breaking news
Srikakulam
-
అయ్యో... ఎంత కష్టమొచ్చిందో!
ఆమదాలవలస రూరల్: తాను లేకపోతే తన బిడ్డలు ఈ లోకంలో ఎలా బతుకుతారని కలత చెందిందో ఏమో ఆ మాతృహృదయం కర్కశంగా మారిపోయింది. అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన బిడ్డల గొంతు కోసం హతమార్చింది. ఆపై తానూ గొంతు కోసుకుంది. ఈ హృదయ విదారక ఘటన శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం వెదుళ్లవలసలో మంగళవారం సంచలనం రేకెత్తించింది. ఆమదాలవలస రూరల్ మండలం వెదుళ్లవలసకు చెందిన తల్లి కూర్మాపు వరలక్ష్మి అనే మహిళ తన కుమార్తెలు భవానీ (3), చాందిని (4నెలలు)లను గొంతుకోసి హతమార్చింది. ఆమె కూడా గొంతు కోసుకుంది. ప్రస్తుతం కొన ఊపిరితో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె భర్త రమణ వరంగల్లో కూలి పనులు చేస్తున్నారు. అత్త వేధింపులను తట్టుకోలేక పిల్లలను హతమార్చి ఆమె కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించినట్లు స్థానికులు చెబుతున్నారు. సోమవారం అర్ధరాత్రి రెండుగంటల వరకు అత్తాకోడళ్లు ఘర్షణ పడ్డారని, దీంతో అత్త వేధింపులు భరించలేక పిల్లలను హతమార్చినట్లు స్థానికులు చెబుతున్నారు. వేకువజామున ఈ ఘటన జరిగి ఉండవచ్చని, పొద్దున్నే అత్త తలుపులు తట్టగా స్పందన లేకపోవటంతో చుట్టు పక్కల ఉన్నవారిని పిలిచి చూడగా రక్తపు మడుగులో తల్లీపిల్లలు కనిపించారని తెలిపారు. శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద్, ఆమదాలవలస సీఐ బి.శ్రీనివాసరావు, ఎస్ఐ ఎస్.బాలరాజు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. -
దిష్టిబొమ్మల్లా కుళాయిలు
జి.సిగడాం: ఆనందపురం.. పేరులో ఉన్న ఆనందం బతుకులో లేకపోయింది. 700 కుటుంబాలు నివసిస్తున్న గ్రామానికి కుళాయిలు ఉన్నాయి గానీ చుక్క నీరు రావడం లేదు. గత ప్రభుత్వం హయాంలో కుళాయిలు ఏర్పాటు చేశారు. గ్రామంలోని వాటర్ ట్యాంకు ప్రస్తుతం శిథిలం కావడంతో కుళాయిల ద్వారా నీరు రావడం లేదు. అధికారులు, నాయ కులు సమీక్షలు నిర్వహిస్తున్నామని చెబుతున్నా అవేవీ సఫలం కావడం లేదు. గత ఏడాది మార్చిలో ప్రజలందరికీ స్వచ్ఛమైన నీరందిస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ ఆ మాట నెరవేరలేదు. నీటి కోసం ఆరాటం నేలబావి నుంచి నీరు తెచ్చుకోవాలంటే నరకం కనిపిస్తోంది. తాగునీటికి నానా ఇబ్బందులు పడుతున్నాం. ఎన్ని సార్లు వినతులు ఇచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదు. – గొర్లె లక్ష్మి, ఆనందపురం, జి.సిగడాం ఇబ్బంది పడుతున్నాం చాలా దూరం వెళ్లి నీరు తెచ్చుకోవాల్సి వస్తోంది. వాటర్ ట్యాంకు నిర్మించి నీరందించాలి. – చిత్తిరి అప్పమ్మ, ఆనందపురం, జి.సిగడాం -
బతుకును పెంచుకో
● ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది ● ఆత్యహత్య దేనికీ పరిష్కారం కాదంటున్న సామాజిక వేత్తలు ● ఒక్క క్షణం ఆలోచించండి అంటున్న మానసిక నిపుణులు.. ధైర్యం చెప్పాలి.. బతకడానికి బలమైన కారణం లేకపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కష్టం వచ్చినప్పుడు ధైర్యం చెప్పే వారు ఉండాలి. ఎవరికి వారే కుమిలిపోవడం, ఒంటరి తనం ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు. – డాక్టర్ రోష్ మల్లిఖార్జున్, మానసిక వైద్యనిపుణులు కౌన్సెలింగ్ తప్పనిసరి జిల్లాలో ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం. పిల్లలు సమాజంలో బతకడం కష్టమనే భావంతో ఇలా చేస్తున్నారు. ఇలాంటి వారికి కౌన్సెలింగ్ తప్పనిసరి. సమస్య ఉంటే కౌన్సెలర్లను సంప్రదించాలి. టెలి మానస్ నంబర్ 144106కు ఫోన్ చేసినా కావాల్సిన సలహాలు ఇస్తారు. – డాక్టర్ బెండి సాయిరామ్, మానసిక వైద్యులు ముందుగానే గుర్తించాలి పిల్లలు జీవించే హక్కును ఎవరి హరించినా నేరమే. వీటిని అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉంది. మానసిక, ఆర్థిక సమస్యలు ఉన్న వారిని గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇస్తే ఇలాంటి ఘటనలు తగ్గుతాయి. – కొమ్ము రమణమూర్తి, అడ్వకేట్, సోషల్ వర్కర్ శ్రీకాకుళం కల్చరల్ : కుంగుబాటు, మానసిక క్షోభ, ఒంటరితనం, క్షణికావేశం.. కలగలిపి ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. మనసులో ఉన్న ఆందోళనను ఎవరూ గుర్తించకపోవడం, బాధను ఎవరితోనూ పంచుకోకపోవడం, సరైన సమయానికి మాట్లాడే వారు లేకపోవడంతో జిల్లాలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. అయితే దీని నివారణకు మార్గాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కౌన్సెలింగ్ అనేది ప్రాణాలను నిలబెడుతుందని అంటున్నారు. క్షణికావేశాల్లో బతుకులను బలి చేసుకుంటున్న వారికి ఇదే మార్గమని సూచిస్తున్నారు. ఇటీవల ఘటనలు.. ● మే 14న ఆమదాలవలస మండలం గాజులకొల్లివలసలో తల్లితో గొడవపడి రాజేష్, గార మండలం గిడిపేటలో భార్య మద్యం తా గొద్దన్నందుకు కర్రి త్రినాధరావు చెట్టుకు ఉరేసుకుని తనువు చాలించారు. ● సారవకోట మండలం కురిడిలో భాస్కరరావు గొంతుకోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ● జూన్ 19న పలాస రైల్వేస్టేషన్ సమీపంలోని తాళభద్ర వద్ద తల్లి ఇద్దరు పిల్లలను రైలు కింద తోసి తనూ ఆత్మహత్య చేసుకుంది. ● మే 4న జి.సిగడాంలో తన భర్త హోంగార్డు శ్యామలరావు మద్యానికి, బెట్టింగ్లకు బానిసై బంగారాన్ని అమ్మేయడంతో భార్య ఉరి వేసుకుంది. ● అప్పు ఇస్తే తిరిగి అవతలివారే కేసు పెట్టడంతో మనస్తాపానికి గురై ఏప్రిల్ 11న పాతపట్నం చిన లోగిడికి చెందిన ఆటో డ్రైవర్ దయానిధి ఆత్మహత్య చేసుకున్నాడు. కుంగుబాటే కారణం.. కుంగుబాటు, మానసిక క్షోభ ఎంతో మందిని చంపేస్తున్నా యి. వీటి నివారణకు కౌన్సె లింగ్ సెంటర్ల ఏర్పాటు అత్యవసరం. ఒంటరితనం, నిరాశ, లేదా క్షోభ వంటి సంకేతాలను గమనిస్తే వారితో మాట్లాడాలి. యోగా, శ్వాస ద్వారా స్థైర్యాన్ని పెంచుకోవడం కుంగుబాటును, ఆందోళనను తగ్గిస్తుంది. – యార్లగడ్డ గీత, ఏపీలోని ’ది ఆర్ట్ ఆఫ్ లివింగ్’, అపెక్స్ మెంబెర్ -
మేతగాళ్ల జేబులోకి.. వేటగాళ్ల సొమ్ములు..!
పోలాకి: రాకాసి అలలను దాటుకుంటూ నడిసముద్రంలో వేట సాగించి తమ జీవననావను ముందుకు సాగిస్తున్న మత్స్యకారుల సంక్షేమం కోసం వేట నిషేధ సమయంలో వారి కుటుంబ పోషణకు ప్రభుత్వం అందించే మత్స్యకార భరోసా సొమ్ములు కొంతమంది నేతల జేబుల్లోకి వెళ్లిపోయాయని అర్హులైన లబ్ధిదారులు చెబుతున్నారు. పోలాకి మండలం అంపలాం పంచాయతీ రాజారాంపురంలో కొన్ని లక్షల రూపాయల వేటగాళ్ల సొమ్ములు మేతగాళ్లు నొక్కేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై నిలదీశారనే నెపంతో గ్రామానికి చెందిన 24 మంది అర్హులైన మత్స్యకారులకు పథకం వర్తింపజేయకుండా కొర్రీలు పెడుతున్నారు. దీనిపై గతంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. ఫిర్యాదు వెనక్కుతీసుకోవాలని బాధితులు ఒత్తిడి చేశారని, సదరు నేతల నుంచి తమకు హాని జరిగే అవకాశం ఉందని బాధితులు తాజాగా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. ఇదీ పరిస్థితి.. మత్స్యకార భరోసా లబ్ధిదారుల జాబితాలో డమ్మీలే ఎక్కువగా ఉన్నారని, కొంతమంది అర్హుల పేర్లు జాబితాలో రాకపోవటంతో మొత్తం గుట్టు బయటపడిందని స్థానికులు చెబుతున్నారు. రాజారాంపురం తీరం నుంచి రిజిస్టర్ కాబడిన బోట్లపై సముద్రంలోకి వేటకు వెళ్లినట్లు వచ్చిన లబ్ధిదారుల జాబితాలో తీరప్రాంతానికి సంబంధం లేని గ్రామాల వ్యక్తుల పేర్లు సైతం ఉన్నాయని ఆధారాలతో సహా గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. రాజారాంపురం తీరంలో 84 బోట్లు, 75 తెప్పలు రిజిస్టర్ కాబడి ఉంటే అందులో ఎన్నిబోట్లు, ఎన్ని తెప్పలు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఈ పథకం ఏమేరకు పక్కదారి పట్టిందో అర్ధం చేసుకోవచ్చు. వాస్తవానికి ఒక బోటుకు ఆరుగురు, తెప్పకు ముగ్గురు చొప్పున 728 మంది క్రూమెంబర్లు(కలాసీలు)గా అంపలాం గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. అందులో 687 మందిని అర్హులుగా గుర్తించారు. రాజారాంపురం తీరం నుంచి వేటసాగితే అంతే స్థాయిలో ప్రొడక్టివిటీ కూడా ఉండాల్సి ఉంది. ఆ విషయానికి వస్తే జిల్లాలో ప్రతిచోటా దాదాపు ఇలాంటి వ్యవహారమే ఉందన్న ఆరోపణలు కూడా లేకపోలేదు. మత్స్యకార భరోసా అందించే వేటగాళ్ల జాబితాకు, మన మత్స్యకారులు నిజంగా కష్టపడి వేటసాగించి తీసుకువచ్చే ప్రొడక్టివిటీ లెక్కలకు ఎక్కడా సరిపోలటం లేదు. రాజారాంపురం విషయానికి వస్తే బాధితులుగా చెప్పబడుతున్న 24 మందిలో కొంతమంది మత్స్యకారేతర కుటుంబాల వ్యక్తులు ఉన్నారని మత్స్యశాఖ అధికారులు చెబుతున్న మాట. ఇక్కడ ఇప్పటికే సొమ్ములు అందుకున్న 704 మందిలో అందరూ మత్స్యకారులేనా అంటే అక్కడా సమాధానం కుదరటంలేదు. సరికదా.. సదరు జాబితాలో నాన్ లోకల్ వ్యక్తులే ఎక్కువగా ఉన్నారు. మత్స్యకార భరోసా కోసం సముద్రంలో వేటసాగించే తీరప్రాంత వ్యక్తులు అందరూ అర్హులే తప్ప ఎక్కడా మత్స్యకారులు మాత్రమే ఉండాలని లేదని అర్హులైన బాధితులు చెబుతున్నారు. మత్స్యకార భరోసాలో డమ్మీ లబ్ధిదారులు లక్షల రూపాయలు నొక్కేశారని అర్హుల ఆవేదన ఇదే విషయమై నిలదీశారని రాజారాంపురంలో 24 మంది పై కక్షసాధింపు న్యాయం చేయాలని కలెక్టర్ను ఆశ్రయించిన బాధితులు తుప్పల్లో తెప్పలు..జాబితాలో పేర్లు.. రాజారాంపురం తీరంలో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఏళ్ల తరబడి ముళ్లపొదలు, తుమ్మతుప్పల్లో చెదలు పట్టిపోయిన బోట్లకు కూడా రంగులేసి రిజిస్టర్ చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దాదాపు రూ.1.37 కోట్లు మత్స్యకార భరోసా సొమ్ము అంపలాం సచివాలయం పరిధిలో అందితే అందులో సగానికిపైగా డమ్మీజాబితా ఖాతాల్లోకే చేరాయని తెలుస్తోంది. ఈ పథకమే కాకుండా ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చే డీజిల్ బిల్లు సైతం ఇలాంటి వేటకెళ్లని బోట్లు పేరుతో రాయితీ దండుకుంటున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని అర్హులు కోరుతున్నారు. -
దళిత ఓటర్ల పేర్లు తొలగించొద్దు
