Srikakulam
-
శ్రీకాకుళం
149 కేంద్రాలు..రేపటి నుంచే టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. ఏర్పాట్లు ముమ్మరం చేశారు. –8లోఆదివారం శ్రీ 16 శ్రీ మార్చి శ్రీ 2025పరీక్షలపై ప్రత్యేక నిఘా ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో న్యాయ విద్య ఎల్ఎల్బీ మూడేళ్లు, ఐదేళ్ల పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ నెల 22 వరకు పరీక్షలు జరగనున్నాయి. చూసీ రాతల ఆరోపణల నేపథ్యంలో అధికారు లు అప్రమత్తమయ్యారు. సెల్ఫోన్లు పక్కాగా తనిఖీ చేసి లోపలకు విడిచి పెడుతున్నారు. సబ్జెక్టు కాంట్రాక్టు, గెస్ట్ ఫ్యాకల్టీకి ఇన్విజిలేట ర్లుగా నియామకం నిలిపివేశారు. కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు మాత్రమే డ్యూటీలు వేస్తున్నారు. అధికారులు నిరంతరం పరీక్షలు పర్యవేక్షిస్తున్నారు. ప్రైవేట్ కళాశాలల విద్యార్థు లు రాస్తున్న గదులపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఏపీపీఎస్సీ పరీక్షలకు సిద్ధం శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు అధికారులను ఆదేశించా రు. కలెక్టరేట్ కార్యాలయంలోని డీఆర్ఓ చాంబర్లో పరీక్షల నిర్వహణపై ఆయన సమీక్షించారు. ఫారెస్టు రేంజ్ అధికారి పరీక్షకు 546 మంది హాజరు కానున్నారని, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్లకు 152 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. అభ్యర్థులు తమ వెంట హాల్ టికెట్తో పాటు ఏదైనా ఒక గుర్తింపు కార్డు తీసుకురావాలని పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర కళాశాల, శ్రీ శివానీ ఇంజనీరింగ్ కళాశాల, కోర్ కళాశాలలో ఎఫ్ఆర్ఓ పరీక్షలు ఆన్లైన్లో జరుగుతాయన్నారు. నేడు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు జయంతి శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నామని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. ఈ మేరకు శనివా రం ఓ ప్రకటన విడుదల చేశారు. శ్రీకాకుళం నగరంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలో పొట్టి శ్రీరాములు కూడలిలో ఆదివారం ఉదయం 10గంటలకు నిర్వహించే కార్యక్ర మానికి పార్టీ నాయకులు, శ్రేణులు, అభిమాను లు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఆసియా ఒలింపియాడ్కు దేవాది విద్యార్థి నరసన్నపేట: ఆసియా స్థాయిలో సౌదీ అరేబియాలో నిర్వహిస్తున్న ఫిజిక్స్ ఒలింపియాడ్కు మండలంలోని దేవాది కి చెందిన విద్యార్థి ధర్మాన జ్ఞాన రుత్విక్ ఎంపి కయ్యాడు. మే నెల 4 నుంచి 12వ తేదీ వరకూ ఆసియా స్థాయిలో సౌదీ అరేబియాలో 3వ స్థా యి సెమినార్ జరుగుతుందని, దీంట్లో రుత్విక్ పాల్గొననున్నట్లు తండ్రి ధర్మాన శంకర్నారాయణ తెలిపారు. ఇండియా నుంచి ఈ ఒలింపియాడ్కు 20 మంది విద్యార్థులు హాజరవుతుండగా ఏపీ నుంచి రుత్విక్ పాల్గొంటున్నాడని తెలిపారు. జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్లో 99.98 శాతం మార్కులు పొంది రుత్విక్ సాయి ప్రతిభ చాటిన విషయం విదితమే. ●జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం ● నలుగురు మృతి ●ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు ●ఇద్దరికి తీవ్ర గాయాలుపెద్దలోగిడిలో విషాద ఛాయలు పాతపట్నం: మండలంలోని పెద్దలోగిడి గ్రామానికి చెందిన దువ్వారి కాళిదాసు కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాళిదాసు చిన్న కుమారుడు లక్ష్మీపతి వైజాగ్ మధురవాడలోని ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నా డు. స్నేహితుడి పెళ్లి కోసం వచ్చిన లక్ష్మీపతి అన్న కుమారుడి పుట్టిన రోజు వేడుకల కోసం కుటుంబాన్ని కారులో విశాఖకు తీసుకెళ్లాడు. అదే అతని ఆఖరి ప్రయాణమైంది. ఈ కారుకు యాక్సిడెంట్ జరిగి లక్ష్మీపతితో పాటు తల్లి మీనమ్మ, బావ భాస్కరరావు చనిపోవడంతో ఊరంతా విషాదంలో మునిగిపోయింది. లక్ష్మీపతి బావ ఉగ్రపల్లి భాస్కరరావు ఆటోడ్రై వర్గా పెద్దలోగిడి గ్రామంలో ఉంటున్నారు. ప్రమాదంలో దెబ్బతిన్న కారు ఎచ్చెర్ల క్యాంపస్/ఎచ్చెర్ల/రణస్థలం/పాతపట్నం/ శ్రీకాకుళం క్రైమ్: లావేరు మండలం బుడుమూరు సమీపంలో జాతీయ రహదారిపై శనివారం సా యంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నాలుగు ప్రాణాలను గాల్లో కలిపేసింది. టైరు పంక్చర్ కావడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. చనిపోయిన నలుగురిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు. ఈ కుటుంబంలో ఆదివారం బర్త్డే వేడుకలు జరగాల్సి ఉంది. మరొకరి ఇంటిలో దత్తత వేడుక జరిగింది. కానీ వీరి విధిరాత మరోలా ఉంది. పోలీసులు, స్థానికులు చెప్పిన వివ రాల మేరకు.. పాతపట్నం గ్రామం పెద్దలోడి గ్రామానికి చెందిన దువ్వారి లక్ష్మీపతి(31) విశాఖపట్నంలోని మధురవాడలో నివాసం ఉంటున్నాడు. స్వగ్రామంలో స్నేహితుడి వివాహానికి హాజరై శనివారం తిరుగు ప్రయాణమయ్యాడు. ఆదివారం తన అన్న కుమారుడి బర్త్ డే ఉండడంతో తన కారులోనే తల్లి మీనమ్మ (56), బావ ఉగ్రపల్లి భాస్కరరావు (45), మేన కోడలు కుసుమ, తండ్రి కాళిదాసుతో కలిసి బయల్దేరారు. కారులో విశాఖ వెళ్తుండగా లావేరు మండలం బుడుమూరు సమీపంలో జాతీయ రహదారిపై కారు టైరు పంక్చర్ అయ్యి బండి అదుపు తప్పింది. సరిగ్గా అదే సమయానికి తోలాపి శంకరరావు(41) రోడ్డు పక్కన తన స్కూటీని ఆపి ఫోన్లో మాట్లాడుతున్నాడు. అదుపు తప్పిన కారు అమాంతం శంకరరావును ఢీకొట్టి రోడ్డు పక్కనే ఆపిఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టి లేఅవుట్లోకి దూసుకుపోయి ంది. ఘటనలో శంకరరావు తీవ్రంగా గాయపడి అక్కడే ఊపిరి వదిలేశాడు. కారులో ఉన్న మీనమ్మ, భాస్కరరావు సంఘటన స్థలంలోనే మృతి చెందా రు. లక్ష్మీపతి, కాళిదాసు, కుసుమ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి అంబులెన్స్ లో వీరిని శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. పోలీసులకు కూడా సమాచారం అందజేశారు. అయితే లక్ష్మీపతి ఆస్పత్రిలో చేరుస్తుండగానే కన్ను మూశా రు. క్షతగాత్రులు అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు. లావేరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కారు ఢీకొన్న లారీ కోసం పోలీసులు దృష్టి సారించారు. ఒంటరైపోయింది.. ఘటనలో చనిపోయిన శంకరరావు స్వగ్రామం విజయనగరం జిల్లా సంతకవిటి మండలం మద్దూరిశంకరపేట. ఈయన రణస్థలంలోని యూబీ బేవరేజెస్ పరిశ్రమలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ రణస్థ లంలోనే ఉంటున్నారు. ఏడాది కిందటే శంకరరావు కుమారుడు అనారోగ్యంతో చనిపోయాడు. అనంత రం ఆయన ఓ బాలికను దత్తత చేసుకున్నట్లు సమా చారం. ఆ బాలిక జనన ధ్రువీకరణ పత్రం కోసం శ్రీకాకుళం ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి, చేపలు పట్టుకుని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో భార్య జీవన కుమారి కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆమె శ్రీకాకుళం రిమ్స్కు వచ్చారు. ఏడాది కిందటే కుమారుడిని కోల్పోయి తీరని శోకంలో ఉన్న ఆమెకు ఇప్పుడు భర్త కూడా దూరం కావడంతో గుండెలవిసేలా రోదించారు. రిమ్స్ ఆస్పత్రిలో లక్ష్మీపతి మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబసభ్యులుప్రమాద స్థలంలో శంకరరావు మృతదేహం●రోడ్డు పక్కనే స్కూటీ ఆపి ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తిని వేగంగా బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి స్కూటీ ముక్కలైంది. వాహనంపై ఉన్న వ్యక్తి స్పాట్లోనే మరణించారు. ●కారు కుడిభాగం నుజ్జు కావడంతో.. ఎయిర్ బెలూన్ లు ఓపెన్ అయినా డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. సంఘటనా స్థలాన్ని ‘సాక్షి’ విజిట్ చేసింది. ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడింది. ప్రమాద స్థలం: బుడుమూరు జాతీయ రహదారి ప్రమాదానికి కారణం: కారు టైర్ పేలడం! ప్రమాదం జరిగిన సమయం: సాయంత్రం 5.40 యాక్సిడెంట్ స్పాట్ వాచ్●అయినా కారు వేగం కంట్రోల్ కాలేదు. అంతే వేగంతో అక్కడే ఆగి ఉన్న లారీ వెనుక భాగాన్ని డ్రైవర్ వైపు భాగం నుంచి బలంగా ఢీకొట్టింది. ●వెనుక వైపు కూర్చున్న వ్యక్తి ఒక్క ఉదుటన పక్కనున్న మహిళను ఢీకొనడంతో ఇద్దరూ సంఘటనా స్థలంలోనే చనిపోయారు. ●వెనుక భాగంలో ఉన్న ఇద్దరిలో ఏ ఒక్కరు సీట్ బెల్ట్ ధరించినా రెండు ప్రాణాలు నిలిచేవి. ●వాహనం ముందు భాగంలోని ఎడమ వైపున్న టైర్ పేలడంతో వాహనం అదుపు తప్పింది. న్యూస్రీల్ప్రమాదాల బుడుమూరు -
ఆప్కాస్ను కొనసాగించాలని ధర్నా
శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్ర ప్రభుత్వం ఆప్కాస్ రద్దు నిర్ణయం ఉపసంహరించుకోవాలని కాంట్రాక్ట్ – ఔట్సోర్సింగ్ ఫెడరేషన్ జిల్లా నాయకులు ఆర్.చిన్నారావు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బి.మురళీ, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆప్కాస్ను కొనసాగించాలని, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ – స్థానిక సంస్థలలోని ఔట్సోర్సింగ్, యూనివర్సిటీలు, ప్రభుత్వ సొసైటీలు, విద్యుత్, నేషనల్ హెల్త్ మిషన్, సమగ్రశిక్ష తదితర అన్ని ప్రభుత్వ పథకాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఎంటీఎస్ అమలు చేయాలని, ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు ఏపీ కాంట్రాక్ట్ –ఔట్ సోర్సింగ్ ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం ధర్నా చేపట్టారు. ముందుగా శ్రీకాకుళం ఆర్ అండ్ బీ బంగ్లా నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆప్కాస్ను రద్దు చేసి ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా నియమించాలనే ఆలోచనను రాష్ట్ర ప్రభు త్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ వయస్సును 62 ఏళ్లకు పెంచాలన్నారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆప్కాస్లో వివిధ వి భాగాల ప్రతినిధులు నక్క శ్రీనివాసరావు, ధన్వంతరి, ప్రసాద్, గుజ్జల ఆదినారాయణ, రిమ్స్ ఉద్యోగు లు కె.తేజ, టి.కిరణ్, టి.సాయి, జి.ధర్మారావు, జ్యో తికుమారి, మౌనిక, ప్రత్యూష, శిరీష పాల్గొన్నారు. -
నదుల పరిరక్షణ అందరి బాధ్యత
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): నదులను కాలుష్యపు కోరల నుంచి పరిరక్షించాలని జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కరుణశ్రీ అన్నారు. నగరంలోని ఏడురోడ్ల కూడలి సమీపంలో ఉన్న నాగావళి నదిలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో శనివారం స్వచ్ఛ శ్రీకాకుళం– స్వచ్ఛ నాగావళి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కరుణశ్రీ మాట్లాడుతూ నదుల పరిరక్షణ కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదని ఇందులో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. నదుల దురాక్రమణ పర్యావరణ వినాశనానికి, నీటి వనరుల క్షీణతకు కారణమవుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ జోనల్ చైర్మన్ నటుకుల మోహన్, మంత్రి వెంకటస్వామి, ఆంధ్రా ఆర్గానిక్స్ లిమిలెడ్ (ఏఓఎల్) ఎం.కృష్ణయ్య, అపర్ణ ఫార్మాస్యూటికల్ ప్రైవేటు లిమిటెడ్ సీనియర్ మేనేజర్ శ్యామ్బాబు, ఎపిటోరియా ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ లైజినింగ్ ఆఫీసర్ ప్రసాద్, మహాధన్ పరిశ్రమ హెచ్ఆర్ రాజేష్, సరాక కంపెనీ ప్రతినిధి ఎ.బ్రహ్మారెడ్డి, రాజశేఖరరెడ్డి, ఎప్టోరియా కంపెనీ జనరల్ మేనేజర్ సంపత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఓపెన్ స్కూల్.. పరీక్షలకు సన్నద్ధం
శ్రీకాకుళం న్యూకాలనీ: సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) ద్వారా జరిగే పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 17 నుంచి నెలాఖరు వరకు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం ప్రతి రోజు ఉదయం 9 నుంచి 12.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు 807 మంది విద్యార్థులు ఫీజులు చెల్లించగా.. వీరంతా పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 8 పరీక్ష కేంద్రాలను ఎంపికచేశారు. శ్రీకాకుళం నగరంలో నాలుగు, టెక్కలిలో రెండు, పలాసలో రెండు చొప్పున కేంద్రాలను కేటాయించారు. ఈ కేంద్రాలకు సీఎస్లు, డీవోలతో పాటు 8 సిట్టింగ్ స్క్వాడ్లు, 2 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. పరీక్ష నిర్వహణ మెటీరియల్స్ను సైతం చేరవేశారు. కాగా ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఇంటర్మీడియెట్ పరీక్షలు ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. మండుటెండల నేపథ్యంలోఓపెన్ స్కూల్ టెన్త్ పరీక్షా కేంద్రాలలో తాగునీరు, విద్యుత్ తదితర ఏర్పాట్లతో పాటు మరుగుదొడ్లు, ఫర్నిచర్ వంటి మౌలిక సదుపాయాల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. అన్ని కేంద్రాల్లో 144 సెక్షన్తోపాటు ప్రాథమిక చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసి ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలను అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. ఎలక్ట్రానిక్ పరికరాలు పూర్తిగా నిషేధమని , పరీక్ష కేంద్రాల సీఎస్లు, డీవోలతో ఏర్పాట్లపై ఇప్పటికే పలుమార్లు సమీక్షించి సూచనలిచ్చామని అధికారులు చెబుతున్నారు. మరిన్ని వివరాలకు 83282 69673, 95056 78655 నంబర్లను సంప్రదించవచ్చన్నారు. ఏర్పాట్లు పూర్తయ్యాయి జిల్లాలో ఈ నెల 17 నుంచి ఎనిమిది కేంద్రాల్లో ఓపెన్ స్కూల్ టెన్త్ పరీక్షలు జరుగుతాయి. కలెక్టర్ ఆదేశాలు, డీఈఓ సూచనల మేరకు ఇప్పటికే అధికారులను నియమించాం. విద్యార్థులు హాల్టికెట్లను అధ్యయన కేంద్రాల నుంచి తీసుకోవాలి. ఏపీఓపెన్స్కూల్.ఓఆర్జీ వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉన్నాయి. – లియాకత్ ఆలీఖాన్, ఓపెన్ స్కూల్ జిల్లా కో–ఆర్డినేటర్ జిల్లాలో రేపటి నుంచే సార్వత్రిక పదో తరగతి పరీక్షలు 8 కేంద్రాల్లో నిర్వహణ హాజరుకానున్న 807 మంది విద్యార్థులు ఎస్సైన్మెంట్ పరీక్షలను రాస్తున్న టెన్త్ విద్యార్థులు -
పాలనా వ్యవస్థలో రెవెన్యూ శాఖ కీలకం
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వ పాలనా వ్యవస్థలో రెవెన్యూ శాఖ కీలకమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ఇందులో పనిచేసే ఉద్యోగులు రేయింబవళ్లు పనిచేస్తూ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్య వైఖరితో ఉంటారని, దీన్ని దష్టిలో పెట్టుకొని జిల్లా రెవెన్యూ అసోసియేషన్ మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. శనివారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెవెన్యూ అతిథి గృహం ఆధునికీకరణను, వైద్య శిబిరాలను రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు, అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లుతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖ అధికారులు అంకితభావంతో పనిచేయటం వల్ల భూమి సమస్యలు లేని జిల్లాగా శ్రీకాకుళం రూపొందుతోందని చెప్పారు. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ శిబిరాన్ని రెవెన్యూ శాఖ కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్, రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు కె.శ్రీరాములు బి.వి.ఎస్.ఎన్.రాజు, పొదిలాపు శ్రీనివాసరావు, ప్రవళ్లిక, కలెక్టరేట్ పరిపాలన అధికారి గుడ్ల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వైద్య శిబిరానికి విశేష స్పందన రెవెన్యూ సర్వీసులు సంఘం, డాక్టర్ శశిధర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. జనరల్ ఫిజీషియన్ డాక్టర్ అన్నెపు శశిధర్, కార్టియాలజిస్టులు డాక్టర్ సాయితేజ బరాటం, డాక్టర్ పూజారి హరిబాబు, జనరల్ సర్జన్ డాక్టర్ చింతాడ గోవిందరావు, గైనకాలజిస్టు డాక్టర్ సనపల సుకన్య, ఆర్థోపెడిక్ డాక్టర్ కింతలికిషోర్, డాక్టర్ బమ్మిడి ప్రభులు వైద్య సేవలు అందించారు. ఆదివారం కూడా శిబిరం కొనసాగుతుందని డాక్టర్ శశిధర్ తెలిపారు. సీపీఆర్, బీఎండీ స్కాన్, థైరాయిడ్ పరీక్ష, డయాబెటిక్, యూరిక్ యాసిడ్, హిమోగ్లోబిన్, సర్వైకల్ కాన్సర్, బెస్టు క్యాన్సర్, ఈసీజీ, 2డీ ఎకో, జీఈఆర్డీ, బీఎంఐ తదితర పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వైద్య శిబిరం ప్రారంభోత్సవంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ -
ఏర్పాట్లు పూర్తి చేశాం..
రేపటి నుంచి మొదలయ్యే టెన్త్ పబ్లిక్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్షలు రాసేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. 65 సి–సెంటర్లను గుర్తించాం. 8 సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలను అమర్చాం. – లియాఖత్ ఆలీఖాన్, అసిస్టెంట్ కమిషనర్, పరీక్షల విభాగం జిల్లా విద్యాశాఖ శ్రీకాకుళం అందరూ సహకరించాలి.. పరీక్ష కేంద్రాలకు సీఎస్లు, డీవోలు, కస్టోడియన్లు, తనిఖీ బృందాలు, సిబ్బంది నియామకం పూర్తయింది. కలెక్టర్ ఆదేశాల మేరకు వేసవిని దృష్టిలో పెట్టుకుని పరీక్ష కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. హెచ్ఎంలు, ఉపాధ్యాయులంతా సహకరించి పరీక్షల ప్రక్రియను పూర్తి చేయాలి. – డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య, జిల్లా విద్యాశాఖాధికారి శ్రీకాకుళం ● -
స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాధించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: స్వర్ణాంధ్ర–2047 లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని జిల్లా ఇన్చార్జి అధికారి శశిభూషణ్కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్లతో కలిసి జిల్లా అధికారులతో సమీక్షించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా వివరాలను కలెక్టర్ వివరించారు. బాహుదా ఓపెన్ హెడ్ చానల్, మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు, మూలపేట పోర్టు, నదుల అనుసంధానం, హిరమండలం రిజర్వాయర్ తదితర పనుల పురోగతిపై చర్చించారు. డీసీహెచ్ డాక్టర్ కళ్యాణ్బాబు మాట్లాడుతూ కిడ్నీ వ్యాధులకు సంబంధించి కొరత లేకుండా మందులు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ షకీలా, ఎంవీఐ గంగాధర్, ఉపాధి పీడీ సుధాకర్, డీఎఫ్ఓ వెంకటేష్, మైన్స్ శాఖ డీడీ మోహనరావు, డీఆర్ఓ ఎం.వెంకటేశ్వరరావు, ఆర్డీఓలు కృష్ణమూర్తి, ఉప కలెక్టర్లు పద్మావతి, అప్పారావు, లక్ష్మణమూర్తి, సివిల్ సప్లయ్ డీఎం వేణుగోపాల్, డీటీసీ ఎ.విజయ సారధి, ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ కృష్ణమూర్తి, భూగర్భ గనుల శాఖ డీడీ మోహనరావు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి.వి.వి.డి.ప్రసాదరావు, డీఎస్ఓ సూర్యప్రకాష్, డ్వామా పీడీ సుధాకర్, జెడ్పీ సీఈవో శ్రీధర్ రాజా, డీఆర్డీఏ పీడీ కిరణ్కుమార్, సీపీఓ లక్ష్మీప్రసన్న, మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ బి.శాంతి శ్రీ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఎహసాన్ భాషా, వ్యవసాయ శాఖ జేడీ త్రినాథస్వామి తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి ఇచ్ఛాపురం రూరల్: విద్యుత్ స్తంభాన్ని బైక్ ఢీకొట్టిన ఘటనలో యువకుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొళిగాం గణేష్ బ్రిక్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న రాజేష్ చవాన్(25) శనివారం స్నేహితుడితో కలిసి మద్యం సేవించి ద్విచక్ర వాహనంపై వెళ్తూ పాయితారి వద్ద విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. రాజేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్నేహితుడు తీవ్ర గాయాలపాలవ్వడంతో స్థానికులు అంబులెన్స్కు సమాచారం అందించి ఇచ్ఛాపురం సామాజిక ఆసుపత్రిలో చేర్పించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ ఇ.శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇచ్ఛాపురం సామాజిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వారు ఒడిశా, బీహార్ ప్రాంతాలకు చెందిన వారని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. -
రెవెన్యూ అసోసియేషన్ సేవలు ప్రశంసనీయం
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉద్యోగులకు సేవలు అందించడంలో జిల్లా రెవెన్యూ అసోసియేషన్ సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర రెవెన్యూ సర్వీసుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా రెవెన్యూ వసతి గృహం ఆధునికీకరణ, మెగా మెడికల్ క్యాంపు ప్రారంభోత్సవంలో భాగంగా శనివారం జిల్లాకు వచ్చిన ఆయన జిల్లాకు చెందిన సీనియర్ రెవెన్యూ అసోసియేషన్ సభ్యులు బుక్కూరు ఉమామహేశ్వరరావు, పి.జగన్మోహన్రావు, ఎం.కాళీప్రసాద్లను సత్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ సర్వీసుల సంఘం కార్యదిర్శ రామశెట్టి రాజేష్, జిల్లా అధ్యక్షుడు కె. శ్రీరాములు, కార్యదర్శి బి.వి.ఎస్.ఎన్.రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పొదిలాపు శ్రీనివాసరావు, ప్రవళ్లిక, దిలీప్ చక్రవర్తి, కలెక్టరేట్ పరిపాలనాధికారి గుడ్ల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జెమ్స్లో అవగాహన సదస్సుశ్రీకాకుళం రూరల్ : రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో ఉద్యోగ అవకాశాలు – శిక్షణా తరగతులపై ఈ నెలాఖరున అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు బొల్లినేని మెడిస్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కిమ్స్ గ్రూప్ చైర్మన్ అండ్ ఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు హాజరవుతారని పేర్కొన్నారు. అర్హులైన వారికి ఏడాది శిక్షణ కాలంలో స్టైఫండ్ కూడా అందిస్తామని, ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలకు 7680945357, 7995013422 నంబర్ను సంప్రదించాలని కోరారు. డయాలసిస్ యూనిట్లు ప్రారంభం కాశీబుగ్గ: పలాస కిడ్నీ పరిశోధన కేంద్రంలో శనివారం ఎనిమిది నూతన డయాలసిస్ యూనిట్లను కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషాల ప్రారంభించారు. అనంతరం పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ సెక్రటరీ వెంకన్న చౌదరి, ఆస్పత్రి సూపరింటెండెంట్ పద్మజ, నాయకులు వజ్జ బాబూరావు, లొడగల కామేశ్వరరావు, గాలి కృష్ణారావు, పీరుకట్ల విఠల్రావు తదితరులు పాల్గొన్నారు. గుజరాత్లో వలస కూలీ మృతి వజ్రపుకొత్తూరు రూరల్: మండలంలోని డోకులపాడు గ్రామానికి చెందిన వలస కూలీ వంక ప్రకాశ్ (36) గుజరాత్లో శనివారం గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడి తండ్రి కృష్ణ ఆరు నెలల కిందటే మృతి చెందాడు. నిరుపేద కుటుంబంలో ఆరు నెలల వ్యవధిలో ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రకాశ్కు తల్లి హేమలత, భార్య లలిత ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కు కోల్పోవడంతో వీధిన పడ్డ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బంధువులు ,స్థానికులు కోరుతున్నారు. చీరకు నిప్పంటుకుని వృద్ధురాలి మృతి రణస్థలం: మండలంలోని జె.ఆర్.పురం పంచాయతీ వెంకటేశ్వర కాలనీలో నివాసముంటున్న నారాయణశెట్టి రవణమ్మ(63) అనే వృద్ధురాలి చీరకు నిప్పంటుకోవడంతో గాయాలపాలై మృతిచెందింది. జె.ఆర్.పురం పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం.. రవణమ్మ శుక్రవారం రాత్రి 9ః30 గంటల సమయంలో ఇంట్లో కరెంట్ పోవడంతో కొవ్వొత్తి వెలిగించగా ప్రమాదవశాత్తు చీరకు నిప్పంటుకొని మోకాలి వరకు పూర్తిగా కాలిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు శ్రీకాకుళం రిమ్స్కు తరలించగా అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖపట్నం కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందింది. ఈమెకు భర్త సత్యనారాయణ, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి కేసు నమోధు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు లభ్యం ఎచ్చెర్ల క్యాంపస్ : ఎచ్చెర్ల మండలం జరజాం జాతీయ రహదారి సమీపంలో ఈ నెల 13న తుప్పల్లో లభ్యమైన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం వివరాలు లభ్యమయ్యాయి. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా..మృతుడు ఆమదాలవలస మండలం బెలమాం గ్రామానికి చెందిన ఎరగడ రాముగా గుర్తించారు. -
పాలిటెక్నిక్తో అపార ఉద్యోగావకాశాలు
ఎచ్చెర్ల క్యాంపస్: పదో తరగతి తర్వాత తక్కువ వయసులోనే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే పాలిటెక్నిక్ విద్యను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్, జిల్లా ప్రవేశాల ఇన్చార్జి గురుగుబెల్లి దామోదర్రావు అన్నారు. కళాశాలలో శనివారం ఆయన మాట్లాడుతూ 2025–26 విద్యా సంవత్సరానికి సాంకేతిక విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసిందని, ఈ నెల 12 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. ఏప్రిల్ 30లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు హెచ్టీటీపీఎస్://ఏపీఎస్బీటీఈటీ.ఏపీ.ఐఎన్ వెబ్సైట్ను సంప్రదించవచ్చన్నారు. ఉమ్మడి జిల్లాలో పది ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయని చెప్పారు. శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్లో 300, మహిళా ప్రభుత్వ పాలిటెక్నిక్లో 120, టెక్కలి ప్రభుత్వ పాలిటెక్నిక్లో 120, ఆమదాలవలస ప్రభుత్వ పాలిటెక్నిక్లో 120, సీతంపేట మోడల్ పాలిటెక్నిక్లో 120 సీట్లు ఉన్నాయని వివరించారు. 10వ తరగతి పరీక్షలు పూర్తయ్యాక ఉచితంగా కోచింగ్ ఇచ్చి స్టడీ మెటీరియల్ అందజేస్తామని తెలిపారు. -
శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందగా, ఇద్దరు వ్యక్తులకు తీవ్రంగా గాయపడ్డారు. లావేరు మండలం బుడుమూరు జాతీయ రహదారిపై ఘటన చోటుచేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు, ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మరో వ్యక్తి మృతి చెందారు. కారులో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులకి తీవ్ర గాయాలయ్యాయి.గాయపడిన వారిని శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్కు తరలించారు. మృతులు పాతపట్నం మండలం లోగిడి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న దువ్వారి మీనమ్మ, భాస్కరరావు ,లక్మీపతి మృతి చెందగా దువ్వారి కాళిదాసు, కుసుమ తీవ్రంగా గాయపడ్డారు. పాత పట్నం మండలం లోగిడి గ్రామం నుంచి విశాఖపట్నం పుట్టినరోజు వేడుకల కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. -
సారీ నాన్నా.. యూజ్లెస్గా ఉండలేను!
శ్రీకాకుళం: ‘సారీ నాన్న.. నాకెంతో చేశారు.. నేను కొంచెం కూడా మీకు ఉపయోగపడలేదు. ఇంత వయస్సు వచ్చినా మీకు సహాయం కాకుండా నేను ఉన్నాను. యూజ్లెస్గా ఉండటం కంటే మీకు దూరంగా ఉంటేనే కరెక్టని నాకు అనిపించింది. మిమ్మల్ని కష్టపెట్టాలనినాకు లేదు..’ అని వాట్సాప్ డీపీలో మెసేజ్ పెట్టి ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన నందిగాం మండలం ఆనందపురం ఊర చెరువు వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వజ్రపుకొత్తూరు మండలం అనంతగిరికి చెందిన ఇచ్ఛాపురం హరికృష్ణ(24) విజయనగరంలో వివిధ పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకునేవాడు. 15 రోజుల క్రితం గ్రామానికి వచ్చాడు. గురువారం ఉదయం విజయనగరం వెళ్తాను డబ్బులు ఇవ్వు అని తల్లిని అడిగాడు. కొద్ది రోజుల్లో ఇంటి సంబరం ఉందని, అదయ్యాక వెళ్లు అని చెప్పి రూ.550 ఇచ్చింది. డబ్బులు తీసుకొని బయటకు వెళ్లిన హరికృష్ణ పురుగుల మందు కొని ఆనందపురం చెరువు వద్దకు వెళ్లి తాగాడు. అనంతరం తన గ్రామానికి చెందిన స్నేహితుడు మామిడి విజయ్కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో విజయ్ కుటుంబసభ్యులకు, గ్రామస్తులకు తెలియజేసి ఆనందపురం వెళ్లారు. అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న హరికృష్ణను పలాసలో ఒక ప్రైవేటు ఆస్పత్రికి, అక్కడి నుంచి శ్రీకాకుళం మెడికవర్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతదేహాన్ని పోలీసులు రిమ్స్కు తరలించారు. మృతుడి తల్లి ఆదిలక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిగాం ఎస్సై షేక్మహమ్మద్ అలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదువులో మంచి ప్రతిభ కనబరిచే హరికృష్ణ ఇలా అర్ధంతరంగా తనువు చాలించడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
స్టీల్ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ స్టీల్ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని, ఉక్కు పరిశ్రమకు సొంత గనులు కేటాయించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీకాకుళం వైఎస్సార్ కూడలిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టీల్ప్లాంట్కు ప్రభుత్వం కేటాయించిన ప్యాకేజీ కేవలం అప్పులకే ఖర్చు చేయాలని ప్రకటించడం దుర్మార్గమన్నారు. స్టీల్ప్లాంట్లో కాంట్రాక్టు కార్మికుల తొలగింపులు ఆపాలని డిమాండ్ చేశారు. ప్రయివేటీకరణ విధానాలను, అక్రమ తొలగింపులు ప్రశ్నిస్తున్న కార్మిక నేతలకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం దుర్మార్గమన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కు పరిశ్రమకు అండగా ఉంటారో కార్పొరేట్ల పక్షంలో ఉంటారో తేల్చుకోవాలన్నారు. నిరసన కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు ఆర్.ప్రకాశరావు, కె.సూరయ్య, కె.కళ్యాణి, డి.సుదర్శనం, హైమ, కె.అప్పారావు, బి.సంతోష్, కె.శ్రీనివాస్, పవిత్ర, హరీష్, ఆర్.రమేష్, పి.దుర్గాప్రసాద్ ఏ.సత్యనారాయణ, రవికుమార్, బి.వాసుదేవరావు, పి.జగ్గారావు, జనార్దణరావు, ప్రవీణ, ఢిల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
ఏప్రిల్ 25 నుంచి అంతర్రాష్ట్ర క్రికెట్ పోటీలు
ఆమదాలవలస: పట్టణంలో ఏప్రిల్ 25 నుంచి మే 25 వరకు అంతర్రాష్ట్ర క్రికెట్ పోటీలు నిర్వహించనున్నట్లు సీఎంసీసీ అధ్యక్షుడు తమ్మినేని విద్యాసాగర్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులు కె.సుదర్శన్, కిరణ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆమదాలవలసలో టోర్నమెంట్ నిర్వహించనున్న మైదానాన్ని పరిశీలించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే క్రీడాకారులకు అనువైన ఏర్పాట్లపై చర్చించారు. త్వరలో పూర్తిస్థాయిలో వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. కార్యక్రమంలో గంధం వేణు, సనపల మోహన సురేష్, కాట్ర సుధాకర్, నిమ్మగడ్డ శేషుకుమార్, సత్య బాల తదితరులు పాల్గొన్నారు. -
ఎస్ఎంసీ తీర్మానాలపై రగడ
● బలవంతంగా వెనక్కు తీసుకునేలా కూటమి సర్కారు కుట్రలు ● చైర్మన్, గ్రామపెద్దలతో మంతనాలకు విద్యాశాఖ అధికారులు సిద్ధం ● తప్పుపడుతున్న విద్యా, ఉపాధ్యాయ, ప్రజా సంఘాల ప్రతినిధులు ● పాఠశాల విద్యను నిర్యీరం చేస్తున్నారని మండిపాటు స్నేహితులకు ప్రైవేటు పాఠశాలలు ఉండటం వల్ల ప్రభుత్వ పాఠశాలలను విచ్ఛిన్నం చేసే ఈ కుట్రలో భాగం కానున్నారని.. వారి వల్లే ప్రభుత్వ పాఠశాలలకు ఈ దుస్థితి పట్టిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొందరు స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు, ఎంఈఓలు అత్యుత్సాహంతో ఉన్నత స్థాయి అధికారుల వద్ద మెప్పు కోసం నిబంధనలను పక్కనపెట్టి.. భారీగా ఉన్నత తరగతులను సమీప పాఠశాలలకు తరలిస్తున్నారు. ఇక్కడ స్థూలంగా గమనిస్తే (నేచురల్ బేరియర్స్) భౌగోళిక అడ్డంకులను అధికారులు అసలు పట్టించుకోవడంలేదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. తప్పుపడుతున్న విద్యావేత్తలు, తల్లిదండ్రులు.. ఓట్లేసి గెలిపించిన ప్రజాప్రతినిధులు, పిల్లలకు న్యాయం చేయాల్సిన అధికారులు ఈ రకంగా వ్యవహరించడాన్ని విద్యావేత్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు తప్పుపడుతున్నారు. మూడో తరగతి కోసం 2, 3 కిలోమీటర్లు., ఆరో తరగతి కోసం 5, 6 కిలోమీటర్లు తమ పిల్లలను ప్రతిరోజు బడికి ఎలా పంపించాలని, వారు ఎలా వెళ్తారని ప్రశ్నిస్తున్నారు. కార్పొరేట్కు తలోగ్గి తమ పిల్లలకు చదువును దూరం చేయాలనే దుర్మార్గపు ఆలోచనలను కూటమి సర్కారు వీడాలని కోరుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తమ తప్పుడు ఆలోచనలను విరమించుకొవాలని.. ప్రస్తుతం ఉన్న మాదిరిగానే పాఠశాలలను కొనసాగిస్తూ విద్య కొనసాగించాలని.. లేనిపక్షంలో న్యాయ పోరాటానికి సిద్ధమౌతామని హెచ్చరిస్తున్నారు. తీర్మానాల కోసం అధికారులు బలవంతంగా ఒత్తిడి తీసుకొస్తే వారిపై కూడా కేసులు పెడతామని స్పష్టం చేస్తున్నారు. శ్రీకాకుళం న్యూకాలనీ : పాఠశాల విద్యను కూటమి ప్రభుత్వం గందరగోళానికి నెట్టేందుకు సరికొత్త కుట్రలకు తెరతీస్తోంది. తాము అనుకున్న కార్యాన్ని పూర్తిచేసేందుకు అధికారులనే అస్త్రాలుగా వాడుకోవాలని చూస్తోంది. పాఠశాల విద్యాకమిటీ(ఎస్ఎంసీ) ఇచ్చిన తీర్మానాలను వెనుక్కి తీసుకునేలా అధికారుల నుంచే ఒత్తిళ్లు చేసేలా కుయుక్తులకు తెరతీసింది. కార్పొరేట్ వ్యవస్థకు తలొగ్గి.. పంచాయతీకి ఒక మోడల్ ప్రైమరీ స్కూళ్ల పేరిట దగా చేసేందుకు సిద్ధమౌతోంది. బలవంతంగా ప్రాథమిక పాఠశాల నుంచి 3,4,5 తరగతులను, ప్రాథమిక ఉన్నత పాఠశాల నుంచి 6,7,8 తరగతులను దూరంతో సంబంధం లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా.. సమీప ఆవాస ప్రాంతాలకు తరలించడానికి సన్నాహాలు చేస్తోంది. అందుకోసం న్యాయపరమైన అడ్డంకులు లేకుండా గతంలో తమ పాఠశాలలోని ఉన్నత తరగతుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఇచ్చిన తీర్మానాలను వెనక్కి తీసుకోమని బలవంతం చేస్తోంది. తీర్మానాలను ఏ మార్చేలా.. వాస్తవానికి 117 సవరణ జీవో ద్వారా కూటమి సర్కారు తీసుకొచ్చిన దుర్మార్గపు విద్యా సంస్కరణలను తీవ్రంగా వ్యతరేకిస్తూ మార్చి 1న రాష్ట్రవ్యాప్తంగా జరిగిన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ(ఎస్ఎంసీ) సమావేశాల్లో.. తమ పాఠశాలను యథాతధంగా కొనసాగించాలని, పాఠశాలలోని ఉన్నత తరగతులు తరలించకూడదని పేర్కొంటూ ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు. వాటిని అధికారులకు అందజేశారు. అయితే ఏయే కమిటీలు తరగతులను యథాతధంగా కొనసాగించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశాయో.. ఆయా పాఠశాల లేదా ఆవాస ప్రాంత విద్యా కమిటీ చైర్మన్, సభ్యులు, గ్రామ పెద్దలను ఈ రెండు మూడు రోజల్లో ఎంఈఓ ఆఫీసులకు పిలిపించి తీర్మానాలను వెనక్కి తీసుకొని.. ప్రభుత్వ నిర్ణయాలకు అనుకూలంగా తీర్మానాలు ఇమ్మని ఒత్తిడి తీసుకురానున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో అధికారుల ఒత్తిడికి తలొగ్గని పాఠశాల మేనేజ్మెంట్ కమిటీలతో ఎమ్మెల్యే వద్దకు పంచాయితీ పెట్టి ఒప్పించే ప్రయత్నం చేయడానికి రూట్మ్యాప్ సిద్ధం చేసినట్టు తెలిసింది. ఎమ్మెల్యేలు, అధికారుల అత్యుత్సాహం.. జిల్లాలో ఓ శాసనసభ్యుడికి సొంత ప్రైవేట్ పాఠశాల ఉండటంతో తన స్కూల్ అభివృద్ధి కోసం.. తెరవెనుక కుయుక్తులు పన్నతున్నట్టు ఆ మండల పరిధిలోని ఉపాధ్యాయులు చెప్పుకుంటున్నారు. చాలామంది ఎమ్మెల్యేలు వారి బంధువులకు, -
వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
రణస్థలం: మండలంలోని కోష్ట ఫ్లై ఓవర్ సమీపంలో శుక్రవారం ఉదయం గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వయస్సు 40 నుంచి 50 ఏళ్ల మధ్య ఉంటుందని ఎస్సై ఎస్.చిరంజీవి తెలిపారు. మతిస్థిమితం సక్రమంగా లేకపోవడంతో భిక్షాటన చేసుకుంటా రోడ్లుపై తిరుగుతుండేవాడని స్థానికులు చెబుతున్నారు. మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. ఎస్సై ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలిసిన వారు 63099 90850, 6309990816 నంబర్లకు తెలియజేయాలని కోరారు. చైన్నెలో వలస మత్స్యకారుడు మృతి సోంపేట: మండలంలోని ఇస్కలపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారుడు సీరాపు శ్యాంసుందరరావు(38) చైన్నెలో చేపల వేట సాగిస్తూ మృతిచెందాడు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..శ్యాంసుందరరావు నెల రోజుల కిందట చైన్నె వలస వెళ్లాడు. సముద్రంలో చేపల వేట సాగిస్తుండగా ప్రమాదవశాత్తు బోటు బోల్తాపడటంతో శుక్రవారం మృతి చెందాడు. శ్యాంసుందరరావుకు భార్య భానుమతి, కుమారుడు కుమారస్వామి ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. లిఫ్ట్ ఇస్తానని చెప్పి.. టెక్కలి రూరల్: మండలంలోని మోదుగువలస గ్రామానికి చెందిన ఓ దివ్యాంగురాలు బైక్ పైనుంచి పడి తీవ్రగాయాలకు గురైన విషయం తెలిసిందే. అయితే బాధితురాలు ఈ ఘటన ఎలా జరిగిందనే విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను గ్రామం వద్ద రోడ్డుపై నిల్చుని ఉండగా పక్క గ్రామానికి చెందిన వ్యక్తి ద్విచక్రవాహనంపై వచ్చి ఎక్కడికి వెళ్తున్నావని అడిగాడని, టెక్కలి జిల్లా ఆసుపత్రికని చెప్పడంతో తానూ అక్కడికే వెలుతున్నానంటూ బైక్ ఎక్కించుకున్నాడని పేర్కొంది. మార్గమధ్యలో గూడేం వైపు తీసుకెళ్తుండటంతో ఆపమని చెప్పినా వినలేదని, అందుకే గెంతేశానని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు వివరాలు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రాణం తీసిన నిద్రమత్తు!
ఎచ్చెర్ల క్యాంపస్: మండలంలోని జరజాం జంక్షన్ ఫ్లై ఓవర్ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వైపు వెళుతున్న కారు ముందు వెళుతున్న లారీని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన జరిగాక లారీ ఆపకుండా వెళ్లిపోయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న కల్లుగీత కార్మికుడు వెంటనే స్థానికుల సాయంతో అత్యవసర విభాగాలకు ఫోన్ చేయడంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. స్టీరింగ్ వద్ద ఇరుక్కున్న వ్యక్తిని బయటకు తీయగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. అతని వద్ద లభించిన ఆధారాల మేరకు తమిళనాడు రాష్ట్రం అవడి పట్టణానికి చెందిన ఆకాష్ (29)గా గుర్తించారు. ఇతను ఎల్అండ్టీ పరిశ్రమలో ఇంజినీర్గా పనిచేస్తున్నట్లు సమచారాం. ఫోన్ నంబర్ ఆధారంగా కుటుంబ సభ్యులకు విషయం తెలియజేశారు. మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యులు వచ్చాక ఫిర్యాదు స్వీకరించి కేసు దర్యాప్తు చేయనున్నట్లు ఎస్సై నక్క కృష్ణారావు తెలిపారు. అతివేగం, నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. కాగా, గత కొంత కాలంగా ఎచ్చెర్ల పరిధిలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. లారీని కారు ఢీకొట్టిన ఘటనలో తమిళనాడు వ్యక్తి మృతి జరజాం ఫ్లై ఓవర్ సమీపంలో ఘటన -
పెళ్లి వేడుకకు లైటింగ్ కడుతూ..
