంపెనీ పరిచయం చేసిన ‘పెర్ప్లెక్సిటీ కంప్యూటర్’ అధునాతన ఆర్కెస్ట్రేషన్ ఫీచర్లను ఇప్పుడు నేరుగా యూజర్ల పర్సనల్ కంప్యూటర్లలో తీసుకువచ్చారు. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఇది కంప్యూటర్లోని లోకల్ ఫైల్స్, ఇన్స్టాల్ చేసిన యాప్లు, వెబ్ కంటెంట్ను ఒకే చోట అనుసంధానిస్తుంది. సంక్లిష్టమైన పనులను పూర్తి చేయడానికి ఈ సాఫ్ట్వేర్ ఏకకాలంలో మల్టీ ఏఐ ఏజెంట్లను రంగంలోకి దించుతుంది.మాక్ మినీతో నిరంతర సేవలుఈ సాఫ్ట్వేర్ అత్యంత ఆకర్షణీయమైన అంశం దాని ‘రిమోట్ యాక్సెస్’ సామర్థ్యం. ఒకవేళ మీరు మాక్ మినీలో ఈ సాఫ్ట్వేర్ను రన్ చేస్తుంటే అది 24/7 అందుబాటులో ఉంటుంది. మీరు ఇంటి బయట ఉన్నప్పుడు కూడా మీ స్మార్ట్ఫోన్ ద్వారా వాయిస్ కమాండ్స్ ఇచ్చి మీ కంప్యూటర్లోని పనులను పూర్తి చేయవచ్చు లేదా పర్యవేక్షించవచ్చు.పర్సనల్ కంప్యూటర్ చేసే పనులు ఇవే..ఈ ఏఐ అసిస్టెంట్ కేవలం సమాధానాలు చెప్పడమే కాకుండా క్రియేటివ్ పనులను కూడా చక్కబెడుతుంది.మీ 'టూ-డూ లిస్ట్' సమీక్షించి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తుంది. యాపిల్ నోట్స్ లేదా మెసేజెస్ వంటి యాప్లను తెరిచి మీకు కావాల్సిన సమాచారాన్ని పంపడం లేదా నోట్స్ సిద్ధం చేయడం వంటివి చేస్తుంది. అస్తవ్యస్తంగా ఉన్న ఫోల్డర్లను క్రమబద్ధీకరించడం, ఫైళ్లకు అర్థవంతమైన పేర్లు పెట్టడం వంటి పనులను క్షణాల్లో పూర్తి చేస్తుంది.మొబైల్ నుంచే వాయిస్ ద్వారా పనులను పూర్తి చేసే వెసులుబాటు ఉంది.భద్రతే ప్రాధాన్యంవినియోగదారుల డేటా భద్రత విషయంలో పెర్ప్లెక్సిటీ కఠినమైన చర్యలు చేపట్టినట్లు అధికారులు చెప్పారు. ‘పర్సనల్ కంప్యూటర్ అప్లికేషన్ అత్యంత సురక్షితమైన ‘శాండ్బాక్స్’ వాతావరణంలో పనిచేస్తుంది. ఇది చేసే ప్రతి చర్యను యూజర్లు పర్యవేక్షించవచ్చు. ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే మార్పులు చేసే సదుపాయం కూడా ఉంది’ అని కంపెనీ స్పష్టం చేసింది.ప్రస్తుతానికి ఈ ‘పర్సనల్ కంప్యూటర్’ ఫీచర్ పెర్ప్లెక్సిటీ ప్రో చందాదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. వెయిట్లిస్ట్లో ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తూ త్వరలోనే సాధారణ వినియోగదారులందరికీ అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ వెల్లడించింది.ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధరల వేడి! -
‘ఫ్యామిలీతో చూడదగ్గ కొత్త సినిమా ఏదైనా ఉందా?’
మొబైల్ డేటాతోనో లేకుంటే ఇంట్లో వైఫై నెట్తోనో చేతిలో స్మార్ట్ ఫోన్లో చేతిని పైకి కిందకు ఆడిస్తూ గడిపేస్తున్న కాలమిది. దీనికి తోడు వారాంతంలో ప్రశాంతంగా ఓ సినిమానో, వెబ్సిరీసో చూడడం కుటుంబరావులకు పెద్ద టాస్క్గా మారింది. ఇప్పటి ప్రేక్షకుల పెద్ద సమస్య ఏమిటంటే.. ఏం చూడాలి? ఏది ట్రెండింగ్లో ఉంది? ఏది సరదాగా ఉంటుంది? అనే. ఈ ప్రశ్నలతోనే ఎక్కువ సమయం వృథా అవుతోందట. ఇది ఎంతలా అంటే.. ఒక సినిమా చూసే సమయం కంటే ఎక్కువే!అవును.. ఆశ్యర్యం కలిగించినా పైన చెప్పుకున్నదే ఇదే నిజం. యూజర్టెస్టింగ్ అనే సర్వే ప్రకారం.. మన దేశంలో ఒక యూజర్ ‘ఏం చూడాలి’ అని నిర్ణయించుకోవడంలోనే ఒక ఏడాదిలో 110 గంటలు.. అంటే సుమారుగా ఐదు రోజులు వేస్ట్ చేస్తున్నారని వెల్లడైంది. అలాగే డెలాయిట్ సర్వే ప్రకారం.. ఈ గందరగోళంలోనే ఒక వ్యక్తి రోజుకు సగటున ఆరు రకాల డిజిటల్ వినోదం (సిరీస్, షార్ట్ వీడియోలు, సోషల్ ఫీడ్స్) మధ్య చక్కర్లు కొడుతున్నాడు. అయితే.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఈ పరిస్థితి మార్చేయబోతోంది. ఈరోజుల్లో విరామం దొరికితే విశ్రాంతి కోసం కాకుండా వినోదం కోసం వెతికే పనిలోనే బిజీ అయిపోతున్నాం. చాలా ఇళ్లలో ఏం చూడాలి అని ఎంచుకోవడానికి పట్టే సమయం పెరిగిపోతూ వస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఏం చూడడం బెస్ట్ అనే అడిగేవాళ్లు.. దానికి తమ రివ్యూలతో ఆన్సర్లు ఇచ్చేవాళ్లు పెరిగిపోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి స్ట్రీమింగ్ ప్లాట్ఫార్మ్లే నడుం బిగించాయి. ఇప్పుడు AI ఆధారిత కంటెంట్ డిస్కవరీ వైపు అడుగులు వేస్తున్నాయి. అది ఎలాగంటే.. ఏఐ సెర్చ్ బార్లోనూ సాధారణ కీవర్డ్ సెర్చ్ కాకుండా.. అంటే చేతి వేళ్లు నొప్పి పుట్టేలా, రిమోట్ బటన్లు అరిగిపోయేలా టైప్ చేయాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు.. ‘నేను ఫ్యామిలీతో కొత్త సినిమా ఏదైనా చూడాలనుకుంటున్నా.. ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాల్లేని సినిమా ప్లే చేయి’, ‘లేటెస్ట్ రిలీజ్లు ఏమున్నాయో చూపించు’, ‘తక్కువ రన్టైంలో పూర్తయ్యే సినిమాలు ఏమైనా ఉన్నాయా?’’ అలా వాయిస్ కమాండ్ ద్వారా కావాల్సినవి ఎంచుకోవచ్చు. ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు. యూజర్ మూడ్ను, సందర్భాన్ని, ఉద్దేశం అర్థం చేసుకుని కూడా సరైన సజెషన్లు ఇస్తుంది. సో.. ప్రేక్షకులు ఇప్పుడు జానర్ మాత్రమే చెప్పాల్సిన అవసరం లేదు.. ఫీలింగ్స్ చెప్పినా సరిపోతుందన్నమాట!. ‘‘రోజంతా అలసిపోయాను.. రిలాక్సేషన్ కోసం ఫన్నీగా ఏదైనా ఇవ్వు”, ‘‘ఆదివారం సాయంత్రం బయట వాతావరణం వర్షం పడేలా ఉంది.. ఈ మూడ్కు తగ్గట్లు మంచి పాటలు ప్లే చేయు’.. ఇలాగన్నమాట. అలాగే ఏఐ కాబట్టి భాషతోనూ పెద్దగా ఇబ్బంది లేకుండా చూసుకుంటోంది. జియో హాట్స్టార్ ఓపెన్ఏఐతో కలిసి ChatGPT ఆధారిత వాయిస్ డిస్కవరీని భారతీయ ప్రేక్షకులకు అందిస్తోంది. నెట్ఫ్లిక్స్ ChatGPT ఆధారిత సెర్చ్ని మొదట ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో ప్రారంభించి.. ఇప్పుడు భారత్కు విస్తరించింది. Amazon Prime Video కూడా ఏఐ జానర్ క్లస్టర్లు (fantasy quest, mind‑bending sci‑fi”) చూపిస్తూ యూజర్కు ఎంపిక చేసుకోవడంలో సహాయం చేస్తోంది. సో.. ఇకపై ప్రేక్షకులు ఎంత స్క్రోల్ చేసినా ఏదో దొరకడం లేదు అనే సమస్యతో బాధపడాల్సిన అవసరం లేదు. AI ఆధారిత డిస్కవరీ వల్ల ‘ఏం చూడాలి?’ అనే ప్రశ్నకు నేరుగా సమాధానం దొరుకుతుందన్నమాట. -
‘టెక్ మహీంద్రా’పైనా తీవ్ర ఆరోపణలు..
టీసీఎస్ (TCS) నాసిక్ బీపీవోలో లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడులపై ఓ వైపు దర్యాప్తు కొనసాగుతుండగా మరో ఐటీ సంస్థ టెక్ మహీంద్రాపైనా ఇదే రకమైన మతపరమైన పక్షపాత ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ముంబై గోరేగావ్ ఐటీ పార్క్లో ఈ సంస్థకు చెందిన బీపీపీ కార్యాలయంలో మతపరమైన పక్షపాతం, వివక్షపూరిత నియామక పద్ధతులు కొనసాగుతున్నాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి.బాంబే హైకోర్టు న్యాయవాది అశుతోష్ దూబే తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో ఒక ఉద్యోగి పంపిన సందేశాన్ని షేర్ చేయడంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. సదరు కార్యాలయంలోని హెచ్ఆర్ విభాగం ఒక నిర్దిష్ట వర్గానికి చెందిన వారినే ఎక్కువగా నియమిస్తోందని, కార్యాలయ నిబంధనలు కూడా పక్షపాతంగా ఉన్నాయని ఆ సందేశంలో ఆరోపించారు.ముఖ్యంగా రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులకు క్యాంటీన్లో ఇఫ్తార్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రత్యేక వెసులుబాటు కల్పించారని, ఆ సమయంలో ప్యాంట్రీ ఏరియాలోకి ఇతరులు పాదరక్షలతో రావద్దంటూ ఏర్పాటు నోటీసులకు సంబంధించిన ఫోటోలనూ దూబే షేర్ చేశారు. దీనివల్ల తాము "మినీ పాకిస్తాన్లో" పని చేస్తున్నట్లు అనిపిస్తోందని, అక్కడ పనిచేయడం అసౌకర్యంగా ఉందంటూ ఒక ఉద్యోగి వాపోయినట్లుగా దూబే పేర్కొన్నారు. అలాగే, నియామకాల్లో పారదర్శకత లేదని, కార్పొరేట్ విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని న్యాయవాది అశుతోష్ దూబే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.స్పందించిన టెక్ మహీంద్రా యాజమాన్యంఈ ఆరోపణలపై టెక్ మహీంద్రా యాజమాన్యం వెంటనే స్పందించింది. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వార్తలు, ఫోటోలు పూర్తిగా "నిరాధారమైనవి" అని కొట్టిపారేసింది. తాము నిర్వహించిన అంతర్గత సమీక్షలో అటువంటి వివక్షపూరిత సంఘటనలు ఏవీ జరగలేదని తేలిందని సంస్థ ప్రతినిధి స్పష్టం చేశారు. ముఖ్యంగా వైరల్ అవుతున్న 'ఫుట్వేర్ ఫ్రీ జోన్' నోటీసు అసలు తమ కార్యాలయానికే చెందినది కాదని, నియామక ప్రక్రియలో కూడా ఎలాంటి అవకతవకలు లేవని కంపెనీ వెల్లడించింది.తమ సంస్థ సర్వమత సమానత్వాన్ని పాటిస్తుందని, సమ్మిళిత, గౌరవప్రదమైన పని వాతావరణాన్ని కల్పించడమే తమ ప్రాధాన్యతని టెక్ మహీంద్రా పేర్కొంది. మతం, కులం లేదా ఇతర ప్రాతిపదికన ఎలాంటి వివక్షను సహించబోమని, ప్రతి ఉద్యోగిని నిష్పాక్షికంగా చూస్తామని కంపెనీ స్పష్టం చేసింది. కార్పొరేట్ విలువలను కాపాడటంలో తాము ఎప్పుడూ ముందుంటామని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఈ సందర్భంగా కోరింది.ఇదీ చదవండి: కంపెనీల్లో ఇదేం నీతి? దెబ్బకు హెచ్ఆర్ సైలెంట్! -
‘న్యూడిఫై’ యాప్లతో కాసుల వేట!