శ్రీకాకుళం/శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితాల సవరణ ప్రక్రియలో జిల్లాలోని అర్హులైన దళిత ఓటర్ల పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగిపోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుతూ దళిత సంఘాల జేఏసీ నాయకులు మంగళవారం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి స్వప్నిల్ దినకర్ పుండ్కర్ను కలెక్టరేట్లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కంఠ వేణు, జిల్లా ప్రధాన కార్యదర్శి తైక్వాండో శ్రీను మాట్లాడుతూ జిల్లాలోని అనేక గ్రామాల్లో నిరక్షరాస్యులు, వృద్ధులు, సామాజికంగా వెనుకబడిన వర్గాల ప్రజలు అధికంగా ఉన్నందున సర్ ప్రక్రియలో అవసరమైన పత్రాలు సమర్పించడం, దరఖాస్తులు నింపడం వంటి అంశాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కేవలం సాంకేతిక కారణాలు, పత్రాల లోపాల పేరుతో అర్హులైన దళిత ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోకుండా ఎన్నికల యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. గ్రామాలు, దళితవాడల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు బూత్ లెవల్ అధికారులు సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. వృద్ధులు, దివ్యాంగులు, నిరక్షరాస్యులకు ఇంటి వద్దే సేవలు అందించి వారి దరఖాస్తులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. -
ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమాలకు మద్దతు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఏపీజేఏసీ అమరావతి ఆధ్వర్యంలో జూలై 12 నుంచి జరగనున్న తొలి విడత ఉద్యమాలకు ఆంధ్రప్రదేశ్ సహకార శాఖ ఉద్యోగులు సంఘీభావం తెలిపారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని సహకార శాఖ కార్యాలయంలో మంగళవారం జిల్లా అధ్యక్షుడు పి.జానకిరామ్ తదితరులు ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ బి.వి.వి.ఎన్.రాజును కలిశారు. కార్యక్రమంలో జేఏసీ అసోసియేట్ చైర్మన్ దామోదర్, మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.అరుణకుమారి, ఏపీ సహకార శాఖ సేవా సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
పట్టుబడిన దారిదోపిడీ దొంగలు
శ్రీకాకుళం రూరల్ : శ్రీకాకుళం రూరల్ పోలీస్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం జరిగిన దారిదోపిడీ కేసులో నిందితులను రూరల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. కేసు వివరాలను మంగళవారం టౌన్ సీఐ పైడపునాయుడు, రూరల్ ఎస్ఐ సురేష్ విలేకరులకు వెల్లడించారు. మద్యానికి బానిసైన శ్రీకాకుళం నగరానికి చెందిన కొంకాన వెంకటనారాయణ, పడిపాటి నితిన్రెడ్డి, కొల్లు విజయ్కుమార్లు సులువుగా డబ్బులు సంపదించాలని దారిదోపిడీల మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ క్రమంలో ఖాజీపేటకు చెందిన పంచిరెడ్డి అప్పలనాయుడు శ్రీకాకుళం పట్టణం నుంచి స్వగ్రామానికి వస్తుండగా ఉదయం 4 గంటల సమయంలో అదే మార్గంలో ద్విచక్ర వాహనం వస్తున్న ఈ ముగ్గురూ కలిసి దాడిచేశారు. అతని జేబులో రూ.20వేల నగదును బలవంతంగా లాక్కొని పరారయ్యారు. వీరిలో ఇద్దరు పట్టుబడగా, విజయ్కుమార్ పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. డీఎస్పీ వివేకానంద ఆధ్వర్యంలో కేసును త్వరితగతిన ఛేదించి నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. నిందితుల వద్ద నుంచి రూ.7500 నగదు, సెల్ఫోన్, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. శతాధిక వృద్ధురాలి మృతి వజ్రపుకొత్తూరు రూరల్: బాతుపురం గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు తామాడ పాపుడమ్మ (105) మంగళవారం మృతి చెందారు. ఈమె 1973లో సర్పంచ్గా పనిచేశారు. ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. భర్త పోలినాయుడు పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఆయన కొన్నేళ్ల క్రితం మృతి చెందారు. సరస్వతమ్మ వైఎస్సార్ సీపీ మండల మహిళా విభాగం అధ్యక్షురాలిగా సేవలు అందించారు. ఈమె మృతి పట్ల తాజా మాజీ సర్పంచ్ బత్తిని సృజన లక్ష్మీనారాయణ, గ్రామ పెద్దలు సంతాపం తెలియజేశారు. -
వ్యాన్ ఢీకొని ముగ్గురికి గాయాలు
● వ్యాన్ డ్రైవర్ మద్యం మత్తే కారణం శ్రీకాకుళం క్రైమ్ : మద్యం మత్తులో ఉన్న లగేజీ వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడిపి ముగ్గురి గాయాలకు కారణమయ్యాడు. ట్రాఫిక్ సీఐ వి.రామారావు తెలిపిన వివరాల ప్రకారం..శ్రీకాకుళం మండలం రాయిపాడుకు చెందిన వృద్ధుడు యట్రాజుల తవుడు ఏఎస్ఎన్కాలనీలో నిర్మిస్తున్న ఓ ఇంటికి తాపీ పనికి మంగళవారం ఉదయం వెళ్లాడు.. మధ్యాహ్నం బలగ సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో తమ గ్రామానికి చెందిన ఫంక్షన్ జరుగుతుండటంతో భోజనానికని నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో కొత్తరోడ్డు నుంచి ఆర్టీసీ కాంప్లెక్సు వైపు వస్తున్న లగేజీ వ్యాను డ్రైవర్ నారు మురళి (ఆమదాలవలస మండలం దూసి) మద్యం మత్తులో వృద్ధుడిని ఢీకొట్టాడు. అంతేకాక కాంప్లెక్సు వైపు స్కూటీపై వెళ్తున్న దంపతులు సాధు గణేష్, మాధవిలను ఢీకొట్టాడు. అందరూ గాయపడటంతో డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వెల్లడించారు. పీఎన్ కాలనీలో.. శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని పీఎన్కాలనీలో మంగళవారం రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఓ మహిళ గాయపడింది. ట్రాఫిక్ ఏఎస్ఐ మెట్ట సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. పీఎన్కాలనీలో కర్రి స్వాతి తన భర్త సంతోష్కుమార్తో కలిసి నివాసముంటోంది. ఈ క్రమంలో తన బంధువైన ఉదయ్కుమార్తో నవభారత్ జంక్షన్కు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లావేరుకు చెందిన ప్రగఢ గోపి తన ద్విచక్రవాహనంతో ఢీకొట్టాడు. మహిళకు గాయాలవ్వడంతో కేసు నమోదు చేశామని చెప్పారు. దంపతులకు గాయాలు రణస్థలం: లావేరు మండలం బొంతుపేట జాతీయ రహదారిపై బైక్పై వెళుతున్న దంపతులు నడుపూరి సురేష్, రాజకుమారిలకు బొలెరో వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికీ గాయాలు కావడంతో 108 అంబులెన్సులో శ్రీకాకుళం తరలించారు. లావేరుకు చెందిన సురేష్ బైక్పై శ్రీకాకుళం వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించిందని 108 సిబ్బంది ఈశ్వరరావు, చిన్నా తెలిపారు. లావేరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. -
రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో బంగారు పతకం
ఎచ్చెర్ల : చిలకపాలెంలోని శివానీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ సి.ఎస్.ఈ.విద్యార్థి ఎండ శివచరణ్ జూన్ 27, 28వ తేదీల్లో చిత్తూరులో జరిగిన రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలలో అండర్–23 విభాగంలో 72 కేజీల గ్రీకోరోమన్ కేటగిరీలో బంగారు పతకం సాధించాడు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్య సభ్యులు వి.ఎం.ఎం.సాయినాథ్రెడ్డి, కె.దుర్గా శ్రీనివాసరావు, పి.దుర్గాప్రసాద్రాజు, డి.వెంకటరావు, డాక్టర్ ఎస్.శ్రీనివాసరావు, జె.హరీష్లు శివచరణ్ను అభినందించారు. జూలై 10, 11వ తేదీలలో హర్యానాలో జరగబోయే జాతీయ స్థాయి కుస్తీ పోటీల్లోనూ పతకం సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వై.శ్రీనివాసరావు, జి.టి చంద్రశేఖర్, వైస్ ప్రిన్సిపాల్ కె.రాజ్కిరణ్, ఎస్వీఎస్ సునీల్కుమార్, వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు. -
ఆశలపై నీళ్లు
నరసన్నపేట: ‘అధికారులకు మొర పెట్టుకున్నాం.. ఎమ్మెల్యేను కలిశాం. ఎవరూ స్పందించలేదు. మా సమస్యలు పరిష్కరించని వారికి మేమెందుకు ఓటెయ్యాలి. మేము అసలు ఓటు వేయం. సర్ కార్యక్రమాన్ని కూడా బహిష్కరిస్తాం..’ నరసన్నపేట మండలంలోని వజ్రంపేట వాసుల ఆక్రందన ఇది. తాగునీటి సమస్య పరిష్కరించాలని సోమవారం ఉదయం పంచాయతీ కార్యాలయాన్ని మహిళలు చుట్టుముట్టారు కూడా. చాలాకాలంగా సమస్య ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మంగళవారానికి నీరు వస్తుందని ఆశించినా చుక్క నీరు కూడా రాలేదు. దీంతో ప్రభుత్వం, అధికారులపై స్థానిక మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఓటరు నమోదులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఓటరు జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటిని సందర్శించి, అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం నగరపాలక సంస్థ పరిధిలోని బీఎల్ఓలు, సూపర్వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధుల్లో వెనుకబడిన బీఎల్ఓలు పనితీరును మెరుగుపరుచుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్ఓలు మాత్రమే స్వయంగా పంపిణీ చేసి తిరిగి వారే సేకరించాలని స్పష్టం చేశారు. ప్రక్రియను సులభతరం చేసేందుకు వీలుగా ఫారాల డిజిటలైజేషన్కు కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ఒక సహాయకుడిని, ఓటర్లను గుర్తించడంలో తోడ్పాటునందించేందుకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగవావాడీ సిబ్బందిని ప్రతి బీఎల్ఓకు సహాయకులుగా కేటాయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ కూర్మారావు, అసిస్టెంట్ కమిషనర్ శివకుమార్, ఏసీపీ జానకి తదితరులు పాల్గొన్నారు. -
మహిళా శిశు సంక్షేమ శాఖ సంఘం కార్యవర్గం ఎన్నిక
శ్రీకాకుళం అర్బన్: జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక ఏపీ ఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.వేణుగోపాల్ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని ఎన్జీవో కార్యాలయంలో జరిగింది. జిల్లా అధ్యక్షురాలిగా శోభారాణి (సీడీపీఓ గార), ప్రధాన కార్యదర్శిగా ఉమాజానకి (సీడీపీఓ కొత్తూరు), కోశాధికారిగా ఎం.రాజేశ్వరి, (సీడీపీఓ ఇచ్చాపురం), వైస్ ప్రెసిడెంట్లుగా శోభారాణి, పాపునాయుడు, జాయింట్ సెక్రటరీగా మణెమ్మ, అనురాధ, కార్యవర్గ సభ్యులుగా గీత, బీవీ లక్ష్మి, రూపలత, వంశీ ప్రియా తదితరులు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఎన్జీజీవో సంఘ పట్టణ అధ్యక్షుడు బొచ్చ శ్రీనివాసరావు, మహిళా శిశు సంక్షేమ శాఖ జేఏసీ జాయింట్ సెక్రెటరీ విద్య తదితరులు పాల్గొన్నారు. -
2 న సామూహిక ఉపనయనాలు
