breaking news
Srikakulam
-
అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలి
పలాస: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీదారుల వినతులను పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ స్పప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. మండలంలోని తహసీల్దార్ కార్యాలయం పక్కనే ఉన్నటువంటి ఉప ఖజానా కార్యాలయంలో ప్రజా సమస్యల నమోదు, పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం 120 వినతులు స్వీకరించారు. దీనిలో ముఖ్యంగా పింఛన్లు, భూ సమస్యలు, రోడ్లు, డీ–పట్టా భూములు, మంచినీరు, గృహ నిర్మాణాలు, సదరం, రేషన్కార్డులు వంటి సమస్యలపై ఫిర్యాదులు ఉన్నాయి. వైద్యులను నియమించాలి కాశీబుగ్గలో గత ప్రభుత్వంలో నిర్మించిన కిడ్నీ రీసెర్చ్ సెంటర్లో పూర్తిస్థాయిలో వైద్యులను నియమించాలని ఉద్దానం ఆరోగ్య పరిరక్షణ కమిటీ ప్రతినిధులు విన్నవించారు. ప్రతిరోజూ ఉద్దానం ప్రాంతం నుంచి రోజుకు కనీసం 60 మందికి తగ్గకుండా డయాలసిస్ చేయించుకోవడానికి వస్తున్నారని, అందుకే డయాలసిస్ యూనిట్లను పెంచాలని విన్నవించారు. అలాగే సీరం క్రియేటిన్ 3 దాటిన వారికి కనీసం రూ.5 వేలు ఫించను ఇవ్వాలని, ఆస్పత్రిలో రోగులకు ఉచిత భోజన సదుపాయం కల్పించాలని కోరారు. అదేవిధంగా తమకు సంబంధించిన జిరాయితీ భూమిని పలాస పెద్దవీధికి చెందిన టీడీపీ కౌన్సిలర్ భర్త కృష్ణనాయక్, అతని బంధువులు పొందర త్రిలోచన, పొందర బలరాం, పొందర ప్రభాపాత్రో తదితరులు ఆక్రమించుకోవడానికి చూస్తున్నారని పలాసలోని ఉదయపురం గ్రామానికి చెందిన రాజాం ఆదమ్మ, ఆమె కుమారులు గణపతి, సురేష్, రవి, గిరి, మురళి తదితరులు వినతిపత్రం అందజేశారు. ఉద్దానం ప్రాంత జీడి పిక్కలకు తగిన గిట్టుబాటు ధర కల్పించాలని జీడి రైతాంగ కమిటీ ప్రతినిధులు కోరారు. నందిగాం మండలం కణితూరు శ్మశానవాటికకు విద్యుత్ లైన్ ఏర్పాటు విషయంలో టీడీపీ నాయకులు రాజకీయం చేస్తూ పనులు అడ్డుకుంటున్నారని ఎంపీపీ నడుపూరు శ్రీరామమూర్తి ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జెడ్పీ సీఈవో ఎల్.శ్రీధర్రాజు, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ కిరణ్కుమార్, డ్వామా పీడీ సుధాకర్, పలాస ఆర్డీవో జి.వెంకటేష్, డీఎంఅండ్హెచ్వో కల్యాణబాబు, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ కవిత, పలాస–కాశీబుగ్గ మున్సిపల్ కమిషనర్ ఎన్.రామారావు, పలాస తహసీల్దార్ కల్యాణ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లాలి శ్రీకాకుళం పాతబస్టాండ్: అర్జీల పరిష్కారానికి క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికలో ఆయన అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీల పరిష్కారానికి సంబంధిత అర్జీదారుని వద్దకు క్షేత్రస్థాయిలోకి వెళ్లి మాట్లాడి వారికి నాణ్యమైన సమాచారం అందజేయాలన్నారు. రెవెన్యూ, పంచాయతీ రాజ్, డ్వామా, మహిళా శిశు సంక్షేమం, మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా పంచాయతీ, ఏపీఈపీడీసీఎల్, సర్వే, భూగర్భ గనులు, ఇరిగేషన్, తదితర శాఖల సమస్యలపై 217 అర్జీలు స్వీకరించారు. అర్జీలు స్వీకరణలో డిప్యూటీ కలెక్టర్లు పద్మావతి, అప్పారావు, ఐసీడీఎస్ పీడీ బి.శాంతిశ్రీ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ స్పప్నిల్ దినకర్ పుండ్కర్ పలాసలోని పీజీఆర్ఎస్లో 120 వినతుల స్వీకరణ -
బాబును బతికించండి
ఇచ్ఛాపురం రూరల్: ఆ బాబు వయసు పది నెలలు. నవ్వితే నిండు చందమామలా ముద్దుగా ఉంటాడు. తండ్రి పెయింటింగ్ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఉన్నట్టుండి ఈ బాలుడికి అనారోగ్యం చేసింది. చూస్తుండగానే అది ప్రాణాంతకంగా మారిపోయింది. ఇప్పుడు బాబు బతకాలంటే రూ.20 లక్షలు ఖర్చు పెట్టి శస్త్ర చికిత్స చేయించాలి. పెయింటింగ్ పనికి వెళ్తే గానీ కుటుంబం కడుపు నిండని పరిస్థితుల్లో అంత డబ్బు తీసుకురావడం ఆ తల్లిదండ్రులకు తలకుమించిన భారమవుతోంది. బాబును బతికించుకోవడానికి వారు దాతల సాయం కోరుతున్నారు. ఇచ్ఛాపురం మండలం తిప్పనపుట్టుగ గ్రా మానికి చెందిన మజ్జి పురుషోత్తం, శాంతిలకు ఆడపిల్ల పుట్టిన తర్వాత రెండో సంతానం రియా న్. మూడు నెలలు కిందట బాబుకు హై ఫీవర్ రావడంతో స్థానిక ఆస్పత్రిలో చూపించారు. బ్లడ్ ఇన్ఫెక్షన్తో పాటు ఫిట్స్ రావడంతో శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో విశాఖ పట్నంలో చేర్పించారు. 15 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచిన వైద్యులు పసివాడి మెదడులో ద్రవం చేరడంతో ‘హైడ్రో సెఫెలెస్ ఇన్ఫెక్షన్’కు గురయ్యాడని, శస్త్ర చికిత్స చేయాలంటూ చెప్పడంతో ఆరోగ్యశ్రీ ద్వా రా తొలిసారి ఆపరేషన్ చేశారు. అప్పటికే లక్ష రూ పాయల వరకు ఖర్చయింది. రెండు నెలలు తర్వా త బాబు తల రోజురోజుకూ పెరగడంతో మళ్లీ విశాఖ ఆస్పత్రిలో చేర్పించగా వెంటనే తిరుపతి స్విమ్స్కు లేదా హైదరాబాద్కు తీసుకువెళ్లాలంటూ వైద్యులు సూచించారు. తిరుపతిలో పరీక్షించిన వైద్యులు వెంటనే శస్త్ర చికిత్స చేయాలని, అందుకు సుమారు రూ.20 లక్షలు వరకు ఖర్చవుతుందని చెప్పడంతో తల్లిదండ్రులకు దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. ఇప్పటికే ఎస్జీఎఫ్ సంస్థ, కాళీమాత సేవా సమితి, పూర్వ విద్యార్థులు కలసి రూ.50వేలు వరకు ఆర్థిక సాయం అందించడంతో తిరుపతి వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. తమ కుమారుడికి ప్రాణభిక్ష పెట్టాలంటూ ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సా యం చేయదలచుకున్న వారు 6304051247 నంబర్ను సంప్రదించాలని కోరుతున్నారు. కన్నపేగు కోసం తల్లిదండ్రుల అభ్యర్థన హైడ్రో సెఫెలెస్ ఇన్ఫెక్షన్తో బాధ పడుతున్న చిన్నారి శస్త్ర చికిత్సకు రూ.20లక్షలు అవసరమవుతున్న వైనం దాతల సాయం కోరుతున్న తల్లిదండ్రులు -
గుర్తు తెలియని వృద్ధుడు మృతి
కంచిలి: మండల కేంద్రంలోని సోంపేట రైల్వేస్టేషన్ ప్రాంగణంలో గుర్తు తెలియని 60 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. రైల్వేస్టేషన్లో 2, 3 ఫ్లాట్ఫారంల మధ్యలో వృద్ధుని మృతదేహాన్ని జీఆర్పీ పోలీసులు సోమవారం గుర్తించారు. మృతుడు పసుపు రంగు చొక్కా, దానిపైన నీలం రంగు గీతలు ఉన్నాయి. నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడు. ప్రాథమిక పరిశీలనలో సహజ మరణంగా జీఆర్పీ పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతుడిని గుర్తించేందుకు పలాస గవర్నమెంట్ రైల్వే పోలీస్స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ షేక్ షరీఫ్ కేసు నమోదు చేశారు. సమాచారం తెలిస్తే 94406 27567 నంబర్కు తెలియజేయాలని కోరారు. -
వెల్ఫేర్ అసిస్టెంట్ల బదిలీలకు ముగిసిన కౌన్సెలింగ్
శ్రీకాకుళం పాతబస్టాండ్: గ్రామ సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న వెల్ఫేర్ అసిస్టెంట్లకు సోమవారం బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కౌన్సెలింగ్ను శ్రీకాకుళం అంబేడ్కర్ ఆడిటోరియంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ మధుసూదన్ పర్యవేక్షణలో నిర్వహించా రు. సిఫార్సు లేఖలతోనే బదిలీలన్నీ జరగడం గమనార్హం. ఈ బదిలీల్లో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులకు అవకాశం కల్పించగా, మొదట విభిన్న ప్రతిభావంతులు, స్పౌజ్ కేటగిరీకి చెందిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించా రు. అభ్యర్థుల నుంచి ఇప్పటికే తీసుకున్న ఆప్షన్లు, ఖాళీల ఆధారంగా సీనియారిటీ పద్ధతిలో ఎంపికలు చేస్తామని తెలిపారు. అంతే కా కుండా మీకు ఫలానాచోట నియామకం కల్పిస్తామని హామీ ఇవ్వకుండానే, ఆప్షన్లు తీసుకొని పంపించేశారు. ఈ బదిలీలపై వెల్ఫేర్ అసిస్టెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి జిల్లా మొత్తం 350 మందికి బదిలీల కౌన్సెలింగ్ చేపట్టినట్లు డీడీ తెలిపారు. హొన్నాళి పాఠశాల సందర్శన మందస: జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.తిరు మల చైతన్య సోమవారం మందస మండలం హొన్నాళి ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించారు. స్థానికులు పెద్ద ఎత్తున వచ్చి బడిని పరిరక్షించాలని, 6, 7, 8 తరగతుల పిల్లలు సుమారు 5 కిలోమీటర్లు ప్రయాణం చేసి పక్క బడికి వెళ్లడం కష్టమవుతుందని వివరించారు. యూటీఎఫ్ నాయకులు కూడా డీఈఓను కలిసి ఈ మేరకు విన్నవించారు. గోవుల అక్రమ రవాణాపై కేసు నమోదు సరుబుజ్జిలి: మండల కేంద్రంలోని సరుబుజ్జిలి జంక్షన్ వద్ద ప్రధాన రహదారిలో తరలిస్తున్న గోవుల అక్రమ రవాణాకు సంబంధించి ముగ్గురు వ్యక్తులపై సోమవారం కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్ఐ బి.హైమావతి తెలిపారు. ఆదివారం రాత్రి సరుబుజ్జిలి నాలుగు రోడ్ల కూడలిలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా బోలేరో పికప్ వాహనంలో గోవులను గుర్తించినట్లు తెలిపారు. వాహనంలో ఉన్న కొండంగి కృష్ణ, పుచ్చ లక్ష్మణరావు, ఓనము వెంకట తిరుపతి అనే వ్యక్తులను విచారించామన్నారు. వీరంతా కలిసి రుగడ ప్రాంతం నుంచి విజయనగరం జిల్లా అలమండకు కబేళాకు తరలిస్తున్నట్లు తెలిసిందని, దీంతో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి బండిని సీజ్ చేశామని చెప్పారు. ‘సమాన పనికి సమాన వేతనం కల్పించాలి’ శ్రీకాకుళం అర్బన్: ఏపీఎస్ ఆర్టీసీలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు చట్టప్రకారం సమాన పనికి సమాన వేతనం కల్పించాలని ఆర్టీసీ ఔట్సోర్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్య క్షుడు టి.ముత్యాలరావు డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం శ్రీకాకుళంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఆర్టీసీ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఆర్టీసీ శ్రీకాకుళం–1, 2 డిపోలతో పాటు టెక్కలి, పలాస డిపోలలో ఔట్ సోర్సింగ్ కార్మి కులు దాదాపుగా 220 మంది పని చేస్తున్నారన్నారు. వీరికి ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనాల పంపిణీలో న్యాయం చేయాలని కోరా రు. కార్యక్రమంలో ఏపీపీటీడీ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు దాసరి కిరణ్, కార్యదర్శి పి.సంతోష్, జిల్లా కోశాధికారి ఆర్.నవీన్కుమార్, సభ్యులు రా మ్మోహన్, శివ, శ్యాం, నరసింహ, రాజారావు, వేణుగోపాల్, వెంకట్, పార్వతమ్మ, సావిత్రి, ఈశ్వరమ్మ తదితరులు ఉన్నారు. -
ఎస్పీ గ్రీవెన్సుకు 63 ఫిర్యాదులు
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక (గ్రీవెన్స్)లో అర్జీదారుల నుంచి 63 ఫిర్యాదులందాయి. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఫిర్యాదులు స్వీకరించారు. ఎచ్చెర్ల మండలం కొంగరాం గ్రామానికి చెందిన నక్క దామోదరరావు అదే గ్రామానికి చెందిన కొంతమందిపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. గత నెల 16న తమ పొలంలోకి ట్రాక్టరు ఎందుకు తెచ్చారని తన కుటుంబీకులు అడిగినందుకు దాడి చేసి చంపేందుకు ప్రయత్నించారన్నారు. రిమ్స్లో చికిత్స సైతం పొందామని, ఇదే విషయమై ఎచ్చెర్ల ఎస్ఐను సంప్రదించామని, న్యాయం చేయలేదు సరికదా ఎఫ్ఐఆర్ తమపై నమోదు చేశారని వాపోయారు. స్టేషన్లో దివ్యాంగుడైన తనను కాళ్లతో తన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే విషయమై ఎచ్చెర్ల ఎస్ఐ వద్ద ప్రస్తావించగా అవతలి వ్యక్తులపై కేసు నమోదు చేశామని, తనపై ఆరోపణలుంటే రుజువు చేసుకోవాలన్నారు. -
కార్యకర్తలకు అండగా ఉంటాం
నరసన్నపేట: అధికారం అండతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు, సానుభూతి పరులపై అక్రమ కేసులు బనాయించడం, వారి ఆస్తులను ధ్వంసం చేయడం కూటమి ప్రభుత్వం చేస్తోందని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. వారి దౌర్జన్యాలు, అక్రమాలు ఇంకెన్నాళ్లో కొనసాగవని, వారికి తగిన బుద్ధి చెబుతామని అంతవరకు ధైర్యంగా ఉండాలని, పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా నిచ్చారు. కోమర్తి సర్పంచ్ ఉంగటి చి న్నమ్ముడు, భర్త, అత్తల పేరున ఉన్న ఆస్తులను పోలీసు బందోబస్తుతో ధ్వంసం చేయడం తెలిసిందే. ఈ సమాచారాన్ని తెలుసుకున్న కృష్ణదాస్ సోమ వారం ఉంగటి చిన్నమ్ముడు, ఆమె భర్త ఉంగటి రాజు, అత్త ఉంగటి అప్పమ్మలకు ధైర్యం చెప్పారు. మీకు పార్టీ అండగా ఉంటుందన్నారు. నరసన్నపేట మండలంలో చోడవరం, పారశిల్లి, చేనులవలస ఇలా పలు గ్రామాల్లో వైఎస్సార్ సీపీ కార్యకర్తల ఆస్తులను ధ్వంసం చేశారని అన్నారు. జగనన్న మళ్లీ సీఎం అయిన వెంటనే వీరందరికీ తగు విధంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కృష్ణదాస్ వెంట వైఎస్సార్సీపీ నాయకులు చింతు రామారావు, రాజాపు అప్పన్న, బగ్గు రమణయ్య, కనపల శేఖరరావు బొబ్బాది ఈశ్వరరావు, యాబాజి రమేష్, కోల ఈశ్వరరావు తదితరులు ఉన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ -
సదరం సర్టిఫికెట్ల వ్యవహారంపై సీఐ ఆరా
నరసన్నపేట: స్థానిక ఏరియా ఆస్పత్రిలో ఆర్థో స్పెషలిస్టుగా పనిచేసిన రవికిరణ్ జారీ చేసిన సద రం సర్టిఫికెట్లపై నరసన్నపేట సీఐ శ్రీనివాసరావు తన కార్యాలయంలో ఆరా తీశారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఆయన శ్రీకాకుళంలో గతంలో డీసీహెచ్గా పనిచేసి ప్రస్తుతం రాజాం సివిల్ సర్జన్ స్పెషలిస్టుగా బాధ్యతలు నిర్వహిస్తున్న రాజ్యలక్ష్మితో సోమవారం మాట్లాడి వివరాలు సేకరించారు. నరసన్నపేట ఏరి యా ఆస్పత్రిలో పలువురు అనర్హులకు వికలాంగత్వం ఉందని రవికిరణ్ సర్టిఫై చేయడం, దానికి ఆస్పత్రి కమిటీ సదరం సర్టిఫికెట్లు జారీ చేయడం తెలిసిందే. ఈ సర్టిఫికెట్లపై కలెక్టర్కు ఫిర్యాదులు వెళ్లడం, ఆయన పరిశీలనకు ఆదేశించడం, అవి అక్ర మమని నిర్ధారణ కావడం విధితమే. దీనిపై ఆర్థో స్పెషలిస్టు రవికిరణ్తో పాటు కమిటీలో ఉన్న వైద్యులకు వైద్య శాఖ ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు ఇవ్వడం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఏప్రిల్ 30న నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేశా రు. దీనికి సంబంధించి గతంలో డీసీహెచ్గా పనిచేసిన రాజ్యలక్ష్మి నుంచి కొంత సమాచారాన్ని సేకరించారు. ఎంత మంది అనర్హులకు సర్టిఫికెట్లు ఇచ్చారో అడిగి తెలుసుకున్నారు. సీఐ మాట్లాడుతూ ఈ కేసు దర్యాప్తులో ఉందని మరిన్ని వివరాల కోసం రాజ్యలక్ష్మితో మాట్లాడామని అన్నారు. -
కింజరాపు ఏజెన్సీ ద్వారా మైనింగ్ దోపిడీ
● ధ్వజమెత్తిన పేరాడ తిలక్టెక్కలి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో కి వచ్చిన తర్వాత టెక్కలి నియోజకవర్గంలో కింజరాపు ఏజెన్సీ ద్వారా పెద్ద ఎత్తున మైనింగ్ దోపిడీ జరుగుతోందని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ ఆరోపించారు. సోమ వారం టెక్కలిలోని ఆ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. మైనింగ్ కార్యకలాపాల కోసం గతంలో విశ్వ సముద్ర, ఏఎంఆర్ సంస్థలు ఉండేవని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు సోదరుడు హరిప్రసాద్ నేతృత్వంలో కింజరాపు ఏజె న్సీగా మారిందన్నారు. టెక్కలి మండలంలోని గూ డేం, అడ్డుకొండ, కోటబొమ్మాళి మండలంలోని అక్కయ్యవలస, కొత్తపేట, శ్రీజగన్నాథపురం, పొడుగుపాడు, చిన్నసాన, జర్జంగి, సంతబొమ్మాళి మండలంలోని నర్సాపురం, గోవిందపురం, సంతబొ మ్మాళి, వెంకటాపురం, నందిగాం మండలంలోని తురకలకోట, సొంటినూరు, బెజ్జిపల్లి, కొండతెంబూరు తదితర ప్రాంతాల్లో మంత్రి అండదండలతో మైనింగ్ మాఫియా జరుగుతోందని దుయ్యబట్టారు. కక్ష సాధింపులు చేస్తున్నారు అనుమతులు ఉన్న క్వారీలు, క్రషర్లు, ఫ్యాక్టరీలపై కక్ష సాధింపులు చేస్తూ, అనుమతులు లేని క్వారీలు, క్రషర్లు, ఫ్యాక్టరీలను నడిపించడానికి రాజస్థాన్కు చెందిన వ్యక్తికి అధ్యక్ష పదవి కట్టబెట్టారని మండిపడ్డారు. ప్రతి నెలా ఒక్కో క్వారీ నుంచి మంత్రి సోద రుడికి 4 గ్రానైట్ బ్లాకులు ఉచితంగా ఇస్తున్నారని, దీంతో అక్రమ మైనింగ్ చేసినా అధికారులు పట్టించుకోకుండా ఉండేవిధంగా డీల్ కుదుర్చుకున్నారని ధ్వజమెత్తారు. నందిగాం మండలంలోని కణితూరు గ్రామంలో శ్మశానవాటికకు విద్యుత్ సదుపాయం కల్పించే విషయంలో సైతం అధికారులతో మంత్రి కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం విడ్డూరంగా ఉందన్నారు. తన ఆరోపణల్లో ఎక్కడైనా అవాస్తవం ఉందని నిరూపిస్తే దేనికై నా సిద్ధంగా ఉన్నానని తిలక్ సవాల్ విసిరారు. మూలపేట పోర్టు సీఎం చంద్రబాబు తీసుకువచ్చారని కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. -
ఉపాధ్యాయులే ఉద్యమ, సాహిత్య నిర్మాతలు
శ్రీకాకుళం కల్చరల్ : ఇటు ఉద్యమాలైనా, అటు సాహిత్య ప్రక్రియలైనా సమర్థంగా నిర్వహించగల సత్తా ఉపాధ్యాయులకు ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని బాపూజీ కళామందిర్లో ఆదివారం ఏపీటీఎఫ్ అధ్యక్షుడు మజ్జి మదన్మోహన్ అధ్యక్షతన పుస్తకావిష్కరణ, పుస్తక పరిచయ సభ నిర్వహించారు. కంచరాన భుజంగరావు రచించిన ‘గీసి చెరిపే బొమ్మ’ పుస్తకాలను ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో పుస్తక రూపంలో ప్రచురించారు. ఏపీటీఎఫ్ పూర్వ ప్రధాన కార్యదర్శి సీహెచ్ ప్రభాకరరావు సతీమణి చిగురుపల్లి చంద్రకళ వర్ధంతి సందర్భంగా రచయిత గంట్యాడ గౌరునాయుడు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కవి తన ఆలోచనలను మెరుగుపరుచుకుంటూ చేసిన రచనకు ఈ పుస్తకం ప్రతీక అని పేర్కొన్నారు. డాక్టర్ సుంకరి గోపాలయ్య పుస్తకాన్ని పరిచయం చేస్తూ కొన్ని కవితలను చదివి వినిపించారు. కవి కంచరాన భుజంగరావు మాట్లాడుతూ తాను సాహిత్యం రాయడానికి గురువులే కారణమని చెప్పారు. అనంతరం దివికుమార్ రచించిన ‘ఉరికంబం సాక్షిగా’ పుస్తకాన్ని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.భానుమూర్తి పరిచయం చేశారు. భగత్సింగ్ జీవితాన్ని ఈ పుస్తకం మనముందు ఆవిష్కరిస్తుందన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ తిరుమల చైతన్య మాట్లాడుతూ శబ్దం అర్థం కలిస్తే సాహిత్యం అవుతుందని, ఉపాధ్యాయుడు బోధనలో తాత్వికుడుగా ఎదగాలని, వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి సాహిత్యం అవసరమని చెప్పారు. జనసాహితీ రాష్ట్ర అధ్యక్షుడు, రచయిత దివికుమార్ మాట్లాడుతూ భగత్ సింగ్ జీవితాన్ని తప్పుగా ప్రచారం చేస్తున్నారని, ఈ పుస్తకంలో పూర్తి సాక్ష్యాలతో జీవితాన్ని, తాత్వికతను పరిచయం చేశానని చెప్పారు. కార్యక్రమంలో సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.వి.అనిల్కుమార్, రాష్ట్ర కార్యదర్శి ధవళ సరస్వతి, జనసాహితీ జిల్లా కార్యదర్శి పి.మోహనరావు, చావలి శ్రీనివాస్, సదాశివుని శంకరరావు, సీహెచ్ రామచంద్రరావు, కె.గోవిందరావు, పి.లక్ష్మణరావు, రౌతు గణపతిరావునాయుడు, మజ్జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పుస్తకావిష్కరణ సభలో వక్తలు -
ఉద్యోగులకు పీఆర్సీ ఎప్పుడిస్తారు?
శ్రీకాకుళం న్యూకాలనీ: ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు కొత్త పీఆర్సీ ఇచ్చే ఉద్దేశం ఉందో లేదో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేయాలని ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం శ్రీకాకుళం నగరంలోని దాసరి క్రాంతి భవన్లో ఆదివారం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11వ వేతన సవరణ గడువు ముగిసి రెండేళ్లు పూర్తి కావస్తున్నా 12వ వేతన సవరణ ఊసే లేదన్నారు. అసలు పీఆర్సీ చైర్మన్ను ఇంతవరకు నియమించకపోవడం తగదన్నారు. పీఆర్సీపై ఇప్పటికై నా స్పష్టత ఇవ్వకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షుడు ఎస్వీ రమణమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యమంటూ ఒక ప్రక్క ప్రకటనలు చేస్తూ కార్పొరేట్ పాఠశాలలకు తల్లికి వందనం పథకం అమలు చేయడంలో ప్రభుత్వం కుట్ర దాగి ఉందని ఆరోపించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రమణ మాట్లాడుతూ విద్యార్థులను తరలించకుండా మోడల్ పాఠశాలలు ఏర్పాటు చేయమని ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా వినకుండా విద్యార్థులను సమీప పాఠశాలలకు తరలించి మోడల్ విధానమంటూ ఏకోపాధ్యాయ పాఠశాలలను పెంచిందని దుయ్యబట్టారు. సమావేశంలో పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు పాలక పురుషోత్తం, ఆర్థిక కార్యదర్శి పి.రామకృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు పి.తమ్మినాయుడు, చింతల రామారావు, కూన శ్రీనివాసరావు, బి.సత్యం, ఎస్.రామచంద్ర, హనుమంతు రామకృష్ణ, జి.తిరుమలరావు, డీవీఎస్ పట్నాయిక్, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, జిల్లా మండల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
ఊరి బడికి ఊపిరి
టెక్కలి: నూతన విద్యా విధానంలో భాగంగా విలీనం పేరిట జిల్లాలో అనేక ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం మూసివేస్తోంది. పిల్లలు తక్కువగా ఉన్నారని, ఇతర కారణాలు చూపుతూ గ్రామాలకు సర్కారు బడులను దూరం చేస్తోంది. ఊరి బడితో ఎంతో అనుబంధం కలిగిన ఆయా గ్రామాల ప్రజలు ప్రభుత్వ వైఖరి పట్ల మండిపడుతున్నారు. ఎలాగైనా తమ పాఠశాల మూతపడకుండా ఉండేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టెక్కలి మండలం గంగాధరపేటలో గ్రామస్తులు ఏకతాటిపైకి వచ్చి పిల్లలను బడిలో చేర్పించడంతో పాటు మౌలిక వసతులు కల్పించి అదనంగా వలంటీర్ను సైతం నియమించి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సొంత ఖర్చులతో నిర్వహణ... గంగాధరపేట ప్రాథమిక పాఠశాలలో గతంలో 13 మంది వరకు విద్యార్థులు ఉండేవారు. గత రెండేళ్లుగా విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతూ వస్తోంది. ఈ ఏడాది పూర్తిగా ఒకే ఒక్క విద్యార్థికి పరిమితమైంది. దీంతో పాఠశాల కొనసాగింపు విషయంలో గ్రామస్తుల్లో ఆందోళన మొదలైంది. పిల్లలు లేకపోతే పాఠశాల ఎత్తివేస్తారని తెలిసి ఎలాగైనా పాఠశాలలో విద్యార్థులను చేర్పించి బడిని బతికించాలనే నిర్ణయానికి వచ్చారు. అప్పటికే గ్రామం నుంచి ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల్ని తిరిగి గ్రామ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. దీంతో ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 19కు చేరింది. ఇప్పటికే ఒక టీచర్ ఉన్నప్పటికీ అదనంగా సొంత ఖర్చుతో విద్యా వలంటీర్ను ఏర్పాటు చేశారు. విద్యార్థులకు అవసరమైన మినరల్ వాటర్, ఇతర గ్రామాల నుంచి వస్తున్న విద్యార్థులను సురక్షితంగా ఇళ్లకు తీసుకువెళ్లడానికి సొంతంగా ఆటో ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన ఆర్మీ ఉద్యోగులు పిల్లల కోసం భోజనం ప్లేట్లు, మరికొంత మంది గ్రామస్తులు బెంచీలను వితరణగా అందజేశారు. పాఠశాలకు రంగులు వేయించడమే కాకుండా పాఠశాలకు ఆనుకుని విద్యార్థుల ఆట వస్తువుల కోసం చిన్న పాటి మైదానాన్ని సిద్ధం చేస్తున్నారు. ప్రైవేట్ స్కూల్ మాన్పించేశా.. గ్రామ పెద్దలు, యువకులంతా మాలో చైతన్యం కల్పించారు. ఎలాగైనా మా గ్రామంలో పాఠశాలను బతికించుకోవాలనే ఆలోచనతో టెక్కలిలో ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు పిల్లల్ని మా గ్రామంలో ప్రభుత్వ బడిలో చేర్పించాను. నాతో పాటు ఎంతో మంది ఇలాగే వారి పిల్లల్ని మా ఊరి బడిలో చేర్పించారు. – బి.శ్రీనివాసరావు, విద్యార్థుల తండ్రి, గంగాధరపేట పాఠశాలను వదులుకోం... గ్రామంలో ఎన్నో దశాబ్దాలుగా ప్రాథమిక పాఠశాల ఉంది. అయితే ఇటీవల విద్యార్థుల సంఖ్య పూర్తిగా పడిపోయింది. దీంతో పాఠశాల మూసివేస్తారనే భయం మా గ్రామంలో ఏర్పడింది. ఎట్టి పరిస్థితుల్లో పాఠశాలను వదులుకోకూడదనే సంకల్పంతో అన్ని వర్గాల ప్రజలతో పాటు యువకుల సాయంతో స్వచ్ఛందంగా అభివృద్ధి చేస్తున్నాం. – సంపతిరావు ధర్మారావు, గ్రామపెద్ద, గంగాధరపేట గంగాధరపేట పాఠశాలకు మూసివేత ముప్పు బడిని కాపాడుకునేందుకు రంగంలోకి దిగిన గ్రామస్తులు ప్రైవేటు స్కూళ్లలో పిల్లలను మాన్పించి పాఠశాలలో చేర్పిస్తున్న వైనం సొంత ఖర్చులతో మౌలిక సదుపాయాల ఏర్పాటు అందరి సహకారంతో.. పాఠశాల అభివృద్ధి విష యంలో గ్రామస్తుల సహకారం మరువలేనిది. ముఖ్యంగా విద్యార్ధుల తల్లిదండ్రులు చైతన్యవంతమై ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న వారి పిల్లల్ని ప్రభుత్వ బడిలో చేర్పించారు. బడిని బతికించుకోవడానికి మేము చేస్తున్న కార్యక్రమాలకు ఉపాధ్యాయురాలు ఎంతగానో సహకరిస్తున్నారు. గ్రామస్తులతో పాటు యువకులు, ఆర్మీ ఉద్యోగులు, మిగిలిన వారు వారి తోచినవిధంగా సాయం చేస్తున్నారు. – బమ్మిడి లక్ష్మీపతి, గంగాధరపేట, టెక్కలి మండలం గ్రామస్తుల కృషి అభినందనీయం.. గంగాధరపేటలో ప్రాథమిక పాఠశాలకు ఇటీవల బదిలీపై వచ్చాను. నేను వచ్చినప్పటికే విద్యార్థుల సంఖ్య పూర్తిగా శూన్యంగా ఉండేది. ఈ నేపథ్యంలో విద్యార్థులను చేర్పించడమే కాకుండా మౌలిక సదుపాయాలు కల్పించడానికి గ్రామస్తులు పడుతున్న ఆరాటం చూస్తే ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి గ్రామంలోనూ ఇలాగే చేస్తే ప్రభుత్వ పాఠశాలలు ఎంతో బాగుపడతాయి. ఇక్కడి గ్రామస్తుల కృషి ఆదర్శనీయం. – బి.భవానీ, ఉపాధ్యాయురాలు, గంగాధరపేట -
న్యాయం కోసం మృతదేహంతో బైఠాయింపు
నందిగాం/వజ్రపుకొత్తూరు: వజ్రపుకొత్తూరు మండలం బెండిగేటు సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కొరికాన చైతన్య అనే యువకుడు మృతిచెందిన సంగతి తెలిసిందే. అయితే ప్రమాదానికి కారణమైన వాహన డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోవడంతో కొండవూరు గ్రామస్తులు ఆదివారం నిరసనకు దిగారు. యువకుడి మృతదేహంతో నందిగాం మండలం కవిటిఅగ్రహరం రోడ్డుపై బైఠాయించి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ప్రమాదానికి కారణమైన కవిటి అగ్రహారం ట్రాక్టర్ డ్రైవర్ పిట్ట మహేష్ సాయం కోసం వేడుకుంటున్న క్షతగాత్రున్ని అక్కడే విడిచి పట్టి మానవత్వం లేకుండా వెళ్లిపోయాడని, విషయం తెలుసుకున్న ట్రాక్టర్ యజమాని పిట్ట అర్జున్ ట్రాక్టర్ను నీటితో కడిగి ప్రమాద ఆనవాళ్లు లేకుండా దాచారని మండిపడ్డారు. న్యాయం చేస్తానని చెప్పి కనిపించకుండాపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గ్రామస్తుల నిరసన నేపథ్యంలో కవిటి అగ్రహారం వద్ద పూండి –పలాస రోడ్డుపై ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న కాశీబుగ్గ రూరల్ సీఐ ఎం.తిరుపతి, నందిగాం ఎస్సై షేక్ మహహ్మద్ ఆలీ ఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే యజమాని అర్జున్ వజ్రపుకొత్తూరు పోలీస్ స్టేషన్లో లొంగిపోవడం, కాశీబుగ్గ డీఎస్పీ వి.వెంకటఅప్పారావు వచ్చి బాధితులతో మాట్లాడి ట్రాక్టర్ డ్రైవర్తో పాటు, ఓనర్పై కూడా కేసు నమోదు చేస్తామని, మృతుని తమ్ముడు హరీష్కు న్యాయం చేస్తామని తెలపడంతో శాంతించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడు మానవత్వం చూపని ట్రాక్టర్ డ్రైవర్, ఓనర్ రోడ్డుపై ఆందోళనకు దిగిన గ్రామస్తులు -
అచ్చెన్నా..మీకిది తగునా!
నందిగాం: మండల పరిధిలోని కణితూరు శ్మశాన వాటికకు విద్యుత్ సరఫరా కోసం పంచాయతీ తీర్మాణం చేసి డబ్బులు చెల్లించినా కనెక్షన్ మంజూరు చేయకుండా విద్యుత్శాఖ అధికారులు తాత్సారం చేస్తున్నారని సర్పంచ్ పేరాడ విమల, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఉన్న మంచినీటి కోనేరు పక్కనున్న ట్రాన్స్ఫార్మర్ నుంచి శ్మశాన వాటికకు విద్యుత్ సదుపాయం కల్పించేందుకు అంచనాలు తయారు చేయాలని ఆ శాఖ ఏఈని కోరేందుకు ఈ ఏడాది జనవరి 7న పంచాయతీ తీర్మానం చేశారు. ఫిబ్రవరి 27న నందిగాం కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. అందుకు అనుగుణంగా విద్యుత్ శాఖ వారు తయారు చేసిన అంచనాల మేరకు స్తంభాలు, లైన్ కోసం ఏప్రిల్ 29న రూ.1,26,273 సంస్థకు చెల్లించారు. అనంతరం విద్యుత్ సిబ్బంది శ్మశాన వాటిక వరకు స్తంభాలు తీసుకువచ్చి రెండింటిని పాతిపెట్టారు. తర్వాత ఏం జరిగిందో గానీ మిగిలిన వాటిని అలాగే వదిలేశారు. నెలలు గడుస్తున్నా మిగతావాటిని పాతకుండా విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయకుండా కాలయాపన చేస్తున్నారు. దీనికి కారణం రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు విద్యుత్ శాఖ అధికారులపై లొత్తిడి చేసి పని జరగకుండా అడ్డుకోవడమేనని సర్పంచ్, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామాల అభివృద్దికి కట్టుబడి ఉంటానని చెప్పే మంత్రి.. ప్రతిపక్ష పార్టీ బలంగా ఉన్న పంచాయతీల్లో అభివృద్ధి జరగకుండా, అధికారులపై ఒత్తిడి చేసి పనులు జరగకుండా అడ్డుకోవడం తగదని గ్రామస్తులు అంటున్నారు. అధికారులు కూడా గ్రామాల మౌలిక సదుపాయాల కల్పనలో ఒత్తిళ్లకు తలొగ్గకుండా ప్రజలకు సేవలు అందించాలని కోరుతున్నారు. ఇక్కడా రాజకీయమేనా.. గ్రామ పరిధిలోని శ్మశాన వాటికకు విద్యుత్ సదుపాయం కల్పించకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీకి అనుకూలమైన గ్రామమనే కక్షతోనే మంత్రి అచ్చెన్నాయుడు శ్మశానవాటిక వద్ద కూడా రాజకీయం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి విద్యుత్ పనులు పూర్తి చేయాలి. – పేరాడ రమేష్, కణితూరు కణితూరులో శ్మశానవాటికకు విద్యుత్ సరఫరా చేయని అధికారులు రాజకీయ కక్షలో భాగమేనంటున్న సర్పంచ్, గ్రామస్తులు -
శ్రీముఖలింగంలో అధికారికంగా బాలియాత్ర
జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో వంశధార నదీ తీరాన కార్తీక పౌర్ణమి తర్వాత బాలియాత్ర నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఆదివారం నిర్వాహక కమిటీ ప్రతినిధులు జీవితేశ్వరరావు, హెచ్.వి.దొర, అర్చకులు, భక్తులతో శ్రీముఖలింగంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ముందుగా బాలియాత్ర నిర్వహించే ఘాట్లను పరిశీలించారు. వాస్తవంగా కార్తీక పౌర్ణమి మరుసటి రోజున వంశధార నదిలో దీపాలు విడిచిపెట్టి ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అనుమతులు, బాలియాత్రకు వచ్చే భక్తులకు ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించారు. ఎంతో విశిష్టతగల ఈ యాత్రను అధికారికంగా నిర్వహించాలని వారు కోరారు. శ్రీముఖలింగేశ్వరునికి ప్రత్యేక పూజలు, ఏకవార అభిషేకాలు, వారాహి అమ్మవారికి కుంకుమ పూజలు, వివిధ దేవతా విగ్రహాల దర్శనం అనంతరం సాయంత్రం ఆరు గంటలకు దీపోత్సవం నిర్వహించేందుకు గ్రామ పెద్దలతో చర్చించారు. పార్టీలకు అతీతంగా పుణ్యక్రతువు నిర్వహించాలని నిర్ణయించారు. సుమారు ఐదు వేల సంవత్సరాలు క్రితం కళింగ రాజ్యంలో బాలి అనే దీవికి వెళ్లి దీపాలు విడిచిపెట్టేవారని, దీంతో వారి నౌకా వ్యాపారం విజయవంతంగా జరిగి మంచి లాభాలతో తిరిగి వచ్చేవారని పూర్వీకుల కథనం. బాలి యాత్ర వల్ల పూర్వీకులు ఆత్మకు శాంతి కలుగుతుందని, తోబుట్టువులు ఆయురారోగ్యాలతో జీవితం గడిపేవారని స్థానికులు చెబుతుంటారు. సమావేశంలో ఎంపీటీసీ సభ్యులు కె.హరిప్రసాద్, బి.వి.రమణ, బి.యోగీశ్వరరావు, వైద్యులు సంపతిరావు జగదీష్, పైల శ్రీనివాసరావు, పంచాది రవికుమార్, అర్చకులు కొండయ్య, నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి నివేదించిన నిర్వాహక కమిటీ ప్రతినిధులు కార్తీక పౌర్ణమి తర్వాత నిర్వహించాలని నిర్ణయం -
పేటలో మాటల తూటా
శ్రీకాకుళంఊరి బడికి ఊపిరిగంగాధరపేట వాసులు బడిని కాపాడుకున్నారు. మూసివేత ముప్పును తప్పించారు. –8లోసోమవారం శ్రీ 30 శ్రీ జూన్ శ్రీ 2025పలాస, టెక్కలిలో డివిజన్ స్థాయి రెవెన్యూ సమావేశాలు శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో రెవెన్యూ పరిపాలన మరింత సమర్థంగా ఉండేందుకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధ్యక్షతన రెవెన్యూ అధికారుల సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం పలాసలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫి ర్యాదుల స్వీకరణ అనంతరం, పలాస డివిజన్ అధికారుల సమావేశాన్ని నిర్వహించనున్నారు. అలాగే జూలై 2 వ తేదీన టెక్కలిలో టెక్కలి డివిజన్ రెవెన్యూ అధికారుల సమావేశం జరగనుంది. ఈ మేరకు వివరాలు తెలియజేస్తూ జిల్లా రెవెన్యూ అధికారి మారెళ్ల వెంకటేశ్వరరావు ప్రకటన విడుదల చేశారు. సమీక్ష సమావేశాల్లో ప్రజలకు సంబంధించిన అంశాలపై చర్చించి, పరిష్కార మార్గాలు సూచించనున్నట్లు తెలిపారు. మేట తొలగింది.. గండం గడిచింది ఇచ్ఛాపురం రూరల్: ఇటీవల కురిసిన వర్షాలకు డొంకూరు మత్స్యకార గ్రామంలోని బంగాళాఖాతంలో ఏర్పడిన ఆటుపోట్లకు సముద్రం–ఉప్పుటేరు మధ్య ఇసుక మేట వేయడంతో పంట పొలాల్లో ఉప్పునీరు పూర్తిగా నిండిపోయింది. ఖరీఫ్ సీజన్ దగ్గర పడుతుండటంతో రైతులు నారు మడులు వేసేందుకు భయాందోళన చెందారు. అధికారులు స్పందించకపోవడంతో పంచాయతీ నిధులతో ఆదివారం పంచాయతీ పాలక వర్గం పొక్లెయినర్లతో ఇసుక మేటలు(పొగురు తీత) తొలగించి ఉప్పుటేరు నీటిని సముద్రంలోకి మళ్లించారు. దీంతో అ టు అన్నదాతలు, ఇటు మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ దున్న గురుమూర్తి, సర్పంచ్ బుడ్డ కళ్యాణ్, చీకటి కృష్ణ, బాలరాజు, శివంగి మోహనరావు, బైపల్లి మోహనరావులతో పాటు గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. బాహుదాకు గర్భశోకం ఇచ్ఛాపురం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ఇచ్ఛాపురంలో ఇసుక రీచ్లను ప్రభుత్వం మంజూరు చేయనప్పటికి స్థానిక నేతల సాయంతో బాహుదా నది పరివాహక ప్రాంతాల్లో ఇసుకాసురులు దర్జాగా తవ్వకాలు సాగిస్తున్నారు. ఈ విదంగా తవ్వకాలు చేపట్టడంతో బాహుదానది ఇప్పటికే ముళ్ల పొదలు, పిచ్చిమొక్కలతో నిండిపోయింది. నదికి వరదలు వచ్చేటప్పుడు నది ఉప్పొంగే సమయంలో మట్టిదిబ్బలు, వరదగట్లు రక్షణగా ఉంటున్నాయి. ప్రస్తుతం ఇసుకాసురుల కన్ను బాహుదానదిలో గల మట్టిదిబ్బలు, వరద గట్లపై పడింది. దీంతో ఆ మట్టిదిబ్బలు, వరదగట్టులను సైతం తవ్వేస్తున్నారు. పట్టపగలే ఈ తంతు జరుగుతున్నా అధికారులు స్పందించడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే వరదల సమయంలో ఊరిలోకి నీరు వచ్చేస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ‘యూజ్లెస్ ఫెలో’.. టీడీపీ వర్గాల్లో రెండురోజులుగా నలుగుతున్న మాట ఇది. జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు, కింజరాపు సోదరుల ముద్దుల మేనల్లుడు మెండ దాసునాయుడుపై సాక్షాత్తు అతని బావ కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు సమక్షంలోనే నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కుమార్తె అర్చన ఈ పదం వాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశా రు. అంతటితో ఆగకుండా ‘గెట్అవుట్’ అని కూడా అన్నారు. అసలు అర్చనకు దాసునాయుడుపై ఇంత అసహనానికి కారణమేంటి?, అనుకోకుండా అక్కడ జరిగిన ఇష్యూ వల్లనే దాసునాయుడును అనాల్సి వచ్చిందా..? లేక మరేదైనా కారణం మనసులో పెట్టుకుని అందరిముందూ అవకాశం చూసుకుని కావాలనే ‘గెట్అవుట్’ అన్నారా..? అని ఇలా అనేక రకాలుగా పార్టీలో చర్చ జరుగుతోంది. తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు మెండ దాసునాయుడు దురుసుగా వ్యవహరిస్తున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు మామ అనో, కేంద్రమంత్రి రా మ్మోహన్నాయుడు బావనో గానీ దూకుడుగా వెళ్తున్నారు. అంతా తానే అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. జిల్లా కేంద్రంలో అనేక వ్యవహారాలు నడుపుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులను, ఇతర నాయకులను ఓవర్టేక్ చేసి చక్రం తిప్పుతున్నారు. కానీ నరసన్నపేటలో ఆయన ఆధిపత్యం సాగలేదు. దిమ్మతిరిగే విధంగా, అవాక్కయ్యేలా అవమానం ఎదుర్కొన్నారు. ప్రతి విషయంలోనూ ఆయన జోక్యం చేసుకుంటుండడంతో ఎమ్మెల్యేతో పాటు కుమార్తె ఒప్పుకోవడం లేదని, అందుకే ఇలా అన్నారనే వాదన ఉంది. అర్చన చేసిన వ్యాఖ్యలు టీడీపీలో చిచ్చు రేపాయి. పేటలో కింజరాపు కోటరీకి దన్ను నరసన్నపేట ఎమ్మెల్యే రమణమూర్తి అయినప్పటికీ అక్కడ కింజరాపు కుటుంబం ప్రత్యేకంగా కోటరీని నడుపుతోందని రమణమూర్తి వర్గం ఎన్నికల్లో సీటు కేటాయించినప్పటి నుంచే ఆరోపిస్తూ వస్తోంది. సొంత నియోజకవర్గం కావటం, బావ కేంద్రమంత్రిగా, మామ రాష్ట్రమంత్రిగా కొనసాగుతుండటంతో దాసునాయుడు ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా పనులు చేపడుతున్నారని రమణమూర్తి వర్గం నుంచి ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా పోలాకి మండలంలోని అప్పట్లో హరిశ్చంద్రపురం నియోజకవర్గం నుంచి విడిపోయి నరసన్నపేటలో చేరిన 14 పంచాయతీల టీడీపీ కేడర్ ఇప్పటికీ నిమ్మాడ నాయకత్వంపైనే ఆధారపడుతున్నారనేది వాస్తవం. ఆ గ్రామాల్లోనే దాసునాయుడు స్వగ్రామం యాట్లబసివలస కూడా ఒక టి. క్రమేణా ఆయాగ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు నిమ్మాడలో రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడు అందుబాటులో లేకపోవటంతో దాసునాయుడుకు టచ్లోకి వెళ్లిపోతున్నారు. ఇవన్నీ మనసులో పెట్టుకుని ‘గెట్అవుట్’ అని ఉండవచ్చని కొందరు అంటున్నారు. కించపరిచినందుకేనా..? అధికారంలోకి వచ్చిన తర్వాత మేనమామల అండతో దాసునాయుడు ఆధిపత్యం మరింత ఎక్కువైంది. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే ఫొటో లేకుండా నరసన్నపేట నియోజకవర్గం మొత్తం దాసునాయుడు జన్మదిన బ్యానర్లు, వాల్పోస్టర్లతో అనుచరులు హ డావుడి చేశారు. సోషల్మీడియాలో సైతం పేటలో కాబోయే ఎమ్మెల్యే దాసునాయుడే అంటూ రమణమూర్తిని కించపరిచేలా వ్యవహరించటం వెనుక దా సునాయుడు పాత్ర ఉందనేది అర్చన అనుమానం కావచ్చు. పట్టణంలో ఇటీవల ఒక హోటల్ ప్రారంభానికి ఎమ్మెల్యే లేకుండా దాసునాయుడు నేరుగా ప్రారంభానికి విచ్చేశారని, దీంతో బగ్గు వర్గానికి మ రింత మండినట్లు అయిందని చెబుతున్నారు. ఇవే కాకుండా వైన్స్ సిండికేట్ దగ్గర కూడా అక్కడక్కడా దాసునాయుడు వర్గంతో ఇబ్బందులు తలెత్తుతున్న ట్లు వినికిడి. ఒక సమావేశంలో ఎమ్మెల్యేను నెట్టేసినట్టు సైతం వార్తలు వినిపిస్తున్నాయి. బగ్గు రమణమూర్తి కుమార్తె అర్చన చేసిన వ్యాఖ్యలు రచ్చ రచ్చ అవుతున్నాయి. సోషల్ మీడి యా వేదికగా పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు యువత అధ్యక్షుడిని పట్టుకుని అంత పెద్ద మాట అనేస్తారా అని పోస్టులు పెట్టుకు ని బాధపడుతున్నారు. నరసన్నపేట నియోజకవర్గంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా యూజ్ లెస్ ఫెలో.. గెట్ అవుట్ వ్యాఖ్యలపై చర్చ నడుస్తోంది. ● మార్పులే గానీ చేర్పులు లేని పింఛన్ జాబితాలు ● పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులు శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో కొత్త పింఛన్ల కోసం ఎదు రు చూపులు తప్పడం లేదు. కూటమి పాలనలో నెలనెలా కలిపి దాదాపు 12వేల మంది పింఛన్లను తొలగించేసిన ప్రభుత్వం కొత్తవారికి మాత్రం పింఛన్ల జాబితాలో చోటు కల్పించడం లేదు. 2024 ఏప్రిల్లో జిల్లాలో పింఛన్దారుల సంఖ్య 3,20,886 ఉండగా ఈ ఏడాది మే నాటికి ఆ సంఖ్య 3,08,674కు పడిపోయింది. దాదాపు 12,212 పింఛన్లు తగ్గాయి. చనిపోయిన వారి సంఖ్య పక్కన పెట్టేసినా.. అనర్హుల పేరుతో రాజకీయ కారణాలతో తీసేసిన వారి సంఖ్యే ఎక్కువ. కొత్త పింఛన్ల మాట అటుంచితే ఉన్న పింఛన్లను కూడా ప్రతి నెలా తీసేస్తున్నారు. ప్రధానంగా దివ్యాంగులు తమ దివ్యాంగత్వం నిరూపించుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. సదరం పత్రం ఉన్నా మరోసారి వెరిఫికేషన్ చేసుకోవాలని, లేకుంటే పింఛన్ నిలిపివేస్తామని నోటీసులు ఇచ్చి తొలగించడానికి కూడా వెనుకాడడం లేదు. ఇక చాలా గ్రామాల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కక్షపూరితంగా పింఛన్లను ఆపే క్రమం నడుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారనే నెపంతో పింఛన్లు ఆపేశారు. జిల్లాలో దాదాపు ఇరవై వేల మంది పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. వారంతా వయోవృద్ధులు, సదరం దివ్యాంగ పత్రాలు కలిగిన వారు, ఒంటరి మహిళలు, అనారోగ్య బాధితులు. కానీ వీరికి పింఛన్లు మంజూరు చేసే అవకాశాలు కనిపించడం లేదు. వారి గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలీక అవస్థలు పడుతున్నారు. రెండు నెలల కిందట భర్త పింఛనుదారుడై ఉండి మరణిస్తే వారి భార్యకు వితంతు పింఛన్ ఇస్తామని చెప్పారు. ఇలాంటి వారు జిల్లాలో 4623 మంది ఉన్నారని లెక్కలు వేశారు. కానీ వారికి పింఛన్ మొత్తం అందడం లేదు. ఇక యాభై ఏళ్లకే పింఛన్ హామీని పాలకులు పూర్తిగా మర్చిపోయారు. న్యూస్రీల్ మెండ దాసునాయుడిపై ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కుమార్తె అర్చన తీవ్ర వ్యాఖ్యలు ‘యూజ్లెస్ ఫెలో’ అనడంతో పార్టీలో దుమారం హీటెక్కిన టీడీపీ అంతర్గత రాజకీయం వేడెక్కిన టీడీపీ అంతర్గత రాజకీయం మెండ దాసునాయుడ్ని యూజ్ లెస్ ఫెలో...గెట్ అవుట్ అంటూ ఎమ్మెల్యే కుమార్తె అర్చన చేసిన వ్యాఖ్యలతో టీడీపీలో అంతర్గత రాజకీయం వేడెక్కింది. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి వద్ద చర్చ పెట్టాలని, ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలని మెండ దాసునాయుడు వర్గం డిమాండ్ చేస్తోంది. సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతోంది. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో నరసన్నపేట నుంచి మెండ దాసునాయుడే పోటీ చేస్తారని అప్పుడు చూసుకుంటామని తామేంటో చూపిస్తామని బీరాలు కూడా పలు కుతున్నారు. మరోవైపు జరుగుతున్న పరిణామాలపై బగ్గు రమణమూర్తి వర్గం కూడా నిశితంగా పరిశీలిస్తోంది. తదుపరి ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై సమాలోచనలు చేస్తోంది. -
క్లస్టర్ ఉపాధ్యాయులకు
గోడు వినేవారు కరువు భాషోపాధ్యాయుల సమస్యలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. రాష్ట్ర అధికారులకు, ప్రజాప్రతినిధులకు చెబుతున్నా మా సమస్యలు పరిష్కరించకుండా మరింత జటిలం చేస్తున్నారు. క్లస్టర్ పోస్టుల్లో పనిచేస్తున్న వారి కష్టాలు వర్ణణాతీతం. – పిసిని వసంతరావు, చైర్మన్ భాషోపాధ్యాయ సంస్థ, శ్రీకాకుళం● ఏ పాఠశాలలో ఏ సబ్జెక్టు బోధించాలో తెలీని పరిస్థితి ● క్లస్టర్ పరిధిలో ఏ పాఠశాలకు వెళ్లాలో తెలీని వైనం ● బయోమెట్రిక్ సమయానికి వెళ్లలేమోనని ఆందోళన శ్రీకాకుళం: జిల్లాలో ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేసిన క్లస్టర్ ఉపాధ్యాయ పోస్టుల్లో ఉన్న వారికి అనుకోని కష్టాలు ఎదురవుతున్నాయి. క్లస్టర్ పోస్టులను ఏర్పాటు చేసినప్పటికీ విధి విధానాలు ఇప్పటివరకు ప్రకటించలేదు. ఉపాధ్యాయుల బదిలీలకు ముందు క్లస్టర్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని, అందులో నియమితులైన వారు క్లస్టర్ పరిధిలో ఎవరైనా సెలవు పెడి తే, ఆయా పాఠశాలలకు వెళ్లాలని సూచించారు. క్లస్టర్ పరిధిలో 10 నుంచి 15 పాఠశాలలు ఉంటాయి. ఈ పాఠశాలల్లో ఎవరైనా సెలవు పెడి తే, ఆ పాఠశాలకు క్లస్టర్ ఉపాధ్యాయుడు వెళ్లా ల్సి ఉంటుంది. ఈ క్లస్టర్ పోస్టుల్లో నియమితు లైన వారంతా డీఈఓ పూల్లో ఉన్న తెలుగు స్కూల్ అసిస్టెంట్లు కావడం గమనార్హం. వీరు తెలుగు ఉపాధ్యాయులైనప్పటికి, తెలుగు బోధించే పరిస్థితి ఉండదు. క్లస్టర్ పరిధిలోని ఏ పాఠశాలలోనైనా ఎవరైనా సెలవు పెడితే వీరు బోధించాల్సి ఉంటుంది. దీంతో వీరు మనోవేదనకు గురవుతున్నారు. అలాగే ఇటీవల విద్యాశాఖ రాష్ట్ర అధికారులు ఓ ఉత్తర్వు విడుదల చేస్తూ, ప్రార్థన సమయానికి ఏ ఉపాధ్యాయుడైనా బయోమెట్రిక్ వేయకపోతే, వారిని గైర్హాజరు కింద పరిగణించి, ఆ రోజు జీతం కూడా చెల్లించకూడదని పేర్కొన్నారు. దీంతో ఎప్పుడు ఏ పాఠశాలకు వెళ్లాలో తెలీని క్లస్టర్ ఉపాధ్యాయులు మరింత వేదనకు గురవుతున్నారు. సమాచారం లోపం ఉంటే సమయానికి బడికి వెళ్లడం కుదరని పని. అలాగే క్లస్టర్ ఉపాధ్యాయుడి బయోమెట్రిక్ కూడా క్లిష్టతరంగా ఉంటోంది. ఆన్లైన్లో స్పెష ల్ డ్యూటీ అప్లై చేసుకుని, వెళ్లబోతున్న పాఠశాల లొకేషన్ నమోదు చేసి, హాజరు వేయాల్సి ఉంటుంది. ఇలా ఎన్నో రకాలుగా క్లస్టర్ ఉపా ధ్యాయులకు గండాలు ఎదురవుతున్నాయి. ఇటీవల ఉపాధ్యాయుల బదీలీలు జరగక ముందు, డీఈఓ పూల్లో 200 మందికి పైగా భాషా పండితులు ఉండేవారు. వీరిలో 100 మందిని క్లస్టర్ పోస్టుల్లో నియమించగా 45 మంది హిందీ, 18 మంది ఒడియా, 60మంది వరకు తెలుగు భాషా ఉపాధ్యాయులు ఇంకా డీఈఓ పూల్ ఉన్నారు. వాస్తవానికి జిల్లా వ్యాప్తంగా 160 ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో భాషోపాధ్యాయులను నియమిస్తే, క్లస్టర్ పోస్టులను ఏర్పాటు చేయాల్సి ఉన్నా డీఈఓ పూల్లో ఉంచాల్సిన పని ఉండదు. ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో 6,7,8 తరగతులు ఉన్నప్పటికి, తెలుగు పోస్టునే ఇవ్వలేదు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సర్ ప్లస్ ఉపాధ్యాయులు ఉన్నప్పటికి, డీఎస్సీని ప్రకటించి, క్షేత్ర స్థాయిలో ఖాళీలను చూపించేందుకు ఫీట్లు చేస్తున్నారు. ఇప్పటిౖకైనా ఈ గందరగోళ పరిస్థితిని తప్పించాలని గురువులు కోరుతున్నారు. -
వైఎస్సార్ సీపీ సమావేశానికి ముమ్మర సన్నాహాలు
నరసన్నపేట: జిల్లా కేంద్రంలోని అరసవల్లి రోడ్డులో ఉన్న సన్రైజ్ హొటల్లో జూలై 3న సాయంత్రం 3 గంటలకు వైఎస్సార్ సీపీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నామని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’పై కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు ఈ సమావేశం నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ఇందులో శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త కురసాల కన్నబాబు, పార్టీ జిల్లా పరిశీలకులు కుంభా రవిబాబు తదితరులు ముఖ్య అతిథులు గా పాల్గొంటారని తెలిపారు. -
నవ్విపోదురు గాక..
● ఉద్దానం తాగునీటి పథకం రెండోదశ పనులకు రెండోసారి శంకుస్థాపన ● గత ఏడాదే ఈ పనులకు శ్రీకారం చుట్టిన అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ● మళ్లీ ఆ పనులకే శంకుస్థాపన చేయడంపై విమర్శలు పాతపట్నం/హిరమండలం: వైఎస్సార్ సుజల ధార ఉద్దానం ప్రాజెక్ట్.. వైఎస్ జగన్ ప్రభుత్వం రూపకల్పన చేసి, నిధులు విడుదల చేసి, పనులు పూర్తి చేసిన ప్రాజెక్టు. దశాబ్దాల తరబడి జిల్లాను పాలిస్తున్న వారు కలలో సైతం ఊహించని రీతిలో వైఎస్సార్ సీపీ సర్కారు ఉద్దానం గ్రామాల ప్రజల కోసం ఈ ప్రాజెక్టును పూర్తి చేసి చూపించింది. ఇదే ప్రాజెక్టుకు అనుసంధానంగా పాతపట్నం నియోజకవర్గంలోని 444 గ్రా మాలకు తాగునీరు అందించేందుకు పథకం విస్తరణకు సైతం శ్రీకారం చుట్టింది. అప్పట్లోనే శంకుస్థాపన కూడా జరిగింది. సరిగ్గా అవే పనులకు కేంద్ర మంత్రి కె.రామ్మోహన్నాయుడు, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు శనివారం మళ్లీ శంకుస్థాపన చేయడం హాస్యాస్పదంగా మారింది. భగీరథ ప్రయత్నం.. కిడ్నీ వ్యాధులతో బాధ పడుతున్న ఉద్దానం ప్రజల కోసం రూ.700 కోట్లతో ఉద్దానం సమగ్ర మంచినీటి పథకం నిర్మాణానికి వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కరోనా కష్టకాలం ఎదురువచ్చి నా అన్నింటినీ దాటుకుని ఉద్దానం వరకు వంశధారను తీసుకువచ్చింది. ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు భగీరథ ప్రయత్నమే చేసింది. రూ.265 కోట్లతో పాతపట్నానికి.. హిరమండలం వద్ద ఉన్న వంశధార రిజర్వాయర్ నుంచి జలాలను తరలించి శుద్ధి చేసి నీటిని అందించాలన్నది ఈ పథకం లక్ష్యం. పాతపట్నంకు కూడా ఈ నీటిని అందించేందుకు అప్పటి ఎమ్మెల్యే రెడ్డి శాంతి వైఎస్ జగన్ను ఒప్పించారు. ఆమె అడిగిందే తడవుగా పథకం విస్తరణకు రూ.265 కోట్లు విడుదల చేశారు. దీంతో 2024 ఫిబ్రవరి 19న అప్పటి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు శంకుస్థాపన చేసి పను లు కూడా ప్రారంభించారు. ఇంతలో ఎన్నికలు వ చ్చి ప్రభుత్వం మారిపోయింది. ఏడాదిగా ఈ పను ల ఊసేలేదు. కానీ ఇప్పుడు అవే పనులకు మళ్లీ శంకుస్థాపన చేయడం విమర్శలకు తావిస్తోంది. జెడ్పీ చైర్ను అవమానించారు.. ‘జిల్లా పరిషత్ నుంచే ఆర్డబ్ల్యూఎస్ పథకాలకు నిధులిస్తున్నాం. ఉద్దానం ప్రాజెక్టుకై తే జగనన్న ప్రభుత్వ హయాంలో రూ.700 కోట్లతో హిరమండలం నుంచి ఏకంగా ఉద్దాన ప్రాంతానికి ఇంటింటికీ తాగునీరు అందించాం. కానీ ఇప్పుడు అధికారులు నాకు కనీసం సమాచారం ఇవ్వకుండా కొత్తగా శంకుస్థాపనలు చేస్తున్నారు. ఇలా ప్రొటోకాల్ ఉల్లంఘించడం నన్ను అవమానించడం కాదు.. జెడ్పీ చైర్ను అవమానించడం.’ అని జెడ్పీ చైర్ పర్సన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆమె ఇలా స్పందించారు. పాతపట్నం నియోజకవర్గానికి హిరమండలం నుంచి రూ.265 కోట్లతో మంచినీటిని అందించే పనులకు గతంలోనే శంకుస్థాపన చేయించామని, మళ్లీ ఇవే పనులకు ఇప్పుడేదో కొత్తగా చేస్తున్నట్లు మళ్లీ శంకుస్థాపనకు సిద్ధమయ్యారని విమర్శించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్గా తనకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సమాచారం ఇవ్వకపోవడం ఏమాత్రం సరికాదన్నారు. -
అక్రమ ఇసుక రవాణా నిలుపుదల
ఆమదాలవలస రూరల్: ఇసుక అక్రమ రవాణాపై ‘సాక్షి’ వరుస కథనాలకు అధికారులు స్పందించారు. ఆమదాలవలస రూరల్ మండలం కొత్తవలస ఇసుక ర్యాంపు నుంచి ఇసుక లారీలు శనివారం పూర్తిగా నిలుపుదల చేశారు. అంతే కాకుండా దూసి రోడ్డు పొడవునా లారీల రాకపోకలు నిలిచిపో వటంతో రహదారి నిర్మానుష్యంగా దర్శనమిచ్చింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కొత్తవలస గ్రామంలో విద్యుత్ తీగలను తాకేవిధంగా ఇసుక నిల్వ వేయటంతో ఇసుక ర్యాంపుల యజమానులకు విద్యుత్ శాఖాధికారులు హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. దారులన్నీ గోతులమయం కావడంతో దూసిపేట గ్రామానికి చెందిన ప్రజలు లారీలు కొంత సమయం నిలుపుదల చేయటమే కాకుండా జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించడంతో లారీలు పూర్తిగా నిలిచిపోయాయి. -
మత్స్యావతారుడై..
శ్రీకాకుళం కల్చరల్: శ్రీకాకుళం మొండేటివీధి షిర్డీ సాయి సేవా సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న రథయాత్ర ఉత్సవాల్లో స్వామిని శనివారం మత్స్యావతారంలో అలంకరించారు. భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు. ఖండాలు దాటి.. కన్నవారింటికి ఇచ్ఛాపురం రూరల్: సైబీరియా నుంచి విదేశీ విహంగాలు తేలుకుంచికి చేరుకుంటున్నాయి. వీటి శాసీ్త్రయ నామం ‘అనస్థోమస్’. పక్షులు గ్రామంలోని ఊర చెరువు, గ్రామ దేవత ఆల యం వద్ద కంచి చెట్లపై గూళ్లు ఏర్పాటు చేసుకొని ఇక్కడే గుడ్లు పొదుగుతాయి. ఏటా జూన్ నెలాఖరులో వచ్చి తమ గ్రామంలో గుడ్లు పొదిగి, పిల్లలను సంరక్షించుకునే ఈ పక్షులను గ్రామస్తులు తమ పుట్టింటి ఆడబిడ్డగా పరిగణిస్తారు. పక్షులకు ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా గ్రామస్తులు కాపాడుకుంటారు. -
తెలుగు వారి ధైర్యసాహసాలకు ప్రతీక రామ్గోపాల్ నాయుడు
టెక్కలి: తెలుగు వారి ధైర్య సాహసాలకు ప్రతీకగా రామ్గోపాల్నాయుడు నిలిచారని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కొనియాడారు. శనివారం సంతబొమ్మాళి మండలం నగిరిపెంట గ్రామంలో మేజర్ రామ్గోపాల్నాయుడును అభినందించి జ్ఞాపికను అందజే శారు. దేశరక్షణలో భాగంగా జమ్మూ కశ్మీర్ నియంత్రణ రేఖ వద్ద శత్రువులను మట్టుబెట్టి తన తోటి సైనికులను రక్షించడంలో రామ్గోపాల్నాయుడు చూపిన ధైర్య సాహసాలు నేటి యువతకు ఆదర్శ మని గుర్తు చేశారు. దేశంలో అత్యున్నత పురస్కా రం అందుకున్న తొలి తెలుగు వ్యక్తిగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన రామ్గోపాల్నాయుడు చరిత్ర సృష్టించారని కొనియాడారు. రామ్గోపాల్నాయుడును సన్మానించిన వారిలో వైఎస్సార్సీపీ టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్, కళింగ సామాజిక వర్గం రాష్ట్ర అధ్యక్షుడు దుంపల లక్ష్మణరావు, సంతబొమ్మాళి, టెక్కలి, కోటబొమ్మాళి జెడ్పీటీసీలు పాల వసంత్రెడ్డి, దువ్వాడ వాణి, దుబ్బ వెంకటరావు, నందిగాం ఎంపీపీ ఎన్.శ్రీరామ్మూర్తి పాల్గొన్నారు. -
అధికారులూ.. ఇదేం పద్ధతిప్రొటోకాల్ ఉల్లంఘనపై జెడ్పీ చైర్ పర్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్ను అవమానించడం సరికాదన్నారు. –8లో
జూలై 3న వైఎస్సార్ సీపీ సమావేశం నరసన్నపేట: జిల్లా కేంద్రంలో జూలై మూడున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. ఈ సమావేశానికి పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త కురసాల కన్నబాబు, జిల్లా పరిశీలకులు కుంభా రవిబాబు ముఖ్య అతిథులుగా హాజరవుతారని పేర్కొన్నారు. చంద్రబాబు హామీలను ప్రజలందరికీ గుర్తు చేసే లక్ష్యంతో వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ కార్యక్రమం జరగనుందని, దీనిపై ఆలోచనలు, కార్యాచరణ ఖరారు చేసేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశానికి నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు, మండల పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొనాలని పిలుపు నిచ్చారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. -
పకడ్బందీగా లింగ నిర్ధారణ చట్టం అమలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: మహిళా శిశు సంక్షేమం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని, లింగ నిర్ధారణ చట్టం అమలులో ఎలాంటి విడుపులూ లేకుండా కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన సలహా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆడపిల్లలపై వివక్ష, మూఢనమ్మకాలపై ప్రజల్లో చైతన్యం కలిగించాలన్నారు. లింగ నిర్ధారణ చేసి గర్భస్రావానికి పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్ నిర్వహించిన సర్వే ప్రకారం 2019–21లో 1000 మందికి పురుషులకు 1163 మంది సీ్త్రలు ఉన్నట్లు పేర్కొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్ అనిత మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 16 కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించామని, లింగ నిర్ధారణ జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఎన్టీఆర్ వైద్య సేవా పథకం ద్వారా పేద ప్రజలకు సత్వరం వైద్య సేవలను అందించే విషయంలో నిర్లక్ష్యం పనికిరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రైవేటు ఆస్పత్రులు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఐవీఆర్ఎస్ ద్వారా 387 కేసులలో అభిప్రాయం కోరగా 20 కేసులలో ప్రైవేట్ ఆసుపత్రులు డబ్బులు వసూలు చేశాయని ఫిర్యాదులు అందాయని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో డీసీహెచ్ఎస్ కళ్యాణ్ బాబు, డీఐఓ రామ్దాస్, డిప్యూటీ డీఎంహెచ్ఓ మేరీ కాథరిన్, ఆర్బీఎస్కే కో–ఆర్డినేటర్ వెంకట్రావు, డీపీఎంవో బి.రవీంద్ర, ట్రైనింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ జి.వి.లక్ష్మి, స్వర్ణలత, బెజ్జిపురం యూత్ క్లబ్ ప్రతినిధి ఎన్.ప్రసాదరావు, డిప్యూటీ డీఈఎంఓ వెంకటేశ్వరరావు, ఆరోగ్యశ్రీ కో–ఆర్డినేటర్ ప్రకాష్రావు, కిమ్స్ ఆస్పత్రి ఏవో సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
పోలీసు అధికారులకు ప్రశంసలు
శ్రీకాకుళం క్రైమ్ : ప్రాపర్టీ కేసుల ఛేదన, రికవరీ, ముద్దాయిల అరెస్టు, పనితీరు పాటు మరికొన్ని ముఖ్య కేసులను ఛేదించడంలో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులను ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి శనివారం ప్రశంసించారు. గత ఆరు నెలల్లో 84 ప్రాపర్టీ, గ్రేవ్ కేసులు, రెండు నెలల్లో 20 కేసుల్లో ప్రతిభ కనబర్చిన సీఐ సూర్యచంద్రమౌళి సారథ్యంలోని సీసీఎస్ పోలీసు బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ప్రశంసాపత్రాలు అందజేశారు. ఇటీవల ఛేదించిన కేసులివే.. మందస, సారవకోటలో బ్యాంకులకు వెళ్లిన ఇద్దరు వేర్వేరు వ్యక్తులు అమౌంట్ తీసుకుని వచ్చి కారు ఢిక్కీలో పెట్టడాన్ని చూసిన ఒడిశాకు చెందిన దున్న మనోజ్ వారిని దృష్టి మరల్చి ఓ చోట రూ.1.50 లక్షలు, మరో చోట రూ. 90 వేలు దొంగిలించాడు. కాశీబుగ్గలో 40 తులాల బంగారం, శ్రీకాకుళంలోని ఏసీబీ సీఐ హరి నివాస గృహంలో ఏడున్నర తులాల బంగారం కేసులతో పాటు మరో 14 కేసుల్లో ముద్దాయిలైన ముద్దాడ నర్సింగరావు (ఎచ్చెర్ల మండలం), పార్వతీపురం మన్యం జిల్లావాసిని పట్టుకోవడంలో కృషి చేశారు. ఉమెన్స్ కళాశాల ఆవరణలో విద్యార్థినిపై జరిగిన దాడి కేసు ఛేదనలో సీసీఎస్ సీఐ చంద్రమౌళితో పాటు శ్రీకాకుళం ఒకటో పట్టణ సీఐ పైడపునాయుడుకు ప్రశంసాపత్రం దక్కింది. వీరితో పాటు పాతపట్నం సీఐ రామారావు, సైబర్ సెల్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐలు హరికృష్ణ, రాము, మధుసూదన్, గఫూర్, హెచ్సీ జగదాంబ, పోలీస్ కానిస్టేబుళ్లు ఉన్నారు. -
సచివాలయ బదిలీల్లో సిఫార్సులకే పెద్దపీట!
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): గ్రామీణ వ్యవసాయ సహాయకులు (వీఏఏ)ల బదిలీల ప్రక్రియ శనివారం జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయంలో నిర్వహించారు. పేరుకే వెబ్ కౌన్సెలింగ్ అయినా చేసేదంతా సిఫార్సు లేఖలకేనని విమర్శలు వినిపిస్తున్నాయి. సచివాలయ ఉద్యోగు లకు బదిలీ జీవో ఇచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు పేషీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేలు ఓ జాబితా తయారుచేసి జిల్లా వ్యవసాయాధికారి చేతిలో పెట్టినట్లు సమాచారం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 557మంది వీఏఏలు ఉండగా వీరిలో 18 మంది వివిధ పరిస్థితులు దృష్ట్యా బదిలీల్లో ఎఫెక్ట్ కాకుండా ఉన్నారు. మిగిలిన వారికి నిబంధనలు, పారదర్శకంగా బదిలీలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రతి నియోజకవర్గంలో తమకు కావాల్సినవారికి ఎమ్మెల్యేలు, మంత్రులు ఇప్పటికే లేఖలు ఇచ్చి సిఫార్సులున్నవారికే నచ్చిన చోటకి బదిలీ చేస్తున్నారని పలువురు గగ్గోలు పెడుతున్నారు. మొదటి రోజు 150 మందికి కౌన్సిలింగ్కు పిలవగా.. మిగిలినవారికి ఆది, సోమవారాల్లో కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు తెలిసింది. మున్సిపాలిటీల్లో 300 మందికి పైగా బదిలీ.. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ కలిపి శ్రీకాకుళం కార్పోరేషన్, ఆమదా లవలస, రాజాం, పాలకొండ, పలాస, ఇచ్ఛాపురం కమిషనర్లు ఆధ్వర్యంలో పనిచేస్తున్న వార్డు అడ్మిని స్ట్రేటివ్ సెక్రటరీలు, ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు, వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీలు, వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీలకు సైతం బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. వార్డు ఎమినిటి సెక్రటరీలకు మా త్రం పబ్లిక్ హెల్త్ సూపరింటిండెంట్ ఆఫీస్ విశాఖ పట్నం నుంచి అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించా రు. అన్ని విభాగాల్లో కలిసి సుమారు 300 మందికి పైగా బదిలీ చేసినట్లు కమిషనర్ తెలిపారు. అధిక సంఖ్యలో సిఫార్సు లేఖలకే ప్రాధాన్యమిచ్చినట్లు తెలుస్తోంది. -
అధికారులూ.. ఇదేం పద్ధతి!
● ప్రొటోకాల్ ఉల్లంఘనపై జెడ్పీ చైర్పర్సన్ విజయ మండిపాటు ● 15వ ఆర్థిక సంఘ నిధుల మళ్లింపుపై జెడ్పీటీసీల ఆగ్రహం ● టెక్కలిలో పారిశుద్ధ్య నిర్వహణ తీరుపై ధ్వజమెత్తిన దువ్వాడ వాణి ● వాడీవేడిగా జెడ్పీ సర్వసభ్య సమావేశం అరసవల్లి: జిల్లా పరిషత్ నిధులతో నిర్మిస్తున్న ఆర్డబ్ల్యూఎస్ పథకాల పనుల శంకుస్థాపన సమయంలో అధికారులు ప్రొటోకాల్ ఉల్లంఘించడంపై జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల తీరు తనకు మాత్రమే కాకుండా తన పదవి(చైర్)కే అవమానం జరిగినట్లు భావించాల్సి ఉంటుందని మండిపడ్డారు. శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్, జెడ్పీ సీఈవో శ్రీధర్ రాజాల ఆధ్వర్యంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో పలు అంశాలపై వాడీవేడిగా చర్చ జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, ఎమ్మెల్యేలు గొండు శంకర్, ఎన్.ఈశ్వరరావు, డీసీఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్, డీసీసీబీ చైర్మన్ శివ్వాల సూర్యనారాయణ, ఉమ్మడి జిల్లా అధికారు లు పాల్గొన్నారు. కాగా ఈ కీలక సమావేశానికి అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఇద్దరు మిన హా మిగిలినవారెవ్వరూ హాజరుకాలేదు. ప్రజల సమస్యలపై జెడ్పీటీసీలు నిలదీస్తారేమో అనే ఇంటిలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలోనే మంత్రులు, విప్లు హాజరుకాలేదని సమాచారం. ●జిల్లాలో పంచాయతీలకు జమ కావాల్సిన 15వ ఆర్థిక సంఘ నిధులు ఎటుపోయాయని జెడ్పీ వైస్ చైర్మన్ సిరిపురపు జగన్మోహనరావు, జెడ్పీటీసీలు టొంపల సీతారాం, నాగేశ్వరరావు, కాయల రమణ, బెండి గోవిందరావు, దువ్వాడ వాణి, వంగ ర ఎంపిపి సురేష్ ముఖర్జీ తదితరులు అధికారులను నిలదీశారు. దీనిపై జెడ్పీ సీఈవో శ్రీధర్రాజా స్పందించి నిధులు పంచాయతీల ఖాతాలకు అడ్జస్ట్ అవుతాయని ప్రకటించారు. అనంతరం డీపీఓ భార తీ సౌజన్య పంచాయతీల ఆర్థిక నిధుల ఖాతాల్లో బాలెన్స్ల వివరాలను చదివి వినిపించారు. ●ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ మాట్లాడుతూ నాగావళి కుడి ఎడమ కాలువల ఆధునీకరణ పను ల సంగతేంటని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ఈ పనులకు రెండు దఫాలుగా నిధులు కేటాయించి ననా ఈ ప్రభుత్వం ఎందుకు పనులు మొదలు పెట్టలేదని జలవనరుల శాఖాధికారులను ప్రశ్నించారు. జిల్లా పరిషత్ పాలకులకు ఇంకో ఏడాదిన్నర సమయం మాత్రమే ఉందని, ఇప్పటికై నా జెడ్పీటీసీలకు నిధులు కేటాయించి వారి హక్కులను కాపాడేలా పనులు చేయించాలని కోరారు. ●శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ గార మండలంలో వత్సవలస, కళింగపట్నం, అంబళ్లవలస ఎత్తిపోతల పథకాల పనులు ఎప్పుడు పూర్తి చేస్తారని అధికారులను ప్రశ్నించారు. దీనిపై జలవనరుల శాఖాధికారులు స్పందిస్తూ వచ్చే నెల 15న నీరు అందిస్తామని సమాధానమిచ్చారు. ●ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వం శ్రీకాకుళం కార్పొరేషన్లో ఎచ్చెర్ల పరిధిలోని కుశాలపురం, తోటపాలెం గ్రామ పంచాయతీలను విలీనం చేసిందని..దీంతో అక్కడి గ్రామీ ణ ప్రాంత ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని, మళ్లీ ఈ రెండు గ్రామాలను పంచాయతీలుగా మార్చేలా గెజిట్ తెస్తామని ప్రకటించారు. జల్జీవన్ మిషన్, ఉపాధి హామీ పనులకు కూడా ఈ రెండు గ్రామాలు అర్హత కోల్పోయాయని, అక్కడి గ్రామస్తుల వినతిమేరకు ఈ గెజిట్ విడుదలకు చర్యలు చేపట్టాలని సీఎం దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. సమాచారం ఇవ్వకపోవడం తగదు: జెడ్పీ చైర్పర్సన్ విజయ వివిధ శాఖల ప్రగతి నివేదికల సమీక్షలో భాగంగా ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఇంజినీర్ లలితకుమారి మాట్లాడుతూ ఉద్దానం ప్రాజెక్టు విస్తరణ పనులను వివరించారు. ఇచ్ఛాపురం పట్టణానికి తాగునీటిని అందించే పనుల ప్రస్తావించగానే.. చైర్పర్సన్ విజయ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన పనులకు మళ్లీ శంకుస్థాపన చేయడమేంటని ప్రశ్నించారు. చైర్పర్సన్గా ఇచ్ఛాపురం నియోజకవర్గానికి చెందిన తనకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సమాచారం ఇవ్వకపోవడం తగదన్నారు. కంచిలి మండలంలో తాగునీటి పథకాలకు విద్యుత్ కనెక్షన్ కట్ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. డ్రోన్ల వినియోగంపై అక్కడి రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. -
బైక్ను ఢీకొట్టిన కారు
● ఒకే కుటుంబంలో ముగ్గురికి గాయాలు కంచిలి: కంచిలిలో జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గాయటపడ్డారు. వివరాల్లోకి వెళితే.. బొగాబెణి పంచాయతీ జెన్నాగాయి గ్రామానికి చెందిన దుర్యోధన జెన్నా భార్య తులసి జెన్నా, మూడేళ్ల కుమారుడు ఢిల్లేశ్ జెన్నాలతో కలిసి బైక్పై కంచిలి బజారుకు బయలుదేరాడు. అదే సమయంలో పలాస వైపు నుంచి ఇచ్ఛాపురం వైపు వెళుతున్న కారు అతివేగంతో వెనుక నుంచి బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన కాలువలోకి ద్విచక్ర వాహనంతో సహా సుమారు వంద మీటర్లు ఈడ్చుకెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న భర్త, భార్య, బిడ్డలు తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిని 108 అంబులెన్స్లో సోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కారు కవిటి మండలం ఇంటెనకపుట్టుగ గ్రామానికి చెందినదిగా స్థానికులు చెబుతున్నారు. కారును నిర్లక్ష్యంగా నడపటం వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. గాయపడిన దుర్యోధన జెన్నా గొల్లకంచిలి గ్రామంలో నిమ్మాసినమ్మ ఆలయ పూజారిగా పనిచేస్తున్నారు. పూజా సామగ్రి కొనుగోలుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కంచిలి ఏఎస్ఐ పి.అప్పిరెడ్డి కేసు నమోదు చేశారు. -
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
హిరమండలం: అప్పుల బాధ తట్టుకోలేక తంప గ్రామానికి చెందిన డోల దొరబాబు (35) ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను ధనుపురం గ్రామ సమీపంలో స్పైసీ దాబా నిర్వహించేవాడు. ఈ క్రమంలో ఐదేళ్ల కిందట వ్యాపారం కోసం అప్పులు చేశాడు. ఇటీవల ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు శ్రీకాకుళం రిమ్స్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దొరబాబుకు భార్య, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. తండ్రి అప్పలనాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ మహ్మద్ యాసిన్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి వజ్రపుకొత్తూరు : కొండవూరు గ్రామానికి చెందిన కొరికాన చైతన్య(29) అనే యువకుడు శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో పూండి నుంచి పలాస బైక్పై వెళుతుండగా బెండిగేటు సాయిబాబా గుడి సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చైతన్య సీమేన్గా పనిచేస్తున్నాడు. తమ్ముడు హరీష్తో కలసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. తల్లితండ్రులు గున్నయ్య, అమ్మన్నలు ఏడేళ్ల క్రితమే చనిపోయారు. చైతన్యకు జూలై 31న వివాహం జరగాల్సి ఉంది. ఇంతలోనే మృతిచెందడంతో విషాదఛాయలు అలముకున్నా యి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఏఎస్ఐ రమణా రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పాముకాటుకు చిన్నారి మృతి కంచిలి: మకరాంపురం గ్రామానికి చెందిన గుడియా సాయిసా(10) అనే చిన్నారి పాము కాటుకు గురై మృతిచెందింది. వివరాల్లోకి వెళితే.. గుడియా పూర్ణచంద్ర–గీత దంపతుల కుమార్తె సాయిసా కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా పాము కాటేసింది. చిన్నారిని కుటుంబ సభ్యులు వెంటనే సోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బరంపురం ఎం.కె.సి.జి. ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతిచెందింది. సాయిసా స్థానిక ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. తండ్రి పూర్ణచంద్ర టిఫిన్ హోటల్లో హెల్పర్గా, తల్లి కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. చిన్నారి సాయిసాతోపాటు కుమారుడు ఉన్నాడు. కుమార్తె మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జాతీయ కబడ్డీ పోటీలకు సిక్కోలు క్రీడాకారులు శ్రీకాకుళం న్యూకాలనీ: మొదటి జాతీయ స్థాయి జూనియర్ కబడ్డీ చాంపియన్షిప్–2025 పోటీలకు జిల్లాకు చెందిన సత్తారు రామ్మోహనరావు (అక్కులపేట, ఆమదాలవలస మండలం), పోతనపల్లి యమున (పల్లిసారథి, పలాస మండలం) ఎంపికయ్యారు. ఈ పోటీలు జూన్ 29 నుంచి జూలై ఒకటో తేదీ వరకు ఉత్తరాఖండ్లోని హరిద్వార్ వేదికగా జరగనున్నాయి. ఇప్పటికే వీరు ఏపీ జట్లతో కలిసి హరిద్వార్ చేరుకున్నారు. వీరి ఎంపిక పట్ల జిల్లా కబడ్డీ సంఘం చైర్మన్, ఎమ్మెల్యే గొండు శంకర్, అధ్యక్షుడు నక్క రామకృష్ణ, కార్యదర్శి సాధు ముసలి నాయుడు, ఆర్గనైజింగ్ సెక్రటరీ సాధు శ్రీనివాసరావు, కోశాధికారి నాగళ్ల రమేష్, మెట్ట తిరుపతిరావు, కబడ్డీ సంఘ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. జాతీయ పోటీల్లోనూ సత్తాచాటి జిల్లాకు పతకంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. మెరుగైన ప్రదర్శన కనబరాలన్నారు. -
బాక్సింగ్లో మెరిసిన సత్య భార్గవ్
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాకు చెందిన జి.సత్య భార్గవ్ బాక్సింగ్లో మెరిశాడు. ఇటీవల హర్యానాలో జరిగిన 6వ జూనియర్ నేషనల్ బాక్సింగ్ చాంపియన్షిప్ – 2025 పోటీల్లో తృతీయ స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించాడు. ఈ పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎస్.దేవివరప్రసాద్ త్రుటిలో పతకం కోల్పోయాడు. టోర్నీ ముగించుకుని జిల్లాకు తిరిగొచ్చిన క్రీడాకారులను, డీఎస్ఏ కోచ్ ఎం.ఉమామహేశ్వరరావును డీఎస్డీఓ డాక్టర్ కై .శ్రీధర్ గవరావు శనివారం అభినందించారు. జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బీఏ లక్ష్మణ్ దేవ్, బలగ సీతారాం, వంగా మహేష్, సీనియర్ బాక్సర్లు హర్షం వ్యక్తం చేశారు. -
మందస ఎంఈఓపై డీఈఓకు ఫిర్యాదు
మందస : ఉన్నత విద్యాశాఖ అధికారుల ఉత్తర్వుల ను మందస ఎంఈఓ–1 లక్ష్మణరావు పట్టించుకోకుండా మండలంలో ఒక్క ప్రాథమికోన్నత పాఠశా ల కూడా లేకుండా పాఠశాలల పునర్ వ్యవస్థీకరణ చేశారని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కిషోర్కుమార్ తప్పుపట్టారు. దీనిపై దర్యాప్తు చేపట్టి ఎంఈ ఓపై చర్యలు తీసుకోవాలని డీఈఓ తిరుమల చైతన్యకు వినతిపత్రం అందజేసినట్లు శనివారం స్థానిక విలేకరులకు తెలిపారు. పలు ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6, 7, 8 తరగతుల విద్యార్థులు నిబంధనల మేరకు ఉన్నప్పటికీ స్కూల్స్ను కుదించారని, ఇందులో ఎంఈఓ చేతివాటం ప్రదర్శించారని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్.బాబూరావు, బి.శ్రీరామ్మూర్తి ఆరోపించారు. నారాయణపురం పాఠశాలలో 6, 7, 8వ తరగతుల విద్యార్థులు 52 మంది, బుడారిసింగిలో 44 మంది, హోన్నాలిలో 44 మంది, పరియాపల్లిలో 37 మంది, సువర్ణాపురంలో 31 మంది, కొరాడాబడిలో 33 మంది ఉన్నా పాఠశాలలను డౌన్గ్రేడ్ చేయడం బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఈఓ స్పందిస్తూ క్షేత్రస్థాయిలో పర్య టించి పాఠశాలల పునరుద్ధరణకు తనవంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కోశాధికారి బి.రవికుమార్, జిల్లా కార్యదర్శి గున్న రమేష్, రాష్ట్ర కౌన్సిలర్ జి.కోదండరావు,మండల ప్రధాన కార్యదర్శులు జగదీష్, దాసరి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
స్వచ్ఛ గ్రామాలే లక్ష్యం
రణస్థలం: జిల్లా వ్యాప్తంగా అనిన్న గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా పంచాయతీరాజ్ అధికారి కె.భారతి సౌజన్య అన్నారు. రణస్థలం మండలం కోటపాలెం పంచాయతీని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంపద తయారీ కేంద్రం ద్వారా స్వచ్ఛ పంచాయతీ సాధనకు సిబ్బంది చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. పంచాయతీ ప్రజలకు తడి, పొడి చెత్త నిర్వహణపై అవగాహన కల్పించారు. ఐ.వి.ఆర్.ఎస్ ఫోన్ కాల్స్ ద్వారా చెత్త బండికి సంబంధించిన అభిప్రాయ సేకరణ వస్తే సరైన సమాధానం చెప్పాలని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ వి.ప్రకాష్రావు, డీపీఆర్ఎస్ కో ఆర్డినేటర్ కె.నిశ్చల, మాజీ సర్పంచ్ సుంకరి ధనుంజయరావు, పంచాయతీ కార్యదర్శి ఆర్.శ్రీధర్, నాయకులు జోగ శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఆమరణ దీక్ష చేస్తా: టెక్కలి జెడ్పీటీసీ దువ్వాడ వాణి
టెక్కలి మండలంతో పాటు చాలా చోట్ల సర్పంచ్లు ఎలాంటి తప్పులు చేయకపోయినా అధికారులు చెక్పవర్ రద్దు చేస్తున్నారని..ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తొలిగిస్తున్నారని టెక్కలి జెడ్పీటీసీ సభ్యురాలు దువ్వాడ వాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోవద్దని.. మళ్లీ జగనన్న ప్రభుత్వం వస్తుందని అధికారులు గుర్తుంచుకోవాలన్నారు. టెక్కలి మేజర్ పంచాయతీలో పారిశుద్ధ్యం, మౌలిక వసతుల నిర్వహణ తీరు దారుణంగా ఉందని, ఈ నిర్లక్ష్యం వీడేంతవరకు టెక్కలిలో ఆమరణ దీక్ష చేపడతానని ప్రకటించారు. పంచాయతీ, మండల పరిషత్ నిధులను ఆయా ప్రాంతాల అభివృద్ధికే వినియోగించాలన్నారు. టెక్కలిలో 196 హుదూద్ ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు కల్పించాలని కోరారు. -
చెల్లని సిఫార్సులు
కూటమి నేతలకు శృంగభంగం! పోలీస్ బదిలీల్లో ● సిఫార్సులకు ప్రాధాన్యత ఇవ్వలేదని నాయకుల్లో ఆవేదన ● 220 మంది బదిలీల్లో చెప్పిన వారికి జరగలేదని ఆక్రోశం ● కీలక నేత దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం ● ఓ అధికారిని పిలిచి క్లాస్ పీకినట్టు ప్రచారం ● బదిలీలపై నెలకొన్న అనుమానాలు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పోలీసుల బదిలీల్లో నేతల పప్పులుడకలేదు. వారి మాట చెల్లలేదు. ఒక్కో నేత తమ లెటర్ హెడ్ ద్వారా పోస్టింగ్ల కోసం రికమెండ్ చేశారు. ఎవరికి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలనేది నాయకులే డిసైడ్ చేశారు. లిఖిత పూర్వకంగా అధికారులకు రాసి పంపించారు. కానీ వారు సూచించిన విధంగా బదిలీలు జరగలేదు. వారి సిఫార్సులకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో పరువు పోయిందని నేతలంతా లబోదిబోమంటున్నారు. చివరికి కానిస్టేబుళ్లకు కూడా పోస్టింగ్ ఇప్పించలేకపోయామని ఆవేదన చెందుతున్నారు. అవమానకరమని జిల్లా కీలక నేత దృష్టికి ఆ నాయకులంతా తీసుకెళ్లారు. సంబంధిత అధికారిని ఒకరిని పిలుపించుకుని ఆ కీలక నేత క్లాస్ పీకినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇటీవల చేసిన బదిలీలు అమల్లోకి వస్తాయా? మళ్లీ ఏమైనా మారుతాయా? అన్న దానిపై సందేహం నెలకొంది. ఈ పదవులెందుకంటూ ఆవేదన... పోలీసుల బదిలీలపై నేతలు గుర్రుగా ఉన్నారు. సిఫార్సులకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో ఇటీవల 220 మందికి బదిలీలు జరిగాయి. 19 మంది ఏఎస్ఐలకు, 53 మంది హెడ్ కానిస్టేబుళ్లకు, 148 మంది కానిస్టేబుళ్లను బదిలీలు చేశారు. ఈ ప్రక్రియకు ముందు ఆ పోలీసుల్లో చాలా మంది నేతల సిఫార్సు లేఖలు తీసుకున్నారు. కావాల్సిన పోస్టింగ్ కోసం నాయకుల ద్వారా రికమెండ్ చేయించుకున్నారు. సిఫార్సుల కోసం పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్టు ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల అవసరాన్ని నాయకులు క్యాష్ చేసుకున్నట్టు తెలిసింది. దీంతో ఒక్కసారిగా సిఫార్సుల తాకిడి ఎక్కువైంది. ఆ లేఖలు వచ్చి పడటంతో అధికారులు సైతం ఆశ్చర్యపోయినట్టు తెలిసింది. కోరుకున్న ప్లేస్ ఇవ్వాలంటే కష్టమన్న అభిప్రాయానికి వచ్చేసి ఉన్నతాధికారుల సూచనల మేరకు బదిలీ కసరత్తు పూర్తి చేసినట్టు తెలిసింది. సిఫార్సులకు పెద్ద పీట వేయకుండా పరిస్థితులకు తగ్గట్టుగా, పనితీరు ఆధారంగా బదిలీలు చేసినట్టు సమాచారం. ఇది నాయకులకు రుచించ లేదు. పోలీసు అధికారులపై మండిపడిపోతున్నారు. కానిస్టేబుళ్ల పోస్టింగ్లు కూడా వేయించుకోలేకపోతే ఇంకెందుకు పదవులని ఆవేదనకు లోనైనట్టు తెలిసింది. గట్టిగా క్లాస్ పీకారా..? సిఫార్సులకు ప్రాధాన్యత ఇవ్వలేదని, ఏకపక్షంగా బదిలీలు చేశారని, రాజకీయ నాయకులకు విలువ లేకపోతే ఎలా అని సదరు నాయకులంతా జిల్లా కీలక నేత దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. జరిగినదంతా పూసగుచ్చినట్లు వివరించారు. అంతేకాకుండా ప్రస్తుతం పోలీసు శాఖలో పనిచేస్తున్న ఓ సామాజిక వర్గ క్షేత్ర స్థాయి అధికారులు కూడా నాయకులకు మద్దతుగా కీలక నేతకు బ్రీఫ్ చేసినట్టు తెలిసింది. ఎవరు చెప్పినా జరగలేదని, కనీసం పట్టించుకోలేదని కీలక నేతకు నూరిపోసినట్టు సమాచారం. సమాచారమంతా తెలుసుకుని సదరు కీలక నేత రియాక్ట్ అయ్యారు. గురువారం రాత్రి ఒక పోలీసు అధికారిని పిలిపించుకుని ఇలా అయితే ఎలా అని కాస్త గట్టిగా క్లాస్ పీకినట్టు చర్చ జరుగుతోంది. ఆ సమయంలో సదరు అధికారి ఏదో చెప్పడానికి ప్రయత్నించినా వినలేదని తెలిసింది. నాయకులు చెప్పింది చేయాల్సిందే అని హుకుం జారీ చేసినట్టు తెలియవచ్చింది. దీంతో ఇటీవల జరిగిన బదిలీలపై సందేహాలు కమ్ముకున్నాయి. ఆ నేత ఆదేశాల మేరకు బదిలీలపై పునరాలోచన చేస్తారేమో అన్న చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి. అంతేకాదు నాయకులు చెప్పినట్టు జరగకపోవడంతో ఆ అధికారిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. -
‘మా భూములు మాకు కావాలి’
మందస: మందస మండలం చీపి పంచాయతీ పద్మపురం గ్రామంలో గిరిజనులు 60 ఏళ్లుగా భూములు సాగు చేస్తున్నారని, ఆ భూములపై లోన్లు కూడా తీసుకున్నారని, ఇప్పుడు ఆ భూ ములను పెత్తందారులు ఆక్రమించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తమ సర్వే నంబర్లపై వేరే పేర్లు చూపిస్తున్నారని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మార్వో ఆఫీస్కు శుక్రవారం వెళ్లగా ఈ భూములపై సర్వేయర్ను పంపించి సర్వే చేయిస్తామని చెప్పారని గిరిజనులు తెలిపారు. తమ భూములు తమకు ఇప్పించాలని కోరారు. జిల్లా జైలు సందర్శన శ్రీకాకుళం క్రైమ్ : గార మండల పరిధి అంపోలులో ఉన్న జిల్లా జైలును జిల్లా ప్రధాన న్యా యమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ జునైద్ అహ్మద్ మౌలానా శుక్రవారం సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ (అమరావతి ) ఆదేశాల మేరకు ఖైదీల సత్ప్రవర్తన, వారి పెట్టుకున్న బెయిల్ పిటిషన్ దరఖాస్తులను పరిశీలించారు. ఖైదీలకు పెట్టే ఆహార నాణ్యతను పరిశీలించి పరిసర ప్రాంతాలను సందర్శించి జైలు అధికారులకు సూచనలందించారు. సబ్జైల్లో సేవలపై జిల్లా జడ్జి ఆరా నరసన్నపేట: స్థానిక సబ్జైల్ను జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిమాండ్ ఖైదీలతో మా ట్లాడారు. జైలులో ప్రభుత్వ నిబంధనల మేర కు సేవలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. ఆహార పదార్థాలు అందుతున్న తీరు ను అడిగి తెలుసుకున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, సామరస్యంగా మెలగాలని, వివాదాలకు దూరంగా ఉండాల ని సూచించారు. దురలవాట్లకు బానిసలు కా వద్దని అన్నారు. ఉచిత న్యాయవాది అవసరం ఉంటే ఏర్పాటు చేస్తామన్నారు. ఆయన వెంట స్థానిక జూనియర్ సివిల్జడ్జి ఎస్.వాణి, సబ్జైల్ సూపరింటెండెంట్ వినయ్ తదితరులు ఉన్నారు. పత్తిలో అంతర పంటల సాగుపై అవగాహన కొత్తూరు: పత్తిలో అంతర పంటల సాగుపై ప్ర కృతి వ్యవసాయం రీజనల్ యూనిట్ సభ్యులు హేమసుందరరావు, ప్రకాశరావులతో పాటు పలువురు అవగాహన కల్పించారు. మండలంలోని బాడ్రగూడ గిరిజన గ్రామంలో నవధాన్యాల సాగును శుక్రవారం పరిశీలించారు. -
కదిలినాడు చూడరో..
బొందిలీపురంలో ఉత్సవమూర్తులు శ్రీకాకుళం బొందిలీపురంలో రథంపై ఊరేగుతున్న స్వామి వారు కాశీబుగ్గ: పలాసరైల్వేస్టేషన్ రోడ్డులో జగన్నాథుడి రఽథాన్ని లాగుతున్న భక్తులు అన్న, చెల్లెలితో కలిసి దేవదేవుడు గర్భగుడి నుంచి బయటకు వచ్చాడు. జగన్నాథుడితో పాటు బలభద్రుడు, సుభద్రలు రథమెక్కి గుండిచాకు పయనమయ్యారు. ప్రజమంతా జయ జగన్నాథ అంటూ స్మరిస్తుండగా భక్త జనం రథం తాళ్లను ప్రేమతో లాగుతుండగా యాత్ర వైభవోపేతంగా సాగింది. జిల్లావ్యాప్తంగా జగన్నాథ రథయాత్ర మహోత్సవం కన్నుల పండువలా జరిగింది. -
పట్టాలపై మృత్యు ఘంటిక
కాశీబుగ్గ : కుటుంబమంతా పెళ్లి సందడిలో ఉన్న వేళ వరుడి చావు కబురు శోకం నింపింది. ఆగస్టులో వివాహం జరగాల్సిన యువకుడిని పట్టాలపై మృత్యువు మింగేసింది. కుటుంబ సభ్యులు, పలాస జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టెక్కలి మండలం అక్కవ రం గ్రామానికి చెందిన బందాపు హరికృష్ణ(26) నౌపడ రైల్వేస్టేషన్ వద్ద రైలు నుంచి జారిపడి మృతిచెందాడు. ఇతడు రైల్వేలో కాంట్రాక్ట్ కార్మి కుడిగా పనిచేస్తున్నాడు. విశాఖపట్నం నుంచి పలాసకు తరచూ రాకపోకలు సాగిస్తుంటాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి సూపర్ఫాస్ట్ రైలు ఎక్కి పలాస బయలుదేరాడు. నౌపడ రైల్వేస్టేషన్ వద్ద హాల్ట్ లేకపోవడంతో బండి నెమ్మదిగా కదులుతున్న వేళ దిగి పోదామని ప్రయత్నించి మరోవైపు ఉన్న పట్టాలపై గెంతాడు. కానీ ప్రమాదవశాత్తు జారిపోవడంతో కాలు రైలు కిందకు వెళ్లిపోయి తెగిపోయింది. అర్ధరాత్రి వేళ అతడు బాధతో విలవిలాడిపోయాడు. నీరు కావాలని గట్టిగా కేకలు వేసి నా నిర్మానుష్య ప్రదేశం కావడంతో ఎవరూ అతడిని గుర్తించలేదు. దీంతో అతడు తనకు కాబోయే భార్యకు ఫోన్లో సమాచారం అందించడంతో.. కుటుంబ సభ్యులకు విషయం తెలిసింది. వారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు నొప్పితో విలవిలలాడిన హరికృష్ణ అక్కడే ప్రాణాలు వదిలేశాడు. పలాస జీఆర్పీ ఎస్ఐ షరీఫ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ యువకుడు ఇలా రైలు ఆపని వేళ బలవంతంగా దిగిపోవడం మొదటిసారి కాదని, ఇదివరకు కూడా ఇలా చేయగా హెచ్చరించామని స్థానిక రైల్వే సిబ్బంది చెబుతున్నారు. అందుకే రైలు నుంచి ఫ్లాట్ ఫాం వైపు దిగకుండా వెనుక వైపు దిగాడని, కానీ ఆ పట్టాలపై గూడ్సు రైలు ఉండడంతో అనుకోని రీతిలో ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. మృతుడు హరికృష్ణ తండ్రి లచ్చయ్య పిడుగుపాటుతో చాలా ఏళ్ల కిందట మృతి చెందాడు. అప్పటి నుంచి తల్లి దాలమ్మ కూలి పనులు చేసుకుని ఇద్దరు కుమార్తెలకు వివాహం చేసింది. ఒక్కగానొక్క కొడుక్కి ఆగస్టు 13న వివాహం చేయడానికి నిశ్చయించారు. కానీ విధి వక్రీకరించడంతో ఆ కుటుంబమంతా విషాదంలో మునిగిపోయింది. రైలు నుంచి జారిపడి యువకుడు మృతి ఆగస్టులో పెళ్లి ముహూర్తం అక్కవరంలో విషాదఛాయలు -
బ్యారేజీ నిర్వహణలో అశ్రద్ధ వద్దు
హిరమండలం: గొట్టా బ్యారేజీ నిర్వహణ విషయంలో అశ్రద్ధ వద్దని వంశధార ప్రాజెక్టు నరసన్నపేట ఈఈ ఎంఏ సీతారామనాయుడు అన్నా రు. శుక్రవారం గొట్టా బ్యారేజీతో పాటు ఎడమ ప్రధాన కాలువ హెడ్ రెగ్యులేటరీని పరిశీలించారు. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల నుంచి నదిలో నీరు బ్యారేజీలో చేరుతున్నందున నీటిని స్థిరీకరించాలన్నారు. ఖరీఫ్నకు ఎలాంటి నీటి ఇబ్బందులు లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం గొట్టా బ్యారేజీ కంట్రోల్ రూమ్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. డీఈ సరస్వతి, ఏఈ ధనుంజయరావు, పరిశుద్ధబాబు, భాను తదితరులు పాల్గొన్నారు. -
పలాసలో కార్మిక హక్కులకు భంగం
కాశీబుగ్గ: తమ సమస్యల పరిష్కారం కోసం కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద పలాస–కాశీబుగ్గ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేపడుతున్న నిరసనను శుక్రవారం ఉదయం పోలీసులు అడ్డుకున్నారు. నిరసన, ర్యాలీ చేసేందుకు వీలు లేదని పో లీసులు చెప్పడంతో పోలీసులు, పారిశుద్ధ్య కార్మికుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెయ్యిల గణపతి, యూనియన్ నాయకులు సీహెచ్ మురగన్, కె.వెంకట్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా లేని పోలీస్ నిబంధనలు పలాసలోనే అమలు చేస్తూ ప్రజల హక్కులను పోలీసులు హరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు పోలీసులను పంపించి నిరసన జరగనివ్వకుండా అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. సమస్యలు పరిష్కారం అయ్యేవరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బి.కూర్మారావు, ఎం.రవి, పి.బాలకృష్ణ, కె.ఈశ్వరరావు, ఎస్.తిరుపతి, ఢిల్లీ, ప్రకాష్ ముఖి, ఎస్.శంకర్, ఎస్.లక్ష్మి, ఉషా, గులాబీ, ఎస్.రమేష్ పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. -
పీఎం–ఉషా నిధులతో మౌలిక వసతులు
ఎచ్చెర్ల: ప్రధాన మంత్రి ఉచ్ఛతర శిక్ష అభియాన్ (పీఎం–ఉషా) నిధులను పూర్తి స్థాయిలో ఉన్నత విద్యాభివృద్ధికి, మౌలిక వసతులు కల్పనకు వినియోగించాలని న్యూఢిల్లీకి చెందిన సంబంధిత అధికారి ఎస్.కె భర్నహాల్ సూచించారు. పీఎం ఉషా పథకానికి ఎంపికై న యూనివర్శిటీల వైస్ చాన్సలర్లు, అధికారులతో శుక్రవారం వర్చువల్ విధానంలో సమావేశం నిర్వహించారు. బోధన, పరిశోధన, నూతన నిర్మాణాలు, లేబొరేటరీ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, క్రీడా మైదానాలు ఏర్పాటు వంటివాటికి ప్రాధాన్యమివ్వాలన్నారు. నిర్దేశిత సమయంలో నిధులు సద్వినియోగం చేసుకోకపోతే తదుపరి విడత నిధులు విడుదల కావన్నారు. వైస్ చాన్సలర్ కె.ఆర్ రజినీ మాట్లాడుతూ రెండో విడతలో పీఎం ఉషాకు అర్హత సాధించిన దేశంలోని 12 వర్శిటీల్లో అంబేడ్కర్ యూనివర్సిటీ ఒకటని పేర్కొన్నారు. నిధులు వినియోగానికి ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. సమావేశంలో రెక్టార్ బి.అడ్డయ్య, రిజిస్ట్రార్ పి.సుజాత తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థినికి గేట్లో 241వ ర్యాంక్ ఎచ్చెర్ల: ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ సీఎస్ఈ విద్యార్థిని కొమరాల శ్వేతశ్రీ గేట్లో 241వ ర్యాంకు సాధించడం అభినందనీయమని డైరెక్టర్ బాలాజీ అన్నారు. ఈ మేరకు విద్యార్థిని శుక్రవారం అభినందించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కుమార్తె మంచి ర్యాంకు సాధించడంపై పల్నాడు జిల్లా దుగ్గి గ్రామానికి చెందిన శ్వేతశ్రీ తల్లిదండ్రులు ఆదినారాయణ, అరుణ సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పరిపాలన అధికారి ముని రామకృష్ణ, ఫైనాన్స్ అధికారి వాసు, వెల్ఫేర్ అధికారి గేదెల రవి, మోహన్కృష్ణ చౌదరి, ఇన్చార్జి సాగర్, అధ్యాపకులు కోడా దిలీప్కుమార్, నూకేశ్వరరావు, గణేష్ మళ్లా, తేజకిరణ్, సింహాచలం తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ శ్రీకాకుళం పాతబస్టాండ్: దివ్యాంగులను అన్ని విధాలా ఆదుకుంటామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సామాజిక బాధ్యత కింద నిర్వహించిన 802 మంది దివ్యాంగులకు రూ.3.20 కోట్ల విలువైన 1230 పరికరాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిర్పోర్ట్ అథారిటి ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అలీంకో సంస్థ సహకారంతో జనవరిలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు తెలిపారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ భవిష్యత్తులో 40 నుంచి 60 శాతం ఉన్న దివ్యాంగులకు కూడా బ్యాటరీ సైకిళ్లు అందజేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, ఉపకరణాల కోసం సుమారు 1500 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నా 802 మందికే పంపిణీ చేయడంతో మిగిలిన వారు నిరాశ చెందారు. కార్యక్రమంలో శ్రీకాకుళం, నరసన్నపేట ఎమ్మెల్యేలు గొండు శంకర్, బగ్గు రమణమూర్తి, పౌర విమానయాన సంస్థ చైర్మన్ విపిన్కుమార్, హెచ్ఆర్ మెంబర్ హెచ్.శ్రీనివాస్, జనరల్ మేనేజర్ సంజయ్ సింగ్, ఇండియా ట్రస్ట్ పింక్ సంస్థ ఫౌండర్ ఆనంద్కుమార్, డీసీఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్, డీసీసీబీ చైర్మన్ ఎస్.సూర్యం, వంశధార చైర్మన్ అరవింద్, రిటైర్డ్ ఆర్డీఓ పీఎంజే బాబు తదితరులు పాల్గొన్నారు. -
గుమ్మగెడ్డ అభివృద్ధి కలేనా?
పాతపట్నం: ఆయకట్టు రైతులకు సాగునీటి కష్టాలు వీడటం లేదు. చాకిపల్లి, ఎ.ఎస్.కవిటి, రొమదల, రొంపివలస, సీది, కొరసవాడ, తామర, తీమర, గంగువానిపేట, పాతపట్నం సమీపంలో సుమారు రెండు వేల ఎకరాల పంట భూములకు ఆధారమైన గుమ్మగెడ్డ అభివృద్ధికి నోచుకోవడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నా గుమ్మగెడ్డను పట్టించుకునే వారే కరువయ్యారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గుమ్మగెడ్డ చానల్లో పూడికలు పేరుకుపోయాయి. నీటి ప్రవాహనికి అవరోధంగా ఏర్పడ్డాయి. దీంతో ఖరీఫ్ సీజన్లో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధించి అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి గుమ్మగెడ్డ లోతు పెంచి, వెడల్పు చేసి మెరుగుపర్చాలని వారు కోరుతున్నారు. రైతులను ఆదుకోవాలి వర్షాలు రాక ముందే గుమ్మగెడ్డలో పూడికలు తీయడం, చెక్డ్యామ్కు మరమ్మతులు చేపట్టడం వంటి పనులు చేయాలి. ఖరీఫ్ సీజన్ వచ్చినా ప్రభుత్వం, ఇరిగేషన్ అధికారులు ఇంత వరకు పట్టించుకోకపోవడం తగదు. – బొంగు శ్రీరాములు, రైతు, ఆర్.ఎల్.పురం, పాతపట్నం మండలం ప్రతిపాదనలు పంపించాం గుమ్మగెడ్డ చానెల్ అభివృద్ధి, చెక్డ్యామ్ మరమ్మతుల విషయమై ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. అక్కడి నుంచి అనుమతులు వచ్చాక పనులు చేయిస్తాం. – జి.వి.రమణ, ఏఈ ఇరిగేషన్, పాతపట్నం మండలం రెండు వేల ఎకరాలకు అందని సాగునీరు ఆందోళనలో ఆయకట్టు రైతులు పట్టించుకోని పాలకులు -
లారీ ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు
కంచిలి: మండలంలోని అంపురం జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. కంచిలి మండలం కర్తలి గ్రామానికి చెందిన మూలి సింహాచలం కత్తివరంలో బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి సైకిల్పై వస్తుండగా ఫ్లై ఓవర్ డౌన్లో వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన యువకుడ్ని అంబులెన్స్లో సోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. యువకుడి పరిస్థితి విషమించడంతో బరంపురం ఆస్పత్రికి తరలించినట్లు ఏఎస్ఐ పి.అప్పిరెడ్డి తెలిపారు. -
ఎట్టకేలకు ఆలయ భూమికి విముక్తి
అరసవల్లి: విలువైన ఆదిత్యుని భూమిని ‘వాస్తు’ నెపంతో తమ స్థలంలోకి కలిపేసుకోవాలన్న ఓ స్థల యజమానికి ఆలయ అధికారులు చెక్పెట్టారు. స్థానిక గ్రామదేవత అసిరితల్లి గుడికి ఎదురుగా ఉన్న అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయానికి చెందిన భూమిలో కొంత భాగాన్ని ఆక్రమించి భారీ నిర్మాణానికి తలపెట్టిన సంగతిని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 20న ‘ఆలయ భూముల్లో అక్రమార్కులు’ అనే కథనాన్ని ప్రచురించడంతో అధికారులు స్పందించారు. సదరు యజమానికి చెందిన హక్కు పత్రాలను పరిశీలించి ఆలయ భూముల్లోకి రాకుండా చెక్పెట్టారు. స్థానికంగా రాజీ యత్నాలు చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ఆలయ భూమిని వదిలేసి తన హక్కుదారి స్థలంలోనే పిల్లర్లు వేసుకుని ఎర్త్ఫిల్లింగ్ పనులు చేపట్టారు. అయితే తూర్పు భాగంలో మాత్రం కొంత ఆలయ భూమి ఆక్రమణకు గురైనట్లుగా స్థానికులు చెబుతున్నారు. దీనిపై కూడా ఫిర్యాదులు చేసినప్పటికీ..ఆలయానికి చెందిన కొందరు అధికారిక ఉద్యోగులు చేతివాటం కారణంగా స్థల యజమానికి మద్దతుగా పనులు జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే తూర్పు భాగంలో కొంత మేరకు ఆలయానికి చెందిన స్థలం ఆక్రమణకు గురైందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కూడా ఆలయ అధికారులు స్పందిచాలని కోరుతున్నారు. దీనిపై ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ వద్ద ప్రస్తావించగా..ఆలయ భూమిని ఒక్కసెంటు కూడా వదులుకోబోమని..ఇందులో ఆలయ ఉద్యోగుల పాత్ర ఉంటే క్షమించేది లేదని స్పష్టం చేశారు. -
అడ్డు లేకుండా!
అడ్డగోలు నిల్వలకు.. ఆమదాలవలస రూరల్: కూటమి ప్రభుత్వం వచ్చాక ఆమదాలవలస నియోజకవర్గంలో ఇసుకాసురులు చెలరేగిపోతున్నారు. ఉచిత ఇసుక విధానం పేరిట ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో తమకు అడ్డుగా ఉన్న దేన్నైనా పక్కకు తరలించేస్తున్నారు. ఈ క్రమంలో ఆమదాలవలస మండలం కొత్తవలస–పాతూరు గ్రామాల మధ్య ఇసుక నిల్వలు పోగు చేసేందుకు ఏకంగావిద్యుత్ స్తంభాలను మార్పు చేయడం విమర్శలకు తావిస్తోంది. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లే వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా.. ఇక్కడి నాగావళి నదీతీరం నుంచి అక్రమంగా ఇసుక తరలించేందుకు కొత్తవలస గ్రామానికి సమీపంలో పంట పొలాల్లో ఇసుక నిల్వలు డంపింగ్ చేస్తున్నారు. ఈ నిల్వలకు విద్యుత్ స్తంభాలు అడ్డుగా ఉన్నాయనే కారణంగా కొందరు నాయకులు తమ పలుకుబడి ఉపయోగించి రక్షిత మంచినీటి పథకాలను నీరందించే 11 కె.వి.విద్యుత్ స్తంభాలను తరలింపు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొర్లకోట, చీమలవలస రక్షిత మంచినీటి పథకాలతో పాటు ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలో ఉండే వెంకయ్యపేట రక్షిత మంచినీటి పథకాలకు నీరందించేందుకు నాగావళి నదిలో రెండు పంపుహౌస్లు ఏర్పాటు చేశారు. వీటికి తొగరాం విద్యుత్ ఉపకేంద్రం నుంచి విద్యుత్ లైన్ వెళ్తుంది. అయితే కొత్తవలస ప్రాంతంలో ఇసుక నిల్వలకు అడ్డుగా ఉన్నాయనే సుమారు నాలుగు నుంచి ఆరు విద్యుత్ స్తంభాలను నాగావళి నది గట్టుకు తరలించారు. వాస్తవంగా ఏదైనా ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఉంటే మీ–సేవ ద్వారా దరఖాస్తు చేసుకుంటే విద్యుత్ శాఖాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రూ.40 వేలు నుంచి రూ.60 వేలు వరకు డి.డి.స్వీకరించి ఆ తర్వాతే విద్యుత్ స్తంభాలు తొలగిస్తుంటారు. ఇక్కడ మాత్రం ఆ నిబంధనలేవీ అమలుకాలేదు. ఇసుక మాఫియా రంగంలోకి దిగి రూపాయి ఖర్చులేకుండా రైతులను బెదిరించి మరీ కొత్తగా విద్యుత్ స్తంభాలను వేయించినట్లు తెలుస్తోంది. సమాచారమిచ్చాం.. కొత్తవలస గ్రామంలో అక్రమ ఇసుక నిల్వలు విద్యుత్ తీగలను తాగుతున్న విషయమై ఆమదాలవలస విద్యుత్ శాఖ రూరల్ ఏఈ రవికుమార్ వద్ద ప్రస్తావించగా ‘ఇసుక నిల్వల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోందని సంబంధిత ఇసుక తవ్వకందారులకు చెప్పాం. ఇసుక నిల్వల కోసం 11 కె.వి.విద్యుత్ స్తంభాలు పక్కకు తరలించడం అనేది ఏమీ లేదు. కొత్తగా లైన్ వేశాం అంతే..’ అని సమాధానమిచ్చారు. తవ్వకాలతో ఇబ్బందులు.. ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాల వల్ల వెంకయ్యపేట వద్ద ఉన్న రక్షిత మంచినీటి పథకానికి నీరందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఇప్పటికై నా స్పందించి అక్రమ ఇసుక తవ్వకాలకు అడ్డుకట్టు వేసి విద్యుత్ అంతరాయం లేకండా చూడాలి. లేనిపక్షంలో ఆందోళన తప్పదు. –దుంపల శ్యామలరావు, వైఎస్సార్ సీపీ పట్టణ ఉపాధ్యక్షుడు, ఆమదాలవలస నదిలో యంత్రాలతో ఇసుక తవ్వకాలు కొత్తవలస సమీపంలో విద్యుత్ తీగలను తాకుతున్న ఇసుక పోగులు అడ్డుగా ఉంటున్నాయని ఏకంగా విద్యుత్ స్తంభాల మార్పు! ఆమదాలవలసలో చెలరేగిపోతున్న ఇసుకాసురులు విద్యుత్ తీగలను తాకుతూ.. కొత్తవలస –పాతూరు మధ్య అక్రమ ఇసుక నిల్వలు 11 కె.వి.విద్యుత్ తీగలను తాకేంతగా పేరుకుపోయాయి. దీనివల్ల విద్యుత్ అంతరాయం ఏర్పడటమే కాకుండా ఇసుక లోడింగ్ చేసేటప్పడు ప్రమాదాలు సంభవించే అవకాశం కూడా ఉంది. ఇటీవల ఇసుక నిల్వలు మీదుగా వెళ్లిన మూడు నాలుగు మూగజీవాలు మరణించిన సంఘటనలు కూడా ఉన్నాయి. నాగావళి నదిలో వెంకయ్యపేట, కొర్లకోట, చీమలవలస గ్రామల రక్షిత మంచినీటి పథకాలకు తరచూ విద్యుత్ అంతరాయం తప్పడం లేదు. ఇసుక నిల్వలు విద్యుత్ తీగలను తాకటమే కాకుండా తరలించిన విద్యుత్ స్తంభాలు తోటలకు ఆనుకొని వేయటంతో వర్షం వస్తే ఎప్పటికప్పుడు సరఫరా నిలిచిపోతోంది. దీంతో ఆయా గ్రామాల ప్రజలకు తాగునీరు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. దీనికితోడు నాగావళి నదిలో నిబంధనలకు మించిన లోతులో ఇసుక తవ్వకాలు చేయటంతో భవిష్యత్తులో రక్షిత పథకాలకు నీరందే పరిస్థితి ఉండదని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ప్రాణం తీసిన సిగరెట్ అలవాటు
నరసన్నపేట: మడపాం టోల్గేట్ సమీపంలో గురువారం రాత్రి విద్యుత్ షాక్కు గురై యువకుడు మృతిచెందగా..మరొకరు గాయపడ్డారు. కుటుంబ సభ్యులు, స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలకొండపేట కు చెందిన పాలకొండ రమేష్(24) డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. గురువారం రాత్రి స్నేహితుడు బమ్మిడి గణేష్తో కలిసి ద్విచక్ర వాహనంపై మడపాం టోల్గేట్ వద్దకు వెళాడు. అక్కడున్న గాయిత్రి టీ షాపులో టీ తాగారు. రాత్రి 11.30 సమయంలో సిగరెట్ తాగేందుకు మూసి ఉన్న షాపు వెనుక భాగం బాత్రూమ్ పైకి ఎక్కారు. అక్కడ 11 కె.వి. విద్యుత్ వైర్లు తగలడంతో షాక్కు గురయ్యారు. ఈ ఘటనలో రమేష్ అక్కడికక్కడే మృతి చెందగా.. గణేష్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చేతికి అందివచ్చిన కుమారుడు మృత్యువాత పడటంతో రమేష్ తల్లిదండ్రులు అప్పన్న, పార్వతి, సోదరుడు సంతోష్ కన్నీరుమున్నీరుగా విలపించారు. సిగరెట్ అలవాటు ప్రాణం మీదకు తెచ్చిందని స్థానికులు అంటున్నారు. విషయం తెలుసుకున్న నరసన్నపేట ఎస్ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తండ్రి అప్పన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేశారు. విద్యుత్ షాక్తో యువకుడు మృతి మడపాం టోల్గేట్ సమీపంలో ఘటన -
ఓహెచ్..తూచ్!
శ్రీకాకుళం: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం గందరగోళం నెలకొంది. ఆప్షనల్ హాలిడే(ఓహెచ్)ను గురువారం రాత్రి వేళ రద్దు చేయడమే దీనికి కారణం. వివరాల్లోకి వెళితే.. విద్యాశాఖ ప్రతి సంవత్సరం పాఠశాలల పని దినాలకు సంబంధించిన ముందుగానే క్యాలెండర్ను విడుదల చేయడం పరిపాటి. ఈ ఏడాది ఐదు రోజులు ఆప్షనల్ హాలిడే ఇచ్చుకునే సౌలభ్యం కల్పించారు. దీని ప్రకారం స్థానిక పండుగలు, ప్రత్యేక రోజుల్లో ఆ సెలవులను పాఠశాల స్థాయిలోనే ప్రకటించుకునే వీలుంటుంది. శుక్రవారం రథయాత్ర ప్రారంభం కావడంతో జిల్లాలోని పాఠశాలలకు ఆప్షనల్ సెలవు ప్రకటించారు. ఈ మేరకు గురువారం సాయంత్రమే విద్యార్థులకు సెలవు సర్క్యులర్ పంపించారు. ఉపాధ్యాయులు కూడా నిబంధనలు మేరకు యాప్లో ఓహెచ్గా నమోదు చేసేశారు. అయితే గురువారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఓహెచ్ను రద్దు చేస్తున్నట్లు జిల్లాకు వర్తమానం పంపించారు. దీంతో శుక్రవారం ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లినప్పటికి, అప్పటికే ఓహెచ్ నమోదు కావడంతో బయోమెట్రిక్ హాజరు వేయలేకపోయారు. విద్యార్థులకు సెలవు అని చెప్పడంతో వారెవరు పాఠశాలకు రాలేదు. పాఠశాల సమీపంలోని విద్యార్థులకు కబురు పంపించి రప్పించినప్పటికి సమీప గ్రామాల్లోని విద్యార్థులు మాత్రం హాజరు కాలేదు. సెలవు అని చెప్పడంతో వంట కార్మికులు కూడా రాకపోవడంతో వారిని అప్పటికప్పుడు పిలిపించి వంట చేయించాల్సి వచ్చింది. ఇది ఇలా ఉంటే జూలై 5న మొహరం సందర్భంగా ఆప్షనల్ హాలీడేను ప్రకటించారు. ఆ రోజున ప్రభుత్వం పేరెంట్స్ డే నిర్వహించాలని ఆదేశించడంతో ఆ నాటి ఆప్షనల్ హాలీడే కూడా రద్దు అయినట్టే. దీంతో రెండు సెలవులు కోల్పోయామని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలకు సెలవు విషయంలో గందరగోళం రాత్రి వేళ ఆదేశాలు రావడంతో ఇబ్బందులు -
రెడ్క్రాస్ ద్వారా విస్తృత సేవలు
శ్రీకాకుళం కల్చరల్: జిల్లా రెడ్క్రాస్ సొసైటీ ద్వారా విస్తృత సేవలు అందిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఇండియన్ రెడ్క్రాస్ సర్వసభ్య సమావేశం, అవార్డుల ప్రదానోత్సవం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల సమయంలో గత ఏడాది విజయవాడలో వరదలు వచ్చినప్పుడు రెండు ట్రక్కుల వస్తువులను పంపించి ఆదుకున్నట్లు గుర్తుచేశారు. రెడ్క్రాస్ ద్వారా సేకరించిన రక్తం అవసరమైన వారికి అందిస్తున్నారని, ఇటీవల తలసేమియా పేషెంట్ల కోసం కేంద్రం ఏర్పాటు చేసి అక్కడే రక్తం ఎక్కించే కార్యక్రమం జరుగుతోందన్నారు. సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. రెడ్క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు మాట్లాడుతూ వచ్చే నెల 9న జిల్లా కలెక్టర్ అవార్డు అందుకోబోతున్నట్లు తెలిపారు. రెడ్క్రాస్ ద్వారా గత ఏడాది చేసిన సేవలను వివరించారు. రక్తదానానికి సహకరించిన వివిధ స్వచ్ఛంద సంస్థలు, జూనియర్, డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలను సన్మానించారు. అంతకుముందు ఫొటో ప్రదర్శనను తిలకించారు. ఇటీవల యోగాంధ్రలో పాల్గొన్న లయన్స్ క్లబ్ యోగాంధ్ర ఇన్స్ట్రక్టర్లు, ఆయుష్ అధికారి డాక్టర్ జగదీష్, డాక్టర్ ఉత్తమ్ రాజు, డాక్టర్ సునీల్, డాక్టర్ మోహనరావు, జె.చంద్రశేఖర్, ఆయుష్ సిబ్బంది, యోగాచార్యులు పాండ్రంకి మురళీకృష్ణ, తంగి స్వాతి తదితరులను సత్కరించారు. అనంతరం కలెక్టర్ను రెడ్క్రాస్ తరఫున సన్మానించారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ ఉపాధ్యక్షులు డాక్టర్ కె.సుధీర్, ట్రెజరర్ కె.దుర్గారావు, ఏజీఎం పరిశీలకులు, పార్వతీపురం మన్యం జిల్లా రెడ్క్రాస్ వైస్ చైర్మెన్ డాక్టర్ ఎం.శ్రీరాములు, పెంకి చైతన్యకుమార్, కె.సత్యనారాయణ, రమణ, ఆర్ట్స్ సంస్థ సన్యాసిరావు, తదితరులు పాల్గొన్నారు. -
ట్రిపుల్ ఐటీ పరిపాలనాధికారికి డాక్టరేట్
ఎచ్చెర్ల: రాజీవ్గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) శ్రీకాకుళం అసిస్టెంట్ ప్రొఫెసర్, పరిపాలనాధికారి ముని రామకృష్ణ ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూ ట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) తిరుపతి నుంచి డాక్టరేట్ పట్టా (పీహెచ్డీ)ను పొందారు. భాగస్వామ్య ఆధారిత సామాజిక అభ్యాసం, మార్కెట్లలో ధరల విధానాలు అనే అంశంపై డాక్టర్ కె.పి.నవీన్ పర్యవేక్షణలో పరిశోధన పూర్తిచేయడంతో డాక్టరేట్ లభించింది. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ డాక్టర్ సండ్ర అమరేంద్రకుమార్, డైరెక్టర్ ప్రొపెసర్ కె.వి.డి.జి.బాలాజీ, అకడమిక్ డీన్ శివరామకృష్ణ, ఫైనాన్స్ అధికారి వాసు, మోహనకృష్ణచౌదరి, డీన్ వెల్ఫేర్ రవి, డిప్యూటీ ఏవో డాక్టర్ గణేష్ మళ్ల తదితరులు రామకృష్ణను గురువారం అభినందించారు. ఇంజినీరింగ్ కార్మికులకు బీసీ నేతల మద్దతు శ్రీకాకుళం (పీఎన్కాలనీ): మున్సిపల్ ఇంజనీ రింగ్ వర్కర్లు తమ నైపుణ్యతతో నగరవాసుల కు తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు అందిస్తున్నా వారి సమస్యలను ప్రభు త్వం పట్టించుకోకపోవడం తగదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు గద్దిబో యిన కృష్ణయాదవ్ అన్నారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని 43 రోజులుగా నిరసన తెలియజేస్తున్నా సర్కారు స్పందించకపోవడం దారుణమన్నారు. ఇప్పటికై నా పాలకులు స్పందించి డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి అలపాన త్రినాథరెడ్డి, కర్రి రంగాజీదేవ్ తదితరులు పాల్గొన్నారు. పీజీసెట్లో అదరగొట్టిన చెస్ చాంపియన్ శ్రీకాకుళం న్యూకాలనీ: చెస్ క్రీడలో రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి పోటీల్లో అనేక పతకాలతో విజయబావుటా ఎగురవేసిన లక్ష్మీ గాయత్రి పీజీ ప్రవేశాలకుగాను నిర్వహించిన ఏపీ పీజీసెట్–2025 ఫలితాల్లో సత్తాచాటింది. హిస్టరీ సబ్జెక్టులో 100 మార్కుకుగాను 94 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 7వ ర్యాంకు సాధించింది. ఆమదాలవలసలోని మెట్టక్కివలస వీరి నివాసం. తండ్రి చింతాడ ప్రేమ్కుమార్ ప్రభుత్వ ఉపాధ్యాయు డు, తల్లి సత్యవతి గృహిణి. ఆటో ఢీకొని ఇద్దరికి గాయాలు మెళియాపుట్టి: వసుంధర గ్రామంలో ఆటో ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. ఎస్సై రమేష్బాబు తెలిపిన వివరాల మేరకు.. ఒడిశాకు చెందిన బొమ్మాళి కేశవరావు, వసుంధర గ్రామానికి చెందిన కుంతీపాత్రో వసుంధర గ్రామ రహదారి వద్ద నడిచి వెళుతుండగా ఒడిశా రాష్ట్రం బి.సీతాపురం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ కె.గణపతి అతివేగంగా వచ్చి అదుపు తప్పి ఢీకొన్నాడు. ఈ ఘటనలో మహిళ తలకు తీవ్రగాయం కావడంతో శ్రీకాకు ళం తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదే ప్రమాదంలో గాయపడిన కేశవరావును టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. బ్రేక్ ఫెయిల్ కావడంతో ఆటో అదుపు తప్పినట్లు పోలీసులు చెబుతున్నారు. కేశవరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
చెరువులోకి పరిశ్రమ వ్యర్థ జలాలు
రణస్థలం: మండలంలోని రణస్థలం పంచాయతీ సీతంపేట గ్రామానికి చెందిన చెరువులోకి బంటుపల్లి సమీపంలో ఉన్న యూబీ పరిశ్రమ వ్యర్థ జలాలు హైవే కాలువ ద్వారా వచ్చి చేరుతున్నాయని గ్రామస్తులు భావరాజు లక్ష్మణరావు, బత్తుల అన్నారావు, భావరాజు ఆనందరావు, పడాల దుర్గారావు, వంక రాంబాబు, భావరాజు రాంబాబు, రాజు, పడాల శ్రీను ఆరోపించారు. ఈ మేరకు గురువారం యూబీ పరిశ్రమ వ్యర్థ జలాలు చెరువులోకి చేరుతున్న తీరును విలేకరులకు చూపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యర్థ జలాల కారణంగా తీవ్రమైన దుర్వాసన రావడమే కాకుండా గ్రామమంతా ఈగలు, దోమలు వ్యాప్తి చెందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భూగర్భ జలాలు పాడైపోయి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని చెప్పారు. చెరువులో ఉన్న చేపలు చనిపోతున్నాయని, పశువులు కూడా చెరువు నీరు తాగలేకపోతున్నాయని వాపోయారు. కాలుష్యం కారణంగా అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతున్నాయని చెప్పారు. వ్యర్థ జలాల విషయమై గతంలో స్థానిక ప్రజాప్రతినిధి వద్దకు వెళితే ఆ కాలుష్య నీరు పంట పొలాలకు మంచిదేనని చెప్పడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఇప్పటికై నా కాలుష్య నియంత్రణ అధికారులు స్పందించి చెరువును పరిశీలించి తగు చర్యలు చేపట్టాలని కోరారు. పరిశ్రమ వద్ద వ్యర్థ జలాలను చూపుతున్న గ్రామస్తులు -
తమ్ముడి హత్య కేసులో అన్న అరెస్టు
నందిగాం: తమ్ముడిని హత్య చేసిన ఘటనలో నిందితుడైన అన్నను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి టెక్కలి సీఐ కె.శ్రీనివాసరావు విలేకర్లకు వివరాలు వెల్లడించారు. నందిగాం మండలం కామధేనువు గ్రామానికి చెందిన కిల్లి లక్ష్మణనాయుడుకు ధర్మారావు, నీలకంఠం, తవిటయ్య అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. తన భూమిలో కొంత ఉంచుకొని మిగతాది ముగ్గ్గురికి పంచిపెట్టాడు. పెద్దవాడైన ధర్మారావు ఎక్కువ భూమి కావాలని తరుచూ తండ్రితో గొడవ పడేవాడు. ఈ క్రమంలో ఈ నెల 22న ధర్మారావు అడుగుతున్న ఉలిమి మడిలో రెండో కుమారుని భార్య రాములమ్మ విత్తనాలు వేస్తుండగా నిందితుడికి విషయం తెలిసింది. దీనంతటికీ కారణం చిన్న తమ్ముడు తవిటియ్యేనని, అతనిని చంపేస్తే ఏ గొడవ ఉండదని భావించాడు. పారతో ఉలిమి మడి దగ్గరకు వెళ్లి రాములమ్మతో గొడవ పడి పని ఆపితే తవిటయ్య వస్తాడని, అప్పుడు అతనిని చంపేయవచ్చని నిర్ణయించుకున్నాడు. వెంటనే పొలానికి వెళ్లి రాములమ్మతో గొడవ పడ్డాడు. తవిటయ్య రావడంతో పారతో తలపై కొట్టి కిందపడిన తర్వాత కూడా పలుమార్లు గట్టిగా కొట్టి చంపేశాడు. గురువారం నర్సిపురం వద్ద నిందితుడు ధర్మారావు కనిపించగా అదుపులోకి తీసుకొని అరెస్టు చేశామని సీఐ తెలిపారు. నిందితుడిని పలాస కోర్టులో హాజరుపర్చామని సీఐ చెప్పారు. ఎస్సై మహమ్మద్ ఆలీ, కానిస్టేబుల్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
మృత్యు అలలు
● వేటకు వెళ్లిన మత్స్యకారుడు మృతి ● గొలుగువానిపేటలో విషాదఛాయలు సంతబొమ్మాళి: లక్కివలస పంచాయతీ గొలుగువానిపేటకు చెందిన గొర్లి రామారావు (39) అనే మత్స్యకారుడు సముద్రంలో వేటకు వెళ్లి మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఐదుగురు మత్స్యకారులతో కలిసి రామారావు గురువారం వేకువజామున సముద్రంలో చేపలవేటకు బయలుదేరాడు. వేట ముగించుకుని తిరిగి వస్తుండగా అలల తాకిడికి బోటు బోల్తాపడింది. మత్స్యకారులంతా సముద్రంలో పడిపోగా అతి కష్టమ్మీద ఒడ్డుకు చేరుకున్నారు. రామారావు మాత్రం ఒడ్డుకు చేరకపోవడంతో మళ్లీ బోటులో వెళ్లి గాలించారు. కొద్దిసేపటి తర్వాత మృతదేహం నీటిలో తేలడంతో ఒడ్డుకు చేర్చారు. రామారావు మృతదేహం వద్ద కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇతనికి భార్య తులసమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఎంపీటీసీ చింతల రాజులు, మత్స్యకారులు కోరారు. సంతబొమ్మాళి ఎస్ఐ సింహాచలం సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. -
క్రీడా పోటీలతో మానసికోల్లాసం
శ్రీకాకుళం రూరల్: శారీరక, మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయని కేంద్రీయ విద్యాలయం ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ బి.లవకుమార్ అన్నారు. పీఎం కేంద్రీయ విద్యాలయంలో హైదరాబాద్ రీజియన్ క్రికెట్ టోర్నమెంట్ అండర్–14 బాలురు పోటీలు గురువారం నిర్వహించారు. ఏడు జట్లకు చెందిన 101 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ గుంట తులసీరావు మాట్లాడుతూ విద్యార్థులు చదువుకే పరిమితం కాకుండా క్రీడల్లోనూ రాణిస్తే ఉజ్వల భవిష్యత్ సొంతమవుతుందన్నారు. ఈ విషయమై విద్యార్థుల తల్లిదండ్రులూ ఆలోచన చేయాలన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు, పతకాలు ప్రదా నం చేశారు. కార్యక్రమంలో పీఈటీ కె.సుందర్రావు తదితరులు పాల్గొన్నారు. -
ఉద్దాన ధ్వంస రచనకు నిరసనగా..
● ఉద్యాన యూనివర్సిటీ బోర్డు సభ్యత్వానికి బత్తిని లక్ష్మణ్ రాజీనామా మందస: పచ్చని ఉద్దానంలో కార్గో ఎయిర్పోర్టు నిర్మాణానికి వ్యతిరేకంగా డాక్టర్ వై.ఎస్.ఆర్ ఉద్యా న యూనివర్సిటీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు బత్తిని లక్ష్మణ్ ప్రకటించారు. ఈ మేరకు గురువారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడు తూ తిత్లీ తుఫాన్తో నష్టపోయిన రైతులను జగన న్న ఆదుకున్నారని, అదే విధంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన తనను ఉద్యాన యూనివర్సిటీ బోర్డు మెంబర్గా నియమించారని చెప్పారు. కూట మి ప్రభుత్వం వచ్చాక రైతుల ఆమోదం లేకుండా ఉద్దానంలో 1394 ఎకరాల భూమిని స్వాధినం చేసుకొని 16 గ్రామాల ప్రజల జీవనోపాధిని దెబ్బతీయడం నచ్చలేదన్నారు. ఉద్దాన ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక పదవికి రాజీనా మా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై రైతులతో కలి సి ఉద్యమంలో పాల్గొంటానని చెప్పారు. సమావేశంలో దున్న హరికృష్ణ, బెలమర జీవన్, మర్ల సంతోష్, పిచ్చు కిరణ్ తదితరులు పాల్గొనారు. -
మన్యం మహిళలకే వన్ధన్ వికాస్ కేంద్రాలు
మందస: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన్ ధన్ వికాస్ కేంద్రాలు కేవలం మన్యం ప్రాంత గిరిజన మహిళలకే అప్పగిస్తామని వెలుగు ఐటీడీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ పైడి కూర్మారావు తెలిపారు. గురువారం కొండలోగాం సచివాలయం వద్ద సర్పంచ్ సవర రోజాడిల్లీశ్వర్, ఎంపీటీసీ డిల్లీశ్వరి అధ్యక్షతన ఎంపీడీఓ వై.వెంకటరమణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ గౌరవ వర్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గిరిజన గ్రా మాలకు మంచినీరు, విద్య, వైద్యం, పౌష్టికాహారం, శానిటేషన్ అందించాలన్నారు. కార్యక్రమంలో ఏపీఓ హరికృష్ణ, వ్యవసాయ విస్తరణ అధికారి జ్యోత్స్న, వెలుగు క్లస్టర్ కోఆర్డినేటర్ స్వామి, ఐసీడీఎస్ సూపర్వైజర్ రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం
వజ్రపుకొత్తూరు: మండలంలోని పెద్దమురహరిపురం గ్రామానికి చెందిన గొరకల వైకుంఠరావు (33) గురువారం పూండి రైల్వే స్టేషన్ వద్ద గుర్తు తెలియని రైలు ఢీకొని మృతిచెందాడు. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వైకుంఠరావు రాజమండ్రిలో కూలి పనులు చేస్తుండేవాడు. ఇటీవల స్వగ్రామం వచ్చాడు. గురువారం తిరిగి రాజమండ్రి వెళ్లేందుకు పూండి రైల్వే స్టేషన్కు వచ్చాడు. పాసింజర్ రైలు ఎక్కే ఆతృతతో పట్టాలపై పడిపోయాడు. ఆ సమయంలో రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి శ్రీరాములు ఇదివరకే మృతి చెందగా, మతి స్థిమితం లేని తల్లి రాజులమ్మ, తమ్ముడు వెంకటేష్ ఉన్నారు. పూండి రైల్వేస్టేషన్ మాస్టర్ ఫిర్యాదు మేరకు పలాస జీఆర్పీ ఎస్ఐ ఎస్కే షరీఫ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. -
అసమగ్ర ప్రాజెక్టు!
● అస్తవ్యస్తంగా సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్టు ● సెక్టోరియల్ అధికారులు లేకుండానే నిర్వహణ ● భర్తీకి నోచుకోని సీఎంవో, జీసీడీవో, కో– ఆర్డినేటర్ పోస్టులు ● మినిస్టీరియల్ సిబ్బందితోనే కొనసాగిస్తున్న వైనం ● విద్యార్థులపై తీవ్ర ప్రభావం జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష అభియాన్ కార్యాలయం శ్రీకాకుళం: జిల్లా సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్టు.. సెక్టోరియల్ అధికారులు లేకుండానే నడుస్తోంది. కొన్ని నెలలుగా కీలక పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. విద్యా సంవత్సరం ప్రారంభమై సుమారు రెండు నెలలు కావస్తున్నా ఇప్పటికీ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం, మినిస్టీరియల్ సిబ్బందితోనే అన్ని విభాగాలను నిర్వహిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. 25 కేజీబీవీలను పర్యవేక్షించి అందులోని 2700 బాలికల బాగోగులను చూడాల్సిన జీసీడీవో పోస్టు మూడు నెలలుగా ఖాళీగా ఉంది. కేజీబీవీలోని ఆహార బిల్లులు, ఇతర ఖర్చులతో పాటు విద్యార్థినుల సంరక్షణ బాధ్యతలు చూడాల్సింది జీసీడీవోఏ. నెలకు కోటి రుపాయలపైనే జీతభ త్యాలు, ఆహార బిల్లులు ఇతర ఖర్చులకు సంబంధించి లావాదేవీలు జీసీడీవో ద్వారా జరగాల్సి ఉంది. ప్రస్తుతం ఆ బాధ్యతలన్నీ సూపరింటెండెంట్ స్థాయి ఉద్యోగి ద్వారా నిర్వహిస్తుండటంపై ఆక్షేపణలు వినిపిస్తున్నాయి. జాప్యమెందుకో? వాస్తవానికి రెండు కంటే ఎక్కువ సెక్టోరియల్ పోస్టులు ఖాళీగా ఉంటే తక్షణం నోటిఫికేషన్ ఇచ్చి శాసీ్త్రయ విధానంలో నియామకాలు చేపట్టాల్సి ఉంటుంది. అయితే అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్, ఎంఐఎస్ ప్లానింగ్ కో ఆర్డినేటర్ తమ సర్వీసును పూర్తి చేసుకోని రిలీవ్ అయ్యి పాఠశాలలకు వెళ్లిపోగా ఇప్పటీకీ ఆ పోస్టులను భర్తీ చేయలేదు. కమ్యూనిటీ మొబలైజేషన్ ఆఫీసర్, ప్రత్యామ్నాయ పాఠశాలల కో ఆర్డినేటర్ పోస్టులు మూడేళ్లు ఫారిన్ సర్వీస్తో నియామకం పొందినప్పటికీ గడువు తీరకముందే రీ ప్యాట్రేషన్ చేసి వేరొకరిని నియమించడం గమనార్హం. ఇది నిబంధనలకు పూర్తి విరుద్ధం. సీఎంవోగా పనిచేసిన అధికారి ప్రధానోపాధ్యాయునిగా పదోన్నతి పొంది వెళ్లి పోగా ఆ పోస్టును ఇప్పటికీ భర్తీ చేయలేదు. ఎక్కడి పనులు అక్కడే.. – పాఠశాలలు పునఃప్రారంభమై రెండు వారాలు కావస్తున్నా జిల్లాలోని కొన్ని మండలాలకు కిట్లు పంపిణీ జరగలేదు. మండల స్థాయికి బూట్లు, యూనిఫామ్ చేరకపోవడమే ఇందుకు కారణం. కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ దీనిని పర్యవేక్షించాల్సి ఉండగా ఆ పోస్టు ఖాళీగా ఉండటంతో పట్టించుకునే వారే కరువయ్యారు. – ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల్లో ప్రారంభ తరగతుల్లో 20 శాతం సీట్లు పేదలకు కేటాయించాల్సి ఉండగా ఆ పని ఇప్పటికీ పూర్తి కాలేదు. దీనిని పర్యవేక్షించాల్సిన పోస్టు ఖాళీగా ఉండటంతో ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల్లో మొత్తం సీట్లు ఎన్ని, పేదలకు ఎన్ని సీట్లు ఇచ్చారన్న సమాచారం నేటికీ సేకరించలేకపోయారు. – ప్రధానోపాధ్యాయులు సెక్టోరియల్ అధికారులుగా ఉండకూడదని 2024లో విద్యాశాఖ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులు శ్రీకాకుళం ఎస్ఎస్ఏలో అమలుకావడం లేదు. ముగ్గురు ఉద్యోగులు సుదీర్ఘ కాలం నుంచి ఫారిన్ సర్వీసెస్పై ఇదే శాఖలో కొనసాగుతున్నారు. దీనివల్ల ఆ పోస్టులు కోసం చూస్తున్న ఆశావహులు నిరాశకు గురవుతున్నారు. ఇలా ఎస్ఎస్ఏ పనితీరు ఉండటం వల్లే రాష్ట్రస్థాయిలో జిల్లా స్థానకం 26కు చేరుకుంది. ఇప్పటికై నా ప్రాజెక్టు కో ఆర్డినేటర్గా వ్యవహరించే జిల్లా విద్యాశాఖాధికారి, ప్రాజెక్టు చైర్మన్గా ఉన్న జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టిసారించకుంటే ఎస్ఎస్ఏ శాఖ పరిధిలోని విద్యార్థులకు తీరని నష్టం తప్పదు. నిబంధనలకు తిలోదకాలు ఎస్ఎస్ఏ ప్రాజెక్టు పనితీ రు అస్తవ్యస్తంగా మారింది. రాజకీయ నాయకులు పేరు చెప్పి కొందరు ఉద్యోగులు పబ్బం గడుపుకుంటున్నారు. సెక్టోరియల్ పోస్టులను మినిస్టీరియ ల్ సిబ్బందితో నిర్వహింపజేస్తూ ప్రాజెక్టును ఎలా నడిపిస్తున్నారో ఏపీసీకే తెలియాలి. పీఎం జన్మాన్ పాఠశాలల పురోగతి నత్తనడకన సాగుతోంది. ఐదు కీలక పోస్టులు ఖాళీగా ఉంటే నోటిఫికేషన్ ఇవ్వకపోవడం ఆక్షేపణీయం. – ఎస్.వి.రమణమూర్తి, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు కీలక పోస్టులన్నీ ఖాళీయే.. సమగ్ర శిక్షలో జీసీడీవో, సీఎంవో, అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఎంఎస్ కో ఆర్డినేటర్ పోస్టులు కీలకమైనవి. వీటి ద్వారానే విద్యార్థుల స్థితిగతులు, బాగోగులు పర్యవేక్షిస్తుంటారు. ఇలాంటి కీలకమైన పోస్టులు నెలల తరబడి భర్తీ చేయకపోవడం విచారకరం. – గొంటి గిరిధర్, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి -
హార్డ్వేర్ షాపులో చోరీ
ఇచ్ఛాపురం: మున్సిపాలిటీ పరిధి రత్తకన్న గ్రామం వద్ద కొలిగాం రోడ్డులో ఉన్న శ్రీమహాలక్ష్మి హార్డ్వేర్ షాపులో బుధవారం అర్థరాత్రి చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రత్తకన్న గ్రామానికి చెందిన గిన్ని వాసుదేవరెడ్డి కొలిగాం రోడ్డులో హార్డ్వేర్ వ్యాపారం చేస్తున్నారు. ఎప్పటిలాగానే బుధవారం రాత్రి షాపుకి తాళాలు వేసి ఇంటికి వెళ్లిపోయారు. గురువారం ఉదయం అటుగా రాకపోకలు చేసిన వారు షాపు తాళాలు పగులగొట్టి ఉండటం గమనించి యజమానికి సమాచారం అందించారు. అతను వచ్చి చూసేసరికి క్యాష్కౌంటర్లో ఉన్న రూ.95వేలు నగదు మాయమైనట్లు గుర్తించారు. వెంటనే బాధితుడు పట్టణ ఎస్సై ముకుందరావుకు ఫిర్యాదు చేయగా పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం క్లూస్టీమ్ వచ్చి వివరాలు సేకరించారు. -
దారుణాలు చూడండి..!
కలివరం వద్ద బస్సు ఎలా వెళ్లాల్సి వస్తుందో చూశారా. ఇసుక లారీల ధాటికి రోడ్డు గోతుల మయం కావడంతో బస్సు ఇలా పూర్తిగా ఒకవైపు వంగితే గానీ ముందుకు వెళ్లని ప్రమాదకర పరిస్థితి నెలకొంది. ఆమదాలవలస రూరల్: ఆమదాలవలస నియోజకవర్గంలోని పలు దారులు దారుణాలకు ఆనవాళ్లుగా కనిపిస్తున్నాయి. జాతీయ రహదారికి ఆనుకొని బూర్జ మండలం నారాయణపురం వరకు నాగావళి నదీతీరం పొడవునా సుమారు 30 వరకు అనధికార ఇసుక ర్యాంపు లు కొనసాగుతున్నాయి. నిత్యం వందల కొద్దీ లారీ లు, ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా ఇసుక తరలిస్తున్నా రు. రాత్రి, పగలు తేడా లేకుండా వాహనాలు తిరుగుతుండడంతో ఈ పల్లె దారులు తట్టుకోలేకపోతు న్నాయి. ఎక్కడికక్కడ గోతులు ఏర్పడటమే కాకుండా రహదారి పొడవునా బీటలు వారడంతో దారుల రూపురేఖలే మారిపోయాయి. దూసి నుంచి బూర్జ మండలం నారాయణపురం వరకు ఇదే పరిస్థితి. నిబంధనలకు మించి లోడింగ్ అక్రమ ఇసుక దందా దందాలో లారీ యజమానులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. రవాణా శాఖ నిబంధనలు మేరకు ఒక్కో లారీలో 20 నుంచి 25 టన్నులకు మించి లోడింగ్ చేయరాదు. కానీ ఇక్కడ ఒక్కో లారీకి పరిమితికి మించి ఇసుక లోడింగ్ చేయటంతో రహదారులు ధ్వంసమై అధ్వానంగా మారుతున్నాయి. వీటిని అడ్డుకోవాల్సిన రవాణా శాఖ అధికారులు, పోలీసులు వీరివైపు కన్నెత్తి చూడడం లేదు. బిక్కు బిక్కు మంటూ ప్రయాణాలు బూర్జ మండలం గుత్తావల్లి నుంచి ఆమదాలవలస మండలం కొత్తవలస, దూసి మీదుగా శ్రీకాకుళం మండలం రాగోలు మీదుగా శ్రీకాకుళం పట్టణానికి ప్రభుత్వ, ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలకు సంబంధించి బస్సులతో పాటు సుమారు 60 ఆటోలపై ప్రజలు తమ ప్రయాణం సాగిస్తుంటారు. రహదారి అధ్వానంగా ఉండడంతో ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణాలు సాగిస్తున్నారు. ప్రజలతో పనిలేదు రహదారులు ఏమైనా తమకు సంబంధం లేదన్నట్లు కూటమి నాయకులు వ్యవహరిస్తుండడం విస్మయ పరుస్తోంది. రహదారులు పూర్తిగా పాడైపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నా నాయకులు, అధికారులు ఎవరూ స్పందించడం లేదు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణా అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇసుక అక్రమ రవాణాతో రూపురేఖలు కోల్పోతున్న రహదారులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణిస్తున్న ప్రజలు పట్టించుకోని పాలకులు పీరుసాహెబ్వానిపేట వద్ద రోడ్డు చూశారా. ఇసుక వాహనాలు తొక్కీ తొక్కీ రోడ్డును ఇలా గుల్ల చేసి పారేశాయి. ఈ దారి గుండా వాహనాలు ప్రయాణించాలంటే ఎంత కష్టం. ఆమదాలవలస మండలం తొగరాం, కలివరం గ్రామాలను కలిపే రహదారి ఇది. చూసేందుకు మట్టి కుప్పలా మారిపోయింది. రాత్రి, పగలు లేకుండా ఇసుక వాహనాలు తిరుగుతుండడంతో దారికి ఈ పరిస్థితి దాపురించింది. ప్రజల హక్కులు హరిస్తున్నారు.. ప్రజల హక్కులను హరించే విధంగా కూటమి పాలకులు ఇసుక దందా చేస్తున్నారు. బూర్జ, ఆమదాలవలస మండలాలకు చెందిన సుమారు ఇరవై గ్రామాల ప్రజలు నిత్యం శ్రీకాకుళానికి రాకపోకలు సాగిస్తుంటారు. ఇసుక లారీల వల్ల రహదారి పూర్తిగా రూపురేఖలు కోల్పోయినా ఇంకా దందా చేస్తూనే ఉన్నారు. జిల్లా ఉన్నతాధికారులు తక్షణం స్పందించాలి. – చింతాడ రవికుమార్, వైఎస్సార్సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త -
కక్ష కట్టారు..
గతంలో వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నాననే ఒకే ఒక్క కారణంతో నాపై కక్ష కట్టి నా క్రషర్ను మూయించేశారు. క్రషర్ నిర్వహణలో 8 ఏళ్లుగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన అన్ని రకాల ఆదాయం చెల్లింపులు చేశాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి అండతో ఆయన సోదరుడి ఆదేశాలతో స్థానిక నాయకుల ప్రమేయంతో అధికారులతో పదే పదే దాడులు చేయించి క్రషర్ను మూ యించేశారు. గతంలో ఇలాంటి కక్ష సాధింపు చర్యలు ఉండేవి కావు. నా తల్లి వైఎస్సార్సీపీ తరఫున సర్పంచ్గా ఉన్నారు. నేను వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉండడంతో, ఇలా కక్ష కట్టి క్రషర్ను మూయించేశారు. – కిల్లి అజయ్కుమార్, బాధిత యజమాని, టెక్కలి ● -
ఫ్లెక్సీలో కానరాని డిప్యూటీ సీఎం
శ్రీకాకుళం క్రైమ్ : పేరుకు కూటమి ప్రభుత్వం అయినప్పటికీ జనసేనను తెలుగుదేశం పార్టీ పట్టించుకో వడం లేదనడానికి గురువారం జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమమే ప్రత్యక్షంగా సాక్ష్యంగా నిలిచింది. మాదకద్రవ్యాల నిర్మూలన, వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో నిర్వహించిన సభలో అతిథులుగా మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే శంకర్ పాల్గొన్నారు. వేదిక వెనక కట్టిన బ్యానర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత, రాష్ట్ర డీజీపీ, ఇతర పోలీసు అధికారుల ను ప్రోటోకాల్పరంగా పెట్టారు. డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ఫొటో మాత్రం లేదు. తమ నాయకు డి పరిస్థితే ఇలా ఉంటే తమను ఎవరు పట్టించుకుంటారంటూ జనసేన నాయకులు గుసగుసలాడుకోవడం కనిపించింది. -
‘వార్డు సభ్యులకు తెలుపకుండా పనులేంటి..?’
టెక్కలి: మేజర్ పంచాయతీలో వార్డు సభ్యుల ప్రమేయం లేకుండా అధికార పార్టీ కార్యకర్తలు గుర్తించిన పనులకు ఎట్టి పరిస్థితుల్లో ఆమోదం తెలియజేసేది లేదని పంచాయతీ వార్డు సభ్యు లు ముక్త కంఠంతో స్పష్టం చేశారు. గురువారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో సాధారణ సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా పంచాయతీలో ఇటీవల గుర్తించిన కొన్ని రకాల పనులపై ఈఓ వెంకటరావు ప్రస్తావించగా, సభ్యులంతా వ్యతిరేకించారు. పంచాయతీ పరిధిలో వార్డు సభ్యులకు తెలియకుండా ఇష్టానుసారంగా అధిక మొత్తంలో ప్రతిపాదనలు చేసి పనులు గుర్తించారని మండిపడ్డారు. చేసిన ప్రతిపాదనలపై విచారణ చేయాలని పలువురు వార్డు సభ్యులు పట్టుబట్టారు. తమ ప్రమేయం లేకుండా గుర్తించిన పనులకు తామెలా ఆమో దం తెలియజేస్తామని ప్రశ్నించారు. దీంతో సమావేశం పూర్తి స్థాయిలో కొనసాగలేదు. సమావేశంలో సర్పంచ్ జి.సుజాత, వైస్ సర్పంచ్ జి.విశ్వశాంతిరెడ్డితో పాటు పలువురు వార్డు సభ్యులు పాల్గొన్నారు. ‘గిరిజన పాఠశాలలకు సౌకర్యాలు కల్పించాలి’ పలాస: పలాస నియోజకవర్గంలోని పలాస, మందస ప్రాంతంలోని గిరిజన పాఠశాలలకు తగిన సౌకర్యాలు కల్పించాలని గిరిజన సంక్షే మ సంఘం నాయకులు కోరుతున్నారు. వారు ఈ మేరకు గురువారం వివిధ పాఠశాలలను పరిశీలించారు. చాలా పాఠశాలల్లో తగిన సదుపాయాలు లేవని, పాఠశాలలు కూడా విద్యార్థులకు అందుబాటులో లేవని ఆందోళన వ్యక్తం చేశారు. కిల్లోయి బాలుర పాఠశాలను బాలికల పాఠశాలగా మార్పు చేశారని బాలికలు ఆ పాఠశాలలో చేరడానికి పరిస్థితులు అనుకూలంగా లేవన్నారు. చాలా మంది బాలికలు పెద్దమడికి వెళ్లిపోతున్నారని, వారిని ఇక్కడకు రప్పించే బాధ్యత సంబంధిత అధికారులు తీసుకోవాల ని కోరారు. కిల్లోయి పాఠశాల ఉపాధ్యాయులు గ్రామాల్లో తిరిగి తగిన ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ సంఘం నాయకులు ఎస్.నారాయణరావు, ఎస్.నరిసింహులు, ఎస్.లక్ష్మణరావు, కె.రమేష్ పాల్గొన్నారు. ‘రెవెన్యూ సమస్యలపై సత్వరం స్పందించాలి’ శ్రీకాకుళం పాతబస్టాండ్: రెవెన్యూ సమస్యలపై సత్వరమే స్పందించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలసి గురువారం శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్కు సంబంధించి తహసీల్దార్లు, హెచ్డీటీ లు, మండల సర్వేయర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రతి మంగళవారం తహసీల్దార్లు, వీఆర్ఓలతో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. వారానికో మండలంతో సమావేశం నిర్వహించాలని డీఆర్ఓను ఆదేశించారు. ఈహెచ్ఎస్ ఆస్పత్రి నిర్మించేందుకు స్థలం కో సం ప్రతిపాదనలు పంపాలని సైనిక సంక్షేమ అధికారిని ఆదేశించారు. గార మండలంలో డీసీసీబీ, జలుమూరు మండలంలో వైద్య ఆరోగ్య శాఖ, గార మండలంలో డీఆర్డీఏ, ఎచ్చెర్లలో ఆర్టీఓ, సరుబుజ్జిలి, రణస్థలం మండలాల్లో అంగన్వాడీ కేంద్రాలు, శ్రీకాకుళంలో మార్క్ ఫెడ్, పర్యాటక శాఖకు సంబంధించి భూ సమస్యలపై చర్చించారు. ఇళ్ల స్థలాలపై రీ వెరిఫికేషన్ గతంలో జరిగిందని, దీనిపై సంబంధిత తహసీల్దార్ వీఆర్ఓను తీసుకొని స్వయంగా స్థల పరిశీలన చేసి అక్కడ నిర్మా ణాలు ప్రారంభించారా లేదా చూడాలన్నారు. కర్మయోగి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని డీఆర్ఓ ఎం.వెంకటేశ్వరరావు చెప్పారు. గ్రామ సభ, గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తున్నప్పటికీ రెవెన్యూ సమస్యలు తగ్గడం లేదన్నారు. సివిల్ సమస్యలపై తలదూర్చరాదని జేసీ ఆదేశించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి కె.సాయి ప్రత్యూష, డిప్యూటీ కలెక్టర్లు జి. జయదేవి, డి.పద్మావతి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
నాటుసారా స్వాధీనం
మందస: మండలంలోని గుడ్డికోలా గ్రామంలో గురివారి అనే మహిళ నుంచి 40 లీటర్ల నాటుసారా పట్టుకోవడంతో పాటు, సారా తయారీకి వినియోగిస్తున్న 300 లీటర్ల బెల్లంఊటను ఎకై ్సజ్ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. దీనిలో భాగంగా ఆమెను అరెస్టు చేసి సోంపేట కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. దాడుల్లో సోంపేట ఎకై ్సజ్ సీఐ జీవీ రమణ, ఎన్ఫోర్స్మెంట్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ సుజాత, సిబ్బంది భాను ప్రసాద్, రమణ, వెంకటేష్, ఉమాపతి, విజయ్, మార్కరావు, గాలిబ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల్లోకి ప్రభుత్వ వ్యతిరేకత
సమావేశంలో పాల్గొన్న ధర్మాన కృష్ణదాస్, కుంభా రవిబాబు, సీదిరి అప్పలరాజు, నర్తు రామారావు, గొర్లె కిరణ్కుమార్, పేరాడ తిలక్ తదితరులుసమావేశానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి, జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ తదితరులునరసన్నపేట: జిల్లాలో పార్టీ బలంగా ఉందని, ఏడాది కూటమి పాలనపై వ్యక్తమైన వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డికి తెలియజేశారు. తాడేపల్లిలో బుధవారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో అధినేతకు పార్టీ పరిస్థితిని వివరించారు. కూటమి పాలనపై ప్రజా వ్యతిరేకత పెరుగుతోందని, దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని, గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని, కార్యకర్తలకు అండగా ఉంటూ వారిలో మనోధైర్యం పెంపొందించాలని పార్టీ అధినేత సూచించినట్లు కృష్ణదాస్ వివరించారు. కార్యక్రమానికి హాజరైన వారిలో పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలకుడు కుంభా రవిబాబు, ఎమ్మెల్సీ నర్తు రామారావు, జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు రెడ్డి శాంతి, మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్, టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్, ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్ ఉన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ -
కిడ్నీ ఆస్పత్రిలో అసౌకర్యాలపై ఆరా
కాశీబుగ్గ: పలాస కిడ్నీ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలోని వైద్యులు, సిబ్బందిని నియమించాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ డిమాండ్ చేశారు. పలాస కిడ్నీ పరిశోధన కేంద్రం, 200 పడకల ఆసుపత్రిని బుధవారం వేదిక సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 మంది డాక్టర్లకు గాను 20 మందిని మాత్రమే నియమించడం రోగులకు ఎలా సేవలు అందుతాయని ప్రశ్నించారు. 60 మంది నర్సులకు 58 మంది కాంట్రాక్టు పద్ధతిలోనే ఉన్నారని, శాశ్వత నర్సులను ఎందుకు నియమించడం లేదో ప్రభుత్వం సమాధానమివ్వాలన్నారు. రీసెర్చ్ పూర్తి స్థాయిలో జరగడం లేదన్నారు. రోజు రోజుకు కిడ్నీ రోగుల సంఖ్య, మరణాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదన్నారు. కార్యక్రమంలో ప్రజారోగ్య వేదిక రాష్ట్ర కార్యదర్శి టి.కామేశ్వరరావు, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక నాయకులు ధర్మారావు మాస్టారు, అజయ్ కుమార్, రైతు సంఘం అధ్యక్షుడు మోహనరావు, సీఐటీయూ నాయకులు గణపతి, దిలీప్కుమార్ తదితరులు పాల్గొన్నారు. సెమిస్టర్ ఫలితాలు విడుదల ఎచ్చెర్ల : డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో స్పెషల్ బీఈడీ (ఎంఆర్) కోర్సుకు సంబంధించిన మూడో సెమిస్టర్ ఫలితాలను వర్శిటీ ఎగ్జామినేషన్ డీన్ డాక్టర్ ఉదయ్భాస్కర్ బుధవారం విడుదల చేశారు. 33 మంది హాజరుకాగా శతశాతం ఉత్తీర్ణత సాధించారు. దీంతో పాటు బొల్లినేని మెడిస్కిల్స్ సంస్థ, వర్శిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న పీజీ, డిప్లమా మెడికల్ కోర్సుల సెమిస్టర్ ఫలితాలను కూడా విడుదల చేశారు. మాస్టర్ ఆఫ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్లో ఒకటో సెమిస్టర్కు 30, మూడో సెమిస్టర్కు 31 మంది పరీక్షకు హాజరుకాగా అందరూ ఉత్తీర్ణత సాధించారు. పీజీ డిప్లమో ఇన్ మెడికల్ రికార్డ్స్ అండ్ హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ కోర్సులో ఒకటో సెమిస్టర్కు 19 మంది హాజరై శతశాతం ఉత్తీర్ణులయ్యారు. -
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జూలై 9న జరగనున్న దేశవ్యాప్త సమ్మెలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, పాఠశాల స్వీపర్లు పాల్గొంటారని ఏపీ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్, పాఠశాల, కళాశాలల స్వీపర్స్ యూనియన్ ప్రతినిధులు ప్రకటించారు. ఈ మేరకు డీఈఓ కార్యాలయం సూపరింటెండెంట్ వెంకటేశ్వర పట్నాయక్కు యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.ఉత్తర, కె.సుశీల, నగర కార్యదర్శి టి.ప్రవీణ సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లేబర్ కోడ్లను రద్దు చేయాలని, మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం రూ.20 వేలు ఇవ్వాలని, మెనూ చార్జీలు పెంచాలని, ప్రభుత్వమే గ్యాస్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎ.ఈశ్వరమ్మ, ఎ.మాలతి, చాందిని, ఎ.సుధారాణి పాల్గొన్నారు. -
పనులయ్యాయి.. ప్రారంభమెన్నడో..!
ఒకేరోజు ప్రారంభించేందుకేనా..? రాష్ట్రంలో సుమారు 10 నుంచి 12 చోట్ల ఇదే కార్యాలయ భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే శ్రీకాకుళంలోనే ముందుగా నిర్మాణం పూర్తవ్వడం జరిగింది. కానీ మిగతా ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో నిర్మాణాలు జరగకపోవడం కూడా ఇక్కడ భవనం ప్రారంభమవ్వకపోవడానికి ఒక్క కారణంగా తెలుస్తోంది. రాష్ట్ర వైద్యారోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి సత్యకుమార్యాదవ్తో ఒకే రోజు అన్ని భవనాలు ప్రారంభించాలని అనుకోవడం వలనే ఈ భవనం ఆలస్యానికి కారణమని సమాచారం. ఇదే భవనానికి సమీపంలో ఉన్న ఇండోర్ భవనం కూడా రూ.60 కోట్ల వ్యయంతో నిర్మితమై ఉన్నా ప్రారంభానికి నోచుకోకపోవడం కూటమి పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం. శ్రీకాకుళం క్రైమ్/శ్రీకాకుళం: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలోని రిమ్స్ ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలో నిర్మాణం పూర్తయిన జిల్లా ఔషధ నియంత్రణ సహాయ సంచాలకుడి కార్యాలయం నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు. 2020లో ఈ భవన నిర్మాణం ప్రారంభించగా, 2024 ఎన్నికలకు ముందే నిర్మాణం పూర్తయ్యింది. కానీ ఏడాది క్రితం ఏర్పడిన కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం.. పరిపాలనా విభాగం తాత్సారంతో ఇప్పటికీ అద్దె భవనానికి నెలకు రూ.10,497లు చెల్లిస్తున్నారు. రీ ఎస్టిమేట్ బిల్లులో జాప్యం వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.81.60 లక్షలతో మొదట అంచనా వ్యయంగా బిల్లు మంజూరు చేసింది. దీంతో గడిచిన ఎన్నికల ముందే భవనం పూర్తిస్థాయిలో నిర్మాణం జరిగింది. 2024 జూన్ 3న సంబంధిత శాఖ సహాయ సంచాలకుడు (ఏడీ) చంద్రరావుకు అప్పగించడమూ జరిగింది. అయితే కార్యాలయానికి విద్యుత్ సదుపాయం, చుట్టూ ఫెన్సింగ్ కోసం ముందుగా మంజూరు చేసిన నిధులు సరిపోలేదని అదనంగా రూ.12 లక్షల అంచనా వ్యయం కోసం కూటమి ప్రభుత్వానికి మళ్లీ ఏడీ ప్రతిపాదనలు పంపారు. దీంతో దాదాపు తొమ్మిది నెలల జాప్యం తర్వాత ఈ ఏడాది మార్చి 3వ తేదీన ప్రభుత్వం నుంచి రీఎస్టిమేట్ వ్యయం రూ.10.62 లక్షలు మంజూరైనట్లు ఉత్తర్వులు వచ్చాయి. అయినప్పటికీ నేటికీ విద్యుత్ సదుపాయం, ఫెన్సింగ్ పనులు పూర్తి చేయలేదు. వైఎస్సార్సీపీ హయాంలో పూర్తయిన జిల్లా ఔషధ నియంత్రణ పరిపాలన కార్యాలయం ఏడాది క్రితమే ఏడీకి అప్పగింత నేటీకి ప్రారంభమవ్వని వైనం -
విత్తన శుద్ధి.. సాగు వృద్ధి
● ఖరీఫ్కు సిద్ధమవుతున్న రైతులు ● విత్తన శుద్ధిపై అధికారుల సూచనలు సూచనలు పాటించాలి రైతులంతా శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారుల సూచనలు పాటిస్తే వ్యవసాయం ఎప్పటికీ లాభదాయకం అవుతుంది. ప్రస్తుతం రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు రైతు భరోసా కేంద్రాల నుంచే అందుతున్నాయి. రైతులు మట్టి పరీక్షలు నిర్వహించి వాటికి అనుగుణంగా ఎరువులు వేసుకుంటే దిగుబడులు సాధించుకోవచ్చును. రైతు భరోసా కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. – మోహనరావు, వ్యవసాయాధికారి, ఆమదాలవలస ఆమదాలవలస: ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో ఖరీఫ్కు సిద్ధమవుతున్న రైతులు తమ పంట పొలాల్లో జల్లే వరి విత్తనాలకు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. రైతులు ఎంపిక చేసుకున్న విత్తనాలకు విత్తన శుద్ధి చేసి పొలాల్లో వెద, నారుమడుల్లో వేస్తే అధిక దిగుబడులు సాధించుకోవచ్చునని చెబుతున్నారు. విత్తన శుద్ధి సాగులో చీడపీడల నివారణకు ఎంతగానో ఉపయోగపడుతుందని గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 1.70 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వరిసాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. విత్తన శుద్ధి చేసుకోవడం ఇలా... కిలో విత్తనానికి ఒక గ్రాము కార్బండిజమ్ లేదా 2.5 గ్రామాల మాంకోజెట్ కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధిలో తగిన మోతాదులో మందులు వాడాలి. మోతాదు మించితే విత్తనం మొలకశాతం తగ్గుతుంది. శిలింద్ర నాశిని పురుగు మందులతో శుద్ధి చేసిన తర్వాత జీవ రసాయనాలతో మరోసారి శుద్ధి చేయాలి. గింజ పగలకుండా, పైపొర పోకుండా చూసుకోవాలి. చేతులకు గ్లౌజులు, ముఖానికి గుడ్డు కట్టుకోవాలి. ప్రయోజనాలివే.. విత్తన శుద్ధి నేల ద్వారా వ్యాపించే తెగుళ్లు, పురుగును సమర్దవంతంగా నివారించడానికి దోహదపడుతుంది. శుద్ధికి వినియోగించే మందులు విత్తనంలోకి చొచ్చుకుపోయి శిలీంద్రాలను నాశనం చేస్తాయి. మొలకెత్తిన లేత మొక్కలు నేలలో ఉన్న శిలీంద్రాలు నుంచి రక్షణ పొందుతాయి. తక్కువ ఖర్చుతో పురుగులు, తెగుళ్లు పంటను ఆశించకుండా చేయవచ్చు. -
పోలీసుల విచారణ
ఎల్.ఎన్.పేట: మండలంలోని లక్ష్మీనర్సుపేట గ్రామ వంశధార నదీ తీరంలో కొలువైన బంగారమ్మ తల్లి గుడి వద్ద సరుబుజ్జిలి పోలీసులు బుధవారం విచారణ చేపట్టారు. సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బంగారమ్మ గుడి వద్ద ఉన్న హుండీ పగలగొట్టి అందులో ఉన్న నగదు ఎత్తుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న సరుబుజ్జిలి ఎస్ఐ బి.హైమవతి సంఘటనా స్థలానికి పోలీసులను పంపించి సమగ్ర వివరాలను సేకరించారు. విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో భార్య మృతి ● భర్త పరిస్థితి విషమం టెక్కలి: కోటబొమ్మాళి మండలంలోని తర్లిపేట సమీపంలో జాతీయ రహదారి వద్ద బుధవారం వేకువజామున గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో భార్య మృతి చెందగా, భర్త పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. తర్లిపేట గ్రామానికి చెందిన బుడత లోకేష్, భార్య రత్నాలమ్మ తదితరులు వేకువజామున తమకు చెందిన ట్రాలీ రిక్షాపై సారికందను శ్రీపురం జంక్షన్లోని కూరగాయల సముదాయం వద్దకు తీసుకెళ్తున్నారు. ఆ సమయంలో హఠాత్తుగా గుర్తు తెలియని వాహనం వచ్చి బలంగా ఢీకొంది. దీంతో ఇరువురు రోడ్డుపై పడిపోగా, సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను టెక్కలి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇందులో రత్నాలమ్మ చికిత్స పొందుతూ మృతి చెందింది. లోకేష్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. ఘటనపై కోటబొమ్మాళి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జెమ్స్లో రోబోటిక్ శస్త్ర చికిత్స శ్రీకాకుళం రూరల్: శ్రీకాకుళంలోని రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో బుధవారం రోబోటిక్ శస్త్ర చికిత్స విజయవంతంగా నిర్వహించినట్లు రోబోటిక్ సర్జన్ డాక్టర్ చీపురపల్లి వసుంధర తెలిపారు. జిల్లాలోని జలుమూరు మండలానికి చెందిన 46 ఏళ్ల మహిళ గర్భాశయ వ్యాధితో గత కొన్నేళ్లుగా బాధపడుతోంది. ఎన్నో మందులు వాడినప్పటికీ తగ్గకపోవడంతో జెమ్స్ ఆస్పత్రిని సంప్రదించింది. ఈమెను పరీక్షించిన వైద్యురాలు రోబోటిక్ సాయంతో విజయవంతంగా శస్త్ర చికిత్స పూర్తి చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీ లలిత, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్రెడ్డి, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హేమంత్, హెచ్వోడీ డాక్టర్ రేవతి, గైపాకాలజిస్ట్ డాక్టర్ స్నేహలు పాల్గొన్నారు. కర్ణాటకకు చెందిన యువకుడు ఆత్మహత్య రణస్థలం: పైడి భీమవరంలోని ఒక ప్రైవేటు లాడ్జిలో కర్ణాటకకు చెందిన సర్వీస్ ఇంజినీర్ ఎంఆర్ సందీప్(25) ఆత్మహత్యకు పాల్పడినట్లు జేఆర్పురం పోలీసులు తెలిపారు. పైడి భీమవరం డాక్టర్ రెడ్డీస్ పరిశ్రమలో సర్వీసింగ్ చేసేందుకు లోటస్ కంపెనీ నుంచి సర్వీస్ ఇంజినీరుగా సందీప్ ఈనెల 4వ తేదీన వచ్చాడు. విధులు నిర్వహిస్తూ పైడిభీమవరంలో ఒక లాడ్జిలో రూమ్ తీసుకుని ఉంటున్నాడు. మంగళవారం నుంచి లోటస్కు సంబంధించిన తోటి ఉద్యోగులు ఫోన్ చేస్తున్నా తీయడం లేదు. బుధవారం ప్రయత్నించగా ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. పైడి భీమవరం రెడ్డీస్ ఉద్యోగులకు విషయం చెప్పి లాడ్జికు పంపించారు. రూమ్ లోపల గడియపెట్టి ఉండడంతో లాడ్జి నిర్వాహకుల సాయంతో తలుపు తెరవగా, బాత్ రూమ్లో ఆత్మహత్య చేసుకుని మృతి చెంది ఉన్నాడు. మృతుడిది కర్ణాటక రాష్ట్రం దేవన్గిరి సమీపంలోని భాన్వల్లి గ్రామంగా గుర్తించారు. అత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ ఎస్.చిరంజీవి తెలిపారు. -
వారం వ్యవధిలో..అక్కాచెల్లెళ్లు మృత్యువాత
మందస: వారం రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలోని అక్కాచెల్లెళ్లు మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. మందస మండలం తాళ్లగురంటి గ్రామానికి చెందిన తిలోచన్ జన్ని, బోగి జన్ని దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె నిఖిత(9) నాలుగో తరగతి కాగా, చిన్న కుమార్తె హారిక(7) రెండో తరగతి. ఇద్దరూ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలోనే చదువుతున్నారు. నిఖితకు గత మంగళవారం(జూన్ 17) వేకువజామున 3 గంటల సమయంలో కడుపు నొప్పి రావడంతో తండ్రి సిరప్ తాగించాడు. అయినా ఫలితం లేకపోవడంతో ఉదయాన్నే మృతిచెందింది. సరిగ్గా వారం తర్వాత రెండో కుమార్తె హారిక కూడా మంగళవారం(ఈ నెల 24) వేకువజామున మూడు గంటల ప్రాంతంలో కడుపునొప్పితో బాధపడింది. ఈ పాపకు తండ్రి సిరప్ తాగించడంతో ఉదయాన్నే మృతిచెందింది. మరోవైపు, బాలికల చిన్నాన్న శంకర్ కూడా అస్వస్థతకు గురయ్యాడు. వింతగా ప్రవరిస్తుండటంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఆందోళనలో గ్రామస్తులు వారం వ్యవధిలో ఇద్దరు మృతిచెందడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో మరికొందరు కూడా జ్వర లక్షణాలతో బాధపడుతున్నట్లు చెబుతున్నారు. అయినా ఇంతవరకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా వైద్యులు స్పందించి ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయమై సిరిపురం పీహెచ్సీ వైద్యాధికారి సాయి వద్ద ప్రస్తావించగా.. మృతులకు జ్వర లక్షణాలు లేనట్లు గుర్తించామన్నారు. గుండెనొప్పితో చనిపోయి ఉంటుందని భావిస్తున్నామని చెప్పారు. కడుపునొప్పి లక్షణాలతో బాధపడ్డారని చెబుతున్న కుటుంబ సభ్యులు గుండెనొప్పి కావచ్చంటున్న వైద్యులు తాళ్లగురంటిలో విషాదఛాయలు కానరాని వైద్య శిబిరాలు -
గంజాయి నిర్మూలనపై స్పష్టమైన ప్రణాళిక
● డీఐజీ గోపినాథ్ జెట్టి శ్రీకాకుళం క్రైమ్: గంజాయి నిర్మూలన, నిందితుల అరెస్టు, వారి ఆస్తుల జప్తు, డీ–అడిక్షన్ సెంటర్లకు తరలింపుపై అధికారులకు స్పష్టమైన ప్రణాళిక ఉండాలని విశాఖ రేంజి డీఐజీ గోపినాథ్ జెట్టి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూలై 5న పాడేరులో జిల్లాస్థాయి అధికారులతో సమావేశం ఉంటుందని తెలియజేశారు. గడిచిన 2024–25లో గంజా అక్రమ రవాణాపై 694 కేసులు నమోదు చేసి 40,063 కిలోల గంజాయి, 18 కిలోల హనీష్ ఆయిల్, 478 వాహనాలను స్వాధీనం చేసుకొని 1,945 మందిని అరెస్టు చేశామని వెల్లడించారు. ఒడిశా రాష్ట్ర ఉన్నతాధికారులతో సమావేశాలు పెడుతున్నామని, 26 స్టాటిక్ చెక్పోస్టుల వద్ద 183 కేసుల్లో 11,047 కిలోల గంజాయి సీజ్ చేసి 469 మందిని అరెస్టు చేశామన్నారు. అదనంగా ఉన్న 298 డైనమిక్ చెక్పోస్టుల వద్ద 237 కేసుల్లో 21,070 కిలోల గంజాయి సీజ్ చేసి 743 మందిని అరెస్టు చేశామన్నారు. రవాణా చేసే ఎనిమిది మంది వ్యాపారుల నుంచి రూ.9.76 కోట్ల ఆస్తులను జప్తు చేశామని, 1310 మంది గంజాయి నేరస్తుల కదలికల మీద నిఘా కోసం షీట్స్ తెరిచామన్నారు. 50 మందిపై పీడీ చట్టం, 19 మందిపై పీటీ ఎన్డీపీఎస్ చట్టం ప్రయోగించేందుకు ప్రతిపాదించామన్నారు. రవాణాలో పాల్గొన్న 527 మందిని, గంజాయితోపాటు ఇతర నేరాల్లో పాల్గొన్న 348 మందిని ఇప్పటికే గుర్తించామన్నారు. 2024–25 కాలంలో 23 కేసుల్లో 40 మంది ముద్దాయిలకు న్యాయస్థానం 10 నుంచి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించిందని, 3039 విద్యాసంస్థలు మరియు అన్ని గ్రామాల్లో 10,654 అవగాహన సదస్సులు పెట్టామన్నారు. 51 మంది గంజాయి వినియోగదారులపై కేసులు పెట్టి 161 మందికి పునరావాస కేంద్రాలకు పంపామన్నారు. పాత కేసుల్లో పట్టుబడిన 72,196 కిలోల గంజాయిని, 74.26 కిలోల హనీష్ ఆయిల్ను ధ్వంసం చేశామని తెలియజేశారు. -
సమష్టి కృషితోనే వర్సిటీ అభివృద్ధి
ఎచ్చెర్ల: అందరి సమష్టి కృషితోనే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ అభివృద్ధి జరుగుతోందని వర్సిటీ వైస్ చాన్సలర్ ఆచార్య కె.ఆర్.రజనీ అన్నారు. వర్సిటీ 18వ వ్యవస్థాపక దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ వెనుకబడిన ప్రాంతంలో స్థాపించిన వర్సిటీ ప్రగతిలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యమయ్యేలా సంకల్పించుకోవాలన్నారు. వర్సిటీ ప్రతిష్టకు భంగం కలిగేలా ఎవరూ వ్యవహరించకూడదని సూచించారు. ఇటీవల విడుదలైన పీఎం ఉషా నిధులను వర్సిటీ బలోపేతానికి, మౌలిక వసతులు పెంచేందుకు, నూతన నిర్మాణాలకు వెచ్చించనున్నట్లు తెలిపారు. సిబ్బందికి ఎదైనా సమస్య ఉంటే తనకు నేరుగా తెలియజేయాలన్నారు. డిగ్రీ కళాశాలల అధ్యాపకులు పరీక్షలకు అబ్జర్వర్లను నియమించాలని అంటున్నారని, అయితే ఇన్విజిలేటర్ ఉండగా పరీక్షల్లో చూచిరాతలకు తావు ఉండదని పేర్కొన్నారు. తక్కువ బడ్టెట్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉందని, అబ్జర్వర్లను నియమిస్తే అదనపు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. వర్సిటీతో పేదలకు ఉన్నత విద్య వర్సిటీ రెక్టార్ ఆచార్య బి.అడ్డయ్య మాట్లాడుతూ గిరిజన, పేద వర్గాలకు ఉన్నత విద్యనందించడంలో వర్సిటీ ముఖ్య భూమిక పోషిస్తోందన్నారు. వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య పి.సుజాత మాట్లాడుతూ గత 17 ఏళ్లలో వర్సిటీ సాధించిన విజయాలను వివరించారు. ప్రగతే ధ్యేయంగా పనిచేస్తున్న అధికారులు, వర్సిటీ వర్గాలు పరిపాలనా వ్యవస్థను దిగజార్చే పనులకు దూరంగా ఉండాలని సూచించారు. అయితే తనకు ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ శిష్యుడని, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు వద్ద మంచి పేరు ఉందని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కార్యక్రమంలో వర్సిటీ కళాశాలల ప్రిన్సిపాల్స్ డా.ఎ.ఉదయ్భాస్కర్, డా.ఎం.అనురాధ, డా.సీహెచ్ రాజశేఖరరావు, ఎన్.ఎస్.ఎస్ కో–ఆర్డినేటర్ డా.డి.వినజ, డా.కె.ఉదయ్కిరణ్లు ప్రసంగించారు. ఎస్వో డా.కె.సామ్రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు క్యాంపస్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, గాంధీజీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వీసీ ఆచార్య కేఆర్ రజనీ ఘనంగా బీఆర్ఏయూ 18వ వ్యవస్థాపక దినోత్సవం -
ఇరాన్పై దాడులను ఖండించాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ఇరాన్పై అమెరికా దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కొన్న శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు వామపక్షాల ఆధ్వర్వంలో శ్రీకాకుళం నగరంలోని అంబేడ్కర్ జంక్షన్ వద్ద బుధవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారత్ అవలంభిస్తున్న సంప్రదాయ విదేశాంగ విధానానికి అమెరికా దాడులు విరుద్ధమని దుయ్యబట్టారు. ఇరాన్పై దాడితో క్రూడ్ ఆయిల్ సంక్షోభం వస్తుందని, దేశ ప్రజలపై తీవ్రమైన భారాలు పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం వెంటనే అమెరికా దాడులను ఖండించాలని డిమాండ్ చేశారు. ఇరాన్పై దాడులు అమెరికా స్వప్రయోజనాల కోసమేనని, ప్రపంచ ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం లేదన్నారు. భారత్తో ఇరాన్ ఎల్లప్పుడూ స్నేహపూర్వకంగా వ్యవహరిస్తోందని గుర్తు చేశారు. ఈ దాడి ప్రపంచ శాంతి, సాధారణ ప్రజల జీవనోపాధిపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వామపక్ష నాయకులు ఆర్.ప్రకాశరావు, ఎ.సత్యం, ఎం.గోవర్దనరావు, ఎం.ఆదినారాయణమూర్తి, టి.తిరుపతిరావు, ఎ.లక్ష్మి, బి.సంతోష్, ఆర్.అరవింద్, ఎ.సోమశేఖర్, పి.జగ్గారావు, పి.జనార్దనరావు, ఎన్.సంతోష్, ఎంవీ రమణ తదితరులు పాల్గొన్నారు. -
పులిజూదం
టీడీపీలో అంతర్గత కుట్రలుసాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జూదం ఆడటం తప్పు. పేకాట శిబిరాలు నిర్వహించడం అంతకుమించి తప్పు. శ్రీకాకుళంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా పేకాట శిబిరాలు నడుస్తున్నాయి. స్వయంగా కూటమి నాయకులే నిర్వహిస్తున్న ఈ శిబిరాల్లో పెద్ద పెద్ద వ్యక్తులు జూదమాడుతున్నారు. ఇప్పుడీ బలహీనతలే కొంతమందిని రోడ్డుపైకి తీసుకొస్తున్నాయి. దానివెనక రాజకీయ కుట్రలు ఉంటున్నాయి. ఎవరినైతే పదవుల విషయంలో ఎలిమినేట్ చేయాలనుకుని భావిస్తున్నారో వారిని వ్యూహాత్మకంగా బుక్ చేస్తున్నారు. ఆ మధ్య ప్రముఖ వైద్యుడు దానేటి శ్రీధర్ను, తాజాగా పాండ్రంకి శంకర్ బ్రదర్స్ను అదే రకంగా దెబ్బకొట్టారని కూటమి నాయకుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దానేటి శ్రీధర్ను రచ్చకీడ్చేలా.. ఆ మధ్య కుశాలపురం సమీపంలో దానేటి శ్రీధర్ గెస్ట్ హౌస్లో పేకాట జరుగుతున్నట్టుగా పోలీసులకు సమాచారం వెళ్లింది. స్పెషల్ బ్రాంచ్, ఎచ్చెర్ల పోలీసులు ఓ రాత్రి దాడి చేసి, ఆరుగురు వ్యక్తుల్ని పట్టుకున్నారు. అప్పట్లో దొరికిన వారిలో దానేటి శ్రీధర్ కూడా ఉన్నట్టు బయట ప్రచారం జరిగింది. పోలీసుల దాడులు, పట్టుకున్న విషయమంతా బయటికి వచ్చేలా తెరవెనక కొందరు కథ నడిపించారు. ఆ తర్వాత అదే కూటమి పెద్దల పలుకుబడితో దానేటి శ్రీధర్ను సేఫ్ చేసినట్టు రక్తికట్టించారు. ఆయన గెస్ట్హౌస్లో పేకాట జరిగిందని.. శ్రీధర్ లేరని క్లారిటీ ఇచ్చేశారు. మొత్తానికి దానేటి శ్రీధర్ పరువు అధికారికంగా పోలేదు. ఎందుకిలా చేశారంటే జనసేన నాయకుడిగా డాక్టర్ దానేటి శ్రీధర్ రాజకీయంగా పోటీ పడుతున్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో భవిష్యత్లో పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఒక ముద్ర వేసి వీధిన పెట్టేస్తే.. పదవుల విషయంలో పోటీ ఉండటానికి అవకాశం ఉండదని కూటమిలోనే ప్రత్యర్థులే కుట్ర పూరితంగా వ్యవహరించారన్న వాదనలు నడిచాయి. పథకం ప్రకారం పట్టుకునేలా చేసి.. దొరికాక పట్టుబడ్డ వారి పేర్లలో డాక్టర్ పేరు తప్పించేందుకు శరణు కోరేలా చేశారనే ప్రచారం జరిగింది. అనుకున్నట్టే.. ఎన్నికల ముందు హడావుడిగా కన్పించిన దానేటి శ్రీధర్ తర్వాత పదవుల విషయంలో పోటీపడ్డ పరిస్థితులు కన్పించలేదు. అందుకు తగ్గట్టుగానే ఆయనకు ఏ పదవీ రాలేదు. తాజాగా పాండ్రంకి శంకర్ బ్రదర్స్.. శ్రీకాకుళం నగర టీడీపీలో ప్రముఖ నాయకులుగా పాండ్రంకి శంకర్ బ్రదర్స్ ఉన్నారు. పట్టణ టీడీపీ అధ్యక్ష పదవిని శంకర్ ఆశిస్తున్నారు. దాదాపు వారికే ఖరారు అవుతుందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ సమయంలో ఆ పార్టీలో వారే టార్గెట్ చేసి దెబ్బకొట్టారన్న ప్రచారం నడుస్తోంది. ఆయనకున్న పేకాట బలహీనతపై గురి పెట్టి అదను చూసి కొట్టారు. జిల్లా కేంద్రంలోని టౌన్ హాల్ సమీపంలో ఉన్న పాండ్రంకి శంకర్ అపార్ట్మెంట్లో పేకాడుతూ పలువురు పట్టుబడ్డారు. వారిలో పాండ్రంకి శంకర్, ఆయన సోదరుడు దేవేంద్రనాయుడు, ఆమదావలస టీడీపీ నాయకుడు పరధామ విజయ్రామ్తో పాటు మరొకరు ఉన్నారు. పార్టీలోని ప్రత్యర్థులే అక్కడ పేకాట ఆడుతున్న సమాచారమిచ్చి పట్టించారన్న వాదనలు ఉన్నాయి. పేకాటలో దొరికిపోయే వ్యక్తికి పట్టణ అధ్యక్ష పదవి ఇస్తే ఇబ్బందికరమన్న సమీకరణాలు తెచ్చి ఎలిమినేట్ చేయడమే అంతర్గత ప్రత్యర్థుల వ్యూహమని తెలుస్తోంది. సోదరుడు దేవేంద్రనాయుడుకు నగరంలోని ఓ దేవాలయం ట్రస్టుబోర్డు చైర్మన్ ఇస్తారన్న ప్రచారం నేపథ్యంలో అతన్ని కూడా టార్గెట్ చేసినట్టు తెలిసింది. రేసులో అర డజనుకు పైగా.. అధికారంలో ఉండటంతో నగర అధ్యక్ష పదవి కోసం టీడీపీలో పోటీ ఎక్కువైంది. అధికారిక పదవి కాకపోయినా పార్టీ పదవితో చక్రం తిప్పొచ్చన్న ఉద్దేశంతో అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత నగర పార్టీ అధ్యక్షుడు మాదారాపు వెంకటేష్, ఎన్నికల ముందు టీడీపీలో చేరిన అంధవరపు సంతోష్, తాజాగా పేకాటలో పట్టుబడ్డ పాండ్రంకి శంకర్, కోరాడ హరిగోపాల్, ఉంగటి వెంకట రమణ, గిరిజా శంకర్, ఇప్పిలి తిరుమలరావు రేసులో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. మళ్లీ తనకే వస్తుందని మాదారాపు వెంకటేష్ ధీమాగా ఉన్నా.. ఎన్నికలకు ముందు ప్రస్తుత ఎమ్మెల్యే గొండు శంకర్తో స్థానిక రెల్లి వీధి దగ్గర ప్రధాన రహదారిలో గొడవ పడ్డారు. ఆ ఘటన గొండు శంకర్కు ఘోర అవమానంగానే చెప్పవచ్చు. తర్వాత ఎమ్మెల్యేతో సన్నిహితంగా ఉంటున్నా.. గతాన్ని గుర్తు చేసుకుని వెంకటేష్ను పక్కన పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక, పాండ్రంకి శంకర్కు ఎమ్మెల్యేతో సత్సంబంధాలు ఉండటంతో దాదాపు ఆయనకే ఖరారు అవుతుందన్న ప్రచారం ఉంది. వరం ఫ్యామిలీ కూడా ప్రస్తుతానికి కార్పొరేషన్ ఎన్నికలు లేకపోవడంతో కనీసం పట్టణ అధ్యక్ష పదవి వస్తుందేమో అన్న ఆశతో ఉన్నారు. ఇక, సీనియర్ నాయకులుగా ఉన్న కోరాడ హరిగోపాల్, ఉంగటి వెంకటరమణ, గిరిజా శంకర్, ఇప్పిలి తిరుపతిరావు వంటి తమదైన శైలిలో ప్రయత్నిస్తున్నారు. అదును చూసి.. రేసులో ఉన్న వారికి మంత్రులు, ఎమ్మెల్యే అండ ఎవరికి ఉందో తెలియదు గాని పాండ్రంకి శంకర్ను మాత్రం అదును చూసి పేకాట బాగోతంలో పట్టుబడేలా చేశారు. వాస్తవంగా నగరంలో అనేక చోట్ల పేకాట శిబిరాలు నడుస్తున్నాయి. ఆడుతున్న వారిలో టీడీపీ ప్రముఖులతో పాటు ఇతర ప్రముఖులు ఉన్నారు. గూనపాలెంకు చెందిన ఓ నాయకుడు ఆధ్వర్యంలో, మహిళా కళాశాల రోడ్డులో ఒక అపార్ట్మెంట్లో ఎన్నికల ముందు టీడీపీలో చేరిన వారి ఆధ్వర్యంలో, మరికొన్నిచోట్ల పేకాట శిబిరాలు నడుస్తున్నాయి. వారంతా పకడ్బందీగా శిబిరాలు నిర్వహిస్తున్నారు. -
పీజీ సెట్ ఫలితాల్లో టెక్కలి విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్
టెక్కలి: రాష్ట్రవ్యాప్తంగా బుధవారం విడుదలైన పీజీ సెట్ ఫలితాల్లో టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన తియాలు హారిక బోటనీ విభాగంలో మొదటి ర్యాంకు సాధించింది. ఒడిశా పర్లాకిమిడి సమీపంలో రామసాగరం గ్రామానికి చెందిన ధనుంజయరావు, శాంతి దంపతుల కుమార్తె హారిక టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇటీవలే డిగ్రీ పూర్తి చేసింది. తాజాగా వెలువడిన ఫలితాల్లో మొదటి ర్యాంకు రావడం పట్ల ప్రిన్సిపాల్ టి.గోవిందమ్మ, అధ్యాపకుడు డి.వాసుబాబు, కళాశాల సిబ్బంది అభినందించారు.జనావాసాల్లోకి జింక సరుబుజ్జిలి: అటవీ ప్రాంతం కుచించుకుపోవడంతో జంతువులు మైదాన ప్రాంతాల బాటపడుతున్నాయి. బుధవారం సరుబుజ్జిలి మండలం మర్రిపాడు గ్రామం వైపు జింక రావడంతో స్థానిక వ్యక్తి వెంబడించాడు. దీంతో సమీపంలోని సవళాపురం జంక్షన్ వద్ద బురిడివలస కాలనీలో ఓ ఇంట్లోకి చొరబడింది. సమాచారం అందుకున్న అటవీసెక్షన్ అధికారి సాయిరాం సిబ్బందితో వచ్చి జింకను చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం సీతంపేట మండలం ఓండ్రుజ్వాల వద్ద విడిచిపెట్టారు.కలెక్టర్ను కలిసిన ఎల్డీఎంశ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎం.శ్రీనివాసరావు బుధవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్తో మాట్లాడుతూ లక్ష్యాలను చేరుకుని రైతులకు,ప్రజలకు సకాలంలో రుణాల అందిస్తామని తెలిపారు.నేడు జిల్లాస్థాయి ఫెన్సింగ్ ఎంపిక పోటీలుశ్రీకాకుళం న్యూకాలనీ : జిల్లా స్థాయి చైల్డ్ అండ్ మినీ ఫెన్సింగ్ ఎంపిక పోటీలు గురువారం నిర్వహిస్తున్నట్టు జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బలభద్రుని రాజా ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం టౌన్ హాల్ వేదికగా అండర్–10, అండర్–12 విభాగాలలో బాలురు, బాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక్కడ ఎంపికై న క్రీడాకారులను ఈ నెల 29న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించే ఏపీ రాష్ట్రస్థాయి పోటీలకి పంపిస్తామన్నారు. వ్యక్తిగత ఫెన్సింగ్ కిట్, జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డుతో హాజరుకావాలని సూచించారు. వివరాలకు ఫెన్సింగ్ ఎన్ఐఎస్ కోచ్ జోగిపాటి వంశీ(సెల్: 7660874844)ను సంప్రదించాలని కోరారు. -
ఐవీఆర్ఎస్ పర్సంటేజ్ తగ్గుదలపై క్షేత్ర పరిశీలన
కవిటి: గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాల అమలు తీరుపై గ్రామీణాభివృద్ధిశాఖ నిర్వహిస్తున్న ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం(ఐవీఆర్ఎస్) ఫోన్కాల్స్ శాతం తగ్గుదలపై రాష్ట్ర కమిషనరేట్ వివరణ కోరిందని శ్రీకాకుళం జెడ్పీ సీఈవో ఎల్ఎంవీ శ్రీధర్రాజా తెలియజేశారు. ఈ మేరకు బొరివంక సచివాలయం పరిధిలో బుధవారం ఆకస్మికంగా క్షేత్ర పర్యటన చేశారు. స్థానిక ప్రజలకు వచ్చే కాల్స్ శాతం జిల్లా సగటుకన్నా బాగా తక్కువగా నమోదు కావడంపై ప్రజలతో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయనకు ఆసక్తికరమైన విషయాలు ప్రజలు తెలిపారు. ఫోన్కాల్స్ తీసుకుని స్పందించడానికి తమకు అటువంటి కాల్స్ రాలేదన్నారు. అంతేకాకుండా నెటవర్క్ సమస్యలు అధికంగా ఉన్నాయని వెల్లడించారు. మండలంలోని ఐదు సచివాలయాలు ఐవీఆర్ఎస్కు అనుసంధానం చేశామని డిప్యూటీ ఎంపీడీవో అబ్ధుల్ ఖాన్ అన్నారు. అనంతరం బొరివంక, ఇద్దివానిపాలెంలో ఇంటింటికీ శ్రీధర్రాజా వెళ్లి ఐవీఆర్ఎస్ కాల్స్కు స్పందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాలని ఉద్యోగులకు సూచించారు. సమావేశంలో ఎంపీడీవో కె.శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ శ్రీరాంప్రసాద్, ఎంపీటీసీ దుద్ది సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయ కక్ష సాధింపు..?
● కోమర్తి సర్పంచ్ బంధువుల రేకుల షెడ్డు, గడ్డికుప్ప తొలగింపు ● రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నా పట్టించుకోని రెవెన్యూ సిబ్బంది నరసన్నపేట: మండలంలోని కోమర్తి పంచాయతీ సర్పంచ్ ఉంగటి చిన్నమ్ముడు అత్త, భర్తలకు చెందిన ఆస్తులను అధికార యంత్రాంగం బుధవారం తొలగించింది. గ్రామస్తులు ఫిర్యాదు చేశారనే నెపంతో రేకుల షెడ్డు, గడ్డికుప్పను తొలగించారు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయని, గడిచిన 60 ఏళ్లుగా తమ తాతల నుంచి ఈ స్థలాన్ని అనుభవిస్తున్నామని చూపించినా రెవెన్యూ సిబ్బంది పట్టించుకోలేదు. దీనికి కూటమికి చెందిన నాయకుల ఒత్తిడే దీనికి కారణమని సర్పంచ్ చిన్నమ్ముడు, ఆమె భర్త ఉంగటి రాజేశ్వరరావు, సర్పంచ్ అత్త ఉంగటి అప్పమ్మలు అన్నారు. రాజకీయ కక్షతోనే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ స్థలానికి సంబంధించి రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నాయని, హద్దులు సక్రమంగా ఉన్నప్పటికీ ఇది ప్రభుత్వ భూమి అని తప్పుడు కొలతలు వేసి షెడ్డు తొలగించారని ఆరోపించారు. గడ్డికుప్ప వేసిన స్థలం కూడా తమదేనని వాపోయారు. కొంతమంది ప్రోద్బలంతో ఈ చర్యకు రెవెన్యూ సిబ్బంది పాల్పడ్డారని ఆవేదన చెందారు. దీనికి సంబంధించి ఆర్ఐ సాయిరాం మాట్లాడుతూ ఈ స్థలం కోమర్తిలోని ఎస్సీల కాలనీ కోసం ప్రభుత్వం సేకరించిన స్థలంగా రికార్డుల్లో ఉందని, దీనిపై గ్రామస్తుల నుంచి ఫిర్యాదులు రాగా పరిశీలించి నోటీసులు ఇచ్చి తొలగించామని తెలిపారు. -
కొద్దిరోజుల్లోనే ప్రారంభిస్తాం
భవనం ప్రారంభంలో జాప్యం వాస్తవమే. విద్యుత్ సౌకర్యం లేకపోవడం, చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుకు ముందు వచ్చిన నిధులు సరిపోకపోవడంతో మళ్లీ అంచనా వ్యయం నివేదికను సంబంధిత విద్యుత్ శాఖను సమన్వయం చేసుకుని ప్రభుత్వానికి పంపాం. మార్చిలో మంజూరైన నిధులపై సంబంధిత విద్యుత్ శాఖ ఏఈకి లెటర్ పెట్టాం. వారు ఏపీఎంఐఎస్డీకి సబ్మిట్ చేశారు. ఈనెల 20న హెల్త్ మినిస్టర్ విశాఖలోని జాయింట్ డైరెక్టర్ కార్యాలయంతో పాటు వర్చువల్గా ప్రారంభించాల్సి ఉన్నా, యోగాంధ్ర కార్యక్రమంతో వాయిదా పడింది. త్వరలోనే ప్రారంభిస్తాం. – చంద్రరావు, డ్రగ్ కంట్రోలర్ ఏడీ అండ్ ఇన్చార్జి ఇన్స్పెక్టర్, శ్రీకాకుళం -
వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: రెవెన్యూ విభాగంలో కిందిస్థాయిలో ఉన్న గ్రామ రెవెన్యూ సహాయకులను అధికారులు, ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని, వారి జాబ్చార్టులో లేని పనులు అప్పగించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఈ రకమైన సమస్యలు పరిష్కరించాలని గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు అల్లు సత్యనారాయణ కోరారు. ఈ మేరకు గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం అధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద బుధవారం ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుండ్కర్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ.. వీఆర్ఎలకు నైట్ డ్యూటీలు రద్దు చేయాలని, పేస్కేలు అమలు చేయాలని విన్నవించారు. నామినీలను వీఆర్ఏలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా నేటికీ తమకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిర్లక్ష వైఖరి ప్రదర్శిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్ఏల సమస్యలు పరిష్కరించకుండా మంచి ప్రభుత్వం ఎలా అవుతుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కనీస వేతనం అమలు చేయాలి వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టి.త్రినాథరావు, కె.రమణమూర్తిలు మాట్లాడుతూ పార్ట్ టైం పేరుతో ఫుల్ టైం సేవలను ప్రభుత్వం ఉపయోగించుకుంటోందన్నారు. అయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం లేదని, కనీస వేతనం అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 15 సంవత్సరాలుగా నామినీలుగా పనిచేస్తున్న వారితో సేవలను చేయించుకున్నప్పటికీ వీఆర్ఏలుగా గుర్తించకుండా వెట్టి చాకిరి చేయిస్తోందన్నారు. వారిని వెంటనే వీఆర్ఏలుగా గుర్తించాలని, డీఏతో కూడిన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీఆర్వో, అటెండర్, వాచ్మెన్, డ్రైవర్ మొదలగు ఖాళీల్లో ప్రమోషన్లు 70 శాతం వీఆర్ఏలకు కేటాయించాలని, చట్ట విరుద్ధంగా చేయిస్తున్న నైట్ డ్యూటీలను ఆపాలని కోరారు. కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన సంఘ నాయుకులు, వీఆర్ఏలు కె.అప్పారావు, బి.రాములమ్మ, ఎన్.సీతప్పడు, జి.రామ్మూర్తి, లక్ష్మణరావు, జనార్ధనరావు, బి.అప్పారావు, మీనాక్షి, రాజులమ్మ, పద్మ, ఎం.రాము, లోకనాథం, ఈశ్వరరావు, పోతయ్య, దాలప్పుడు తదితరులు పాల్గొన్నారు. -
రైలు నుంచి జారిపడి వ్యక్తికి గాయాలు
టెక్కలి రూరల్: స్థానిక ఎన్టీఆర్ కాలనీకి చెందిన ఎం.వెంకటరమణ అనే తాపీమేస్త్రి మంగళవారం ఉదయం రైలు నుంచి జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. పర్లాఖిమిడి నుంచి టెక్కలి వచ్చేందుకు గుణ్పూర్–పూరీ పాసింజర్ రైలులో వస్తుండగా లింగాలవలస సమీపంలోని లక్ష్మీపురం వద్ద ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు 108లో టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్కు తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు వివరాలు సేకరించారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి కంచిలి: సోంపేట రైల్వేస్టేషన్ ఆవరణలో రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పలాస జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు నలుపు టీషర్టు, నీలం జీన్స్ ఫ్యాంట్ ధరించాడని, సుమారు 50 నుంచి 55 ఏళ్ల వయస్సు ఉండవచ్చని పలాస జీఆర్పీ హెచ్సీ ఎం.సోమేశ్వరరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామని, వివరాలు తెలిసిన వారు పలాస జీఆర్పీ స్టేషన్లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈలకు వర్క్షాపు రేపు శ్రీకాకుళం (పీఎన్కాలనీ): యువతకు స్వయం ఉపాధి అవకాశాలను పరిచయం చేసేందుకు జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో జూన్ 26న ఉదయం 10.30 గంటలకు నరసన్నపేటలోని శ్రీరామ సత్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలోని ఫంక్షన్ హాలులో అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. డీఐసీ, ఏపీఎస్ఎఫ్సీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ వర్క్షాప్లో పారిశ్రామిక ప్రోత్సాహకాలు, వివిధ పాలసీలు, ప్రభుత్వ పథకాలపై సంపూర్ణ వివరాలు అందించనున్నట్లు జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీధర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ప్రారంభించాలనుకునే ఔత్సాహికులకు ఈ వర్క్షాప్ ఉపయుక్తంగా ఉంటుందని, కార్యక్రమంలో ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలతో హాజరైన వారు ఉచితంగా రిజిస్ట్రేషన్ పొందవచ్చని, ఈ అవకాశాన్ని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వినియోగించుకోవాలని శ్రీధర్ కోరారు. పోయిన డబ్బులు తిరిగొచ్చాయి! శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం నగరానికి చెందిన సూరపు కృష్ణవేణి అనే సీనియర్ సిటిజన్ తన బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.3లక్షలు పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాలో జమ చేసేందుకు బ్యాంక్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయించారు. సాంకేతిక కారణాలతో ఆ నగదు చిత్తూరుకు చెందిన ఓ వ్యక్తి అకౌంట్లో జమయ్యింది. విషయం తెలుసుకున్న శ్రీకాకుళం హెడ్ పోస్టాఫీస్ అధికారులు, డివిజనల్ ఆఫీస్ అధికారులు సకాలంలో స్పందించి సీఈపీటీ ద్వారా ఆ నగదును కృష్ణవేణి అకౌంట్లోకి తిరిగి జమ చేయించారు. పోయిన డబ్బులు తిరిగి వచ్చినందుకు ఖాతాదారు మంగళవారం పోస్టల్ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో హెడ్ పోస్టాఫీస్ పోస్ట్మాస్టర్ పడాల రంగారావు, అసిస్టెంట్ పోస్ట్మాస్టర్ నూలు భానోజీరావు పాల్గొన్నారు. -
పరిహారం కోసం.. ఎన్నాళ్లీ ఎదురుచూపులు?
మెళియాపుట్టి : జిల్లా అభివృద్ధిలో భాగంగా భూములు, ఇళ్లు, గ్రామాలను సైతం త్యాగం చేసిన నిర్వాసితులు నేడు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమకు పూర్తిస్థాయిలో పరిహారం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నా ప్రభుత్వం నుంచి కనీస స్పందన కరువైంది. కుటుంబాలతో కలిసి నెల రోజులకు పైగా నిరాహార దీక్షలు చేస్తున్నా కూటమి పాలకులు గానీ, అధికారులు గానీ పట్టించుకోకపోవడంతో నిర్వాసితుల్లో ఆగ్రహం కట్టలుతెంచుకుంటోంది. పలాస మండలం రేగులపాడు వద్ద దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన ఆఫ్షోర్ ప్రాజెక్టు కోసం సరిహద్దులో ఉన్న మెళియాపుట్టి మండలంలోని చీపురుపల్లి, దాసుపురం, సవర చీపురుపల్లి గ్రామాల నిర్వాసితులు సర్వం త్యాగం చేశారు. వీరితో పాటు టెక్కలి, నందిగాం మండలాలకు చెందిన పలు గ్రామాల నిర్వాసితులకు న్యాయపరంగా ప్యాకేజీలు అందించాల్సి ఉన్నా పాలకులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. పాలకులు మారుతున్నా తమకు న్యాయం జరగకపోవడంతో ఈ ఏడాది మే 22న మెళియాపుట్టి మండలం చీపురుపల్లిలో అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరాహార దీక్షలు చేపట్టారు. నేటికి 33 రోజులైనా స్పందించే వారే కరువయ్యారని నిర్వాసితులు వాపోతున్నారు. ఎన్నాళ్లో ఈ ఎదురుచూపులు.. ఈ ప్రాంతంలో అర్హులైన 132 మందికి నేటికీ పరిహారాలు అందలేదు. గ్రామంలో 14.55 ఎకరాల డి–పట్టా భూములకు సైతం పరిహారం చెల్లించలేదు. అంతేకాకుండా సుమారు 240 మంది యువతకు యూత్ ప్యాకేజీలు అందాల్సి ఉంది. 360 కుటుంబాలకు 5 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. హిరమండలం నిర్వాసితులకు జీవో 460 ప్రకారం పూర్తిస్థాయి ప్యాకేజీలు ఇవ్వాల్సి ఉన్నా చెల్లింపుల్లో తేడాలు జరిగాయని, వాటిని సవరించి ఇళ్లకు సంబంధించి పరిహారం ఇవ్వాలని గ్రామానికి చెందిన యవ్వారి ఈశ్వరరావు, నందిగాం జగన్నాయకులు, గుమ్మడి మల్లేసు, నందిగాం హేమలత, చిన్నమ్మి, కొక్కిరి కిరణ్, ఉమాశంకర్, వెంకటరమణ తదితరులు డిమాండ్ చేస్తున్నారు. పాలకుల స్పందన కరువు.. పరిహారం విషయమై నిర్వాసిత గ్రామాల్లో ద్విచక్ర వాహనాలతో ర్యాలీ చేపట్టారు. తహసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అధికారులకు వినతిపత్రం అందజేశారు. టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సైతం నిరాహార దీక్షా శిబిరాన్ని సందర్శించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ వారి సమస్యలు పరిష్కారం కాలేదని నిర్వాసిత కుటుంబీకులు చెబుతున్నారు. ఇప్పటికై నా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు స్పందించి న్యాయం చేయకపోతే పోరాటాలు మరింత ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఆఫ్షోర్ నిర్వాసితులపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం 33 రోజులుగా దీక్షలు చేస్తున్న మెళియాపుట్టి మండల నిర్వాసితులు పరిహారానికి నోచుకోని 132 కుటుంబాలు 240 మందికి అందని యూత్ ప్యాకేజీలు వలస కూలీనంటూ.. ఇద్దరు పిల్లలతో కలిసి కాలం వెల్లదీస్తున్నాను. వలస కూలీ గా ఉన్నానంటూ అధికారుల తప్పుగా నమోదు చేయడంతో ఒక్క రూపాయి కూడా పరిహారం అందలేదు. పరిహారం కోసం అధికారులు, నాయకులకు ఎన్నిసార్లు విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా స్పందించి పరిహారం ఇప్పించాలి. – ఇప్పిలి వరలక్ష్మి, చీపురుపల్లి, మెళియాపుట్టి మండలం ఎలా బతకాలి? ప్రాజెక్టు కోసం సర్వస్వం త్యాగం చేసి గ్రామాలను విడిచి బయట బతుకుతున్నాం. నా కుటుంబానికి ఒక్కపైసా ప్యాకేజీ రాలేదు. నాకు ముగ్గురు పిల్లలు. నిర్వాసితుడినైనా పరిహారానికి నోచుకోలేదు. ఇలాగైతే ఎలా బతకాలి? న్యాయం కోసం దీక్షలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. – నందిగాం భాస్కరరావు, చీపురుపల్లి, మెళియాపుట్టి మండలం -
సచివాలయ ఉద్యోగుల నిరసన
రణస్థలం: గ్రామ సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం రణస్థలంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ సచివాలయ ఉద్యోగుల బదిలీలు, రేషనలైజేషన్కు సంబంధించిన జీఓ 5 పునఃపరిశీలించి సొంత మండలాల్లోనే పోస్టింగులు ఇచ్చేలా మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి చేశాకే బదిలీలు చేపట్టాలన్నారు. మిగులు ఉద్యోగులను ఎక్కడ నియమిస్తారో స్పష్టత ఇవ్వాలని కోరారు. సచివాలయ ఉద్యోగులందరికి ప్రమోషన్ చానల్ కల్పించాక రేషనలైజేషన్ ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు. జాయినింగ్ తేదీ నుంచి సర్వీసును పరిగణనలోకి తీసుకుని రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరారు. ఆలస్యంగా ప్రొహిబిషన్ ప్రకటించినందుకు తొమ్మిది నెలల ఎరియర్స్ మంజూరు చేయాలన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడులు వీరికి సంఘీభావం తెలిపారు. అనంతరం ఎంపీడీవో ఎం.ఈశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. -
హత్య కేసులో నిందితుడు అరెస్టు
ఇచ్ఛాపురం టౌన్ : మండపల్లి గ్రామంలో ఈ నెల17న జరిగిన బర్రి గంగయ్య హత్య కేసులో నిందితుడు పాతిర్ల దాశరథిరెడ్డి(దాసు)ని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇచ్ఛాపురం సీఐ చిన్నమనాయుడు విలేకరులకు వివరాలు వెల్లడించారు. మండపల్లికి చెందిన బర్రి గంగయ్య కుమార్తె డిల్లమ్మకు అదే గ్రామానికి చెందిన పాతిర్ల దాశరథి రెడ్డితో 2014లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. దాశరది మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో పిల్లలతో కలిసి భార్య కన్నవారింటికి వెళ్లిపోయింది. ఈసారి సక్రమంగా చూసుకుంటానని, డ్యూటీకి వెళ్లేందుకు బైక్ కావాలని చెప్పగా భార్య డ్వాక్రా సంఘంలో రూ.ఐదు వేలు అప్పుచేసి ఇచ్చింది. మళ్లీ ఎప్పటిలాగే మద్యానికి బానిసై భార్యాపిల్లలను పట్టించుకోకపోవడంతో డిల్లమ్మ మరలా పుట్టింటికి వెళ్లిపోయింది. ఏడాదిగా కన్నవారింటిలో డిల్లమ్మ ఉండటంతో దాశరథి తన మామ గంగయ్యతో ఈ నెల 17న గొడవకు దిగాడు. అనంతరం గంగయ్య సైకిల్పై వెళ్తుండగా గ్రామ సచివాలయం సమీపంలో కత్తితో పొడిచి పరారయ్యాడు. గంగయ్య మృతి చెందడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టి మంగళవారం లోద్దపుట్టి సమీపంలో దాశరథిని అరెస్టు చేశారు. -
కలెక్టర్, ఎస్పీలకు ప్రశంసలు
శ్రీకాకుళం పాతబస్టాండ్ : సముద్ర తీరప్రాంత గ్రామమైన పెద్దగనగళ్లవానిపేటలో ఈ నెల 3న నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆరు వేల మందికిపైగా మత్స్యకారులు పాల్గొని యోగాసనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదైంది. ఈ నేపథ్యంలో విజయవాడలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డిలను అభినందించారు. తెల్లదోమ నివారణకు చర్యలు తీసుకోవాలి శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉద్దానంలో కొబ్బరి పంటలో వ్యాప్తి చెందిన తెల్ల దోమ నివారణకు చర్యలు తీసుకోవాలని జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ పూడి కిరణ్కుమార్ మంగళవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ను కలిసి వినతిపత్రం అందించారు. కవిటి, కంచిలి, సోంపేట, ఇచ్ఛాపురం, వజ్రపుకొత్తూరు, పలాస, మందస మండలాల్లో తెల్లదోమ వల్ల కొబ్బరిపంట దిగుబడి తగ్గి రైతులు పూర్తిగా నష్టపోతున్నారని చెప్పారు. వీటిపై పరిశోధన చేయించి ఉద్దాన ప్రాంత రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెల్లదోమపై ప్రభుత్వం డ్రోన్ ద్వారా మందులు చల్లాలని విన్నవించారు. బంగారమ్మ తల్లి హుండీలో చోరీ ఎల్.ఎన్.పేట : లక్ష్మీనర్సుపేట వద్ద వంశధార నదీ తీరంలో ఉన్న బంగారమ్మ తల్లి ఆలయంలో హుండీ చోరీకి గురైంది. సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హుండీని ధ్వంసం చేసి నగదు, కానుకలు దొంగిలించుకుపోయారని సర్పంచ్ ముగడ దివాకరనాయుడు తెలిపారు. మంగళవారం ఉదయం భక్తులు ఆలయానికి వెళ్లేసరికి చోరీ జరిగినట్లు గుర్తించడంతో సరుబుజ్జిలి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. -
జాబ్మేళాకు విశేష స్పందన
శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ (అటానమస్)కళాశాలలో నిర్వహించిన జాబ్మేళాలో 189 మంది అభ్యర్థులు వివిధ కంపెనీలకు ఎంపికయ్యారు. కళాశాలలో నోడల రిసోర్స్ సెంటర్, జవహర్ నాలెడ్జ్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో కెరీర్ సొల్యూషన్స్ సంస్థ నిర్వహించిన ఈ జాబ్మేళాకు జిల్లా నలుమూలల నుంచి 298 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వివిధ పరీక్షల అనంతరం 189 మందిని ఎంపిక చేసినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ కింతలి సూర్యచంద్రరావు తెలిపారు. కార్యక్రమంలో జేకేసీ కో–ఆర్డినేటర్ శ్రీలక్ష్మి, కెరీర్ సొల్యూషన్స్ మేనేజర్ ప్రేమ్కుమార్, డాక్టర్ ఎస్.వాణికుమారి, డాక్టర్ ఎన్.రామకృష్ణ, అధ్యాపకులు పాల్గొన్నారు. -
ప్రత్యేక రైలు సౌకర్యం కల్పించాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): విజయవాడలో రాష్ట్ర సచివాలయం ఉన్నందున శ్రీకాకుళం జిల్లా ప్రజలు రాకపోకలు చేసేందుకు ఇచ్ఛాపురం నుంచి విజయవాడకు ప్రత్యేక రైలు సౌకర్యం కల్పించాలని ఈస్ట్కోస్ట్ రైల్వే సలహా మండలి బోర్డు సభ్యుడు డాక్టర్ బుడుమూరు రాజేష్ కోరారు. విశాఖపట్నం డివిజనల్ రైల్వే మేనేజర్తో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ శ్రీకాకుళంలో రాత్రి బయలుదేరి విజయవాడలో ఉదయం దిగేలా, తిరిగి విజయవాడలో రాత్రి బయలుదేరి ఇచ్ఛాపురం ఉదయం చేరుకునేలా సౌకర్యం కల్పించాలని విన్నవించారు. దీనికి డివిజనల్ మేనేజర్ అంగీకరించినట్లు తెలిపారు. -
జనశక్తి నేత సాంబశివరావు మృతికి సంతాపం
పలాస: బొడ్డపాడులో నివాసముంటున్న సి.పి.ఐ.ఎం.ఎల్ (జనశక్తి) పార్టీ నాయకుడు మారెళ్ల సాంబశివరావు(70) అనారోగ్యంతో మృతిచెందారు. మంగళవారం విప్లవ సంప్రదాయం ప్రకారం భౌతికకాయంపై ఎర్రజెండాను కప్పి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. అనంతరం బొడ్డపాడు కాలనీలోని స్వగృహం వద్దే సంతాప సభను నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సాంబశివరావు ఆర్టీసీలో మెకానిక్గా పనిచేసి విప్లవోద్యమానికి ఆకర్షితుడై ఉద్యమ అవసరాల కోసం బొడ్డపాడు చేరుకున్నారని, గ్రామానికి చెందిన పి.రాజేశ్వరిని వివాహం చేసుకొని ఇక్కడే స్థిరపడ్డారని తెలిపారు. ఉమ్మడి జనశక్తిపార్టీ, అనంతరం సి.పి.ఐ.ఎం.ఎల్ న్యూడెమొక్రసీ పార్టీలో పనిచేసిన సాంబశివరావు కొద్దిరోజులు పాతపట్నంలో జైలు జీవితం అనుభవించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు తామాడ సన్యాసిరావు, పోతనపల్లి కుసుమ, మద్దిల రామారావు, రాపాక చిరంజీవి, కుత్తుం దుష్యంతు, పోతనపల్లి మురళి, కోనేరు గురయ్య, మురిపింటి గంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఏఓబీలో సారా స్థావరాలపై దాడులు
● 1,520 లీటర్ల సారా స్వాధీనం పాతపట్నం: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో అక్రమంగా నిర్వహిస్తున్న సారా తయారీ స్థావరాలపై ఆంధ్ర, ఒడిశా ఎకై ్సజ్ అధికారులు సంయుక్తంగా మంగళవారం దాడులు నిర్వహించారు. పాతపట్నం, మెళియాపుట్టి, కొత్తూరు మండలాలకు ఆనుకుని ఉన్న ఒడిశా గ్రామాలైన శిరడా, గురిసింగిగూడ, కొత్తగూడ, దిద్దిన గూడ, తమిళగూడ పరిసరాల్లో 1,520 లీటర్ల సారా, 7,700 లీటర్ల బెల్లం ఊటలను గుర్తించి ధ్వంసం చేశారు. తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. సారా తయారీ, విక్రయాలు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని పాతపట్నం ఎకై ్సజ్ సీఐ కోట కృష్ణారావు హెచ్చరించారు. ఈ దాడుల్లో గజపతి జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ప్రదీప్ కుమార్ సాహూ, ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ ఎం.శ్రీనివాసరావు, పాతపట్నం, కొత్తూరు, పలాస, శ్రీకాకుళం, పలాస టాస్క్ఫోర్స్ ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు. -
పూరీ రథయాత్రకు ప్రత్యేక రైళ్లు
పూరీలో నిర్వహించనున్న జగన్నాథ స్వామి రథయాత్రకు శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) మీదుగా ప్రత్యేక రైళ్లు నడిపించేందుకు రైల్వే అధికారులు చర్యలు చేపట్టినట్లు శ్రీకాకుళం రోడ్ రైల్వే అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27వ తేదీన 08445 నంబర్ గల రైలు జగదల్పూర్ నుంచి పూరీ వరకు ప్రయాణించనుంది. ఈ రైలు విజయనగరం మీదుగా శ్రీకాకుళం రోడ్ను కలుపుకుంటూ ప్రయాణిస్తుందని తెలిపారు. మళ్లీ 28వతేదీన పూరీలో బయల్దేరి 08446 నంబర్గల విశాఖప ట్నం–పూరీ– విశాఖపట్నం రైలు శ్రీకాకుళం మీదుగా ప్రయాణిస్తుందని పేర్కొన్నారు. అలాగే జూన్ 27, 28, జూలై 5, 6 తేదీల్లో 08314 నంబరు గల ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ రైలు శ్రీకాకుళం రోడ్ (ఆమదాలవలస)కు ఉదయం 2.51 గంటలకు చేరనుందని తెలిపారు. ఈ రైలు కోటబొమ్మాళి, పలాస, మందస, సోంపేట, ఇచ్చాపురం స్టేషన్లలో ఆగుతుందని వివరించారు. –ఆమదాలవలస -
ఇలా అయితే పిల్లల్ని పంపించం
మండల కేంద్రంలోని నందికొండ కాలనీ ప్రాథమిక పాఠఽశాలలో 42 మంది విద్యార్థులు ఉన్నారు. ముగ్గురు ఉపాధ్యాయుల్లో ఒకరిని అకారణంగా బదిలీ చేశారని, మళ్లీ ఉపాధ్యాయుడిని నియమించే వరకు తమ పిల్లల్ని పాఠశాలకు పంపించబోమని పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ మండ సుదర్శనరావు తెలిపారు. ఈ మేరకు విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి మంగళవారం మండల విద్యాశాఖ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. విద్యార్థులు అధికంగా ఉన్నచోట ఉపాధ్యాయులను తగ్గించి, పిల్లలు లేని చోట్ల నియామకం చేసి విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ఈ తీరు వల్ల పిల్లలు ప్రైవేటు విద్యా సంస్థలకు వెళ్లిపోతున్నారని పేర్కొన్నారు. అధికారులు పునరాలోచన చేసి ఉపాధ్యాయుడిని నియమించేవరకు తమ పిల్లలను పాఠశాలకు పంపింబోమని స్పష్టం చేశారు. అనంతరం ఎంఓఈ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. –సరుబుజ్జిలి -
మహిళల టాయిలెట్కు తాళాలు
జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్యారోగ్య శాఖాధి కారి కార్యాలయంలో మహిళా ఉద్యోగుల అవస్థలు వర్ణణాతీతంగా మారాయి. మరుగుదొడ్లకు ఏకంగా తాళాలను వేసేయడంతో మహిళా ఉద్యోగులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. కారణాలు తెలియకపోగా...కార్యాలయ అధికారులకు పలుమార్లు విన్నవిస్తున్నా...పురుషుల టాయిలెట్లను వినియోగించుకోండని పరుషంగా సమాధానాలు వస్తున్నాయని మహిళలు వాపోతున్నారు. ఇప్పటికై నా డీఎంహెచ్ ఓ కార్యాలయంలో మహిళా టాయిలెట్లకు తాళాలు తీయించాలని మహిళా ఉద్యోగులు కోరుతున్నారు. గ్రౌండ్ ఫ్లోర్, మొదటి ఫ్లోర్లో కూడా ఇదే పరిస్థితి ఉందని, ఎక్కడా మరుగుదొడ్లు వినియోగానికి పనికిరాని విధంగా తయారయ్యాయని, అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. – అరసవల్లి -
● డిగ్రీ 2, 4 సెమిస్టర్ల స్పెషల్ డ్రైవ్ పరీక్షలు ప్రారంభం
ఎచ్చెర్ల: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వ విద్యాలయంలో 2015–18 విద్యా సంవత్సరంలో సీబీఎస్ విధానంలో చదివి డిగ్రీ పూర్తి చేయలేకపోయిన వారికి, 2019లో డిగ్రీలో చేరి ఏవైనా సబ్జెక్ట్లు ఉండిపోయిన సప్లిమెంటరీ విద్యార్థులకు సంబంధించి రెండు, నాలుగు స్పెషల్డ్రైవ్ పరీక్షలను మంగళవారం ప్రారంభించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రతి రోజు జరిగే ఈ పరీక్షలు వచ్చే నెల 7వ తేదీ వరకూ కొనసాగనున్నాయి. వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన పరీక్షలను రెక్టార్ ఆచార్య బి.అడ్డయ్య పరిశీలించారు. -
● జూలై 5న జాతీయ లోక్ అదాలత్
శ్రీకాకుళం పాతబస్టాండ్: జాతీయ లోక్ అదాలత్ను జూలై 5న నిర్వహించనున్నామని, ఇందులో ఎక్కువ కేసులు రాజీ చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా కోర్టు భవనంలో పోలీస్ అధికారులు, ఎకై ్సజ్ అధికారులు, బీమా న్యాయవాదులు, చిట్ఫండ్ కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈసారి కూడా ఎక్కువ కేసులు పోలీసు వారి దగ్గర నుంచి రావాలని కోరారు. కార్యక్రమంలో ఒకటో అదనపు జిల్లా జడ్జి పి.భాస్కర రావు, 3 వ అదనపు జిల్లా జడ్జి వివేక్ ఆనంద్ శ్రీనివాస్, 4 వ అదనపు జిల్లా జడ్జి ఎస్ ఎం ఫణి కుమార్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎం.శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
ముక్కలు.. హైటెక్కులు
ప్రత్యేకత చాటుతున్న టాస్క్ఫోర్స్ ● జిల్లాలో పెరుగుతున్న జూద శిబిరాలు ● ఆన్లైన్ పేమెంట్లతో కొత్త పంథాలో పేకాట శిబిరాలు ● నిర్వాహకులంతా ప్రముఖులే ● ఎప్పటికప్పుడు దాడులు చేస్తున్న పోలీసులు శ్రీకాకుళం క్రైమ్ : అందరూ కలుసుకునేలా ఓ ఇల్లు.. లోపల ఏం జరిగినా రహస్యంగా ఉండేలా ఏర్పాట్లు.. కరెన్సీ నోట్లతో సంబంధం లేకుండా లావాదేవీలు.. బయట వ్యక్తులకు అర్థం కాకుండా ప్రత్యేక సంజ్ఞలతో ఆదేశాలు.. వెరసి సిక్కోలు జూద శిబిరంలా మారుతోంది. పెడ దోవన పట్టొద్దని చెప్పాల్సిన పెద్దలే జిల్లాలో ఈ జూద శిబిరాలు నిర్వహిస్తుండడం గమనార్హం. జిల్లాకేంద్రంలో ఏకంగా రాజకీయ నాయకులే శిబిరాలు నడుపుతుండటం, అదీ తమ తమ నివాసగృహాల్లోనే బంధువులు, సిండికేట్ ముసుగులో నడుపుతుండటం మరింత చర్చనీయాంశంగా మారింది. మొన్నటికి మొన్న ఓ ప్రము ఖ వైద్యుడు, జనసేన నాయకుడు ఎచ్చెర్ల పరిధి గెస్ట్హౌస్లోనే నడుపుతూ దొరికిపోయాడు. నిన్నటికి నిన్న నగరంలో పేరున్న టీడీపీ నాయకుడు మరికొందరితో రెడ్హ్యాండెడ్గా దొరికిపోయారు. వీరే కాక నరసన్నపేట, టెక్కలి, కాశీబుగ్గల్లో సైతం పేరున్న ప్రముఖులే పట్టుబడటంలో ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి నేతృత్వంలోని ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలు గట్టిగా పనిచేస్తున్నాయి. కానీ పోలీసులకు ధీటుగా జూద నిర్వాహకులు సైతం రోజుకో పంథాతో.. ఆశ్చర్యగొలిపే రీతిలో శిబిరాలు నడిపిస్తున్నారు. పంథా మార్చేశారు.. ఇది వరకు పేకాట, ఇతర బెట్టింగ్లకు పాల్పడేవారు శిబిరాలకు వెళ్లేటప్పుడు ద్విచక్ర వాహనాలపై, కార్లపై వెళ్లేవారు. ఇప్పుడలా లేదు. నిర్వాహకులు ముందుగా చెప్పిన ప్రకారం ఓ జంక్షన్ వరకు సింగిల్గా వచ్చేయడం, అక్కడే నిర్వాహకుని అసిస్టెంట్ బైక్తో సిద్ధంగా ఉండి ఒకరిద్దరిని ఎక్కించుకుని వెళ్లి శిబిరంపై డ్రాప్ చేసి వదిలేయడం చేస్తున్నారు. ఇలా ఇద్దరు ముగ్గురు అసిస్టెంట్లు ఉంటారు. వీరికి ఒక్కొక్కరికి రూ.వెయ్యి ఇచ్చేందుకు ఒప్పందం కుదిరి ఉంటుంది. ల్యాప్టాప్లు, ఆండ్రాయిడ్ ఫోన్లు, భారీగా నగదు సైతం పట్టుకెళ్లడం లేదు. పేకాట డెన్లన్నీ మార్చేశారు. ఎవరో ఒకరింటి దగ్గర నిర్వహించుకోవడం మొదలుపెట్టారు. పోలీసులు గట్టిగా అడిగితే నాయకుల పేరు చెప్పి తిరగబడేందుకు కూడా సిద్ధమవుతున్నారు. అయినప్పటికీ పోలీసులు జీపులెక్కిస్తే ప్రసన్నం చేసుకోవడానికి మీరు గ్రేట్ అంటూ తమ నాయకుల సిఫార్సులతో ప్రమోషన్లు, నచ్చిన చోట పోస్టింగులిప్పిస్తామంటూ బేరాలు పెడుతున్నారు. పేకాట ఇంజినీర్లు అనాలేమో.. ● జూదంలో ప్లస్ 10 కేఆర్.. ప్లస్ అంటే ఆటలో గెలిచినట్లు టెన్ అంటే పదివేలు, కేఆర్ అంటే కరాటే రాంబాబుతో. అంటే రూ.పదివేలు కరాటే రాంబాబు నుంచి రావాలని అర్థం. ● మైనస్ 20 డీఎన్ అంటే.. రూ.20 వేలు దట్టి నాగేశ్వరరావుకు ఇవ్వాలని అర్థం. 1/20 అంటే ఒకటో గేమ్లో 20 వేలు రావాలి. ● 3/15 అంటే మూడో గేమ్లో రూ.15 వేలు ఇవ్వాలి.. పక్కనే కృష్ణారావుకి ఇవ్వాలి అంటే కేఆర్ ఆని రాస్తారు. అదే రాంబాబు అంటే ఆర్బీ, కిశోర్ అంటే కేఐ ఇలా.. ఇవన్నీ కీప్యాడ్ మొబైల్ లేదా చిన్న స్లిప్పుల్లో గాని, చిన్న సైజు బుక్కుల్లో లేదంటే చేతులమీద, కాళ్లు, తొడలమీద రాసేస్తుంటారు. ● మొన్న ఆదివారం జలుమూరు, రణస్థలం, గార జొన్నలపాడు, వన్టౌన్ లిమిట్స్లో పోలీసులకు ఇదే పరిస్థితి ఎదురైంది. తక్కువ మొత్తంలో నగదు పట్టుబడటం, ఫోన్లు, ల్యాప్ట్యాప్లు, బళ్లు దొరక్కపోవడం ఒకింత వింతనిపించింది. ఎస్పీ నేతృత్వంలోని స్పెషల్ టాస్క్ఫోర్స్ బృందాలు ఇటీవలి కాలంలో దాదాపు 250 నుంచి 300 వరకు పేకాట, బెట్టింగ్ రైడ్లు చేసి తమ ప్రత్యేకతను చాటుకున్నాయి. స్పష్టమైన సమాచారంతో మాటువేసి ఎంతటివారినైనా వదలిపె ట్టడం లేదు. కానీ ఇలా పట్టుకోవడాలే కాదు అక్కడక్కడా వదిలేయడాలు కూడా గోప్యంగా జ రుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా లో అధికార పార్టీ నాయకులు, విద్యావేత్తలు, ప్ర ముఖుల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు చేస్తే ఊరుకునేది లేదని ఎస్పీ హెచ్చరిస్తున్నారు. -
బడి బయట ఉన్న పిల్లల్ని గుర్తించేలా..
శ్రీకాకుళం న్యూకాలనీ: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు ఎట్టకేలకు ప్రభుత్వం మొద్దునిద్రను వీడింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జూలై 12 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ–సమగ్ర శిక్షా అభియాన్ నిర్ణయించింది. అర్హత కలిగిన 6 నుంచి 14 ఏళ్ల పిల్లలందర్నీ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. డ్రాప్బాక్సులో, బడి బయట ఉండే పిల్లల్ని గుర్తించి వారందరూ బడిలో ఉండేలా చూడాలని తెలిపింది. జిల్లాలో బడి బయట ఉన్న పిల్లల్ని గుర్తించి బడులకు చేరువ చేసేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని సమగ్రశిక్ష ఏపీసీ డాక్టర్ ఎస్.శశిభూషణ్ పేర్కొన్నారు. శ్రీముఖలింగం హుండీ ఆదాయం రూ.3.32 లక్షలు జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో గడిచిన 112 రోజులకు గాను హుండీ ఆదాయం రూ.3,32,883 వచ్చినట్లు ఆలయ ఈఓ పి.ప్రభాకరరావు మంగళవారం తెలిపా రు. పర్యవేక్షణ అధికారి ఆమదాలవలస గ్రూప్ టెంపుల్ అధికారి టి.రవితోపాటు కొమనాపల్లి సత్యసాయి భజన మండలి అధ్యక్షులు పైడి శెట్టి వెంకటరమణ, అర్చకులు వెంకటాచలం,ధనాల స్వామి,భక్తులు పాల్గొన్నారు. ‘ఆ భూములు పేదలకే చెందాలి’ బూర్జ: పేదల సాగులో ఉన్న భూములు పేదలకే చెందాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలో గల అన్నంపేట గ్రామ రెవెన్యూ పరిధిలో గల వ్యవసాయ భూముల ను ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 70 ఏళ్లుగా 25 దళిత, బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలు సాగు చేస్తున్న భూములు వారికే చెందే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు. ఈ ప్రాంతంలో థర్మల్ పవర్ ప్లాంట్ వస్తుందనే పేరుతో విశాఖపట్టణానికి చెందిన మంగపల్లి సూర్యప్రకాశరావు ఇక్కడ ఉన్న నాయకుల అండదండలతో ఈ సాగులో ఉన్న భూములు తొలగించి కోట్ల రూపాయలకు అమ్ముకోడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బాధితులంతా జిల్లా వ్యవసా య కార్మిక సంఘ కార్యదర్శి గంగరాపు సింహాచలంను సంప్రదించడంతో గడచిన నెల రోజుల నుంచి పెద్ద ఎత్తున పోరాటాలు చేసి, ఏరువాక కార్యక్రమం చేపట్టి విత్తనాలు వేశా రు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ కార్మిక సంఘ కార్యదర్శి గంగరాపు సింహాచలం, మండలనాయకులు అప్పలనాయుడు, మామిడి కిరణ్, స్థానికులు, బలహీన వర్గాల ప్రజలు పాల్గొన్నారు. -
సిక్కోలు వాకిట్లో సిండికేట్ల రాజ్యం
తాగు నీరు దొరకని గ్రామాలు ఉన్నాయేమో గానీ మద్యం దొరకని చోటు లేదు... వేల సంఖ్యలో బెల్టు షాప్లు... దర్జాగా లిక్కర్ దందా... ఎవరికి అందాల్సిన మొత్తం వారికి... వాటాలు కుదరనిచోట నెలవారీ ముడుపులు..! సిక్కోలు వాకిట్లో ఇదీ మద్యం సిండికేట్ల రాజ్యం..! మద్యం ద్వారా ఆదాయం ముంచెత్తాలని ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడంతో అధికారులు గేట్లు ఎత్తారు...!శ్రీకాకుళం జిల్లాలో మద్యం షాపుల నిర్వాహకులు, సిండికేట్లు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో షాప్ పరిధిలోని గ్రామాల్లో 10 నుంచి 40 బెల్ట్ షాప్లు ఏర్పాటయ్యాయి. మొత్తంగా 10 వేలపైనే అని అంచనా. ఇవన్నీ బార్లను తలపిస్తున్నాయి. కొన్నిచోట్ల నివాస గృహాలు, చిన్న చిన్న దుకాణాల్లోనూ మద్యం దొరుకుతోంది. క్వార్టర్ బాటిల్పై రూ.30 నుంచి రూ.50 అదనంగా అమ్ముతున్నారు. కొన్నిచోట్ల లైసెన్స్ దుకాణాల కౌంటర్లలోనే రూ.10 నుంచి రూ.20 వరకు ఎక్కువ తీసుకుంటున్నారు. వైన్ షాప్లు, బార్లలో నిర్దేశిత వేళల్లో మద్యం దొరుకుతుంటే బెల్ట్షాపుల్లో 24 గంటలు అందుబాటులో ఉంటోంది. ఇక బార్లలో మాదిరిగా బెల్ట్షాప్లలో ఆహార పదార్థాలు లభ్యమవుతున్నాయి. – సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం⇒ బెల్ట్ షాప్లు, లైసెన్స్ దుకాణాల వద్ద అనధికారికంగా పర్మిట్ రూమ్ల ఏర్పాటుకు, ఎంఆర్పీకి మించి అమ్మకాలకు నాయకులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. తమవంతు సాయం చేసినందుకు షాప్ల యజమానులు, సిండికేట్ల నుంచి ముడుపులు, వాటా తీసుకుంటున్నారు. సిండికేట్ ఏర్పాటైనచోట నేతలు అదనపు వాటా పొందగా, అది లేనిచోట లైసెన్స్ షాప్నకు నెలకు రూ.లక్ష చొప్పున తీసుకుంటున్నారు.రాజాంలో మొదలై జిల్లా అంతటికి విస్తరణ ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన తీసుకుంటే రాజాం నియోజకవర్గంలో లిక్కర్ దందా మొదలైంది. లైసెన్స్ షాపుల యజమానులందరినీ సిండికేట్ చేశారు. ఇందులో సభ్యుడిగా నియోజకవర్గ కీలక నేతను చేర్చారు. లాభాల్లో వాటాను కీలక నేతకు ఇస్తున్నారు. అంతా ఏకం కావడంతో ఎంఆర్పీకి మించి విక్రయాలే కాదు ఎక్కడికక్కడ బెల్ట్ షాపులూ నడుపుతున్నారు.నెలకి షాపునకు రూ.లక్ష శ్రీకాకుళం నియోజకవర్గంలోనైతే సిండికేట్ లేదు కానీ బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్లు, ఎంఆర్పీకి మించి విక్రయాలు జరుగుతున్నాయి. చూసీ చూడనట్టున్నందుకు నియోజకవర్గ నేతకు ఒక్కో షాపు నుంచి నెలకు రూ.లక్ష ముట్టజెబుతున్నారు. అధికారులే సూత్రధారులై ఆ ఒప్పందం అమలు చేస్తుండడం గమనార్హం. టెక్కలి, ఆమదాలవలసలో సోదరుల పెత్తనం టెక్కలి, ఆమదాలవలసల్లో కీలక నేతల సోదరులే అంతా తామై వ్యవహరిస్తున్నారు. ఆమదాలవలసలో కొన్ని షాపులు సిండికేట్లో కలవలేదు. వాటి యజమానులు నెలవారీ ముడుపులిస్తున్నారు. పాతపట్నంలో కూడా వ్యాపారులంతా సిండికేటై, అక్కడున్న నేతకు వాటా ఇచ్చి వ్యాపారం చేసుకుంటున్నారు. బెల్ట్ షాపుల్లో క్వార్టర్పై రూ.30 అదనంగా పిండుకుంటున్నారు. ఇచ్ఛాపురంలో నెల వారీ మామూళ్లు కొనసాగుతున్నాయి.నరసన్నపేటలో మొత్తమంతా కీలక నేతకేనరసన్నపేటలో కీలక నేత పంట పండింది. కలిసి మద్యం వ్యాపారం చేసుకుందామని నమ్మబలికి అనుచరులు, నాయకుల దగ్గరి నుంచి రూ.20 కోట్లకు పైగా సేకరించారు. వారికి వ్యాపారంలో వాటా ఇస్తామని చెప్పారు. నాయకుల పేరునే దుకాణాలకు దరఖాస్తులు చేయిస్తామని భరోసా ఇచ్చారు. తీరా తన కుటుంబ సభ్యుల పేరునే ఎక్కువగా దరఖాస్తులు చేశారు. వారి కుటుంబసభ్యులకే లాటరీలో ఎక్కువ దుకాణాలు వచ్చాయి. రూ.20 కోట్లు ఇచి్చన నాయకులు, అనుచరులను దూరంపెట్టారు. వారి డబ్బూ తిరిగివ్వలేదు. వాటాలూ ఇవ్వలేదు. దీంతో ఆగకుండా.. నియోజకవర్గంలో మిగతావారికి దక్కిన షాపులను సైతం బెదిరించి సిండికేట్లో కలిపారు. పైసా పెట్టుబడి లేకుండా తానొక వాటా తీసుకుంటున్నారు.పలాసలో అల్లుడి దందా పలాసలో సీనియర్ నేత అల్లుడే చక్రం తిప్పుతున్నారు. వ్యాపారులందరినీ సిండికేట్గా చేయడమే కాక లైసెన్స్ షాపుల కౌంటర్లలోనే క్వార్టర్ బాటిల్పై రూ.20 అదనంగా అమ్మేలా దారి చూపించారు. ప్రతిఫలంగా సిండికేట్లో వాటాతో పాటు షాపుల నుంచి నెల వారీ ముడుపులు తీసుకుంటున్నారు. జిల్లాలో లైసెన్స్ షాప్ల కౌంటర్లలో ఎంఆర్పీకి మించి విక్రయాలు చేపట్టడం పలాసలోనే మొదలవడం గమనార్హం.మద్యం మత్తులో గ్రామాలు ప్రభుత్వం తీసుకొచి్చన విధానంతో పాటు బెల్ట్షాపులు విచ్చలవిడిగా పుట్టుకొచ్చి సిక్కోలు గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోంది. మత్తులో హత్యలు, అత్యాచారాలు, గొడవలు జరుగుతున్నాయి. జనవరి 19న శ్రీకాకుళం న్యూకాలనీలో పొందూరు మండలానికి చెందిన పూజారి లలితను అతి కిరాతకంగా ఓ యువకుడు చంపేశాడు. ఫిబ్రవరి 10న సోంపేట సమీప జింకిభద్ర బీసీ కాలనీలో మద్యం మత్తులో సాహుకారి ఢిల్లీశ్వరరావు భార్యను హత్య చేశాడు. మార్చి 18న ఎచ్చెర్ల మండలం సంతసీతారాంపురానికి చెందిన గాలి నాగమ్మ (42)ను భర్త అప్పలరెడ్డి దారుణంగా నరికి చంపాడు. కాశీబుగ్గలో మద్యం మత్తులో ఇద్దరు బాలికలపై ముగ్గురు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. శ్రీకాకుళం బలగ వద్ద బార్ అండ్ రెస్టారెంట్ వద్ద బీరు సీసాలతో ఇరువర్గాలు దాడులు చేసుకున్నాయి. -
శాన్ఫ్రాన్సిస్కోలో సెంచూరియన్ వర్సిటీ ప్రదర్శన
భువనేశ్వర్: సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ–మేనేజ్మెంట్ (సీయూటీఎం) అరుదైన ఘనత సాధించింది. శాన్ఫ్రాన్సిస్కోలో ప్రారంభమైన 62వ డిజైన్ ఆటోమేషన్ కాన్ఫరెన్స్ (డీఏసీ)లో పాల్గొనే అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకోవడమే కాకుండా తన సామర్థ్యాన్ని ప్రదర్శించి ప్రశంసలు అందుకుంది. ఈ కాన్ఫరెన్స్ ఈ నెల 22న ప్రారంభమైంది, 25 వరకు కొనసాగనుంది. సెమీ కండక్టర్, డిజైన్ ఆటోమేషన్ పరిశ్రమ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కాన్ఫరెన్స్లో సెంచూరియన్ ప్రాతినిధ్యం వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘చిప్స్ టు సిస్టమ్స్’ అనే శీర్షికతో నిర్వహిస్తున్న డీఏసీ కార్యక్రమానికి ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ (ఈడీఏ), సెమీకండక్టర్ టెక్నాలజీలు, సిస్టమ్ ఇన్నోవేషన్ రంగంలో దిగ్గజాలు హాజరు కావడం విశేషం. వర్సిటీ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ డీఎన్రావు ఆధ్వర్యంలో ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్దాస్, లక్ష్మీకాంత్ సుతార్లతో కూడిన బృందం సెంచూరియన్కు ప్రాతినిధ్యం వహించింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ డీఎన్రావు మాట్లాడుతూ ప్రపంచ స్థాయి వేదికపై సామర్థ్యాన్ని ప్రదర్శించిన తొలి వర్సిటీగా సెంచూరియన్ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. వర్సిటీలో సెమీ కండక్టర్ టెక్నాలజీ పాఠ్యాంశాలు మెరుగుపరచడానికి మార్క్యూ సెమీ కండక్టర్స్తో ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. విద్యతో పాటు సాంకేతిక ఆవిష్కరణల్లోనూ వర్సిటీ గుర్తింపు సాధించడం ఆనందంగా ఉందన్నారు. అధునాతన పారిశ్రామిక రంగానికి అక్కరకు వచ్చే రీతిలో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. రానున్న కాలంలో ప్రపంచ స్థాయిలో సెంచూరియన్ తన ఉనికి చాటుకుంటుందని ఆశాభవం వ్యక్తం చేశారు. -
మీజిల్స్, రుబెల్లా వ్యాక్సినేషన్కు స్పెషల్ డ్రైవ్
శ్రీకాకుళం పాతబస్టాండ్: మీజిల్స్, రుబెల్లా వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ జూన్ 23 నుంచి జూన్ 28 వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు వెల్లడించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికలో 2వ విడత మీజిల్స్ రుబెల్లా నిర్మూలనా కార్యక్రమం బ్యానర్ను ఆవిష్కరించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.అనిత మాట్లాడుతూ మీజిల్స్ రుబెల్లా స్పెషల్ డ్రైవ్లో భాగంగా జూన్ 23 నుంచి జూన్ 28 వరకు జిల్లా వ్యాప్తంగా ఇమ్యునైజేషన్ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డి.పద్మావతి, డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ వేణుగోపాల్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ రామ్స్, ఇతర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. జాబ్మేళాలో 182 మంది ఎంపిక టెక్కలి: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జేకేసీ, క్యాంపస్ రిక్రూట్మెంట్ సొల్యూషన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన జాబ్మేళాకు 246 మంది హాజరైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ టి.గోవిందమ్మ తెలిపారు. కంపెనీ ప్రతినిధులు బి.టి.ఇవెంజిల్, బి.ప్రేమ్కుమార్ పర్యవేక్షణలో నిర్వహించిన జాబ్మేళాలో 182 మందిని ఎంపిక చేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ బి.సతీష్కుమార్, ఐక్యూఏసీ కో–ఆర్డినేటర్ వి.ల్యూక్పాల్, అధ్యాపకులు జి.కసవయ్య, వి.శాంతన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. లా సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల ఎచ్చెర్ల: బీఆర్ఏయూ అనుబంధ లా కాలేజీలో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను వర్సిటీ ఎగ్జామినేషన్ డీన్ ఎస్.ఉదయ్భాస్కర్ సోమవారం విడుదల చేశారు. మూడేళ్ల కోర్సుకు సంబంధించి 1,3,5 సెమిస్టర్లు, ఐదేళ్ల న్యాయశాస్త్రం కోర్సుకు సంబంధించి 1,3,5,7,9 సెమిస్టర్ పరీక్ష ఫలితాలు వెల్లడించారు. మూడేళ్ల న్యాయశాస్త్రంలో ఒకటో సెమిస్టర్కు సంబంధించి 110 మంది పరీక్షకు హాజరు కాగా 89 మంది, మూడో సెమిస్టర్లో90 మందికి 88 మంది, ఐదో సెమిస్టర్లో 94 మందికి 94 మంది ఉత్తీర్ణతను సాధించారని తెలిపారు. ఐదేళ్ల న్యాయశాస్త్ర కోర్సులో ఒకటో సెమిస్టర్కు సంబంధించి 29 మందికి 18 మంది, మూడో సెమిస్టర్ 24 మందికి 22 మంది, ఐదో సెమిస్టర్లో 28 మందికి 27 మంది, ఏడో సెమిస్టర్లో 20 మందికి 20 మంది, తొమ్మిదో సెమిస్టర్లో 25 మందికి 25 మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. పరీక్ష ఫలితాలను వర్సిటీ వెబ్సైట్తో పాటు జ్ఞానభూమి పోర్టర్లలో విద్యార్థులకు అందుబాటులో ఉంచామన్నారు. సందేహాలున్న విద్యార్థులు 15 రోజుల్లోగా రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏపీ పీఈ సెట్ పరిశీలకుడిగా శ్రీనివాసరావు ఎచ్చెర్ల: ఈ విద్యా సంవత్సరంలో బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏపీపీఈ సెట్– 2025కు పరిశీలకునిగా ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిడీ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం క్రీడా కార్యదర్శి డాక్టర్ ఎం.శ్రీనివాసరావు ఎంపికయ్యారు. దీనికి సంబంధించి సెట్ కన్వీనర్ పి.జాన్సన్ వర్సిటీకి నియామక ఉత్తర్వులను అందించారు. వ్యాయామ, క్రీడా నైపుణ్యాల పరీక్షలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. -
రాష్ట్ర అధ్యక్షుడిగా కిల్లాన
శ్రీకాకుళం: జాతీయ బీసీ సంక్షేమ సంఘం బీసీ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడిగా కిల్లాన శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్ సోమవారం నియామక ఉత్తర్వులు అందించారు. ఎస్ఐసీ అభివృద్ధి అధికారిగా పనిచేసి పదవీ విరమణ చేసిన శ్రీనివాసరావు గత ఐదు సంవత్సరాలుగా బీసీ సంఘంలో పనిచేస్తూ సంఘ అభివృద్ధికి, పటిష్టతకు కృషి చేశారు. తనను నియమించిన జాతీయ, రాష్ట్ర నాయకత్వానికి శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు. డాబా పైనుంచి జారిపడి వృద్ధుడు మృతి బూర్జ: మండలంలోని డొంకలపర్త గ్రామానికి చెందిన జడ్డు అప్పలనాయుడు (67) డాబా పైనుంచి జారిపడి సోమవారం మృతి చెందినట్లు గ్రామస్తులు, కుటుంబీకులు తెలియజేశారు. వివరాల్లోకి వెళ్తే.. మృతుడు జడ్డు అప్పలనాయుడు ఉదయాన్నే ఇంటి డాబాపైకి వెళ్తుండగా కళ్లు తిరిగి పైనుంచి కిందకి పడిపోవడంతో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య లచ్చమ్మ, నలుగురు కుమారులు ఉన్నారు. భార్య లచ్చమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్పీ గ్రీవెన్సుకు 58 ఫిర్యాదులు శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ మరియు పరిష్కార వేదిక (గ్రీవెన్సు)కు ప్రజల నుంచి 58 అర్జీలు అందాయి. అదనపు ఎస్పీ కె.వి.రమణ అర్జీలు స్వీకరించి సకాలంలో పరిష్కరించేలా చూస్తామని భరోసా ఇచ్చారు. -
బంగారం చోరీ
నందిగాం: మండల కేంద్రమైన నందిగాం గణేష్ కాలనీలోని ఒక ఇంట్లో బంగారం చోరీ జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గణేష్ కాలనీలో నివాసముంటున్న కృష్ణవేణి లఖిదాసుపురం సచివాలయంలో ఏఎన్ఎంగా పని చేస్తుంది. ఆదివారం తన ఇంటికి తాళం వేసి హరిదాసుపురంలో ఉన్న కన్నవారింటికి వెళ్లింది. తిగిరి సోమవారం సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా కొన్ని వస్తువులు చిందరవందరగా ఉండడాన్ని గమనించింది. అనుమానంతో బెడ్రూమ్ తలుపు తీయగా అక్కడ ఉన్న కిటికీ గ్రిల్ సగం తీసి వేసి ఉంది. మరో గదిలో ఉన్న ఇనుప బీరువాను చూడగా బీరువా తలుపు వంచి ఉండటం గమనించి చూడగా, లోపల ఉండాల్సిన బంగారం కనిపించలేదు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది. టెక్కలి సీఐ శ్రీనివాసరావు కృష్ణవేణి ఇంటిని పరిశీలించి, క్లూస్ టీమ్ను రప్పించి వేలి ముద్రలు సేకరించారు. సుమారు 16 తులాల బంగారు ఆభరణాలు, వెండి చెంబు, గ్లాసు, పళ్లెం తదితర వస్తువులు పోయినట్లు తెలిపింది. -
సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి
● కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల ధర్నా శ్రీకాకుళం పాతబస్టాండ్: అంగన్వాడీలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.కల్యాణి, డి.సుధ డిమాండ్ చేశారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి లేదా సంక్షేమ పథకాలైనా అమలు చేయాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా చేపట్టారు. ముందుగా ఆర్ అండ్ బీ బంగ్లా రోడ్డు నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చిరుద్యోగులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అంగన్వాడీలను సాధికార సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదు చేసినందువలన సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతినెలా లబ్ధిదారుల ముఖ ఆధారిత గుర్తింపు(ఎఫ్.ఆర్.ఎస్) రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీవో ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే దశలవారీగా పోరాటాలు నిర్వహిస్తామని తెలియజేశారు. వేధింపులకు పాల్పడుతున్నారు కోటబొమ్మాళి మండలంలో అంగన్వాడీలపై అధికార పార్టీ నేతలు రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. గత నెలలో ఇద్దరు అంగన్వాడీ వర్కర్లను రాజకీయ కక్షలతో తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తొలగించిన అంగన్వాడీలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం జిల్లా పరిషత్లో డీఆర్వో ఎం.వెంకటేశ్వరరావుకు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు కె.సూరయ్య, ఎన్.వి.రమణ, ఆర్.ప్రకాశరావు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు ఎన్.హైమవతి, పి.లతాదేవి, కె.సుజాత, జె.కాంచన, కె.లక్ష్మి, ఎస్.ఆదిలక్ష్మి, పి.రమణమ్మ, వి.హైమవతి, కె.మోహిని, జ్యోతి, టి.రాజేశ్వరి, వై.విజయలక్ష్మి పాల్గొన్నారు. -
ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి విడనాడాలి
● ఆఫ్షోర్ నిర్వాసితుల నిరసన శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆఫ్షోర్ నిర్వాసితుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, నిర్వాసితుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి విడనాడాలని సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ. సింహాచలం డిమాండ్ చేశారు. ఈ మేరకు నిర్వాసితులతో కలిసి జిల్లా జెడ్పీ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 18 ఏళ్లుగా ప్రాజెక్టు పని నత్తనడకగా సాగుతోందని ధ్వజమెత్తారు. నిర్వాసితులు చాలా రోజులుగా రిలే దీక్షలు చేపడుతున్నా కూటమి ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం అన్యాయమన్నారు. ప్రాజెక్టు అంచనా వ్యయం పెంచినప్పటికీ నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సమావేశం ఏర్పాటు చేయాలి జిల్లాలో ఉన్న మంత్రులు, పలాస, పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యేలు జోక్యం చేసుకొని, నిర్వాసితులతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి సమస్యలపై చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ సమస్య పరిష్కారమయేంతవరకు ఎంతటి పోరాటమైన కొనసాగిస్తామని పిలుపునిచ్చారు. 18 ఏళ్ల నిండిన యువతి, యువకులకు యూత్ ప్యాకేజీ మంజూరు చేయాలని, నిర్వాసితులందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం భూములకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. హిరమండలం నిర్వాసితులకు ఇచ్చిన 460 జీవో ప్రకారం పూర్తిస్థాయి ప్యాకేజీ ఇవ్వాలన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే భవిష్యత్తులో మరిన్ని పోరాటాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. అనంతరం డీఆర్వో నిర్వాసితులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి జిల్లా కలెక్టర్, ప్రభుత్వం దృష్టిలో పెడతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.యుగంధర్, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి లండ వెంకటరావు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి శిర్ల ప్రసాద్, చీపురుపల్లి గ్రామ సర్పంచ్ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
అర్జీలు సత్వరమే పరిష్కరించాలి
పాఠశాల భవనం నిర్మించాలి తమ గ్రామంలో ప్రాథమిక పాఠశాల నిర్వహించేందుకు నూతన భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని పోలాకి మండలం దీర్ఘాశి గ్రామ పంచాయతీ కింజరాపువానిపేటకు చెందిన ప్రజలు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. అంతకుముందు జిల్లా పరిషత్ గేట్ వద్ద నిరసన చేపట్టారు. తమ గ్రామంలో 100 కుటుంబాలకు పైగా ఉన్నాయని, ప్రస్తుతం పాఠశాలలో 35 మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. పాఠశాల పాత భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రస్తుతం గ్రామస్తులే చందాలు వేసుకొని అద్దె కట్టి పాఠశాల నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో నూతన భవనాన్ని మంజూరు చేయాలని విన్నవించారు. అలాగే గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. గ్రామంలో ఉన్న పిల్లలు ఐదో తరగతి వరకు ఇక్కడే చదివేందుకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక(మీకోసం)లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. స్వీకరించిన అర్జీల్లో రెవెన్యూ, పంచాయతీరాజ్, డ్వామా, మహిళా శిశు సంక్షేమం, మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా పంచాయతీ, ఏపీఈపీడీసీఎల్, సర్వే, భూగ ర్భ గనులు, ఇరిగేషన్ తదితర శాఖల సమస్యలు ఉన్నాయి. అర్జీలు స్వీకరణలో డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ వేణుగోపాల్, డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఆయా శాఖల వద్ద పెండింగ్లో ఉన్న అర్జీలపై సమీక్షించారు. అర్జీలు సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పింఛన్లు పునరుద్ధరించాలి ఆమదాలవలస నియోజకవర్గంలోని బూర్జ మండలం కటకమయ్యపేట గ్రామంలో ఇద్దరు వితంతువులకు నిలిపివేసిన పింఛన్లను పునరుద్ధరించాలని ఆ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ కోరారు. ఈ మేరకు పీజీఆర్ఎస్లో వినతిపత్రం అందజేశారు. వితంతువులకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ, గత కొన్ని సంవత్సరాలుగా పింఛన్లు పొందుతున్నప్పటికీ కేవలం రాజకీయ కారణాలతో గత 8 నెలలుగా పింఛన్ నిలిపివేశారని తెలియజేశారు. అధికారులు స్పందించి ఆ నిరుపేదలను ఆదుకోవాలని కోరారు. అక్రమ ఇసుక ర్యాంపుల నిర్వహణ ఆపాలి శ్రీకాకుళం రూరల్ మండలం నైర గ్రామం పరిసరాల్లోని వంశధార నదిలో అక్రమ ఇసుక ర్యాంపులు నిర్వహిస్తున్నారని, వాటిని నిలుపుదల చేయాలని వైఎస్సార్సీపీ శ్రీకాకుళం మండల ప్రధాన కార్యదర్శి ఊటపల్లి కృష్ణారావు కోరారు. నైర గ్రామ పరిధిలో వంశధార నుంచి వాటర్ స్కీమ్లు ఏర్పాటు చేశారని, ఈ అక్రమ తవ్వకాల వలన ప్రాజెక్టుకు నష్టం జరిగే పరిస్థితి ఉందని తెలిపారు. వాల్టా చట్టం పరిధిలో అక్రమ ఇసుక ర్యాంపులు ఆపాలని విన్నవించారు. శ్రీకాకుళం మండలానికి 20 సంవత్సరాల నుంచి 75 శాతం మంది ప్రజలకు తాగునీరు సక్రమంగా దానినుంచే అందుతోందని తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు మీకోసంలో 106 అర్జీల స్వీకరణ -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
నందిగాం: మండల పరిధిలోని మద్దిలివానిపేట వద్ద జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నరేంద్రపురం పంచాయతీ నారాయణపురానికి చెందిన మెట్ట లోకనాథం(55) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. లోకనాథం తన పొలంలో విత్తనాలు చల్లడానికి వెళ్లి తిరిగి నారాయణపురం గ్రామానికి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తున్నాడు. అయితే అదే సమయంలో పలాస వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బైక్పై నుంచి ఎగిరిపడి రోడ్డు మీద పడడంతో తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య లీలావతి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అన్నదాత సుఖీభవ అనేదెప్పుడు..?
రైతన్నను ఆదుకోవాలి వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. దుక్కి దున్నడంతో పాటు విత్తనాలు పోసేందుకు చేతిలో చిల్లి గవ్వలేక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. రైతుభరోసా డబ్బులు ఇవ్వకపోవడంతో ప్రైవేటు దళారుల్ని ఆశ్రయించి అప్పలు వాడాలి వస్తోంది. ప్రభుత్వం చొరవ చూపి ఈ సీజన్కి కావాల్సిన డబ్బులు ప్రభుత్వం ఇచ్చేలా చూడాలి. – మజ్జి రమణ, అన్నంపేట గ్రామం, బూర్జ మండలం ఆదేశాలు వచ్చిన వెంటనే.. ప్రభుత్వం ఇప్పటికే అన్నదాత సుఖీభవ నిధులు రైతుల ఖాతాల్లో వేసేందుకు అడుగులు ముందుకేస్తుంది. రైతుల డేటాను అప్లోడ్ చేసి అర్హులందరికి అందించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. 20వ విడత పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ డబ్బులు కలిపి ఒక్కసారి జమ చేసేందుకు కృషి చేస్తున్నాం. – త్రినాథస్వామి, జిల్లా వ్యవసాయాధికారి ●శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): అవసరమైనప్పుడే సాయం చేయాలి.. పుణ్యకాలం కాస్తా అయిపోయాక సాయం అందినా లాభముండదు. జిల్లావ్యాప్తంగా ఖరీఫ్ పనులు మొదలైపోయాయి. రైతన్నలు ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏటా రైతులకు రూ.20 వేలు ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు, నేటికీ రైతుల వివరాలు ఎన్ఐసీలో సక్రమంగా అప్లోడ్ చేయలేదు. వెబ్ల్యాండ్ వివరాలతో ఈ–క్రాప్ సింక్ అవ్వకపోవడం వంటి సాంకేతిక సమస్యలు అనేకం ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఒక ఏడాది అన్నదాత సుఖీభవ పూర్తిగా ఎగ్గొట్టేశారని రైతులంతా మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థులకు వెన్నుపోటు పొడిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రైతులు కూడా ఆ జాబితాలో చేరిపోయారు. పెట్టుబడికి కష్టాలు అనుకున్న సమయానికి ప్రభుత్వం సాయం అందకపోవడంతో సన్నకారు రైతులు అప్పులు చేయక తప్పడం లేదు. వైఎస్సార్సీపీ హయాంలో ఖరీఫ్ సీజన్లో రైతులు విత్తనాల కొనుగోలుతో పాటు సాగుకు ఇబ్బంది కలగకుండా సాగుకు ముందే పెట్టుబడి సాయం అందించేవారు. కానీ కూటమి ప్రభుత్వం గత ఏడాది పూర్తిగా సాయం ఇవ్వకుండా వదిలేసింది. ఈ ఏడాది ఇప్పటివరకు తేదీ కూడా ప్రకటించలేదు. దీంతో రైతుకు పెట్టుబడి కష్టాలు పెరుగుతున్నాయి. వైఎస్సార్ సీపీ హయాంలో.. జగన్ సర్కార్ రైతుకు ఇబ్బందులు కలగకుండా వైఎస్సార్ రైతు భరోసా సొమ్ము సకాలంలో ఖాతా ల్లో జమ చేసేది. ఖరీఫ్ పంట వేసేముందు ఏటా సరిగ్గా మే నెలలో ‘వైఎస్సార్ రైతు భరోసా’ కింద రూ.7,500 జమ చేసేది. తర్వాత అక్టోబర్ నెలలో ఖరీఫ్ పంట కోతతో పాటు రబీ సాగు అవసరాల కోసం రెండో విడతలో రూ.4 వేలు ఇచ్చేది. ఆ తర్వాత జనవరి నెలలో మూడో విడతగా ధాన్యం ఇంటికి చేరే వేళ సంక్రాంతి పండుగ సమయంలో మరో రూ.2 వేలు... ఇలా మూడు విడతల్లో ఒక్కో రైతుకు ’వైఎస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్’ ద్వారా మొత్తం రూ.13,500 చొప్పున గత ప్రభుత్వం రైతు ఖాతాల్లో జమ చేసింది. వైఎస్సార్ రైతు భరోసా పథకంతో పాటు వైఎస్సార్ సున్నా వడ్డీ, డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల భీమా, ఇన్పుట్ సబ్సిడి ఇలా అనేక పథకాలు ద్వారా గత ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది. ప్రారంభమైన ఖరీఫ్ పనులు ‘అన్నదాత సుఖీభవ’ నిధుల కోసం ఎదురుచూపులు ఏటా జూన్ 10లోపే జమచేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం కూటమి హయాంలో తీవ్ర జాప్యం -
బూతులు తిట్టి.. కాలర్ పట్టుకుని నెట్టేసి
రణస్థలం: కూటమి నాయకుల దౌర్జన్యాలు పెచ్చుమీరుతున్నాయి. జనంపై పెత్తనం చెలాయించడమే కాకుండా ఉద్యోగులను కూడా వేధిస్తున్నారు. తాజా గా జనసేన పార్టీ రణస్థలం మండలాధ్యక్షుడు బస్వ గోవిందరెడ్డి ఈ నెల 20వ తేదీన కొచ్చెర్ల గ్రామ సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ కె.మోహన్రావుపై దాడికి తెగబడడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. ఈ నెల 20వ తేదీన మోహనరావు ఉదయం 10.30 గంటలకు సచివాలయానికి వచ్చి తన పని తాను చేసుకుంటున్నాడు. ఆ సమయంలో బస్వ గోవిందరెడ్డి సచివాలయానికి వచ్చి గతంలో తాను చెప్పి న పని ఏం చేశావని గట్టిగా అడిగాడు. యోగాంధ్ర, తల్లికి వందనం వంటి పనుల్లో బిజీగా ఉన్నానని, ఆ పని పంచాయతీ కార్యదర్శి లాగిన్లో ఉందని సమాధానం చెప్పినా వినకుండా తాను చెప్పిన పని ముందు చేయకుండా మిగతా పనులు చేసుకుంటావా అని బూతులు తిట్టారు. అంతటితో ఆగకుండా కాలర్ పట్టుకుని నెట్టేశారు. ఆ సమయంలో సచి వాలయంలో మహిళా పోలీస్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ ఉన్నారు. ఈ అనుకోని ఘటనతో తీవ్రంగా మనస్తాపం చెందిన మోహనరావు ఉన్నతాధికారులకు సమాచారం అందజేశారు. సోమవారం తోటి ఉద్యోగులతో కలిసి మండల పరిషత్ ఏఓ మార్కండేయకు వినతి పత్రం ఇచ్చారు. గోవిందరెడ్డి అంటే అధికారులకు హడల్ జనసేన మండలాధ్యక్షుడు బస్వ గోవిందరెడ్డి ఓ రౌడీ షీటర్. అతనిపై పలు కేసులు ఉన్నాయి. గతంలో ఒక కుటుంబం వద్ద నగదు తీసుకుని చెల్లించకపోగా ఆ కుటుంబంపై విచక్షణారహితంగా దాడి చేయడంపై అప్పట్లో కేసు నమోదైంది. ఇక కొచ్చెర్ల గ్రామ సచివాలయంపై ఉద్యోగులపై ఎన్నో మార్లు చిందులు తొక్కిన ఘటనలు ఉన్నాయి. 2022 సమయంలో గ్రామ సచివాలయ భవనాలు కడుతున్న సమయంలో పంచాయతీ కార్యదర్శి రాజేశ్వరిపై ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ నానా యాగీ చేశాడు. జగనన్న కాలనీ లబ్ధిదారులపై దాడి, కొచ్చెర్ల ప్రేమ జంటతో పాటు వాళ్ల కుటుంబం పైన దాడి వంటి అనేక కేసులున్నాయి. సచివాలయ ఉద్యోగిపై జనసేన నాయకుడు బస్వ గోవిందరెడ్డి దౌర్జన్యం అతడు ఇదివరకే పలు కేసుల్లో నిందితుడు -
ఉద్యోగ భద్రత కల్పించాలి
శ్రీకాకుళం అర్బన్: ఏపీఎస్ ఆర్టీసీలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆర్టీసీ ఔట్సోర్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ముత్యాలు డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఔ ట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాల ని కోరుతూ సోమవారం శ్రీకాకుళంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఆర్టీసీ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ జిల్లాలోని ఆర్టీసీ శ్రీకాకుళం–1, 2 డిపోలతో పాటు టెక్కలి, పలాస డిపోలలో ఔట్ సోర్సింగ్ కార్మికులు దాదాపుగా 220 మంది పని చేస్తున్నారన్నారు. వీరి వేతనం దోపిడీకి గురవుతోందని అన్నారు. కార్యక్రమంలో ఏపీపీటీ డీ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు దాసరి కిరణ్, కార్యదర్శి పి.సంతోష్, జిల్లా ట్రెజరర్ ఆర్.నవీన్కుమార్ పాల్గొన్నారు. -
‘యువత పోరు విజయవంతమైంది’
నరసన్నపేట: జిల్లా కేంద్రంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన యువత పోరు విజయవంతమైందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. పార్టీ సమన్వయ కర్తలు, యువజన విభాగాల నాయకులు, ప్రత్యేకంగా నరసన్నపేట నుంచి 300 ద్విచక్ర వాహనాల ర్యాలీ ఆకట్టుకుందన్నారు. అలాగే యువత పోరు విజయవంతం కావడంలో పోలాకి జెడ్పీటీసీ ధర్మాన కృష్ణచైతన్య, రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు మెంటాడ స్వరూప్, జిల్లా అధ్యక్షుడు పృథ్వీ సమన్వయంతో పనిచేశారని కితాబునిచ్చారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ పోరాటం కూటమి ప్రభుత్వానికి గట్టి హెచ్చరికగా నిలిచిందని పేర్కొన్నారు.తిలారు ఫ్లై ఓవర్పై నుంచి ఆర్టీసీ బస్సులుసారవకోట: జలుమూరు మండలంలోని తిలా రు గేట్ పై నిర్మించిన ఫ్లై ఓవర్ పై ఆర్టీసీ బస్సులు మంగళవారం నుంచి ప్రయాణిస్తాయని ఆర్టీసీ మేనేజర్ రవిశంకర్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం నుంచి పాతపట్నం వెళ్లే బస్సులు మాత్రమే తిలారు ఫ్లై ఓవర్ పై నుంచి వస్తున్నాయని, పాతపట్నం నుంచి శ్రీకాకుళం వచ్చే బస్సులు చల్లవాని పేట మీదుగా జర్జంగి, హరిశ్చంద్రాపురం, నిమ్మాడ నుంచి నరసన్నపేట వస్తున్నాయన్నారు. మంగళవారం నుంచి శ్రీకాకుళం నుంచి పాతపట్నం వెళ్లే ఆర్టీసీ బస్సులు తిలారు దగ్గర సర్వీసు రోడ్డులో నడుస్తాయని పాతపట్నం నుంచి శ్రీకాకుళం వచ్చే బస్సులు మాత్రం ఫ్లై ఓవర్ పై నుంచి వస్తాయన్నారు.పునరావాస కాలనీ పరిశీలనసంతబొమ్మాళి: మూల పేట పోర్టు నిర్వాసిత గ్రామమైన విష్ణుచక్రం గ్రామానికి కేటాయించిన పునరావాస కాలనీని తహసీల్దార్ హేమసుందర్ పరిశీలించారు. ‘ఊరిని వదిలేసి వస్తే... గాలికొదిలేస్తారా..’ అనే శీర్షికన సాక్షి దినపత్రికలో సోమవారం కథనం ప్రచురితం కావడంతో ఆయన స్పందించారు. జోరువానలో కూడా పునరావాస కాలనీ పరిశీలించి నిర్వాసితులతో మాట్లాడారు. ఎర్త్ ఫిల్లింగ్ పూర్తిస్థాయిలో చేయిస్తామని, మరుగుదొడ్లకు తలుపులు వేయిస్తామని, మురికి కాలువ నిర్మాణం త్వరలోనే చేయిస్తామని హామీ ఇచ్చారు. పునరావాస కాలనీలో ఎలాంటి విద్యుత్ సమస్య రాకుండా నిరంతరం పర్యవేక్షించాలని విద్యుత్ లైన్మెన్ను ఆదేశించారు. ఆయనతో పాటు ఆర్ఐ ప్రసన్న తదితరులు ఉన్నారు.గురుకుల ప్రవేశ పరీక్ష సమయాల్లో మార్పుశ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2025–26 విద్యా సంవత్సరానికి 6, 7, 8, 9వ తరగతుల్లో మిగిలి ఉన్న సీట్ల అడ్మిషన్ కోసం దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది. దరఖా స్తు చేసుకున్న వారిలో జిల్లా వ్యాప్తంగా బాలు రుకు దుప్పలవలస, బాలికలకు ఎచ్చెర్లలోను పరీక్షలు జరుగుతాయి. జూన్ 25న బుధవారం 6, 7వ తరగతులకు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, అదే రోజు మధ్యాహ్నం 8, 9వ తరగతులకు 2 నుంచి 3 వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు గురుకులాల జిల్లా సమ న్వయకర్త గుంపుల గ్రేస్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. సమయాల్లో మార్పులను గమనించాలని ఆమె కోరారు. సందేహాలుంటే 9701736862/9000314209 నంబర్లకు ఫోన్ చేయాలని తెలిపారు. -
ఆస్తులు అమ్ముకుంటున్నారు
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య చాలా దారుణంగా ఉంది. అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి కల్పిస్తామని ఆశ పెట్టిన చంద్రబాబు రూ.7200 కోట్లు బకాయి పెట్టి మౌనంగా ఉంటున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ రూ.4200 కోట్లు, వసతి దీవెన రూ.2200 కోట్లు అవసరమైతే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. 2014–19 నుంచి టీడీపీ హయాంలో ఫీజు రీయింబర్స్మెంట్ రూ. 17వేల కోట్లు బకాయి పెడితే వైఎస్ జగన్ ఆ రు నెలల్లో ఆ బకాయి చెల్లించారు. కానీ చంద్రబాబు బకాయిలు ఇవ్వకపోవడంతో అనేక మంది ఆస్తులు అమ్ముకుని ఫీజులు కట్టి సర్టి ఫికెట్లు తీసుకోవాల్సి వస్తోంది. – కుంభా రవిబాబు, వైఎస్సార్ సీపీ శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలకుడు చంద్రబాబుకు కొత్త కాదు.. హామీలు ఇవ్వడం.. మర్చిపోవడం చంద్రబాబుకు కొత్త కాదు. సొంతమామనే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకి రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడవడం పెద్ద వింతకాదు. హామీలు అమలు చేసే సత్తా లేనప్పుడు ఎందుకివ్వాలి. ఏడాది పాలనలో 80శాతం హామీలు పూర్తిచేశామని చెబుతున్న తీరు చూసి ప్రజలంతా నవ్వుకుంటున్నారన్నారు. – తమ్మినేని సీతారాం, పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త యువత ప్రశ్నించారు.. కూటమి పాలనలో జరిగిన అన్యాయంపై యువత ప్రశ్నించేందుకు భారీగా రావడం ఆనందంగా ఉంది. నిరుద్యోగులు, యువకులకు కూటమి ప్రభుత్వం రూ.7200 కోట్లు బకాయి పడింది. – ఎంవీ స్వరూప్, పార్టీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ● -
హామీలపై మంత్రి అచ్చెన్న సమాధానమివ్వాలి
టెక్కలి: ఎన్నికల ముందు జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదో మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం చెప్పాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యవర్గ సభ్యుడు కె.మోహన్రావు డిమాండ్ చేశారు. టెక్కలి మండలం జక్కరపేటలో ఆదివారం సమావేశం నిర్వహించి అనంతరం ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు అప్పులు తప్ప ప్రయోజనం ఏమీ లేదన్నారు. జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటుపై కనీస ప్రస్తావన లేదని, జీడి పంటకు గిట్టుబాటు ధర కల్పించలేదని, జీడి బోర్డు ఏర్పాటు చేయలేదని, వంశధార నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వలేదని మండిపడ్డారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి శివారు భూములకు నీరు అందజేస్తామని చెప్పినా అమలు కావడం లేదన్నారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యం ఎందుకు అందజేయలేకపోతున్నారో మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కె.ఎల్లయ్య, హెచ్.ఈశ్వరరావు, బి.వాసుదేవరావు, యు.లక్ష్మణరావు, దుర్గాప్రసాద్, బి.అప్పారావు, బి.రవి, హరీష్, బి.నరసమ్మ, సుబ్రహ్మణ్యం, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
పాలిసెట్ కౌన్సెలింగ్కు 403 మంది హాజరు
ఎచ్చెర్ల : పాలిటెక్నిక్ డిప్లమో కోర్సుల్లో ప్రవేశాల కోసం స్థానిక పాలిటెక్నిక్ కాలేజీ వద్ద ఆదివారం నిర్వహించిన ఏపీ పాలిసెట్ – 2025 వెబ్ కౌన్సెలింగ్కు 403 మంది విద్యార్థులు హజరయ్యారు. 15001 నుంచి 32000 వేలు ర్యాంక్ మధ్య ధ్రువపత్రాలు పరిశీలన చేయగా.. ఓసీ, బీసీ విద్యార్థులు 371 మంది, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 32 మంది హాజరయ్యారు. మూడోరోజు సోమవారం 32001 నుంచి 50,000 ర్యాంక్ వరకు విద్యార్థుల ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. కార్యక్రమంలో సహాయ కేంద్రం జిల్లా కో–ఆర్డినేటర్ డాక్టర్ కె.నారాయణరావు, సీనియర్ అధ్యాపకులు మురళీకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. కాగా, పాలిసెట్ వెబ్ కౌన్సెలింగ్ సహాయ కేంద్రం వద్ద కోచింగ్ సెంటర్, ప్రైవేటు కళాశాలల ప్రతినిధులు, మధ్యవర్తుల తాకిడి ఎక్కువైంది. వేలకు వేలు కమీషన్లు తీసుకుని వారికి నచ్చిన కళశాలల్లో చేరేలా విద్యార్థులను మభ్యపెడుతున్నట్లు సమాచారం. వాస్తవానికి విద్యార్థితో పాటు తల్లిదండ్రులు, సంరక్షకులు మాత్రమే రావాల్సి ఉండగా.. బయట వ్యక్తులు పెద్ద ఎత్తున చేరి విద్యార్థులను గందరగోళానికి గురి చేస్తున్నారు. -
ఆదిత్యుని సన్నిధిలో జస్టిస్ సుబ్బారెడ్డి
అరసవల్లి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారిని ఏపీ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుబ్బారెడ్డి శెట్టి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మలు పూర్ణకుంభ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. అనివెట్టి మండపంలో వేదాశీర్వచనాన్ని చేయించి తీర్థప్రసాదాలను అందజేశారు. ప్రధానార్చకులు శంకరశర్మ ఆలయ విశిష్టతను జస్టిస్కు వివరించారు. కార్యక్రమంలో కోర్టు ప్రోటోకాల్ సిబ్బంది, ఆలయ అధికార సిబ్బంది పాల్గొన్నారు. గార: ఆదికూర్మ క్షేత్రం శ్రీకూర్మంలోని కూర్మనాథున్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి ఎస్.సుబ్బారెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. మూలవిరాట్కు గోత్ర నామాలతో పూజలు జరిపించుకున్నారు. ఆల య ప్రధానార్చకులు సీహెచ్ సీతారామనృసింహాచార్యులు క్షేత్ర మహత్యాన్ని వివరించారు. భూ తగాదాలో వ్యక్తికి గాయాలు జి.సిగడాం: నాగులవలసలో ఆదివారం జరిగిన భూ తగాదాలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శశిధర్ ట్రాక్టర్తో సొంత పొలంలో దున్నేందుకు వెళుతుండగా అదే గ్రామానికి చెందిన వెంకట అప్పారావు తన పొలంలో నుంచి వెళ్తావా అంటూ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో శశిధర్ తలకు గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని రాజాం ఆస్పత్రికి తరలించారు. బాధితుడు ఫిర్యాదు మేరకు ఎస్సై వై.మధుసూదనరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిక్కోలుకు సముచిత స్థానంశ్రీకాకుళం న్యూకాలనీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాఫ్ట్బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాకు సముచితస్థానం లభించింది. దశాబ్దకాలంలో సాఫ్ట్బాల్ క్రీడలో చెరగని ముద్రవేసుకున్న శ్రీకాకుళం జిల్లాకు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శితోపాటు కన్వీనర్ వంటి కీలకమైన మూడు స్థానాలు వరించాయి. జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో ఆదివారం ఏపీ రాష్ట్ర సాఫ్ట్బాల్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఏఐ) ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ అనోకర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సాఫ్ట్బాల్ సంఘ పురోగాతికి, క్రీడా టోర్నమెంట్ల నిర్వహణ, వివిధ జిల్లాకు స్పోర్ట్స్మీట్ల కేటాయింపు, క్రీడాకారులకు ప్రోత్సాహాకాలు, స్పోర్ట్స్ కిట్ల పంపిణీకి ప్రతిపాదనలు వంటి అంశాలపై చర్చించి, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాఫ్ట్బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికలను నిర్వహించారు. ఎన్నికల అధికారిగా రిజైర్డ్ జడ్జి పప్పల జగన్నాథరావు, అన్నెపు భువనేశ్వరరావు, పరిశీలకులగా శాప్ తరఫున డీఎస్డీఓ డాక్టర్ కె.శ్రీధర్రావు, ఒలింపిక్ అసోసియేషన్ తరఫున ఎం.సాంబమూర్తి, సీఈఓ పి.సుందరరావు, మెట్ట తిరుపతిరావు, గురుగుబెల్లి రాజశేఖర్, ఎస్జీఎఫ్ సెక్రటరీ బి.వి.రమణ, గ్రిగ్స్ సెక్రటరీ కె.మాధవరావు, ఎం.ఆనంద్కిరణ్, ఢిల్లేశ్వరరావు, మహంతి, స్టేట్ సాఫ్ట్బాల్ కోచ్ బద్రి, 13 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సూర శ్రీనివాసరావును ఎన్నుకున్నారు. వందలాది మంది క్రీడాకారులను రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించేలా చేసి.. సాఫ్ట్బాల్కు కేరాఫ్ సిక్కోలు అనేలా చేసిన మొజ్జాడ వెంకట రమణకు కీలకమైన రాష్ట్ర కన్వీనర్ పోస్టు లభించింది. కార్యవర్గ సభ్యులగా మరికొంతమందికి అవకాశం కల్పించారు. -
బాత్రూమ్ క్లీనర్ తాగి వ్యక్తి ఆత్మహత్య
టెక్కలి రూరల్: టెక్కలి శ్రీనివాసనగర్కు చెందిన రొక్కం రాజారావు(65) బాత్రూం క్లీనర్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజారావు కొన్నేళ్లుగా స్థానిక తెంబూర్ రోడ్డులోని రైల్వే గేటు వద్ద నిమ్మకాయల వ్యాపారం చేస్తుండేవాడు. కొద్ది రోజులుగా ఆరోగ్యం సరిగా లేకపోవడంతో మనస్థాపానికి గురై శనివారం తన ఇంట్లో ఉన్న బాత్రూం క్లీనర్ (లైజాల్) తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన కుటుంబసభ్యులు హుటాహూటిన టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్కు తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం వేకువజామున మృతిచెందాడు. మృతుడి భార్య కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు టెక్కలి పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రిజర్వాయర్లో పడి ఇంటర్ విద్యార్థి దుర్మరణం
మందస: కొంటాసాయి గిరిజన గ్రామానికి చెందిన సవర థ్రిల్లర్ మంజు(16) అనే ఇంటర్మీడియెట్ విద్యార్థి రిజర్వాయర్లో ప్రమాదశాత్తుపడి దుర్మరణం చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొంటాసాయి గ్రామానికి చెందిన సవర సుబ్బారావు కుమారుడు థ్రిల్లర్ మంజు పలాస జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం సెలవు దినం కావడంతో పశువులను మేపేందుకు డబార్సింగి జలాశయం ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ స్నానానికి దిగి ఈత రాక మునిగిపోయాడు. ఎంతసేపటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో తండ్రి జలాశయం వైపు వెళ్లి వెతకగా నీటిలో విగతజీవిగా కనిపించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హరిపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
గాలికొదిలేస్తారా?
ఊరిని వదిలేసి వస్తే.. రాష్ట్రాభివృద్ధిలో భాగంగా సొంత ఇల్లు, భూములు.. ఇలా సర్వస్వం త్యాగం చేసిన నిర్వాసితులకు కూటమి పాలకులు చుక్కలు చూపిస్తున్నారు. కనీస సదుపాయాలు కూడా కల్పించకుండా గాలికొదిలేస్తున్నారు. తమ గోడు పట్టించుకునే వారే లేకపోవడంతో నిర్వాసిత కాలనీవాసులు కుమిలిపోతున్నారు. తరతరాలుగా జీవిస్తున్న ఇళ్లు, భూములను వదులుకుంటే తమనే నట్టేట ముంచుతారా?అంటూ సంతబొమ్మాళి మండలం విష్ణుచక్రం గ్రామస్తులు ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. సంతబొమ్మాళి : మూలపేట పోర్టు నిర్మాణానికి భూములతో పాటు గ్రామాన్నే త్యాగం చేసిన విష్ణుచక్రం గ్రామస్తులు తమకు కేటాయించిన పునరావాస కాలనీలో కనీస స్థాయిలో కూడా మౌలిక వసతులు లేకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తాగునీరు, మురుగు కాలువలు, మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉండటం, ఇతర సమస్యలతో సతమతమవుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవిస్తున్నా పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మూలపేట పోర్టు నిర్వాసిత గ్రామమైన విష్ణుచక్రం గ్రామానికి నౌపడలో పునరావాస కాలనీని ఏర్పాటు చేశారు. ప్రతి కుటుంబానికి ఐదు సెంట్ల భూమి ఇచ్చారు. ఇందులో తాత్కాలిక షెడ్లను వేసుకొని జీవనం సాగిస్తున్నారు. 57 రేషన్ కార్డులు ఉండగా 45 మందికి మాత్రమే తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయడంపై మిగిలిన వారు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు కాలనీలో మౌలిక వసతులు కొరవడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచినీటి పథకం నిర్మాణంలో ఉండటంతో తలగాం నుంచి పైపులైన్ ద్వారా వస్తున్న నీరు ఎప్పుడు వస్తుందో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. పునరావాస కాలనీలో ఎర్త్పిల్లింగ్ పూర్తిస్థాయిలో చేయకుండా వదిలేయడంతో చిన్నపాటి వర్షాలకు నీరు నిల్వ ఉండి చెరువులను తలపిస్తున్నాయి. మురుగునీరు ప్రవహించేందుకు కాలువలు లేకపోవడంతో వాడుక నీరు ఎక్కడికక్కడే నిలిచిపోతోంది. దీంతో రోడ్డు బురదమయంగా తయారై దోమలకు నిలయంగా మారింది. మరుగుదొడ్లకు తలుపులు లేకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయి. దీంతో కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఆరు బయటకు వెవెళ్లాల్సిన పరిస్థితి వస్తోంది. రాత్రి వేళల్లో పాములు సంచరించడంతో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగించాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. పెండింగ్లో పరిహారం.. గ్రామంలో ఉన్న మరిడమ్మ తల్లి ఆలయానికి, అయ్యప్ప స్వామి ఆలయానికి సంబంధించిన పరిహారం ఇంతవరకు చెల్లించలేదు. పోర్టు రైల్వేలైన్, రోడ్డు మార్గానికి మధ్యన ఉన్న 40 ఎకరాల గ్యాప్ ఏరియాకి ఇంతవరకు పరిహారం అందజేయలేదని గ్రామస్తులు అంటున్నారు. రౖడైనేజీ వ్యవస్థ లేదు.. పునరావాస కాలనీలో వసతులు లేవు. డ్రైనేజీ వ్యవస్థ లేక వాడుక నీటితో పాటు చిన్నపాటి వర్షాలకు ఎక్కడికక్కడే నీరు నిలిచిపోతోంది. ఇల్లు చుట్టూ నీరు చేరి బురదమయంగా మారుతోంది. ఈగలు, దోమలకు నిలయంగా మారడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. పునరావాస కాలనీలో గుడి నిర్మాణం చేపట్టాలి. ఇప్పటికై నా అధికారులు స్పందించాలి. – గిన్ని శ్యామ్సుందర్రావు, విష్ణుచక్రం గ్రామం, సంతబొమ్మాళి మండలం ఇబ్బంది పడుతున్నాం.. పునరావాస కాలనీలో వసతులు లేక ఇబ్బందులు పడుతున్నాం. మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఆరు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి. మట్టివేసి ఎత్తు చేయకపోవడంతో చిన్నపాటి వర్షాలకే ఇళ్ల చుట్టూ నీరు నిల్వ ఉండి చెరువులను తలపిస్తున్నాయి. అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలి. – గిన్ని ముత్తమ్మ, విష్ణుచక్రం గ్రామం, సంతబొమ్మాళి మండలం విష్ణుచక్రం నిర్వాసిత కాలనీలో కనీస సౌకర్యాలు కరువు మూలపేట పోర్టు కోసం సర్వం వదులుకున్న గ్రామస్తులు కాలువలు, తాగునీరు వంటి సదుపాయాలు లేక ఇక్కట్లు పట్టించుకోని కూటమి సర్కారు -
పాపం.. ఎంటీఎస్ టీచర్లు!
శ్రీకాకుళం న్యూకాలనీ: ఎన్నో అవాంతరాలు, ఆవేదనలు, ఆక్రందనల నడుమ జిల్లాలో ఎట్టకేలకు మినిమం టైమ్ స్కేల్(ఎంటీఎస్) టీచర్లకు సర్దుబాటు బదిలీ కౌన్సెలింగ్ పూరయ్యింది. పాఠశాలలు పునఃప్రారంభమై రెండు వారాలు కావొస్తున్నా.. ఇప్పటికీ ఎంటీఎస్ టీచర్లకు పోస్టింగులు ఇవ్వకపోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున నేపథ్యంలో ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం మొద్దునిద్ర వీడింది. ఇటీవల ఉపాధ్యాయ సాధారణ బదిలీల్లో సమీప ప్రాంతాల్లోని స్కూళ్లలో పోస్టులను ఎంపికచేసుకున్నారు. దీంతో జిల్లా సరిహద్దు ప్రాంతాలు, సదూర ప్రాంతాల్లోని పాఠశాలల్లో మాత్రమే పోస్టులు ఖాళీగా మిగిలాయి. దీంతో గత్యంతరం లేక ఆ పోస్టులనే ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమకు వచ్చే అరకొర జీతాలతో.. సుదూరంతాలకు రాకపోకలు ఎలా సాగించగలమని, ఎలా పనిచేయగలమని వారంతా ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 371 మందికి కౌన్సెలింగ్ పూర్తి.. జిల్లాలో 1998, 2008 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్లకు బదిలీ కౌన్సెలింగ్ ముగిసింది. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శ్రీకాకుళం ప్రభుత్వ ఉన్నత పాఠశాల వేదికగా అదివారం ఉదయం 8 గంటలకు మొదలుకావాల్సిన ఈ ప్రక్రియ మధ్యాహ్నం వరకు ప్రారంభం కాలేదు. సాంకేతిక సమస్యల కారణంగా జాప్యం జరిగిందని అధికారులు చెబుతున్నారు. మధ్యాహ్నం మొదలైన కౌన్సెలింగ్ ప్రక్రియ రాత్రి 7.30 గంటల వరకు కొనసాగింది. ఉదయం 8 గంటలకే పాఠశాల ప్రాంగణానికి చేరుకున్న ఎంటీఎస్ టీచర్లు నానా అవస్థలు పడ్డారు. ప్రస్తుతం పాఠశాల్లో ఖాళీలు బట్టి వీరికి స్థానాలు ఖరారు చేశారు. జిల్లాలో 1998 డీఎస్సీ బ్యాచ్కు చెందిన 261 మంది, 2008 డీఎస్సీ బ్యాచ్ 110 మంది కలిపి మొత్తం 371 మంది ఎంటీఎస్ టీచర్లు పనిచేస్తున్నారు. వీరందరికీ కౌన్సెలింగ్ పూర్తిచేశారు. ఇద్దరు గైర్హాజరైనప్పటికీ.. వారికి ఫోన్లోనే పలు స్కూళ్ల ఖాళీలను తెలియజేసి కౌన్సెలింగ్ కానిచ్చారు. జిల్లాలో 371 మందికి 410 ఖాళీ పోస్టులను చూపించారు. మాన్యువల్ పద్ధతిలో జరిగిన ఈ కౌన్సెలింగ్ ప్రక్రియను డీఈఓ డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య, శ్రీకాకుళం ఉప విద్యాశాఖాధికారి ఆర్.విజయకుమారి తదితరులు పర్యవేక్షించారు. విభజించి.. పాలించేలా.. ఎంటీఎస్ టీచర్ల పరిస్థితి ముందుగొయ్యి.. వెనుక నుయ్యి అన్న చందంగా తయారైంది. వారిలో వారికే తగాదాలు సృష్టించి.. విభజించి, పాలించూ అన్న చందంగా తయారుచేసింది కూటమి ప్రభుత్వం. గ్రూపు తగాదాలు సృష్టించి, తారతమ్యాలు వచ్చేలా చేసింది. తమకే ముందు కౌన్సెలింగ్ నిర్వహించాలని ఈ రెండు బ్యాచ్ల ఉపాధ్యాయులు పట్టుబట్టడంతో గందరగోళం నెలకొంది. దీంతో కొన్ని గంటలసేపు కౌన్సెలింగ్ నిలిచిపోయింది. వాస్తవానికి ప్రభుత్వం 2008 డీఎస్సీ ఎంటీఎస్లకే మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. వాస్తవ నేపథ్యం అందుకు భిన్నంగా ఉంది. 1998 బ్యాచ్ ఎంటీఎస్లే సీనియారిటీలో ముందుంటారనేది వారి వాదన. మొత్తమ్మీద విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నిర్వహించి చివరకు 2008 ఎంటీఎస్లకు, ఆ తరువాత 1998 ఎంటీఎస్ ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఎంటీఎస్ టీచర్ల ఇంటి చిరునామాకు సమీపంలోగానీ, వారి మండల పరిధిలోని పాఠశాలల్లో పోస్టింగులు ఇచ్చి బాసటగా నిలిచారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం సుదూర ప్రాంతాలకు బదిలీలు చేయడంతో వారంతా లబోదిబోమంటున్నారు. ఉన్న చోటు నుంచి సుదూర ప్రాంతాలకు బదిలీ అరకొర జీతాలతో అంతదూరం వెళ్లి ఎలా పనిచేయగలమని ఆవేదన న్యాయం చేయాలని వేడుకోలు జిల్లాలో 371 మందికి కౌన్సెలింగ్ పూర్తి -
వైభవంగా కూర్మనాథుని జయంతి
గార: శ్రీకూర్మనాథుని జయంతోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఏటా జ్యేష్ఠ శుద్ధ బహుళ ద్వాదశి నాడు ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉదయం జరిగిన పూజా కార్యక్రమంలో మూలవిరాట్కు వేకువజామున పంచామృతాభిషేకం జరిగింది. బాలభోగం అనంతరం స్నపన తిరుమంజనం సేవ నిర్వహించి ప్రధాన కలశాన్ని దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. బేడా మండపంలో ప్రధానార్చకులు చామర్తి సీతారామనృసింహాచార్యులు ఆధ్వర్యంలో రుత్వికులు ఉత్సవమూర్తికి వసంత కలశాభిషేకం వైభవంగా నిర్వహించారు. స్వామివారికి శీతల నైవేద్యం సమర్పించారు. శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వాములను అనివెట్టి మండపంలో వేంచింపజేసి ధర్మకర్త గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆస్థాన మంటపంలో తీర్థ జలాలు, క్షీరాభిషేకం, కుంకుమలతో అభిషేకం నిర్వహించారు. స్వామికి నూతన వస్త్రాలంకరణ జరిపి కూర్మనాథుని ఆవిర్భావ చరిత్ర వివరించారు. అనంతరం మంగళాశాసనం, ప్రసాద వితరణ జరిగింది. కార్యక్రమంలో ఈవో కె.నరసింహనాయుడు, స్థానాచార్యులు శ్రీభాష్యం పద్మనాభాచార్యులు, దాసుబాబు, శ్రీనివాసాచార్యులు, లక్ష్మణాచార్యులు, కిషోర్బాబు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ప్రైవేటు స్కూల్ టీచర్ మృతి
శ్రీకాకుళం రూరల్: శ్రీకాకుళం కొత్త రోడ్డు జంక్షన్ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పలాసకు చెందిన జి.కాంతారావు (28) అంపోలు సమీపంలోని కేశవరెడ్డి స్కూల్లో పీఈటీగా పనిచేస్తున్నారు. వ్యక్తిగత పనిమీద మిత్రుడితో కలిసి నరసన్నపేట నుంచి శ్రీకాకుళం ద్విచక్ర వాహనంపై వస్తుండగా కొత్త రోడ్డు జంక్షన్ వద్ద ఓ బిచ్చగాడు అడ్డంగా రావడంతో డివైడర్ను ఢీకొట్టారు. ఈ ఘటనలో కాంతారావు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న శ్రీకాకుళం రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని రిమ్స్ ఔట్ పోస్టుకు తరలించారు. -
● ఫీజు రీయింబర్స్మెంట్ ఏదీ..?
ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల కోసం వేలాదిగా విద్యార్థులు నిరీక్షిస్తున్నారు. ఈ రెండింటిపైనే ఆధారపడి చదువుకుంటున్న వారి సంఖ్య జిల్లాలో వేలలో ఉంది. వీరిని కూటమి సర్కారు ఘోరంగా వంచించింది. 2023–24 విద్యా సంవత్సరంలో జిల్లాలో ఉపకార వేతనం, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం 45,657 మంది విద్యార్థులకు ఒక విడత రూ.34 కోట్లు గత ప్రభుత్వం విడుదల చేసింది. తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం మూడు విడతలకు సంబంధించి రూ.107 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉండగా.. దీనిపై మాటైనా మాట్లాడడం లేదు. 2024–25 విద్యా సంవత్సరంలో జిల్లాలో 47,153 మంది వివిధ కోర్సుల్లో చదువుతున్నారు. వీరికి కూడా నాలుగు విడతల్లో డబ్బులు వేయాలి. ఒక విద్యా సంవత్సరం ముగిసి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనా పాత బకాయిల ఊసు లేదు. కేవలం ఒక విడత మాత్రమే విడుదల చేసి మూడు విడతల డబ్బు బకాయి పెట్టారు. దీంతో చదువులు పూర్తి చేసిన విద్యార్థులు సర్టిఫికెట్లు తెచ్చుకోవడానికి పూర్తి డబ్బు చెల్లించాల్సి వస్తోంది. పన్నెండు నెలలు గడిచిపోయాయి.. ఒక్క ఉద్యోగమూ ఇవ్వలేదు. 365 రోజులు అయిపోయాయి. నిరుద్యోగ భృతి ఊసే లేదు. ఒక విద్యా సంవత్సరం ముగిసిపోయింది. విద్యా దీవెన, వసతి దీవెన విధివిధానమేంటో ఎవరికీ తెలీదు. కూటమి ఏడాది పాలనలో యువత ఘోరంగా మోసపోయింది. ఎన్నికల సమయంలో ఉద్యోగాలు, నిరుద్యోగ భృతిపై ఊరూరా తిరిగి ప్రచారం చేసిన కూటమి నాయకులు.. ఇప్పుడు ఆ మాటెత్తడానికి కూడా ఇష్టపడడం లేదు. యువత సమస్యలపై గళమెత్తడానికి వైఎస్సార్సీపీ సిద్ధమైంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి యువత పోరును నిర్వహించనుంది. నరసన్నపేట: కూటమి ప్రభుత్వం యువతకు వెన్నుపోటు పొడిచిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. యువత పక్షాన నిలుస్తూ వారికి జరుగుతున్న అన్యాయాలను ప్రభు త్వం దృష్టికి తీసుకువెళ్లడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందని, అందులో భాగంగా సోమవారం జిల్లా కలెక్టరేట్ వరకూ శాంతి ర్యాలీ నిర్వహించి కలెక్టర్కు వినతి పత్రం ఇస్తామన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లా కేంద్రం శ్రీకాకుళంలో ఉదయం 10 గంటలకు జ్యోతీరావు పూలే విగ్రహం వద్దకు కార్యకర్తలు యువకులు, నిరుద్యోగ యువత చేరుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు యువతకు బోలెడు హామీలిచ్చిన చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ అధికారంలోకి వచ్చాక ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని కృష్ణదాస్ విమర్శించారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన వారు ఏడాది పాలనలో ఒక్క ఉద్యోగం ఇవ్వక పోగా వేలాది మంది చిరుద్యోగులను తొలగించారని అన్నారు. నిరుద్యోగ భృతి నెలకు రూ. 3 వేలు ఇస్తామంటూ వాగ్దానం చేశా రని, ఒక్కరికై నా ఇచ్చారా అని ప్రశ్నించా రు. కూటమి నాయకులు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకూ యువతకు మద్దతుగా వైఎస్సార్ సీపీ ఉంటుందన్నారు. సోమవారం యువత పోరులో అందరూ పాల్గొనాలని పిలుపు నిచ్చారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: యువతను అధికార పక్ష నాయకులు నమ్మించి మోసం చేశారు. ఎన్నికల ముందు మాటలు కోటలు దాటించి.. అధికారం దక్కాక హామీలు మర్చిపోయారు. యువతకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయకుండానే కూటమి ప్రభుత్వం ఏడాది గడిపేసింది. ● విద్యా దీవెన, వసతి దీవెన కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు ● ఏడాది పాలనలో ఊసే లేని నిరుద్యోగ భృతి ● ఒక్క ఉద్యోగమూ ఇవ్వని కూటమి ● హామీలకు, అమలుకు పొంతన లేకుండా పాలన ● కొలువులేమయ్యాయి..? ఏటా నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కూటమి నాయకులు ఎన్నికల ముందు హామీలిచ్చారు. ఈ ఏడాదిలో ఒక్కటంటే ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. కనీసం కాంట్రాక్టు ఉద్యోగం కూడా ఇవ్వలేదు. దీనిపై జిల్లా యువత మండిపడుతున్నారు. ● జాబ్ క్యాలెండర్ గుర్తుందా..? ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని యువగళం పాదయాత్రలో నారా లోకేష్ హామీ ఇచ్చారు. వీడియో రికార్డు చేసుకోండి.. రాసి పెట్టుకోండి.. అని గొప్పలకు పోయారు. కానీ 2025 జనవరి దాటి జూన్ వరకు వచ్చేశాం. కానీ జాబ్ క్యాలెండర్ మాటే ఆయనకు గుర్తు రాలేదు. కనీసం కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల జోలికి కూడా పోలేదు. డీఎస్సీ ప్రకటించినా వివాదాలు వీడడం లేదు. వైఎస్ జగన్ హయాంలో ఉద్యోగాల విప్లవమే వచ్చింది. 2019–24 మధ్య సచివాలయం ఉద్యోగాలు, పోలీస్, పాత డీఎస్సీలతో టీచర్ల పోస్టులు భర్తీ చేశారు. ● నిరుద్యోగ భృతి నిరుద్యోగ యువతను వంచించడంలో చంద్రబాబు రికార్డులు సృష్టిస్తున్నారు. 1999 నుంచి 2024 వరకు ఎన్నికల వేళ అధికారం కోసం ఉద్యోగాలు ఇస్తా లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పడం ఆయనకే చెల్లింది గత ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం, లేకుంటే ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని పోస్టర్లు వేసి మరీ ప్రచారం చేశారు. పాలనలో రెండో ఏడాదికి చేరినా భృతిపై ఎక్క డా ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడుతున్నారు. నేడే యువత పోరు యువతకు కూటమి వెన్నుపోటు పొడిచింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ -
అన్న చేతిలో తమ్ముడు హతం
నందిగాం: ఆర్థిక కారణాలు మానవ బంధాలను ధ్వంసం చేస్తున్నాయి. ఆస్తి కోసం అన్న తన సొంత తమ్ముడినే కొట్టి చంపిన ఘటన నందిగాం మండలం బోరుభద్ర పంచాయతీ కామధేనువు గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే..గ్రామానికి చెందిన కిల్లి లక్ష్మణనాయుడు, ఊర్మిల దంపతులకు ముగ్గురు కుమారులు ధర్మారావు, నీలకంఠం, తవిటయ్యతో పాటు ఒక కుమార్తె రమాదేవి ఉన్నారు. అందరికీ వివాహా లు చేశారు. తమ పోషణ కోసం కొంత భూమిని ఉంచుకొని మిగతా పొలం ముగ్గురు కుమారులకు పంచిపెట్టారు. అయితే తనకు ఎక్కువ భూ మి కావాలని ధర్మారావు తన తండ్రితో గొడవ పడుతూ ఉండేవాడు. పెద్దవాడైన ధర్మారావు మండలంలోని నౌగాంలో భార్యతో నివాసం ఉంటూ, నర్సిపురంలో వెల్డింగ్ షాపు పెట్టుకొని పనిచేస్తూ, అప్పుడప్పుడు కామధేనువు వచ్చి తన వాటా పొలంలో వ్యవసాయ పనులు చేసేవాడు. రెండో వాడైన నీలకంఠం తిరుపతిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా అతని భార్య గ్రామంలో ఉంటుంది. చిన్నవాడైన తవిటయ్యకు వివాహం అయినప్పటికీ భార్యతో విడాకులు కావడంతో తల్లిదండ్రులతో కలిసి కామధేనువులోనే ఉంటున్నాడు. పీజీ వరకు చదివిన తవిటయ్య గతంలో పలు ప్రైవేటు కాలేజీల్లో లెక్చరర్గా పనిచేసే వాడు. కానీ ప్రస్తుతం వ్యవసాయం చేసుకుంటూ గ్రామంలోనే ఉంటున్నాడు. అయితే పొలం వాటాలు పంచుకున్నప్పటికీ తల్లిదండ్రులు చిన్నవాడి దగ్గర ఉండటంతో వారి వాటా కూడా చిన్నవాడికి వెళ్లిపోతుందనే అపోహతో పలు మార్లు ధర్మారావు తండ్రి, తమ్ముడితో గొడవ పడేవాడు. ఈ గొడవల నేపథ్యంలో కలెక్టర్ గ్రీవెన్స్లో అర్జీ పెట్టడంతో వారు తహసీల్దార్ను పంపించారు. తహసీల్దార్ పంచాయతీ చేసి పెద్దల సమక్షంలో పంచుకోవాలని సూచించినా ధర్మారావు ఒప్పు కోలేదు. దీంతో తండ్రి ఎకరా 28 సెంట్లు అతని పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. ప్రస్తుతం వ్యవసాయ సీజన్ కావడంతో నీలకంఠం భార్య రాములమ్మ ఆదివారం తన భర్త వాటాగా వచ్చి న పొలంలో విత్తనాలు వేయిస్తుండగా ధర్మా రావు వచ్చి అడ్డుకొని గొడవకు దిగాడు. దీంతో చిన్న తమ్ముడు తవిటయ్య వదినతో గొడవ ఎందు కని అడగ్గా ఆవేశంతో తమ్ముడి తలపై గడ్డపారతో కొట్టడంతో అతడుఅక్కడికక్కడే కు ప్పకూలిపోయాడు. అనంతరం ధర్మారావు అక్క డి నుంచి పారిపోయాడు. వదిన రాములమ్మ ఇచ్చిన సమాచారంతో 108 టెక్కలి జిల్లా కేంద్రాస్పత్రికి తవిటయ్యను తరలించారు. అయితే తీవ్ర రక్తస్రావంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నీలకంఠం భార్య రాములమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో నందిగాం ఎస్ఐ మహమ్మద్ అలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు
అరసవల్లి, శ్రీకాకుళం న్యూ కాలనీ: కేంద్ర, రాష్ట్ర పర్యాటక శాఖల ఆధ్వర్యంలో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ, ఆప్టెడ్ న్యూట్రిషన్ కేంద్రం (తిరుపతి)లో పలు హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి గల వారి నుంచి దరఖాస్తుల ను ఆహ్వానిస్తున్నట్లుగా జిల్లా పర్యాటక శాఖా ధికారి ఎన్.నారాయణరావు, తిరుపతి కేంద్ర అడ్మిషన్ ఇన్చార్జి కె.శివరామకృష్ణ సంయుక్తంగా తెలియజేశారు. గురువారం ఓ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 2025–26 విద్యాసంవత్సరానికి బీఎస్సీ (హెచ్హెచ్ఎ) మూడేళ్ల కాలపరిమితి కోర్సునకు ఇంటర్ 40 శాతం మించిన మార్కు లు సాధించిన అభ్యర్థులు అర్హులని, అలాగే క్రాఫ్ట్ కోర్సు ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ అండ్ పెటిసరీ (సిసిఎఫ్పిపి) కోర్సునకు, అలాగే సర్టిఫికెట్ కోర్సు ఇన్ ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్ (సిసిఎఫ్బిఎస్) కోర్సుల్లో చేరేందుకు కనీస అర్హతగా 10వ తరగతి అని పేర్కొన్నారు. తిరుపతి కేంద్రంగా నిర్వహిస్తున్న ఈ కోర్సుల్లో ఆసక్తి గల అభ్యర్థులకు బ్యాంకు రుణ సదుపాయం కూడా ఉందని, వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎస్ఐహెచ్ఎంటిపిటి.ఓఆర్జి వెబ్సైట్ను సంప్రదించాలని మరిన్ని వివరాలకు 9701343846, 9700440604 నంబర్లకు సంప్రదించాలని, పూర్తి చేసిన దరఖాస్తులను వచ్చే నెల 4వ తేదీలోగా తిరుపతి కేంద్రానికి చేరేలా పంపించాలని కోరారు. జూలై 9 సార్వత్రిక సమ్మెకు ‘పెన్షనర్ల ఐక్యవేదిక’ మద్దతు శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెకు పెన్షనర్లు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు స్థానిక ఎన్జీఓ హోమ్లో ఆదివారం వివిధ పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో కన్వీనర్ ఎం.ఆదినారాయణమూర్తి మాట్లాడుతూ ఉద్యోగులకు, కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్లను ఉపసంహరించాలని డిమాండ్ చేశా రు. సుదీర్ఘ పోరాటం చేసి కార్మికులు సాధించుకున్న 44 కార్మిక చట్టాలు రద్దు చేయడం ఉద్యోగులు, కార్మికులకు తీవ్ర నష్టం చేయడమే అన్నారు. ప్రభుత్వం అమలు చేయదలుచుకు న్న పని గంటల పెంపు, మహిళలకు నైట్ షిఫ్ట్ లు, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్ విధానం, జాతీయ ఆస్తులను ప్రైవేటీకరణ తదితర విధానాలు ఉద్యోగులు, కార్మికులు, సామాన్య ప్రజలకు నష్ట దాయకమని ఫలితంగా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని అన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా పెన్షనర్లు తమ నిరసన తెలియజేస్తూ జూలై 9 సమ్మెకు మద్దతు తెలియజేయడానికి నిర్ణయించుకున్నారని తెలియజేశారు. సమావేశంలో వివిధ సంఘాల నాయకులు వీఎస్ఎస్ కేశవరావు(శ్యామ్) (రాష్ట్ర ప్రభుత్వం), డి.పార్వతీశం (ఎడ్యుకేషన్), ఎం.గోవర్ధన్ రావు (బిఎస్ఎన్ఎల్ ), కె.చంద్రశేఖర రావు, కె.వెంకటరావు (పోస్టల్), ఎం.ప్రభాకర్ రావు (ఎల్ఐసి), పి.సుధాకర రావు (బ్యాంక్ ), ఎస్.వెంకటరావు(రాష్ట్ర ప్రభుత్వం) తదితరులు పాల్గొన్నారు. భారీగా పోలీసులకు స్థానచలనం శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా పోలీస్ శాఖలో ఐదేళ్లకు పైగా ఒకే చోట పాతుకుపోయిన ఉద్యోగుల పీఠం ఎట్టకేలకు కదిలినట్టు సమాచారం. రాష్ట్ర డీజీపీ హరీష్కుమార్ గుప్తా ఉత్తర్వులతో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం ఏఎస్ఐలు, హెడ్కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లకు కౌన్సిలింగ్ ప్రక్రియ జరిగింది. జిల్లావ్యాప్తంగా 221 మంది స్థానచల నం చెందగా వీరిలో 19 మంది ఏఎస్ఐలు, 53 మంది హెచ్సీలు, మిగతావారిలో కానిస్టేబు ళ్లు, ఎస్టీఎఫ్ పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది. కాశీబుగ్గ సబ్డివిజన్ పరిధిలో విధులు నిర్వర్తించిన వారికి రెండు చోట్ల (శ్రీకాకుళం, కాశీబుగ్గ) కౌన్సిలింగ్లో అవకాశం ఇవ్వగా వారిలో ఎక్కువ శాతం అదే డివిజన్లో వేరే చోట ఉండేందుకు ఇష్టపడ్డారు. టెక్కలి సబ్ డివిజన్ వారికి ఇలానే అవకాశం వచ్చిన ట్టు భోగట్టా. శ్రీకాకుళం సబ్డివిజన్ పరిధిలో ఉన్నవారికి మాత్రం కాశీబుగ్గ సబ్డివిజన్ పరిధి దూరప్రాంతాలకు బదిలీ చేయడంతో అంతా ఆవేదన చెందుతున్నారు. విద్యాసంస్థలు తెరిచి పిల్లలకి ఇప్పటికే నిర్ణయించిన స్కూళ్లు, కళాశాలలకు ఫీజులు కట్టి.. పుస్తకాలు కొనేయడంతో కుటుంబాలతో ఏం చేయాలో తెలియని స్థితి అంటూ ఏకరువు పెడుతుండటం విశేషం. -
‘జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలి’
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యారంగాన్ని నాశనం చేసే విధానాలను మానుకోవాలని, ఎన్ఈపీ–2020 రద్దు చేయాలని వక్తలు డిమాండ్ చేశారు. కేరళలో జరగనున్న ఎస్ఎఫ్ఐ 18వ అఖిలభారత మహాసభల సందర్భంగా ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో కూడా ఎస్సార్ జూనియర్ కాలేజ్లో విద్యాసదస్సు నిర్వహించారు. తొలుత ఎస్ఎఫ్ఐ జెండాను ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సీహెచ్ వెంకటేష్ ఆవిష్కరించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు పి.పవిత్ర అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు ముఖ్య వక్తలుగా డిప్యూటీ డీఈఓ కొత్తకోట అప్పారావు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సీహెచ్ వెంకటేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి.చందు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో వి ద్యారంగంలో వచ్చే సమస్యలపై నిస్వార్థంగా పోరాటం చేసే ఏకై క విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ మాత్రమేనని అన్నారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు విద్యావ్యతిరేక విధానాలు తీసుకొస్తున్నాయని, ప్రధానంగా నూతన జాతీయ విద్యావిధానం పేరు తో విద్యను పూర్తిగా కాషాయీకరణ, కార్పొరేటీకరణ చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కె. ఖగేష్, జిల్లా ఉపాధ్యక్షులు సీహెచ్ రాజు, జిల్లా కమిటీ సభ్యులు జైరాం, టౌన్ కమిటీ మెంబర్స్ భరత్, శివ తదితరులు పాల్గొన్నారు. -
రన్.. అదిరెన్
శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళంలో ఒలింపిక్ డే రన్ ఆదివారం ఉత్సాహంగా సాగింది. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్, జిల్లా క్రీడాప్రాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఒలింపిక్ డే రన్ను ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ జెండా ఊపి ప్రారంభించారు. శ్రీకాకుళం మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎంవీ పద్మావతి క్రీడాజ్యోతిని వెలిగించారు. నగరంలోని పొట్టి శ్రీరాములు జంక్షన్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ పాతబస్టాండ్ నుంచి వైఎస్సార్ సర్కిల్, పాలకొండా రోడ్, డే అండ్ నైట్ జంక్షన్, అంబేడ్కర్ జంక్షన్ మీదుగా కోడిరామ్మూర్తి స్టేడియం ప్రాంగణం వరకు సాగింది. యువ, వర్ధమాన క్రీడాకారులతోపాటు క్రీడాసంఘాల ప్రతినిధులు, క్రీడాభిమానులు, పీడీలు, కోచ్లు, వెటరన్ ఆటగాళ్లు పాల్గొన్నారు. విశ్వవ్యాప్త గుర్తింపు క్రీడాకారులకే సొంతం: దాసన్న అనంతరం కోడిరామ్మూర్తి స్టేడియం ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సమావేశంలో క్రీడాకారులను ఉద్దే శించి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడారు. క్రీడలు చదువులో భాగంగానే చూడాలనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలని సూచించారు. జిల్లాలో క్రీడాకారుల ప్రతిభకు కొదవలేదని, వారిని మరింతగా ప్రోత్సహించాలన్నారు. ఈరోజు విశ్వవ్యాప్తంగా గుర్తింపు, గౌరవం దక్కేది క్రీడాకారులకేనని పేర్కొన్నారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా అధ్యక్షుడు కొన్న మధుసూదనరావు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా క్రీడాకారుల ఖిల్లాగా గుర్తింపు పొందిందని, వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వంతోపాటు దాతలు సైతం ముందుకు రావాలని కోరారు. కోడిరామ్మూర్తి స్టేడియం పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తిచేసి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలని వక్తలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎంవీ పద్మావతి, డీఎస్డీఓ డాక్టర్ కె.శ్రీధర్రావు, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సాంబమూర్తి, సీఈఓ పి.సుందరరావు మాస్టారు, ఎండీ కాసీంఖాన్, చిట్టి నాగభూషణం, కేఎన్ఎస్వీ ప్రసాద్, జిల్లా పీఈటీ సంఘ అధ్యక్షుడు ఎంవీ రమణ, ఎస్జీఎఫ్ కార్యదర్శి బీవీ రమణ, గ్రిగ్స్ జిల్లా కార్యదర్శి కె.మాధవరావు, చల్లా జగదీష్, శ్రీనివాసరావు, గాలి అర్జున్రావురెడ్డి, ఆనంద్కిరణ్, భాస్కరరావు, సతీ ష్రాయుడు, రవికుమార్, వెంకటరమణ, ఆనంద్, లక్ష్మీనారాయణ, డీఎస్ఏ కోచ్లు, పీడీ, పీఈటీలు, క్రీడాసంఘాల ప్రతినిధులు, వాకర్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. ముఖం చాటేసిన అధికార పార్టీ నాయకులు ఒలింపిక్ డే రన్కు కూటమి పార్టీల నాయకులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మరోసారి దూరంగా ఉన్నారు. గతంలో 2014–18 మధ్య కాలంలోనూ టీడీపీ నాయకులు ఇదే వైఖరి అవలంబించారు. దీనిపై క్రీడాకారులు, క్రీడాభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉత్సాహంగా ఒలింపిక్ డే రన్ పాల్గొన్న క్రీడా సంఘాల నాయకులు, క్రీడాభిమానులు, అధికారులు, పీడీలు, ప్లేయర్లు ముఖం చాటేసిన పాలకపక్ష నాయకులు, ప్రజాప్రతినిధులు -
విద్యా శాఖ.. వింత పోకడ
● ఒక వైపు పాఠశాలల్లో తరగతుల విలీనంతో రగడ ● మరోవైపు ఏక ఉపాధ్యాయులతో బడుల్లో అవస్థలు ● ఇంతలో నేటి నుంచి ‘సాల్ట్’ పేరిట ఎస్జీటీలకు శిక్షణ తరగతులు శ్రీకాకుళం న్యూకాలనీ: విద్యా శాఖ వింత పోకడలు పోతోంది. ఇప్పటికే ఒకవైపు పాఠశాల విద్యాశాఖలో.. బడుల్లో తరగతుల విలీనం పంచాయితీ రచ్చ లేపుతోంది. మరోవైపు ఏక ఉపాధ్యాయులతో బడు లు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ఇంకొంతమంది బదిలీలు జరిగినప్పటికీ ఇప్పటికీ విధుల్లో చేరలే దు. ఇంతలోనే సెకండరీ గ్రేడ్ టీచర్లకు వృత్యంతర శిక్షణ పేరిట వారం రోజులపాటు శిక్షణ తరగతుల కు సన్నాహాలు చేశారు. సోమవారం నుంచి మొదలయ్యే పాఠశాల విద్య– సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ర్మేషన్ (ఎస్ఏఎల్టీ) ప్రొగ్రాం నిర్వహణ కు విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీకాకుళం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నాన్ రెసిడెన్షియల్ విధానంలో ఈనెల 23 నుంచి మొదలయ్యే ఈ మొదటి స్పెల్ శిక్షణ తరగతులు ఈనెల 28వ తేదీ వరకు ఆరు రోజులపాటు కొనసాగనున్నాయి. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో శిక్షణా..? పాఠశాల విద్యను బలోపేతం చేయడానికి, నాణ్యమైన విద్యను అందించడానికి, అభ్యాస ఫలితాలను మెరుపర్చడానికి, ఉపాధ్యాయులు బోధనా నైపుణ్యాలను పెంచడానికి సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అనే కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రాథమికస్థాయిలో అనగా పునాది అభ్యసనాన్ని బలోపేతం చేయడం, ఉపాధ్యాయ–విద్యార్థి పరస్పర సంబంధాలను, బోధన నైపుణ్యాలను మెరుగుపర్చడం, సంస్థాగత సామర్థ్యాలను పెంచడం కోసం సెకెండరీ గ్రేడ్ టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణకు అనువైన సమ యం ఇది కాదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్లు లేక వెలవెల.. ఇప్పుడిప్పుడే బడిబాట పడుతున్న ఉపాధ్యాయుల కు, కొత్త స్కూళ్లతో పరిచయాలు లేకపోవడం, మరోవైపు అడ్మిషన్లపై దృష్టి పెట్టే సమయం లేకపోవడంతో పాఠశాలలు బోసిపోతున్నాయి. పాఠశాలలకు సమీప ప్రాంతాల్లోని గ్రామాల్లో ఉపాధ్యాయులు అడ్మిషన్ డ్రైవ్ల కోసం క్యాంపెయినింగ్లు చేసే అవకాశం కూడా ఇవ్వకపోవడంతో ఈ ఏడాది గణనీయంగా అడ్మిషన్లు తగ్గిపోయాయి. కొన్నిచోట్ల వెలవెలబోతున్నాయి. దీనికితోడు 3,4,5 తరగతులు, 6,7,8 తరగతులు సమీప ప్రాంతాల్లోని పాఠశాలల్లో విలీనం చేయడంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ బడుల్లో చదువులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ఏక ఉపాధ్యాయ బడుల్లో తీరు మరీ అధ్వానం తయారైందంటే అతిశయోక్తి కాదు. -
● ఫీజుల బాదుడు
కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రైవేటులో ఫీజుల బాదుడు పెరిగింది. ఏడాది కాలంలో సగటున 10 నుంచి 30 శాతం పైగా స్కూల్ ఫీజులు పెంచేయడంతో మధ్య తరగతి జనం తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది ఓ కార్పొరేట్ స్కూల్లో 3వ తరగతి ఫీజు రూ.45 వేలు ఉంటే, ఇప్పుడు రూ.55 వేలకు పెరిగింది. పుస్తకాల ధర రూ.7 వేల నుంచి రూ.8,500కి చేరింది. ఏడాది కాలంలో వందకుపైగా కొత్త ప్రైవేట్ స్కూళ్లకు విద్యాశాఖ అనుమతి ఇచ్చినట్టు అంచనా. సాధారణ బడ్జెట్ పాఠశాలల్లో ఒకటో తరగతికి రూ.12 వేలు ఫీజు, పుస్తకాలకు మరో రూ.3 వేలు వసూలు చేస్తుండగా, ఆరో తరగతికి రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు తీసుకుంటున్నారు. పుస్తకాలకు మరో రూ.5 వేలు వెరసి రూ.30 వేలు అవుతోంది. కార్పొరేట్ పాఠశాలలు నాన్ ఏసీ, ఏసీ తరగతులు అంటూ ఫీజులు బాదుతుండడం గమనార్హం. -
●జాబ్మేళా రేపు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఈ నెల 23న ఎచ్చెర్లలోని టీటీడీసీలో జాబ్మేళా నిర్వహించనున్నట్లు డీఆర్డీఏ పీడీ కిరణ్కుమార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫైనాన్స్ లిమిటె డ్ కంపెనీలో బ్రాంచి మేనేజర్ పోస్టులు 8 ఉన్నాయని, ఎంపికై న వారు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. 18–35 ఏళ్ల వయసు గల సీ్త్ర, పురుష అభ్యర్థులు అర్హులని ఎంబీఏ, మార్కెటింగ్ ప్రత్యేక సబ్జెక్టు కలిగి ఉండాలని తెలిపారు. ఇంటర్వ్యూలు సోమవారం ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4 వరకు జరుగుతాయని పేర్కొన్నారు. -
శ్రీకాకుళం
ప్రయాణికుల కస్సు‘బస్సు’యోగాంధ్ర కారణంగా ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. సరిపడా సర్వీసులు లేక ఇక్కట్లు పడ్డారు. –8లోఆసనం వేస్తున్న కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విలీన గందరగోళం పాఠశాలల విలీనం గందరగోళం సృష్టిస్తోంది. పలు పాఠశాలలకు తాళాలు పడ్డాయి. –8లోఆదివారం శ్రీ 22 శ్రీ జూన్ శ్రీ 2025యోగా నిరంతర అభ్యాసం శ్రీకాకుళం కల్చరల్: యోగాను నిరంతర అభ్యాసంగా మార్చుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో శనివారం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ గత నెల 21 నుంచి జిల్లాలో 6500 ప్రదేశాల్లో యోగాసనాల శిక్షణ నిర్వహించామన్నారు. ఆర్ట్స్ కళాశాల మైదానంలో పడేసిన బాటిల్స్, పాలిథిన్ కవర్లు శుభ్రం చేశారు. మాదక ద్రవ్యాలకు అడ్డుకట్ట వేయాలని యువతకు సందేశం ఇచ్చారు. 1972 టోల్ఫ్రీ నంబరుకు వీటిపై సమాచారం ఇవ్వాలన్నా రు. కార్యక్రమంలొ జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ సంచాలకులు బి.శాంతిశ్రీ, జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె.అనిత, నెహ్రూయువ కేంద్రం ఉపసంచాలకులు వెంకట్ ఉజ్వ ల్, ఆయూష్ వైద్యులు జగదీష్, ఉత్తమరాజ్రాణా తదితరులు పాల్గొన్నారు. ● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ న్యూస్రీల్ -
‘యోగాంధ్ర కాదు.. ఉద్యోగాంధ్ర కావాలి’
నరసన్నపేట: రాష్ట్రాన్ని యోగాంధ్రగా కాదని ఉద్యోగాంధ్రగా మార్చాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మొజ్జాడ యుగంధర్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా ఏడాది గడిపేసిందని విమర్శించారు. వీరు శనివారం నరసన్నపేటలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ఒక వైపు అప్పులు చేస్తూ మరో వైపు గొప్పల కోసం తిప్పలు పడుతోందన్నారు. విశాఖలో యోగాంధ్ర పేరిట కోట్లాది రూ పాయలు వెచ్చించి ప్రజాధనం వృధా చేశారని మండిపడ్డారు. గిరిజన స్కూల్స్లో నాణ్యమైన విద్య, మంచి భోజనం అందించినప్పుడే యోగాంధ్ర లాంటి కార్యక్రమాలను చేపట్టాలని అన్నారు. మన జిల్లాలో నిరుద్యోగులకు ఎలా ఉపాధి కల్పిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే పరిస్థితి కొనసాగి తే యువత, నిరుద్యోగుల తరఫున ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. సమావేశంలో ఏఐవైఎఫ్ నాయకులు ఆర్. అరవిందు, వై. వేణు, జి. వసంతరావు తదితరులు పాల్గొన్నారు. -
‘ఆహ్వానించి అవమానించారు’
టెక్కలి: యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా టెక్కలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో యో గా దినోత్సవం కార్యక్రమానికి ఆహ్వానించి అ వమానించారని ఎంపీటీసీ సభ్యురాలు, యో గా నిర్వాహకురాలు సత్తారు ఉషారాణి ఆవేదన వ్యక్తం చేశారు. ముందు రోజు తమను ఆహ్వానించి కళాశాలలో యోగా దినోత్సవ కార్యక్రమానికి సహకరించాలని కోరారని, తీరా కళాశాలకు వెళితే...రాజకీయ పార్టీ పేరు ను ఆపాదించి అవమానించారని ఆమె వాపోయారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పీఎం, సీఎం ప్రకటనలు చేశారని ఇక్కడ మాత్రం ఆ పరిస్థితులు లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. యోగాంధ్రకు వెళ్లి వస్తూ.. రణస్థలం: మండలంలోని రణస్థలం జాతీయ రహదారిపై యోగాంధ్ర వెళ్లి వస్తుండగా గనగళ్ల నూకరాజు అనే వ్యక్తికి కోళ్ల వ్యాను ఢీకొని గాయాలయ్యాయి. జేఆర్ పురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. విశాఖ నుంచి శ్రీకాకుళం వైపు యోగాంధ్రకు వెళ్లిన రెండు బస్సుల్లోని వ్యక్తులు మండల కేంద్రంలోని గాయత్రి హాటల్ వద్ద భోజనాలకు దిగా రు. మధ్యాహ్నం 12.15 గంటల సమయంలో నూకరాజు రోడ్డు దాటుతుండగా శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వైపు వెళుతున్న కోళ్ల వ్యాను ఢీకొట్టి వెళ్లిపోయింది. నూకరాజుకు కాలు విరగడంతో అదే బస్సులో శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు హైవే సీసీ కెమెరాల సాయంతో వ్యాన్ను పట్టుకున్నారు. క్షత్రగాత్రుడి స్వగ్రామం శ్రీకాకుళం రూరల్ మండలంలోని పుక్కళ్లవానిపేట. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు జేఆర్ పురం ఎస్ఐ ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఏపీ పాలిసెట్ వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభం ఎచ్చెర్ల: ఏపీ పాలిసెట్ 2025 తొలివిడత వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ మండలంలోని కుశాలపురంలోని శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్ కళాశాలలో శనివారం ప్రారంభమైంది. తొలి రోజు ఒకటి నుంచి 15 వేలు ర్యాంక్ మ ధ్య విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించారు. పత్రాల పరిశీలన పూర్తి చేసుకున్న వారు 25వ తేదీ నుంచి కళాశాలలు, బ్రాంచ్ల ఎంపికకు వెబ్ ఆప్షన్లు ప్రారంభించనున్నారు. రెండో రోజు 15001 నుంచి 32000 ర్యాంక్ వరకూ గల విద్యార్థులు ధ్రువీకరణ పత్రాల పరిశీలనలకు హాజరు కావాలని అధికారులు తెలిపా రు. పాలిటెక్నిక్ కళాశాల ప్రధానాచార్యులు, సహాయ కేంద్రం జిల్లా సమన్వయకర్త డాక్టర్ కె.నారాయణరావు, సీనియర్ అధ్యాపకులు మురళీకృష్ణ పర్యవేక్షణలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియను నిర్వహించారు. హెచ్సీ జగదీష్ కుటుంబానికి సాయం సోంపేట: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ పి.జగదీశ్వరరావు కుటుంబానికి డెత్ రిలీఫ్ ఫండ్ కింద రూ.లక్ష నగదు చెక్కును పోలీస్ అసోసియేషన్ సభ్యులు శనివారం అందజేశారు. వీరు మృతుడు జగదీష్ స్వగ్రామం మండలంలోని ఎర్రముక్కాం గ్రా మం వెళ్లి సాయాన్ని అందించారు. జగదీష్ ఇచ్ఛాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించేవారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదే శాల మేరకు మృతుడు జగదీష్ కుటుంబ సభ్యులను శనివారం కలిసి రూ.లక్ష చెక్కును సతీమణి పుష్పలతకు జిల్లా పోలీసు యూని యన్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.కృష్ణంనా యుడు,ట్రెజరర్ కె.భుజంగరావులు అందజేసి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నేడు శ్రీకాకుళంలో ఒలింపిక్ డే రన్ శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా కేంద్రంలో ఒలింపిక్ డే రన్ ఆదివారం ఉదయం జరగనుంది. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సంయుక్తంగా ఏటా నిర్వహించే ఈ ఒలింపిక్ డే రన్ ర్యాలీ నేడు ఉదయం 6.30 గంటలకు శ్రీకాకుళం నగరంలోని పొట్టిశ్రీరాములు జంక్షన్ నుంచి మొదలుకానుంది. అక్క డ నుంచి కళింగరోడ్, వైఎస్సార్ సర్కిల్, పాలకొండ రోడ్, కృష్ణాపార్క్, డే అండ్ నైట్ జంక్షన్, అంబేడ్కర్ జంక్షన్ మీదుగా కోడిరామ్మూర్తి స్టేడియం వరకు సాగుతుంది. కార్యక్రమంలో క్రీడాభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ధర్మా న కృష్ణదాస్, ప్రధాన కార్యదర్శి ఎం.సాంబమూర్తి, సీఈఓ పి.సుందరరావు, డీఎస్డీఓ డాక్టర్ కె.శ్రీధర్రావు సంయుక్తంగా కోరారు. -
దుకాణాలు సర్దేశారు..!
ఆమదాలవలస రూరల్: ఆమదాలవలస బస్టాండ్ కు సమీపంలో ఏర్పాటు చేసిన రైతు బజార్ ఖాళీగా దర్శనమిస్తోంది. కొనుగోలుదారులు అంతగా రాకపోవటంతో రైతులు తమ దుకాణాలను పూర్తిగా ఖాళీ చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి నేరుగా విక్రయించుకునేందుకు గతంలో రైతు బజార్లను ఏర్పాటు చేశారు. ఆమదాలవలస రైతు బజారులో 48 దుకాణాలను ఏర్పాటు చేశారు. అయితే ఒకటి రెండు దుకాణాల్లో కిరాణా, బియ్యం వంటివి విక్రయించుకొని రైతులు తమ వ్యాపారం సాగిస్తున్నారు. అయితే పట్టణానికి దూరంగా ఈ రైతు బజారును నిర్మించడం వల్ల కొనుగోలుదారులు అంత దూరం వెళ్లడానికి సుముఖత చూపడం లేదు. మున్సిపాలిటీ పరిధిలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో కొత్తగా కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేసి అనేక దుకాణాలు నిర్మించి వ్యాపారులకు అద్దెలకు ఇవ్వటంతో వ్యాపారమంతా అక్కడే కొనసాగుతోంది. దీంతో విక్రయదారులు రైతు బజారుకు వచ్చే అవకాశం లేకపోవటంతో రైతులంతా ఒక్కసారిగా ఖాళీ చేశారు. ముఖ్యంగా ప్రభుత్వం రైతులకు సంబంధించిన పంటలను కొనుగోలు చేసి ఉల్లి, టమాటా వంటి వస్తువులు రైతు బజార్ల ద్వారా రాయితీపై అందించాల్సి ఉంది. అసలు రైతు బజా రే లేకపోతే రాయితీపై సరుకులు ఎలా ఇస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. తుఫాన్, వరదలు వంటి సమయంలో ప్రజలకు కావాల్సిన నిత్యావసర వస్తువులు రైతు బజార్ల ద్వారానే ప్రభుత్వం అందిస్తుంది. అయితే ఆమదాలవలసలో పూర్తిగా రైతు బజారే మూతపడే పరిస్థితి ఉంటే ప్రజలను కూటమి ప్రభుత్వం విపత్తుల సమయంలో ఎలా ఆదుకుంటుందో ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటిౖకైనా కూటమి ప్రభుత్వ పాలకులు, అధికారులు రైతులకు ఎంతో మేలు కల్పించే ఈ రైతు బజార్ను తెరిపించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. -
ఎంటీఎస్ టీచర్లకు సర్దుపోటు
శ్రీకాకుళం న్యూకాలనీ: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నియామకమైన మినిమమ్ టైమ్స్కేల్ ఉపాధ్యాయులకు ఎట్టకేలకు సర్దుబాటు బదిలీల కౌన్సెలింగ్కు అధికారు లు చర్యలు తీసుకున్నారు. జిల్లా కేంద్రంలోని ప్ర భుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం వీరికి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి 2008 బ్యాచ్ టీచర్లకు, ఉదయం 10 నుంచి 1998 బ్యాచ్ టీచర్లకు బదిలీల కౌన్సెలింగ్ చేప ట్టాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను అధికారులు ఇప్పటికే జారీ చేశారు. ఉద్యోగాలు కల్పించి ఆదుకున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. సాధారణ ఉపాధ్యాయ బదిలీల్లో 1998 డీఎస్సీతో పాటు 2008 డీఎస్సీ మినిమమ్ టైం స్కేల్ టీచర్లు తీవ్ర అన్యాయానికి గురయ్యారు. ఎంటీఎస్ టీచర్లు పనిచేస్తున్న పోస్టులను ఖాళీల జాబితాలోకి తీసుకురావడంతో వారి పోస్టులు గల్లంతయ్యాయి. దీంతో వీరందరికీ కౌన్సెలింగ్ అనివార్యంగా మారింది. ఇదిలా ఉంటే 1998 డీఎస్సీతో పాటు 2008 డీఎస్సీలో అన్యాయానికి గురై న్యాయస్థానాల్లో దశాబ్దాలపాటు కేసులతోను, అనేక ప్రభుత్వాల ముఖ్యమంత్రులు, ప్రజాప్రతినిధులు చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. ఎట్టకేలకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో 2023లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీరి పాలిట దేవుడయ్యారు. వీరందిరికీ మినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) పద్ధతిన ఉద్యోగాలు కల్పించి ఆపద్బాంధవుడిగా నిలిచారు. వీరిలో 70 శాతం మంది పదవీ విరమణ దశకు చేరుకున్నారు. కూటమి ప్రభుత్వంలో అడుగడుగునా అన్యాయం.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో వీరి పరిస్థితి బాగానే ఉండేది. కానీ కూటమి ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన తర్వాత అడుగడుగునా అన్యాయం జరుగుతోంది. వేధింపులు సైతం ఎక్కువయ్యాయి. గతంలో ఉన్న 12 నెలల జీతాన్ని కూటమి ప్రభు త్వం 11 నెలలకు మార్చివేసింది. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ సాధారణ బదిలీల్లోను అన్యాయం జరిగింది. వీరి భార్య లేదా భర్త ప్రభుత్వ ఉద్యోగి అయితే వారికి కచ్చితంగా బదిలీల్లో స్పౌజ్ పాయింట్లు కేటాయించాలి. కానీ కూటమి ప్రభుత్వం ఎంటీఎస్ టీచర్లను ఇప్పటికీ తమ వ్యతిరేకులుగానే చూస్తోంది. కేజీబీవీల్లోని టీచర్లకు స్పౌజ్ పాయింట్లు కేటాయిస్తున్నప్పటికీ ఎంటీఎస్ టీచర్లకు మా త్రం మొండిచేయి చూపడాన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు తప్పుబడుతున్నారు. జిల్లాలో ఎంటీఎస్ టీచర్లు 371 మంది.. శ్రీకాకుళం జిల్లాలో 1998 డీఎస్సీ టీచర్లు 260 మంది, 2008 డీఎస్సీ టీచర్లు మంది 111 కలిపి మొత్తం 371 మంది మినిమమ్ టైం స్కేల్ విధానంలో వివిధ పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లగా పనిచేస్తున్నారు. వీరిలో మెజారిటీ టీచర్లు ఈ రెండు మూడేళ్లలో రిటైర్ కానున్నారు. ఈ జూన్ నెలలోనే 8 మంది వరకు పదవీ విరమణ చేయనుండడం గమనార్హం. ఈ నెలలోనే పదవీ విరమణ చేయనున్న ఎంటీఎస్ టీచర్లు సైతం నేడు జరిగే సర్దుబాటు బదిలీ కౌన్సెలింగ్కు హాజరుకానున్నారు. ఇదిలా ఉండగా బదిలీల్లో ప్రాధాన్యం ఎవరికి..? ఇవ్వాలన్న అంశం చర్చనీయాంశంగా మారింది. తమ వృద్ధాప్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరు తూ 1998 ఎంటీఎస్ టీచర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం జరగనున్న బదిలీల్లో తమ ను దూర ప్రాంతాలకు పంపిస్తే.. అరకొర జీతాల తో ఎలా వెళ్లగలమని వారంతా వాపోతున్నారు. ప్రభుత్వం కూడా బదిలీల్లో 2008 డీఎస్సీ ఎంటీఎస్లకు తొలి ప్రాధాన్యమివ్వాలని భావిస్తోంది. అదే జరిగితే తాము అన్యాయమైపోతామని 1998 ఎంటీఎస్ టీచర్లు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే బదిలీలకు సంబంధించిన సీనియారిటీ జాబితాను ప్రకటించారు. మిగిలి ఉన్న సర్వీసును పరిగణనలోకి తీసుకుని మానవతా దృక్పథంతో స్థాన చలనానికి అవకాశం కల్పించాలని ఎంటీఎస్ ఉపాధ్యాయ సంఘ నాయకులు విన్నవిస్తున్నారు. మినిమమ్ టైమ్ స్కేల్ టీచర్లకు అడుగడుగునా అవమానాలు, అన్యాయాలు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పోస్టింగులు ఇవ్వడంతోనే ఈ దుస్థితి జిల్లాలో 1998 టీచర్లు 260 మంది, 2008 టీచర్లు 111 మంది నేడు జిల్లా కేంద్రంలో మినిమమ్ టైమ్ స్కేల్ టీచర్లకు సర్దుబాటు బదిలీ కౌన్సెలింగ్ -
గ్రామంలో ఒంటరి జీవితం
సంతబొమ్మాళి : మూలపేట పోర్టు నిర్మాణంలో భాగంగా విష్ణుచక్రం ఊరు మొత్తం ఖాళీ అయ్యింది. కానీ ఆ వృద్ధ దంపతులు మాత్రం గ్రామాన్ని వదిలి వెళ్లలేదు. పగలు, రాత్రి బిక్కుబిక్కుమంటూ ఒంటరి జీవితం గడుపుతున్నారు. వివరాల్లోకి వెళితే.. మూలపేట, విష్ణుచక్రం గ్రామస్తులు తమ భూ ములతో పాటు గ్రామాన్ని కూడా పోర్టు నిర్మాణానికి త్యాగం చేశారు. నష్టపరిహారంతో పాటు నౌపడలోని 58 ఎకరాల్లో ఈ రెండు గ్రామాలకు పునరావాస కాలనీ గత ప్రభుత్వ హయాంలోనే మొదలైంది. అయితే మొదటి విడతగా విష్ణు చక్రం గ్రా మానికి చెందిన 57 మందికి లాటరీ ద్వారా పునరావాస కాలనీలో ప్రతి కుటుంబానికి ఐదు సెంట్లు ఇంటి స్థలాన్ని కేటాయించారు. దీంతో విష్ణుచక్రం గ్రామాన్ని ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. గ్రా మంలో అందరూ ఖాళీ చేసినా గ్రామానికి చెందిన గిన్ని ఈశ్వరరావు, మహాలక్ష్మి అనే వృద్ధ దంపతులు మాత్రం ఊరిని విడిచి వెళ్లలేదు. పీడీఎఫ్ పరిహారం ఇవ్వలేదని, నౌపడలో పునరావాస కాలనీలో ఇంటి స్థలం ఇవ్వలేదని, కన్న ఊరును విడిచి వెళ్లకుండా బిక్కుబిక్కుమంటూ పగలు, రాత్రి జీవనం సాగిస్తున్నారు. ఇంటి స్థలం ఇవ్వకపోతే తాము ఎక్కడికి వెళ్లినా ఎలా బతకగలమని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో మనుషులు ఎవరూ లేకపోవడంతో భయాందోళనతో బతుకుతున్నామని, తాగునీటి ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అదే గ్రామానికి చెందిన దారపు కనకరత్నం కూడా పీడీఎఫ్ పరిహారం, పునరావాస కాలనీలో ఇంటి స్థలం ఇవ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. -
రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
పొందూరు: పొందూరు రైల్వేస్టేషన్ సమీపంలో శనివారం ఉదయం ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి (40) మృతి చెందినట్లు హెచ్సీ ఎం.సోమేశ్వరరావు తెలిపారు. రైలు పట్టాలు దాటుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు. మృతుడు తెలుపు, నలుపు గీతల షర్టు, నల్లని నిక్కరు ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. వివరాలకు 9110305494 నంబర్ను సంప్రదించాలని కోరారు. యువకుడు ఆత్మహత్య కాశీబుగ్గ : పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డు సూదికొండ ప్రాంతంలో సూర్యకాలనీకి చెందిన కొవిరి నూకరాజు (22) అనే యువకుడు శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీడి కార్మికుడు నారాయణరావు రెండో కుమారుడు నూకరాజు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుండేవాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో శనివారం మధ్యాహ్నం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న కాశీబుగ్గ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆటోడ్రైవర్ అనుమానాస్పద మృతి ఎచ్చెర్ల : లావేరు మండలం అదపాక సమీపంలోని పంట పొలాల్లో విశాఖపట్నం జిల్లా తాటిచెట్లపాలెం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ పి.జగన్నాథం(35) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. అదపాక వీఆర్వో ఎన్.వెంకటరమణ ఫిర్యాదు మేరుకు లావేరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. లావేరు హెచ్సీ జోగారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అంబేడ్కర్ ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాలి
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ అంబేడ్కర్ ఆలోచన ఫౌండేషన్ రాష్ట్ర చైర్మన్, సీనియర్ అడ్వకేట్ పినిపే వెంకట రామకృష్ణ అన్నారు. నగరంలోని ఇలిసిపురం అంబేడ్కర్ విజ్ఞాన మందిర్లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఎస్సీ, ఎస్టీ అడ్వకేట్స్ క్యాడర్ క్యాంపు శనివారం నిర్వహించారు. ముందుగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 158 బార్ కౌన్సిల్లు ఉన్నాయని, వాటిలో ఏఎఎఫ్ క్యాడర్ కూడా ఉందన్నారు. ఎనిమిది వేల మంది ఎస్సీ, ఎస్టీ న్యాయవాదులున్నారని, మనమంతా ఐక్యతను చాటి చెప్పాలన్నారు. ఏఏఎఫ్ అనేది నిరంతర ప్రక్రియ అని, ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేశారు. అంబేడ్కర్ మూమెంట్ నడపాలంటే కఠోర దీక్ష ఉండాలని, నాయకునికి ఎటువంటి బలహీనతలు ఉండకూడదని చెప్పారు. రాజకీయ పార్టీలు ఎస్సీ, ఎస్టీలను విభజించి పాలిస్తున్నాయన్నారు. ఈసారి రాష్ట్ర బార్ కౌన్సిల్ పోటీల్లో ముగ్గురు న్యాయవాదులు తప్పనిసరిగా గెలవాల్సిన అవసరం ఉందన్నారు. మనకు ఎవ్వరూ ఎటువంటి పదవులు ఇవ్వరని, పోరాటాల ద్వారానే సాధించుకోవాలని పిలుపునిచ్చారు. బతికినంత కాలం అంబేడ్కర్ విధానంతో బతకాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు పొన్నాడ రాము, బి.మురళీకృష్ణ, రుంకు అప్పారావు, గంజి ఆర్.ఎజ్రా, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు, అడ్వకేట్ దండాసి తదితరులు పాల్గొన్నారు. -
మా పిల్లలను వేరే స్కూల్కు పంపించలేం
● వనుమువానిపేట పాఠశాల వద్ద తల్లిదండ్రుల నిరసన గార : మా పిల్లలను కిలోమీటరు దూరంలో ఉన్న వేరే పాఠశాలకు పంపలేమంటూ గార మండలం వనుమువానిపేట పాఠశాల వద్ద తల్లిదండ్రులు శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ మాధవి, మాజీ చైర్మన్ రమణలు మాట్లాడుతూ పాఠశాలలో మొత్తం 26 మంది విద్యార్థులుండగా, ఆదర్శ పాఠశాల పేరు చెప్పి తండ్యాలపేట పాఠశాలకు 3, 4, 5వ తరగతుల విద్యార్థులను కలిపేందుకు నిర్ణయించారని, పాఠశాల నుంచి 12 మంది విద్యార్థులు ప్రతీ రోజు పుస్తకాల బరువుతో ఎలా వెళ్లగలరని ప్రశ్నించారు. దారిలో కుక్కల గుంపులు వంటి సమస్యలున్నాయని, ఈ విషయాన్ని అధికారులు పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందరూ రోజువారీ వ్యవసాయం, కూలి పనులుకు వెళ్లకపోతే బతకలేని పరిస్థితి ఉందని, చిన్నారులను రోజు తీసుకువెళ్లి, తీసుకురావడం ఇబ్బంది అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గొండు శంకర్, విద్యాశాఖ అధికారులు స్పందించి సమస్య పరిష్కారించాలని కోరారు. -
నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో నిత్యాన్నదాన పథకానికి జిల్లాకు చెందిన ప్రగడ రామ్నాయుడు, గజలక్ష్మి దంపతులు, వారి కుమారుడు బాలాదిత్య రూ.1,00,001 విరాళంగా సమర్పించారు. ఈమేరకు ఆలయ సీనియర్ అసిస్టెంట్ వెంకటరమణకు శనివారం విరాళం అందజేశారు. అంతకుముందు ఆదిత్యున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ బాలభాస్కర్ సాయి తదితరులు పాల్గొన్నారు. 49 ఆశావర్కర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అరసవల్లి: జిల్లాలో ఖాళీగా ఉన్న 49 ఆశావర్కర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ కె.అనిత ప్రకటించారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో వివరాల ప్రకారం.. జిల్లాలో ఈ పోస్టులకు ఆసక్తి గల అర్హులు ఈ నెల 23 నుంచి 30వ తేదీలోగా ఆయా ప్రాంతాల్లో ఉన్న సచివాలయాల వద్ద దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 10వ తరగతి ఉత్తీర్ణత, 25 నుంచి 45 ఏళ్ల లోపు వయస్సున్న అదే గ్రామానికి చెందిన మహిళలు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. జిల్లాలో అక్కులపేట, బూర్జ, ఎచ్చెర్ల, బాతువ, జి.సిగడాం, గార, కొలిగాం, బొరివంక, తిలారు, నిమ్మాడ, రెంటికోట, తాడివలస, పాతర్లపల్లి, రావాడ, బోరుబద్ర, డి.జి.పురం, నౌపడ, సంతబొమ్మాళి, సింగుపురం, శ్రీకాకుళం రూరల్, అక్కుపల్లి, కంచిలి, నందిగాం, నౌగాం, బైదలాపురం, బొంతు, సారవకోట, కె.కొత్తూరు, లింగాలవలస, ఎల్ఎన్.పేట తదితర ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోనూ అలాగే అరసవల్లి, ఫాజుల్బాగ్పేట, కాకివీధి, డీసీసీబీ కాలనీ, ఆదివారంపేట అర్బన్ పిహెచ్సీ పరిధిలోనూ అలాగే సచివాలయాల పరిధిలో మొత్తం 49 ఆశావర్కర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లుగా డీఎంహెచ్ఓ అనిత ప్రకటించారు. జెమ్స్లో యోగా డే శ్రీకాకుళం రూరల్: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం రాగోలు జెమ్స్ ఆస్పత్రి ఆవరణలో యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీలలిత, అకడమిక్ కో ఆర్డినేటర్ డాక్టర్ సుధీర్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా, బొల్లినేని మెడిస్కిల్స్ బీఎస్సీ పారామెడికల్ కళాశాలలోనూ యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఫిజికల్ డైరెక్టర్ కుసురాజు, జగదీష్, అకడమిక్ డైరెక్టర్ సీహెచ్ లక్ష్మీ పద్మజ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. మిగులు సీట్లు నిరుపేద దళితులకు ఇవ్వాలి శ్రీకాకుళం (పీఎన్కాలనీ)/శ్రీకాకుళం పాతబస్టాండ్: ఏపీఆర్డబ్ల్యూర్ఈఐ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న డాక్టర్ బి.అర్.అంబేడ్కర్ గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియెట్ ప్రవేశాల్లో భర్తీ చేయగా మిగిలిన సీట్లలో ప్రవేశ పరీక్ష రాయని నిరుపేద దళిత విద్యార్థులను చేర్పించుకోవాలని కులనిర్మూలనా పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.కృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్క కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
ప్రయాణికుల కస్సు‘బస్సు’
శ్రీకాకుళం అర్బన్: జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద శనివారం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం విశాఖపట్నంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమానికి జనాలను తరలించేందుకు జిల్లా నుంచి 220 బస్సులు వేసిన సంగతి తెలిసిందే. దీంతో చాలా రూట్లలో బస్సులు తిరగకపోవడంతో ముఖ్య ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంత ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఈ క్రమంలో జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్లో వింత పరిస్థితి నెలకొంది. శనివారం ఉదయం నుంచి దూరప్రాంతాలకు వెళ్లేందుకు కాంప్లెక్స్లో బస్సులు ఉన్నప్పటికీ ప్రయాణికులు ఎవరూ కనిపించలేదు. ముఖ్యంగా విశాఖ వెళ్లే నాన్స్టాప్ కౌంటర్ ఖాళీగా కనిపించింది. మధ్యాహ్నం 12గంటల వరకూ బోసిపోయి కనిపించింది. ప్రయాణికులు రాక ఆ బస్సులు అలాగే ఉండిపోయాయి. ఇక ఇచ్ఛాపురం, పాతపట్నం, బత్తిలి, రాజాం, బొబ్బిలి, విజయనగరం, పాలకొండ తదితర ప్రాంతాలకు వెళ్లే బస్టాప్ల వద్ద ప్రయాణికులు కూడా అంతంత మాత్రంగానే ఉండటం కనిపించింది. తప్పని పడిగాపులు.. శనివారం మధ్యామ్నం సమయంలో ప్రయాణికులు బస్సుల కోసం వేచి ఉండటం కనిపించింది. యోగాంధ్ర కార్యక్రమం పూర్తయి బస్సులు వచ్చేస్తాయని భావించి అనేక మంది ప్రయాణికులు రావడంతో ఈ పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకూ అధిక సంఖ్యలో ప్రయాణికులు కాంప్లెక్స్కు చేరుకున్నా బస్సులు లేక గంటల తరబడి నిరీక్షించారు. మారుమూల గ్రామాలకు వెళ్లేందుకు సైతం బస్సుల కోసం పడిగాపులు కాయాల్సి వచ్చింది. ముందస్తు సమాచారం లేకే.. విశాఖపట్టణంలో జరిగిన యోగాంధ్రకు ఆర్టీసీ బస్సులను తరలించిన నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు తిరగవని అధికారులు ముందస్తు సమాచారం చేరవేస్తే బాగుండేదని, తమ ప్రయాణాలను వాయిదా వేసుకునేవారమని పలువురు ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. ఉదయం పూట బస్సులు ఉన్నా కానరాని ప్రయాణికులు మధ్యాహ్నం పూట ప్రయాణికులు ఉన్నా లేని బస్సులు ఆర్టీసీ అధికారుల తీరుపై మండిపాటు -
విలీన గందరగోళం.. పాఠశాలలకు తాళం
శ్రీకాకుళం న్యూకాలనీ: పాఠశాల విద్యలో ప్రభుత్వ బడులను 9 రకాల స్కూళ్లగా విభజించి అటు ఉపాధ్యాయులను, ఇటు విద్యార్థులను కూటమి ప్రభుత్వం గందరగోళంలోకి నెట్టింది. విద్యాహక్కు చట్టానికి తూట్లు పొడుస్తూ పిల్లలకు ప్రాథమిక విద్యను ‘దూరం’ చేస్తోంది. ఒకప్పుడు సొంత ఊరిలోనే ఉండి చదువుకున్న పరిస్థితుల నుంచి.. నేడు సుదూర ప్రాంతాలకు వెళ్లి చదువు కొనాల్సిన దుస్థితి కల్పిస్తోంది. పునర్విభజన జరిగిన శ్రీకాకుళం జిల్లాలో తరగతుల విలీనమైన బడుల సంఖ్య 338 ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో 6,7,8 తరగతులు సమీపంలో విలీనమైన స్కూళ్లు 93 ఉండగా.., 3,4,5 తరగతుల విలీనం జరిగిన స్కూళ్లు ఏకంగా 245 ఉండటం గమనార్హం. ఒక్క పొందూరు మండలంలోనే సుమారు 12 ప్రాథమికోన్నత తరగతులను పొరుగున ఉన్న హైస్కూళ్లలో కలిపేశారు. జిల్లాలో దాదాపు అన్ని మండలాల్లోను ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలల్లో తరగతులు విలీనం కావడంతో విద్యార్థులతో కలిపి తల్లిదండ్రులు బడుల వద్ద నిరసన చేస్తున్నారు. కొన్నిచోట్ల తాళం వేస్తున్నారు. అలవెన్సులు ఇస్తారట.. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య (6–14సంవత్సరాలు) అనేది రాజ్యాంగం బాలలకు ఇచ్చిన హక్కు. దానిని కూడా ట్రాన్స్పోర్ట్ అలవెన్సు పేరిట ప్రత్యమ్నాయ దిశగా హరించడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను బాలల హక్కుల సంఘాలు, మహిళా శిశుసంక్షేమ శాఖ, మానవ హక్కుల సంఘాలు వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు చెబుతున్నారు. తక్షణమే బాలలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక హక్కును కల్పించాల్సిందేనని నొక్కి చెబుతున్నారు. పాఠశాలల విలీనం తరువాత సింగిల్ టీచర్ స్కూళ్లే అధికమయ్యాయి తప్పిస్తే.. పిల్లలకు ఏవిధంగా మేలు జరిగిందో ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. ఒకటి నుంచి పది తరగతులు నడపడానికి ప్రపంచంలో ఎక్కడా తొమ్మిది రకాల స్కూళ్లు లేవని.. ఒక్క ఏపీలోనే ఈ దుస్థితి ఉందని, ఇది సిగ్గుపడాల్సిన విషయమని విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ స్కూల్కు పంపించాలో.. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన 9 రకాల స్కూళ్లతో తమ పిల్లలను ఏ స్కూల్కు తమ పిల్లలను పంపించాలో తెలియక తల్లిదండ్రులు సతమతమవుతున్నారు. మరోవైపు ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతలు, శిక్షణా తరగతలు పూర్తిచేసుకుని.. ఇప్పుడిప్పుడే ఉపాధ్యాయులు బడిబాట పడుతున్నారు. కొత్త పాఠశాలల్లో చేరిన టీచర్లకు సైతం స్థానిక పరిస్థితులు, స్థితిగతులు తెలియక అయోమయానికి గురవుతున్నారు. ఇదీ పరిస్థితి.. శ్రీకాకుళం జిల్లాలో ఈ కొత్త విద్యా సంవత్సరంలో ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు 2955 పనిచేయనున్నాయి. గత విద్యా సంవత్సరం ప్రకారం 1,62,554 మంది చదువుతున్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఈ సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యపు విధానాలు, ఏకపక్ష నిర్ణయాలతో విద్యావ్యవస్థను అస్తవ్యస్తం చేస్తుండటంతో పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు బడుల్లో చేర్పించడానికి మొగ్గుచూపుతున్నట్టు ఉపాధ్యాయులే బాహాటంగా చెబుతున్నారు. 400 ప్రైవేటు పాఠశాలల్లో 95వేల మంది వరకు చదువులు కొనసాగిస్తున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన మోడల్ ప్రైమరీ స్కూళ్ల పేరిట ప్రభుత్వం నయవంచన సుదూర ప్రాంతాలకు వెళ్లలేక ఆవేదన కూటమి సర్కారు తీరుపై సర్వత్రా విమర్శలు -
సాధ్యమయ్యేనా?
విద్యాహక్కు చట్టానికి విరుద్ధంగా రెండు, రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న సమీప పాఠశాలల్లో ఉన్న 3,4,5 తరగతులను చేసేశారు. 4 లేదా 5 కిలోమీటర్ల దూరంలో ఉండే ఉన్నత పాఠశాలల్లో 6,7,8 తరగతుల పిల్లలను విలీనం చేసేశారు. ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించినా ప్రభుత్వం మాత్రం వెనిక్కి తగ్గలేదు. ఇదేంటని ప్రశ్నిస్తే రవాణా (ట్రాన్స్పోర్ట్) అలవెన్సు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ఇది సాధ్యమయ్యే పనేనా ? – ఎండ ఉమాశంకర్, యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ ● -
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే..
ప్రభుత్వ నిబంధనలు, నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారమే బడులను విభిజించాం. విద్యాహక్కు చట్టానికి లోకబడే చర్యలు తీసుకున్నాం. కొన్నిచోట్ల విద్యార్థుల సంఖ్య ఆధారంగా తప్పని పరిస్థితుల్లో సమీప పాఠశాలల్లో తరగతుల విలీనం చేపట్టాల్సి వచ్చింది. కొన్ని స్కూళ్ల వద్ద తల్లిదండ్రులు ఆందోళన చేపడుతున్నట్టు తెలిసింది. వాటి వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తాం. – డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య, డీఈఓ శ్రీకాకుళం ● -
అరసవల్లిలో సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి
● ఆర్జిత సేవల్లో ఫ్యాషన్ దుస్తులకు అనుమతి నిరాకరణ ● రోజూ సాయంత్రం వరకు ఆదిత్యుని అంతరాలయ దర్శనాలు ● ఆదివారాల్లో రూ.300 టిక్కెట్తో అంతరాలయ దర్శనం ● అరసవల్లి ఆలయ ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్ ప్రకటన అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించే క్రమంలో ఆలయ సంప్రదాయాలను కాపాడేలా పలు కీలక నిర్ణయాలను ఆలయ ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్ శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ఆలయంలో ఇకపై క ల్యాణోత్సవాలు, క్షీరాభిషేక సేవలు, సూర్యనమస్కారాలు తదితర ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు ఫ్యాషన్ దుస్తులు వేసుకుంటే అనుమతి నిరాకర ణ తప్పదని, కచ్చితంగా సంప్రదాయ వస్త్రధారణ నియమాలను పాటించాల్సిందేనని వివరించారు. సేవల్లో పాల్గొనే భక్తుల్లో పురుషులు పంచె, చొ క్కా, సీ్త్రలు చీర లేదా చుడీదార్లతో వస్తేనే ఈ సేవల్లో కూర్చునేందుకు అనుమతి ఉంటుందని ప్రకటించారు. అలాగే ఈ ఆర్జిత సేవల టిక్కెట్లు ధరలు పెంచేందుకు ఉన్నతాధికారులకు ప్రతిపాదించనున్నామని, ఈ మేరకు అనుమతి రాగానే కల్యాణ సేవ, క్షీరాభిషేక సేవలు, సూర్యనమ స్కారాల పూజల రుసుములు పెంచుతూ టిక్కెట్ల విక్రయాలు జరపనున్నట్లుగా ఆయన ప్రకటించారు. అలాగే ఆదిత్యుని అంతరాలయ దర్శనాల వేళలను ఇక మీదట సాయంత్రం వరకు ఉండేలా సమయం పెంపు చేస్తున్నామని, ఈ మేరకు ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మతో సంప్రదించే నిర్ణయాన్ని ప్రకటిస్తున్నామని వివ రించారు. సోమవారం నుంచి ఽశనివారం వరకు ప్రతి రోజూ ఉదయం 7 నుంచి 11.30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రూ.100 టిక్కెట్లు కొను గోలు చేసుకుని ఆదిత్యుని అంతరాలయ దర్శనం చేసుకోవచ్చని తెలిపారు. అలాగే ఆదివారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రూ.300 దర్శన టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తు లను ప్రత్యేక క్యూలైన్ ద్వారా దర్శనాలకు అనుమతిస్తారని, అలాగే మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రూ.300 టిక్కెట్ల ద్వారా అంతరాలయ దర్శనాలకు అవకాశం కల్పించనున్నట్లుగా ఈఓ ప్రకటించారు. -
శ్రీకాకుళం
శనివారం శ్రీ 21 శ్రీ జూన్ శ్రీ 2025కొత్తమ్మ తల్లి హుండీ ఆదాయం లెక్కింపు టెక్కలి రూరల్: కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి అమ్మవారి ఆలయ హుండీ కానుకల లెక్కింపు శుక్రవారం నిర్వహించినట్లు కార్యనిర్వహణాధి కారి వాకచర్ల రాధాకృష్ణ తెలిపారు. అలయాని కి సంబంధించి ఆలయ ప్రాంగణంలోని హుండీలను లెక్కించగా 86రోజులకు రూ. 5,59,597 అదాయం వచ్చినట్లు తెలిపారు. ఈ హుండీ లెక్కింపు శ్రీకాకుళం దేవదాయ శాఖ సీనియర్ అసిస్టెంట్ జి.వి.బి.ఎస్ రవికుమార్ ఆధ్వర్యంలో జరిగింది. సరిహద్దులో గట్టి నిఘా ఇచ్ఛాపురం: నవోదయం 2.0లో భాగంగా ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ఒడిశా మ ద్యం, నాటుసారా, గంజాయి వంటి నిషేధిత పదార్థాలను అరికట్టడానికి నిఘా పెంచాలని డిప్యూటీ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కమిషనర్ డి.శ్రీకాంత్రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధి పురుషోత్తపురంలో గల ప్రొహిబిషన్ ఎకై ్సజ్ చెక్పోస్టుని శుక్రవారం పరిశీలించారు. అనంతరం స్థానిక ప్రొహిబిషన్ ఎకై ్సజ్ పోలీస్స్టేషన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సము ద్ర తీర ప్రాంతాల్లో తరచుగా తనిఖీలు నిర్వహిస్తూ అక్రమ సారా నివారణ కృషి చేయాలని సూచించారు. పెండింగ్ కేసుల్లోని నిందితులపై చార్జిషీట్లు వేసి దర్యాప్తు వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రొహిబిషన్ సీఐ పి.దుర్గాప్రసాద్, ప్రొహిబిషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ‘మెనూ ప్రకారం భోజనం పెట్టాలి’ పాతపట్నం: మండలంలోని సవర సిద్ధమణుగు బాలుర ఆశ్రమ పాఠశాలను సీతంపేట ఐటీడీఏ ఏపీఓ జి.చిన్నబాబు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో 10, 9వ తరగతి విద్యార్థులతో కలిసి తరగతి గతిలో కూర్చుని పాఠాలు విన్నారు. అనంతరం విద్యార్థులతో కాసేపు మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు పెడుతున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని వార్డెన్ జీవనరావుకు సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు కె.అబ్బాయి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ●యోగ సాధకులు నరసన్నపేట: నరసన్నపేటకు చెందిన సుమా బాలబాల, సదాశివుని రవి, వండాన సుప్రజలు ఒక వైపు యోగా సాధన చేస్తూ శిక్షణ ఇస్తున్నారు. స్థానిక సూరజ్ నగర్కు చెందిన వి. సుమాబాల యోగా టీచర్గా నరసన్నపేటలో మంచి గుర్తింపు పొందారు. 2007లో యోగాలో పీజీ డిప్లమా పూర్తి చేసిన సుమాబాల నరసన్నపేటకు యోగా శిక్షణ పరిచయం చేశారు. నరసన్నపేటలోనే ఒక ప్రైవేటు స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉచితంగా మహిళలకు యోగా నేర్పిస్తున్నారు. యోగా దినోత్సవం సందర్భంగా స్థానిక జీసీ హోంలో ప్రత్యేక యోగా క్లాసులు నిర్వహిస్తున్నారు. చిన్న వయసు నుంచి.. స్థానిక జగన్నాథపురానికి చెందిన సదాశివుని రవి యోగాను ప్రాచుర్యంలోనికి తీసుకువచ్చారు. ఆంధ్రా యూనివర్సిటీలో యోగాలో పీజీ డిప్లమా పూర్తి చేసిన రవి 2010 నుంచి శిక్షణలు ఇస్తున్నారు. 2017 వరకూ విశాఖలో క్లాసులు నిర్వహించగా తర్వాత నరసన్నపేటకు వచ్చి యోగా శిక్షణలు ఉచితంగా స్థానిక యోగా భవన్లో ఇస్తున్నారు. మహిళలకు శిక్షణ నిస్తూ.. స్థానిక శ్రీరాంనగర్కు చెందిన వండాన సుప్రజ ఆర్ట్ఆఫ్ లివింగ్లో పూర్తి శిక్షణ పొంది యోగా టీచర్గా పనిచేస్తున్నారు. పలు ప్రైవేటు స్కూల్స్లో పనిచే స్తూ మహిళలకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. 2018 నుంచి యోగా శిక్షణలు ప్రారంభించారు. పలు పోటీల్లోనూ పాల్గొన్నారు.ఆసనాల్లో శ్రీకాంతులు ఇచ్ఛాపురం: యోగా సాధన చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు పేరుప్రఖ్యాతలు కూడా సంపాదించుకోవచ్చని పట్టణానికి చెందిన శ్రీకాంత్ మహంతి రుజువు చేస్తున్నారు. పట్టణానికి చెందిన శ్రీకాంత్మహతి శరీరాన్ని రబ్బరులా వంచుతూ ఆసనాలు వేస్తారు. బడి ఈడు లోనే ఆయనలోని ప్రతిభను గుర్తించిన వ్యాయామ ఉపాధ్యాయురాలు జయలక్ష్మి, స్థానిక యోగా సాధకుడు మధుసూదన్ బెహరా శ్రీకాంత్ను ప్రోత్సహించారు. అప్పటి నుంచి ఆయన వెనుదిరిగి చూడలేదు. ప్రస్తుతం ఆయన యోగాసనాల పోటీలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లోనూ పాల్గొన్నారు. 2010 నుంచి 2025 వరకు పదుల సంఖ్యలో బంగారు పతకాలు గెలుచుకున్నారు. సాధన చేస్తున్న శ్రీకాంత్మహంతి ●40 ఏళ్లుగా యోగా సాధన నేను 40 ఏళ్లుగా యోగా సాధన చేస్తున్నాను. మూడేళ్లుగా హైదరాబాద్లోని ప్రీ గురుకుల్ సే వా సంస్థలో యోగా, ప్రాణాయామం తరగతులను ఆన్లైన్లో నిర్వహిస్తున్నాను. 77 ఏళ్ల వయసు వచ్చిన యువకులతో సమానంగా కొన్ని వందల మంది సాధకులతో 108 సూర్యనమస్కారాలు మాఘమాసంలో వేయిస్తుంటాను. – ఎంవీ రామారావు, విశ్రాంత ఏఈ, బీఎస్ఎన్ఎల్, శ్రీకాకుళంన్యూస్రీల్ -
●23 ఏళ్లుగా..
నేను 23 ఏళ్లుగా యోగాభ్యాసం చేస్తున్నాను. శ్రీకాకుళంలోని యోగాచార్య రామారావు వద్ద యోగా నేర్చుకున్నా ను. తర్వాత బెంగళూరు అంతర్జాతీయ యోగా యూనివర్సిటీలో డిప్లమో చేశాను. నా శిష్యులు కూడా చాలా యోగా కేంద్రాలను నిర్వహిస్తున్నారు. – మావురి నాగేశ్వరరావు, యోగా గురువు ●మహిళలకు ఉచితంగా యోగా ఇక్కడ కేవలం మహిళలకు మాత్రమే ఉచితంగా నేర్పుతున్నాను. ఈ పార్కులో ఉదయం 5గంటల నుంచి యోగాభ్యాసం జరుగుతుంది. కొన్ని ఆసనాలు ప్రదర్శించడం ద్వారా 16 ఏళ్ల వయసు నుంచి తరచూ వచ్చే పీరియడ్స్ సమస్యలు కూడా తొలగిపోతాయి. – పిండి శారద, ఎల్బీఎస్ కాలనీ యోగా కేంద్రం -
23న యువత పోరులో గళమెత్తుదాం
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): కూటమి పార్టీలు ఎన్నికల ముందు యువతకు, విద్యార్థులకు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక విస్మరించడం సరికా దని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలకుడు కుంభా రవిబాబు అన్నారు. ఫీజు రీ యింబర్స్మెంట్కు రూ.4200 కోట్లు, వసతి దీవెన కు రూ.2200 కోట్లు అవసరమైతే కనీసం సగం ని ధులు కూటా కేటాయించకపోవడం దారుణమన్నా రు. ఇంజినీరింగ్, డిగ్రీ కాలేజీల్లో విద్యార్థులు ఫీజు లు కట్టలేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈ నెల 23న నిర్వహించనున్న యువత పోరు కార్యక్ర మం విజయవంతం చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ విద్యార్థుల్ని, యువతను మోసం చేసిన చంద్రబాబు, పవన్కల్యాణ్లకు తగిన బుద్ధి చెప్పేందు కు ఈ నెల 23న నిర్వహించబోయే ‘యువత పోరు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లాలో యువత, విద్యార్థులకు పిలుపునిచ్చారు. నిరుద్యోగులకు ఇవ్వాల్సిన భృతి, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుంటే భవిష్యత్లో ఉద్యమించక తప్పదన్నారు. మాజీ మంత్రి, పార్టీ డాక్టర్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని ప్రగల్బాలు పలికే పవన్ కల్యాణ్ రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలపై ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నా రు. చంద్రబాబు మోసాలు, పవన్కల్యాణ్ ప్రశ్నించే గొంతు మూగబోయిందన్న విషయం ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. మొన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చినప్పుడు టీడీపీకి చెందిన వారే రప్పా రప్పా అంటూ ప్లకార్డులతో వస్తే దాన్ని వైఎస్సార్సీపీ వాళ్లపై ఆపాదించడం దారుణమన్నారు. ఈ సందర్భంగా యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంవీ స్వరూప్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 1.90కోట్ల మంది నిరుద్యోగులకు రూ.3వేలు చొప్పున బకాయి పడ్డారన్నారు. కార్యక్రమంలో పా తపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి, పార్టీ తూర్పుకాపు, కాళింగ, కళింగవైశ్య కుల రాష్ట్ర అధ్యక్షులు మామిడి శ్రీకాంత్, దుంపల లక్ష్మణరావు, అంధవ రపు సూరిబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేవీజీ సత్యనారాయణ, టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్, ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమా ర్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మార్పు పృథ్వీ, జెడ్పీటీసీ రుప్ప దివ్య, గ్రీవెన్స్సెల్ జిల్లా అధ్య క్షులు రౌతు శంకరరావు, అంబటి శ్రీనివాసరావు, గొండు కృష్ణమూర్తి, యువజన విభాగం నగర, ని యోజకవర్గ అధ్యక్షులు గుండ భాస్కర్, భరద్వాజ్, నక్క రామరాజు, పిల్లల రామకృష్ణ, సీపాన వెంకటరావు, టి.కామేశ్వరి, మట్ట నీలంయాదవ్, సీపానా రామారావు, మూకళ్ల తాతబాబు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలకుడు కుంభా రవిబాబు పిలుపు చంద్రబాబు యువతకు న్యాయం చేయాలి: ధర్మాన కృష్ణదాస్ 20 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి? : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు యువత పోరు పోస్టర్ ఆవిష్కరణ -
ఆశా కార్యకర్తల సమ్మె నోటీసు
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ఆశా కార్యకర్తలను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం రూ.26 వేలు మంజూరు చేయాలని, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయా లని కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు జూలై 9న జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో అంతా పాల్గొనా లని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి.ధనలక్ష్మి, జి.అమరావతి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సి.హెచ్.అమ్మన్నాయు డు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కె.అనితకు సమ్మె నోటీసు అందజేశారు. పేదలకు ఆరోగ్యసేవలు అందిస్తున్న తమకు కార్మికులుగా గుర్తించి సౌకర్యాలు కల్పించాల ని విన్నవించారు. కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశాలుగా మార్పు చేయాలని, రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. -
తాపీమేసీ్త్ర నుంచి సంగీత గురువుగా..
శాసీ్త్రయ సంగీతానికి పేదరికం అడ్డుకాదు అని ఇచ్ఛాపురం పట్టణానికి చెందిన సంగీత కళాకారుడు ఆశికృష్ణారెడ్డి నిరూపించారు. బెల్లుపడ గ్రామంలో వ్యవసాయకూలీ కుటుంబానికి చెందిన ఆశి వాసు సరోజిని దంపతుల చిన్న కుమారుడు ఆశి కృష్ణారెడ్డి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో తాపీపని, కూలిపనులు చేసుకొంటూ కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలిచారు. సంగీతంపై మక్కువతో కె.ముఖలింగం, మావుడూరి జగన్నాథశర్మ, మావుడూరి సత్యనారాయణ శర్మ వద్ద సంగీతంలో మెలకువలు నేర్చుకున్నారు. మావుడూ రి జగన్నాథశర్మ పేరిట సంగీత కళాశాలను ప్రారంభించి 22 మంది చిన్నారులకు ఉచితంగా సంగీతంలో శిక్షణ ఇస్తున్నారు. -
టీడీపీ అరాచకాలకు మూల్యం చెల్లించక తప్పదు
సరుబుజ్జిలి : టీడీపీ నేతలు చేస్తున్న అరాచకాలకు ప్రజాక్షేత్రంలో మూల్యం చెల్లించుకోకతప్పదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ హెచ్చరించారు. రాజకీయ కారణాలతో చిగురువలస కాలనీకి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త జరుగుళ్ల రాజారావు ఇంటిని కూటమి నేతలు కక్షకట్టి కూల్చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రవికుమార్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కూల్చివేసిన ప్రదేశాన్ని పరిశీలించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలు తుంగలోకి తొక్కిందని, ఇదేంటని ప్రశ్నిస్తున్న వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై దౌర్జన్యాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. అధికార పక్ష ప్రధాన నేతలు లిక్కర్, ఇసుక, భూదందాలతో అక్రమంగా సంపదిస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ సానుభూతిపరులపై అక్రమ కేసులు, ఉద్యోగాలు, పింఛన్ల తొలగింపు తప్ప నియోజకవర్గానికి ఒరిగిందేమిలేదన్నారు. ఇప్పటికై నా అధికార పక్షనేతలు కక్షపూరిత రాజకీయాలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవుపలికారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు సురవరపు నాగేశ్వరరావు, డకరవలస సర్పంచ్ సురవరపు తిరుపతిరావు, పార్టీ నేతలు అత్తులూరి రవికాంత్, కొవిలాపు చంద్రశేఖర్, మెట్ట నందేశు, కెప్టెన్ రామారావు, చల్ల యర్రయ్య, పల్లి శాంతారావు, ముద్దాడ రంజిత్, దనాల చిరంజీవి, బేపల రవి పాల్గొన్నారు. -
సంగీతమే జీవితం..
మూడు తరాలనుంచి మా కుటుంబం సంగీతంతో అల్లుకుపోయింది. మూడేళ్ల వయస్సులో మృదంగం నేర్చుకోవాలనే అభిరుచి కలిగింది. అమ్మ శ్రీలక్ష్మి, నాన్న సుసరాపు లక్ష్మీగణపతిశర్మ నా ఆలోచనకు సహకరించారు. ఇప్పటి వరకు పదులసంఖ్యలో కర్నాటక సంగీత కళాకారులతో కచేరీలకు మృదంగసహకారం అందించాను. –సుసరాపు కుమార్ విఘ్నేశ్, మృదంగ కళాకారుడు,శ్రీకాకుళం నాన్న ప్రోత్సాహంతో.. సంగీతం నేర్చుకోమని నాన్న ప్రోత్సహించారు. వయోలిన్ సాధన చేశాను. 2023లో జరిగిన కళా ఉత్సవ్ పోటీలో జ్ఞాపిక సాధించడం మరపురాని అనుభూతి. సంగీత రంగంలో స్థిరపడాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాను. –చెన్నూరు వరుణ్సాయి, వయోలీన్ కళాకారుడు, సిలగాం, కవిటి -
చిన్నతనంలో ఆడుతూ పాడుతూ తిరిగే అల్లరి పిల్లల్ని మందలించే తల్లిదండ్రులు చదువు సంగీతం ఏమీ లేదేంట్రా అంటూ పిల్లలకు బుద్ధి చెప్పెవారు...కానీ వారు మాటవరుసకు పలికే ఆ చదువు సంగీతం అనే మాటలోనే ఆ రెండింటికీ ఉన్న అవినాభావ సంబంధం అర్ధం అవుతోంది. ప్రస్తుతం సమాజంలో ఎం
● విద్యతో పాటు సంగీతం నేర్చుకోవడంపై ఆసక్తి పెంచుకుంటున్న చిన్నారులు ● అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్న సీనియర్ కళాకారులు ● నేడు ప్రపంచ సంగీత దినోత్సవం శ్రీకాకళం కల్చరల్/కవిటి/ఇచ్ఛాపురం: ఒత్తిడితో కూడిన జీవనానికి సంగీతం సాంత్వన కలిగిస్తుంది. మనస్సును ఆహ్లాదపరుస్తుంది. మానసిక ఆందోళనతో ఉండేవారికి ఔషధంలా పనిచేస్తుంటుంది. అందుకే సంగీతానికి ఎప్పటికీ ఆదరణ కొనసాగుతునే ఉంటుంది. నాటితరమే కాకుండా నేటి యువతరం కూడా సంగీతంపై మక్కువ పెంచుకుంటోంది. క్రమం తప్పకుండా సాధన చేస్తూ వాయిద్యాలపై పట్టు సాధిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా అనేక చోట్ల సంగీత శిక్షణ కేంద్రాల్లో చిన్నారులు తర్ఫీదు పొందుతున్నారు. అనురాగ నిలయంలో.. జిల్లా కేంద్రంలోని అనురాగ నిలయంలో రెడ్క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు సూచనల మేరకు చిన్నారులకు రెడ్డి సత్యనారాయణ నేతృత్వంలో సంగీతం తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక్కడి అనాథ చిన్నారులు వేదికపై ప్రదర్శనలు కూడా ఇచ్చే స్థాయికి చేరుకున్నారు. తల్లిదండ్రులు లేనివారిని అక్కున చేర్చుకుని బాగోగులు చూడటంతో పాటు వారి అభిరుచి మేరకు సంగీతం నేర్పిస్తుండటంతో సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వైద్యం.. సంగీతం ఓవైపు వైద్య వృత్తిలో ఎంత బిజీగా ఉన్నా సంగీత రంగంలోనూ రాణిస్తున్నారు జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ చిట్టి రామకృష్ణ. ప్రస్తుతం పాలకొండ ఏరియా ఆసుపత్రిలో నేత్రవైద్యులుగా పనిచేస్తున్న ఈయన వీణా వాయిద్యంలో అద్భుత ప్రద ర్శనతో ఆకట్టుకుంటున్నారు. విజయనగరం సంగీ త కళాశాలలో సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసి ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా కెనడా, మలేషియా, బెంగళూరు లోని విద్యార్థులు సంగీత తరగతులు నిర్వహిస్తున్నారు. ఇతని సతీమణి శ్రీసౌమ్య రేడియేషన్ అంకాలజిస్టుగా జెమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. ఆది త్యా మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్లో మిస్టర్ లోన్ లీ సినిమాకు వీణ ప్రదర్శన చేశారు. ఆల్ ఇండియా రేడియో ఏ–గ్రేడ్ ఆర్టిస్టుగా నమోదయ్యారు. ఎస్బీవీసీ ఛానల్లో కూడా వీణ ప్రదర్శన ఇచ్చారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ పోటీల్లో ప్రథమ బహుమతి సాధించారు. తండ్రి స్ఫూర్తితో.. తన తండ్రి బండారు చిట్టిబాబు స్ఫూర్తితో తనకంటూ ప్రత్యేకతను చాటుకోడానికి తబలా విద్యను అభ్యసించారు బండారు రమణముర్తి. సినీ నేపథ్య గాయకులు పి.సుశీల, ఎస్.జానకి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ మంగళం పల్లి బాలమురళీకృష్ణ, లతామంగేష్కర్, సత్యసాయిబాబా తదితర ఉద్ధండులైన గాయనీ గాయకులకు తబలా సహకారాన్ని అందించారు. అనేక టీవీ షోలలో ప్రాతినిధ్యం వహించారు. బ్యాంకు ఉద్యోగం చేస్తూనే.. నగరానికి చెందిన మండా శ్రీనివాస్ యూనియన్ బ్యాంకులో ఉద్యోగం చేస్తూ మృదంగంలోనూ రాణిస్తున్నారు. ఔత్సాహిక శాసీ్త్రయ, లలిత, సినీ సంగీత కళాకారులందరిని ఒకే వేదికపై ప్రదర్శన అవకాశం కల్పించేందుకు తరుణి కృష్ణస్మారక ధార్మిక ట్రస్టు 2019లో ఏర్పాటు చేసి సంగీత రంగంలో కృషి చేస్తున్నారు. కీబోర్డు రాజు.. నగరంలొ కీబోర్డు రాజుగా తనకంటూ ప్రత్యేక పేరు సాధించారు ముంజేటి రాజు. బండారు రమణమూర్తి సంగీత సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఢిల్లీ, కోల్కతా, జంషెడ్పూర్, నాగపూర్ వంటి నగరాల్లో సంగీత ప్రదర్శనలు ఇస్తున్నారు. సినీ నేపథ్య గాయకులు గోపికాపూర్ణిమ, మల్లికార్జున్ ప్రోగ్రామ్స్లో కీబోర్డు సహకారం అందించారు. అమ్మవారి సేవలో.. ఓవైపు రాజరాజేశ్వరీ మహాత్రిపుర సుందరీ దేవిపీఠంలో అమ్మవారి ఉపాసన చేస్తునే మరోవైపు ఆ అమ్మవారి పేరుతో సంగీత విద్యాలయాన్ని నడిపిస్తూ సంగీత సేవలందిస్తున్నారు సుసరాపు లక్ష్మీగణపతి శర్మ. తన తండ్రి దుర్గాప్రసాద్ శర్మను స్ఫూర్తిగా తీసుకొని పీఠాన్ని నిర్వహిస్తునే వైణీకుడిగా, గాయకుడిగా ప్రదర్శనలు ఇస్తూ ఎంతోమంది చిన్నారులకు, యువకులకు సంగీత విద్యను అభ్యసింపజేస్తున్నారు. శాక్సోఫోన్ శ్రీనివాస్ హయతినగరానికి చెందిన సుందరపల్లి శ్రీనివాస్ శాక్సోఫోన్, క్లారినెట్ ప్రదర్శనలో రాణిస్తున్నారు. కర్నాటక సంగీతంలో దిట్ట. ఇప్పటికీ ప్రతి రోజు ఆరుగంటల పాటు సాధన చేస్తుంటారు. మైసూరు గురుదత్త ఆశ్రమం, విశాఖ, హైదరాబాద్, తిరుపతి తదితర పుణ్యక్షేత్రాల్లో తన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. -
మొగదాలపాడులో పూరిల్లు దగ్ధం
గార: వత్సవలస పంచాయతీ మొగదాలపాడులో గనగళ్ల లక్ష్మమ్మకు చెందిన పూరిల్లు అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో విద్యుత్ మీటరు వద్ద మంటలు చెలరేగి ఇంటి మొత్తం వ్యాపించాయని బాధితురాలు తెలిపారు. గ్రామస్తులు మంటలార్పే ప్రయత్నం చేసినా ఫలితం దక్క లేదు. శ్రీకాకుళం నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. సుమారు రూ. 2 లక్షలు వరకు ఆస్తి నష్టం ఉంటుందని రెవెన్యూ సిబ్బంది అంచనా వేశారు. జూలై 9న అఖిలభారత సమ్మె శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): కార్మిక హక్కులు కాలరాసే లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థలు పరిరక్షణ కోరుతూ కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు మేరకు జూలై 9న అఖిల భారత సమ్మె జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సీహెచ్.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు పిలుపునిచ్చా రు. ఈ మేరకు శుక్రవారం శ్రీకాకుళం సీఐటీ యూ జిల్లా సమావేశం కార్యాలయంలో సమ్మె పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూలై 9న అన్ని మండల కేంద్రాలలో నిరసన ప్రదర్శనలు జరుగుతాయని, కార్మికులు, స్కీం వర్కర్లు పాల్గొనాలని కో రారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు ఎం.ఆదినారాయణమూర్తి, అల్లు సత్యనారాయణ, కె.సూరయ్య, ఎన్.వి.రమణ, ఎన్. గణపతి, ఎస్.లక్ష్మీనారాయణ, శ్రీకాకుళం నగ ర కన్వీనర్ ఆర్.ప్రకాశ్ పాల్గొన్నారు. -
వరదొస్తే పల్లెలకు ముప్పు
● అడ్డుకట్టలతో నీటి మళ్లింపుఈ చిత్రం చూడండి. ఇసుకను లారీల్లో రవాణా చేసేందుకు నదిలో ప్రవహిస్తున్న నీరు అడ్డొస్తుందని పెద్ద పెద్ద పైపులను కింద పెట్టి, పైన గ్రావెల్తో గట్టు నిర్మించారు. ఆ గట్టు కింద నున్న పైపుల ద్వారా నీరు మళ్లించేలా చర్యలు తీసుకున్నారు. వాస్తవంగా నదిలో యంత్రాలతో ఎలాంటి పనులు చేపట్టకూడదు. కానీ పట్టించుకోకుండా ఇష్టారీతిన ఇసుక నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వానలు పడుతున్నా.. నదుల్లోకి నీరు వస్తున్నా జిల్లాలో ఇసుక తవ్వకాలు ఆపడం లేదు. తరలింపు ఆగడం లేదు. ప్రభుత్వం అండదండలతో ఇసుక మాఫియా రెచ్చిపోతూనే ఉంది. ఇసుక డబ్బుల కోసం గ్రామాలను ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టేస్తోంది. నేతల జేబులు నింపడానికి ప్రజల ప్రాణాలను పణంగా పెట్టేస్తోంది. ఎవరేమైనా ఫర్వాలేదు తమ ఖజానా నిండితే చాలు అన్నట్టుగా పచ్చనేతలు చెలరేగిపోతున్నారు. ఎగువ ప్రాంతాలతో పాటు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వంశధార నదిలోకి వరద నీరు వస్తోంది. దీంతో నీటి ప్రవాహం మొదలైంది. ఈ పరిణామం ఇసుక అక్రమార్కులకు రుచించడం లేదు. వరదలొచ్చి తమకొచ్చే ఆదాయాన్ని గండికొడుతోందని, ఊరకనే వచ్చే సొమ్మును కోల్పోతున్నామని తెగ బాధపడిపోతున్నారు. నదిలోకి నీరొస్తే తవ్వకాలకు ఇబ్బందని, లారీలతో తరలించేందుకు కష్టమవుతుందని మదనపడిపోతున్నారు. ఏం జరిగినా ఇసుక తవ్వకాలు ఆగకూడదు, రవాణా ఆపకూడదన్న నిర్ణయానికొచ్చి బరితెగింపునకు దిగారు. తవ్వకాలు జరిగే చోటుకి వరద నీరు రాకుండా ఉండటానికి నదీ ప్రవాహానికి మధ్యలో యుద్ధ ప్రాతిపదికన గట్టు నిర్మించారు. అంతేకాకుండా భారీ ట్రక్కుల ద్వారా ఇసుక రవాణా చేసేందుకు ఇబ్బంది వస్తుందని నదిలోనే నీటి ప్రవాహానికి అడ్డంగా పైపులతో మరో గట్టు నిర్మించారు. ఇవన్నీ యంత్రాలతోనే చేసేశారు. వాస్తవంగా నదిలో యంత్రాల ద్వారా ఎలాంటి పనులు చేపట్టకూడదు. పర్యావరణానికి హాని కలిగించే ఎలాంటి నిర్మాణాలు చేయకూడదని సుప్రీంకోర్టు కూడా స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది. కానీ, ఇక్కడి నిర్వాహకులు తమకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఒక లెక్కా తాము చేసిందే న్యాయం అన్నట్టుగా నదిలో అడ్డంగా నిర్మాణాలు చేపట్టారు. వరద ఉద్ధృతి పెరిగితే ఆ గ్రామాలకు ముప్పే.. నదిలో అడ్డంగా పొడవైన గట్లు నిర్మించడం వలన భారీ వర్షాల కారణంగా వరదలొస్తే దిగువ ప్రాంతాలకు ముప్పు వాటిల్లుతుంది. వరద ఉద్ధృతికి ఆ గట్లు తెగిపడితే తీర ప్రాంత గ్రామాలు ముంపు బారిన పడక తప్పదు. ఇప్పటికే ఇసుక తవ్వకాలతో నదీ గమనం మారిపోయింది. పైపెచ్చు నదిలో అడ్డంగా పొడవైన గట్లు నిర్మించడం వల్ల ప్రవాహ గమనం మారిపోతుంది. అదే జరిగితే పెను ప్రమాదం చోటు చేసుకున్నా ఆశ్చర్య పోనక్కర్లేదు. గార వద్ద జరుగుతున్న ఇసుకాసురుల దుశ్చర్యల వల్ల లోతట్టు ప్రాంతాలైన వమరవల్లి, తోనంగి, క ళింగపట్నం, మత్స్యలేశం, బందరవానిపేట, కొర్ని పంచాయతీలకు ముప్పు ఉండే అవకాశం ఉంది. ఇసుక అక్రమ తవ్వకాలతో ముప్పులో తీర ప్రాంత గ్రామాలు అక్రమ సొమ్ము కోసం గార తీరంలో అడ్డదారులు వరదల వేళ వంశధార నదిలో అడ్డంగా కరకట్ల నిర్మాణం తవ్వకాలు జరిపే చోటుకి నీరు రాకుండా గట్లు వేసిన అక్రమార్కులు వర్షాకాలం నేపథ్యంలో భయాందోళనలో తీర ప్రాంత గ్రామ ప్రజలు -
‘పరిహారం ఇప్పించండి మహాప్రభో’
సంతబొమ్మాళి: మూలపేట పోర్టు నిర్మాణంతో సర్వస్వం కోల్పోయినా ఇంతవరకు తమకు ఎలాంటి పరిహారం ఇవ్వలేదని, పరిహారం ఇప్పించాలని విష్ణుచక్రం గ్రామానికి చెందిన దంపతులు గిన్ని ఈశ్వరరావు, మహాలక్ష్మి కోరుతున్నారు. గురువారం విలేకరులతో మాట్లాడారు. పీడీఎఫ్ లిస్టులో తమ పేరు ఉన్నా ఇంతవరకు పరిహారం ఇవ్వలేదన్నారు. పోర్టు పునరావాస కేంద్రంలో ఐదు సెంట్లు భూమి కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశా రు. అందరూ ఊరు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారని, తాము మాత్రమే ఊరిలో ఉండి ఏం చేయ గలమని అన్నారు. ప్రభుత్వం స్పందించి న్యా యపరంగా నష్టపరిహారం ఇప్పించాలని కోరారు. కల్తీ పదార్థాలు విక్రయిస్తే చర్యలు వజ్రపుకొత్తూరు: మండలంలోని పూండి వర్తక, వ్యాపార కేంద్రంలోని కిరాణా షాపుల్లో కాలం చెల్లిన, కల్తీ పదార్థాలు విక్రయించే షాపుల ఆట కట్టిస్తామని శ్రీకాకుళం ఫుడ్ సేఫ్టీ అధికారి జి.శ్రీరాములు హెచ్చరించారు. ఆయన గురువారం పూండి కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర సూపర్ మార్కెట్, సంతోషి కిరాణా, మరి కొన్ని షాపు ల్లో తనిఖీలు చేపట్టి కల్తీ జరిగినట్లు అనుమానించి నెయ్యి, కందిపప్పు, మినప గుళ్లు శాంపిల్స్ సేకరించారు. పూండి పరిసర ప్రాంతాల వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో తని ఖీలు చేశారు. అయితే వ్యాపారులు ఫుడ్ సేఫ్టీ అధికారులపై తిరగబడి, కొంత మంది టీడీపీ నేతలను పిలిచి విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా బెదింపులకు సైతం దిగడం స్థానికంగా సంచలనం కలిగించింది. ఈ విషయమై ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీరాములు మాట్లాడుతూ పూండిలోని కిరాణా షాపుల్లో కల్తీ జరిగినట్లు అనుమానించి శాంపిల్స్ సేకరించామని, వాటిని హైదరాబాద్లోని సెంట్రల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీకి పంపించామని తెలిపారు. ఈ విషయం జిల్లా జాయింట్ కలెక్టర్ దృష్టి సైతం తీసుకెళుతున్నట్లు ఆయన తెలిపారు. అకడమిక్ సిలబస్లపై దృష్టి శ్రీకాకుళం రూరల్: అకడమిక్ సిలబస్లపై ఎంఈఓలు దృష్టి సారించాలని రాష్ట్ర విద్యాశాఖ కమిషన్ విజయరామరాజు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని మునసబుపేటలో గల గురుజాడ కళాక్షేత్రంలో గురువారం 38 మండలాల ఎంఈఓలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటివరకూ ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా పూర్తి చేసినందుకు ఎంఈఓలను అభినందించారు. రానున్న మూడు నెలల్లో అకడమిక్లపై దృష్టి పెట్టాలన్నారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న భాషోపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలంటూ పిసిని వసంతరావు రాష్ట్రవిద్యాశాఖ కమిషనర్ను కోరారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో తెలుగు ఉపాధ్యాయుల పోస్టులను పునరుద్ధరించాలని, మాన్యువల్ బదిలీల కౌన్సెలింగ్ చేయాలని కోరారు.