breaking news
Srikakulam
-
అంపశయ్యపై ఆశల దీపం
● అరుదైన మెనింజైటీస్తో బాధపడుతున్న విద్యార్థిని ● దాతల సాయం కోసం కుటుంబ సభ్యుల వేడుకోలు సోంపేట: అల్లారు ముద్దుగా పెంచుకున్న అమ్మాయి.. ఆస్పత్రిలో అచేతన స్థితిలో పడి ఉంది. సుమారు 15 రోజుల క్రితం వచ్చిన జ్వరం ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది. పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధిస్తానని చెప్పిన విద్యార్థిని మృత్యువుతో పోరాడుతుంది. తల్లిదండ్రులు తమ కుమార్తెను కాపాడుకోవడానికి దాతలు కోసం ఎదురు చూస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని ఇసకలపాలేం గ్రామానికి చెందిన మాచర్ల అప్పారావు కుమార్తె ఎస్.హేమలత, బాబురావు దంపతులు ఒడిశా రాయగడలోని జేకేపూర్లో నివాసం ఉంటున్నా రు. వీరి కుమార్తె తేజస్విని ప్రస్తుతం పదో తరగ తి చదువుతోంది. ఎంతో సాఫీగా సాగుతున్న వారి జీవితంలోకి సుమారు 15 రోజుల క్రితం పిడుగులాంటి కష్టం వచ్చింది. విద్యార్థిని జ్వరంతో బాధపడుతూ కోమాలోకి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు వైద్య పరీక్షలు చేయించగా అరుదైన మెనింజైటీస్ వ్యాధిగా నిర్ధారణ అయ్యింది. దీంతో విశాఖపట్నంలోని ఒక ప్రైవే టు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే విద్యార్థిని చికిత్స కోసం సుమారు రూ.5 నుంచి రూ.6 లక్షలు ఖర్చు అవుతాయని వైద్యులు తెలి యజేయడంతో కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. కూలి చేస్తేగానీ కడుపు నింపుకోలేనివారు అంత డబ్బు సమకూర్చలేక కన్నీ టి పర్యంతమవుతున్నారు. దాతలు దయచూపి తమ కుమార్తె వైద్యానికి సాయం చేయాలని వేడుకుంటున్నారు. సాయం చేసేవారు 95333 41833 నంబర్ను సంప్రదించాలని కోరుతున్నారు. -
ఊరెళ్తున్నారా.. ఊడ్చేస్తారు..!
● సంక్రాంతి సమయంలో దొంగల బెడద ● ఊరెళ్తే పోలీసులకు సమాచారమివ్వండి ● ఎల్హెచ్ఎంఎస్తో మీ ఇల్లు సురక్షితం ● జిల్లావ్యాప్తంగా 119 పోలీసు బీట్లతో నిఘా శ్రీకాకుళం క్రైమ్/ఇచ్ఛాపురం రూరల్: సంక్రాంతి పండగ వస్తుందంటే చాలు చాలామంది ఊళ్లకు వెళ్తుంటారు. ఈనెల 10 నుంచి 18వ తేదీ వరకు పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. విధులు, ఉపాధి నిమిత్తం పట్టణాల్లో ఉండేవారు వారివారి ఇళ్లకు తాళాలు వేసి సొంత గ్రామాలకు వెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. ఇదే అదునుగా దొంగలు ఇళ్లల్లో చొరబడే ప్రమాదముంది. అందువలన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు హితవు పలుకుతున్నారు. రెండేళ్లుగా చూసుకుంటే జిల్లాను గజ దొంగలు హడలెత్తించారు. భారీ చోరీలతో విరుచుకుపడ్డారు. ఏకంగా 800పైగా ప్రాపర్టీ నేరాలు చేశారంటే ఏ స్థాయిలో రెచ్చిపోయారో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా తాళాలు వేసిన ఇళ్లల్లోనే ఎక్కువ చోరీలు జరిగాయి. అందువలన క్యాంపులకు వెళ్లేవారు పోలీసులకు ముందస్తుగా సమాచారమిచ్చి ఎల్హెచ్ఎంఎస్ సేవలు వినియోగించుకుంటే, ఇల్లు మరింత సురక్షితంగా ఉంటుందని పోలీసులు అంటున్నారు. జిల్లావ్యాప్తంగా 119కు పైగా నైట్బీట్ బృందాలతో పాటు డివిజనల్ స్థాయి అధికారులు, సీఐలు, ఎస్ఐలనే కాకుండా ప్రత్యేక కార్య, నేర బృందాలను, పెట్రోలింగ్ పార్టీలను సైతం జిల్లా ఉన్నతాధికారి అలెర్ట్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. స్వగ్రామాలకు, క్యాంపులకు వెళ్లేముందు ఇంటికి తాళాలు వేసేటప్పుడు పక్కింటివారికి సమాచార మిచ్చి కాస్తా ఇల్లు చూడమని చెప్పాలి. ఎక్కువ రోజులు బయటకు వెళ్తే సమాచారా న్ని దగ్గరలో ఉన్న పోలీస్స్టేషన్కు గానీ, సచివాలయ పోలీసులకు గానీ తెలియపర్చాలి. ఎల్హెచ్ఎంఎస్ ద్వారా వీరికి భద్రత కల్పి స్తారు. ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. అపార్ట్మెంట్స్ ఇన్గేట్, ఔట్గేట్ల వద్దే కాకుండా బయట కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవాలి. వాచ్మెన్ తప్పనిసరి. అపరిచిత వ్యక్తులు తారసపడితే 100కు గానీ, 112కు గానీ డయల్ చేసి పోలీసులకు తెలియజేయాలి. మంచినీళ్ల కోసం, సాయం కోసం వచ్చేవారు అనుమానాస్పదంగా ఉంటే తలుపులు తీయ కుండానే మాట్లాడి పోలీసులకు ఫోన్ చేయాలి. ఆటోల్లో, బస్సుల్లో ప్రయాణించేటప్పుడు విలువైన బంగారం, నగదు బ్యాగుల్లో భద్రపరిచి గమనిస్తుండాలి. ముఖ్యంగా వృద్ధులు, ఒంటరి మహిళలు ప్రయాణించేటప్పుడు నగలు ఏమీ ధరించకుండా, బ్యాగుల్లో పట్టుకోకుండా జాగ్రత్తపడాలి. షాపింగ్ చేసేటప్పుడు ప్రజలు తమ బ్యాగు లు, పర్సులు ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి. జేబు దొంగలుంటారు. ద్విచక్ర వాహనాలకు, కార్లకు హ్యాండ్ లాక్ వేసుకోవాలి. దూర ప్రాంతాలకు వెళ్లేవారు ఆభరణాలు, నగదు, విలువైన డాక్యుమెంట్స్ బ్యాంకుల్లో భద్రపరుచుకోవాలి. వెళ్లేముందు పోలీసులకు చెప్పి ఎల్హెచ్ఎంఎస్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. సీసీ కెమెరాలు అమర్చి ఇంటి యజమాని మొబైల్కు, పోలీస్ కంట్రోల్ రూమ్కు జీపీఎస్ ద్వారా అనుసంధానం చేస్తాం. పరిసరాల్లో పోలీస్ బీట్ పెడతాం. ఇప్పటికే సబ్ డివిజన్ పరిధిలో 45 పోలీస్ బీట్లు పెట్టాం. స్పెషల్ పెట్రోలింగ్ పార్టీలు తిరుగుతాయి. ఎస్పీ ఆదేశాలతో అవసరం మేరకు మరిన్ని పెంచుతాం. నగరంలో షాపింగ్ మాల్స్, ఇతర దుకాణ సముదాయాల వారు బయట సీసీ కెమెరాలు తప్పనిసరిగా పెట్టుకోవాలి. – సీహెచ్ వివేకానంద, డీఎస్పీ, శ్రీకాకుళం -
వ్యక్తి ఆత్మహత్య
రణస్థలం: మండలంలోని మెంటాడ గ్రామానికి చెందిన సాడి సూరిరెడ్డి (33) ఇంటి దగ్గర విషం తాగి ఆత్మహత్యకు పాల్పడి, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు జేఆర్పురం పోలీసులు తెలిపారు. చెడు వ్యసనాలకు బానిసై తరుచూ ఇంటి వద్ద గొడవపడుతున్న సూరిని శనివారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో మనస్థాపానికి గురై పాయిజిన్ తాగా డు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని ఆటోలో రణస్థలం సీహెచ్సీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడికి భార్య హేమలత, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు జేఆర్పురం ఎస్ఐ ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
టెక్కలిలో మాజీ మంత్రి ధర్మాన పర్యటన
టెక్కలి: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు శనివారం టెక్కలి మండలంలో పర్యటించారు. దీంట్లో భాగంగా టెక్కలి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ముందుగా వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్, జెడ్పీటీసీలు దువ్వాడ వాణి, పాల వసంత్రెడ్డి, ఎంపీపీలు ఆట్ల సరోజనమ్మ, నడుపూరు శ్రీరామ్ముర్తి తదితరులు తెంబూరు రోడ్డులో స్వాగతం పలికారు. అనంతరం రాధావల్లభాపురం గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకుడు కిల్లి అజయ్కుమార్ ఇంటికి వెళ్లారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్షపూరితంగా క్రషర్ మూసివేతపై మాజీ మంత్రి ఎదుట బాధిత యజమాని అజయ్కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఇటీవల విశాఖపట్టణం సాక్షి రిపోర్టర్ దుక్క మురళీకృష్ణారెడ్డి మృతి చెందడంతో వారి కుటుంబాన్ని, టెక్కలి దివంగత మాజీ ఎంపీపీ తిర్లంగి జానకిరామయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం జెడ్పీటీసీ దువ్వాడ వాణి ఇంట్లో నాయకులు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. కార్యక్రమంలో మండల కన్వీనర్లు హెచ్.వెంకటేశ్వరరావు, ఎస్.హేమసుందర్రాజు, టి.పాల్గుణరావు, మాజీ ఎంపీపీ సంపతిరావు రాఘవరావు, నాయకులు కుర్మాన బాలకృష్ణ, సత్తారు సత్యం, అన్నెపు రామారావు, టి.కిరణ్, వై.చక్రవర్తి, కె.ధర్మారావు, జి.గురునాథ్ యాదవ్, ఆర్.మల్లయ్య, ఎన్.భీమారావు, వై.మన్మథరావు, కె.రవికుమార్గాంధీ, ఎస్.ఉషారాణి, ఎ.రాహుల్, రాములమ్మ, పి.లక్ష్మి పి.రవికుమార్రెడ్డి, కె.జీవన్, ఆర్.జయమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
విస్తృతంగా ఎకై ్సజ్ దాడులు
పాతపట్నం: ఆంధ్రా – ఒడిశా సరిహద్దులో అక్రమంగా నిర్వహిస్తున్న సారా తయారీ కేంద్రాలపై ఆంధ్ర, ఒడిశా ఎకై ్స జ్ అధికారులు రెండో రోజు శనివారం విస్తృతంగా దాడులు నిర్వహించారు. టెక్కలి, పలాస, మెళియాపుట్టి మండలాలకు అనుకుని ఉన్న ఒడిశా రాష్ట్రం గారబంద పోలీసుస్టేషన్ పరిధిలోని గ్రామాలైన గోట్టయి, రామచంద్రాపూర్లు, కాశీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని శిరడా తదితర పరిసరాల్లో 1,070 లీటర్ల నాటుసారా, 14,100 లీటర్ల బెల్లపు ఊటలను గుర్తించి ధ్వంసం చేశారు. అలాగే భారీగా తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పాతపట్నం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ కోట కృష్ణారావు తెలిపారు. సారా తయారీ, విక్రయాలు చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాడుల్లో శ్రీకాకుళం అసిస్టెంట్ కమిషనర్ పి.రామచంద్రరావు, పి.మురళీ, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి తిరుపతినాయుడు, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరిటెండెంట్ రామచంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఒక్క పైసా ఇవ్వకుండా..
గత ఏడాది మూడు రోజుల రథసప్తమి వేడుకలకు ప్రభుత్వం ఒక్క పైసా విడుదల చేయలేదు. రాష్ట్ర పండగగా ప్రకటిస్తూ జీఓ ఇచ్చి చేతులు దులుపుకుంది. కార్పొరేషన్ నిధులతో గత ఏడాది హడావుడి చేసింది. రాజకీయంగా మైలేజ్ పొందడానికి ప్రయత్నించింది. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి పునరావృతమైంది. ఈ సారి వారం రోజుల ఉత్సవాలకు అనుమతి ఇచ్చింది. కానీ, ఒక్క పైసా విడుదల చేస్తున్నట్టు ప్రకటించలేదు. దీంతో మళ్లీ కార్పొరేషన్ నిధులపైన, నగరంలోని దాతలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురాకుండా లోటు బడ్జెట్ ఉన్న కార్పొరేషన్ నుంచి ఖర్చు పెట్టి గొప్పలు చెప్పుకోవాలని నేతలంతా చూస్తున్నారు. ఈ ప్రయత్నాలన్నీ నాయకులకు బాగానే ఉన్నా అధికారులకు ఇబ్బందికరంగా మారింది. ఇలాగైతే కష్టమని అన్నందుకు ఏకంగా కమిషనర్పై బదిలీ వేటు వేసినట్టు చర్చ జరుగుతోంది. రథసప్తమి వేడుకలకు ముందు నగరంలో అనుభవం ఉన్న అధికారి ఉండాలి. అలాంటిది మరో 15 రోజుల ఉత్సవాలు ఉండగా బదిలీ జరిగిందంటే రాజకీయంగా మాట వినడం లేదన్న కారణమై ఉండవచ్చనే వాదనలు విన్పిస్తున్నాయి. మరోవైపు మున్సిపల్ ఇంజినీర్ (ఎం.ఈ) శ్రీనివాసరావు రథసప్తమి పనులు, స్థానిక నాయకుల ఒత్తిడి తట్టుకోలేక సెలవుపై వెళ్లిపోయారు. తిరిగి విధుల్లో చేరుతారో లేదో అన్న అనుమానాలు వ్య క్తం అవుతున్నాయి. ఇంజినీరింగ్ విభాగంలోనే డీఈగా ఉన్న కమలాకర్ ప్రస్తుతం ఇన్చార్జి కమిషనర్గా బాధ్యతలు అప్పగించారు. -
శారీగమలు
● చీరకు జై కొడుతున్న యువతులు ● వేగంగా ధరించగలిగే చీరలకు డిమాండ్ ● అత్యధికంగా అమ్ముడవుతున్నవి అవే శ్రీకాకుళం కల్చరల్: పండక్కి చీర కట్టాలి.. కానీ ‘కట్టు’ క్షణాల్లో అయిపోవాలి. ఇదీ నేటి యువతుల అభిప్రాయం. వారి అభిరుచి మేరకు సరికొత్త చీరలు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. నిన్నటి తరం వారంతా ఆరు గజాల చీరలను ఎంచక్కా ధరిస్తారు. కానీ కొత్తతరం వారితోనే చిక్కు. చీర కట్టు రాక, శారీతో రోజంతా ఉండలేక వెస్ట్రన్ దుస్తులతో గడిపేస్తున్నారు. ఎట్టకేలకు వారికి అనుగుణంగా, సులభంగా ఉండేలా చీరలు వచ్చేశాయి. వేగంగా క్షణాలమీద ధరించగలిగే చీరలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది మార్కెట్. యువతులకే కాదు చిన్న పిల్లలను సైతం ఈ చీరలు తెగ ఆకట్టుకుంటున్నాయి. సంక్రాంతి కి ‘వన్ మినిట్ శారీస్’ పేరుతో అన్ని షాపుల వాళ్లూ తెగ అమ్ముతున్నారు. ఆన్లైన్లోనూ ఇవి ట్రెండవుతున్నాయి. పండగల సమయంలో చీర కట్టుకోవడం బాగుంటుంది. ఒక్క నిమిషంలో కట్టుకునే చీరలు రావడంతో చీర కట్టుకోవడం మరింత సులభమైంది. – సాయి నిహారిక, సాఫ్ట్వేర్, శ్రీకాకుళం నాకు చీర కట్టుకోవడం అంటే ఇష్టం. అ యితే అంత పెద్ద చీర కట్టుకోవడం కష్టం. మార్కెట్లో వన్మినిట్ చీరలు రావడంతో మామూలు డ్రస్సులతో పాటు నేను కూడా ఈ చీర కొనిపించుకున్నా. – వెన్నెల, శ్రీకాకుళంవన్మినిట్ శారీతో యువతులు ఆన్లైన్లో నాకు కావాల్సిన డిజైన్లతో ఆర్డర్ పెట్టుకుంటా. నాకు చీర అంటే ఇష్టం. కానీ ఎక్కువసేపు కట్టాల్సి వస్తోంది. అయితే ఈ వన్మినిట్ శారీ వల్ల చాలా సింపుల్గా వెంటేనే కట్టుకోవచ్చు. – యశశ్విని, బీటెక్ విద్యార్థిని -
కర్షకులకు కష్టకాలం
కొత్తూరు: విత్తనాలకు పరుగులు పెట్టి, ఎరువులకు గంట ల తరబడి నిలబడి, తుఫాన్లకు తట్టుకుని, వరదల ను కాచుకుని పంట పండించిన రైతన్న ఇంట నిజంగా సంక్రాంతి సంతోషం కనిపిస్తోందా..? అంటే లేదనే సమాధానం వినిపిస్తోంది. ఖరీఫ్ ఆరంభంలో విత్తనాల కోసం ఆపసోపాలు పడ్డారు. వర్షాలు మురిపించీ మురిపించీ ఏనాటికో కురవగా.. ప్రభు త్వం ఇవ్వాల్సిన ఎరువు పక్కదారి పట్టిపోవడంతో పక్క రాష్ట్రాలకు వెళ్లి ఎరువు తెచ్చుకున్నారు. వాయుగుండాలు, మోంథా తుఫాన్లు ఎప్పటికప్పు డు దాడులు చేస్తే.. కొంత పంటను పోగొట్టుకుని, మిగిలిన పంటను కంటికి రెప్పలా కాపాడుకున్నా రు. ఎట్టకేలకు పంట చేతికి వచ్చాక.. దళారికి, ధా న్యం కొనేవారికి అట్టే తేడా లేకపోవడంతో మద్దతు ధర కంటే తక్కువకే పంటనంతా విక్రయించేస్తున్నా రు. లెక్కకు మించి ట్రక్షీట్లు జనరేట్ చేయడం, లెక్కలకు అందకుండా మిల్లుల్లో ధాన్యపు రాశులు పోగు కావడం, అదనంగా ఇస్తేనే ధాన్యం తీసుకుంటానని బెదిరించడం.. అన్నీ కర్షకుడి కష్టాన్ని వెక్కింరించేవే. కష్టాలు.. నష్టాలు మోంథా కారణంగా కొత్తూరు, హిరమండలం, ఎల్ ఎన్పేట, సరుబుజ్జిలి, ఆమదాలవలస, జలుమూ రు, గార, నరసన్నపేట, మండలాల్లో వంశధార నది పరివాహక ప్రాంతాల్లో మూడువేల ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బ తింది. ఇదే తుఫాన్ వల్ల ఇచ్ఛాపురం, సోంపేట, కంచిలి, మందస, పలాస, లావే రు, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, గార మండలాలతో పాటు పలు మండలాల్లో వరి, మొక్క జొన్న తదితర పంటలకు నష్టం కలిగింది. ఇంత నష్టం జరిగినా పరిహారం అందరికీ అందలేదు. వరదలు, తుఫాన్ల కారణంగా దిగుబడి కూడా తగ్గిపోయింది. పత్తి రైతులదీ అదే పరిస్థితి. అంతకుముందు యూరి యా కోసం రైతులు నానా అవస్థలు పడ్డారు. అన్నదాత సుఖీభవ కూడా అందరికీ పడలేదు.భారీ వర్షాలతో పాటు మోంథా తుఫాన్ కారణంగా పత్తి కాయలు, పిందెలు కుళ్లిపోయి కిందకు రాలిపో యాయి. పత్తి చేనుకు ఉన్న పత్తి తడిసి పోవడంతో పాడైంది. దీంతో దిగుబడి గణనీయంగా పడిపోయింది. ఎకరాకు కనీసం 3 క్వింటాళ్ల దిగుబడి కూడా రాలేదు. అప్పుల్లో కూరుకు పోయాను. – గేదెల బాలకృష్ణ, పత్తి రైతు, కొత్తూరు వంశధార వరదలకు వరి పంట పూర్తిగా మునిగిపో యింది. పూర్తిగా కుళ్లిపో యింది. పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చలేక అవస్థలు పడుతున్నాను. కనీసం వడ్డీలు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంది. – అగతమూడి నాగేశ్వరరావు, వరద బాధిత రైతు, కుంటిభద్ర వైఎస్ జగన్ పాలనలో ఎరువులు, విత్తనాలు సుల భంగా అందేవి. రైతులు సుభిక్షంగా ఉండేవారు. సాయం ఎప్పటికప్పుడు అందేది. – అంపిలి బుచ్చిబాబు, రైతు, గూనభద్ర ఈ ఏడాది వ్యవసాయం నష్టాల్లో ముంచింది. దీంతో సంక్రాంతి సందడి లేదు. వర్షాలకు వరి, పత్తి పంటలు నాశనమయ్యాయి. పంట పూర్తిస్థాయిలో చేతికి అందకపోవడంతో చేసిన అప్పులు తీర్చలేక సంక్రాంతి సందడి లేకుండాపోయింది. – కుప్పలి భాస్కరరావు, రైతు, కొత్తూరు -
రాజకీయ కుతంత్రం
శ్రీకాకుళంఆదివారం శ్రీ 11 శ్రీ జనవరి శ్రీ 2026కవిటి: శ్రీకాకుళం డీఈఓ కార్యాలయంలో సీనియర్ సహాయకునిగా పనిచేస్తు న్న కవిటి పట్టణానికి చెందిన తుంగాన శరత్ ఈ నెల 13 నుంచి 18 వరకు ఢిల్లీ లోని ఇందిరాగాంధీ ఇండోర్స్టేడియంలో నిర్వహించనున్న ఇండియా ఓపెన్ ఇంటర్నేషనల్ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్కు అంపైర్గా ఎంపికయ్యారు. ఈ మేరకు జిల్లా సంఘానికి ఆదేశాలు అందినట్టు ఆ సంఘం ఉపాధ్యక్షుడు అడ్వకేట్ తమరాల జయరాం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలకు లోకాయుక్త సేవలను మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ఉప లోకాయుక్త పి.రజని ఈనెల 29, 30 తేదీల్లో విశాఖపట్నంలో ‘క్యాంప్ సిట్టింగ్’ నిర్వహించనున్నారు. మహారాణిపేటలోని జిల్లా పరిషత్ కార్యాలయం వేదికగా రెండు రోజుల పాటు ఈ విచారణ కొనసాగనుంది. ప్రభుత్వ యంత్రాంగంలో పారదర్శక తను పెంచడం, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకోవడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని లోకాయుక్త రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో సూచించారు. శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి సీనియర్స్ పారా అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ముగిశాయి. శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియం క్రీడా మైదానంలో స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ శ్రీకాకుళం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన 7వ జిల్లా స్థాయి పారా అథ్లెటిక్స్ ఎంపిక పోటీలను నిర్వహించారు. సీనియర్స్ విభాగంలో నిర్వహించిన ఈ ఎంపికల్లో 100, 400, 1500 మీటర్ల పరుగు పందా లు, లాంగ్జంప్, షాట్పుట్, డిస్కస్ త్రో, జావెలిన్ త్రో పోటీలు జరిపారు. వివిధ ప్రాంతాల నుంచి 31 మంది పారా అథ్లెట్స్ హాజరై ప్రతిభ కనబరిచారు. ఇక్కడ ఎంపికై న పారా క్రీడాకారులను 8వ రాష్ట్ర స్థాయి పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్ –2025–26 పోటీలకు పంపించనున్నట్టు స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ శ్రీకాకుళం కార్యదర్శి డి.అచ్యుతరావు, ఎన్.స్రవంతి, మోహన్రావు, ఖేలో ఇండియా అథ్లెటిక్స్ కోచ్ శ్రీనివాస్, అథ్లెటిక్స్ కోచ్ యన్.రాజేష్ తదితరులు పాల్గొన్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్పై రాజకీయ పెత్తనం మితిమీరుతోంది. కీలక నేతల ఆశీస్సులున్న అధికారులు తప్ప మరో అధికారి ఇక్కడ పనిచేయలేని పరిస్థితి ఏర్పడింది. అధికారులు చేయాల్సిన పనిని నేతలే చేస్తామంటున్నారు. కార్పొరేషన్ బడ్జెట్తో సంబంధం లేకుండా నిధులు ఖర్చు పెట్టా లని చూస్తున్నారు. కాదూ కూడదంటే కష్టమని అధికారులకు తెగేసి చెప్పేస్తున్నారు. మొండి పట్టు పడితే ఏకంగా బదిలీ వేటు వేస్తున్నారు. తాజాగా మున్సిపల్ కమిషనర్ పీవీవీడీ ప్రసాదరావు ఆకస్మిక బదిలీ వెనక రాజకీయ కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. వారం రోజుల పాటు రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో కమిషనర్ బదిలీ వెనక రాజకీయ కుతంత్రం ఉందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. జిల్లాలోని ఓ కీలక నేత అనుచరుడు కార్పొరేషన్లో ఓ విభాగానికి అధికారిగా ఉన్నారు. ఆయన చెప్పిందే వేదమవుతోంది. తన శాఖ విధులతో పాటు మిగతా శాఖ విధుల్లోనూ వేలు పెడుతున్నారు. చివరికి కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల విషయంలో తాను చెప్పినట్టు జరిగేలా అజమాయిషీ చెలాయిస్తున్నారు. రెవెన్యూ శాఖలో మరో ఇద్దరు ఉన్నారు. వీరిద్దరు అంతా తామై చక్రం తిప్పుతున్నారు. చె ప్పాలంటే కార్పొరేషన్లో నియంతలు ఎక్కువైపోయారు. వీరికి నియోజకవర్గ కీలక నేతతో పాటు జిల్లా కీలక నేత ఆశీస్సులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కమిషనర్ డమ్మీ అయిపోయిన పరిస్థితి నెలకొంది. వీరి అజమాయిషీని కమిషనర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. ఇదే సమయంలో రథసప్తమి వేడుకలు సమీపించాయి. కార్పొరేషన్ నిధుల నుంచి ఖర్చు పెడుతున్నారు. గత ఏడాదికి సంబంధించిన రథసప్తమి వేడుకలకు ఖర్చు చేసిన నిధులే ఇంతవరకు రాలేదు. తాజాగా వారం రోజుల ఉ త్సవాలకు కూడా ఖర్చు పెట్టిస్తున్నారు. ఇదంతా కార్పొరేషన్కు గుదిబండగా మారింది. రూ. 36 కోట్లు వరకు లోటు బడ్జెట్ ఉన్న కార్పొరేషన్ నుంచి రథసప్తమి వేడుకలకు నిధులు వెచ్చించలేమన్నట్టుగా ఉన్నతాధికారులకు నివేదిక వెళ్లింది. అటు కార్పొరేషన్ అంతర్గత అధికారుల అజమాయిషీని వ్యతిరేకిస్తుండటం, మరోవైపు రథసప్తమి వేడుకలకు నిధులు ఖర్చు పెట్టలేమన్న నివేదిక వెరసి కమిషనర్ను హడావుడిగా బదిలీ చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్కు పాలకవర్గం లేకపోవడం వలన 15వ ఆర్థిక సంఘం నుంచి రూ. 25కోట్ల వరకు గ్రాంట్ రాలేదని సమాచారం. అలాగే, రిజిస్ట్రేషన్ శాఖ నుంచి మరో రూ.25కోట్లు రావాల్సి ఉంది. దానికి తోడు గత ఏడాది రథసప్తమి వేడుకలకు ఖర్చు పెట్టిన రూ. 8కోట్లు రీయింబర్స్ కాలే దు. అదేవిధంగా అరసవిల్లి దేవస్థానం కోసం గత ఏడాది ఖర్చు చేసిన రూ. 65లక్షలు ఇప్పటివరకు రాలేదు. అటు ఆదాయం రాక, ఇటు ఖర్చు పెట్టిన సొమ్ము వెనక్కి రాక కార్పొరేషన్ లోటు బడ్జెట్లోకి వెళ్లిపోయింది. ఇంత లోటు బడ్జెట్ ఉండగా, ఒక్కొక్కటీ కూల్చేస్తున్నారు. మరమ్మతుల పేరుతో కూల్చివేతలు చేస్తున్నారు. రథసప్తమి వేడుకలకు మళ్లీ ఖర్చు పెట్టమంటున్నారు. ఇవన్నీ భారమై కూర్చున్నాయి. దాదాపు రూ. 36కోట్లు లోటు ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని కార్పొరేషన్ అధికారులు ఉన్నతాధికారులకు నివేదించినట్టు తెలిసింది. వేడుకలకు ముందు ప్రతికూలంగా వ్యవహరిస్తున్నారన్న అక్కసుతో పాటు అంతర్గత రాజకీయాలు వెరసి కమిషనర్ బదిలీకి కారణమని తెలుస్తోంది. పాతపట్నం: గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపడాలని ట్రైనీ ఐఏఎస్ అధికారి పృథ్వీరాజ్ అన్నారు. మండలంలోని సోద గ్రామంలో రైతుల కు పట్టాదార్ పాస్ పుస్తకాలను పృథ్వీరాజ్ శనివా రం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన రైతులు ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. తహసీల్దార్ ఎన్.ప్రసాదరావు మాట్లాడుతూ సోద రెవెన్యూ పరిధిలో 502మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో రీ సర్వే డీటీ సునీల్ కుమార్, ఆర్ఐ రవణమ్మ, మండల గ్రామ, వార్డు సచివాలయాధికారి బి.కృష్ణారావు, వీఆర్వోలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
100 ఎకరాలు
శ్రీకాకుళం10 మంది.. బోడికొండపై అక్రమాల పర్వం● 10 మంది ముఠాతో పచ్చనేత కబ్జా ● ఓ మంత్రి అండ చూసుకుని చెలరేగిపోతున్న ఆక్రమణదారులు ● 100ఎకరాలకు పైగా చదును చేసి ఆక్రమణ ● రిజర్వ్ ఫారెస్టు భూములు సైతం కబ్జా ● 12 నుంచి సమ్మెకు సిద్ధం ● భవ్య సర్వీసెస్ ఏజెన్సీ తీరుపై మండిపాటు ● డిమాండ్ల సాధనకు సిబ్బంది ఉద్యమ బాట శనివారం శ్రీ 10 శ్రీ జనవరి శ్రీ 2026మార్కెట్లో విక్రయిస్తున్న ఈగల్ కైట్ఫిర్యాదులు వెళ్లినా.. కొండను ఆక్రమించేస్తున్నారని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. అక్రమంగా చదును చేసిన ప్రాంతానికి వచ్చి ఆందోళన కూడా చేశారు. అంతేకాకుండా కళ్ల ముందే జరుగుతున్న భూ ఆక్రమణల విషయాన్ని ఓ ప్రజాప్రతినిధి దృష్టికి స్థానికులు తీసుకెళ్లడం కూడా జరిగింది. తప్పని పరిస్థితుల్లో స్పందిస్తూ పరిశీలించమని రెవెన్యూ అధికారులకు మౌఖిక ఆదేశాలిచ్చినట్టు తెలిసింది. ఆ మేరకు బెండి కొండపై చదును చేస్తున్న ప్రాంతానికి వెళ్లి చూసేసరికి అధికారులు సైతం ఆశ్చర్యపోయినట్టు సమాచారం. 21న జిల్లా స్థాయి రంగోత్సవ్ పోటీలు శ్రీకాకుళం: జిల్లా స్థాయి రంగోత్సవ్ పోటీలను జనవరి 21వ తేదీన వమరవెల్లి డైట్ కళాశాలలో నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎ.రవిబాబు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నా రు. రంగోత్సవ్ అంటే విద్యార్థులు తమలోని ప్రతిభను స్వేచ్ఛగా, సృజనాత్మకంగా చూపించుకునే వేదిక అని, పిల్లల్లో ఆనందం, ఉత్సాహం పెంచుతూ వారి సమగ్ర అభివృద్ధికి తోడ్పడుతుందని పేర్కొన్నారు.భారత స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలను గీయడం, హ్యాండ్ రైటింగ్ పోటీల్లో తెలుగు లేదా ఇంగ్లి ష్లో ఒక పేరాగ్రాఫ్ లేదా ఒక కొటేషన్ రాయడం, వికసిత్ భారత్ అంశంపై 3–4 మంది సభ్యులు రంగోలి రూపొందించడం, పంజాబీ జానపద నృత్యం / ఆంధ్రప్రదేశ్ జానపద నృత్యం (4–5 మంది సభ్యులు), రోల్ ప్లే వికసిత్ భారత్ అంశంపై పోటీలు ఉంటాయి. ప్రభు త్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలలో 6 నుంచి 8వ తరగతుల విద్యార్థులు రంగో త్సవ్ 2025–2026 లో పాల్గొనవచ్చు. ఒక విద్యార్థి ఒక్క పోటీలో మాత్రమే పాల్గొనాలి. రిజిస్ట్రేషన్ చివరి తేదీ జనవరి 18. జిల్లా స్థాయిలో మొదటి బహుమతి పొందినవారు రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్తారు. సందేహాలకు జీవీ రమణ ఇన్చార్జ్ ప్రిన్సిపల్,డైట్, వమరవెల్లి, మొబైల్ నంబర్ 9491813995, ఆశింటి వేణుగోపాలరావు, నోడల్ ఆఫీసర్, డైట్, వమ రవెల్లి, 8985485617ను సంప్రదించాలని సూచించారు. సోంపేట: బారువ తీరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శుక్రవారం స్థానిక అధికారులతో కలిసి బారువ తీరాన్ని కలెక్టర్ పరిశీలించారు. బారువ సముద్ర తీరం అభివృద్ధి గురించి చర్చించారు. అనంతరం మూల పొలం బ్రిడ్జి పనులు కలెక్టర్ పరిశీలించారు. ఆర్డీఓ జి.వెంకటేష్, తహసీల్దార్ బి.అప్పలస్వామి, ఎంపీడీఓ ఈశ్వరమ్మ, డిప్యూటీ ఎంపీడీఓ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. ‘చంద్రబాబు యువతను మోసగించారు’ శ్రీకాకుళం (పీఎన్కాలనీ): యువతకు, విద్యార్థులకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తానని చెప్పిన చంద్రబాబు, లోకేష్లు ఇవ్వకుండా మోసగించారని వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మార్పు పృథ్వీ మండిపడ్డారు. శ్రీకాకుళం నగరంలో అంబేడ్కర్ కూడలి వద్ద విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధులు శుక్రవారం దీనిపై ర్యాలీ నిర్వహించి ఎమ్మార్వో కార్యా ల యం వద్ద ప్రభుత్వ మోసాల్ని ఎండగట్టారు. ఈ సందర్బంగా పృథ్వీ మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెడుతున్నారని అన్నారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభా గం నాయకులు ముత్తా విజయ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పూడి కిరణ్ కుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు కె.సాయికుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కె.చందు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బొత్స సంతో ష్, వైఎస్సార్సీపీ యూత్ విభాగం టౌన్ ప్రెసిడెంట్ భరద్వాజ్ మాట్లాడుతూ ఆస్తులు అడగడం లేదని, కేవలం ప్రజలకు ఎన్నికల సమ యంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోమంటే అ క్రమంగా జైలుకు పంపడం దుర్మార్గమన్నారు. విశాఖపట్నంలో విద్యార్థి నాయకులపై పెట్టిన అక్రమ రౌడీషీట్లను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పలాస నియోజకవర్గంలో భూ ఆక్రమణలు పెచ్చు మీరిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. కొండ భూములు, వాగు లు, కాలువలు, ప్రభుత్వ భూములు, అటవీ భూ ములని చూడకుండా దర్జాగా ఆక్రమించేస్తున్నారు. నియోజకవర్గంలో రోజుకొక ఆక్రమణ వెలుగు చూస్తోంది. పత్రికల్లో పతాక శీర్షికన కబ్జాలు వెలుగు చూస్తున్నాయి. కాశీబుగ్గ టౌన్లోనే కాదు పలాస, వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లో ఆక్రమణదారులు చెలరేగిపోతున్నారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు గెద్దల్లా వాలిపోతున్నారు. తమ గుప్పెట్లోకి తెచ్చుకుని అధికార దర్పం ప్రదర్శిస్తున్నారు. నియంత్రించాల్సిన అధికారులు నేతల అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు. తాజాగా వజ్రపుకొత్తూరు మండలం పెద్ద బొడ్డపాడు పంచాయతీ పరిధిలోని బెండికొండపై పడ్డారు. ఓ మంత్రి అండ చూసుకుని నందిగాం మండలానికి చెందిన ఓ నాయకుడి నేతృత్వంలో 10 మంది ఏకంగా కొండ భూములతో పాటు రిజర్వ్, సోషల్ ఫారెస్టు భూముల్లో దాదాపు 100 ఎకరాలు కబ్జా చేసేస్తున్నారు. చదును చేయడమే కాకుండా ఏళ్ల నాటి జీడి మొక్కలు తొలగించేసి, కొత్తగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రిజర్వ్ ఫారెస్టు భూములు సైతం.. ఈ కొండకు ఆనుకుని 84.36 హెక్టార్ల మేర రిజర్వ్ ఫారెస్టు భూములు ఉన్నాయి. వాటిని కూడా కబ్జాదారులు వదల్లేదు. ఆ భూములను కూ డా చదును చేసేసి తమ అనుభవంలోకి తెచ్చుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. దీంట్లో వారి ప్రమే యం కూ డా ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. కళ్ల ముందు పొక్లెయినర్ల సాయంతో ఇష్టారీతిన చదును చేసేస్తున్నా చేష్టలుడిగి చూస్తున్నారు. ముడుపులకు కక్కుర్తి పడి ఆక్రమణలపై చోద్యం చూస్తున్నారు. దౌర్జన్యపూరితంగా.. కొండ ప్రాంతంలో ఏళ్ల నాటి పెద్ద పెద్ద జీడిచెట్లు ఉన్నప్పటికీ యంత్రాల సాయంతో తొలగించేస్తున్నారు. చదును చేసిన ప్రాంతంలో కొత్తగా మొక్కలు నాటుతున్నారు. చెప్పాలంటే దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఫారెస్టు అధికారులు రిజర్వు ఫారెస్టు పరిధిలోని భూమలు, తోటలను కాపాడుకునేందుకు ట్రెంచ్లను ఏర్పాటు చేయగా వాటిని తొలగించి, జీడిచెట్లు, కంకరతో పూడ్చేస్తున్నా రు. ముందున్న ఆనవాళ్లు లేకుండా పథకం ప్రకారం యంత్రాల సాయంతో చదును చేసేసి, వందల ఎకరాలను వశం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. శ్రీకాకుళం న్యూకాలనీ: సంక్రాంతి సంబరాల్లో భాగంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన జిల్లా స్థాయి సంప్రదాయ క్రీడల పోటీలు జరగనున్నాయి. జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూర్తి స్టేడియం వేదికగా పోటీలు జరగనున్నాయి. సోమవారం ఉదయం 9 గంటల నుంచి పోటీలు మొదలవుతాయని డీఎస్డీఓ ఎ. మహేష్బాబు తెలిపారు. ఈ పోటీల్లో భాగంగా మహిళలకు స్కిప్పింగ్, తొక్కుడు బిళ్ల పోటీలు జరగనుండగా, పురుషులకు 7 పెంకులాట, గాలిపటాల పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. అలాగే పురుషులు, మహిళలకు కర్రసాము, టగ్ ఆఫ్ వా ర్ ఉంటాయని, వివరాల కోసం 93903 52942, 7680075375 నంబర్లను సంప్రదించాలన్నారు. 108సిబ్బంది అరసవల్లి: ఆపత్కాలంలో కోట్లాది మందిని ఆదుకున్న 108 ఇప్పుడు కష్టాల్లో పడింది. తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ 108 సిబ్బంది సమ్మె సైరన్ మోగించారు. ఇటీవలే 104 వాహనాల సి బ్బంది కూడా సమస్యల డిమాండ్లు కోరుతూ నిర్వహణ సంస్థ చూపిస్తున్న నిర్లక్ష్య ధోరణిని ఖండిస్తూ నిరసనలకు దిగారు. తాజాగా 108 వాహనాల సి బ్బంది కూడా సమ్మెకు సై అంటున్నారు. ఈ నెల 12 నుంచి 108 వాహన సేవల్లో పాల్గొనేది లేదంటూ కలెక్టర్ స్వప్నిల్ దినకర్, డీఎంహెచ్ఓ అనితలకు సమ్మె నోటీసులను గురువారం రాత్రి జారీ చేశారు. కక్ష సాధింపు వల్లనేనా..? చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 108 వాహన సిబ్బందికి సమస్యలు మొదలయ్యాయి. తమ సమస్యలను ఎప్పటికప్పుడు విన్నవించుకుంటున్నా గత ఆరు నెలల నుంచి పరిష్కా రం కోసం ప్రయత్నిస్తున్నా, సర్కారు మాత్రం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని 108 వాహన సిబ్బంది విమర్శిస్తున్నారు. గత ఆరు నెలల కిందట ఆందోళనకు దిగినప్పుడు ఉద్యోగులకు ఉత్తుత్తి హామీలను ఇచ్చి కాలం గడిపేసిన చంద్రబాబు సర్కార్ నేటికీ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టకపోవడంపై సిబ్బంది తీవ్రంగా తప్పుపడుతున్నారు. సర్కారు వైఖరిపై నిరసనగా సమ్మెకు సన్నద్ధమంటూ అల్టిమేటం జారీ చేశారు. తమ సమస్యలను పరిష్కరించకుంటే ఈనెల 12 నుంచి సమ్మెలోకి వెళ్లనున్నట్లుగా అల్టిమేటంతో కూడిన నోటీసును జిల్లా ఉన్నతాధికారులకు అందజేశారు. జిల్లాలో ఇదీ పరిస్థితి జిల్లాలో 30 మండలాలకు 31 వాహనాలు పనిచేస్తున్నాయి. గత కొన్ని నెలల ముందే 11 కొత్త వాహనాలను జిల్లాకు తీసుకువచ్చారు. అయితే అంతకుముందు వాహనాలను మరమ్మతు చేసి కొత్తగా రంగులు వేసి రంగంలోకి దించారని కొందరు డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. నిర్వహణ సంస్థ వాహనాల ఫిట్నెస్ను పట్టించుకోకుండా సిబ్బందిపై నెపం తోసేసి చిన్న కారణాలు చూపించి ఉద్యోగం నుంచి తీయించేలా కుట్రలు పన్నుతున్నాయి. 108 వాహనాల్లో పనిచేసే ఈఎంటీలు, పైలెట్లకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు వేతనం అందుతుంది. సూపర్వైజర్లకు రూ.30 వేలు, మేనేజర్లకు రూ.50 వేలు చెల్లిస్తున్నారు. గతంలో మూడు మాసాల నుంచి వే తనాలను ఇంకా పెండింగ్లో ఉంచారు. దీంతో 18 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఉన్నతాధికారులకు అందజేశారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్కు సమ్మె నోటీసును అందజేస్తున్న 108 వాహన సిబ్బంది ఆక్రమణల ముఠా.. వజ్రపుకొత్తూరు మండలం పెద్ద బొడ్డపాడు పంచాయతీ పరిధిలోని బెండి, సీతారాంపురం, పెద్దబొడ్డపాడు, కొండవూరు, నారాయణపురం, తోటపల్లి, కొల్లిపాడు, కవిటి గ్రామాల్లో గ్రామాలను ఆనుకుని వందల హెక్టార్లలో బెండికొండ ఉంది. దీంట్లో నారాయణపురం, తోటపల్లి, కొల్లిపాడు పరిధిలో ఉన్న కొండ ఆక్రమణకు గురైంది. నందిగాం మండలానికి చెందిన పచ్చనేత ఆధ్వర్యంలో కవిటి, నారాయణపురం, దుంపవానిపేట, కూర్మనాథపురం, తోటపల్లి గ్రామానికి చెందిన 10 మంది పెద్ద ఆక్రమణలకు ఒడిగట్టారు. కూటమి ప్రభుత్వం రాగానే బరితెగించారు. కబ్జాదారులంతా ఒక ముఠాగా తయారై కొండ భూములను కొట్టేస్తున్నారు. గతంలో అక్కడిచ్చిన డీ పట్టాల ముసుగులో కొండంతా ఆక్రమించేస్తున్నారు. దాదాపు 100 ఎకరాల వరకు ఇప్పటికే తమ గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. -
కొబ్బరి చెట్టు నుంచి జారిపడి వ్యక్తి మృతి
పోలాకి: కోడూరు గ్రామానికి చెందిన టెంక సంజీవు(40) శుక్రవారం కొబ్బరిచెట్టు నుంచి జారిపడి మృతిచెందాడు. ఎప్పట్లాగే బొండాలు దించే క్రమంలో చెట్టు ఎక్కగా నడుముకు కట్టిన తాడు తెగిపోవటంతో సుమారు 20 అడుగుల ఎత్తు నుంచి కిందపడిపోయాడు. వెంటనే తోటి కూలీలు నరసన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సంజీవు భార్య ముత్యాలు ఫిర్యాదు మేరకు పోలాకి పోలీసులు కేసు నమోదు చేశారు. కాశీబుగ్గ రైల్వే గేట్ను ఢీకొన్న వ్యాన్ వజ్రపుకొత్తూరు రూరల్ : పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని రైల్వే ఎల్సీ గేట్ను శుక్రవారం టాటామ్యాజిక్ వ్యాన్ ఢీకొట్టింది. గేటు విరిగిపోవడంతో సుమారు గంట సేపు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. గేట్ కీపర్ విషయాన్ని రైల్వే స్టేషన్ మేనేజర్ కుమార్దాస్కు తెలియజేయడంతో రైల్వే ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని తాత్కాలిక గేటు ఏర్పాటు చేశారు. ఆర్పీఎఫ్ పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడంతో వాహనాల రాకపోకలు కొనసాగాయి. ప్రమాదానికి కారణమైన వ్యాన్ డ్రైవర్పై ఆర్పీఎఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. వాహనాన్ని స్వాధీనం చేసుకొని రైల్వే పోలీసుస్టేషన్కు తరలించారు. ఉరేసుకుని యువకుడు ఆత్మహత్యవజ్రపుకొత్తూరు రూరల్: బెండి గ్రామానికి చెందిన దేవలింగం మహేష్ (27) కాశీబుగ్గలో ఉన్న రోటరీనగర్లో శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. బెండి గ్రామానికి చెందిన మహేష్ పలాస మండలం వీరభద్రాపురం గ్రామానికి చెందిన జ్యోత్స్నతో ఏడాది క్రితం కులాంతర ప్రేమ వివాహం జరిగింది. అప్పటి నుంచి కాశీబుగ్గలోని రోటరీ నగర్లో నివాసం ఉంటూ ప్రైవేట్ పనులు చేసుకుంటూ జీవనోపాధి సాగిస్తున్నారు. కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని, ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. మహేష్కు తల్లిదండ్రులు కాంతమ్మ, సింహాచలం ఉన్నారు. ఏకై క కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడు మృతితో బెండి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
స్మార్ట్ పోలీసింగ్తో కేసులు ఛేదించాలి
శ్రీకాకుళం క్రైమ్ : కేసుల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞాన ఆధారిత స్మార్ట్ పోలీసింగ్ ఎంతో కీలకమని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సాంకేతిక అప్లికేషన్ల వినియోగం, కేసుల పురోగతి, ఆన్లైన్ పోర్టల్స్లో సమాచారం నమోదు విధి విధానాలను వివరించారు. నాట్గ్రిడ్ ద్వారా డేటా విశ్లేషణ, సీసీటీఎన్ఎస్లో ఎఫ్ఐఆర్ నుంచి చార్జిషీట్ వరకు సమాచారాన్ని సకాలంలో నమోదదు చేసి, క్రైమ్ మాక్ ద్వారా అంతరజిల్లా – రాష్ట్ర నేరగాళ్ల గుర్తింపు, ఈ–సాక్ష్య ద్వారా డిజిటల్ ఆధారాలు భద్రపరిచే విధానం తప్పనిసరిగా అమలుచేయాలన్నారు. సమన్లను ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా పంపి ఖర్చు ఆదా చేయడంతో పాటు పారదర్శకత పెంచాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 112 కాల్స్కు తక్షణంగా స్పందించాలని, నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో అదనపు ఎస్పీలు కె.వి.రమణ, పి.శ్రీనివాసరావు, డీఎస్పీలు సీహెచ్ వివేకానంద, షేక్ షాహబాబ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం
శ్రీకాకుళం న్యూకాలనీ: మహిళలు ఆరోగ్యవంతంగా ఉండాలంటే నాణ్యమైన పౌష్టికాహారాన్ని తీసుకోవాలని డాక్టర్ బి.రజని అన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్, రెడ్ రిబ్బన్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం మహిళల ఆరోగ్య సమస్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యాళ్ల పోలినాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళల ఆరోగ్య సమస్యలతోపాటు థైరాయిడ్ వంటి హార్మోన్ల అసమతౌల్య సమస్యలకు గల కారణాలు, వాటి పరిష్కార మార్గాలను వివరించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రోణంకి హరిత, ఐక్యూఏసీ కో–ఆర్డినేటర్ డాక్టర్ జి.రాజశేఖర్, రెడ్ రిబ్బన్ క్లబ్ కో–ఆర్డినేటర్ డి.రవీంద్ర, ఉమెన్ అండ్ పవర్మెంట్ సెల్ కన్వీనర్ అరుణకుమారి, అధ్యాపకులు పాల్గొన్నారు. -
ఖ్యాతి పెంచేలా..