అరసవల్లి: అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో ఈనెల 2న జ్యేష్ట బహుళ విదియ గురువారం ఉదయం 7.09 గంటలకు బ్రాహ్మణ బాలురుకి సామూహిక ఉపనయనాలు జరిపిస్తున్నట్లుగా ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, ఆరామ ద్రావిడ సంఘం జిల్లా కార్యదర్శి దార్లపూడి రవి తదితరులు ప్రకటించారు. ఈ మేరకు మొత్తం 22 మంది బాలురుకు ఉపనయనాలు పూర్తిగా ఉచితంగా చేపడుతున్నామని, ఆది త్యుని సన్నిధిలో ఇలాంటి కార్యక్రమాన్ని జరిపించుకోవడం ఒక అదృష్టమని వివరించారు. ఇంటింటి సర్వేపై దిశానిర్దేశం శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా నవీకరణలో భాగంగా చేపట్టిన ఇంటింటా సర్వే ప్రక్రియను అత్యంత సమర్థంగా, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని భారత ఎన్నికల సంఘం అధికారి పవన్ కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం ఢిల్లీ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అమరావతి నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఈ సమీక్షలో పాల్గొన్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ హరి ఓం పాండియా ఈ సమావేశానికి హాజరయ్యారు. జిల్లాలో ప్రస్తుతం సాగుతున్న ఇంటింటా సర్వే పురోగతిని, ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వారు కేంద్ర ఎన్నికల సంఘం అధికారికి వివరించారు. ఈ పనులను గడువులోగా, ఎలాంటి తప్పుల్లేకుండా పూర్తి చేసేందుకు తీసుకుంటున్న చర్యలను నివేదించారు. మూన్నాళ్ల ముచ్చటేనా..? మందస: మందస మండలం మకరజోల పంచాయతీ అల్లిమెరక గ్రామానికి హరిపురం నుంచి వేసిన రోడ్డు అప్పుడే విరిగిపోయింది. కొద్ది నెలల కిందటే ఈ రోడ్డు వేయగా.. ఇది మూన్నాళ్ల ముచ్చటగా మారిందని స్థానికులు అంటున్నారు. రోడ్డును ఇలాగే వదిలేస్తే ప్రమాదాలు జరుగుతాయని, అధికారులు స్పందించాలని కోరుతున్నారు. మొగిలిపాడులో కంకర అక్రమ నిల్వలు పలాస: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలోని 2వ వార్డు మొగిలిపాడులో రియల్ ఎస్టేట్ వ్యా పారులు కంకర అక్రమ నిల్వలు భారీ స్థాయిలో డంప్ చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా రియల్ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లు వేయడం, దాన్ని చదును చేయడానికి అక్రమంగా కొండలను కరిగించి కంకర తీసుకొచ్చి ఈ విధంగా డంప్ చేస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇటీవల మొగిలిపాడు గ్రామం జాతీయ రహదారి పక్కన, ప్రస్తుతం కంకర నిల్వ ఉన్న అతి సమీపంలోనే వెంచర్లు వేశారు. దానికి సమీపంలోనే చెరువు, వరద కాలువ కూడా ఉంది. వాటిని కప్పేసి అందులో కలు పుకోవడానికి ఈ విధంగా అక్రమంగా కంకర అర్ధరాత్రి పూట కంకర తీసుకొచ్చి నిల్వ చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తహసీల్దార్ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్న ఈ రియల్ ఎస్టేటు ప్లాట్లుపై రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడటం లేదు. దీనికి ఎలాంటి అనుమతులు లేవని మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు చెబుతున్నా, అక్కడ పనులు మాత్రం రాత్రిపగలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. పైగా విద్యుత్ స్తంభాలు కూడా వేశారు. -
● పొందూరు చేనేత చీరలకు భాగ్యం
ఒన్ డిస్ట్రిక్ట్, ఒన్ ప్రొడక్ట్ పథకంలో భాగంగా ఎంపికైన పొందూరు చేనేత చీరలకు మహర్దశ కలిగిదని కేంద్ర మూల్యాంకన అధికారులు హర్ప్రీత్ సింగ్, శిష్టి తెలిపారు. మంగళవారం ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర మూల్యాంకన బృందం అధికారులు పొందూరు ఖాదీ చేనేత కాటన్ చీరల ఉత్పత్తిని పరిశీలించారు. కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ట్రేడ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఓడీఓపీకి పొందూరు కాటన్ చీరల భౌతిక పరిశీలనకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో మూల్యాంకన బృందం పర్యటించింది. తండ్యా మెట్టలో చేనేత, కాటన్చీరలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా చేనేతజౌళిశాఖ అధికారి టి జనార్ధనరావు, చేనేత సొసైటీ మేనేజర్ ఒ.శ్రీనివాసరావు, ఏఎఫ్కేకే సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కామేశ్వరప్రసాద్, డి.వెంకటరమణ పాల్గొన్నారు. –పొందూరు -
డిజిటలైజేషన్ పూర్తి చేయాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: పోలింగ్ స్టేషన్ల డిజిటలైజేషన్ సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) – 2026 కార్యక్రమంలో భాగంగా మంగళవారం అరసవల్లి మిల్లు జంక్షన్ వద్ద 131 పోలింగ్ స్టేషన్కు సంబంధించి అపార్ట్మెంట్లో ఉన్న ప్లాట్ యజమానులతో మాట్లాడారు. ఎన్యూమరేషన్ ఫారాలు, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు 30 శాతం డిజిటలైజేషన్ పూర్తయినట్లు నగర సహాయ టౌన్ ప్లానర్ జానకి తెలిపారు. కార్యక్రమంలో ఎన్నికల డీటీ శ్రీనివాసరావు, బీఎల్ఓలు పాల్గొన్నారు. జె.భైరిపురంలో చైన్స్నాచింగ్ కంచిలి : జె.భైరిపురంలో సోమవారం రాత్రి చైన్స్నాచింగ్ జరిగింది. గ్రామానికి చెందిన 62 ఏళ్ల వృద్ధురాలు బల్ల సావిత్రి రాత్రి ఏడున్నర గంటల సమయంలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి గ్రామంలో మెయిన్రోడ్డు పక్కన ఉన్న చెరువుకు వెళ్లింది. అదే సమయంలో ముగ్గురు దుండగులు మోటార్ సైకిల్పై వచ్చి వృద్ధురాలి మెడలో ధరించిన ఒకటిన్నర తులాల బంగారు గొలుసును తెంచుకుని పారిపోయారు. దుండగుల్లో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. వీరంతా బైక్పై ఒడిశా వైపు పారిపోయారు. ఈ మేరకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ పి. పారినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సేవలకు సత్కారం మెళియాపుట్టి: విధి నిర్వహణలో అందించిన సేవలే గుర్తింపునిస్తాయని ఎంపీడీఓ ఎన్.పి.పండా అన్నారు. మెళియాపుట్టి మండల పరిషత్ ఏవోగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన రాజేశ్వరమ్మను మంగళవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షుడు ఎస్.మోహనరావు, బైపోతు ఉదయ్కుమార్, ఎన్.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. వార్షిక కార్యాచరణ ప్రణాళికపై శిక్షణ ఎచ్చెర్ల : సెర్ప్ ఆదేశాల మేరకు జిల్లాలోని 19 మండలాల వార్షిక కార్యాచరణ ప్రణాళికపై లావేరు మండల సమాఖ్య ఆధ్వర్యంలో ఎచ్చెర్ల టీటీడీసీ కార్యాలయంలో రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఆర్డీఏ పీడీ కిరణ్కుమార్ మాట్లాడుతూ బడిఈడు పిల్లలను బడికి పంపించడం, మహిళల అక్షరాస్యత, పోటీ పరీక్షలకు సిద్ధం చేయడం, భూసార పరీక్షలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సంస్థాగత నిర్మాణ డీపీఎం మోహనరావు, ఏపీఎం భాగ్యలత, ఎల్సీ బసవరాజు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ కార్యాలయంలో బండికి చార్జింగ్
ఇచ్ఛాపురం రూరల్: ప్రభుత్వ కార్యాలయాలను ప్రజల సేవల కోసం వినియోగించాల్సి ఉండ గా, కొందరు అధికార పార్టీ నాయకులు వాటిని వ్యక్తిగత అవసరాలకు ఉపయోగిస్తున్నారు. స్థానిక టీడీపీ నాయకుడు మంగళవారం తన వ్యక్తిగత ఎలక్ట్రిక్ బైక్కు చార్జింగ్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ విద్యుత్ను వ్యక్తిగత అవసరాలకు వినియోగించడం నిబంధనలకు విరుద్ధమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాన్ని సొంత ఆస్తిలా ఉపయోగించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ● టీడీపీ నాయకుడి దుశ్చర్య -
గిరిజన నాయకులపై ఎమ్మెల్యే ఆగ్రహం
ఆమదాలవలస రూరల్: పిల్లలను చంపేంత కష్టం ఏం వచ్చిందో..? గొంతుపై కత్తి పెట్టేంత కర్కశం ఎందుకు వచ్చిందో..? ప్రాణం తీసుకోవాలనేంత ఆలోచన ఆ మనసులో ఎలా చేరిందో గానీ.. ఆ కన్నతల్లి పేగు తెంచుకుని పుట్టిన బిడ్డల మరణ శాసనం రాసింది. ఆమదాలవలస మండలం వెదుళ్లవలస గ్రామంలో మంగళవారం కూర్మాపు వరలక్ష్మి అనే మహిళ తన బిడ్డలైన కూర్మాపు భవాని(3), కూర్మాపు చాందిని (4నెలలు)ని కత్తితో గొంతుకోసి దారుణంగా హతమార్చింది. ఆమె కూడా కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. ప్రస్తుతం కొన ఊపిరితో ఆస్పత్రిలో ఉంది. ఆమె భర్త కూర్మా పు రమణ వరంగల్లో కూలి పనులు చేస్తూ ఉంటారు. ఈ సంఘటనతో వెదుళ్లవలస శోకసంద్రమైంది. ఊరు ఊరంతా కంట తడి పెట్టింది. కలహాలే కారణమా..? వరలక్ష్మికి అత్త కూర్మాపు లక్ష్మితో కలహాలు ఉన్నా యి. కుటుంబంలో వరలక్ష్మి వద్దనే అత్త కూర్మాపు లక్ష్మి ఉంటున్నారు. కొంత కాలం నుంచి అత్త వేధింపులకు పాల్పడుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. సోమవారం అర్ధరాత్రి రెండుగంటల వరకు అత్త, కోడలు ఘర్షణ పడ్డారని, దీంతో అత్త వేధింపులు భరించలేక పిల్లలను హతమార్చినట్లు స్థానికులు చెబుతున్నారు. అత్తాకోడళ్లు రాత్రి ఘర్షణ పడ్డాక అత్త ఇంటి బయట నిద్రపోయింది. తల్లీపిల్లలు తలుపులు వేసుకుని లోపల నిద్రపోయారు. ఉదయం 5 గంటల సమయానికి అత్త తలుపులు తట్టగా ఎవరూ తీయలేదు. దీంతో చుట్టుపక్కల వారికి సమా చారం ఇవ్వగా వారు వచ్చి చూశారు. తలుపులు తీయగా రక్తపు మడుగులో తల్లీపిల్లలు కనిపించడంతో నిశ్చేష్టులైపోయారు. వెంటనే 108కు సమాచారం ఇచ్చారు. అప్పటికే పిల్లలు ప్రాణాలు కోల్పోగా.. తల్లి మాత్రం కొన ఊపిరితో ఉంది. వెంటనే ఆమెను శ్రీకాకుళం రిమ్స్కు తరలించా రు. పసి పిల్లలు అలా పడుకున్నట్టే ప్రాణాలు విడిచేసిన దృశ్యాలు చూసి స్థానికులు కంట తడి పెట్టారు. రాత్రి మూడింటి తర్వాతే ఘటన జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. అత్త వేధింపులతో పాటు ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా ఈ ఘటనకు కారణమై ఉండవచ్చనే వాదన వినిపిస్తోంది. ఘటనా స్థలానికి పోలీసులు ఈ విషయం తెలిసిన వెంటనే వెదుళ్లవలసకు పోలీసులు చేరుకున్నారు. శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద, ఆమదాలవలస సీఐ బి.శ్రీనివాసరావు, ఎస్ఐ ఎస్.బాలరాజు సంఘటన జరిగిన విషయం గ్రామస్తులను అడిగి తెలుసున్నారు. ఈ ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాపు చేస్తామని డీఎస్పీ చెప్పారు. తల్లి కోలుకున్న తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బాలరాజు తెలిపారు. సారవకోట: మండలంలోని పలువురు గిరిజన నాయకులపై నరసన్నపేట ఎంఎల్ఏ బగ్గు రమణమూర్తి మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని గిరిజన మత్స్యకారులకు ద్విచక్ర వాహనం, ఐస్ బాక్స్లు మంజూరయ్యాయి. బుడితి సొసైటీ సభ్యులు ఆరుగురికి ఈ యూనిట్లు మంజూరు కాగా బొమ్మికపేట, సింగంవలస గ్రామాల కు చెందిన ఇద్దరు గిరిజనులకు సైతం రెండు యూ నిట్లు మంజూరయ్యాయి. బొమ్మికపేట, సింగంవలస గ్రామాలకు చెందిన ఇద్దరికి తన నోటీసులో లేకుండా ఏ విధంగా యూనిట్లు మంజూరు చేశా రని సంబంధిత శాఖ సిబ్బంది పై తొలుత ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేయగా.. ఐటీడీఏ నుంచి వచ్చిన యూనిట్లను మీరు ఎలా మంజూరు చేయించుకుంటారని గిరిజన నాయకులైన జన్ని రామారావు, బి.తులసీరావు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఐటీడీఏ సీతంపేటలో దరఖాస్తు చేసుకున్నామని, మంజూరయ్యాయని ఇద్దరూ సమాధానమిచ్చారు. అమ్మ తప్ప వారికేదీ తెలీదు.. ఆకలేస్తే అమ్మ.. నిద్ర వస్తే అమ్మ.. నిద్రలో ఉలికిపడినా అమ్మ.. నొప్పి పుట్టినా అమ్మే కావాలి. ఆ రాత్రి కూడా గొంతు వద్ద ఏదో కోసుకుంటుంటే అమ్మా.. అనే అరిచి ఉంటారు. రక్తం ధార కట్టి ఊపిరి పోతూ ఉంటే అమ్మనే తలచుకుని ఉంటారు. ప్రాణం గాల్లో కలిసిపోతూ ఉన్న సమయాన అమ్మా.. అమ్మా అంటూ ఏడ్చి ఉంటారు. ఆ పసివాళ్లకేం తెలుసు.. ఆ గొంతు కోసింది అమ్మేనని. ఆ చిన్నారులకేం తెలుసు తమ ప్రాణాలు తీసింది కన్నతల్లేనని. వెదుళ్లవలసలో కన్నతల్లి ఇద్దరు బిడ్డల గొంతుకోసి చంపేసింది. తాను కూడా గొంతు కోసుకుని చనిపోవడానికి ప్రయత్నించింది. పసికందుల గొంతు కోసి చంపిన కన్నతల్లి అనంతరం పీక కోసుకుని ఆత్మహత్యాయత్నం వెదుళ్లవలసలో ఘటన కొన ఊపిరితో చికిత్స పొందుతున్న తల్లి -