జలుమూరు: మండలంలోని టి.లింగాలుపాడు పంచాయతీ ఎర్రన్నపేటకు చెందిన బలగ మణికంఠ(20) అనే యువకుడు విద్యుత్ షాక్కు గురై శుక్రవారం ఉదయం మృతి చెందాడు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మణికంఠతో పాటు కూన లక్ష్మణరావు, మెట్ట వికాస్లు జోనంకి పంచాయతీ అబ్బాయిపేటలో ఓ వివాహ వేడుకకు లైటింగ్ వైర్లు కట్టేందుకు వెళ్లారు. వైర్లు అమర్చుతుండగా అదే రోడ్డులో భారీగా వాహనం రావడంతో వాటిని తప్పించే క్రమంలో 11 కె.వి.లైన్ తాకడంతో వైర్లు పట్టుకున్న మణికంఠ షాక్కు గురయ్యాడు. వెంటనే నరసన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. చేతికందిన కుమారుడు అకాల మరణం చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. మణికంఠకు తల్లిదండ్రులు లచ్చన్న, కుమారి, తమ్ముడు జశ్వంత్ ఉన్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అశోక్బాబు తెలిపారు. విద్యుత్ షాక్తో యువకుడు మృతి ఎర్రన్నపేటలో విషాదచాయలు -
20న తపాలా అదాలత్
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ పరిధిలోని తపాలా వినియోగదారుల వ్యక్తిగత ఫిర్యాదులు, సమస్యలు పరిష్కరించేందుకు మా ర్చి 20న శ్రీకాకుళంలోని రెల్లవీధిలో ఉన్న తపా లాశాఖ సూపరింటెండెంట్ వారి కార్యాలయం వద్ద తపాలా అదాలత్ నిర్వహించనున్నట్లు సూపరింటెండెంట్ అఫ్ పోస్ట్ ఆఫీస్ వి.హరిబాబు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపా రు. తపాలా సేవలకు సంబంధించిన ప్రత్యేక వ్యక్తిగత ఫిర్యాదులు ఈ అదాలత్లో చర్చి స్తామని పేర్కొన్నారు. శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ పరిధిలోని తపాలా వినియోగదారులు తమ సమస్యలు, ఫిర్యాదులు మార్చి 20వ తేదీ లోగా ‘తపాల అదాలత్’ అనే శీర్షికతో వి హరిబాబు, సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసు, శ్రీకాకుళం పోస్టల్ డివిజన్–శ్రీకాకుళం 532001‘ అనే చిరునామాకు పంపించాలని సూచించారు. ఫిర్యాదులు వ్యక్తిగతంగా కూడా తీసుకొని అదాలత్కు హాజరు కావచ్చునని పేర్కొన్నారు. ఆర్థిక అవకతవకలకు సంబంధించిన విషయాలపై ఫిర్యాదులు తీసుకోబోమని స్పష్టం చేశారు. మెరుగైన ఫలితాలు సాధించాలి నరసన్నపేట: జిల్లాలోని బీసీ వసతి గృహాల్లో విద్యా ప్రమాణాలు మెరుగు పరిచేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి అనురాధ తెలిపారు. స్థానిక బీసీ బాలికల వసతి గృహంలో ఆమె గు రువారం రాత్రి బస చేశారు. శుక్రవారం ఉద యం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. అంతకుముందు విద్యార్థుల దినచర్య పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా బీసీ వసతి గృహాల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రిమ్స్ డ్యూటీ డాక్టర్ల భోజనంలో పురుగులు శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్లకు సరఫరా చేస్తున్న భోజనంలో పురుగులు వచ్చాయి. శుక్రవారం మధ్యాహ్న భోజనంలో పురుగులు రాగా, రాత్రికి మంచి ఆహారం వస్తుందని వైద్యులు భావించారు. రాత్రి భోజనంలో కూడా పురుగులు కనిపించడంతో డాక్టర్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. భోజనాలు మానేసి విధులు నిర్వహించారు. రిమ్స్లో విధులు నిర్వహించే డాక్టర్లకు ప్రభుత్వ పరంగా ఆహారాన్ని సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షకీల వద్ద ప్రస్తావించగా తాను మధ్యాహ్నం సమయంలో ఇక్కడే భోజనం చేస్తున్నానని, పురుగులు తన ఆహారంలో లేవన్నారు. ఇటీవలి కలెక్టర్ కూడా ఆస్పత్రిని తనిఖీ చేసిన సమయంలో భోజనాలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారని గుర్తు చేశారు. ఉన్నతాధికారులు ఇచ్చే ఆదేశాల మేరకు నడుచుకుంటామని స్పష్టం చేశారు. -
కస్టమరు.. గెలిచారు
ఫోరంను ఆశ్రయించా 2023లో ఓ మొబైల్ షోరూమ్లో రెండు ఫోన్లను మొత్తం రూ.20 వేలతో కొనుగోలు చేశాను. కొన్న నెల రోజుల్లోపే ఆ రెండు ఫోన్లు పాడైపోయాయి. షోరూమ్ వాళ్లను అడిగితే తమకు సంబంధం లేదన్నారు. దీంతో బిల్లులు, ఆధారాలతో సహా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాను. ఐదు నెలల్లోనే నాకు రెండు ఫోన్లకు నష్ట పరిహారంగా రూ.42 వేల వరకు కోర్టు ద్వారా వచ్చింది. ఎవరైనా నష్టపోతే నిరభ్యంతరంగా కోర్టును ఆశ్రయించవచ్చు. – కె.శ్రీనివాసరావు, వైద్యశాఖ ఉద్యోగి ఏసీ పోతే.. పొందూరు మండలంలోని గోరింట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గత ఏడాది ఏప్రిల్లో ఏసీ మిషన్ను రూ.32వేలకు కొన్నారు. వారం రోజులు తిరగక ముందే ఆ మిషన్పోయింది. దీంతో ఆ య న సర్వీసు సెంటర్కు, ఏసీ కొన్న దుకాణానికి చాలాసార్లు వెళ్లి చూశారు. నెలలు గడిచినా ఫలితం లేకపోవడంతో వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. విచారణ అనంతరం పాత ఏసీ స్థానంలో కొత్త ఏసీ ఇవ్వాలని, అన్ని ఖర్చులు కలిపి రూ.42వేలు చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది. వినియోగదారుడికి ఉపశమనం టెక్కలిలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్య వైఖరితో ఓ వినియోగదారుడికి విద్యుత్ సేవల్లో తీవ్రమైన జాప్యం కల్పించారు. అంతే కా కుండా ఆర్థికంగా, మానసికంగా వేధించారు. దీనిపై సీజీఆర్ఎఫ్ను ఆశ్రయిస్తే న్యాయం చేశారు. – కె.కిశోర్, స.హ.చట్టం ప్రతినిధి, టెక్కలి రెండుసార్లు గెలిచా.. 2011లో ఓ బ్యాంకులో నేను వేసిన డిపాజిట్ సొమ్ము చెల్లించాల్సిన కాలం పూర్తయినా ఇవ్వకపోవడంతో శ్రీకాకుళం వినియోగదారుల ఫోరంలో అన్ని ఆధారాలతో కేసు వేసి నేనే వాదించాను. మూడు నెలల్లో నాకు నా రూ.లక్ష సొమ్ముతోపాటుగా బ్యాంకుకు 15శాతం వడ్డీ చెల్లించాలని చెప్పడంతో పాటు కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.5వేలు ఇచ్చారు. అలాగే 2019లో నేను విజయనగరంలోని ఓ కొరియర్ సర్వీసులో ఒక అత్యవసర కవర్ పంపాను. అది వారికి చేరలేదు. అడిగితే నిర్లక్ష్యంగా జవాబు చెప్పారు. దీంతో విజయనగరం వినియోగదారుల ఫోరంలో కేసు వేశారు. దీంతో నిర్లక్ష్యానికి మూల్యంగా రూ.10వేలు చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది. కోర్టు ఖర్చుల కోసం రూ.3వేలు ఇవ్వాలని సూచించింది. కానీ వారు ఇవ్వకపోవడంతో కోర్టు ధిక్కరణ కేసు వేశా. – కొమ్మాజ్యోస్యుల వసంతకుమార్, శ్రీకాకుళం -
ఉత్సాహంగా జిల్లాస్థాయి బలప్రదర్శన పోటీలు
సారవకోట: మండలంలోని వడ్డినవలస గ్రామంలో శుక్రవారం జిల్లాస్థాయి బల ప్రదర్శన పోటీలు సందడిగా నిర్వహించారు. శ్రీ త్రినాథస్వామి ఆలయ వార్షికోత్సవంలో భాగంగా ఏటా ఈ జిల్లాస్థాయి బలప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నారు. 80 కిలోల విసురుగుండు పోటీలలో ఒప్పంగి గ్రామానికి చెందిన గేదెల సత్యనారాయణ ప్రథమ, ఆవల వసంతరావు ద్వితీయ బహుమతి పొందారు. అలాగే 100 కిలోల సంగిడి పోటీల్లో గేదెల సత్యనారాయణ, ఆవల గోవిందరావు మొదటి, ద్వితీయ బహుమతులు పొందారు. పురుషుల వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో ఆవల గోవిందరావు 160 కిలోలు ఎత్తి ప్రథమ, గుజ్జల ట్వింకిల్ కుమార్ ద్వితీయ స్థానంలో నిలిచారు. మహిళల విభాగంలో దూబ హేమశ్రీ 95 కిలోలు ఎత్తిడంతో ప్రథమ బహుమతి పొందగా తాలాడ కావ్య 80 కిలోలు ఎత్తి ద్వితీయ స్థానం సాధించారు. ఈ వెయిట్ లిఫ్టింగ్ పోటీలను పీడీ ఈశ్వరరావు, పవర్ వెయిట్ లిఫ్టింగ్ గౌరవ అధ్యక్షుడు బి.తిరుపతిరావు సమక్షంలో నిర్వహించారు. విజేతలకు ఎంపీపీ చిన్నాల కూర్మినాయుడు, బగ్గు అర్చన, మెండ రాంబాబు తదితరులు బహుమతులు అందించారు. కార్యక్రమంలో నిర్వాహకులు ఇప్పిలి ఆంజనేయ ప్రసాద్, ఇప్పిలి వేణులతో పాటు నిర్వహక కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
మిగులు ధాన్యం కొనుగోలు చేయాలి
ఇచ్ఛాపురం రూరల్: ఖరీఫ్ సీజన్కు సంబంధించి మిగులు 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని ఎమ్మెల్సీ నర్తు రామారావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఇచ్ఛాపురంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల శాసన మండలి బడ్జెట్ సమావేశంలో సైతం తాను ధాన్యం విషయమై ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు గుర్తు చేశారు. జిల్లా వ్యాప్తంగా ధాన్యం సేకరణ నిలిచి పోయిందని, ఇప్పటి వరకు 49,2000 మెట్రిక్ టన్నులు ప్రభుత్వం సేకరించిందని, మిగతా ధాన్యం ఎప్పుడు సేకరిస్తారంటూ ప్రశ్నించగా.. అధికార యంత్రాంగం స్పందించి 45000 మెట్రిక్ టన్నులు వరకు కొనుగోలు చేసిందన్నారు. ఇంకా సుమారు 60వేలు మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సి ఉందని చెప్పారు. ప్రభుత్వం, వ్యవసాయ అధికారులు స్పందించి రైతుల వద్ద ఉన్న ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని కోరారు. ఉద్దానం విద్యార్థి ప్రతిభ కాశీబుగ్గ: దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ (ఐఎంఓ ఢిల్లీ) ప్రతిభా పరీక్షలో మందస మండలం నాతుపురం బొడ్లూరుకు చెందిన బొడ్డు షణ్ముఖరావు సత్తాచాటాడు. రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్వాహకుల చేతులమీదుగా ప్రశంసాపత్రం, మెడల్ అందుకొని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచాడు. షణ్ముఖరావు నాలుగో తరగతి వరకు స్వగ్రామంలోనే చదివాడు. అనంతరం ఏపీఆర్ఎస్ ప్రవేశ పరీక్ష రాసి గుంటూరు జిల్లా తాడికొండ గురుకులంలో సీటు సాధించి ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు. విద్యార్థి ప్రతిభ పట్ట ఉపాధ్యాయులు దాసరి ఈశ్వరరావు, తల్లిదండ్రులు బొడ్డు జీవనరావు, మోహిని, గ్రామస్తులు చేశారు. ఘనంగా బీఎస్ఎన్ఎల్ మహాసభలుశ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళంలోని యూటీఎఫ్ కార్యాలయంలో వీజీకె మూర్తి సభాప్రాంగణం వద్ద శుక్రవారం భారత సంచార నిగమ్ లిమిటెడ్ ఎంప్లాయిస్ యూనియన్ 10వ మహాసభలు ఘనంగా నిర్వహించారు. ఆలిండియా బీఎస్ఎన్ఎల్ ఈయూ ఉపాధ్యక్షురాలు కె.రమాదేవి, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సాగర్, కృష్ణబాలాజీలు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. బీఎస్ఎన్ఎల్కు తక్షణమే 4జీ, 5జి ఎక్విప్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు 2017 నుంచి పే రివిజన్, పెన్షన్ రివిజన్ అమలు చేయాలని కోరారు. అనంతరం ‘బీఎస్ఎన్ఎల్ మనుగడ–ఉద్యోగుల కర్తవ్యాలు’ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. బీఎస్ఎన్ఎల్ ఈయూ జిల్లా అధ్యక్షునిగా మాతల గోవర్ధనరావు, కార్యదర్శిగా పోలాకి వెంకటరావు, కోశాధికారిగా జి.అరుణశ్రీతో పాటు 18 మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సీఐటీయూ సీనియర్ నాయకులు కె.శ్రీనివాస్, బీఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ మర్రి నాయుడు, ఈయూ ప్రతినిధులు అభిమన్యు, ఆదినారాయణ, డి.శ్రీనివాసరావు, శివప్రసాద్, బి.రామారావు తదితరులు పాల్గొన్నారు. మా ప్రమేయం లేకుండానే ఫిర్యాదు టెక్కలి రూరల్: మండలంలోని పెద్దసాన ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వ్యక్తి విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడనే ఫిర్యాదు మేరకు డీఈఓ తిరుమల చైతన్య విచారణ చేపటిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయమై శుక్రవారం విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ తమకు తెలియకుండానే హెచ్ఎం ఫిర్యాదు చేశారని చెప్పారు. హెచ్ఎం, ఉపాధ్యాయుడి మధ్య వివాదం ఉండటం వల్లే ఇలా జరిగిందని తెలిపారు. ఈ వ్యవహారంలో పాఠశాలకు సంబంధం లేని ఓ మహిళ పాత్ర ఉందన్నారు. ఉన్నతధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. శివాలయంలో చోరీ రణస్థలం: పైడిభీమవరం శివాలయంలో గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి హుండీ, ఎలక్ట్రికల్ యాంప్లిఫయర్ పట్టుకుపోయారు. శుక్రవారం జె.ఆర్.పురం పోలీసులు ఆలయాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. ఎస్సై ఎస్. చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వసూల్ రాజాలపై విజిలెన్స్
అరసవల్లి: జిల్లా వైద్యారోగ్య శాఖలో కొన్నాళ్లుగా సాగుతున్న అవినీతి అక్రమాలతో పాటుగా తాజాగా మొదలైన వసూల్ రాజాల అక్రమాలపై ‘విజిలెన్స్’ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ అంతర్గత వ్యవహారాలపై ఈ నెల 5న వైద్య శాఖలో వసూల్ రాజాల పేరిట ‘సాక్షి’లో ప్రచురితమైన వరుస కథనాలపై విజిలెన్స్ అధికారులు ఆరా తీశారు. అందుకు అనుగుణంగా కార్యాలయంలో పరిస్థితులుండటంతో సంబంధిత అధికారులపై నిఘా ఉంచారు. ఇప్పటికే రెండుసార్లు డీఎంహెచ్ఓ కార్యాలయానికి చేరిన విజిలెన్స్ బృందానికి పరిపాలన విభాగం నుంచి ఎలాంటి సహకారం అందకపోవడంతో నేరుగా డీఎంహెచ్వో డాక్టర్ బాలమురళీకృష్ణతోనే మాట్లాడి పరిస్థితులను అడి గి తెలుసుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు నివేదికను సిద్ధం చేయనున్నారు. సాక్షిలో వరుస కథనాలు... డీఎంహెచ్వో కార్యాలయంలో వరుసగా జరుగుతున్న పలు అక్రమాలపై సాక్షిలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడం, అక్రమంగా రూ.లక్షల్లో వసూళ్లు చేయడంతో పాటు ఫేక్ జాయినింగ్ ఆర్డర్లు జారీ చేయడం వంటి అంశాలపై ఆధారాలతో సహా ప్రచురించిన సంగతి తెలిసిందే. వీటినే ప్రామాణికంగా తీసుకుని నిరుద్యోగ బాధితుల వివరాలతో పాటు అక్రమాలకు పాల్పడిన స్థానిక డీఎంహెచ్వో కార్యాలయంలో కీలక సిబ్బంది, కాంట్రాక్ట్ ఉద్యోగుల తీరుపై చర్యలుండేలా విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటికే చాలావరకు అక్రమాలతో పాటు ప్రస్తుతం ఏళ్ల నాటి నుంచి పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల విద్యార్హత సర్టిఫికెట్లు కూడా ఫేక్ అనే కథనాలు రావడంతో దీనిపైన కూడా విజిలెన్స్ దృష్టి పెట్టింది. ఔట్సోర్సింగ్ ఉద్యోగాలను ఇచ్చేసినట్లుగా ఆర్డర్లు జారీ చేయడంతో పాటు ఫోర్జరీ సంతకాలతో ఆన్లైన్లో జీతాలను జమ చేయడాన్ని విజిలెన్స్ అధికారులకు ఆశ్చర్యాన్ని కల్పించినట్లు సమాచారం. గత నెలలో విశాఖ డీఎంహెచ్వో జగదీశ్వరరావు చేపట్టిన విచారణాంశాలను కూడా విజిలెన్స్ అధికారులు పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిసింది. త్వరలోనే అక్రమాలు, వసూల్ రాజాల బండారాలను విజిలెన్స్ అధికారులు ప్రత్యేక నివేదిక ద్వారా ప్రభుత్వానికి పంపించేలా సన్నద్ధమవుతున్నారు. దీంతో రెండు రోజులుగా డీఎంహెచ్వో కార్యాలయంలో స్తబ్దత నెలకొందరు. కొందరు లాంగ్లీవ్లో వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. డీఎంహెచ్వో కార్యాలయంలో కీలకాధికారులపై నిఘా సాక్షి కథనాలను ప్రామాణికంగా తీసుకుని విచారణ సాగిస్తున్న అధికారులు -
నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం
సెల్ఫోన్ కొన్నారు.. కొన్నాళ్లకే రిపేరుకు వచ్చింది. మౌనంగా ఉండిపోకండి. ఆ మౌనమే మోసానికి ప్రోత్సాహం. పండ్లు కొన్నారు.. కొలతలో తేడా తెలుస్తోంది. నిశ్శబ్దంగా ఉండిపోకండి. ఆ నిశ్శబ్దమే హక్కులకు మరణశాసనం. వస్తువులు కొన్నారు.. ఎమ్మార్పీ కంటే అధికంగా వసూలు చేస్తున్నాడు. మనకెందుకులే అనుకోకండి. ఆ నిర్లిప్తతే అక్రమాలకు అసలు కారణం. డబ్బులు ఖర్చు పెడుతున్నప్పుడు దానికి తగ్గట్టు సేవలు పొందే అధికారం అందరికీ ఉంది. డబ్బుకు తగ్గ వస్తువు లేదా సేవ అందనప్పుడు మీ హక్కుకు భంగం వాటిల్లినట్టే. ఆ హక్కులను కాపాడేందుకే ఏటా ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం నిర్వహిస్తారు. ఈ హక్కులు కాపాడేందుకు ఓ పెద్ద వ్యవస్థే నడుస్తోంది. మనం చేయాల్సిందల్లా దానిపై అవగాహన పెంచుకోవడమే. – శ్రీకాకుళం పీఎన్ కాలనీ, శ్రీకాకుళం పాతబస్టాండ్, శ్రీకాకుళం,అరసవల్లి, టెక్కలి, శ్రీకాకుళం కల్చరల్ తూకాల్లో తేడాలు, ధరల్లో వ్యత్యాసాలు, నాణ్యతలో మార్పులు.. కొనుగోలుదారుడు అను నిత్యం మోసపోతున్నాడు. చిన్న పాన్షాపు మొదలకుని పెద్ద షోరూమ్ వరకు జిల్లాలో ఈ తరహా మోసాలు లెక్కకు మిక్కిలి జరుగుతున్నాయి. కానీ కొందరు మాత్రమే గుర్తించగలుగుతున్నారు. ఇలా మోసపోతున్న వారికి అండగా నిలిచేందుకు వినియోగదారుల రక్షణ చట్టం అంటూ ఒకటుంది. దీన్ని 1986లోనే ఏర్పాటు చేశారు. 2019లో కొత్త చట్టం కూడా వచ్చింది. దీని ప్రకారం మనం నిత్య జీవితంలో ప్రతి వస్తువు, సేవలు, కొనుగోలు, పొందడంలో ఎక్కడ లోపం, మోసం ఉన్నా వెంటనే వినియోగదారులు ఫోరం ద్వారా నష్టపోయిన వాటిని పొందవచ్చు. జిల్లాలో చాలా మంది ఈ ఫోరాన్ని ఆశ్రయించి న్యాయం పొందారు. అలాగే జిల్లా, రాష్ట్ర, దేశ స్థాయిలో రక్షణ మండలిలు ఏర్పాటు చేసి, వాటి ద్వారా వినియోగదారులకు రక్షణ కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. హక్కులు తెలుసుకో.. ● వస్తువుల కొనుగోలు, వినియోగం విషయంలో వినియోగదారులకు కొన్ని రకాల హక్కులు ఉన్నాయి. ● వస్తువుల నాణ్యత, పనితీరు, సేవల గురించి పూర్తి సమాచారం పొందే హక్కు వినియోగదారులకు ఉంది. ● హక్కులు ఉల్లంఘిస్తే పరిష్కారం కోరే హక్కు వినియోగదారులకు ఉంది. ● తప్పుగా మార్కెట్ చేసే వస్తువులు, సేవల నుంచి రక్షణ కల్పించే హక్కు వినియోగదారులకు ఉంది. ● దేశంలో ఎక్కడ వస్తువు కొన్నా, ఎక్కడ సేవా లోపం ఉన్నా ఆ వినియోగదారుడు నివసించే ప్రదేశం, ఉద్యోగం చేసే జిల్లా పరిధిలో కమిషన్కు ఫిర్యాదు చేయవచ్చు. ● నేషనల్ కన్స్యూమర్ హెల్ప్లైన్ (ఎన్సీహెచ్) మొబైల్ యాప్లో కూడా బాధితులు ఫిర్యాదు చేయవచ్చు. ● వస్తు సేవలతో పాటు బీమా పాలసీలు, చిట్ఫండ్లు, మ్యూచువల్ ఫండ్లు, సేవింగ్లు, బ్యాంకు బీమాలు, అలాగే స్కీంల విషయంలో మోసం, లేదా నిర్లక్ష్యం చేస్తే వినియోగదారులు ఫోరంలో ఫిర్యాదు చేసి న్యాయం పొందవచ్చు. కోర్టు ఉంది జిల్లాలో వినియోగదారుల సమాఖ్య (కోర్టు) ఉంది. ఈ కోర్టులో ప్రతి రోజు కేసుల విచారణ ఉంటుంది. ఈ ఫోరంలో నేరుగా బాధితుడు ఫిర్యాదు చేయవచ్చు. లేదా ఫో రం సభ్యులను ఆశ్రయించి వారి ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అందుబాటులో ఉన్న న్యాయవాది ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. దీనికి కేవలం నష్టం, ఇబ్బంది జరిగిందని రుజువులు ఉంటే చాలు. జిల్లాలో ప్రధానంగా వస్తు, సేవలకు సంబంధించి 107 కేసులు ఈ కోర్టులో ఉన్నాయి. నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ యాప్ ఇలా ఫిర్యాదు చేయాలి.. 1915,1800114000 టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి సమస్య చెబితే వారు జిల్లా స్థాయి కమిషన్కు తెలియజేస్తారు. వస్తువు కొనేటప్పుడు ఇన్వాయిస్లు, ఐడీలను కచ్చితంగా నిక్షిప్తం చేయాలి. ఫిర్యాదు సమయంలో అవే ఆధారాలు. ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు వస్తువులు విక్రయించినా, నాసిరకం ఉత్పత్తులు అంటగట్టి సేవా లోపానికి పాల్పడినా నేరుగా వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసే విధంగా కేంద్ర మంత్రిత్వ శాఖ వెసులుబాటు కల్పించింది. వాట్సాప్ నంబర్ 88000 01915 లో మొదట హాయ్ అని టైప్ చేయాలి. అక్కడి సూచనల ఆధారంగా వివరాలు నమోదు చేస్తే జాతీయ వినియోగదారుల కమిషన్ హెల్ప్లైన్లో ఫిర్యాదు నమోదవుతుంది. తెలుసుకో హక్కు.. చట్టమే దిక్కు జిల్లాలో విచ్చలవిడిగా తూకాల్లో మోసాలు.. కొలతల్లో తేడాలు మోసపోతున్న కొనుగోలుదారులు హక్కులపై అవగాహన పెంచుకోవాలంటున్న నిపుణులు కొను‘గోల్మాల్’ శ్రీకాకుళం ఆర్టీసీ కాంపెక్స్కి సమీపంలో, ఎస్పీ కార్యాలయం పక్కన ఓ దుకాణం వద్ద కిలో నల్ల ద్రాక్షపండ్లు కొనుగోలు చేశా ను. ధర రూ.150 తీసుకున్నారు. ఆ పండ్లను నెహ్రూ యువ కేంద్రానికి సమీపంలో ఓ దుకాణం వద్ద మళ్లీ తూకం వేయించాను. అక్కడ 840 గ్రామలు మాత్రమే ఉంది. – సీహెచ్ రామకృష్ణ, ప్రొఫెసర్, ఏఎస్ఎన్కాలనీ, శ్రీకాకుళం నగరం టెక్కలి పాత బస్టాండ్లో ఓ కిరాణా దుకాణంలో పాత తరం తూకాలు, కొత్త తరం ఎలక్ట్రానిక్ తూకాలతో సామాన్లు విక్రయిస్తున్నారు. అయితే పాత తరం తూకాలకు వినియోగిస్తున్న గుండ్లు పూర్తిగా కాల పరిమితి దాటి ఉన్నాయి. ‘సాక్షి’ పరిశీలనలో భాగంగా కిలో వస్తువులకు సుమారుగా 100 నుంచి 150 గ్రాముల వరకు తేడా కనిపిస్తోంది. వీటితో పాటు మొదటి రకం గ్రేడ్ పేరుతో నాశిరకమైన నిత్యావసర సామగ్రిను అసలు ధరలకు అమ్మకాలు చేస్తున్నారు. టెక్కలిలో ఓ బంగారు దుకాణంలో అమ్మకాలు చేస్తున్న బంగారం, వెండి వస్తువుల విషయా న్ని పరిశీలించగా నాసిరకమైన వెండి వస్తువులకు అసలు ధరను వసూలు చేస్తున్నారు. అలాగే బంగారం బరువు తూచే క్రమంలో వినియోగిస్తున్న డిజిటల్ తూకాల్లో అంకెల గారడీ కనిపిస్తోంది. టెక్కలిలో ఓ మందుల దుకాణంలో ఓ వినియోగదారుడు కొన్ని రకాల మందులు కొనుగోలు చేశాడు. అయితే ఇంటికి వెళ్లి పరిశీలించగా అవి కాలం చెల్లినవిగా గుర్తించాడు. దీంతో ఆయా మందుల దుకాణదారుడి వద్దకు వెళ్లి నిలదీయగా వాటిని మార్పు చేసి కొత్త తేదీలతో ఉన్న మందులను ఇచ్చాడు. కొలతలో తేడా.. ఏసీబీ కార్యాలయం బలగ వద్ద చేపల మార్కెట్లో కిలోన్నర రొయ్యలు కొన్నాను. కానీ తూకం తక్కువగా ఉన్నట్లు అనుమానం వచ్చింది. సమీపంలోగల ఓ చికెన్ షాపు వద్దకు వెళ్లి డిజిటల్ కాటాలో మళ్లీ తూయిస్తే 1.290 గ్రాములు ఉంది. ఇదేంటని అడిగితే నచ్చితే కొనండి అని సమాధాన మిస్తున్నారు. – ఎన్.శ్రీనివాసరావు, డీసీసీబీ కాలనీ, కొనుగోలుదారుడు -
రైలు ఢీకొని రిక్షా కార్మికుడు దుర్మరణం
ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం రైలు నిలయం సమీపంలో జరిగిన ప్రమాదంలో ఓ రిక్షా కార్మికుడు మృతిచెందాడు. బెల్లుపడ కాలనీకి చెందిన ఆసి బైరెడ్డి(50) ఎర్రచెరువు సమీపంలో రైలు పట్టాలు దాటుతుండగా అప్లైన్ ట్రాక్లో తిరుపతి–పూరి ఎక్సప్రెస్ రైలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని జీఆర్పీ ఎస్సై ఎస్కే షరీఫ్ తెలిపారు. మృతదేహాన్ని పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జీఆర్పీ ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పరిశీలిస్తున్న రైల్వే పోలీసులు -
రేపటి నుంచి ఒంటి పూట బడులు
శ్రీకాకుళం న్యూకాలనీ: ఒంటి పూట బడులకు వేళయ్యింది. పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు ఒకటో తరగతి నుంచి నుండి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు శనివారం నుంచి ఉద యం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఒక్కపూట తరగతులను నిర్వహించనున్నారు. జిల్లాలో వసతి గృహాలు మినహా ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, మోడల్స్కూల్స్, ఎయిడెడ్, ప్రైవేట్పాఠశాలలు, గుర్తింపు పొందిన అన్ఎయిడెడ్ పాఠశాలల మేనేజ్మెంట్లలో ఒంటి పూట బడులు పక్కాగా అమలు కావాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈనెల 15వ తేదీ నుంచి ఈ విద్యా సంవత్సరం ఆఖరి పనిదినం అనగా ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటి పూట బడులు వర్తించనున్నాయి. అయితే పదో తరగతి పరీక్ష కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో పరీక్షలు జరిగే ఏడు రోజులపాటు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తిన్నాకే పిల్లలను ఇళ్లకు విడిచిపెడతామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఒంటిపూట సందర్భంగా బడుల్లో తగి నంత తాగునీరు అందుబాటులో ఉంచాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఉపయోగించాలని సూచించారు. -
వేర్వేరు చోట్ల 8 కేజీల గంజాయి సీజ్
మందస: గంజాయి అక్రమ రవాణాను అడ్డుకున్న ట్లు డీఎస్పీ వెంకట అప్పారావు తెలిపారు. కాశీబుగ్గ రూరల్ సీఐ ఎం.తిరుపతిరావు, మందస ఎస్ఐ కె.కృష్ణప్రసాద్తో కలిసి గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన రాహుల్ మండల్ తమిళనాడు రాష్రం ఈరోడ్ పట్టణంలో టైలర్గా పనిచేస్తున్నాడు. అక్కడ రంజిత్ అనే గంజాయి వ్యాపారితో పరిచయం పెంచుకున్నాడు. అతని సూచన మేరకు ఒడిశా రాష్ట్రం పారదీప్ వెళ్లి భానోజీ అనే వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసి మందస రాగా రైల్వేస్టేషన్ వద్ద ఎస్ఐ కృష్ణప్రసాద్ నేతృత్వంలోని పోలీసుల బృందం పట్టుకున్నారు. రాహుల్ వద్ద 4 కేజిల 132 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. నిందితుడిని సోంపేట కోర్టులో హాజరు పరుస్తున్నట్టు తెలిపారు. ప్రైవేటు వాహనంలో తరలిస్తూ.. నరసన్నపేట: పోలీసులు నిర్వహిస్తున్న వాహన తనిఖీల్లో భాగంగా ఒడిశా రాష్ట్రం భద్రక్ జిల్లా పడిసాయి గ్రామానికి చెందిన షేక్ గుల్ఫాన్ నాలుగు కేజీల గంజాయితో గురువారం పట్టుబడ్డాడు. హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రయివేటు వాహనాన్ని అనుమానంతో దేవాది వద్ద తనిఖీ చేయగా గంజాయి పట్టుబడిందని నరసన్నపేట సీఐ జె.శ్రీనివాసరావు తెలిపారు. ఎస్ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామన్నారు. -
కొనసాగుతున్న గ్యాస్ కష్టాలు
● పొందూరులో ఏజెన్సీ మార్చినా ఇళ్ల వద్దకు సరఫరా కాని వైనం ● ఇబ్బందుల్లో లబ్ధిదారులు పొందూరు: మండల కేంద్రం పొందూరులో ఇండేన్ గ్యాస్ లబ్ధిదారులకు గ్యాస్ కష్టాలు తప్పడం లేదు. గ్యాస్ ఏజెన్సీని మార్చినా వినియోగదారుల ఇళ్లకు సిలిండర్లు చేరడం లేదు. పొందూరు, జి.సిగడాం, లావేరు, సంతకవిటి, ఎచ్చెర్ల మండలాల్లోని పలు పంచాయతీలకు పొందూరు ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ యే ఆధారం. ఆయా పంచాయతీల్లో సుమారు 28 వేలు గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. పొందూరు ఇండేన్ గ్యాస్ ఏజెన్సీకి సుమారు 25 కిలోమీటర్ల పరిధి వరకు కస్టమర్లు ఉన్నారు. వారందరూ పొందూరు ఏజెన్సీకి వచ్చి గ్యాస్ తీసుకెళ్లాల్సిన పరిస్థతి నెలకొంది. డోర్ డెలివరీ అయ్యేనా... ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారులు, కూలీలు ఆదరాబాదరగా తమ విధి నిర్వహణలకు పరుగులు తీస్తున్నారు. సొంత పనులు చేసుకునేందుకు సైతం సమయం ఉండటం లేదు. ఈ క్రమంలో గ్యాస్ కష్టాలు మరింతగా వెంటాడుతున్నాయి. ఈ నెల 1 నుంచి 10 వరకు గ్యాస్ సిలిండర్లు సరఫరా కాక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 11వ తేదీ నుంచి సరఫరా చేస్తున్నా గోదాము వద్దకు వెళ్లాల్సి వస్తోందని, ఇళ్లకు తెచ్చి ఇవ్వడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. ఈ విషయమై ప్రస్తుత వజ్రపుకొత్తూరు ఏజెన్సీ సిబ్బంది వద్ద ప్రస్తావించగా రెండు రోజుల్లో డోర్ డెలివరీ ప్రారంభిస్తామని చెప్పారు. తప్పెవరిది.. శిక్ష ఎవరికి? -
ఇసుక ర్యాంపులో తనిఖీలు
సరుబుజ్జిలి: పురుషోత్తపురం 1, 2 ఇసుక ర్యాంపుల్లో టెక్కలి గనుల శాఖ ఏడీ విజయలక్ష్మి ఆధ్వర్యంలో గురువారం తనిఖీలు నిర్వహించారు. ఇటీవల కలెక్టర్ గ్రీవెన్స్కు వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ ఆమదాలవలస నియోజకవర్గం ఇన్చార్జి చింతాడ రవికుమార్ ఇసుక ర్యాంపుపై ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ ఆదేశాలు మేరకు టెక్కలి గనుల శాఖ అధికారులు ఆధ్వర్యంలో గురువారం తనిఖీలు చేపట్టా రు. ఇసుక ర్యాంపు నిర్వహణ ఎంత విస్తీర్ణం మేరకు నిర్వహించారు, తవ్వకాలు ఎంత లోతులో చేపడుతున్నారన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. ర్యాంపు తీరం వరకు మైన్స్ అధికారులు బొలేరో వాహనం ద్వారా వెళ్లి తనిఖీ చేశారు. ర్యాంపులో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటా మన్నారు. ర్యాంపులో సీసీ కెమెరాలు ఉండాలని, ఇసుక రవాణా చేస్తున్న ప్రతి వాహనానికి బ్యానర్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. తవ్వకాలు జరిగే ప్రదేశం వద్దకు వెళ్లకుండా అక్కడ ఉన్న కొంతమంది వద్ద నుంచి వివరాలు సేకరించి వెనుదిరిగారు. మైన్స్ అధికారులు ర్యాంపు వద్దకు తనిఖీలు కోసం వచ్చే సమయంలో మండల స్థాయి అధికారులు ఎవ్వరూ లేకపోవడం గమనించదగ్గ విషయం. -
ప్రత్యేకం..పంచకర్మ వైద్యం
పంచకర్మ దశలు.. టెక్కలి: మారుతున్న కాలంతో పాటు విస్తరిస్తున్న వివిధ రకాల అనారోగ్య సమస్యల పరిష్కారానికి ఎంతో మంది ఆయుర్వేద వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. కేరళ వంటి రాష్ట్రాల్లో దీనికి ఎక్కువ ఆదరణ ఉంది. ఆయుర్వేద వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలనే ఆలోచనతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2023లో కేంద్ర ఆయుష్ విభాగం జిల్లాలో కోటబొమ్మాళి ఆయుర్వేద ఆసుపత్రిలో ‘పంచకర్మ చికిత్స’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కీళ్ల నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలు, గ్యాస్ట్రిక్, చర్మవ్యాధులు, మూలవ్యాధులు, నరాల సమస్యలు, సయాటికా, మైగ్రేన్, వెన్నెముక సంబంధించిన అనారోగ్య సమస్యలకు ఈ పంచకర్మ వైద్యాన్ని వినియోగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 ఆయుర్వేద ఆసుపత్రులలో ఈ పంచకర్మ వైద్య సేవలు ఉండగా, అందులో కోటబొమ్మాళి ఆయుర్వేద ఆసుపత్రి ఒకటి కావడం విశేషం. డాక్టర్ వివేకానంద ఆధ్వర్యంలో పంచకర్మ చికిత్సలతో పాటు ఆయుర్వేదిక్ మొక్కలతో హెర్బల్ గార్డెన్ పెంచుతున్నారు. బహుళ ప్రయోజనాలు... శరీరాన్ని పూర్తిగా శుభ్రపరచడం, విష పదార్థాల విసర్జన చేయడం, జీవక్రియను వేగవంతం చేయడం, బరువు తగ్గడం, జీర్ణ అగ్ని బలాన్ని పెంచడం, మానసిక, శారీరక విశ్రాంతి, కణజాలాల పునరుజ్జీవనంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడం, ఒత్తిడిని తగ్గించడంలో ఈ వైద్యం ఎంతగానో ఉపయోగపడుతుంది. వామన కర్మ: కఫాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడటానికి ప్రేరేపిత వాంతులు ఉంటాయి. దీని ద్వారా శ్వాసకోశ వ్యాధులు, చర్మ వ్యాధులను నిరోధిస్తారు. విరేచన కర్మ: జీర్ణ సమస్యలను నియంత్రించడానికి ఈ ప్రక్రియ ఉపయోగిస్తారు. కడుపులో పేరుకుపోయిన విషాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. వస్తి కర్మ: వాతాన్ని సమతుల్యం చేయటానికి సూచించిన నూనెలు, కషాయాలను యానోరెక్టల్ మార్గం ద్వారా వైద్యం చేస్తారు. నశ్య కర్మ: నాసికా రంధ్రం ద్వారా వైద్యం అందజేస్తారు. మైగ్రేన్ సమస్యలను తగ్గించడానికి ఈ ప్రక్రియ ఉపయోగిస్తారు. రక్తమోక్షణ కర్మ: శరీరంలో ఉన్న అపరిశుభ్రమైన రక్తాన్ని తొలగించడానికి ఈ ప్రక్రియను వినియోగిస్తారు. కొన్ని రకాల పరికరాలతో ఈ వైద్యం చేస్తారు. కోటబొమ్మాళి ఆయుర్వేద ఆస్పత్రిలో అందుబాటులో చికిత్సలు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఉపయోగకరం రాష్ట్రంలో 13 ఆస్పత్రుల్లోనే ఈ రకమైన వైద్యసేవలు కోటబొమ్మాళి ఆయుర్వేద ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న పంచకర్మ చికిత్సను అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలి. చికిత్సతో పాటు మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడే ఆయుర్వేద మొక్కలను పెంచుతున్నాం. కీళ్ల నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలు, గ్యాస్ట్రిక్, చర్మవ్యాధులు, మూలవ్యాధులు, నరాల సమస్యలు, సయాటికా, మైగ్రేన్, వెన్నెముక సంబంధిత సమస్యలకు వైద్యం అందజేస్తాం. –డాక్టర్ కె.వివేకానంద, ఎండీ, ఆయుర్వేదిక్, కోటబొమ్మాళి -
బెల్ట్ బాదుడు
విశృంఖలంగాసాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో మద్యం మాఫియా జడలు విప్పింది. లిక్కర్ సిండికేట్ వ్యవహరం మూడు క్వార్టర్లు.. ఆరు ఫుట్బాటిళ్లుగా వర్ధిల్లుతోంది. జిల్లావ్యాప్తంగా లెక్కకు మించి బెల్టు దుకాణాలు తెరిచారు. ఎమ్మార్పీకి మించి మద్యం ధరలు పెంచేసి అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ఈ దోపిడీకి అండగా నిలిచినందుకు ప్రజాప్రతినిధులకు భారీగా ముడుపులు అందుతున్నాయి. కొన్నిచోట్ల షాపుకి నెలకు రూ.50 వేలు చొప్పున, మరికొన్ని చోట్ల అక్కడున్న అమ్మకాల దృష్ట్యా రూ.30వేల నుంచి రూ.70వేల వరకు తీసుకుంటున్నారు. పనిలో పనిగా అధికార వర్గాలు కూడా రెన్యువల్ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాయి. జనవరిలో జరిగిన రెండో రెన్యువల్కు షాపునకు రూ. 70 వేలు వసూలు చేయగా, ఈ నెలలో చేయాల్సిన మూడో రెన్యువల్కు రూ.30వేలు అడుగుతున్నాయి. రూ.10 అదనం జిల్లాలో బెల్ట్షాపులు పుట్టగొడుగుల్లా వెలిశాయి. అన్నీ నేతల కనుసన్నల్లోనే ప్రారంభమయ్యాయి. తమ టర్నోవర్ పెరగడం కోసం లైసెన్స్ దుకాణాలు బెల్ట్షాపులను ప్రోత్సహిస్తున్నాయి. ఒక్కో గ్రామానికి కనీసం 10 బెల్ట్షాపులు నడుస్తున్నాయి. ఈ బెల్ట్షాపులకు మద్యం సరఫరా చేసే బాధ్యతను లైసెన్సు దుకాణాలు తీ సుకుంటున్నాయి. ఒక్కో క్వార్టర్ బాటిల్కు రూ.10 పెంచి తీసుకోగా, ఆ బెల్ట్ షాపుల నిర్వాహకులు మరో రూ.40వేసి రూ. 50 అధికంగా విక్రయిస్తున్నారు. ప్రస్తుతానికి శ్రీకాకుళం టౌన్, శ్రీకాకుళం రూరల్, ఎచ్చెర్ల, ఇచ్ఛాపురంలో మినహా మిగతా అన్ని చోట్ల బెల్ట్షాపులకు ఒక్కో బాటిల్పై రూ. 10 పెంచి సరఫరా చేస్తున్నారు. పలాస నియోజకవర్గంలో బరితెగింపు పలాస నియోజకవర్గంలోనైతే మద్యం దుకాణాల కౌంటర్లో క్వార్టర్ బాటిల్కు రూ.10 అదనంగా వేసి విక్రయిస్తున్నారు. ఆ మధ్య జామి జాతరలోనైతే ఒక్కో బాటిల్కు రూ. 50 పెంచి విక్రయించారు. వాస్తవానికి జాతర సమయంలో దుకాణాలు తెరవకూడదు. కానీ బ్యాక్డోర్లో మొత్తం తతంగం నడిపేశారు. కీలక నేతల అనుమతి తీసుకుని దర్జాగా షాపుల కౌంటర్లలోనే ఎమ్మార్పీకి రూ.10 పెంచి విక్రయించేస్తున్నారు. ఎవరికెంత ముడుపులందుతున్నాయో గానీ ఎమ్మార్పీకి మించి విక్రయాలకు గేట్లు ఎత్తేశారు. తిలాపాపం తలా పిడికెడు మద్యం దోపిడీలో నేతలు లాభాలు ఆర్జిస్తుంటే.. తామెందుకు వదులుకోవాలని అధికార వర్గాలు సైతం అక్రమ వసూళ్లు చేస్తున్నాయి. కాకపోతే, లైసెన్సుల రెన్యువల్ పేరుతో వసూళ్లు చేస్తున్నాయి. జనవరిలో జరిగిన రెండో రెన్యువల్కు షాపుకి రూ. 70వేలు వసూలు చేయగా, ఈ నెలలో జరిగే మూ డో రెన్యువల్కు ఇప్పటికే రూ. 30వేలు డిమాండ్ చేస్తున్నాయి. శాంతిభద్రతలు, మందుబాబుల రాకపోకలు తదితర వ్యవహారాలను కంట్రోల్ చేసేందుకు సంబంధిత అధికారులు షాపుకింత అని నెల వారీ ముడుపులు ఇప్పటికే తీసుకుంటున్నారు. జడలు విప్పిన లిక్కర్ సిండికేట్ పుట్టగొడుగుల్లా వెలిసిన బెల్ట్షాపులు నాలుగైదు మండలాల్లో మినహా జిల్లా వ్యాప్తంగా అడ్డగోలు విక్రయాలు బెల్ట్షాపులకు సరఫరా చేస్తున్నందుకు క్వార్టర్ బాటిల్కు అదనంగా రూ. 10 వసూలు పలాస నియోజకవర్గంలోనైతే లైసెన్సు దుకాణాల కౌంటర్లలో క్వార్టర్ బాటిల్పై రూ. 10 పెంచి విక్రయాలు దోపిడీకి కీలక నేతల అండ కీలక నేతలకు ముడుపులు జిల్లాలో జరుగుతున్న మద్యం దోపిడీపై కీలక నేత ముడుపుల ఒప్పందం కుదుర్చుకున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో షాపుకి నెలకు రూ. 50 వేలు చొప్పున, మరికొ న్ని నియోజకవర్గాల్లో షాపు సామ ర్థ్యం మేరకు రూ.30వేల నుంచి రూ. 70వేలు ఇచ్చేందుకు నిర్ణయాలు జరిగిపోయాయి. ఇప్పటికే కొన్నిచోట్ల చెల్లింపులు జరిగిపోగా, మరికొన్ని చోట్ల వారం పది రోజుల్లో ఆ మేరకు చెల్లింపులు చేయడానికి సిండికేట్ సిద్ధం చేసింది. ఇక,లైసెన్సు షాపుల కౌంటర్లలోనే క్వార్టర్ బాటిల్కు రూ.10 పెంచి విక్రయిస్తు న్న చోట ఈ ముడుపులు మరింత ఎక్కువగా ఉన్నాయి. నెలకి రూ. లక్షకు పైగా ముట్టచెబుతున్న షాపులు కూడా ఉన్నాయి. శ్రీకాకుళం టౌన్, శ్రీకాకుళం రూర ల్, ఎచ్చెర్ల, ఇచ్ఛాపురంలో విక్రయాలకు చర్చలు జరుగుతున్నాయి. దీనికి తోడు సిండికేటైన చోట వ్యాపారం టర్నోవర్ చూసి ఈ ముడుపులు పెంచే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం 20 శాతాలు లాభాలు ఇస్తే ఈ ముడుపులు మరింత పెరగనున్నాయి. తక్కువ ధరల కు నాణ్యమైన మద్యం అందిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దశల వారీగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ధరలు పెంచేసి మందుబాబులను దోచుకుంటోంది. -
కిడ్నీ సమస్యతో యువకుడి మృతి
● కిడ్ని దినోత్సవం నాడు విషాదం టెక్కలి రూరల్: ప్రపంచ కిడ్నీ దినోత్సవం నాడే టెక్కలిలో డయాలసిస్ సేవలు పొందుతూ ఓ యువకుడు మృతి చెందాడు. శ్రీనివాస నగర్కు చెందిన ఎస్.భాస్కర్(30) కొంత కాలంగా కిడ్ని వ్యాధి తో బాధపడుతున్నాడు. గురువారం తీవ్ర అస్వస్థత రావడంతో కుటుంబసభ్యులు హుటాహూటిన టెక్కలి జిల్లా ఆసుపత్రిలో ఉన్న డయాలసిస్ కేంద్రానికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అత్యవసర విభాగానికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భాస్కర్ మృతి చెందాడు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం నాడు కిడ్ని వ్యాధితో యువకుడు మృతి చెంద డం బాధాకరమని పలువు రు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఫుల్ టైమ్ ఫ్రాడ్
పార్ట్ టైమ్ జాబ్.. ● పార్ట్ టైమ్ జాబ్ పేరిట సైబరాసురుల వల ● అమాయకుల పేరిట బ్యాంకు ఖాతాలు, సిమ్లు ఓపెన్ చేసి సొమ్ము చేసుకుంటున్న వైనం శ్రీకాకుళం క్రైమ్ : నరసన్నపేటలో ఓ వ్యక్తి తన ఇన్స్ర్ట్రాగామ్లో తెలియని లింక్ రావడంతో ఓపెన్ చేశాడు. ఓ వెబ్ పేజీ ఓపెన్ అయ్యింది. పార్ట్టైమ్ జాబ్ చేసుకోవచ్చని చేయాల్సిందల్లా టాస్క్లు క్లియర్ చేయడమేనని మెయిల్లో రావడంతో ఓకే చేశాడు. మొదట్లో తన అకౌంట్లో డబ్బులు పడ్డాయి. తర్వాత రూ.7.50 లక్షల వరకు లాగేశారు. మోసపోయానని తెలుసుకున్నలోపే అంతకుముందు అతని నంబర్ను యాడ్ చేసిన గ్రూపు నుంచి తొలగించి బ్లాక్లిస్టులో పెట్టేశారు. ●శ్రీకాకుళం కేంద్రంగా టెలిగ్రామ్ యాప్లో ఓ యువతి పైన చెప్పిన తరహాలోనే రూ.2.80 లక్షలు మోసపోయింది. ఆమె సాఫ్ట్వేర్ ఇంజినీర్ కావడం విశేషం. ●ఇచ్ఛాపురానికి చెందిన ఓ యువకుడు వర్క్ఫ్రం హోం అంటూ ఆన్లైన్ టాస్క్ల పేరిట రూ.12.50 లక్షలు అప్పు చేసి పెట్టుబడి పెట్టాడు. ఆఖరికి ఇంట్లో వాళ్లు అప్పు తీర్చాల్సి వచ్చింది. టాస్క్ బేస్డ్ పార్ట్ టైమ్ జాబ్.. మోసగాళ్ల సరికొత్త వల. డబ్బులు సంపాదించుకోవచ్చనే ఆశ చూసి ఖాతాలు ఖాళీ చేసేందుకు వేసిన తాజా ప్రణాళిక. జిల్లాలోనూ ఈ తరహా మోసాలు వెలుగుచూస్తున్నాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో తెలియని లింక్లు, పార్ట్టైం జాబ్ ఆఫర్స్ కొన్నిమార్లు వస్తుంటాయి. క్లిక్ చేశాక వెబ్పేజీ ఓపెన్ అవుతుంది. మనకు తెలియకుండానే అవతలి వాళ్లు మనల్ని గ్రూపులో యాడ్చేస్తారు. కొన్ని టాస్క్లు (లైక్లు కొట్టడం, సబ్స్క్రైబ్ చేయడం) మీరు గెలుచుకుంటే సొమ్ము రెట్టింపు వస్తుందని నమ్మబలుకుతారు. మొదటి టాస్క్లో రూ. 1000 నుంచి రూ. 2 వేలు పెట్టుబడి పెడితే దానికి డబుల్ అమౌంట్ తర్వాత టాస్క్ రూ. 10 వేలు అని ఫినిష్ చేస్తే డబుల్ అంటారు.. సక్సెస్గా పూర్తి చేసినా మన ఖాతాలో డబ్బులు రావు. మన పేరుతో ఓ ఫేక్ యాప్ అకౌంట్ను వ్యాలెట్ రూపంలో చూపించి అందులో డబ్బులు యాడ్ అయినట్లు చూపిస్తారు. మనం విత్డ్రా చేయడానికి అవ్వదు. మళ్లీ మూడో టాస్క్ రూ. 50 వేలు అని పూర్తి చేస్తే రూ. 1 లక్ష వస్తుందని నమ్మిస్తారు. కంప్లీట్ అయ్యాక డబ్బులు విత్డ్రా చేద్దామంటే అవ్వకపోవడంతో వారిని మనం అడిగితే అందులో మొదట పంపిన రూ. 10 వేలకు రూ. 10 వేలు, తర్వాత పంపిన రూ. 50 వేలకు రూ. 50 వేలు చూపించి విత్డ్రా ఆప్షన్ డిజేబుల్ అని చూపిస్తుందంటారు. టాస్క్లో మీరేదో తప్పు చేయడం వలనే ఇలా జరిగిందని అది ఎనేబుల్ చేయడానికి నాలుగో టాస్క్ చేయాలంటారు. రూ. లక్ష నుంచి రూ. 5 లక్షల వరకు ఆ టాస్క్ ఉంటుందంటారు. మనం నమ్మి ఆ డబ్బులు పంపిస్తే అక్కడికి కొద్ది క్షణాల్లోనే అకౌంట్ బ్లాక్ అయిపోయిందని మీ అకౌంట్లో రూ. 7 లక్షల నుంచి రూ. 8 లక్షలుందని అవి విత్డ్రా అవ్వాలంటే మరో రూ. 2లక్షలు, లేదా రూ. 3లక్షలు వేయాలని చెబుతారు. పైగా మనకు తెలియకుండానే వేరే బాధితుడి అకౌంట్కు సైతం రూ. 10 వేలు వేయించి మన చేతే ముందుగా ఫ్రాడ్ చేయించి ఉంటారు. డబ్బులు వేశాక గ్రూపు నుంచి రిమూవ్ చేసి నంబర్లు బ్లాక్ చేస్తారు. కాంబోడియా, చైనాలో.. ఈ తరహా మోసాలకు పాల్పడేవాళ్లు కాంబోడియా, చైనాలోనే ఉంటారని సైబర్ నిపుణులంటున్నారు. ఇక్కడి మధ్య వర్తులు అమాయక ప్రజల చేత బ్యాంకు ఖాతాలు తెరిపించి, వారి పేరుతోనే ఫోన్ సిమ్లు కొనిపించి మోసపోయిన బాధితుల సొమ్మును వీరి ఖాతాలో పడేటట్లు చేసి తర్వాత అనేక ఖాతాలు మార్చి చివరికి వారికెళ్లేలా చేస్తారు. ఇదంతా ఓ లింక్ సిస్టమ్ మాదిరిగా జరు గుతుంది. ఇప్పటివరకు ఎన్నో సైబర్ కేసుల్లో మన జిల్లా పోలీసులు పక్క రాష్ట్రాల వరకు వెళ్లారు. బ్యాంకు ఖాతా చిరునామాలున్నవారికి, నడిపిన మధ్యవర్తులకు నోటీసులిచ్చారు. కొందరు ఇక్కడి కోర్టులకు సైతం వచ్చారు. కానీ మోసం చేసే కేటుగాళ్లు మాత్రం విదేశాల్లో దాక్కుని ఉన్నారు. అప్రమత్తంగా ఉండాలి.. తెలియని లింక్లు క్లిక్ చేయకూడదు. స్పామ్ కాల్స్, అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్ లిఫ్ట్ చేయొద్దు. టాస్క్బేస్డ్ ఆఫర్స్పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సైబర్ నేరాలను అరిక ట్టేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వ్యూహాత్మ కంగా కొన్ని నిర్ణయాలను తీసుకుంటున్నాయి. జిల్లాకు సైబర్ పోలీస్ స్టేషన్ అందుబాటులోకి వస్తుంది. – కేవీ మహేశ్వరరెడ్డి, ఎస్పీ, శ్రీకాకుళం -
సెమిస్టర్ పరీక్షల్లో చూసిరాత‘లా’!
ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో మూడేళ్ల ఎల్ఎల్బీ, ఐదేళ్ల ఎల్ఎల్బీ సెమిస్టర్ పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం వేళల్లో నిర్వహిస్తున్నారు. ఇందులో చూసిరాతలు జరగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నెల 11న ప్రారంభమైన పరీక్షలు ఈ నెల 22 వరకు కొనసాగనున్నాయి. 1, 3, 5, 7, 9 సెమిస్టర్లకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల, శ్రీకాకుళం పట్టణంలోని ఓ ప్రైవేట్ న్యాయ కళాశాలకు చెందిన 250 మంది వరకు విద్యార్థులు హాజరవుతున్నారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్ఫోన్లు అనుమతించడం వల్ల గూగుల్, వాట్సాప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆస్క్ మేటా ఏ–1ల ద్వారా చూసిరాతలు జరగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై రెక్టార్, చీఫ్ సూపరింటెండెంట్ అడ్డయ్య వద్ద ప్రస్తావించగా పూర్తిస్థాయి నిఘా మధ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పరీక్ష కేంద్రం పరిశీలన ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న ఎల్ఎల్బీ మూడేళ్లు, ఐదేళ్ల కోర్సుల సెమిస్టర్ పరీక్షలను గురువారం రెక్టార్ అడ్డయ్య, పరీక్షల నిర్వహణ డీన్ ఉదయ్భాస్కర్, ప్రత్యేకాధికారి సామ్రాజ్యలక్ష్మి పరీక్షలు పరిశీలించారు. మాస్ కాపీయింగ్కు అవకాశం లేకుండా అప్రమత్తంగా ఉండాలని ఇన్విజిలేటర్లకు సూచించారు. -
సకాలంలో రెవెన్యూ సమస్యల పరిష్కారం
● డివిజన్ అధికారుల సమీక్షలో జేసీ ఫర్మాన్ అహ్మద్ఖాన్ టెక్కలి: జిల్లాలో రెవెన్యూ శాఖకు సంబంధించి ప్రజల నుంచి వచ్చిన వినతుల పరిష్కారంలో ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా తక్షణమే పరిష్కార మార్గం చూపాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం, టెక్కలి, పలాస డివిజన్ల పరిధిలోని రెవెన్యూ శాఖలో వివిధ విభాగాల అధికారులతో గురువారం టెక్కలిలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా పీజీఆర్ఎస్కు వస్తున్న రెవెన్యూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. ప్రతి అర్జీపై క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి పరిష్కార మార్గం చూపాలన్నారు. రీసర్వేకు సంబంధించి పైలట్ గ్రామాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ల్యాండ్ బ్యాంకింగ్ ప్రక్రియను సమర్థంగా చేపట్టాలన్నారు. కోర్టు వివాదాలు భూవ్యవహారాల్లో చిత్తశుద్ధిగా వ్యవహరించాలన్నారు. అనంతరం రీసర్వేపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. సమావేశంలో డీఆర్ఓ ఎం.వెంకటేశ్వరరావు, ఆర్డీఓలు ఎం.కృష్ణమూర్తి, సాయిప్రత్యూష, జి.వెంకటేష్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, ల్యాండ్ సర్వే విభాగం ఏడీ విజయకుమార్, తహసీల్దార్లు, డీటీలు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు సర్వేయర్లు, వీఆర్ఓ తదితరులు పాల్గొన్నారు. -
వేర్వేరు చోట్ల 8 కేజీల గంజాయి సీజ్
మందస: గంజాయి అక్రమ రవాణాను అడ్డుకున్న ట్లు డీఎస్పీ వెంకట అప్పారావు తెలిపారు. కాశీబుగ్గ రూరల్ సీఐ ఎం.తిరుపతిరావు, మందస ఎస్ఐ కె.కృష్ణప్రసాద్తో కలిసి గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన రాహుల్ మండల్ తమిళనాడు రాష్రం ఈరోడ్ పట్టణంలో టైలర్గా పనిచేస్తున్నాడు. అక్కడ రంజిత్ అనే గంజాయి వ్యాపారితో పరిచయం పెంచుకున్నాడు. అతని సూచన మేరకు ఒడిశా రాష్ట్రం పారదీప్ వెళ్లి భానోజీ అనే వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసి మందస రాగా రైల్వేస్టేషన్ వద్ద ఎస్ఐ కృష్ణప్రసాద్ నేతృత్వంలోని పోలీసుల బృందం పట్టుకున్నారు. రాహుల్ వద్ద 4 కేజిల 132 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. నిందితుడిని సోంపేట కోర్టులో హాజరు పరుస్తున్నట్టు తెలిపారు. ప్రైవేటు వాహనంలో తరలిస్తూ.. నరసన్నపేట: పోలీసులు నిర్వహిస్తున్న వాహన తనిఖీల్లో భాగంగా ఒడిశా రాష్ట్రం భద్రక్ జిల్లా పడిసాయి గ్రామానికి చెందిన షేక్ గుల్ఫాన్ నాలుగు కేజీల గంజాయితో గురువారం పట్టుబడ్డాడు. హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రయివేటు వాహనాన్ని అనుమానంతో దేవాది వద్ద తనిఖీ చేయగా గంజాయి పట్టుబడిందని నరసన్నపేట సీఐ జె.శ్రీనివాసరావు తెలిపారు. ఎస్ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామన్నారు. -
● రిమ్స్లో మద్యం మత్తులో రోగి ఆత్మహత్యాయత్నం ● భవనం పైనుంచి దూకేందుకు ప్రయత్నం ● కాపాడిన సెక్యూరిటీ సిబ్బంది, కార్మికులు
దగ్గరకొచ్చారో దూకేస్తా..! శ్రీకాకుళం: మద్యం తాగేందుకు డబ్బుల కోసం ఫోన్ చేస్తే కుటుంబ సభ్యులు లిఫ్ట్ చేయకపోవడంతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రిమ్స్ ఆస్పత్రి భవనం మూడో అంతస్థు పైనుంచి దూకేందుకు ప్రయత్నించాడు. అయితే సకాలంలో ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది గమనించి కాపాడారు. రిమ్స్ సిబ్బంది, రెండో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సరుబుజ్జిలి మండలం నక్కలపేట గ్రామానికి చెందిన సనపల వరహానర్సింహం ఆనే వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. మద్యం మాన్పించేందుకు కుటుంబ సభ్యులు రిమ్స్లో చేర్పించారు. అక్కడి ఎన్ఎం వార్డులో ఉండి చికిత్స పొందుతున్నాడు. గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో భవనంలోని మూడో అంతస్థుకు చేరిన వరహానర్సింహం ప్రహరీ గోడపై కూర్చున్నాడు. అతన్ని వారించగా కిందకి దూకే ప్రయత్నం చేయబోయాడు. సెక్యూరిటీ సిబ్బంది, అక్కడే పనిచేస్తున్న తాపీమేసీ్త్రలు, కార్మికులు చాకచక్యంగా పట్టుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. సిబ్బంది పట్టుకుని పైకి తీసే క్రమంలో సుమారు 20 నిమిషాల పాటు ఆ వ్యక్తి గాలిలోనే వేలాడుతూ ఉన్నాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు, వైద్యులు, స్థానికులు చెబుతున్నారు. మద్యం తాగేందుకు తన వద్ద డబ్బులు లేవని కుటుంబ సభ్యులకు ఫోన్ చేస్తే వారు ఫోన్ లిప్ట్ చేయకపోవటం వల్లే తాను ఆత్మహత్యకు ప్రయత్నించానని రిమ్స్ అధికారులకు చెప్పాడు. కాగా, వరహా నర్సింహం ఇన్పేషెంట్ కాదని ఆస్పత్రి సూపరెండెంట్ డాక్టర్ షకీల చెపుతుండగా.. ఎన్ఎం వార్డులో చికిత్స పొందుతున్నారని రెండో పట్టణ సీఐ ఈశ్వరరావు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
21 నుంచి జాతీయ ఆహ్వాన నాటిక పోటీలు
శ్రీకాకుళం కల్చరల్: ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా ఈ నెల 21 నుంచి 23 వరకు హనుమంతు చిన్నరాములు స్మారక జాతీయ స్థాయి ఆహ్వాన నాటిక పోటీలు నిర్వహిస్తున్నట్లు సుమిత్రా కళా సమితి అధ్యక్షుడు ఇప్పిలి శంకరశర్మ తెలిపారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని వాసవీ కల్యాణ మండపంలో గురువారం కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతరించిపోతున్న కళలను ఆదరించి, వాటిని భావితరాలకు అందించే ప్రయత్నంలో భాగంగా ఈ ఏడాది కూడా ప్రపంచ రంగస్థళ కళాకారుల దినోత్సవం పురస్కరించుకొని జాతీయ స్థాయి ఆహ్వాన నాటిక పోటీలు నిర్వహించేందుకు సిద్ధమైనట్లు చెప్పారు. 21న షిరిడిసాయి వెల్ఫేర్ అసోసియేషన్(అనకాపల్లి) ‘ఆశ కదరా శివ’, 22న చైతన్య కళాభారతి(కరీంనగర్) ‘స్వప్నం రాల్చిన అమృతం’, మణికంఠ ఆర్ట్స్(పిఠాపురం) ‘కొత్త తరం కొడుకులు’, ఉషోదయా కళానికేతన్(కట్రపాడు) ‘కిడ్నాప్’, 23న అరవింద్ ఆర్ట్స్ (తాడేపల్లి) ‘అసత్యం’ నాటిక ప్రదర్శనలు జరుగుతాయని వివరించారు. ప్రముఖ సినీ, టీవీ, హాస్యనటులు అప్పారావు ఆధ్వర్యంలో హాస్యవల్లరి ప్రదర్శన జరుగుతుందని తెలిపారు. సమావేశంలో సమితి కార్యదర్శి గుత్తు చిన్నారావు, కోశాధికారి నక్క శంకరరావు, ఉపాధ్యక్షులు మండవిల్లి రవి, కిల్లాన ఫల్గుణరావు, మెట్ట పోలినాయుడు, కొమనాపల్లి సురేష్, కొంక్యాన మురళీధర్, పార్థసారధి, వరలక్ష్మీ, ఉషారాణి, యు.పూజ, రాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
హాల్టికెట్ల పేరిట విద్యార్థులను వేధించొద్దు
శ్రీకాకుళం అర్బన్: ఈ నెల 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షల హాల్ టికెట్ల జారీలో ఫీజులు పెండింగ్లో ఉన్నాయన్న నెపంతో జిల్లాలో పలు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు హాల్ టికెట్లలో స్కూల్ ప్రిన్సిపాల్ సంతకాలు, స్టాంపులు ఉండాల్సిందేనన్న నిబంధనలు పెట్టి విద్యార్థులను మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు గొండు సీతారాం గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమయంలో ఫీజుల కోసం ఒత్తిడి చేయడం సమంజసం కాదని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పలు సూచనలు జరీ చేసిందని గుర్తు చేశారు. ఎక్కడైనా హాల్ టికెట్ల జారీ పేరుతో యాజమాన్యాలు గందరగోళ పరిస్థితులు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. తుప్పల్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఎచ్చెర్ల క్యాంపస్: మండలంలోని జరజాం రోడ్డు పక్కన తుప్పల్లో గురువారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న ఎస్సై నక్క కృష్ణారావు, పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి వయస్సు సుమారు 30 ఉండవచ్చని భావిస్తున్నారు. ఇతను కొంతకాలంగా ఈ ప్రాంతంలోనే తిరిగే వాడని స్థానికులు చెబుతున్నారు. అనారోగ్యం, ఆకలి వంటి సమస్యలతో మృతి చెంది ఉంటాడని భావిస్తున్నా రు. వివరాలు తెలిసిన వారు పోలీస్స్టేషన్లో తెలియజేయాలని పోలీసులు సూచించారు. మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్ మార్చురీకి తరలించారు. వివరాలు తెలిసిన వారు 08942 –281833, 63099 90853 నంబర్లకు సమాచా రం తెలియజేయాలని కోరారు. లారీని ఢీకొట్టిన కారు ● ఇద్దరు మహిళలకు గాయాలు నరసన్నపేట: జమ్ము ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టెక్కలికి చెందిన పి.సునీత, పి.పద్మలకు తీవ్ర గాయాలయ్యాయి. ముందు వెళ్తున్న లారీని వెనకనుంచి కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారు డ్రైవరు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కారు ముందు భాగం పూర్తిగా నుజ్జయ్యింది. తాపీమేసీ్త్ర పి.గణపతి కాలికి గాయం కావడంతో శ్రీకాకుళంలో చికిత్స చేసిన అనంతరం తిరిగి ఇంటికి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం తెలుసుకున్న ఎన్హెచ్ అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఫీడర్ అంబులెన్సులో ప్రసవం కంచిలి: మండలంలోని కుంబరినౌగాం గ్రామానికి చెందిన సునీత బెహరా అనే గర్భిణికి గురువారం మధ్యాహ్నం పురిటి నొప్పులు వచ్చాయి. సమాచారం అందుకున్న ఎం.ఎస్.పల్లి పీహెచ్సి ఫీడర్ అంబులెన్స్ ఈఎంటీ అజయ్ వెంటనే గ్రామానికి వెళ్లారు. ఫీడర్ అంబులెన్సులో సునీతను తీసుకొస్తుండగా నొప్పులు ఎక్కువ కావడంతో మార్గమధ్యలోనే ప్రసవం చేయించడంతో మగబిడ్డ జన్మించాడు. అనంతరం తల్లీబిడ్డలను ఆస్పత్రికి తరలించారు. సమయస్ఫూర్తితో స్పందించిన ఈఎంటీ అజయ్ను గ్రామస్తులు అభినందించారు. మానవ అక్రమ రవాణా నిరోధించాలి శ్రీకాకుళం పాతబస్టాండ్ : మానవ అక్రమ రవాణా, వెట్టిచాకిరీ వ్యవస్థను సమూలంగా నిర్మూలించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని న్యాయసేవా సదన్లో పోక్సో చట్టం, వెట్టి చాకిరి నిర్మూలన, మానవ అక్రమ రవాణా నిషేధ చట్టంపై స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు, మున్సిపల్ కమిషనర్ పి.వి.ఆర్.పి.ప్రసాదరావు, డిప్యూటీ లేబర్ కమిషనర్ కె.అజయ్ కార్తికేయ, డిప్యూ టీ డైరెక్టర్ విశ్వమోహన్ రెడ్డి, బాలల సంక్షేమ అధికారులు శ్రీలక్ష్మి, కె.వి.రమణ పాల్గొన్నారు. -
శ్రీకాకుళం
దగ్గరకొచ్చారో దూకేస్తా..! రిమ్స్లో ఓ రోగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సెక్యూరిటీ సిబ్బంది రక్షించారు. –8లోశుక్రవారం శ్రీ 14 శ్రీ మార్చి శ్రీ 2025ఇన్విజిలేటర్కు దేహశుద్ధి ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ఓ ఇన్విజిలేటర్కు దేహశుద్ధి జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన బుధవారం సాయంత్రం జరగ్గా, గురువారం క్యాంపస్లో చర్చనీయాంశంగా మారింది. వర్సిటీలో.. న్యాయ విద్య ఎల్ఎల్బీ మూడేళ్లు, ఎల్ఎల్బీ ఐదేళ్ల పరీక్షలు 1, 3, 5 సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. బుధవారం శ్రీకాకుళానికి చెందిన ఓ విద్యార్థిని పరీక్షకు హాజరైంది. ఇన్విజిలేటర్గా వర్సిటీకి చెందిన గెస్ట్ ఫ్యాకల్టీ సభ్యుడు వ్యవహరించారు. అయితే పరీక్ష రాస్తున్న విద్యార్థిని ఫోన్ నంబర్ను అడిగి తీసుకున్న ఇన్విజిలేటర్ ‘నువ్వంటే నాకిష్టం.. చూసి పరీక్ష రాసుకో.. నీకోసం రూం మొత్తం విడిచి పెడతా’ అంటూ మెసేజ్పెట్టాడు. దీంతో ఆమె తన కుటుంబ సభ్యులకు ఈ మెసేజ్ను ఫార్వర్డ్ చేసి విష యం చెప్పి కాలేజీకి రావాలని సూచించింది. పరీక్ష సాయంత్రం ఐదు గంటలకు అయిపో యాక ఆమె ఇన్విజిలేటర్ను తన కుటుంబ సభ్యులకు చూపించింది. దీంతో నలుగురు వ్య క్తులు ఇన్విజిలేటర్పై దాడికి దిగారు. అక్కడ ఏం జరుగుతుందో.. ఎందుకు దాడి చేస్తున్నా రో తెలీక విద్యార్థులంతా చూస్తూ ఉండిపోయా రు. తర్వాత వారికి కూడా విషయం తెలిసింది. మెసేజ్ పెట్టిన వ్యక్తి క్షమాపణ చెప్పటంతో అతడిని విడిచిపెట్టారు. అయితే పరీక్ష కేంద్రంలోనికి సెల్ఫోన్ను అనుమతించడం వల్లే ఈ తంతు జరగడం వర్సిటీలో చర్చనీయాంశమైంది. టీచర్పై ఫిర్యాదు టెక్కలి రూరల్: మండలంలోని పెద్దసాన గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమికోన్న త పాఠశాలలో ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని వారి తల్లిదండ్రులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి.నేతాజీకి బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఎంఈఓ దల్లి తులసిరావురెడ్డి ఉన్నతాధికారులకు తెలియజేశారు. డీఈఓ ఎస్.తిరుమల చైతన్య గురువారం సాయంత్రం పాఠశాలకు చేరుకుని విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులతో మాట్లాడి వివరాలు సేకరించారు. బాధిత విద్యార్థినుల తల్లిదండ్రులతో సైతం మాట్లాడారు. కిడ్నీ వ్యాధులపై జాగ్రత్త శ్రీకాకుళం: కిడ్నీ సంబంధిత వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పిలుపునిచ్చారు. గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి వద్ద జరిగిన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కిడ్నీ బాధితుల కోసం డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మరో ఐదు డయాలసిస్ యూనిట్లను ప్రభుత్వం మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. పలాసలో ఉన్న కిడ్నీ పరిశోధన కేంద్రం (ఆస్పత్రి)లో మెరుగైన సేవలు అందిస్తామన్నారు. కిడ్నీ వ్యాధిని త్వరగా గుర్తించేందుకు హార్వర్డ్, నార్త్ కెరోలీనా, కొలంబియా సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజి, ఐఏఎస్సీ బెంగళూరు యూనివర్సిటీలతో కలసి పరిశోధనలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. కిడ్నీ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు మనిషి జీవన విధానంలో మార్పు రావాలన్నారు. ఎక్కువ నీరు తాగటం, వ్యాయామం చేయటం, ఒత్తిడికి గురికాకుండా ఉండటం, ఏటా పరీక్షలు చేయించుకోవటం వంటి పలు పద్ధతులను పాటించాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ రమేష్, డీసీహెచ్ డాక్టర్ కళ్యాణ్ బాబు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బాలమురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.శ్రీకాకుళం కల్చరల్: రంగుల వేడుకకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే మార్కెట్ను రంగులు ముంచెత్తుతున్నాయి. మరోవైపు ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి సందర్భంగా వసంతోత్సవం పేరుతో స్వామికి డోలోత్సవాలు కూడా నిర్వహిస్తారు. దేశంలోనే ఏకై క దేవాలయమైన అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయంలో డోలోత్సవాలు నిర్వహిస్తున్నారు. ముందురోజు కామదహనోత్సవం జరుపుతారు. అనంతరం పడియ సందర్భంగా సముద్రస్నానాలు ఆచరిస్తారు. ఈ సందర్భంగా ఉషా, ఛాయా, ప ద్మినీ సమేత శ్రీసూర్యనారాయణ స్వామి రోడ్డు పక్కనున్న డోలో మండపంలో ఉత్తర ముఖంగా భక్తులకు దర్శనమిస్తారు. భక్తులపైన వసంతం జల్లుతారు. శ్రీకూర్మంలో కూడా ఉత్సవం నిర్వహిస్తారు. శ్రీకాకుళంలోని ఉమా రుద్రకోటేశ్వరస్వామి ఆలయం ఆధ్వర్యంలో స్వామి ఉత్సమూర్తులను డోలో మండపంలో ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తారు. జిల్లా కేంద్రంలో సుమా రు 150 కుటుంబా లు ఉన్న మార్వాడీలు ఒకే చోట చేరి హోలీ ఉత్సవాన్ని రాజస్థానీ మిలన్ మంచ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ●రక్తచందనం, ఎర్రమందారం, టమాటా, క్యారెట్లతో ఎర్రరంగు తయారు చేయవచ్చు. ●గోరింటాకుతో ఆకుపచ్చని రంగు తయారు చేయవచ్చు. ●పసుపు కొమ్ములను దంచి నీళ్లలో నానబెట్టి పసుపు రంగు చేసుకోవచ్చు. ●మోదుగపూలను నీటిలో నానబెట్టి రంగులను తయారు చేస్తారు. ●గోగుపూలతో బోలెడంత ఎర్రరంగు తయరు చేసుకోవచ్చు. జాగ్రత్తలు తప్పనిసరి ●హోలీలో సహజమైన రంగులు మాత్రమే వాడాలి. ●రసాయన రంగులు వాడి ప్రమాదం తెచ్చుకోవద్దు. ●హోలీ రంగుల్లో ఉపయోగించే క్రోమియం, సీసం రసాయనాలు క్యాన్సర్ కారకాలు. ●రంగులు విపరీతంగా చల్లుకోవడం వల్ల గాలిలోకి రంగుల సూక్ష్మ కణాలు చేరుతాయి. దాని వల్ల మనకు తుమ్ములు, దగ్గు వచ్చి శ్వాశకోస సంబంధ ఇబ్బందులు వస్తాయి. ●రసాయన రంగులు కళ్లల్లో పడగానే కంటి చికాకు, ఎరుపు, నీరుకారడం, తాత్కాలిక అంధత్వం కలిగిస్తుంది. కళ్లలో పడకుండా జాగ్రత్త పడాలి. ●రంగుల వల్ల కొందరిలో ఎలర్జీ వస్తుంది. వారిని దూరంగా ఉంచాలి. ●హోలీ ఆడిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరచుకోవాలి. ●రసాయన రంగుల వలన అనుకోని ప్రమాదం జరిగితే వెంటనే వైద్యుని సంప్రదించాలి. ●మూడు రోజులపాటు.. హిందూ సంప్రదాయంలో ఈ ఉత్సవాన్ని వసంతోత్స వం అని పిలుస్తారు. మూడు రోజుల పాటు జరుగుతుంది. మొదటి రోజు కామదహనోత్సవం, రెండో రోజు పడి యా సందర్భంగా సముద్రస్నానాలు, మూడో రోజున స్వామిని తోటలోని డోలో మండపంలో ఉంచి ఊయలలో ఊపుతూ డోలోత్సవం నిర్వహిస్తాం. – ఇప్పిలి శంకరశర్మ, ప్రధాన అర్చకులు, అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం ●సహజ రంగులు వాడాలి కళ్లకు, చర్మానికి ఎలాంటి ప్రమాదం రాకుండా సహజ రంగులు వాడాలి. రసాయన రంగులు కళ్లలో పడితే ఎర్రగా మారి నీళ్లు వస్తాయి. అలాగే చర్మ వ్యాధులు వస్తాయి. జాగ్రత్తలు పాటించాలి. – ఎంఆర్కే దాస్, ఆఫ్తాలమిక్ అధికారిప్రశాంతంగా పండగ చేసుకోండి: ఎస్పీ శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా ప్రజలు హోలీ పండగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి సూచించారు. ఈ మేరకు గురువా రం పత్రికా ప్రకటన విడుదల చేశారు. గొడవలు, అల్లర్ల జోలికి వెళ్లకుండా వేడుకలు జరుపుకోవాలని, బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకరంగా ప్రవర్తించినా, ఆకతాయి చర్యలకు పాల్పడినా చర్యలు తప్పవన్నారు. కలుషితమైన, ప్రమాదకరమైన రంగులు వినియోగించవద్దని పర్యావరణహితమైన రంగులు వాడాలని సూచించారు. పోర్ట్ నిర్వాసితులకు ప్లాట్ల కేటాయింపు టెక్కలి రూరల్: సంతబొమ్మాళి మండలం మూల పేట గ్రీన్ ఫీల్డ్ ఫోర్ట్ నిర్వాసితులకు ప్లాట్లను టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి లాటరీ ద్వారా గురువారం కేటాయించారు. మూలపేట, విష్ణు చక్రం గ్రామాలకు గాను నౌపడలో 58 ఎకరాల్లో 596 కుటుంబాలకు ప్లాట్లను కేటాయించారు. పోర్టు నిర్మాణంతో గ్రా మాన్ని కోల్పోయిన విష్ణు చక్రం గ్రామస్తులకు ముందుగా 80 మందికి పునరావాస కాలనీలో పాట్లను కేటాయించారు. మరో రెండు నెలల్లో గ్రామాన్ని తరలించాల్సి వస్తుందని, అంతా సహకరించాలని కోరారు. అంతకు ముందు పునరావాస కాలనీలో భూమి పూజ చేశారు. న్యూస్రీల్ఇంటి వద్దే రంగుల తయారీ ఇలా.. హోలీ వేడుకకు సర్వం సిద్ధం దేవాలయాల్లో డోలోత్సవాలు రసాయన రంగులు వద్దంటున్న నిపుణులు -
డిగ్రీ స్పెషల్ డ్రైవ్ పరీక్ష ఫలితాలు విడుదల
ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో డిసెంబర్లో జరిగిన స్పెషల్ డ్రైవ్ డిగ్రీ–1, 2, 3 సెమిస్టర్ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. జ్ఞానభూమి వెబ్సైట్, వర్సిటీ వెబ్సైట్లలో ఫలితాలు అందుబాటులో ఉంచామని యూజీ ఎగ్జామినేషన్స్ ఇన్చార్జి డీన్ పి.పద్మారావు తెలిపారు. రీ వాల్యుయేషన్కు 15 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ ● బీసీ సంక్షేమశాఖలో ఇద్దరు చిరుద్యోగుల నుంచి లంచం డిమాండ్ ● రూ.25 వేలు తీసుకుంటూ పట్టుబడిన వైనం శ్రీకాకుళం పాతబస్టాండ్ : చిరుద్యోగుల నుంచి లంచం తీసుకుంటూ బీసీ సంక్షేమ శాఖ సీనియర్ అసిస్టెంట్ బుడుమూరు బాలరాజు ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ బి.వి.ఎస్.ఎస్.రమణమూర్తి, సీఐ కె.భాస్కరరావులు విలేకరులకు వివరాలు వెల్లడించారు. బీసీ సంక్షేమ శాఖలో పనిచేస్తున్న కుక్, అటెండర్లకు ఇంక్రిమెంట్లు, ఇతర ఎరియర్స్ బిల్లులు పెట్టేందుకు సీనియర్ అసిస్టెంట్ బాలరాజు డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. వారు ఇచ్చి న సూచనల మేరకు బుధవారం మున్సిపల్ కార్యాలయం పరిసరాల్లో బాధితుల నుంచి రూ.10,000, రూ.15,000 చొప్పున మొత్తం రూ.25,000బాలరాజు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. గాడితప్పిన ‘సంక్షేమం’ కాగా, బీసీ సంక్షేమ శాఖ ఉద్యోగులు ఏసీబీ దాడుల్లో పట్టుపడటం ఇది మూడోసారి. డీబీసీగా రవిచంద్ర ఉన్న సమయంలో ఉపకార వేతనాల కుంభకోణంలో అప్పటి అధికారులు, సిబ్బంది ఏసీబీకి చిక్కారు. ఆరుగురు సస్పెండయ్యారు. ఆ కేసు ఇంకా కొనసాగుతోంది. మూడేళ్ల క్రితం బీబీసీగా శ్రీదేవి ఉన్న సమయంలో విద్యార్థుల యూనిఫారాల కుట్టు మజూరీలు చెల్లించేందుకు లంచం అడిగిన జూనియర్ అసిస్టెంట్ ప్రసాద్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తాజాగా బాలరాజు సైతం ఏసీబీకి చిక్కారు. అయితే ఈ ఘటనలన్నింటిలోనూ చిన్నస్థాయి ఉద్యోగులకే కాకుండా ఉన్నతాధికారుల భాగస్వామ్యం కూడా ఉండే అవకాశం ఉందంటూ పలువురు చర్చించుకోవడం గమనార్హం. నెల రోజులు క్రితం ఈ శాఖ అధికారులు, వార్డెన్లను ఏసీబీ అధికారులు కార్యాలయానికి పిలిపించారు. అవినీతి కార్యక్రమాలపై ఆరాతీశారు. వీటిలో ప్రధానంగా బీఆర్ (బొడ్డేపల్లి రాజగోపాలరావు) శతజయంతి ఉత్సవాలకు రూ.25 లక్షలు ఖర్చు చేసినట్టు చూపించారని, అందులో భారీగా అవినీతి జరిగిందని, బదిలీలు, పదోన్నతులు, తదితర అంశాలపై ఆరాలు తీసినట్లు తెలిసింది. అయినా ఈ శాఖలోని కొందరు అవినీతి ఉద్యోగుల్లో మార్పు రాలేదు. పక్కాగా ‘పది’ పరీక్షలు శ్రీకాకుళం పాతబస్టాండ్: పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ బుధవారం జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, డీఈవో తిరుమల చైతన్య తదితరులు పాల్గొన్నారు. -
విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు
పాతపట్నం: విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు బి.కాంతారావు హెచ్చరించారు. మండల కేంద్రంలోని రేషన్ డిపోలు, మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లు(ఎండీయూఎస్), బూరగాంలోని రేషన్ షాపు, అంగన్వాడీ కేంద్రాలతో పాటు పాతపట్నం ఆల్ ఆంధ్ర రోడ్డులోని ప్రభుత్వ మోడల్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని బుధవారం తనిఖీ చేశారు. విద్యార్థులకు పెట్టే భోజనం సరిగా లేకపోవడంతో నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డులు సక్రమంగా లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనతో పాటు తహసీల్దార్ ఎస్.కిరణ్ కుమార్, సీడీపీవో టి.విమలారాణి, ఏఎస్డబ్ల్యూవో ఎం.శ్యామల, ఎస్ఎస్ఏ జీసీడీవో ఎస్.నీరజ, ఎంఈవో–2 సీహెచ్ తిరుమలరావు, సీఎస్డీటీలు ప్రసాదరావు, చక్రవర్తిలు, ఆర్ఐ బాబి, ఎండీయూ ఆపరేటర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రైతు సూర్యనారాయణ, ఐసీడీఎస్ సూపర్వైజర్లు అనూరాధ, ఉషారాణి తదితరులు ఉన్నారు. మెళియాపుట్టి: విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ కమిటీ సభ్యుడు బి.కాంతారావు సూచించారు. మండలంలోని కేజీబీవీ, చాపర ఎస్సీ హాస్టల్, ఎఫ్సీఐ గోడౌన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చాపర ఎస్సీ వసతి గృహంలో రికార్డులు, నిల్వ ఉన్న సామగ్రిలో తేడాలున్నట్లు గుర్తించారు. పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసి, వార్డెన్కు మెమో జారీ చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఆయనతో పాటు తహసీల్దార్ పాపారావు తదితరులు ఉన్నారు. -
యువత పోరుకు విశేష స్పందన
ప్లకార్డులు ప్రదర్శిస్తున్న విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, నిరుద్యోగులుప్రభుత్వ తీరు దుర్మార్గం ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి వైఎస్సార్ సీపీ హయాంలో 17 కొత్త మెడికల్ కళాశాలలు ఏర్పాటయ్యాయి. కూటమి సర్కారు మాత్రం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తోంది. మెడికల్ సీట్లు కూడా వద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడం దురదృష్టకరం. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడం తగదు. ప్రభుత్వం వెంటనే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలి. – తమ్మినేని సీతారాం, మాజీ శాసన సభాపతి ● కలెక్టరేట్ వద్ద కదం తొక్కిన విద్యార్థులు, నిరుద్యోగులు ● వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ● సర్కారు ఉక్కుపాదం మోపినా వెనక్కి తగ్గని పరిస్థితి ● ‘సీఎం డౌన్ డౌన్’ అంటూ నినాదాల హోరు ● బాబు మోసం గ్యారెంటీ: పార్టీ జిల్లా అధ్యక్షుడు కృష్ణదాస్ ● బాబు ధ్యాసంతా అమరావతిపైనే: మాజీ మంత్రి సీదిరి ● నిరుద్యోగులను నట్టేట ముంచారు: మాజీ స్పీకర్ తమ్మినేని ●శ్రీకాకుళం(పీఎన్కాలనీ)/శ్రీకాకుళం పాతబస్టాండ్ : కూటమి ప్రభుత్వ మోసాలపై యువత గర్జించింది. తమకు మద్దతుగా పోరు సాగిస్తున్న వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలిసి ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపించింది. ప్రధానంగా ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం చేస్తున్న పాలకుల తీరును తీవ్రంగా ఎండగట్టింది. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘యువత పోరు’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ నేతృత్వంలో తొలుత బకాయి ఫీజులు వెంటనే చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మహాత్మా జ్యోతిరావుపూలే పార్కు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లారు. అక్కడ డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు. బాబు ష్యూరిటీ– మోసం గ్యారెంటీ.. బకాయి పడ్డ వేతనాలు వెంటనే చెల్లించాలి.. నిరుద్యోగ యువతకు భృతి ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయసాయిరాజ్, ఎమ్మెల్సీ నర్తు రామా రావు, మాజీ ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, గొర్లె కిరణ్కుమార్, టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్, ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్లు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ రెండు పథకాలకు సరిపడా నిధులను బడ్జెట్ కేటాయింపులు పెంచి సకాలంలో వాటిని విడుదల చేయాలన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి మోసాలపై భవిష్యత్లో ఉద్యమాలు మరింత ఉద్ధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో యువజన విభాగం ఉత్తరాంధ్ర జిల్లాల అధ్యక్షుడు ఎం.వి.స్వరూప్, తూర్పుకాపు, కళింగ వైశ్య కులాల రాష్ట్ర అధ్యక్షులు మామిడి శ్రీకాంత్, అంధవరపు సూరిబాబు, కళింగ కుల రాష్ట్ర అధ్యక్షుడు దుంపల లక్ష్మణరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.జి సత్యనారాయణ, డాక్టర్స్సెల్ విభాగం జిల్లా అధ్యక్షుడు చింతాడ వరుణ్, ఇంటెలెక్చువల్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లల రామకృష్ణారావు, కార్యదర్శి సీపాన వెంకటరావు, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, ధర్మాన కృష్ణచైతన్య, తమ్మినేని చిరంజీవినాగ్, మార్పు పృథ్వీ, ముంజేటి కృష్ణమూర్తి, ఎంఏ బేగ్, లోలుగు కాంతారావు, గొండు కృష్ణ, చిట్టి జనార్దన, సాదు వైకుంఠరావు, గొండు రఘు, శాడి శ్యాంప్రసాద్ రెడ్డి, ప్రత్తి అన్వేష్, బల్లాడ జనార్దన్ రెడ్డి, పిన్నింటి సాయి, రౌతు శంకరరావు, ఎన్ని ధనుంజయరావు, సీపాన రామారావు, రుప్ప దివ్య, వై.వి.శ్రీధర్, బొడ్డేపల్లి పద్మజ, బొడ్డేపల్లి రమేష్, గుండ హరీష్, టి.కామేశ్వరి, యజ్జల గురుమూర్తి, ఖండాపు గోవిందరావు, కోట గోవిందరావు, పప్పల రమేష్, పీస శ్రీహరి, పీస గోపి, అంబటి శ్రీనివాసరావు, మూకళ్ల తాతబాబు, బొడ్డేపల్లి రమణ, పప్పల పారినాయుడు, సనపల బాబూరావు, తమ్మినేని మురళి, బెండి గోవిందరావు, తమ్మినేని శ్రీరామ్మూర్తి, బాడాన సునీల్, వాడన కృష్ణ, దుంపల గోవిందరావు, సీహెచ్ భాస్కరరావు, విద్యార్థులు, నిరుద్యోగ యువత పాల్గొన్నారు. అప్పులు తెచ్చి ఫీజులు కడుతున్నారు కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలిచ్చింది. నిరుపేద విద్యార్థులను, నిరుద్యోగ యువతకు అమలుచేయలేని హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు వాటిని అమలు చేయలేక సీఎం చంద్రబాబునాయుడు ముఖం చాటేస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 11 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ అందక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పరీక్షలు రాసేందుకు యాజమాన్యాలు హాల్టిక్కెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నట్లు తెలిసింది. దీంతో తల్లిదండ్రులు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. నిరుద్యోగులంటే కూటమి ప్రభుత్వానికి ఎందుకంత చిన్నచూపు? –ధర్మాన కృష్ణదాస్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అరకొరగా కేటాయింపులు గత ఏడాది ఎన్నికల కోడ్ సమయంలో విద్యార్థులకు ఫీజు డబ్బులు ఇవ్వనీయకుండా కూటమి పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. అధికారంలోకి వచ్చాక ఫీజులు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, వసతిదీవెన పథకాలకు ఏటా రూ.3,900 కోట్లు కావాలి. ఇప్పటికే ఉన్న బకాయిలు రూ.3,200 కోట్లు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సింది మరో రూ.3,900 కోట్లు. మొత్తం కావాల్సింది రూ. 7,100కోట్లు. ఈ బడ్జెట్లో కేటాయించింది మాత్రం రూ 2,600 కోట్లే. నిరుద్యోగ భృతి పేరిట కూడా యువతను మోసగించారు. బాబు ధ్యాసంతా అమరావతిపైన తప్ప మెడికల్ కాలేజీలపై లేదు. – డాక్టర్ సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రిడీఆర్ఓకు వినతిపత్రం అందజేస్తున్న ధర్మాన కృష్ణదాస్, తమ్మినేని సీతారాం, సీదిరి అప్పలరాజు, పిరియా విజయ, నర్తు రామారావు, రెడ్డి శాంతి, గొర్లె కిరణ్కుమార్, పేరాడ తిలక్, చింతాడ ర వికుమార్ తదితరులుయువతరం ఉత్తుంగ తరంగమై కదం తొక్కింది. కూటమి సర్కారు మోసపూరిత వైఖరిని గొంతెత్తి గర్జించింది. ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి వంటి హామీలను విస్మరించిన చంద్రబాబు సర్కారు తీరుపై నిరసనలతో హోరెత్తించింది. వైఎస్సార్సీపీ పిలుపునకు యువత నుంచి లభించిన అనూహ్య స్పందన తొమ్మిది నెలల స్వల్ప కాలంలోనే కూటమి ప్రభుత్వంపై యువతలో పెరిగిన అసంతృప్తికి యువత పోరు ఉద్యమం దర్పణం పట్టింది. -
ఆఫ్షోర్ ఎప్పుడు పూర్తి చేస్తారు
● నిధులు కేటాయించకపోతే పోరాటం తప్పదు ● సీపీఎం జిల్లా కార్యదర్శి గోవిందరావు నందిగాం: ఆఫ్షోర్ రిజర్వాయర్ పనులు ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యవర్గ సభ్యుడు కె.మోహనరావులు డిమాండ్ చేశారు. ప్రజా చైతన్య యాత్రల్లో భాగంగా బుధవారం నందిగాంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు నంబూరు షణ్ముఖరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆఫ్షోర్ రిజర్వాయర్ పనులు 2007లో ప్రారంభించారని, నేటికి 18 ఏళ్లు గడుస్తున్నా సగం పనులు కూడా పూర్తవ్వకపోవడం దారుణమన్నారు. ఇది శ్రీకాకుళం జిల్లాపై పాలకులకు ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రారంభంలో రూ.127 కోట్లు అంచనా వ్యయం కాగా, ప్రస్తుతం అది రూ.852 కోట్లకు పెరిగిందని గుర్తు చేశారు. ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో రిజర్వాయర్కు తగిన నిధులు ఎందుకు కేటాయించలేదో మంత్రి అచ్చెన్నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. బడ్జెట్లో మొక్కుబడి కేటాయింపులు పాత పనుల బిల్లులకే సరిపోతాయని ఎద్దేవా చేశారు. రిజర్వాయర్ పూర్తి చేయాలనే చిత్తశుద్ధి ఉంటే రూ.500 కోట్లు కేటాయించాలన్నారు. ఆఫ్షోర్ పూర్తయితే 24,600 ఎకరాలకు సాగునీటితో పాటు పలాసకు తాగునీరు అందుతుందని తెలిపారు. పెండింగ్ పనులకు నిధులు కేటాయించకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు. అలాగే జిల్లాలో గిరిజన ప్రాంతాన్ని ఐదో షెడ్యూల్లో చేర్చాలని, ఐటీడీఏను ఏర్పాటు చేయాలని, రైతులు పండించిన పంట మొత్తాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు పాలిన సాంబమూర్తి, హనుమంతు ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
పేదల పక్షపాతి వైఎస్సార్ సీపీ
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): మహానేత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాంతరం రాష్ట్రంలో పేదల కన్నీళ్లు, నిరుపేద ల కష్టాలు తీర్చాలన్న దృఢ సంకల్పంతో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 2011లో వైఎస్సార్ సీపీని ప్రారంభించారని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్స వం సందర్భంగా జెండా ఆవిష్కరించారు. ముందు గా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన సాగించారని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే సీఎం చంద్రబాబు చేస్తున్న అరాచక పాలనను ప్రజలు తట్టుకోలేకపోతున్నార ని చెప్పారు. చంద్రబాబుని ఎప్పుడు గద్దె దింపుదా మా అని ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించిన నాయకుడు వైఎస్ జగన్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ -
భారీగా గంజాయి స్వాధీనం
నరసన్నపేట: గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా సుబలై గ్రామానికి చెందిన తుఫాన్ కరియా అనే వ్యక్తిని నరసన్నపేట పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 24 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ జె.శ్రీనివాసరావు తెలిపారు. తుఫాన్ కరియా ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి గుజరాత్ రాష్ట్రంలోని సూరత్లో రితీష్ అనే వ్యక్తికి ఇచ్చేందుకు తీసుకెళ్తున్నాడు. దీనికి సంబంధించి ముందస్తు సమాచారంతో మడపాం టోల్గేట్ వద్ద నరసన్నపేట ఎస్ఐ దుర్గాప్రసాద్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో తుఫాన్ కరియా ఒక వాహనంలో నుంచి దిగిపారిపోతుండగా వెంబడించి పట్టుకొని కేసు నమోదు చేశారు. బరంపురం నుంచి ఈ గంజాయిని తీసుకెళ్తున్నట్లు తెలిపారు. ఇచ్ఛాపురం టౌన్: ఒడిశా నుంచి సూరత్కు 10.31 కిలోల గంజాయి తరలిస్తున్న ఒడిశా రాష్ట్రం ముమిదిహ గ్రామానికి చెందిన బురగాన సింహాచల పాత్రో, సంజయ బెహరాలను అరెస్ట్ చేసినట్లు కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు తెలిపారు. వీరిద్దరూ సూరత్లో పనిచేస్తూ జీవిస్తున్నారు. వారికి అక్కడ గంజాయి వ్యాపారం చేసే గొల్ల అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతను తనకు గంజాయి అందిస్తే కిలోకు రూ.9 వేలు ఇస్తానని చెప్పడంతో ఒడిశా రాష్ట్రంలోని కొద్ద గ్రామానికి చెందిన వ్యక్తి వద్ద కొనుగోలు చేశారు. గంజాయిని ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్కు తీసుకెళ్తుండగా పట్టణ పోలీసులు తనిఖీలు చేసి పట్టుకున్నారు. సమావేశంలో సీఐ చిన్నమనాయుడు, ఎస్ఐ ముకుందరావు పాల్గొన్నారు. -
రాజగోపాలరావు సేవలు చిరస్మరణీయం
● వైఎస్సార్సీపీ కళింగ కుల రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరావు శ్రీకాకుళం (పీఎన్కాలనీ): కళింగ జాతి అభివృద్ధికి బొడ్డేపల్లి రాజగోపాలరావు చేసిన సేవలు చిరస్మరణీయమని వైఎస్సార్సీపీ కళింగ కుల రాష్ట్ర అధ్యక్షుడు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ దుంపల లక్ష్మణరావు అన్నారు. బుధవారం బొడ్డేపల్లి రాజగోపాలరావు 102వ జయంతి సందర్భంగా శ్రీకాకుళం పట్టణంలోని సింహద్వారం వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి పదవి కావాలా.. ప్రాజెక్టు కావాలా అని అప్పట్లో ఆయనకు ఆఫర్ ఇస్తే ప్రాజెక్టు కావాలంటూ జిల్లా అభివృద్ధి కోరుకున్న మహనీయుడని కొనియాడారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కిల్లి వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ కళింగ జాతికి బీసీ–ఏ రిజర్వేషన్ కల్పించేందుకు ఎంతో కృషి చేశారన్నారు. ఆయన కృషి వలన నేడు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతున్నామని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణించినా ప్రతీ ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పొందూరు మండల పార్టీ అధ్యక్షుడు పప్పల రమేష్, చింతాడ ప్రసాద్, పైడి నాగభూషణ్, సీపాన రామారావు, చాపర వెంకటరావు, పైడి శ్రీను, తిర్లంగి లోకనాథం, బొడ్డేపల్లి మోహన్, గురుగుబెల్లి శేఖర్, పప్పల సూర్యారావు, పొన్నాడ సత్యం, దుంపల గోవిందరావు, సీపాన హేమసుందర్, చింతాడ శ్రీను, మెట్ట రామారావు, బుడుమురు మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
గృహ నిర్మాణాలకు అదనపు సాయం
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న గృహాలను నిర్మించుకునేందుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అదనపు సాయం అందిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2029 నాటికి ‘అందరికీ గృహ నిర్మాణం‘ అనే లక్ష్యాన్ని సాధించేందుకు ఈ సాయం అందిస్తున్నట్టు చెప్పారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద ఇప్పటికే ఇల్లు మంజూరై నిర్మాణంలో ఉన్న వాటిని పూర్తి చేసేందుకు సాయం అందిస్తామన్నారు. ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు యూనిట్ ధర కంటే అదనంగా రూ.50,000, ఎస్టీ లబ్ధిదారులకు రూ.75,000, పీవీటీజీ (పర్టిక్యులర్లీ వనరబుల్ ట్రైబుల్ గ్రూప్) లబ్ధిదారులకు రూ.1,00,000 చెల్లించనున్నట్లు వివరించారు. 2024 డిసెంబర్ 10 నాటికి నిర్మాణ దశలో ఉన్న ఇళ్లకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. సమావేశంలో హౌసింగ్ పీడీ నగేష్ పాల్గొన్నారు. -
బాధ్యతగా విధులు నిర్వహించండి
● జెడ్పీ చైర్పర్సన్ విజయ అరసవల్లి: జిల్లా పరిషత్ యాజమాన్యంలో కారుణ్య నియామకాలను పూర్తి పారదర్శకంగా చేపడుతున్నామని, ఉద్యోగాలు పొందినవారు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాలని జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ సూచించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బంగ్లాలో కారుణ్య నియామకాల కింద పాలక దమయంతి (సరుబుజ్జిలి ఎంపీపీ ఆఫీస్ సబార్డినేట్), మక్క అప్పలనాయుడు (జెడ్పీ ఆఫీస్ సబార్డినేట్), లండ కోటేశ్వరరావు (కొలిగాం జెడ్పీ స్కూల్ ఆఫీస్ సబార్డినేట్) లకు నియామకపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో ఎల్ఎన్వీ శ్రీధర్ రాజా, సీ సెక్షన్ సూపరింటెండెంట్ రమేష్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి పాతపట్నం: మండలంలోని ద్వారాకాపురం వద్ద పాతపట్నం–టెక్కలి రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని లాబర గ్రామానికి చెందిన సనపల మధు(22) బుధవారం సాయంత్రం సారవకోట మండలం కరడసింగి గ్రామంలోని తన చెల్లెలు ఇంటికి వెళ్లాడు. అనంతరం తన బావ మండల శివ, మేనల్లుడు (రెండు సంవత్సరాల)తో కలిసి ద్విచక్ర వాహనంపై లాబర బయల్దేరారు. అదే సమయంలో ద్విచక్ర వాహనంపై సారవకోట మండలం జమచక్రంకు చెందిన పంతులు గోపి వస్తున్నాడు. ద్వారకాపురం వద్ద ఈ రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఘటనలో సనపల మధు అక్కడిక్కడే మృతి చెందగా, పంతులు గోపి, మండల శివకు తీవ్రగాయాలయ్యాయి. రెండేళ్ల బాబుకి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి ఎస్ఐ బి.లావణ్య చేరుకున్నారు. గోపిని టెక్కలి జిల్లా ఆస్పత్రికి అంబులెన్స్లో, మండల శివ, బాలుడిని పాతపట్నం సీహెచ్సీకి ఎస్ఐ జీపులో తరలించారు. మృతుడు మధుకి తండ్రి సనపల కృష్ణారావు, తల్లి సనపల సావిత్రిలు ఉన్నారు. వచ్చే నెల ఏప్రిల్ 16న పెళ్లి చేయాలని ముహూర్తం పెట్టుకున్నామని విలపిస్తున్నారు. -
మీ కిడ్నీలు భద్రమేనా?