రథసప్తమి ఉత్సవం యోగాసనం అదరహోఅరసవల్లి: అరసవల్లి పుణ్యక్షేత్ర ఖ్యాతి మరింత వ్యాప్తి చెందేలా రథసప్తమి మహోత్సవాలకు జిల్లా కేంద్రంలో ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ అధికారిక రాష్ట్ర పండుగను ఏడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరి గేలా చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలియజేశారు. శుక్రవారం రథసప్తమి ఉత్సవ ఏర్పాట్లకు కర్టన్రైజర్గా నిర్వహించిన సామూహిక సూర్యనమస్కారాల కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఇంద్రపుష్కరిణి మార్గ్లో సుమారు 200 మంది పాల్గొన్న సూర్యనమస్కారాల ప్రక్రియలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్, ఎమ్మెల్యే గొండు శంకర్, ఆలయ ఈఓ కేన్వీడీవీ ప్రసాద్లు స్వయంగా ఆసనాలను వేశారు. ఈ సందర్భంగా రథసప్తమి ఉత్సవ ప్రచారానికి ప్రత్యేకంగా ఏడు గుర్రాలతో వాహనాన్ని కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఈనెల 19 నుంచి 25 వరకు రథసప్తమి మహోత్సవాలు జరగనున్నాయని, ఏడు రోజులు ఈ ప్రచార రథం గ్రామగ్రామాన తిరుగుతుందన్నారు. రానున్న 10 రోజుల పాటు జిల్లాలో అన్ని పాఠశా లలు, కళాశాలలు, నివాస సముదాయాల ప్రాంగణాల్లో సూర్య నమస్కారాలను చేయించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా నేషనల్ యోగా ప్లేయర్ రసజ్ఞ రాజహంసను కలెక్టర్ అభినందించారు. ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో భారీ ఎగ్జిబిషన్, ఎన్టీఆర్ గ్రౌండ్స్లో ఫుడ్ ఫెస్టివల్, కేఆర్ స్టేడియంలో ప్రసిద్ధ ఆలయాల నమూనాల ఏర్పాటు, సాంస్కృతిక కార్యక్రమాలు, 5 వేల మందితో సూర్యనమస్కారాలు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రథసప్తమి ప్రచారానికి సప్తాశ్వాలతో రథం -
కాంప్లెక్స్కు పోటెత్తిన ప్రయాణికులు
శ్రీకాకుళం అర్బన్: జిల్లాకేంద్రమైన శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ శుక్రవారం ప్రయాణికులు పోటెత్తారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ నెల 10 నుంచి 18 వరకు పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కాంప్లెక్స్కు చేరుకోవడంతో రద్దీమయంగా కనిపించింది. పండగ నేపథ్యంలో సుదూర ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు వెళ్లేందుకు కాంప్లెక్స్కు చేరుకోవడంతో కాంప్లెక్స్ మొత్తం ప్రయాణికులతో నిండిపోయింది. ప్రయాణికుల రద్దీకి తగ్గ బస్సులు లేకపోవడంతో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తర్వాత బస్సులు రావడంతో రద్దీ తగ్గింది. -
డ్వాక్రా సంఘాలకు సీ్త్రనిధి రుణాలు
జి.సిగడాం: అర్హులైన మహిళా సంఘాల సభ్యులకు సీ్త్ర నిధి పథకం ద్వారా ప్రత్యేక రుణాలను మంజూరు చేస్తున్నట్లు సీ్త్ర నిధి ఏజీఎం సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం జి.సిగడాంలోని కార్యాలయంలో ఎంఎంఎస్ అధ్యక్షురాలు శీర్రా లక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్యాంకు ద్వారా తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించిన సంఘాలకు ప్రత్యేక రుణాలు మంజూరు చేస్తామన్నారు. ఇప్పటికే అర్హులైన సంఘాలను గుర్తించి వారికి స్వయం ఉపాధి కోసం రుణాలు విడుదల చేశామన్నారు. వీటితో వివిధ రకాల వ్యాపారాలను నెలకొల్పి ఆర్థిక స్వావలంబన సాధించాలన్నారు. కార్యక్రమంలో ఏపీఎం రెడ్డి రామకృష్ణంనాయుడు, సీ్త్ర నిధి మేనేజర్ ఉదయ్కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
సారా స్థావరాలపై దాడులు
పాతపట్నం: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో అక్రమంగా నిర్వహిస్తున్న సారా తయారీ స్థావరాలపై ఆంధ్ర, ఒడిశా ఎకై ్సజ్ అధికారులు సంయుక్తంగా శుక్రవారం దాడులు నిర్వహించారు. పాతపట్నం, కొత్తూరు, మెళియాపుట్టి మండలాలకు ఆనుకుని ఉన్న ఒడిశా గ్రామాలైన సింగుపూర్, నేరేడిగూడ తదితర చోట్ల 560 లీటర్ల సారా, 7,200 లీటర్ల బెల్లం ఊటలను ధ్వంసం చేసి సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పాతపట్నం ప్రొహిబిషన్, ఎకై ్సజ్ సీఐ కోట కృష్ణారావు తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం బాటిల్(ఎన్డీపీఎల్) ఒక్కటి తీసుకొస్తున్నా అరెస్టు చేసి కేసు నమోదు చేస్తామన్నారు. సారా తయారీ, విక్రయాలు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రానున్న పండగల దృష్ట్యా దాడులు విస్తృతం చేశామన్నారు. దాడుల్లో శ్రీకాకుళం అసిస్టెంట్ కమిషనర్ పి.రామచంద్రరావు, పి.మురళీ, జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి తిరుపతినాయుడు, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్లు రామచంద్ర కుమార్, గజపతి జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ప్రదీప్కుమార్ సాహూ, జిల్లా టాస్క్ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్, పాతపట్నం, కొత్తూరు, ఆమదాలవలస ఎకై ్సజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
చైనా దారం వాడొద్దు
సంప్రదాయ పద్ధతిలో పత్తితో తయారుచేసిన దారం మాత్రమే గాలిపటాలకు ఉపయోగించాలి. చైనా మాంజాతో ప్రమాదాలు జరుగుతాయి. అవి అమ్మితే కేసులు నమోదు చేస్తాం. వాడిన వారిపై కూడా కఠిన చర్యలు తప్పవు. కై ట్ ఫెస్టివల్ చేస్తే పోలీసులు అనుమతి తీసుకోవాలి. – సీహెచ్ వివేకానంద, శ్రీకాకుళం డీఎస్పీ ● గాలిపటాలు ఎగరేసేటప్పుడు చైనా మాంజా అస్సలు వినియోగించకూడదు. ● గాజు పొడి, రసాయనాలతో తయారు చేసే ఈ దారం చాలా ప్రమాదకరం. దీన్ని అమ్మినా వాడినా చట్టపరంగా చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ● ఈ మాంజా తగిలి పక్షులు చనిపోతాయి. వాటి కాళ్లు, రెక్కలు తెగిపోయే ప్రమాదం ఉంది. ● సంక్రాంతి పండుగ సమయంలో కేవలం పాత కాటన్ దారాలనే వాడాలని అధికారులు సూచిస్తున్నారు. -
ఎరువులు దుకాణాల తనిఖీ
జి.సిగడాం: రబీ సీజన్లో జిల్లావ్యాప్తంగా లక్షా 53 వేల ఎకరాల్లో మొక్కజొన్న, రాగి, వరి, ఇతర పంటలను సాగు చేస్తున్నారని, వీటి కావాల్సిన యూరియా రైతులకు అందుబాటులో ఉంచామని జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ కోరాడ త్రినాథస్వామి వెల్లడించారు. శుక్రవారం ఆనందపురం, పాలఖండ్యాం, జి.సిగడాం గ్రామాల్లో ఎరువుల షాపులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 13,963 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందజేశామన్నారు. ఖరీఫ్ సీజన్లో లక్ష్యానికి మించి వరి పంటలో దిగుబడులు సాధించినట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలులో దళారులు లేకుండా నేరుగా ప్రభుత్వమే రైతు కొనుగోలు చేస్తుందన్నారు. ఈ–క్రాప్ నమోదు వచ్చే నెల 15లోగా పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. ఈయనతోపాటు మండల వ్యవసాయాధికారి బెండి బాబ్జీ, రైతుసేవా కేంద్రం అసిస్టెంట్ ముంతా హరీష్, తూలుగు అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ
● ముగ్గురు యువకులకు గాయాలు మెళియాపుట్టి : మండల కేంద్రం మెళియాపుట్టిలో శుక్రవారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు గాయాలపాలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మామిడిగుడ్డి గిరిజన గ్రామానికి చెందిన జన్ని ధర్మారావు, జన్ని శ్రీశాంత్ ఒక ద్విచక్ర వాహనంపై, జన్ని దిలీప్ మరో ద్విచక్ర వాహనంపై మెళియాపుట్టి వైపు వస్తుండగా విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో అతివేగంతో పక్కపక్కనే ఢీకొన్నారు. వెనుక కూర్చున్న ధర్మారావు గాల్లో ఎగిరిపడటంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. మిగిలిన ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు 108 అంబులెన్సుకు సమాచారం అందించడంతో ధర్మారావును టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. దీనిపై ఎటువంటి కేసు నమోదు కాలేదు. -
రాష్ట్ర బీసీ విభాగం ప్రధాన కార్యదర్శిగా నాని
రణస్థలం: వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన కంది సురేంద్రనాథ్ (నాని)ని పార్టీ రాష్ట్ర బీసీ విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి శుక్రవారం ప్రకటన వెలువడింది. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట శ్రీకాకుళం రూరల్: బైరి ఇసుక ర్యాంపుపై శుక్రవారం రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. వంశధార నదిలో అనధికారికంగా సాగుతున్న ఇసుక రవాణాను అడ్డుకున్నారు. ర్యాంపు నడిచే ప్రాంతాల్లో ఎక్కడికక్కడ గట్లకు అడ్డుకట్ట వేస్తూ స్ట్రెంచ్ కొట్టించారు. సైనిక లాంఛనాలతో జవాన్ అంత్యక్రియలు సారవకోట : మండల కేంద్రం సారవకోటకు చెందిన బీఎస్ఎఫ్ జవాన్ పారశెల్లి ధర్మేంద్రబాబు(53) గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. శుక్రవారం ఆయన మృతదేహానికి పాతపట్నంలో పోస్టుమార్టం నిర్వహించగా స్థానిక యువకులు ద్విచక్ర వాహనాలతో గ్రామంలో ర్యాలీగా తీసుకొచ్చారు. కుర్ధాకు చెందిన 110 బెటాలియన్ బీఎస్ఎఫ్ సైనికులు ఎస్ఐ నారాయణమూర్తి ఆధ్వర్యంలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ధర్మేంద్రబాబు డిసెంబర్ 28న సెలవుపై వచ్చారు. ప్రస్తుతం 18 బెటాలియన్ నార్త్ బెంగాల్లో విధులు నిర్వర్తించారు. ఈయనకు భార్య దేవి, కుమారుడు ఉన్నాడు. పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడికి సాయం శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాకు చెందిన అంతర్జాతీయ పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సతివాడ హిమశేఖర్కు అంబేద్కర్ ప్రోగ్రెసివ్ ట్రస్ట్ చైర్మన్ కొండ్రు జగదీశ్వరరావు రూ.20 వేలు ఆర్థిక సాయం శుక్రవారం అందజేశారు. శ్రీకాకుళం గూనపాలెంకు చెందిన హిమశేఖర్ ఈజిప్ట్ దేశం కై రో నగరం వేదికగా ఈ నెల 13 నుంచి 18 వరకు జరగనున్న పారా వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్–2025–26 పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా జగదీశ్వరరావు మాట్లాడుతూ నిరుపేద క్రీడాకారులకు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. దేశం తరఫున ప్రాతినిధ్యం వహించి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ అంపిలి ప్రేమ్కుమార్, తదితరులు పాల్గొన్నారు. డ్రోన్ పిచికారీ పరిశీలనపాతపట్నం: రైతులకు ఉపయోగపడేలా సేద్యంలో ప్రయోగాలు చేయాలని ట్రైనీ ఐఏఎస్ అధికారి పృథ్వీరాజ్ అన్నారు. శుక్రవారం సీది, తామర గ్రామాల్లో పంట నమోదును పరిశీలించారు. రైతు కాగతాపల్లి వెంకటరావు మొక్కజొన్న పంటకు డ్రోన్తో మందు పిచికారీ చేయడంపై ఆరా తీశారు. ఆయనతో పాటు తహసీల్దార్ ఎన్.ప్రసాదరావు, వ్యవసాయాధికారి కె.సింహాచలం, ఏఎస్వో బాలరాజు, రైతులు పాల్గొన్నారు. పేకాట శిబిరంపై దాడి రణస్థలం: తెప్పలవలస పంచాయతీ సీతారాంపురం సమీపంలోని తోటల్లో పేకాట శిబిరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం దాడి చేశారు. ఏడుగురిని అదుపులోనికి తీసుకుని పోలీసులకు అప్పగించారు. వీరి వద్ద నుంచి ఏడు సెల్ఫోన్లు, రూ.1,95,960 నగదు స్వాధీనం చేసుకున్నట్లు జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. -
గగనపు అంచులు తాకుతూ..
చలి కాస్త తగ్గాలి. చలిమంటలు పెరగాలి. రంగవల్లులు మెరవాలి. భోగిమంటకు రంగం సిద్ధం కావాలి. అంతేనా.. హరిదాసులు రావాలి. హరినామ సంకీర్తనలు పాడాలి. సంకురాతిరికి సంకేతాలు ఇవన్నీ. వీటన్నింటి కంటే ముందు ఓ గాలిపటం గగనపు అంచును తాకాలి. వృక్షాల కొమ్మలపై కొత్త అతిథుల్లా తెగిన గాలిపటాలు వచ్చి విశ్రాంతి తీసుకోవాలి. తలెత్తి చూసినప్పుడు అక్కడక్కడా పతంగులు ప్రాణం లేని పక్షుల్లా గాలివాటానికి ఎగురుతూ కనిపించాలి. అదీ అసలు సిసలు సంక్రాంతి. రెక్కలు తెంపుకోవాలనే ఉత్సాహంతో గగనపు వీధుల్లోకి వెళ్లాలనుకునే పతంగులు ఓ వైపు, తాడు తెగాక దారీ తెన్నూ తెలీక గాలివాటంగా ఎగిరే గాలిపటాలు మరోవైపు, పిల్లాడి చేతి నుంచి ఎప్పుడెప్పుడు ఎగిరిపోదామా అని చూసే కైట్లు ఇంకోవైపు. ఒకప్పుడంటే కష్టపడి ఇళ్లలోనే గాలిపటాలు తయారు చేసుకునేవారు. కానీ ఇప్పుడు వేలాది డిజైన్లలో మాంజాలతో సహా గాలిపటాలు అందుబాటులో లభిస్తున్నాయి. రూ.20 నుంచి మొదలుపెట్టి రూ.500 వరకు రకరకాల గాలిపటాలు దొరుకుతున్నాయి. విభిన్న ఆకృతులతో పతంగులు ఆకట్టుకుంటున్నాయి. – శ్రీకాకుళం కల్చరల్/ శ్రీకాకుళం క్రైమ్పండగ సందడి గాలిపటాలు ఎగరేస్తా.. నా చిన్నతనం నుంచి పండగ సమయంలో గాలి పటాలు ఎగురవేయడం అలవాటు. విభిన్న రకాల గాలిపటాలు సేకరించి పండగ సెలవుల సమయంలో రోజు స్నేహితుల కలసి ఎగరేస్తాం. – సాయికిరణ్, వాంబే కాలనీ విక్రయాలు బాగున్నాయి.. పండగను బట్టి మార్కెట్లో కావాల్సిన వస్తువులను అమ్ముతాం. సంక్రాంతి పండగను పురస్కరించుకొని వివిధ రకాల గాలిపటాలు, బొమ్మలు తీసుకొచ్చాం. చాలా మంది కొనుక్కొని వెళ్తున్నారు. – దాస్యం రాంబాబు, షాపు ఓనర్ -
సచివాలయ ఉద్యోగులను ఒత్తిడికి గురిచేయొద్దు
ఆమదాలవలస : రకరకాల సర్వేల పేరుతో పూర్తిస్థాయి సమాచారం, అవగాహన కల్పించకుండానే సచివాలయ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేయడం, మరోవైపు బీఎల్ఓ విధులను అప్పగించడం తగదని ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా జాయింట్ సెక్రటరీ, జీడబ్ల్యూఎస్ఈఎఫ్ సంఘం ఉత్తరాంధ్ర కన్వీనర్ కూన వెంకట సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ఆమదాలవలసలోని ఓ ప్రైవేట్ కల్యాణ మండపంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది సర్వే పనుల నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో కార్యాలయాల్లో ఖాళీ కుర్చీలు చూపిస్తూ పలు రిపోర్టుల పేరుతో తీవ్ర పని ఒత్తిడి కల్పించడం అన్యాయమన్నారు. ఈ ఒత్తిడి కారణంగా డిసెంబర్లోనే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 మంది సచివాలయ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారన్నారు. వారి కుటుంబాలకు కారుణ్య నియామకాల కింద తక్షణమే ఉద్యోగాలు కల్పించాలని కోరారు. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సచివాలయ ఉద్యోగుల పనితీరును తప్పుబట్టడం సమంజసం కాదన్నారు. ఉద్యోగులకు న్యాయబద్ధంగా రావలసిన నోషనల్ ఇంక్రిమెంట్లు, స్పెషల్ ఇంక్రిమెంట్లు, కరువు భత్యం, వేతన సవరణ కమిటీ ఏర్పాటు వంటి అంశాలపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్ చానల్ కల్పించి, ఖాళీగా ఉన్న వివిధ ప్రభుత్వ విభాగాల్లో భర్తీ చేయాలని కోరారు. -
పలాస జాతీయ రహదారిపై జీడిపిక్కల వ్యాన్ బోల్తా
వజ్రపుకొత్తూరు రూరల్: జాతీయ రహదారిలో పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ మొగిలిపాడు సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు మేరకు.. సోంపేట మండలం కొర్లాం నుంచి టెక్కలి వైపు జీడిపిక్కల లోడుతో వెళ్తున్న లగేజ్ వ్యాన్ టైర్లు పేలి మొగిలిపాడు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయట పడగా జీడి పిక్కల బస్తాలు రోడ్డుపై పడి చెల్లాచెదురయ్యాయి. కాగా ఈ సమయంలో ఎలాంటి వాహనాలు రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం త ప్పింది. అయితే ఈ సంఘటనతో కొంత సమ యం ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించా రు. అలాగే గాయపడిన డ్రైవర్ను పలాస ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డుపై బోల్తా -
‘ప్రారంభించని పనుల వివరాలు ఇవ్వండి’
అరసవల్లి: జిల్లాలో పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్, ఆర్డబ్ల్యూఎస్ శాఖల్లో 15వ ఆర్థిక సంఘం నిధులతో పాటు జెడ్పీ సాధారణ నిధుల నుంచి గత నాలుగేళ్లలో కోట్లాది రూపాయ లతో మంజూరు చేసిన పనుల్లో ఇంకా ప్రారంభం కాని పనుల వివరాలను తక్షణమే సిద్ధం చేయాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ ఆదేశించారు. ఈ మేరకు గురువారం తన బంగ్లాలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంకా పనులు మొదలుపెట్టని వివరాలను తదుపరి చర్యల నిమిత్తం జెడ్పీ సీఈఓకు లిఖితపూర్వకంగా అధికారులు అందజేయా లని ఆదేశించారు. నిధులున్నా ఇంతవరకు ఎందుకు పనులు ప్రారంభించలేదో ఇంజినీరింగ్ అధికారులు గమనించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ డి.సత్యనారాయణ, శ్రీకాకుళం, పాలకొండ, టెక్కలి డివిజనల్ అధికారులు పాల్గొన్నారు. 108 సిబ్బంది సమ్మె బాట శ్రీకాకుళం పాతబస్టాండ్: గత ఏడాది కాంట్రాక్టర్–ఉద్యోగుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం పెంచిన జీతాలు, పీఎఫ్ కటింగ్ బాధ్యతలు నెరవేర్చడం లేని, పలు సార్లు కాంట్రాక్టర్ను కోరినా ఫలితం లేదని అందుకే సమ్మెకు సిద్ధమవుతున్నామని 108 ఉద్యోగుల సంఘం ప్రతినిధులు గురువారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్కు తెలిపారు. 108లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని విన్నవించారు. ఈ సందర్భంగా కలెక్టర్కు గురువారం సమ్మె నోటీసు అందజేశారు. కలెక్టర్ను కలిసిన వారిలో ఆ సంఘం నాయకులు విజయమోహన్ తదితరులు ఉన్నారు. ‘శిక్షణ సద్వినియోగం చేసుకోండి’ సారవకోట: నూతన తరానికి అవసరమైన గృహోపకరణాలు తయారు చేయాలని కేంద్ర హస్తకళల అభివృద్ధి కమిటీ రీజనల్ డైరెక్టర్ లక్ష్మణరావు సూచించారు. గురువారం ఆయన మండలంలోని బుడితి గ్రామంలో ఇటీవల లేపాక్షి ద్వారా శిక్షణ ఇచ్చి తయారు చేసిన గృహోపకరణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లేపాక్షి ద్వారా తా ము శిక్షణ ఇచ్చామని, ఆ శిక్షణలో నేర్చుకున్న వస్తువుల తయారు చేసి లేపాక్షి ద్వారా విక్రయించాలని కోరారు. అలాగే కేంద్ర హస్తకళల విభాగంగా ద్వారా దేశంలో నిర్వహించే వస్తు ప్రదర్శనలకు బుడితి కంచు, ఇత్తడి వస్తువులతో పాటు నూతనంగా కొత్త తరానికి అవసరమైన వస్తువులను తయారు చేసి ఆయా వస్తు ప్రదర్శనలకు తీసుకెళ్లాలన్నారు. ఈ సందర్భంగా ఆయన కింతాడ జనర్ధానరావు, అద్దాల రామకృష్ణలు తయారు చేసిన వస్తువులను పరిశీలించి పలు సూచనలిచ్చారు. తాము ఇటీవల ఇచ్చిన శిక్షణ ద్వారా కొంతమేర వస్తువుల తయారీ నేర్చుకున్నామని, మరికొన్ని మెలకువలు నేర్చుకునేందుకు మరింత శిక్షణ ఇవ్వాలన్నారు. ఆయనతో పాటు లేపాక్షి మేనేజర్ కార్తీక్ కుమార్, అకౌంటెంట్ మురళీ తదితరులు ఉన్నారు. అధికారుల నిర్లక్ష్యం.. అన్నదాతకు నష్టం ఆమదాలవలస రూరల్: అధికారుల నిర్లక్ష్యం అన్నదాతలను ముంచేసింది. కాలం కాని కా లంలో నారాయణపురం ఎడమ కాలువ ద్వా రా సాగునీరు అధికంగా విడిచిపెట్టంతో అనేక గ్రామాల్లో అపరాల పంటకు నష్టం వాటిల్లిందని అన్నదాతలు గగ్గోలు పెడుతున్నారు. మండలంలోని కొత్తవలస, చీమలవలస, కొర్లకోట, నారిపేట, కలివరం, కనుగులవలస తదితర ప్రాంతాల్లో అపరాలు నీటమునిగాయి. అధికారులు చేసిన పనికి తాము పంటను కూడా కోల్పోవాల్సి వస్తుందని పలువురు కంటతడిపెడున్నారు. -
రాష్ట్రంలో ‘రెడ్బుక్’ రాజ్యాంగం అమలు
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా సమస్యలపై ప్రశ్నిస్తున్న విద్యార్థి, యువజన సంఘాల నాయకులపై అక్రమ కేసులు బనాయించడాన్ని, రౌడీషీట్లు ఓపెన్ చేయడాన్ని యువజన, విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు శ్రీకాకుళం నగరంలో దాసరి క్రాంతిభవన్లో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మార్పు ఫృథ్వీ, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పూడి కిరణ్ కుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు సాయికుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కె.చందు, విద్యార్థి విభాగం నాయకులు విజయ్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బొత్స సంతోష్, నిరుద్యోగ పోరాట సమితి నాయకులు డి.సూర్యంలు మాట్లాడారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు, విద్యార్థులకు ఇచ్చిన ఉద్యోగ క్యాలెండర్, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి హామీలను అమలు చేయాలని కోరడం నేరమా అని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్ల సొంత ఆస్తులు అడగడం లేదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోమంటే అక్రమంగా జైలుకు పంపడం దుర్మార్గమన్నారు. విశాఖపట్నంలో విద్యార్థి నాయకులపై పెట్టిన అక్రమ రౌడీషీట్లను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. నారా లోకేష్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ‘మా ప్రభుత్వం వస్తే యువజన విద్యార్థి సంఘాల నాయకులపై కేసులుండవు, మీ సమస్యలు నేరుగా నా దృష్టికి తీసుకురండి’ అని చెప్పి ఇప్పుడు ‘రెడ్ బుక్’ రాజ్యాంగాన్ని అమలు చేయ డం సరికాదన్నారు. అణచివేతతో ఉద్యమాలను ఆపలేరన్నారు. డిమాండ్లు నెరవేర్చని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిరసనల ద్వారా ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో యువజన, విద్యార్థి సంఘాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
అందుకోలేం
శ్రీకాకుళంపండగ సరే.. పైసలేవీ..?రథసప్తమి పండగ వచ్చేస్తోంది. కానీ ప్రభుత్వ నిధులివ్వడం లేదు. –IIలో3● కోనేం.. ● జిల్లా మత్స్యకారులకు చిక్కని కోనేం ● సీజన్లో గంగపుత్రులకు నిరాశ ● కిలో రూ.700 నుంచి రూ.1000 వరకు పలుకుతున్న ధర శుక్రవారం శ్రీ 9 శ్రీ జనవరి శ్రీ 2026గతం ఘనం.. ఒకప్పుడు మనకూ కోనేంలు విరివిగా దొరికేవి. వలలు మోయలేనంత బరువుతో గంగపు త్రులు కోనేం చేపలతో తీరానికి చేరేవారు. నాడు రూ.450 నుంచి రూ.650 వరకు ధర పలికిన కోనేం నేడు విశాఖ, ప్రధాన రేవుల్లో రూ.700 నుంచి రూ.వెయ్యి పలుకుతోంది. గతంలో ఇతర ప్రాంతాలకు సైతం ఎగుమతు లు జరిగేవి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. గత రెండేళ్లుగా జిల్లాలో సుమారు 760 టన్ను లు వరకు కోనేం చేపలు చిక్కగా ఈ ఏడాది సుమారు 160 టన్నులకే పరిమితమైంది. ఫిషింగ్ హార్బర్లు కట్టాలి ప్రధానంగా జిల్లాలో మంచినీళ్లపేట, భావనపాడు, బుడగట్లపాలెం ప్రాంతాల్లో ఫిషింగ్ హార్బర్లు నిర్మించాలి. లోతుగా వేట సాగించేలా మత్స్యశాఖ సహకరించాలి. వలలు, మరబోట్లను సబ్సిడీపై అందించాలి. – జి.దానయ్య, మత్స్యకారుడు, మంచినీళ్లపేట చేపలు చిక్కడం లేదు కోనేం చేప ప్రస్తుతం ధర ఎక్కువగా ఉంది. కానీ వలకు చిక్కడం లేదు. అడపా దడపా తప్ప టన్నుల్లో దొరకడం లేదు. వాతావరణమూ అనుకూలించడం లేదు. భావనపాడు హార్బర్ పూర్తయ్యి ఉంటే బాగుండేది. రెండేళ్లుగా తుఫాన్లూ పెరిగాయి. కోనేం, ట్యూనా, పండుగప్ప, సందువ లాంటి చేపలు చిక్కడం లేదు. – డి.కొర్లయ్య, మత్స్యకారుడు, భావనపాడు లోతుగా వేట సాగించాలి మత్స్యకారులు డీప్ సీలోకి వెళ్తే కోనేం, ట్యూనా, సందువ లాంటి చేపలు దొరుకుతాయి. పైగా ప్రస్తుతం టెక్నాజీతో కూడిన వేట వల్ల చాలా మంది మత్స్యకారులు మత్స్య సంపదను అధికంగా చేజిక్కించుకోగలుగుతున్నారు. వలలు, బోట్లు కాలానుగుణంగా మార్చుకోవాలి. మత్స్యశాఖ అధికారుల నుంచి, టెక్నికల్ సూచనలు తీసుకోవాలి. – వై.సత్యనారాయణ, డీడీ మత్స్య శాఖ , శ్రీకాకుళం అధికారులతో సమీక్షిస్తున్న జెడ్పీ చైర్పర్సన్ విజయ వజ్రపుకొత్తూరు: జిల్లా మత్స్యకారులకు ఈ సీజన్లో నిరాశ తప్పడం లేదు. అధికంగా ధర పలికే కోనేం మన వలకు చిక్కలేదు. ప్రస్తుతం కోనేం ధర మటన్తో సమానంగా పెరుగుతోంది. కానీ చేప చిక్కకపోవడంతో జిల్లాలో ప్రధానంగా వేట సాగించే ఏడూళ్లపాలెం, బారువ, నువ్వలరేవు మంచినీళ్లపేట, భావనపాడు, బుడగట్లపాలెం, కళింగపట్నం తది తర రేవులు నిస్తేజంగా కనిపిస్తున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ప్రధాన కారణమైతే, ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం కాక, సముద్రంలో లోతుగా చేపల వేట(డీప్ సీ ఫిషింగ్) సాగక వీరు ఆదాయం కోల్పోతున్నారు. ఫిషింగ్ హార్బర్లు ఉంటే.. 193 కిలోమీటర్లు సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన సిక్కోలులో మత్స్య సంపదకు లోటు లేదు. కానీ అందుకు తగ్గట్టుగా మత్స్యకారుల వల్ల వసతులు లేవు. మెకనైజ్డ్ బోట్లతో డీప్ సీలో వేట సాగిస్తే తప్ప ఖరీదైన చేపలైన కోనేం, చందువ, పండుగ ప్ప, ట్యూనాలు చిక్కవు. హార్బర్లు ఉండి ఉంటే ఈ వేట సాగేది. ఇది గమనించిన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మన జిల్లాలో బుడగట్లపాలెం, మంచినీళ్లపేటల్లో ఫిషింగ్ హార్బర్లు నిర్మించేందుకు దాదాపు రూ.370 కోట్లు నిధులు మంజూరు చేసింది. కూట మి వచ్చాక ఆ పనులన్నీ దాదాపు ఆగిపోయాయి. దీనికి తోడు ఎప్పటికప్పుడు తుఫాన్లు విరుచుకుపడడంతో మత్స్యకారులకు నిస్తేజం తప్పడం లేదు. వలసలే గతి.. వేటపై అధిక ఆదాయం వచ్చే మార్గాలు లేకపోవడంతో గంగపుత్రులు మళ్లీ కాండ్లా, గుజరాత్, చైన్నె, విశాఖపట్నం తదితర పట్టణాలకు వలసపోతున్నారు. అక్కడ ఫిషింగ్ హార్బర్లలో మరబోట్లు యజమానుల వద్ద కూలీలుగా చేపల వేటకు వెళుతున్నారు. జిల్లాలోనూ అటు ఇచ్ఛాపురం, బారువ నుంచి ఇటు రణస్థలం వరకు ఎక్కడా మత్స్యకారులకు అవసరమైన ఫిషింగ్ హార్బర్లు, మార్కెట్ సదుపాయం లేకపోవడంతో వలసే గతిగా మారుతోంది. -
పంచాయతీల్లో కొత్త కుంపటి
● కొత్తగా 62 పంచాయతీల ఏర్పాటుకు సన్నాహాలు ● వైఎస్సార్సీపీ కంచుకోట గ్రామాలపై అధికార పార్టీ కుట్ర ● టీడీపీ అగ్రనేతల కనుసన్నల్లో ప్రణాళికలు ● అధికారుల వైఖరిపై మండిపడుతున్న పల్లెవాసులు అరసవల్లి: పంచాయతీలకు విభజన సెగ తగలనుంది. కొద్ది రోజులుగా పలు గ్రామాలను, తండాలను కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు ప్ర భుత్వం కసరత్తు చేస్తోంది. అయితే ఈ మేరకు ఆయా విభజిత గ్రామాల ప్రజల నుంచి అభిప్రాయ సేకరణను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా అశాసీ్త్రయంగానే విభజించేయాలని నిర్ణయించింది. దీంతో పల్లెల్లో పెద్ద పండుగ కాంతులు కాకుండా విభజన సెగలు రేగుతున్నాయి. ఐదేళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 95 శాతం పల్లెలు వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలిచాయి. ఈ కంచుకోటలను ఎలాగైనా బద్దలు కొట్టాలని ప్రస్తుత అధికార పార్టీ పావులు కదుపుతోంది. అంతా అశాసీ్త్రయంగానే.. 2014 రాష్ట్ర విభజన అనంతరం జిల్లాలో పలు చోట్ల గ్రామ పంచాయతీల విలీనాలు, కొత్త పంచాయతీల ఏర్పాటు, తండాలను గ్రామ పంచాయతీలను చేయ డం జరిగింది. అలాగే వంశధార ప్రాజెక్టు నిర్వాసితుల కాలనీలను సైతం పంచాయతీలుగా ఏర్పాటు చేసిన సందర్భాలున్నాయి. శాసీ్త్రయతను పాటిస్తూ, ప్రజాభిప్రాయాలను తీసుకుని జనాభా ప్రాతిపదిక న పంచాయతీలను ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతం అలాంటి ప్రయత్నాలేవీ జరగడం లేదు. తూతూ మంత్రంగా గ్రామ సభలు ఏర్పాటు చేసి, తాము అనుకున్న పంచాయతీలను విభజించి పాలించాలనే సూత్రాన్ని అనుసరిస్తూ టీడీపీ నేతలు కొత్త పంచాయతీల ఏర్పాటు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఇచ్చిన మార్గదర్శకాలను బట్టి గత నెలాఖరుకే పంచాయతీల విభజనలపై అభ్యంతరాలకు, ప్రతిపాదనలకు గడువు ముగిసింది. నిబంధనల ప్రకారం కనీసం 3 వేల జనాభా, 3 కిలోమీటర్ల విస్తీర్ణం, కనీస ఆదాయం రూ. 3 వేలు కలిగి ఉన్న పంచాయతీ హేమ్లెట్స్, అలాగే రెండు ప్రాంతాలను నదీ పరివాహక కాలువలు లేదా జాతీయ రహదారులు, ఇతరత్రా ప్రధాన కారణాల తో చెరో పక్క ఉన్న ఒకే ప్రాంతాలను విభజించి కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విభజన వెనుక కనిపిస్తున్న ఉద్దేశం మాత్రం రాజకీయమే. జిల్లాలో మొత్తం 912 గ్రామ పంచాయతీలుండగా, అదనంగా మరో 93 చోట్ల పంచాయతీలను ఏర్పాటుకు పాలకులు ప్రతిపాదించాలని భావించినప్పటికీ, పలుచోట్ల ఫిర్యాదులతో పాటు గ్రామసభల్లో ప్రతిపాదనలు సిద్ధం చేయకపోవంతో 62 కొత్త పంచాయతీలకు కొత్త ప్రతిపాదనలుగా జిల్లా పంచాయతీ అఽధికారి కార్యాలయం నుంచి పంచాయతీ రాజ్ కమిషనరేట్కు పంపించారు. ఇందులో వివిధ కారణాలతో 52 పంచాయతీల ప్రతిపాదనలను తిరిగి పంపించి, మరిన్ని పత్రాలతో తీసుకురావాల ని కమిషనరేట్ అధికారులు ఆదేశించారు. కాగా 10 వరకు పంచాయతీలను మాత్రం కొత్తగా ఏర్పాటు చేసేందుకు గ్రీన్సిగ్నల్ వచ్చేసింది. జి.సిగడాం మండలం ఆనందపురం, నడిమివలస, సీతంపేట, సేతుభీమవరం, వెలగాడ, లావేరు మండలంలో గోవిందపురం, తాళ్లవలస, ఎల్ఎన్పేట మండలంలో చింతలబడవంజ, కరకవలస, పెద్ద కొల్లివలస తదితర పంచాయతీల విభజనకు మార్గం సుగమమమైంది. త్వరలో మిగిలిన పంచాయతీల పత్రాలను పరిశీలించిన తర్వాత వాటికి కూడా ఆమోదం లభించనుందని అధికారులు చెబుతున్నారు. విభజనలపై ఫిర్యాదులు జిల్లాలో ఆమదాలవలస నియోజకవర్గం బూర్జ మండలంలో 2, ఎచ్చెర్ల నియోజకవర్గంలో 16, ఇచ్ఛా పురం నియోజకవర్గంలో 10, నరసన్నపేట నియోజకవర్గంలో 10, పలాస నియోజకవర్గంలో 06, పాతపట్నం నియోజకవర్గంలో 11, శ్రీకాకుళం నియోజకవర్గంలో 02, టెక్కలి నియోజవర్గంలో అత్యధికంగా 36 చోట్ల అంటే మొత్తంగా 93 కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటుకు అధికార పార్టీ నేతలు తెర వెనుక నుంచి ప్రతిపాదనలందేలా చర్యలు చేపట్టారు. అయితే చాలావరకు పంచాయతీల్లో విభజనకు స్థానికంగా గ్రామసభల్లోనే నిరసనలు వ్యక్తం కావడంతో వాటిపై ఫిర్యాదులతో పాటు గ్రామ తీర్మాణాలను సై తం అధికారికంగా ఇవ్వని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇందులో మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంలో ఏకంగా 36 పంచాయతీల విభజనకు చెందిన ప్రతిపాదనలకు కేవలం రెండింటికే గ్రామాల నుంచి తీర్మాణాలు అందాయి. దీంతో మొత్తంగా ప్రతిపాదనలు 62కే పరిమితమయ్యాయి. జిల్లాలో ఆమదాలవలస నియోజకవర్గం బూర్జ మండలం అన్నంపేట, జంగాలపా డు, డొంకలపర్త, నరసన్నపేట నియోజకవర్గం జలుమూరు మండలం అంధవరం, అల్లాడ, లింగాలవలస, పోలాకి మండలం బొద్దాం, శ్రీకాకుళం మండలం పొన్నాం పంచాయతీల్లో విభజన ప్రక్రియపై నేటి వరకు గ్రామాల తీర్మాణాలు ఇవ్వలేదు. అలాగే ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండలం కొచ్చె ర్ల, నరసన్నపేట నియోజకవర్గం సారవకోట మండలం కుమ్మరిగుంట, శ్రీకాకుళం నియోజకవర్గం గార మండలం వత్సవలసలలో పంచాయతీల విభజనపై ఇప్పటికే గ్రామ సభల్లో, పంచాయతీరాజ్ శాఖ కమీషనర్కు, అలాగే గ్రీవెన్స్లలో లిఖితపూర్వక ఫిర్యాదులు పంపించారు. పోలాకి మండలం పిన్నింటిపేటలో విభజనపై కొందరు కోర్టును ఆశ్రయించారు. అలాగే పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరు మండలం చిన్నవంక, కిడిసింగి, మెట్టూ రు, పల్లివూరు, పాతపట్నం నియోజకవర్గం మెళి యాపుట్టి మండలం చీపురుపల్లి, జాడుపల్లి, కొత్తూరులలో గ్రామ పంచాయతీల విభజనకు పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు సిద్ధం కాలేదు. ప్రతిపాదనలు పంపించాం నిబంధనల ప్రకారం గ్రామసభల్లో తీర్మా ణాలను బట్టి మొత్తం 62 కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు దిశగా ప్రతిపాదనలను రాష్ట్ర కమిషనరేట్కు పంపించాం. అయితే కొన్ని అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటున్నాం. ఉన్నతాధికారుల సూచనల మేరకు త్వరలో ఆమోదం పొందిన అనంతరం కొత్త పంచాయతీల ఏర్పాటుకు చర్యలు చేపడతాం. – భారతీసౌజన్య, జిల్లా పంచాయతీ అధికారి -
మా ప్రాంతంలో విధ్వంసం సహించబోం
వజ్రపుకొత్తూరు రూరల్: పచ్చని ఉద్దానంలో విధ్వంసాన్ని సహించబోమని కార్గో ఎయిర్ పోర్టు బాధితులు ముక్తకంఠంతో హెచ్చరించారు. మండలంలో గల మోట్టూరు పంచాయతీ పరిధిలో గల బర్రివానిపేటలో కార్గో ఎయిర్ పోర్టు వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో గురువారం ‘మా ఊరు మా భూమి’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులు ముక్తకంఠంతో మా భూములే మాకు ముద్దు..మా ప్రాంతంలో విధ్వంసం వద్దు అంటూ నినాదాలు చేశారు. ఏళ్ల తరబడి తమకు తల్లిలా ఉన్న ఈ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. అనంతరం పోరాట కమిటీ అధ్యక్ష కార్యదర్శి కొమర వాసు, జోగి అప్పారావులు మాట్లాడుతూ తరతరాలుగా భూములను నమ్ముకొని జీవనోపాధి సాగిస్తున్న రైతులు నేడు కార్గో ఎయిర్ పోర్టు నిర్మాణం చేయాలన్న ప్రభుత్వ ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. దీనిలో భాగంగానే బాధిత ప్రాంతాలలో దశల వారిగా అవగాహన, పోరాట కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. చివరిగా బాధితులు అంతా కలిసి ఉద్దాన ప్రాంతాన్ని కాపాడుకునేందుకు ప్రతిజ్జ చేశారు. కార్యక్రమంలో పోరాట కమిటీ నాయకులు, బాధితులు గుంటు లోకనాథం, బర్రి కుర్మానాయకులు, గుల్ల ఈశ్వరరావు, బర్రి సురేష్, జోగి కామరాజు, ఉమాపతి, రామస్వామీ తదితరులు ఉన్నారు. -
ఆర్థిక సంఘం నిధులకు గండి
నగరపాలక సంస్థకు మూడు విడతలుగా పాలకవర్గం లేకపోవడంతో రూ.25 కోట్ల మేర 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా రాలేదు. వీటిని రాబట్టేందుకు కూడా కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు కృషి చేయకపోగా, నగరపాలక సంస్థపై మరింత ఆర్థిక భారాన్ని మోపుతున్నారు. ఇప్పటికే నగరపాల క సంస్థ విద్యుత్ శాఖతో పాటు ఎంతోమందికి బకాయిలు పడగా అవి మరింత పెరిగి ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా అందించలేని స్థాయికి నగరపాలక సంస్థ దిగజారింది. గత ఏడాది మూడు రోజులకు రూ.8 కోట్లకు పైగా ఖర్చు అయితే, ఈ ఏడాది ఏడు రోజులు జరిపితే ఇంకెంత ఖర్చు అవుతుందో ఊహించవచ్చు. జిల్లా ప్రజా ప్రతినిధులు ఇటువంటి వాటిని పరిగణనలోనికి తీసుకోకుండా పండగ లుగా ప్రకటించేసి నిధులు విదల్చకుండా చేతు లు దులుపుకొంటున్నారు. ఇప్పటికై నా పాలకు లు స్పందించి పాత బకాయిలు ప్రభుత్వం నుంచి రాబట్టడంతోపాటు రథసప్తమి నిర్వహణకు నిధులు మంజూరయ్యేలా చూడాలనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
నందిగాం: లట్టిగాం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తి గురువారం మృతి చెందారు. కాశీబుగ్గ బ్రాహ్మణ వీధికి చెందిన సింహాద్రి సూర్యం(41) పలాస నుంచి టెక్కలి వైపు ద్విచక్రవాహనంపై వస్తుండగా లట్టిగాం వద్దకు వచ్చే సరికి కుక్క అడ్డం రావడంతో ఢీకొట్టి పడిపోయాడు. తీవ్రంగా గాయపడటంతో స్థానికులు టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యుల కోరికి మేరకు పలాస తరలించగా అక్కడ మృతి చెందాడు. సూర్యం భార్య మంగ ఫిర్యాదు మేరకు నందిగాం ఎస్సై షేక్ మహమ్మద్ ఆలీ కేసు నమోదు చేశారు. శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వద్ద ఒడిశా రాష్ట్రం రాయ్ఘడ్ జిల్లా గుణుపూర్కు చెందిన ఓ కారు డ్రైవర్ అదృశ్యమయ్యాడు. రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. ఈనెల 7న గుణుపూర్కు చెందిన లోక్నా థ్ మిశ్రో కుటుంబం వైద్య చికిత్స నిమిత్తం నగరంలోని ఓ వైద్యుని వద్దకు వచ్చారు. భోజనం నిమి త్తం ఓ హోటల్కు వెళ్లి తిరిగి ఆసుపత్రికి సాయంత్రం 3.45 గంటలకు చేరారు. వైద్యం ముగించుకుని డ్రైవర్ సుశాంత్కుమార్ జిన్నా (50)కు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. కారు ఉన్నా మనిషి లేకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. ఫలితం లేకపోవడంతో రెండో పట్టణ పోలీసులకు శుక్రవారం ఫిర్యా దు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు. శ్రీకాకుళం క్రైమ్: సోంపేట ఎస్ఐ బి.లోవరాజుకు వీఆర్కు పంపుతున్నట్లు జిల్లా పోలీసు శాఖ నుంచి గురువారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి. విధుల్లో నిర్లక్ష్యం వహించడంతో శాఖాపరమైన చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సుశాంత్కుమార్(ఫైల్) -
8 కిలోల గంజాయితో వ్యక్తి అరెస్టు
సోంపేట: కొర్లాం జాతీయ రహదారి వద్ద ఎనిమిది కిలోల గంజాయితో ఓ వ్యక్తిని బారువ ఎస్ఐ హరిబాబునాయుడు అరెస్టు చేసినట్లు సోంపేట సీఐ బి.మంగరాజు తెలిపారు. సోంపేట సర్కిల్ కార్యాలయంలో గురువారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా ముత్తగుడా గ్రామానికి చెందిన సుశాంత్ గమాంగో బుధవారం సాయంత్రం కొర్లాం జాతీయ రహదారి వద్ద పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. వెంటనే సిబ్బంది వెంబడించి అదుపులోకి తీసుకుని బ్యాగులు పరిశీలించారు. అందులో 8 కిలోలు బరువున్న 4 గంజాయి ప్యాకెట్లు గుర్దించారు. గంజాయితో పాటు ఫోన్, రూ.650 నగదు స్వాధీనం చేసుకున్నారు. గురువారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సమావేశంలో బారువ ఎస్ఐ హరిబాబునాయుడు, సిబ్బంది పాల్గొన్నారు. రెండు కేజీల గంజాయి స్వాధీనం శ్రీకాకుళం రూరల్: సింగుపురం పంచాయతీ సరిహద్దు ప్రాంతంలో నర్సింగ్ కళాశాల ఆవరణలో గంజాయి పీలుస్తున్న నలుగురు యువకులను శ్రీకాకుళం రూరల్ పోలీసులు గురువారం సాయంత్రం పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రెండు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. టౌన్ సీఐ పైడపునాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉత్సాహంగా అండర్–14 క్రికెటర్ల ఎంపిక
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా అండర్–14 బాలుర క్రికెట్ ఎంపికలు ఆరంభమయ్యాయి. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలోని క్రికెట్ నెట్స్ వద్ద ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సౌజన్యంతో జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో మొదలైన ఈ సెలక్షన్స్ ట్రయల్స్కు జిల్లా నలుమూలల నుంచి 82 మంది క్రీడాకారులు హాజరై ప్రతిభ నిరూపించుకున్నారు. బ్యాటింగ్, బౌలింగ్, కీపింగ్ ఇలా అన్ని విభాగాల్లో ప్రతిభ కనబర్చిన 33 మందిని ప్రాథమికంగా గుర్తించారు. వీరిని ఫస్ట్ రౌండ్కు ఎంపిక చేశారు. వీరికి శుక్రవారం ఉదయం 9 గంటలకు చిలకపాలెంలోని శ్రీ శివానీ ఇంజనీరింగ్ కళాశాల మైదానం సెలక్షన్ మ్యాచ్లు నిర్వహించి తుది జాబితా వెల్లడిచేంచనున్నారు. సెలక్టర్లగా ఏసీఏ నుంచి ఆర్.విష్ణువర్ధన్రెడ్డి (తిరుపతి), పి.భాను ప్రకాష్రెడ్డి (నెల్లూరు) హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా క్రికెట్ సంఘం ప్రతినిధులు, సిబ్బంది, కోచ్లు పాల్గొన్నారు. -
పట్టుబడినా పట్టించుకోలేదు!
● లెక్కకు మించిన ధాన్యంతో పట్టుబడిన రైస్మిల్ ● సీజ్ చేయాలని మంత్రి ఆదేశించినా పట్టించుకోని అధికారులు శ్రీకాకుళం రూరల్ : ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 367 క్వింటాళ్లు (458 బస్తాలు) ధాన్యాన్ని శ్రీకాకుళం పరిధి లోని చింతాడ వద్ద చిట్టెమ్మ రైస్మిల్లో ఈ నెల 5న రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నేరుగా పట్టుకున్నారు. లెక్కకు మించి ధాన్యం ఉన్నందున సీజ్ చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అయినా ఇంతవరకు ఆయన ఆదేశా లు ఎవరూ పట్టించుకోలేదు. వాస్తవానికి, కెపాసిటీ కి మించి ట్రక్ షీట్లను నమోదు చేసినట్లు ఈ మిల్లులో గుర్తించారు. నవంబర్ నుంచి వేమెంట్ బ్రిడ్జి రికార్డుల ప్రకారం వెయ్యికు పైగా ట్రక్షీట్లు చిట్టెమ్మ రైస్మిల్లో నమోదు చేసినట్లు తేల్చారు. అయితే రెవెన్యూ అధికారులు మాత్రం బస్తాల లెక్కలతోనే సరిపెట్టారు తప్ప కనీసం చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. అతి తక్కువకే కొనుగోలు.. వాస్తవంగా ఈ–క్రాప్ చేసిన పంట భూముల ధా న్యాన్నే మిల్లర్లు కొనుగోలు చేయాలి. ఇక్కడ మా త్రం పోరంబోకు భూములు, డిపట్టా భూములు, ఇనామి భూముల్లో పండించిన ధాన్యాన్ని అతి త క్కువ ధరకే రైతుల వద్ద కొనుగోలు చేసినట్లు సమాచారం. టార్గెట్కు మించిన ధాన్యం మిల్లులో గుర్తించినా చర్యలు చేపట్టకుండా ఓ అధికారి పావులు కదిపినట్లు తెలుస్తోంది. చిట్టెమ్మ రైస్మిల్లులో అదనంగా 367 క్వింటాళ్ల ధాన్యం గుర్తించాం. దీనిపై రిపోర్టు రాసి ఉన్నతాధికారులకు పంపించాం. మిల్లును సీజ్ చేయలేదు. మిల్ యాజమాన్యం నవంబర్ నుంచి డిసెంబర్ వరకే రికార్డులు చూపించా రు. జనవరి నుంచి ఎటువంటి రికార్డులు నమోదు చేయలేదు. – పైడి అనిల్కుమార్, సివిల్ సప్లయ్ అధికారి -
రెండు ఆలయాల్లో చోరీలు
నరసన్నపేట: సత్యవరం పాదాలమ్మ తల్లి గుడి, దూకులపాడులోని జ్యోతి రామలింగేశ్వర స్వామి ఆలయాల్లో బుధవారం రాత్రి దుండగులు చోరీలకు పాల్పడ్డారు. రెండు చోట్లా సీసీ కెమెరాలు ఉన్నా.. వాటి హార్డ్డిస్క్లు, డీవీఆర్లు కూడా ఎత్తుకుపో యారు. రూ.60 వేల వరకూ నష్టం జరిగినట్లు సమాచారం. దూకులపాడు శివాలయంలో అమ్మ వారి పుస్తెలు, ఉత్సవ విగ్రహాల ఆభరణాలు, హుండీ కొల్లగొట్టి నగదు పట్టుకుపోయారని పూజారి గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సత్యవరం పాదాలమ్మ తల్లి ఆలయంలో విగ్రహాల ఆభరణాల ను పూజారి భద్రపరచడంతో పెద్ద నష్టమే తప్పింది. అయితే హుండీలో నగదు మాత్రం పట్టుకుపోయారు. పోలీసులు, క్లూస్టీమ్ ఆలయాలను పరిశీలించి వివరాలు సేకరించారు. -
పండగ సరే.. పైసలేవీ?
శ్రీకాకుళం : రాష్ట్ర ప్రభుత్వం అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో రథసప్తమి వేడుకలను ఈ నెల 19 నుంచి 25 వరకు ఏడు రోజులపాటు రాష్ట్ర పండుగగా జరపాలని నిశ్చయించింది. అయితే ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు నిధుల కొరత వేధిస్తోంది. గత ఏడాది నిధులు సమకూర్చిన నగర పాలక సంస్థ అధికారులు ఈసారి మాత్రం చేతులెత్తేసినట్లు తెలిసింది. రథసప్తమి ఏర్పాట్లకు సంబంధించి పలు శాఖల అధికారులతో జిల్లా ఉన్నతాధికారులు జరిపిన సమీక్షలో పలు వివరాలు వెలుగుచూశాయి. అప్పులే మిగిలే.. గత ఏడాది మూడు రోజులపాటు రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా జరిపేందుకు ప్రభుత్వం ప్రకటనలు చేసింది. ఈ మేరకు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర, కేంద్ర మంత్రులు అధికారులను ఆదేశించారు. ముందుగా నగరపాలక సంస్థ ఖర్చు చేస్తే దానిని ప్రభుత్వం నుంచి వెనక్కు ఇప్పి స్తామని భరోసా ఇవ్వడంతో, జిల్లా ఉన్నతాధికారులతో పాటు నగరపాలక సంస్థ అధికారులు వెనుకా ముందు చూడకుండా ఎనిమిది కోట్ల రూపాయల ను ఖర్చు చేశారు. ఈ మొత్తంలో ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి రాలేదు. నగరపాలక సంస్థ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతుండడంతో తమకు ఉన్న సౌలభ్యాన్ని వినియోగించుకొని రాష్ట్ర ప్రణాళిక విభాగం నుంచి రూ.నాలుగు కోట్లు వడ్డీ లేని రుణాన్ని తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది కోట్లను వెనక్కి చెల్లిస్తే అందులో నుంచి నాలుగు కోట్లు తీర్చవచ్చని భావించగా, ఆ నిధులు రాకపోగా నాలుగు కోట్లు అప్పు మిగిలింది. ప్రస్తుతం నగరపాలక సంస్థ రూ.36 కోట్ల మేర లోటు బడ్జెట్లో ఉన్నట్లు తెలుస్తోంది. దేవదాయశాఖ బకాయి రూ.65 లక్షలు దేవాదాయశాఖ నగరపాలక సంస్థకు రూ.65 లక్షల బకాయి పడింది. గత ఏడాది రథసప్తమి సందర్భంగా దేవాదాయ శాఖ కొన్ని పనులు చేపట్టేందుకు నిధులు లేకపోవడంతో జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి అనుమతితో ఆ పనులను కూడా నగరపాలక సంస్థ జరిపింది. ఆ మొత్తాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ ద్వారా వెనక్కి వచ్చేలా చూస్తామని అప్పట్లో హామీ ఇచ్చిన కొందరు ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఆ ఊసే ఎత్తకపోవడంతో ఈ విషయం కూడా అగమ్యగోచరంగా మారి నగరపాలక సంస్థను ఆర్థిక ఇబ్బందుల్లో పడేసింది. రిజిస్ట్రేషన్ శాఖ బకాయిలు రూ.25 కోట్లు.. నగరపాలక సంస్థకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కూడా రూ.25 కోట్లు వరకు బకాయిపడినట్లు నగరపాలక సంస్థ ఉన్నతాధికారులకు అందజేసిన నివేదిక ప్రకారం తెలుస్తోంది. నగరంలో ఇల్లు, స్థలాలకు సంబంధించిన క్రయ విక్రయాలు జరిగితే దీని ద్వారా రిజిస్ట్రేషన్ శాఖకు సమకూరిన ఆదాయంలో కొంత వాటాను నగరపాలక సంస్థకు ఇవ్వాల్సి ఉంటుంది. కొన్నేళ్లుగా చెల్లింపులు జరగకపోవడంతో ఈ మొత్తం రూ.25 కోట్లకు చేరినట్లు సమాచారం. -
పీఆర్ ఉద్యోగుల క్యాలెండర్ ఆవిష్కరణ
అరసవల్లి : జిల్లా పంచాయతీరాజ్ మినిస్టీరియల్ సంఘం నూతన క్యాలెండర్ను జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ గురువారం ఆవిష్కరించారు. జిల్లా మినిస్టీరియల్ సంఘ అధ్యక్షుడు కిలారి నారాయణరావు ఆధ్వర్యంలో సంఘ సభ్యులంతా కలిసి చైర్పర్సన్ బంగ్లాలో ఆమెను కలిసి ఉద్యోగుల పదోన్నతుల సమస్యలను ప్రస్తావించారు. అనంతరం క్యాలెడర్ను ఆమె ఆవిష్కరించారు. ఉద్యోగులంతా కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ డి.సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి కింజరాపు నర్సింహమూర్తి, ఉపాధ్యక్షుడు ఇ.రఘు, సంఘ ప్రతినిధు లు పైడి నాగేశ్వరరావు, ఎస్.రమణ, వై.హిమవతి, ఉరిటి రమేష్, జి.లక్ష్మణరావు, ఎస్.రమణ, ఎ.ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
సంక్రాంతికి ● అదనపు బస్సులు నడపనున్న ఆర్టీసీ అధికారులు ● నేటి నుంచి 12వ తేదీ వరకూ ప్రత్యేక సర్వీసులు ● ప్రత్యేక సర్వీసులకు సాధారణ చార్జీలే శ్రీకాకుళం అర్బన్: సంక్రాంతి సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపనుంది. సుదూర ప్రాంతాలైన బెంగళూరు, తమిళనాడు, కర్ణాటక, మహా రాష్ట్ర, హైదరాబాద్, విజయవాడ వంటి ప్రాంతాల నుంచి శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల గ్రామీణ ప్రాంతాలకు చేరుకునే ప్రయాణికుల కోసం ఏపీఎస్ ఆర్టీసీ సర్వం సిద్ధం చేస్తోంది. ప్ర త్యేక బస్సులకు ఎలాంటి అదనపు రుసుం వసూ లు చేయకుండా సింగిల్ఫేర్(యథావిది చార్జీలు)తోనే నడపనున్నారు. జిల్లాలోని 4 డిపోల పరిధిలో ఈనెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకూ విజయవాడ నుంచి శ్రీకాకుళం, టెక్కలి, పలాసకు ఆర్టీసీ అధికారులు అదనంగా 25 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేశారు. విజయవాడ నుంచి.. విజయవాడ నుంచి శ్రీకాకుళంకు ప్రతి రోజూ యథావిధిగా 18 బస్సులకు అదనంగా 25 బస్సు లు నడపనున్నారు. అదేవిధంగా రాజమండ్రి నుంచి శ్రీకాకుళానికి యథావిధిగా తిరిగే 5 సర్వీసులకు అదనంగా మరో 2 బస్సులు వేశారు. అలాగే రావులపాలెం నుంచి 1, అమలాపురం నుంచి 2, కాకి నాడ, భద్రాచలంనకు ఒక్కో బస్సు చొప్పున రెగ్యులర్గా తిరిగేవి అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు ఆయా ప్రాంతాల నుంచి కూడా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. విశాఖపట్టణం నుంచి.. శ్రీకాకుళం జిల్లాకు విశాఖపట్టణం నుంచే ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుంది. ఇందుకోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. శ్రీకాకుళం ఒకటో డిపో నుంచి ప్రతిరోజూ 25 నాన్స్టాప్లు, 23 పల్లెవెలుగులు తిరుగుతున్నా యి. వీటితో పాటు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నెల 9వ తేదీ, 10, 11, 12, 13వ తేదీ వరకూ విశాఖపట్టణం నుంచి శ్రీకాకుళం నకు ప్రతి రోజూ ఉదయం 6గంటల నుంచి రాత్రి 9గంటల వరకూ ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు చొప్పున నడపనున్నారు. జిల్లాలోనూ నాలుగు డిపోల పరిధి లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనంగా సర్వీసులు నడుపుతారు. 10 శాతం రాయితీ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి సంస్థ రాయితీతో కూడిన ప్రయాణ చార్జీని ప్రవేశపెట్టింది. ఏసీ, సూపర్లగ్జరీ, అల్ట్రాడీలక్స్ వంటి సర్వీసులకు రాను, పోను ఒకేసారి టికెట్ తీసుకుంటే ప్ర యాణ చార్జీలో 10శాతం, ఈ–వాలెట్ ద్వారా బుక్ చేసుకుంటే 5శాతం రాయితీ ఇస్తున్నారు. అన్ని చర్యలు తీసుకున్నాం ఉచిత ప్రయాణం దృష్ట్యా ఈ ఏడాది అధిక రద్దీ ఉండవచ్చని అంచనా వేస్తున్నాం. అందుకు తగ్గ ఏర్పాట్లు చేశాం. సర్వీసులను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి. తిరుగు ప్ర యాణానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశాం. – సీహెచ్ అప్పలనారాయణ, జిల్లా ప్రజా రవాణా అధికారి -
పశువుల అక్రమ రవాణా అడ్డగింత
నరసన్నపేట: జాతీయ రహదారిపై లారీలో హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న 45 పశువులను హైవే పెట్రోలింగ్ పోలీసు సిబ్బంది గురువా రం పట్టుకున్నారు. అనంతరం నరసన్నపేట పోలీసులకు వాహనాన్ని అప్పగించారు. బరంపురం నుంచి వీటిని తీసుకొస్తున్నారు. లోపల పశువులను ఎక్కించి పైన క్లాత్ కట్టి రవాణా చేస్తున్నారు. హైవే పోలీసులకు అనుమానం వచ్చి గొట్టిపల్లి వద్ద వాహనం నిలిపి తనిఖీలు చేయగా గుట్టు రట్టు అయ్యింది. వాహనంలో 15 ఆవులు, 20 ఎడ్లు, 10 దూడలు ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి మూగజీవాలను కొత్తవలస గోశాలకు తరలించామని ఎస్సై శేఖరరావు తెలిపారు. మందస: బాలిగాం సమీపంలో జాతీయ రహదారి పై ఇచ్ఛాపురం వైపు నుంచి పలాస వైపు పవువుల తో వెళుతున్న నాలుగు వాహనాలను పోలీసులు పట్టుకున్నారు. వాహనాలను సీజ్ చేసి 17 పశువులను గోశాలకు తరలించినట్లు మందస ఎస్ఐ కె.కృష్ణప్రసాద్ తెలిపారు. మెళియాపుట్టి: ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి నుంచి టెక్కలి వైపు రెండు పశువులను వాహనంలో అక్రమంగా తరలిస్తుండగా గురువారం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. పశువులను గోశాలకు తరలించారు. -
గవర్నమెంట్ ప్లీడర్గా ఇప్పిలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా కోర్టు గవర్నమెంట్ ప్లీడరు (జీపీ)గా సీనియ ర్ న్యాయవాది ఇప్పిలి తాతను ప్రభుత్వం నియమించింది. పోలాకి మండలం మబగాం గ్రామానికి చెందిన తాత నరసన్నపేటలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేశారు. ప్రస్తు తం పలు బ్యాంకులకు స్టాండింగ్ కౌన్సిల్గా ఉన్నారు. ఈయనకు పదవి రావడం పట్ల జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తంగి శివప్రసా దరావు, ప్రధాన కార్యదర్శి పిట్టా దామోదరరావు, సభ్యులు అభినందనలు తెలియజేశారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్ట ర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. గురువారం భవన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అసంపూర్తిగా మిగిలిన పనుల వివరాలను ఎగ్జిక్యూ టివ్ ఇంజినీర్ సుగుణాకర్ను అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళం అర్బన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం డైరీ – 2026ను శ్రీకాకుళం ఎన్జీఓ హోమ్లో ప్రభుత్వ పెన్షనర్ల రాష్ట్ర జాయింట్ యాక్షన్ చైర్మన్ చౌదరి గురువా రం పురుషోత్తంనాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈ సందర్బంగా ఆయన మాట్లాడతూ సంఘ ప్రతినిధులు పెన్షనర్ల ఇంటి వద్దకు కూడా వెళ్లి లైఫ్ సర్టిఫికెట్లు వంటి సేవలు అందిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రకాష్రావు మాట్లాడుతూ ఫిబ్రవరి 28వరకు ప్రతిరోజూ ఎన్జీవో హోంలో లైఫ్ సర్టి ఫికెట్లు ప్రక్రియ నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కె. సోమసుందరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పీఎస్ ప్రసాదరావు, అసోసియేట్ అధ్యక్షుడు పి.నరసింహమూర్తి, కోశాధికారి కె.వెంకటేశ్వరరావు, సిటీ బ్రాంచ్ అధ్యక్షుడు బి.జానకిరామ్ పట్నాయక్, కార్యదర్శి ఎన్.ఎస్.పండా, కోశాధికారి రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు. మందస: మఖరజోల రహదారిపై పలాస నుంచి హైవేలో మొక్కలను తడుపుకుంటూ వెళ్తున్న వాటర్ ట్యాంకర్ను సోంపేంట నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ ముందుభాగం నుజ్జయ్యింది. క్యాబిన్లో ఇరుకున్న డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న నేషనల్ హైవే పెట్రోలింగ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్య లు చేపట్టారు. డ్రైవర్ను బయటకు తీసి పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మందస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీకాకుళం (పీఎన్కాలనీ): జిల్లాలో అన్నీ శాఖలలో టెండర్ విధానంలో చేస్తున్న పనులకు ఏళ్ల తరబడి బిల్లులివ్వకపోవడంతో కాంట్రాక్టులకు ఆత్మహత్యలే శరణ్యమని సబ్కా శ్రీకాకుళం కాంట్రాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు జి.వి.రామానాయుడు అన్నారు. బ్యాంకులో డబ్బులు లేకుండానే బడ్జెట్ ఉందని చెప్పి.. తీరా పనులు చేయించాక డబ్బులు లేవని అధికారులు మొండిచేయి చూపిస్తున్నారని మండిపడ్డారు. శ్రీకాకుళం నగరంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పండుగపూట కాంట్రాక్టులు, వారిపై ఆధారపడి ఉన్న కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. జిల్లాలో రూ.200 కోట్లు మేర బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు గ్రంధి వెంకటగణేష్ మాట్లాడుతూ శ్రీకాకుళం మున్సిపాల్టీలో పలుకుబడి ఉంటేనే బిల్లులు వస్తున్నాయన్నారు. సంఘ ప్రధాన కార్యదర్శి చల్ల సింహాచలం, కోఆర్డినేటర్ మొదలవలస ఆంజనేయులు, సంయుక్త కార్యదర్శులు యాళ్ల రామారావు, కిల్లి మోహనరావు, సభ్యులు తలగాపు సంతోష్ కుమార్, ఎం.రవికుమార్ పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ రాష్ట్ర లీగల్సెల్లో ఇద్దరికి చోటు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వైఎస్సార్ సీపీ రాష్ట్ర లీగల్సెల్ సంయుక్త కార్యదర్శులుగా ఎచ్చెర్ల నియెజకవర్గానికి చెందిన మూగి శ్రీరాములు, ఇచ్ఛాపురం నియోజకవర్గానికి చెందిన దుప్పల చలపతి నియమితులయ్యారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై ఆగ్రహం టెక్కలి: ప్రభుత్వ వసతి గృహాల్లో మెనూ ప్రకారం విద్యార్థులకు రుచికరమైన భోజనాలు అందజేయాల్సిందేనని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు కాంతారావు స్పష్టం చేశారు. బుధవారం టెక్కలిలో ఎంజేపీ బాలికల పాఠశాల, బీసీ, ఎస్సీ, ఎస్టీ బాలికల కళాశాల వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంజేపీ బాలికల పాఠశాలలో కూరగాయలు, ఇతర వంట సామగ్రి సరఫరా చేసే కాంట్రాక్టర్ సక్రమంగా సరుకులు సరఫరా చేయకపోవడంపై ఫోన్లో మండిపడ్డారు. ఇష్టమైతే కొనసాగాలని, లేకపోతే తప్పుకోవాలని హెచ్చరించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న బీసీ బాలికల కళాశాల వసతి గృహాన్ని సందర్శించి భోజనాల నిర్వహణ సక్రమంగా లేకపోవడంపై వార్డెన్ శ్రావణికి మెమో జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్ఓ సూర్యప్రకాశ్, ఆహార నియంత్రణ అధికారి శ్రీరాములు, తూనికలు కొలతల శాఖ ఇన్స్పెక్టర్ బలరామకృష్ణ, సీఎస్డీటీ అనిల్, ఇన్చార్జి ఏబీసీడబ్ల్యూఓ త్రినాథరావు, ఏఎస్డబ్ల్యూఓ విజయలక్ష్మి , ఎంజేపీ పాఠశాలల కన్వీనర్ రత్నకుమారి, ప్రిన్సిపాల్ పి.సుధారాణి పాల్గొన్నారు. దాడి అమానుషం శ్రీకాకుళం క్రైమ్ : సర్పంచ్లను ఉత్సవ విగ్రహాలుగా మార్చుతూ టీడీపీ నాయకులు రాజ్యాంగేతర శక్తులుగా మారుతున్నారని.. దాని పర్యావసనమే టెక్కలిపాడు సర్పంచ్ ధర్మాన నీలవేణి భర్త ధర్మాన బువ్వాజీపై టీడీపీ వర్గీయుల దాడి అని వైఎస్సార్సీపీ యువనేత ధర్మాన కృష్ణచైతన్య అన్నారు. నరసన్నపేట మండలం టెక్కలిపాడు పంచాయతీ గొల్లపేటలో పారిశుద్ధ్య పనులు చేయిస్తున్న బువ్వాజీపై దాడి జరిగిన విషయం తెలిసిందే. రిమ్స్లో చికిత్స పొందుతున్న బువ్వాజీని బుధవారం పరామర్శించారు. అనంతరం ఈ ఘటనలో బాధితునికి న్యాయం చేయాలని, నిందితులను శిక్షించాలని కోరుతూ జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కృష్ణచైతన్య మాట్లాడుతూ తాము అధికారంలో ఉండగా ఎలా పనులు చేయిస్తావ్ అంటూ టీడీపీ నాయకులు ప్రశ్నించడాన్ని తప్పుపట్టారు. టీడీపీ నాయకులు తీరు మార్చుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీలు వానగోపి, ఆరంగి మురళీధర్, జెడ్పీటీసీ చింతు రామారావు, వైఎస్సార్సీపీ నాయకులు ఆర్.అప్పన్న, డి.మన్మధరావు, కె.శేఖర్రావు, డి.జగన్మోహన్, జి.వెంకటరమణి, కె.సీతారాం, పి.విజయ్కుమార్, బి.ఈశ్వరరావు, బి.రాజశేఖర్, పి.గోవింద, ఎన్.రాజేశ్వరరావు, పి.రాజప్పలనాయుడు, ఎం.గోవింద, వి.గోవింద, టి.భార్గవ్, కె.ఆనంద్ తదితరులున్నారు. బస్ స్టేషన్లు బాగుండాలి శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆర్టీసీ కాంప్లెక్సు, బస్స్టేషన్లలో మరుగుదొడ్లు, ఇతర వసతులు బాగుండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో ప్రజా రవాణా సంస్థ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైవర్, కండక్టర్ల ప్రవర్తన, బస్ స్టేషన్ పరిసరాలలో పరిశుభ్రత, సీటింగ్, వెయిటింగ్ ప్రాంతాల నిర్వహణ, తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సీ్త్ర శక్తి అమల్లో ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. సమావేశంలో జిల్లా ప్రజా రవాణాధికారి సీహెచ్.అప్పలనారాయణ, డిపో మేనేజర్లు ఎం.అమరసింహుడు, శర్మ, శ్రీనివాస్, నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ కార్యకర్త చెబితేనే యూరియా
రణస్థలం : లావేరు మండలం గుమ్మడాం రైతు సేవా కేంద్రంలో టీడీపీ కార్యకర్త చెప్పిన వారికే యూరియా అందిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం రైతు సేవా కేంద్రంలో పంచాయతీ టీడీపీ కార్యకర్త మజ్జి రామ్మూర్తి సమక్షంలో యూరియా పంపిణీ చేశారని, ఇతర పార్టీల మద్దతుగా ఉన్న రైతులకు ఇవ్వడం లేదని సర్పంచ్ దుర్గాశి ధర్మారావు, ఎంపీటీసీ ప్రతినిధి జగ్గురోతు తవిటినాయుడు, వైఎస్సార్ సీపీ నాయకులు ముప్పిడి శ్రీరాములు, నాగం కనకరాజు వాపోయారు. పరిస్థితి మారకపోతే ఆందోళన తప్పదన్నారు. ఈ విషయమై లావేరు వ్యవసాయాధికారి డి.మహేష్నాయుడు వద్ద ప్రస్తావించగా.. గుమ్మడాం పంచాయతీకి 20 టన్నుల యూరియా పంపించామని చెప్పారు. ఉదయం నుంచి టీడీపీ, వైఎస్సార్ సీపీ పెద్దలు ఫోన్లు చేసి ఫిర్యాదులు చేస్తున్నారని, అక్కడ ఉద్యోగులు పని చేయలేకపోతున్నారని తెలిపారు. ఎవరికి వారే రాజకీయం చేస్తున్నారని చెప్పారు. -
రథసప్తమికి పటిష్ట బందోబస్తు
శ్రీకాకుళం క్రైమ్ : అరసవల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలకు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం పోలీసు అధికారులతో సమీక్షా నిర్వహించారు. పోలీసులు ఆలయ, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్తు, వైద్య శాఖల అధికారులతో సమన్వయం పాటించాలన్నారు. ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు జరగనున్న వేడుకల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా విధులు నిర్వర్తించాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణ, హెలిప్యాడ్ భద్రత, పార్కింగ్ ఏర్పాట్లు, క్యూలైన్, బారికేడ్ల నిర్వహణపై ఎస్పీ చర్చించారు. సమావేశంలో అదనపు ఎస్పీలు కె.వి.రమణ, పి.శ్రీనివాసరావు, డీఎస్పీ వివేకానంద, ఽశ్రీకాకుళం సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
యువ క్రికెటర్లకు చాన్స్
● నేడు, రేపు అండర్–14 జిల్లా స్థాయి సెలక్షన్ ట్రయల్స్ ● ఎంపికై తే స్టేట్ లెవల్ ఎంపికకు అవకాశం నెట్స్లో సాధన చేస్తున్న క్రీడాకారులు శ్రీకాకుళం న్యూకాలనీ: ఫ్యూచర్ క్రికెటర్ల గుర్తింపునకు జిల్లా క్రికెట్ సంఘం(జెడ్సీఏ) సమాయత్తమైంది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) సౌజన్యంతో శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ క్రీడా మైదానంలో మహిళల క్రికెట్ నెట్స్ వేదికగా గురు, శుక్రవారాల్లో అండర్–14 బాలుర విభాగంలో సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఇప్పటి కే ఏసీఏ నుంచి సెలక్షన్ కమిటీ ప్రతినిధులు జిల్లాకు చేరుకున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ (మీడియం పేస్/స్పిన్), కీపింగ్ విభాగాల్లో బాలురు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. నిర్దేశిత ఎంపిక జాబితాలో అవకాశం లభిస్తే ప్రత్యేకంగా శిక్షణ అందించి మరింత ఉన్నతంగా ఫ్యూచర్ క్రికెటర్లను తీర్చిదిద్దనున్నారని జిల్లా క్రికెట్ సంఘం మెంటార్ ఇలియాస్ మహ్మద్ పేర్కొన్నారు. తెలుపు క్రికెట్ యూనిఫాం ధరించి హాజరుకావాలని, జనన ధృవీకరణ పత్రం, ఆధార్ ఒరిజినల్, జిరాక్స్కాపీలో ఉదయం 8 గంటలకు రిపోర్ట్ చేయాలని సూచించారు. ఏర్పాట్లు పూర్తిచేశాం.. యువ టాలెంట్ హంట్గా జిల్లా అండర్–14 బాలురుకు నిర్వహిస్తున్న ఈ ఎంపికలను శిక్షణ పొందుతున్న క్రీడాకారులంతా సద్వినియోగం చేసుకోవాలి. సెలక్షన్ ట్రయల్స్కు అన్ని ఏర్పాట్లు చేశాం. – పుల్లెల శాస్త్రి, జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు, శ్రీకాకుళం సువర్ణ అవకాశం.. జిల్లా అండర్–14 సెలక్షన్ ట్రయ ల్స్ యువ క్రికెటర్లకు సువర్ణ అవకాశం. ఏసీఏ నుంచి సెలక్షన్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. అత్యంత పారదర్శకంగా సెలక్షన్స్ జరుగుతాయి. – హసన్రాజా షేక్, జిల్లా క్రికెట్ సంఘం ప్రధాన కార్యదర్శి, శ్రీకాకుళం -
విద్యార్థులతో బాధ్యతగా వ్యవహరించాలి
ఇచ్ఛాపురం రూరల్: విద్యార్థులతో ఉపాధ్యాయులు బాధ్యతగా వ్యవహరించాలే తప్పా.. కఠినతరమైన శిక్షలు అమలు చేయకూడదని ఎంఈవో–2 ఎస్.విశ్వనాథం అన్నారు. బూట్లు వేయలేదనే నెపంతో టెన్త్ విద్యార్థులను పాత శాసనాం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పైడి గోపాలరావు బయటకు గెంటేయడంతో మంగళవారం సాక్షి దినపత్రికలో ‘బూట్లు వేయలేదని టెన్త్ విద్యార్థుల గెంటివేత’ శీర్షికతో వచ్చిన కథనానికి విద్యాశాఖ స్పందించింది. బుధవారం ఎంఈవో–2 విశ్వనాథం పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. ఇకపై విద్యార్థులపై ఇలాంటి చర్యలు తీసుకోకూడదంటూ సూచించారు. ప్రధానోపాధ్యాయుడితో లిఖిత పూర్వకంగా సంజాయిషీ పత్రాన్ని తీసుకున్నట్లు తెలిపారు. -
సర్పంచ్ల నిరసన
సరుబుజ్జిలి: గ్రామ పంచాయతీల్లోని నిధుల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించి, అభివృద్ధికి విఘాతం కలిగించడం ఎంతవరకు సమంజసమని పలువురు సర్పంచ్లు ప్రశ్నించారు. పంచాయతీ నిధుల ఖర్చు విషయంలో ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిరంకు విధానాలపై మండల కేంద్రంలో బుధవారం పలు పంచాయతీల సర్పంచ్లంతా కలిసి నిరసన తెలిపారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ పాలనకు పట్టుగొమ్మల్లాంటి పంచాయతీలను నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ నిధుల వినియోగంపై జారీ చేసిన జీవో వలన పారిశుద్ధ్యం, తాగునీరు, గ్రామ సచివాలయాల నిర్వహణ విషయంలో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వెల్లడించారు. పంచాయతీల్లో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు మంజూరు కాలేదని, ఇలాంటి తరుణంలో ఆంక్షలు విధించడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన జీవోను తక్షణమే వెనుక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెగిపడిన విద్యుత్ వైర్ టెక్కలి రూరల్: మండలంలోని రావివలస గ్రామంలో ఉన్న అల్లాయిస్ పరిశ్రమకు చెందిన విద్యుత్ వైరు బుధవారం తెగిపడి రెండు పందులు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పరిశ్రమకు సమీపంలో ఉన్న వంశధార కాలువ వద్దనున్న విద్యుత్ స్తంభం నుంచి వైరు తెగి కిందనున్న పందులపై పడిపోయింది. దీంతో అక్కడికక్కడే రెండు పందులు మృతి చెందాయి. దీనిపై అప్రమత్తమైన గ్రామస్తులు పరిశ్రమ యాజమాన్యానికి సమాచారం అందించారు. అనంతరం గ్రామస్తులు చనిపోయిన పందులను పరిశ్రమ ముందు వేసి నిరసన తెలిపారు. విద్యుత్ వైర్లు మనుషులపై పడి ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మన భూములను కాపాడుకుందాం మందస: మన ఊరు.. మన భూములను కాపాడుకుందామని, ఈ క్రమంలో ఎవరు ఎటువంటి ప్రలోభాలకు గురిచేసినా లొంగవద్దని మందస మండలం తెలగ గంగువాడ గ్రామస్తులు బుధవారం ప్రతిజ్ఞ చేశారు. స్థానిక సామాజిక భవనం వద్ద కార్గో ఎయిర్పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు కొమర వాసు ఆధ్వర్యంలో రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామపెద్ద చిత్త కూర్మారావు మాట్లాడుతూ కార్గో ఎయిర్ పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ పిలుపు మేరకు ఉద్యమంలో అందరూ భాగస్వాములం అవుతామన్నారు. -
హక్కుల సాధనకు ఆల్ ఇండియా జేఏసీ
శ్రీకాకుళం: ఉపాధ్యాయుల హక్కుల సాధనే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ఏడు జాతీయ ఉపాధ్యాయ సంఘాలు కలిసి ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఫర్ టీచర్స్ ఆర్గనైజేషన్ను ఏర్పాటు చేసినట్లు ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు పేడాడ ప్రభాకరరావు తెలిపారు. దీనికి సంబంధించి శ్రీకాకుళం నగరంలో పోస్టర్ను బుధవారం విడుదల చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న విద్యారంగ వ్యతిరేక విధానాలపై జాతీయస్థాయిలో ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ ఉద్యమంలో భాగంగా ఫిబ్రవరి 5వ తేదీన చలో ఢిల్లీ, మార్చ్ టు పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. జాతీయ పోరాటంలో ఎస్టీయూ అనుబంధ సంఘాలు ఏఐఎస్టీఎఫ్, ఏఐఎఫ్ఈటీవోలు భాగస్వాములుగా ఉన్నాయని, ఉపాధ్యాయ సమస్యలను జాతీయ స్థాయిలో బలంగా వినిపించేందుకు ఈ ఉద్యమం కీలకమని సంఘం రాష్ట్ర కార్యదర్శి పడాల తమ్మి నాయుడు పేర్కొన్నారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గురువు శ్రీనివాస్రావు మాట్లాడుతూ.. మన రాష్ట్రంలో ఇప్పటికే ప్రతీ జిల్లాలో వందల సంఖ్యలో పాఠశాలలను మూసివేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని మండిపడ్డారు. విద్యార్థులు తక్కువగా ఉన్న పాఠశాలలను మౌఖిక ఆదేశాలతో విలీనం చేయడం దుస్సాహసమని చెప్పారు. ఈ జాతీయ ఉద్యమానికి ఫిబ్రవరి 5న జరిగే మార్చ్ టు పార్లమెంట్ ద్వారా నాంది పలుకుతున్నట్లు సీనియర్ నాయకులు ఎస్వీ రమణమూర్తి అన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు కె.తేజేశ్వరరావు, సూర్యారావు, రామారావు, రామచంద్ర, రామకృష్ణ, రాజేశ్వరరావు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సారా ప్యాకెట్లతో ఐదుగురు అరెస్టు
కంచిలి/సోంపేట: కంచిలి, మందస మండలాల్లోని వివిధ గ్రామాల్లో ఎకై ్సజ్ సిబ్బంది జరిపిన దాడుల్లో మొత్తంగా 590 నాటుసారా ప్యాకెట్లు స్వాధీనం చేసుకొని, ఐదుగురిని అరెస్టు చేసి, మరో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు సోంపేట ఎకై ్సజ్ సీఐ జీవీ రమణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కంచిలి మండలం ఎంఎస్ పల్లి గ్రామంలో పడాల నరసమ్మ నుంచి 100 నాటుసారా ప్యాకెట్లు, జలంత్రకోట గ్రామంలో రత్నాల అర్జున నుంచి 100 ప్యాకెట్లు, గొల్లకంచిలి గ్రామంలో దుబ్బ భీమయ్య నుంచి 300 నాటుసారా ప్యాకెట్లు, మందస మండలం శ్రీరాంపురం గ్రామంలో కొమర రాజులమ్మ నుంచి 5 లీటర్లు నాటుసారా, కొండలోగాం గ్రామంలోని సవర కుమారి నుంచి 40 నాటుసారా ప్యాకెట్లు పట్టుకొని అరెస్టు చేశామన్నారు. వీరితోపాటు వీరికి నాటుసారా సరఫరా చేసిన ఎం.ఎస్.పల్లి గ్రామానికి చెందిన బొండాడ మోహనరావు, కాలాపాణికి చెందిన నాయక్, తుట్టసాయికి చెందిన భయ్యా గొమాంగో మీద కూడా కేసు నమోదు వెల్లడించారు. అరెస్టు చేసినవారిలో ముగ్గురిని సోంపేట మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా, 14 రోజులు రిమాండ్ విధించారని తెలిపారు. ఈ దాడుల్లో సీఐ మధుకుమార్, ఎస్ఐలు జాన్ ప్రసాద్, కల్యాణి, సుజాత, సిబ్బంది కృష్ణ, మార్కారావు, ఉమాపతి, భాను, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆటలకు చోటేది..?
శ్రీకాకుళం: విద్యార్థులకు మానసిక ఆందోళన ఉండకూడదని, ఆరోగ్యం సరిగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్న విషయం తెలిసిందే. దీని ఆధారంగా చేసుకొని పాఠశాలల్లో ప్రతిరోజు ఒక వ్యాయామ పీరియడ్ ఉండేలా రూపకల్పన చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇవి అమలవుతున్నాయి. అయితే ప్రైవేట్ పాఠశాలల్లో మాత్రం దీనిని అమలు చేయకపోగా నీట్, జేఈఈ, ఐఐటీ, ఒలింపియాడ్ ఇలా రకరకాల పేర్లు పెడుతూ విద్యార్థులను ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు పాఠశాలల్లో ఉంచి ఒత్తిడికి గురి చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల మానసిక, శారీరక ఆరోగ్య పరిస్థితిని ఆలోచించకుండా చదువే ముఖ్యమని ప్రైవేట్ పాఠశాలలు తీసుకొస్తున్న ఒత్తిడికి లొంగుతున్నారు. ఈ కారణంగానే ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థులు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పలు సర్వేలు తేటతెల్లం చేస్తున్నాయి. వీటిని పరిగణలోనికి తీసుకున్నారో.. మరే కారణంగానో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల అమలుపై విద్యాశాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. వ్యాయామం కోసం పీరియడ్ ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రతిరోజూ ఒక పీరియడ్ తప్పనిసరిగా వ్యాయామం కోసం కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే జిల్లాలోని 95 శాతం ప్రైవేట్ పాఠశాలల్లో మైదానాలు లేవని విద్యాశాఖ అధికారులకు తెలియనిది కాదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతీ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో క్రీడా మైదానం తప్పనిసరి. అయితే ప్రైవేట్ పాఠశాలలకు అనుమతులు ఇచ్చినప్పుడు అప్పటి విద్యాశాఖ అధికారులు ఏ కారణంగానో ఉదాసీనంగా వ్యవహరించి మైదానాలు లేకపోయినా అనుమతులు జారీ చేసేశారు. జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలు 400 వరకు ఉండగా, గుర్తింపు లేని పాఠశాలలు మరో 100 వరకు ఉన్నాయి. వీటిలో దాదాపుగా 95 శాతం పాఠశాలల్లో క్రీడా మైదానాలే లేవు. అపార్ట్మెంట్లలో పాఠశాలలు చాలావరకు ప్రైవేట్ పాఠశాలలు అపార్ట్మెంట్ల తరహా భవనాల్లో కొనసాగుతున్నాయి. అధికారులు వీటికి అనుమతులు జారీ చేసినప్పుడు సెల్లార్ను మైదానంగా చూపించేశారు. వాస్తవానికి ఒక పది శాతం పాఠశాలలు మినహా మిగిలిన ప్రైవేట్ పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులే లేరనడంలో అతిశయోక్తి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అమలు చేయడం కష్టతరమే. దీనిని గుర్తించిన విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ పాఠశాలల్లో ఉదయం ప్రార్థన సమయంలో యోగ, సాయంత్రం వేళ ఇండోర్ గేమ్స్ నిర్వహించాలని మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర అధికారుల నుంచి కూడా జిల్లా శాఖకు ఇదే విధమైన మౌఖిక ఆదేశాలు అందడం గమనార్హం. ఇదిలా ఉండగా చాలా ప్రైవేట్ పాఠశాలల్లో ఇండోర్ గేమ్స్ నిర్వహించే సౌకర్యం కూడా లేదు. వీటిని నిర్వహించాలంటే విశాలమైన హాలు ఉండాలి. ఇటువంటి పరిస్థితులు దాదాపుగా ఏ పాఠశాలలోనూ లేవు. చాలా పాఠశాలలు ఇరుకు గదుల్లోనే తరగతులను నిర్వహిస్తున్నాయి. దీనిపై అనేక సందర్భాల్లో విద్యార్థి సంఘాలు ఆందోళన చేసిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఈ లెక్కన ప్రభుత్వం వ్యాయామ పీరియడ్పై జారీ చేసిన ఉత్తర్వులు అమలు చేయడం దాదాపుగా సాధ్యం కాదనే చెప్పాలి. దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ప్రైవేట్ పాఠశాలల్లో ప్రతీ తరగతికి ఒక పీరియడ్ వ్యాయామం కోసం కేటాయించాలని ఆదేశాలు రావడం వాస్తవమే. ఉదయం వేళ యోగ, సాయంత్రం ఇండోర్ గేమ్స్ ఆడించాలని ఆదేశాలు వచ్చాయి. మైదానాలు చాలా పాఠశాలల్లో లేకపోవడం కూడా నిజమే. ఇండోర్ గేమ్స్ నిర్వహించాలని సూచిస్తున్నాం. – ఎ.రవిబాబు, జిల్లా విద్యాశాఖ అధికారి -
ఇచ్ఛాపురంలో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేస్తాం
ఇచ్ఛాపురం/ఇచ్ఛాపురం రూరల్: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్ఛాపురం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేస్తామని వైఎస్సార్సీపీ ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యామ్ ప్రసాద్రెడ్డి అన్నారు. నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన ఆయన పలువురు నాయకులను బుధవారం కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుంటానని తెలియజేశారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా కార్యకర్తలతో కలిసి సమన్వయంతో పనిచేసి విజయం సాధించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం సాగిస్తామని, పార్టీ కార్యక్రమాలను విస్తతంగా చేపడతామని వెల్లడించారు. బూత్ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేస్తామని పేర్కొన్నారు. ఆయనతో పాటు పార్టీ రాష్ట్ర బీసీ విభాగం కార్యదర్శి నర్తు నరేంద్ర యాదవ్, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సల్ల దేవరాజు, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు నర్తు ప్రేమ్కుమార్ యాదవ్, వైస్ ఎంపీపీ దున్న గురుమూర్తి, కౌన్సిలర్ బచ్చు జగన్, సర్పంచ్ దుక్క ధనలక్ష్మి, ఎంపీటీసీ నీలాపు జగదీష్, నర్తు భానోజీ, నీలాపు చంద్రయ్య తదితరులు ఉన్నారు. -
8 కేజీల గంజాయి స్వాధీనం
మందస: మండలంలోని హరిపురం గ్రామంలో మందస రోడ్డు రైల్వేస్టేషన్ వద్ద 8 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. బుధవారం ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లా గోలండా గ్రామానికి చెందిన జగన్నాథ్ బెహరా(23) రైల్వేస్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతుంటే పోలీసులు పట్టుకున్నారు. జగన్నాథ్ బెహరా బరంపురం పట్టణంలో గంగా ప్రధాన్ అనే వ్యక్తి వద్ద నుంచి రూ.36,000లకు గంజాయి కొనుగోలు చేశాడు. ఆ గంజాయిని బెంగులూరులో ఉన్న నరేంద్ర అనే గంజాయి వ్యాపారికి ఇవ్వనున్నట్లు తెలిపాడు. దీంతో పోలీసులు అరెస్టు చేశాడు. కాశీబుగ్గ రూరల్ సీఐ ఎం.తిరుపతిరావు, మందస ఎస్ఐ కృష్ణ ప్రసాద్ తదితరులు ఉన్నారు. పలాస: మండలంలోని బ్రాహ్మణతర్లా గ్రామానికి చెందిన సాహు ఆనంద్, నీలిభద్ర గ్రామానికి చెందిన బెహరా రమేష్ అనే ఇద్దరు యువకులను గంజాయితో అరెస్టు చేసినట్లు కాశీబుగ్గ డీఎస్పీ షేక్ షహబాజ్ అహ్మద్ తెలిపారు. వారి నుంచి 3.70 కిలోల గంజాయి, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. కాశీబుగ్గ పోలీసుస్టేషన్లో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ కేసులో మరో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారన్నారు. ఈ నలుగురు బ్రాహ్మణతర్లా పాఠశాలలో కలిసి చదువుకున్నారని, వీరంతా అప్పుడప్పుడు గంజాయి తాగడం, బరంపురం వెళ్లి ఒకరి వద్దనుంచి గంజాయి తీసుకొని వచ్చి అమ్మడం చేస్తుండేవారన్నారు. ఈ క్రమంలో గంజాయితో బ్రాహ్మణతర్లా నుంచి నడుచుకుంటూ వస్తుండగా పలాస మండలం కంబిరిగాం బ్రిడ్జి వద్ద కాశీబుగ్గ ఎస్ఐ నరిసింహమూర్తి, సీఐ వై.రామకృష్ణ, పోలీసు సిబ్బంది పట్టుకున్నారన్నారు. వారి నుంచి గంజాయిని స్వాధీనం చేసుకొని అరెస్టు చేయడం జరిగిందన్నారు. నిందితులను పలాస కోర్టులో హాజరుపరిచామని వెల్లడించారు. -
ముంచుతున్న మంచు..!
మెళియాపుట్టి: ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వాతావరణంలో మార్పుల కారణంగా రోజూ కురుస్తున్న పొగమంచు ధాటికి మామిడి పూత మాడిపోతోంది. పొగమంచు రైతులపాలిట శాపంగా మారింది. గతేడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో వరుస వర్షాల కారణంగా భూమిలో తేమశాతం పెరగడమే కాకుండా వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న పొగమంచు దీనికి తోడై మామిడి పూతను దెబ్బ తీస్తోంది. మామిడి పంటకు ప్రతీ ఏడాది ఒక్కో ఎకరాకు రూ.35 నుంచి రూ.40 వేల వరకు ఖర్చుచేసి జంగిల్ క్లియరెన్స్, పూతకు మందుల స్ప్రే చేయడం, చెట్లకు చుట్టూ కందకాలు తవ్వడం వంటివి చేస్తున్నారు. దీంతో పూత నిలబడి పంట ఆశాజనకంగా ఉంటేనే ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. లేకుంటే ఇబ్బందులు తప్పవని రైతులు వాపోతున్నారు. అయితే ఉద్యాన పంటల సీజన్లో రైతులకు అధికారులు విస్తృతంగా అవగాహన కల్పించాలి. వచ్చిన పూత రాలిపోకుండా.. కొత్తపూత వచ్చేందుకు తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలను వివరించాల్సి ఉంటుంది. అధికారులు మామిడి తోటలను పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు అందిస్తే రైతులకు అనవసర ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుంది. రోజూ దట్టంగా మంచు కురుస్తుండడంతో ఇప్పటివరకు వచ్చిన పూత మొత్తం రాలిపోతోంది. గతంలో ఈ సమయానికి మామిడిపూత చాలా ఎక్కువగా వచ్చేది. ప్రస్తుతం పూత తక్కువగా ఉంది. వచ్చిన పూత కూడా మాడిపోతోంది. దీంతో ఈ ఏడాది మామిడి పంట ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నాం. – గూడ రామారావు, కేరాసింగి, మెళియాపుట్టి వాతావరణం కారణంగానే పూత రాలుతోంది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పూత రానిచోట అధిక మొత్తంలో ఎరువులు, మందులు వినియోగిస్తే ఖర్చులు పెరగడమే కాకుండా, నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. మా సిబ్బంది క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించి, సలహాలు సూచనలు ఇస్తున్నారు. – మంగమ్మ, ఉద్యానవనశాఖ అధికారి, పాతపట్నం ఈ ఏడాది పూత రాలిపోతుండడంతో ఆందోళనగా ఉంది. అప్పులు చేసి చేసి తోటలను జాగ్రత్త చేసుకున్నాం. కానీ ఇప్పుడు అదనపు ఖర్చులు తప్పేలా లేవు. ఇలా మంచు కురుస్తూ ఉంటే దిగుబడులు తగ్గిపోతాయి. అధికారులే మాకు అండగా ఉంటూ అధిక దిగుబడులు వచ్చేలా సహకరించాలి. – జన్ని భాస్కరరావు, నేలబొంతు, మెళియాపుట్టి -
ఇదేం పద్ధతి..?