●కొబ్బరి రైతుల భూములు కాపాడాలి
కవిటి మండలం శిలగాం సమీపంలోని అల్లేరు భూములను కొబ్బరి రైతుల ప్రయోజనాలకే వినియోగించాలని, కొబ్బరి ఆధారిత పరిశ్రమలు మాత్రమే ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ నర్తు రామారావు కోరారు. ఈ మేరకు పీజీఆర్ఎస్లో కలెక్టర్కు సోమవారం వినతిపత్రం అందజేశారు. శిలగాం గ్రామ పరిధిలోని సర్వే నంబర్–110లో ఉన్న 21.76 ఎకరాల అల్లేరు భూములను 1990లో కొబ్బరి, జీడి, మామిడి రైతుల అభివృద్ధి కోసం ఉద్యానవన శాఖకు ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. ప్రస్తుతం ఆ భూముల్లో ఎంఎస్ఎంఈ పార్కు పేరుతో ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు రావడం వల్ల కొబ్బరి రైతుల్లో ఆందోళన నెలకొందని పేర్కొన్నారు. ఈ భూముల్లో కొబ్బరి అనుబంధ పరిశ్రమలకు మాత్రమే అవకాశం కల్పించాలని కోరారు. అలాగే ఈ భూమిలో శిలగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కేటాయించిన ఐదు ఎకరాల ఆట స్థలాన్ని యథాతథంగా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా ఇటీవల పెద్ద కర్రివానిపాలెం మత్స్యకార గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు తక్షణమే నష్ట పరిహారం అందించాలని, పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ ప్రమాదంలో ఎనిమిది కుటుంబాలు తీవ్రంగా నష్టపోగా, వాటిపై ఆధారపడిన మరో 50 కుటుంబాల జీవనోపాధి దెబ్బతిన్నదని వివరించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ.. సుమారు రూ.88 లక్షల నష్టం జరిగినట్లు అంచనా వేసి నివేదికను ప్రభుత్వానికి పంపించామని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు కడియాల ప్రకాష్ పాల్గొన్నారు. -
ప్రతీ అర్జీని ఆడిట్ చేయాలి
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ● పీజీఆర్ఎస్కు 165 వినతులు శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చే ప్రతీ అర్జీని జిల్లా అధికారులు స్వయంగా పరిశీలించడంతో పాటు ఖచ్చితంగా గ్రీవెన్స్ ఆడిట్ నిర్వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సమస్యల తీవ్రతను బట్టి అధికారులు స్పందించాలని, జాప్యానికి తావులేకుండా నాణ్యమైన పరిష్కారం చూపాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 165 ఫిర్యాదులు నమోదయ్యాయని పేర్కొన్నారు. కాగా జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎస్ఈ పీఏ ఆ శాఖ పరమైన సమస్యపై స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవడంతో ఆమెకు మెమో జారీ చేయాలని ఆదేశించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం దూర విద్యా విధానంలో టెన్త్, ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ ప్రారంభం గోడ పత్రికను ఆవిష్కరించారు. కొన్ని వినతులు పరిశీలిస్తే.. ●జిల్లాలో రైతులకు ఎరువులు, పురుగు మందుల కొరత లేకుండా చూడాలని డీసీసీ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు వినతిపత్రం అందజేశారు. ●శ్రీముఖలింగం క్షేత్రంలో 30 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రధాన సమస్యలు పరిష్కరించాలని శ్రీముఖలింగేశ్వర దేవస్థానం అర్చక సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు నాయుడుగారి రాజశేఖర్ కోరారు. దిక్కున్న చోట చెప్పుకోమంటున్నారు.. ●జిల్లాలోని భైరవానిపేట గ్రామానికి చెందిన 14 దళిత కుటుంబాలకు 2013లో అప్పటి ప్రభుత్వం ఇందిరమ్మ పచ్చ తోరణం కింద ఒక్కొక్కరికి 100 మొక్కల్ని ఇవ్వడం జరిగింది. అయితే దళితులకు ఇచ్చిన మొక్కలపై కూటమి నాయకులు పెత్తనం చేస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు ముంజేటి కృష్ణమూర్తి పీజీఆర్ఎస్లో కోరారు. రాత్రి సమయంలో కొబ్బరి చెట్ల ఫలసాయాన్ని దొంగతనంగా కోస్తున్నారని, అడిగితే దిక్కున్నచోట చెప్పుకోండని దళితులను భయపెడుతున్నారన్నారు. ఆమదాలవలస మండలంలోని కొత్తరోడ్డు జంక్షన్లో బావాజీ మఠం భూముల్లో అక్రమ లే అవుట్కు ఎంపీ ల్యాడ్ నిధులు మంజూరు సరికాదని, అక్కడ జరుగుతున్న అక్రమాలు పరిశీలించాలని వైఎస్సార్సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ కోరారు. ఈ మేరకు పీజీఆర్ఎస్లో వినతిపత్రం అందజేశారు. అలాగే బుర్జ మండలంలోని అన్నంపేట గ్రామం భూ వివాదం అంశంపై నిజమైన హక్కుదారునకు న్యాయం చేయాలని విన్నవించారు. పొందూరు మండలంలోని గోకర్ణపల్లి పంచాయతీలో అక్రమంగా తొలగించిన వృద్ధాప్య, వికలాంగ పెన్షన్లను వెంటనే పునరుద్దించాలన్నారు. ఆయనతో పాటు పార్టీ నాయకులు పైడి పోలయ్య తదితరులు ఉన్నారు. మత్య్సకార భరోసా పథకం లబ్ధిదారుల పేర్లలో అవకతవకలు ఉన్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని పోలాకి మండలం అంపలాం గ్రామ మత్స్యకారుడు మైలపల్లి సూరిబాబు కోరారు. వాస్తవంగా గ్రామంలో 100 కుటుంబాలు కంటే తక్కువ మంది వేటకు వెళ్లిన మత్య్సకారులు ఉండగా, 640 మందికి మంజూరైనట్లు జాబితాలు వచ్చాయన్నారు. దీనిపై నిలదీసినందుకు 24 మంది అర్హులైన మత్స్యకారుల పేర్లను లబ్ధిదారులు జాబితా నుంచి తొలగించారని తెలిపారు. ఇది చాలా అన్యాయమని అడిగితే దాడులు చేసేందుకు సిద్ధపడుతున్నారని, అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
టెక్కలి ఆర్డీఓ తీరు సరిగ్గాలేదు ‘సర్’
టెక్కలి : టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి తీరు సక్రమంగా లేదని, కేవలం మంత్రి అచ్చెన్నాయుడుకు మాత్రమే తాబేదారుగా పనిచేస్తున్నారు తప్ప సామాన్య ప్రజలకు పనిచేయడం లేదని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో లోపాలున్నాయని, నిమ్మాడ చుట్టుపక్కల ప్రాంతాల్లోని పోలింగ్ బూత్ల్లో కొన్నేళ్లుగా మరణించిన వారి ఓట్లు తొలగించడం లేదన్నారు. ఈ నేపథ్యంలో.. సోమవారం తిలక్ నియోజకవర్గ నాయకులతో కలిసి ఆర్డీఓను కలిశారు. కానీ, సమస్య స్వీకరించే విషయంలో ఆర్డీఓ తీరు నచ్చకపోవడంతో అసహనంతో ఆయన బయటకు వచ్చేశారు. ఈ సందర్భంగా తిలక్ మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయాల్సిన ఆర్డీఓ పూర్తిగా మంత్రి అచ్చెన్నాయుడు మెప్పు కోసం ఒక ఏజెంట్గా పనిచేస్తున్నారని మండిపడ్డారు. సర్ ప్రక్రియలో లోపాలున్నాయని చెబితే మాపై తిరుగుబాటు చేసేలా వ్యవహరించడం అత్యంత హేయనీయమన్నా రు. మరోవైపు.. టెక్కలి ఆర్డీఓ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నాయ కులతో నిర్వహిస్తున్న సమావేశాన్ని ఆర్డీఓ తీరు నచ్చక బహిష్కరిస్తున్నట్లు వైఎస్సార్సీపీ టెక్కలి మండలం అధ్యక్షుడు హనుమంతు వెంకటేశ్వరరావు చెప్పారు. పలాస: మండలంలోని కోసంగిపురం వద్దనున్న జగనన్న కాలనీలో సోమవారం హృదయ విదారక ఘటన చోటుకుంది. కాలనీకి చెందిన నెయ్యిల ఉమామహేశ్వరరావు (56) అనారోగ్యంతో మృతి చెందాడు. పిల్లలు చిన్నవారు కావడంతో ఉమామహేశ్వరరావు భార్య సరస్వతి ఆయనకు తలకొరివి పెట్టింది. దీంతో కాలనీలో విషాదచాయలు అలముకున్నాయి. శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీ సు కార్యాలయంలో సోమ వారం నిర్వహించిన ఎస్పీ గ్రీవెన్సుకు బాధితుల నుంచి 61 ఫిర్యాదులు అందా యి. ఎస్పీ కె.వి.మహేశ్వరరె డ్డి బాధితుల నుంచి ఫిర్యా దులు స్వీకరించి, వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యలుతెలుసుకుని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. -
సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: అంధ్రప్రదేశ్ సివిల్ సప్లయ్ హమాలీ ల సమస్యలు పరిష్కరించాలని సివిల్ సప్లయ్ హమాలీ వర్క ర్స్ యూనియన్ శ్రీకాకుళం శాఖ సభ్యులు కోరారు. ఈ మేరకు సోమవారం జీజీఆర్ఎస్ వద్ద జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. సివిల్ సప్లయ్ కార్పొరేషన్, రాష్ట్ర ప్రభుత్వం అదే పనిగా హమీలీలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. నెలాఖరు వరకు కూలీలు జమ అవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలు కార్పొరేషన్ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. అనంతరం పీజీఆర్ఎస్లో యూనియన్ నాయకులు కెస్ నారాయణ, చిక్కాల గోవిందరావు తదితరులు వినతిపత్రంను అందజేశారు. -
● ఐదు బైకులు, మోటారు పంపు స్వాధీనం ● ముగ్గురు మైనర్లు, ఇద్దరు వ్యక్తులు అరెస్టు
రణస్థలం: మండలంలోని జేఆర్పురం పోలీస్ సర్కిల్ పరిధిలో ఇటీవల కాలంలో జరిగిన వరుస బైక్ చోరీల దొంగలను జేఆర్పురం సర్కిల్ పరిధి పోలీసులు పట్టుకున్నారని జేఆర్పురం సీఐ ఎం.అవతారం తెలిపారు. ఈ మేరకు పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రణస్థలం పరిధిలో 6 ద్విచక్ర వాహనాలు, లావేరులో 1, జి.సిగడాంలో 1 మొత్తం 8 ద్విచక్ర వాహనాలు, లావేరులో ఒక వ్యవసాయ మోటారు ఇటీవల కాలంలో దొంగిలించారు. దీంతో ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించామన్నారు. జే.ఆర్.పురం, సీతంవలస పరిధిలో నలుగురు నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. అయితే వారిలో ముగ్గురు మైనర్లు కాగా.. ఒక వ్యక్తి లావేరు మండలంలోని బుడతవలస గ్రామానికి చెందిన కుప్పిలి హరిగా పేర్కొన్నారు. మైనర్లులంతా లావేరు మండలంలోని ఒక గ్రామానికి చెందినవారే. అలాగే ఈ బైకులు కొనుగోలు చేసిన ఇనుప తుక్కు దుకాణం నిర్వాహకుడు అదపాక గ్రామానికి చెందిన బెజ్జిపురపు వెంకట నాయుడును ఆరెస్టు చేశామని తెలిపారు. వీరి నుంచి ఐదు బైకులు, ఒక వ్యవసాయ మోటారు రికవరీ చేశారు. మిగతా మూడు బైకులు తుక్కుకు అమ్మేశారు. సమావేశంలో జేఆర్పురం, లావేరు, జి.సిగడాం ఎస్లు ఎస్.చిరంజీవి, కె.అప్పలసూరి, సందీప్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ కె.కిరణ్ కుమార్, ఎం.జోగారావు, లావేరు కానిస్టేబుల్ లక్ష్మణరావు, హేమంత్, ఎచ్చెర్ల కానిస్టేబుల్ రవి కుమార్ తదితరులు ఉన్నారు. -
బాధ్యతల స్వీకరణ
శ్రీకాకుళం: శ్రీకాకుళం ఏపీహెచ్ఎంహెచ్ఐడీసీ ఈఈగా మాడెం శ్రీనివాసరావు సోమవారం బాధ్యతలు స్వీకరించా రు. ఇదే సంస్థలో క్వాలిటీ కంట్రోల్ ఈఈగా పనిచేసిన శ్రీనివాసరావును కొద్ది నెలల క్రితం శ్రీకాకుళంలో పూర్తి అదనపు బాధ్యతలతో నియమించిన విషయం తెలిసింది. అయితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెండు నెలల వరకు విధుల్లో చేరని శ్రీనివాసరావు సోమవారం విధుల్లో చేరారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన వారం రోజులు పాటు సెలవులో వెళ్లిపోయారు. శ్రీనివాసరావు సోదరుడు రెండు రోజుల క్రితం మృతి చెందడంతో ఆయన సెలవు పెట్టినట్లు తెలిసింది. -
సోమవారం సంత..