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లాలో డయాలసిస్ కిడ్నీ రోగుల దుస్థితి దయనీయంగా మారింది. ఉద్దానంలో ఈ ఒక్కరిదే కాదు వందలాది మంది డయాలసిస్ రోగుల పరిస్థితి ఇలాగే ఉంది. కవిటి, సోంపేట సీహెచ్సీ పరిధిలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అవసరాలకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయకపోవడంతో డయాలసిస్ చేయడం అసాధ్యంగా మారింది. అప్పటికే డయాలసిస్ చేసుకుంటున్న వారు చనిపోతే తప్ప కొత్త వారికి డయాలసిస్ చేసే పరిస్థితి జిల్లాలో లేదు. జిల్లాలో 25వేలకు పైగా కిడ్నీ రోగులు ఉన్నారు. కిడ్నీ రోగులతో పాటు డయాలసిస్ కు చేరుకుంటున్న వారి కూడా సంఖ్య పెరుగుతోంది. ఇప్పుడున్న డయాలసిస్ యూనిట్లు సరిపోవడం లేదు. మరోవైపు మృత్యువాత పడుతున్న రోగుల సంఖ్య పెరుగుతోంది. 2024–25లో సుమారు 100మంది కిడ్నీ రోగులు మరణించినట్టుగా తెలుస్తోంది. డయాలసిస్ సెంటర్లతో పాటు అన్ని పీహెచ్సీల్లో గత ప్రభుత్వం 12 రకాల మందులను ఉచితంగా సరఫరా చేసేది. ఇప్పుడా పరిస్థితి లేదు. నెప్రాలజిస్టుౖలు అందుబాటులో ఉండటం లేదు. దీంతో విశాఖపట్నం, శ్రీకాకుళం వెళ్లి తనిఖీలు చేసుకోవల్సిన పరిస్థితి. వైద్యం కోసం రూ.లక్షలు ఖర్చు అవుతుండటం, ప్రభుత్వం అర్హులైన వారందరికీ ఫించన్లు ఇవ్వకపోవడంతో కుటుంబాలు చిదికిపోతున్నాయి. ఒక్క ఉద్దానం ఏరియాలోనే జిల్లాలో కూడా కిడ్నీ కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వం ఆ స్థాయిలో అప్రమత్తం కావడం లేదు. కవిటి మండలం సహలాలపుట్టుగ గ్రామానికి చెందిన పొట్టి దుర్యోధన ఐదు నెలలుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. గతంలో టీబీ క్యాన్సర్తో పోరాటం చేసి కోలుకుంటున్న దశలో కిడ్నీ మహమ్మారి సోకడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇతనికి భార్య జమున, ఐదు, ఏడు తరగతులు చదువుతున్న కుమార్తెలు మోక్ష, సమీరా ఉన్నారు. సొంతిల్లు లేకపోవడంతో స్పెసెల్ గాయ్స్ ఫౌండేషన్ సభ్యులు నిర్మించిన చిన్నపాటి గుడిసెలో తలదాచుకుంటున్నారు. తొలుత శ్రీకాకుళంలోని కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. వేలాది రూపాయలు ఖర్చు చేశారు. సోంపేట, కవిటి డయాలసిస్ కేంద్రాలకు వెళ్లి ఉచితంగా డయాలసిస్ చేయించాలని వేడుకోగా.. ఎవరైనా చనిపోతే ఆ స్థానంలో డయాలసిస్ అవకాశం ఉందంటూ సిబ్బంది చెప్పేశారు. శుక్రవారం మరోమారు కవిటి వెళ్లి సిబ్బంది కాళ్లావేళ్లా పడితే చేతికి ‘ఫిస్టల్’ అమర్చారని, త్వరలో పిలుస్తామంటూ చెప్పి నేటికి వారం దినాలు అవుతున్నా కబురు పంపలేదని భార్య ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం స్పందించి ఉచితంగా డయాలసిస్ చేయించి తండ్రి ప్రాణాలు కాపాడాలని కుమార్తెలు వేడుకుంటున్నారు. స్వీయ అప్రమత్తత తప్పనిసరి కిడ్నీ పనితీరుపైనే మన ఆరోగ్యం కిడ్నీలు ఒంట్లోని వ్యర్థాలు, అదనపు నీటిని బయటకు పంపిస్తాయి. రక్తాన్ని శుద్ధి చేస్తాయి. హిమోగ్లోబిన్ ఉత్పత్తికి కావల్సిన హార్మోన్ కిడ్నీ నుంచే వస్తుంది. విటమిన్– డీ చివరి రూపం కూడా కిడ్నీలోనే ఏర్పడుతుంది. తద్వారా ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. శరీరంలో నీటిస్థాయిని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. గుండె తర్వాత బ్లడ్ ప్రజర్ని కంట్రోల్ చేయడంలో కీలక పాత్ర వహిస్తుంది. ఆరోగ్యంగా ఉండాలంటే... ఉప్పు ఎంత తగ్గిస్తే అంత మేలు. జంక్ ఫుడ్, కొవ్వులు ఎక్కువగా ఉండే నూనె పదార్థాలకు దూరంగా ఉండాలి. శరీరం బరువు పెరగకుండా కంట్రోల్లో ఉంచుకోవాలి. రోజుకి సరిపడా నీళ్లు తాగాలి. కూరగాయలు, ఆకు కూరలు తినాలి. డయాబెటిస్, బీపీ సమస్యలతో బాధపడుతున్న వారు రెగ్యులర్గా చెకప్ చేయించుకోవాలి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా పెయిన్ కిల్లర్ వంటి మందులు రెగ్యులర్గా వాడకూడదు. అనారో గ్యంగా ఉన్నట్లు అనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఆ మూడు పరీక్షలు చాలు క్రియాటినిన్, అల్ట్రా సౌండ్, యూరిన్ టెస్ట్ అనేవి కిడ్నీ ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి చేసే సాధారణ పరీక్షలు. కిడ్నీ ఆరోగ్యంగా ఉందా? లేదా? అనేది తెలుసుకోవడానికి క్రియాటెనిన్ చేస్తారు. కిడ్నీలు పరిణామం తెలుసుకోవడానికి ఆల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు. కిడ్నీ పనితీరు ఎలా ఉందో తెలుసుకోవడానికి మూత్ర పరీక్షలు చేస్తారు. కొందరికీ మూడు పరీక్షలు అవసరం అవుతాయి. కొందరికి వీటిలో ఏదొక పరీక్షలో సమస్య బయటపడుతుంది. ఆ మూడు పరీక్షలు తప్పనిసరి జిల్లాను పట్టిపీడిస్తున్న కిడ్నీ మహమ్మారి బాధితులకు భరోసా ఇవ్వని కూటమి ప్రభుత్వం నేడు ప్రపంచ కిడ్నీ దినోత్సవం -
లక్ష్మీ గణేష్ చిట్స్ యజమానుల ఆస్తుల జప్తు
నరసన్నపేట: నరసన్నపేటలో లక్ష్మీ గణేష్ చిట్స్ సంస్థకు చెందిన యజమానుల ఆస్తులను జప్తు చేస్తూ హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జీఓ నంబరు 46 ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ విశ్వజీత్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో చిట్ ఫండ్ వ్యాపారి కోరాడ గణేశ్వరరావు, ఆయన భార్య కోరాడ లక్ష్మి, బంధువులు అంధవరపు సూర్యనారాయణమూర్తి, అంధవరపు భారతిల పేరిట ఉన్న ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు. స్థానిక కలివరపుపేటలో నివసిస్తున్న గణేశ్వరరావు 2021 జూన్ 30న కుటుంబంతో సహా పరారయ్యాడు. దీంతో బాధితులు పోలీసుస్టేషన్ను ఆశ్రయించారు. నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేయగా.. అనంతరం కేసు సీఐడీకి అప్పగించారు. సీఐడీ అదనపు ఎస్పీ రవివర్మ నరసన్నపేటకు పలుమార్లు వచ్చి వివరాలు సేకరించారు. అప్పటి వరకూ తప్పించుకు తిరుగుతున్న గణేష్, భార్య, బంధువులను అరెస్టు చేశారు.తాజాగా ఆస్తుల జప్తుకు ఆదేశాలు జారీ అయ్యాయి. నిందితులు రూ.2.5 లక్షలు, రూ.5 లక్షలు, రూ.10 లక్షలు చిట్టీలను నడిపి 48 మంది బాధితల నుంచి రూ.3.26 కోట్లు, మరో 26 మంది బాధితుల నుంచి రూ. 2.59 కోట్లు డిపాజిట్లు రూపంలో సేకరించినట్లు తేలింది. -
లోయలో పడి ఇద్దరు మృతి
● ఒడిశాలో దుర్ఘటన ● మృతులు సూదికొండ వాసులు కాశీబుగ్గ: ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా రాయఘడ బ్లాక్ అర్సిలింగి ఘాట్ వద్ద మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని సూదికొండకు చెందిన ఇద్దరు మృత్యువాతపడ్డారు. సూదికొండకు చెందిన ముగ్గురు కొయంపూర్కు వ్యక్తిగత పనిపై వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న స్కూటీని తప్పించబోయి లోయలో పడిపోయినట్లు తెలిసింది. ఈ ఘటనలో సూదికొండకు చెందిన సయ్యద్ ఫరీద్ (27) అక్కడికక్కడే మృతిచెందగా, బుట్ట గంగాధర్ (35) గజపతి జిల్లా పర్లాఖిమిడి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. గంగాధర్ భార్య బుట్ట సరళకు తీవ్ర గాయాలు కావడంతో బరంపురం పెద్దాసుపత్రికి చికిత్స అందిస్తున్నారు. బుధవారం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను బాధిత కుటుంబాలకు అప్పగించనున్నారు. గారబంద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కార్గో ఎయిర్పోర్టును అడ్డుకుందాం
వజ్రపుకొత్తూరు రూరల్: పచ్చని ఉద్దాన ప్రాంతంలో కార్గో ఎయిర్పోర్టు నిర్మాణానికి వ్యతిరేకంగా ఈ నెల 18, 19 తేదీల్లో బాధిత ప్రాంతాలలో చేపట్టనున్న ప్రచార యాత్రను విజయవంతం చేయాలని ఎయిర్ పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఈ మేరకు వజ్రపుకొత్తూరు మండలం ఒంకులూరులో మంగళవారం వామపక్ష పార్టీలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఉద్దాన ప్రాంతాన్ని నమ్ముకొని వేలాది మంది ప్రజలు జీవనోపాధి పొందుతుంటే ప్రభుత్వం ఈ ప్రాంతంలో విధ్వంసకర ఎయిర్ పోర్టుతో వారి బతుకులను నాశనం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. ప్రజలకు మేలు చేయాలంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయాలని, ఉద్యాన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. కార్యక్రమంలో పోరాట కమిటీ అధ్యక్షుడు వాసుదేవరావు, సీపీఐ(ఎం.ఎల్) కార్యదర్శి చాపర వేణుగోపాల్, న్యూ డెమొక్రసీ నాయకులు వంకల మాధవరావు, జోగి అప్పారావు, ఎల్.రామస్వామి, రామ్మూర్తి, ధనుంజయ, గుంటు రామారావు, జోగి శ్రీదేవి, వల్లభరావు, మైనపల్లి శేఖరం, గుంటు రామస్వామి తదితరులు పాల్గొన్నారు. -
బ్యాంక్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం అర్బన్: బ్యాంక్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని యూఎఫ్బీయూ జిల్లా కన్వీనర్ బి.శ్రీనివాసులు డిమాండ్ చేశారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు మంగళవారం శ్రీకాకుళం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ కార్యాలయం వద్ద ఉద్యోగులు, అధికారులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకులపై ప్రభుత్వం చేపడుతున్న వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ధర్నాచేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఐ బోక్ రీజనల్ కార్యదర్శి కె.తేజేశ్వరరావు, కో–ఆర్డినేషన్ కమిటీ అధ్యక్షులు గిరిధర్ నాయక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల ఉపాధ్యక్షురాలు జి.కరుణ, ఇండియన్ బ్యాంక్ మహిళా కన్వీనర్ శ్రావణి, కో–ఆర్డినేషన్ జాయింట్ కార్యదర్శి ఎ.సూర్య, ఓబీసీ ఉద్యోగ సంఘ నాయకులు సూర్యకిరణ్, నరేష్ శ్రీనివాస్, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. మార్చి 24, 25 తేదీలలో సమ్మె శ్రీకాకుళం అర్బన్: యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్న్స్ ఆధ్వర్యంలో దాదాపు పది లక్షలమంది ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు, అధికారులు ఈ నెల నెల 24, 25 తేదీల్లో సమ్మెకు దిగుతున్నట్లు యూనియన్ ప్రతినిధులు తెలిపారు. యూనియన్ శ్రీకాకుళం కన్వీనర్ కేసీహెచ్ వెంకటరమణ ఆధ్వర్యంలో మంగళవారం శ్రీకాకుళం పెద్దపాడు రోడ్డులోని ఎస్బీఐ రీజనల్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. సమ్మె ఉద్దేశం, ప్రధానమైన డిమాండ్లను వివరించారు. కార్యక్రమంలో ఎస్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ రీజనల్ సెక్రెటరీ కృష్ణ కిషోర్, లోకల్ సెక్రటరీ నాయుడు, ఐబోక్ కిషోర్, బెఫి మండ శ్రీనివాసరావు, ఏఐబీఈఏ శ్రావణి పాల్గొన్నారు. -
ముగిసిన జాతీయ విజ్ఞాన దినోత్సవ పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవ పోటీలు ముగిశాయి. శ్రీకాకుళం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో శ్రీకాకుళం, టెక్కలి, పలాస మూడు డివిజన్ల పరిధిలో విజేతలగా నిలిచిన పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రాథమిక, సెకండరీ విభాగాల్లో క్విజ్, ఎక్పైర్మెంట్, సింపోసియం (విశ్లేషనాత్మక చర్చ) అంశాల్లో పోటీలు జరిగాయి. విజేతలకు రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు కాంతారావు, డీఈఓ తిరుమల చైతన్య బహుమతులు అందజేశారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు శాసీ్త్రయమైన దృక్పథాలను అలవర్చుకోవాలని, పరిశోధనలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. అంతకుముందు కార్యక్రమ కో–ఆర్డినేటర్, శ్రీకాకుళం ఉప విద్యాశాఖాధికారి ఆర్.విజయకుమారి పోటీలను పర్యవేక్షించారు. వీటి కొనసాగింపుగా జరిగే రాష్ట్రస్థాయి విజ్ఞానశాస్త్ర దినోత్సవ పోటీలు (తేదీలు ఖరారుకాలేదు) శ్రీకాకుళంలోనే జరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప విద్యాశాఖాధికారి(టెక్కలి)పి.విలియమ్స్, జిల్లా సైన్స్ అధికారి ఎన్.కుమారస్వామి, సైన్స్ ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. విజేతలు వీరే.. క్విజ్: ప్రాథమిక స్థాయిలో ఎంపీపీ స్కూల్ గంగువాడ, ఎంపీపీ స్కూల్ నందిగాం మెయిన్, ఎంపీపీ స్కూల్ పెద్దలంకాం మొదటి మూడుస్థానాల్లో నిలిచారు. సెకండరీ స్థాయిలో జెడ్పీహెచ్ స్కూల్ కొయ్యాం, జెడ్పీహెచ్స్కూల్ ప్లస్ హరిపురం, జెడ్పీహెచ్ స్కూల్ బోరివంగ తొలి మూడుస్థానాలు సాధించాయి. ఎక్పైర్మెంట్: ప్రాథమిక స్థాయిలో జరిగిన ఈ పోటీల్లో జెడ్పీహెచ్ స్కూల్ కోటబొమ్మాళి, ఎంజేపీడబ్ల్యూఆర్జీ స్కూల్ హయాతీనగరం, జెడ్పీహెచ్ స్కూల్(బోర్డు) నరసన్నపేట మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. సింపోసియం: సెకండరీ స్థాయిలోనే జరిగిన ఈ పోటీల్లో జెడ్పీహెచ్ స్కూల్ రొంపివలస, జెడ్పీహెచ్ స్కూల్ కొసమాల, జీహెచ్ స్కూల్ కవిటి పాఠశాలలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. -
ఎత్తిపోతల పథకం సామగ్రి చోరీ
ఆమదాలవలస రూరల్: రైతులకు సాగునీరందించేందుకు ఆమదాలవలస మండలం అక్కులుపేటలో బొడ్డేపల్లి రాజుగోపాలరావు వంశధార కుడిప్రధాన కాలువ 20ఎల్ ఎత్తిపోతల పథకం వద్ద చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి కరెంట్ సరఫరా నిలుపుదల చేసి మూడు ట్రాన్స్ఫార్మర్లలోని రాగి కాయిల్స్, కరెంట్ ఆయిల్ పట్టుకుపోయారు. పాటు అందులో ఉండే కరెంట్ ఆయిల్ అపహరించుకుపోయారు. విషయం తెలుసుకున్న రైతులు, శ్రీనివాసచార్యులుపేట సర్పంచ్ గౌరిపతి ఆమదాలవలస పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ ఎస్ బాలరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ కమిటీ ఏర్పాటు శ్రీకాకుళం కల్చరల్: రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథాలయ పునర్వికాస ఉద్యమం కోసం జిల్లా, డివిజన్ కన్వీనర్లను నియమిస్తున్నట్లు ఉద్యమ రాష్ట్ర కన్వీనర్ వల్లూరి శివప్రసాద్ మంగళవారం ప్రకటించారు. జిల్లా కన్వీనర్గా విద్యావేత్త బుడుమూరు సూర్యారావును నియమించారు. ఈయన ప్రస్తుతం బూర్జ మండల ఉపాధ్యక్షునిగా ఉన్నారు. గ్రంథాలయ వ్యవస్థ పట్ల అభిమానం ఉన్నవారినే ఉద్యమ కమిటీలో ఏర్పాటు చేస్తున్నామని, వారి రాజకీయ కార్యకలాపాలతో తమకు సంబంధం లేదని శివప్రసాద్ స్పష్టం చేశారు. శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్ కన్వీనర్గా విద్యావేత్త డాక్టర్ జామి భీమశంకర్, టెక్కలి డివిజన్ కన్వీనర్గా బెండి నర్సింగరావు, పలాస డివిజన్ కన్వీనర్గా చాపర వేణుగోపాల్ను నియమించారు. సాహితీ స్రవంతి జిల్లా కన్వీనర్ కె.శ్రీనివాస్, న్యాయవాది బొడ్డేపల్లి మోహన్రావు, విశ్రాంత లైబ్రేరియన్ డి.గోపాలరావు, అరసం జిల్లా కార్యదర్శి చింతాడ కృష్ణారావు, విద్యావేత్త శాసనపురి మధుబాబు, ఇస్కఫ్ జిల్లా అధ్యక్షులు ఎం.వి.మల్లేశ్వరరావులను సభ్యులుగా ఎంపికచేశారు. ఈ నియామకాలపై రచయిత అట్టాడ అప్పలనాయుడు, అరసం జిల్లా అధ్యక్షులు నల్లి ధర్మారావు, కథానిలయం ప్రతినిధి దాసరి రామచంద్రరావు, శ్రీకాకుళ సాహితీ ప్రతినిధులు, కవులు కంచరాన భుజంగరావు, కలమట దాసుబాబు తదితరులు హర్షం వ్యక్తం చేస్తూ ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. పరిశ్రమ వ్యర్థాలతో భూగర్భ జలాలు కలుషితం రణస్థలం: మండలంలోని పైడిభీమవరం పారిశ్రామికవాడలో సరాకా లేబొరేటరీ పరిశ్రమ వ్యర్థ జలాలు బయటకు విడిచిపెట్టి భూగర్భ జలాలు కలుషితం చేస్తున్నారంటూ నారువ పంచాయతీ ప్రజలు మంగళవారం ఫ్యాక్టరీ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. గతంలో పైపులైన్లు ద్వారా సముద్రంలో విడిచిపెట్టేవారని, కొన్నాళ్లుగా పరిశ్రమ పక్కనే గెడ్డ, కొండదిబ్బ దిగువ ప్రాంతాల్లో విడిచిపెడుతున్నారని చెప్పారు. వ్యర్థ జలాల కారణంగా ప్రాణాంతక వ్యాధులు సంక్రమిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై కాలుష్య నియంత్రణ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికై నా వ్యర్థాలు పారబోయడం ఆపకపోతే పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో నారువ, అక్కయ్యపాలెం, బోయపాలెం తదితర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. ప్రకృతి సాగుకు ప్రాధాన్యం ఎచ్చెర్ల క్యాంపస్: వచ్చే ఖరీఫ్లో జిల్లాలో 1.40 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం సాగు చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ పి.రేవతి తెలిపారు. ఎచ్చెర్లలోని సాంకేతిక శిక్షణ కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు రిసోర్సుపర్సన్లకు మూడు రోజుల శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 70వేల మంది రైతులకు ప్రకృతి వ్యవసాయ సాగుపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. పురుగుల మందులు, రసాయన ఎరువుల రహిత వ్యవసాయం లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. అనంతరం శాస్త్రవేత్తలు, నిపుణులు ఆన్లైన్లో పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ ధనుంజయరావు, సిబ్బంది సూర్యనారాయణ, పీఎస్ బాబు పాల్గొన్నారు. -
విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం
ఆమదాలవలస: సంక్షేమం, అభివృద్ధి అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కేవీజీ సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఆమదాలవలసలోని పార్టీ కార్యాలయంలో యువత పోరు పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని దుయ్యబట్టారు. సూపర్సిక్స్ హామీలు నెరవేర్చకుండా నయవంచన పాలన చేస్తోందని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్కు రూ.3600 కోట్లు బకాయిలు ఉంటే ఇటీవల బడ్జెట్లో రూ. 2,600 కోట్లు మాత్రమే కేటాయించడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పేదలకు నేరుగా వారి ఖాతాలోకి సంక్షేమ పథకాలు అందాయని గుర్తు చేశారు. ●రాష్ట్ర కాళింగ సామాజిక వర్గం అధ్యక్షుడు దుంపల లక్ష్మణరావు (రామారావు)మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న కూటమి ప్రభుత్వంపై యువత పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కూటమి పాలనను ప్రజలు గమనిస్తున్నారని, ఇటీవల జరిగిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే వారి పాలనకు నిదర్శనమన్నారు. కలెక్టరేట్ వద్ద జరిగే యువతకు పోరుకు ప్రతిఒక్కరూ తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో ఆమదాలవలస మండల పార్టీ అధ్యక్షుడు తమ్మినేని శ్రీరామమూర్తి, పొందూరు మండల పార్టీ అధ్యక్షుడు పప్పల రమేష్కుమార్, సరుబుజ్జలి మండల పార్టీ అధ్యక్షుడు బెవర మల్లేశ్వరరావు, మాజీ పీఎసీఎస్ అధ్యక్షుడు గురుగుబెల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
కేరాఫ్ దివ్యాంగులు
సహజ రంగులు.. పూలరెక్కలను ఎండబెడుతున్న దివ్యాంగులు శ్రీకాకుళం కల్చరల్ : రంగుల కేళీ హోలీ పండుగ సమీపిస్తోంది. ఈ నెల 14న జరిగే ఆనందాల వేడుకకు ఇప్పటికే తాత్కాలిక రంగుల దుకాణాలు సిద్ధమయ్యాయి. అయితే రసాయనాలతో తయారుచేసే కృత్రిమ రంగులు కాకుండా పర్యావరణ హితమైన రంగులు వాడాలని పర్యావరణవేత్తలు ఎప్పటి నుంచో విజ్ఞప్తులు చేస్తున్నా అలాంటి రంగులు ఎలా తయారవుతాయో..అవి ఎక్కడ దొరుకుతాయో చాలామందికి తెలియదు. ఈ నేపథ్యంలో రసాయనాలు లేని రంగులు తయారు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు జిల్లా కేంద్రంలో ఉంటున్న బెహరా మనోవికాస కేంద్రంలోని దివ్యాంగులు. అందమైన, పర్యావరణానికి హాని చేయనటువంటి రంగులను స్వహస్తాలతో తయారు చేస్తున్నారు. పూలరెక్కలతో.. హోలీ రంగులు పర్యావరణానికి హాని చేయకుండా ఉండడానికి రసాయనాలు లేకుండా కేవలం పూల రెక్కలతోనే ఇక్కడ సహజ సిద్ధమైన రంగులు తయారు చేస్తున్నారు. 74మంది మానసిక దివ్యాంగులు ఈ రంగుల రూపకల్పనలో పాలుపంచుకుంటున్నారు. ముందుగా వివిధ రకాల పూల రెక్కలను ఆరబెడతారు. అవి పూర్తిగా ఆరాక రంగుల వారీగా విడదీసి యంత్రంలో వేసి పౌడర్గా చేస్తున్నారు. వాటిని చిన్నచిన్న ప్యాకెట్లలో కట్టి అమ్మకానికి సిద్ధం చేస్తున్నారు. కేంద్రంలో మానసిక దివ్యాంగులు తయారు చేసిన సహజ సిద్ధమైన రంగులు, ఇతర ఉత్పత్తులతో ఎగ్జిబిషన్ సైతం ఏర్పాటు చేశారు. వీటిని కొనుగోలు చేయడం ద్వారా మానసిక దివ్యాంగులను ప్రోత్సహించిన వారవుతారు. దివ్యాంగులకు ప్రోత్సాహం దివ్యాంగుల సృజనకు మా వంతు ప్రోత్సాహం ఇస్తున్నాం. పూలతో సహజ సిద్ధంగా తయారు చేసిన ఈ రంగులు ప్యాకెట్ రూ.30 నుంచి మొదలుకుని సెట్ రూ.150 వరకు విక్రయిస్తున్నాం. దివ్యాంగులను ప్రోత్సహించేందుకు ఎవరైనా కొనుగోలు చేయాలంటే కేంద్రంలో సంప్రదించవచ్చు. – శ్యామల, బెహరా మనోవికాస కేంద్రం నిర్వాహకులు, పాత హౌసింగ్ బోర్డు కాలనీ, శ్రీకాకుళం పూలతో పర్యావరణ హితమైన రంగుల తయారీ అబ్బురపరుస్తున్న మనోవికాస కేంద్రం దివ్యాంగులు 14న హోలీ వేడుకలకు రంగులు సిద్ధం -
నిర్లక్ష్యపు చెదలు
కిడ్నీ ఆస్పత్రికి.. కాశీబుగ్గ: ఉద్దానంలో కిడ్నీ మహమ్మారిని కట్టడి చేయడంతో పాటు కిడ్నీ వ్యాధిగ్రస్తులతో అత్యుత్తమ వైద్యసేవలు అందించిన గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రం, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, డయాలసిస్ యూనిట్లను ప్రారంభించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సమున్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ ఆస్పత్రిపై కూటమి సర్కారు నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. నిర్వహణను గాలికొదిలేసింది. సిబ్బంది కొరత, మందుల లేమి తదితర సమస్యలతో కిడ్నీ బాధితులు సతమతమవుతున్నారు. ఇదీ పరిస్థితి.. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.85 కోట్లతో కిడ్నీ పరిశోధన కేంద్రం, 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, డయాలసిస్ యూనిట్ను ప్రారింభించారు. ఉద్దాన కిడ్నీ బాధితులకు సేవలు అందిస్తున్న తరుణంలో ప్రభుత్వం మారడంతో సేవలు మృగ్యమవుతున్నాయి. గత ఎనిమిది నెలల వ్యవధిలో సర్కారు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుండటంతో ఇరవై ఐదు మందికిపైగా మరణించినట్లు సమాచారం. మృతదేహాలను గుట్టుచప్పుడు కాకుండా తరలించేస్తున్నారు తప్ప మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి..తదితర కారణాలను పట్టించుకునే వారే కరువయ్యారు. ఇవీ సమస్యలు.. ● పలాస కిడ్నీ ఆస్పత్రిలో పూర్తి స్థాయిలో వైద్యులు లేరు. కిడ్నీ వ్యాధి నిపుణులు ఒక్కరే కావడంతో అతని కోసం వేలాది మంది రోగులు వేచి ఉండాల్సిన పరిస్థితి. ●గత ప్రభుత్వంలోనే పూర్తిస్థాయి మెషీన్లు సిద్ధం చేసినా ప్రస్తుత ప్రభుత్వం ఆపరేటర్లను ఇంతవరకు నియమించలేదు. దీంతో బయటే పరీక్షలు చేయించుకోవాల్సి వస్తోంది. ● ఆస్పత్రిలో అరకొరగా మందులు మాత్రమే అందిస్తున్నారు. గత ప్రభుత్వంలో 40 రకాల మాత్రలు మందులు అందించేవారు. ఇప్పుడు 23 రకాలు అందిస్తున్నా అందులో చాలావరకు స్టాకు లేదు. స్కానింగ్, ఇంజక్షన్లదీ అదే పరిస్థితి. ● ఇన్పేషెంట్కు డైట్ ఇవ్వడం లేదు. వారం నుంచి పది రోజులు ఉండాల్సిన వ్యాధిగ్రస్తులు, వారికి సహాయంగా వచ్చేవారికి ఇబ్బందులు తప్పడం లేదు. మందులు ఇవ్వడం లేదు.. కిడ్నీ సమస్యకు సంబంధించిన మాత్రలు ప్రభుత్వం ఇవ్వమని రెండు వారాలుగా అడుగుతున్నా ప్రభుత్వం సరఫరా చేయడం లేదని చెబుతున్నారు. అధికారులు స్పందించి పలాస కిడ్నీ ఆసుపత్రికి పూర్తి స్థాయిలో మందులు అందుబాటులోకి తీసుకురావాలి. – పిట్ట నీలయ్య, ఆర్అండ్ఆర్ కాలనీ, కోసంగిపురం కూడలి అధికారుల దృష్టికి తీసుకెళ్లాం.. పలాస కిడ్నీ పరిశోధన కేంద్రంలో సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఆసుపత్రిలో డైట్ ఇవ్వకపోవడం వాస్తవమే. వైద్యులు, మిషన్ ఆపరేటర్లు, ఇతర సిబ్బందిని నియమించాల్సి ఉంది. – డాక్టర్ అల్లు పద్మజ, సూపరింటెండెంట్, కిడ్నీ పరిశోధన కేంద్రం, పలాస నిర్వహణను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం వసతుల లేమి..మందుల కొరత -
బంగారు అవకాశం.. హద్దు ఆకాశం
ఎన్నాళ్లుగానో మదిలో మెదులుతున్న రూపం కళ్ల ముందు కదలాడే క్షణాలవి.. ఎన్నో కలలు, మరెన్నో ఆశల ప్రతిరూపాలుగా వాహనాలు మెరుపులా దూసుకెళ్లే అపురూప ఘడియలవి. గోకార్టింగ్ అంటే కేవలం వాహనాల పోటీ కాదు. ఎంతో ఇష్టపడి తయారు చేసుకున్న మోడల్, కష్టపడి తయారు చేసుకున్న ఇంజిన్, వాహనంలో ప్రతి విభాగంపై సొంత ముద్ర.. ఇలా ప్రతి అంశంలోనూ విద్యార్థులు తమను తాము చూసుకుంటారు. పోటీలో బండి పరుగులు పెడుతుంటే చూసి మురిసిపోతారు. ఓ కొత్త వాహనానికి పురుడు పోసే దశను గుండెతో ఆస్వాదిస్తారు. టెక్కలి: శ్రీకాకుళం జిల్లాలో జరిగిన జాతీయ స్థాయి గోకార్టింగ్ పోటీలు ఇంజినీరింగ్ విద్యార్థుల మనసు దోచుకున్నాయి. ఆటోమొబైల్ రంగంలో ఎదగాలనుకునే విద్యార్థులకు ఈ పోటీలు ఒకరకంగా తొలి పరీక్ష లాంటివి. ఈ పోటీలు నిర్వహించడం, అందులో పాల్గొనడం, వాహనాలు తయారు చేయడం ఆషామాషీ విషయం కాదు. చాలారకాల దశలు దాటాకే బండిని ట్రాక్ మీదకు ఎక్కించాలి. గోకార్టింగ్ పోటీలు ఎందుకు నిర్వహిస్తారు..? ఆటోమొబైల్ రంగంపై ఆసక్తి కలిగిన ఇంజినీరింగ్ విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉండే సృజనకు పరీక్ష పెట్టేందుకే ఈ గోకార్టింగ్ పోటీలు నిర్వహిస్తారు. ఇందులో రెండు రకాల వాహనాలు తయారు చేస్తారు. వాటిలో సీవీ(ఇంజిన్తో తయారుచేసినవి) ఈవీ(ఎలక్ట్రికల్ వాహనాలు) ఉంటాయి. వాహనాల తయా రీతో పాటు బిజినెస్ ఆలోచనలు సైతం పంచుకునే విధంగా ఈ గోకార్టింగ్ పోటీలు నిర్వహిస్తారు. అర్హతలు ఉండాల్సిందే.. గోకార్టింగ్ పోటీల్లో పాల్గొనాలంటే కళాశాల స్థాయి లో ‘మోటార్ స్పోర్ట్ కార్పొరేషన్’ తయారు చేసిన రూల్ బుక్ ఆధారంగా గ్రాఫికల్గా డిజైన్ చేస్తూ వాహనాన్ని తయారుచేయాలి. ఆ తర్వాత పోటీల్లో పాల్గొనేందుకు ఆయా కళాశాలలు నిర్వహించే ఆన్లైన్ పరీక్ష ఉత్తీర్ణత సాధించాలి. పోటీల్లో పాల్గొనే ముందు కూడా డిజైనింగ్ చెక్, ఇన్నోవేషన్ చెకింగ్లో భాగంగా కొత్తగా ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్), ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత ఆలోచనలకు ప్రాముఖ్యతనిస్తారు. అలాగే బ్రేక్ టెస్ట్, లోడ్ టెస్ట్, స్పీడ్ టెస్ట్, స్టీరింగ్ టెస్ట్ తో పాటు ఇండ్యూరేషన్ టెస్ట్కూడా చేస్తారు. చివరగా బిజినెస్ రౌండ్లోనూ నెగ్గితేనే అర్హత సాధించినట్టు. ఒక్కో వాహనానికి 20 నుంచి 30 మంది టీమ్ సభ్యులు ఉంటారు. వారిలో కెపె్టన్, రైడర్, కో రైడర్ ఉంటారు. వాహనం తయారీ » గోకార్టింగ్ వాహనం తయారీకి సుమారు రూ. 70వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చవుతుంది. »ఇందులో సీవీ వాహనాలను పూర్తిగా ఇంజిన్తో తయారు చేస్తారు. ఇంజిన్, మోటారు, వీల్స్, స్టీరింగ్, ఇతర పార్టులు ఉంటాయి. »ఈవీ వాహనాలను బ్యాటరీ ఆధారంగా తయారుచేస్తారు. దీనికి బ్యాటరీ, వీల్స్, స్టీరింగ్, మోటారు ఇతర పార్టులు ఉంటాయి. ఒక్కో వాహనం సుమారు 80 నుంచి 100 కిలోల వరకు బరువు ఉంటుంది. అఫిడవిట్ కచ్చితం.. గోకార్టింగ్ పోటీల్లో రైడర్ల పాత్ర కీలకం. కానీ రైడర్గా మారాలంటే విద్యార్థి తల్లిదండ్రులు, కళాశాల సిబ్బంది నుంచి అఫిడవిట్ను సమర్పించాల్సిందే. గోకార్టింగ్ తో వచ్చే అవకాశాలు గోకార్టింగ్ పోటీల్లో పాల్గొనే అవకాశం రావడమే విద్యార్థుల విజయానికి తొలిమెట్టు లాంటిది. వాటి లో ప్రముఖ కోర్ కంపెనీల్లో ఉద్యోగవకాశాలు, ఆటోమొబైల్ రంగంలో సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచన ఉన్న వారికి ప్రాథమిక ప్లాట్ఫామ్గా గోకార్టింగ్ ఉపయోగపడుతుంది. ప్రమాదమైనా ఇష్టమే.. గోకార్టింగ్ లో రైడింగ్ ప్రమాదకరమైనప్పటికీ ఎంతో ఆసక్తిగా ఉండడం వలన రైడర్గా మారాను. 60 ఓల్ట్స్ బ్యాటరీ సామర్థ్యంతో వాహనం తయారుచేశాం. మా కళాశాల ప్రిన్సిపాల్ కె.వీ.ఎన్.సునీత, ఫ్యాకల్టీ లు రూపత్, గోపీకృష్ణ సహకారంతో గోకార్టింగ్ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నాం. అందరి సహకారంతో ఈవీ వెహికల్ రైడ్లో మొదటి స్థానంలో నిలిచాం. – జననీ నాగరాజన్, రైడర్, బీవీఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాల, హైదరాబాద్. రెండు సార్లు రైడర్గా మొదటి స్థానం మా కళాశాల సీనియర్స్ ఇన్స్పిరేషన్తో గోకార్టింగ్ రైడర్ గా పోటీల్లో పాల్గొంటున్నాను. 150 సీసీ పల్సర్ ఇంజిన్తో వాహనం తయారుచేశాం. రైడర్గా రెండు సార్లు మొదటి స్థానంలో నిలిచాం. మాది మధ్య తరగతి కుటుంబం. మా నాన్న ఆటోడ్రైవర్, అమ్మ గృహిణి. భవిష్యత్లో మంచి కోర్ కంపెనీలో ఉద్యోగం సాధించడమే లక్ష్యం. – వి.సునీల్, రైడర్, రఘు ఇంజినీరింగ్ కళాశాల, విశాఖపట్టణం -
ఏ ఇంటి తలుపు తట్టినా... గుండెల్ని పిండేసే ఉద్దానం కథలు
నిత్యం పంటలతో తొణికిసలాడే ఉద్దానం విషాదాలకు నిలయంగా మారింది. ఏ ఇంటి తలుపుతట్టినా కన్నీటిచారలే కనిపిస్తున్నాయి. గుండెలను పిండేసే కిడ్నీ బాధలు అడుగడుగునా తారసపడుతున్నాయి. ఇంటికి పెద్ద దిక్కు కిడ్నీ వ్యాధితో మంచాన పడితే.. ఆ పెద్ద దిక్కును దక్కించుకోవడానికి ఉన్నదంతా అమ్మేసి రోడ్డున పడ్డ కుటుంబాల దర్శనమిస్తున్నాయి. ఎదిగొచ్చిన కన్న కొడుకు కిడ్నీ వ్యాధితో కళ్లేదుటే కూలిపోతుంటే భరించలేని ఆ తల్లిదండ్రులు, భారీగా అప్పులు చేసి ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. ఆ కుటుంబాలను ఒకసారి పలకరిస్తే... – ఇచ్ఛాపురం రూరల్ ఇల్లు అమ్మేశాం భర్తే సర్వస్వంగా భావించి తన ఐదో తనాన్ని కాపాడుకునేందుకు నీడనిచ్చే ఇంటిని అమ్మేసి అతడిని రక్షించుకునే పనిలో పడింది ఈ ఇల్లాలు. ఇచ్ఛాపురం మండలం నీలాపపుట్టుగ గ్రామానికి చెందిన కోనేటి తులసీరావు, దమయంతి దంపతులకు పిల్లలు లేకపోవడంతో ఒకరి కొకరు కంటి పాపల్లా బతుకుతున్నారు. విసనకర్రలు తయారు చేస్తూ ఊరూరా తిరిగి అమ్ముతూ, వచ్చే ఆదాయంతో కడుపునింపుకునేవారు. అయితే ఈ దంపతులపై కిడ్నీ భూతం పంజా విసిరింది. ఐదేళ్ల క్రితం కిడ్నీ వ్యాధికి గురైన తులసీరావును రక్షించుకునేందుకు శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో భర్తను చేరి్పంచింది. ఖరీదైన వైద్యం కోసం భార్య దమయంతి రెండు ఇళ్లను అమ్మేసింది. 8 నెలలు నుంచి వ్యాధి మరింత తీవ్రరూపం దాల్చడంతో ప్రస్తుతం కవిటిలో డయాలసిస్ చేయిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న అరకొర మందులతో ఇబ్బంది పడుతున్న భర్త బాధను చూడలేక ప్రస్తుతం తాము నివసిస్తున్న ఇంటిని సైతం తాకట్టుపెట్టింది. రోజుకు పది విసనకర్రలు తయారు చేసి అమ్మితే రూ.100లు వస్తుందని, అయితే ఆ డబ్బులు మందులకే సరిపోవడం లేదని వాపోతోంది.ఉన్నదంతా వైద్యానికే ఇచ్ఛాపురం మండలం సన్యాసిపుట్టుగ గ్రామానికి చెందిన ఆయన పేరు నందూరి విజయ భూషణ్. ఛండీగడ్లో కూలి పనులు చేసుకొని కుటుంబాన్ని పెంచుకుంటూ వస్తున్న దశలో కిడ్నీ మహమ్మారికి గురయ్యాడు. శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఖరీదైన చికిత్స తీసుకున్నప్పటికీ ఫలితం కనిపించలేదు. రూ.లక్షలు అప్పులు చేసి నెలకు రూ.20 వేలు చొప్పున చెల్లించి ఏడాది పాటు డయాలసిస్ చేయించుకున్నాడు. ప్రస్తుతం కవిటిలో డయాలసిస్ చేయించుకుంటున్నారు. డయాలసిస్కు వెళ్లిన ప్రతిసారి కేవలం ఆటో ఖర్చులే రూ.600 వరకు అవుతున్నాయని, ప్రభుత్వం ఇచ్చే పింఛన్ ఆటో ఖర్చులకే అయిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కళ్లముందు అప్పులు కనిపిస్తుంటే తమ కుటుంబ భవిష్యత్తు ఎలా ఉంటుందోననే భయమేస్తోందని విచారం వ్యక్తం చేస్తున్నాడు. మునుపటిలా 108 వాహనం ద్వారా తమను ఆస్పత్రికి తీసుకెళ్లడం, రావడం వంటి సదుపాయాలు కల్పించాలని కోరుతున్నాడు.ఇదీ చదవండి: అప్పుడు వెడ్డింగ్ గౌను, ఇపుడు ఎంగేజ్మెంట్ రింగ్ : సమంత అంత పనిచేసిందా?నాడు భర్త, కొడుకు – నేడు తల్లి కవిటి మండలం బొరివంక గ్రామంలోని హరిజనవాడకు చెందిన ఈమె పేరు బలగ కామాక్షి. భర్త తలయారీగా పనిచేస్తూ పన్నెండేళ్ల కిత్రం మూత్రపిండాల వ్యాధితో మృతి చెందగా, తండ్రి ఉద్యోగాన్ని సంపాదించిన కొడుకు బాలరాజు తల్లితో పాటు భార్య, పిల్లలను సాకుతూ వచ్చాడు. విధి ఆడిన వింత నాటకంలో కొడుకు బాలరాజు సైతం కిడ్నీవ్యాధి బారినపడ్డాడు. కొడుకు వైద్యం కోసం తల్లి అప్పులు చేసినా ఎంతో కాలం బతకలేదు. ఈ పిరిస్థితుల్లో కోడలు పిల్లలను వదిలేసి వెళ్లిపోయింది. దీంతో ఎదిగొచ్చిన పిల్లలను పెంచి పోషించే బాధ్యత కామాక్షిపై పడింది. అప్పులు చేసి పిల్లలకు పెళ్లి చేసిన కామాక్షి, ఇప్పుడు తాను సైతం కిడ్నీ భూతం కబంధ హస్తాల్లో చిక్కుకుంది. నెలకు సుమారు రూ.10 వేలు వరకు వైద్యానికే ఖర్చవుతోందని, ప్రభుత్వం వితంతు పింఛన్ మాత్రమే ఇస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తోంది -
TDP: చెరువు దగ్గరకొస్తే.. తేల్చుకుందాం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: విజయనగరం జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి సంధ్యా గజపతిని తోటి టీడీపీ నాయకుడు, నీటి సంఘం అధ్యక్షుడు, చౌదరి బాబ్జీ అనుచరుడు సంపతిరావు గణపతి ఫోన్ చేసి బెదిరించారు. పల్లవాని చెరువు భూమిని ఆనుకుని ఆక్రమించారని చెరువుల పరిరక్షణ పేరుతో ఫిర్యాదు చేయడమేంటని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ‘సత్తా ఉంటే.. చెరువు దగ్గరకొస్తే తేల్చుకుందాం. అది చెరువు అని ఉందా. నీకు జ్ఞానం ఉందా?’ అని రాత్రి 9.20గంటల సమయంలో ఫోన్ చేసి ఇష్టారీతిన మాట్లాడారు. దీంతో ఆమె పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. జిల్లాలోని పలుచోట్ల చెరువులు ఆక్రమణకు గురయ్యాయని, ఆక్రమణలు తొలగించాలని కోరుతూ ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్లో ఆ సంఘం ప్రతినిధులు కృష్ణమూర్తినాయుడు, సంధ్యా గజపతి తదితరులు ఫిర్యాదు చేశారు.ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నాయకుడు, నీటి సంఘం అధ్యక్షుడు సంపతిరావు గణపతి నేరుగా సంధ్యా గజపతికి రాత్రి 9.20గంటల సమయంలో ఫోన్ చేసి బెదిరిస్తూ మాట్లాడారు. డీ పట్టాయే కొన్నానని ఒప్పుకుంటూనే.. ‘ఇంకా ఏమీ చెరువులు కనిపించలేదా? బాబ్జీ చెరువును జన్మలో తీయించగలవా? ఊర్లో పెద్ద చెరువు 165ఎకరాలు ఉంటే 60ఎకరాలకు వస్తే అప్పుడెక్కడికి వెళ్లిపోయావు? చెరువులన్నీ తీయడానికి పోటుగెత్తివా...మండలంలో అన్నీ తీయ్...రాష్ట్రంలో ఉన్న చెరువులన్నింటిని తీయ్. అప్పుడు ఇక్కడికి రా...సత్తా ఉంటే చెరువు దగ్గరికి రా..’ అని బెదిరించారు. ‘రికార్డు చేసుకో...ఎవరికిచ్చినా నష్టం లేదు’ అని వార్నింగ్ ఇచ్చారు.ఫిర్యాదులో పేర్కొన్న చెరువు వివరాలివి ఎచ్చెర్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 1బీలోని ఎకరా 58సెంట్లు మేర భూమిని 1971లో మొహమ్మద్ ఫజుల్లాత్ అనే వ్యక్తికి డీ పట్టా కింద ఇచ్చారు. అయితే, ఈ భూమిని తర్వాత సంపతిరావు గణపతితో పాటు మరో నలుగురు కొనుగోలు చేశారు. రికార్డుల్లో కూడా అనుభవ స్వభావం కొనుగోలు అని నమోదు చేశారు. దీనిపై ఫిర్యాదులు వెళ్లాయి. సుధాసాగర్ అనే తహసీఉన్నప్పుడు డీ పట్టా భూమిని కొనుగోలు చేయడం కుదరదని, నిబంధనల ప్రాప్తికి అమ్మకం, కొనుగోలు చేయకూడదని, దీన్ని స్వాధీన పర్చుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని విచారణలో నిగ్గు తేల్చడమే కాకుండా దాన్ని ప్రభుత్వ భూమిగా మార్చేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పల్లవాని చెరువుకు ఆనుకుని ఉన్న ఈ భూమిలో ఉన్న వాటిని తొలగించాలని ఆదేశాలిచ్చారు. అప్పట్లో సదరు ఉత్తర్వుల మేరకు తొలగింపులు జరిగాయి. కానీ మళ్లీ అక్కడే కట్టడాలు జరిగాయి. వాటిని తొలగించాలని కోరుతూ మళ్లీ సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్లో ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి «ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు చేసిన వారిలో సంధ్యా గజపతి కూడా ఉండటంతో ఆమెకు సంపతిరావు గణపతి అనే వ్యక్తి ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు. ఈ ఫోన్ సంభాషణను సంధ్యా గజపతి రికార్డు చేశారు. దీన్ని పట్టుకుని పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని సోమవారం రాత్రి మీడియాను ఆశ్రయించి జరిగిందంతా వివరించారు. దీనిపై గణపతిని ‘సాక్షి’ వివరణ కోరగా.. తాను మాట్లాడానని, తన భూమి విషయంలో ఫిర్యాదులు చేస్తున్నారని, ఆమె రికార్డు చేస్తుందని తెలిసినా కూడా మాట్లాడానని, తానేమీ బెదిరించలేదని, ఆమే తిరిగి బెదిరించిందని తెలిపారు. -
విధి రాత: ప్రసవం కోసం వెళ్తూ..!
మరో రెండు రోజుల్లో ఆమెకు ప్రసవం. ఆ దంపతుల ఆలోచనలన్నీ పుట్టబోయే బిడ్డపైనే ఉన్నాయి. అంతా సవ్యంగా జరగాలని దేవుళ్లందరికీ మొక్కారు. డాక్టర్లు సోమవారం నుంచే ఆస్పత్రిలో ఉండిపొమ్మన్నారు. కానీ వారి విధిరాత మరోలా ఉంది. వస్తువులన్నీ సర్దుకుని వస్తామని చెప్పి వచ్చేశారు. అదే వారి తప్పైపోయింది. ఇంటికి వెళ్తుంటే బస్సు రూపంలో మృత్యువు ఎదురొచ్చింది. తల్లిని, కడుపులోని బిడ్డను తనతో తీసుకెళ్లిపోయి.. కుటుంబానికి శోకం మిగిల్చింది. శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలోని డేఅండ్నైట్ కూడలి సమీపంలో సోమవారం జరిగిన ప్రమాదంలో యంపాడ రాజేశ్వరి(20)(Rajeshwari) అనే నిండు గర్భిణి దుర్మరణం పాలయ్యారు. మరో 48 గంటల్లో ఆమె ప్రసవానికి సిద్ధమవుతుండగా.. ఈ దుర్ఘటన జరగడంతో కుటుంబం తల్లడిల్లిపోతోంది. స్కూటీని(Scooty) ఆర్టీసీ బస్సు (rtcbus)ఢీకొట్టడంతో ఆమె బస్సు చక్రాల కింద నలిగిపోయి ప్రాణాలు విడిచారు. ఘటనలో ఆమె భర్త దుర్గారావు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ట్రాఫిక్ సీఐ నాగరాజు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. ఎచ్చెర్ల మండలం కుంచాల కూర్మయ్యపేటకు చెందిన యంపాడ దుర్గారావు అర్బన్ కాలనీలో తన ఇంటికి సమీపంలోనే టిఫిన్షాపు నడుపుతున్నారు. ఆయనకు అదే గ్రామానికి చెందిన రాజేశ్వరితో నాలుగేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఏడాదిన్నర వయసు గల పాప ఉంది. రాజేశ్వరి మళ్లీ గర్భం(pregnant woman) దాల్చడంతో శ్రీకాకుళం రిమ్స్లో తరచూ చూపిస్తున్నారు. ఆ క్రమంలోనే సోమవారం ఉదయం 9:30 గంటలకు దంపతులిద్దరూ స్కూటీపై బయల్దేరారు. రిమ్స్లో వైద్యులకు చూపించాక బుధవారం ప్రస వం జరిగే అవకాశం ఉందని, ఇప్పుడు వెళ్తే రావడం కష్టమవుతుంది కాబట్టి సోమవారమే ఇక్కడ ఉండిపోవాలని వైద్యులు సూచించారు. కానీ వస్తువులన్నీ సర్దుకుని వచ్చేస్తామని భార్యాభర్తలు తిరుగు ప్రయాణమయ్యారు. డేఅండ్నైట్ కూడలి సమీపానికి ఉదయం 11.48గంటలకు వారు బండిపై చేరుకున్నారు. కూడలి దాటుకుని బ్రి డ్జి వైపు వెళ్లిన కొద్ది సేపటికే విశాఖ వెళ్తున్న ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు వీరిని దాటుకుంటూ వెళ్లింది. అయితే బస్సు స్కూటీ అద్దాన్ని తాకడంతో.. బండి అదుపు తప్పి దుర్గారావు డివైడర్ వైపు పడిపోయా రు. రాజేశ్వరి మాత్రం బస్సు వెనుక చక్రాల కింద పడిపోవడంతో తీవ్ర రక్తస్రావమైంది. ప్రమాదం జ రిగినా బస్సు డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోవడం అక్కడి వారిని నిశ్చేషు్టలను చేసింది.వెంటనే అక్కడున్న వా రి సాయంతో భర్త దుర్గారావు రాజేశ్వరిని ఆటోలో మెడికవర్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కానీ తీవ్రంగా గాయపడిన ఆమె సాయంత్రం నాలుగు గంటలకు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రమాద దృశ్యాలన్నీ మెడిల్యాబ్ సీసీ కెమెరా ఫుటేజీలో నిక్షిప్తమయ్యాయి. దాని ప్రకారం పోలీసులు బస్సును గుర్తించి డ్రైవర్కు ఫోన్ చేసి రమ్మని పిలిచారు. అయితే తనకు ఏం జరిగిందో తెలియ దని డ్రైవర్ చెప్పడం గమనార్హం. దీనిపై కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మెట్ట సుధాకర్ తెలిపారు. 20 ఏళ్లకే .. చనిపోయిన రాజేశ్వరి వయసు కేవలం 20 ఏళ్లు. పదహారేళ్లు దాటాక పెళ్లి చేసుకుని 18 ఏళ్లకు తల్లిగా మారిన రాజేశ్వరికి 20 ఏళ్లకే ఆయుష్షు రేఖ ఆగిపోయింది. ఇంత చిన్న వయసులో అది కూడా గర్భిణిగా చనిపోవడంతో ఊరంతా శోకసంద్రమైంది. -
కొనసా..గుతున్న పడిగాపులు
● గ్యాస్ సరఫరా కాక ప్రజల ఇబ్బందులు పొందూరు: స్థానిక ఇండేన్ గ్యాస్ కస్టమర్లకు సోమవారం కూడా పడిగాపులు తప్పలేదు. గత పది రోజులుగా గ్యాస్ సరఫరా కాకపోవడంతో కస్టమర్లకు వంట తిప్పలు తప్పడం లేదు. పొందూరు ఏజెన్సీ బాధ్యతలను రణస్థలం, వజ్రపుకొత్తూరు ఏజెన్సీలకు అప్పగించారు. ఈ మేరకు రణస్థలం ఏజెన్సీ స్పందన సరిగ్గా లేకపోయిన్పటికీ వజ్రపుకొత్తూరు ఏజెన్సీ స్పందించింది. సోమవారం నుంచి గ్యాస్ సరఫరా చేయనున్నట్లు ప్రచారం జరగడంతో పలువురు గ్యాస్ ఆఫీసుకు మధ్యా హ్నం 2 గంటలకు చేరుకున్నారు. గ్యాస్ ఆఫీసుకు వజ్రపుకొత్తూరు సిబ్బంది వచ్చా రు. అయితే ఆన్లైన్లో సమస్య తలెత్తింది. దీంతో సాయంత్రం 6 గంటల వరకు గ్యాస్ కస్టమర్లు ఆఫీసుకు రావడం, వెళ్లడం మాత్రమే జరిగింది. గ్యాస్ ఆఫీసుకు వచ్చిన వారందరికీ మంగళవారం నుంచి గ్యాస్ సరపరా చేస్తామని చెప్పి పంపించేశారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి పలువురు ఆటోల్లో సిలిండర్లు తీసుకువచ్చారు. ఆటోలకు ఎక్కువ చార్జీలు చెల్లించి అక్కడే గంటల తరబడి ఉన్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఉసూరుమని వెనుదిరిగారు. మంగళవారమైనా గ్యాస్ సరఫరాను కచ్చితంగా చేయాలని ప్రజలు కోరుతున్నారు. తప్పెవరిది.. శిక్ష ఎవరికి? -
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
హిరమండలం: బంధువుల ఇంటికి వెళ్లి వస్తానని చెప్పిన భార్య, సమయానికి రాకపోవడంతో మండలంలో ధనుపురం గ్రామ సమీపంలోని తోటలో చెట్టుకు ఉరేసుకొని గొర్లె కన్నారావు (34) అనే వ్యక్తి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పొందూరుకు చెందిన కన్నారావు దంపతులు ఊరూరా గాడిద పాలు అమ్ముకొని జీవనం సాగిస్తుంటారు. ధనుపురం స్పైసీ దాబా సమీపంలోని ఖాళీ గదుల్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే కొన్నిరోజులుగా దంపతుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల అతడి భార్య ఆమె చెల్లెలు ఉన్న కవిటి గ్రామానికి వెళ్లింది. ఆదివారం తిరిగి వస్తానని చెప్పి రాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కన్నారావు చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు తల్లి జి.సీతమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఎండీ యాసిన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం సీహెచ్సీకి తరలించారు. మృతుడికి భార్య, ఎనిమిదేళ్ల పాప, ఆరేళ్ల బాబు ఉన్నారు. -
అర్జీలు సత్వరమే పరిష్కరించాలి
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశం ● మీకోసంలో 141 వినతుల స్వీకరణ శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక(మీకోసం)ను సోమవారం నిర్వహించారు. దీనిలో భాగంగా రెవెన్యూ, పంచాయతీరాజ్, సర్వే అండ్ లాండ్ రికార్డులు, హౌసింగ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, విభిన్న ప్రతిభావంతులు, గ్రామీణాభివృద్ధి, వాటర్ రిసోర్సెస్, సీ్త్ర, మహిళా, శిశు సంక్షేమ శా ఖ, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్, దేవ దాయశాఖ, మైన్స్ అండ్ జియాలజీ శాఖ లకు సంబంధించి 141 అర్జీలను స్వీకరించారు. అర్జీలు స్వీకరించిన వారిలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, జెడ్పీ సీఈ వో ఎల్ఎన్ వి.శ్రీధర్ రాజ పాల్గొన్నారు. ఆగడాలు అరికట్టాలి శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆమదాలవలస నియోజకవర్గంలో కూటమి నాయకుల ఆగడాలు అరికట్టాలని ఆ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ కోరారు. ఈ మేరకు మీకోసంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్కి వినతిపత్రం అందజేశారు. కూటమి నేతలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమదాలవలస మండలం ముద్దాడపేట, సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం వంటి అధికారిక అనుమతులు ఉన్న ఇసుక రీచ్ల నుంచి, అలాగే ఆమదాలవలస మండలం తోటాడ, పొందూరు మండలం బొడ్డేపల్లి, సింగూరు, నెల్లిమెట్ట వంటి అనుమతులు లేని ఇసుక రీచ్ల నుంచి ప్రతిరోజూ వందలాది లారీల ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని తెలిపారు. దీనివలన సాగునీటి వనరులకు, పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతోందని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా రాత్రి వేళల్లో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని తెలిపారు. సీసీ కెమెరాలు పనిచేయకుండా చేస్తున్నారని, అటువంటి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని విన్నవించారు. అలాగే పొందూరు మండలం గోకరతపల్లి గ్రామానికి చెందిన వీవోఏను రాజకీయ కక్షతో తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారని, ఆమెను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా పొందూరు మండలం గోకర్ణపల్లి గ్రామంలోని పంతకోనేరు, నూకమ్మ చెరువుల్లో ఆక్రమణల వలన ఆయకట్టు రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. అధికారులు స్పందించి ప్రభుత్వ స్థలం, చెరువులను కాపాడలని కోరారు. ఈ విషయంలో గతంలోనే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. -
గర్జిద్దాం రండి
కన్నీరే మిగిలిందిక నేస్తం..కిడ్నీ బాధితుల కష్టాలు అంతులేనివి. ప్రాణాలతో పాటు ఆస్తులు కూడా హరించుకుపోతున్నాయి. –8లోవిద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై వైఎస్సార్ సీపీ పోరుబాట పట్టనుంది. యువత పోరు పేరుతో 12న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేయడానికి సిద్ధమైంది. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వానికి చెమటలు పట్టేలా ఈ ఆందోళన నిర్వహించాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా కాలయాపన చేస్తున్న సర్కారు మొద్దు నిద్ర వీడేలా నినదించాలని కోరారు. కార్యక్రమానికి శ్రేణులను సమాయత్తం చేస్తూ పార్టీ నేతలు అన్ని నియోజకవర్గాల్లో సోమవారం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థి లోకానికి తోడుగా ఆ రోజు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. -
తుది దశకు ఇంటర్ పరీక్షలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియెట్ (ఐపీఈ మార్చి–2025) పబ్లిక్ పరీక్షలు తుది దశకు చేరుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా 75 కేంద్రాల్లో జరుగుతున్న పరీక్షల్లో భాగంగా 8వ రోజు సోమవారం సెకెండియర్ విద్యార్థులు సెట్–2 ప్రశ్న పత్రంతో మ్యాథ్స్ 2బి, జువాలజీ, హిస్టరీ–2 తదితర పేపర్లకు పరీక్ష రాశారు. జనరల్, ఒకేషనల్ రెండు విభాగాల్లో కలిపి 17523 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 351 మంది గైర్హాజరయ్యారు. అధికారులు, స్క్వాడ్లు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ సీజన్లో మొదటిసారి బ్లాంక్ ఓఎంఆర్ షీట్ను ఉపయోగించారు. పొందూరు ప్రభు త్వ జూనియర్ కళాశాలలో ఓ విద్యార్థికి బ్లాంక్ ఓంఆర్ను వినియోగించినట్టు ఆర్ఐఓ పి.దుర్గారావు ధ్రువీకరించారు. మంగళవారం ప్రథమ సంవత్సం హెచ్ఈసీ, తదితర గ్రూప్ల పరీక్షలు ముగియనున్నాయి. రెండో రోజూ నిరాశే అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో తొలి సూర్యకిరణాలు స్వామి మూలవిరాట్టును తాకే అద్భుత దృశ్యానికి మరోసారి మబ్బులు అడ్డంకిగా మారాయి. తొలిరోజున కూడా ఇలాగే మబ్బులు అడ్డుగా రావడంతో భక్తులకు నిరాశ మిగల్చగా.. రెండో రోజూ కూడా భక్తులకు అదే పరిస్థితి ఎదురైంది. దీంతో సోమవారం ఉదయం 4 గంటల నుంచి వేచి చూసిన భక్తులకు నిరాశ తప్ప లేదు. ఉదయం 6.45 గంటల తర్వాత సూర్యకిరణాలు ఆలయంలోని గోపురం స్థాయికి చేరిపోయాయి. దీంతో మళ్లీ ఈ ఏడాది అక్టోబర్ 1,2 తేదిల్లో ఇలాగే కిరణ దర్శనం ఉంటుందని, అంతవరకు భక్తులకు ఆగాల్సిందేనని ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ తెలియజేశారు. ఘనంగా ఆదిత్యుని కల్యాణం అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి కల్యాణం సోమవారం ఉదయం ఘనంగా జరిగింది. ఫాల్గుణ శుద్ధ ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీ ఉషా పద్మిని ఛాయాదేవేరులతో శ్రీవారి కల్యాణ మూర్తులను అనివెట్టి మండపంలో వేంచేసింపజేసి ఆగమశాస్త్ర ప్రకారం కల్యాణాన్ని నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకులు వేదమంత్రోచ్ఛరణలతో శాస్త్రోక్తంగా కల్యాణాన్ని జరిపించారు. రూ.500 చెల్లించిన భక్తదంపతులు కల్యాణ సేవలో పాల్గొనగా, ఆలయం తరఫున స్వామి వారి శేషవస్త్రాలను, తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఇప్పిలి సాందీప్శర్మ, సూపరింటెండెంట్ కనకరాజు పాల్గొన్నారు. -
చెరువు దగ్గరకొస్తే
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : విజయనగరం జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి సంధ్యా గజపతిని తోటి టీడీపీ నాయకుడు, నీటి సంఘం అధ్యక్షుడు, చౌదరి బాబ్జీ అనుచరుడు సంపతిరావు గణపతి ఫోన్ చేసి బెదిరించారు. పల్లవాని చెరువు భూమిని ఆనుకుని ఆక్రమించారని చెరువుల పరిరక్షణ పేరుతో ఫిర్యాదు చేయడమేంటని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ‘సత్తా ఉంటే.. చెరువు దగ్గరకొస్తే తేల్చుకుందాం. అది చెరువు అని ఉందా. నీకు జ్ఞానం ఉందా?’ అని రాత్రి 9.20గంటల సమయంలో ఫోన్ చేసి ఇష్టారీతిన మాట్లాడారు. దీంతో ఆమె పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. జిల్లాలోని పలుచోట్ల చెరువులు ఆక్రమణకు గురయ్యాయని, ఆక్రమణలు తొలగించాలని కోరుతూ ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్లో ఆ సంఘం ప్రతినిధులు కృష్ణమూర్తినాయుడు, సంధ్యా గజపతి తదితరులు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నాయకుడు, నీటి సంఘం అధ్యక్షుడు సంపతిరావు గణపతి నేరుగా సంధ్యా గజపతికి రాత్రి 9.20గంటల సమయంలో ఫోన్ చేసి బెదిరిస్తూ మాట్లాడారు. డీ పట్టాయే కొన్నానని ఒప్పుకుంటూనే.. ‘ఇంకా ఏమీ చెరువులు కన్పించలేదా? బాబ్జీ చెరువును జన్మలో తీయించగలవా? ఊర్లో పెద్ద చెరువు 165ఎకరాలు ఉంటే 60ఎకరాలకు వస్తే అప్పుడెక్కడికి వెళ్లిపోయావు? చెరువులన్నీ తీయడానికి పోటుగెత్తివా...మండలంలో అన్నీ తీయ్...రాష్ట్రంలో ఉన్న చెరువులన్నింటిని తీయ్. అప్పుడు ఇక్కడికి రా...సత్తా ఉంటే చెరువు దగ్గరికి రా..’ అని బెదిరించారు. ‘రికార్డు చేసుకో...ఎవరికిచ్చినా నష్టం లేదు’ అని వార్నింగ్ ఇచ్చారు. ఫిర్యాదులో పేర్కొన్న చెరువు వివరాలివి ఎచ్చెర్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 1బీలోని ఎకరా 58సెంట్లు మేర భూమిని 1971లో మొహమ్మద్ ఫజుల్లాత్ అనే వ్యక్తికి డీ పట్టా కింద ఇచ్చారు. అయితే, ఈ భూమిని తర్వాత సంపతిరావు గణపతితో పాటు మరో నలుగురు కొనుగోలు చేశారు. రికార్డుల్లో కూడా అనుభవ స్వభావం కొనుగోలు అని నమోదు చేశారు. దీనిపై ఫిర్యాదులు వెళ్లాయి. సుధాసాగర్ అనే తహసీఉన్నప్పుడు డీ పట్టా భూమిని కొనుగోలు చేయడం కుదరదని, నిబంధనల ప్రాప్తికి అమ్మకం, కొనుగోలు చేయకూడదని, దీన్ని స్వాధీన పర్చుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని విచారణలో నిగ్గు తేల్చడమే కాకుండా దాన్ని ప్రభుత్వ భూమిగా మార్చేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పల్లవాని చెరువుకు ఆనుకుని ఉన్న ఈ భూమిలో ఉన్న వాటిని తొలగించాలని ఆదేశాలిచ్చారు. అప్పట్లో సదరు ఉత్తర్వుల మేరకు తొలగింపులు జరిగాయి. కానీ మళ్లీ అక్కడే కట్టడాలు జరిగాయి. వాటిని తొలగించాలని కోరుతూ మళ్లీ సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్లో ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ఽఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు చేసిన వారిలో సంధ్యా గజపతి కూడా ఉండటంతో ఆమెకు సంపతిరావు గణపతి అనే వ్యక్తి ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు. ఈ ఫోన్ సంభాషణను సంధ్యా గజపతి రికార్డు చేశారు. దీన్ని పట్టుకుని పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని సోమవారం రాత్రి మీడియాను ఆశ్రయించి జరిగిందంతా వివరించారు. దీనిపై గణపతిని ‘సాక్షి’ వివరణ కోరగా.. తాను మాట్లాడానని, తన భూమి విషయంలో ఫిర్యాదులు చేస్తున్నారని, ఆమె రికార్డు చేస్తుందని తెలిసినా కూడా మాట్లాడానని, తానేమీ బెదిరించలేదని, ఆమే తిరిగి బెదిరించిందని తెలిపారు. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి సంధ్యా గజపతికి బెదిరింపులు బెదిరించింది తోటి టీడీపీ నాయకుడే చౌదరి బాబ్జీ అనుచరుడు సంపతిరావు గణపతి బెదిరించారని మీడియాను ఆశ్రయించిన సంధ్యా గజపతి -
హామీలు నెరవేర్చాలి
● కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల నిరసన శ్రీకాకుళం పాతబస్టాండ్: ఎన్నికల ముందు అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కె.కల్యాణి డిమాండ్ చేశారు. అంగన్వాడీల ఛలో విజయవాడపై రాష్ట్ర ప్రభుత్వ నిర్భందానికి నిరసనగా, 42 రోజుల సమ్మె మినిట్స్ అమలు చేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద సోమవారం అంగన్వాడీలు నిరసన తెలిపారు. ముందుగా వాంబే కాలనీ జంక్షన్ నుంచి ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చిన జీవోనే మరలా ఇచ్చి మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. శాంతియుతంగా ఛలో విజయవాడకు పిలుపునిస్తే రాష్ట్రవ్యాప్తంగా గృహ నిర్భందాలు, అరెస్టులు చేయడం సరికాదన్నారు. ఎన్నికల ముందు 42 రోజుల సమ్మె సమయంలో టీడీపీ నాయకులు మద్దతు తెలిపి, అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇచ్చి, ఇప్పుడు కనీసం స్పందించడం లేదని పేర్కొన్నారు. కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించి అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ – హెల్పర్స్ యూనియన్ నాయకులు కె.సుజాత, కె.హేమలత, కె.లక్ష్మి, మాధవి, చంద్రమౌళి, పి.భూలక్ష్మి, టి.రాజేశ్వరి, అప్పమ్మ, లలిత, ఇ.అప్పలనర్సమ్మ, కె.జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
తప్పిపోయిన బాలుడు తల్లి చెంతకు
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం తండ్రితో పాటు వెళ్లిన ఒక బాలుడు తప్పిపోయాడు. అయితే మూడు గంటల వ్యవధిలోనే తప్పిపోయిన బాలుడిని రెండో పట్టణ పోలీసులు సాంకేతికత సాయంతో తల్లి చెంతకు చేర్చారు. రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో నగరంలోని సత్యలాడ్జి ఎదురుగా ఉన్న దుకాణం వద్ద బాలుడు ఏడుస్తూ కనిపించడంతో స్థానికులు 112కి కాల్చేసి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. స్టేషన్కు వెళ్లాక బాబును సీఐ పి.ఈశ్వరరావు వివరాలు అడిగినా చెప్పలేకపోయాడు. దీంతో వెంటనే వెంటనే బాలుడి ఫొటోలు తీసి జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్, స్థానికంగా ఉన్న కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో వివరాలతో సహా పంపారు. తన కుమారుడి ఫొటో వాట్సాప్ గ్రూపులో కనిపించడంతో అది చూసిన వాంబేకాలనీకి చెందిన బమ్మిడి రూప సాయంత్రం 5 గంటలకు రెండో పట్టణ పోలీస్స్టేషన్కు వెళ్లింది. బాబు తన భర్త వెంట నడిచి వెళ్లాడని, ఆ విషయం తన భర్త గమనించకపోవడంతో ఇటువంటి పరిస్థితి ఎదురయ్యిందన్నారు. పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. -
కోశాధికారిగా ఎంవీ రమణ
శ్రీకాకుళం న్యూకాలనీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీడీ–పీఈటీ అసోసియేషన్ కోశాధికారిగా మొజ్జాడ వెంకటరమణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయవాడలో ఆదివారం జరిగిన రాష్ట్ర పీడీ–పీఈటీ సంఘ విస్తృతస్థాయి సమావేశంలో ఈ మేరకు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇప్పటివరకు ఈయన రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా సేవలు అందించారు. అలాగే శ్రీకాకుళం జిల్లా పీడీ, పీఈటీ సంఘ అధ్యక్షుడిగా గత పదేళ్ల నుంచి విశేషమైన సేవలు అందిస్తున్నారు. ఈయన నియామకంపై ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ధర్మాన కృష్ణదాస్, ఎం.సాంబమూర్తి, చీఫ్ అడ్వైజర్ పి.సుందరరావు, ఎస్జీఎఫ్ సెక్రటరీ బీవీ రమణ, గ్రిగ్స్ సెక్రటరీ కె.మాధవరావు, గ్రిగ్స్ జోనల్, జిల్లా సంఘ ప్రతినిధులు, పీడీలు హర్షం వ్యక్తం చేశారు. ఎంవీ రమణ -
పట్టుబడిన గంజాయి ముఠా
కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరా చౌక్ వద్ద కాశీబుగ్గ పోలీసులకు గంజాయి ముఠా సోమవారం పట్టుబడింది. ఈ మేరకు కాశీబుగ్గ పట్టణ పోలీసుస్టేషన్లో డీఎస్పీ వెంకట అప్పారావు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రంలోని గజపతి జిల్లా హరుపదర్ గ్రామానికి చెందిన అన్నదమ్ములు వినయమిన్ మాఝీ, ఆయుభ మాఝీలు అన్నారు. వీరికి ఉదయగిరి బ్లాక్కు చెందిన మైఖేల్ బదరైతతో పరిచయం ఉంది. మైఖేల్ తమ గ్రామ పరిసర ప్రాంతాల్లో గంజాయి పండిస్తుంటాడు. దీంతో అతడు తన గ్రామానికే చెందిన జాన్, అన్నదమ్ములు వినయమిన్, ఆయుభలకు గంజాయి రవాణా చేస్తే డబ్బులు ఇస్తానని చెప్పాడు. పలాస రైల్వేస్టేషన్లో తాను చెప్పిన వ్యక్తికి గంజాయి అప్పగిస్తే కిలోకి రూ.1000లు చొప్పున ఇస్తానని తెలిపాడు. దీంతో వీరు ముగ్గురు ఒక ద్విచక్ర వాహనంపై గంజాయి తీసుకొస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. వీరి ముగ్గురినీ అరెస్టు చేశారు. కాశీబుగ్గ సీఐ సూర్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కన్నీరే మిగిలిందిక నేస్తం..!
