breaking news
Technology
-
జియో ప్లాన్: ఒక్కసారి రీచార్జ్తో బోలెడు బెనిఫిట్లు
పదే పదే రీఛార్జ్ చేయించుకునే తలనొప్పి లేకుండా, ఒక్కసారి రీఛార్జ్తో ఏడాది మొత్తం ప్రశాంతంగా గడపాలనుకునే వారి కోసం రిలయన్స్ జియోలో ఒక అద్భుతమైన ప్లాన్ అందుబాటులో ఉంది. రూ. 3,599 ధరతో కూడిన ఈ ప్లాన్ కేవలం డేటా, కాలింగ్ మాత్రమే కాకుండా, ఏకంగా రూ. 35,000 పైగా విలువైన ప్రీమియం ప్రయోజనాలను అందిస్తుండటం విశేషం.జియో రూ. 3,599 ప్లాన్ పూర్తి వివరాలుఈ ప్లాన్ ద్వారా లభించే ప్రధాన ప్రయోజనాలు ఇవే.. 365 రోజులు (పూర్తిగా ఒక సంవత్సరం) వాలిడిటీ ఉంటుంది. ప్రతిరోజూ 2.5 GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. దేశంలోని ఏ నెట్వర్క్కైనా అపరిమిత ఉచిత కాలింగ్ చేసుకోవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఉచితం. అర్హత ఉన్న వినియోగదారులకు అపరిమిత 5G డేటా పొందే అవకాశం ఉంటుంది.సాధారణ బెనిఫిట్స్తో పాటు, ఈ ప్లాన్ ద్వారా లభించే ఎక్స్ట్రా ఫీచర్లు యూజర్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. క్రికెట్ మ్యాచ్లు, లేటెస్ట్ సినిమాలు చూడాలనుకునే వారి కోసం కంపెనీ 3 నెలల డిస్నీ+ హాట్స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ను ఉచితంగా అందిస్తోంది.అలాగే ఈ ప్లాన్లోని అత్యంత ఆకర్షణీయమైన అంశం రూ. 35,100 విలువైన గూగుల్ జెమిని ప్రో (Google Gemini Pro) సబ్స్క్రిప్షన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రియుల కోసం భారీ విలువ కలిగిన గూగుల్ జెమిని ప్రో సబ్స్క్రిప్షన్ను జియో ఆఫర్ చేస్తోంది. ఫోన్ మెమరీ సమస్యను అధిగమించేందుకు 50 GB ఉచిత క్లౌడ్ స్టోరేజ్ సౌకర్యాన్ని కూడా జియో కల్పిస్తోంది. -
ఏఐలో భారత్కి ప్రత్యేక స్థానం: కాగ్నిజెంట్ చీఫ్ ఏఐ ఆఫీసర్
న్యూఢిల్లీ: కృత్రిమ మేథ (ఏఐ) వినియోగంలో భారత్కి విశిష్ట స్థానం ఉందని టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ చీఫ్ ఏఐ ఆఫీసర్ బాబక్ హోద్జాత్ తెలిపారు. డిజిటల్ సిస్టమ్లు, ప్రక్రియల గురించి అపార అవగాహన ఉన్న ప్రతిభావంతులు పెద్ద సంఖ్యలో ఉండటం ఇందుకు దోహదపడుతోందని పేర్కొన్నారు.ఏఐ సిస్టమ్లను రూపొందించడంలో, వివిధ పరిశ్రమలవ్యాప్తంగా వినియోగాన్ని వేగవంతం చేయడంలో ఈ నిపుణులు కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు. ఏఐ సాధనాలతో కోడింగ్ సులభతరమవుతున్నప్పటికీ, ఔట్పుట్ నాణ్యతను మదింపు చేయడానికి డెవలపర్లు ఇప్పటికీ అవసరమేనని ఆయన చెప్పారు.వివిధ రంగాలవ్యాప్తంగా మరింత మంది ప్రొఫెషనల్స్కి ఏఐ సాధికారత కల్పిస్తోందని వివరించారు. కంపెనీలు కృత్రిమ మేథ టెక్నాలజీలను వినియోగించుకోవడంలో సహకరించే దిశగా కాగ్నిజెంట్ ఇప్పుడు ఏఐ బిల్డర్ కంపెనీగా రూపాంతరం చెందిందని బాబక్ చెప్పారు.ఉద్యోగులకు కొత్త నైపుణ్యాల్లో శిక్షణనివ్వడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు వివరించారు. కంపెనీలో అంతర్గతంగా కోడ్ జనరేషన్లో ఏఐ వాటా సుమారు 30 శాతంగా ఉండగా, ఇది గణనీయంగా పెరుగుతోందని పేర్కొన్నారు. -
సెమీకాన్ మార్కెట్ @ 300 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: దేశీ సెమీకండక్టర్ల మార్కెట్ 2030 నాటికి మూడు రెట్లు పెరిగి 120 బిలియన్ డాలర్లకు చేరనుంది. అలాగే 2035 నాటికి 300 బిలియన్ డాలర్ల స్థాయికి వృద్ధి చెందనుంది. కృత్రిమ మేధ వినియోగం పెరుగుతుండటం, ఆటోమోటివ్ పరిశ్రమ వృద్ధి చెందుతుండటం, డేటా సెంటర్లు విస్తరిస్తుండటం తదితర అంశాలు ఇందుకు దన్నుగా నిలవనున్నాయి. టెక్నాలజీ, మీడియా, టెలికమ్యూనికేషన్స్ భవిష్యత్తుపై డెలాయిట్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ప్రస్తుతం 90 శాతం సెమీకండక్టర్లను భారత్ దిగుమతి చేసుకుంటోంది. అయితే, 2035 ఆఖరు నాటికి దేశీ డిమాండ్లో 60 శాతం చిప్స్ను స్థానికంగానే ఉత్పత్తి చేసుకోనుంది. ‘భారత్లో సెమీకండక్టర్ మార్కెట్ 2024–25 ఆర్థిక సంవత్సరంలో సుమారు 45–50 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండగా, గత మూడేళ్లుగా వార్షికంగా 20 శాతం మేర వృద్ధి చెందుతోందని అంచనా. ఈ నేపథ్యంలో ఏఐ, ఆటోమోటివ్స్, డేటా సెంటర్స్, ఎల్రక్టానిక్స్ తయారీ ఊతంతో 2030 నాటికల్లా 120 బిలియన్ డాలర్లకు, 2035 నాటికి 300 బిలియన్ డాలర్లకు చేరొచ్చు‘ అని డెలాయిట్ పేర్కొంది. దేశీయంగా సెమీకండక్టర్ల డిమాండ్లో మొబైల్ ఫోన్లు, ఆటోమోటివ్, కంప్యూటింగ్, డేటా సెంటర్లలాంటి సెగ్మెంట్ల వాటా 70 శాతం పైగా ఉండనుంది. ఐదేళ్లలో 50 బిలియన్ డాలర్ల పెట్టుబడులు .. ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం) కింద ఇప్పటికే 10 ప్రాజెక్టుల్లోకి 19 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. వీటిలో ఎనిమిది ఔట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ ..టెస్ట్ (ఓఎస్ఏటీ) ప్లాంట్లు, ఒక సెమీకండక్టర్ ఫ్యాబ్ ఉన్నాయి. సుమారు 20–25 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో మరో 18–20 ప్రతిపాదనలు వివిధ దశల్లో ఉన్నాయి. ‘వచ్చే ఐదేళ్లలో భారత్లో సెమీకండక్టర్ పరిశ్రమలోకి మరో 50 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రావొచ్చు. అలాగే 2030–2035 మధ్య ఇంకో 75–80 బిలియన్ డాలర్లు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ వ్యవస్థ మరింతగా విస్తరిస్తుంది‘ అని నివేదిక వివరించింది. భారీగా ఉద్యోగాలు.. సెమీకండక్టర్ల వ్యవస్థ విస్తరించడంతో భారీ స్థాయిలో ఉద్యోగాల కల్పన కూడా జరగనుంది. 2035 నాటికి పరిశ్రమలో సుమారు 20 లక్షల ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉంది. ఇందులో 30% ఉద్యోగాలు తయారీ కార్యకలాపాల్లో, 30% డిజైన్ సర్వీసుల్లో, మిగతా 40 శాతం ఇతరత్రా విభాగాల్లోనూ ఉంటాయి. ఈ నేపథ్యంలో పరిశ్రమ ఏటా 4,00,000–5,00,000 మందికి పరిశ్రమ సంబంధిత కోర్సులు, నైపుణ్యాల్లో శిక్షణనివ్వాల్సి ఉంటుందని నివేదిక వివరించింది. అయితే, ఈ సానుకూల పరిణామాలన్నీ కూడా వ్యూహాలను సరిగ్గా అమలు చేయడంపైనే ఆధారపడి ఉంటాయని వివరించింది. స్థలం, యుటిలిటీలు, మౌలిక సదుపాయాలకు సింగిల్ విండో విధానాన్ని అమలు చేసేందుకు కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం మరింత మెరుగుపడాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే, వార్షికంగా బడ్జెట్లో కేటాయింపులు, నిర్దిష్ట కాలపరిమితితో కూడుకున్న ప్రోత్సాహక స్కీములకే పరిమితం కాకుండా నిధుల లభ్యతపరంగా కచ్చితత్వం ఉండేలా జాతీయ స్థాయి ప్రోగ్రాంను రూపొందించాలని సూచించింది. -
డెల్ కంపెనీ సైలెంట్గా ఇంత పని చేసిందా!!
ప్రముఖ టెక్నాలజీ సంస్థ డెల్ టెక్నాలజీస్ (Dell Technologies) సైలెంట్గా భారీ స్థాయిలో ఉద్యోగ కోతలు చేపట్టింది. 2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ తన గ్లోబల్ వర్క్ఫోర్స్ను సుమారు 11,000 తగ్గించి, మొత్తం సిబ్బందిని 108,000 నుండి 97,000కు తీసుకువచ్చింది. ఈ వివరాలు తాజాగా విడుదల చేసిన వార్షిక 10-K ఫైలింగ్లో వెల్లడయ్యాయి.కంపెనీ ఈ తొలగింపులపై పెద్దగా బహిరంగ ప్రకటన చేయకపోయినా, ఉద్యోగ విరమణ (severance) ఖర్చుల రూపంలో సుమారు 569 మిలియన్ డాలర్లు వెచ్చించినట్లు తెలిపింది. ఇది కంపెనీ అమలు చేస్తున్న “క్రమశిక్షణా వ్యయ నిర్వహణ” వ్యూహంలో భాగమని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ ఖర్చు 693 మిలియన్ డాలర్లు ఉండగా, ఈసారి తగ్గడం గమనార్హం.ఒకేసారి పెద్దఎత్తున ఉద్యోగులను తొలగించడం కాకుండా, దశలవారీగా సిబ్బందిని తగ్గించుకున్నట్లు కంపెనీ ఫైలింగ్ సూచిస్తోంది. ఖర్చులను ఆప్టిమైజ్ చేయడం, కార్యకలాపాలను ఆధునీకరించడం, ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (AI), ఎంటర్ప్రైజ్ మౌలిక సదుపాయాలపై పెట్టుబడులను పెంచడం లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కంపెనీ వెల్లడించింది.డెల్ ఉద్యోగుల సంఖ్యలో తగ్గుదల కొత్త విషయమేమీ కాదు. 2023లో సుమారు 1.33 లక్షల మంది ఉన్న డెల్ వర్క్ఫోర్స్, 2024లో 1.20 లక్షలకు, 2025లో 1.08 లక్షలకు పడిపోయింది. తాజా కోతలతో మూడు సంవత్సరాల్లో దాదాపు 27 శాతం వర్క్ఫోర్స్ తగ్గిపోయినట్లైంది.ఇక టెక్ రంగంలో మొత్తం పరిస్థితి కూడా ఇదే దిశగా సాగుతోంది. లేఆఫ్స్.ఎఫ్వైఐ డేటా ప్రకారం, 2026లో ఇప్పటివరకు 66 టెక్ కంపెనీలు కలిపి 39,000కు పైగా ఉద్యోగాలను తగ్గించాయి. మెటా ప్లాట్ఫామ్స్, అట్లాసిన్, బ్లాక్ వంటి సంస్థలు కూడా ఏఐ ఆధారిత మార్పుల దిశగా ఉద్యోగ కోతలు చేపడుతున్నాయి. -
భారత్లో పాగా వేసేందుకు అమెజాన్ దూకుడు!
భారతీయ శాటిలైట్ ఇంటర్నెట్ కమ్యునికేషన్ (శాట్కామ్) విభాగంలో ఆధిపత్యం కోసం ప్రపంచ దిగ్గజ కంపెనీల మధ్య పోటీ ముదురుతోంది. ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ ఇప్పటికే రేసులో ముందంజలో ఉండగా జెఫ్ బెజోస్ నేతృత్వంలోని అమెజాన్ తన ‘ప్రాజెక్ట్ కూపర్’ కోసం అనుమతులను వేగవంతం చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరుతోంది. ఈ మేరకు అమెజాన్ ప్రతినిధులు భారత టెలికాం శాఖ (డాట్)ను సంప్రదించినట్లు తెలుస్తోంది.అనుమతుల కోసం..భారత్లో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలను ప్రారంభించేందుకు అవసరమైన గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ (జీఎంపీసీఎస్) లైసెన్స్ కోసం అమెజాన్ గత కొంతకాలంగా వేచి చూస్తోంది. ఇతర పోటీదారులతో పోలిస్తే అనుమతుల ప్రక్రియలో జాప్యం జరుగుతుండటంతో దీన్ని వేగవంతం చేయాలని కోరుతూ అమెజాన్ వరుస లేఖలు రాసినట్లు సమాచారం.స్టార్లింక్ వర్సెస్ కూపర్ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో పాగా వేయడమే కాకుండా భారత్లో కూడా అనుమతుల ప్రక్రియలో తుది దశకు చేరుకుంది. స్టార్లింక్తో పోలిస్తే అమెజాన్ తన సాటిలైట్ లాంచింగ్ షెడ్యూల్లో కొంత వెనుకబడి ఉంది. ఈ గ్యాప్ను భర్తీ చేయడానికి, భారతీయ వినియోగదారులకు త్వరగా చేరువ కావడానికి అమెజాన్ వేగంగా చర్యలు చేపడుతోంది.భారీ కెపాసిటీతో సవాలుస్టార్లింక్ సేవలతో పోలిస్తే తమ శాటిలైట్ నెట్వర్క్ భారత్లో గణనీయమైన స్థాయిలో డేటా కెపాసిటీని అందించగలదని అమెజాన్ ధీమా వ్యక్తం చేస్తోంది. వేగవంతమైన ఇంటర్నెట్, నిరంతర కనెక్టివిటీ విషయంలో స్టార్లింక్కు గట్టి పోటీ ఇస్తామని కంపెనీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది.టెలికాం రంగంలో కొత్త విప్లవంకేవలం నగరాలకే పరిమితం కాకుండా మారుమూల గ్రామాలకు, ఇంటర్నెట్ సదుపాయం లేని ప్రాంతాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించడమే లక్ష్యంగా ప్రాజెక్ట్ కూపర్ పనిచేస్తోంది. అయితే, స్పెక్ట్రమ్ కేటాయింపులు, ధరల విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే ఈ కంపెనీల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.భారత ప్రభుత్వం ఇప్పటికే స్పెక్ట్రమ్ కేటాయింపులను వేలం ద్వారా కాకుండా అడ్మినిస్ట్రేటివ్ పద్ధతిలో కేటాయించాలని నిర్ణయించడంతో అంతర్జాతీయ సంస్థలకు సానుకూల వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో అమెజాన్ ఎంత త్వరగా లైసెన్స్ పొందుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ అమెజాన్ రంగంలోకి దిగితే ధరల యుద్ధం మొదలై అంతిమంగా భారతీయ వినియోగదారులకే మేలు జరుగుతుందని కొందరు మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఏఎంఐ ల్యాబ్స్తో ఓఎక్స్ఎంఐక్యూ ల్యాబ్స్ జట్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పునరుత్పాదక విద్యుత్తో నడిచే అతి పెద్ద ఏఐ ఆధారిత కంప్యూట్ ప్లాట్ఫాంను నిర్మించేందుకు ఏఎం ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ (ఏఎంఐ)తో ఓఎక్స్ఎంఐక్యూ ల్యాబ్స్ జట్టు కట్టింది. ఈ ఒప్పందం ప్రకారం నోయిడాలో ప్రాథమికంగా 1 గిగావాట్ ఏఐ కంప్యూట్ హబ్ను ఏర్పాటు చేస్తారు. 2030 నాటికి దీన్ని 2 గిగావాట్ల స్థాయికి విస్తరిస్తారు. దీని విద్యుత్ వ్యయాలు సంప్రదాయ డేటా సెంటర్ విద్యుత్ వ్యయాలతో పోలిస్తే 50–70 శాతం తక్కువగా ఉండనున్నాయి.ఈ ఒప్పందం కింద కంప్యూట్ ప్లాట్ఫాంకి సంబంధించి ఆర్కిటెక్చర్, ఇంజినీరింగ్ భాగస్వామిగా ఓఎక్స్ఎంఐక్యూ వ్యవహరిస్తుంది. ఆర్కిటెక్చర్, హార్డ్వేర్ రోడ్మ్యాప్, సప్లై చెయిన్ వ్యూహాలను డిజైన్ చేయడంలో ఏఎంఐ ల్యాబ్స్తో కలిసి పని చేస్తుంది. ఇప్పటికే తొలి దశ పనులు ప్రారంభం కాగా, 2027 నాటికి ప్రాథమిక కంప్యూట్ సామర్థ్యం అందుబాటులోకి రానుంది.పర్యావరణహిత విద్యుత్ దిగ్గజం గ్రీన్కో మాతృ సంస్థ ఏఎం గ్రూప్లో ఏఎంఐ ల్యాబ్స్ భాగంగా ఉంది. జీపీయూ ఆర్కిటెక్చర్, ఏఐ టెక్నాలజీ కంపెనీ అయిన ఓఎక్స్ఎంఐక్యూ ల్యాబ్స్ని రాజా కోడూరి ఏర్పాటు చేశారు. సిలికాన్ వేలీ కంపెనీలకు సేవలందిస్తున్న ఓఎక్స్ఎంఐక్యూ అనుభవం తమకు ఉపకరిస్తుందని ఏఎం గ్రూప్ చైర్మన్ అనిల్ చలమలశెట్టి తెలిపారు. ఏఎంఐ ల్యాబ్స్ తమకు సరైన భాగస్వామి అని రాజా కోడూరి తెలిపారు. -
లక్షన్నర జీతం.. రూ.15 వేలు కూడా మిగల్లేదు!
బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో అధిక జీతాలు ఉన్నప్పటికీ, పెరుగుతున్న జీవన వ్యయం కారణంగా నెలాఖరుకు పెద్దగా పొదుపు మిగలకపోవడం చాలా మంది ఉద్యోగుల వాస్తవ పరిస్థితిగా మారుతోంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక పోస్టు ఈ పరిస్థితిని స్పష్టంగా చూపించింది.తన బంధువు అనుభవాన్ని సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’(గతంలో ట్విట్టర్)లో ఓ యూజర్ పంచుకున్నారు. కంప్యూటర్ సైన్స్లో పట్టభద్రుడైన అతని బంధువు మొదటి సాఫ్ట్వేర్ డెవలపర్ ఉద్యోగం కోసం నెలకు రూ.1.5 లక్షల జీతంతో బెంగళూరుకు వెళ్లాడని చెప్పారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు అతను పెద్ద విజయాన్ని సాధించాడని భావించినప్పటికీ, కొన్ని నెలల తర్వాత నగర జీవన వ్యయం ఎంత భారంగా ఉంటుందో అతనికి అర్థమైంది.వచ్చే జీతంలో దేనికి ఎంత ఖర్చు అవుతోందన్నది ఆయన వివరంగా తన పోస్ట్లో రాసుకొచ్చారు. ఇంటి అద్దె: ఆఫీస్కు సమీపంలోని చిన్న అపార్ట్మెంట్కు సుమారు రూ.36,000కిరాణా సామాగ్రి: రూ.13,000 – రూ.15,000ప్రయాణ ఖర్చులు: ట్రాఫిక్ కారణంగా క్యాబ్లు, ఆటోల కోసం రూ.6,000 – రూ.8,000ఇతర ఖర్చులు: ఆన్లైన్ ఫుడ్, కాఫీ, వీకెండ్ విహారాలు కోసం రూ.10,000 – రూ.12,000ఇవి కాకుండా సబ్స్క్రిప్షన్లు, వైద్య ఖర్చులు, అనుకోని బిల్లులు, అలాగే ఇంటికి డబ్బు పంపడం వంటి ఖర్చులు కూడా ఉంటాయని పేర్కొన్నారు. ఈ అన్ని ఖర్చుల తర్వాత నెలాఖరుకు అతనికి కేవలం రూ.15,000 నుంచి రూ.20,000 వరకు మాత్రమే పొదుపు మిగులుతుందని తెలిపారు.ఈ అనుభవం ద్వారా అతను ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహించాడని పోస్టులో పేర్కొన్నారు. “సొంతూరులో నెలకు రూ.1 లక్షకుపైగా జీతం చాలా పెద్దదిగా అనిపిస్తుంది. కానీ బెంగళూరు వంటి మెట్రో నగరంలో అదే జీతం కేవలం ప్రారంభ స్థాయి మాత్రమే” అని వ్యాఖ్యానించారు.సోషల్ మీడియాలో భిన్న స్పందనలుఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వేలల్లో వ్యూస్, వందలాది లైక్లను సాధించింది. చాలా మంది నెటిజన్లు తమ అనుభవాలను కూడా పంచుకున్నారు. “సొంతూరులో అదే జీతంతో ఎక్కువగా పొదుపు చేయవచ్చు”, “పెద్ద నగరాలు మీకు తెలియకుండానే డబ్బును వేగంగా ఖర్చు చేయిస్తాయి” అని కొందరు వ్యాఖ్యానించగా “సరైన ఎంపికలు చేస్తే ఖర్చులను నియంత్రించుకోవచ్చు” అని మరో యూజర్ కామెంట్ చేశారు. -
అంతర్జాతీయ చెల్లింపుల్లో ఫిన్టెక్ స్టార్టప్ల దూకుడు
భారతీయ సాఫ్ట్వేర్ సర్వీసులు, ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో గిరాకీ పెరుగుతోంది. ఈ తరుణంలో నగదు లావాదేవీలు సులభతరం చేసే ప్రక్రియ వేగవంతం అవుతోంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న సంక్లిష్టమైన బ్యాంకింగ్ వ్యవస్థల స్థానంలో స్వదేశీ ఫిన్టెక్ స్టార్టప్లు అత్యంత సులభమైన, పారదర్శకమైన సాంకేతిక వేదికలను అందుబాటులోకి తెస్తున్నాయి.పాత పద్ధతులకు స్వస్తి..గతంలో అంతర్జాతీయ చెల్లింపులంటే స్విఫ్ట్ వంటి సాంకేతికతపై ఆధారపడాల్సి వచ్చేది. నగదు చేరడానికి అనేక మధ్యవర్తిత్వ బ్యాంకుల గుండా ప్రయాణించాల్సి రావడం వల్ల రోజుల కొద్దీ సమయం పట్టడమే కాకుండా, భారీగా చార్జీలు వసూలయ్యేవి. ఇది పెద్ద కంపెనీలకు భారంగా అనిపించకపోయినా చిన్న ఎగుమతిదారులు, ఫ్రీలాన్సర్లు, ఎస్ఎంఈలకు పెద్ద సవాలుగా ఉండేది.ప్రస్తుతం ఫిన్టెక్ సంస్థలు సాఫ్ట్వేర్ ఆధారిత మౌలిక సదుపాయాలను రూపొందించడం ద్వారా ఈ అంతరాన్ని పూడుస్తున్నాయి. దీనివల్ల విదేశీ మారక ద్రవ్య నిర్వహణ, నియంత్రణ సంస్థల నిబంధనల అమలు ఆటోమేషన్ ద్వారా సులభతరం అవుతున్నాయి.గ్లోబల్ మార్కెట్లో భారతీయ ముద్ర‘అంతర్జాతీయ వాణిజ్యం ఇప్పుడు కేవలం కార్పొరేట్ దిగ్గజాలకే పరిమితం కాలేదు. ఈ విభాగంలో స్టార్టప్ కంపెనీలు సులభంగా సర్వీసులు అందిస్తున్నాయి’ అని రేజర్పే సీఓఓ రాహుల్ కొఠారి విశ్లేషించారు. సాస్ సంస్థల నుంచి ఇ-కామర్స్ బ్రాండ్ల వరకు అన్నీ అంతర్జాతీయ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుంటున్నాయని చెప్పారు. రేజర్పే ప్రస్తుతం 130కి పైగా కరెన్సీల్లో చెల్లింపులను అనుమతిస్తోందన్నారు.ఎయిర్బీఎన్బీ, షాపిఫై వంటి గ్లోబల్ బ్రాండ్లతో పాటు ఆకాశా ఎయిర్, హౌస్ ఆఫ్ మసాబా వంటి భారతీయ బ్రాండ్లు కూడా వీటి సేవలను వినియోగిస్తున్నాయి. క్రాస్-బోర్డర్(విదేశాలు) విభాగంలో లావాదేవీలు జరిపే వినియోగదారుల సంఖ్య రెట్టింపు అవుతోంది.నమ్మకమే పెట్టుబడి..విదేశీ కస్టమర్లు తమకు అలవాటైన యాపిల్ పే లేదా అంతర్జాతీయ క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేసే వెసులుబాటు కల్పించడం వల్ల వ్యాపారాలు మెరుగుపడుతున్నాయని క్యాష్ఫ్రీ సీఈఓ ఆకాష్ సిన్హా తెలిపారు. ‘భారతదేశంలో అంతర్జాతీయ కార్డు లావాదేవీలు విఫలమయ్యే రేటు 35-40% వరకు ఉంటుంది. కానీ యూపీఐ, రూపే వంటి స్థానిక పద్ధతులను అనుసంధానించడం ద్వారా సక్సెస్ రేటును పెంచగలిగాం’ అని చెప్పారు.ఎగుమతిదారులకు భరోసాఫ్రీలాన్సర్లు, చిన్న ఎగుమతిదారుల కోసం స్కైడో సంస్థ ప్రత్యేక సేవలను అందిస్తోంది. ఎగుమతి చేసిన తర్వాత బ్యాంకుల నుంచి పొందాల్సిన ఫిరా(ఫారెన్ ఇన్వార్డ్ రెమిటెన్స్ అడ్వైజ్) వంటి పత్రాల సేకరణను ఈ సంస్థ సులభతరం చేస్తోంది. ప్రస్తుతం స్కైడో ఏడాదికి సుమారు 1 బిలియన్ డాలర్ల విలువైన లావాదేవీలను నిర్వహిస్తోంది. వస్త్రాలు, ప్రాసెస్ చేసిన ఆహారం, గృహాలంకరణ వస్తువుల ఎగుమతిదారులు ఈ ప్లాట్ఫామ్ను ఎక్కువగా వినియోగిస్తున్నారు.ఆర్బీఐ వెన్నుదన్నుభారత రిజర్వ్ బ్యాంక్ ప్రవేశపెట్టిన పేమెంట్ అగ్రిగేటర్–క్రాస్ బోర్డర్ నిబంధనలు ఈ రంగానికి కొత్త ఊపిరి పోశాయి. ఈ ఫ్రేమ్వర్క్ వల్ల ఫిన్టెక్ సంస్థలకు స్పష్టమైన గుర్తింపు లభించడమే కాకుండా బ్యాంకులపై పూర్తిస్థాయి ఆధారపడటం తగ్గింది. భవిష్యత్తులో ఈ సంస్థలు కేవలం చెల్లింపులకే పరిమితం కాకుండా గ్లోబల్ బిజినెస్లకు అవసరమైన పూర్తిస్థాయి ఫైనాన్షియల్ ఆపరేటింగ్ సిస్టమ్గా ఎదగాలని ప్లాన్ చేస్తున్నాయి.ఇదీ చదవండి: యుద్ధం.. ఆయుధ ఎగుమతిదారులకు కాసుల వర్షం -
వెలుగుల భారత్కు ‘రామన్న’ పవర్
(ఇండోర్ నుంచి సాక్షి ప్రతినిధి) సాక్షి,అమరావతి: మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో ఉన్న రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ (ఆర్ఆర్ కాట్) దేశంలోని విద్యుత్ రంగ అభివృద్ధికి అత్యంత ముఖ్యమైన పరిశోధన కేంద్రంగా నిలుస్తోంది. ఈ సంస్థ అణు విద్యుత్ ఉత్పత్తి, విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యం పెంపు, ఆధునిక శక్తి సాంకేతికతల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. త్వరలోనే విశాఖపట్నంలోనూ కార్యకలాపాలు విస్తరిస్తోంది. సెన్సార్ల ద్వారా రైలు ప్రమాదాలను నివారించడంతోపాటు ప్రతిక్షణం పర్యవేక్షించే సాంకేతికతను తయారు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ కాట్ సాంకేతికత అభివృద్ధి, సహాయం డైరెక్టర్ డాక్టర్ జిష్ణు ద్వివేది, ఆర్ఆర్క్యాట్లో ఆవిష్కరణలు, వ్యాపార ప్రారంభాలను ప్రోత్సహించే అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ (ఏఐసీ పీఐఈ హబ్) డైరెక్టర్ డాక్టర్ క్రైస్ట్ ప్రకాష్ పాల్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్లోని ఇండోర్ వెళ్లిన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు వారి మాటల్లోనే..ఆధునిక సాంకేతికతతో అణు విద్యుత్ ఉత్పత్తి దేశంలో అణు విద్యుత్ ఉత్పత్తిని పెంచడానికి అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో ఆర్ఆర్ కాట్ ముందంజలో ఉంది. అణు విద్యుత్ కేంద్రాల్లో ఉపయోగించే అధునాతన యాక్సిలరేటర్లు, లేజర్ పరికరాలు, సూపర్ కండక్టింగ్ టెక్నాలజీలను ఈ కేంద్రం అభివృద్ధి చేసింది. ఈ సాంకేతికతలు కమ్యూనికేషన్స్, పరిశ్రమలు, వైద్య రంగాల్లో ఉపయోగపడుతున్నాయి. అణు రియాక్టర్ల పనితీరు మరింత సమర్థవంతంగా మారి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతోంది. అలాగే రియాక్టర్ల భద్రతా ప్రమాణాలు కూడా మెరుగుపడుతున్నాయి. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఉపయోగించే పరికరాలు అధిక ఉష్ణోగ్రతలు, ఒత్తిడిని తట్టుకోవాలి. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ కాట్లో అభివృద్ధి చేసిన మెటీరియల్ సైన్స్, టెక్నాలజీ విద్యుత్ ప్లాంట్ల పరికరాల నాణ్యతను పెంచుతున్నాయి. అత్యాధునిక పదార్థాలతో తయారైన పరికరాలు ఎక్కువ కాలం పనిచేయడమే కాకుండా నిర్వహణ ఖర్చులను కూడా తగ్గిస్తున్నాయి. ముందుగానే లోపాలు గుర్తించే టెక్నాలజీ విద్యుత్ కేంద్రాల్లో పరికరాల లోపాలు ముందుగానే గుర్తించడానికి ఆర్ఆర్ కాట్ రూపొందించిన ఆధునిక లేజర్, డయాగ్నస్టిక్ టెక్నాలజీలు ఉపయోగపడుతున్నాయి. ఈ సాంకేతికతల ద్వారా విద్యుత్ ప్లాంట్లలో జరిగే లోపాలను త్వరగా గుర్తించి సరిచేయడం సాధ్యమవుతుంది. దీంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడం వంటి సమస్యలు తగ్గుతాయి. అణు విద్యుత్ మాత్రమే కాకుండా పునరుత్పాదక శక్తి రంగంలో కూడా ఆర్ఆర్ కాట్ పరిశోధనలు కొనసాగిస్తోంది. ముఖ్యంగా సౌర శక్తి ఉత్పత్తి కోసం ఉపయోగించే అధునాతన పరికరాల అభివృద్ధిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.ఈ టెక్నాలజీలు భవిష్యత్లో సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడతాయి. ఆర్ఆర్ కాట్లో అభివృద్ధి చేసిన పలు టెక్నాలజీలు విద్యుత్ రంగానికి సంబంధించిన పరిశ్రమలకు కూడా ఉపయోగపడుతున్నాయి. విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, పరికరాల తయారీ, నిర్వహణలో ఈ టెక్నాలజీలను ఉపయోగిస్తున్నారు. దేశంలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో శక్తి ఉత్పత్తి వ్యవస్థలను మరింత సమర్థంగా నిర్వహించడం చాలా అవసరం. ఈ దిశగా ఇక్కడి కేంద్రంలో జరుగుతున్న పరిశోధనలు దేశ విద్యుత్ భద్రతకు అండగా నిలుస్తున్నాయి. -
‘అసలుకు అచ్చుగుద్దినట్లు చేస్తే ఊరుకోం’
ప్రపంచవ్యాప్తంగా టిక్టాక్, క్యాప్కట్ వంటి యాప్లతో సంచలనం సృష్టించిన చైనా కంపెనీ ‘బైట్డ్యాన్స్’కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తన ప్రతిష్టాత్మకమైన ఏఐ వీడియో జనరేషన్ మోడల్ ‘సీడ్యాన్స్ 2.0’ గ్లోబల్ లాంచ్ను కంపెనీ నిరవధికంగా నిలిపివేసింది. హాలీవుడ్ అగ్రశ్రేణి నిర్మాణ సంస్థల నుంచి కాపీరైట్ ఉల్లంఘన నోటీసులు రావడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది.వివాదానికి కారణం ఇదే..సీడ్యాన్స్ 2.0 సృష్టించే వీడియోలు అచ్చం హాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రాలను తలపిస్తున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని క్లిప్స్ చిత్ర పరిశ్రమను విస్మయానికి గురిచేశాయి. అందులో హాలీవుడ్ నటులు బ్రాడ్ పిట్, టామ్ క్రూజ్ మధ్య జరిగిన పోరాట దృశ్యాలు రియలిస్టిక్గా ఉన్నాయి. ఐకానిక్ క్యారెక్టర్లుగా పేరున్న స్పైడర్ మ్యాన్, వెనమ్ వంటి సూపర్ హీరోలతో పాటు ప్రముఖ యానిమేషన్ క్లిప్లను ఈ ఏఐ మోడల్ అత్యంత నాణ్యతతో సృష్టించింది.దాంతో తమ మేధో సంపత్తిని అనుమతి లేకుండా ఈ మోడల్కు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించారని హాలీవుడ్ స్టూడియోలు మండిపడుతున్నాయి.హాలీవుడ్ దిగ్గజాల ధ్వజంప్రముఖ నిర్మాణ సంస్థ డిస్నీ గత నెలలోనే బైట్డ్యాన్స్కు ‘సీజ్ అండ్ డెసిస్ట్’ (నిలిపివేత) లేఖను పంపింది. తమ కంటెంట్ను అనుమతి లేకుండా వాడుకున్నారని డిస్నీ ఆరోపించింది. మరోవైపు, పారామౌంట్ స్కైడాన్స్ సైతం రంగంలోకి దిగింది. ‘స్టార్ ట్రెక్, ది గాడ్ ఫాదర్, సౌత్ పార్క్ వంటి మా ఐకానిక్ చిత్రాల హక్కులను బైట్డ్యాన్స్ ఉల్లంఘించింది’ అని పారామౌంట్ స్పష్టం చేసింది.సీడ్యాన్స్ 2.0 ప్రస్తుతం చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ప్లాట్ఫామ్ను ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకింగ్, ఇ-కామర్స్, అడ్వర్టైజింగ్ రంగాల్లో విప్లవాత్మక మార్పుల కోసం రూపొందించారు. ఒకవేళ ఇది గ్లోబల్ మార్కెట్లోకి వస్తే హాలీవుడ్ ఉనికికే ప్రమాదమని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: యుద్ధం.. ఆయుధ ఎగుమతిదారులకు కాసుల వర్షం -
ఏసీ క్లీనింగ్ ఇలా ఈజీ!
మార్చి నెల.. ఎండ... ఉక్కపోతను తట్టుకోవాలంటే ఏసీ ఆన్ చేయాల్సిందే. అయితే నెలల తరబడి వాడకుండా వదిలేసిన ఏసీని ఇప్పుడు సడెన్గా ఆన్ చేస్తే గది త్వరగా చల్లబడదు. పోనీ సర్వీసింగ్ కోసం టెక్నీషియన్ను పిలుద్దామంటే బోలెడంత ఖర్చు. అయితే ఎలాంటి ప్రొఫెషనల్ టూల్స్ అవసరం లేకుండానే, కేవలం ఓ పాత టూత్ బ్రష్, కొద్దిగా నీళ్లతో మీ ఏసీని మీ చేతులతోనే కొత్తదానిలా క్లీన్ చేసుకోవచ్చు.క్లీనింగ్ మొదలుపెట్టే ముందు ఏసీ పవర్ ఆఫ్ చేసి, ప్లగ్ తీసేయడం మరచిపోవద్దు. కరెంట్, నీళ్లు కలిస్తే చాలా ప్రమాదం కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించాలి.స్టెప్ 1: ఫిల్టర్లతో మొదలుపెట్టాలి. విండో ఏసీ అయినా, స్ప్లిట్ ఏసీ అయినా ఫ్రంట్ కవర్ ఓపెన్ చేయగానే మెష్ ఫిల్టర్లు కనిపిస్తాయి. గదిలోని దుమ్ము, చెత్తాచెదారాన్ని ఇవే ఆపుతాయి. వీటిని బయటకు తీసి ట్యాప్ కింద పెట్టి ఫోర్స్గా వచ్చే నీటితో శుభ్రంగా కడగాలి. డస్ట్ అంతా పోయి ఫిల్టర్లు పారదర్శకంగా కనిపించేలా కడిగాక పక్కన ఆరబెట్టాలి. ఈ ఒక్క పనితోనే సగం గాలి ఫ్రీగా వస్తుంది.స్టెప్ 2: కాయిల్స్ క్లీనింగ్: ఫిల్టర్ల వెనుక అల్యూమినియంతో చేసిన సన్నటి కూలింగ్ కాయిల్స్ (ఫిన్స్) ఉంటాయి. చల్లటి గాలి వచ్చేది అక్కడి నుంచే కాబట్టి వీటి క్లీనింగ్ జాగ్రత్తగా చేయాలి. ఇందుకోసం పాత టూత్బ్రష్ను నీళ్లలో ముంచి, ఈ కాయిల్స్పై పైనుంచి కిందకు సున్నితంగా రుద్దాలి. బ్రష్ను మధ్యమధ్యలో నీళ్లలో కడుగుతూ మురికిని తొలగించాలి. గట్టిగా రుద్దితే ఆ సన్నటి కాయిల్స్ వంగిపోయే ప్రమాదం ఉంది, కాబట్టి పైపైన మెల్లగా క్లీన్ చేయాలి.స్టెప్ 3: విండో, ఔట్డోర్ యూనిట్ క్లీనింగ్: మీది విండో ఏసీ అయితే, వెనుక వైపు కూడా కాయిల్స్ ఉంటాయి. వాటర్ పైపుతో ఆ కాయిల్స్పై నీళ్లు కొడుతూ మురికిని కడిగేయాలి. లోపలి మోటార్పై నీళ్లు పడకుండా జాగ్రత్త పడాలి. స్ప్లిట్ ఏసీ (Splict AC) అయితే.. బయట డాబా మీద లేదా గోడకు ఉండే ఔట్డోర్ యూనిట్ను క్లీన్ చేయాలి. దీని చుట్టూ పేరుకుపోయిన దుమ్ము, బూజును వాటర్ పైపుతో ఫోర్స్గా కొట్టి క్లీన్ చేయాలి. ఇది శుభ్రంగా ఉంటే ఏసీ వేడిని ఈజీగా బయటకు పంపుతుంది.స్టెప్ 4: ఆరేదాకా వెయిట్ చేయాలి: క్లీనింగ్ అంతా అయిపోయిన వెంటనే ఏసీ ఆన్ చేయకూడదు. ఎందుకంటే లోపల నీటి తడి అలాగే ఉంటుంది కాబట్టి కనీసం గంటన్నర పాటు దాన్ని గాలికి ఆరనివ్వాలి. పూర్తిగా ఆరిన తర్వాతే ప్లగ్ పెట్టి ఆన్ చేయాలి. ఇప్పుడు ఏసీ ఆన్ చేస్తే... గాలి ఫ్లో, కూలింగ్ ఎఫెక్ట్ మీకే అర్థమవుతుంది. ఈ సాఫ్ట్ సర్వీసింగ్తో ఏసీ కూలింగ్ పెరగడం ఖాయం. అయితే ఇది టెక్నీషియన్ చేసే పనికి ప్రత్యామ్నాయం కాదు. ఏసీలో గ్యాస్, ఇతరత్రా ఏమైనా పార్టులు పోతే టెక్నీషియన్ రావలసిందే! చదవండి: ఇల్లు కొనాలంటే ఈ వసతులు ఉండాల్సిందే -
వాట్సాప్లో కొత్త ఫీచర్.. పేరెంట్ మేనెజ్డ్ అకౌంట్
వాట్సాప్ చిన్న పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని.. ఒక కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. ఇది ముఖ్యంగా 13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం రూపొందించిన 'పేరెంట్ మేనెజ్డ్ అకౌంట్'. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.గతంలో వాట్సాప్ను పిల్లలు కూడా పెద్దవాళ్ల మాదిరిగానే ఉపయోగించేవారు. అప్పుడు తల్లిదండ్రులకు వారి చాట్స్ లేదా కాంటాక్ట్స్పై ఎక్కువ నియంత్రణ ఉండేది కాదు. ఇప్పుడు వచ్చిన పేరెంట్ మేనెజ్డ్ అకౌంట్ ద్వారా తల్లిదండ్రులు నేరుగా పిల్లల ఖాతాను పర్యవేక్షించవచ్చు. ఎవరు పిల్లలకు మెసేజ్ చేయాలి, ఏ గ్రూపుల్లో చేరాలి, ప్రైవసీ సెట్టింగ్స్ ఎలా ఉండాలి వంటి విషయాలను తల్లిదండ్రులు నిర్ణయించవచ్చు.పేరెంట్ మేనెజ్డ్ అకౌంట్ సెటప్● ముందుగా పిల్లల ఫోన్లో వాట్సాప్ యాప్ను ఇన్స్టాల్ చేయాలి. ● తరువాత యాప్ను ఓపెన్ చేసి భాషను ఎంచుకుని అగ్రీ అండ్ కంటిన్యూ అనే ఎంపికపై క్లిక్ చేయాలి.● తరువాత మోర్ ఆప్షన్స్లోకి వెళ్లి.. క్రియేట్ పేరెంట్ మేనెజ్డ్ అకౌంట్ అనే ఎంపికను ఎంచుకోవాలి● పిల్లల ఫోన్ నంబర్ను నమోదు చేసి వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి.● తరువాత పిల్లల పుట్టిన తేదీ నమోదు చేయాలి. దీని ద్వారానే వారి వయస్సు 13 సంవత్సరాల కంటే తక్కువ అని వాట్సాప్ నిర్ధారిస్తుంది.● ఇవన్నీ పూర్తయిన తరువాత.. పిల్లల ఖాతాను తల్లిదండ్రుల ఖాతాతో లింక్ చేయడానికి కంటిన్యూపై క్లిక్ చేయాలి.పిల్లల ఖాతాతో ఎలా లింక్ చేయాలిపిల్లల ఫోన్ స్క్రీన్పై ఒక QR కోడ్ కనిపిస్తుంది. తల్లిదండ్రుల ఫోన్తో ఆ కోడ్ను స్కాన్ చేయాలి. ఆ తరువాత వాట్సాప్ తల్లిదండ్రుల పర్యవేక్షణను నిర్ధారించడానికి అగ్రీ అండ్ కంటిన్యూ అనే ఎంపికను చూపిస్తుంది. తరువాత తల్లిదండ్రులు ఒక 6 అంకెల పేరెంట్ పిన్ సెట్ చేసుకోవాలిసెట్ చేయాలి. ఈ పిన్ ద్వారా మాత్రమే పిల్లల ఖాతాకు సంబంధించిన ప్రైవసీ & సేఫ్టీ సెట్టింగ్స్ను మార్చగలుగుతారు. ఈ పిన్ నెంబరును పిల్లలతో షేర్ చేసుకోకూడదు. -
ఏఐ వైద్యం.. జాగ్రత్త సుమీ!
ఇటీవలికాలం వరకు సందేశాలకు, సెర్చ్ ఇంజిన్లకు మాత్రమే పరిమితమైన మీ స్మార్ట్ ఫోన్.. ఏఐ పుణ్యామా అని విభిన్న పనులకు ఉపయోగపడుతోంది. ప్రస్తుతం ఏఐ మీ నాడిచూసి, గుండె వేగం నుంచి ఆసుపత్రి రిపోర్టుల వరకు అన్నింటినీ విశ్లేషించడానికి సిద్ధమవుతోంది. మైక్రోసాఫ్ట్ తన ఏఐ చాట్బాట్ కోపైలట్ ద్వారా తీసుకువచ్చిన కొత్త హెల్త్ ఫీచర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమెజాన్, ఓపెన్ఏఐ చాట్జీపీటీ , ఆంత్రోపిక్ వంటి సంస్థలు కూడా ఇదే బాటలో నడుస్తుండటంతో ఆరోగ్య సంరక్షణ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త విప్లవానికి నాంది పలుకుతోందా లేక ఆరోగ్య రికార్డుల గోప్యతకు నీళ్లు వదులుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.ఏమిటీ మైక్రోసాఫ్ట్ కోపైలట్ హెల్త్ ఫీచర్?మైక్రోసాఫ్ట్ తాజాగా ఆవిష్కరించిన ఈ టూల్ వినియోగదారులు తమ ఆరోగ్య రికార్డులను నేరుగా చాట్బాట్తో పంచుకోవడానికి అనుమతిస్తుంది. యాపిల్ వాచ్, ఫిట్బిట్, స్లీప్ ట్రాకర్ వంటి పరికరాల నుంచి సేకరించిన ఫిట్నెస్ డేటాను ఇది విశ్లేషిస్తుంది.వివిధ ఆసుపత్రుల రికార్డులను కలిపి వినియోగదారుడికి ఉన్న ఆరోగ్య సమస్యలపై నిమిషంలో పూర్తి సమచారాన్ని అందిస్తుంది.‘నేను సరిగ్గా నిద్రపోవడం లేదు’ అని మీరు చాట్బాట్తో అంటే చాలు.. మీ పాత మెడికల్ రిపోర్టులను, స్లీప్ ట్రాకర్ డేటాను పరిశీలించి అది మీకు ఉన్న నిద్రలేమి లేదా డయాబెటిస్ వంటి ముప్పులను హెచ్చరిస్తుంది. ప్రస్తుతానికి ఉచితంగా అందుబాటులోకి రానున్న ఈ సేవలకు భవిష్యత్తులో సబ్స్క్రిప్షన్ ఫీజు వసూలు చేయాలని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది.ప్రయోజనాలు..సాధారణంగా ఒక రోగి వివిధ వైద్యులను సంప్రదించినప్పుడు వారి రికార్డులు వేర్వేరు డేటాబేస్ల్లో ఉంటాయి. ఒక జనరల్ ఫిజీషియన్ రోగి గత చరిత్రను అర్థం చేసుకోవడానికి గంటల సమయం పడుతుంది. మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగం హెల్త్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ డొమినిక్ కింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏఐ సెకన్లలోనే సంక్లిష్టమైన రికార్డులను విశ్లేషిస్తుంది. పెరుగుతున్న వైద్య ఖర్చుల దృష్ట్యా సామాన్యులకు ఇది తక్కువ ఖర్చుతో కూడిన ప్రాథమిక విశ్లేషణ సాధనంగా ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.నష్టాలు లేవా?టెక్ కంపెనీల చేతికి అత్యంత సున్నితమైన ఆరోగ్య డేటా వెళ్లడంపై సైబర్ భద్రతా నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ఆరోగ్య రికార్డులన్నీ ఒకే చోట కేంద్రీకృతమై ఉంటే అవి సైబర్ నేరగాళ్లకు ప్రధాన లక్ష్యంగా మారుతాయి’ అని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మాథ్యూ గ్రీన్ హెచ్చరించారు. అమెరికా వంటి దేశాల్లో రోగి గోప్యతను కాపాడే ‘హిప్పా’ చట్టాలు సాంప్రదాయ ఆసుపత్రులకు వర్తిస్తాయి కానీ, ఈ టెక్ కంపెనీలకు వర్తించవు. దీనివల్ల కంపెనీలు రోగుల డేటాను ప్రకటనల కోసం లేదా తమ ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి వాడుకునే ప్రమాదం ఉంది. గర్భస్రావాలపై నిషేధం ఉన్న ప్రాంతాల్లో మహిళల పునరుత్పత్తి ఆరోగ్య రికార్డులను కొన్ని సంస్థలు టెక్ కంపెనీల నుంచి సులభంగా పొందే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.ఏఐ వైద్యుడికి ప్రత్యామ్నాయమా?మైక్రోసాఫ్ట్ స్వయంగా ఒక గమనికను(Disclaimer) తెలియజేసింది. ఈ చాట్బాట్ కేవలం సమాచార విశ్లేషణకు మాత్రమేనని, ఇది వైద్యుడి స్థానాన్ని భర్తీ చేయదని స్పష్టం చేసింది. వ్యాధులను నిర్ధారించడానికి లేదా చికిత్స చేయడానికి దీన్ని ప్రామాణికంగా తీసుకోకూడదని సూచించింది. అయితే ఏఐ ఇచ్చే తప్పుడు సమాచారం వల్ల అనవసరమైన ఆందోళన చెంది ప్రజలు ఆసుపత్రులకు పరుగులు తీసే ప్రమాదం కూడా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: దిగొస్తున్న పసిడి ధరలు.. వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే.. -
విద్వేష ప్రసంగాలకు చెక్ పెట్టే ‘హోడియో’!
సోషల్ మీడియా వేదికలపై విచ్చలవిడిగా సాగుతున్న విద్వేషపూరిత ప్రసంగాలకు (హేట్ స్పీచ్) అడ్డుకట్ట వేసేలా స్పెయిన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లను నడిపే టెక్ దిగ్గజాలను జవాబుదారీలుగా చేసే దిశగా స్పెయిన్ సంచలన నిర్ణయం తీసుకుంది. డిజిటల్ వేదికలపై ఏ స్థాయిలో ఈ ప్రసంగాలు విస్తరిస్తున్నాయో లెక్కగట్టేందుకు ‘హోడియో’ (Hodio) అనే టెక్నాలజీ టూల్ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రధాని పెడ్రో సాంచెజ్ ప్రకటించారు. మాడ్రిడ్లో జరిగిన ఒక ప్రత్యేక ఫోరమ్లో ఆయన మాట్లాడుతూ, టెక్ సంస్థల యజమానుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.ఏమిటీ ‘హోడియో’?డిజిటల్ ప్లాట్ఫారమ్ల్లో ద్వేషపూరిత కంటెంట్ ఉనికిని, అది వ్యాపిస్తున్న తీరును, దాని ప్రభావ పరిధిని శాస్త్రీయంగా కొలవడానికి ఈ సాధనం ఉపయోగపడుతుంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ టూల్ సమగ్ర నివేదికను రూపొందిస్తుంది. ‘స్పానిష్ అబ్జర్వేటరీ ఆఫ్ రేసిజం అండ్ జెనోఫోబియా’ ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తుంది. ఏ సంస్థ ద్వేషాన్ని ఆపుతోంది, ఏ సంస్థ ప్రేక్షక పాత్ర వహిస్తోంది, ఈ వ్యవహారం ద్వారా ఎవరు వ్యాపారం చేస్తున్నారో ప్రపంచానికి తెలియజేస్తామని సాంచెజ్ స్పష్టం చేశారు.గత దశాబ్ద కాలంలో స్పెయిన్లో ద్వేషపూరిత నేరాలు 41% పెరగడంపై పెడ్రో సాంచెజ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఇప్పటి నుంచి సోషల్ మీడియా సంస్థలు తాము అనుమతించే ప్రతి విద్వేషపూరిత అంశానికి బహిరంగంగా సమాధానం చెప్పుకోవాల్సిందే’ అని తెలిపారు.మస్క్, దురోవ్లతో ఢీ!స్పెయిన్ ప్రభుత్వం తీసుకుంటున్న వరుస నిర్ణయాలు గ్లోబల్ టెక్ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించే ప్రణాళికను ఫిబ్రవరిలోనే ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం ఎక్స్ (గతంలో ట్విట్టర్) యజమాని ఎలాన్ మస్క్, టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్లతో వాగ్వివాదానికి దారితీసింది. ఏఐ సృష్టించిన చైల్డ్ పోర్నోగ్రఫీని నిరోధించడంలో విఫలమైనందుకు ఎక్స్, మెటా, టిక్టాక్లపై దర్యాప్తు చేయాలని స్పెయిన్ ఇప్పటికే ప్రాసిక్యూటర్ కార్యాలయాన్ని కోరింది.యూరోపియన్ యూనియన్లో డిజిటల్ సేవల చట్టం (డీఎస్ఏ) ఇప్పటికే అమలులో ఉన్నప్పటికీ స్పెయిన్ సొంతంగా ‘హోడియో’ వంటి సాధనాన్ని తీసుకురావడం గమనార్హం. ఇది కేవలం నియంత్రణ మాత్రమే కాదు, టెక్ కంపెనీల వ్యాపార నమూనాలను సైతం సవాలు చేసే వ్యూహంలా కనిపిస్తోందని కొందరు భావిస్తున్నారు.ఇదీ చదవండి: దిగొస్తున్న పసిడి ధరలు.. వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే.. -
మొబైల్ డేటాపై పన్ను.. కేంద్రం కొత్త ఆలోచన!
దేశంలో పన్ను వసూళ్లను క్రమబద్ధీకరించి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో మొబైల్ డేటా వినియోగంపై పన్ను విధించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జనవరిలో జరిగిన సీనియర్ అధికారుల సమావేశంలో చర్చ జరిగినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.సమావేశంలో ప్రధానంగా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే కొత్త మార్గాలపై చర్చ జరిగింది. అందులో భాగంగా దేశంలో రోజువారీ డేటా వినియోగంపై చిన్న మొత్తంలో పన్ను విధించే ప్రతిపాదనను పరిశీలనకు తీసుకున్నట్లు తెలుస్తోంది.భారీగా పెరిగిన డేటా వినియోగం భారతదేశంలో చౌకైన ఇంటర్నెట్ సేవల కారణంగా మొబైల్ డేటా వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక డేటా వినియోగించే మార్కెట్లలో భారత్ ఒకటిగా నిలిచింది. ఈ నేపథ్యంలో టెలికాం రంగం ద్వారా కొత్త ఆదాయ వనరులు సృష్టించాలనే ఉద్దేశంతో టెలీకాం శాఖ ఇప్పటికే ఈ ప్రతిపాదనపై అధ్యయనం ప్రారంభించినట్లు సమాచారం. వచ్చే సెప్టెంబర్ నాటికి దీనిపై సమగ్ర ప్రణాళికను సమర్పించాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది.జీబీకి రూ.1 పన్ను వేధించినా..ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2025 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో మొబైల్ వినియోగదారులు మొత్తంగా సుమారు 229 బిలియన్ జీబీల డేటాను వినియోగించారు. ఈ నేపథ్యంలో ఒక్కో జీబీకి కేవలం రూ.1 పన్ను విధించినా ప్రభుత్వానికి ఏటా సుమారు రూ.22,900 కోట్లు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.వినియోగదారులపై ప్రభావంప్రస్తుతం మొబైల్ రీఛార్జ్ ప్లాన్లపై 18 శాతం జీఎస్టీ ఇప్పటికే అమల్లో ఉంది. ఇదిలా ఉండగా టెలికాం కంపెనీలు గత కొంతకాలంగా ప్లాన్ ధరలను పెంచుతున్నాయి. ఇలాంటి సమయంలో డేటా పన్ను అమల్లోకి వస్తే వినియోగదారులపై మరింత భారం పడే అవకాశం ఉంది. ఉదాహరణకు, జీబీకి రూ.1 పన్ను విధిస్తే రోజుకు 2 జీబీ డేటా ఉపయోగించే వినియోగదారుడు నెలకు సుమారు రూ.60 అదనంగా చెల్లించాల్సి వస్తుంది.అయితే ఈ ప్రతిపాదన ప్రస్తుతం చర్చ దశలో మాత్రమే ఉందని, ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
మౌలిక సదుపాయాలకు ఏఐ దన్ను
చరిత్రలో ఎన్నడూ ఎరుగని స్థాయిలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి కృత్రిమ మేథ (ఏఐ) తోడ్పడుతోందని ఎన్విడియా వ్యవస్థాపకుడు, సీఈవో జెన్సెన్ హువాంగ్ చెప్పారు. ఇందుకోసం లక్షల కోట్ల కొద్దీ డాలర్ల పెట్టుబడులు అవసరమన్నారు. ఈ పరిణామాలతో నిపుణులైన కార్మికులకు భారీగా డిమాండ్ ఏర్పడుతుందని పేర్కొన్నారు.ఏఐని గతంలోలాగా ఏదో సాధారణ అప్లికేషన్లాగా పరిగణించడానికి లేదని, విద్యుత్తు.. ఇంటర్నెట్లాగా కీలకమైన మౌలిక సదుపాయంగా చూడాల్సిన పరిస్థితి ఉందని హువాంగ్ ఒక బ్లాగ్పోస్ట్లో చెప్పారు. ‘మనం ఇప్పుడిప్పుడే నిర్మాణాన్ని మొదలుపెట్టాం. ఏదో, కొన్ని వందల కోట్ల డాలర్లను ఇన్వెస్ట్ చేశాం. కానీ మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి చేయాలంటే ఇది సరిపోదు. లక్షల కోట్ల డాలర్లు కావాలి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అసాధారణ స్థాయిలో చిప్ ఫ్టాక్టరీలు, కంప్యూటర్ అసెంబ్లీ ప్లాంట్లు, ఏఐ ఫ్యాక్టరీలు నిర్మితమవుతున్నాయి. ఇదంతా కూడా మానవ చరిత్రలోనే అత్యంత భారీ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనగా మారబోతోంది‘ అని పేర్కొన్నారు. అయిదంచెల కేక్.. విద్యుత్, చిప్లు, మౌలిక సదుపాయాలు, మోడల్స్, అప్లికేషన్ల మేళవింపుతో కృత్రిమ మేథ అయిదంచెల ’కేక్’గా ఉంటుందని హువాంగ్ అభివరి్ణంచారు. పరిశ్రమల్లో భారీ స్థాయి మార్పుల వల్ల సంప్రదాయ టెక్ రంగం పరిధికి వెలుపల పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. ‘ఈ మౌలిక సదుపాయాలను నిర్మించేందుకు భారీ స్థాయిలో కారి్మకులు కావాలి. ఏఐ ఫ్యాక్టరీలకు ఎల్రక్టీíÙయన్లు, ప్లంబర్లు, పైప్ఫిట్టర్లు, స్టీల్వర్కర్లు, నెట్వర్క్ టెక్నీíÙయన్లు, ఇన్స్టాలర్లు, ఆపరేటర్లు కావాలి. మంచి జీతభత్యాలు ఉండి, నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాలివి. అలాంటి నిపుణులకు కొరత నెలకొంది. ఈ పరివర్తనలో పాలుపంచుకునేందుకు కంప్యూటర్ సైన్స్లో పీహెచ్డీల్లాంటివేమీ అవసరం లేదు’ అని హువాంగ్ చెప్పారు.సంప్రదాయ కంప్యూటింగ్ మోడల్ను కృత్రిమ మేథ ఏ విధంగా మార్చివేస్తోందనేది ఆయన వివరించారు. ఏఐ మోడల్స్ గతేడాది కీలకమైన దశలను దాటాయని పేర్కొన్నారు. ఔషధాల డిస్కవరీ , లాజిస్టిక్స్, కస్టమర్ సరీ్వసు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, తయారీ తదితర రంగాల్లో పెద్ద స్థాయిలో ఉపయోగపడుతోందని, ఆర్థికంగా ప్రయోజనాలను చేకూరుస్తోందని హువాంగ్ చెప్పారు. డీప్సీక్–ఆర్1లాంటి ఓపెన్ సోర్స్ మోడల్స్, ఏఐ వినియోగాన్ని మరింత వేగవంతం చేస్తున్నాయని కితాబిచ్చారు.ఇదీ చదవండి: ట్రంప్ కోరిక నెరవేరుతుందా? -
క్రోమ్ బ్రౌజర్లో ఏఐ టూల్స్
సురక్షితమైన, మెరుగైన బ్రౌజింగ్ అనుభూతిని కల్పించే దిశగా టెక్ దిగ్గజం గూగుల్ భారత్లో క్రోమ్ బ్రౌజర్ యూజర్ల కోసం ప్రత్యేకంగా బిల్ట్ ఇన్ ఏఐ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. తెలుగు, తమిళం, హిందీలాంటి 8 ప్రాంతీయ భాషలతో పాటు 50 ల్యాంగేజ్లకు సపోర్ట్ను అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. లేటెస్ట్ జెమిని 3.1 మోడల్పై రూపొందించిన ఈ ఫీచర్లతో, బ్రౌజర్ని మరింత సమర్ధవంతంగా ఉపయోగించుకునేందుకు వీలవుతుందని వివరించింది. ముందుగా డెస్క్టాప్, ఐవోఎస్లలో ఇవి అందుబాటులో ఉంటాయని గూగుల్ డైరెక్టర్ షార్మెయిన్ డిసిల్వా తెలిపారు.వీటిని తొలిసారిగా ప్రవేశపెడుతున్న మార్కెట్లలో భారత్ కూడా ఒకటని వివరించారు. కొత్త ఫీచర్ల ప్రకారం వేరే ట్యాబ్కి మారాల్సిన అవసరం లేకుండా యూజర్లు, ప్రస్తుత ట్యాబ్లోనే పైన కుడివైపున ఉండే బ్రౌజింగ్ అసిస్టెంట్ ఐకాన్ని క్లిక్ చేసి నేరుగా చాట్ చేయొచ్చు. చాంతాడంత కంటెంట్ను సంక్షిప్తంగా పొందవచ్చు. జీమెయిల్తో అనుసంధానించడం వల్ల ప్రస్తుత పేజీ నుంచి వేరే పేజీకి వెళ్లక్కర్లేకుండా, సైడ్ ప్యానెల్ నుంచే ఈమెయిల్స్ రాయొచ్చు, పంపించవచ్చు.ఇదీ చదవండి: చమురు, గ్యాస్.. తర్వాత దీని వంతే! -
3 రోజుల్లోనే ఉద్యోగం పోతే.. ఈ ఏఐ ఇంజనీర్ ఏం చేసిందంటే..
ఎన్నో ఆశలతో కొత్త ఉద్యోగంలో చేరతాం.. అలా చేరిన మూడు రోజుల్లోనే ఆ ఉద్యోగం ఊడిపోతే.. రీతూ మౌర్య అనే ఏఐ (AI) ఆటోమేషన్ ఇంజనీర్ తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఇలాంటి కఠిన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఉద్యోగంలో చేరిన కేవలం మూడు రోజుల్లోనే క్లయింట్ ముందు ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారని ఆమె తెలిపారు. అయితే ఏడాది తరువాత అదే రంగంలో మొదట ఆఫర్ చేసిన జీతానికి ఎనిమిది రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నానని పేర్కొంది. ఈ విజయానికి స్వీయ అభ్యాసం, సరైన మార్గదర్శకత్వం కారణమని ఆమె చెప్పింది.ప్రారంభంలోనే ఎదురైన చేదు అనుభవంఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియోలో రీతూ మౌర్య తన అనుభవాన్ని పంచుకుంది. తనను ఉద్యోగంలోకి తీసుకున్నప్పుడు ప్రారంభంలో సంస్థ ఫౌండర్ తనకు కావాల్సిన సహాయం, మార్గదర్శకత్వం ఇస్తానని హామీ ఇచ్చాడని ఆమె తెలిపింది. కానీ వాస్తవానికి ఆమె సందేశాలకు గంటల తరువాత కానీ సమాధానం ఇచ్చేవాడు కాదని, సమస్యలు అర్థం చేసుకునేందుకు కాల్ చేయడానికీ ముందుకు రాలేదని చెప్పింది. “ఉద్యోగంలో రెండో రోజుకే నాకు చాలా విషయాలు తెలియకపోయాయి. మార్గదర్శనం చేస్తానని చెప్పినా, అతను ఎక్కడా కనిపించలేదు” అని మౌర్య తెలిపింది.క్లయింట్ ముందు విమర్శలు… వెంటనే తొలగింపుమూడో రోజు అసైన్మెంట్ సమయంలో వ్యవస్థాపకుడు క్లయింట్ ముందే ఆమె పనితీరును తీవ్రంగా విమర్శించాడని మౌర్య తెలిపింది. “మీరు పనిని సరిగ్గా చేయడం లేదు. నేను ఇదే పని ఒక గంటలో పూర్తి చేసేవాడిని. ఇకపై మనం కలిసి పనిచేయలేము” అని అతను చెప్పాడని ఆమె గుర్తుచేసుకుంది. ఆశ్చర్యకరంగా, అదే క్లయింట్ ఆమెను ఫుల్ టైమ్గా చేరగలరా అని అడిగిన మరుసటి రోజే ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారని ఆమె వెల్లడించింది.మానసికంగా తీవ్ర ప్రభావంఈ ఘటన తనపై తీవ్ర ప్రభావం చూపిందని మౌర్య తెలిపింది. “అంతా శూన్యంగా అనిపించింది. చాలా రోజులు ఏడ్చాను. నేను ఏమీ చేయలేనన్న భావన కలిగింది” అని ఆమె చెప్పింది. ఈ అనుభవం చాలా కాలం పాటు తనను వెంటాడిందని కూడా పేర్కొంది.మళ్లీ ప్రయాణం ప్రారంభంఅయితే తర్వాత ఆమె తనను తాను తిరిగి నిర్మించుకోవాలని నిర్ణయించుకుంది. ఆన్లైన్ ట్యుటోరియల్స్ చూడడం, సహచరుల సహాయం కోరడం, అలాగే “తెలివితక్కువ ప్రశ్నలు అయినా అడగడం” ద్వారా తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది. తన అభ్యాస ప్రయాణాన్ని లింక్డ్ఇన్లో పంచుకోవడం ప్రారంభించడంతో, చివరికి తనకు మరో సంస్థ అధినేత అవకాశం ఇచ్చారు.ఏడాదిలో భారీ మార్పుఉద్యోగం కోల్పోయిన ఏడాది తరువాత ప్రస్తుతం తాను మొదట ఇచ్చిన ఆఫర్ కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నానని మౌర్య తెలిపింది. “ఇప్పుడు అన్నీ చాలా బాగున్నాయి. అప్పటి విషపూరితమైన కార్యాలయం నుంచి బయటపడటం మంచిదే అనిపిస్తోంది” అని ఆమె పేర్కొంది.నెటిజన్ల స్పందనలుమౌర్య కథకు అనేక మంది టెక్ ప్రొఫెనల్స్ స్పందించారు. తమ కెరీర్ ప్రారంభంలో కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని చెప్పారు. కొంతమంది అనుభవం లేని వ్యవస్థాపకులు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారని వ్యాఖ్యానించగా, మరికొందరు స్పష్టత కోసం ప్రశ్నలు అడిగినందుకు విమర్శలు ఎదుర్కొన్నట్లు తెలిపారు. “అది ఐదేళ్ల క్రితం జరిగింది. ఇప్పటికీ కొన్నిసార్లు ఆ సంఘటన పీడకలలా అనిపిస్తుంది. కానీ చివరకు నేను తిరిగి లేచి నిలబడ్డాను” అని మరో టెక్ ఉద్యోగి కూడా తనకు జరిగిన అనుభవాన్ని పంచుకున్నారు. -
యూఎస్ పరిపాలన, శాసన ప్రక్రియలో ఏఐ పాగా
ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా తన పరిపాలన, శాసన ప్రక్రియలో కృత్రిమ మేధ విప్లవానికి నాంది పలికింది. అమెరికా సెనేట్ అధికారిక కార్యకలాపాల కోసం ప్రముఖ ఏఐ చాట్బాట్లు.. ఓపెన్ఏఐ చాట్జీపీటీ, గూగుల్ జెమిని, మైక్రోసాఫ్ట్ కోపైలట్ల వాడకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ది న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం, ఈ ఏఐ పరికరాలు సెనేట్ ప్లాట్ఫారమ్ల్లో అంతర్భాగంగా మారి విధాన నిర్ణేతలకు సహాయంగా నిలవనున్నాయి.పాలనలో వేగం.. పనిలో పారదర్శకతసెనేట్ అధికారులు తమ రోజువారీ విధుల్లో ఎదుర్కొనే సంక్లిష్టతలను తగ్గించడానికి ఈ సాంకేతికతను వినియోగించనున్నారు. ఇందులో భాగంగా డ్రాఫ్టింగ్ ప్రక్రియను సులభతరం చేయడం, అపారమైన సమాచారాన్ని విశ్లేషించి కచ్చితమైన డేటాను అందించడం, సుదీర్ఘమైన నివేదికలను క్లుప్తంగా బ్రీఫింగ్ నోట్స్ రూపంలోకి మార్చడం వంటి పనులు చేస్తాయి. ఒకే రకమైన పనులను ఆటోమేట్ చేయడం ద్వారా అధికారుల సమయాన్ని ఇవి ఆదా చేయనున్నాయి.అమెరికా ప్రభుత్వ నిర్ణయం ప్రపంచ దేశాలకు ఒక సంకేతంగా మారింది. పాలనలో ఏఐ కేవలం సహాయకారి మాత్రమే కాదు, భవిష్యత్తులో ఇది అనివార్యమనే సంకేతాలు ఇస్తోంది. అయితే భద్రత, గోప్యత వంటి అంశాల్లో ఈ సంస్థలు ఎంతవరకు కట్టుబడి ఉంటాయనేది వేచి చూడాల్సి ఉంది.ఇదీ చదవండి: రీఛార్జ్ ముగిస్తే ఇన్కమింగ్ కాల్స్ ఎందుకు ఆపేస్తారు? -
ఐటీ కంపెనీలూ...పారాహుషార్
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో భౌగోళికరాజకీయ ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో కార్యకలాపాల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలకు ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ హెచ్చరించింది. యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా దీటుగా ఎదుర్కొనేలా ఆపరేషనల్ సన్నద్ధతను పెంచుకోవాలని, సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకోవాలని సూచిస్తూ తాజాగా అడ్వైజరీ జారీ చేసింది.ప్రస్తుతానికి వ్యాపార కార్యకలాపాలు నిలకడగానే ఉన్నప్పటికీ పరిస్థితులు దిగజారితే ఎదురయ్యే అవరోధాలను అదిగమించేందుకు కంపెనీలు క్రియాశీలకంగా తమ అత్యవసర ప్రణాళికలను పునఃసమీక్షించుకుంటున్నాయని, పటిష్టమైన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయని నాస్కామ్ పేర్కొంది. కీలకమైన సరీ్వసులు దెబ్బతినకుండా సిస్టంలు పటిష్టంగా ఉండేందుకు క్లౌడ్ మౌలిక సదుపాయాలు, డేటా సెంటర్లకు ప్రత్యామ్నాయ రూటింగ్ ఆప్షన్లను కూడా పరిశీలించాలని సూచించింది. ప్రభావిత ప్రాంతాల్లో ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ, వర్క్ ఫ్రం హోమ్ వెసులుబాటు కల్పిస్తున్నాయని, క్షేత్ర స్థాయిలో పరిస్థితులను నిశిచంగా పరిశీలిస్తున్నాయని వివరించింది. అనిశ్చితితో సైబర్ దాడుల ముప్పులు సాధారణంగా భౌగోళికరాజకీయ అనిశ్చితి ఏర్పడినప్పుడు మూకుమ్మడి సైబర్ దాడులు, తప్పుడు ప్రచారాలు, మౌలిక సదుపాయాలను దెబ్బతీయడంలాంటి ఉదంతాలు చోటు చేసుకుంటూ ఉంటాయని నాస్కామ్ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే మల్టీ–ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ని అమల్లోకి తేవడం, పశి్చమాసియా దేశాల్లో కార్యకలాపాలున్న థర్డ్ పార్టీ వెండార్లతో లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించడం తదితర చర్యలు తీసుకోవాలని సూచించింది.యుద్ధ పరిస్థితులు, ప్రభుత్వం నుంచి అలర్టుల్లాగా మభ్యపెట్టే థీమ్లతో జరిగే సోషల్ ఇంజినీరింగ్ దాడులపై ఉద్యోగులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నాస్కామ్ పేర్కొంది. పశ్చిమాసియాలో పరిణామాలను తాము కూడా నిశితంగా పరిశీలిస్తున్నామని, అవసరమైన మద్దతును అందించేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని వివరించింది. -
డేటా అక్కర్లేని వారి కోసం జియో ప్రత్యేక ప్లాన్లు!
డేటాతో పనిలేకుండా కేవలం కాలింగ్ ప్రయోజనాలు మాత్రమే కోరుకునే వారి కోసం రిలయన్స్ జియో రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఆదేశాల మేరకు వినియోగదారులపై అనవసరమైన డేటా భారాలను తగ్గించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.చాలా కాలంగా టెలికాం కంపెనీలు వాయిస్ కాల్స్ను డేటాతో కలిపి విక్రయిస్తున్నాయి. దీనివల్ల ఇంటర్నెట్ వాడకం లేని వారు కూడా అదనపు భారాన్ని మోయాల్సి వస్తోంది. ‘వినియోగదారులకు తమకు నచ్చిన సర్వీసులను ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలి’ అన్న ట్రాయ్ సూచనతో జియో రూ.1,178, రూ.448 ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పింది.రూ.1,178 ప్లాన్..దీర్ఘకాలిక వాలిడిటీని కోరుకునే వారికోసం ఈ ప్లాన్ చాలా ఉపయోగమని కంపెనీ చెప్పింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వృద్ధులకు, కేవలం కాల్స్ కోసం ఫోన్ వాడే వారికి ఇది సరైన ఎంపికని తెలిపింది. దీని వాలిడిటీ 336 రోజులు. ఏ నెట్వర్క్కైనా అపరిమిత వాయిస్ కాలింగ్, మొత్తం వాలిడిటీ కాలానికి 3,600 ఎస్ఎంఎస్లు పొందవచ్చు.రూ.448 ప్లాన్..మూడు నెలల కాలపరిమితితో తక్కువ బడ్జెట్లో కాలింగ్ సేవలు పొందాలనుకునే వారికి ఇది అనుకూలమని కంపెనీ చెప్పింది. వాలిడిటీ 84 రోజులు. అపరిమిత వాయిస్ కాల్స్, మొత్తం 1,000 ఎస్ఎంఎస్లు పొందవచ్చు. అందులో ఇందులో జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ వంటి యాడ్ ఆన్ సేవలకు యాక్సెస్ ఉంటుంది.డేటా కావాలంటే ఏం చేయాలి?ఈ ప్లాన్లలో ప్రాథమికంగా డేటా ఉండదు. అయితే, ఒకవేళ అత్యవసరంగా ఇంటర్నెట్ అవసరమైతే వినియోగదారులు ఆందోళన చెందాల్సిన పనిలేదని జియో తెలిపింది. నేరుగా కంపెనీ అందిస్తున్న డేటా వోచర్లతో రీఛార్జ్ చేసుకోవచ్చని చెప్పింది.ఇదీ చదవండి: నగరాల్లో వంటగ్యాస్ సంక్షోభం! -
30వేల ఉద్యోగుల తొలగింపు?: స్పందించిన కంపెనీ
2026లో ప్రముఖ కంపెనీలెన్నో తమ ఉద్యోగులను తొలగించాయి. ఇలాంటి సమయంలో టెక్ మహీంద్రా కంపెనీ కూడా ఒకేసారి 30వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు కొన్ని వార్తలు తెరపైకి వచ్చాయి. దీనిపై సదరు కంపెనీ స్పందించింది.ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్కు ఇచ్చిన అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు.. కేవలం తప్పుదారి పట్టించే వదంతులేనని పేర్కొంది. మార్కెట్లో అనవసర గందరగోళం రాకుండా.. ఉండేందుకు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చినట్లు తెలిపింది.టెక్ మహీంద్రా కంపెనీ ఏజెంటిక్ ఏఐ ప్లాట్ఫామ్ను తీసుకొచ్చేందుకు మైక్రోసాఫ్ట్తో కలిసి పనిచేసేందుకు భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఆ తరువాత లేఆఫ్స్ ప్రచారం తెరమీదకు వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ విషయంపై కంపెనీ క్లారిటీ ఇచ్చేసింది. కాగా.. టెక్ మహీంద్రా త్రైమాసిక గణాంకాల ప్రకారం కంపెనీలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.5 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.ఇదీ చదవండి: పసిడి ప్రియులకు శుభవార్త.. మరింత తగ్గిన బంగారం, వెండి!ఏఐ కారణంగానే ఉద్యోగులను తొలగించనున్నట్లు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. దీనికి ప్రధాన కారణం ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కంపెనీలు AI ఉపయోగాన్ని పెంచుతున్న నేపథ్యంలో ఉద్యోగాలపై ప్రభావం పడవచ్చనే భావన అని తెలుస్తోంది. అయితే టెక్ మహీంద్రా భారీ స్థాయి ఉద్యోగాల కోత గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది. -
ఓపెన్ఏఐ రోబోటిక్స్ హెడ్ రాజీనామా: కారణం ఇదే!
ప్రముఖ ఏఐ దిగ్గజం ఓపెన్ఏఐలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కంపెనీలో రోబోటిక్స్ విభాగానికి నాయకత్వం వహిస్తున్న కైట్లిన్ కలినోవ్స్కీ (Caitlin Kalinowski) తన పదవికి రాజీనామా చేసారు.కైట్లిన్ కలినోవ్స్కీ కంపెనీ నుంచి వైదొలగడానికి ప్రధాన కారణం ఓపెన్ఏఐ అమెరికా రక్షణ శాఖతో చేసుకున్న కొత్త ఒప్పందం అని తెలుస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం సంస్థ రూపొందించిన ఏఐ మోడళ్లను అమెరికా సైన్యానికి చెందిన రహస్య నెట్వర్క్లలో ఉపయోగించడానికి అనుమతిస్తారు.కైలిన్ కలినోవ్స్కీ తన సోషల్ మీడియా పోస్టులో ఈ నిర్ణయం తేలికగా తీసుకోలేదని పేర్కొన్నారు. తన అభిప్రాయం ప్రకారం జాతీయ భద్రతలో AIకి ముఖ్యమైన పాత్ర ఉన్నప్పటికీ, కొన్ని అంశాలు చాలా జాగ్రత్తగా చర్చించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అమెరికా ప్రజలపై న్యాయపరమైన అనుమతి లేకుండా నిఘా పెట్టడం లేదా మానవ నియంత్రణ లేకుండా స్వతంత్రంగా పనిచేసే ప్రాణాంతక ఆయుధాల అభివృద్ధి వంటి అంశాలు తగిన చర్చ లేకుండా ముందుకు వెళ్లడం సరైంది కాదని వెల్లడించారు.ఇదీ చదవండి: మహిళల నుంచే అన్నీ.. గౌతమ్ అదానీ భావోద్వేగం!కలినోవ్స్కీ రాజీనామాను ఓపెన్ఏఐ కంపెనీ కూడా ధృవీకరించింది. అంతే కాకుండా కొత్త ఒప్పందం ప్రకారం.. జాతీయ భద్రత కోసం బాధ్యతాయుతంగా AIని ఉపయోగించే మార్గం ఏర్పడుతుందని, సంస్థకు కొన్ని స్పష్టమైన పరిమితులు ఉన్నాయని కూడా వెల్లడించింది. -
టీ20 వరల్డ్ కప్ ఫైనల్.. BSNL కొత్త ఆఫర్!
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ జరుగుతున్న సమయంలో బీఎస్ఎన్ఎల్ తన యూజర్ల కోసం ఒక అద్భుతమైన ఆఫర్ ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ ప్రకారం 16 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే 4జీబీ డేటా లభిస్తుంది. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.''వరల్డ్ కప్ అంటే కేవలం ఒక టోర్నమెంట్ కాదు, ప్రతి ఇంట్లోనూ జరిగే ఒక వేడుక. పవర్ ప్లేల నుంచి చివరి ఓవర్ల వరకు చూడండి. కేవలం రూ.16కే 4జీబీ డేటా పొందండి. ఒక రోజు వ్యాలిడిటీ మాత్రమే. మ్యాచ్ ఇప్పుడు అంతరాయం లేకుండా చూడండి. ఎందుకంటే ప్రపంచ కప్ సమయం వచ్చినప్పుడు, మీ డేటా ఛాంపియన్ లాగా ఉండాలి'' అని బీఎస్ఎన్ఎల్ ఇండియా ట్వీట్ చేసింది.The World Cup isn’t just a tournament, it’s a celebration in every home. 🏏From power plays to nail-biting last overs, don’t let buffering steal the thrill.Get 4GB data with 1-day validity at just ₹16 and stream every match live, loud, and uninterrupted.Because when it’s… pic.twitter.com/VJyYEDtt7z— BSNL India (@BSNLCorporate) March 8, 2026 -
ఏఐ వాడకం.. అప్పుడొచ్చింది ఒక సందేహం!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అన్ని రంగాల్లోనూ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే ఈ టెక్నాలజీపై ఎక్కువగా ఆధారపడటం వల్ల తన వ్యక్తిగత నైపుణ్యాలు తగ్గుతున్నాయేమో అనే అనుమానం కలుగుతోందని ఒక యంగ్ బ్యాక్ఎండ్ ఇంజనీర్ ఆందోళనల వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.టెక్ ప్రొఫెషనల్ 11 నెలలుగా బ్యాక్ఎండ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. తాను రోజువారీ ఆఫీస్ పనుల్లో ఎక్కువ భాగం ఏఐ టూల్స్ సహాయంతోనే పూర్తిచేస్తున్నాడు. ముఖ్యంగా కర్సర్ ఏఐ కోడ్ ఎడిటర్ & క్లౌడ్ ఏఐ అసిస్టెంట్ వంటివి కోడ్ రాయడంలో, APIలు రూపొందించడంలో మాత్రమే కాకుండా.. ఇతర సాంకేతిక పనులను పూర్తి చేయడంలో సహాయం చేస్తున్నాయి. ఈ టూల్స్ ఇచ్చిన సూచనల ప్రకారం పనులు పూర్తి చేస్తున్నానని అతను తెలిపాడు.ఇలాంటి సమయంలో అతనిలో ఒక సందేహం కలిగింది. సుమారు ఏడాదిగా పనిచేస్తున్నప్పటికీ.. నేను నిజంగా ఏమి నేర్చుకున్నాను. నేను ఇప్పటికే కొత్తగా ఉద్యోగంలో చేరిన వ్యక్తి మాదిరిగానే ఉన్నానని తన పోస్టులో పేర్కొన్నాడు. ఒకరోజు కర్సర్ ఏఐ సాంకేతిక సమస్య వల్ల పనిచేయకుండా పోయింది. అప్పుడు నేనే ఆ పనిని పూర్తి చేయాల్సి వచ్చింది. కానీ నేను ఏఐ సహాయం లేకుండా స్వతంత్రంగా పనిచేయలేకుండా పోతున్నానని, పని కష్టమవుతోందని వాపోయాడు.టెక్ రంగంలోకి ప్రవేశించడం తనకు అంత సులభం కాదని కూడా సోషల్ మీడియా పోస్టులో వివరించాడు. 2023లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి.. అనేక ఇంటర్వ్యూలు విఫలమైన తర్వాత 2025లో ఉద్యోగం సంపాదించాడు. ఇప్పుడు ఏఐ ఉపయోగించకుండా.. చేయాల్సిన పని కష్టం అయితే.. ఉద్యోగం బహుశా పోవచ్చు కూడా.ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కర్సర్ లేకుండా పని చేయడం కష్టమే అని కొందరు సీనియర్లు సరదాగా కామెంట్ చేశారు. ప్రస్తుతం ఏఐ ఉపయోగిస్తూ.. పని సులభంగా ఉందని సంబరపడిపోయే వారికి ఇదొక హెచ్చరిక అని ఇంకొందరు చెబుతున్నారు. -
‘కోడ్ అదిరింది.. లాజిక్ అడగ్గానే ఫ్యూజులు అవుట్’
సాఫ్ట్వేర్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విప్లవం సృష్టిస్తోంది. సంక్లిష్టమైన కోడింగ్ను నిమిషాల్లో పూర్తి చేస్తూ, డెవలపర్ల పనిని మరింత సులభతరం చేస్తోంది. అయితే ఇదే ఏఐపై అతిగా ఆధారపడటం వల్ల తలెత్తుతున్న పరిణామాలు ఇప్పుడు ఐటీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. తాజాగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తాను రాసిన (ఏఐ సాయంతో) కోడ్ను వివరించలేక తోటి ఉద్యోగుల ముందు అభాసుపాలైన ఘటన వెలుగులోకి వచ్చింది.సాధారణంగా సాఫ్ట్వేర్ కంపెనీల్లో డెవలపర్లు తాము రాసిన కోడ్ను రివ్యూ కోసం ‘పుల్ రిక్వెస్ట్’ రూపంలో సమర్పిస్తుంటారు. ఈ క్రమంలోనే ఒక ప్రముఖ టెక్ కంపెనీకి చెందిన డెవలపర్ ఒక ఫంక్షన్కు సంబంధించిన కోడ్ను తన టీమ్ లీడర్కు పంపాడు. ఆ కోడ్ అద్భుతంగా పని చేస్తోంది. ఎటువంటి ఎర్రర్స్ లేవు. అయితే ఆ కోడ్ వెనుక ఉన్న లాజిక్ను వివరించాల్సిందిగా సీనియర్ ఎడిటర్ కోరడంతో అసలు విషయం బయటపడింది. ఆ డెవలపర్ నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. నిశ్శబ్దం రాజ్యమేలింది. చివరకు తల దించుకుని తాను ఆ కోడ్ను 'క్లాడ్' (Claude) అనే ఏఐ టూల్ నుంచి నేరుగా కాపీ-పేస్ట్ చేశానని తెలిపాడు.ఈ ఉదంతాన్ని సదరు టీమ్ లీడర్ ‘ఎక్స్’ వేదికగా పంచుకోవడంతో ఇది కాస్తా వైరల్గా మారింది. ‘అతనికి కోడింగ్ రాదని కాదు.. కానీ తాను స్వయంగా రాయకపోవడం వల్ల అందులోని లాజిక్ను విశ్లేషించలేకపోయాడు. ఏఐ ఇచ్చింది.. పంపేశాడు.. అంతే!’ అంటూ ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం 50 శాతం కంటే ఎక్కువ పుల్ రిక్వెస్టుల్లో ఏఐ ప్రమేయం ఉంటోందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. స్టాక్ ఓవర్ఫ్లో వంటి వెబ్సైట్ల నుంచి గతంలో కోడ్ తీసుకునేవారని, కానీ అప్పట్లో కనీసం ఆ కోడ్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకునే ప్రయత్నం చేసేవారని సీనియర్లు గుర్తుచేస్తున్నారు.ఇప్పుడు ఏఐ టూల్స్ నేరుగా పరిష్కారాన్ని అందిస్తుండటంతో, యువ డెవలపర్లు మౌలిక సూత్రాలను (Fundamentals) విస్మరిస్తున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది. కోడ్ పని చేస్తే చాలు, అది ఎలా ఉన్నదనేది ముఖ్యం కాదు అనే ధోరణి భవిష్యత్తులో సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్లో తీవ్ర ఇబ్బందులకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏఐని ఒక సహాయకారిగా చూడాలే తప్ప, అది ఇచ్చే సమాచారాన్ని కళ్లు మూసుకుని వాడటం వృత్తిపరమైన ఎదుగుదలకు ఆటంకమని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: Women's Day: ఇడ్లీలు అమ్ముతూ.. రిసెర్చ్ స్కాలర్ విజయ గాథ -
వాట్సాప్ సబ్స్క్రిప్షన్ ప్లాన్.. ఫీచర్లు ఇవే..
వాట్సాప్ తన వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్లను పరిచయం చేసే క్రమంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ తరహాలోనే వాట్సాప్ ‘వాట్సాప్ ప్లస్’ పేరుతో సబ్స్క్రిప్షన్ ప్లాన్ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. అయితే, ఇకపై వాట్సాప్ వాడాలంటే డబ్బులు కట్టాలా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. దీనికి సంబంధించిన అంశాలు కింద చూద్దాం.వాట్సాప్ ప్లస్లో స్పెషల్ ఫీచర్లుప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, పెయిడ్ ప్లాన్ తీసుకునే వినియోగదారులకు ఈ కింది ప్రత్యేక ప్రయోజనాలు లభించవచ్చు.ఫీచర్వివరణచాట్ పిన్సాధారణంగా 3 చాట్లు మాత్రమే పిన్ చేయగలం, కానీ ఇందులో 20 చాట్ల వరకు పిన్ చేయవచ్చు.కస్టమైజేషన్యాప్ ఐకాన్ రంగులు, ట్యాబ్లు, బటన్లు మార్చుకునే సౌలభ్యం.థీమ్స్, స్టిక్కర్స్ఎక్స్క్లూజివ్ థీమ్స్, స్పెషల్ స్టిక్కర్ ప్యాక్స్.రింగ్టోన్స్కాంటాక్ట్స్ కోసం కస్టమ్ రింగ్టోన్స్ సెట్ చేసుకునే ఆప్షన్.రియాక్షన్స్మెసేజ్ రియాక్షన్ల రంగులను మార్చుకునే వెసులుబాటు. వినియోగదారులు గమనించాల్సిన విషయం ఏమిటంటే.. వాట్సాప్ ప్లస్ అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమేనని కంపెనీ తెలిపింది. ఎలాంటి సర్వీసులు ఉచింతంగా అందుబాటులో ఉంటాయో కింద చూద్దాం.ఇదీ చదవండి: ఫ్లిప్కార్ట్లో పనితీరుపై సమీక్ష -
ఏఐ వల్ల భారీగా ఉద్యోగాలేమీ పోలేదు
న్యూఢిల్లీ: కృత్రిమ మేధతో భారీ సంఖ్యలో ఉద్యోగాలేమీ పోలేదని ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ ఒక నివేదికలో వెల్లడించింది. దీని వల్ల టెక్నాలజీ నైపుణ్యాలు అవసరమయ్యే ఉద్యోగాల్లో యువ ఉద్యోగుల నియామకాలు మాత్రమే నెమ్మదించిన సంకేతాలు కనిపిస్తున్నాయని వివరించింది. ఏఐ సామర్థ్యం కొండంత ఉన్నప్పటికీ, ప్రస్తుతం వినియోగించుకుంటున్నది గోరంతేనని పేర్కొంది. కోడింగ్, ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్, అనాలిసిస్, రొటీన్ డిజిటల్ విధులను నిర్వర్తించే వైట్ కాలర్ ఉద్యోగాల్లో ఏఐ వినియోగం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. కంప్యూటర్ ప్రోగ్రామర్లు, కస్టమర్ సర్విస్ రిప్రజెంటేటివ్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మార్కెట్ రీసెర్చ్ అనలిస్టులు, ఫైనాన్షియల్..ఇన్వెస్ట్మెంట్ అనలిస్టుల్లాంటి ఉద్యోగ విధులను ఆటోమేట్ చేసేందుకు భారీగా అవకాశాలు ఉన్నందున, ఆయా ఉద్యోగాలకు రిసు్కలు ఉంటాయని నివేదిక తెలిపింది. మరోవైపు, వంటవాళ్లు, మోటార్సైకిల్ మెకానిక్లు, లైఫ్గార్డ్లు, బార్టెండర్లు, డ్రెస్సింగ్ రూమ్ అటెండెంట్స్లాంటి మాన్యువల్ సామర్థ్యాలు అవసరమయ్యే ఉద్యోగాలకు ఢోకా ఉండదని పేర్కొంది. అమెరికా లేబర్ స్టాటిస్టిక్స్ బ్యూరో డేటా ప్రకారం 2022 ఆఖరు నుంచి టెక్నాలజీ వినియోగం ఎక్కువగా ఉండే విభాగాల్లో యువ ఉద్యోగుల నియామకాలు మాత్రమే తగ్గినట్లు తెలుస్తోందని వివరించింది. ఏఐతో భారీగా ఉద్యోగాల్లో కోత పడుతోందంటూ ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆంథ్రోపిక్ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. -
జియో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్: 200 రోజుల కంటే ఎక్కువ వ్యాలిడిటీ!
ప్రతి నెల రీఛార్జ్ చేసుకునే అవసరం వద్దనుకునేవారి కోసం రిలయన్స్ జియో అనేక ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. ఇందులో ఒకటి సెలక్ట్ చేసుకుంటే.. 200 కంటే ఎక్కువ రోజులు రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలాంటి ప్లాన్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.రూ.1748 ప్లాన్రూ. 1748 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. 336 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అపరిమిత వాయిస్ కాలింగ్, 3600 ఎస్ఎమ్ఎస్లు పొందవచ్చు. అయితే ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే మీకు డేటా లభించదు. ఇది పూర్తిగా వాయిస్-ఓన్లీ ప్లాన్ అనే విషయం గుర్తించాల్సి ఉంటుంది. అయితే ఎంటర్టైన్మెంట్ కోసం జియోటీవీ, 50జీబీ జియోఏఐక్లౌడ్ క్లౌడ్ స్టోరేజ్కు యాక్సెస్ అందిస్తుంది. ఈ ప్లాన్ సీనియర్ సిటిజన్లకు లేదా సెకండరీ నంబర్ను ఉపయోగించే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.రూ.2025 ప్లాన్ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 200 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకు 2.5 జీబీ డేటా (మొత్తం 500 జీబీ), అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు లభిస్తాయి. ఇవి కాకుండా కొత్త కనెక్షన్లకు రెండు నెలల ఫ్రీ జియోహోమ్ ట్రయల్, మూడు నెలల జియో హాట్స్టార్ మొబైల్ లేదా టీవీ సబ్స్క్రిప్షన్, 50జీబీ జియోఏఐక్లౌడ్ క్లౌడ్ స్టోరేజ్, 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్నవారికి 18 నెలల గూగుల్ జెమిని ప్రో ప్లాన్ వంటి లభిస్తాయి.రూ.3599 ప్లాన్ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా ఏడాదిపాటు (365 రోజులు) వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకు 2.5 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు లభిస్తాయి. వీటితో పాటు కొత్త కనెక్షన్లకు రెండు నెలల ఫ్రీ జియోహోమ్ ట్రయల్, మూడు నెలల జియో హాట్స్టార్ మొబైల్ లేదా టీవీ సబ్స్క్రిప్షన్, 50జీబీ జియోఏఐక్లౌడ్ క్లౌడ్ స్టోరేజ్, 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్నవారికి 18 నెలల గూగుల్ జెమిని ప్రో ప్లాన్ వంటి లభిస్తాయి.రూ.3999 ప్లాన్రూ. 365 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్ ద్వారా రోజుకు 2.5 జీబీ డేటా పొందవచ్చు. అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు లభిస్తాయి. అర్హత కలిగిన వినియోగదారులు అపరిమిత 5G డేటాను పొందుతారు. హై-స్పీడ్ డేటా అయిపోయిన తర్వాత వేగం 64Kbpsకి పడిపోతుంది. -
రియల్మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. ‘పవర్’ఫుల్ బ్యాటరీతో..
స్మార్ట్ఫోన్ దిగ్గజం రియల్మీ తన నార్జో సిరీస్లో కొత్తగా రియల్మీ నార్జో పవర్ 5జీ (Realme Narzo Power 5G) స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఎక్కువసేపు బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.ఈ స్మార్ట్ఫోన్లో ప్రధాన ఆకర్షణ 10,001mAh భారీ బ్యాటరీ. సాధారణ స్మార్ట్ఫోన్లతో పోలిస్తే ఎక్కువసేపు వినియోగానికి ఇది సహాయపడుతుందని కంపెనీ పేర్కొంది. గేమింగ్, వీడియో స్ట్రీమింగ్, రోజువారీ వినియోగం ఎక్కువగా చేసే వారికి ఈ డివైజ్ ఉపయోగకరంగా ఉంటుందని తెలిపింది.ధర, లభ్యతరియల్మీ నార్జో పవర్ 5G స్మార్ట్ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ఒకటి కాగా మరొకటి 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్. అలాగే ఈ ఫోన్ టైటాన్ సిల్వర్, టైటాన్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. ప్రారంభ విక్రయంలో దీని ధర రూ.23,999 నుంచి మొదలవుతుంది.మార్చి 5 నుంచి మధ్యాహ్నం 12 గంటల తర్వాత అమెజాన్, రియల్మీ అధికారిక వెబ్సైట్లో విక్రయాలు ప్రారంభమవుతాయి. బ్యాంక్, ఎక్స్చేంజ్ ఆఫర్లతో కలిపి కంపెనీ రూ.3,999 వరకు బండిల్ బెనిఫిట్లు అందిస్తోంది. అదనంగా 4 సంవత్సరాల బ్యాటరీ వారంటీ కూడా ఇస్తోంది.ప్రధాన ఫీచర్లుఈ ఫోన్లోని 10,001mAh బ్యాటరీని సిలికాన్ యానోడ్ టెక్నాలజీతో రూపొందించారు. భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ బరువు సుమారు 219 గ్రాములు మాత్రమే ఉండేలా రూపొందించారు.80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్: కేవలం 36 నిమిషాల్లో 50% వరకు ఛార్జ్ అవుతుంది. అలాగే 27W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.పర్ఫార్మెన్స్ కోసం ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్ను ఉపయోగించారు. 8GB ర్యామ్తో పాటు ప్రత్యేక AI ప్రాసెసింగ్ చిప్ కూడా ఉంది. ఇది గేమింగ్ సమయంలో స్థిరమైన పనితీరును అందించడంలో సహాయపడుతుందని కంపెనీ చెబుతోంది.డిస్ప్లే విషయానికి వస్తే ఫోన్ ముందుభాగంలో 144Hz రిఫ్రెష్ రేట్తో హైపర్గ్లో 4డీ కర్వ్+ అమోల్డ్ డిస్ప్లే అందించారు. ఇది 1.07 బిలియన్ రంగులను సపోర్ట్ చేస్తుంది. గరిష్టంగా 6500 నిట్స్ బ్రైట్నెస్ ఇస్తుంది. -
ఏఐ సంక్షోభం.. ఏం చేయాలో ఆలోచించాలి!
ప్రపంచంలోని టాప్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న జేపీ మోర్గాన్ చేజ్ సీఈఓ జామీ డిమోన్ టెక్నాలజీలో వస్తున్న మార్పులపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. మొన్నటి వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతిని తీవ్రంగా వ్యతిరేకించిన డిమోన్.. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వల్ల పని దినాలు తగ్గుతాయని అంచనా వేయడం గమనార్హం.వారానికి 3.5 రోజుల పనే!బ్లూమ్బెర్గ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డిమోన్ మాట్లాడుతూ.. ఏఐ ప్రభావంతో భవిష్యత్ తరాల జీవనశైలి పూర్తిగా మారిపోతుందని పేర్కొన్నారు. ‘వచ్చే మూడు నాలుగు దశాబ్దాల్లో మన పిల్లలు వారానికి కేవలం నాలుగు లేదా మూడున్నర రోజులు మాత్రమే పని చేసే స్థాయికి ఏఐ ఉత్పాదకతను పెంచుతుంది’ అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సాంకేతికత వల్ల పని గంటలు తగ్గి వర్క్-లైఫ్ బ్యాలెన్స్ మెరుగుపడటం అనేది ఒక అద్భుతమైన విషయం అన్నారు.జేపీ మోర్గాన్లో ఇప్పటికే ఏఐ జోరుకేవలం అంచనాలు వేయడమే కాకుండా, తన బ్యాంకులో ఇప్పటికే ఏఐని భారీగా వినియోగిస్తున్నట్లు డిమోన్ వెల్లడించారు. మోసాల గుర్తింపు, రిస్క్ మేనేజ్మెంట్, మార్కెటింగ్, ఎర్రర్ రిడక్షన్ వంటి చాలా విభాగాల్లో ఏఐని వాడుతున్నట్లు చెప్పారు. సంస్థలోని సుమారు 1,50,000 మంది ఉద్యోగులు ఇప్పటికే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు.‘సాంకేతికత ఎప్పుడూ ఉద్యోగాలను మారుస్తూనే ఉంటుంది. కానీ ఏఐ తెచ్చే మార్పులు వేగంగా ఉంటాయి. ప్రభుత్వం, వ్యాపార సంస్థలు ఈ మార్పునకు ఇప్పుడే సిద్ధం కావాలి’ అని జామీ డిమోన్ తెలిపారు.ఉద్యోగ ముప్పుపై హెచ్చరికఒకవైపు ఆశావాదాన్ని ప్రకటిస్తూనే, మరోవైపు ఉద్యోగాల తొలగింపుపై డిమోన్ వాస్తవాలను బయటపెట్టారు. పరిశ్రమలు ఏఐని స్వీకరించే క్రమంలో ఉద్యోగాల నష్టాన్ని తక్కువ అంచనా వేయకూడదని హెచ్చరించారు. రాబోయే ఐదేళ్లలో ఏఐ వల్ల పెరిగే ఉత్పాదకత కారణంగా బ్యాంకులో తక్కువ మంది ఉద్యోగుల అవసరం ఉంటుందని అంగీకరించారు. ఉద్యోగాలు కోల్పోయే వారిని ఎలా ఆదుకోవాలనే అంశంపై ప్రభుత్వాలు, సంస్థలు ఆలోచించాలని సూచించారు.ఇదీ చదవండి: ఇంధన సంక్షోభం.. చైనా రిఫైనరీల కీలక నిర్ణయం! -
చాట్జీపీటీని బాయ్కాట్ చేసిన 25 లక్షల మంది!
అమెరికా రక్షణ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఓపెన్ఏఐ సేవలపై వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి. చాట్జీపీటీని బహిష్కరించాలంటూ ప్రతిజ్ఞకు పిలుపునిచ్చిన ఒక వెబ్సైట్.. ఇప్పటికే సుమారు 25 లక్షల మంది వినియోగదారులు చాట్జీపీటీని బాయ్కాట్ చేసినట్లు పేర్కొంది.900 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉన్న ఓపెన్ఏఐ (OpenAI) గత వారం అమెరికా రక్షణ శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం.. రక్షణ శాఖ తన వర్గీకృత నెట్వర్క్లో ఏఐ మోడల్ను అమలు చేయడానికి అనుమతి లభించింది.ఈ డీల్తో వినియోగదారుల అసంతృప్తి పెరుగుతోందని ఆ వెబ్సైట్ వెల్లడించింది. సంతకాల సంఖ్య, సోషల్ మీడియా షేర్లు, యాప్ వినియోగ డేటా ఆధారంగా ప్రజలు చాట్జీపీటీపై విశ్వాసం కోల్పోతున్నారని పేర్కొంది. “అమెరికన్లతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లను చాట్జీపీటీ నుంచి నిష్క్రమించడానికి మేము సమన్వయం చేస్తున్నాం. వినియోగదారుల చర్యల ద్వారా ఓపెన్ఏఐకు స్పష్టమైన సందేశం పంపవచ్చు” అని వెబ్సైట్ పేర్కొంది.ఇదిలా ఉండగా, సెన్సార్ టవర్ విశ్లేషణ ప్రకారం.. పెంటగాన్ నుంచి తప్పుకొన్న ఆంథ్రోపిక్ (Anthropic) రూపొందించిన ‘క్లాడ్’ చాట్బాట్ యాప్, అమెరికాలో యాపిల్ యాప్ స్టోర్ చార్టుల్లో చాట్జీపీటీ యాప్ను అధిగమించి అగ్రస్థానానికి చేరినట్లు సమాచారం. అలాగే టెక్క్రంచ్ నివేదిక ప్రకారం.. గత శనివారం చాట్జీపీటీ మొబైల్ యాప్ యూఎస్లో అన్ఇన్స్టాల్ల సంఖ్య రోజుకు 295 శాతం పెరిగినట్లు వెల్లడైంది. -
ఏజీఆర్ బకాయిలు ఎలా రాబట్టాలో ఏమో!
భారత టెలికాం రంగంలో మార్పులు చోటుచేసుకునేలా ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు బ్యాంకులు, టెలికాం సంస్థలు, ప్రభుత్వ యంత్రాంగంలో తీవ్ర చర్చకు దారితీసింది. టెలికాం స్పెక్ట్రం అనేది ప్రజా ఆస్తి అని, ఇది ప్రభుత్వ సార్వభౌమత్వ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేస్తూ ఫిబ్రవరి 13, 2026న అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. దాంతో దివాలా తీసిన సంస్థల బకాయిల వసూలు ప్రక్రియ చిక్కుల్లో పడినట్టయిందని కొందరు భావిస్తున్నారు.ముఖ్యంగా రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్), ఎయిర్ సెల్ సంస్థల నుంచి వేల కోట్ల రూపాయల ఏజీఆర్ బకాయిలను(స్పెక్ట్రం వినియోగానికి బదులుగా టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజు) ఎలా రాబట్టాలనే అంశంపై టెలికమ్యూనికేషన్స్ విభాగం (డాట్) ఇప్పుడు అటార్నీ జనరల్ నుంచి అత్యవసర న్యాయ సలహాను కోరింది.స్పెక్ట్రం ప్రభుత్వ ఆస్తి.. ఐబీసీ పరిధిలోకి రాదుసుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. టెలికాం స్పెక్ట్రం అనేది ఒక పరిమిత సహజ వనరు. దీనిపై పూర్తి హక్కులు భారత ప్రభుత్వానికే ఉంటాయి. టెలికాం ఆపరేటర్లకు కేవలం షరతులతో కూడిన వినియోగ హక్కు మాత్రమే ఉంటుంది తప్ప, అది వారి సొంత ఆస్తి కాదు. దివాలా కోడ్ (ఐబీసీ) కింద స్పెక్ట్రంను విక్రయించడం లేదా బదిలీ చేయడం సాధ్యపడదు. ఈ నేపథ్యంలో ఆర్కామ్, ఎయిర్ సెల్ వంటి సంస్థల ఆస్తులను విక్రయించి తమ అప్పులు తీర్చుకోవాలని భావించిన బ్యాంకులు (రుణదాతలు) ఇప్పుడు చేతులెత్తేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.రుణదాతల ఆందోళనఈ తీర్పుతో సుమారు రూ.37,588 కోట్ల ఏజీఆర్ బకాయిల వసూలు ప్రశ్నార్థకంగా మారింది. అందులో ఆర్కామ్ బకాయిలు సుమారు రూ.25,199.3 కోట్లుగా ఉన్నాయి. ఎయిర్ సెల్ బకాయిలు సుమారు రూ.12,389 కోట్లుగా ఉన్నాయి. సాధారణంగా ఏదైనా కంపెనీ దివాలా తీస్తే దాని ఆస్తులను అమ్మి ‘వాటర్ఫాల్ మెకానిజం’(ఒక కంపెనీ దివాలా తీసినప్పుడు దాని ఆస్తులను అమ్మగా వచ్చిన డబ్బును ఎవరికి ముందు ఇవ్వాలి, ఎవరికి తర్వాత ఇవ్వాలి అని నిర్ణయించే క్రమం) ద్వారా రుణదాతలకు పంచుతారు. కానీ, ఇప్పుడు స్పెక్ట్రం ఐబీసీ పరిధిలో లేకపోవడంతో ప్రభుత్వ బకాయిలు అలాగే ఉండిపోవడమే కాకుండా, ఇతర ఆర్థిక సంస్థల అప్పు రికవరీ కూడా నామమాత్రంగానే మిగిలే ప్రమాదం ఉంది.టెలికాం రంగంపై ఒత్తిడిభారత టెలికాం రంగం ఇప్పటికే భారీ అప్పులతో సతమతమవుతోంది. ఆర్థిక సంవత్సరం 2024 నాటికి ప్రధాన ఆపరేటర్ల మొత్తం అప్పు రూ.4.09 లక్షల కోట్లుగా ఉంది. వొడాఫోన్ ఐడియా నెట్వర్క్ బలోపేతం కోసం నిధులు సేకరించినప్పటికీ స్పెక్ట్రం ఫీజులు, అప్పుల నిర్వహణ సవాలుగా మారింది. భారతీ ఎయిర్ టెల్ 75.6% డెట్-టు-ఈక్విటీ నిష్పత్తితో బ్యాలెన్స్ షీట్ను నెట్టుకొస్తోంది. టెలికాం కంపెనీలు 5జీ సేవలకు మారుతున్న తరుణంలో భారీ పెట్టుబడులు అవసరం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో నియంత్రణ సంస్థల స్పష్టత లేకపోవడం పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేస్తోంది.బ్యాంకులు టెలికాం రంగానికి రుణాలు ఇచ్చేటప్పుడు ఇకపై చాలా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటార్నీ జనరల్ ఇచ్చే వివరణ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం తదుపరి అడుగు వేయనుంది. ఒకవేళ స్పెక్ట్రంను వేలం వేయడానికి వీలు లేకపోతే ప్రభుత్వం ఈ బకాయిలను ఎలా సర్దుబాటు చేస్తుందనేది తేలాల్సి ఉంది.ఇదీ చదవండి: బిగ్రిలీఫ్.. ఒకేరోజు భారీగా పడిన బంగారం ధర! -
ఒక రీఛార్జ్.. 72 రోజుల వ్యాలిడిటీ!
రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఈ లేటెస్ట్ ప్లాన్ తీసుకొచ్చింది. 485 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 72 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన రూ. 485 రీఛార్జ్ ప్లాన్ ద్వారా 72 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకి 2.5 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు పొందవచ్చు. ఆఫర్ వ్యాలిడిటీ ఉన్నంత వరకు అపరిమిత కాల్స్ ఆస్వాదించవచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని సంస్థ వెల్లడించింది.Caption-Shoot. Share. Shine! Celebrate this Holi with extra data and uninterrupted fun on BSNL ₹485 plan. Hurry, offer ends 31st March 2026.#HoliWithBSNL #ExtraDataExtraFun #BSNLIndia #Holi2026 pic.twitter.com/Hw9gdSPEPd— BSNL India (@BSNLCorporate) March 3, 2026 -
ఏఐపై అత్యంత భారీ పెట్టుబడులు
ఇటీవల నిర్వహించిన 2026 ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో భారీ పెట్టుబడులకు తెరలేచినట్లు ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. ఏఐపై కార్పొరేట్ దిగ్గజాలు రిలయన్స్ ఇండస్ట్రీస్సహా అదానీ గ్రూప్, గూగుల్, టాటా, లైట్స్పీడ్ వెంచర్స్ తదితరాలు ఉమ్మడిగా 240 బిలియన్ డాలర్లు(రూ. 21.84 లక్షల కోట్లు) ఇన్వెస్ట్ చేసేందుకు కట్టుబాటును ప్రదర్శించాయి. గత నెల 16–21 మధ్య నిర్వహించిన ఏఐ సదస్సు సుమారు 6 లక్షల మంది హాజరైన అతిపెద్ద ఈవెంట్గా నిలుస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 100 దేశాల నుంచి ప్రతినిధులు, 20 అంతర్జాతీయ సంస్థలు వీటిలో పాలుపంచుకున్నట్లు వెల్లడించింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫౌండేషన్ మోడళ్లు, హార్డ్వేర్, అప్లికేషన్లు తదితర విభాగాలలో 200 బిలియన్ డాలర్లకుపైగా ఏఐ సంబంధిత పెట్టుబడులకు కట్టుబాటు కనిపించినట్లు తెలియజేసింది. దిగ్గజాలు ఇలా..ఏఐ సదస్సులో డైవర్సిఫైడ్ దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏఐ ఆధారిత ఇన్ఫ్రాస్ట్రక్చర్పై 110 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసేందుకు ప్రణాళికలు ప్రకటించింది. ఏడేళ్లలో వీటిని వెచి్చంచనున్నట్లు తెలియజేసింది. అదానీ ఎంటర్ప్రైజెస్ 2035కల్లా 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళికలు వెల్లడించింది. జనరల్ కేటలిస్ట్ ఐదేళ్లలో 5 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్కు కమిట్మెంట్ను ప్రకటించింది. ఈ బాటలో లైట్స్పీడ్ వెంచర్ పార్ట్నర్స్ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు సిద్ధమని తెలియజేసింది.గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కొత్తగా ఇండియా– యూఎస్ సబ్సీ కేబుల్ మార్గంసహా.. 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళికలు వెల్లడించారు. వీటిలో విశాఖపట్టణంలోని ఏఐ హబ్ సైతం కలసి ఉంది. ఇక టాటా గ్రూప్ ఏఐ రెడీ డేటా సెంటర్ల ఏర్పాటుకు ఓపెన్ఏఐతో భాగస్వామ్యాన్ని ప్రకటించడం గమనార్హం! ఈ సదస్సులో దేశ సావరిన్ కంప్యూట్ సామర్థ్యాన్ని విస్తరించనున్నట్లు కీలక ప్రకటన వెలువడింది. ఇండియా ఏఐ మిషన్లో భాగంగా ఇప్పటికే ఏర్పాటు చేసిన 38,000 జీపీయూలకు జతగా కొద్ది వారాలలో మరో 20,000 జీపీయూలకు తెరతీయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. దీంతో నేషనల్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరింత పటిష్టంకానుంది. 850 ఎగ్జిబిటర్లతో 10 థిమాటిక్ పెవిలియన్లతో ఏర్పాటైన ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఏఐ ఎగ్జిబిషన్లలో ఒకటిగా నిలిచినట్లు ప్రస్తావించింది.ఇదీ చదవండి: విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు -
ఇరాన్పై దాడులు.. ఆంథ్రోపిక్ నెత్తిన పాలు పోసిన డొనాల్డ్ ట్రంప్!
వాషింగ్టన్: ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ. ఫిబ్రవరి 28న అమెరికా,ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన సైనిక చర్య. మిలటరీ ఆపరేషన్లో ఇరాన్ అణు కేంద్రాలు, సైనిక మౌలిక సదుపాయాలతో సహా ఇరాన్ ప్రభుత్వంలోని ముఖ్య కేంద్రాల్లో భీభత్సం సృష్టించాయి. వెన్నులో వణుకు పుట్టించేలా చేపట్టిన మిలటరీ ఆపరేషన్ వెనుక ప్రముఖ ఏఐ టెక్నాలజీ సంస్థ ఆంత్రోపిక్ ఏఐ మోడళ్లు ఉన్నట్లు తేలింది. దీంతో నాడు తన మాట వినలేదని వెళ్లగొట్టిన ఆంథ్రోపిక్ ఇప్పుడు అక్కరకు వచ్చింది’ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధంలో ఏఐ మోడళ్లు సైనికుల కళ్లూ, మెదడులా పనిచేస్తాయి. ఇవి నేరుగా ఆయుధం కాకపోయినా.. ఎక్కడ దాడి చేయాలి. ఎలా రక్షించుకోవాలి. శత్రువు కదలికలు ముందుగానే అంచనా వేస్తాయి. సైనికులకు సమాచారం అందిస్తాయి. అందుకు అనుగుణంగానే దాడి చేయొచ్చు. తాజాగా, ఇరాన్పై దాడుల సమయంలో అమెరికా,ఇజ్రాయెల్ సంయుక్తంగా ఆంథ్రోపిక్ క్లాడ్ మోడల్స్ను వినియోగించాయి. అయితే, వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. డొనాల్డ్ ట్రంప్ ఆంథ్రోపిక్ సప్లయ్ చైన్ను ప్రమాదంగా భావించారు. ఆంథ్రోపిక్ సప్లయ్ చైన్ను నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. అనూహ్యంగా కొన్ని గంటల్లో ట్రంప్ తన నిర్ణయంపై యూటర్న్ తీసుకున్నారు. అమెరికా తన మిలిటరీ కార్యకలాపాల కోసం క్లాడ్ను ఉపయోగించింది. ఇరాన్లో తాను నిర్ధేశించిన లక్ష్యాల్ని ఛేదించగలిగింది. అమెరికా ప్రభుత్వం, దాని ఏజెన్సీలు ఆంథ్రోపిక్ క్లాడ్ ఏఐ మోడల్ను ఉపయోగించడం మానేస్తాయని ట్రంప్ ప్రకటించారు. ఈ మార్పు రాత్రికి రాత్రే సాధ్యం కాదని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. క్లాసిఫైడ్ నెట్వర్క్ అంటే అత్యంత రహస్యమైన, భద్రతా ప్రమాణాలు ఉన్న ప్రభుత్వ,సైనిక కంప్యూటర్ వ్యవస్థలు. వీటిలో సాధారణ సాఫ్ట్వేర్ లేదా టూల్స్ను సులభంగా అమలు చేయలేరు.కానీ ఇప్పుడు అమెరికా ప్రభుత్వం ఇరాన్పై దాడి చేసేందుకు ఆంథ్రోపిక్ ఏఐ క్లౌడ్ను ఉపయోగిస్తోంది. ఆంథ్రోపిక్ ఏఐ క్లౌడ్ను మార్చి వాటి స్థానంలో మరో ఏఐ క్లౌడ్ను మార్చాలంటే కనీసం ఆరునెలల సమయం పట్టనుంది. ఈలోపు సైనికులకు వాటిపై శిక్షణ, వినియోగం వంటి కార్యకలాపాలు చేయాల్సి వస్తుంది. -
2033 నాటికి 9 కీలక ఉద్యోగాలకు ఎసరు!
ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా సాంకేతిక విప్లవంలో కృత్రిమ మేధ కీలకంగా వ్యవహరిస్తోంది. అది కొన్ని కంపెనీలు, ఉద్యోగులకు వరంగా మారితే ఇంకొందరికి శాపంగా మారుతోంది. ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ఇటీవల ఎక్స్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఏఐ కార్పొరేట్, సామాన్య వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. 2028 నుంచి 2033 మధ్య కాలంలో కృత్రిమ మేధ ఏయే వృత్తులను కబళించబోతుందో ఆయన విశ్లేషించిన తీరు, ఉపాధి భవిష్యత్తుపై చర్చకు దారితీసింది. గోయెంకా అంచనా ప్రకారం వివరాలు కింది విధంగా ఉన్నాయి.తొలి దశ: 2028 - 2029 (సాంకేతిక, సేవా రంగాల్లో మార్పులు)ఈ రెండేళ్ల కాలంలో ఏఐ కేవలం ఉద్యోగులకు సహాయకారిగా మాత్రమే కాకుండా నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతుందని గోయెంకా పేర్కొన్నారు. అందులో..సాఫ్ట్వేర్ కోడర్లు (2028): ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్ల బృందాలు చేసే పనిని ఏఐ స్వతంత్రంగా చేయనుంది. కోడ్ రాయడం, బగ్స్ ఫిక్స్ చేయడం, సిస్టమ్ ఆప్టిమైజేషన్ వంటి పనులను ఏఐ స్వతంత్రంగా నిర్వహించడంతో డెవలపర్ల అవసరం గణనీయంగా తగ్గుతుంది.డ్రైవింగ్, లాజిస్టిక్స్ (2029): సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ విస్తరిస్తుంది. దీనివల్ల టాక్సీ డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లు, డెలివరీ ఏజెంట్ల ఉపాధికి గండం పొంచి ఉంది.బోధన రంగం (2029): క్లాస్రూమ్ బోధన స్థానంలో పర్సనలైజ్డ్ ఏఐ ట్యూటర్స్ వస్తారు. విద్యార్థి సామర్థ్యాన్ని బట్టి 24/7 అందుబాటులో ఉండే ఈ వ్యవస్థలు సంప్రదాయ ఉపాధ్యాయ వృత్తికి సవాలుగా మారుతాయి.రెండో దశ: 2030 - 2032 (వృత్తి నిపుణులపై ప్రభావం)వైద్యులు, రోగ నిర్ధారణ (2030): రోగ నిర్ధారణ విషయంలో ఏఐ మానవ వైద్యుల కంటే వేగంగా, కచ్చితంగా ఫలితాలను ఇస్తుంది. మెడికల్ ఇమేజింగ్, హిస్టరీ అనాలిసిస్ వంటివి పూర్తిగా ఏఐ మయం అవుతాయి.కళాకారులు, సృజనాత్మకత (2030): సంగీతం, పెయింటింగ్, రైటింగ్, డిజైనింగ్ వంటి రంగాల్లో ఏఐ సృష్టించే కంటెంట్ ఆధిపత్యం చెలాయిస్తుంది. సృజనాత్మకత అనేది కేవలం మానవుల సొత్తు అనే భావన చెరిగిపోనుంది.న్యాయవాదులు (2031): లీగల్ రీసెర్చ్, ఒప్పంద పత్రాల తయారీ వంటి పనులను ఏఐ సెకన్లలో పూర్తి చేస్తుంది. దీనివల్ల జూనియర్ న్యాయవాదుల డిమాండ్ పడిపోతుంది.మాన్యుఫాక్చరింగ్ (2031): ఫ్యాక్టరీలు పూర్తిస్థాయి ఆటోమేషన్కు చేరుకుంటాయి. విశ్రాంతి అవసరం లేని రోబోలు ఉత్పత్తి రంగంలో మానవ శ్రమను పూర్తిగా భర్తీ చేస్తాయి.సర్జన్లు (2032): శస్త్రచికిత్సల్లో రోబోటిక్ కచ్చితత్వం పెరుగుతుంది. సర్జన్ల పాత్ర కేవలం పర్యవేక్షణకు మాత్రమే పరిమితం కావచ్చు.2033 (రక్షణ రంగం)గోయెంకా అంచనాల ప్రకారం 2033 నాటికి యుద్ధ తంత్రం కూడా మారిపోతుంది. మానవ సైనికుల కంటే ఏఐ ఆధారిత స్వయంప్రతిపత్త ఆయుధ వ్యవస్థలు నిఘా, వ్యూహాత్మక దాడులను నిర్వహిస్తాయి. ఇది అంతర్జాతీయ రక్షణ వ్యవస్థలను మార్చేయనుంది.భవిష్యత్తు మంత్రంమారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి. మార్పును ఆహ్వానిస్తూ ఏఐని ఒక పనిముట్టుగా వాడుకోవడం నేర్చుకోవాలి. యంత్రాలు చేయలేని సృజనాత్మక, వ్యూహాత్మక నిర్ణయాల్లో రాణించాలి. ఉద్యోగాలు పోతాయనే భయం కంటే ఏఐ సృష్టించే కొత్త అవకాశాలను ఎలా అందిపుచ్చుకోవాలనేదే నేటి యువత ముందున్న అసలు సవాలు.ఇదీ చదవండి: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య వార్కు కారణం ఇదే.. -
రోబో సలహాలు.. మంచివే!
మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? సలహాదారులను ఆశ్రయిస్తున్నారా? వారికి చెల్లించాల్సిన ఫీజు ఎక్కువగా ఉందని ఆలోచిస్తున్నారా? సలహాదారులు ఎందుకులే... అనుకుంటూ మీకు తోచినట్లు ఇన్వెస్ట్మెంట్లు చేసి చేతులు కాల్చుకుంటున్నారా? పోనీ సలహాదారులు చెప్పినట్లే చేసినా కూడా వారి ఫీజులు పోను పెద్దగా రిటర్న్స్ రావటం లేదా? ‘నేను పెట్టేది తక్కువ మొత్తమే కదా! ఆర్థిక సలహాదారులు ఎందుకులే’ అని అనుకుంటున్నారా? ఇలాంటి వాటన్నిటికీ సమాధానమే కొత్తతరం రోబో అడ్వైజర్లు. చౌకగా పోర్టుఫోలియోలను నిర్వహించుకోవటమే కాదు... ఆకర్షణీయమైన లాభాలూ సొంత చేసుకోవచ్చు. ఈ తరం ఎక్కువగా ఆసక్తి చూపుతున్న రోబో అడ్వైజర్ల గురించి సమగ్రంగా చెప్పేదే ఈ ‘వెల్త్ స్టోరీ’...దశాబ్దాలుగా ఇన్వెస్టింగ్ చేయడమంటే ఆర్థిక సలహాదారును కలవడమే కాదు. చాంతాడంత ఫారాలూ నింపాల్సి వచ్చేది. అడ్వైజరీ ఫీజులు ఎక్కువే. దీంతో ఇదంతా చాలా పెద్ద వ్యవహారంగా ఉంటూ వస్తోంది. కానీ ఇప్పుడు కొత్త టెక్నాలజీలు రోబో అడ్వైజర్లను తెచ్చాయి. వీటి సాయంతో అత్యంత చౌకగా పోర్ట్ఫోలియోలను నిర్మించుకోవటమే కాదు. నిర్వహణ పనులు కూడా అవే చేసిపెడుతున్నాయి. ఎవరీ రోబో అడ్వైజర్లు.. రోబో అడ్వైజర్లంటే మరెవరో కారు..(కావు). అల్గోరిథమ్లను ఉపయోగించి పోర్ట్ఫోలియోలను రూపొందించడంతో పాటు నిర్వహణ సేవలూ అందించే ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫారాలు. పోర్ట్ ఫోలియో నిర్వహణకు సంబంధించి ఇవి ప్రధానంగా ఇన్వెస్టర్ రిస్కు సామర్థ్యాలను తెలుసుకునేందుకు కొన్ని ప్రశ్నలు వేస్తాయి. వాటి సమాధానాలను బట్టి ఏ సాధనానికి ఎంత కేటాయించాలనేది వివిధ మోడల్స్ని బట్టి సూచిస్తాయి. అలాగే పెట్టుబడి వ్యయాలు తక్కువగా ఉండే సాధనాలను ఎంపిక చేస్తాయి. ఆటోమేటిక్గా రీబ్యాలెన్స్ చేస్తాయి. అంతర్జాతీయంగా చూస్తే... బెటర్మెంట్, వెల్త్ఫ్రంట్, ఫిడిలిటీ గో, సోఫైలాంటి ప్లాట్ఫామ్లు ఈ విధానాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చాయి. ఈ మోడల్లో తమ ఆదాయం, లక్ష్యాలు, రిస్కు సామర్థ్యాల్లాంటి ప్రశ్నలకు ఇన్వెస్టర్లు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా ఈ రోబో వ్యవస్థ ఒక డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోను సిఫార్సు చేస్తుంది. ఈ ప్రక్రియలో మనిషి జోక్యం చాలా తక్కువ. అంతా సిస్టం చూసుకుంటుంది. అందుకే ఖర్చూ తక్కువగా ఉంటుంది. అసలెలా పని చేస్తాయి.. ఈ రోబో అడ్వైజర్లు ముందుగా రిస్క్ ప్రొఫైలింగ్ చేస్తాయి. ఈ దశలో మీరు ఎంతకాలం ఇన్వెస్ట్ చేయదల్చుకుంటున్నారు? ఒకవేళ మార్కెట్ గానీ 10 శాతం పడితే మీరెలా స్పందిస్తారు? మీ ఆదాయం ఎంత మేర స్థిరంగా ఉంటుంది? వంటి ప్రశ్నలు వేస్తాయి. మీరిచ్చే సమాధానాలను బట్టి మీ రిస్కు సామర్థ్యాన్ని అంచనా వేస్తాయి. మీరు ఎక్కువగా రిస్కు తీసుకోవడానికి ఇష్టపడతారా? లేక ఒక మోస్తరుగా తీసుకోగలరా? లేక రిసు్కకు దూరంగా ఉంటారా? అనేది అర్థం చేసుకుంటాయి. పోర్ట్ఫోలియో నిర్మాణం ఇలా... మీరు ఓకే చేశాక... రెండో దశలో అల్గోరిథం మీ రిస్కు సామర్థ్యాలకు అనుగుణంగా ఈక్విటీ, డెట్, కొన్ని సందర్భాల్లో బంగారం లేదా అంతర్జాతీయ అసెట్స్లాంటి సాధనాలకు ఎంతెంత కేటాయించవచ్చనేది నిర్ణయిస్తుంది. ఆ తర్వాత ఒకవేళ ఈక్విటీ మార్కెట్లు పెరిగి, మీరు నిర్దేశించిన స్థాయికన్నా కేటాయింపులు పెరిగిపోతే, సిస్టం ఆటోమేటిక్గా రీబ్యాలెన్స్ చేస్తుంది. చాలా మటుకు ప్లాట్ఫామ్లు మీ లక్ష్యాలను ట్రాక్ చేసే విధంగా పని చేస్తాయి. రిటైర్మెంట్, పిల్లల చదువులు, ఇంటి కొనుగోలు ఇలాంటి లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడిని నిర్వహిస్తాయి. తద్వారా ఆర్థిక విషయాల్లో స్పష్టతనిచ్చేందుకు ప్రయతి్నస్తాయి. కొత్త వారికి లాభాలెన్నో..→ తక్కువ వ్యయాలు: సంప్రదాయ అడ్వైజరీ సరీ్వసులందించే సంస్థలు ఏటా 1– 2 శాతం చార్జీలు లేదా లావాదేవీలకింత కమీషన్ చొప్పున వసూలు చేస్తుంటాయి. అంతా ఆటోమేటెడ్గానే ఉంటుంది కాబట్టి రోబో–అడ్వైజర్ల ఫీజులు చాలా తక్కువ ఉంటాయి. ఇలా ఫీజులు తక్కువగా ఉండటం వల్ల దీర్ఘకాలంలో మరింత ఎక్కువగా రాబడులు వచ్చే అవకాశం ఉంటుంది. → క్రమశిక్షణ: సాధారణంగా ఇన్వెస్ట్ చేసేటప్పుడు భావోద్వేగాలు మనల్ని ప్రభావితం చేస్తుంటాయి. భయం వల్ల కావచ్చు లేదా అత్యాశ వల్ల కావచ్చు, రిటైల్ ఇన్వెస్టర్లు సర్వసాధారణంగా ఎక్కువ రేటులో కొని, తక్కువ రేటుకు అమ్మేస్తుంటారు. ఆటోమేటెడ్ సిస్టంలలో ఇలాంటి భావోద్వేగాలు ఉండవు. వాటి తాలూకా తప్పిదాలూ ఉండవు. డేటా ఆధారిత అలొకేషన్ నిబంధనలను ఇవి పాటిస్తాయి. తద్వారా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైనా ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగేలా చూస్తాయి. → సరళత్వం: రోబో అడ్వైజర్లు దన్నుగా ఉంటే డజన్ల కొద్దీ మ్యూచువల్ ఫండ్లను విశ్లేíÙంచుకోవాల్సిన పనిగానీ... ప్రతి రోజూ మార్కెట్ న్యూస్ని ట్రాక్ చేస్తూ ఉండటం గానీ చేయనక్కర్లేదు. డైవర్సిఫికేషన్ రీబ్యాలెన్సింగ్ అంతా కూడా ఆన్లైన్ ప్లాట్ఫామే చూసుకుంటుంది. → అందుబాటు స్థాయిలో: సాధారణంగా చాలా తక్కువ మొత్తాలతో కూడా పెట్టుబడిని ప్రారంభించవచ్చు. సంపాదన అప్పుడప్పుడే మొదలుపెట్టినవారికి ఇది ఎంతో అనుకూల అంశంగా ఉంటుంది. మన దగ్గర ఇలాంటి సాధనాలున్నాయా? భారత్లోను ఇప్పుడిప్పుడే ఇలాంటి సరీ్వసులు అందుబాటులోకి వస్తున్నాయి. జెరోధా, గ్రో లాంటి డిస్కౌంట్ బ్రోకరేజీలు, ఫిన్టెక్ ప్లాట్ఫామ్లు.. లక్ష్యాల ఆధారిత ఇన్వెస్టింగ్ సాధనాలు, ఇన్వెస్టర్ల అవసరాలకు తగ్గట్లుగా తీర్చిదిద్దిన పోర్ట్పోలియోలను అందిస్తున్నాయి. కొన్ని ప్లాట్ఫాంలు మోడల్ పోర్ట్ఫోలియోలను రూపొందిస్తున్నాయి. అర్థయంత్ర, కువేర, ఇండ్మనీ, స్క్రిప్బాక్స్, ఫండ్స్ ఇండియా లాంటివి వివిధ ప్రొఫైల్స్కి తగ్గట్లుగా సరీ్వసులు ఇస్తున్నాయి. ప్రస్తుతం దేశీయంగా సుమారు 140 రోబో–అడ్వైజరీ స్టార్టప్స్ ఉన్నట్లు అంచనా. కాకపోతే ఇంకా దేశీయంగా పూర్తి స్థాయిలో అమెరికా మాదిరి ఆటోమేట్ చేసిన ఈటీఎఫ్ ఆధారిత రోబో ప్లాట్ఫాంలు అందుబాటులో లేవు. హైబ్రిడ్ మోడల్స్ మాత్రం వస్తున్నాయి. ఇవి లక్ష్యాల ఆధారిత మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టింగ్, పెట్టుబడులకు ముందు డిజిటల్గా రిస్క్ ప్రొఫైలింగ్ చేయడం, ఆటోమేటిక్గా సిప్లను సరి చేయడంలాంటివి చేస్తున్నాయి. దేశీయంగా ఫిన్టెక్ వినియోగం, సిప్ పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో, రాబోయే రోజుల్లో రోబో–అడ్వైజరీ సరీ్వసులు మరింత విస్తరిస్తాయనేది సుస్పష్టం.ఇవి ఎవరికి అనువంటే...→ తొలిసారిగా ఇన్వెస్ట్ చేస్తున్నవారికి → బిజీగా ఉండే ప్రొఫెషనల్స్కి → మార్కెట్పై పరిమిత స్థాయి పరిజ్ఞానం ఉన్న వారికి → దీర్ఘకాలంలో సంపదను పెంచుకోవాలనుకునేవారికి అయితే, అత్యంత సంపన్న వర్గాల వారికి, సంక్లిష్టమైన విధంగా పన్నులు కట్టాల్సిన వారికి మాత్రం వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా మనుషులు అందించే అడ్వైజరీ సరీ్వసులే అవసరం కావచ్చు.ఇప్పుడిదే ట్రెండు..యువ ఇన్వెస్టర్లు ఇప్పుడు పేపర్ వర్క్, సేల్స్మెన్ బాదరబందీని కాకుండా సింపుల్గా ఉండే యాప్ల వైపు మొగ్గు చూపుతున్నారు. రోబో–అడ్వైజర్లు సరిగ్గా ఇందుకు సరిపోతాయి. సాధారణంగా చాలా మటుకు ఇండియన్స్ పెట్టుబడి అంటే అదేదో బ్రహ్మపదార్థమనే భావనతో ఇన్వెస్టింగ్ని వాయిదా వేస్తుంటారు. రోబో అడ్వైజరీ సాధనాలు ఇలాంటి అపోహలను పోగొట్టి.. పెట్టుబడి పెట్టడాన్ని చాలా సులభతరం చేస్తున్నాయి. గుర్తుంచుకోవాల్సిన విషయాలు..→ పెట్టుబడులు పెట్టడం మీకు కొత్తయినా, ఎలా మొదలెట్టాలో తెలియకపోయినా, రిస్క్ ప్రొఫైలింగ్ టూల్తో మొదలుపెట్టండి. వైవిధ్యమైన, తక్కువ ఖర్చులు ఉండే ప్రోడక్టులను ఎంచుకోండి. స్వల్పకాలిక గందరగోళం ప్రభావంలో పడకుండా దీర్ఘకాలిక లక్ష్యాలపై ఫోకస్ చేయండి. → ముఖ్యంగా రోబో–అడ్వైజర్లంటే మ్యాజిక్ చేసేసి, సంపదను సృష్టించే సాధనాలేమీ కాదు. క్రమశిక్షణతో, తక్కువ ఖర్చుతో ఇన్వెస్ట్ చేసేందుకు ఉపయోగపడే శక్తివంతమైన సాధనాలుగా మాత్రం చూడొచ్చు. అడ్వైజర్లతో గంటల తరబడి, రోజుల తరబడి చర్చిస్తూ కూర్చోడం కన్నా సింప్లిసిటీని కోరుకునే బిగినర్స్.. మార్కెట్లలోకి తొలి అడుగు వేసేందుకు ఇది స్మార్ట్ మార్గంగా ఉపయోగపడొచ్చు. -
యూజర్లు సేఫ్.. మోసాలకు చెక్!
భారతదేశంలోని ప్రముఖ టెలికమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన భారతీ ఎయిర్టెల్ వినియోగదారులకు సురక్షితమైన మెసేజింగ్ అనుభవాన్ని అందించడానికి గూగుల్తో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది. దీంతో ఎయిర్టెల్ నెట్వర్క్ ఇంటెలిజెన్స్ను గూగుల్ రిచ్ కమ్యూనికేషన్స్ సర్వీసెస్ (RCS) ప్లాట్ఫామ్ & స్పామ్ ఫిల్టరింగ్తో కలపడం ద్వారా వినియోగదారులకు మెరుగైన రక్షణ కలిగిన మెసేజింగ్ సేవలను అందించనున్నారు.గత 1.5 సంవత్సరాలుగా.. ఎయిర్టెల్ స్పామ్ కాల్స్ అండ్ డిజిటల్ మోసాలపై పోరాడుతోంది. ఏఐ బేస్డ్ విధానాలను ఉపయోగించి కంపెనీ ఇప్పటి వరకు 71 బిలియన్ స్పామ్ కాల్స్, 2.9 బిలియన్ స్పామ్ SMSలను అడ్డుకుంది. దీంతో సంస్థ ఆర్ధిక నష్టాల విలువ 68.7 వరకు తగ్గాయి. ఇది వినియోగదారుల పట్ల కంపెనీకున్న నిబద్ధతను స్పష్టంగా చూపిస్తుంది.అయితే.. టెలికాం నెట్వర్క్లకు ఉన్న భద్రతా ప్రమాణాలు ఇతర మెసేజింగ్ యాప్స్లో పూర్తిగా అమలు కావడం లేదు. దీనిని అదనుగా తీసుకుని కొందరు సైబర్ నేరగాళ్లు ఆర్ధిక మోసాలకు పాల్పడుతున్నారు. స్పామ్ మెసేజస్ పంపిస్తున్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టడానికి ఎయిర్టెల్.. గూగుల్తో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది. మొత్తం మీద వినియోగదారుల భద్రతకు సంస్థ గొప్ప నిర్ణయం తీసుకుంది.ఉపయోగాలు➤సందేశం పంపిన వారి గుర్తింపును చెక్ చేయవచ్చు.➤వినియోగదారుల డీఎన్డీ సెట్టింగ్స్కు అనుగుణంగా మెసేజ్లను ప్రకటన లేదా అవసరమైన మెసేజ్లుగా వేరు చేసుకోవచ్చు.➤స్పామ్ బిజినెస్ మెసేజ్లు మీ ఫోన్కు రాకుండా చేసుకోవచ్చు.➤హానికరమైన లేదా మోసపూరిత లింకులను ముందుగానే గుర్తించి బ్లాక్ చేసుకోవచ్చు. -
సిమ్ బైండింగ్పై ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధం
న్యూఢిల్లీ: వాట్సాప్, సిగ్నల్, టెలిగ్రాం లాంటి యాప్ ఆధారిత కమ్యూనికేషన్ సర్వీసులు తప్పనిసరిగా యాక్టివ్ సిమ్కార్డుతో లింక్ అయి ఉండాల్సిందేనంటూ (సిమ్ బైండింగ్) కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై బ్రాడ్బ్యాండ్ ఇండియా ఫోరం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది టెలికమ్యూనికేషన్స్ చట్టాన్ని అతిక్రమించడమేనని, రాజ్యాంగవిరుద్ధమని టెలికం శాఖ కార్యదర్శి అమిత్ అగ్రవాల్కి ఫిబ్రవరి 23న రాసిన లేఖలో వ్యాఖ్యానించింది.దీని వెనుక గల అసలు కారణాలను తాము అర్థం చేసుకోగలమని, కాకపోతే నియంత్రణ సంస్థ జోక్యమనేది నిర్దిష్ట చట్టపరిధికి లోబడి ఉండాలని కోరుతున్నామని పేర్కొంది. మెటా, గూగుల్ లాంటి టెక్ దిగ్గజాలన్నీ బ్రాడ్బ్యాండ్ ఇండియా ఫోరంలో సభ్యులుగా ఉన్నాయి. దేశ భద్రత రీత్యా సిమ్ బైండింగ్ నిబంధనలను మార్చే ప్రసక్తి లేదంటూ కేంద్ర టెలికం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేసిన నేపథ్యంలో బీఐఎఫ్ లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఏఐప్లస్ స్మార్ట్ఫోన్ నుంచి నోవాపాడ్స్
న్యూఢిల్లీ: ఏఐప్లస్ స్మార్ట్ఫోన్ సంస్థ తాజాగా ఏఐఓటీ విభాగంలోకి కార్యకలాపాలు విస్తరించింది. నోవాపాడ్స్, నోవావాచ్ని ప్రవేశపెట్టింది. ఇవి ఫిబ్రవరి 27 నుంచి ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంటాయి. నోవాపాడ్స్ ధర రూ. 699 నుంచి, నోవా వాచ్ ధర రూ. 2,499 నుంచి ప్రారంభమవుతుంది.అలాగే కొత్త తరం స్మార్ట్ఫోన్లయిన పల్స్ 2, నోవా 2 సిరీస్ని కూడా కంపెనీ ప్రకటించింది. మార్చ్ 2న పల్స్ 2ని, ఆ తర్వాత నోవా 2 సిరీస్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపింది. పల్స్ 2లో 50 ఎంపీ ఏఐ డ్యుయల్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16 తదితర ఫీచర్లు ఉంటాయని పేర్కొంది. -
ఏఐ ఎంత ఎదిగినా.. భర్తీ చేయలేని పనులు ఇవే!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల ఇప్పటికే చాలా కంపెనీల్లో ఉద్యోగులు జాబ్స్ కోల్పోయారు. రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని నిపుణులు సైతం అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏఐ కొన్ని వృత్తులను, ఉద్యోగాలను భర్తీ చేయలేదని స్పష్టం చేశారు.శ్రీధర్ వెంబు ప్రకారం.. పిల్లలను చూసుకోవడం, వృద్ధులను సంరక్షించడం, బోధన చేయడం, ప్రకృతిపట్ల ప్రేమతో.. అటవీ రక్షకులుగా పనిచేయడం, దేవాలయంలో భక్తితో నిత్యకార్యాలు నిర్వహించడం వంటివి ఏఐ చేయలేదు. ఇవన్నీ కేవలం డబ్బు సంపాదన కోసం చేసేవి కాదు. ఇవి బాధ్యత, ప్రేమ, నిబద్దత, ఆత్మసంతృప్తి కోసం చేస్తారు.నిజానికి ఏఐ ఎంత అభివృద్ధి చెందినా.. మనిషి విలువను, విలువలను తగ్గిచలేదు. కొన్ని రంగాల్లో మనిషికంటే గొప్పగా ముందుకు సాగినప్పటికీ, మనిషి ఆలోచనలను అందుకోవడం కష్టం అనే చెప్పాలి. అంతే కాకుండా.. భవిష్యత్తులో సమాజం కూడా ఆర్థిక ప్రమాణాలకన్నా, మనసుకు దగ్గరైన విలువల చుట్టూ తిరిగే విధంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.If our notion of self-worth comes from the economic value we add, or if it comes our intellectual pretense (*cough*), AI may pose a serious challenge to our self-worth.On the other hand no one takes up activities like taking care of children, teaching children, taking care of…— Sridhar Vembu (@svembu) February 27, 2026 -
ఫోన్ ఛార్జర్కి ఇంత కథ ఉందా!
కొన్ని పరికరాలు పని చేయాలంటే కరెంట్ అవసరం. మరికొన్ని పరికరాలు పనిచేయాలంటే ఛార్జింగ్ అవసరం. ముఖ్యంగా ఫోన్ పనిచేయాలంటే ఛార్జింగ్ తప్పనిసరి. మరి ఈ ఛార్జర్ ఎప్పుడు పుట్టిందో తెలుసా?ప్రారంభ కాలంలో ఫోన్ ఛార్జ్ చేయడానికి గంటలకు పైగా పట్టేది. ఇది కూడా 30 నిమిషాలు మాత్రమే నిలిచేది. 1990ల అనంతరం ఫోన్ల వాడకం పెరిగిన తర్వాత నోకియా, మోటరోలా, శామ్సంగ్ ఫోన్ సంస్థలు ప్రత్యేకమైన ఛార్జర్లు తయారు చేశారు. ఒక ఫోన్కు వాడే ఛార్జర్ మరొక ఫోన్కు వాడే అవకాశం లేకుండా చేశారు. దీంతో ఆయా ఫోన్ల కోసం వినియోగదారులు వేర్వేరు ఛార్జర్లు కొనాల్సి వచ్చేది.ఆ తర్వాత యూఎస్బి (యూనివర్సల్ సీరియల్ బస్) ప్రమాణాలకు అనుగుణంగా ఫోన్ తయారీ సంస్థలు ఛార్జర్లను తయారు చేయడం మొదలుపెట్టాయి. దీనివల్ల ఛార్జర్లు ప్రామాణికంగా మారాయి. గంటలకొద్దీ ఛార్జింగ్ పెట్టే అవసరం లేకుండా తర్వగా ఛార్జింగ్ అందేలా ఛార్జర్లను తయారు చేయడం ప్రారంభమైంది. ఛార్జర్కు వైర్లెస్గా తయారు చేయడానికి 2000 సంవత్సరం నుంచే ప్రయత్నాలు మొదలయ్యాయి. 2010లో తయారు చేయగలిగారు. ప్రస్తుతం మార్కెట్లో వైర్లెస్ ఛార్జర్లు అందుబాటులో ఉన్నాయి.చాలామంది ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఫోన్ వాడుతుంటారు. దీనివల్ల కరెంట్ షాక్ కొట్టే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట పడుకునేముందు ఛార్జింగ్ పెట్టి ఉదయం దాకా ఉంచడం కూడా సరైన పని కాదంటున్నారు. దీనివల్ల కరెంట్ షాక్, అగ్నిప్రమాదాలు జరిగాయని అంటున్నారు. ఫోన్లో 100 శాతం ఛార్జింగ్ ఎప్పుడూ పెట్టకూడదని, 90 శాతం కంటే తక్కువ ఉంటే సరిపోతుందని అంటున్నారు. -
అలా ఆలోచిస్తేనే ‘రిచ్’ అవుతారు.. కియోసాకీ హెచ్చరిక!
అమెరికా ఫిన్టెక్ దిగ్గజం .. స్క్వేర్, క్యాష్ యాప్లకు చెందిన బ్లాక్ (Block Inc.) కంపెనీ ఊహించని నిర్ణయం తీసుకుంది. కంపెనీలోని సుమారు 10 వేల మంది ఉద్యోగుల్లో 40 శాతం.. అంటే 4,000 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోతున్నారని స్వయంగా కంపెనీ సీఈఓ జాక్ డార్సీ (ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు) ఇటీవల ప్రకటన చేశారు. ఇది ఆర్థిక సంక్షోభం వల్ల కాదు, కంపెనీ లాభాలు బాగున్నాయి.. షేర్లు 20-25 శాతం పెరిగాయి. కారణం ఒక్కటే.. కృత్రిమ మేధస్సు (AI)!"ఇంటెలిజెన్స్ టూల్స్ (AI) వాడితే చిన్న టీమ్తోనే ఎక్కువ పని, మెరుగైన ఫలితాలు సాధ్యమవుతున్నాయి. ఇది కంపెనీల నడిపించే విధానాన్నే మార్చేసింది" అని డార్సీ స్పష్టంగా చెప్పారు. గతంలో ప్రతి ఉద్యోగి కంపెనీకి కోట్ల రూపాయల ఆదాయం తెచ్చినా, ఇప్పుడు వాళ్ల పనిని ఏఐ చేస్తోందని అంగీకరించారు. దీంతో ఉద్యోగుల సంఖ్య 6 వేల దాటకుండా తగ్గించాలని నిర్ణయించారు.ఈ పరిణామంపై ప్రసిద్ధ ఆర్థిక గురూ, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకీ (Robert Kiyosak) ‘ఎక్స్’ (ట్విట్టర్)లో ఓ శక్తివంతమైన పోస్ట్ చేశారు. "ఏఐ ధనవంతుల్ని మరింత ధనవంతుల్ని చేస్తోంది" అంటూ ఆయన హెచ్చరించారు. "ఉద్యోగిలా ఆలోచిస్తే ఏఐ మిమ్మల్ని భర్తీ చేస్తుంది. అదే వ్యాపారవేత్తలా ఆలోచిస్తే, డార్సీలా ఏఐని 'హైర్' చేసుకుని మీరు ధనికులవుతారు" అని స్పష్టంగా చెప్పారు.AI MAKES the RICH RICHER:Jack Dorsey just fired 4400 hundred employees. Not because the company needed the money.Dorsey admitted each employee made his company millions of dollars.Dorsey fired 4400 employee because AI could do their jobs.RICH DAD LESSON:Think like an…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 27, 2026 -
ఐక్యూ15ఆర్ స్మార్ట్ఫోన్: ధర ఎంతంటే?
ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఐక్యూ కొత్తగా 15ఆర్ ఫోన్ను మార్కెట్లో లాంచ్ చేసింది. డిస్కౌంట్లు, ఆఫర్లు పోగా ధర రూ. 40,999 నుంచి ప్రారంభమవుతుంది. మార్చి 3 నుంచి అమెజాన్, ఐక్యూ ఈ-స్టోర్, రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ మొదలైన వాటిల్లో సేల్ మొదలవుతుంది.ఇందులో 6.59 అంగుళాల డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 8 జెన్ 5, 7600 ఎంఏహెచ్ బ్యాటరీ, సూపర్ కంప్యూటింగ్ చిప్ క్యూ2, ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 6.0 తదితర ఫీచర్లు ఉంటాయి. 4 ఏళ్ల పాటు సాఫ్ట్వేర్, 6 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి. ఇది 100W ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. -
దీపిందర్ గోయల్ కొత్త స్టార్టప్లో ఉద్యోగాలు
జొమాటో వ్యవస్థాపకుడు, ఎటర్నల్ వైస్ చైర్మన్ దీపిందర్ గోయల్ తన హెల్త్-టెక్ స్టార్టప్ ‘టెంపుల్’ కోసం ఉద్యోగ నియామకాలను ప్రారంభించారు. తాజాగా సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్)లో చేసిన పోస్టులో, మెషిన్ లెర్నింగ్ నుంచి న్యూరల్ డీకోడింగ్ పరిశోధకుల వరకు పలు ఇంజనీరింగ్ హోదాలకు అభ్యర్థులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.అయితే, ఈ నియామక ప్రకటనలో శరీర కొవ్వు శాతాన్ని అర్హత ప్రమాణంగా పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. పురుషులు 16 శాతం కంటే తక్కువున్నవారు, మహిళలు 26 శాతం కంటే తక్కువ శరీర కొవ్వు ఉన్నవారే దరఖాస్తు చేసుకోవాలని గోయల్ స్పష్టం చేశారు.ఏమిటీ ‘టెంపుల్’?ప్రస్తుతం పరిశోధన, ప్రోటోటైప్ దశలో ఉన్న ‘టెంపుల్’ అనేది ధరించదగిన (వేరబుల్) పరికరం. ఇది మెదడు రక్త ప్రవాహాన్ని ఖచ్చితంగా, రియల్ టైమ్లో, నిరంతరంగా కొలిచే ప్రయోగాత్మక పరికరం. గోయల్ ప్రకారం.. ఈ స్టార్టప్ ఎలైట్ అథ్లెట్ల కోసం అత్యాధునిక పనితీరు కొలిచే పరికరాన్ని అభివృద్ధి చేస్తోంది.ఫిట్నెస్కు ప్రాధాన్యం‘టెంపుల్’ స్టార్టప్ ‘క్రాఫ్ట్’, ‘కేటగిరీ’ పట్ల మక్కువ కలిగిన వ్యక్తులను కోరుకుంటోంది. అభ్యర్థులు కేవలం నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు మాత్రమే కాకుండా, తమ శారీరక సామర్థ్యాలను మెరుగుపరచడానికి కృషి చేసే అథ్లెట్లుగా ఉండాలని గోయల్ అభిప్రాయపడ్డారు.ఈ ప్రకటన వైరల్ కావడంతో సోషల్ మీడియాలో విభిన్న కామెంట్లు వ్యక్తమయ్యాయి. కొందరు గోయల్ ధైర్యవంతమైన ఆలోచనను ప్రశంసిస్తే, మరికొందరు శరీర కొవ్వు శాతం ఆధారంగా నియామకాలు చేపట్టడం సరైన ఫిల్టర్ కాదని అభిప్రాయపడ్డారు. “16 శాతం కంటే తక్కువ శరీర కొవ్వుతో ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంజనీర్ దొరకడం కష్టం” అని ఓ యూజర్ సరదాగా కామెంట్ చేశారు.We're recruiting at @temple.At Temple, we are building the ultimate wearable for elite performance athletes. A device that measures what no other wearable in the world measures, with a level of precision that doesn't exist yet.To build it, we need people who are obsessive… pic.twitter.com/iCHaMUwdEw— Deepinder Goyal (@deepigoyal) February 27, 2026 -
శాంసంగ్ గెలాక్సీ ఎస్26 సిరీస్: ధరలు ఇలా
దక్షిణ కొరియన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తమ ఫ్లాగ్షిప్ గెలాక్సీ ఎస్26 సిరీస్ స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించింది. వీటిలో ఎస్26, ఎస్26ప్లస్, ఎస్ 26 అల్ట్రా అని మూడు వేరియంట్స్ ఉంటాయి. శాంసంగ్ పోర్టల్ ప్రకారం వేరియంట్ని బట్టి ధర రూ. 87,999 నుంచి రూ. 1,89,999 (అల్ట్రా) వరకు ఉంటుంది. ప్రీఆర్డర్ చేసే వారికి రూ. 20,000 వరకు విలువ చేసే ప్రయోజనాలు లభిస్తాయి.ఈ సిరీస్లోని అల్ట్రా వేరియంట్లో పరిశ్రమలోనే తొలిసారిగా ప్రైవసీ డిస్ప్లే ఫీచర్ ఉంది. స్క్రీన్ మీద ఉన్న కంటెంట్ పక్క వారికి కనిపించకుండా కేవలం యూజరుకు మాత్రమే కనిపించేలా సెట్టింగ్స్ని మార్చుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ప్రయాణాలు చేస్తున్నప్పుడు, ఇతరులతో ఉన్నప్పుడు ప్రైవసీని కాపాడుకునేందుకు సహాయకరంగా ఉంటుంది. శక్తివంతమైన స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ జెన్ 5 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, అరగంటలోనే 75 శాతం చార్జ్ అయ్యేలా సూపర్ ఫాస్ట్ చార్జింగ్ 3.0, 50 ఎంపీ, అల్ట్రా వైడ్ కెమెరా, 200 ఎంపీ వైడ్ కెమెరా, 256 జీబీ నుంచి 1 టీబీ వరకు స్టోరేజ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. దీనికి ముందు సిరీస్ తరహాలోనే ఈ ఫోన్లను కూడా భారత్లోని నోయిడా ప్లాంటులో ఉత్పత్తి చేయనున్నట్లు శాంసంగ్ తెలిపింది. దక్షిణ కొరియా వెలుపల, బెంగళూరులోని తమ ఆర్అండ్డీ సెంటర్ వీటిని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు వివరించింది. ఈ సిరీస్తో దేశీయంగా యాపిల్ నుంచి పోటీ నెలకొన్న 800 డాలర్ల ఎగువ ధర పలికే సూపర్ ప్రీమియం స్మార్ట్ఫోన్ సెగ్మెంట్లో శాంసంగ్ తన స్థానాన్ని పటిష్టం చేసుకునే అవకాశం లభించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. -
సైబర్ భద్రతలో రాజీ లేదు
దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడానికి, జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. మెసేజింగ్ యాప్లకు సంబంధించి ప్రతిపాదించిన ‘సిమ్ బైండింగ్’ నిబంధనల్లో ఎటువంటి సడలింపు ఉండబోదని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. ముఖ్యంగా వెబ్ ఆధారిత మెసేజింగ్ ప్లాట్ఫామ్లకు విధించిన 6 గంటల ఆటోమేటిక్ లాగ్-అవుట్ నిబంధనను సడలించబోమని తేల్చి చెప్పారు.ఏమిటీ సిమ్ బైండింగ్? వినియోగదారులపై ప్రభావం?టెలికాం సైబర్ సెక్యూరిటీ రూల్స్-2024 ప్రకారం వాట్సాప్, టెలిగ్రామ్.. మెసేజింగ్ యాప్లు ఇకపై వినియోగదారుడి ఫోన్లోని యాక్టివ్ సిమ్ కార్డుతో నిరంతరం అనుసంధానమై ఉండాలి. ఒకవేళ ఫోన్ నుంచి ఒరిజినల్ సిమ్ కార్డును తొలగించినా లేదా అది డీయాక్టివేట్ అయినా ఆ పరికరంలో మెసేజింగ్ సేవలు తక్షణమే నిలిచిపోతాయి. ల్యాప్టాప్ లేదా పీసీల్లో వాడే వెబ్ వెర్షన్లు ప్రతి 6 గంటలకు ఒకసారి ఆటోమేటిక్గా లాగ్-అవుట్ అవుతాయి. వినియోగదారులు క్యూఆర్ కోడ్ ద్వారా మళ్లీ ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది.ఈ నిబంధనలను పాటించడానికి ఇచ్చిన 90 రోజుల గడువు ఫిబ్రవరి 28, 2026తో ముగియనుంది. దీన్ని పొడిగించే ఆలోచన లేదని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) స్పష్టం చేసింది. ‘జాతీయ భద్రతే మాకు ముఖ్యం. మోసాలను నివారించడానికి సిమ్ బైండింగ్ తప్పనిసరి. ఇందులో రాజీ పడే ప్రసక్తే లేదు’ అని సింధియా పేర్కొన్నారు.ఏజీఆర్, స్పెక్ట్రమ్ వేలంటెలికాం ఆపరేటర్లు కోరుతున్న సర్దుబాటు చేసిన స్థూల ఆదాయ (ఏజీఆర్) ఉపశమనంపై మంత్రి స్పందిస్తూ సుప్రీంకోర్టు తీర్పునకు లోబడే ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. వొడాఫోన్ ఐడియా తరహాలో ఏజీఆర్ ఉపశమనం కోరే ఏ సంస్థ అయినా న్యాయపరమైన మార్గాలనే అనుసరించాలని సూచించారు. మరోవైపు, తదుపరి స్పెక్ట్రమ్ వేలం కోసం ట్రాయ్ సిఫార్సులను సమర్పించిందన్నారు. వీటిని పరిశీలించి త్వరలోనే వేలం కాలక్రమాన్ని విడుదల చేస్తామని వెల్లడించారు.శాటిలైట్ ఇంటర్నెట్: స్టార్లింక్కు షరతులుభారతదేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ భద్రతా ప్రమాణాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. ఎలాన్ మాస్క్ నేతృత్వంలోని స్టార్లింక్ ఇంకా అవసరమైన భద్రతా డెమోలను పూర్తి చేయలేదని మంత్రి తెలిపారు. భారత సరిహద్దుల వెలుపల ఇంటర్నెట్ సేవలను నిలిపివేసే సామర్థ్యం, నెట్వర్క్పై పూర్తి స్థాయి భద్రతా నియంత్రణ వంటి అంశాల్లో స్పష్టత వచ్చిన తర్వాతే స్పెక్ట్రమ్ కేటాయింపులు జరుగుతాయని వివరించారు.ఇదీ చదవండి: విమాన ప్రయాణికులకు ఊరట -
ఏఐతో మరిన్ని అవకాశాలు
ముంబై: కృత్రిమ మేథ (ఏఐ) రాకతో ఉద్యోగాలు పోతాయనే భయపడనక్కర్లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ చెప్పారు. దీనితో ఉద్యోగ విధుల స్వభావం మాత్రమే మారుతుందని ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు. దేశీయంగా ఉద్యోగాలపై ఏఐ ప్రతికూల ప్రభావం గురించి తనకెలాంటి ’ఆందోళన’ లేదని ఆయన చెప్పారు. 2000లో వై2కే సమస్య తలెత్తినప్పుడు భారత్కి ఎలాగైతే మంచి అవకాశాలు లభించాయో, అదే విధంగా ఇప్పుడు కూడా కొత్త టెక్నాలజీతో కంపెనీలకు మరిన్ని వ్యాపార అవకాశాలు లభించగలవని మంత్రి తెలిపారు. 60 లక్షల ఉద్యోగాలు, 315 బిలియన్ డాలర్ల భారతీయ ఐటీ పరిశ్రమపై ఏఐ ప్రభావం గురించి ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరింత మెరుగ్గా మారడానికి ఏఐ ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. టెక్నాలజీని వినియోగించే కొద్దీ మానవ నైపుణ్యాలు, ప్రతిభావంతుల అవసరం మరింతగా పెరుగుతుందని, తద్వారా కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని మంత్రి వివరించారు. ఏఐతో లాభాలు, ఎగుమతులు పెరుగుతాయని, 23 లక్షలకు పైగా సైన్స్, ఇంజినీరింగ్, టెక్నాలజీ, మ్యాథ్స్ గ్రాడ్యుయేట్స్ వీటిని అందిపుచ్చుకోవచ్చని తెలిపారు. ఇటీవల కుదుర్చుకున్న తొమ్మిది స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల కోవలోనే ప్రపంచంతో భారత్ మరింతగా అనుసంధానమయ్యేందుకు ఇవి దోహదపడతాయని పేర్కొన్నారు. -
ఆర్టిస్ట్ మీరే... క్యారికేచర్ మీదే!
సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్... క్యారికేచర్ ట్రెండ్. పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీలో క్యారికేచర్లలోకి మార్చడమే ఈ ట్రెండ్ సారాంశం. వ్యక్తిత్వం నుంచి అభిరుచుల వరకు వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని అందుకు అనుగుణంగా క్యారికేచర్లను రూపొందిస్తున్నారు. ఈ కార్టూన్–స్టైల్ ఇమేజ్లు నెటిజనులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రెండ్లో భాగం కావడానికి డ్రాయింగ్ స్కిల్స్, డిజైన్ సాఫ్ట్వేర్, ఎడిటింగ్ ఎక్స్పీరియెన్స్లాంటివేమీ అవసరం లేదు. జస్ట్... ఆసక్తి ఉంటే చాలు!మీరు కూడా ఈ ట్రెండ్లో భాగం కావాలనుకుంటే... ఇలా చేయండి:→ చాట్జీపీటీ ఒపెన్ చేసి లేటెస్ట్ వెర్షన్ (జీపీటి–4వో) ఎంపిక చేసుకోవాలి.→ స్పష్టమైన, ఫ్రంట్–పేసింగ్ సెల్ఫీ లేదా ఫొటోను అప్లోడ్ చేయాలి.→ ‘క్రియేట్ ఏ క్యారికేచర్ ఆఫ్ మై మీ’... ఇలా ఇన్పుట్ ఇవ్వాలి.→ మీ వృత్తి, అభిరుచులకు సంబంధించిన వివరాలను యాడ్ చేయాలి.→ ఇమేజ్ జనరేట్ అయిన తరువాత డౌన్లోడ్ చేసుకోవాలి. -
ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కొత్త వార్నింగ్!
యువత వారానికి 70 గంటలు పని చేయాలన్న వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచిన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్.నారాయణ మూర్తి (N.R. Narayana Murthy) మరోసారి దేశ యువతకు కీలక సందేశం ఇచ్చారు. ఈసారి ఆయన దృష్టి కృత్రిమ మేధస్సు (AI)పై ఉంది. వైట్-కాలర్ ఉద్యోగాలను ఏఐ, యంత్రాలు భర్తీ చేస్తాయనే భయాలు పెరుగుతున్న వేళ, యువత ఆందోళన చెందకుండా సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.“ఏఐ శత్రువు కాదు… అవకాశాల ద్వారం”జనరేటివ్ ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ భద్రతపై చర్చలు ముదురుతున్నాయి. అయితే ఈ భయాలను తప్పుబట్టిన మూర్తి, ఏఐ ఆటోమేటిక్గా అందరికీ సమాన అవకాశాలు కల్పించదని స్పష్టం చేశారు.“జనరేటివ్ ఏఐని ఉత్పాదకత కోసం నేను స్వయంగా ఉపయోగించిన అనుభవం చెబుతోంది. దీన్ని తెలివిగా వినియోగించినవారికి మెరుగైన నాణ్యత, అధిక ఉత్పాదకత లభిస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.యువత ఏఐని ప్రమాదంగా కాకుండా, సమర్థంగా వినియోగించాల్సిన సాధనంగా చూడాలని ఆయన పిలుపునిచ్చారు. క్రమశిక్షణ, కృషి, నిరంతర అభ్యాసంతో ఏఐ నైపుణ్యాలను మిళితం చేస్తే భవిష్యత్తులో విజయం సాధ్యమని మూర్తి అన్నారు.ఉద్యోగాలపై ఏఐ ప్రభావం… తీవ్రమౌతున్న చర్చఇటీవల అమెరికాకు చెందిన ఆంథ్రోపిక్ (Anthropic) సంస్థ పలు అధునాతన ఏఐ సాధనాలను విడుదల చేయడంతో ఏఐ ఆధారిత ఉద్యోగ నష్టాలపై చర్చ మళ్లీ జోరందుకుంది. ముఖ్యంగా ఈ కంపెనీ అభివృద్ధి చేసిన క్లాడ్ (Claude) ప్లాట్ఫామ్ ఆఫీస్ పనులను స్వయంచాలకంగా నిర్వహించే సామర్థ్యంతో ముందుకు వచ్చింది.లీగల్ సర్వీసులు, ఫైనాన్స్, మానవ వనరులు, ఇంజినీరింగ్, ఆపరేషన్స్ వంటి రంగాల్లో పత్రాల విశ్లేషణ, డేటా ప్రాసెసింగ్, వర్క్ఫ్లో మేనేజ్మెంట్ వంటి పనులను ఈ సాధనాలు సులభతరం చేస్తున్నాయి. సాధారణంగా పెద్ద మొత్తంలో సిబ్బంది అవసరమయ్యే క్లిష్ట ప్రక్రియలను కూడా ఇవి సమర్థంగా నిర్వహించగలవని నిపుణులు చెబుతున్నారు.“భయపడకండి… సిద్ధం అవ్వండి”ఏఐ వల్ల ఉద్యోగాలు మార్పు చెందవచ్చు కానీ పూర్తిగా అంతరించిపోవని మూర్తి అభిప్రాయపడ్డారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అర్థం చేసుకుని, దానిపై ప్రావీణ్యం సాధించినవారికే భవిష్యత్తు అనుకూలంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సారాంశంగా “ఏఐపై పట్టు సాధించండి.. లేదంటే అవకాశాలు కోల్పోతారు” అంటూ యువతకు నారాయణ మూర్తి హితవు పలికారు. -
షాపింగ్ బిల్లుకు నో ఫోన్నెంబర్!
షాపింగ్ మాల్స్ ఎంట్రీ వద్ద.. రిటైల్ స్టోర్లలో బిల్లింగ్ దగ్గర మొబైల్ ఫోన్ నంబర్ అడుగుతున్నారా..? వారు అడిగిన వెంటనే చెప్పేస్తున్నారా..? అవసరం లేదు. వ్యక్తిగత మొబైల్ నంబర్ను వాణిజ్య కేంద్రాల వద్ద ఇవ్వాల్సిన అవసరం లేనే లేదు. ఈ విషయాన్ని చట్టాలు స్పష్టం చేస్తున్నాయి. షాపింగ్ మాల్స్, రిటైల్ స్టోర్లకు ఈ విషయమై ప్రభుత్వం ఏవైనా మార్గదర్శకాలు జారీ చేసిందా? అంటూ లోక్సభ ఎంపీ జనార్థన్ సింగ్ సిగ్రివాల్ లోక్సభలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా లెవనెత్తగా.. కేంద్రం బదులు ఇచ్చింది.రిటైలర్లకు వాటి అసోసియేషన్ల ద్వారా ఈ విషయంలో 2023 మే 26న సూచలను జారీ చేసినట్టు చెప్పారు. వీటి ప్రకారం.. వినియోగదారుల అభీష్టం మేరకే మొబైల్ నంబర్ తీసుకోవాల్సి ఉంటుంది. మొబైల్ నంబర్ వెల్లడించాలని ఏ నిబంధన కూడా నిర్దేశించడం లేదు. నంబర్ వెల్లడించేందుకు వినియోగదారులు తిరస్కరించొచ్చు. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ 2025 అన్నవి పౌరుల వ్యక్తిగత డేటా (మొబైల్ నంబర్లు సహా) దుర్వినియోగం కాకుండా, తగిన రక్షణ కల్పించాలని స్పష్టం చేస్తున్నాయి. ఒకవేళ తమ వ్యక్తిగత డేటా దుర్వినియోగం అయినట్టు గురిస్తే కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ హెల్ప్లైన్కు కాల్ చేసి ఫిర్యాదు కూడా చేయొచ్చు.ఇదీ చదవండి: వినియోగంలో లేని పీఎఫ్ ఖాతాల్లో డిపాజిట్ల రిఫండ్ -
స్వదేశీ విశ్వరూపం.. సర్వం విజయం
దిల్లీ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సాక్షిగా ‘సర్వం ఏఐ’ సగర్వంగా చెప్పకనే చెప్పింది. ‘వరల్డ్–క్లాస్ హార్డ్ టెక్నాలజీ ఇండియాలో కూడా సాధ్యమే’ అని! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ‘సర్వం’ విజయం ఆ కంపెనీ వ్యవస్థాపకుల సమర్థతకు మాత్రమే పరిమితమైన విజయం కాదు. ‘మన దేశం–మన కంపెనీ’ అని కలలు కనే ఔత్సాహిక ఎంటర్ప్రెన్యూర్ల విజయం. ‘మేధోవలస’కు చేయి అడ్డు పెట్టి...‘ఎక్కడో ఎందుకు? మన దేశంలోనే అద్భుతాలు సృష్టించవచ్చు’ అని ధైర్యాన్ని ఇచ్చే విజయం....‘పీహెచ్డీలు ముఖ్యం కాదు. కంపెనీకి సరిగ్గా అవసరమైన వారే ముఖ్యం’ అంటూ ఎంటర్ప్రెన్యూర్లుగా స్వదేశంలో ప్రయాణం మొదలుపెట్టిన వివేక్ రాఘవన్, ప్రత్యూష్ కుమార్లు ‘సర్వం ఏఐ’తో సత్తా చాటారు. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం) నుంచి నిన్నా మొన్నటి ‘సర్వం కేజ్’ స్మార్ట్గ్లాసెస్ వరకు, ఏ.ఐ మోడల్స్ శిక్షణకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో గ్రామీణ మహిళల ప్రతిభను వెలుగులోకి తీసుకురావడం వరకు... సర్వం సాంకేతికమయం!సర్వం సక్సెస్ మంత్రాఒక స్టార్టప్ సక్సెస్ కావడానికి, సూపర్ సక్సెస్ కావడానికి ఏం ఉండాలి? ‘సర్వం ఏఐ’ ఫౌండర్లలో ఒకరైన వివేక్ రాఘవన్ మాటల్లో చె΄్పాలంటే ‘ఏదైనా చేయగలననే నమ్మకం ఉండాలి’ఇండియా నుంచి వరల్డ్ క్లాస్ మోడల్స్ను నిర్మించాలనే లక్ష్యంతో బయలుదేరింది సర్వం. ‘మా విజయం ఎలా ఉండాలంటే ఇతర డెవలపర్లు, స్టార్టప్లు కూడా యస్...మేము కూడా ప్రపంచంతో ΄ోటీ పడుతూ వరల్డ్–క్లాస్ మోడల్స్ను నిర్మించగలం అనే నమ్మకాన్ని పాదుకొల్పేంతగా’ అన్నారు వివేక్. ‘వీరి ఆత్మవిశ్వాసం ఆకాశమంత ఎత్తులో కనిపిస్తుంది. సాధించగలరా?’ అని కొందరికి సందేహం వచ్చింది.పగటి కలలకే పరిమితమై ఉంటే వారి కలలు కలలుగానే ఉండేవి. అయితే వారు రాత్రనకా, పగలనకా కష్టపడ్డారు.ఇది యువత విజయంతొలి అడుగులు వేస్తున్నప్పుడు ‘సర్వం’ టీమ్లో ఉన్నది సాంకేతిక ఉద్దండులు కాదు. నవ యువకులు! ‘వీరితో విజయం సాధ్యమా?’ అని కూడా కొందరికి సందేహం వచ్చింది. ‘కచ్చితంగా సాధ్యమే’ అని నిరూపించింది సర్వం. అందుకే...‘‘మా సంస్థ విజయాన్ని భారతదేశ యువత విజయంగా కూడా నేను భావిస్తున్నాను’ అంటారు వివేక్. ఎంటర్ప్రెన్యూర్గా సిలికాన్ వ్యాలీలో గెలుపు జెండా ఎగరేసిన తరువాత స్వదేశీ బాట పట్టారు. రచ్చ గెలిచి ఇంట గెలవడానికి బయలుదేరారు.పీహెచ్డీ... పెద్ద విషయం కాదు!‘మీ ఇద్దరికీ పీహెచ్డీ ఉంది. సిలికాన్ వ్యాలీలో ఉన్నట్లు పీహెచ్డీ చేసిన డీప్–టెక్ వ్యవస్థాపకులు మన దేశంలో పెద్దగా కనిపించరు’ అనే ప్రశ్నకు ‘నిజమే!’ అని కాలర్ ఎగరేయలేదు వివేక్. ‘పీహెచ్డీ అనేది పెద్ద విషయం కాదు. సంస్థకు పనికొచ్చే సామర్థ్యమే ముఖ్యం. పీహెచ్డీ వరకు ఎందుకు? హైస్కూల్ స్థాయిలో కూడా అద్భుత ప్రతిభæ చూపుతున్న విద్యార్థులను మనం చూస్తూనే ఉన్నాం. నాకు పీహెచ్డీ ఉన్నప్పటికీ దానిలో ప్రత్యేకంగా ఏమీ లేదని నేను అనుకుంటున్నాను. పీహెచ్డీలు చేసినవారు ఎంతోమంది ఉన్నారు. కంపెనీకి అవసరమైన సరిౖయెన వ్యక్తిని ఎంచుకోవడమే ముఖ్యం’ అంటారు వివేక్.వివేక్ రాఘవన్, ప్రత్యూష్ కుమార్లు వ్యవస్థాపనలో బెంగళూరు కేంద్రంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ‘సర్వం’ 2023లో ప్రారంభమైంది. భారతీయ భాషలలో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం)ను అభివృద్ధి చేసింది. స్పీచ్–టు–టెక్ట్స్, విజన్–లాంగ్వేజ్ మోడల్స్లాంటి మల్టీ మోడల్స్ను, సిస్టమ్స్ను కూడా కంపెనీ డెవలప్ చేసింది. ‘సర్వం విజన్’ పేరుతో విజన్–లాంగ్వేజ్ మోడల్ని పరిచయం చేసింది.గత సంవత్సరం సర్వం ఏఐ ‘ఇండియా ఏఐ మిషన్’కు ఎంపికైంది. డొమెస్టిక్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మోడల్ డెవలప్మెంట్కు ఈ మిషన్ స΄ోర్ట్ చేస్తుంది. ‘ఏఐ ఫర్ భారత్’తో పాటు లాంగ్వేజ్ డాటాబేస్, స్పీచ్ రిసెర్చ్కు సంబంధించి విద్యాసంస్థలతో కలిసి పనిచేసింది సర్వం. ఇద్దరూ ఇద్దరేవివేక్ రాఘవన్ ఐఐటీ–దిల్లీ నుండి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో డిగ్రీ, కార్నెగీ మెలన్ యూనివర్శిటీలో పీహెచ్డీ చేశారు. ఐఐటీ–బాంబే ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన ప్రత్యూష్ కుమార్కు కంప్యూటర్ సైన్స్ పరిశోధనకు సంబంధించి పదిహేను సంవత్సరాల అనుభవం ఉంది. జ్యూరిచ్ యూనివర్శిటీలో పీహెచ్డీ చేశారు. ఇద్దరు ప్రతిభావంతులు ఒక దగ్గర చేరితే అద్భుతాలు జరుగుతాయనేది నిజమే అయినా, ఆ ప్రతిభావంతులు తమలాంటి వారి కోసం అన్వేషించి, తమ జట్టులో చేర్చుకోవడమే అసలుసిసలు అద్భుతం.రిస్క్ తీసుకోక΄ోవడమే పెద్ద రిస్క్!సిలికాన్ వ్యాలీ తన ఆలోచన తీరును మార్చింది అంటారు వివేక్ రాఘవన్. ‘మనల్ని మనం నిరూపించుకోవాలనుకుంటే కచ్చితంగా రిస్క్ తీసుకోవాలి’ అనేది సిలికాన్ వ్యాలీ చెప్పిన పాఠం. ‘ఇతరత్రా రిస్క్లతో ΄ోల్చితే టెక్నాలజీ రిస్క్ అనేది భిన్నమైది’ అనే విషయం తెలిసినా ‘సై’ అంటూ స్వదేశీ బాట పట్టారు వివేక్ రాఘవన్.నెట్ అవసరం లేదండీ!‘ఎడ్జ్’ అనే కొత్త ఆన్–డివైజ్ ఏఐ మోడల్ను ఆవిష్కరించింది సర్వం ఏఐ. ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండా నేరుగా స్మార్ట్ఫోన్, లాప్టాప్లలో పనిచేసేలా దీన్ని రూపొందించారు. స్పీచ్ రికగ్నిషన్, ట్రాన్స్లేషన్, టెక్స్›్ట–టు–స్పీచ్లాంటి పనులెన్నో చేస్తుంది. డివైజ్లోనే డాటా ప్రాసెస్ చేయబడినందున యూజర్లు సమాచారాన్ని క్లౌడ్కు పంపాల్సిన అవసరం లేదు. ‘ఈ మోడల్ వేగం, గోప్యత, విశ్వసనీయతపై దృష్టి సారిస్తుందని, అదే సమయంలో ప్రధాన భారతీయ భాషలకు మద్దతు ఇస్తుంది’ అని కంపెనీ ప్రకటించింది.ఇండస్ స్వదేశీ స్టార్టప్ సర్వం ఏఐ ‘ఇండస్’ అనే కొత్త ఏఐ చాట్బాట్ యాప్ను తీసుకువచ్చింది. ‘భారతీయ వినియోగదారుల కోసం భారత్లో రూపొందించిన యాప్ ఇది’ అని ప్రకటించింది కంపెనీ. చాట్జీపీటీ, జెమినివంటి ప్రసిద్ధ చాట్బాట్ల మాదిరిగానే ‘ఇండస్’లో ఫీచర్లు ఉన్నాయి. యూజర్లు వాయిస్ కమాండ్లు ఇవ్వవచ్చు. ప్రశ్నలను టైప్ చేయడానికి బదులుగా మాట్లాడవచ్చు. ఏఐ వెబ్లో శోధించవచ్చు. స్పష్టమైన సమాధానాలను తెలుసుకోవచ్చు, లోతైన పరిశోధన చేయవచ్చు. నేరుగా యాప్లోనే డాక్యుమెంట్లు రాయవచ్చు. ఇమేజ్లు, పీడీఎఫ్లు, ఫైళ్లను అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్లోని మరో ప్రత్యేకత భాషా సౌలభ్యం. -
ఏఐ యుగం.. సముద్రంలో కేబుళ్లు కాపాడుకోవడమే కీలకం
న్యూఢిల్లీ: ఏఐ యుగంలో డిజిటల్ లక్ష్యాల సాధనకు సముద్ర అంతర్భాగంలో (సబ్ సీ) వేసే కేబుల్ నెట్వర్క్ కీలకమైందని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చైర్మన్ అనిల్ కుమార్ లాహోటి తెలిపారు. అయితే, ప్రకృతి విపత్తులు, భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు, డేటాకి డిమాండ్ మొదలైన వాటి వల్ల తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న సబ్మెరైన్ కేబుల్ వ్యవస్థల భద్రతకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు.ఇందుకు సంబంధించిన సవాళ్లను పరిష్కరించేందుకు సాంకేతిక ఆవిష్కరణలు, నిర్వహణపరమైన సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడం, విధానాలపరమైన చర్యల్లాంటి బహుముఖ వ్యూహం అవసరమని పేర్కొన్నారు. కేబుల్స్ వేసే మార్గాల ప్లానింగ్, రిస్కులు తక్కువగా ఉండే ప్రాంతాలను ఎంచుకోవడం, రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్లను వినియోగించడంలాంటి అంశాలతో నష్టాలను నివారించవచ్చని బ్రాడ్బ్యాండ్ ఇండియా ఫోరం నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా లాహోటి చెప్పారు.సబ్మెరీన్ కేబుల్ వ్యవస్థ భద్రతను బలోపేతం చేసేందుకు అంతర్జాతీయ సహకారం, పటిష్టమైన నియంత్రణ విధానాలు అవసరమన్నారు. సబ్ సీ కేబుల్, డిజిటల్ క్లౌడ్ మౌలిక సదుపాయాలు డిజిటల్ ప్రపంచానికి, ఏఐ యుగానికి కీలకమైన ఇన్ఫ్రాగా మారాయని చెప్పారు. ఈ నేపథ్యంలో క్లౌడ్ మౌలిక సదుపాయాలకు సంబంధించి పటిష్టమైన సైబర్ సెక్యూరిటీ చర్యలు, నిరంతరం పొంచి ఉన్న ముప్పులను పర్యవేక్షించడం కీలకమని ఆయన పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో డేటా వినియోగం.. దేశీయంగా డిజిటల్ వినియోగం చాలా వేగంగా వృద్ధి చెందుతోందని, గత దశాబ్దకాలంలో బ్రాడ్బ్యాండ్ యూజర్ల సంఖ్య ఆరు రెట్లు ఎగిసిందని లాహోటి చెప్పారు. 2025 నవంబర్ నాటికి ఇది 100 కోట్ల మైలురాయిని అధిగమించిందని వివరించారు. కనెక్టివిటీ వల్ల డేటా వినియోగం రికార్డు స్థాయిలో పెరిగిందని, ప్రపంచంలోనే అత్యధికంగా మొబైల్ యూజర్లు నెలకు సగటున 27 జీబీ మేర వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ‘డేటా వినియోగం, డిజిటలీకరణ, ఏఐ వృద్ధి మొదలైన వాటి వల్ల గ్లోబల్ డేటా సెంటర్ల మౌలిక సదుపాయాలకు, సబ్మెరైన్ కేబుల్ వ్యవస్థలకు డిమాండ్ పెరుగుతోంది’ అని లాహోటి చెప్పారు. -
రాత్రిపూట వై-ఫై ఆఫ్ చేస్తున్నారా?
నేటి డిజిటల్ యుగంలో ఓ పూట ఫుడ్ లేకపోయినా ఉండగలరేమో కానీ, ఇంటర్నెట్ లేనిదే నిమిషం గడవని పరిస్థితి. ఇళ్లలో వై-ఫై రౌటర్లు ఇప్పుడు నిత్యావసర వస్తువులైపోయాయి. అయితే రాత్రి నిద్రపోయే సమయంలో కూడా మీ రౌటర్ ఆన్ చేసే ఉంటుందా? అలా అయితే అది మీ ఆరోగ్యంపై, ముఖ్యంగా మీ నిద్రపై ప్రభావం చూపుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట వై-ఫై ఆఫ్ చేయడం వల్ల కలిగే లాభనష్టాలపై విశ్లేషణ మీకోసం..నిద్రలేమికి రౌటర్ కారణమా?చాలామంది ఉదయాన్నే నిద్రలేవగానే నీరసంగా, అలసటగా ఉన్నట్లు ఫిర్యాదు చేస్తుంటారు. దీనికి గదిలో ఉండే వై-ఫై రౌటర్ నుంచి విడుదలయ్యే విద్యుదయస్కాంత తరంగాలు ఒక కారణం కావచ్చని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి.ఆర్ఎంఐటీ యూనివర్సిటీ (ఆస్ట్రేలియా) రిపోర్ట్: 2024లో వెలువడిన ఒక అధ్యయనం ప్రకారం వై-ఫై రౌటర్ సమీపంలో నిద్రించే వారిలో 27 శాతం మంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు. 2.4 గిగా హెడ్జ్ ఫ్రీక్వెన్సీ గల వై-ఫై సిగ్నల్స్ మానవుల గాఢ నిద్రను తగ్గిస్తాయని ఒక పరిశోధనలో తేలింది. అయితే, దీనిపై భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ నాన్-అయోనైజింగ్ రేడియేషన్ ప్రొటెక్షన్ వంటి సంస్థలు.. వై-ఫై రేడియేషన్ చాలా స్వల్పమని, ఇది మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపదని అంటున్నాయి.రాత్రిపూట వై-ఫై ఆఫ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలురేడియేషన్ ప్రభావం పక్కన పెడితే రౌటర్ ఆఫ్ చేయడం వల్ల డిజిటల్ ప్రపంచం నుంచి మన మెదడుకు విరామం దొరుకుతుంది. ఇది మానసిక ప్రశాంతతో గాఢ నిద్రకు ఉపకరిస్తుంది.రౌటర్ నిరంతరం ఆన్ చేసి ఉంచడం వల్ల విద్యుత్ వినియోగం జరుగుతుంది. రాత్రిపూట ఆఫ్ చేయడం ద్వారా ఏడాదికి కొంత మేర విద్యుత్ ఆదా చేయవచ్చు.రాత్రిపూట ఇంటర్నెట్ వాడనప్పుడు వై-ఫై ఆఫ్ చేయడం వల్ల హ్యాకింగ్ ముప్పు తగ్గుతుంది. అలాగే అనవసరమైన బ్యాక్గ్రౌండ్ అప్డేట్స్ ఆగిపోయి డేటా మిగులుతుంది.నిరంతరం ఆన్లో ఉంటే వేడి వల్ల ఎలక్ట్రానిక్ పరికరాల సామర్థ్యం తగ్గుతుంది. రాత్రి పూట పవర్ ఆఫ్ చేయడం వల్ల రౌటర్ జీవితకాలం పెరుగుతుంది.ఎప్పుడు ఆఫ్ చేయకూడదు?మీరు స్మార్ట్ హోమ్ టెక్నాలజీని వాడుతుంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. కొన్ని పరిస్థితుల్లో వై-ఫై ఆఫ్ చేయకపోవడమే మంచిది. అందులో..మీ ఇంట్లో సీసీ కెమెరాలు వై-ఫై ద్వారా పని చేస్తున్నప్పుడు.స్మార్ట్ డోర్ లాక్స్, వాయిస్ అసిస్టెంట్లు వాడుతున్నప్పుడు.సెక్యూరిటీ అలారమ్స్ యాక్టివ్గా ఉండాల్సినప్పుడు.ఒకవేళ మీరు వై-ఫై ఆఫ్ చేయలేని పరిస్థితులుంటే రౌటర్ను మీ బెడ్రూమ్లో కాకుండా హాలులో లేదా బెడ్కు కనీసం 10-15 అడుగుల దూరంలో అమర్చుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: వినియోగంలో లేని పీఎఫ్ ఖాతాల్లో డిపాజిట్ల రిఫండ్ -
ఏఐతో ఐటీకి ఇబ్బందే...
ముంబై: పెద్ద సంఖ్యలో ఉద్యోగులతో ముడిపడి ఉన్నందున కృత్రిమ మేధకు (ఏఐ) మారడం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమకు బాధాకరమైన ప్రక్రియగానే ఉంటుందని హెచ్సీఎల్ టెక్ సీఈవో విజయకుమార్ చెప్పారు. అయితే, గతంలో వై2కే సవాళ్లు వచ్చినప్పుడు దీటుగా ఎదుర్కొన్నట్లుగానే, పరిశ్రమ తిరిగి తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఇందుకు కావాల్సిన సామర్థ్యాలు పరిశ్రమకు ఉన్నాయని పేర్కొన్నారు. ఐటీ షేర్ల విషయంలో ఇన్వెస్టర్లు మరీ ఎక్కువగా ఆందోళన చెందుతున్నారన్నారు.ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ నిర్వహించిన టెక్నాలజీ అండ్ లీడర్షిప్ ఫోరం సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. ఏఐ మోడల్స్ రాకతో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు టెక్ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్న నేపథ్యంలో కుమార్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రస్తుతం దేశీ ఐటీ రంగం కీలక దశలో ఉందని, వచ్చే 5–10 ఏళ్లలో పరిశ్రమ సరికొత్తగా రూపాంతరం చెందే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. కోడింగ్ విషయంలో ఆంథ్రోపిక్ క్లాడ్ అత్యద్భుతంగా పని చేసినప్పటికీ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో కోడింగ్ వాటా 30 శాతమే ఉంటుంది కాబట్టి పరిశ్రమలో అవకాశాలు మెరుగ్గానే ఉండొచ్చన్నారు. ప్రత్యేక నైపుణ్యాలకు డిమాండ్ రాబోయే రోజుల్లో ప్రత్యేక నైపుణ్యాలకు డిమాండ్ పెరుగుతుందని, దానికి తగ్గట్లుగా ఉద్యోగులు, ఉద్యోగార్థులు సామర్థ్యాలను పెంచుకోవాల్సి ఉంటుందని కుమార్ చెప్పారు. క్లయింట్లకు భారీగా బిల్లింగ్ వేస్తూ, గణనీయంగా వృద్ధి చెందిన సాస్ (సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్) కంపెనీలకు, ఇకపై అదే స్థాయిలో చార్జీలు విధించడం సాధ్యపడదు కాబట్టి అవి సవాళ్లు ఎదుర్కొనాల్సి రావొచ్చని పేర్కొన్నారు. పెట్టుబడులకు తగ్గ స్థాయిలో ఆదాయాలు వచ్చే అవకాశాలు లేనందున విస్తృత స్థాయిలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంపై భారీగా ఇన్వెస్ట్ చేసిన సంస్థలకు సమస్యలు ఎదురుకావొచ్చన్నారు. -
ఏఐతో ముప్పేమీ లేదు
కృత్రిమ మేథ (ఏఐ)తో టెక్ పరిశ్రమ ఉద్యోగాల్లో భారీగా కోత పడుతుందన్న ఆందోళనలను మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్ తోసిపుచ్చారు. దీనివల్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ఐటీ ప్రొఫెషనల్స్కి ముప్పేమీ లేదని, ఇది వారి స్థానాన్ని భర్తీ చేయదని చెప్పారు. వారు తమ నైపుణ్యాలను, సృజనాత్మకతను మెరుగుపర్చుకునేందుకు ఏఐ సహాయకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు మరింత స్మార్ట్గా పని చేసుకునేందుకు తోడ్పడే టెక్నాలజీని రూపొందించడం మైక్రోసాఫ్ట్ లక్ష్యమని ఆయన చెప్పారు.పదే పదే పునరావృతమయ్యే కోడింగ్ పనులను మాత్రమే ఏఐ టేకోవర్ చేయొచ్చని, దీనితో ప్రోడక్ట్ డిజైన్, ఆర్కిటెక్చర్, టెస్టింగ్, భద్రత మొదలైన వాటిపై ఫోకస్ చేసేందుకు డెవలపర్లకు వీలు చిక్కుతుందని స్మిత్ తెలిపారు. ఉద్యోగాలను తగ్గించడం కాకుండా వాటిని మరింత ఆసక్తికరంగా మార్చేందుకు ఏఐ సహాయపడుతుందని చెప్పారు. దీనితో నిపుణులకు డిమాండ్ పెరుగుతుందని, వేతనాలు కూడా పెరుగుతాయని స్మిత్ వివరించారు.ప్రజల సామర్థ్యాలు మెరుగుపర్చేందుకు ఉపయోగపడే టెక్నాలజీని, మెషిన్లను తయారు చేయడమే మైక్రోసాఫ్ట్ ప్రాథమిక లక్ష్యమని ఆయన చెప్పారు. సాంకేతికత అనేది ఉత్పాదకత, ఆర్థిక వృద్ధికి చోదకంగా ఉంటూనే అత్యంత నాణ్యమైన ఉద్యోగాల కల్పనకు దోహదపడే విధంగా ఉండాలని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ప్రైవేటు రంగానికి నిధుల లభ్యత -
ఏఐ ఏజెంట్లతో షాపింగ్.. మాస్టర్ కార్డ్ ఏజెంటిక్ కామర్స్ విప్లవం!
కృత్రిమ మేధ(ఏఐ) కేవలం సమాధానాలు ఇచ్చే స్థాయి నుంచి మన తరఫున పనులు పూర్తి చేసే ఏజెంటిక్ స్థాయికి చేరుకుంది. ఢిల్లీలో జరిగిన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ వేదికగా మాస్టర్ కార్డ్ తన వినూత్న ఏజెంటిక్ కామర్స్ ఫ్రేమ్వర్క్ను ఆవిష్కరించింది. కేవలం వస్తువులను సిఫార్సు చేయడమే కాకుండా వినియోగదారుడి అవసరాలను గుర్తించి బేరసారాలు ఆడి, సురక్షితంగా లావాదేవీలను పూర్తి చేసే సామర్థ్యం దీని సొంతం. ఈ సందర్భంగా మాస్టర్ కార్డ్ ఏఐ హెడ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నితేంద్ర రాజ్పుత్ కొన్ని అంశాలు వెల్లడించారు.స్థానిక భాషల్లో ఆర్థిక లావాదేవీలుప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇండియా ఏఐ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా మాస్టర్ కార్డ్ తన ఏజెంటిక్ వ్యవస్థను రూపొందించింది. కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాకుండా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని వినియోగదారులకు సైతం ఏఐ ప్రయోజనాలను అందించడమే దీని ప్రధాన ఉద్దేశం. ఈ వ్యవస్థలో వినియోగదారుడు మొదటగా తనకిష్టమైన భాషను ఎంచుకోవచ్చు. వాయిస్ సపోర్ట్తో కూడిన ఈ టెక్నాలజీ వివిధ భారతీయ భాషల్లో సంభాషించగలదు.భారతీయ నిబంధనలకు అనుగుణంగా డేటా స్థానికీకరణ (Data Localization), గోప్యత, భారతీయ ఆర్థిక చట్టాలకు లోబడి ఈ ఫ్రేమ్వర్క్ నిర్మించినట్లు కంపెనీ తెలిపింది. ‘మేము భారతదేశంలో దశాబ్దాలుగా సర్వీసులు అందిస్తున్నాం. ఇక్కడి డేటా నిబంధనల ఆధారంగానే మా ఏజెంటిక్ కామర్స్ ఏర్పాటు చేశాం’ అని రాజ్పుత్ స్పష్టం చేశారు.సాధారణ ఈ-కామర్స్ Vs ఏజెంటిక్ కామర్స్సాధారణ ఈ-కామర్స్లో మీరు ఒక వెబ్సైట్కి వెళ్లి వస్తువులను వెతికి, ధరలను పోల్చి, మీరే ఆర్డర్ చేస్తారు. ఇక్కడ ఏఐ కేవలం ‘మీకు ఫలానా వస్తువులు నచ్చవచ్చు’ అని సిఫార్సులు మాత్రమే చేస్తుంది.ఏజెంటిక్ కామర్స్లో ఒక ఏఐ ఏజెంట్ ఉంటుంది. మీరు దానికి ఒక పని చెబితే (ఉదాహరణకు: వచ్చే వారం మా నాన్నగారి పుట్టినరోజు కోసం రూ.5000 బడ్జెట్లో ఒక మంచి వాచ్ కొనాలి), అది స్వయంగా ఇంటర్నెట్లో వెతుకుతుంది. రివ్యూలు చదువుతుంది. ఉత్తమమైన ధర ఎక్కడ ఉంటుందో తెలుసుకుంటుంది. చివరగా మీ అనుమతితో లావాదేవీని పూర్తి చేస్తుంది.మోసాలకు తావులేని ఆటోమేషన్ఏఐ ఏజెంట్లు స్వయంగా ఖర్చు చేస్తాయంటే భద్రతపై ఆందోళన కలగడం సహజం. దీన్ని అరికట్టడానికి మాస్టర్ కార్డ్ టోకెనైజేషన్, పాస్ కీ వంటి అధునాతన భద్రతా ప్రమాణాలను ప్రవేశపెట్టింది. ఏజెంట్ లావాదేవీ చేయాలంటే వినియోగదారుడి అనుమతి తప్పనిసరి. అనుమానాస్పద లావాదేవీలను గుర్తించడానికి కంపెనీ తన ప్లాట్ఫామ్ను మరింత బలోపేతం చేసింది. ఇది వినియోగదారుడి గత చరిత్రను విశ్లేషించి అసాధారణ మార్పులను వెంటనే గుర్తిస్తుంది. గ్రాఫ్ ఆధారిత సాంకేతికత ద్వారా సింథటిక్ ఐడెంటిటీలు, అంతర్జాతీయ మోసగాళ్ల నెట్వర్క్లను పసిగట్టడం మాస్టర్ కార్డ్ ప్రత్యేకతని కంపెనీ తెలిపింది.ఉద్యోగాల కోత కాదు..ఏజెంటిక్ ఏఐ రాకతో ఫిన్టెక్ రంగంలో ఉద్యోగాలపై ప్రభావం గురించి అడిగిన ప్రశ్నకు రాజ్పుత్ స్పందిస్తూ ‘కచ్చితంగా ఉద్యోగాల స్వరూపంలో మార్పు ఉంటుంది. అయితే ఉద్యోగాల కోత కంటే వివిధ జాబ్ రోల్స్పై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది’ అని విశ్లేషించారు. మెకానికల్ పనులను ఏఐ చూసుకుంటే మానవులు మరింత సృజనాత్మక, వ్యూహాత్మక పనుల వైపు మళ్లాలని సూచించారు.ఇదీ చదవండి: రిటైర్మెంట్కు రెడీనా? -
ఆ ఐటీ కంపెనీ ఉద్యోగుల్లో ఫుల్ జోష్..
దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో (TCS) పనిచేసే ఉద్యోగుల్లో ఫుల్ జోష్లో ఉన్నారు. కారణం.. మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగుల త్రైమాసిక వేరియబుల్ పేను మూడో త్రైమాసికంలో గరిష్ఠంగా 80 శాతం వరకు పెంచింది. దాదాపు రెండేళ్లుగా తక్కువ స్థాయిలో కొనసాగిన చెల్లింపుల తరువాత ఇది గణనీయమైన మార్పుగా భావిస్తున్నారు.రెండేళ్ల తర్వాత గణనీయమైన పెంపుఇటీవలి కాలంలో మధ్య, సీనియర్ స్థాయి సిబ్బందికి వేరియబుల్ పే 20–50 శాతం మధ్యకే పరిమితమై ఉండేది. ఇప్పుడు అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి చాలామంది మధ్యస్థాయి ఉద్యోగులు సుమారు 80 శాతం వేరియబుల్ చెల్లింపులు పొందినట్లు సమాచారం. సీనియర్ స్థాయి ఉద్యోగులకు 40–80 శాతం మధ్య చెల్లింపులు జరిగినట్లు తెలిసింది. ‘మనీ కంట్రోల్’ కథనం ప్రకారం.. ఉద్యోగులకు జనవరిలో ఈ మొత్తాలు జమయ్యాయి.కంపెనీ వర్గాల ప్రకారం.. మొత్తం ఉద్యోగుల్లో 70 శాతం మందికి పైగా తమ త్రైమాసిక వేరియబుల్ వేతనంలో 100 శాతం అందుతోంది. అయితే, పూర్తి చెల్లింపులు ఎక్కువగా జూనియర్ స్థాయి ఉద్యోగులకే పరిమితమై ఉన్నట్లు తెలుస్తోంది.ఇన్ఫోసిస్లోనూ బలమైన చెల్లింపులుఇక మరో దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) కూడా డిసెంబర్ 31, 2025తో ముగిసిన త్రైమాసికానికి (Q3FY26) సగటున 85 శాతం పనితీరు బోనస్ చెల్లింపులు విడుదల చేసింది. గత మూడున్నరేళ్లలో ఇది బలమైన వేరియబుల్ పే ఫలితంగా నిలిచింది.ఇదీ చదవండి: కోట్లాది ఉద్యోగాలు.. అమెరికా పారిశ్రామికవేత్త ఆందోళన -
ప్రీమియం ఫీచర్లతో బడ్జెట్ ధరల్లో కొత్త స్మార్ట్ ఫోన్
చైనా మొబైల్ తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ బడ్జెట్ ధరల్లో కొత్త స్మార్ట్ ఫోన్ తీసుకువచ్చింది.‘ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ 5జీ’ పేరుతో భారత మార్కెట్లో విడుదల చేసింది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 21,999గా, 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 23,999గా, 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 25,999గా నిర్ణయించారు.లాంచ్ ఆఫర్లో భాగంగా 12 నెలల సాధారణ వారెంటీతో పాటు 12 నెలల ఎక్స్టెండెడ్ వారెంటీ సదుపాయాన్ని కంపెనీ కల్పిస్తోంది. వన్టైమ్ స్క్రీన్ రీప్లేస్మెంట్ ఆఫర్ను కూడా అందిస్తోంది. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు కార్డుల ద్వారా చేసే కొనుగోళ్లపై రూ.2 వేల వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్కార్ట్తో పాటు కంపెనీ వెబ్సైట్, ఆఫ్ లైన్ స్టోర్స్లో ఈ ఫిబ్రవరి 25నుంచి సేల్ అందుబాటులో ఉండనుంది.సిల్క్ ఫైబర్ ఫినిష్, స్టెల్లర్ బ్లూ, లూనార్ టైటానియం కలర్స్లో మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో 6.78 అంగుళాల 1.5కే త్రీడీ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్, మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్, ఐపీ65 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ సర్టిఫికెట్, ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఎక్స్ఓఎస్ 16 ఆపరేటింగ్ సిస్టం తదితర ఫీచర్లు ఉన్నాయి. వెనకవైపు 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్తో కూడిన డ్యుయల్ కెమెరా సెట్ అప్ ఉంది.ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. 6500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 45డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయంతో వస్తోంది. 5జీ, డ్యూయల్ 4జీ వీఓఎల్ఈటీ కనెక్టివిటీ సపోర్టులున్నాయి. వై–ఫై, బ్లూటూత్ 5.4, జీపీఎస్, ఎన్ఎఫ్సీ ఉన్నాయి. యూఎస్బీ టైప్–సీ పోర్ట్, ఐఆర్ సెన్సార్ ఉన్నాయి. ఇన్–డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్లున్నాయి. -
వివో నుంచి ప్రీమియం ఫోన్లు.. ‘జీస్’ ట్రిపుల్ కెమెరాతో..
న్యూఢిల్లీ: వివో ఇండియా తన ‘వీ’ సిరీస్ నుంచి ‘వివో వీ70’, ‘వివో వీ70 ఎలైట్’ పేర్లతో రెండు ప్రీమియం స్మార్ట్ ఫోన్లను భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఫోటోగ్రఫీకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే ‘వివో’ ఈసారి కెమెరాలకు ప్రసిద్ధి చెందిన ‘జీస్’ సంస్థతో ప్రతేక్య భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. రెండు ఫోన్లలోనూ జీస్ పార్ట్నర్షిప్తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది.50 మెగా పిక్సెల్(ఎంపీ) ప్రైమరీ కెమెరా, 50 ఎంపీ టెలి ఫొటోలెన్స్, 8 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు. ఉత్తమ సెల్ఫీల కోసం ముందు భాగంలో 50 ఎంపీ జీస్ ఫ్రంట్ కెమెరా ఉంది. అల్యూమినియం ఫ్రేమ్, రౌండెడ్ కార్నర్లతో ప్రీమియం లుక్ ఇచ్చారు. వీటికి ఐపీ68, ఐపీ69 రేటింగ్ ఉండడంతో నీరు, దుమ్ము, ధూళి నుంచి రక్షణ లభిస్తుంది. 6.59 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే ఇచ్చారు. 120హెచ్జెడ్ రిఫ్రెష్ రేటుకు, 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్కు సపోర్ట్ చేస్తాయి.ఈ రెండూ ఆండ్రాయిడ్ 16తో కూడిన ఆరిజన్ ఓఎస్6తో పనిచేస్తాయి. వీటికి ఆరేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్ ప్రకటించింది. రెండు ఫోన్లలో భారీ 6500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 90డబ్ల్యూ ఫ్లాష్ఛార్జ్కి సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 40 గంటల వీడియో ప్లేబ్యాక్ లేదా 11 గంటల నావిగేషన్ లభిస్తుందని కంపెనీ పేర్కొంది. హీట్ తగ్గించడానికి ‘బైపాస్ ఛార్జింగ్’ సౌకర్యం కూడా ఉంది.వివో వీ70 ఇందులో స్నాప్డ్రాగన్ 7 జెన్4 ప్రాసెసర్ను అందించారు. రోజువారీ పనులు, గేమింగ్కు అనుకూలంగా ఉంటుంది. రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ+ 256జీబీ వేరియంట్ ధర రూ.45,999గా కంపెనీ నిర్ణయించింది. 12జీబీ+ 256జీబీ వేరియంట్ రూ.49,999కు లభిస్తుందివివో వీ70 ఎలైట్ ఇందులో శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8ఎస్జెన్3 చిప్సెట్తో వస్తుంది. ఇది గేమింగ్, అధిక పనితీరుకు అనువుగా ఉంటుంది. మొత్తం మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది. 8జీబీ+ 256జీబీ వేరియంట్ ధరను రూ.51,999గా కంపెనీ పేర్కొంది. 12జీబీ+ 256జీబీ వేరియంట్ ధర రూ.56,999, 12జీబీ+ 512 జీబీ వేరియంట్ ధర రూ.61,999గా నిర్ణయించింది.ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యెస్ బ్యాంక్ కార్డులపై 10% వరకు డిస్కౌంట్ అందిస్తోంది. రూ.1,499 వివో ఇయర్ బడ్స్ ను ఉచితంగా పొందవచ్చు. ఫ్లిప్కార్ట్, అమెజాన్, వివో ఆన్లైన్ స్టోర్లలో లభిస్తున్నాయి. -
ఆంథ్రోపిక్ మరో సంచలనం.. రూ.90 వేల కోట్లు ఆవిరి!
అమెరికా ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సంస్థ ఆంథ్రోపిక్ (Anthropic) మరోసారి మార్కెట్లలో సంచలనం సృష్టించింది. సంస్థ తన ఏఐ ప్లాట్ఫామ్ క్లాడ్ (Claude)లో కొత్తగా ప్రవేశపెట్టిన “క్లాడ్ కోడ్ సెక్యూరిటీ” ఫీచర్ ప్రభావంతో గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ రంగంలో భారీ కలకలం రేగింది. ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే ప్రముఖ సైబర్ భద్రతా సంస్థల షేర్లు 5% నుంచి 9% వరకు క్షీణించగా, మార్కెట్ విలువలో దాదాపు 10 బిలియన్ డాలర్లు (రూ.90 వేల కోట్ల వరకు) ఆవిరైనట్లు అంచనాలు సూచిస్తున్నాయి.ఏమిటీ క్లాడ్ కోడ్ సెక్యూరిటీ?“క్లాడ్ కోడ్ సెక్యూరిటీ” అనేది క్లాడ్ ఏఐ ప్లాట్ఫామ్లో విలీనం చేసిన ఆధునిక భద్రతా సామర్థ్యం. ఇది సాఫ్ట్వేర్ కోడ్ బేస్లను స్కాన్ చేసి లోపాలను గుర్తించడంతో పాటు, వాటికి లక్ష్యిత పరిష్కారాలను సూచిస్తుంది. కోడింగ్ దశలోనే భద్రతా లోపాలను గుర్తించి సరిచేయడానికి డెవలపర్లకు ఇది సహాయపడుతుంది. సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సాధనం భారీ స్థాయిలో కోడ్ను విశ్లేషించి, బలహీనతలను గుర్తించి, మానవ సమీక్ష కోసం ప్యాచ్లను సూచించగలదు. ప్రస్తుతం ఇది ఎంటర్ప్రైజ్ కస్టమర్లు, ఓపెన్ సోర్స్ ప్రాజెక్టుల నిర్వాహకులకు పరిమిత రీసెర్చ్ ప్రివ్యూగా అందుబాటులోకి తీసుకువచ్చారు.ఏ స్టాక్స్ దెబ్బతిన్నాయంటే..ఆంథ్రోపిక్ ప్రకటన తర్వాత ప్రధాన సైబర్ సెక్యూరిటీ కంపెనీల్లో గణనీయమైన అమ్మకపు ఒత్తిడి కనిపించింది. క్రౌడ్స్ట్రయిక్ (CrowdStrike) షేర్లు సుమారు 8% పడిపోయాయి. ఓక్టా స్టాక్ 9% పైగా క్షీణించింది. క్లౌడ్ఫ్లేర్ (Cloudflare) 7–8% మధ్య తగ్గింది. జెడ్స్కేలర్ గణనీయమైన నష్టాలను నమోదు చేసింది. అలాగే గిట్ల్యాబ్, జేఫ్రాడ్ షేర్ల కూడా భారీ క్షీణతను చవిచూశాయి. ఇక సైబర్ సెక్యూరిటీ రంగాన్ని ట్రాక్ చేసే గ్లోబల్ ఎక్స్ సైబర్సెక్యూరిటీ ఈటీఎఫ్ (Global X Cybersecurity ETF) కూడా దాదాపు 5% పడిపోయి, 2023 నవంబర్ తర్వాతి కనిష్ట స్థాయికి చేరింది.మార్కెట్ ఎందుకు షేక్ అయిందంటే..సైబర్ సెక్యూరిటీ సంస్థలు సాధారణంగా లోపాల గుర్తింపు, ముప్పుల పర్యవేక్షణ, డిజిటల్ మౌలిక సదుపాయాల రక్షణ వంటి సేవలను అందిస్తాయి. ఈ విభాగంలో లోపాల గుర్తింపు కీలక అంశం. ఆంథ్రోపిక్ ప్రవేశపెట్టిన ఈ ఏఐ-ఆధారిత ఫీచర్ కోడ్ దశలోనే లోపాలను గుర్తించి పరిష్కారాలను సూచించడం ద్వారా సాంప్రదాయ భద్రతా సాధనాలకు సవాలు విసిరినట్టైంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ అభివృద్ధి వర్క్ఫ్లోలోనే భద్రతా తనిఖీలు ఆటోమేటిక్ కావడం మార్కెట్ ఆందోళనకు కారణమైంది. -
సుందర్ పిచాయ్తో సరదాగా, సర్ప్రైజింగా : వైరల్ వీడియోలు
న్యూఢిల్లీలో జరిగిన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’లో గూగుల్ ఉద్యోగి సీఈఓ సుందర్ పిచాయ్ను కలవడం గురించి చేసిన హృదయపూర్వక పోస్ట్ ఆన్లైన్లో అందరినీ ఆకట్టుకుంది. గూగుల్లో డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ అయిన తనుషి గుప్తా సుందర్ పిచాయ్ కలవాలనే తన చిరకాలకలను సాకారం చేసుసుకున్న వైనం గురించి లింక్డ్ఇన్లోపోస్ట్ చేసింది.గుర్గావ్ కార్యాలయంలో సుందర్ పిచాయ్తో తన సంభాషణను సంగ్రహించిన వీడియో క్లిప్తో పాటు, ఆ భావోద్వేగ క్షణాన్ని ఆ ఒక కలగా అభివర్ణించింది. తన చిన్ననాటినుంచి తనకు 'రోల్ మోడల్' అయిన వ్యక్తితో షేక్ హ్యాండ్ ఇచ్చిన ఆ క్షణాలు తన జీవితంలో మర్చిపోలేనని చెప్పుకొచ్చింది. ఈ ఎన్కౌంటర్ తనను ఉక్కిరిబిక్కిరి చేసిందని తెలిపింది. అలాగే తాను గూగుల్లో డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ని మాత్రమే కాదనీ, మేకప్ కంటే యంత్రాలను ఎంచుకున్న చిన్న అమ్మాయినని పేర్కొంది. టెక్ గురించి అంతులేని ఆసక్తి ఉన్న విద్యార్థిని. వస్తువులను కొనడం కంటే వస్తువులను నిర్మించడం ముఖ్యమని నమ్మిన అమ్మాయి నంటూ పోస్ట్ చేసింది. ఇదీ చదవండి: బంగారాలూ..మీరే నా సర్వస్వం : నటుడి భావోద్వేగ సందేశంసోషల్ మీడియా స్పందనఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో 259,000 కంటే ఎక్కువ మంది వీక్షించారు. పలువురు నెటిజన్లు ఆమెను అభినందించగా, మరికొందరు తాము ఆరాధించే ప్రజా వ్యక్తులను కలిసిన అనుభవాలను పంచుకున్నారు.> తనుషి కథతోపాటు మరో యువకుడి సరదా సంభాషణ కూడా నెట్టింట సందడిగా మారింది. యూట్యూబ్ ద్వారా సక్సెస్ అయిన అనంత్ లథా స్టోరీ ఇది. ‘ఇన్వెస్ట్ ఆజ్ ఫర్ కల్’ అను యూట్యూబ్ ని రన్ చేస్తున్న అనంత్ ఏఐ సదస్సులో సుందర్ పిచాయ్తో కలిసి దిగిన సెల్ఫీని షేర్ చేశాడు. ‘ఫ్యాన్ బాయ్’ మూమెంట్ గురించి ఎక్స్ లో పోస్ట్ చేయడంతోపాటు తన అనుభవాన్ని కూడా షేర్ చేశాడు. సదస్సులో సుందర్ పిచాయ్ పక్కనే కూర్చునే అవకాశం వచ్చిన తాను నమస్తే సార్.. మీరే నాకు నెలనెలా డబ్బులు ఇస్తున్నారు’ అంటూ పలకరించానని చెప్పుకొచ్చాడు. దీనికి ఆశ్చర్యపోయిన పిచాయ్ ఎలా అని ప్రశ్నించారట. తానొక యూట్యూబర్నిని, మీ మూలంగానే నెలనెలా యూట్యూబ్ నుంచిఆదాయం పొందుతున్నానని చెప్పడంతో ఆయన సరదాగా నవ్వేశారంటూ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు సుందర్ పిచాయ్ సింప్లిసిటీపై ప్రశంసలు కురిపించారు. View this post on Instagram A post shared by Anant Ladha (@anantladha1234) -
జియో కొత్త రీఛార్జ్ ప్లాన్: 25 జేబీ డేటా..
ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్ పరిచయం చేసే రిలయన్స్ జియో.. తాజాగా రూ. 365 ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఎంత?, డేటా, ఎస్ఎమ్ఎస్ వంటి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.రూ. 365 ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా.. కస్టమర్లు 25 జీబీ డేటా పొందవచ్చు. రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు, అన్లిమిటెడ్ కాల్స్ 30 రోజుల వ్యాలిడిటీతో పొందవచ్చు. ఇవి కాకుండా.. యూజర్లు మూడు నెలల పాటు జియో హాట్స్టార్ మొబైల్ & టీవీ యాక్సెస్ను పొందవచ్చు.జియోఏఐ క్లౌడ్ కింద 50 జీబీ డేటా అందుబాటులో ఉంటుంది. కంపెనీ గూగుల్ జెమిని ప్రో ప్లాన్ను కూడా అందిస్తోంది. అంతే కాకుండా.. రూ. 35,100 విలువైన గూగుల్ జెమిని ప్లాన్ వినియోగదారులకు ఉచితంగా అందుబాటులో ఉంది. అయితే, దీనిని యాక్టివేట్ చేయాలి. ఈ ప్లాన్ను ఉపయోగించడానికి మీరు 18 ఏళ్లు పైబడి ఉండాలని గుర్తుంచుకోండి.ఇదీ చదవండి: ఏమిటీ MANAV Vision: ప్రపంచానికి దిక్సూచిగా భారత్! -
ఏఐ గ్లోబల్ గవర్నెన్స్కు అమెరికా పూర్తి వ్యతిరేకం
కృత్రిమ మేధపై ప్రపంచవ్యాప్త నియంత్రణ లేదా ‘గ్లోబల్ గవర్నెన్స్’ను అమెరికా పూర్తిగా వ్యతిరేకిస్తోందని వైట్ హౌస్ టెక్నాలజీ సలహాదారు మైఖేల్ క్రాట్సియోస్ స్పష్టం చేశారు. ఇటీవల న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో పాల్గొన్న ఆయన ఈ సాంకేతికతపై అంతర్జాతీయ బ్యూరోక్రసీల నియంత్రణను ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అంగీకరించబోదని తేల్చి చెప్పారు.కేంద్రీకృత నియంత్రణతో ప్రమాదంప్రపంచ నాయకుల ఉమ్మడి ప్రకటనకు ముందు క్రాట్సియోస్ తన అభిప్రాయాలను పంచుకుంటూ.. ఏఐను కేంద్ర అధికారులు లేదా బ్యూరోక్రాట్లు నియంత్రిస్తే అది సాంకేతికత ఉజ్వల భవిష్యత్తుకు ఆటంకంగా మారుతుందని హెచ్చరించారు. ‘ఏఐ గ్లోబర్ గవర్నెన్స్లను అమెరికా పూర్తిగా తిరస్కరిస్తోంది. భద్రత, ఊహాజనిత ప్రమాదాలపైనే దృష్టి కేంద్రీకరించడం వల్ల పోటీతత్వ పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటుంది. ఇది కేవలం కొందరి చేతుల్లో అధికారాన్ని పెంచి అభివృద్ధి చెందుతున్న దేశాలను ఏఐ ఆర్థిక వ్యవస్థకు దూరం చేస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు.మరోవైపు, ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్ ఏఐ నియంత్రణ కోసం ఒక అంతర్జాతీయ సంస్థను, నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వాతావరణ మార్పులపై పని చేసే ఐపీసీసీ తరహాలోనే ఏఐ కోసం ఒక ప్రత్యేక ప్యానెల్ను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సలహా బృందంలో మొత్తం 40 మంది సభ్యులను ధ్రువీకరించారు. అయితే, అమెరికా ఈ ధోరణిని తప్పుబడుతోంది. ఐక్యరాజ్యసమితి వంటి వేదికలు ఏఐ పట్ల అనవసరమైన భయాన్ని కలిగిస్తున్నాయని తెలిపింది.ఇదీ చదవండి: అమెరికా డ్రీమ్ Vs రియాలిటీ -
AI ఇంపాక్ట్ సమ్మిట్ : వాటికోసం ఎగబడిన జనం వీడియో వైరల్
న్యూఢిల్లీలో జరిగిన AI ఇంపాక్ట్ సమ్మిట్లో మరో అంశం నెట్టింట చర్చకు దారి తీసింది. ఉచిత క్యాలెండర్లు పంపిణీ చేప్పడంతో ఒక్కసారిగా సందర్శకులు ఎగబడ్డారు. దీంతో కొద్దిసేపు గందరగోళం చెలరేగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇండియా AI సమ్మిట్లో భారత్ మండపం వద్ద ఉన్న కౌంటర్ చుట్టూ పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. ఉచితంగా అందిస్తున్న క్యాలెండర్ల కోసం క్యూ కట్టారు. ఒకరినొకరు తోసుకున్న వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు స్పందించారు. ఈ వీడియోను ఎక్స్ యూజర్ డాక్టర్ రంజన్ షేర్ చేయడంతో చర్చకు తెరలేచింది. హై-ప్రొఫైల్ టెక్ ఈవెంట్లో కనీస మర్యాద పాటించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేయగా, మరికొందరు ఫ్రీగా వచ్చేదాన్ని తీసుకోవడానికి ఎందుకు సిగ్గుపడాలి అంటూ కమెంట్ చేశారు. క్యాలెండర్లో ఉపయోగకరమైన సమాచారం ఉండి ఉండవచ్చు,అలాంటి బహుమతులు కంపెనీలకు బ్రాండింగ్గా కూడా పనిచేస్తాయి కదా అన్నారు. మరోవైపు వీడియోలో కనిపించే వారిలో చాలామంది నిజమైన AI నిపుణులు లేదా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నవారు కాకపోవచ్చు అని కమెంట్ చేయడం గమనార్హం.Visitors queuing up for FREE CALENDARS at the India AI Summit.They'll never change their DEHATI MENTALITY. Poor Beggars. pic.twitter.com/eoBrdPJG0V— Dr Ranjan (@Doc_RGM) February 19, 2026 -
నిజంగా భారత్ ఏఐని నిర్మిస్తుందా? అనుసరిస్తుందా?
న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన ఏఐ సమ్మిట్ భారతీయ స్టార్టప్లైన సర్వం (Sarvam), జ్ఞాని (Gnani), భారత్జెన్ (BharatGen) స్వదేశీ ఏఐ మోడల్స్ను ప్రదర్శించి కొత్త ఆశలు రేకెత్తించాయి. ప్రపంచ టెక్ దిగ్గజాలు భారత్ పాత్రను కొనియాడుతూ భారీ పెట్టుబడుల ప్రకటనలు గుప్పించినప్పటికీ అసలు ప్రశ్న అలాగే ఉంది.. ప్రపంచ ఏఐ పరిణామ క్రమంలో భారత్ స్థానం ఎక్కడ? ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ ప్రతిపాదించిన ‘ఐదు అంచెల ఏఐ స్టాక్’ ప్రాతిపదికన భారత్ స్థితిగతులను విశ్లేషిస్తే వాస్తవాలు కింది విధంగా ఉన్నాయి.ఏఐ ఐదు అంచెల్లో భారత్ స్థానం ఇదేనా?ఇంధనం.. ఏఐ డేటా సెంటర్లకు నిరంతర నాణ్యమైన విద్యుత్ అవసరం. భారత్లో విద్యుత్ ధరలు తక్కువే అయినప్పటికీ గ్రిడ్ విశ్వసనీయత, పంపిణీ లోపాలు సవాలుగా మారాయి.కంప్యూటింగ్ సదుపాయాలు.. ప్రస్తుతం భారత్ పూర్తిగా దిగుమతి చేసుకున్న చిప్స్, జీపీయూలపైనే ఆధారపడుతోంది.ఫౌండేషన్ మోడల్స్.. అమెరికా (ఓపెన్ఏఐ, జెమిని, మైక్రోసాఫ్ట్ కోపైలట్..), చైనా (డీప్సీక్) ఈ రంగంలో దూసుకుపోతున్నాయి. భారత్ వద్ద మల్డీమోడల్ డేటా ఉన్నప్పటికీ ప్రపంచ స్థాయి మోడల్స్ ఇంకా రూపుదిద్దుకోవాల్సి ఉంది.ప్లాట్ఫారమ్స్.. మన దగ్గర భారీ డెవలపర్ బేస్ ఉన్నప్పటికీ ప్రపంచాన్ని శాసించే ఏఐ ప్లాట్ఫారమ్స్ లేవు.అప్లికేషన్ లేయర్.. ఇందులో భారత్కు మంచి పట్టు ఉంది. తక్కువ ఖర్చుతో ఏఐ పరిష్కారాలను అందించగల సామర్థ్యం మనకుంది. అయితే మేధో సంపత్తిని కాపాడుకోవడమే అసలు సవాలు.గ్లోబల్ టెక్ దిగ్గజాలకు భారత్ ఎందుకు అవసరం?అమెరికా కంపెనీలు భారత్పై ఇంతలా దృష్టి సారించడానికి ప్రధాన కారణాలు ఉన్నాయి. చైనా తన డేటాను బయట ప్రపంచానికి ఇవ్వదు. కానీ భారత్ వద్ద చెల్లింపులు, ఈ-కామర్స్, వ్యవసాయం వంటి రంగాల నుంచి అపారమైన డేటా ఉంది. భారత్ ఒక ఉచిత డేటా పూల్గా మారింది. విదేశీ సంస్థలు ఇక్కడి డేటాతో తమ మోడల్స్ను తయారు చేసి తిరిగి మనకే అధిక ధరలకు అమ్ముతాయి. చాట్జీపీటీకి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మార్కెట్ భారత్. రాబోయే రోజుల్లో 50 కోట్ల ఏఐ వినియోగదారులు భారత్ నుంచే వస్తారని అంచనా. అమెరికా వైట్ హౌస్ సలహాదారులు సైతం ప్రపంచం అమెరికన్ ఏఐ మోడల్స్నే వాడాలని కోరుకుంటున్నారు.భారత ఏఐ భవిష్యత్తు ఎలా ఉండాలంటే..భారత్ కేవలం ఒక ఏఐ వినియోగదారు దేశంగా మిగిలిపోకుండా ఉండాలంటే తక్షణమే కొన్ని చర్యలు చేపట్టాలి.డేటాపై పూర్తి అధికారంభారతీయ డేటా స్థానిక అవసరాలకే ప్రాధాన్యతనివ్వాలి. ఫిబ్రవరి 6 నాటి భారత్-అమెరికా సంయుక్త ప్రకటనలోని ‘డిజిటల్ ట్రేడ్ రూల్స్’ భారత్ తన డేటాను నియంత్రించే శక్తిని తగ్గించే ప్రమాదం ఉంది. గతంలో ఆటోమొబైల్ రంగాన్ని రక్షించుకున్నట్టే ఏఐ రంగంలోనూ డేటా ప్రవాహంపై స్పష్టమైన నిబంధనలు ఉండాలి.స్వదేశీ మౌలిక సదుపాయాల కల్పనచైనా, ఫ్రాన్స్, దక్షిణ కొరియా వంటి దేశాలు సొంత జాతీయ ఏఐ వ్యవస్థలను నిర్మిస్తున్నాయి. భారత్ ఇండియా ఏఐ మిషన్ ద్వారా ఈ మేరకు చర్యలు చేపడుతున్నప్పటికీ మన స్టార్టప్లకు నిధుల కొరత ఉంది. ఐటీ దిగ్గజ కంపెనీలు అమెరికా క్లయింట్ల కోసం కాకుండా సొంతంగా ఏఐ మోడల్స్ నిర్మించే దిశగా అడుగులు వేయాలి.నైపుణ్యం కలిగిన మానవ వనరులుఏఐ వల్ల సంప్రదాయ కోడింగ్, టెస్టింగ్ ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉంది. కానీ, క్లౌడ్ ఆధునికీకరణ, ఏఐ గవర్నెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి విభాగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. మన ఇంజినీరింగ్ విద్యావ్యవస్థను ఏఐకి అనుగుణంగా మార్చడం అత్యవసరం.ఇదీ చదవండి: బంగారం ధరలు యూటర్న్! తులం ఎంతంటే.. -
జెమిని 3.1 ప్రో.. రెట్టింపు మేధస్సు.. అద్భుత ఫలితాలు!
న్యూఢిల్లీ: ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ తన కృత్రిమ మేధ (ఏఐ)విభాగంలో తాజాగా మరో భారీ అప్డేట్ను ప్రకటించింది. జెమిని శ్రేణిలో అత్యంత శక్తివంతమైన ‘జెమిని 3.1 ప్రో’ మోడల్ను కంపెనీ ఆవిష్కరించింది. ఇది గతంలో ఉన్న మోడల్ కంటే రెండు రెట్లు మెరుగైన సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని సంస్థ తెలిపింది. ‘జెమిని 3.1 ప్రో’ను కేవలం టెక్స్ట్ జనరేషన్ మాత్రమే కాకుండా, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఫైనాన్స్ వంటి రంగాల్లో సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించేలా తీర్చిదిద్దారు.గత నవంబర్లో విడుదలైన జెమిని 3 సిరీస్ను మెరుగుపరుస్తూ, రూపొందించిన జెమిని 3.1 ప్రో.. మేధస్సులో ఒక కొత్త మైలురాయిని దాటిందని గూగుల్ తెలిపింది. సంస్థ నిర్వహించిన అంతర్గత పరీక్షల ప్రకారం కఠినమైన తార్కిక సమస్యలను పరిష్కరించే ‘ఏఆర్సీ- ఏజీఐ-2' బెంచ్మార్క్లో ఈ మోడల్ 77.1% స్కోరును సాధించింది. ఇది గతంలోని 3.0 ప్రో మోడల్ పనితీరు కంటే రెట్టింపు కంటే ఎక్కువే కావడం విశేషం. లాజిక్ నమూనాలను విశ్లేషించి, పరిష్కరించడంలో ఈ మోడల్ అసాధారణ ప్రతిభను కనబరుస్తుందని గూగుల్ వెల్లడించింది. Gemini 3.1 Pro is here: A smarter model for your most complex tasks.Building on the Gemini 3 series, 3.1 Pro is a step forward in reasoning. It's designed for tasks where a simple answer isn’t enough, taking advanced reasoning and making it useful for your hardest challenges.🧵— Google Gemini (@GeminiApp) February 19, 2026డెవలపర్లు, డిజైనర్ల కోసం జెమిని 3.1 ప్రో అద్భుతమైన ఫీచర్లను తీసుకువచ్చింది. కేవలం టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే చాలు, వెబ్సైట్లలో నేరుగా ఉపయోగించుకోదగ్గ యానిమేటెడ్ ఎస్వీజీ (ఎస్వీజీ) ఫైళ్లను ఇది సృష్టించగలదు. ఇవి కోడింగ్ ఆధారంగా రూపొందుతాయి. అంతేకాకుండా, హ్యాండ్ ట్రాకింగ్ ద్వారా నియంత్రించే సంక్లిష్టమైన 3డీ సిమ్యులేషన్లను, వాటికి అనుగుణంగా రియల్ టైమ్ ఆడియోను కూడా ఇది రూపొందించగలదు.వేల పేజీల సాంకేతిక పత్రాలను, లేదా మొత్తం సాఫ్ట్వేర్ కోడ్ మొత్తాన్ని ఒకేసారి విశ్లేషించగలగడం ‘జెమిని 3.1 ప్రో’ ప్రత్యేకత. 2026, ఫిబ్రవరి 20 నుండి జెమిని 3.1 ప్రో మోడల్ అందుబాటులోకి రానున్నదని గూగుల్ తెలిపింది. గూగుల్ ఏఐ స్టూడియో, గూగుల్ యాంటీగ్రావిటీ వంటి ప్లాట్ఫారమ్ల ద్వారా డెవలపర్లకు, గూగుల్ ఏఐ ప్రో అల్ట్రా సబ్స్క్రైబర్లకు జెమిని యాప్ ద్వారా ఇది అందుబాటులో ఉండనుంది. ఇది కూడా చదవండి: ‘వయనాడ్’ బాధితులకు రాహుల్ భారీ కానుక -
ఇంటర్నెట్ నుంచి ఇంటెలిజెన్స్ యుగానికి
న్యూఢిల్లీ: భారత టెక్నాలజీ భవిష్యత్తును పూర్తిగా మార్చేలా కృత్రిమ మేధస్సు (ఏఐ) పై దేశీ కార్పొరేట్ దిగ్గజాలు భారీ దృష్టి సారించాయి. భారత్ ‘ఇంటెలిజెన్స్ ఎరా’లోకి అడుగుపెట్టాల్సిందేనని స్పష్టం చేస్తూ, దేశీయ ఏఐ మౌలిక సదుపాయాల నిర్మాణం, డేటా సార్వ¿ౌమత్వం, హైపర్ ప్రోగ్రెస్ దిశగా ముందుకెళ్లాలని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, గ్లోబల్ టెక్ నేతలు పిలుపునిచ్చారు. డేటా విప్లవం తర్వాత ఇప్పుడు ఏఐ విప్లవం దిశగా భారత్ దూసుకెళ్తోందని, స్వదేశీ మౌలిక వసతులు, చౌక డేటా వినియోగంతో ‘ఇంటెలిజెన్స్ సెంచరీ’లో గ్లోబల్ లీడర్గా ఎదగాలనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రిలయన్స్ అధినేత అంబానీ, అదానీ గ్రూప్ ఈడీ జీత్ అదానీ, గూుగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఏఐ సదస్సులో తెలిపారు. మొబైల్, ఇంటర్నెట్ తరహాలోనే కృత్రిమ మేధను (ఏఐ) చౌకగా అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు వచ్చే ఏడేళ్లలో రూ. 10 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముకేశ్ అంబానీ వెల్లడించారు. ప్రతి పౌరుడు, వ్యాపారం, ప్రభుత్వ సరీ్వసులను ఏఐతో అనుసంధానం చేస్తామని ఆయన చెప్పారు. జామ్నగర్లో గిగావాట్ స్థాయి ఏఐ–రెడీ డేటా సెంటర్ల ఏర్పాటు, 10 గిగావాట్ల వరకు హరిత విద్యుదుత్పత్తి, అతి తక్కువ లేటెన్సీతో దేశవ్యాప్తంగా ఏఐని అందించేలా ఎడ్జ్–కంప్యూట్ వ్యవస్థను నెలకొల్పేందుకు జియో ఇంటెలిజెన్స్ ఈ మొత్తాన్ని వెచి్చంచనున్నట్లు వివరించారు. డీప్టెక్, తయారీ, అసంఘటిత రంగం కోసం ఏఐని అందుబాటులోకి తేవడం, ప్రపంచ స్థాయి బహుభాషా ఏఐని రూపొందించడం, అత్యధిక నైపుణ్యాలు అవసరమయ్యే ఉద్యోగాలను కల్పించడంలాంటి అయిదు మార్గదర్శక సూత్రాల ఆధారంగా జియో ఇంటెలిజెన్స్ పని చేస్తుందని చెప్పారు. ‘‘భారత్ను జియో ఇంటర్నెట్ యుగానికి అనుసంధానం చేసింది. ఇప్పుడు ఇంటెలిజెన్స్ యుగానికి అనుసంధానం చేస్తుంది. జియో, రిలయన్స్ కలిసి వచ్చే ఏడేళ్లలో రూ. 10 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తాయి. ఇవేవో స్పెక్యులేటివ్ లేదా వేల్యుయేషన్లపరమైన పెట్టుబడులు కావు. రాబోయే అనేక దశాబ్దాల పాటు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుస్తాయి. దేశం ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకుని నిలబడగలిగే సత్తాను సాధించేందుకు దోహదపడతాయి. డేటా తరహాలోనే ఏఐ ఖర్చుని కూడా మేము గణనీయంగా తగ్గిస్తాం. అద్దె మేధస్సుతో భారత్ ముందుకెళ్లలేదు’’ అని అంబానీ స్పష్టం చేశారు. ఏఐ వ్యూహానికి 3 కీలకాంశాలు: జీత్ అదానీ భారతదేశపు సార్వభౌమత్వాన్ని ఏఐ సరికొత్త నిర్వచనం ఇస్తుందని అదానీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జీత్ అదానీ చెప్పారు. దేశ కృత్రిమ మేథ వ్యూహానికి విద్యుత్, కంప్యూట్–క్లౌడ్, సర్వీసులనే మూడు అంశాలు ప్రదానంగా ఉంటాయన్నారు. ‘‘ఏఐని కోడింగ్ చేస్తారు. కానీ అది పని చేయాలంటే విద్యుత్ భద్రత సాధించడం అవసరం. ఈ విషయంలో పర్యావరణహితమైన విద్యుత్ కీలకంగా ఉంటుంది. క్రిటికల్ ఏఐ వర్క్లోడ్లను భారత్ స్వదేశంలోనే హోస్ట్ చేయాలి. స్టార్టప్లు, విద్యా, రక్షణ, ఆరోగ్య సంరక్షణ, తయారీ రంగాలకు అత్యుత్తమ కంప్యూట్ సామర్థ్యాలు అందుబాటులో ఉండాలి. ఏఐ అనేది ముందుగా దేశ ప్రజలకు సేవలందించేందుకు ఉపయోగపడాలి’’ అని ఆయన పేర్కొన్నారు. హరిత విద్యుత్ ఆధారిత ఏఐ ప్లాట్ఫాం ఏర్పాటునకు అదానీ గ్రూప్ 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు కట్టుబడి ఉందన్నారు. ‘‘ప్రస్తుతం ఇంటెలిజెన్స్ శతాబ్దంలో భారత్ కూడా పాలు పంచుకుంటుందా లేదా అనేది ప్రశ్న కాదు. ఏఐ సెంచరీలో మౌలిక సదుపాయాలు, మేథస్సు, ప్రమాణాలు, విలు వలపై ఎంత వరకు తన ముద్ర వేస్తుందనేదే ప్రశ్న. కానీ నిస్సందేహంగా భారత్ దీన్ని సాధించగలదు’’ అని చెప్పారు. హైపర్ పురోగతి శకం: గూగుల్ సుందర్ హైపర్ పురోగతి శకానికి కృత్రిమ మేథ నాంది పలికిందని అమెరికన్ టెక్ దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చెప్పారు. వర్ధమాన దేశాలు నిదానంగా ఉండే సంప్రదాయ వృద్ధి బాటలో కాకుండా ఎకాయెకిన వేగంగా పైకి ఎదిగేందుకు ఏఐ ఉపయోగపడుతుందని తెలిపారు. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం మొదలైన విభాగాల్లో ఏఐ వినియోగం పెరుగుతోందన్నారు. ‘‘ఏఐ వల్ల ఉద్యోగ విధుల్లో నిస్సందేహంగా గణనీయ మార్పులు వస్తాయి. కొన్ని ఆటోమేట్ అవుతాయి. మరికొన్ని ఉద్యోగాల స్వరూపం మారుతుంది. పూర్తిగా సరికొత్త కెరియర్లు వస్తాయి. ఈ నేపథ్యంలోనే ఏఐ ఆధారిత మార్పులను అందిపుచ్చుకునేలా వర్కర్ల కోసం గూగుల్ ఏఐ ప్రొఫెషనల్ సరి్టఫికెట్ని ప్రవేశపెట్టాం. 10 కోట్ల మందికి డిజిటల్ నైపుణ్యాల్లో శిక్షణనిచ్చాం’’ అని సుందర్ చెప్పారు. -
రూ.10 లక్షల కోట్లు.. ముఖేష్ అంబానీ భారీ ప్రకటన
భారతదేశంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగ అభివృద్ధికి రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) అధినేత ముఖేష్ అంబానీ (Mukesh Ambani) భారీ పెట్టుబడిని ప్రకటించారు. వచ్చే ఏడేళ్లలో ఏఐ మౌలిక సదుపాయాలు, డిజిటల్ సేవల నిర్మాణానికి రూ.10 లక్షల కోట్ల (రూ.10 ట్రిలియన్) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు.న్యూఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో (India AI Impact Summit 2026) కీలకోపన్యాసం చేసిన ముఖేష్ అంబానీ.. దేశాన్ని ‘ఇంటెలిజెన్స్ యుగం’ వైపు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. “జియో ఇప్పుడు భారతదేశాన్ని ఇంటెలిజెన్స్ యుగంతో అనుసంధానిస్తుంది. ప్రతి పౌరుడికి, ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగానికి, సామాజిక అభివృద్ధి ప్రతి కోణానికి, ప్రభుత్వ సేవల ప్రతి విభాగానికి మేధస్సును అందించడమే మా ధ్యేయం” అని పేర్కొన్నారు.జియోతో కలిసి రిలయన్స్ చేపట్టనున్న ఈ పెట్టుబడి ప్రణాళిక ఈ ఏడాదిలోనే ప్రారంభమవుతుందని ముఖేష్ అంబానీ తెలిపారు. ఇది కేవలం ఊహాజనిత పెట్టుబడి కాదని, దేశ నిర్మాణం, దీర్ఘకాలిక వ్యూహాత్మక స్థిరత్వం దిశగా ఓపికతో కూడిన క్రమబద్ధమైన ప్రయత్నమని ఆయన వివరించారు.ప్రస్తుతం ఏఐ రంగంలో అతిపెద్ద అడ్డంకులు గణన సామర్థ్య కొరత, అధిక ఖర్చు అని ముఖేష్ అంబానీ అన్నారు. “అద్దెకు ఇంటెలిజెన్స్” మోడల్ను భారతదేశం భరించలేదని ఆయన స్పష్టం చేశారు. జియో డేటా ధరలను ఎలా గణనీయంగా తగ్గించిందో, అదే విధంగా ఏఐ సేవల ఖర్చును కూడా తగ్గిస్తుందని తెలిపారు.ఈ లక్ష్యంతో రిలయన్స్ జియో గిగావాట్ (GW) స్థాయి డేటా సెంటర్ను ఏర్పాటు చేసి భారతదేశానికి సార్వభౌమ గణన మౌలిక సదుపాయాలను నిర్మించనున్నట్లు వెల్లడించారు. జామ్నగర్లో బహుళ-గిగావాట్ ఏఐ మౌలిక సదుపాయాల నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైందని చెప్పారు.ఈ భారీ పెట్టుబడి ద్వారా దేశంలో ఏఐ డేటా సెంటర్లు, క్లౌడ్ మౌలిక వసతులు, డిజిటల్ సేవల విస్తరణ, పరిశోధనాభివృద్ధి కార్యక్రమాలకు ఊతమిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.ఇదీ చదవండి: చేతులు కలపని సంచలన సీఈవోలు.. వైరల్ సంఘటన -
ఏమిటీ MANAV Vision: ప్రపంచానికి దిక్సూచిగా భారత్!
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మానవ్ విజన్ (MANAV Vision) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏఐ రంగంలో భారత్ ప్రపంచానికి దిక్సూచిగా మారబోతోందని అన్నారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మానవులను శాసించకూడదు, మానవులే ఏఐను శాసించే స్థాయికి ఎదగాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఏఐ యుగంలో మానవులు ఏఐను సాధనంగా మార్చుకోవాలని అన్నారు. సాంకేతికత మానవాళి అభివృద్ధికి దోహదపడాలి. దానికి తగినవిధంగా మానవుడు ఎదగాలని పేర్కొన్నారు.MANAV అంటే మనిషి అని ఆయన వివరించారు. సాంకేతికత ఎంత వేగంగా ఎదిగినా, అది మానవ విలువలు, నైతికత & సమాజ శ్రేయస్సుకు అనుగుణంగా ఉండాలి అని అన్నారు.MANAV అంటే?M - Moral and Ethical Systems (నైతిక వ్యవస్థలు): ఏఐ వ్యవస్థలు నైతిక మార్గదర్శకాలపై ఆధారపడాలి. అవి మానవ హక్కులను గౌరవించాలి, వివక్షను పెంచకూడదు, సమాజంలో న్యాయం, సమానత్వాన్ని కాపాడాలి. సాంకేతికతకు విలువలు తోడై ఉండాలి.A - Accountable Governance (జవాబుదారిత్వ పాలన): ఏఐ పారదర్శక నియమాలను కలిగి ఉండాలి. ఎవరు ఏ విధంగా ఏఐను ఉపయోగిస్తున్నారు అనే విషయంపై స్పష్టమైన పర్యవేక్షణ అవసరం. తప్పులు జరిగితే బాధ్యత ఎవరికి? అనే ప్రశ్నకు సమాధానం ఉండాలి.N - National Sovereignty (జాతీయ స్వావలంబన): ఎవరి డేటా వారి హక్కు. అంటే.. డేటా ఎవరిదైతే, ఆ వ్యక్తికే దాని మీద హక్కు ఉండాలి. దేశాల డేటా భద్రత, డిజిటల్ స్వతంత్రత ముఖ్యం.A - Accessible and Inclusive Systems (అందరికీ అందుబాటు): ఏఐ కొన్ని కంపెనీలకే పరిమితం కాకూడదు. అది సమాజంలోని అన్ని వర్గాలకు ఉపయోగపడాలి. అది అవకాశాలను పెంచాలి కానీ ఏకాధిపత్యాన్ని సృష్టించకూడదు.V - Valid and Legitimate (చట్టబద్ధత & ధృవీకరణ): ఏఐ వ్యవస్థలు చట్టబద్ధంగా ఉండాలి. అవి విశ్వసనీయంగా, ధృవీకరించదగినవిగా ఉండాలి. సమాజానికి హానికరం కాకుండా నియంత్రణలో ఉండాలి.The M.A.N.A.V. vision for AI. pic.twitter.com/NVmxQ8bXq6— PMO India (@PMOIndia) February 19, 2026మానవ్ విజన్ అనేది కేవలం భారతదేశానికి మాత్రమే కాకుండా.. ప్రపంచ ఏఐ అవసరాలకు మార్గదర్శకంగా ఉండాలని మోదీ ఆకాంక్షించారు. పిల్లల భద్రతపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. AI వేదికలు పిల్లలకు సురక్షితంగా ఉండాలి. ప్రస్తుతం అమెరికాలో సోషల్ మీడియా సంస్థలపై పిల్లలపై ప్రభావం గురించి కేసులు నడుస్తున్న సందర్భంలో, AI వినియోగంలో జాగ్రత్త అవసరమని ఆయన సూచించారు. ఏఐ అనేది ఒక పరివర్తన శక్తి. దీనిని దిశానిర్దేశం లేకుండా వదిలేస్తే.. అవరోధాలు ఏర్పడతాయని అన్నారు.ఇదీ చదవండి: బ్యాంక్ లాకర్లోని బంగారం పోతే.. పరిహారం ఎంత? -
కృత్రిమ మేధ భవిష్యత్తుకు భారత్ దిక్సూచి
ప్రపంచ కృత్రిమ మేధ (ఏఐ) ముఖచిత్రంలో భారత్ కేవలం వినియోగదారు మాత్రమే కాదని, రాబోయే కాలంలో ఏఐ భవిష్యత్తును శాసించే ప్రధాన శక్తిగా అవతరించబోతోందని ఆంత్రోపిక్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ డారియో అమోదే ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో జరిగిన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో పాల్గొన్న ఆయన భారత్లోని సాంకేతిక నైపుణ్యం, ఏఐ రంగంలో దేశం చూపిస్తున్న వేగాన్ని ప్రశంసించారు. అమెరికా వెలుపల ఆంత్రోపిక్ తన ఉనికిని వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.భారత్ - ఆంత్రోపిక్.. వ్యూహాత్మక భాగస్వామ్యంటోక్యో తర్వాత ఆసియాలోనే రెండో కార్యాలయాన్ని బెంగళూరులో ప్రారంభించిన కొద్ది రోజులకే అమోదే ఈ సదస్సులో ప్రసంగించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆంత్రోపిక్ క్లాడ్ ఏఐ వినియోగంలో 5.8% వాటాతో భారత్ రెండో అతిపెద్ద మార్కెట్గా ఉంది. టెక్ రంగ నిపుణురాలు ఇరినా ఘోష్ను ఆంత్రోపిక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా నియమించింది. ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఎక్స్-స్టెప్ ఫౌండేషన్, ప్రథమ్, సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్ వంటి స్వచ్ఛంద సంస్థలతో కలిసి విద్య, వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో ఏఐ వినియోగంపై దృష్టి సారించింది.అపార అవకాశాలు2023 బ్లెచ్లీ పార్క్ సమ్మిట్ నుంచి ఏఐ సాధించిన పురోగతి అద్భుతమని అమోదే అన్నారు. ఏఐ సామర్థ్యం గురించి వివరిస్తూ ‘మనం డేటా సెంటర్లను ఏర్పాటు చేసే దిశగా ఉన్నాం. ఇవి మానవాతీత వేగంతో పనిచేయగల ఏఐ ఏజెంట్లు. వేల ఏళ్లుగా పీడిస్తున్న వ్యాధులను నయం చేయగలవు. కోట్ల మందిని పేదరికం నుంచి విముక్తులను చేయగలవు. ఎన్నో అవకాశాలు సృష్టించగలవు’ అన్నారు.సామర్థ్యంతో పాటు ఏఐ వల్ల కలిగే ప్రమాదాలను కూడా అమోదే స్పష్టం చేశారు. స్వయంప్రతిపత్తిలోని పరివర్తన, ఉద్యోగాల కోత, సాంకేతిక దుర్వినియోగం వంటి సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్ నాయకత్వం వహించాలని ఆయన కోరారు.అమోదే ప్రసంగంలోని ముఖ్యాంశాలుభారత్లో అభివృద్ధి చేసే ఏఐ నమూనాలు ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆదర్శంగా నిలుస్తాయి.భారతీయ భాషల్లో ఏఐ మోడళ్లను పరీక్షించేందుకు స్థానిక సంస్థలతో ఆంత్రోపిక్ సహకరిస్తోంది.ప్రపంచ ఏఐ భద్రతా ప్రమాణాలను రూపొందించడంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ పాత్ర కీలకం.ఏఐ వల్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుంది. అయితే ఆటోమేషన్ వల్ల కలిగే సామాజిక మార్పులను ప్రభుత్వం, కంపెనీలు కలిసి సమన్వయం చేసుకోవాలి.ఇదీ చదవండి: ‘భారత్లో ఏఐ స్పీడ్ చూస్తే విస్మయం కలుగుతుంది’ -
చేతులు కలపని సంచలన సీఈవోలు.. వైరల్ సంఘటన
దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో (#IndiaAIImpactSummit2026) ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ప్రపంచ టాప్ టెక్ సీఈవోలతో భారత ప్రధాని నరేంద్ర మోదీ గ్రూప్ ఫోటో సందర్భంగా చోటుచేసుకున్న ఇద్దరు సంచలన సీఈవోల మధ్య జరిగిన ఒక చిన్న సంఘటన టెక్ ప్రపంచంలో చర్చనీయాంశమైంది.ఏఐ అభివృద్ధిపై ఐక్యతకు సంకేతంగా వేదికపై భారత ప్రధాని మోదీ, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సహా అందరూ చేతులు కలిపగా ఓపెన్ఏఐ (OpenAI) సీఈవో సామ్ ఆల్ట్మన్ (Sam Altman), ఆంథ్రోపిక్ (Anthropic) సీఈవో డారియో అమొడెయి (Dario Amodei) మాత్రం చేతులు కలపకుండా పిడికిలి బిగించి పలకరించుకోవడం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది.ఈ చిన్న సంఘటన సైతం ఏఐ రంగంలోని పోటీ వాతావరణాన్ని మరోసారి గుర్తు చేసింది. తీవ్రంగా పోటీ పడుతున్న రెండు ప్రముఖ ఏఐ సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఇద్దరు నేతలు వేదికపై మొదట క్షణకాలం సంకోచంగా కనిపించినా, అనంతరం పిడికిలితో పరస్పరం అభివాదం చేసుకున్నారు. ఈ దృశ్యం ఆన్లైన్లో హాస్యభరితమైన వ్యాఖ్యలకు దారితీసింది. పుచ్ ఏఐ కో ఫౌండర్ సిద్ధార్థ్ భాటియా తన సోషల్ మీడియా ఖాతాలో “ఏజీఐ ఎప్పుడు? డారియో, సామ్ చేతులు కలిపిన రోజు!” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.కాగా డారియో అమొడెయి ఓపెన్ఏఐలో రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. 2021 ప్రారంభంలో ఆ పదవి నుంచి వైదొలిగి, పలువురు సీనియర్ పరిశోధకులతో కలిసి ఆంథ్రోపిక్ సంస్థను స్థాపించారు. అప్పటి నుంచి ఈ రెండు సంస్థలు జనరేటివ్ ఏఐ రంగంలో తీవ్రంగా పోటీ పడుతున్నాయి.When AGI?The day Dario and Sam hold hands. pic.twitter.com/bfmqgnTV89— Siddharth Bhatia (@siddharthb_) February 19, 2026 -
ముంబై, బెంగళూరుల్లో ఓపెన్ఏఐ కార్యాలయాలు
ప్రముఖ జనరేటివ్ ఏఐ చాట్ జీపీటీ మాతృసంస్థ ‘ఓపెన్ఏఐ’ తన భారతీయ కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఇప్పటికే న్యూఢిల్లీలో తన కార్యాలయం ప్రారంభించిన సంస్థ ఈ ఏడాది చివర్లో ముంబై, బెంగళూరుల్లో రెండు కొత్త కార్యాలయాలను ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’లో పాల్గొనేందుకు భారత్ వచ్చిన ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మన్ ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు.ఈ సందర్భంగా ఆల్ట్మన్ స్పందిస్తూ.. భారతదేశంలో ఏఐని వేగంగా స్వీకరిస్తుండడంపై సామ్ ఆల్ట్మన్ ప్రశంసలు కురిపించారు. ‘భారతదేశం ఇప్పటికే ఏఐ వినియోగంలో ప్రపంచ దేశాల కంటే ముందు వరుసలో ఉంది. ఇక్కడి అద్భుతమైన సాంకేతిక ప్రతిభ, ఏఐ పట్ల ప్రజల్లో ఉన్న ఆశావాదం, ప్రభుత్వం నుంచి లభిస్తున్న మద్దతు ఆకట్టుకున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఏఐని ఎలా అభివృద్ధి చేయవచ్చో భారత్ ప్రపంచానికి దిక్సూచిగా మారనుంది’ అన్నారు.ముంబై, బెంగళూరు కార్యాలయాల ద్వారా స్థానిక మౌలిక సదుపాయాల కల్పన, నైపుణ్యాభివృద్ధి, భారతీయ సంస్థలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలను పెంచుకోవడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ‘భారతదేశం కోసం, భారతదేశంలో, భారత్తో కలిసి ఏఐని నిర్మించడమే మా సంకల్పం’ అని ఆయన తెలిపారు.ఇదీ చదవండి: యూఎస్-ఇరాన్ యుద్ధ భయాలు.. ఒక్కసారిగా క్రూడ్ ధరలు.. -
కోట్లాది ఉద్యోగాలు.. అమెరికా పారిశ్రామికవేత్త ఆందోళన
అమెరికాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాబోయే 12 నుండి 18 నెలల్లో మిలియన్ల సంఖ్యలో వైట్-కాలర్ ఉద్యోగాలు ప్రమాదంలో పడవచ్చని అమెరికన్ పారిశ్రామికవేత్త, మాజీ డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి ఆండ్రూ యాంగ్ (Andrew Yang) హెచ్చరించారు.ఏఐ సామర్థ్యం రోజురోజుకు పెరుగుతోందని పేర్కొన్న ఆయన, తన కుటుంబ సభ్యుల్లో ఒకరు ఉపయోగించిన ఏఐ ప్రోగ్రామ్ కొన్ని నిమిషాల్లోనే ఒక వెబ్సైట్ రూపకల్పన పూర్తి చేసిందని ఉదాహరణగా చెప్పారు. సాధారణంగా డిజైనర్కు లేదా నిపుణుడికి రోజులు పట్టే పనిని ఏఐ కేవలం నిమిషాల్లో ముగించగలగడం ఉద్యోగాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ప్రస్తుతం మిడ్-కెరీర్ కార్యాలయ ఉద్యోగులు, కాల్ సెంటర్ సిబ్బంది, సేల్స్ సిబ్బంది, కోడర్లు వంటి వారు నిర్వహిస్తున్న పనుల్లో చాలా భాగాన్ని ఏఐ ఆటోమేట్ చేసే అవకాశం ఉందని యాంగ్ అభిప్రాయపడ్డారు. డేటా ప్రాసెస్ చేయడం, నివేదికలు తయారు చేయడం మాత్రమే కాకుండా నిర్ణయ ప్రక్రియ కూడా ఆటోమేషన్ వైపు మళ్లవచ్చని ఆయన తెలిపారు.ఈ పరిణామం వైట్-కాలర్ ఉద్యోగాల్లో “గొప్ప విచ్ఛిన్నత”కు దారితీయవచ్చని హెచ్చరించిన ఆయన, ఒక కంపెనీ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం ప్రారంభిస్తే, పోటీ కారణంగా ఇతర సంస్థలు కూడా అదే మార్గాన్ని అనుసరించే అవకాశముందని అన్నారు. హెడ్కౌంట్ తగ్గిస్తే స్టాక్ మార్కెట్ ప్రతిఫలం ఇస్తుందనే భావన ఈ ధోరణిని మరింత వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు.అమెరికాలో సుమారు 70 మిలియన్ల వైట్-కాలర్ కార్మికుల్లో 20 నుండి 50 శాతం మంది రాబోయే రోజుల్లో ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన అంచనా వేశారు. డేటా విశ్లేషణ, రిపోర్ట్ తయారీ, కోడింగ్, కస్టమర్ సర్వీస్ వంటి రంగాల్లో ఏఐ సాధనాలు వేగంగా విస్తరిస్తుండటం ఈ పరిస్థితికి కారణమవుతుందని వివరించారు.ఉద్యోగ నష్టాల ప్రభావం వినియోగదారుల ఖర్చులు, గృహ మార్కెట్, పన్ను ఆదాయాలపై పడే అవకాశం ఉందని, దీని వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినవచ్చని యాంగ్ హెచ్చరించారు. ఈ ప్రభావాన్ని తగ్గించేందుకు సార్వత్రిక ప్రాథమిక ఆదాయం (UBI), పునఃశిక్షణ కార్యక్రమాలు, అలాగే ఏఐ కంపెనీలపై పన్నులు విధించడం వంటి విధానాలను పరిశీలించాలని ఆయన సూచించారు. -
ఇక ‘జియో ఏఐ స్టాక్’.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్లో ముందడుగు
కృత్రిమ మేధా (AI) రంగంలో భారతదేశ స్థాయిని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రిలయన్స్ జియో ‘నేషన్-ఫస్ట్ ఏఐ స్టాక్’ బ్లూప్రింట్ను ప్రకటించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు (India AI Impact Summit) వేదికగా ‘జియో ఏఐ స్టాక్’ పేరుతో ఈ సమగ్ర, స్వదేశీ ఏఐ ఎకోసిస్టమ్ రూపకల్పనను సంస్థ వెల్లడించింది.జియో ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ కింద అభివృద్ధి చేస్తున్న ఈ ఏఐ స్టాక్, కేవలం డేటా సెంటర్లకే పరిమితం కాకుండా పూర్తి స్థాయి సమగ్ర ఏఐ వ్యవస్థగా రూపుదిద్దుకుంటోంది. భారతదేశ జనాభా పరిమాణం, భాషా వైవిధ్యం, సామాజిక-ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని దీన్ని రూపొందిస్తున్నట్లు సంస్థ తెలిపింది.గిగావాట్ స్థాయి గ్రీన్ డేటా సెంటర్లుజియో ఏఐ స్టాక్లో ప్రధాన భాగంగా గిగావాట్ స్థాయి గ్రీన్ డేటా సెంటర్లు, అధిక సామర్థ్య గణన వసతులు (HPC), ఏఐ ప్లాట్ఫార్మ్లు, డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్లు, భారతీయ భాషల ఆధారిత డేటా ఫౌండేషన్లు, మల్టీలింగ్వల్ ఇంటెలిజెన్స్ లేయర్, రంగాల వారీ అప్లికేషన్ మాడ్యూల్స్ ఉంటాయని వెల్లడించింది.ఈ డేటా సెంటర్లు పూర్తిగా పునరుత్పాదక శక్తితో నడిచేలా నిర్మాణం చేయనున్నట్లు జియో తెలిపింది. దేశవ్యాప్తంగా స్థిరమైన, సుస్థిర ఏఐ మౌలిక సదుపాయాలను సృష్టించడమే లక్ష్యమని పేర్కొంది.జియో ఏఐ స్టాక్ను “సార్వభౌమ ఏఐ ఎకోసిస్టమ్”గా సంస్థ అభివర్ణించింది. దేశీయంగా అభివృద్ధి చేయబడిన ఈ వ్యవస్థ, డేటా పరిరక్షణ, డిజిటల్ మౌలిక వసతులు, వ్యూహాత్మక స్వయం నియంత్రణ వంటి జాతీయ ప్రాధాన్యతలతో అనుసంధానమై ఉంటుంది.ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, సూక్ష్మ-చిన్న వ్యాపారాలు, పౌర సేవలు వంటి రంగాల్లో ఏఐ ఆధారిత పరిష్కారాలను అందించేలా ఈ వేదిక రూపుదిద్దుకుంటుందని సంస్థ పేర్కొంది.భారతీయ భాషలకు ప్రాధాన్యంఈ ప్రాజెక్ట్లో భాగంగా వివిధ భారతీయ భాషల్లో విస్తృత డేటా సేకరణ జరుగుతోందని జియో తెలిపింది. స్థానిక భాషలను అర్థం చేసుకునే ఏఐ వ్యవస్థలు, ఫేఫ్టీ మల్టీలింగ్వల్ వాయిస్ ఏఐ సొల్యూషన్లు, వినియోగదారులు తమకు ఇష్టమైన భాషలో సహజంగా సంభాషించగలిగే ఏజెంటిక్ ప్లాట్ఫార్మ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. -
ఏఐ.. మనిషికి సూపర్ పవర్!
భారత్లోని ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో కృత్రిమ మేధ ప్రభావంపై తీవ్రంగా చర్చ సాగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) అనేది ఎన్నటికీ మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయం కాబోదని కొందరు నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ మార్పు క్రమంలో సాంప్రదాయ ఉద్యోగాలకు మాత్రం ముప్పు పొంచి ఉందన్నది కాదనలేని వాస్తవమని ఇంకొందరు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏఐ ప్రభావం ఉద్యోగాలపై ఎలా ఉంటుందో, నిపుణులు ఏం అంటున్నారో చూద్దాం.సాంప్రదాయ ఉద్యోగాలకు పొంచి ఉన్న ముప్పుఏఐ వల్ల పునరావృతమయ్యే పనులు చేసే విభాగాల్లో భారీ మార్పులు వస్తున్నాయి. డేటా ఎంట్రీ, అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ల వల్ల క్లరికల్ పనుల అవసరం తగ్గుతోంది. కస్టమర్ సర్వీసులో చాట్బాట్స్, ఏఐ వాయిస్ అసిస్టెంట్లు ప్రాథమిక కస్టమర్ సమస్యలను సెకన్లలో పరిష్కరిస్తున్నాయి. ప్రాథమిక స్థాయి సాఫ్ట్వేర్ కోడింగ్ను ఏఐ మోడల్స్ సమర్థవంతంగా చేస్తున్నాయి. ఫ్యాక్టరీల్లో రోబోటిక్స్ ఏఐ ఏకీకరణ వల్ల మానవ ఆధారిత లేబర్ అవసరం తగ్గుతోంది.కొత్త తరం అవకాశాలుపాత ఉద్యోగాలు పోతున్నా అంతకు రెట్టింపు స్థాయిలో సరికొత్త కెరీర్ మార్గాలు పుట్టుకొస్తున్నాయి. 2026 నాటికి మార్కెట్లో డిమాండ్ ఉన్న విభాగాలు కింది విధంగా ఉన్నాయి. ఏఐ నుంచి సరైన ఫలితాలను రాబట్టే ప్రాంప్ట్ ఇంజినీర్లకు భారీ వేతనాలు లభిస్తున్నాయి. అల్గారిథమ్స్లో పక్షపాతం లేకుండా చూసేందుకు ఏఐ ఎథిక్స్ ఆఫీసర్లు అవసరం పెరుగుతోంది. ఏఐ మోడల్స్కు శిక్షణ ఇవ్వడానికి అవసరమైన డేటాను ఉపయోగించేందుకు డేటా క్యూరేటర్లకు డిమాండ్ ఉంది. మనుషులు, ఏఐ కలిసి పనిచేసే ప్రక్రియను సమన్వయం చేసే మేనేజర్లకు మార్కెట్లో డిమాండ్ ఏర్పడుతోంది.ప్రస్తుత పరిస్థితులు: భారత్ సన్నద్ధతప్రస్తుతం భారతదేశం ‘ఏఐ ఫర్ ఆల్’ అనే నినాదంతో ముందుకు వెళ్తోంది. సమ్మిట్లో వెల్లడైన వివరాల ప్రకారం భారతీయ కంపెనీలు తమ ఉద్యోగుల కోసం భారీగా ‘రీ-స్కిల్లింగ్’(నైపుణ్యాభివృద్ధి) ప్రోగ్రామ్లను నిర్వహిస్తున్నాయి. నైపుణ్యం లేని చోట మాత్రమే ఉపాధి ముప్పు కనిపిస్తోందని, నైపుణ్యం ఉన్న చోట ఉత్పాదకత పెరిగిందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.సవాళ్లను అధిగమించడం ఎలా?రాబోయే రోజుల్లో ఏఐ విప్లవాన్ని తట్టుకుని నిలబడాలంటే కొన్ని మార్పులు అవసరం.డిగ్రీతో విద్య ముగిసిందని అనుకోకుండా ఎప్పటికప్పుడు కొత్త ఏఐ టూల్స్ నేర్చుకోవాలి.సృజనాత్మకత, క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవడం వంటి పనులను ఏఐ చేయలేదు. వీటిని మెరుగుపరుచుకోవాలి.ప్రభుత్వం ఇండియా ఏఐ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏఐ అక్షరాస్యతను పెంచేలా చర్యలు తీసుకోవాలి.ఉద్యోగాల కోతను అరికట్టేలా కంపెనీలు సామాజిక బాధ్యతతో ఏఐని అమలు చేయాలి.అసలైన సవాలు..ఏఐ అనేది మనిషిని తొలగించే సాధనం కాదు, మనిషి సామర్థ్యాన్ని పెంచే ఒక ‘సూపర్ పవర్’. సాంకేతికతను చూసి భయపడటం కంటే, దాన్ని మన ఉపాధికి ఎలా వాడుకోవాలో నేర్చుకోవడమే ప్రస్తుతం అసలైన సవాలు.ఇదీ చదవండి: దిగొస్తున్న వెండి ధరలు.. ఒకేసారి రూ.5000 -
‘భారత ఏఐ రంగంలో వృద్ధి వేగవంతం’
గూగుల్ భారత్తో తన అనుబంధాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. న్యూఢిల్లీలో జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ సందర్భంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కొన్ని విషయాలను వెల్లడించారు. ఇండియా ఏఐ రంగంలో పురోగతి సాధిస్తున్న తరుణంలో గూగుల్ తన పూర్తి ఏఐవ్యవస్థలను స్థానికంగా అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు.గూగుల్, ఇండియా ఏఐ భాగస్వామ్యంగూగుల్ కేవలం ఒక టెక్నాలజీ ప్రొవైడర్గానే కాకుండా భారత ఏఐ పర్యావరణ వ్యవస్థలో ఒక సమగ్ర భాగస్వామిగా ఉండాలని నిర్ణయించుకుంది. కంప్యూట్ పవర్, మోడల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ, రీసెర్చ్ వంటి ఏఐకి సంబంధించిన అన్ని విభాగాల్లో గూగుల్ భారత్తో కలిసి పనిచేయనుంది. గూగుల్ తన గ్లోబల్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 185 బిలియన్ డాలర్ల భారీ మూలధన వ్యయ ప్రణాళికను ప్రకటించింది. ఇందులో గణనీయమైన భాగం భారత్లో డేటా సెంటర్లు, గిగావాట్ స్థాయి కంప్యూటింగ్ సామర్థ్యం, స్థిరమైన ఇంధన వనరుల కోసం కేటాయించనున్నారు.రిలయన్స్ జియో (క్లౌడ్ రీజియన్ల కోసం), అదానీ గ్రూప్, క్లీన్మ్యాక్స్ (పునరుత్పాదక ఇంధనం కోసం) వంటి దిగ్గజ సంస్థలతో గూగుల్ ఒప్పందాలు చేసుకుంది.ఈ పరిణామం ఎందుకు కీలకం?ఈ భాగస్వామ్యం దేశ డిజిటల్ భవిష్యత్తును మార్చబోయే ఒక వ్యూహాత్మక అడుగు. భారత ప్రభుత్వం నిర్దేశించుకున్న వికసిత్ భారత్ 2047 విజన్కు అనుగుణంగా ఆధునిక సాంకేతికతను సామాన్యులకు చేరవేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. గూగుల్ అత్యాధునిక ఏఐ పరికరాలు అందుబాటులోకి రావడం వల్ల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, స్టార్టప్లు తక్కువ ఖర్చుతో ప్రపంచస్థాయి ఆవిష్కరణలు చేయవచ్చు. గిగావాట్ స్థాయి కంప్యూటింగ్, సముద్రగర్భ కేబుల్ నెట్వర్క్ ద్వారా భారత్ ప్రపంచానికి ఏఐ సేవలను అందించే కేంద్రంగా మారుతుంది. ఇది భారత్-అమెరికా సాంకేతిక సహకారాన్ని మరింత బలపరుస్తుంది.భవిష్యత్తుపై అంచనాలు..ఈ సందర్భంగా సుందర్ పిచాయ్ మాట్లాడుతూ..‘భారతదేశం ఏఐ రంగంలో వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ పరివర్తనకు అవసరమైన మౌలిక సదుపాయాలను, క్లీన్ ఎనర్జీని, ఏఐకి సంబంధించి ఓపెన్ మోడల్స్ను అందించడమే మా లక్ష్యం’ అన్నారు. గూగుల్ ఇప్పటికే రాజస్థాన్లో 150 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు వంటి వాటితో తన మౌలిక సదుపాయాల కల్పనను ప్రారంభించింది.ఇదీ చదవండి: రష్యా డాలర్లలో వ్యాపారం? భారత్పై ప్రభావం.. -
కోడ్ నుంచి క్లౌడ్ వరకు.. ఆంత్రోపిక్తో ఇన్ఫోసిస్ జట్టు
న్యూఢిల్లీ: దేశీయంగా టెలికం, ఆర్థిక సేవలు, తయారీ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ తదితర రంగ సంస్థల కోసం ఎంటర్ప్రైజ్ ఏఐ సొల్యూషన్స్ని రూపొందించేందుకు, వినియోగంలోకి తెచ్చేందుకు అమెరికన్ ఏఐ సంచలనం ఆంత్రోపిక్తో దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని కింద క్లాడ్ కోడ్ సహా ఆంత్రోపిక్ క్లాడ్ మోడల్స్ని ఇన్ఫోసిస్కి చెందిన టొపాజ్ ఏఐ సొల్యూషన్స్తో అనుసంధానం చేస్తారు. అలాగే టెలికం రంగ అవసరాల కోసం ఏఐ ఏజెంట్లను తయారు చేసేందుకు ప్రత్యేక ఆంత్రోపిక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయనున్నట్లు, తదుపరి ఇతర నియంత్రిత రంగాల్లోకి కూడా విస్తరించనున్నట్లు ఇన్ఫోసిస్ తెలిపింది.క్లెయిమ్స్ ప్రాసెసింగ్, కాంప్లయెన్స్ సమీక్షలు, కోడ్ జనరేషన్, టెస్టింగ్లాంటి బహుళ దశలు ఉండే పనులను స్వతంత్రంగా హ్యాండిల్ చేయగలిగే ఏజెంటిక్ ఏఐ సిస్టమ్లను రూపొందించడంపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు సీఈవో సలిల్ పరేఖ్ చెప్పారు. వివిధ రంగాల్లో అపార అనుభవం ఉన్న ఇన్ఫీ డెవలపర్లు ఇప్పటికే తమ క్లాడ్ కోడ్ని ఉపయోగిస్తున్నట్లు ఆంత్రోపిక్ సీఈవో డేరియో తెలిపారు. భారత్లో ఆంత్రోపిక్ కార్యాలయం ఆంత్రోపిక్ దేశీయంగా బెంగళూరులో తమ కార్యాలయాన్ని మంగళవారం ప్రారంభించింది. ఆసియాలో టోక్యో తర్వాత కంపెనీకి ఇది రెండో ఆఫీసు. తమ క్లాడ్.ఏఐ సొల్యూషన్కి భారత్ రెండో అతి పెద్ద మార్కెట్ అని కంపెనీ ఇండియా ఎండీ ఇరినా ఘోష్ తెలిపారు. 2025 అక్టోబర్లో విస్తరణను ప్రకటించినప్పటి నుంచి భారత్లో తమ ఆదాయ వృద్ధి వేగం రెట్టింపయ్యిందని వివరించారు. వివిధ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు స్థానికంగా రిక్రూట్ చేసుకోనున్నట్లు వివరించారు. విద్య, వ్యవసాయం తదితర రంగాల్లో సంస్థలతో భాగస్వామ్యాలను కుదుర్చుకుంటున్నట్లు చెప్పారు. ఆంత్రోపిక్తో భాగస్వామ్యం వార్తల నేపథ్యంలో ఇన్ఫోసిస్ షేరు మంగళవారం దాదాపు రెండు శాతం లాభపడింది. బీఎస్ఈలో 1.83 శాతం లాభపడి రూ. 1,391.20 వద్ద క్లోజయ్యింది. ఓపెన్ఏఐతో ఎటర్నల్ చెట్టాపట్టాల్వివిధ విభాగాలవ్యాప్తంగా కృత్రిమ మేధ(ఏఐ) వినియోగాన్ని పెంచుకునే దిశగా ఓపెన్ఏఐతో భాగ స్వామ్య పరిధిని మరింతగా విస్తరించినట్లు ఎటర్నల్ వెల్లడించింది. దీని ప్రకారం జొమాటో, బ్లింకిట్, డిస్ట్రిక్ట్, హైపర్ప్యూర్తో పాటు తమ భాగస్వామ్య ప్లాట్ఫాంలు, అంతర్గత వ్యవస్థల్లో ఏఐ వాడకాన్ని పెంచనుంది. కస్టమర్లు, భాగస్వాములు తమ ప్లాట్ఫాంలను మరింత మెరుగ్గా ఉపయోగించుకునేందుకు వీలు కలి్పంచే కొత్త మార్గాలను ఆవిష్కరించేందుకు ఓపెన్ఏఐకి చెందిన ఎంటర్ప్రైజ్ ఏపీఐ ప్లాట్ఫాంతో కలిసి ఎటర్నల్ పని చేయనుంది. అంతర్గతంగా తమ ఆటోమేషన్ ప్లాట్ఫాం స్టిచ్తో జీపీటీ–5.3–కోడెక్స్లాంటి లేటెస్ట్ కోడింగ్ మోడల్స్ని అనుసంధానం చేయడంపై దృష్టి పెట్టనుంది. -
ఫేక్, ఏఐ కంటెంట్ నియంత్రణకు కేంద్రం కొత్త నిబంధనలు
కేంద్ర ప్రభుత్వం కీలకం నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ ఫేక్ కంటెంట్ను అరికట్టడానికి కొత్త నిబంధనలను ప్రకటించింది. ఇవి కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కంటెంట్కే పరిమితం కాకుండా, అన్ని రకాల కంటెంట్పై వర్తించనున్నట్లు తెలిపింది. ఈ కొత్త నిబంధనలు ఫిబ్రవరి 20 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇంటర్నెట్ యుగంలో వ్యక్తుల గోప్యత ఉల్లంఘన, నకిలీ సమాచారం, డీప్ఫేక్ వీడియోలు వంటి సమస్యలు పెరుగుతున్నాయి. అదే సమయంలో భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త నిబంధనల్ని అందుబాబులోకి తెచ్చింది. తద్వారా వినియోగదారులు ఎవరైనా సంబంధిత సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్లో చూసిన ఫేక్ కంటెంట్ గురించి సంబంధిత ఫ్లాట్ఫామ్ యాజమాన్యానికి నేరుగా ఆన్లైన్లో ఫిర్యాదు చేసే వెసులు బాటు కల్పించింది. ఉదాహరణకు, ఫేస్బుక్లో గోప్యత ఉల్లంఘించే వీడియో కనిపిస్తే, ఫేస్బుక్ గ్రివెన్సెస్ ఆఫీసర్కి ఆన్లైన్లో ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు చేసిన 24 గంటల్లోగా దాన్ని ఫ్లాట్ఫామ్ నుంచి తొలగిస్తుంది. అంతేకాదు, అశ్లీల కంటెంట్, పిల్లల లైంగిక నేరాలు, కులం లేదా మతం ఆధారిత ద్వేషం, నకిలీ సమాచారం వంటి వాటిని 36 గంటల్లో, వ్యక్తిగత నగ్నత్వం, లైంగిక సంపర్కం, డీప్ఫేక్ వీడియోలు వంటి వాటిపై ఫిర్యాదు వస్తే 2 గంటల్లో చర్య తీసుకోవాలి. కాపీరైట్, పేటెంట్, ట్రేడ్మార్క్ ఉల్లంఘనలపై ఫిర్యాదులు అయితే 7 రోజుల్లో పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం లేదా కోర్టు ఆదేశాలపై కంటెంట్ తొలగించడానికి గడువు 36 గంటల నుండి 3 గంటలకు తగ్గించారు. జాతీయ భద్రత, శాంతిభద్రతలు, పరువు నష్టం వంటి అంశాలకు ఇది వర్తిస్తుంది.మీరు ఫిర్యాదు చేసినా సదరు సోషల్ మీడియా యాజమాన్యం పట్టించుకోకపోతే 30 రోజుల్లో ప్రభుత్వ Grievance Appellate Committee (GAC)ని సంప్రదించవచ్చు. ఇది పూర్తిగా ఆన్లైన్లో ఉంటుంది. వెబ్సైట్ gac.gov.inలో మొబైల్ నంబర్, OTP, ఆధార్ ద్వారా నమోదు చేసి, ‘File New Appeal’ ద్వారా వివరాలు సమర్పించాలి. కమిటీ నిర్ణయం తప్పు అని భావిస్తే, కంటెంట్ తొలగించాలని ఆదేశించవచ్చు. ఏఐ కంటెంట్పై ప్రత్యేక నియంత్రణలు కూడా ఉన్నాయి. ఏఐ ద్వారా రూపొందించిన కంటెంట్కి తప్పనిసరిగా లేబుల్ (నోటీసు) ఇవ్వాలి. ఆడియో లేదా వీడియోలో ప్రారంభంలోనే ఇది AI కంటెంట్ అని స్పష్టంగా చూపించాలి. అశ్లీల కంటెంట్, చైల్డ్ పోర్నోగ్రఫీ, నకిలీ పత్రాలు, డీప్ఫేక్లు ఉత్పత్తి కాకుండా ఆటోమేటెడ్ టూల్స్ ఏర్పాటు చేయాలి. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు కంటెంట్ అప్లోడ్ చేసే సమయంలో వినియోగదారుల నుండి అఫిడవిట్ తీసుకోవాలి.ఇప్పటివరకు సోషల్ మీడియా సంస్థలకు సేఫ్ హార్బోర్ ప్రొటెక్షన్ ఉండేది. కొత్త నిబంధనలతో, ప్లాట్ఫారమ్లు కంటెంట్ తొలగించడంలో విఫలమైతే ఈ రక్షణ కోల్పోతాయి. అంటే, వినియోగదారులు రాసిన పోస్ట్పై కూడా కంపెనీలు న్యాయపరమైన బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలు ఒకవైపు గోప్యత రక్షణను బలపరుస్తాయి, మరోవైపు భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడేలా రూపొందించబడ్డాయి. AI కంటెంట్కి ప్రత్యేక నియంత్రణలు ఉండటం వల్ల భవిష్యత్తులో డీప్ఫేక్లు, నకిలీ వీడియోలు వంటి సమస్యలు తగ్గే అవకాశం ఉంది. -
జియో ఏఐ డాక్టర్.. అద్దం ముందే ఆరోగ్య పరీక్ష!
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో.. జియో పెవిలియన్ ఎంతో మందికి ఆకట్టుకుంది. ఇక్కడ జియో ఏఐ స్టాక్, జియో సంస్కృతి ఏఐ, జియో ఆరోగ్యం ఏఐ, జియో శిక్షా, జియో ఏఐ హోమ్ వంటి వివిధ ఏఐ మోడల్స్ ప్రదర్శించారు. ఇందులో ప్రత్యేకంగా 'జియో ఆరోగ్య ఏఐ' మరింత ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.'జియో ఆరోగ్య ఏఐ' అనేది ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కోసం రూపొందించిన ఏఐ క్లినిక్ మోడల్. దీనిని దేశంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏఐ సాంకేతికతతో శక్తివంతం చేసి, గ్రామీణ ప్రాంతాల్లో కూడా వేగవంతమైన.. తక్కువ ఖర్చుతో కూడిన వైద్య సేవలను అందించడానికి తీసుకొచ్చారు.వీడియోలో మీరు గమనించినట్లయితే.. ఒక వ్యక్తి అద్దం మాదిరిగా ఉన్న ఒక పరికరం ముందు నిలబడితే.. తక్కువ వ్యవధిలోనే వారి కళ్లు, చర్మ రంగు, ముఖ కవళికలు & ఇతర దృశ్య సూచనలను ఆధారంగా తీసుకుని అవసరమైన ప్రాథమిక ఆరోగ్య సమాచారం ప్రదర్శిస్తుంది. ఆ తర్వాత AI సిస్టమ్.. ఈ డేటాను పరిశీలించి ఒక ప్రాథమిక ఆరోగ్య నివేదికను సిద్ధం చేస్తుంది.ఏఐ డాక్టర్.. అద్దం ముందే ఆరోగ్య పరీక్ష!'జియో ఆరోగ్య ఏఐ' అనేది ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కోసం రూపొందించిన ఏఐ క్లినిక్ మోడల్.దీనిని దేశంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏఐ సాంకేతికతతో శక్తివంతం చేసి, గ్రామీణ ప్రాంతాల్లో కూడా వేగవంతమైన.. తక్కువ ఖర్చుతో కూడిన వైద్య సేవలను… pic.twitter.com/QcblqE5UUF— Sakshi (@SakshiNews) February 17, 2026రోగులు తమ సమస్యలను వాయిస్ AI డాక్టర్కు మాటల ద్వారా కూడా వివరించవచ్చు. ఈ వాయిస్ సిస్టమ్ అవసరమైతే మరిన్ని ప్రశ్నలు అడిగి రోగి పరిస్థితిని స్పష్టంగా అర్థం చేసుకుంటుంది. ముఖ్యంగా, ఇది అనేక భారతీయ భాషల్లో సంభాషించడం వల్ల భాషకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయి. దీని ద్వారా గ్రామీణ ప్రజలు సులభంగా తమ ఆరోగ్య సమస్యలను చెప్పుకోవచ్చు.ఏఐ డాక్టర్ రోగుల పరిస్థితిని ముందుగానే గుర్తించి.. అవసరమైతే నిపుణుల వద్దకు రిఫర్ చేస్తుంది. అయితే.. ఈ ఏఐ సిస్టం కేవలం ప్రాథమిక అంచనా మాత్రమే. డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి మందులు లేదా చికిత్స అందించదు. దీనిని డిజిటల్ కనెక్టివిటీ ఉన్న ఎక్కడైనా ఏర్పాటు చేయవచ్చు. పోర్టబుల్ ఎక్స్-రేలు, పోర్టబుల్ ఈసీజీలు వంటి పరికరాలను కూడా ఈ వ్యవస్థతో అనుసంధానం చేయవచ్చు. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. -
ఏఐతో నిజంగా ఉద్యోగాలు పోతాయా?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచాన్ని శాసిస్తున్న తరుణంలో అది మానవ ఉపాధిని ఏ మేరకు ప్రభావితం చేస్తుందనే అంశంపై ప్రముఖ టెక్ దిగ్గజం, జోహో వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏఐ వల్ల వైట్ కాలర్ ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయన్న ఆందోళనల నడుమ, ఈ సాంకేతికతను అర్థం చేసుకునే ప్రక్రియలో తాను ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ లూయిస్ గరికానో సామాజిక మాధ్యమాల్లో చేసిన ఒక విశ్లేషణాత్మక పోస్ట్పై స్పందిస్తూ వెంబు తన అభిప్రాయాలను పంచుకున్నారు.ఆటోమేషన్ అంటే ఉద్యోగం పోవడం కాదుఒక ఉద్యోగంలోని కొన్ని పనులను ఆటోమేట్ చేయడం అంటే, ఆ మొత్తం ఉద్యోగాన్ని ఏఐ భర్తీ చేస్తుందని అర్థం కాదని ప్రొఫెసర్ గరికానో తన పోస్ట్లో పేర్కొన్నారు. చాలా ఉద్యోగాల్లో సంక్లిష్టమైన మానవ తీర్పు (హ్యుమన్ జడ్జ్మెంట్), సామాజిక అవగాహన అవసరమని, వీటిని ఏఐ భర్తీ చేయలేదన్నారు. సాఫ్ట్వేర్ ఎప్పటికీ ఆ బాధ్యతను తీసుకోలేదని, సంస్థలు మనుషుల అధికారంపైనే ఆధారపడతాయని స్పష్టం చేశారు.శ్రీధర్ వెంబు ‘లెర్నింగ్ ఫ్రేమ్వర్క్’మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త టెక్నాలజీని ఎలా అర్థం చేసుకోవాలో వివరిస్తూ శ్రీధర్ వెంబు ఒక ఫ్రేమ్వర్క్ను ప్రతిపాదించారు. ‘ముందస్తు అంచనాలకు వెళ్లకుండా అన్ని రకాల వాదనలను (సానుకూల, ప్రతికూల) వినాలి. ప్రారంభంలో కొన్ని అభిప్రాయాలను ఏర్పరచుకోవాలి. అయితే కొత్త ఆధారాలు లభించినప్పుడు ఆ అభిప్రాయాలను వెంటనే సవరించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. కాలక్రమేణా అభిప్రాయాలు బలమైన నమ్మకాలుగా మారాలి. కానీ, ఆ నమ్మకంలోకి అహం (ఈగో) చేరకూడదు. అహం కొత్త విషయాలను నేర్చుకోనివ్వదు. కొత్త సాంకేతికతకు సంబంధించి కేవలం నమ్మకం ఉంటే సరిపోదు, దానిపై స్పష్టమైన వైఖరి ఉండాలి’ అన్నారు.‘ఏఐ మా కంపెనీని, ఉద్యోగాలను ఎలా ప్రభావితం చేస్తుందనే విషయంలో నేను ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాను. దీనిపై కచ్చితమైన నిర్ణయానికి రావడానికి ఇంకా సమయం పడుతుంది’ అని శ్రీధర్ వెంబు అన్నారు.The quoted post makes a strong argument that white collar jobs won't go away anytime soon due to AI.In rapidly changing times like this, here is a framework I use:1. Keep an open mind and absorb every kind of information (like the quoted post and the ones that argue the… https://t.co/P0UOemLiXe— Sridhar Vembu (@svembu) February 16, 2026సాంకేతికత పరిష్కరించలేని సమస్యలులండన్లో గృహ నిర్మాణ రంగంలోని సమస్యలను ఉదహరిస్తూ కేవలం ఏఐ డాక్యుమెంటేషన్ను సిద్ధం చేయగలదు కానీ, రాజకీయ వ్యవస్థను ఒప్పించడం లేదా సామాజిక వివాదాలను పరిష్కరించడం వంటి పనులు చేయలేదని గరికానో పేర్కొన్నారు. ఈ వాదనతో వెంబు ఏకీభవిస్తూ.. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి కామాండ్స్ రూపొందించే ముందు ఎంతో జాగ్రత్త అవసరమని సూచించారు. మొత్తానికి ఏఐ అనేది ఒక శక్తివంతమైన సాధనం అయినప్పటికీ మానవ మేధస్సు, సామాజిక నైపుణ్యాలు, జవాబుదారీతనం అవసరమైన వైట్ కాలర్ ఉద్యోగాలకు తక్షణమే వచ్చే ముప్పేమీ లేదని ఈ టెక్ నిపుణుల విశ్లేషణ సారాంశం.ఇదీ చదవండి: రష్యా డాలర్లలో వ్యాపారం? భారత్పై ప్రభావం.. -
ఒప్పో కొత్త ఫోన్.. ధర ఎంతంటే..
కే14ఎక్స్ 5జీ ఫోన్ల అమ్మకాలు ప్రారంభించినట్లు స్మార్ట్ఫోన్ల దిగ్గజం ఒప్పో ఇండియా తెలిపంది. దీని ధర వేరియంట్ని బట్టి రూ.14,999 నుంచి ప్రారంభమవుతుంది. కాగా తమ ఈ–స్టోర్, ఫ్లిప్కార్ట్పై సేల్ రోజున రూ. 1,500 వరకు తక్షణ డిస్కౌంటుతో రూ.13,499 నుంచి పొందవచ్చని సంస్థ తెలిపింది. ఫిబ్రవరి 20 తర్వాత నుంచి రెండు వేరియంట్లపై రూ. 1,000 డిస్కౌంటు ఉంటుందని పేర్కొంది. ఇందులో 6.75 అంగుళాల హెచ్డీ డిస్ప్లే, 6500 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 50 ఎంపీ ఏఐ కెమెరా, కలర్ఓఎస్ 15 మొదలైన ఫీచర్లు ఉన్నాయి.ఇదీ చదవండి: నకిలీ రెజ్యూమెతో కంపెనీకి కుచ్చుటోపీ -
డాక్టర్ ఏఐతో తస్మాత్ జాగ్రత్త!
కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సహాయంతో తమంతట తామే పనిచేసే (ఆటోమేటెడ్ గైడెన్స్) డిజిటల్ యాప్లతో పెను ప్రమాదాలే వచ్చి పడుతున్నాయంటూ చాలా ఫిర్యాదులు అందుతున్నాయి. దాంతో అవి చేసే సిఫార్సులు ఒక్కోసారి పెద్దపెద్ద ముప్పులు తెచ్చిపెడుతున్నాయంటూ ప్రముఖ వార్తా సంస్థ ‘రాయిటర్స్’ హెచ్చరిస్తోంది.ప్రస్తుతం కృత్రిమ మేధ (ఏఐ) కాలూనని రంగమంటూ ఏదీ లేదు. చట్టాలూ, సాఫ్ట్వేర్, విద్యా, వినోదంతో పాటు ఆఖరికి లక్షలాది మెడికల్ కేసుల అనుభవంతో వైద్య విద్య, చికిత్సల్లో కూడా అది పాలుపంచుకుంటోంది. ఇక చైనాలాంటి దేశాలైతే ఏఐతో నడిచే క్లినిక్లూ, హాస్పిటళ్లు సైతం ఏర్పాటు చేసుకుంటున్నాయి. మిగతా రంగాలెలా ఉన్నప్పటికీ... వైద్యరంగంలో మాత్రం ఏఐతో కొన్ని తప్పులూ, పొరబాట్లు జరుగుతున్నాయనీ, ఇవి ఆందోళన గొలిపేలా ఉన్నాయంటూ డాక్టర్లు, మెడికల్ ప్రొఫెషన్లో ఉన్న నిపుణులు బెంబేలెత్తుతున్నారు. ఒకవేళ పేషెంట్లు తమంతట తామే ఏఐకు తమ సమస్య చెప్పుకుని ఆ మేరకు వైద్య సలహా పొందితే అది ఆందోళనకరంగా పరిణమించేందుకు అవకాశాలు లేకపోలేదంటూ హెచ్చరిస్తున్నారు. టర్కీ (తుర్కియా) రాజధాని అంకారాలోని ఒక హాస్పిటల్కు వచ్చిన ఒక పేషెంట్ తాలూకు కేస్స్టడీతో ఒక సంఘటన వెలుగుచూసింది. అదేమిటంటే... ఆ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ సెమ్ అక్సోయ్ అనే డాక్టర్ దగ్గరికి కౌమార వయస్సులో ఉన్న ఓ పద్ధెనిమిదేళ్ల పిల్లాడు వచ్చాడు. అతడికి కాలిలో క్యాన్సర్ గడ్డ ఉందని నిర్ధారణ అయ్యాక తన కేసు వివరాలను ‘ఏఐ’కి సంబంధించిన చాట్ జీపీటీకి తెలిపి తనకు సలహా ఇవ్వాలంటూ కోరాడు. అంతే... ‘‘నువ్వు ఐదేళ్లకు మించి బతకవు’’ అంటూ ఏఐ సమాధానమిచ్చింది. ఈ సమాచారం ఆ కుర్రాడిని ఎంతగా ఆందోళనపరిచి ఉంటుందో ఎవరైనా ఊహించవచ్చు. కానీ ఓ సర్జికల్ ఆంకాలజిస్టూ, ఓ ΄్లాస్టిక్ సర్జన్ నిర్వహించిన సర్జరీల తర్వాత అతడు పూర్తిగా కోలుకున్నాడు. అంతేకాదు... ‘‘ఇప్పుడు నీలోంచి క్యాన్సర్ తొలగిపోయినట్టే’’ అంటూ భరోసా కూడా ఇచ్చారు. అయితే మళ్లీ అదే అబ్బాయి కొన్ని వారాల తర్వాత డాక్టర్ అక్సోయ్కు మరోసారి ఫోన్ చేశాడు. ఈసారి వచ్చిన ఫోన్ సందేశంలోని సందేహమేమిటంటే... ‘‘నాకు తరచూ దగ్గు వస్తోంది. అంటే మొన్నటి క్యాన్సర్ ఇప్పుడు ఊపిరితిత్తులకు సోకిందంటారా?’’ అని అతడు ప్రశ్నించాడు. అయితే డాక్టర్లు అతడి ఊపిరితిత్తులను పూర్తిగా పరీక్షించాక తేలిందేమిటంటే అతడికి క్యాన్సర్ ఏమాత్రం లేదు. అయితే... ఆ పిల్లాడు ఈమధ్య సిగరెట్లు తాగడం మొదలుపెట్టడమే అతడి దగ్గుకు కారణమని తేలింది. ‘‘ఏదైనా వ్యాధి నిర్ధారణ చేయాలంటూ కేవలం లక్షణాలను మాత్రమే చూడకూడదు. అతడికి ఆ లక్షణాలు కనిపిస్తున్న సందర్భాలనూ పరిశీలించాలి. ఆ యువకుడు ఇటీవల పొగతాగడం మొదలుపెట్టినందువల్ల దగ్గు వచ్చిందని తేలింది. వైద్యవిజ్ఞాన సమారమంతా ఓ దట్టమైన అడవి అయితే... ఇలా అరకొర పరిజ్ఞానంతో అందులో తిరగడమన్నది దారీతెన్నూ తెలియకుండా అందులో తప్పిపోవడం లాంటిదం’’టూ డాక్టర్ అక్సోయ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ‘ఏఐ’ సంస్థలకు సంబంధించిన ఓ ప్రతినిధి మాట్లాడుతూ... ‘‘ఇలాంటి అనుభవాల తర్వాత... ఏఐ అడగాల్సిన ప్రశ్నలను నమోదు చేస్తూ కృత్రిమ మేధ మరింత సమర్థంగా, పరిపుష్టంగా పనిచేసేలా మెరుగుపరుస్తున్నామని పేర్కొన్నారు. అయితే కృత్రిమ మేధ ఎప్పటికీ ఓ డాక్టర్ / మెడికల్ ప్రొఫెషనల్కు మంచి ప్రత్యామ్నాయం కాబోదంటూ ఆయన తెలిపారు. ఇక్కడ ఈ టర్కిష్ అబ్బాయి ఉదంతం రెండు అంశాలను సూచిస్తోంది. మొదటిది... ప్రపంచంలోని చాలామంది వ్యక్తులు... తాము హాస్పిటళ్ల వరకూ వెళ్లాల్సిన శ్రమ తప్పడం కోసం అలాగే తమ ప్రైవసీని కాపాడుకోవడం కోసం టెక్నాలజీ ఆధారిత సలహాల మీద ఎలా ఆధారపడుతున్నారనే అంశం. ఇక రెండోది... ఏఐ ఆధారిత చాట్బాట్లు తమకున్న పరిజ్ఞానంతో సమాజాన్ని ఎలా తప్పుదారి పట్టిస్తున్నాయో తెలపడం కోసం ఈ టర్కీ అబ్బాయి ఉదంతమే ఒక తార్కాణం.మేర దాటుతున్న మేధ... ఈ నేపథ్యంలో చూసినప్పుడు కొన్ని మెడికల్ యాప్స్ తమ నైతిక పరిధులను దాటుతున్నాయి. ఉదాహరణకు ‘యురేకా హెల్త్’ అనే ఓ యాప్ తనను తాను ‘‘ఆల్ ఇన్ వన్ హెల్త్ కంపేనియన్’గా ప్రకటించుకుంది. అంటే... ఆరోగ్యం విషయంలో అన్ని వ్యాధుల నిపుణుడూ తానే అయిపోయి ఆరోగ్య సమాచారాన్ని తెలుపుతానంటూ గొప్పలు చెప్పుకుంటోంది. అయితే ఆపిల్ యాప్ స్టోర్ మాత్రం కొంత సంయమనం పాటిస్తూ... ‘‘ఇది కేవలం తగిన సమాచారాన్ని తెలుసుకోవడం కోసం మాత్రమే. తాను వ్యాధి నిర్ధారణగానీ లేదా చికిత్సగానీ చేయడానికి తగనం’’టూ’’ స్పష్టం చేస్తోంది. కానీ దాన్ని అభివృద్ధి చేసిన సంస్థవాళ్లు మాత్రం ‘మీకు మీరే మీ డాక్టర్’ అంటూ ప్రచారాలు చేసేస్తున్నారు. అలాగే ‘‘ఆస్క్, డయాగ్నోజ్, ట్రీట్’’ అనే మరో సైట్ వాళ్లు మరికాస్త ముందుకెళ్లి ‘‘మా ఐఏ వ్యాధి నిర్ధారణా చేసేస్తుంది. వాడాల్సిన మందుల్ని సూచిస్తూ ప్రిస్క్రిప్షన్ కూడా రాసేస్తుంది. ఈ ప్రపంచంలోని హాస్పి టల్స్లో వాస్తవంగా మీకు ఎలాంటి చికిత్స దొరుకుతుందో దాన్ని ఇక్కడే మీకు సూచిస్తుంది’’ అంటూ గొప్పలకు పోతున్నారు. అయితే... రాయిటర్స్ సంస్థలో వచ్చిన వార్తల వల్ల... ‘‘యురేకా హెల్త్’’ యాప్ కారణంగా జరిగిన అనర్థాలను తెలుసుకున్న తర్వాత ‘ఆపిల్’ సంస్థ సదరు యాప్ను తమ స్టోర్నుంచి తొలగించింది. అంతే కాదు... ఏ సమాచారం ఆధారంగా; ఏ పద్ధతుల ద్వారా; ఏయే అంశాల సహాయంతో వ్యాధి నిర్ధారణ విషయంలో ఆ నిర్ధారణకు వస్తున్నారో స్పష్టంగా తెలపాలంటూ యాప్ను అభివృద్ధి చేసే నిపుణులకు స్పష్టమైన సూచనలు చేసింది.మెడికల్ యాప్స్!ఇటీవల కృత్రిమమేధ (ఏఐ) సహాయంతో గూగుల్ లేదా ఆపిల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకునే మెడికల్ యాప్ల సంఖ్య బాగా పెరిగింది. నిజానికి అవి ఎలాంటి వ్యాధి నిర్ధారణా చేయకూడదు. అయినప్పటికీ వాటిని ఆశ్రయించి... తమ సమస్య ఏమిటో తెలుసుకోవడమన్నది చాలా ఎక్కువైంది. అయితే ఇక్కడ ఒక చిక్కుముడి ఉంది. నిజానికి ఏఐ ఎలాంటి వ్యాధినిర్ధారణా (డయాగ్నోజ్) చేయకూడదు. కానీ యూఎస్ ఎఫ్డీఏ (ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) సంస్థ నియమాల ప్రకారం... ప్రజల ప్రాథమిక అవగాహన కోసమే సమాచారం తెలిపే సందర్భాల్లో ఆ చాట్బాట్లు ఎవరి అనుమతులూ తీసుకోనక్కర్లేదు. అందుకోసమే ‘‘తాము డాక్టర్కు ప్రత్యామ్నాయం కానేకాదనీ,వ్యాధిని నిర్ణయించడంలో విషయంలో తాము చేసేది ‘తుది నిర్ధారణ’ కాదం’’టూ స్పష్టంగా సూచన (డిస్కె›్లయిమర్) చేస్తుంటాయి. – యాసీన్ -
జియోలో పని చేయాలనుకుంటే.. వచ్చేయండి!
ప్రతిభావంతుల అన్వేషణకు రిలయన్స్ జియో (Reliance Jio) సరికొత్త పంథాను ఎంచుకుంది. జియో చీఫ్ ఏఐ సైంటిస్ట్ గౌరవ్ అగర్వాల్ (Gaurav Aggarwal) తన బృందాన్ని విస్తరించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 (India AI Impact Summit 2026)ను వేదికగా చేసుకుంటున్నారు. జియోలో పని చేయాలనుకునే ప్రతిభావంతులైన ఇంజనీర్లు ఈ సమ్మిట్లోనే తనను నేరుగా సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.బెంగళూరుకు చెందిన గౌరవ్ అగర్వాల్.. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్లో ఈ వారం మొత్తం తన బృందంతో కలిసి ఉంటానని ‘ఎక్స్’ (ట్విటర్) ద్వారా ప్రకటించారు. “మా బృందాన్ని కలవండి. మేము ఏం నిర్మిస్తున్నామో మీతో పంచుకోవడానికి సంతోషిస్తాం” అని ఆయన పేర్కొన్నారు.తాజా అప్డేట్లో, ఏఐAI మోడల్స్, ఆప్టిమైజేషన్, లేదా ప్లాట్ఫారమ్ల అభివృద్ధిలో పనిచేస్తున్న ఇంజనీర్లను ప్రత్యేకంగా ఆహ్వానించారు. “మీరు ఏఐ సరిహద్దుల్లో నిర్మిస్తున్న ‘క్రాక్డ్ ఇంజనీర్లు’ అయితే, మాకు మీరు అవసరం. నన్ను సంప్రదించండి. మా రిక్రూట్మెంట్ బృందంతో మీ పరిచయాన్ని వేగంగా ట్రాక్ చేస్తాను. భారత్ కోసం, భారీ స్థాయిలో నిర్మిద్దాం!” అంటూ గౌరవ్ అగర్వాల్ తన పోస్ట్లో రాసుకొచ్చారు.ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఏఐ, టెక్ పరిశ్రమ నాయకులు ఇందులో పాల్గొంటున్నారు. వీరిలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్గేట్స్, ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మన్, మెటా ఛీఫ్ ఏఐ ఆఫీసర్ అలెగ్జాండర్ వాంగ్, టీసీఎస్ సీఈవో కృతివాసన్ తదితరులు ఉన్నారు.Unsurprisingly, I am at the AI Summit this entire week with folks from my team and colleagues. Come visit us - we are all excited to share a glimpse of what all is cooking in our kitchen!Divided by companies, United by Mission - Let's build AI for Bharat 🙏 pic.twitter.com/eg7QDCDEVZ— Gaurav Aggarwal (@fooobar) February 15, 2026 -
ఏఐ భయాలు నిజమే.. కానీ..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వస్తున్న మార్పుల వల్ల ప్రస్తుతం భారతీయ సాఫ్ట్వేర్ రంగం సందిగ్ధంలో ఉంది. ఏఐ కారణంగా సాఫ్ట్వేర్ అభివృద్ధిలో ఆటోమేషన్ పెరుగుతుందనే భయాలు ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ, ‘వయానాయి’(Vianai) వ్యవస్థాపకులు విశాల్ సిక్కా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మానవ ఆధారిత సాఫ్ట్వేర్ అభివృద్ధి పనుల్లో ఏఐ అంతరాయం నిజమైనదేనని అయితే దాన్ని ఎదుర్కొనే సత్తా భారతీయ మేధోశక్తికి ఉందని ఆయన స్పష్టం చేశారు.మార్కెట్ పతనానికి కారణం ఏఐ భయంగత వారం రోజులుగా భారత ఐటీ స్టాక్స్ తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఫిబ్రవరి నెలలోనే ఐటీ ఇండెక్స్ దాదాపు 15% పతనం కావడం గమనార్హం. గత వారంలోనే టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు దాదాపు 9 శాతం మేర నష్టపోయాయి. సాఫ్ట్వేర్ బడ్జెట్ల్లో ఏఐ ఏజెంట్లు అధిక వాటాను కలిగి ఉన్నాయని, తద్వారా సాంప్రదాయ ఐటీ సేవల బిజినెస్ మోడల్ దెబ్బతింటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.వేగమే అసలు సవాలుఓ ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడిన విశాల్ సిక్కా.. ప్రస్తుత పరిస్థితులపై విశ్లేషించారు. ‘సాఫ్ట్వేర్ అభివృద్ధిలో మానవ ఆధారిత పనులకు అంతరాయం కలగడం ఖాయం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అయితే, ఈ మార్పు పరిశ్రమలన్నింటికీ వ్యాపించడానికి సమయం పడుతుంది’ అన్నారు. సిక్కా అభిప్రాయం ప్రకారం, గతంలో భారత ఐటీ రంగం మొబైల్ కంప్యూటింగ్, క్లౌడ్ సర్వీసెస్ వంటి అనేక మార్పులను తట్టుకుని నిలబడింది. కానీ, ఈసారి ఇది వేగంగా మార్పు చెందుతుందన్నారు. మన మెదడు ఇంత వేగవంతమైన మార్పులను అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేకపోవడమే అసలు సమస్య అని ఆయన పేర్కొన్నారు.అపరిమిత అవకాశాలుభారత ఐటీ రంగంలో పనిచేస్తున్న సుమారు 17 లక్షల మంది ఉద్యోగుల సమష్టి సామర్థ్యం అనంతమని సిక్కా కొనియాడారు. కంపెనీలు ట్రెండ్కు తగినట్టుగా కొత్త సాంకేతికతను అలవరుచుకుని నూతన ఆవిష్కరణలు చేయాలన్నారు. ఏఐ వల్ల కలిగే అంతరాయాన్ని ఒక ‘టెయిల్ విండ్’ (సానుకూల శక్తి)గా మార్చుకున్న కంపెనీలే ఈ పోటీలో విజేతలుగా నిలుస్తాయని చెప్పారు.ఇదీ చదవండి: ఈ-రూపీ ఆధారిత రేషన్ పంపిణీ ప్రారంభం -
ఇంటర్వ్యూలో ఊహించని ప్రశ్న.. ఉద్యోగం వచ్చేసింది!
జాబ్ ఇంటర్వ్యూలలో అభ్యర్థులను అంచనా వేయడానికి ఇంటర్వ్యూయర్లు ఎన్నో సృజనాత్మక పద్ధతులను ఉపయోగిస్తుంటారు. కొన్నిసార్లు వారు అడిగే ప్రశ్నలు అక్కడికక్కడే సమాధానం ఇవ్వడానికి కష్టంగా అనిపిస్తాయి. అలాంటి అనుభవాన్ని ఇటీవల ఒక మహిళ ఎదుర్కొని, దానిని ఉద్యోగ అవకాశంగా మార్చుకుంది.అనుకోని ప్రశ్నకాత్యాయని శుక్లా (Katyayani Shukla) అనే ఉద్యోగ అభ్యర్థిని తన అనుభవాన్ని ‘ఎక్స్’(గతంలో ట్విట్టర్) లో పంచుకున్నారు. ఆమె ఇటీవల హాజరైన ఉద్యోగ ఇంటర్వ్యూలో ఆ సంస్థ సీఈవో ఒక అసాధారణమైన ప్రశ్న అడిగారు.. “మిమ్మల్ని నియమించుకోకుండా ఉండటానికి ఒక మంచి కారణం చెప్పండి” అని. ఆ ప్రశ్నకు తక్షణం సమాధానం చెప్పడానికి సిద్ధంగా లేకపోయిన శుక్లా, ఆలోచించడానికి కొంత సమయం కావాలని చెప్పి, తరువాత ఈమెయిల్ ద్వారా సమాధానం పంపుతానని తెలియజేశారు.“ఆ ప్రశ్నకు నేను సిద్ధంగా లేను. కాబట్టి ఆలోచించడానికి కొంత సమయం కావాలని చెప్పాను” అని ఆమె వివరించారు. కొన్ని గంటల తరువాత సీఈవో ఫాలో-అప్ మెసేజ్ పంపి ఆమె సమాధానాన్ని కోరారు. జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత, శుక్లా తన సమాధానాన్ని ఈమెయిల్ ద్వారా పంపించారు. అదే ఆమెకు ఉద్యోగ ఆఫర్గా మారింది.కాత్యాయని ఇచ్చిన సమాధానం ఇదే.. సీఈవో అడిగిన గమ్మత్తైన ప్రశ్నకు తాను ఏం సమాధానం చెప్పిందో తన ఈమెయిల్ స్క్రీన్షాట్ను కూడా కాత్యాయని శుక్లా పంచుకున్నారు. తన సమాధానాన్ని క్షమాపణతో ప్రారంభించిన ఆమె.. “నన్ను నియమించుకోకుండా ఉండటానికి ఒక మంచి కారణం ఏమిటంటే.. నా జీవితం సవ్యంగా అంటే నా వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలను సమతుల్యంగా, వ్యవస్థీకృతంగా ఉంచుకుంటాను” అని రాసుకొచ్చారు.తాను రోజూ (వీక్ డేస్లో) 9 గంటల నుండి 5 వరకు మాత్రమే పని చేస్తానని, పని-వ్యక్తిగత జీవితం మధ్య స్పష్టమైన సరిహద్దులు ఉంచుతానని చెప్పారు. ‘ప్రతిదీ అర్జెంట్ అని చెబుతుంటారు కానీ నిజానికి ఏదీ అర్జెంట్ కాదు’ అని తాను నమ్ముతుంటానన్నారు.తన సమయం, ఇతరుల సమయం పట్ల గౌరవం చూపడం తనకు అత్యంత ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. కొంతమంది దీనిని ఒక సానుకూల లక్షణంగా చూస్తారని, మరికొందరు వ్యతిరేకంగా భావించే అవకాశం ఉందని ఆమె అంగీకరించారు.During my last job interview, the CEO asked me to give her one good reason not to hire me.I told her I wasn’t ready for that question and needed some time to think.She said, “That’s fine... just promise you’ll email me your answer.”Honestly, I thought she’d forget. But a… pic.twitter.com/z5CWWF8uxZ— Katyayani Shukla (@aibytekat) February 15, 2026 -
ఏఐ ప్రమాదం.. సెబీ చైర్మన్ హెచ్చరిక!
ఏఐ వల్ల ఉద్యోగాలు ఊడిపోతున్నాయని పలువురు టెక్ నిపుణులు చెబుతున్నవేళ.. సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ ఆర్ధిక వ్యవస్థకు ప్రమాదమని హెచ్చరించారు.ఏఐ వంటి లేటెస్ట్ టెక్నాలజీ.. ఆర్థిక రంగాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి.. దీనికి అనుగుణంగా నియంత్రణ వ్యవస్థలు సైతం అభివృద్ధి చెందాలని పాండే పేర్కొన్నారు. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈఓ ముస్తఫా సులేమాన్ను ఉటంకిస్తూ.. రాబోయే ఏఐ, సింథటిక్ బయాలజీ వంటివన్నీ మానవాళికి సవాలుగా మారుతాయని వెల్లడించారు. ఈ సాంకేతికతలు మన జీవితాలను మెరుగుపరచగలిగినప్పటికీ.. సరైన నియంత్రణ లేకపోతే సమస్యలను కూడా సృష్టించగలవని అన్నారు.ఇదీ చదవండి: ఏఐ రేసులో భారత్.. మూడేళ్లలో రూ.6 లక్షల కోట్లు!ఏఐ టెక్నాలజీనీ దృష్టిలో ఉంచుకునే.. సెబీ సూపర్టెక్ (సూపర్వైజరీ టెక్నాలజీస్) & రెగ్టెక్ (రెగ్యులేటరీ టెక్నాలజీస్) వంటి సాంకేతిక పద్ధతులను అమలు చేస్తోంది. అంతే కాకుండా.. సైబర్ భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం, డేటా పరిపాలనను మెరుగుపరచడం వంటి చర్యలు తీసుకుంటోంది. సెక్యూరిటీస్ మార్కెట్ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని తక్షణ & దీర్ఘకాలిక సాంకేతిక వ్యూహ పథకాన్ని రూపొందించడానికి ఒక ఉన్నత స్థాయి నిపుణుల బృందాన్ని కూడా ఏర్పాటు చేసిందని పాండే పేర్కొన్నారు. -
బెంగళూరులో తొలి స్టోర్ : ఆటోలో స్టైలిష్గా ‘నథింగ్’ సీఈవో
ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ నథింగ్ భారతదేశంలో తన మొట్టమొదటి ఫ్లాగ్షిప్ స్టోర్ను అధికారికంగా ప్రారంభించింది. బెంగళూరులో తన తొలి స్టోర్ను లాంచ్ చేసింది. ఈ ప్రారంభోత్సవం సందర్బంగా ఒక వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది. అదేంటో తెలియాలంటే ఈ స్టోరీ మొత్తం చదవాల్సిందే.నథింగ్ సిగ్నేచర్ బ్రాండింగ్తో సరిపోలేలా అద్భుతమైన తెల్లటి ఆటోలో సీఈవో CEO కార్ల్ పీ స్టోర్కు రావడం అభిమానులకు ఆకట్టుకుంది. ఆటోలో ఆయన్ని చూడగానే అక్కడ గుమిగూడిన అభిమానుల హర్ష ధ్వానాలు చేశారు. వారి కరతాళ ధ్వనుల మధ్య స్టోర్లోకి బెంగళూరు స్టైల్లో కాలు పెట్టారు పీ. ఫ్లాగ్షిప్ అవుట్లెట్ వెలుపల భారీ జనసమూహం క్యూలైన్లలో వేచి ఉన్నారు.ఆయన రాకతో,అప్పటివరకూ క్యూలో వేచి ఉన్న వేలాదిమంది అభిమానుల ఉత్సాహానికి అంతులేకుండాపోయింది.ఇదీ చదవండి: కాలిఫోర్నియాలో భారతీయ విద్యార్థి అదృశ్యం, 5 రోజులుగా గాలింపుI heard there was "Nothing" happening today, but then I showed up and saw all this! My mind is officially blown by this store opening. Who knew Nothing could be so exciting? 🤯✨😂@nothingindia #nothingstore #nothingindia pic.twitter.com/sxUZ8OasKW— Entertainment & Trendz (@mktrendz) February 14, 2026"> ఇండియాలో ప్రత్యేకంగా బెంగళూరునే తమ తొలి అవుట్లెట్ కోసం ఎందుకు ఎంచుకున్నారో వివరిస్తూ, ప్రపంచవ్యాప్తంగా నథింగ్ అతిపెద్ద మార్కెట్లలో దేశం ఒకటి అని, తమ వినియోగదారులు చాలా మంది భారతదేశంలో మరీ ముఖ్యంగా బెంగళూరులో ఎక్కువమంది ఉన్నారని తెలిపారు. ఇక్కడ బలమైన టెక్ కమ్యూనిటీ కూడా ఉంది, కాబట్టి ఇక్కడ ప్రారంభించడం సహజంగా అనిపించిందన్నారు. ఈ సందర్బంగా ఈవెంట్ను గ్రాండ్ సక్సెస్ చేసిన బెంగళూరు వాసులకు పీ ప్రత్యక ధన్యవాదాలు తెలిపారు. దీంతో నెటిజన్లు కూడా సంతోషం వ్యక్తం చేశారు. నథింగ్ బ్రాండ్కు కొంతమంది శుభాకాంక్షలు తెలపగా, మరికొంతమంది లాంచ్ స్థాయిని చూసి ఆశ్చర్య పోయామన్నారు. భారతదేశ టెక్ రాజధాని బెంగళూరులో నథింగ్ బ్రాండ్కు పెరుగుతున్న ప్రజాదరణకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఎప్స్టీన్ను గొంతు నులిపి చంపేశారు : ఫోరెన్సిక్ నిపుణుడు సంచలన వ్యాఖ్యలు -
భారీ బోనస్.. ఐటీ కంపెనీ ఉద్యోగులకు గుడ్ న్యూస్
సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలోని డిసెంబర్ త్రైమాసికం (Q3) కోసం సంస్థ సగటున 85 శాతం పనితీరు బోనస్ ప్రకటించింది. ఈ బోనస్ ఫిబ్రవరి జీతంతో పాటు ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు కంపెనీ ఈమెయిల్ ద్వారా తెలిపింది.ఈసారి మెరుగైన చెల్లింపులుఈసారి బోనస్ చెల్లింపులు మంచి వ్యాపార ఫలితాలు, కొత్త ఒప్పందాల విజయాల నేపథ్యంలో పెరిగినట్లు సమాచారం. టెక్నాలజీ స్టాక్స్ మార్కెట్లో ఒత్తిడి ఉన్న సమయంలో ఈ ప్రకటన ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది.కొంతమంది ఉద్యోగులు చెప్పినదాని ప్రకారం.. గత త్రైమాసికంతో పోలిస్తే సుమారు 15% ఎక్కువ బోనస్ ఈసారి అందనుంది. కొందరికైతే 100% వరకు కూడా వేరియబుల్ పే లభిస్తోంది. వ్యక్తిగత పనితీరు ఆధారంగా 75% నుంచి 100% మధ్య బోనస్ జమ చేయనున్నట్లు తెలిసింది.ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కాకుండా, గత ఆర్థిక సంవత్సరంలోని ఏ త్రైమాసికంతో పోల్చినా మెరుగైన చెల్లింపుగా ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. కంపెనీ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ షాజీ మాథ్యూ గత నెల టౌన్హాల్ సమావేశంలో ఈసారి వేరియబుల్ పే మెరుగ్గా ఉండొచ్చని సంకేతాలు ఇచ్చారు.ఇన్ఫోసిస్లో ప్రస్తుతం సుమారు 3,23,000 మంది ఉద్యోగులు ఉన్నారు. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో అర్హులైన ఉద్యోగులకు సగటున 75% వేరియబుల్ పే చెల్లించిన సంస్థ, ఈసారి మరింత ఎక్కువగా అందించడం గమనార్హం. -
బీఎస్ఎన్ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్.. రోజుకు 3జీబీ డేటా!
రూ.2626 యాన్యువల్ ప్లాన్ పరిచయం చేసిన బీఎస్ఎన్ఎల్ మరో వార్షిక రీఛార్జ్ ప్లాన్ ప్రకటించింది. 365 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్ కొంత ఎక్కువ డేటా కావాలనుకునేవారికి ఉపయోగకరంగా ఉంటుంది.బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన కొత్త రూ. 2766 ప్లాన్ ద్వారా రోజుకు 3 జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత కాల్స్ మాత్రమే కాకుండా రోజుకు 100 ఎస్ఎంఎస్లు పొందవచ్చు. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 365 రోజులు.A Year of Connectivity, SortedChoose BSNL ₹2799 Annual Plan, get- 3GB data/day, Unlimited calls, 100 SMS/day for 365 days validity. Recharge smart via #BReX 👉 https://t.co/41wNbHpQ5c #BSNL #BSNLAnnualPlan #BSNL2799 #StayConnected pic.twitter.com/80JMv67IaH— BSNL India (@BSNLCorporate) February 12, 2026రూ. 2,626 రీఛార్జ్ ప్లాన్దేశ్ కా నెట్వర్క్, దేశ్ కా భరోసా అంటూ.. బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన ప్లాన్ కోసం వినియోగదారులు 2,626 రూపాయలతో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. 365 రోజుల వరకు చెల్లుబాటు అయ్యే ఈ ప్లాన్ ద్వారా.. రోజుకు 2.6 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు పొందవచ్చు. అపరిమిత కాల్స్ యధావిధిగా లభిస్తాయి. అయితే ఈ ఆఫర్ కేవలం ఫిబ్రవరి 24 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని సంస్థ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. -
రూ .300 లకు కొన్న 2 అక్షరాలు.. ఇప్పుడు రూ .634 కోట్లు
అక్షరాలకు అదృష్టం వరించడమంటే ఇదోనేమో. మూడు దశాబ్దాల క్రితం కేవలం రూ.300కి కొనుగోలు చేసిన ఏఐ.కామ్ (AI.com) అనే రెండు అక్షరాల డొమైన్ నేమ్ నేడు సుమారు రూ.634 కోట్ల విలువైన డిజిటల్ ఆస్తిగా మారింది. కృత్రిమ మేధస్సు (AI) విప్లవం సాధారణ వందల రూపాయల పెట్టుబడిని వందల కోట్ల మహా సంపదగా ఎలా మార్చగలదో ఈ స్టోరీ తెలియజేస్తోంది.1993లో అర్సయాన్ ఇస్మాయిల్ అనే ఎంటర్ప్రెన్యూర్ ఈ డొమైన్ను సుమారు రూ.300కి రిజిస్టర్ చేశారు. ఆ సమయంలో ఇంటర్నెట్ ప్రారంభ దశలో ఉండగా, కృత్రిమ మేధస్సు ప్రధానంగా విద్యా పరిశోధనలకే పరిమితమైంది. రెండు అక్షరాల డొమైన్ పేర్లకు అప్పట్లో పెద్దగా వాణిజ్య విలువ లేకపోవడంతో, AI.com సంవత్సరాల పాటు నిశ్శబ్దంగానే ఉంది.ఏఐ బూమ్తో పెరిగిన విలువగత కొన్నేళ్లలో జనరేటివ్ AI, మెషిన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్లు, వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిన AI సాధనాల పెరుగుదలతో “AI” అనే పదానికి అపారమైన ప్రాధాన్యం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా శోధించే టెక్నాలజీ పదాల్లో ఇది ఒకటిగా మారింది. దీంతో చిన్నగా, సులభంగా గుర్తుపట్టే డొమైన్ పేర్లు పరిమిత డిజిటల్ ఆస్తులుగా మారాయి. AI.com కూడా ఈ ట్రెండ్తో క్రమంగా భారీ విలువను సంపాదించింది.రూ.634 కోట్ల డీల్2025 నాటికి AI.com అమ్మకం సుమారు రూ.634 కోట్లకు పూర్తయింది. దీన్ని కొనుగోలు చేసిన వ్యక్తి క్రిస్ మర్స్జలెక్ (Kris Marszalek). ఆయన ఈ డొమైన్ను కేవలం పెట్టుబడిగా కాకుండా వినియోగదారుల కోసం కృత్రిమ మేధస్సు ఆధారిత ప్లాట్ఫారమ్గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. డొమైన్ పేర్లు ఇప్పుడు కేవలం వెబ్ చిరునామాలు కాదు.. అవి వ్యూహాత్మక డిజిటల్ ఆస్తులు. రెండు అక్షరాల డొమైన్లను అత్యంత అరుదైనవిగా పరిగణిస్తారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాలతో అనుసంధానమైతే, అవి తక్షణ బ్రాండ్ గుర్తింపు, విశ్వసనీయతను అందిస్తాయి. ఏఐ రంగంలో స్టార్టప్లు, పెద్ద సంస్థలు పోటీ పడుతున్న నేపథ్యంలో, సరళమైన, ప్రభావవంతమైన వెబ్ చిరునామాల యాజమాన్యం ఇప్పుడు దీర్ఘకాలిక బ్రాండింగ్ వ్యూహంగా మారింది. -
ఆల్‘ఇంటి’యా రేడియో!
వన్స్ అ పాన్ ఏ టైమ్ రేడియో అంటే... ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ కాదు. మన కుటుంబసభ్యురాలు! ΄÷ద్దుటే సుప్రభాతంతో నిద్ర లేపి, ప్రపంచంలో, దేశంలో ఏ మూలన ఏం జరుగుతుందో చెప్పి, బుర్ర హీటెక్కి పోకుండా చల్లని పాటలు వినిపించి... ఒక్కటా రెండా... రేడియో అంటే అంతులేని అపురూపమైన జ్ఞాపకాల సంపద....ఆకాశవాణి–రజనిమన ఆకాశవాణిని జనరంజకం చేసిన వారిలో బాలాంత్రపు రజనీకాంతరావు ఒకరు. ఆకాశవాణిలో స్వరకర్తగా, గీతరచయితగా, సంచాలకునిగా పలు బాధ్యతలు నిర్వహించారు. లలిత సంగీతాన్ని ఆకాశవాణి వేదికగా జనరంజకం చేశారు. 1947 ఆగస్ట్ 15 భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన అర్ధరాత్రి, ప్రధాని నెహ్రూ ప్రసంగం తరువాత రజని రచించి, స్వర పరిచిన ‘మాదీ స్వతంత్రదేశం’ ప్రసారం అయింది.99%: ఆకాశవాణిగా ప్రసిద్ధమైన ఆల్ ఇండియా రేడియో (ఏఐఆర్) ప్రపంచంలో అతి పెద్ద ప్రసార సంస్థలలో ఒకటి. 23 భాషలలో, 179 మాండలికాలలో మన దేశంలోని 99 శాతం మందికి చేరువైంది.ఆకాశవాణి – ఆధ్యాత్మికం – ఉషశ్రీరామాయణ, భారత, భాగవతాలను ఆకాశవాణి వేదికగా సామాన్యులకు చేరువ చేశారు ఉషశ్రీ. భగవద్గీత, సుందరకాండలను అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. ఆయన నిర్వహించిన ‘ధర్మసందేహాలు’ కార్యక్రమం చాలా జనాదరణ పొందింది. పౌరాణికాలకు సంబంధించి ఎంత జటిలమైన విషయాన్ని అయినా సులభంగా అర్థమయ్యేలా చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి.1923: బాంబే రేడియో క్లబ్ కార్యక్రమాలతో 1923లో ప్రసారాలు ప్రారంభమయ్యాయి. మొదటి న్యూస్ బులెటిన్ జనవరి 19, 1936లో ప్రసారం అయింది.ఆకాశవాణి–మహానటిమహానటి సావిత్రి సమర్పించిన జనరంజని ప్రత్యేక కార్యక్రమం 1979లో ఉగాది రోజున ప్రసారం అయింది.సిగ్నేచర్ ట్యూన్ శివరంజనిశివరంజని రాగం ఆధారంగా వాల్టర్ కౌప్మన్ ఆల్ ఇండియా రేడియో సిగ్నేచర్ ట్యూన్ను స్వరపరిచారు. వయోలిన్పై వాయించారు.జనం మెచ్చిన జనరంజనిశ్రోతలు కోరిన పాటల కార్యక్రమం ‘జనరంజని’ అత్యంత ప్రజాదరణ పొందిన కార్యక్రమాలలో ఒకటి. ఆదివారాలు, పండగ రోజుల్లో ప్రత్యేక జనరంజని కార్యక్రమాలు ప్రసారమయ్యేవి.బారిష్టర్ పార్వతీశం రాకతో రేడియో నవ్వింది!మొక్క పాటి ప్రసిద్ధ హాస్య నవల ‘బారిస్టర్ పార్వతీశం’ ఆకాశవాణిలో అత్యంత ప్రజాదరణ పొందిన నాటకాల్లో ఒకటి.రేడియోలో వేటూరి విజయవాడ కేంద్రం ద్వారా ప్రసారమైన వేటూరి సంగీత రూపకం ‘సిరికాకొలను చిన్నది’ అద్భుతమైన ఆడియో నాటిక. ఈ సంగీతక రూపకానికి పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం అందించారు.థీమ్ 2026ఈ సంవత్సరం ‘వరల్డ్ రేడియో డే’ థీమ్...‘రేడియో అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: ఏఐ ఈజ్ ఏ టూల్, నాట్ ఏ వాయిస్’ -
ఏడాదిలో 4000 కోట్ల స్పామ్ కాల్స్!
భారత్ డిజిటల్ విప్లవం దిశగా దూసుకుపోతున్న వేళ స్పామ్ కాల్స్, సైబర్ మోసాలు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయి. 2025 సంవత్సరంలో భారతీయులకు ఏకంగా 4,000 కోట్లకు పైగా స్పామ్ కాల్స్ వచ్చినట్లు ‘ట్రూకాలర్ ఇండియా ఇన్సైట్స్ రిపోర్ట్ 2025’ కొన్ని విషయాలను వెల్లడించింది.ఈ సందర్భంగా ట్రూకాలర్ సీఈఓ రిషిత్ ఝున్ఝున్వాలా మాట్లాడుతూ.. వికసిత్ భారత్ విజన్లో భాగంగా దేశం డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా మారుతున్న తరుణంలో కమ్యూనికేషన్ వ్యవస్థపై నమ్మకం చాలా కీలకమన్నారు. ‘ఈ రోజుల్లో మోసం అనేది కేవలం సాంకేతిక సమస్య కాదు, అది మానవ బలహీనతలతో ఆడుకునే ప్రక్రియ. భయం, అత్యవసరం, అనిశ్చితిని పెట్టుబడిగా చేసుకుని స్కామర్లు రెచ్చిపోతున్నారు. ప్రతి భారతీయుడికి డిజిటల్ భద్రత కల్పించాలన్నదే మా లక్ష్యం’ అన్నారు.నివేదిక ప్రకారం, గడిచిన ఏడాదిలో నమోదైన స్పామ్ కాల్స్ వివరాలు ఇలా ఉన్నాయి:మొత్తం స్పామ్ కాల్స్: 4,168 కోట్లు.బ్లాక్ చేసిన కాల్స్: 1,189 కోట్లు (యూజర్లకు చేరకముందే సాంకేతికతతో నిరోధించినవి).మోసపూరిత కాల్స్: సుమారు 770 కోట్లు. ఇవి ప్రధానంగా బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, పేమెంట్ ప్లాట్ఫారమ్ల పేరుతో వచ్చాయి.స్పామ్ ఎస్ఎంఎస్లు: ఏడాది పొడవునా 12,903 కోట్ల స్పామ్ సందేశాలు నమోదయ్యాయి.స్పామ్ కాల్స్ నిరోధించడం వల్ల కేవలం మోసాలు తగ్గడమే కాకుండా ప్రజల విలువైన సమయం కూడా ఆదా అవుతోంది. కమ్యూనిటీ రిపోర్టింగ్ ద్వారా భారతీయులకు రోజుకు సుమారు 21.7 లక్షల గంటల సమయం ఆదా అవుతోందని నివేదిక పేర్కొంది. దీనివల్ల అనవసరపు ఒత్తిడి తగ్గడమే కాకుండా హడావుడిలో తీసుకునే తప్పుడు నిర్ణయాల వల్ల కలిగే ఆర్థిక నష్టాలను నివారించవచ్చు.2026లో పొంచి ఉన్న ముప్పురాబోయే రోజుల్లో మోసగాళ్లు మరింత అధునాతన పద్ధతులను అవలంబిస్తారని నివేదిక హెచ్చరించింది. అందులో ఏఐ సృష్టించిన వాయిస్ స్కామ్స్, కాల్స్, మెసేజ్లతో చేసే మోసాలు ఉండనున్నాయి. ఇతరుల పేర్లతో డిజిటల్ ఐడెంటిటీని దొంగిలించడం వంటి మోసాలు ఎక్కువగా జరగవచ్చని అంచనా.జాగ్రత్తలుఅత్యవసరమని వచ్చే కాల్స్ను వెంటనే నమ్మకుండా ధ్రువీకరించుకోవాలి. వ్యక్తిగత వివరాలను, ఓటీపీలను ఎవరితోనూ పంచుకోకూడదు. నమ్మకమైన కాలర్ ఐడీ సాధనాలను ఉపయోగించాలి. డిజిటల్ సాధికారత సాధించే క్రమంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండటమే అసలైన రక్షణ అని గుర్తించాలి.ఇదీ చదవండి: ‘బంగారు ప్రయాణం’లో రహస్యాలు! -
ఐటీ కంపెనీలను వణికిస్తున్న ఆ ‘పేరు’ మాదే..
అమెరికా ఆధారిత ఏఐ సంస్థ ‘ఆంథ్రోపిక్’ భారత విస్తరణ ప్రణాళికలు చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. అదే పేరుతో పనిచేస్తున్న భారతీయ సంస్థ ‘ఆంథ్రోపిక్ సాఫ్ట్వేర్’.. తమ బ్రాండ్కు గందరగోళం కలుగుతోందని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ కేసు భారత కోర్టులో పెండింగ్లో ఉండటం వల్ల, దేశంలో ఆంథ్రోపిక్ వ్యూహాత్మక ప్రణాళికలు క్లిష్టతరం అయ్యే అవకాశముంది.అమెరికా ఆంథ్రోపిక్ Vs ఇండియా ఆంథ్రోపిక్టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం.. ఆంథ్రోపిక్ సాఫ్ట్వేర్ గత నెలలో కర్ణాటక వాణిజ్య కోర్టులో ఫిర్యాదు దాఖలు చేసింది. 2017 నుంచే తమ సంస్థ "ఆంథ్రోపిక్" పేరును ఉపయోగిస్తోందని, అమెరికా సంస్థ భారత మార్కెట్లో ప్రవేశించడం వల్ల వినియోగదారుల్లో గందరగోళం ఏర్పడుతోందని కంపెనీ పేర్కొంది.స్థానిక సంస్థ తన ముందస్తు వినియోగాన్ని అధికారికంగా గుర్తించాలని, అలాగే మరింత గందరగోళం నివారించేందుకు తగిన ఉపశమనం ఇవ్వాలని కోరుతోంది. అదనంగా, రూ.1 కోటి నష్టపరిహారం కూడా డిమాండ్ చేసినట్లు సమాచారం.భారతీయ సంస్థ వాదన ఏమిటంటే..ఆంథ్రోపిక్ సాఫ్ట్వేర్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ మొహమ్మద్ అయ్యాజ్ ముల్లా టెక్ క్రంచ్తో మాట్లాడుతూ, ఈ ఫిర్యాదు వెనుక ఉద్దేశం ఘర్షణ కాదని, తమ ముందస్తు వినియోగానికి అధికారిక గుర్తింపు పొందడమేనని తెలిపారు. గుర్తింపు లభించకపోతే, చట్టపరమైన పోరాటాన్ని కొనసాగించవచ్చని ఆయన స్పష్టం చేశారు.భారతీయ సంస్థ తమ వెబ్సైట్లో “ఆంథ్రోపిక్ సాఫ్ట్వేర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (అప్లికేషన్ పెండింగ్) ట్రేడ్మార్క్” అని పేర్కొంది. ట్రేడ్మార్క్ నమోదు ఇంకా పెండింగ్లో ఉన్నందున, ఇది నేరుగా ట్రేడ్మార్క్ ఉల్లంఘన కేసుగా పరిగణించబడకపోవచ్చు. అయితే కోర్టు భారతీయ సంస్థకు అనుకూలంగా తీర్పు ఇస్తే, అమెరికా సంస్థ భారతదేశంలో తన పేరును మార్చాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశముంది.ఇదీ చదవండి: పేరు మార్చుకున్న ప్రముఖ ఐటీ కంపెనీకేసు ప్రస్తుత స్థితిజనవరి 20న కోర్టు ఆంథ్రోపిక్ ఇండియాకు సమన్లు జారీ చేసింది. అయితే ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు. అంటే, సంస్థ తన కార్యకలాపాలను తక్షణం నిలిపివేయాల్సిన అవసరం లేదు. తదుపరి విచారణ ఫిబ్రవరి 16న జరగనుంది.ఇదిలా ఉండగా, ఆంథ్రోపిక్ ఏఐ భద్రతా విభాగాధిపతి మృణక్ శర్మ రాజీనామా చేశారు. ఇలీవల ‘ఎక్స్’ (ట్విట్టర్)లో తన రాజీనామాను ప్రకటించారు. తాను వెంటనే కొత్త వెంచర్ ప్రారంభించడం లేదని, తదుపరి నిర్ణయం తీసుకునే ముందు స్వల్ప విరామం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. -
‘బంగారు ప్రయాణం’లో రహస్యాలు!
బంగారం షాపులో నగదు చెల్లించి నచ్చిన నగను కొనుక్కుంటాం. అద్దాల షోరూమ్లో విద్యుత్ కాంతుల మధ్య తళతళలాడే ఆ బంగారు ఆభరణాలను చూసి మురిసిపోతాం. కానీ, ఆ మెరుపు వెనుక.. వందల మంది కార్మికుల చెమట చుక్కలు ఉన్నాయని ఎంతమందికి తెలుసు? ఆ హొయల వెనుక.. వేల అడుగుల లోతులో పేలే బాంబుల మోత, ఊపిరాడని గనుల్లో ఉక్కపోత ఉందని చాలా మందికి తెలియదు కదా.. ఒక చిన్న ఉంగరం మన వేలికి చేరడానికి ముందు అది ఒక కఠినమైన శిల. ఆ శిల నుంచి స్వచ్ఛమైన పసిడిని ఒడిసి పట్టుకోవడానికి ప్రకృతితో చేసే యుద్ధమే ఈ ‘బంగారు ప్రయాణం’. బంగారాన్ని గనుల్లో నుంచి ఎలా వెలికితీస్తారో.. ఆభరణాల రూపంలోకి ఎలా మారుస్తారో తెలుసుకుందాం.అన్వేషణ, మైనింగ్బంగారం ఎక్కడ ఉందో గుర్తించడం మొదటి దశ. దీన్ని ప్రోస్పెక్టింగ్ అంటారు. భూగర్భంలో బంగారం నిల్వలు ఉన్నాయని శాస్త్రవేత్తలు నిర్ధారించిన తర్వాత మైనింగ్ ప్రారంభమవుతుంది. బంగారం భూమిపై పొరల్లోనే ఉన్నప్పుడు పెద్ద గుంతలు తవ్వి వెలికితీస్తారు. దీన్ని ఓపెన్ పిట్ మైనింగ్ అంటారు. బంగారం చాలా లోతులో ఉన్నప్పుడు సొరంగాలు తవ్వి, పేలుళ్ల సాయంతో ముడి ఖనిజాన్ని బయటకు తీస్తారు. దీన్ని అండర్గ్రౌండ్ మైనింగ్ అంటారు.ముడి ఖనిజాన్ని పొడి చేయడంగనుల నుంచి సేకరించిన పెద్ద రాళ్లను క్రషర్స్ యంత్రాల్లో వేసి చిన్న ముక్కలుగా మారుస్తారు. ఆ తర్వాత వాటిని చిన్న స్పటికాల పరిమాణంలోకి, ఆపై మెత్తటి పౌడర్లాగా పిండి చేస్తారు. ఈ పొడిలోనే అతి సూక్ష్మమైన బంగారు రేణువులు దాగి ఉంటాయి.బంగారం వేరు చేయడంపొడి చేసిన మట్టి నుంచి బంగారాన్ని వేరు చేయడానికి ప్రధానంగా కొన్ని పద్ధతులను ఉపయోగిస్తారు.సైనైడ్ లీచింగ్: ఈ పౌడర్కు సోడియం సైనైడ్ ద్రావణాన్ని కలుపుతారు. ఇది బంగారాన్ని ద్రవ రూపంలోకి మారుస్తుంది. ఆ తర్వాత జింక్ పౌడర్ లేదా యాక్టివేటెడ్ కార్బన్ ఉపయోగించి బంగారాన్ని తిరిగి ఘన రూపంలోకి మారుస్తారు.గ్రావిటీ సెపరేషన్: బంగారం బరువు ఎక్కువగా ఉండటం వల్ల నీటి ప్రవాహం ద్వారా తేలికపాటి మట్టిని కొట్టుకుపోయేలా చేసి బంగారు రేణువులను కిందకు చేరేలా చేస్తారు.స్మెల్టింగ్పైన తెలిపిన ప్రక్రియలో వచ్చిన బంగారాన్ని (దీన్ని డోర్ అని పిలుస్తారు) దాదాపు 1064 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద కరిగిస్తారు. ఈ దశలో బంగారం నుంచి ఇతర లోహాలు వేరవుతాయి. ఇక్కడ వచ్చే పసిడి 100% స్వచ్ఛంగా ఉండదు. ఇందులో వెండి లేదా రాగి కలిసి ఉంటాయి. వీటిని బార్స్ రూపంలోకి మారుస్తారు.శుద్ధీకరణ(రిఫైనింగ్)చివరి దశలో బంగారాన్ని పూర్తిస్థాయిలో శుద్ధి చేయడానికి మిల్లర్ ప్రక్రియ లేదా వోల్విల్ ప్రక్రియ వాడతారు. ఈ ప్రక్రియల్లో క్లోరిన్ గ్యాస్ను ఉపయోగించి ఇతర మలినాలను తొలగిస్తారు. దీని ద్వారా 99.9% (24 క్యారెట్) స్వచ్ఛమైన బంగారం లభిస్తుంది.ఆభరణాల తయారీచివరిగా ఈ స్వచ్ఛమైన బంగారానికి కొంత మోతాదులో రాగి లేదా వెండిని కలిపి (సాధారణంగా 22 క్యారెట్లు) నచ్చిన ఆభరణాలుగా మలుస్తారు.ఒక గ్రాము బంగారాన్ని పొందడానికి దాదాపు ఒక టన్ను ముడి ఖనిజాన్ని ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. అందుకే బంగారం అంత విలువైనది!ఇదీ చదవండి: భవిష్యత్తులో పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇదే.. -
భవిష్యత్తులో పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇదే..
సాంకేతిక ప్రపంచంలో ప్రస్తుతం కృత్రిమ మేధ (ఏఐ) సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో ఎన్విడియా అధినేత జెన్సెన్ హువాంగ్ భవిష్యత్తు ప్రోగ్రామింగ్ గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. భవిష్యత్తులో అత్యంత శక్తివంతమైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సీ++ లేదా పైథాన్ వంటివి కాదని, అది మన ‘సహజ భాష’(ఇంగ్లీష్) అని ఆయన పేర్కొన్నారు.సాంప్రదాయకంగా కంప్యూటర్లతో సంభాషించాలంటే క్లిష్టమైన సింటాక్స్ కలిగిన కోడింగ్ భాషలు అవసరం. అయితే జనరేటివ్ ఏఐ రాకతో ఈ పరిస్థితి వేగంగా మారుతోంది. హువాంగ్ అభిప్రాయం ప్రకారం.. వినియోగదారులు క్లిష్టమైన కోడ్ రాయడానికి బదులు తమకు కావాల్సిన అంశాన్ని సాధారణ ఇంగ్లీషులో వివరిస్తే చాలు. ఏఐ వ్యవస్థలు ఆ ఆదేశాలను అర్థం చేసుకుని డిజిటల్ ఉత్పత్తులను సృష్టిస్తాయి. గతంలో కోడ్లోని లోపాలను మాన్యువల్గా టెస్టింగ్లో వెతకాల్సి ఉండేది. ఇప్పుడు వినియోగదారులు ఏఐ సిస్టమ్లతో సంభాషిస్తూ అవుట్పుట్ను సరిచేయమని ఆదేశిస్తే సరిపోతుంది. ఈ లూప్ సాఫ్ట్వేర్ అభివృద్ధిని మరింత సులభతరం చేస్తోంది.అధికారిక కోడింగ్ పరిజ్ఞానం లేని వారు కూడా తమ వ్యాపార ప్రక్రియలను ఆటోమేట్ చేసుకోవడానికి, డేటాను విశ్లేషించడానికి, కొత్త ప్రోటోటైప్లను రూపొందించడానికి ఈ మార్పు దోహదపడుతుందని చెబుతున్నారు.డెవలపర్లు, పరిశ్రమపై ప్రభావంజెన్సెన్ హువాంగ్ వ్యాఖ్యల తర్వాత, ఇకపై ప్రోగ్రామింగ్ భాషలు అదృశ్యమవుతాయా? అనే సందేహం కలగడం సహజం. కానీ వాస్తవానికి సీ++, పైథాన్ వంటి కంప్యూటర్ భాషలు ఆపరేటింగ్ సిస్టమ్స్, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కీలక పాత్ర పోషిస్తూనే ఉంటాయని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే డెవలపర్లు ఇకపై కేవలం సింటాక్స్ రాయడంపై కాకుండా సమస్యను స్పష్టంగా నిర్వచించడం, ఏఐని సమర్థవంతంగా మార్గనిర్దేశం చేయడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. తార్కిక, కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరింత కీలకం కానున్నాయి.ఇదీ చదవండి: బీహెచ్ఈఎల్లో వాటాల విక్రయానికి భారీ స్పందన -
పేరు మార్చుకున్న ప్రముఖ ఐటీ కంపెనీ
ప్రముఖ దేశీయ ఐటీ సేవల సంస్థ ఎల్టీఐ మైండ్ట్రీ (LTIMindtree) తన పేరును మార్చుకుంది. కంపెనీ కొత్త పేరును ఎల్టీఎం లిమిటెడ్ (LTM Limited)గా ప్రకటించింది. తన కొత్త బ్రాండ్ గుర్తింపు, లోగోను ఆవిష్కరించింది. వేణు లాంబును చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO), మేనేజింగ్ డైరెక్టర్గా నియమించిన సంవత్సరం తర్వాత తన పేరును అధికారికంగా మార్చుకుంది."వ్యాపార సృజనాత్మకత భాగస్వామి" (Business Creativity Partner)గా కొత్త గుర్తింపు, స్థానాన్ని ప్రకటిస్తూ, ఎల్టీఎం తన సాంకేతిక సామర్థ్యాలు, లోతైన డొమైన్ నైపుణ్యం కలిసి వాటాదారులకు అర్థవంతమైన విలువను ఎలా సృష్టిస్తాయో వివరించింది. ఈ విషయాన్ని కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్లో తెలిపింది."మార్కెట్లు మారుతున్నాయి, క్లయింట్ల అంచనాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో, మన ప్రస్తుత సామర్థ్యాలు, భవిష్యత్తు దృష్టిని ప్రతిబింబించే బ్రాండ్తో ముందుకు సాగుతున్నాము. బిజినెస్ క్రియేటివిటీ భాగస్వామిగా, మనం పని చేసే కొత్త మార్గాలు, కొత్త ఉత్పాదకత నమూనాలు, విలువ సృష్టించే కొత్త విధానాలను రూపొందిస్తున్నాము" అని సీఈఓవేణు లాంబు తెలిపారు.ఎల్టీఐ మైండ్ట్రీ లిమిటెడ్.. లార్సెన్ & టుబ్రో గ్రూప్కు చెందిన ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కన్సల్టింగ్ అండ్ డిజిటల్ సొల్యూషన్స్ సంస్థ. ఎల్అండ్టీఐ ఇన్ఫోటెక్, మైండ్ట్రీ విలీనంతో ఏర్పడిన ఈ సంస్థ, ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల సంస్థలకు డిజిటల్ మార్పు, క్లౌడ్, డేటా అనలిటిక్స్, కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత సేవలను అందిస్తోంది. ఇటీవల విడుదల చేసిన డిసెంబర్ త్రైమాసిక (Q3) ఆర్థిక ఫలితాల ప్రకారం.. కంపెనీ ఆదాయం సుమారు 11 శాతం పెరిగి రూ. 10,781 కోట్లకు చేరుకోగా, పునరావృతం కాని (one-off) వ్యయ ప్రభావాల కారణంగా నికర లాభం సుమారు 12 శాతం తగ్గి రూ. 960 కోట్లుగా నమోదైంది.ఇదీ చదవండి: ఉద్యోగం వద్దనుకుంటే.. గూగుల్ ఆఫర్ ఇదే.. -
ఉద్యోగం వద్దనుకుంటే.. గూగుల్ ఆఫర్ ఇదే..
గూగుల్ తన గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్ (GBO) ఉద్యోగుల కోసం మరోసారి స్వచ్ఛంద నిష్క్రమణ ప్యాకేజీలను (Voluntary Exit Packages - VEP) ప్రకటించింది. ఏఐ (AI) ఆధారిత భవిష్యత్తుకు పూర్తిగా కట్టుబడి ఉన్న సంస్థగా మారేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.“కొత్త సంవత్సరాన్ని మనం బలమైన స్థితిలో ప్రారంభిస్తున్నాం. 2025లో మీరు అందించిన సహకారానికి కృతజ్ఞతలు. అయితే టెక్నాలజీ రంగం వేగంగా మారుతోంది. పోటీ తీవ్రంగా ఉంది. కాబట్టి మన ఏఐ మిషన్కు పూర్తిగా అనుగుణంగా పనిచేసే శ్రామిక శక్తి అవసరం” అని గూగుల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ షిండ్లర్ అంతర్గత మెమోలో ఉద్యోగులకు తెలిపారు.ఏఐ-ఫస్ట్ దిశగా అడుగులుగూగుల్ ఇప్పుడు పూర్తిగా “ఏఐ-ఫస్ట్” సంస్థగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే వ్యాపార విభాగంలోని ప్రతి ఉద్యోగీ ఏఐని స్వీకరించి, ఎక్కువ ప్రభావాన్ని చూపాలని సంస్థ స్పష్టం చేసింది. “ఈ వేగానికి సరిపోలలేనివారు లేదా ముందుకు సాగడానికి సిద్ధంగా లేనివారు స్వచ్ఛందంగా నిష్క్రమించేందుకు కంపెనీ అవకాశం ఇస్తుంది” అని షిండ్లర్ పేర్కొన్నారు.ఎవరిపై ప్రభావం?ఈ స్వచ్ఛంద నిష్క్రమణ ప్యాకేజీలు ముఖ్యంగా సొల్యూషన్స్ టీమ్స్, సేల్స్ విభాగం, కార్పొరేట్ డెవలప్మెంట్, ఇతర సంబంధిత వ్యాపార విభాగాల వారికి వర్తిస్తాయి. అయితే, అమెరికాలోని పెద్ద కస్టమర్ సేల్స్ టీమ్స్, కొన్ని కస్టమర్-ఫేసింగ్ పాత్రలకు ఈ ఆఫర్ వర్తించదని స్పష్టం చేశారు. “మా వినియోగదారులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండటానికి ఈ నిర్ణయం తీసుకున్నాము” అని షిండ్లర్ తెలిపారు.ఏడాదిలో మూడోసారి.. ఇది గూగుల్ అమలు చేస్తున్న మూడో స్వచ్ఛంద నిష్క్రమణ ప్రణాళిక. గతంలో కూడా ఇలాంటి చర్యలు తీసుకుంది. 2025 జూన్లో ‘రిటర్న్-టు-ఆఫీస్’ విధానం కఠినతరం చేసిన సమయంలో యూఎస్ ఉద్యోగులకు ఇలాంటి ఆఫర్లు ఇచ్చింది. మళ్లీ 2025 అక్టోబర్లోనూ యూట్యూబ్ విభాగంలో పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ఎగ్జిట్ ప్యాకేజీలు ప్రకటించింది.వీఈపీ ప్యాకేజీలో ఏం ఉంటాయంటే..గూగుల్ వీఈపీ (Voluntary Exit Program) ప్యాకేజీని ఎంచుకుని స్వచ్ఛందంగా నిష్క్రమించే ఉద్యోగులకు సాధారణంగా వారి సర్వీస్ పీరియడ్, దా ఆధారంగా లంప్సమ్ సెవరెన్స్ పే (కొన్ని వారాలు/నెలల జీతం), ప్రోరేటెడ్ బోనస్ చెల్లింపు, ఉపయోగించని సెలవులకు నగదు, కొంతకాలం వరకు ఆరోగ్య బీమా కొనసాగింపు, ఇప్పటికే వెస్ట్ అయిన RSUs/స్టాక్లపై హక్కులు, అలాగే కొత్త ఉద్యోగం కోసం కెరీర్ ట్రాన్సిషన్ లేదా అవుట్ప్లేస్మెంట్ సపోర్ట్ వంటి ప్రయోజనాలు అందిస్తారు. -
ఎయిర్టెల్ సరికొత్త ఏఐ ఫ్రాడ్ అలర్ట్ ప్రారంభం
దేశంలో వేగంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, ముఖ్యంగా వన్-టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) లీకేజీల ద్వారా జరుగుతున్న బ్యాంకింగ్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. కృత్రిమ మేధ(ఏఐ) ఆధారంగా పనిచేసే అత్యాధునిక ‘ఫ్రాడ్ అలర్ట్’ ఫీచర్ను కంపెనీ ఆవిష్కరించింది.ఏమిటీ ఏఐ ఫ్రాడ్ అలర్ట్?సాధారణంగా డెలివరీ బాయ్స్ లేదా సర్వీస్ ఏజెంట్ల పేరుతో ఫోన్ చేసే మోసగాళ్లు వినియోగదారులను మాటల్లో పెట్టి వారి బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన ఓటీపీలను కాజేస్తుంటారు. ఇలాంటి దాడుల నుంచి కస్టమర్లను రక్షించడమే ఈ ఏఐ వ్యవస్థ ప్రధాన ఉద్దేశం.ఒక కస్టమర్ కాల్లో ఉన్నప్పుడు అవతలి వ్యక్తి బ్యాంకింగ్ ఓటీపీ కోసం ప్రయత్నిస్తున్నాడని ఏఐ గుర్తించినట్లయితే నెట్వర్క్ స్థాయిలో ఎయిర్టెల్ వెంటనే జోక్యం చేసుకుంటుంది. కాల్ సమయంలో కస్టమర్కు వెంటనే ‘ఫ్రాడ్ అలర్ట్’ ద్వారా హెచ్చరిక పంపుతుంది. తద్వారా కస్టమర్ అప్రమత్తమై తన సమాచారాన్ని పంచుకోకుండా జాగ్రత్త పడవచ్చు.ఈ సందర్భంగా ఎయిర్టెల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ శాశ్వత్ శర్మ మాట్లాడుతూ.. ‘ఎయిర్టెల్ను దేశంలోనే అత్యంత సురక్షితమైన నెట్వర్క్గా మార్చాలన్నదే లక్ష్యం. డిజిటల్ లావాదేవీల్లో ఓటీపీలు కీలకమే అయినప్పటికీ నేరగాళ్ల చేతికి చిక్కితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అందుకే నెట్వర్క్ స్థాయిలోనే ఈ మోసాలను అడ్డుకునే ఏఐ పరిష్కారాన్ని తీసుకొచ్చాం. ప్రయోగాత్మక పరీక్షల్లో ఇది మంచి ఫలితాలను ఇచ్చింది’ అని పేర్కొన్నారు.అందుబాటులోకి ఎప్పుడు?గత రెండేళ్లుగా స్పామ్ కాల్ హెచ్చరికలు, హానికరమైన లింక్లను కట్టడి చేయడం వంటి చర్యలు తీసుకుంటున్న ఎయిర్టెల్ ఇప్పుడు ఈ ఓటీపీ ప్రొటెక్షన్ను మరింత బలోపేతం చేసింది. ఎయిర్టెల్ ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ ప్రస్తుతం ప్రారంభ దశలో భాగంగా హరియాణా రాష్ట్రంలోని వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ సదుపాయాన్ని కేవలం ఒక ప్రాంతానికే పరిమితం చేయకుండా రాబోయే రెండు వారాల్లో దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్టెల్ కస్టమర్లందరికీ ఈ సర్వీసును విస్తరించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.ఈ రక్షణ వ్యవస్థ పూర్తిగా నెట్వర్క్ స్థాయి ఏఐ సాంకేతికతపై ఆధారపడి పనిచేస్తుంది. వినియోగదారుల మొబైల్ ఫోన్లలో ప్రత్యేకంగా ఎలాంటి యాప్లు ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండానే నెట్వర్క్ స్థాయిలోనే మోసపూరిత కాల్స్, ఓటీపీ లీకేజీలను గుర్తించి అడ్డుకుంటుంది.ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప ఊరట -
ఏఐ వినియోగంలో భారత్ జోరు
దేశీయంగా కృత్రిమ మేథ (ఏఐ) వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ఎంటర్ప్రైజ్ విభాగంలో ఏఐ/ఎంఎల్ (మెషిన్ లెర్నిగ్) కార్యకలాపాలకు సంబంధించి అమెరికా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. క్లౌడ్ సెక్యూరిటీ సేవల దిగ్గజం జీస్కేలర్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. భారత్లో ఏఐ వినియోగం వేగంగా పెరుగుతున్నప్పటికీ భద్రతాపరమైన సవాళ్లు గణనీయంగా ఉంటున్నాయని రిపోర్ట్ పేర్కొంది. ఏజెంటిక్ ఏఐని ఆయుధంగా ఉపయోగించకోవడం, నవకల్పనలు–భద్రత చర్యల మధ్య అంతరం భారీగా ఉండటం మొదలైనవి ఇందులో ఉన్నాయని వివరించింది. 2025 జనవరి–డిసెంబర్ మధ్య జీస్కేలర్ జీరో ట్రస్ట్ ఎక్సే్చంజ్ ప్లాట్ఫాంపై నమోదైన లక్ష కోట్ల ఏఐ, మెషిన్ లెరి్నంగ్ లావాదేవీల విశ్లేషణ ఆధారంగా జీస్కేలర్ ఈ రిపోర్టును రూపొందించింది. ఫిబ్రవరి 16–20 మధ్య భారత్లో ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026 జరగనున్న నేపథ్యంలో ఈ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. ఎని్వడియా సీఈవో జెన్సన్ హువాంగ్, ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మన్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, ఆంథ్రోపిక్ సీఈవో డేరియో, క్వాల్కామ్ సీఈవో క్రిస్టియానో ఎమోన్ తదితర దిగ్గజాలు ఈ సదస్సులో పాల్గోనున్నారు. నివేదిక ప్రకారం..దేశీ కంపెనీలు 2025 జూన్–డిసెంబర్ మధ్య కాలంలో ఏకంగా 8,230 కోట్ల ఏఐ/ఎంఎల్ లావాదేవీలు నిర్వహించాయి. ఆసియా–పసిఫిక్ (ఏపీఏసీ) ప్రాంతంలో నమోదైన మొత్తం ఏఐ లావాదేవీల్లో ఇది 46.2 శాతం కావడం గమనార్హం. దీనితో ప్రాంతీయంగా భారత్ అగ్రస్థానంలో నిలిచింది.డిజిటల్ పరివర్తనకు ప్రభుత్వం దన్నుగా నిలవడంతో పాటు ఏఐ మౌలిక సదుపాయాలు–నైపుణ్యాల అభివృద్ధిపై ప్రభుత్వ–ప్రైవేట్ పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఏఐ సామర్థ్యాలున్న సిబ్బంది పెరుగుతుండటం, ఏఐ సేవలను వేగంగా, భారీ స్థాయిలో వినియోగంలోకి తెచ్చేందుకు వీలు కలి్పంచే క్లౌడ్–ఫస్ట్ విధానాలనేవి గతంతో పోలిస్తే భారత్ చాలా వేగంగా వృద్ధి చెందేందుకు తోడ్పడ్డాయి. దేశీయంగా ఏఐ కార్యకలాపాలకు దన్నుగా నిలుస్తున్న రంగాల్లో టెక్నాలజీ–కమ్యూనికేషన్ (3,130 కోట్ల లావాదేవీలు), తయారీ (1,570 కోట్లు), సరీ్వసులు (1,260 కోట్లు), ఫైనాన్స్–ఇన్సూరెన్స్ (1,220 కోట్ల లావాదేవీలు) ఉన్నాయి. కంపెనీల పర్యవేక్షణ సామర్థ్యాలకు మించిన వేగంతో ఎంటర్ప్రైజ్ ఏఐ వినియోగం పెరుగుతోంది. కానీ చాలా సంస్థల్లో కీలకమైన డేటా ఏ దశలో బహిర్గతమయ్యే అవకాశం ఉందో కనిపెట్టలేని భద్రతపరమైన లోపాలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం నెలకొంది. ఏఐని దేనికోసం వినియోగిస్తున్నారు, ఏ డేటాను షేర్ చేస్తున్నారనే దానిపై ఓ కన్నేసి ఉంచుతూ, లీకేజీలను కట్టడి చేసేందుకు ఎప్పటికప్పుడు తగు చర్యలను అమలు చేస్తూ ఉండాలి. మార్కెట్ డిమాండ్కి తగ్గట్లుగా సురక్షితమైన ఏఐ వైపు మళ్లాలంటే డేటా భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వడం చాలా అవసరం. ప్రతికూల పరిస్థితులను సృష్టించి ఎంటర్ప్రైజ్ ఏఐ సిస్టంలను పరీక్షించినప్పుడు కేవలం నిమిషాల వ్యవధిలోనే వాటి బలహీనతలు బయట పడిపోతుండటమనేది సెక్యూరిటీపరంగా నెల కొన్న రిస్క్లను సూచిస్తోంది.స్వతంత్రంగా ప్రణాళికలు వేసుకుని, చర్యలు కూడా తీసుకోగలిగే సామర్థ్యాలున్న ఏజెంటిక్ ఏఐ వినియోగం పెరుగుతోంది. ఈ టెక్నాలజీని ఇప్పటికే ఆయుధంగా మార్చుకుంటున్నారు. సైబర్క్రిమినల్స్, నిఘా గ్రూప్లు ఏఐని ఉపయోగించుకుని దాడులకు పాల్పడుతున్నాయనడానికి స్పష్టమైన ఆధారాలు తెరపైకి వస్తున్నాయి. ఏఐ ఏజెంట్లు నిఘా, చొరబాటు, విస్తృత దాడుల బాధ్యతలు తీసుకుంటున్నాయి. స్వతంత్రంగా, మెషిన్ వేగంతో, భారీ స్థాయిలో సైబర్ దాడులకు దిగుతున్నాయి. ఏఐ కేవలం ఉత్పాదకతను పెంచుకునేందుకు ఉపయోగపడే సాధనంగానే ఉండటం లేదు, నేరగాళ్లకు ఆయుధంగా కూడా మారుతోంది. డేటా చౌర్యం తీవ్ర ఆందోళనకర అంశంగా మారుతోంది. 2025లో అంతర్జాతీయంగా ఏఐ అప్లికేషన్స్లోకి 18,000 టెరాబైట్స్ డేటా వచ్చి చేరింది. ఇది దాదాపు 360 కోట్ల డిజిటల్ ఫొటోలకు సమానం. ఏజెంటిక్ ఏఐ చొరబడిందంటే, సంప్రదాయ రక్షణ పద్ధతులు అడ్డుకోలేవు. నిమిషాల వ్యవధిలో భారీ స్థాయిలో డేటా చౌర్యం జరిగిపోతుంది. ఈ రిస్క్లను ఎదుర్కొనాలంటే ఏఐని కట్టడి చేసేందుకు కంపెనీలు ఏఐనే ఆయుధంగా మార్చుకోవాలి. దాడులకు ఉపయోగపడే ఆస్కారమున్న అన్ని మార్గాలను మూసివేసేందుకు ప్రతి దశలోనూ భద్రతకు ప్రాధాన్యతనిచ్చే ఇంటెలిజెంట్ జీరో ట్రస్ట్ వ్యవస్థను వినియోగించుకోవాలి.ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల అప్డేట్స్ -
బిలియన్ డాలర్ల...భావోద్వేగాల బిజినెస్
సాక్షి, బిజినెస్ డెస్క్: భారత్లో ఇప్పుడు కొత్త తరహా డిజిటల్ స్నేహితులు అడుగుపెడుతున్నారు. ఏఐ ఆధారిత వర్చువల్ పెట్స్ (ఏఐ పెట్స్) యువతలో వేగంగా ఆదరణ పొందుతున్నాయి. నగర జీవనంలో పెరుగుతున్న ఒంటరితనం, నిజమైన పెంపుడు జంతువుల బాధ్యతలు తీసుకోలేని పరిస్థితుల్లో ఏఐ పెట్స్ ఒక ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. భావోద్వేగంగా స్పందించడం, మాటలతో ఆదుకోవడం వంటి లక్షణాల వల్ల ఇవి యువతను ఆకర్షిస్తున్నాయి. వీటితో యూజర్లు నిజమైన జంతువును పెంచుకుంటున్న అనుభూతి పొందుతారు.వీటితో కూడా రోజువారీ రొటీన్ను ఫాలో అవచ్చు. ఆహారం పెట్టడం, స్నానం చేయించడం, ఆడించడం, నిద్ర షెడ్యూల్ చూసుకోవడం వంటి పనులు చేస్తూ నిజమైన పెంపుడు జంతువును ఆడించినట్లే ఆనందిస్తారు. ఈ పెట్ అప్లికేషన్లలో వినియోగదారులు తమ పెంపుడు జంతువుకు దుస్తులు, ఆభరణాలు కొనుగోలు చేయవచ్చు. నెలకు సగటున రూ. 30 నుంచి రూ. 60 వరకు ఖర్చు చేస్తూ, ఆ ఏఐ పెట్ను సంరక్షించడం, శిక్షణ ఇవ్వడం, భావోద్వేగంగా స్పందించేలా నేరి్పంచడం చేస్తున్నారు. పెరుగుతున్న మార్కెట్ వర్చువల్ పెట్స్ మార్కెట్ విలువ ప్రస్తుతం సుమారు 150 మిలియన్ డాలర్లని అంచనా. వెంచర్ క్యాపిటలిస్టులు ఈ రంగం 35–40 శాతం వార్షిక వృద్ధితో బిలియన్ డాలర్లకు చేరుతుందని ఊహిస్తూ అందుకు అనుగుణంగా పెట్టుబడులు పెడుతున్నారు. ఈ యాప్లు ప్రధానంగా సబ్ర్స్కిప్షన్లు,ఇన్–యాప్ కొనుగోళ్లు, పెట్ యాక్సెసరీస్ ద్వారా ఆదాయం పొందుతున్నాయి. భవిష్యత్తు ఎలా ఉంటుంది? వాయిస్ ఆధారిత ఇంటరాక్షన్, మల్టీప్లేయర్ ఫీచర్లు, వివిధ లొకేషన్లలో పెట్స్ను కలుసుకునే అవకాశాలతో ఈ రంగం మరింత విస్తరిస్తోంది. అయితే ఏఐ పెట్స్ టెక్నాలజీ నిజమైన మానవ సంబంధాల నుంచి మనుషులను దూరం చేస్తుందని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.టమాగోచ్చి నుంచి ఏఐ వరకువాస్తవానికి డిజిటల్ పెట్స్ కాన్సెప్ట్ కొత్తది కాదు. జపాన్లో 1990లలో వచి్చన టమాగోచ్చి వీడియో గేమ్ వర్చువల్ పెట్స్కు బాట వేసింది. ఆ తర్వాత 2000లలో టాకింగ్ టామ్, ఫ్రెండ్స్ యాప్స్, విడ్జెట్స్ వంటి అప్లికేషన్లు పాపులర్ అయ్యాయి. ఇప్పుడు ఏఐ టెక్నాలజీతో ఈ వర్చువల్ పెట్స్ మరింత అడ్వాన్స్డ్గా మారాయి. పాకెట్ పెట్, క్రిప్టో కిట్టీస్, జూమీ వంటి యాప్లు యూజర్లు తమ ఊహలకు అనుగుణంగా పెంపుడు జంతువులను సృష్టించుకునే అవకాశం ఇస్తున్నాయి. -
వాతావరణ విపత్తుల ధాటికి చెక్
భారత్లో పెరుగుతున్న వాతావరణ ముప్పులను ఎదుర్కోవడానికి, డేటా ఆధారంగా పట్టణాల రక్షణను మెరుగుపరచడానికి గాంధీనగర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కీలక ఆవిష్కరణ చేసింది. తన రీసెర్చ్ పార్క్లో కొత్తగా ఏర్పాటు చేసిన ఏఐ రెసిలియన్స్ అండ్ కమాండ్ (ఏఆర్సీ) సెంటర్ను విద్యావేత్తలు, ప్రభుత్వ ఉన్నతాధికారుల సమక్షంలో ఇటీవల ప్రారంభించింది.ఈ సెంటర్ ప్రధానంగా ‘రెయిన్-టు-రెసిలియన్స్’ (వర్షం నుంచి తట్టుకునే పరిస్థితులు) అనే ఫ్రేమ్వర్క్పై పనిచేస్తుంది. ఇది భౌతిక శాస్త్ర నమూనాలను కృత్రిమ మేధతో (ఏఐ) అనుసంధానిస్తుంది. దీని ద్వారా ఐఐటీ గాంధీనగర్ చెప్పిన అంశాల ప్రకారం.. నగరాల్లో వరదలను ముందే అంచనా వేయవచ్చు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలపై పడే ప్రభావాన్ని విశ్లేషించవచ్చు. విపత్తు సమయంలో నిర్ణయాలు తీసుకోవడంలో అధికారులకు వేగంగా సమాచారాన్ని అందించవచ్చు.అత్యాధునిక సాంకేతికతఈ కేంద్రంలో వినియోగిస్తున్న సాధనాలను ఐఐటీ గాంధీనగర్ ఇంక్యుబేటెడ్ డీప్-టెక్ స్టార్టప్ ‘AIResQ ClimSols’ అభివృద్ధి చేసింది. ఇవి వాతావరణ మార్పులకు సంబంధించిన సంక్లిష్ట పరిస్థితులకు అత్యంత వేగంగా స్పందించగలవు. విపత్తు జరగకపోయినా ‘ఒకవేళ ఇలా జరిగితే పరిస్థితి ఏంటి?’ అనే అత్యవసర అంశాలకు ప్రణాళికలను ముందే సిద్ధం చేసుకోవడానికి ఇవి ఎంతగానో దోహదపడతాయి.పట్టణాల్లో..ఐఐటీ గాంధీనగర్లోని మెషీన్ ఇంటెలిజెన్స్ అండ్ రెసిలియన్స్ (ఎంఐఆర్) ల్యాబ్ పరిశోధనల ఫలితంగా ఈ కేంద్రం ఏర్పాటైంది. నగరాల్లో నీటి ఎద్దడి లేదా వరదలు వంటి సవాళ్లను ఎదుర్కోవడంలో ఈ సాంకేతికత కీలకం కానుంది. కేవలం విపత్తు జరిగిన తర్వాత స్పందించడం కాకుండా ముందే ఊహించి నష్టాన్ని నివారించడం ఈ కేంద్రం ప్రధాన లక్ష్యం.సమన్వయంతో..ప్రభుత్వం, టెక్నాలజీ భాగస్వాములను ఒకే తాటిపైకి తీసుకురావడం ద్వారా పరిశోధనలను క్షేత్రస్థాయిలో ప్రజలకు ఉపయోగపడే సాధనాలుగా ఈ కేంద్రం మారుస్తోంది. ఇది భారతీయ నగరాలను మరింత సురక్షితంగా, వాతావరణ మార్పులను తట్టుకోగల సుస్థిర పట్టణాలుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించనుంది.ఇదీ చదవండి: సరికొత్త లుక్లో మార్కెట్లోకి కొత్త ఈవీ -
భారత టెక్ రంగానికి భారీ ఊతం
భారత దేశాన్ని గ్లోబల్ టెక్నాలజీ హబ్గా మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 2025లో ప్రకటించిన పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణ (ఆర్డీఐ) పథకం 2026-27 ఆర్థిక సంవత్సరంలో పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం ఏకంగా రూ.1 లక్ష కోట్ల నిధిని సిద్ధం చేస్తోంది.నిధుల కేటాయింపు.. పురోగతిగత బడ్జెట్లో ఈ పథకం కోసం రూ.20,000 కోట్లు కేటాయించినప్పటికీ సవరించిన అంచనాల ప్రకారం కేవలం రూ.3,000 కోట్లు మాత్రమే వినియోగంలోకి వచ్చాయి. అయితే తాజా బడ్జెట్లో ప్రభుత్వం రూ.20,000 కోట్లను మూలధన వ్యయం కింద కేటాయించింది. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంకి కేటాయించిన మొత్తం రూ.28,049 కోట్లలో అధిక భాగం ఈ పథకానికే దక్కడం విశేషం.ఈ పథకం అమలుకు సంబంధించి కొన్ని అంశాలు..అక్టోబర్ 11న ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ పథకానికి సంబంధించిన నిబంధనలు, పాలన నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ‘అనుసంధాన్’ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ కింద ప్రాథమికంగా నిధిని ఏర్పాటు చేశారు. సెకండ్ లెవల్ ఫండ్ మేనేజ్మెంట్(ఎస్ఎల్ఎఫ్ఎం) నియామక ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ (టీడీబీ), బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బైరాక్)లు ఇప్పటికే నామినేషన్ ప్రాతిపదికన మేనేజర్లుగా నియమితులయ్యాయి.పథకం ప్రధాన ఉద్దేశంప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని పెంపొందించడం ద్వారా డీప్-టెక్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే ఈ ఆర్డీఐ పథకం లక్ష్యం. ఈ విభాగంలోని కంపెనీలకు చాలా తక్కువ లేదా సున్నా వడ్డీతో దీర్ఘకాలిక రుణాలు అందిస్తారు. స్టార్టప్ల్లో నేరుగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. అయితే, ఈ పథకం ద్వారా గ్రాంట్లు లేదా స్వల్పకాలిక రుణాలు మంజూరు చేయరని గమనించాలి. ఈ పథకంలో భాగంగా నేషనల్ క్వాంటం మిషన్, సెమీకండక్టర్ ల్యాబ్ (మొహాలీ), ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ తయారీ, నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ వంటివాటికి నిధులు కేటాయించనున్నారు.సెమీకండక్టర్ రంగానికి బూస్ట్భారతదేశాన్ని సెమీకండక్టర్ తయారీ కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం రూ.8,000 కోట్లను ‘మోడిఫైడ్ ప్రోగ్రామ్ ఫర్ సెమీకండక్టర్స్’ కోసం కేటాయించింది. గతేడాది ఇది రూ.7,000 కోట్లుగా ఉంది. అయితే, భారీ ఎలక్ట్రానిక్స్ తయారీకి ఇచ్చే పీఎల్ఐ పథకానికి కేటాయింపులను రూ.8,885 కోట్ల నుంచి రూ.1,345 కోట్లకు తగ్గించడం గమనార్హం. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే 2026 నాటికి భారత టెక్, రీసెర్చ్ రంగం కొత్త పుంతలు తొక్కేందుకు సిద్ధంగా ఉందని అర్థమవుతోంది.ఇదీ చదవండి: సరికొత్త లుక్లో మార్కెట్లోకి కొత్త ఈవీ -
ఆన్లైన్లో అనకొండలున్నాయి
తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే... అంతర్జాలం కాస్తా మాయాజాలం అవుతుంది. డబ్బులు పోగొట్టుకోవడం నుంచి ప్రైవసీకి ముప్పు రావడం వరకు ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఇప్పుడు మన నిత్యావసరాల జాబితాలో ‘ఇంటర్నెట్’ భాగం అయింది. ఆ నెట్టింట ప్రయోజనాలూ, ఉపయోగాలతో పాటు మింగేసే అనకొండలు కూడా ఉన్నాయి. వాటి బారిన పడకుండా ఉండడం ఈరోజుల్లో సవాలుగా మారింది. ‘ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అన్ని విధాలుగా ఆలోచించాలి. తొందరపాటు కూడదు’ అనేది సేఫ్టీ ఇంటర్నెట్ తారకమంత్రం...గిబ్లీ స్టైల్ ఏఐ ఆర్ట్గిబ్లీ–స్టైల్ ఏఐ ఆర్ట్ మన ఫొటోలను చిత్రవిచిత్రమైన, యానిమీ–స్టైల్ చిత్రాలుగా మారుస్తుంది. సరదా సంగతి ఎలా ఉన్నా, ఈ గిబ్లీ–స్టైల్ ఆర్ట్ ట్రెండ్ అనేది ప్రైవసీ, డాటా సెక్యూరిటీకి సంబంధించి ముప్పు తెచ్చిపెడు తుందని చెబుతున్నారు టెక్ నిపుణులు. మరికొన్ని...ప్రైవసీ నైట్మేర్: గిబ్లీ–స్టైల్ ఆర్ట్లాంటి ఫీచర్లను అందించే కొన్ని యాప్లు, ప్లాట్ఫామ్లు యూజర్ల ముఖ కవళికలు, రకరకాల ఎక్స్ప్రెషన్స్కు సంబంధించిన చిత్రాలను సేకరించి స్టోర్ చేసి ప్రాసెస్ చేస్తున్నాయి. దీన్నే ప్రైవసీ నైట్మేర్ అంటున్నారు.డీప్ఫేక్: మహిళలు, పిల్లలు అప్లోడ్ చేసిన పర్సనల్ ఫొటోలు, సెల్ఫీలతో డీప్ఫేక్స్ సృష్టించే ప్రమాదం ఉంది. తెలియకుండానే ఓకే అనేస్తున్నారు: ఫ్యూచర్ మోడల్ ట్రైనింగ్కు సంబంధించి స్టోర్ చేయడానికి, విక్రయించడానికి ఏఐ డెవలపర్లు పర్సనల్ ఫొటోలను ఉపయోగిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన నిబంధనలను చాలామంది యూజర్లు తెలియకుండానే అంగీకరిస్తున్నారు!లైక్నెస్ ఎక్స్ప్లాయిటేషన్నిజమైన వ్యక్తి, ముఖ్యంగా మహిళల పోలికలను, ఏఐ జనరేటెడ్ క్యారెక్టర్స్లో మెర్జ్ చేస్తున్నారు. వీటిని హానికరమైన పనుల కోసం ఉపయోగించే ప్రమాదం ఉంది.తీసుకోవాల్సిన జాగ్రత్తలు→ ప్రైవసీ పాలసీకి సంబంధించి స్పష్టత లేని, అనుమానించే రీతిలో ఉన్న ఏఐ టూల్స్ను ఉపయోగించవద్దు.→ ప్రైవసీ పాలసీలను జాగ్రత్తగా చదవాలి. అప్లోడ్ చేసిన ఇమేజ్లను ఏఐ ప్లాట్ఫామ్లు ఎలా స్టోర్ చేస్తున్నాయి, ఎలా ఉపయోగిస్తున్నాయనేది లోతుగా అర్థం చేసుకోవాలి.→ దుర్వినియోగం చేయడానికి అవకాశం ఉండే సెన్సిటివ్, పర్సనల్ ఫొటోలను అప్లోడ్ చేయవద్దు.→ ఫొటోలను అప్లోడింగ్ చేసే ముందు లొకేషన్ డాటా, వ్యక్తిగత వివరాలు లేకుండా చూసుకోవాలి.→ ఏఐ అకౌంట్స్ ఆథెంటికేషన్ కోసం స్ట్రాంగ్ పాస్ వర్డ్స్ ఉపయోగించాలి.→ ఉచిత ఏఐ పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ అనుమతులు కోరితే వాటిని ఉపయోగించే విషయంలో పునరాలోచన చేయాలి.వాయిస్ క్లోనింగ్ స్కామ్ఒక తండ్రికి విదేశాల నుంచి ఫోన్ వచ్చింది. ఆయన కుమారుడు వికాస్ వేరే దేశంలో ఉద్యోగం చేస్తున్నాడు.‘ఒక కేసులో వికాస్ను అరెస్ట్ చేశాం. ఒకసారి మాట్లాడండి’ అన్నది అవతలి గొంతు.‘నాన్న... నేను చెప్పిన ఎకౌంట్కు అర్జంటుగా డబ్బు పంపించు. అలా చేయకపోతే జైల్లో ఉండాల్సి వస్తుంది’ భయం ఉట్టిపడే గొంతుకతో అన్నాడు వికాస్. అది తన కుమారుడి వాయిసే కాబట్టి ఆ పెద్దాయన వారు అడిగినన్ని డబ్బులు పంపాడు.ఆ తరువాత ఎప్పటికో వికాన్ నుంచి ఫోన్ రాగానే ఆత్రంగా ఫోన్ ఎత్తాడు...‘రిలీజ్ చేశారా? క్షేమంగా ఉన్నావా?’ అని ఆత్రంగా అడిగాడు.‘రిలీజ్ చేయడం ఏమిటి?’ అని షాకై పోయాడు వికాస్. జరిగినందంతా చెప్పాడు తండ్రి. తన వాయిస్ ఎవరో క్లోనింగ్ చేశారు అనే విషయం వికాస్కు అర్థమైంది. బ్లాక్మెయిల్ చేయడం నుంచి డబ్బులు డిమాండ్ చేయడం వరకు స్కామర్స్ వాయిస్ క్లోనింగ్ చేస్తున్నారు. దీన్ని ‘వాయిస్ క్లోనింగ్ స్కామ్’ అంటారు.జాగ్రత్తలు→ అనుమానించడానికి ఏమాత్రం టైమ్ ఇవ్వకుండా ‘మీ అమ్మాయి చాలా సీరియస్గా ఉంది’లాంటి మాటలు స్కామర్లు ఉపయోగిస్తారు. వెంటనే ఎమోషనల్ కాకుండా కాస్త ఆలోచించడం మంచిది.→ అపరిచిత ఫోన్లకు సంబంధించి ‘నిజమా? కాదా?’ అని నిర్ధారించుకోవడానికి కుటుంబ సభ్యులతో సీక్రెట్ పాస్వర్డ్ ఏర్పాటు చేసుకోవాలి. లేదా వారికి మాత్రమే జవాబు తెలిసిన కొన్ని ప్రశ్నలు అడగాలి.→ స్కామర్లు మీ వాయిస్ కాప్చర్ చేయకుండా ఉండడానికి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన వీడియోలను మీ సన్నిహితులు మాత్రమే చూసేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పరిమితులు విధించాలి.స్మిషింగ్ స్కామ్ బ్యాంకులు, ప్రభుత్వ సంస్థల పేర్లతో వ్యక్తిగత, ఆర్థిక, లాగిన్ సమాచారాన్ని దొంగిలించడానికి రూ పొందించిన మోసపూరిత టెక్ట్స్ మెసేజ్ను స్మిషింగ్ స్కామ్ అంటారు. ‘మీ ఎకౌంట్ను సస్పెండ్ చేస్తున్నాం’ అంటూ మెసేజ్ రావచ్చు. ‘డియర్ కస్టమర్’ పేరుతో వచ్చే మెసేజ్లో పెద్దగా వివరాలేమీ లేకపోవడం, అనుమానాస్పద మేసేజ్లు, ఊహించని రిక్వెస్ట్లు నోటిఫికేషన్ల రూపంలో రావడం.. మొదలైనవి స్మిషింగ్ స్కామ్లో భాగం.కొన్ని జాగ్రత్తలు→ తెలియని, అన్ఎక్స్పెక్టెడ్ మెసేజెస్ల నుంచి వచ్చిన లింక్లను క్లిక్ చేయకూడదు. అటాచ్మెంట్స్ను డౌన్లోడ్ చేయవద్దు → చట్టబద్ధమైన కంపెనీ లేదా బ్యాంకు నుండి వచ్చినట్లు ఏదైనా మెసేజ్ క్లెయిమ్ చేసుకుంటే, టెక్ట్స్లో ఉన్నవి కాకుండా వారి అధికారిక వెబ్సైట్ లేదా ఫోన్ నంబర్ ద్వారా వారిని నేరుగా సంప్రదించాలి.→ అనుమానంగా అనిపించిన మెసేజ్లను మీ సెల్యూలార్ ప్రొవైడర్కు, ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్(ఎఫ్సీసీ)కు రిపోర్ట్ చేయాలి.→ సెన్సిటివ్ ఎకౌంట్స్కు సంబంధించి మల్టీ–ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ (ఎంఎఫ్ఏ)ను ఎనేబుల్ చేయాలి.... ఇవి మాత్రమే కాదు, మ్యాట్రిమోనియల్ స్కామ్స్, విషింగ్ ఎటాక్స్, గేమింగ్ స్కామ్స్, ఆన్లైన్ డేటింగ్ ఫ్రాడ్స్... ఇలా ఎన్నో స్కామ్లు ఆన్లైన్లో పొంచి ఉన్నాయి. ‘నాకు అన్నీ తెలుసు. నన్ను ఎవరూ మోసం చేయలేరు’ అనే అతి ఆత్మవిశ్వాసంతో ఉంటే బాధితుల్లో మొదటి వరసలో మీరే ఉంటారు!అందుకే ఆన్లైన్కు సంబంధించి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఆపదలు దరిచేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రేమ కోసమై నెట్ (వల)లో పడెనే... పాపం...మన దేశంలో రొమాన్స్ స్కామ్లు అంతకంతకూ పెరుగుతున్నాయి. డేటింగ్ యాప్స్లో నకిలీ ప్రొఫైల్ను ఉపయోగిస్తున్నారు. డాక్టర్, మిలిటరీ ఆఫీసర్, సాఫ్ట్వేర్ కంపెనీ సీయీవో... ఇలా రకరకాల ప్రొఫైల్లను సృష్టిస్తున్నారు. ఈ ప్రొఫైల్ నిజమే అనుకొని ప్రేమ ప్రపంచంలోకి వచ్చిన వారిని, ప్రేమబంధం బలపడిన తరువాత ‘అర్జంటుగా అవసరం ఉంది డియర్’ అని (ఫేక్) ఎమర్జెన్సీల పేరుతో డబ్బు లాగుతున్నారు. ఇదొక రకం అయి™ó, సన్నిహితంగా ఉన్న ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేయడం అనేది మరో రకం. డేటింగ్ యాప్లలో 39 శాతం మంది యూజర్లు వివిధ రూపాల్లో రొమాన్స్ స్కామ్స్ బారిన పడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ స్కామ్ల బారిన పడిన బాధితులు డబ్బులు పోగొట్టుకోవడం మాత్రమే కాదు డిప్రెషన్ బారిన కూడా పడుతున్నారు. ఆత్మçహత్య ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని జాగ్రత్తలు... → పేరు నమోదు చేసుకునే ముందు డేటింగ్ యాప్ లేదా మ్యాట్రిమోనియల్ అథెంటిసిటీని ధ్రువీకరించుకోవాలి → నివాస చిరునామా, వ్యక్తిగత వివరాలను బహిర్గత పరచకపోవడం మంచిది → డేటింగ్ యాప్లో పరిచయం అయిన వారిని ప్రత్యక్షంగా కలుసుకొని తగిన ప్రశ్నలు అడగాలి → మ్యాట్రిమోనియల్ సైట్లలో ఎన్ఆర్ఐ ప్రొఫైల్స్కి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి → బ్యాంకింగ్ సమాచారం, గుర్తింపు లేదా పాస్పోర్ట్ కాపీలు, ముఖ్యమైన సమాచారం తెలియని సైట్లకు అందించవద్దు. -
33 ఏళ్ల క్రితం సాధారణ వెబ్ అడ్రస్గా రిజిస్టర్.. ఇప్పుడు రూ. 600 కోట్లు!
పేరులో నేముంది అని అనుకుంటే పొరపాటు. ఒక చిన్న పదం. కేవలం రెండే రెండక్షరాలు. కానీ దాని విలువ భారత కరెన్సీలో అక్షరాల 600 కోట్లు. ఆ రెండక్షరాల పదం ఏంటి? దానిని రూ.600కోట్లకు కొనుగోలు చేయాల్సిన అవసరం ఏంటి? దాని కథా కమా మిషు ఏంటో తెలుసుకుందాం పదండి.ఇంటర్నెట్లో డొమైన్ అడ్రస్ చాలా విలువైంది. వెబ్సైట్ డొమైన ట్రెండింగ్లో ఉన్నా డిమాండ్ ఉండే బిజినెస్కు చెందినదైనా దాని ధర కోట్లు పలుకుతుంది. ఎంత ధరపెట్టైనా సరే దాన్ని కొనుగోలు చేస్తారు. అలాంటి వెబ్సైట్ డొమైన్ కళ్లు చెదిరే ధరకు అమ్ముడుపోయింది. క్రిప్టో.కామ్ వ్యవస్థాపకుడు క్రిస్ మార్జాలెక్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ డొమైన్ ఏఐ డాట్ కామ్ను 70మిలియన్ డాలర్లు వెచ్చించి మరీ కొనుగోలు చేశారు. అంటే భారత కరెన్సీలో అక్షరాల రూ.600కోట్లు.ఇదే అత్యధికర ధర పలికిన డొమైన్లలో తొలి స్థానంలో నిలిచింది.ఏఐ ఇండస్ట్రీలో ప్రవేశించాలనుకున్నా క్రిప్టో.కామ్ సీఈవో క్రిస్ మార్జాలెక్ సూపర్ బౌల్ సమయంలో ఏఐ.కామ్ను అధికారికంగా లాంచ్ చేయనున్నారు. ఈ వెబ్సైట్లో ఏఐ పర్సనల్ అసిస్టెంట్ లాంచ్ కానుంది. ఈ ఏఐ అసిస్టెంట్ పర్సనల్ మెసేజ్లు పంపడంతో పాటు క్రిప్టో ట్రేడింగ్,యాప్స్ మేనేజ్ చేయడంతో పాటు ఇతర కార్యకలాపాల్ని చక్కబెడుతోంది. చాట్జీపీటీ రాకతో టెక్నాలజీ కొంతపుంతలు తొక్కుతోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం ఎప్పటి నుంచో ఉన్నా.. చాట్జీపీటీ రాకతో సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చింది. దీంతో ఏఐ వినియోగం రోజురోజుకి పెరిగిపోతుంది. ప్రతిరంగంలో ఏఐ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఈ తరుణంలో ఏఐ.కామ్ డొమైన్ను అంత భారీ మొత్తంలో వెచ్చించారు. భవిష్యత్ మొత్తం ఏఐదేనని,అన్నీ రంగాల్లో ఏఐ పెత్తనం చెలాయిస్తుందంటున్నారు.ఇది స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ అయినప్పటికీ రానున్న 20ఏళ్లలో పెట్టుబడులు అమాంతం పెరుగుతాయని క్రిస్ చెబుతున్నారు. ఏఐతో ప్రిమీయం డొమైన్లు బ్రాండింగ్ను పెంచుతాయని అంటున్నారు.2016లో క్రిస్.. క్రిప్టో.కామ్ను ప్రారంభించారు. అప్పటికే మార్కెట్లో క్రిప్టోఫ్లాట్ఫారమ్స్ ఉన్నాయి. అయినప్పటికీ కంపెనీ వేగంగా వృద్ధి సాధించింది. ప్రస్తుతం, ఏడాదికి 1.5బిలియన్ డాలర్ల ఆదాయం వస్తోంది. మార్కెటింగ్ బ్రాండింగ్పై భారీ ఇన్వెస్ట్ చేసింది.2021లో స్టేడియం బ్రాండింగ్పై సుమారు 700 మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. ట్రంప్ మీడియాతో బిజినెస్ డీల్స్ కూడా చేసింది. ఇవన్నీ గ్లోబుల్ బ్రాండింగ్ రికగ్నైజేషన్ను పెంచాయి. ఇప్పుడు ఏఐ.కామ్ కొనుగోలుతో సరికొత్త రికార్డులు సృష్టించారు క్రిస్ మార్స్జాలెక్.ఇక క్రిస్ మార్స్జాలెక్ ఏఐ.కామ్ డొమైన్ను మలేషియన్ టెక్ ఎంట్రప్రెన్యూర్ అర్స్యాన్ ఇస్మాయిల్ నుంచి కొనుగోలు చేశారు. ఈ డొమైన్ను ఇస్మాయిల్ 1993లో 100 డాలర్లు చెల్లించి రిజిస్టర్ చేసుకున్నారు. ఆ సమయంలో ఇది సాధారణ వెబ్ అడ్రస్ మాత్రమే. కానీ కాలక్రమేణా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రాధాన్యం పెరిగిన కొద్దీ, ఈ డొమైన్ విలువ ఆకాశాన్ని తాకింది.2025 ఏప్రిల్లో అర్స్యాన్ ఇస్మాయిల్ ఈ డొమైన్ను క్రిస్ మార్జాలెక్కి విక్రయించారు. ధర? అక్షరాల 70 మిలియన్ డాలర్లు.అంటే భారత కరెన్సీలో సుమారు రూ.600 కోట్లు. ఇది ఇప్పటివరకు పబ్లిక్గా వెల్లడైన అత్యధిక ధర పలికిన డొమైన్ ట్రాన్సాక్షన్గా గుర్తింపు పొందింది.ఒకప్పుడు 100 డాలర్ల విలువైన ఈ డిజిటల్ ఆస్తి 30 ఏళ్ల తర్వాత 70 మిలియన్ డాలర్లకు అమ్ముడవడం, ఇంటర్నెట్లో డొమైన్ల ప్రాధాన్యం ఎంత పెరిగిందో చూపించే అద్భుత ఉదాహరణ. ఏఐ భవిష్యత్తు అన్నీ రంగాల్లో ఆధిపత్యం చెలాయిస్తుందని భావిస్తున్న ఈ తరుణంలో ఏఐ.కామ్పై వంటి ప్రీమియం డొమైన్ను సొంతం చేసుకోవడం ఒక వ్యూహాత్మక పెట్టుబడిగా మారింది. ఇది కేవలం ఒక వెబ్ అడ్రస్ కాదు, భవిష్యత్ టెక్నాలజీకి ప్రతీకగా నిలిచే బ్రాండింగ్ ఆస్తి. -
వివో కీలక ప్రకటన.. త్వరలో మడత ఫోన్
ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని చాలా కంపెనీలు.. ఈ విభాగంలో కూడా తమ హవా కొనసాగించడానికి సిద్ధమవుతున్నాయి. ఈ జాబితాలో హానర్, ఒప్పో ముందు వరుసలో ఉన్నాయి. ఈ సంస్థల తరువాత షియోమి కూడా ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ చేయడానికి సిద్దమవుతోంది. కాగా వివో కూడా X ఫోల్డ్ 6 స్మార్ట్ఫోన్ను కూడా త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటించనుంది.వివో లాంచ్ చేయనున్న X ఫోల్డ్ 6 స్మార్ట్ఫోన్ 200-మెగాపిక్సెల్ కెమెరా & మల్టీ-స్పెక్ట్రల్ సెన్సార్తో రానుంది. ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న అన్ని ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ల కంటే ఇది బెస్ట్ కెమెరా ఫీచర్ కలిగి ఉంటుంది. కాగా కంపెనీ దీనికి సంబంధించిన చాలా విషయాలను వెల్లడించాల్సి ఉంది.వివో X ఫోల్డ్ 6 స్మార్ట్ఫోన్ మూడు వేరియంట్లలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మొదట దీనిని చైనా మార్కెట్లో లాంచ్ చేసిన తరువాత.. ఇతర దేశాల్లో కూడా లాంచ్ చేయనున్నారు. కాగా దీని ధరలు, లాంచ్ డేట్ వంటివి తెలియాల్సి ఉంది. అంతే కాకుండా ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ కూడా త్వరలోనే తెలుస్తాయి. -
యాపిల్ ఫోన్నూ మడతెట్టేయొచ్చు..?
శాంసంగ్, వివో, గూగుల్, వన్ ప్లస్ వంటి కంపెనీలన్నీ ఫోల్డబుల్ ఫోన్స్ లాంచ్ చేసి, విక్రయిస్తున్న తరుణంలో.. యాపిల్ కూడా ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ చేయడానికి సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఈ ఏడాది ఐఫోన్ 18 ప్రో & ప్రో మాక్స్ లాంచ్ సమయంలో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.ఇప్పుడు చాలామంది స్మార్ట్ఫోన్ వినియోదాగారులు ఫోల్డబుల్ ఫోన్స్ ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే యాపిల్ కూడా ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ చేయనున్నట్లు చెబుతున్నారు. అయితే.. ఈ విషయంపై కంపెనీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తల ప్రకారం.. ఐఫోన్ ఫోల్డ్ కోసం ఓఎల్ఈడీ డిస్ప్లేలను శాంసంగ్ ఉత్పత్తి చేయనుంది. ఎందుకంటే.. శాంసంగ్ అత్యుత్తమ ఫ్లెక్సిబుల్ డిస్ప్లే టెక్నాలజీ కలిగి ఉంది.ఐఫోన్ ఫోల్డ్ మార్కెట్లో లాంచ్ అయితే దీని ధర కూడా ఎక్కువగా (సుమారు 2399 డాలర్లు) ఉండే అవకాశం ఉందని ప్రముఖ రీసర్చ్ అనలిస్ట్ ఆర్థర్ లియావో పేర్కొన్నారు. ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్ పరంగా రెండు విధాలుగా ఉండవచ్చని అంచనా. ఒకటి బుక్ స్టైల్ ఫోల్డ్(ఫోన్ తెరిస్తే టాబ్లెట్ లాంటి పెద్ద స్క్రీన్), మరొకటి ఫ్లిప్-స్టైల్ ఫోల్డ్ (మడిచినప్పుడు చిన్నదిగా మారే డిజైన్).బ్యాటరీ విషయంలో.. పెద్ద స్క్రీన్కు సరిపడే విధంగా అధిక సామర్థ్యం గల బ్యాటరీతో పాటు, పవర్ ఎఫిషియెన్సీపై యాపిల్ ప్రత్యేక శ్రద్ధ పెట్టే అవకాశం ఉంది. అనుకున్న విధంగా ఐఫోన్ ఫోల్డ్ మార్కెట్లో లాంచ్ అయితే.. దీనికి కూడా మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉందని సమాచారం. -
జియో రూ.198 రీఛార్జ్ ప్లాన్: రోజుకు 2 జీబీ డేటా..
భారతదేశపు అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన రిలయన్స్ జియో.. తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త 5జీ రీఛార్జ్ ప్లాన్లను పరిచయం చేస్తూనే ఉంది. ఇందులో సరసమైన రీఛార్జ్ ప్లాన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.రూ.198 రీఛార్జ్ ప్లాన్ఇది రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం అందిస్తున్న సరసమైన రీఛార్జ్ ప్లాన్. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. రోజుకు 2జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు, అపరిమిత వాయిస్ కాలింగ్ వంటివి పొందవచ్చు. అయితే దీని వ్యాలిడిటీ కేవలం 14 రోజులు మాత్రమే.రూ.349 రీఛార్జ్ ప్లాన్ఈ ప్లాన్ ద్వారా రోజుకు 2 జీబీ హైస్పీడ్ డేటా పొందవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. దీని వ్యాలిడిటీ 28 రోజులు. జియో హాట్స్టార్, జియోసావన్ ప్రో సబ్స్క్రిప్షన్లతో పాటు.. మూడు నెలలు జొమాటో గోల్డ్ కూడా పొందవచ్చు. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి వాటికి యాక్సెస్ కూడా పొందవచ్చు.ఇదీ చదవండి: కొత్త రీఛార్జ్ ప్లాన్.. ఫిబ్రవరి 24 వరకే! -
ఏఐ రేసులో భారత్.. మూడేళ్లలో రూ.6 లక్షల కోట్లు!
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో ప్రపంచ దేశాల మధ్య పోటీ వేగంగా పెరుగుతున్న వేళ.. పెట్టుబడుల పరంగా భారత్ కూడా ఈ రేసులో ముందంజలోనే ఉందని వరల్డ్ ఎకనమిక్ ఫోరం వెల్లడించింది. 2010 నుంచి 2024 వరకు ఏఐలో అత్యధిక పెట్టుబడులు (జీడీపీలో శాతంగా లెక్కించినప్పుడు) పెట్టిన 11 దేశాల జాబితాలో భారత్కు 8వ స్థానం దక్కింది. మరోపక్క.. ఏఐ మనదేశ ఆర్థిక వ్యవస్థకు భారీ ఊతమివ్వనుందని పీడబ్ల్యూసీ ఇండియా తెలిపింది. 2035 నాటికి ఏఐ వల్ల దేశ జీడీపీలోకి సుమారు రూ.50 లక్షల కోట్లు అదనంగా చేరే అవకాశం ఉందని అంచనా వేసింది.ఇటీవల దావోస్లో.. ప్రముఖ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ బెయిన్ అండ్ కంపెనీతో కలిసి వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఓ శ్వేత పత్రం విడుదల చేసింది. దాని ప్రకారం.. 2010 నుంచి 2024 వరకు ఏఐలో పెట్టుబడుల పరంగా అమెరికా, సింగపూర్, దక్షిణ కొరియా, చైనా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఇదే సమయంలో.. భారత్లో ఏఐ పెట్టుబడులు జీడీపీలో 1.2 నుంచి 1.8 శాతం వరకు ఉన్నాయి. అమెరికాలో ఇది రికార్డు స్థాయిలో 3.4 నుంచి 5.1 శాతం, సింగపూర్లో 3.1 నుంచి 4.6 శాతం వరకు ఉంది.అమెరికా, చైనా దూకుడు2010–2024 మధ్య కాలంలో ఏఐ రంగంలో పెట్టుబడులు ఏడాదికి సగటున 33 శాతం చొప్పున పెరిగాయని శ్వేతపత్రం తెలిపింది. ఏఐ రంగం అత్యంత ఖరీదైనదనీ, భారీగా పెట్టుబడులు అవసరమైనప్పటికీ తక్షణ లాభాలపై స్పష్టత లేదని పేర్కొనడం విశేషం. కానీ, అమెరికా, చైనా ఈ రంగంలో భారీ పందాలు కాస్తున్నాయి. 2010 నుంచి ఇప్పటివరకు పెట్టిన మొత్తం ఏఐ పెట్టుబడుల్లో 65 శాతం ఈ రెండు దేశాలదే కావడమే అందుకు నిదర్శనం.మూడేళ్లలో రూ. 6 లక్షల కోట్లుభారత్లో వచ్చే మూడేళ్లలో రూ.6.14 లక్షల కోట్లకుపైగా ఏఐ పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చనున్నాయని వరల్డ్ ఎకనమిక్ ఫోరం అంచనా వేసింది. అలాగే ఏఐకి అవసరమైన అధునాతన చిప్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, హార్డ్వేర్ రంగంలో పెట్టుబడులు ఏటా 15 నుంచి 25 శాతం వరకు పెరిగే అవకాశముందని తెలిపింది.ఆర్థిక వ్యవస్థకూ ఊతంభారత్ ఆర్థిక వ్యవస్థకు ఏఐ భారీ ఊతమివ్వనుందని పీడబ్ల్యూసీ ఇండియా అంచనా వేసింది. 2035 నాటికి ఏఐ వల్ల దేశ జీడీపీలోకి రూ.50 లక్షల కోట్లకుపైగా అదనంగా వచ్చి చేరే అవకాశం ఉందని వెల్లడించింది. వ్యవసాయం, విద్య, ఇంధనం, ఆరోగ్యం, తయారీ రంగాల్లో ఏఐ వినియోగం వేగంగా పెరిగితే ఈ వృద్ధి సాధ్యమవుతుందని పేర్కొంది. 2050 నాటికి 160 కోట్ల జనాభాకు ఆహారం అందించాలంటే వ్యవసాయ ఉత్పత్తిని 70 శాతం వరకు పెంచాల్సి ఉంటుందని, దీనికి డిజిటల్ సాంకేతికతలు, ముఖ్యంగా ఏఐ అవసరమని పేర్కొంది. అలాగే విద్య, వైద్య రంగాల్లోనూ ఏఐ కీలకపాత్ర పోషించనుందని వివరించింది. -
ఆండ్రాయిడ్ యూజర్లకు హెచ్చరిక
ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 కోట్ల మంది ఆండ్రాయిడ్ వినియోగదారులకు గూగుల్ షాకింగ్ వార్తను అందించింది. ఆండ్రాయిడ్ 12 (Android 12) లేదా అంతకంటే పాత వెర్షన్లపై పనిచేస్తున్న స్మార్ట్ఫోన్లకు ఇకపై అధికారికంగా సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్లు అందవని ధ్రువీకరించింది. దీనివల్ల దాదాపు 42.1% ఆండ్రాయిడ్ ఫోన్లు సైబర్ దాడులు, మాల్వేర్, స్పైవేర్ బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అసలు సమస్య ఇదే!తాజా గణాంకాల ప్రకారం కేవలం 57.9% పరికరాలు మాత్రమే ఆండ్రాయిడ్ 13 లేదా అంతకంటే కొత్త వెర్షన్లను వాడుతున్నాయి. ఆండ్రాయిడ్ వ్యవస్థలోని ‘ఫ్రాగ్మెంటేషన్’ సమస్యే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. గూగుల్ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ను రూపొందించినప్పటికీ గూగుల్ పిక్సెల్ ఫోన్లు మినహా మిగిలిన కంపెనీలపై (శాంసంగ్, షావోమి, ఒప్పో, మోటరోలా మొదలైనవి) అప్డేట్ల విషయంలో గూగుల్కు పూర్తి నియంత్రణ ఉండదు. ఫోన్ తయారీదారులు తమ సొంత షెడ్యూల్స్ పాటిస్తూ కొన్ని సంవత్సరాల తర్వాత పాత మోడళ్లకు అప్డేట్లు నిలిపివేస్తున్నారు. యాపిల్ తన హార్డ్వేర్, సాఫ్ట్వేర్ రెండింటినీ నియంత్రిస్తుంది కాబట్టి, పాత ఐఫోన్లకు కూడా అప్డేట్లు వేగంగా అందుతాయి. ఉదాహరణకు ఐఓఎస్ 26 ఇప్పటికే 50% ఐఫోన్ల్లో నడుస్తుండగా ఆండ్రాయిడ్ లేటెస్ట్ వెర్షన్ కేవలం 7.5%ఫోన్లలో మాత్రమే ఉంది.ఏ వెర్షన్లు సురక్షితం? ఏవి కావు?ప్రస్తుతం సెక్యూరిటీ అప్డేట్లు పొందుతున్న, నిలిపివేసిన వెర్షన్ల జాబితా ఇక్కడ ఉంది.భద్రతా అప్డేట్ ఉన్నవిసాఫ్ట్వేర్ అప్డేట్ నిలిపేసినవిఆండ్రాయిడ్ 16ఆండ్రాయిడ్ 12ఆండ్రాయిడ్ 15ఆండ్రాయిడ్ 11ఆండ్రాయిడ్ 14ఆండ్రాయిడ్ 10ఆండ్రాయిడ్ 13ఆండ్రాయిడ్ 9, అంతకంటే పాతవి ముప్పులేమిటి?సెక్యూరిటీ అప్డేట్లు లేని ఫోన్ వాడటం అంటే తాళం లేని ఇంట్లో ఉండటమే. మాల్వేర్ దాడుల వల్ల కొన్ని నష్టాలు సంభవించవచ్చు.మీ యూజర్ నేమ్స్, పాస్వర్డ్ల చోరీ.బ్యాంకింగ్, ట్రేడింగ్ యాప్స్ హ్యాకింగ్.ఓటీపీ సందేశాలను అడ్డగించడం.మీ ఆర్థిక ఖాతాల నుంచి డబ్బు మాయం కావడం.గూగుల్ ప్లే ప్రొటెక్ట్ సరిపోదా?ఆండ్రాయిడ్ 7 నుంచి అన్ని వెర్షన్లలో ‘ప్లే ప్రొటెక్ట్’ రియల్ టైమ్ మాల్వేర్ స్కానింగ్ అందిస్తుందని గూగుల్ తెలిపింది. అయితే ఇది కేవలం యాప్స్ స్థాయిలోనే రక్షణ ఇస్తుంది. సిస్టమ్ స్థాయిలో ఉండే లోపాలను (Security Patches) ఇది సరిదిద్దలేదు. కాబట్టి పాత ఫోన్లు ప్రమాదంలో ఉన్నట్లేనని గమనించాలి.ఇప్పుడేం చేయాలి?మీ ఫోన్ సురక్షితంగా ఉందో లేదో తనిఖీ చేయండి.1. ఫోన్లో Settings ఓపెన్ చేయండి.2. తర్వాత About Phone కు వెళ్లండి.3. Android Versionను తనిఖీ చేయండి.ఒకవేళ మీ ఫోన్ ఆండ్రాయిడ్ 12 లేదా అంతకంటే పాతది అయితే దాన్ని అప్గ్రేడ్ చేయడం శ్రేయస్కరం. గూగుల్ సలహా ప్రకారం.. మీ ఫోన్ ఖరీదైన ఫ్లాగ్షిప్ ఫోన్ కానవసరం లేదు. కనీసం ఆండ్రాయిడ్ 13 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్ ఉన్న ఫోన్ కొనుగోలు చేసినా మీకు భద్రత లభిస్తుంది.ఇదీ చదవండి: ఎలాన్ మస్క్ ‘ఇడియట్ ఇండెక్స్’ -
ఎలాన్ మస్క్ ‘ఇడియట్ ఇండెక్స్’
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తన వినూత్న వ్యాపార శైలితో మరోసారి వార్తల్లో నిలిచారు. క్లిష్టమైన పరిశ్రమలను సైతం అత్యంత వేగంగా, తక్కువ ఖర్చుతో నిర్వహించవచ్చని ఆయన నిరూపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రాచుర్యంలోకి తెచ్చిన ‘ఇడియట్ ఇండెక్స్’ అనే భావన ఇప్పుడు పారిశ్రామిక వర్గాల్లో చర్చనీయాంశమైంది.ఏమిటీ ఇడియట్ ఇండెక్స్?ఇది అధికారిక ఆర్థిక గణాంకం కానప్పటికీ మస్క్ కంపెనీలైన టెస్లా, స్పేస్ ఎక్స్ పనితీరును నిర్దేశించే ఒక అనధికారిక కొలమానం. దీని ప్రకారం.. ఒక ఉత్పత్తిని తయారు చేయడానికి అయ్యే ముడి పదార్థాల మొత్తం ధర, ఆ ఉత్పత్తి విక్రయించే తుది ధర మధ్య వ్యత్యాసాన్నే మస్క్ ‘ఇడియట్ ఇండెక్స్’ అని పిలుస్తారు. ఉదాహరణకు ఒక యంత్రం తయారీకి వాడే ఉక్కు, అల్యూమినియం ఖర్చు చాలా తక్కువగా ఉండి తుది యంత్రం ధర విపరీతంగా ఎక్కువగా ఉంటే ఆ మధ్యలో ఉన్న వ్యత్యాసం వ్యవస్థలోని అసమర్థతను సూచిస్తుందని మస్క్ వాదిస్తున్నారు. ఇంజినీరింగ్ క్లిష్టత లేదా భద్రతా కారణాలు లేకుండా ఈ వ్యత్యాసం ఎక్కువగా ఉంటే అక్కడ వ్యవస్థలో లోపం ఉందని లేదా కాలం చెల్లిన పద్ధతులు వాడుతున్నారని ఆయన నమ్ముతున్నట్లు చెప్పారు.స్పేస్ ఎక్స్, ఎక్స్ఏఐ విలీనం2026 ప్రారంభంలో మస్క్ తీసుకున్న ఒక సంచలన నిర్ణయం వ్యాపార రంగంలో మైలురాయిగా నిలిచింది. తన కృత్రిమ మేధ సంస్థ ఎక్స్ఏఐని అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్ ఎక్స్లో విలీనం చేయడం ద్వారా ఆయన సాంకేతిక సమగ్రతను కొత్త స్థాయికి తీసుకెళ్లారు.ఈ విలీనం వెనుక కారణాలుఏఐ శిక్షణకు అవసరమైన భారీ విద్యుత్, డేటా కేంద్రాల నిర్వహణకు స్పేస్ ఎక్స్ స్టార్లింక్ నెట్వర్క్ తోడ్పడుతుంది.ఏఐ ఇంజినీర్లు, రాకెట్ శాస్త్రవేత్తలు ఒకే గొడుగు కింద పనిచేయడం వల్ల సంస్థాగత జాప్యం తగ్గుతుంది.బాహ్య సరఫరాదారులపై ఆధారపడకుండా ఏఐ నుంచి రాకెట్ తయారీ వరకు అంతా అంతర్గతంగానే నిర్వహించేందుకు వీలవుతుంది.విమర్శలు, వాస్తవాలుమస్క్ పద్ధతులు ఎంత విజయవంతమైనా అవి విమర్శలకు అతీతం కాదు. ఉద్యోగులపై విపరీతమైన పని ఒత్తిడి, కఠినమైన టార్గెట్లు వంటి అంశాలపై మాజీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఫలితాల పరంగా చూస్తే స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్లు, టెస్లా గిగాఫ్యాక్టరీలు పారిశ్రామిక రంగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పాయనడంలో సందేహం లేదు. మొత్తానికి ‘ఇడియట్ ఇండెక్స్’ ద్వారా అసమర్థతను తొలగించి వేగమే ప్రధానంగా మస్క్ తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నట్లు తెలుస్తుంది. 2026 నాటి ఈ పరిణామాలు భవిష్యత్తులో సాంకేతిక రంగం ఏ దిశగా వెళ్తుందో సూచిస్తున్నాయి.ఇదీ చదవండి: కియోసాకీకి కోపమొచ్చింది! -
కాగ్నిజెంట్ ఉద్యోగులకు బొనాంజా.. 100% బోనస్
సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం కాగ్నిజెంట్ తన ఉద్యోగులకు 100 శాతం భారీ బోనస్ ప్రకటించింది. 2025లో అంచనాలను మించి ఆదాయ ఫలితాలను సాధించిన తరువాత ఈ బంపర్ బొనాంజా ప్రకటించింది. దీంతో ఉద్యోగుల్లో ఆనందోత్సాహం నిండింది.కాగ్నిజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) రవి కుమార్ ఎస్ గత కొన్నేళ్లుగా "విజేత సర్కిల్"లోకి ప్రవేశించాలనే సంస్థ లక్ష్యం గురించి చాలాసార్లు మాట్లాడారు. ఫలితాల విడుదల సందర్భంగా 2025లో పటిష్ట పనితీరుకు కారణమైన 3.5 లక్షలమంది సిబ్బందిని సీఈవో ప్రశంసించారు. నాస్డాక్ లిస్టెడ్ కంపెనీ దేశీయంగా భారీ స్థాయిలో ఉద్యోగులను కలిగి ఉన్న విషయం విదితమే. డిసెంబర్31కల్లా కంపెనీ సిబ్బంది సంఖ్య 14,800 పెరిగి 3.51 లక్షలకు చేరింది.లాభం జూమ్కాగ్నిజెంట్ గత ఆర్థిక సంవత్సరం(2025) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 19 శాతం జంప్చేసి 64.8 కోట్ల డాలర్లను తాకింది. అంతక్రితం ఏడాది(2024) ఇదే కాలంలో కేవలం 54.6 కోట్ల డాలర్లు ఆర్జించింది. కంపెనీ కేలండర్ ఏడాదిని ఆర్థిక సంవత్సరంగా పరిగణించే సంగతి తెలిసిందే. మొత్తం ఆదాయం సైతం 5 శాతం ఎగసి 533.3 కోట్ల డాలర్లకు చేరింది. అంతక్రితం క్యూ4లో 508.2 కోట్ల డాలర్ల టర్నోవర్ అందుకుంది. ఈ కాలంలో 12 భారీ డీల్స్ కుదుర్చుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. కాగా.. డిసెంబర్తో ముగిసిన పూర్తిఏడాది(2025)కి ఆదాయం 7 శాతం వృద్ధితో 21.1 బిలియన్ డాలర్లను తాకింది.ఆదాయ అంచనాలు గుడ్ ప్రస్తుత ఏడాది(2026)కి కాగ్నిజెంట్ 5–7.4 శాతం అధికంగా 22.14–22.66 బిలియన్ డాలర్ల ఆదాయ అంచనాలు(గైడెన్స్) ప్రకటించింది. ఈ బాటలో తొలి క్వార్టర్(జనవరి–మార్చి)కు 5.36–5.44 బిలియన్ డాలర్ల ఆదాయం ఆశిస్తున్నట్లు తెలియజేసింది. 2.7–4.2 శాతం వృద్ధి అంచనాలివి. -
ఓపెన్ ఏఐ మరో షాక్.. ఇక స్మార్ట్ ఫోన్లకు చెక్!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) తన నూతన ఆవిష్కరణలతో ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా దూసుకుపోతోంది. ఇప్పటివరకూ సాఫ్ట్వేర్ వరకే పరిమితమైందనుకుంటున్న ఓపెన్ ఏఐ ఇప్పుడు హార్డ్వేర్ రంగంలోకీ గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. ‘డైమ్’ (Dime) అనే కోడ్ నేమ్తో కంపెనీ తన మొట్టమొదటి హార్డ్వేర్ ఉత్పత్తిగా ఏఐ ఆధారిత ఇయర్బడ్స్ను తీసుకురానున్నట్లు ‘మింట్’తన కథనంలో పేర్కొంది.‘డైమ్’ ఇయర్ బడ్స్ కేవలం సంగీతం వినడానికే పరిమితం కాకుండా, వాయిస్ కమాండ్స్ ద్వారా ఏఐ మోడళ్లను నియంత్రించేలా, హ్యాండ్స్-ఫ్రీ అసిస్టెన్స్ను అందించేలా రూపొందించారు. ఈ ఏడాది చివరిలో వీటిని ప్రపంచానికి పరిచయం చేసి, 2027 ప్రారంభంలో మార్కెట్లోకి వీటిని విడుదల చేసే అవకాశం ఉంది. ‘స్మార్ట్ పికాచు’ అందించిన సమాచారం ప్రకారం చైనాలో ఇటీవల దాఖలైన ఒక పేటెంట్ ఫైలింగ్లో ‘డైమ్’ అనే పేరు వెలుగులోకి వచ్చింది.భారీ స్థాయిలో హార్డ్వేర్ పరికరాలను నేరుగా మార్కెట్లోకి తెచ్చే కంటే, వినియోగదారులకు అందుబాటులో ఉండేలా ఇయర్బడ్స్ లాంటి సాధారణ పరికరంతో రంగప్రవేశం చేయాలని ఓపెన్ ఏఐ భావిస్తోంది. తక్కువ ఖర్చుతో సాంకేతిక ఇబ్బందులు లేకుండా హార్డ్వేర్ మార్కెట్ను చేజిక్కించుకోవడమే కంపెనీ వ్యూహమని తెలుస్తోంది. ఇవి వాయిస్ ఇంటరాక్షన్లపై దృష్టి సారిస్తూ, వినియోగదారులకు రియల్ టైమ్ ఏఐ సేవలను నేరుగా చెవి దగ్గరికే చేర్చనున్నాయి.గతంలో ఓపెన్ ఏఐ స్మార్ట్ఫోన్ తరహాలో ఉండే శక్తివంతమైన ఏఐ డివైజ్ను తీసుకువస్తుందనే ప్రచారం జరిగింది. అయితే హై బ్యాండ్విడ్త్ మెమరీ (హెచ్బీఎం)కొరత కారణంగా విడిభాగాల ధరలు విపరీతంగా పెరగడంతో ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం వాయిదా పడినట్లు సమాచారం. తయారీ వ్యయం కారణంగా కంపెనీ ప్రస్తుతానికి తన నిర్ణయాన్ని మార్చుకుని, 2026లో సరళమైన వెర్షన్ (డైమ్ ఇయర్బడ్స్)ను లాంచ్ చేయాలని నిశ్చయించుకుందని సమాచారం.ఓపెన్ ఏఐ చీఫ్ గ్లోబల్ అఫైర్స్ ఆఫీసర్ క్రిస్ లెహనే గతంలోనే కంపెనీ తొలి హార్డ్వేర్ ఉత్పత్తిపై పనిచేస్తున్నట్లు ప్రకటించారు. అయితే అప్పట్లో దాని ఆకారం లేదా ఫీచర్ల గురించి ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ ఏడాదిలోనే ఆ పరికరాన్ని ఆవిష్కరిస్తామని ఆయన పేర్కొన్నప్పటికీ, లాంచ్ తేదీని వెల్లడించలేదు. ప్రస్తుతం ‘డైమ్’ బ్రాండింగ్తో వస్తున్న ఇయర్బడ్స్ వార్తలపై ఓపెన్ ఏఐ ఇంకా స్పందించాల్సి ఉంది. ఆపిల్ మాజీ డిజైన్ హెడ్ జోనీ ఐవ్ నేతృత్వంలో ఈ నూతన పరికరాలు రూపుదిద్దుకుంటున్నాయనే వార్తలు టెక్ ప్రపంచంలో సంచలనంగా మారాయి. కాగా డైమ్ ఇయర్బడ్స్ అందుబాటులోకి వస్తే, అవి స్మార్ట్ ఫోన్ల వినియోగానికి చెక్ పెట్టనున్నాయనే వాదన వినిపిస్తోంది.ఇది కూడా చదవండి: ‘వాషింగ్టన్ పోస్ట్’లో మరో సంచలనం.. ఇప్పుడు సీఈఓ వంతు.. -
ఏఐతో టెక్ సర్వీసుల్లో సరికొత్త మార్పులు
న్యూఢిల్లీ: అధునాతన కృత్రిమ మేథ (ఏఐ) రాకతో దేశీ టెక్నాలజీ సరీ్వసుల రంగంలో విపత్కర పరిణామాలు ఉంటాయన్న ఆందోళనలను ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ తోసిపుచ్చింది. ఇది పరిశ్రమను సరికొత్తగా తీర్చిదిద్దుతుందని పేర్కొంది. దేశీ ఐటీ కంపెనీలు సంక్లిష్టమైన టెక్నాలజీలపై అంతర్జాతీయ సంస్థలతో కలిసి పని చేస్తుంటాయని వివరించింది.ఏఐ నుంచి సిసలైన ప్రయోజనాలు పొందాలంటే మనుషులతో కూడా సమన్వయం చేసుకోవడం కీలకంగా ఉంటుందని తెలిపింది. వారికి పరిశ్రమపైన, నిర్దిష్ట వ్యాపారాలపైన లోతైన అవగాహన అవసరమని నాస్కామ్ పేర్కొంది. ఏఐని ప్రయోగాత్మకంగా పరీక్షించడం నుంచి భారీ స్థాయిలో వినియోగంలోకి తేవడం వైపు మళ్లించడంలో టెక్నాలజీ సేవల సంస్థలు తోడ్పడతాయని వివరించింది. -
రిలయన్స్ జియో రూ. 1,984 కోట్లు బాకీ..
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం (2024–25) నాటికి టెలికం కంపెనీలు సవరించిన స్థూల రాబడిపరంగా (ఏజీఆర్) ప్రభుత్వానికి కట్టాల్సిన బాకీలు రూ. 1.77 లక్షల కోట్లకు చేరాయి. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపయిన వొడాఫోన్ ఐడియా రూ. 89,952 కోట్లు, భారతి గ్రూప్ రూ. 51,091 కోట్లు, టాటా గ్రూప్ రూ. 20,426 కోట్లు, ఎంటీఎన్ఎల్ రూ. 14,462 కోట్లు, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ రూ. 1,984 కోట్లు కట్టాల్సి ఉంది.పార్లమెంటుకు సమర్పించిన అధికారిక డేటాలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వొడాఫోన్ ఐడియా కేసులో 2006–2018 ఆర్థిక సంవత్సరాల మధ్యకాలంలో కట్టాల్సిన బాకీలను రూ. 87,695 కోట్ల స్థాయికి పరిమితం చేసి, చెల్లించేందుకు మరింత గడువును ఇచ్చిన సంగతి తెలిసిందే. -
కొత్త రీఛార్జ్ ప్లాన్.. ఫిబ్రవరి 24 వరకే!
ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్-ఐడియా వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ఓ కొత్త ఆఫర్ తీసుకొచ్చింది. ఈ లేటెస్ట్ ఆఫర్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.దేశ్ కా నెట్వర్క్, దేశ్ కా భరోసా అంటూ.. బీఎస్ఎన్ఎల్ ఏడాది ప్లాన్ తీసుకొచ్చింది. 2,626 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే.. 365 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది. రోజుకు 2.6 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు పొందవచ్చు. అపరిమిత కాల్స్ యధావిధిగా లభిస్తాయి. అయితే ఈ ఆఫర్ కేవలం ఫిబ్రవరి 24 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని సంస్థ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.Desh ka network, Desh ka bharosa. BSNL Bharat Connect 26 PlanEnjoy 2.6GB data/day, unlimited calls, 100 SMS/day & 365 days validity all at just ₹2626.That’s why millions trust BSNL Bharat Connect 26 Plan.Recharge smart via #BReX 👉 https://t.co/41wNbHpQ5c Offer valid… pic.twitter.com/cmJE1pTXxR— BSNL India (@BSNLCorporate) February 7, 2026 -
భయంకరమైన భవిష్యత్తు! రానున్నది ‘ఆకలి రాజ్యం’మేనా?
వైట్ కాలర్ ఉద్యోగాలకు గడ్డుకాలం మొదలైందా? రానున్నది ‘ఆకలి రాజ్యం’మేనా? విజృంభిస్తున్న ‘ఏఐ(AI) మహమ్మారి’ మానవ ఉద్యోగాలను మింగేస్తోందన్న భయాలు నిజమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఐటీ దిగ్గజాలను సైతం వణికిస్తున్న ‘ఆంథ్రోపిక్’ సీఈవో డారియో అమోడేయి చేసిన తాజా హెచ్చరికలు ఉద్యోగ మార్కెట్ భవిష్యత్తుపై భయాన్ని రేకెత్తిస్తున్నాయి.ఉద్యోగ అవకాశాల్లో తీవ్ర పతనంఅమోడేయి వ్యాఖ్యల తర్వాత విడుదలైన యూఎస్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ తాజా గణాంకాలు ఆయన అంచనాలకు అనూహ్యంగా సరిపోలడం ఆందోళనలను మరింత పెంచుతున్నాయి. తాజా లేబర్ డేటా ప్రకారం.. గత డిసెంబర్ ఆఖరు నాటికి అమెరికాలో ఉద్యోగ ఖాళీలు 65.4 లక్షలకు పడిపోయాయి. 2020 సెప్టెంబర్ తర్వాత ఇదే అత్యల్ప స్థాయి కావడం గమనార్హం.ఏఐ వల్ల భారీ ఉద్యోగ నష్టంజనవరి చివరలో అమోడేయి “ది అడోలెసెన్స్ ఆఫ్ టెక్నాలజీ” అనే పేరుతో సుమారు 20,000 పదాల సుదీర్ఘ వ్యాసాన్ని ప్రచురించారు. అందులో ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు ఇవీ..“రాబోయే 1–5 సంవత్సరాల్లో ఏఐ వల్ల ఎంట్రీ-లెవల్ వైట్ కాలర్ ఉద్యోగాల్లో 50 శాతం వరకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. అంతేకాదు, 1–2 సంవత్సరాల్లో మనుషుల కంటే ఎక్కువ సామర్థ్యం గల ఏఐ కూడా సాధ్యమే”2021లో ఆంథ్రోపిక్ను సహ-వ్యవస్థాపకుడిగా స్థాపించిన అమోడేయి, ఏఐ అభివృద్ధి వేగం కారణంగా లేబర్ మార్కెట్లో ‘అసాధారణ, బాధాకరమైన షాక్’ తప్పదని హెచ్చరించారు.“ఏఐ పురోగతి వేగం గతంలో వచ్చిన ఇతర సాంకేతిక విప్లవాల కన్నా వేగంగా ఉంది. ఉద్యోగం చేసే విధానం మారడమే కాదు, కొత్త ఉద్యోగాలకు మారాల్సిన అవసరం కూడా ప్రజలకు తీవ్ర సవాల్గా మారుతుంది”ఏఐ ఏదో ఒక్క ఉద్యోగాన్ని భర్తీ చేయడం కాదు.. ‘మానవ కార్మిక శక్తికే ప్రత్యామ్నాయం’గా మారుతోంది’ అని ఆయన స్పష్టం చేశారు. న్యాయ శాఖ, ఫైనాన్స్, కన్సల్టింగ్ వంటి రంగాలు కూడా దీని ప్రభావానికి లోనవుతాయని హెచ్చరించారు.తరువాత ఎన్బీసీ న్యూస్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలోనూ, ఉద్యోగ మార్కెట్పై ఏఐ ప్రభావం తీవ్రంగానే ఉంటుందని ఆయన తన అభిప్రాయాన్ని పునరుద్ఘాటించారు.నియామకాలు కనిష్టానికి.. తొగింపులు గరిష్టానికి..ఈ వారం విడుదలైన తాజా డేటా, కోవిడ్-19 మహమ్మారి తర్వాత ఉద్యోగ మార్కెట్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభాన్ని సూచిస్తోంది. 2025 డిసెంబర్ చివరి నాటికి ఉద్యోగ ఖాళీలు మళ్లీ 65.4 లక్షలకే పరిమితమయ్యాయి. అదే రోజు విడుదలైన ‘ఛాలెంజర్, గ్రే & క్రిస్మస్’ నివేదిక ప్రకారం.. జనవరిలో యూఎస్ కంపెనీలు కేవలం 5,306 నియామక ప్రణాళికలను మాత్రమే ప్రకటించారు. 2009 నుంచి డేటా సేకరణ ప్రారంభించిన తర్వాత ఇదే అత్యల్ప సంఖ్య.ఇదిలా ఉండగా, జనవరి 31తో ముగిసిన వారంలో 2.31 లక్షల మంది తాము నిరుద్యోగులుగా ఉన్నట్లు క్లెయిమ్ చేశారు. ఇది గత వారంతో పోలిస్తే 22,000 పెరుగుదల. అమెజాన్, యూపీఎస్ వంటి సంస్థలు ప్రకటించిన భారీ తొలగింపులు ఈ జనవరిని గ్రేట్ రిసెషన్ తర్వాత మళ్లీ అంత చెత్త నెలగా మార్చాయని ఛాలెంజర్ నివేదిక పేర్కొంది.నెలవారీ గణాంకాల ప్రకారం.. జనవరిలో యూఎస్ కంపెనీలు 1,08,435 ఉద్యోగ కోతలను ప్రకటించాయి. ఇది డిసెంబర్తో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ కాగా, 2025 జనవరితో పోలిస్తే రెండింతలకుపైగా ఉంది. ఈ తొలగింపుల్లో అమెజాన్, యూపీఎస్ సంస్థల వాటా 40 శాతం. రవాణా, టెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ, రసాయనాలు, ఆర్థిక రంగాల్లో ఈ కోతలు ఎక్కువగా నమోదయ్యాయి.ఏఐ పాత్ర ఎంతవరకు?ఏఐ కారణంగా నేరుగా 7,624 ఉద్యోగ కోతలు జరిగినట్లు నివేదిక పేర్కొంది. అయితే, “తొలగింపులపై ఏఐ ప్రభావం ఎంతవరకు ఉందో ఖచ్చితంగా చెప్పడం కష్టం” అని ‘ఛాలెంజర్, గ్రే & క్రిస్మస్’ ఛీఫ్ రెవెన్యూ ఆఫీసర్ ఆండీ ఛాలెంజర్ చెప్పారు. అయినా, చాలా సంస్థలు ఏఐ అమలుపై దృష్టి పెడుతున్నాయని, మార్కెట్ కూడా ఏఐని ప్రస్తావించే కంపెనీలను ప్రోత్సహిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
‘ఐటీ వాళ్లు వేరే పని వెతుక్కోవాల్సిందే’
ఐటీ ఉద్యోగుల భవిష్యత్తుపై ఆన్లైన్లో కొత్త చర్చను రేకిత్తించారు జోహో కోఫౌండర్ శ్రీధర్ వెంబు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడళ్లు కోడ్ రాయడంలో వేగంగా పురోగతి సాధిస్తున్న నేపథ్యంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ల పాత్రపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.ఒక్క లైన్ కోడ్ కూడా రాయకుండా ఏఐ సహాయంతో భగవద్గీత యాప్ను అభివృద్ధి చేసిన విషయంపై ‘ఎక్స్’ (ట్విట్టర్)లో వచ్చిన ఒక పోస్ట్కు స్పందించిన వెంబు, “కోడ్ రాయడంపై ఆధారపడి బతుకుతున్నవారు ప్రత్యామ్నాయ జీవనోపాధుల గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది” అని అన్నారు. ఇది తనకు కూడా వర్తిస్తుందన్న ఆయన, ఇది భయాందోళనలతో కాకుండా ప్రశాంతంగా అంగీకరించాల్సిన వాస్తవమని పేర్కొన్నారు.“ఆ పోస్ట్లో చెప్పింది కేవలం భగవద్గీత యాప్ మాత్రమే కాదు. ఆంథ్రోరోపిక్ (Anthropic) సంస్థ వారి క్లాడ్ ఏఐ (Claude AI)తో మొత్తం సీ కంపైలర్ను నిర్మించింది. ఇదేదో చిన్న ఇంజినీరింగ్ ఫీట్ కాదు” అని వెంబు రాసుకొచ్చారు.ప్రపంచం వేగంగా మారుతున్న నేపథ్యంలో, ఏఐ విప్లవం భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థను ఎలా రూపుదిద్దుతుందన్న విషయంపై గూగుల్ జెమినీ చాట్బాట్తో తాను లోతైన చర్చ నిర్వహించానని వెంబు వెల్లడించారు. ఆ సంభాషణలో, కార్మికుల అవసరం తగ్గిన తర్వాతి ఆర్థిక వ్యవస్థ (post-labor economy)లో సమాజం ఎలా అభివృద్ధి చెందగలదో చర్చించడమే కాకుండా, ఏఐ తన సొంత సమాధానాలను కూడా విమర్శించవచ్చంటూ సవాలు చేసినట్లు చెప్పారు.ఈ సంభాషణల ఆధారంగా, భవిష్యత్తు రెండు విధాలుగా ఉండవచ్చని వెంబు అభిప్రాయపడ్డారు. ఏఐపై యాజమాన్యం ఎవరి చేతిలో ఉంటుందన్నదే కీలకమని పేర్కొంటూ టెక్నాలజీ మానవ జీవితంలో ఒక చిన్న భాగంగా మాత్రమే ఉండి, మనుషులకు కుటుంబం, ప్రకృతి, కళ, సంగీతం, సంస్కృతి, క్రీడలు, పండుగలు, విశ్వాసంపై ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఇస్తుందని ఆశావాద దృక్కోణంలో చెప్పుకొచ్చారు. ఇక నిరాశావాద దృక్కోణంలో.. ఈ టెక్నాలజీ ‘కేంద్రీకృత నియంత్రణ’కు దారి తీస్తుందని హెచ్చరించారు.శ్రీధర్ వెంబు చేసిన ఈ వ్యాఖ్యలు వెంటనే వైరల్గా మారాయి. సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది వెంబు అంచనాలతో ఏకీభవించగా, మరికొందరు విభేదిస్తూ ఏఐ కోడింగ్ మానవ మేధస్సుకు ముగింపు కాదని వాదించారు.Examples are now pouring in about AI-assisted Code Engineering productivity. The quoted post is a Bhagwad Gita app. Anthropic has built an entire C compiler with their Claude AI. That is not an easy engineering feat at all.At this point, it is best for those of us who… https://t.co/KbgVX8G9nU— Sridhar Vembu (@svembu) February 6, 2026 -
రీల్స్ మాయలో బాల్యం బందీ
పిల్లలు రీల్స్, షార్ట్ వీడియోలకు అడిక్ట్ అవడం అనేది ప్రస్తుతం తల్లిదండ్రులను వేధిస్తున్న అతిపెద్ద సమస్య. ఇది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు, వారి మెదడు పనితీరును కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఏకాగ్రత సమయం తగ్గిపోవడంరీల్స్ వల్ల కలిగే అత్యంత ఆందోళనకరమైన అంశం ఏమిటంటే.. ఏకాగ్రత సమయం తగ్గడం. సాధారణంగా మనిషి సగటు ఏకాగ్రత సమయం సుమారు 12 సెకన్ల వరకు ఉంటుంది. కానీ రీల్స్, షార్ట్ వీడియోలు చూసే వారిలో అది 8 సెకన్ల కంటే తక్కువకు పడిపోయిందని పరిశోధనలు చెబుతున్నాయి. కేవలం 15–30 సెకన్ల వీడియోలకే అలవాటు పడటం వల్ల, ఏదైనా ఒక విషయం గురించి లోతుగా ఆలోచించడం, కష్టమైన సమస్యను పరిష్కరించడం మెదడుకు భారంగా అనిపిస్తుంది.సహనం నశించడంనిజ జీవితంలో పనులు నెమ్మదిగా జరుగుతాయి. కానీ రీల్స్ ప్రపంచంలో అన్నీ వేగంగా జరిగిపోతాయి. దీనివల్ల పిల్లల్లో విపరీతమైన చిరాకు, అసహనం కలుగుతాయి. ఫోన్ నిరంతరం వేగవంతమైన సమాచారాన్ని అందించడం వల్ల మెదడు కేవలం తక్షణ వినోదం కోసం మాత్రమే ఎదురు చూసేలా మారిపోతుంది. కష్టపడి సాధించే ఫలితం కంటే, వెంటనే వచ్చే వినోదాన్ని కోరుకుంటారు.స్పీచింగ్ థెరపీ సెంటర్లకు డిమాండ్రీల్స్, వీడియోలు చూసే పిల్లల్లో మాటలు ఆలస్యంగా వస్తున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మధ్యకాలంలో సంవత్సరాలు పెరుగుతున్నా తమ పిల్లలకు మాటలు రావడం లేదంటూ స్పీచ్ థెరపీ సెంటర్లకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. రీల్స్ చూసే పిల్లలు .. ఇంట్లో వారితో మాట్లాడే ప్రయత్నం కంటే స్క్రీన్ను చూడటానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.ఆందోళన, నిరాశఇతరుల జీవితాలను రీల్స్లో చూసి, తమ జీవితాన్ని వారితో పోల్చుకోవడం వల్ల పిల్లల్లో ఆందోళన, నిరాశ పెరిగిపోతాయి. ఫిల్లర్లతో కూడిన వీడియోలని చూసి, తమ రూపం పట్ల ఆత్మన్యూనతా భావానికి గురవడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. ఇది పిల్లల అభివృద్ధిని కుంటుపడేలా చేస్తుంది.భావోద్వేగాలు మొద్దుబారడంరీల్స్లో హాస్యం, హింస, విషాదం అన్నీ వెంటవెంటనే వస్తాయి. దీనివల్ల మెదడుకు ఒక భావోద్వేగాన్ని సరిగ్గా ప్రాసెస్ చేసే సమయం ఉండదు, ఇది పిల్లలను భావోద్వేగపరంగా మొద్దుబార్చే అవకాశం ఉంది. ఇది నిజజీవితంలో మరింత ప్రమాదకరం.నిద్ర పట్టకపోవడంస్మార్ట్ఫోన్తో మరో ముఖ్యమైన సమస్య నిద్ర పట్టకపోవడం. రీల్స్ చూడటం, మెసేజ్లు చేయడం వల్ల మెదడు ఉద్వేగానికి గురవుతుంది. దీనివల్ల స్లీపింగ్ సైకిల్ దెబ్బతిని .. పిల్లల్లో ఆందోళన, ఒత్తిడి పెరిగిపోతాయి. దాంతో చిరాకు, కోపం, మొండిగా ప్రవర్తించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.ప్రత్యామ్నాయమే పరిష్కారంఫోన్ వద్దు అని ఒకేసారి చెప్పడం కంటే వారికి నచ్చిన కథల పుస్తకాలు, బోర్డ్ గేమ్స్ లేదా ఏదైనా క్రీడావిశేషాలను చర్చించడం వల్ల వారి మనసు మరోవాటి మీదకి మళ్లుతుంది. బోర్గా ఉందని చెప్పగానే పిల్లలకు ఫోన్ ఇవ్వడం మానుకోవాలి. వారితో మాట్లాడాలి, ఆడుకోవాలి. అలాగే మీరు నిరంతరం ఫోన్ చూస్తూ ఉంటే, వారు కూడా మిమ్మల్ని అనుకరిస్తారు గనుక స్క్రీన్ టైమ్ తగ్గించుకోవాలి. స్మార్ట్ ఫోన్ను.. మనం ఎలా వాడుతాము అనేదానిపైనే అది మనకు మేలు చేస్తుందా.. కీడు చేస్తుందా అనే అంశాలు ఆధారపడి ఉంటాయనే విషయాన్ని గ్రహించాలి లేదా వీటిలో భాగస్వామ్యం చేయాలి. బాల్యం నుంచే పిల్లల దృష్టి రీల్స్ నుంచి రియల్కు మళ్లించే ప్రయత్నం చేయాలి. -
ఒప్పో కొత్త స్మార్ట్ఫోన్: ధర ఎంతంటే?
స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో ఇండియా తాజాగా రెనో 15సీ ఫోన్ని ఆవిష్కరించింది. ట్రావెలర్లు, క్రియేటర్లు, ఫొటోగ్రఫీపై మక్కువ గల వారి కోసం దీన్ని తెచ్చినట్లు తెలిపింది. ఇందులో 7000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80వాట్స్ సూపర్వూక్ ఫాస్ట్ చార్జింగ్, 6.57 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, 50 ఎంపీ అల్ట్రా క్లియర్ మెయిన్ కెమెరా, తదితర ఫీచర్లు ఉన్నాయి. ధర రూ. 34,999 నుంచి ప్రారంభమవుతుంది.ఒప్పో రెనో 15c ఫిబ్రవరి 5 నుంచి భారతదేశంలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఇది ఆఫ్టర్గ్లో పింక్ & ట్విలైట్ బ్లూ అనే రెండు రంగు ఎంపికలలో లభిస్తుంది. 8GB RAM & 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 34,999 కాగా.. 12GB RAM & 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 37,999. ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఒప్పో ఆన్లైన్ స్టోర్, ఆఫ్లైన్ రిటైల్ అవుట్లెట్ల ద్వారా అమ్మకానికి ఉంది.కెమెరాల విషయానికొస్తే.. రెనో 15c 50MP మెయిన్ రియర్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP మాక్రో సెన్సార్తో వస్తుంది. ముందు భాగంలో 50MP అల్ట్రా-వైడ్ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ ముందు & వెనుక కెమెరాలలో 4K వీడియో రికార్డింగ్కు సపోర్ట్ చేస్తుంది. -
హైదరాబాద్లో మరో కొత్త జీసీసీ.. భారీగా ఉద్యోగాలు
హైదరాబాద్: దిగ్గజ వెల్ మేనేజ్మెంట్ ఎల్పీఎల్ ఫైనాన్షియల్ సంస్థ హైదరాబాద్లో ఎల్పీఎల్ ఫైనాన్షియల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ని ప్రారంభించినట్లు వెల్లడించింది. అలాగే కొత్త కార్యకలాపాలకు హెడ్గా రమేష్ కాజాను నియమించుకున్నట్లు తెలిపింది.ఎల్పీఎల్ ఫైనాన్షియల్ తమ టెక్నాలజీ, కార్యకలాపాలను విస్తరించే క్రమంలో ఆర్థిక సేవల్లో విస్తృతంగా ప్రతిభావంతుల లభ్యత, పటిష్టమైన మౌలిక సదుపాయాలు, వ్యాపారాన్ని కొనసాగించేందుకు సంబంధించిన సానుకూలాంశాలు ఉన్న హైదరాబాద్ నగరాన్ని ఎంచుకుంది.భారీగా ఉద్యోగావకాశాలువచ్చే మూడు నుంచి అయిదేళ్ల వ్యవధిలో టెక్నాలజీ, ఆపరేషన్స్, ప్రోడక్ట్ డెవలప్మెంట్, డేటా అండ్ అనలిటిక్స్, రిస్క్ మేనేజ్మెంట్ విభాగాలకు సంబంధించి హైదరాబాద్లో ఎల్పీఎల్ వందల కొద్దీ ఉద్యోగాలను కల్పించనుంది.ఎల్పీఎల్ ఫైనాన్షియల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ప్రస్తుతం తమ టీమ్ కోసం ప్రతిభావంతులను నియమించుకునే ప్రక్రియలో ఉంది. నెట్వర్క్ సెక్యూరిటీ, కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏఐ ఇంజినీరింగ్, డేటా ప్లాట్ఫామ్స్, మిడిల్వేర్ మరియు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్వ్యాప్తంగా నిపుణులైన ఇంజినీర్లు, టెక్నాలజిస్టులు వీరిలో ఉండనున్నారు.భారత్లోని ఎల్పీఎల్ ఫైనాన్షియల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లో ఉద్యోగావకాశాల కోసం ఎల్పీఎల్ ఫైనాన్షియల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ లింక్డ్ఇన్ (LinkedIn) పేజీ, ఎల్పీఎల్ ఫైనాన్షియల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ కెరియర్స్ సైట్ని సందర్శించాలని కంపెనీ సూచించింది.ఎల్పీఎల్ ఫైనాన్షియల్ గురించి..ఫార్చూన్ 500 కంపెనీ అయిన ఎల్పీఎల్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ (Nasdaq: LPLA) అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న వెల్త్ మేనేజ్మెంట్ సంస్థల్లో ఒకటి. 32,000 మందికి పైగా ఫైనాన్షియల్ అడ్వైజర్లకు, 1,200కు పైగా ఆర్థిక సంస్థల వెల్త్ మేనేజ్మెంట్ విధానాలకు సపోర్ట్ అందిస్తూ దాదాపు 80 లక్షల మందికి సంబంధించి 2.4 ట్రిలియన్ డాలర్ల నిధులను నిర్వహిస్తోంది.అధునాతన ఫైనాన్షియల్ టెక్నాలజీ సాధనాలు, అప్లికేషన్ల వినూత్న ప్లాట్ఫాం దన్నుతో, ఆర్థిక సలహాదారులు తమ క్లయింట్లకు వ్యక్తిగతీకరించిన ఆర్థిక ప్రణాళికలను అందించడానికి ఉపయోగించే ఇన్వెస్ట్మెంట్ సొల్యూషన్స్ , వెల్త్ మేనేజ్మెంట్ ప్రోడక్టులను ఎల్పీఎల్ ఫైనాన్షియల్ అందిస్తోంది. -
వాలెంటైన్స్ డే ఆఫర్.. ఐఫోన్ 17పై భారీ డిస్కౌంట్లు
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా యాపిల్ భారత మార్కెట్లో వాలెంటైన్స్ డే సేల్ను ప్రారంభించింది. ఈ ప్రత్యేక ఆఫర్లో భాగంగా లేటెస్ట్ ఐఫోన్ 17 సిరీస్పై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు అందిస్తోంది. ఈ వాలెంటైన్స్ డే సేల్ ప్రస్తుతం యాపిల్ ఇండియా అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంది.ఈ సేల్లో భాగంగా యాపిల్ ఎప్పటిలానే నేరుగా ధరలు తగ్గించకుండా, బ్యాంక్ ఆధారిత ఇన్స్టంట్ క్యాష్బ్యాక్లు, క్రెడిట్ కార్డు డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ ఆఫర్లు ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్, అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డులపై వర్తిస్తాయి. చెక్అవుట్ సమయంలో అర్హత కలిగిన కార్డును ఉపయోగించిన వెంటనే ఇన్స్టంట్ క్యాష్బ్యాక్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దీంతో ఫోన్ ధర తగ్గుతుంది. డిస్కౌంట్ తప్ప, మిగతా కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి మార్పులు ఉండవు. డెలివరీ అంచనాలు, స్టోర్ పికప్ ఆప్షన్లు, చెల్లింపు విధానం యథాతథంగా ఉంటాయి.ఐఫోన్ 17 స్పెసిఫికేషన్లు, ధరఐఫోన్ 17లో 6.3 అంగుళాల సూపర్ రెటీనా XDR OLED డిస్ప్లే ఉంది. ఇది A19 చిప్, 8GB ర్యామ్, 256GB / 512GB స్టోరేజ్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.ఫోటోగ్రఫీ కోసం ఇందులో 48MP డ్యూయల్ ఫ్యూజన్ కెమెరా సిస్టమ్ ఉండి, 10x డిజిటల్ జూమ్కు సపోర్ట్ చేస్తుంది.వాలెంటైన్స్ డే సేల్ సందర్భంగా ఈ ఫోన్ రూ.77,900 ప్రారంభ ధరకు లభిస్తోంది. దీనిపై రూ.5,000 ఇన్స్టంట్ బ్యాంక్ క్యాష్బ్యాక్ అందుబాటులో ఉంది.ఐఫోన్ 17 ప్రో స్పెక్స్.. ఆఫర్లు ఇలా..ఐఫోన్ 17 ప్రోలో 6.3 అంగుళాల LTPO సూపర్ రెటీనా XDR డిస్ప్లే ఉంది. ఇది 120Hz ప్రోమోషన్, ఆల్వేస్-ఆన్ ఫీచర్తో వస్తుంది. ఈ మోడల్లో A19 ప్రో చిప్ (6-కోర్ CPU, 6-కోర్ GPU, 16-కోర్ న్యూరల్ ఇంజిన్), 12GB ర్యామ్ ఉన్నాయి. అలాగే 48MP కెమెరా అరే, 5x ఆప్టికల్ జూమ్, 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ లభిస్తుంది. టైటానియం ఫ్రేమ్, USB-C పోర్ట్, అధునాతన AI ఫీచర్లు, అలాగే 33 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.వాలెంటైన్స్ డే సేల్లో ఈ ఫోన్ రూ.1,29,900 తగ్గింపు ధరకు లభిస్తుంది. దీనిపై కూడా రూ.5,000 ఇన్స్టంట్ క్యాష్బ్యాక్ వర్తిస్తుంది.ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ప్రత్యేకతలు, ధరఐఫోన్ 17 ప్రో మ్యాక్స్లో 6.9 అంగుళాల LTPO సూపర్ రెటీనా XDR డిస్ప్లే ఉంది. ఇది 120Hz ప్రోమోషన్, ఆల్వేస్-ఆన్ ఫీచర్తో పాటు 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను అందిస్తుంది. ఈ మోడల్ A19 ప్రో చిప్, 12GB ర్యామ్తో శక్తివంతమైన పనితీరు, మెరుగైన AI సామర్థ్యాలను అందిస్తుంది. ఫోటోగ్రఫీ కోసం ఇందులో ట్రిపుల్ 48MP కెమెరా సెటప్, LiDAR సెన్సార్, 5x టెలిఫోటో జూమ్, 8K వీడియో సపోర్ట్ ఉన్నాయి.వాలెంటైన్స్ డే సేల్ సందర్భంగా ఈ ఫోన్ రూ.1,44,900 ప్రత్యేక ధరకు లభిస్తుంది. దీనిపైనా రూ.5,000 ఇన్స్టంట్ బ్యాంక్ క్యాష్బ్యాక్ అందుబాటులో ఉంది. -
ఐటీ ఉద్యోగమా.. ఊడిగమా?
ఐటీ కంపెనీల్లో పని గంటలు, ఉద్యోగులపై పని ఒత్తిడి ఆందోళనలు ఇటీవల ఎక్కువయ్యాయి. హైదరాబాద్లో ఓ ప్రముఖ బహుళజాతి ఐటీ సంస్థ తనను ఏళ్ల తరబడి ఓవర్టైమ్ చెల్లించకుండా అధిక పని గంటలు చేయమని బలవంతం చేసిందని ఆరోపిస్తూ ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి తెలంగాణ కార్మిక శాఖను ఆశ్రయించాడు. దేశంలో పని గంటలపై పరిశ్రమ పెద్దలు చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ఫిర్యాదు ప్రాధాన్యం సంతరించుకుంది.రోజుకు 16 గంటల పనిటైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన కథనం ప్రకారం.. ఫిర్యాదుదారు శ్రీధర్ మేరుగు తన 14 ఏళ్ల ఉద్యోగ కాలంలో చాలా సార్లు రోజుకు 16 గంటలకు పైగా పనిచేయాల్సి వచ్చిందని తెలిపారు. అదనంగా పనిచేసిన గంటలకు తగిన పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.తగిన వేతనం లేకుండా అధిక షిఫ్టుల్లో పనిచేయాలని ఆశించడం అన్యాయమని, కార్మిక చట్టాలను సంస్థ ఉల్లంఘించిందని శ్రీధర్ ఆరోపించారు. ఓవర్టైమ్ వేతనాలు చెల్లించకుండా నిరాకరించడంతో ఈ వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ను కూడా ఆయన ఆశ్రయించారు.అనారోగ్యంలోనూ పనిభారంతాను అనారోగ్యానికి గురైన సమయంలో పరిస్థితి మరింత దారుణంగా మారిందని, అయినప్పటికీ పని కొనసాగించాల్సిందిగా ఒత్తిడి తెచ్చారని శ్రీధర్ తెలిపారు. అర్ధరాత్రి, తెల్లవారుజామున షిఫ్ట్ భత్యాలను కూడా కంపెనీ నిరాకరించిందని ఆయన ఆరోపించారు.సిబ్బంది కొరతను కారణంగా చూపుతూ నిరంతరం ఒత్తిడి పెంచారని, మూడు నుంచి నాలుగు నెలల పాటు రోజుకు 16 గంటలకు పైగా పని చేసిన తర్వాతే ఈ సమస్యను అధికారికంగా లేవనెత్తినట్లు చెప్పారు. అయితే చట్టవిరుద్ధమైన పని పరిస్థితుల్లో పనిచేయడానికి నిరాకరించాడనే కారణంతోనే 2025 సెప్టెంబర్లో తనను ఉద్యోగం నుంచి తొలగించారని శ్రీధర్ ఆరోపిస్తున్నారు.చట్టబద్ధమైన వడ్డీ, జరిమానాలతో పాటు పెండింగ్లో ఉన్న ఓవర్టైమ్ బకాయిలను చెల్లించాలని యూఎస్ కేంద్రంగా పనిచేస్తున్న ఆ కంపెనీని ఆదేశించాలని శ్రీధర్ కార్మిక శాఖకు విజ్ఞప్తి చేశారు.హైదరాబాద్ ఐటీ రంగంలో పెరుగుతున్న ఆందోళనహైదరాబాద్కు చెందిన ఇతర ఐటీ ఉద్యోగులు కూడా వారానికి 40 గంటలకంటే ఎక్కువగా పని చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. చట్టపరమైన హక్కు ఉన్నప్పటికీ చాలా మంది ఉద్యోగులు ఓవర్టైమ్ క్లెయిమ్ చేయడానికి వెనుకాడుతున్నారు.దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉన్న ఐటీ ప్రొఫెషనల్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ, ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత వేతనం లేని వారాంతపు, సెలవు రోజుల పని సాధారణంగా మారిపోయిందని తెలిపారు. పొడిగించిన పని గంటలను పాటించలేకపోతే పరోక్ష ఒత్తిడి, ఉద్యోగం కోల్పోతామన్న భయం ఉద్యోగులను వెంటాడుతోందని ఆయన అన్నారు.పని ఒత్తిడితో పోతున్న ప్రాణాలుపని ఒత్తిడిని తట్టుకోలేక హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి సతీష్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. అలాగే హైదరాబాద్కు చెందిన మరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయశాంతి రెడ్డి, ఇంటర్ చదువుతున్న తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన కూడా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనల వెనుక కూడా తీవ్రమైన పని ఒత్తిడే కారణమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐటీ పెట్టుబడిదారుల్లో ఆందోళన
కృత్రిమ మేధ (ఏఐ) విభాగంలో ఆంథ్రోపిక్ సంస్థ తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పు భారత ఐటీ రంగాన్ని వణికిస్తోంది. ఆంథ్రోపిక్ తన ‘క్లాడ్ కోవర్క్’ ఏజెంట్ కోసం సరికొత్త ఆటోమేషన్ ప్లగ్ఇన్లను విడుదల చేసింది. దాంతో శ్రమ ఆధారిత సర్వీసులపై ఆధారపడిన భారత ఐటీ కంపెనీల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ పరిణామం ఫలితంగా స్టాక్ మార్కెట్లో ఇటీవల ఐటీ షేర్లు భారీగా కుప్పకూలాయి.ఐటీ రంగానికి సవాలు..ఆంథ్రోపిక్ విడుదల చేసిన కొత్త ప్లగ్ఇన్లు కేవలం సాధారణ చాటింగ్ కోసం మాత్రమే కాదు, ఒక సంస్థలోని కీలక విభాగాలను స్వయంచాలకంగా నిర్వహించేలా రూపొందించారు. వీటి ప్రభావం ప్రధానంగా కింది విభాగాలపై ఉండనుంది.లీగల్, ఫైనాన్స్: కాంట్రాక్ట్ రివ్యూ, కంప్లయన్స్ వంటి సంక్లిష్ట ప్రక్రియలను ఏఐ వేగంగా పూర్తి చేస్తుంది.కస్టమర్ సపోర్ట్: టికెట్ల వర్గీకరణ, సమాధానాలు ఇవ్వడం.. వంటి అంశాలపై మనుషుల ప్రమేయం లేకుండానే సమస్యల పరిష్కారాన్ని క్లాడ్ నిర్వహిస్తుంది.సేల్స్, మార్కెటింగ్ వ్యూహాలను రూపొందించి వాటిని సమర్థంగా అమలు చేస్తుంది.ఎంటర్ప్రైజ్ సెర్చ్: ఒక కంపెనీలోని ఈ-మెయిల్లు, క్లౌడ్ స్టోరేజ్, చాట్ డేటాను విశ్లేషించి నివేదికలు తయారు చేస్తుంది.ఇప్పటివరకు ‘సాస్’ ఆధారిత సర్వీసుల ద్వారా పై పనులను నిర్వహించేవారు. ఏదైనా సాఫ్ట్వేర్ను మన కంప్యూటర్ లేదా ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోకుండా, నేరుగా ఇంటర్నెట్ ద్వారా వాడుకోవడాన్ని సాస్ అంటారు. ఇప్పుడు చర్చల్లో ఉన్న క్లాడ్ కోవర్క్ వంటి ఏఐ సాధనాలు వస్తే భవిష్యత్తులో సాప్ వంటి ప్రత్యేక సాఫ్ట్వేర్ల అవసరం లేకుండా ఏఐతోనే పనులు చేయిస్తారని ఇన్వెస్టర్లు భయపడుతున్నారు.భారత ఐటీ రంగంపై ప్రభావం..భారత ఐటీ కంపెనీల ప్రధాన ఆదాయ వనరు ‘అవుట్సోర్సింగ్’. అంటే విదేశీ కంపెనీలకు అవసరమైన కస్టమర్ సపోర్ట్, డేటా ఎంట్రీ, సాఫ్ట్వేర్ టెస్టింగ్ వంటి పనులను తక్కువ ఖర్చుతో కూడిన మానవ వనరుల ద్వారా అందిస్తున్నారు. ఆంథ్రోపిక్ క్లాడ్ వంటి ఏఐ వ్యవస్థలు ఇప్పుడు నేరుగా ఈ పనులనే తక్కువ ఖర్చుతో, వేగంగా పూర్తి చేస్తున్నాయి.గతంలో ఏఐని ఒక కేవలం ఒక సహాయక సాధనంగా చూసిన కంపెనీలు ఇప్పుడు దాన్ని ఒక ప్రత్యామ్నాయంగా భావిస్తున్నాయి.ఏఐ వాడకం పెరిగితే క్లయింట్లు ఐటీ కంపెనీలకు ఇచ్చే ప్రాజెక్టుల విలువ తగ్గించే అవకాశం ఉంది.భారత కంపెనీలు ప్రధానంగా సర్వీసులపై దృష్టి పెట్టాయి కానీ, సొంత ఏఐ ఉత్పత్తులను తయారు చేయడంలో వెనుకబడి ఉన్నాయి.ఇదీ చదవండి: వ్యక్తిగత సంపదలో 75 శాతం విరాళం -
నియామకాలను శాసిస్తున్న ఏఐ!
ముంబై: కృత్రిమ మేథ (ఏఐ) నియామకాల ప్రక్రియను మరింత సమర్థవంతం, సులభతరం చేస్తోంది. సరైన నైపుణ్యాలతో కూడిన అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం రిక్రూటర్లకు (నియామకాలు చేపట్టేవారు) సవాలు కాగా.. వీరు ఏఐ సాయాన్ని తీసుకుంటున్నారు. తమకు కావాల్సిన సరైన అర్హతలు, నైపుణ్యాలు దాగి ఉన్న అభ్యర్థులను గుర్తించేందుకు ఏఐ సాయపడుతున్నట్టు రిక్రూటర్లు లింక్డ్ఇన్ సర్వేలో భాగంగా తెలిపారు. ఒత్తిళ్ల మధ్య ఏఐని పరిష్కారంగా వారు భావిస్తున్నారు. 2025 నవంబర్ 13 నుంచి 28 మధ్య 19,113 మంది అభిప్రాయాలను, నవంబర్ 10 నుంచి 27 మధ్య 6,554 అంతర్జాతీయ హెచ్ఆర్ నిపుణులను లింక్డ్ఇన్ సర్వే చేసి వివరాలు విడుదల చేసింది. → గతంలో తాము గుర్తించలేని నైపుణ్యాలు కలిగిన అభ్యర్థుల నియామకానికి ఏఐ సాయపడుతున్నట్టు 71 శాతం మంది చెప్పారు. → అభ్యర్థుల నైపుణ్యాలను మరింత లోతుగా విశ్లేíÙంచేందుకు ఏఐ ఉకపరిస్తున్నట్టు 80 మంది పేర్కొన్నారు. → నియామకాలను ఏఐ వేగవంతం చేసిందని 76 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. → నియామకాలు కరోనా ముందునాటితో పోలి్చతే 40 శాతం పెరిగినా.. అర్హులైన అభ్యర్థులను గుర్తించడంలో ఇబ్బంది పడుతున్నట్టు 74 శాతం మంది రిక్రూటర్లు తెలిపారు. → ఏఐ ఆధారిత దరఖాస్తులు పెరిగినట్టు 53 శాతం మంది తెలిపారు. → కావాల్సిన నైపుణ్యాల్లో లోటు ఉంటున్నట్టు 47 శాతం రిక్రూటర్లు పేర్కొన్నారు. → తప్పుదోవ పట్టించే, తక్కువ నాణ్యత కలిగిన వాటి నుంచి నిజమైన దరఖాస్తులను వడబోయడంలో ఏఐ సాయపడుతున్నట్టు 48 శాతం మంది చెప్పారు. → 2026లోనూ ఇంటర్వ్యూల ముందస్తు స్క్రీనింగ్కు, వేగవంతమైన నియామకాలకు, మెరుగైన అభ్యర్థుల ఎంపికకు ఏఐని ఉపయోగించనున్నట్టు మెజారిటీ రిక్రూటర్లు తెలిపారు. -
స్మార్ట్ గ్లాసెస్... సో డేంజర్!
సరికొత్త సాంకేతికతలో స్మార్ట్ గ్లాసెస్ ట్రెండ్ ఒకటి. హ్యాండ్స్–ఫ్రీ సెల్ఫీల నుంచి ఇన్స్టంట్ ట్రాన్సాక్షన్స్ వరకు స్మార్ట్ గ్లాసెస్ ఉపయోగాలు ఉన్నాయి. ఆ ఉపయోగాల మాట ఎలా ఉన్నా... మహిళల ప్రైవసీకి సంబంధించి స్మార్ట్ గ్లాసెస్ బ్యాడ్ గ్లాసెస్గా తయారయ్యాయి. స్మార్ట్గ్లాసెస్తో మహిళల వీడియోలు తీసి వివిధ సైట్లలో అప్లోడ్ చేస్తున్నారు. మహిళలకు తెలియకుండా స్మార్ట్గ్లాసెస్ కెమెరాతో వీడియోలు తీయడం అనేది యూఎస్, యూకేలలో ప్రమాదకరమైన ట్రెండ్గా మారింది...బస్స్టాప్లో నిలబడినప్పుడో, ఏ షాపింగ్ మాల్లోనో ఉన్నప్పుడో స్మార్ట్గ్లాసెస్ ధరించిన వ్యక్తి మీ దగ్గరకి వచ్చి... ‘హాయ్ అండీ... మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుగా ఉంది’ అని మాట కలిపి చాలాసేపు మాట్లాడవచ్చు.చివరికి... ‘ఒకరి పోలికలతో ఒకరు ఉండడం సహజమే కదండీ. నేను పొరబడ్డాను...సారీ...’ అంటాడు. ‘భలేవారండీ, ఈ మాత్రం దానికి సారీ ఎందుకు!’ అని మనం అంటాం.→ కట్ చేస్తే...కొన్ని రోజుల తరువాత మీ వీడియో ఇన్స్టాగ్రామ్లోనో, టిక్టాక్లోనో కనిపించవచ్చు. షాక్కు గురి చేయవచ్చు. అభ్యంతరకరమైన సైట్స్లోనూ కనిపించి మిమ్మల్ని ఆందోళనకు గురి చేయవచ్చు. ‘అసలు.. నా వీడియో ఈ సైట్లోకి ఎలా వచ్చింది!’ అని ఆలోచిస్తుండగా మీతో మాట్లాడిన వ్యక్తి గుర్తుకు వస్తాడు.‘నాతో మాట్లాడింది నిజమేగానీ. అతడి చేతిలో సెల్ఫోన్లాంటిదేమీ కనిపించలేదే!’ అని అతడికి క్లీన్ సర్టిఫికెట్ ఇస్తారు. నిజాకి ఆ వీడియో సృష్టికర్త అతడే!అతను పెట్టుకున్న స్మార్ట్గ్లాసెస్ కేవలం గ్లాసెస్ మాత్రమే కాదు. అందులో కెమెరా కూడా ఉంటుంది.యూఎస్, యూకేలలో ‘స్మార్ట్ గ్లాసెస్ బాధితులు’ ఎంతోమంది ఉన్నారు. సాంకేతికతలో మరో ముందుడుగుగా ‘స్మార్ట్ గ్లాసెస్’ వచ్చాయి. హ్యాండ్స్–ఫ్రీ సెల్ఫీలు, ఇన్స్టంట్ ట్రాన్సాక్షన్స్, వాయిస్–యాక్టివేటెడ్ అసిస్టెంట్స్లాంటి సదుపాయాల మాట ఎలా ఉన్నా కొన్ని సందర్భాలలో ఇవి మహిళల పాలిట పీడకలగా మారుతున్నాయి.→ భయపడవద్దుగత నెల ఇంగ్లాండ్లో ఓ నలభై ఏడేళ్ల మహిళ ఒక వ్యక్తిని కోర్టుకు లాగింది. ఇంతకీ ఆ వ్యక్తి చేసిన నేరం ఏమిటి? ఒక హోటల్లో ఆమెకు తెలియకుండా తన స్మార్ట్గ్లాసెస్తో అభ్యంతరకరమైన రీతిలో వీడియో తీయడానికి ప్రయత్నిస్తుంటే ఆమెకు అనుమానం వచ్చి, అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసి కోర్టుకు లాగింది. కొద్దిమంది బాధితులు మాత్రం ‘నలుగురికి తెలిస్తే పరువు పోతుంది’ అనుకుంటూ బ్లాక్మెయిల్ చేసే వారి బెదిరింపులకు లొంగిపోతున్నారు. వారు ఎంత డిమాండ్ చేస్తే అంత సొమ్ము ఇచ్చేస్తున్నారు.సూపర్ మార్కెట్కు వెళ్లిన తనను అపరిచితుడు ఎవరో రే–బాన్ మెటా స్మార్ట్ గాసెస్తో అభ్యంతర కరమైన రీతిలో వీడియో తీశాడని ఒక మహిళ ఆన్లైన్లో కన్నీరు మున్నీరు అయింది. ‘ఎవరో చేసిన దుర్మార్గమైన పనికి మానసికంగానే కాదు, శారీరకంగా కూడా బలహీన పడిపోయాను’ అని ‘ఎక్స్’లో చేసిన పోస్ట్లో వెల్లడించింది ఆ బాధిత మహిళ.→ ఆ లైట్ వెలగక పోవచ్చు కూడా!సార్ట్ఫోన్ కెమెరా తో ఎవరైనా షూట్ చేస్తుంటే వెంటనే గమనించి అడ్డుకోవచ్చు. అయితే స్మార్ట్ గ్లాసెస్తో రికార్డ్ చేస్తున్న విషయం తెలియకపోవడం వల్ల ప్రమాదాన్ని పసిగట్టలేము. స్మార్ట్ గ్లాసెస్ విషయానికి వస్తే, ఉదాహరణకు మెటా ప్రాడక్ట్ రే–బాన్ స్మార్ట్ గ్లాసెస్ను తీసుకుంటే...రికార్డింగ్ చేస్తున్నప్పుడు గ్లాసెస్లోని తెల్లటి చిన్న ఎల్ఈడి ఇండికేటర్ వెలుగుతుంది. ఈ లైట్ ఆధారంగా వీడియో రికార్డింగ్ జరుగుతున్న విషయం తెలుసుకోవచ్చు. అయితే ఈ లైట్ పగటి వెలుగులో, ప్రకాశవంతమైన పరిసరాలలో అంతగా కనిపించదు. కొందరు ఈ లైట్ కనిపించకుండా కూడా మ్యానేజ్ చేస్తున్నారు.కొన్ని గ్లాసెస్కు రికార్డింగ్ ఇండికేటర్ లేకపోవడం వల్ల అక్రమంగా వీడియో తీస్తున్నవారి పని మరింత సులువు అవుతుంది. ముఖ్యంగా తక్కువ ధరల్లో వచ్చే చైనీస్ మోడల్స్లో ఈ ఫీచర్ కనిపించడం లేదు.స్మార్ట్ గ్లాసెస్లోని ఎల్ఈడి లైట్ ఎందుకు వెలుగుతుందనేది చాలామందికి తెలియక పోవడం వల్ల అనుమానం రావడం లేదు. యూఎస్, యూకేలలో ప్రైవసీ చట్టాలు రకరకాలుగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో బహిరంగ ప్రదేశాలలో వీడియోలు తీయడం నేరం కాదు. మనకు తెలియకుండానే కేఫ్, మెట్రోస్టేషన్, పార్క్, ఆలయం సమీపంలో ఎవరైనా వీడియో షూట్ చేసి ఉండవచ్చు. ఆ వీడియోలో మనం ఉన్నామా లేదా అని తెలుసుకోవడానికి, ఫుటేజి తీసివేయాలని డిమాండ్ చేయడానికి చట్టపరమైన అధికారం లేదు. అయితే ఇతరులు అభ్యంతరం చెప్పినప్పుడు రికార్డింగ్ నిలిపివేయాలని టెక్ కంపెనీలు చెప్పవచ్చు. యూఎస్, యూకేలలోనే కాదు మన దేశంలోనూ స్మార్ట్గ్లాసెస్ దుర్వినియోగానికి సంబంధించిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి.→ పరిష్కారం లేదా?‘అవగాహన, అప్రమత్తతే సమస్యకు పరిష్కారం’ అంటున్నారు టెక్ నిపుణులు. ‘సందేహంతో ఉండాలి. అప్రమత్తంగా ఉండాలి. అనుమానంగా అనిపిస్తే సమాచారం ఇవ్వాలి’ అని కూడా చెబుతున్నారు. కెమెరాలు ఉన్న అన్ని స్మార్ట్గ్లాసులలోనూ స్పష్టమైన లైట్లు, సంకేతాలు ఉండవనే విషయం తెలుసుకోవాలి. డేంజర్ ట్రెండ్!యూఎస్. యూకేలలో స్మార్ట్ గ్లాసెస్ కెమెరాలను ఉపయోగించి మహిళలకు తెలియకుండా వారి వీడియోలు తీసి. వివిధ సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేయడం అనేది ప్రమాదకరమైన ధోరణిగా మారింది. వీడియో ఫుటేజీని సైకలాజికల్ మేనిప్యులేషన్ కోసం ఉపయోగించే ప్రమాదకరమైన «ధోరణి పెరిగింది.‘నాకు తెలియకుండానే నా వీడియోను చిత్రీకరించి, ఏదో సైట్లో పోస్ట్ చేశారు. ఆ తరువాత నేను పడిన ఇబ్బందులు ఇన్నీ అన్నీ కావు. ఎంత దారుణం ఇది!’ అంటూ న్యూయార్క్లో ఉండే కెసీ జనంజని కళ్లనీళ్ల పర్యంతం అయింది. ‘ఈ పని వారు యాదృచ్ఛికంగా, సరదా కోసం చేశారనుకోవడం లేదు. విషపూరిత ఆలోచనలతోనే చేస్తున్నారు’ అంటుంది కెసీ. -
ఏఐ సృష్టికర్తకే తప్పని అభద్రతా భావం
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న ఓపెన్ఏఐ అధినేత సామ్ ఆల్ట్మాన్ తన సొంత ఉత్పత్తిపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. యాపిల్ కంప్యూటర్ల (మ్యాక్) కోసం ఓపెన్ఏఐ కొత్తగా ‘కోడెక్స్’ స్టాండలోన్ యాప్ను విడుదల చేసిన తరుణంలో ఆయన తన వ్యక్తిగత అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.ఇటీవల కోడెక్స్ టూల్ను ఉపయోగించి ఆల్ట్మాన్ స్వయంగా ఒక అప్లికేషన్ను రూపొందించారు. ఆ ప్రక్రియలో భాగంగా కొన్ని మార్పుల కోసం ఏఐని సలహాలు అడగగా అది ఇచ్చిన ఐడియాలు ఆయన ఊహించిన దానికంటే అద్భుతంగా ఉన్నాయట. ఈ విషయాన్ని ఎక్స్(గతంలో ట్విట్టర్)లో పేర్కొంటూ.. ‘ఏఐ ఇచ్చిన ఐడియాలు చూసిన సమయంలో నేను కొంచెం పనికిరాని వాడినని (Useless) భావించాను. అది నన్ను కొంత విచారానికి గురిచేసింది’ అని ఆయన నిజాయితీగా ఒప్పుకున్నారు. ఒక ఏఐ సృష్టికర్త తాను చేసిన యాప్ ఇచ్చిన సమాధానం చూసి అభద్రతకు లోనవ్వడం ఇప్పుడు టెక్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.కోడెక్స్ మాక్ యాప్ఓపెన్ఏఐ విడుదల చేసిన ఈ కొత్త మాక్ యాప్ డెవలపర్ల పనితీరును పూర్తిగా మార్చేయనుంది. దీని ప్రత్యేకతలు గమనిస్తే.. ఒకేసారి ఒక చాట్బాట్తో కాకుండా సమాంతరంగా ఒకటి కంటే ఎక్కువ ఏఐ ఏజెంట్లతో పని చేయవచ్చు. కోడింగ్ కష్టాలను తగ్గించి డెవలపర్లు తమ ఆలోచనలను సులభంగా అమలు చేసేలా ఈ యాప్ రూపొందించినట్లు చెప్పారు. ఈ ఏఐ ఏజెంట్లు కేవలం సలహాలు ఇవ్వడమే కాకుండా వినియోగదారు తరఫున కోడ్ రాయడం, దాన్ని మెరుగుపరచడం, ఇమేజ్ జనరేషన్ వంటి పనులను కూడా చేయగలవు.మార్కెట్లో పెరుగుతున్న పోటీగత నెలలో దాదాపు ఒక మిలియన్ మంది డెవలపర్లు కోడెక్స్ను ఉపయోగించినట్లు ఓపెన్ఏఐ వెల్లడించింది. ఆంత్రోపిక్, కర్సర్ వంటి సంస్థల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో యాపిల్ వినియోగదారుల కోసం ఈ ప్రత్యేక యాప్ను తీసుకురావడం వ్యూహాత్మక అడుగుగా కనిపిస్తోంది.వినియోగదారులకు బంపర్ ఆఫర్ప్రస్తుతం కోడెక్స్ సేవలు ఓపెన్ఏఐ ప్లస్, ప్రో, ఎంటర్ప్రైజ్ సబ్స్క్రిప్షన్లు ఉన్నవారికి అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ కొత్త యాప్ విడుదల సందర్భంగా ఉచిత వినియోగదారులకు కూడా పరిమిత కాలం పాటు కోడెక్స్ యాక్సెస్ను కల్పిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. అలాగే ఇప్పటికే ఉన్న పెయిడ్ యూజర్లకు రేట్ లిమిట్స్ రెట్టింపు చేసింది.ఇదీ చదవండి: ధర తగ్గిందనుకునేలోపే మళ్లీ.. తులం ఎంతంటే.. -
‘భారత్-విస్తార్’తో డిజిటల్ అండ!
భారతీయ వ్యవసాయ రంగంలో సాంకేతిక విప్లవానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విడివిడిగా ఉన్న వ్యవసాయ పరిశోధనలను, డేటాను ఏకీకృతం చేస్తూ కృత్రిమ మేధ (ఏఐ) ఆధారంగా రైతులకు నేరుగా సలహాలు అందించేలా ‘భారత్-విస్తార్’ అనే సరికొత్త డిజిటల్ వ్యవస్థను రూపొందించింది. అగ్రిస్టాక్ పోర్టల్స్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐకార్) ప్యాకేజీలను ఏఐ సిస్టమ్లతో అనుసంధానించడం ద్వారా సాగును మరింత లాభసాటిగా మార్చడమే దీని ప్రధాన లక్ష్యం.ఏఐ టూల్ ఎందుకు?ప్రస్తుతం మన దేశంలో అనేక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, స్టార్టప్లు విత్తన అభివృద్ధి నుంచి సప్లై చైన్ వరకు వేర్వేరు ప్రాజెక్టులపై పనిచేస్తున్నాయి. అయితే ఈ సమాచారం అంతా ఒకే చోట లేకపోవడం వల్ల ఆశించిన ఫలితాలు అందడం లేదు. భారత్-విస్తార్ ద్వారా ఈ వనరులన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొస్తారు. అగ్రిటెక్ స్టార్టప్లు, పరిశోధనా సంస్థలు ఉత్పత్తి చేసే భారీ డేటాను ఏఐ విశ్లేషించి రైతులకు అర్థమయ్యేలా వివరిస్తుంది.రైతులకు చేకూరే ప్రయోజనాలుదీని ద్వారా సాధారణ సమాచారం కంటే నిర్దిష్టమైన, ధ్రువీకరించిన శాస్త్రీయ సలహాలు రైతులకు అందనున్నాయి.ఐకార్ శాస్త్రీయ పరిశోధనలను నేరుగా డిజిటల్ రికార్డులతో అనుసంధానించడం ద్వారా పొలంలోని పరిస్థితిని బట్టి సలహాలు అందుతాయి.సంక్లిష్టమైన శాస్త్రీయ డేటాను రైతులకు వారి స్థానిక భాషల్లోనే సులువుగా అర్థమయ్యేలా ఈ ఏఐ టూల్ సర్వీసులు అందిస్తుంది.కరువు, వరదలు లేదా తెగుళ్ల దాడుల గురించి అగ్రిస్టాక్ ద్వారా ముందస్తుగా హెచ్చరికలు అందుతాయి.ఇది కేవలం సమాచారానికే పరిమితం కాకుండా ప్రభుత్వ పథకాల అమలు, రుణాలు అందజేయడం, బీమా సేవలను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది.ప్రైవేట్ సంస్థలకు భాగస్వామ్యంఈ వ్యవస్థ కేవలం ప్రభుత్వానికే పరిమితం కాదు. యూనిఫైడ్ ఫార్మర్ సర్వీస్ ఇంటర్ ఫేస్ (యూఎఫ్ఎస్ఐ), ఏపీఐల ద్వారా ప్రైవేట్ కంపెనీలు, స్టార్టప్లు కూడా ఈ ప్లాట్ఫారమ్తో అనుసంధానం కావచ్చు. దీనివల్ల మార్కెట్ కనెక్షన్లు మెరుగుపడటమే కాకుండా రైతులకు మరిన్ని వినూత్నమైన సేవలు అందుబాటులోకి వస్తాయి.డేటా భద్రతకు ప్రాధాన్యంరైతుల డేటా విషయంలో ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చింది. డేటాపై పూర్తి హక్కు రైతుకే ఉంటుంది. ఐటీ చట్టం, ఆధార్ చట్టం ప్రకారం ఈ సమాచారం భద్రంగా ఉంటుంది. ఏదైనా ప్రైవేట్ సంస్థ రైతు డేటాను యాక్సెస్ చేయాలంటే కచ్చితంగా ఆ రైతు నుంచి ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: భారమైన బహుమతులు.. దూరమవుతున్న బంధాలు -
జియో, ఎయిర్టెల్.. బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే!
అత్యంత ప్రజాదరణ పొందిన టెలికాం కంపెనీలు.. రిలయన్స్ జియో, ఎయిర్టెల్ తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు లెక్కకు మించిన రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతూనే ఉన్నాయి. ఇందులో నెల, మూడు నెలలు, ఏడాది ప్లాన్స్ ఉన్నాయి. అయితే ఈ కథనంలో 84 రోజుల పాపులర్ రీఛార్జ్ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం.ఎయిర్టెల్ రీఛార్జ్ ప్లాన్స్రూ.469 ప్లాన్: కంపెనీ అందించే 84 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా.. అపరిమిత కాల్స్ లభిస్తాయి. అయితే డేటా లభించదు. నెంబర్ యాక్టివ్గా ఉంచుకోవాలన్నా.. కేవలం కాలింగ్ కోసం మాత్రమే రీఛార్జ్ చేసుకోవాలన్నా యూజర్లు ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవచ్చు.రూ.548 ప్లాన్: 84 రోజుల పాటు అపరిమిత కాల్స్ మాత్రమే కాకుండా.. 7 జీబీ డేటా కూడా పొందవచ్చు. ఎస్ఎంఎస్లు లభిస్తాయి. డేటా ఎక్కువ కావాలనుకునే యూజర్లకు ఈ ప్లాన్ అంత ఉపయోగకరంగా ఉండదు.రూ.979 ప్లాన్: రోజుకు 2జీబీ డేటా కావాలనుకునే యూజర్లకు ఇది బెస్ట్ ప్లాన్. 84 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్ ద్వారా అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. సోనీ లివ్ యాప్ యాక్సెస్ లభిస్తుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. మొత్తం 168 జీబీ డేటా లభిస్తుందన్నమాట.రిలయన్స్ జియోరూ.448 ప్లాన్: జియో అందిస్తున్న ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇందులో డేటా లభించదు. కానీ అపరిమిత కాలింగ్, 1000 ఎస్ఎంఎస్లు పొందవచ్చు. తక్కువ ఖర్చుతో కాల్స్ చేయాలకునేవారు లేదా నెంబర్ యాక్టివ్గా ఉంచుకోవాలకునేవారికి ఈ రీఛార్జ్ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది.రూ.799 ప్లాన్: ఈ ప్లాన్ వ్యాలిడిటీ కూడా 84 రోజులే. అయితే రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత కాలింగ్ మాత్రమే కాకుండా.. రోజుకు 100 ఎస్ఎంఎస్లు పొందవచ్చు. జియో టీవీ, జియో ఎయిర్ క్లౌడ్ సబ్స్క్రిప్షన్లు లభిస్తాయి.రూ.859 ప్లాన్: రోజుకు 2 జీబీ డేటా కావాలనే వారికి ఈ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది. 84 రోజుల వ్యాలిడిటీ (168 జీబీ డేటా).. మూడు నెలలు జియో హాట్స్టార్కు ఫ్రీ యాక్సిస్ కూడా లభిస్తుంది. అంతే కాకుండా యూజర్లు గూగుల్ జెమినీ ప్రోకు 18 నెలలు సబ్స్క్రిప్షన్ కూడా పొందవచ్చు. -
బంపరాఫర్.. ఐఫోన్పై రూ.24000 తగ్గింపు!
గత ఏడాది మార్కెట్లో లాంచ్ అయిన వెంటనే ఎంతోమంది యాపిల్ ప్రియులను ఆకట్టుకున్న 'ఐఫోన్ ఎయిర్' మోడల్ మీద అద్భుతమైన డిస్కౌంట్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఏకంగా రూ. 24వేల తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.మార్కెట్లో రూ.1,19,900లకు లాంచ్ అయిన ఐఫోన్ ఎయిర్.. అమెజాన్ ఇండియాలో రూ.99 వేలకు (రూ.20900 తగ్గింపు) కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా, వినియోగదారులు ఐఫోన్ ఎయిర్ కొనుగోలుపై బ్యాంక్ ఆఫర్ కింద (క్రెడిట్ కార్డుపై) రూ.4,000 వరకు తగ్గింపును కూడా పొందవచ్చు. అంటే మొత్తం రూ. 24900 తగ్గింపు పొందవచ్చన్నమాట.ఐఫోన్ ఎయిర్ మొబైల్.. స్కై బ్లూ, క్లౌడ్ వైట్, స్పేస్ బ్లాక్ & లైట్ గోల్డ్ అనే నాలుగు రంగులలో లభిస్తుంది. ఇది 6.5 ఇంచెస్ LTPO సూపర్ రెటినా XDR OLED డిస్ప్లేతో పాటు 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను కలిగి ఉంది. అంతే కాకుండా యాపిల్ 5-కోర్ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్తో కూడిన యాపిల్ A19 ప్రో చిప్సెట్ పొందుతుంది.ఇదీ చదవండి: 15 మోదీ బడ్జెట్లు.. 8 సార్లు మార్కెట్ల పతనం!ఐఫోన్ ఎయిర్ iOS 26 ఆపరేటింగ్ సిస్టమ్పై ఆధారపడి ఉంటుంది. ఇందులో బేస్ వేరియంట్ 12GB RAM & 256GB ఇంటర్నల్ స్టోరేజ్ను పొందుతుంది.కెమెరా సెటప్ విషయానికి వస్తే.. సెన్సార్ షిఫ్ట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన సింగిల్ రియర్ 48 మెగాపిక్సెల్ సెంటర్ స్టేజ్ రియర్ షూటర్ ఉంది. సెల్ఫీలు మరియు వీడియో కాల్ల కోసం, ఫోన్లో 18 మెగాపిక్సెల్ ఫ్రంట్ స్నాపర్ కూడా ఉంది. హ్యాండ్సెట్ 3149mAh బ్యాటరీ & 20W MagSafe వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో పనిచేస్తుంది. -
పౌరుల గోప్యతను పాటించకపోతే దేశం విడిచి వెళ్లిపోండి: సుప్రీంకోర్టు
సాంకేతికత లేదా వ్యాపార పద్ధతుల పేరుతో భారత పౌరుల గోప్యతా హక్కును హరించలేరని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. డేటా షేరింగ్ నెపంతో ప్రజల వ్యక్తిగత సమాచారంతో ఆటలాడటం సరికాదని మెటా, వాట్సాప్ సంస్థలను అత్యున్నత ధర్మాసనం తీవ్రంగా హెచ్చరించింది. దీనిలో పౌరుల గోప్యతను పాటించకపోతే దేశం విడిచి వెళ్లిపోవచ్చని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ హెచ్చరించారు.సమాచారాన్ని దొంగిలించడానికి ఇదో మార్గంవాట్సాప్ తీసుకొచ్చిన వివాదాస్పద గోప్యతా విధానంపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఘాటైన వ్యాఖ్యలు చేసింది. వినియోగదారుల ‘సమ్మతి’(Consent), ‘ఆప్ట్-అవుట్’(వైదొలగడం) మెకానిజంపై కంపెనీల వాదనలను కోర్టు తోసిపుచ్చింది. ‘టెక్ కంపెనీల నిబంధనలు సామాన్యులకు అర్థం కానంత తెలివిగా రూపొందించారు. అసలు ‘వైదొలగడం’(ఆప్ట్-అవుట్) అనే విధానం ఎక్కడ ఉంది? ఇది ప్రైవేట్ సమాచారాన్ని దొంగిలించడానికి ఒక తెలివైన మార్గం’ అని కోర్టు వ్యాఖ్యానించింది.కేసు నేపథ్యం ఏమిటి?2021లో వాట్సాప్ ప్రవేశపెట్టిన గోప్యతా విధానంపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) రూ.213.14 కోట్ల భారీ జరిమానా విధించింది. దీన్ని సవాలు చేస్తూ మెటా సంస్థ నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)ను ఆశ్రయించగా అక్కడ కూడా కంపెనీకి చుక్కెదురైంది. వినియోగదారులు వాట్సాప్ వాడాలంటే తప్పనిసరిగా డేటా షేరింగ్కు అంగీకరించాలనే నిబంధన వినియోగదారులను బలవంతం చేయడమేనని గతంలో ఎన్సీఎల్ఏటీ స్పష్టం చేసింది. వాట్సాప్ తన మార్కెట్ ఆధిపత్యాన్ని ఉపయోగించుకుని అన్యాయమైన నిబంధనలను విధిస్తోందని రెగ్యులేటర్లు నిర్ధారించాయి.కేసు పరిధి విస్తరణఈ వివాదాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు కేసు పరిధిని మరింత విస్తరించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖను (మైటీ) ఈ విచారణలో చేర్చింది. ఈ వ్యవహారంపై ఫిబ్రవరి 9వ తేదీన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని ధర్మాసనం ప్రకటించింది. ప్రకటనల ప్రయోజనాల కోసం మెటా గ్రూప్ కంపెనీలతో డేటాను పంచుకోవడాన్ని ఐదేళ్లపాటు నిషేధించిన సీసీఐ ఉత్తర్వులను కూడా పరిగణనలోకి తీసుకుని పౌరుల డేటా రక్షణపై సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది.ఇదీ చదవండి: భారమైన బహుమతులు.. దూరమవుతున్న బంధాలు -
జాబిలితో నాసా అష్టావధానం!
అర్ధ శతాబ్దం తర్వాత చందమామ చెంతకు మానవసహిత యాత్ర చేపట్టబోతోంది నాసా. వాతావరణం అనుకూలిస్తే అమెరికాలో ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ నెల 8న ‘స్పేస్ లాంచ్ సిస్టమ్’ (ఎస్ఎల్ఎస్)కు చెందిన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన రాకెట్ గాల్లోకి లేస్తుంది. 32 అంతస్తుల ఎత్తుండే ఈ భారీ ఆ రాకెట్లో అతి శీతల ద్రవ ఆమ్లజని, ద్రవ ఉదజనితో కూడిన 26.5 లక్షల లీటర్ల ఇంధనం వాడబోతున్నారు. 53 ఏళ్ల క్రితం 1972లో నిర్వహించిన ‘అపోలో 17’ మిషన్ తర్వాత నాసా చేపడుతున్న తొలి మానవసహిత చంద్రయాత్ర ఇది. నలుగురు అమెరికన్ వ్యోమగాములు రీడ్ వైస్ మాన్ (కమాండర్), విక్టర్ గ్లోవర్ (పైలట్), క్రిస్టినా కోచ్ (మిషన్ స్పెషలిస్ట్), జెరెమీ హాన్సెన్ (మిషన్ స్పెషలిస్ట్) చంద్రకక్ష్యలోకి వెళ్లి తిరిగిరానున్నారు. ప్రస్తుతానికి వీరు జాబిల్లిపై దిగబోవడం లేదు. చంద్రుడి చుట్టూ ‘ఓ రౌండ్’ కొడతారు. చంద్రుడి ఆవలి వైపునకు వెళతారు. ఆ సందర్భంలో వారికి భూమి కొంతసేపు అదృశ్యమవుతుంది. అంతేకాదు... 40 నిమిషాలపాటు వారికి భూమితో సమాచార సంబంధాలు తెగిపోతాయి. అన్ని కమ్యూనికేషన్స్ కట్ అవుతాయి. భూమితో రియల్ టైమ్ కాంటాక్ట్స్ ఉండవు. అంటే డీప్ స్పేస్ ఐసోలేషన్లో ఉండిపోతారు! భూమి నుంచి బయల్దేరి తిరిగొచ్చేవరకు ఈ చంద్రయాత్రకు దాదాపు పది రోజులు పడుతుంది. భూకక్ష్యకు చేరగానే రాకెట్ నుంచి విడివడి నాసా ఆస్ట్రోనాట్లు వ్యోమనౌక ‘ఆరియన్’లో ప్రయాణం కొనసాగిస్తారు. భూమి నుంచి చంద్రుడి వరకు వారి యాత్ర సరళరేఖా మార్గంలో ఉండదు. వ్యోమనౌక పయనించే పథం ‘8 అంకె’ ఆకారంలో ఉంటుంది. ఈ పయన మార్గం నౌకను చంద్రుడి ఆవలి వైపునకు పట్టుకెళ్లడమే కాకుండా తిరిగి సురక్షితంగా భూమికి తీసుకొస్తుంది. దీన్ని ఫ్రీ రిటర్న్ ట్రాజెక్టరీ అంటారు. వ్యోమగాములు తొలుత భూమి చుట్టూ అత్యున్నత దీర్ఘవృత్తాకార కక్ష్యలో ఒక రోజు గడుపుతారు. ‘ఆరియన్’ నౌకలోని జీవనాధార వ్యవస్థలు సరిగా పనిచేస్తున్నాయో, లేదో ఈ వ్యవధిలో తెలిసిపోతుంది. ఈ సమయంలో ఏదైనా సమస్య తలెత్తితే వారు భూమి సమీపంలోనే ఉంటారు కనుక వెంటనే క్షేమంగా తిరిగి వచ్చేయవచ్చు. 24 గంటల తర్వాత కూడా నౌకలో అన్ని వ్యవస్థలు సవ్యంగా పనిచేస్తున్నాయని ధృవీకరించుకున్నాక వారు ముందుకు సాగి నాలుగు రోజులకు చంద్రుడి కక్ష్యకు చేరతారు. చంద్రుడి గురుత్వశక్తిని ఉపయోగించుకుని వ్యోమనౌక మనకు కనిపించని జాబిలి ఆవలి వైపునకు వెళ్లడమే కాకుండా... తిరుగు ప్రయాణానికి అవసరమైన ఇంజిన్లను మండించకుండానే భూమి వైపు మళ్లగలదు. అంటే.. చంద్రయాత్రలో భూమిని విడిచిపెట్టాక ‘ఆరియన్’ వ్యోమనౌక చోదక వ్యవస్థలో ఏదైనా సమస్య ఉత్పన్నమై ఇంజిన్ పూర్తిగా విఫలమైనా ఆందోళన చెందనక్కర్లేదు. భౌతికశాస్త్ర సూత్రాలే భూ, చంద్రుల గురుత్వశక్తుల రూపంలో వ్యోమగాముల పాలిత సహజ రక్షాకవచాలుగా నిలిచి వారికి భద్రత కల్పిస్తాయి! గురుత్వశక్తే వారిని తిరిగి క్షేమంగా భూ వాతావరణంలోకి రప్పిస్తుంది. అంతరిక్షంలో వ్యోమనౌక ప్రయాణించే ‘8’ అంకె ఆకృతిలోని పథ విశేషం ఇదే. ఈ యాత్రలో వ్యోమగాములు చంద్రుడి ఆవలి (వెనుక) వైపున చంద్రుడి ఉపరితలం నుంచి 4,700 మైళ్ళ దూరంలో ప్రయాణిస్తారు. ఆ సందర్భంగా భూమి నుంచి ఇప్పటివరకు అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించిన వ్యక్తులుగా వారు రికార్డు నెలకొల్పనున్నారు. చంద్రుడిపై దిగనప్పటికీ వారు భారీ గోతులమయమైన దాని ఉపరితలాన్ని దగ్గరిగా వీక్షిస్తారు. అలాగే ఉదయిస్తున్న భూమిని తిలకిస్తారు. చివర్లో ‘ఆరియన్’ క్రూ కేప్సూల్ గంటకు 40 వేల కిలోమీటర్ల వేగంతో భూమి వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. ఆ వేగంలో గాలి రాపిడికి నౌక వెలుపల 2,760 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడి జనిస్తుంది. అంత తీవ్రమైన వేడిని తట్టుకోవడం నౌక ఉష్ణ రక్షాకవచం (హీట్ షీల్డ్)కు ఓ అగ్నిపరీక్ష. అనంతరం పారాచూట్ల సాయంతో కేప్సూల్ నిదానంగా పసిఫిక్ మహాసముద్రంలో దిగుతుంది. వ్యోమగాములు లేకుండా ‘ఆర్టెమిస్-1’తో 2022లో మానవరహిత యాత్ర నిర్వహించి ‘ఆరియన్’ నౌక సన్నద్ధతను నాసా పరీక్షించింది. అప్పుడు కేప్సూల్ పసిఫిక్ మహా సంద్రంలో సురక్షితంగా దిగినప్పటికీ దాని హీట్ షీల్డ్ దెబ్బతిన్నట్టు అనంతర తనిఖీల్లో ఇంజినీర్లు గుర్తించారు. అయితే కేప్సూల్ లోపలి భాగానికి ఏమీ కాలేదు. అన్నీ సవ్యంగా సాగితే 2028లో చేపట్టే ‘ఆర్టెమిస్-3’ యాత్రతో జాబిల్లి దక్షిణ ధృవంపై నాసా వ్యోమగాములు దిగుతారు. చైనా కూడా ఈ విషయంలో అమెరికాతో తీవ్రంగా పోటీ పడుతోంది. 2030లో చంద్రుడిపై తమ వ్యోమగాములను దింపే దిశగా అది ప్రణాళికలు రచిస్తోంది. ద్రవ ఉదజని ఇంధనం లీక్... నాసా చంద్రయాత్ర మార్చికి వాయిదా!ఇంధన ట్యాంకు నుంచి లీకవుతున్న ద్రవ హైడ్రోజన్. దీంతో ‘ఆర్టెమిస్-2’ ప్రయోగాన్ని మార్చి నెలకు వాయిదా వేసిన నాసా. నలుగురు వ్యోమగాములు ప్రయాణించే ‘ఆరియన్’ వ్యోమనౌకను భూకక్ష్యకు చేర్చాల్సిన ఎస్ఎల్ఎస్ భారీ రాకెట్లో ఇంధనంగా క్రయోజెనిక్ ప్రొపెల్లెంట్ వాడతారు. ఈ రాకెట్ ఇంధన ట్యాంకుల్లో అతి శీతల ద్రవరూప హైడ్రోజన్ 20 లక్షల లీటర్లు, ఆక్సిజన్ 7 లక్షల లీటర్లు వినియోగిస్తారు. రాకెట్ అడుగు భాగం వద్ద ద్రవ ఉదజని లీకవుతున్నట్టు సెన్సర్లు గుర్తించడంతో ప్రయోగం వాయిదాపడింది. వాతావరణం అనుకూలించే దాన్ని బట్టి ఈ ఏడాది మార్చి 6, 7, 8, 9, 11 తేదీల్లో గానీ లేదా ఏప్రిల్ 1, 3, 4, 5, 6, 30 తేదీల్లో గానీ ఏదో ఒక రోజు ప్రయోగం జరిగే అవకాశముంది.(NASA, Interstellar Traveller, Space.com, BBC Sky at Night Magazine, India Today, News 18, El Mundo America, CBS News, WION, The Times of India).-జమ్ముల శ్రీకాంత్. -
ఎయిర్టెల్ షాక్.. ఆ ఫ్రీ ఆఫర్ ఇక లేదు
లక్షలాది మంది ఎయిర్టెల్ వినియోగదారులకు నిరాశ కలిగించే వార్త. రీఛార్జ్ ప్లాన్లతో పాటు వేల రూపాయల విలువైన ఉచిత సబ్స్క్రిప్షన్లను ఎయిర్టెల్ నిలిపివేసింది. ఇకపై రీఛార్జ్ చేసిన వినియోగదారులకు పెర్ప్లెక్సిటీ ప్రో ఏఐ సబ్స్క్రిప్షన్ అందుబాటులో ఉండదని కంపెనీ స్పష్టం చేసింది. అయితే, ఈ ఆఫర్ను ప్రారంభించినప్పుడే ఇది పరిమిత కాలానికి మాత్రమే వర్తిస్తుందని ఎయిర్టెల్ పేర్కొంది.పెర్ప్లెక్సిటీ ప్రో ఆఫర్ వివరాలుఎయిర్టెల్ గత సంవత్సరం తన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లతో పాటు పెర్ప్లెక్సిటీ ప్రో సబ్స్క్రిప్షన్ను తాత్కాలిక ప్రయోజనంగా అందించింది. దీని మార్కెట్ విలువ సుమారు రూ.17,000 కాగా, ఎయిర్టెల్ వినియోగదారులకు పూర్తిగా ఉచితంగా లభించింది. ఈ ఆఫర్ 2026 జనవరి 16 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుందని అప్పుడే ఎయిర్టెల్ ప్రకటించింది. ఆ గడువు ముగియడంతో ఇప్పుడు ఈ ప్రయోజనాన్ని ప్రీపెయిడ్ ప్లాన్ల నుంచి తొలగించింది.ఇప్పటికే క్లెయిమ్ చేసినవారికి ప్రభావం ఉంటుందా?జనవరి 16కు ముందే ఆఫర్ను క్లెయిమ్ చేసిన వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేదు. వారు ఆఫర్ యాక్టివేట్ అయిన తేదీ నుంచి ఒక సంవత్సరం పాటు పెర్ప్లెక్సిటీ ప్రో సేవలను కొనసాగించవచ్చు. అయితే, జనవరి 16 తర్వాత రీఛార్జ్ చేసిన వినియోగదారులకు ఈ ప్రయోజనం అందుబాటులో ఉండదు.ఒక ఆఫర్ ముగిసినా… మరో కొత్త అవకాశంపెర్ప్లెక్సిటీ ప్రో ఆఫర్ రద్దయినా, ఎయిర్టెల్ వినియోగదారులు పూర్తిగా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. తాజాగా ఎయిర్టెల్ అడోబ్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం కింద, ఎయిర్టెల్కు చెందిన సుమారు 360 మిలియన్ల వినియోగదారులు ఇప్పుడు అడోబ్ ఎక్స్ప్రెస్ ప్రీమియంకు ఉచిత యాక్సెస్ పొందనున్నారు. సాధారణంగా సంవత్సరానికి సుమారు రూ.4,000 ఖర్చయ్యే ఈ సబ్స్క్రిప్షన్ ద్వారా, వినియోగదారులు అడోబ్ జనరేటివ్ ఏఐ ఫీచర్లు, ఇతర ప్రీమియం సదుపాయాలను ఉచితంగా ఉపయోగించవచ్చు. -
సాఫ్ట్వేర్ బూమ్ మళ్లీ వస్తుందా?
దేశంలో 90ల నాటి సాఫ్ట్వేర్ బూమ్ మళ్లీ వస్తుందా? అంటే అవుననే అంటున్నారు ప్రముఖ మార్కెట్ వేత్త, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చైర్మన్, సహ వ్యవస్థాపకుడు రామ్దేవ్ అగర్వాల్. కేంద్ర బడ్జెట్ 2026ను ఆయన “భారతదేశ డిజిటల్ భవిష్యత్తుకు మాస్టర్ స్ట్రోక్”గా అభివర్ణించారు. 2047 వరకు డేటా సెంటర్లకు 100% ట్యాక్స్ హాలిడే (పన్ను రహితం) అందించే విధాన నిర్ణయాన్ని ఆయన “1,000 పౌండ్ల గొరిల్లా” (అత్యంత శక్తివంతమైన) తరహా నిర్ణయంగా పేర్కొన్నారు.ప్రస్తుత డిజిటల్ పురోగతిని 1990ల సాఫ్ట్వేర్ బూమ్తో పోలుస్తూ.. “మనం ఇప్పటికే ఏఐ(AI)ని స్వీకరించాం. ఇప్పుడు ‘ఏఐ ఫ్యాక్టరీ ఆఫ్ ది వరల్డ్’ను నిర్మిస్తున్నాం. విద్యుత్, కేబుల్స్, మౌలిక సదుపాయాల్లో భారీ మూలధనం పెట్టుబడి పెడుతున్నాం” అని రామ్దేవ్ అగర్వాల్ తెలిపారు.మరోవైపు కేంద్ర బడ్జెట్ 2026లో సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (STT) పెరగడం వల్ల సమీప కాలంలో మార్కెట్లకు హెడ్విండ్స్ ఉన్నాయని అంగీకరించారు. అయితే దేశ దీర్ఘకాలిక ఆదాయ కథ బలంగా కొనసాగుతోందని రామ్దేవ్ అగర్వాల్ స్పష్టం చేశారు. “4.3% ద్రవ్యలోటు లక్ష్యం, రూ.12.2 లక్షల కోట్ల క్యాపెక్స్ పుష్తో, దీర్ఘకాలంలో భారతదేశమే నిజమైన విజేత” అని ఆయన పేర్కొన్నారు.బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం.. ఫ్యూచర్స్పై ఎస్టీటీ 0.02% నుంచి 0.05 శాతానికి, ఆప్షన్స్ ప్రీమియంపై 0.10% నుంచి 0.15%కి పెరిగింది. అలాగే ఆప్షన్ ఎక్సర్సైజ్పై పన్ను 0.125% నుంచి 0.15 శాతానికి ఎగిసింది. ఈ చర్యలు స్వల్పకాలిక ట్రేడింగ్ కార్యకలాపాలను తగ్గించవచ్చని అగర్వాల్ అభిప్రాయపడ్డారు.ఇది చదివారా? వర్క్ ఫ్రమ్ హోమ్.. కొత్త కండీషన్బడ్జెట్లోని సూక్ష్మ అంశాలు కూడా అంతే ప్రాధాన్యత కలవని ఆయన అన్నారు. ఐటీ సేవల నిర్వచనాన్ని విస్తరించడం వల్ల గ్లోబల్ కెపాసిటీ సెంటర్లకు (GCC) బదిలీ ధరలపై స్పష్టత లభించిందని, ఇది హైఎండ్ టెక్నాలజీ వ్యాపారాలకు భారత్ స్వాగతం పలుకుతోందనే బలమైన సంకేతం అని పేర్కొన్నారు. -
ఒరాకిల్ నిధుల వేట.. రూ.14 లక్షల కోట్లు కావాలట!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో అగ్రగామిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న టెక్ దిగ్గజం ఒరాకిల్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఏఐ డేటా సెంటర్ల విస్తరణకు అవసరమైన భారీ నిధులను సమీకరించుకోవడానికి కంపెనీ దాదాపు 30,000 మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.నిధుల కొరతఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ టీబీ కోవెన్ పరిశోధన నివేదిక ప్రకారం.. ఒరాకిల్ తన ఏఐ మౌలిక సదుపాయాల కల్పన కోసం సుమారు 156 బిలియన్ డాలర్ల(సుమారు రూ.14 లక్షల కోట్లు) భారీ పెట్టుబడిని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ స్థాయిలో అప్పులు ఇవ్వడానికి అమెరికాలోని ప్రముఖ బ్యాంకులు వెనకడుగు వేస్తుండటం కంపెనీకి పెద్ద సవాలుగా మారింది. ఈ వ్యవహారంపై ఈక్విటీ, రుణ పెట్టుబడిదారులు అనుమానాలు వ్యక్తం చేస్తుండటంతో నిధుల కోసం కంపెనీ తన సొంత వనరులపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది.తొలగింపుల ద్వారా ఎంతంటే..ఒరాకిల్ తన కార్యకలాపాల పునరుద్ధరణలో భాగంగా 20,000 నుంచి 30,000 మంది ఉద్యోగులను తగ్గించాలని భావిస్తోంది. ఈ భారీ లేఆఫ్స్ ద్వారా కంపెనీకి సుమారు 8 బిలియన్ల డాలర్ల నుంచి 10 బిలియన్ డాలర్ల వరకు నగదు అందుబాటులోకి వస్తుందని టీవీ కోవెన్ అంచనా వేసింది. ఒకవేళ ఇదే జరిగితే ఒరాకిల్ చరిత్రలోనే ఇది అతిపెద్ద లేఆఫ్ అవుతుంది. గతంలో 2025 చివరలో కంపెనీ తన పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా 10,000 మందిని తొలగించింది. ఇటీవల అమెజాన్ కూడా తన ఏఐ వ్యూహంలో భాగంగా 16,000 మందిని తొలగించిన సంగతి తెలిసిందే.వ్యూహాత్మక మార్పులునిధుల సమీకరణ కోసం ఒరాకిల్ మరికొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. 2022లో 28.3 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన హెల్త్కేర్ సాఫ్ట్వేర్ యూనిట్ ‘సెర్నర్’ను విక్రయించే ఆలోచనలో కంపెనీ ఉంది. ‘బ్రింగ్ యువర్ ఓన్ చిప్’ అనే కొత్త విధానాన్ని కంపెనీ ప్రవేశపెట్టాలని భావిస్తోంది. దీని ప్రకారం కస్టమర్లే తమ సొంత హార్డ్వేర్ను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. తద్వారా ఒరాకిల్పై మూలధన భారం తగ్గుతుంది. మౌలిక సదుపాయాల నిర్మాణంలో నేరుగా పెట్టుబడి పెట్టాలని క్లయింట్లను ఒరాకిల్ కోరుతోంది.భారీ లక్ష్యాలుక్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సామర్థ్యాన్ని పెంచడానికి 2026 నాటికి 45 బిలియన్ డాలర్ల నుంచి 50 బిలియన్ డాలర్ల వరకు నిధులు సేకరించాలని ఒరాకిల్ లక్ష్యంగా పెట్టుకుంది. సామ్ ఆల్ట్మాన్ నేతృత్వంలోని ఓపెన్ఏఐ కోసం డేటా సెంటర్లను నిర్మించే బాధ్యతను కూడా ఒరాకిల్ గతంలో చేపట్టింది. అయితే ప్రస్తుత ఫైనాన్సింగ్ ఇబ్బందులు ఈ ప్రాజెక్టులపై ప్రభావం చూపే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: బంగారం ధరల యూటర్న్.. భారీ తగ్గుదల! -
బీఎస్ఎన్ఎల్కు రూ.28,473 కోట్లు
కేంద్ర బడ్జెట్ 2026-27లో టెలికాం రంగానికి ప్రభుత్వం ప్రతిపాదించిన వ్యయం గణనీయంగా పెరిగిందని టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. భారత్ నెట్, బీఎస్ఎన్ఎల్ మూలధన అవసరాలు, స్పెక్ట్రమ్ వ్యయం, నెట్వర్క్ రోలౌట్తో పాటు ఇతర అంతర్గత అవసరాలను తీర్చేందుకు ఈ కేటాయింపులు పెంచినట్లు ఆయన పేర్కొన్నారు.గత ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం టెలికాం రంగానికి రూ.53,000 కోట్ల కేటాయింపు ఉండగా, తాజా బడ్జెట్లో దాన్ని రూ.73,000 కోట్లకు పెంచినట్లు తెలిపారు. ఇది దాదాపు 40 శాతం వృద్ధి అని సింధియా వెల్లడించారు. టెలికాం మంత్రిత్వ శాఖకు, ముఖ్యంగా బీఎస్ఎన్ఎల్కు కేటాయింపులు పెరగడానికి గల కారణాలపై ప్రశ్నించగా, బీఎస్ఎన్ఎల్ను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.“బీఎస్ఎన్ఎల్ ఏఆర్పీయూ (సగటున ఒక్కో యూజర్ ద్వారా వచ్చే ఆదాయం) రూ.90 నుంచి రూ.99కు దాదాపు 9 శాతం పెరిగింది. త్వరలో మూడు అంకెల స్థాయిని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మా మూడు విభాగాల్లోనూ ఆదాయం పెరిగింది. అంతర్గత నగదు ప్రవాహాలతో పాటు క్యాపెక్స్ ఇంజెక్షన్ అవసరం ఉంది. తద్వారా బీఎస్ఎన్ఎల్ను పునరుజ్జీవన మార్గంలో ముందుకు తీసుకెళ్లగలుగుతాం,” అని మంత్రి తెలిపారు.ప్రతిపాదిత అదనపు బడ్జెట్లో గ్రామీణ బ్రాడ్బ్యాండ్ ప్రాజెక్ట్ అయిన భారత్ నెట్కు నిధులు కేటాయించినట్లు ఆయన చెప్పారు. బీఎస్ఎన్ఎల్కు స్పెక్ట్రమ్ కోసం సుమారు రూ.1.39 లక్షల కోట్ల విలువైన కేటాయింపులు చేసినట్లు పేర్కొన్నారు. టవర్లు, మౌలిక వసతులు, బ్యాటరీలు వంటి అన్ని అంశాల్లో సమగ్ర అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.అలాగే ఈశాన్య ప్రాంత అభివృద్ధికి కేటాయింపులు కూడా గణనీయంగా పెరిగాయని సింధియా తెలిపారు. గతంలో రూ.4,495 కోట్లుగా ఉన్న సవరించిన అంచనాలను రూ.6,800 కోట్లకు పెంచామని, ఇది దాదాపు 50 శాతం వృద్ధి అని వివరించారు. ఈ బడ్జెట్లో ఈశాన్య ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చినట్లు పేర్కొన్న ఆయన, పట్టణీకరణ, ఆరు రాష్ట్రాల్లోని ఐదు బౌద్ధ సర్క్యూట్ల అభివృద్ధి, 4,000 ఈ-బస్సుల ప్రవేశపెట్టడం, అలాగే ఆరోగ్యం మరియు విద్యా రంగాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. -
డేటా సెంటర్ పెట్టుబడులపై స్పష్టత
భారతదేశాన్ని గ్లోబల్ డేటా హబ్గా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. విదేశీ సంస్థలు భారత్లో డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ఉన్న పన్ను సంబంధిత అడ్డంకులను తొలగిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బడ్జెట్ అనంతర విలేకరుల సమావేశంలో స్పష్టతనిచ్చింది. క్లౌడ్ ఆధారిత సేవలు అందించే అంతర్జాతీయ సంస్థలకు ఈ నిర్ణయం ఊరటనివ్వనుంది.పార్లమెంట్లో బడ్జెట్ సమర్పణ అనంతరం మీడియా సమావేశంలో ఆర్థికశాఖ వివరాల ప్రకారం.. ‘ఒక అంతర్జాతీయ సంస్థ భారత్లో డేటా సెంటర్ను ఏర్పాటు చేసినంత మాత్రాన ఆ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఆదాయంపై భారత్లో పన్ను విధించబోం. విదేశీ సంస్థలు ఇక్కడ డేటా సెంటర్లను ఏర్పాటు చేయడం వల్ల స్థానిక ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి. ఇది దేశానికి నికర ఆర్థిక వెసులుబాటు అందిస్తుంది. భారత్లో ఉన్న డేటా సెంటర్ కార్యకలాపాలకు మాత్రమే పన్ను వర్తిస్తుంది. సదరు సంస్థ తన సేవలను భారత్లోని రీసెల్లర్ ద్వారా విక్రయిస్తే, ఆ విక్రయాలపై వచ్చే ఆదాయానికి యథావిధిగా పన్ను విధిస్తారు’ అని తెలిపింది.ఎందుకు ఈ నిర్ణయం?క్లౌడ్ సేవలు అందించే సంస్థలు ప్రపంచవ్యాప్తంగా వందలాది డేటా సెంటర్లను ఉపయోగిస్తాయి. ఏ నిర్దిష్ట సెంటర్ వల్ల ఎంత ఆదాయం వచ్చిందో లెక్కించడం సాంకేతికంగా చాలా క్లిష్టమైన ప్రక్రియ. ‘గ్లోబల్ సంస్థలు భారతదేశంలో తమ సేవలను పెంచుకోవాలని మేము కోరుకుంటున్నాం. పన్నుల భయంతో వారు వెనకడుగు వేయకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.దీనివల్ల కలిగే ప్రయోజనాలుఅమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు భారత్లో మరిన్ని డేటా సెంటర్లను నిర్మించే అవకాశం ఉంది. నిర్మాణ, నిర్వహణ రంగాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తాయి. దేశంలో డేటా స్టోరేజ్ సామర్థ్యం పెరగడం వల్ల డిజిటల్ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ప్రభుత్వం ప్రకటించిన ఈ సరళీకృత నిబంధనలు అంతర్జాతీయ టెక్ దిగ్గజాలకు భారత్లో పెట్టుబడులు పెట్టడానికి భరోసా ఇస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగంలోని కీలక ప్రకటనలు -
బడ్జెట్ 2026.. ఇండియా ఏఐ మిషన్ విస్తరణకు చాన్స్
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను పాలన, పరిశ్రమల అభివృద్ధికి కీలక శక్తిగా అభివర్ణించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెడుతూ.. నైపుణ్యం, పోటీతత్వం, ఉత్పాదకతతో భారత్ను ప్రపంచస్థాయికి తీసుకెళ్తామన్నారు. ఈ క్రమంలో యూనియన్ బడ్జెట్ 2026లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రకటించారు. పాలన- ప్రజా సేవలు.. ఏఐ అనువర్తనాలు “ఫోర్స్ మల్టిప్లయర్స్”గా పనిచేస్తాయని.. సేవల అందజేతలో సమర్థత పెరుగుతుందని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆరోగ్యరంగం, వ్యవసాయం, సామాజిక సంక్షేమ పథకాలలో AI వినియోగం ద్వారా లక్ష్యబద్ధత పెరిగి.. లీకేజీలు తగ్గుతాయని అంచనా వేశారు.రంగాల వారీగా AI వినియోగం చూసుకుంటే.. డిజిటల్ పాలన: మోసాల గుర్తింపు, కంప్లయెన్స్, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం.విద్య: వ్యక్తిగతీకరించిన లెర్నింగ్ ప్లాట్ఫారమ్లుఆరోగ్య రంగం: డయాగ్నస్టిక్స్, టెలీమెడిసిన్ విస్తరణ.వ్యవసాయం: పంట దిగుబడుల అంచనా, వాతావరణ సూచనలు, ప్రిడిక్టివ్ అనలిటిక్స్ కోసం..ఇండియా AI మిషన్ విస్తరణ.. పరిశ్రమ వర్గాలు ఇండియా AI మిషన్కు కేటాయింపులను రూ.2,000 కోట్ల నుంచి కనీసం రూ.5,000 కోట్లకు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇందులో ప్రధానంగా.. జాతీయ కంప్యూట్ సామర్థ్యం (GPUలు, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంపు), స్టార్టప్లు, పరిశోధకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కోసం అవసరమైన కంప్యూటింగ్ వనరులు (GPUలు, క్లౌడ్ సర్వర్లు, హై-పర్ఫార్మెన్స్ కంప్యూటర్లు) తక్కువ ఖర్చుతో ఉపయోగించుకునేలా ప్రభుత్వం లేదా సంస్థలు క్రెడిట్లు/సబ్సిడీలు ఇవ్వడం.. అందుబాటులో ఉండే AI ప్రయోగశాలలు (labs) ఏర్పాటు చేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వనరులు, సాంకేతికత, శిక్షణ, పరిశోధన అవకాశాలను అందరికీ సమానంగా అందించడం ఉన్నాయి.AI స్టార్టప్లకు ప్రోత్సాహకాలు.. AI స్వీకరణ ఖర్చు తగ్గించేందుకు పన్ను రాయితీలు, సబ్సిడీలు ఇవ్వాలని సూచనలు వస్తున్నాయి. ఈ క్రమంలో.. తక్కువ ఖర్చుతో కంప్యూట్ వనరులు, స్పష్టమైన ప్రోత్సాహకాలు అందించడం ద్వారా భారత్ను గ్లోబల్ AI అభివృద్ధిలో పోటీదారుగా నిలపాలని లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలనుకుంటోంది. మొత్తంగా ఏఐని దేశ అభివృద్ధి, పరిశ్రమల పోటీ, ప్రజా సేవల సమర్థత కోసం ప్రధాన సాధనంగా ప్రభుత్వం గుర్తించినట్లు ఈ బడ్జెట్తో అర్థమవుతోంది. -
ఏఐపై నమ్మకం కల్పించమే ప్రధానం
భారతదేశం డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) రంగంలో ప్రపంచానికి దిక్సూచిగా నిలుస్తోంది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆ వ్యవస్థపై నమ్మకాన్ని అందించే సమయం ఆసన్నమైందని ప్రముఖ ఏఐ సంస్థ థింక్360.ఏఐ వ్యవస్థాపకులు, సీఈఓ అమిత్ దాస్ పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ 2026 నేపథ్యంలో ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు.ఇండియా డిజిటల్ రంగంలో ఇప్పటికే ఆధార్, యూపీఐ, డేటా షేరింగ్ వంటి విభాగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని అమిత్ దాస్ గుర్తు చేశారు. ఇది కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అద్భుతాలు సృష్టిస్తోందని అన్నారు. డిసెంబర్ 2025లోనే యూపీఐ ద్వారా 21.6 బిలియన్ లావాదేవీలు జరగడం, వాటి విలువ సుమారు రూ.28 లక్షల కోట్లకు చేరడం భారత్ సాధించిన డిజిటల్ వృద్ధికి నిదర్శనమని చెప్పారు.ఈ విజయాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లాలంటే జాతీయ స్థాయిలో ఏఐపై నమ్మకాన్ని పెంపొందించే విధానం అవసరమని అభిప్రాయపడ్డారు. ఇది ఏఐ వ్యవస్థలను ప్రామాణీకరించడం, ఆడిట్ చేయడం, ఫలితాలను పారదర్శకంగా పర్యవేక్షించడం ద్వారా వ్యవస్థాగత ప్రమాదాలను తగ్గిస్తుందని వివరించారు.ఇదీ చదవండి: బంగారం, వెండి ధరలు క్రాష్వికసిత్ భారత్ 2047‘వికసిత భారత్ 2047’ లక్ష్యాన్ని చేరుకోవడానికి కేవలం పైలట్ ప్రాజెక్టులు సరిపోవని, ప్రభుత్వ, ఆర్థిక వ్యవస్థల మూలాల్లో డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవాలని దాస్ స్పష్టం చేశారు. నవంబర్ 2025లో డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) రూల్స్ నోటిఫై చేయడాన్ని ఆయన స్వాగతించారు. 18 నెలల అనుసరణ గడువు ఉన్న నేపథ్యంలో బడ్జెట్ 2026లో ఈ క్రింది అంశాలకు నిధులు కేటాయించాలని కోరారు.డేటా గోప్యతను కాపాడే సాంకేతికత అభివృద్ధి.పౌరుల అనుమతితో కూడిన డేటా నిర్వహణ వ్యవస్థల ఏర్పాటు.బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్) రంగంలో సంస్కరణలు. -
అమెరికా, ఫ్రాన్స్లు కాదన్నాయి.. భారత్ మాత్రం సాధించింది!
విద్యుత్ వృథా, ఛార్జింగ్కు ఎక్కువ టైం.. బరువైన బ్యాటరీలు.. సిలికాన్ ఆధారిత ప్రాసెసర్లతో విద్యుత్ వాహనాలు ఎదుర్కొంటున్న సమస్యలు ఇవి. అయితే.. ఇకపై ఈ సమస్యలేవీ ఎదురు కాకపోవచ్చు. గాలియం-నైట్రైడ్ టెక్నాలజీతో.. గంటల తరబడి ఛార్జింగ్ కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా, తేలికైన బ్యాటరీలతో ఎక్కువ దూరం రయ్మంటూ దూసుకెళ్లే అవకాశం కలగబోతుంది. ఇంతకీ ఈవీ రంగపు భవిష్యత్తును మార్చబోయే ఈ అరుదైన టెక్నాలజీ మనకు ఎలా సొంతం అయ్యిందో తెలుసా?.. టెక్నాలజీ రంగంలో భారత్ ఓ మహత్తర ఘట్టాన్ని నమోదు చేసింది. భారత రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్డీవో)కు చెందిన సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ లాబొరేటరీ డైరెక్టర్ డాక్టర్ మీనా మిశ్రా పరిశోధనల పుణ్యమా అని ఇకపై దేశం రక్షణ రంగంలోనే కాదు... విద్యుత్తు వాహనాలు, 5జీ నెట్వర్క్ల విషయంలోనూ గణనీయమైన పురోగతిని నమోదు చేయనుంది. గాలియం-నైట్రైడ్ విషయంలో డాక్టర్ మీనా మిశ్రా సాధించిన విజయం దీనికి కారణం. ఇంతకీ ఏమా గాలియం-నైట్రైడ్? డీఆర్డీవో సైంటిస్ట్ సాధించిన విజయమేమిటి? దాంతో దేశానికి, సామాన్యుడికి వచ్చే లాభమేమిటి?మీకు సిలికాన్ గురించి తెలిసే ఉంటుంది. కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్లోని ప్రాసెసర్లు ఈ అర్ధ వాహకంతోనే తయారవుతాయి. దశాబ్దాలుగా మన టెక్నాలజీ పురోభివృద్ధికి కేంద్రం ఈ సిలికానే. అయితే ఈ పదార్థంతో అనేక సమస్యలూ ఉన్నాయి. మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఇప్పటివరకూ దీన్నే వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. థ్యాంక్స్టు డాక్టర్ మీనా మిశ్రా. ఇకపై ఆ పరిస్థితి ఉండదు. సిలికాన్తో వచ్చే సమస్యలను దాదాపుగా పరిష్కరించగల సరికొత్త అర్ధవాహకం గాలియం-నైట్రైడ్తో(Gallium Nitride GaN) ప్రాసెసర్ల తయారీకి మార్గం సుగగమైంది మరి. డీఆర్డీవో శాస్త్రవేత్తలు గాలియం-నైట్రైడ్ మోనోలిథిక్ మైక్రోవేవ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లను విజయవంతంగా తయారు చేయగలిగారు. రక్షణ రంగానికి కీలకమైన రాడార్లు, క్షిపణులు, డ్రోన్లు, యుద్ధ విమానాల్లో ఈ సర్క్యూట్లు కీలకం కానున్నాయి. భారతదేశం ఇటీవలి కాలంలో కొనుగోలు చేసిన రఫేల్ యుద్ధ విమానాల్లోని ఎలక్ట్రానిక్ ఉపకరణాల్లోనూ ఈ గాలియం-నైట్రైడ్ ఉంటుంది కానీ.. ఆ టెక్నాలజీని మనకిచ్చేందుకు ఫ్రాన్స్ నిరాకరించింది. గతంలోనూ ఇతర అగ్రరాజ్యాలు కూడా ఈ టెక్నాలజీని భారత్తో పంచుకునేందుకు నిరాకరించాయి. డాక్టర్ మీనా మిశ్రా పరిశోధనల ఫలితంగా ఇప్పుడు భారత్ గాలియం-నైట్రైడ్ టెక్నాలజీ కలిగిన ఏడవ దేశంగా ఎదిగింది. ఇప్పటివరకూ అమెరికా, ఫ్రాన్స్, రష్యా, దక్షిణ కొరియా, చైనా, జర్మనీల వద్ద మాత్రమే ఈ టెక్నాలజీ ఉండటం గమనార్హం.ఏమిటి దీని ప్రత్యేకతలు..ఒక్క ముక్కలో చెప్పాలంటే సిలికాన్తో పోలిస్తే గాలియం-నైట్రైడ్ ఎక్కువ వోల్టేజీలు, ఫ్రీక్వెన్సీ, ఉష్ణోగ్రతల్లోనూ సమర్థంగా పని చేయగలదు. విద్యుత్తు వాహనాల్లో బ్యాటరీల నుంచి విద్యుత్తును మోటారుకు.. మోటారు నుంచి బ్యాటరీలకు మార్చేందుకు ప్రస్తుతం సిలికాన్ను ఉపయోగిస్తున్నారు. అయితే దీనివల్ల విద్యుత్తు వృథా అవుతూంటుంది. గాలియం-నైట్రైడ్ ఆధారిత ప్రాసెసర్లతో ఈ నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ఒక అంచనా ప్రకారం సిలికాన్తో వచ్చే నష్టాలు 6 - 10 శాతం వరకూ ఉంటే.. గాలియం-నైట్రైడ్ ప్రాసెసర్లతో వచ్చే నష్టాలు 2 - 6 శాతం మాత్రమే. అంతేకాదు.. ఈ పదార్థంతో బ్యాటరీ ఛార్జింగ్ కూడా చాలా వేగంగా జరిగి పోతుంది. బ్యాటరీల బరువు తగ్గడమే కాకుండా.. ఎక్కువ విద్యుత్తును నిల్వ చేసుకునే అవకాశం వస్తుంది. అంటే.. విద్యుత్తు వాహనాల మైలేజీ పెరగడం, గంటలు పడుతున్న బ్యాటరీ ఛార్జింగ్ సమయం తగ్గడం జరిగిపోతుందన్నమాట. అలాగే సోలార్ ప్యానెల్స్ ఉత్పత్తి చేసే డైరెక్ట్ కరెంట్ (డీసీ)ను... మనం వాడుకునే ఆల్టర్నేట్ కరెంట్ (ఏసీ)కి మార్చే క్రమంలో అయ్యే నష్టాన్ని సగానికి సగం తగ్గిస్తుంది. అంతేకాదు.. 5జీ నెట్వర్క్ల ద్వారా డేటా ట్రాన్స్ఫర్ వేగాన్ని పెంచేందుకు కూడా దీన్ని వాడుకోవచ్చు. ఇన్ని ప్రయోజనాలున్నాయి కాబట్టే.. ‘‘డాక్టర్ మీనా మిశ్రా సాధించిన విజయం ద్వారా దేశం విదేశాల నిషేధాలను అధిగమించగలిగాము. దేశ భద్రత విషయంలో ఇదో మేలి మలుపు’’ అని వ్యాఖ్యానించారు.:::గిళియారు గోపాలకృష్ణ మయ్యా, సీనియర్ జర్నలిస్ట్. -
ఈ ఏడాది చివరి నాటికి అధునాతన కార్ల టెక్నాలజీ..!
ఎదురెదురుగా వాహనాలు వచ్చినా... ఒకదానితో ఒకటి ఢీకొనవు... అంతే కాకుండా ప్రమాదానికి ఆస్కారముందని డ్రైవర్లను అప్రమత్తం కూడా చేస్తాయి... దీంతో ప్రమాదాలు విపరీతంగా తగ్గే అవకాశముంటుంది.... అవును మీరు వింటున్నది వాస్తవమే. ఈ ఏడాది చివరి నాటికి ఈ అధునాతన టెక్నాలజీ రోడ్లపైకి వచ్చే అవకాశముంటుంది. కార్లలో అమర్చే V2V చిప్ ద్వారా ఇది సాధ్యమే.2026 చివరి నాటికి కొత్త వాహనాలలో V2V చిప్ చేరే అవకాశముంటుంది. కొత్త కార్లలో కంపెనీల నుంచే చిప్ యాడ్ అయిన తర్వాత వాహనాలు చేతికి అందుతాయి. చిప్ ధర కేవలం 5వేల రూపాయల నుంచి నుండి 7 వేల రూపాయల వరకు ఉంటుంది. ఇప్పటికే... ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ....రెనాల్ట్ ఇండియా కంపెనీ.... తన పాపులర్ ఎస్ యూవీ డస్టర్ వాహనానికి సంబంధించి మూడవ తరం మోడల్ ను ఇటీవల జనవరి 26న భారతదేశంలో ప్రవేశపెట్టింది. ఆ వాహనంలో చిప్ అమర్చి ఉన్న తీరును.. అది పని చేస్తున విధానాన్ని... టీజర్ ను విడుదల చేసి ఫస్ట్ లుక్ ను చూపించింది. ఈ కారు భద్రత కోసం లెవల్ -2 ఏడీఏఎస్ ఫీచర్లను పొందే అవకాశం ఉందని ప్రతినిధులు వెల్లడించారు. -
రియల్మీ కొత్త స్మార్ట్ఫోన్: 10,001 mAh బ్యాటరీతో..
స్మార్ట్ఫోన్ వినియోగదారులతో చాలామందికి ఎదురయ్యేది ఛార్జింగ్ సమస్యే. దీనికి చెక్ పెట్టడానికి రియల్మీ (Realme) లేటెస్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఇది ఏకంగా 10,001 mAh బ్యాటరీతో వస్తుంది. దీని ధర ఎంత?, డెలివరీలు ఎప్పుడు అనే విషయాలు ఈ కథనంలో చూసేద్దాం.రియల్మీ లాంచ్ చేసిన ఎక్కువ బ్యాటరీ పవర్ కలిగిన స్మార్ట్ఫోన్ పేరు 'పీ4 పవర్ 5జీ'. ఇది 6.78 అంగుళాల 4డి కర్వ్⁺ అమోలెడ్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ & 6500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్తో 12 జిబి వరకు ర్యామ్ మరియు 256 జిబి స్టోరేజ్తో లభించే ఈ స్మార్ట్ఫోన్ ఫిబ్రవరి 5 నుంచి అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.ట్రాన్స్ఆరెంజ్, ట్రాన్స్సిల్వర్, ట్రాన్స్బ్లూ ఎంపికలలో లభించే రియల్మీ పీ4 పవర్ 5జీ మొబైల్.. 8 జీబీ/ 128 జీబీ ధర రూ. 25,999 నుంచి ప్రారంభమవుతుంది. 8 జీబీ / 256 జీబీ ధర రూ. 27,999 &12 జీబీ / 256 జీబీ ధర రూ. 30,999. ఇది పెద్ద బ్యాటరీ కలిగి ఉన్నప్పటికీ.. 219 గ్రాముల బరువు ఉంటుంది. ఈ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. -
రూ.4000 విలువైన ప్రీమియం.. ఏడాదిపాటు ఉచితం!
భారతదేశంలోకి ప్రముఖ టెలికాం కంపెనీ 'ఎయిర్టెల్'.. ఓ గొప్ప నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే తొలిసారిగా.. తన 36 కోట్ల వినియోగదారులకు ప్రముఖ డిజైన్ ప్లాట్ఫామ్ అడోబ్ ఎక్స్ప్రెస్ ప్రీమియం (Adobe Express Premium)ను ఉచితంగా అందిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ ఈ కథనంలో తెలుసుకుందాం.అడోబ్ ఎక్స్ప్రెస్ ప్రీమియం అనేది కేవలం మొబైల్ యూజర్లకు మాత్రమే కాకుండా.. బ్రాడ్బ్యాండ్, డీటీహెచ్ కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. సుమారు రూ.4,000 విలువైన ఈ ప్రీమియం ప్యాకేజీని ఎయిర్టెల్ యూజర్లు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా.. ఏడాది పాటు ఉచితంగా పొందవచ్చు.అడోబ్ ఎక్స్ప్రెస్ అనేది.. అడోబ్ రూపొందించిన ఒక సులభమైన, వేగవంతమైన క్రియేట్ ఎనీథింగ్ యాప్. డిజైన్ అనుభవం లేకపోయినా, ఎవరికైనా ప్రొఫెషనల్ స్థాయి పోస్టర్లు, సోషల్ మీడియా కంటెంట్, వీడియోలు, ఆహ్వాన పత్రికలు, మార్కెటింగ్ మెటీరియల్ రూపొందించడానికి ఇది సహాయపడుతుంది. ఇందులో ఉన్న AI ఆధారిత ఫీచర్లు పనిని మరింత వేగంగా, ఆకర్షణీయంగా చేస్తాయి. ఎయిర్టెల్ థాంక్స్ యాప్ట్లో లాగిన్ అయి ఈ సర్వీస్ యాక్టివేట్ చేసుకోవచ్చు.అడోబ్ ఎక్స్ప్రెస్ కేవలం ఇంగ్లీష్ భాషలో మాత్రమే కాకుండా.. హిందీ, తమిళం, బెంగాలీ భాషల్లో కూడా అందుబాటులో ఉంది. దీనివల్ల వినియోగదారులు తమ మాతృభాషలోనే డిజైన్ చేయగలుగుతారు. పండుగ శుభాకాంక్షలు, పెళ్లి ఆహ్వానాలు, వాట్సాప్ స్టేటస్లు, స్థానిక దుకాణాల ప్రమోషన్లు అన్నీ సులభంగా రూపొందించవచ్చు.ఇదీ చదవండి: పెరిగిపోతున్న గోల్డ్ రేటు.. కియోసాకి కొత్త అంచనాఅడోబ్ ఎక్స్ప్రెస్ ప్రీమియం ద్వారా.. కంటెంట్ క్రియేటర్లు & ఇన్ఫ్లూయెన్సర్లు.. రీల్స్, యూట్యూబ్ థంబ్నెయిల్స్, వైరల్ కంటెంట్ సులభంగా తయారు చేయవచ్చు. సాధారణ వినియోగదారులు పండుగ శుభాకాంక్షలు, వ్యక్తిగత ఆహ్వానాలు పంపుకోవచ్చు. విద్యార్థులు ప్రాజెక్టులు, ప్రెజెంటేషన్లు, పోర్ట్ఫోలియోలు రూపొందించవచ్చు. చిన్న వ్యాపారులు లోగోలు, పోస్టర్లు, సోషల్ మీడియా ప్రకటనలు నిమిషాల్లో రూపొందించవచ్చు.You x Us x @adobeexpress - collab of the year!Casually unlocking the quick & easy design app worth ₹4000 for all of you.#EveryoneCanDesign #MadeWithAdobeExpress #AirtelXAdobe pic.twitter.com/JmCHG4tvgE— airtel India (@airtelindia) January 29, 2026 -
వివో కొత్త స్మార్ట్ఫోన్.. రెండు వేరియంట్లు
మొబైల్ తయారీ సంస్థ వివో తన ప్రీమియం సెగ్మెంట్లో జైస్ పార్టనర్షిప్తో ‘వివో ఎక్స్200టీ’ స్మార్ట్ మొబైల్ను లోకి విడుదల చేసింది. స్పెసిఫికేషన్ల చూస్తే.., 6.67 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, 120హెచ్డీ రిఫ్రెష్ రేటు, హెచ్డీఆర్ 10+ సపోర్ట్ ఉంది 3.73 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400+ ప్రాసెసర్ను అమర్చారు. ఈ ఫోన్లో వెనక వైపు 50 ఎంపీ సామర్థ్యం కలిగిన 3, ముందువైపు 32 ఎంపీ కెమెరా లున్నాయి. 6,200ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉంది. ఇది 90డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. 40డబ్ల్యూ వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది.ఇది రెండు వేరియంట్లలో లభిస్తోంది. 12జీబీ+ 256జీబీ వేరియంట్ రూ.59,999గా, 12జీబీ+ 512జీబీ వేరియంట్ ధర రూ.69,999గా ఉన్నాయి. ఈ మొబైల్కు ఐదేళ్ల పాటు ఓఎస్ అప్డేట్స్, 7ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ఇవ్వనున్నట్లు కంపెనీ హామీ ఇస్తోంది. హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ కార్డులతో కొనుగోళ్లపై రూ.5వేలు ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. ఫోన్ ఎక్సే్ఛంజీ బోనస్ రూ.5 వేలు లభిస్తుంది. ప్రస్తుతం ప్రీబుకింగ్స్ మొదలయ్యాయి.ఇదీ చదవండి: ఏజెంటిక్ ఏఐ నిపుణులకు డిమాండ్ -
హాయ్ ఫ్రెండ్స్... ఇన్స్టా ఇకపై ఫ్రీ కాకపోవచ్చు!
ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ వంటి తన ప్లాట్ఫాంలలో కొత్త చెల్లింపు సబ్స్క్రిప్షన్లను ప్రవేశపెట్టేందుకు మెటా సిద్ధమవుతోంది. యాప్ల ప్రాథమిక వెర్షన్లు ఉచితంగానే కొనసాగుతాయి. అయితే ఉత్పాదకత, సృజనాత్మకత, ఆధునిక ఏఐ (AI) టూల్స్తో వచ్చే అదనపు ఫీచర్ల కోసం ప్రీమియం ప్లాన్లను పరీక్షించనున్నట్లు మెటా టెక్క్రంచ్కు ధ్రువీకరించింది.మెటా ప్రకారం.. ప్రతి యాప్కు దాని ప్రత్యేక ప్రయోజనాలకు అనుగుణంగా వేర్వేరు సబ్స్క్రిప్షన్ ప్లాన్లు ఉంటాయి. ఒకే స్థిరమైన ప్లాన్కు బదులుగా, వివిధ ఫీచర్ బండిల్స్ను ప్రయోగాత్మకంగా అందించి, వినియోగదారులకు ఏవి ఉపయోగకరంగా ఉంటాయో తెలుసుకోవాలని కంపెనీ భావిస్తోంది.ఈ సబ్స్క్రిప్షన్లలో ప్రధానంగా ఏఐ ఫీచర్లు ఉండనున్నాయి. మెటా ఇటీవల సుమారు 2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన ‘మానస్’ ఏఐ ఏజెంట్ను విస్తృతంగా వినియోగంలోకి తీసుకురావాలని యోచిస్తోంది. మానస్ను మెటా యాప్లలోనే భాగంగా చేర్చడమే కాకుండా, వ్యాపారాల కోసం ప్రత్యేక సబ్స్క్రిప్షన్గా కూడా అందించనుంది. ఇప్పటికే ఇన్స్టాగ్రామ్లో మానస్ ఏఐ షార్ట్కట్ను జోడించే పనిలో మెటా ఉంది.అలాగే, అధునాతన ఏఐ ఫీచర్లకు ఛార్జీలు వసూలు చేయాలని కూడా మెటా భావిస్తోంది. ఉదాహరణకు, ‘వైబ్స్’ అనే ఏఐ ఆధారిత షార్ట్-ఫార్మ్ వీడియో టూల్. దీంట్లో ఏఐని ఉపయోగించి వీడియోలను సృష్టించడం, రీమిక్స్ చేయడం వంటివి చేయొచ్చు. ఇప్పటివరకు ఉచితంగా ఉన్న ఈ ఫీచర్ను ఫ్రీమియం మోడల్కు మార్చే యోచనలో మెటా ఉంది.ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రిప్షన్ తీసుకునే వినియోగదారులకు అపరిమిత ఆడియన్స్ లిస్టులు సృష్టించే అవకాశం, ఎవరు తిరిగి ఫాలో చేయడం లేదో తెలుసుకునే ఫీచర్, స్టోరీలను అనామకంగా వీక్షించే సౌకర్యం (పోస్టర్కు తెలియకుండా) వంటి అదనపు ఫీచర్లు అందుబాటులోకి రావొచ్చు.కాగా ఈ కొత్త సబ్స్క్రిప్షన్లు, మెటా వెరిఫైడ్ వేరువేరు. మెటా వెరిఫైడ్ ప్రధానంగా క్రియేటర్లు, బిజినెస్ అకౌంట్ల కోసం రూపొందించినది. ఇందులో వెరిఫైడ్ బ్యాడ్జ్, డైరెక్ట్ సపోర్ట్, ఇంపర్సనేషన్ ప్రొటెక్షన్ వంటి ప్రయోజనాలు ఉంటాయి. రాబోయే కొత్త సబ్స్క్రిప్షన్లు మాత్రం సాధారణ రోజువారీ యాజర్ల కోసం తీసుకొస్తున్నవి. -
రిలయన్స్ జియో చొరవ.. ఏఐ ఎడ్యుకేషన్
విద్యా రంగానికి అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నైపుణ్యాలను అందించడం ద్వారా డిజిటల్ వ్యత్యాసాన్ని తగ్గించడానికి రిలయన్స్ జియో తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తృతమైన విద్యా ప్రచారాన్ని ప్రారంభించింది. ఆధునిక యుగంలో అభ్యాస & బోధనా పద్ధతులను మెరుగుపరచడానికి 'గూగుల్ జెమిని ప్రో' యొక్క ఆచరణాత్మక అప్లికేషన్పై ఈ చొరవ దృష్టి పెడుతుంది. అత్యాధునిక ఏఐ సాధనాలను తరగతి గదుల్లోకి తీసుకురావడం ద్వారా, సాంకేతికతతో కూడిన వృత్తిపరమైన రంగంలో రాణించగల డిజిటల్ నైపుణ్యం కలిగిన విద్యార్థులను మరియు ఉపాధ్యాయులను తయారు చేయడమే జియో లక్ష్యం.ఈ ప్రచారం ఇప్పటికే గణనీయమైన పురోగతిని సాధించి.. రెండు రాష్ట్రాల్లో 2200 కంటే ఎక్కువ పాఠశాలలకు విజయవంతంగా చేరుకుంది. జియో సీనియర్ ఎగ్జిక్యూటివ్ల నేతృత్వంలో జరుగుతున్న ఈ ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలలో 27,000 కంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు & విద్యార్థులు పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో1500 కంటే ఎక్కువ పాఠశాలల్లో 20వేల మంది, తెలంగాణలో 700 పాఠశాలల్లో 7000 వేల మందికిపైగా ఈ శిక్షణ పొందుతున్నారు.ఈ ఇంటరాక్టివ్ వర్క్షాప్లు గూగుల్ జెమిని వ్యవస్థను పరిచయం చేయడానికి ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. పాఠ్యాంశాల నోట్స్ తయారు చేయడం, అసైన్మెంట్లు రాయడం & సంక్లిష్టమైన కోడింగ్ ప్రాజెక్ట్లలో సహాయం పొందడం వంటి పనులను ఈ సాంకేతికతతో ఎలా సులభతరం చేయవచ్చో ఇందులో వివరించారు. దీర్ఘకాలిక వృత్తిపరమైన వృద్ధి కోసం ప్రాజెక్ట్ ఐడియేషన్, గ్రాఫిక్ డిజైన్ మరియు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కోసం AIని ఉపయోగించడంపై కూడా ఈ శిక్షణ ప్రాధాన్యతనిస్తుంది.ఈ డిజిటల్ సాధికారత ప్రచారంలో ప్రధాన అంశం ఏమిటంటే, వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా ప్రీమియం సాంకేతికతను అందించడం. జియో తన అన్లిమిటెడ్ 5జీ సబ్స్క్రైబర్లకు రూ.35,100 విలువైన 'గూగుల్ జెమిని ప్రో ప్లాన్'ను 18 నెలల పాటు ఉచితంగా అందిస్తోంది. వినియోగదారులు నేరుగా మైజియో (MyJio) యాప్ ద్వారా యాక్టివేట్ చేసుకునే ఈ సబ్స్క్రిప్షన్, అత్యాధునిక 'జెమిని 3 ప్రో' మోడల్తో పాటు హై-ఎండ్ క్రియేటివ్ టూల్స్కు ప్రాప్యతను కల్పిస్తుంది.ఇందులో AI సహాయంతో చిత్రాలను రూపొందించే 'నానో బనానా ప్రో' (Nano Banana Pro), వీడియో జనరేషన్ కోసం 'వీయో 3.1' (Veo 3.1) వంటి సాధనాలు ఉన్నాయి. అకడమిక్ రీసెర్చ్ కోసం 'నోట్బుక్ ఎల్ఎమ్' (NotebookLM) మరియు డిజిటల్ డేటాను భద్రపరుచుకోవడానికి 2 TB క్లౌడ్ స్టోరేజ్ కూడా ఈ ప్లాన్లో భాగంగా ఉన్నాయి.యువత నైపుణ్యాభివృద్ధికి ఉన్న నిబద్ధతను మరింత ముందుకు తీసుకెళ్తూ, కంపెనీ 'జియో ఏఐ క్లాస్రూమ్' అనే ఉచిత నాలుగు వారాల ఆన్లైన్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ను కూడా ప్రవేశపెట్టింది. విద్యార్థులు డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ ద్వారా వారి స్వంత వేగంతో ఏఐ సాంకేతికతలపై ఆచరణాత్మక పరిజ్ఞానాన్ని పొందేలా ఈ కోర్సు రూపొందించబడింది. తెలంగాణ & ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులు Jio.com/ai-classroom పోర్టల్ను సందర్శించడం ద్వారా ఈ శిక్షణను పొందవచ్చు. ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో పోటీ పడటానికి అవసరమైన పునాది జ్ఞానాన్ని ఇది అందిస్తుంది, తద్వారా ప్రాంతీయ శ్రామిక శక్తి సాంకేతిక ఆవిష్కరణలలో ముందంజలో ఉండేలా జియో నిర్ధారిస్తుంది. -
వర్క్ ఫ్రమ్ హోమ్.. కొత్త కండీషన్
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), విప్రో అడుగుజాడల్లో నడుస్తూ మరో దేశీ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్.. తన వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) విధానాన్ని మరింత కఠినతరం చేసింది. అదనపు వర్క్ ఫ్రమ్ హోమ్ రోజులను కోరుకునే ఉద్యోగుల కోసం కొత్త షరతులను ప్రవేశపెట్టింది.బెంగళూరు ప్రధాన కార్యాలయంగా ఉన్న ఇన్ఫోసిస్, ఇకపై ఒక్కో త్రైమాసికంలో గరిష్టంగా ఐదు అదనపు వర్క్ ఫ్రమ్ హోమ్ రోజులు లేదా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ (WFO) మినహాయింపులకు మాత్రమే అనుమతి ఇస్తుంది. ఉద్యోగి లేదా అతనిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు సంబంధించిన క్లిష్టమైన వైద్య పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే దీనికి మినహాయింపు ఉంటుంది. అలాంటి సందర్భాల్లో డాక్టర్ వెరిఫికేషన్తో పాటు అవసరమైన డాక్యుమెంట్లు తప్పనిసరిగా సమర్పించాలి.ప్రస్తుతం జాబ్ లెవల్ 5, అంతకంటే తక్కువ స్థాయిలో ఉన్న ఉద్యోగులు నెలకు కనీసం 10 రోజులు కార్యాలయం నుంచి పని చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలు, అదనంగా సహాయక వర్క్ ఫ్రమ్ హోమ్ రోజులు కోరే అభ్యర్థనలపై మరింత నియంత్రణకు ఉద్దేశించినవిగా కంపెనీ తెలిపింది.ఉద్యోగులకు మేనేజర్లు పంపిన ఈమెయిల్స్ ప్రకారం.. అదనపు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆమోదం కోసం వచ్చే అభ్యర్థనల సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ అభ్యర్థన ఉంటే ఈమెయిల్ ద్వారా కాకుండా సిస్టమ్ ద్వారా ముందస్తు ఆమోదం పొందాలని స్పష్టం చేశారు. చివరి నిమిషంలో సమస్యలు తలెత్తకుండా ఉద్యోగులు ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. “పాలసీ ప్రకారం అభ్యర్థన ఆమోదించబడకపోతే, మేనేజర్లుగా తాము చేయగలిగేదేమీ లేదు” అని పేర్కొన్నారు.ఇది చదివారా? ఉద్యోగుల కరెంటు బిల్లులు అడుగుతున్న ఇన్ఫోసిస్..దేశంలో రెండవ అతిపెద్ద ఐటీ సంస్థగా ఉన్న ఇన్ఫోసిస్లో 3 లక్షల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. కంపెనీ 2023 నవంబర్ 20న రిటర్న్-టు-ఆఫీస్ విధానాన్ని ప్రకటించినప్పటికీ, దాన్ని 2024 మార్చి 10 నుంచి పూర్తిస్థాయిలో అమలు చేయడం ప్రారంభించింది. ఈ విధానం ప్రకారం ఉద్యోగులు కార్యాలయంలో కనీసం మూడు గంటలు గడపాల్సి ఉంటుంది. -
ఈ-గేమింగ్ రంగంలో నియామకాలు భళా!
భారతీయ గేమింగ్ పరిశ్రమ ప్రస్తుతం ఒక కీలక మలుపులో ఉంది. రియల్ మనీ గేమింగ్ (RMG)పై ఉన్న ఆంక్షలు సుమారు రెండు లక్షల ఉద్యోగాలపై ప్రభావం చూపుతాయనే ఆందోళనల మధ్య, ఈ-గేమింగ్ రంగం అనూహ్య రీతిలో పుంజుకుంటోంది. గడిచిన ఐదు నెలలుగా పరిశ్రమ తన వ్యూహాలను మార్చుకుంటూ, ప్రతిభను నిలుపుకోవడమే కాకుండా కొత్త విభాగాల్లో ఉపాధి అవకాశాలను సృష్టిస్తోంది.కోర్ డెవలప్మెంట్కు క్రేజ్ప్రస్తుతం భారతీయ గేమింగ్ మార్కెట్ కేవలం వినోదం కోసమే కాకుండా హై-ఎండ్ గేమ్ డెవలప్మెంట్ హబ్గా మారుతోంది. ఇన్స్టాహైర్ గణాంకాల ప్రకారం, ప్రస్తుతం ఈ రంగంలో 50,000 నుంచి 60,000 వరకు ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. యూనిటీ (Unity), అన్రియల్ (Unreal) డెవలపర్లు, సీ++ ఇంజినీర్లు, 3డీ ఆర్టిస్టులు, గేమ్ డిజైనర్లకు గిరాకీ పెరిగింది. మొత్తం ఉద్యోగాల్లో వీటి వాటా 70-80 శాతంగా ఉంది. భారతీయ స్టూడియోలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి AAA క్వాలిటీ టైటిల్స్ రూపొందించడంపై దృష్టి పెట్టాయి. టోర్నమెంట్ మేనేజర్లు, కంటెంట్ క్రియేటర్లు, అనలిస్ట్ ఉద్యోగాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 2026 చివరి నాటికి గేమింగ్ రంగంలో ఉపాధి 60-70 శాతం వృద్ధి చెందుతుందని ఇన్స్టాహైర్ అంచనా వేసింది.నియంత్రణలతో భరోసా‘ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ చట్టం, 2025’ అమల్లోకి రావడం పరిశ్రమకు ఒక వరంలా మారిందని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఇది ఆర్ఎంజీ, సాధారణ ఈ-గేమ్స్ మధ్య స్పష్టమైన సరిహద్దులను ఏర్పరిచినట్లు తెలుపుతున్నారు. ‘75 శాతం భారతీయ ఈ-స్పోర్ట్స్ ప్లేయర్లు ఈ రంగాన్ని ఒక గౌరవప్రదమైన కెరీర్గా భావిస్తున్నారు. కేవలం ప్లేయర్లుగానే కాకుండా కోచ్లు, ఈవెంట్ మేనేజర్లుగా మారేందుకు 56 శాతం మంది ఆసక్తి చూపుతున్నారు’ అని జెంట్సింథసిస్ సర్వే తెలిపింది.ప్రతిభను వదులుకోని కంపెనీలుఆర్ఎంజీ కంపెనీల్లో గతంలో నియామకాలు తాత్కాలికంగా నెమ్మదించినప్పటికీ అక్కడ ఉన్న నైపుణ్యం కలిగిన సిబ్బందిని ఇతర గేమింగ్ విభాగాలు అందిపుచ్చుకుంటున్నాయి. డ్రీమ్ స్పోర్ట్స్ (Dream Sports) తమ వద్ద ఉన్న ప్రతిభను వదులుకోకుండా తమ గ్రూప్లోని ఇతర ఏడు ప్లాట్ఫారమ్ల్లో ఉద్యోగులను సర్దుబాటు చేస్తామని ప్రకటించింది. ఫెలిసిటీ గేమ్స్ (Felicity Games) గతంలో ఆర్ఎంజీ విభాగాల్లో పనిచేసిన హెడ్ ఆఫ్ ఇంజినీరింగ్, అనలిటిక్స్ వంటి కీలక నిపుణులను నియమించుకుంది. పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆర్ఎంజీపై ఆంక్షలు ఒక రకంగా ఇతర గేమింగ్ విభాగాలు గ్లోబల్ స్థాయిలో ఎదిగేందుకు మార్గం సుగమం చేశాయి.ఇదీ చదవండి: నిర్మాణంలో ఉన్న ఇల్లు బెటరా?