మందస: సోమవారం సంత.. వందలాది వ్యాపారులు, వేలాది మంది గిరిజనులకు ఆధారం. మందస చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామాల ప్రజలు ప్రజలు ప్రతి వారం ఇక్కడకు వచ్చి సరుకులు కొనుగోలు చేసుకుంటారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన సంతలో మలమూత్ర విసర్జనకు ఆరుబయటకే వెళ్లాల్సిన దీనస్థితి ఉంది. ఇదివరకు ఈ గ్రామానికి కనీసం బస్టాండ్ సదుపాయం కూడా లేదు. ఎన్నో దశాబ్దాల నిరీక్షణ తర్వాత వైఎస్సార్సీపీ హయాంలో రోడ్లు విస్తరించి బస్టాండ్ సదుపాయం కల్పించడంతో బస్సు కోసం దుకాణాల ముందు దీనంగా నిలబడే దుస్థితి తప్పింది. అప్పుడే స్థానికులు మందస అభివృద్ధి కమిటీ పేరిట ముందుకు వచ్చి మరుగుదొడ్లు ఏర్పాటు చేయగా దానికి రన్నింగ్ వాటర్ సదుపాయం కల్పించారు. మందసకు వచ్చే వారికి ఇవి ఉపయోగకరంగా ఉండేవి. కానీ కాలక్రమేణా అవి పాడైపోవడంతో సమస్య మొదటికి వచ్చింది. సంతకు వేలాదిగా గిరిజన ఆడపడుచులు వస్తారు. వీరి అవసరాలకు ఆరుబయటకు వెళ్లాల్సి రావడం అత్యంత బాధాకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరుగుదొడ్లకు మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు. మందసలో సమస్యల గురించి ఎన్నోసార్లు చెప్పినా ఎవ రూ పట్టించుకోవడం లేదు. ప్రజలు, ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. – కంచి బెహరా, ఎంపీటీసీ సభ్యుడు, మందస -
మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య
గార: మద్యానికి బానిసై జీవితంపై విరక్తి చెంది శ్రీకూర్మం పంచాయతీ వెలమవీధికి చెందిన సాధు లక్ష్మణరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం.. లక్ష్మణరావు (46) గత కొన్నేళ్లు గా మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం సాయంత్రం చెరువులో పడి చనిపోతానని చెప్పి బయటకు వెళ్లడంతో గ్రామస్తులు వెతికి ఇంటికి తీసుకువచ్చారు. సోమవారం ఉదయం భోజనం చేసిన తర్వాత బయటకు వెళ్లిపోయాడు. సమీపంలోని సత్రం వద్ద భద్రం పంతులు మేడ మీద మునగ చెట్టుకు తన తువ్వాలుతో ఉరివేసుకున్నాడు. పనిమనిషి మేడమీదకు వెళ్లే సమయంలో చూసి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. భార్య సుమంగళి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సీహెచ్. గంగరా జు తెలిపారు. -
నిఘా నిద్రపోతోందా..!
●ప్రతి నెలా క్రైమ్ మీటింగ్లో ఎస్పీ.. నిఘా పెంచండి.. రాత్రి గస్తీ పటిష్టంగా అమలు చేయండి అని ఇస్తున్న ఆదేశాలు బేఖాతరవుతున్నాయా..! ●శ్రీకాకుళం నగరంలో ఆదివారం పోలీసుల పెట్రోలింగ్ ఉందా..! ఉంటే ఒక్క చోట కాకపోయినా మరొక్క చోటైనా పోలీసుల నిఘాకు నిందితులు చిక్కేవారు. ●నిఘా నీడలో నగరం అంటూ ఊదరగొడుతున్న పోలీసులు సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయో.. లేదో పరిశీలించాల్సిన అవసరం లేదా..! ●వజ్రపుకొత్తూరు మండలంలో రెండు రోజుల క్రితం రెండు చైన్ స్నాచింగ్లు నమోదయ్యాయి. అంతర్రాష్ట్ర గ్యాంగులకు ఇది పరిపాటిగా మారింది. ఆ నేపథ్యంలోనైనా పోలీస్ వర్గాలు అప్రమత్తమై ఉంటే ఈ పరిస్థితి ఉండేదా..! ●అత్యంత రద్దీగా ఉండే ఆర్టీసీ కాంప్లెక్స్లో సీసీ కెమెరాల మోనిటరింగ్పై ఎప్పుడైనా దృష్టి సారించారా..! -
మేం ఓటర్లం కాదా.. పన్నులు కట్టడం లేదా?
● పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించిన వజ్రంపేట మహిళలు ● ఏడాదిగా నీరు రావడం లేదని ఆవేదన మాకు ఒక పూట నీరు వస్తుంది. అది కూడా పైపు ను గట్టిగా పీల్చితే నాలుగైదు లీటర్లు నీరు వస్తుంది. పీల్చకపోతే అదీ రాదు. దీంతో తీవ్ర అవస్థలు పడుతున్నాం. అధికారులు చర్యలు తీసుకోవాలి. – రావాడ పార్వతి, వజ్రంపేట నరసన్నపేట: ‘అయ్యా.. పంచాయతీ వారూ.. మేము వజ్రంపేటలో ఉంటున్నాం. తాగడానికి బిందెడు నీరు ఇప్పించండి.. మీ పేరు చెప్పుకుంటాం. చాలాసార్లు మీ కార్యాలయం చుట్టూ తిరిగాం. అదిగో ఇదిగో అన్నారు. ఆరు నెలలు గడిచాయి. అసలు మీ ఉద్దేశం ఏమిటి. మా వీధికి నీరు ఎందుకు రావడం లేదు. ఎంతో ప్రయత్నిస్తే ముంతడు నీరు వస్తుంది. దీంతో రోజంతా ఎలా గడిపేది. మేము పంచాయతీలో ఓటర్లం కాదా. మేము ఇంటి పన్నులు కట్టడం లేదా.. కుళాయి పన్ను కట్టడం లేదా.. మరెందుకు మాకు నీరు ఇవ్వరు..’ మండలంలోని వజ్రంపేటకు చెందిన మహిళలు పంచాయతీ సిబ్బందిని సోమవారం నిలదీసిన తీరు ఇది. ప్రతి నిత్యం నీటికి ఇబ్బంది పడుతుండడంతో అక్కడి మహిళలు సోమవారం పంచాయతీ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. ఆ సమయానికి ఇన్చార్జి ఈఓ లేకపోవడంతో సీనియర్ అసిస్టెంట్ మురళికి తమ సమస్యను వివరించారు. పశువుల ఆస్పత్రి వద్ద కొత్తగా వాటర్ ట్యాంకు కడుతున్నారు. అది పూర్తయితే తప్ప మీకు నీరు ఇవ్వలేమని మురళి చెప్పడంతో మహిళలు మరింతగా ఆవేదన చెందారు. ఆ ట్యాంకు ఎప్పటికి పూర్తమవుతుంది.. అప్పటివరకు తామేం చేయాలి.. ఊరొదిలి వెళ్లిపోవాలా అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి అధి కారి స్పందిస్తూ తానేమీ చేయలేనని ఎంపీడీఓను కలవాలని చెప్పడంతో వారంతా వెనుదిరిగారు. వజ్రంపేట జంక్షన్ వద్ద గతంలో మూడు లక్షలు ఖర్చు చేసి ప్రధాన పైపు లైన్కు ఒక వాల్ పెట్టారు. కొన్నాళ్లు నీరు కొంత మేరకు వచ్చేది. ఆరునెలల కిందట వజ్రంపేట పక్క వీధుల వాళ్లు తమకు నీరు రావడం లేదని ఆ వాల్ రూట్ మార్చారు. అప్పటి నుంచి తమకు నీరు రావడం లేదని మహిళలు తెలిపారు. ఇళ్లకు కుళాయిలు ఉన్నా దిష్టిబొమ్మలా మారిపోయాయని తెలిపారు. ఇంటి పన్నులు కడుతున్నాం. నీటి పన్ను కడుతు న్నాం. మాకు ఎందుకు తాగడానికి నీరు ఇవ్వరు. గతంలో ఒకసారి పంచాయ తీ కార్యాలయానికి వచ్చాం. వారం రోజులు కొంత నీరు వచ్చింది. ఇప్పుడు మళ్లీ మొదటికి వచ్చింది. – షేక్ ఫాతిమా -
టెక్కలి ఆర్డీఓ తీరుపై మండిపాటు
టెక్కలి: టెక్కలి ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి తీరుపై కొంత మంది ఫిర్యాదుదారులు మండిపడ్డారు. సంతబొమ్మాళి మండలం మూలపేట పోర్టుకు సంబంధించి పీడీఎఫ్లు అందలేదంటూ జీరు జయలక్ష్మి, జీరు రమేష్, జీరు హైమావతి, జీరు అశోక్, జీరు నారాయణరావు, నాగేశ్వర్రావు, తిరుపతిరావు తదితరులు సోమవారం టెక్కలి ఆర్డీఓ కార్యాలయంలో పీజీఆర్ఎస్లో విన్నవించేందుకు వచ్చారు. అయితే తమ విన్నపాన్ని స్వీకరించే విషయంలో ఆర్డీఓ తీరుపై తీవ్రంగా అసహనం వ్యక్తం చేశారు. తమ బాధలను చెప్పుకోవడానికి వస్తే ఆర్డీఓ చాలా హీ నంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ కార్యకర్తలుగా ఉన్నప్పటికీ తమ పై వ్యవహరించిన తీరు ఎంతో ఇబ్బంది కలిగిందంటూ వాపోయారు. జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో వెలిసిన మధుకేశ్వరుని చక్రతీర్థ స్నానాలు పుణ్య వంశధార నదిలో ఘనంగా జ్యేష్టమాసం సోమవారం జరిగాయి. పార్వతీ పరమేశ్వరులను చక్కగా అలంకరించి పల్లకిలో ఆశీనులుగా చేశారు. అనంతరం వంశధార నదిలో స్వామివారి సహిత వారాహి అమ్మవారికి పుణ్య చక్రతీర్థ సాన్నాలు నిర్వహించారు. అనంతరం దేవాలయంలో యథాస్థానంలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో స్వామివారి పాంచరాత్రి కల్యాణ ఉత్సవాలు ముగిశాయి. జి.సిగడాం: కప్ప..కప్ప నీలాలు, కండవ నిండా వర్షాలు, కురవాలి వానదేవుడా, వానమ్మ వానమ్మా ఒక్క సారి వచ్చిపోవమ్మా.. రైతుల కష్టాలు తీర్చేవా రావమ్మా.. అంటూ మండల పరిధిలోని వెలగాడ, గొలుసుపూడిపేట గ్రా మాల్లో రైతులు, యువకులు, విద్యావంతులు కప్పయాత్ర చేశారు. కప్పను కావిడిలో ఊరేగిస్తూ ఇంటింటికి తీసుకువెళ్లి పసుపు, కుంకుమ, బిందెలతో నీరు తెచ్చి పూజలు చేశారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో సమగ్ర ఆర్థికాభివద్ధి, వ్యవసాయం, పరిశ్రమలు, ఉపా ధి కల్పన, స్వయం ఉపాధి రంగాలకు 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జిల్లా రుణ ప్రణాళికను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం కలెక్టర్ సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన జిల్లా రుణ ప్రణాళిక మొత్తం పరిమాణం రూ.19,735.42 కోట్లు, గత ఆర్థిక సంవత్సరంలోని రూ.15,576.44 కోట్లతో పోలిస్తే రూ.4,158.98 కోట్ల (26.70 శాతం) పెరుగుదల నమోదైందని తెలిపారు. -
● బైక్పై రయ్మంటూ వెళ్లిపోయిన చైన్ స్నాచర్లు ● పోలీసులకు సమాచారం తెలిసేలోగానే పారిపోయిన వైనం