నిత్యం పంటలతో తొణికిసలాడే ఉద్దానం విషాదాలకు నిలయంగా మారింది. ఏ ఇంటి తలుపుతట్టినా కన్నీటిచారలే కనిపిస్తున్నాయి. గుండెలను పిండేసే కిడ్నీ బాధలు అడుగడుగునా తారసపడుతున్నాయి. ఇంటికి పెద్ద దిక్కు కిడ్నీ వ్యాధితో మంచాన పడితే.. ఆ పెద్ద దిక్కును దక్కించుకోవడానికి ఉన్నదంతా అమ్మేసి రోడ్డున పడ్డ కుటుంబాల దర్శనమిస్తున్నాయి. ఎదిగొచ్చిన కన్న కొడుకు కిడ్నీ వ్యాధితో కళ్లేదుటే కూలిపోతుంటే భరించలేని ఆ తల్లిదండ్రులు, భారీగా అప్పులు చేసి ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. ఆ కుటుంబాలను ఒకసారి పలకరిస్తే... – ఇచ్ఛాపురం రూరల్ ● ఉద్దానంలో కుటుంబాలకు మూత్ర గండాలు ● చితికిపోతున్న బతుకులు ● పట్టించుకోని ప్రభుత్వం -
ఆశలు గల్లంతు
● సముద్రంలో గల్లంతైన గ్రూప్–2 అభ్యర్థి ● రాజమ్మతల్లి జాతర స్నానాల్లో అపశృతి ● మరో నలుగురిని కాపాడిన మైరెన్ పోలీసులు గార: మండలంలోని చిన్న వత్సవలస రాజమ్మ తల్లి జాతర సముద్ర స్నానాల్లో అపశృతి చోటుచేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం జి.సిగడాం మండలం దేవరవలసకు చెందిన తండ్రీ కొడుకులు కొడమటి ఈశ్వరరావు, అశోక్(23) సముద్ర స్నానానికి వెళ్లగా అలల తాకిడి గల్లంతయ్యారు. తోటివారు కేకలు వేయడంతో మైరెన్ పోలీసులు స్పందించి తండ్రి ఈశ్వరరావును ఒడ్డుకు తీసుకురాగలిగారు. అశోక్ ఆచూకీ దొరకలేదు. అశోక్ ఎంఎస్సీ పూర్తి చేసి, ఇటీవలే గ్రూప్–2 పరీక్షలు రాశాడు. తండ్రి ఈశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గార ఎస్ఐ ఆర్.జనార్దన కేసు నమోదు చేశారు. కాగా, ఇదే ప్రాంతంలో చీపురుపల్లి మండలం కాపుశంభాం గ్రామానికి చెందిన చందక వంశీ, పిన్నింటి జయలక్ష్మీ, పిన్నింటి దిలీప్ సముద్ర స్నానానికి దిగి చిక్కుకుపోతున్న తరుణంలో మైరెన్ ఎస్ఐ హరికృష్ణ టీం సభ్యులు గమనించి రక్షించారు. లైఫ్ జాకెట్లు ఉపయోగించి నీటిలో ఇబ్బందులు పడుతున్న ముగ్గురినీ ఒడ్డుకు తీసుకొచ్చి సపర్యలు చేశారు. -
కన్నీళ్లకే.. కన్నీళ్లొచ్చే..!
నందిగాం : ఆడపిల్ల పుట్టిందని నాడు తండ్రి విడిచిపెట్టి వెళ్లిపోయాడు. జీవితాంతం తోడు ఉంటానని అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్త రెండేళ్లకే వదిలేశాడు. అయినా ధైర్యం కోల్పోక ముందుకు సాగుతున్న ఆమెకు కిడ్నీ భూతం కాటేయడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. విధి చేతిలో ఓడిపోయి నిస్సహాయ స్థితిలో సాయం కోసం ఎదురుచూస్తున్న కాంతమ్మ దీనస్థితి ఇది. వివరాల్లోకి వెళ్తే.. నందిగాం మండలం మర్లపాడుకు చెందిన కోనారి వెంకయ్య, నీలమ్మల కుమార్తె కాంతమ్మ. అయితే కాంతమ్మ పుట్టిన తర్వాత మగబిడ్డ పుట్టలేదని చెప్పి తండ్రి వెంకయ్య కోపంతో భార్య, కుమార్తెను విడిచిపెట్టి మరో మహిళతో వెళ్లిపోయాడు. దీంతో పేదరికంలో పెరిగిన కాంతమ్మ కూలి పనులు చేసుకుంటూ తల్లికి తోడుగా ఉండేది. పెళ్లి ఈడు వచ్చేసరికి గ్రామస్తులు సహకరించి సమీప ప్రతాపవిశ్వనాథపురం గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం చేశారు. అయితే తాగుడుకు బానిసైన ఆయన రెండేళ్లకే భార్యను విడిచిపెట్టడంతో కాంతమ్మ మరలా కన్నవారింటికి చేరింది.కూలి పనులతోనే జీవనంకూలీ పనులు, ఉపాధి పనులు చేసుకుంటూ తల్లి ఉంటున్న పూరి గుడిసెలో కాంతమ్మ జీవనం సాగిస్తుండేది. వదిలి వెళ్లిన తండ్రి ఐదేళ్ల క్రితం గ్రామ సమీప తోటలో శవంగా మరడంతో కుమారుడిలా అంత్యక్రియలు చేసి కన్నరుణం తీర్చుకుంది. విడిచిపెట్టిన భర్త కొద్దిరోజులకే చెరువులో పడి విగతజీవిగా మారాడు. తల్లి వృద్ధాప్యానికి చేరుకొని కంటి సమస్యతో కుమార్తె కాంతమ్మ మీద ఆధారపడింది. అయినప్పటికీ ధైర్యంగా కష్టాలను ఎదుర్కొని తల్లికి సపర్యలు చేసుకుంటూ జీవనం సాగించేది. అయితే రెండేళ్ల క్రితం కిడ్నీ భూతం కాంతమ్మకు సోకింది. మొదటిలో కూలీ చేసిన డబ్బులతో వైద్యం పొందేది. అయితే క్రమేపీ వ్యాధి తీవ్రత పెరిగి కూలీ చేసుకోలేని స్థితికి చేరుకుంది. దీంతో గ్రామంలోని కొంతమంది యువకులు ఆర్థిక సాయం చేస్తూ పలాసలో ఉన్న కిడ్నీ ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తున్నారు. అయితే ఇటీవల వ్యాధి తీవ్రత బాగా పెరగడంతో కాంతమ్మ మంచానికే పరిమితమైపోయింది. ఫలితంగా తల్లీకూతుళ్లు ఇద్దరూ ఇబ్బంది పడుతున్నారు. పూట గడవడమే కష్టంగా మారిన స్థితిలో డయాలసిస్ చేయించుకునే స్థోమత లేకుండా పోయింది. దీంతో జీవితంలో ఎన్నో కష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్నా, ఎక్కడా చేయిచాచని కాంతమ్మ విధికి తలవంచి దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది. మనసున్న మారాజులు ఎవరైనా ఆదుకోవాలని కోరుతోంది. తనకు సాయం చేయాలనుకునేవారు 9440487406 నంబర్ను సంప్రదించాలని కోరుతోంది. -
అన్నయ్యపై తమ్ముడి దాడి
టెక్కలి రూరల్: మండల కేంద్రం టెక్కలిలోని రెల్లివీధి సమీపంలో పరపటి వినోద్ అనే వ్యక్తి తీవ్ర గాయాలతో అంబేడ్కర్ జంక్షన్ నుంచి పోలీస్టేషన్ వైపుగా భార్యాపిల్లలతో కలిసి రోడ్డుపై వెళ్లడం ఆదివారం స్థానికంగా కలకలం రేపింది. తలపై రక్తాలు కారడంతో ఏమైందని అడిగినా స్పందించకపోవడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం గాయపడిన వ్యక్తిని టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై టెక్కలి సీఐ విజయ్కుమార్ వద్ద ప్రస్తావించగా అన్నదమ్ముల మధ్య గొడవ జరిగిందని, తమ్ముడు బాల అన్నయ్య వినోద్ను కర్రతో కొట్టి గాయపరిచాడని తెలిపారు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. అ‘పూర్వ’ సమ్మేళనం కొత్తూరు : కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1970–71 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఆదివారం అదే పాఠశాల ఆవరణలో అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. 55 ఏళ్ల తర్వాత ఒకరినొకరు కలిసి ఆనాటి జ్ఞాపకాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ హెచ్ఎం ఎద్దు గోపాలదాసునాయుడుతో పాటు పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. -
దివ్యాంగులపై అక్కసు!
ఉపాధ్యాయ బదిలీల్లో.. ● ఇటీవల విడుదల చేసిన ముసాయిదాపై తీవ్ర విమర్శలు ● 80 వరకు ప్రాధాన్యత పాయింట్ల పెంచడంపై అభ్యంతరం ● సవరణలు చేసి న్యాయం చేయాలని వేడుకోలు శ్రీకాకుళం న్యూకాలనీ: దివ్యాంగ ఉపాధ్యాయులపై కూటమి సర్కారు అక్కసు ప్రదర్శిస్తోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉపాధ్యాయ బదిలీల నిబంధనల ముసాయిదా మార్గదర్శకాలు దివ్యాగుంలు, శారీరక వైకల్యం, అనారోగ్య రుగ్మతలతో బాధపడుతున్న వారికి తీరని నష్టం కలిగించేలా ఉన్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గ్రేడ్–2 హెచ్ఎంలు, ఉపాధ్యాయుల సీనియారిటీ, రోస్టర్ పాయింట్లను తుంగలొకి తొక్కిన కూటమి సర్కారు.. టీచర్ల వైకల్య శాతాన్ని అమాంతం పెంచేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా ఆర్థోపెడికల్, విజువల్లీ ఛాలెంజ్డ్ వంటి సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ నిబంధనలతో తీవ్ర అన్యాయం జరిగి బదిలీల్లో సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని పలువురు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో పాఠశాల విద్య పరిధిలో దివ్యాంగులు, వివిధ తీవ్ర రుగ్మతలు కలిగినవారు 294 మంది వరకు ఉన్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. వైకల్య శాతాన్ని తీసుకొచ్చిందే చంద్రబాబు.. వాస్తవానికి వైకల్యశాతాన్ని బదిలీల్లోకి తీసుకొచ్చి 2017లో అన్యాయం చేసింది నాడు చంద్రబాబు సారధ్యంలోని టీడీపీ సర్కారేనని వారంతా గుర్తుచేస్తున్నారు. నాడు 40 శాతం వైకల్యం కలిగినవారికి ప్రాధాన్యత పాయింట్లను కేటాయించారు. 2023లో వైఎస్సార్సీపీ అధికారంలో వచ్చాక దానిని విభిన్నమైన రీతిలో వైకల్యాన్ని గుర్తించి మేలుచేసేలా చర్యలు చేపట్టింది. దీంతో ఎక్కువ వైకల్యం కలిగినవారికి బదిలీల్లో మరింత న్యాయం జరిగింది. వైకల్యశాతాన్ని బట్టి వారికి సమన్యాయం చేశారు. మరళా కూటమి సర్కారు 2025లో చేపట్టనున్న బదిలీల మార్గదర్శకాల్లో వైకల్యాన్ని 80 శాతం వరకు తీసుకెళ్లడాన్ని వాంతా తప్పుపడుతున్నారు. ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉన్నవారికి వైకల్యశాతం 70 శాతం దాటి ఇవ్వడంలేదు. ఈ కోవకు చెందినవారు జిల్లాలో 50 మంది వరకు ఉన్నారు. దీనికితోడు ట్రాన్స్ఫర్స్కు మాన్యువల్ సర్టిఫికెట్ సరిపోదు. శ్రీకాకుళంలో రిమ్స్ మెడికల్ బోర్డులో డాక్టర్లు సర్టిఫై చేసిన సర్టిఫికెట్ మాత్రమే అనుమతిస్తారు. ఈ లెక్కన వారంతా తీవ్ర అన్యాయానికి గురవుతారని దిగులు చెందుతున్నారు. ప్రభుత్వ పెద్దలు, విద్యాశాఖ ఉన్నతాధికారులు తమకు న్యాయం చేయాలని వారంతా విజ్ఞప్తి చేస్తున్నారు. శారీరక వికలాంగులు అంటే.. ●దృశ్యపరమైన వారు/ఆర్థోపెడికల్ చాలెంజ్డ్ ఉద్యోగులకు 80 శాతం కంటే ఎక్కువ లేదా సమానం. ● దృశ్యపరమైన వారు/ ఆర్థోపెడికల్ చాలెంజ్డ్/ వినికిడి లోపం ఉన్న ఉద్యోగులకు 70 శాతం కంటే ఎక్కువ లేదా సమానం. ● క్యాన్సర్, ఓపెన్ హార్ట్ సర్జరీ/కర్ణిక సెప్టల్ లోపాన్ని సరిదిద్దడం/అవయవ మార్పిడి, మేజర్ న్యూరో సర్జరీ, బాంక్ టీబీ, కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్/డయాలసిస్, వెన్నెముక శస్త్రచికిత్స వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు. ●మానసిక దివ్యాంగులు/చికిత్స పొందుతున్న వారిపై ఆధారపడిన పిల్లలు, జీవిత భాగస్వామి కలిగినవారు ●జువైనెల్ డయాబెటీస్/ తలసేమియా వ్యాధి/హీమోఫిలియా వ్యాధి/మస్కులర్ డిసీజ్/కండర క్షీణతతో బాధపడుతున్న వారిపై ఆధారపడిన పిల్లలతో టీచర్లు. అలాగే చికిత్స కొనసాగుతున్న టీచర్లకు ప్రాధాన్యతా పరంగా పాయింట్లను కేటాయించనున్నారు. ●ప్రధానోపాధ్యాయులు గ్రేడ్–2/ఉపాధ్యాయులు పైన పేర్కొన్న కేటగిరీ కింద బదిలీ కోసం దరఖాస్తుచేసుకున్న వారు జిల్లా/రాష్ట్ర మెడికల్ బోర్డ్ ద్వారా ధ్రువీకరించబడిన అన్ని మెడికల్ రిపోర్టులు/సర్టిఫికెట్లను ఆన్లైన్ ద్వారా కొత్తగా సమర్పించాలి. పాత సర్టిఫికెట్లను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని మార్గదర్శకాల్లో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. అభ్యంతరాల స్వీకరణ.. ఉపాధ్యాయ బదిలీ నిబంధనల ముసాదాయిదా మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. విద్యాశాఖలో అన్ని వర్గాల అభిప్రాయాలను తీసుకుంటుంది. ఎలాంటి అభ్యంతరాలున్నా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. ప్రత్యేకంగా మాడ్యూల్ను కూడా ఆన్లైన్లో ఉంచింది. దివ్యాంగులు వారి సమస్యలు తెలియజేయవచ్చు. – డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య, జిల్లా విద్యాశాఖాధికారి, శ్రీకాకుళం -
పొయ్యి వెలిగేనా..?
పొందూరు: స్థానిక ఇండేన్ గ్యాస్ లబ్ధిదారులు పడరాని పాట్లు పడుతున్నారు. అధికారులు ఇక్కడి ఇండేన్ గ్యాస్ను సీజ్ చేసి గ్యాస్ సరఫరా బాధ్యతలను తాత్కాలికంగా వేరొక ఏజెన్సీకి అప్పగించారు. మూడు రోజుల కిందట గోడౌన్ తాళాలు రణస్థలం ఏజెన్సీకి అందించారు. కానీ గ్యాస్ సరఫరా ఎలా జరుగుతుందనేది చూడలేదు. పొందూరు, జి.సిగడాం, లావేరు, సంతకవిటి, ఎచ్చెర్ల మండలాల్లో పలు పంచాయతీల్లో పొందూరు ఇండేన్ ఏజెన్సీ సేవలు అందుతున్నాయి. ఈ ఏజెన్సీకి తాళాలు పడడంతో సుమారు 60 పంచాయతీల్లో ప్రజలకు గ్యాస్ అందని పరిస్థితి నెలకొంది. ఆయా పంచాయతీల్లో దాదాపు 28వేల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఈ నెల ఒకటో తేదీకి సుమారు 700 మంది బుక్ చేసుకోగా, ఆదివారం నాటికి సుమారు 2 వేల ఒక వంద మంది వరకు బుక్ చేసుకొన్నారు. గ్యాస్ బుక్ చేసుకోవడం రాని వారు వేల మంది ఉన్నారు. వారంతా ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లతో పాటు గృహాలు, తోపుడు బళ్ల వారు సైతం ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఎదురు చూపులే.. వారం రోజులుగా గ్యాస్ కోసం పొందూరు వాసులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. గ్యాస్ గోడౌన్ వద్దకు వెళ్లినా కూడా సిలిండర్ దొరకడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి గ్యాస్ సరఫరా జరిగేట్టు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరుతున్నారు. డెలివరీ బాయ్స్ చేసిన తప్పు గ్యాస్ డెలివరీ బాయ్స్ చేసిన తప్పులకు ఏజెన్సీని రద్దు చేశారు. ఇది సమంజసం కాదు. ఫలితంగా గ్యాస్ లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీని రద్దు చేయడంపై దృష్టి సారించిన అధికారులు పంపిణీ చేయించడంపైనా శ్రద్ధ చూపాలి. – పొన్నాడ షణ్ముఖరావు, లబ్ధిదారుడు, పొందూరు అవస్థలు పడుతున్న పొందూరు, పరిసర ప్రాంత ప్రజలు సిలిండర్లు రాకపోవడంతో వంటకు ఇబ్బందులు తప్పెవరిది.. శిక్ష ఎవరికి? రాజకీయాలు చేస్తున్నారు.. గ్యాస్ బుక్ చేసి ఆరు రోజులైంది. ఇప్పటికే ఐదు సార్లు గ్యాస్ గోడౌన్కు వచ్చాను. గోడౌన్ మూసే ఉంటుంది. ఇంటి దగ్గర గ్యాస్ అయిపోయింది. ఇంటి వద్ద ఇబ్బందులు పడుతున్నాం. రాజకీయాలు చేసి ప్రజలకు ఇబ్బందులు పెడుతున్నారు. – గురుగుబెల్లి ప్రకాశరావు, లబ్ధిదారుడు, పిల్లలవలస -
స్నానానికి బావిలో దిగి..
● డిప్లమో విద్యార్థి మృతి ● గోపినాథపురంలో విషాదఛాయలు టెక్కలి రూరల్: మండలంలోని గోపినాథపురం గ్రామానికి చెందిన బెండి దీపక్ అలియాస్ కుమారస్వామి (17) ఆదివారం స్నేహితులతో కలసి గ్రామ సమీపంలో ఉన్న నేల బావిలో స్నానానికి దిగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే స్నేహితులు బయటకు తీసి టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే కుమారస్వామి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుమారస్వామి ఎచ్చెర్లలో పాలిటెక్నిక్ డిప్లమో చదువుతున్నాడు. చేతికందిన కుమారుడు మృత్యుఒడికి చేరడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తండ్రి ఆనంద్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు సీఐ విజయ్కుమార్ తెలిపారు. -
ద్విచక్ర వాహనం దగ్ధం
వజ్రపుకొత్తూరు రూరల్: అక్కుపల్లి శివసాగర్ తీరంలో శనివారం రాత్రి ఓ ద్విచక్ర వాహనం దగ్ధమైంది. విషయం తెలుసుకున్న ఎస్సై నిహర్ ఆదివారం సంఘటన స్థలానికి వెళ్లి వాహనాన్ని పరిశీలించారు. నంబర్ ప్లేట్ ఆధారంగా ద్విచక్రవాహనం కొత్తూరు మండలానికి చెందిన వ్యక్తిదిగా గుర్తించామని చెప్పారు.రెండు రోజులు క్రితం షోరూమ్కు అప్పగించి కొత్త వాహనాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. అయితే ఇదే వాహనాన్ని ఇక్కడికి ఎవరు తీసుకువచ్చారు.. ఎందుకు నిప్పు పెట్టారో తెలియాల్సి ఉందన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పలాసలో వైభవ్ జ్యూయలర్స్ ప్రారంభం
కాశీబుగ్గ: కోస్తా ఆంధ్రా, తెలంగాణలో తమకంటూ ప్రత్యేక ప్రస్థానాన్ని ఏర్పాటు చేసుకున్న వైభవ్ జ్యూయలర్స్ నూతన బ్రాంచిని పలాసలో గొప్పగా ప్రారంభించింది. పలాస–కాశీబుగ్గ కేటీ రోడ్డులో ఆదివారం వైభవ్ జ్యూయలర్స్ 19వ బ్రాంచిన పలాస నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త యార్లగడ్డ వెంకన్నచౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక సంస్థ 19 బ్రాంచ్లు ఏర్పాటు చేసిందంటే కొనుగోలుదారుల ఆదరణ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చన్నారు. వ్యాపారంతో పాటు సుమారు 1200 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం అభినందనీయమన్నారు. వైభవ్ సంస్థల సీఎండీ భారత మల్లికా రత్నకుమారి గ్రంథి మాట్లాడుతూ ఇప్పటికే తమ సంస్థ విశాఖపట్నం, గాజువాక, గోపాలపట్నం, అనకాపల్లి, కాకినాడ, రాజమహేంద్రవరం, తుని, పార్వతీపురం, బొబ్బిలి, శ్రీకాకుళం, విజయనగరం, రాజాం, అనంతపురం, అమలాపురం, యలమంచిలి, దిల్సుఖ్నగర్, ఏఎస్రావ్నగర్, మంచిర్యాల తదితర చోట్ల బ్రాంచిలు ఏర్పాటు చేసిందన్నారు. వైభవ్ సంస్థ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ జె.రఘునాథ్ మాట్లాడుతూ అద్భుత శ్రేణి షాపింగ్ అనుభవంతో పాటు 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ డైమండ్స్, వెండి వస్తువులు, వివాహ ఆభరణాలను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. మన పలాస గురించి తెలుసుకుందాం కాంటెస్ట్ డ్రాలో గెలుపొందిన ఏడుగురు విజేతలకు ఒక్కొక్కరికి 1 గ్రాములు 22 క్యారెట్ బంగారు కాయిన్లు అందజేస్తామన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో క్యాష్యూ ట్రేడర్ మళ్లా కాంతారావు, హోల్టైమ్ డైరెక్టర్ సాయి కీర్తన గ్రంధి, సీఓఓ గొంట్ల రాఖాల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సింధూరి వెంకటేష్, ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జ బాబూరావు, పీసీఎంఏ అధ్యక్షుడు మల్లా శ్రీనివాస్, పలాస వైశ్య సంఘం అధ్యక్షుడు మల్లా కృష్ణరావు, టీడీపీ నాయకులు లొడగల కామేశ్వరరావు, చిన్ని, శాసనపురి మోహనరావు, విఠల్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళా పారిశ్రామికవేత్తల హబ్గా శ్రీకాకుళం
శ్రీకాకుళం అర్బన్: ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసి శ్రీకాకుళాన్ని మహిళా పారిశ్రామికవేత్తల హబ్గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శ్రీకాకుళంలోని 80 అడుగుల రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్లో సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ పీడీ బి.శాంతిశ్రీ ఆధ్వర్యంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా సాధికారతకు ప్రభుత్వం చేస్తున్న కృషిని మంత్రి వివరించారు. అనంతరం పలువురు మహిళలకు ప్రోత్సాహకాలు, పురస్కారాలు, చెక్లు, బాలికలకు ల్యాప్టాప్లు, మహిళా డ్రైవర్లకు ఆటోలు అందజేశారు. కార్యక్రమంలో ఆమదాలవలస, నరసన్నపేట, పలాస ఎమ్మెల్యేలు కూన రవికుమార్, బగ్గు రమణమూర్తి, గౌతు శిరీష ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, శ్రీకాకుళం ఆర్డీవో సాయి ప్రత్యూష, సీపీవో ప్రసన్నలక్ష్మి, ఐసీడీఎస్ పీడీ శాంతిశ్రీ, వ్యవసాయ శాఖ అధికారి కోరాడ త్రినాథస్వామి, డీఆర్డీఏ పీడీ కిరణ్కుమార్, డీఎంహెచ్ఓ బాలకృష్ణ, బీసీ కార్పొరేషన్ ఈడీ గెడ్డమ్మ, లీడ్ బ్యాంకు మేనేజర్ సూర్య కిరణ్, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ కె.కవిత, వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి ఈ.అనురాధ, పలు విభాగాలకు చెందిన మహిళ ఉద్యోగులు, అంగన్వాడీలు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ పాలనలోనే మహిళా సాధికారత
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): మహిళలు రాజకీయ, సామాజిక ఎదుగుదలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చినది మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని వైఎస్సార్ సీపీజిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటి సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళంలో జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఉలాల భారతి ఆధ్వర్యంలో శనివారం మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి కుటుంబం వద్ద లక్షలాది రూపాయలు ఉండేవని, ప్రతి పథకాన్ని మహిళా ఖాతాల్లో వేసి కుటుంబ అభివృద్ధికి బాటలు వేశారని గుర్తు చేశారు. చంద్రబాబు అధికార దాహంతో మహిళలకు లేనిపోని హామీలన్నీ ఇచ్చి ఒక్కటి కూడా అమలుచేయకుండా మోసగించారని దుయ్యబట్టారు. వైఎస్సార్ సీపీ హయాంలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, చైర్మన్ పదవులన్నీ 70 శాతం మహిళలకే ఇచ్చారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంపై తొమ్మిది నెలల్లోనే మహిళలంతా మండిపడుతున్నారని చెప్పారు. జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయసాయిరాజ్ మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి మహిళలకు గుర్తించి పదవులిచ్చిన క్రమంలోనే తనకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి దక్కిందన్నారు. పార్టీలకు అతీతంగా పథకాలు వర్తింపజేసిన ఘనత జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ మహిళా నేతలు అంబటి నిర్మలా శ్రీనివాస్, మూకళ్ల సుగుణ, కోరాడ ఆశాలత, రాజాపు హైమావతి, చింతు అన్నపూర్ణ, జి.వెంకటరమణి, చల్ల సుగుణా, టి.కామేశ్వరి, గుంట జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
వృద్ధురాలిపై కన్నకొడుకు దాష్టీకం!
శ్రీకాకుళం క్రైమ్ : మహిళా దినోత్సవం నాడు ఆ మాతృమూర్తి రోధన వర్ణనాతీతం. కన్నకొడుకు చెక్కతో కొట్టి రోడ్డుపైకి అమాంతం నెట్టేసి 13 రోజులవుతున్నా పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో నేరుగా ఎస్పీ మహేశ్వరరెడ్డి వద్ద మొరపెట్టుకునేందుకు కుమార్తెతో సహా జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చింది. ఉదయం 11:30 గంటలకు వచ్చిన ఆమె సాయంత్రం 3:10 గంటల వరకు ఎదురు చూసి వెనుదిరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. లావేరుకు చెందిన 60 ఏళ్ల వృద్ధురాలైన సౌభాగ్య భర్త అప్పారావు అంగవైకల్యంతో 11 ఏళ్ల క్రితమే మరణించడంతో లావేరు హైస్కూల్ ఎదురుగా పెంకుటిల్లులో నివసిస్తోంది. ఒక కుమారుడు విశాఖలో ఉండగా.. మరో కుమారుడు లావేరు హైస్కూల్ సమీపంలోనే టిఫిన్ కొట్టు నడుపుతున్నాడు. కుమార్తెకు మురపాకకు చెందిన వ్యక్తితో వివాహమైనా ఆమె భర్త కొన్నాళ్లకే చనిపోవడంతో పిల్లలతో కలిసి తల్లి వద్దకే వచ్చేసింది. కాగా, కుమారులు తల్లిని పట్టించుకోకపోవడంతో సౌభాగ్య పాన్షాప్ పెట్టుకుని జీవనం సాగిస్తోంది. ఇటీవల కాలువ పనుల్లో భాగంగా పాన్షాపు తీసేశారు. దీంతో భర్త పేరిట ఉన్న స్థలంలో దుకాణం పెట్టుకునేందుకు ఇటీవల సౌభాగ్య ప్రయత్నించగా చిన్న కుమారుడు లక్ష్మణరావు అడ్డుకున్నాడు. చెక్కతో గాయపరచడంతో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా రక్తపు గాయాలు కాలేదని, కేసు కట్టేది లేదని చెప్పారని, అందుకే ఎస్పీకి మొరపెట్టేందుకు వచ్చినట్లు వృద్ధురాలు వాపోయింది. సిబ్బంది సోమవారం రావాలని చెప్పడంతో వెనుదిరిగింది. -
ఉత్సాహంగా 3కే రన్
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా కేంద్రంలో శనివారం జీఎన్వీ జ్యూయలర్స్ ఆధ్వర్యంలో 3కే రన్, వాక్ ఉత్సాహభరితంగా సాగింది. జీఎన్వీ జ్యూలయర్స్ ఎండీ కిరణ్, పృథ్వీ అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 80 అడుగుల రోడ్డులో మహిళలకు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతిశంకర్ జెండా ఊపి ప్రారంభించారు. శ్రీకాకుళం మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పైడిశెట్టి జయంతి క్రీడాజ్యోతిని వెలిగించారు. 30 ఏళ్లలోపు, 30 నుంచి40 ఏళ్ల మధ్య విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎన్వీ ఎండీలు బోయిన నిర్మల, సంయుక్త, ఊన్న సుజాత తదితరులు మాట్లాడుతూ మహిళలకు ఓర్పు, సహనం, అణుకువ ఆభరణాలతో సమానమన్నారు. అనంతరం 3కే వాక్లో విజేతలకు బహుమతులు అందజేశారు. అంతకుముందు ప్రదర్శించిన నృత్యప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వందన షాపింగ్ మాల్, క్వాంటమ్ ఈ బైక్స్, హెచ్కే ఏజెన్సీ, గ్రాండ్ హోటల్ కార్యక్రమానికి సహకరించినందుకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్లు పైడి సింధూర, కింజరాపు షర్మిళ, పీఈటీలు సాంబమూర్తి, వెంకటరమణ, జెసీఐ మెయిన్ బెందాళం వరలక్ష్మి, తమ్మినేని ఉషారాణి, యోగా టీచర్ తంగి స్వాతి తదితరులు పాల్గొన్నారు. విజేతలు వీరే.. అండర్–30 విభాగంలో పైడి వసంత, ఎస్.శార్వాణి, మేరీ గ్రేస్ తొలి మూడు స్థానాల్లో నిలవగా సీహెచ్ భార్గవి, జి.దివ్య, హెచ్.కల్పన, వి.సంధ్యారాణి ఆ తర్వాత స్థానాల్లో నిలిచారు. 30 నుంచి 40 ఏళ్ల విభాగంలో వి.నాగమణి, అరుణకుమారి, బి.కృష్ణకుమారి తొలి మూడు స్థానాలు సాధించగా..పి.లక్ష్మీప్రసన్న, ఎం.రోజా, జి.సూర్యకుమారి, కె.అశ్విని ఆ తర్వాత స్థానాల్లో నిలిచి బహుమతులు అందుకున్నారు. -
హెల్త్సిటీలో రక్త రుగ్మతల కేంద్రం ప్రారంభం
ఆరిలోవ: హెల్త్సిటీ యునిక్ ఆస్పత్రిలో మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో రక్త రుగ్మతుల కేంద్రం అందుబాటులోకి వచ్చింది. ఈ కేంద్రాన్ని హెమటాలజీ పితామహుడు డాక్టర్ మామ్మెన్ చాందీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో సికిల్ సెల్, తలసేమియాతో బాధపడుతున్న వారు ఎక్కువగా ఉన్నారన్నారు. అలాంటి వారికి ఈ కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. పేదలకు వైద్యం అందుబాటులో ఉండే విధంగా ఈ కేంద్రాన్ని నిర్వహించాల ని నిర్వాహకులకు సూచించారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ కేంద్రం విశాఖలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఊన్న మురళీకృష్ణను అభినందించారు. నిమ్స్ మెడికల్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ సదాశివుడు మాట్లాడుతూ విశాఖలో రక్త రుగ్మతుల కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల ఆరోగ్య సంరక్షణలో కీలక ముందుడుగు పడిందన్నారు.దీర్ఘకాలిక వ్యాధులు ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయన్నారు. అలాంటి సమస్యల నివారణకు ఈ కేంద్రం అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ ఏపీతోపాటు ఒడిశా, చత్తీస్గఢ్ లలో ఎక్కడా రక్త వ్యాధులను సమగ్రంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా హెమటాలజీ కేంద్రం లేదన్నారు. ఈ లోటును భర్తీ చేయడానికి ఇక్కడ సమగ్ర రక్త రుగ్మతల కేంద్రం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పలువురు ఆంకాలజీ విభాగం వైద్యులు పాల్గొన్నారు. -
శిక్ష ఎవరికి?
శ్రీకాకుళంఆదివారం శ్రీ 9 శ్రీ మార్చి శ్రీ 2025తప్పు ఎవరిది.. ● బాయ్స్ అదనపు వసూళ్లు చేశారని, గోడౌన్లో స్టాక్ తేడాలున్నాయని ఇండేన్ గ్యాస్ గోడౌన్ సీజ్ ● పొందూరు, ఎచ్చెర్ల, జి.సిగడాం, లావేరు, సంతకవిటి వినియోగదారులకు ఇక్కట్లు ● రణస్థలం ఏజెన్సీకి ఇక్కడి సరఫరా బాధ్యతలు అప్పగింత ● గ్యాస్ రాక ఇబ్బందులు పడుతున్న వినియోగదారులు ఆ ప్రజాప్రతినిధికి లైన్ క్లియర్.. రాజకీయ కక్షసాధింపుల్లో భాగంగా అక్కడి గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులను దెబ్బ కొట్టాలని గత కొన్నాళ్లుగా అదను కోసం ఓ ప్రజాప్రతినిధి ఎదురు చూస్తున్నారు. కరెక్ట్గా ఇదే సమయంలో ఏకంగా కలెక్టర్ పర్యటనలో అదనపు వసూళ్లు చేస్తున్నారని కొందరు చెప్పడం, వారిని డీఎస్ఓ, తహసీల్దార్ తదితర అధికారుల విచారణలో స్టేట్మెంట్ ఇవ్వడంతో కక్ష సాధింపు కోసం వేచి చూస్తున్న సదరు ప్రజాప్రతినిధికి లైన్ క్లియర్ అయింది. ఎలాగోలా ఆ ఏజెన్సీని తన చేతులోకి తెచ్చుకోవాలన్న కుట్ర తో పావులు కదుపుతున్న ప్రజాప్రతినిధికి ఇదొక మంచి అవకాశంగా దొరికింది. -
12న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో యువత పోరు
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 12న ‘యువత పోరు’ కార్యక్రమం నిర్వహించనున్నామని, విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ పడక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, వారికి జరుగుతున్న అన్యాయాన్ని వివరించాలన్నారు. ఈ నెల 12న పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉన్నందున అన్ని నియోజకవర్గాల్లో పార్టీ జెండా ఎగురవేయాలన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పిరియా విజయసాయిరాజ్, కళింగకుల రాష్ట్ర అధ్యక్షుడు దుంపల లక్ష్మణరావు, ఉత్తరాంధ్ర యువజన విభాగం అధ్యక్షులు ఎంవీ స్వరూప్, టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్, ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు ముంజేటి కృష్ణ, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఉలాల భారతి, అంబటి శ్రీనివాసరావు, గొండు రఘు, మూకళ్ళ తాతబాబు, పీస గోపి, చల్ల రవికుమార్ లతో పాటు అధిక సంఖ్యలో పార్టీముఖ్య నేతలు పాల్గొన్నారు. -
గంజాయి రవాణా గుట్టురట్టు
పాతపట్నం: గంజాయి తరలిస్తున్న తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు జిల్లా తిరుమల్లైయల్ గ్రామానికి చెందిన ధనుష్ ఏకాంబరంను శనివారం అరె స్టు చేశామని సీఐ వి.రామారావు తెలిపారు. పాతపట్నం అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టు వైపు పర్లాకిమిడి (ఒడిశా) నుంచి నడుకుంటూ వస్తున్న ధనుష్ వద్ద 4.596 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఒడిశాలోని బల్లిగుడా వెళ్లి రాజు అలియాస్ దొరవద్ద రూ.10 వేలుకు గంజాయి కొ నుగొలు చేసి వస్తున్నట్లు గుర్తించామన్నారు. సమా వేశంలో ఎస్ఐ బి.లావణ్య, సిబ్బంది పాల్గొన్నారు. గంజాయి విక్రేతపై కేసు నమోదు ఆమదాలవలస: పట్టణ రైల్వేస్టేషన్ జంక్షన్లో కిళ్లీ కొట్టులో గంజాయి విక్రయిస్తున్న పొట్నూరు కృష్ణారావుపై శనివారం కేసు నమోదు చేసినట్లు ఆమదాలవలస ఎస్ఐ ఎస్.బాలరాజు తెలిపారు. 70 గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకుని, ఆమదాలవలస జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు తరలించినట్లు చెప్పారు. -
ఉపాధి కోర్సుల్లో మహిళలకు శిక్షణ
శ్రీకాకుళం రూరల్: ఎచ్చెర్లలోని ఎన్టీఆర్ మహిళా ప్రాంగణంలో మహిళలకు ఉపాధి కల్పించే దిశగా నూతన కోర్సులను నిర్వహించనున్నట్లు బొల్లినేని మెడిస్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బేబికేర్ టేకర్, వేర్హౌస్ అసోసియేట్, ఫార్మా స్టోర్ అసోసియేట్, జనరల్ డ్యూటీ అసిస్టెంట్, పేషెంట్ రిలేషన్స్ కోర్సులను ఈ నెల 17 నుంచి ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ఐదు నుంచి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ చదివిన 18 నుంచి 45 ఏళ్ల మహిళలు అర్హులని తెలిపారు. 45 రోజుల పాటు శిక్షణ ఉంటుందని, పూర్తి వివరాలకు 7680945357, 7995013422 నంబర్లను సంప్రందించాలని కోరారు. వేతనాలు పెంచాలని వినతి ఎచ్చెర్ల క్యాంపస్: ట్రిపుల్ ఐటీలో 2018 నుంచి పని చేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీకి వేతనాలు పెంచాలని కోరుతూ సిబ్బంది శనివారం ఎస్ఎంపురం ఆర్జీయూకేటీ క్యాంపస్లో వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎం.విజయ్కుమార్కు వినతిపత్రం అందజేశారు. రైలు ఢీకొని వృద్ధుడి మృతి టెక్కలి రూరల్ : ధర్మనీలాపురం గ్రామానికి చెందిన గురుబెల్లి కృష్ణారావు(65) శనివారం సాయంత్రం రైలు ఢీకొని మృతి చెందాడు. కృష్ణారావు రైలు పట్టాలు దాటుతుండగా గుర్తు తెలియని రైలు ఢీకొనడంతో ఈ ఘటన సంభవించింది. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి మృతదేహం మాయమైనట్లు తెలుస్తోంది. డ్రోన్ టెక్నాలజీపై అవగాహన ఎచ్చెర్ల క్యాంపస్: రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ట్రిపుల్ ఐటీ) ఎస్ఎంపురం క్యాంపస్లో నిర్వహిస్తున్న జాతీయ టెక్నో మేనేజ్మెంట్ ఫెస్ట్ (టెక్నివర్స్ 2025) శనివారం కూడా కొనసాగింది. విద్యార్థులు డ్రోన్ టెక్నాలజీ, ప్రాజెక్టు ఎక్స్పో వంటివి నిర్వ హించారు. ఐఐటీ గువాహటి నుంచి రీసోర్సు పర్సన్గా హాజరైన ప్రొఫెసర్ విజయసారథి మిషన్ లెర్నింగ్ అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కన్వీనర్ గేదెల రవి, సహాయ కన్వీనర్ తేజ్కిరణ్ తదితరులు పాల్గొన్నారు. డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత ఆన్లైన్ శిక్షణ శ్రీకాకుళం పాతబస్టాండ్ : శ్రీకాకుళం బీసీ స్టడీ సర్కిల్ ద్వారా డీఎస్సీ అభ్యర్థులకు ఆన్లైన్ ద్వారా ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఏపీ బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు ఇ.అనురాధ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. టెట్ అర్హత సాధించి జిల్లాకు చెందిన బీసీ, ఈబీసీ కేటగిరీల అభ్యర్థులు అర్హులని, వివరాలకు శ్రీకాకుళం 80 అడుగుల రోడ్డులోని బీసీ స్టడీ సర్కిల్ వద్ద గా నీ, 7382975679, 9295653489 నంబర్లను గానీ సంప్రదించవచ్చని పేర్కొన్నారు. రాష్ట్ర ఇంటెలెక్చువల్ ఫోరం విభాగం నియామకం శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఇంటెలెక్చువల్ ఫోరం విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పిల్లల రామకృష్ణ, కార్యదర్శిగా సీపాన వెంకటరావు, సంయుక్త కార్యదర్శిగా ఎస్.భీమాచార్యులును నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర కమిటీ లో జిల్లా నుంచి వీరికి అవకాశం కల్పించారు. -
కిడ్నీ మందులకు కోత
● బాధితులపై తప్పని ఆర్థిక భారం ● బయటే కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి ● నిర్లక్ష్యం వహిస్తున్న కూటమి సర్కారు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కిడ్నీ బాధితులకు డయాలసిస్ ఎంత ముఖ్యమో.. మందులూ అంతే కీలకం. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కిడ్నీ రోగులకు ప్రభుత్వం అవసరమైన కీలక మందులను ఉచితంగా అందిస్తూ వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చాక బడ్జెట్ కొరతతో ప్రభుత్వాసుపత్రులకు పూర్తిగా మందులు సరఫరా చేయడం లేదు. కీలకమైన మందులకు కోత పెడుతోంది. అసలే కిడ్నీ రోగంతో చిదికిపోయిన కుటుంబాలకు రోగులను ఆసుపత్రులకు తీసుకెళ్లడం, రోజుల తరబడి డయాలసిస్ కోసం వేచి ఉండటం, దానికయ్యే ఖర్చులు భారంగా మారుతుంటే దానికి తోడు ప్రభుత్వం మందులు సరఫరా చేయకుండా చేతులేత్తేయడంతో వారి ఆర్థిక బాధలు రెట్టింపవుతున్నాయి. మందులు కొనుగోలు చేసుకోలేని పరిస్థితిలో రోగులు చనిపోతున్న సంఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సోడియం బై కార్పొనెట్ వంటి కీలక మందులు ఇవ్వడం లేదు. పత్రికల్లో వస్తే అప్పటికప్పుడు ఒక్కో స్ట్రిప్ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. వారానికి ఒకసారి రక్తం ఇంప్రూమెంట్ కోసం ఇంజక్షన్ వేస్తుంటారు. ఇవి కూడా అప్పుడప్పుడు ఇవ్వడం లేదు. స్టాక్ ఉంటే ఇస్తున్నారు. లేదంటే కొనుక్కోమంటున్నారు. వేలాది రూపాయల విలువైన ఐరన్ ఇంజక్షన్ పరిస్థితి కూడా అంతే. బయట కొనుగోలు చేసుకోమని చెబుతున్నారు. టెస్టుల కోసం భారీగా ఖర్చు.. కవిటి, సోంపేట, పలాస డయాలసిస్ సెంటర్లలో రోగులకు ఆర్థిక భారం తప్పడం లేదు. డయాలసిస్ చేసుకోవాలంటే చేతికి, మెడకు, గుండెకు, తొడలకు వేయాల్సిన ఎక్విప్మెంట్ను రూ.4 వేల నుంచి రూ.30 వేల వరకు బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది. బ్లడ్ ఇన్ఫెక్షన్ కల్చర్ టెస్ట్ చేయించుకోవాలి. ప్రభుత్వాసుపత్రుల్లో చేయకపోవడంతో బయ ట రూ.1000 నుంచి రూ.2వేల వరకు వెచ్చించాల్సి న పరిస్థితి. యూరిన్ ఇన్ఫెక్షన్ కల్చర్ టెస్ట్ కోసం శ్రీకాకుళం, విశాఖపట్నం పంపించాల్సి వస్తోంది. ఇందుకు రూ.2వేలు వరకు ఖర్చవుతోంది. జీవనాధారంపై దెబ్బ.. కుటుంబంలో ఒకరికి డయాలసిస్ చేయించుకోవాల్సివస్తే ఆ కుటుంబంలో మరొకరికి జీవనాధారం కరువవుతోంది. రెండురోజులకు ఒకసారి రోగితో పాటు ఆస్పత్రికి వచ్చి నిరీక్షించాల్సిన పరిస్థితి. ఇచ్ఛాపురం నుంచి సోంపేటకు ఆటోలో వచ్చి డయాలసిస్ చేయించుకుంటున్న వారు టోకున రూ.1200 చెల్లించాల్సిన పరిస్థితి. గతంలో 108 ద్వారా రోగులను డయాలసిస్ సెంటర్కు తరలించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. రోగులు సొంత ఖర్చులతో వెళ్లాల్సి వస్తోంది. మందులు బయటే.. ఏడాదిన్నర నుంచి కవిటి డయాలసిస్ కేంద్రంలో డయాలసిస్ చేయించుకుంటున్నాను. గతంలో డయాలసిస్ కేంద్రాల్లో పూర్తి స్థా యిలో మందులు ఇచ్చేవారు. ప్రస్తుతం చాలా వరకు బయటనే కొనుక్కోవాల్సి వస్తోంది. నెఫ్రాలజిస్ట్ డాక్టర్ లేకపోవడంతో ఇక్కడ డయాలసిస్ రోగులంతా నెలకు ఒకసారి విశాఖపట్నం వెళ్లి అక్కడ చూపించాల్సి వస్తోంది. – బినాయిక్ బిసాయి, కుసుంపురం, కవిటి మండలంప్రతిసారీ రూ.4వేలు ఖర్చు.. పదేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాను. కవిటి ప్రభుత్వ డయాలసిస్ సెంటర్కు వెళితే బెడ్లు ఖాళీ లేవన్నారు. దీంతో పలాసలో ఓ ప్రైవేట్ సెంటర్లో మూడుసార్లు వెళ్లా. ఒక్కసారికే రూ.4000 ఖర్చయింది. దీంతో శ్రీకాకుళంలోని జెమ్స్లో ప్రస్తుతం డయాలసిస్ ఆరోగ్యశ్రీలో చేయించుకుంటున్నాను. ఆస్పత్రి బస్కు కవిటి నుంచి తీసుకెళ్లి తీసుకొస్తున్నారు. బస్సు తప్పిపోతే ట్రైన్కు వెళ్లొస్తున్నాను. కవిటి ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్ చేస్తేనే రూ.10,000 పెన్షన్ వస్తుందంటున్నారు. – కె.తిరుపతిరావు, మధ్యపుట్టుగ, కవిటి మండలం●ఇంజక్షన్లు సరఫరా చేయాలి కొండి పుట్టుగ గ్రామానికి చెందిన మా అమ్మ శాంతమ్మ సోంపేట డయాలసిస్ కేంద్రంలో డయాలసిస్ చేయించుకుంటుంది. ప్రస్తుతం ఐరన్ ఇంజక్షన్లు ప్రభుత్వం సరఫరా చేయడం లేదు. అవి కొనలేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రక్తశుద్ధి ఇంజక్షన్లు ఒక్కొక్క సారి కొరత వస్తోంది. – నర్తు దుర్యోధన, కొండిపుట్టుగ, కవిటి మండలంలక్షన్నర ఖర్చు.. మాది తీరప్రాంతం సీహెచ్ కపాసుకుద్ధి. కష్టపడే కుటుంబంలోనే పుట్టాను. ఎందుకో ఈ అంతుచిక్కని వ్యాధి సోకింది. రెండునెలలుగా డయాలసిస్ చేస్తున్నారు.ఆరోగ్యశ్రీలో భాగంగా శ్రీకాకుళం జెమ్స్ ఆస్పత్రిలో డయాలిసిస్లు అయ్యాయి. వైద్యం కోసం ఇప్పటి వరకు రూ.1.5 లక్షలు అప్పు చేయాల్సి వచ్చింది. కవిటిలో డయాలసిస్ అయితే మా కష్టాలు తీరుతాయి. – ఆర్.ముకుందరావు, సీహెచ్.కపాసుకుద్ధి, కవిటి మండలం -
No Headline
యార్లగడ్డ గీతాశ్రీకాంత్.. ఓవైపు పారిశ్రామిక వేత్తగా ఎదుగుతూ, మరోవైపు సామాజిక సేవల్లో ఒదుగుతున్నారు. పాతికేళ్లుగా ఆమె ఎన్నో రూపాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామీణ మహిలు ఎదిగేందుకు కృషి చేసి జాతీయ స్థాయిలో ఉత్తమ మహిళా పారిశ్రామిక వేత్తగా గుర్తింపు పొందారు. ట్రాక్టర్ల బిజినెస్ చేస్తూ తానూ ట్రాక్టర్ నడపడం నేర్చుకున్నారు. గిరిజన మహిళల జీవనంపై పరిశోధన చేసి డాక్టరేట్ సాధించారు. 100 యువ టూరిజం క్లబ్లను టూరిజం సహకారంతో ఏర్పాటు చేశారు. జల యోగా ప్రదర్శన ద్వారా 30 రకాల ఆసనాలు నీటిలో వేసి నేషనల్ అవార్డు పొందారు. -
బతుకు నిత్య నృత్యం..
