breaking news
Srikakulam
-
ఎదురుచూపులు ఎన్నాళ్లు?
ఎన్నికల హామీలను చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేసింది. బీసీ, ఎస్సీలకు మొండిచేయి చూపించింది. కూటమి నాయకులకు పాలనలోనే పలు కార్పొరేషన్లకు సంబంధించి ఇంటర్వ్యూలు జరిగాయి. వారు సిఫార్సు చేసిన వారికే రుణాలు ఇవ్వాలని అప్పట్లో బ్యాంకర్లకు హుకుం జారీ చేశారు. రుణాలకు సంబంధించిన సబ్సిడీ నిధులు ఎందుకు జమ కాలేదన్న సంగతి కూటమి నాయకులకే తెలియాలి. – నర్తు రామారావు, ఎమ్మెల్సీ మండలానికి బీసీ కార్పొరేషన్ కింద 70, ఎస్సీ కార్పొరేషన్ కింద 3, కాపు కార్పోరేషన్ కింద 2 యూనిట్లు మంజూరయ్యాయి. అయితే మండలాలలో నిరుద్యోగులకు ఇచ్చిన యూనిట్లు చాలవని పలువురు ఎమ్మెల్యేలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అదనపు యూనిట్ల కేటాయింపులు చేయాలనే ఆలోచనలో ప్రక్రియ నడుస్తోంది. ప్రస్తుతం జరిగిన కేటాయింపుల మేరకు మండలాల్లో బ్యాంకర్లతో ఇంటర్వ్యూలు చేసి జాబితా ఉన్నతాధికారులకు నివేదించాం. – కె.శ్రీనివాసరెడ్డి, ఇన్చార్జి ఎంపీడీఓ, కవిటి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంపిక ప్రక్రియ నిర్వహించాం. ఇంటర్వ్యూలు పూర్తి చేశాం. లబ్ధిదారులను ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదించాం. త్వరలో లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ అయ్యే అవకాశం ఉంది. – ఆర్.కాళీప్రసాద్, ఎంపీడీఓ, హిరమండలం హిరమండలం/కవిటి: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పథకాలకు రుణాలు అందిస్తామని కూటమి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలు అందించేందుకు ఏడాది కిందట దరఖాస్తుల స్వీకరించింది. ఇంటర్వ్యూలు సైతం పూర్తి చేసి లబ్ధిదారులను ఎంపిక చేసి ఏడాది అవుతున్నా ఇంతవరకూ రుణాలు ఇవ్వలేదు. దీంతో నిరుద్యోగ యువత ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. ఇదీ పరిస్థితి.. జిల్లాలో 30 మండలాలతో పాటు శ్రీకాకుళం నగరపాలక సంస్థ, ఆమదాలవలస, పలాస–కాశీబుగ్గ, ఇచ్ఛాపురం మునిసిపాల్టీల పరిధిలో వెనుకబడిన సామాజికవర్గాలకు బీసీ కార్పొరేషన్ కింద రుణాలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 2,870 స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాట్లు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికిగాను రూ.56.11 కోట్లు కేటాయించింది. మొత్తం సొమ్ములో రూ.28.05 కోట్లు రాయితీగా ఇవ్వాలని నిర్ణయించింది. అప్పట్లో లబ్ధిదారులకు ఇంటర్వ్యూలు కూడా పూర్తిచేశారు. టీడీపీ కూటమి నాయకులు ఇచ్చిన జాబితా మేరకే అప్పట్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేశారనే విమర్శలు ఉన్నాయి. ఇది జరిగి ఏడాది దాటుతున్నా ఇంతవరకూ లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమకాలేదు. అప్పట్లో కొంతమంది ఖాతాల్లో రూపాయి పడినట్టు తెలుస్తోంది. గత ఏడాది కాలంగా వారికి ఎదురుచూపులే మిగిలాయి. బ్యాంకులు రుణాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నా.. రాయితీ సొమ్ము ప్రభుత్వం విడుదల చేయకపోవడంతోనే ప్రక్రియ నిలిచిపోయినట్టు తెలుస్తోంది. నర్సరీలు, పుట్టగొడుగుల పెంపకం, నీటి ఇంజన్లు, ట్రాక్టర్లు, ఆటోమొబైల్ విడిభాగాలు, కొబ్బరి వ్యాపారం, ఫిషింగ్ బోట్లు, హోటళ్లు వంటి 100కుపైగా యూనిట్లు ఏర్పాటుచేసుకోవచ్చని అప్పట్లో అధికారులు ప్రకటించారు. ఒక్కో లబ్ధిదారుడు కనిష్టంగా రూ.లక్ష, గరిష్టంగా రూ.5 లక్షలు పొందవచ్చని చెప్పారు. యూనిట్ ధర అనుసరించి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ రాయితీ పొందుతారని చెప్పుకొచ్చారు. రుణాలను బ్యాంకుల ద్వారా అందిస్తామన్నారు. అయినా ఇంతవరకూ లబ్ధిదారులకు రుణం అందకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లా వ్యాప్తంగా అప్పట్లో 21,649 మంది దరఖాస్తు చేసుకున్నారు. అర్హులను ఎంపిక చేయడానికి ఆయా మండలాల అధికారులు, బ్యాంకర్ల సమక్షంలోనే ఇంటర్వ్యూలు నిర్వహించారు. అర్హులను గుర్తించి ఆయా బ్యాంకులకు వివరాలు పంపారు. అక్కడితో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. అయితే మంజూరైన యూనిట్ల కంటే అధికంగా దరఖాస్తుల రావడంతో ప్రక్రియ నిలిచిపోయినట్టు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఏడాది కిందట బీసీ కార్పొరేషన్ రుణాల ప్రకటన ఇంటర్వ్యూలు సైతం పూర్తి లబ్ధిదారులకు తప్పని నిరీక్షణ ప్రభుత్వం తీరుపై విమర్శలు -
లేబర్ కోడ్లు రద్దు చేయాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): కార్మికుల మెడకు ఉరితాళ్లు వంటి నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 12న తలపెట్టిన సమ్మె విజయవంతం చేయాలని కోరుతూ ఆల్ ట్రేడ్ యూనియనన్లు, ఎస్.కె.ఎం, రైతు, కార్మిక, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి రామలక్ష్మణ, సూర్యమహాల్ మీదుగా ఏడురోడ్ల జంక్షన్ వరకు మోటార్ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సంఘాల నాయకులు మాట్లాడుతూ దశాబ్దాల పాటు కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి మోదీ నాయకత్వంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారీ ప్రయోజనాల కోసం నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి వేసిందని మండిపడ్డారు. కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు పి.తేజేశ్వరరావు, టి.తిరుపతిరావు, ఎస్.కష్ణవేణి, జి.సింహాచలం, పి.ప్రసాదరావు, ఎన్.బలరాం, ఎం.గోవర్దనరావు, కొత్తకోట అప్పారావు, ఎం.ఆదినారాయణమూర్తి, ఎస్.జ్యోతిశ్వరరావు, టి.సత్యాచారిరామ్, ఆర్.ప్రకాశరావు, అల్లు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
స్నేహితుడి ఇంటికే కన్నం
● చోరీ కేసులో ఇద్దరు అరెస్టు పలాస: కాశీబుగ్గ రోటరీనగర్లోని సునీత పాత్రో ఇంట్లో ఈ నెల 7న జరిగిన చోరీ కేసులో కాశీబుగ్గ పోలీసులు ఇద్దరు నిందితులు తెల్లి దీనబందు, టెంకు నాగరాజులను అరెస్టు చేశారు. కాశీబుగ్గ డీఎస్పీ షేక్ సహబాద్ అహ్మద్ సోమవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. సునీత పాత్రో భర్త బతుకు తెరువు కోసం చైన్నె వలసపోయాడు. ఇతనితో దీనబంధు అనే వ్యక్తి కలిసి ఎలక్ట్రికల్ పనులు చేసేవాడు. ఆ సమయంలో అతని ఇంటికి వెళ్తుండేవాడు. సునీత కాశీబుగ్గలోని ఓ షోరూమ్లో పనిచేస్తున్నారు. దీనబంధుకు ఆర్థిక అవసరాల నిమిత్తం డబ్బు అవసరం ఏర్పడింది. దీంతో సునీత ఇంట్లో బంగారు ఆభరణాలు ఉండటం గమనించి దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో శనివారం సునీత ఇంటి తాళాన్ని చాకచక్యంగా సంపాదించాడు. ఓ షాపులో పనిచేస్తున్న నాగరాజు అనే వ్యక్తి వద్దకు వెళ్లి ఇంట్లో బీరువా రిపేరు ఉందంటూ సునీత ఇంటికి తీసుకెళ్లాడు. బీరువాలో బంగారు ఆభరణాలు ఉన్నాయని, వాటిని తీసుకెళ్లి అమ్ముకుంటే డబ్బులు వస్తాయని, అందులో సగం వాటా ఇస్తానని చెప్పాడు. అనంతరం సుత్తితో బీరువా తెరిచి రూ.7.50 లక్షలు విలువైన ఆరు రకాల బంగారు అభరణాలు అపహరించుకుపోయారు. బాధితురాలు సునీత ఇంటికి వచ్చి చూడగా చోరీ జరగడాన్ని గమనించి కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించి కాశీబుగ్గ బంకేశ్వరగుడి సమీపంలో ఒకరిని, జి.ఎం.ఇ కాలనీ వద్ద ఒక షాపు వద్ద మరొకరిని అరెస్టు చేసి వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పలాస కోర్టులో సోమవారం హాజరుపరిచారు. కేసును ఛేదించిన కాశీబుగ్గ సీఐ రామకృష్ణ, పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
21 నుంచి జాతీయ స్థాయి నాటక పోటీలు
అరసవల్లి: ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా దివంగత కొన్నా చిన్నారావు, చిన్నమ్మడు చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో ఈ నెల 21 నుంచి 23 వరకు జాతీయ స్థాయి ఆహ్వాన నాటిక పోటీలు జిల్లా కేంద్రంలోని బాపూజీ కళామందిర్లో నిర్వహిస్తున్నట్లు శ్రీసుమిత్ర కళాసమితి అధ్యక్షుడు, ఆదిత్యాలయ ప్రధానార్చకుడు ఇప్పిలి శంకరశర్మ ప్రకటించారు. ఈ మేరకు సోమవారం అరసవల్లిలో ఆహ్వాన పత్రికలను సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శంకరశర్మ మాట్లాడుతూ మూడు రోజుల పాటు సాయంత్రం 6 గంటల నుంచి నాటికల ప్రదర్శన మొదలవుతుందన్నారు. 21న ‘మాయాజాలం’, ‘తరమెల్లిపోతున్నదో’, 22న ‘సమయం’, ‘సూక్తం’, 23న ‘మమ్మల్ని బ్రతకనివ్వండి..’, ‘నిన్ను నీవు గెలుచుకో..’ తదితర నాటికలు ప్రదర్శితమవుతాయని ప్రకటించారు. అనంతరం విశిష్ట అతిథుల చేతులమీదుగా బహుమతి ప్రదానంతో మూడు రోజుల కార్యక్రమాలు ముగుస్తాయన్నారు. కార్యక్రమంలో సుమిత్ర కళాసమితి సభ్యులు మండవల్లి రవి, నక్క శంకరరావు, కొంక్యాన మురళి, కర్రి అశోక్కుమార్, ప్రధాన విజయరాం, కొమ్మనాపల్లి హరికృష్ణ, ఫల్గుణరావు, పందిరి సంగీత, వీవీఎస్ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. చదరంగంతో మేధాశక్తి టెక్కలి: చదరంగంతో మేధాశక్తి మరింత పెరుగుతుందని టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు అన్నారు. ఆదిత్య కళాశాలలో అంతర్ కళాశాలల చదరంగం పోటీలను సోమవారం ప్రారంభించారు. జేఎన్టీయూవీ స్థాయి టోర్నమెంట్ కోసం క్రీడాకారుల ఎంపికలో భాగంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 30 కళాశాలల నుంచి 100 మంది క్రీడాకారులు పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. జీఎంఆర్ఐటీ పీడీ పి.అరుణ్కుమార్, జేఎన్టీయూ పీడీ డి.నాగరాజు తదితరులు ఈ పోటీలకు పర్యవేక్షకులుగా వ్యహరిస్తున్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, కో–ఆర్డినేటర్ మురళీధర్, పీడీలు లక్ష్మణమూర్తి, మురళీమోహన్, తేజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. హయ్యర్ పింఛన్ కోసం పెన్షనర్ల ధర్నా శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్రంలో సుమారు 17 లక్షల మంది పింఛనుదారులు హయ్యర్ పెన్షన్ కోసం దరఖాస్తు చేయగా వారిలో ఎక్కువ మంది దరఖాస్తులు తిరస్కరించడాన్ని నిరసిస్తూ ఆల్ పెన్షనర్స్, అండ్ రిటైర్డు పెన్షన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని జ్యోతీరావు పూలే పార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి ఎం.ఆదినారాయణమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వ నిర్వాకం వల్ల పింఛనుదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కనీస పెన్షన్ రూ.తొమ్మిది వేలు, కరువు భత్యం చెల్లించాలన్నారు. లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ప్రైవేటీకరణ విధానాలు విడనాడాలని డిమాండ్ చేశారు. పింఛనుదారులు సమస్యల పరిష్కారానికి ఈ నెల 12న జరగనున్న దేశవ్యాప్త సమ్మెలో విశ్రాంత ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొంటారని ప్రకటించారు. నిరసన కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు పి.సుధాకర్, బి.జనార్దన్, పి.వాసుదేవరావు, బి.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. లాడ్జిలో వ్యక్తి మృతి రణస్థలం: పైడిభీమవరంలో ఓ లాడ్జీలో బీహార్ రాష్ట్రానికి చెందిన రాకేష్ కుమార్(46) అనే వ్యక్తి మృతి చెందాడు. పూసపాటిరేగ మండలంలోని ఒక ప్లైవుడ్ పరిశ్రమలో పని కోసం మూడు రోజుల క్రితం వచ్చిన ఈయన పైడిభీమవరంలోని ఎస్ఎస్ లాడ్జిలో దిగాడు. ఆదివారం రాత్రి భోజనం కోసం లాడ్జి నిర్వాహకులు రాకేష్ రూమ్కు వెళ్లి చూడగా విగత జీవిగా కనిపించాడు. వెంటనే జె.ఆర్.పురం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అతని వద్ద లభించిన మందుల ప్రకారం అనారోగ్య సమస్యలతో మృతి చెందినట్లు భావిస్తున్నారు. రాకేష్కుమార్కు భార్య, కుమారుడు ఉన్నారు. లాడ్జి సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. -
రిటైర్డు నేవీ ఉద్యోగి ఇంట్లో చోరీ
● ఐదు తులాల బంగారు వస్తువులు అపహరణ శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలోని పీఎన్కాలనీ రెండో లైన్లో నివాసముంటున్న రిటైర్డ్ నేవీ ఉద్యోగి ఎ.వి.రత్నం ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి 5 తులాల బంగారు ఆభరణాలు దొంగిలించారు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండో లైన్లోని సత్యసాయిబాబా మందిరానికి వెళ్లే దారిలో వనిత బొటిక్ పక్కనే ఉన్న నివాసంలో ఎ.వి.రత్నం తన భార్యతో కలిసి ఉంటున్నారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్న కుమారుడి వద్దకు గత నెల 24న వెళ్లారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం అక్కడి వాచ్మేన్ పరిశీలించగా ఇంటి కుడివైపు పోర్టికో పక్కన కిటికీ గ్రిల్ వంగి ఉండటాన్ని గమనించాడు. చోరీ జరిగిందన్న అనుమానంతో 112కు కాల్చేశాడు. రెండో పట్టణ ఎస్ఐ లక్ష్మి, ఫింగర్ ప్రింట్ సీఐ భరత్, క్లూస్ టీమ్ సభ్యులు ఘటనా స్థలికి చేరి పరిశీలించారు. ఇంటికి సమీపంలోనే సీసీ కెమెరాలుండటం, కారుపై కాలిబూట్ల మరకలు ఉండటం గమనించారు. ఈలోగా ఎ.వి.రత్నం బావమరిది సిమ్మ రాజశేఖర్ వచ్చి లోపలికి వెళ్లి చూడగా బీరువా లోపల హ్యాండ్బ్యాగులు, దుస్తులు, ఇతర వస్తువులు చెల్లాచెదురుగా ఉండటం గుర్తించారు. ఎ.వి.రత్నంతో ఎస్ఐ లక్ష్మి ఫోన్లో మాట్లాడగా.. బీరువాలో రుద్రాక్షలు కూడిన బంగారు గొలుసు, నల్లపూసల తాడు, కొంత వెండి సెంటిమెంట్ ప్రకారం దాచుకున్నామని, మిగతాదంతా బ్యాంకు లాకర్లలో దాచామని చెప్పారు. 4 నుంచి 5 తులాల బంగారం చోరీకి గురై ఉండవచ్చన్నారు. ఇంటి యజమానులు రాకపోవడంతో ప్రస్తుతానికి కేసు నమోదు కాలేదని సీఐ ఈశ్వరరావు చెప్పారు. -
సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఇంటర్నెట్ భద్రతపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఎస్పీ కె.వి.మహేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. ఫిబ్రవరి 11న ‘సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవం’ పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అవగాహన ప్రచార పోస్టర్ను సోమవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచి ఇంటర్నెట్ కోసం అనే థీమ్తో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, డీఐఓ కిరణ్కుమార్, ఏడీఐఓ విజయబాబు, ఎల్డీఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఎస్పీ గ్రీవెన్స్కు 53 వినతులు
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార వేదిక (గ్రీవెన్సు)కు 53 వినతులు అందాయి. అదనపు ఎస్పీ కె.వి.రమణ అర్జీలు స్వీకరించి బాధితులతో నేరుగా మాట్లాడారు. సకాలంలో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. యాసిడ్ దాడి చేశారు.. 2024లో తనపై యాసిడ్ దాడికి యత్నించారని, 2025 అక్టోబరు 20న దుండగులు వచ్చి ఇంటికి నిప్పంటించారని, అంతా సీసీ ఫుటేజీలో నిక్షిప్తమైందని, ఇదే విషయమై 112 కాల్కు ఫిర్యాదు చేసినా, స్టేషన్కు లెక్కలేనన్ని సార్లు వెళ్లినా శ్రీకాకుళం రెండో పట్టణ పోలీసులు పట్టించుకోలేదని బాధితుడు గుడ్ల శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. -
జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఈ నెల 12 నుంచి మొదలుకానున్న అసెంబ్లీ సమావేశాలలో జాబ్ క్యాలెండర్పై ప్రకటన చేయాలని, నిరుద్యోగుల సమస్య పరిష్కారానికి మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులను అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే భర్తీ చేస్తామని, ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి రెండేళ్లు పూర్తవుతున్నా ఇంతవరకు హామీలను నిలబెట్టుకోలేదన్నారు. నిరుద్యోగ భృతి ఊసేలేదన్నారు. నెలకు పదివేల రూపాయలు భృత కల్పిస్తామని చెప్పిన కూటమి నాయకులు ఏకంగా వాలంటీర్ వ్యవస్థనే తొలగించారని మండిపడ్డారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం కాకుంటే మంత్రులు, కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో ఏఐవైఎఫ్ టౌన్ కన్వీనర్ వై.వేణు, ఏఐవైఎఫ్ నాయకులు వసంతరావు, అన్నాజీ, శ్రీనిధి, ఉపేంద్ర, రామోజీ, రామమూర్తి, రమేష్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్జీజీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడికి ఘన స్వాగతం
శ్రీకాకుళం అర్బన్: ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికై జిల్లాకు మొదటిసారిగా వచ్చిన రాయి వేణుగోపాల్కు సంఘ నాయకులు, ఉద్యోగులు శ్రీకాకుళం సింహద్వారం వద్ద ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి డే అండ్ నైట్ కూడలి, పాతబస్టాండ్ మీదుగా ఎన్జీవో కార్యాలయం వరకు ర్యాలీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో వేణుగోపాల్ మాట్లాడుతూ సంఘ సభ్యుడిగా ప్రస్తానం మొదలై రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కావడం వెనుక చౌదరి పురుషోత్తంనాయుడు, హనుమంతు సాయిరాంలతో కృషితో పాటు ఉద్యోగుల మద్దతు ఎంతో ఉందన్నారు. అనంతరం వేణుగోపాల్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు జయరావు, పూజారి జానకిరాం, బడగల పూర్ణచంద్రరావు, రాధాకృష్ణ, జగన్మోహనరావు, నక్క రమణమూర్తి, శ్రావణి, ఉపేంద్ర, జి.లలిత, హైమవతి, బి.గోపాల్, టి.శ్రీనివాసరావు, వివిధ సంఘాల ప్రతినిధులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. -
పీజీఆర్ఎస్కు వినతుల వెల్లువ
శ్రీకాకుళం పాతబస్టాండ్: అర్జీలన్నింటినీ పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వీ లక్ష్మణమూర్తి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయదేవితో కలిసి 145 అర్జీలు స్వీకరించారు. అయితే కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర ఉన్నాతాధికారులు హాజరుకాకపోవడంతో వినతిదారులు నిరాశ చెందారు. వినతుల్లో కొన్ని.. ● ఎటువంటి అవకతవకలు జరగకపోయినా ఎంక్వయిరీ పేరిట వచ్చి నోటీసులు ఇచ్చారని అరసవిల్లి చౌక ధరల దుకాణం మహిళా రేషన్ డీలర్ కొండ్రి విజయలక్ష్మి వాపోయారు. రాజకీయ కక్షతో తనను తొలగించేందుకు చూస్తున్నారని వినతిలో పేర్కొన్నారు. ● శ్రీకాకుళం మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయ పరిధిలోని రైల్వే రిజర్వేషన్ కౌంటర్ పనివేళల మార్పు సరికాదని శ్రీకాకుళం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు వినతిపత్రం అందించారు. ● గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో వక్ఫ్ భూములపై ఇచ్చిన నోటిపికేషన్ నిలుపుదల చేయాల జిల్లా ముస్లిం కమ్యూనిటీ సభ్యులు కోరారు. వైఎస్సార్ సీపీ మైనారిటీ విభాగం అధ్యక్షుడు బేగ్, మహ్మద్ రఫీ, అమీర్ పాల్గొన్నారు. ● శ్రీముఖలింగేశ్వర క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినం నాడు సాధారణ భక్తులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేయాలని వంశపారంపర్య అర్చకుడు ఎన్.రాజశేఖరం కోరారు. ● ఆమదాలవలస మండలం చింతలపేట పంచాయతీ దండింవలసలో కాలువను కప్పి రోడ్డు వేయడంతో సాగునీరు అందని పరిస్థితి ఏర్పడిందని పరిసర ప్రాంత రైతులు విన్నవించారు. -
సుందరరావును అభినందించిన కృష్ణదాస్
నరసన్నపేట: రావులవలసకు చెందిన పైల సుందరరావును మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అభినందించారు. సుందరరావు గ్రూప్–1 పరీక్షలో సత్తా చాటి డీఎస్పీగా ఎంపికై న విషయం విదితమే. డీఎస్పీగా ఎంపికై న సుందరరావు మర్యాద పూర్వకంగా సోమవా రం ధర్మాన కృష్ణదాస్ను మబగాంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు కృష్ణదాస్ శాలువ తో సత్కరించారు. నిరుపేద కుటుంబం నుంచి గ్రూప్–1 పరీక్షలో సత్తా చాటి ఉన్నత కొలువు సాధించడం గొప్ప విషయమని కృష్ణదాస్ అన్నారు. అలాగే సుందరరావు తండ్రి పైల రాజారావును అభినందించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు మడ్డు కృష్ణ, పంచిరెడ్డి సత్యం, పంచిరెడ్డి శివ, పల్లి వెంకటేష్, ముద్దాడ గోపి, మడ్డు అమ్మన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. 23 వరకు స్మార్ట్ మీటర్స్ పఖ్వాడా అరసవల్లి: విద్యుత్ వినియోగదారులకు అత్యాధునిక సాంకేతిక సేవలు, ప్రీపెయి డ్ మీటర్ల వినియోగంపై అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యా ప్తంగా ‘స్మార్ట్ మీటర్స్ పఖ్వాడా’ పేరిట ఈనెల 9 నుంచి 23 వరకు పక్షోత్సవాలను నిర్వహిస్తున్నట్లుగా విద్యుత్ శాఖ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి ప్రకటించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల ద్వారా విద్యుత్ వినియోగం ఎంతమేర అవుతుందో అనే సమాచారం కూడా మొబైల్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చునన్నారు. ఈ పక్షోత్సవాల్లో విద్యుత్ వినియోగదారుల కోసం వివిధ ప్రాంతాల్లో అవగాహన సదస్సులు, మొబైల్ యాప్ ఇన్స్టాలేషన్ కేంద్రాలు, మీటర్ల పనితీరుపై ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించనున్నట్లుగా ఆయన వివరించారు. సందేహాల నివృత్తికి టోల్ఫ్రీ నంబర్ 1912ను కూడా సంప్రదించవచ్చునన్నారు. 11న వైఎస్సార్సీపీ యువజన విభాగం సమావేశం శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ఉత్తరాంధ్ర వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 11వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు విశాఖపట్నం ఎండాడ లా–కాలేజ్ రోడ్డులోని పార్టీ కార్యాలయంలో యువజన విభాగం సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంవీ స్వరూప్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సమావేశానికి వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా ముఖ్య అతిథిగా హాజరవ్వనున్నట్లు తెలిపారు. ఉత్తరాంధ్రలో యువజన విభాగం కార్యకలాపాల సమీక్ష, భవిష్యత్ కార్యాచరణ, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి యువజన విభాగం రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ సభ్యులు, నియోజకవర్గం, మండలం డివిజన్ స్థాయి అధ్యక్షులంతా హాజరవ్వాలని కోరారు. -
40 రోజులు.. 20 చోరీలు
● జిల్లాలో ఆగని దొంగతనాలు ● స్వైర విహారం చేస్తున్న దొంగలు ● భయాందోళనలో ప్రజలుశ్రీకాకుళం క్రైమ్ : ఏడాది ప్రారంభమై నలభై రోజులవుతోంది. అప్పుడే జిల్లాలో 20 చోరీలు జరిగాయి. అటు ఇచ్ఛాపురం నుంచి ఇటు జేఆర్పురం వరకు దొంగలు వీర విహారం చేస్తున్నారు. ఇది అంతర్రాష్ట్ర ముఠా పనేనన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. తాళం వేసిన ఇళ్లు, ఒంటరి మహిళలు, వృద్ధులే కాక బంగారు దుకాణాలు, దేవాలయాలు, బ్యాంకులే వీరి లక్ష్యంగా కనిపిస్తోంది. అంతర్రాష్ట్ర ముఠా పనేనా..? గత ఏడాది జిల్లాలో దాదాపు 398 చోరీలు జరగగా రూ.3.82 కోట్ల సొత్తు పోయింది. చోరీలు అధిక శాతం చేసింది అంతర్రాష్ట్ర ముఠాల సభ్యులే. 57.5 శాతం ఉన్నది వారే. దుప్పట్లు, బూరలు, ప్లాస్టిక్ బొమ్మలు, ఎలక్ట్రికల్ వస్తువులైన హోంథియేటర్లు అమ్మడమే కాక పాడైపోయిన టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మెషీన్లు, ఫర్నిచర్లు కొంటామన్న నెపంతో ఊరూరా తిరిగి రెక్కీ చేయడమే వీరి పని. తర్వాత వరుస చోరీలు చేసి చెక్కేస్తారు. 2026లో దాదాపు 20 చోరీలు ఇప్పటికే జరిగాయి. గత మూడు రోజుల్లోనే నాలుగు చోరీలు జరిగాయి. దేవాలయాల్లో.. ● గత నెల 9న కాశీబుగ్గ చిన్నతిరుపతి ఆలయంలో ఆరున్నర తులాల బంగారం, 15 కిలోల వెండి రూ. 80 వేలు నగదు చోరీతో పాటు సీసీకెమెరాలు డీవీఆర్ చెరువులో పడేశారు. ● అదే రోజు కొత్తూరు మండలం పారాపురం సత్యసాయిబాబా గుడిలో 28 కిలోల వెండి పాదుకలు చోరీకి గురయ్యాయి. ● దీనికి ముందురోజే నరసన్నపేట సత్యవరం పాదాలమ్మ తల్లిగుడి, దూకుల పాడులోని జ్యోతి రామలింగేశ్వరస్వామి గుడిలో దొంగతనాలు జరిగాయి. వరుస దొంగతనాలు ● సోమవారం జిల్లాకేంద్రంలోని పీఎన్కాలనీ 2వ లైన్లో రిటైర్డ్ నేవీ ఉద్యోగి ఏవీ మూర్తి ఇంటిలో 4 తులాలకు పైగా బంగారం చోరీకి గురైంది. ● ఈ నెల 7న మందస మండలం బాలిగాంలో వరుస ఇళ్లల్లో దొంగలు చోరీకి పాల్పడి దాదాపు ఒకటిన్నర తులాల బంగారం, ఆరు తులాల వెండి కాజేశారు. ● అదే రోజు పలాస బత్తుల వీధిలో ఓ వృద్ధురాలికి మత్తు మందిచ్చి రూ. 2.50 లక్షల నగదు, పావు తులం బంగారం పట్టుకుపోయారు. ● అదే రోజు రోటరీ నగర్కు చెందిన సునీతా పాత్రో ఇంట్లోని బీరువాలో 5 తులాల బంగారం చోరీకి గురైంది. ఇళ్లకు వచ్చి మరీ ● గత నెల 5న ఆమదాలవలస చంద్రయ్యపేటలో మహిళను ఓ అగంతకుడు కత్తితో బెదిరించి రెండున్నర తులాల తాడు పట్టుకుపోయాడు. ● గత నెల 20న సారవకోట మండలం బద్రిగ్రామంలో పట్టపగలే మహిళ కాళ్లుచేతులు కట్టి 3 తులాల బంగారం చోరీ చేశారు. ● గతనెల 17న వజ్రపుకొత్తూరు మండలం పూండి–గోవిందపురంలో పంచాయతీ కార్యదర్శి శరత్చంద్రదొర ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి 75 తులాల వెండి, ఐదున్నరతులాల బంగారం, రూ. 90 వేలు నగదు చోరీ చేశారు. ● ఇదే పూండిలో ఓ బంగారం దుకాణంలో 18 తులాల బంగారు ఆభరణాలను మధ్యప్రదేశ్కు చెందిన ముఠా దోచుకుపోయింది. ● గత నెల 7న ఫాజుల్బేగ్పేటకు చెందిన గౌరీదేవి ఇంట్లో 2 తులాల బంగారం, రూ. 40 వేలు నగదు చోరీకి గురైంది. ● 10న ఇచ్ఛాపురం అప్పన్నపేటలో రామారావు ఇంట్లో తులంన్నర బంగారం చోరీకి గురయ్యాయి. టెక్కలి రూరల్: టెక్కలి పరిధిలోని పలు మొబైల్ షాపుల్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి ప్రయత్నిస్తుండటంతో యజమానులు భయాందోళనకు గురవుతున్నారు. సోమ వారం వేకువజామున స్థానిక అంబేడ్కర్ జంక్షన్ సమీపంలో ఉన్న గణేష్ మొబైల్ షాపులో సోమవారం వేకువ జామున దొంగతనానికి ప్రయత్నించగా యజమాని ఒక్కసారిగా కేకలు వేయడంతో పారిపోయాడు. ఈ నెల 5న కూడా ఓ చోరీ ప్రయత్నం జరిగింది. వస్తువులు చోరీకి గురి కాకపోవడంతో పోలీసులకు చెప్పలేదు. కానీ యజమానుల్లో మాత్రం భయం మెదులుతోంది. -
విద్యార్థి ఆకలి కేక
● పదో తరగతి విద్యార్థులకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక తరగతులు ● అల్పాహారం ఇవ్వని వైనం ● పైసా విదల్చని ప్రభుత్వం ● నీరసించిపోతున్న విద్యార్థులు వంద రోజుల ప్రణాళిక.. పదిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి.. వంద రోజుల ప్రణాళిక పాటించాలి.. ఉదయమంతా స్కూల్లోనే ఉండాలి.. అత్యధిక మార్కులు తెచ్చి తీరాలి.. విద్యాశాఖకు ఇచ్చిన లక్ష్యాలివి. కానీ ఈ లక్ష్య సాధనలో పిల్లలు పడుతున్న యాతన సర్కారు కంటికి కనిపించడం లేదు. పిల్లలు నీరసించిపోతారేమో.. కేవలం మధ్యాహ్న భోజనంతో పది గంటల పాటు ఎలా ఉంటారో.. అల్పాహారమైనా ఇద్దాం.. వంటి మంచి ఆలోచన ఒక్కటి కూడా ప్రభుత్వం చేయడం లేదు. ఫలితంగా పిల్లలు పొద్దుపోయే వేళకు నీరసించి ఇంటికి చేరుకుంటున్నారు. ఇది పరీక్షలపై ప్రభావం చూపుతుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్ఛాపురం రూరల్/ శ్రీకాకుళం: ప్రభుత్వ పాఠశాలల్లోని పదో తరగతి విద్యార్థులను వంద రోజుల ప్రణాళిక నరకయాతనకు గురిచేస్తోంది. ఈ ప్రణాళిక ప్రకారం పిల్లలు ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్తే సాయంత్రం 6 గంటల వరకు స్కూల్లోనే ఉండాలి. కానీ ఈ ప్రత్యేక తరగతుల నిర్వహణలో విద్యార్థులు నీరసించిపోతున్నారు. కనీసం స్నాక్స్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయకపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అల్పాహారం కోసం ప్రభుత్వం పైసా విదల్చకపోవడంతో పిల్లలు ఇబ్బంది పడుతూనే చదువుకోవాల్సి వస్తోంది. జిల్లాలో 410 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 21,284 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. వచ్చే నెల 16 నుంచి ప్రారంభించనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఎలాగైనా వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని ఉన్నతాధికారు లు ఒత్తిడి తెస్తున్నారు. ఉపాధ్యాయులు కూడా అదే స్థాయిలో ఉదయం 8 గంటల నుంచి, సాయంత్రం 6 గంటల వరకూ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. నీరసించిపోతున్న విద్యార్థులు వసతి గృహాల సౌకర్యం ఉన్న కేజీబీవీ, ఏపీ మోడల్ హైస్కూల్, గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులకు ఉదయం, సాయంత్రం సమయాల్లో ఆయా పాఠశాల యాజమాన్యం స్నాక్స్ సదుపాయం కల్పిస్తోంది. అయితే ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదివే పదో తరగతి విద్యార్థులకు మాత్రం ఈ సౌకర్యం లేకపోవడంతో ప్రత్యేక తరగతుల్లో నీరసించిపోతున్నా రు. కొంత మంది విద్యార్థులు ఇంటి వద్ద నుంచి తెస్తున్న స్నాక్స్ సరిపోవడం లేదు. దీంతో చాలా మంది పిల్లలు ఇంటికి వచ్చేటప్పటికి నీరసించి పోతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. దాతలపైనే ఆధారం పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల సమయంలో పౌష్టికాహారాన్ని అందించేందుకు గ్రామా ల్లోని దాతలు, స్వచ్ఛంద సంస్థలను ఆశ్రయిస్తున్నా రు ఉపాధ్యాయులు. గతంలో దాతలు ముందుకు రాని చోట్ల ఆయా పాఠశాలల్లోనే ఉపాధ్యాయులే కొంత సొమ్ము వేసుకొని విద్యార్థులకు అల్పాహారాన్ని అందజేశారు. పదో తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లి దండ్రులు కోరుతున్నారు. స్టడీ మెటీరియల్ సరఫరా చేయని ప్రభుత్వం టెన్త్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేయడం పరిపాటిగా వస్తోంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడాది మెటీరియల్ ఇవ్వలేదు. ఈ మెటీరియల్ తయారీకి ఐదు కోట్ల రూపాయలు లోపే ఖర్చవుతుందని ఉపాధ్యాయ సంఘం నేతలు చెబుతున్నారు. విద్యార్థులకు ఉపయోగపడే స్టడీ మెటీరియల్ సరఫరా చేయకుండా మానసిక ఒత్తిడికి గురయ్యేలా ప్రణాళికలు చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. నీరసంగా ఉంటోంది పదో తరగతి ప్రత్యేక తరగతుల్లో ఎక్కువ సమయం పాఠశాల ఆ వరణలో ఉంటున్నాం. అల్పాహారం లేకపోవడంతో చాలా ఇబ్బందిగా ఉంటుంది. అల్పాహారం అందిస్తే బాగుంటుంది, లేకుంటే నీరసం వస్తోంది. – జె.జాను, పదో తరగతి విద్యార్థిని, డొంకూరు దాతలు చేయూతనందిస్తే.. ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు అల్పాహారం అందజేసేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు మంజూరు కావడం లేదు. దాతలు స్పందించి చేయూతనందిస్తే అల్పాహారం అందించవచ్చు. – నరేంద్రనాథ్ పట్నాయక్, ఇంచార్జీ హెచ్ఎం, కొళిగాం హైస్కూల్, ఇచ్ఛాపురం విద్యార్థులకు స్నాక్స్ అందించాలి ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు ప్రభుత్వం రెండు పూటలా స్నాక్స్ అందించాలి. ఏపీ మోడల్ స్కూల్స్లోని పది విద్యార్థులకు స్నాక్స్ అందించేందుకు రూ.2,600 అందిస్తున్నారు. అయితే ప్రభుత్వ, పంచాయతీరాజ్, మున్సిపల్, ట్రైబల్ తదితర ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లోని విద్యార్థులను విస్మరించడం తగదు. – తమ్మినేని చందనరావు, ప్రధాన కార్యదర్శి, స్కూల్ టీచర్స్ అసోసియేషన్, శ్రీకాకుళం -
గురువుల మెడపై ఆటోమేషన్ కత్తి
● టెన్త్ పరీక్షలకు రాష్ట్రస్థాయి నుంచి ఇన్విజిలేషన్ బాధ్యతలు ● ఆరోగ్యం, కుటుంబ పరిస్థితులకు అతీతంగా విధులు ● దూర ప్రాంతాల్లో నియమించే అవకాశం ● ఆందోళన బాట పట్టాలని ఉపాధ్యాయుల యోచన శ్రీకాకుళం: చంద్రబాబు ప్రభుత్వం బాధ్యతలు స్వీ కరించిన తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయులపై అదనపు భారాలు మోపుతోంది. తాజాగా పదో తరగతి పరీక్షలకు ఇన్విజిలేషన్ బాధ్యతల విషయంలో మరింత కఠిన నిర్ణయం తీసుకుంది. ఏటా పదో తరగతి ఇన్విజిలేషన్ బాధ్యతలు జిల్లా స్థాయిలో విద్యాశాఖ అధికారుల ద్వారా చేపట్టడం పరిపాటి. ఈ సారి అలా కా కుండా ఆటోమేషన్ విధానంతో రాష్ట్రస్థాయి నుంచి ఇన్విజిలేషన్ నియామకాలు జరపాలని రాష్ట్ర అధికారులు నిశ్చయించి జిల్లాల నుంచి ఉపాధ్యాయుల సీనియారిటీ తదితర వివరాలను తీసుకున్నారు. ఆటోమేషన్ విధానం ద్వారా ఇన్విజిలేషన్ బాధ్యతలు కేటాయిస్తే దీర్ఘ అనారోగ్యాలతో బాధపడుతున్న వారు, కుటుంబ సమస్యలతో ఉన్నవారికి సైతం ఇన్విజిలేషన్ బాధ్యతలు పడే అవకాశాలు ఉంటాయి. అలాగే సుదూర ప్రాంతాల్లో ఇన్విజిలేషన్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఇలాంటి విధానం పూర్తి అసంబద్ధమని ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్ర అధికారులకు చెబుతున్నా వారు ఏమీ పట్టించుకోకుండా ఇదే విధానాన్ని అవలంబించాలని కసరత్తు చేస్తుండడంతో జిల్లాల్లో కూడా ఆందోళన బాట పట్టాలని ఉపాధ్యాయులు యోచిస్తున్నారు. -
కుక్క అడ్డు రావడంతో..
● అదుపు తప్పిన బైక్ ● యువకుడు దుర్మరణం నందిగాం: పెద్దతామరాపల్లి–తూముకొండ రహదారిలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. నందిగాం పోలీసులు , గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. హుకుంపేటకు చెందిన ముద్దాడ కుమారికి సంతబొమ్మాళి మండలం పాలతలగాంకు చెందిన వ్యక్తితో వివాహం జరిగి కుమారుడు పుట్టాక మనస్పర్థల కారణంగా విడిపోయారు. అప్పటి నుంచి కుమారుడు ఖగేశ్వరరావు(23)తో కలిసి కన్నవారింట హుకుంపేటలోనే నివసిస్తోంది. ఖగేశ్వరరావు తాత కోనారి బైరాగి ఇంట దేవుడి సంబరం జరుగుతోంది. సంబరానికి అవసరమైన శతమానం తీసుకురావాలని ఖగేశ్వరరావుకు తల్లి చెప్పింది. దీంతో ఖగేశ్వరరావు ద్విచక్ర వాహనంపై టెక్కలి వెళ్లి శతమానం కొనుక్కొని తిగిరి హుకుంపేట వస్తుండగా కర్లపూడి వద్ద కుక్క అడ్డురాగా సడెన్ బ్రేక్ వేశాడు. బండి నుంచి జారిపడటంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. కూలి పనులు చేస్తు డిగ్రీ వరకు చదివించిన కుమారుడు ఇలా అర్ధంతరంగా మృతిచెందడంతో తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ మేరకు తల్లి కుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై షేక్ మహమ్మద్ అలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిగాంలో దొంగల హల్చల్ మందస: బాలిగాం గ్రామంలో దొంగలు హల్చల్ చేశారు. పలు ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డారు.శనివార రాత్రి కిల్లి శారదమ్మ ఇంట్లో తులమున్నర బంగారం, వల్లభ భూదేవి ఇంట్లో ఆరు తులాల వెండి పట్టుకుపోయా రు. మార్పు భుజంగరావు ఇంట్లో బీరువాలను తెరిచి చిందర వందరగా పడేశారు. ఆదివారం విషయం వెలుగు చూడటంతో కాశీబుగ్గ రూరల్ సీఐ తిరుపతిరావు, మందస ఎస్ఐ కృష్ణప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. -
● అరసవల్లికి భక్తుల వరుస..
ప్రత్యక్ష దైవం అరసవల్లి ఆదిత్యాలయానికి భక్తులు పోటెత్తారు. మాఘమాసం రెండో ఆదివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. పలువురు భక్తులు ఆరోగ్యం కోసం భక్తులు సూర్యనమస్కారాల పూజలు చేయించుకున్నారు. మరోవైపు, ఎండ కారణంగా క్యూలైన్లలో పలువురు భక్తులు అవస్థలు పడ్డారు. ఆలయంలో ప్రత్యేక పూజలు సందర్భంగా ఆదివారం ఒక్క రోజే రూ.21,32,969 ఆదాయం వచ్చినట్లు ఈఓ కె.ఎన్.డీ.వీ.ప్రసాద్ తెలిపారు. టికెట్ల రూపంలో రూ.11,33,100, పూజలు, విరాళాలు రూపంలో రూ.2,51,239, ప్రసాదాల రూపంలో రూ.3,20,885, వివిధ రకాల ఆన్లైన్ సేవల ద్వారా రూ.4,27,745 ఆదాయం వచ్చినట్లు వివరించారు. – అరసవల్లి -
చెలరేగుతున్న చోరులు
కిక్కిరిసిన బస్సులు..● ఆర్టీసీ బస్సుల్లో చేతివాటం చూపుతున్న దొంగలు ● ఆదివారం నరసన్నపేట కాంప్లెక్స్లో ఇద్దరు పర్సుల చోరీ నరసన్నపేట: నరసన్నపేట ఆర్టీసీ బస్టాండ్లో ఆదివారం ఉదయం 10.15 సమయంలో విశాఖ వెళ్లేందుకు బస్సు వచ్చి ఆగింది. గంట నుంచి బస్సు కోసం ఎదురు చూస్తున్న జమ్ముకు చెందిన నలుగురు మహిళలు బస్సు ఎక్కేందుకు ప్రయత్నించారు. ఒకేసారి పదుల సంఖ్యలో ప్రయాణికులు బస్సు ఎక్కేందుకు రావడంతో వీరు మాత్రం లోపలికి వెళ్లలేకపోయారు. కొద్ది సమయం తరువాత బ్యాగుల్లో ఉన్న వస్తువులు సరిచూసుకోగా పర్సులు కనిపించలేదు. దీంతో ఆర్టీసీ ఎస్ఎం వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో తానేమీ చేయలేనని, మీరే తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడంతో మహిళలు ఆందోళన చెందారు. ఉచిత బస్సు అని వస్తే ఇలా పర్సులు పోతున్నాయని లబోదిబోమన్నారు. తన పర్సులో వెయ్యి రూపాయలు, ఆధార్కార్డు ఉన్నాయని ఒక మహిళ చెప్పగా.. మొబైల్ ఫోనుతో పాటు ఆధార్ కార్డు, ఏటీఎం కార్డు పోగొట్టుకున్నట్లు మరో మహిళ వాపోయారు. నిత్యం ఇదే తంతు.. నరసన్నపేట ఆర్టీసీ బస్టాండ్లో మహిళల వస్తువులు, పర్సులు తరచూ చోరీకి గురవుతున్నాయి. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో ఆక్యుపెన్సీ బాగా పెరిగింది. దీనికి తగ్గట్టుగా ఆర్టీసీ బస్టాండ్లలో భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో మహిళలు నష్టపోతున్నారు. ప్రయాణికుల మాదిరిగా దొంగలు రద్దీలోకి చొరబడి చేతివాటం చూపుతున్నారు. అయితే ఈ చోరీల విషయం పోలీసుల వరకూ వెళ్లడం లేదు. ఇదే అదునుగా దొంగలు చెలరేగిపోతున్నారు. సీసీ కెమెరాలు ఎక్కడ..? ప్రయాణికుల (మహిళా) రద్దీ బాగా పెరిగిన నేపథ్యంలో ఆర్టీసీ బస్టాండ్ల్లో విధిగా నిఘా పెంచాలని స్థానికులు కోరుతున్నారు. సీసీ కెమెరాలు అమర్చాలని, భద్రతా చర్యలు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లాలో ప్రముఖ వ్యాపార కేంద్రం కావడం, నరసన్నపేటకు ఆనుకొని పరిసర గ్రామాలు అధికంగా ఉండటంతో నిత్యం బస్టాండ్ రద్దీగా ఉంటోంది. ఈ పరిస్థితుల్లో ఆర్టీసీ యాజమాన్యం తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. బస్టాండ్లలో ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటోంది. బస్సులు ఎక్కేటప్పుడు కొందరు చేతివాటం చూపించవచ్చు. ముఖ్యంగా మహిళలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. బంగారు ఆభరణాల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. గడిచిన రెండు రోజుల నుంచీ నరసన్నపేట బస్టాండ్ వద్ద నిఘా పెంచాం. – బలివాడ గణేష్, ఎస్సై, నరసన్నపేట -
నీరు రాదోయి!
ఖాళీ కుళాయి.. ● మూడు నెలలుగా టి.బరంపురం పంచాయతీకి అందని తాగునీరు ● తీవ్రంగా ఇబ్బంది పడుతున్న స్థానికులుఇచ్ఛాపురం రూరల్: మండలంలోని టి.బరంపురం పంచాయతీ పరిధిలో ఉన్న కొత్త శాసనాం, పాత శాసనాం, టి.బరంపురం గ్రామ ప్రజలు మూడు నెలలుగా మంచినీటి కోసం అల్లాడిపోతున్నారు. జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికీ కుళాయి ఏర్పాటు చేసినా, వాటి నుంచి నీటి చుక్క కూడా రావడం లేదని పంచాయతీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు రాకపోవడంతో మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బోర్ల నుంచి స్వచ్ఛమైన నీరు రాకపోవడం, కుళాయిలు బంద్ కావడంతో పక్కింటి మోటారు బోర్లను ఆశ్రయిస్తున్నారు. పి.శాసనాం ప్రజలు స్థానిక బహుదా నదిలోని నీటిని అవసరాల కోసం వాడుకునే పరిస్థితి నెలకొంది. అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం శూన్యమేనని గ్రామ సర్పంచ్ కారంగి త్రినాథ్రెడ్డి వాపోయారు. ఎండాకాలం వస్తుండడంతో పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదం కనిపిస్తోంది. కనీసం తాత్కాలికంగా అయినా నీటి సరఫరా పునరుద్ధరించాలని, జల్ జీవన్ మిషన్, ఉద్దానం రక్షిత మంచినీటి పథకం కాగితాలకే పరిమితం చేయకుండా కార్యరూపం చూపించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మూడు నెలల నుంచి ఉద్దానం మంచినీరు రావడం లేదు. పలుమార్లు సర్పంచ్కు ఫిర్యాదు చేశాం. తాగేందుకు పక్కింటి వారిని బతిమలాడుకుంటున్నాం. ఇంటింటికీ కుళాయి నుంచి ఇప్పటి వరకు చుక్క నీరు కూడా రాలేదు. అధికారులు స్పందించి నీరు ఇప్పించాలి. – బి.ధనలక్ష్మి, కె.శాసనాం పంచాయతీకి ఉద్దానం రక్షిత మంచినీటి పథకం ద్వారా నీరు రాక సుమారు వంద రోజులవుతోంది. పలుమార్లు సంబంధిత అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఫిర్యాలు చేసినా స్పందించడం లేదు. మూడు గ్రామాల ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. – కారంగి త్రినాథ్, సర్పంచ్, టి.బరంపురం టి.బరంపురం పంచాయతీకి తాగునీరు అందడం లేదన్న విషయం మా సిబ్బందిని అడిగి తెలుసుకున్నాను. ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకుండా తక్షణమే పైప్లైన్ మరమ్మతులు చేపట్టి రెండు రోజుల్లో పంచాయతీ ప్రజలకు తాగునీరు ఇప్పించేందుకు కృషి చేస్తాం. – చైతన్య, జేఈ. ఉద్దానం రక్షిత మంచినీటి పథకం -
బతుకుల్లో చీకటి
నందిగాం/టెక్కలి రూరల్: ప్రాణాలు కాపాడుకోవడానికి ఆస్పత్రికి వెళ్తుంటే మృత్యువు దారి కాచి దాడి చేసింది. ఎక్కడో ఒడిశా నుంచి శ్రీకాకుళంలోని ఆస్పత్రికి వెళ్దామని బయల్దేరిన వారిని చావు పలకరించింది. నందిగాం సమీపంలో శనివారం అర్ధరా త్రి దాటాక జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. ఐదుగురు గాయపడ్డారు. మృతులు ఒడిశా వాసులు. పోలీ సులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా సున్నాపురానికి చెందిన వాసుపల్లి దాలయ్య, వాసుపల్లి ముత్యా లమ్మ భార్యాభర్తలు. సముద్రంలో చేపల వేట చేసుకుంటూ జీవనం గడుపుతుంటారు. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. దాలయ్యకు పక్షవాతం రావడంతో భార్య, కుటుంబసభ్యులు శనివారం సాయంత్రం బరంపురం ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం శ్రీకాకు ళం జెమ్స్కు వెళ్లాలని సూచించారు. దీంతో భార్య ముత్యాలమ్మ, గ్రామానికి చెందిన దగ్గరి బంధువులు వాసుపల్లి మోహినమ్మ(50), డొంక రామారావు(39), బైపల్లి చంద్రమణి(40), వాసుపల్లి నీ లాద్రి(31), బుడ్డ భారతి(19)తో కలిసి స్కార్పి యో వాహనంలో బయల్దేరారు. పులకల వెంకటరావు డ్రైవింగ్ చేశారు. రోడ్డు పక్కన మృత్యు శకటం.. బండి అర్ధరాత్రి దాటాక నందిగాంకు చేరుకుంది. నందిగాం ఫ్లై ఓవర్ వంతెనకు కొద్ది దూరంలో హైవేపై మధ్యప్రదేశ్కు చెందిన ఐచర్ వ్యాన్ బ్రేక్ డౌన్ అయ్యి నిలిపి ఉంచారు. దీని చుట్టూ హైవే సిబ్బంది స్టాపర్లు కూడా ఏర్పాటు చేశారు. రోగి తో వస్తున్న స్కార్పియో వాహనం రాత్రి 2.45 గంటల సమయంలో ఆగి ఉన్న వ్యాన్ను బలంగా ఢీకొట్టి అదుపు తప్పి డివైడర్ను సైతం ఢీకొట్టింది. దీంతో స్కార్పియోలో అనారోగ్యానికి గురై ఉన్న వాసుపల్లి దాలయ్య, వాసుపల్లి మోహినమ్మ(50) అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశారు. దాలయ్య భార్య ముత్యాలమ్మ, రామారావు, చంద్రమణి, నీలాద్రి డ్రైవర్ వెంకటరావుకు తీవ్ర గాయాలయ్యాయి. భారతి సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన హైవే పెట్రోలింగ్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నందిగాం ఎస్ఐ షేక్ మహమ్మద్ ఆలీ సిబ్బందితో ప్రమాద స్థలానికి చేరుకొని క్షతగాత్రులను, మృతులను 108 వాహనం, హైవే అంబులెన్స్లో టెక్కలి జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు అక్కడ చికిత్స అందిస్తూ మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిఫర్ చేయగా బంధువులు బరంపురం ఆస్పత్రికి తరలించారు. భారతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిగాం ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకే గ్రామానికి, ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్ద రు మృతి చెందడం, మరో ఐదుగురు గాయాల పాలవ్వడంతో సున్నాపురం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతి చెందిన వాసుపల్లి మోహినమ్మ మృతి చెందిన వాసుపల్లి దాలయ్య నందిగాం వద్ద ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొన్న స్కార్పియో ఇద్దరు మృతి, ఐదుగురికి గాయాలు అర్ధరాత్రి దాటాక ప్రమాదం మృతులు ఒడిశా వాసులు -
బకాయిలు తీర్చరూ..!