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలో ఆదివారం వేకువజామున అలజడి సృష్టించిన చైన్ స్నాచ ర్లు పోలీసులు మేలుకునేలోపే ఉడాయించారు. ఆదివారం రాత్రి 11 గంటలకు రెండో పట్టణ ఎస్ఐ హేమంత్కళ్యాణ్ ఐతమ్ కాలేజీ వైపు ఉన్న సర్వీసు రోడ్డు తుప్పల్లో దొంగిలించిన బైక్ను పట్టుకోగలిగారు. ●ఈ దుండగులు ఆ దివారం వేకువజామున 3:22 గంటలకు ఆర్టీసీ కాంప్లెక్సు నుంచి బయటకు వచ్చారు. ●3.42కు నీలమ్మగుడి సమీపంలో నివాసముంటున్న వ్యాపారి మరుపల్లి సీతారాం ఇంటి ముందున్న పల్సర్ 250 మో డల్ బైక్ చోరీ చేశారు. ●ఈ బైక్తో 5.03కు కార్గిల్ పార్క్ నుంచి 5.30 గంటలకు పెదపాడు వరకు వరుసపెట్టి దొంగతనాలకు పాల్పడ్డారు. ●ఈ విషయాలు పోలీసులకు తెలిసే లోపే జంప్ అయ్యారు. ●5:40 గంటలకు మడపాం టోల్ప్లాజా దాటి న దుండగులు 5.53కే 34 కిలోమీటర్ల దూరంలో ఉన్న టెక్కలి ఐతమ్ కాలేజీ వద్ద తేలారు. సీసీ కెమెరాలు ఫెయిల్ : ఐతమ్ కాలేజీ వైపున్న రోడ్డులోకి చేరి తుప్పల్లో బైక్ను పడేశారు. సమీపంలో సీసీ కెమెరా ఉన్నా పనిచేయకపోవడంతో వారు బస్సు లో వెళ్లారా.. మరే ఇతర వాహనంలో వెళ్లారా.. అన్నది తెలియరాలేదు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద కూడా కెమెరాలు పనిచేయకపోవడంతో ఎటు నుంచి వచ్చారన్నది తెలియలేదు. ఆ గ్యాంగుల పనేనా..? ఆదివారం నాడే విశాఖ, అనకాపల్లిలో వరుస చైన్స్నాచ్లు జరగడంతో ఆ గ్యాంగు లోని సభ్యులే జిల్లాలో ఎంటరై ఉంటారని అనుమానిస్తున్నారు. వీరు యూపీ, వెస్ట్బెంగాల్, రాజస్థాన్, బీహార్కు చెందినవారై ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. -
ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలి..? ఇంకా ఎంత శోకం అనుభవించాలి..? డ్రైవర్ల మద్యం మత్తు ప్రాణాలను బలి తీసుకుంటోంది. అయినా మేలుకోవడం లేదు. రథ సారధుల నిద్ర మత్తు మాటిమాటికీ ప్రమాదాలకు కారణమవుతోంది. అయినా చర్యలు తీసుకోవడం లేదు. రోడ్డు పక్క నిలుపుతున్న వాహనాలు ప్రమాద
పెద్దపాడు ఫ్లైఓవర్పై మలుపులో రాత్రి సమయాన లారీ పార్కింగ్ మా కుటుంబానికి పెద్ద దిక్కు మా అమ్మ మురపాల పార్వతి. ఎన్నో ఏళ్లుగా ఆటోలో ప్రయాణం చేసినా ఎప్పుడూ ఏమీ కాలేదు. లారీ డ్రైవర్ మద్యంతాగి బండి నడిపి మా అమ్మను పొట్టన పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ మద్యం దొరుకుతోంది. అదే ఈ ప్రమాదానికి కారణమైంది. రోడ్డుపై తనిఖీలు జరుగుతున్నాయా లేదా అన్న అనుమా నం కలుగుతోంది. వ్యవస్థలో లోపాలే దీనికి కారణం. – మురపాల సంగీత, మృతురాలు మురపాల పార్వతి కుమార్తె శ్రీకాకుళం క్రైమ్ : ●కవిటి మండలంలో వ్యాపారం చేసుకుందామని ఇంటి నుంచి బయల్దేరిన ముగ్గురు మహిళలను ఓ డ్రైవర్ మద్యం మత్తు బలి తీసుకుంది. ●కొర్లాం ప్రాంతంలో ఓ లారీ డ్రైవర్ మత్తులో రాంగ్రూట్లోకి వచ్చేయడంతో మూడు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ●నందిగాం ఫ్లై ఓవర్లో బ్రేక్డౌన్ అయిన ఐరన్ వ్యాన్ను ఒడిశా నుంచి వస్తున్న స్కార్పియో ఢీకొట్టడంతో ముగ్గురు చనిపోయారు. ఇవే కాదు ఇలాంటి ఘటనలు ఇంకెన్నో జరిగాయి. వీటిలో మెజారిటీ సంఘటనల్లో డ్రైవర్ల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. నిద్ర మత్తు, మద్యం మత్తు, మితిమీరిన వేగం వంటి కారణాల వల్ల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు జరిగిన ప్రమాదాల్లో 46 మందికి మరణాలు సంభవిస్తే.. గడిచిన 2 నెల ల్లో 33 మంది మృత్యువాత పడటం గమనార్హం. వీరిలో ఎక్కువ మంది రహదారి నిబంధనలు పాటించకపోవడం, మద్యం మత్తు, నిద్రమత్తు, మితిమీరిన వేగం, అకస్మాత్తుగా బ్రేక్ వేయడం, అదుపు తప్పి ఆగి ఉన్న వాహనాలను, కల్వర్టులను, స్తంభాలను ఢీకొట్టడం, హెల్మెట్ ధరించకపోవడం వంటి స్వయం తప్పిదాలున్న వారే కాక ఎదుటివారి ర్యాష్ డ్రైవ్, రహదారుల్లో భద్రతా లోపాలు వంటివీ కారణంగా కనిపిస్తుండటం గమనార్హం. ఎస్పీ మాట వింటున్నారా..? రోడ్డు ప్రమాదాలపై ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి అను నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నారు. అనేక సూచనలు చేస్తున్నారు. కానీ అవి క్షేత్రస్థాయిలో అమలులోకి రావడం లేదనే మాట వినిపిస్తోంది. హైవే పెట్రోలింగ్ వాహనాలు తక్షణమే స్పందించి క్షణాల్లో ఘటనాస్థలికి చేరాలని, స్పీడ్ ర్యాష్, డ్రంక్ అండ్ డ్రైవ్, త్రిబుల్, మైనర్ రైడింగ్ చేస్తున్నవారి వాహనాలు ఆపాలని, అర్ధరాత్రి, వేకువజామున లారీ, కార్లు, ఇతర వాహనాల డ్రైవర్లను ఆపి ఫేష్వాష్ చేయించాలని, హైవేలపైన, కింద సర్వీసు రోడ్డులపైన, ఫ్లై ఓవర్ల కింద భారీ వాహనాలు పార్కింగ్ చేయకుండా చూడాలని ఎంత చెబుతున్నా ఎవరూ వినడం లేదు. దానికి నిదర్శనమే ఈ ప్రమాదాలు. ●సర్వీసు రోడ్డు నుంచి హైవేకి వెళ్లేటప్పుడు అధిక వేగంతో వాహనాలు వెళ్లడం, ఒకే మార్గంలో ఎదురెదురుగా వాహనాలు రావడం. ●వాహనదారుల మద్యం మత్తు, నిద్ర మత్తు, రహదారి నిబంధనలు ఉల్లంఘించడం. ●హైవే వెంబడి రాత్రి పూట లైట్లు వెలగకపోవడం, సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, హెచ్చరిక బోర్డులు అనుకున్న స్థాయిలో లేకపోవడం. ●ఎన్హెచ్–16 నుంచి సర్వీసు రోడ్డులోకి ఎంటరయ్యేటప్పుడు జిల్లాలో చాలా చోట్ల కాంక్రీట్ దిమ్మలు అడ్డంగా ఉండటం, ఇసుక లారీలు రవాణాతో దారి పొడవునా ఇసుక పేరుకుపోయి వాహనాలు స్కిడ్ అవ్వడం. ●ఇచ్ఛాపురం నుంచి పైడి భీమవరం వరకు లారీలు సర్వీసు రోడ్లలోనే కాక ఫ్లై ఓవర్లు, హైవేలపై రోజుల గంటల తరబడి పార్కింగ్ చేయడం, ఫ్లై ఓవర్ల కింద రోజుల తరబడి ఉంచేయడం. ●హైవేల వెంబడి ముఖ్య కూడళ్లలో దాబాలు, హోటళ్లు, టోల్ప్లాజాల వద్ద పోలీసుల తనిఖీలు శూన్యం. అక్కడే మద్యం పూటుగా సేవించి భారీ వాహనాలు నడపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ●హైవేకు లింక్గా ఉన్న గ్రామీణ రహదారుల్లో భారీగా గోతులుండటం, ఇరువైపులా పొదలు అల్లుకుపోయి మలుపుల్లో వచ్చే వాహనాలు, కల్వర్టులు కనపడకపోవడం, సైడ్ ఎడ్జ్ల్లో గ్రావెల్ నింపకపోవడం. ●కొత్త బ్లాక్స్పాట్లు గుర్తించకపోవడం, పాత బ్లాక్స్పాటుల్లో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోకపోవడం, సూచిక బోర్డులు లేకపోవడం కారణాలు.నరసన్నపేట జమ్ము కూడలి సమీప సర్వీసు రోడ్డులో లారీలు పార్కింగ్ రహదారి ప్రమాదాలపై జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారు. వాహనదారులు రహదారి నిబంధనలు పాటించాలి. హైవేల్లో నెలకొన్న సమస్యలపై ఇతర విభాగాల అధికారులతోను సమన్వయం చేసుకుంటూ ఉన్నతాధికారికి నివేదించి చర్యలు తీసుకుంటాం. – పి.శ్రీనివాసరావు, అడిషనల్ ఎస్పీ, శ్రీకాకుళం మద్యం మత్తులోనే ఘోరంచాలా ఏళ్లుగా మా అమ్మ ఉద్దానంలో కొబ్బరి కా యలు, పనసపండ్లు తదితర వస్తువులు ఇక్కడ కొని బరంపురంలో విక్రయిస్తోంది. ఎప్పుడూ చిన్న సమస్య కూడా రాలేదు. కేవలం డ్రైవర్ మ ద్యం మత్తే ఈ ప్రమాదానికి కారణం. మాలాంటి దుస్థితి ఎవరికీ రాలేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ తని ఖీలు చేసి ఉంటే మా అమ్మ బతికి ఉండేదేమో. – నర్తు నారాయణరావు, రాపాకపుట్టుగ, కవిటి మండలం -
ఒంటరితనం భరించలేక టీచర్..!
శ్రీకాకుళం: పలాస ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు జె.రోహిణి (39) అనారోగ్య కారణాల వల్ల తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మెళియాపుట్టి మండలం తూముకొండ గ్రామానికి చెందిన రోహిణి కాశీబుగ్గలోని మారుతీనగర్లో ఒంటరిగా ఉంటున్నారు. భర్త జీవనరావు విజయనగరంలోని జీఎస్టీ కార్యాలయంలో గుమస్తాగా పనిచేస్తున్నారు. ఇద్దరు కుమార్తెలు విశాఖపట్నం, ఇతర ప్రాంతాల్లో చదువుకుంటున్నారు. భర్త వారానికి ఒక రోజు వస్తుంటారు. ఎప్పటిలాగే శనివారం రాత్రి వచ్చేసరికి తలుపు మూసి ఉంది. పక్కింటి వారి సహకారంతో తలుపులు పగలు గొట్టి లోపలికి వెళ్లి చూసే సరికి రోహిణి ఉరికి వేలాడుతూ కనిపించారు. వెంటనే కాశీబుగ్గ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా వెంటనే శనివారం రాత్రి 10 గంటల సమయంలో సీఐ రామకృష్ణ వచ్చి పరిశీలించారు. ఆదివారం ఉదయం పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోహిణికి కొద్ది నెలలుగా అనారోగ్య సమస్యలు ఉన్నాయని, వాటిని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని సీఐ చెప్పారు. -
వేసెయ్ పాగా!
శ్రీకాకుళం రూరల్: కోర్టులో కేసు నడుస్తున్నా.. ప్రభుత్వ అధికారులు హెచ్చరిక బోర్డులు పెట్టినా.. స్థలాల ఆక్రమణ విషయంలో మాత్రం కూటమి నాయకులు వెనక్కి తగ్గడం లేదు. మమ్మల్ని ఎవరు ఆపుతారో చూస్తామన్న రీతిలో కబ్జాలకు తెగబడుతున్నారు. అధికారం చేతిలో ఉందనే అండతో చెలరేగిపోతున్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న సింగుపురంలో ప్రధాన రహదారిని ఆనుకొని కోట్ల రూపాయల విలువ చేసే ముసలగుండం చెరువుపై కబ్జాదారుల కన్ను మరోసారి పడింది. గ్రామ సచివాలయం ఎదురుగానే ఈ చెరువు స్థలం ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. రెవెన్యూ, పంచాయతీ అధికారులు సైతం చూసీచూడనట్లు వదిలేస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదీ పరిస్థితి.. సింగుపురం గ్రామ ప్రారంభంలోనే సుమారు 200 ఏళ్ల కిందటి ముసలగుండం చెరువు ఉంది. దీని విస్తీర్ణం రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 270/4లో సుమారు నాలుగు ఎకరాలు. ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం ఎకరా కోటి రూపాయలపైనే ధర పలుకుతోంది. అప్పట్లో గ్రామస్తులు ఓవైపు తాగునీటి అవసరాలకు, మరోవైపు స్నానాలకు వాడుకునేవారు. ఏటా నిర్వహించే కొండమ్మతల్లి జాతర ఉత్సవాల్లో సైతం ఊరేగించిన ఉత్సవ విగ్రహాలకు ఇందులో పవిత్ర స్నానాలు చేయించేవారు. కాలక్రమేణ చెరువు వినియోగం తగ్గిపోయింది. గ్రామాల్లో తాగునీటి కుళాయిలు రావడం, బోర్లు, ఇతరత్రా వసతులు స్థానిక ప్రజలకు అందుబాటులో రాకపోవడంతో గ్రామస్తులు చెరువుపై ఆధారపడటం మానేశారు. కూటమి నేతల కన్ను.. 2024 జనవరిలో చెరువు అంతటినీ డంపింగ్ యార్డులోని మట్టిని తీసుకొచ్చి రాత్రికిరాత్రే కప్పేందుకు ఓ కూటమి నాయకుడు కుట్రపన్నాడు. ఈ విషయం రెవెన్యూ అధికారులకు తెలియడంతో అప్పటి తహశీల్దార్ వెంకట్రావు చెరువు చుట్టువైపులా ప్రభుత్వ చెరువు అంటూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయించారు. అప్పట్లో ఆక్రమణ నిలిచిపోయింది. తాజాగా సదరు కూటమి నాయకుడు కన్ను మరోసారి అదే చెరువుపై పడింది. అప్పట్లో ఈ చెరువు వివాదాస్పదం కావడం, గ్రామస్తులు కోర్టులో సైతం కేసులు వేయడంతో జిల్లా యంత్రాంగం సైతం ఇది చెరువేనంటూ నిర్ధారించారు. రెండోసారి కబ్జాకు యత్నం.. ఇదే చెరువు స్థలంలో రెండు రోజుల క్రితం సాగునీటి కాలువల్లోని మట్టిని తీసుకొచ్చి చెరువులోని మిగిలిన నీటిని కప్పిస్తూ కూటమి నేత పనులు చేయిస్తున్నాడు. ఇంత వ్యవహారం జరుగుతున్నా పంచాయతీ, రెవెన్యూ అధికారులు చూసిచూడనట్లుగానే వ్యవహరిస్తున్నారు. చెరువు పరిరక్షణపై 2024 ఫిబ్రవరిలో గ్రామస్తులంతా కలిసి కోర్టులో కేసులు వేశాం. అయినప్పటికీ సింగుపురం టీడీపీ మాజీ సర్పంచ్ గుండ ఆదిత్యనాయుడు నాలుగు ఎకరాల చెరువు కబ్జాకు పాల్పడుతున్నారు. ఇదివరకూ ప్రభుత్వ చెరువు అంటూ ఏర్పాటు చేసిన బోర్డులు సైతం పీకిపారేశారు. రెండు రోజులుగా కాలువల్లో మట్టిని తీసుకొచ్చి చెరువులో నీటితో మిగిలిన భాగాన్ని కప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. – బగ్గు అప్పారావు, ఎంపీటీసీ, సింగుపురం సింగుపురం మేజర్ పంచాయతీ పరిధిలో ఖాళీ స్థలం కనిపిస్తే కూటమి నేతలు పాగా వేసేందుకు సిద్ధపడుతున్నారు. వీరి ఆగడాలకు అడ్డు లేకుండాపోతోంది. రెవెన్యూ అధికారులు స్పందించి ఆక్రమణలు అరికట్టాలి. – బాణ నర్సింగరావు, సింగుపురం సింగుపురంలో చెరువు కబ్జా జరుగుతుందన్న విషయం నా దృష్టికి రాలేదు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తాం. ప్రభుత్వ చెరువులు, డీ పట్టా భూములు, కాలువలు ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. – ఎస్.గణపతి, శ్రీకాకుళం మండల తహశీల్దార్ సింగుపురంలో కోట్లు విలువైన చెరువు కబ్జాకు కూటమి నేత ఎత్తుగడ కోర్టులో కేసు ఉండగానే మరోసారి ఆక్రమణకు యత్నం పట్టించుకోని అధికారులు -
ఆదిత్యుని సన్నిధిలో భక్తుల సందడి
అరసవల్లి: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి కనిపించింది. ఆలయ ఈవో కేఎన్వీడీవీ ప్రసాద్ ఆదేశాల మేరకు ఏఈఓ అప్పలనాయుడు ఆధ్వర్యంలో భక్తులకు దర్శనాలు సజావుగా జరిగేలా ఏర్పాటు చర్యలు చేపట్టారు. ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో రూ.300 దర్శన టికెట్ల భక్తులకు అంతరాలయ దర్శనం చేయించారు. ప్రసాదాల కౌంటర్ల వద్ద ఫ్యాన్లు పని చేయకపోవడంతో ఉక్కపోతకు గురయ్యారు. మరోవైపు, క్యూలైన్లలో సెల్ఫోన్లు చెకింగ్ పాయింట్ల వద్ద గంటల తరబడి వేచివుండడంతో దర్శనాలు ఆలస్యం కావడంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేశఖండన శాల, మరుగుదొడ్లు, కొబ్బరి కాయలు కొట్టిన చోట అదనపు వసూళ్లు జరిగాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఒకే పాయింట్ వద్ద చెప్పుల కలెక్షన్ ఉండటంతో భక్తులకు పాట్లు తప్పలేదు. ఆదిత్యుని సన్నిధిలో అసోం చీఫ్ సెక్రటరీ.. అరసవల్లి సూర్యనారాయణ స్వామిని జిల్లాకు చెందిన అసోం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోత రవి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. -
ఆ రెండు చుక్కలే శ్రీరామరక్ష
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అరసవల్లి: పోలియో నిర్మూలన లక్ష్యంగా వరుస గా మూడు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఇందులో మారుమూల ప్రాంతంలో చిన్నారికి కూడా పోలియో డ్రాప్స్ ఇచ్చేలా యంత్రాంగం చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. ఆదివారం స్థానిక నగరంలో హౌసింగ్ బోర్డు కాలనీలో అంబేడ్కర్ భవన్ వద్ద పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని డీఎంహెచ్ఓ కె.అనితతో కలి సి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 0–5 వయస్సు గల చిన్నారులు 1,80,879 మందికి తప్పనిసరిగా ఈ పోలియో చుక్కలు వేయించాలని, ఈ మేరకు కొండ ప్రాంతాలతో పాటు వలసదారుల పిల్లలకు కూడా ఈ డ్రాప్స్ వేయించాలన్నారు. ఈ రెండు చుక్కలే భవిష్యత్కు శ్రీరామరక్ష అని అన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ కె.అనిత మాట్లాడుతూ జి ల్లాలో మొత్తం 30 మండలాల్లో అన్ని మారు మూల ప్రాంతాలను కూడా కవర్ చేస్తూ పోలియో డ్రాప్స్ వేయించేలా మొబైల్ బృందాలను నియ మించామన్నారు. మొత్తం 1096 పోలియో బూత్లలో మొత్తం 7430 మంది సిబ్బంది విధుల్లో ఉన్నారన్నారు. అనివార్య కారణాలతో పోలియో డ్రాప్స్ వేయించుకోలేని వారి కోసం 29, 30 తేదీల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించారు. -
ఓటు పాట్లు..!