స్వాతీ సోమనాథ్.. ఈ పేరు చెబితే చాలు.. మరీ ఎక్కువ పరిచయం అక్కర్లేదు. దూసి గ్రామంలో మొదలైన ఆమె ప్రస్థానం నేడు ఖండాంతరాలు దాటింది. కూచిపూడి నృత్య కళతో అంచెలంచెలుగా ఎదిగారు. ఆమె 1980లో అరంగ్రేటం చేశారు. దాదాపుగా వెయ్యి సోలో ప్రదర్శనలు ఇచ్చారు. ఎంఏ ఇంగ్లిష్, ఎంఫిల్ పూర్తి చేశారు. సెంట్రల్స్ యూనివర్సిటీలో ఆర్ట్స్లో మాస్టర్ పెర్ఫామెన్స్ చేశారు. దాదాపు 40 దేశాలు పర్యటించి ప్రదర్శనలు చేశారు. 13 బ్యాలేలు రూపొందించారు. శ్రీకాకుళంలో కూచిపూడి సంప్రదాయ గురుకులం నిర్వహిస్తూ కళకు కాపలా కాస్తున్నారు. ఇంతవరకు ఎవరూ చేయని కిన్నెరసాని పాటలకు 45 నిమిషాల పాటు బాలేను రూపొందించారు. త్వరలో అమెరికాలో జరిగే తానా సభలలో సంప్రదాయం చిన్నారులచే ప్రదర్శన కోసం కృషి చేస్తున్నారు. – శ్రీకాకుళం కల్చరల్ -
No Headline
యార్లగడ్డ గీతాశ్రీకాంత్.. ఓవైపు పారిశ్రామిక వేత్తగా ఎదుగుతూ, మరోవైపు సామాజిక సేవల్లో ఒదుగుతున్నారు. పాతికేళ్లుగా ఆమె ఎన్నో రూపాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామీణ మహిలు ఎదిగేందుకు కృషి చేసి జాతీయ స్థాయిలో ఉత్తమ మహిళా పారిశ్రామిక వేత్తగా గుర్తింపు పొందారు. ట్రాక్టర్ల బిజినెస్ చేస్తూ తానూ ట్రాక్టర్ నడపడం నేర్చుకున్నారు. గిరిజన మహిళల జీవనంపై పరిశోధన చేసి డాక్టరేట్ సాధించారు. 100 యువ టూరిజం క్లబ్లను టూరిజం సహకారంతో ఏర్పాటు చేశారు. జల యోగా ప్రదర్శన ద్వారా 30 రకాల ఆసనాలు నీటిలో వేసి నేషనల్ అవార్డు పొందారు. -
రంగమేదైనా.. కీర్తీ.. ఖ్యాతీ..
ఎచ్చెర్ల మండల పరిధిలోని కేశవరావుపేట గ్రామానికి చెందిన గురుగుబెల్లి దుర్గాప్రశాంతి సాఫ్ట్బాల్లో జాతీయస్థాయిలో మెరుస్తోంది. ఈమె తల్లిదండ్రులు లక్ష్మణరావు, కృష్ణవేణి వ్యవసాయం చేస్తుంటారు. అయినా ఏ మాత్రం బెరుకు లేకుండా బిడ్డను క్రీడల్లో ప్రోత్సహించారు. ఆమె 7వ తరగతిలో ఉన్నప్పుడు సాఫ్ట్బాల్లో రంగప్రవేశం చేసి ఇప్పుడు జాతీయ స్థాయికి ఎదిగింది. చక్కటి క్యాచర్గా ఆమెకు గుర్తింపు ఉంది. మొత్తం 9 రాష్ట్రస్థాయి, 5 జాతీయస్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించింది. వీటిల్లో మూడు పతకాలు సాధించింది. ప్రస్తుతం విజయవాడలోని ఎన్ఆర్ఐ అకాడమీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. స్పోర్ట్స్ కోటా ద్వారా ప్రభుత్వం ఉద్యోగం సాధించడంతోపాటు శ్రీకాకుళం జిల్లాలో సాఫ్ట్బాల్ క్రీడ మరింత పురోగాభివృద్ధికి అవసరమైన సాయం చేస్తానని ‘సాక్షి’కి చెబుతోంది. –శ్రీకాకుళం న్యూకాలనీబీసీ బాలికల వసతి గృహ మేట్రిన్గా పైడి పద్మావతి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. 19 ఏళ్ల వయసులో సర్వీసులో చేరిన ఆమె వసతి గృహ మేట్రిన్గా 23 ఏళ్ల సర్వీసు పూర్తి చేశారు. ఎక్కడకు వెళ్లినా అక్కడి పిల్లలను కన్నబిడ్డల్లా చూసుకోవడం ఆమెకు ఇష్టం. పండగలు, పిల్లల పుట్టిన రోజులు ఇంట్లో కంటే హాస్టల్లోనే బాగా జరుగుతాయని పిల్లలే చెబుతుంటారు. పిల్లలకు ఒంట్లో బాగోలేకపోయినా ఆమె సొంత ఖర్చుతో వైద్యం చేయిస్తారు. పిల్లలు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడకు వస్తారని, ఇక్కడ తల్లీతండ్రి తానే అయి చూసుకుంటానని చెబుతారు. సమాజంలో మహిళలకు తగిన గౌరవం, ప్రాధాన్యత లభించాలనేదే తన ఆలోచన అని అన్నారు – నరసన్నపేట -
బతుకు నిత్య నృత్యం..
స్వాతీ సోమనాథ్.. ఈ పేరు చెబితే చాలు.. మరీ ఎక్కువ పరిచయం అక్కర్లేదు. దూసి గ్రామంలో మొదలైన ఆమె ప్రస్థానం నేడు ఖండాంతరాలు దాటింది. కూచిపూడి నృత్య కళతో అంచెలంచెలుగా ఎదిగారు. ఆమె 1980లో అరంగ్రేటం చేశారు. దాదాపుగా వెయ్యి సోలో ప్రదర్శనలు ఇచ్చారు. ఎంఏ ఇంగ్లిష్, ఎంఫిల్ పూర్తి చేశారు. సెంట్రల్స్ యూనివర్సిటీలో ఆర్ట్స్లో మాస్టర్ పెర్ఫామెన్స్ చేశారు. దాదాపు 40 దేశాలు పర్యటించి ప్రదర్శనలు చేశారు. 13 బ్యాలేలు రూపొందించారు. శ్రీకాకుళంలో కూచిపూడి సంప్రదాయ గురుకులం నిర్వహిస్తూ కళకు కాపలా కాస్తున్నారు. ఇంతవరకు ఎవరూ చేయని కిన్నెరసాని పాటలకు 45 నిమిషాల పాటు బాలేను రూపొందించారు. త్వరలో అమెరికాలో జరిగే తానా సభలలో సంప్రదాయం చిన్నారులచే ప్రదర్శన కోసం కృషి చేస్తున్నారు. – శ్రీకాకుళం కల్చరల్ -
No Headline
టాక్షోలో శివానీ కళాశాల విద్యార్థినుల ఉత్సాహం చుట్టూ మృగాళ్లు, ఒక్క తప్పటడుగు పడినా అమాంతం లాగేసే క్రూర వేటగాళ్లు.. వీధి చివర, బస్టాండుల్లో, కూడళ్లలో వేధించే ఆకతాయిలు.. ఇవి చాలవన్నట్టు ఆన్లైన్లోనూ అనుక్షణం పీడించుకుని తినే సైబరాసురులు.. ఇందరి మధ్య ఓ అబల స్వేచ్ఛగా బతకడం నిత్య యుద్ధమే. మహిళా దినోత్సవం సందర్భంగా చిలకపాలెంలోని శ్రీ శివానీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ‘సాక్షి’ మహిళల భద్రత, సోషల్ మీడియా ప్రభావంపై చర్చా వేదిక నిర్వహించింది. ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రాజ్కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అమ్మాయిలు, మహిళలు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం / ఎచ్చెర్ల క్యాంపస్ / టెక్కలి / పాత బస్టాండ్ / కాశీబుగ్గ/ శ్రీకాకుళం క్రైంనియంత్రించుకోవాలి.. వ్యక్తిగత జీవితాన్ని సోషల్ మీడియాలో పంచుకోకూడదు. చిన్న తప్పు చేసినా అదే మనల్ని వేధిస్తుంది. మన లిమిట్స్ లో మనం ఉండాలి. – పొన్నాడ దీపిక, విద్యార్థిని వస్త్రధారణా కీలకమే.. మహిళల వస్త్రధారణపై చాలా డిబేట్లు జరుగుతున్నాయి. మగవారిని ఆకర్షించే వస్త్రధారణ ఎప్పుడూ మంచిది కాదు. – బాలక రమ్యశ్రీ, విద్యార్థిని విలువలు ముఖ్యం చెడు స్నేహాలకు దూరంగా ఉంటే మేలు. ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు. విలువలు పాటించాలి. – ఆర్.స్వాతి, విద్యార్థిని ● -
No Headline
ముదితల్ నేర్వగ రాని విద్య గలదె.. అన్నారు చిలకమర్తి వారు. ఇప్పుడు ముదితల్ నడపగ లేని బండి గలదె.. అనాలేమో. ఔను మరి బైక్ మొదలుపెట్టి ట్రైన్ వరకు అన్నింటా అతివలు స్పీడు చూపిస్తున్నారు. అందుకు వీరే సాక్షి. స్వీయనియంత్రణ అవసరం మహిళలపై వేధింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. కానీ స్వీయ నియంత్రణ ఉంటే సమస్యలను ఎదుర్కోగలం. ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా పోరాడాలి. – ఎన్.స్వాతి, అసిస్టెంట్ ప్రొఫెసర్ మానసిక బలం ప్రధానం మహిళలు మానసికంగా, శారీకంగా బలంగా ఉండాలి. బలహీనతలను ఎదుటివారు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. మనల్ని మనమే రక్షించుకోవాలి. – ఎం.సత్యవాణి, అసిస్టెంట్ ప్రొఫెసర్ అవసరం మేరకే వాడాలి.. సోషల్ మీడియా అవసరం మేరకే వాడాలి. ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకోకపోవడమే ఉత్తమం. – జి.ఈక్షిత, అసిస్టెంట్ ప్రొఫెసర్బైక్ నడిపే అమ్మాయి కనిపిస్తేనే సమాజం కళ్లు ఇంతలు చేసుకుని చూస్తుంది. ఇప్పుడిప్పుడే ఆటోలు, బస్సులు నడిపే అతివలను చూడడం నేర్చుకుంటోంది. కానీ మరడ వాణి రెడ్డి రూటే సెపరేటు. బైక్లు, బస్సులు దాటి ఏకంగా ట్రైన్ నడిపే ఉద్యోగం సాధించి ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం పలాస రైల్వేస్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆమె చత్తీస్గఢ్లోని దుర్గ్లో ఎలక్ట్రికల్ విభాగంలో ఇంజినీరింగ్ పూర్తిచేశారు. తల్లి ఎల్.రుక్మిణిరెడ్డి ప్రోత్సాహంతో ఈ రంగంలోకి అడుగు పెట్టారు. పలాస రైల్వేస్టేషన్ మీదుగా నడిచే వందేభారత్ రైలును నడుపుతున్నారు. రోజుకి 220 కిటోమీటర్లు దూరం ప్రయాణిస్తారు. తన కుటుంబం పరిసర ప్రాంతాల ప్రజలు తనను వింతగా చూస్తుంటారని, తాను కూడా ఇదే కోరుకున్నానని గర్వంగా ఆమె చెబుతుంటారు. ●● అపరిచిత వ్యక్తులతో ఆన్లైన్ చాటింగ్, వీడియో కాల్స్ చేయకూడదు. ● సైబర్ మోసానికి గురయ్యేవారు గోల్డెన్ అవర్లో 1930 నెంబర్కు డయల్ చేయాలి. లేదంటే డబ్లూడబ్ల్యూడబ్ల్యూ.సైబర్క్రైమ్.జీఓవీ.ఇన్ పోర్టల్లో ఆన్లైన్ ఫిర్యాదు ఇవ్వాలి. ● జిల్లా ప్రజలకు హెచ్టీటీపీఎస్: //శ్రీకాకుళంపోలీస్.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్ అందుబాటులో ఉంది.సాహ‘షి’ దేశ రక్షణ బాధ్యత నాది కూడా అంటోంది సాహ‘షి’. అనాదిగా మగాళ్ల రాజ్యంగా పేరొందిన రక్షణ శాఖలో ఇప్పుడు ఆడ సింహాలు కూడా గర్జిస్తున్నాయి. లో8శ్రీకాకుళంశనివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2025మెరుపులా.. ఈమె పేరు బి.మేఘన. ఇంజినీరింగ్ విద్యార్థిని. స్వస్థలం హైదరాబాద్. వాహనాన్ని మెరుపులా పరిగెత్తించడం ఈమెకు సరదా. విద్యుత్ శాఖలో లైన్మెన్గా పనిచేస్తున్న తండ్రి ఈమెకు ఆదర్శం. ప్రస్తుతం టెక్కలి ఆదిత్య కళాశాలలో జరుగుతున్న గోకార్టింగ్ రేసులో మెరుపులా దూసుకెళ్తోంది. తనకంటూ ప్రత్యేకత సాధించాలనే ఇలా రైడర్గా మారానని చెబుతోంది. ఈమె రూటే సెపరేటు అలెర్ట్ -
ఆమేయం.. అజేయం..
మహిళలే రథ సారధులు నేటి సమాజంలో మహిళలే కుటుంబాలకు రథ సారధులుగా ఉన్నారు. నా విద్యాభ్యాసం అంతా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలోనే పూర్తయ్యింది. అనేక సమస్యలు ఎదుర్కొని ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. చిన్న సమస్యకు కుంగిపోకూడదు, విజయాలు వచ్చినప్పుడు పొంగిపోకూడదు దేనినైనా సవాలుగా తీసుకుని ముందుకు సాగాలి. శారీరక ధైర్యం అనేది శారీరక నొప్పిని ఎదుర్కొంటుంది, అయితే నైతిక ధైర్యం ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేలా తీర్చిదిద్దుతుంది. – బి.కరుణశ్రీ, ఈఈ, పొల్యుషన్ కంట్రోల్బోర్డు లక్ష్యం నిర్దేశించుకోండి ప్రతి బాలిక చదువుకునే సమయంలోనే లక్ష్యం నిర్దేశించుకోవాలి. కష్టపడి ఆ లక్ష్యాన్ని సాధించాలి. మనం పట్టుదలగా ఉంటే కుటుంబ సభ్యులు కూడా సహకరిస్తారు. – కె.సాయి ప్రత్యూష, ఆర్డీఓ, శ్రీకాకుళం సమానత్వం కీలకం మహిళలు తమ కర్తవ్యాన్ని గుర్తు చేసుకోవాల్సిన రోజు ఇది. సాధికారత, సమానత్వం రెండూ సాధించాలి. – ఇ.అనురాధ, డీబీసీ, శ్రీకాకుళం అన్ని రంగాల్లో ఎదగాలి.. పురుషులతో సమానంగా అన్నింటా ఎదగాలి. అప్పుడే నిజమైన మహిళా దినోత్సవం సాధ్యమవుతుంది. మహిళల సంరక్షణ ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలి. – కె.కవిత, సహాయ సంచాలకులు, వికలాంగుల సంక్షేమ శాఖ, శ్రీకాకుళం మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మహిళలకు వివిధ సంక్షేమ పథకాలను అమలు చేశారు. కానీ కూటమి ప్రభుత్వ హయాంలో ఆ పరిస్థితి మచ్చుకై నా కనిపించడం లేదు. – పిరియా విజయ, జెడ్పీ చైర్పర్సన్, ఆత్మవిశ్వాసంతో ముందుకు.. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి. ఉన్నతమైన ఆలోచనలతో, ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలి. తల్లిదండ్రులు మహిళలను విద్యలో ప్రోత్సహించాలి. కుటుంబాన్ని, సమాజాన్ని మహిళలు ఆదర్శంగా తీర్చి దిద్దగలరు. – ప్రొఫెసర్ కేఆర్ రజిని, వైస్ చాన్స్లర్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ చదువే మూలధనం మహిళలు రాణించాలంటే చదువు చాలా ముఖ్యం. చక్కగా చదువుకుంటేనే ఉన్నత శిఖరాలు అధిరోహించగలం. కుటుంబ బాధ్యతలు కూడా మహిళలకు కీలకమే. – ప్రసన్న లక్ష్మి, జేడీ, సీపీఓ కార్యాలయం, వివక్ష లేని సమాజం కావాలి.. వివక్ష లేని, వేధింపులు లేని, సమసమాజం వచ్చిన నాడే ఈ కార్యక్రమాలకు, ఈ ఉ త్సవాలకు అర్థం ఉంటుంది. ఆ దిశగా మనమంతా కృషి చేయాలి. – ఆర్.గడ్డెమ్మ, ఈడీ, బీసీ కార్పొరేషన్ ● -
మహిళా పోలీసుల ఆనందహేల
శ్రీకాకుళం క్రైమ్: మహిళా దినోత్సవ ముందస్తు వేడుకల్లో భాగంగా శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో మహిళా పోలీసుల వేడుకలు సందడిగా జరిగాయి. డీఎస్పీ సీహెచ్ వివేకానంద ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. శ్రీకాకుళం రూరల్, రెండో పట్టణ, మహిళా పోలీస్ స్టేషన్లకు చెందిన మహిళా పోలీసులు, స్థానిక కాకినాడ ఆదిత్య కళాశాల విద్యార్థినులు సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలతో సందడి చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ తన ఎదుగుదలలో మహిళల నిర్ణయాలే ప్రధాన భూమిక పోషించాయని, బ్యాక్బెంచ్ ఇంజినీరింగ్ స్టూడెంట్ అయిన తాను ఐపీఎస్పై ఆసక్తి పెట్టడానికి ఐఏఎస్, ఐఆర్ఎస్లుగా ఉన్న దంపతులే కారణమని గుర్తు చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె.వి.రమణ, సీఐలు పైడపునాయు డు, ఈశ్వరరావు, ఇమ్మాన్యుయల్ రాజు, ఎస్ఐలు హరికృష్ణ, రాము, జనార్ధన, మహిళా పోలీసుస్టేషన్ సీఐ త్రినేత్రి, ఎస్ఐ లక్ష్మి, చంద్రకళ అధిక సంఖ్యలో మహిళా పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. -
దేశ రక్షణలో సాహషి
●గర్వంగా ఉంది కఠోర సాధన చేసి మొదటి ప్రయత్నంలోనే ఎస్ఎస్సీ పరీక్షలో ప్రతిభ కనబర్చి నాలుగేళ్ల క్రితం బీఎస్ఎఫ్కు ఎంపికయ్యాను. దేశ రక్షణ కోసం సరిహద్దులలో విధులు నిర్వర్తించడం గర్వంగా ఉంది. – కె.స్రవంతి, సీతాపురం, బీఎస్ఎఫ్ జవాన్, వజ్రపుకొత్తూరు మండలం ●సమాజంలో గుర్తింపు గొర్రెల కాపరి కుటుంబంలో పుట్టిన నేను దేశ సైన్యంలో చేరాలన్న కోరికతో ప్రతి రోజు కఠోర సాధన చేశాను. మా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో లక్ష్యం సాధించాను. ఇండియన్ నేవికి ఎంపికై ప్రస్తుతం ఒడిశాలో శిక్షణ పొందుతున్నాను. – బందాపు శ్రీనిధి, ఇండియన్ నేవి, వజ్రపుకొత్తూరు మండలం వజ్రపుకొత్తూరు రూరల్: తరతరాలుగా కుటుంబ బాధ్యతలకే పరిమితమైన ఆడపడుచులు నేడు దేశ సరిహద్దుల్లో ముష్కరులను మట్టికరిపిస్తున్నారు. బ్రిటీషర్లను తరిమికొట్టిన వీరనారుల వీరత్వాన్ని అందిపుచ్చుకొని సిక్కోలు యువతులు సివంగిలా మారి దేశ రక్షణకు సై అంటున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా నుంచి సుమారు 350 మంది వరకు యువతులు త్రివిధ దళాల్లో చేరినట్లు సైన్యాధికారులు చెప్తున్నారు. -
డయాలసిస్ బెడ్లు పెంచాలి
కవిటి: కిడ్నీ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం డయాలసిస్ బెడ్ల సంఖ్య పెంచాలని ఇచ్ఛాపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ నేత పిరియా సాయిరాజ్ డిమాండ్ చేశారు. శుక్రవారం కవిటిలో మండల కన్వీనర్ కడియాల ప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానంగా కవిటి మండలంతో పాటు చాలా కేంద్రాల్లో డయాలసిస్ కోసం వేచి చూసే రోగులసంఖ్య అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం సానుకూల దృక్పథంతో డయాలసిస్ బెడ్ల సంఖ్య పెంపు దిశగా ఆలోచన చేయాలని కోరారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత పింఛన్లను రూ.10వేలకు పెంచాలని గుర్తు చేశారు. కవిటిలో పదిలోపు ఉన్న బెడ్ల సంఖ్యను 19కు పెంచిన విషయాన్ని తెలిపారు. ఇచ్ఛాపురంలో డయాలసిస్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారని, దాన్ని ప్రారంభించాలన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నేతలు కడియాల ప్రకాష్, జల్లు యుగంధర్, పి.చంద్రశేఖర్, ఎస్పీ నారాయణస్వామి, భద్రాచలం, వై.నీలయ్య, కొర్రాయి గోపాల్, దుద్ది ధర్మారావు పాల్గొన్నారు. సర్కారు సేవాలోపం ఉద్దానం విలాపం -
వారంతా వెనుకబాటుకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే శ్రీకాకుళం జిల్లాలో జన్మించినా అనుకున్న లక్ష్యం సాధించారు. ఈ క్రమంలో ఎన్ని అవాంతరాలు ఎదురైన మొక్కవోని దీక్షతో అధిగమించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ అత్యున్నత స్థానాలను అధిరోహిస్తూ నేటితరానికి స్ఫూర్తిగా నిలిచారు. మా
● అనుకున్న లక్ష్యం సాధిస్తాం ● ‘సాక్షి’ టాక్షోలో మనోగతం వెల్లడించిన టెక్కలి ప్రభుత్వం డిగ్రీ కళాశాల విద్యార్థినులు ●జిల్లా మహిళామణులే ఆదర్శం ●ఎన్ని అవాంతరాలు ఎదురైనా వెనుకడుగు వేయం ●లక్ష్యం సాధించాలి మహిళలు తమ గౌరవాన్ని మరింత పెంచుకునేలా లక్ష్యాలను సాధించుకోవాలి. విద్యార్థి దశ నుంచి ఉన్నతమైన ఆలోచనలతో విద్యనభ్యసిస్తే అనుకున్న లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చు. – వై.లీలాపద్మజ, తెలుగు అధ్యాపకురాలు, మహిళా సాధికారత విభాగం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, టెక్కలి ●జిల్లా విజేతలే ఆదర్శం... మన చుట్టూ ఉన్న ఎంతో మంది మహిళలు విభిన్నమైన రంగాల్లో గొప్ప స్థానాల్లో ఉన్నారు. అటువంటి వారిని ఆదర్శంగా తీసుకుని ఉన్నతమైన లక్ష్యంతో అడుగులు వేయాలి. మనం అనుకున్న ప్రతి ఆలోచలను సాకారం చేసుకోవాలి. – బి.ఝాన్సీరాణి, ఆంగ్ల అధ్యాపకురాలు, మహిళా సాధికారత విభాగం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, టెక్కలి -
ఆరో రోజు ఒకరు డిబార్
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 75 కేంద్రాల్లో జరుగుతున్న పరీక్షల్లో భాగంగా 6వ రోజు శుక్రవారం సెకండియర్ విద్యార్థులు సెట్–2 ప్రశ్న పత్రంతో మాథ్స్ 2ఎ, బోటనీ, సివిక్స్ పేపర్–2, ఇతర ఒకేషనల్ పేపర్లకు పరీక్ష రాశారు. జనరల్, ఒకేషనల్ రెండు విభాగాల్లో కలిపి 18763 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 385 మంది గైర్హాజరయ్యారు. 6వ రోజు జిల్లాలో ఒక మాల్ప్రాక్టీసు కేసు నమోదైంది. పొందూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెకెండియర్ మాథ్స్ 2ఏ పరీక్ష రాస్తున్న ఒక విద్యార్థి మాల్ప్రాక్టీసుకు పాల్పడుతూ పట్టుబడటంతో అధికారులు డీబార్ చేశారు. రెండు టన్నుల చింతపండు పట్టివేత సారవకోట: మండలంలోని వడ్డినవలస గ్రామ సమీపంలో శుక్రవారం ఒడిశా రాష్ట్రం గుణుపురం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా తీసుకొస్తున్న చింతపండు వ్యాన్ను అటవీ శాఖ ఎస్ఎఫ్ఓ ఈశ్వరరావు పట్టుకున్నారు. సుమారు 2 టన్నుల చింతపండును గుణుపురం నుంచి నరసన్నపేటకు తీసుకొస్తున్నట్లు గుర్తించారు. అనుమతులు లేకపోవడంతో వ్యాన్ను అదుపులోకి తీసుకున్నారు.నరసన్నపేటకు చెందిన ఒక వ్యాపారి నిత్యం ఇదే మార్గంలో ఒడిశా నుంచి చింతపండు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. తెరుచుకోని గ్యాస్ గోదాంపొందూరు రూరల్: పొందూరులో గ్యాస్ ఇబ్బందులు తప్పడం లేదు. గత వారం రోజులుగా గ్యాస్ లభించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ బుక్ చేసినప్పటికీ ఇవ్వటం లేదు. గోదాం దగ్గరకు వచ్చి తీసుకుందామంటే తాళాలు వేసి ఉంటున్నాయి. గ్యాస్ గోదాం దగ్గరకు వచ్చిన లబ్ధిదారులు తమ గోడును వినిపించుకుంటున్నారు. శుక్రవారం రాపాక, పిల్లలవలస, ఎరుకులపేట, పొందూరుకు చెందిన పలువురు లబ్ధిదారులు గ్యాస్ గోడౌన్కు వచ్చి ఉసూరుమని తిరిగి వెనుకకు ఖాళీ సిలిండర్లతో వెళ్లిపోయారు. దుర్గమ్మ ఆలయంలో చోరీ వజ్రపుకొత్తూరు: మండలంలోని సుంకర జగన్నాథపురం దుర్గమ్మ తల్లి ఆలయంలో గురువారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. తాళాలు పగలుగొట్టి వెండి, బంగారం నగలు ఎత్తుకెళ్లారు. శుక్రవారం ఉదయం దాసురాలమ్మ గాడి హైమావతి ఆలయం వద్దకు రాగా.. తాళం పగలుగొట్టి ఉండటంతో చోరీ జరిగినట్లు గుర్తించి గ్రామస్తులకు సమాచారం అందించారు. ఆభరణలు మాయం కావడంతో వజ్రపుకొత్తూరు పోలీసులకు సమాచారమిచ్చారు. చోరీలో రెండు కిలోల బరువు కలిగిన వెండి పల్లెం, అమ్మవారి విగ్రహం, కిరీటం, బల్లెం, గ్లాసు, రెండు తులాల బంగారం శతమానాలు, ముక్కు పుడకలు, కాసులను దొంగలు ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పూండి – నౌపడ ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న దేవాలయం కావడంతో దొంగలు రెక్కీ నిర్వహించి చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. వజ్రపుకొత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
No Headline
టెక్కలి: ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల వేదికగా గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి గోకార్టింగ్ సీజన్–2 పోటీలు శుక్రవారం అట్టహాసంగా ముగిశాయి. ఈ పోటీల్లో పెట్రోల్ విభాగం (సీవీ) విశాఖపట్టణం రఘు ఇంజినీరింగ్ కళాశాల ఓవరాల్ చాంపియన్షిప్ను కై వసం చేసుకుంది. అలాగే ఎలక్ట్రికల్ (ఈవీ) విభాగంలో హైదరాబాద్కు చెందిన బీవీఆర్ఐటీ కళాశాల విద్యార్థినులు చాంపియన్షిప్ను సొంతం చేసుకున్నారు. ముగింపు సందర్భంగా టెక్కలి ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, ఒడిశా, తమిళనాడు ప్రాంతాలకు చెందిన సుమారు 16 బృందాలు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. అంతకుమునుపు టెక్కలి మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ డి.సంజీవరావు, సీఐ ఎ.విజయ్కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. కార్యక్రమం ఆద్యంతం యువత సందడి చేశారు. -
డీఆర్డీఏ పీడీపై నిరసన గళం
శ్రీకాకుళం పాతబస్టాండ్: వెలుగు వీఓఏలపై అనుచితంగా ప్రవర్తించిన డీఆర్డీఏ పీడీ పి.కిరణ్కుమార్ను సస్పెండ్ చేయాలని, ఆయన చేసిన వ్యాఖ్యలకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా వీఓఏలు గురువారం నిరసన తెలిపారు. ఏపీ వీఓఏ ఉద్యోగుల సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. డీఆర్డీఏ పీడీ ధర్నా వద్దకు వచ్చి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సి.హెచ్.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావులు మాట్లాడుతూ డీఆర్డీఏ పీడీ అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. వీఓఏ ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు అల్లు మహాలక్ష్మి, జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు వి.ధనలక్ష్మి, జి.అసిరినాయుడు మాట్లాడుతూ వీఓఏలుగా 95 శాతం మంది మహిళలే పనిచేస్తున్నారని, వారిని కించపరచడం బాధాకరమన్నారు. అనంతరం శ్రీకాకుళం పోలీసులు వచ్చి వారికి నచ్చజెప్పారు. కానీ మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా నిరసన తెలిపారు. తర్వాత పీడీ యూనియన్తో మాట్లాడడంతో ఆందోళన విరమించారు. -
ఐదో రోజు 815 మంది గైర్హాజరు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో ఇంటర్మీడియె ట్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా సాగుతున్నాయి. ఐదో రోజు గురువారం ఫస్టియర్ విద్యార్థులు సెట్–2 ప్రశ్న పత్రంతో మ్యాథ్స్ 1ఎ, బోటనీ, సివిక్స్ పేపర్–1, ఇతర ఒకేషనల్ పేపర్ల పరీక్ష రాశారు. జనరల్, ఒకేషనల్ రెండు విభాగాల్లో కలిపి 22,498 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 21,683 మంది పరీక్ష రాశారు. వివిధ కారణాలతో రికార్డుస్థాయిలో 815 మంది గైర్హాజరయ్యారు. ఎలాంటి మాల్ ప్రాక్టీసు కేసులు నమోదుకాలేదని ఆర్ఐఓ ప్రగడ దుర్గారావు ధ్రువీకరించారు. -
కరెంటే వాడలేదు బిల్లు మాత్రం రూ.290
కాశీబుగ్గ: పలాస మండలం బొడ్డపాడు పంచాయతీ కేంద్రంలో ఉన్న తెప్పల గారమ్మ ఒక్క యూనిట్ విద్యుత్ వాడకపోయినా రూ.290 బిల్లు వేశారు. గురువారం సాయంత్రం ఆమె ఇంటికి కరెంటు బిల్లు వచ్చింది. ఆమె అనారోగ్యం కారణంగా వేరే వారి ఇంటిలో ఉంటున్నారు. ఈ ఇంటిలో కనీసం ఒక్క రోజు కూడా కరెంటు వాడలేదు. ఒక్క యూనిట్ కరెంటు వాడకపోయినా చార్జీ రూ.237, షార్ట్ ఫాల్ బిల్, కస్టమ్ చార్జ్ రూ.25, ఫిక్స్డ్ చార్జ్ రూ.10, ఎఫ్పీపీసీఏ3 చార్జ్ పేరుతో రూ.9.5 అంటూ మొత్తం రూ.290.47 బిల్లు వచ్చింది. దీంతో ఆమె నిశ్చేష్టురాలయ్యారు. ధాన్యం కొనుగోలు చేయాలని ఆందోళన బూర్జ: మండలంలో గల లక్కుపురం గ్రామంలో ఖరీఫ్లో పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు ధాన్యం బస్తాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. గురువారం రైతులు వి య్యపు భాగ్యారావు, వారాడ రామినాయుడు, వియ్యపు దుర్గారావు, వాకముడ్లు పెంటయ్య, శేషపు తవిటినాయుడు, పొదిలాపు ధర్మారావు తదితరులు పొలంలో ధాన్యం బస్తాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో 20 శాతం మాత్రమే ధాన్యం అమ్మకాలు జరిగాయని, ఇంకా గ్రా మంలో రైతుల వద్ద సుమారు 80 శాతం వరకు ధాన్యం నిల్వలు ఉన్నాయని వారు తెలియజేశారు. ఇదివరకు జేసీ హామీ ఇచ్చినా పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని అన్నారు. తక్షణమే న్యాయం చేయాలని కోరారు. 8 నుంచి పి–4 సర్వే శ్రీకాకుళం పాతబస్టాండ్: పేదరికం లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్ట్నర్షిప్ (పి 4) సర్వేకు కార్యాచరణ రూపొందించిందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ సర్వే కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ను ఉపయోగించి ఈ నెల 8వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా సర్వే ప్రా రంభించి 15వ తేదీ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. ఈ సర్వే పై మార్చి 6, 7 తేదీల్లో ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. పేదల అవసరాలను గుర్తించి వారి సమగ్రాభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టుల రూపకల్పనకు ఈ సర్వే దోహ దపడుతుందని, ప్రస్తుతం కుటుంబాలు అందుకుంటున్న పథకాలపై ఈ సర్వే ఎలాంటి ప్రభావం చూపబోదని, సర్వే ద్వారా సేకరించిన డేటా ఆధారంగా కుటుంబ అవసరాలకు అనుగుణంగా సమర్థమైన ప్రణాళికలు రూపొందించవచ్చన్నారు. -
నవోదయం 2.0 ప్రారంభిస్తాం
● ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ డి.శ్రీకాంత్రెడ్డిశ్రీకాకుళం క్రైమ్ : జిల్లాను సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తామని, దానిలో భాగంగానే ప్రభుత్వం నవోదయం 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు జీఓ సైతం ఇచ్చిందని, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ దోసకాయల శ్రీకాంత్రెడ్డి అన్నారు. ఈ మేరకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పూర్తిస్థాయి ప్రణాళికలతో కార్యాచరణ సిద్ధం చేస్తున్నారని డీసీ అన్నారు. గురువారం డీసీ సమక్షంలో జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో గీత, సొండి కులాల వారికి మద్యం షాపుల కేటాయింపు లాటరీ పద్ధతిలో జరిగిన విషయం విదితమే. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. సారాయి కేంద్రాలను ఎ, బి, సి క్యాటగిరీలుగా విభజించామని తెలిపారు. మన జిల్లాలో ఇప్పటికే ఆరు ఎకై ్సజ్ స్టేషన్ల పరిధిలో 110 పాయింట్లను ఎస్హెచ్ఓలు గుర్తించారన్నారు. సారాయిని కాసే గ్రామాల్లోని వ్యక్తులను గుర్తించడమే కాక ఆయా గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. ఇప్పటికే నల్లబెల్లం వ్యాపారులు, సారాయి క్రయ, విక్రయాలు, కాసేవారు, పాతముద్దాయిలను గుర్తించామన్నారు. జిల్లాలో వేయిమందికి పైగా ఇలాంటి కేసుల్లో అనుమానితులుగా ఉన్నారని, వీరిలో 700 మందికి పైగా (70 శాతం) బైండోవర్లు కట్టామన్నారు. ఇప్పటికై నా సన్మార్గంలో నడవాలని, లేదంటే గట్టి చర్యలుంటాయని ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్రెడ్డి హెచ్చరించారు. -
చీకటిలో ఇసుక దొంగలు
జలుమూరు: సురవరం పంచాయతీ దొంపాక వద్ద వంశధార నది నుంచి ఇసుక అక్రమంగా రాత్రి వేళలో తరలిస్తున్నారు. నిన్నటి వరకూ సైరిగాం పంచాయతీ పరిధి లింగంన్నాయుడుపేట నుంచి తవ్వకాలు జరిపిన నాయకులు తాజాగా దొంపాక గ్రామాన్ని ఎంచుకున్నారు. మండల కూటమి నాయకులతో కలిపి ఈ అక్రమ రవాణా చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాకు చెందిన మంత్రి అండదండలతో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. కొద్ది నెలల కిందట జిల్లా పోలీసు అధికారికి ఫిర్యా దు చేసి ఇసుక లారీలు పట్టించినా వాటిని నామమా త్ర చర్యలతో పోలీసులు విడిచిపెట్టేశారని విమర్శలు వచ్చాయి. అయితే దొంపాక ఇసుక రీచ్ నుంచి ఇసుకను పాత అనుభవం ఉన్నవారే మళ్లీ ఈ అక్రమ రవాణాకు తెర తీశారు. స్థానిక అధికారులకు ఫిర్యా దు చేస్తే సంబంధిత అధికారులే ఈ అక్రమ రవాణాదారులకు సమాచారం ఇచ్చి దాడులు చేసే సమయానికి కొమనాపల్లి వంతెన దాటిస్తున్నారు. పేరుకు దాడులు చేసినట్లుగా కలరింగ్ ఇచ్చి తూతూ మంత్ర చర్యలతో మమ అనిపిస్తున్నారు. ఈ మార్గంలో రవాణా.. కొమనాపల్లి జంక్షన్, వంశధార వంతెన వద్ద వాహనాలు నిలుపుదలకు అవకాశం ఉండడంతో అదే చో ట ఇసుకను తవ్వేందుకు యంత్రాలు సైతం సిద్ధంగా ఉంచుతున్నారు. రాత్రి తొమ్మిది గంటలు దాటిన తర్వాత సిద్ధం చేసిన యంత్రాలతో తవ్వకాలు జరిపి వాహనాలలో లోడింగ్ చేసి రవాణా చేస్తున్నారు. కొమనాపల్లి వంతెన నుంచి సరుబుజ్జిలి వైపు నుంచి ఈ వాహనాలు విశాఖకు తరలిస్తున్నారు. ఎంపీపీ వాన గోపితో వాగ్వాదం ఇసుక రాత్రి వేళలో అక్రమంగా రవాణా జరుగుతుందన్న సమాచారంతో ఎంపీపీ వాన గోపి, స్థానికులతో కలిసి గురువారం రాత్రి ఇసుక లారీలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇసుకాసురులు ప్రతిఘటించి వాగ్వాదానికి దిగారు. అనుమతులు ఉన్నాయని దబాయింపు చేస్తున్నారు. విచిత్రంగా రాత్రి వేళల్లో అనుమతు లు ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నా యి. దీనిపై తహసీల్దార్ జెన్ని రామారావు మాట్లాడుతూ నది నుంచి రాత్రి వేళలో తవ్వకాలకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. దొంపాక కేంద్రంగా రాత్రి వేళలో ఇసుక అక్రమ రవాణా యంత్రాలతో తవ్వకాలు చోద్యం చూస్తున్న అధికారులు -
ముగిసిన మద్యం షాపుల లాటరీ
ఆ తప్పులు దొర్లకుండా.. గతంలో 6వ నెంబరు టోకెన్ను ముందుగా సక్సెస్ అప్లికెంట్గా ప్రకటించిన కాసేపటికే 9వ నెంబరు టోకెన్ అభ్యర్థిని మళ్లీ ప్రకటించడంతో తీవ్ర వాగ్వాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఈసారి ఆ తప్పు దొర్లకుండా 6వ నెంబర్ టోకెన్కు కింది భాగాన బాణం గుర్తు పెట్టి డ్రా తీసే ముందు ప్రతీసారి దరఖాస్తుదారులకు చూపించారు. శ్రీకాకుళం ఎకై ్సజ్ స్టేషన్ పరిధి రెండు షాపులకు (మున్సిపల్ కార్పొరేషన్–31, రూరల్– 24) అత్యధికంగా 55 దరఖాస్తులు అందగా ఇచ్ఛాపురం రూరల్ పరిధి ఓ షాపునకు అత్యల్పంగా ఇద్దరే దరఖాస్తు వేయడం గమనార్హం. అనంతరం జేసీ మాట్లాడుతూ డ్రా ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని చెప్పారు. లైసెన్సుదారులకు ప్రొవిజనల్ లైసెన్సు ఇచ్చి అనంతరం రెగ్యులర్ లైసెన్సును ఎకై ్సజ్ విభాగం ద్వారా అందజేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి తిరుపతినాయుడు, సీఐ గోపాలకృష్ణ, ఎకై ్సజ్ స్టేషన్ల సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాకుళం క్రైమ్ : కొత్త మద్యం పాలసీ (2024–26)లో భాగంగా గీత, సొండి కులాలకు ప్రభుత్వం కేటాయించిన 18 మద్యం షాపులకు గురువారం లాటరీ పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. గతేడాది అక్టోబరులో జనరల్ క్యాటగిరీలో జిల్లాలో 158 మద్యం షాపులకు డ్రా తీసిన సంగతి తెలిసిందే. అప్పట్లో 4671 దరఖాస్తులు రాగా ఇప్పడు 203 దరఖాస్తులొచ్చాయి. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాల మేరకు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ విభాగం డిప్యూటీ కమిషనర్ దోసకాయల శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ డ్రా టోకెన్లను అభ్యర్థుల సమక్షంలో తీసి చూపించారు. ఎంపికై న రోజే కట్టేశారు.. గీత కుల ఉప కులాలైన సెగిడి (4), శ్రీశయన (10), యాత(1), గౌడ (1) కులాల వారికి కేటాయించిన 16 దుకాణాలకు, సొండి కులాలవారి రెండు దుకాణాలకు అభ్యర్థులను ఎంపిక చేయగా వెంటనే రిజిస్టర్లో సంతకాన్ని పెట్టి మొదటి వాయిదా సొమ్ము సుమారు రూ. 9 లక్షలు (ఒక్కొక్కరికి) కట్టేసి కుల, ఉపకుల ధృవీకరణపత్రాలను ఇచ్చేశారు. జనరల్ క్యాటగిరిలో రూ.65 లక్షలు సంవత్సర ఫీజు ఛలానాల రూపంలో కట్టగా.. వీరు రూ. 35 లక్షలను నాలుగు వాయిదాల్లో ప్రభుత్వానికి కట్టాల్సి ఉంది. ద్వితీయ శ్రేణి నాయకుల హడావిడి.. పేరుకు గీత, సొండి కులాల వారికే షాపులు కేటా యించడం జరిగినా అక్కడ టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకుల హడావిడే కనిపించింది. సిండికేట్గా ఏర్పాటయ్యేందుకు వారి కనుసన్నల్లో ముందుగానే మంత్రాంగం నడిచినట్లు సమాచారం. ప్రభుత్వం జనరల్ క్యాటగిరీలో మొదటిచ్చిన తొమ్మిదికి పైగా మార్జిన్తో రూ.లక్షల్లో నష్టాలను చవిచూసిన సిండికేట్ ఇటీవల 14కి పైగా మార్జిన్ పెంచడంతో వీరి కోటాలోనైనా (సగం ధరకే షాపులు దక్కడం) గుత్తాధిపత్యం చేసి సొమ్ములు చేసుకునే యోచనలో ఉన్నట్లు అక్కడక్కడా వినిపించింది. జేసీ సమక్షంలో గీత, సొండి కులాలకు 18 దుకాణాల కేటాయింపు హడావిడి చేసిన టీడీపీ నాయకులు -
లిఫ్ట్ ఇచ్చి.. పుస్తెలతాడు కొట్టేసి..
జి.సిగడాం: మండలంలోని మర్రివలస గ్రామంలో వృద్ధురాలి మెడలో పుస్తెలతాడును గుర్తు తెలియని వ్యక్తి తెంచుకుపోయిన ఘటన గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మర్రివలసకు చెందిన పలిశెట్టి కన్నమ్మ మానంపేట గ్రామానికి నడిచి వెళ్తుండగా అటువైపు బైక్పై వెళ్తున్న వ్యక్తికి లిఫ్ట్ అడిగింది. మానంపేట వద్ద దిగి నడుచుకుంటూ వెళ్తుండగా వెనకి నుంచి వచ్చి ముఖంపై కారంజల్లి మెడలో తులన్నర బంగారు పుస్తెలతాడును తెంచుకుని బైక్తో పరారయ్యాడు. ఈ ఘటనలో వృద్ధురాలికి స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ ఎం.అవతారం, ఎస్ఐ మధుసూదనరావు ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ● మానంపేట వద్ద చైన్స్నాచింగ్ ● వృద్ధురాలికి స్వల్ప గాయాలు -
వీఆర్ఓలపై ఇతర శాఖల పెత్తనం తగదు
శ్రీకాకుళం పాతబస్టాండ్: గ్రామ రెవెన్యూ అధికారులపై ఇతర శాఖల అధికారుల పెత్తనం చలాయిస్తున్నారని, వారు చేయాల్సిన పనులు తమపై నెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వెంటనే ఇటువంటి చర్యలకు అడ్టుకట్ట వేయాలని కోరుతూ వీఆర్ఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ సమీపంలోని డచ్భవన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా రెవెన్యూ అధికారి కె.వెంకటేశ్వరరావుకు అందజేశారు. ఈ సందర్భంగా అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడు వీఎల్ఆర్ శాస్త్రి, గౌరవాధ్యక్షుడు వేణుగోపాల్ తదితరులు మాట్లాడుతూ పంచాయతీరాజ్, సర్వే ఉద్యోగుల విధులు కూడా తమతో చేయించడం దారుణమన్నారు. ఇప్పటికే పీజీఆర్ఎస్, రెవెన్యూ, భూ వివాదాలు, ఇతర అంశాలతో పని ఒత్తిడి ఎక్కువగా ఉందని, 24 గంటలు పనులు చేస్తున్నా పని భారం తగ్గడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ వార్డు సచివాలయాలు వచ్చాక తమకంటే తక్కువ స్థాయి కలిగిన వారు కూడా గ్రేడ్– 1 వీఆర్ఓలపై పెత్తనం చలాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సూపర్ విజన్ పేరుతో వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ ఫార్వర్డ్ చేస్తున్నారని చెప్పారు. నిరసన కార్యక్రమంలో వీఆర్వోల సంఘం ప్రతినిధులు అప్పలనాయుడు, విశ్వేశ్వరరావు, శ్రీనివాసరావు, తౌడు, తదితరులు పాల్గొన్నారు. -
సీనియారిటీ జాబితాలో తప్పులు సవరించాలి
శ్రీకాకుళం న్యూకాలనీ: విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లో ఉంచిన ఉపాధ్యాయ సీనియారిటీ జాబితాలో తప్పులు దొర్లాయని.. వాటిని సవరించాలని జిల్లా ఎస్టీయూ నాయకులు ఎస్వీ రమణ, జి.రమణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ తిరుమల చైతన్యకు వినతిపత్రం అందజేశారు. కొంతమందివి డీఎస్సీ సంవత్సరాల్లో తప్పులున్నాయని, కొంతమంది పేర్లే లేవని, మేనేజ్మెంట్లలో తప్పులు, దోషాలున్నాయని పేర్కొన్నారు. అప్పీల్ చేసుకునేందుకు గడువు పెంచాలని విన్నవించారు. సానుకూలంగా స్పందించిన డీఈఓ తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్టు చెప్పారు. కార్యక్రమంలో ఎస్టీయూ ప్రతినిధులు కె.శ్రీనివాసరావు, చింతల రామారావు, ఎస్.లక్ష్మణరావు, ఎం.తేజ, జి.శ్రీను, డీవీఎస్, హరి, సీహెచ్ జగన్ తదితరులు పాల్గొన్నారు. -
కేజీ గంజాయికి వెయ్యి కమీషన్
● గంజాయి అక్రమ రవాణా గుట్టురట్టు ● వివరాలు వెల్లడించిన కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు వివరాలు వెల్లడిస్తున్న కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు కవిటి: ఒడిశా సరిహద్దు నుంచి ఆంఽధ్రప్రదేశ్లోకి అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాలను ఎప్పటికప్పుడు పట్టుకుంటున్నామని కాశీబుగ్గ డీఎస్పీ వి.వెంకటఅప్పారావు తెలిపారు. కవిటి పోలీస్స్టేషన్లో గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తాజాగా పట్టుబడిన 10.250 కిలోల గంజాయికు సంబంధించి వివరాలు వెల్లడించారు. ఒడిషా రాష్ట్రం గంజాం జిల్లా లాఠీ గ్రామానికి చెందిన సురేష్ నాయక్ తన స్నేహితుడు, గంజాయి వ్యాపారం చేసే రాజేంద్ర బాడిత్య సహకారంతో అక్రమ రవాణా వ్యాపారానికి అలవాటుపడ్డాడు. గంజాయిని తీసుకొని బెంగళూరులో తాను చెప్పిన మనిషికి అప్పగిస్తే కేజీకి రూ.1000 కమీషన్గా ఇచ్చేవాడు. ఈ క్రమంలో సురేష్ గురువారం రాజేంద్ర బాడిత్య నుంచి 10 కేజీల 250 గ్రాముల గంజాయిని తీసుకొని బరంపురం నుంచి బస్సులొ బయలుదేరి కొజ్జీరియా టోల్గేటు ముందు ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద దిగాడు. అక్కడి నుంచి కంచిలి రైల్వే స్టేషనుకు వెళ్లేందుకు బస్సు కోసం నిరీక్షిస్తుండగా ముందస్తు సమాచారంతో కవిటి ఎస్ఐ వి.రవివర్మ తన సిబ్బందితో వెళ్లి సురేష్నాయక్ను అదుపులోకి తీసుకున్నారు. సమావేశంలో ఇచ్ఛాపురం సీఐ ఎం.చిన్నంనాయుడు, కవిటి ఎస్ఐ వి.రవివర్మ, సిబ్బంది పాల్గొన్నారు. కేజీన్నర గంజాయితో.. ఇచ్ఛాపురం: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీమ్పట్నం మండలం తుమ్మలపాలెం గ్రామానికి చెందిన కొర్లపాటి వంశీ అనే యువకుడు కేజీన్నర గంజాయితో పట్టుబడినట్లు కాశీబుగ్గ డీఎస్పీ వి.వెంకట అప్పారావు తెలిపారు. గురువారం ఇచ్ఛాపురం పట్టణ పోలీస్స్టేషన్లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. నిందితుడితో పాటు ఆదే గ్రామానికి స్నేహితులు కలపాటి తేజ, కుంచాల సూర్యలు గంజాయికి బానిసయ్యారు. అవసరమైనప్పుడలా ఒడిశా వచ్చి గంజాయిని కొనేవారు. ఈ క్రమంలో వంశీ గురువారం ఒడిశాలో కేజీ 540 గ్రాముల గంజాయిని కొనుగోలు చేసి బస్సులో ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్కి వస్తుండగా పట్టణ పోలీసులకు చిక్కాడు. నిందితుడి వద్ద గంజాయి, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో సీఐ మీసాల చిన్నంనాయుడు, పట్టణ ఎస్సై ముకుందరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. దుకాణాల్లో గంజాయి విక్రయం! ఆమదాలవలస: పట్టణంలో ఇటీవల పలు దుకాణాల్లో గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణ ప్రధాన రహదారిపై ఉన్న ఒక దుకాణానికి మఫ్టీలో ఉన్న పోలీసు సిబ్బంది వెళ్లి గంజాయి కావాలని అడగ్గా.. పోలీసులని తెలియక నిర్వాహకురాలు గంజాయి ఇచ్చినట్లు తెలిసింది. దీంతో దుకాణం నిర్వహిస్తున్న దంపతులను పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై ఆమదాలవలస సీఐ సత్యనారాయణ వద్ద ప్రస్తావించగా దుకాణాలు తనిఖీలు చేస్తున్నామని, ఎవరైనా పట్టుపడితే విలేకరుల సమావేశంలో వెల్లడిస్తామని స్పష్టం చేశారు. -
వ్యక్తి అదృశ్యం
కాశీబుగ్గ: పలాస మండలం బ్రాహ్మణతర్లా గ్రామానికి చెందిన కుప్పిలి మల్లేశ్వరరావు (61) కనిపించడం లేదని కుమార్తె మామిడి గీతారాణి గురువారం కాశీబుగ్గ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫిబ్రవరి 19న బయటకు వెళ్లి ఇంతవరకు రాలేదని, అన్నిచోట్లా వెతికినా ఆచూకీ తెలియలేదని పేర్కొన్నారు. వివరాలు తెలిస్తే 949475297 నంబర్కు సమాచారం అందించాలని కోరారు. కాశీబుగ్గ పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాంకేతిక అంశాలపై పట్టు అవసరం ఎచ్చెర్ల క్యాంపస్: విద్యార్థుల్లో సాంకేతిక అంశాలపై పట్టు అవసరమని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎం.విజయ్కుమార్ అన్నారు. ఎస్ఎంపురం క్యాంపస్లో మూడు రోజుల పాటు నిర్వహించనున్న టెక్నికల్ ఫెస్ట్ టెక్నివేర్ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజ్ఞానం, వినోదం, సాంకేతిక అంశాల అవగాహన ఆధారంగా కార్యక్రమం జరుగుతుందని, 600 కళాశాలలను ఆహ్వానించామని చెప్పారు. కార్యక్రమంలో డైరెక్టర్ కొక్కిరాల వెంకటగోపాల ధన బాలాజీ, ఏవో ముని రామకృష్ణ, అకడమిక్ డీన్ కొర్ల మోహన్కృష్ణ చౌదరి, సెమినార్ కన్వీనర్ గేదెల రవి, సహాయ కన్వీనర్ తేజ్కిరణ్ పాల్గొన్నారు. -
ఇప్పుడు బాదుడా?