● పెంట కుప్పల మధ్య కుళాయిలు ఏర్పాటు ● ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు జలుమూరు: సాధారణంగా ఒక గ్రామంలో ప్రజలందరికీ అందుబాటులో తాగునీరు ఉండాలంటే ప్రజలకు అవసరమైన చోట కుళాయిలు ఏర్పాటు చేయాలి. కానీ మండలంలోని అల్లాడ గ్రామంలో కూటమి నాయకులు పెంట కుప్పల మధ్య ఎటువంటి ఉపయోగం లేకుండా కుళాయిలను ఏర్పాటు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఈ గ్రామంలో జల్ జీవన్ మిషన్ పనుల్లో భాగంగా కుళాయిలను ఏర్పాటు చేసి తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకున్నారు. కాగా ఇటీవల కూటమి ప్రభుత్వం మండలానికి సంబంధించి తాగునీటి కోసం రూ.14 కోట్లు కేటాయించింది. దీంట్లో అల్లాడ గ్రామానికి సుమారు రూ.8 లక్షలు కేటాయించారు. ఈ నిధులతో వైఎస్సార్సీపీ కార్యకర్తలే లక్ష్యంగా వారి జిరాయితీ భూముల్లో ఎటువంటి అనుమతులు లేకుండా రాత్రికి రాత్రి యంత్రాలతో తవ్వకాలు చేపట్టారు. అలాగే పెంట కుప్పల మధ్య ఎటువంటి ఉపయోగం లేనివిధంగా కుళాయిలు ఏర్పాటు చేశారు. ఇళ్లకు దూరంగా నీటిని తీసుకెళ్లలేనివిధంగా కుళాయిలు ఏర్పాటు చేయడంలో ఆంతర్యం ఏంటని పంచాయతీ వైఎస్సార్సీపీ యూత్ అధ్యక్షుడు సనపల శ్రీనివాసరావు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా కుళాయిల ఏర్పాటుకు సంబంధించి ప్రతీ ఇంటి వద్ద రూ.100ల చొప్పున వసూలు చేశారని ఆరోపిస్తున్నారు. దీనిపై గ్రామీణ నీటి సరఫరా విభాగం డీఈఈ జల్లు సుదర్శనరావు మాట్లాడుతూ కుళాయిలకు సంబంధించి ఎవరు వసూళ్లు చేసినా చర్యలు తప్పవని, అలాగే గుత్తేదారు మనుషులు వసూళ్లకు పాల్పడినా పరిశీలించి ఆ మొత్తం తిరిగి ఇప్పిస్తామన్నారు. పెంట కుప్పల మధ్య కుళాయిల ఏర్పాటుపై స్పందిస్తూ.. ప్రజలకు పూర్తిస్థాయిలో వినియోగం అయ్యేలా చూస్తామని పేర్కొన్నారు. -
ప్రాణాల కోసం పోరాటం
శ్రీకాకుళం జిల్లా: పన్నెండేళ్ల ప్రాయం. చలాకీగా స్నేహితులతో ఆడుకోవాల్సిన ఈ వయసులో ఆస్పత్రి మంచంపై ప్రాణాల కోసం ఓ బాలుడు పోరాడుతున్నాడు. కేన్సర్ మహమ్మారితో పోరాడే స్థోమత లేక ఆ కుటుంబం దాతల సాయం కోరుతోంది. వివరాల్లోకి వెళితే.. పలాస మండలంలోని పెదంచల గ్రామానికి చెందిన కొమటూరు రామారావు, బాలమ్మకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అందులో చిన్న కుమారుడైన 12 ఏళ్ల లింగరాజు గ్యాస్ట్రిక్ క్యాన్సర్తో పోరాడుతున్నాడు. వీరిది నిరుపేద కుటుంబం. పిల్లాడికి విశాఖపట్నంలోని పినాకిల్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. పూర్తిస్థాయి చికిత్స చేసేందుకు వారి ఆర్థిక స్థోమత సరిపోవడం లేదు. దాతలు సాయం చేస్తే బిడ్డకు చికిత్స చేయించుకోగలమని వారు కోరుతున్నారు. సాయం చేయాలనుకునేవారు 7093341878 నంబర్ను సంప్రదించాలని వారు కోరుతున్నారు. -
● బొంతు.. ఎండుతోంది గొంతు
మండలంలోని చిన్నకిట్టాలపాడు పంచాయతీ బొంతు గ్రామంలో తాగునీటి సరఫరా లేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ గ్రామంలో గతంలో ఉన్న రక్షిత మంచినీటి పథకం ద్వారా తాగునీరు సరఫరా అయ్యేది. కొన్నేళ్ల కిందట జలజీవన్ మిషన్ పథకం మంజూరు కావడంతో స్థానిక అంగన్వాడీ కేంద్రానికి సమీపంలో బోరు ఏర్పాటు చేశారు. ఈ పథకం ద్వారా పాత కుళాయి లైన్లు తొలగించి కొత్తగా ఇంటింటికీ కుళాయి లైన్లు వేశారు. కొత్త బోరు ద్వారా నీరు అనుకున్నంతగా సరఫరా కావడం లేదు. దీంతో స్థానికులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. – సారవకోట -
● కదం తొక్కిన 104 ఉద్యోగులు
పల్లెల్లో సంజీవనిగా వైద్య సేవలందిస్తున్న 104 వాహనాల్లో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలను తగ్గించడం దారుణమని, భవ్య హెల్త్ కేర్ సర్వీసెస్ ఏజెన్సీ నిర్వాకం తగదని ఉద్యోగులంతా నిరసన వ్యక్తం చేశారు. జిల్లా 104 ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలో స్థానిక డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద నుంచి ఏడురోడ్ల కూడలి వరకు ఉద్యోగులంతా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో కొవ్వొత్తులను వెలిగించి ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ తమకు భవ్య ఏజెన్సీ నుంచి దారుణంగా వేధింపులు ఎదురవుతున్నాయని, నెలకు సుమారుగా రూ.780 వర కు జీతం తగ్గించారని, అలాగే ఎర్న్డ్ లీవ్, క్యాజువల్ లీవ్స్ను కూడా రద్దు చేయడం దారుణమన్నా రు. బఫర్ సిబ్బందిని నియమించి రోజుకు డ్రైవర్కు రూ.500 ఇచ్చి నడిపిస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో అరబిందో యాజమాన్యం ఇచ్చిన జీతాల కంటే దారుణంగా కోత విధిస్తున్నా రని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏజెన్సీ దారుణాలను గుర్తించి తక్షణమే తమకు న్యాయం చేయాలని ఉద్యోగ సంఘ ప్రతినిధులంతా డిమాండ్ చేశారు. – అరసవల్లి -
నేడు మెగాజాబ్మేళా
కొత్తూరు: స్థానిక శ్రీవెంకటేశ్వర డిగ్రీ కాలేజీలో బుధవారం మెగాజాబ్ మేళా నిర్వహించనున్నట్లు కాలేజీ చైర్మన్ గేదెల కృష్ణారావు మంగళవారం తెలిపారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మేళాకు 10 కంపెనీలు హాజరవుతాయన్నారు. వివిధ కేటగిరీలకు చెందిన సుమా రు 360 పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతి నుంచి డిగ్రీ, బీటెక్ అర్హత ఉన్న వారంతా అర్హులేనని, 18–35 ఏళ్ల వయసు గల వ్యక్తులు హాజరు కావాలని సూచించారు. మేళాకు విద్యార్హతతో పాటు ఆధార్కార్డు, ఫొటోలు తీసుకురావాలని సూచించారు. -
నన్ను చంపడానికే వచ్చారు
● సర్పంచ్ భర్త, వైఎస్సార్ సీపీ నాయకుడు బువ్వాజీ ● టీడీపీ వర్గీయుల దాడిలో తీవ్ర గాయాలు నరసన్నపేట: సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో గొల్లపేటలో పారిశుద్ధ్య పను లు చేపడుతుండగా.. టీడీపీకి చెందిన అసిరినాయుడుతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు తనను చంపడానికే దాడి చేశారని, ఇప్పటికే చాలాసార్లు బెదిరించారని, ఒక్కడినే ఉండగా వచ్చి దాడి చేశారని టెక్కలిపాడు సర్పంచ్ నీలవేణి భర్త, వైఎస్సార్సీపీ నాయకుడు ధర్మాన బువ్వాజీ తెలిపారు. నరసన్నపేట ప్రభుత్వాస్పత్రి వద్ద ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కత్తులు, కర్రల తో దాడికి పాల్పడ్డారని, అడ్డుకోవడానికి ప్రయత్నించిన తమ్ముడు అచ్చెన్నపై కూడా దాడి చేశారని తెలిపారు. ‘పనులు చేయడానికి నీవెవరు’ అంటూ ప్రశ్నించారని, సర్పంచ్ భర్తగా పారిశుద్ధ్య పనుల వద్ద ఉండడం తప్పా అని అడిగారు. దీనిపై బువ్వాజీ సోదరుడు అచ్చెన్న మా ట్లాడుతూ పారిశుద్ధ్య పనులు చేస్తున్నప్పుడు వెనుకగా వచ్చి దాడి చేశారని, బువ్వాజీని హత్య చేయడమే వారి ఆలోచన అని తెలిపా రు. పారిపోతూ కూడా మీ అంతుచూస్తామ ని బెదిరించారని పేర్కొన్నారు. గ్రామస్తులు బండి జోగారావు, పిరియా పండువాడు, ధర్మాన లింగన్న తదితరులు స్పందిస్తూ టీడీపీ వాళ్లు కక్ష కట్టి ఇలా దాడి చేయడం దారుణమని అన్నారు. పంచాయతీ ప్రజలంతా బువ్వాజీకి అండగా ఉంటామన్నారు. బువ్వాజీని పరామర్శిస్తున్న ధర్మాన కృష్ణదాస్ తదితరులు దాడి అమానుషం వైఎస్సార్సీపీ నాయకుడిపై మారణాయుధాలతో దాడికి పాల్పడడం అమానుషమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. బువ్వాజీ వివాదాలకు దూరంగా ఉంటారని, అలాంటి వ్యక్తిపై ఇలా దాడులు చేయడం తగదని అన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని సూచించారు. సమాచారం తెలిసిన వెంటనే ఎస్పీతో మా ట్లాడానని చెప్పారు. స్వయంగా కలిసి కూడా దాడి గురించి వివరిస్తామన్నారు. బువ్వాజీకి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. అంతకుముందు ఆస్పత్రిలో బాధితుడిని కలిసి పరామర్శించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కాళింగ విభా గం అధ్యక్షుడు ఆరంగి మురళి, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు కేసీహెచ్బీ గుప్త, పార్టీ రైతు విభాగం రాష్ట కార్యదర్శి కనపల శేఖర్, పార్టీ నాయకులు బగ్గు రామకృష్ణ, ధర్మాన జగన్, రాజాపు అప్పన్న, బగ్గు రమణయ్య, నేతింటి రాజేశ్వరరావు, బీఎల్ శర్మ తదితరులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బువ్వాజీని ఆయన సోదరుడు అచ్చెన్నను పరామర్శించారు. అనంతరం వీరు మాట్లాడుతూ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. -
వైఎస్సార్సీపీ ఇచ్ఛాపురం సమన్వయకర్తగా శ్యామ్ ప్రసాద్ రెడ్డి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఇచ్ఛాపురం నియోజకవర్గం వైఎస్సార్ సీపీ సమన్వయ కర్తగా సాడి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులుగా పిరియా సాయిరాజ్ నియమితులయ్యారు. పార్లమెంట్ కో ఆర్డినేటర్గా తమ్మినేని సీతారాం కొనసాగుతారని పార్టీ కేంద్ర కార్యాలయం స్పష్టం చేసింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. సాడికి గుర్తింపు సాడి పార్టీకి అందిస్తున్న సేవలను గుర్తించి సమన్వయకర్తగా నియమించారు. ఇచ్ఛాపురం మండలం అరకభద్ర గ్రామానికి చెందిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి బీటెక్ చదువుకున్నారు. విద్యాభ్యాసం తర్వాత వైజాగ్, కాకినాడ కోరమండల్ ఇంటర్నేషనల్ కంపెనీలో ఏజీఎంగాను, సౌదీలో సీనియర్ ఇంజినీర్గా పని చేశారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి తల్లి కాంచనా దేవి అరకభద్ర వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యురాలిగా సేవలు అందిస్తున్నారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి భార్య కళావతి తాత దక్కత పితంబర్ రెడ్డి ఇచ్ఛాపురం సమితి ఏర్పడిన తర్వాత మొదటి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి 2014లో ఇచ్ఛాపురం నియోజకవర్గానికి వైఎస్సార్ సీపీ మొదటి సమన్వయకర్తగా కొన్ని నెలల పాటు సేవలందించారు. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు సీడాప్ చైర్మన్గా, పార్టీ జిల్లా సోషల్ మీడియా టాస్క్ఫోర్స్ సభ్యునిగా, విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గ పరిశీలకుడిగా పని చేశారు. ప్రస్తుతం టెక్కలి, నరసన్నపేట నియోజకవర్గాల పరిశీలకుడిగా, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్)గా చేస్తున్నారు. సీఈసీ సభ్యునిగా పిరియా సాయిరాజ్ మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యులుగా నియమితులయ్యారు. పార్టీకి సుదీర్ఘ కాలంగా అందించిన సేవలను దృష్టిలో ఉంచుకుని సాయిరాజ్ను సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులుగా నియమించారు. పార్లమెంట్ కో ఆర్డినేటర్గా తమ్మినేని సీతారాం శ్రీకాకుళం పార్లమెంట్ కో ఆర్డినేటర్గా తమ్మినేని సీతారాం కొనసాగుతారని పార్టీ అధిష్టానం స్పష్టం చేసింది. సీనియర్ నాయకుడిగా, పార్టీకి అందించిన సేవలను దృష్టిలో ఉంచుకుని పార్లమెంట్ సమన్వయకర్తగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. పార్టీ సీఈసీ సభ్యుడిగా పిరియా సాయిరాజ్ పార్లమెంట్ కో ఆర్డినేటర్గా తమ్మినేని సీతారాం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం తమ్మినేని సీతారాం శ్యామ్ ప్రసాద్ రెడ్డి -
● కూల్చివేతలకే పరిమితం
ఏడాది కిందట అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం చుట్టూ శాశ్వత కట్టడాలను కూల్చేసి వదిలేసింది. సరైన అభివృద్ధి ప్రణాళిక లేకుండా, ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతుల్లేకుండా యుద్ధ ప్రాతిపదికన పలు భవనాలను కూల్చివేసి, రథ సప్తమికి ముందు పాలకులు, అధికారులు హడావుడి చేసి, తర్వాత మౌనం పాటించారు. ఆలయ నిధులతో తాత్కాలిక ఏర్పాట్లు చేసి మూడు రోజుల పండగను జరిపించేసి, ఆ తర్వాత అభివృద్ధి జోలికి పోలేదు. దీంతో భక్తులు, అక్కడున్న వ్యాపారులకు అవస్థలే మిగిలాయి. గత ఏడాది డిసెంబర్లో రథసప్తమి వేడుకల ఏర్పాట్లలో భాగంగా ఆలయం వద్ద క్యూలైన్లు, మరుగుదొడ్లు, స్నాన పు గదులు, షాపింగ్ కాంప్లెక్స్, అన్నదానం, అన్న ప్రసాదాల తయారీ, ప్రసాద విక్రయశాల భవనాలతో పాటు వివిధ నిర్మాణాలను కూల్చేశారు. అంతా ఆర్భాటమే.. అరసవల్లిలో దాతల సాయంతో నిర్మించిన నిర్మాణాలను దాతలకు తెలియకుండానే, సమాచారం ఇవ్వకుండా యుద్ధ ప్రాతిపదికన కూల్చేసి సంబంధిత దాతల్ని ఆవేదనకు గురి చేశారు. పోనీ, తర్వాత ఏమైనా చేశారంటే అదీ లేదు. ఏడాది దాటినా వాటి స్థానంలో ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేదు. తాత్కాలిక ఆర్భాటంతో కానిచ్చేశారు. రథసప్తమి పండగ పేరుతో గత ఏడాది మూడు రోజుల పాటు హడావుడి చేసిన కేంద్ర, రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్యేలు ఆలయానికి ఒక్క రూపాయి కూడా మంజూరు చేయించలేదు. రాష్ట్ర పండగగా ప్రకటిస్తూ జీఓ జారీ చేసి చేతులు దులుపుకున్నారు. ప్రభుత్వం నుంచి ఒక్క పైసా ఇచ్చే పరిస్థితి లేదని లిఖితపూర్వకంగా చెప్పేశారు. పోనీ, రెండో ఏడాదైనా ప్రత్యేకంగా నిధులు తెప్పిస్తున్నారంటే అదీ లేదు. గత ఏడాది కార్పొరేషన్ నిధులతో సోకు చేసినట్టే ఈ సారి కూడా అదే తరహాలో ముందుకెళ్తున్నారు. చిత్తశుద్ధి లేకుండా, ఒక ప్రణాళిక రూపొందించకుండా ఆలయ విస్తరణను ఏడాదిగా గాలికొదిలేసి, కూల్చేసిన నిర్మాణాల చోటనే శాశ్వత భవనాలను నిర్మించేందుకు మళ్లీ దాతల కోసం చేతులు చాస్తున్నారు. దాతల సాయంతో నిర్మించిన భవనాలు కూల్చేసి, మళ్లీ కొత్తగా దాతల సాయం తీసుకుని నిర్మించాలని చూడటం ఏమనాలో పాలకులకే తెలియాలి. -
● మార్కెట్ విస్తరణలోనూ అదే నిర్వాకం
నగరంలోని పొట్టి శ్రీరాముల మార్కెట్లో గత ప్రభుత్వం రోడ్లను వేసి అభివృద్ధి చేసింది. దానికి ముందు వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వంలో ఐడీఎస్ఎంటీ పథకం కింద రుణ సాయంతో షాపులను నిర్మించారు. కూల్చివేతల ప్రభుత్వంగా ముద్ర వేసుకున్న చంద్రబాబు ప్రభుత్వం దృష్టి ఇప్పుడా షాపులపై పడింది. వాస్తవానికి షాపుల భవనాలు పటిష్టంగా ఉన్నాయి. వాటిని ఎలా వినియోగించాలన్న దానిపై ఆలోచన చేయకుండా గత పాలకుల ముద్ర కనబడకుండా, స్వప్రయో జనాలతో అనుయాయులకు ధారాదత్తం చేసేందుకు విస్తరణ అజెండా ఎత్తుకుంది. యుద్ధ ప్రాతిపదికన రెండు బ్లాకుల్లోని షాపులు కూల్చేస్తోంది. ఒక బ్లాక్లో 32 షాపులను ఇప్పటికే కూల్చేయగా, మరో బ్లాక్లోని 38 షాపులను కూల్చే పనిలో పడింది. భవనాలు పటిష్టంగా ఉండటంతో ప్రొక్లైనర్లు కూల్చడానికి కష్టపడుతున్న పరిస్థితులు నెలకున్నాయి. అంత స్ట్రాంగ్గా ఉన్న భవనాలను వ్యక్తిగత అజెండా కోసం ఎలాంటి ప్లాన్ లేకుండా, అనుమతులు రాకుండానే కూల్చేడం విమర్శలకు దారితీస్తోంది. అది కూడా పండగ పూట కూల్చేడంతో అక్కడున్న వారు తమ వ్యాపారాలను నష్టపోతున్నారు. ఏ మాత్రం ఆలోచన చేయకుండా ప్రస్తుతం మార్కెట్లో కూల్చేస్తున్న షాపులను 2008లో వైఎస్ రాజశేఖర్ ప్రభుత్వంలో ఐడీఎస్ఎంటీ పథకం కింద రుణ సాయంతో నిర్మించారు. రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 30 శాతం, రుణ సాయం 70శాతంగా ఉంది. ఈ రుణాన్ని 25ఏళ్ల లోగా తీర్చాలి. రుణం క్లియర్ కాకుండా ఆ భవనాల జోలికి వెళ్లడం, వాటిని కూల్చడం కూడా చట్ట విరుద్ధం. కానీ, ప్రస్తుత పాలకులు ఎలాంటి ప్రణాళిక, ముందు చూపులేకుండా యుద్ధ ప్రాతిపదికన కూల్చేస్తున్నారు. దీనిపై న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే రెంటికి చెడ్డ రేవడిలా కూల్చివేతలు తయారవుతాయి. కూల్చివేతల ఎత్తుగడ వెనక నేతల స్వప్రయోజనాలు, దురాలోచన ఉన్నట్టు తెలుస్తోంది. తమ అనుయాయులకు శాశ్వత ప్రాతిపదికన కట్టబెట్టేందుకు ప్లాన్ చేసినట్టు విమర్శలు ఉన్నాయి. ఎవరైతే షాపు కావాలనుకుంటారో వారే తమ సొంత నిధులతో నిర్మించుకుని, తర్వాత ఆ షాపును అనుభవించేలా ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. ఈ లెక్కన ఇప్పుడా షాపుల్లో ఉన్న వ్యక్తులకు అంత స్థోమత లేదు. వారి స్థానంలో నేతల అనుయాయులే దక్కించుకుని, సొంత నిధులతో నిర్మించి, తమ జాగీరులా వాడుకునేలా చేసుకోవడమే ఎత్తుగడ అని వాదనలు ఉన్నాయి. -
‘క్వారీలపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై ఏదీ..?’
టెక్కలి: గ్రానైట్ క్వారీలు ప్రారంభించినపుడు ఉన్న శ్రద్ధ ఆ తర్వాత ఆయా గ్రామాల అభివృద్ధిపై చూపడం లేదని టెక్కలి మండలం ఆంజనేయపురం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశా రు. ఆంజనేయపురం గ్రామానికి ఆనుకుని అడ్డుకొండ సర్వే నంబర్లో హెరిటేజ్ గ్రానైట్ క్వారీ ఏర్పాటు, అర్చనా గ్రానైట్ క్వారీ విస్తరణకు సంబంధించి మంగళవారం ప్రజాభిప్రా య సేకరణ నిర్వహించారు. టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ కరుణశ్రీ, మైన్స్ ఏడీ విజయలక్ష్మి, తహసీల్దార్ బి.సత్యం సమక్షంలో అభిప్రాయ సేకరణ నిర్వహించారు. మేఘవరం పంచాయతీ పరిధిలో క్వారీలు ఉన్నప్పటికీ ఆ క్వారీల వల్ల తమ గ్రామంలో ఇబ్బందులు తలెత్తుతున్నా యని గుర్తు చేశారు. స్థానికంగా ఉన్న కార్మికులకు కాకుండా ఒడిశా నుంచి కార్మికులకు తీసుకురావడం వల్ల పనులకు ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. గ్రామంలో కనీసం ఆర్ఓ వాటర్ ప్లాంట్ కూడా లేని దుస్థితిలో ఉన్నామన్నారు. గ్రామంలో నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అనంత రం ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ ఇటీవల మెళియాపుట్టి ప్రాంతంలో గ్రానైట్ క్వారీల్లో చోటు చేసుకున్న సంఘటనల్లో గా యపడిన వారిని కనీసం పట్టించుకోలేదన్నా రు. ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి మాట్లాడుతూ క్వారీ లకు ఆనుకుని ఉన్న గ్రామాల్లో అభివృద్ధి చర్య లు చేపట్టే విధంగా ఆయా యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొన్నారు. జవాబుదారీతనంతో పనిచేయండి: కలెక్టర్ శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వ లక్ష్యం పక్కదారి పడితే సహించేది లేదని, విధుల్లో బాధ్యతారాహిత్యం ప్రదర్శించే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని, ప్రజలకు సేవ చేయాల్సిన వారు మెయింటైన్ చేయాల్సిన రిజిస్టర్ల దగ్గర నుంచి బయోమెట్రిక్ వరకు అన్నీ సక్రమంగా ఉండాల్సిందేనని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులను హెచ్చరించారు. కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి మంగళవారం సాయంత్రం మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడి యో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. వైద్యారోగ్య శాఖపై సమీక్ష సందర్భంగా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది మెడికల్ ఆఫీసర్లు బాధ్యతగా వ్యవహరించడం లేదని, ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. డిప్యూ టీ డీఎంహెచ్ఓలు వారం రోజుల్లోగా జిల్లాలో ని 71 పీహెచ్సీలను తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న 6,400 మంది సిబ్బంది పనితీరుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని కలెక్టర్ సూచించారు. అన్నీ ఈ–ఆఫీస్ ద్వారానే ప్రభుత్వ పరిపాలనలో ’ఈ–ఆఫీస్’ అమలును అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఇకపై ఫైళ్లన్నీ ఈ–ఆఫీస్ ద్వారానే జరగాలని, కాలయాపన చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పారిశుద్ధ్యం మెరుగుపరచాలని, చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల ద్వారా ఆదాయం పెంచేలా చూడాలని సూచించారు. నివాస స్థలాల పట్టాల పంపిణీకి ఖాళీ ప్లాట్ల వివరాలు సిద్ధం చేయాలని, పంచాయతీ భవనాల నిర్మాణానికి స్థలాలు సేకరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. -
నిబంధనలు పాటించకుంటే చర్యలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వం పేద ప్రజల కోసం వేలాది కోట్లు వెచ్చించి అమలు చేస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థలో అలసత్వాన్ని సహించేది లేదని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు కాంతారావు స్పష్టం చేశారు. మంగళవారం శ్రీకాకుళం నగరంలోని పలు రేషన్ డిపోలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముందుగా బలగ హాస్పిటల్ రోడ్డులోని డిపోను పరిశీలించిన కాంతారావు, అక్కడ స్టాక్ ఉన్నప్పటికీ అదనపు వస్తువులైన గోధుమపిండి, బెల్లం విక్రయించడంలో విఫలమవ్వడంపై అసహనం వ్యక్తం చేశారు. దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా సరఫరా అధికారిని ఆదేశించారు. అనంతరం డీసీఎంఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్న డిపోలను సందర్శించి, నోటీసు బోర్డులో వివరాలు ప్రదర్శించకపోవడం చట్టపరంగా తప్పని హెచ్చరించారు. న్యూ కాలనీలోని డిపో మూసివేయడం వల్ల లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారని, అంగన్వాడీలకు బియ్యం పంపిణీ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆ డీలర్పై చర్యలకు ఆదేశించారు. శ్రీకాకుళం అర్బన్ పరిధిలోని గాజులవీధి అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆయన, అక్కడ స్టాక్ రిజిస్టర్లను నిశితంగా పరిశీలించారు. హాజరు పట్టికలో గైర్హాజరైన వారిని రెడ్ మార్క్తో గుర్తించాలని, రికార్డుల్లో కొట్టివేతలు, దిద్దుబాట్లు ఉంటే సంబంధిత సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. చిన్నారులకు అందించే ఆహార నాణ్యతను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం పీఎస్ఎన్ఎం పాఠశాల సందర్శనలో భాగంగా అక్షయపాత్ర మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి, విద్యార్థులతో కలిసి ముచ్చటించారు. పర్యటనలో ఆయనతో పాటు జిల్లా సరఫరా అధికారి జి.సూర్యప్రకాశరావు, ఐసీడీఎస్ సిబ్బంది, రెవెన్యూ అధికారులు, ఇతర శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. -
కాశీబుగ్గ వెంకన్న ఆలయ పునఃప్రారంభానికి చర్యలు
వజ్రపుకొత్తూరు రూరల్: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని వేంకటేశ్వర స్వామి ఆలయం(చిన తిరుపతి) పునఃప్రారంభానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. గత ఏడాది నవంబర్లో ఏకాదశి నాడు తొక్కిసలాట జరిగి 9 మంది భక్తులు మృతిచెందిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాల మేరకు అప్పట్లో ఆలయం మూసి వేశారు. తాజాగా ఆలయాన్ని పునఃప్రారంభించే చర్యల్లో భాగంగా మంగళవారం దేవదాయశాఖ అధికారి గురునాథ్, రావివలస ఆలయ దేవస్థానం కార్యదర్శి గురునాథరావు ఆలయాన్ని పరిశీలించారు. ఆలయ ధర్మకర్త హరిముకుంద పండాతో మాట్లాడారు. క్యూలెన్లు, బారికేడ్లు, గ్రిల్స్, ఐరన్ రెయిలింగ్స్, ఎగ్జిట్ మార్గాల పనులను పరిశీలించారు. త్రిసభ్య కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆలయాన్ని పునఃప్రారంభించి భక్తులకు స్వామి దర్శన భాగ్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వారు తెలిపారు. -
9న రథసప్తమి ఉత్సవాలకు శ్రీకారం
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఈ నెల 19 నుంచి 25 వరకు అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో జరిగే రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈనెల 9వ తేదీ ఉదయం 8 గంటలకు ‘కర్టెన్ రైజర్’ కార్యక్రమంతో ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలన్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో సూర్యనమస్కారాలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయ ప్రాశస్త్యం తెలిసేలా ఫ్లెక్సీలు, విదేశీ పుష్పాలతో అలంకరణలు చేయాలని ఆదేశించారు. రూ.100 క్యూ లైన్లు, ఉచిత దర్శనం లైన్లలో వచ్చే సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకూడదని స్పష్టం చేశారు. సీనియర్ సిటిజన్లకు పార్కింగ్ నుంచి ఆలయం వరకు రవాణా సౌకర్యం కల్పించాలని, పోలీసు శాఖ సమన్వయంతో పార్కింగ్ స్థలాలను సిద్ధం చేయాలని సూచించారు. గతంలో విధి నిర్వహణలో ఉన్న సిబ్బందికి భోజనం అందలేదన్న ఫిర్యాదులు మళ్లీ రాకూడదని, ఫుడ్ కమిటీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సిక్కోలు రథసప్తమి జ్ఞాపికలు, పొందూరు ఖాదీ శాలువాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్వహణకు 15 ప్రత్యేక కమిటీలు: ఉత్సవాల విజయవంతం కోసం 15 ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో ఫండింగ్ కమిటీ, ఆహ్వాన పత్రికల కమిటీ, పబ్లిసిటీ కమిటీ వంటి కీలక బృందాలను నియమించారు. వీటితో పాటు శోభాయాత్ర, మెగా సూర్యనమస్కార్, సాంస్కృతిక కార్యక్రమాలు, పార్కింగ్, బ్యూటిఫికేషన్ కమిటీలు క్షేత్రస్థాయిలో పనిచేస్తాయని కలెక్టర్ వివరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, డీఆర్వో ఎస్వీ లక్ష్మణమూర్తి, ఆర్డీవో సాయి ప్రత్యూష, డీఎస్పీ వివేకానంద, ఆలయ ఈఓ, మున్సిపల్ కమిషనర్, వైద్య ఆరోగ్య శాఖ సహా పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పండగకు ‘ధరా’ఘాతం!
సంక్రాంతి పండగ వస్తే చాలు ప్రతి తెలుగింటా పిండివంట ఘుమఘుమలాడాల్సిందే. పేద, మధ్య తరగతి అనే తేడా లేకుండా ఉన్నంతలో గొప్పగా జరుపుకుంటారు. అయితే ఈసారి పండగకు సామాన్యులపై ధరల భారం ఎక్కువైంది. బియ్యం నుంచి పప్పులు వరకు నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇక కూరగాయలు, గుడ్లు ధరల సంగతి సరేసరి. ● ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు ● హడలెత్తిపోతున్న సామాన్యులుహిరమండలం: సామాన్యులు పండగ చేసుకోవాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. వంట నూనెల ధరలు సలసలా కాగుతుండగా.. కూరగాయల ధరల అధరహో అనిపిస్తున్నాయి. గతంలో ఉన్నడూ లేనివిధంగా నిత్యావసరాల ధరలు రోజురోజూకూ పెరిగిపోతుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. మండుతున్న నూనెలు.. కూరగాయలు, నిత్యావసర ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే దీనికి తోడు వంటనూనెలు ధరలు కూడా మండిపోతున్నాయి. రిఫండ్ ఆయిల్ పది రోజుల క్రితం రూ.140 ఉండగా ఇప్పుడు రూ.165కి పెరిగింది. పామాయిల్ ధర కొండెక్కి కూర్చొంది. పదిరోజుల క్రితం రూ.120 ఉండగా ఇప్పుడు రూ.140కి చేరింది. ఉడకని పప్పులు.. వేరుశనగ పలుకులు ధరలు ఒక్కసారిగా పెంచేశారు. పది రోజుల క్రితం కేజీ రూ.110 కాగా ఇప్పుడు రూ.130 నుంచి రూ.150కి అమ్ముతున్నారు. కంది పప్పు ఒక్కసారిగా రూ.20 పెరిగింది. పదిరోజుల కిందట రూ.120 ఉండగా రూ.150కి పెంచేశారు. మినప్పప్పు కిలో రూ.115 నుంచి రూ.130కి పెరిగింది. డిపోల్లో కానరాని కందిపప్పు.. గతంలో రేషన్ డిపోల ద్వారా కందిపప్పు, పామాయిల్ పంపిణీ చేసేవారు. గత ఏడాది నుంచి చాలా డిపోల్లో కందిపప్పు పంపిణీ నిలిపివేశారు. అప్పట్లో కిలో కందిపప్పు కేవలం రూ.67కే అందించేవారు. ఇప్పుడు సరఫరా నిలిపివేయడంతో పేదలు పప్పులు కొనలేక ఇబ్బందులు పడుతున్నారు. అంతా సిండికేట్ మాయ.. ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని, హోల్సేల్,రిటైల్ వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి ప్రజలను దోచుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో షాపులో ఒక్కో రకంగా ధరలను అమలుచేస్తున్నా పౌరసరఫరాల శాఖాధికారులు కన్నెత్తి కూడా చూడటంలేదు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించినప్పటికీ దానిని బోర్డులకే పరిమితం చేస్తున్నారు. ఎవరైనా జీఎస్టీ తగ్గిందని ప్రశ్నిస్తే ఇంకా తమకు ఆదేశాలు రాలేదంటూ సమాధానం ఇస్తున్నారని పలువురు వాపోతున్నారు. నిత్యావసరాల ధరల నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోవడంతో పిల్లలకు పూర్తిస్థాయిలో పౌష్టికాహారం అందించలేని పరిస్థితి నెలకొంది. ప్రజల ఆదాయాలను పెంచేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. – సిర్ల ప్రసాద్ సీఐటీయూ నాయకుడు నూనె, పప్పు దినుసులు, బియ్యం తదితర నిత్యావసరాలతో పాటు కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. సామాన్య ప్రజలు కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. ధరలను నియంత్రించేలా పాలకులు చర్యలు చేపట్టాలి. – జి.లలిత, తంప గ్రామం, హిరమండలం బయటమార్కెట్లో నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నాయి. వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచేస్తున్నారు. సామాన్యులు కొనలేకపోతున్నారు. ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకోవాలి. రేషన్ డిపోల ద్వారా కందిపప్పు, నూనె సరఫరా చేయాలి. – కె.రోజా, యంబరాం, ఎల్ఎన్పేట మండలం -
రహదారి భద్రతపై డ్రైవర్లకు అవగాహన
శ్రీకాకుళం రూరల్: రహదారి భద్రతకు సంబంధించి మునసబుపేటలోని గురజాడ ఎడ్యుకేషన్ అకాడమీలో మంగళవారం రవాణా శాఖ ఆధ్వర్యంలో 120 మంది ఆటో, లారీ డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. శ్రీకాకుళం నగరంలోని డాక్టర్ సత్యసూర్య, డాక్టర్ శశిధర్ హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీటీసీ విజయసారధి మాట్లాడారు. డ్రైవర్లు రోడ్డు నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం డ్రైవర్లకు కంటి పరీక్షలు, షుగర్ బీపీ టెస్టులు నిర్వహించారు. కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు గంగాధర్, అనిల్, వైద్యులు దానేటి హర్ష, బొడ్డేపల్లి అనూష, బ్రాహ్మణి, సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
కన్నీటి తీరం!
● సముద్రంలో బోటు బోల్తాపడి మత్స్యకారుడు మృతి ● ప్రాణాలతో బయటపడ్డ మరో నలుగురు ● దేవునల్తాడలో విషాదం వజ్రపుకొత్తూరు: సముద్రంలో రాకాసి అలలకు మర బోటు బోల్తాపడిన ఘటనలో వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడ గ్రామానికి చెందిన మత్స్యకారుడు చెక్క గోపాలరావు(46) మృతి చెందాడు. మరో నలుగురు మత్స్యకారులు ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవునల్తాడకు చెందిన చెక్క గోపాలరావుకు భార్య మహాలక్ష్మీ, ఇద్దరు కుమారులు రాజు, చాణిక్య ఉన్నారు. సముద్రంలో చేపల వేట జీవనాధారంగా బతుకుతున్నారు. ఎప్పటిలాగే మంగళవారం వేకువజామున గాడి శ్రీనివాసరావుకు చెందిన మర బోటులో గోపాలరావు, శ్రీనివారావు, తెరుపల్లి లింగమయ్య, ఎరుపల్లి ఈశ్వరరావు, చింతల దానేసులు వేటకు వెళ్లారు. కొద్దిసేపటికే రాకాసి అలల ఉధృతికి బోటు బోల్తా పడింది. అందరూ చెల్లాచెదురయ్యారు. అతికష్టమ్మీద ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. గోపాలరావు ఆచూకీ లభ్యం కాకపోవడంతో బోటుతో వెళ్లి గాలించారు. చివరకు తీవ్ర గాయాలతో మృతి చెందిన గోపాలరావును గమనించి మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. అనంతరం గ్రామస్తులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తీరానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా రోదించారు. మృతుడి భార్య మహాలక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వజ్రపుకొత్తూరు ఎస్ఐ బి.నిహార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అందని పరిహారం
నష్టం అపారం.. కొత్తూరు : ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం వాటిల్లితే వెంటనే నష్టపరిహారం అందించి రైతులను ఆదుకుంటామని గత ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడు ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక షరామామూలుగా హామీని విస్మరించారు. గత ఏడాది అక్టోబర్ 3న వంశధార నదీ పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలకు కురిశాయి. వంశధార నదికి సుమారు లక్షా పది వేల క్యూసెక్కుల వరద నీరు రావడంతో ఉద్ధృతంగా ప్రవహించింది. వంశదార నదీ తీర ప్రాంతాలైన కొత్తూరు, హిరమండలం, ఎల్ఎన్పేట, సరుబుజ్జిలి, ఆమదాలవలస, జలుమూరు, నరసన్నపేట తదితర మండలాల్లో 2739 మంది రైతులకు చెందిన 1132 హెక్టార్లలో వరి పంట ముంపునకు గురైంది. 26 మంది రైతులకు చెందిన 13.06 హెక్టార్ల మొక్కజొన్న పంట నాశనమైంది. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన పంటంతా పూర్తిగా నష్టపోవడంతో రైతులు కుదేలయ్యారు. ఎదురుచూపులు ఎన్నాళ్లో.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలో ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే వెంటనే పరిహారం అందేది. దీంతో రైతులు పంట పోయినా కోలుకునే వారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితి లేదు. ఇందుకు అక్టోబర్ వరదలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. వరదలు వచ్చి నాలుగు నెలలైనా పరిహారం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్పట్లో నష్టపోయిన పంటలు వివరాలు పంపించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశించడంతో.. వ్యవసాయ శాఖ అధికారులు పంటల విస్తీర్ణం, రైతులు వివరాలతో కూడిన జాబితాను సమర్పించారు. అయినా ఇంతవరకు చిల్లిగవ్వ కూడా అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రానున్న సంక్రాంతి పండగ నాటికై నా నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. ● -
చిన్నబాబు కుటుంబానికి పరామర్శ
టెక్కలి : పెద్దసాన గ్రామానికి చెందిన రైతు నాయకుడు కోత చిన్నబాబు మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని అస్సాం చీఫ్ సెక్రటరీ కోత రవి మంగళవారం పరామర్శించారు. చిన్నబాబు చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. పుస్తెలతాడు చోరీ రణస్థలం: లావేరు మండలం బెజ్జిపురంలో కలిశెట్టి సూరమ్మకు చెందిన రెండు తులాల పుస్తెలతాడు గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు చోరికి పాల్పడ్డారు. లావేరు పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. బెజ్జిపురం హైస్కూల్ వెనుక రొంపివలసకు వెళ్లే దారిలో పొలం నుంచి సూరమ్మ అనే వృద్ధురాలు వస్తుండగా సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చిన పుస్తెలతాడు లాగారు. వెంటనే తేరుకుని తాడు పట్టుకోవడంతో సగం ముక్క ఆమె చేతిలోనే ఉండిపోయింది. దీంతో మరో సగం తాడు పట్టుకుని పరారయ్యారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లావేరు ఎస్సై కె.అప్పలసూరి మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటుకల ట్రాక్టర్ బోల్తా మందస: మేఘమాల గ్రామ సమీపంలో మంగళవారం ఇటుకల ట్రాక్టర్ బోల్తా పడింది. మందస నుంచి చీపి గ్రామం ఇటుకల లోడుతో వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పొగమంచుకు తోడు కొండ ప్రాంతం కావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో నష్టం తప్పింది. గురుకుల విద్యార్థి ప్రతిభ కంచిలి: మండల కేంద్రం కంచిలిలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాల పదో తరగతి విద్యార్థి పొట్నూరు ప్రవీణ్కుమార్ జాతీయ స్థాయిలో నిర్వహించిన ఎస్హెచ్ఆర్ఈఎస్టీఏ–ఎన్ఈటీఎస్–2026 పరీక్షలో ఆల్ ఇండియాలో 725వ ర్యాంకు సాధించినట్లు ప్రిన్సిపాల్ పేడాడ శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. జోన్–1 స్కూల్స్లో ఇదే అత్యుత్తమ ర్యాంక్గా నమోదైందని పేర్కొన్నారు. మినిస్ట్రీ ఆప్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాతీయ స్థాయిలో పేద దళిత విద్యార్థులకు అత్యుత్తమ విద్య ఉచితంగా అందించే లక్ష్యంతో కార్పొట్ సంస్థల్లో ఇంటర్మీడియట్ అడ్మిషన్ కోసం ఈ పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో విజయం సాధించిన విద్యార్థితో పాటు కృషి చేసిన ఉపాధ్యాయులను ప్రిన్సిపాల్ అభినందించారు. రణస్థలం : లావేరు మండలం రావివలస సమీపంలో విశాఖపట్నం వైపు నుంచి చిలకపాలెం మీదుగా రాయ్పూర్ వైపు వెళుతున్న లారీ మంగళవారం తెల్లవారుజామున బోల్తా పడింది. డ్రైవర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. లారీలోని బొగ్గు రోడ్డు పక్కన కళ్లద్దాలు, హెల్మెట్ దుకాణంపై పడటంతో సామగ్రి ధ్వంసమైంది. ఈ ఘటనలో రణస్థలం మండలం ఎన్జీఆర్పురం పంచాయతీ చీకటిపేటకు చెందిన కళ్లజోడు దుకాణ నిర్వాహకురాలు కొమర లక్ష్మీ సుమారు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లింది. పోలీసులు లారీని పక్కకు జరిపి ట్రాఫిక్ చక్కదిద్దారు. కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు. -
దళిత బాలికపై లైంగిక దాడి
శ్రీకాకుళం క్రైమ్: శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఓ యువకుడు ఇంటర్ చదువుతున్న దళిత బాలికపై లైంగికదాడి చేయడంతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. మంగువారితోట కండ్రవీధికి చెందిన బొమ్మలాట నవీన్ (19) నెలరోజులుగా బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు.బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకటో పట్టణ ఎస్ఐ ఎం.హరికృష్ణ యువకుడిని అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్కు తరలించారు. కేసును జిల్లా పోలీస్ శిక్షణా సంస్థ డీఎస్పీ గోవిందరావు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎస్పీ గ్రీవెన్సుకు 36 ఫిర్యాదులు
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ మరియు పరిష్కార వేదిక (గ్రీవెన్సు)కు ప్రజల నుంచి 36 వినతులు అందాయి. ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి వినతులు స్వీకరించి బాధితులకు సకాలంలో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. రైతు నాయకుడు చిన్నబాబు మృతి టెక్కలి: మండలంలోని పెద్దసాన గ్రామానికి చెందిన రైతు నాయకుడు కోట చిన్నబాబు (103) సోమవారం మృతి చెందారు. ఆయన ఈ గ్రామానికి 5 దశాబ్ధాలు సర్పంచ్గా, రైతు నాయకుడిగా ఎన్నో సేవలు అందించారు. ప్రస్తుతం టెక్కలిలో బీఎస్ అండ్ జేఆర్ విద్యా సంస్థలకు చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. గ్రామంలో వివిధ పార్టీల రాజకీయ నాయకులు, ప్రముఖులు, కుటుంబ సభ్యుల నడుమ అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు చిన్నబాబు నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. ఈయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు శివరామరాజు పెద్దసాన గ్రామ సర్పంచ్గా సేవలు అందజేశారు. అలాగే మరో కుమారుడు మురళీధర్ గతంలో టెక్కలి జెడ్పీటీసీగా సేవలు అందజేశారు. అంతేకాకుండా గ్రానైట్ అసోసియేషన్లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. చిన్నబాబు మృతిపై గురజాడ విద్యాసంస్థల అధినేత స్వామి నాయుడు తదితరురు సంతాపం వ్యక్తం చేశారు. వీరి కుటుంబాన్ని అస్సాం చీఫ్ సెక్రటరీ కోట రవి మంగళవారం పరామర్శించనున్నారు. -
గొంతు కోసుకొని ఆత్మహత్యా యత్నం
బూర్జ: పెట్రోల్ బంకు ఓనర్ బంకులో పనిచేయకుండా వెళ్లిపోమని గెంటివేసినందుకు మనస్థాపం చెందిన యువకుడు గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన మండలంలోని కొల్లివలస జంక్షన్ వద్దనున్న ఒక బంక్లో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కొల్లివలస జంక్షన్లో ఉన్న పెట్రోల్ బంకులో సరుబుజ్జిలి మండలంలోని తురకపేట గ్రామ కాలనీకి చెందిన కోరాడ వెంకటేష్ గత 4 నెలలుగా పంపు ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం శ్రీకాకుళంలో ఉంటున్న బంకు యజమాని ఇప్పిలి రవికి కాల్చేసి తనకు అర్జెంటుగా డబ్బులు కావాలని, లేకపోతే చచ్చిపోతానని వెంకటేష్ భయపెట్టాడు. దీంతో సోమవారం ఉదయం 11 గంటల సమయంలో బంకు యజమాని వచ్చి వెంకటేష్కు అతను అమ్మకం చేసిన డబ్బులు గురించి అడిగాడు. అందులో రూ.13,800లు సొంతానికి వాడుకున్నట్లు రుజువైంది. దీంతో బంకు యజమాని కోపగించికొని అక్కడ నుంచి వెళ్లిపోమని, బైక్ ఇక్కడ పెట్టి తండ్రిని తీసుకురమ్మని మెడమీద చేయి వేసి గెంటాడు. దీంతో వెంకటేష్ వెంటనే జంక్షన్కు వెళ్లి బ్లేడ్ తెచ్చికొని బంకు వద్ద తన పీక మీద, ఎడమచేతి మండపైన కోసుకున్నాడు. దీంతో వెంటనే బంకులో ఉన్న కారులో ఎక్కించుకొని శ్రీకాకుళంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రాణహాని లేదని వైద్యులు తెలియజేసినట్లు సమాచారం. స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయలేదు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
నందిగాం: విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని చింతల అగ్రహారం గ్రామ సమీపంలో సోమవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కాపు తెంబూరుకు చెందిన గజరాపు నగేష్ (31) మృతి చెందారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన గజరాపు పద్మలోచన, మాలతి దంపతుల కుమారుడు నగేష్ లగేజీ వ్యాన్ నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు. విజయవాడలో ఉన్న ఒక కుటుంబం టెక్కలికి మారేందుకు గాను వారి సామాన్లు తీసుకొచ్చేందుకు నగేష్ ఆదివారం లగేజీ వ్యాన్తో పాటు సింగుపురానికి చెందిన ఇద్దరు వ్యక్తులతో కలిసి విజయవాడ వెళ్లారు. అక్కడ సామాన్లు లోడ్ చేసుకొని తిరిగి వస్తూ సోమవారం వేకువజామున విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చింతల అగ్రహారం జంక్షన్ వద్ద వ్యాన్ ఆపి కాలకృత్యాలు తీర్చుకొని తిరిగి వస్తుండగా లారీ ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. వ్యాన్లో వెళ్లిన సింగుపురం వ్యక్తులు విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మృతుడికి భార్య భవానీ, నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు. పోలీసు లాంచనాలు పూర్తయిన తర్వాత మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు. -
ముస్తాబు..!
ప్రభుత్వ పాఠశాలలో డైలీ హైజిన్ అండ్ డిసిప్లేన్ పేరుతో ముస్తాబు కార్యక్రమానికి ఇటీవల శ్రీకారం చుట్టారు. దీనికోసం జీవో నంబర్ 43ను విడుదల చేశారు. ప్రతీ తరగతి గదిలో విధిగా ముస్తాబు కార్నర్ ఏర్పాటు చేయాలని ఆ జీవోలో నిర్దేశించారు. ఆ కార్నర్లో అద్దం, దువ్వెన, సబ్బు, హ్యాండ్ వాష్, నెయిల్ కట్టర్, పౌడర్ ఉండాలి. విద్యార్థులు పరిశుభ్రంగా, క్రమశిక్షణగా ఉండేలా చూడాలన్నది ఆ జీవో సారాంశం. చేతులు శుభ్రం చేసుకునే దశల చార్టులు, గోర్లు, జుత్తు, వ్యక్తిగత పరిశుభ్రత చార్టు, టాయిలెట్ వినియోగం, సురక్షిత నీటిపై విద్యార్థులకు అవగాహన కల్పించే మెటీరియల్ కూడా ప్రదర్శించాలి. ఎంపిక చేసిన ఇద్దరు విద్యార్థులకు తొలుత శిక్షణ ఇవ్వాలి. వారం వారం ముస్తాబు ‘స్టార్ ఆఫ్ ది వీక్‘ ఎంపిక చేయడం, రివార్డులు ఇవ్వడం క్రమం తప్పకుండా జరగాలి. ఇదంతా ఉపాధ్యాయులే చేయాలి. పాఠశాలకు అపరిశుభ్రంగా వచ్చేవారిని, తల దువ్వుకోకుండా వచ్చే వారిని గుర్తించాలి. వారితో బడిలోనే తల దువ్వడం లేదా, దువ్వించడం చేయించాలి. అయితే ఈ కార్యక్రమంపై ఉపాధ్యాయ వర్గాలు మండిపడుతున్నాయి. బడికి వెళ్లి విద్యార్థులకు పాఠాలు బోధించాలా లేక పాఠాలు మానేసి విద్యార్థులను ముస్తాబు చేస్తూ కూర్చోవాలా అంటూ ధ్వజమెత్తుతున్నారు. విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం అవసరమే కానీ ఈవిధంగా ఉపాధ్యాయులపై భారం మోపడం సరికాదని అంటున్నారు. అయితే ఈ కార్యక్రమం ఆగమేఘాలపై ప్రారంభం కావాలనే ఆదేశాలతో పలు పాఠశాలల్లో నామమాత్రంగా ముస్తాబు కార్నర్లు ఏర్పాటు చేశారు. బాబు మార్కు డాబు.. శ్రీకాకుళం: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకమాట.. అధికారంలోకి వచ్చాక మరోమాట చెప్పడం సీఎం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. దీనిలో భాగంగానే గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులపై ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తూ.. వారిని బోధనేతర పనులకు వినియోగించనని చెప్పారు. తీరా గద్దెనెక్కాక ఆ మాటలు గాలికొదిలేసి బోధనేతర పనులు పెంచేస్తున్నారని ఉపాధ్యాయులు కూటమి సర్కారుపై నిప్పులు చెరుగుతున్నారు. ప్రస్తుతం పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న వంద రోజుల యాక్షన్ ప్లాన్ పర్యవేక్షణ కోసం ఇతర శాఖల అధికారుల నియామకంతో తమపై ఒత్తిడి పెంచారని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో పాఠశాలకు వివిధ శాఖల నుంచి నోడల్ అధికారుల నియామకంపై ఆవేదన చెందుతున్నారు. కాగా ఇప్పుడు తమపై ముస్తాబు పేరుతో మరో అదనపు పనిభారం కూటమి ప్రభుత్వం మోపిందని మండిపడుతున్నారు. దీనికోసం ప్రత్యేక జీవో కూడా విడుదల చేయడాన్ని తప్పుబడుతున్నారు. ● బడుల్లో ముస్తాబు కార్నర్లు ఏర్పాటు జీవో విడుదల చేసిన ప్రభుత్వం బోధనేతర పనులపై ఉపాధ్యాయుల ఆగ్రహం బోధనా సమయం వృథా అవుతుందని ఆవేదన -
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలి
శ్రీకాకుళం: రాష్ట్రంలో బీసీల అభ్యున్నతి కోసం 42 శాతం రిజర్వేషన్ను తప్పనిసరి చేయాలని అఖిల భారత వెనుకబడిన తరగతుల సమాఖ్య శ్రీకాకుళం జిల్లా శాఖ అధ్యక్షుడు కేవీఎస్ నాయుడు (బుజ్జి) ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం స్థానిక జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీల సంక్షేమం కోసం తామంతా నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. తమిళనాడు రాష్ట్రం మాదిరిగా రిజర్వేషన్ విషయంలో బీసీలకు అండగా నిలిచే విధంగా 42 శాతం రిజర్వేషన్ అంశాన్ని చట్టసభలలో ప్రస్తావన తీసుకొచ్చి ఆమోదానికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అఖిల భారత వెనుకబడిన తరగతుల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు జస్టిస్ ఈశ్వరయ్య ఆదేశాల మేరకు రానున్న రోజుల్లో రిజర్వేషన్ విషయమై ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ముందుకెళ్లనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విభాగం అధికార ప్రతినిధి బొడ్డేపల్లి దామోదరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు, మహిళా విభాగం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలి శ్రీకాకుళం అర్బన్: ఏపీఎస్ ఆర్టీసీలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆర్టీసీ అవుట్ సోర్సింగ్ యూనియన్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు సోమవారం విజయవాడలోని ఆర్టీసీ హౌస్లో ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావును అవుట్ సోర్సింగ్ యూనియన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. అనంతరం యూనియన్ క్యాలెండర్ను ఆయన చేతులమీదుగా ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 8000 మంది అవుట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలను విన్నవిస్తూ గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా ఆర్టీసీలో కాంట్రాక్టు వ్యవస్థ వలన రోజురోజుకూ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిన జీతాలు రాష్ట్రం మొత్తం మీద ఏ కార్మికుడు కూడా అందుకోని పరిస్థితులపై అధ్యయనం చేయాలని కోరారు. కాంట్రాక్ట్ వ్యవస్థను సమూలంగా రద్దు చేసి ప్రతి కార్మికుడికి యాజమాన్యం ద్వారా జీతాలు చెల్లించే విధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తంగుడు ముత్యాలరావు, ప్రధాన కార్యదర్శి గంగాంజనేయులు, రాష్ట్ర కమిటీ నాయకులు వి.బాజి, ప్రసాద్ కుమార్, మధుసూదనరావు, దాసరి కిరణ్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. మహిళ మెడలో పుస్తెల తాడు చోరీ ఆమదాలవలస: పట్టణంలోని 12వ వార్డు చంద్రయ్యపేటకు చెందిన కరణం సుమిత్ర అనే మహిళ, తన మెడలో సుమారు రెండున్నర తులాల పుస్తెల తాడును గుర్తు తెలియని వ్యక్తి అపహరించినట్లు ఆమదాలవలస పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఐ సనపల బాలరాజు తెలిపిన వివరాల మేరకు.. కరణం సుమిత్ర అత్త అనారోగ్యంతో బాధపడుతుండగా, ఆమె భర్త వైద్య చికిత్స నిమిత్తం విశాఖపట్నానికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం సుజాత ఇంటి బయట ఉన్న బాత్రూంలో స్నానం చేసి తిరిగి ఇంట్లోకి వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమెను కత్తితో బెదిరించాడు. అరిస్తే తన పిల్లలను చంపేస్తానని చెబుతూ మెడలోని బంగారు పుస్తెలతాడును లాక్కొని పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. ఇదిలాఉండగా పట్టణంలో ఇటీవల పెరుగుతున్న చోరీలు, స్నాచింగ్ ఘటనలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు సరుబుజ్జిలి: మండలంలోని షళంత్రి జంక్షన్ వద్ద సోమవారం ఒక ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. వివరాల్లోకి వెళ్తే.. ఆమదాలవలస నుంచి సరుబుజ్జిలి వస్తున్న ఆటోను, శ్రీకాకుళం నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు వెనుక నుండి ఢీకొట్టడంతో సమీపంలో ఉన్న చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. అయితే ఆటోలో ప్రయాణిస్తున్నవారికి, బస్సులో ఉన్నవారికి ఎటువంటి గాయాలు కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
అర్జీలు త్వరితగతిన పరిష్కరించాలి
● సహాయ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్ ● పీజీఆర్ఎస్లో 173 అర్జీల స్వీకరణ శ్రీకాకుళం పాతబస్టాండ్: పీజీఆర్ఎస్కు వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని సహాయ(శిక్షణ) కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మణమూర్తి, విశ్రాంత జిల్లా రెవెన్యూ అధికారి (పలాస ఎయిర్పోర్టు ప్రత్యేక అధికారి) ఎం.వెంకటేశ్వరరావు, డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్లతో కలిసి అర్జీదారుల నుండి వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం 173 అర్జీలు స్వీకరించారు. వీటిలో రెవెన్యూ–69, సోషల్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ–49, పంచాయతీ రాజ్–9, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్–7, వ్యవసాయ శాఖ–5, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్–5, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్–5, ఏపీఈపీడీసీఎల్–4, రూరల్ వాటర్ సప్లయ్ ఇంజినీరింగ్–3, రూరల్ డవలప్మెంట్–3, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్–2, మెడికల్ ఎడ్యుకేషన్–2, వాటర్ రీసోర్సెస్–2, స్కూల్ ఎడ్యుకేషన్–2, మైన్స్ అండ్ జియాలజీ–2, సమగ్ర శిక్ష–1, ఎండోమెంట్–1, ఏపీ స్టేట్ స్కిల్ డవలప్మెంట్–1, ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్టు–1 అర్జీలు ఉన్నాయి. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా రెవెన్యూ క్లీనిక్ ఈవారం వినతుల స్వీకరణతో పాటు ప్రత్యేకంగా రెవెన్యూ క్లీనిక్ పేరిట రెవెన్యూ సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లు, సిబ్బందిని పీజీఆర్ఎస్ హాల్కు తీసుకొచ్చారు. వినతుల స్వీకరణకు ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ చేసేందుకు 9 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్లలో 22ఏ, జాయింట్ ఎల్పీఎం, మ్యుటేషన్, ఎఫ్లైన్, అడంగల్ రాకపోవడం, విస్తీర్ణంలో తేడాలు, ఎస్ఎల్ఆర్లో భూమి నమోదు లేకపోవడం వంటి సమస్యలపై వినతులు స్వీకరించారు. ఈ విభాగానికి 140 దరఖాస్తులు వచ్చాయి. అయితే ఈ సమస్యలపై వినతుల స్వీకరణ తప్ప పరిష్కారం జరగలేదు. ఉన్నతాధికారులు గ్రీవెన్సులో లేకపోవడంతో పరిష్కరానికి వీలున్న వాటిని కూడా చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ వారం రెవెన్యూ క్లీనిక్ వినతుల్లో ఎక్కువ శాతం అర్జీలు మండల స్థాయిలో పరిష్కారం జరగాల్సింది. కానీ అక్కడ జరగకపోవడంతో జిల్లా గ్రీవెన్సును ఆశ్రయిస్తున్నారు. రోడ్డు తొలగింపును అడ్డుకోవాలి పొందూరు మండలంలోని గోకర్ణపల్లి గ్రామ సచివాలయానికి వేసిన రోడ్డు తొలగింపు చర్యలను అడ్డుకోవాలని వైఎస్సార్సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ కోరారు. ఈ మేరకు పీజీఆర్ఎస్లో సోమవారం వినతిపత్రం అందజేశారు. వైఎస్సార్సీపీ హయాంలో సుమారు రూ.5 లక్షల నిధులు ఖర్చుచేసి గ్రామ సచివాలయానికి సీసీ రోడ్డును వేయడం జరిగిందన్నారు. ప్రజాపయోగానికి వేసిన రోడ్డును టీడీపీ నాయకులు తొలగించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గోకర్ణపల్లి సర్పంచ్ చింతాడ సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
క్రెడిట్ చోరీకి ఆద్యుడు చంద్రబాబు
● వైఎస్సార్సీపీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్ ఆమదాలవలస: సీఎం చంద్రబాబు క్రెడిట్ చోరీకి ఆద్యుడని వైఎస్సార్సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ అన్నారు. సోమవారం ఆమదాలవలసలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ అభివృద్ధి పని జరిగినా అది తన ఘనతేనని చెప్పుకొని క్రెడిట్ తీసుకోవడానికి చంద్రబాబు తాపత్రయ పడుతుంటారని పేర్కొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటులో 10 శాతం కూడా తన పాత్ర లేకున్నా.. కర్త, కర్మ, క్రియ తానేనని చెప్పుకోవడం దారుణమన్నారు. 2014 – 2019 మధ్య భోగాపురం విమానాశ్రయంలో పది శాతం పనులు కూడా జరగలేదన్నారు. ఫేజ్ వన్ కింద 2,700 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉండగా ఐదు శాతం మాత్రమే చేసిందన్నారు. అనంతరం హైకోర్టులో కేసు వేయడంతో భూ సేకరణ నిలిపివేయాలని కోర్టు స్టే ఇచ్చిందని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ హయాంలోనే పనులు 2019 – 24 మధ్య అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకొని రైతులతో కోర్టు కేసులను ఉపసంహరించుకునేలా చేసి, రూ.960 కోట్ల పరిహారాన్ని రైతులకు అందజేశారని గుర్తు చేశారు. 2,700 ఎకరాల్లో 2,200 ఎకరాలు విమానాశ్రయానికి, మిగిలిన 500 ఎకరాలు రాబోయే రోజుల్లో ప్రభుత్వ అవసరాలకు కేటాయించారని తెలిపారు. 2023 మేలో ఈ ప్రాజెక్టుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారన్నారు. అనంతరం శరవేగంగా పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటులో రీల్స్ కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు, సీఎం చంద్రబాబు చేసిన ఘనకార్యం ఏమీ లేదని, ఇప్పటికై నా క్రెడిట్ చోరీని ఆపేయాలని హితవు పలికారు. సమావేశంలో పార్టీ నాయకులు దుంపల శ్యామలరావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు పొడుగు శ్రీనివాసరావు, పార్టీ జిల్లా కార్యదర్శి పొన్నాడ చిన్నారావు, మామిడి రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
రైస్మిల్లు లెక్కల్లో తేడాలు
● మిల్లు సీజ్ చేసిన మంత్రి నాదెండ్ల శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని చింతాడ పరిసర ప్రాంతంలో గల చిట్టెమ్మ రైస్మిల్ను సీజ్ చేయాలంటూ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం చింతాడ గ్రామంలోని చిట్టెమ్మ రైస్మిల్ను నేరుగా పరిశీలించారు. కెపాసిటీకి మించి ట్రక్షీట్లు నమోదైనట్లు ఆన్లైన్లో చూపించడం, రైస్మిల్లుకు 23వేల మెట్రిక్ టన్నుల లక్ష్యం ఇస్తే నవంబర్ నుంచి వెయ్యికిపైగా ట్రక్షీట్లు నమోదు కావడం, తూకాల్లో, స్టాకులో తేడాలు రావడం, రికార్డుల్లో ధాన్యం బస్తాల వివరాలను నమోదు చే యకపోవడంతో సంబంధిత మిల్లు యజమాన్యానికి మంత్రి ప్రశ్నించారు. వారు నీళ్లు నమలడంతో వెంటనే మంత్రి స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులపై సీరియస్ అయ్యారు. ఉన్నఫలంగా మిల్లును సీజ్ చేయాలని ఆదేశించారు. అయితే ఇలాగే జిల్లాలో చాలా మిల్లుల్లో పరిస్థితి ఉంది. ట్రక్షీట్లు జారీ చేయకుండానే మిల్లులకు ధాన్యం వెళ్తుంది అనడానికి ఇదే నిదర్శనం. కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ ఎండీ ఢిల్లీరావు, జేసీ అహ్మద్ ఖాన్, ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, ఆర్డీఓ సా యి ప్రత్యూష, జిల్లా పౌరసరఫరాల అధికారి సూర్యప్రకాశరావు, అగ్రికల్చర్ ఏడీ త్రినాథరావు, ఎమ్మార్వో గణపతిరావు, సర్పంచ్ అరవల రామ్ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. -
విచారణ ఏమైంది సారూ..!
అరసవల్లి: తనకు ఉద్యోగమిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేసిన వైద్యశాఖ ఉద్యోగులపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన ఆ బాధితురాలికి ఏళ్లు గడుస్తున్నా న్యాయం జరగడం లేదు. జిల్లా వైద్యారోగ్యశాఖలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగమిప్పిస్తానంటూ రెండేళ్ల క్రితం ఏకంగా రూ.4.50 లక్షల వరకు తీసుకుని.. తీరా నకిలీ ఉద్యోగ నియామక ఆర్డర్ను చేతిలో పెట్టేసి వదిలించుకున్న వైద్యశాఖ అక్రమార్కులైన ఇద్దరు ఉద్యోగులపై ఇచ్చిన ఫిర్యాదుపై నేటికీ చర్యలు చేపట్టలేదు. వైద్యశాఖలో హెచ్చుమీరిన అక్రమాలు, అవినీతి ఆగడాల్లో ఆ ఇద్దరు ఉద్యోగుల పాత్ర కీలకమని ఆధారాలున్నప్పటికీ ఉన్నతాధికారులు మాత్రం మామూళ్ల మత్తుకు దాసోహమవుతున్నారనే ఆరోపణలున్నాయి. కూటమి ప్రభుత్వంలో బాధిత మహిళలకు న్యాయం జరగదని మరోసారి రుజువైందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇదీ విషయం శ్రీకాకుళం నగరానికి చెందిన ఒక మహిళకు వైద్యారోగ్య శాఖలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం ఇస్తామని చెప్పి ఆ శాఖకు చెందిన ఇద్దరు ఉద్యోగులు రూ.4.50 లక్షలు డబ్బులు తీసుకొని మోసం చేశారు. దీంతో బాధితురాలు గతేడాది జనవరి చివరిలో వైద్యశాఖ రీజనల్ డైరక్టర్ కార్యాలయానికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. సదరు ఉద్యోగులకు తాను చెల్లించిన డబ్బుల వివరాలను ఆధారాలతో సహా జత చేసింది. దీంతో ఆగమేఘాల మీద విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఫిబ్రవరి 12న జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి కార్యాలయంలో విచారణ ప్రక్రియను చేపట్టారు. విశాఖపట్నం డీఎంహెచ్వో డాక్టర్ జగదీశ్వరరావును విచారణాధికారిగా నియమించారు. అతను బాధితురాలితో పాటు ఆరోపణలున్న కాంట్రాక్టు హెల్త్ అసిస్టెంట్తో పాటు కార్యాలయ సూపరింటెండెంట్లను విచారించారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని.. తదనుగుణంగా చర్యలుంటాయని అప్పట్లో విచారణాధికారి వెల్లడించారు. దీంతో తనకు న్యాయం జరిగిపోతుందని బాధితురాలు, ఆమె కుటుంసభ్యులు భావించారు. కానీ నేటికి సుమారు ఏడాది అవుతున్నా, ఇప్పటివరకు ఆ విచారణ ఏమైందో.. నివేదిక ఎక్కడుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీనిపై స్థానిక డీఎంహెచ్వో కార్యాలయ కీలకాధికారి వద్ద ప్రస్తావించగా.. అదంతా ‘మేనేజెడ్ సార్’ అంటూ బదులిచ్చారు. దీనిబట్టి చూస్తే జగదీశ్వరరావు చేపట్టిన విచారణపై ఎలాంటి చర్యలుండవని, కూటమి ప్రభుత్వంలో బాధితురాలికి న్యాయం జరగదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని తీవ్రంగా భావించిన బాధితురాలు న్యాయ పోరాటానికి సన్నద్ధమవుతోందని సమాచారం. ఉద్యోగం పేరుతో మోసం చేసినట్లు బాధితురాలి ఆవేదన వైద్యారోగ్య శాఖలో ఇద్దరిపై ఫిర్యాదు విచారణ ఏమైందో తెలియని వైనం ఏడాదిగా న్యాయం కోసం బాధితురాలి నిరీక్షణ జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి కార్యాలయం -
కుక్కల దాడిలో ముగ్గురికి గాయాలు
హిరమండలం: మండలంలోని అంబావల్లి గ్రామంలో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నా యి. సోమవారం కుక్కలబారిన పడి ముగ్గురికి గాయాలయ్యాయి. సిమ్మ ఈశ్వరమ్మ, చిన్న మ్మి, లలితలు కుక్కల బారిన పడ్డారు. వెంటనే కుటుంబ సభ్యులు హిరమండలం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యసేవలందించారు. అయితే గత కొద్దిరోజులుగా కుక్కలు స్వైర విహారం చేస్తుండడంతో గ్రామస్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వాటిని నియంత్రించాలని కోరుతున్నారు. సిగ్నల్ సమస్యతో నిలిచిన రైలు టెక్కలి రూరల్: స్థానిక తెంబూర్ రోడ్డులో గల జిల్లా ఆస్పత్రి సమీపంలో సోమవారం ఉదయం రైలు సుమారు 15 నిమిషాలు పాటు నిలిచిపోయింది. గుణుపూర్ నుంచి కటక్ వైపు వెళ్లే రైలు సోమవారం ఉదయం సుమారు 5:50 నిమిషాలు సమయంలో తెంబూర్ రోడ్డు జంక్షన్ వద్ద ఉన్న గేటు వేసినప్పటికి సిగ్నల్ సమస్య ఏర్పడటంతో నిలిచిపోయింది. దాదా పు 15 నిమిషాల పాటు గేటుకు అటూ ఇటూ వాహనాలు నిలిచిపోయాయి. కొంత సమయం తర్వాత సిగ్నల్ సరిచేయడంతో రైలు కదిలింది. పోస్టుల భర్తీ ఇప్పుడా? శ్రీకాకుళం: జిల్లాలోని 9 మోడల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 15 పీజీటీ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసేందుకు సోమవారం విద్యాశాఖ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విద్యా సంవత్సరం మరో మూడు నెలల్లో ముగుస్తుండగా ఇప్పుడు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడాన్ని ఆక్షేపిస్తున్నారు. సిలబస్లు దాదాపు పూర్తయిపోయిన దశలో నోటిఫికేషన్ రావడం విడ్డూరంగా ఉందంటున్నారు. లావేరు, పొందూరు, పోలాకి, జలుమూరు, పాతపట్నం, సోంపేట, కంచిలి, కమిటీ, ఇచ్ఛాపురం మండలాలలో ఖాళీగా ఉన్న 15 పోస్టులకు సంబంధించి అర్హులైన అభ్యర్థుల నుంచి ఈ నెల 8వ తేదీలోగా దరఖాస్తులను మోడల్ స్కూల్లలో అందజేయాలని సూచించారు. ఈ లెక్కన సంక్రాంతి పండుగలోగా భర్తీలు జరిగే అవకాశాలు లేవు. ఫిబ్రవరి నుంచి మీరు పాఠశాలలకు వెళ్లే పరిస్థితి ఉంటుంది. మార్చి నెలలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనుండగా, ఒక్క నెలలో వీరితో ఏ విధంగా బోధన చేయిస్తారో ఏ ఒక్కరికి అర్థం కావడం లేదు. అలాగే ఈ ఉద్యోగంలో చేరిన అభ్యర్థులను ఏప్రిల్లో విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత తొలగిస్తారు. బోధన సమయాన్ని లెక్కకట్టి గంటకు రూ.250 చొప్పున చెల్లిస్తారు. ‘కార్గో వద్దంటుంటే సర్వేలు ఎందుకు..?’ మందస: మందస మండలం ఎం.గంగువాడ బస్ షెల్టర్లో కార్గో ఎయిర్ పోర్టు వ్యతిరేక కమిటీ అధ్యక్షుడు కొమర వాసు ఆధ్వర్యంలో సోమవారం రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రోజుల క్రితం మందస తహసీల్దార్ కార్యాలయంలో కార్గో ఎయిర్ పోర్టు ప్రత్యేక అధికారి, లీగల్ అడ్వైజర్ ఎం.వెంకటేశ్వరరావు, పలాస ఆర్డీఓ జి.వెంకటేశ్వరరావు చేసిన ప్రకటనను తాము ఖండిస్తున్నామని తెలిపారు. మందస, వజ్రపుకొత్తూరు మండలాల ప్రజలు కార్గోకు వ్యతిరేకంగా పోరాడుతుంటే ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పలాస ఆర్డీఓ వచ్చినప్పుడు కూడా ఇదే తీర్మానాన్ని రాసి ఇచ్చామని, ఇప్పుడు మళ్లీ సర్వేకు సహకరించాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. కార్గో ఎయిర్ పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ కార్యదర్శి జోగి అప్పారావు మాట్లాడుతూ రైతుల అభిప్రాయాలను ప్రభుత్వానికి చెప్పకుండా సర్వేలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. కమిటీ కన్వీనర్ బత్తిని లక్ష్మణ్, స్థానిక సర్పంచ్ పొట్టి ధర్మారావు, మామిడి తులసయ్య, జుత్తు భూపతి, బడిచిత్త కూర్మారావు, పొట్టి ఎర్రయ్య, యోగేశ్వరరావు, దున్న రామారావు, రత్నాల చలపతి, గుంటు రామస్వామి, చిత్త గున్నయ్య, చిరంజీవి, సుంకర దిలీప్, సత్యం, కృష్ణారావు, మోహన్రావు, హేమరాజు తదితరులు పాల్గొన్నారు. -
రెడ్బుక్ రాజ్యంలో..
అధికారం చేతిలో ఉంటే.. పాలించే పార్టీ మనదే అయితే ఇక తిరుగేముంటుంది. మనం తప్పు చేసినా ఒప్పే.. చట్టం మనవైపు నిలుస్తుంది. దేశ రక్షకులైనా, ఒక పంచాయతీని పాలించే సర్పంచ్ అయినా అధికార పార్టీ వారు కాకపోతే శత్రువుల్లానే చూస్తుంది. బాధితులనే నిందితులుగా నిలబెడుతుంది.. కుదిరితే దోషు లుగానూ తేల్చేస్తుంది. ఏమిటీ నమ్మడం లేదా.. అయితే హిరమండలం ధనుపురం, కోటబొమ్మాళి, జలుమూరు మండలం రావిపాడు గ్రామాల్లో టీడీపీ దన్నుతో కొందరు పెట్రేగిన తీరు.. వారిపై ఫిర్యాదులందినా చర్యలు తీసుకోకుండా కొమ్ముకాస్తున్న పోలీసులు, ఎమ్మెల్యే, మంత్రుల తీరు చూడండి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. ఆటవిక రాజ్యంలో ఉన్నామా అన్న అనుమానం, ఆందోళన కలగక మానవు. -
● ఆర్పీఎఫ్ ఉద్యోగిపై సర్పంచ్ భర్త ఫిర్యాదు
శ్రీకాకుళం క్రైమ్ : విశాఖపట్నం మర్రిపాలెం సెక్టార్లో ఆర్పీఎఫ్ ఉద్యోగిగా పనిచేస్తున్న గొల్లంగి సత్యనారాయణపై జలుమూరు మండలం రావిపాడు పంచాయతీ (యేనేటికొత్తూరు గ్రామం) సర్పంచ్ బోర భారతి భర్త బోర సింహాచలం, గ్రామస్తులు సోమవారం ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డికి ఫిర్యాదు చేశారు. సత్యనారాయణది తమ గ్రామమేనని, ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ రాజకీయ కార్యక్రమాలు, తగువులు చేస్తూ గ్రామంలో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నారని, యువతకు మ ద్యం ఇచ్చి రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు పెట్టుకుని అల్లర్లు సృష్టిస్తున్నాడని, తనని, తన భార్యని దుర్భాషలాడుతూ మానసికంగా హింసిస్తున్నాడని సింహాచలం ఫిర్యాదు చేశారు. గతంలో గోవాలో పనిచేసిన సత్యనారాయణ అక్కడి మద్యం తెచ్చి వారి తండ్రితో గ్రామంలో అమ్మించగా ఎకై ్సజ్ విభాగం వారు అరెస్టు చేసి రిమాండ్కు పంపించారన్నారు. ఈ విషయమై ఆర్పీఎఫ్ ఉన్నతాధికారులకు ఆన్లైన్లో ఫిర్యాదు చేశామన్నారు. -
● బూట్లు వేయలేదని టెన్త్ విద్యార్థుల గెంటివేత
ఇచ్ఛాపురం రూరల్: ప్రభుత్వం అందించిన బూట్లు ధరించలేదనే కారణంతో పదో తరగతి విద్యార్థులను పాఠశాల నుంచి ప్రధానోపాధ్యాయుడు బయటకు గెంటేయడం మండలంలో తీవ్ర వివాదాస్పదమైంది. వివరాల్లోకి వెళితే... మండలం కొత్త శాసనాం ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 15 మంది విద్యార్థులు సోమవారం బూట్లు ధరించలేదని ప్రధానోపాధ్యాయుడు పైడి గోపాలరావు ప్రార్థనా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటి ఆగకుండా విద్యార్థులను బయటకు గెంటేయడంతో వారంతా స్థానిక బస్టాండ్, రోడ్లపై ఉదయం నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తిరిగా రు. వారిని చూసిన తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలకమైన టెన్త్లో ఉన్న విద్యార్థులపై ఈ రకమైన కఠిన చర్యలు అమానవీయమని, విద్య కంటే బూట్లకే ప్రాధాన్యం ఇస్తున్నా రా? అని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నా రు. చిన్న కారణాలతో విద్యార్థులను అవమానపరచడం మానసిక ఒత్తిడికి దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ప్రధానోపాధ్యాయుడి వివరణ కోరగా... విద్యార్థుల్లో క్రమశిక్షణ లోపించిందని, పలుమార్లు హెచ్చరించినా ప్రయోజనం కనిపించకపోవడంతో వారిలో మార్పు కోసం ఇలా విద్యార్థులను బయటకు పంపించడం జరిగిందని స్పష్టం చేశారు. -
పంటకు పొగ పెడుతోంది
● రైతులను భయపెడుతున్న పొగమంచు ● జీడి,మామిడి పూతకు నష్టం ● అపరాల పంటలదీ ఆదే పరిస్థితి మంచుతో నష్టం అపరాల పంటలైన పెసర, మినుము ఆశాజనకంగా ఉన్నాయి. కొన్నిచోట్ల ప్రస్తు తం పూత దశకు వచ్చాయి. పస్తుతం కురుస్తున్న మంచు కారణంగా పూతకు వచ్చిన పంటంతా నల్లగా మారిపోతోంది. పూత రాలిపోవడంతో పాటు చిన్న దోమ చేరి నష్టం జరుగుతుంది. పంటను కాపాడుకునేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నాం. – కొల్లి కృష్ణారావు, రైతు, బైరాగిపేట గ్రామం, పాతపట్నం మండలం పాతపట్నం: గత పది, పదిహేను రోజులుగా కురుస్తున్న పొగ మంచు పంటలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పూత దశకు వచ్చిన పంటలు పొగ మంచు కారణంగా మాడిపోతున్నాయి. జీడి,మామిడి పూతతో పాటు అపరాల పంటలైన పెసర, మినుము, పూతకు నష్టం కలుగుతోంది. ఆలస్యంగా పూతకు వచ్చిన కంది పంటదీ అదే పరిస్థితి. ఉదయం 9 వరకు.. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు పొగ మంచు కురుస్తోంది. సూర్యుడు కనిపించనంతగా దట్టంగా మంచు కురవటంతో ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కూలి పనులకు వెళ్లేవారు, పాఠశాలకు వెళ్లే విద్యార్థులు.. ఇలా అన్ని వర్గాల వారు మంచుతో పాటు చలి పెరగటంతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల వాసులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. -
● ఆర్మీ ఉద్యోగి కుటుంబంపై దాడి
● ఇంటికి వెళ్లే దారి అడ్డగింత ● రెచ్చిపోయిన టీడీపీ నాయకులు హిరమండలం: ఆర్మీ ఉద్యోగి దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ఉండగా, ఇక్కడ ఆయన ఇంటిపై దాడి చేసి, ఇంటికి దారి లేకుండా చేసే పనిలో పడ్డారు టీడీపీ నాయకులు. ఎమ్మెల్యే అండదండలు, పార్టీకి చెందిన ఓ విభాగం అధ్యక్షుడి దన్ను చూసుకుని స్థానిక టీడీపీ నాయకులు ఏకంగా ఆర్మీ ఉద్యోగినే టార్గెట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. హిరమండలం ధనుపురం గ్రామంలో సిరిపురం శ్యామలరావు అనే ఆర్మీ ఉద్యోగి పదేళ్ల కిందట ఇల్లు నిర్మించుకున్నాడు. అక్కడ స్థలం కొనుగోలు చేసి ఇల్లు కట్టుకున్నారు. తాను కొనుకున్న ఇంటి ముందు కొంత ఖాళీ స్థలం ఉంది. అయితే ఆ స్థలం గుండా ఇంటిలోకి రాకపోకలు ఉండేవి. అయితే ఇంటి ముందు ఉన్న స్థలంలో ఇంటి గేటు తీయకుండా అడ్డంగా రాళ్లు, కర్రలు వేశారు. దీంతో గోడ దూకి ఇంటికి రాకపోకలు జరుపుతున్నారు. అదే గ్రామానికి చెందిన దారపు షణ్ముఖరావు, అంగూరు భాస్కరావులు తమ స్థలం అని చెబుతూ ఆ స్థలంలో కంచెలు కూడా వేశారు. అప్పటి నుంచి వారి మధ్య వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఆ వివాద స్థలంలో నిర్మాణ పనులు చేపట్టారు. దీన్ని శ్యామలరావు తండ్రి, భార్య అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిపై దాడి చేశారు. దీంతో బాధితులు పోలీసులకు ఫోన్ చేయడంతో హుటాహుటిన పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఉభయ వర్గాలను పోలీస్స్టేషన్కు పిలిపించారు. ప్రస్తుతం బాధితుడు అరుణాచల్ ప్రదేశ్లో విధుల్లో ఉన్నాడు. అక్కడ నుంచి నేరుగా విలేకరులతో ఫోన్లో మాట్లాడాడు. బాధితుడు శ్యామలరావు ఈ విషయాన్ని స్థానిక సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లగా పెద్దగా స్పందించలేదు. స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో జిల్లా మంత్రి అచ్చెన్నాయుడును కలిసి విన్నవించారు. చివరకు మంత్రి నారా లోకే ష్కు సైతం ఫిర్యాదు చేశారు. అయినా బాధితులకు న్యాయం జరగడం లేదు. అధికారులపై ఓ ఎమ్మెల్యే ఒత్తిడి ఉందని బాధితులు చెబుతున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అయితే దీనిపై ఇంతవరకూ పోలీసులు కేసు నమోదు చేయలేదని తెలుస్తోంది. -
● నగదు లేక.. టోల్ కట్టక
శ్రీకాకుళం ఆర్టీసీ డిపోకు చెందిన ఏపీ 30 జెడ్ 0129 నంబర్ బస్సు ప్రయాణికులను అవస్థలకు గురి చేసింది. బస్సుకు చెందిన ఫాస్టాగ్లో డబ్బులు లేకపోవడంతో మడపాం టోల్గేట్ వద్ద బస్సును నిలిపివేశారు. శ్రీకాకుళం నుంచి పలాసకు సోమవారం ఉదయం బస్సు 70 మంది ప్రయాణికులతో బయల్దేరింది. మడపాం టోల్గేట్ వద్ద అక్కడ సిబ్బంది తనిఖీ చేయగా ఫాస్టాగ్లో డబ్బు లేదని గుర్తించారు. దీంతో బస్సును పంపించేందుకు టోల్ సిబ్బంది నిరాకరించారు. చేసేదేమీ లేక బస్సు డ్రైవర్ పక్కకు తీసి నిలుపుదల చేశారు. ప్రయాణికులు కూడా కిందకు దిగి నిరీక్షించారు. వారంతా వేరొక బస్సులో తమను పంపించాలని గొడవ చేయడంతో బస్సు డ్రైవర్ విషయాన్ని శ్రీకాకుళం డిపో అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వారు స్పందించి పది నిమిషాల తర్వాత ఫాస్టాగ్లో జమ చేశారు. దాని తర్వాత బస్సు ముందుకు కదిలింది. దాదాపు అరగంట పాటు ఇబ్బంది తప్పలేదు. –శ్రీకాకుళం -
ఏపీ స్టేట్ తైక్వాండో చాంపియన్గా శ్రీకాకుళం
శ్రీకాకుళం న్యూకాలనీ: సిక్కోలు వేదికగా రెండు రోజులపాటు కన్నులపండువలా సాగిన ఏపీ రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలు ముగిశాయి. ఏపీ రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ సౌజన్యంతో శ్రీకాకుళం జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ కల్యాణమండపం వేదికగా 39వ ఏపీ రాష్ట్రస్థాయి సబ్జూనియర్స్ కుర్గీ, 14వ ఏపీ రాష్ట్రస్థాయి సబ్జూనియర్స్ పూమ్సే బాలబాలికల తైక్వాండో చాంపియన్షిప్ పోటీలను నిర్వహించారు. మెగా టోర్నీలో ఓవరాల్ చాంపియన్గా శ్రీకాకుళం నిలవగా, రన్నరప్గా విజయనగరం జిల్లా, తృతీయ స్థానంలో కర్నూలు జిల్లా నిలిచా యి. ఆదివారం అర్ధరాత్రి వరకు పోటీలు కొనసాగాయి. తొలుత బాలురుకు పోటీలను పూర్తిచేయగా, ఆ తర్వాత బాలికల పోటీలను ముగించారు. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన క్రీడాకారులకు బంగారు, రజత, కాంస్య పతకాలను అందజేశారు. విజేతలకు పలువురు ప్రజాప్రతినిధులు, అథ్లెటిక్స్ అసోసియేషన్ ఏపీ రాష్ట్ర చైర్మన్ కొన్న వెంకటేశ్వరరావు (వాసు) తదితరులు విజేతలకు బహుమతులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తైక్వాండో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్టీ చంద్రమౌళి, తైక్వాండో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి తైక్వాండో శ్రీను, టోర్నీ ఆర్గనైజింగ్ కన్వీనర్ మజ్జి గౌతమ్, నౌపడ విజయ్కుమార్, వర్మ, వేణు, మాధురి, పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రముఖులు, సామాజిక వేత్తలు ఒలింపిక్, పీఈటీ సంఘ నాయకులు, రిఫరీలు, టెక్నికల్ అఫీషియల్స్ తదితరులు పాల్గొన్నారు. -
● వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలు చించివేత
టెక్కలి: కోటబొమ్మాళి పాతబస్టాండ్లో పంచాయ తీ పార్కు వద్ద వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. ఇటీవల వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినం, నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేయడంపై వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు భగ్గుమంటున్నారు. సోమవారం ఉదయం కొంత మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు గమనించి మండల స్థాయి నాయకులకు తెలియజేశారు. దీంతో కోటబొమ్మాళి సర్పంచ్ కాళ్ల సంజీవ్, పార్టీ మండల అధ్యక్షుడు ఎస్.హేమసుందర్రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు అన్నెపు రామారావు, మండల స్థాయి నాయకులు రోణంకి మల్లయ్య, దుక్క రామకృష్ణారెడ్డి, పి.వెంకట్రావు, కల్లి విశ్వనాధం, హెచ్.గోవిందరావు, అనపాన కర్రెయ్య, శివారెడ్డి, పి.సతీష్, గుంట సోమేశ్వరరావు తదితరులు సంఘటన స్థలానికి చేరుకుని ఫ్లెక్సీలను పరిశీలించారు. అనంతరం కోటబొమ్మాళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు మాట్లాడుతూ కొంత మంది వ్యక్తులు చిల్లర రాజకీయాలకు అలవాటు పడి ఇలా వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలను చింపివేశారని పేర్కొన్నారు. ఇలాంటి కవ్వింపు చర్యల వల్ల తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే కోటబొమ్మాళిలో ఫ్లెక్సీలు కడుతున్న సమయంలో కొంత మంది అడ్డు చెప్పారని గుర్తు చేశారు. రాజకీయంగా తమను ఎదుర్కొనలేక ఇలాంటి పనికిమాలిన చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి చర్యలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సంఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించి ఫ్లెక్సీలు చింపిన వారిని అదుపులోకి తీసుకుని భవిష్యత్లో ఇలాంటి చర్యలకు పాల్పడకుండా చూడాలని వైఎస్సార్సీపీ నాయకులు కోరారు. -
ఆగని దోపిడీ
శ్రీకాకుళం● రైతుల నుంచి అదనంగా ధాన్యం తీసుకుంటున్న మిల్లర్లు ● సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న రైతులు– మిల్లర్ మధ్య సంభాషణ వీడియో సోమవారం శ్రీ 5 శ్రీ జనవరి శ్రీ 2026కంచిలి: రైతులు పంట విక్రయానికి ఎన్ని అవస్థలు పడుతున్నారన్నది ఒక్క వీడియోతో తేటతెల్లమైపోయింది. ట్రక్షీట్ జనరేట్ అయిన తర్వాత మిల్లుకు వచ్చిన ధాన్యాన్ని దించడానికి మిల్లరు రకరకాల కొర్రీలు పెడుతూ రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారు. ధాన్యం నాణ్యతపై అభ్యంతరం ఉందంటూ సరకు దించకుండానే రైతుల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈ విషయమై జిల్లావ్యాప్తంగా రైతులు, ప్రజాప్రతినిధులు జెడ్పీ సర్వసభ్య సమావేశంలో సైతం సాక్షాత్ కలెక్టర్ దృష్టిలో పెట్టిన సంగతి విదితమే. కానీ మిల్లర్ల వ్యవహార శైలిలో ఏ మాత్రం మార్పు లేదు సరికదా మరింతగా రెచ్చిపోతున్నారు. దీనికి కంచిలి మండలం పురుషోత్తపురం పంచాయతీ పరిధిలోని స్వప్న రైస్ మిల్లు యజమాని కిల్లంశెట్టి మోహనరావు రైతులతో వ్యవహరించిన తీరు ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పవచ్చు. రైతుల తెచ్చిన ధాన్యానికి వంకలు పెడుతూ 80 కిలోల బస్తా బదులుగా 92 కిలోలు ఇస్తేనే అనుమతిస్తానంటూ హుకుం జారీ చేస్తున్నారు. అదనంగా 12 కిలోలు ఇస్తేనే అన్లోడింగ్ చేస్తానంటే.. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని అమ్ముకొనేందుకు ఆత్మాభిమానం చంపుకొని వ్యాపారి చేతులు పట్టుకొని బతిమలాడటం కనిపించింది. ఈ వ్యవహారానికి సంబంధించి మిల్లు యజమానికి మద్దతుగా టీడీపీ నేతలు ప్రవేశించడం, స్థానిక కూటమి ఎమ్మెల్యే బెందాళం అశోక్ దృష్టికి వెళ్లడంతో ఆయన కూడా స్తబ్ధుగా ఉంటూ మిల్లర్కు కొమ్ముకాస్తున్నా రని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో రైతులకు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. జిల్లావ్యాప్తంగా అదనంగా 3 కిలో లు, 4 కిలోలు నుంచి ఏకంగా 12 కిలోలు అదనంగా అడుగుతుండటంపై ప్రభుత్వ పెద్దలు ఏ విధంగా కొమ్ముకాస్తున్నారో ఈ వ్యవహారంతో అవగతమవుతుంది. ‘పండించిన ధాన్యం నాణ్యత బాగోలేదు. నేనేం చేయలేను. నష్టం వస్తే ఎవరు భరిస్తారు. నువ్వు తెచ్చిన ధాన్యంలో పొల్లు, నూకలే 50శాతం ఉన్నాయి. రైతు అభ్యంతరం చెబుతుంటే 40శాతం ఉన్నాయా అంటూ.. రామారావు(టీడీపీ నేత), ఎమ్మార్వో చెప్పారు కదా. 92 కిలోలు ఇస్తేనే తీసుకొంటాను. మీకు ఇందులో ఎలాంటి నష్టం రాదు.’ – కంచిలి మండలం పురుషోత్తపురం పంచాయతీ పరిధిలో స్వప్న ట్రేడర్స్ రైస్ మిల్లు వద్ద యజమాని కిల్లంశెట్టి మోహనరావు ధాన్యం తీసుకొచ్చిన రైతుతో జరిపిన సంభాషణ ఇది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
ఖర్చులకు సూచనలిలా..
● కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘ నిధులను రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు గ్రామ పంచాయతీల్లో పేరుకుపోయిన అన్ని రకాల చెత్తకుప్పలు, పాతచెత్త సహా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమా లకు, 2025 డిసెంబర్ వరకు గ్రీన్ అంబాసిడర్లకు అన్ని రకాల బకాయిలు, విద్యుత్ బిల్లులు, నీటి పథకాల నిర్వహణకు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంది. ● మండల పరిషత్లలో లింక్రోడ్లు, హ్యాండ్ పంపుల నిర్వహణ, స్వచ్ రథానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించాల్సి ఉంటుంది. ● జిల్లా పరిషత్లో గ్రామీణ మంచినీటి పథకాలకు సంబంధించిన సీసీ చార్జీల చెల్లింపులు, పథకాల నిర్వహణ, అవసరాలకు అనుగుణంగా లింకు రోడ్ల మరమ్మతులు, నిర్వహణకు మాత్ర మే ఖర్చు చేయాలని ప్రభుత్వం సూచించింది. ● జిల్లాలో స్థానిక సంస్థల్లో సింహభాగం వైఎస్సార్సీపీకి చెందినవే కావడంతో అధికార కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
రైలెక్కి హల్చల్ చేసిన యువకుడు
రైల్వేస్టేషన్లో పోలీసుల అదుపులో ఉన్న యువకుడు రైలు పెట్టైపె కూర్చున్న యువకుడు కంచిలి: కంచిలి మండల కేంద్రంలో గల సోంపేట రైల్వేస్టేషన్లో సూపర్ఫాస్ట్ రైలెక్కి ఓ యువకుడు ఆదివారం హల్చల్ చేశాడు. భువనేశ్వర్ నుంచి తిరుపతి వెళ్లే ట్రైన్ నంబర్ 22871 మధ్యాహ్నం 3.26 గంటలకు వచ్చింది. ఇంతలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం హౌరా పట్టణం నవదీప్ ప్రాంతానికి చెందిన ప్రయాణికుడు విజయ్ సర్కార్ అమాంతంగా రైలు పైకి ఎక్కాడు. ఎక్కడమే కాకుండా అందర్నీ భయ భ్రాంతులకు గురిచేశాడు. రైలు పైన అటు, ఇటూ పరిగెడుతూ హల్చల్ చేశాడు. దీంతో స్టేషన్ మాస్టర్ బలరాం బెహరా వెంటనే అక్కడికి చేరుకొని ఖుర్దా డీఆర్ఎం ఆఫీస్కు ఫోన్ చేసి, విద్యుత్ సరఫరాను ఆపించారు. తర్వాత చాకచక్యంగా స్థానిక సిబ్బంది, ప్రయాణికులు కలిసి ఆ యువకుడిని కిందకు దించి, అదుపులోకి తీసుకొన్నారు. ఈ సమాచారం అందుకున్న కంచిలి ఎస్ఐ పి.పారినాయుడు అక్కడకు చేరుకొని, ఆ యువకుడిని స్టేషన్ వెయిటింగ్ రూమ్లో ఉంచి, పలాస రైల్వే పోలీసులకు అప్పగించారు. ఆ యువకుడు ఏదో మత్తు పదార్థాలు సేవించి, మతిస్థిమితం కోల్పోయి ఇలా తిక్కతిక్కగా వ్యవహరించినట్లు గుర్తించారు. అతడి జేబులో విశాఖ పట్నం నుంచి హౌరాకు పెనాల్టీ కట్టినట్లు ఒక స్లిప్ జేబులో ఉందని అధికారులు గుర్తించారు. ఈ యువకుడు చేసిన పనికి సూపర్ఫాస్ట్ రైలు 21 నిమిషాలు పాటు సోంపేట స్టేషన్లో నిలిచిపోయింది. -
ధాన్యం లోడ్తో వెళ్తున్న వ్యాన్ బోల్తా
టెక్కలి రూరల్: స్థానిక ఒలేసాగరం సమీప ఫ్లై ఓవర్ బ్రిడ్జిపైన ఆదివారం ధాన్యం లోడ్తో వెళ్తున్న వ్యాన్ బోల్తా పడింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. పలాస నుంచి కోటబొమ్మాళి వైపు ధాన్యం లోడ్తో వెళ్తున్న వ్యాన్ టెక్కలి సమీప ఒలేసాగరం వద్దకు వచ్చే సరికి వ్యాన్ అదుపు తప్పి ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో వ్యాన్లోని ధాన్యం బస్తాలు మొత్తం చెల్లాచెదురుగా రోడ్డుపై పడిపోయా యి. వ్యాన్లో ఉన్న వ్యక్తులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెనుప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. నేటి నుంచి శాఖాపరమైన పరీక్షలు శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో సోమవారం నుంచి శనివారం వరకు ఏపీపీఎస్సీ శాఖాపరమైన (డిపార్డుమెంటల్) పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వీ లక్ష్మణమూర్తి తెలిపారు. ఆదివారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో పరీక్షల ఏర్పాట్లకు సంబంధించి సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమన్వయ కమిటీ నిర్వహించారు. చిలకపాలెంలోని శివాని ఇంజినీరింగ్ కళాశాల, ఎచ్చెర్లలోని శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాల, నరసన్నపేటలోని కోర్ టెక్నాలజీ కేంద్రాలను పరీక్ష కేంద్రాలుగా కేటాయించామన్నారు. ప్రతి రోజూ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని, అభ్యర్థులు గంటన్నర ముందే కేంద్రాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. సమయపాలన విషయంలో నిబంధనలు కఠినంగా ఉంటాయని, ఉదయం 9:30 గంటలు, మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను కేంద్రంలోకి అనుమతించబోమ ని ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ పీవీ నవ జ్యోతి స్పష్టం చేశారు. పరీక్షా హాల్లోకి సెల్ఫోన్లు, వాచీలు, క్యాలిక్యులేటర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురావడాన్ని పూర్తిగా నిషేధించారు. హోరాహోరీగా తైక్వాండో పోరు శ్రీకాకుళం న్యూకాలనీ: ఏపీ రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలు ఆద్యంతం హోరాహోరీగా సాగుతున్నాయి. ఏపీ రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ సౌజన్యంతో శ్రీకాకుళం జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ కల్యాణ మండపం వేదికగా 39వ ఏపీ రాష్ట్రస్థాయి సబ్జూనియర్స్ కుర్గీ, 14వ ఏపీ రాష్ట్రస్థాయి సబ్జూనియర్స్ పూమ్ సే బాలబాలికల తైక్వాండో చాంపియన్షిప్–2025–26 పోటీలు జరుగుతున్నాయి. రెండు రోజుల పోటీల్లో భాగంగా శనివారం ప్లేయర్స్ వేయింగ్ (బరువు) పూర్తిచేసిన నిర్వాహకులు, రెండోరోజు ఆది వారం పోటీలను నిర్వహిస్తున్నారు. తొలుత బాలురుకు పోటీలను పూర్తిచేయగా, బాలికల పోటీలు అర్ధరాత్రి వరకు కొనసాగుతున్నాయి. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన క్రీడాకారులకు పతకాలను అందజేస్తున్నారు. ఎప్పటికప్పుడు విజేతలుగా నిలిచిన ప్లేయర్స్కు మెడల్స్ను బహూకరిస్తున్నారు. తొలుత ఉదయం ఈ పోటీలను శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ముఖ్య అతిఽథిగా హాజరై ప్రారంభించారు. మార్షల్ ఆర్ట్స్ క్రీడలతో శారీరక దారుఢ్యంతోపాటు ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. అనంతరం శ్రీకాకుళం ఎమ్మె ల్యే గొండు శంకర్, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, అథ్లెటిక్స్ అసోసియేషన్ ఏపీ రాష్ట్ర చైర్మన్ కొన్న వెంకటేశ్వరరావు (వాసు) తదితరులు హాజరై వివిధ బరువుల కేటగిరి పోటీలను ప్రారంభించి, విజేతలకు బహుమతులను పంపిణీ చేశారు. -
ఐటీడీఏ ఆశ అడియాసేనా..?
ఐదు వందల కిలోమీటర్ల ప్రయాణం వారిని చావుకు దగ్గర చేసింది. లారీ రూపంలో దారి కాచిన మృత్యువు తల్లీపిల్లలను తీసుకెళ్లిపోయింది. అమ్మ పక్కనే హాయిగా పడుకున్న బిడ్డలను కనికరం లేకుండా చంపేసింది. లిప్తపాటు కాలంలో ఆ కుటుంబాన్ని కారు చీకటి కమ్మేసింది. కొర్లాం జాతీయ రహదారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి, ఇద్దరు బిడ్డలు ఊపిరి వదిలేశారు. సోంపేట: కొర్లాం జాతీయ రహదారి నుంచి బారువ వెళ్లే రహదారి సమీపంలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్రూట్లో అమాంతం దూసుకువచ్చిన లారీ కారును ఢీకొట్టడంతో ఒడిశా బాలాసోర్కు చెందిన కనక లత(31) ఆమె బిడ్డలు అభిలాష (8), ఆది త్య (1) దుర్మరణం పాలయ్యారు. వారు స్వస్థలం నుంచి అప్పటికే 550 కిలోమీటర్లు ప్రయాణించారు. మరో 250 కిలోమీటర్లు వెళ్తే గమ్యస్థానం చేరుకునేవారు. కానీ లారీ రూపంలో వచ్చిన మృత్యువు వారిని కబళించింది. బారువ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం బాలాసోర్కు చెందిన కనకలత విశాఖలో పనిచేస్తున్నారు. ఆదివారం వారి స్వగ్రా మం బాలాసోర్ నుంచి విశాఖ వెళ్లేందుకు ట్రావెల్ కార్ బుక్ చేసుకున్నారు. కనకలతతో పాటు కుమార్తె అభిలాష, పది నెలల కుమారుడు ఆదిత్యతోపాటు పదేళ్ల జానకి అనే మరో అమ్మాయి ఉన్నారు. డ్రైవర్తో కలిపి మొత్తం ఐదుగురు ఉదయమే బయల్దేరారు. కారు కొర్లాం జాతీయ రహ దారి జంక్షన్ వద్దకు చేరుకుంది. అదే సమయంలో పలాస నుంచి బరంపురం వెళ్తున్న లారీ ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి డివైడర్ను దాటి రాంగ్రూట్లోకి ప్రవేశించి అమాంతం కారును ఢీకొట్టి పొలాల్లోకి దూసుకుపోయింది. ప్రమాదంలో కారు లో ఉన్న కనకలత, అభిలాష, ఆదిత్య మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ నాగరాజు, మరో బాలిక జానకిని శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను బారువ సామాజిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే జాతీయ రహ దారి భద్రతా సిబ్బంది, బారువ పోలీసులు, స్థానికులు వెంటనే అక్కడకు చేరుకుని కారులో ఉన్న వారికి బయటకు తీశారు. పసిబాలుడు ఆదిత్య, మరో పాప అభిలాష కొన ఊపిరితో ఉండగా వారికి బతికించేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. పసివాళ్ల కష్టం చూసి అక్కడున్న వారు కంట నీరు పెట్టుకున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ప్రమాదంపై బారువ ఎస్ఐ హరిబాబు నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల బంధువులు వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు. కారులో బాధితులు కనకలత మృతదేహంమూడు బస్సులు మారాలి.. సమస్యలు చెప్పుకోవడానికి వెళ్లడమే పెద్ద సమస్యగా మారుతోంది. సీతంపేట వరకు వెళ్లాలంటే రూ.500 ఖర్చవుతుంది. ఎన్నిసార్లని వెళ్లగలం. మా మండలంలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలి. – సవర గణేష్, పుస్తలవార గ్రామం, మెళియాపుట్టి మండలం పోరాటాలు చేస్తూనే ఉన్నాం మా గిరిజన ప్రజల కష్టాలు తీరాలంటే ఐటీడీఏ అవసరం. రాష్ట్రం, జిల్లా స్థాయిలో ఆందోళనలు చేస్తూనే ఉన్నాం. ఢిల్లీ వరకు వెళ్లి జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్ దృష్టిలో పెట్టాం. ఇటీవల మెళియాపుట్టి మండలం కేరాసింగి గ్రామాన్ని ఆయన సందర్శించారు. ప్రభుత్వం స్పందించాలి. – వాబ యోగి, ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెళియాపుట్టి: జిల్లాల పునర్విభజనలో భాగంగా సీతంపేట ఐటీడీఏ మన్యం జిల్లాలో కలిసిపోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే మెళియాపుట్టిలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తామని పలువురు నేత లు హామీ ఇచ్చారు. కానీ దీనిపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో గిరిజనులు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. సమస్యలు చెప్పుకోవడానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న సీతంపేటకు వెళ్లాల్సి వస్తోందని అంటున్నారు. ఎన్నికల ముందు పాతపట్నం నియోజక వర్గానికి ఏ నేత వచ్చినా.. మెళియాపుట్టిలో ఐటీ డీఏ ఏర్పాటు చేస్తామని చెప్పేవారు. ఇదే హామీతో గిరిజనుల ఓట్లు దండుకున్నారు. అధికారం దక్కాక ఇచ్చిన మాట మర్చిపోయారు. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మెళియాపుట్టి, మందస, కొత్తూరు, పాతపట్నం మండలాల్లో అధికంగా గిరిజనులు ఉన్నారు. 16 గిరిజన ఉప ప్రణాళిక మండలాలు ఉన్నాయి. విభజన ప్రక్రియలో భాగంగా సీతంపేట ఐటీడీఏ పరిధిలో 847 గిరిజన గ్రామాలు ఉండగా శ్రీకాకుళం జిల్లాకు 469, మన్యం జిల్లాకు 378 గ్రామాలను కేటాయించారు. అయితే విభజన అనంతరం అధికారులు గిరిజన గ్రామాల్లోని సమస్యలు ఎక్కడికక్కడే వదిలేశారని గిరిజన సంఘాల నాయకులు చెబుతున్నారు. రహదారులు, తాగునీరు, విద్య, వైద్య సదుపాయాలకు దూరంగా నానా అవస్థలు పడుతున్నట్లు వారు చెబుతున్నారు. అత్యధిక గిరిజన గ్రామాలు ఉండి, అన్ని గ్రామాల ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే మెళియాపుట్టి మండలకేంద్రంలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని ఇది వరకే గిరిజన సంఘాలు పలు సందర్భాల్లో జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, దీక్షలు, ఆందోళనలు చేశాయి. కానీ సర్కారు స్పందించలేదు. మందస, నందిగాం, మెళియాపుట్టి, పాతపట్నం, సారవకోట, ఎల్ఎన్పేట మండలాలకు చెందిన గిరిజనులకు ఐటీడీఏ అందని ద్రాక్షలామారింది. సమస్యలున్నా సీతంపేట వరకు వెళ్లలేకపోతున్నారు. ఇక్కడే ఐటీడీఏ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెబుతున్నారు. కొర్లాం జాతీయ రహదారి వద్ద ఘోర ప్రమాదం కారును ఢీకొట్టిన లారీ ముగ్గురు తల్లీపిల్లల దుర్మరణం మృతులంతా ఒడిశా వాసులు మెళియాపుట్టిలో ఐటీడీఏ ఏర్పాటు ఎప్పుడో..? కోటి ఆశలు పెట్టుకున్న గిరిజనులు సమస్యలు చెప్పుకోవడానికి సీతంపేట వెళ్లాల్సి వస్తోందని ఆవేదన -
మేం చెప్పిన పనులే చేయాలి
అరసవల్లి: గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులకు గాను కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు 2025– 26 ఆర్థిక సంవత్సరానికి మొదటి విడతగా జిల్లాకు మొత్తం రూ. 31.76 కోట్లు వరకు నిధులను కేటాయించింది. దీంతో గ్రామ పంచాయతీల్లో స్థానిక సంస్థల పాలక వర్గాలు పనులను గుర్తించి ఆయా పనులను ఆమోదించేలా గ్రామ పంచాయతీల్లో తీర్మానాలను సిద్ధం చేశారు. తీరా చూస్తే ఆ నిధులను వినియోగించే విషయంలో తీవ్రమైన ఆంక్షలను విధించేలా చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించడంతో గ్రామ సర్పంచ్లు తలలుపట్టుకున్నారు. గ్రామ ప్రణాళిక రిపోర్టు ఆధారంగా జనాభా ఆధా రంగా కేంద్ర ప్రభుత్వం నేరుగా రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు గాను ఆర్థిక సంఘం నిధులను కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం చెలాయించి, తాము గుర్తించిన పనులనే చెయ్యాలి, తాము చెప్పి న విధంగానే చెయ్యాలనేలా షరతులు పెట్టారు. దీంతో రాష్ట్రంతో పాటు స్థానిక జిల్లాలో కూడా అత్యధిక శాతం గ్రామ పంచాయతీల్లో సర్పంచ్లుగా వైఎస్సార్సీపీ మద్దతుదారులే ఉండడంతో వీరంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆర్థిక సంఘ నిధులపై చంద్రగ్రహణం ఎప్పుడు వీడుతుందో అని ఎదురుచూస్తున్నారు. 896 పంచాయతీలకు ఆర్థిక నిధుల సర్దుబాటు జిల్లాలో 15వ ఆర్థిక సంవత్సర మొదటి విడతగా టైడ్ నిధుల కింద రూ.19,05,60,817, అన్టైడ్గా రూ.12,70,40,552 నిధులను కేటాయించింది. మొత్తంగా జిల్లాలో 912 గ్రామ పంచాయతీలుండగా.. ఇందులో 896 పంచాయతీలకే ఈ మొత్తం రూ.31,76,01,339 నిధులను సర్దుబాటు చేశారు. సగటున ఒక్కో పంచాయతీకి రూ.6 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు జనాభా ప్రాతిపదికన కేటా యించారు. నిబంధనల మేరకు 15వ ఆర్థిక సంఘ నిధులు వాడుకోవాల్సి ఉంటుంది. టైడ్ గ్రాంట్ను తాగునీరు, పారిశుద్ధ్యానికి, బేసిక్ (అన్టైడ్) నిధులను గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ప్రాథమిక అవసరాలైన విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, వేతనాలు తదితర ఖర్చులకు వినియోగించే వెసులుబాటు ఉంది. అయితే నిబంధనలను కాదని, తాము సూచించిన వాటికే ఈ నిధులు ఖర్చు పెట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం గత నెల 24న పలు సూచనలను జారీ చేసింది. ఈ సూచనల మేరకు జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీలు విడుదలైన ఆర్థిక సంఘ నిధులను ఖర్చుచేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీనిపై గ్రామ సర్పంచ్లు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఈ నిధులు వస్తాయనే పలు పంచాయతీల్లో సీసీ రోడ్లను వేయించేసిన గ్రామ సర్పంచులు తాజా నిబంధనల ప్రకారం తమ పనులకు బిల్లులు వచ్చే అవకాశాలు లేవని గ్రహించి ఆందోళన చెందుతున్నారు. మరో మూడు నెలల్లోనే స్థానిక సంస్థల పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో తాజా ఆంక్షలు స్థానిక సర్పంచ్లకు నిద్ర పట్టకుండా చేస్తున్నా యి. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన క్రమంలో తాజా ఆంక్షలతో బిల్లులు వచ్చే పరిస్థితులు లేవని దీంతో స్థానిక సంస్థల హక్కులను హరిస్తున్నారని గ్రామ సర్పంచ్లు ఆందోళన చెందుతున్నారు. ఆర్థిక సంఘ నిధుల వినియోగంలో అధికార పార్టీ ఆంక్షలు సర్పంచ్ల పదవీ కాలం ముగియనున్న సమయంలో కుట్ర జిల్లాకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.31.76 కోట్లు విడుదల జిల్లాలో 896 పంచాయతీల్లో నిధుల సర్దుబాటు కేంద్ర నిధులపై రాష్ట్ర ప్రభుత్వ పెత్తనం -
ప్రభుత్వ స్థలాల ఆక్రమణ!
● ఇచ్ఛాపురంలో ఇష్టారాజ్యంగా కబ్జాలు ● పట్టించుకోని అధికారులు ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయి. ఎక్కడ ప్రభుత్వ భూమి కనిపించినా ఆక్రమణదారులు ఏదో ఒక విధంగా సొంతం చేసుకుంటున్నారు. స్థానిక నాయకుల ఆండదండలతో కబ్జా చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లే వ్యవహరిస్తున్నారు. రత్తకన్న రోడ్డులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో మంగలకాలనీ వద్ద 197 సర్వే నంబర్లోని ప్రభుత్వ భూమిని జగనన్న కాలనీకి కేటాయించారు. లబ్ధిదారులు వారికి కేటాయించిన స్థలాల్లో ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారు. కాలనీ పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిపై ఆక్రమణదారుల కన్నుపడింది. స్థలాన్ని చదును చేసి నాలుగు వైపులా స్థంభాలు పాతి కంచె వేశారు. పాతాళ సిద్ధేశ్వరాలయం సమీపంలో ప్రభుత్వ స్థలాల్లో కొంతమంది పశువులను కట్టి మేపుతున్నారు. కొంతకాలం చేసిన తర్వాత ఆ స్థలం తమదే అంటూ నకిలీపత్రాలు సృష్టించి ఆక్రమణలకు పాల్పడుతున్నారు. సంతపేట పంపు హౌస్ వద్ద పాతాళ సిద్ధేశ్వరాలయానికి వెళ్లే దారిలో చిన్నపాటి చెరువులాంటి ప్రాంతం, దాని సమీపంలో స్థలంపై ఆక్రమణదారుల కన్నుపడింది. ఎటువంటి అనుమతులు లేకుండానే నిర్మాణ పనులు మొదలుపెట్టారు. అధికారులు సైతం అడ్డుపడకపోవడంతో ఇదే అదునుగా చెరువును సైతం ఆక్రమించడానికి సన్నాహాలు చేస్తున్నారు. చెరువులో మట్టివేసి కప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణకు పాల్పడితే చర్యలు తప్పవు. ఆక్రమణలు జరిగినట్లు మా దృష్టికి తీసుకొస్తే వెంటనే చర్యలు చేపడతాం. ప్రభుత్వ స్థలాల్లో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టకూడదు. – ఎన్.వెంకటేశ్వరరావు, తహసీల్దార్, ఇచ్ఛాపురం -
ఉపాధ్యాయినులకు పూలే అవార్డులు
శ్రీకాకుళం కల్చరల్/జి.సిగడాం: తిరుపతికి చెందిన ఆర్గనైజేషన్ ఆఫ్ రూరల్, అర్బన్ అండ్ ట్రైబల్ ఎంపవర్మెంట్ నిర్వాహకులు ఉపాధ్యా వృత్తిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులకు ఆదివారం విశాఖపట్నం పౌర గ్రంథాలయంలో సావిత్రిబాయి పూలే లెగసీ అవార్డులను ప్రదానం చేశారు. శ్రీకాకుళం వరం మున్సిపల్ హైస్కూల్లో హిందీ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న తిమ్మరాజు నీరజకుమారి, సీతంపేట జి.టి.డబ్ల్యూ.ఎ.జి.హెచ్.స్కూల్ హెచ్ఎం తిమ్మరాజు వసంతలక్ష్మి, జి.సిగడాం మండలం బూటుపేట ప్రాథమిక పాఠశాల హెచ్ఎం కూర్మాన అరుణకుమారి ఈ అవార్డులను అందుకున్నారు. -
ఆదిత్యునికి ప్రత్యేక పూజలు
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారికి ఆదివారం ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. స్థానికులతో పాటు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి ఆదిత్యునికి మొక్కులు చెల్లించుకున్నారు. రథసప్తమి ఉత్సవ ఏర్పాట్లలో భాగంగా ఆలయ మండపాల్లో పరిసరాల్లో పెయింటింగ్ ఇతర త్రా క్యూలైన్ల ఏర్పాటు పనులు జరుగుతున్న క్రమంలో భక్తులకు దర్శనాల మార్గంలో ఇబ్బందులు లేకుండా ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ చర్యలు చేపట్టారు. అంతరాలయంలో సర్వదర్శనాలు సక్రమంగా అయ్యేలా ప్రధానార్చకులు ఇప్పిలి శంశరశర్మ ప్రత్యేక చర్యలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ సతీమణి ఆదిత్యున్ని దర్శించుకున్నారు. హోంగార్డుపై దాడి సోంపేట: సోంపేటలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న బెహరా ఖగపతిపై దాడి చేసిన బి.సతీష్పై పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం రాత్రి సోంపేట పట్టణంలో మద్యం తాగి గొడవ చేస్తున్న సతీష్ను హోంగార్డు పోలీస్స్టేషన్కు తీసుకొస్తున్న క్రమంలో సతీష్ దాడి చేశాడు. ఈ మేరకు హోంగార్డు ఖగపతి ఫిర్యాదు మేరకు ఎస్ఐ వి.లోవరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చెట్టును ఢీకొని వ్యాన్ బోల్తా మెళియాపుట్టి : బాణాపురం వద్ద శనివారం అర్ధరాత్రి ఓ వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొని బోల్తాపడింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పలాస వైపు నుంచి మెళియాపుట్టి వైపు వస్తున్న ఓ వ్యాన్ అర్ధరాత్రి రెండు గంటల సమయంలో బాణాపురం రహదారి వద్ద చెట్టును ఢీకొట్టింది. గాల్లో ఎగిరి రహదారిపై పడింది. ఉదయం వెళ్లి స్థానికులు చూసేసరికి రెండు చక్రాలు ఊడిపోయి వ్యాన్ కనిపించింది. ఒడిశా రిజిస్ట్రేషన్తో ఉన్న ఈ వ్యాన్లో ఓ కంపెనీ సామగ్రి రవాణా చేస్తున్నట్లు తెలిసింది. ఇద్దరు వ్యక్తులు గాయపడటంతో అంబులెన్స్లో తీసుకెళ్లారని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తమ ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై రమేష్బాబు తెలిపారు. డీసీసీ అధ్యక్షుడిగా అన్నాజీరావు శ్రీకాకుళం అర్బన్: జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా సనపల అన్నాజీరావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. అన్నాజీరావు కట్యాచార్యులపేట పీఏసీఎస్ అధ్యక్షుడిగా, కొర్లకోట ఎంపీటీసీ సభ్యుడిగా, డీసీసీ జిల్లా కార్యదర్శిగా, ప్రచార కార్యదర్శిగా, ఆమదాలవలస మండల, బ్లాకు అధ్యక్షుడిగా, పంచాయతీ అభియాన్ అధ్యక్షుడిగా పనిచేశారు. గతంలో ఆమదాలవలస నియోజకవర్గానికి చెందిన బొడ్డేపల్లి సత్యవతి డీసీసీ అధ్యక్ష పదవిని చేపట్టగా ఇపుడు అన్నాజీరావు నియమితులవ్వడం విశేషం. ఈయన నియామకం పట్ల జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ కిటకిట శ్రీకాకుళం అర్బన్ : శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆదివారం ప్రయాణికులతో కిటకిటలాడింది. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల నుంచి అరసవల్లి సూర్యనారాయణస్వామివారిని దర్శించుకునేందుకు, శ్రీకూర్మం, శ్రీముఖలింగం, రావివలస తదితర పుణ్యక్షేత్రాలను సందర్శించుకునేందుకు భారీ ఎత్తున రావడంతో రద్దీగా కనిపించింది. ఉచిత ప్రయాణం కావడంతో మహిళా ప్రయాణికులు అధిక సంఖ్యలో రావడంతో బస్సుల్లో సీట్ల కోసం ఎగబడ్డారు. అరకు అందాలు అద్భుతం అరకులోయ టౌన్: అరకులోయ అందాలు అద్భుతమని ఏపీ మాజీ స్పీకర్, వైఎస్సార్సీపీ నేత తమ్మినేని సీతారాం అన్నారు. ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి అనంతగిరి, అరకులోయ, డుంబ్రిగుడలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. కటికి జలపాతం, సుంకరమెట్టలోని ఉడెన్ బ్రిడ్జి, గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానవనం, డుంబ్రిగుడలోని చాపరాయి జలవిహారిని తిలకించారు. మాడగడ సన్రైజ్ వ్యూపాయింట్ వద్ద గిరిజనుల వస్త్రధారణలో థింసా కళాకారులతో నృత్యం చేస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ సెలయేర్లు, కొండలు, లోయలు, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు చాలా ఆకట్టుకున్నాయని చెప్పారు. -
చేనేత..ఏదీ చేయూత?
● చతికిల పడిన చేనేత రంగం ● గిట్టుబాటు కాని మజూరీలు ● కార్మికులకు ప్రోత్సాహం కరువు ● ప్రత్యామ్నాయ వృత్తుల్లో చేనేత కుటుంబాలు ఆమదాలవలస : జిల్లాలో వ్యవసాయం తర్వాత అంతటి ప్రాధాన్యమున్న చేనేత రంగంపై చంద్రబాబు ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. ఏటా బడ్జెట్లో చేనేత రంగానికి కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని పాలకులు ప్రగల్భాలు పలుకుతున్నా కార్మికులకు మాత్రం ఎటువంటి నిధులు అందడం లేదు. అరకొర మజూరిలు గిట్టుబాటు కాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని చేనేత కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమదాలవలస నియోజకవర్గంలో ఆమదాలవలస, పొందూరు మండలాల పరిధిలో చేనేత కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆమదాలవలస మండలంలోని అక్కులపేట, వేణమ్మపేట, ఎస్సార్సీపేట, చింతలపేట, బొబ్బిలిపేట, దూసి, ముద్దాడపేట తదితర గ్రామాల్లో సుమారు 260 కుటుంబాలు మగ్గాలపై ఆధారపడి బతుకుతున్నారు. పొందూరు మండలంలో పొందూరు, తోలాపి, తండ్యాం మెట్ట తదితర గ్రామాల్లో సుమారు 450 కుటుంబాలు చేనేతనే నమ్ముకున్నాయి. ప్రభుత్వం వీరికి మగ్గాలు నూలు కొనుగోలుకు లక్షలాది రూపాయలు ఆర్థిక సహాయం అందించినట్లు రికార్డులో చూపుతున్నారు. వాస్తవంగా ఆ నిధులన్ని బినామీ పేర్లతో కొంతమంది చేనేత సొసైటీల ప్రతినిధులు, అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు స్వాహా చేస్తున్నారని నేత కార్మికులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సహకారం అందడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబమంతా శ్రమించినా.. పెరిగిన నూలు ధరలకు అనుగుణంగా కుటుంబమంతా శ్రమించి నేస్తున్నా రోజుకు రూ.150 నుంచి రూ.200కు మించి గిట్టుబాటు కావడం లేదని చేనేత కార్మికులు చెబుతున్నారు. మిల్లుల్లో తమారయ్యే దుస్తులకు గిరాకీ ఉండడం, చేనేత వస్త్రాల ధరలకు పాలిస్టర్తో పోల్చితే అధికంగా ఉండడం తదితర కారణాలతో ఆర్డర్లు తక్కువగా వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మజూరి(కూలీ) గిట్టుబాటు కాక ప్రత్యామ్నాయ పనులకు వెళ్లాల్సి వస్తోందని, పనికి వెళ్తే కూలి రూ.500 వస్తుందని చెబుతున్నారు. పాలకుల నిర్లక్ష్యం.. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన చేనేత రంగం పాలకుల నిర్లక్ష్యం కారణంగా నేడు దయనీయ స్థితికి చేరుకుంది. చేనేత రంగం అభివృద్ధి కోసమంటూ ఏటా కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా అవేవీ కార్మికుల చెంతకు చేరడంలేదు. ఓవైపు ప్రభుత్వం ప్రోత్సాహం లేక, మరో వైపు మజూరి గిట్టుబాటు కాక నేతన్నలు ప్రత్యామ్నాయ పనులు, వృత్తులను ఆశ్రయిస్తున్నారు. ఆదుకోని వర్క్షాప్లు.. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక పద్ధతుల్లో చేనేత వస్త్రాలు తయారు చేసే ఉద్దేశంతో కార్మికుల వృత్తి నైపుణ్యత పెంచేందుకు జిల్లాలో గతంలో రూ.10 కోట్లతో వర్కుషాపు నిర్వహించారు. ఈ శిక్షణ సొసైటీ పరిధిలో ఉన్న కొందరి కార్మికులకు మాత్రమే ఉపయోగపడిందని అంటున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వ స్పందించి నేత కార్మికులను ఆదుకునే చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.పాలకులు స్పందించి రుణాలు, పథకాలు అందించి చేనేత కార్మికులను ఆదుకోవాలి. ఎన్నికల హామీలు అమలు చేయాలి. ప్రోత్సాహకాలు అందించి, మజూరీలు పెంచి చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకురావాలి. – బొట్ట సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు చేనేత కార్మికులను ప్రభుత్వం పెద్ద మనసుతో ఆదుకోవాలి. ఇదే వృత్తిని నమ్ముకొని ఉన్న చేనేత కార్మికులు బయట పనులు చేసుకోలేక, ఇప్పుడిస్తున్న మజూరీ చాలక అవస్థలు పడుతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో చాలామంది ఉన్నాం. – ఎ.పైడిరాజు చేనేత కార్మికుడు, ఆమదాలవలస -
మహిళా క్రికెట్ నెట్స్ ప్రారంభం
శ్రీకాకుళం న్యూకాలనీ: నగరంలో క్రికెట్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ హామీఇచ్చారు. శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలో మహిళలు/బాలికల క్రికెట్ సాధనకు ఏసీఏ తోడ్పాటుతో జిల్లా క్రికెట్ సంఘం (జెడ్సీఎస్) ఏర్పాటు చేసిన క్రికెట్ నెట్స్, టర్ఫ్ వికెట్, ఆస్ట్రో టర్ఫ్వికెట్, జిల్లా క్రికెట్ సంఘ కార్యకలాపాల కోసం నిర్మించిన భవనాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాత్రునివసలో ఖేలో ఇండియా మల్టీ స్టేడియం మైదానం కేటాయించిన ప్రాంతంలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి స్థలం కేటాయిస్తామని చెప్పారు. అనంతరం జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్కు జెడ్సీఎస్ తరఫున రూ.50వేల చెక్కును బాస్కెట్బాల్ సంఘ కార్యదర్శి, కోచ్ అర్జున్రెడ్డికి అందజేశారు. దివ్యాంగుల క్రికెట్లో ఆంధ్రా జట్టుకు ప్రాతినిధ్యం వహంచిన వర్షత్ను సత్కరించారు. కార్యక్రమలో జిల్లా క్రికెట్ సంఘం మెంటార్ ఇలియాస్ మహ్మద్, కోశాధికారి మదీనా శైలానీ, ఏసీఏ ప్రతినిధులు నాగ గంగాధర్, వంశీ, దుప్పల వెంకటరావు, ప్రిన్సిపాల్ పి.సురేఖ, జెడ్సీఎస్ ౖౖకౌన్సిలర్ ఎస్.రవికుమార్, సీహెచ్ విజయభాస్కర్, బాస్కెట్బాల్ కోచ్ గాలి అర్జున్రావురెడ్డి, పాండ్రంగి శంకర్, రమేష్, క్రికెట్ కోచ్లు కె.సుదర్శన్, ఆనంద్కుమార్, కె.కిరణ్, పీడీ మోహన్రాజ్ తదతరులు పాల్గొన్నారు. -
బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
సోంపేట: సోంపేట పట్టణానికి చెందిన తెల్లి అవినాష్ (23) అనే యువకుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సోంపేట పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తెల్లి యోగేశ్వరరావు, రోహిణిల కుమారుడు అవినాష్ బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతుండగా మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. కాలికి తీవ్ర గాయాలు కావడంతో నడవ లేని పరిస్థితి ఎదురైంది. మూడు శస్త్ర చికిత్సలు జరిగినా నయం కాలేదు. చదువు మధ్యలో ఆగిపోవడం, నడవలేని పరిస్థితి కావడంతో నిత్యం ఆందోళన చెందుతుండేవాడు. కుటుంబానికి భారం కాకూడదని ఆదివారం వేకువజామున ఇంటికి సుమారు 100 మీటర్ల దూరంలో ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వీరికి అవినాష్తో పాటు డిగ్రీ చదువుతున్న మరో కుమారుడు ఉన్నాడు. సోంపేట ఎస్ఐ వి.లోవరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స పొందుతూ మహిళ మృతి శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో వడ్డాణ జయలక్ష్మి(40) అనే మహిళ మూడు రోజుల క్రితం ఒంట్లో నీరసమంటూ చేరింది. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. ఈమెకు తోడుగా ఎవరూ రాలేదని, తనది శ్రీకాకుళం బరాటం వీధి అని చెప్పినట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొంటున్నాయి. వివరాలు తెలిసిన వారు 6309990842 నంబరును సంప్రదించాలని ఎస్ఐ ఎం.హరికృష్ణ కోరారు. -
ప్రతిభకు వైకల్యం అడ్డుకాదు
శ్రీకాకుళం పాతబస్టాండ్: అంధులు, పాక్షిక దృష్టి లోపం ఉన్నవారి జీవితాల్లో బ్రెయిలీ లిపి సరికొత్త వెలుగులు నింపిందని, ఈ గొప్ప ఆవిష్కరణ ద్వారా వారు విద్యావంతులుగా మారి సమాజంలో సగౌరవంగా జీవించగలుగుతున్నారని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. కలెక్టరేట్ ఆవరణలోని విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయంలో ఆదివారం ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దృష్టి లోపం ఉన్నవారు ఆత్మన్యూనతా భావాన్ని వీడి లూయిస్ బ్రెయిలీని స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. దృష్టి లోపం ఉన్నవారికి న్యాయ సేవాధికార సంస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఎటువంటి సమస్యలు ఎదురైనా తక్షణమే న్యాయ సేవా సంస్థను ఆశ్రయించి ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో కల్పిస్తున్న రిజర్వేషన్లు, ఇతర రాయితీలను అందిపుచ్చుకుని ఆర్థికంగా ఎదగాలని కోరారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు శైలజ, వివిధ సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
జనవిజ్ఞాన వేదిక క్యాలెండర్ ఆవిష్కరణ
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): పెట్రోల్ నిక్షేపాల కోసం వెనెజులా దేశంపై అమెరికా దాడి చేయడం దుర్మార్గమని జనవిజ్ఞానవేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని యూటీఎఫ్ భవనంలో ఆదివారం జన విజ్ఞాన వేదిక డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవిజ్ఞాన వేదిక ద్వారా ప్రజల్లో శాసీ్త్రయ ఆలోచనలు పెంచేలా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కుప్పిలి కామేశ్వరరావు మాట్లాడుతూ అందరిలో శాసీ్త్రయ దృక్పథం పెంచేందుకు, ప్రజల కోసం సైన్సు – ప్రగతి కోసం సైన్స్–స్వావలంబన కోసం సైన్స్– పర్యావరణ పరిరక్షణ కోసం సైన్స్ అనే నినాదాలతో జనవిజ్ఞావేదిక పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో జేవీవీ జిల్లా ఉపాధ్యక్షుడు సంజీవరావు, జిల్లా సహాధ్యక్షుడు బి.ధనలక్ష్మి, మహిళా విభాగం కన్వీనర్ కె.శాంతి ప్రియ, మద్యం మాదక ద్రవ్యాల వ్యతిరేక కమిటీ కన్వీనర్ సీహెచ్ రాజు, ఆమదాలవలస డివిజన్ నాయకులు కె.షణ్ముఖరావు తదితరులు పాల్గొన్నారు. -
ఎస్ఎస్ఆర్పురం విద్యార్థుల ప్రతిభ
ఎచ్చెర్ల : శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాలలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ సోషల్ స్టడీస్ టీచర్ ఫోరమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సోషల్ స్టడీస్ ఫెస్టివల్–2026 జిల్లా స్థాయి పోటీల్లో సంతసీతారాంపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు విజేతలుగా నిలిచారు. వీరు ప్రదర్శించిన స్టార్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ప్రథమ బహుమతి లభించింది. అధునాతన సాంకేతిక విధానాలను ఉపయోగించి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించేలా వ్యవసాయం చేయడం ఈ ప్రాజెక్టు ఉద్దేశమని విద్యార్థులు పేర్కొన్నారు. సోషల్ ఉపాధ్యాయురాలు పి.జగదాంబ సహాయంతో ఈ ప్రాజెక్టు తయారుచేశారు. వీరిని హెచ్ఎం టి.జయలక్ష్మీ, ఉపాధ్యాయులు అభినందించారు. -
పీఆర్సీ కమిషన్ నియమించాలి
శ్రీకాకుళం: ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి 12వ పీఆర్సీ కమిషన్ నియమించి 30 శాతం మధ్యంతర భృతి వెంటనే ప్రకటించాలని స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినాన చందనరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యాలయంలో ఎస్టీఏ జిల్లా అధ్యక్షుడు సప్పటి మల్లేసు అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే మూడు డీఏలు పెండింగ్లో ఉన్నాయని, జనవరి నుంచి మరొక డీఏ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. న్యాయంగా రావాల్సిన డీఏలు సకాలంలో అందక ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారని చెప్పారు. సరెండర్ లీవ్ బిల్లులు చెల్లించాలని, విశ్రాంత ఉద్యోగులకు పెన్షనరీ బెనిఫిట్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పంచాది గోవిందరాజులు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మేడిశెట్టి సాయిరాజ్, జిల్లా ఉపాధ్యక్షుడు సిరిపురం మురళి, తదితరులు పాల్గొన్నారు. -
ఉర్రూతలూగించిన ‘రేలా రే రేలా’
శ్రీకాకుళం కల్చరల్: శ్రీకాకుళ రంగస్థల కళాకారుల సమాఖ్య(నెలవారీ సాంస్కృతిక విభాగం) 315వ నెల కార్యక్రమం శనివారం నగరంలోని బాపూజీ కళామందిర్లో ఘనంగా నిర్వహించారు. ధర్మశాస్త సన్నిదానం ట్రస్ట్ సౌజన్యంతో నూతన వస్త్రాలు, పేద కళాకారులకు పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం గజపతినగరానికి చెందిన శ్రీ విజయ జానపద కళాబృందం ‘రేలా రే రేలా‘ ప్రదర్శన ఉర్రూతలూగించింది. ఉత్తరాంధ్ర జానపదాలను పి.రఘు బృందం చక్కగా ఆలపించారు. కార్యక్రమంలో సమాఖ్య అధ్యక్షుడు ఎల్.రామలింగస్వామి, ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి, జిల్లా పర్యాటక శాఖ అధికారి నడిమింటి నారాయణరావు, వ్యాపారవేత్త బరాటం సంతోష్, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు బెండి శివప్రసాద్, సమాఖ్య సభ్యులు బి.ఎ.మోహనరావు, ఐ.రమణారావు, కంచరాన అప్పారావు, మెట్ట పోలినాయుడు, తాయి రవి, ఎన్ని రాజేశ్వరరావు, మజ్జి మోహనరావు, ప్రసాదరావు రౌళో, పైడి సత్యవతి, బత్తుల జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
వాలీబాల్ పోటీలకు ఇద్దరు ఎంపిక
శ్రీకాకుళం న్యూకాలనీ: ఆలిండియా సీనియర్స్ వాలీబాల్ పోటీలకు జిల్లా నుంచి ఇద్దరు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసి కేంద్రంగా ఈ నెల 4 నుంచి 11వ తేదీ వరకు 72వ సీనియర్ నేషనల్స్ వాలీబాల్ చాంపియన్షిప్–2025–26 పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలకు రణస్థలం మండలం కొవ్వాడ మత్స్యలేశం గ్రామానికి చెందిన మైలపల్లి సత్యం, కవిటికి చెందిన మరిడి సుధీర్కుమార్ ఎంపికయ్యారు. వీరిద్దరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరి ఎంపిక పట్ల శ్రీకాకుళం వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ప్రధాన కార్యదర్శి కె.రామచంద్రుడు, యాళ్ల పోలినాయుడు, మొజ్జాడ వెంకటరమణ, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.సాంబమూర్తి, సలహాదారు పి.సుందరరావు మాస్టారు, టి.రవి, ఎన్వీ రమణ, సతీష్, డీఎస్డీఓ ఎ.మహేష్బాబు, డీఎస్ఏ కోచ్ కె.హరికృష్ణ హర్షం వ్యక్తంచేశారు. ఎం.సత్యం ఎం.సుధీర్ -
మరింత ముందుకు మహిళా క్రికెట్
● మహిళా క్రికెట్ అభివృద్ధికి జిల్లా క్రికెట్ సంఘం కృషి ● శ్రీకాకుళంలో టర్ఫ్ వికెట్, నెట్స్ ప్రారంభం నేడు శ్రీకాకుళం న్యూకాలనీ: మహిళా క్రికెట్ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు జిల్లా క్రికెట్ సంఘం(జెడ్సీఎస్) నడుం బిగించింది. మహిళా క్రికెటర్లను ప్రోత్సహించేందుకు జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా క్రికెట్ నెట్స్ ఏర్పాటు చేశారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) తోడ్పాటుతో శ్రీకాకుళం ఎన్టీఆర్ నగరపాలకోన్నత పాఠశాల మైదానంలో మహిళా క్రికెటర్లకు శిక్షణ ఇచ్చేందుకు అత్యాధునిక హంగులతో టర్ఫ్, ఆస్ట్రో టర్ఫ్ వికెట్లు ఏర్పాటు చేశారు. క్రికెట్ కార్యకలాపాలను నిర్వహించేందుకు చిన్న కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ క్రికెట్ నెట్స్ను ఆదివారం ప్రారంభించేందుకు జిల్లా క్రికెట్ సంఘం పెద్దలు ఏర్పాట్లు చేస్తున్నారు. మెరుపులు లేమితో.. జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారిణులు జోనల్ స్థాయి, రాష్ట్రస్థాయి ప్రాబబుల్స్ వరకు వెళ్తున్నప్పటికీ అంతర్రాష్ట్ర, జాతీయస్థాయి, అంతర్జాతీయ స్థాయిలో నిలదొక్కుకునేలా రాణించలేకపోతున్నారు. వీటికి అనేక కారణాలు ఉన్నాయి. ఆది నుంచి మహిళా క్రికెట్పై బాలికల తల్లిదండ్రుల్లో ఆసక్తి లేకపోవడం, క్రికెట్ సంఘాల ప్రతినిధుల ప్రేక్షకపాత్ర, టర్ఫ్వికెట్ వంటి నాణ్యమైన వసతులు, సౌకర్యాలు కల్పించకపోవడం తదితర కారణాలతో ఎలాంటి మెరుపులు లేకపోయాయి. జిల్లా నుంచి కేవీఎస్పీ చందన, హారిక యాదవ్, బి.నవ్య, కుమూదిని రాష్ట్రస్థాయి వరకు ఆడగలిగారు. జాహ్నవి, వనజాక్షి స్టేట్ ప్రాబబుల్స్ వరకు ఎంపికయ్యారు. ఆధునిక హంగులతో నెట్స్.. తాజాగా ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఏర్పాటుచేసిన క్రికెట్ నెట్స్ వద్ద అత్యాధునిక వసతులు, సౌకర్యాలు కల్పించారు. రెండు వికెట్లతో కూడిన నెట్స్ ఏర్పాటు చేశారు. ఫ్లడ్ లైట్లను అమర్చారు. నెట్స్ వద్ద సాధనకు హాజరయ్యే క్రీడాకారిణులకు ఇబ్బంది లేకుండా డ్రెస్సింగ్ రూమ్, రెస్ట్ రూమ్లను నిర్మించారు. ప్రతిరోజు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4.30 నుంచి 7.30 వరకు శిక్షణ అందించనున్నారు. కనీసం 10 ఏళ్లు పైబడి క్రికెట్పై ఆసక్తి కలిగిన బాలికలు ఈ నెట్స్ వద్దకు సాధనకు అవకాశం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇద్దరు మహిళా క్రికెట్ కోచ్లను అందుబాటులో ఉంచుతున్నారు. ఫిట్నెస్ను మెరుగుపర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో మహిళా క్రికెట్ను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టాం. తాజాగా అన్ని హంగులతో కూడిన నెట్స్ను శ్రీకాకుళం నగరం మధ్యలో ఏర్పాటు చేశాం. – ఇలియాస్ మహ్మద్, సీనియర్ ప్లేయర్, జిల్లా క్రికెట్ సంఘం మెంటార్ బాలికల క్రికెట్ను విస్తరించాలని జెడ్సీఎస్ సంకల్పించింది. శిక్షణకు హాజరయ్యే మహిళలకు, బాలికలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. డ్రెస్సింగ్రూమ్ను, రెస్ట్రూమ్లను ఏర్పాటు చేశాం. అన్ని వసతులు, సౌకర్యాలతో నెట్స్ సిద్ధం చేశాం. – మదీనా శైలానీ, సీనియర్ ప్లేయర్, జిల్లా క్రికెట్ సంఘం కోశాధికారి -
గోడ కూలి కార్మికురాలు దుర్మరణం
మందస: భేతాళపురంలోని కొత్త వీధిలో శనివారం భవన నిర్మాణ పనులు జరుగుతుండగా గోడ కూలిన ఘటనలో కార్మికురాలు మృతి చెందింది. బచ్చల కాంతమ్మ(35), కీలు కనకదుర్గలు ఇటుకలు మోస్తుండగా ఒక్కసారిగా పక్కింటి గోడ వీరిపై కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో కాంతమ్మ అక్కడికక్కడే మరణించింది. కనకదుర్గ గాయాలుపాలు కావడంతో పలాస ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. కాంతమ్మకు భర్త పాపారావు, ఇద్దరు పిల్లలు. ఎస్ఐ కె.కృష్ణప్రపాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. వెంకన్నకు విశేష అలంకరణ శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని చిన్నబజారులో దూది వారి వేంకటేశ్వరాలయంలో శనివారం స్వామివారిని తులసిమాలలతో అలంకరించారు. అర్చకులు శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో స్వామికి అష్టోత్తర శతనామాలతో అర్చనలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. మొండేటివీధిలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా అర్చకులు శ్రీనివాసశర్మ ఆధ్వర్యంలో స్వామివారిని తులసిమాలలతో అలంకరించారు. -
10 వేల వాటర్ బాటిళ్లు ఇస్తే 4 పాసులు
అరసవల్లి: ఈ నెల 25న జరగనున్న రథసప్తమి ఉత్సవాలకు సంబంఽధించి భారీగా భక్తులు తరలిరానున్నారని.. వీరి కోసం 10 వేల వాటర్ బాటిళ్లు (250 మి.లీ.)ను ఆలయానికి సమర్పించిన దాతలకు, ఆలయంలో పుష్పాలంకరణకు అధికంగా పూలదండలను ఇచ్చిన వారికి విశిష్ట దర్శనంగా నాలుగు దాతల పాసులను ఇస్తామని ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ ప్రకటించారు. శనివారం ఆయన మాట్లాడుతూ ఆర్వో ప్లాంట్ నిర్వాహకులు తమ సంస్థ పేరును బాటిల్పై ముద్రించుకోవచ్చునని చెప్పారు. దాతలను ప్రోత్సహించే క్రమంలో కార్యాలయంలో పేర్లను రిజిస్ట్రేషన్ ప్రక్రియ అమలు చేస్తున్నామని వివరించారు. నగరానికి చెందిన దీపక్ కర్ణాణి అనే వ్యాపారి శనివారం పది వేల వాటర్ బాటిళ్లు, రూ.లక్ష విలువైన ఏడు వాటర్ డిస్పెన్షరీలను ఆలయానికి సమర్పించారు. వసతి గృహాలపై ప్రత్యేక శ్రద్ధ శ్రీకాకుళం పాతబస్టాండ్: వసతి గహాల్లో విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు పారిశుద్ధ్యం, ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు సూచించారు. శనివారం శ్రీకాకుళం రామలక్ష్మణ కూడలి వద్ద వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినుల గదులను పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని హెచ్డబ్ల్యూఓకు దిశానిర్దేశం చేశారు. నాణ్యమైన భోజనం అందించాలని స్పష్టం చేశారు. విద్యార్థినులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణతో మెలగాలన్నారు. సామాజిక మాధ్యమాల దుష్ప్రభావానికి గురికాకుండా కేవలం చదువుపైనే దృష్టి సారించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఎటువంటి సమస్యలు ఉన్నా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి ఇ.అనురాధ, సిబ్బంది పాల్గొన్నారు. రౌడీషీటర్కు రిమాండ్ శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని మంగువారితోటకు చెందిన రౌడీషీటర్ యలమంచిలి కోటేశ్వరరావు మద్యం మత్తులో పబ్లిక్ న్యూసెన్సు చేసినందుకు కోర్టు 10 రోజుల జైలు శిక్ష విధించిందని ఒకటో పట్టణ ఎస్ఐ తెలిపారు. కోటేశ్వరరావు శనివారం ఉదయం కిన్నెర థియేటర్ వద్ద మద్యం సేవించి ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించాడని, అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చామని పేర్కొన్నారు. -
మార్కులు..మార్పులు!
శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణల్లో భాగంగా ఇంటర్మీడియెట్ విద్యామండలి అధికారులు ఈ ఏడాది నుంచి ఫస్టియర్లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు అమలవుతున్న ఆరు పేపర్ల విధానానికి బదులు ఐదు పేపర్లకు కుదించారు. మ్యాథ్స్, బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీల ప్రశ్నపత్రాల్లో మార్కుల కేటాయింపు, ప్రశ్నపత్రం సైతం మార్పు చేశారు. అయితే ఈ విషయమై విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రిన్సిపాళ్లకు, సీనియర్ లెక్చరర్లకు బోర్డు అధికారులు పరీక్షల పేట్రన్పై అవగాహన కల్పించి మమ అనిపించారని, పరీక్షల తీరుతెన్నులపై విద్యార్థులకు మాత్రం అవగాహన కల్పించలేదని సమాచారం. సెకెండియర్ విద్యార్థులకు మాత్రం వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త పేట్రన్ అమలుచేయనున్నారు. 39,733 మంది విద్యార్థులు.. జిల్లాలో అన్ని యాజమాన్యాల పరిధిలో 39,733 మంది చదువుతున్నారు. వీరిలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 19,825 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 19,908 మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించారు. సర్కారీ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచడానికి ప్రభుత్వం ‘సంకల్ప్’ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అంతర్గత పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా విద్యార్థులను గ్రేడ్లుగా విభిజించి వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఒకే పేపర్గా.. ప్రథమ సంవత్సరం పరీక్షల విధానం, సబ్జెక్టులవారీగా పేపర్లకు మార్కుల కేటాయింపుల్లో కీలక మార్పులు చేశారు. ఎంపీసీ గ్రూపును 500 మార్కులగా నిర్ణయించారు. రాత పరీక్షలకు 470 మార్కులు, ప్రాక్టికల్స్కు 30 మార్కులు (ఫిజిక్స్15, కెమిస్ట్రీ15 చొప్పున) కేటాయిస్తున్నారు,. ● ఇప్పటివరకు మ్యాథ్స్ పరీక్షను రెండు పేపర్లుగా నిర్వహిస్తున్నారు. పేపర్–1ఏకు 75 మార్కులు, పేపర్–2ఏకు 75 మార్కులు కలిపి 150 మార్కులకు పరీక్షలు జరిగేవి. ఇకపై మొదటి సంవత్సరంలో 100 మార్కులకు ఒకటే మ్యాథ్స్ పేపర్ ఉంటుంది. పాస్ మార్కులు 35గా నిర్ణయించారు. ● గతంలో ఫిజిక్స్ 60 మార్కులు, కెమిస్ట్రీ 60 మార్కులకు ప్రశ్నపత్రం ఉండేది. వాటి స్థానంలో ఈ రెండు సబ్జెక్టులు ఒక్కొక్క పేపర్ 85 మార్కులకు మార్పు చేశారు. వీటితో పాటు రెండు లాంగ్వేజి సబ్జెక్టులు ఒక్కొక్కటి వంద మార్కులకు ఉంటుంది. కొత్తగా బయాలజీ పేపర్.. బైపీసీ గ్రూపునకు సంబంధించి 500 మార్కులగా నిర్ణయించారు. ఇందులో రాత పరీక్షలకు 455 మార్కులు, ప్రాక్టికల్స్కు 45 మార్కులు (ఫిజిక్స్ 15, కెమిస్ట్రీ15, బోటనీ, జువాలజీతో కలబోసిన బయాలజీ 15 మార్కులు)గా కేటాయించారు. ● ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ రెండు సబ్జెక్టులు కలిపి 85 మార్కులకు ఒకే ప్రశ్నపత్రం ఇస్తారు. ఇందులో బోటనీకి 43 మార్కులు, జువాలజీకి 42 మార్కులు నిర్దేశించారు. మూల్యాంకనానికి వీలుగా జవాబు పత్రాలు మాత్రం వేర్వేరుగా ఇవ్వనున్నారు. గతంలో బోటనీ 60 మార్కులు, జువాలజీ 60 మార్కులకు ఉండేవి. ● విద్యార్థులు రెండు జవాబు పత్రాల్లో బోటనీ, జువాలజీ ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. బయాలజీలో ఉత్తీర్ణత 29.5 మార్కులుగా నిర్ధారించారు. కానీ అరమార్కు ఉండదు కాబట్టి 29 మార్కులు వస్తే ఉత్తీర్ణత సాధించినట్టు పరిగణిస్తారు. ● 2025–26 విద్యా సంవత్సరంలో నూతన విధానంలో పరీక్షలు రాసిన విద్యార్థులు వచ్చే విద్యా సంవత్సరంలో సెకెండియర్లోనూ ఇలాగే పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో సెకండియర్ పరీక్షలు రాయబోయే విద్యార్థులు మాత్రం పాత విధానంలోనే పరీక్షలు రాస్తారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో పలు సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే ప్రిన్సిపాళ్లకు, లెక్చరర్లకు అవగాహన కల్పించాం. విద్యార్థులకు సైతం అవగాహన కల్పిస్తున్నాం. ఉత్తీర్ణత శాతం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – రేగ సురేష్కుమార్, డీవీఈఓ/ఆర్ఐఓ ఇంటర్మీడియెట్ బోర్డు, శ్రీకాకుళం ఇంటర్ పరీక్షల నిర్వహణలో సమూల మార్పులు ఫస్టియర్ ఎంపీసీ, బైపీసీ పరీక్షల్లో ఐదు పేపర్లే.. విద్యార్థులకు అవగాహన కల్పించడంపై దృష్టి సారించని ప్రభుత్వం -
●ఒత్తిడి తట్టుకోలేక..
ఇచ్ఛాపురం మండలం కేశుపురం పంచాయతీ సన్యాసిపుట్టుగ గ్రామానికి చెందిన మాసుపత్రి శంకర్, లోలమ్మల రెండో కొడుకు మాసుపత్రి విజయ్(21) ఏడు నెలల కిందట తన అన్నయ్య బన్నీతో కలసి అబుదాబి వెళ్లాడు. సోదరులిద్దరూ ఓ కంపెనీలో ఫిట్టర్లుగా పనిచేసేవారు. అక్టోబర్ 22 తెల్లవారుజామున ఆరు గంటలకు విజయ్ తల్లిదండ్రుల తో బాగానే మాట్లాడాడు. తర్వాత ఏమైందో గానీ పెద్ద కొడుకు బిన్నీ తల్లిదండ్రులకు పిడుగులాంటి వార్తను చేరవేశాడు. తమ్ముడు బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడంటూ కన్నీరుమున్నీరుగా విలపించాడు. దీంతో తల్లిదండ్రులు శంకర్, లోలమ్మలు ఉన్నచోటనే కుప్పకూలిపోయారు. వారం రోజుల తర్వాత మృత దేహం స్వగ్రామం చేరుకుంది. సంబంధిత కంపెనీ నుంచి పరిహారమే దక్కలేదు. -
బోధన సామర్థ్యాలు పెంపొందించాలి
కంచిలి: బోధన సామర్థ్యాలు మరింతగా పెంపొందించి, ఉత్తమ ఫలితాల సాధనకు అధ్యాపకులు కృషిచేయాలని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖ అధికారి, ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి ఆర్.సురేష్కుమార్ అన్నారు. ఆయన కంచిలి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు శనివారం విచ్చేశారు. ఈ సందర్భంగా అధ్యాపకుల సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులు పరీక్ష ఫలితాల్లో గత ఏడాది కంటే మెరుగవ్వాలని కళాశాల ప్రిన్సిపాల్ ఉరిటి జగదీష్ కుమార్ నేతృత్వంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆదేశించారు. అంతకన్నా ముందు కళాశాల ఆవరణలో నిర్మించిన ఫిజిక్స్ ల్యాబ్ను ప్రారంభించారు. ప్రిన్సిపాల్ సొంత నిధులతో నిర్మించిన కెమిస్ట్రీ ల్యాబ్ను పరిశీలించారు. విద్యార్థుల పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలను తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం అమ లు తీరును పరిశీలించారు. ఆయనతో పాటు కళాశాల ప్రిన్సి పాల్, అధ్యాపకులు వేణుగోపాల్, దాస్ పాల్గొన్నారు. -
శ్రీకాకుళం
మార్కులు.. మార్పులుఇంటర్ పరీక్ష విధానం మారుతోంది. దీనిపై అవగాహన కరువవుతోంది. –8లోకన్నీటి కథలు తెలుసా..? సారవకోట: మండలంలోని చీడిపూడి కల్యాణ వేంకటేశ్వర స్వామికి శనివారం 25 కిలోల వెన్నతో అలంకరించారు. శ్రీదేవి, భూదేవి సహిత వేంకటేశ్వరస్వామి మూల విరాట్లను ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా అలంకరించినట్లు అర్చకులు రామానుజాచార్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక, విశేష పూజలు, అభిషేకాలు, తులాభారం నిర్వహించారు. శ్రీకాకుళం న్యూకాలనీ: జాతీయ స్థాయి గట్కా(మార్షల్ఆర్ట్స్) స్కూల్ గేమ్స్ పోటీలకు శ్రీకాకుళం జిల్లా నుంచి నలుగురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పంజాబ్లోని లూథియానా వేదికగా ఈ నెల 6 నుంచి 11వ తేదీ వరకు ఆలిండియా స్కూల్గేమ్స్ అండర్–19 బాలబాలికల గట్కా చాంపియన్షిప్ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో శ్రీకాకుళం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఎం.మోహన్ (10వ తరగతి), జి.అగస్థ్యరాం (10వ తరగతి), ఎల్.కీర్తి (8వ తరగతి) ఎంపి కయ్యారు. అలాగే ఇవే పోటీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బృందానికి మేనేజర్గా ఫిజికల్ డైరెక్టర్ నిమ్మక పార్వతి నియామకమయ్యారు. ఈ పోటీల కోసం వీరంతా ఆదివారం ఇక్కడ నుంచి లూథియానా పయనమై వెళ్తున్నారు. నరసన్నపేట: విద్యార్థి దశలో టెన్త్ చాలా కీలకమని, ఈ తరగతి మీ భవిష్యత్కు పునాది వేస్తుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. కంబకాయ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన శనివారం ఆకస్మికంగా పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయులు బమ్మిడి మన్మధరావుతో పాటు ఉపాధ్యాయులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పాగోటి ఉమామహే శ్వరి, విశ్రాంత ఉపాద్యాయులు అప్పలనాయు డు తదితరులు ఉన్నారు. ఇచ్ఛాపురం మండ లం ధర్మపురం గ్రామానికి చెందిన ఉప్పాడ సోమేశ్ (32) ఎనిమిది నెలల కుమార్తె కావ్యశ్రీని విడిచి 2023 అక్టోబర్ నెలలో పోలెండ్ వెళ్లిన కొన్నాళ్లకు అక్కడే అస్వస్థతకు గురయ్యాడు. ఊరు కాని ఊరు, భాష రాని మనుషుల మధ్య ఆస్పత్రిలో నరకయాతన అనుభవించాడు. తన కు చాలా భయంగా ఉందని, తన వద్ద ఎవ్వరూ లేరని, వైద్యం అందడం లేదంటూ భార్యకు వీడియో కాల్ ద్వారా తెలిపాడు. మరుసటి రోజే ఆయన ప్రాణాలు వదిలేశాడు. తన భర్త మృతదేహం స్వగ్రామానికి తెప్పించాలని భార్య అధికారులను బతిమలాడినా స్పందించలేదు. పో లెండ్లోనే దహన సంస్కారాలు పూర్తి చేసి బూడిదను మాత్రం ఇక్కడకు పంపారు. ప్రభుత్వం కూడా ఎలాంటి పరిహారం ఇవ్వలేదు. శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి పారా అథ్లెటిక్స్ ఎంపిక పోటీలను ఈనెల 10వ తేదీన నిర్వహిస్తున్నామని స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేష న్ ఆఫ్ శ్రీకాకుళం ఉపాధ్యక్షుడు ఎన్.గిరిధర్, కార్యదర్శి డి.అచ్యుతరావు, ఎన్.మోహనరావు, కోశాధి కారి ఎన్.స్రవంతి, మజ్జియ్య, రమేష్ పేర్కొన్నారు. ఈ ఎంపిక పోటీలు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడియంలో ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. ఇక్కడ ఎంపికైన పారా అథ్లెట్స్ను త్వరలో జరిగే ఏపీ రాష్ట్ర స్థాయి పారా అథ్లెటిక్స్ పోటీలకు పంపించనున్నట్టు తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన తమ జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్కార్డుతో ఎంపికల కు హాజరుకావాలని, మరిన్ని వివరాలకు 80081 62432, 9177693836 నంబర్లను సంప్రదించాలని వారు కోరారు. -
కేజీబీవీల్లో పోస్టుల భర్తీ కేజీబీవీల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 55 పోస్టులు భర్తీ చేయనున్నారు. –8లో
●ఈ ఏడాది మార్చి 21న పోలెండ్లో పలాస మండలం తర్లకోటకు పంచాయతీకి చెందిన బుడత దామోదర్ ప్రమాదవశాత్తు మృతి చెందాడు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. పోలెండ్ శ్రీకాకుళం తెలుగు సంఘం వారు చందాలు వేసుకుని సాయం చేశారు. ●ఈదుపురం గ్రామానికి చెందిన దల్లి గురుమూర్తి పోలెండ్లో వలస కూలీగా పనిచేస్తూ అనారోగ్యానికి గురయ్యాడు. స్నేహితుల సహాయంతో స్వగ్రామం చేరుకున్న గురుమూర్తి ఈ ఏడాది సెప్టెంబర్ 27న ఇంటి వద్ద మృతి చెందాడు. ●కంచిలి మండలం పురుషోత్తపురం పంచా యతీ గద్దలపాడు గ్రామానికి చెందిన నక్క నరసింహరావు అబుదాబిలోని ఎన్.ఎస్.హెచ్ కంపెనీలో వెల్డర్గా పనిచేస్తున్నా డు. ఈ ఏడాది అక్టోబ ర్ 26న కడుపునొప్పిగా ఉందంటూ చెప్పడంతో తోటి కార్మికులు ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం మొండి చేయి
విదేశాలకు వలస వెళ్లి దురదృష్టవశాత్తు చనిపోతున్న వారికి ప్రభుత్వ సాయం చేయడం లేదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మాదిరి మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నష్ట పరిహారం అందిస్తే బాగుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విదేశాల్లో మృతి చెంది తే మృతదేహం స్వదేశానికి తీసుకురావడానికి అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వం భరించాలని, మృతదేహం రాకపోతే, విదేశాల్లోనే అంత్యక్రియ లు నిర్వహిస్తే ఖర్చు చెల్లించడం, కేంద్ర ప్రభుత్వం ప్రవాస భారతీయ బీమా పథకం(పీబీబీంఐ) కింద ప్రమాద మరణమైతే రూ.10 లక్షలు, సాధారణ మరణం అయితే రూ.5 లక్షలు నుంచి రూ.10 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లించాలని ప్రవాసాంధ్రులు డిమాండ్ చేస్తున్నారు. అంతే కాకుండా ప్రమాదం ఉద్యోగ స్థల నిర్లక్ష్యంతో జరిగితే యజమానిపై కేసు నమోదు చేసి అధిక పరిహారం సాధించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మృతుల కుటుంబాలకు ప్రయోజనకరంగా ఉంటుందని అంటున్నారు. -
వలస.. దశాబ్దాలుగా సిక్కోలు గుండె మోస్తున్న భారమిది. పసి వయసులో ఉన్న బిడ్డ నాన్నా అని పిలిస్తే ఆ మనిషి ఇంటిలో కనిపించడు. అర్ధరాత్రి ఓ నిండు గర్భిణి ఉలిక్కిపడి నిద్ర లేస్తే ధైర్యం చెప్పేందుకు మగడు పక్కన ఉండడు. పండగొచ్చినా, పబ్బమొచ్చినా కన్నపేగుకు వండి పెడదా
కవిటి మండలం బొరివంక గ్రామానికి చెందిన శివ మజ్జి(23) చిన్నతనంలో తండ్రిని పోగొట్టుకున్నాడు. కుటుంబ బాధ్యత ను భుజానికెత్తుకున్నాడు. తల్లి మాట ప్రకారం ఓ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. పెళ్లికి రెండే ళ్లు గడువు పెట్టి స్నేహితుడితో కలసి 2024 మార్చి లో దుబాయ్ వెళ్లాడు. ఆగస్టు 28న కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందినట్లు స్వగ్రామానికి సమాచారం అందడంతో కుటుంబమంతా హతాశుతులయ్యారు. వారం రోజుల తర్వాత మృత దేహం గ్రామానికి చేరుకుంది. నేటికి 16 నెలలు కావస్తున్నా ఆ కంపెనీ నుంచి నయా పైసా తన చేతికి అందలేదని మృతుడి తల్లి ఊర్మిళ మజ్జి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇచ్ఛాపురం మండలం డొంకూరు మత్స్యకార గ్రామానికి చెందిన బడే భాస్కరరావు ఉరఫ్ చంటి(22) ఏడాదిన్నర కిందట జీవనోపాధి కోసం అబుదాబికి వెల్డింగ్ హెల్పర్గా వెళ్లాడు. మీ కుమారుడు చంటి ఆత్మహత్య చేసుకున్నాడంటూ కంపెనీ ఎండీ ఈ ఏడాది నవంబర్ 25న ఫోన్లో సమాచారం అందివ్వడంతో గ్రామం విషాదంలో మునిగిపోయింది. తమ కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఏదైనా ప్రమాదం జరిగి ఉంటుందని తల్లి దండ్రుల ఆవేదన అరణ్య రోదనగా మిగిలింది. అబుదాబి పోలీసులు మరణాన్ని నమోదు చేసి వా రం రోజుల్లో మృతదేహాన్ని డొంకూరు పంపించా రు. కంపెనీ నుంచి ఎలాంటి పరిహారం అందలేదు. -
కంచు, ఇత్తడి పరిశ్రమ అభివృద్ధికి కృషి
సారవకోట: కంచు, ఇత్తడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేయనున్నట్లు డీఆర్డీఏ పీడీ పెద్దింటి కిరణ్ కుమార్ తెలిపారు. శనివారం మండలంలోని బుడి తి గ్రామంలో మన ఊరు మన ఇల్లు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుడితి కంచు, ఇత్తడి పరిశ్రమ ప్రపంచ ప్రసిద్ధి చెందిందని, ఆ పరిశ్రమను జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి చేసేందుకు తగిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. పరిశ్రమల శాఖ, బ్యాంకుల సహకారంతో రుణాలు మంజూరు చేసి వివిధ రకా ల యంత్రాలను ఏర్పాటు చేసి మరింత ఉత్పత్తి పెరిగేందుకు కృషి చేస్తామన్నారు. దీని కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రుణాల గురించి వివరించారు. బుడితితో పాటు నరసన్నపేట మండలంలోని మాకివలస గ్రామంలో ఈ కంచు, ఇత్తడి పరిశ్రమ ఉందని వారికి సైతం తగిన రుణాలు మంజూరు చేసి అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆయనతో పాటు జిల్లా పరిశ్రమల శాఖ ఇన్చార్జి డీఓ పీవీ రఘునాఽథ్, ఆర్జీఈఐటిటి రామ్జి, డీఆర్డీఏ డీపీఎం నారాయణరావు, స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు రామినాయుడు ఉన్నారు. -
తైక్వాండో స్టేట్మీట్ ప్రారంభం
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా కేంద్రంలో ఏపీ రాష్ట్రస్థాయి సబ్–జూనియర్స్ తైక్వాండో కుర్గీ, పూమ్సే చాంపియన్షిప్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. వైఎస్సార్ కల్యాణ మండపంలో జరుగుతున్న రెండు రోజుల టోర్నీలో భాగంగా తొలిరోజు వివిధ జిల్లా నుంచి చేరుకున్న క్రీడాకారులకు వేయింగ్ (బరువు) పూర్తి చేశారు. స్థానికంగా వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు. రెండోరోజు ఆదివారం పోటీలను పూర్తిచేసి, విజేతలకు పతకాలు, బహుమతులు, ప్రసంశాపత్రాలు అందజేయనున్నారు. బరువు పరిశీలిస్తున్న దృశ్యం -
వినూత్నంగా బోధిస్తూ.. విద్యా దీపాలు వెలిగిస్తూ..
● ఉపాధ్యాయ వృత్తిలో రాణిస్తున్న మహిళలు ● అత్యుత్తమంగా బోధన ● నేడు అంతర్జాతీయ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం ఇచ్ఛాపురం రూరల్: తరగతి గదిలో జ్ఞాన దీపాలు వెలిగిస్తూ, సమాజానికి దిశా నిర్దేశం చేస్తున్నారు పలువురు మహిళా ఉపాధ్యాయులు. కేవలం పాఠాలకే పరిమితం కాకుండా విలువలు–వినయం–విజ్ఞానం నేర్పుతూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తల్లిలాంటి స్నేహం, గురువు లాంటి క్రమశిక్షణను విద్యార్థులకు అందిస్తూ పిల్లలను కంటిరెప్పలా కాపాడుకుంటూ వస్తున్న కొంత మంది ఉపాధ్యాయినుల గురించి అంతర్జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. ఇచ్ఛాపురం మండలం ఈదుపురం కండ్రావార్డు ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఈమె పేరు బూరవెల్లి ఉమామహేశ్వరి. తరగతిలో సామాన్య విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠం చెప్పడం ఈమె ప్రత్యేకత. టీఎల్ఎంతో పాటుగా, క్షేత్రస్థాయి పర్యటనలు, ఫ్లో చార్టులు, ప్రోజెక్ట్, బృంద కృత్యాలతో ప్రతి విద్యార్థి అన్నింటిలో భాగమయ్యేలా ప్రోత్సహిస్తుంటారు. నేషనల్ గ్రీన్ కోర్ నోడల్ ఆఫీసర్గా 2023లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు పొందారు. ప్రయోగాలకు పెద్ద పీట వేస్తున్న ఈమెకు కేంద్ర ప్రభుత్వం ‘సారాభాయి టీచర్ సైంటిస్ట్’ అవార్డుతో గౌరవించింది. గత ఏడాది ఆగస్టులో న్యూ ఢిల్లీ ప్రగతి మైదానంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేతులు మీదుగా ఉత్తమ బహుమతి అందుకున్నారు. ఇచ్ఛాపురం పట్టణానికి చెందిన ఊర్మిళా కుమారీ రథోకు చిన్నప్పటి నుంచి క్రీడలంటే ఆసక్తి. ఇచ్ఛాపురం బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడు అథ్లెటిక్స్లో పాల్గొని బహుమతులు సాధించారు. బీపీఈడీ పూర్తిచేసి వ్యాయోమాపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. రాజపురం గర్ల్స్ హైస్కూల్లో తన ప్రస్థానం మొదలు పెట్టిన ఈమె ప్రస్తుతం లొద్దపుట్టి ఉన్నత పాఠశాలలో పీడీగా విధులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు క్రీడలు, యోగా విద్యలో తర్ఫీదు ఇస్తున్నారు. ఇచ్ఛాపురం మండలం బూర్జపాడు ఉన్నత పాఠశాలలో ప్రధానోపాద్యా యురాలిగా పనిచేస్తున్న పి.హేమలత గణితం సులభంగా బోధిస్తుంటా రు. లెక్కలంటే భయపడే విద్యార్థులకు ఆమె పాఠం మొదలు పెడితే తర గతి అంతా నిశ్శబ్ధం అలముకుంటోంది. కష్టతరమైన లెక్కల్ని సైతం అలవోకగా చెబుతుంటారు. మరోవైపు ప్రధానోపాధ్యాయురాలిగా బాధ్యత లు నిర్వర్తిస్తూ బడికి బాసటగా నిలుస్తున్నారు. పదో తరగతి విద్యార్థుల కు పబ్లిక్ పరీక్షల సన్నద్ధతపై స్వయంగా అవగాహన కల్పిస్తున్నారు. -
ఏఎన్ఎంల పదోన్నతులపై ఫిర్యాదు
సారవకోట : జిల్లాలోని వైద్యారోగ్య శాఖ ఏఎన్ఎంల పదోన్నతుల్లో అవకతవకలు జరిగాయని, వాటిపై విచారణ జరపాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ సభ్యులు కోరారు. ఈ మేరకు విజయవాడలో శుక్రవారం ఆ శాఖ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఏఎన్ఎం సీనియారిటీ లిస్టు విడుదల చేయలేదని, పదోన్నతుల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదని, ఆదివాసీలకు ఆరు శాతం రిజర్వేషన్లు కల్పించలేద ని ఆరోపించారు. లక్షలాది రూపాయలు వసూలు చేసి అడ్డగోలుగా మెరిట్ లిస్టు తయారు చేసిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగేశ్వరరావు, జిల్లా అధ్యక్షు డు గురాడి అప్పన్న, మెళియాపుట్టి మండల అధ్యక్షుడు ఎస్.గణేష్ పాల్గొన్నారు. -
బడి బస్సులు భద్రమేనా?
హిరమండలం: జిల్లాలో బడి బస్సుల భద్రతపై అధికారులు పెద్దగా దృష్టి సారించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి విద్యాసంవత్సరంలో సామర్థ్య పరీక్షలు, త్రైమాసిక తనిఖీలు చేపడుతున్నామని చెబుతున్నా ఎక్కడో ఓ చోట ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. ఈ విషయంలో రవాణా శాఖ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి కాలం చెల్లిన బస్సులు, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలకు దిగితేనే ప్రమాదాలు అరికట్టవచ్చని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇదీ పరిస్థితి.. జిల్లాలో 398 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ప్రైవేటు జూనియర్ కాలేజీలు 71, డిగ్రీ కాలేజీలు 85, ఇంజినీరింగ్ కాలేజీలు 3 ఉన్నాయి. వీటికి సంబంధించి 580 బస్సులు ఉన్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభంలో మే నెలలో సామర్థ్యం పరీక్షలు నిర్వహించారు. గతంలో రవాణా శాఖ అధికారులు ఈ ప్రక్రియ చేపట్టేవారు. ఇప్పుడు ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. దీంతో తనిఖీలు నామమాత్రంగా జరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే అదునుగా పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. శ్రీకాకుళం, టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో రవాణా శాఖ అధికారులు బృందాలుగా విడిపోయి పాఠశాల, కాలేజీ బస్సుల్లో ఇటీవల తనిఖీలు చేశారు. చాలా వాటిలో అగ్నిమాపక పరికరాలు లేవు. కొన్నిచోట్ల ఉన్నా పనిచేయట్లేదు. ప్రథమ చికిత్స కిట్లలో మందులు కాలం చెల్లినని ఉన్నుట్ల గుర్తించారు. స్పీడ్ గవర్నెన్స్లోనూ లోపాలు బయటపడ్డాయి. ఇటువంటి లోపాలు బయటపడిన 208 బస్సులకు నోటీసులు జారీచేశారు. మరోవైపు చాలా బస్సుల్లో వయసుకు మించిన వారు, డ్రైవింగ్ లైసెన్స్లు లేని వారు డ్రైవర్లుగా నియమించినట్టు ఆరోపణలున్నాయి. ఇప్పటికై నా జిల్లా యంత్రాంగం దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. ●గత ఏడాది ఫిబ్రవరిలో మందస మండలం ఉమాగిరి సమీపంలో చెరువులో ఓ ప్రైవేటు పాఠశాల బస్సు పడిపోయింది. ఆ సమయంలో ఐదుగురు విద్యార్థులు బస్సులో ఉన్నారు. సమీపంలో ఉన్నవారు హుటాహుటిన చెరువులో దిగి విద్యార్థులను రక్షించారు. స్కూల్ బస్సులకు సంబంధించి యాజమాన్యాలు నిబంధనలు పాటించాలి. ఎప్పటికప్పుడు వాహన సామర్థ్య పరీక్షలు చేసుకోవాలి. ఎటువంటి లోపాలు ఉన్నా సరి చేసుకో వాలి. అనుభవం ఉన్న డ్రైవర్లను నియమించుకోవాలి. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు. – కె.వెంకటేష్ ఇన్చార్జ్ ఎస్ఐ, హిరమండలం పాఠశాల బస్సుల విషయంలో యంత్రాంగం ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఫీజు లు వసూలు చేస్తున్నవారు అందుకు తగ్గట్టు పాఠశాల బస్సుల నిర్వహణ చేపట్టడం లేదు. ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే బస్సు సామర్థ్యంగా ఉండాలి. నిపుణులైన డ్రైవర్ ఉండాలి. ఈ విషయంలో అధికారు లు జాగ్రత్తలు తీసుకోవాలి. – కె.చిన్నారావు విద్యార్థి తండ్రి, ఎల్ఎన్పేట -
రోడ్డు భద్రత అందరి బాధ్యత
శ్రీకాకుళం అర్బన్: రోడ్డు భద్రత మనందరి బాధ్యత అని ఆర్టీవో గంగాధర్ అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఒకటో డిపో గ్యారేజీ ఆవరణలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలన్నారు. జిల్లా రవాణా అధికారి సీహెచ్ అప్పల నారాయణ మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థ పరిరక్షణ మనమంతా కృషి చేద్దామన్నారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోల మేనేజర్లు హనుమంతు అమరసింహుడు, కె.ఆర్.ఎస్.శర్మ, అసిస్టెంట్ మేనేజర్లు పి.సంతోష్కుమార్, ఎ.గంగరాజు, ఎస్ఎం ఎంపీ రావు, అధికారులు ఏఎన్ఎస్ శ్రీనివాస్, ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆదిత్యుని సన్నిధిలో గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ని గుజరాత్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ సునీత అగర్వాల్ కుటుంబసమేతంగా శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మలు పూర్ణకుంభ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. వీరి వెంట జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా తదితరులున్నారు. ఎచ్చెర్ల : రాష్ట్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల సంఘం శ్రీకాకుళం జిల్లా శాఖ క్యాలెండర్ను శుక్రవారం ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో వైస్ చాన్సలర్ కె.ఆర్.రజనీ ఆవిష్కరించారు. ఉన్న త విద్యారంగ అభివృద్ధిలో వర్సిటీతో కలిసి పనిచేయాలని సంఘ ప్రతినిధులకు వీసీ సూచించారు. కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్షుడు కె.చక్రపతి, కార్యదర్శి ఎస్.రామకృష్ణ, ఉపాధ్యక్షుడు ఎస్.ఢిల్లీశ్వరరావు, రాష్ట్ర అకడమిక్ కార్యదర్శి డి.పైడితల్లి, యూనివర్సిటీ కార్యదర్శి బి.మోహనరావు పాల్గొన్నారు. శ్రీకాకుళం: శ్రీకాకుళం కిమ్స్ ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేశారు. గత నెల 28 ఏళ్ల మహిళ కిడ్నీ సంబంధిత వ్యాధితో కిమ్స్ వైద్యులను సంప్రదించింది. ఆమెకు కిడ్నీలు పనిచేయడం లేదని వైద్యు లు గుర్తించారు. ఓ 32 ఏళ్ల మహిళ కిడ్నీని ఇచ్చేందుకు సమ్మతించారు. దీంతో కిమ్స్ వైద్యులు డిసెంబర్ 24న శస్త్రచికిత్స జరిపారు. ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకోవడంతో శనివా రం ఆమెను డిశ్చార్జి చేసేందుకు నిర్ణయించా రు. శస్త్రచికిత్స విజయవంతం కావడంలో వైద్యులు ఉమామహేశ్వర్, మురళి, బి.రమణ, గౌతమి, బాలకష్ణ, మురళీ, ఝాన్సీలక్ష్మి, ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ జోగినాయుడు కీలక పాత్ర పోషించారు. వీరిని కిమ్స్ చైర్మన్ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు, డాక్టర్ గూడెన సోమేశ్వరరావు శుక్రవారం అభినందించారు. శ్రీకాకుళం రూరల్: అరసవల్లి రథసప్తమి ఉత్సవాలను ఈ ఏడాది వారం రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ వెల్లడించారు. శుక్రవారం సింగుపురం పంచాయతీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రథసప్తమి ఈ నెల 25 కాగా.. 19 నుంచి వారం రోజుల పాటు ఉత్సవాలను ప్రణాళికాబద్ధగా నిర్వహిస్తామ న్నారు. శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో వైద్యం కోసం ఎవరూ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఇటీవల వైద్యం కోసం రిమ్స్ ఆస్పత్రి లో చేరిన వారిని డబ్బులు డిమాండ్ చేసిన విషయం తన దృష్టికి వచ్చిందని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. సింగుపురంలో ని నర్సింగ్ వైద్య కళాశాల ఫిబ్రవరి మొదటి వా రంలో ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పి.ఎం.జె.బాబు, సర్పంచ్ ఆదిత్యనాయుడు పాల్గొన్నారు. తెలుగు మహాసభలకు శరత్బాబు శ్రీకాకుళం కల్చరల్ : గుంటూరులో కరుణశ్రీ, జాషువా సాహితీ వేదికపై ఈ నెల మూడో తేదీ నుంచి జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభల కవి సమ్మేళనం సహ సమన్వయకర్తగా శ్రీకాకుళం రచయిత, విశ్వసాహితీ కళావేదిక సంస్థ ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రతినిధి జంధ్యాల శరత్బాబు నియమితులయ్యారు. గజల్ శ్రీనివాస్ నేతృత్వంలో తెలుగు తోరణం ప్రదర్శన, గ్రంథాల ఆవిష్కరణ తదితర కార్యక్రమాలు ఉంటాయని శరత్బాబు శుక్రవారం తెలిపారు. -
మృదంగ తరంగం
● రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటిన కుర్రాడు కంచిలి: డ్రమ్స్ అంటూ జాక్బాక్స్ అంటూ పాశ్చాత్య శైలికి బాగా ఆకర్షితులమవుతున్న రోజు ల్లో ఓ పదో తరగతి విద్యార్థి మృదంగం ధ్వనిని ఇష్టపడుతున్నాడు. తాత, తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన సంగీతాన్ని బతికించేందుకు మృదంగం వాయించడం నేర్చుకున్నాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటి కళకు కాపలా ఉంటానని ప్రకటించాడు. కంచిలి మండలం జాడుపూడి గ్రామానికి చెందిన బొయిరిశెట్టి గౌతమ్ మృదంగ విద్యలో నిష్ణాతుడవుతున్నాడు. కొద్దినెలల క్రితం విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి కళా ఉత్సవ పోటీ ల్లో సత్తా చాటాడు. ఆమదాలవలసకు చెందిన మావుడూరు సూర్యప్రసాద్ శర్మ ఆశీస్సులతో శ్రీ మహతి సాంస్కృతిక కళాసేవా సంస్థ ప్రచార కార్య దర్శి, ప్రముఖ మృదంగ వి ద్వాంసుడు చలపరాయి వినో ద్ కుమార్ శిష్యరికంలో గౌతమ్ రాటుదేలుతున్నాడు. కుటుంబ నేపథ్యం.. గౌతమ్ తాత ఒడిశా పరిధి గుడ్డిపద్ద గ్రామానికి చెందిన ధవలశెట్టి కూర్మారావు గాత్ర కళాకారుడు. తండ్రి మోహనరావు హార్మోనియం వాయిస్తారు. తల్లి జీవేశ్వరి గృహిణి. ప్రస్తుతం తండ్రి మోహనరావు బయటి దేశానికి ఉపాధి కోసం వెళ్లారు. సంగీతంపై ఆసక్తి ఉండడంతో గౌతమ్ను చిన్నప్పుడే చలపరాయి వినోద్కుమార్ వద్ద చేర్పించారు. అక్కడి నుంచి రాష్ట్ర స్థాయి పోటీల వరకు ఎదిగాడు. ఇటీవల స్వగ్రామం జాడుపూడిలోను, ఆర్.బెలగాం పాఠశాలలో గౌతమ్ను సత్కరించారు. -
104 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): భవ్య యాజమాన్యం 104 ఉద్యోగులకు తీవ్రమైన అన్యాయం చేస్తోందని సీఐటీయూ నాయకులు(యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్) మురళి, 104 ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎం.గోవర్ధనరావు మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో అనుబంధ సంఘాల అఖిలపక్ష సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిసెంబర్ 19 నుంచి నిరసన కార్యక్రమాలు చేస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. జిల్లా అధ్యక్షుడు చల్ల నారాయణ మాట్లాడు తూ క్యాజువల్ లీవ్లు పునరుద్ధరించాలని, ప్రభు త్వ సెలవులు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.రామారావు మాట్లాడుతూ బఫర్ సిబ్బందిని తిరిగి నియమించి ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ దాసరి మహేష్, సీఐటీయూ నాయకులు సాయి ప్రకాష్, అంగన్వాడీ నాయకురాలు కళ్యాణి, ఆశ వర్కర్లు యూనియన్ నాయకులు నాగమణి, 108 ప్రెసిడెంట్ విజయమోహన్, సీతారాం రాజు, డివిజన్ నాయకులు కూర్మారావు, మహేష్ కిరణ్, బాలకృష్ణ పాల్గొన్నారు. -
6 నుంచి కార్గో ఎయిర్ పోర్టు కోసం భూ సర్వేలు
మందస: కార్గో ఎయిర్పోర్టు నిర్మాణం కోసం ఈ నెల 6 నుంచి విజయవాడ రైట్ సంస్థ వారు భూ సర్వేలు (సాయిల్ టెస్ట్) చేస్తారని, అలాగే ఎన్హెచ్–16 రోడ్డుకు ఎంత దూరంగా ఉందో ఆర్అండ్బీ శాఖ కూడా సర్వే చేస్తారని కార్గో ఎయిర్ పోర్టు లీగల్ అడ్వైజర్ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. ఆయన శుక్రవారం మందస తహసీల్దార్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కార్గో ఎయిర్ పోర్టు బాధిత రైతులకు ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా ఒక ఎకరాకు 20 సెంట్లు భూమి ఇస్తారని, ప్రతి కుటుంబంలోని చదువుకున్న యువతకు వారి క్వాలిఫికేషన్ ప్రకారం ఉద్యోగ కల్పన జరుగుతుందని, లేదంటే కుటుంబానికి ప్యాకేజీ రూపంలో చెల్లింపులు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్వరరావు, ఆర్ఎంఓ మిస్క శ్రీకాంత్, డీటీ వై.రామకృష్ణ, ఎంఈఓ లక్ష్మణరావు, మండల సర్వేయర్ బాబురావు అధికారులు పాల్గొన్నారు. సైనికుడికి ఘన స్వాగతం రణస్థలం: భారత సైన్యంలో ముప్పై ఏళ్లు పని చేసి ఉద్యోగ విరమణ పొందిన సుబేదార్ ఆళ్ల అప్పన్న రెడ్డికి స్వగ్రామం నారువ వాసులు ఘనంగా స్వాగతం పలికారు. ఆ గ్రామ యువత సుమారు వంద బైక్లు, పదుల సంఖ్యలో కార్లతో పైడిభీమవరం నుంచి నారువ గ్రామం వరకు భారీ ఊరేగింపుగా జాతీయ జెండాలు చేతబూని జై భారత్, జై సైనికా నినాదాలతో తీసుకువచ్చారు. మహిళలందరూ హారతులు పట్టి స్వాగతం పలికారు. 1995 డిసెంబర్ 30న సైనికుడిగా విధుల్లో చేరిన అప్పన్న, 2025 డిసెంబర్ 31 ఉద్యోగ విరమణ పొందారు. 4న క్రికెట్ నెట్స్ ప్రారంభం శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళంలో క్రికెట్ అబివృద్ధి కోసం సహకరించాలని జిల్లా క్రికెట్ సంఘం మెంటార్ ఇలియాస్ మహ్మద్ విన్నవించారు. ఈ మేరకు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ను అతని క్యాంపు కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో నూతనంగా ఏర్పాటు చేసిన క్రికెట్ నెట్స్ను ఈ నెల 4న ఎమ్మెల్యే, అధికారులు, జిల్లా క్రికెట్ సంఘం ముఖ్య ప్రతినిధుల సమక్షంలో ప్రారంభించాలని నిర్ణయించినట్టు ఇలియాస్ చెప్పారు. ఎరువుల కొరత ఉండకూడదు: కలెక్టర్ శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో ఎరువుల కొరత ఉండకూడదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వ్యవసాయ శాఖ జేడీ త్రినాథ స్వా మి, ఇతర అధికారులకు సూచించారు. ఆయన శుక్రవారం సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. రైతుల అవసరాలకు తగ్గట్టుగా ఎరువులను అందుబాటులో ఉంచాలని, పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని వ్యవసాయ సహాయకులకు దిశానిర్దేశం చేశారు. రైల్వే గేట్ల తొలగింపునకు అవసరమైన కసరత్తు ప్రారంభించాలని ఆదేశించారు. అంతకుముందు ఆయన కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు రైల్వే గేట్ల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సూచించారు. రైల్వే బోర్డు నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రంలోని అన్ని రైల్వే గేట్ల స్థానంలో రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, అండర్ బ్రిడ్జిల నిర్మాణానికి రైల్వే శాఖతో కలిసి సంయుక్త కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఫిబ్రవరి 10లోగా ‘యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే’ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టమైన గడువు విధించారు. -
రిమ్స్లో కొనసాగుతున్న నిరసన
శ్రీకాకుళం: శ్రీకాకుళం రిమ్స్లో సెక్యూరిటీ గార్డులు, పారిశుద్ధ్య కార్మికులకు జీవో ప్రకారం జీతాలు చెల్లించాలంటూ శుక్రవారం కూడా నిరసనలు కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం చట్టవిరుద్ధమన్నారు. చట్టాలను ఉల్లంఘిస్తూ కార్మికులను వేధిస్తున్న శ్రీ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్, క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ లిమిటెడ్ యాజమాన్యాలపై ప్రభుత్వం సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారు లు, ప్రజాప్రతినిధులు తక్షణమే జోక్యం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి బగాది శ్రీనివాసరావు, పారిశుద్ద్య కార్మికుల ప్రధాన కార్యదర్శి దమ్ము చిన్నారావు, సాదు శ్రీనివాస్, దమ్ము వామనరావు, తంగి ప్రభ, కొర్లకోట విజయ, దువ్వి జయప్రద, మిర్తిపాటి మోహన్, చంద్రకళ, కొప్పల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
చెత్త పేరుకుపోతుంటే ఏం చేస్తున్నారు?
● ఎంపీడీఓపై జెడ్పీ సీఈఓ ఆగ్రహం శ్రీకాకుళం రూరల్: ిసంగుపురం రహదారిపై నిత్యం దుర్వాసన వస్తోందని, ప్రధాన రహదారిపై ఎక్కడికక్కడే చెత్తచెదారాలు కుప్పలుగా పేరుకుపోయినా పంచాయతీ అధికారులు, సిబ్బంది ఏం చేస్తున్నా రని జెడ్సీ సీఈఓ సత్యనారాయణ శ్రీకాకుళం ఎంపీడీఓ ప్రకాశరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆ ప్రాంతం మీదుగా ప్రయాణిస్తున్న సీఈఓ వాహనం ఆపి పరిశీలించారు. జాతీయ రహదారిపై నిత్యం ఇదే దారిలో అధికారులు, ప్రజాప్రతినిధులు రాకపోకలు సాగిస్తుంటారని, ఇలా ఎక్కడికక్కడే చెత్తచెదారాలు పారబోస్తుంటే మీరంతా ఏం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాన రహదారి పరిస్థితే ఇలా ఉంటే గ్రామ వీధుల్లో పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని అసహనం వ్యక్తం చేశారు. -
భూముల రీసర్వేతో రైతులకు లబ్ధి
గార: భూముల రీసర్వే 4.0తో రైతులకు లబ్ధి చేకూ రుతుందని కేంద్ర పౌరవిమానాయన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహననాయుడు అన్నారు. గార మండలం అంపోలు పంచాయతీలో సర్పంచ్ గొండు జయరాం అధ్యక్షతన భూమి రీసర్వే 4.0ను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్లతో కలిసి ప్రారంభించారు. ముందుగా గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించి గ్రామస భ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ వారం రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ చేపట్టిందన్నారు. అనంతరం అంపోలు పంచాయతీలో డ్రోన్ ద్వారా తీసిన సర్వే మ్యాపును తహశీల్దార్ మునగవలస చక్రవర్తి చూపించి వివరాలు తెలియజేశారు. స్థానిక అగస్త్యేశ్వర చేనేత సహకార సంఘాన్ని సందర్శించిన కేంద్రమంత్రికి చేనేత కార్మికులు సమస్యలు వివరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ కె.సాయిప్రత్యూష, ఎంపీడీఓ సురవజ్జల శ్రీనివాసులు, డిప్యూటీ ఎంపీడీఓలు కేవీవీ జగన్నాథం, ఆర్.సత్యనారాయణ ఎంపీటీసీలు గొండు అచ్యుతరావు, పొదిలాపు రామజోగి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ కార్యకర్తపై టీడీపీ వర్గీయుల దాడి
● లావేరు మండలం వేణుగోపాలపురంలో ఘటన రణస్థలం: లావేరు మండలంలోని గుమడాం పంచాయతీలో గల వేణుగోపాలపురం (ఆగ్రహారం) లో వైఎస్సార్ పీపీ కార్యకర్తపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. బాధితుడు మీసాల రామప్పడు పోలీ సులకు తెలిపిన వివరాలు ప్రకారం.. రామప్పడు శుక్రవారం ఉదయం ఇంటికి వెళ్లే సమయంలో అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులైన ఇజ్జురోతు సూర్యారావు, ఆశ వర్కర్ భూలక్ష్మి ఆయనను పిలి చారు. దుర్భాషలాడుతూ మీద మీదకు వచ్చారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఇజ్జురోతు బ్రహ్మాజీ రాయితో ముఖంపై బలంగా కొట్టాడు. దీంతో చుట్టుపక్కల వారు చూసి రక్తపు మడుగులో ఉన్న రామప్పడును రణస్థలం సీహెచ్సీకి తరలించారు. అక్కడకు లావేరు ఏఎస్ఐ ఎస్.ప్రసాదరావు వచ్చి వాంగ్మూలం సేకరించారు. ఈ ఘటనలో నిందితు డు ఇజ్జురోతు బ్రహ్మాజీ కూడా పోలీసులకు ఫిర్యా దు చేశారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని లావేరు ఎస్ఐ కె.అప్పలసూరి తెలిపారు. గొడవకు దారి తీసిన కారణాలివే.. ఇజ్జురోతు బ్రహ్మాజీకి సంబంధించి ఒక భూమి వివాదంలో ఉంది. ఆ వివాదం వైఎస్సార్ సీపీ సర్పంచ్ ప్రతినిధి దుర్గాశి ధర్మారావు క్లియర్ చేశారు. దీంతో బ్రహ్మాజీ సర్పంచ్పై కక్ష పెంచుకున్నాడు. ఈ విషయాన్ని మీసాల రామప్పడు సర్పంచ్ ధర్మారావుకు చేరవేశారు. మూడు రోజుల కిందట ఎందుకిలా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నావని గ్రామపెద్దలు, సర్పంచ్ ధర్మారావు బ్రహ్మాజీని మందలించారు. తాను తిడుతున్న విషయం సర్పంచ్కు రామప్పడు చేరవేశాడనే అక్కసుతో అతనిపై దాడికి పాల్పడినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. -
ఇంట్రస్ట్ ఉందా.. లేదా..?
● అరసవల్లిలో ట్రస్ట్ బోర్డు నియామకాలెప్పుడో..? ● గడువు ముగిసి 120 రోజులు దాటినప్పటికీ కానరాని ఆదేశాలు అరసవల్లి: అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయానికి పాలకమండలి సభ్యుల నియామకానికి ఇంకా గ్రహణం వీడలేదు. రాష్ట్రంలో ప్రముఖ ఆలయాలన్నింటికీ ట్రస్ట్ బోర్డులను నియమించేలా ఆదేశించిన ప్రభుత్వం అరసవల్లి ఆలయ విషయంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తోంది. కూటమి రాజకీయాల నడుమ స్థానిక ఎమ్మెల్యే మంత్రుల చొరవతో ఇంకా ఈ ట్రస్ట్ బోర్డు నియామకాలకు లెక్కలు తేలలేదని తాజా పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ట్రస్ట్ బోర్డు నోటిఫికేషన్ విడుదలై దరఖాస్తుల గడువు కూడా ముగిసి వందరోజులు దాటినప్పటికీ.. ఇంతవరకు పాలకమండలి సభ్యుల నియామకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రీన్సిగ్నల్ రాలేదు. ఈ నియామకాల ఉత్తర్వులు ఎప్పుడెప్పుడొస్తాయో అని తెలుగు తమ్ముళ్లతో పాటు జనసేన, బీజేపీ కీలక కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. ‘ట్రస్ట్’ రికార్డు లేని టీడీపీ టీడీపీ గతంలో రాష్ట్రంలో పలుమార్లు అధికారం చేపట్టినప్పటికీ అరసవల్లి ఆలయానికి ట్రస్ట్ బోర్డు నోటిఫికేషన్తో పాటు నియామకాలను చేపట్టడం విషయంలో ఎప్పుడూ వెనుకడుగే కనిపించింది. గత రికార్డులను పరిశీలిస్తే అప్పట్లో ఎన్టీఆర్, చంద్రబాబు సీఎంలుగా ఉన్నప్పుడు కూడా ఎన్నడూ ఈ ఆలయానికి ట్రస్ట్ బోర్డును నియమించలేదు. అలా గే గత 2014–19లోనూ, స్థానికంగా ట్రస్ట్ బోర్డు నియామకానికి చెందిన నోటిఫికేషన్ను తొలిసారిగా వేసినప్పటికీ నియామకాలు లేకుండా కాలం గడిపేశారు. అయితే తాజాగా కూటమి ప్రభుత్వంలో కూడా గత ఏడాది ఆగస్టు 7న నియామకాలకు చెందిన నోటిఫికేషన్ను విడుదల చేసింది. అయితే నిబంధనల ప్రకారం అదే నెలాఖరు వరకు దరఖాస్తులకు గడువు ఇవ్వగా.. సుమారు 83 మంది దరఖాస్తు చేసుకున్నట్లుగా సమాచారం. అయితే గడువు ముగిసి కూడా 120 రోజులు దాటినప్పటికీ ఇంతవరకు స్థానిక టీడీపీ పెద్దలు దీనిపై ఎలాంటి దృష్టి సారించలేదు. ఫలితంగా ఈ నెల 25న జరుగనున్న రథసప్తమి మహోత్సవాల్లో కొత్త ట్రస్ట్ బోర్డు కళ లేకుండా ఉండనుందని తెలుస్తోంది. రథసప్తమిని రాష్ట్ర పండుగగా ఈనెల 19 నుంచి ఏడు రోజుల పాటు నిర్వహించేలా మంత్రి అచ్చెన్నా యుడు ప్రకటించిన నేపథ్యంలో పాలకమండలి నోటిఫికేషన్ వేసినప్పటికీ నియమించని పరిస్థితి నెలకొంది. తమ్ముళ్ల ఎదురుచూపులు జిల్లాలో అతిపెద్ద ఆలయంగా శ్రీ సూర్యనారాయణ స్వామిఆలయం డిప్యూటీ కమిషనర్ స్థాయిలో ఉంది. అయితే జిల్లాలో శ్రీకూర్మం, శ్రీముఖలింగం, కోటబొమ్మాళి, రావివలస తదితర ఆలయాలతో పాటు గ్రేడ్–1, 2 ఆలయాల్లో కూడా చాలావరకు ట్రస్ట్ బోర్డు నియామకాలను చేపట్టారు. కీలకమైన అరసవల్లి ట్రస్ట్ బోర్డు నియామకాలు మాత్రం జరగకపోవడంపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నగర పార్టీ, వివిధ విభాగాల్లో తెలుగు తమ్ముళ్ల నియామకాలను పూర్తిచేసిన ప్రభుత్వం, అఽధికార పార్టీ పెద్దలు, అరసవల్లిలో నియామకాలకు సంబంధించి చర్యలు చేపట్టకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర పండుగగా రథసప్తమిలోగానే ఈ నియామకాలు జరిగితే తమ గౌరవంతో పాటు ఆలయ అభివృద్ధికి కూడా మార్గం సుగమం అవుతుందని పలువురు నేతలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. -
మాట వంకరం తీరు సంకరం
● కార్పొరేషన్లో బూతు పంచాంగంపై అంతర్మఽథనం ● ఉద్యోగులకు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న నియోజకవర్గ కీలకనేత ● ప్రతి ఫైల్ తన అనుమతితోనే కదలాలని ఆదేశం ● మాట వినని అధికారులపై పరుష పదజాలంతో దూషణ ● కీలక నేత తీరుపై గుర్రుగా ఉన్న ఉద్యోగులు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘ఆయనకెవరైనా చెప్పండి’.. అంటూ కార్పొరేషన్ ఉద్యోగులు మొత్తుకుంటున్నారు. అధికార అహంభావంతో నోటికొచ్చిన మాట విసిరేస్తున్న కీలక నేత వైఖరిపై వారు విసుగెత్తిపోతున్నారు. జిల్లా కేంద్రంలో అధికార పార్టీకి చెందిన నియోజకవర్గ కీలక నేత ‘సొంత నిర్ణయాలు వద్దు.. చెప్పిన చోట సంతకాలు చేయాలి.. లేదంటే విధులు నుంచి తప్పుకోవాలి’ అంటూ అధికార దర్పం ప్రదర్శిస్తున్నారు. నోటికేది వస్తే అదే మాటలాడుతున్నారు. ఆయనకు నచ్చకుండా ఏదైనా చేసినట్లు తెలిసినా, ఆయన దృష్టిలో లేకుండా ఏ పనైనా చేసినా, తన అనుచరులు చెప్పినా నోటికొచ్చినట్లు చెప్పలేని భాషలో బూతుపురాణం మొదలెట్టి చివరికి ఉద్యోగం చేయాలంటే ఉండండి లేకుంటే వెళ్లిపోండని సీరియస్గా హెచ్చరికలు జారీ చేసేస్తున్నారు. దీంతో శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్లో అధికారులు ఎప్పుడు అవకాశం వస్తే వేరే చోటకు వెళ్లిపోదామా అని చూస్తున్నారు. ● కొన్ని నెలల కిందట శ్రీకాకుళం నగరం పీఎన్కాలనీకి చెందిన ఓ సీనియర్ మున్సిపల్ ఇంజినీర్ (ఎమ్ఈ) కీలక నేత ఒత్తిడికి కొన్నాళ్లు సెలవు పెట్టి ఆ తర్వాత విశాఖపట్నంకు బదిలీపై వెళ్లిపోయారు. ● గత ఏడాది జూన్లో జరిగిన యోగాంధ్ర కార్యక్రమం సమయంలో పలుచోట్ల టాయిలెట్స్తో పాటు సౌకర్యాలు కల్పించడం చేతకాలేదని మున్సిపల్ అధికారులను ఉద్దేశించి ‘మీరు తాగుబోతులు.. తాగి పడుకోండి.. నీలాంటోడికి ఉద్యోగం ఎందుకు’ అంటూ చెప్పలేని భాషలో తిట్టడంతో ఎవరికీ చెప్పుకోలేక ఉండలేక మిన్నకుండిపోయారు. ● ఇంజినీరింగ్ విభాగంలో సచివాలయం ఇంజినీర్లతో పాటు ఏఈలు, డీఈలు, ఎమ్ఈ, కాంట్రాక్టర్లకు సైతం నోటికొచ్చినట్లు తిడుతున్నారని గగ్గోలు పెడుతున్నారు. ఆ నాయకుడు కార్పొరేషన్ కార్యాలయానికి రెండురోజులకోసారి వచ్చి రాత్రి 11 గంటల వరకు ఉద్యోగుల్ని టార్చర్ చేస్తున్నారని గొల్లుమంటున్నారు. అంతా తానై.. కార్పోరేషన్లో ఎవరికి ఏ వర్క్ ఇవ్వాలి, ఆ కాంట్రాక్టర్ ఎవరై ఉండాలి ఇలా అంతా ఆయనే నిర్దేశిస్తున్నారు. కార్పోరేషన్లో చీమ కదలడానికై నా తన అనుమతి ఉండాలన్న హుకుం జారీచేస్తున్నా రు. నియోజకవర్గ కీలక నేతకు కోటరీగా ఉన్న నాయకులకే అన్నీ జరిగేలా చూసుకుంటున్నారు. శ్రీకాకుళం కార్పొరేషన్లో వర్కుల కాంట్రాక్టుల కేటాయింపులో వివక్ష చూపిస్తూ తన వాళ్ల జేబులు నింపే పనిలో పడ్డారు. అందులోంచి తనకు రావాల్సిన వాటా కోసం ఆరాటపడుతున్నారు. గత కొంత కాలంగా కార్పొరేషన్లో మంజూరైన పనులు, వాటి కాంట్రాక్టు దక్కించుకున్నవారి జాబితా చూస్తే కీలక నేత పచ్చపాతం ఏంటో తెలుస్తోంది. పనులు కేటాయింపులే కాకుండా ఆ పనుల బిల్లులు చెల్లింపు విషయంలో కూడా తన మార్క్ కనబడాలని చెప్పినట్టు జరగాలని అజమాయిషీ చేస్తున్నారు. ఇప్పటివరకు కార్పొరేషన్లో జరిగిన చెల్లింపులను పరిశీలిస్తే జరుగుతున్న తంతు కళ్లకు కట్టినట్టు కనబడుతుంది. తన అభిరుచుల మేరకు తన ఆలోచనల మేరకు తన అభిప్రాయం ప్రకారం తన ఆదేశాలకు అనుగుణంగా నడుచుకునే అధికారులే ఉండాలని దర్పం ప్రదర్శిస్తున్నారు. ఎవరైనా మాట వినకపోయినా, చెప్పినట్టు జరగకపోయినా సంబంధిత అధికారులపై ఒంటి కాలిపై లేచి నోటికి పనిచెబుతున్నారు. ఆ సమీక్షల పేరిట నిర్వహించిన సమావేశాల్లో సహనం కోల్పోయి విచక్షణారహితంగా మాట్లాడుతున్నారు. బెదిరించే ధోరణితో మాట్లాడి ఉద్యోగుల వ్యక్తిత్వాన్ని హననం చేసేలా వ్యవహరిస్తున్నారు. ఆ దూషణలు, బూతుపురాణం వినలేక చెప్పినట్టే చేసుకుపోతున్నారు. ఆత్మగౌరవంతో పనిచేయాలనుకున్నవారు ఇక్కడ నుంచి వెళ్లిపోవడానికి సిద్ధమవుతున్నారు. మానసిక క్షోభలో కూడా కొందరు ఉద్యోగులు తప్పని పరిస్థితిలో పనిచేస్తున్నారు. -
వినరో భాగ్యము
● శ్రీకూర్మ క్షేత్రంలో 44 ఏళ్లుగా గోదాగోష్టి ● ధనుర్మాస వేళ శ్రీకూర్మనాథాలయంలో ప్రత్యేక ఉత్సవం గార: పవిత్ర శ్రీకూర్మ క్షేత్రంలో 44 ఏళ్లుగా ఆండాల్ గోదాగోష్టి పేరిట గ్రామ సంకీర్తన కొనసాగుతోంది. గోదా దేవి శ్రీకృష్ణుని పొందే విధానాన్ని వివరిస్తూ శ్రీకృష్ణుని చిత్రపటాన్ని పట్టుకొని శ్రీకూర్మనాథాలయ తిరువీధుల్లో ధనుర్మాస వేకువల్లో సంకీర్తన జరుపుతున్నారు. తొలుత శ్రీభాష్యం తిరువేంగలమ్మ, శ్రీభాష్యం అనంత లక్ష్మమ్మ ప్రారంభించగా, 20 ఏళ్లుగా తిరుమల పెద్దింటి సుశీలరాణి ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. శ్రీకృష్ణుని లీలలు వివరించే గీతాలను మహిళలు ఆలపిస్తారు. ఇంటి వద్ద భక్తులు మేలుకొలుపు వద్ద ఉన్న స్వామి చిత్రపటానికి హారతినివ్వడంతో పాటు దక్షిణలు సమ ర్పిస్తారు. ఇలా వచ్చిన డబ్బులతో గోదాదేవి కల్యా ణం రోజున మంగళసూత్రం, ప్రసాదాలను శ్రీకూర్మనాథాలయానికి అందించి ఆశీర్వాదాలు తీసుకుంటారు. ప్రతి రోజూ 5 గంటల తర్వాత శ్రీకూర్మనాథాలయంలో తిరుప్పావై ప్రవచనాల ముందుగా జరిగే బేడా సేవలో మహిళలతో పాటు భక్తులు పా ల్గొంటారు. ఆలయ ప్రధానార్చకులు సీహెచ్ సీతారామనృసింహాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు పల్లకిలో గోదాదేవి మూర్తితో పాటు సుదర్శన ఆళ్వా ర్ మూర్తులను ఎదురెదుగా ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ప్రధాన గోపురం చుట్టూ ఉన్న బేడా మంటపంలో బేడా సేవ నిర్వహించి శ్రీకూర్మనాయకి సన్నిధిలో తిరుప్పావై పఠనం నిర్వహిస్తారు. -
రెక్కాడితేనే.. డొక్క నిండేది!
కుటుంబంతో కలిసి ఇచ్ఛాపురం, కంచిలి, సోంపేట, కవిటి ప్రాంతాలకు వచ్చి దాదాపు 20 ఏళ్లు కావొస్తోంది. మేము తయారు చేసిన పనిముట్లు ఎవరైనా కొంటేనే మా పొట్ట నిండేది. రోజంతా పనిచేస్తే వచ్చేది చాలా తక్కు వ. వేరే పనులు చేయలేక ఈ పనితోనే నెట్టుకొస్తున్నాం. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి – ఛత్రసింగ్, ఇచ్ఛాపురం కొలిమి పనులు చేసేటప్పు డు, సమ్మెట దెబ్బ వేసేటప్పుడు ఎంతో కష్టంగా ఉంటుంది. అయినా తప్పడం లేదు. చేసిన పని ము ట్లు అమ్ముతాం. ఒక్కోసారి డబ్బులు సరిగా రా వు. అయినా పొట్ట కూటి కోసం తిప్పలు పడుతున్నాం. – నరేంద్ర సింగ్, ఇచ్ఛాపురం ఇచ్ఛాపురం రూరల్ : ప్రదేశం ఎక్కడైనా కష్టపడే తత్వం వారి సొంతం. కొలిమి వృత్తిని నమ్ముకుంటూ పుట్టిన ఊరును వదిలి బతుకుదెరువు కోసం వలస బాటపట్టారు. రెక్కల కష్టమే బతుకుదెరువుగా మార్చుకున్నారు. ఇంటిల్లపాదీ పొద్దంతా పనిచేసి కడుపు నింపుకుంటున్నారు. రోడ్ల వెంట గుడారాలు వేసుకొని, మండుతున్న కొలిమిలో ఇనుము కాలుస్తూ, సమ్మెట దెబ్బలు వేస్తూ చిన్నచిన్న పనిముట్లు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారు. మధ్యప్రదేశ్కు చెందిన పలువురు కొన్నేళ్ల క్రితం జిల్లాకు వచ్చి గ్రామాల్లో సంచరిస్తూ కొలిమి పనులు చేస్తూ ఇక్కడే నివాసముంటున్నారు. అందరూ కష్టపడితేనే.. పనిముట్లు తయారు చేసే క్రమంలో పురుషులు ఇనుమును కొలిమిలో కాల్చి బయటకు తీసినప్పుడు మహిళలు సమ్మెట దెబ్బలు వేయల్సి వస్తుంది. బరువైన పెద్ద సుత్తితో వారు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. కానీ బతుకుదెరువు కోసం తప్పని పరిస్థితి. కొలిమి పనుల్లో వచ్చే పొగ, సెగతో ఆరోగ్యం క్షీణించిపోతోంది. ఎండైనా..వానైనా.. కొలిమి పనులు చేస్తూ పొట్ట పోసుకుంటున్న కార్మికుల భవితాలు దుర్భరంగా మారాయి. వారికి చిన్నచిన్న గుడారాలే ఇళ్లు. ఎండైనా, వానైనా కుటుంబం అంతా వాటిలో ఉండాల్సిందే. రోడ్డు పక్కనే జీవనం, కనీస సదుపాయాలు కరువయ్యాయి. ప్రస్తు తం చలి తీవ్రతతో ఇబ్బందులు పడుతున్నారు. వారి పిల్లల చదువులు, ఆరోగ్యం అంతంత మాత్ర మే. ఊరుకాని ఊరు వచ్చి వారు అనేక కష్టాల నడు మ జీవనం సాగిస్తున్నామని, పాలకులు, ప్రభు త్వం ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. -
అధికారుల నిర్లక్ష్యం.. పేద కుటుంబానికి శాపం!
హిరమండలం: సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని కూటమి ప్రభుత్వం ఆర్భాటం చేస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి విరుద్ధంగా ఉంది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం అమలుచేసినట్టు కూటమి ప్రభుత్వం చెప్పింది. కానీ హిరమండలం మండలంలో నిరుపేద కుటుంబంలో ముగ్గురు పిల్లలకు ఈ పథకం వర్తించలేదు. దీంతో ఆ కుటుంబం కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది. అయినా కనికరించేవారు కరువయ్యారు. జగన్నాథపురంలో లిమ్మక పెంటయ్య, ఈశ్వరి దంపతులకు ముగ్గురు పిల్లలు. వీరంతా వంశధార నిర్వాసితులు. నిరుపేదలు కావడంతో పూరిగుడిసెలో నివాసముంటున్నా రు. ముగ్గురు పిల్లలూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. కనీసం వీరికి విద్యుత్ మీటరు కూడా లేదు. కానీ ఏకంగా ఏడు మీటర్లు ఉన్నట్టు చూపడంతో తల్లికి వందనం పథకం వర్తించలేదు. విద్యు త్ శాఖ అధికారులు వీరికి ఎటువంటి మీటరు లేదని ధ్రువీకరించినప్పటికీ తల్లికి వందనం పథకం మాత్రం అందలేదు. కార్యాలయాల చుట్టూ తిరగడమే కానీ ఫలితం లేకపోతోంది. కొత్త సంవత్సరంలోనైనా అధికారులు స్పందించి పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. -
ఘనంగా హిందూ సమ్మేళనం
శ్రీకాకుళం కల్చరల్ : ఆర్ఎస్ఎస్ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హిందూ సమ్మేళనం కార్యక్రమం శ్రీకాకుళం నగరంలోని విశాఖ–బీ కాలనీ షిర్డీసాయిబాబా మందిరంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన షిర్డీసాయిబాబా సేవా సత్సంగం చైర్మన్ డాక్టర్ మధుకర్ విలేకర్ మాట్లాడుతూ హైందవ సమాజం అభివృద్ధి చెందాలని, సామాజిక సేవా కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషించాలన్నారు. గురజాడ విద్యా సంస్థల డైరెక్టర్, సేవా భారతి సంయుక్త కార్యదర్శి జి.సంయుక్త మాట్లాడుతూ హైందవ సమాజం ప్రతి ఒక్కరి అభ్యున్నతి కోసం పనిచేస్తుందన్నారు. సమాజ వికాసానికి దోహదపడే కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. అనంతరం షిర్డీసాయిబాబా ఆలయ ప్రాంగణంలో నారాయణసే వా సమితి ఆధ్వర్యంలో మహాన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో షిర్డీసాయిబాబా మందిరం ప్రధాన అర్చకులు రేజేటి శ్రీనివాసాచార్యులు, ట్రెజరర్ ఇప్పిలి భవానీ, బంగార్రాజు, శేఖర్, ప్రసాద్, వడ్డి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాధనం వృథా!
● నిరుపయోగంగా ప్రభుత్వ కార్యాలయ భవనాలు ● పట్టించుకోని అధికారులు ఎచ్చెర్ల : ప్రభుత్వ అనాలోచిత విధానాలతో ప్రజాధనం దుర్వినియోగమవుతోంది. ఎచ్చెర్ల మండలంలో అవసరం లేకుండా కోట్ల విలువ చేసే భవనాలను నిర్మించి నిరుపయోగంగా వదిలేశారు. మరోవైపు ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వహించే కార్యాలయాలను అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఎచ్చెర్ల మండల కేంద్రంలో పౌరసరఫరాల గోదామును పదేళ్ల క్రితం నిర్మించారు. ఆహార పదార్థాల నిల్వకు, సరుకుల సరఫరాకు అన్ని విధాలా ఉపయోగపడేలా మోడల్గా నిర్మించారు. తర్వాత వివిధ కారణాలతో ప్రారంభించకుండానే వదిలేశారు. చిలకపాలెం జంక్షన్ వద్ద జాతీయ రహదారికి ఆనుకుని వికలాంగుల పునరావాస కేంద్రాన్ని నిర్మించారు. ఇది కూడా అధునాతన పద్ధతిలో 15 ఏళ్ల కిందట నిర్మించారు. కొన్నాళ్లు దివ్యాంగుల కార్యకలాపాలు కొనసాగించారు. వారికి అవసరమైన పరికరాలు అందించడంతో పాటు పిజియోథెరపి అందించడానికి నిర్మించిన ఈ భవనాన్ని తర్వాత మూసివేశారు. ప్రస్తుతం పిచ్చిమొక్కలతో నిండిపోయి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. మరోవైపు మండలంలో పీఏసీఎస్ కేంద్రాన్ని అద్దె భవనంలో నడిపిస్తున్నారు. వీటితో పాటు అంగన్వాడీ కేంద్రాలను కూడా అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఇప్పటికై నా పాలకులు స్పందించి భవనాలను వినియోగంలోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. -
పారా, మాస్టర్ అథ్లెట్లకు సత్కారం
శ్రీకాకుళం న్యూకాలనీ: లక్ష్యసాధన దిశగా క్రీడాకారులు అడుగులు వేయాలని ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు, బాస్కెట్బాల్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ ఎమ్మెస్సార్ కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. గురువారం శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో క్రీడాకారులతో కలిసి 2026 నూతన సంవత్సరం వేడుకలను జరుపుకున్నారు. ఈసందర్భంగా సౌత్ ఏషియన్ పారా త్రోబాల్ రజత పతకం సాధించిన బగ్గు రామకృష్ణ, మాస్టర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీల్లో పతకాలు సాధించిన మాస్టర్స్ను ఘనంగా సత్కరించారు. అనంతరం బాస్కెట్బాల్, సెపక్తక్రా, మాస్టర్స్ అథ్లెటిక్స్, పారా దివ్యాంగుల క్రికెట్ అసోసియేషన్ సంఘాల ప్రతినిధులు మాట్లాడారు. కార్యక్రమంలో డీఎస్ఏ బాస్కెట్బాల్ కోచ్ గాలి అర్జున్రావురెడ్డి, ఎండీ కాసీంఖాన్, కళావతి దంపతులు, గాలి జగన్నాథ్రెడ్డి, బి.సోములు, జి.కొర్లయ్య, వి.శశి, యు.రవి, జి.వేణుగోపాల్రెడ్డి, సంతోష్, నవీన్, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. -
25న జిల్లాస్థాయి హిందీ ప్రతిభా పరీక్ష
శ్రీకాకుళం కల్చరల్: హిందీ సేవా సదన్ (అనంతపురం) ఆధ్వర్యంలో గత నెల రాష్ట్రవ్యాప్తంగా 6 నుంచి 10వ తరగతుల విద్యార్థులకు నిర్వహించిన పాఠశాల స్థాయి హిందీ టాలెంట్ టెస్ట్లో జిల్లా స్థాయి పరీక్షకు ఎంపికై న విద్యార్థుల వివరాలను విశ్రాంత డీఈఓ బలివాడ మల్లేశ్వరరావు గురువారం విడుద ల చేశారు. హిందీ మంచ్ సంస్థ ఆధ్వర్యంలో గురువారం జరిగిన కార్యక్రమంలో మల్లేశ్వరరావు మా ట్లాడుతూ హిందీ సేవా సదన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో మొదటిసారిగా హిందీ భాష పట్ల అభిరుచి పెంచేందుకు టాలెంట్ టెస్ట్ నిర్వహించినట్లు తెఇపారు. జిల్లా స్థాయి పోటీకి ఎంపికై న విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. మంచ్ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోనే శ్రీధర్ మాట్లాడుతూ హిందీ మంచ్ సంస్థ సమన్వయంతో ఉత్తరాంధ్రలో 2,300 మందికిపైగా విద్యార్థులు పాఠశాల స్థాయి ప్రతిభా పోటీ లో పాల్గొన్నారని వివరించారు. వీరిలో 150 మంది పాఠశాల స్థాయిలో ప్రతిభావంతులుగా నిలిచి జిల్లా స్థాయి పరీక్షకు ఎంపికయ్యారని తెలిపారు. ఈ నెల 25న శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో జిల్లాస్థా యి ప్రతిభా పరీక్ష నిర్వహించనున్నామని పేర్కొ న్నారు. హిందీ పండిట్లు రొంపివలస రామారావు, బి.మంజుల, కనుగుల సత్యం సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారని చెప్పారు. ఎంపికై న విద్యార్థులను రెడ్క్రాస్ జిల్లా చైర్మన్ పోలుమహంతి జగన్మోహనరావు, విశ్రాంత సెట్శ్రీ సీఈవో సురంగి మోహనరావు, బలివాడ మల్లేశ్వరరావు అభినందించారు. కార్యక్రమంలో మంచ్ జోనల్ కమిటీ ప్రతినిధి ఎం. వి.మల్లేశ్వరరావు, జిల్లా గౌరవాధ్యక్షుడు దొంతం పార్వతీశం, జిల్లాశాఖ ప్రతినిధులు కనుగుల సత్యం, రొంపివలస రామారావు, ఈరంకి ఉమారా ణి, సింగూరు రాధ, శిరీష, సత్యనారాయణ, విజయ్, తంగివానిపేట హైస్కూల్ హెచ్ఎం రామకృష్ణ, పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
ఒడియా విద్యార్థుల అభివృద్ధికి కృషి
ఇచ్ఛాపురం: ఆంధ్రప్రదేశ్లో ఒడియా మైనారి టీ విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తామని ఒడి యా లింగ్విస్టిక్ మైనారిటీ సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ పాడీ అన్నారు. ఇచ్ఛాపురం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు సమీపంలో ఆంధ్రప్రదేశ్ ఒడియా టీచర్స్ అసోసియేషన్ (అపో టా) ప్యాకెట్ క్యాలెండర్ను గురువారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఒడియా డీఐ దుర్గాప్రసాద్ చౌదరి, ఆపోటా రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్ పాఢీ, ప్రధాన కార్యదర్శి బృందావన్ దొళాయి, ఒడియా సంఘం పెద్దలు రఘునాథ్ గౌడో తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం కల్చరల్ : మాజీ సైనికుల సంక్షేమ సంఘం వెబ్సైట్, క్యాలెండర్ను ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు గురువారం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్షుడు పూర్ణచంద్రరావు కటకం, సభ్యులు పాల్గొన్నారు. శ్రీకాకుళం కల్చరల్: జిల్లా కేంద్రంలోని ఏడు రోడ్ల జంక్షన్ ప్రాంతంలో నివా సముంటున్న పట్నాల శ్యామలాంబ(86) మృతిచెందడంతో ఆమె నేత్రాల ను దానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకువచ్చారు. మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియ న్ పూతి సుజాత, పి.సుమతి ద్వారా ఆమె కార్నియాలు సేకరించి విశాఖపట్నం ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు. నేత్రదానం చేయాలనుకునే వారు 78426 99321 నంబరుకు సంప్రదించాలని నిర్వాహకులు కోరారు. వజ్రపుకొత్తూరు రూరల్ : పలాస మండలం బొడ్డపాడు జంక్షన్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యా యి. పలాస మున్సిపాలిటీ పరిధి రామకృష్ణా పురం గ్రామానికి చెందిన లండ శశికుమార్ బైక్పై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో శశికుమార్ తలకు తీవ్ర గాయాలు కావడంతో పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం నిమిత్తం శ్రీకాకుళం ఆస్పత్రికి తరలించారు. ద్విచక్ర వాహన్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టిందా.. లేక అదుపు తప్పి ప్రమాదం జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. శ్రీకాకుళం క్రైమ్ : కలెక్టరేట్కు వెళ్లే దారిలో అపార్ట్మెంట్స్ వెనుక భాగంలో 2.4 కిలోల గంజాయితో ఉన్న ఆరుగురు యువకులను గురువారం పోలీసులు పట్టుకున్నారు. రూరల్ సీఐ పైడపునాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. పక్కా సమాచారం మేరకు ఎస్ఐ ఎం.హరికృష్ణ సిబ్బందితో మాటు వేసి భానుగురి చంద్రశేఖర్, కిల్లంశెట్టి నిఖిల్, పొన్నాడ కిషోర్, కుందు గోపాల్, కొన్న రాందేవ్, దండి వేణులను పట్టుకున్నారు. వీరిన విచారించగా ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ నుంచి గంజాయిని అక్రమంగా తీసుకొచ్చి పరస్పరం పంచుకుంటున్నట్లు నిర్ధారించారు. గంజాయిని సీజ్ చేసి యువకులను కోర్టులో హాజరుపర్చగా.. జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో జిల్లా జైలుకు తరలించారు. -
ఏపీ గట్కా టీమ్ కోచ్గా సత్యవరం స్కూల్ పీడీ
నరసన్నపేట: జాతీయ స్థాయిలో పంజాబ్ రాష్ట్రం లూథియానాలో జరగనున్న గట్కా(కర్రసాము) పోటీలకు వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ టీమ్ కోచ్గా సత్యవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పీడీ జ్యోతీరాణి నియమితులయ్యారు. జాతీయ స్థాయిలో గట్కా పోటీ లు 5 నుంచి 10 వ తేదీల్లో జరగనున్నాయని పీడీ తెలిపారు. ఈ అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. శుక్రవారం పయనం అవుతున్నట్లు తెలిపారు. విజయవాడ చేరుకొని అక్కడ నుంచి లూథియానాకు వెళ్లనున్నట్లు వివరించారు. నేటి నుంచి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు ప్రభుత్వం ముద్రించిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను శుక్రవారం నుంచి అందజేయనున్నారు. ఈ నెల 9వ తేదీ వరకు కార్యక్రమం నిర్వహించనున్నారు. జిల్లాలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో పాత భూహక్కు పత్రాల స్థానంలో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. జిల్లాలో రీసర్వే పూర్తయిన 652 గ్రామాల్లో రెవెన్యూ గ్రామ సభల ద్వారా 2,54,218 కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలు శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్లో 13 మండలాల్లో 277 రెవెన్యూ గ్రామాల్లో 1,25,716 పాస్ పుస్తకాలు అందజేయనున్నారు. టెక్కలి డివిజన్లో 9 మండలాల్లో 192 రెవెన్యూ గ్రామాల్లో 65,618 మంది రైతులకు పాస్ పుస్తకాలు ఇవ్వనున్నారు. పలాస డివిజన్లో 8 మండలాల్లో 183 రెవెన్యూ గ్రామాల్లో 62,884 పాస్ పుస్తకాలు అందజేస్తారు. జిల్లాను హరితమయం చేద్దాం: కలెక్టర్ శ్రీకాకుళం పాతబస్టాండ్: కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మ ద్ ఖాన్లను పలు శాఖల ఉన్నతాధికారులు తమ సిబ్బందితో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన కలెక్టరేట్ సముదాయం వద్ద నూతనంగా నిర్మిస్తున్న రహదారికి ఇరువైపులా మొక్కలు నాటారు. కొత్త ఏడాదిలో జిల్లాను హరితమయంగా మార్చేందుకు అధికారులు, ప్రజలు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. -
మద్యం తాగేశారు
● డిసెంబరు 31 రాత్రి విపరీతంగా మద్యం విక్రయాలు డిసెంబర్ 31 అర్ధరాత్రి మందు ప్రియులు ‘ఫుల్లు’గా ఎంజాయ్ చేశారు. ఎప్పటికంటే దాదాపు దాదాపు కోటి రూపాయల అదనపు మద్యాన్ని గుటకేశారు. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా మద్యం ప్రియులు డిసెంబరు 31న రూ.3.75 కోట్ల మందు తాగేశారు. అర్ధరాత్రి వరకు ప్రభుత్వం విక్రయాలకు ఇచ్చిన అనుమతిని వినియోగించుకుని మందుషాపుల గల్లా పెట్టెలు నింపారు. ఈ మేరకు జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సీహెచ్ తిరుపతినాయుడు ఓ ప్రకటన గురువారం విడుదల చేశారు. సాధారణ రోజుల్లో రూ. 2.50 కోట్ల నుంచి రూ. 2.70 కోట్ల సరాసరిన మద్యం అమ్మకాలు జరిగేవని ఆ లెక్కన రూ.1.20 కోట్లు మద్యం అధికంగా అమ్ముడు పోయిందని ఆయన అన్నారు. శ్రీకాకుళం సర్కిల్ పరిధిలో రూ. 80 లక్షల మేర మద్యం అమ్మకాలు సాగినట్లు సీఐ ఎంవీ గోపాలకృష్ణ ప్రకటించారు. సాధారణ రోజుల్లో రూ. 60 లక్షలు అమ్మకాలు సాగేవన్నారు. మందుబాబులపై కేసులు.. జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ 36, ఓపెన్ డ్రింకింగ్ 15 కేసులు నమోదు చేశారు. శ్రీకాకుళం నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఒకటో పట్టణ పరిధిలో 14, ట్రాఫిక్ పీఎస్ పరిధిలో 6 నమోదు కాగా రెండో పట్టణ పరిధిలో 4 ఓపెన్ డ్రింకింగ్ కేసులు పోలీసులు కట్టారు. వీరిని శుక్రవారం కోర్టు ముందు హాజరుపర్చనున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మద్యం అమ్మకాలకు సమయం ఒంటి గంట వరకు పెట్టిన ప్రభుత్వం రోడ్లపై మద్యం తాగి తిరగవద్దని, అదే ఒంటి గంట తర్వాత తిరిగితే కేసులు కట్టి జైలుకు పంపిస్తామని పోలీసుల చేత ప్రకటించడంపై జిల్లావ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. – శ్రీకాకుళం క్రైమ్ -
కనికుట్టు విద్య
● నృత్య ప్రదర్శనలు ఇచ్చే చిన్నారుల డ్రెస్ డిజైనింగ్లో ప్రతిభ చూపుతున్న దర్జీ ● 40 ఏళ్లుగా ఇదే వృత్తిలో రాణిస్తున్న ఏకై క వ్యక్తి ● వేల మందికి కాస్ట్యూమ్స్ డిజైనింగ్ శ్రీకాకుళం కల్చరల్: నృత్య ప్రదర్శన ఎక్కడ చేసినా ముందు ఆయన వద్దకు వెళ్లాల్సిందే. శిక్షణ నుంచి ఆరంగేట్రం వరకు అన్ని దశల్లోనూ ఆయనను కలవాల్సిందే. నాట్య ప్రదర్శనలో అడుగులు ఎంత లయబద్ధంగా కదపాలో, ము ఖ కవళికలు ఎంత అందగా ఉండాలో, భంగిమ లు ఎంత శ్రద్ధగా కుదరాలో ఆహార్యం కూడా అంతే సుందరంగా అమరాలి. అందుకు 40 ఏళ్లుగా ఏకై క చిరునామా వీరభద్రరావు. రంగురంగుల పట్టు వస్త్రాలు, కచ్చితమైన కొలతలతో కూడిన ఆ దుస్తుల వెనుక ఒక సామాన్య టైలర్ అసామాన్య కృషి దాగి ఉంది. ఆయనే శ్రీకాకుళంలో సుపరిచితులైన మల్లెమొగ్గల వీరభద్రరావు (భద్రం). చదివింది ఐదో తరగతి అయినా, శాసీ్త్రయ నృత్య దుస్తుల తయారీలో ఆయనది అందెవేసిన చేయి. 40 ఏళ్లుగా ఈ వృత్తిలోనే.. వీరభద్రరావు బాల్యంలో తన మేనమామ చాగంటి నాగేశ్వరరావు కుట్టు మిషన్పై దుస్తులు కుడు తుంటే చూసి ఆసక్తి పెంచుకున్నారు. కుట్టు వృత్తి పైనే మక్కువతో 40 ఏళ్లుగా ఇవే దుస్తులు కుడుతున్నారు. ప్రారంభంలో పౌరాణిక సినిమాల ప్రభావం ఆయనపై ఎక్కువగా ఉండేది. ముఖ్యంగా నంద మూరి తారకరామారావు ధరించే వైవిధ్యమైన దుస్తులను చూసి, డ్రామా కళాకారులకు అలాంటి దుస్తులు కుట్టడం మొదలుపెట్టారు. 1990వ దశకంలో నాట్య గురువు రఘుపాత్రుని శ్రీకాంత్ ప్రోత్సాహంతో శాసీ్త్రయ నృత్యాల వైపు మళ్లింది. ఎలాంటి అధికారిక శిక్షణ లేకపోయినా, కేవలం స్వయంకృషితో అవగాహన పెంచుకున్నారు. విదేశాలకు సైతం.. నేడు కూచిపూడి, భరతనాట్యం, కథాకళి, మోహినియాట్టం వంటి ఏ శాసీ్త్రయ నృత్యానికై నా భద్రం కుట్టిన దుస్తులు ఉండాల్సిందే. ఆయన నైపు ణ్యాన్ని గుర్తించిన డ్యాన్స్ మాస్టర్లు తమ విద్యార్థులకు భద్రం చేతనే దుస్తులు కుట్టించడానికి మొగ్గు చూపుతారు. అమెరికా వంటి దేశాల నుంచి సైతం ఆర్డర్లు వస్తున్నాయంటే ఆయన పనితనం అర్థం చేసుకోవచ్చు. ప్రముఖ డ్యాన్స్ మాస్టర్లు శ్రీకాంత్, శివ కుమార్, మెహర్ విద్యావిహార్, నీరజలతో పాటు స్వాతి స్వామినాథన్ వంటి జాతీయ స్థాయి గురువులకు ఈయన అంటే ఎంతో ఇష్టం. ఆయనకు భార్య సుబ్బలక్ష్మి, ఆయన శిష్యురాలు బాలనాగమణి సహకారం అందిస్తున్నారు. వీరభద్రరావు రూపొందించిన డ్రెస్లో చిన్నారి నృత్య భంగిమ డ్యాన్స్ మాస్టర్ల సహకారంతోనే.. నేను ఇంతగా ఎదగడానికి కారణం డ్యాన్స్ మాస్టర్లు నాకు ఇస్తున్న సహకారం. నాట్యగురువు శ్రీకాంత్ నన్ను ముందుగా ప్రోత్సహించారు. నాటి నుంచి నా జీవితం ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సాగుతోంది. – ఎం.వీరభద్రరావు, దర్జీ, శ్రీకాకుళం -
సముద్రంలో బోటు మునక
● లక్షల్లో ఆస్తినష్టం కొత్తపాలెంలో వలల్ని తీస్తున్న మత్స్యకారులు కవిటి : మండలంలోని కొత్తపాలెం సముద్రతీరంలో లంగరువేసిన గంగామాత అనే బోటు సము ద్రంలో కూరుకుపోయిందని బోటుకు చెందిన 11 మంది మత్స్యకారులు డొంక సోమయ్య, సూర్ని లచ్చయ్య తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి గురువారం సాయంత్రం మత్స్యకారులు మీడియాకు వివరాలు వెల్లడించారు. వారు తెలిపిన వివరాల మేరకు.. బుధవారం వేట నుంచి వచ్చిన తర్వాత కొత్త పాలెం సముద్ర తీరంలో లంగరు వేసి బోటు సురక్షితంగానే నిలిపారు. గురువారం ఉదయం వేటకు వెళదామని అంతా తీరానికి వెళ్లారు. చూసేసరికి బోటు సముద్రంలో భారీగా కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో దానిలో ఉన్న లక్షల రూపాయల విలువైన వల కూడా పాడైపోయింది. బోటును మరికొన్ని బోట్ల సాయంతో బయటకు తీసేందుకు గ్రామస్తులంతా శతవిధాలుగా ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో అది ముక్కలుగా విరిగి బాగా దెబ్బతిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో బోటులో రెండు జీపీఎస్ మిషన్లు, ఇంజిన్లలో ఉన్న ఇంజిన్ ఆయిల్ పడిపోయింది. బోటులో ఉన్న టీవీ కూడా దెబ్బతింది. జేసీబీ సాయంతో బయటకు తీసేందుకు ప్రయ త్నించామని మత్స్యకారులు తెలిపారు. వలతో పాటు బోటు కూడా పాడైపోయిందని లక్షల్లో నష్టపోయామని తెలిపారు. కొత్తబోటు కొనాలంటే ప్రస్తుతం రూ.16 నుంచి రూ.18 లక్షల వరకు ఖర్చవుతుంది. జీపీఎస్ మిషన్లు, టీవీ తదితర సౌకర్యా లు అన్నీ సమకూర్చడం ఇప్పుడు తమకు తలకు మించిన భారమని మత్స్యకారులు వాపో తున్నా రు. అధికారులు సంఘటనా స్థలానికి వచ్చి జరిగిన నష్టాన్ని అంచనా వేసి తమకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. -
మహాసభలను విజయవంతం చేయండి
పలాస : రాజ్యహింసకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన గొంతు వినిపించేందుకు ఈ నెల 10, 11వ తేదీలలో చేపట్టనున్న 20వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు బొడ్డపాడులో గురువారం పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బూటకపు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా, ప్రజా నిర్బంధాలు, అణచివేతతో పాటు అన్ని వర్గాల ప్రజలను పీడిస్తున్న ప్రభుత్వ విధానాలను ముక్తకంఠంతో వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ప్రజా హక్కులను కాపాడుకోవాలంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూ డెమొక్రసీ జిల్లా సహాయక కార్యదర్శి వంకల మాధవరావు, లిబరేషన్ జిల్లా నాయకులు మద్దిల రామారావు, దుష్యంత్, ప్రగతిశీల మహిళా సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనపల్లి కుసుమ, ప్రజా సంఘాల నాయకులు ఈశ్వరమ్మ, మద్దిల వినోద్, కోనేరు రమేష్, వీరాస్వామి, లక్ష్మణ్, జోగి కోదండరావు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ బాక్సింగ్ పోటీలకు విశ్వేశ్వరరావు
శ్రీకాకుళం న్యూకాలనీ : జాతీయ బాక్సింగ్ పోటీల కు జిల్లాకు చెందిన బాక్సర్ పి.విశ్వేశ్వరరావు ఎంపికయ్యాడు. ఉత్తరప్రదేశ్లోని నోయిడా వేదికగా ఈ నెల 4 నుంచి 10 వరకు తొమ్మిదో ఆలిండియా ఎలైట్మెన్ బాక్సింగ్ చాంపియన్షిప్–2025–26 పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల కోసం విశ్వేశ్వరరావు గురువారం ఇక్కడి నుంచి పయనమైవెళ్లాడు. ఇటీవ ల జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించడంతో జా తీయ పోటీలకు ఎంపికయ్యాడు. డీఎస్ఏ బాక్సింగ్ కోచ్ ఎం.ఉమామహేశ్వరరావు నేతృత్వంలో కఠోర సాధన చేస్తూ జాతీయస్థాయికి చేరుకోవడం అభినందనీయమని డీఎస్డీఓ ఎ.మహేష్బాబు సంతో షం వ్యక్తం చేశారు. జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ సెక్రటరీ బీఏ లక్ష్మణ్దేవ్, వంగా మహేష్ ప్రోత్సా హం, శిక్షకుల చొరవ ప్రసంశనీయమని సీనియర్ బాక్సర్లు రాజీవ్, అప్పలరాజు, రాము, మనోజ్కుమార్ తదితరులు పేర్కొన్నారు. విశాఖ రేంజ్ ఐజీగా గోపీనాథ్ జట్టి బాధ్యతల స్వీకరణ విశాఖసిటీ: విశాఖ రేంజ్ డీఐజీగా విధులు నిర్వర్తిస్తున్న గోపీనాథ్ జట్టి పదోన్నతి పొందారు. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఐజీ)గా గురువారం ఆయన రేంజ్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కార్యాలయంలోని ఇతర పోలీస్ అధికారులతో కలిసి ఆయన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. నూతన సంవత్సరంలో రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవ చేయాలని ఐజీ ఆకాంక్షించారు. రేంజ్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేర నియంత్రణకు పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారు. పోలీసు యంత్రాంగం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం ఎస్పీ కె.వి.మహేశ్వర్రెడ్డి (శ్రీకాకుళం) మర్యాదపూర్వకంగా కలిశారు. రేంజ్ పరిధిలోని డీఎస్పీలు, ఇతర ఉన్న తాధికారులు, కార్యాలయ మినిస్టీరియల్ సిబ్బంది, క్యాంపు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. బాధ్యతలు స్వీకరిస్తున్న గోపీనాథ్ జట్టి -
78 గంటలైనా నా భర్త జాడలేదు
శ్రీకాకుళం క్రైమ్ : నిమ్మాడ.. శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర, రాష్ట్ర మంత్రివర్యులైన కింజరాపు అచ్చెన్నాయుడు, రామ్మోహన్నాయుడుల స్వగ్రామం. ఇదే గ్రామానికి చెందిన కింజరాపు చంద్రకళ అనే వివాహిత తన భర్త కింజరాపు అప్పన్న ఈనెల 29 నుంచి కనపడటంలేదని, ఇద్దరు కానిస్టేబుళ్లు తీసుకెళ్లినట్లు తెలిసిందని, 78 గంటలైనా తన భర్త జాడలేదని, ఆయన ప్రాణానికి హాని ఉందని మీడియా ముందు కన్నీటిపర్యంతమైంది. ఏడాదిన్నరగా నిమ్మాడలోకి అడుగు పెట్టలేకపోతున్నామని, తెలుగుదేశం పార్టీ వాళ్లు రానీయడంలేదని ఆరోపించారు. ఇదే విషయమై జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్న ఎస్పీ మహేశ్వరరెడ్డిని కలిసి ఫిర్యాదు చేసినట్లు ఆమె గురువారం మీడియాకు వివరించారు. 29 నుంచి కనిపించడంలేదు.. గతనెల 29న మా కన్నవారి గ్రామమైన మెళియాపుట్టి మండలం కొసమాలలో కింజరాపు అప్పన్నను ఉ.8–10 గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్లారు. అప్పుడు నేను వైజాగ్లో ఉండటంతో తెలీలేదు. సాయంత్రం వచ్చేస్తున్నానని చెప్పేందుకు నా భర్తకు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. కన్నవారింటికి వచ్చాక బైక్, హెల్మెట్ అయితే ఉందిగానీ భర్త లేడు. ఇదే విషయం అక్కడ కొందరిని అడగ్గా ఎవరో ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్లారని చెప్పారు. ఆ తర్వాత నా భర్తకు చాలాసార్లు ఫోన్ చేశా. స్విచ్చాఫ్ రావడంతో అదేరోజు సా.6.30కు మెళియాపుట్టి స్టేషన్కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశా.ఎఫ్ఐఆర్ రాయమంటే.. ‘డైరీలో రాసి రేపు 9 గంటలకు రండి.. ఈలోగా విచారణ చేసి కనుక్కొని చెబుతాం’ అని అన్నారు. అయితే, మర్నాడు ‘ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చారు. రెండేళ్ల కిందట పనిచేసిన మెళియాపుట్టి కానిస్టేబుల్ చందు, మరొకతను తీసుకెళ్లారు’ అని స్థానికులు చెప్పారు. వెంటనే అక్కడి ఎస్ఐకు ఫోన్ చేస్తే బిజీగా ఉన్నానని అనడంతో బుధవారం మళ్లీ స్టేషన్కు వెళ్లి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాను. ఎస్ఐను అడిగితే.. తమ వాళ్లయితే తీసుకెళ్లలేదని, చందు ఎవరో తెలీదని, ఎస్పీ దగ్గరకు వెళ్లమన్నారు. దీంతో బుధవారం రాత్రి ఎస్పీని కలవడానికి శ్రీకాకుళం వచ్చా. ఆయన లేకపోవడంతో మళ్లీ గురువారం వచ్చి ఎస్పీని కలిశాను.టీడీపీ వాళ్లు నిమ్మాడకు రానీయడంలేదు.. ‘ఏడాదిన్నర నుంచి టీడీపీ వాళ్లు మమ్మల్ని నిమ్మాడ గ్రామంలో అడుగుపెట్టనీయడం లేదు. పొలం ఉన్నా.. సాగుచేయకుండా ఉండిపోయింది. అత్తయ్యకు పింఛను, మామయ్య రేషన్కార్డు తీసేశారు. మా చుట్టాలంతా బయటకెళ్లి బతుకుతున్నారు. మేం ఒడిశా వెళ్లిపోయాం. నా భర్తను ఎవరేం చేశారోనని భయంగా ఉంది. ప్రాణహాని ఉందని ఆ ఊరికి వెళ్లడంలేదు. ఇదంతా రాజకీయపరంగా ఎవరో చేస్తున్నారు. నా భర్త ఎవరికీ ఏ అన్యాయం చేయలేదు. ఎవరినీ చంపలేదు, మోసంచేసి డబ్బులు, ఆస్తులు తీసుకోలేదు’ అని చంద్రకళ తెలిపింది. -
భారీగా గంజాయి పట్టివేత
ఇచ్ఛాపురం: పోలీసులకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు స్థానిక రైల్వే ఎల్సీ గేట్ వద్ద పట్టణ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా 86.950 కేజీలు భారీగా గంజాయి పట్టుబడినట్లు సీఐ మీసాల చిన్నంనాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం సీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఒడిశాకి చెందిన ఒక కారులో తరలిస్తున్న గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఒడిశాలోని బరంపురం లంజిపల్లికి చెందిన ప్రపుల్కుమార్ జలి అనే వ్యక్తి కారులో గంజాయిని తీసుకొని విజయనగరంలోని హిమాన్సుశేఖర్ మజి అనే వ్యక్తికి ఇచ్చేందుకు తీసుకెళ్తుండగా పట్టణ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ గంజాయిని ఒడిశాలోని మోహన బ్లాక్ గుమిగుడ ప్రాంతానికి చెందిన ప్రశాంత్ నాయక్ వద్ద నుంచి కొనుగోలు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడిని అదుపులోనికి తీసుకొని అతని వద్దనుంచి గంజాయి, సెల్ఫోన్, కారుని సీజ్ చేశారు. రిమాండ్ నిమిత్తం కోర్టుకి తరలించనున్నట్లు పేర్కొన్నారు. -
ప్రజలు ఆనందంగా గడపాలి
హిరమండలం: నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలు నిత్యం ఆనందంతో గడపాలని వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి, వినియోగదారుల హక్కుల సంఘం ప్రతినిధి అంధవరపు వెంకట సురేష్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు వస్తువుల క్రయ, విక్రయాల్లో జాగ్రత్తలు పాటించాలన్నారు. మోసాలకు గురవ్వకుండా వస్తువులు కొనుగోలు చేసినప్పుడు రశీదు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో వైఎస్సార్సీపీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల నాటికి వైఎస్సార్సీపీ బలమైన శక్తిగా ఎదగడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.