● బడాయిల సర్కారు.. అరసవల్లి: చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆరోగ్య శ్రీ పథకంపై నీలి నీడలు కమ్ముకుంటూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు బకాయిలు పేరుకుపోవడం, రోగులు ఇబ్బంది పడడం, నెట్వర్క్ ఆస్పత్రుల వారు ఆందోళనలు నిర్వహించడం పరిపాటిగా మారిపోయింది. తాజాగా నెట్వర్క్ ఆస్పత్రులకు రూ.80 కోట్ల వరకు బకాయిలు పెట్టేసినట్టు తేలింది. ఏప్రిల్ నుంచి కొత్త యూనివర్సల్ హెల్త్ పాలసీ వస్తుందన్న ఊహాగానాల నేపథ్యంలో ఆరోగ్య శ్రీ అమలు ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. దీనిపైనే ఆధారపడి ఉన్న వైద్యమిత్రల భవిష్యత్ కూడా అయోమయంలో పడింది. దాదాపు రెండు దశాబ్దాలుగా లక్షలాది మంది పేద, సామాన్య వర్గ రోగులకు ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు, ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఈ పథకం అచ్చంగా వైఎస్సార్ మానస పుత్రిక. ఈ పథకం కింద స్వస్థత పొందిన ప్రతి ఒక్కరికీ వైఎస్సార్ గుర్తుకు వస్తారు. కానీ అది చంద్రబాబు ప్రభుత్వానికి గిట్టడం లేదు. ఎలాగైనా ఆ పేరును జనం మనసులోంచి తొలగించాలని ఈ పథకానికి ఎన్టీఆర్ వైద్యసేవగా పేరు మార్చారు. అంతటితో ఆగకుండా త్వరలో యూనివర్సల్ హెల్త్ పాలసీని తీసుకురానున్నారు. ఇందుకోసం చంద్రబాబు ప్రభుత్వం చర్య లు మొదలుపెట్టింది. రానున్న ఏప్రిల్ నుంచే ఈ ఇన్సూరెన్స్ స్కీం వర్తించేలా మార్గదర్శకాల విడు దలకు సన్నాహాలు చేస్తోంది. ఈ తరుణంలో ఇప్పటివరకు పలు నెట్వర్క్ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ క్రింద చెల్లింపులు బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోయాయి. అలాగే ఈ నెట్వర్క్ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న ఆరోగ్యశ్రీ వైద్యమిత్రల ఉద్యోగ భవితవ్యం కూడా ఆందోళనలో పడేసింది. ఆందోళనలో వైద్యమిత్రలు జిల్లాలో 6,39,427 ఎన్టీఆర్ వైద్యసేవ హెల్త్ కార్డుదారులున్నాయి. మొత్తం 40 నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఈ మేరకు ఈ పథకం కింద ప్రొసీజర్లను అమలు చేస్తున్నారు. వీటిలో టెక్కలి జిల్లా ఆస్పత్రి, నరసన్నపేట ఏరియా ఆస్పత్రి, 13 కమ్యూనిటీ ఆస్పత్రులు, శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రి, రిమ్స్ మెడికల్ కాలేజి ఆస్పత్రిలతో పాటు మరో 23 ప్రైవేటు ఆస్పత్రులు, కార్పోరేట్ ఆస్పత్రులున్నా యి. వీటిల్లో సుమారు 87 మంది వైద్యమిత్రలు గత రెండు దశాబ్దాల నుంచి రోగులకు సలహాలు, సూచనలతో పాటు పథకం అమలుకు సేవలందిస్తున్నారు. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి వైద్యమిత్రల ఉపాధి ప్రశ్నార్థకమవుతోంది. ఇప్పుడు ఏకంగా పథకాన్ని నిర్వీర్యం చేస్తే వీరి పరిస్థితి ఏంటో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పేరుకుపోయిన రూ.80 కోట్ల బకాయిలు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక వ్యూహం ప్రకా రం ఆరోగ్యశ్రీ పథకాన్ని మంగళం పాడించేలా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ముందుగా ఆయా నెట్వర్క్ ఆస్పత్రులకు చెల్లించాల్సిన నిధులను బకాయిలుగా నిలిపివేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సు మారు రూ.2,800 కోట్ల వరకు బకాయిలుండడంతో ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పటల్స్ అసోసియేషన్ (ఆశా) ఆధ్వర్యంలో గత ఏడాది ఏప్రిల్, సెప్టెంబర్ నెలల్లో రెండు సార్లు నిరసనలకు దిగి ఏకంగా 20 రోజుల పాటు ఆరోగ్యశ్రీ సర్వీసులను నిలిపివేశారు. అలాగే ఈహెచ్ఎస్ సేవలను కూడా నిలిపివేశారు. దీంతో ప్రభుత్వం చర్చలు జరిపి కొంత మొ త్తాన్ని నిధులను విడుదల చేయడంతో సర్వీసులు ఆయా ప్రైవేటు ఆస్పత్రుల్లో కొనసాగుతున్నాయి. అయితే ఇంకా జిల్లాలో 13 నెట్వర్క్ ఆస్పత్రులకు సుమారుగా రూ.80 కోట్ల వరకు నిధులు చెల్లించాల్సి ఉంది. ఓ నెట్వర్క్ ఆస్పత్రిలో ఎన్టీఆర్ వైద్యసేవల కియోస్క్లో పనిచేస్తున్న వైద్యమిత్ర గోప్యంగా ఆదేశాలు ఆరోగ్యశ్రీ పేరును పూర్తిగా తొలగించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సల్ హెల్త్ పాలసీని తీసుకొస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు జీఓ నంబర్ 162 ను మాత్రమే విడుదల చేసి, పాలసీకి సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకాలను బయటపెట్టలేదు. రూ.2 లక్షల వరకు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపై మొత్తాన్ని ఇన్స్యూరెన్స్ కంపెనీల ద్వారా చికిత్స అందించాలనే ప్రతిపాదనపై అధికారులకు శిక్షణను ఇటీవల ఇచ్చారు. ఇప్పటికే ఆస్పత్రుల సిబ్బంది వివరాలు రిజిస్టర్ చేశారు. అయితే తక్కువ ప్యాకేజిల కారణంగా ఇన్స్యూరెన్స్ కంపెనీలు ముందుకు రావడం లేదని సమాచారం. -
తప్పిదం... యాతన.. విముక్తి
వజ్రపుకొత్తూరు రూరల్: కంచెలో ఇరుక్కున్న ఎలుగు, బయట పడేందుకు అది పడిన యాతన, దాన్ని బయటకు తీసేందుకు పొద్దంతా సాగిన ఆపరేషన్ భల్లూకంతో ఉద్దానం ఉలిక్కిపడింది. మండలంలోని చీపురపల్లి పంచాయతీ పరిధిలో గల అనకాపల్లి పరిసర జీడి తోటల్లో రైతులు పంట రక్షణకు ఏర్పాటు చేసిన ఇనుప కంచెలో ఓ భల్లూకం శనివారం రాత్రి ఇరుక్కుంది. శనివారం రాత్రి తల్లి ఎలుగుబంటితో కలిసి రెండు పిల్ల ఎలుగులు జీడి తోటల్లో సంచరిస్తూ అటుగా రాగా.. పిల్ల ఎలుగు ఇసుప కంచెల్లో ఇరుక్కుపోయింది. బయటపడేందుకు రాత్రంతా ప్రయత్నించిన ఆ ఎలుగు పిల్ల బయటకు రాలేక నరకం చూసింది. ఆదివారం ఉదయం రైతులు గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ మేరకు జిల్లా అటవీ శాఖ అధికారి ఎస్.వెంకటేష్ పర్యవేక్షణలో ఆపరేషన్ భల్లూకం చేపట్టారు. ఆపరేషన్ భల్లూకం సాగిందిలా.. ● ఎలుగు ఇనుప కంచెలో చిక్కిందన్న వార్తను విశాఖపట్నం జూ అధికారులకు సమాచారం అందించడంతో అక్కడ నుంచి మత్తు ఇంజెక్షన్ ఇచ్చే వైద్య నిపుణులు పి.భానుబాబు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ● ఉదయం 7 గంటల నుంచి ఎలుగు కదలికలను పరిశీలించిన అధికారులు ముందుగా విశాఖ జూ వైద్యులు సాయంతో మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. అప్పటికే తల్లి ఎలుగు మరో పిల్ల వెళ్లిపోయాయి. ● అదుపులోకి వచ్చిన ఎలుగు గాయాలతో ఉండటంతో వైద్య చికిత్సలు అందించి ఎట్టకేలకు సురక్షితంగా బోనులో బంధించి విశాఖపట్నం జూకి తరలించారు. ● ఈ ప్రక్రియ అంతా ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సాగింది. ● ఆపరేషన్ భల్లూకంలో సబ్ డీఎఫ్ఓ ఏవీ నాగేంద్ర, ఫారెస్ట్ రేంజర్ ఎ.మురళీకృష్ణంనాయుడు, ఫారెస్టు సిబ్బంది, జూ సిబ్బంది పాల్గొన్నారు. బాబోయ్ భల్లూకాలు.. ఉద్దానంలో భల్లూకాల అలజడి తగ్గడం లేదు. జీడి తోట పనుల సమయంలో ఎలుగులు సంచరించడంతో రైతులకు మళ్లీ భయం పట్టుకుంది. అయితే ఎలుగుల భయం ఒకవైపు వెంటాడుతుంటే మరో వైపు కంచెకు చిక్కిన ఎలుగును చూసి భయపడినా అధికారులు బంధించడంతో ఈ ప్రాంత వాసులు ఊపిరిపీల్చుకున్నారు. కంచెలో ఇరుక్కున్న ఎలుగు పిల్ల రాత్రంతా నరకయాతన ఆపరేషన్ భల్లూకం చేపట్టిన అటవీ శాఖాధికారులు సురక్షితంగా విశాఖ జూకి తరలింపు -
కింజరాపు కుటుంబంతో జిల్లాకు ఒరిగిందేమీ లేదు
ఆమదాలవలస: సుదీర్ఘ రాజకీయ చరిత్ర గల కింజరాపు కుటుంబంతో జిల్లాకు ఒరిగిందేమీ లేదని వైఎస్సార్ సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ విమర్శించారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు జిల్లాకు చేసిన సేవలు శూన్యమన్నారు. ఇప్పటికై నా జిల్లాలో ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేయించి రుణం తీర్చుకోవాలని కోరుతూ కేంద్ర మంత్రికి రాసిన లేఖను ఆదివారం విడుదల చేశారు. అనంతరం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం 13 జిల్లాలు కలిగిన రాష్ట్రానికి 23 ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తే, మన జిల్లాకు ఒక్క సంస్థ కూడా రాకపోవడం మీ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. మూలపేట పోర్టును పక్కనపెట్టి రామాయపట్నం వద్ద బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు చేయడం చేతకానితనాన్ని చాటుతోందన్నారు. తాజా కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వ రంగ సంస్థల స్థాపనకు పలు ప్రతిపాదనలు ఉన్నాయని, వాటిని జిల్లాకు తీసుకొచ్చేలా చొరవ తీసుకోవాలని కోరారు. వంశధార ప్రాజెక్టు సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలన్నారు. గతంలో ఏపీ సీఎంగా పనిచేసినప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నేరడి బ్యారేజ్ విషయమై ఒడిశా సీఎంతో చర్చించారని గుర్తుచేశారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రమేష్ కుమార్, బూర్జ, సరుబుజ్జిలి మండల పార్టీ, ఆమదాలవలస పట్టణ పార్టీ అధ్యక్షులు ఖండాపు గోవిందరావు, బెవర మల్లేశ్వరరావు, పొడుగు శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పొన్నాడ చిన్నారావు, ముఖ్యనాయకులు దుంపల శ్యామలరావు, మామిడి రమేష్, ఈశ్వరరావు, బొడ్డేపల్లి నాగరాజు, ఎస్.తవిటినాయుడు, మన్మధరావు, దన్నాన అజయ్కుమార్, చిగురుపల్లి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం అర్బన్: స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సంఘ ప్రతినిధులు డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోని ఏపీ ఎన్జీజీవో కార్యాలయంలో ఆదివారం ఐక్య సమావేశం నిర్వహించారు. ఇటీవల మరణించిన 40 మంది ఉద్యోగులకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఉద్యోగ సంఘాల నాయకులు కలిసి ఇక మీదట జిల్లాలోని ఉద్యోగులకు బాసటగా నిలచి కలిసి పోరాడాలని తీర్మానించారు. అనంతరం ఏపీ ఎన్జీజీవో జాయింట్ సెక్రటరీ కూన వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగుల ఆత్మ గౌరవం దెబ్బతీసేలా కొందరు అధికారులు ప్రవర్తించటం తగదన్నారు. పదోన్నతులు, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘ ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
●సాంకేతిక పరిజ్ఞాన ‘ప్రవాహ్’ం
భువనేశ్వర్: క్రానికల్స్ ఆఫ్ టైమ్ ఇతివృత్తంతో భువనేశ్వర్లోని భారతీయ సాంకేతిక సంస్థ (ఐఐటీ) సంయుక్త సాంస్కృతిక, టెక్నోప్రెన్యూర్ షిప్ వార్షిక ఉత్సవం ప్రవాహ్ ఉత్సాహంగా సాగింది. నాలుగు రోజుల పాటు జరిగిన ప్రవాహ్ కార్యక్రమం సాంకేతికత, సంస్కృతి, వ్యవస్థాపకత సంగమాన్ని ప్రతిబింబించింది. డేటా సైన్స్ హ్యాకథాన్, జనరల్ క్విజ్, మార్కటస్ బిజినెస్ ఛాలెంజ్, ఫ్యాషన్ షో, స్టార్టప్ ఎక్స్పో, రోబో సాకర్, సాంస్కృతిక ప్రదర్శనలు, స్టార్ నైట్ వంటి విభిన్న కార్యక్రమాల మేళవింపుగా ఆకట్టుకుంది. ఐఐటీ భువనేశ్వర్ డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీపాద కర్మల్కర్, విద్యార్థి వ్యవహారాల డీన్ ప్రొఫెసర్ డాక్టర్ రాజేష్ రోషన్ దాస్, ప్రవాహ్ చైర్పర్సన్ డాక్టర్ జి.సంతోష్ కుమార్, స్టూడెంట్ జింఖానా అధ్యక్షుడు డాక్టర్ కోదండ రామ్ మంగిపూడి, ప్రవాహ్ సహ చైర్పర్సన్ డాక్టర్ బంకిమ్ చంద్ర మహంత హాజరైన ఈ కార్యక్రమానికి విద్యార్థి కందుల జోజి కుమార్ ప్రధాన సమన్వయకర్తగా వ్యవహరించాడు. -
ఇంకెన్నాళ్లీ తప్పుడు ఆరోపణలు..?
● దేవుడిని స్వార్థ రాజకీయాలకు వాడుకోవడం తగదు ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ నరసన్నపేట: స్వార్థ రాజకీయాలకు దేవుడిని వాడుకుంటూ ప్రతిపక్షంపై తప్పుడు ఆరోపణలు చేసి వాటిని నిజం అని ఒప్పించడానికి ఇంకెన్నాళ్లు మాయ మాటలు చెబుతారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ సూటిగా ప్రశ్నించా రు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని వాదించడానికి సిగ్గు లేదా చంద్రబాబూ, పవన్ కల్యాణ్, లోకేష్ అని మండిపడ్డారు. ఆయన ఆదివారం నరసన్నపేట పార్టీ కార్యాలయంలో విలేకరులతో మా ట్లాడారు. పవిత్రమైన తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని, చేపల ఆయిల్ వాడారని తీవ్రమైన ఆరోపణలు చేశారని విమర్శించారు. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అనుకొని సిట్ వేశారని, సీబీఐతో విచారణ జరిపించారని, తిరుమల అధికారులపై తీవ్రమైన ఒత్తిడి చేశారని పేర్కొన్నా రు. సీబీఐ నివేదికలో జంతువుల కొవ్వు ఉన్నట్లు నిరూపితం కాలేదన్నారు. ఈ నివేదికలు బహిరంగం కావడంతో తమ తప్పుడు ఆరోపణలు నిజం చేసేందుకు ఇప్పుడు నానా అవస్థలు పడుతున్నా రని అన్నారు. ఎప్పటికీ అబద్ధం నిజం కాదన్నా రు. దీన్ని ఇప్పటికై నా అంగీకరించి భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని లడ్డూ వ్యవహారంలో తప్పును అంగీకరించాలని హితవు పలికారు. ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లడ్డూ వ్యవహారం నుంచి దృష్టి మళ్లించడానికి వైఎస్సార్ సీపీ నాయకుల ఇళ్లపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. అక్రమ కేసులు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మున్ముందు దీనికి తప్పకుండా బదులు తీర్చుకుంటామని అన్నారు. సమావేశంలో కృష్ణదాస్తో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు, నరసన్నపేట, జలుమూరు ఎంపీపీలు ఆరంగి మురళి, వాన గోపి, పోలాకి, సారవకోట నాయకులు ముద్దాడ బైరాగినాయుడు, వరుదు వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
మన ప్రశాంతి ‘బంగారం’
● ఏషియన్ మహిళల సెపక్తక్రా చాంపియన్షిప్ పోటీల్లో విజేతగా నిలిచిన భారత జట్టు శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాకు చెందిన సెపక్తక్రా క్రీడాకారిణి గేదెల దుర్గాప్రశాంతి సత్తా చాటింది. ఆరో ఏషియన్ మహిళల అంతర్జాతీయ సెపక్తక్రా చాంపియన్షిప్లో భారత జట్టు విజేతగా నిలిచింది. జట్టు విజయంలో ప్రశాంతి కీలక పాత్ర పోషించడం గమనార్హం. క్రీడాకారిణి రాణించడంపై కలెక్టర్తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ప్రధాన కార్యదర్శి ఎం.సాంబమూర్తి, సలహాదారు పి.సుందరరావు మాస్టారు, సెపక్తక్రా అసోసియేషన్ శ్రీకాకుళం జిల్లా చైర్మన్ ఎమ్మెస్సార్ కృష్ణమూర్తితోపాటు, సంఘ ప్రతినిధులు, కోచ్ గాలి అర్జున్రెడ్డి, డీఎస్డీఓ ఎ.మహేష్బాబు, సీనియర్ క్రీడాకారులు తదితరులు సంతోషం వ్యక్తంచేశారు. దళిత నాయకులపై కేసులు సరికాదు టెక్కలి: దళితులు, దళిత నాయకులపై తప్పుడు కేసులు సరికాదని విదసం ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ బూసి వెంకట్రావు అన్నారు. రాష్ట్ర కమిటీ సభ్యుడు బోకర మోహన్రావు అధ్యక్షతన ఆదివారం టెక్కలిలో జిల్లా మహాసభలను నిర్వహించారు. జిల్లాలో టెక్కలి, పాతపట్నం మండలాల్లో దళితులు, దళిత నాయకుల పై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని దుయ్యబట్టారు. రెవెన్యూ అధికారుల పక్షపాత వైఖరితో దళితులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో భూ ఆక్రమణలు, ఆధిపత్య కులాల కబ్జాలపై ప్ర స్తావించారు. అంబేడ్కర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపు నిచ్చారు. అనంతరం వివిధ రకాల దళిత సమస్యలపై తీర్మానం చేశారు. శ్రీముఖలింగంలో బారికేడ్లు ఏర్పాటు జలుమూరు: శ్రీముఖలింగం శివరాత్రి ఉత్సవాలకు బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నామని ఆలయ ఈఓ కె.ఏడు కొండలు ఆదివారం తెలిపారు. ముందుగా ఆలయం రెండు వైపులా మాఢవీధుల గుండా బారికేడ్లు కట్టి అనంతరం ఆల యం ముందు, వెనుక భాగంలోనూ అవసరం మేర ఏర్పాటు చేయనున్నారు. విజయనగరం పైడితల్లి, అరసవల్లి దేవాలయాల నుంచి బారికేడ్లు తీసుకురానున్నారు. ఆలయంలో 12 సీసీ కెమెరాలు ఉండగా అదనంగా ఏడు సీసీ కెమెరాలు కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. శ్రీముఖలింగం శాశ్వత ధర్మకర్తకు ఆహ్వానం జలుమూరు: ఈ నెల 15 నుంచి 18 వరకు శ్రీముఖలింగంలో జరగనున్న శివరాత్రి ఉత్స వాలకు ఆలయ శాశ్వత ధర్మకర్త పర్లాఖిముండి మహారాణి కల్యాణి గజపతివర్మకు ఆహ్వానం అందించామని ఆలయ ఈఓ కె.ఏడుకొండలు ఆదివారం తెలిపారు. పర్లాఖిముండిలో ధర్మకర్త స్వగృహానికి అర్చకులు, కమిటీ సభ్యులతో వెళ్లి ఆహ్వానం అందించామన్నారు. శివరాత్రి రోజు రాత్రి జరిగే లింగోద్భవానికి ఏటా కల్యా ణి గజపతి వర్మ హాజరై స్వామికి బంగారు, వెండి పువ్వులతో ప్రత్యేక పూజలు,అభిషేకాలు చేయడం సంప్రదాయం. ఉల్లాసంగా రగ్బీ జిల్లా జట్ల ఎంపికలు టెక్కలి: ఈ నెల 13 నుంచి రెండు రోజుల పాటు గుంటూరులో జరగనున్న రాష్ట్ర స్థాయి మినీ జూనియర్ క్రీడా పోటీలకు సంబంధించి ఆదివారం టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో రగ్బీ జిల్లా జట్ల ఎంపికలు నిర్వహించారు. అండర్–12 విభాగంలో నిర్వహించిన ఈ ఎంపికల్లో భాగంగా 210 మంది బాలురు, బాలికలు హాజరయ్యారు. వీరిలో 12 మంది చొప్పున రెండు విభాగాల్లో ఎంపికలు నిర్వహించారు. ఎంపికైన క్రీడాకారులకు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డి.రామకృష్ణ ఆధ్వర్యంలో క్రీడా దుస్తులను అందజేశారు. -
శ్రీకాకుళం
కర్రీ.. నో వర్రీకర్రీ పాయింట్లు పెరుగుతున్నాయి. ఇదో ఉపాధిగా మారింది. –8లోనరసన్నపేట: వైఎస్సార్సీపీ గ్రామ కార్యకర్తలను పార్టీ కేంద్ర కార్యాలయంతో అనుసంధానం చేసే ప్రక్రియలో భాగంగా పార్టీ అనుబంధ సంఘాల కార్యవర్గాలను ఈ నెల 15వ తేదీలోగా డిజిటలైజేషన్ పూర్తి చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపు నిచ్చారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే పలు గ్రా మాల్లో గ్రామ కమిటీలను డిజిటలైజేషన్ చేయడంలో కార్యకర్తలు నిమగ్నమయ్యారని, కొన్ని చోట్ల పూర్తయ్యాయని మిగిలిన చోట్ల జాప్యం చేయకుండా పార్టీ ఇచ్చిన సూచనల మేరకు 15 నాటికి పూర్తి చేయలన్నారు. గ్రామ కమిటీల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యుల పేర్లు 5 నుంచి 10 వరకూ ఆన్లైన్లో పొందుపరచాలన్నారు. కనీసం ఒక్కో గ్రామం నుంచి 10 మందికి త క్కువ లేకుండా డిజిటలైజేషన్ చేయాలన్నారు. మహిళా, ఎస్సీసెల్, బీసీ సెల్, రైతు విభాగం, సోషల్మీడియా, విద్యార్థి విభాగం, యువజన విభాగం, గ్రామ బూత్ కమిటీల నుంచి కనీసం 5 నుంచి 9 మంది సభ్యులను ఆన్లైన్ చేయాలన్నారు. మండల అనుబంధ కమిటీలకు ప్రతి గ్రామం నుంచి 18 పేర్లు గ్రామ శాఖ అధ్యక్షులు తీసుకొని మండల పార్టీ అధ్యక్షులకు అందించాలని సూచించారు. డిజిటలైజేషన్ చేసేటప్పుడు విధిగా పేరు, తండ్రి పేరు, ఓటర్ ఐడీ, ఫొటో, ఫోన్ నంబర్ ఉండాలన్నారు. వీరికి పార్టీ నుంచి ఐడీ కార్డు వస్తుందని ఇన్స్యూరెన్స్ అమలు చేసే విధానం కొనసాగుతుందని తెలిపారు. నియోజకవర్గాల సమన్వయకర్తలు బాధ్యత తీసుకొని సకాలంలో పూర్తి చేయించాలన్నారు. హిరమండలం: ఒడిశా రాష్ట్రం హడ్డు బంగి నుంచి ఎచ్చెర్ల మండలానికి అక్రమంగా తరలిస్తున్న ఒడిశా యూరియాను విజిలెన్స్ ఎస్ఐ బి. రా మారావు, వ్యవసాయాధికారి బి.సంధ్య పట్టుకున్నారు. శనివారం హిరమండలం మండల కేంద్రంలోని సుభలయ సమీపంలో యూరియాతో వస్తున్న బొలేరో వాహనం పట్టుకున్నా రు. 60 బస్తాలు (45 కేజీలు), వాటి విలువ రూ.1,30,527 ఉంటుందన్నారు. ఎరువులు అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసి, అరుణసాయి ఎరువు షాపు వద్ద ఉంచినట్లు ఏఓ తెలిపారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా అభివృద్ధికి కీలకమైన పన్నుల వసూళ్లలో అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన వాణిజ్య పన్నుల శాఖ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన వర్చువల్గా పాల్గొని మాట్లాడారు. పన్ను చెల్లింపు ప్రక్రియను క్రమబద్ధీకరించడం ద్వారా జిల్లాను ఆర్థికంగా బలోపేతం చేయవచ్చని తెలిపారు. కాంట్రాక్టర్ల జీఎస్టీ చెల్లింపులు, బకాయిల రికవరీపై ప్రత్యేక దష్టి పెట్టాలని, బ్యాంకులు తమ వద్ద ఉన్న అటాచ్మెంట్ ఆర్డర్లను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. శ్రీకాకుళం క్రైమ్ : ఓ వైపు మందుబాబుల జేబులు గుల్ల అవుతుంటే.. మరోవైపు అధికార పార్టీ నాయకుల గల్లా పెట్టె లు కళకళలాడుతున్నాయి. మద్యం మహమ్మారి పట్టి సామాన్యుల కుటుంబాలు ధ్వంసమవుతుంటే.. అదే మద్యం దుకాణాలు పెట్టుకున్న ‘పెద్దల’ బ్యాంకు బ్యాలెన్సులు తెగ పెరుగుతున్నాయి. మద్యం ప్రభుత్వంతో పాటు నాయకులకూ ప్రధాన ఆదాయ మార్గంగా మారిపోయింది. అధికారికంగా దక్కించుకున్న దుకాణాలతో పాటు దానికి అనుబంధంగా బెల్టుషాపులను కూడా వారే ఏర్పాటు చేసుకుని మద్యం సరఫరా చేస్తుండడంతో ఊళ్లకు ఊళ్లు మత్తులో జోగుతున్నాయి. జిల్లాలో ఎచ్చెర్ల డిపో నుంచి 40 వాహనాల్లో రోజుకు సరాసరిన 5 వేల నుంచి 6 వేలకు పైగా లిక్కర్ కేసులు దుకాణాలకు, బార్లకు సర్దుబాటు చేస్తుండటం, రూ.2.50 కోట్ల నుంచి రూ.3. 50 కోట్ల సరాసరిన అమ్మకాలు సాగుతుండటం విశేషం. జిల్లాలో అధికారికంగా 176 దుకాణాలు ప్రైవేటు లైసెన్సుదారులు దక్కించుకు ని నడుపుతుండగా వీరికి లింకుగా 2500కు పైగా బెల్టుషాపులు నడుస్తున్నాయి. ఊరూరా దర్జాగా బెల్టుషాపులు నడుస్తుంటే సంబంధిత ఎకై ్సజ్ శాఖ అధికారులు చోద్యం చూస్తూ ‘పచ్చ’ నోట్ల మామూళ్లను సర్దేసుకుంటున్నారు. నిఘా వేసి పట్టాల్సిన ఎకై ్సజ్ టాస్క్ఫోర్స్ పోలీసులు, స్క్వాడ్ బృందాలు మిన్నకుండిపోవడంతో బెల్టుషాపులవారు ఇష్టారా జ్యంగా తాము చెప్పే రేటుకే మద్యం అన్న చందంగా రెచ్చిపోతున్నారు. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందిస్తామన్న చంద్రబాబు ఏడాదిన్నర పాలన కాకముందే ఎమ్మార్పీపై అదనంగా బాదేశారు. ఈ ఏడాది సంక్రాంతికి ముందు రూ. 10 పెంచుతూ ఉత్తర్వులు ఇవ్వడంతో పాత స్టాకుపై ఉన్న పాత ఎంఆర్పీ స్టిక్కర్పై అదనంగా వసూలు చేశారు. కొత్త స్టిక్కర్ అంటించినా కూడా అలవాటులో పొరపాటన్న చందంగా కొన్ని ప్రాంతాల్లో పిండేస్తున్నారు. వాస్తవానికి బీర్లు, బ్రీజర్లు, వైన్పై ఎమ్మార్పీ రేటు పెరగకపోయినా వాటిపై కూడా అదనంగా వడ్డించేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో దాదాపు 1091 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామ జనాభాను బట్టి 2 నుంచి 3 బెల్టుషాపులు అక్కడి టీడీపీ నేతల కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. కొన్ని గ్రామాల్లోనైతే వీధికొక బెల్టుషాపున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. షాపు దూరాన్ని బట్టి ఎమ్మార్పీపై రూ.20 నుంచి రూ.50ల వరకు వసూ లు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో అయితే రూ. 70ల వరకు పిండేస్తున్నారు. ఇక ప్రముఖ దినాలు, పండగ రోజులైతే మరింత అదనం. లైసెన్స్ దుకాణదారుల్లో చోటా మోటా పచ్చనేతలే అధికంగా ఉండటం, ఓ సిండికేట్గా ఏర్పడి ఏరి యా, ఏరియాలుగా పంచుకుని బెల్టుషాపులు నడిపిస్తుండటం విశేషం. మద్యం దుకాణాల వద్దకు వచ్చి బెల్టు నడిపేవారు తీసుకుంటే బాటిల్పై రూ.10 లు అదనంగా తీసుకోవడం, లేదంటే వారే డైరెక్టుగా బెల్టు దుకాణాలకు సరఫరా చేస్తే రూ. 20 లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆమదాలవలస నియోజకవర్గంలో అయితే ద్విచక్రవాహనాలు, ఆటోల్లో ఇ లానే సరఫరా చేస్తున్నారు. కాశీబుగ్గలోని ఒక వైన్ షాపులో సిటింగ్ రూమ్ కాశీబుగ్గ రామాలయం ఎదురుగా వైన్ షాపు అరసవల్లి: అరసవల్లిలో నగర పరిధి లేఅవుట్స్ రిజర్వ్ స్థలాలపై స్థానిక టీడీపీ నేత కన్ను పడింది. మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన ఈ స్థలాలను అధికారులు కనీసం పట్టించుకోకపోవడంతో కబ్జాలకు గురయ్యే పరిస్థితికి చేరింది. స్థానిక ఎమ్మెల్యే, కేంద్రమంత్రి అనుచరుడిగా చెలామణి అవుతున్న స్థానిక టీడీపీ నేత ఒకరు ఈ కబ్జా యత్నాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు రావడంతో అరసవల్లి వాసులు వాట్సాప్ గ్రూప్ ద్వారా సమాచారాలను పంపించి..ఎలాగైనా మన భూములను కాపాడుకుందాం అంటూ పిలుపునిచ్చారు. దీంతో శనివా రం స్థానికులంతా సంబంధిత కబ్జాకు గురవుతున్న స్థలాలను పరిశీలించి, అక్కడ ఫెన్సింగ్ పోల్స్ వేస్తున్న పని వారిని స్థానికులు అడ్డుకుని, ఈ విషయాన్ని నేరుగా ఎమ్మెల్యే శంకర్ దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే కార్పొరేషన్ అధికారులకు కూడా తెలియజేసేలా చేస్తామంటూ స్థానికులు ప్రకటించారు. వాస్తవానికి అర్బన్ హెల్త్ సెంటర్కు పక్కనున్న ఈ విలువైన రిజర్వ్ స్థలాలను రథసప్తమి రాష్ట్ర పండుగ మహోత్సవాల పేరిట శుభ్రపరిచి, పార్కింగ్ తదితర అవసరాల దృష్ట్యా సిద్ధం చేశారు. రథసప్తమి పండుగ అనంతరం రిజర్వ్ స్థలాల్లో ఫెన్సింగ్ పోల్స్ వేసేలా అడుగులు పడ్డాయి. దీంతో ప్రస్తుతానికి దాదాపుగా రెండు స్థలాలకు ఫెన్సింగ్ పనులు పూర్తికాగా, మరో 15 సెంట్ల స్థలం చుట్టూ ఫెన్సింగ్ పోల్స్ వేసే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స్థానికులంతా ఒక్కటై పనులను అడ్డుకున్నారు. దీంతో ఆక్రమణల పర్వం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికై నా కార్పొరేషన్ అధికారులు స్పందించి అరసవల్లి రిజర్వ్ స్థలాలను, కల్లాలుగా వినియోగించిన ప్రభుత్వ రెవెన్యూ స్థలాలను స్వాధీనం చేసుకుని ప్రజావసరాలకు వినియోగించాలని స్థానికులు కోరుతున్నారు. గత రెండు మూడు దశాబ్దాలుగా అరసవల్లి ప్రాంతంలో ఎక్కడా సెంటు భూమి కూడా కబ్జాలకు, గానీ ఆక్రమణలకు గానీ గురికాలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్థానిక నేతలు కొందరు పెద్దల పేరుతో ఆలయానికి చెందిన భూములను, ప్రభుత్వ భూములను, రిజర్వ్ స్థలాలను ఆక్రమించేందుకు దిగుతున్నారంటూ స్థానికంగా చర్చ జోరందుకుంది. పూల దండలు వేసి స్వాగతం పలుకుతున్న గ్రామస్తులు గ్రూప్–1 పరీక్షలో ప్రతిభ చాటి డీఎస్పీగా కొలువు సాధించిన పైల సుందరరావును రావువలస గ్రామస్తులు శనివారం ఘనంగా సత్కరించారు. జాతీయ రహదారి నుంచి తమ గ్రామానికి ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ముందుగా గుండవల్లిపేట వద్దకు సుందరరావు వచ్చిన వెంటనే గ్రామస్తులు పూల దండలు వేసి స్వాగతం పలికా రు. ఈ సందర్భంగా సుందరరావు తల్లిదండ్రులకు పాదాభివందనం చేశారు. అనంతరం గ్రామం వరకూ రెండు కిలోమీటర్లు ఊరేగింపుగా తీసుకెళ్లి స్కూల్ ఆవరణలో సత్కరించారు. అలాగే ఇటీవల డీఎస్సీలో ఉపాధ్యాయులుగా ఎంపికై న ముద్దాడ రమ్య, పల్లి సాయికుమారిలను కూడా గ్రామస్తులు సత్కరించారు. –నరసన్నపేటఫెన్సింగ్ పోల్స్ వేసి ఆక్రమించిన స్థలమిదే...ఇటీవల సారవకోటలో కల్తీ లిక్కర్తో టీడీపీ నేతే పట్టుబడటంతో మరికొన్ని ఏఓబీ సమీప ప్రాంతాల్లో కల్తీ జరుగుతున్నా సంబంధిత శాఖ వాళ్లు కనిపెట్టడం లేదన్న ఆరోపణలున్నాయి. కవిటి మండలంలో కొన్ని షాపుల్లో మద్యంలో తేడా కనిపిస్తుందంటూ అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. మద్యం ఆదాయం రుచి మరిగిన కూటమి ప్రభుత్వం సంబంధిత శాఖ అధికారులను టార్గెట్ పెట్టి మరీ జిల్లాలో బార్లు పెట్టించింది. జిల్లాలో 19 బార్లకు దాదాపు 4 సార్లు నోటిఫికేషన్ ఇవ్వడమే కాక చివరి సారి చాలా గోప్యంగా సుమారు 10 బార్లను పచ్చ నేతలకు డ్రాలో కట్టబెట్టింది. వీరిలో అధికంగా షాపులు దక్కించుకున్నవారే బార్లు పెట్టాలంటూ హుకుం జారీ చేయడం విశేషం. పలాస: పలాస ఎకై ్సజ్ పోలీసు స్టేషన్ పరిధిలోని పలాస కాశీబుగ్గ, పలాస మండలం, వజ్రపుకొ త్తూరు మండలాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా బడి, గుడి అన్న తేడా లేకుండా షాపులు ఏర్పాటు చేసి మద్యం విక్రయిస్తున్నారు. కాశీబుగ్గ పాత జాతీయ రహదారి పక్కన నిత్యం భక్తుల రద్దీతో ఉన్న శ్రీరామాలయం, షిర్డీసాయి దేవాలయాలకు అతి సమీపంలో అతి దగ్గరలో రెండు మద్యం షాపులు నడుస్తున్నాయి. ఇందులో ఒక షాపు అయితే ఉదయం 6గంటలకే తెరుచుకొని బెల్టు షాపు అవతారమెత్తుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అతి సమీపంలో రైల్వే స్టేషన్ ఉండటం వల్ల ఉదయం రైళ్లు దిగిన ప్రయాణాకుల కోసం ఈ విధంగా అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని అక్కడ ప్రజలు చెబుతున్నారు. ఈ ఎకై ్సజ్ పోలీసు స్టేషన్ పరిధిలో పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో 7 లైసెన్సు పొందిన మద్యం దుకాణా లు ఉండగా.. వీటిలో సిట్టింగ్ రూమ్లను కూడా అధికార పార్టీ అండతో ఏర్పాటు చేసుకుని బార్లను నడిపిస్తున్నారు. ఇక వజ్రపుకొత్తూరు మండలం బెండిగేటు, బెండి, అక్కుపల్లి, నువ్వలరేవు, మంచినీళ్లపేట, పూండి ఉద్దానంలోని అనేక గ్రా మాల్లో బెల్టు షాపులు నడుస్తున్నాయి. మందస మండలం ఉద్దానం ప్రాంతంలోని భేతాళపురం, లోహరబంద, సువర్ణపురం, మహాదేవుపురం, కొండలోగాం, భైరిసారంగిపురం, అలాగే పలాస మండలంలో అల్లుకోల, లొద్దబద్ర, రెంటికోట, తర్లాకోట, గరుడఖండి, పలాస,మందస ఉద్దానం ప్రాంతంలోని అనేక గ్రామాల్లో బెల్టు షాపులు రాత్రి పగలు అని తేడా లేకుండా సిండికేట్ ఆదేశాలతో నడుస్తున్నాయి. ఒక సీసాపై అక్కడ డిమాండ్ బట్టి రూ.30ల నుంచి రూ.50లకు వరకు అదనంగా విక్రయిస్తున్నారు. -
ఎగిరెగిరిపడుతున్న రాజకీయ పాసు!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రథసప్తమి వేడుకల నకిలీ వీఐపీ, వీవీఐపీ పాసుల కుంభకోణం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. రథసప్తమి వేడుకలు ముగిసిన మరుసటి రోజు కేసును టేకప్ చేసిన సీసీఎస్, టాస్క్ఫోర్స్ పోలీసులు కేసులో ఎంతమందికి ప్రమేయం ఉంది? వెనకుండి నడిపింది ఎంతమంది? అన్నది విచారణలో తెలుసుకుని ఉన్నతాధికారులకు అప్పగించారు. అయితే శుక్రవారం పోలీస్ స్పోర్ట్స్ మీట్కు ఓ ఉన్నతాధికారి రావడం, ఆ వెంటనే పరిణామాలు మారిపోవడం, రాత్రికి రాత్రే అర్థాంతరంగా కేసును కాస్తా సీసీఎస్, టాస్క్ఫోర్స్ పోలీసుల నుంచి ఒకటో పట్టణ పోలీస్స్టేషన్కు బదిలీ చేయడం చకచకా జరిగిపోయాయి. అరసవల్లి సూర్యనారాయణస్వామి దేవాలయం ఒకటో పట్టణ పరిధిలో కావడంతోనే అక్కడికి బదిలీ చేశారు. మొదటి నుంచి కేసుతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న 13 మందిలో ఏడుగురినే ఫిక్స్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు, మిగతా ఆరుగురిని తప్పించే యోచనలో ఉన్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. రథసప్తమి రోజున ఆలయానికి అనుకోని రీతిలో భక్తులు పోటెత్తడం, మరో భారీ తొక్కిసలాట త్రుటిలో తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక్కడే పోలీసుల పోస్టుమార్టం మొదలైంది. నిజం బహిర్గతమైంది. దేవాలయం అధికారులు జారీ చేసిన వీఐపీ, వీవీఐపీ పాసులను కొందరు వేలల్లో నకిలీవి సృష్టించడంతోనే ఈ దుర్గతి పట్టిందని తెలియడంతో ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆగమేఘాల మీద ప్రత్యేక విభాగాలైన సీసీఎస్, టాస్క్ఫోర్స్ పోలీసులతో విచారణ చేయించారు. విజయవాడ, రాజమండ్రి, విజయనగరం, శ్రీకాకుళంతో పాటు పలు ప్రాంతాలకు వెళ్లి విచారణ చేశారు. నకిలీ పాసులు ముద్రించారన్న సమాచారం మేరకు పలు ప్రింటింగ్ ప్రెస్లను, జెరాక్స్ సెంటర్ల ప్రతినిధులను విచారించారు. దాదాపు 10 రోజులకు పైగా జరిగిన తమ విచారణలో మణికంఠ జిరాక్స్, ప్రింటింగ్ సెంటర్తో పాటు కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, నేతల అనుచరులు, సిబ్బంది, రెవెన్యూ, దేవాదాయ విభాగాల్లో కొంతమందిని విచారించారు. వీరిలో కొందరి పాత్రను కూడా నిర్ధారణ చేశారు. ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి పోలీసులపై తీవ్ర రాజకీయ ఒత్తిడి నడుస్తూనే ఉంది. కొంతమంది నేరుగా స్టేషన్కు వెళ్లి కూడా ఒత్తిడి చేసిన సందర్భాలున్నాయి. స్థానిక కీలక ప్రజాప్రతినిధైతే కొంతమంది మీడియా ప్రతినిధులకు ఫోన్ చేసి ఏమీ రాయొద్దన్నట్లు ప్రచారం కూడా సాగింది. కీలక నేతల ఒత్తిళ్లతోనే కేసులో అనుమానితులుగా ఉన్న స్థానిక కీలక నేత సోదరుడు, జిల్లాలోని ఓ పెద్ద నేతకు వ్యక్తిగత ఇన్ఫ్లూయెన్సర్గా కొనసాగుతున్న వ్యక్తి, రణస్థలానికి చెందిన ఓ రెవెన్యూ ఉద్యోగి, కీలక నేతలను, సిబ్బందిని తప్పించారనే అనుమానాలు ఉన్నాయి. మణికంఠ జిరాక్స్ సెంటర్కు సంబంధించి తండ్రీకొడుకులనే కాక, ఆపరేటర్ను, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు ముగ్గురిని, దేవదాయశాఖకు చెందిన ఒకరిని ప్రస్తుతం విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమేయం ఉందని భావిస్తున్న ఇన్ఫ్లూయెన్సర్లలో ‘ప్రశాంత’ంగా కథ నడిపిన వ్యక్తి కూడా ఉన్నారు. కాక పోతే ఇన్ని రోజులు విచారణ జరిపి కొండను తవ్వి ఎలుకను పట్టే చందంగా చివరి నిమిషంలో ఇలా కేసును వేరే స్టేషన్కు అప్పగించి, రాజకీయ ఒత్తిళ్లతోనే కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. -
ప్రశాంతి @ టీమిండియా
ఇండియా ప్లకార్డుతో దుర్గాప్రశాంతి కొలంబోలో జరుగుతున్న 6వ ఏషియన్ మహిళల అంతర్జాతీయ సెపక్తక్రా చాంపియన్షిప్–2026 పోటీల్లో పాల్గొనే భారత జట్టుకు జిల్లాకు చెందిన గేదెల దుర్గాప్రశాంతి ఎంపికై న విషయం తెలిసిందే. ఈ పోటీలు శనివారం ప్రారంభం కాగా సిక్కోలు ఇండియా జెర్సీ ధరించి తళుక్కున మెరిసింది. సిక్కోలు ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పింది. – శ్రీకాకుళం న్యూకాలనీ మందస: వాసుదేవుని బ్రహోత్సవాలు శనివా రం ప్రారంభమయ్యాయి. తొలి రోజున ఆంజనేయస్వామికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు,అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు గోపినంబాళ్ల దాసుకూర్మాచార్యులు మాట్లాడుతూ ఈ ఏడాది భక్తులు అధికంగా దర్శనానికి వస్తున్నారని, 9వ తేదీ నుంచి స్వామి అన్నదాన కార్యక్రమాలు ఏర్పా టు చేస్తున్నామని, ప్రతి రోజు స్వామివారి సంకీర్తనలు, సాంస్కృతిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, ఒడిశా నుంచి ప్రత్యేకంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆదివారం వాసుదేవునికి అభిషేకం ఉంటుందని పేర్కొన్నారు. జీయర్ స్వామి అనుగ్రహ భాషణం, శ్రీమన్నారాయణ భక్తి సంఘం(లోహరిబంద) భక్తి సంగీత విభాషనం, శ్రీసప్తస్వరాల సంగీత పాఠశాల(విశాఖపట్నం) సంగీత విభావరి, శ్రీసాయి మెహర్ నృత్య కళానికేతన్(మందస)నృత్య ప్రదర్శన జరుగుతుంది. శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కొత్త డీఎస్పీగా కె.సత్యనారాయణ రావు శనివారం విధుల్లో చేరారు. 1995 ఎస్ఐ బ్యాచ్కు చెందిన ఈయన విజయనగరం పీటీసీలో ఆరున్నరేళ్లు సీఐగా చేశారు. అనంతరం డీఎస్పీగా ఉద్యోగోన్నతి పొంది మంగళగిరి డీ జీపీ కార్యాలయంలో కొన్నాళ్లు విధులు నిర్వర్తించి డీఎస్పీగా తొలిసారి శ్రీకాకుళంలోనే అడుగుపెట్టారు. ఇంతకుముందు ఇక్కడ పనిచేసిన బీవీ రమణమూర్తి విశాఖకు బదిలీ అయ్యారు. -
అబద్ధాల పునాదులపై కూటమి రాజకీయాలు
ఆమదాలవలస: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ మీడియా ముందు అవాస్తవాలు మాట్లాడటం ఎమ్మెల్యే కూన రవికుమార్కు తగదని ఆమదాలవలస వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ అన్నారు. అంతరాత్మను ఆయన ప్రశ్నించుకొని మాట్లాడితే బాగుంటుందని హితవుపలికారు. ఎమ్మెల్యే కూన రవికుమార్ విజయవాడలో చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తిరుమ ల లడ్డూ ప్రసాదంపై కూటమి ప్రభుత్వం చేసిన నీచమైన రాజకీయాలు సీబీఐ విచారణతో బట్టబయలయ్యాయన్నారు. ప్రజలకు సమాధానం చెప్పలేక అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డా రు. అబద్ధాల పునాదులపై కూటమి రాజకీయం చేస్తోందన్నారు. ఈ మహా పాపాన్ని టీడీపీ క్యాడర్ కు అందరికీ అంటిస్తున్నారని, అందులో భాగంగా నే స్క్రిప్ట్ చదువుతున్నారని దుయ్యబట్టారు. తిరుమల ప్రతిష్టను దిగజార్చేలా తప్పుడు ప్రచారం చేసినందుకు భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పా లని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ మున్సిప ల్ అధ్యక్షుడు పొడుగు శ్రీనివాస్, సోషల్ మీడియా విభాగం రాష్ట్ర కార్యదర్శి బొడ్డేపల్లి వెంకట సత్యం, డకరవలస పంచాయతీ సర్పంచ్ సురవరపు తిరుప తి తదితరులు పాల్గొన్నారు. -
రూ.లక్షలు వ్యయం..లక్ష్యం శూన్యం
ఎచ్చెర్ల: మండల కేంద్రం ఎచ్చెర్లలోని నిర్మిత కేంద్రం వద్ద సిమ్మెంట్ పరికరాలు తయారీ కోసం తెచ్చిన రూ.లక్షలు విలువైన యంత్రాలు ఇప్పుడు తుప్పట్టిపోతున్నాయి. అప్పట్లో ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లకు తక్కువ ధరకు సిమెంట్ ఇటుకలను అందించేందుకు అధికారులు ఈ యంత్రాలు కొనుగోలు చేసి నిర్మిత కేంద్రానికి అందజేశారు. ప్రస్తుతం కేంద్రం మూసివేయడంతో యంత్రాలన్నీ తుప్పుపట్టిపోయి పనికిరాకుండా పోతున్నాయి. అధికారులు సైతం ఈ కేంద్రం వైపు కన్నెత్తి చూడటం లేదు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
చోరీకి విఫలయత్నం
రణస్థలం: మండల కేంద్రంలోని జె.ఆర్.పురం పంచాయతీలో రామతీర్థాలు మార్గంలో డాక్టర్ ఎం.నాగేశ్వరరావు ఇంటి ఆవరణలో బుల్లెట్ బైక్ చోరీకి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు విఫలయత్నం చేశాలు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఇంటి ఆవరణలోనికి చొరబడ్డారు. బైక్ లాక్ రాకపోవడంతో వైర్లు తెంచేసి, సైడ్ డోర్లు పగలుకొట్టి చిందరవందరగా పడేశారు. ఇంటికి సీసీ కెమెరాలు ఉన్నాయని గుర్తించి వాటిని ధ్వంసం చేసి పరారయ్యారు. చోరీ యత్నం జరిగినట్లు శనివారం ఉదయం గుర్తించిన బాధితులు జే.ఆర్.పురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పదిలో ‘వంద’ సాధించాలి
శ్రీకాకుళం: పదో తరగతి వార్షిక పరీక్షల్లో జిల్లాలో వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా ఉపాధ్యాయు లు అంకితభావంతో పని చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. శనివారం శ్రీకాకుళంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో జిల్లాలోని ప్రభు త్వ ఉన్నత పాఠశాలలు, కేజీబీవీల ప్రధానోపాధ్యాయు లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్ఎస్సీ 100 రోజుల కార్యాచరణలో భాగంగా జరుగుతున్న స్లిప్ టెస్టుల ఫలితాల నివేదికను క్షుణ్ణంగా పరిశీలించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది జి ల్లా 82 శాతం ఉత్తీర్ణతతో సరిపెట్టుకుందని, కానీ పొరు గు జిల్లా పార్వతీపురం 92 శాతంతో ముందుందని గుర్తు చేశారు. ఈసారి ఏమాత్రం వంద శాతం ఫలితా లే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పరీక్షలకు కేవలం 37 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉందని, ఈ స్వల్ప కాలాన్ని అత్యంత కీలకంగా భావించాల ని సూచించారు. విద్యార్థులను ప్రతిభ ఆధారంగా ‘షైనింగ్ స్టార్స్’, ‘రైజింగ్ స్టార్స్’గా సన్నద్ధం చేస్తున్నామని చెప్పా రు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు పదో తరగతి ఫలితాల నుంచే ప్రారంభమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఏ.రవిబా బు, సమగ్ర శిక్ష పీఓ వేణుగోపాలరావు, సోష ల్ వెల్ఫేర్ డిస్ట్రిక్ట్ కో–ఆర్డినేటర్ యశోదలక్ష్మి, డిప్యూటీ డీఈఓ ఆర్.విజయకుమారి తదితరులు పాల్గొన్నారు. -
జీడిమామిడి సాగుతో గిరిజన రైతులకు అధిక ఆదాయం
ఆమదాలవలస: జీడిమామిడి సాగుతో గిరిజన రైతులకు అధిక ఆదాయం లభిస్తుందని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ డాక్టర్ జి.శివన్నారాయణ అన్నారు. ఆమదాలవలస పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో డైరెక్టరేట్ ఆఫ్ కాష్యూ నట్ అండ్ కోకో డెవలప్మెంట్, కొచ్చిన్ వారి ఆర్థిక సహకారంతో జిల్లా స్థాయి జీడిమామిడి సదస్సును శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ జీడిమామిడి గిరిజన రైతులకు ముఖ్య ఆదాయ వనరుగా మారిందని, సరైన సాగు యాజమాన్య పద్ధతులు అనుసరిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. అంతర పంటలు వేసుకోవడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చునని అన్నారు. జీడి పళ్లు, జీడిపిక్కల నుంచి విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేస్తే రైతుల ఆదాయం మరింత పెరుగుతుందని వివరించారు. కేవీకే కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ కె.భాగ్యలక్ష్మి మాట్లాడుతూ జీడి పండ్లతో సిరప్, జామ్, జెల్లీ, క్యాండీ, పచ్చడి తయారీ విధానాలపై అవగాహన కల్పించారు. సదస్సులో జిల్లా నలుమూలల నుంచి రైతులు, ఉత్పత్తిదారుల సంఘాల సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ జీఎస్ రాయ్, డాక్టర్ సీహెచ్ బాలకృష్ణ, డాక్టర్ ఎస్.కిరణ్ కుమార్, డాక్టర్ బి.సునీత తదితరులు పాల్గొన్నారు. -
ఆదర్శ విప్లవకారుడు గుణవంతు
పలాస: ఉద్దానం ప్రాంతంలో ఆదర్శ విప్లవకారుడు రాజాం గుణవంతు అని పలువురు వక్తలు కొనియాడారు. పలాస మండలం బొడ్డపాడు గ్రామానికి చెందిన రాజాం గుణవంతు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందడంతో శనివారం సంతాప సభ నిర్వహించారు. బొడ్డపాడు యర్రయ్య అధ్యక్షతన జరిగి న ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ గుణవంతు నాటి శ్రీకాకుళం గిరిజన రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని జైలు జీవితం అనుభవించారని, పీపుల్స్ వార్ పార్టీ నాయకత్వాన ఉద్దానం ప్రాంతంలో జరిగిన సముద్రం తీర ప్రాంత భూములు పంపిణీలోను, సారా వ్యతిరేక పోరాటంలో, జీడి రైతాంగ గిట్టుబాటు ధర ఉద్యమంలో పాల్గొన్నట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు దాసరి శ్రీరాములు, తామాడ త్రిలోచన రావు, కిక్కర ఢిల్లీరావు, బొడ్డు సింహాద్రి, కోత ధర్మారావు, ప్రభాకర్, బొడ్డు దుష్యంతు, మద్దిల ధర్మారావు, సాలిన వీరాస్వామి, మెట్టూరు వీరాస్వా మి, పోతనపల్లి కుసుమ, నైగాపు గంగాధర్, బొడ్డు సింహాచలం తదితరులు పాల్గొన్నారు. -
ఆమె నేత్రాలు సజీవం
శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని మంగువారితోటకు చెందిన నానుబాల లలితారా ణి (72) మృతి చెందడంతో ఆమె నేత్రాల ను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. కుమారుడు భవానీప్రసాద్, ఎ.వెంకటరమణ, డోలా వలసయ్యలు విషయాన్ని రెడ్క్రాస్కు తెలియజేయగా సిబ్బంది వచ్చి కార్నియాలు సేకరించారు. అనంతరం విశాఖపట్నంలోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు. నేత్రదానం చేయాలనుకునే వారు 78426 99321 నంబరును సంప్రదించాలని రెడ్క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు, కార్యదర్శి బి.మల్లేశ్వరరావు, కోశాధికారి కె.దుర్గా శ్రీనివాస్ కోరారు. టెక్కలి: మార్చి నెలాఖరులోగా వివిధ రకాల అభివృద్ధి పనులు పూర్తి చేయాలని మంత్రి కె.అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. శనివారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో చేపడుతున్న పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. టెక్కలి నియోజకవర్గంలో కొత్తగా రెండు ఎత్తిపోతల పథకాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. సమావేశంలో ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి , పంచాయతీరాజ్, నీటి పారుదల శాఖాధికారులు పాల్గొన్నారు. -
స్థలం పవిత్రతను దెబ్బ తీయవద్దు
పలాస: కాశీబుగ్గ కె.టి.రోడ్డులో శ్మశాన వాటిక గోడకు ఆనించి చిరు వ్యాపారులు షాపులు పెట్టడం తగదని, అది తమ పవిత్ర స్థలమని కాశీబుగ్గ క్రిస్టియన్, ముస్లిం సంఘాల నేతలు చెప్పారు. ఫుట్పాత్పై పెట్టడం కూడా తగదన్నారు. రోడ్డుపై షాపులు పెట్టుకుంటే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారు. కాశీబుగ్గ పల్లివీధిలోని చర్చిలో శనివారం యునైటెడ్ క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ కమిటీ నేతలు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వందేళ్ల క్రితం తర్లాకోట రాజు శ్మశాన స్థలం తమకు దఖలు పరిచారన్నారు. మురికికాలువ, ఫుట్పాత్, రోడ్డు విస్తరణ కోసమంటూ ఇప్పటికే శ్మశాన స్థలం ఇచ్చామని చెప్పారు. ఇటీవల మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు రోడ్డుపై ఉన్న దుకాణాలను తొలగించడంతో వారంతా శ్మశాన వాటిక గోడను ఆనుకుని ఉన్న ఫుట్పాత్పైకి వచ్చేశారన్నారు. కొందరు పర్మినెంటు షాపులు కూడా కడుతున్నారని, సాయంత్రం, రాత్రి వేళల్లో మద్యం తాగి సీసాలను, వాటర్ బాటిళ్లు, ఇతర చెత్తను వేస్తూ డంపింగ్యార్డులా తయారు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఎక్కడా క్రిస్టియన్ శ్మశానాల గోడల పక్కన షాపులు లేవని, ఇక్కడే ఎందుకు కొత్త సంస్కృతి మొదలైందన్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. సమావేశంలో క్రిస్టియన్, ముస్లిం పెద్దలు అనిల్కుమార్రాజు, పయ్యజ్ అహ్మద్, డి.వి.డి.వి.కుమార్, మురళి, జాన్సన్, బి.ఐ.కుమార్, అప్పలస్వామి, ధర్మారావు, కె.జయ, స్టీపెన్పాల్ తదితరులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహిస్తున్న ఫారెస్ట్ బీట్ అధికారి, అసిస్టెంట్ బీట్ అధికారి, దేవదాయ శాఖ ఎగ్జిక్యూ టివ్ ఆఫీసర్ గ్రేడ్ 3, తానేదర్ ఇన్ ఎ.పి. ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వీ లక్ష్మణమూర్తి అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 9 నుంచి 11 వర కు జరిగే ఈ పరీక్షలకుఅభ్యర్థులు హాల్ టికెట్, ఒరిజినల్ ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డుతో హాజరుకావాలని కోరారు. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాల, ఎచ్చెర్లలోని అంబేడ్కర్ యూనివర్సిటీ కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు జరుగుతాయని చెప్పారు. 1375 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని చెప్పారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు, కాలేజీ ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. -
బాలల హక్కులు పరిరక్షించాలి
ఆమదాలవలస: బాలల హక్కులపై చట్టసభల్లో సుదీర్ఘ చర్చలు జరపాల్సిన ఆవశ్యకత ఉందని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శనివారం ఆమదాలవలసలోని తన కార్యాలయంలో చైల్డ్ రైట్స్ అవేర్నెస్ ఫోరం రాష్ట్ర కమిటీ రూపొందించిన 2026 క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలల సంరక్షణ దేశానికి కీలకమన్న అంశాన్ని యావత్ సమాజంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తెరగాలన్నారు. బాలలపై లైంగిక దాడులు సిగ్గుచేటన్నారు. బాలల హక్కుల కమిషన్లపై రాజకీయ ఒత్తిళ్లు లేనప్పుడే సంపూర్ణ హక్కులు కాపాడవచ్చన్నారు. కార్యక్రమంలో ఫోరం వ్యవస్థాపక అధ్యక్షురాలు గొండు ధనలక్ష్మి, చైల్డ్ రైట్స్ అవేర్నెస్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ గొండు సీతారాం, తొగరాం పంచాయతీ సర్పంచ్ తమ్మినేని వాణి సీతారాం, వైఎస్సార్ సీపీ యువనేత తమ్మినేని చిరంజీవి నాగ్, ఫోరం శ్రీకాకుళం ప్రతినిధులు కొత్తకోట శ్రీనివాస్, మొదలవలస వాసుదేవకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కర్రీ..నో వర్రీ!