అప్పుడు వదిలేసి.. రూ.3వేలు అదనం.. గత ఏడాది రూ.1.02 లక్షలు అప్పు చూపిస్తే ఆ మొత్తానికి వడ్డీ జమ చేసి రెన్యూవల్ చేయించుకున్నాను. ఈ ఏడాది అప్ప ఖాతా రూ. 1.05 లక్షలకు పెంచిచూపించారు. ఆ మొత్తానికి వడ్డీ చెల్లించి రెన్యూవల్ చేసుకోవాలని సిబ్బంది చెబుతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే కరోనా సమయంలో 2020లో బ్యాంకు సిబ్బంది వడ్డీ వసూలు చేసేందుకు రాలేదని, ఇప్పుడు ఆ మొత్తం కలిపేశామని చెబుతున్నారు. – తమ్మినేని శ్రీనివాసరావు, రైతు, కట్యాచార్యులపేట రసీదులు ఇవ్వడం లేదు.. అప్పు, వడ్డీ చెల్లింపులు చేస్తున్నప్పుడు రైతులకు ఎటువంటి రసీదులు ఇవ్వడంలేదు. ఖాళీ ఓచర్లపై సంతకాలు చేయించుకుంటున్నారు. అసలుకు ఎసరు పెడుతూ అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు. లక్షల్లో అప్పులు వాడిన ప్రతి రైతుకు 4 శాతం మొత్తం రుణ ఖాతాకు కలిపారు. ఉన్నతాధికారులు పరిశీలించి రైతులకు న్యాయం చేయాలి. – పేడాడ భానూజీరావు, కొర్లకోట, ఆమదాలవలస మండలం ఆమదాలవలస: పట్టణంలోని కృష్ణాపురం వ్యవసాయ పరపతి సంఘం(పీఎసీఎస్) కార్యాలయంలో వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతులు వడ్డీ బాదుడుపై లబోదిబోమంటున్నారు. గతంలో వాడిన అప్పు మొత్తాలకంటే ఎక్కువ చూపిస్తూ ఇప్పుడు వడ్డీలు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఒక్కో రైతుకు రూ.లక్షకు రూ. 3వేలు నుంచి రూ.4 వేలు వరకు అధికంగా కలిపిజాబితా చూపిస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. ఇదేంటని సిబ్బందిని ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని వాపోతున్నారు. భారీగా తేడాలు.. కృష్ణాపురం పీఏసీఎస్ పరిధిలో ఆమదాలవలస మండలం, మున్సిపాలిటీకి సంబంధించి 2796 మంది రైతులు రుణాలు వాడారు. ఆయా రైతుల పేరిట రూ.15,77,7,642 అప్పు ఉన్నట్లు చూపిస్తున్నారు. ఇంతవరకు రెన్యూవల్స్ చేసి వడ్డీలు చెల్లించిన సుమారు 400 మంది రైతుల నుంచి రూ.1.50 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. 2019–20 సంవత్సరంలో కరోన సమయంలో రైతులు వడ్డీలు చెల్లించలేదని, దీంతో ఆ మొత్తాలు ఇప్పుడు ఖాతాలకు జమచేసినట్లు చెబుతున్నారు. నాలుగేళ్లు పాటు వదిలేసి ఈ ఏడాది మాత్రమే అదనంగా కలపడంపై రైతులు మండిపడుతున్నారు. మరోవైపు గతంలో రాష్ట్ర ప్రభుత్వం 4శాతం వడ్డీ రాయితీ, కేంద్ర ప్రభుత్వం 3 శాతం వడ్డీరాయితీ ఇవ్వకపోవడంతో ఆ మొత్తం కోపరేటివ్ బ్యాంకు ద్వారా రైతుల ఖాతాలకు జమచేసినట్లు సిబ్బంది చెబుతున్నారు. అదే విధంగా, కృష్ణాపురం పీఎసీఎస్ అప్పు మొత్తాలకు, కో ఆపరేటిట్ బ్యాంకుకు పీఏసీఎస్ చెల్లించాల్సిన మొత్లాకు సుమారు రూ.3 కోట్లు తేడా చూపిస్తున్నట్లు సమాచారం. ఈ మొత్తాలను కూడా ఎక్కడ తమకే విధిస్తారోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. పీఏసీఎస్ పరిధిలో వడ్డీలు, రుణాలు చెల్లిస్తున్న రైతులకు ఎటువంటి రసీసులు ఇవ్వకుండా ఖాళీ ఓచర్లపై సంతకాలు పెట్టిస్తూ పంపిస్తున్నారని, ఇలాంటి చర్యలు మోసగించడానికేనని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర దర్యాప్తు చేపట్టి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. కృష్ణాపురం పీఏసీఎస్ పరిధిలో రైతుల ఖాతాల్లో అప్పు మొత్తాల పెంపు కరోనా సమయం నాటి వడ్డీ అంటూ పొంతనలేని సమాధానాలు ఆందోళనలో రైతులు బ్యాంకు జాబితా మేరకే.. బ్యాంకుల నుంచి మాకు వచ్చిన జాబితా ప్రకారం రైతుల నుంచి వడ్డీలు వసూలు చేస్తున్నాం. అప్పు మొత్తాలకు ప్రతి రైతు ఖాతాకు 4 శాతం మొత్తం చేసి లక్ష రూపాయలకు రూ.4000 చొప్పున కలిపి జాబితాలో వచ్చింది. 2020లో కరోనా సమయంలో ఇక్కడ సిబ్బంది వడ్డీలు వసూలు చేయలేదు. ఆ మొత్తాలను 2024లో రైతుల ఖాతాలకు కలిపినట్లు ఉన్నతాధికారులు రైతులకు చెప్పమన్నారు. –చిగురుపల్లి వెంకటరావు, కృష్ణాపురం పీఏసీఎస్ సీఈఓ -
నరసన్నపేటలో దొంగలు హల్చల్
నరసన్నపేట: మండల కేంద్రం నరసన్నపేటలో బుధవారం రాత్రి దొంగలు హల్చల్ సృష్టించారు. పట్టణ శివారులో జాతీయ రహదారి సర్వీసు రోడ్డుకు ఆనుకొని ఉన్న శ్రీనివాసనగర్లో రెండు ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డారు. తొలుత వీధిలో ఉన్న సీసీ కెమెరాల వైర్లు కట్ చేసి పట్నాల నాగేశ్వరరావు ఇంట్లో చొరబడ్డారు. నాగేశ్వరరావు కుటుంబం దైవ దర్శనాల టూర్లో ఉండటంతో ఇదే అదునుగా బీరువాను తెరిచి చిందరవందర చేశారు. ఇంటి ముందు సీసీ కెమెరాను ధ్వంసం చేశారు. ఇంట్లో ఏయే వస్తువులు చోరీకి గురయ్యాయో నాగేశ్వరరావు కుటుంబం తిరిగి వస్తే తప్ప స్పష్టత రాదు. ఈ ఇంటికి సమీపంలో ఉంటున్న పోలాకి మండలం రేవు అంప్లాం పంచాయతీ కార్యదర్శి టి.దుర్గాప్రసాద్ ఇంట్లో కూడా దుండగులు చోరీకి ప్రయత్నించారు. అక్కడ ఏమీ దొరక్కపోవడంతో గేటు విరగ్గొట్టి వెళ్లిపోయారు. గురువారం విషయం తెలుసుకున్న నరసన్నపేట ఎస్ఐ దుర్గాప్రసాద్ చోరీకి గురైన ఇళ్లను పరిశీలించారు. కాగా, దేవుడు బొమ్మలతో మూడు చక్రాల రథాలపై కొందరు వచ్చారని, చోరీ వీరి పనే అయి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. -
నదుల అనుసంధానానికి కేటాయింపులేవీ?
కవిటి: వంశధార, బాహుదా నదుల అనుసంధానానికి తాజా బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు చేయకపోవడం దారుణమని ఎమ్మెల్సీ నర్తు రామారావు అన్నారు. గురువారం శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే, నదులను అనుసంధానం చేసే కార్యక్రమాలు చేపడతామని ఎన్నికల ముందు అట్టహాసంగా ప్రకటనలు చేసిన చంద్రబాబు ఇప్పుడు ఆ విషయాన్నే విస్మరించడం సరికాదన్నారు. ముఖ్యంగా ఇచ్ఛాపురం నియోజకవర్గ ప్రజలకు, రైతాంగానికి ఎంతో అవసరమైన వంశధార నది జలాలను బాహుదాకు అనుసంధానం చేసేందుకు బడ్జెట్లో ఒక రూపాయి కూడా కేటాయింపులు చేపట్టకపోవడం అన్యాయమన్నారు. కేవలం వర్షాధారం మీదే వ్యవసాయ రంగం కొనసాగుతోందన్నారు. 10న అప్రెంటీస్ మేళా ఎచ్చెర్ల క్యాంపస్ : ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 10న ప్రధాన మంత్రి జాతీయ అప్రెంటీస్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ ఎల్.సుధాకరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఏడు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు ఈ మేళాకు హాజరవుతారని చెప్పారు. ఉదయం 9 గంటల నుంచి రిజస్ట్రేషన్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు ఆధార్, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని కోరారు. భక్తుడిపై దాసుడి దురుసు ప్రవర్తన సంతబొమ్మాళి: తక్కువ డబ్బులు పల్లెంలో పెట్టానని ఆగ్రహిస్తూ సంతబొమ్మాళి మండలం హనుమంతునాయుడుపేట పంచాయతీ పోతునాయుడుపేట గ్రామానికి చెందిన రెయ్యమ్మ దాసుడు (పరపటి రాము) తనపై దాడి చేశాడని టెక్కలి మండలం బొరిగిపేట గ్రామానికి చెందిన రోణంకి ధర్మారావు ఆవేదన వ్యక్తం చేశాడు. గురువారం దాసుడి వద్దకు వెళ్లి పళ్లెంలో పండ్లు, రూ.50 పెట్టగా.. ఇంత తక్కువ ఇస్తావా అంటూ ఆగ్రహిస్తూ పండ్లు, డబ్బులను బయటకు విసిరేశాడని, ఇదేంటని ప్రశ్నిస్తే దాడిచేసి సెల్ఫోన్ లాక్కున్నాడని వాపోయాడు. సెల్ఫోన్ తిరిగిచ్చేయాలని కోరితే అనుచరులు బయటకు గెంటేశారని, కొంతసేపటి తర్వాతే తిరిగిచ్చారని చెప్పాడు. కాగా, ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఆరా తీశారు. బార్ కౌన్సిల్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా కేంద్రంలోని జిల్లా న్యాయవాదుల బార్ కౌన్సిల్ ఎన్నికలకు నోటిఫికేషన్ గురువారం విడుదలైంది. ఏడాదికి ఒకసారి జరిగే ఈ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ను ప్రస్తుత అధ్యక్ష, కార్యదర్శులు కె.ఈశ్వరరావు, వై.ప్రసన్నకుమార్ ప్రకటించారు. ఈ నెల 10న ఎన్నికల అధికారిని నియామకం, 17న నామినేషన్ల స్వీకరణ, 19న నామినేషన్లు పరిశీలన, 20న నామినేషన్ల ఉపసంహరణ, 21న పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా విడుదల చేస్తారు. 27న ఉదయం 10 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఫలితాలు విడుదల చేస్తారు. కార్యవర్గంలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శి, మహిళా ప్రతినిధులు తదితర సభ్యులను ఎన్నుకుంటారు. మహిళాభ్యున్నతికి తోడ్పాటు శ్రీకాకుళం అర్బన్ : మహిళాభ్యున్నతికి నాబార్డు అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థిక శక్తిగా ఎదగాలని నాబార్డు డీడీఎం కె.రమేష్ అన్నారు. శ్రీకాకుళం పట్టణంలో నాబార్డు, ఐసీడీఎస్ సంయుక్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు గురువారం ఐసీడీఎస్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యం, స్వయం ఉపాధి అభివృద్ధి అంశాలపై మహిళలు ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ బి.శాంతిశ్రీ, డీఆర్డీఏ డీపీఎం ఏ.శ్రీగౌరి, సీఐ టి.త్రినేత్రి, కేవీకే శాస్త్రవేత్తలు డాక్టర్ అనూష, డాక్టర్ వి.సునీత, సీడీపీవో శోభారాణి, డీసీసీబీ మేనేజర్ సంధ్యారాణి, ఝాన్సీ, లలిత, ఎఫ్పీఓలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
కన్నుమూత
బండారు చిట్టిబాబు చిట్టిబాబు పార్థివదేహానికి నివాళులు అర్పిస్తున్న ప్రముఖ గాయకులు బి.ఎ.నారాయణ, మండపాక శారద శ్రీకాకుళం కల్చరల్: లలిత సంగీతానికి ఎనలేని సేవలు అందించిన ప్రముఖ సంగీత కళాకారుడు బండారు చిట్టిబాబు(89) బుధవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూశారు. హార్మోనియం కళాకారుడిగా, ఆర్కెస్ట్రా నిర్వాహకుడిగా సుమారు ఏడు దశాబ్దాల పాటు కళామతల్లి సేవలో తరిస్తూ ఎంతో మంది గాయకులను తీర్చిదిద్దారు. 1936లో బండారు సత్యనారాయణ, వరాలమ్మ దంపతులకు 5వ సంతానంగా జన్మించిన చిట్టిబాబు సంగీతంలో అసమాన ప్రతిభతో రాణించారు. 400కుపైగా లలిత గీతాలకు స్వరకల్పన చేశారు. ప్రముఖ సినీ నటులు రావి కొండలరావు, తిమ్మరాజు శివరావుల సహకారంతో 1955లో సుకుమార్ ఆర్కెస్ట్రాను నెలకొల్పారు. సినీ రచయితలు దేవులపల్లి, ఆరుద్ర, సినారె, జొన్నవిత్తుల, దూసి ధర్మారావు తదితరులు రచించిన లలిత గీతాలకు స్వరకల్పన చేస్తూ హార్మోనియంపై వాయిద్య సహకారం అందించారు. ‘అంటరాని వారు ఎవరంటే’, ‘ఏది హిందూ.. ఏది ముస్లిం’ వంటి పాటలను జాతీయ భాషల్లో కూడా స్వరపరిచారు. ప్రముఖ సినీ గాయకులు జి.ఆనంద్, బి.ఎ.నారాయణలతో కలిసి రథసప్తమి సందర్భంగా ఏకాంత సేవ నిర్వహించారు. 1974లో రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకం, 1983లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా కళాప్రవీణ బిరుదులు అందుకున్నారు. 1984లో రాష్ట్ర సంగీత నాటక అకాడమీ సభ్యునిగా ఎనలేని సేవలు అందించారు. ఈయన కుమారుడు బండారు రమణమూర్తి తబలా కళాకారుడిగా ఏ–గ్రేడ్ ఆర్టిస్టుగా పేరుగాంచారు. 70 ఏళ్లుగా సంగీత సేవ నివాళులర్పించిన ప్రముఖులు ప్రముఖుల సంతాపం.. చిట్టిబాబు మృతి సంగీతానికి తీరని లోటని గాయకులు నిక్కు అప్పన్న, రెడ్క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు, తరుణి కృష్ణ సంస్థ ప్రతినిధులు మండా శ్రీనివాసరావు, ఎం.వి.కామేశ్వరరావు, ఉపనిషన్మందిరం అధ్యక్షుడు గుమ్మా నగేష్, సుమిత్రా కళాసమితి అధ్యక్షుడు ఇప్పిలి శంకరశర్మ, రంగస్థల కళాకారుల సమాఖ్య గౌరవ అధ్యక్షుడు ఎల్.రామలింగస్వామి, చిట్టి వేంకటరావు, రామచంద్రదేవ్, పన్నాల నరసింహమూర్తి, ప్రముఖ గాయకులు బి.ఏ.నారాయణ, మండపాక శారద, కె.ఎల్.ఎన్ మూర్తి, కళ్యాణం రామ్మోహన్రావు, తదితరులు సంతాపం తెలియజేశారు. -
అక్రమ వసూళ్లపై విచారణ పూర్తి
అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో కొందరు నిరుద్యోగులకు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు కల్పిస్తామంటూ అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ అసిస్టెంట్ కృష్ణమాచార్యులు వ్యవహారంపై విచారణ పూర్తయింది. దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు విశాఖపట్నం కనకమహాలక్ష్మి ఆలయ డిప్యూటీ కమిషనర్ శోభారాణి విచారణాధికారిగా హాజరై బుధవారం పలువురు సిబ్బందిని విచారణ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెన్షన్లో ఉన్న కృష్ణమాచార్యులుపై వచ్చిన అభియోగాలపై స్టేట్మెంట్ రికార్డు చేశారు. అనంతరం కొందరు దినసరి వేతనదారులను పిలిపించి ఉద్యోగాల కోసం ఎవరికి డబ్బులు చెల్లించారో లిఖితపూర్వకంగా నమోదు చేశారు. ఈ వ్యవహారంలో గతంలో పనిచేసిన ఈవో చంద్రశేఖర్, రిటైర్డ్ ఈవో జగన్మోహనరావు తదితరుల సూచనల మేరకు తాము గతంలో కృష్ణమాచార్యులుపై తప్పుడు ఫిర్యాదు ఇచ్చామని కొందరు దినసరి వేతనదారులు అంగీకరించినట్లు తెలిసింది. అలాగే విచారణకు హాజరైన కృష్ణమాచార్యులు మాట్లాడుతూ తాను నేరుగా ఎవరిదగ్గరా డబ్బులు వసూలు చేయలేదని చెబుతూనే కొందరు రెగ్యులర్ ఉద్యోగుల పీఆర్సీ వ్యవహారాల్లో తాను అడ్డుగా ఉన్నందున తనపై తప్పుడు ఫిర్యాదులు చేయించి సస్పెన్షన్కు గురిచేయించినట్లు విచారణాధికారికి వెల్లడించారు. మెడికల్ రీయింబర్స్మెంట్ విషయంలో కూడా ఎలాంటి వసూళ్లు చేపట్టలేదని వాంగ్మూలం ఇచ్చారు. ఈ మేరకు బాధితుల నుంచి, అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తుల నుంచి వివరాలు సేకరించామని, తుది నివేదికను ప్రభుత్వానికి నివేదించనున్నట్లు శోభారాణి తెలిపారు. -
దివ్యాంగులపై దయ లేదాయె..!
● టెక్కలి ఆస్పత్రిలో దివ్యాంగుల అవస్థలు ● పింఛన్ల పునఃపరిశీలన పేరిట తిప్పిస్తున్నారని ఆవేదన టెక్కలి: టెక్కలి జిల్లా ఆసుపత్రిలో దివ్యాంగులు అవస్థలు పడ్డారు. ఆస్పత్రిలో కొద్ది రోజులుగా చేపడుతున్న పింఛన్ల పునఃపరిశీలన ప్రక్రియలో భాగంగా బుధవారం సంతబొమ్మాళి, పాతపట్నం మండలాల నుంచి సుమారు 50 మంది వరకు దివ్యాంగులు చేరుకున్నారు. అయితే పునఃపరిశీలన ప్రక్రియ ఆపివేశామంటూ అక్కడ సిబ్బంది చెప్పడంతో ఆందోళనకు గురయ్యారు. వారం రోజుల క్రితం అనేక ప్రయాసలతో పునఃపరిశీలన కోసం వస్తే 5వ తేదీన రావాలని చెప్పారని.. తీరా మండుటెండలో అవస్థలు పడుతూ వస్తే ఇప్పుడు తాత్కాలికంగా నమోదు ఆపివేశారని చెప్పడం భావ్యం కాదంటూ పింఛన్దారులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామాల నుంచి ఇక్కడకు రావాలంటే ఆటోల్లో అనేక ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఉందని వాపోయారు. తమకు ఎటువంటి సమాచారం లేకుండా ఇలా అకస్మాత్తుగా నమోదు ఆపివేయడం సరికాదని నిరాశగా వెనుదిరిగారు. కాగా, పింఛన్ల పునఃపరిశీలన తాత్కాలికంగా ఆపేసిన విషయం తెలియక దివ్యాంగులు అవస్థలు పడాల్సి వచ్చింది. ఆస్పత్రిలో త్వరలోనే పునఃపరిశీలన ప్రారంభించనున్నట్లు సమాచారం. -
గోకార్టింగ్ సీజన్–2 ప్రారంభం
టెక్కలి: ఆటో మొబైల్ రంగంలో నూతన సాంకేతిక ఆవిష్కరణల దిశగా విద్యార్థులు ఆలోచనలు చేయాలని హైదరాబాద్కు చెందిన డీప్లూప్ టెక్నాలజీ సీఈవో కుసుమంచి సూర్యప్రకాశ్ కోరారు. టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల వేదికగా జాతీయ స్థాయి గోకార్టింగ్ సీజన్–2 పోటీలను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆటో మొబైల్ రంగంలో నూతన సాంకేతిక ఆవిష్కరణలు చేసిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఎన్నో వ్యయ ప్రయాసలతో పోటీలు నిర్వహిస్తున్న ఆదిత్య కళాశాలకు అలాగే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, ఒడిశా ప్రాంతాల నుంచి విచ్చేసిన విద్యార్థులను అభినందించారు. కళాశాల కార్యదర్శి ఎల్.ఎల్.నాయుడు, కోశాధికారి టంకాల నాగరాజు, డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావులు మాట్లాడుతూ.. తమ కళాశాలలో జాతీయ స్థాయి గోకార్టింగ్ పోటీలు రెండోసారి నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. మొత్తం 16 బృందాలు పాల్గొంటున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో గోకార్టింగ్ కన్వీనర్ ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, కో–కన్వీనర్లు డి.శ్రీరాములు, ఈసీఈ హెచ్వోడీ వి.అశోక్కుమార్, సీఎస్ఈ హెచ్వోడీ వై.రమేష్, ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్లు రఘువీర్, విద్యార్థి కన్వీనర్లు పి.ఉదయ్కుమార్, బి.సాయి సాకేత్ తదితరులు పాల్గొన్నారు. -
516 పెన్నులతో అలంకరణ
నరసన్నపేటలోని వేంకటేశ్వర ఆలయం సమీపంలో ఉన్న లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి బుధవారం 516 పెన్నులతో అర్చన చేశారు. అనంతరం వాటిని తోరణంగా అలంకరించారు. అర్చకులు భాస్కరబట్ల జగదీశ్వర శర్మ పూజా కార్యక్రమం పూర్తయ్యాక పదో తరగతి విద్యార్థులకు ఈ పెన్నులు పంపిణీ చేశారు. – నరసన్నపేట పీజీ మూడో సెమిస్టర్ ఫలితాలు విడుదల ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాలల పోస్టు గ్రాడ్యుయేషన్ మూడో సెమిస్టర్ ఫలితాలను బుధవారం ఎగ్జామినేషన్స్ డీన్ ఎస్.ఉదయ్భాస్కర్ విడుదల చేశారు. ఫలితాలను వర్సిటీ వెబ్సైట్, జ్ఞానభూమి పోర్టల్లో అందుబాటులో ఉంచారు. రీవాల్యుయేషన్కు 15 రోజుల్లోగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎకనామిక్స్, ఇంగ్లీష్, రూరల్ డెవలప్మెంట్, తెలుగు, ఎంకాం, ఎంబీఏ, ఎంఈడీ, ఎంఎల్ఐసీ, జువాలజీ, ఎంజేఎంసీ, మైక్రోబయోలజీ కోర్సుల్లో శతశాతం ఉత్తీర్ణత నమోదైంది. కంప్యూటర్ సైన్స్లో 22 మందికి 18 మంది, అప్లయిడ్ మ్యాథ్స్లో 8 మందికి ఏడుగురు, ఎనలిటికల్ కెమిస్ట్రీలో 41 మందికి 40 మంది, బయోటెక్నాలజీలో 25 మందికి 24 మంది, ఫిజిక్స్లో 12 మందికి 8 మంది, ఆర్గానిక్ కెమిస్ట్రీలో 185 మందికి 118 మంది, గణితంలో 15 మందికి 14 మంది ఉత్తీర్ణత సాధించారు. నేడు మద్యం షాపుల లాటరీ శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా లో గీత, సొండి కులా లకు కేటాయించిన 18 మద్యం షాపులకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చేతుల మీదుగా గురువారం ఉదయం 10 గంటలకు డ్రా తీయనున్నారు. ఈ మేరకు శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల సమీపంలోని అంబేడ్కర్ ఆడిటోరియానికి ఉదయం ఎనిమిది గంటలకల్లా దరఖాస్తుదారులు హాజరుకావాలని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి సీహెచ్.తిరుపతినాయుడు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నూతన మద్యం పాలసీ (2024–26)లో భాగంగా జిల్లాలో గీత, సొండి కులాల వారికి పదిశాతం మద్యం దుకాణాలు ప్రభుత్వం కేటాయించిన సంగతి తెలిసిందే. జిల్లాలో 18 షాపులకు 203 దరఖాస్తులు అందాయి. మొదటగా ఫిబ్రవరి 10న డ్రా తీయాలని నిర్ణయించినా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా వేశారు. పీడీఎస్ బియ్యం పట్టివేత గార : మండల పరిధిలోని అంపోలు జంక్షన్ వద్ద విజిలెన్స్, ఎన్ఫోర్సుమెంట్ అధికారులు సంయుక్తంగా జరిపిన దాడుల్లో 54 బస్తాల పీడీఎస్ బియ్యం పట్టుకున్నారు. బుధవారం సాయంత్రం సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా అక్రమంగా బియ్యం రవాణా చేస్తూ వాహనం పట్టుబడిందని విజిలెన్సు అధికారులు యు.వెంకటేష్, ఎస్సై రామారావు తెలిపారు. నడగాం గ్రామానికి చెందిన పొట్నూరు శ్రీరామమూర్తి స్థానికంగా బియ్యం సేకరించి నడగాం పరిసర ప్రాంతాల్లోని కోళ్లఫారాలకు రవాణా చేస్తున్నట్టు గుర్తించామని చెప్పారు. విజిలెన్స్ ఎస్పీ బి.ప్రసాదరావు ఆదేశాల మేరకు పీడీఎస్ అక్రమ రవాణాదారులపై నిఘా ఉంచామని, పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 307 మంది గైర్హాజరు శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు సాఫీగా సాగుతున్నాయి. నాలుగో రోజు బుధవారం జనరల్, ఒకేషనల్ రెండు విభాగాల్లో కలిపి 18,709 మంది సెకెండియర్ విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 18,402 మంది పరీక్ష రాశారు. 307 మంది గైర్హాజరయ్యారు. ఎలాంటి మాల్ ప్రాక్టీసు కేసు లు నమోదుకాలేదని ఆర్ఐఓ ప్రగడ దుర్గారా వు, డీవీఈఓ ఎస్.తవిటినాయుడు తెలిపారు. -
ధాన్యం కొనేదెప్పుడు అధ్యక్షా?
● శాసన మండలి సమావేశాల్లో ఎమ్మెల్సీ నర్తు రామారావు కవిటి : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సొంత జిల్లా శ్రీకాకుళంలో నేటికీ రైతుల వద్ద లక్షన్నర టన్నులకు పైగా ధాన్యం నిల్వలు ఉండిపోయాయని, వాటిని ప్రభుత్వం ఎప్పుడు కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్సీ నర్తు రామారావు ప్రశ్నించారు. శాసనమండలి సమావేశాల సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందు ఎంతో ఆర్భాటంగా చివరి ధాన్యపు గింజ వరకు కూడా కొనుగోలు చేస్తామని ప్రచారాలు చేశారని, కానీ స్థానికంగా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని చెప్పారు. రైతుల ఇళ్లు, కల్లాల వద్ద ధాన్యం నిల్వలు ఉండిపోయిన విషయమై గతంలో జిల్లా కలెక్టర్కు వివిధ మండలాల నుంచి రైతు సంఘాల నేతలు విన్నవించినా న్యాయం జరగలేదని పేర్కొన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి రైస్ మిల్లర్లకు టార్గెట్లు ఇచ్చి ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. -
ధాన్యం దళారులు భోజ్యం
సర్కారు చోద్యం ధాన్యం అమ్మలేకపోతున్నాం.. ● కొనుగోలు లక్ష్యాలను తగ్గించి రైతులను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం● ఒడిశా ధాన్యంతో టార్గెట్ పూర్తి చేశారంటున్న రైతులు● క్షేత్రస్థాయి పరిస్థితి గమనించని అధికారులు శ్రీకాకుళం పాతబస్టాండ్: అన్నదాత ఆరుగాలం కష్టించి పండించిన పంట దళారుల పాలవుతోంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో వరి కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. పంట దిగుబడిని గుర్తించడంలో లోపం, కొనుగోలు లక్ష్యాలు తక్కువగా పెట్టుకోవడం, ఆ లక్ష్యాలు నెరవేర్చేందుకు ఒడిశా ధాన్యం కొనడం వంటి తప్పిదాలు మన రైతుల పుట్టి ముంచాయి. ఎవరూ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో చివరకు మిల్లర్లు, మధ్యవర్తులతోనే బేరం కుదుర్చుకోవాల్సిన దుస్థితి రైతన్నలకు ఎదురవుతోంది. లక్ష్యం నిర్ణయంలోనే కుట్ర జిల్లాలో ఈ ఏడాది 3,60,325 ఎకరాల్లో వరి పండించారు. అయితే ఈ ఏడాది పంటలు ఆలస్యంగా వేసినా, దిగుబడి చాలా వరకు అనుకూలంగానే వచ్చింది. సుమారుగా ఈ ఏడాది వరి 8 లక్షల మెట్రిక్ టన్నుల పైబడి దిగుబడి వచ్చింది. అయితే కోనుగోలు లక్ష్యాన్ని కేవలం 4.90 లక్షల మెట్రిక్ టన్నులుగానే నిర్ధారించారు. అంచనాలు కావాలనే తక్కువ వేసి, కొనుగోలు టార్గెట్లు తగ్గించారు. జిల్లాలో వరి పండించే రైతులు సుమారుగా 2.5 లక్షల మంది ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కేవలం 99 వేల మంది రైతులు మాత్రమే పంటను విక్రయించారు. మిగిలిన వారు ధాన్యం విక్రయించే పరిస్థితి లేదు. గ్రామాల్లో దళారులు ధాన్యం కొనుగోలు టార్గెట్లు పూర్తయిపోయాయని అధికారులు చెబుతుండడంతో.. దళారులు ఈ పరిస్థితిని అలుసుగా తీసుకున్నారు. దళారుల్లో అధిక శాతం మంది అధికార పక్షానికి చెందిన వారే. వీరు మిల్లర్లతో మిలాఖత్ కావడం వల్ల ధాన్యం సగం ధర మాత్రమే పలుకుతోంది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో దళారు లు నేరుగా రైతుల వద్దకు వెళ్లి సగం ధరకే ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. దీనికి తోడు పీపీసీ కేంద్రాలు టార్గెట్ పూర్తి చేసే నెపంతో ఒడిశా ధాన్యం తీసుకువచ్చినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. సివిల్ సప్లై అధికారులు కూడా సహకరించడంతో టార్గెట్లు సజావుగా పూర్తయిపోయాయని అంటున్నారు. రాష్ట్రంలో గత ఐదేళ్లు ఈ పరిస్థితి లేదు. పీపీసీ కేంద్రాలు, రైతు భరోసాకేంద్రాల ద్వారా నేరుగా ధాన్యంను కళ్లం వద్దకు వచ్చి తీసుకెళ్లేవారు. ఈ ఏడాది ఆర్బీకేలు, పీపీసీ కేంద్రాలు, సివిల్ సప్లై అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ధాన్యం కొన డం లేదు. టార్గెట్లు అయిపోయాయని అంటున్నారు. ఖరీఫ్లో పండించిన ధాన్యం అమ్మలేని పరిస్థితి. – బి.వెంకటరమణ, వాకలవలస, శ్రీకాకుళం మండలం అపరాలు పండేంత వరకు.. జిల్లాలోని పలు మండలాల్లో ఫిబ్రవరి నెలాఖరు వరకు వరి నూర్చే పరిస్థితి లేదు. వరి చివరి కాలంలో ఆ పొలాల్లో మినుగులు, పెసలు వంటి అపరాలు పంటలు వేస్తారు. అవి పండేంత వరకు అక్కడే వరి కుప్పలు పెడుతున్నారు. అపరాలు పంటలు మార్చిలో చేతికి వస్తాయి. అప్పుడు వరి, అపరాలు రెండింటినీ నూర్పు యంత్రాల సాయంతో నూర్చడానికి చాలా మంది ప్రణాళిక వేసుకున్నారు. ప్రధానంగా నాగావళి, వంశధార తీరంలో ఉన్న మండలాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. -
జమ్మూకాశ్మీర్లో సిక్కోలు జవాన్ మృతి
వజ్రపుకొత్తూరు: మండలంలోని అమలపాడు గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ నాయక్ బచ్చల తిరుపతిరావు(26) జమ్మూకాశ్మీర్లో మృతి చెందాడు. ఏకే–47 గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే.. అమలపాడుకు చెందిన బచ్చల వెంకటరావు, కామేశ్వరి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు గోవింద గ్రామంలోనే నివాసం ఉంటుండగా.. చిన్న కుమారుడు తిరుపతిరావు 2017లో ఆర్మీలో చేరాడు. తండ్రి వెంకటరావు సైతం బీఎస్ఎఫ్లో జవాన్గా విధులు నిర్వహించారు. తిరుపతిరావుకు ఇటీవలే గ్రామానికి చెందిన అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది. ముందుగా ఇల్లు నిర్మించాలని భావించి కొంతమేర అప్పులు చేశారు. తర్వాత వివిధ కారణాలతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్లోని 8 ఆర్ఆర్ మద్రాస్ రెజిమెంట్ తరఫున ఈ నెల 4న ఎల్ఓసీ వద్ద తిరుపతిరావు విధులు నిర్వహిండగా ఒక్కసారిగా గన్ పేలిన శబ్దం వినిపించింది. వెంటనే ఆర్మీ అధికారులు వెళ్లి పరిశీలించగా తిరుపతిరావు ఏకే–47తో కాల్చుకుని చనిపోయినట్లు గుర్తించారు. అయితే మృతికి గల కారణాలు నిర్ధారించలేదు. అప్పులు ఎక్కువైపోవడం, వచ్చిన జీతం మిగలకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్లు కూడా కారణం కావచ్చనని మరికొందరు చెబుతున్నారు. తిరుపతిరావు మృతదేహం గురువారం అమలపాడుకు రానుంది. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయని గ్రామస్తులు తెలిపారు. ఏకే–47తో కాల్చుకుని చనిపోయినట్లు అనుమానాలు స్వగ్రామం అమలపాడులో విషాదఛాయలు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నేడు -
పనసతో విందు.. భలే పసందు
వజ్రపుకొత్తూరు: ఉద్దానం పనస ఉత్తరాదికి తరలి వెళుతోంది. హోలీ, ఉగాది పర్వదినాలు ముందుండడంతో ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి ఊపందుకుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో పనసతో చేసే విందులకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. పనస హల్వా, పొట్టు కూర, పకోడి, గింజల కూర, ఇడ్లీ పచ్చళ్లు, బూరెలు లాంటి వంటకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక స్థానికంగా ఉద్దానం ప్రాంతంలోని పెళ్లిళ్లలో పనస ముక్కల బిర్యాని, గూన చారు, పొట్టు కూరకు మంచి పేరుంది. ఇటీవల శాస్త్ర పరిశోధనల్లో పనస గింజలు, పొట్టుతో తయారు చేసే పొడితో షుగర్ వ్యాధికి ఇన్సులిన్ అదుపులో ఉంచుకునేందుకు అవసరమైన ఫైబర్ ఎక్కువ ఉందని తేలడంతో పనస ఆధారిత వంటకాలకు ప్రాధాన్యత పెరిగింది. సహజ సిద్ధంగా కల్తీ లేకుండా పెరిగే పనస ప్రతీ వయసు వారు తినేందుకు అనుకూలమైన ఫలం కావడం విశేషం. 70 శాతం ఎగుమతి చేసే ఒక్క కాయలోనే కాదు. 30 శాతం ఫలాలుగా తినే పండులోనూ మంచి పోషకాలు ఉంటాయని న్యూట్రీషియన్లు చెబుతున్నారు. మిశ్రమ పంటగా.. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం, గిరిజన ప్రాంతాల్లో ప్రధాన పంటగా కాకుండా 16వేల హెక్టార్లలో మిశ్రమ అంతర పంటగా దీన్ని రైతులు పండిస్తారు. సీతంపేటతో పాటు వజ్రపుకొత్తూరు, పలాస, మందస, కవిటి, సోంపేట, కంచిలి, ఇచ్ఛాపురం, నందిగాం మండలాల్లో ఏటా ఏప్రి ల్, మే నెలల్లో కాపునకు వచ్చే ఈ పంట ప్రస్తుతం ఫిబ్రవరి ప్రారంభంలోనే కాపునకు వచ్చింది. మే నెల వరకు వచ్చే కాపులో 70 శాతం మేర కాయలను ఉత్తరాది రాష్ట్రాలైన ఒడిశా, బీహార్ ఉత్తరప్రదేశ్, కోల్కతాలకు ఎగుమతి చేస్తున్నారు. పూండి, పలాస, హరిపురం, పాలకొండ కేంద్రాలుగా కిలో పనస కాయ రూ.25 ధరతో రోజుకు 55 టన్నుల వరకు ఎగుమతి చేస్తున్నారు. అంటే రోజుకు జిల్లా నుంచి రూ. 13.75 లక్షలు టర్నోవర్ జరుగుతోంది. దీంతో రైతులకు మే నెల వరకు మంచి ఆదాయం సమకూరుతుంది. అదనపు ఆదాయం పనస రైతులకు అదనపు ఆదాయ వనరు. జీడి, కొబ్బరి తోటల్లోని గట్లపై ఖాళీ స్థలాల్లో మిశ్రమ అంతర పంటగా సాగు చేస్తున్నారు. ఈ ఏడాది ఎలాంటి చీడ పీడ లు ఆశించకుండా పంట కాసింది. పంట ప్రారంభం కాబట్టి కిలో రూ.25ల వరకు ధర ఉంది. ఎకరాకి 4 నుంచి 10 చెట్లు వరకు గిరిజన, ఉద్దానం ప్రాంతాల్లో రైతులు పనసను పండిస్తున్నారు. ఏడాదికి రైతు రూ.20 వేలు వరకు ఆర్జిస్తున్నారు. – కె.సునీత, ఉద్యానవన శాఖ అధికారి, పలాసపనస ప..ద..ని..సవంటకాలు: హల్వా, పొట్టు కూర, పకోడి, గింజల కూర, ఇడ్లీ పచ్చళ్లు, బూరెలు ఉద్దానం ప్రాంతంలోని పెళ్లిళ్లలో పనస ముక్కల బిర్యాని, గూన చారు, పొట్టు కూర ఔషధ విలువలు: పనస గింజలు, పొట్టుతో తయారు చేసే పొడితో షుగర్ వ్యాధికి సంబంధించి ఇన్సులిన్ అదుపులో ఉంచుకునేందుకు అవసరమైన ఫైబర్ ఎక్కువ ఉందని శాస్త్ర పరిశోధనల్లో తేలింది. ఎగుమతి ఎక్కడికి: ఒడిశా, బీహార్ ఉత్తరప్రదేశ్, కోల్కతా -
● రంగంలోకి ‘అధికారిక’ దళారులు ● వారాంతంలో కీలక అధికారి చేతిలోకి వాటాలు! ● ప్రతి పనికీ రేటు విధానంపై విమర్శలు
జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి కార్యాలయం అరసవల్లి : జిల్లాలో అన్ని వర్గాల ప్రజలకు ఉచితంగా వైద్యసేవలు అందించాల్సిన వైద్య ఆరోగ్య శాఖలో.. వాటాల వ్యవహారం రచ్చరచ్చగా తయారైంది. వైద్య సేవలను పక్కనపెట్టి కేవలం పనులకు తగ్గట్టుగా ‘వసూళ్లు.. వాటాలే..’ ప్రధానమన్న రీతిలో కొందరు వ్యవహరించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ శాఖలో అవినీతి అక్రమాలు పెచ్చుమీరుతుండటం గమనార్హం. డెమో విభాగం, పరిపాలన విభాగం నుంచి చేస్తున్న కలెక్షన్లు అన్నీ కీలకాధికారికి పెద్ద వాటాగా వారాంతంలో జేబులోకి చేరేలా ఈ అధికారిక దళారులు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి పనికీ ఒక్కో రేటు..! జిల్లా వైద్యారోగ్య శాఖకు చెందిన అనేక అంశాలతో పాటు మార్కెట్లో ఎన్నో వ్యాపారాలకు ప్రత్యక్షంగా డీఎంహెచ్వో కార్యాలయం నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రైవేటు ఆస్పత్రుల రిజిస్ట్రేషన్లు, అనుమతులు పొడిగింపు, వివిధ రకాల వైద్య పరీక్షల ల్యాబ్ల ఏర్పాట్లు, స్కానింగ్ సెంటర్లు రిజిస్ట్రేషన్లు అనుమతులతో పాటు పౌల్ట్రీ ఫారం, గ్యాస్ గొడౌన్లు, పెట్రోల్ బంకుల ఏర్పాటుకు నో అబ్జక్షన్ సర్టిఫికెట్లు (ఎన్వోసి), ప్రైవేటు పాఠశాలకు శానిటేషన్ సర్టిఫికేట్లు, ఇలాంటి అనుమతులను డీఎంహెచ్ఓ కార్యాలయమే అనుమతి పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక విధుల్లో భాగంగా చేయాల్సిన సర్వీస్ రెగ్యులరైజేషన్లు, సర్వీస్ మేటర్లు, మెడికల్ లీవ్లు, మెటర్నటీ లీవ్స్, స్పెషల్ గ్రేడ్లు కేటాయింపు తదితర పరిపాలనాంశాలకు ఒక్కో రేటు ఫిక్స్ చేశారు. వీటికి గాను గరిష్టంగా రూ.50 వేల వరకు వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల పీహెచ్సీ వైద్యులకు అదే స్థాయిలో ఉండే ఓ మోనటరింగ్ విభాగ అధికారి జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసి కలెక్షన్లకు సిద్ధమవ్వాలంటూ హుకుం జారీ చేశారంటే పరిస్థితి ఎంతవరకు వచ్చిందో స్పష్టమవుతోంది. ఇక కీలకమైన మాస్ మీడియా సెక్షన్ పరిధిలో ఉన్న జిల్లాలో ఉన్న సుమారు 310 వరకు స్కానింగ్ సెంటర్లు, 3 వేలకు పైగా ఉన్న ల్యాబ్ల రెన్యువల్స్తో పాటు కొత్త రిజిస్ట్రేషన్లు, అనుమతిచ్చేందుకు గాను రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు వసూళ్లు మొదలుపెట్టేశారు. ఇందుకోసం కీలక అధికారి పేరిట మూడు వాటాలుగా కలెక్షన్లు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదంతా డీఎంహెచ్వోకు తెలిసే జరుగుతుందనే ప్రచారం బయటకురావడంతో జిల్లా వ్యాప్తంగా ఈ వాటాల వ్యవహారం చర్చనీయాంశమైంది. జిల్లాకు కొత్తగా వచ్చిన ఆయనకు స్థానిక జిల్లాకు చెందిన ఉద్యోగుల్లో ఎవరేంటో తెలియకపోవడంతోనే సమస్య వచ్చిపడిందంటూ ఉద్యోగుల్లోనే చర్చసాగుతోంది. ఇదిలావుంటే నిన్నమొన్నటివరకు డీఎంహెచ్వోగా పనిచేసిన ఓ అధికారిణి ప్రాక్టీస్ చేసిన ఆసుపత్రి నుంచి కూడా ఇప్పుడు కలెక్షన్లు రావాల్సిందే అని దళారీ అధికార బృందం పట్టుపట్టడం గమనార్హం. -
అదనపు వసూళ్లపై విచారణ
పొందూరు: మండల కేంద్రం పొందూరులో ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది సిలిండర్ల డెలివరీ సమయంలో అదనపు బిల్లులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదుపై ఐవోఎల్ అధికారులు మంగళవారం విచారణ జరిపారు. అదనపు వసూళ్లపై మూగోడువీధి మహిళలు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రతి ఇంటి వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. అదనపు వసూళ్లు వాస్తవమేనని కొందరు మహిళలు తెలిపారు. ఇప్పటికే రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు మూగోడువీధిలో విచారణ జరిపి కలెక్టర్కు నివేదికలు అందించారు. ఆలయంలో చోరీ కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని కొండమ్మతల్లి ఆలయంలో సోమవారం రాత్రి దొంగలు పడ్డారు. హుండీని దొంగలు పగలుగొట్టి నగదు పట్టుకుపోయారు. అక్కడి వస్తువులన్నీ చిందరవందరగా పడేశారు. స్థానికులు మంగళవారం ఉదయం పూజలు నిమిత్తం ఆలయానికి చేరుకుని పరిశీలించగా చోరీ జరిగిందని గుర్తించారు. అనంతరం కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందించగా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కాశీబుగ్గ పోలీసులు తెలిపారు. -
గ్రామ సచివాలయ సర్వేయర్ల ధర్నా
శ్రీకాకుళం పాతబస్టాండ్: గ్రామ సచివాలయం సర్వేయర్లపై పనిభారం తగ్గించాలని డిమాండ్ చేస్తు గ్రామ సచివాలయం సర్వేయర్ల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయం సర్వేయర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బూరాడ మధుబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక సర్వేయర్లపై పనిభారం, ఒత్తిడి, వేధింపులు ఎక్కువయ్యాయని చెప్పారు. క్షేత్రస్థాయి సమస్యలు తెలుసుకోకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రోసీజర్ (ఎస్ఓపీ) ప్రకారం పనిచేయాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారని, వీఆర్వోల పని కూడా తమతో చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా 28 మండలాల్లో రీ సర్వే జరుగుతోందని, ఆ పనులు పూర్తి కాకముందే మండలానికి రెండు గ్రామాలు వంతునా అదనంగా మరో 56 గ్రామాలు రీ–సర్వే చేయాలని ఉత్తర్వులు ఇవ్వడం దారుణమన్నారు. కొత్త పరికరాలు ఇవ్వకపోవడంతో సర్వే చేయడం కష్టంగా మారిందన్నారు. గతంలో క్షేత్రస్థాయిలో ఉన్నప్పుడు బయోమెట్రిక్ హాజరు వెసులుబాటు ఉండేదని, కొత్త ప్రభుత్వం వచ్చాక కచ్చితంగా కార్యాలయంలోనే హాజరువేయాలని నిబంధనలు విధించడం సరికాదన్నారు. సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధనకు ఈ నెల 9న విజయవాడలో పెద్ద ఎత్తున ర్యాలీ, నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. అనంతరం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్షుడు జగదీష్, కార్యదర్శి లోకేష్, రాష్ట్ర కో–ఆర్డినేటర్ మజ్జి అయ్యప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
మెళియాపుట్టి: మండలంలోని పట్టుపురం గ్రామానికి చెందిన పతివాడ మురళి మంగళవారం జాడుపల్లి గ్రామానికి వ్యక్తిగత పని నిమిత్తం బైక్పై వెళ్లి తిరిగి వస్తుండగా బురద రామచంద్రాపురం వద్ద అదుపు తప్పి పడిపోయాడు. తీవ్రంగా గాయపడటంతో స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించారు. సిబ్బంది వెంటనే చేరుకుని టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్కు తీసుకెళ్లారు. అంధత్వ నివారణే లక్ష్యం అరసవల్లి: జిల్లాలో అంధత్వ నివారణ లక్ష్యంగా ప్రతి ఒక్క కంటి వైద్యుడూ పనిచేయాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ బాలమురళీకృష్ణ సూచించారు. మంగళవారం తన చాంబర్లో కంటి వైద్యులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెలా నిర్వహిస్తున్న కాటరాక్ట్ శిబిరాలను సందర్శించి బాధితులను గుర్తించి జిల్లా కేంద్రానికి రిఫరల్ చేయాలన్నారు. ప్రతి నెలా అడ్వాన్స్డ్ టూర్ ప్రోగాం ప్రకారం ప్రతిరోజూ ఎఫ్ఆర్ఎస్ హాజరు నమోదు చేసుకోవాలని సూచించారు. అనంతరం బడిపిల్లలకు కళ్లద్దాలను సకాలంలో అందజేసినందుకు ఆప్తాలమిక్ అధికారులను అభినందించారు. సమావేశంలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రాం అధికారి డాక్టర్ త్రినాథరావు, డిప్యూటి పారా మెడికల్ అధికారి వాన సురేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. 8న పీఓడబ్ల్యూ సంస్థల విలీన సభ పలాస: ఒంగోలులో ఈ నెల 8న జరగనున్న పీఓడబ్ల్యూ(ప్రగతి శీల మహిళా సంఘం) సంస్థల విలీన సభను విజయవంతం చేయాలని సంఘం జిల్లా నాయకులు కోరారు. ఈ మేరకు పలాస మండలం మాకన్నపల్లిలో మంగళవారం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంస్థల జిల్లా అధ్యక్షులు ఎస్.కృష్ణవేణి, బి.ఈశ్వరమ్మలు మాట్లాడుతూ భావసారూప్యత కలిగిన అన్ని మహిళా సంఘాలు ఒకే వేదికపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా కార్యదర్శి పోతనపల్లి కుసుమ మాట్లాడుతూ మహిళా హక్కుల సాధనకు సంఘటిత పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘ నాయకులు కుత్తుం హేమక్క, బర్ల జానకి, సైని కళావతి, బత్తిన ఉమ, బత్తిన సాయమ్మ, వెంకటమ్మ, పూర్ణావతి, ధన లక్ష్మి, మోహిని తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల విజేతగా ‘జెస్సీ’ పలాస: మండలంలోని బొడ్డపాడు యువజన సంఘం 71వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో జెస్సీ(బొడ్డపాడు) జట్టు విజేతగా నిలిచింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 30 జట్లు పాల్గొన్న ఈ టోర్నీ మూడ రోజులుగా ఫ్లడ్లైట్ల వెలుగుల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉత్కంఠగా సాగిన ఫైనల్ పోటీల్లో బాహడపల్లి జట్టుపై జెస్సీ జట్టు విజయం సాధించింది. విజేత జట్టుకు రూ.40వేలు నగదు, షీల్డ్ను బొడ్డపాడు యువజన సంఘం అధ్యక్షుడు తామాడ క్రాంతి చేతుల మీదుగా అందజేశారు. రన్నరప్కు రూ.30వేలు, షీల్డు, తృతీయ స్థానంలో నిలిచిన వైజాగ్ వారియర్స్కు రూ.20వేలు నగదు, నాలుగో స్థానంలో నిలిచిన విజయనగరం జట్టుకు రూ.10వేలు చొప్పున నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జైభీమ్ యువజన సంఘం అధ్యక్షుడు కిక్కర ఢిల్లీరావు, కరగాన సుధా, కరగాన కుమార్, బొడ్డు జగన్, రెయ్యి మోహనరావు, బొడ్డు శ్రీనివాస్, రాజాం శ్రీనివాస్, గర్తం తులసీరావు, పోతనపల్లి గణపతి, బుడత బాలరాజు, కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రాపాక అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు. -
పాల వ్యాన్ ఢీకొని వ్యక్తి మృతి
మెళియాపుట్టి: నడుచుకుంటూ వెళున్న వ్యక్తిని వాహనం ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మెళియాపుట్టి మండలకేంద్రంలో మంగళవారం వేకువజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా భిన్నాళ గ్రామానికి చెందిన మదన్ జెన్నా (52) ప్రతి రోజు మెళియాపుట్టి వచ్చి కూరలు అమ్ముతుంటాడు. ఎప్పటిలాగే మంగళవారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో గ్రామానికి చెందిన బిసక్ ప్రధాన్తో కలిసి మెళియాపుట్టి బయలుదేరాడు. బిసక్ ప్రధాన్ వ్యక్తిగత పనిపై ఓ చోట ఆగిపోయారు. మదన్ జెన్నా నడుచుకుని వెళ్తుండగా మూడురోడ్ల కూడలి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని ఆపకుండా వెళ్లిపోయింది. తలకు బలమైన గాయం కావడంతో మదన్ అక్కడికక్కడే మృతిచెందాడు. కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడి సీసీ కెమెరాలు పరిశీలించగా పాలవ్యాన్ ఈ ప్రమాదానికి కారణమని గుర్తించారు. అనంతరం డ్రైవర్ బొడ్డేపల్లి రోహిత్కుమార్ను అరెస్ట్ చేశారు. ఎస్సై రమేష్బాబు మృతదేహాన్ని పరిశీలించి పోస్ట్మార్టం నిమిత్తం పాతపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మదన్కు భార్య ఫుల్లో జెన్నా, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
నిర్మాణ పనుల్లో నాణ్యత తప్పనిసరి
● ఐటీడీఏ పీఓ యశ్వంత్కుమార్ రెడ్డి మెళియాపుట్టి : మల్టీపర్పజ్ సెంటర్ల నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని సీతంపేట ఐటీడీఏ పీఓ యశ్వంత్కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం మెళియాపుట్టి మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. ఎర్రమానుగూడ, సవర చీడిపాలెం, నందల పాడు గ్రామాల్లో జరుగుతున్న మల్టీపర్పజ్ సెంటర్లను పరిశీలించి స్టీల్, సిమ్మెంట్, ఇటుకల నాణ్యతపై ఆరా తీశారు. పనుల్లో నాణ్యత పరిశీలించడానికి ప్రత్యేక బృందాలను పంపిస్తామన్నారు. భవనాలకు ఉన్న విద్యుత్ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని పీఓ చెప్పారు. అనంతరం భరణికోట గిరిజన బాలికల సంక్షేమ ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. మరుగుదొడ్లు, తరగతిగదులు, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. పదో తరగతి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం కరజాడ పీహెచ్సీని సందర్శించి ఓపీ పరిశీలించారు. ఆయనతో పాటు పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఫేక్ సర్టిఫికెట్లపై విచారణ..