సాంకేతిక ప్రపంచంలో పారదర్శకత, భద్రత గురించి గొప్పలు చెప్పుకునే యాపిల్, గూగుల్ సంస్థల అసలు రంగు బయటపడిందని కొందరు టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అశ్లీలతను, ఏకాభిప్రాయం లేని లైంగిక కంటెంట్ను ప్రోత్సహించబోమని కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు ప్రకటించిన ఈ టెక్ దిగ్గజాలు వాస్తవానికి ‘న్యూడిఫై’(లైంగిక పరమైన) యాప్ల ద్వారా కోట్లాది రూపాయల ఆదాయాన్ని గడిస్తున్నాయని ‘టెక్ ట్రాన్స్పరెన్సీ ప్రాజెక్ట్’ (టీటీపీ) తాజా నివేదికలో బయటపెట్టింది.కోట్లలో డౌన్లోడ్లు.. వందల కోట్లలో ఆదాయం!టెక్ ట్రాన్స్పరెన్సీ ప్రాజెక్ట్ నివేదిక ప్రకారం, యాపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్లలో కృత్రిమ మేధ సాయంతో సాధారణ వ్యక్తుల, సెలబ్రిటీల ఫొటోల నుంచి దుస్తులను తొలగించి నగ్నంగా మార్చే అన్డ్రెస్ లేదా న్యూడిఫై యాప్లు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఈ తరహా యాప్లు ఇప్పటివరకు సుమారు 483 మిలియన్ల సార్లు డౌన్లోడ్ అయ్యాయి. యాప్ మ్యాజిక్ గణాంకాల ప్రకారం, వీటి ద్వారా ఈ కంపెనీలు 122 మిలియన్ డారల్లు (సుమారు రూ.1,000 కోట్లు) ఆదాయాన్ని ఆర్జించాయి. యాపిల్ స్టోర్లో 18, గూగుల్ ప్లే స్టోర్లో 20 ఇలాంటి యాప్లను పరిశోధకులు గుర్తించారు.సెర్చ్ చేస్తే చాలు.. ప్రకటనలే స్వాగతం!వినియోగదారులు యాప్ స్టోర్ల్లో న్యూడిఫై వంటి పదాల కోసం వెతికినప్పుడు ఈ యాప్లు కనిపించడమే కాకుండా కంపెనీలు స్వయంగా వాటికి సంబంధించిన ప్రకటనలను కూడా ప్రదర్శిస్తుండటం గమనార్హం. అంతేకాకుండా ఆటోకంప్లీట్ ఫీచర్ ద్వారా వినియోగదారులను నేరుగా ఇటువంటి అశ్లీల యాప్ల వైపు మళ్లిస్తున్నాయని నివేదిక తీవ్రంగా విమర్శించింది. ‘ఈ కంపెనీలు కేవలం యాప్లను ఆమోదించడమే కాదు, వాటి ద్వారా లాభం పొందుతూ వినియోగదారులను ఆ దిశగా ప్రోత్సహిస్తున్నాయి’ అని టెక్ ట్రాన్స్పరెన్సీ ప్రాజెక్ట్ డైరెక్టర్ కేటీ పాల్ అన్నారు.నిబంధనలు ఏం చెబుతున్నాయి?యాపిల్ మార్గదర్శకాలు బహిరంగ లైంగిక లేదా అశ్లీల కంటెంట్ను స్పష్టంగా నిషేధిస్తున్నాయి. గూగుల్ సైతం వ్యక్తులను దిగజార్చే ‘ప్రాంక్’ పేరుతో బట్టలు విప్పినట్లు చూపే యాప్లను అనుమతించబోమని చెబుతోంది. అయితే, ఫొటో ఎడిటింగ్ యాప్లుగా ముసుగు వేసుకుని వచ్చే ఇటువంటి సాఫ్ట్వేర్లను గుర్తించడంలో ఈ కంపెనీలు విఫలమవుతున్నాయి.అంతర్జాతీయంగా పెరుగుతున్న ఒత్తిడినగ్నత్వ యాప్ల వల్ల మహిళలు, చిన్నారుల భద్రత ప్రమాదంలో పడుతోందని ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే ‘టేక్ ఇట్ డౌన్’ చట్టంపై సంతకం చేశారు. ఇది ఏకాభిప్రాయం లేని లైంగిక చిత్రాలను ప్రచురించడాన్ని నేరంగా పరిగణిస్తుంది. అశ్లీల చిత్రాలను తొలగించని టెక్ కంపెనీల ఎగ్జిక్యూటివ్లను విచారించేలా యూకే ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువస్తోంది.దిద్దుబాటా? కంటితుడుపు చర్యలా?బ్లూమ్బెర్గ్, టీటీపీ నివేదికల అనంతరం, యాపిల్ సుమారు 15 యాప్లను తొలగించినట్లు తెలిపింది. గూగుల్ కూడా పలు యాప్లను సస్పెండ్ చేసినట్లు పేర్కొంది. అయితే, ఒకసారి తొలగించిన యాప్లు కొన్ని నెలలకే మళ్లీ కొత్త పేర్లతో ప్రత్యక్షమవుతున్నాయని, టెక్ దిగ్గజాల పర్యవేక్షణ వ్యవస్థలో తీవ్ర లోపాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం లాభాల కోసం నైతికతను పక్కన పెడుతున్న ఇలాంటి కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక వేత్తలు డిమాండ్ చేస్తున్నారు.ఇదీ చదవండి: కాకమీదున్న పసిడి ధరలు -
ఏఐ వినియోగంలో భారత్ టాప్.. కానీ..
న్యూఢిల్లీ: కోడింగ్, డేటా అనాలిసిస్, సంక్లిష్టమైన రీజనింగ్లాంటి అంశాల్లో భారత్ ప్రపంచంలోనే అధునాతన ఏఐ మార్కెట్లలో ఒకటిగా ఉంటోందని ఓపెన్ ఏఐ ఒక నివేదికలో తెలిపింది. సంక్లిష్టమైన సవాళ్లను పరిష్కరించేందుకు, అడ్వాన్స్డ్ స్థాయిలో ఏఐని తరచుగా యూజర్లు వినియోగించుకోవడంలో టాప్ అయిదు దేశాల్లో భారత్ ఒకటిగా ఉంటోందని పేర్కొంది. అయితే, కృత్రిమ మేథ వినియోగం కొన్ని నగరాలకే పరిమితమవుతోందని, గ్రామీణ.. పట్టణ ప్రాంతాల్లో చాలా తక్కువగా ఉంటోందని వివరించింది. సాటి దేశాలతో పోల్చి చూసినప్పుడు, భారత్లో మిగతా ప్రాంతాల కన్నా టాప్ నగరాల్లో ఏఐ వినియోగం 3 రెట్లు అధికంగా ఉంటోందని ఓపెన్ఏఐ తెలిపింది. రిపోర్ట్ ప్రకారం కోడింగ్, డేటా అనలిటిక్స్ వినియోగంలో కూడా భారత్కి పటిష్టమైన ర్యాంకింగ్ ఉంది. 2026 ఫిబ్రవరిలో ఓపెన్ఏఐ కోడెక్స్ (కోడింగ్ టూల్) యాప్ను ఆవిష్కరించిన రెండు వారాల్లోనే దీని యూజర్ల సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. అయితే, ఈ వినియోగం అన్ని ప్రాంతాల్లోనూ సమానంగా, ఒకే రకంగా లేదు. అడ్వాన్స్డ్ ఏఐ వినియోగంలో భారీగా అంతరాలు ఉంటున్నాయి. మరిన్ని విశేషాలు.. → మొత్తం ఏఐ యూజర్లలో 50 శాతం మంది టాప్ 10 నగరాల్లో ఉంటున్నారు, ఢిల్లీ ఎన్సీఆర్ అగ్రస్థానంలో ఉంది. అమెరికా, బ్రిటన్, బ్రెజిల్, జర్మనీలాంటి సాటి దేశాలతో పోలిస్తే దేశీయంగా టాప్ నగరాల్లో ఏఐ వినియోగం 3 రెట్లు ఎక్కువగా ఉంటోంది. దేశ జనాభాలో ఈ నగరాల్లో నివసించే వారి సంఖ్య 10 శాతం లోపే ఉంటుంది. → అడ్వాన్స్డ్ ఏఐ వినియోగం విషయానికొస్తే అంతరం మరింత ఎక్కువగా ఉంటోంది. వెనుకబడిన నగరాలతో పోలిస్తే టాప్ సిటీల్లో డేటా అనాలిసిస్ వినియోగం 30 రెట్ల వరకు, కోడింగ్ వినియోగం 4 రెట్లు, ఏఐ డెవలపర్ (కోడెక్స్) వినియోగం 9 రెట్లు అధికంగా ఉంది. → పోటీ దేశాలతో పోలిస్తే భారత్కి ఏఐ సామర్థ్యాలు గణనీయంగా ఉన్నప్పటికీ, హైదరాబాద్, బెంగళూరు,, ఢిల్లీ, చెన్నైలాంటి కొన్ని పట్టణ ప్రాంత హబ్లలో మాత్రమే అవి కేంద్రీకృతమై ఉంటున్నాయి. → విద్య, ఆరోగ్యంలాంటి రంగాల్లో అత్యంత అర్థవంతమైన విధంగా ఏఐ వినియోగం పెరుగుతోంది. విద్య విషయంలో తూర్పు రాష్ట్రాలు ముందుంటున్నాయి. విద్యాభ్యాసానికి సంబంధించిన మొత్తం మెసేజీలు జాతీయ సగటైన 20 శాతానికి మించి అస్సాంలో 22 శాతం స్థాయిలో ఉంటున్నాయి. ఒరిస్సా, మణిపూర్, త్రిపుర, చత్తీస్గఢ్లలో కూడా దాదాపు ఇదే ధోరణి ఉంది. ఆరోగ్యం విషయంలో జమ్మూ కాశీ్మర్, పంజాబ్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, కేరళలాంటి ప్రాంతాల్లో ఏఐ వినియోగం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. జమ్మూ కాశ్మీర్లో ప్రతి 10 మెసేజీల్లో ఒకటి ఆరోగ్యానికి సంబంధించినది ఉంటోంది. జాతీయ సగటుతో పోలిస్తే ఇది 32 శాతం అధికం. → టెక్నాలజీ వినియోగ సామర్థ్యాలు ఎంత విస్తృతంగా అందరికీ అందుబాటులోకి వచ్చాయనే దానిపై భారతదేశపు తదుపరి దశ ఏఐ ప్రస్థానం ఆధారపడి ఉంటుంది. తొలినాటి వినియోగదారుల పరిధిని దాటి ఏఐ ప్రయోజనాలు ఎంత వేగంగా మరింత భారీ స్థాయిలో జనాభాకు అందుబాటులోకి వస్తాయనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఈ అంతరాలను భర్తీ చేయాలంటే నైపుణ్యాలను పెంపొందించడం, అర్థవంతమైన విధంగా ఉపయోగించుకునేందుకు తోడ్పాటు అందించడం కీలకంగా ఉండనున్నాయి. -
హైదరాబాద్ ఐకేపీ నాలెడ్జ్ పార్క్ కొత్త ప్రోగ్రామ్
హైదరాబాద్: భారతదేశాన్ని లైఫ్ సైన్సెస్ రంగంలో గ్లోబల్ ప్రోడక్ట్ లీడర్గా నిలబెట్టే లక్ష్యంతో, ప్రతిష్టాత్మకమైన ఐకేపీ నాలెడ్జ్ పార్క్ (IKP Knowledge Park) ‘ఐకేపీ ఏఆర్కే’(IKP ARK) పేరుతో సరికొత్త వెంచర్ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. లోతైన శాస్త్రీయ పరిశోధనలు (Deep-Science) చేసే స్టార్టప్లు ఎదుర్కొంటున్న వాణిజ్యపరమైన సవాళ్లను అధిగమించడానికి ఈ ప్రోగ్రామ్ ఒక వారధిలా పనిచేయనుంది.చాలా స్టార్టప్లు అద్భుతమైన ఆవిష్కరణలు చేసినప్పటికీ, సరైన సహకారం, రెగ్యులేటరీ నిబంధనలపై అవగాహన లేక మధ్యలోనే ఆగిపోతున్నాయి. ఈ అంతరాన్ని తగ్గించడానికి, ఐకేపీ ఏఆర్కే ఒక వినూత్న నమూనాను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా అనుభవజ్ఞులైన నిపుణులు నేరుగా ఆయా కంపెనీలతో కలిసి పనిచేస్తూ, వ్యాపార విస్తరణలో వ్యవస్థాపకులకు వెన్నుదన్నుగా నిలుస్తారు.ఎంపికైన ప్రతి స్టార్టప్కు సుమారు రూ.2 కోట్ల వరకు విలువైన ప్రయోజనాలను ఐకేపీ కల్పిస్తోంది. ఇందులో ప్రాజెక్ట్ మైలురాళ్ల ఆధారిత నిధులతో పాటు, మౌలిక సదుపాయాల కల్పన, సీడీఎస్సీవో, ఎఫ్డీఏ వంటి సంస్థల నుండి రెగ్యులేటరీ అనుమతులు పొందడంలో సాంకేతిక మద్దతు ఉంటుంది. ఐకేపీకి ఉన్న 20 ఏళ్ల సుదీర్ఘ పెట్టుబడిదారుల నెట్వర్క్ ద్వారా స్టార్టప్లు తమ వ్యాపార నమూనాలను మెరుగుపరుచుకుని నిధులు సేకరించుకునే అవకాశం కలుగుతుంది.ఈ ప్రోగ్రామ్ 12 నెలల కాలపరిమితితో మూడు దశల్లో సాగుతుంది. మొదటి దశలో వ్యాపార ప్రణాళిక (బ్లూప్రింట్) సిద్ధం చేయడం, రెండో దశలో నిర్వహణపరమైన ముప్పులను తగ్గించడం, చివరి ఎనిమిది నెలల్లో నేరుగా మార్కెట్లోకి ప్రవేశించి సిరీస్-ఎ ఫండింగ్ సాధించడంపై దృష్టి సారిస్తారు. ఈ వినూత్న పద్ధతి ద్వారా ప్రయోగశాలలోని ఆవిష్కరణలు వేగంగా ప్రజలకు చేరువవుతాయని ఐకేపీ సీఈఓ డాక్టర్ సత్య ప్రకాష్ డాష్ పేర్కొన్నారు.తొలి విడతలో భాగంగా మెడ్టెక్, హెల్త్టెక్ స్టార్టప్ల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ (TRL 3+) కలిగి ఉన్న సంస్థలు దరఖాస్తు చేసుకోవచ్చు. గత రెండు దశాబ్దాలుగా సుమారు 1,900 కంపెనీలకు అండగా నిలిచిన ఐకేపీ, ఈ కొత్త ప్రోగ్రామ్ ద్వారా భారతీయ స్టార్టప్ వ్యవస్థలో మరో కీలక మైలురాయిని అధిగమించనుంది. -
లాభాలు ఎలా రాబట్టుకుంటారో ఏమో!
గడిచిన రెండేళ్లుగా ప్రపంచ పారిశ్రామిక, సాంకేతిక రంగాలను సునామీలా చుట్టుముట్టేసిన పదం ‘కృత్రిమ మేధ’ (ఏఐ). డేటా సెంటర్లు, అధునాతన చిప్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం) అభివృద్ధి కోసం కంపెనీలు బిలియన్ల కొద్దీ డాలర్లను వరదలా పారించాయి. అయితే, ఈ ఏఐ విప్లవం ఇప్పుడు ఒక కీలక మలుపు వద్ద నిలిచింది. గతంలో ఉత్సాహంగా పెట్టిన పెట్టుబడులపై ఇన్వెస్టర్లు, కంపెనీల యాజమాన్యాలు ఆలోచనలో పడ్డాయి. అసలు ఇంతటి భారీ పెట్టుబడులకు తగిన ప్రతిఫలం లభిస్తుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రపంచ మార్కెట్లను వేధిస్తున్నాయి.పెరుగుతున్న ఉత్కంఠఏఐ రంగంలో మైలురాయిగా భావించే మైక్రోసాఫ్ట్-ఓపెన్ఏఐ భాగస్వామ్యం ఇప్పుడు అంతర్గత సవాళ్లను ఎదుర్కొంటోంది. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రీసెర్చ్ కలయికగా మొదలైన ఈ బంధం వ్యయ నియంత్రణ వద్దకు వచ్చేసరికి అనిశ్చితి ఎదుర్కొంటోంది. అత్యున్నత స్థాయి ఏఐ వ్యవస్థలను నిర్మించడానికి, శిక్షణ ఇవ్వడానికి అయ్యే ఖర్చు అసాధారణంగా ఉంటోంది. ఒకే మోడల్ను ఒక్కసారి ట్రైన్ చేయడానికి వందల మిలియన్ల డాలర్లు ఖర్చవుతుండగా రోజువారీ మిలియన్ల కొద్దీ యూజర్ల ప్రశ్నలకు సమాధానమివ్వడం కంపెనీలకు సవాలుగా మారుతుంది. టెక్ దిగ్గజాల వద్ద నిధులు పుష్కలంగా ఉన్నప్పటికీ ఈ వ్యయం దీర్ఘకాలంలో భారంగా మారుతుందన్న ఆందోళన మొదలైంది.మౌలిక సదుపాయాలు..ఏఐ రంగంలో మౌలిక సదుపాయాల కల్పన ఒక పెద్ద చిక్కుముడిగా మారింది. ఎన్విడియా, ఏఎండీ వంటి కంపెనీలు ఏటా మరింత శక్తివంతమైన చిప్స్ను విడుదల చేస్తున్నాయి. ఇది సాంకేతిక పురోగతికి శుభసూచకమే అయినా, పెట్టుబడి కోణంలో ఒక విచిత్రమైన పరిస్థితిని సృష్టిస్తోంది. రెండేళ్ల క్రితం వందల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన డేటా సెంటర్లు నేటి ఏఐ అవసరాలకు (విద్యుత్, కూలింగ్ వ్యవస్థ) సరిపోవడం లేదు. మౌలిక సదుపాయాలు అనేవి దీర్ఘకాలిక ఆస్తులు. కానీ ఏఐ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ వేగంతో మారిపోతోంది. దీనివల్ల భారీ పెట్టుబడులు పెట్టిన ఆస్తులు త్వరగా వాడుకలో లేకుండా పోతున్నాయి.స్కేలింగ్ లాస్ Vs ఎకనామిక్ లాస్ఏఐ అభివృద్ధిలో ఒక ప్రాథమిక సూత్రం ఉంది. అది ‘ఎక్కువ డేటా + ఎక్కువ గణన సామర్థ్యం = మెరుగైన ఫలితం’. దీనినే స్కేలింగ్ లాస్ అంటారు. కానీ, ఇప్పుడు ఆర్థిక పరిమితులు ఈ సూత్రాన్ని అడ్డుకుంటున్నాయి. నమూనాలు పెద్దవి అయ్యే కొద్దీ, వాటి పనితీరులో వచ్చే మెరుగుదల తగ్గుతూ ఖర్చు మాత్రం విపరీతంగా పెరుగుతోంది. దీంతో కంపెనీలు మోడల్ కంప్రెషన్, ప్రత్యేక అప్లికేషన్లపై దృష్టి సారిస్తున్నాయి.పెట్టుబడిపై రాబడి ఎప్పుడు?సాంప్రదాయ సాఫ్ట్వేర్ రంగంలో ఒకసారి ప్రోగ్రామ్ రాస్తే ఎంతమంది వాడుకున్నా అదనపు ఖర్చు నామమాత్రంగానే ఉంటుంది. కానీ ఏఐ అలా కాదు. ప్రతి సెర్చ్, ప్రతి ఇంటరాక్షన్ వెనుక భారీ ఖర్చు ఉంటుంది. దీనిని మానిటైజ్ చేయడం (డబ్బుగా మార్చుకోవడం) ఇంకా ఒక సవాలుగానే ఉంది. సంస్థలకు ఏఐ వల్ల కలిగే ప్రయోజనాలు దీర్ఘకాలికంగా కనిపిస్తుండగా ఖర్చులు మాత్రం తక్షణమే చెల్లించాల్సి వస్తోంది.ఆగిపోని విప్లవంఏఐ విప్లవం ఆగిపోతుందని దీని అర్థం కాదు. కానీ, ఇది ‘అపరిమిత అవకాశాల’ దశ నుంచి ‘పరిమిత ఆప్టిమైజేషన్’ దశకు చేరుకుంటుంది. పెట్టుబడిదారులు ఇప్పుడు కేవలం సాంకేతిక సామర్థ్యాన్ని మాత్రమే చూడటం లేదు, లాభదాయకత కూడా లెక్కిస్తున్నారు.ఇదీ చదవండి: ‘మధ్య తరగతి’ బండి సాగేదెలా? -
Ai+ నోవా 2 అమ్మకాలు ఎప్పుడంటే?
నోవా సిరీస్లో భాగంగా తమ సరికొత్త డివైస్ 'నోవా 2' విక్రయాలు ప్రారంభమైనట్లు Ai+ స్మార్ట్ఫోన్ ప్రకటించింది. రోజువారీ వినియోగానికి అనుకూలంగా ఉండే ఈ ఫోన్ ఏప్రిల్ 14న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్కార్ట్, ఎంపిక చేసిన రిటైల్ ఔట్లెట్స్లో అందుబాటులో ఉంటుంది.Ai+ నోవా 2 ధరలు4జీబీ + 64 జీబీ: రూ.8,9996 జీబీ + 128 జీబీ: రూ.10,999మొదటిసారి అప్గ్రేడ్ అవుతున్న లేదా Ai+కి మారుతున్న వినియోగదారులకు అవసరమైన దాదాపు అన్ని ఫీచర్స్ నోవా 2 ఉండనున్నాయి. ఇది నమ్మకమైన, విశ్వసనీయమైన రోజువారీ ఉపయోగానికి చాలా అనుకూలంగా ఉంటుందని Ai+ స్మార్ట్ఫోన్ సీఈఓ, నెక్స్ట్ క్వాంటం (NxtQuantum) షిఫ్ట్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు మాధవ్ సేథ్ అన్నారు.6000mAh బ్యాటరీతో కూడిన నోవా 2.. స్ట్రీమింగ్, బ్రౌజింగ్, గేమింగ్, మల్టీటాస్కింగ్కు సరిపోయేలా తయారైంది. ఇది నెక్ట్స్ క్వాంటం (NxtQuantum) OSతో కూడిన ఆండ్రాయిడ్ 16పై పనిచేస్తూ సున్నితమైన, ఆప్టిమైజ్ చేసిన అనుభూతి అందిస్తుంది. 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, HBM సపోర్ట్తో కూడిన 6.745 ఇంచెస్ HD+ డిస్ప్లేతో వినియోగదారులు కంటెంట్ను చూస్తున్నా లేదా రోజువారీ పనులు చేస్తున్నా, నోవా 2 స్పష్టమైన విజువల్స్, నిరంతరాయమైన స్క్రోలింగ్ అందిస్తుంది.ఈ స్మార్ట్ఫోన్లో అన్ని రకాల లైటింగ్ పరిస్థితులలోనూ కచ్చితమైన, సహజమైన ఫొటోలు తీయడానికి అనువైన 50MP బ్యాక్ కెమెరా, అలాగే స్పష్టమైన సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. IP64 రెసిస్టెన్స్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో కూడిన మెరుగైన నిర్మాణాన్ని నోవా 2 కలిగి ఉంది. ఇది పర్పుల్, గ్రీన్, పింక్, బ్లూ, బ్లాక్ అనే ఐదు విభిన్న రంగులలో లభిస్తుంది. -
వెలుగులోకి ‘లేడీ కెప్టెన్’ లీలలు.. టీసీఎస్లో సంచలనం
ముంబై: లైంగిక వేధింపులు, మత మార్పిడి ఆరోపణలతో ప్రముఖ టెక్ దిగ్గజం టీసీఎస్ నాసిక్ క్యాంపస్ వ్యవహారం సంచలనంగా మారింది. తాజాగా ఈ ఘటనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. 2021 నుంచి టీసీఎస్లో దారుణాలు జరుగుతున్నాయని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. మహిళా ఉద్యోగులను మత మార్పిడి చేసుకునేలా ప్రోత్సహించిన ఆరుగురు ఉద్యోగులు అరెస్టయ్యారు. పరారీలో ఉన్న హెచ్ఆర్ మేనేజర్ కూడా ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెలుగులోకి వచ్చాయి. ఆమె సహచర ఉద్యోగులకు హిందూ మహిళా ఉద్యోగులను పెళ్లి చేసుకోవాలని ప్రోత్సహించేవారని సమాచారం. మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధించడం, మత మార్పిడిని ప్రోత్సహించడం, వారి బ్రెయిన్వాష్ చేసి మతం మార్చుకునేలా ఒత్తిడి చేయడం, అందుకు కావాల్సిన నిధులను సమకూర్చడం వంటి చర్యలు జరిగినట్లు తేలింది. హెచ్ఆర్ విభాగానికి చెందిన కొంతమంది ఉద్యోగులు కూడా ఈ వ్యవహారంలో భాగమయ్యారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.హెచ్ఆర్ మేనేజర్ మా సహచరులతో నిత్యం మాట్లాడేవారు. వారి మాటల్లో మతం ప్రస్తావన ఉండేది. హిందూ మహిళా ఉద్యోగులను ప్రేమలోకి దించమని, వారిని పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చేవారు. 2021 నుంచి ఇదే విధంగా జరుగుతోంది. మత మార్పిడిని ప్రోత్సహిస్తూ ఫండ్స్ సమకూర్చేవారు' అని సాక్షులు వివరించారు.ఓ నిందితుడు పెళ్లి చేసుకుంటానని మోసం చేసి ఓ ఉద్యోగినిని శారీరకంగా లోబర్చుకున్నాడు. పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు తప్పించుకుని తిరిగేవాడు. ప్రశ్నిస్తే బాధిత ఉద్యోగినిని బాడీషేమింగ్ చేస్తూ అసభ్యంగా మాట్లాడేవాడు. సంస్థలో ఇలా జరుగుతోందని హెచ్ఆర్ విభాగంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. పైగా వారి చర్యలకు పరోక్షంగా సహకరించారు.నిందితులు పురుష ఉద్యోగులలో ఒకరిని నమాజ్ చేయమని బలవంతం చేసి, అతని మతాన్ని అవమానించాడు. బాధిత మహిళా ఉద్యోగులు కంపెనీ మహిళా హెచ్ఆర్ మేనేజర్కు ఫిర్యాదు చేస్తే..‘ఫిర్యాదు చేస్తే ఉద్యోగం నుండి తొలగిస్తాం’ అని బెదిరించేవారు ‘లేడీ కెప్టెన్’గా పేరున్న హెచ్ఆర్ మేనేజర్ నిదా ఖాన్ మహిళా ఉద్యోగులతో స్నేహం పెంచి, వారిని సౌకర్యంగా ఉంచి, క్రమంగా నమాజ్ చేయడం, హిజాబ్ ధరించడం వంటి ఆచారాలకు శిక్షణ ఇచ్చిందని ఆరోపణలు ఉన్నాయి. టీసీఎస్ నాసిక్ క్యాంపస్ ఘటన యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులపై చర్యలు తీసుకుంది. -
ఏళ్ల తరబడి ఉన్న యాప్ను నిలిపేసిన మైక్రోసాఫ్ట్
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తమ వినియోగదారులకు ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో తక్కువ డేటా, తక్కువ మెమరీతో పనిచేసేలా రూపొందించిన ‘అవుట్లుక్ లైట్’ యాప్ సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 2026, మే 25వ తేదీ నుంచి ఈ యాప్ పూర్తిగా పనిచేయడం ఆగిపోతుందని కంపెనీ స్పష్టం చేసింది.ఏమిటీ మార్పు? ఎందుకు?ఎంట్రీ లెవల్ స్మార్ట్ఫోన్లు, నెమ్మదిగా ఉండే ఇంటర్నెట్ కనెక్షన్లను దృష్టిలో ఉంచుకుని మైక్రోసాఫ్ట్ గతంలో ఈ ‘లైట్’ వెర్షన్ను ప్రవేశపెట్టింది. అయితే, తన మొబైల్ ఈమెయిల్ వ్యూహాన్ని ఏకీకృతం చేయడంలో భాగంగా ఇకపై సింగిల్ ప్లాట్ఫామ్ పైనే దృష్టి సారించాలని కంపెనీ నిర్ణయించింది. మైక్రోసాఫ్ట్ 365 సేవలతో అనుసంధానం, మెరుగైన భద్రతా ఫీచర్లు, వ్యక్తిగత, కార్పొరేట్ వినియోగదారులకు విస్తృతమైన సౌకర్యాలను ఒకేచోట అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే 2025 చివరి నుంచే కొత్త డౌన్లోడ్లను నిలిపివేసిన కంపెనీ ఇప్పుడు తుది గడువును ఖరారు చేసింది.వినియోగదారులపై ప్రభావం ఇలా..మే 25 తర్వాత మీ ఫోన్లో యాప్ ఐకాన్ కనిపించినప్పటికీ మెయిల్ బాక్స్ ఓపెన్ కాదు. అంటే, మీరు కొత్త ఈమెయిల్స్ చూడటం, పంపడం లేదా క్యాలెండర్ ఈవెంట్లను నిర్వహించడం సాధ్యం కాదు. అయితే, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ ఈమెయిల్స్, కాంటాక్ట్స్, క్యాలెండర్ డేటా అంతా సురక్షితంగా ఉంటుంది. యూజర్లు వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుంచి ప్రధాన ‘అవుట్లుక్ మొబైల్’ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి.ఇప్పుడేం చేయాలి?అంతరాయం లేని అవుట్లుక్ సర్వీసుల కోసం వినియోగదారులు గడువు ముగిసేలోపే కొన్ని చర్యలు తీసుకోవాలని కంపెనీ సూచించింది. అవుట్లుక్ లైట్ యాప్లోనే అప్గ్రేడ్ ఆప్షన్ కనిపిస్తుంది. దాని ద్వారా నేరుగా మెయిన్ యాప్కు వెళ్లవచ్చు. మెయిన్ అవుట్లుక్ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ పాత మైక్రోసాఫ్ట్ అకౌంట్ వివరాలతో లాగిన్ అయితే సరిపోతుంది. మీ మెయిల్స్, అటాచ్మెంట్లు ఆటోమేటిక్గా సింక్ అవుతాయి. కంపెనీ ఐటీ నిర్వాహకులు ప్రత్యేకంగా ఏమీ చేయనవసరం లేదు కానీ, తమ ఉద్యోగులు సకాలంలో కొత్త యాప్కు మారేలా అంతర్గత మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉంటుంది.సాంకేతికత సర్వీసులు వేగంగా మారుతున్న తరుణంలో ఫీచర్ రిచ్ ప్లాట్ఫామ్ల వైపు మొగ్గు చూపడం ద్వారా యూజర్లకు అత్యుత్తమ సేవలు అందించడమే లక్ష్యమని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. కాబట్టి, గడువు ముగిసే వరకు వేచి చూడకుండా ఇప్పుడే మెయిన్ యాప్కు మారడం ఉత్తమం.ఇదీ చదవండి: రూ.30 లక్షలలోపు ఈవీలపై పన్ను రాయితీ! -
మరణించిన వ్యక్తి ఆధార్ డీయాక్టివేట్ ఇలా..
సైబర్ మోసాలు పెరుగుతున్న సమయంలో.. నకిలీ డాక్యుమెంట్స్ ఉపయోగించి ఆర్ధిక పరమైన నేరాలకు పాల్పడుతున్నారు. బ్రతికున్న వారి డాక్యుమెంట్స్ అనధికార కార్యకలాపాలకు ఉపయోగిస్తే.. కొంతకాలం తరువాత అయినా తెలుసుకోవచ్చు. ఒకవేళా చనిపోయినవారి డాక్యుమెంట్స్ ద్వారా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే?..దీనిని దృష్టిలో ఉంచుకుని.. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఓ ఆధార్ డీ యాక్టివేట్ విధానం పరిచయం చేసింది. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.డీయాక్టివేట్ చేయడం ఇలా.. ➤అధికారిక UIDAIలో MyAadhaar పోర్టల్కు వెళ్లండి➤మీ స్వంత ఆధార్ నెంబర్ లేదా కుటుంబ సభ్యులలో ఎవరిదో ఒక ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, ఓటీపీ ఉపయోగించి లాగిన్ అవ్వాలి.➤లాగిన్ అయిన తరువాత Report Death of a Family Member అనే ఆప్షన్ ఎంచుకుని.. మరణించిన వ్యక్తి ఆధార్ వివరాలు నమోదు చేయాలి.➤తరువాత డెత్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి.➤మున్సిపాలిటీ లేదా సంబంధిత అధికారులు జారీ చేసిన మరణ ధృవీకరణ పత్రం అప్లోడ్ చేయాలి.➤ఇవన్నీ పూర్తయిన తరువాత.. వివరాలను వెరిఫై చేసిన తర్వాత UIDAI మరణించిన వ్యక్తి ఆధార్ను శాశ్వతంగా డీయాక్టివేట్ చేస్తుంది.Reporting death and deactivation of Aadhaar of a deceased family member helps in preventing the misuse of their Aadhaar.Report death on myAadhaar Portal: https://t.co/4k2YjTw4BM#Aadhaar #UIDAI #ReportDeath #AadhaarDeactivation pic.twitter.com/jELeDN2EIu— Aadhaar (@UIDAI) April 10, 2026 -
వంటగది కోసం.. ప్రత్యేక గ్యాడ్జెట్స్!
వంటగదిలో గంటల తరబడి కష్టపడాల్సిన పనిలేకుండా, అదే పనిని తక్కువ టైమ్లో, తక్కువ శ్రమతో స్టయిలిష్గా పూర్తి చేసే గాడ్జెట్లు మీకోసం!స్ప్రే టచ్! మీ కిచెన్లో టేస్ట్ మాత్రమే కాదు, హెల్త్ కూడా కంట్రోల్లో ఉండాలంటే ఈ స్మార్ట్ ఆయిల్ స్ప్రేయర్ ఉండాల్సిందే! ఎందుకంటే, ఇది కేవలం ఒక నూనె బాటిల్ మాత్రమే కాదు. ఇందులో డ్యూయల్ మ్యాజిక్ ఉంది. మీకు కావాలంటే నూనెను ధారగా పోసుకోవచ్చు, వద్దు అనుకుంటే పైన ఉన్న నాజిల్తో మంచు జల్లులా స్ప్రే చేసుకోచ్చు. మీరు ఎయిర్ ఫ్రయ్యర్లో చికెన్ రోస్ట్ చేసినా, దోశలు వేస్తున్నాం ఒక్కసారి స్ప్రే చేస్తే చాలు, నూనె మొత్తం సమానంగా పరుచుకుంటుంది. దీనివల్ల నూనె వృథా కాదు, మీ ఒంట్లో కొవ్వు చేరే చాన్స్ కూడా తగ్గుతుంది! సలాడ్స్ నుంచి బార్బెక్యూ వరకు అన్నిటికీ పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఇచ్చే దీని ధర రూ. 380 మాత్రమే!వంటింట్లో ఆర్గానిక్ ఫామ్!బయట మార్కెట్లో దొరికే మొలకలు ఎప్పుడు తయారు చేశారో, ఎంత శుభ్రంగా ఉన్నాయో అని సందేహిస్తున్నారా? అయితే మీ ఇంట్లోనే తాజా మొలకలను అతి తక్కువ సమయంలో, చాలా సులభంగా తయారు చేసుకోవడానికి వచ్చేసింది ఈ స్ప్రౌట్ మేకర్! ఇందులో ఉన్న స్మార్ట్ ‘నాబ్’ టెక్నాలజీ వల్ల నీరు ఒక అంతస్తు నుంచి మరో అంతస్తుకు నెమ్మదిగా వెళ్లి, గింజలకు కావాల్సిన తేమను అందిస్తుంది.దీంతో మొలకలు కుళ్లిపోకుండా, చాలా తాజాగా, పోషకాలతో నిండి ఉంటాయి. పైగా ఇందులో నాలుగు వేర్వేరు కంపార్ట్మెంట్ ట్రేలు ఉంటాయి. అంటే ఒకేసారి పెసలు, శనగలు, అలసందలు ఇలా నాలుగు రకాల గింజలను మొలకెత్తించవచ్చు. అంతేకాదు, ట్రాన్స్పరెంట్ బాక్స్ వల్ల మొలకలు ఎంతవరకు వచ్చాయో బయట నుంచే చూసుకోవచ్చు. ధర రూ. 290 మాత్రమే!స్నాక్ పార్ట్నర్!సినిమా చూస్తున్నప్పుడో లేదా ఇష్టమైన మ్యాచ్ జరుగుతున్నప్పుడో పిస్తాపప్పులు, వేరుశెనగలు తింటూ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? కానీ ఆ పెంకులు, తొక్కలు ఎక్కడ వేయాలో తెలియక చేత్తో పట్టుకోవడమో లేదా టేబుల్ మీద పడేయడమో చేస్తున్నారా? అయితే మీ కోసం వచ్చేసింది ఈ డబుల్ డిష్ నట్ బౌల్!ఇది మామూలు గిన్నె కాదు, మీ స్నాక్ టైమ్ను క్లీన్గా, స్టయిలిష్గా మార్చే చిన్న మ్యాజిక్ బౌల్! ఇందులో డబుల్ డిష్ బౌల్స్ ఉంటాయి. పై భాగంలో మీ ఫేవరెట్ నట్స్ లేదా పండ్లను పెట్టుకోవచ్చు. తిన్న తర్వాత వచ్చే పెంకులు, విత్తనాలు లేదా పిక్కలను కింద ఉన్న హోల్డర్లో సులభంగా పడేయవచ్చు. అవసరమైతే దీనిని విడదీసి రెండు విడివిడి గిన్నెలుగా కూడా వాడుకోవచ్చు. ఇది చాలా గట్టిగా ఉండటమే కాకుండా, క్లీన్ చేయడం కూడా చాలా సులభం. ధర రూ. 280 మాత్రమే! -
గూగుల్ పిక్సెల్ 10 కొనుగోలుపై భారీ తగ్గింపు!
ఖరీదైన స్మార్ట్ఫోన్లు ఎప్పుడెప్పుడు తక్కువ ధరకు లభిస్తాయా?.. అని చాలామంది వేచి చూస్తుంటారు. అలాంటి వారికి ఇప్పుడు పిక్సెల్ 10 మంచి ఎంపిక అవుతుంది. ఎందుకంటే.. ఈ ఫోన్ ఇప్పుడు రూ. 55వేల కంటే తక్కువ ధరకు లభించనుంది.ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో పిక్సెల్ 10 ప్రారంభ ధర రూ. 79,999 ఉండగా.. దానిని తగ్గింపుతో రూ. 74,999కు అందుబాటులో ఉంచింది. అంటే ప్రారంభంలోనే రూ.5000 డిస్కౌంట్ లభిస్తుందన్నమాట. ఇది కాకుండా.. HDFC బ్యాంక్ కార్డ్ ఉపయోగిస్తే వెంటనే రూ. 4,000 అదనపు తగ్గింపు లభిస్తుంది. పాత ఫోన్ ఎక్స్చేంజ్ ద్వారా భారీ తగ్గింపు పొందవచ్చు.ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది మీరు ఎక్స్చేంజ్ చేసే ఫోన్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. దీనిద్వారా గరిష్టంగా రూ.52,000 వరకు తగ్గింపు పొందవచ్చు.ఉదాహరణకు మీ దగ్గర ఉన్న పాత పిక్సెల్ 7 ఎక్స్చేంజ్ చేసుకుంటే.. 15,000 రూపాయల వరకు ఎక్స్చేంజ్ లభించవచ్చు. అదనంగా మరో 5000 ఇతర డిస్కౌంట్స్ లభిస్తాయి. కాబట్టి గూగుల్ పిక్సెల్ 10 మొబైల్ రూ. 55,000 కంటే కూడా తక్కువకు లభించే అవకాశం ఉంది.గూగుల్ పిక్సెల్ 10గూగుల్ పిక్సెల్ 10 మొబైల్ 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజిని పొందుతుంది. టెన్సర్ జీ5 ప్రాసెసర్ లభిస్తుంది. ఏఐ బేస్డ్ పనులను నిర్వహించడానికి కూడా చాలా సహాయపడుతుంది. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ముందు భాగంలో 10.5MP సెల్ఫీ కెమెరా లభిస్తుంది. డిస్ప్లే 6.3 అంగుళాల OLED స్క్రీన్తో వస్తుంది, ఇది మంచి క్లారిటీ ఇస్తుంది. అలాగే 4970 యాంపియర్ బ్యాటరీ ఉండటం వల్ల సాధారణ వినియోగంలో ఒక రోజు మొత్తం సులభంగా పనిచేస్తుంది.