ఊరి నుంచి చుట్టాలు వచ్చారు. మీరు వచ్చేటప్పుడు కర్రీ, సాంబారు తెచ్చేయండి. నేను రైస్ పెట్టేస్తా.. ఒంట్లో నలతగా ఉంది. వంట చేయలేదు. వచ్చేటప్పుడు కూరలు, పులిహోరా తెచ్చేయండి.. ఇవీ పట్టణాల్లో చాలామంది గృహిణుల నుంచి వినిపిస్తున్న మాటలు. అన్నం మాత్రమే ఇంట్లో వండుతున్నారు. కూరలన్నీ కర్రీ పాయింట్లు నుంచి తెచ్చుకుంటున్నారు. కర్రీ పాయింట్లు అందు బాటులో ఉంటున్నాయి. రుచి కూడా బాగుంటుంది. సడన్గా కూరలు అవసరం కర్రీ పాయింట్లనే ఆశ్రయిస్తున్నాం. రూ.20 పెడితే కావాల్సిన కూర లభిస్తోంది. వీటికి బ్యాచిలర్స్, ఉద్యోగుల ఆదరణ ఎక్కువగా ఉంటోంది. – పాగోటి జానకిరాం, మారుతీనగర్, నరసన్నపేట నరసన్నపేట: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎక్కడ చూసినా ఉరుకులు పరుగుల జీవనమే. మారుతున్న కాలానికి అనుగుణంగా జీవన శైలిలో అనేక మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా ఆహారం విషయంలో కొత్తకొత్త ట్రెండ్స్ నడుస్తున్నాయి. గతంతో బ్యాచ్లర్స్, ఉద్యోగులు, విద్యార్థులు మాత్రమే కర్రీ పాయింట్లను ఆశ్రయించే వారు. ఇప్పుడు పరిస్థితి మారింది. ముఖ్యంగా పట్టణంలో చాలావరకు భార్యాభర్తలిద్దరూ పనిచేస్తే తప్ప జీవనం కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో వంట పనులకు టాటా చెబుతున్నారు. కర్రీ పాయింట్ల బాట పడుతున్నారు. కర్రీ పాయింట్లు ఇప్పుడు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. రెండేళ్ల క్రితం నరసన్నపేటలో రెండు మూడు కర్రీ పాయింట్లు హోటల్స్ వద్ద ఉండేవి. ఇప్పుడు దాదాపు ప్రతి వీధిలోనూ ఆనుకొని 20కి పైగా పాయింట్లు వెలిశాయి. ఇదే పరిస్థితి జిల్లాలోని ప్రధాన పట్టణాలైన శ్రీకాకుళం, ఆమదాలవలస, టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం, సోంపేట తదితర ప్రాంతాల్లోనూ కనిపిస్తోంది. కర్రీ పాయింట్లలో అన్నం, పులిహోరా, ఇగురు, ఫ్రై కూరలు, పప్పు, సాంబారు, రసం, పెరుగుతో పాటు నాన్ వెజ్ కూరలు కూడా అందుబాటులో ఉంటున్నాయి. వినియోగదారులకు అనుకూలమైన ధరల్లో లభిస్తున్నాయి. శాకాహార కూరలు రూ.20కే లభిస్తున్నాయి. రూ.50 వెచ్చిస్తే ఓ వ్యక్తి సంతృప్తిగా భోజనం చేయగలుగుతున్నారు. గుత్తు వంకయకూర, నాన్ వెజ్ కూరలు బాగా అమ్ముడుపోతున్నాయని వ్యాపారులు అంటున్నారు. పెరిగిన కూరగాయల ధరలు తమకు అనుకూలంగా మారుతున్నాయని చెబుతున్నారు. కర్రీ పాయింట్లలో నిర్వాహకులు రోజుకో స్పెషల్ వైరెటీని ప్రజలకు అందిస్తున్నారు. దీంతో వాటికి ఆదరణ పెరుగుతుంది. కర్రీ పాయింట్లకు వచ్చే వారు ఈ రోజు స్పెషల్ ఏమిటి అని అడిగి మరీ తీసుకెళ్తున్నారు. వీటిలో నాన్ వెజ్ కూరలకే అధిక ప్రాధాన్యత. సోమ, శని వరాల్లో తప్ప మిగిలిన వారాల్లో నాన్ వెజ్ కూరలు బాగా అమ్ముడవుతున్నాయి. ఎగ్ కర్రీకి డిమాండ్ ఎక్కువ. హోటళ్లలో పనిచేసే అనుభవం ఉన్న వారే కాకుండా సొంత కాళ్లపై నిలబడాలనే ఉద్దేశం ఉన్న వారు తక్కువ పెట్టుబడితో కర్రీ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు. నరసన్నపేటలో ఇళ్లల్లో, కేటరింగ్కు ఆహారం సరఫరా చేసేవారు కూరలు వండి ఇస్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటలు కష్టపడితే గిట్టుబాటుగానే ఉంటోందని నిర్వాహకులు అంటున్నారు. ఒక్క నరసన్నపేటలోనే 45 మంది ఈ కర్రీ పాయింట్లతో జీవనోపాది పొందుతున్నారు.కాలేజీ రోడ్డులో పిల్లర్స్ నిర్మాణం కోసం ఐరన్ బాక్సులు అద్దెకు ఇస్తుంటా ను. ఈ పని ఉదయం, సాయంత్రమే ఉంటుంది. మధ్యాహ్నం సమ యంలో కూరలు తీసుకొని వచ్చి కర్రీ పాయింట్లో విక్రయాలు చేస్తున్నాను. ఇది కూడా జీవనోపాధిగా ఉంది. – ఎస్.మహేష్, కాలేజీ రోడ్డు, నరసన్నపేట -
హామీలను డైవర్ట్ చేసేందుకే లడ్డూ నాటకం
కొత్తూరు: సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో ప్రజలు నుంచి వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికే పవిత్రమైన తిరుమల లడ్డూ పేరుతో నాటకం ఆడుతున్నారని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు రెడ్డి శాంతి అన్నారు. కొత్తూరు మండలం ఉప్పరపేటలో ఆమె విలేకరలతో మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ సిట్ వేసిన దర్యాప్తులో లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు ఉపయోగించ లేదని తేల్చినా రాష్ట్ర ప్రభుత్వం మరో కమిటీ వేయడం సిగ్గుచేటన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లభిస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే కూటమి పాలకులు ఇటువంటి చులకన రాజకీయాలకు ఒడిగడుతున్నారని విమర్శించారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు గండివలస ఆనందరావు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ చింతాడ సూర్యనారాయణ, సర్పంచ్ చిన్నమ్మడు, ఎంపీటీసీ సభ్యుడు వనుము లక్ష్మినారాయణ, ధర్మారావు, బాలకృష్ణ, సాధుబాబు, నాయకులు అగతమూడి నాగేశ్వరరావు, గుడబండి పోలయ్య, రాఘవ, పూర్ణ, గోవిందరావు పాల్గొన్నారు. -
9 నుంచి ప్రీ ఫైనల్ పరీక్షలు
శ్రీకాకుళం: జిల్లాలో ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి పదో తరగతి వారికి ప్రీ ఫైనల్ పరీక్షలు జరగనున్నాయి. అలాగే ఒకటి నుంచి తొమ్మి దో తరగతి విద్యార్థులకు ఎఫ్ఏ–4 పరీక్షలు నిర్వహిస్తారు. పాఠశాల విద్యాశాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. డీఈఓ రవిబాబు పర్యవేక్షణలో పరీక్షలు సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతికి సంబంధించిన ప్రశ్న పత్రాలను ఎమ్మార్సీ నుంచి క్లస్టర్ స్కూళ్లకు సరఫరా చేస్తారు. క్లస్టర్ పాఠశాలల్లో వాటిని భద్రపరుస్తారు. ఆరు నుంచి పదో తరగతి వరకు సంబంధించిన ప్రశ్న పత్రాలను ఎమ్మార్సీలోనే భద్రపరుస్తారు. ప్రశ్న పత్రాలను పరీక్ష ప్రారంభమయ్యే రోజున సరఫరా చేసేందుకు ము గ్గురు సభ్యులతో కూడిన ఓ బృందాన్ని ఏర్పాటు చేస్తారు. ‘గిరిజన సమస్యలు ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం’ సారవకోట: జిల్లాలోని పలు మండలాల్లో గిరిజన గ్రామాల్లో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు గిరిజన ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ చౌదరి తెలిపారు. శుక్రవారం ఆయన సారవకోటలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్కు కేబినెట్ హోదా కల్పించడం శుభ పరిణా మమని, ఆయన దృష్టికి గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను తీసుకెళ్తామని తెలిపారు. ఈ నెల 8న రంపచోడవరంలో జరిగే ప్రత్యేక కార్యక్రమానికి జిల్లా నుంచి గిరిజనులు హాజరై ఎస్టీ కమిషన్ చైర్మన్ దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లడానికి అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. బ్రహ్మోత్సవాలకు సిద్ధం మందస: వాసుదేవుని ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఉత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానుండడంతో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఆలయ అర్చకులు దాస్కూర్మాచార్యులు తెలిపారు. మొదటి రోజు ఆంజనేయ స్వామికి అభిషేకం నిర్వహిస్తారు. స్వామిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. శ్రీముఖలింగం శివరాత్రి ఉత్సవాలకు పక్కా ఏర్పాట్లు జలుమూరు: దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖలింగంలో ఈ నెల 15 నుంచి 18 వరకు జరగనున్న శివరాత్రి ఉత్సవాలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. ఆయన శుక్రవారం ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తితో కలిసి అధికారులకు దిశానిర్దేశం చేశారు. దర్శనం సులువుగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదన్నారు. 18వ తేదీన వంశధార నదిలో జరగనున్న స్వామివారి చక్రతీర్థ స్నానాలు కీలకమని, భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. ఆయనతోపాటు శ్రీకాకుళం ఆర్డీఓ కె.సాయి ప్రత్యూష, డీఎస్పీ లక్ష్మణమూర్తి, ఏసీ ప్రసాద్ పట్నాయక్ తోపా టు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఉత్సవాల ఏర్పాట్లపై ఆరా శ్రీకాకుళం పాతబస్టాండ్: శ్రీముఖలింగ క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డిలతో ఫోన్ ద్వారా మాట్లాడి ఏర్పాట్లపై ఆరా తీశారు. -
పీఏసీఎస్ భవనంలో తాత్కాలిక కోర్టు
ఆమదాలవలస: ఆమదాలవలస పట్టణంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన కృష్ణాపురం వ్యవసాయ పరపతి సంఘం భవనంలో తాత్కాలికంగా కోర్టు నిర్వహణకు జిల్లా కలెక్టర్ అనుమతులు అందించారు. శుక్రవారం కలెక్టర్ ఉత్తర్వులు, జిల్లా జడ్జి ఆదేశాల మేరకు భవనాన్ని న్యాయవాదుల సమక్షంలో కోర్టు సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో బార్ అసోషియేషన్ అధ్యక్షుడు అన్నెపు సత్యనారాయణ, మాజీ అధ్యక్షులు కె.విజయలక్ష్మిభాయి, సీనియర్ న్యాయవాదులు పి.వి.నరసింహులు, తమ్మినేని అన్నంనాయుడు, కె.త్రినాధరావు, దానేటి రామ్మోహన్రావు, గోవిందరావు, విజయ్, బి.మోహన్రావు, అప్పలనాయుడు, కోర్టు సూపరింటెండెంట్ బషీర్, సిబ్బంది పాల్గొన్నారు. ఇదీ వివాదం.. ఆమదాలవలసలో ప్రస్తుతం ఉన్న కోర్టు భవనాలు శిథిలావస్థకు చేరిన నేపథ్యంలో కొత్త భవనం నిర్మించే వరకు తాత్కాలికంగా కోర్టు నిర్వహణకు పీఏసీఎస్ భవనం అందించాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే సమయంలో అద్దె భవనంలో నడుస్తున్న కృష్ణాపురం పీఏసీఎస్ను కొత్త భవనంలోకి మార్చేందుకు ప్రయత్నాలు జరగడంతో వివాదం చెలరేగింది. ఈ క్రమంలోనే న్యాయవాదులు కలెక్టర్ ఉత్తర్వులతో రెండు రోజుల కిందట ఈ భవనం వద్దకు పరిశీలనకు వచ్చారు. ఈ సమయంలో డీసీసీబీ అధ్యక్షుడు, పీఏసీఎస్ అధ్యక్షులు, సిబ్బంది చేరుకొని రైతుల డబ్బులతో నిర్మాణం చేశామని, భవనం అందించేందుకు రైతులతో సమావేశం ఏర్పాటు చేసి పరిశీలిస్తామని చెప్పడంతో కోర్టు సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే న్యాయవాదులపై కొందరు దురుసుగా మాట్లాడటంతో కోర్టు ఇన్చార్జి సూపరింటెండెంట్ సాయిరాం స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇటువంటి నాటకీయ పరిణామాల మధ్య న్యాయవాదులు సంబంధిత భవనాన్ని స్వాధీనం చేసుకుని కొత్తగా తాళాలు వేసి బోర్డును ఏర్పాటు చేయడం గమనార్హం. -
స్కేటింగ్ పోటీల్లో స్వర్ణం
వజ్రపుకొత్తూరు రూరల్: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో నివాసముంటున్న ఐ. శివశంకర్ అనే విద్యార్థి రెండు రోజుల క్రితం ఇండోనేషియాలో జరిగిన స్కేటింగ్ చాంపియన్ షిప్–2026 పోటీల్లో బంగారు పతకం సాధించాడు. ఓవైపు చదువులో రాణిస్తూ.. మరో వైపు స్కేటింగ్ పట్ల ఆసక్తి చూపుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటుతున్నాడు. వజ్రపుకొత్తూరు మండలం గరుడబద్రలోని శ్రీ గాయత్రీ విద్యాలయంలో 10వ తరగతి చదువుతున్న శివశంకర్ను శుక్రవారం ప్రిన్సిపాల్ టి.అర్జున్ చక్రవర్తి, ఉపాధ్యాయులు అభినందించారు. భవిష్యత్లో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అకాంక్షించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. -
మూడున్నర కిలోల గంజాయి స్వాధీనం
ఆమదాలవలస: ఆమదాలవలస పట్టణంలోని శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) రైల్వేస్టేషన్ టికెట్ కౌంటర్ ఆవరణలో శుక్రవారం మూడున్నర కిలోల గంజాయితో ఓ వ్యక్తి పట్టుబడినట్లు ఆమదావలస ఎస్ఐ ఎస్.బాలరాజు తెలిపారు. నిందితుడు ఒడిశాకు చెందిన చించాను సురేష్గా గుర్తించామన్నారు. మూడున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. రాయగడకు చెందిన సిబా మిస్సాల్ వద్ద గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్లో విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. వీరిద్దరిపైనా కేసు నమోదు చేశామన్నారు. సురేష్ను రిమాండ్కు తరించినట్లు తెలిపారు. -
తమ్ముళ్లే ఇసుక తోడేళ్లు
శ్రీకాకుళం నియోజకవర్గం: వంశధార నదిలో పొన్నాం, బట్టేరు, నైరా, బైరి, కరజాడ, నాగావళి నదిలో కిల్లిపాలెం, గార మండలం బూరవల్లి, అంబల్లవలస, గార ఆమదాలవలస నియోజకవర్గం: ఆమదాలవలస మండలంలోని నిమ్మ తొర్లువాడ, తొగరాం, కలివరం, కొత్తవలస, చవ్వాకులపేట, తోటాడ, అక్కివరం, జీకే వలస, ముద్దాడపేట, సరుబుజ్జిలి మండలంలో పురుషోత్తపురం, బూర్జ మండలంలో అల్లిన, నారాయణపురం, కాఖండ్యాంలో, పొందూరు మండలంలో సింగూరు, బొడ్డేపల్లి నరసన్నపేట నియోజకవర్గం: మడపాం, గోపాలపెంట, జలుమూరు మండలం పర్లాం, అంధవరం, కొమ్మనాపల్లి, దొంపాక పాతపట్నం నియోజకవర్గం: కొత్తూరు, హిరమండలం, ఎల్ఎన్పేట మండలాల్లో వంశధార నదిలో ఎక్కడికక్కడ ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి.సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలోని నదుల్లో ఇసుక తోడేళ్లు పడ్డాయి. అధికారం అండతో నాయకులు ఇసుక అక్రమాలకు గేట్లెత్తేశారు. యథేచ్ఛగా టిప్పర్లతో రవాణా జరిగిపోతోంది. పచ్చనేతలు రోజుకి రూ.లక్షల్లో అక్రమంగా ఆర్జిస్తున్నారు. ఇక్కడి ఇసుకంతా విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం జిల్లాలకు తరలిపోతోంది. అదే స్థాయిలో ఒడిశాకు ఇక్కడ నుంచి ఇసుక రవాణా అవుతోంది. ఇసుక అక్రమ తవ్వకాలపై జిల్లాలో నిఘా లేదు. చెక్ పోస్టులను సైతం ఎత్తేశారు. పట్ట పగలే తెలుగు తమ్ముళ్లు మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు చెప్పి దోచేస్తున్నారు. ‘తమ్ముళ్ల’ ఆధ్వర్యంలోనే.. జిల్లాలో టీడీపీ నేతల ఆధ్వర్యంలో ఇసుక ర్యాంపులు నడుస్తున్నాయి. ఆమదాలవలస, పాతపట్నం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, నరసన్నపేట, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున అనధికార ర్యాంపులు కొనసాగుతున్నాయి. వంశధార, నాగావళి నదుల్లో ఎక్కడికక్కడ ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. తాగునీటి పైపులు, తాగునీటి బావులు, వంతెనలు, పర్యావరణ సమస్యలను చూడకుండా ఇష్టారీతిన ఇసుకను తోడేస్తున్నారు. కొన్నిచోట్ల ప్రజాప్రతినిధులే సూత్రధారులు కాగా, మరికొన్ని చోట్ల వారి అనుయాయులు ఇసుక దోపిడీ సాగిస్తున్నారు. గతంలో రాత్రిపూటే తవ్వకాలు జరిపేవారు. ఇప్పుడు అఽధికారుల తనిఖీలు, నిఘా లేకపోవడంతో పగలు, రాత్రి తేడా లేకుండా నదులను గుల్ల చేసేస్తున్నారు. అక్కడక్కడా ఉన్న డీసిల్టేషన్ పాయింట్ల ముసుగులో మిగతా చోట్ల తవ్వేస్తున్నారు. పట్టపగలే లారీలు, టిప్పర్లతో పక్క జిల్లాకు తరలించేస్తున్నారు. ముడుపుల మత్తులో.. ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణాను అధికారులు సైతం పట్టించుకోవడం లేదు. లారీలు, టిప్పర్లతో తరలిపోతున్నా చోద్యం చూస్తున్నారు. గతంలో నకిలీ బిల్లులతో తరలిపోతున్నా కనీసం తనిఖీలైనా చేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. సరిహద్దులో చెక్పోస్టులు కనిపించడం లేదు. రహదారిపై అడ్డంగా ఉండే డ్రమ్ములను సైతం తీసేశారు. ఉన్నతాధికారులు సైతం పర్యవేక్షణను పూర్తిగా పక్కన పెట్టేశారు. దీంతో సరిహద్దులో ఉండే కొందరు అధికారులు అక్రమ రవాణా సాగిస్తున్న వారితో లాలూచీ పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎన్ని లారీలు వెళ్లిపోయినా, టిప్పర్లతో ఇసుక తరలిపోతున్నా చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు. ముందుగానే సంబంధిత లారీ, టిప్పర్ల యజమానులు, అక్రమ ర్యాంపులు నిర్వహిస్తున్న వారి నుంచి పెద్ద ఎత్తున ముడుపులు అందుతున్నాయి. ఇచ్చినవి తీసుకుని తమ మీదుగా వెళ్తున్న ఇసుక లారీలు, టిప్పర్లను చెక్ చేయకుండా వదిలేస్తున్నారు. రూ.500 కోట్ల ఇసుక తరలింపు! జిల్లాలో ఇప్పటికే రూ.500 కోట్ల విలువైన ఇసుక అక్రమంగా తరలిపోయిందన్న వాదనలు ఉన్నా యి. రాత్రి పగలు తేడా లేకుండా ఇసుక తవ్వకాలతో పాటు రవాణా సాగిపోతోంది. నిత్యం ఇసు క లోడ్తో లారీలు, టిప్పర్ల రాకపోకలు సాగుతుండటంతో సంబంధిత పల్లెల్లోని రోడ్లు నాశనమైపోతున్నాయి. మంచినీటి బావులు, వంతెనలు కూడా ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి. వాటి పక్కనే తవ్వకాలు జరుగుతున్నాయి. పలుచోట్ల గ్రామస్తులు అభ్యంతరం చెప్పినా వినడం లేదు. ఇసుక అక్రమ సొమ్ము కోసం అడ్డంగా నదిలోకి రోడ్డేసి, పొక్లెయినర్లు, జేసీబీలతో ఇసుక తవ్వకాలు జరిపి, తరలించేస్తున్నారు. దందా ఎక్కడెక్కడ.. జిల్లా వ్యాప్తంగా ఇసుక అక్రమ తవ్వకాలు వంశధార, నాగావళి, బహుదా నదుల్లో తోడేస్తున్న ఇసుక లారీలు, టిప్పర్లతో అక్రమ రవాణా మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు చెప్పి దోపిడీ పర్యవేక్షణ చేయని ఉన్నతాధికారులు నిఘా, చెక్ పోస్టులను గాలికొదిలేసిన వైనం -
కొత్త ఉపాధి చట్టాన్ని ఉపసంహరించుకోవాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హమీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘వీబీ జీ రామ్ జీ’ అనే కొత్త చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సనపల అన్నాజీరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఏఐసీసీ, పీసీసీ పిలుపుమేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి గాదం వెంకట త్రినాథరావు, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు రెల్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
రైలు ఢీకొని ఉపాధ్యాయుడికి గాయాలు
పాతపట్నం: గుణుపూర్ నుంచి రూర్కెలా వెళుతున్న రాజరాణి ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని కొదూరు గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు మాలువ సింహాచలం తీవ్రంగా గాయపడ్డాడు. పాతపట్నం రైల్వేస్టేషన్ సమీపంలోని హౌసింగ్బోర్డు కాలనీ వద్ద శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం నేపథ్యంలో సుమారు 20 నిమిషాలు రైలు నిలిపివేశారు. క్షతగాత్రుడిని పాతపట్నం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. సింహాచలం స్టువట్పేటలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం పాతపట్నంలోని బాలాజీనగర్–3లో నివాసం ఉంటున్నాడు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. వలస కూలీకి గాయాలు టెక్కలి రూరల్: సంతబొమ్మాళి మండలం నౌపడ సమీపంలో ఆర్అండ్ఆర్ కాలనీలో పనులు చేస్తున్న వలస కూలీ శుక్రవారం ప్రమాదశాత్తు గాయపడ్డాడు. పార్వతీపురం మండలానికి చెందిన వై.కళ్యాణకుమార్ నౌపడ ఆర్అండ్ఆర్ కాలనీలో జరుగుతున్న గృహనిర్మాణ పనుల్లో భాగంగా కర్ర పని చేస్తుండగా కటింగ్ మిషన్ కాళ్లపై పడింది. కాళ్లకు తీవ్ర గాయం కావడంతో వెంటనే టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యపరీక్షల అనంతరం కుటుంబసభ్యులు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. -
100 రామచిలుకలు పట్టివేత
ఆమదాలవలస: శ్రీకాకుళం రోడ్ (ఆమదాలవలస) రైల్వేస్టేషన్లో శుక్రవారం 100 రామచిలుకలను తీసుకెళ్తున్న ఇద్దరిని ఆర్పీఎఫ్ పోలీసులు అడ్డుకున్నారు. వీటిని తరలిస్తున్నారనే విషయమై ప్రశ్నిస్తుండగా పక్షులను వదిలి ఇద్దరూ పారిపోయినట్లు సిబ్బంది చెబుతున్నారు. ఉన్నతాధికారులకు నివేదించి తదుపరి చర్యలు చేపడతామని వారు తెలిపారు. కాగా, శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషన్(ఆమదాలవలస) ఆర్పీఎఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో వివిధ రకాలకు చెందిన 400 కేసులను శుక్రవారం పరిష్కరించినట్లు ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ ఎస్.కాంతారావు తెలిపారు. రైల్వేజడ్జి జి.కార్తి ఈ కేసులు పరిష్కరించినట్లు చెప్పారు. -
నిఘానీడలో కేజీబీవీలు
శ్రీకాకుళం: జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో అత్యాధునిక సాంకేతికత కలిగిన సీసీ కెమెరాలు అమర్చారు. జిల్లాలో 25 కేజీబీవీలో ఉండగా సుమారు 7000 మంది విద్యార్థినులు 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నారు. ఇటీవల కాలంలో కేజీబీవీలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతుండటంతో విద్యార్థినుల భద్రతకు పెద్దపీట వేయాలని ఈ చర్యలు తీసుకున్నారు. ఒక్కో కేజీబీవీలో 9 ఏసీ కెమెరాలను అమర్చారు. ఇవి మనిషి కదలికలను బట్టి 360 డిగ్రీల కోణంలో తిరుగుతూ పర్యవేక్షణ జరుపుతాయి. కేజీబీవీలో జరిగే రాకపోకలన్నీ రికార్డవుతాయి. బోధన, బోధనేతర సిబ్బంది పనితీరు, ఆహార పదార్థాలు వండటం, వీటికి సంబంధించిన వస్తువుల వినియోగంతో పాటు మరెన్నో పర్యవేక్షించేందుకు అవకాశం ఉంటుంది. ఈ కెమెరాలు జిల్లా అధికారి కార్యాలయంతో పాటు రాష్ట్ర అధికారుల కార్యాలయం, జిల్లా సమగ్ర శిక్ష అధికారి కార్యాలయానికి అనుసంధానమై ఉండటంతో అక్కడి నుంచి కూడా అన్ని కేజీబీవీలను పర్యవేక్షించే అవకాశాలు ఉంటాయి. కేజీబీవీలో బాలికల భద్రత కోసం అత్యాధునిక సీసీ కెమెరాలు అమర్చాం. దీని ద్వారా విద్యార్థుల పర్యవేక్షణ కాకుండా సిబ్బంది పనితీరును జిల్లా స్థాయి నుంచే కాకుండా రాష్ట్ర స్థాయి వరకు పర్యవేక్షించే వీలుంటుంది. – వేణుగోపాలరావు, ఏపీసీ, సమగ్రశిక్ష అత్యాధునిక సీసీ కెమెరాల ఏర్పాటు అవాంఛనీయ ఘటనలు అరికట్టేందుకు చర్యలు -
మహిళలపై దాడులకు వ్యతిరేకంగా పోరాడాలి
పలాస: మహిళలపై హింస, ఉపాధి, మద్యం, డ్రగ్స్, పోర్న్ వెబ్సైట్లకు వ్యతిరేకంగా ప్రగతిశీల మహిళా సంఘం పోరాటం చేస్తుందని ప్రగతి శీల మహిళా సంఘం రాష్ట్ర అద్యక్షురాలు ఎం.లక్ష్మి పిలుపునిచ్చారు. పలాస మండలం బొడ్డపాడులో శుక్రవారం మహిళా సంఘం జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా బదకల ఈశ్వరమ్మ, ఉపాధ్యక్షురాలిగా బి.చిన్నప్పన్నమ్మ, ప్రధాన కార్యదర్శిగా పోతనపల్లి కుసుమ, కార్యదర్శిగా జి.ప్రభావతి, కోశాధికారిగా బర్ల జానకి ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా కె.హేమక్క, కె.జానకమ్మ, ఎస్.రజనీ, కె.లత, ఈ.సరస్వతి, కె.సుహాసిని, ఎం.మహాలక్ష్మి, వంకల డిల్లేశ్వరిలు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కుసుమ మాట్లాడుతూ ఈ నెల 12న దేశవ్యాప్త సమ్మెకు మద్దతు ఇవ్వాలని, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యథాతధంగా అమలు చేయాలని కోరారు. సమావేశంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన మహిళలు పాల్గొన్నారు. -
● పందిరి రాట
జలుమూరు: ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీముఖలింగంలో ఈ నెల 15 నుంచి 18 వరకూ వరకు జరగనున్న శ్రీముఖలింగేశ్వరుని శివరాత్రి ఉత్సవాలకు శుక్రవారం ఉదయం ఆలయ ప్రధాన ముఖద్వారం వద్ద పందిరి రాట వేశారు. పందిరి రాట వేసిన రోజు నుంచి ఆలయంలో ఉత్సవ పనులు ప్రారంభంచనున్నారు. అలాగే విద్యుత్, క్యూలు, అలంకర ణ, గర్భగుడిలో ముఖ్యమైన పనులకు సిద్ధం చేశా రు. స్వామి వాహనాలైన నంది, ఐరావతం, పార్వ తీ పరమేశ్వరుల విగ్రహాలను శుద్ధి చేయడం వంటి పనులు ప్రారంభిస్తారు. దీనికి ముందు ముత్తైదువులు పాలకొమ్మ, మామిడి తోరణాలు వెదురు కర్రతో కలిపి ముత్యాలు, గోధుమ రాయి పాలతో కలిపి భూమి పూజ చేశారు. ఆలయ ఈఓ ఏడు కొండలు, చైర్మన్ పాడి, సర్పంచ్ టి.సతీష్ కుమార్, ఎంపీటీసీ సభ్యులు కె.హరి ప్రసాద్, పురోహితులు బంకుపల్లి మధుశర్మ, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు. -
భళా ప్రశాంతి
● ఏషియన్ సెపక్తక్రా చాంపియన్షిప్ పోటీలకు ఎంపికై న రాగోలు వాసి ● శ్రీలంకలో నేటి నుంచి పోటీలు ● కొలంబో చేరుకున్న క్రీడాకారిణి శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాకు చెందిన సెపక్తక్రా క్రీడాకారిణి గేదెల దుర్గాప్రశాంతి చరిత్ర సృష్టించింది. శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలుకు చెందిన గేదెల దుర్గాప్రశాంతి భారత మహిళల సెపక్తక్రా జట్టుకు ఎంపికై ంది. ఈ నెల 7 నుంచి 10వ తేదీ వరకు శ్రీలంకలోని కొలంబో వేదికగా జరగనున్న 6వ ఏషియన్ ఇంటర్నేషనల్ మహిళల సెపక్తక్రా మహిళల చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనే భార త జట్టుకు ఎంపికై ంది. ఈ యువక్రీడాకారిణి భారత జట్టుతో కలిసి పోటీలు జరగనున్న కొలంబోకు చేరుకుంది. రాగోలు నుంచి కొలంబో వరకు.. జిల్లాలోని రాగోలుకు చెందిన దుర్గాప్రశాంతి గేదెల నర్సింహులు, పుణ్యావతిల కుమార్తె. వీరిది వ్యవసాయ కుటుంబం. డిగ్రీ పూర్తిచేసిన దుర్గాప్రశాంతి పదేళ్ల క్రితమే బాస్కెట్బాల్ గేమ్లో ప్రవేశం పొందింది. ఆ వెంటనే కోచ్ గాలి అర్జున్రావురెడ్డి ప్రోత్సాహంతో సెపక్తక్రా గేమ్లోనూ ఓనమాలు నేర్చుకుంది. అనతికాలంలో అనేక రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తాచాటిన దుర్గా ప్రశాంతి జాతీయ స్థాయిలోనూ రాణిస్తూ ఎన్నో పతకాలు అందుకుంది. దీంతో స్పోర్ట్స్ కోటా ద్వారా నాలుగేళ్ల కిందటే పారా మిలటరీ బలగాల్లో ఒకటైన ఎస్ఎస్బీలో ఉద్యోగం సంపాదించుకుంది. ఇండియన్ కోచింగ్ క్యాంప్నకు ఎంపికై .. గేదెల దుర్గాప్రసాంతి ఈ సీజన్లో ఒంగోలులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో శ్రీకాకుళం జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించి జిల్లాను ముందంజలో నిలిపింది. గోవాలో జరిగిన ఆలిండియా సెపక్తక్రా మహిళల చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొ నే ఆంధ్రప్రదేశ్ మహిళల జట్టుకు ఎంపికై ంది. ఈ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ జట్టు విజేతగా నిలవడంలో కీలక భూమిక వహించింది. దీంతో సెలక్షన్ కమిటీ ప్రతినిధులు సిక్కోలు క్రీడాతేజాన్ని ఇండియన్ కోచింగ్ క్యాంపునకు ఎంపిక చేశా రు. గత ట్రాక్ రికార్డుతో పాటు మెరుగైన ప్రదర్శనలు కనబర్చడంతో జాతీయ జట్టుకు ఎంపికచేశారు. ప్రశాంతి భారత జట్టుకు ఎంపిక కావడం మాటల్లో చెప్పలేని సంతోషంగా ఉందని కోచ్ గాలి అర్జున్రావురెడ్డి ఆనందం వ్యక్తంచేశారు. నా జీవిత లక్ష్యం నెరవేరింది.. జాతీయ జట్టుకు ఎంపిక కావాలన్న నా లక్ష్యం నెరవేరింది. నన్ను నిరంతరం ప్రోత్సహించిన మా పేరెంట్స్, కుటుంబ సభ్యులు మరీ ముఖ్యంగా సెపక్తక్ర సంఘం పెద్దలు ఎమ్మెస్సార్ కృష్ణమూర్తి, కోచ్ అర్జున్ ప్రోత్సాహం మరువలేను. – గేదెల దుర్గాప్రశాంతి, సెపక్తక్రా క్రీడాకారిణి, ఇండియన్ టీమ్ జిల్లాకు గర్వకారణం జిల్లాకు చెందిన గేదెల దుర్గా ప్రశాంతి భారత మహిళల సెపక్తక్రా జట్టుకు ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణం. ప్రశాంతిని ఆణిముత్యంలా తీర్చిదిద్దున కోచ్ గాలి అర్జున్రెడ్డిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. – ఎమ్మెస్సార్ కృష్ణమూర్తి, సెపక్తక్రా అసోసియేషన్ శ్రీకాకుళం జిల్లా చైర్మన్ -
చేతి రాత.. మార్చేను భవిత..!
● పరీక్షల్లో చేతిరాత కూడా ముఖ్యమే ● దస్తూరిపైనా సాధన చేయాలంటున్న నిపుణులు కాశం కూడా లేకపోలేదు. విద్యార్థులు చేతిరాతపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. టెన్త్ పరీక్షలకు నెలకుపైగా సమయం ఉన్నందున విద్యార్థులు ప్రతి రోజు అరగంట చేతిరాతపై సాధన చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. హిరమండలం: మా అబ్బాయి బాగానే చదువుతున్నా మార్కులు ఆ స్థాయిలో రావడం లేదు.ఎందుకో అర్థం కావడం లేదంటూ కొందరు తల్లిదండ్రులు నిత్యం ఆవేదన చెందుతుంటారు.. నాకొచ్చినవన్నీ సరిగ్గానే రాశాను.. అయినా మంచి మార్కులు రాలేంటూ విద్యార్థులు వాపోతుంటారు .ఆశించిన మార్కులు తగ్గడానికి అందంగా రాయకపోవడం, రాయలేకపోవడం కూడా ఓ కారణమే. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాల్సిన అవసరాన్ని గుర్తించే తరుణమిది. ఎంతబాగా చదివినా సరైన సమాధానం రాయకపోవడంతో పాటు అందమైన చేతిరాత కూడా ఎంతో ముఖ్యం. దస్తూరి సాధన చేస్తే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు, ఇది వరకే మంచిమార్కులు సాధించిన విద్యార్థులు సూచిస్తుచెబుతున్నారు. వారికి అర్ధమైతేనే.. పరీక్ష రాసే విద్యార్ధుల చేతిరాత బాగుంటే మూల్యాంకనం చేసేవారికి సులువుగా అర్ధమవుతుంది. ఫలితంగా మంచి మార్కులు వేస్తారు. చేతిరాత బాగాలేకపోతే మూల్యాంకనం చేసేవారికి సమాధానం ఒక్కోసారి అర్ధం కాదు. ఫలితంగా మార్కులు తగ్గే అవకాశం ఉంటుంది. ఇది మొత్తం మార్కులపై ప్రభావం చూపి ర్యాంకు తగ్గే అవ సంగ్రహక శక్తి ఎంత ఉన్నా అర్ధవంతంగా రాయడమే ప్రధానం. ఎక్కువ రాయాలన్న తపనతో సమయాన్ని వృథా చేసుకోకుండా చూసుకోవాలి. బాగా వచ్చిన జవాబును అందంగా రాస్తే మంచి మార్కులు సులభంగా వస్తాయి. – కె.రాంబాబు, మండల విద్యాశాఖాధికారి, హిరమండలం చక్కటి చేతిరాత సాధనతోనే సాధ్యమవుతుంది. పరీక్షలకు ఇంకా సమయం ఉన్నందున విద్యార్థులు అక్షరాలను గుండ్రంగా రాసేందుకు సమయం కేటాయించి సాధన చేయాలి. – ఎస్.కృష్ణవేణి, కేజీబీవీ ప్రత్యేకాధికారి, హిరమండలం మొదటి జవాబులు స్పష్టంగా రాయాలి. సమయం మించిపోతుందన్న ఆందోళన వద్దు. రెండు వరసల మధ్య ఖాళీ వదలాలి. పదాలు అంటుకున్నట్లు కాకుండా ప్రతి అక్షరం వీలైనంతలో ఒకే పరిమాణంలో రాయాలి. పెన్ను గట్టిగా పట్టుకుని రాయడం మంచిదికాదు. కొట్టివేతలు, దిద్దుబాటులు మంచివి కాదు. చిత్రాలు ఉంటే వాటిని ఆకట్టుకునేలా శీర్షికలు, ఉప శీర్షికలు స్పష్టంగా కనిపించేలా రాయాలి. గణితంలో సూత్రాలు, సమీకరణాలు కనిపించేలా రాయాలి. పేజీ పైభాగంలో అంగుళం, ఎడమవైపు అదే స్థాయిలో మార్జిన్లు విడిచిపెట్టాలి. బుక్లెట్లో వాక్యాలు పైకి, కిందకు లేకుండా వరస క్రమంలో ఉండాలి. పరీక్షల సమయంలో విద్యార్థులు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. లేకుంటే ఆ ప్రభావం చేతిరాతపై కూడా పడుతుంది. -
విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి
కొత్తూరు: మెట్టూరు బీసీ కాలనీలో నివాసముంటున్న ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ ముండూరు ప్రకాశరావు(55) విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రకాశరావు కొద్దిరోజులుగా ఉప్పరపేటలోని నూతన గృహంలో వైరింగ్ పనులు చేస్తున్నాడు. శుక్రవారం వైరింగ్ చేస్తున్న సమయంలో విద్యుత్ షాక్ గురయ్యాడు. అపస్మారక స్థితిలో ఉన్న ప్రకాశరావును 108 అంబులెన్సులో స్థానిక సీహెచ్సీకి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రకాశరావుకు భార్య జానకి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెచ్సీ టి.తిరుపతిరావు తెలిపారు. -
ఐకమత్యంతోనే సంఘ బలోపేతం
జి.సిగడాం/శ్రీకాకుళం: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేసిన సీఎన్సీ(ఉడ్ కార్వింగ్ ) యూనియన్ సభ్యులు ఐత్యమత్యంతో మెలిగి సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు సింహాద్రి ధనుంజయాచారి పిలుపునిచ్చారు. శుక్రవారం శ్రీకాకుళం ఇందిరా విజ్ఞాన్ భవన్లో సీఎన్సీ యానియన్ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా విశ్వబ్రాహ్మణులే సీఎన్సీ మిషన్లు ఏర్పాటు చేసుకుని జీవనోపాధి పొందుతున్నారని చెప్పారు. సంఘ సభ్యుల సంక్షేమానికి అందరూ కృషి చేయాలన్నారు. అనంతరం సీఎన్సీ యజమానుల సంఘం కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా గౌరవ అధ్యక్షులుగా సింహాద్రి గణపతి ఆచారి(నరసన్నపేట), సింహాద్రి కేశవరావు ఆచారి (కోటబొమ్మాళి), అరసవిల్లి భద్రరావు ఆచారి(శ్రీకాకుళం), జిల్లా అధ్యక్షుడిగా పట్నాన బుజ్జి(కోటబొమ్మాళి), ఉపాధ్యక్షుడిగా అరసవిల్లి రాంబాబు(పొందూరు), ప్రధాన కార్యదర్శిగా అరసవిల్లి గోపాల్ వెంకటరమణ(ఎల్ఎన్పేట), కోశాధికారిగా సింహాద్రి వెంకటరమణ చాచారి(బుడితి), ఉప కోశాధికారిగా పేలూరు జగదీశ్వరరావు ఆచారి (పాలకొండ), కార్యదర్శిగా కొండూరు చిట్టిబాబు ఆచారి(నరసన్నపేట), సహాయ కార్యదర్శిగా మల్లవరపు హరికృష్ణ (వీరఘట్టం) ఎన్నుకున్నారు. కార్యక్రమంలో భవన కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మంతిన హరినాథ్ ఆచారి తదితరులు పాల్గొన్నారు. -
9 నుంచి టీటీడీ కల్యాణోత్సవాలు
శ్రీకాకుళం కల్చరల్ : తిరుమల తిరుపతి దేవస్థానాలు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కల్యాణాల ప్రాజెక్టులో భాగంగా ఈ నెల9 నుంచి 11 వరకు పలుచోట్ల కల్యాణోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ప్రోగ్రాం అసిస్టెంట్ జె.శ్యామసుందర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఇచ్ఛాపురం మండలం బరంపురం ప్రాథమిక పాఠశాల ఆవరణలో, 10వ తేదీ ఉదయం 11 గంటలకు కళింగపట్నంలోని మత్స్యనారాయణ స్వామి ఆలయ సాగర తీరంలో, 11వ తేదీ సాయంత్రం 6 గంటలకు శ్రీకాకుళం మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో కల్యాణోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులంతా పాల్గొనాలని కోరారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్గా కూర్మారావు శ్రీకాకుళం: శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్గా హనుమంతు కూర్మారావును నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. గతంలో కమిషనర్గా పని చేసిన ప్రసాదరావును రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయానికి బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈయన స్థానంలో కూర్మారావును నియమించారు. ప్రస్తుతం ఈయన ఆగ్రోస్ జనరల్ మేనేజర్గా మంగళగిరిలో పనిచేస్తున్నారు. గతంలో శ్రీకాకుళం డ్వామా పీడీగా వ్యవహరించారు. అప్పట్లో శ్రీకాకుళం జిల్లా ఉపాధి హామీ పనులు అమల్లో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం, జాతీయ స్థాయిలో మూడో స్థానం దక్కించుకుంది. ఈయన సోమవారం బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. ఈ సందర్భంగా కూర్మారావు ‘సాక్షి’తో మాట్లాడుతూ నగరాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. నైరా కళాశాల సందర్శన శ్రీకాకుళం రూరల్: నైరాలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ కళాశాలను అగ్రికల్చర్ యూనివర్సిటీ (ఏఎన్జీఆర్ఏయూ, లామ్ గుంటూరు) వైస్ చాన్సలర్ డాక్టర్ ఆర్.శారదా జయలక్ష్మి దేవి, డీన్ ఆఫ్ పీజీ స్డడీస్ డాక్టర్ ఎ.వి.రమణ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల గ్రంథాలయం, డిజిటల్ లైబ్రరీని సందర్శించి మౌలిక సదుపాయాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పరిశోధన అంశాలపై చర్చించారు. నైరా కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జి.జోగినాయుడు మాట్లాడుతూ విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలతో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో హెచ్ఓడీ ప్రొఫెసర్ డాక్టర్ వి.శ్రీనివాసరావు, అసోసియేట్ ప్రొఫెసర్ లైబ్రరీ ఇన్చార్జి, ఓఎస్ఏ డాక్టర్ ఎస్.గోవిందరావు, పీడీ పురుషోత్తమరావు, సీనియర్ లైబ్రరీ అసిస్టెంట్ వై.కుశరాజు తదితరులు పాల్గోన్నారు. -
పల్లె పాట.. భాగ్యనగర బాట!
రికార్డింగ్ రూమ్లో జానపద పాటలు పాడుతూ.. నటుడు సమీర్ చేతుల మీదుగా నంది అవార్డు అందుకుంటున్న శ్రీనివాస్ ఇచ్ఛాపురం రూరల్ : ఇచ్ఛాపురం మండలం బుడ్డేపుపేటకు చెందిన లెంక శ్రీను చిన్నతనం నుంచే పల్లెల్లో పాటలు పాడటం అలవాటుగా మార్చుకున్నాడు. ఎప్పటికై నా వేదికపైకి ఎక్కి అద్భుత ప్రదర్శనతో అందరితో ప్రశంసలు అందుకోవాలని కలలు కన్నాడు. పల్లె పాటల మాధుర్యమే ఊపిరిగా, కలలే దారిగా.. తన ఊరి మట్టి వాసనను గుండెల్లో దాచుకుని ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుతూ పదకొండేళ్ల వయసులోనే భాగ్యనగరానికి రైలెక్కి బయల్దేరాడు. చేతిలో చిల్లిగవ్వ లేదు. కానీ..కళ్లల్లో మాత్రం ధైర్యం, ఆశల వెలుగు, సినిమాల్లో పాడాలన్న కోరికతో చేసిన ప్రయాణంలో శ్రీనును అక్కున చేర్చుకున్నాడు ప్రముఖ గాయకుడు రసమయి బాలకిసాన్. ఆ ఆశ్రయమే శ్రీనివాస్ జీవితాన్ని మలుపుతిప్పింది. గాయకుడిగా, కళాకారుడుగా తన ప్రతిభకు పదును పెట్టుకున్నాడు. ‘థూమ్ ధామ్’ కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. భీమ్లానాయక్, దసరా, బాహుబలి–2, ఇటీవల సంక్రాంతికి విడుదలైన మన శంకర వర ప్రసాద్ సినిమాలకు శ్రీనివాస్ అసిస్టెంట్ క్యాస్టింగ్ డైరెక్టర్గా పరిశ్రమలో అడుగు పెట్టాడు. ఐదు వందల జానపద పాటలకు లిరిక్స్ రైటర్గా తన కలాన్ని ఝులిపించిన శ్రీనివాస్.. శివ కళ్యాణ్ దర్శకత్వంలో విడుదలకు సిద్ధంగా ఉన్న ‘తురుమ్ ఖాన్లు’ చిత్రానికి ఆరు పాటలు రాశాడు. అంతే కాకుండా యూట్యూబ్లో ప్రాచుర్యం పొందిన ‘బెంగాలీ రసగుళ్ల’, ‘చికెనీ తెస్తాడు నా అల్లుడు’, ‘రాను బొంబాయికి రాను’, ‘బాయిలోనే బల్లి పలికే’, నిమ్మ తోట వనంలో, బావ బంగారం’ వంటి జానపథ పాటలకు బ్యాక్ గ్రౌండ్ ఆర్ట్ డైరెక్టర్గా తన సృజనాత్మకతను చాటుకుంటూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. అంతే కాకుండా సుమారు 25 జానపద గేయాల్లో హీరోగా నటనను నిరూపించుకున్నాడు. ప్రొడక్షన్ మేనేజర్గా 200 జానపథ గేయల చిత్రీకరణలో పనిచేశాడు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా రాణిస్తున్న శ్రీనివాస్ హైదరాబాద్లో ధూమ్ధామ్ కార్యక్రమం ద్వారా వెలుగులోకి గాయకుడు రసమయి శిష్యుడిగా ప్రస్థానం 500కు పైగా జానపద పాటలకు సాహిత్యం అందించిన బుడ్డేపుపేట కుర్రాడు టాలెంట్స్వర్ణ బంగారు నంది బహూకరణ పల్లె ప్రాంతం నుంచి పట్టణానికి వచ్చిన శ్రీనివాస్ బహుముఖ ప్రతిభకు ఇటీవల రుద్ర ది బెస్ట్ హెల్పింగ్ ఫౌండేషన్, రుద్ర స్టూడియోస్ నిర్వాహకులు ప్రముఖ నటుడు సమీర్ చేతుల మీదుగా ‘స్వర్ణ బంగారు నంది’ అవార్డు ప్రదానం చేశారు. కలలు కనడమే కాదు.. వాటిని నిజం చేయాలన్న పట్టుదల ఉంటే పల్లె నుంచి భాగ్యనగరం దాక విజయబాట తప్పదని తెలియజేసిన శ్రీనివాస్ తన పేరును ‘శ్రీను శ్రీకాకుళం’గా మార్చుకున్నాడు. -
హోరాహోరీగా పోరు
జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో తండ్యాలవలస పోలీసు శిక్షణ కేంద్రంలో నిర్వహిస్తున్న వార్షిక పోలీసు స్పోర్ట్స్ గేమ్స్ మీట్ రెండో రోజు గురువారం ఉత్సహభరితంగా సాగింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసులు అధికారులు, సిబ్బంది ఉత్సహంగా క్రీడాపోటీల్లో పాల్గొంటున్నారు. బ్యాడ్మింటన్, జావెలిన్ త్రో, ట్రాక్ రన్నింగ్, షాట్పుట్ వంటి పోటీలు హోరాహోరీగా సాగాయి. మహిళా సిబ్బంది కోసం మ్యూజికల్ చైర్, స్పూన్ గేమ్, రింగ్ టెన్నిస్ తదితర వినోదాత్మక క్రీడలు కొనసాగాయి. – శ్రీకాకుళం రూరల్ – సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం -
అప్పులు తీర్చేందుకు చోరీలు
శ్రీకాకుళం: అప్పులు తీర్చేందుకు శ్రీకాకుళం రూరల్ మండలం నందగిరిపేటలో జనవరి 30న చైన్ స్నాచింగ్కు పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ వివేకానంద తన కార్యాలయంలో గురువారం విలేకరులకు వెల్లడించారు. గత నెల 30న వేకువజామున 5 గంటల సమయంలో నందగిరిపేటలోని పాతిన భూదేవమ్మ ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. నీరు కావాలని అడిగే క్రమంలో భూదేవమ్మ మెడలోని 32.4 గ్రాముల బంగారు పుస్తెలతాడును తెంచుకుని కారులో పారిపోయారు. ఈ మేరకు బాధితురాలి కుమారుడు శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో పరిశీలించారు. గ్రామానికి రాకపోకల సాగించిన కార్లపై దృష్టిపెట్టారు. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను బట్టి కారు నంబరును గుర్తించి యజమాని వివరాలను సేకరించారు. ఆమదాలవలసలోని మెట్టెక్కివలస ప్రాంతానికి చెందిన కారు యజమానిని అదుపులోనికి తీసుకొని ప్రశ్నించగా తానే మరో ఇద్దరితో కలిసి నేరం చేసినట్లు అంగీకరించారు. చైన్ స్నాచింగ్కు పాల్పడిన వారిలో గుంట జగదీశ్వరరావు, గుంట ప్రమీలతోపాటు మెండ వెంకటరమణ ఉన్నారు. వీరి ముగ్గురూ ఆమదాలవలస పట్టణంలోని మెటక్కివలస హడ్కో కాలనీకి చెందినవారు. వీరిలో జగదీశ్వరరావు, ప్రమీల భార్యాభర్తలు కాగా, వెంకటరమణ వీరికి స్నేహితుడు. వీరంతా అప్పుల పాలు కావడంతో వాటిని తీర్చేందుకు దొంగతనం చేయాలని నిశ్చయించుకున్నారు. 20 రోజుల పాటు నందగిరిపేటలో రెక్కీ నిర్వహించి ఒకటి రెండు సార్లు విఫలమయ్యారు. వేకువజామున అయితే ఎవరూ ఉండరని భావించి చైన్ స్నాచింగ్కు పాల్పడ్డారు. నిందితుల వద్ద నుంచి 32.4 గ్రాముల బంగారం, సెల్ ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. కేసును వారం రోజుల్లోనే ఛేదించిన శ్రీకాకుళం రూరల్ సీఐ కె.పైడపునాయుడు, ఎస్సై కె.రాములను ఎస్పీ మహేశ్వరరెడ్డి అభినందించారు. సిబ్బందికి నగదు పారితోషకాలను డీఎస్పీ అందజేశారు ముగ్గురు చైన్స్నాచర్ల అరెస్ట్ 32.4 గ్రాముల బంగారం స్వాధీనం వివరాలు వెల్లడించిన డీఎస్పీ వివేకానంద -
ఏకలవ్య పాఠశాలలో ప్రవేశాలకు ఆహ్వానం
మెళియాపుట్టి: ఏకలవ్య గురుకుల పాఠశాలలో 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ అధికారులు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. 30 మంది బాలురు, 30 మంది బాలికల సీట్లు భర్తీ చేసేందుకు ఏప్రిల్ 4న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 5 నుంచి 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. కోడిగుడ్ల లారీ బోల్తా ఎచ్చెర్ల : తూర్పుగోదావరి జిల్లా హనుమాన్ జంక్షన్ నుంచి పశ్చిమబెంగాల్కు కోడిగుడ్ల లోడుతో వెళ్తున్న లారీ గురువారం వేకువజామున ఎచ్చెర్ల సమీపంలోని బైపాస్ జాతీయ రహదారిపై బోల్తాపడింది. లారీ ముందు భాగంలోని టైరు పంక్చర్ కావడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు పది లక్షల విలువ చేసే గుడ్లు పాడయ్యాయి. ఈ ఘటనలో పశ్చిమబెంగాల్కు చెందిన లారీ డ్రైవర్ రోహిత్ ఖాజీ, క్లీనర్ షేక్ రోహిత్లు స్వల్పంగా గాయపడ్డారని ఎచ్చెర్ల ఎస్సై జి.లక్ష్మణరావు తెలిపారు. కబళించిన కిడ్నీ వ్యాధి నరసన్నపేట: తామరాపల్లికి చెందిన కోల చక్రవర్తి(30)ని కిడ్నీ వ్యాధి కబళించింది. ప్రైవేటు డ్రైవర్గా పనిచేస్తున్న చక్రవర్తి కొన్నాళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విధుల్లోకి ఉపాధ్యాయుడు టెక్కలి: కోటబొమ్మాళి మండలం మాసాహెబ్పేట పంచాయతీ కమలనాభపురం ప్రాథమిక పాఠశాలకు ఎట్టకేలకు గురువారం ఉపాధ్యాయుడు విధులకు హాజరయ్యారు. ఇదే పాఠశాలలో గతంలో పనిచేసిన ఉపాధ్యాయుడు గత నెల 31న పదవీ విరమణ పొందిన తరువాత కొత్తగా ఉపాధ్యాయుడిని నియమించినప్పటికీ అతను విధులకు హాజరుకాలేదు. ఈ విషయమై విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై ‘ఏకోపాధ్యాయ ఎక్కడయ్యా...’ అనే కథనం గురువారం సాక్షిలో ప్రచురితమైంది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సంబంధిత ఉపాధ్యాయుడు పాఠశాలకు హాజరయ్యారు. ఆదిత్యుని సన్నిధిలో పంచాయతీరాజ్ కమిషనర్ అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారిని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ వి.ఆర్.కృష్ణతేజ గురువారం దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, అధికారులు గౌరవ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ డి.సత్యనారాయణ, అర్చకులు ఇప్పిలి రంజిత్ శర్మ, సాందీప్శర్మ, ఫణీంద్రశర్మ, జూనియర్ అసిస్టెంట్ చక్రవర్తి పాల్గొన్నారు. గడ్డి కుప్ప దగ్ధం ఆమదాలవలస: పురపాలక సంఘం పరిధిలోని 6వ వార్డు కె.మన్నయ్యపేటలో వరి గడ్డి కుప్పకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టి కాల్చేశారు. దీంతో బాధితుడు అన్నెపు గోవిందరావు లబోదిబోమంటున్నారు. గత ఏడాది కూడా తన గడ్డి కుప్పను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చివేశారని వాపోయారు. శ్రీకాకుళం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆచూకీ తెలపండి శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలోని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పోక్సో, వివిధ సెక్షన్లకు సంబంధించి కేసులో ముద్దాయి ఆమదాలవలస మండలం బొడ్డేపలి గ్రామస్తుడు గొండు సురేష్ ఆచూకీ తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఎస్ఐ ఎం.హరికృష్ణ కోరారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత కొంతకాలంగా పైకేసులో వాయిదాలకు హాజరుకానందున కోర్టు ప్రోక్లమినేషన్ నోటీసులు జారీ చేసిందని పేర్కొన్నారు. ఎవరికై నా తెలిస్తే ఒకటో పట్టణ పోలీస్స్టేషన్కు సమాచారం అందించాలని కోరారు. -
‘యురేకా సైన్స్ ఎక్స్పో’ విజయవంతం చేయండి
శ్రీకాకుళం: త్వరలో అన్ని జిల్లాల్లోనూ జరగనున్న రాష్ట్రస్థాయి సైన్స్ ప్రయోగాల వినూత్న పోటీలు (యురేకా సైన్స్ ఎక్స్పో– 2026)ను విజయవంతం చేయాలని డీఈఓ ఏ.రవిబాబు, పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేవీవీ జిల్లా ప్రధాన కార్యదర్శి కుప్పిలి కామేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు సామ సంజీవరావు, జిల్లా కార్యదర్శి పూజారి గోవిందరావు మాట్లాడుతూ ప్రయోగాలతో విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం పెరుగుతుందన్నారు. జేవీవీ ఎడ్యుకేషన్ సబ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గొంటి గిరిధర్ మాట్లాడుతూ ఇన్నోవేషన్– టెక్నాలజీ,పర్యావరణం– వ్యవసాయ రంగం, అపోహలు –శాసీ్త్రయ వివరణ అనే అంశాలపై ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 8,9,10 తరగతులు చదువుతున్న విద్యార్థులు పోటీల్లో పాల్గొనేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో శ్రీకాకుళం, టెక్కలి ఉపవిద్యాశాఖాధికారులు ఆర్.విజయ్కుమారి, పి.విలియం, జిల్లా పరీక్ష విభాగాధిపతి చంద్రభూషణ్, డీసీఈబీ సెక్రటరీ సంజీవరావు పాల్గొన్నారు. -
మిస్సమ్మ బంగ్లా స్థలం పరిశీలన
టెక్కలి: టెక్కలి పాతబస్టాండ్లో మిస్సమ్మ బంగ్లా స్థలాన్ని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్, టెక్కలి ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి గురువారం పరిశీలించారు.ఈ స్థలంలో కొన్నేళ్లుగా వివాదాలు చోటు చేసుకుని నిరుపయోగంగా మారిన సంగతి తెలిసిందే. ఆర్డీఓ నేతృత్వంలో రెండు రోజులుగా జంగిల్ క్లియరెన్స్ చేస్తూ స్థలాన్ని శుభ్రం చేస్తున్నారు. సుమారు 1.75 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ స్థలాన్ని ప్రజల అవసరాలకు అనుగుణంగా వాణిజ్య పరంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన ఆక్రమిత స్థలాన్ని సైతం స్వాధీనం చేసుకునేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ బి.సత్యం, డీటీ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. స్థలాన్ని పరిశీలిస్తున్న జేసీ, ఆర్డీఓ -
పారిశుద్ధ్య నిర్వహణకు ఈ–ఆటోలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా మంజూరైన ఎనిమిది ఎలక్ట్రికల్ ఆటోలను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ పరిశుభ్రతను పాటించాలన్నారు. జిల్లా పంచాయతీ అధికారి భారతి సౌజన్య మాట్లాడుతూ కవిటి మండలం రాజపురం పంచాయతీ, కంచిలి మండలం ఎం.ఎస్.పల్లి, ఇచ్ఛాపురం మండలం మసకాపురం, వజ్రపుకొత్తూరు మండలం పల్లివూరు, మందస మండలం బుడారిసింగి, పలాస మండలం తర్లకోటకు ఒక్కొక్కటి చొప్పున, కోటబొమ్మాలి మండలం నిమ్మాడకు రెండు వాహనాలు మంజూరైనట్లువివరించారు. వాహనాల పరిశుభ్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అనుభవం ఉన్న డ్రైవర్లతో పని చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో డీపీఓ భారతి సౌజన్య, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
కండ్రావార్డు హైస్కూల్కు ఎన్బీటీ పుస్తకాలు
ఇచ్ఛాపురం రూరల్: మండలంలోని కండ్రావార్డు ఉన్నత పాఠశాలకు భారత ప్రభుత్వం న్యూఢిల్లీ నుంచి విలువైన పుస్తకాలను గురువారం పంపించింది. ఈ సందర్భంగా ఎంఈఓ కురమాన ఆప్పారావు మాట్లాడుతూ.. ప్రధానోపాధ్యాయురాలు బూరవిల్లి ఉమామహేశ్వరి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురష్కారానికి నామినేట్ కావడం జిల్లాకే గర్వకారణమన్నారు. విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న ఆమె దేశ వ్యాప్తంగా 154 మంది ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాలో చోటుదక్కించుకున్నారని చెప్పారు. దీనిలో భాగంగానే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాఠశాల విద్య, సాక్షరత విభాగం ఆధ్వర్యంలో నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (ఎన్బీటీ) పుస్తకాలను బహుమతులుగా అందించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా పుస్తకాలను పాఠశాలలో ప్రదర్శించి హెచ్ఎం ఉమామహేశ్వరిని దుశ్శాలువతో సత్కరించారు. -
బోర్డు బంగ్లా స్థలంపై ప్రత్యేక దృష్టి
● ఇప్పటికే స్థల వివాదంపై సమీక్ష చేసిన కలెక్టర్ ● ఎంపీడీఓ ఫిర్యాదుతో విచారణ ప్రారంభించిన ఎస్సై నరసన్నపేట: మేజరు పంచాయతీ నరసన్నపేట నడిబొడ్డున విలువైన బోర్డు బంగ్లా స్థల వివాదంపై అధికారులు దృష్టి పెట్టారు. ఏటా ఎవరో ఒకరు వచ్చి స్థలం తమదంటూ స్వాధీనానికి ప్రయత్నిస్తుండటం తెలిసిందే. దీనిలో భాగంగా గత గురువారం రాత్రి ఆమదాలవలసకు చెందిన వ్యక్తులు శ్రీకాకుళంకు చెందిన కూటమి నాయకుడి సూచనలతో స్థలం వద్ద పనులు చేపట్టిన తెలిసిందే. దీనిపై విమర్శలు చెలరేగడంతో అధికారులు మేల్కొన్నారు. ఏటా వివాదం జరుగుతుండటంతో దీనిపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టి తగిన చర్యలు తీసుకోవడానికి చర్యలకు ఉపక్రమించారు. ఈ స్థలంపై కూటమి నాయకుల కన్ను ఉందని ఎమ్మెల్యే స్వయంగా చెప్పడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ దశలో ఎంపీడీఓ వెంకటేశ్వరప్రసాద్ నరసన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ టి.సత్యనారాయణతో కలిసి కలెక్టర్ వద్దకు వెళ్లి స్థల వివాదం వివరించారు. అక్కడే ఉన్న ఎస్పీ మహేశ్వరరెడ్డిని కూడా కలిశారు. దీంతో కలెక్టర్, ఎస్పీలు తగిన చర్యలు తీసుకొనేందుకు కింది స్థాయి అధికారులకు మౌఖికంగా ఆదేశాలిచ్చారు. ఈ మేరకు పాత రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. గతంలో కోర్టు నుంచి వచ్చిన సమాచారం.. ఎవరెవరు దీనిపై కోర్టుకు వెళ్లారు అనే వివరాలను సేకరిస్తున్నారు. మరోవైపు నరసన్నపేట ఎస్సై బి.గణేష్ ఎంపీడీఓ ఇచ్చిన ఫిర్యాదు పై ఆమదాలవలసకు చెందిన ముద్దాడ గోవిందరావు తదితరులను గురువారం పిలిచి విచారించారు. తనకు స్పష్టంగా హైకోర్టు నుంచి అనుమతులు ఉన్నాయని, అధికారులు ఎవరూ ఈ స్థలంలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదంటూ గోవిందరావు కోర్టు ఆర్డర్లు ఉన్నాయని తెలిపినట్లు సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉందని ఎస్సై తెలిపారు. ముదిరిన వివాదం.. కాగా, గొట్టిపల్లి సర్వే నంబరు 219/బీ1 లో ఉన్న 38 సెంట్ల స్థలం బోర్డు బంగ్లాకు చెందిన స్థలంగా ఉంది. అధికారులు దీనిపై సరైన చర్యలు గతంలో తీసుకోకపోవడంతో ఇప్పుడు వివాదం మరింత ముదిరింది. 2023 అక్టోబరు 21న, డిసెంబర్ 16న, 2024 ఫిబ్రవరి 20న ఈ స్థలంపై వివాదం జరిగింది. తాజాగా జనవరి 29న మరోసారి వివాదం చోటు చేసుకుంది. -
వారి నేత్రాలు సజీవం
శ్రీకాకుళం కల్చరల్ : నగరంలోని అఫీషియల్ కాలనీకి చెందిన అనంత పట్నాయకుని రామ్మోహనరావు(65), గుజరాతిపేటకు చెందిన పొట్నూరు నిర్మల(45) మృతిచెందడంతో వారి నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకుని రెడ్క్రాస్కు సమాచారం అందించారు. మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ–టెక్నీషియన్ పూతి సుజాత, నంది ఉమాశంకర్ల ద్వారా కార్నియాలు సేకరించి విశాఖ ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు. సహకరించిన కుటుంబ సభ్యులకు చైర్మన్ జగన్మోహనరావు, కార్యదర్శి బి.మల్లేశ్వరరావు, కోశాధికారి కె.దుర్గా శ్రీనివాస్, సభ్యులు అభినందించారు. నేత్రదానం చేయాలనుకునే వారు 78426 99321 నంబరును సంప్రదించాలని కోరారు. -
తత్కాల్ స్కీమ్ ద్వారా టెన్త్ ఫీజు చెల్లింపునకు అవకాశం
శ్రీకాకుళం: జిల్లాలో పదో తరగతి పరీక్షలకు హాజరు కావాలనుకునే విద్యార్థులు తత్కాల్ స్కీం ద్వారా ఈనెల 12వ తేదీ వరకు ఫీజులు చెల్లించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని జిల్లా విద్యాశాఖ అధికారి ఎ.రవిబాబు తెలిపా రు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ పరీక్ష తప్పిన విద్యార్థులతో పాటు రెగ్యులర్ విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. ఫీజులకు అదనంగా వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. పరీక్షల విభాగం డైరెక్టర్ ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించారని, ఆరో తేదీ నుంచి 12వ తేదీ వరకు ఫీజులు చెల్లించవచ్చన్నారు. నామినల్ రోల్స్ ను కూడా ఆన్లైన్లో సమర్పించాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు ‘సమన్వయంతోనే వివాదాల పరిష్కారం’ శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో వివిధ భూ సమస్యల కేసులు అధికారుల సమన్వయంతోనే పరిష్కారమవుతాయని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధ్యక్షతన జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లాలో గల ఆర్డీవోలు, ఎమ్మార్వోలు, పోలీస్ అధికారులతో రెవెన్యూ సదస్సు సమావేశాన్ని గురు వారం నిర్వహించారు. రెవెన్యూ సమస్యల వివరాలను ముందుగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. అందుకు సంబంధించిన పవర్ ప్రజెంటేషన్ ద్వారా అందించిన వివరాలపై కలెక్టర్ స్పందిస్తూ రెవెన్యూ, పోలీసు యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని సూ చించారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి మా ట్లాడుతూ తప్పుడు కేసులకు అండదండలు అందించిన వారికి భయం కలిగేలా బైండోవర్ కేసుల్లో పూచికత్తుగా ఉన్న మొత్తాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించకూడదని, తప్పు చేయా లనే ఉద్దేశం ఉన్నవారికి కేసుల భయం, ఆర్థిక భారం కలిగేలా వ్యవహరించాలని సూచించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వీ లక్ష్మణమూర్తి మాట్లాడుతూ రిటైర్ అయి గ్రామాల్లో ఉన్న నాయుడు, కారణం తదితర వాళ్ల సహాయంతో రెవెన్యూ వ్యవస్థలో మార్పు తీసుకురావాలని అన్నారు. స్థలాల పరిశీలన సంతబొమ్మాళి: మూలపేట పోర్టు పరిసర ప్రాంతాల్లోని మర్రిపాడు, కాకరపల్లిలో స్థలాలను జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ గురువారం పరిశీలించారు. మర్రిపాడులో కాకరపల్లిలో ఏిపీఐఐసీ చెందిన 400 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. ఈ స్థలాల్లో పోర్టు అనుబంధ పరిశ్రమలు, టౌన్షిప్ కోసం సేకరణ చేస్తున్నట్లు సమాచారం. అనంతరం మూలపేట పోర్టును నౌపడలో ఆర్అండ్ ఆర్ కాలనీని పరిశీలించారు. టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, తహసీల్దార్ హేమసుందరరావు, ఆర్ఐ చంద్రమౌళి ఉన్నారు. ‘వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పోలీసు సేవలు సులభం’ శ్రీకాకుళం క్రైమ్ : డిజిటల్ పాలనలో భాగంగా ప్రజలకు మరింత సులువుగా పోలీసు సేవలు అందేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన మిత్ర (వాట్సాప్ గవర్నెన్సు) సేవలు అందరూ వినియోగించుకోవాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పరిపాలనకు సంబంధించి అన్ని పనులను ఈ–ఆఫీస్ విధానంలోనే నిర్వహించాలని, పీజీఆర్ఎస్ (పబ్లిక్ గ్రీవెన్సు) ద్వారా స్వీకరించే ప్రజా ఫిర్యాదులను సకాలంలో పారదర్శకంగా పరిష్కరించేలా చర్యలుండాలన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలు పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా ఎఫ్ఐఆర్ కాపీ, ఎఫ్ఐఆర్ ప్రస్తుత స్థితి, ఈ–చలానా వివరాలు పొందవచ్చన్నారు. ఈ సేవలు పొందేందుకు 9552300009 నంబర్ను మొబైల్ఫోన్లో సేవ్ చేసుకుని ఆ నంబర్కు ‘హాయ్’ అని మెసేజ్ పంపితే ప్రభుత్వ సేవల వివరాలు వస్తాయన్నారు. . -
శ్రీకాకుళం
పల్లెపాట.. భాగ్యనగర బాటబుడ్డేపుపేట కుర్రాడు అదరగొడుతున్నాడు. పాటలతో ఆకట్టుకుంటున్నాడు. –8లో శుక్రవారం శ్రీ 6 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026కార్యక్రమాల షెడ్యూల్ ఫిబ్రవరి 7 ఆంజనేయస్వామికి అభిషేకం. 8 వాసుదేవునికి అభిషేకం. 9 గరుడపూజ,ధ్వజారోహణం, హనుమద్వాహనం, శేషవాహన సేవ. 10 కల్పవృక్ష వాహనం, ఎదుర్కోలు ఉత్సవం. 11 వాసుదేవుని కల్యాణ మహోత్సవం. 12 పొన్నచెట్టు వాహనం,తెప్పోత్సవం, అశ్వవాహన సేవ. 13 రథోత్సవం, చక్రస్నానం, శ్రీ పుష్టయాగం కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, సంకీర్తనలు జరుగుతాయి. మందసలోని వాసుదేవ పెరుమాళ్ బ్రహ్మోత్సవాలు ఈ నెల 7 నుంచి 13వ తేదీ వరకు జరగనున్నా యి. ఈ బ్రహ్మోత్సవాలు ఏటా అంగరంగ వైభవంగా జరుపుతారు. ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ జీర్ణోద్ధరణ పనులు అయ్యాక త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి ఆధ్వర్యంలో 2010 ఫిబ్రవరి 5వ తేదీన మొదటి బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ఆలయ చరిత్రలోకి వెళ్తే.. 1744వ సంవత్సరంలో మందస సంస్థానానికి స్థానాచార్యులుగా నరసాపురానికి చెందిన తెలికిచర్ల కందాడ రామానుజాచార్యస్వామి ఉండేవారు. ఆయన వద్ద త్రిదండి శ్రీమన్నారాయణ పెద్ద జీయర్ స్వామి, గోపాలచార్య స్వామి శిష్యులుగా ఉండేవారు. వాసుదేవుని ఆల య ప్రాంగణంలోని వేద పాఠశాలలో వీరిద్దరూ పండిత విద్యను అభ్యసించారు. అప్పట్లో వాసుదేవునికి నిత్య అర్చనలు జరిగేవి. ఏటా 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారు. రాచరిక పాలనలో వైభవోపేతంగా ఉత్సవాలు జరిగేవి. రాచరికం పోయాక బ్రహ్మోత్సవాలు నిలిచిపోయా యి. క్రమానంతరం ఆలయం కూడా జీర్ణావస్థకు చేరుకుంది. పెద్ద జీయర్ స్వామి తదనంతరం వచ్చిన త్రిదండిచిన్నజీయర్స్వామి ఆలయ ప్రాధా న్యతను గుర్తించి గురువుల స్మారకార్థం అభివృద్ధి చేసేందుకు సంకల్పించారు. 2000 జూలై 7వ తేదీన మధుభయ వేదాంత ఆచార్య పీఠం దేవదాయశాఖ నుంచి సర్వహక్కులను తీసుకుంది. శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని పునర్నిర్మించారు. ఒడిశాకు చెందిన కళాకారులతో పనులు చేయించి 2009 సంవత్సరం ఫిబ్రవరి 19వ తేదీన వేదపండితులతో స్వామిని పునఃప్రతిష్టించారు. ఆలయానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా భక్తులు వస్తుంటారని ఆలయ ప్రధాన అర్చకులు గోపీనంబాళ్ల దాసుకూర్మాచార్యులు తెలిపారు. బ్రహ్మోత్సవానికి హాజరైన భక్తులకు భోజన ఏర్పాట్లు, మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. -
సిబ్బంది లేక..
అవినీతి నిరోధక శాఖ● అరకొర సిబ్బందితో ఏసీబీ ● డీఎస్పీ సహా సరిపడా సిబ్బంది లేక అవస్థలు శ్రీకాకుళం క్రైమ్ : అవినీతిని నిరోధించాల్సిన శాఖ.. సిబ్బంది కొరతతో కునారిల్లుతోంది. గత ఏడాది అక్టోబరులో డీఎస్పీ బీవీ రమణమూర్తి విశాఖపట్నం బదిలీ కావడం, విజయనగరం జిల్లాకు చెందిన డీఎస్పీ రమ్యకు అక్కడితో పాటు ఇక్కడ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడం, ఆమె విజయనగరానికే ఎక్కువ శాతం పరిమితం కావడంతో జిల్లాలో ఈ శాఖ స్తబ్ధుగా ఉండిపోయింది. 2025 ఏడాదిలో మూడంటే మూడు కేసులు అదీ రమణమూర్తి డీఎస్పీగా ఉన్నప్పుడే కట్టారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో అవినీతి పెచ్చుమీరుతున్నా అవినీతి నిరోధక శాఖ నిద్రావస్థలో ఉందన్న విమర్శలు అధికమవ్వడంతో ఈ మధ్య ఏసీబీ దాడులు అధికం చేసింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రజలను మేలుకొలిపి అవినీతిపై ఫిర్యాదులిచ్చేవిధంగా సంబంధిత శాఖ 14400 టోల్ఫ్రీ నంబర్కు విస్తృతంగా ప్రచారం కల్పించింది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. కొత్తగా వచ్చిన 1064 టోల్ఫ్రీ నంబర్ అంత బాగా ప్రాచుర్యంలో లేదు. సిబ్బంది కొరత.. ఆరుగురు పీసీలు, ఆరుగురు హెచ్సీలు, ముగ్గురు ఎస్ఐలు, ముగ్గురు సీఐలు, ఓ రెగ్యులర్ డీఎస్పీ జిల్లా ఏసీబీలో ఉండాలి. దాదాపు 8 ఏళ్లు డీఎస్పీగా కొనసాగిన రమణమూర్తి గత ఏడాది అక్టోబరులో విశాఖపట్నానికి బదిలీ కావడం, రెగ్యులర్ డీఎస్పీ లేకుండా ఇన్చార్జిగా విజయనగరం డీఎస్పీ రమ్యను మన జిల్లాకు నియమించినా ఆమె సరిగా రాకపోవడం చాలా ఇ బ్బందిగా పరిణమిస్తోంది. అంతేకాక సీఐ ఒకరు, ఎస్ఐలు ముగ్గురు, పీసీలు ముగ్గురు, హెచ్సీ ఒకరు లేకపోవడంతో ఉన్నవారిపైనే పూర్తిగా భారం పడుతోంది. దీనిపై ఈ మధ్య ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి వద్ద ప్రస్తావించగా సిబ్బంది కొరత మాట వాస్తవమేనని, రెగ్యులర్ అధికారి వచ్చినంత వరకు ఇబ్బంది ఉంటుందన్నారు. కొత్త ఫోన్ నంబర్లు, టోల్ఫ్రీ నంబర్ల తాలుకా పాంప్లెట్లు, స్టిక్కర్లు వచ్చాయని, ప్రచారం కల్పిస్తామన్నారు ఈ శాఖలపైనే ఆరోపణలు ● జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఇబ్బడిముబ్బడిగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ● నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాల ను, నిర్ణీత జరిమానా చెల్లించడం ద్వారా చట్టబద్ధం (రెగ్యులరైజ్) చేసే ప్రక్రియ బీపీఎస్ (బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్)ను సంబంధిత రెవెన్యూ, మున్సిపల్, కార్పొరేషన్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు ప్రజల నుంచే వినిపిస్తున్నాయి. ● సుడా పరిధిలో ఏవైనా నిర్మాణాలకు, లేఅవుట్లకు అనుమతులు కోసం వెళ్తే కాగితాల కోసం తిప్పిస్తారని, చేతులు తడిపితే పని వేగంగా అవుతుందనే ఆరోపణ అంతటా వినిపిస్తోంది. ● తూనికలు కొలతల శాఖ, ఎరువుల కంపెనీల నుంచి వచ్చే కంటైనర్లు, హోల్సేల్ ఎరువుల షాపుల్లో అవినీతి పెచ్చుమీరుతోంది. ● పశు సంవర్ధక శాఖపై కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది. పోలీసు శాఖపై కూడా అక్కడక్కడా ఆరోపణలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. బంగా రం రికవరీ విషయంలో ఆరోపణలున్నాయి. ఏదీ ప్రచారం.. ? గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అవినీతి నిరోధక శాఖకు చెందిన 14400 టోల్ఫ్రీ నంబర్ను, జిల్లా అధికారుల నంబర్లను, మెయిల్ అడ్రస్ల ను మండలకేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలోనే కాక మారుమూల పల్లెలకు సైతం పాంప్లెట్లు, స్టిక్కర్ల రూపంలో అంటించి విస్తృత ప్రచారం కల్పించారు. దీనిలో భాగంగా ప్రభుత్వం కొంతమేర నిధులు సైతం వెచ్చించారు. కొత్తగా వచ్చిన టోల్ఫ్రీ నంబర్ 1064 ఆ స్థాయిలో ప్రజల్లోకి వెళ్లకపోవడానికి కారణం, కొత్తగా వచ్చిన పాంప్లెట్లు, స్టిక్కర్లు ఇప్పటికీ స్టోరేజీ రూముల్లో మగ్గుతుండటమే. ఇప్పటికీ ప్రజలు పాత టోల్ఫ్రీ నంబర్కే ఫోన్ చేస్తుండటం, అది పనిచేయకపోవడంతో తీవ్ర నిరాశ చెందుతున్నారు. -
చిరు వ్యాపారులతో చెలగాటం
పలాస: కాశీబుగ్గ కేటీ రోడ్డులోని క్రిస్టియన్, ముస్లిం శ్మశానం ఎదురుగా గత కొన్నేళ్లుగా ఆశీలు కడుతూ వ్యాపారాలు చేస్తున్న చిరు వ్యాపారులతో టీడీపీ నాయకులు చెలగాటమాడుతున్నారు. మున్సిపాలి టీ ఏర్పాటు కాక ముందు నుంచి శ్మశానం ఎదురుగా వీరు వ్యాపారాలు చేస్తున్నారు. గతంలో కేటీ రోడ్డు వెడల్పు చేసే సమయంలో వీరిని శ్మశానం ఎదురుగా ఉన్న ఫుట్పాత్పైకి పంపించారు. రోడ్డు వెడల్పైన తర్వాత వీరు మళ్లీ యథా స్థానాలకు వచ్చారు. ఇటీవల మున్సిపల్ కమిషనర్గా వచ్చిన ఇ.శ్రీనివాసరావు వారిని ఫుట్పాత్పైకి పంపడంతో అంతా వెళ్లిపోయారు. ఇటీవల ఓ టీడీపీ నేత వారి వద్దకు వెళ్లి అద్దె వసూలు చేయడానికి రాయబేరా లు నడిపాడు. మున్సిపాలిటీకి తాము ఆశీళ్లు కడుతున్నామని వ్యాపారులు చెప్పినా ఆ నాయకుడు ఒప్పుకోలేదు. తమకు డబ్బులు చెల్లిస్తేనే షాపులు ఉంటాయని హెచ్చరించాడు. దీంతో వారంతా ఆందోళన చేసి రోడ్డు మీద దుకాణాలు పెట్టుకున్నారు. గురువారం పోలీసులు వచ్చి మళ్లీ ఫుట్పాత్ ము న్సిపాలిటీదని, అక్కడే పెట్టుకోండని వారే దగ్గరుండి మళ్లీ పెట్టించారు. బాధిత వ్యాపారులు రోహిణీ బెహరా, మీనకేశ్వరరావు, బరాట వెంకటరమణ తదితరులు మాట్లాడుతూ తమ పొట్టకొట్టవద్దని, చాలా కాలంగా దీన్ని నమ్ముకొని బతుకుతున్నామని, మున్సిపాలిటీకి కూడా ఆశీలు కడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకో తీరుగా వ్యవహరిస్తూ నరకం చూపిస్తున్నారని అంటున్నారు. -
వందేమాతరం.. అందాం అందరం
నరసన్నపేట: సీఐఎస్ఎఫ్ కోస్టల్ సైక్లోథాన్ సైకిల్ యాత్ర గురువారం సాయంత్రం నరసన్నపేటకు చేరుకుంది. మండల సరిహద్దు గ్రామం తామరాపల్లి వద్ద ఘన స్వాగతం పలికారు. వందేమాతర గీతానికి 150 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఈ సీఐఎస్ఎఫ్ కోస్టల్ బృందాలు సైకిల్ యాత్రను పశ్చిమ బెంగాల్లో జనవరి 28న ప్రారంభించాయి. ఈ ర్యాలీ కేరళ వరకు సాగుతుంది. అందు లో భాగంగా గురువారం నరసన్నపేటకు వచ్చిన ర్యాలీకి పారామిలటరీ మాజీ సైనికులు, పోలీసులు, ఎన్సీసీ కేడెట్లు ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక పైడితల్లి అమ్మవారి ఆలయం రోడ్డు లో ఉన్న పారామిలటరీ మాజీ సైనికుల కార్యాలయం వద్ద భోజన వసతి కల్పించారు. ఈ సందర్భంగా సీఐఎస్ఎఫ్ సౌత్ జోన్ డీఐజీ ఎం.జీ.రాఘవేంద్రకుమార్ మాట్లాడుతూ వందేమాతర గీతం స్వాతంత్రోద్యమ కాలంలో దేశ సమైక్యతను చాటిందని అన్నారు. ఈ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సీఐఎస్ఎఫ్ జవాన్లతో సైకిల్ ర్యాలీ తలపెట్టామన్నారు. 25 రోజుల పాటు తొమ్మిది రాష్ట్రాలను కవర్ చేస్తూ 6533 కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తామన్నారు. నరసన్నపేట ఎస్ఐ బి.గణేష్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు కల్పించారు. కార్యక్రమంలో ఐసీఎల్ కమాండర్ డి.జితేంద్ర బాబు, డిప్యూటీ కమాండర్ అవినాష్కుమార్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ సునీల్ కుమార్ తో పాటు పలువురు సీఐఎస్ఎఫ్ అధికారులు పాల్గొన్నారు. -
ఆకట్టుకున్న అవధానాలు
నరసన్నపేట: మండలంలోని ఉర్లాంలో బుధవారం నిర్వహించిన త్రిగళ అష్టావధానం ఆకట్టుకుంది. సుసరాపు చంద్రశేఖర శర్మ, రంప సాయికుమార్ శర్మ, ఎన్.జయలక్ష్మిలు తెలుగు, ఆంధ్రం, సంస్కృతం భాషల్లో త్రిగళ అవధానం చేశారు. మండపాటి మహేశ్వరి అష్టావధానం నిర్వహించారు. 212 మంది కవులు, పండితులు పాల్గొన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు అవధాన కార్యక్రమాలు జరిగాయి. సంధించిన ప్రశ్నలను అవధానులు సమయస్ఫూర్తితో వివరించడం ఆకట్టుకుంది. అవధాన సభా అధ్యక్షుడు బంకుపల్లె రమేష్ శర్మ మాట్లాడుతూ ఉర్లాం సంస్థానం కళలకు పెట్టింది పేరని, దానిని గుర్తు చేసుకొని ఈ అవధాన కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సత్యవరాగ్రహారానికి చెందిన మారుతీ బ్రాహ్మణ సంఘం ప్రతినిధి మావుడూరి జగదీష్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
హైవే.. తనిఖీలకు నో వే..!
రణస్థలం: జాతీయ రహదారిపై ఇసుక బళ్లు దర్జాగా దూసుకెళ్తున్నాయి. అక్రమమా, సక్రమమా అని అడిగే నాథుడు లేకపోవడంతో హైవే వెంబడి హారన్ కొట్టుకుంటూ బళ్లు రంకెలేస్తున్నాయి. నాగావళి, వంశధార పరివాహక ప్రాంతాల నుంచి నిత్యం ఇసుక తవ్వుకుంటున్న వారు వందలాది లారీల్లో ఆ ఇసుకను విశాఖ తదితర ప్రాంతాలకు సులువుగా తరలించుకుంటున్నారు. సాధారణంగా సుదూర ప్రాంతాలకై తే ప్రభుత్వ నిర్దేశిత రుసుం చెల్లించి అనుమతులు పొందాలి. కానీ అనుమతులు ఉన్నాయో లేవో పరిశీలించే దిక్కు కూడా లేకపోవడంతో హైవే ఇసుక రవాణాకు ప్రధాన రహదారిగా మారిపోయింది. జిల్లా నుంచి వెళ్లే ఇసుక వాహనాలను పైడిభీమవరం ఇసుక చెక్పోస్టు వద్ద తప్పనిసరిగా తనిఖీ చేయాలని, అనుమతులు ఉంటేనే విడిచిపెట్టాలని లేదంటే వెంటనే సీజ్ చేయాలని రెవెన్యూ, పోలీస్ సిబ్బందికి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి 2024 ఆక్టోబర్ 6వ తేదీన పైడిభీమవరం ఇసుక చెక్పోస్టు పరిశీలనలో ఆదేశించారు. చెక్పోస్టు వద్ద ఆ రోజే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించి పోలీస్, రెవెన్యూ, విజిలెన్సు, మైన్స్ సిబ్బందికి ఆర్డీఓ, జేసీల సమక్షంలో పలు సూచనలు చేశారు. కానీ ఆ ఆదేశాల అమలు మూడునాళ్ల ముచ్చటగానే సాగింది. నకిలీ బిల్లుల ఊసే లేదు జిల్లా నుంచి నకిలీ బిల్లులతో ఇసుక అక్రమంగా తరలిపోతుందని 2025 ఫిబ్రవరి 14న ఎస్పీ, కలెక్టర్ అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఆ రోజు పట్టుకున్న 28 ఇసుక లారీల్లో 12 లారీలు నకిలీ బిల్లులేనని క్షేత్రస్థాయిలో గుర్తించారు. ఆపై 12 లారీలు సీజ్ చేసి కేసులు నమోదు చేసి లారీలు వదిలేశారు. పట్టుకున్న ఇసుకకు కాపలాగా వీఆర్ఏలను నియమించారు. వారు ఆరుమాసాల పాటు కాపు కాశారు. తర్వాత ఆ ఇసుకను వేరే శాఖకు అప్పగించి నిర్మాణాలకు ఉపయోగించారు. ఇసుక అక్రమ రవాణాలో ఓ అధికారి చేతివాటం ఉందని పత్రికల్లో రావటంతో అప్పట్లో ఎంకై ్వరీ చేసినా ప్రజా ప్రతినిధుల ఒత్తిడితో నీరుగార్చేశారు. ఇంత పగడ్బందీగా ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న అధికారులు ఏడాది గడవక ముందే చేతులెత్తేయడం వెనుక ఆంతర్యమేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చెక్పోస్టు అలంకార ప్రాయమేనా..? గత కొన్ని నెలలు పైడిభీమవరం చెక్పోస్టులో ఎలాంటి తనిఖీలు జరగడం లేదు. రెవెన్యూ అధికారులు ఉండటం లేదు. సీసీ కెమెరాలు, విద్యుత్ దీపాలు, ఇతర వస్తువులకు కాపాలాగా పగటి పూట ఇద్దరు కానిస్టేబుళ్లు ఉంటున్నారు. వారు అలా కాలక్షేపానికి వచ్చి వెళ్లిపోయినట్లు వెళ్తున్నారే తప్ప లారీ ఆపి తనిఖీలు చేయడం లేదు. కనిపిస్తే లారీ నంబర్ ఒక నోట్ బుక్పై రాస్తున్నారు. లేదంటే అదీ లేదు. రాత్రి తనిఖీలు ఉండడం లేదు. అంతా సక్రమమేనా..? శ్రీకాకుళం జిల్లా వైపు నుంచి విశాఖపట్నం వైపు రోజు 150కిపైగా ఇసుక భారీ లారీల్లో తరలిపోతోంది. ఇసుక అంతా సక్రమమేనా అని స్థానికులు చర్చించుకుంటున్నారు. పగటి పూట ఓ పుస్తకంలో ఆ వాహనాల నంబర్లు రాస్తున్నారు. రాత్రిపూటైతే అదీ లేదు. దీనిపై జేఆర్పురం సీఐను సంప్రదించగా పైడిభీమవరం ఇసుక చెక్పోస్టు వద్ద తమ సిబ్బంది ఉంటున్నారని పేర్కొన్నారు. సిబ్బంది ఉండడం లేదు రీ సర్వే పనుల్లో భాగంగా పైడిభీమవరం చెక్ పోస్టులో మా సిబ్బంది ఎవరూ ఉండటం లేదు. పోలీస్ అధికారులు మాత్రమే ఉంటున్నారు. రెవె న్యూ అధికారులకు ఎలాంటి డ్యూటీలు వేయలేదు. – సనపల కిరణ్ కుమార్, తహసీల్దార్, రణస్థలం జాతీయ రహదారిపై ఇష్టానుసారం ఇసుక అక్రమ రవాణా తనిఖీలు లేకపోవడంతో రెచ్చిపోతున్న ఇసుకాసురులు అలంకారప్రాయంగా మారిన పైడిభీమవరం ఇసుక చెక్ పోస్టు షిఫ్ట్లుగా ఉంటున్నారు పైడిభీమవరం ఇసుక చెక్పోస్టు వద్ద ఉదయం, సాయంత్రం ఒక్కొక్కరుగా పోలీస్ సిబ్బంది ఉంటున్నారు. రాత్రి ఎవరూ ఉండడం లేదు. రెవెన్యూ సిబ్బంది గత కొన్ని నెలలుగా రావడం లేదు. ఇసుక లారీ వచ్చే బిల్లులు నకిలీయా లేక ఒరిజినలా అన్నది రెవెన్యూ, విజిలెన్స్ వాళ్లకే తెలుస్తుంది. – ఎస్.చిరంజీవి, ఎస్ఐ, జేఆర్ పురం -
ఏకోపాధ్యాయ ఎక్కడయ్యా..?
టెక్కలి: కోటబొమ్మాళి మండలంలోని కమలనాభపురం గ్రామ ప్రాథమిక పాఠశాలకు ఉపాధ్యాయుడు లేకపోవడంతో విద్యార్థుల పరిస్థితి అయోమయంగా మారింది. ఈ పాఠశాలకు చెందిన ఒకే ఒక్క ఉపాధ్యాయుడు జనవరి 31వ తేదీన ఉద్యోగ విరమణ పొందారు. అదే రోజున మరో ఉపాధ్యాయుడిని నియమిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఉపాధ్యాయుడు మాత్రం విధులకు హాజరవ్వడం లేదు. దీంతో రెండు రోజులు పాటు సీఆర్పీతో నెట్టుకొచ్చారు. కొత్తగా నియమించిన ఉపాధ్యాయుడు బుధవారం సైతం రాకపోవడంతో విద్యార్థులు పాఠశాలకు వెళ్లినప్పటికీ పాఠాలు బోధించేవారు కరువయ్యారు. ఈ విషయం తెలుసుకున్న మండల విద్యాశాఖాధికారి గోవిందరావు పాఠశాలకు వెళ్లి పరిస్థితిని గమనించారు. అనంతరం ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఉపాధ్యాయుడు పాఠశాలకు హాజరవ్వని విషయాన్ని విద్యా శాఖాధికారుల వద్ద ప్రస్తావించగా.. ఇక్కడ పనిచేసిన ఉపాధ్యాయుడు ఉద్యోగ విరమణ పొందిన రోజునే చిన్నహరిశ్చంద్రాపురం పాఠశాలలో పనిచేస్తున్న మరో ఉపాధ్యాయుడ్ని నియమించామన్నారు. అయితే ఆదివారం సెలవు కావడంతో సోమవారం సైతం విధులకు సెలవు పెట్టారని పేర్కొన్నారు. దీంతో రెండు రోజుల పాటు విధులకు రాకపోవడంతో సీఆర్పీతో పాఠశాలను నిర్వహించామన్నారు. బుధవారం కూడా రాలేదనే విషయం గ్రామస్తులను నుంచి తెలుసుకున్నామని తెలిపారు. తక్షణమే విధులకు హాజరు కావాలని ఆదేశించామని, ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏది ఏమైనప్పటికీ విధులకు హాజరవ్వాల్సిన ఉపాధ్యాయుడు పాఠశాలకు వెళ్లకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పలేదు. -
ప్రాణం పోసిన రిమ్స్ వైద్యులు
శ్రీకాకుళం: నగరంలో రిమ్స్ సర్వజన ఆస్పత్రిలోని ప్రసూతి విభాగంలో ఇద్దరు రోగులకు అత్యంత క్లిష్టమైన చికిత్స చేసి వైద్యులు ప్రాణం పోశారు. వివరాల్లోకి వెళ్తే.. వనజ సాయిశ్రీ అనే 22 ఏళ్ల మహిళ తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలోని సీహెచ్సీలో ప్రసవం చేయించుకుంది. అనంతరం గత నెల జనవరి 27వ తేదీన వేకువజామున 5 గంటలకు శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తీవ్ర రక్తస్రావంతో వచ్చింది. అప్పటికే డ్యూటీలో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వంశీ ప్రియ రోగిని పరీక్షించారు. ప్రసవానంతరం ఆమెకు గర్భసంచి సైతం బయటకు వచ్చినట్లు గుర్తించారు. దీంతో రోగి పరిస్థితిని ఇన్చార్జి ఆర్.పద్మజ, అసోసియేట్ ప్రొఫెసర్ సురేష్ కుమార్లకు తెలియజేశారు. అనంతరం వైద్యులంతా పరిశీలించి నాణ్యమైన వైద్యాన్ని అందించారు. దీంతో వనజ సాయిశ్రీ ప్రస్తుతం కోలుకున్నారు. అలాగే హెచ్వోడీ డాక్టర్ డి.పార్వతి నేతృత్వంలో మరో మహిళకు చికిత్స అందజేసి ప్రాణాలు కాపాడారు. నందిగామ మండలంలోని చిన్న గురువూరుకు చెందిన జగదీశ్వరి అనే మహిళకు టెక్కలి ఆస్పత్రిలో ప్రసవం అయింది. అయితే ఆమెకు తీవ్ర రక్తస్రావం జరగడంతో శ్రీకాకుళం రిమ్స్ సర్వజన ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ఆక్సిజన్ అందిస్తూ 20 మంది వైద్యులు 6 గంటల పాటు శ్రమించి చికిత్స అందించడంతో కోలుకుంది. దీంతో ప్రసూతి విభాగం వైద్యులను ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రసన్నకుమార్, ఆర్ఎంవో డాక్టర్ సుభాషిణి, డిప్యూటీ ఆర్ఎంవో డాక్టర్ శ్రీదేవిలు అభినందించారు -
అల్లం సాగుపై ఆసక్తి..!
మెళియాపుట్టి: వ్యవసాయంలో నూతన పంటల సాగుపై రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. సంప్రదాయ పంటల సాగు వలన వస్తున్న నష్టాల నుంచి గట్టెక్కేందుకు వాణిజ్య పంటలపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. దీనిలో భాగంగానే అల్లం సాగుపై అధికంగా మక్కువ చూపిస్తున్నారు. ముఖ్యంగా పాతపట్నం నియోజకవర్గం వ్యాప్తంగా 1,328 ఎకరాల్లో గిరిజనులు అల్లం సాగు చేస్తున్నారు. కొత్తూరు వెలుగు అసోసియేషన్ (స్వచ్ఛంద సంస్థ) సభ్యులు స్వచ్ఛందంగా అల్లం విత్తనాలను రాయితీపై ఇస్తూ సహకారం అందిస్తున్నారు. పాతపట్నం నియోజకవర్గవ్యాప్తంగా అల్లం సాగు చేస్తున్నారు. మార్కెట్లో దొరికే హైబ్రీడ్ అల్లం వలన పలువురు చిన్న వయస్సులోనే మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. అందువలన మైదాన ప్రాంత ప్రజలు గిరిజన రైతులు పండిస్తున్న దేశీ అల్లం, అదేవిధంగా చిరుధాన్యాల వైపు మొగ్గు చూపుతున్నారు. కరోనా తర్వాత అత్యధిక శాతం మంది ఆహారపు అలవాట్లను మార్చుకున్నారని పలువురు వైద్యులు చెబుతున్నారు. ఎటువంటి ఎరువులు ఉపయోగించకుండా అల్లం పండిస్తున్నట్లు పలువురు గిరిజనులు తెలుపుతున్నారు. వారపు సంతల్లో విక్రయాలు నిర్వహిస్తున్నామని, పలువురు గ్రామాలకే వచ్చి కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం సహకరిస్తే మరిన్ని ఎకరాల్లో అల్లం సాగు చేస్తామని పేర్కొంటున్నారు. అల్లం సాగుతో ఆర్థికంగా మేలు జరుగుతోందని చెబుతున్నారు. మెళియాపుట్టి మండలంలోని ఆంపురం, గొట్టిపల్లి, కేరాసింగి, నేలబొంతు గ్రామాల గిరిజనులు, నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఈ ఏడాది అధికంగా సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. మేము దేశవాలీ విత్తనాలు వేసి పండిస్తున్న అల్లంకు చాలా గిరాకీ ఉంది. అదేవిధంగా లాభాలు సైతం అధికంగానే వస్తున్నాయి. కుటుంబాలతో కష్టపడుతున్నాం. ఫలితం కూడా ఆశించిన విధంగానే ఉంది. గతేడాది 50 సెంట్లలో పండించాను. ప్రస్తుతం మరో రెండెకరాల్లో పండించాలని యోచిస్తున్నాం. – జన్ని భాస్కరరావు, నేలబొంతు గ్రామం, మెళియాపుట్టి మండలం అల్లం సాగు చేయడానికి పెట్టుబడులు తక్కువ. నేను ఒక ఎకరాలో పోడు వ్యవసాయం చేస్తున్నాను. అల్లం విత్తనాలను కొత్తూరు వెలుగు అసోసియేషన్ వారు రాయితీపై అందిస్తున్నారు. మేము పండించే అల్లం మాకు ఆర్థికంగా పురోభివృద్ధి చేకూర్చడమే కాకుండా, పలువురుకి ఆరోగ్యం అందిస్తున్నాయి. చాలా ఆనందంగా ఉంది. వ్యవసాయ శాఖ అధికారులు మరింత సహకారం అందించాలి. – సవర రమేష్, కేరాసింగి గ్రామం, మెళియాపుట్టి మండలం గిరిజనులు అధిక శాతం అల్లం పంట పండిచే విధంగా అవగాహన కల్పిస్తున్నాం. చాలా మంది రైతులకు దీని లాభాలు తెలియజేశాం. రైతులకు అన్నివిధాలుగా.. ఆర్థిక సహకారం అందేందుకు ఉద్యానవన పంటలు పండించాలి. గిరిజనులకు ప్రాధాన్యత కలిగిన మరిన్ని రకాలు చిరు ధాన్యాలు పండించేందుకు కూడా కృషి చేస్తున్నాం. – మంగమ్మ, ఉద్యాన శాఖ అధికారి, పాతపట్నం -
పిచ్చికుక్క స్వైర విహారం
● పలువురిపై దాడి టెక్కలి రూరల్: మండలంలోని నర్శింగపల్లి, కిట్టాలపాడు, ముఖలింగాపురం గ్రామాల్లో బుధవారం పిచ్చికుక్క స్వైరవిహారం చేస్తూ కనిపించిన వారిపై దాడికి పాల్పడింది. ఈ మేరకు స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. బుధవారం ఉదయం కిట్టాలపాడు గ్రామానికి చెందిన మోద అప్పారావు అనే వ్యక్తి గ్రామంలో తిరుగుతున్న సమయంలో అటుగా వెళ్తున్న పిచ్చికుక్క అతడి కాలిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. అదే కుక్క నర్సింగపల్లి గ్రామం వైపుగా వెళ్తూ అక్కడ సైతం సింగుపురం పాపారావు, రట్టి లక్ష్మణరావు, నాగవరపు మణికంఠతో పాటు మరికొంత మందిపై దాడి చేసింది. అలాగే ముఖలింగాపురం గ్రామంలో సైతం కొంతమందిపై దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. కుక్కకాటుకి గాయపడిన వారిలో 9 మంది వరకు టెక్కలి జిల్లా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. గాయపడిన వారికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అదేవిధంగా మంగళవారం సైతం కొల్లివలస గ్రామంలో కూడా ఇదే పిచ్చికుక్క కొంత మందిపై దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. దీంతో ఈ కుక్క ఇంక ఎంతమందిపై దాడి చేస్తుందోనని బయపడిన గ్రామస్తులు హతమార్చినట్లు తెలుస్తోంది. -
తాగునీరు అందించేందుకు చర్యలు
కవిటి: మండలంలోని కొత్తపాలెం గ్రామంలో తాగునీటి సమస్యకు సంబంధించి ‘ఏం నేరం చేశామని ఈ శిక్ష’ శీర్షికతో జనవరి 28వ తేదీన సాక్షి పత్రికలో ప్రచురితమైన కథనంపై అధికారులు పటిష్టమైన చర్యల దిశగా అడుగులు వేశారు. ఈ మేరకు కవిటి గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్ నుంచి రూ.3.6 లక్షల వ్యయంతో 15,000 లీటర్ల అండర్ గ్రౌండ్ సంప్ నిర్మాణానికి ఎమ్మెల్యే అశోక్, సర్పంచ్ పూడి లక్ష్మణరావులు బుధవారం భూమిపూజ చేశారు. త్వరలో ఈ పనులు పూర్తిచేసి తాగునీరు అందించేవిధంగా చర్యలు తీసుకుంటామని ఇన్చార్జి ఎంపీడీవో కె.శ్రీనివాసరెడ్డి తెలిపారు. అనుమానాస్పదంగా ఆర్మీ హవల్దార్ మృతిమందస: మండలంలోని రాధాకృష్ణపురం గ్రామానికి చెందిన ఆర్మీ హవల్దార్ లోళ్ల జోగారావు(36) బుధవారం హరిపురం రైల్వే లైన్ సమీపంలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మృతుడు జోగారావు ప్రస్తుతం జమ్ముకాశ్మీర్లో దేశానికి సేవలు అందిస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియలేదు. విషయం తెలుసుకున్న జీఆర్పీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని శవపంచనామ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతితో గ్రామంలో విషాదం అలముకుంది. వజ్రపుకొత్తూరు రూరల్: మండలంలోని కొండవూరు గ్రామానికి చెందిన యువకుడు, పశు పెంపకందారుడు కొల్లి నాగేశ్వరరావుపై బుధవారం కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కారంతో దాడి చేశారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. తనకు ఉన్న పశువుల శాలలో ఉదయం పాలు తీస్తుండగా.. ఒక వ్యక్తి వచ్చి తనకు పాలు కావాలని అడుగుతూ ఒక్కసారిగా దాడికి పాల్పడినట్లు తెలిపాడు. అయితే అప్పటికే కొంతమంది వ్యక్తులు కారులో దాడి చేసేందుకు మాటు వేసినట్లు తాను గమనించినట్లు బాధితుడు వెల్లడించాడు. ఇంతలో పాల కోసం తన వద్దకు వచ్చిన దుండగుడు ఒక్కసారిగా తన కళ్లలో కారం కొట్టి దాడి చేసే ప్రయత్నం చేయడంతో తాను తప్పించుకున్నట్లు చెప్పాడు. ఇది గమనించిన దుండగులు కారులో పరారయ్యారని పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. నాగేశ్వరరావుపై జరిగిన ఈ దాడితో ఒక్కసారిగా గ్రామం ఉలిక్కిపడింది. -
లెక్కలు చెప్పండి సార్..!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఇటీవల జరిగిన రథసప్తమి వేడుకలకు ప్రభుత్వం పైసా నిధులు కూడా విదల్చకపోవడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు దాతలపై భారం వేశారు. అధికారికంగా డొనేషన్లు అడిగారు. ఫండ్స్ సేకరణకు ఎనిమిది మంది అధికారులతో ప్రత్యేక కమిటీ వేశారు. వీరికి తోడు ప్రజాప్రతినిధులు నేరుగా ఫోన్లు చేసి, సమావేశాలు నిర్వహించి విరాళాలు సేకరించారు. అసలెంత వచ్చాయి? వచ్చిన దాంట్లో ఎంత ఖర్చు పెట్టారు? ఇంకా ఎంత మిగిలింది? ఇప్పుడీ వివరాలు వెల్లడిస్తే బాగుంటుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. వాటిని పారదర్శకంగా వెల్లడించాల్సిన అవసరం అధికారులపై ఉంది. జనం సొమ్ముతో ఘనంగా సంబరాలు నిర్వహించారని, అదే స్ఫూర్తితో ఆ సంబరాలకు సహకరించిన ప్రముఖుల వివరాలు ప్రకటిస్తే అంతా సవ్యంగా జరిగినట్టు అవుతుందనే వాదన వినిపిస్తోంది. గతేడాది సేకరించిన విరాళాలకు సంబంధించి వివరాలు వెల్లడించకపోవడంతో అనేక ఆరోపణలకు తావిచ్చాయి. మరోసారి ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఏడు రోజులకు పెంచినా.. ఈసారి రథసప్తమి వేడుకలను ఏడు రోజులకు పెంచారు. ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయించారు. ఈసారీ చంద్రబాబు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. రథసప్తమి వేళ నగరంలో అభివృద్ధి పనులకు మున్సిపల్ మంత్రి నారాయణ రూ.2 కోట్లు విడుదల చేసినట్టు ప్రకటించారు. ఆ ప్రకటనపై కూడా హడావుడి చేశారు. ఎమ్మెల్యేను ప్రశంసిస్తూ కథనాలు కూడా రాయించుకున్నారు. కానీ, ఆ రూ.2 కోట్లు విడుదల కాలేదు. ప్రకటనకే పరిమితమైంది. ఇక, సంబరాల కోసమైతే చెప్పనక్కర్లేదు. చిల్లి గవ్వ ఇవ్వలేదు. ఈసారి కూడా జనం సొమ్ముతో చేయాలని నిర్ణయించారు. ఆమేరకు ప్రమఖులతో సమావేశాలు పెట్టారు. ప్రజాప్రతినిధులు నేరుగా ఫోన్లు చేసి, పండగకు సహకరించాలని కోరారు. ఒకవిధంగా డొనేషన్ల కోసం ఒత్తిడి కూడా చేశారు. అంతటితో ఆగలేదు. వివిధ రంగాల నుంచి ఫండ్స్ సేకరణకు ఎనిమిది మంది అధికారులతో ప్రత్యేక కమిటీ వేశారు. అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేశారు. వారి పరిధిలో ఉన్న ప్రముఖులు, వర్తకులు, వైద్యులు.. ఇతరత్రా వర్గాల నుంచి నిధులు సేకరించేందుకు తమదైన శైలిలో ప్రయత్నించారు. మొత్తానికి సిక్కోలు దేవుడు పండగ అని అంతా సహకరించారు. సంబరాల కోసం విరాళాలు ఇచ్చారు. తమన్ మ్యూజికల్ నైట్, రథసప్తమి దర్శనాల రోజున నకిలీ పాసుల బాగోతంతో ఇబ్బందులకు గురి చేసినా సంబరాలు మాత్రం బాగానే జరిగాయి. ఇందుకు కారణమైన దాతల వివరాలు మాత్రం నేటికీ వెల్లడించలేదు. ఒకవేళ దాతలు ఎవరైనా తమ పేర్లు బయటికి చెప్పొద్దని అంటే.. వారి పేర్లు మినహాయించి వెల్లడించాల్సిన అవసరం ఉంది. కనీసం ఎంత వచ్చింది? ఎంత ఖర్చు పెట్టారు? దేనికెంత ఖర్చు అన్నది ప్రకటిస్తే పారదర్శకం అవుతుంది. ఎందుకంటే, ఎవరి స్థాయిలో వారు విరాళాల సేకరణకు కృషి చేశారు. ఎవరి ద్వారా ఎంత వచ్చింది? మన దగ్గర ఏదైనా పండగ చేయాలంటే దాతలు ఏ స్థాయిలో ముందుకొస్తారో? భవిష్యత్లో ఒక అంచనాకు రావడానికి దోహదపడుతుంది. అంతేకాదు ఎటువంటి అపోహాలకు, అనుమానాలకు, ఆరోపణలకు తావివ్వకుండా ఉంటుంది. రథసప్తమి వేడుకలకు భారీగా ఫండ్ సేకరణ జనం సొమ్ముతో సంబరాల నిర్వహణ అధికారికంగానే నిధులు సేకరణ ఎవరెంత ఇచ్చారో వెల్లడిస్తేనే పారదర్శకత గతేడాది నిధులకూ నేటికీ లెక్క చెప్పని వైనం పైసా విదల్చని ప్రభుత్వం.. గతేడాది రఽథసప్తమి వేడుకలను రాష్ట్ర పండగగా ప్రభుత్వం ప్రకటించింది. మూడు రోజుల పండగను ఆర్భాటంగా చేసింది. కానీ, చంద్రబాబు ప్రభుత్వం ఒక్క పైసా విడుదల చేయలేదు. నగరంలో జరిగిన పనులు సైతం కార్పొరేషన్, సుడా నిధులతో కానిచ్చేశారు. వాటికింత వరకు నిధులు విడుదల చేయలేదు. దీంతో ఆ పనులు చేసిన కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరగలేదు. వారంతా ఏడాదికి పైగా బిల్లుల కోసం నిరీక్షిస్తున్నారు. గత ఏడాది మూడు రోజుల సంబరాలన్నీ దాతల సొమ్ముతోనే జరిగాయి. వారిచ్చిన విరాళాలతోనే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి ఖర్చు దాతలదే. వారి సొమ్ముతో సంబరాలు చేసి శభాష్ అన్పించుకున్న అధికారులు, పాలకులు.. దాతలు, ఖర్చు వివరాలు అధికారికంగా ప్రకటించలేదు. -
వ్యాయామ విద్యాభివృద్ధికి కృషి చేయాలి
ఇచ్ఛాపురం: ప్రభుత్వ పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులంతా వ్యాయామ విద్యాభివృద్ధికి కృషి చేయాలని ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(ఐపీఈ) ఆంధ్రప్రదేశ్ ఎండీ మహబూబ్బాషా అన్నారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో వ్యాయామ విద్యపై పర్యవేక్షణ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వ్యాయామ ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వ్యాయామ ఉపాధ్యాయులంతా సమయపాలన పాటించడంతో పాటు నిబద్ధతతో పనిచేస్తూ విద్యార్థులకు మార్గదర్శకంగా నిలవాలని సూచించారు. విద్యార్థుల్లో దాగున్న క్రీడా ప్రతిభను వెలికి తీయడానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు పి.తవిటయ్య, జోన్–1 వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కె.పద్మనాభం రెడ్డి, పి.గజేంద్ర, హెచ్ఎంలు కె.సూర్యారావు, కె.హరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
● తవ్వేస్తూ.. తరలిస్తూ..
నరసన్నపేట నియోజకవర్గంలో ఇసుకాసురలు చెలరేగిపోతున్నారు. అటు కరకవలస నుంచి ఇటు వనితమండలం వరకూ వంశధార నదిలో ఇష్టారాజ్యంగా అనధికార ర్యాంపులు ఏర్పాటు చేసి తవ్వకాలు సాగిస్తున్నారు.గోపాలపెంట, మడపాం, బుచ్చిపేట, చేనువలస, ఉప్పరిపేట, లుకలాం, వెంకటాపురం, పర్లాం, కొమనాపల్లి, దొంపాక, అందవరం ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చాలాచోట్ల అనుమతులు లేకుండా నదీ గర్భంలో పరిమితికి మించి జేసీబీలతో తవ్వకాలు చేస్తున్నారు. విశాఖ వంటి దూర ప్రాంతాలకు నిత్యం ట్రిప్పర్ ద్వారా రవాణా చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. పర్యావరణానికి తూట్లుపొడుస్తున్నారు. – నరసన్నపేట -
రూ.
అరసవల్లి ఆదిత్యుడి ఆదాయం 1,35,14,879 అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ హుండీ కానుకల లెక్కింపు బుధవారంతో పూర్తయ్యింది. రెండు రోజులుగా ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ ఆధ్వర్యంలో కానుకల లెక్కింపు జరుగుతుండగా బుధవారం మొత్తం నగదు, చిల్లర కలుపుకుని రూ.33,49,379 ఆదాయం లభించింది. మంగళవారం లెక్కింపులో లభించిన ఆదాయం కలిపితే మొత్తం రూ.1,35,14,879 ఆదాయం లభించిందని ఈఓ వివరించారు. అనివెట్టి మండపంలో జరిగిన ఈ లెక్కింపులో ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, పలు ఆలయాల ఈవోలు జి.గురునాథరావు, మునగవలస సుకన్య తదితరులు పాల్గొన్నారు. -
రెయిన్ గన్తో సాగునీరు ఆదా
గార: వ్యవసాయంలో రెయిన్ గన్ వాడడం ద్వారా పూర్తిస్థాయిలో పంటకు సాగునీరు అందడంతో పాటు సాగునీరు ఆదా అవుతుందని శ్రీకాకుళం వ్యవసాయ సహాయ సంచాలకురాలు బగ్గు రజిని అన్నారు. బుధవారం రామచంద్రాపురం పంచాయతీ అంబటివానిపేట ఆర్ఎస్కే పరిధిలోని మొక్కజొన్న, అపరాలు, మిరప మొక్కలకు రెయిన్ గన్ద్వారా సాగునీరు అందించే పద్ధతిని రైతులు, అధికారులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. మొక్కజొన్న సాగుపై రైతులు మొగ్గు చూపుతున్నారన్నారు. అధికంగా యూరియా వాడడడంతో సూక్షధాతు లోపాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రబీలో ఈ ఏడాది అధికంగా మంచు కురవడంతో పెసర, మినుము పంట పాడయ్యిందని, పూత దశలో మల్టీకే వాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏవో దుంపల పద్మావతి, ఏఈవోలు బడగల దుర్గాప్రసాదరావు, శ్రీదీప్తి, వినీత, అంబటి సుధాకరరావు, సాధు దాలినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
సీఆర్పీఎఫ్ ఉద్యోగిపై పోలీసులకు ఫిర్యాదు
జలుమూరు: మండలంలోని చిన్న దూగాంనకు చెందిన సీఆర్పీఎఫ్ ఉద్యోగి దుంగ వల్లయ్య తనపై దాడిచేసి గాయపరిచినట్లు అదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త, సామాజిక కార్యకర్త రావాడ హిమంత్ బుధవారం పబ్లిక్ గ్రీవెన్స్లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2024లో వల్లయ్య అనే సీఆర్పీఎఫ్ ఉద్యోగి పలు అక్రమాలకు పాల్పడడం, మోసాలు చేయడంతో ఈయనపై సీబీఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టులో రిట్ వేశానన్నాడు. ఇటీవల కోర్టు రిట్ను స్వీకరించినట్లు వల్లయ్యకు నోటీసులు వచ్చాయి. ఈ నేపథ్యంలో దర్యాప్తు జరిగితే తన ఉద్యోగానికి ముప్పు వాటిళ్లుతుందనే భయంతో రిట్ పిటిషన్ వాపస్ చేసుకోవాలని వల్లయ్య ఒత్తిడి తెచ్చాడన్నారు. దీనికి తాను నిరాకరించడంతో దాడిచేసి గాయపరిచాడని తెలిపారు. దాడిలో తనకు ముఖం, కంటిపై గాయాలయ్యాయని పేర్కొన్నారు. దీంతో చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్లో చేరానన్నాడు. అలాగే టెక్కలి డీఎస్సీని కూడా కలిసి వల్లయ్యపై ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. దీనిపై హెచ్సీ రాజశేఖర్ మాట్లాడుతూ చిన్నదూగం వెళ్లి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. లారీ – కారు ఢీ టెక్కలి రూరల్: మండలంలోని బొప్పాయిపురం గ్రామ జాతీయ రహదారిపై బుధవారం రెండు వాహనాలు ఢీకొన్నాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గార ప్రాంతానికి చెందిన కారు టెక్కలి మండలం బొప్పాయిపురం వద్దకు వచ్చేసరికి అదే మార్గంలో వెళ్తున్న లారీని ఓవర్టెక్ చేయబోయి అదుపుతప్పి లారీని ఢీకొంది. దీంతో కారు సమీప డివైడర్ పైకి దూసుకుపోయింది. ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు అవ్వకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. హైవే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. విద్యుత్ షాక్తో ఇద్దరికి గాయాలు వజ్రపుకొత్తూరు రూరల్: మండలంలోని కొండవూరు గ్రామానికి చెందిన ఒక మహిళ, చిన్నారి విద్యుత్ షాక్కు గురై తీవ్రగాయాలు పాలయ్యారు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన అద్ది సింహాచలం, ధనలక్ష్మిల రెండేళ్ల బాబు భువన్ మంగళవారం రాత్రి డాబాపై ఆడుతూ విద్యుత్ తీగలకు తాకి ఉన్న ఇనుప చువ్వను పట్టుకోవడంతో ప్రమాదానికి గురయ్యాడు. దీంతో వాళ్ల నాన్నమ్మ తులసమ్మ చిన్నారిని కాపాడే ప్రయత్నంలో అమె కూడా విద్యుత్ ఘాతానికి గురైంది. దీంతో క్షతగాత్రులను పూండిలోని ప్రైవేట్ అస్పత్రికి తరలించారు. దాడులను ధైర్యంగా ఎదుర్కోవాలి శ్రీకాకుళం కల్చరల్: పలు ప్రాంతాల్లో క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ధైర్యంగా ఎదుర్కోవాలని వైఎస్సార్సీపీ స్టేట్ క్రిస్టియన్ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి డా.ప్రత్తి అన్వేష్ అన్నారు. నగరంలోని ఆంధ్ర బాప్టిస్ట్ చర్చిలో జిల్లాలో ఉన్న బాప్టిస్ట్ చర్చి దైవ సేవకులందరూ బిషప్.రెవరెండ్.డా.కొత్తపల్లి అబ్రహం ఆధ్వర్యం బుధవారం సమావేశమయ్యారు. దీనిలో భాగంగా క్రైస్తవుల మీద, దైవ సేవకులు మీద, చర్చిల మీద జరుగుతున్న దాడులు, వ్యతిరేక ప్రచారాలపై చర్చించారు. భవిష్యత్లో జిల్లాలో ఉన్న క్రైస్తవ దైవ సేవకుల సంఘాలన్నీ ఐక్యంగా ముందుకెళ్లి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గడ్డిమందు తాగి వృద్ధుడు మృతి పొందూరు: మండలంలోని తానెం గ్రామానికి చెందిన బాకి పాపినాయుడు(65) గడ్డి మందు తాగి మృతి చెందినట్లు బుధవారం ఎస్ఐ వి.సత్యనారాయణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. ఈనెల 2వ తేదీన మద్యం మత్తులో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పారు. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
బిల్లు బాదుడు తప్పదా!
● ఐదు రోజులుగా సమ్మెలో విద్యుత్ మీటర్ల రీడర్లు ● స్లాబ్ పెరిగి బిల్లులు అధికమయ్యే అవకాశాలు ● తీవ్ర ఆందోళనలో వినియోగదారులు అరసవల్లి : కూటమి ప్రభు త్వం వచ్చాక ఇప్పటికే మూడు సార్లు విద్యుత్ చార్జీలు పెరగడంతో తీవ్ర ఇబ్బందులకు గురైన సామాన్యులు.. తాజాగా మరో బాదుడు తప్పదనే సంకేతాలతో ఆందోళనకు గురవుతున్నారు. సమస్యల పరిష్కారం కోరుతూ విద్యుత్ మీటర్ రీడర్లు ఐదు రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. వారు సకాలంలో రీడింగ్ తీయకపోవడంతో స్లాబ్ పెరిగితే.. యూనిట్ చార్జీలు పెరుగుతాయని వినియోగదారులు ఆందోళనలో ఉన్నారు. పెనుభారం.. వాస్తవానికి ప్రతి నెలా 2 నుంచి 10వ తేదీలోగా గృహ విద్యుత్మీటర్ల వినియోగ రీడింగ్ను తీయాల్సి ఉంది. నేటికి ఐదు రోజులుగా రీడింగ్కు ఎవ్వరూ రాకపోవడంతో విద్యుత్ వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది. ప్రతి నెలా 10లోగా మీటర్ రీడింగ్ తీస్తే అప్పుడున్న వినియోగం బట్టి యూనిట్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. 0–50 యూనిట్లు లోపు వినియోగానికి యూనిట్కు రూ.1.50, అదే 50–75 యూనిట్ల లోపు అయితే రూ.3 చొప్పున, 76–125 యూనిట్ల లోపు ఉంటే రూ.4.50 వరకు చార్జీ చేస్తారు. అదే 126–225 యూనిట్లు ఉంటే రూ.6 వరకు చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా రీడర్ల సమ్మెతో రీడింగ్ ఆలస్యమైతే..స్లాబ్కు మించి ఒక యూనిట్ దాటినా భారీగా విద్యుత్ బిల్లులు వచ్చే అవకాశాలున్నాయని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఇదీ పరిస్థితి జిల్లాలో విద్యుత్ శాఖలో మొత్తం 6 లక్షల వరకు గృహ విద్యుత్ కనెక్షన్లున్నాయి. ప్రతి నెల వీటి నుంచి సుమారుగా రూ.32 కోట్ల నుంచి రూ.35 కోట్లు వరకు డిమాండ్ ప్రకారం బిల్లులు చెల్లింపులు జరుగుతున్నాయి. శ్రీకాకుళం, టెక్కలి, పలాస డివిజన్లలో ఈమేరకు విద్యుత్ మీటర్ల రీడర్లు 207 మంది ఉన్నారు. రీడింగ్ మిషన్లు ఛార్జీలు, ఫోన్ రీఛార్జ్, రీడింగ్ పేపర్ రోల్స్, మరమ్మతులు, ఈఎస్ఈ, ఈపీఎఫ్ మినహాయింపులు పోగా ఒక్కో రీడర్కు ఒక్కో మీటర్ నుంచి రూ.3.10 మాత్రమే అందుతుంది. సగటున ఒక రీడర్ నెలకు 3 వేల మీటర్లను రీడింగ్ చేస్తే నెలకు ఆదాయం రూ.10 వేల లోపే వస్తుంది. డిమాండ్లు ఇవే.. స్మార్ట్మీటర్లు తీసుకొచ్చిన తరుణంలో మీటర్ రీడర్లకు విద్యుత్ శాఖలోనే ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి. కనీస వేతనాలు అమలు చేయాలి. రీడర్ల విద్యార్హతల బట్టి విద్యుత్ శాఖలో టెక్నికల్, నాన్ టెక్నికల్ షిఫ్ట్ ఆపరేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, వాచ్మేన్లు, అటెండర్లు వంటి పోస్టుల్లో నియమించాలి. ఎస్క్రో ఖాతా తెరిపిస్తామన్న హామీ నెరవేర్చాలి. సమస్యలు పరిష్కరించాల్సిందే.. రాష్ట్ర సంఘం పిలుపుమేరకు మీటర్ల రీడర్ల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ సమ్మె చేస్తున్నాం. హామీలను నెరవేర్చి ప్రత్యామ్నయ ఉపాధి కల్పించేవరకు పోరాడతాం. – మామిడి బాలకృష్ణ, జిల్లా విద్యుత్ మీటర్ల రీడర్ల సంఘం ప్రతినిధి ప్రత్యామ్నాయం అమలు చేస్తున్నాం... రీడర్లు సమ్మెలో ఉండడంతో సదరు క్రాంట్రాక్టర్లు నుంచి 160 స్కానర్లు, 160 ప్రింటర్లు అందుబాటులోకి తీసుకున్నాం. 250 మందికి పైగా లైన్మేన్లు, లైన్ ఇన్స్పెక్టర్లు, జేఎల్ఎంల సహాయంతో ఇంటింటి వినియోగ బిల్లుల రీడింగ్ను సకాలంలో తీయించేలా చర్యలు చేపడుతున్నాం. – నాగిరెడ్డి కృష్ణమూర్తి, ఎస్ఈ -
అందుబాటులో ఆక్వా ల్యాబ్లు
అరసవల్లి: జిల్లాలోని ఆక్వా ల్యాబ్ల్లో రైతులకు వివిధ రకాల సేవలందిస్తున్నామని మత్స్యశా ఖ డిప్యూటీ డైరెక్టర్ వై.సత్యనారాయణ బుధవారం తెలిపారు. జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో ఉన్న ల్యాబ్తో పాటు నరసన్నపేట, టెక్కలి, సోంపేట, పలాసలలోని ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్లలో నీటి విశ్లేషణ పరీక్షలు, పీహె చ్ ఉష్ణోగ్రత, టీడీఎస్, లవణీయత, అమ్మో నియో, మట్టి పీహెచ్ తదితర పరీక్షలకు నిర్ణీత రుసుం చెల్లించి ఫలితాలు పొందవచ్చని పేర్కొన్నారు. కొత్తగా చేపలు, రొయ్యిల చెరువుల రిజిస్ట్రేషన్ల కోసం సచివాలయాల్లో మత్స్య సహాయకులను సంప్రదించాలని కోరారు. మద్యం బెల్టుషాపులపై ఎకై ్సజ్ దాడులు ● బొడ్డపాడుకాలనీలో వ్యక్తి అరెస్టు ● మద్యం బాటిళ్లు స్వాధీనం పలాస: వజ్రపుకొత్తూరు, పలాస మండలాల్లో బుధవారం పలాస ఎకై ్సజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. పలాస మండలం బొడ్డపాడు కాలనీలో బెల్టు షాపు నిర్వహిస్తున్న మామిడి పాపారావును అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. అతని వద్ద నుంచి అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ‘ కల్తీ మద్యం తాగి ప్రాణాలు పోతున్నాయి’ అనే శీర్షికతో సాక్షి మెయిన్ ఎడిషన్లో బుధవారం ప్రచురితమైన కథనానికి ఎకై ్సజ్ అధికారులు స్పందించారు. అక్కుపల్లి, బొడ్డపాడు కాలనీ, గరుడఖండి, అల్లుకోల తదితర గ్రామాల్లో పర్యటించి మద్యం దుకాణాలపై పలాస ఎకై ్సజ్ సీఐ కె.మల్లికార్జునరావు, సిబ్బంది సూర్యారావు, సింహాచలం తదితరులు తనిఖీలు చేశారు. కాగా, బెల్టుషాపుల నిర్వాహకులకు ముందుగానే ఎకై ్సజ్ పోలీసులు తనిఖీలకు వస్తున్నట్టు సమాచారం చేరవేయడంతో బెల్టుషాపుల నిర్వాహకులు జాగ్రత్త పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వసతి గృహంలో మెనూపై ఆరా మెళియాపుట్టి: మండల కేంద్రం మెళియాపుట్టికి సుమారు 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న భరణికోట గిరిజన సంక్షేమ వసతి గృహాన్ని సీతంపేట ఐటీడీఏ పీఓ పవార్ స్వప్నిల్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న మెనూపై ఆరా తీశారు. వసతి గృహం పరిసరాలు, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులతో వ్యక్తిగతంగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఇన్చార్జి హెచ్ఎం వాసంతికి సూచించారు. ఇటీవల డిప్యూటీ డీఓ నారాయుడు వసతిగృహాన్ని సందర్శించిన నేపథ్యంలో మెనూ సక్రమంగా అమలు కావడం లేదనే ఫిర్యాదు రావడంతో పీఓ ఇక్కడికి సందర్శనకు వచ్చినట్లు తెలిసింది. పరిశ్రమల్లో భద్రతపై రాజీవద్దు శ్రీకాకుళం పాతబస్టాండ్ : జిల్లాలోని రసాయన పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల అమలులో రాజీపడవద్దని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సంక్షోభ నివారణ బృందం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు థర్డ్ పార్టీ సేఫ్టీ ఆడిట్ సిఫార్సులను యుద్ధప్రతిపాదికన అమలు చేయాలన్నారు. పైడిభీమవరంలోని శ్రేయాస్ ఇండస్ట్రీస్లో మిథనాల్ నిల్వ సామర్థ్యాన్ని కమిటీ పరిశీలించాలన్నారు. పరిశ్రమల్లో విష వాయువుల లీకేజీని గుర్తించేలా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నిరంతరం నిఘా ఉంచాలని, అత్యవసర సమయాల్లో స్పందించేందుకు వీలుగా ఆన్–సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. పరిశ్రమల్లో ప్రమాదాలపై సమీప గ్రామాల ప్రజలకు, కార్మికులకు అవగాహన కల్పించడంతో పాటు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్లకు జిల్లా అగ్నిమాపక అధికారి ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో విశాఖపట్నం ఫ్యాక్టరీల జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ జె.శివశంకర్ రెడ్డి, జిల్లా డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ బి.రాంబాబు, డీఐసీ జనరల్ మేనేజర్ రఘునాథ్, వివిధ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. -
మాయమవుతున్న సాగునీటి కాలువలు..?
టెక్కలి: వంశధార ప్రధాన కాలువ నుంచి టెక్కలి పరిధిలోని పలు గ్రామాల సాగునీటి అవసరాలకు ఆసరాగా ఉన్నటువంటి కాలువలు మాయమవుతున్నాయి. సాగునీటి కాలువలను ఆక్రమిస్తూ అక్రమ కట్టడాలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలుస్తున్న విషయం అధికారులు గుర్తిస్తున్నప్పటికీ, వాటిని తొలగించే విషయంలో తాత్సారం కనిపిస్తోంది. దీంతో సాగునీటి కాలువల స్వరూపం మారిపోతోంది. టెక్కలి నుంచి బన్నువాడకు వెళ్లేదారిలో కోదండ రామవీధికి ఎదురుగా 49–1ఆర్ కాలువకు ఆనుకుని కొన్ని నెలల క్రితం ఒక వెంచర్ వేశారు. అప్పట్లో సాగునీటి కాలువను ఆక్రమించినట్లు అధికారులు గుర్తించారు. వెంచర్కు ఆనుకుని ఉన్న ఆక్రమణలతో పాటు మొత్తం కాలువ ఆక్రమణలు తొలగిస్తామని సంబంధిత అధికారులు హడావుడి చేసి మధ్యలో వదిలేశారు. దీంతో ఆక్రమణల తొలగింపు ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా పాత జాతీయ రహదారిలో గతంలో 49–ఏఆర్గా పిలవబడే సాగునీటి కాలువకు ఆనుకుని ఇటీవల ఒక పెద్ద స్థలాన్ని చదును చేశారు. అయితే సాగునీటి కాలువ స్థానంలో మండల పరిషత్ నిధుల నుంచి కాలువల నిర్మాణం చేస్తున్నారు. కాగా గతంలో ఉన్న కాలువకు ఇప్పుడు నిర్మాణం చేస్తున్న కాలువకు పూర్తిగా స్వరూపం మారిపోయింది. కొత్తగా చదును చేసిన స్థలానికి లబ్ధి కలిగే విధంగా సాగునీటి కాలువను మురుగునీటి కాలువలా స్వరూపం మార్చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై అధికారులు పూర్తిగా సర్వే నిర్వహించి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ స్థానికంగా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై వంశధార ఈఈ శేఖర్రావు వద్ద ప్రస్తావించగా.. పాత జాతీయ రహదారిలో గతంలో రైతుల ప్రయోజనం దృష్ట్యా 49–ఏఆర్తో చానల్ ఉండేదన్నారు. అలాగే బన్నువాడకు వెళ్లే మార్గంలో వేసిన వెంచర్కు ఆనుకుని ఉన్నటువంటి 49–1 ఆర్లో ఆక్రమణలు గుర్తించామని, దీనిపై రెవెన్యూ అధికారుల సాయంతో తొలగింపు ప్రక్రియ కోసం ఇప్పటికే అన్ని రకాల అనుమతులతో సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. -
సర్వం అక్రమాల మయం
● ఒడిశాలో తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇక్కడ కొన్నట్లు నమోదు ● అక్రమార్కులకు భారీ లబ్ధి సిక్కోలుకు ఒడిశా ధాన్యం ● జిల్లా రైతుకు సున్నంసాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఒడిశా నుంచి జిల్లాకు ధాన్యం అక్రమ రవాణా ఆగడం లేదు. అక్కడ కొనుగో లు చేసిన ధాన్యాన్ని జిల్లాలో కొనుగోలు చేసినట్టుగా లెక్కల్లో చూపిస్తున్నారు. ఒడిశాలో తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇక్కడ ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరను పొందుతున్నారు. కొందరు మిల్లర్లు, దళారులు కుమ్మకై ్క అక్రమ దందా సాగిస్తూనే ఉన్నారు. దీనికి కొందరు కొనుగోలు కేంద్రాల సిబ్బంది సహ కరిస్తున్నారు. అక్రమంగా కొనుగోలు చేసిన ధాన్యా నికి చట్టబద్ధత కలిగిస్తున్నారు. వాస్తవంగా జిల్లాలో ఎక్కడికక్కడ కొనుగోలు చేయని ధాన్యం రైతుల వద్ద ఉంది. లక్ష్యాలు అయిపోయాయని కొందరు మిల్లర్లు, బ్యాంకు గ్యారెంటీలు ఇవ్వక మరికొందరు మిల్లర్లు కొనుగోలు చేయడం లేదు. కానీ, తక్కువ ధరకు దొరికే ఒడిశా ధాన్యాన్ని మాత్రం ఇక్కడ ఆన్లైన్ చేసి దర్జాగా సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు అంతా ఒక మిస్టరీగా మారిపోయింది. రైతుల కళ్లాల్లో ధాన్యపు రాశులు కనబడుతుంటాయి. కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసినట్టు లెక్కలు కనిపిస్తాయి. కొనుగో లు చేసిన ధాన్యమంతా ఎక్కడదని ఆలోచిస్తే అదో రహస్యంలా అనిపిస్తోంది. ధాన్యం కొనుగోలు చేయకుండానే కొనుగోలు చేసినట్టు రికార్డులో చూపిస్తూ, వాటికి ట్రక్షీట్ జారీ చేస్తూ, సీఎంఆర్ కోసం మిల్లుకు పంపించినట్టు, మిల్లులు కూడా వచ్చిన ధాన్యాన్ని ఆడించి సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) ఇచ్చినట్టు సైక్లింగ్ ప్రక్రియ అంతా సాగిపోతోంది. ఒడిశా నుంచి తీసుకొచ్చిన ధాన్యాన్ని ఇక్కడ రైతుల వద్ద కొనుగోలు చేసినట్టుగా చూపించి, రికార్డుల్లో కౌలు రైతులు తీసుకున్న భూముల వివరాల్లో ఆన్లైన్ చేసి, వాటికి ట్రక్షీట్ జారీ చేసి, మిల్లులకు తరలించినట్టు జిమ్మిక్కు చేస్తున్నారు. ఇదంతా పథకం ప్రకారం జరుగుతోంది. దళారులు, మిల్లర్లు కుమ్మకై ్క చేస్తున్న బాగోతమిది. వీటికి తోడు రైతుల నుంచి కొనుగోలు కేంద్రాల ద్వారా వచ్చినఽ ధాన్యాన్ని తేమ శాతం, నూకలు పేరుతో 5 నుంచి 10 కిలోలు వరకు అదనంగా తీసుకుని దోపిడీ చేస్తున్న సంగతి ఇక చెప్పనక్కర్లేదు. రైతుల నుంచి వచ్చిన ధాన్యాన్ని ఆడించి సీఎంఆర్ ఇవ్వాల్సిన స్థానంలో పీడీఎస్ బియ్యం ఇస్తారన్న ఆరోపణలు ఉండనే ఉన్నాయి. ఇలా జరగాలి.. వాస్తవంగా మిల్లుల వద్ద రెండు రకాల ధాన్యం ఉండాలి. కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి వచ్చిన ధాన్యాన్ని ‘ఏ’ రిజిస్టర్లో నమోదు చేసి, ఆ ధాన్యానికి బదులు సీఎంఆర్ ఇవ్వాలి. చెప్పాలంటే సవ్యంగా జరిగిన ప్రక్రియ అని చెప్పాలి. ఇక, మిల్లర్లు నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉంది. కాకపోతే, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. అలా కొనుగోలు చేసిన ధాన్యాన్ని ‘బి’ రిజిస్టర్లో నమోదు చేయాలి. ఇవన్నీ ఎప్పటికప్పుడు అఽధికారులు తనిఖీలు చేసి పరిశీలించాలి. ● ఆ ప్రక్రియ సక్రమంగా జరగడం లేదు. రైతుల విస్తీర్ణంలో మాయ చేసి మద్దతు ధర కొట్టేస్తున్నారు. ● తాజాగా ఎల్ఎన్పేట మండలం స్కాట్పేట వద్ద పట్టుబడ్డ లారీ కూడా అలాంటిదే. ఒడిశాలో కొనుగోలు చేసిన ఽరూ.7లక్షల విలువైన ధాన్యాన్ని అక్రమంగా లారీలో ఒక రైస్మిల్లుకు తీసుకొస్తూ జిల్లా అధికారులకు పట్టుబడ్డారు. ● వాస్తవంగా జిల్లాలో ఇప్పటికే 6.70లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు జరిగిపోయాయి. మరో 70వేల మెట్రిక్ టన్నుల వరకు లక్ష్యాల మేర కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇది కాకుండా మరో లక్ష మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం రైతుల వద్ద ఉంది. ఏ, బీ రిజిస్టర్ల ప్రకారం కొనుగోలు చేయాలి. కానీ ఇక్కడైతే మద్దతు ధర రైతులకు ఇవ్వాల్సి వస్తుందని, ఒడిశాలో తక్కువ రేటుకు కొని ఇక్కడ మద్దతు ధరకు అమ్మి కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. -
శాంతిభద్రతలు క్షీణించాయి
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. దర్యాప్తు సంస్థల నివేదికలు కూడా కాదని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. వీరి బుద్ధి మారాలని ఆలయాల్లో పూజలు చేసినా వారి మనసులోని నీచమైన ఆలోచనలు మారడం లేదు. – తమ్మినేని చిరంజీవి నాగ్, వైఎస్సార్ సీపీ యువనేత, –దుంపల లక్ష్మణరావు పార్టీ రాష్ట్ర కార్యదర్శి, – కేవీజీ సత్యనారాయణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి (ఆమదాలవలస పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం..) -
పొన్నాడలో ప్రభుత్వ స్థలం ఆక్రమణ
ఎచ్చెర్ల: మండలంలోని పొన్నాడ గ్రామంలో పాఠశాల సమీపంలోని 255 సర్వే నంబర్ కలిగిన ప్రభుత్వ స్థలాన్ని స్థానికులు కొంతమంది ఆక్రమించుకుంటున్నారు. ఇక్కడ ఉన్న సు మారు రెండెకరాల చెరువు గర్భంలో మొక్కలు వేస్తామంటూ స్థలాన్ని చదును చేస్తున్నారు. ఆ స్థలాన్ని పాఠశాల మైదానం కోసం గతంలో ఇక్కడ ప్రజాప్రతినిధులు అడిగితే ఇది ప్రభు త్వ స్థలమని అధికారులు ఇవ్వలేదు. ఇప్పుడు కూటమి అధికారంలోకి రాగానే వారి ప్రోద్భలంతో గ్రామానికి చెందిన కొందరు ఇది తమ స్థలమని చదును చేసేస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. దీనిపై వీఆర్ఓ మురళీని వివరణ కోరగా ఆయన మాట్లాడుతూ తమ దృష్టికి రాలేదని, క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎంఆర్ఓ గోపాల్ మాట్లాడుతూ ఇది చెరువు గర్భమని, పరిశీలిస్తామని అన్నారు. ఇందులో ఆక్రమణలు చేపడితే చర్యలు తీసు కుంటామని అన్నారు. గతంలో ఇక్కడ పనులు చేపడితే తాము అడిగామని, చెరువు క్లీన్ చేసి చెత్తను భోగి మంటలో వేస్తామని వారు చెప్పారని పేర్కొన్నారు. -
రూ.కోటి దాటిన హుండీ కానుకల ఆదాయం
● అరసవల్లిలో నేడు కూడా కొనసాగనున్న హుండీ ఆదాయం లెక్కింపు ప్రక్రియ అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ హుండీ కానుకల లెక్కింపులో రికార్డు స్థాయిలో 60 రోజులకు గాను రూ.కోటికి మించి ఆదాయం లభించింది. తొలిరోజు మంగళవారం జరిగిన లెక్కింపులో మొత్తం రూ. 1,01,65,500 ఆదాయం లభించిందని ఆలయ ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్ తెలియజేశారు. గత రెండు నెలల నుంచి ఆలయంలోని 19 హుండీల్లో లభించిన భక్తుల కానుకలను అనివెట్టి మండపంలో గట్టి భద్రత నడుమ లెక్కింపు చేపట్టారు. ఈ మేరకు నగదుతో పాటు బంగారం 30 గ్రాములు, వెండి 1700 గ్రాముల వరకు కానుకలు లభించినట్లుగా తెలియజేశారు. తొలిరోజు 17 హుండీలను తెరిపించగా బుధవారం మిగిలిన హుండీలను తెరిపించడంతో పాటు చిల్లరను కూడా లెక్కించనున్నామని ఈఓ తెలిపారు. -
● రూ.7 లక్షల విలువైన ధాన్యం లారీ పట్టివేత
హిరమండలం: ఎల్ఎన్పేట మండలం స్కాట్పేట వద్ద మంగళవారం ఓ అనూహ్య ఘటన జరిగింది. ఓ మిల్లుకు ధాన్యం లోడుతో వచ్చిన లారీ రోడ్డు పక్కనే నిలబెట్టి ఉంది. ఆ సమయంలో పౌరసరఫరాల శాఖ డీఎం టీ.వేణుగోపాలరావు అటువైపుగా వచ్చారు. అనుమానాస్పదంగా కనిపించిన లారీని పరిశీలించారు. ఎక్కడకు తీసుకొచ్చారని డ్రైవర్ను అడగ్గా స్థానిక రైస్మిల్లుకు తీసుకొచ్చినట్టు తెలిపాడు. కానీ అందుకు తగ్గ పత్రాలేవీ లేవు. పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చినట్లు తెలిసింది. దీంతో ఆ లారీ లోడు ధాన్యాన్ని స్థానిక తహసీల్దార్ ఈశ్వరమ్మ, వీఆర్వో రమణమ్మలకు అప్పగించి పోలీస్స్టేషన్కు తరలించాలని ఆదేశించారు. లారీలో రూ.7 లక్షల విలువైన ధాన్యం ఉన్నట్టు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన ధాన్యం కొనుగోలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
ముగిసిన జిల్లా స్థాయి గ్రిగ్స్ పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: పాఠశాలల్లో విద్యార్థులను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో గ్రిగ్స్ క్రీడా పోటీలను ప్రతీ ఏటా నిర్వహించేది శ్రీకాకుళం జిల్లా మాత్రమేనని రాష్ట్ర వ్యాయామ విద్య పరిశీలకుడు షేక్ మెహబూబ్ బాషా అన్నారు. శ్రీకాకుళం పీఎస్ఎన్ఎంహెచ్ స్కూల్ ఆధ్వర్యంలో స్థానిక కోడి రామ్మూర్తి స్టేడియంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి బాలుర గ్రిగ్స్ పోటీలు మంగళవారంతో ముగిశాయి. రెండోరోజు ఉదయం జరిగిన వివిధ క్రీడాంశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన బాషా మాట్లాడుతూ ప్రతిరోజు కనీసం గంటపాటు క్రీడల్లో పాల్గొంటే ఆరోగ్యంతో పాటు విద్యలో కూడా రాణించవచ్చన్నారు. కాగా, బాలుర జిల్లా స్థాయి గ్రిగ్స్ పోటీల్లో శ్రీకాకుళం రూరల్ మండలంలోని శాస్త్రులపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తాచాటి ఓవరాల్ చాంపియన్గా నిలిచారు. గేమ్స్ చాంపియన్షిప్ను ఎంజేపీఏపీ నరసన్నపేట విద్యార్థులు కై వసం చేసుకున్నారు. డీఎస్డీఓ ఎ.మహేష్బాబు విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో గ్రిగ్స్ జిల్లా కార్యదర్శి టి.శ్రీనివాసరావు, పీడీ–పీఈటీ అసోసియేషన్ అధ్యక్షుడు పి.తవిటయ్య, ప్రధా న కార్యదర్శి ఎం.వి.రమణ, టోర్నీ ఆర్గనైజర్, హెచ్ఎం దేవదత్తానాంద్, పీడీ కె.మాధవరావు, ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ ఎం.తిరుపతిరావు, ఎస్జీఎఫ్ కార్యదర్శి స్వాతి, జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.సాంబమూర్తి, హెచ్ఎంలు కె.హరిబాబు, వై.పోలినాయుడు పీడీ, పీఈటీలు పాల్గొన్నారు. శాస్త్రులపేట పాఠశాల -
8న మాస్టర్స్ బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి మాస్టర్స్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ కప్ సెలక్షన్ ట్రయల్స్ను ఈ నెల 8న నిర్వహిస్తున్నామని జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు కిల్లంశెట్టి సాగర్, ప్రధాన కార్యదర్శి మెట్ట అశోక్కుమార్ తెలిపారు. మంగళవారం శ్రీకాకుళం శాంతినగర్కాలనీలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ టోర్నమెంట్తోపాటు రాష్ట్రపోటీల సెలక్షన్ ట్రయల్స్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. టోర్నీ ఆర్గనైజింగ్ సెక్రటరీ నారాయణశెట్టి వెంకట కిరణ్కుమార్ మాట్లాడుతూ ఇక్కడ రాణించిన వెటరన్ క్రీడాకారులకు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికచేస్తామని చెప్పారు. విజేతలకు బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు. ఫీల్ షోరూమ్ అధినేత కేఎస్ మదీనా శైలానీ తన తండ్రి కేఎస్ సైఫుల్లా జ్ఞాపకార్థం స్పాన్షర్షిప్ అందిందేందుకు ముందుకు రావడం సంతోషదాయకమని చెప్పారు. కార్యక్రమంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా చీఫ్ ప్యాట్రన్ డాక్టర్ గూడేన సోమేశ్వరరావు, ఉపాధ్యక్షుడు కేఎస్ మదీనా శైలానీ, గురుగుబెల్లి ప్రసాద్, బి.దామోదరరావు, ఎన్ఈ రత్నజీ. జి.అనిల్ కుమార్, ఎం.శాంతికుమార్, తదితరులు పాల్గొన్నారు. -
ఉచితం.. అత్యల్పం!
హిరమండలం: జిల్లాలో ఉచిత గ్యాస్ పథకం ప్రహసనంలా మారింది. అధికారంలోకి వస్తే ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను అందిస్తామని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా 2024 అక్టోబరులో దీపావళికి కానుకగా ఈ పథకాన్ని మన జిల్లాలోనే ప్రకటించారు. అక్కడ నుంచి ప్రతి నాలుగు నెలలకు ఒక గ్యాస్ సిలెండర్ను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. ఈ లెక్కన ఇప్పటివరకూ ప్రతి కుటుంబానికి ఐదు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందించాలి. కానీ ఒకటి రెండుసార్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అది కూడా కొంతమంది, కొన్ని ఏజెన్సీలకు మాత్రమే ఇచ్చారు. దీంతో ఉచిత గ్యాస్ పథకంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. బ్యాంక్ అకౌంట్లలో గ్యాస్ నగదు పడకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమల్లో వైఫల్యం.. జిల్లాలో తెల్లరేషన్కార్డు ఉన్న ప్రతిఒక్కరికీ ఉచిత గ్యాస్ పథకం వర్తిస్తుందని అప్పట్లో ప్రకటించారు. అప్పట్లో 4,95,793 మంది అర్హులుగా తేల్చారు. ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ ఉచితంగా అందిస్తామని తెలిపారు. గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత డోర్ డెలివరీ చేసే ఏజెన్సీకి వినియోగదారులు డబ్బులు చెల్లిస్తున్నారు. తరువాత ఒకటి రెండు రోజుల్లో సిలిండర్ నగదును వినియోగదారుడి బ్యాంక్ అకౌంట్లలో వేస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే చాలా మందికి సాంకేతిక కారణాలు చూపుతున్నారు. వేలిముద్ర పడలేదని.. వివరాలు సరిగ్గా అందించలేదని చెప్పడంతో గ్యాస్ ఏజెన్సీలతో పాటు అధికారులకు దరఖాస్తులు అందిస్తున్నారు. అయినప్పటికీ బ్యాంక్ అకౌంట్లలో రూపాయి కూడా జమకాలేదు. ఇదీ పరిస్థితి.. జిల్లాలో హెచ్పీసీఎల్, ఐవోసీఎల్, బీపీసీఎల్ సంస్థలకు చెందిన మొత్తం 37 ఏజెన్సీలు ఉన్నాయి. వీటి ద్వారా 692825 లక్షల మంది వినియోగదారులు అన్ని పథకాల నుంచి గ్యాస్ కనెక్షన్లు పొంది ఉన్నారు. అయితే ఉజ్వల, దీపం వంటివన్నీ తెల్ల రేషన్కార్డు ఉన్నవారికే అందించారు. అటువంటప్పుడు లబ్ధిదారుల్లో కోత ఏంటనేది అంతుపట్టడం లేదు. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి ముందుగానే చెల్లింపులు చేస్తామని చెప్పింది. అయినా అమలుకావడం లేదు. లబ్ధిదారులకు కోత ప్రభుత్వం 2024 నవంబర్లో ఈ పథకాన్ని ప్రారంభించగా మొదటి విడతగా 435037 మందికి ఉచిత సిలిండర్లకు సంబందించిన నగదు జమచేశారు. రెండో విడతగా 408740 మందికి, మూడో విడతగా 352254 మందికి, నాలుగో విడతగా 191015 మంది లబ్ధిదారులకు మాత్రమే ఉచిత సిలిండర్ల నగదు జమ చేశారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: సీపీఎస్ రద్దు కోరుతూ రానున్న బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టాలని ఏపీసీపీఎస్ఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లో సాగర్ ఘోష పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తవుతున్నా సీపీఎస్ను ప్రస్తావించడం లేదని, ఎన్నికల ముందు ఏడాదిలోగా పరిష్కార మార్గం చూపిస్తామని హామీ ఇచ్చినట్లు గురచ్తు చేశారు. అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులు హామీ మరచిపోయారన్నారు. ఇప్పటికే గత ఏడాది సెప్టెంబర్ 1న విజయవాడలో భారీ నిరసన తెలియజేశామని చెప్పారు. 26 జిల్లాల్లో సుమారు 2500 కిలోమీటర్ల మేర సీపీఎస్ ఉద్యోగుల చైతన్య యాత్ర చేసి కలెక్టర్లకు ఉద్యోగుల సమస్యపై వినతిపత్రాలు ఇచ్చామని గుర్తు చేశారు. ఆ పోరాట ఫలితమే ఇటీవల డీఏల బకాయిల విడుదలయ్యాయని చెప్పారు. మార్చి 1న సీపీఎస్ ఉద్యోగుల సాగర ఘోష పేరు తో విశాఖపట్నం ఆర్టీసీ బస్టాండ్ వద్ద గాంధీ విగ్రహం వద్ద భారీ నిరసన చేస్తామని తెలియజేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర కౌన్సిలర్ పి.సూర్యచంద్ర, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తాబేళ్ల మృతికి వలలే కారణం ఎచ్చెర్ల : సముద్రతీర ప్రాంతంలో తాబేళ్లు మృత్యువాత పడటానికి మత్స్యకారులు వేసే వలలే కారణమని పొన్నాడ వెటర్నరీ అసిస్టెంట్ శ్రీసాయి ప్రసాద్ అన్నారు. స్కిడ్ నెట్, నానాజాతి వలలు, గిల్లెట్ నెట్, టేకువలల్లో తాబేళ్లు చిక్కుకుని మృతి చెందుతున్నట్లు చెప్పారు. బొంతలకోడూరు ప్రాంతంలో మంగళవారం శ్రీకాకుళం అటవీ పరిధి అధికారి, సిబ్బంది నిర్వహించిన విచారణలో విశాఖపట్నం నుంచి వచ్చే మెకానికల్ బోట్లు వల్ల కూడా తాబేళ్లు అధికంగా మృత్యువాత పడుతున్నట్లు గుర్తించామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు అటవీ, ఫిషరీష్, మైరెన్, ట్రీ ఫౌండేషన్, స్థానిక మత్స్యకారులతో కలిసి అవగాహన సదస్సులు నిర్వహించడం అవసరమన్నారు. కార్యక్రమంలో అటవీశాఖ అధికారి రాజశేఖర్, ఫారెస్ట్ సెక్షన్ అధికారి వినోద్కుమార్, ట్రీ ఫౌండేషన్, అటవీసిబ్బంది పాల్గొన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల విషయంలో సాంకేతిక సమస్య అని చెబుతున్నారు. కార్యాలయాలతో పాటు గ్యాస్ ఏజెన్సీకి దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకపోయింది. ప్రభుత్వం నేరుగా ఖాతాల్లో జమ చేస్తామని చెబుతోంది. కానీ రకరకాల కారణాలు చెప్పి అందించడం లేదు. – బి.మురళీ, గ్యాస్ వినియోగదారుడు, తంప, హిరమండలం మా కుటుంబానికి తెల్ల రేషన్కార్డు ఉంది. అయినా ఉచిత గ్యాస్ సిలిండర్ అందడం లేదు. ఒకటి రెండు సార్లు మాత్రమే బ్యాంక్లో నగదు వేసినట్టూ చూపుతోంది. అయితే ముందుగా గ్యాస్ సొమ్ము అకౌంట్లో వేసి పథకం అమలు చేస్తే బాగుంటుంది. – పెనుమజ్జి పద్మావతి, గ్యాస్ వినియోగదారురాలు, యంబరాం గ్రామం జిల్లాలో ఉచిత గ్యాస్ పథకం అమలవుతోంది. ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. అయితే ఏవైనా తప్పిదాలు, సాంకేతిక సమస్యలు ఉన్నవారికే అందడం లేదు. అటువంటి వారు బ్యాంకులతో పాటు గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాలను సంప్రదించాలి. – సూర్యప్రకాశ్, డీఎస్వో, శ్రీకాకుళం -
పాఠశాలలో పాము కలకలం
పొందూరు: మండలంలోని మలకాం ప్రభుత్వ పాఠశాలలో సోమవారం పాము కలకలం రేపింది. పాఠశాల బాత్ రూమ్ గజాల తలుపుపై సుమారు 5 అడుగుల పాము కనిపించడంతో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. అనంతరం ఉపాధ్యాయులకు చెప్పడంతో బయటకు పంపించారు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు. కళాశాలలో లాప్టాప్లు దొంగతనం పాతపట్నం: స్థానిక ఆల్ ఆంధ్ర రోడ్డు సమీపంలో ఉన్న మహేంద్ర డిగ్రీ కళాశాలలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో చోరీ జరిగింది. కళాశాల తలుపుల తాళాలు పగలుగొట్టి కంప్యూటర్ లాబ్లోని ఎనిమిది లాప్టాప్లు, రెండు ఎల్ఈడీలు, మూడు డెస్క్టాప్లను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించినట్లు ప్రిన్సిపాల్ రాజగోపాల్ ఆచార్యులు తెలిపారు. -
గ్రిగ్స్ పోటీలు ప్రారంభం
శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం నగరంలోని కోడి రామ్మూర్తి స్టేడియం వేదికగా జిల్లాస్థాయి బాలుర గ్రిగ్స్ పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు కబడ్డీ, ఖోఖో, సాఫ్ట్బాల్, బాస్కెట్ బాల్, బాల్ బాడ్మింటన్ క్రీడాంశాల్లో పోటీలు ఉత్సాహ భరితంగా సాగాయి. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన పాఠశాలల జట్లకు జ్ఞాపికలను అందజేశారు. మిగిలిన వివిధ క్రీడాంశాల్లో పోటీలు మంగళవారం నిర్వహించి గ్రిగ్స్ పోటీలను ముగిస్తారు. కాగా అంతకుముందు పోటీలను డీఈవో ఎ.రవిబాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో పోటీల నిర్వహణ పాఠశాల హెచ్ఎం దేవదత్తానందం, పీడీ కె.మాధవరావు, పీఈటీ సంఘ నాయకులు ఎంవీ రమణ, పి.తవిటయ్య, గ్రిగ్స్ సెక్రటరీ టి.శ్రీనివాసరావు, ఎస్జీఎఫ్ సెక్రటరీ బీవీ రమణ, ఆర్.స్వాతి, ఎం.తిరుపతిరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
స్మార్ట్ మీటర్లతో ఆందోళన
కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున స్మార్ట్ మీటర్లు అమర్చుతోంది. దీనికి తోడు సూర్యఘర్ పథకం కింద సోలార్ పథకానికి రూపకల్పన చేసింది. దీంతో విద్యుత్ మీటర్లు గణనీయంగా తగ్గముఖం పట్టనున్నాయి. స్మార్ట్ మీటర్తో నేరుగా వినియోగదారుడే ఆన్లైన్ చెల్లింపుల ప్రక్రియ జరుపుతాడు. సూర్యఘర్తోనూ అదే పరిస్థితి. అందుకే మీటర్ రీడింగ్ తీసేవారు ఆందోళనలో ఉన్నారు. తమ సమస్యలను పరిష్కరించేదాకా ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెబుతున్నారు. ఈ నిర్ణయంతో విద్యుత్ శాఖ అధికారులు ప్రత్యామ్నాయంపై దృష్టిపెట్టారు. -
అందరి సొమ్ములు ఒకేసారి చెల్లించాలి
ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం పోస్టాఫీస్లో జరిగిన సుమారు రూ.2.78 కోట్ల భారీ స్కామ్లో 33 మంది బాధిత ఖాతాదారులు తమందరికీ సొమ్ములను ఒకేసారి చెల్లించాలని డిమాండ్ చేశారు. బాధిత ఖాతాదారులంతా సోమవారం స్థానిక పోస్టాఫీస్ వద్ద బైఠాయించి పోస్టల్ సిబ్బందిని కార్యాలయంలోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఇటీవల ఖాతాదారులంతా డిసెంబర్ 15వ తేదీన ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో సంక్రాంతి నాటికి అందరి సొమ్ములను చెల్లించడం జరుగుతుందని జిల్లా పోస్టల్ అధికారి హామీ ఇచ్చారు. అయితే సంక్రాంతి అయిపోయినా ఇప్పటివరకు డబ్బులు చెల్లించకపోవడంతో మరోసారి ఆందోళన చేపట్టారు. దీంతో స్థానిక పోస్టల్ సిబ్బంది బాధితుల్లో 20 మందికి చెక్లను సిద్ధం చేశారు. కాగా బాధిత ఖాతాదారులంతా అందరికి ఒకేసారి చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఖాతాదారులంతా స్థానిక పోలీస్ సిబ్బందిని ఆశ్రయించడంతో సీఐ మీసాల చిన్నంనాయుడు జిల్లా పోస్టల్ అధికారితో ఫోన్ ద్వారా సంప్రదించారు. పోస్టల్ డివిజనల్ అధికారితో బాధిత ఖాతాదారులందరితో మాట్లాడించి, వారి సమస్య పరిష్కరానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 2 గంటల వరకు పోస్టల్ సిబ్బందిని కార్యాలయంలోకి విడిచిపెట్టకపోవడంతో పోస్టల్ సేవలు నిలిచిపోయాయి. -
అర్జీలపై తక్షణమే స్పందించాలి
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ● పీజీఆర్ఎస్కు 41 వినతులు టెక్కలి: ప్రజల నుంచి వచ్చిన అర్జీలపై అధికారులు తక్షణమే స్పందించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి తదితరులు సుమారు 41 వినతులు స్వీకరించారు. వినతులు పరిశీలిస్తే... ● టెక్కలి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వివిధ అనారోగ్య సమస్యలతో వస్తున్న వారిని రిఫర్ పేరుతో పంపించేస్తున్నారని, అంతేకాకుండా ప్రైవేట్ క్లీనిక్లు అధికమై రోగులకు ప్రభుత్వ వైద్య సేవలు అందకుండా చేస్తున్నారని బీజేపీ మండల అధ్యక్షుడు జర్జాన రామ్జీ తదితరులు ఫిర్యాదు చేశారు. ● తనకు పీఎం కిసాన్ సాయం పడడం లేదని, సమస్యను పరిష్కరించాలని టెక్కలి మండలం బూరగాం గ్రామానికి చెందిన జనపాన నీలయ్య విన్నవించారు. ● తన తండ్రి పేరున ఉన్న ఇంటి పన్నును తన పేరుకు మార్చాలని టెక్కలికి చెందిన నేపాలం బలరాం కోరారు. ● తన భర్త ప్రమాదవశాత్తు గాయపడి ఎటువంటి పనులు చేసుకోలేకపోతున్నారని, అతనికి దివ్యాంగ పింఛన్ మంజూరు చేయాలని టెక్కలి మండలం ఆంజనేయపురం గ్రామానికి చెందిన ముడిదాన దుర్గ విన్నవించారు. ● తన కుమారుడు ధనుష్కు దివ్యాంగ పింఛన్ మంజూరు చేయాలని టెక్కలి మండలం ఆంజనేయపురం గ్రామానికి చెందిన జామి సంతోషికుమారి వినతి అందించారు. ● నందిగాం మండలంలోని పాలవలస గ్రామానికి ఉపాధి పనులు కల్పించాలని గ్రామస్తులు విన్నవించారు. ● టెక్కలి మండలంలోని సీతాపురం గ్రామంలో రోడ్డుకు ఆనుకుని నివసిస్తున్న 8 మంది ఎస్సీ కుటుంబాలకు కాలనీ ఇళ్లు మంజూరు చేశారని, అయితే అక్కడ ఎటువంటి మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆయా కుటుంబాలు విన్నవించారు. ● టెక్కలి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వలన ఆదివాసీ కుటుంబానికి చెందిన పసికందు మృతి చెందిందని, దీనిపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ గిరిజన చైతన్య వేదిక ప్రతినిధులు కోరారు. ● తనకు బ్రెయిన్ క్యాన్సర్ ఉండడం వలన ఎటువంటి పనులు చేసుకోలేకపోతున్నానని, తనకు పింఛన్ మంజూరు చేయాలని సంతబొమ్మాళి మండలం మర్రిపాడు గ్రామానికి చెందిన చల్లా రాజారావు విన్నవించారు. ● ఎలక్ట్రికల్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న తాను కొద్ది రోజుల క్రితం జరిగిన ప్రమాదంతో పూర్తిగా నడవలేని స్థితిలో ఉన్నానని, తనకు పింఛన్ మంజూరు చేయాలని టెక్కలి గోపినాథపురం గ్రామానికి చెందిన సత్తారు ప్రేమ్చంద్ కోరారు. ● గత కొన్ని సంవత్సరాలుగా అందుతున్న దివ్యాంగ పింఛన్ను సాంకేతిక కారణాలతో ఆపేశారని, దీనికి సంబంధించి అన్ని రకాల క్లియరెన్స్ పత్రాలు సమర్పించినప్పటికీ పింఛన్ అందజేయడం లేదని టెక్కలికి చెందిన గొంటి వెంకటరత్నం విన్నవించారు. ● టెక్కలి అంజనాపురం సమీపంలోని జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డి.రాజ్కుమార్రెడ్డి కోరారు. జిల్లాకేంద్రంలో బోసిపోయిన పీజీఆర్ఎస్ శ్రీకాకుళం పాతబస్టాండ్: శ్రీకాకుళం నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ను సోమవారం నిర్వహించారు. అయితే కలెక్టర్, జేసీ ఇతర అధికారులు టెక్కలి రెవెన్యూ క్లీనిక్కి వెళ్లడంతో బోసిపోయింది. జిల్లా రెవెన్యూ శాఖ, పంచాయతీ రాజ్ విభాగాలు సమన్వయంతో వినతులు స్వీకరించారు. డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి భారతి సౌజన్య, డీఎస్వో సూర్య ప్రకాష్లు అర్జీదారులతో నేరుగా మాట్లాడి సమస్యలను నమోదు చేసుకున్నారు. -
కాలయాపన చేస్తే సహించేది లేదు
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ● టెక్కలిలో రెవెన్యూ క్లీనిక్ ● వివిధ భూ సమస్యలపై 125 అర్జీలు స్వీకరణ టెక్కలి: భూ సమస్యల పరిష్కారంలో అధికారులు కాలయాపన చేస్తూ.. అర్జీదారులకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హెచ్చరించారు. సోమవారం టెక్కలి సబ్ కలెక్టర్ ప్రాంగణంలో రెవెన్యూ క్లీనిక్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొన్ని రకాల కారణాలతో పరిష్కారం కాని భూ సమస్యలను పరిష్కరించే దిశగా రెవెన్యూ క్లీనిక్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం వివిధ భూ సమస్యలపై 125 అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో డీఆర్వో వీఎస్ లక్ష్మణమూర్తి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. అర్జీలను పరిశీలిస్తే... ● టెక్కలి మండలంలోని అక్కవరం గ్రామానికి చెందిన కుమ్మరి మల్లేష్ తనకు చెందిన భూమి మరొకరి పేరును మారిపోయిందని, దానిని సరి చేయాలని కోరారు. ● కంచిలి మండలంలోని బూరగాం సమీపంలో రైల్వే ఫ్లై ఓవర్ వంతెన కోసం చేపట్టిన సర్వేలో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా జిరాయితీ స్థలంలో రాళ్లు పాతారని, దీనిపై న్యాయం చేయాలని బి.జయప్రసాద్ కోరారు. ● కొత్తూరు మండలంలోని మెట్టూరు గ్రామంలో ఉన్న గ్రామకంఠం ప్రభుత్వ భూమిని కొంతమంది వ్యక్తులు ఆక్రమించి ఇళ్ల నిర్మాణం చేశారని, వాటిపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్తో పాటు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ● తన భూమికి సంబంధించిన వివరాలు తప్పుగా నమోదు చేయడంతో పాస్ పుస్తకాల్లో తప్పులు చోటు చేసుకున్నాయని, వాటిని సరిచేయాలని టెక్కలి మండలం తలగాం గ్రామానికి చెందిన పేడాడ శార్వాణి కోరారు. ● టెక్కలి మండలంలోని చింతలగార సమీపంలో తమ భూమికి సంబంధించిన వివాదంలో అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడమే కాకుండా తప్పుడు మార్గాన్ని అనుసరిస్తున్నారని, దీనిపై చర్యలు చేపట్టాలని రాధావల్లభాపురం గ్రామానికి చెందిన బగాది కృష్ణారావు విన్నవించారు. -
చెక్ పవర్ను పునరుద్ధరించండి
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఎచ్చెర్ల మండలంలోని బొంతలకోడూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ పంచిరెడ్డి రాంబాబు చెక్ డ్రాయింగ్ అధికారాన్ని తాత్కాలికంగా నిలిపివేశారని, దానిని పునరుద్ధరించాలని ఎచ్చెర్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్, సర్పంచ్ పంచిరెడ్డి రాంబాబు, ఎంపీటీసీ జగదేశ్వరరావు తదితరులు పీజీఆర్ఎస్లో సోమవారం ఫిర్యాదు చేశారు. సర్పంచ్ చెక్క పవర్ను 2025 ఏప్రిల్ 2వ తేదీన తాత్కాలికంగా నిలుపుదల చేశారని, అయితే గడువు పూర్తయినా ఇంకా పునరుద్ధరించలేదని పేర్కొన్నారు. దీనివలన పంచాయతీలో కనీస అవసరాలు నేరవేరక, చేసిన పనులకు బిల్లుల చెల్లింపులు జరగక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. 2025 నవంబర్ 25న నాలుగు వారాల్లో చెక్కు డ్రాయింగ్ ఇవ్వాలని హైకోర్టు తెలిపినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. -
జీవితాల్లో వెలుగు లేక..!
హిరమండలం: జిల్లాలో చిరుద్యోగులు ఉద్యమబాట పట్టారు. విద్యుత్ మీటర్ల రీడింగ్ తీసేవారు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం నుంచి సమ్మెకు దిగారు. దీంతో ఫిబ్రవరి నెలకు సంబంధించి విద్యుత్ మీటర్ రీడింగ్ ప్రక్రియ ప్రారంభం కాలేదు. దీంతో విద్యుత్ శాఖ ఆందోళన చెందుతోంది. సచివాలయ ఎనర్జీ అసిస్టెంట్లు ( గ్రేడ్–2 లైన్మెన్ల)తో రీడింగ్ తీసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండడంతో వారు కూడా ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే పని ఒత్తిడిలో తాము ఉంటే.. రీడింగ్ పని చేయలేమని తేల్చి చెబుతున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోక విద్యుత్ శాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇదీ పరిస్థితి.. జిల్లాలో అన్ని రకాల విద్యుత్ కనెక్షన్లు సుమారు 7.37 లక్షలు ఉన్నాయి. ఇందులో గృహ, వాణిజ్య మీటర్లకు చిరుద్యోగులు రీడింగ్ తీస్తుంటారు. ఇలా జిల్లావ్యాప్తంగా 235 మంది వరకూ రీడింగ్ తీసేవారు ఉన్నారు. శ్రీకాకుళం, టెక్కలి, పలాస డివిజన్ల పరిధిలో ఒక్కొక్కరూ 3,000 మీటర్లకు రీడింగ్ తీస్తుంటారు. అయితే తాము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే కాంట్రాక్ట్ ఉద్యోగులుగా వారిని గుర్తిస్తామని కూటమి నేతలు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు సమీపిస్తున్నా ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన రాలేదు. ఏడాది కిందట ఇదే మాదిరిగా మీటర్ రీడింగ్ తీసేవారు రీజియన్ల వారీగా ఆందోళనకు దిగారు. సమ్మెకు సిద్ధమయ్యారు. అయితే రకరకాల కారణాలు చెప్పి ప్రభుత్వం వారి నోరు మూయించింది. అయితే కాలం గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వారు సమ్మెబాట పట్టారు. నేను కొన్నేళ్లుగా మీటర్ రీడింగ్ తీస్తున్నాను. కనీసం కాంట్రాక్ట్ ఉద్యోగిగా గుర్తిస్తారన్న నమ్మకంతో పనిచేస్తున్నాను. జీతం నెలనెలా సక్రమంగా అందించడం లేదు. అందుకే కమీషన్ పెంచడంతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతున్నాం. – పెద్దకోట జనార్దనరావు, మీటర్ రీడింగ్ తీసే ఉద్యోగి, ఎల్ఎన్పేట మాకు చాలా అన్యాయం జరుగుతోంది. ఇంటింటికీ వెళ్లి రీడింగ్ తీస్తే కనీసం గిట్టుబాటు కావడం లేదు. కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించి కమీషన్ పెంచుతామని హామీ ఇచ్చారు. 20 నెలలుగా ఎదురుచూస్తున్నా ఫలితం లేకపోయింది. అందుకే సమ్మెబాట పట్టాం. – ప్రసాద్ మహోపాత్రో, మీటర్ రీడింగ్ తీసే ఉద్యోగి, హిరమండలం సమ్మెబాట పట్టిన విద్యుత్ మీటర్ రీడింగ్ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తిస్తామని కూటమి హామీ 20 నెలలుగా కార్యరూపం దాల్చకపోవడంతో ఆందోళన ప్రారంభమవ్వని ఫిబ్రవరి నెల రీడింగ్ మీటర్ల రీడింగ్ తీసేవారు చాలా తక్కువ వేతనానికి పనిచేస్తున్నారు. గతంలో విద్యుత్ శాఖ సిబ్బంది ఈ రీడింగ్ తీసే క్రమంలో ఇతర పనులకు ఇబ్బందులు ఎదురయ్యేవి. అందుకే ఈ రీడింగ్ తీసే బాధ్యతను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించారు. ఈ ఏజెన్సీలు చిరుద్యోగులను నియమించుకున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో విద్యుత్ మీటరు రీడింగ్ తీస్తే రూ.3.70లు, పట్టణ ప్రాంతాల్లో తీస్తే రూ.3.60లు ఇస్తున్నారు. అయితే ఇలా రీడింగ్ తీస్తున్న క్రమంలో వీరికి వేతనాలు సక్రమంగా అందించడం లేదు. ఇచ్చిందే తక్కువ కాగా సంబంధిత కాంట్రాక్టర్ జీతాలు సక్రమంగా సకాలంలో ఇవ్వడం లేదు. కూటమి అధికారంలోకి వస్తే నేరుగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించి.. కమీషన్ను భారీగా పెంచుతామని హామీ ఇచ్చారు. అయితే అదిగో ఇదిగో అంటూ కాలయాపన తప్ప హామీ అమలు చేసే దాఖలాలు కనిపించడం లేదు. -
చావే శరణ్యం
తన భూమి సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు సంవత్సరాల తరబడి కాళ్లరిగేలా తిప్పుతున్నారని.. కానీ సమస్యను మాత్రం పరిష్కరించడం లేదని సంతబొమ్మాళి మండలంలోని మూలపేట గ్రామానికి చెందిన జీరు ధర్మారావు అనే రైతు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రెవెన్యూ క్లీనిక్ కార్యక్రమంలో తన సమస్యను విన్నవించుకునేందుకు వచ్చారు. తన గ్రామంలో పరపటి జంగమయ్యకు చెందిన 3.50 ఎకరాల భూమిని 23 ఏళ్ల క్రితం కొనుగోలు చేయగా.. అప్పట్లో అధికారులతో కుమ్మకై ్క మరో భూమిని చూపించేశారని వాపోయాడు. ఆ సమస్యను పరిష్కరించాలని ఏళ్ల తరబడి తిరుగుతున్నప్పటికీ సంతబొమ్మాళి మండలం రెవెన్యూ అధికారులు డబ్బులు దోచేస్తున్నారు తప్ప, భూ సమస్యను పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కొద్దిరోజుల క్రితం వీఆర్వోగా పనిచేసిన ప్రసాదరావు కూడా తన వద్ద రూ.50 వేలు లంచంగా తీసుకున్నాడని ఆరోపించాడు. చివరకు సీఎం ఆఫీస్కు ఫిర్యాదు చేసినా సమస్యను పరిష్కరించకుండా రెవెన్యూ అధికారులు తనతో ఆడుకుంటున్నారని, ఇక తనకు చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు ధర్మారావును పక్కకు తీసుకుని వెళ్లిపోయారు. కొంత సమయం తర్వాత రైతు ధర్మారావు మరోసారి ఫిర్యాదు చేశారు. -
ఎస్పీ గ్రీవెన్సుకు 61 ఫిర్యాదులు
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ మరియు పరిష్కార కార్యక్రమం (గ్రీవెన్సు)లో ప్రజల నుంచి 61 వినతులు స్వీకరించారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి బాధితుల నుంచి వినతులు స్వీకరించి సకాలంలో పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అలాగే జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్లో ఈనెల 27న 10 వేల మంది దంపతులతో స్వర్ణ పుష్పాభిషేక మహోత్సవం, శ్రీమద్విరాట్ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కార్యక్రమానికి అనుమతి కోరుతూ ఎస్పీని కలిశారు. పీఎన్కాలనీ నారాయణ తిరుమల వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. -
‘మాదిన’కు జాతీయ అవార్డు
కంచిలి: మండలంలోని పెద్దశ్రీరాంపురం గ్రామానికి చెందిన విశాఖపట్నం పశువైద్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న డాక్టర్ మాదిన ప్రసాదరావుకు పశువైద్య రంగంలో అత్యున్నత స్థాయిలో సేవలు అందించిన పశువైద్యులకు జాతీయ స్థాయిలో ఇచ్చే డాక్టర్ సీఎం సింగ్ సుశృత గౌరవ్ రత్న సమ్మాన్ 2025 అవార్డులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంపిక చేశారు. ఈ అవార్డులను వెటర్నరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(వీఏఐ) ఎంపిక చేసినట్లు ప్రసాదరావు తెలిపారు. ఈ అవార్డుకు తనతోపాటు ఒంగోలు వెటర్నరీ పాలీ క్లినిక్లో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న డాక్టర్ నల్లపాటి జగత్ శ్రీనివాస్కు కూడా ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ అవార్డులను ఆంధ్రప్రదేశ్ పశు సంవర్ధకశాఖ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ దామోదరనాయుడు చేతులమీదుగా సోమవారం అమరావతిలో రాష్ట్ర కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ డైరెక్టర్లు డాక్టర్ రత్నకుమారి, డాక్టర్ రజనీకుమారి, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ భూపాల్రెడ్డి పాల్గొన్నారు. సచివాలయం పరిశీలన జి.సిగడాం: మండలంలోని బాతువ గ్రామ సచివాలయాన్ని అదనపు ట్రైనీ కలెక్టర్ డి.పృథ్వీరాజ్ కుమార్ సోమవారం ఆకస్మికంగా పరిశీలించారు. రికార్డుల నిర్వహణ, పనితీరుపై ఆరా తీశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అలసత్వం వహించవద్దన్నారు. సిబ్బంది సమర్దవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఆయనతో పాటు డిప్యూటీ తహసీల్దార్ ఎన్.నిర్మల, ఆర్ఐ అబోతుల రాధ, సర్వేయర్ శాంతారావు తదితరులు ఉన్నారు. ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తికి గాయాలు శ్రీకాకుళం క్రైమ్: నగరంలోని 80 ఫీట్ రోడ్డులో వాకింగ్ చేస్తున్న వ్యక్తిని వెనుక నుంచి వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొనడంతో గాయాలయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నగరానికి చెందిన సువ్వారి కృష్ణ అనే వ్యక్తి ఆదివారం 80 అడుగుల రహదారిలో వాకింగ్ చేస్తున్నారు. అదే సమయంలో ఒక ద్విచక్ర వాహనంపై అతివేగంగా వచ్చిన వ్యక్తి మద్యం మత్తులో ఢీ కొట్టడంతో సువ్వారి కృష్ణకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం బాధితుడిని రిమ్స్కు తరలించారు. కృష్ణ ఫిర్యాదు మేరకు ట్రాఫిక్ ఎస్ఐ దండపాణి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. తప్పిన ప్రమాదం సరుబుజ్జిలి: సరుబుజ్జిలి జంక్షన్ వద్ద సోమవారం ద్విచక్ర వాహనం అదుపుతప్పింది. సరుబుజ్జిలి నుంచి హిరమండలం వైపు ద్విచక్ర వాహనంతో వెళ్తున్న యువకుడు సరుబుజ్జిలి జంక్షన్ దాటుతున్న సమయంలో వాహనం అదుపు తప్పడంతో పల్టీలుకొట్టింది. ఈ సమయంలో ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టాడు. అయితే ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు అవ్వకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అధికారుల నిర్లక్ష్యం శ్రీకాకుళం: నగరపాలక సంస్థకు మంజూరవుతున్న ఆర్థిక సంఘం నిధులు ఖర్చు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. 2020–21 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటివరకు మంజూరైన 15వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చు చేయకపోవడంతో ఈ నెలాఖరు నాటికి అవి మురిగిపోయే ప్రమాదం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే తక్షణమే ఈ నిధులను ఖర్చు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. అయితే అధికారులు దృష్టి సారించడం లేదు. ముఖ్యంగా అధికారులకు సిబ్బంది సహకరించకపోవడంతో ఇటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. 2020–21, 2021–22 సంవత్సరాల్లో ఆర్థిక సంఘం మంజూరు చేసిన నిధులతో అధికారులు పంపిన పనులకు సంబంధించిన అంచనాలను ప్రభుత్వం ఆమోదించింది. వీటికి టెండర్లు కూడా పూర్తయినప్పటికీ పనులు చేయించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల అవి పెండింగ్లో ఉండిపోయాయి. నిబంధనల ప్రకారం వీటిని రద్దుచేసి కొత్త్త పనులకు ప్రభుత్వం నుంచి ఆమోదం పొంది వాటిని చేపట్టాల్సి ఉంది. పాత పనులను రద్దుచేసి కొన్ని కొత్త పనులకు ప్రభుత్వ ఆమోదం పొందినా.. ఇప్పటివరకు వీటికి సంబంధించిన టెండర్లను పిలవకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఇదే నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తే కోట్లాది రూపాయులు వృథాగా మురిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా ఉండిపోయిన నిధులు సుమారు రూ.20 కోట్లకు పైబడి ఉండవచ్చని తెలుస్తోంది. శ్రీకాకుళం నగరపాలక సంస్థకు 2010 నుంచి పాలకవర్గం లేకపోవడంతో ఆర్థిక సంఘం నిధులు మంజూరునకు కేంద్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అందువలన నిధుల ఖర్చుకు ఇప్పటికై నా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
● కక్ష సాధింపు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పల్లె పాలనకు అధికార పార్టీ నాయకులు తూట్లు పొడుస్తున్నారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన సర్పంచ్ల చెక్ పవర్ను ఉద్దేశపూర్వకంగా ఆపి ఆ ఊరి ఊపిరి తీసేస్తున్నారు. అధికారులు కూడా వారు చెప్పినట్టే తలూపడంతో ప్రజాస్వామ్య విలువలు నిలువునా కుప్పకూలుతున్నాయి. ఎచ్చెర్ల మండలం బొంతల కోడూరు సర్పంచ్ వ్యవహారమే ఇందుకు ఉదాహరణ. చెరువుల ఆక్రమణలను అడ్డుకున్నందుకు అక్కడి సర్పంచ్పై కక్ష పూరితంగా వ్యవహరిస్తూ, తప్పుడు అభియోగాలతో చెక్ పవర్ రద్దు చేశారు. నిబంధనల మేరకై తే ఆరు నెలలకు మించి చెక్ పవర్ రద్దు చేయడానికి లేదు. పునరుద్ధరించాల్సిన అధికారులు నేతల ఒత్తిళ్లకు తలొగ్గి పది నెలలైనా పునరుద్ధరించలేదు. హైకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోవడం లేదు. అలాగని, ఆ గ్రామానికి సర్పంచ్ స్థానంలో డ్రాయింగ్ ఆఫీసర్ను కూడా నియమించలేదు. దీంతో పనులు ఆగిపోతున్నాయని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నా అధికారులకు పట్టడం లేదు. పొంతన లేని అభియోగాలు సాధారణంగా ఉపాధి హామీ పథకం నిధులు దుర్వినియోగమైతే సామాజిక తనిఖీల్లో అభ్యంతరం వ్యక్తమవుతుంది. తేడాలుంటే రికవరీకి ఆదేశిస్తారు. అవసరమైతే క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. కానీ, ఇక్కడదేమీ జరగలేదు. నిధులు దుర్వినియోగమైనట్టు సామాజిక తనిఖీల్లో ఎక్కడా తేలలేదు. కనీసం దుర్వినియోగం జరిగినట్టు ఉత్తర్వులు కూడా జారీ కాలేదు. పంచాయతీ నిధులకు సంబంధం లేని ఉపాధి హామీ నిధులు దుర్వినియోగం జరిగినట్టు చూపించి సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేశారు. పంచాయతీ నిధులు దుర్వినియోగమైతేనే సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేయాలి. అలాంటిదేమీ జరగకపోయినా ఉపాధి నిధులతో చేపట్టిన సచివాలయం భవన నిర్మాణాన్ని చూపించి, అందులో దుర్వినియోగం అయిందని అభియోగాలు మోపి సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేశారు. ఉపాధి నిధులకు, పంచాయతీ నిధులకు తేడా తెలియదా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. అసలు ఏం జరిగింది.. బొంతల కోడూరులో కూటమి నాయకుల చెరువుల ఆక్రమణలకు పాల్పడ్డారు. సర్వే నంబర్ 57–11లో గల చెరువులో రూ.3కోట్లు విలువైన ఎకరా 94 సెంట్లు, సర్వే నంబర్ 39–8లో గల రూ. 5కోట్లు విలువైన 3ఎకరాల చెరువుల ఆక్రమణలను అక్కడ సర్పంచ్ పి.రాంబాబు అడ్డుకున్నారు. ఆక్రమణదారులపై పెద్ద పోరాటమే చేశారు. చివరికి ఆక్రమణలని తేలడంతో అధికారులు సైతం చర్యలు తీసుకున్నారు. కబ్జాదారుల నుంచి చెరువులను కాపాడారు. నిబంధనలు పాటించని అధికారులు ● తప్పుడు అభియోగాలతో చెక్ పవర్ రద్దు చేసిన అధికారులు, పంచాయతీరాజ్ చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలు ఉన్నాయి. ● 1995 పంచాయతీరాజ్ చట్టంలోని జీఓ ఎంఎస్ నంబర్ 30 ప్రకారం సర్పంచ్ చెక్ పవర్ రద్దు కాలం గరిష్టంగా ఆరు నెలలే ఉండాలి. తర్వాత పునరుద్ధరించాలి. లేదంటే ఎక్స్టెన్షన్ చేసినట్టు ఉత్తర్వులైనా ఇవ్వాలి. ● రద్దు చేసిన కాలంలో డ్రాయింగ్ ఆఫీసర్ను నియమించాలి. కానీ జిల్లా అధికారులు ఈ విషయాలేవీ పట్టించుకోలేదు. ● నేటికి 10 నెలలు అవుతున్నా చెక్ పవర్ పునరుద్ధరించలేదు. డ్రాయింగ్ ఆఫీసర్ను నియమించలేదు. ● చెక్ పవర్ రద్దుపై ఏపీ హైకోర్టును ఆశ్రయించగా, 2025నవంబర్ 25న డబ్లూపీ నంబర్ 30010/2025 ఉత్తర్వుల్లో నాలుగు వారాల్లో చట్ట ప్రకారం సర్పంచ్కు చెక్ పవర్ పునరుద్ధరించాలని స్పష్టంగా ఆదేశాలు జారీ చేసిందని సర్పంచ్ ఉత్తర్వులు చూపిస్తున్నారు. కానీ, అధికారులు హైకోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదని ఆరోపిస్తున్నారు. ● కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టే అవుతుందని అంటున్నారు. హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని, చట్టం ప్రకారంగా నడుచుకోవాలని, గ్రామ అభివృద్ధికి సహకరించాలని గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగినా అధికారులు స్పందించడం లేదు. దీని వెనక కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు ఎమ్మెల్యేల హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. వారి ఒత్తిళ్లకు భయపడి అధికారులు చట్ట ప్రకారంగా నడుచుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. అయినప్పటికీ సర్పంచ్ రాంబాబు న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు.అక్కసుతో కూటమి నాయకులు కక్ష సాధింపునకు దిగారు. అధికారులను అడ్డం పెట్టుకుని ఏకంగా చెక్ పవర్ రద్దు చేయించారు. ఉపాధి హామీ పథకం నిధుల అవతకవకలు అభియోగంతో చర్యలు తీసుకున్నారు. వాస్తవానికి.. గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెనక భాగంలో సచివాలయం భవన నిర్మాణ పనులు కలెక్టర్ ఉత్తర్వులతో జిల్లా పరిషత్ సమావేశం తీర్మానం ప్రాప్తికి మొదలుపెట్టారు. అయితే, 2022 జూలైలో ఏపీ హైకోర్టు ఉత్తర్వుల మేరకు నిర్మాణం నిలుపుదల చేశారు. అప్పటికే భవన నిర్మాణానికి గ్రామ పంచాయతీకి రూ.1,81,339 నిధులు జమయ్యాయి. ఈ నేపథ్యంలో నిలిచిపోయిన సచివాలయం భవనాన్ని మరో ప్రదేశంలో నిర్మించడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు సచివాలయం పూర్తయ్యి ప్రారంభోత్సవం కూడా జరిగిపోయింది. నిలిచిపోయిన సచివాలయం భవన నిర్మాణాన్ని పార్ట్ (ఏ) గా, కొత్త సచివాలయం భవనాన్ని పార్ట్ (బి)గా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు రాటిఫికేషన్ చేసి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రాప్తికి పాత సచివాలయం కాంట్రాక్టర్ మెట్ట హరిహరరావు పేరున రూ.1,81,339లను చెక్ ద్వారా సర్పంచ్ చెల్లించారు. సంబంధిత కాంట్రాక్టర్ కూడా నిధులు దుర్వినియోగం జరిగినట్టు సామాజిక విచారణలో అభ్యంతరం వ్యక్తం చేస్తే మొత్తం నిధులు తిరిగి చెల్లిస్తానని లిఖిత పూర్వకంగా రాసి కూడా ఇచ్చారు. అంతా పక్కా పారదర్శకంగా, ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం నిర్మాణం, నిధుల వినియోగం జరిగితే.. పంచాయతీ నిధులు దుర్వినియోగం అయ్యాయని కూటమి నాయకులు ఇచ్చిన ఫిర్యాదుకు తలొగ్గి, ఒత్తిళ్లకు లోనై వారు చెప్పినట్టుగా వ్యవహరిస్తూ ఏకపక్షంగా సర్పంచ్ రాంబాబు చెక్ పవర్ను రద్దు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. -
‘అసలు ఏపీలో పరిపాలన ఉందా... లేదా?’
శ్రీకాకుళం: ఏపీలో ఇటీవల జరిగిన పరిణామాలు చూస్తుంటే ఆందోళనకరంగా ఉందన్నారు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారం. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిణామాలు ఇప్పుడే చూస్తున్నానన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా.. లేదా? అని ప్రశ్నించారు. ‘అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై జరిగిన దాడి దురదృష్టకరం. అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరిగితే నిందితులపై జిల్లా ఎస్పీ సైతం కనీస చర్యలు తీసుకోలేదు. ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కోరుతున్నా. రాష్ట్రంలో అరాచకాల్ని రెచ్చగొడుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. తిరుమల లడ్డులో కల్తీ లేదు అని సీబీఐ రిపోర్ట్ ఇచ్చింది.. మళ్ళీ దానిపై రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు?, సిబిఐ రిపోర్ట్ మీరు స్వీకరించి ఇప్పటితో ఈ చేష్టలు వదిలేస్తాం అని చంద్రబాబు అంటే హుందాగా ఉండేది. కోట్లాది మంది ఆరాధ్య దైవం వెంకటేశ్వరస్వామి ప్రసాదంలో కల్తీ జరిగింది అంటే ఎంత దారుణం. ఇది భక్తుల మనోభావాలు దెబ్బతీయడం కాదా?, గీతం యూనివర్సిటీ అక్రమ భూములు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న ఎంపీ భరత్ మళ్ళీ భూ అక్రమణలకు పాల్పడడం ఎంత దారుణం. ప్రజాస్వామ్య వ్యవస్థను పట్టపగలు నిట్ట నిలువునా ఖూనీ చేశారు. చంద్రబాబు నాయుడిది అటవిక పాలన. అమరావతి కోసం లెక్క లేనంత అప్పు చేస్తున్నారు. మీరు చేసిన తప్పులకు తగిన మూల్యం చెల్లిస్తారు. చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ భజన చెయ్యడానికే టైం సరిపోతుంది. కనీసం తప్పును తప్పు అని చెప్పాలి కదా?। అని ప్రశ్నించారు. -
రైతులపై అదనపు భారం
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు వెతలు ఇంకా కనిపిస్తున్నాయి. జిల్లాలో పండిన ధాన్యం మిల్లింగ్ చేసేందుకు మిల్లర్లు సిద్ధంగా ఉన్నప్పటికీ మన జిల్లాలో ఖరీఫ్లో పండించిన ధాన్యంను పక్క జిల్లాలకు పంపిస్తున్నారు. ఈ ఏడాది 4.07 లక్షల ఎకరాల్లో వరి పంటలు ఖరీఫ్లో వేశారు. ప్రభుత్వం 6.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు లక్ష్యంగా పెట్టుకుంది. 6.22 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు చెబుతోంది. ఈ ధాన్యంను జిల్లాలో ఉన్న 271 రైస్ మిల్లులకు మిల్లింగ్కు పంపించారు. కానీ జిల్లా లో చాలా చోట్ల పొలాల్లో దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. అపరాల పంటలు తర్వాత వాటిని రైతులు వాటిని నూర్పు చేస్తారు. ఫిబ్రవరి నెలాఖరు వరకు వీటిని నూర్చే పరిస్థితి లేదు. దీంతో అదనంగా ధాన్యం సేకరించా లని రైతులు కోరుతున్నారు. తాజాగా 50వేల మెట్రి క్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. కానీ ఇది ఏమాత్రం సరిపోదని పెంచాలని రైతులు కోరుతున్నారు. పక్క జిల్లాలకు మన ధాన్యం జిల్లాలో రైతులు పండించిన ధాన్యంను పక్క జిల్లాల మిల్లర్లకు అందజేసే అవకాశం ఈ ఏడాది ప్రభుత్వం కల్పించింది. గతంలో ఎప్పుడూ ఇలా లేదు. జిల్లాలో పండిన ధాన్యం జిల్లాలో మిల్లర్లు మా త్రమే కొనుగోలు చేసేవారు. ప్రభు త్వం నిర్ణయించే లక్ష్యాలు కూడా స్థానిక మిల్లర్లు సాధించేవారు. అయితే కూటమి ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లాకు చెంది న మిల్లర్ల ఒత్తిడికి లోబడి ఆ జిల్లాకు కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించింది. జిల్లా నుంచి ఇప్పటికే దాదాపు లక్ష మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం పక్క జిల్లాలకు తరలిపోయాయి. జిల్లాకు కొత్తగా కొనుగోలు లక్ష్యాలు ప్రభుత్వం కల్పించకపోతే, ఇక్కడ మిగిలి ఉన్న ధాన్యం మరో రెండు లక్షలు మెట్రిక్ టన్నుల వరకు ఇతర జిల్లాకు వెళ్లే అవకాశం ఉంది. ఇలా జరి గితే జిల్లా మిల్లర్లు నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. మిల్లర్లకు అన్యాయం జిల్లాలో తమకు అన్యాయం జరుగుతోందని మిల్లర్లు వాపోతున్నారు. ఈ ఏడాది అన్ని రకాలుగా ప్రభుత్వం మిల్లర్లను ఇబ్బంది పెట్టిందని, బ్యాంకు గ్యారెంటీలు అన్నీ ఇచ్చినా వారికి సరిపడినంత ధాన్యంను అందజేయలేదని ముందు నుంచీ ఫి ర్యాదులు ఉన్నాయి. పోలాకికి చెందిన మిల్లర్ ఒకరు నేరుగా కలెక్టర్, జేసీలకే ఫిర్యాదు చేశారు. జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాలకు, ఉత్సవాలకు, ఇతర సంక్షేమాలకు మిల్లర్ల నుంచి సాయం తీసుకుంటున్న రాజకీయ నాయకులు వారిని కాదని ఇతర జిల్లాల మిల్లర్లకు మేలు చేసేలా వ్యవహరించడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పక్క జిల్లాలకు వెళ్తున్న మన ధాన్యం జిల్లాలో కొనుగోలు లక్ష్యాలు పూర్తి అదనపు కొనుగోలు అంతంతమాత్రమే -
లారీడ్రైవర్ మృతి
ఎచ్చెర్ల : ఎచ్చెర్ల జాతీయ రహదారిపై వెళ్తున్న భాస్కరరావు అనే లారీ డ్రైవర్ ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. శ్రీకాకుళం నుంచి చిలకపాలెం వెళ్తుండగా కింతలిమిల్లు సమీపంలో ఫ్లై ఓవర్ వంతెన వద్ద లారీ ఆపి దిగాడు. అసౌకర్యానికి గురై వాంతులు చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. భాస్కరారావుది విజయనగరం రైతుబజార్ వీధి. కుటుంబ సభ్యులకు క్లీనర్ సమాచారం అందించాడు. ఘనంగా తెరవే కవి సమ్మేళనం శ్రీకాకుళం కల్చరల్ : నగరంలోని శాంతినికేతన్ కళాశాలలో తెలుగు రచయితల వేదిక ఆధ్వర్యంలో 113వ నెలవారీ సాహితీ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. సంస్థ అధ్యక్ష కార్యదర్శులు ఉత్తరావల్లి నాగేశ్వరరావు, రఘుపాత్రుని వెంకట రమణమూర్తి నిర్వహణలో క్రియాశీలక సభ్యులు ఇద్ది పాపయ్య అతిథిగా పాల్గొన్న కవి సమ్మేళనంలో 13 మంది హాజరై తమ కవితలు చదివి వినిపించారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ హిందీ ప్రచారసభ కార్యదర్శి, ఇంటెలెక్చువల్ ఫోరం వ్యవస్థాపకులు కోనె శ్రీధర్ కేంద్ర ఆర్థిక శాఖ హిందీ సలహా మండలి సభ్యుడిగా నియామకం కావడం పట్ల సభ్యులు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కవులు తోట గోపాలరావు, యం.ఉపేంద్రశర్మ, యు.నాగేశ్వరరావు, ఆర్.వి.రమణమూర్తి, గుడిమెట్ల గోపాలకృష్ణ, ఐ.పాపయ్య, డబ్బీరు గోవిందరావు, కిల్లాన శ్రీనివాస్, వావిలపల్లి రాజారావు, పి.వి.దుర్గాప్రసాద్, కుప్పిలి త్రినాథరావు, టి.విజయలక్ష్మణ్, కె.బి.రవికిరణ్ పాల్గొన్నారు. -
కోతలే.. చేతల్లేవు!
● కేంద్ర బడ్జెట్లో జిల్లాకు మొండిచేయి ● కేంద్ర మంత్రి ఉన్నా కేటాయింపులు శూన్యం ● ప్రచారం తప్ప కనిపించని ప్రయోజనం ఉద్యోగులకు రిక్తహస్తం కేంద్ర బడ్జెట్ ఉద్యోగులను నిరాశ పరిచింది. ఇన్కంటాక్స్ శ్లాబ్లు యథాతధంగా ఉన్నా యి. ఆధారిత పన్ను మినహాయింపులో మార్పు లేదు. – హనుమంతు సాయిరాం, ఏపీ ఎన్జీఓ సంఘ జిల్లా అధ్యక్షుడు ఆశాజనకంగా లేదు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా లేదు. రైల్వేజోన్కు సరిపడా నిధులు కేటాయించలేదు. జాతీయ రహదారి నరసన్నపేట నుంచి ఆరులైన్లకు నిధులు కేటాయించలేదు. – హెచ్.సుబ్రహ్మణ్యం, అసిస్టెంట్ ప్రొఫెసర్, బీఆర్ఏయూ పన్ను ఉపశమనం ఎక్కడ? రూ.12.21 లక్షల కోట్లు రికా ర్డు మూలధన ఖర్చు, రూ. 53.47 లక్షల కోట్లు మొత్తం వ్యయంతో ప్రభుత్వం భారీ పెట్టుబడి దూకుడు చూపించినా ఆదాయ పన్ను శ్లాబ్లలో ఒక్క రూపాయి మార్పు కూడా చేయలేదు. బడ్జెట్ ఒక పెట్టుబడి ఆధారిత దీర్ఘకాల వృద్ధి దిశగా భారత వ్యవస్థను మళ్లించే ప్రయత్నంగా వర్ణించవచ్చు. – డాక్టర్ మళ్ల పూర్ణసూరిగణేష్, ఆర్థిక విశ్లేషకులు, ట్రిపుల్ ఐటీ వేతన జీవులకు నిరాశ ఆదాయ పన్ను శ్లాబులు మార్చకపోవడం వేతనజీవులకు నిరాశే. స్టాండర్డ్ డిడక్షన్ 1,50,000కు పెంచి ఉండాల్సింది. సేవింగ్స్ పరిమితిని కనీసం 2.5 లక్షలకు పెంచి ఉంటే పొదుపు చేసుకోవడానికి ప్రోత్సాహం ఉండేది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి విభజన చట్టం ప్రకారం ప్రత్యేక హోదా ప్రకటించి ఉండాల్సింది. – బి.వెంకటేశ్వర్లు, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : సిక్కోలుపై సీతమ్మ మళ్లీ శీతకన్ను వేశారు. జిల్లాలో కేంద్ర మంత్రి ఉన్నా, పక్క జిల్లా ఎంపీ కూడా కూటమికే చెందినా ఈ ప్రాంతానికి ఏ మాత్రం ప్రయోజనం లేకుండాపోయింది. కోతలు ఎక్కువ.. చేతలు తక్కువ అని మ రోసారి రుజువైంది. కేంద్ర బడ్జెట్లో సిక్కోలుకు ప్రత్యేకంగా సాధించిందేమీ కనిపించలేదు. అందులోనూ కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయు డు చేసిన కృషి లేశమాత్రమైనా లేకపోవడం విచారకరం. స్వల్పకాలిక ప్రయోజనాలే ● కేంద్ర బడ్జెట్లో జిల్లాకు ప్రత్యేకమైన ప్రయోజనాలేవీ కల్పించలేదు. దేశవ్యాప్తంగా కొబ్బరి చెట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకం, జీడి పప్పు ఉత్పత్తి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న ట్టు ప్రకటన తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ జిల్లాకు అన్యాయమే జరిగింది. కొత్తగా కొబ్బరి చెట్ల ఏర్పాటుకు ప్రోత్సాహం, జీడిపప్పు ఉత్పత్తికి ప్రత్యేక చర్యల వలన ఉద్దానంకు కొంత మేలు జరగనుంది. ● భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి, శ్రీకాకుళం, ఎచ్చెర్ల నుంచి అనుసంధానించే రహదారుల అభివృద్ధికి, పారిశ్రామిక కారిడార్లకు ప్రత్యేక నిధులు కేటాయింపు జరగలేదు. ● కిసాన్ డ్రోన్ పథధకం కింద రైతులకు ప్రోత్సాహం, మత్స్యకారులకు ఆధునిక జెట్టీలు, కోల్ట్ స్టోరేజీల నిర్మాణాలకు సాయంపై బడ్జెట్లో స్పష్టత ఇవ్వలేదు. ● ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద సాగునీటి పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు జరగలేదు. కొబ్బరి ఆధారిత పరిశ్రమలకు, పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు రాయితీలు ప్రకటించలేదు. రైల్వే, రహదారులకు స్పష్టత కరువు ● నౌపడ– గుణుపూర్ రైల్వే లైన్ నిర్మాణం కోసం రూ. 900కోట్లతో ప్రాజెక్టు ప్రతిపాదన ఉంది. ఈ లైన్ వస్తే వాణిజ్య కార్యకలాపాలు పెరు గుతాయి. కానీ బడ్జెట్లో ఎక్కడా దీనిపై ప్రస్తావించలేదు. ● పలాస రైల్వే ఫ్లై ఓవర్ పనులకు నిధుల కేటాయింపుపై స్పష్టత ఇవ్వలేదు. ● అమృత్ భారత్ పథం కింద శ్రీకాకుళం, ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులకు కూడా నిధుల కేటాయింపుపై క్లారిటీ లేదు. ● మూలపేట పోర్టు కనెక్టివిటీ రైల్వే లైన్, పలుచోట్ల రైల్వే అండర్ పాసెజీల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. వీటిపైనా బడ్జెట్లో స్పష్టమైన ప్రకటన ఇవ్వలేదు. ● ఈస్ట్కోస్టు రైల్వే లైన్తో పాటు విశాఖ,విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల మీదుగా ఒడిశాలోని కొన్ని ప్రాంతాలకు రైల్వే లైన్ల అభివృద్ధిపైనా ఎక్కడా స్పష్టత ఇవ్వలేదు. ● జిల్లాలో నరసన్నపేట నుంచి ఇచ్ఛాపురం వరకు ప్రస్తుతం నాలుగులైన్ల జాతీయ రహదారి మా త్రమే ఉంది. దీన్ని ఆరు లైన్లుగా మార్పు చేయా ల్సి ఉంది. ఇచ్ఛాపురం, నరసన్నపేట, పలాస, ఆమదాలవలస నియోజకవర్గాల్లో పలు వంతెనల నిర్మాణాలు కూడా చేపట్టాలి. ఇవన్నీ పూర్తి చేయాలంటే రూ. వేల కోట్లలో అవసరం ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో కేటాయింపులు చేయలేదు. -
శ్రీకాకుళం
సోమవారం శ్రీ 2 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026గ్రామాలకు నిరాశే కేంద్ర బడ్జెట్ ఉద్యోగులకు కొంత ఊరట. కానీ గ్రామీణ ఆర్థిక రంగానికి నిరాశే. ఇది పేరుకే ఆత్మ నిర్భర భారత్ బడ్జెట్. రాష్ట్రానికి ఆశించిన కేటాయింపులు చేయలేదు. విభజన చట్టం హామీలు, గిరిజన యూనివర్సిటీ, దుగరాజపట్నం పోర్ట్ విస్మరించారు. – బొడ్డేపల్లి మోహనరావు, ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులుసామాన్యులకు ప్రయోజనం లేదు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన బడ్జెట్తో సామాన్యులకు ఏమీ ప్రయోజనం లేదు. మహిళలకు, యువత, రైతులకు వ్యతిరేకంగా బడ్జెట్ ఉంది. విద్యారంగానికి నిధులు కేటాయించలేదు. యువత, రైతులు, ఉపాధి గురించి ప్రస్తావించలేదు. బడ్జెట్లో సంక్షేమ పథకాల కేటాయింపుల గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. – రెడ్డి శాంతి, వైఎస్సార్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే -
నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఓ ప్రకటనలో ఆదివారం వెల్లడించారు. అర్జీదారులు వారి అర్జీలు నేరుగా పై కార్యక్రమంలో లేదా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అర్జీల స్థితి గురించి తెలుసుకోవడానికి 1100కు కాల్ చేయాలన్నారు. టెక్కలిలో రెవెన్యూ క్లినిక్ జిల్లాలోని రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేస్తూ టెక్కలి రె వెన్యూ డివిజన్ కార్యాలయంలో జిల్లా మొ త్తానికి సోమవారం ప్రత్యేక ‘రెవెన్యూ క్లినిక్’ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్వయంగా పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించనున్నారు. భూ సమస్యలు, మ్యుటేషన్లు, పట్టాదారు పాసు పుస్తకాలు, భూ సర్వే వంటి దీర్ఘకాలిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఈ క్లినిక్ను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ‘లేబర్ కోడ్లు రద్దు చేయాలి’ శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): భవన నిర్మాణ కా ర్మిక సంక్షేమ చట్టాన్ని నిర్వీర్యం చేసే లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అసంఘటిత రంగ కార్మికులకు పటిష్టమైన చట్టం అమలు చేయా లని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.ఆదినారాయణమూర్తి, సిటు టౌన్ కన్వీనర్ ఆర్.ప్రకాశరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లాకమిటీ సమావేశం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ రాష్ట్రంలో సుమారు 30 లక్షలు, జిల్లాలో సుమారు 80 వేల మంది నిర్మాణరంగ కార్మికులు ఉన్నారని, వారు పోరాడి సాధించుకున్న నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టాన్ని నిలుపుదల చేసి కార్మికులకు తీవ్ర అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్, లోకేష్ రాజకీయ ప్రచారాలకు భవన నిర్మాణ సంక్షేమ నిధిని వినియోగించడం దుర్మార్గమని విమర్శించారు. గృహ నిర్మాణాలకు రుణాలు మంజూరు చేసి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ బోర్డు ని పునరుద్ధరిస్తామని కూటమి ప్రభుత్వం హా మీ ఇచ్చి మర్చిపోయిందన్నారు. పెండింగ్ క్లెయిమ్లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మెలో భవన నిర్మాణ కార్మికులు పాల్గొని జయప్రదం చేయా లని పిలుపునిచ్చారు. తంగి హరి నారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తర్ల లక్ష్మణరావు, బూసి లక్ష్మణ రావు, పనస రమేష్ వివిధ మండలాల నుంచి కార్మికులు పాల్గొన్నారు. -
అరసవల్లిలో మాఘ సందడి
అరసవల్లి: పవిత్ర మాఘ మాసం మొదటి ఆదివారం సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయానికి వేలాది మంది భక్తులు పోటెత్తారు. ఆదివారం వేకువజామునకే సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్థానిక ఇంద్రపుష్కరిణి వద్ద పిడకల పొయ్యిలో క్షీరాన్నం వండి ఆదిత్యునికి భోగం నివేదించారు. అలాగే ఆరోగ్యం కోసం పలువురు భక్తులు సూర్యనమస్కారాల పూజలను చేయించుకున్నారు. మాఘమాసం సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పుష్పాలంకరణచేసారు. ఒక్క రోజు ఆదాయం రూ.18,33,261 ఆదిత్యాలయంలో ఆదివారం ఒక్కరోజే రూ.18,33,261 ఆదాయం వచ్చినట్లు ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్ తెలిపారు. టికెట్ల రూపంలో రూ.11,65,200, విరాళాల రూపంలో రూ.1,71,271, ప్రసాదాల రూపంలో రూ.3,99,090, ఆన్లైన్ ద్వారా రూ.97,700 విరాళం వచ్చినట్లు వివరించారు. -
ఆగని ఇసుక దందా
● బాహుదానదిని ఊడ్చేస్తున్న ఇసుకాసురులు ● ట్రాక్టర్ల ద్వారా అక్రమ రవాణా ● చోద్యం చూస్తున్న అధికారులు ఇచ్ఛాపురం: ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో బాహుదా నది నుంచి అక్రమార్కులు ఇసుకను దోచేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాపై స్థానిక ప్రజలు సామాజిక మాధ్యమాలలో వైరల్ చేస్తున్నప్పుడు, వార్తాపత్రికల్లో కథనాలు వచ్చినప్పుడు మాత్రమే స్థానిక అధికారులు దాడులు చేస్తున్నారు. తర్వాత పట్టించుకోకపోవడంతో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. దర్జాగా అక్రమ రవాణా చేసుకుంటూ జేబులు నింపుకొంటున్నారు. స్థానిక బాహుదానది నుంచి అక్రమార్కులు నిత్యం వందలాది ట్రాక్టర్లతో ఇసుకను తరలించుకుపోతున్నారు. నది సమీప ప్రాంతాలు, తోటల్లో డంప్ చేసుకొంటూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. అనుమతులు లేకుండానే.. ఇచ్ఛాపురం మండలంలో బాహుదానది పరివాహక ప్రాంతంలో ఎక్కడా ఇసుక రీచ్లకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయలేదు. అయినప్పటికీ ప్రజల అవసరాల నిమిత్తం నిర్మాణం కోసం ఎడ్లబండి, ట్రాక్టర్లతో ఇసుకను తీసుకెళ్లేందుకు అవకాశం కల్పించింది. ఇదే అదునుగా అక్రమార్కులు నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. నదిలో ఇసుక లేకపోతే భవిష్యత్లో సాగునీరు, వేసవిలో తాగునీటి సమస్య ఏర్పడే ప్రమాదం ఉందని ముందుగానే గుర్తించిన బెల్లుపడ రైతులు నదీ దారుల్లో డిసెంబర్లో పెద్ద పెద్ద గోతులు తవ్వించారు. అయినప్పటికీ ఇసుకాసురులు కొత్త మార్గాలను అన్వేషిస్తూ తవ్వకాలు సాగిస్తున్నారు. నదిలో తవ్వకాలు చేపట్టకూడదని రెవెన్యు సిబ్బంది హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేసినా ఫలితం లేకపోతోంది. అడిగే వారేరీ? బాహుదా నది నుంచి ఇసుకను తరలించేందుకు ఇసుకాసురులు ఉపయోగించే ట్రాక్టర్ ఇంజిన్కు గానీ, ట్రాక్టర్ తొట్టెకు గాని ఎటువంటి నంబర్లు ఉండవు. వీటికి ఎటువంటి అనుమతులు కూడా ఉండవు. ఇటువంటి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను నిత్యం పట్టణంలోని రెవెన్యు కార్యాలయం, పోలీస్ స్టేషన్ ముందుగానే తరలిస్తున్నా అడిగేవారే కరువయ్యారు. ఇప్పటికై నా మైనింగ్, పోలీస్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి ప్రకృతి సంపద తరలిపోకుండా, ప్రజలకు నీటి సమస్య రాకుండా తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
టెక్కలి రూరల్ : టెక్కలి వలేసాగరం సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. రావివలసకు చెందిన విద్యుత్ లైన్మేన్ పి.రామచంద్రుడు ద్విచక్ర వాహనంపై టెక్కలి నుంచి వలేసాగరం ఫ్లై ఓవర్ బ్రిడ్జి వైపు వెళ్తుండగా అదుపు తప్పి సమీపంలో ఉన్న స్తంభాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో రామచంద్రుడికి తీవ్ర గాయాలు కావడంతో టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు.స్థానిక పోలీసులు వివరాలు సేకరించారు. పశువులు పట్టివేత రణస్థలం: లావేరు మండలం బుడుమూరు జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం 7 గంటలకు అక్రమంగా తరలిస్తున్న ఐదు పశువులను పట్టుకున్నారు. శ్రీకాకుళం వైపు నుంచి రణస్థలం వైపు లగేజీ వ్యాన్లో తరలిస్తుండగా లావేరు ఎస్సై కె.అప్పలసూరి పట్టుకుని కేసు నమోదు చేశారు. గంజాయితో ఇద్దరు అరెస్టు వజ్రపుకొత్తూరు రూరల్: పూండి రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం గంజాయి తరలిస్తూ ఇద్దరు వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. ఒడిశా నుంచి సికింద్రాబాద్కు గంజాయి అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారం మేరకు స్థానిక ఎస్ఐ బి.నీహర్ తన బృందంతో కలిసి పూండి రైల్వే స్టేషన్ వద్ద మాటువేశారు. ఒడిశా రాష్ట్రం రాయ్ఘడ్కు చెందిన ప్రమోద్, సరోజ్లు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని పట్టుకొని ప్రశ్నించగా గంజాయి తరలిస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు. వారి వద్ద 16 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని అరెస్టు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు హిరమండలం: ఎల్.ఎన్.పేట మండలం చిట్టిమండలం కాలనీ వద్ద అలికాం–బత్తిలి ప్రధాన రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొమ్మువలస గ్రామానికి చెందిన ఎస్.పరశురాంకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పరశురాం కొమ్మువలస నుంచి సరుబుజ్జిలి వైపు ద్విచక్రవాహనంపై వెళుతుండగా ఎదురుగా వస్తున్న కారు ముందు వెళుతున్న బస్సును ఓవర్ టేక్ చెయ్యిబోయి ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. తీవ్రంగా గాయపడిన పరశురాంను స్థానికులు 108 అంబులెన్సులో శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. -
కీలక ప్రాజెక్టులకు చోటేదీ..?
● ఉద్దానం ఏరియాలో కిడ్నీ భూతం పట్టి పీడిస్తోంది. ప్రతి రోజూ వ్యాధిగ్రస్తులు చనిపోతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రి, డ యాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసి, కొంతమేరకు ఆదుకుంది. దాని కొనసాగింపుగా కూటమి ప్రభుత్వంలో ఏమీ జరగడం లేదు. గత ప్రభుత్వం ప్రతిపాదనల మేరకు ఐసీఎంఆర్ చొరవ తీసుకుని, పరిశోధనలకు ముందుకొచ్చింది. కానీ, బడ్జెట్లో జాతీయ స్థాయి నిధులను మాత్రం కేటాయించలేదు. ● జిల్లా ఆర్థికంగా వెనకబడినా విద్య, స్కిల్డ్ పరంగా టాలెంటెడ్ వ్యక్తులు ఉన్నారు. కానీ సరైన సంస్థల్లేక ప్రతిభను చూపలేకపోతున్నారు. ఇక్కడో జాతీయ విద్యా సంస్థ ఏర్పాటు చేస్తే మేలు జరుగుతుంది. కానీ ఈ బడ్జెట్లోనూ అవేవీ జరగలేదు. ● అధిక దిగబడిని ఇచ్చే కొత్త కొత్త వంగడాల పరిశోధనలు జిల్లాలో జరుగుతున్నాయి. నైరా వంటి పరిశోధనా స్థానం ఉన్నప్పటికీ దానికి జాతీయ స్థాయిలో ప్రోత్సాహం అందితే దేశానికి మరిన్ని కొత్త కొత్త వంగడాలు పరిచయం చేసేందుకు అవకాశం ఉంటుంది. గత వైఎస్ జగన్ ప్రభుత్వం వ్యవసాయ పాలిటెక్నికల్ కళాశాల, హార్టికల్చరల్ రీసెర్చ్ సెంటర్, వెట ర్నరీ పాలిటెక్నికల్ కళాశాల వంటివి ఏర్పాటు చేశారు. అక్కడ తయారయ్యే విద్యార్థులకు జాతీయ స్థాయి సంస్థలు దగ్గరగా ఉంటే మేలు జరిగేది. ఆ కానీ ప్రయత్నం జరగడం లేదు. ● వైఎస్సార్సీపీ హయాంలో బుడగట్లపాలెం పిషింగ్ హార్బర్, జెట్టీ నిర్మాణాలు చేపట్టగా ఇప్పుడా పనులు పూర్తి చేసేందుకు ఈ ప్రభు త్వం చేస్తున్న ప్రణాళిక ఏంటో కన్పించడం లేదు. కేంద్ర బడ్జెట్లో వీటికోసం ప్రత్యేకంగా కేటాయించిన దాఖలాల్లేవు. ● జిల్లాలో అపారమైన అటవీ వనరులు ఉన్నా యి. ముఖ్యంగా ఔషధ మొక్కలు ఎక్కువగా ఉన్నాయి. సెంట్రల్ రీసెర్చ్ ఇన్సిటిట్యూట్ ఫర్ మెడిషనల్ ప్లాంట్స్ (కేంద్రీయ ఔషద మొక్కల పరిశోధనా సంస్థ) వంటివి ఏర్పాటు చేస్తే ప్రపంచానికి కొత్త కొత్త ఔషధాలను పరిచయం చేసేందుకు అవకాశం ఉంటుంది. కానీ బడ్జెట్లో ప్రస్తావన లేదు. ● జిల్లాలో అనేక వ్యవసాయ ఉత్పత్తులు తయా రవుతున్నాయి. ప్రాసెస్డ్ ఫుడ్ ఇండస్ట్రీస్ను ఏర్పాటు చేస్తే వేలాది మందికి ఉపయోగపడుతుంది. వీటికీ బడ్జెట్లో చోటు దక్కలేదు. -
మూసేస్తున్నారు!
ఒక్కొక్కటిగా.. శ్రీకాకుళం (పీఎన్కాలనీ): గత వైఎస్సార్ సీపీ పాలనలో వ్యవసాయం పండగలా ఉండేది. విత్తనాలు, ఎరువులు, రైతు భరోసా పథకం, ఇన్పుట్ సబ్సిడీ.. ఇలా అనేక రకాల సేవలు రైతు ముంగిటకే చేరేవి. వీటన్నింటికీ కారణం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన రైతు భరోసా కేంద్రాలు. విత్తు నుంచి విపత్తు వరకు అన్నింటా అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలిచాయి. అంతటి మహత్తరమైన ఆర్బీకేలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. ఇప్పటికే రైతు సేవా కేంద్రాలు (ఆర్ఎస్కే)లుగా పేరు మార్చి రైతులకు సేవలు అందకుండా చేసింది. తాజాగా రేషనలైజేషన్ పేరిట సిబ్బందిని కుదించేసి రైతు సేవా కేంద్రాలను మూసివేసే దిశగా ఆడుగులు వేస్తోంది. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సొంత జిల్లా శ్రీకాకుళంలోనే ఇప్పటివరకు 123 రైతుసేవా కేంద్రాలు మూసివేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లాలో 656 రైతు భరోసా కేంద్రాలు ఉండేవి. రైషనలైజేషన్ పేరుతో రెండు, మూడు ఆర్ఎస్కేలను కలిపి ఒకటిగా సర్దుబాటు చేసేశారు. దీంతో కేంద్రాల సంఖ్య 533కి చేరింది. అంటే 123 రైతు సేవాకేంద్రాల సేవలకు సెలవిచ్చేశారు. ఇందులో 515 గ్రామీణ ప్రాంతాల్లో ఉండగా మరో 18 అర్బన్ స్టేషన్లలో ఉన్నాయి. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్లతోపాటు విలేజ్ సెరికల్చర్ సిబ్బంది పనిచేస్తూ రైతులకు సేవలందిస్తున్నారు. ఇందులో సుమారు 52 మంది ప్రస్తుతానికి పలు కారణాల వల్ల సిబ్బంది లేనట్లు అధికారికంగా చెబుతున్నారు. కొందరు పదోన్నతులపై వెళ్లగా మరికొందరు ఉద్యోగాలను వదిలి వెళ్లిపోయారు. ప్రస్తుతం 481 మంది సిబ్బంది మాత్రమే రైతు సేవా కేంద్రాలలో సేవలందిస్తున్నారు. సిబ్బంది కొరత.. జిల్లాలో 4.50 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతున్నాయి. ఆయా భూముల పరిధిలోని రైతులకు సేవలందించేందుకు ఒక్కో ఆర్ఎస్కేకు ఒక్కో వీఏఏ/ వీహెచ్ఎ ఉండాల్సి ఉండగా అనేకచోట్ల సిబ్బంది కొరత ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో రైతు సేవా కేంద్రం పరిధిలోకి 1400 హెక్టార్ల భూమిని కేటాయించారు. సిబ్బంది కొరత కారణంగా కొన్ని ప్రాంతాల్లో సేవలు సరిగ్గా అందడం లేదని పలువురు రైతులు వాపోతున్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో రైతు ఇంటి వద్దకే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందేవి. రైతుభరోసా–పీఎం కిసాన్ పెట్టుబడి సాయం ప్రతీ సీజన్లో ఠంచన్గా రైతుల ఖాతాల్లో డబ్బులు పడేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. అగ్రిల్యాబ్ల్లో పరీక్షలు సైతం నిర్వహించడం లేదు. ఇప్పటికే యూరియా ఇవ్వడంలో ఘోరంగా విఫలమయ్యారు. ఇప్పుడు రైతుసేవా కేంద్రాలు మూసివేస్తుండటం దారుణం. – గొండు రఘురాం, వైఎస్సార్ సీపీ వ్యవసాయ విభాగం జిల్లా అధ్యక్షుడు రైతులకు సక్రమంగా సేవలందించాలన్న ఆలోచనతో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తే విలీనం పేరుతో వాటిని తగ్గించేసి రైతులకు ఇబ్బంది పెట్టడం సరికాదు. హిరమండలంలో మూడు రైతు భరోసా కేంద్రాలకు గాను ఒకటికి తగ్గించేశారు. 400 మంది రైతులు ఒకే ఆర్బీకేకు వెళ్లి ఇబ్బంది పడాల్సి వస్తోంది. సేవలు దూరం చేసేలా రైతులపై కక్షసాధింపు చర్యలు తగవు. – నక్క ఆనందరావు, పాత హిరమండలం రేషనలైజేషన్ వల్ల ఆర్ఎస్కేలు తగ్గాయి. సిబ్బందిని తగ్గించాం. ప్రభుత్వం నిర్ణయాన్ని అమలుచేశాం. రైతులకు సేవలు అందించడంలో మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. భవిష్యత్లో ఎటువంటి సేవలు అందించామో ఇప్పుడే అలానే అన్ని రకాల సేవల్ని అందిస్తున్నాం. ఎక్కడైనా సమస్యలుంటే మా దృష్టికి తీసుకురావాలి. – త్రినాథస్వామి, జిల్లా వ్యవసాయాధికారి -
రాష్ట్రంలో రాక్షస పాలన
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ధ్వజం ‘అరాచకం సృష్టిస్తున్నారు’ సోంపేట: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అధికార పార్టీ నేతలు అరాచకం సృష్టిస్తున్నారని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నర్తు రామారావు దుయ్య బట్టారు. నర్తు రామారావు ఆదివారం మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై అధికార పార్టీ నేతలు దాడి చేసి వాహనాలు దగ్ధం చేయడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామో, ఆటవిక రాజ్యంలో ఉన్నామో అర్థం కావడం లేదని అన్నారు. అంబటి రాంబాబు ఇంటి పై దాడి చేసిన వారు, దాడి చేయించిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రికే రక్షణ లేకపోతే సామాన్యుడి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ‘రెడ్బుక్ రాజ్యాంగంతో అరాచక పాలన’ శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అంటూ అరాచక పాలన సాగుతోందని, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడి చేయించడమే కాకుండా, ఆయన పార్టీ కార్యా లయం, ఇంటిని ముట్టడించి, ఫర్నీచర్, విలువైన వస్తువులకు నిప్పంటించి తగులబెట్టడం దారుణమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి దుంపల లక్ష్మణరావు అన్నారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఒక ప్రణాళికతో బాబు, లోకేష్ జరిపించిన హత్యాయత్నంగానే భావించాలన్నారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో సుపరిపాలన మాట పక్కనబెడితే ఆటవిక రాజ్యాన్ని నడుపుతున్నారని పేర్కొన్నారు. మొదటి నుంచి చంద్రబాబు నోటి మాటలు, ఆయన ఇచ్చిన హామీలు అన్నీ కల్తీయేనని విమర్శించారు. రానున్న రోజుల్లో ప్రజా వ్యతిరేకత ఉప్పెనగా మారి తెలుగు దేశం పార్టీని సర్వ నాశనం చేస్తుందన్నారు. నరసన్నపేట: రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని, ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారని, వ్యక్తిగత స్వేచ్ఛ ను హరిస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబా బుపై జరిగిన దాడే దీనికి నిదర్శనమని అన్నారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత విపక్ష నేతలే లక్ష్యంగా దాడులు పెరిగి పోయాయని ఆందోళన చెందారు. పోలీసుల సమక్షంలోనే దాడులు చేశారంటే కూటమి పాలన ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదన్నారు. బాధితులకు రక్షణ కల్పించాల్సింది పోయి దాడులు చేస్తున్నవారికి పోలీసులు రక్షణగా వ్యవహరించారని విమర్శించారు. బహిరంగంగా కర్ర లు, కత్తులు పట్టుకొని రాంబాబుపై దాడికి తెగబడ్డారని, కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురి చేశారని అన్నారు. వీరిపై కేసులు పెట్టాల్సింది పోయి తిరిగి రాంబాబుపై కేసు పెట్టి అరెస్టు చేయడాన్ని తప్పు పట్టారు. రాష్ట్రంలో జంగిల్ రాజ్ పాలన నడుస్తోందని అన్నారు. తిరుపతి లడ్డూ వ్యవహరంలో లేనిపోని అసత్య ప్రచారాలు, ఆరోపణలు చేశారని భక్తుల మనోబావాలను దెబ్బతీశారని ఇది ప్రజల్లోకి వెళ్లడంతో డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా అంబటిపై దాడులకు తెగబడ్డారని విమర్శించారు. రాంబాబుపై దాడికి దిగిన వారిని వెంటనే అరెస్టు చేయాలని కృష్ణదాస్ డిమాండ్ చేశారు. -
పొందూరులో అగ్నిప్రమాదం
● ట్రేడర్స్ గొడౌన్ దగ్ధం ● రూ.94 లక్షల ఆస్టినష్టం పొందూరు: మండల కేంద్రం పొందూరులోని శ్రీసాయి సూర్య హర్షిని ట్రేడర్స్లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షాపు తెరిచే సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో యజమాని పోలాకి రవి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే గోదాంలో ఉన్న వివిధ వ్యవసాయ ఉత్పత్తుల బస్తాలు కాలి బూడిదైపోయాయి. శనివార రాత్రి విద్యుత్ షార్టు సర్క్యూట్ కావడం వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని అగ్నిమాపక సిబ్బంది పేర్కొన్నారు. ఈ ఘటనలో సుమారు రూ.94 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందన్నారు. 217 టన్నుల మొక్కజొన్న బస్తాలు, 650 నువ్వుల బస్తాలు, 200 మిర్చి బస్తాలు, వేరుశెనగ యంత్రం, ఇతర వస్తువులు కాలిపోయినట్లు గుర్తించారు. -
విద్యార్థులకు అభినందనలు
నరసన్నపేట: మండలంలో మారుమూల గ్రామం బసివలస ప్రాథమిక పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్ధులు రాష్ట్ర స్థాయి స్పెల్–బీ పోటీల్లో ప్రాతినిధ్యం వహించడం పట్ల ఎస్ఈఆర్టీ డైరెక్టర్ ఎం.వెంకట కృష్ణారెడ్డి అభినందించారు. మండల, జిల్లా, జోన్స్థాయిల్లో ప్రతిభ చూపిన బసివలస విద్యార్థులు బమ్మిడి యశ్విక(2వ తరగతి), పాగోటి నవీన్ (3వ తరగతి), ఇంటివెనుకల నిహారిక (3వ తరగతి)లను ప్రత్యేకంగా అభినందించారు. శనివారం రాష్ట్ర స్థాయి స్పెల్ బీ పోటీలను ఏపీ ప్రభుత్వం శనివారం విజయవాడ మేరీస్ స్టెల్లా కాలేజీలో నిర్వహించింది. ఇందులో యశ్విక చివరి రౌండ్వరకూ వెళ్లి గట్టి పోటీ ఇచ్చినట్లు ఉపాధ్యాయుడు అప్పయ్య తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సర్టిఫికెట్లు, మెమెంటోలు జారీ చేశారు. పోటీల్లో నరసన్నపేట మండలం బొరిగివలస స్కూల్కు చెందిన తంగి లాస్యశ్రీ కూడా ప్రాతినిధ్యం వహించింది. ఈ సందర్భంగా విద్యార్థులను ఎంఈఓలు శాంతారావు, దాలినాయుడు అభినందించారు. -
ట్రాన్స్ఫార్మర్ల చోరీ కేసులో ఆరుగురు అరెస్టు
టెక్కలి రూరల్: ట్రాన్స్ఫార్మర్ల నుంచి కాపర్ వైర్లు చోరీకి పాల్పడిన ఆరుగురిని కోటబొమ్మాళి పోలీసులు అరెస్టు చేసినట్లు టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు తెలిపారు. ఆదివారం కోటబొమ్మాళి పోలీస్స్టేషన్లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం బైరెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఎం.రాము, మారేడుపాలెం గ్రామానికి చెందిన ఎం.నాగరాజు, పూసపాటిరేగ మండలం కోనాడకు చెందిన ఎన్.మోహన్రావు, పి.శ్రీను, ఎం.శ్రీనివాస్, ఎన్.రఘుబాబులు స్నేహితులు. వీరంతా మద్యానికి బానిసయ్యారు. ఎం.రాము తనకు ఎలక్ట్రికల్ వర్క్ తెలుసని, ట్రాన్స్ఫార్మర్లోని కాపర్ వైర్లు చోరీ చేసి అమ్మితే బాగా డబ్బులు సంపాదించవచ్చని చెప్పడంతో అందరూ కలిసి చోరీ ప్లాన్ చేశారు. ఈ క్రమంలో 2023 నుంచి లావేరు, జలుమూరు, టెక్కలి, నందిగాం, ఎచ్చెర్ల, కవిటి, జె.ఆర్.పురం, మందస, పాతపట్నం, కోటబొమ్మాళి మండలాల్లోని పలు గ్రామాల్లో శివారున ఉన్న ట్రాన్స్ఫార్మర్లను లక్ష్యం చేసుకున్నారు. పక్కా ప్లాన్తో రాత్రి సమయాల్లో చోరీలకు పాల్పడే వారు. దీనిలో భాగంగా ఆదివారం సైతం ట్రాన్స్ఫార్మర్ల కోసం రెక్కీ చేసేందుకు రాగా వారిపై అనుమానంతో కోటబొమ్మాళి పోలీసులు జర్జంగి జంక్షన్ వద్ద పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.8లక్షల15వేల100 విలువైన 607 కేజీల కాపర్ వైర్, 20 కేజీల అల్యూమినియం వైర్లు, ఆటో, బైక్, ఆరు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. -
కూర్మ విలాపం
● తీరానికి కొట్టుకువస్తున్న తాబేళ్ల కళేబరాలు ● నిర్లక్ష్య ధోరణిలో మత్స్యశాఖ ● ఆందోళనలో పర్యావరణ ప్రేమికులు ఇచ్ఛాపురం రూరల్: జిల్లా తీర ప్రాంతానికి తాబేళ్ల కళేబరాలు తరచూ కొట్టుకుని వస్తున్నాయి. తీర ప్రాంత ప్రజలను ఈ దృశ్యాలు కలచివేస్తున్నాయి. ఇచ్ఛాపురం మండలం డొంకూరు లక్ష్మీపురం నుంచి జిల్లా చివరి మత్స్యకార గ్రామం తడా వరకు ఏటా 1500 నుంచి 2000 వరకు ఈ తాబేళ్లు చనిపోతుంటా యని మత్స్యకారులు చెబుతున్నారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితులలో ఆ జాతి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. శీతాకాలంలో ఆడ తాబేళ్లు సముద్రంలో కిలో మీటర్ల దూరం ప్రయాణించి తీరానికి చేరే ప్రయత్నం చేస్తాయి. అనువైన చోట గుడ్లు పెట్టేందుకు స్థలం ఎంపిక చేసుకుంటాయి. నవంబర్ నుంచి మే నెల వరకు ఎక్కువగా వస్తుంటాయి. ఆడ తాబేళ్లు తీరంలో రాత్రిళ్లు జనసంచారం లేని సమయంలో ఎక్కువగా కనిపిస్తాయి. లోతైన గుంతలను తవ్వి వాటిలో 100 నుంచి 150 వరకు గుడ్లను పెట్టి వెళ్లిపోతాయి. ఏప్రిల్, మే ప్రాంతంలో గుడ్లు నుంచి పిల్లలు బయటకు వచ్చి సముద్రంలోకి చేరుతాయి. సంతానోత్పత్తి దశలో తాబేళ్లు మృత్యువాత పడుతుండటం విచారకరమని పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మానవ తప్పిదాలే కారణమా..? వేట పడవల నుంచి వేసే నైలాన్ వలల్లో చిక్కుకుని తాబేళ్లు ఊపిరాడక ప్రాణాలు కోల్పోతున్నట్లు స్థాని కులు చెబుతున్నారు. మరోవైపు సముద్రంలో పెరుగుతున్న కాలుష్యం, ఆధునిక మరబోట్ల తాకిడి, చలి వాతావరణం తాబేళ్ల మృతికి కారణమవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంత జరుగుతున్నా అటవీశాఖ, మత్స్యశాఖాధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మృత తాబేళ్లను తొలగించడంలోనూ, కారణాలపై అధ్యయనం చేయడంలోనూ నిర్లక్ష్యం కనిపిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైజాగ్ బోట్లు వల్లే మృతి నా చిన్నతనం నుంచి చూస్తున్నా. ఏదో ఏడాది ఒక టో, రెండో తాబేళ్లు చనిపోయే వి. ఈ మధ్య వైజాగ్ నుంచి బోట్లు రావడంతో తాబేళ్లు అధిక సంఖ్యలో మృతి చెందుతున్నాయి. ఈ ప్రాంతానికి ఆ బోట్లు రాకుండా అధికారులు హెచ్చరిస్తే తాబేళ్లు మృతి చెందే అవకాశం లేదు. – బుడ్డ లింగరాజు, మత్స్యకారుడు, డొంకూరు అవగాహన కల్పిస్తున్నాం కొంత మంది సముద్రం ఒడ్డు కు దగ్గరలో పెద్ద పడవలతో అక్రమంగా చేపలను వేటాడుతుండడంతో ఒడ్డుకు వచ్చే క్ర మంలో ఈ తాబేళ్లు పడవల వలలకు చిక్కి మృతి చెందుతున్నాయి. ముఖ్యంగా టెలీ బోట్లు నిరోధి స్తే ఫలితం ఉంటుంది. మత్స్యకారులకు తాబేళ్లపై అవగాహన కల్పిస్తున్నాం. – ఏవీ నాగేంద్రరావు, సహాయక అటవీ సంరక్షణ అధికారి -
లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మె
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ‘లేబర్ కోడ్లు రద్దు చేసేవరకు పోరాడుదాం– ఫిబ్రవరి 12న జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేద్దాం‘ అనే పుస్తకాన్ని శనివారం శ్రీకాకుళం సీఐటీయూ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం కార్మికుల్ని బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్లను అమల్లోకి తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా, వ్యవసాయ కార్మిక సంఘాలు ఉమ్మడిగా ఫిబ్రవరి 12న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. లేబర్ కోడ్ల వల్ల కార్మికుల కొనుగోలు శక్తి పడిపోయి, మార్కెట్లు మరింత కుదేలవుతాయన్నారు. అలా కాకుండా ఉండాలంటే కార్మికులు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు చిరు వ్యాపారులు స్వచ్ఛందంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పని బంద్ చేసి జిల్లా కేంద్రాలు, పట్టణ కేంద్రాలలో జరిగే ర్యాలీ, బహిరంగ సభలలో కార్మికులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ కె.నాగమణి, జన విజ్ఞాన వేదిక జిల్లా వ్యవస్థాపక కార్యదర్శి కొత్తకోట అప్పారావు, ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.ఆదినారాయణమూర్తి, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు డి.రమణారావు, ఉద్యోగ సంఘ నాయకులు శ్రీనివాస్ యాదవ్, సీఐటీయూ జిల్లా కోశాధికారి అల్లు సత్యనారాయణ, శ్రీకాకుళం పట్టణ కన్వీనర్ ఆర్.ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధికి చంద్ర గ్రహణం
హిరమండలం : ఉపాధి హామీ పథకం పేరు, తీరు రెండూ మారనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త పథకం ద్వారానే ఉపాధి హామీ కొనసాగనుంది. అయితే నిధుల వాటాలో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రం భరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పథకం సక్రమంగా అమలుకావడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గర్ అండ్ అజవీక మిషన్ గ్రామీణ –2025 (వీబీజీ రామ్జీ )గా పేరు మార్చిన విషయం తెలిసిందే. పథకం పేరు మార్పు అటుంచితే.. నిధుల వాటాలో గతంలో పోల్చుకుంటే భారీగా తేడాలున్నాయి. 13 ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి పాత నిధులు వెచ్చించే విధంగానే మినహాయింపు ఇచ్చారు. కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులు మినహాయింపు ఇచ్చిన రాష్ట్రాల జాబితాలో మన రాష్ట్రాన్ని చేర్చుకోలేకపోవడం తీవ్ర వైఫల్యంగా పలువురు పరిగణిస్తున్నారు. జిల్లాలో వ్యయం రూ.800 కోట్లు.. ఉపాధి హామీ పథకానికి జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.800 కోట్లు ఖర్చు కాగా, ఇందులో పనులకు హాజరైన 5,86 లక్షల మంది వేతనదారులకు, నిర్మాణాత్మక పనులకు ఈ మొత్తాన్ని వ్యయం చేస్తారు. అయితే ఈ మొత్తంలో కేంద్ర ప్రభుత్వం కూలీలకు పూర్తిగా వేతనం చెల్లించేది. ప్రస్తుత కొత్త పథకంలో వేతనదారులకు 40 శాతం రాష్ట్రమే వాటా చెల్లించాల్సిఉంటుంది. ఈ నేపథ్యంలో రూ.800 కోట్లలో రూ.320 కోట్లు రాష్ట్రం వాటా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పనిదినాలు 100–125 రోజులకు పెంచడం వల్ల ఈ వాటా పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రాలపై 40 శాతం ఆర్థిక భారం మోపుతూ తీసుకొచ్చిన వికసిత్ భారత్ జీ రామ్ జీ చట్టం వల్ల అటు రాష్ట్రాలకు ఇటు పేదలకు నష్టదాయకం. ఉపాధి హామీని నిర్వీర్యం చేసేందుకు తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు చేయాలి. గ్రామీణ ఉపాధి చట్టాన్ని పునరుద్ధరించాలి. – సిర్ల ప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జిల్లాలో 4.35 లక్షల జాబ్కార్డులు ప్రస్తుత నిధుల వాటా ప్రకారం రాష్ట్రంలో పథకం నిర్వహణ గగనమే 13 రాష్ట్రాలకు మినహాయింపు ఇచ్చిన కేంద్రం అందులో చోటు దక్కించుకోవడంలో చంద్రబాబు వైఫల్యం -
బెండి కొండపై ఆక్రమణల తొలగింపు
వజ్రపుకొత్తూరు రూరల్: పెద్దబొడ్డపాడు పంచాయతీ నారాయణపురం, తోటపల్లి సమీపంలో సర్వే నంబర్–252లో ఉన్న బెండి కొండపై ప్రభుత్వ భూమి ఆక్రమణలను శనివారం రెవెన్యూ అధికారులు తొలిగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బెండి కొండను కొందరు నాయకులు రైతులతో కలిసి ఆక్రమించుకున్నారు. ఈ కబ్జాపై ‘10 మంది 100 ఎకరాలు..బెండి కొండపై అక్రమాల పర్వం ’ అనే శీర్షికతో గత నెల పదో తేదీన సాక్షిలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ కజ్జా పర్వంపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు శనివారం తహశీల్దార్ సీతారామయ్య సమక్షంలో యంత్రాల సాయంతో ఆక్రమణలు తొలగించారు. ప్రభుత్వ భూమిలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉప తహశీల్దార్ శ్రావణ్, ఆర్ఐ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు భద్రత అందరి బాధ్యత
శ్రీకాకుళం పాతబస్టాండ్: రోడ్డు భద్రత అనేది కేవలం ఒక నెలకే పరిమితం కాకుండా సంవత్సరమంతా పాటించాల్సిన బాధ్యత అని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల ముగింపు కార్యక్రమం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఉప రవాణా కమిషనర్ విజయ సారథి అధ్యక్షతన శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రహదారి నిబంధనలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, క్రమశిక్షణతో వాహనాలు నడపడం ద్వారానే ప్రమాదాల నివారణ సాధ్యమని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖ నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు విజయవంతమయ్యాయని, సిబ్బంది కృషి అభినందనీయమని కొనియాడారు. మాసోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో పెదపాడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులం విద్యార్థినులు ప్రతిభ చాటారు. ఎస్. సోని (8వ తరగతి) ప్రథమ బహుమతి సాధించగా, బి.ధనలక్ష్మి (9వ తరగతి) ద్వితీయ, బి.హాసిని (9వ తరగతి) తృతీయ బహుమతులు గెలుచుకున్నారు. విజేతలకు కలెక్టర్ బహుమతులు అందజేసి అభినందించారు. ఈ నెల రోజుల పాటు క్షేత్రస్థాయిలో కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన రవాణా శాఖ అధికారులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఆర్టీఓ ఆర్.అనిల్, మోటార్ వాహన తనిఖీ అధికారులు (ఎం.వి.ఐ) గంగాధర్, కె.శిరీష, ఎస్.శిరీష, జి.శ్రీధర్, డి. సంజీవరావు, ఆర్.గోవిందరాజు, వై.శ్రీనివాస్ ఇతర సిబ్బందిని వారి నిబద్ధతకు గాను అభినందనలు తెలిపారు. -
●దూడల పెంపకమే కీలకం
గార: మేలైన దూడల పెంపకమే పాడిసంపద వృద్ధి చెందేందుకు దోహదం చేస్తుందని శ్రీకాకుళం డివిజనల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ సూర్యనారాయణమూర్తి అన్నారు. మండల కేంద్రం కుమ్మరిపేటలో పశుఆరోగ్య శిబిరాల్లో డీఎల్డీఏ సౌజన్యంతో దూడల ప్రదర్శన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆడదూడల పోటీలు నిర్వహించడం వల్ల బాగా పెంపకంపై శ్రద్ధ వహిస్తారన్నారు. వైఎస్సార్ సీపీ నాయకుడు, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ మార్పు ధర్మారావు మాట్లాడుతూ వ్యవసాయంతో పాటు పాడిపశువుల పెంపకంతో లబ్ధి చేకూరుతుందన్నారు. వైద్యుల సలహాలతో పెంపకం చేపట్టాలని సూచించారు. విజేతలతో పాటు పాల్గొన్న రైతులందరీకీ బహుమతులను అందజేశారు. -
కలకలం రేపిన కబ్జా
నరసన్నపేట: ప్రముఖ వాణిజ్య కేంద్రం నరసన్నపేట నడిబొడ్డున జిల్లా పరిషత్కు చెందిన (బోర్డుబంగ్లా) స్థలాన్ని కూటమి నాయకులు కాజేయడానికి ప్రయత్నాలు చేపట్టడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. విలువైన ఈ ఆస్తిపై శ్రీకాకుళంకు చెందిన కూటమి నాయకులు కన్నేశారని, ఇది వారి పరమవుతుందనే ఊహాగానాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ‘కోట్లు విలువైన స్థలం.. కొట్టేసేందుకు సిద్ధం’ అనే శీర్షికన శనివారం సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీంతో ఒక్కసారిగా నరసన్నపేట ప్రజలు, రాజకీయ పక్షాలు ఉలిక్కిపడ్డాయి. అయ్యో.. ఇన్నాళ్లూ కాపాడుకుంటూ వస్తున్న ఈ స్థలమూ కబ్జాకు గురవుతుందా..అంటూ పలువురు ఆవేదన వెలిబుచ్చారు. ఉదయం నుంచీ ఈ వ్యవహారంపై చర్చ జరగడంతో అధికారుల్లో ఒక్కసారి చలనం వచ్చింది. ఆక్రమణ కట్టడికి చర్యలు మొదలెట్టారు. ఎంపీడీఓ ప్రసాద్ న్యాయ సలహా కోసం న్యాయవాదులను సంప్రదించారు. ఈ వ్యవహరంపై కలెక్టర్, జెడ్పీ సీఈఓ దృష్టి పెట్టి తగు చర్యలు తీసుకోవాలని సర్వత్రా కోరుతున్నారు. బోర్డు బంగ్లా స్థలం ఆక్రమణపై నరసన్నపేట పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాం. ముద్డాడ గోవిందరాజులు అనే వ్యక్తి గురువారం రాత్రి వచ్చి గోడ కూల్చి స్థలాన్ని దౌర్జన్యంగా చదును చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాం. – ప్రసాద్, నరసన్నపేట ఎంపీడీఓ ఈ వ్యవహారంపై స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు నరసన్నపేట పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. నరసన్నపేట ఎంపీపీ ఆరంగి మురళి, మండల పార్టీ అధ్యక్షులు లుకలాపు రవి, పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి కనపల శేఖరరావు తదితరులు మాట్లాడుతూ కూటమి నాయకుడు కొర్ను ప్రతాప్ హస్తం దీంట్లో ఉందని ఆరోపించారు. ఆమదాలవలసకు చెందిన వ్యక్తి నుంచి ప్రతాప్ కొనుగోలు చేశారని విమర్శించారు. రాత్రిపూట వచ్చి స్థలాన్ని చదును చేయడంలో అంతర్యం ఏంటని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోనికి వచ్చినప్పటి నుంచి నరసన్నపేటలో ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఈ స్థలాన్ని అన్ని విధాలా కాపాడామని, అధికారులకు సైతం పూర్తి అండగా ఉన్నామని గుర్తు చేశారు. విలువైన ఈ స్థలం కబ్జాకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఈ వ్యవహారంపై నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి శనివారం స్పందించి వీడియో రిలీజ్ చేశారు. బోర్డు బంగ్లా స్థలం కాజేయడానికి కూటమి నాయకులు ప్రయత్నాలు చేస్తున్నది వాస్తవమేనని అంగీకరించారు. భూమి విషయమై తన వద్దకూ వచ్చారని, అందుకు తాను ఒప్పుకోలేదని చెప్పారు. బోర్డు బంగ్లా స్థలం కాపాడటంలో అధికారుల ఉదాసీన వైఖరిని సైతం తప్పుపట్టారు. పరిస్థితి ఇంతవరకు రావడానికి అధికారులే బాధ్యులని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇది ముమ్మాటికీ జిల్లా పరిషత్కు చెందినదని స్పష్టం చేశారు. నరసన్నపేట బోర్డు బంగ్లా స్థలం ఆక్రమణపై అలజడి కూటమి నేతల ప్రమేయాన్ని అంగీకరించిన ఎమ్మెల్యే బగ్గు ఆక్రమణ దందాకు అడ్డుకట్ట వేయాలన్న వైఎస్సార్ సీపీ నాయకులు న్యాయపరంగా ఎదుర్కోవడానికి అధికారుల సన్నాహాలు -
●వత్సవలస రాజమ్మ తల్లి జాతర ప్రారంభం
గార: జిల్లాలోనే ప్రాముఖ్యత గల వత్సవలస రాజమ్మ తల్లి జాతర శనివారం సాయంత్రం నుంచి ప్రారంభమైంది. శనివారం సాయంత్రానికి దూర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చారు. ఆదివారం ఉదయం ప్రధాన పీఠాల వద్ద పూజలు జరుపుకోవడంతో పాటు మొక్కులు చెల్లించుకుంటారు. వత్సవలస తొలివారం జాతరకు వచ్చే భక్తుల వాహనాలు తూలుగు మీదుగా వత్సవలస రావాలని, తిరుగు ప్రయాణంలో శ్రీకూర్మం మీదుగా శ్రీకాకు ళం పట్టణం వైపు వెళ్లాలని శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్. వివేకానంద, సీఐ కె.పైడపునాయుడు తెలిపారు. సముద్ర స్నానాల్లో లోతుగా దిగవద్దని, పోలీసులకు సహకరించాలన్నారు. -
●స్థల సేకరణ చేపట్టాం
ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో ఎన్ఆర్ఈజీఎస్ అధికారుల సమన్వయంతో ఒక పశువుల వసతి గృహం ఏర్పాటుకు ఇప్పటికే స్థల సేకరణ చేపట్టాం. తదుపరి పరిశీలన చేపట్టి ఆ తర్వాత నిర్మాణం పై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. మరి కొద్ది రోజుల్లో పనుల ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. –బి.రాజ్గోపాల్, జేడీ, పశు సంవర్ధక శాఖ గత ప్రభుత్వంలో పాడి రైతు చెంతకు వెళ్లి పశువులకు వైద్యం చేసే విధంగా సంచార పశు వైద్య శాలను ఏర్పాటు చేశారు. అంతే కాకుండా పశు వైద్య సిబ్బంది నియామకాలు చేశారు. వాటి కొనసాగింపు పట్టించుకోకుండా హాస్టళ్ల ఏర్పాటు అంటూ కొత్త రాగాన్ని ఎత్తుకున్నారు. అధికార పార్టీ కార్యకర్తలకు పనులు కల్పించడానికే తప్ప పాడి రైతులకు ఎలాంటి ఉపయోగం లేదు. టెక్కలిలో వ్యవసాయ శాఖ మంత్రి ప్రారంభించిన గో సంరక్షణ శాల నిర్వహణకే దిక్కు లేదు. – హెచ్.వెంకటేశ్వరరావు, రైతు, టెక్కలి. -
పర్సు అప్పగింత
పాతపట్నం: మండల కేంద్రం పాతపట్నంలోని అచ్యుతాపురం ఎదురుగా రవింద్రభారతి పాఠశాల సమీపంలో శనివారం ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా రాణిపేటకు చెందిన బోడు గణపతికి రహదారిపై రూ.11,290, వివిధ కార్డులతో ఉన్న పర్సు దొరికింది. వెంటనే పాతపట్నం పోలీసు స్టేషన్కు వెళ్లి సీఐ ఎన్.సన్యాసినాయుడు, ఎస్ఐ కె.మధుసూదనరావు, ఏఎస్ఐ కె.రామమూర్తికి అప్పగించారు. పర్సులో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా బాధితుడు కొరసవాడ గ్రామం పెద్దవీధికి చెందిన గొలుకొండ సతీష్గా గుర్తించి స్టేషన్కు పిలిపించారు. సీఐ సమక్షంలో పర్సు అప్పగించారు. నిజాయితీ చాటుకున్న గణపతిని పోలీసులు అభినందించారు. -
మధ్యవర్తిత్వంతో కేసులకు మోక్షం
శ్రీకాకుళం పాతబస్టాండ్ : కోర్టుల్లో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కేసులను మధ్యవర్తిత్వం ద్వారా సత్వరమే పరిష్కరించుకోవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. ఎంపిక చేసిన న్యాయవాదులకు ఐదు రోజులుగా నిర్వహిస్తున్న 40 గంటల ప్రత్యేక శిక్షణా తరగతులు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యవర్తిత్వ ప్రక్రియలో మెలకువలు నేర్చుకోవడం వల్ల న్యాయవాదులకే కాకుండా, కక్షిదారులకు కూడా ఎంతో మేలు జరుగుతుందన్నారు. శిక్షణ పొందిన న్యాయవాదులు ఈ ప్రక్రియను మరింత సమర్థంగా నిర్వహించాలని, ఉభయ పక్షాల అంగీకారంతో కేసులను పరిష్కరించి ప్రజలకు భారం తగ్గించాలని సూచించారు. సీనియర్ ట్రైనర్లు వి.పి.తనకచన్, పి.జి.సురేష్లు పాల్గొని మధ్యవర్తిత్వంలోని న్యాయపరమైన చిక్కులు, వాటిని పరిష్కరించే విధానాలను వివరించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
నిర్వహణ భారం
టెక్కలి: గోమాతలకు రక్షణ కరువవుతోంది. మాటలు తప్ప చేతలు లేని నాయకుల వైఖరికి నిదర్శనాలుగా కునారిల్లుతున్న గోశాలలు కనిపిస్తున్నాయి. వీటిలో వసతులు ఓ వైపు వెక్కిరిస్తుంటే గోవులకు హాస్టళ్లంటూ సమావేశాల్లో హామీలు ఇస్తుండడం విస్తుగొలుపుతోంది. కొద్ది రోజుల కిందట డివిజన్ కేంద్రమైన టెక్క లిలో గో సంరక్షణ శాల ను ఏర్పాటు చేసి కొద్ది రోజులకే మూసేశారు. ఇప్పటికే గోకులాలకు నిధులు ఇవ్వకపోవడంతో ఆ గోకులాలను అధికార పార్టీ వర్గీయులు సొంత కార్యక్రమాలకు వాడుకుంటున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు పశువులకు వసతి గృహాల పేరుతో ప్రతి నియోజకవర్గంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో వెండర్ పేరుతో అధికార పార్టీ కార్యకర్తలకు కాసులు వర్షం కురిపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంతే కాకుండా నియోజకవర్గ స్థాయి లో కమిటీలు ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలో వసతి గృహాల నిర్వహణ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వసతి గృహం ప్రక్రియలో పశు సంవర్ధక శాఖ, ఎన్ఆర్ఈజీఎస్ సమన్వయంతో షెడ్ల నిర్మా ణం చేపట్టాల్సి ఉంది. రెండు నెలల కిందట జిల్లా అధికారులకు విధి విధానాలు జారీ చేసినప్పటికీ ప్రస్తుతానికి స్థల సేకరణ ప్రక్రియ జరుగుతోంది. ఈ వసతి గృహాల నిర్మాణంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాధ్యమయ్యే పనేనా..? ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో సుమారు 50 సెంట్లు స్థలంలో సుమారు రూ. 9.95 లక్షలతో ఒక్కో పశువుల వసతి గృహం నిర్మాణం చేపట్టనున్నారు. నిర్మాణ బాధ్యతలను వెండర్కు అప్పగిస్తూ నిర్వహణ బాధ్యతలను కమిటీలకు అప్పగిస్తారు. ఒక్కో వసతి గృహంలో 20 పశువులకు ఆశ్రయం కల్పించే విధంగా ప్రణాళిక రూపొందించారు. సొంతంగా పశువులు ఉన్న పాడి రైతులు ఆయా పశువుల పర్యవేక్షణ చేయలేని పక్షంలో వాటిని ఈ వసతి గృహంలో చేర్పించవచ్చు. ఇందులో కమిటీ సభ్యులతో అగ్రిమెంట్ కుదుర్చుకుని వారికి కొంత మొత్తాన్ని చెల్లించేలా విధి విధానాలు పొందు పరిచారు. ప్రస్తుతానికి స్థల సేకరణ ప్రక్రి య కొనసాగుతోంది. జిల్లాలో ప్రస్తుతానికి ఆవులు 3.80 లక్షలు, గేదెలు 24 వేలకు పైగా ఉన్నట్లు అధికారుల అంచనా. అయితే వ్యక్తిగతంగా నిర్మా ణం చేపట్టిన గోకులాల పరిస్థితే అధ్వానంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పశువుల వసతి గృహాల నిర్మాణం, నిర్వహణ సాధ్యమేనా అంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
వైఎస్ జగన్ సంస్కరణలకు కేంద్రం జేజేలు
నరసన్నపేట: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాహసోపేతంగా చేపట్టి న భూముల సమగ్ర రీ సర్వే అప్పట్లో ఎంతో సంచలనం కలిగించింది. ఇప్పుడు కేంద్ర ఆర్థిక సర్వే కూడా ఆ ప్రక్రియ ను తాజాగా కొనియాడింది. కేంద్ర సర్వే సంస్థ ఇచ్చిన సర్టిఫికెట్ చూసైనా కూటమి ప్రభుత్వం కళ్లు తెరవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన శనివా రం విడుదల చేశారు. వైఎస్సార్ సీపీ కాలంలో చేపట్టిన భూ సంస్కరణలు దేశానికే మార్గదర్శకం అని కేంద్రం స్వయంగా అప్పట్లో ఒప్పుకుందని గుర్తు చేశారు. నాడు వైఎస్ జగన్ భూ సర్వే చేపడితే రైతుల భూములు లాక్కుంటార ని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని, వేదికలపై అసత్యాలు మాట్లాడారని, కానీ ఇప్పుడు స్వయంగా కేంద్ర ఆర్థిక సర్వే అధికారులు ఈ పథకాన్ని ప్రశంసించడంతో బాబు కుట్రలన్నీ పటాపంచలయ్యాయని కృష్ణదాస్ ప్రకటనలో పేర్కొన్నారు. అత్యాధునిక టెక్నాలజీ, జీపీఎస్ సహాయంతో అత్యంత పారదర్శకంగా సర్వే నిర్వహించామన్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు చేపట్టిన సంస్కరణలు కేంద్రం కొనియాడుతుంటే కూటమి నాయకులు రాజకీ య కక్షతో బురద జల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హిరమండలం: చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకే టీడీపీ డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే రెడ్డిశాంతి విమర్శించారు. శనివారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. తిరుమల ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల కోసం ఎంతటి నీచానికై నా దిగజారే మనస్తత్వం చంద్రబాబు, పవన్కల్యాణ్లకు ఉందనే విషయాన్ని ప్రజలే మా ట్లాడుకుంటున్నారని అన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో ఎలాంటి కల్తీ జరగలేదని, ఉద్దేశపూర్వకంగా తిరుమలపై రాజకీయలు చేయడం సిగ్గుచేటన్నారు. ఇదే విషయం ప్రజలు చర్చించుకుంటున్నారన్నారని వాటిని డైవర్షన్ చేసేందుకు కొత్తగా మాజీ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబును అసభ్యంగా తిట్టారంటూ ప్రచారం చేస్తూ టీడీపీ పాలిటిక్స్ మెదలుపెట్టిందని ఆమె పేర్కొన్నారు. ఎన్ని రకాల డైవర్షన్ పాలిటిక్స్ చేసినా ప్రజలు గమనిస్తున్నారన్నారు. నరసన్నపేట: మాజీ మంత్రి అంబటి రాంబాబుపైన ఇంటి పైన కూటమి ఎమ్మెల్యే మాధవి తదితరులు దాడికి పాల్పడడంపై డీసీసీబీ మాజీ చైర్మన్, తూర్పు కాపు నాయకులు కరిమి రాజేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. రాంబాబును హత్య చేసేందుకే ఈ విధంగా పక్కా ప్లాన్ ప్రకారం ఆయన ఇంటిపై దాడి చేశారని ఆరోపించారు. టీడీపీ గూండాలు పోలీసుల సమక్షంలో ఈ విధంగా భౌతిక దాడులకు తెగబడటం శోచనీయమన్నారు. ఈ మేరకు ఆయన శనివారం రాత్రి మాట్లాడారు. మాజీ మంత్రిని ఆయన కుటుంబ సభ్యులను బెదిరించి ఇంటిలో ఉన్న ఫర్నీచర్ను ధ్వంసం చేయడం, వ్యక్తిగతంగా దాడులు చేయడం సరికాదని అన్నారు. దాడులను అరికట్టాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం శోచనీయమన్నారు. -
శ్రీకాకుళం
ఉపాధికి ‘చంద్ర’ గ్రహణంఉపాధికి చంద్ర గ్రహణం పట్టింది. పనులు జరగడం లేదు. –8లోనెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సిట్ చెప్పినా ప్రభుత్వం పాత పాటే పాడుతోంది. వారి దుష్ప్రచారం చివరకు వారినే చుట్టుకుంది. ఏపీ ఇమేజ్ను దెబ్బ తీసేలా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు నోట కల్తీ మాట రాగానే వెంటనే దేవాలయాలు శుభ్రం చేయడం, ప్రాయశ్చిత్త పూజలు చేసిన నాయకులు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు. – కాశీబుగ్గలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తిరుపతి లడ్డూ వివాదంలో కూటమి నాయకులు జనాలకు, భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పి తీరాల్సిందే. లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు, చేపనూనె లేదని సిట్ నివేదిక స్పష్టం చేసింది. చంద్రబాబు అబద్ధాలకు ప్రతిరూపం. ఈ ఆరోపణలు చేసిన కూటమి నాయకులంతా భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పి, తిరుపతి మెట్లన్నీ కడిగినా ప్రాయశ్చితం జరగదు. – ఇచ్ఛాపురంలో జెడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయ, నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యామ్ప్రసాద్ పాలనలో లోపాలు కప్పి పుచ్చుకోవడానికే చంద్రబాబు ఈ కుట్రలు చేస్తున్నారు. దేవుళ్లను అడ్డం పెట్టుకుని రాజకీయ పబ్బం గడుపుకోవడం చంద్రబాబుకు అలవాటు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే హిందూ దేవాలయాల్లో విధ్వంసాలు సృష్టించి వైఎస్సార్ సీపీపై నెట్టేయాలని చూశారు. – టెక్కలిలో నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ -
గ్రూప్–1కు ఎంపికై న బోరవానిపేట యువకుడు
గార: ఏపీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్–1 ఫలితాల్లో గార మండలం బోరవానిపేట గ్రామానికి చెందిన బోర జీవన్కిషోర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా ఎంపికయ్యాడు. ఐఐఐటీ ఖరగ్పూర్లో ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఈయన 2022 గ్రూప్–1 నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ప్రోహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్గా ఎంపికై ప్రస్తుతం విజయనగరం క్రైమ్ డివిజన్లో ఎన్ఫోర్సుమెంట్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. తండ్రి డాక్టర్ బోర ప్రసాదరావు విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి బోర గీతారాణి గృహిణి. భార్య పూర్ణవర్షిత హైదరాబాద్లో గ్రాఫిక్ డిజైనర్గా పనిచేస్తున్నారు. ప్రజలతో సత్సంబంధాలు కలిగిన ఉద్యోగం ఉండాలన్న కోరికతో మరోసారి గ్రూప్–1 పరీక్ష రాసి విజయం సాధించాడని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆమె నేత్రాలు సజీవం శ్రీకాకుళం కల్చరల్ : నగరంలోని మండలవీధికి చెందిన తాళ లక్ష్మి (59) మృతిచెందడంతో ఆమె నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు కుమార స్వామి, రవికుమార్ నిర్ణయించారు. విషయాన్ని రెడ్క్రాస్కు తెలియజేయడంతో మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్ పూతి సుజాత, పి. చిన్నికృష్ణల ద్వారా కార్నియాలు సేకరించారు. అనంతరం విశాఖలోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు. ఈ సందర్భంగా రెడ్క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు మాట్లాడుతూ నేత్రదానం చేయాలనుకునే వారు 78426 99321 నంబరును సంప్రదించాలని కోరారు. ఆల్రౌండ్ చాంపియన్గా నరసన్నపేట శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి గ్రిగ్స్మీట్ ఫైనల్స్ పోరు మొదలయ్యాయి. తొలుత జరిగిన బాలికల గ్రిగ్స్మీట్ ఫైనల్స్ పోటీల్లో అన్ని విభాగాల్లో విజయదుందుభి మోగించిన నరసన్నపేట జీహెచ్ స్కూల్ ఆల్రౌండ్ చాంపియన్గా నిలిచింది. స్పోర్ట్స్ చాంపియన్గా జెడ్పీహెచ్ స్కూల్ బొడ్డపాడు, గేమ్స్ చాంపియన్గా జీహెచ్ స్కూల్ నరసన్నపేట, జెడ్పీహెచ్ స్కూల్ అంపోలు సంయుక్తంగా నిలిచాయి. బాలికల పోటీల్లో విజేతలుగా నిలిచిన జట్లు/క్రీడాకారులకు శ్రీకాకుళం డివిజన్ ఉప విద్యాశాఖాధికారి ఆర్.విజయకుమారి బహుమతులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రిగ్స్మీట్ సెక్రటరీ టి.శ్రీనివాసరావు, స్పోర్ట్స్మీట్ కార్వనిర్వాహక పాఠశాల(శ్రీకాకుళం పీఎస్ఎన్ఎంహెచ్స్కూల్) హెచ్ఎం దేవదత్తానందం, పీడీ కె.మాధవరావు, పీడీ–పీఈటీ సంఘ జిల్లా అధ్యక్షుడు పి.తవిటయ్య, ప్రధాన కార్యదర్శి ఎంవీ రమణ, స్కూల్గేమ్స్ సెక్రటరీ బీవీ రమణ, ఎం.తిరుపతిరావు, ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.సాంబమూర్తి, సలహాదారు పి.సుందరరావు, రాజారావు, రాజశేఖర్, పురుషోత్తం, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు. ఫిబ్రవరి 2, 3 తేదీల్లో శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా బాలుర విభాగంలో జిల్లాస్థాయి గ్రిగ్స్మీట్ ఫైనల్స్ పోటీలు నిర్వహించనున్నారని కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. ట్రిపుల్ ఐటీలో ముగిసిన వర్క్షాప్ ఎచ్చెర్ల : ఆర్జీయూకేటీ శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాప్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్సైకిల్ (ఎన్డీఎల్సీ)పై రెండురోజులుగా నిర్వహిస్తున్న వర్క్షాప్ శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా సారికి టెక్నాలజీ సంస్థ సీఈవో ప్రసాద్ సారికి మాట్లాడుతూ ప్రస్తుతం పరిశ్రమలో జరుగుతున్న పరిమాణాలు, వాస్తవ వినియోగాలను వివరించారు. జనరల్ ఏఐలో కొత్త విధానాలు, ప్రాయోగిక ప్రదర్శనలు, ఏఐ ఆధారిత సాప్ట్వేర్ అభివృద్ధిలో ఉన్న వృత్తి అవకాశాలపై అవగాహన కల్పించారు. విద్య, పరిశ్రమల మధ్య అంతరాన్ని వివరించారు. క్యాంపస్ డైరెక్టర్ కేవీజీడీ బాలాజీ మాట్లాడుతూ నూతన సాంకేతికతతో పరిశ్రమల్లో పని చేయడానికి విద్యార్థులు సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో పరిపాలనాధికారి ముని రామకష్ణ, అకడమిక్ డీన్ శివరామకష్ణ, ఎఫ్వో వాసు, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి కోడా దిలీప్కుమార్, డి.పద్మావతి తదితరులు పాల్గొన్నారు. -
తొలగిస్తున్న ఆక్రమణలు ఎవరివో అందరికీ తెలుసు
పలాస : పలాస నియోజకవర్గంలో భూ ఆక్రమణలు జరుగుతున్న మాట వాస్తవమేనని, అవన్నీ ఎమ్మెల్యే వెనుక ఉన్న దొంగలవేనని, అందుకు ఉదాహరణే కాశీబుగ్గ జగన్నాథసాగరం ఆక్రమణలని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు చెప్పారు. పలాస ఉల్లాసపేటలోని వేంకటేశ్వర దేవాలయం వద్ద శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం తొలగిస్తున్న ఆక్రమణలు ఎవరివో వారికే తెలుసని, ఇప్పటి వరకు తమ పార్టీ కార్యకర్త ఆక్రమణ అంటూ ఒక్కటైనా తొలగించారా అని ప్రశ్నించారు. తాను అద్దం లాంటి వాడినని, మీరు ఎలా చూస్తే అలా కనిపిస్తానన్నారు. ప్రతిసారీ నల్లబొడ్లూరు కొండ అంటారని, ఆ కంకర వెంకన్న చౌదరి తవ్వి నాకు డబ్బులు ఇచ్చాడా? అని ప్రశ్నించారు. అక్రమ కంకర తవ్వకాలపై సాక్షాత్తు పలాస తహశీల్దారు అధికారుల సమక్షంలోనే తాము అడ్డుకుంటే వెంటనే ఫోన్ వస్తుందని, తాము ఏం చేస్తామని మొరపెట్టుకోలేదా అని అన్నారు. ఆ ఫోన్ చేసిన నాయకుడిపై ఇంతవరకు చర్యలు లేవన్నారు. తన హయాంలో కబ్జా అని నిరూపించి ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. కూటమి హయాంలోనే అక్రమ లేఅవుట్లు వెలుస్తున్నాయని, తమ ప్రభుత్వం వస్తే ఒక్కటి కూడా ఉంచబోమని హెచ్చరించారు. సీతమ్మగుడి వద్ద వంశధార కాలువ గట్టును మింగేసి రోడ్డు వేశారని, కంబిరిగాం బ్రిడ్జి వద్ద లాండ్ సీలింగ్ యాక్టు అతిక్రమించి లేఅవుట్లు వేస్తున్నారని, వాటిపై సమాధానం చెప్పాలన్నారు. తనతో వస్తే ఎవరు ఆక్రమణలకు పాల్పడుతున్నారో చూపిస్తానన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు హనుమంతు వెంకటరావు, వైఎస్సార్ సీపీ జిల్లా నాయకులు ఉంగ సాయికృష్ణ, పైల చిట్టి, బమ్మిడి దుర్యోధనరావు, బోర బుజ్జి, పాలిన శ్రీనివాసరావు, మందస ఎంపీపీ డొక్కర దానయ్య, లీలారాణి, శిష్టు గోపి, దువ్వాడ రవి, నర్తు వెంకటరమణ, బమ్మిడి సంతోష్కుమార్, మల్లా సురేష్కుమార్, మల్లా భాస్కరరావు, పి.గురయ్యనాయుడు, ఇరోతు మోహనరావు, తిర్రి రాజారావు, డల్లి జానకి రెడ్డి, దున్న హరి, సొర్ర ఢిల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు -
బంగారం చోరీ కేసులో మహిళ అరెస్టు
ఇచ్ఛాపురం : మున్సిపాలిటీ పరిధిలోని ఏఎస్పేటలో నివాసముంటున్న కదంబాల భాగ్యలక్ష్మి గత నెల 25న మార్కెట్లో సరుకులు కొనుగోలు చేస్తుండగా ఆరుంపావు తులాల బంగారు ఆభరణాలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. ఈ మేరకు బాధితురాలు పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా ఆస్కా నువాపల్లి గ్రామానికి పులి సుభాషిణిని నిందితురాలిగా గుర్తించి శనివారం ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ వద్ద అదుపులోకి తీసుకొన్నారు. ఆమె వద్ద నుంచి ఆరుంపావు తులాల బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. నిందితురాలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ బషీర్ని సీఐ మీసాల చిన్నంనాయుడు, ఎస్సై ముకుందరావు అభినందించారు. ప్రొఫెసర్ సుజాతకు పేటెంట్ హక్కులు మంజూరు ఎచ్చెర్ల : యాంటీబయాటిక్ సమూహమైన ‘టెట్రాసైక్లిన్ అనలాగ్’పై పరిశోధనలకు గాను బి. ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయం బయో టెక్నాలజీ విభాగం సీనియర్ అధ్యాపకురాలు ప్రొఫెసర్ పి.సుజాతకు పేటెంట్ (చట్టపరమైన మేథో సంపత్తి హక్కు) మంజూరైంది. 2018 నుంచి ఇరవై ఏళ్లపాటు ఈ హక్కులను కల్పిస్తూ కేంద్ర ప్రధాన పేటెంట్ కార్యాలయం (కోలకత్తా) తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ఈ సందర్భంగా సుజాతను వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె.ఆర్.రజని శనివారం అభినందించారు. -
అంతర్ పాలిటెక్నిక్ క్రీడల్లో ప్రతిభ
ఎచ్చెర్ల : గత నెల 28, 29, 30వ తేదీల్లో జరిగిన రాష్ట్ర స్థాయి అంతర్ పాలిటెక్నిక్ క్రీడా పోటీల్లో శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు సత్తాచాటారు. జావెలిన్త్రోలో ప్రథమ, బ్యాడ్మింటన్ సింగిల్స్, హైజంప్, 400 మీటర్ల పరుగు, 4/100 మీటర్లు రిలేలో తృతీయ స్థానాలు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రిన్సిపాల్ కె.నారాయణరావు శనివారం అభినందించారు. కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు జి.దామోదరావు, బి.తులసిరావు, ఎ.శివప్రకాశరావు, డి.మురళీకృష్ణ, రామాచార్యులు తదితరులు పాల్గొన్నారు. -
కొత్త ఉపాధి చట్టాన్ని రద్దు చేయాలి
రణస్థలం: పీఎం మోదీ తెచ్చిన 2025 జీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం–2005ను పునరుద్ధరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు వెలమల రమణ డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ వర్థంతి సందర్భంగా గాంధీ స్ఫూర్తితో గ్రామీణ పేదలకు, రైతులకు కూలీలకు అండగా ఉన్న జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవడానికి పోరాడుతామని శుక్రవారం రణస్థలంలో ప్రతిజ్ఞ చేశారు. ఈ సంద్భంగా వారు మాట్లాడుతూ పాత చట్టం రద్దుతో గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కూలీలకు, పేద రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో నర్సింహులు, వ్యవసాయ కార్మికులు పాల్గొన్నారు. -
ప్రయోగాలకు వేళాయె!
శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ సైన్స్ విద్యార్థుల ప్రాక్టికల్స్ పరీక్షలకు రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి ఒకటి నుంచి మొదలుకానున్న ప్రాక్టికల్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇప్పటికే కేంద్రాలకు బుక్లెట్స్, ఇతర సామగ్రి చేరవేశారు. ఆర్ఐఓ రేగ సురేష్కుమార్ నేతృత్వంలో డీఈసీ కమిటీ ఏర్పాట్లలో నిమగ్నమైంది. నిఘా నడుమ పరీక్షలు.. ప్రాక్టికల్ పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలతో అధికారులు నిఘా పెట్టారు. ఇందుకోసం మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లతోపాటు డీఈసీ కమిటీ సభ్యులు బి.శ్యామ్సుందర్, ఎస్.భీమేశ్వరరావు, ఎస్.అన్నపూర్ణారావు, బీటీవీ మంగపతి, ఇంటర్బోర్డు అధికారులు పరీక్షా కేంద్రాల్లో తనిఖీలు చేపట్టనున్నారు. సీసీ కెమెరాలతో ఆన్లైన్ స్ట్రీమింగ్ చేయడంతో వాటిని ఇంటర్బోర్డు సెక్రటరీ/సీఓఈ అధికారులతోపాటు జిల్లా ఆర్ఐఓ కార్యాలయానికి స్ట్రీమింగ్ చేశారు. కాగా, మెజారిటీ కాలేజీల్లో విద్యార్థుల నుంచి రూ.500 నుంచి 800 వరకు ‘కలెక్షన్స్’కు పాల్పడినట్టు ప్రచారం జరుగుతోంది. ఇదీ పరిస్థితి.. జిల్లాలో 119 కేంద్రాల్లో ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. వీటిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 37, మోడల్ స్కూల్/కాలేజీలు 13, సోషల్ వెల్ఫేర్ 8, ట్రైబల్ వెల్ఫేర్ 1, ప్రైవేటు అన్ ఎయిడెడ్ మరో 60 కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 15432 మంది విద్యార్థులు ప్రాక్టికల్స్కు సన్నద్ధమౌతున్నారు. ఎంపీసీ గ్రూపు నుంచి 10626 మంది, బైపీసీ గ్రూపు నుంచి 4806 మంది విద్యార్థులు ఉన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి. ఇప్పటికే చీఫ్ సూపరింటెండెంట్లు, ఎక్స్టర్నల్ ఎగ్జామినర్లు, ఇతర సిబ్బంది నియామకాలు పూర్తిచేశారు. అయితే కొంతమంది లెక్చరర్లు/ఎక్స్టర్నల్ ఎగ్జామినర్లను సుదూర ప్రాంతాలకు ఎగ్జామినర్లగా నియామకాలు చేయడంతో వారంతా ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఒకటో తేదీ నుంచి మొదలయ్యే సైన్స్ ప్రాక్టికల్ పరీక్షల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేశాం. సీసీ కెమెరాల నిఘాలో ప్రాక్టిక ల్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. విద్యార్థుల నుంచి వసూళ్లకు పాల్పడితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. – రేగ సురేష్కుమార్, జిల్లా ఆర్ఐఓ -
పెంచుతోంది దడ
ఆకాశయానం చేస్తున్న బంగారం ధర సామాన్యులను భయపెడుతుంటే.. దొంగలను మాత్రం రెచ్చగొడుతోంది. రోజురోజుకూ స్వర్ణం ధర విపరీతంగా పెరుగుతుండడంతో చోరులు హస్త లాఘవం చూపుతున్నారు. వృద్ధులు, ఒంటరి మహిళలే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో దాడులకు కూడా వెరవడం లేదు. ఈ వైఖరి జిల్లాలో ఆందోళన కలిగిస్తోంది. చైన్స్నాచింగ్లు, దోపిడీలకు కూడా ఆస్కారం ఉంది. శుక్రవారమే ఏకంగా రెండు చైన్స్నాచింగ్లు జరగడం ఓ హెచ్చరిక.శ్రీకాకుళం క్రైమ్ : -
ట్రిపుల్ ఐటీలో వర్క్షాపు ప్రారంభం
ఎచ్చెర్ల : స్థానిక ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో సారిక టెక్నాలజీ సంస్థ సహకారంతో ‘జీఈఎన్ఏ1 ఎస్డీఎల్సీ’ అంశంపై రెండు రోజుల వర్క్షాప్ను డైరెక్టర్ కొక్కిరాల వెంకటధన బాలాజీ శుక్రవారం ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానంలో నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని డైరెక్టర్ బాలాజీ సూచించారు. సంస్థ సీఈవో ప్రసాద్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగాధిపతి కోడా దిలీప్కుమార్ కన్వీనర్గా వ్యవహరించగా, డి.పద్మావతి సహ కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు. పరిపాలనాధికారి ముని రామకృష్ణ, డీన్ శివరామకృష్ణ, ఫైనాన్స్ అధికారి డాక్టర్ వాసు, కంప్యూటర్సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఆక్రమణలు జరుగుతుంటే ఏం చేస్తున్నారు?
● తొలగించకపోతే మీపై చర్యలు తప్పవు ● పలాసలో అధికారులపై కలెక్టర్ ఆగ్రహం పలాస : పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో భూ ఆక్రమణలను తక్షణమే తొలగించాలని, లేకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హెచ్చరించారు. పలాస నియోజకవర్గంలో ఇష్టానుసారంగా భూ ఆక్రమణ లు, కంకర తవ్వకాలు జరుగుతుంటే రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో శుక్రవారం కలెక్టర్ పర్యటించారు. పలు వివాదాస్పద స్థలాలను పరిశీలించారు. సూదికొండ సర్వే నంబరు 51లో డీ పట్టా భూము ల్లో ఇతర వ్యక్తులు ఎలా ఉన్నారని , ఆ భూముల్లో ఏం సాగు చేస్తున్నారని ప్రశ్నించారు. తక్షణమే వారికి నోటీసులు ఇవ్వాలని తహశీల్దారును ఆదేశించారు. డి పట్టా భూములను అడుగుతున్న సమయంలో మండల సర్వేయరు గిరి సరైన సమాధా నం చెప్పకపోవడంతో అక్కడికక్కడే సస్పెండ్ చేస్తా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వే నంబరు 52 లో ఉన్న లే అవుట్కు అనుమతులు లేవని కలెక్టరు దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే వారికి నోటీసులు ఇచ్చి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. బొడ్డపాడు రెవెన్యూ పరిధిలోని కోసంగిపురం కూడలి వద్ద సర్వే నంబరు 67లో డి.పట్టా భూములను ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకుంటున్నారని బొడ్డపాడు రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లారు. పలాస జగన్నాథసాగరం ఆక్రమణ ప్రాంతాన్ని సందర్శించారు. చెరువు గర్భాన్ని ఆక్రమిస్తుంటే మున్సిపల్ రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా వేసిన లేఅవుట్ ను తక్షణమే తొలగించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావును ఆదేశించారు. అనంతరం వంశధా ర ఇరిగేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ చెరువు పనులు తక్షణమే ప్రారంభించి ఆ ఫొటోలు పంపించాలని ఆదేశించారు. చిన్న చిన్న సమస్యల ను కూడా ఎందుకు పరిష్కరించలేకపోతున్నారని ఆర్డీవో వెంకటేశ్ను ప్రశ్నించారు తహశీల్దారు కళ్యాణచక్రవర్తిపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరుతో పాటు ఎమ్మెల్యే శిరీషా, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఏపీ ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జ బాబూరా వు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పీరుకట్ల విఠల్రావు, లొడగల కామేశ్వరరావు, గాలి కృష్ణారావు, బి.నాగ రాజు, ఎం.నరేంద్ర, కొరికాన శంకర్, సవర రాంబా బు తదితరులు పాల్గొన్నారు. -
పీఎం–ఉషా పథకంపై సమీక్ష
ఎచ్చెర్ల: ప్రధానమంత్రి ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (పీఎం–ఉషా) పథకంపై ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ చాన్సలర్ కె. ఆర్.రజనీ మాట్లాడుతూ కేరళలోని కన్నూర్ యూనివర్సిటీలో పీఎం–ఉషాపై జరిగిన దక్షిణ భారత ప్రాంతీయ సమావేశంలో చర్చకు వచ్చిన ఉన్నత విద్యా రంగ అంశాలను వివరించారు. జాతీయ విద్యా విధానంలో భాగంగా పీఎం–ఉషా పథకం క్రింద మంజూరైన నిధుల నుంచి పలు అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభించామని చెప్పా రు. విద్యార్థి కేంద్రీకృత కార్యకలాపాలకు, వినూత్న వైజ్ఞానిక ప్రదర్శనల నిర్వహణకు వర్సిటీ విభాగా లు సిద్ధం కావాలన్నారు. సమావేశంలో రిజిస్ట్రార్ బి.అడ్డయ్య, ప్రిన్సిపాళ్లు ఎం.అనూరాధ, సీహెచ్ రాజశేఖరరావు, కె.స్వప్నవాహిని, అధ్యాపకులు పి. సుజాత, పీఎం–ఉషా వర్శిటీ నోడల్ అధికారి కె.కావ్యజ్యోత్స్న, ఎగ్జామ్ డీన్ ఎస్.ఉదయభాస్కర్, ఎస్ వో సామ్రాజ్యలక్ష్మీ, ఎల్.అనంతరావు పాల్గొన్నారు. -
కొట్టేసేందుకు సిద్ధం!
కోట్లు విలువైన స్థలం.. నరసన్నపేట: నరసన్నపేట పట్టణం నడిబొడ్డున బజారులో ప్రభుత్వానికి చెందిన బోర్డు బంగ్లా స్థలం ఆక్రమణకు మళ్లీ ప్రయత్నాలు మొదలయ్యాయి. కోటి రూపాయలకు పైగా విలువైన ఈ స్థలం కొట్టేయడానికి అధికార పార్టీకి చెందిన జిల్లా కేంద్రంలో కేంద్ర మంత్రికి సన్నిహితంగా ఉంటున్న ఓ వ్యక్తి చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అధికారుల గతంలో కట్టిన గోడను తొలగించి గురువారం రాత్రి రెండు జేసీబీలతో బోర్డు బంగ్లా స్థలాన్ని చదును చేయించారు. ఇక్కడ నిర్మాణ పనులు చేపట్టేందుకు సిమెంట్ ఇటుకలు సైతం సిద్ధం చేశారు. ఈ సమాచారం శుక్రవారం ఉదయం వెలుగులోకి రావడంతో స్థలం కబ్జాకు గురి కావడం ఖాయమని స్థానికులు గుసగుసలాడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆమదాలవలసకు చెంది న కొందరు వ్యక్తులు బొరిగివలస వారితో కలసి తమకు రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నాయని, కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందంటూ స్థలం వద్దకు వచ్చి నానా హంగామా చేశారు. అయితే అధికారులు, పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగి సమర్థంగా అడ్డుకుని ఈ స్థలాన్ని కాపాడుకోగలిగారు. అప్పటి తహసీల్దార్ సింహాచలం, ఎంపీ డీఓ మధుసూదనరావులు స్పందించి ఇది ప్రభుత్వ స్థలంగా బోర్డులు పెట్టడం, స్థలం రోడ్డువైపున గోడ కట్టడం వంటివి చేయించారు. తాజాగా ఆమదాలవలసకు చెందిన వ్యక్తులు సదరు స్థలాన్ని శ్రీకాకుళానికి చెందిన టీడీపీ నాయకుడికి విక్రయించారని తెలుస్తోంది. వీరి మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా సదరు నేత రాత్రిపూట వచ్చి పనులకు శ్రీకారం చుట్టారు. మంగళ, బుధవారాల్లో నరసన్నపేటకు వచ్చిన ఆయన స్థానికులతో మంతనాలు జరిపారని, టీడీపీ నాయకులు, అధికారులను సైతం కలిశారని తెలుస్తోంది. దీనిలో భాగంగానే రాత్రి వచ్చి పనులు మట్టిని చదును చేయించారని సమాచారం. ఈ స్థలం 40 ఏళ్ల క్రితం నుంచి ప్రభుత్వ ఆధీనంలో ఉంది. బ్రిటిష్ కాలంలో ఇక్కడ బోర్డు బంగ్లా పేరిట ఒక భవనం ఉండేది. ఇది జిల్లా పరిషత్కు చెందినది. సంబంధిత పత్రాలు సైతం ఉన్నాయని అధికారులు అంటున్నారు. అయితే ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ ఎవరో ఒకరు తమకు హక్కులు ఉన్నా యంటూ రావడం.. అధికారులు అడ్డుకోవడం జరుగుతోంది. గొట్టిపల్లి రెవెన్యూలో పరిధిలోని సర్వే నంబరు 219 బీ వన్లో ఉన్న ఈ 38 సెంట్లు (బోర్డు బంగ్లా) స్థలం ప్రభుత్వానిదేనని తహసీల్దార్, ఎంపీడీఓలు గతంలోనే స్పష్టం చేశారు. తప్పుడు పత్రా లు చూపించి తమకు అనుకూలంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, లింకు డాక్యుమెంట్లు సృష్టించుకోవడం చెల్లదని తేల్చిచెప్పారు. అయినప్పటికీ తాజాగా ఈ స్థలంలో మట్టి చదును చేయడం.. దీని వెనుక కేంద్ర మంత్రి సన్నిహితుడు ఉన్నారనే ఆరోపణలు రావడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఇప్పటికే పట్టణం, పరిసర గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్న అధికార పార్టీ కార్యకర్తలు ఇప్పుడు దీనిపై కన్నేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై నరసన్నపేట పంచాయతీ ఈఓ ద్రాక్షాయిని వద్ద ప్రస్తావించగా సమాచారాన్ని ఎంపీడీఓ దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. బోర్డు బంగ్లా స్థలంలో రాత్రి ఎవరో వచ్చి జేసీబీల సహాయంతో మట్టి చదును చేశారని మా దృష్టికి వచ్చింది. ఎవరో తెలియకుండా రాత్రి సమయంలో వచ్చి పనులు చేయడం సరికాదు. మీ స్థలం అనుకున్నప్పుడు రాత్రి వచ్చి పనులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. పగలే చేయవచ్చుకదా? దీనిపై దృష్టి పెట్టాం. ఎవరు పనులు చేశారనేదానిపై ఆరా తీస్తున్నాం. – వెంకటేశ్వర ప్రసాద్, నరసన్నపేట ఎంపీడీఓ -
వైఎస్సార్సీపీ రాష్ట్ర విభాగాల్లో ముగ్గురికి చోటు
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ముగ్గురిని రాష్ట్ర అనుబంధ విభాగాల్లో నియమిస్తూ శుక్రవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీచేశారు. శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శిగా బరాటం నాగేశ్వరరావు, మైనార్టీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంఏ రఫీ, ఇచ్ఛాపురం నియోజకవర్గం నుంచి ఐటీ విభా గం రాష్ట్ర కార్యదర్శిగా చినపాన సాయిసందీప్రెడ్డిలను నియమించారు. టెక్కలి: టెక్కలి ఆదిఆంధ్రావీధిలో భర్త చితికి భార్య తలకొరివి పెట్టిన ఘటన చోటు చేసుకుంది. జోగి మల్లేష్ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మృతి చెందా డు. ఒక్కగానొక్క కుమారుడు గతంలోనే మృతి చెందడంతో భార్య సీతమ్మ అంత్యక్రియలు పూర్తి చేసింది. సంతబొమ్మాళి: తాళ్లవలసలో శుక్రవారం వరి కుప్పలు దగ్ధమయ్యాయి. దుబ్బాక శశిభూషణరావు, పురుషోత్తం, కామమ్మ, గున్న పాపారా వులకు చెందిన సుమారు ఐదు ఎకరాల వరి చేనుకుప్పలు కాలిపోవడంతో సుమారు రూ.2 లక్షలు నష్టం వాటిల్లింది. పారిశుద్ధ్య కార్మికు లు రోడ్డు ఇరువైపులా చెత్త పోగుచేసి ఒకేచోట మంట పెట్టారు. ఈ క్రమంలో పక్కన ఉన్న వరి కుప్పలకు అంటుకోవడంతో దగ్ధమయ్యా యని స్థానికులు అంటున్నారు. టెక్కలి అగ్ని మాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: దేశం కోసం సేవలందించిన మాజీ సైనికుల సంక్షేమం, వారి కుటుంబాల రక్షణే లక్ష్యంగా ‘నాల్సా వీర్ పరివార్ సహాయత యోజన–2025’ను ప్రవేశపెట్టినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పెద్దరెల్లి వీధిలో జిల్లా సైనిక్ బోర్డు కార్యాలయాన్ని సందర్శించారు. నూతనంగా ఏర్పాటు చేసిన లీగల్ సర్వీస్ క్లినిక్ని ప్రారంభించి, మాజీ సైనికులు ఎదుర్కొంటున్న సమ స్యలపై చర్చించారు. కార్యక్రమంలో స్పెషల్ జడ్జి (పోక్సో) ఎన్.సునీత, ప్యానెల్ అడ్వకేట్ వి.జ్యోతిర్మయి, పారా లీగల్ వలంటీర్ కె.ఆదిత్యకుమార్, కెప్టెన్ పి.ఈశ్వరరావు, జిల్లా సైనిక సంక్షేమ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీకాకుళం: పాత పీఆర్సీ గడువు పూర్తయి 30 నెలలు గడిచినా 12వ పీఆర్సీ కమిటీని ఏర్పా టు చేయకపోవడం తగదని ఎస్టీయూ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. పీఆర్ సీ జాప్యంతో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షన ర్లలో తీవ్ర ఆందోళన నెలకొందన్నారు. ఈ మేరకు ఎస్టీయూ రాష్ట్ర కన్వీనర్ ఎస్వీ రమణమూర్తి నేతృత్వంలో శ్రీకాకుళం తహసీల్దార్కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే మధ్యంతర భృతి ప్రకటిస్తామ ని, ఆర్థిక బకాయిల చెల్లింపులు చేస్తామని, పెన్షనర్లకు పెన్షన్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా మని హామీలిచ్చి ఇప్పుడు విస్మరించడం తగదన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఫిబ్రవరి 10న అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నా, 25న ఛలో విజయవాడ కార్యక్రమం నిర్వహించాల ని నిర్ణయించామని, ఉపాధ్యాయులంతా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. బరాటం నాగేశ్వరరావు చినపాన సాయిసందీప్రెడ్డి ఎంఏ రఫీ -
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
శ్రీకాకుళం అర్బన్: ఆర్టీసీలో పనిచేసే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, రోడ్డు ప్రమాదాల శాతం తగ్గించాలని జిల్లా రవాణాశాఖ అధికారి గంగాధర్ పిలుపునిచ్చారు. రహదారి భద్రత మాసోత్సవాల ముగింపు కార్యక్రమం శ్రీకాకుళంలోని ఆర్టీసీ శ్రీకాకుళం ఒకటో డిపో గ్యారేజీ ఆవరణలో శుక్రవారం నిర్వహించారు. జిల్లాలోని నాలుగు డిపోల్లో ప్రమాద రహితంగా విధులు నిర్వర్తించిన డ్రైవర్లను సన్మానించారు. రోడ్డు భద్రతపై మున్సిపల్ స్కూల్, అమర కౌమది స్కూల్లో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు డీఎస్పీ వివేకానంద చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. జిల్లా ప్రజారవాణా అధికారి సి.హెచ్ అప్పలనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం 1, 2 డిపో మేనేజర్లు హనుమంతు అమరసింహుడు, కె.ఆర్.ఎస్.శర్మ, అసిస్టెంట్ మేనేజర్లు పి.సంతోష్కుమార్, ఎ.గంగరాజు, ఎస్ఎం ఎంపీ రావు, అధికారులు ఎఎన్ఎస్ శ్రీనివాస్, పి.ప్రసాదరావు, రాజు, యూ నియన్ల ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.