జిల్లా వైద్యారోగ్య శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈవో) పోస్టు ఇస్తున్నట్లుగా కొందరు నిరుద్యోగులకు ఫేక్ సర్టిఫికెట్లను జారీ చేసిన ఉదంతం నాలుగు నెలల క్రితమే బయటకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బాధితుల ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారులు సైతం విచారణకు ఆదేశించడం..ఇటీవలే డీఎంహెచ్వో బాలమురళీకృష్ణ సమక్షంలోనే విచారణాధికారిగా విశాఖపట్నం డీఎంహెచ్వో జగదీశ్వరరావు స్వయంగా విచారణ ప్రక్రియ చేపట్టారు. ఈ వ్యవహారంలో బాధితులిచ్చిన ఫిర్యాదు ప్రకారం అనుమానితులుగా ఉన్న సూపరింటెండెంట్ భాస్కరకుమార్, కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్ జి.వి.నరసింహంలపై చర్యలకు దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులోనుంచి ఎలాగైనా శాఖాపరమైన చర్యల నుంచి తప్పించుకునేందుకు కొత్తగా దళారీ వ్యవస్థ రంగంలోకి దిగింది. వారిద్దరికీ సహకరించేలా స్థానికంగా శాఖకు చెందిన కీలక అధికారి జేబు నింపేందుకు దళారీ వ్యవహారం సిద్ధమైంది. దీంతో ఈ విచారణ పక్కదారి పట్టే అవకాశాలున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలావుంటే ఈ ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారంపై జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ పిరియా విజయ కూడా సమావేశంలో ఇటీవల ప్రస్తావించి.. అనుమానితులపై శాఖాపరంగా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించిన సంగతి విదితమే. ఏదిఏమైనా వైద్యారోగ్యశాఖలో జరుగుతున్న వరుస అక్రమాలు, అక్రమ వసూళ్ల వ్యవహారం కూటమి ప్రభుత్వం వచ్చాక శృతిమించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
టీచర్లకు వెబ్ ఆధారిత బదిలీలు వద్దు
● మాన్యువల్గానే నిర్వహించాలి ● ఎస్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి గురుగుబెల్లి రమణ శ్రీకాకుళం న్యూకాలనీ: వెబ్ కౌన్సిలింగ్, వెబ్ ఆధారిత బదిలీల పట్ల తమకు నమ్మకం లేదని, మాన్యువల్ విధానంలోనే కౌన్సిలింగ్ నిర్వహించాలని ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గురుగుబెల్లి రమణ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని దాసరి క్రాంతిభవన్లో మంగళవారం ఉపాధ్యాయ బదిలీల చట్టం డ్రాఫ్ట్పై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాన్యువల్ విధానమే కావాలంటూ రాష్ట్రంలో లక్షలాది మంది ఉపాధ్యాయులు గగ్గోలు పెడుతున్నా విద్యాశాఖ ఉన్నతాధికారులు తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకపోవడం సరికాదన్నారు. తాజాగా విడుదల చేసిన డ్రాఫ్ట్లో సైతం వెబ్ ఆధారిత కౌన్సిలింగ్ విధానమే ఉంటుందని ఉన్నతాధికారులు తెలియజేయడాన్ని ఎస్టీయూ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెబ్ కౌన్సిలింగ్లో వేలాది ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుందని.. సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులైతే.. ఒక జిల్లాలో 3,500 నుంచి 5వేల సంఖ్య వరకు సీనియారిటీ లిస్టు ఉంటుందన్నారు. అందులో చివర ఉన్న వ్యక్తులు 4వేల వరకూ పాఠశాలకు ఆప్షన్స్ ఇవ్వడం దాదాపు అసాధ్యమని, ఇదెంతో తీవ్రమైన ఒత్తిడితో కూడిన అంశం కాదా ? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో దాదాపు 98 వేల మంది సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు వెబ్ కౌన్సలింగ్ వద్దని మొరపెట్టుకుంటున్నా వినిపించుకోకుండా విద్యాశాఖాధికారులు ఎవరి ప్రయోజనాలు కోసం వెబ్ కౌన్సలింగ్లో బదిలీలు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా కూటమినేతలు, విద్యాశాఖ మంత్రి కలుగజేసుకొని ఉన్నతాధికారులు ఒంటెద్దు పోకడలను నిలువురించకపోతే భవిష్యత్తులో మూల్యం చెల్లించకతప్పదని స్పష్టం చేశారు. అనంతరం మండలాల నాయకులు, పలువురు ఉపాధ్యాయులు డ్రాఫ్ట్ చట్టంపై ఉన్న అభ్యంతరాలను ప్రొఫార్మాలో నింపి పాఠశాల విద్యాశాఖకు మెయిల్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పి.రామకృష్ణ, కె.శ్రీనివాసరావు, జి.శ్రీను, ఎం.తేజ, చింతల రామారావు, చౌదరి జగన్ తదితరులు పాల్గొన్నారు. -
అందరికీ అందుబాటులో ఉంటా..
కలిసికట్టుగా పనిచేద్దాం.. పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్గా కురసాల కన్నబాబును నియమించడం సంతోషంగా ఉందన్నారు. పార్టీ శ్రేణులంతా కలిసి కట్టుగా పనిచేస్తే విప్లవాత్మకమైన మార్పులు వస్తాయన్నారు. వైఎస్సార్ హయాంలో 9 సీట్లు వచ్చాయని ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటన్నారు. ఆ తరువాత జగన్ కీలకంగా మారారని పోరాటం చేసి వైఎస్సార్సీపీని పటిష్టంగా నిలబెట్టారన్నారు. ఓటమిని అంగీకరించే తత్వం చంద్రబాబుకి లేదన్నారు. ● కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి ● వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు ● ఓటమిని అంగీకరించడం చంద్రబాబుకి చేతకాదు: ధర్మాన కృష్ణదాస్ ● పాలనంటే రెడ్బుక్ రాజ్యాంగమా : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): వైఎస్సార్సీపీ శ్రేణులందరికీ తాను అన్ని వేళల్లో అందుబాటులో ఉంటానని, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాల్సిన అవసరం ఉందని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు. అర్ధరాత్రి ఫోన్ చేసి సమస్య ఉందని చెప్పినా స్పందిస్తానని భరోసానిచ్చారు. పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్గా బాధ్యతలు చేపట్టాక తొలిసారి మంగళవారం శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు, పార్టీశ్రేణులతో సమావేశం నిర్వహించారు. ముందుగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. తనను నోటికి వచ్చినట్టు తిట్టిన వారితోనే చంద్రబాబు జతకట్టి ఎన్నికల్లో గెలిచారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అప్పట్లో టీడీపీకి అభ్యర్థులే దొరకలేదని గుర్తు చేశారు. చంద్రబాబు, పవన్ పూటకో విషయం మాట్లాడతారని, 9 నెలలు తిరగకముందే ప్రభుత్వంపై జనం ఆగ్రహంగా ఉన్నారని అన్నారు. అక్రమంగా కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే భయపడేది లేదని అన్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎన్నికల్లో కూటమి మద్దతిచ్చిన అభ్యర్థి రఘువర్మ ఓడిపోవడంతో ఆయన తమ పార్టీ అభ్యర్థి కాదనడం టీడీపీకి సిగ్గుచేటన్నారు. పొరపాట్లు జరిగితే సరిదిద్దుకునే దమ్మున్న వ్యక్తి జగన్ అని తెలిపారు. పార్టీని స్థాపించిన వారిని వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్న వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్ గెలవడం ఖాయమన్నారు. ● ఈ సందర్భంగా విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలని, కూటమి నేతలకు భయపడకుండా ఉండాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం పతనం ఉత్తరాంధ్ర తోనే స్టార్ట్ అయ్యిందన్నారు. ఓటమిని జీర్ణించుకోలేని పరిస్థితి ఈ జిల్లాలో టీడీపీ నాయకులకు ఉందన్నారు. ● జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పిరియా విజయసాయిరాజ్, పార్టీ ఎచ్చెర్ల నియోజకవర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్కుమార్, పాతపట్నం నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి శాంతి, ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ మాట్లాడుతూ నెలకోసారి జిల్లా సమన్వయ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. జగనన్న ఉద్దానం ప్రాంతానికి తాగునీరందించి ఆదుకుంటే ఆ పథకాన్ని కూటమి కొనసాగించలేకపోవడం దౌర్భాగ్యమని అన్నారు. ● టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ మాట్లాడుతూ టెక్కలిలో అచ్చెన్నాయుడు మనుషులే అధికారులుగా ఉన్నారని దీంతో అధికార దుర్వినియోగం చాలా ఎక్కువవుతుందన్నారు. దీంతో వైఎస్సార్సీపీ సర్పంచులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ తూర్పుకాపు రాష్ట్ర అ ధ్యక్షుడు మామిడి శ్రీకాంత్, కళింగవైశ్య రాష్ట్ర అధ్యక్షుడు అంధవరపు సూరిబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేవీజీ సత్యనారాయణ, యువజన విభాగం ఉత్తరాంధ్ర అధ్యక్షుడు ఎంవీ స్వరూప్, జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, చింతాడ వరుణ్, అంబటి శ్రీనివాసరావు, ఎంవీ పద్మావతి, గొండు కృష్ణ, సాధు వైకుంఠరావు, ఎంఏ భేగ్, పొన్నాడ రుషి, రౌతు శంకరరావు, పీస గోపి, వైవీ శ్రీధర్, ఎన్ని ధనుంజయరావు, టి.కామేశ్వరి, గుంట జ్యోతి, బొడ్డేపల్లి పద్మజ, శాడి శ్యామ్ప్రసాద్రెడ్డి, పాల వసంతరెడ్డి, మార్పు పృథ్వీ, బూర్లె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి, పార్టీ డాక్టర్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ సాధారణ వ్యక్తి రీజనల్ కో ఆర్డినేటర్ స్థాయికి ఎదగడం గర్వకారణమన్నారు. పయ్యావుల కేశవ్ బడ్జెట్ పెడుతూ జగన్ సమయంలో ఆర్థిక విధ్వంసం చేశారనడం హాస్యస్పదంగా ఉందన్నారు. జగన్ వల్ల దేశంలో అప్పు పుట్టడం లేదంటూనే 2024–25 ఆర్థిక సంవత్సరానికి లక్షానలభై వేల కోట్ల అప్పు ఎలా తెచ్చారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు పడిన విషయాన్ని గమనించాలన్నారు. అమ్మఒడి రెండేళ్లు ఎగ్గొట్టడానికి చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. -
యువతి ఆత్మహత్య
కవిటి: మండలంలోని సీహెచ్ కపాసుకుద్ధి పంచాయతీ వడ్డిపుట్టుగకు చెందిన ఎలుసూరు సోనియా(25) అనే యువతి మంగళవారం సాయంత్రం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సోనియా మానసిక సమస్యలతో బాధపడుతోంది. కొన్నాళ్లుగా చికిత్సకూడా పొందుతోంది. ఇటీవలే ఆరోగ్యం కుదుటపడటంతో కుటుంబసభ్యులు పెళ్లి సంబంధం చూశారు. మే నెలలో వివాహానికి ముహూర్తం పెట్టుకున్నారు. ఇంతలో సోనియా ఆత్మహత్యకు పాల్పడడంతో విషాదఛాయలు అలముకున్నాయి. తండ్రి ఆనంద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కవిటి ఎస్ఐ వి.రవివర్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళా ఉద్యోగులకు చట్టాలపై అవగాహన
శ్రీకాకుళం అర్బన్: ప్రతి మహిళా ఉద్యోగి చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, వాటిని సామాన్య ప్రజలకు చేరువ చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు అన్నారు. జిల్లాకేంద్రంలోని ఐసీడీఎస్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులకు ప్రస్తుతం జరుగుతున్న నేరాలు, వాటికి విధిస్తున్న శిక్షలు, చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సన్యాసినాయుడు మాట్లాడుతూ కొత్త చట్టాలను వివరించారు. ఐసీడీఎస్ పీవో బి.శాంతిశ్రీ మాట్లాడుతూ పలు చట్టాలను ఉదహరిస్తు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సమాజ సేవకులు హారికా ప్రసాద్, పీఓఐసీ మెట్ట మల్లేశ్వరరావు, విభిన్న ప్రతిభావంతుల ప్రాజెక్ట్ అధికారి కవితా, ఐసీడీఎస్ నోడల్ అధికారి మణెమ్మ, మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ లక్ష్మి, పీఓఎన్ఐసీ లక్ష్మునాయుడు, పలువురు మహిళలు, బాలికలు పాల్గొన్నారు. -
నరకం
గంటల రాజాం పైపు నిలిచిపోయిన భారీ వాహనాలుపొందూరు పరీక్ష కేంద్రంలో పరీక్షలు రాసేందుకు నడిచి వెళ్తున్న విద్యార్థులు కూరుకుపోయిన భారీ లారీ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటాం జి.సిగడాం: మండలంలోని దవళపేట గ్రామ సమీపంలో దారికి అడ్డంగా ఓ లారీ నిలిచిపోవడంతో ప్రయాణికులు నాలుగు గంటల పాటు నరకం చూశారు. రాజాం–శ్రీకాకుళం ప్రధాన రహదారి, దవళపేట గ్రామ సమీపంలో కల్వర్టు పనులు జరుగుతున్నాయి. వాహనాల రాకపోకల కోసం పక్క నుంచి డైవర్షన్ రహదారి ఏర్పాటు చేశారు. ఈ రహదారిలో మంగళవారం వేకువజామున 2 గంటల సమయంలో అధిక లోడుతో వెళ్తున్న ఓ సిమెంట్ లారీ కూరుకుపోయింది. దీంతో రాజాం–శ్రీకాకుళం వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం 4 గంటల నుండి 8 గంటల వరకు వాహనాలన్నీ నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న రహదారులు భవనాల శాఖ ఏఈఈ పీటీ రాజు సంఘటన స్థలానికి చేరుకుని లారీని యంత్రాల సాయంతో బయటకు తీయించారు. దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించారు. దవళపేట వద్ద ట్రాఫిక్ జామ్ డైవర్షన్ వద్ద మట్టిలో కూరుకుపోయిన భారీ లారీ అవస్థలు పడిన ప్రయాణికులు -
నాలుక మడతేసిన టీడీపీ
అవునా.. అచ్చెన్న మద్దతిచ్చారా. దానిపై నాకు అవగాహన లేదు. నేను రాజకీయాలకు అతీతంగా పోటీ చేసి గెలిచాను. ఎవరి ఫొటోలు పెట్టుకుని గెలవలేదు. ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో గెలిచా. నా గెలుపును రాజకీయాలతో ముడి పెట్టొద్దు. అవసరమైతే ప్రభుత్వంపై సామదానభేద దండోపాయాలకు సిద్ధంగా ఉన్నాను. – గెలిచాక ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు చేసిన వ్యాఖ్యలివి. ● ఎమ్మెల్సీ ఓటమి తర్వాత మాట మార్చిన వైనం ● పాకలపాటి రఘువర్మతో పాటు గాదెకు ఓటేయాలని చెప్పినట్టు బుకాయింపు ● రఘువర్మ కోసం ఎన్నికల్లో గట్టిగా పనిచేసిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ● పోలింగ్ రోజునైతే ఎక్కడికక్కడ శిబిరాలు ఏర్పాటు చేసి ప్రచారం ● ఎన్ని చేసినా ఓటమి పాలైన టీడీపీ బలపరిచిన అభ్యర్థి సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ తనకు అలవాటైన ఆటను మరోసారి రక్తికట్టించింది. గెలిస్తే మనోడు.. ఓడిపోతే వేరే వాడు అన్నట్లు నిస్సిగ్గుగా వ్యవహరించింది. ఏపీటీఎఫ్ తరఫున పోటీ చేస్తున్న పాకలపాటి రఘువర్మను బలపరుస్తున్నామని టీడీపీ నాయకులు బహిరంగంగా ప్రకటించారు. ఎన్నికల ప్రచారం దగ్గర నుంచి పోలింగ్ వరకు అన్ని బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. తీరా రఘువర్మ ఓడిపోయాక గెలిచిన అభ్యర్థి గాదె శ్రీనివాసులునాయుడు ‘మావోడే’ అని ప్రకటించుకోవడం చర్చనీయాంశంగా మారింది. కానీ గాదె శ్రీనివాసులు నాయుడు ఎక్కడా సానుకూలంగా స్పందించలేదు సరికదా.. అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు విని.. అవునా.. అచ్చెన్న మద్దతిచ్చారా.. నాకు తెలియదే అంటూ తిప్పికొట్టారు. దీంతో టీడీపీ అప్రతిష్ట పాలైంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారం ప్రారంభం కావడమే తరువాయి టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలంతా రంగంలోకి దిగి, తాము బలపరిచిన పాకలపాటి రఘువర్మను గెలిపించాలని, టీడీపీ మద్దతు ఉన్న రఘువర్మకు టీడీపీ సానుభూతి పరులంతా సహకరించాలని వాడవాడలా ప్రచారం చేశారు. ప్రచారం చేసిన సమయంలో వారే తమ ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. ఇక, ఎన్నికల దగ్గర కొచ్చాక సీఎం చంద్రబాబునాయుడు పలు పర్యాయాలు టెలీ కాన్ఫరెన్స్లు పెట్టి పార్టీ మద్దతిచ్చిన రఘువర్మను ఎట్టి పరిస్థితుల్లో గెలిపించాలని, ఎమ్మెల్యే, మంత్రులు, ఎంపీలు బాధ్యత తీసుకోవాలని కూడా ఆదేశించారు. విశ్రమించకుండా పోలింగ్ వరకు పనిచేయాలని, ఆయన గెలుపును భుజాన వేసుకోవాలని సూచించారు. దానికి తగ్గట్టుగానే పోలింగ్కు మూడు రోజుల ముందునుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు మరింత స్పీడు పెంచారు. నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా సమావేశాలు పెట్టి, రఘువర్మకు ఓటు వేసేలా చూడాలని శ్రేణులను కూడా సమాయత్త పరిచారు. పోలింగ్కు ముందు రోజైతే కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూటమి పార్టీల అగ్రనేతల ఫొటోలను పెట్టుకుని, మరోవైపు మద్దతిచ్చిన రఘువర్మ నిలువెత్తు ఫొటోను డిస్ ప్లే చేసి ప్రత్యేక వీడియో విడుద ల చేశారు. టీడీపీ, జనసేన బలపరిచిన పాకలపాటి రఘువర్మను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఇక పోలింగ్ రోజునైతే ఏపీటీఎఫ్ కంటే కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలే ఎక్కువగా పనిచేశారు. పోలింగ్ కేంద్రాల దగ్గరలో ఏర్పాటు చేసిన శిబిరాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూర్చొని పాకలపాటి రఘువర్మకు ఓటు వేయాలని కోరారు. నరసన్నపేట నియోజకవర్గంలో బగ్గు రమణమూర్తి, ఎచ్చెర్ల నియోజకవర్గంలో నడికుదిటి ఈశ్వరరావు, ఆమదాలవలస నియోజకవర్గంలో కూన రవికుమార్, పాతపట్నం నియోజకవర్గంలో మామిడి గోవిందరావు, శ్రీకాకుళంలో గొండు శంకర్, టెక్కలిలో పలువురు టీడీపీ నాయకులు, పలాస నియోజకవర్గంలో గౌతు శిరీష భర్త వెంకన్న చౌదరి, పొందూరులో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు నేరుగా పోలింగ్ కేంద్రాలకు సమీపంలో ఏర్పాటు చేసిన శిబిరాల్లో గంటల తరబడి ఉండి, ఓటు వేసేందుకు వచ్చిన ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు. టీడీపీ బాటలోనే జనసేన నాయకులు కూడా పెద్ద ఎత్తున ప్రచారంలోనూ, పోలింగ్ రోజున కష్టపడి పనిచేశారు. పోలింగ్ అనంతరం పాకలపాటి రఘువర్మ కోసం నిరంతరం కష్టపడి పనిచేసిన కూటమి నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఫేస్బుక్ల్లోనూ, వాట్సాప్ గ్రూపుల్లోనూ పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు పోస్టులు కూడా పెట్టారు. ఏ సందర్భంలో కూడా రెండో ప్రాధాన్యత ఓటు గాదెకు వేయాలని ఒక్కసారీ విజ్ఞప్తి చేయలేదు. కనీసం ప్రకటన కూడా విడుదల చేయలేదు. కానీ రఘువర్మ ఓడిపోగానే.. రెండో ప్రాధాన్యత ఓటు గాదె శ్రీనివాసులునాయుడుకు వేయాలని తామే చెప్పామని, ఇద్దరు మన అభ్యర్థులే అని చెప్పుకోవడం విడ్డూరంగా మారింది. టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలతో గెలిచిన గాదె శ్రీనివాసులు నాయుడే కాదు ఓడిపోయిన పాకలపాటి రఘువర్మ కూడా బాధపడే ఉంటారు. -
ఈ ఓటమి.. అసమర్థ పాలనకు సాక్ష్యం
మంత్రి అచ్చెన్న వ్యాఖ్యలు సరికాదు●● ఉపాధ్యాయ ఉద్యమాన్ని అవమానించడం తగదు ● ఉపాధ్యాయ ఉద్యమంలో చీలికలు తెచ్చిందే కూటమి ప్రభుత్వం ● ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై పోరాటమే తమ లక్ష్యమని యూటీఎఫ్ నాయకుల వెల్లడి శ్రీకాకుళం న్యూకాలనీ: ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర మంత్రి కె.అచ్చెనాయుడు ఉపాధ్యాయ ఉద్యమాన్ని అవమానించేలా చేసిన వ్యాఖ్యలు ఎంతమాత్రం సరికాదని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కిషోర్కుమార్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్.బాబూరావు, బి.శ్రీరామమూర్తి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చౌదరి రవీంద్ర, కోశాధికారి బి.రవికుమార్, గౌరవాధ్యక్షులు కె.వైకుంఠరావు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. యూటీఎఫ్కు వైఎస్సార్ సీపీ ముసుగు వేస్తూ మంత్రి అచ్చెన్న వ్యాఖ్యలు చేయడాన్ని యూటీఎఫ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వాస్తవానికి ఏపీటీఎఫ్, పీఆర్టీయూ అభ్యర్థులకు కూటమి ముసుగు వేయ డం ద్వారా అధికార పక్షమే ఉపాధ్యాయ ఉద్యమంలో చీలికలు తెచ్చిందని వారు విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన పార్టీలు బహిరంగంగా మద్దతు పలికిన అభ్యర్థి ఓటమి చవిచూడటాన్ని చూస్తుంటే.. వారి అసమర్థ పరిపాలనకు, ఉద్యోగ, ఉపాధ్యాయ, అధ్యాపక, ఆచార్యుల ఆగ్రహానికి నిదర్శనమన్నారు. విద్యారంగంలో అనుసరిస్తున్న విధానాలకు చెంపపెట్టే కూటమి అభ్యర్థి ఓటమి అనే విషయాన్ని ఇప్పటికై నా అధికార పాలకులు గ్రహించాలని కోరారు. ఈ ఎన్నికల్లో పీడీఎఫ్ స్వతంత్రంగా పోటీ చేసిందని.. దానికి యూటీ యఫ్, ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయని వారు గుర్తుచేశారు. ఏ అధికార, ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా గానీ, వ్యతిరేకంగా గానీ యూటీఎఫ్ పనిచేయదని స్పష్టం చేశారు. ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల పట్ల తమ పోరాటాన్ని నిరంతరం కొనసాగిస్తూనే ఉంటామని కిషోర్కుమార్, బాబూరావు, శ్రీరామమూర్తి పేర్కొన్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే.. కూటమి ప్రభుత్వం ఆలోచనలు, నిర్ణయాలు అత్యంత ప్రమాదకారంగా ఉంటున్నాయని పేర్కొన్నారు. పీడీఎఫ్ అంటే సర్కారుకు భయం శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వం ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ అంటే భయపడుతోందని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ పేర్కొన్నా రు. తాజాగా జరిగిన శాసన మండలి ఎన్నికలు దీన్ని రుజువు చేశాయని తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాల్లో ఇద్దరేసి అభ్యర్థులను తమవారిగా చెప్పుకోవడం సిగ్గుచేటు అని అన్నారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పీడీఎఫ్ సభ్యులు బహిరంగ పోరాటాలు చేయడంతో పాటు మండలిలో ప్రభుత్వాలను నిలదీశారని గుర్తు చేశారు. ఎన్నికల్లో నైతిక విజయం విజయ గౌరీదే అని పేర్కొన్నారు. బుచ్చిపేటకు జ్వరమొచ్చింది..! నరసన్నపేట: మండలంలోని మడపాం పంచాయతీ బుచ్చిపేట మంచం పట్టింది. గ్రామంలో ప్రతి ఇంటా జ్వర పీడితులు కనిపిస్తున్నారు. జ్వరం తగ్గి కీళ్ల నొప్పులతో ఉన్నవారు కొందరైతే, జ్వరంతో మంచం పట్టిన వారు మరి కొందరు. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. జ్వరం తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తోందని అంటున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవా లని కోరుతున్నారు. జ్వరాల గురించి తెలుసుకున్న మాకివలస పీహెచ్సీ సిబ్బంది నీటిని పరీక్షలకు పంపినా ఎలాంటి కాలుష్యం కనిపించలే దు. దీంతో సీజనల్ జ్వరాలుగానే భావిస్తున్నారు. అధికారులు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
పింఛన్లు ఆపేశారు మహాప్రభో
సంతబొమ్మాళి: సంతబొమ్మాళి పంచాయతీ నగిరిపెంట గ్రామానికి చెందిన పదిమంది తమ పింఛన్లు ఆపేశారంటూ ఎంపీడీఓ జయంతి ప్రసాద్ ముందు గోడు వెళ్లబోసుకున్నారు. అందరికీ ఈ నెల 1వ తేదీన పింఛన్లు ఇచ్చి తమవి ఎందుకు ఆపేశారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన వ్యక్తి తమపై ఫిర్యాదు చేశారని, ఆ తర్వాత తమ పింఛన్లు హోల్డ్లోకి వెళ్లిపోయాయని రకరకాల కారణాలు చెప్పి పింఛన్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు పింఛన్లు ఇప్పించాలని లబ్ధిదారులు బి.సుజాత, అరంగి ప్రకాష్, ఎస్.లక్ష్మి, జి.లోకనాధం, అప్పారావు, రాజు తదితరులు కోరారు. ధాన్యం నిల్వలపై ఆరా బూర్జ: మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం నిల్వలపై జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆరా తీశారు. ఆయన మంగళవారం గుత్తావల్లి, లాభాం, పాలవలస, లక్కుపురం గ్రామాల్లో పర్యటించారు. కుప్పలతో ఉన్న ధాన్యం, కుప్పలు నూర్చిన తర్వాత కొనుగోలుకి సిద్ధంగా ఉన్న ధాన్యం నిల్వల గురించి అడిగి తెలు సుకున్నారు. మండలంలో గల మిల్లర్లు టార్గెట్ పూర్తయ్యిందని కొనుగోలు చేయడం లేదని రైతులు జేసీకి తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి ఎన్.శ్రీనివాసరావు, సివిల్ సప్లై డీటీ మురళి మోహన్, వీఏఏలు వ్యవసాయ రైతులు పాల్గొన్నారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి ప్రణాళికలు: కలెక్టర్ శ్రీకాకుళం పాతబస్టాండ్: నియోజకవర్గాల అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ జిల్లా అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులతో సమీక్షించారు. ముందస్తు అనుమతి లేకుండా సెలవుపై వెళ్లిన సెక్రటేరియట్ సిబ్బంది సెలవులను సంబంధిత జిల్లా అధికారులు రెగ్యులరైజ్ చేయవద్దన్నారు. సచివాలయ సిబ్బంది హాజరు 90 శాతం కన్నా తగ్గకూడదని పేర్కొన్నారు. పీఎంఏవైకు దరఖాస్తు చేసుకున్న వారు 41,862 మంది ఉన్నట్లు హౌసింగ్ పథక సంచాలకులు నగేష్ తెలియజేశారు. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. ఎవరైనా రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని ఆర్ఎస్కే వారీగా లిస్ట్ ఇస్తే వారికి ధాన్యం సేకరణకు అనుమతి మంజూరు చేస్తామని జాయింట్ కలెక్టర్ తెలియజేశారు. మూడోరోజు 741 మంది గైర్హాజరుశ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. 75 కేంద్రాల్లో జరుగుతున్న పరీక్ష ల్లో భాగంగా మూడోరోజు ఫస్టియర్ విద్యార్థులు సెట్–1 ప్రశ్నాపత్రంతో ఇంగ్లీషు పేపర్కు పరీక్ష రాశారు. జనరల్, ఒకేషనల్ రెండు విభాగాల్లో కలిపి 21,966 మంది హాజరుకావాల్సి ఉండగా 741 మంది గైర్హాజరయ్యారు. ఎలాంటి మాల్ ప్రాక్టీసు కేసులు నమోదుకాలేదని అధికారులు ధ్రువీకరించారు. 4 -
శ్రీకాకుళం
బుధవారం శ్రీ 5 శ్రీ మార్చి శ్రీ 2025ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేం అభ్యర్థిని పెట్టలేదు. మేము ఓపెన్గా రఘువర్మకి, శ్రీనివాసులనాయుడికి ఓటు వేయాలని చెప్పాం. టెలీ కాన్ఫరెన్స్ పెట్టి మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత ఓట్లు రఘువర్మకి, గాదె శ్రీనివాసులునాయుడికి వేయమని చంద్రబాబు చెప్పారు. ఇద్దరూ మన అభ్యర్థులే, ఎవరు గెలిచినా మనవాళ్లే అన్నారు. – సోమవారం రాత్రి ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలివి న్యూస్రీల్ -
అటు సిండికేటు.. ఇటు అదనపు రేటు
మందు బాబులకు ఝలక్సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో మద్యం దోపిడీకి అధికార పార్టీ నాయకులు తెర తీశారు. ఒకనేత అంతా తానై వ్యవహరించి, సిండికేట్కు నాయకత్వం వహించి, పలాస నియోజకవర్గంలో వసూళ్లకు శ్రీకారం చుట్టారు. కీలక నేతకు ముడుపులు ఇచ్చేందుకు ఒప్పందం జరగడంతో ఎమ్మార్పీకి మించి విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. క్వార్టర్ బాటిల్పై రూ.10 అదనంగా వేసి షాపుల్లో విక్రయిస్తున్నారు. 2014–19 పరిస్థితులు పునరావృతం ఎమ్మార్పీకి మించి మద్యం విక్రయాలు జరపడం కొత్తేమీ కాదు. 2014–19 టీడీపీ హయాంలో బరితెగించి విక్రయాలు చేపట్టారు. ఒక్కో బాటిల్పై రూ.20 నుంచి రూ.50 వరకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. అప్పట్లో ఎమ్మార్పీకి మించి చేపట్టిన విక్రయాలపై మద్యం బాబుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇంట్లో డబ్బు అంతా మద్యానికి పోసేస్తున్నారని మహిళలు ఆందోళన చేశారు. అప్పట్లో లిక్కర్ వ్యాపారులు భారీగా సంపాదించారు. అందులో కొంత నేతలకు ముట్ట జెప్పారు. అది జిల్లా ప్రజలందరికీ తెలిసిన విషయమే. మళ్లీ ఇప్పుడా పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. ఇప్పటికే బెల్ట్షాపులు విచ్చలవిడిగా వెలిశాయి. అదే తప్పు అని గగ్గోలు పెడుతుంటే, ఇప్పుడు ఎమ్మార్పీకి మించి విక్రయాలు మొదలయ్యాయి. పలాస నియోజకవర్గంలో తొలుత శ్రీకారం చుట్టారు. ఇప్పుడది జిల్లా అంతా పాకే పరిస్థితి కనబడుతోంది. చక్రం తిప్పిన నాయకుడు.. మద్యం షాపులను దక్కించుకున్న ఓ నాయకుడు కీలకంగా వ్యవహరించి, సిండికేట్ను ఏర్పాటు చేసి, అందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చారు. ఎవరికెంత ముడుపులు ఇవ్వాలో డిసైడ్ చేసి, తదనుగుణంగా కీలక నేతకు జరిగినదంతా చెప్పి, ఎమ్మార్పీకి మించి విక్రయాలకు తలుపులు తెరిచారు. ఏకంగా ఎకై ్సజ్ పరిధిలో నిర్ణయాన్ని అమలు పరిచారు. ప్రస్తుతానికి ఒక్కో క్వార్టర్ బాటిల్పై రూ.10 పెంచి విక్రయిస్తున్నారు. మున్ముందు ఈ పెంపు మరింత పెరగనుంది. జిల్లాలో తొలుత పలాస నియోజకవర్గం, సర్కిల్ పరిధిలోనే ప్రారంభించారు. కీలక నేత అండదండలతో ముందుకెళ్తున్నారు. మొదలైన మద్యం దోపిడీ ఒక్కో బాటిల్పై రూ.10 అదనపు వడ్డన పలాస నియోజకవర్గంలో శ్రీకారం సిండికేట్ను తయారు చేసిన ఓ నాయకుడు కీలక నేత అంగీకరించడంతో ఎమ్మార్పీకి మించి విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ -
భారీగా ముడుపులు
ఎమ్మార్పీకి మించి విక్రయాలు జరుపుకోవడానికి గ్రీన్ సిగ్నల్ రావడంతో భారీగా ముడుపులు వెళ్తున్నాయి. స్థానిక, మండల, నియోజకవర్గ స్థాయి మేరకు అడ్డు తగలకుండా ఉండేందుకు కాసుల పంపకాలు చేశారు. ఈ నెలలో తొలి విడత ముడుపులు అందనున్నాయి. వ్యాపారం టర్నోవర్ చూసి ఈ ముడుపులు పెరిగే అవకాశం ఉంది. తక్కువ ధరలకు నాణ్యమైన మద్యం అందిస్తామనే హామీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దశల వారీగా తన కార్యాచరణ అమలు చేస్తోంది. ఇప్పటికే ఽఅధికారికంగా ధరలు పెంచి మద్యం బాబులకు వాత పెట్టింది. ఇప్పుడా అధికారిక ధరలకు రూ.10 పెంచి విక్రయిస్తూ మందు బాబులకు మరింత షాక్ ఇచ్చింది. -
వంశధారలో వినాశన కాండ
బోర్లు మొరాయిస్తున్నాయి.. ● వంశధారి నదిలో ఇసుక అక్రమార్కుల బరితెగింపు ● పెద్ద పెద్ద గొట్టాల ద్వారా నీరు మళ్లింపు ● మారిపోతున్న నదీ గమనం ● పరిమితికి మించి తవ్వకాలు జరపడంతో అడుగంటిపోతున్న భూగర్భ జలాలు బైరి పరిసర ప్రాంతంలో ఇసుక తవ్వకాలు చేయడంతో చాలా చోట్ల బోర్లు మొరాయిస్తున్నాయి. గ్రామంలోని వ్యవసాయ బోర్లు 70వరకు ఉన్నాయి. ఇటీవల మైనింగ్, రెవెన్యూ అధికారులు వచ్చి నదీ పరివాహక ప్రాంతాన్ని సందర్శించినప్పుడు గ్రామస్తులకు ఎలాంటి నష్టం లేకుండా చూస్తామన్నారు. కానీ ప్రస్తుతం అనుమతులకు మించి తవ్వకాలు చేయడంతో తాగునీటిని అందించే బోర్లు సైతం పనికి రాకుండా పోతున్నాయి. – మూల కృష్ణవేణి, బైరిసాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఇసుక అక్రమార్కులు ఏకంగా వంశధార నదికి తీరని అన్యాయం చేస్తున్నా రు. అధికారం చేతిలో ఉండడంతో అడ్డూఅదుపు లేకుండా రెచ్చిపోతున్నారు. యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘించి, ప్రకృతి వనరులను దోచుకుంటున్నారు. ఇష్టారీతిన నిర్వహిస్తున్న ఇసుక ర్యాంపుల్లో రూ.కోట్లు సంపాదిస్తున్నారు. వంశధార నదీ తీరంలో ఏర్పాటు చేసిన ఇసుక ర్యాంపుల్లో గుట్టల కొద్దీ ఇసుక తరలిపోతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. బైరిలో విధ్వంసం.. శ్రీకాకుళం రూరల్ పరిధిలోని బైరి గ్రామంలో నడుస్తున్న ఇసుక ర్యాంపుల నుంచి నిత్యం రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుక లారీల్లో తోడేస్తూ తరలిస్తు న్నారు. నదీగర్భంలోకి ఏకంగా అనధికారికంగా రహదారి వేసేశారు. నదిలో ఉన్న నీటిని పెద్ద పెద్ద గొట్టాల ద్వారా బయటకు మళ్లిస్తున్నారు. ఇసుక తవ్వకాలు జరిపే సమయంలో పాటించాల్సిన నిబంధనలు తుంగలో తొక్కేస్తున్నారు. ప్రభుత్వ అనుమతి ఉన్న ఇసుక ర్యాంపుల్లో మీటర్ లోతులో కేవలం మనుషులతోనే తవ్వకాలు చేపట్టాలి. కానీ ఇక్కడ యంత్రాలతో తోడేస్తున్నారు. ఐదు నుంచి 10 మీటర్ల లోతు వరకు తవ్వకాలు చేపడుతున్నారు. ఇసుక మేటలతో పాటు నదీ గర్భాన్ని తవ్వేసి, టన్నుల కొద్దీ ఇసుకను నదిలోనే పోగేసి ఉంచుతున్నారు. పెద్ద పెద్ద దిబ్బలుగా వేసి, అక్కడికే ఏకంగా లారీలను రప్పించి లోడింగ్ చేస్తున్నారు. నదీ గమనానికి, బోర్లకు ముప్పు నిబంధనలు అతిక్రమించి మీటర్ దాటి తవ్వితే నది సమతుల్యత దెబ్బతిని, ప్రవాహంలో మార్పు వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పటికే గ్రామానికి సమీపంలో ఉండే నీరు కిలోమీటర్ల దూరం వెళ్లిపోయింది. గ్రామంలో గల తాగునీరు, సాగునీటి బోర్లు 40 వరకు మూలకు చేరిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో బోర్లకు నీరు అందుతూ మధ్యలోనే ఆగిపోవడంతో మోటర్లు సైతం పాడవుతున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. నదిలో లోతుగా తవ్వకాలు జరపడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి ఆ బోర్లన్నీ పనికి రాకుండా పోతున్నాయి. -
జిల్లాలో కురసాల కన్నబాబు పర్యటన నేడు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్గా నియమితులైన కురసాల కన్నబాబు మంగళవారం తొలిసారిగా జిల్లాలో పర్యటించనున్నారు. పార్టీ అధిష్టానం రీజనల్ బాధ్యతలు అప్పగించిన తర్వాత పార్టీ పటిష్టతపై ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే మంగళవారం శ్రీకాకుళం వస్తున్నారు. పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలు, సీనియర్ నాయకులు వివిధ హోదాల్లో ఉన్న నాయకులతో సమావేశం కానున్నారు. జిల్లాలోని పార్టీ అగ్రనేతలను ప్రత్యేకంగా కలిసి పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. -
గట్టి పోటీ ఇచ్చిన యూటీఎఫ్ విజయగౌరి
పీడీఎఫ్ తరఫున పోటీ చేసిన యూటీఎఫ్ సంఘం నాయకురాలు విజయగౌరి ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చారు. వాస్తవంగా, యూటీఎఫ్లో ఎమ్మెల్సీ ఓటు ఉన్న ఉపాధ్యాయులు కాస్త తక్కువే అని చెప్పాలి. ప్రాథమిక పాఠశాల స్థాయిలో వారికి బలం ఎక్కువ ఉంది. హైస్కూ ల్ స్థాయి ఉపాధ్యాయుల బలం ఆశించినంత లేదు. కాకపోతే, విజయగౌరి వ్యక్తిత్వం, పోరాట తత్వం, పీడీఎఫ్కున్న నమ్మకం గెలిపిస్తాయ ని ఆశించారు. సంఘాలతో సంబంధం లేకుండా ఓటేస్తారని భావించారు. 100శాతం అనుకున్నంతగా కాకపోతే చాలా మేరకు విజయగౌరికి ఓటింగ్ పడిందని చెప్పుకోవాలి. తనకొచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లును చూస్తే గట్టి పోటీ ఇచ్చారనే అనుకోవాలి. -
తిరుగుబాటు
శ్రీకాకుళంఅంతన్నారు.. ఇంతన్నారుడీఎస్సీపై డోలాయమానం కొనసాగుతోంది. అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు. –8లోతొమ్మిది నెలల్లోనేమంగళవారం శ్రీ 4 శ్రీ మార్చి శ్రీ 2025సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కూటమి ప్రభుత్వానికి ఉపాధ్యాయులు షాకిచ్చారు. అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే టీడీపీ, జనసేనకు ఓటమి రుచి చూపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా తమ మనోభావాలకు భిన్నంగా ఎమ్మెల్సీ ఎన్నికను టీడీపీ నాయకులు భుజాన వేసుకోవడాన్ని ఉపాధ్యాయులు జీర్ణించుకోలేకపోయారు. ఇప్పుడు అవకాశం ఇస్తే తమకు ఎదురు లేదని నాయకులు విర్రవీగే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. తామేంటో చూపిస్తామంటూ ఎన్నికల్లో ఓట్లేసి గట్టిగా దెబ్బ కొట్టారు. అంచనాలకు తగ్గట్టుగా ‘గాదె’ గెలుపు.. ప్రభుత్వ వ్యతిరేక పవనాల మధ్య ఉపాధ్యాయవ ర్గాల్లో మంచి పట్టు ఉన్న గాదె శ్రీనివాసులునాయు డు బరిలో దిగుతున్నట్టు ప్రకటించినప్పుడే దాదా పు విజయం ఖరారైపోయింది. గతంలో రెండు ఎమ్మెల్సీగా పనిచేసిన తీరు, పీఆర్టీయూ సంఘంలో ఐక్యత, సామాజిక వర్గం తదితర విషయాలు గాదెకు కలిసొచ్చాయి. దానికి తోడు ఎమ్మెల్సీ ఎన్ని కను టీడీపీ, జనసేన ప్రతిష్టాత్మకంగా తీసుకుని, గ్రామ స్థాయి నాయకుడి దగ్గరి నుంచి మంత్రులు వరకు సీరియస్గా పనిచేయడం మరింత ప్లస్ అ యింది. ఉపాధ్యాయులను రెచ్చ గొట్టేలా సాధారణ ఎన్నికల మాదిరిగా ప్రచారం చేయడం, తాము మ ద్దతు ఇచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలని ఒత్తిడి చేయడం, పోలింగ్ ముందు రోజున ప్రలోభాలకు గురి చేయడం, పోలింగ్ రోజున టీడీపీ నాయకులే శిబిరాలు పెట్టి ప్రభావితం చేసేందుకు ప్రయత్నించడం వంటి అంశాలు గాదె గెలుపునకు దోహదపడ్డాయి. ఓటర్లుగా ఉన్న ఉపాధ్యాయులను ప్రలోభ పెట్టేందుకు టీడీపీ నేతలు ఎంత ప్రయత్నించినప్పటికీ వెనక్కి తలొగ్గలేదు. రఘువర్మ స్వయం కృతాపరాధం ఏపీటీఎఫ్ తరఫున పోటీ చేసిన పాకలపాటి రఘువర్మ ఓటమికి స్వయం కృతాపరాధమే కారణమని నిపుణులు అంటున్నారు. వాస్తవంగా ఏపీటీఎఫ్ బలమైన సంఘం. ఉత్తరాంధ్రలో ఓటర్లు ఎక్కువగానే ఉన్నారు. కానీ, టీడీపీ, జనసేన మద్దతుతో పోటీ చేయాలనుకోవడమే ఆయన కొంప ముంచిందనే వాదనవినిపిస్తోంది. వాస్తవంగా, రఘువర్మ సౌమ్యుడనే అభిప్రాయం ఉంది. పార్టీలతో సంబంధం లేకుండా ఏపీటీఎఫ్ తరఫునే పోటీ చేసి ఉంటే బాగుండేదని, కానీ, ఆయన టీడీపీతో కలవడంతో అప్రతిష్టను మూటగట్టుకున్నారని అంటున్నారు. వాస్తవంగా టీడీపీ మద్దతుతో పోటీ చేయాలన్న ఆసక్తి ఏపీటీఎఫ్ నాయకుల్లో చాలా మందికి లేదు. తొలుత కొందరు వ్యతిరేకించినట్టుగా కూడా తెలిసింది. అయితే అధికారంలో ఉన్న పార్టీలు తమ వెంట ఉన్నాయని, గెలుపు సాధ్యమవుతుందని హితబోధ చేయడంతో ఏపీటీఎఫ్ నాయకులు సైతం వెనక్కి తగ్గినట్టు తెలిసింది. కానీ ఈ నిర్ణయమే గెలుపు అవకాశాలను తీవ్రంగా దెబ్బ కొట్టింది. కూటమి నాయకులు పరోక్షంగా మద్దతు ఇస్తారనుకుంటే.. టీడీపీ, జనసేన నాయకులే మొత్తం ఎన్నిక ప్రక్రియను హైజాక్ చేసేశారు. తమ పార్టీ అభ్యర్థిలా రంగంలోకి దిగిపోయారు. గ్రామ స్థాయి నాయకుల దగ్గరి నుంచి మంత్రులు వరకు పాకలపాటి రఘువర్మ కోసం నడుంబిగించారు. దీంతో ఎన్నిక ఉపాధ్యాయ సంఘాల మధ్య కాకుండా టీడీపీతో జరిగిన ఎన్నికలా మారిపోయింది. చివరికి పోలింగ్ రోజున ఓటర్లను ప్రభావితం చేసేలా శిబిరాలు ఏర్పాటు చేయడం, వాటిలో ఉపాధ్యాయ సంఘ నాయకుల కంటే టీడీపీ నాయకులే ఎక్కువగా ఉండటంతో చర్చనీయాంశమైంది. ఇదే టీచర్లను ఆలోచించేలా చేసింది. ఎన్నికల్లో ప్రభావితం చేసిన అంశాలివే.. మంచి ఐఆర్ ఇస్తానని, రివర్స్ పీఆర్సీ కాకుండా మంచి పీఆర్సీ ఇస్తానని చంద్రబాబు చెప్పడంతో సాధారణ ఎన్నికల్లో ఉపాధ్యాయులు అనుకూలంగా వ్యవహరించారు. కానీ అధికారంలోకి వచ్చాక పీఆర్సీ మాట దేవుడెరుగు, ఆ వేతన సవరణ సంఘానికి కనీసం చైర్మన్ను నియమించలేదు. ఈ ప్రభుత్వం న్యూస్రీల్సర్కారుకు టీచర్ల బెత్తం దెబ్బ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన గాదె శ్రీనివాసులనాయుడు స్వయంకృతాపరాధంతో ఓటమిపాలైన పాకలపాటి రఘువర్మ ఎన్నికల్లో ప్రభావం చూపించిన టీడీపీ ప్రజా వ్యతిరేక విధానాలు ప్రభుత్వం హామీలను విస్మరించడంపై తీవ్ర అసంతృప్తిలో ఉపాధ్యాయులు స్వరం మార్చిన టీడీపీ.. పాకలపాటి రఘువర్మ ఎన్నికను భుజానికి ఎత్తుకున్న టీడీపీ తాజా ఓటమితో స్వరం మార్చింది. తాము ఇక్కడ పోటీ చేయలేదని.. చెప్పుకుంటూనే ఎదురైన ఓటమిని దూరం పెడుతోంది. గెలిస్తే మా వోడు.. ఓడితే కాని వాడు అని చెప్పుకునే ప్రయత్నంలో పడింది. సాక్షాత్తూ జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఎమ్మెల్సీ ఎన్నికపై స్పందిస్తూ తాము పోటీ చేయలేదని.. పాకలపాటి రఘువర్మకు మొదటి ప్రాధాన్యత ఓటును గాదె శ్రీనివాసులు నాయుడుకు రెండో ప్రాధాన్యత ఓటును వేయా లని చెప్పామంటూ మాట మార్చారు. ఒక అభ్యర్థిని గెలిపించమంటూనే మరో అభ్యర్థిని కూడా గెలిపించండని అంతర్గంతగా చెప్పుకోవడాన్ని ఏమనుకోవాలో వారికే తెలియాలని... ఓటమిని స్వాగతించాలే తప్ప గెలుపు దరి చేరకపోవడంతో మాటమార్చడం సిగ్గుచేటని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి.