breaking news
Srikakulam
-
ప్రాణాల కోసం పోరాటం
శ్రీకాకుళం జిల్లా: పన్నెండేళ్ల ప్రాయం. చలాకీగా స్నేహితులతో ఆడుకోవాల్సిన ఈ వయసులో ఆస్పత్రి మంచంపై ప్రాణాల కోసం ఓ బాలుడు పోరాడుతున్నాడు. కేన్సర్ మహమ్మారితో పోరాడే స్థోమత లేక ఆ కుటుంబం దాతల సాయం కోరుతోంది. వివరాల్లోకి వెళితే.. పలాస మండలంలోని పెదంచల గ్రామానికి చెందిన కొమటూరు రామారావు, బాలమ్మకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అందులో చిన్న కుమారుడైన 12 ఏళ్ల లింగరాజు గ్యాస్ట్రిక్ క్యాన్సర్తో పోరాడుతున్నాడు. వీరిది నిరుపేద కుటుంబం. పిల్లాడికి విశాఖపట్నంలోని పినాకిల్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. పూర్తిస్థాయి చికిత్స చేసేందుకు వారి ఆర్థిక స్థోమత సరిపోవడం లేదు. దాతలు సాయం చేస్తే బిడ్డకు చికిత్స చేయించుకోగలమని వారు కోరుతున్నారు. సాయం చేయాలనుకునేవారు 7093341878 నంబర్ను సంప్రదించాలని వారు కోరుతున్నారు. -
● బొంతు.. ఎండుతోంది గొంతు
మండలంలోని చిన్నకిట్టాలపాడు పంచాయతీ బొంతు గ్రామంలో తాగునీటి సరఫరా లేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ గ్రామంలో గతంలో ఉన్న రక్షిత మంచినీటి పథకం ద్వారా తాగునీరు సరఫరా అయ్యేది. కొన్నేళ్ల కిందట జలజీవన్ మిషన్ పథకం మంజూరు కావడంతో స్థానిక అంగన్వాడీ కేంద్రానికి సమీపంలో బోరు ఏర్పాటు చేశారు. ఈ పథకం ద్వారా పాత కుళాయి లైన్లు తొలగించి కొత్తగా ఇంటింటికీ కుళాయి లైన్లు వేశారు. కొత్త బోరు ద్వారా నీరు అనుకున్నంతగా సరఫరా కావడం లేదు. దీంతో స్థానికులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. – సారవకోట -
● కదం తొక్కిన 104 ఉద్యోగులు
పల్లెల్లో సంజీవనిగా వైద్య సేవలందిస్తున్న 104 వాహనాల్లో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలను తగ్గించడం దారుణమని, భవ్య హెల్త్ కేర్ సర్వీసెస్ ఏజెన్సీ నిర్వాకం తగదని ఉద్యోగులంతా నిరసన వ్యక్తం చేశారు. జిల్లా 104 ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలో స్థానిక డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద నుంచి ఏడురోడ్ల కూడలి వరకు ఉద్యోగులంతా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో కొవ్వొత్తులను వెలిగించి ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ తమకు భవ్య ఏజెన్సీ నుంచి దారుణంగా వేధింపులు ఎదురవుతున్నాయని, నెలకు సుమారుగా రూ.780 వర కు జీతం తగ్గించారని, అలాగే ఎర్న్డ్ లీవ్, క్యాజువల్ లీవ్స్ను కూడా రద్దు చేయడం దారుణమన్నా రు. బఫర్ సిబ్బందిని నియమించి రోజుకు డ్రైవర్కు రూ.500 ఇచ్చి నడిపిస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో అరబిందో యాజమాన్యం ఇచ్చిన జీతాల కంటే దారుణంగా కోత విధిస్తున్నా రని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏజెన్సీ దారుణాలను గుర్తించి తక్షణమే తమకు న్యాయం చేయాలని ఉద్యోగ సంఘ ప్రతినిధులంతా డిమాండ్ చేశారు. – అరసవల్లి -
నేడు మెగాజాబ్మేళా
కొత్తూరు: స్థానిక శ్రీవెంకటేశ్వర డిగ్రీ కాలేజీలో బుధవారం మెగాజాబ్ మేళా నిర్వహించనున్నట్లు కాలేజీ చైర్మన్ గేదెల కృష్ణారావు మంగళవారం తెలిపారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మేళాకు 10 కంపెనీలు హాజరవుతాయన్నారు. వివిధ కేటగిరీలకు చెందిన సుమా రు 360 పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతి నుంచి డిగ్రీ, బీటెక్ అర్హత ఉన్న వారంతా అర్హులేనని, 18–35 ఏళ్ల వయసు గల వ్యక్తులు హాజరు కావాలని సూచించారు. మేళాకు విద్యార్హతతో పాటు ఆధార్కార్డు, ఫొటోలు తీసుకురావాలని సూచించారు. -
నన్ను చంపడానికే వచ్చారు
● సర్పంచ్ భర్త, వైఎస్సార్ సీపీ నాయకుడు బువ్వాజీ ● టీడీపీ వర్గీయుల దాడిలో తీవ్ర గాయాలు నరసన్నపేట: సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో గొల్లపేటలో పారిశుద్ధ్య పను లు చేపడుతుండగా.. టీడీపీకి చెందిన అసిరినాయుడుతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు తనను చంపడానికే దాడి చేశారని, ఇప్పటికే చాలాసార్లు బెదిరించారని, ఒక్కడినే ఉండగా వచ్చి దాడి చేశారని టెక్కలిపాడు సర్పంచ్ నీలవేణి భర్త, వైఎస్సార్సీపీ నాయకుడు ధర్మాన బువ్వాజీ తెలిపారు. నరసన్నపేట ప్రభుత్వాస్పత్రి వద్ద ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కత్తులు, కర్రల తో దాడికి పాల్పడ్డారని, అడ్డుకోవడానికి ప్రయత్నించిన తమ్ముడు అచ్చెన్నపై కూడా దాడి చేశారని తెలిపారు. ‘పనులు చేయడానికి నీవెవరు’ అంటూ ప్రశ్నించారని, సర్పంచ్ భర్తగా పారిశుద్ధ్య పనుల వద్ద ఉండడం తప్పా అని అడిగారు. దీనిపై బువ్వాజీ సోదరుడు అచ్చెన్న మా ట్లాడుతూ పారిశుద్ధ్య పనులు చేస్తున్నప్పుడు వెనుకగా వచ్చి దాడి చేశారని, బువ్వాజీని హత్య చేయడమే వారి ఆలోచన అని తెలిపా రు. పారిపోతూ కూడా మీ అంతుచూస్తామ ని బెదిరించారని పేర్కొన్నారు. గ్రామస్తులు బండి జోగారావు, పిరియా పండువాడు, ధర్మాన లింగన్న తదితరులు స్పందిస్తూ టీడీపీ వాళ్లు కక్ష కట్టి ఇలా దాడి చేయడం దారుణమని అన్నారు. పంచాయతీ ప్రజలంతా బువ్వాజీకి అండగా ఉంటామన్నారు. బువ్వాజీని పరామర్శిస్తున్న ధర్మాన కృష్ణదాస్ తదితరులు దాడి అమానుషం వైఎస్సార్సీపీ నాయకుడిపై మారణాయుధాలతో దాడికి పాల్పడడం అమానుషమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. బువ్వాజీ వివాదాలకు దూరంగా ఉంటారని, అలాంటి వ్యక్తిపై ఇలా దాడులు చేయడం తగదని అన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని సూచించారు. సమాచారం తెలిసిన వెంటనే ఎస్పీతో మా ట్లాడానని చెప్పారు. స్వయంగా కలిసి కూడా దాడి గురించి వివరిస్తామన్నారు. బువ్వాజీకి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. అంతకుముందు ఆస్పత్రిలో బాధితుడిని కలిసి పరామర్శించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కాళింగ విభా గం అధ్యక్షుడు ఆరంగి మురళి, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు కేసీహెచ్బీ గుప్త, పార్టీ రైతు విభాగం రాష్ట కార్యదర్శి కనపల శేఖర్, పార్టీ నాయకులు బగ్గు రామకృష్ణ, ధర్మాన జగన్, రాజాపు అప్పన్న, బగ్గు రమణయ్య, నేతింటి రాజేశ్వరరావు, బీఎల్ శర్మ తదితరులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బువ్వాజీని ఆయన సోదరుడు అచ్చెన్నను పరామర్శించారు. అనంతరం వీరు మాట్లాడుతూ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. -
వైఎస్సార్సీపీ ఇచ్ఛాపురం సమన్వయకర్తగా శ్యామ్ ప్రసాద్ రెడ్డి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఇచ్ఛాపురం నియోజకవర్గం వైఎస్సార్ సీపీ సమన్వయ కర్తగా సాడి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులుగా పిరియా సాయిరాజ్ నియమితులయ్యారు. పార్లమెంట్ కో ఆర్డినేటర్గా తమ్మినేని సీతారాం కొనసాగుతారని పార్టీ కేంద్ర కార్యాలయం స్పష్టం చేసింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. సాడికి గుర్తింపు సాడి పార్టీకి అందిస్తున్న సేవలను గుర్తించి సమన్వయకర్తగా నియమించారు. ఇచ్ఛాపురం మండలం అరకభద్ర గ్రామానికి చెందిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి బీటెక్ చదువుకున్నారు. విద్యాభ్యాసం తర్వాత వైజాగ్, కాకినాడ కోరమండల్ ఇంటర్నేషనల్ కంపెనీలో ఏజీఎంగాను, సౌదీలో సీనియర్ ఇంజినీర్గా పని చేశారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి తల్లి కాంచనా దేవి అరకభద్ర వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యురాలిగా సేవలు అందిస్తున్నారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి భార్య కళావతి తాత దక్కత పితంబర్ రెడ్డి ఇచ్ఛాపురం సమితి ఏర్పడిన తర్వాత మొదటి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి 2014లో ఇచ్ఛాపురం నియోజకవర్గానికి వైఎస్సార్ సీపీ మొదటి సమన్వయకర్తగా కొన్ని నెలల పాటు సేవలందించారు. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు సీడాప్ చైర్మన్గా, పార్టీ జిల్లా సోషల్ మీడియా టాస్క్ఫోర్స్ సభ్యునిగా, విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గ పరిశీలకుడిగా పని చేశారు. ప్రస్తుతం టెక్కలి, నరసన్నపేట నియోజకవర్గాల పరిశీలకుడిగా, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్)గా చేస్తున్నారు. సీఈసీ సభ్యునిగా పిరియా సాయిరాజ్ మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యులుగా నియమితులయ్యారు. పార్టీకి సుదీర్ఘ కాలంగా అందించిన సేవలను దృష్టిలో ఉంచుకుని సాయిరాజ్ను సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులుగా నియమించారు. పార్లమెంట్ కో ఆర్డినేటర్గా తమ్మినేని సీతారాం శ్రీకాకుళం పార్లమెంట్ కో ఆర్డినేటర్గా తమ్మినేని సీతారాం కొనసాగుతారని పార్టీ అధిష్టానం స్పష్టం చేసింది. సీనియర్ నాయకుడిగా, పార్టీకి అందించిన సేవలను దృష్టిలో ఉంచుకుని పార్లమెంట్ సమన్వయకర్తగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. పార్టీ సీఈసీ సభ్యుడిగా పిరియా సాయిరాజ్ పార్లమెంట్ కో ఆర్డినేటర్గా తమ్మినేని సీతారాం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం తమ్మినేని సీతారాం శ్యామ్ ప్రసాద్ రెడ్డి -
● కూల్చివేతలకే పరిమితం
ఏడాది కిందట అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం చుట్టూ శాశ్వత కట్టడాలను కూల్చేసి వదిలేసింది. సరైన అభివృద్ధి ప్రణాళిక లేకుండా, ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతుల్లేకుండా యుద్ధ ప్రాతిపదికన పలు భవనాలను కూల్చివేసి, రథ సప్తమికి ముందు పాలకులు, అధికారులు హడావుడి చేసి, తర్వాత మౌనం పాటించారు. ఆలయ నిధులతో తాత్కాలిక ఏర్పాట్లు చేసి మూడు రోజుల పండగను జరిపించేసి, ఆ తర్వాత అభివృద్ధి జోలికి పోలేదు. దీంతో భక్తులు, అక్కడున్న వ్యాపారులకు అవస్థలే మిగిలాయి. గత ఏడాది డిసెంబర్లో రథసప్తమి వేడుకల ఏర్పాట్లలో భాగంగా ఆలయం వద్ద క్యూలైన్లు, మరుగుదొడ్లు, స్నాన పు గదులు, షాపింగ్ కాంప్లెక్స్, అన్నదానం, అన్న ప్రసాదాల తయారీ, ప్రసాద విక్రయశాల భవనాలతో పాటు వివిధ నిర్మాణాలను కూల్చేశారు. అంతా ఆర్భాటమే.. అరసవల్లిలో దాతల సాయంతో నిర్మించిన నిర్మాణాలను దాతలకు తెలియకుండానే, సమాచారం ఇవ్వకుండా యుద్ధ ప్రాతిపదికన కూల్చేసి సంబంధిత దాతల్ని ఆవేదనకు గురి చేశారు. పోనీ, తర్వాత ఏమైనా చేశారంటే అదీ లేదు. ఏడాది దాటినా వాటి స్థానంలో ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేదు. తాత్కాలిక ఆర్భాటంతో కానిచ్చేశారు. రథసప్తమి పండగ పేరుతో గత ఏడాది మూడు రోజుల పాటు హడావుడి చేసిన కేంద్ర, రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్యేలు ఆలయానికి ఒక్క రూపాయి కూడా మంజూరు చేయించలేదు. రాష్ట్ర పండగగా ప్రకటిస్తూ జీఓ జారీ చేసి చేతులు దులుపుకున్నారు. ప్రభుత్వం నుంచి ఒక్క పైసా ఇచ్చే పరిస్థితి లేదని లిఖితపూర్వకంగా చెప్పేశారు. పోనీ, రెండో ఏడాదైనా ప్రత్యేకంగా నిధులు తెప్పిస్తున్నారంటే అదీ లేదు. గత ఏడాది కార్పొరేషన్ నిధులతో సోకు చేసినట్టే ఈ సారి కూడా అదే తరహాలో ముందుకెళ్తున్నారు. చిత్తశుద్ధి లేకుండా, ఒక ప్రణాళిక రూపొందించకుండా ఆలయ విస్తరణను ఏడాదిగా గాలికొదిలేసి, కూల్చేసిన నిర్మాణాల చోటనే శాశ్వత భవనాలను నిర్మించేందుకు మళ్లీ దాతల కోసం చేతులు చాస్తున్నారు. దాతల సాయంతో నిర్మించిన భవనాలు కూల్చేసి, మళ్లీ కొత్తగా దాతల సాయం తీసుకుని నిర్మించాలని చూడటం ఏమనాలో పాలకులకే తెలియాలి. -
● మార్కెట్ విస్తరణలోనూ అదే నిర్వాకం
నగరంలోని పొట్టి శ్రీరాముల మార్కెట్లో గత ప్రభుత్వం రోడ్లను వేసి అభివృద్ధి చేసింది. దానికి ముందు వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వంలో ఐడీఎస్ఎంటీ పథకం కింద రుణ సాయంతో షాపులను నిర్మించారు. కూల్చివేతల ప్రభుత్వంగా ముద్ర వేసుకున్న చంద్రబాబు ప్రభుత్వం దృష్టి ఇప్పుడా షాపులపై పడింది. వాస్తవానికి షాపుల భవనాలు పటిష్టంగా ఉన్నాయి. వాటిని ఎలా వినియోగించాలన్న దానిపై ఆలోచన చేయకుండా గత పాలకుల ముద్ర కనబడకుండా, స్వప్రయో జనాలతో అనుయాయులకు ధారాదత్తం చేసేందుకు విస్తరణ అజెండా ఎత్తుకుంది. యుద్ధ ప్రాతిపదికన రెండు బ్లాకుల్లోని షాపులు కూల్చేస్తోంది. ఒక బ్లాక్లో 32 షాపులను ఇప్పటికే కూల్చేయగా, మరో బ్లాక్లోని 38 షాపులను కూల్చే పనిలో పడింది. భవనాలు పటిష్టంగా ఉండటంతో ప్రొక్లైనర్లు కూల్చడానికి కష్టపడుతున్న పరిస్థితులు నెలకున్నాయి. అంత స్ట్రాంగ్గా ఉన్న భవనాలను వ్యక్తిగత అజెండా కోసం ఎలాంటి ప్లాన్ లేకుండా, అనుమతులు రాకుండానే కూల్చేడం విమర్శలకు దారితీస్తోంది. అది కూడా పండగ పూట కూల్చేడంతో అక్కడున్న వారు తమ వ్యాపారాలను నష్టపోతున్నారు. ఏ మాత్రం ఆలోచన చేయకుండా ప్రస్తుతం మార్కెట్లో కూల్చేస్తున్న షాపులను 2008లో వైఎస్ రాజశేఖర్ ప్రభుత్వంలో ఐడీఎస్ఎంటీ పథకం కింద రుణ సాయంతో నిర్మించారు. రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 30 శాతం, రుణ సాయం 70శాతంగా ఉంది. ఈ రుణాన్ని 25ఏళ్ల లోగా తీర్చాలి. రుణం క్లియర్ కాకుండా ఆ భవనాల జోలికి వెళ్లడం, వాటిని కూల్చడం కూడా చట్ట విరుద్ధం. కానీ, ప్రస్తుత పాలకులు ఎలాంటి ప్రణాళిక, ముందు చూపులేకుండా యుద్ధ ప్రాతిపదికన కూల్చేస్తున్నారు. దీనిపై న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే రెంటికి చెడ్డ రేవడిలా కూల్చివేతలు తయారవుతాయి. కూల్చివేతల ఎత్తుగడ వెనక నేతల స్వప్రయోజనాలు, దురాలోచన ఉన్నట్టు తెలుస్తోంది. తమ అనుయాయులకు శాశ్వత ప్రాతిపదికన కట్టబెట్టేందుకు ప్లాన్ చేసినట్టు విమర్శలు ఉన్నాయి. ఎవరైతే షాపు కావాలనుకుంటారో వారే తమ సొంత నిధులతో నిర్మించుకుని, తర్వాత ఆ షాపును అనుభవించేలా ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. ఈ లెక్కన ఇప్పుడా షాపుల్లో ఉన్న వ్యక్తులకు అంత స్థోమత లేదు. వారి స్థానంలో నేతల అనుయాయులే దక్కించుకుని, సొంత నిధులతో నిర్మించి, తమ జాగీరులా వాడుకునేలా చేసుకోవడమే ఎత్తుగడ అని వాదనలు ఉన్నాయి. -
‘క్వారీలపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై ఏదీ..?’
టెక్కలి: గ్రానైట్ క్వారీలు ప్రారంభించినపుడు ఉన్న శ్రద్ధ ఆ తర్వాత ఆయా గ్రామాల అభివృద్ధిపై చూపడం లేదని టెక్కలి మండలం ఆంజనేయపురం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశా రు. ఆంజనేయపురం గ్రామానికి ఆనుకుని అడ్డుకొండ సర్వే నంబర్లో హెరిటేజ్ గ్రానైట్ క్వారీ ఏర్పాటు, అర్చనా గ్రానైట్ క్వారీ విస్తరణకు సంబంధించి మంగళవారం ప్రజాభిప్రా య సేకరణ నిర్వహించారు. టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ కరుణశ్రీ, మైన్స్ ఏడీ విజయలక్ష్మి, తహసీల్దార్ బి.సత్యం సమక్షంలో అభిప్రాయ సేకరణ నిర్వహించారు. మేఘవరం పంచాయతీ పరిధిలో క్వారీలు ఉన్నప్పటికీ ఆ క్వారీల వల్ల తమ గ్రామంలో ఇబ్బందులు తలెత్తుతున్నా యని గుర్తు చేశారు. స్థానికంగా ఉన్న కార్మికులకు కాకుండా ఒడిశా నుంచి కార్మికులకు తీసుకురావడం వల్ల పనులకు ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. గ్రామంలో కనీసం ఆర్ఓ వాటర్ ప్లాంట్ కూడా లేని దుస్థితిలో ఉన్నామన్నారు. గ్రామంలో నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అనంత రం ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ ఇటీవల మెళియాపుట్టి ప్రాంతంలో గ్రానైట్ క్వారీల్లో చోటు చేసుకున్న సంఘటనల్లో గా యపడిన వారిని కనీసం పట్టించుకోలేదన్నా రు. ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి మాట్లాడుతూ క్వారీ లకు ఆనుకుని ఉన్న గ్రామాల్లో అభివృద్ధి చర్య లు చేపట్టే విధంగా ఆయా యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొన్నారు. జవాబుదారీతనంతో పనిచేయండి: కలెక్టర్ శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వ లక్ష్యం పక్కదారి పడితే సహించేది లేదని, విధుల్లో బాధ్యతారాహిత్యం ప్రదర్శించే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని, ప్రజలకు సేవ చేయాల్సిన వారు మెయింటైన్ చేయాల్సిన రిజిస్టర్ల దగ్గర నుంచి బయోమెట్రిక్ వరకు అన్నీ సక్రమంగా ఉండాల్సిందేనని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులను హెచ్చరించారు. కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి మంగళవారం సాయంత్రం మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడి యో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. వైద్యారోగ్య శాఖపై సమీక్ష సందర్భంగా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది మెడికల్ ఆఫీసర్లు బాధ్యతగా వ్యవహరించడం లేదని, ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. డిప్యూ టీ డీఎంహెచ్ఓలు వారం రోజుల్లోగా జిల్లాలో ని 71 పీహెచ్సీలను తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న 6,400 మంది సిబ్బంది పనితీరుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని కలెక్టర్ సూచించారు. అన్నీ ఈ–ఆఫీస్ ద్వారానే ప్రభుత్వ పరిపాలనలో ’ఈ–ఆఫీస్’ అమలును అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఇకపై ఫైళ్లన్నీ ఈ–ఆఫీస్ ద్వారానే జరగాలని, కాలయాపన చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పారిశుద్ధ్యం మెరుగుపరచాలని, చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల ద్వారా ఆదాయం పెంచేలా చూడాలని సూచించారు. నివాస స్థలాల పట్టాల పంపిణీకి ఖాళీ ప్లాట్ల వివరాలు సిద్ధం చేయాలని, పంచాయతీ భవనాల నిర్మాణానికి స్థలాలు సేకరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. -
నిబంధనలు పాటించకుంటే చర్యలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వం పేద ప్రజల కోసం వేలాది కోట్లు వెచ్చించి అమలు చేస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థలో అలసత్వాన్ని సహించేది లేదని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు కాంతారావు స్పష్టం చేశారు. మంగళవారం శ్రీకాకుళం నగరంలోని పలు రేషన్ డిపోలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముందుగా బలగ హాస్పిటల్ రోడ్డులోని డిపోను పరిశీలించిన కాంతారావు, అక్కడ స్టాక్ ఉన్నప్పటికీ అదనపు వస్తువులైన గోధుమపిండి, బెల్లం విక్రయించడంలో విఫలమవ్వడంపై అసహనం వ్యక్తం చేశారు. దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా సరఫరా అధికారిని ఆదేశించారు. అనంతరం డీసీఎంఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్న డిపోలను సందర్శించి, నోటీసు బోర్డులో వివరాలు ప్రదర్శించకపోవడం చట్టపరంగా తప్పని హెచ్చరించారు. న్యూ కాలనీలోని డిపో మూసివేయడం వల్ల లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారని, అంగన్వాడీలకు బియ్యం పంపిణీ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆ డీలర్పై చర్యలకు ఆదేశించారు. శ్రీకాకుళం అర్బన్ పరిధిలోని గాజులవీధి అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆయన, అక్కడ స్టాక్ రిజిస్టర్లను నిశితంగా పరిశీలించారు. హాజరు పట్టికలో గైర్హాజరైన వారిని రెడ్ మార్క్తో గుర్తించాలని, రికార్డుల్లో కొట్టివేతలు, దిద్దుబాట్లు ఉంటే సంబంధిత సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. చిన్నారులకు అందించే ఆహార నాణ్యతను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం పీఎస్ఎన్ఎం పాఠశాల సందర్శనలో భాగంగా అక్షయపాత్ర మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి, విద్యార్థులతో కలిసి ముచ్చటించారు. పర్యటనలో ఆయనతో పాటు జిల్లా సరఫరా అధికారి జి.సూర్యప్రకాశరావు, ఐసీడీఎస్ సిబ్బంది, రెవెన్యూ అధికారులు, ఇతర శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. -
కాశీబుగ్గ వెంకన్న ఆలయ పునఃప్రారంభానికి చర్యలు
వజ్రపుకొత్తూరు రూరల్: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని వేంకటేశ్వర స్వామి ఆలయం(చిన తిరుపతి) పునఃప్రారంభానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. గత ఏడాది నవంబర్లో ఏకాదశి నాడు తొక్కిసలాట జరిగి 9 మంది భక్తులు మృతిచెందిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాల మేరకు అప్పట్లో ఆలయం మూసి వేశారు. తాజాగా ఆలయాన్ని పునఃప్రారంభించే చర్యల్లో భాగంగా మంగళవారం దేవదాయశాఖ అధికారి గురునాథ్, రావివలస ఆలయ దేవస్థానం కార్యదర్శి గురునాథరావు ఆలయాన్ని పరిశీలించారు. ఆలయ ధర్మకర్త హరిముకుంద పండాతో మాట్లాడారు. క్యూలెన్లు, బారికేడ్లు, గ్రిల్స్, ఐరన్ రెయిలింగ్స్, ఎగ్జిట్ మార్గాల పనులను పరిశీలించారు. త్రిసభ్య కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆలయాన్ని పునఃప్రారంభించి భక్తులకు స్వామి దర్శన భాగ్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వారు తెలిపారు. -
9న రథసప్తమి ఉత్సవాలకు శ్రీకారం
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఈ నెల 19 నుంచి 25 వరకు అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో జరిగే రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈనెల 9వ తేదీ ఉదయం 8 గంటలకు ‘కర్టెన్ రైజర్’ కార్యక్రమంతో ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలన్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో సూర్యనమస్కారాలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయ ప్రాశస్త్యం తెలిసేలా ఫ్లెక్సీలు, విదేశీ పుష్పాలతో అలంకరణలు చేయాలని ఆదేశించారు. రూ.100 క్యూ లైన్లు, ఉచిత దర్శనం లైన్లలో వచ్చే సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకూడదని స్పష్టం చేశారు. సీనియర్ సిటిజన్లకు పార్కింగ్ నుంచి ఆలయం వరకు రవాణా సౌకర్యం కల్పించాలని, పోలీసు శాఖ సమన్వయంతో పార్కింగ్ స్థలాలను సిద్ధం చేయాలని సూచించారు. గతంలో విధి నిర్వహణలో ఉన్న సిబ్బందికి భోజనం అందలేదన్న ఫిర్యాదులు మళ్లీ రాకూడదని, ఫుడ్ కమిటీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సిక్కోలు రథసప్తమి జ్ఞాపికలు, పొందూరు ఖాదీ శాలువాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్వహణకు 15 ప్రత్యేక కమిటీలు: ఉత్సవాల విజయవంతం కోసం 15 ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో ఫండింగ్ కమిటీ, ఆహ్వాన పత్రికల కమిటీ, పబ్లిసిటీ కమిటీ వంటి కీలక బృందాలను నియమించారు. వీటితో పాటు శోభాయాత్ర, మెగా సూర్యనమస్కార్, సాంస్కృతిక కార్యక్రమాలు, పార్కింగ్, బ్యూటిఫికేషన్ కమిటీలు క్షేత్రస్థాయిలో పనిచేస్తాయని కలెక్టర్ వివరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, డీఆర్వో ఎస్వీ లక్ష్మణమూర్తి, ఆర్డీవో సాయి ప్రత్యూష, డీఎస్పీ వివేకానంద, ఆలయ ఈఓ, మున్సిపల్ కమిషనర్, వైద్య ఆరోగ్య శాఖ సహా పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పండగకు ‘ధరా’ఘాతం!
సంక్రాంతి పండగ వస్తే చాలు ప్రతి తెలుగింటా పిండివంట ఘుమఘుమలాడాల్సిందే. పేద, మధ్య తరగతి అనే తేడా లేకుండా ఉన్నంతలో గొప్పగా జరుపుకుంటారు. అయితే ఈసారి పండగకు సామాన్యులపై ధరల భారం ఎక్కువైంది. బియ్యం నుంచి పప్పులు వరకు నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇక కూరగాయలు, గుడ్లు ధరల సంగతి సరేసరి. ● ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు ● హడలెత్తిపోతున్న సామాన్యులుహిరమండలం: సామాన్యులు పండగ చేసుకోవాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. వంట నూనెల ధరలు సలసలా కాగుతుండగా.. కూరగాయల ధరల అధరహో అనిపిస్తున్నాయి. గతంలో ఉన్నడూ లేనివిధంగా నిత్యావసరాల ధరలు రోజురోజూకూ పెరిగిపోతుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. మండుతున్న నూనెలు.. కూరగాయలు, నిత్యావసర ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే దీనికి తోడు వంటనూనెలు ధరలు కూడా మండిపోతున్నాయి. రిఫండ్ ఆయిల్ పది రోజుల క్రితం రూ.140 ఉండగా ఇప్పుడు రూ.165కి పెరిగింది. పామాయిల్ ధర కొండెక్కి కూర్చొంది. పదిరోజుల క్రితం రూ.120 ఉండగా ఇప్పుడు రూ.140కి చేరింది. ఉడకని పప్పులు.. వేరుశనగ పలుకులు ధరలు ఒక్కసారిగా పెంచేశారు. పది రోజుల క్రితం కేజీ రూ.110 కాగా ఇప్పుడు రూ.130 నుంచి రూ.150కి అమ్ముతున్నారు. కంది పప్పు ఒక్కసారిగా రూ.20 పెరిగింది. పదిరోజుల కిందట రూ.120 ఉండగా రూ.150కి పెంచేశారు. మినప్పప్పు కిలో రూ.115 నుంచి రూ.130కి పెరిగింది. డిపోల్లో కానరాని కందిపప్పు.. గతంలో రేషన్ డిపోల ద్వారా కందిపప్పు, పామాయిల్ పంపిణీ చేసేవారు. గత ఏడాది నుంచి చాలా డిపోల్లో కందిపప్పు పంపిణీ నిలిపివేశారు. అప్పట్లో కిలో కందిపప్పు కేవలం రూ.67కే అందించేవారు. ఇప్పుడు సరఫరా నిలిపివేయడంతో పేదలు పప్పులు కొనలేక ఇబ్బందులు పడుతున్నారు. అంతా సిండికేట్ మాయ.. ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని, హోల్సేల్,రిటైల్ వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి ప్రజలను దోచుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో షాపులో ఒక్కో రకంగా ధరలను అమలుచేస్తున్నా పౌరసరఫరాల శాఖాధికారులు కన్నెత్తి కూడా చూడటంలేదు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించినప్పటికీ దానిని బోర్డులకే పరిమితం చేస్తున్నారు. ఎవరైనా జీఎస్టీ తగ్గిందని ప్రశ్నిస్తే ఇంకా తమకు ఆదేశాలు రాలేదంటూ సమాధానం ఇస్తున్నారని పలువురు వాపోతున్నారు. నిత్యావసరాల ధరల నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోవడంతో పిల్లలకు పూర్తిస్థాయిలో పౌష్టికాహారం అందించలేని పరిస్థితి నెలకొంది. ప్రజల ఆదాయాలను పెంచేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. – సిర్ల ప్రసాద్ సీఐటీయూ నాయకుడు నూనె, పప్పు దినుసులు, బియ్యం తదితర నిత్యావసరాలతో పాటు కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. సామాన్య ప్రజలు కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. ధరలను నియంత్రించేలా పాలకులు చర్యలు చేపట్టాలి. – జి.లలిత, తంప గ్రామం, హిరమండలం బయటమార్కెట్లో నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నాయి. వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచేస్తున్నారు. సామాన్యులు కొనలేకపోతున్నారు. ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకోవాలి. రేషన్ డిపోల ద్వారా కందిపప్పు, నూనె సరఫరా చేయాలి. – కె.రోజా, యంబరాం, ఎల్ఎన్పేట మండలం -
రహదారి భద్రతపై డ్రైవర్లకు అవగాహన
శ్రీకాకుళం రూరల్: రహదారి భద్రతకు సంబంధించి మునసబుపేటలోని గురజాడ ఎడ్యుకేషన్ అకాడమీలో మంగళవారం రవాణా శాఖ ఆధ్వర్యంలో 120 మంది ఆటో, లారీ డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. శ్రీకాకుళం నగరంలోని డాక్టర్ సత్యసూర్య, డాక్టర్ శశిధర్ హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీటీసీ విజయసారధి మాట్లాడారు. డ్రైవర్లు రోడ్డు నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం డ్రైవర్లకు కంటి పరీక్షలు, షుగర్ బీపీ టెస్టులు నిర్వహించారు. కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు గంగాధర్, అనిల్, వైద్యులు దానేటి హర్ష, బొడ్డేపల్లి అనూష, బ్రాహ్మణి, సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
కన్నీటి తీరం!
● సముద్రంలో బోటు బోల్తాపడి మత్స్యకారుడు మృతి ● ప్రాణాలతో బయటపడ్డ మరో నలుగురు ● దేవునల్తాడలో విషాదం వజ్రపుకొత్తూరు: సముద్రంలో రాకాసి అలలకు మర బోటు బోల్తాపడిన ఘటనలో వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడ గ్రామానికి చెందిన మత్స్యకారుడు చెక్క గోపాలరావు(46) మృతి చెందాడు. మరో నలుగురు మత్స్యకారులు ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవునల్తాడకు చెందిన చెక్క గోపాలరావుకు భార్య మహాలక్ష్మీ, ఇద్దరు కుమారులు రాజు, చాణిక్య ఉన్నారు. సముద్రంలో చేపల వేట జీవనాధారంగా బతుకుతున్నారు. ఎప్పటిలాగే మంగళవారం వేకువజామున గాడి శ్రీనివాసరావుకు చెందిన మర బోటులో గోపాలరావు, శ్రీనివారావు, తెరుపల్లి లింగమయ్య, ఎరుపల్లి ఈశ్వరరావు, చింతల దానేసులు వేటకు వెళ్లారు. కొద్దిసేపటికే రాకాసి అలల ఉధృతికి బోటు బోల్తా పడింది. అందరూ చెల్లాచెదురయ్యారు. అతికష్టమ్మీద ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. గోపాలరావు ఆచూకీ లభ్యం కాకపోవడంతో బోటుతో వెళ్లి గాలించారు. చివరకు తీవ్ర గాయాలతో మృతి చెందిన గోపాలరావును గమనించి మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. అనంతరం గ్రామస్తులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తీరానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా రోదించారు. మృతుడి భార్య మహాలక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వజ్రపుకొత్తూరు ఎస్ఐ బి.నిహార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అందని పరిహారం
నష్టం అపారం.. కొత్తూరు : ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం వాటిల్లితే వెంటనే నష్టపరిహారం అందించి రైతులను ఆదుకుంటామని గత ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడు ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక షరామామూలుగా హామీని విస్మరించారు. గత ఏడాది అక్టోబర్ 3న వంశధార నదీ పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలకు కురిశాయి. వంశధార నదికి సుమారు లక్షా పది వేల క్యూసెక్కుల వరద నీరు రావడంతో ఉద్ధృతంగా ప్రవహించింది. వంశదార నదీ తీర ప్రాంతాలైన కొత్తూరు, హిరమండలం, ఎల్ఎన్పేట, సరుబుజ్జిలి, ఆమదాలవలస, జలుమూరు, నరసన్నపేట తదితర మండలాల్లో 2739 మంది రైతులకు చెందిన 1132 హెక్టార్లలో వరి పంట ముంపునకు గురైంది. 26 మంది రైతులకు చెందిన 13.06 హెక్టార్ల మొక్కజొన్న పంట నాశనమైంది. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన పంటంతా పూర్తిగా నష్టపోవడంతో రైతులు కుదేలయ్యారు. ఎదురుచూపులు ఎన్నాళ్లో.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలో ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే వెంటనే పరిహారం అందేది. దీంతో రైతులు పంట పోయినా కోలుకునే వారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితి లేదు. ఇందుకు అక్టోబర్ వరదలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. వరదలు వచ్చి నాలుగు నెలలైనా పరిహారం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్పట్లో నష్టపోయిన పంటలు వివరాలు పంపించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశించడంతో.. వ్యవసాయ శాఖ అధికారులు పంటల విస్తీర్ణం, రైతులు వివరాలతో కూడిన జాబితాను సమర్పించారు. అయినా ఇంతవరకు చిల్లిగవ్వ కూడా అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రానున్న సంక్రాంతి పండగ నాటికై నా నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. ● -
చిన్నబాబు కుటుంబానికి పరామర్శ
టెక్కలి : పెద్దసాన గ్రామానికి చెందిన రైతు నాయకుడు కోత చిన్నబాబు మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని అస్సాం చీఫ్ సెక్రటరీ కోత రవి మంగళవారం పరామర్శించారు. చిన్నబాబు చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. పుస్తెలతాడు చోరీ రణస్థలం: లావేరు మండలం బెజ్జిపురంలో కలిశెట్టి సూరమ్మకు చెందిన రెండు తులాల పుస్తెలతాడు గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు చోరికి పాల్పడ్డారు. లావేరు పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. బెజ్జిపురం హైస్కూల్ వెనుక రొంపివలసకు వెళ్లే దారిలో పొలం నుంచి సూరమ్మ అనే వృద్ధురాలు వస్తుండగా సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చిన పుస్తెలతాడు లాగారు. వెంటనే తేరుకుని తాడు పట్టుకోవడంతో సగం ముక్క ఆమె చేతిలోనే ఉండిపోయింది. దీంతో మరో సగం తాడు పట్టుకుని పరారయ్యారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లావేరు ఎస్సై కె.అప్పలసూరి మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటుకల ట్రాక్టర్ బోల్తా మందస: మేఘమాల గ్రామ సమీపంలో మంగళవారం ఇటుకల ట్రాక్టర్ బోల్తా పడింది. మందస నుంచి చీపి గ్రామం ఇటుకల లోడుతో వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పొగమంచుకు తోడు కొండ ప్రాంతం కావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో నష్టం తప్పింది. గురుకుల విద్యార్థి ప్రతిభ కంచిలి: మండల కేంద్రం కంచిలిలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాల పదో తరగతి విద్యార్థి పొట్నూరు ప్రవీణ్కుమార్ జాతీయ స్థాయిలో నిర్వహించిన ఎస్హెచ్ఆర్ఈఎస్టీఏ–ఎన్ఈటీఎస్–2026 పరీక్షలో ఆల్ ఇండియాలో 725వ ర్యాంకు సాధించినట్లు ప్రిన్సిపాల్ పేడాడ శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. జోన్–1 స్కూల్స్లో ఇదే అత్యుత్తమ ర్యాంక్గా నమోదైందని పేర్కొన్నారు. మినిస్ట్రీ ఆప్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాతీయ స్థాయిలో పేద దళిత విద్యార్థులకు అత్యుత్తమ విద్య ఉచితంగా అందించే లక్ష్యంతో కార్పొట్ సంస్థల్లో ఇంటర్మీడియట్ అడ్మిషన్ కోసం ఈ పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో విజయం సాధించిన విద్యార్థితో పాటు కృషి చేసిన ఉపాధ్యాయులను ప్రిన్సిపాల్ అభినందించారు. రణస్థలం : లావేరు మండలం రావివలస సమీపంలో విశాఖపట్నం వైపు నుంచి చిలకపాలెం మీదుగా రాయ్పూర్ వైపు వెళుతున్న లారీ మంగళవారం తెల్లవారుజామున బోల్తా పడింది. డ్రైవర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. లారీలోని బొగ్గు రోడ్డు పక్కన కళ్లద్దాలు, హెల్మెట్ దుకాణంపై పడటంతో సామగ్రి ధ్వంసమైంది. ఈ ఘటనలో రణస్థలం మండలం ఎన్జీఆర్పురం పంచాయతీ చీకటిపేటకు చెందిన కళ్లజోడు దుకాణ నిర్వాహకురాలు కొమర లక్ష్మీ సుమారు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లింది. పోలీసులు లారీని పక్కకు జరిపి ట్రాఫిక్ చక్కదిద్దారు. కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు. -
దళిత బాలికపై లైంగిక దాడి
శ్రీకాకుళం క్రైమ్: శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఓ యువకుడు ఇంటర్ చదువుతున్న దళిత బాలికపై లైంగికదాడి చేయడంతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. మంగువారితోట కండ్రవీధికి చెందిన బొమ్మలాట నవీన్ (19) నెలరోజులుగా బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు.బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకటో పట్టణ ఎస్ఐ ఎం.హరికృష్ణ యువకుడిని అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్కు తరలించారు. కేసును జిల్లా పోలీస్ శిక్షణా సంస్థ డీఎస్పీ గోవిందరావు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎస్పీ గ్రీవెన్సుకు 36 ఫిర్యాదులు
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ మరియు పరిష్కార వేదిక (గ్రీవెన్సు)కు ప్రజల నుంచి 36 వినతులు అందాయి. ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి వినతులు స్వీకరించి బాధితులకు సకాలంలో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. రైతు నాయకుడు చిన్నబాబు మృతి టెక్కలి: మండలంలోని పెద్దసాన గ్రామానికి చెందిన రైతు నాయకుడు కోట చిన్నబాబు (103) సోమవారం మృతి చెందారు. ఆయన ఈ గ్రామానికి 5 దశాబ్ధాలు సర్పంచ్గా, రైతు నాయకుడిగా ఎన్నో సేవలు అందించారు. ప్రస్తుతం టెక్కలిలో బీఎస్ అండ్ జేఆర్ విద్యా సంస్థలకు చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. గ్రామంలో వివిధ పార్టీల రాజకీయ నాయకులు, ప్రముఖులు, కుటుంబ సభ్యుల నడుమ అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు చిన్నబాబు నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. ఈయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు శివరామరాజు పెద్దసాన గ్రామ సర్పంచ్గా సేవలు అందజేశారు. అలాగే మరో కుమారుడు మురళీధర్ గతంలో టెక్కలి జెడ్పీటీసీగా సేవలు అందజేశారు. అంతేకాకుండా గ్రానైట్ అసోసియేషన్లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. చిన్నబాబు మృతిపై గురజాడ విద్యాసంస్థల అధినేత స్వామి నాయుడు తదితరురు సంతాపం వ్యక్తం చేశారు. వీరి కుటుంబాన్ని అస్సాం చీఫ్ సెక్రటరీ కోట రవి మంగళవారం పరామర్శించనున్నారు. -
గొంతు కోసుకొని ఆత్మహత్యా యత్నం
బూర్జ: పెట్రోల్ బంకు ఓనర్ బంకులో పనిచేయకుండా వెళ్లిపోమని గెంటివేసినందుకు మనస్థాపం చెందిన యువకుడు గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన మండలంలోని కొల్లివలస జంక్షన్ వద్దనున్న ఒక బంక్లో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కొల్లివలస జంక్షన్లో ఉన్న పెట్రోల్ బంకులో సరుబుజ్జిలి మండలంలోని తురకపేట గ్రామ కాలనీకి చెందిన కోరాడ వెంకటేష్ గత 4 నెలలుగా పంపు ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం శ్రీకాకుళంలో ఉంటున్న బంకు యజమాని ఇప్పిలి రవికి కాల్చేసి తనకు అర్జెంటుగా డబ్బులు కావాలని, లేకపోతే చచ్చిపోతానని వెంకటేష్ భయపెట్టాడు. దీంతో సోమవారం ఉదయం 11 గంటల సమయంలో బంకు యజమాని వచ్చి వెంకటేష్కు అతను అమ్మకం చేసిన డబ్బులు గురించి అడిగాడు. అందులో రూ.13,800లు సొంతానికి వాడుకున్నట్లు రుజువైంది. దీంతో బంకు యజమాని కోపగించికొని అక్కడ నుంచి వెళ్లిపోమని, బైక్ ఇక్కడ పెట్టి తండ్రిని తీసుకురమ్మని మెడమీద చేయి వేసి గెంటాడు. దీంతో వెంకటేష్ వెంటనే జంక్షన్కు వెళ్లి బ్లేడ్ తెచ్చికొని బంకు వద్ద తన పీక మీద, ఎడమచేతి మండపైన కోసుకున్నాడు. దీంతో వెంటనే బంకులో ఉన్న కారులో ఎక్కించుకొని శ్రీకాకుళంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రాణహాని లేదని వైద్యులు తెలియజేసినట్లు సమాచారం. స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయలేదు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
నందిగాం: విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని చింతల అగ్రహారం గ్రామ సమీపంలో సోమవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కాపు తెంబూరుకు చెందిన గజరాపు నగేష్ (31) మృతి చెందారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన గజరాపు పద్మలోచన, మాలతి దంపతుల కుమారుడు నగేష్ లగేజీ వ్యాన్ నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు. విజయవాడలో ఉన్న ఒక కుటుంబం టెక్కలికి మారేందుకు గాను వారి సామాన్లు తీసుకొచ్చేందుకు నగేష్ ఆదివారం లగేజీ వ్యాన్తో పాటు సింగుపురానికి చెందిన ఇద్దరు వ్యక్తులతో కలిసి విజయవాడ వెళ్లారు. అక్కడ సామాన్లు లోడ్ చేసుకొని తిరిగి వస్తూ సోమవారం వేకువజామున విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చింతల అగ్రహారం జంక్షన్ వద్ద వ్యాన్ ఆపి కాలకృత్యాలు తీర్చుకొని తిరిగి వస్తుండగా లారీ ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. వ్యాన్లో వెళ్లిన సింగుపురం వ్యక్తులు విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మృతుడికి భార్య భవానీ, నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు. పోలీసు లాంచనాలు పూర్తయిన తర్వాత మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు. -
ముస్తాబు..!
ప్రభుత్వ పాఠశాలలో డైలీ హైజిన్ అండ్ డిసిప్లేన్ పేరుతో ముస్తాబు కార్యక్రమానికి ఇటీవల శ్రీకారం చుట్టారు. దీనికోసం జీవో నంబర్ 43ను విడుదల చేశారు. ప్రతీ తరగతి గదిలో విధిగా ముస్తాబు కార్నర్ ఏర్పాటు చేయాలని ఆ జీవోలో నిర్దేశించారు. ఆ కార్నర్లో అద్దం, దువ్వెన, సబ్బు, హ్యాండ్ వాష్, నెయిల్ కట్టర్, పౌడర్ ఉండాలి. విద్యార్థులు పరిశుభ్రంగా, క్రమశిక్షణగా ఉండేలా చూడాలన్నది ఆ జీవో సారాంశం. చేతులు శుభ్రం చేసుకునే దశల చార్టులు, గోర్లు, జుత్తు, వ్యక్తిగత పరిశుభ్రత చార్టు, టాయిలెట్ వినియోగం, సురక్షిత నీటిపై విద్యార్థులకు అవగాహన కల్పించే మెటీరియల్ కూడా ప్రదర్శించాలి. ఎంపిక చేసిన ఇద్దరు విద్యార్థులకు తొలుత శిక్షణ ఇవ్వాలి. వారం వారం ముస్తాబు ‘స్టార్ ఆఫ్ ది వీక్‘ ఎంపిక చేయడం, రివార్డులు ఇవ్వడం క్రమం తప్పకుండా జరగాలి. ఇదంతా ఉపాధ్యాయులే చేయాలి. పాఠశాలకు అపరిశుభ్రంగా వచ్చేవారిని, తల దువ్వుకోకుండా వచ్చే వారిని గుర్తించాలి. వారితో బడిలోనే తల దువ్వడం లేదా, దువ్వించడం చేయించాలి. అయితే ఈ కార్యక్రమంపై ఉపాధ్యాయ వర్గాలు మండిపడుతున్నాయి. బడికి వెళ్లి విద్యార్థులకు పాఠాలు బోధించాలా లేక పాఠాలు మానేసి విద్యార్థులను ముస్తాబు చేస్తూ కూర్చోవాలా అంటూ ధ్వజమెత్తుతున్నారు. విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం అవసరమే కానీ ఈవిధంగా ఉపాధ్యాయులపై భారం మోపడం సరికాదని అంటున్నారు. అయితే ఈ కార్యక్రమం ఆగమేఘాలపై ప్రారంభం కావాలనే ఆదేశాలతో పలు పాఠశాలల్లో నామమాత్రంగా ముస్తాబు కార్నర్లు ఏర్పాటు చేశారు. బాబు మార్కు డాబు.. శ్రీకాకుళం: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకమాట.. అధికారంలోకి వచ్చాక మరోమాట చెప్పడం సీఎం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. దీనిలో భాగంగానే గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులపై ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తూ.. వారిని బోధనేతర పనులకు వినియోగించనని చెప్పారు. తీరా గద్దెనెక్కాక ఆ మాటలు గాలికొదిలేసి బోధనేతర పనులు పెంచేస్తున్నారని ఉపాధ్యాయులు కూటమి సర్కారుపై నిప్పులు చెరుగుతున్నారు. ప్రస్తుతం పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న వంద రోజుల యాక్షన్ ప్లాన్ పర్యవేక్షణ కోసం ఇతర శాఖల అధికారుల నియామకంతో తమపై ఒత్తిడి పెంచారని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో పాఠశాలకు వివిధ శాఖల నుంచి నోడల్ అధికారుల నియామకంపై ఆవేదన చెందుతున్నారు. కాగా ఇప్పుడు తమపై ముస్తాబు పేరుతో మరో అదనపు పనిభారం కూటమి ప్రభుత్వం మోపిందని మండిపడుతున్నారు. దీనికోసం ప్రత్యేక జీవో కూడా విడుదల చేయడాన్ని తప్పుబడుతున్నారు. ● బడుల్లో ముస్తాబు కార్నర్లు ఏర్పాటు జీవో విడుదల చేసిన ప్రభుత్వం బోధనేతర పనులపై ఉపాధ్యాయుల ఆగ్రహం బోధనా సమయం వృథా అవుతుందని ఆవేదన -
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలి
శ్రీకాకుళం: రాష్ట్రంలో బీసీల అభ్యున్నతి కోసం 42 శాతం రిజర్వేషన్ను తప్పనిసరి చేయాలని అఖిల భారత వెనుకబడిన తరగతుల సమాఖ్య శ్రీకాకుళం జిల్లా శాఖ అధ్యక్షుడు కేవీఎస్ నాయుడు (బుజ్జి) ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం స్థానిక జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీల సంక్షేమం కోసం తామంతా నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. తమిళనాడు రాష్ట్రం మాదిరిగా రిజర్వేషన్ విషయంలో బీసీలకు అండగా నిలిచే విధంగా 42 శాతం రిజర్వేషన్ అంశాన్ని చట్టసభలలో ప్రస్తావన తీసుకొచ్చి ఆమోదానికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అఖిల భారత వెనుకబడిన తరగతుల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు జస్టిస్ ఈశ్వరయ్య ఆదేశాల మేరకు రానున్న రోజుల్లో రిజర్వేషన్ విషయమై ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ముందుకెళ్లనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విభాగం అధికార ప్రతినిధి బొడ్డేపల్లి దామోదరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు, మహిళా విభాగం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలి శ్రీకాకుళం అర్బన్: ఏపీఎస్ ఆర్టీసీలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆర్టీసీ అవుట్ సోర్సింగ్ యూనియన్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు సోమవారం విజయవాడలోని ఆర్టీసీ హౌస్లో ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావును అవుట్ సోర్సింగ్ యూనియన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. అనంతరం యూనియన్ క్యాలెండర్ను ఆయన చేతులమీదుగా ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 8000 మంది అవుట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలను విన్నవిస్తూ గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా ఆర్టీసీలో కాంట్రాక్టు వ్యవస్థ వలన రోజురోజుకూ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిన జీతాలు రాష్ట్రం మొత్తం మీద ఏ కార్మికుడు కూడా అందుకోని పరిస్థితులపై అధ్యయనం చేయాలని కోరారు. కాంట్రాక్ట్ వ్యవస్థను సమూలంగా రద్దు చేసి ప్రతి కార్మికుడికి యాజమాన్యం ద్వారా జీతాలు చెల్లించే విధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తంగుడు ముత్యాలరావు, ప్రధాన కార్యదర్శి గంగాంజనేయులు, రాష్ట్ర కమిటీ నాయకులు వి.బాజి, ప్రసాద్ కుమార్, మధుసూదనరావు, దాసరి కిరణ్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. మహిళ మెడలో పుస్తెల తాడు చోరీ ఆమదాలవలస: పట్టణంలోని 12వ వార్డు చంద్రయ్యపేటకు చెందిన కరణం సుమిత్ర అనే మహిళ, తన మెడలో సుమారు రెండున్నర తులాల పుస్తెల తాడును గుర్తు తెలియని వ్యక్తి అపహరించినట్లు ఆమదాలవలస పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఐ సనపల బాలరాజు తెలిపిన వివరాల మేరకు.. కరణం సుమిత్ర అత్త అనారోగ్యంతో బాధపడుతుండగా, ఆమె భర్త వైద్య చికిత్స నిమిత్తం విశాఖపట్నానికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం సుజాత ఇంటి బయట ఉన్న బాత్రూంలో స్నానం చేసి తిరిగి ఇంట్లోకి వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమెను కత్తితో బెదిరించాడు. అరిస్తే తన పిల్లలను చంపేస్తానని చెబుతూ మెడలోని బంగారు పుస్తెలతాడును లాక్కొని పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. ఇదిలాఉండగా పట్టణంలో ఇటీవల పెరుగుతున్న చోరీలు, స్నాచింగ్ ఘటనలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు సరుబుజ్జిలి: మండలంలోని షళంత్రి జంక్షన్ వద్ద సోమవారం ఒక ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. వివరాల్లోకి వెళ్తే.. ఆమదాలవలస నుంచి సరుబుజ్జిలి వస్తున్న ఆటోను, శ్రీకాకుళం నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు వెనుక నుండి ఢీకొట్టడంతో సమీపంలో ఉన్న చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. అయితే ఆటోలో ప్రయాణిస్తున్నవారికి, బస్సులో ఉన్నవారికి ఎటువంటి గాయాలు కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
అర్జీలు త్వరితగతిన పరిష్కరించాలి
● సహాయ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్ ● పీజీఆర్ఎస్లో 173 అర్జీల స్వీకరణ శ్రీకాకుళం పాతబస్టాండ్: పీజీఆర్ఎస్కు వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని సహాయ(శిక్షణ) కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మణమూర్తి, విశ్రాంత జిల్లా రెవెన్యూ అధికారి (పలాస ఎయిర్పోర్టు ప్రత్యేక అధికారి) ఎం.వెంకటేశ్వరరావు, డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్లతో కలిసి అర్జీదారుల నుండి వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం 173 అర్జీలు స్వీకరించారు. వీటిలో రెవెన్యూ–69, సోషల్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ–49, పంచాయతీ రాజ్–9, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్–7, వ్యవసాయ శాఖ–5, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్–5, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్–5, ఏపీఈపీడీసీఎల్–4, రూరల్ వాటర్ సప్లయ్ ఇంజినీరింగ్–3, రూరల్ డవలప్మెంట్–3, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్–2, మెడికల్ ఎడ్యుకేషన్–2, వాటర్ రీసోర్సెస్–2, స్కూల్ ఎడ్యుకేషన్–2, మైన్స్ అండ్ జియాలజీ–2, సమగ్ర శిక్ష–1, ఎండోమెంట్–1, ఏపీ స్టేట్ స్కిల్ డవలప్మెంట్–1, ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్టు–1 అర్జీలు ఉన్నాయి. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా రెవెన్యూ క్లీనిక్ ఈవారం వినతుల స్వీకరణతో పాటు ప్రత్యేకంగా రెవెన్యూ క్లీనిక్ పేరిట రెవెన్యూ సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లు, సిబ్బందిని పీజీఆర్ఎస్ హాల్కు తీసుకొచ్చారు. వినతుల స్వీకరణకు ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ చేసేందుకు 9 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్లలో 22ఏ, జాయింట్ ఎల్పీఎం, మ్యుటేషన్, ఎఫ్లైన్, అడంగల్ రాకపోవడం, విస్తీర్ణంలో తేడాలు, ఎస్ఎల్ఆర్లో భూమి నమోదు లేకపోవడం వంటి సమస్యలపై వినతులు స్వీకరించారు. ఈ విభాగానికి 140 దరఖాస్తులు వచ్చాయి. అయితే ఈ సమస్యలపై వినతుల స్వీకరణ తప్ప పరిష్కారం జరగలేదు. ఉన్నతాధికారులు గ్రీవెన్సులో లేకపోవడంతో పరిష్కరానికి వీలున్న వాటిని కూడా చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ వారం రెవెన్యూ క్లీనిక్ వినతుల్లో ఎక్కువ శాతం అర్జీలు మండల స్థాయిలో పరిష్కారం జరగాల్సింది. కానీ అక్కడ జరగకపోవడంతో జిల్లా గ్రీవెన్సును ఆశ్రయిస్తున్నారు. రోడ్డు తొలగింపును అడ్డుకోవాలి పొందూరు మండలంలోని గోకర్ణపల్లి గ్రామ సచివాలయానికి వేసిన రోడ్డు తొలగింపు చర్యలను అడ్డుకోవాలని వైఎస్సార్సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ కోరారు. ఈ మేరకు పీజీఆర్ఎస్లో సోమవారం వినతిపత్రం అందజేశారు. వైఎస్సార్సీపీ హయాంలో సుమారు రూ.5 లక్షల నిధులు ఖర్చుచేసి గ్రామ సచివాలయానికి సీసీ రోడ్డును వేయడం జరిగిందన్నారు. ప్రజాపయోగానికి వేసిన రోడ్డును టీడీపీ నాయకులు తొలగించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గోకర్ణపల్లి సర్పంచ్ చింతాడ సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
క్రెడిట్ చోరీకి ఆద్యుడు చంద్రబాబు
● వైఎస్సార్సీపీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్ ఆమదాలవలస: సీఎం చంద్రబాబు క్రెడిట్ చోరీకి ఆద్యుడని వైఎస్సార్సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ అన్నారు. సోమవారం ఆమదాలవలసలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ అభివృద్ధి పని జరిగినా అది తన ఘనతేనని చెప్పుకొని క్రెడిట్ తీసుకోవడానికి చంద్రబాబు తాపత్రయ పడుతుంటారని పేర్కొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటులో 10 శాతం కూడా తన పాత్ర లేకున్నా.. కర్త, కర్మ, క్రియ తానేనని చెప్పుకోవడం దారుణమన్నారు. 2014 – 2019 మధ్య భోగాపురం విమానాశ్రయంలో పది శాతం పనులు కూడా జరగలేదన్నారు. ఫేజ్ వన్ కింద 2,700 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉండగా ఐదు శాతం మాత్రమే చేసిందన్నారు. అనంతరం హైకోర్టులో కేసు వేయడంతో భూ సేకరణ నిలిపివేయాలని కోర్టు స్టే ఇచ్చిందని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ హయాంలోనే పనులు 2019 – 24 మధ్య అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకొని రైతులతో కోర్టు కేసులను ఉపసంహరించుకునేలా చేసి, రూ.960 కోట్ల పరిహారాన్ని రైతులకు అందజేశారని గుర్తు చేశారు. 2,700 ఎకరాల్లో 2,200 ఎకరాలు విమానాశ్రయానికి, మిగిలిన 500 ఎకరాలు రాబోయే రోజుల్లో ప్రభుత్వ అవసరాలకు కేటాయించారని తెలిపారు. 2023 మేలో ఈ ప్రాజెక్టుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారన్నారు. అనంతరం శరవేగంగా పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటులో రీల్స్ కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు, సీఎం చంద్రబాబు చేసిన ఘనకార్యం ఏమీ లేదని, ఇప్పటికై నా క్రెడిట్ చోరీని ఆపేయాలని హితవు పలికారు. సమావేశంలో పార్టీ నాయకులు దుంపల శ్యామలరావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు పొడుగు శ్రీనివాసరావు, పార్టీ జిల్లా కార్యదర్శి పొన్నాడ చిన్నారావు, మామిడి రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
రైస్మిల్లు లెక్కల్లో తేడాలు
● మిల్లు సీజ్ చేసిన మంత్రి నాదెండ్ల శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని చింతాడ పరిసర ప్రాంతంలో గల చిట్టెమ్మ రైస్మిల్ను సీజ్ చేయాలంటూ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం చింతాడ గ్రామంలోని చిట్టెమ్మ రైస్మిల్ను నేరుగా పరిశీలించారు. కెపాసిటీకి మించి ట్రక్షీట్లు నమోదైనట్లు ఆన్లైన్లో చూపించడం, రైస్మిల్లుకు 23వేల మెట్రిక్ టన్నుల లక్ష్యం ఇస్తే నవంబర్ నుంచి వెయ్యికిపైగా ట్రక్షీట్లు నమోదు కావడం, తూకాల్లో, స్టాకులో తేడాలు రావడం, రికార్డుల్లో ధాన్యం బస్తాల వివరాలను నమోదు చే యకపోవడంతో సంబంధిత మిల్లు యజమాన్యానికి మంత్రి ప్రశ్నించారు. వారు నీళ్లు నమలడంతో వెంటనే మంత్రి స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులపై సీరియస్ అయ్యారు. ఉన్నఫలంగా మిల్లును సీజ్ చేయాలని ఆదేశించారు. అయితే ఇలాగే జిల్లాలో చాలా మిల్లుల్లో పరిస్థితి ఉంది. ట్రక్షీట్లు జారీ చేయకుండానే మిల్లులకు ధాన్యం వెళ్తుంది అనడానికి ఇదే నిదర్శనం. కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ ఎండీ ఢిల్లీరావు, జేసీ అహ్మద్ ఖాన్, ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, ఆర్డీఓ సా యి ప్రత్యూష, జిల్లా పౌరసరఫరాల అధికారి సూర్యప్రకాశరావు, అగ్రికల్చర్ ఏడీ త్రినాథరావు, ఎమ్మార్వో గణపతిరావు, సర్పంచ్ అరవల రామ్ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. -
విచారణ ఏమైంది సారూ..!
అరసవల్లి: తనకు ఉద్యోగమిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేసిన వైద్యశాఖ ఉద్యోగులపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన ఆ బాధితురాలికి ఏళ్లు గడుస్తున్నా న్యాయం జరగడం లేదు. జిల్లా వైద్యారోగ్యశాఖలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగమిప్పిస్తానంటూ రెండేళ్ల క్రితం ఏకంగా రూ.4.50 లక్షల వరకు తీసుకుని.. తీరా నకిలీ ఉద్యోగ నియామక ఆర్డర్ను చేతిలో పెట్టేసి వదిలించుకున్న వైద్యశాఖ అక్రమార్కులైన ఇద్దరు ఉద్యోగులపై ఇచ్చిన ఫిర్యాదుపై నేటికీ చర్యలు చేపట్టలేదు. వైద్యశాఖలో హెచ్చుమీరిన అక్రమాలు, అవినీతి ఆగడాల్లో ఆ ఇద్దరు ఉద్యోగుల పాత్ర కీలకమని ఆధారాలున్నప్పటికీ ఉన్నతాధికారులు మాత్రం మామూళ్ల మత్తుకు దాసోహమవుతున్నారనే ఆరోపణలున్నాయి. కూటమి ప్రభుత్వంలో బాధిత మహిళలకు న్యాయం జరగదని మరోసారి రుజువైందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇదీ విషయం శ్రీకాకుళం నగరానికి చెందిన ఒక మహిళకు వైద్యారోగ్య శాఖలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం ఇస్తామని చెప్పి ఆ శాఖకు చెందిన ఇద్దరు ఉద్యోగులు రూ.4.50 లక్షలు డబ్బులు తీసుకొని మోసం చేశారు. దీంతో బాధితురాలు గతేడాది జనవరి చివరిలో వైద్యశాఖ రీజనల్ డైరక్టర్ కార్యాలయానికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. సదరు ఉద్యోగులకు తాను చెల్లించిన డబ్బుల వివరాలను ఆధారాలతో సహా జత చేసింది. దీంతో ఆగమేఘాల మీద విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఫిబ్రవరి 12న జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి కార్యాలయంలో విచారణ ప్రక్రియను చేపట్టారు. విశాఖపట్నం డీఎంహెచ్వో డాక్టర్ జగదీశ్వరరావును విచారణాధికారిగా నియమించారు. అతను బాధితురాలితో పాటు ఆరోపణలున్న కాంట్రాక్టు హెల్త్ అసిస్టెంట్తో పాటు కార్యాలయ సూపరింటెండెంట్లను విచారించారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని.. తదనుగుణంగా చర్యలుంటాయని అప్పట్లో విచారణాధికారి వెల్లడించారు. దీంతో తనకు న్యాయం జరిగిపోతుందని బాధితురాలు, ఆమె కుటుంసభ్యులు భావించారు. కానీ నేటికి సుమారు ఏడాది అవుతున్నా, ఇప్పటివరకు ఆ విచారణ ఏమైందో.. నివేదిక ఎక్కడుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీనిపై స్థానిక డీఎంహెచ్వో కార్యాలయ కీలకాధికారి వద్ద ప్రస్తావించగా.. అదంతా ‘మేనేజెడ్ సార్’ అంటూ బదులిచ్చారు. దీనిబట్టి చూస్తే జగదీశ్వరరావు చేపట్టిన విచారణపై ఎలాంటి చర్యలుండవని, కూటమి ప్రభుత్వంలో బాధితురాలికి న్యాయం జరగదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని తీవ్రంగా భావించిన బాధితురాలు న్యాయ పోరాటానికి సన్నద్ధమవుతోందని సమాచారం. ఉద్యోగం పేరుతో మోసం చేసినట్లు బాధితురాలి ఆవేదన వైద్యారోగ్య శాఖలో ఇద్దరిపై ఫిర్యాదు విచారణ ఏమైందో తెలియని వైనం ఏడాదిగా న్యాయం కోసం బాధితురాలి నిరీక్షణ జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి కార్యాలయం -
కుక్కల దాడిలో ముగ్గురికి గాయాలు
హిరమండలం: మండలంలోని అంబావల్లి గ్రామంలో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నా యి. సోమవారం కుక్కలబారిన పడి ముగ్గురికి గాయాలయ్యాయి. సిమ్మ ఈశ్వరమ్మ, చిన్న మ్మి, లలితలు కుక్కల బారిన పడ్డారు. వెంటనే కుటుంబ సభ్యులు హిరమండలం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యసేవలందించారు. అయితే గత కొద్దిరోజులుగా కుక్కలు స్వైర విహారం చేస్తుండడంతో గ్రామస్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వాటిని నియంత్రించాలని కోరుతున్నారు. సిగ్నల్ సమస్యతో నిలిచిన రైలు టెక్కలి రూరల్: స్థానిక తెంబూర్ రోడ్డులో గల జిల్లా ఆస్పత్రి సమీపంలో సోమవారం ఉదయం రైలు సుమారు 15 నిమిషాలు పాటు నిలిచిపోయింది. గుణుపూర్ నుంచి కటక్ వైపు వెళ్లే రైలు సోమవారం ఉదయం సుమారు 5:50 నిమిషాలు సమయంలో తెంబూర్ రోడ్డు జంక్షన్ వద్ద ఉన్న గేటు వేసినప్పటికి సిగ్నల్ సమస్య ఏర్పడటంతో నిలిచిపోయింది. దాదా పు 15 నిమిషాల పాటు గేటుకు అటూ ఇటూ వాహనాలు నిలిచిపోయాయి. కొంత సమయం తర్వాత సిగ్నల్ సరిచేయడంతో రైలు కదిలింది. పోస్టుల భర్తీ ఇప్పుడా? శ్రీకాకుళం: జిల్లాలోని 9 మోడల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 15 పీజీటీ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసేందుకు సోమవారం విద్యాశాఖ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విద్యా సంవత్సరం మరో మూడు నెలల్లో ముగుస్తుండగా ఇప్పుడు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడాన్ని ఆక్షేపిస్తున్నారు. సిలబస్లు దాదాపు పూర్తయిపోయిన దశలో నోటిఫికేషన్ రావడం విడ్డూరంగా ఉందంటున్నారు. లావేరు, పొందూరు, పోలాకి, జలుమూరు, పాతపట్నం, సోంపేట, కంచిలి, కమిటీ, ఇచ్ఛాపురం మండలాలలో ఖాళీగా ఉన్న 15 పోస్టులకు సంబంధించి అర్హులైన అభ్యర్థుల నుంచి ఈ నెల 8వ తేదీలోగా దరఖాస్తులను మోడల్ స్కూల్లలో అందజేయాలని సూచించారు. ఈ లెక్కన సంక్రాంతి పండుగలోగా భర్తీలు జరిగే అవకాశాలు లేవు. ఫిబ్రవరి నుంచి మీరు పాఠశాలలకు వెళ్లే పరిస్థితి ఉంటుంది. మార్చి నెలలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనుండగా, ఒక్క నెలలో వీరితో ఏ విధంగా బోధన చేయిస్తారో ఏ ఒక్కరికి అర్థం కావడం లేదు. అలాగే ఈ ఉద్యోగంలో చేరిన అభ్యర్థులను ఏప్రిల్లో విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత తొలగిస్తారు. బోధన సమయాన్ని లెక్కకట్టి గంటకు రూ.250 చొప్పున చెల్లిస్తారు. ‘కార్గో వద్దంటుంటే సర్వేలు ఎందుకు..?’ మందస: మందస మండలం ఎం.గంగువాడ బస్ షెల్టర్లో కార్గో ఎయిర్ పోర్టు వ్యతిరేక కమిటీ అధ్యక్షుడు కొమర వాసు ఆధ్వర్యంలో సోమవారం రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రోజుల క్రితం మందస తహసీల్దార్ కార్యాలయంలో కార్గో ఎయిర్ పోర్టు ప్రత్యేక అధికారి, లీగల్ అడ్వైజర్ ఎం.వెంకటేశ్వరరావు, పలాస ఆర్డీఓ జి.వెంకటేశ్వరరావు చేసిన ప్రకటనను తాము ఖండిస్తున్నామని తెలిపారు. మందస, వజ్రపుకొత్తూరు మండలాల ప్రజలు కార్గోకు వ్యతిరేకంగా పోరాడుతుంటే ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పలాస ఆర్డీఓ వచ్చినప్పుడు కూడా ఇదే తీర్మానాన్ని రాసి ఇచ్చామని, ఇప్పుడు మళ్లీ సర్వేకు సహకరించాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. కార్గో ఎయిర్ పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ కార్యదర్శి జోగి అప్పారావు మాట్లాడుతూ రైతుల అభిప్రాయాలను ప్రభుత్వానికి చెప్పకుండా సర్వేలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. కమిటీ కన్వీనర్ బత్తిని లక్ష్మణ్, స్థానిక సర్పంచ్ పొట్టి ధర్మారావు, మామిడి తులసయ్య, జుత్తు భూపతి, బడిచిత్త కూర్మారావు, పొట్టి ఎర్రయ్య, యోగేశ్వరరావు, దున్న రామారావు, రత్నాల చలపతి, గుంటు రామస్వామి, చిత్త గున్నయ్య, చిరంజీవి, సుంకర దిలీప్, సత్యం, కృష్ణారావు, మోహన్రావు, హేమరాజు తదితరులు పాల్గొన్నారు. -
రెడ్బుక్ రాజ్యంలో..
అధికారం చేతిలో ఉంటే.. పాలించే పార్టీ మనదే అయితే ఇక తిరుగేముంటుంది. మనం తప్పు చేసినా ఒప్పే.. చట్టం మనవైపు నిలుస్తుంది. దేశ రక్షకులైనా, ఒక పంచాయతీని పాలించే సర్పంచ్ అయినా అధికార పార్టీ వారు కాకపోతే శత్రువుల్లానే చూస్తుంది. బాధితులనే నిందితులుగా నిలబెడుతుంది.. కుదిరితే దోషు లుగానూ తేల్చేస్తుంది. ఏమిటీ నమ్మడం లేదా.. అయితే హిరమండలం ధనుపురం, కోటబొమ్మాళి, జలుమూరు మండలం రావిపాడు గ్రామాల్లో టీడీపీ దన్నుతో కొందరు పెట్రేగిన తీరు.. వారిపై ఫిర్యాదులందినా చర్యలు తీసుకోకుండా కొమ్ముకాస్తున్న పోలీసులు, ఎమ్మెల్యే, మంత్రుల తీరు చూడండి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. ఆటవిక రాజ్యంలో ఉన్నామా అన్న అనుమానం, ఆందోళన కలగక మానవు. -
● ఆర్పీఎఫ్ ఉద్యోగిపై సర్పంచ్ భర్త ఫిర్యాదు
శ్రీకాకుళం క్రైమ్ : విశాఖపట్నం మర్రిపాలెం సెక్టార్లో ఆర్పీఎఫ్ ఉద్యోగిగా పనిచేస్తున్న గొల్లంగి సత్యనారాయణపై జలుమూరు మండలం రావిపాడు పంచాయతీ (యేనేటికొత్తూరు గ్రామం) సర్పంచ్ బోర భారతి భర్త బోర సింహాచలం, గ్రామస్తులు సోమవారం ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డికి ఫిర్యాదు చేశారు. సత్యనారాయణది తమ గ్రామమేనని, ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ రాజకీయ కార్యక్రమాలు, తగువులు చేస్తూ గ్రామంలో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నారని, యువతకు మ ద్యం ఇచ్చి రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు పెట్టుకుని అల్లర్లు సృష్టిస్తున్నాడని, తనని, తన భార్యని దుర్భాషలాడుతూ మానసికంగా హింసిస్తున్నాడని సింహాచలం ఫిర్యాదు చేశారు. గతంలో గోవాలో పనిచేసిన సత్యనారాయణ అక్కడి మద్యం తెచ్చి వారి తండ్రితో గ్రామంలో అమ్మించగా ఎకై ్సజ్ విభాగం వారు అరెస్టు చేసి రిమాండ్కు పంపించారన్నారు. ఈ విషయమై ఆర్పీఎఫ్ ఉన్నతాధికారులకు ఆన్లైన్లో ఫిర్యాదు చేశామన్నారు. -
● బూట్లు వేయలేదని టెన్త్ విద్యార్థుల గెంటివేత
ఇచ్ఛాపురం రూరల్: ప్రభుత్వం అందించిన బూట్లు ధరించలేదనే కారణంతో పదో తరగతి విద్యార్థులను పాఠశాల నుంచి ప్రధానోపాధ్యాయుడు బయటకు గెంటేయడం మండలంలో తీవ్ర వివాదాస్పదమైంది. వివరాల్లోకి వెళితే... మండలం కొత్త శాసనాం ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 15 మంది విద్యార్థులు సోమవారం బూట్లు ధరించలేదని ప్రధానోపాధ్యాయుడు పైడి గోపాలరావు ప్రార్థనా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటి ఆగకుండా విద్యార్థులను బయటకు గెంటేయడంతో వారంతా స్థానిక బస్టాండ్, రోడ్లపై ఉదయం నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తిరిగా రు. వారిని చూసిన తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలకమైన టెన్త్లో ఉన్న విద్యార్థులపై ఈ రకమైన కఠిన చర్యలు అమానవీయమని, విద్య కంటే బూట్లకే ప్రాధాన్యం ఇస్తున్నా రా? అని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నా రు. చిన్న కారణాలతో విద్యార్థులను అవమానపరచడం మానసిక ఒత్తిడికి దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ప్రధానోపాధ్యాయుడి వివరణ కోరగా... విద్యార్థుల్లో క్రమశిక్షణ లోపించిందని, పలుమార్లు హెచ్చరించినా ప్రయోజనం కనిపించకపోవడంతో వారిలో మార్పు కోసం ఇలా విద్యార్థులను బయటకు పంపించడం జరిగిందని స్పష్టం చేశారు. -
పంటకు పొగ పెడుతోంది
● రైతులను భయపెడుతున్న పొగమంచు ● జీడి,మామిడి పూతకు నష్టం ● అపరాల పంటలదీ ఆదే పరిస్థితి మంచుతో నష్టం అపరాల పంటలైన పెసర, మినుము ఆశాజనకంగా ఉన్నాయి. కొన్నిచోట్ల ప్రస్తు తం పూత దశకు వచ్చాయి. పస్తుతం కురుస్తున్న మంచు కారణంగా పూతకు వచ్చిన పంటంతా నల్లగా మారిపోతోంది. పూత రాలిపోవడంతో పాటు చిన్న దోమ చేరి నష్టం జరుగుతుంది. పంటను కాపాడుకునేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నాం. – కొల్లి కృష్ణారావు, రైతు, బైరాగిపేట గ్రామం, పాతపట్నం మండలం పాతపట్నం: గత పది, పదిహేను రోజులుగా కురుస్తున్న పొగ మంచు పంటలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పూత దశకు వచ్చిన పంటలు పొగ మంచు కారణంగా మాడిపోతున్నాయి. జీడి,మామిడి పూతతో పాటు అపరాల పంటలైన పెసర, మినుము, పూతకు నష్టం కలుగుతోంది. ఆలస్యంగా పూతకు వచ్చిన కంది పంటదీ అదే పరిస్థితి. ఉదయం 9 వరకు.. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు పొగ మంచు కురుస్తోంది. సూర్యుడు కనిపించనంతగా దట్టంగా మంచు కురవటంతో ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కూలి పనులకు వెళ్లేవారు, పాఠశాలకు వెళ్లే విద్యార్థులు.. ఇలా అన్ని వర్గాల వారు మంచుతో పాటు చలి పెరగటంతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల వాసులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. -
● ఆర్మీ ఉద్యోగి కుటుంబంపై దాడి
● ఇంటికి వెళ్లే దారి అడ్డగింత ● రెచ్చిపోయిన టీడీపీ నాయకులు హిరమండలం: ఆర్మీ ఉద్యోగి దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ఉండగా, ఇక్కడ ఆయన ఇంటిపై దాడి చేసి, ఇంటికి దారి లేకుండా చేసే పనిలో పడ్డారు టీడీపీ నాయకులు. ఎమ్మెల్యే అండదండలు, పార్టీకి చెందిన ఓ విభాగం అధ్యక్షుడి దన్ను చూసుకుని స్థానిక టీడీపీ నాయకులు ఏకంగా ఆర్మీ ఉద్యోగినే టార్గెట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. హిరమండలం ధనుపురం గ్రామంలో సిరిపురం శ్యామలరావు అనే ఆర్మీ ఉద్యోగి పదేళ్ల కిందట ఇల్లు నిర్మించుకున్నాడు. అక్కడ స్థలం కొనుగోలు చేసి ఇల్లు కట్టుకున్నారు. తాను కొనుకున్న ఇంటి ముందు కొంత ఖాళీ స్థలం ఉంది. అయితే ఆ స్థలం గుండా ఇంటిలోకి రాకపోకలు ఉండేవి. అయితే ఇంటి ముందు ఉన్న స్థలంలో ఇంటి గేటు తీయకుండా అడ్డంగా రాళ్లు, కర్రలు వేశారు. దీంతో గోడ దూకి ఇంటికి రాకపోకలు జరుపుతున్నారు. అదే గ్రామానికి చెందిన దారపు షణ్ముఖరావు, అంగూరు భాస్కరావులు తమ స్థలం అని చెబుతూ ఆ స్థలంలో కంచెలు కూడా వేశారు. అప్పటి నుంచి వారి మధ్య వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఆ వివాద స్థలంలో నిర్మాణ పనులు చేపట్టారు. దీన్ని శ్యామలరావు తండ్రి, భార్య అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిపై దాడి చేశారు. దీంతో బాధితులు పోలీసులకు ఫోన్ చేయడంతో హుటాహుటిన పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఉభయ వర్గాలను పోలీస్స్టేషన్కు పిలిపించారు. ప్రస్తుతం బాధితుడు అరుణాచల్ ప్రదేశ్లో విధుల్లో ఉన్నాడు. అక్కడ నుంచి నేరుగా విలేకరులతో ఫోన్లో మాట్లాడాడు. బాధితుడు శ్యామలరావు ఈ విషయాన్ని స్థానిక సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లగా పెద్దగా స్పందించలేదు. స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో జిల్లా మంత్రి అచ్చెన్నాయుడును కలిసి విన్నవించారు. చివరకు మంత్రి నారా లోకే ష్కు సైతం ఫిర్యాదు చేశారు. అయినా బాధితులకు న్యాయం జరగడం లేదు. అధికారులపై ఓ ఎమ్మెల్యే ఒత్తిడి ఉందని బాధితులు చెబుతున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అయితే దీనిపై ఇంతవరకూ పోలీసులు కేసు నమోదు చేయలేదని తెలుస్తోంది. -
● నగదు లేక.. టోల్ కట్టక
శ్రీకాకుళం ఆర్టీసీ డిపోకు చెందిన ఏపీ 30 జెడ్ 0129 నంబర్ బస్సు ప్రయాణికులను అవస్థలకు గురి చేసింది. బస్సుకు చెందిన ఫాస్టాగ్లో డబ్బులు లేకపోవడంతో మడపాం టోల్గేట్ వద్ద బస్సును నిలిపివేశారు. శ్రీకాకుళం నుంచి పలాసకు సోమవారం ఉదయం బస్సు 70 మంది ప్రయాణికులతో బయల్దేరింది. మడపాం టోల్గేట్ వద్ద అక్కడ సిబ్బంది తనిఖీ చేయగా ఫాస్టాగ్లో డబ్బు లేదని గుర్తించారు. దీంతో బస్సును పంపించేందుకు టోల్ సిబ్బంది నిరాకరించారు. చేసేదేమీ లేక బస్సు డ్రైవర్ పక్కకు తీసి నిలుపుదల చేశారు. ప్రయాణికులు కూడా కిందకు దిగి నిరీక్షించారు. వారంతా వేరొక బస్సులో తమను పంపించాలని గొడవ చేయడంతో బస్సు డ్రైవర్ విషయాన్ని శ్రీకాకుళం డిపో అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వారు స్పందించి పది నిమిషాల తర్వాత ఫాస్టాగ్లో జమ చేశారు. దాని తర్వాత బస్సు ముందుకు కదిలింది. దాదాపు అరగంట పాటు ఇబ్బంది తప్పలేదు. –శ్రీకాకుళం -
ఏపీ స్టేట్ తైక్వాండో చాంపియన్గా శ్రీకాకుళం
శ్రీకాకుళం న్యూకాలనీ: సిక్కోలు వేదికగా రెండు రోజులపాటు కన్నులపండువలా సాగిన ఏపీ రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలు ముగిశాయి. ఏపీ రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ సౌజన్యంతో శ్రీకాకుళం జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ కల్యాణమండపం వేదికగా 39వ ఏపీ రాష్ట్రస్థాయి సబ్జూనియర్స్ కుర్గీ, 14వ ఏపీ రాష్ట్రస్థాయి సబ్జూనియర్స్ పూమ్సే బాలబాలికల తైక్వాండో చాంపియన్షిప్ పోటీలను నిర్వహించారు. మెగా టోర్నీలో ఓవరాల్ చాంపియన్గా శ్రీకాకుళం నిలవగా, రన్నరప్గా విజయనగరం జిల్లా, తృతీయ స్థానంలో కర్నూలు జిల్లా నిలిచా యి. ఆదివారం అర్ధరాత్రి వరకు పోటీలు కొనసాగాయి. తొలుత బాలురుకు పోటీలను పూర్తిచేయగా, ఆ తర్వాత బాలికల పోటీలను ముగించారు. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన క్రీడాకారులకు బంగారు, రజత, కాంస్య పతకాలను అందజేశారు. విజేతలకు పలువురు ప్రజాప్రతినిధులు, అథ్లెటిక్స్ అసోసియేషన్ ఏపీ రాష్ట్ర చైర్మన్ కొన్న వెంకటేశ్వరరావు (వాసు) తదితరులు విజేతలకు బహుమతులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తైక్వాండో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్టీ చంద్రమౌళి, తైక్వాండో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి తైక్వాండో శ్రీను, టోర్నీ ఆర్గనైజింగ్ కన్వీనర్ మజ్జి గౌతమ్, నౌపడ విజయ్కుమార్, వర్మ, వేణు, మాధురి, పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రముఖులు, సామాజిక వేత్తలు ఒలింపిక్, పీఈటీ సంఘ నాయకులు, రిఫరీలు, టెక్నికల్ అఫీషియల్స్ తదితరులు పాల్గొన్నారు. -
● వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలు చించివేత
టెక్కలి: కోటబొమ్మాళి పాతబస్టాండ్లో పంచాయ తీ పార్కు వద్ద వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. ఇటీవల వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినం, నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేయడంపై వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు భగ్గుమంటున్నారు. సోమవారం ఉదయం కొంత మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు గమనించి మండల స్థాయి నాయకులకు తెలియజేశారు. దీంతో కోటబొమ్మాళి సర్పంచ్ కాళ్ల సంజీవ్, పార్టీ మండల అధ్యక్షుడు ఎస్.హేమసుందర్రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు అన్నెపు రామారావు, మండల స్థాయి నాయకులు రోణంకి మల్లయ్య, దుక్క రామకృష్ణారెడ్డి, పి.వెంకట్రావు, కల్లి విశ్వనాధం, హెచ్.గోవిందరావు, అనపాన కర్రెయ్య, శివారెడ్డి, పి.సతీష్, గుంట సోమేశ్వరరావు తదితరులు సంఘటన స్థలానికి చేరుకుని ఫ్లెక్సీలను పరిశీలించారు. అనంతరం కోటబొమ్మాళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు మాట్లాడుతూ కొంత మంది వ్యక్తులు చిల్లర రాజకీయాలకు అలవాటు పడి ఇలా వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలను చింపివేశారని పేర్కొన్నారు. ఇలాంటి కవ్వింపు చర్యల వల్ల తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే కోటబొమ్మాళిలో ఫ్లెక్సీలు కడుతున్న సమయంలో కొంత మంది అడ్డు చెప్పారని గుర్తు చేశారు. రాజకీయంగా తమను ఎదుర్కొనలేక ఇలాంటి పనికిమాలిన చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి చర్యలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సంఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించి ఫ్లెక్సీలు చింపిన వారిని అదుపులోకి తీసుకుని భవిష్యత్లో ఇలాంటి చర్యలకు పాల్పడకుండా చూడాలని వైఎస్సార్సీపీ నాయకులు కోరారు. -
ఆగని దోపిడీ
శ్రీకాకుళం● రైతుల నుంచి అదనంగా ధాన్యం తీసుకుంటున్న మిల్లర్లు ● సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న రైతులు– మిల్లర్ మధ్య సంభాషణ వీడియో సోమవారం శ్రీ 5 శ్రీ జనవరి శ్రీ 2026కంచిలి: రైతులు పంట విక్రయానికి ఎన్ని అవస్థలు పడుతున్నారన్నది ఒక్క వీడియోతో తేటతెల్లమైపోయింది. ట్రక్షీట్ జనరేట్ అయిన తర్వాత మిల్లుకు వచ్చిన ధాన్యాన్ని దించడానికి మిల్లరు రకరకాల కొర్రీలు పెడుతూ రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారు. ధాన్యం నాణ్యతపై అభ్యంతరం ఉందంటూ సరకు దించకుండానే రైతుల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈ విషయమై జిల్లావ్యాప్తంగా రైతులు, ప్రజాప్రతినిధులు జెడ్పీ సర్వసభ్య సమావేశంలో సైతం సాక్షాత్ కలెక్టర్ దృష్టిలో పెట్టిన సంగతి విదితమే. కానీ మిల్లర్ల వ్యవహార శైలిలో ఏ మాత్రం మార్పు లేదు సరికదా మరింతగా రెచ్చిపోతున్నారు. దీనికి కంచిలి మండలం పురుషోత్తపురం పంచాయతీ పరిధిలోని స్వప్న రైస్ మిల్లు యజమాని కిల్లంశెట్టి మోహనరావు రైతులతో వ్యవహరించిన తీరు ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పవచ్చు. రైతుల తెచ్చిన ధాన్యానికి వంకలు పెడుతూ 80 కిలోల బస్తా బదులుగా 92 కిలోలు ఇస్తేనే అనుమతిస్తానంటూ హుకుం జారీ చేస్తున్నారు. అదనంగా 12 కిలోలు ఇస్తేనే అన్లోడింగ్ చేస్తానంటే.. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని అమ్ముకొనేందుకు ఆత్మాభిమానం చంపుకొని వ్యాపారి చేతులు పట్టుకొని బతిమలాడటం కనిపించింది. ఈ వ్యవహారానికి సంబంధించి మిల్లు యజమానికి మద్దతుగా టీడీపీ నేతలు ప్రవేశించడం, స్థానిక కూటమి ఎమ్మెల్యే బెందాళం అశోక్ దృష్టికి వెళ్లడంతో ఆయన కూడా స్తబ్ధుగా ఉంటూ మిల్లర్కు కొమ్ముకాస్తున్నా రని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో రైతులకు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. జిల్లావ్యాప్తంగా అదనంగా 3 కిలో లు, 4 కిలోలు నుంచి ఏకంగా 12 కిలోలు అదనంగా అడుగుతుండటంపై ప్రభుత్వ పెద్దలు ఏ విధంగా కొమ్ముకాస్తున్నారో ఈ వ్యవహారంతో అవగతమవుతుంది. ‘పండించిన ధాన్యం నాణ్యత బాగోలేదు. నేనేం చేయలేను. నష్టం వస్తే ఎవరు భరిస్తారు. నువ్వు తెచ్చిన ధాన్యంలో పొల్లు, నూకలే 50శాతం ఉన్నాయి. రైతు అభ్యంతరం చెబుతుంటే 40శాతం ఉన్నాయా అంటూ.. రామారావు(టీడీపీ నేత), ఎమ్మార్వో చెప్పారు కదా. 92 కిలోలు ఇస్తేనే తీసుకొంటాను. మీకు ఇందులో ఎలాంటి నష్టం రాదు.’ – కంచిలి మండలం పురుషోత్తపురం పంచాయతీ పరిధిలో స్వప్న ట్రేడర్స్ రైస్ మిల్లు వద్ద యజమాని కిల్లంశెట్టి మోహనరావు ధాన్యం తీసుకొచ్చిన రైతుతో జరిపిన సంభాషణ ఇది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
ఖర్చులకు సూచనలిలా..
● కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘ నిధులను రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు గ్రామ పంచాయతీల్లో పేరుకుపోయిన అన్ని రకాల చెత్తకుప్పలు, పాతచెత్త సహా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమా లకు, 2025 డిసెంబర్ వరకు గ్రీన్ అంబాసిడర్లకు అన్ని రకాల బకాయిలు, విద్యుత్ బిల్లులు, నీటి పథకాల నిర్వహణకు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంది. ● మండల పరిషత్లలో లింక్రోడ్లు, హ్యాండ్ పంపుల నిర్వహణ, స్వచ్ రథానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించాల్సి ఉంటుంది. ● జిల్లా పరిషత్లో గ్రామీణ మంచినీటి పథకాలకు సంబంధించిన సీసీ చార్జీల చెల్లింపులు, పథకాల నిర్వహణ, అవసరాలకు అనుగుణంగా లింకు రోడ్ల మరమ్మతులు, నిర్వహణకు మాత్ర మే ఖర్చు చేయాలని ప్రభుత్వం సూచించింది. ● జిల్లాలో స్థానిక సంస్థల్లో సింహభాగం వైఎస్సార్సీపీకి చెందినవే కావడంతో అధికార కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
రైలెక్కి హల్చల్ చేసిన యువకుడు
రైల్వేస్టేషన్లో పోలీసుల అదుపులో ఉన్న యువకుడు రైలు పెట్టైపె కూర్చున్న యువకుడు కంచిలి: కంచిలి మండల కేంద్రంలో గల సోంపేట రైల్వేస్టేషన్లో సూపర్ఫాస్ట్ రైలెక్కి ఓ యువకుడు ఆదివారం హల్చల్ చేశాడు. భువనేశ్వర్ నుంచి తిరుపతి వెళ్లే ట్రైన్ నంబర్ 22871 మధ్యాహ్నం 3.26 గంటలకు వచ్చింది. ఇంతలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం హౌరా పట్టణం నవదీప్ ప్రాంతానికి చెందిన ప్రయాణికుడు విజయ్ సర్కార్ అమాంతంగా రైలు పైకి ఎక్కాడు. ఎక్కడమే కాకుండా అందర్నీ భయ భ్రాంతులకు గురిచేశాడు. రైలు పైన అటు, ఇటూ పరిగెడుతూ హల్చల్ చేశాడు. దీంతో స్టేషన్ మాస్టర్ బలరాం బెహరా వెంటనే అక్కడికి చేరుకొని ఖుర్దా డీఆర్ఎం ఆఫీస్కు ఫోన్ చేసి, విద్యుత్ సరఫరాను ఆపించారు. తర్వాత చాకచక్యంగా స్థానిక సిబ్బంది, ప్రయాణికులు కలిసి ఆ యువకుడిని కిందకు దించి, అదుపులోకి తీసుకొన్నారు. ఈ సమాచారం అందుకున్న కంచిలి ఎస్ఐ పి.పారినాయుడు అక్కడకు చేరుకొని, ఆ యువకుడిని స్టేషన్ వెయిటింగ్ రూమ్లో ఉంచి, పలాస రైల్వే పోలీసులకు అప్పగించారు. ఆ యువకుడు ఏదో మత్తు పదార్థాలు సేవించి, మతిస్థిమితం కోల్పోయి ఇలా తిక్కతిక్కగా వ్యవహరించినట్లు గుర్తించారు. అతడి జేబులో విశాఖ పట్నం నుంచి హౌరాకు పెనాల్టీ కట్టినట్లు ఒక స్లిప్ జేబులో ఉందని అధికారులు గుర్తించారు. ఈ యువకుడు చేసిన పనికి సూపర్ఫాస్ట్ రైలు 21 నిమిషాలు పాటు సోంపేట స్టేషన్లో నిలిచిపోయింది. -
ధాన్యం లోడ్తో వెళ్తున్న వ్యాన్ బోల్తా
టెక్కలి రూరల్: స్థానిక ఒలేసాగరం సమీప ఫ్లై ఓవర్ బ్రిడ్జిపైన ఆదివారం ధాన్యం లోడ్తో వెళ్తున్న వ్యాన్ బోల్తా పడింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. పలాస నుంచి కోటబొమ్మాళి వైపు ధాన్యం లోడ్తో వెళ్తున్న వ్యాన్ టెక్కలి సమీప ఒలేసాగరం వద్దకు వచ్చే సరికి వ్యాన్ అదుపు తప్పి ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో వ్యాన్లోని ధాన్యం బస్తాలు మొత్తం చెల్లాచెదురుగా రోడ్డుపై పడిపోయా యి. వ్యాన్లో ఉన్న వ్యక్తులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెనుప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. నేటి నుంచి శాఖాపరమైన పరీక్షలు శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో సోమవారం నుంచి శనివారం వరకు ఏపీపీఎస్సీ శాఖాపరమైన (డిపార్డుమెంటల్) పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వీ లక్ష్మణమూర్తి తెలిపారు. ఆదివారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో పరీక్షల ఏర్పాట్లకు సంబంధించి సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమన్వయ కమిటీ నిర్వహించారు. చిలకపాలెంలోని శివాని ఇంజినీరింగ్ కళాశాల, ఎచ్చెర్లలోని శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాల, నరసన్నపేటలోని కోర్ టెక్నాలజీ కేంద్రాలను పరీక్ష కేంద్రాలుగా కేటాయించామన్నారు. ప్రతి రోజూ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని, అభ్యర్థులు గంటన్నర ముందే కేంద్రాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. సమయపాలన విషయంలో నిబంధనలు కఠినంగా ఉంటాయని, ఉదయం 9:30 గంటలు, మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను కేంద్రంలోకి అనుమతించబోమ ని ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ పీవీ నవ జ్యోతి స్పష్టం చేశారు. పరీక్షా హాల్లోకి సెల్ఫోన్లు, వాచీలు, క్యాలిక్యులేటర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురావడాన్ని పూర్తిగా నిషేధించారు. హోరాహోరీగా తైక్వాండో పోరు శ్రీకాకుళం న్యూకాలనీ: ఏపీ రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలు ఆద్యంతం హోరాహోరీగా సాగుతున్నాయి. ఏపీ రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ సౌజన్యంతో శ్రీకాకుళం జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ కల్యాణ మండపం వేదికగా 39వ ఏపీ రాష్ట్రస్థాయి సబ్జూనియర్స్ కుర్గీ, 14వ ఏపీ రాష్ట్రస్థాయి సబ్జూనియర్స్ పూమ్ సే బాలబాలికల తైక్వాండో చాంపియన్షిప్–2025–26 పోటీలు జరుగుతున్నాయి. రెండు రోజుల పోటీల్లో భాగంగా శనివారం ప్లేయర్స్ వేయింగ్ (బరువు) పూర్తిచేసిన నిర్వాహకులు, రెండోరోజు ఆది వారం పోటీలను నిర్వహిస్తున్నారు. తొలుత బాలురుకు పోటీలను పూర్తిచేయగా, బాలికల పోటీలు అర్ధరాత్రి వరకు కొనసాగుతున్నాయి. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన క్రీడాకారులకు పతకాలను అందజేస్తున్నారు. ఎప్పటికప్పుడు విజేతలుగా నిలిచిన ప్లేయర్స్కు మెడల్స్ను బహూకరిస్తున్నారు. తొలుత ఉదయం ఈ పోటీలను శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ముఖ్య అతిఽథిగా హాజరై ప్రారంభించారు. మార్షల్ ఆర్ట్స్ క్రీడలతో శారీరక దారుఢ్యంతోపాటు ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. అనంతరం శ్రీకాకుళం ఎమ్మె ల్యే గొండు శంకర్, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, అథ్లెటిక్స్ అసోసియేషన్ ఏపీ రాష్ట్ర చైర్మన్ కొన్న వెంకటేశ్వరరావు (వాసు) తదితరులు హాజరై వివిధ బరువుల కేటగిరి పోటీలను ప్రారంభించి, విజేతలకు బహుమతులను పంపిణీ చేశారు. -
ఐటీడీఏ ఆశ అడియాసేనా..?
ఐదు వందల కిలోమీటర్ల ప్రయాణం వారిని చావుకు దగ్గర చేసింది. లారీ రూపంలో దారి కాచిన మృత్యువు తల్లీపిల్లలను తీసుకెళ్లిపోయింది. అమ్మ పక్కనే హాయిగా పడుకున్న బిడ్డలను కనికరం లేకుండా చంపేసింది. లిప్తపాటు కాలంలో ఆ కుటుంబాన్ని కారు చీకటి కమ్మేసింది. కొర్లాం జాతీయ రహదారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి, ఇద్దరు బిడ్డలు ఊపిరి వదిలేశారు. సోంపేట: కొర్లాం జాతీయ రహదారి నుంచి బారువ వెళ్లే రహదారి సమీపంలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్రూట్లో అమాంతం దూసుకువచ్చిన లారీ కారును ఢీకొట్టడంతో ఒడిశా బాలాసోర్కు చెందిన కనక లత(31) ఆమె బిడ్డలు అభిలాష (8), ఆది త్య (1) దుర్మరణం పాలయ్యారు. వారు స్వస్థలం నుంచి అప్పటికే 550 కిలోమీటర్లు ప్రయాణించారు. మరో 250 కిలోమీటర్లు వెళ్తే గమ్యస్థానం చేరుకునేవారు. కానీ లారీ రూపంలో వచ్చిన మృత్యువు వారిని కబళించింది. బారువ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం బాలాసోర్కు చెందిన కనకలత విశాఖలో పనిచేస్తున్నారు. ఆదివారం వారి స్వగ్రా మం బాలాసోర్ నుంచి విశాఖ వెళ్లేందుకు ట్రావెల్ కార్ బుక్ చేసుకున్నారు. కనకలతతో పాటు కుమార్తె అభిలాష, పది నెలల కుమారుడు ఆదిత్యతోపాటు పదేళ్ల జానకి అనే మరో అమ్మాయి ఉన్నారు. డ్రైవర్తో కలిపి మొత్తం ఐదుగురు ఉదయమే బయల్దేరారు. కారు కొర్లాం జాతీయ రహ దారి జంక్షన్ వద్దకు చేరుకుంది. అదే సమయంలో పలాస నుంచి బరంపురం వెళ్తున్న లారీ ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి డివైడర్ను దాటి రాంగ్రూట్లోకి ప్రవేశించి అమాంతం కారును ఢీకొట్టి పొలాల్లోకి దూసుకుపోయింది. ప్రమాదంలో కారు లో ఉన్న కనకలత, అభిలాష, ఆదిత్య మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ నాగరాజు, మరో బాలిక జానకిని శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను బారువ సామాజిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే జాతీయ రహ దారి భద్రతా సిబ్బంది, బారువ పోలీసులు, స్థానికులు వెంటనే అక్కడకు చేరుకుని కారులో ఉన్న వారికి బయటకు తీశారు. పసిబాలుడు ఆదిత్య, మరో పాప అభిలాష కొన ఊపిరితో ఉండగా వారికి బతికించేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. పసివాళ్ల కష్టం చూసి అక్కడున్న వారు కంట నీరు పెట్టుకున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ప్రమాదంపై బారువ ఎస్ఐ హరిబాబు నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల బంధువులు వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు. కారులో బాధితులు కనకలత మృతదేహంమూడు బస్సులు మారాలి.. సమస్యలు చెప్పుకోవడానికి వెళ్లడమే పెద్ద సమస్యగా మారుతోంది. సీతంపేట వరకు వెళ్లాలంటే రూ.500 ఖర్చవుతుంది. ఎన్నిసార్లని వెళ్లగలం. మా మండలంలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలి. – సవర గణేష్, పుస్తలవార గ్రామం, మెళియాపుట్టి మండలం పోరాటాలు చేస్తూనే ఉన్నాం మా గిరిజన ప్రజల కష్టాలు తీరాలంటే ఐటీడీఏ అవసరం. రాష్ట్రం, జిల్లా స్థాయిలో ఆందోళనలు చేస్తూనే ఉన్నాం. ఢిల్లీ వరకు వెళ్లి జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్ దృష్టిలో పెట్టాం. ఇటీవల మెళియాపుట్టి మండలం కేరాసింగి గ్రామాన్ని ఆయన సందర్శించారు. ప్రభుత్వం స్పందించాలి. – వాబ యోగి, ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెళియాపుట్టి: జిల్లాల పునర్విభజనలో భాగంగా సీతంపేట ఐటీడీఏ మన్యం జిల్లాలో కలిసిపోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే మెళియాపుట్టిలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తామని పలువురు నేత లు హామీ ఇచ్చారు. కానీ దీనిపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో గిరిజనులు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. సమస్యలు చెప్పుకోవడానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న సీతంపేటకు వెళ్లాల్సి వస్తోందని అంటున్నారు. ఎన్నికల ముందు పాతపట్నం నియోజక వర్గానికి ఏ నేత వచ్చినా.. మెళియాపుట్టిలో ఐటీ డీఏ ఏర్పాటు చేస్తామని చెప్పేవారు. ఇదే హామీతో గిరిజనుల ఓట్లు దండుకున్నారు. అధికారం దక్కాక ఇచ్చిన మాట మర్చిపోయారు. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మెళియాపుట్టి, మందస, కొత్తూరు, పాతపట్నం మండలాల్లో అధికంగా గిరిజనులు ఉన్నారు. 16 గిరిజన ఉప ప్రణాళిక మండలాలు ఉన్నాయి. విభజన ప్రక్రియలో భాగంగా సీతంపేట ఐటీడీఏ పరిధిలో 847 గిరిజన గ్రామాలు ఉండగా శ్రీకాకుళం జిల్లాకు 469, మన్యం జిల్లాకు 378 గ్రామాలను కేటాయించారు. అయితే విభజన అనంతరం అధికారులు గిరిజన గ్రామాల్లోని సమస్యలు ఎక్కడికక్కడే వదిలేశారని గిరిజన సంఘాల నాయకులు చెబుతున్నారు. రహదారులు, తాగునీరు, విద్య, వైద్య సదుపాయాలకు దూరంగా నానా అవస్థలు పడుతున్నట్లు వారు చెబుతున్నారు. అత్యధిక గిరిజన గ్రామాలు ఉండి, అన్ని గ్రామాల ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే మెళియాపుట్టి మండలకేంద్రంలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని ఇది వరకే గిరిజన సంఘాలు పలు సందర్భాల్లో జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, దీక్షలు, ఆందోళనలు చేశాయి. కానీ సర్కారు స్పందించలేదు. మందస, నందిగాం, మెళియాపుట్టి, పాతపట్నం, సారవకోట, ఎల్ఎన్పేట మండలాలకు చెందిన గిరిజనులకు ఐటీడీఏ అందని ద్రాక్షలామారింది. సమస్యలున్నా సీతంపేట వరకు వెళ్లలేకపోతున్నారు. ఇక్కడే ఐటీడీఏ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెబుతున్నారు. కొర్లాం జాతీయ రహదారి వద్ద ఘోర ప్రమాదం కారును ఢీకొట్టిన లారీ ముగ్గురు తల్లీపిల్లల దుర్మరణం మృతులంతా ఒడిశా వాసులు మెళియాపుట్టిలో ఐటీడీఏ ఏర్పాటు ఎప్పుడో..? కోటి ఆశలు పెట్టుకున్న గిరిజనులు సమస్యలు చెప్పుకోవడానికి సీతంపేట వెళ్లాల్సి వస్తోందని ఆవేదన -
మేం చెప్పిన పనులే చేయాలి
అరసవల్లి: గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులకు గాను కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు 2025– 26 ఆర్థిక సంవత్సరానికి మొదటి విడతగా జిల్లాకు మొత్తం రూ. 31.76 కోట్లు వరకు నిధులను కేటాయించింది. దీంతో గ్రామ పంచాయతీల్లో స్థానిక సంస్థల పాలక వర్గాలు పనులను గుర్తించి ఆయా పనులను ఆమోదించేలా గ్రామ పంచాయతీల్లో తీర్మానాలను సిద్ధం చేశారు. తీరా చూస్తే ఆ నిధులను వినియోగించే విషయంలో తీవ్రమైన ఆంక్షలను విధించేలా చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించడంతో గ్రామ సర్పంచ్లు తలలుపట్టుకున్నారు. గ్రామ ప్రణాళిక రిపోర్టు ఆధారంగా జనాభా ఆధా రంగా కేంద్ర ప్రభుత్వం నేరుగా రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు గాను ఆర్థిక సంఘం నిధులను కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం చెలాయించి, తాము గుర్తించిన పనులనే చెయ్యాలి, తాము చెప్పి న విధంగానే చెయ్యాలనేలా షరతులు పెట్టారు. దీంతో రాష్ట్రంతో పాటు స్థానిక జిల్లాలో కూడా అత్యధిక శాతం గ్రామ పంచాయతీల్లో సర్పంచ్లుగా వైఎస్సార్సీపీ మద్దతుదారులే ఉండడంతో వీరంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆర్థిక సంఘ నిధులపై చంద్రగ్రహణం ఎప్పుడు వీడుతుందో అని ఎదురుచూస్తున్నారు. 896 పంచాయతీలకు ఆర్థిక నిధుల సర్దుబాటు జిల్లాలో 15వ ఆర్థిక సంవత్సర మొదటి విడతగా టైడ్ నిధుల కింద రూ.19,05,60,817, అన్టైడ్గా రూ.12,70,40,552 నిధులను కేటాయించింది. మొత్తంగా జిల్లాలో 912 గ్రామ పంచాయతీలుండగా.. ఇందులో 896 పంచాయతీలకే ఈ మొత్తం రూ.31,76,01,339 నిధులను సర్దుబాటు చేశారు. సగటున ఒక్కో పంచాయతీకి రూ.6 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు జనాభా ప్రాతిపదికన కేటా యించారు. నిబంధనల మేరకు 15వ ఆర్థిక సంఘ నిధులు వాడుకోవాల్సి ఉంటుంది. టైడ్ గ్రాంట్ను తాగునీరు, పారిశుద్ధ్యానికి, బేసిక్ (అన్టైడ్) నిధులను గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ప్రాథమిక అవసరాలైన విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, వేతనాలు తదితర ఖర్చులకు వినియోగించే వెసులుబాటు ఉంది. అయితే నిబంధనలను కాదని, తాము సూచించిన వాటికే ఈ నిధులు ఖర్చు పెట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం గత నెల 24న పలు సూచనలను జారీ చేసింది. ఈ సూచనల మేరకు జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీలు విడుదలైన ఆర్థిక సంఘ నిధులను ఖర్చుచేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీనిపై గ్రామ సర్పంచ్లు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఈ నిధులు వస్తాయనే పలు పంచాయతీల్లో సీసీ రోడ్లను వేయించేసిన గ్రామ సర్పంచులు తాజా నిబంధనల ప్రకారం తమ పనులకు బిల్లులు వచ్చే అవకాశాలు లేవని గ్రహించి ఆందోళన చెందుతున్నారు. మరో మూడు నెలల్లోనే స్థానిక సంస్థల పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో తాజా ఆంక్షలు స్థానిక సర్పంచ్లకు నిద్ర పట్టకుండా చేస్తున్నా యి. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన క్రమంలో తాజా ఆంక్షలతో బిల్లులు వచ్చే పరిస్థితులు లేవని దీంతో స్థానిక సంస్థల హక్కులను హరిస్తున్నారని గ్రామ సర్పంచ్లు ఆందోళన చెందుతున్నారు. ఆర్థిక సంఘ నిధుల వినియోగంలో అధికార పార్టీ ఆంక్షలు సర్పంచ్ల పదవీ కాలం ముగియనున్న సమయంలో కుట్ర జిల్లాకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.31.76 కోట్లు విడుదల జిల్లాలో 896 పంచాయతీల్లో నిధుల సర్దుబాటు కేంద్ర నిధులపై రాష్ట్ర ప్రభుత్వ పెత్తనం -
ప్రభుత్వ స్థలాల ఆక్రమణ!
● ఇచ్ఛాపురంలో ఇష్టారాజ్యంగా కబ్జాలు ● పట్టించుకోని అధికారులు ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయి. ఎక్కడ ప్రభుత్వ భూమి కనిపించినా ఆక్రమణదారులు ఏదో ఒక విధంగా సొంతం చేసుకుంటున్నారు. స్థానిక నాయకుల ఆండదండలతో కబ్జా చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లే వ్యవహరిస్తున్నారు. రత్తకన్న రోడ్డులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో మంగలకాలనీ వద్ద 197 సర్వే నంబర్లోని ప్రభుత్వ భూమిని జగనన్న కాలనీకి కేటాయించారు. లబ్ధిదారులు వారికి కేటాయించిన స్థలాల్లో ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారు. కాలనీ పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిపై ఆక్రమణదారుల కన్నుపడింది. స్థలాన్ని చదును చేసి నాలుగు వైపులా స్థంభాలు పాతి కంచె వేశారు. పాతాళ సిద్ధేశ్వరాలయం సమీపంలో ప్రభుత్వ స్థలాల్లో కొంతమంది పశువులను కట్టి మేపుతున్నారు. కొంతకాలం చేసిన తర్వాత ఆ స్థలం తమదే అంటూ నకిలీపత్రాలు సృష్టించి ఆక్రమణలకు పాల్పడుతున్నారు. సంతపేట పంపు హౌస్ వద్ద పాతాళ సిద్ధేశ్వరాలయానికి వెళ్లే దారిలో చిన్నపాటి చెరువులాంటి ప్రాంతం, దాని సమీపంలో స్థలంపై ఆక్రమణదారుల కన్నుపడింది. ఎటువంటి అనుమతులు లేకుండానే నిర్మాణ పనులు మొదలుపెట్టారు. అధికారులు సైతం అడ్డుపడకపోవడంతో ఇదే అదునుగా చెరువును సైతం ఆక్రమించడానికి సన్నాహాలు చేస్తున్నారు. చెరువులో మట్టివేసి కప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణకు పాల్పడితే చర్యలు తప్పవు. ఆక్రమణలు జరిగినట్లు మా దృష్టికి తీసుకొస్తే వెంటనే చర్యలు చేపడతాం. ప్రభుత్వ స్థలాల్లో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టకూడదు. – ఎన్.వెంకటేశ్వరరావు, తహసీల్దార్, ఇచ్ఛాపురం -
ఉపాధ్యాయినులకు పూలే అవార్డులు
శ్రీకాకుళం కల్చరల్/జి.సిగడాం: తిరుపతికి చెందిన ఆర్గనైజేషన్ ఆఫ్ రూరల్, అర్బన్ అండ్ ట్రైబల్ ఎంపవర్మెంట్ నిర్వాహకులు ఉపాధ్యా వృత్తిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులకు ఆదివారం విశాఖపట్నం పౌర గ్రంథాలయంలో సావిత్రిబాయి పూలే లెగసీ అవార్డులను ప్రదానం చేశారు. శ్రీకాకుళం వరం మున్సిపల్ హైస్కూల్లో హిందీ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న తిమ్మరాజు నీరజకుమారి, సీతంపేట జి.టి.డబ్ల్యూ.ఎ.జి.హెచ్.స్కూల్ హెచ్ఎం తిమ్మరాజు వసంతలక్ష్మి, జి.సిగడాం మండలం బూటుపేట ప్రాథమిక పాఠశాల హెచ్ఎం కూర్మాన అరుణకుమారి ఈ అవార్డులను అందుకున్నారు. -
ఆదిత్యునికి ప్రత్యేక పూజలు
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారికి ఆదివారం ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. స్థానికులతో పాటు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి ఆదిత్యునికి మొక్కులు చెల్లించుకున్నారు. రథసప్తమి ఉత్సవ ఏర్పాట్లలో భాగంగా ఆలయ మండపాల్లో పరిసరాల్లో పెయింటింగ్ ఇతర త్రా క్యూలైన్ల ఏర్పాటు పనులు జరుగుతున్న క్రమంలో భక్తులకు దర్శనాల మార్గంలో ఇబ్బందులు లేకుండా ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ చర్యలు చేపట్టారు. అంతరాలయంలో సర్వదర్శనాలు సక్రమంగా అయ్యేలా ప్రధానార్చకులు ఇప్పిలి శంశరశర్మ ప్రత్యేక చర్యలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ సతీమణి ఆదిత్యున్ని దర్శించుకున్నారు. హోంగార్డుపై దాడి సోంపేట: సోంపేటలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న బెహరా ఖగపతిపై దాడి చేసిన బి.సతీష్పై పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం రాత్రి సోంపేట పట్టణంలో మద్యం తాగి గొడవ చేస్తున్న సతీష్ను హోంగార్డు పోలీస్స్టేషన్కు తీసుకొస్తున్న క్రమంలో సతీష్ దాడి చేశాడు. ఈ మేరకు హోంగార్డు ఖగపతి ఫిర్యాదు మేరకు ఎస్ఐ వి.లోవరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చెట్టును ఢీకొని వ్యాన్ బోల్తా మెళియాపుట్టి : బాణాపురం వద్ద శనివారం అర్ధరాత్రి ఓ వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొని బోల్తాపడింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పలాస వైపు నుంచి మెళియాపుట్టి వైపు వస్తున్న ఓ వ్యాన్ అర్ధరాత్రి రెండు గంటల సమయంలో బాణాపురం రహదారి వద్ద చెట్టును ఢీకొట్టింది. గాల్లో ఎగిరి రహదారిపై పడింది. ఉదయం వెళ్లి స్థానికులు చూసేసరికి రెండు చక్రాలు ఊడిపోయి వ్యాన్ కనిపించింది. ఒడిశా రిజిస్ట్రేషన్తో ఉన్న ఈ వ్యాన్లో ఓ కంపెనీ సామగ్రి రవాణా చేస్తున్నట్లు తెలిసింది. ఇద్దరు వ్యక్తులు గాయపడటంతో అంబులెన్స్లో తీసుకెళ్లారని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తమ ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై రమేష్బాబు తెలిపారు. డీసీసీ అధ్యక్షుడిగా అన్నాజీరావు శ్రీకాకుళం అర్బన్: జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా సనపల అన్నాజీరావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. అన్నాజీరావు కట్యాచార్యులపేట పీఏసీఎస్ అధ్యక్షుడిగా, కొర్లకోట ఎంపీటీసీ సభ్యుడిగా, డీసీసీ జిల్లా కార్యదర్శిగా, ప్రచార కార్యదర్శిగా, ఆమదాలవలస మండల, బ్లాకు అధ్యక్షుడిగా, పంచాయతీ అభియాన్ అధ్యక్షుడిగా పనిచేశారు. గతంలో ఆమదాలవలస నియోజకవర్గానికి చెందిన బొడ్డేపల్లి సత్యవతి డీసీసీ అధ్యక్ష పదవిని చేపట్టగా ఇపుడు అన్నాజీరావు నియమితులవ్వడం విశేషం. ఈయన నియామకం పట్ల జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ కిటకిట శ్రీకాకుళం అర్బన్ : శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆదివారం ప్రయాణికులతో కిటకిటలాడింది. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల నుంచి అరసవల్లి సూర్యనారాయణస్వామివారిని దర్శించుకునేందుకు, శ్రీకూర్మం, శ్రీముఖలింగం, రావివలస తదితర పుణ్యక్షేత్రాలను సందర్శించుకునేందుకు భారీ ఎత్తున రావడంతో రద్దీగా కనిపించింది. ఉచిత ప్రయాణం కావడంతో మహిళా ప్రయాణికులు అధిక సంఖ్యలో రావడంతో బస్సుల్లో సీట్ల కోసం ఎగబడ్డారు. అరకు అందాలు అద్భుతం అరకులోయ టౌన్: అరకులోయ అందాలు అద్భుతమని ఏపీ మాజీ స్పీకర్, వైఎస్సార్సీపీ నేత తమ్మినేని సీతారాం అన్నారు. ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి అనంతగిరి, అరకులోయ, డుంబ్రిగుడలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. కటికి జలపాతం, సుంకరమెట్టలోని ఉడెన్ బ్రిడ్జి, గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానవనం, డుంబ్రిగుడలోని చాపరాయి జలవిహారిని తిలకించారు. మాడగడ సన్రైజ్ వ్యూపాయింట్ వద్ద గిరిజనుల వస్త్రధారణలో థింసా కళాకారులతో నృత్యం చేస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ సెలయేర్లు, కొండలు, లోయలు, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు చాలా ఆకట్టుకున్నాయని చెప్పారు. -
చేనేత..ఏదీ చేయూత?
● చతికిల పడిన చేనేత రంగం ● గిట్టుబాటు కాని మజూరీలు ● కార్మికులకు ప్రోత్సాహం కరువు ● ప్రత్యామ్నాయ వృత్తుల్లో చేనేత కుటుంబాలు ఆమదాలవలస : జిల్లాలో వ్యవసాయం తర్వాత అంతటి ప్రాధాన్యమున్న చేనేత రంగంపై చంద్రబాబు ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. ఏటా బడ్జెట్లో చేనేత రంగానికి కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని పాలకులు ప్రగల్భాలు పలుకుతున్నా కార్మికులకు మాత్రం ఎటువంటి నిధులు అందడం లేదు. అరకొర మజూరిలు గిట్టుబాటు కాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని చేనేత కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమదాలవలస నియోజకవర్గంలో ఆమదాలవలస, పొందూరు మండలాల పరిధిలో చేనేత కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆమదాలవలస మండలంలోని అక్కులపేట, వేణమ్మపేట, ఎస్సార్సీపేట, చింతలపేట, బొబ్బిలిపేట, దూసి, ముద్దాడపేట తదితర గ్రామాల్లో సుమారు 260 కుటుంబాలు మగ్గాలపై ఆధారపడి బతుకుతున్నారు. పొందూరు మండలంలో పొందూరు, తోలాపి, తండ్యాం మెట్ట తదితర గ్రామాల్లో సుమారు 450 కుటుంబాలు చేనేతనే నమ్ముకున్నాయి. ప్రభుత్వం వీరికి మగ్గాలు నూలు కొనుగోలుకు లక్షలాది రూపాయలు ఆర్థిక సహాయం అందించినట్లు రికార్డులో చూపుతున్నారు. వాస్తవంగా ఆ నిధులన్ని బినామీ పేర్లతో కొంతమంది చేనేత సొసైటీల ప్రతినిధులు, అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు స్వాహా చేస్తున్నారని నేత కార్మికులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సహకారం అందడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబమంతా శ్రమించినా.. పెరిగిన నూలు ధరలకు అనుగుణంగా కుటుంబమంతా శ్రమించి నేస్తున్నా రోజుకు రూ.150 నుంచి రూ.200కు మించి గిట్టుబాటు కావడం లేదని చేనేత కార్మికులు చెబుతున్నారు. మిల్లుల్లో తమారయ్యే దుస్తులకు గిరాకీ ఉండడం, చేనేత వస్త్రాల ధరలకు పాలిస్టర్తో పోల్చితే అధికంగా ఉండడం తదితర కారణాలతో ఆర్డర్లు తక్కువగా వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మజూరి(కూలీ) గిట్టుబాటు కాక ప్రత్యామ్నాయ పనులకు వెళ్లాల్సి వస్తోందని, పనికి వెళ్తే కూలి రూ.500 వస్తుందని చెబుతున్నారు. పాలకుల నిర్లక్ష్యం.. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన చేనేత రంగం పాలకుల నిర్లక్ష్యం కారణంగా నేడు దయనీయ స్థితికి చేరుకుంది. చేనేత రంగం అభివృద్ధి కోసమంటూ ఏటా కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా అవేవీ కార్మికుల చెంతకు చేరడంలేదు. ఓవైపు ప్రభుత్వం ప్రోత్సాహం లేక, మరో వైపు మజూరి గిట్టుబాటు కాక నేతన్నలు ప్రత్యామ్నాయ పనులు, వృత్తులను ఆశ్రయిస్తున్నారు. ఆదుకోని వర్క్షాప్లు.. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక పద్ధతుల్లో చేనేత వస్త్రాలు తయారు చేసే ఉద్దేశంతో కార్మికుల వృత్తి నైపుణ్యత పెంచేందుకు జిల్లాలో గతంలో రూ.10 కోట్లతో వర్కుషాపు నిర్వహించారు. ఈ శిక్షణ సొసైటీ పరిధిలో ఉన్న కొందరి కార్మికులకు మాత్రమే ఉపయోగపడిందని అంటున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వ స్పందించి నేత కార్మికులను ఆదుకునే చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.పాలకులు స్పందించి రుణాలు, పథకాలు అందించి చేనేత కార్మికులను ఆదుకోవాలి. ఎన్నికల హామీలు అమలు చేయాలి. ప్రోత్సాహకాలు అందించి, మజూరీలు పెంచి చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకురావాలి. – బొట్ట సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు చేనేత కార్మికులను ప్రభుత్వం పెద్ద మనసుతో ఆదుకోవాలి. ఇదే వృత్తిని నమ్ముకొని ఉన్న చేనేత కార్మికులు బయట పనులు చేసుకోలేక, ఇప్పుడిస్తున్న మజూరీ చాలక అవస్థలు పడుతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో చాలామంది ఉన్నాం. – ఎ.పైడిరాజు చేనేత కార్మికుడు, ఆమదాలవలస -
మహిళా క్రికెట్ నెట్స్ ప్రారంభం
శ్రీకాకుళం న్యూకాలనీ: నగరంలో క్రికెట్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ హామీఇచ్చారు. శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలో మహిళలు/బాలికల క్రికెట్ సాధనకు ఏసీఏ తోడ్పాటుతో జిల్లా క్రికెట్ సంఘం (జెడ్సీఎస్) ఏర్పాటు చేసిన క్రికెట్ నెట్స్, టర్ఫ్ వికెట్, ఆస్ట్రో టర్ఫ్వికెట్, జిల్లా క్రికెట్ సంఘ కార్యకలాపాల కోసం నిర్మించిన భవనాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాత్రునివసలో ఖేలో ఇండియా మల్టీ స్టేడియం మైదానం కేటాయించిన ప్రాంతంలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి స్థలం కేటాయిస్తామని చెప్పారు. అనంతరం జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్కు జెడ్సీఎస్ తరఫున రూ.50వేల చెక్కును బాస్కెట్బాల్ సంఘ కార్యదర్శి, కోచ్ అర్జున్రెడ్డికి అందజేశారు. దివ్యాంగుల క్రికెట్లో ఆంధ్రా జట్టుకు ప్రాతినిధ్యం వహంచిన వర్షత్ను సత్కరించారు. కార్యక్రమలో జిల్లా క్రికెట్ సంఘం మెంటార్ ఇలియాస్ మహ్మద్, కోశాధికారి మదీనా శైలానీ, ఏసీఏ ప్రతినిధులు నాగ గంగాధర్, వంశీ, దుప్పల వెంకటరావు, ప్రిన్సిపాల్ పి.సురేఖ, జెడ్సీఎస్ ౖౖకౌన్సిలర్ ఎస్.రవికుమార్, సీహెచ్ విజయభాస్కర్, బాస్కెట్బాల్ కోచ్ గాలి అర్జున్రావురెడ్డి, పాండ్రంగి శంకర్, రమేష్, క్రికెట్ కోచ్లు కె.సుదర్శన్, ఆనంద్కుమార్, కె.కిరణ్, పీడీ మోహన్రాజ్ తదతరులు పాల్గొన్నారు. -
బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
సోంపేట: సోంపేట పట్టణానికి చెందిన తెల్లి అవినాష్ (23) అనే యువకుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సోంపేట పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తెల్లి యోగేశ్వరరావు, రోహిణిల కుమారుడు అవినాష్ బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతుండగా మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. కాలికి తీవ్ర గాయాలు కావడంతో నడవ లేని పరిస్థితి ఎదురైంది. మూడు శస్త్ర చికిత్సలు జరిగినా నయం కాలేదు. చదువు మధ్యలో ఆగిపోవడం, నడవలేని పరిస్థితి కావడంతో నిత్యం ఆందోళన చెందుతుండేవాడు. కుటుంబానికి భారం కాకూడదని ఆదివారం వేకువజామున ఇంటికి సుమారు 100 మీటర్ల దూరంలో ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వీరికి అవినాష్తో పాటు డిగ్రీ చదువుతున్న మరో కుమారుడు ఉన్నాడు. సోంపేట ఎస్ఐ వి.లోవరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స పొందుతూ మహిళ మృతి శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో వడ్డాణ జయలక్ష్మి(40) అనే మహిళ మూడు రోజుల క్రితం ఒంట్లో నీరసమంటూ చేరింది. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. ఈమెకు తోడుగా ఎవరూ రాలేదని, తనది శ్రీకాకుళం బరాటం వీధి అని చెప్పినట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొంటున్నాయి. వివరాలు తెలిసిన వారు 6309990842 నంబరును సంప్రదించాలని ఎస్ఐ ఎం.హరికృష్ణ కోరారు. -
ప్రతిభకు వైకల్యం అడ్డుకాదు
శ్రీకాకుళం పాతబస్టాండ్: అంధులు, పాక్షిక దృష్టి లోపం ఉన్నవారి జీవితాల్లో బ్రెయిలీ లిపి సరికొత్త వెలుగులు నింపిందని, ఈ గొప్ప ఆవిష్కరణ ద్వారా వారు విద్యావంతులుగా మారి సమాజంలో సగౌరవంగా జీవించగలుగుతున్నారని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. కలెక్టరేట్ ఆవరణలోని విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయంలో ఆదివారం ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దృష్టి లోపం ఉన్నవారు ఆత్మన్యూనతా భావాన్ని వీడి లూయిస్ బ్రెయిలీని స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. దృష్టి లోపం ఉన్నవారికి న్యాయ సేవాధికార సంస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఎటువంటి సమస్యలు ఎదురైనా తక్షణమే న్యాయ సేవా సంస్థను ఆశ్రయించి ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో కల్పిస్తున్న రిజర్వేషన్లు, ఇతర రాయితీలను అందిపుచ్చుకుని ఆర్థికంగా ఎదగాలని కోరారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు శైలజ, వివిధ సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
జనవిజ్ఞాన వేదిక క్యాలెండర్ ఆవిష్కరణ
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): పెట్రోల్ నిక్షేపాల కోసం వెనెజులా దేశంపై అమెరికా దాడి చేయడం దుర్మార్గమని జనవిజ్ఞానవేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని యూటీఎఫ్ భవనంలో ఆదివారం జన విజ్ఞాన వేదిక డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవిజ్ఞాన వేదిక ద్వారా ప్రజల్లో శాసీ్త్రయ ఆలోచనలు పెంచేలా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కుప్పిలి కామేశ్వరరావు మాట్లాడుతూ అందరిలో శాసీ్త్రయ దృక్పథం పెంచేందుకు, ప్రజల కోసం సైన్సు – ప్రగతి కోసం సైన్స్–స్వావలంబన కోసం సైన్స్– పర్యావరణ పరిరక్షణ కోసం సైన్స్ అనే నినాదాలతో జనవిజ్ఞావేదిక పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో జేవీవీ జిల్లా ఉపాధ్యక్షుడు సంజీవరావు, జిల్లా సహాధ్యక్షుడు బి.ధనలక్ష్మి, మహిళా విభాగం కన్వీనర్ కె.శాంతి ప్రియ, మద్యం మాదక ద్రవ్యాల వ్యతిరేక కమిటీ కన్వీనర్ సీహెచ్ రాజు, ఆమదాలవలస డివిజన్ నాయకులు కె.షణ్ముఖరావు తదితరులు పాల్గొన్నారు. -
ఎస్ఎస్ఆర్పురం విద్యార్థుల ప్రతిభ
ఎచ్చెర్ల : శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాలలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ సోషల్ స్టడీస్ టీచర్ ఫోరమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సోషల్ స్టడీస్ ఫెస్టివల్–2026 జిల్లా స్థాయి పోటీల్లో సంతసీతారాంపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు విజేతలుగా నిలిచారు. వీరు ప్రదర్శించిన స్టార్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ప్రథమ బహుమతి లభించింది. అధునాతన సాంకేతిక విధానాలను ఉపయోగించి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించేలా వ్యవసాయం చేయడం ఈ ప్రాజెక్టు ఉద్దేశమని విద్యార్థులు పేర్కొన్నారు. సోషల్ ఉపాధ్యాయురాలు పి.జగదాంబ సహాయంతో ఈ ప్రాజెక్టు తయారుచేశారు. వీరిని హెచ్ఎం టి.జయలక్ష్మీ, ఉపాధ్యాయులు అభినందించారు. -
పీఆర్సీ కమిషన్ నియమించాలి
శ్రీకాకుళం: ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి 12వ పీఆర్సీ కమిషన్ నియమించి 30 శాతం మధ్యంతర భృతి వెంటనే ప్రకటించాలని స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినాన చందనరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యాలయంలో ఎస్టీఏ జిల్లా అధ్యక్షుడు సప్పటి మల్లేసు అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే మూడు డీఏలు పెండింగ్లో ఉన్నాయని, జనవరి నుంచి మరొక డీఏ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. న్యాయంగా రావాల్సిన డీఏలు సకాలంలో అందక ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారని చెప్పారు. సరెండర్ లీవ్ బిల్లులు చెల్లించాలని, విశ్రాంత ఉద్యోగులకు పెన్షనరీ బెనిఫిట్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పంచాది గోవిందరాజులు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మేడిశెట్టి సాయిరాజ్, జిల్లా ఉపాధ్యక్షుడు సిరిపురం మురళి, తదితరులు పాల్గొన్నారు. -
ఉర్రూతలూగించిన ‘రేలా రే రేలా’
శ్రీకాకుళం కల్చరల్: శ్రీకాకుళ రంగస్థల కళాకారుల సమాఖ్య(నెలవారీ సాంస్కృతిక విభాగం) 315వ నెల కార్యక్రమం శనివారం నగరంలోని బాపూజీ కళామందిర్లో ఘనంగా నిర్వహించారు. ధర్మశాస్త సన్నిదానం ట్రస్ట్ సౌజన్యంతో నూతన వస్త్రాలు, పేద కళాకారులకు పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం గజపతినగరానికి చెందిన శ్రీ విజయ జానపద కళాబృందం ‘రేలా రే రేలా‘ ప్రదర్శన ఉర్రూతలూగించింది. ఉత్తరాంధ్ర జానపదాలను పి.రఘు బృందం చక్కగా ఆలపించారు. కార్యక్రమంలో సమాఖ్య అధ్యక్షుడు ఎల్.రామలింగస్వామి, ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి, జిల్లా పర్యాటక శాఖ అధికారి నడిమింటి నారాయణరావు, వ్యాపారవేత్త బరాటం సంతోష్, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు బెండి శివప్రసాద్, సమాఖ్య సభ్యులు బి.ఎ.మోహనరావు, ఐ.రమణారావు, కంచరాన అప్పారావు, మెట్ట పోలినాయుడు, తాయి రవి, ఎన్ని రాజేశ్వరరావు, మజ్జి మోహనరావు, ప్రసాదరావు రౌళో, పైడి సత్యవతి, బత్తుల జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
వాలీబాల్ పోటీలకు ఇద్దరు ఎంపిక
శ్రీకాకుళం న్యూకాలనీ: ఆలిండియా సీనియర్స్ వాలీబాల్ పోటీలకు జిల్లా నుంచి ఇద్దరు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసి కేంద్రంగా ఈ నెల 4 నుంచి 11వ తేదీ వరకు 72వ సీనియర్ నేషనల్స్ వాలీబాల్ చాంపియన్షిప్–2025–26 పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలకు రణస్థలం మండలం కొవ్వాడ మత్స్యలేశం గ్రామానికి చెందిన మైలపల్లి సత్యం, కవిటికి చెందిన మరిడి సుధీర్కుమార్ ఎంపికయ్యారు. వీరిద్దరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరి ఎంపిక పట్ల శ్రీకాకుళం వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ప్రధాన కార్యదర్శి కె.రామచంద్రుడు, యాళ్ల పోలినాయుడు, మొజ్జాడ వెంకటరమణ, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.సాంబమూర్తి, సలహాదారు పి.సుందరరావు మాస్టారు, టి.రవి, ఎన్వీ రమణ, సతీష్, డీఎస్డీఓ ఎ.మహేష్బాబు, డీఎస్ఏ కోచ్ కె.హరికృష్ణ హర్షం వ్యక్తంచేశారు. ఎం.సత్యం ఎం.సుధీర్ -
మరింత ముందుకు మహిళా క్రికెట్
● మహిళా క్రికెట్ అభివృద్ధికి జిల్లా క్రికెట్ సంఘం కృషి ● శ్రీకాకుళంలో టర్ఫ్ వికెట్, నెట్స్ ప్రారంభం నేడు శ్రీకాకుళం న్యూకాలనీ: మహిళా క్రికెట్ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు జిల్లా క్రికెట్ సంఘం(జెడ్సీఎస్) నడుం బిగించింది. మహిళా క్రికెటర్లను ప్రోత్సహించేందుకు జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా క్రికెట్ నెట్స్ ఏర్పాటు చేశారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) తోడ్పాటుతో శ్రీకాకుళం ఎన్టీఆర్ నగరపాలకోన్నత పాఠశాల మైదానంలో మహిళా క్రికెటర్లకు శిక్షణ ఇచ్చేందుకు అత్యాధునిక హంగులతో టర్ఫ్, ఆస్ట్రో టర్ఫ్ వికెట్లు ఏర్పాటు చేశారు. క్రికెట్ కార్యకలాపాలను నిర్వహించేందుకు చిన్న కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ క్రికెట్ నెట్స్ను ఆదివారం ప్రారంభించేందుకు జిల్లా క్రికెట్ సంఘం పెద్దలు ఏర్పాట్లు చేస్తున్నారు. మెరుపులు లేమితో.. జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారిణులు జోనల్ స్థాయి, రాష్ట్రస్థాయి ప్రాబబుల్స్ వరకు వెళ్తున్నప్పటికీ అంతర్రాష్ట్ర, జాతీయస్థాయి, అంతర్జాతీయ స్థాయిలో నిలదొక్కుకునేలా రాణించలేకపోతున్నారు. వీటికి అనేక కారణాలు ఉన్నాయి. ఆది నుంచి మహిళా క్రికెట్పై బాలికల తల్లిదండ్రుల్లో ఆసక్తి లేకపోవడం, క్రికెట్ సంఘాల ప్రతినిధుల ప్రేక్షకపాత్ర, టర్ఫ్వికెట్ వంటి నాణ్యమైన వసతులు, సౌకర్యాలు కల్పించకపోవడం తదితర కారణాలతో ఎలాంటి మెరుపులు లేకపోయాయి. జిల్లా నుంచి కేవీఎస్పీ చందన, హారిక యాదవ్, బి.నవ్య, కుమూదిని రాష్ట్రస్థాయి వరకు ఆడగలిగారు. జాహ్నవి, వనజాక్షి స్టేట్ ప్రాబబుల్స్ వరకు ఎంపికయ్యారు. ఆధునిక హంగులతో నెట్స్.. తాజాగా ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఏర్పాటుచేసిన క్రికెట్ నెట్స్ వద్ద అత్యాధునిక వసతులు, సౌకర్యాలు కల్పించారు. రెండు వికెట్లతో కూడిన నెట్స్ ఏర్పాటు చేశారు. ఫ్లడ్ లైట్లను అమర్చారు. నెట్స్ వద్ద సాధనకు హాజరయ్యే క్రీడాకారిణులకు ఇబ్బంది లేకుండా డ్రెస్సింగ్ రూమ్, రెస్ట్ రూమ్లను నిర్మించారు. ప్రతిరోజు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4.30 నుంచి 7.30 వరకు శిక్షణ అందించనున్నారు. కనీసం 10 ఏళ్లు పైబడి క్రికెట్పై ఆసక్తి కలిగిన బాలికలు ఈ నెట్స్ వద్దకు సాధనకు అవకాశం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇద్దరు మహిళా క్రికెట్ కోచ్లను అందుబాటులో ఉంచుతున్నారు. ఫిట్నెస్ను మెరుగుపర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో మహిళా క్రికెట్ను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టాం. తాజాగా అన్ని హంగులతో కూడిన నెట్స్ను శ్రీకాకుళం నగరం మధ్యలో ఏర్పాటు చేశాం. – ఇలియాస్ మహ్మద్, సీనియర్ ప్లేయర్, జిల్లా క్రికెట్ సంఘం మెంటార్ బాలికల క్రికెట్ను విస్తరించాలని జెడ్సీఎస్ సంకల్పించింది. శిక్షణకు హాజరయ్యే మహిళలకు, బాలికలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. డ్రెస్సింగ్రూమ్ను, రెస్ట్రూమ్లను ఏర్పాటు చేశాం. అన్ని వసతులు, సౌకర్యాలతో నెట్స్ సిద్ధం చేశాం. – మదీనా శైలానీ, సీనియర్ ప్లేయర్, జిల్లా క్రికెట్ సంఘం కోశాధికారి -
గోడ కూలి కార్మికురాలు దుర్మరణం
మందస: భేతాళపురంలోని కొత్త వీధిలో శనివారం భవన నిర్మాణ పనులు జరుగుతుండగా గోడ కూలిన ఘటనలో కార్మికురాలు మృతి చెందింది. బచ్చల కాంతమ్మ(35), కీలు కనకదుర్గలు ఇటుకలు మోస్తుండగా ఒక్కసారిగా పక్కింటి గోడ వీరిపై కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో కాంతమ్మ అక్కడికక్కడే మరణించింది. కనకదుర్గ గాయాలుపాలు కావడంతో పలాస ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. కాంతమ్మకు భర్త పాపారావు, ఇద్దరు పిల్లలు. ఎస్ఐ కె.కృష్ణప్రపాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. వెంకన్నకు విశేష అలంకరణ శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని చిన్నబజారులో దూది వారి వేంకటేశ్వరాలయంలో శనివారం స్వామివారిని తులసిమాలలతో అలంకరించారు. అర్చకులు శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో స్వామికి అష్టోత్తర శతనామాలతో అర్చనలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. మొండేటివీధిలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా అర్చకులు శ్రీనివాసశర్మ ఆధ్వర్యంలో స్వామివారిని తులసిమాలలతో అలంకరించారు. -
10 వేల వాటర్ బాటిళ్లు ఇస్తే 4 పాసులు
అరసవల్లి: ఈ నెల 25న జరగనున్న రథసప్తమి ఉత్సవాలకు సంబంఽధించి భారీగా భక్తులు తరలిరానున్నారని.. వీరి కోసం 10 వేల వాటర్ బాటిళ్లు (250 మి.లీ.)ను ఆలయానికి సమర్పించిన దాతలకు, ఆలయంలో పుష్పాలంకరణకు అధికంగా పూలదండలను ఇచ్చిన వారికి విశిష్ట దర్శనంగా నాలుగు దాతల పాసులను ఇస్తామని ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ ప్రకటించారు. శనివారం ఆయన మాట్లాడుతూ ఆర్వో ప్లాంట్ నిర్వాహకులు తమ సంస్థ పేరును బాటిల్పై ముద్రించుకోవచ్చునని చెప్పారు. దాతలను ప్రోత్సహించే క్రమంలో కార్యాలయంలో పేర్లను రిజిస్ట్రేషన్ ప్రక్రియ అమలు చేస్తున్నామని వివరించారు. నగరానికి చెందిన దీపక్ కర్ణాణి అనే వ్యాపారి శనివారం పది వేల వాటర్ బాటిళ్లు, రూ.లక్ష విలువైన ఏడు వాటర్ డిస్పెన్షరీలను ఆలయానికి సమర్పించారు. వసతి గృహాలపై ప్రత్యేక శ్రద్ధ శ్రీకాకుళం పాతబస్టాండ్: వసతి గహాల్లో విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు పారిశుద్ధ్యం, ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు సూచించారు. శనివారం శ్రీకాకుళం రామలక్ష్మణ కూడలి వద్ద వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినుల గదులను పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని హెచ్డబ్ల్యూఓకు దిశానిర్దేశం చేశారు. నాణ్యమైన భోజనం అందించాలని స్పష్టం చేశారు. విద్యార్థినులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణతో మెలగాలన్నారు. సామాజిక మాధ్యమాల దుష్ప్రభావానికి గురికాకుండా కేవలం చదువుపైనే దృష్టి సారించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఎటువంటి సమస్యలు ఉన్నా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి ఇ.అనురాధ, సిబ్బంది పాల్గొన్నారు. రౌడీషీటర్కు రిమాండ్ శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని మంగువారితోటకు చెందిన రౌడీషీటర్ యలమంచిలి కోటేశ్వరరావు మద్యం మత్తులో పబ్లిక్ న్యూసెన్సు చేసినందుకు కోర్టు 10 రోజుల జైలు శిక్ష విధించిందని ఒకటో పట్టణ ఎస్ఐ తెలిపారు. కోటేశ్వరరావు శనివారం ఉదయం కిన్నెర థియేటర్ వద్ద మద్యం సేవించి ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించాడని, అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చామని పేర్కొన్నారు. -
మార్కులు..మార్పులు!
శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణల్లో భాగంగా ఇంటర్మీడియెట్ విద్యామండలి అధికారులు ఈ ఏడాది నుంచి ఫస్టియర్లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు అమలవుతున్న ఆరు పేపర్ల విధానానికి బదులు ఐదు పేపర్లకు కుదించారు. మ్యాథ్స్, బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీల ప్రశ్నపత్రాల్లో మార్కుల కేటాయింపు, ప్రశ్నపత్రం సైతం మార్పు చేశారు. అయితే ఈ విషయమై విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రిన్సిపాళ్లకు, సీనియర్ లెక్చరర్లకు బోర్డు అధికారులు పరీక్షల పేట్రన్పై అవగాహన కల్పించి మమ అనిపించారని, పరీక్షల తీరుతెన్నులపై విద్యార్థులకు మాత్రం అవగాహన కల్పించలేదని సమాచారం. సెకెండియర్ విద్యార్థులకు మాత్రం వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త పేట్రన్ అమలుచేయనున్నారు. 39,733 మంది విద్యార్థులు.. జిల్లాలో అన్ని యాజమాన్యాల పరిధిలో 39,733 మంది చదువుతున్నారు. వీరిలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 19,825 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 19,908 మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించారు. సర్కారీ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచడానికి ప్రభుత్వం ‘సంకల్ప్’ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అంతర్గత పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా విద్యార్థులను గ్రేడ్లుగా విభిజించి వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఒకే పేపర్గా.. ప్రథమ సంవత్సరం పరీక్షల విధానం, సబ్జెక్టులవారీగా పేపర్లకు మార్కుల కేటాయింపుల్లో కీలక మార్పులు చేశారు. ఎంపీసీ గ్రూపును 500 మార్కులగా నిర్ణయించారు. రాత పరీక్షలకు 470 మార్కులు, ప్రాక్టికల్స్కు 30 మార్కులు (ఫిజిక్స్15, కెమిస్ట్రీ15 చొప్పున) కేటాయిస్తున్నారు,. ● ఇప్పటివరకు మ్యాథ్స్ పరీక్షను రెండు పేపర్లుగా నిర్వహిస్తున్నారు. పేపర్–1ఏకు 75 మార్కులు, పేపర్–2ఏకు 75 మార్కులు కలిపి 150 మార్కులకు పరీక్షలు జరిగేవి. ఇకపై మొదటి సంవత్సరంలో 100 మార్కులకు ఒకటే మ్యాథ్స్ పేపర్ ఉంటుంది. పాస్ మార్కులు 35గా నిర్ణయించారు. ● గతంలో ఫిజిక్స్ 60 మార్కులు, కెమిస్ట్రీ 60 మార్కులకు ప్రశ్నపత్రం ఉండేది. వాటి స్థానంలో ఈ రెండు సబ్జెక్టులు ఒక్కొక్క పేపర్ 85 మార్కులకు మార్పు చేశారు. వీటితో పాటు రెండు లాంగ్వేజి సబ్జెక్టులు ఒక్కొక్కటి వంద మార్కులకు ఉంటుంది. కొత్తగా బయాలజీ పేపర్.. బైపీసీ గ్రూపునకు సంబంధించి 500 మార్కులగా నిర్ణయించారు. ఇందులో రాత పరీక్షలకు 455 మార్కులు, ప్రాక్టికల్స్కు 45 మార్కులు (ఫిజిక్స్ 15, కెమిస్ట్రీ15, బోటనీ, జువాలజీతో కలబోసిన బయాలజీ 15 మార్కులు)గా కేటాయించారు. ● ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ రెండు సబ్జెక్టులు కలిపి 85 మార్కులకు ఒకే ప్రశ్నపత్రం ఇస్తారు. ఇందులో బోటనీకి 43 మార్కులు, జువాలజీకి 42 మార్కులు నిర్దేశించారు. మూల్యాంకనానికి వీలుగా జవాబు పత్రాలు మాత్రం వేర్వేరుగా ఇవ్వనున్నారు. గతంలో బోటనీ 60 మార్కులు, జువాలజీ 60 మార్కులకు ఉండేవి. ● విద్యార్థులు రెండు జవాబు పత్రాల్లో బోటనీ, జువాలజీ ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. బయాలజీలో ఉత్తీర్ణత 29.5 మార్కులుగా నిర్ధారించారు. కానీ అరమార్కు ఉండదు కాబట్టి 29 మార్కులు వస్తే ఉత్తీర్ణత సాధించినట్టు పరిగణిస్తారు. ● 2025–26 విద్యా సంవత్సరంలో నూతన విధానంలో పరీక్షలు రాసిన విద్యార్థులు వచ్చే విద్యా సంవత్సరంలో సెకెండియర్లోనూ ఇలాగే పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో సెకండియర్ పరీక్షలు రాయబోయే విద్యార్థులు మాత్రం పాత విధానంలోనే పరీక్షలు రాస్తారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో పలు సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే ప్రిన్సిపాళ్లకు, లెక్చరర్లకు అవగాహన కల్పించాం. విద్యార్థులకు సైతం అవగాహన కల్పిస్తున్నాం. ఉత్తీర్ణత శాతం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – రేగ సురేష్కుమార్, డీవీఈఓ/ఆర్ఐఓ ఇంటర్మీడియెట్ బోర్డు, శ్రీకాకుళం ఇంటర్ పరీక్షల నిర్వహణలో సమూల మార్పులు ఫస్టియర్ ఎంపీసీ, బైపీసీ పరీక్షల్లో ఐదు పేపర్లే.. విద్యార్థులకు అవగాహన కల్పించడంపై దృష్టి సారించని ప్రభుత్వం -
●ఒత్తిడి తట్టుకోలేక..
ఇచ్ఛాపురం మండలం కేశుపురం పంచాయతీ సన్యాసిపుట్టుగ గ్రామానికి చెందిన మాసుపత్రి శంకర్, లోలమ్మల రెండో కొడుకు మాసుపత్రి విజయ్(21) ఏడు నెలల కిందట తన అన్నయ్య బన్నీతో కలసి అబుదాబి వెళ్లాడు. సోదరులిద్దరూ ఓ కంపెనీలో ఫిట్టర్లుగా పనిచేసేవారు. అక్టోబర్ 22 తెల్లవారుజామున ఆరు గంటలకు విజయ్ తల్లిదండ్రుల తో బాగానే మాట్లాడాడు. తర్వాత ఏమైందో గానీ పెద్ద కొడుకు బిన్నీ తల్లిదండ్రులకు పిడుగులాంటి వార్తను చేరవేశాడు. తమ్ముడు బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడంటూ కన్నీరుమున్నీరుగా విలపించాడు. దీంతో తల్లిదండ్రులు శంకర్, లోలమ్మలు ఉన్నచోటనే కుప్పకూలిపోయారు. వారం రోజుల తర్వాత మృత దేహం స్వగ్రామం చేరుకుంది. సంబంధిత కంపెనీ నుంచి పరిహారమే దక్కలేదు. -
బోధన సామర్థ్యాలు పెంపొందించాలి
కంచిలి: బోధన సామర్థ్యాలు మరింతగా పెంపొందించి, ఉత్తమ ఫలితాల సాధనకు అధ్యాపకులు కృషిచేయాలని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖ అధికారి, ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి ఆర్.సురేష్కుమార్ అన్నారు. ఆయన కంచిలి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు శనివారం విచ్చేశారు. ఈ సందర్భంగా అధ్యాపకుల సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులు పరీక్ష ఫలితాల్లో గత ఏడాది కంటే మెరుగవ్వాలని కళాశాల ప్రిన్సిపాల్ ఉరిటి జగదీష్ కుమార్ నేతృత్వంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆదేశించారు. అంతకన్నా ముందు కళాశాల ఆవరణలో నిర్మించిన ఫిజిక్స్ ల్యాబ్ను ప్రారంభించారు. ప్రిన్సిపాల్ సొంత నిధులతో నిర్మించిన కెమిస్ట్రీ ల్యాబ్ను పరిశీలించారు. విద్యార్థుల పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలను తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం అమ లు తీరును పరిశీలించారు. ఆయనతో పాటు కళాశాల ప్రిన్సి పాల్, అధ్యాపకులు వేణుగోపాల్, దాస్ పాల్గొన్నారు. -
శ్రీకాకుళం
మార్కులు.. మార్పులుఇంటర్ పరీక్ష విధానం మారుతోంది. దీనిపై అవగాహన కరువవుతోంది. –8లోకన్నీటి కథలు తెలుసా..? సారవకోట: మండలంలోని చీడిపూడి కల్యాణ వేంకటేశ్వర స్వామికి శనివారం 25 కిలోల వెన్నతో అలంకరించారు. శ్రీదేవి, భూదేవి సహిత వేంకటేశ్వరస్వామి మూల విరాట్లను ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా అలంకరించినట్లు అర్చకులు రామానుజాచార్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక, విశేష పూజలు, అభిషేకాలు, తులాభారం నిర్వహించారు. శ్రీకాకుళం న్యూకాలనీ: జాతీయ స్థాయి గట్కా(మార్షల్ఆర్ట్స్) స్కూల్ గేమ్స్ పోటీలకు శ్రీకాకుళం జిల్లా నుంచి నలుగురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పంజాబ్లోని లూథియానా వేదికగా ఈ నెల 6 నుంచి 11వ తేదీ వరకు ఆలిండియా స్కూల్గేమ్స్ అండర్–19 బాలబాలికల గట్కా చాంపియన్షిప్ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో శ్రీకాకుళం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఎం.మోహన్ (10వ తరగతి), జి.అగస్థ్యరాం (10వ తరగతి), ఎల్.కీర్తి (8వ తరగతి) ఎంపి కయ్యారు. అలాగే ఇవే పోటీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బృందానికి మేనేజర్గా ఫిజికల్ డైరెక్టర్ నిమ్మక పార్వతి నియామకమయ్యారు. ఈ పోటీల కోసం వీరంతా ఆదివారం ఇక్కడ నుంచి లూథియానా పయనమై వెళ్తున్నారు. నరసన్నపేట: విద్యార్థి దశలో టెన్త్ చాలా కీలకమని, ఈ తరగతి మీ భవిష్యత్కు పునాది వేస్తుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. కంబకాయ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన శనివారం ఆకస్మికంగా పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయులు బమ్మిడి మన్మధరావుతో పాటు ఉపాధ్యాయులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పాగోటి ఉమామహే శ్వరి, విశ్రాంత ఉపాద్యాయులు అప్పలనాయు డు తదితరులు ఉన్నారు. ఇచ్ఛాపురం మండ లం ధర్మపురం గ్రామానికి చెందిన ఉప్పాడ సోమేశ్ (32) ఎనిమిది నెలల కుమార్తె కావ్యశ్రీని విడిచి 2023 అక్టోబర్ నెలలో పోలెండ్ వెళ్లిన కొన్నాళ్లకు అక్కడే అస్వస్థతకు గురయ్యాడు. ఊరు కాని ఊరు, భాష రాని మనుషుల మధ్య ఆస్పత్రిలో నరకయాతన అనుభవించాడు. తన కు చాలా భయంగా ఉందని, తన వద్ద ఎవ్వరూ లేరని, వైద్యం అందడం లేదంటూ భార్యకు వీడియో కాల్ ద్వారా తెలిపాడు. మరుసటి రోజే ఆయన ప్రాణాలు వదిలేశాడు. తన భర్త మృతదేహం స్వగ్రామానికి తెప్పించాలని భార్య అధికారులను బతిమలాడినా స్పందించలేదు. పో లెండ్లోనే దహన సంస్కారాలు పూర్తి చేసి బూడిదను మాత్రం ఇక్కడకు పంపారు. ప్రభుత్వం కూడా ఎలాంటి పరిహారం ఇవ్వలేదు. శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి పారా అథ్లెటిక్స్ ఎంపిక పోటీలను ఈనెల 10వ తేదీన నిర్వహిస్తున్నామని స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేష న్ ఆఫ్ శ్రీకాకుళం ఉపాధ్యక్షుడు ఎన్.గిరిధర్, కార్యదర్శి డి.అచ్యుతరావు, ఎన్.మోహనరావు, కోశాధి కారి ఎన్.స్రవంతి, మజ్జియ్య, రమేష్ పేర్కొన్నారు. ఈ ఎంపిక పోటీలు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడియంలో ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. ఇక్కడ ఎంపికైన పారా అథ్లెట్స్ను త్వరలో జరిగే ఏపీ రాష్ట్ర స్థాయి పారా అథ్లెటిక్స్ పోటీలకు పంపించనున్నట్టు తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన తమ జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్కార్డుతో ఎంపికల కు హాజరుకావాలని, మరిన్ని వివరాలకు 80081 62432, 9177693836 నంబర్లను సంప్రదించాలని వారు కోరారు. -
కేజీబీవీల్లో పోస్టుల భర్తీ కేజీబీవీల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 55 పోస్టులు భర్తీ చేయనున్నారు. –8లో
●ఈ ఏడాది మార్చి 21న పోలెండ్లో పలాస మండలం తర్లకోటకు పంచాయతీకి చెందిన బుడత దామోదర్ ప్రమాదవశాత్తు మృతి చెందాడు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. పోలెండ్ శ్రీకాకుళం తెలుగు సంఘం వారు చందాలు వేసుకుని సాయం చేశారు. ●ఈదుపురం గ్రామానికి చెందిన దల్లి గురుమూర్తి పోలెండ్లో వలస కూలీగా పనిచేస్తూ అనారోగ్యానికి గురయ్యాడు. స్నేహితుల సహాయంతో స్వగ్రామం చేరుకున్న గురుమూర్తి ఈ ఏడాది సెప్టెంబర్ 27న ఇంటి వద్ద మృతి చెందాడు. ●కంచిలి మండలం పురుషోత్తపురం పంచా యతీ గద్దలపాడు గ్రామానికి చెందిన నక్క నరసింహరావు అబుదాబిలోని ఎన్.ఎస్.హెచ్ కంపెనీలో వెల్డర్గా పనిచేస్తున్నా డు. ఈ ఏడాది అక్టోబ ర్ 26న కడుపునొప్పిగా ఉందంటూ చెప్పడంతో తోటి కార్మికులు ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం మొండి చేయి
విదేశాలకు వలస వెళ్లి దురదృష్టవశాత్తు చనిపోతున్న వారికి ప్రభుత్వ సాయం చేయడం లేదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మాదిరి మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నష్ట పరిహారం అందిస్తే బాగుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విదేశాల్లో మృతి చెంది తే మృతదేహం స్వదేశానికి తీసుకురావడానికి అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వం భరించాలని, మృతదేహం రాకపోతే, విదేశాల్లోనే అంత్యక్రియ లు నిర్వహిస్తే ఖర్చు చెల్లించడం, కేంద్ర ప్రభుత్వం ప్రవాస భారతీయ బీమా పథకం(పీబీబీంఐ) కింద ప్రమాద మరణమైతే రూ.10 లక్షలు, సాధారణ మరణం అయితే రూ.5 లక్షలు నుంచి రూ.10 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లించాలని ప్రవాసాంధ్రులు డిమాండ్ చేస్తున్నారు. అంతే కాకుండా ప్రమాదం ఉద్యోగ స్థల నిర్లక్ష్యంతో జరిగితే యజమానిపై కేసు నమోదు చేసి అధిక పరిహారం సాధించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మృతుల కుటుంబాలకు ప్రయోజనకరంగా ఉంటుందని అంటున్నారు. -
వలస.. దశాబ్దాలుగా సిక్కోలు గుండె మోస్తున్న భారమిది. పసి వయసులో ఉన్న బిడ్డ నాన్నా అని పిలిస్తే ఆ మనిషి ఇంటిలో కనిపించడు. అర్ధరాత్రి ఓ నిండు గర్భిణి ఉలిక్కిపడి నిద్ర లేస్తే ధైర్యం చెప్పేందుకు మగడు పక్కన ఉండడు. పండగొచ్చినా, పబ్బమొచ్చినా కన్నపేగుకు వండి పెడదా
కవిటి మండలం బొరివంక గ్రామానికి చెందిన శివ మజ్జి(23) చిన్నతనంలో తండ్రిని పోగొట్టుకున్నాడు. కుటుంబ బాధ్యత ను భుజానికెత్తుకున్నాడు. తల్లి మాట ప్రకారం ఓ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. పెళ్లికి రెండే ళ్లు గడువు పెట్టి స్నేహితుడితో కలసి 2024 మార్చి లో దుబాయ్ వెళ్లాడు. ఆగస్టు 28న కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందినట్లు స్వగ్రామానికి సమాచారం అందడంతో కుటుంబమంతా హతాశుతులయ్యారు. వారం రోజుల తర్వాత మృత దేహం గ్రామానికి చేరుకుంది. నేటికి 16 నెలలు కావస్తున్నా ఆ కంపెనీ నుంచి నయా పైసా తన చేతికి అందలేదని మృతుడి తల్లి ఊర్మిళ మజ్జి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇచ్ఛాపురం మండలం డొంకూరు మత్స్యకార గ్రామానికి చెందిన బడే భాస్కరరావు ఉరఫ్ చంటి(22) ఏడాదిన్నర కిందట జీవనోపాధి కోసం అబుదాబికి వెల్డింగ్ హెల్పర్గా వెళ్లాడు. మీ కుమారుడు చంటి ఆత్మహత్య చేసుకున్నాడంటూ కంపెనీ ఎండీ ఈ ఏడాది నవంబర్ 25న ఫోన్లో సమాచారం అందివ్వడంతో గ్రామం విషాదంలో మునిగిపోయింది. తమ కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఏదైనా ప్రమాదం జరిగి ఉంటుందని తల్లి దండ్రుల ఆవేదన అరణ్య రోదనగా మిగిలింది. అబుదాబి పోలీసులు మరణాన్ని నమోదు చేసి వా రం రోజుల్లో మృతదేహాన్ని డొంకూరు పంపించా రు. కంపెనీ నుంచి ఎలాంటి పరిహారం అందలేదు. -
కంచు, ఇత్తడి పరిశ్రమ అభివృద్ధికి కృషి
సారవకోట: కంచు, ఇత్తడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేయనున్నట్లు డీఆర్డీఏ పీడీ పెద్దింటి కిరణ్ కుమార్ తెలిపారు. శనివారం మండలంలోని బుడి తి గ్రామంలో మన ఊరు మన ఇల్లు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుడితి కంచు, ఇత్తడి పరిశ్రమ ప్రపంచ ప్రసిద్ధి చెందిందని, ఆ పరిశ్రమను జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి చేసేందుకు తగిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. పరిశ్రమల శాఖ, బ్యాంకుల సహకారంతో రుణాలు మంజూరు చేసి వివిధ రకా ల యంత్రాలను ఏర్పాటు చేసి మరింత ఉత్పత్తి పెరిగేందుకు కృషి చేస్తామన్నారు. దీని కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రుణాల గురించి వివరించారు. బుడితితో పాటు నరసన్నపేట మండలంలోని మాకివలస గ్రామంలో ఈ కంచు, ఇత్తడి పరిశ్రమ ఉందని వారికి సైతం తగిన రుణాలు మంజూరు చేసి అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆయనతో పాటు జిల్లా పరిశ్రమల శాఖ ఇన్చార్జి డీఓ పీవీ రఘునాఽథ్, ఆర్జీఈఐటిటి రామ్జి, డీఆర్డీఏ డీపీఎం నారాయణరావు, స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు రామినాయుడు ఉన్నారు. -
తైక్వాండో స్టేట్మీట్ ప్రారంభం
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా కేంద్రంలో ఏపీ రాష్ట్రస్థాయి సబ్–జూనియర్స్ తైక్వాండో కుర్గీ, పూమ్సే చాంపియన్షిప్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. వైఎస్సార్ కల్యాణ మండపంలో జరుగుతున్న రెండు రోజుల టోర్నీలో భాగంగా తొలిరోజు వివిధ జిల్లా నుంచి చేరుకున్న క్రీడాకారులకు వేయింగ్ (బరువు) పూర్తి చేశారు. స్థానికంగా వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు. రెండోరోజు ఆదివారం పోటీలను పూర్తిచేసి, విజేతలకు పతకాలు, బహుమతులు, ప్రసంశాపత్రాలు అందజేయనున్నారు. బరువు పరిశీలిస్తున్న దృశ్యం -
వినూత్నంగా బోధిస్తూ.. విద్యా దీపాలు వెలిగిస్తూ..
● ఉపాధ్యాయ వృత్తిలో రాణిస్తున్న మహిళలు ● అత్యుత్తమంగా బోధన ● నేడు అంతర్జాతీయ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం ఇచ్ఛాపురం రూరల్: తరగతి గదిలో జ్ఞాన దీపాలు వెలిగిస్తూ, సమాజానికి దిశా నిర్దేశం చేస్తున్నారు పలువురు మహిళా ఉపాధ్యాయులు. కేవలం పాఠాలకే పరిమితం కాకుండా విలువలు–వినయం–విజ్ఞానం నేర్పుతూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తల్లిలాంటి స్నేహం, గురువు లాంటి క్రమశిక్షణను విద్యార్థులకు అందిస్తూ పిల్లలను కంటిరెప్పలా కాపాడుకుంటూ వస్తున్న కొంత మంది ఉపాధ్యాయినుల గురించి అంతర్జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. ఇచ్ఛాపురం మండలం ఈదుపురం కండ్రావార్డు ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఈమె పేరు బూరవెల్లి ఉమామహేశ్వరి. తరగతిలో సామాన్య విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠం చెప్పడం ఈమె ప్రత్యేకత. టీఎల్ఎంతో పాటుగా, క్షేత్రస్థాయి పర్యటనలు, ఫ్లో చార్టులు, ప్రోజెక్ట్, బృంద కృత్యాలతో ప్రతి విద్యార్థి అన్నింటిలో భాగమయ్యేలా ప్రోత్సహిస్తుంటారు. నేషనల్ గ్రీన్ కోర్ నోడల్ ఆఫీసర్గా 2023లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు పొందారు. ప్రయోగాలకు పెద్ద పీట వేస్తున్న ఈమెకు కేంద్ర ప్రభుత్వం ‘సారాభాయి టీచర్ సైంటిస్ట్’ అవార్డుతో గౌరవించింది. గత ఏడాది ఆగస్టులో న్యూ ఢిల్లీ ప్రగతి మైదానంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేతులు మీదుగా ఉత్తమ బహుమతి అందుకున్నారు. ఇచ్ఛాపురం పట్టణానికి చెందిన ఊర్మిళా కుమారీ రథోకు చిన్నప్పటి నుంచి క్రీడలంటే ఆసక్తి. ఇచ్ఛాపురం బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడు అథ్లెటిక్స్లో పాల్గొని బహుమతులు సాధించారు. బీపీఈడీ పూర్తిచేసి వ్యాయోమాపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. రాజపురం గర్ల్స్ హైస్కూల్లో తన ప్రస్థానం మొదలు పెట్టిన ఈమె ప్రస్తుతం లొద్దపుట్టి ఉన్నత పాఠశాలలో పీడీగా విధులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు క్రీడలు, యోగా విద్యలో తర్ఫీదు ఇస్తున్నారు. ఇచ్ఛాపురం మండలం బూర్జపాడు ఉన్నత పాఠశాలలో ప్రధానోపాద్యా యురాలిగా పనిచేస్తున్న పి.హేమలత గణితం సులభంగా బోధిస్తుంటా రు. లెక్కలంటే భయపడే విద్యార్థులకు ఆమె పాఠం మొదలు పెడితే తర గతి అంతా నిశ్శబ్ధం అలముకుంటోంది. కష్టతరమైన లెక్కల్ని సైతం అలవోకగా చెబుతుంటారు. మరోవైపు ప్రధానోపాధ్యాయురాలిగా బాధ్యత లు నిర్వర్తిస్తూ బడికి బాసటగా నిలుస్తున్నారు. పదో తరగతి విద్యార్థుల కు పబ్లిక్ పరీక్షల సన్నద్ధతపై స్వయంగా అవగాహన కల్పిస్తున్నారు. -
ఏఎన్ఎంల పదోన్నతులపై ఫిర్యాదు
సారవకోట : జిల్లాలోని వైద్యారోగ్య శాఖ ఏఎన్ఎంల పదోన్నతుల్లో అవకతవకలు జరిగాయని, వాటిపై విచారణ జరపాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ సభ్యులు కోరారు. ఈ మేరకు విజయవాడలో శుక్రవారం ఆ శాఖ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఏఎన్ఎం సీనియారిటీ లిస్టు విడుదల చేయలేదని, పదోన్నతుల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదని, ఆదివాసీలకు ఆరు శాతం రిజర్వేషన్లు కల్పించలేద ని ఆరోపించారు. లక్షలాది రూపాయలు వసూలు చేసి అడ్డగోలుగా మెరిట్ లిస్టు తయారు చేసిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగేశ్వరరావు, జిల్లా అధ్యక్షు డు గురాడి అప్పన్న, మెళియాపుట్టి మండల అధ్యక్షుడు ఎస్.గణేష్ పాల్గొన్నారు. -
బడి బస్సులు భద్రమేనా?
హిరమండలం: జిల్లాలో బడి బస్సుల భద్రతపై అధికారులు పెద్దగా దృష్టి సారించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి విద్యాసంవత్సరంలో సామర్థ్య పరీక్షలు, త్రైమాసిక తనిఖీలు చేపడుతున్నామని చెబుతున్నా ఎక్కడో ఓ చోట ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. ఈ విషయంలో రవాణా శాఖ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి కాలం చెల్లిన బస్సులు, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలకు దిగితేనే ప్రమాదాలు అరికట్టవచ్చని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇదీ పరిస్థితి.. జిల్లాలో 398 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ప్రైవేటు జూనియర్ కాలేజీలు 71, డిగ్రీ కాలేజీలు 85, ఇంజినీరింగ్ కాలేజీలు 3 ఉన్నాయి. వీటికి సంబంధించి 580 బస్సులు ఉన్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభంలో మే నెలలో సామర్థ్యం పరీక్షలు నిర్వహించారు. గతంలో రవాణా శాఖ అధికారులు ఈ ప్రక్రియ చేపట్టేవారు. ఇప్పుడు ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. దీంతో తనిఖీలు నామమాత్రంగా జరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే అదునుగా పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. శ్రీకాకుళం, టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో రవాణా శాఖ అధికారులు బృందాలుగా విడిపోయి పాఠశాల, కాలేజీ బస్సుల్లో ఇటీవల తనిఖీలు చేశారు. చాలా వాటిలో అగ్నిమాపక పరికరాలు లేవు. కొన్నిచోట్ల ఉన్నా పనిచేయట్లేదు. ప్రథమ చికిత్స కిట్లలో మందులు కాలం చెల్లినని ఉన్నుట్ల గుర్తించారు. స్పీడ్ గవర్నెన్స్లోనూ లోపాలు బయటపడ్డాయి. ఇటువంటి లోపాలు బయటపడిన 208 బస్సులకు నోటీసులు జారీచేశారు. మరోవైపు చాలా బస్సుల్లో వయసుకు మించిన వారు, డ్రైవింగ్ లైసెన్స్లు లేని వారు డ్రైవర్లుగా నియమించినట్టు ఆరోపణలున్నాయి. ఇప్పటికై నా జిల్లా యంత్రాంగం దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. ●గత ఏడాది ఫిబ్రవరిలో మందస మండలం ఉమాగిరి సమీపంలో చెరువులో ఓ ప్రైవేటు పాఠశాల బస్సు పడిపోయింది. ఆ సమయంలో ఐదుగురు విద్యార్థులు బస్సులో ఉన్నారు. సమీపంలో ఉన్నవారు హుటాహుటిన చెరువులో దిగి విద్యార్థులను రక్షించారు. స్కూల్ బస్సులకు సంబంధించి యాజమాన్యాలు నిబంధనలు పాటించాలి. ఎప్పటికప్పుడు వాహన సామర్థ్య పరీక్షలు చేసుకోవాలి. ఎటువంటి లోపాలు ఉన్నా సరి చేసుకో వాలి. అనుభవం ఉన్న డ్రైవర్లను నియమించుకోవాలి. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు. – కె.వెంకటేష్ ఇన్చార్జ్ ఎస్ఐ, హిరమండలం పాఠశాల బస్సుల విషయంలో యంత్రాంగం ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఫీజు లు వసూలు చేస్తున్నవారు అందుకు తగ్గట్టు పాఠశాల బస్సుల నిర్వహణ చేపట్టడం లేదు. ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే బస్సు సామర్థ్యంగా ఉండాలి. నిపుణులైన డ్రైవర్ ఉండాలి. ఈ విషయంలో అధికారు లు జాగ్రత్తలు తీసుకోవాలి. – కె.చిన్నారావు విద్యార్థి తండ్రి, ఎల్ఎన్పేట -
రోడ్డు భద్రత అందరి బాధ్యత
శ్రీకాకుళం అర్బన్: రోడ్డు భద్రత మనందరి బాధ్యత అని ఆర్టీవో గంగాధర్ అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఒకటో డిపో గ్యారేజీ ఆవరణలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలన్నారు. జిల్లా రవాణా అధికారి సీహెచ్ అప్పల నారాయణ మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థ పరిరక్షణ మనమంతా కృషి చేద్దామన్నారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోల మేనేజర్లు హనుమంతు అమరసింహుడు, కె.ఆర్.ఎస్.శర్మ, అసిస్టెంట్ మేనేజర్లు పి.సంతోష్కుమార్, ఎ.గంగరాజు, ఎస్ఎం ఎంపీ రావు, అధికారులు ఏఎన్ఎస్ శ్రీనివాస్, ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆదిత్యుని సన్నిధిలో గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ని గుజరాత్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ సునీత అగర్వాల్ కుటుంబసమేతంగా శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మలు పూర్ణకుంభ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. వీరి వెంట జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా తదితరులున్నారు. ఎచ్చెర్ల : రాష్ట్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల సంఘం శ్రీకాకుళం జిల్లా శాఖ క్యాలెండర్ను శుక్రవారం ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో వైస్ చాన్సలర్ కె.ఆర్.రజనీ ఆవిష్కరించారు. ఉన్న త విద్యారంగ అభివృద్ధిలో వర్సిటీతో కలిసి పనిచేయాలని సంఘ ప్రతినిధులకు వీసీ సూచించారు. కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్షుడు కె.చక్రపతి, కార్యదర్శి ఎస్.రామకృష్ణ, ఉపాధ్యక్షుడు ఎస్.ఢిల్లీశ్వరరావు, రాష్ట్ర అకడమిక్ కార్యదర్శి డి.పైడితల్లి, యూనివర్సిటీ కార్యదర్శి బి.మోహనరావు పాల్గొన్నారు. శ్రీకాకుళం: శ్రీకాకుళం కిమ్స్ ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేశారు. గత నెల 28 ఏళ్ల మహిళ కిడ్నీ సంబంధిత వ్యాధితో కిమ్స్ వైద్యులను సంప్రదించింది. ఆమెకు కిడ్నీలు పనిచేయడం లేదని వైద్యు లు గుర్తించారు. ఓ 32 ఏళ్ల మహిళ కిడ్నీని ఇచ్చేందుకు సమ్మతించారు. దీంతో కిమ్స్ వైద్యులు డిసెంబర్ 24న శస్త్రచికిత్స జరిపారు. ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకోవడంతో శనివా రం ఆమెను డిశ్చార్జి చేసేందుకు నిర్ణయించా రు. శస్త్రచికిత్స విజయవంతం కావడంలో వైద్యులు ఉమామహేశ్వర్, మురళి, బి.రమణ, గౌతమి, బాలకష్ణ, మురళీ, ఝాన్సీలక్ష్మి, ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ జోగినాయుడు కీలక పాత్ర పోషించారు. వీరిని కిమ్స్ చైర్మన్ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు, డాక్టర్ గూడెన సోమేశ్వరరావు శుక్రవారం అభినందించారు. శ్రీకాకుళం రూరల్: అరసవల్లి రథసప్తమి ఉత్సవాలను ఈ ఏడాది వారం రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ వెల్లడించారు. శుక్రవారం సింగుపురం పంచాయతీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రథసప్తమి ఈ నెల 25 కాగా.. 19 నుంచి వారం రోజుల పాటు ఉత్సవాలను ప్రణాళికాబద్ధగా నిర్వహిస్తామ న్నారు. శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో వైద్యం కోసం ఎవరూ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఇటీవల వైద్యం కోసం రిమ్స్ ఆస్పత్రి లో చేరిన వారిని డబ్బులు డిమాండ్ చేసిన విషయం తన దృష్టికి వచ్చిందని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. సింగుపురంలో ని నర్సింగ్ వైద్య కళాశాల ఫిబ్రవరి మొదటి వా రంలో ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పి.ఎం.జె.బాబు, సర్పంచ్ ఆదిత్యనాయుడు పాల్గొన్నారు. తెలుగు మహాసభలకు శరత్బాబు శ్రీకాకుళం కల్చరల్ : గుంటూరులో కరుణశ్రీ, జాషువా సాహితీ వేదికపై ఈ నెల మూడో తేదీ నుంచి జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభల కవి సమ్మేళనం సహ సమన్వయకర్తగా శ్రీకాకుళం రచయిత, విశ్వసాహితీ కళావేదిక సంస్థ ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రతినిధి జంధ్యాల శరత్బాబు నియమితులయ్యారు. గజల్ శ్రీనివాస్ నేతృత్వంలో తెలుగు తోరణం ప్రదర్శన, గ్రంథాల ఆవిష్కరణ తదితర కార్యక్రమాలు ఉంటాయని శరత్బాబు శుక్రవారం తెలిపారు. -
మృదంగ తరంగం
● రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటిన కుర్రాడు కంచిలి: డ్రమ్స్ అంటూ జాక్బాక్స్ అంటూ పాశ్చాత్య శైలికి బాగా ఆకర్షితులమవుతున్న రోజు ల్లో ఓ పదో తరగతి విద్యార్థి మృదంగం ధ్వనిని ఇష్టపడుతున్నాడు. తాత, తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన సంగీతాన్ని బతికించేందుకు మృదంగం వాయించడం నేర్చుకున్నాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటి కళకు కాపలా ఉంటానని ప్రకటించాడు. కంచిలి మండలం జాడుపూడి గ్రామానికి చెందిన బొయిరిశెట్టి గౌతమ్ మృదంగ విద్యలో నిష్ణాతుడవుతున్నాడు. కొద్దినెలల క్రితం విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి కళా ఉత్సవ పోటీ ల్లో సత్తా చాటాడు. ఆమదాలవలసకు చెందిన మావుడూరు సూర్యప్రసాద్ శర్మ ఆశీస్సులతో శ్రీ మహతి సాంస్కృతిక కళాసేవా సంస్థ ప్రచార కార్య దర్శి, ప్రముఖ మృదంగ వి ద్వాంసుడు చలపరాయి వినో ద్ కుమార్ శిష్యరికంలో గౌతమ్ రాటుదేలుతున్నాడు. కుటుంబ నేపథ్యం.. గౌతమ్ తాత ఒడిశా పరిధి గుడ్డిపద్ద గ్రామానికి చెందిన ధవలశెట్టి కూర్మారావు గాత్ర కళాకారుడు. తండ్రి మోహనరావు హార్మోనియం వాయిస్తారు. తల్లి జీవేశ్వరి గృహిణి. ప్రస్తుతం తండ్రి మోహనరావు బయటి దేశానికి ఉపాధి కోసం వెళ్లారు. సంగీతంపై ఆసక్తి ఉండడంతో గౌతమ్ను చిన్నప్పుడే చలపరాయి వినోద్కుమార్ వద్ద చేర్పించారు. అక్కడి నుంచి రాష్ట్ర స్థాయి పోటీల వరకు ఎదిగాడు. ఇటీవల స్వగ్రామం జాడుపూడిలోను, ఆర్.బెలగాం పాఠశాలలో గౌతమ్ను సత్కరించారు. -
104 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): భవ్య యాజమాన్యం 104 ఉద్యోగులకు తీవ్రమైన అన్యాయం చేస్తోందని సీఐటీయూ నాయకులు(యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్) మురళి, 104 ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎం.గోవర్ధనరావు మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో అనుబంధ సంఘాల అఖిలపక్ష సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిసెంబర్ 19 నుంచి నిరసన కార్యక్రమాలు చేస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. జిల్లా అధ్యక్షుడు చల్ల నారాయణ మాట్లాడు తూ క్యాజువల్ లీవ్లు పునరుద్ధరించాలని, ప్రభు త్వ సెలవులు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.రామారావు మాట్లాడుతూ బఫర్ సిబ్బందిని తిరిగి నియమించి ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ దాసరి మహేష్, సీఐటీయూ నాయకులు సాయి ప్రకాష్, అంగన్వాడీ నాయకురాలు కళ్యాణి, ఆశ వర్కర్లు యూనియన్ నాయకులు నాగమణి, 108 ప్రెసిడెంట్ విజయమోహన్, సీతారాం రాజు, డివిజన్ నాయకులు కూర్మారావు, మహేష్ కిరణ్, బాలకృష్ణ పాల్గొన్నారు. -
6 నుంచి కార్గో ఎయిర్ పోర్టు కోసం భూ సర్వేలు
మందస: కార్గో ఎయిర్పోర్టు నిర్మాణం కోసం ఈ నెల 6 నుంచి విజయవాడ రైట్ సంస్థ వారు భూ సర్వేలు (సాయిల్ టెస్ట్) చేస్తారని, అలాగే ఎన్హెచ్–16 రోడ్డుకు ఎంత దూరంగా ఉందో ఆర్అండ్బీ శాఖ కూడా సర్వే చేస్తారని కార్గో ఎయిర్ పోర్టు లీగల్ అడ్వైజర్ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. ఆయన శుక్రవారం మందస తహసీల్దార్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కార్గో ఎయిర్ పోర్టు బాధిత రైతులకు ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా ఒక ఎకరాకు 20 సెంట్లు భూమి ఇస్తారని, ప్రతి కుటుంబంలోని చదువుకున్న యువతకు వారి క్వాలిఫికేషన్ ప్రకారం ఉద్యోగ కల్పన జరుగుతుందని, లేదంటే కుటుంబానికి ప్యాకేజీ రూపంలో చెల్లింపులు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్వరరావు, ఆర్ఎంఓ మిస్క శ్రీకాంత్, డీటీ వై.రామకృష్ణ, ఎంఈఓ లక్ష్మణరావు, మండల సర్వేయర్ బాబురావు అధికారులు పాల్గొన్నారు. సైనికుడికి ఘన స్వాగతం రణస్థలం: భారత సైన్యంలో ముప్పై ఏళ్లు పని చేసి ఉద్యోగ విరమణ పొందిన సుబేదార్ ఆళ్ల అప్పన్న రెడ్డికి స్వగ్రామం నారువ వాసులు ఘనంగా స్వాగతం పలికారు. ఆ గ్రామ యువత సుమారు వంద బైక్లు, పదుల సంఖ్యలో కార్లతో పైడిభీమవరం నుంచి నారువ గ్రామం వరకు భారీ ఊరేగింపుగా జాతీయ జెండాలు చేతబూని జై భారత్, జై సైనికా నినాదాలతో తీసుకువచ్చారు. మహిళలందరూ హారతులు పట్టి స్వాగతం పలికారు. 1995 డిసెంబర్ 30న సైనికుడిగా విధుల్లో చేరిన అప్పన్న, 2025 డిసెంబర్ 31 ఉద్యోగ విరమణ పొందారు. 4న క్రికెట్ నెట్స్ ప్రారంభం శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళంలో క్రికెట్ అబివృద్ధి కోసం సహకరించాలని జిల్లా క్రికెట్ సంఘం మెంటార్ ఇలియాస్ మహ్మద్ విన్నవించారు. ఈ మేరకు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ను అతని క్యాంపు కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో నూతనంగా ఏర్పాటు చేసిన క్రికెట్ నెట్స్ను ఈ నెల 4న ఎమ్మెల్యే, అధికారులు, జిల్లా క్రికెట్ సంఘం ముఖ్య ప్రతినిధుల సమక్షంలో ప్రారంభించాలని నిర్ణయించినట్టు ఇలియాస్ చెప్పారు. ఎరువుల కొరత ఉండకూడదు: కలెక్టర్ శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో ఎరువుల కొరత ఉండకూడదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వ్యవసాయ శాఖ జేడీ త్రినాథ స్వా మి, ఇతర అధికారులకు సూచించారు. ఆయన శుక్రవారం సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. రైతుల అవసరాలకు తగ్గట్టుగా ఎరువులను అందుబాటులో ఉంచాలని, పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని వ్యవసాయ సహాయకులకు దిశానిర్దేశం చేశారు. రైల్వే గేట్ల తొలగింపునకు అవసరమైన కసరత్తు ప్రారంభించాలని ఆదేశించారు. అంతకుముందు ఆయన కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు రైల్వే గేట్ల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సూచించారు. రైల్వే బోర్డు నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రంలోని అన్ని రైల్వే గేట్ల స్థానంలో రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, అండర్ బ్రిడ్జిల నిర్మాణానికి రైల్వే శాఖతో కలిసి సంయుక్త కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఫిబ్రవరి 10లోగా ‘యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే’ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టమైన గడువు విధించారు. -
రిమ్స్లో కొనసాగుతున్న నిరసన
శ్రీకాకుళం: శ్రీకాకుళం రిమ్స్లో సెక్యూరిటీ గార్డులు, పారిశుద్ధ్య కార్మికులకు జీవో ప్రకారం జీతాలు చెల్లించాలంటూ శుక్రవారం కూడా నిరసనలు కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం చట్టవిరుద్ధమన్నారు. చట్టాలను ఉల్లంఘిస్తూ కార్మికులను వేధిస్తున్న శ్రీ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్, క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ లిమిటెడ్ యాజమాన్యాలపై ప్రభుత్వం సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారు లు, ప్రజాప్రతినిధులు తక్షణమే జోక్యం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి బగాది శ్రీనివాసరావు, పారిశుద్ద్య కార్మికుల ప్రధాన కార్యదర్శి దమ్ము చిన్నారావు, సాదు శ్రీనివాస్, దమ్ము వామనరావు, తంగి ప్రభ, కొర్లకోట విజయ, దువ్వి జయప్రద, మిర్తిపాటి మోహన్, చంద్రకళ, కొప్పల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
చెత్త పేరుకుపోతుంటే ఏం చేస్తున్నారు?
● ఎంపీడీఓపై జెడ్పీ సీఈఓ ఆగ్రహం శ్రీకాకుళం రూరల్: ిసంగుపురం రహదారిపై నిత్యం దుర్వాసన వస్తోందని, ప్రధాన రహదారిపై ఎక్కడికక్కడే చెత్తచెదారాలు కుప్పలుగా పేరుకుపోయినా పంచాయతీ అధికారులు, సిబ్బంది ఏం చేస్తున్నా రని జెడ్సీ సీఈఓ సత్యనారాయణ శ్రీకాకుళం ఎంపీడీఓ ప్రకాశరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆ ప్రాంతం మీదుగా ప్రయాణిస్తున్న సీఈఓ వాహనం ఆపి పరిశీలించారు. జాతీయ రహదారిపై నిత్యం ఇదే దారిలో అధికారులు, ప్రజాప్రతినిధులు రాకపోకలు సాగిస్తుంటారని, ఇలా ఎక్కడికక్కడే చెత్తచెదారాలు పారబోస్తుంటే మీరంతా ఏం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాన రహదారి పరిస్థితే ఇలా ఉంటే గ్రామ వీధుల్లో పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని అసహనం వ్యక్తం చేశారు. -
భూముల రీసర్వేతో రైతులకు లబ్ధి
గార: భూముల రీసర్వే 4.0తో రైతులకు లబ్ధి చేకూ రుతుందని కేంద్ర పౌరవిమానాయన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహననాయుడు అన్నారు. గార మండలం అంపోలు పంచాయతీలో సర్పంచ్ గొండు జయరాం అధ్యక్షతన భూమి రీసర్వే 4.0ను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్లతో కలిసి ప్రారంభించారు. ముందుగా గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించి గ్రామస భ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ వారం రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ చేపట్టిందన్నారు. అనంతరం అంపోలు పంచాయతీలో డ్రోన్ ద్వారా తీసిన సర్వే మ్యాపును తహశీల్దార్ మునగవలస చక్రవర్తి చూపించి వివరాలు తెలియజేశారు. స్థానిక అగస్త్యేశ్వర చేనేత సహకార సంఘాన్ని సందర్శించిన కేంద్రమంత్రికి చేనేత కార్మికులు సమస్యలు వివరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ కె.సాయిప్రత్యూష, ఎంపీడీఓ సురవజ్జల శ్రీనివాసులు, డిప్యూటీ ఎంపీడీఓలు కేవీవీ జగన్నాథం, ఆర్.సత్యనారాయణ ఎంపీటీసీలు గొండు అచ్యుతరావు, పొదిలాపు రామజోగి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ కార్యకర్తపై టీడీపీ వర్గీయుల దాడి
● లావేరు మండలం వేణుగోపాలపురంలో ఘటన రణస్థలం: లావేరు మండలంలోని గుమడాం పంచాయతీలో గల వేణుగోపాలపురం (ఆగ్రహారం) లో వైఎస్సార్ పీపీ కార్యకర్తపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. బాధితుడు మీసాల రామప్పడు పోలీ సులకు తెలిపిన వివరాలు ప్రకారం.. రామప్పడు శుక్రవారం ఉదయం ఇంటికి వెళ్లే సమయంలో అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులైన ఇజ్జురోతు సూర్యారావు, ఆశ వర్కర్ భూలక్ష్మి ఆయనను పిలి చారు. దుర్భాషలాడుతూ మీద మీదకు వచ్చారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఇజ్జురోతు బ్రహ్మాజీ రాయితో ముఖంపై బలంగా కొట్టాడు. దీంతో చుట్టుపక్కల వారు చూసి రక్తపు మడుగులో ఉన్న రామప్పడును రణస్థలం సీహెచ్సీకి తరలించారు. అక్కడకు లావేరు ఏఎస్ఐ ఎస్.ప్రసాదరావు వచ్చి వాంగ్మూలం సేకరించారు. ఈ ఘటనలో నిందితు డు ఇజ్జురోతు బ్రహ్మాజీ కూడా పోలీసులకు ఫిర్యా దు చేశారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని లావేరు ఎస్ఐ కె.అప్పలసూరి తెలిపారు. గొడవకు దారి తీసిన కారణాలివే.. ఇజ్జురోతు బ్రహ్మాజీకి సంబంధించి ఒక భూమి వివాదంలో ఉంది. ఆ వివాదం వైఎస్సార్ సీపీ సర్పంచ్ ప్రతినిధి దుర్గాశి ధర్మారావు క్లియర్ చేశారు. దీంతో బ్రహ్మాజీ సర్పంచ్పై కక్ష పెంచుకున్నాడు. ఈ విషయాన్ని మీసాల రామప్పడు సర్పంచ్ ధర్మారావుకు చేరవేశారు. మూడు రోజుల కిందట ఎందుకిలా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నావని గ్రామపెద్దలు, సర్పంచ్ ధర్మారావు బ్రహ్మాజీని మందలించారు. తాను తిడుతున్న విషయం సర్పంచ్కు రామప్పడు చేరవేశాడనే అక్కసుతో అతనిపై దాడికి పాల్పడినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. -
ఇంట్రస్ట్ ఉందా.. లేదా..?
● అరసవల్లిలో ట్రస్ట్ బోర్డు నియామకాలెప్పుడో..? ● గడువు ముగిసి 120 రోజులు దాటినప్పటికీ కానరాని ఆదేశాలు అరసవల్లి: అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయానికి పాలకమండలి సభ్యుల నియామకానికి ఇంకా గ్రహణం వీడలేదు. రాష్ట్రంలో ప్రముఖ ఆలయాలన్నింటికీ ట్రస్ట్ బోర్డులను నియమించేలా ఆదేశించిన ప్రభుత్వం అరసవల్లి ఆలయ విషయంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తోంది. కూటమి రాజకీయాల నడుమ స్థానిక ఎమ్మెల్యే మంత్రుల చొరవతో ఇంకా ఈ ట్రస్ట్ బోర్డు నియామకాలకు లెక్కలు తేలలేదని తాజా పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ట్రస్ట్ బోర్డు నోటిఫికేషన్ విడుదలై దరఖాస్తుల గడువు కూడా ముగిసి వందరోజులు దాటినప్పటికీ.. ఇంతవరకు పాలకమండలి సభ్యుల నియామకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రీన్సిగ్నల్ రాలేదు. ఈ నియామకాల ఉత్తర్వులు ఎప్పుడెప్పుడొస్తాయో అని తెలుగు తమ్ముళ్లతో పాటు జనసేన, బీజేపీ కీలక కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. ‘ట్రస్ట్’ రికార్డు లేని టీడీపీ టీడీపీ గతంలో రాష్ట్రంలో పలుమార్లు అధికారం చేపట్టినప్పటికీ అరసవల్లి ఆలయానికి ట్రస్ట్ బోర్డు నోటిఫికేషన్తో పాటు నియామకాలను చేపట్టడం విషయంలో ఎప్పుడూ వెనుకడుగే కనిపించింది. గత రికార్డులను పరిశీలిస్తే అప్పట్లో ఎన్టీఆర్, చంద్రబాబు సీఎంలుగా ఉన్నప్పుడు కూడా ఎన్నడూ ఈ ఆలయానికి ట్రస్ట్ బోర్డును నియమించలేదు. అలా గే గత 2014–19లోనూ, స్థానికంగా ట్రస్ట్ బోర్డు నియామకానికి చెందిన నోటిఫికేషన్ను తొలిసారిగా వేసినప్పటికీ నియామకాలు లేకుండా కాలం గడిపేశారు. అయితే తాజాగా కూటమి ప్రభుత్వంలో కూడా గత ఏడాది ఆగస్టు 7న నియామకాలకు చెందిన నోటిఫికేషన్ను విడుదల చేసింది. అయితే నిబంధనల ప్రకారం అదే నెలాఖరు వరకు దరఖాస్తులకు గడువు ఇవ్వగా.. సుమారు 83 మంది దరఖాస్తు చేసుకున్నట్లుగా సమాచారం. అయితే గడువు ముగిసి కూడా 120 రోజులు దాటినప్పటికీ ఇంతవరకు స్థానిక టీడీపీ పెద్దలు దీనిపై ఎలాంటి దృష్టి సారించలేదు. ఫలితంగా ఈ నెల 25న జరుగనున్న రథసప్తమి మహోత్సవాల్లో కొత్త ట్రస్ట్ బోర్డు కళ లేకుండా ఉండనుందని తెలుస్తోంది. రథసప్తమిని రాష్ట్ర పండుగగా ఈనెల 19 నుంచి ఏడు రోజుల పాటు నిర్వహించేలా మంత్రి అచ్చెన్నా యుడు ప్రకటించిన నేపథ్యంలో పాలకమండలి నోటిఫికేషన్ వేసినప్పటికీ నియమించని పరిస్థితి నెలకొంది. తమ్ముళ్ల ఎదురుచూపులు జిల్లాలో అతిపెద్ద ఆలయంగా శ్రీ సూర్యనారాయణ స్వామిఆలయం డిప్యూటీ కమిషనర్ స్థాయిలో ఉంది. అయితే జిల్లాలో శ్రీకూర్మం, శ్రీముఖలింగం, కోటబొమ్మాళి, రావివలస తదితర ఆలయాలతో పాటు గ్రేడ్–1, 2 ఆలయాల్లో కూడా చాలావరకు ట్రస్ట్ బోర్డు నియామకాలను చేపట్టారు. కీలకమైన అరసవల్లి ట్రస్ట్ బోర్డు నియామకాలు మాత్రం జరగకపోవడంపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నగర పార్టీ, వివిధ విభాగాల్లో తెలుగు తమ్ముళ్ల నియామకాలను పూర్తిచేసిన ప్రభుత్వం, అఽధికార పార్టీ పెద్దలు, అరసవల్లిలో నియామకాలకు సంబంధించి చర్యలు చేపట్టకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర పండుగగా రథసప్తమిలోగానే ఈ నియామకాలు జరిగితే తమ గౌరవంతో పాటు ఆలయ అభివృద్ధికి కూడా మార్గం సుగమం అవుతుందని పలువురు నేతలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. -
మాట వంకరం తీరు సంకరం
● కార్పొరేషన్లో బూతు పంచాంగంపై అంతర్మఽథనం ● ఉద్యోగులకు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న నియోజకవర్గ కీలకనేత ● ప్రతి ఫైల్ తన అనుమతితోనే కదలాలని ఆదేశం ● మాట వినని అధికారులపై పరుష పదజాలంతో దూషణ ● కీలక నేత తీరుపై గుర్రుగా ఉన్న ఉద్యోగులు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘ఆయనకెవరైనా చెప్పండి’.. అంటూ కార్పొరేషన్ ఉద్యోగులు మొత్తుకుంటున్నారు. అధికార అహంభావంతో నోటికొచ్చిన మాట విసిరేస్తున్న కీలక నేత వైఖరిపై వారు విసుగెత్తిపోతున్నారు. జిల్లా కేంద్రంలో అధికార పార్టీకి చెందిన నియోజకవర్గ కీలక నేత ‘సొంత నిర్ణయాలు వద్దు.. చెప్పిన చోట సంతకాలు చేయాలి.. లేదంటే విధులు నుంచి తప్పుకోవాలి’ అంటూ అధికార దర్పం ప్రదర్శిస్తున్నారు. నోటికేది వస్తే అదే మాటలాడుతున్నారు. ఆయనకు నచ్చకుండా ఏదైనా చేసినట్లు తెలిసినా, ఆయన దృష్టిలో లేకుండా ఏ పనైనా చేసినా, తన అనుచరులు చెప్పినా నోటికొచ్చినట్లు చెప్పలేని భాషలో బూతుపురాణం మొదలెట్టి చివరికి ఉద్యోగం చేయాలంటే ఉండండి లేకుంటే వెళ్లిపోండని సీరియస్గా హెచ్చరికలు జారీ చేసేస్తున్నారు. దీంతో శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్లో అధికారులు ఎప్పుడు అవకాశం వస్తే వేరే చోటకు వెళ్లిపోదామా అని చూస్తున్నారు. ● కొన్ని నెలల కిందట శ్రీకాకుళం నగరం పీఎన్కాలనీకి చెందిన ఓ సీనియర్ మున్సిపల్ ఇంజినీర్ (ఎమ్ఈ) కీలక నేత ఒత్తిడికి కొన్నాళ్లు సెలవు పెట్టి ఆ తర్వాత విశాఖపట్నంకు బదిలీపై వెళ్లిపోయారు. ● గత ఏడాది జూన్లో జరిగిన యోగాంధ్ర కార్యక్రమం సమయంలో పలుచోట్ల టాయిలెట్స్తో పాటు సౌకర్యాలు కల్పించడం చేతకాలేదని మున్సిపల్ అధికారులను ఉద్దేశించి ‘మీరు తాగుబోతులు.. తాగి పడుకోండి.. నీలాంటోడికి ఉద్యోగం ఎందుకు’ అంటూ చెప్పలేని భాషలో తిట్టడంతో ఎవరికీ చెప్పుకోలేక ఉండలేక మిన్నకుండిపోయారు. ● ఇంజినీరింగ్ విభాగంలో సచివాలయం ఇంజినీర్లతో పాటు ఏఈలు, డీఈలు, ఎమ్ఈ, కాంట్రాక్టర్లకు సైతం నోటికొచ్చినట్లు తిడుతున్నారని గగ్గోలు పెడుతున్నారు. ఆ నాయకుడు కార్పొరేషన్ కార్యాలయానికి రెండురోజులకోసారి వచ్చి రాత్రి 11 గంటల వరకు ఉద్యోగుల్ని టార్చర్ చేస్తున్నారని గొల్లుమంటున్నారు. అంతా తానై.. కార్పోరేషన్లో ఎవరికి ఏ వర్క్ ఇవ్వాలి, ఆ కాంట్రాక్టర్ ఎవరై ఉండాలి ఇలా అంతా ఆయనే నిర్దేశిస్తున్నారు. కార్పోరేషన్లో చీమ కదలడానికై నా తన అనుమతి ఉండాలన్న హుకుం జారీచేస్తున్నా రు. నియోజకవర్గ కీలక నేతకు కోటరీగా ఉన్న నాయకులకే అన్నీ జరిగేలా చూసుకుంటున్నారు. శ్రీకాకుళం కార్పొరేషన్లో వర్కుల కాంట్రాక్టుల కేటాయింపులో వివక్ష చూపిస్తూ తన వాళ్ల జేబులు నింపే పనిలో పడ్డారు. అందులోంచి తనకు రావాల్సిన వాటా కోసం ఆరాటపడుతున్నారు. గత కొంత కాలంగా కార్పొరేషన్లో మంజూరైన పనులు, వాటి కాంట్రాక్టు దక్కించుకున్నవారి జాబితా చూస్తే కీలక నేత పచ్చపాతం ఏంటో తెలుస్తోంది. పనులు కేటాయింపులే కాకుండా ఆ పనుల బిల్లులు చెల్లింపు విషయంలో కూడా తన మార్క్ కనబడాలని చెప్పినట్టు జరగాలని అజమాయిషీ చేస్తున్నారు. ఇప్పటివరకు కార్పొరేషన్లో జరిగిన చెల్లింపులను పరిశీలిస్తే జరుగుతున్న తంతు కళ్లకు కట్టినట్టు కనబడుతుంది. తన అభిరుచుల మేరకు తన ఆలోచనల మేరకు తన అభిప్రాయం ప్రకారం తన ఆదేశాలకు అనుగుణంగా నడుచుకునే అధికారులే ఉండాలని దర్పం ప్రదర్శిస్తున్నారు. ఎవరైనా మాట వినకపోయినా, చెప్పినట్టు జరగకపోయినా సంబంధిత అధికారులపై ఒంటి కాలిపై లేచి నోటికి పనిచెబుతున్నారు. ఆ సమీక్షల పేరిట నిర్వహించిన సమావేశాల్లో సహనం కోల్పోయి విచక్షణారహితంగా మాట్లాడుతున్నారు. బెదిరించే ధోరణితో మాట్లాడి ఉద్యోగుల వ్యక్తిత్వాన్ని హననం చేసేలా వ్యవహరిస్తున్నారు. ఆ దూషణలు, బూతుపురాణం వినలేక చెప్పినట్టే చేసుకుపోతున్నారు. ఆత్మగౌరవంతో పనిచేయాలనుకున్నవారు ఇక్కడ నుంచి వెళ్లిపోవడానికి సిద్ధమవుతున్నారు. మానసిక క్షోభలో కూడా కొందరు ఉద్యోగులు తప్పని పరిస్థితిలో పనిచేస్తున్నారు. -
వినరో భాగ్యము
● శ్రీకూర్మ క్షేత్రంలో 44 ఏళ్లుగా గోదాగోష్టి ● ధనుర్మాస వేళ శ్రీకూర్మనాథాలయంలో ప్రత్యేక ఉత్సవం గార: పవిత్ర శ్రీకూర్మ క్షేత్రంలో 44 ఏళ్లుగా ఆండాల్ గోదాగోష్టి పేరిట గ్రామ సంకీర్తన కొనసాగుతోంది. గోదా దేవి శ్రీకృష్ణుని పొందే విధానాన్ని వివరిస్తూ శ్రీకృష్ణుని చిత్రపటాన్ని పట్టుకొని శ్రీకూర్మనాథాలయ తిరువీధుల్లో ధనుర్మాస వేకువల్లో సంకీర్తన జరుపుతున్నారు. తొలుత శ్రీభాష్యం తిరువేంగలమ్మ, శ్రీభాష్యం అనంత లక్ష్మమ్మ ప్రారంభించగా, 20 ఏళ్లుగా తిరుమల పెద్దింటి సుశీలరాణి ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. శ్రీకృష్ణుని లీలలు వివరించే గీతాలను మహిళలు ఆలపిస్తారు. ఇంటి వద్ద భక్తులు మేలుకొలుపు వద్ద ఉన్న స్వామి చిత్రపటానికి హారతినివ్వడంతో పాటు దక్షిణలు సమ ర్పిస్తారు. ఇలా వచ్చిన డబ్బులతో గోదాదేవి కల్యా ణం రోజున మంగళసూత్రం, ప్రసాదాలను శ్రీకూర్మనాథాలయానికి అందించి ఆశీర్వాదాలు తీసుకుంటారు. ప్రతి రోజూ 5 గంటల తర్వాత శ్రీకూర్మనాథాలయంలో తిరుప్పావై ప్రవచనాల ముందుగా జరిగే బేడా సేవలో మహిళలతో పాటు భక్తులు పా ల్గొంటారు. ఆలయ ప్రధానార్చకులు సీహెచ్ సీతారామనృసింహాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు పల్లకిలో గోదాదేవి మూర్తితో పాటు సుదర్శన ఆళ్వా ర్ మూర్తులను ఎదురెదుగా ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ప్రధాన గోపురం చుట్టూ ఉన్న బేడా మంటపంలో బేడా సేవ నిర్వహించి శ్రీకూర్మనాయకి సన్నిధిలో తిరుప్పావై పఠనం నిర్వహిస్తారు. -
రెక్కాడితేనే.. డొక్క నిండేది!
కుటుంబంతో కలిసి ఇచ్ఛాపురం, కంచిలి, సోంపేట, కవిటి ప్రాంతాలకు వచ్చి దాదాపు 20 ఏళ్లు కావొస్తోంది. మేము తయారు చేసిన పనిముట్లు ఎవరైనా కొంటేనే మా పొట్ట నిండేది. రోజంతా పనిచేస్తే వచ్చేది చాలా తక్కు వ. వేరే పనులు చేయలేక ఈ పనితోనే నెట్టుకొస్తున్నాం. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి – ఛత్రసింగ్, ఇచ్ఛాపురం కొలిమి పనులు చేసేటప్పు డు, సమ్మెట దెబ్బ వేసేటప్పుడు ఎంతో కష్టంగా ఉంటుంది. అయినా తప్పడం లేదు. చేసిన పని ము ట్లు అమ్ముతాం. ఒక్కోసారి డబ్బులు సరిగా రా వు. అయినా పొట్ట కూటి కోసం తిప్పలు పడుతున్నాం. – నరేంద్ర సింగ్, ఇచ్ఛాపురం ఇచ్ఛాపురం రూరల్ : ప్రదేశం ఎక్కడైనా కష్టపడే తత్వం వారి సొంతం. కొలిమి వృత్తిని నమ్ముకుంటూ పుట్టిన ఊరును వదిలి బతుకుదెరువు కోసం వలస బాటపట్టారు. రెక్కల కష్టమే బతుకుదెరువుగా మార్చుకున్నారు. ఇంటిల్లపాదీ పొద్దంతా పనిచేసి కడుపు నింపుకుంటున్నారు. రోడ్ల వెంట గుడారాలు వేసుకొని, మండుతున్న కొలిమిలో ఇనుము కాలుస్తూ, సమ్మెట దెబ్బలు వేస్తూ చిన్నచిన్న పనిముట్లు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారు. మధ్యప్రదేశ్కు చెందిన పలువురు కొన్నేళ్ల క్రితం జిల్లాకు వచ్చి గ్రామాల్లో సంచరిస్తూ కొలిమి పనులు చేస్తూ ఇక్కడే నివాసముంటున్నారు. అందరూ కష్టపడితేనే.. పనిముట్లు తయారు చేసే క్రమంలో పురుషులు ఇనుమును కొలిమిలో కాల్చి బయటకు తీసినప్పుడు మహిళలు సమ్మెట దెబ్బలు వేయల్సి వస్తుంది. బరువైన పెద్ద సుత్తితో వారు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. కానీ బతుకుదెరువు కోసం తప్పని పరిస్థితి. కొలిమి పనుల్లో వచ్చే పొగ, సెగతో ఆరోగ్యం క్షీణించిపోతోంది. ఎండైనా..వానైనా.. కొలిమి పనులు చేస్తూ పొట్ట పోసుకుంటున్న కార్మికుల భవితాలు దుర్భరంగా మారాయి. వారికి చిన్నచిన్న గుడారాలే ఇళ్లు. ఎండైనా, వానైనా కుటుంబం అంతా వాటిలో ఉండాల్సిందే. రోడ్డు పక్కనే జీవనం, కనీస సదుపాయాలు కరువయ్యాయి. ప్రస్తు తం చలి తీవ్రతతో ఇబ్బందులు పడుతున్నారు. వారి పిల్లల చదువులు, ఆరోగ్యం అంతంత మాత్ర మే. ఊరుకాని ఊరు వచ్చి వారు అనేక కష్టాల నడు మ జీవనం సాగిస్తున్నామని, పాలకులు, ప్రభు త్వం ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. -
అధికారుల నిర్లక్ష్యం.. పేద కుటుంబానికి శాపం!
హిరమండలం: సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని కూటమి ప్రభుత్వం ఆర్భాటం చేస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి విరుద్ధంగా ఉంది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం అమలుచేసినట్టు కూటమి ప్రభుత్వం చెప్పింది. కానీ హిరమండలం మండలంలో నిరుపేద కుటుంబంలో ముగ్గురు పిల్లలకు ఈ పథకం వర్తించలేదు. దీంతో ఆ కుటుంబం కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది. అయినా కనికరించేవారు కరువయ్యారు. జగన్నాథపురంలో లిమ్మక పెంటయ్య, ఈశ్వరి దంపతులకు ముగ్గురు పిల్లలు. వీరంతా వంశధార నిర్వాసితులు. నిరుపేదలు కావడంతో పూరిగుడిసెలో నివాసముంటున్నా రు. ముగ్గురు పిల్లలూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. కనీసం వీరికి విద్యుత్ మీటరు కూడా లేదు. కానీ ఏకంగా ఏడు మీటర్లు ఉన్నట్టు చూపడంతో తల్లికి వందనం పథకం వర్తించలేదు. విద్యు త్ శాఖ అధికారులు వీరికి ఎటువంటి మీటరు లేదని ధ్రువీకరించినప్పటికీ తల్లికి వందనం పథకం మాత్రం అందలేదు. కార్యాలయాల చుట్టూ తిరగడమే కానీ ఫలితం లేకపోతోంది. కొత్త సంవత్సరంలోనైనా అధికారులు స్పందించి పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. -
ఘనంగా హిందూ సమ్మేళనం
శ్రీకాకుళం కల్చరల్ : ఆర్ఎస్ఎస్ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హిందూ సమ్మేళనం కార్యక్రమం శ్రీకాకుళం నగరంలోని విశాఖ–బీ కాలనీ షిర్డీసాయిబాబా మందిరంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన షిర్డీసాయిబాబా సేవా సత్సంగం చైర్మన్ డాక్టర్ మధుకర్ విలేకర్ మాట్లాడుతూ హైందవ సమాజం అభివృద్ధి చెందాలని, సామాజిక సేవా కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషించాలన్నారు. గురజాడ విద్యా సంస్థల డైరెక్టర్, సేవా భారతి సంయుక్త కార్యదర్శి జి.సంయుక్త మాట్లాడుతూ హైందవ సమాజం ప్రతి ఒక్కరి అభ్యున్నతి కోసం పనిచేస్తుందన్నారు. సమాజ వికాసానికి దోహదపడే కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. అనంతరం షిర్డీసాయిబాబా ఆలయ ప్రాంగణంలో నారాయణసే వా సమితి ఆధ్వర్యంలో మహాన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో షిర్డీసాయిబాబా మందిరం ప్రధాన అర్చకులు రేజేటి శ్రీనివాసాచార్యులు, ట్రెజరర్ ఇప్పిలి భవానీ, బంగార్రాజు, శేఖర్, ప్రసాద్, వడ్డి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాధనం వృథా!
● నిరుపయోగంగా ప్రభుత్వ కార్యాలయ భవనాలు ● పట్టించుకోని అధికారులు ఎచ్చెర్ల : ప్రభుత్వ అనాలోచిత విధానాలతో ప్రజాధనం దుర్వినియోగమవుతోంది. ఎచ్చెర్ల మండలంలో అవసరం లేకుండా కోట్ల విలువ చేసే భవనాలను నిర్మించి నిరుపయోగంగా వదిలేశారు. మరోవైపు ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వహించే కార్యాలయాలను అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఎచ్చెర్ల మండల కేంద్రంలో పౌరసరఫరాల గోదామును పదేళ్ల క్రితం నిర్మించారు. ఆహార పదార్థాల నిల్వకు, సరుకుల సరఫరాకు అన్ని విధాలా ఉపయోగపడేలా మోడల్గా నిర్మించారు. తర్వాత వివిధ కారణాలతో ప్రారంభించకుండానే వదిలేశారు. చిలకపాలెం జంక్షన్ వద్ద జాతీయ రహదారికి ఆనుకుని వికలాంగుల పునరావాస కేంద్రాన్ని నిర్మించారు. ఇది కూడా అధునాతన పద్ధతిలో 15 ఏళ్ల కిందట నిర్మించారు. కొన్నాళ్లు దివ్యాంగుల కార్యకలాపాలు కొనసాగించారు. వారికి అవసరమైన పరికరాలు అందించడంతో పాటు పిజియోథెరపి అందించడానికి నిర్మించిన ఈ భవనాన్ని తర్వాత మూసివేశారు. ప్రస్తుతం పిచ్చిమొక్కలతో నిండిపోయి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. మరోవైపు మండలంలో పీఏసీఎస్ కేంద్రాన్ని అద్దె భవనంలో నడిపిస్తున్నారు. వీటితో పాటు అంగన్వాడీ కేంద్రాలను కూడా అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఇప్పటికై నా పాలకులు స్పందించి భవనాలను వినియోగంలోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. -
పారా, మాస్టర్ అథ్లెట్లకు సత్కారం
శ్రీకాకుళం న్యూకాలనీ: లక్ష్యసాధన దిశగా క్రీడాకారులు అడుగులు వేయాలని ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు, బాస్కెట్బాల్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ ఎమ్మెస్సార్ కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. గురువారం శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో క్రీడాకారులతో కలిసి 2026 నూతన సంవత్సరం వేడుకలను జరుపుకున్నారు. ఈసందర్భంగా సౌత్ ఏషియన్ పారా త్రోబాల్ రజత పతకం సాధించిన బగ్గు రామకృష్ణ, మాస్టర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీల్లో పతకాలు సాధించిన మాస్టర్స్ను ఘనంగా సత్కరించారు. అనంతరం బాస్కెట్బాల్, సెపక్తక్రా, మాస్టర్స్ అథ్లెటిక్స్, పారా దివ్యాంగుల క్రికెట్ అసోసియేషన్ సంఘాల ప్రతినిధులు మాట్లాడారు. కార్యక్రమంలో డీఎస్ఏ బాస్కెట్బాల్ కోచ్ గాలి అర్జున్రావురెడ్డి, ఎండీ కాసీంఖాన్, కళావతి దంపతులు, గాలి జగన్నాథ్రెడ్డి, బి.సోములు, జి.కొర్లయ్య, వి.శశి, యు.రవి, జి.వేణుగోపాల్రెడ్డి, సంతోష్, నవీన్, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. -
25న జిల్లాస్థాయి హిందీ ప్రతిభా పరీక్ష
శ్రీకాకుళం కల్చరల్: హిందీ సేవా సదన్ (అనంతపురం) ఆధ్వర్యంలో గత నెల రాష్ట్రవ్యాప్తంగా 6 నుంచి 10వ తరగతుల విద్యార్థులకు నిర్వహించిన పాఠశాల స్థాయి హిందీ టాలెంట్ టెస్ట్లో జిల్లా స్థాయి పరీక్షకు ఎంపికై న విద్యార్థుల వివరాలను విశ్రాంత డీఈఓ బలివాడ మల్లేశ్వరరావు గురువారం విడుద ల చేశారు. హిందీ మంచ్ సంస్థ ఆధ్వర్యంలో గురువారం జరిగిన కార్యక్రమంలో మల్లేశ్వరరావు మా ట్లాడుతూ హిందీ సేవా సదన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో మొదటిసారిగా హిందీ భాష పట్ల అభిరుచి పెంచేందుకు టాలెంట్ టెస్ట్ నిర్వహించినట్లు తెఇపారు. జిల్లా స్థాయి పోటీకి ఎంపికై న విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. మంచ్ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోనే శ్రీధర్ మాట్లాడుతూ హిందీ మంచ్ సంస్థ సమన్వయంతో ఉత్తరాంధ్రలో 2,300 మందికిపైగా విద్యార్థులు పాఠశాల స్థాయి ప్రతిభా పోటీ లో పాల్గొన్నారని వివరించారు. వీరిలో 150 మంది పాఠశాల స్థాయిలో ప్రతిభావంతులుగా నిలిచి జిల్లా స్థాయి పరీక్షకు ఎంపికయ్యారని తెలిపారు. ఈ నెల 25న శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో జిల్లాస్థా యి ప్రతిభా పరీక్ష నిర్వహించనున్నామని పేర్కొ న్నారు. హిందీ పండిట్లు రొంపివలస రామారావు, బి.మంజుల, కనుగుల సత్యం సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారని చెప్పారు. ఎంపికై న విద్యార్థులను రెడ్క్రాస్ జిల్లా చైర్మన్ పోలుమహంతి జగన్మోహనరావు, విశ్రాంత సెట్శ్రీ సీఈవో సురంగి మోహనరావు, బలివాడ మల్లేశ్వరరావు అభినందించారు. కార్యక్రమంలో మంచ్ జోనల్ కమిటీ ప్రతినిధి ఎం. వి.మల్లేశ్వరరావు, జిల్లా గౌరవాధ్యక్షుడు దొంతం పార్వతీశం, జిల్లాశాఖ ప్రతినిధులు కనుగుల సత్యం, రొంపివలస రామారావు, ఈరంకి ఉమారా ణి, సింగూరు రాధ, శిరీష, సత్యనారాయణ, విజయ్, తంగివానిపేట హైస్కూల్ హెచ్ఎం రామకృష్ణ, పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
ఒడియా విద్యార్థుల అభివృద్ధికి కృషి
ఇచ్ఛాపురం: ఆంధ్రప్రదేశ్లో ఒడియా మైనారి టీ విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తామని ఒడి యా లింగ్విస్టిక్ మైనారిటీ సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ పాడీ అన్నారు. ఇచ్ఛాపురం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు సమీపంలో ఆంధ్రప్రదేశ్ ఒడియా టీచర్స్ అసోసియేషన్ (అపో టా) ప్యాకెట్ క్యాలెండర్ను గురువారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఒడియా డీఐ దుర్గాప్రసాద్ చౌదరి, ఆపోటా రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్ పాఢీ, ప్రధాన కార్యదర్శి బృందావన్ దొళాయి, ఒడియా సంఘం పెద్దలు రఘునాథ్ గౌడో తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం కల్చరల్ : మాజీ సైనికుల సంక్షేమ సంఘం వెబ్సైట్, క్యాలెండర్ను ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు గురువారం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్షుడు పూర్ణచంద్రరావు కటకం, సభ్యులు పాల్గొన్నారు. శ్రీకాకుళం కల్చరల్: జిల్లా కేంద్రంలోని ఏడు రోడ్ల జంక్షన్ ప్రాంతంలో నివా సముంటున్న పట్నాల శ్యామలాంబ(86) మృతిచెందడంతో ఆమె నేత్రాల ను దానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకువచ్చారు. మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియ న్ పూతి సుజాత, పి.సుమతి ద్వారా ఆమె కార్నియాలు సేకరించి విశాఖపట్నం ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు. నేత్రదానం చేయాలనుకునే వారు 78426 99321 నంబరుకు సంప్రదించాలని నిర్వాహకులు కోరారు. వజ్రపుకొత్తూరు రూరల్ : పలాస మండలం బొడ్డపాడు జంక్షన్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యా యి. పలాస మున్సిపాలిటీ పరిధి రామకృష్ణా పురం గ్రామానికి చెందిన లండ శశికుమార్ బైక్పై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో శశికుమార్ తలకు తీవ్ర గాయాలు కావడంతో పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం నిమిత్తం శ్రీకాకుళం ఆస్పత్రికి తరలించారు. ద్విచక్ర వాహన్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టిందా.. లేక అదుపు తప్పి ప్రమాదం జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. శ్రీకాకుళం క్రైమ్ : కలెక్టరేట్కు వెళ్లే దారిలో అపార్ట్మెంట్స్ వెనుక భాగంలో 2.4 కిలోల గంజాయితో ఉన్న ఆరుగురు యువకులను గురువారం పోలీసులు పట్టుకున్నారు. రూరల్ సీఐ పైడపునాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. పక్కా సమాచారం మేరకు ఎస్ఐ ఎం.హరికృష్ణ సిబ్బందితో మాటు వేసి భానుగురి చంద్రశేఖర్, కిల్లంశెట్టి నిఖిల్, పొన్నాడ కిషోర్, కుందు గోపాల్, కొన్న రాందేవ్, దండి వేణులను పట్టుకున్నారు. వీరిన విచారించగా ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ నుంచి గంజాయిని అక్రమంగా తీసుకొచ్చి పరస్పరం పంచుకుంటున్నట్లు నిర్ధారించారు. గంజాయిని సీజ్ చేసి యువకులను కోర్టులో హాజరుపర్చగా.. జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో జిల్లా జైలుకు తరలించారు. -
ఏపీ గట్కా టీమ్ కోచ్గా సత్యవరం స్కూల్ పీడీ
నరసన్నపేట: జాతీయ స్థాయిలో పంజాబ్ రాష్ట్రం లూథియానాలో జరగనున్న గట్కా(కర్రసాము) పోటీలకు వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ టీమ్ కోచ్గా సత్యవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పీడీ జ్యోతీరాణి నియమితులయ్యారు. జాతీయ స్థాయిలో గట్కా పోటీ లు 5 నుంచి 10 వ తేదీల్లో జరగనున్నాయని పీడీ తెలిపారు. ఈ అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. శుక్రవారం పయనం అవుతున్నట్లు తెలిపారు. విజయవాడ చేరుకొని అక్కడ నుంచి లూథియానాకు వెళ్లనున్నట్లు వివరించారు. నేటి నుంచి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు ప్రభుత్వం ముద్రించిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను శుక్రవారం నుంచి అందజేయనున్నారు. ఈ నెల 9వ తేదీ వరకు కార్యక్రమం నిర్వహించనున్నారు. జిల్లాలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో పాత భూహక్కు పత్రాల స్థానంలో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. జిల్లాలో రీసర్వే పూర్తయిన 652 గ్రామాల్లో రెవెన్యూ గ్రామ సభల ద్వారా 2,54,218 కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలు శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్లో 13 మండలాల్లో 277 రెవెన్యూ గ్రామాల్లో 1,25,716 పాస్ పుస్తకాలు అందజేయనున్నారు. టెక్కలి డివిజన్లో 9 మండలాల్లో 192 రెవెన్యూ గ్రామాల్లో 65,618 మంది రైతులకు పాస్ పుస్తకాలు ఇవ్వనున్నారు. పలాస డివిజన్లో 8 మండలాల్లో 183 రెవెన్యూ గ్రామాల్లో 62,884 పాస్ పుస్తకాలు అందజేస్తారు. జిల్లాను హరితమయం చేద్దాం: కలెక్టర్ శ్రీకాకుళం పాతబస్టాండ్: కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మ ద్ ఖాన్లను పలు శాఖల ఉన్నతాధికారులు తమ సిబ్బందితో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన కలెక్టరేట్ సముదాయం వద్ద నూతనంగా నిర్మిస్తున్న రహదారికి ఇరువైపులా మొక్కలు నాటారు. కొత్త ఏడాదిలో జిల్లాను హరితమయంగా మార్చేందుకు అధికారులు, ప్రజలు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. -
మద్యం తాగేశారు
● డిసెంబరు 31 రాత్రి విపరీతంగా మద్యం విక్రయాలు డిసెంబర్ 31 అర్ధరాత్రి మందు ప్రియులు ‘ఫుల్లు’గా ఎంజాయ్ చేశారు. ఎప్పటికంటే దాదాపు దాదాపు కోటి రూపాయల అదనపు మద్యాన్ని గుటకేశారు. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా మద్యం ప్రియులు డిసెంబరు 31న రూ.3.75 కోట్ల మందు తాగేశారు. అర్ధరాత్రి వరకు ప్రభుత్వం విక్రయాలకు ఇచ్చిన అనుమతిని వినియోగించుకుని మందుషాపుల గల్లా పెట్టెలు నింపారు. ఈ మేరకు జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సీహెచ్ తిరుపతినాయుడు ఓ ప్రకటన గురువారం విడుదల చేశారు. సాధారణ రోజుల్లో రూ. 2.50 కోట్ల నుంచి రూ. 2.70 కోట్ల సరాసరిన మద్యం అమ్మకాలు జరిగేవని ఆ లెక్కన రూ.1.20 కోట్లు మద్యం అధికంగా అమ్ముడు పోయిందని ఆయన అన్నారు. శ్రీకాకుళం సర్కిల్ పరిధిలో రూ. 80 లక్షల మేర మద్యం అమ్మకాలు సాగినట్లు సీఐ ఎంవీ గోపాలకృష్ణ ప్రకటించారు. సాధారణ రోజుల్లో రూ. 60 లక్షలు అమ్మకాలు సాగేవన్నారు. మందుబాబులపై కేసులు.. జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ 36, ఓపెన్ డ్రింకింగ్ 15 కేసులు నమోదు చేశారు. శ్రీకాకుళం నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఒకటో పట్టణ పరిధిలో 14, ట్రాఫిక్ పీఎస్ పరిధిలో 6 నమోదు కాగా రెండో పట్టణ పరిధిలో 4 ఓపెన్ డ్రింకింగ్ కేసులు పోలీసులు కట్టారు. వీరిని శుక్రవారం కోర్టు ముందు హాజరుపర్చనున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మద్యం అమ్మకాలకు సమయం ఒంటి గంట వరకు పెట్టిన ప్రభుత్వం రోడ్లపై మద్యం తాగి తిరగవద్దని, అదే ఒంటి గంట తర్వాత తిరిగితే కేసులు కట్టి జైలుకు పంపిస్తామని పోలీసుల చేత ప్రకటించడంపై జిల్లావ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. – శ్రీకాకుళం క్రైమ్ -
కనికుట్టు విద్య
● నృత్య ప్రదర్శనలు ఇచ్చే చిన్నారుల డ్రెస్ డిజైనింగ్లో ప్రతిభ చూపుతున్న దర్జీ ● 40 ఏళ్లుగా ఇదే వృత్తిలో రాణిస్తున్న ఏకై క వ్యక్తి ● వేల మందికి కాస్ట్యూమ్స్ డిజైనింగ్ శ్రీకాకుళం కల్చరల్: నృత్య ప్రదర్శన ఎక్కడ చేసినా ముందు ఆయన వద్దకు వెళ్లాల్సిందే. శిక్షణ నుంచి ఆరంగేట్రం వరకు అన్ని దశల్లోనూ ఆయనను కలవాల్సిందే. నాట్య ప్రదర్శనలో అడుగులు ఎంత లయబద్ధంగా కదపాలో, ము ఖ కవళికలు ఎంత అందగా ఉండాలో, భంగిమ లు ఎంత శ్రద్ధగా కుదరాలో ఆహార్యం కూడా అంతే సుందరంగా అమరాలి. అందుకు 40 ఏళ్లుగా ఏకై క చిరునామా వీరభద్రరావు. రంగురంగుల పట్టు వస్త్రాలు, కచ్చితమైన కొలతలతో కూడిన ఆ దుస్తుల వెనుక ఒక సామాన్య టైలర్ అసామాన్య కృషి దాగి ఉంది. ఆయనే శ్రీకాకుళంలో సుపరిచితులైన మల్లెమొగ్గల వీరభద్రరావు (భద్రం). చదివింది ఐదో తరగతి అయినా, శాసీ్త్రయ నృత్య దుస్తుల తయారీలో ఆయనది అందెవేసిన చేయి. 40 ఏళ్లుగా ఈ వృత్తిలోనే.. వీరభద్రరావు బాల్యంలో తన మేనమామ చాగంటి నాగేశ్వరరావు కుట్టు మిషన్పై దుస్తులు కుడు తుంటే చూసి ఆసక్తి పెంచుకున్నారు. కుట్టు వృత్తి పైనే మక్కువతో 40 ఏళ్లుగా ఇవే దుస్తులు కుడుతున్నారు. ప్రారంభంలో పౌరాణిక సినిమాల ప్రభావం ఆయనపై ఎక్కువగా ఉండేది. ముఖ్యంగా నంద మూరి తారకరామారావు ధరించే వైవిధ్యమైన దుస్తులను చూసి, డ్రామా కళాకారులకు అలాంటి దుస్తులు కుట్టడం మొదలుపెట్టారు. 1990వ దశకంలో నాట్య గురువు రఘుపాత్రుని శ్రీకాంత్ ప్రోత్సాహంతో శాసీ్త్రయ నృత్యాల వైపు మళ్లింది. ఎలాంటి అధికారిక శిక్షణ లేకపోయినా, కేవలం స్వయంకృషితో అవగాహన పెంచుకున్నారు. విదేశాలకు సైతం.. నేడు కూచిపూడి, భరతనాట్యం, కథాకళి, మోహినియాట్టం వంటి ఏ శాసీ్త్రయ నృత్యానికై నా భద్రం కుట్టిన దుస్తులు ఉండాల్సిందే. ఆయన నైపు ణ్యాన్ని గుర్తించిన డ్యాన్స్ మాస్టర్లు తమ విద్యార్థులకు భద్రం చేతనే దుస్తులు కుట్టించడానికి మొగ్గు చూపుతారు. అమెరికా వంటి దేశాల నుంచి సైతం ఆర్డర్లు వస్తున్నాయంటే ఆయన పనితనం అర్థం చేసుకోవచ్చు. ప్రముఖ డ్యాన్స్ మాస్టర్లు శ్రీకాంత్, శివ కుమార్, మెహర్ విద్యావిహార్, నీరజలతో పాటు స్వాతి స్వామినాథన్ వంటి జాతీయ స్థాయి గురువులకు ఈయన అంటే ఎంతో ఇష్టం. ఆయనకు భార్య సుబ్బలక్ష్మి, ఆయన శిష్యురాలు బాలనాగమణి సహకారం అందిస్తున్నారు. వీరభద్రరావు రూపొందించిన డ్రెస్లో చిన్నారి నృత్య భంగిమ డ్యాన్స్ మాస్టర్ల సహకారంతోనే.. నేను ఇంతగా ఎదగడానికి కారణం డ్యాన్స్ మాస్టర్లు నాకు ఇస్తున్న సహకారం. నాట్యగురువు శ్రీకాంత్ నన్ను ముందుగా ప్రోత్సహించారు. నాటి నుంచి నా జీవితం ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సాగుతోంది. – ఎం.వీరభద్రరావు, దర్జీ, శ్రీకాకుళం -
సముద్రంలో బోటు మునక
● లక్షల్లో ఆస్తినష్టం కొత్తపాలెంలో వలల్ని తీస్తున్న మత్స్యకారులు కవిటి : మండలంలోని కొత్తపాలెం సముద్రతీరంలో లంగరువేసిన గంగామాత అనే బోటు సము ద్రంలో కూరుకుపోయిందని బోటుకు చెందిన 11 మంది మత్స్యకారులు డొంక సోమయ్య, సూర్ని లచ్చయ్య తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి గురువారం సాయంత్రం మత్స్యకారులు మీడియాకు వివరాలు వెల్లడించారు. వారు తెలిపిన వివరాల మేరకు.. బుధవారం వేట నుంచి వచ్చిన తర్వాత కొత్త పాలెం సముద్ర తీరంలో లంగరు వేసి బోటు సురక్షితంగానే నిలిపారు. గురువారం ఉదయం వేటకు వెళదామని అంతా తీరానికి వెళ్లారు. చూసేసరికి బోటు సముద్రంలో భారీగా కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో దానిలో ఉన్న లక్షల రూపాయల విలువైన వల కూడా పాడైపోయింది. బోటును మరికొన్ని బోట్ల సాయంతో బయటకు తీసేందుకు గ్రామస్తులంతా శతవిధాలుగా ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో అది ముక్కలుగా విరిగి బాగా దెబ్బతిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో బోటులో రెండు జీపీఎస్ మిషన్లు, ఇంజిన్లలో ఉన్న ఇంజిన్ ఆయిల్ పడిపోయింది. బోటులో ఉన్న టీవీ కూడా దెబ్బతింది. జేసీబీ సాయంతో బయటకు తీసేందుకు ప్రయ త్నించామని మత్స్యకారులు తెలిపారు. వలతో పాటు బోటు కూడా పాడైపోయిందని లక్షల్లో నష్టపోయామని తెలిపారు. కొత్తబోటు కొనాలంటే ప్రస్తుతం రూ.16 నుంచి రూ.18 లక్షల వరకు ఖర్చవుతుంది. జీపీఎస్ మిషన్లు, టీవీ తదితర సౌకర్యా లు అన్నీ సమకూర్చడం ఇప్పుడు తమకు తలకు మించిన భారమని మత్స్యకారులు వాపో తున్నా రు. అధికారులు సంఘటనా స్థలానికి వచ్చి జరిగిన నష్టాన్ని అంచనా వేసి తమకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. -
మహాసభలను విజయవంతం చేయండి
పలాస : రాజ్యహింసకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన గొంతు వినిపించేందుకు ఈ నెల 10, 11వ తేదీలలో చేపట్టనున్న 20వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు బొడ్డపాడులో గురువారం పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బూటకపు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా, ప్రజా నిర్బంధాలు, అణచివేతతో పాటు అన్ని వర్గాల ప్రజలను పీడిస్తున్న ప్రభుత్వ విధానాలను ముక్తకంఠంతో వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ప్రజా హక్కులను కాపాడుకోవాలంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూ డెమొక్రసీ జిల్లా సహాయక కార్యదర్శి వంకల మాధవరావు, లిబరేషన్ జిల్లా నాయకులు మద్దిల రామారావు, దుష్యంత్, ప్రగతిశీల మహిళా సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనపల్లి కుసుమ, ప్రజా సంఘాల నాయకులు ఈశ్వరమ్మ, మద్దిల వినోద్, కోనేరు రమేష్, వీరాస్వామి, లక్ష్మణ్, జోగి కోదండరావు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ బాక్సింగ్ పోటీలకు విశ్వేశ్వరరావు
శ్రీకాకుళం న్యూకాలనీ : జాతీయ బాక్సింగ్ పోటీల కు జిల్లాకు చెందిన బాక్సర్ పి.విశ్వేశ్వరరావు ఎంపికయ్యాడు. ఉత్తరప్రదేశ్లోని నోయిడా వేదికగా ఈ నెల 4 నుంచి 10 వరకు తొమ్మిదో ఆలిండియా ఎలైట్మెన్ బాక్సింగ్ చాంపియన్షిప్–2025–26 పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల కోసం విశ్వేశ్వరరావు గురువారం ఇక్కడి నుంచి పయనమైవెళ్లాడు. ఇటీవ ల జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించడంతో జా తీయ పోటీలకు ఎంపికయ్యాడు. డీఎస్ఏ బాక్సింగ్ కోచ్ ఎం.ఉమామహేశ్వరరావు నేతృత్వంలో కఠోర సాధన చేస్తూ జాతీయస్థాయికి చేరుకోవడం అభినందనీయమని డీఎస్డీఓ ఎ.మహేష్బాబు సంతో షం వ్యక్తం చేశారు. జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ సెక్రటరీ బీఏ లక్ష్మణ్దేవ్, వంగా మహేష్ ప్రోత్సా హం, శిక్షకుల చొరవ ప్రసంశనీయమని సీనియర్ బాక్సర్లు రాజీవ్, అప్పలరాజు, రాము, మనోజ్కుమార్ తదితరులు పేర్కొన్నారు. విశాఖ రేంజ్ ఐజీగా గోపీనాథ్ జట్టి బాధ్యతల స్వీకరణ విశాఖసిటీ: విశాఖ రేంజ్ డీఐజీగా విధులు నిర్వర్తిస్తున్న గోపీనాథ్ జట్టి పదోన్నతి పొందారు. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఐజీ)గా గురువారం ఆయన రేంజ్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కార్యాలయంలోని ఇతర పోలీస్ అధికారులతో కలిసి ఆయన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. నూతన సంవత్సరంలో రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవ చేయాలని ఐజీ ఆకాంక్షించారు. రేంజ్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేర నియంత్రణకు పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారు. పోలీసు యంత్రాంగం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం ఎస్పీ కె.వి.మహేశ్వర్రెడ్డి (శ్రీకాకుళం) మర్యాదపూర్వకంగా కలిశారు. రేంజ్ పరిధిలోని డీఎస్పీలు, ఇతర ఉన్న తాధికారులు, కార్యాలయ మినిస్టీరియల్ సిబ్బంది, క్యాంపు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. బాధ్యతలు స్వీకరిస్తున్న గోపీనాథ్ జట్టి -
78 గంటలైనా నా భర్త జాడలేదు
శ్రీకాకుళం క్రైమ్ : నిమ్మాడ.. శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర, రాష్ట్ర మంత్రివర్యులైన కింజరాపు అచ్చెన్నాయుడు, రామ్మోహన్నాయుడుల స్వగ్రామం. ఇదే గ్రామానికి చెందిన కింజరాపు చంద్రకళ అనే వివాహిత తన భర్త కింజరాపు అప్పన్న ఈనెల 29 నుంచి కనపడటంలేదని, ఇద్దరు కానిస్టేబుళ్లు తీసుకెళ్లినట్లు తెలిసిందని, 78 గంటలైనా తన భర్త జాడలేదని, ఆయన ప్రాణానికి హాని ఉందని మీడియా ముందు కన్నీటిపర్యంతమైంది. ఏడాదిన్నరగా నిమ్మాడలోకి అడుగు పెట్టలేకపోతున్నామని, తెలుగుదేశం పార్టీ వాళ్లు రానీయడంలేదని ఆరోపించారు. ఇదే విషయమై జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్న ఎస్పీ మహేశ్వరరెడ్డిని కలిసి ఫిర్యాదు చేసినట్లు ఆమె గురువారం మీడియాకు వివరించారు. 29 నుంచి కనిపించడంలేదు.. గతనెల 29న మా కన్నవారి గ్రామమైన మెళియాపుట్టి మండలం కొసమాలలో కింజరాపు అప్పన్నను ఉ.8–10 గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్లారు. అప్పుడు నేను వైజాగ్లో ఉండటంతో తెలీలేదు. సాయంత్రం వచ్చేస్తున్నానని చెప్పేందుకు నా భర్తకు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. కన్నవారింటికి వచ్చాక బైక్, హెల్మెట్ అయితే ఉందిగానీ భర్త లేడు. ఇదే విషయం అక్కడ కొందరిని అడగ్గా ఎవరో ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్లారని చెప్పారు. ఆ తర్వాత నా భర్తకు చాలాసార్లు ఫోన్ చేశా. స్విచ్చాఫ్ రావడంతో అదేరోజు సా.6.30కు మెళియాపుట్టి స్టేషన్కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశా.ఎఫ్ఐఆర్ రాయమంటే.. ‘డైరీలో రాసి రేపు 9 గంటలకు రండి.. ఈలోగా విచారణ చేసి కనుక్కొని చెబుతాం’ అని అన్నారు. అయితే, మర్నాడు ‘ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చారు. రెండేళ్ల కిందట పనిచేసిన మెళియాపుట్టి కానిస్టేబుల్ చందు, మరొకతను తీసుకెళ్లారు’ అని స్థానికులు చెప్పారు. వెంటనే అక్కడి ఎస్ఐకు ఫోన్ చేస్తే బిజీగా ఉన్నానని అనడంతో బుధవారం మళ్లీ స్టేషన్కు వెళ్లి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాను. ఎస్ఐను అడిగితే.. తమ వాళ్లయితే తీసుకెళ్లలేదని, చందు ఎవరో తెలీదని, ఎస్పీ దగ్గరకు వెళ్లమన్నారు. దీంతో బుధవారం రాత్రి ఎస్పీని కలవడానికి శ్రీకాకుళం వచ్చా. ఆయన లేకపోవడంతో మళ్లీ గురువారం వచ్చి ఎస్పీని కలిశాను.టీడీపీ వాళ్లు నిమ్మాడకు రానీయడంలేదు.. ‘ఏడాదిన్నర నుంచి టీడీపీ వాళ్లు మమ్మల్ని నిమ్మాడ గ్రామంలో అడుగుపెట్టనీయడం లేదు. పొలం ఉన్నా.. సాగుచేయకుండా ఉండిపోయింది. అత్తయ్యకు పింఛను, మామయ్య రేషన్కార్డు తీసేశారు. మా చుట్టాలంతా బయటకెళ్లి బతుకుతున్నారు. మేం ఒడిశా వెళ్లిపోయాం. నా భర్తను ఎవరేం చేశారోనని భయంగా ఉంది. ప్రాణహాని ఉందని ఆ ఊరికి వెళ్లడంలేదు. ఇదంతా రాజకీయపరంగా ఎవరో చేస్తున్నారు. నా భర్త ఎవరికీ ఏ అన్యాయం చేయలేదు. ఎవరినీ చంపలేదు, మోసంచేసి డబ్బులు, ఆస్తులు తీసుకోలేదు’ అని చంద్రకళ తెలిపింది. -
ఆలయ చోరులు చిక్కారు
● ముగ్గురుని అరెస్టు చేసిన నరసన్నపేట పోలీసులు ● 28 గ్రాముల బంగారం, 175 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం నరసన్నపేట: జిల్లాలో నరసన్నపేటతో పాటు పోలాకి, నౌపడ, సంతబొమ్మాళి, సారవకోట, కాశీబుగ్గ పోలీసుస్టేషన్ల పరిధిలోని పలు ఆలయాల్లో చోరీ కేసులను నరసన్నపేట పోలీసులు ఛేదించారు. ఈ కేసుల్లో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వీరి వద్ద 28 గ్రాముల బంగారం, 175 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నరసన్నపేట సీఐ మరడాన శ్రీనివాసరావు బుధవారం స్థానిక పోలీసుస్టేషన్లో వివరాలు వెల్లడించారు. వివిధ ప్రాంతాలకు చెందిన చేవూరి శేఖర్, మోతి జీవరత్నం, చింతాడ మధు ముగ్గురూ నరసన్నపేటలోని గొట్టిపల్లికి వలస వచ్చి చెరువు గట్టుపై కుటుంబాలతో నివసిస్తున్నారు. వీరు ముగ్గురూ గ్రామాల్లో తిరుగుతూ పాత ఇనుము సామాగ్రి కొనుగోలు చేస్తుంటారు. దీంట్లో భాగంగా గ్రామ శివారుల్లోని ఆలయాలను గమనించి రాత్రి ఎవరూ లేని సమయాల్లో తాళాలు విరగ్గొట్టి చోరీలకు పాల్పడుతుంటారు. దీంట్లో భాగంగా పోలాకి మండలంలోని తెల్లవానిపేటలో అసిరితల్లి అమ్మవారి ఆలయం, గుప్పెడుపేటలోని నీలమ్మ తల్లి ఆలయం, రహెమాన్పురంలో అమ్మవారి కోవెల, శివరాంపురంలో అసిరితల్లి ఆలయం, మబగాం కాలనీలో చెన్నమ్మ తల్లి ఆలయం, నౌపాడలో రామాలయం, సంతబొమ్మాళిలో అమ్మవారి ఆలయం, సారవకోటలో వేంకటేశ్వరాలయం ఇలా పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడ్డారని తెలిపారు. అయితే వీరు ముగ్గురు పోలాకి మండలం వనవిష్ణుపురంలోని ఆలయంలో దొంగతనం చేయడానికి వెళ్తుండగా పక్కా సమాచారంతో పోలాకి ఎస్ఐ రంజిత్ కుమార్ సిబ్బందితో కలిసి మాటువేసి వీరిని పట్టుకోవడం జరిగిందన్నారు. వీరి వద్ద నుంచి రెండు ద్విచక్ర వాహనాలు సీజ్ చేశామని నిందితులను మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచామన్నారు. -
భారీగా గంజాయి పట్టివేత
ఇచ్ఛాపురం: పోలీసులకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు స్థానిక రైల్వే ఎల్సీ గేట్ వద్ద పట్టణ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా 86.950 కేజీలు భారీగా గంజాయి పట్టుబడినట్లు సీఐ మీసాల చిన్నంనాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం సీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఒడిశాకి చెందిన ఒక కారులో తరలిస్తున్న గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఒడిశాలోని బరంపురం లంజిపల్లికి చెందిన ప్రపుల్కుమార్ జలి అనే వ్యక్తి కారులో గంజాయిని తీసుకొని విజయనగరంలోని హిమాన్సుశేఖర్ మజి అనే వ్యక్తికి ఇచ్చేందుకు తీసుకెళ్తుండగా పట్టణ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ గంజాయిని ఒడిశాలోని మోహన బ్లాక్ గుమిగుడ ప్రాంతానికి చెందిన ప్రశాంత్ నాయక్ వద్ద నుంచి కొనుగోలు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడిని అదుపులోనికి తీసుకొని అతని వద్దనుంచి గంజాయి, సెల్ఫోన్, కారుని సీజ్ చేశారు. రిమాండ్ నిమిత్తం కోర్టుకి తరలించనున్నట్లు పేర్కొన్నారు. -
ప్రజలు ఆనందంగా గడపాలి
హిరమండలం: నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలు నిత్యం ఆనందంతో గడపాలని వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి, వినియోగదారుల హక్కుల సంఘం ప్రతినిధి అంధవరపు వెంకట సురేష్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు వస్తువుల క్రయ, విక్రయాల్లో జాగ్రత్తలు పాటించాలన్నారు. మోసాలకు గురవ్వకుండా వస్తువులు కొనుగోలు చేసినప్పుడు రశీదు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో వైఎస్సార్సీపీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల నాటికి వైఎస్సార్సీపీ బలమైన శక్తిగా ఎదగడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. -
డీసీసీబీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
శ్రీకాకుళం అర్బన్: డీసీసీబీ బ్యాంక్ అందించే పథకాలను ఖాతాదారులు, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆ బ్యాంక్ చైర్మన్ శివ్వాల సూర్యనారాయణ పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని డీసీసీబీ బ్యాంక్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు రైతులు, చేతివృత్తులవారు, వ్యాపారులు, ఉద్యోగులు, స్వయం సహాయక సంఘాలకు విశిష్ట సేవలు అందిస్తోందన్నారు. అన్ని బ్యాంకుల కంటే డీసీసీబీ అధిక వడ్డీ చెల్లిస్తున్న బ్యాంకు అని, నవతి ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో బ్యాంకు జనరల్ మేనేజర్లు శిమ్మ జగదీష్, డి.వరప్రసాద్, డిప్యూటీ జనరల్ మేనేజర్లు ఎస్వీఎస్ సత్యనారాయణ, శిల్లా రమేష్, జి.సునీల్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు ఆర్కే భాస్కరరావు, బి.దశరథరామ్, బి.కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
అదే మేలిమలుపు
పొదుపు.. అదుపు.. కాలగతిలో మరో ఏడాది మలిగిపోతున్నది. కోటి ఆశలు రేపుతూ కొత్త వత్సరాది ఆహ్వానం పలుకుతోంది. ఆ ఆశలు ఫలించాలంటే.. జీవితం కొత్త మార్పులను అందిపుచ్చుకొని కొత్త పుంతలు తొక్కాలంటే .. జీవన ప్రణాళికలో మార్పులు చేసుకోవాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా పొదుపు, అదుపు, మదుపు పాటించాలి. మీ జీవితం, మీ కుటుంబం మీకే సొంతం.. వాటిని తీర్చిదిద్దుకోవడంలో మీరే నిర్ణేతలు కావాలి. ఆ నిర్ణయాలు మిమ్మల్ని విజేతలుగా నిలబెట్టేలా ఉండాలి. ఇదే అందరి కొత్త సంవత్సర లక్ష్యం కావాలి. ఇచ్ఛాపురం రూరల్: ఎన్నో ఆనందాలు.. అనుభవాలు.. విషాదాలు.. వివాదాలను చరిత్రలో కలిపేస్తూ 2025 ఏడాది ముగిసింది. సరికొత్త ఆలోచనలకు 2026 స్వాగతం పలుకుతోంది. ఎప్పటిలాగే ఈసారి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. దురల వాట్లు మానేద్దామని కొత్త సంవత్సరం ప్రారంభంలో మూడు, నాలుగు రోజుల పాటు నిష్టగా నియమాలను కొనసాగిస్తాం. అయితే వివిధ కారణాలతో ఎప్పటిలాగే అవే అలవాట్లను పునఃప్రారంభిస్తాం. ఈ బలహీనతలే కాలం గడుస్తున్న కొద్దీ మార్చుకోలేని వ్యసనాలుగా మారిపోయి, మనల్ని, మన కుటుంబాలను కూడా ప్రభావితం చేస్తాయి. అందుకే ఈ సారి తీసుకునే నిర్ణయాలను కచ్చితంగా అమలు చేసేందుకు కట్టుబడి ఉందాం. మనకూ ఉండాలో రాజ్యాంగం.. పాలన వ్యవస్థకు రాజ్యాంగ అనుసరణ ఎంత ముఖ్యమో.. కుటుంబ నిర్వహణకు ఓ రాజ్యాంగం ఉండి తీరాలి. పెరుగుతున్న ఖర్చులు, సరిపడని జీతం, శుభకార్యాలు, ఏటా పెరిగే ద్రవ్యోల్బణం.. ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని, రోజువారీ ప్రణాళికను ఒకరోజు ముందే తయారు చేసి పెట్టుకోవడం మంచిది. వ్యసనాలు వదిలేద్దాం.. మద్యపానం, ధూమపానం, జూదం తదితర వ్యసనాల వల్ల ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా చితికిపోవడం ఖాయం. వీటికి దూరంగా ఉండాలన్న నిర్ణయాన్ని కచ్చితంగా పాటించి తీరాలి. పొదుపు మంత్రం.. చేసే పని, ఉద్యోగం ఏదైనా సరే అందులో కనీసం 30 శాతం పొదుపు చేయాలన్న నిర్ణయం ఐదేళ్లలో మిమ్మ ల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. ప్రతి వంద రూపాయల్లో రూ.30 దాచిపెడితే అది మిమ్మల్ని సమాజంలో ఎవరి ముందూ చేయి చాచే అవసరం లేకుండా చేస్తుంది. అలాగే, మనపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులకు మనం నమ్మకంగా ఇవ్వగలిగింది జీవిత బీమా, ఆరోగ్య బీమా. వాటిలో సరైనవి ఎంచుకోవాలి. బరువు కాదు..పరువు ఏటా కాలంతో పాటు సమాజంలో మన పరువు పెరగాలి.. అంతే తప్ప బరువు కాదని అందరూ గుర్తించాలి. రోజుకో అరగంట వ్యాయామం, వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్ ఏదైతే అది చేయాలి. మీకు మీరే పోటీ.. జీవితంలో విజేతలుగా మారాలంటే వేరెవరితోనూ పోల్చుకోనవసరం లేదు. మీరు పోల్చు కోవాల్సింది నిన్నటి వరకు ఉన్న మీతో.. ఏడాది తర్వాత మీరుండాలని కోరుకున్న మీతోనే పోల్చుకోవాలి. మీకు మీరే పోటీపడండి. ప్రణాళికతోనే జీవన వికాసం సరికొత్తగా ఏడాదిని ప్రారంభిద్దాం దురలవాట్లను దూరం పెడదాం మంచి మార్గానికి బాటలు వేద్దాంమార్పు దిశగా.. 2025 పాత అలవాట్లకు గుడ్ బై చెబుతూ కొత్త ఆలోచనలతో ముందుకెళ్లాలి. ఉరుకులు పరుగుల జీవితంలో ఒత్తిడిని తగ్గించుకోవడానికి మెడిటేషన్ చేస్తూ ఆధ్మాత్మిక చింతనలో గడపాలి. కోరికలు తగ్గించి, సమయం వృథా కాకుండా ముందస్తు ప్రణాళికతో 2026లోకి అడుగుపెట్టాలి. ఆర్థిక నియమాలను పాటిస్తూ పొదుపు, సామాజిక బాధ్యతలను గుర్తించి మంచి మార్పునకు కృషి చేయాలి. – దూగాన చిరంజీవులు, రిటైర్డ్ అడిషనల్ చీఫ్ జడ్జి, సోంపేట -
సహకార రంగం బలోపేతమే లక్ష్యం
శ్రీకాకుళం అర్బన్ : సహకార వ్యవస్థ కోట్లాది మంది సామాన్యుల జీవితాలతో ముడిపడి ఉందని, ఈ రంగాన్ని బలోపేతం చేసి ప్రజలకు మరింత చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. బుధవారం శ్రీకాకుళంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో నిర్వహించిన ‘అంతర్జాతీయ సహకార సంవత్సరం – రాష్ట్ర స్థాయి సహకార సదస్సు 2025’ ముగింపు వేడుకలకు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం 2025ను సహకార సంవత్సరంగా ప్రకటించిందని, ముగింపు వేడుకలు శ్రీకాకుళం జిల్లాలో జరగడం సంతోషదాయకమన్నారు. అనంతరం డీఆర్డీఏ పీడీ కిరణ్కుమార్కు సిక్కోలు డ్వాక్రా బజార్ నిర్వహణకు నాబార్డ్ నుంచి రుణ సహాయాన్ని అందించారు. కార్య క్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్, నాబార్డ్ సీజీఎం గోపాల్, జీఎం కేవీఎస్ ప్రసాద్, మూడు జిల్లాల డీసీసీబీ అధ్యక్షులు కిమిడి నాగార్జున, శివ్వాల సూర్యనారాయణ, తాతారావు, డీసీఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్, నాబార్డ్ ప్రతినిధి డీవీఎస్ వర్మ, డీసీసీబీ సీఈఓ దత్తి సత్యనారాయణ పాల్గొన్నారు. -
విశ్రాంత జవానుకు సైబర్ షాక్
కోటి కలల కొత్త ఏడాది సంబరం● సీబీఐ డిజిటల్ అరెస్టు పేరిట రూ.1.31 కోట్లు టోకరా.. శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలోని ఓ విశ్రాంత జవాన్ సైబర్ మోసానికి గురయ్యారు. ఏకంగా రూ.1.31 కోట్లను సీబీఐ డిజిటల్ అరెస్టు పేరిట మోసపోయాడు. కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు.. కాశీబుగ్గ రోటరీనగర్కు చెందిన విశ్రాంత ఆర్మీ ఉద్యోగి దువ్వాడ షణ్ముఖరావు (67)కు ఈ ఏడాది మార్చి 3న ఓ వీడియో కాల్ వచ్చింది. అందులో పోలీస్ యూనిఫామ్లో ఉన్న వ్యక్తి మీ ఆధార్ కార్డుతో లింక్ వున్న ఫోన్ సిమ్ హ్యూమన్ ట్రాఫికింగ్కు గురైందని, దానికి సంబంధించి సయ్యద్ఖాన్ అనే వ్యక్తి మీతో టచ్లోకి వచ్చి అంతా చేశాడని, ఇప్పటికే అతన్ని అరెస్టు చేశామన్నారు. దీనికి ప్రతిగా సయ్యిద్ఖాన్ ఖాతా నుంచే కాకుండా వేర్వేరు ఖాతాల నుంచి రూ. 30 లక్షలు మీ బ్యాంకు ఖాతాలకు నగదు మళ్లిందనడడానికి రుజువులు ఉన్నాయన్నారు. తక్షణమే మీ బ్యాంకు బుక్లు, ఇతర ఆధారాలన్నీ మెయిల్ చేయాలని, బయట వ్యక్తులకు తెలియపర్చరాదని బెదిరించాడు. మరుసటి రోజు మళ్లీ వీడియో కాల్లో సీబీఐ వాళ్లమని, మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేస్తున్నామని చెప్పారు. దీంతో బెదిరిపోయిన షణ్ముఖరావు తన పేరనున్న ఫిక్సిడ్ డిపాజిట్లు, బంగారు నగలు తనఖా పెట్టి రెండు నెలలు దఫదఫాలుగా రూ.1,31,85,000 వారు చెప్పిన ఖాతాలకు మళ్లించాడు. రెండు నెలల తర్వాత మళ్లీ ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల పేరుతో మళ్లీ ఫోన్ చేయడంతో మోసపోయానని గ్రహించిన షణ్ముఖరావు తన కుమారుడికి తెలపడంతో పోలీసులను ఆశ్రయించారు. బుధవారం కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. -
'గ్రీటింగ్'.. 'చీటింగ్'
శ్రీకాకుళం క్రైమ్ : ఏడాది మారుతోంది. డిసెంబర్ 31 మొదలుకుని జనవరి 1 వరకు లెక్కలేనన్ని మెసేజీలు సెల్ను తాకుతాయి. న్యూ ఇయర్ గ్రీటింగ్స్ పేరిట ఎస్ఎంఎస్లు, వాట్సాప్ల ద్వారా సందేశాలు వస్తా యి. వీటితోనే ప్రమాదం పొంచి ఉంది తెలియని సైట్లపై ఏమరపాటుగా క్లిక్ చేసినా మన అకౌంట్లలో నగదు క్షణాల్లో మాయమవుతుంది. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. చీటింగ్ ఇలా..న్యూ ఇయర్ సందర్భంగా మొబైల్లో వచ్చే రకరకాల చిత్రాలు, సందేశాల పేర్లతో సహా తయారుచేసుకుని మెజేస్ పంపుతారు. మీకు నచ్చేవిధంగా మీ పేరుతో గ్రీటింగ్స్, సందేశాలను పంపుకోవచ్చని, ఫలానా లింక్పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేస్తే చాలని అంటారు. మన మొబైల్లో టెలిగ్రామ్, వాట్సాప్లను ఏపీకే (ఆండ్రాయిడ్ ప్యాకేజీ కిట్) ఫైల్స్ రూపంలో మె సేజ్లను పంపిస్తారు. పొరపాటున ఆ లింక్ను క్లిక్ చేస్తే అంతే సంగతులు. మన ఫోన్లో సమాచారమంతా వారికి పోతుంది. కాంటాక్ట్ నంబర్లు, ఫొటో లు, వీడియోలు, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలే కాక డాక్యుమెంట్ ఫైళ్లు సైతం వీరికి చేరిపోతాయి. వెరిఫై చేసుకోవాలి.. రకరకాల గిఫ్ట్ ఓచర్లు, గ్రీటింగ్స్, ట్రావెల్, గాడ్జెట్స్, ఫ్యాషన్లపై ఇచ్చే డిస్కౌంట్లను ఒకటికి రెండుసార్లు నమ్మదగినవా కాదా అన్నది వెరిఫై చేసుకోవాలి. వాటి రివ్యూస్ చూస్తూ వెరిఫైడ్, అథెంటిక్ వెబ్సైట్లోకి వెళ్లి ఆఫర్లను తెలుసుకునేందుకు ప్రయతి్నంచాలి. కొత్త బృందాలు ఏర్పాటుశ్రీకాకుళం జిల్లాలో 2025లో వైట్ కాలర్ నేరాలు 171 నమోదయ్యాయి. సైబర్ నేరాల్లో బాధితులకు అందించే రికవరీ సొమ్ము రాబట్టుకునేలా ఇక కృషి చేస్తాం. ఆన్లైన్ నేరాలను ఛేదించేందుకు ఇప్పటికే కొత్త బృందాలను ఏర్పాటు చేశాం. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, సైబర్ క్రైమ్ సెల్తో సమన్వయం చేసుకుని 1930హెల్ప్లైన్ ఆన్లైన్ పోర్టల్ నిర్వహిస్తాం. విద్యాసంస్థల్లో, గ్రామాల్లో అవగాహన కల్పిస్తాం. – శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డి జాగ్రత్తలు తప్పనిసరి.. » అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఏపీకే ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయరాదు. » ఫోన్లోని సెట్టింగ్లో ఇన్స్టాల్ ఫ్రం అన్నోన్ సోర్సెస్ అనే ఆప్షన్ను డిసేబుల్ చేసుకోవాలి. ఇలా చేస్తే మనకు తెలియకుండా యాప్స్ ఇన్స్టాల్ కావు. » మొబైల్ సెట్టింగ్లో ఫోన్ నంబర్లను యాక్సిస్ చేసే అనుమతి ఇవ్వరాదు. » తెలియని ఏపీకే ఫైల్స్, మాల్వేర్స్ ఇన్స్టాల్ అయితే ఫోన్ను రీసెట్ చేయాలి. » ఈ–మెయిల్స్, టెక్ట్స్æ, ఇతర సోషల్ మీడియా యాప్ల ద్వారా నకిలీ లింక్స్ను గుర్తించాలి. వాటిని క్లిక్ చేయకుండా జాగ్రత్త పడాలి. » గివ్ అవేస్ పోటీల ద్వారా వినియోగదారులను ట్రాప్ చేసి వ్యక్తిగత సమాచారాన్ని దోచేస్తారు. మన వివరాలను సేకరించి డార్క్వెబ్కు అమ్మేస్తారు. » మన మొబైల్, ల్యాప్టాప్ (కంప్యూటర్)లలో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్, యాంటీ వైరస్ ప్రోగ్రామ్, అధికారిక యాప్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. -
అధర్మాస్పత్రిలో అరణ్యరోదన
శ్రీకాకుళం: శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో రోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని, ఇక్కడి సిబ్బంది లంచాలు డిమాండ్ చేస్తున్నారని ఆమదాలవలస మండలం కొర్లకోటకు చెందిన హేమలత అనే మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రి సిబ్బంది తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన కుమార్తె హైందవితో కలిసి బుధవారం ఉదయం రిమ్స్ ఎదుట ఆందోళనకు దిగారు. ఆమె మాట్లాడుతూ తన కుమార్తెను రెండు రోజుల క్రితం రిమ్స్కు తీసుకురాగా వైద్యులు మంగళవారం ఉదయం శస్త్రచికిత్స(కొండనాలుక వ్యాధి) పూర్తయ్యాక ఐసీయూలో ఉంచారని తెలిపారు. అక్కడకు వెళ్లినప్పటి నుంచి ఆపరేషన్ థియేటర్ సిబ్బంది తరచూ వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. వార్డుకు తరలించిన వారు సైతం డబ్బులు అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు లేవని, మరుగుదొడ్లలో నీరు రావడం లేదని చెబితే తనపై కేకలు వేశారని వాపోయారు. కొందరు సిబ్బంది, వైద్యులు వచ్చి బయటకు వెళ్లి చికిత్స చేయించుకోమన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త పోలీస్ శాఖలో పని చేస్తున్నారని చెప్పినా డబ్బులు అడుగుతున్నారని, తమ పరిస్థితే ఇలా ఉంటే ఇక పేదల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో అధికారులు ఆలోచించాలని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. రిమ్స్లో సిబ్బంది పనితీరు అసలు బాగలేదని, ప్రతిదానికీ లంచాలు ఇవ్వాల్సి వస్తోందని ఆరోపించారు. సుమారు అరగంటకు పైగా ఆమె ఆస్పత్రి వద్ద బైఠాయించగా.. సూపరింటెండెంట్ ప్రసన్నకుమార్ ఆమెకు నచ్చజెప్పి వార్డుకు తీసుకువెళ్లారు. సిబ్బందిని పిలిపించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై గురువారం విచారణ జరిపిస్తామని హేమలతకు హామీ ఇవ్వడంతో ఆమె ఆందోళన విరమించి తిరిగి తన కుమార్తెను ఐసీయూలోకి తీసుకెళ్లారు. నివేదిక అందాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ ‘సాక్షి’కి తెలిపారు. -
జిల్లా ఓటర్ల సంఖ్య 18,92,149
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 18,92,149 మంది ఉన్నారని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబి తా, ఈవీఎంల పరిశీలనపై సమావేశం నిర్వహించారు. ఓటర్లలో పురుషులు 9,37,191 మంది కాగా, మహిళా ఓటర్లు 9,54,848 మంది ఉన్నారని వివరించారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో అత్యధికంగా 2,75,568 మంది ఓటర్లు ఉండగా, ఆమదాలవలసలో అత్యల్పంగా 1,94,209 మంది ఓటర్లు ఉన్నారని, జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,358 పోలింగ్ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. గత జనవరి 6 నుంచి ఈ డిసెంబర్ 30 వరకు ఓటరు జాబితాలో కొత్తగా పేరు నమోదు కోసం 37,586 దరఖాస్తులు అందాయని, వాటిలో 29,795 దరఖాస్తులను ఆమోదించామని కలెక్టర్ వివరించారు. జిల్లాలో ఈవీఎంలు అత్యంత భద్రంగా ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించే తనిఖీల్లో భాగంగా గోదాము సీళ్లను తెరిచి యంత్రాలను పరిశీలించారు. అనంతరం తనిఖీ పుస్తకంలో కలెక్టర్తో పాటు ప్రతినిధులు సంతకాలు చేశారు. -
జోష్
మార్కెట్కు న్యూ ఇయర్ ● ఆర్డర్లతో కిటకిటలాడుతున్న బేకరీలు, మిఠాయి దుకాణాలు ● నోరూరిస్తున్న విభిన్న కేకులు శ్రీకాకుళం కల్చరల్: మార్కెట్లో న్యూ ఇయర్ జోష్ కనిపిస్తోంది. పండ్లు, పూల బొకేలు, పూలు, ప్లాస్టిక్ పూల బొకేలు, రకరకాల గ్రీటింగు కార్డులు, డైరీలు కొనుగోళ్లతో బజార్లు హడావుడిగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్లాస్టిక్ బొకేలకు కాలం చెల్లి పోయింది. నిజమైన పూలన్నీ ఒక గుచ్చంగా చేసి లైవ్ బొకేలను విక్రయిస్తున్నారు. వీటి కోసం పూలను ప్రత్యేకంగా బెంగళూరు నుంచి అనేక రంగులతో రకాలు తెప్పిస్తున్నారు. గుభాళిస్తున్న సువాసనలతో రూపొందించిన బొకేలతో నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. పూలతో కాకుండా పండ్లను ఒక బుట్టలో పెట్టి అందంగా ప్యాక్ చేసి వాటిని కూడా అమ్ముతున్నారు. డైరీలు, క్యాలెండర్లు కూడా మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. పేర్లు, ఫొటోలతో సహా డైరీలను తయారు చేయిస్తుండడం గమనార్హం. -
గ్రీటింగ్..చీటింగ్
సైబర్ అలర్ట్● కొత్త సంవత్సర శుభాకాంక్షలు లింకులతో జర జాగ్రత్త ● ఒక్క క్లిక్తో మొత్తం ఊడ్చేస్తారు వినూత్న కేక్లుశ్రీకాకుళం క్రైమ్ : ఏడాది మారుతోంది. డిసెంబర్ 31 మొదలుకుని జనవరి 1 వరకు లెక్కలేనన్ని మెసేజీలు సెల్ను తాకుతాయి. న్యూ ఇయర్ గ్రీటింగ్స్ పేరిట ఎస్ఎంఎస్లు, వాట్సాప్ల ద్వారా సందేశాలు వస్తా యి. వీటితోనే ప్రమాదం పొంచి ఉంది. తెలీని సైట్లపై ఏమరపాటుగా క్లిక్ చేసినా మన అకౌంట్లలో నగదు క్షణాల్లో మాయమవుతుంది. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. చీటింగ్ ఇలా.. న్యూ ఇయర్ సందర్భంగా మొబైల్లో వచ్చే రకరకాల చిత్రాలు, సందేశాల పేర్లతో సహా తయారుచేసుకుని మెజేస్ పంపుతారు. మీకు నచ్చేవిధంగా మీ పేరుతో గ్రీటింగ్స్, సందేశాలను పంపుకోవచ్చని, ఫలానా లింక్పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేస్తే చాలని అంటారు. మన మొబైల్లో టెలిగ్రామ్, వాట్సాప్లను ఏపీకే (ఆండ్రాయిడ్ ప్యాకేజీ కిట్) ఫైల్స్ రూపంలో మె సేజ్లను పంపిస్తారు. పొరపాటున ఆ లింక్ను క్లిక్ చేస్తే అంతే సంగతులు. మన ఫోన్లో సమాచారమంతా వారికి పోతుంది. కాంటాక్ట్ నంబర్లు, ఫొటో లు, వీడియోలు, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలే కాక డాక్యుమెంట్ ఫైళ్లు సైతం వీరికి చేరిపోతాయి. వెరిఫై చేసుకోవాలి.. రకరకాల గిఫ్ట్ ఓచర్లు, గ్రీటింగ్స్, ట్రావెల్, గాడ్జెట్స్, ఫ్యాషన్లపై ఇచ్చే డిస్కౌంట్లను ఒకటికి రెండుసార్లు నమ్మదగినవా కాదా అన్నది వెరిఫై చేసుకోవాలి. వాటి రివ్యూస్ చూస్తూ వెరిఫైడ్, అథెంటిక్ వెబ్సైట్లోకి వెళ్లి ఆఫర్లను తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. కొత్త బృందాలు ఏర్పాటుజాగ్రత్తలు తప్పనిసరి.. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఏపీకే ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయరాదు. ఫోన్లోని సెట్టింగ్లో ఇన్స్టాల్ ఫ్రం అన్నోన్ సోర్సెస్ అనే ఆప్షన్ను డిజేబుల్ చేసుకోవాలి. ఇలా చేస్తే మనకు తెలియకుండా యాప్స్ ఇన్స్టాల్ కావు. మొబైల్ సెట్టింగ్లో ఫోన్ నంబర్లను యాక్సిస్ చేసే అనుమతి ఇవ్వరాదు. తెలియని ఏపీకే ఫైల్స్, మాల్వేర్స్ ఇన్స్టాల్ అయితే ఫోన్లో రీసెట్ ఆప్షన్ కొట్టాలి. ఈ–మెయిల్స్, టెక్ట్స్, ఇతర సోషల్ మీడియా యాప్ల ద్వారా నకిలీ లింక్స్ను గుర్తించాలి. వాటిని క్లిక్ చేయకుండా జాగ్రత్త పడాలి. గివ్ అవేస్ పోటీల ద్వారా వినియోగదారులను ట్రాప్ చేసి వ్యక్తిగత సమాచారాన్ని దోచేస్తారు. మన వివరాలను సేకరించి డార్క్వెబ్కు అమ్మేస్తారు. మన మొబైల్, ల్యాప్టాప్ (కంప్యూటర్)లలో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్, యాంటీ వైరస్ ప్రొగ్రామ్, అధికారిక యాప్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి.జిల్లాలో 2025లో వైట్ కాలర్ నేరాలు 171 నమోదయ్యాయి. సైబర్ నేరాల్లో బాధితులకు అందించే రికవరీ సొమ్ము రాబట్టుకునేలా ఇక కృషి చేస్తాం. ఆన్లైన్ నేరాలను ఛేదించేందుకు ఇప్పటికే కొత్త బృందాలను ఏర్పాటు చేశాం. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, సైబర్ క్రైమ్ సెల్తో సమన్వయం చేసుకుని 1930హెల్ప్లైన్ ఆన్లైన్ పోర్టల్ నిర్వహిస్తాం. విద్యాసంస్థల్లో, గ్రామాల్లో అవగాహన పరుస్తాం. – మంగళవారం నిర్వహించిన వార్షిక సమావేశంలో ఎస్పీ మహేశ్వరరెడ్డి -
కేసులు తగ్గాయి.. హత్యలు పెరిగాయి
● జిల్లాలో క్రైమ్రేటు తగ్గిందని ఎస్పీ వెల్లడి ● మహిళలపై విపరీతంగా వేధింపులు, నేరాలు శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలో క్రైమ్ రేటు తగ్గిందని, కానీ గతంలో కంటే హత్యలు, హత్యాయత్నాలు పెరిగాయని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి వెల్లడించారు. ఆయన మంగళవారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలో నేర వార్షిక గణాంకాలు వెల్లడించారు. సైబర్క్రైమ్ డిటెన్షన్, జాబ్ఫ్రాడ్స్ వంటి అంశాల్లో మెరుగుపడాలని, కొత్తగా బృందాలు వేసి ఫలితాలు సాధించాల్సి ఉందని చెప్పారు. 2024లో 9555 కేసులు నమోదైతే ఈ ఏడాది 6314 నమోదయ్యాయని పేర్కొన్నారు. అయితే మహిళలపై వేధింపులు పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. హత్యల్లో టాప్.. గత ఏడాది జిల్లాలో 17 హత్యలు జరగ్గా.. ఈ ఏడాది 26 హత్యలు నమోదైనట్లు ఎస్పీ పేర్కొన్నా రు. మరికొన్ని దర్యాప్తు దశలో ఉన్నాయన్నారు. వీటితో పాటు హత్యాయత్నం కేసులు కూడా 22 నమోదైనట్లు చెప్పారు. వీటిలో చాలా వరకు కుటుంబ తగాదాల వల్లనే జరిగాయని వివరించారు. పోక్సో కేసులు కూడా 54 నమోదయ్యాయన్నారు. మహిళలకు వేధింపులు మహిళలకు సంబంధించి ఈ ఏడాది 482 కేసులు నమోదు కాగా.. అందులో 333 వేధింపుల కేసులే ఉన్నాయన్నారు. అటెంప్ట్ రేప్ ఒకటి ఉండగా, ఎలోప్మెంట్ రేప్లు 9 ఉన్నాయని, వరకట్న హత్యలు 2, ప్రేరేపిత ఆత్మహత్యలు 4 ఉన్నాయని పేర్కొన్నారు. అవమానించినవి 130 ఉండగా ఈ ఏడాది 51 మంది బాలికలు, 214 మంది మహిళలు అదృశ్యమైనట్లు తెలిపారు. అలాగే ఎస్సీ, ఎస్టీలపై ఇద్దరు హత్యాయత్నంకు పాల్పడగా, 8 మంది దళిత మహిళలపై లైంగిక దాడి జరిగినట్లు కేసులు నమోదుయ్యాయన్నారు. ఎస్సీ మహిళలను అవమానించినవి 6, అదర్ ఐపీసీ 22 కేసులు నమోదయ్యాయన్నారు. ప్రాపర్టీ నేరాల్లో ఈ ఏడాది మొత్తం 396 కేసుల్లో 281 ఛేదించి 260 మంది నేరస్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.2,69,09,869లు స్వాధీనం చేసుకున్నారు. 2025 కంటే ముందు చేసిన నేరాలను ఈ ఏడాదిలో ఛేదించామన్నారు. కొత్త ఏడాది లక్ష్యాలివే.. అల్లర్లు సృష్టించే రౌడీ, సస్పెక్ట్, హిస్టరీ షీటర్లకు జియోట్యాగింగ్ చేస్తామని, ఆపదలో ఆదుకునేలా 112 కాల్స్ వస్తే 5 నిమిషాల్లో చేరేలా టార్గెట్ పెట్టుకున్నామని, ప్రజలు, పోలీసులు, ఆర్గనైజ్ సంస్థలు సౌజన్యంతో 3700 సీసీ కెమెరాలు పెట్టామని, మరో 1100 కెమెరాలు క్రైమ్స్పాట్లకు అవసరం ఉన్నాయని తెలిపారు. రహదారి భద్రతా విషయంలో హెల్మెట్ స్పెషల్ డ్రైవ్ చేస్తామని, వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విధంగా కార్యక్రమాలు ప్రత్యేకంగా చేస్తామని, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్, ఎన్డీపీఎస్(గంజా), గ్యాంబ్లింగ్పై మరింత కఠినతరంగా వ్యవహరించి జైలు శిక్ష పడేలా చేస్తామని ఎస్పీ చెప్పారు. -
శ్రీకాకుళం
ఎన్నాళ్లీ ఎదురుచూపులు..?రెండేళ్లు దాటుతున్నా చంద్రబాబు హామీలు అమలు కాలేదు. వంశధార నిర్వాసితులకు ఇబ్బంది తప్పడం లేదు. –8లోబుధవారం శ్రీ 31 శ్రీ డిసెంబర్ శ్రీ 2025శ్రీకూర్మ నాథునికి హారతిఅరసవల్లిలో తిరువీధిశ్రీకాకుళం మొండేటివీధిలో..న్యూ ఇయర్ వేడుకలకు ఆంక్షలు శ్రీకాకుళం క్రైమ్ : కొత్త ఏడాది సందర్భంగా ఎక్కడ ఈవెంట్ చేసుకున్నా పోలీసుల అనుమ తి పక్కాగా ఉండాలని, జనసంఖ్య, సాంస్కృతిక కార్యక్రమ వివరాలను తెలపాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. పార్టీలో మద్యం సరఫరాకు సంబంఽధించి బార్ అనుమతులు తప్పనిసరని, ఎకై ్సజ్ శాఖతో పాటు సంబంధిత ఇతర శాఖల అనుమతులు ఉండాలన్నారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అనుసరించి డెసిబుల్స్ అధికం కాకుండా సౌండ్సిస్టమ్ పెట్టుకోవాలన్నారు. ఇచ్ఛాపురం నుంచి పైడి భీమవరం వరకు ఉన్న హైవేతో పాటు పట్టణాలు, మండలాలు, ముఖ్య కేంద్రాలు, కూడళ్లలో కచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్లు డిసెంబర్ 31న నిర్వహిస్తామన్నారు. ఇంట్లో తాగినా, ఈవెంట్లో తాగినా, ఎక్కడ తాగినా.. రోడ్డుమీద తాగి డ్రైవ్ చేస్తూ పట్టుబడితే రిమాండ్కు (జైలు) పంపడం ఖాయమని, లైసెన్సులు రద్దు చేసి వాహనాలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. సెలబ్రేషన్ ముఖ్యమే కాని ఎదుటివారిని ఇబ్బంది పడితే సహించేది లేదని, రాత్రి ఒంటి గంట తర్వాత అన్నీ బంద్ చేయాలని ఎస్పీ అన్నారు. షీటర్లపై మరింత నిఘా.. 144 రౌడీషీట్లు, 204 సస్పెక్ట్ షీట్లు 2025లో తెరిచామని, 1870 హిస్టరీ షీటర్లపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని న్యూ ఇయర్ వేడుకల్లో గానీ, పండగ సమయాల్లో గానీ వీరి ఆగడాలు మీరితే సహించేది లేదన్నారు. న్యూసెన్స్ కేసులో నలుగురికి జైలు శిక్ష శ్రీకాకుళం క్రైమ్ : నగరంలోని మహాలక్ష్మినగర్ కాలనీకి చెందిన దువ్వు సాయిపవన్, గంగారావు, రాజశేఖర్, అంబటి తరుణ్లు బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించి న్యూసెన్సు చేసినందుకు కోర్టు 7 రోజుల జైలు శిక్ష విధించిందని ఒకటో పట్టణ ఎస్ఐ హరికృష్ణ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. టెక్కలి డివిజన్లోకి నందిగాం మండలం శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని నందిగాం మండలాన్ని పలాస రెవెన్యూ డివిజన్ నుంచి టెక్కలి రెవెన్యూ డివిజన్లోకి మారుస్తూ ప్రభుత్వం మంగళవారం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. పరి పాలనా సౌలభ్యం, అభివృద్ధి ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో ప్రతిపాదించిన మార్పులపై ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం గవర్నర్ పేరిట ఈ గెజిట్ వెలువడింది. ఈ మార్పు డిసెంబరు 31, 2025 నుంచి అమలులోకి రానుంది. దీనితో టెక్కలి డివిజన్లోని మండలాల సంఖ్య 10కి చేరగా, పలాస డివిజన్లో 7 మండలాలు ఉండనున్నట్లు పేర్కొన్నారు. -
అలుగును చంపిన కేసులో మూడేళ్ల జైలుశిక్ష
వజ్రపుకొత్తూరు రూరల్ : వజ్రపుకొత్తూరు మండలం కొమరల్తాడలో 2015లో అరుదైన అలుగు జంతువును చంపి మాంసం తిన్నట్లు రుజువు కావడంతో అదే గ్రామానికి చెందిన రత్నాల జయరాంకు పలాస జూనియర్ సివిల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధించినట్లు టెక్కలి అటవీశాఖ రేంజర్ జి.జగదీశ్వరరావు తెలిపారు. 2015లో అలుగును చంపిన జయరాంపై వైల్డ్ లైఫ్ యాక్ట్–1972 కింద అప్పటి రేంజ్ అధికారి సంజయ్ కేసు నమోదు చేయగా.. మంగళవారం కోర్టు తుది తీర్పు వెలువరించినట్లు పేర్కొన్నారు. అటవీ జంతువులను హతమార్చితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కె.మత్స్యలేశం తీరానికి భారీ సొరచేప ఎచ్చెర్ల: డి.మత్స్యలేశం పంచాయతీ కె.మత్స్యలేశం సముద్రం ఒడ్డుకు మంగళవారం భారీ సొరచేప కొట్టుకొచ్చింది. కొన ఉపిరితో ఉన్న చేపను రక్షించేందుకు స్థానికులు సముద్రంలోకి నెట్టే ప్రయత్నం చేశారు. అప్పటికే తీవ్రంగా గాయపడటంతో ముందుకు కదల్లేని పరిస్థితిలో ఉంది. కాసేపటికే చేప చనిపోయినట్లు మత్స్యకారులు గుర్తించారు. సుమారు 3 వందల కిలోలపైగా ఉన్న ఈ చేప తినేందుకు ఉపయోగపడదని మత్స్యకారులు తెలిపారు. వజ్రపుకొత్తూరు రూరల్: మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో మంగళవారం నిర్వహించిన జాతీయ స్థాయి స్కేటింగ్ పోటీలలో పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీకి చెందిన ఎనిమిదేళ్ల చిన్నారి జక్కల తోష్నిరాయ్ ప్రతిభ కనబర్చి స్వర్ణ పతకం కై వసం చేసుకుంది. రోలర్ స్కేటింగ్ స్పోర్ట్స్ వీక్ నేషనల్ చాంపియన్షిప్–2025 పోటీలలో 300 మీటర్ల రోలర్ స్కేటింగ్ విభాగంలో ఈమె సత్తాచాటింది. సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన జక్కల గోపాలకృష్ణ, చంద్రవతి దంపతుల కుమార్తె తోష్నిరాయ్ ప్రతిభ కనబరచడం పట్ల పలువురు అభినందనలు తెలియజేశారు. -
ఏపీ ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడిగా హనుమంతు సాయిరాం
శ్రీకాకుళం అర్బన్: ఏపీ ఎన్జీఓ సంఘ జిల్లా అధ్యక్షునిగా హనుమంతు సాయిరాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు మంగళవారం శ్రీకాకుళంలోని ఎన్జీఓ కార్యాలయంలో జరిగిన ఎన్జీఓ సంఘ జిల్లా కార్యవర్గం ఎన్నికల్లో హనుమంతు సాయిరాం ఆరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి డీవీ రమణ నేతృత్వంలో కొత్త కార్యవర్గం ఏర్పాటు జరిగింది. ఈ కొత్త కార్యవర్గం రెండేళ్ల పాటూ విధులు నిర్వర్తించనుంది. సంఘం జిల్లా అధ్యక్షునిగా హనుమంతు సాయిరాం, సహాధ్యక్షులుగా కె.జయరావు, ఉపాధ్యక్షులుగా టి.సోమేశ్వరరావు, రాయి వేణుగోపాల్, పి.జానకిరామ్, డి.శ్రీరామ్ కుమార్, ఎల్.జగన్మోహనరావు, పి.శ్రావణి, కార్యదర్శిగా చల్లా శ్రీనివాసరావు, కార్యనిర్వాహక కార్యదర్శిగా ఆర్.గోవింద్ పట్నాయక్, సంయుక్త కార్యదర్శులుగా ఏజేఎం రాధాకృష్ణ, కె.మోహనరావు, బి.వెంకటేశ్వరరావు, కె.మన్మథరావు, కేవీవీ సత్యనారాయణ, జి.లలిత, కోశాధికారిగా బడగల పూర్ణ చంద్రరావు తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం మాట్లాడుతూ ఉద్యోగ సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ రాజీపడని ధోరణిలోనే ఏపీఎన్జీజీఓ సంఘం వ్యవహరిస్తుందని అన్నారు. అంతకుముందు ఎన్జీవో సంఘ సభ్యులంతా వైఎస్సార్ కూడలి వద్ద నుంచి పొట్టిశ్రీరాములు కూడలి మీదుగా ఎన్జీఓ సంఘ కార్యాలయానికి బైక్ ర్యాలీ నిర్వహించారు. -
ట్రేడ్టెస్ట్కు దరఖాస్తులు ఆహ్వానం
ఎచ్చెర్ల : ఉపాది, శిక్షణా శాఖ(విజయవాడ) ఆదేశాల మేరకు ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ (ప్రైవేటు) 2026 సంవత్సరానికి గాను ఐటీఐ ప్రైవేటు అభ్యర్థులుగా ఎన్టీసీ సర్టిఫికెట్ పొందే పరీక్ష రాసేందుకు ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 28లోగా సమీప ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని ఎచ్చెర్ల ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్ ఎల్.సుధాకరరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. టెన్త్ విద్యార్హత కలిగి ఉండి, 21 ఏళ్లు నిండి, సంబంధిత ట్రేడ్లో మూడేళ్ల అనుభవం కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐలో సంప్రదించాలన్నారు. భర్తకు తలకొరివి పెట్టిన భార్య మెళియాపుట్టి: హీరాపురం గ్రామానికి చెందిన కిల్లి శ్యామసుందరరావు(65) మంగళవారం గుండెపోటుతో మృతిచెందారు. ఈయన ఇద్దరు కుమార్తెలు హైదరాబాద్ నుంచి గ్రామానికి వచ్చినప్పటికీ.. భార్య లలిత అన్నీ తానై వ్యవహరించి భర్త చితికి నిప్పంటించి అంత్యక్రియలు పూర్తి చేసింది. -
కిడ్నీ బాధిత విద్యార్థినికి సాయం
కవిటి: కిడ్నీ బాధిత బాలిక దీనస్థితిపై మానవతా దృక్పథంతో స్పందించి దాతలు ఉదారంగా సాయమందించాలని మాణిక్యపురం జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం మజ్జి వైకుంఠరావు కోరారు. మంగళవారం సిబ్బందితో కలిసి కంచిలి మండలం ప్రధానపుట్టుగలో నివసిస్తున్న తమ పాఠశాల పదో తరగతి విద్యార్థిని భూదేవి బిసాయి ఇంటికి వెళ్లారు. పాఠశాల సిబ్బంది వితరణగా చేసిన రూ.16200 మొత్తాన్ని అందించారు. తండ్రి చిన్నతనంలో మరణించడంతో తల్లి కుమార్తెలిద్దర్నీ పోషిస్తోంది. ప్రస్తుతం తన చెల్లి దయనీయ స్థితిలో ఇంటర్మీడియట్ చదువును కూడా పక్కనపెట్టి ఆమెను కంటికి రెప్పలా చూస్తూ వైద్యం అందిస్తోంది. కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది పిరియా వేణుగోపాల్, ఢిల్లీరావు, సంతోష్కుమార్, మురళీకృష్ణ, రామహరి పాఢి, మిన్నారావులు పాల్గొన్నారు. సాయం చేయాల్సిన దాతలు 9490284017 నంబరును సంప్రదించాలని హెచ్ఎం కోరారు. -
యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన
రణస్థలం: లావేరు మండలం తాళ్లవలస రైతు సేవా కేంద్రం, రణస్థలం మండలం వెల్పురాయి గ్రామంలో మంగళవారం ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజనలో భాగంగా రబీ 2025–26 సీజన్లో పంటల సాగులో మేలైన యాజమాన్య పద్ధతులపై రైతులకు పూర్వ అభ్యాస గుర్తింపు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ సహాయ సంచాలకుడు సీహెచ్ వెంకటరావు మాట్లాడుతూ మొక్కజొన్న, వరి పంటలలో ఎరువుల యాజమాన్యం, పురుగు తెగుల యాజమాన్య పద్ధతులను వివరించారు. కార్యక్రమంలో రాగోలు వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ పి.ఉదయ్ బాబు, రణస్థలం డివిజన్ ఏడీఏ వి.శ్రీనివాసరావు, జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయాధికారి వై.సురేష్, రణస్థలం, లావేరు మండలాల వ్యవసాయాధికారులు డి.విజయభాస్కర్, డి.మహేష్నాయుడు, మాజీ సర్పంచ్ ముప్పిడి మురళీమోహన్, ఏఈవోలు, వీఏఏలు, రైతులు పాల్గొన్నారు. -
ఎన్నాళ్లీ ఎదురుచూపులు?
● రెండేళ్లు దాటుతున్నా అమలుకు నోచుకోని చంద్రబాబు హామీలు ● వంశధార నిర్వాసితులకు తప్పని ఇబ్బందులు ● పట్టించుకోని కూటమి పాలకులు హిరమండలం : ‘వంశధార నిర్వాసితులందరికీ న్యాయం చేస్తాం. అదనపు పరిహారం అందిస్తాం. పునరావాస గ్రామాలు, కాలనీల్లో మౌలిక వసతులు కల్పిస్తాం. మిగుల భూముల సమస్యలను పరిష్కరిస్తాం. అధికారంలోకి వచ్చిన మరుక్షణం చేసి చూపిస్తాం’.. ఇవీ ప్రతిపక్ష నేతగా చంద్రబాబు 2023 ఆగస్టు 10న ప్రాజెక్టులపై యుద్ధభేరిలో భాగంగా హిరమండలం, కొత్తూరులో నిర్వహించిన బహిరంగ సభలో చేసిన ప్రకటనలు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తోంది. అయినా ఇంతవరకు వంశధార నిర్వాసితుల సమస్యలు పరిష్కరించిన దాఖలాలు లేవు. అసలు వారి సమస్యలపై దృష్టిపెట్టిన వారే కరువయ్యారు. దీంతో నిర్వాసితుల సమస్యలు ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్టు మారింది. బలవంతంగా ఇళ్లు ఖాళీ.. 2005లో వంశధార ఫేజ్–2 రిజర్వాయర్ నిర్మాణానికి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. గ్రామాల్లో రెవెన్యూ, భూసేకరణ అధికారులు నిర్వాసితులతో సమావేశాలు నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాక ముందే నిర్వాసితులకు మెరుగైన వసతులు కల్పిస్తామని ఉపాధి, ఉద్యోగం కల్పిస్తామని హామీలు ఇచ్చారు. కానీ 2017లో టీడీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఇప్పటికీ నిర్వాసితులు మరిచిపోలేకపోతున్నారు. అదే ఏడాది సెప్టెంబరు 17 నుంచి డిసెంబరు 30 వరకూ ఇళ్లు పడగొట్టారు. కనీసం పండుగ చేసుకున్న వరకూ విడిచిపెట్టాలని కోరినా చంద్రబాబు సర్కారు పట్టించుకోలేదు. దీంతో సుమారు 10 వేల కుటుంబాలు తలోదిక్కుకు వెళ్లిపోయాయి. కొందరు తెలిసిన వారు, బంధువుల ఇళ్లలో తలదాచుకున్నారు. మరికొందరు పునరావాస కాలనీల్లో రేకుల షెడ్లను ఏర్పాటుచేసుకున్నారు. కానీ అదే ఏడాది వచ్చిన తితలీ తుఫాను వారి తాత్కాలిక నివాసాలను నేలమట్టం చేసింది. అయితే నిదానంగా కోలుకున్నారు. కానీ నిర్వాసితుల సమస్యలు పూర్తిస్థాయిలో మాత్రం పరిష్కారానికి నోచుకోలేదు. భారీగా అవకతవకలు..! టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్వాసితుల పరిహారం పంపిణీలో భారీగా అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. సొంత పార్టీ నేతలకు అప్పట్లో పెద్దపీట వేసినట్టు విమర్శలు వ్యక్తమయ్యాయి. అర్హులకు మొండిచేయి చూపించి అనర్హులకు అందలం ఎక్కించారనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు రూ.216 కోట్ల అదనపు పరిహారం మంజూరు చేసింది. నిర్వాసితులందరికీ రూ.లక్ష వంతున అదనంగా పరిహారం అందించింది. అయితే ప్రతిపక్ష నేతగా ప్రాజెక్టుల సందర్శనకు వచ్చిన క్రమంలో ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటుచేసి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి రెండేళ్లు దాటుతున్నా ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదు. ఎక్కడి సమస్యలు అక్కడే.. ఎల్ఎన్పేట మండలం శ్యామలాపురం, మోదుగులపేట, తాయిమాంబాపురం, జగన్నాథపురం.. ఆమదాలవలస మండలం గాజులకొల్లివలస..కొత్తూరు మండలం గూనభద్ర, మెట్టూరు, మహాసింగి.. సీతంపేట మండలం పులిపట్టి.. హిరమండలంలోని సుభలాయి ఆర్అండ్ఆర్ కాలనీల్లో 80 శాతం నిర్వాసితులు ఉంటున్నారు. ఆయా చోట్ల రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలు లేవు. నిధులు మంజూరైనా కొన్నిచోట్ల ఆలయాలు నిర్మించలేదు. ఇక మిగుల భూములకు సాగునీటి సౌకర్యం కల్పించలేదు. దీంతో సాగుకు వీలుపడడం లేదు. రానున్న మూడున్నరేళ్లలో అయినా నిర్వాసితుల సమస్యలపై దృష్టి పెట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించాలి.. నిర్వాసితులకు సంబంధించి అపరిష్కృత సమస్యలు చాలా ఉన్నాయి. వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. సీఎం చంద్రబాబు రెండేళ్ల కిందట ఇచ్చిన హామీలు ఇంతవరకూ అమలుకాలేదు. పునరావాస గ్రామాల్లో సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయి. – బి.వి.వి.సత్యనారాయణ, నిర్వాసితుడు, తులగాంపరిస్థితి దారుణం.. మా పరిస్థితి దారుణంగా మారింది. రిజర్వాయర్ కోసం సర్వం త్యాగం చేశాం. అయినా మా త్యాగాలకు విలువ లేకుండా పోయింది. పరిహారంతో పాటు మంచి పునరావాసం కల్పిస్తామని చెప్పారు. అనేక హామీలు ఇచ్చారు. అవేవీ కార్యరూపం దాల్చలేదు. – జి.పద్మావతి, నిర్వాసితురాలు, పాడలి -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
గార: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. మంగళవారం గొంటి పంచాయతీ సచివాలయం వద్ద పర్యావరణ పరిరక్షణపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యత దెబ్బతింటే మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లుతుందన్నారు. ప్రకృతిని పెంపోందించే కార్యక్రమంలో భాగంగా దీపావళి గ్రామంలో ప్రతి ఇంటి వద్ద మొక్క నాటాలని సూచించారు. సమావేశంలో సర్పంచ్ చల్ల శ్రీనివాసరావు, ఎన్జీవో ఎం.సింహాచలం, వీఆర్వో కిరణ్, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. -
అంబేడ్కర్ వర్సిటీ క్యాలెండర్ ఆవిష్కరణ
ఎచ్చెర్ల : నూతన సంవత్సరంలో వర్సిటీ, అనుబంధ కళాశాలలు మరింత ప్రగతిబాటలో పయనించాలని ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ కె.ఆర్.రజనీ ఆకాంక్షించారు. మంగళవారం తన చాంబర్లో వర్సిటీ–2026 క్యాలెండర్, డైరెలను ఆవిష్కరించారు. సిక్కోలు చారిత్రక అంశాలతో క్యాలెండర్ రూపొందించిన జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగం అధ్యాపకులు, సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ బి.అడ్డయ్య, ఎస్ఓ డాక్టర్ కె.సామ్రాజ్యలక్ష్మీ, ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ సీహెచ్ రాజశేఖర్రావు, ఎగ్జామ్, సీడీసీ డీన్ డాక్టర్ ఎస్.ఉదయ్భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వెలుగు వీఓఏ మృతి మెళియాపుట్టి: పరశు రాం పంచాయతీలో వెలుగు వీఓఏగా విధు లు నిర్వహిస్తున్న సవర నాగేశ్వరరావు(32) సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. నాగేశ్వరరావు పలాస మండలం టెక్కలిపట్నం నుంచి పరశురాంపురం వైపు ద్విచక్రవాహనంపై వస్తుండగా గేదె అడ్డంగా రావడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం అందించి 108 ద్వారా పలాస ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. నాగేశ్వరరావుకు భార్య బోదెమ్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చెట్టును ఢీకొన్న బైక్ ● యువకుడు దుర్మరణం హిరమండలం: ఎల్ఎన్పేట మండలం శ్యామలాపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శృంగవరపు యుగంధర్ (25) అనే యువకుడు దుర్మరణం పాలయ్యాడు. శ్యామలాపురం గ్రామానికి చెందిన యుగంధర్ సోమవారం అర్థరాత్రి బైక్పై వస్తుండగా గ్రామ సమీపంలో చెట్టును ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. అందివచ్చిన కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. సరుబుజ్జిలి ఎస్ఐ హైమావతి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ‘డ్రగ్ ఫ్రీ సొసైటీ లక్ష్యం’ శ్రీకాకుళం క్రైమ్ : విశాఖపట్నం రేంజి పరిధిలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల నిర్మూలన, డ్రగ్ ఫ్రీ సొసైటీ లక్ష్యంగా సమగ్ర చర్యలు చేపట్టడంతో 2025లో గణనీయమైన ఫలితాలను రాబట్టామని డీఐజీ గోపినాఽథ్ జెట్టి అన్నారు. మంగళవారం ఈ మేరకు పత్రికా ప్రకటన జారీ చేశారు. 4 డ్రోన్లతో 327 గ్రామాల్లో14,870 ఎకరాలను గంజాయి సాగు జరిగిన ప్రాంతాల గుర్తింపునకు సర్వే చేశామని, 138 గ్రామాలు ధ్రువీకరించామన్నారు. 24 సీసీ కెమెరాలతో కూడిన చెక్పోస్టులు, 362 డైనమిక్ తనిఖీల కేంద్రాల ద్వారా భారీగా గంజాయి, హషీష్ ఆయిల్ స్వాధీనం చేసి నిందితులను అరెస్టు చేశామన్నారు. 9 రహస్య గంజాయి నిల్వలను గుర్తించామన్నారు. 25 అంతర్రాష్ట్ర, 44 అంతర్జిల్లా ముఠాలను ఛేదించి ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన 315 మంది నేరస్తులను అరెస్టు చేశామన్నారు. 34 ప్రత్యేక బృందాలు 444 మంది పరారీలో ఉన్న నేరస్తులను పట్టుకున్నాయన్నారు. 39 కేసుల్లో 61 మందికి శిక్ష పడగా, 16 కేసుల్లో రూ. 9.13 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశామని తెలపారు. 99 పీఐటీ ఎన్డీపీఎస్ ప్రతిపాదనలను ప్రారంభించగా 645 ఎన్డీపీఎస్ సస్పెక్ట్ షీట్లు తెరిచామన్నారు. 22,050 అవగాహనా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆన్లైన్ తనిఖీ నిర్వహణలో కార్మికులకు కనీస వేతనాల చట్టం అమలుకానందున 22 మందికి ఆ తేడాను రూ.1,07,161 డి.డి రూపంలో అందించామని ఉపకార్మిక కమిషనర్ దినేష్కుమార్ తెలిపారు. ఈ మేరకు శ్రీకాకుళం నగరంలో ఉపకార్మికశాఖ కార్యాలయంలో మంగళవారం పలువురు కార్మికులకు డీడీలు అందజేశారు. కార్మికులకు అపాయింట్మెంట్ లెటర్లను ఈ–శ్రమ్లో నమోదు చేసినట్లు తెలిపారు. -
వైభవంగా ఆదిత్యుని కల్యాణ సేవ
అరసవల్లి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి సన్నిధిలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా అనివెట్టి మండపంలో ఏకాదశి కల్యాణ సేవ వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ సతీసమేతంగా హాజరై పూజలు చేశారు. అంతకుముందు ఉత్సవమూర్తులను పుష్పాలంకరణ చేసి శ్వేత అశ్వ వాహనంలో కొలువుదీర్చి మాడవీధుల్లో తిరువీధి నిర్వహించారు. ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో మంగళధ్వనుల మధ్య ఉత్తర (వైకుంఠ) ద్వారం లోంచి ఆలయంలోకి ఉత్సవమూర్తులను తీసుకువెళ్లారు. కార్యక్రమంలో అర్చకులు ఇప్పిలి నగేష్ కాశ్యప, రంజిత్ శర్మ, సాందీప్శర్మ, క్షేమేంద్ర శర్మ, హరిప్రసాద్ శర్మ తదితరులు పాల్గొన్నారు. -
అందుబాటులో టోమోథెరపీ సేవలు
ఎంవీపీ కాలనీ : క్యాన్సర్ చికిత్సలో రాష్ట్రంలో తొలిసారి అత్యాధునిక టోమోథెరపీ వైద్యసేవలను విశాఖపట్నం జిల్లా ఎంవీపీ కాలనీలోని మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అందుబాటులోకి తెచ్చింది. మంగళవారం ఆస్పత్రిలో జరిగిన కార్యక్రమంలో విశాఖ ఎంపీ శ్రీభరత్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ వున్నా మురళీకృష్ణతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ క్యాన్సర్ రోగులకు ఉపశమనం కలిగించేలా మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పటల్ ఏపీలో తొలిసారి అత్యాధునిక టోమోథెరపీ సాంకేతిక అందుబాటులోకి తేవడం హర్షణీయమన్నారు. దీని ద్వారా క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడం సాధ్యమవుతుందన్నారు. ఎండీ మాట్లాడుతూ రూ.32 కోట్లు విలువైన ఈ యూనిట్ కొనుగోలుతో మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ దేశంలో లెవల్–3 కేటగిరి హాస్పిటల్స్గా గుర్తింపు తెచ్చుకుందన్నారు. ఈ సాంకేతికత ద్వారా క్యాన్సర్ ట్యూమర్ను అత్యంత కచ్చితత్వంతో గుర్తించి నిమిషాల వ్యవధిలో చికిత్స అందించవచ్చన్నారు. కార్యక్రమంలో పలువురు హాస్పటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. విశాఖలోని మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆస్పత్రిలో టోమోథెరపీ యూనిట్ను ప్రారంభించిన ఎంపీ శ్రీభరత్ -
జీఓ ప్రకారం జీతాలు చెల్లించాలి
శ్రీకాకుళం: రిమ్స్ సెక్యూరిటీ గార్డులకు, పారిశుద్ధ్య కార్మికులకు జీవో ప్రకారం కాంట్రాక్టర్లు జీతాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్ డిమాండ్ చేశారు. మంగళవారం శ్రీకాకుళం రిమ్స్ ముఖద్వారం వద్ద కార్మికుల నిర్వహిస్తున్న రెండో రోజు రిలే దీక్షలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పారిశుద్ధ్య కార్మికులను వేధిస్తున్న క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ లిమిటెడ్ కాంట్రాక్టర్పై ప్రభుత్వం ఎందుకు చర్యలను తీసుకోవడం లేదని ప్రశ్నించారు. జీవో –138 ప్రకారం రూ.18,600 చొప్పున జీతం, బకాయిలు చెల్లించాలన్నారు. కార్యక్రమంలో ఏకెఎంఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి తాండ్ర ప్రకాష్, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు మామిడి క్రాంతి, జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గణేష్, జిల్లా కార్యవర్గ సభ్యురాలు సవలాపురపు కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. -
555 ఫోన్ల రికవరీ
శ్రీకాకుళం క్రైమ్ : బాధితులు వివిధ సందర్భాల్లో పోగొట్టుకున్న 555 మొబైల్ ఫోన్లను జిల్లా సైబర్ పోలీసులు ట్రేస్ చేయడమే కాక దొంగలించిన వారి నుంచి రికవరీ చేశారు. సుమారు రూ. 86 లక్షలు విలువైన ఈ ఫోన్లను జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఉదయం ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తన చేతుల మీదుగా బాధితులకు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. గత నాలుగున్నరేళ్లుగా సీఈఐఆర్ పోర్టల్ ద్వారా బాధితులు పోగొట్టుకున్న మొబైళ్లను తమ సైబర్ సెల్, ఐటీకోర్ సిబ్బంది ట్రేస్ చేస్తున్నారని తెలిపారు. అప్పటినుంచి ఇప్పటివరకు బాధితులు 7212 మంది మొబైళ్లు పోగొట్టుకున్నామంటూ ఫిర్యాదు చేయగా 2660 రికవరీ చేసి అందించడం జరిగిందన్నారు. వీటిలో ఈ ఒక్క ఏడాదిలోనే 2442 ఫిర్యాదులు రాగా 1060 రికవరీ చేశామని, మరో 330 ఫోన్లను గుర్తించామన్నారు. తక్షణ ఫిర్యాదు మేలు.. ఎవరైనా బాధితులు తమ మొబైల్ పోగొట్టుకున్నా.. లేదంటే ఎవరైనా దొంగిలించినా తక్షణమే సీఈఐఆర్ వెబ్ పోర్టల్లో ఫిర్యాదు రిజిస్టర్ చేయాలన్నా రు. అందుబాటులో ఉన్న పోలీస్స్టేషన్ను గానీ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఉన్న సైబర్సెల్ బృందాన్ని కలసి ఫిర్యాదు చేయొచ్చన్నారు. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లో కొత్త వ్యక్తి సిమ్ కార్డు వినియోగించిన వెంటనే ఆ మొబైల్ను ట్రేస్ చేయడం వీలవుతుందన్నారు. సైబర్ సిబ్బందికి ప్రశంసలు.. ఫోన్లలో 60 శాతం ట్రేసిబిలిటీ ఉండగా 80 శాతం రికవరీ ఉండటంలో కృషి చేసిన సైబర్ సెల్ సీఐ టి.శ్రీనివాసరావు బృందం పైలా శరత్చక్రవర్తి, జి.శేషగిరిరావు, టి.సుధీర్, పి.సత్యనారాయణ, పద్మజ్యోతి, కుసుమలను ప్రశంసించారు. బాధితులకు ఎస్పీ చేతుల మీదుగా అందజేత 7212 ఫిర్యాదులకు గాను ఇప్పటివరకు 2660 ఫోన్లు అందించామన్న ఎస్పీ -
ఉత్తర ద్వార దర్శనాలకు ఏర్పాట్లు
అరసవల్లి: అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి (వైకుంఠ ఏకాదశి) పర్వదినం మంగళవారం ఘనంగా నిర్వహించేలా ఆలయ ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మలు తగిన ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు మంగళవారం వేకువజామున శ్రీ ఉషా పద్మిని ఛాయా దేవేరులతో శ్రీసూర్యనారాయణ స్వామి ఉత్సవమూర్తులను తిరువీధిగా ఊరేగించి వైకుంఠ (ఉత్తర) ద్వారం నుంచి ఆలయం లోపలకు తీసుకువెళ్లనున్నారు. అనంతరం ఇదే ఉత్తర ద్వారం నుంచి భక్తులకు సర్వదర్శనాలు ఉంటాయని ఈఓ ప్రకటించారు. అనంతరం అనివెట్టి మండపంలో ఉత్సవమూర్తులకు కల్యాణాన్ని జరిపించనున్నట్టుగా ప్రధానార్చకులు శంకరశర్మ తెలియజేశారు. కార్గో ఎయిర్ పోర్టు ప్రతిపాదన రద్దు చేయాలివజ్రపుకొత్తూరు రూరల్: పచ్చని ఉద్దాన ప్రాంతంలో ప్రభుత్వాలు తలపెట్టిన కార్గో ఎయిర్పోర్టు ప్రతిపాదనను వెంటనే రద్దు చేయాలని కార్గో ఎయిర్పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో సోమవారం కమిటీ అధ్యక్షు డు కొమర వాసు అధ్యక్షతన సమావేశం ఏర్పా టు చేశారు. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, న్యూ డెమొ క్రసీ సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, లిబరేషన్ జిల్లా సహాయ కార్యదర్శి మద్దిల రామారావు, పోరాట కమిటీ కార్యదర్శి జోగి అప్పారావు మాట్లాడుతూ ఉద్దాన ప్రాంతంలో కార్గో ఎయిర్ పోర్టు పేరుతో చేస్తున్న భూ సేకరణ ఆపాలని కోరారు. ఉద్దాన ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను తిప్పికొట్టడానికి జనవరి 7 నుంచి 13 వరకు గ్రామాల్లో ‘మా ఊరు మా భూములు’ పేరిట భూములను కాపాడుకునేందుకు ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్గో ఎయిర్పోర్టు ప్రతిపాదిత పత్రాలను భోగి మంటల్లో వేసి దహనం చేయాలని పిలుపునిచ్చారు. ఉద్దానంలో ఏళ్ల తరబడి పీడిస్తున్న కిడ్నీ వ్యాధి నియంత్రణకు శాశ్వత పరిష్కారం చేయాలని, ఉద్దాన ప్రాంతంలో జీడి ఆధారిత పరిశ్రమను ఏర్పాటు చేయాలని, ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఉద్యమాలను అణచివేసేందుకు కేంద్రం కుట్రలు శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ఉద్యమాలను అణచివేసేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ అన్నా రు. శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రైవేటు రెసిడెన్సీలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని అన్నారు. ఉద్యమాలను అణచివేసేందుకే ఇప్పుడు కొత్తగా 50 ఏళ్ల నుంచి పుట్టిన ఉద్యమాల గురించి ఆరా తీస్తున్నారని తెలిపారు. ఆనాడు పార్లమెంట్లో కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం ఉండడంతో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం జరిగిందని, నేడు మోదీ ప్రభుత్వం ఆ పథకానికి మహాత్మా గాంధీ పేరుని తొలగించడమే కాకుండా నిధు ల కోత విధించిందని తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్న చంద్రబాబు మోదీని మించిపోయారని విమర్శించారు. బల్క్ డ్రగ్ కేంద్రాన్ని ఆ ప్రాంత ప్రజలు వ్యతిరేకిస్తుంటే వారికి అండగా నిలిచిన అనకాపల్లి సీపీఎం నాయకులు అప్పలరాజును అరెస్టు చేసి పీడీ యాక్ట్ పెడతామని బెదిరింపులకు పాల్పడడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనన్నారు. సెంట్రల్ హెల్త్ డిపార్ట్మెంట్లలో కీలక పదవిని చేపట్టిన కె.సుజాతరావు కూడా ప్రభు త్వ వైద్యశాలలు ప్రైవేటుపరం చేస్తే పేదలకు వైద్య విద్యుత్తో పాటు, వైద్యం కూడా భారం అవుతుందని చెప్పారని గుర్తు చేశారు. అమరా వతి కోసం 54 వేల ఎకరాలు భూములు తీసుకుని 12 ఏళ్లు అవుతున్నా భూములు ఇచ్చిన రైతులకు ఒక పట్టానైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. అమరావతిలో రైల్వే స్టేషన్ ఏర్పాటుకు 1500 ఎకరాలు అవసరమని చంద్రబాబు చెబుతున్న తీరు దారుణమని అన్నారు. -
పగలూ రాత్రి లేకుండా చోరులు ఈ ఏడాది రెచ్చిపోయారు. చైన్ స్నాచర్ల నుంచి దోపిడీ దొంగల వరకు అంతా తమ పనితనం చూపించారు. ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి కావడం విశేషం. ఎంబీఏ చదువుకున్న వారి నుంచి లారీ డ్రైవర్ల వరకు అంతా ఈ దొంగల లిస్టులో ఉండడం గమనార్హం. 2025 అంతా హడావుడి
ఎంబీఏ చదివిన చిన్నబాబు దొంగగా మారాడు. వృద్ధులను ఏమార్చి ఏటీఎం కార్డులు మార్చి డబ్బు కొట్టేయడంలో ఘనుడు. ఇతడిది నరసన్నపేట. సాంకేతికంగాను, చదువులోనూ తెలివైనవాడైన చిన్నబాబు జల్సాలకు అలవాటు పడి గత పదేళ్లుగా చోరీలు చేస్తూ కటకటాల్లోకి వెళ్లాడు. ఆమదాలవలస పోలీసులు అరెస్టు చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎంబీఏ చదివి దొంగతనాలు ఏటీఎం దొంగపై 30 కేసులు అరెస్టు : 15 సెప్టెంబరు 2025 ఎగుమతులు, దిగుమతుల కోసం లారీల్లో వస్తాడు. స్వకార్యంతో పాటు చోరీ కార్యం కూడా కానిచ్చి వెళ్లిపోతాడు. అతడే ఉత్తరాఖండ్ డెహ్రడూన్కు చెందిన నూర్హసన్. 140 ఇళ్లకు కన్నాలేసి 32 చోరీకేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. ఇతనిపై జిల్లాలో 18 కేసులున్నాయి. ఛత్తీస్గఢ్ రాయపూర్కు చెందిన ఇర్ఫాన్ అహ్మద్, అబ్ధుల్ గఫూర్లతో కాశీబుగ్గలో చోరీలు చేశాడు. కందిపప్పు లోడు రాయపూర్ నుంచి కాశీబుగ్గ తెచ్చి ఇక్కడి నుంచి జీడిపప్పుతో పాటు మార్గమధ్యంలో దొంగతనాలు చేసేవాడు. చోరీ సొత్తు ఉత్తర ప్రదేశ్లో అమ్ముతాడు. 140 దొంగతనాలు.. 32 సార్లు అరెస్టు అరెస్టు : 15 ఏప్రిల్ 2025 బ్లేడు చూపిస్తాడు.. 49 తులాల బంగారం, 6.8 కిలోల వెండి స్వాధీనం.. అరెస్టు : 21 సెప్టెంబరు 2025 పట్టుకోబోతే మెడపై బ్లేడు పెట్టుకుంటాడు. పట్టుకోకుంటే వరుస పెట్టి దొంగతనాలు చేస్తాడు. అతడే కుప్పిలి రాజు. విజయనగరం జిల్లా సంతకవిటికి చెందిన ఇతడు కుప్పిలి నర్సింగరావుతో కలిసి 68 దొంగతనాలకుపైగా చేశాడు. సీసీఎస్ పోలీసులు పట్టుకోగా ఆమదాలవలస పోలీసులు చోరీ సొత్తు రికవరీ చేశారు. -
ఆధార్ వాడడు.. ఆధారాలు వదలడు
● 33 ఏళ్లుగా చోరీలు.. అరెస్టు: 23 నవంబరు 2025 రెండు తెలుగు రాష్ట్రాలకు కొరకరాని కొయ్య, మోస్ట్ వాంటెడ్ దున్న కృష్ణను జిల్లా సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. సెల్ఫోన్, ఆధార్, ఇతర ఐడెంటిటీ కార్డులు ఏవీ వాడకపోవడం ఇతని స్టైల్. బాల్యం నుంచే చోరీలు మొదలుపెట్టిన మెళియాపుట్టి చాపరకు చెందిన కృష్ణ కుటుంబంతో కోల్కతాలో వుంటూ సీజనల్గా వచ్చి దొంగతనాలు చేసేవాడు. శ్రీకాకుళం రూరల్ పోలీసులు కృష్ణను రిమాండ్కు తరలించి రికవరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. -
రాజకీయ కక్ష.. పేదలకు శిక్ష
కక్ష పూరితం ఇందిరమ్మ హయాంలో పేద రైతులకు పట్టాలు ఇచ్చారు. స్థానిక టీడీపీ సర్పంచ్ కక్ష పూరిత రాజకీయాలకు పాల్పడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిపై కక్ష కట్టి ఇలా చేస్తున్నారు. – రుప్ప అప్పలసూరి, ఎంపీటీసీ కేసు కోర్టులో ఉన్నా.. ఇందిరమ్మ ప్రభుత్వ హయాంలో మాకు పట్టాలు ఇచ్చారు. దశాబ్దాలుగా వరి, చెరుకు, పెసలు, మినుములు పండిస్తున్నాం. ఇప్పుడు ఈ భూమిని రెవెన్యూ అధికారుల స్వాధీనం చేసుకోవడం అన్యాయం. కోర్టులో కేసు నడుస్తున్నా చెట్లు ధ్వంసం చేశారు. – రుప్ప సింహాచలం, సానివాడ గ్రామం శ్రీకాకుళం రూరల్/గార: శ్రీకాకుళం మండల పరిధిలోని సానివాడ పంచాయతీ, గార మండలం అంపోలు రెవెన్యూ పరిధిలో బరాటం చెరువు వద్ద సర్వే నంబర్ 199లో 19 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో పేద రైతులకు 5 ఎకరాల 50 సెంట్లు భూమిని 1975లో అందజేశారు. వారు 50 ఏళ్లుగా ఇక్కడ సాగు చేసుకుంటున్నారు. ఈ భూమిపై కూటమి నేతల కన్ను పడింది. స్థలం గార రెవెన్యూ పరిధిలో ఉండడంతో అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోమవారం పోలీసు బందోబస్తుతో ఆరు పొక్లెయినర్లు పెట్టి చెరువు గర్భంలో గల ప్రభు త్వ భూమిని స్వాధీనం చేసుకోవడానికి పూనుకున్నారు. అడ్డువచ్చిన రైతులను ఎక్కడికక్కడ ఆపేశారు. వైఎస్సార్సీపీకి చెందిన వాళ్లం కాబట్టే ఇలా కక్ష సాధిస్తున్నారని రైతులు చెబుతున్నారు. సానివాడ పంచాయతీ అంపోలు రెవెన్యూ పరిధిలో 19 ఎకరాలు స్వాధీనం దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూమిపై రాజకీయ కుట్ర ఇందిరమ్మ ప్రభుత్వ హయాంలో రైతులకు పట్టాలు -
డిజైన్లలో లేటెస్ట్
చక్కటి టేస్ట్.. ● న్యూ ఇయర్ వేడుకలకు ఆకర్షణీయమైన కేకులు సిద్ధం ● అందుబాటులో సృజనాత్మక డిజైన్లు ఇచ్ఛాపురం రూరల్: కొత్త క్యాలెండర్ గోడకు తగిలించినా లేకపోయినా, అయిన వారికి విషెష్ చెప్పినా చెప్పకపోయినా, వాట్సాప్ స్టేటస్లు పెట్టినా పెట్టకపోయినా.. కేకు మాత్రం కోయాల్సిందే. కేకు లేకుండా న్యూఇయర్ సెలబ్రేషన్ అనేదే ఉండదు కదా. అందుకే బేకరీలు టేస్ట్తో పాటు లేటెస్ట్ డిజైన్లతో కొత్త కొత్త కేక్లను తయారు చేస్తున్నాయి. బెంగళూరు, మహారాష్ట్ర, బరంపురం, భువనేశ్వర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన మాస్టర్స్ జిల్లాలో బేకరీలు నిర్వహిస్తూ కేకుల ద్వారా ఉపాధి పొందుతున్నారు. అందరినీ ఆకట్టుకునేలా చక్కటి డిజైన్లతో కేకులు సిద్ధం చేస్తున్నారు. పెరిగిన డిమాండ్ ప్రస్తుతం న్యూ ఇయర్ వేడుకలతో కేకులకు డిమాండ్ పెరిగింది. దీంతో ట్రెండ్కు తగ్గట్టు జిల్లాలో కేక్లు తయారు చేస్తున్నారు. సాధారణ కేకులు కిలోకు రూ.250–రూ.500 వరకు, కూల్ కేక్స్ కిలోకు రూ. 500 మొదలుకుని రూ.3,500 వరకు ఉన్నాయి. అన్ని వైరెటీల్లో... కేక్స్ అన్ని వైరెటీల్లో అందిస్తున్నాం. కస్టమర్ల అభిరుచుల మేరకు అన్ని ఫ్లేవర్స్లో కేక్స్ సిద్ధం చేస్తున్నాం. ప్రజల నుంచి మంచి ఆదరణ ఉంది. సాధారణ కస్టమర్కు అనుగుణంగా ధరలు నిర్ణయించడం జరిగింది. – కె.అనిల్, హాయ్ కేఫ్, ఇచ్ఛాపురం గంటలోనే తయారు చేసేస్తాం కస్టమర్లు కోరిన డిజైన్లలో కేక్స్ కేవలం గంటలోపే తయారు చేస్తున్నాం. కేక్లపై క్రీమ్తో డిజై న్లు వేయడం సొంతంగా నేర్చు కున్నా. డిసెంబర్ 31 కోసం కేక్లు సిద్ధం చేస్తున్నాం. అన్ని వైరెటీల కేక్స్, ఆన్లైన్లో కనిపించే వైరెటీ కేక్స్ను ఆర్డర్లను బట్టీ తయారు చేసి ఇస్తున్నాం. – జి.గణేష్, కేక్ మేకర్, ఇచ్ఛాపురం -
కిటికీ పక్కన తాళాలు పెట్టారో..
112 తులాలు కొట్టేసిన ఘనులు అరెస్టు : 18 జనవరి 2025 షూ ర్యాక్లు, ఎలక్ట్రికల్ మీటర్ రీడింగ్బోర్డులు, పూలకుండీలు, కిటికీ లోపల తాళాలు పెడితే.. వారికి ఇట్టే తెలిసిపోతుంది. వారే విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన అంతర్రాష్ట్ర దొంగ వున్నాన రాంబాబు, మన జిల్లా జి.సిగడాంకు చెందిన గిడిజాల కోటేశ్వరరావు. దాచిన తాళాలు కనిపెట్టి దొంగతనాలు చేస్తారు. ఇంటిలో ఎక్కడా ఏ వస్తువు టచ్ చేయకుండా.. ఫింగర్ ప్రింట్స్ దొరక్కుండా జాగ్రత్తపడతారు. ఏడాది వ్యవధిలో 32 చోరీలకు పాల్పడి మొత్తం 112 తులాల బంగారాన్ని కాజేశారు. మన పోలీసులు అరెస్టు చేసిన తర్వాత బెయిల్పై విడుదలైన రాంబాబు 15 చోరీలు చేయడంతో కృష్ణాజిల్లా కంకిపాడు పోలీసులు ఈనెల 21న అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
పుస్తక రచనకు గౌరీశంకర్ ఎంపిక
శ్రీకాకుళ రూరల్: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు పోస్టు గ్రాడ్యూయేషన్ కోర్సు పుస్తక రచన కోసం తనను ఎంపిక చేసినట్లు భమిడిపాటి గౌరీశంకర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పుస్తకాన్ని హైదరాబాద్కు చెందిన స్పెక్ట్రమ్ అంతర్జాతీయ ప్రచురణల సంస్థ ముద్రించనున్నట్లు తెలిపారు. గౌరీ శంకర్ మునసబుపేటలోని గాయత్రి కాలేజీ అఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్లో తెలుగు విభాగాధిపతిగా పనిచేస్తున్నారు. ఈయన గతంలో డిగ్రీ మూడు సెమిస్టర్స్కు తెలుగు వాచక రచన చేశారు. కథకుడు, విమర్శకుడు, కవిగా ఎన్నో రచనలు చేసి, బహుమతులు అందుకున్నారు. వందకుపైగా అంతర్జాతీయ, జాతీయ సదస్సుల్లో పత్ర సమర్పణలు చేశారు. దీంతో ఆయనకు గురజాడ విద్యాసంస్థల అధినేత జి.వి.స్వామి నాయుడు, ప్రిన్సిపాల్ కేవీవీ సత్యనారాయణ తదితరులు అభినందనలు తెలిపారు. -
ఆన్లైన్ సేవలు విస్తృతం..!
● అరసవల్లిలో మనమిత్ర క్యూఆర్ కోడ్ సదుపాయం ● ఆన్లైన్ సేవల రిజర్వేషన్కు మార్గం సుగమం అరసవల్లి: ప్రసిద్ధ సూర్యదేవాలయం అరసవల్లిలో ఆన్లైన్ సేవలు మరింత విస్తృతమయ్యాయి. 2020 నుంచే సూర్యనారాయణ స్వామివారి ఆలయ సేవలు ఆన్లైన్లో లభిస్తుండగా.. తాజాగా ఆలయంలో క్యూఆర్ కోడ్ ద్వారా ఆన్లైన్ చెల్లింపులకు అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. ‘మనమిత్ర’ పేరిట సిద్ధ చేసిన ఈ క్యూఆర్ కోడ్తో రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధ ఆలయాల సమాచారంతో పాటు అక్కడి ఆలయాల్లో దర్శనాల టిక్కెట్లు, సేవల టిక్కెట్లను కూడా ఆన్లైన్లో చెల్లింపులు చేసి పొందే అవకాశముంది. దీనికోసం ఆలయ ఈవో కేఎన్వీడీవీ ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీంతో ఆన్లైన్ టిక్కెట్ల విక్రయాలు, ప్రసాదాల విక్రయాలతో పాటు వివిధ రకాల ఆర్జిత సేవా టిక్కెట్లు, సూర్య నమస్కార పూజలు, కల్యాణం, అభిషేక సేవల టిక్కెట్లను కూడా మనమిత్ర పేరిట క్యూఆర్ కోడ్ ద్వారా ఇంటి నుంచే బుక్ చేసుకునే వెసులుబాటు కలిగింది. ఇప్పటికే ప్రముఖ ఆలయాల్లో ఆన్లైన్ సేవలు పొందేందుకు, అలాగే ఆయా ఆలయాల్లో పర్వదినాలు, వివరాల కోసం అధికారికంగా ప్రత్యేక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీటెంపుల్స్.ఏపీ.జీవోవీ.ఇన్ పనిచేస్తోంది. అయితే ఈ ప్రముఖ ఆలయాల జాబితాలోకి అరసవల్లి చేరడంతో ఆన్లైన్ సేవలను దేశం నలుమూలల నుంచి పొందే అవకాశం ఉంది. ఆదిత్యాలయంలో సేవలను, దర్శన టిక్కెట్లను ముందుగానే బుక్ చేసుకోవచ్చు. భక్తుల సౌకర్యార్థం మరిన్ని సేవలు అరసవల్లి ఆలయంలో ఆన్లైన్ సేవలను పొందేందుకు వెబ్సైట్లో పొందుపరిచాం. దేశం నలుమూలల నుంచి ఇక్కడి ఆలయంలో ఆర్జిత సేవలను, టిక్కెట్లను కూడా ఆన్లైన్లో పొందవచ్చు. భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకుని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఆన్లైన్ పేమెంట్ల కోసం ప్రత్యేక క్యూఆర్ కోడ్ను అందుబాటులోకి తెచ్చాం. రానున్న రోజుల్లో ఈ ఆన్లైన్ సేవలు మరింత విస్తృతం కానున్నాయి. – కేఎన్వీడీవీ ప్రసాద్, ఈవో, ఆరసవల్లి ఆలయం -
అర్జీలు త్వరితగతిన పరిష్కరించాలి
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ● 163 అర్జీలు స్వీకరణ శ్రీకాకుళం పాతబస్టాండ్: బాధితులు ఇచ్చిన అర్జీలు త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీలు పెండింగ్లో లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయా సమస్యలకు సంబంధించి వివిధ శాఖల నుంచి 163 అర్జీలు స్వీకరించారు. సోషల్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పవర్టీ–61, రెవెన్యూ–37, పంచాయతీ రాజ్–13, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ – 13, ఏపీ ఈపీడీసీఎల్–6, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్–5, ఏపీ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్టక్చర్ డవలప్మెంట్ కార్పొరేషన్–3, సమగ్ర శిక్ష–3, వ్యవసాయ శాఖ–3, గ్రామీణాభివృద్ధి–2, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్–2, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్–2, కుటుంబ సంక్షేమం–2, వాటర్ రిసోర్సెస్ ఏజెన్సీ–2, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్, ఆర్డబ్ల్యూఎస్, మత్స్యశాఖ, దేవదాయ శాఖ, నైపుణ్యాభివృద్ధి, విద్య, మైన్స్ అండ్ జియాలజీ, పోలీసు, ఆర్టీసీకి సంబంధించి ఒక్కొక్క అర్జీ చొప్పున స్వీకరించారు. అర్జీల స్వీకరణలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మణమూర్తి, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, విశ్రాంత జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వినతులు పరిశీలిస్తే... ● తమ గ్రామంలో పొజిషన్ ధ్రువపత్రాన్ని టాంపరింగ్ చేసిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని కవిటి మండలంలోని ప్రగడపుట్టుగ గ్రామానికి చెందిన పి.పద్మనాభం ఫిర్యాదు చేశారు. ● నందిగాం మండలంలోని హరిదాసుపురం గ్రామానికి చెందిన అక్కూరు మీన తనకు రావాల్సిన అంగన్వాడీ ఆశా కార్యకర్త పోస్టులో కనీసం ఇంటర్వ్యూకి హాజరవ్వని టి.రమాదేవిని అధికారులు నియమించారని, తనకు న్యాయం చేయాలని కోరారు. తను ఈ విషయమై రెండోసారి పీజీఆర్ఎస్కి రావడం జరిగిందని, తనకు న్యాయం జరగలేదని వాపోయారు. ● పురపాలక సంఘం పరిధిలో గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న పార్టు టైం వర్కర్లకు ఇతర పార్ట్ టైం వర్కర్లు మాదిరిగా వేతనం ఇవ్వాలని శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పార్ట్ టైం వర్కర్లు టి.పార్వతి, ఎస్.భాను, ఎం.తవిటమ్మ, వి.కృష్ణవేణిలు కోరారు. ● పోలాకి మండలంలోని రెహమాన్పురం గ్రామానికి చెందిన పూడి అప్పలనాయుడుకి రెహమాన్పురం రెవెన్యూలో సర్వే నంబర్ 165–5లో సుమారుగా 0.53 సెంట్లు భూమి ఉందని, ఆ భూమికి తనకు అనువంశకరంగా సంక్రమించిదని, ఆ భూమికి తనకు పాస్ పుస్తకం, అడంగల్, 1–బీలను ఇప్పించాలని కోరారు. ● ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీఐలో మూడో సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతూ సీనియర్లు వేధింపులు, అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన ప్రత్తిపాటి సృజన్ కుటుంబానికి న్యాయం చేయాలని దళిత సంఘాల జేఏసీ నేతలు తైక్వాండో శ్రీను, డా.కంఠ వేణు, తదితరులు పీజీఆర్ఎస్లో కోరారు. ● పొందూరు మండలంలోని కృష్ణాపురం, రాపాకలో వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న ఎం.శంకరరావు అవితినీతికి పాల్పడి, అడ్డగోలుగా అడంగల్ మంజూరు చేస్తున్నారని గ్రీవెన్స్లో రైతులు కలెక్టరుకి వినతిపత్రం అందించారు. ఆయన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేయాలని జి.నాగేశ్వరరావు, సత్యప్రభ, విజయలక్ష్మి, మధుసూదనరావు తదితరులు కోరారు. -
రిమ్స్ కాంట్రాక్టర్స్ లైసెన్సులు రద్దు చేయాలి
● అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ప్రకాశ్ డిమాండ్ ● రిమ్స్ గేటు వద్ద ఇఫ్టూ ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభం శ్రీకాకుళం: రిమ్స్ ఆస్పత్రిలో గత నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించకుండా సెక్యూరిటీ గార్డ్స్పై నిరంకుశంగా వ్యవహరిస్తున్న శ్రీకార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ యాజమాన్యం లేబర్ లైసెన్సు తక్షణమే రద్దు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి తాండ్ర ప్రకాశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రిమ్స్ గేటు వద్ద కాంట్రాక్టు అండ్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఇఫ్టూ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిమ్స్ ఆస్పత్రిలో వివిధ రకాల కాంట్రాక్టర్లు రాజ్యాంగేతర శక్తుల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జిల్లా అధికారులన్నా.. ప్రజాప్రతినిధులన్నా ఏమాత్రం గౌరవం లేదని, కనీస వేతనాలు అమలు చేయాల్సిన బాధ్యత జిల్లా అధికారులదేనని పేర్కొన్నారు. ఇఫ్టూ జిల్లా కమిటీ సభ్యురాలు సవలాపురపు కృష్ణవేణి, జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాసి గణేష్ మాట్లాడుతూ.. జీవో 138 ప్రకారం రూ.18,600ల కనీస వేతనం ఇవ్వాలన్నారు. కాంట్రాక్టర్లు నియంతల్లా వ్యవహరించి కార్మికుల మధ్య గొడవలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. సెక్యూరిటీ గార్డ్స్కి గత నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించాలని పోరాటాలు చేస్తున్నా కనీస స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు సమస్య పరిష్కారం కోసం చొరవ చూపాలని, లేనిపక్షంలో పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పోరాటానికి సంఘీభావం కార్మికుల రిలే దీక్షా శిబిరాన్ని ఐఏఫ్టీయూ ఏపీ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు పి.ప్రసాద్ సందర్శించి తన సంఘీభావాన్ని ప్రకటించారు. నిరవధికంగా పోరాటం సాగించాలని, దశల వారీ పోరాటానికి సిద్ధపడా లని పిలుపునిచ్చారు. యాజమాన్యం తక్షణమే కార్మికుల డిమాండ్లను పరిష్కరించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో జోగి వెంకటరమణ, గురుగుబెల్లి లక్ష్మణరావు, మామిడి సూర్యనారాయణ, మిర్తిపాటి హైమారావు, సంధ్య, కాపురెడ్డి రాజేశ్వరి, శాంతి కుమారి, దుర్గాప్రసాద్, మోహనరావు, నరసింగరావు, కొప్పుల రాజశేఖర్, హేమలత, ఎస్.సుమతి, యూనియన్ అధ్యక్షుడు గొల్లపల్లి రాజులు, ప్రధాన కార్యదర్శి బగాది శ్రీనివాసరావు, మద్ది శ్రీను సిరిపల్లి ప్రసాద్, తనుకు సంతోషి, బండారి శశికళ, గోవిందమ్మ, సాదు శ్రీనివాస్, దామోదర రవి కుమార్, తాళ్లవలస రామారావు, సతివాడ రాజేంద్రప్రసాద్, బన్నా అప్పన్న, అన్నేపు సూర్యనారాయణ, తిరుమలరావు, చిన్నారావు జయప్ర ద, భాస్కరరావు బీబీ మాధవరావు పాల్గొన్నారు. -
ఛలో విశాఖపట్నం జయప్రదం చేయండి
ఎచ్చెర్ల: జనవరి 4వ తేదీన నిర్వహించనున్న ఛలో విశాఖపట్నం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు పిలుపునిచ్చారు. ఎచ్చెర్లలో అఖిల భారత మహాసభల ప్రచారం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దనున్న అంబేడ్కర్ విగ్రహం నుంచి ప్రదర్శన, అనంతరం ఆర్కే బీచ్ వద్ద భారీ బహిరంగ సభ జరుగుతుందన్నారు. కార్పొరేట్లకు మేలు చేసేందుకు, కార్మిక వర్గ హక్కులను హరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటాయన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా బలమైన కార్మిక ఉద్యమాన్ని నిర్వహించడానికి సీఐటీయూ అగ్రభాగాన నిలిచిందన్నారు. కార్మక వర్గం సాధించుకున్న కార్మిక హక్కులను కార్పొరేట్ల ప్రయోజనాల కోసం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని మండిపడ్డారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు శారద, పుష్ప, లలిత, అమృత, కనకం తదితరులు పాల్గొన్నారు. -
ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శిగా పడాల
శ్రీకాకుళం: లావేరు మండలం బుడుమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ లాంగ్వేజ్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న పడాల తమ్మినాయుడును ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇటీవల కడపలో జరిగిన 79వ రాష్ట్ర కౌన్సిల్ ఎన్నికల్లో పడాలను ఎన్నుకున్నారు. దీంతో ఆయనను జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పేడాడ ప్రభాకరరావు, గురువు శ్రీనివాసరావులు, సంఘం నాయకులు ఎస్వీ రమణమూర్తి, శ్రీనివాస పట్నాయక్, చింతల రామారావు తదితరులు అభినందించారు. ఆర్బిటర్గా నార్మ్ సాధించిన భీమారావు టెక్కలి: ఇప్పటివరకు ఫిడే ఆర్బిటార్గా వ్యవహరించిన జిల్లాకు చెందిన సనపల భీమారావు విశాఖపట్నంలో ఈనెల 24వ తేదీ నుంచి 28 వరకు 5 దేశాలకు చెందిన 582 మంది క్రీడాకారులు పాల్గొన్న చదరంగం అంతర్జాతీయ ఫిడే రేటింగ్ టోర్నమెంట్లో ఆర్బిటార్గా వ్యవహరించారు. దీంతో ఆయన ఇంటర్నేషనల్ ఆర్బిటార్ రెండో నార్మ్ సాధించారు. ఈ నార్మ్ను అంతర్జాతీయ ఆర్బిటార్ జీవీ కుమార్ చేతులమీదుగా అందుకున్నారు. ఆయన ఇంకో నార్మ్ సాధిస్తే ఇంటర్నేషనల్ ఆర్బిటార్గా అవతరించనున్నారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా చెస్కు చేసిన సేవలకు గుర్తింపుగా ఈ నార్మ్ అందుకోవడం జరిగిందన్నారు. మరో గ్రాండ్ మాస్టర్ ఈవెంట్లో రిఫరీగా వ్యవహరిస్తే ఫైనల్ నార్మ్ పూర్తి చేయవచ్చని తెలిపారు. ఆయనకు పలువురు అభినందనలు తెలియజేశారు. ఎస్పీ గ్రీవెన్సుకు 57 వినతులు శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్సుకు 57 వినతులు ప్రజల నుంచి అందాయి. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తన చాంబర్లో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి సకాలంలో న్యాయం జరిగేలా చూస్తానని భరోసా ఇచ్చారు. జిల్లా జైలు తనిఖీ గార: జిల్లా జైలును శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు జునైద్ అహ్మద్ మౌలానా, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బోర్డ్ ఆఫ్ విజిటర్స్ సభ్యులతో సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జైలులో ఖైదీలపై వివక్ష ఉండకూడదని, అందరినీ సమానంగా చూడాలన్నారు. విచారణకు హాజరు పరచని ఖైదీల వివరాలను, గరిష్ట శిక్ష కాలంలో సగం లేదా మూడింతల్లో ఒక వంతు పూర్తి చేసుకున్న అండర్ ట్రయిల్ ఖైదీల సమాచారాన్ని ఆయన అడిగి తెలుసుకున్నారు. తగినంత న్యాయ ప్రాతినిధ్యం లేని ఖైదీలకు తక్షణమే చట్టపరమైన బెయిల్ దరఖాస్తులు, ఇతర ఉపశమనాలు కల్పించాలని అధికారులకు ఆదేశించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు పాల్గొన్నారు. వీఆర్వోలకు పనిభారం తగ్గించాలి శ్రీకాకుళం పాతబస్టాండ్: తమకు పనిభారం తగ్గించాలని వీఆర్వోలు కోరారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. రాత్రీ పగలు పనిచేసినా తరగడం లేదని, వీటితో పాటు అధికారులు తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని వాపోయారు. వీఆర్వోలపై రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లు, పంచాయతీ కార్యదర్శి, మున్సిపల్ కమిషనర్లు అజమాయిసీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రీసర్వేలో కీలకంగా ఉన్న తాము పొలాల్లో ఉంటే సచివాలయాల్లో ఎలా హాజరు వేయగలమని ప్రశ్నించారు. తమకు హాజరు సడలింపు ఇవ్వాలని కోరారు. అనంతరం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. -
సమాజహితమైన ప్రాజెక్టులకు ప్రాధాన్యమివ్వాలి
● హైదరాబాద్ ఐఐటీ డీన్ మల్లారెడ్డి ● టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో ముగిసిన ఆవిష్కార్ టెక్కలి: సమాజానికి హితమైన ప్రాజెక్టులను రూపకల్పన చేసేవిధంగా నైపుణ్యతకు ప్రాధాన్యమివ్వాలని హైదరాబాద్కు చెందిన ఐఐటీ డీన్ సి.మల్లారెడ్డి అన్నారు. టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో గత మూడు రోజులుగా జరుగుతున్న ఆవిష్కార్ హ్యాక్థాన్ సీజన్–3 సాంకేతిక కార్యక్రమం సోమవారంతో ముగిసింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మల్లారెడ్డి విద్యార్థులనుద్దేశించి సూచనలు అందజేశారు. యువ ఇంజినీరింగ్ విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాన్ని, సృజనాత్మక ఆలోచనలను వెలికితీయాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ సాంకేతిక ఆవిష్కరణల శిబిరం విశేష విజయాన్ని సాధించిందన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఇంజినీరింగ్ విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించడం సంతోషకరమన్నారు. విద్యార్థులు రూపొందించిన వినూత్న సాంకేతిక ప్రాజెక్టులు పరిశ్రమలు, సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలుగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రాజెక్టుల్లో మొదటి బహుమతి విశాఖపట్నంకు చెందిన జన్నోగజెనిక్స్ ఎన్ఎస్ఆర్ ఐటీకు రూ.1.25 లక్షలు, గుజరాత్కు చెందిన మైండ్ మోషన్ పారుల్ యూనివర్సిటీకి రెండో బహుమతి రూ.1 లక్ష, తమిళనాడుకు చెందిన కాస్మోస్ అమృత యూనివర్సిటీ విద్యార్థులు మూడవ బహుమతి రూ.75 వేలు గెలిపొందారు. కార్యక్రమంలో కళాశాల డైరక్టర్ వీవీ నాగేశ్వరరావు, కార్యదర్శి ఎల్.ఎల్.నాయుడు, కోశాధికారి టి.నాగరాజు, మనోజ్ కుమార్, సతీష్ కుమార్, బీవీ రమణతదితరులు పాల్గొన్నారు. -
వేడుకగా కళింగ ఆత్మీయ సమ్మేళనం
ఎచ్చెర్ల/శ్రీకాకుళం న్యూకాలనీ: ఎచ్చెర్ల మండల కేంద్రంలోని చౌదరి సత్యనారాయణ తోటలో ఆదివారం రాష్ట్రస్థాయి కళింగ సామాజిక వర్గ ఆత్మీయ కలయిక సమావేశం ఘనంగా జరిగింది. జిల్లా నలుమూలలతోపాటు విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, ఏలూరు, రాయలసీమ, బరంపురం, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. కళింగ సామాజికవర్గ పెద్దల సూచనలతో కళింగ సంక్షేమ సంఘ ప్రతినిధులు చింతాడ రామ్మోహనరావు, దుప్పల వెంకటరావు, దుంపల రామారావు, దానేటి శ్రీధర్, పూజారి చెల్లయ్య, పూడి తిరుపతిరావు, మొదలవలస లీలామోహన్, బీవీఎస్ఎన్రాజు తదితరులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడంతో సుమారు 50వేల మంది హాజరయ్యారు. కళింగ సామాజిక వర్గం సంక్షేమం, అభివృద్ధి కోసం ఐక్యంగా ముందుకు సాగాలని వక్తలు పిలుపునిచ్చారు. ప్రముఖ సినీ గాయకుడు ధనుంజయ్ తన పాటలతో ఉత్సాహపరిచారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ జన్మదిన వేడుకలు జరుపుకొన్నారు. మాజీ మంత్రి తమ్మినేని సీతారాం, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజు, వైఎస్సార్ సీపీ కాళింగ సామాజిక వర్గం వైఎస్సార్ సీపీ మాజీ అధ్యక్షుడు దుంపల లక్ష్మణరావు, తదితరులు హాజరై ఆమె చేత కేక్ కటింగ్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో విశ్రాంత ఏపీ పరిపాలన ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ గురుగుబెల్లి యతిరాజులు, కృష్ణా విశ్వవిద్యాలయం వీసీ కూన రామ్జీ, ఎమ్మెల్యే కూన రవికుమార్, కళింగ కార్పొరేషన్ రాష్ట్ర ౖచైర్మన్ రోణంకి కృష్ణంనాయుడు, మాజీ చైర్మన్లు పేరాడ తిలక్, దుంపల రామారావు, పేడాడ రమణకుమారి, వైఎస్సార్ సీపీ నేతలు కిల్లి సత్యనారాయణ, చింతాడ రవికుమార్, తమ్మినేని చిరంజీవినాగ్, సింగుపురం మోహనరావు, ఎన్ని ధనుంజయరావు, తదితరులు పాల్గొన్నారు. -
సంచలన హత్యలివే..
● మార్చి 3న నరసన్నపేట బొంతలవీధికి చెందిన కేవిటి గున్నమ్మ (85) అనే వృద్ధురాలిని వివస్త్రగా చేసి చెవి, ముక్కు కోసేసి దారుణంగా ఓ బాలుడు హత్య చేశాడు. అనంతరం బంగారం దోచుకుని పారిపోయాడు. ● జూన్ 9న కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురానికి చెందిన వృద్ధురాలు దుంపల దాలమ్మను ఇంట్లో మోటారు రిపేర్ చేసేందుకు అదే గ్రామానికి చెందిన బల్లి రాము వచ్చి ఇనుపరాడ్డుతో తలపై బలంగా కొట్టడంతో చనిపోయింది. బంగారు గొలుసుతో పరారయ్యాడు. ● డిసెంబరు 1న లావేరు మండలం మురపాకకు చెందిన వృద్ధురాలు వడ్డీ పార్వతి (64) 1న అదృశ్యమై 3న ఓ పాడుబడిన బావిలో శవంగా తేలింది. చెవి, ముక్కు కొరికి, కాల్చి హత్య చేసి బంగారం దోచుకెళ్లిన దుండగులు బావిలో పడేశారు. ● జూలై 11న ఎచ్చెర్ల మండలం ఫరీద్పేటకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త సత్తారు గోపిని అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు ఎన్హెచ్–16 సమీప కొయిరాలమెట్ట వద్ద దారుణంగా హత్యచేశారు. ● ఆగస్టు 26న నరసన్నపేటకు చెందిన బంగారం వ్యాపారి పొట్నూరు వెంకటపార్వతీశం గుప్తాను బంగారం కోసం డ్రైవర్ సంతోష్తో పాటు పెద్దపాడు వద్ద ఆదిత్య కార్వరల్డ్ బిల్డింగ్ యజమాని ఎం.అప్పలరాజు మెడకు తాడు బిగించి హత్య చేసి రామిగెడ్డలో మృతదేహాన్ని పడేశారు. ● సెప్టెంబరు 24న కంచిలి మండలం జలంత్రకోట సమీపంలో ఓ దాబాలో భోజనం చేసి బిల్లు చెల్లించకుండా వెళ్లిపోతున్న లారీ డ్రైవర్ను ఓనర్ డబ్బులు అడగడంతో లారీతో తొక్కించి చంపేశాడు. అడ్డుకున్న మరో వ్యక్తిపైనా లారీ ఎక్కించేసి మరణానికి కారణమయ్యాడు. ● జనవరి 18న పొందూరు మండలం మొదలవలసకు చెందిన పూజారి కళావతి (53) శ్రీకాకుళం నగరం న్యూకాలనీలో హత్యకు గురైంది. శ్రీకాకుళం క్రైమ్ : ఏడాది కాలంగా జిల్లా వరుసగా హత్యలు చూస్తూనే ఉంది. గడిచిన ఏడాదిలో 16 హత్యలు జరిగాయని అధికారులు గణాంకాల్లో పేర్కొనగా ఈ ఏడాది చివరికొచ్చేసరికి దాదాపు 30 హత్యలు జరిగాయి. వీటిలో పోలీసులు ధ్రువీకరించినవి కొ న్ని మాత్రమే. కొన్నింటిని అనుమానాస్పద మరణాలుగా చూపారు. కానీ అవి కూడా హత్యలేనని స్థానికులు, కుటుంబీకుల నుంచి గట్టిగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటిలో 15 హత్యలు మహిళలకు సంబంధించినవే కావడం గమనార్హం. ఎందుకీ నేర ప్రవృత్తి..? రాజకీయ కారణాలు, మద్యం మత్తు, అనుమానం, దురాశ.. జిల్లాలో జరిగిన హత్యాకాండల వెనుక దాదాపుగా ఉన్న కారణాలివే. ఎక్కడికక్కడ మద్యం దొరుకుతుండడం, గంజాయి విక్రయాలు పెచ్చుమీరుతుండడంతో నేరాలూ పెరుగుతున్నాయి. మరోవైపు రాజకీయ కారణాలతోనూ చంపుకోవడం వంటి కొత్త సంస్కృతులు కూడా జిల్లాకు ఈ ఏడాదే పరిచయమయ్యాయి. ఇదివరకు దాడులు మాత్రమే జరిగాయి.. ఇప్పుడవి హత్యల స్థాయికి చేరుకున్నాయి. భార్యాభర్తల తగాదాలు.. జనవరి 25న ఆమదాలవలస మండలం బొబ్బిలిపేటకు చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు గురుగుబెల్లి చంద్రశేఖర్ (45), ఫిబ్రవరి 10న సోంపేట మండలం జింకిభద్ర బీసీ కాలనీలో సాహుకారి రత్నాలు (70), ఫిబ్రవరి 24న జిల్లాకేంద్రంలోని టి–ఏజెంట్ కాలనీలో మజ్జి రమేష్నాయు డు (34), మార్చి 18న ఎచ్చెర్ల మండలం సంతసీతారాంపురానికి చెందిన గాలి నాగమ్మ (42), మార్చి 28న కవిటి మండలం ఆర్.కరాపాడులో గర్భిణి కొంతాల మీనాక్షి, ఏప్రిల్ 15న జి.సిగ డాం మండలం సంతవురిటికి చెందిన బాలబొమ్మ భవాని (21), మే 7న కోటబొమ్మాళిలో లేడీస్కార్నర్ షాపు నిర్వహిస్తున్న నర్సిపురం లక్ష్మి (30), నవంబరు 20న నందిగాం మండలం శివరాంపురానికి చెందిన పుష్పలత నౌపడ 3 రోడ్ల కూడలిలో హత్యలకు గురయ్యారు. వీరంతా వారి వారి భార్యలు, భర్తల చేతుల్లోనే మరణించారు. వివాహేతర బంధాలు.. ● ఏప్రిల్ 19న పైడిభీమవరం కాజావారి కోనేరు గట్టు వద్ద ఓ యువతి (23), మే 17న సోంపేట మండలం పాలవలసకు చెందిన వ్యక్తి, జూన్ 1న అదే గ్రామానికి చెందిన మహిళ, ఆగస్టు 30న ఆమదాలవలస చంద్రయ్యపేటలో మహిళ(45) వివాహేతర బంధాలతోనే హత్యలకు గురయ్యారు. డిసెంబరు 2న శ్రీకాకుళం ఏఎస్ఎన్కాలనీకి చెందిన మహిళ(43) ఆస్పత్రికి వెళ్లి 2న అదృశ్యమై ఎచ్చెర్ల కేశవరావుపేట హైవే పక్కన 3న శవమైంది. వివాహేతర బంధమేనన్న చర్చ సాగుతుండగా పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. సొంత కుటుంబీకులే.. ● జూన్ 17న ఇచ్చాపురం మండవల్లికి చెందిన బర్రి గంగయ్యను తన అల్లుడు పాతిర్ల జీవన్రెడ్డి (దాసు) నడిరోడ్డుపై కత్తితో పొడిచి చంపేశాడు. ● అదే నెల 22న నందిగాం మండలం కామధేనుపురంకు చెందిన కిల్లి ధర్మారావు తన తమ్ముడు తవిటయ్యను గడ్డపారతో కొట్టి చంపేశాడు. 2025లో సిక్కోలును వణికించిన హత్యాకాండలు ఏడాదిలో దాదాపు 30 హత్యలు శాంతిభద్రతలను అదుపు చేయడంలో యంత్రాంగం విఫలం -
మద్యం మత్తు.. గ్రామ గొడవల్లో..
● మే 7న శ్రీకాకుళం రూరల్ మండలం ఇప్పిలికి చెందిన కన్నం నర్సింగరావు (58)తో పార్కింగ్ విషయంలో గొడవపడి పూటుగా మద్యం సేవించిన రమణ అర్ధరాత్రి నర్సింగరావు మేడపై నిద్రిస్తున్న సమయం చూసి పదునైన ఆయుధంతో పొడిచి చంపేశాడు. ● నవంబరు 24న టెక్కలి మేజరు పంచాయతీ గోపినాథపురానికి చెందిన కొమనాపల్లి పద్మనా భం గ్రామంలో వ్యక్తులే దాడి చేయడంతో చనిపోయాడు. ● సెప్టెంబరు 2న చిల్లంగి నెపంతో పలాస మండలం కేశుపురానికి చెందిన ఉంగ రాములు (80) అనే వృద్ధున్ని అదే గ్రామానికి చెందిన 8 మంది రాళ్లతో కొట్టి అతికిరాతకంగా చంపేశారు. 040302 02జనవరి ఆగస్టుసెప్టెంబరునవంబరు డిసెంబరు మార్చి ఏప్రిల్ ఫిబ్రవరి మే జూన్జూలై(ఇప్పటివరకు) -
సిక్కోలు లఘు చిత్రోత్సవాలు లోగో ఆవిష్కరణ
శ్రీకాకుళం కల్చరల్ : జిల్లా కేంద్రంలో త్వరలో జరగనున్న సిక్కోలు లఘు చిత్రోత్సవం–2025కు సంబంధించిన లోగోను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు ఆదివారం శ్రీకాకుళం ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్, ఎంసీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు మణిపాత్రుని నాగేశ్వరరావు, కార్యదర్శి తిరుమలరావు, ప్రసాద్, కీర్తి, రామకృష్ణ, రాము, మాదారపు వెంకటేశ్వరరావు, ఎస్.వి.రమణ మాదిగ, విశ్వేశ్వరరావు, డిప్యూటీ ఎంపీడీఓ కణితి సూర్యనారాయణ, ఎలయన్స్ క్లబ్ సభ్యులు జామి మన్మధరావు పాల్గొన్నారు. కూర్మనాథుని సన్నిధిలో హైకోర్టు రిటైర్డ్ జడ్జి గార: ఆదికూర్మ క్షేత్రం శ్రీకూర్మంలోని కూర్మనాథున్ని రాజస్థాన్ హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శంభాజీ షిండే ఆదివారం సతీసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికి అంతరాలయంలో పూజలు చేయించారు. ఈఓ టి.వాసుదేవరావు, ఆలయ ప్రధానార్చకులు సీహెచ్.సీతారామనృసింహాచార్యులు స్వామి చిత్రపటం, క్షేత్ర ప్రసాదాన్ని అందజేశారు బస్సు నుంచి జారిపడి వృద్ధురాలికి గాయాలు వజ్రపుకొత్తూరు రూరల్(పలాస): పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని చినబడాం బస్టాండ్ వద్ద ఆదివారం ఆర్టీసీ బస్సు నుంచి జారిపడి అంతరకుడ్డ గ్రామానికి చెందిన వృద్ధురాలు గొనప లక్ష్మీ గాయాలపాలైంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. లక్ష్మీ సోంపేటలోని బంధువుల ఇంటికి వెళ్లి స్వగ్రామం వచ్చేందుకు కాశీబుగ్గలో బస్ ఎక్కింది. అంతరకుడ్డ వెళ్లేందుకు చినబడాం బస్టాండ్ వద్ద దిగుతుండగా బస్సు ముందుకు కదలడంతో ప్రమాదవశాత్తు జారిపడింది. దీంతో గాయాలపాలైన లక్ష్మీని స్థానికులు పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆకట్టుకున్న వైజ్ఞానిక ప్రదర్శనలు టెక్కలి: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న ఆవిష్కర్ సీజన్–3 హాక్థాన్ సాంకేతిక కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు రూపకల్పన చేసిన వివిధ రకాల ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. సమాజ హితమైన ప్రాజెక్టులను రూపకల్పన చేసి వాటి ప్రయోజనాలను న్యాయ నిర్ణేతలకు వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వెబ్, యాప్ అభివృద్ధి, ఐఓటీ, డైటా సైన్స్ తదితర అంశాలతో రూపకల్పన చేసిన ప్రాజెక్టులు ఆలోచింపజేశాయి. ఎంపికై న ప్రాజెక్టుల నిర్వాహకులకు సోమవారం బహుమతులు అందజేయనున్నారు. గోల్ షాట్బాల్ పోటీల్లో ప్రతిభ కంచిలి: తమిళనాడు రాష్ట్రం తిరుచినాపల్లిలో ఈ నెల 25 నుంచి 28 వరకు నిర్వహించిన జాతీయస్థాయి థర్డ్ ఫెడరేషన్ కప్ గోల్ షాట్బాల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ మహిళా జట్టు విజేతగా నిలిచింది. కంచిలి మండలం జక్కర గ్రామానికి చెందిన బసవ శ్యామల ప్రతిభ కనబరిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. శ్యామల విజయనగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో పీఈటీ కోర్సు పూర్తి చేశారు. తల్లిదండ్రులు తరిణి–తులసి వ్యవసాయ కూలీలు. పోటీలో ప్రతిభ కనబరిచిన శ్యామలను జెడ్పీటీసీ ఇప్పిలి లోలాక్షి కృష్ణారావు, వైఎస్సార్ సీపీ నేతలు కప్పల యుగంధర్, మెండ ప్రకాశరావు, మురళి అభినందించారు. -
వైఎస్సార్ సీపీ అభిమానిపై దాడి
గార: మండలంలోని వాడాడ పంచాయతీ అచ్చెన్నపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ అభిమాని కంచు మధుసూదనరావుపై స్థానిక టీడీపీ కార్యకర్తలు దాడి చేయడంతో గాయాలపాలయ్యారు. బాధితుడు తెలిపిన వివరాలు ప్రకారం.. కంచు మధు ఓ ప్రైవేటు స్కూల్లో బస్ డ్రైవర్గా పనిచేస్తున్నారు. సెలవు కావడంతో ఆదివారం మధ్యాహ్నం ఇంటి బయట కూర్చుని ఉండగా స్థానికుడు శిమ్మ నవీన్తో మరో వ్యక్తి కవ్వించారు. అయినా పట్టించుకోలేదు. కాసేపటి తర్వాత చల్ల ప్రభాకర్, శిమ్మ గోవింద, శిమ్మ చంద్రశేఖర్, శిమ్మ ఆనంద్, శిమ్మ సోమేష్ అనే వ్యక్తు లు వచ్చి మధుసూదనరావుపై ఇనుప రాడ్లు, రాళ్లతో దాడి చేశా రు. దీంతో ఆయన స్పృహ కోల్పోయారు. ఆయన చిన్నాన్న వచ్చి 108లో మధుసూదనరావును రిమ్స్కు తరలించారు. వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకల్లో తన ఫొటో ఉందని, అందుకే కక్ష కట్టి దాడి చేశాడని బాధితుడు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సీహెచ్ గంగరాజు తెలిపారు. -
63 ఏళ్లలో ఆసక్తిగా..
ఈయన పేరు కె.ఎస్.ఎన్.మూర్తి. రిటైర్డ్ బ్యాంకు ఆఫీసర్. చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకోవాలనే ఆసక్తి ఉండేది. బ్యాంకులో ఉద్యోగం వచ్చాక సంగీతం కలగానే మిగిలిపోయింది. రిటైరయ్యాక సమయం దొరకడంతో ఇలిసిపురంలోని వాణీ సంగీత విద్యాలయంలో దుంపల ఈశ్వరరావు వద్ద సంగీత సాధన ఆరంభించారు. ఇప్పటికే వర్ణాలు, కొన్ని అన్నమయ్య కీర్తనలు నేర్చుకున్నారు. 63ఏళ్ల వయసులో అవిశ్రాంతంగా సాధన చేస్తున్నారు. కెఎస్ఎన్ మూర్తి, రిటైర్డ్ డిజిఎం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా -
పనస రైతు ఆశలు చిగురించేనా..?
వజ్రపుకొత్తూరు: ఉద్దానం రైతులు పనసపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. విశాఖపట్నం నుంచి ఇటు ఆంధ్రా–ఒడిశా బోర్డర్ పనస పంటకు ఆలవాలం. ఉద్దానంలో ఈ పంటను మిశ్రమ పంటగా 7812 ఎకరాల్లో 5 లక్షల చెట్లు వరకు సాగు చేస్తున్నారు. ఈ చెట్ల నుంచి ఏడాదికి 1.50 లక్షల టన్నుల పచ్చి కా యలు దిగుబడికి వస్తాయి. ప్రస్తుతం చెట్లు పూత, పిందె దశలో ఉన్నాయి. పూర్తి స్థాయిలో దిగుబడులు వస్తే గనక జిల్లా నుంచి మఖరాంపురం, హరిపురం, కంచిలి, పలాస, పూండి ప్రాంతాల నుంచి ఒడిశా, కోల్కత్తా, అస్సోం, వారణాశి, చత్తీస్గఢ్, బీహార్ తదితర రాష్ట్రాలకు తరలిస్తారు. రోజుకు 350 టన్నుల వరకు ఎగుమతి చేస్తారు. ఇక పోతే కోల్కతా నుంచి బంగ్లాదేశ్కు సైతం ఉద్దానం పనస వెళ్తుంది. అక్కడ చిన్న తరహా పరిశ్రమల్లో చిప్స్, పకోడి ప్యాకెట్లుగా తయారు చేసి మార్కెట్ చేస్తున్నారు. యాజమాన్య పద్ధతులే కీలకం.. డిసెంబర్– జనవరి నెలల్లో పూత నుంచి పిందె దశ ప్రారంభమవుతుంది కాబట్టి ఆడ పుష్పాలు కొమ్మ, కాండంపై వస్తా యని ఉద్యానవన శాఖ అధికారి సీహెచ్ శంకర్దాస్ తెలిపారు. ప్రస్తుతం మంచు, చలి తీవ్రత అధికంగా ఉన్న నేప థ్యంలో పిందె, పువ్వు మధ్య నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. ఈ సీజన్లో ఎస్ఏఏఎఫ్( సాఫ్) పౌడర్లో కార్బండిజమ్, మాంకోజెబ్ కలిపి లేకా డైతేన్ ఎం–45ను లీటరు నీటికి గ్రామున్నర కలిపి కాండం, పూత, పిందెలపై పిచికారీ చేస్తే మంచిదని సూచించారు. కొమ్ము, కాయతొలుచు పురుగు, పిండినల్లి ఆశించి ఎండు తెగులు సైతం సోకుతుంది కాట్టి నిత్యం క్షేత్ర సందర్శన చేయాలన్నారు. మార్కెట్ లేక.. మన ఉద్దానంలో పండే పంటలకు మార్కెట్ కరువనే చెప్పాలి. రైతు కష్టం దళారుల భోజ్యం చేస్తున్నారు. తక్కువ ధర కట్టి ఎక్కువ లాభాలు ఆర్జించి ఈశా న్య రాష్ట్రాలకు తరలిస్తున్నారు. కానీ వాటిని మార్కెట్ చేసి, ప్రాసెసింగ్ చేసే వ్యవసాయాధారిత పరిశ్రమలు మన రాష్ట్రంలో లేకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలు చవి చూస్తున్నారు. చిప్స్, పకో డీ, పనస తాండ్ర లాంటి ఉత్పత్తులకు అవసరమైన కుటీర, చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేస్తే రైతులు లాభాలు ఆర్జించడమే కాకుండా ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వర్షాలు అనుకూలించడంతో దిగుబడిపై అంచనాలు జిల్లాలో 7812 ఎకరాల్లో మిశ్రమ పంటగా పనస ఏటా రూ.1.50లక్షల టన్నుల దిగుబడి మార్కెట్ లేక నష్ట పోతున్న రైతు ఆధారిత పరిశ్రమలు కరువు -
రేషన్ బియ్యం స్వాధీనం
రణస్థలం: లావేరు మండలంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని లావేరు ఎస్సై కె.అప్పలసూరి పట్టుకున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రేగపాలెం గ్రామం వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా లగేజీ వ్యాన్ను అడ్డుకున్నారు. రణస్థలం మండలం సూరంపేట నుంచి వస్తున్న ఈ వాహనంలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించి డ్రైవర్ గొరంటి గణేష్ను అదుపులోనికి తీసుకుని లావేరు పోలీస్ స్టేషన్కు తరలించారు. రణస్థలం సివిల్ సప్లయ్ డీటీ వై.అరుణ పరిశీలించగా 45 బస్తాల్లో 22.50 క్వింటాళ్ల బియ్యం ఉన్నట్లు గుర్తించారు. 6ఏ కేసు నమోదు చేశారు. వాహనం సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై అప్పలసూరి చెప్పారు. ఎచ్చెర్ల మండలం అల్లినగరం గ్రామానికి చెందిన డ్రైవర్ గణేష్ ఈ బియ్యాన్ని శ్రీకాకుళం తరలిస్తున్నాడని, పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఉన్నతాధికారులకు తెలియజేస్తామని అధికారులు వెల్లడించారు. -
దళిత వ్యక్తిపై దాడికి యత్నం
● మద్యం మత్తులో వాగ్వాదం చేసిన టీడీపీ వర్గీయులు శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని శ్రీశయన వీధి లో ఓ దళిత వ్యక్తిపై టీడీపీకి చెందిన రెడ్డి సూర్యనారాయణ మరికొందరు వ్యక్తులు దాడికి యత్నించారు. స్థానికులు, బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. నూతలపాటి శరత్భూషణ్రాజు తన కుటుంబంతో కలసి అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. ఆదివారం రాత్రి రెడ్డి సూర్యనారాయణ అనే టీడీపీ నాయకుడు మద్యం మత్తులో శరత్భూషణ్ ఇంటికి వెళ్లి ఇంటిముందున్న క్రిస్మస్ స్టార్ తీసేయాలని కులాన్ని దూషిస్తూ తీవ్ర పదజాలంతో తిట్టాడు. తీయనని చెప్పడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వా దం జరిగింది. ఆపై తోసుకోవడం, శరత్భూషణ్ సూర్యనారాయణను చెంపదెబ్బ కొట్టడంతో గొడవ మరింత ముదిరింది. సూర్యనారాయణ అనుచరులు వచ్చి శరత్భూషణ్ తలపై, పొట్టపై పిడిగుద్దులు గుద్దడంతో కుటుంబ సభ్యు లు అతడిని రిమ్స్కు తరలించారు. ఈలోగా ఓ 20 మంది వరకు ఎమర్జెన్సీ వార్డుకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్న శరత్భూషణ్ను మంచంపైనుంచి కిందకు లాగేయడం, చంపుతామని బెదిరించడం వంటివి చేశారు. ఇదంతా అక్కడి సీసీ ఫుటేజీ నిక్షిప్తమైంది. ఎస్పీకి సైతం సమాచారం అందడంతో రెండో పట్టణ పోలీసులు అప్పటికే ఆస్పత్రికి చేరుకున్నారు. ఇదే విషయమై రెండో పట్టణ పోలీసుల వద్ద ప్రస్తావించగా ఇంకా కేసు నమోదు చేయలేదన్నారు. -
పెట్రోల్ బంక్ యజమానికి రూ.50వేలు అపరాధ రుసుం
మెళియాపుట్టి: చాపరలోని కృష్ణకామాక్షి ఫిల్లింగ్ స్టేషన్ (ఇండియన్ ఆయిల్) పెట్రోల్ బంక్ యజమానికి రూ.50వేలు అపరాధ రుసుం విధించినట్లు శ్రీకాకుళం జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇటీవల జలక లింగుపురం గ్రామానికి చెందిన నడిమింటి ఉమాపతి అనే వ్యక్తి 40 లీటర్ల పెట్రోల్ కొట్టించాడు. అయితే చెల్లించిన సొమ్ము కంటే 4 లీట ర్ల పెట్రోల్ తక్కువగా వచ్చింది. దీంతో ఆయ న రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దాంతో తూనికలు కొలతల శాఖ అధికారులు పరిశీలించి జేసీకి నివేదించారు. అందులో భాగంగానే ఈ అపరాధ రుసుం విధించినట్లు అధికారులు తెలిపారు. ఉత్సాహంగా ఓపెన్ చెస్ టోర్నీ శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి ఓపెన్ ఫెస్టివల్ చెస్ టోర్నమెంట్ ఉత్సాహంగా సాగింది. శ్రీకాకుళం నగరంలోని ఇలిసిపురం ప్రాంతంలో గల తిలక్నగర్ నర్సెస్ కాలనీలోని స్కూల్ ఆఫ్ చెస్ ఆకాడమీలో క్రిస్మస్ ఫెస్టివల్ ను పురస్కరించుకుని ఆదివారం 209వ చెన్ టోర్నీని నిర్వహించారు. ఐదు రౌండ్ల పాటు జరిగిన చెస్ పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి చెస్ క్రీడాకారులు ఆసక్తిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాకుళం జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్, సంజీవయ్య మెమోరియల్ ట్రస్టు ప్రెసిడెంట్ డాక్టర్ గంజి ఆర్ ఎజ్రా మాట్లాడుతూ నిరంతరం చెస్ క్రీడ సాధనతో మెదడు పదునెక్కుతుందని, తద్వారా చదువులో కూడా రాణించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. అనంతరం విజేతలకు మెడల్స్, ట్రోఫీలు, సర్టిఫికెట్లు, బహు మతులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ చెస్ అకాడమీ కోచ్ భేరి చిన్నారావు, చెస్ కోచ్ కె.సాయినిరంజన్ సింగ్, చెస్ క్రీడాకారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ‘కళారంగాన్ని కాపాడుకోవాలి’ కొత్తూరు: సమాజంలో అంతరించిపోతున్న కళారంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజ లు, ప్రభుత్వాలపై ఉందని పద్మశ్రీ అవార్డు గ్రహీత యడ్ల గోపాలరావు అన్నారు. కొత్తూరు మండలం మెట్టూరు బిట్–3 ఆర్ఆర్ కాలనీలో గుర్రం జాషువా 129వ జయంతి సందర్భంగా కొత్తూరు మండలం గుర్రం జాషువా కళాపీఠం ఆధ్వర్యంలో కళాపీఠం అధ్యక్షుడు గేదెల సుందరనారాయణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముందుగా గుర్రం జాషువా చిత్రపటం వద్ద యడ్ల గోపాలరావు, ప్రముఖ కళాకారురాలు మంగమ్మ, సర్పంచ్ కొయిలాపు శ్రీనివాసరావు తదితరులు నివాళులర్పించారు. హరికథలు, బుర్రకథలు వంటివి రామాయణ భారతాల్లోని ధర్మాన్ని సామాన్యులకు వివరిస్తాయ ని తెలిపారు. సర్పంచ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ గుర్రం జాషువా కళారంగానికి చేసిన సేవలను వివరించారు. ఈ సందర్భంగ అఖిల ప్రజా కఽళాకారుల సంక్షేమ సంఘం(ఏపీకేఎస్ఎస్) 2026 క్యాలెండర్ను ఆవిష్కరించారు. -
ఐక్యతతోనే యాదవుల అభివృద్ధి సాధ్యం
గార: జిల్లాలోని యాదవులంతా ఐక్యతగా ఉన్నప్పుడే రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధ్యమవుతుందని యాదవ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నర్తు నరేంద్రయాదవ్ అన్నారు. ఆదివారం అంపోలు జిల్లా జైలు సమీపంలోని వెలమ సంక్షేమ సంఘ కార్యాలయం ఆవరణలో జిల్లా యాదవుల వనభోజన కార్యక్రమం వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆయన మాట్లాడుతూ బీసీ–డీలో ఉన్న యాదవులను బీసీ–ఏ లేదా బీలో చేర్చేలా అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. యాదవ సంక్షేమ సంఘానికి మూడు ఎకరాల స్థలాన్ని మంజూరు చేసేలా ప్రయత్నం చేద్దామన్నారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా తప్పెటగుళ్ల ప్రదర్శన, జిల్లాస్థాయి సంగిడీ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో గద్దిబోయిన కృష్ణారావు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పాలిన శ్రీనివాసరావు, ఇచ్ఛాపురం మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఉలాల భారతి దివ్య, ఎంపీపీలు డొక్కరి దానయ్య, ఉంగ సాయి, కుజ్జ తాతయ్య, సబ్బి జానకీరామ్, డాక్టర్ నర్తు శేషగిరి, కలగ జగదీష్, జన్నెల రవికుమార్, గొర్లె రమణమూర్తి, ఇప్పిలి జగదీష్, కొరాయి వాసు తదితరులు పాల్గొన్నారు. -
క్రిస్మస్ సెలవులకు వెళ్లి వస్తుండగా..
కంచిలి: మండల కేంద్రం కంచిలిలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాల, కళాశాలలో పదో తరగతి చదువుతున్న మట్టా ప్రణీత్కుమార్(15) ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. జలంత్రకోట కూడలి వద్ద జాతీయ రహదారిపై లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందగా.. తండ్రి గాయాలపాలయ్యాడు. క్రిస్మస్ సెలవుల కోసం సోంపేట మండలం మామిడిపల్లిలోని తన ఇంటికి వెళ్లి తండ్రి హేమంత్రావుతో కలిసి ద్విచక్ర వాహనంపై స్కూల్కు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, ప్రణీత్కుమార్ తండ్రి ఫాస్ట్ఫుడ్ సెంటర్ నడుపుతున్నారు. పెద్ద కుమారుడు హైదరాబాద్లో పనిచేస్తుండగా, చిన్న కుమారుడు కంచిలి గురుకుల పాఠశాలలో చదువుతున్నాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విద్యార్థి మృతిపై గురుకుల ప్రిన్సిపాల్ పేడాడ శ్రీనివాసరావు, అధ్యాపక, ఉపాధ్యాయ సిబ్బంది ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాగా, ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
వైద్యం..సంగీతం
ఈమె పేరు డాక్టర్ పి.మాలతి. జిల్లాలో ప్రముఖ గైనకాలజిస్టుల్లో ఒకరు. సంగీత దర్శకుడు బండారు చిట్టిబాబు వద్ద ఆరేళ్లుగా లలితగీతాలు పాడటం నేర్చుకుంటున్నాను. ఒకసారి రేడియోలో పాడేందుకు అవకాశం వచ్చినా విఫలం కావడంతో ఎలాగైనా బెస్టు అనిపించుకోవాలని శాసీ్త్రయ సంగీతాన్ని మావుడూరు జగన్నాధశర్మ వద్ద శిక్షణ పొంది విజయం సాధించారు. ఇప్పుడు వేదికలపై కూడా ఆలపిస్తున్నారు. వైద్య వృత్తిలో ఏమాత్రం ఖాళీ దొరికినా సంగీత సాధన చేస్తుంటారు. –డాక్టర్ మాలతి. గైనకాలజిస్టు -
డీటీఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ
శ్రీకాకుళం: డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్–2026 క్యాలెండర్లు, డైరీలను ఫెడరేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు కోత ధర్మారావు, జిల్లా అధ్యక్షుడు పూజారి హరిప్రసన్న ఆవిష్కరించారు. శ్రీకాకుళం రైతు బజార్ కూడలిలోని విశ్రాంత ఉద్యోగుల భవనం ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హరిప్రసన్న మాట్లాడుతూ వృత్తి నిబద్ధత, సామాజిక బాధ్యతతో డీటీఎఫ్ పనిచేస్తుందన్నారు. ఉమ్మడి పోరాటాలకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని తెలిపారు. వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేసి తక్షణమే మధ్యంతర భృతి ప్రకటన చేయాలని, ఉపాధ్యాయ సమస్యలపై ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. కార్యక్రమంలో శ్రీకాకుళం, ఐటీడీఏ సంఘ ఇన్చార్జిలు రమణమూర్తి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఔషధ నిల్వ కేంద్రం తనిఖీ గార: గార పీహెచ్సీలోని ఔషధ నిల్వ కేంద్రాన్ని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి అనిత ఆదివారం తనిఖీ చేశారు. ముందుగా రోగుల ఓపీ రిజిస్టర్, మందుల నిల్వలను పరిశీలించారు. వైద్యాధికారులు 24 గంటలూ అందుబాటులో ఉండాలని, అత్యవసర మందులు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ రమ్య, డాక్టర్ సోనియా, ఫార్మాసిస్టు సత్యభామ పాల్గొన్నారు. -
దివ్యాంగుల హక్కులను పరిరక్షించాలి
వజ్రపుకొత్తూరు రూరల్(పలాస): దివ్యాంగుల హక్కుల పరిరక్షణ, సమాన అవకాశాల కల్పనకు ఉద్దేశించిన వికలాంగుల హక్కుల(ఆర్పీడబ్లూడీ) చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని దివ్యాంగుల హక్కుల సాధన కమిటీ జిల్లా అధ్యక్షుడు ఆవుల వేణుగోపాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.మోహన్రావు డిమాండ్ చేశారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యాంగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలన్నింటినీ గ్రామ సచివాలయాల ద్వారా అందించాలన్నారు. రిజర్వేషన్లు పక్కాగా అమలు చేయాలన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా సుస్థిర అవకాశాలను కల్పిచాలని కోరారు. కార్యక్రమంలో సాధన కమిటీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సంపతిరావు లక్ష్మీ, పలు మండలాల అధ్యక్ష కార్యదర్శులు బి.యర్రన్నాయుడు, డి.రమణమూర్తి, కె.చంద్రశేఖరరావు, పి.జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు. -
లీజు ముప్పు!
నౌపడ ఉప్పు.. ● భూముల లీజును పునరుద్ధరించని కేంద్ర ప్రభుత్వం ● సాగుకు దూరమవుతున్న ఉప్పు రైతులు ● వలసబాటలో కార్మికులు సంతబొమ్మాళి : నవరుచులకు తల్లి నౌపడ ఉప్పు గల్లి అనే నానుడి నేడు కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చింది. ఉప్పు భూముల లీజును కేంద్ర ప్రభుత్వం రెన్యువల్ చేయకపోవడంతో సాగు విస్తీర్ణం క్రమేపి తగ్గిపోయి పరిశ్రమ అంతరించే స్థితికి చేరుకుంది. గతంలో ఉప్పు దిగుబడి లక్షల టన్నుల్లో ఉంటే నేడు వేలకు పడిపోయింది. గతంలో మూడు వేలకు పైగా ఎకరాల్లో ఉప్పు విస్తీర్ణం చేయగా నేడు సగానికి పడిపోయింది. సంతబొమ్మాళి మండలంలోని నౌపడ, పాలనాయుడుపేట, కె.లింగూడు, సీతానగరం, మూలపేట, మర్రిపాడు, భావనపాడు, సెలగపేట, ఆర్.సున్నాపల్లి, యామలపేట, కేశునాయుడుపేట గ్రామాలకు చెందిన రెండు వేలు కుటుంబాలు ఆధారపడి జీవనం సాగించేవి. ప్రస్తుతం ఉత్పత్తి తగ్గి ఉప్పు రైతులు, కార్మికులు వలస బాటపడుతున్నారు. ఈ ప్రాంతంలోని ఉప్పు భూములు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండటంతో వాటిని సన్నకారు, చిన్నకార రైతులు సాగుచేసేవారు. ఈ లీజు 2018తో ముగిసిపోయింది. లీజును పునరుద్ధరించాలని పలుమార్లు ఈ ప్రాంత రైతులు కేంద్ర ప్రభుత్వ అధికారులకు వినతులు అందించారు. ఈ నేపథ్యంలో భూముల లీజుకు సంబంధించి 2020లో కేంద్రం సబ్ కమిటీ వేసింది. ఈ ప్రాంతంలోని ఉప్పు భూములను పరిశీలించి కేంద్రానికి నివేదిక ఇచ్చింది. అయినా నేటి వరకు లీజును అధికారులు పునరుద్ధరించలేదు. దీంతో ప్రస్తుతం ఉప్పు పంట 1500 ఎకరాల్లో మాత్రమే సాగు అవుతోంది. పనులు లేక ఉప్పురైతులు, కార్మికులు వలసబాట పడుతున్నారు. గతమెంతో ఘనం.. నౌపడ ఉప్పు పరిశ్రమ ఒకప్పుడు ఉత్పత్తిలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో, దేశంలో రెండో స్థానంలో ఉండేది. రైతులు ప్రతి ఏటా డిసెంబర్లో ఉప్పు సాగును ప్రారంభించి జూలై మొదటి వారం వరకు కొనసాగించేవారు. ప్రతి 40 రోజులకు ఒక సారి దిగుబడి వచ్చేది. ఆ సమయంలో ఇక్కడ ఎంతో సందడిగా ఉండేది. ఇక్కడి నుంచి రైల్వే వ్యాగన్ల ద్వారా ఒడిశా, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు ఉప్పు రవాణా జరుగుతుండేది. రైల్వే రవాణా ఖర్చులు తక్కువగా ఉండటంతో అప్పట్లో రైతులకు ఉప్పుసాగు లాభదాయకంగా ఉండేది. అయితే ఈ ప్రాంతంలో రైల్వే లైన్ తొలగించడంతో నౌపడ ఉప్పు రైతులకు కష్టాలు మొదలయ్యాయి. రోడ్డు మార్గం ద్వారా ఉప్పును రవాణా చేయడంతో ఖర్చులు పెరిగాయి. అయినా రైతులు సాగుకు వెనుకడుగు వేయలేదు. భూముల లీజును కేంద్రం రెన్యువల్ చేయకపోవడం వల్లే సమస్య మొదలైంది. కొంతమంది రైతులు ఉప్పు సాగుకు దూరమై కుటుంబాలతో వలస బాటపట్టారు. ఫలితంగా ఉప్పు పరిశ్రమ ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. మరోవైను ఉప్పు భూములు మూలపేట పోర్టుకు అప్పగించడంతో ఆయా భూముల్లో పరిశ్రమల స్థాపనకు పలుమార్లు అధికారులు పరిశీలించడంతో ఉప్పు సాగు ప్రశ్నార్థకంగా మారిందని ఉప్పు సంఘ నాయకులు, రైతులు అంటున్నారు. నవరుచులు అందించే నౌపడ ఉప్పు పరిశ్రమ నేడు అంతరించే స్థాయికి చేరుకోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా పాలకులు స్పందించి లీజును పునరుద్ధరించాలని వారంతా విజ్ఞప్తి చేస్తున్నారు. తరతరాలుగా ఉప్పును సాగుచేస్తూ కుటుంబాలతో జీవనం సాగిస్తున్నాం. ఉప్పు పంటకు ధర ఉన్నా లేకపోయినా దీనినే నమ్ముకున్నాం. నేడు ఉప్పు పంట సాగు ప్రశ్నార్థకంగా మారడంతో వలసబాటపట్టాల్సి వస్తోంది. ఉప్పు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. – కర్రి భాస్కరరావు, ఉప్పు రైతు, నౌపడ ఉప్పు భూముల లీజును కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరిస్తేనే ఈ ప్రాంతంలో ఉప్పు పరిశ్రమకు పూర్వ వైభవం వస్తుంది. 2018తో లీజు పూర్తయి తర్వాత కేంద్రం సబ్ కమిటి వేసినా ఇంతవరకు చర్యలు లేవు. నౌపడ ఉప్పు పరిశ్రమ పరిరక్షణ కోసం కేద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. – పిలక రవికుమార్రెడ్డి, కార్యదర్శి, సన్నకార ఉప్పు ఉత్పత్తిదారుల సంఘం, నౌపడ నౌపడలో అరకొరగా ఉప్పు మడులు