● కోడళ్లకు చుక్కలు చూపిస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణ ● పుట్టింటి ఐడీ ఆధారాలు సమర్పించేందుకు ఇబ్బందులు ● గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా చిక్కులు హిరమండలం: జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక సమగ్ర సర్వే ప్రక్రియ జోరుగా సాగుతోంది. అయితే క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు ఓటర్లకు చుక్కలు చూ పిస్తున్నాయి. ముఖ్యంగా 2002 తర్వాత వివాహం జరిగిన మహిళలకు సంబంధించి ఎన్యుమరేషన్ ఫామ్స్ను తీసుకునేందుకు బీఎల్ఓలు ముందుకు రావడం లేదు. అలాంటి వారి ఓటు మ్యాపింగ్కు సంబంధించి ఎలాంటి ఆదేశాలు రాలేదని చేతులెత్తేస్తున్నారు. ఫలితంగా కోడళ్ల ఓట్లపై కుటుంబా ల్లో ఆందోళన నెలకొంది. ప్రధానంగా నిరక్షరాస్యులకు ఈ విషయంలో ఏం జరుగుతుందో వారికి తెలియడం లేదు. జిల్లాలో మొత్తం 8 నియోజకవర్గాల్లో 18,97,116 ఓటర్లు ఉన్నారు. ఇందులో 12,92,904 మ్యాపింగ్ జరిగాయి. జిల్లాలో 2,358 బూత్లు ఉన్నాయి. వీటిలో ప్రతి బూత్కు ఒక్కో బూత్లెవల్ ఆఫీసర్(బీఎల్ఓ)ను నియమంచారు. వీరి దగ్గరే ఆయా బూత్లకు సంబంధించి 2002, 2025 ఓటరు జాబితాలు ఉంటాయని ఎన్నికల కమిషన్ (ఈసీ)చెబుతోంది. అయితే బీఎల్ఓలు మాత్రం తమ దగ్గర ఆయా ఓటరు జాబితాలు లేవని, ఉన్నా ఎంతమందికి ఇస్తామని ప్రశ్నిస్తున్నారు. ఎన్యుమరేషన్ ఫాం తోపాటు 2002, 2025 ఓటరు జాబితా వివరాలు బీఎల్ఓలు అందించాలని ప్రజలు కోరుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో.. జిల్లాలో పాతపట్నం, పలాస నియోజకవర్గంలో గిరిజన ఓటర్లు ఎక్కువగా ఉంటారు. 80 వేల మంది వరకూ గిరిజన మహిళా ఓటర్లు ఉంటారు. గిరిజనులు ఒకేచోట ఉండే పరిస్థితి ఉండదు. కొండ శిఖర గ్రామాలతో పాటు గూడల్లో ఎక్కువగా నివసిస్తుంటారు. ఆ పై నిరక్షరాస్యులే అధికం. ఈ రెండు కారణాలతో వీరి ఓట్ల మ్యాపింగ్ చాలా కష్ట మని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు 2002 తర్వాత పుట్టింటి నుంచి మెట్టినింటికి వచ్చిన వారికి చిక్కుముడులు ఎదురవుతున్నాయి. పుట్టింటి నుంచి ఓటరు ఐడీ, ఇతర ఆధారాలు తెస్తేనే ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇస్తామని బీఎల్ఓ లు తేల్చిచెబుతున్నారు. మరి కొంతమంది ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చి వెళ్లిపోతున్నారు. ఆ ఫామ్ ఎలా నింపాలి, ఏయే వివరాలు ఉండాలో తెలియపరచడం లేదని ఆరోపిస్తున్నారు. ఎప్పుడో వివాహాలు జరిగి మెట్టినింటికి వచ్చిన వారికి ఎలాంటి ఆధారాలు లభించడం లేదు. దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి వారిలో ఎక్కువగా గిరిజన మహిళలే అధికంగా ఉంటున్నారని సర్వే అధికారులు చెబుతున్నారు. ఆ నిబంధనతో.. వివాహం తర్వాత మెట్టినింటికి వచ్చిన మహిళలు తప్పకుండా తమ పుట్టినింటి ఐడీ వివరాలు అందించాల్సిందేనని చెబుతుండడంతో వారు బిక్కమొఖం వేస్తున్నారు. సాధారణంగా ఏళ్ల కిందట వివాహాలు జరిగి మెట్టినింటికి వచ్చేవారికి ఎలాంటి ఆధారాలు ఉండవు. గిరిజన ప్రాంతాల్లో నిరక్షరాస్యులే అధికం. దీంతో ఇక్కడ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే జిల్లాలో పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతవుతాయన్న ఆందోళన రాజకీయ పార్టీల్లో ఉంది. మరోవైపు వివరాలు లేవని చెప్పి చాలామంది ఓట్లు గల్లంతు చేసే అవకాశం ఉంటుందని అధికార పార్టీపై విపక్షాలకు అనుమానాలు ఉన్నాయి. -
పైడిగాం ప్రాజెక్టును అభివృద్ధి చేయాలి
సోంపేట: నియోజకవర్గంలో ఏకై క మైనర్ నీటిపారుదల ప్రాజెక్టు పైడిగాం ప్రాజెక్టు పార్టీలకు అతీతంగా అభివృద్ధికి శ్రీకారం చుట్టాలని వైఎస్సార్ సీపీ ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ‘పైడిగాంకు పోదాం’ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. బేసిరామచంద్రాపురం నుంచి స్థానిక రైతులు, పార్టీ నాయకులతో కలిసి ర్యాలీగా పైడిగాం ప్రాజెక్టు వద్దకు చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ సుమారు 63 ఏళ్ల క్రితం నిర్మించిన ప్రాజెక్టు శిథిలావస్థకు చేరుకునే దశకు వచ్చిందన్నారు. తిత్లీ వంటి తుఫాన్లు సంభవిస్తే స్థానిక రైతులకు ఇబ్బందులు తప్పవన్నారు. ప్రభుత్వం , ప్రజా ప్రతినిధులు స్పందించి పైడిగాం ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసి పునఃనిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఒడిశా రాష్ట్రంతో నీటి సరఫరాకు ఎటువంటి ఒప్పందాలు లేకపోవడంతో అక్కడి ప్రభుత్వం మహేంద్ర తనయ నదిపై అవసరాలకు మించి ఆనకట్టలు నిర్మించి దిగువ ప్రాంతానికి నీరు రాకుండా అడ్డుకుంటోందని ఆరోపించారు. ఈ విషయమై జిల్లాకు చెందిన కేంద్రమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, స్థానిక విప్ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. పైడిగాం ప్రాజెక్టు సుమారు 17 కిలోమీటర్ల ప్రధాన కాలువలో 10 కిలోమీటర్లు మాత్రమే సిమెంట్ గోడ నిర్మాణం జరిగిందని, మిగతా కాలువకు గోడ నిర్మించడానికి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గన్ని పద్మనాభం సమితి అధ్యక్షుడిగా ఒక్కసారే పనిచేసి తన కృషితో మూడు మండలాల రైతులకు ఎంతో మేలు చేశారని గుర్తు చేశారు. 15 ఏళ్లపాటు స్థానిక ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తున్న అశోక్ నియోజకవర్గానికి ఏం చేశారో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. పైడిగాం ప్రాజెక్టుకు గన్ని పద్మనాభం ప్రాజెక్టుగా పేరు మార్చడంతో పాటు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నర్తు నరేంద్రయాదవ్ మట్లాడుతూ రాష్ట్రంలోసాగు నీటి ప్రాజెక్టుల కోసం సాగు చేసే ఖర్చులో ఒక్క శాతం కూడా నియోజకవర్గానికి విడుదల చేయకపోవడం దురదృష్టకరమన్నారు. దీనికి పూర్తి బాధ్యత స్థానిక ఎమ్మెల్యే వహించాలన్నారు. ఎంపీపీ డాక్టర్ నిమ్మన దాస్ మాట్లాడుతూ అప్పటి మంత్రి ధర్మాన ప్రసాదరావు కృషితో సుమారు రూ.14 కోట్ల నిధులతో 10 కిలోమీటర్ల మేర కాలువకు సిమెంట్ గోడ నిర్మించారని, తిత్లీ తుఫాన్ సమయంలో అప్పటి నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ ఆధ్వర్యంలో మరమ్మతులు జరిగాయని గుర్తు చేశారు. కంచిలి ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి, కంచిలి మాజీ ఏఎంసీ చైర్మెన్ బతకల మోహనరావు మాట్లాడుతూ నిధులు మంజూరుపై రెండేళ్లుగా ప్రకటనలు ఇవ్వడం తప్ప ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ తడక యశోద, పార్టీ నాయకులు తడక జోగారావు, ఇప్పిలి కృష్ణారావు, శిలగాన భాస్కరరావు, వజ్జ మృత్యుంజయం, రౌతు విశ్వనాథం, బుద్దాన శ్రీకృష్ణ, మడ్డు వెంకటరావు, సల్ల దేవరాజు, నర్తు భాను, గురాల శ్రీను, తామాడ బుజ్జి, రాజేష్ ఖన్నా, టి.ధర్మారావు, దున్న మాధవరావు, సకలాబత్తుల హరీష్, పిన్నింటి ఈశ్వరరావు, తామాడ పద్మావతి, పోకల హేమరాజు, బతకల సతీష్, కె.శ్రీనివాసరావు, ఎం.సిసింద్రీ తదితరులు పాల్గొన్నారు. -
మద్యానికి మరొకటి..
వేసెయ్ పాగా..ఆక్రమణలు పెచ్చుమీరుతున్నాయి. సింగుపురంలో కోట్లు విలువ చేసే భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. –8లోఒంటి మీద వస్త్రం నిలవనంత మత్తు.. ఎదురుగా వాహనం కనిపించనంత నిషా.. ఎంత ఘోరం జరిగిందో గుర్తు పట్టలేనంత మైకం.. ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం మూడు నిండు ప్రాణాలను బలికొంది. డ్రైవర్ నెత్తికెక్కిన మత్తు, అతివేగానికి ఫలితంగా మూడు కుటుంబాల్లో దీపాలు ఆరిపోయాయి. పొద్దున్నే సామాన్లు కొని సాయంత్రానికి అమ్మేసి ఇంటికి వెళ్లిపోదామనుకున్న ఆడ పడుచుల ప్రయాణం నడిరోడ్డుపైనే ఆగిపోయింది. కవిటి మండలం జమేదారుపుట్టుగ జంక్షన్ సమీపంలో లగేజీ ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశారు. చిత్రంలో కనిపిస్తున్న లారీ డ్రైవర్ తీరు చూశారా.. ఒంటి మీద టవల్ కూడా నిలవనంతగా మద్యం తాగి ఉన్నాడు. అదే మత్తులో లారీ డ్రైవింగ్ చేస్తూ ఘోర ప్రమాదానికి కారణమయ్యాడు. ఎక్కడ పడితే అక్కడ మద్యం దొరుకుతుండడం వీరికి వరం కాగా.. సామాన్యులకు శాపమైంది.నుజ్జునుజ్జు అయిన ఆటో కవిటి, ఇచ్ఛాపురం : ఉద్దానం ప్రాంతంలో పండే కొబ్బరి కాయ లు, పనస పండ్లు, అరటికాయలు, మునగ వంటి ఉత్పత్తుల్ని ఇక్కడ కొనుగోలు చేసి వాటిని బరంపురం మార్కెట్లకు తీసుకెళ్లి అమ్ముకోవడం వారికి జీవనోపాధి. అలా వచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తుంటారు. ఎప్పటిలాగానే ఈ ఆదివారం కూడా సరుకులు కొనడానికి ఇంటి నుంచి బయల్దేరారు. సాయంత్రానికి అన్నీ అమ్మేసి ఇంటికి వచ్చేద్దామని అనుకున్నారు. కానీ ఆ ముగ్గురు మహిళలకు ఇదే చివరి రోజైంది. మద్యం మత్తులో లారీని నిర్లక్ష్యంగా అతివేగంగా నడిపిన ఓ డ్రైవర్ నిర్లక్ష్యం వారి జీవితాల్ని గాలిలో కలిపేసింది. కంచిలి మండలం ఆదివారం సంత నుంచి లగేజీ ఆటోలో వెళుతున్న ముగ్గురు మహిళలు కవిటి మండలం జమేదారుపుట్టుగ జంక్షన్ సమీపంలో 16 వ నంబర్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కవిటి మండలం గుజ్జుపుట్టుగకు చెందిన మురపాల పార్వతి(50), రాపాకపుట్టుగ కు చెందిన నర్తు పద్మమ్మ (60), ఇచ్ఛాపురం పట్టణం అమీన్సాహేబ్పేటకు చెందిన మద్దిలి తరిణమ్మ (52)తో పాటు మరికొందరు మఖరాంపురం జంక్షన్ వద్ద సంతకు వెళ్లేందుకు ఆదివారం లగేజీ ఆటోపై బయల్దేరారు. మఖరాంపురం జంక్షన్లో సరుకు కొనుగోలు చేసి తిరుగు ప్రయాణమయ్యా రు. సరిగ్గా జమేదారుపుట్టుగ జంక్షన్కు వచ్చేసరికి ఆటోను రోడ్డు పక్కగా నిలిపారు. అయితే అదే సమయానికి వెనుక నుంచి అతివేగంతో వస్తున్న లారీ ఈ ఆటో ను అమాంతం ఢీకొట్టి 50 మీటర్ల దూరం ఈడ్చుకుపో యి విద్యుత్ స్తంభానికి బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. వారిలో రాపాకపుట్టుగకు చెందిన నర్తు ఎర్రయ్య, బరంపురానికి చెందిన బొడ్డు కేశవులు, రాపాకపుట్టుగకు చెందిన మామిడి మోహినమ్మ, కామాక్షి ఉన్నారు. వీరిలో మోహినమ్మ, కామాక్షి పరిస్థితి విషమంగా ఉండడంతో బరంపురం ఎంకేసీజీ ఆస్పత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించామని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కల వారంతా అక్కడకు చేరుకున్నారు. లారీ డ్రైవర్ పరిస్థితి చూసి అందరూ విస్మయం వ్యక్తం చేశారు. మద్యం మత్తులో ఉన్న ఆ డ్రైవర్ పరిస్థితి దారుణంగా ఉంది. కనీసం ఒంటిపై తువ్వాలు నిలవడం లేదు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఆయా కుటుంబాల వారికి విషయం తెలియడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. తమకు అన్నం పెట్టే చేతులు ఇక లేవని కన్నీరుమున్నీరయ్యారు. మృతుల్లో నర్తు పద్మమ్మకు భర్త బాబయ్య ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. మురపాల పార్వతికి భర్త ఢిల్లీరావు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. మద్దిలి తరిణమ్మకు భర్త దాలయ్య, కొడుకు, కూతురు ఉన్నా రు. పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను ఇచ్ఛాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇచ్ఛాపురం రూరల్ ఎస్ఐ జనార్ధనరావు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. లారీని స్వాధీనం చేసుకుని, డ్రైవర్ భంజారౌత్ను అదుపులోకి తీసుకున్నారు. బాధితులను ఎమ్మెల్సీ నర్తు రామారావు, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ కడియాల ప్రకాష్ వెళ్లి పరామర్శించారు.తరిణమ్మ మృతదేహం మురపాల పార్వతి మృతదేహం వద్ద రోదిస్తున్న భర్త నర్తు పద్మమ్మ మృతదేహం వద్ద రోదిస్తున్న కుమారులు జమేదారుపుట్టుగ జంక్షన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మహిళల దుర్మరణం నలుగురికి గాయాలు మద్యం మత్తులో లారీ నడిపిన డ్రైవర్ -
ఎప్పుడెప్పుడు..?
● ఆదివారం ఉదయం సరిగ్గా 5.03 గంటలు. జిల్లాకేంద్రంలోని ఒకటో పట్టణ పీఎస్ పరిధి కార్గిల్ పార్క్ ప్రాంతం. ఏపీహెచ్బీ కాలనీకి చెందిన చిల్లా రేణుకాదేవి మార్నింగ్వాక్ చేస్తుండగా ఆమెకు ఎదురుగా గుర్తు తెలియని ఇద్దరు అగంతకులు ద్విచక్రవాహనంపై వచ్చి చైన్ తెంపబోయారు. ఆమె ప్రతిఘటించడంతో పారిపోయారు. ● 5.16కు రెండో పట్టణ పరిధి బలిజేపల్లివారివీధిలో బోయిన సూర్యకుమారి, 5.28 గంటలకు ప్రకా ష్నగర్ మహలక్ష్మి నిలయం మలుపులో రేగి లక్ష్మి మెడల్లోంచి మొత్తంగా 4 తులాల పుస్తెల తాడులు తెంపుకుపోయారు. ● కేవలం అరగంట వ్యవధిలో మూడు దొంగతనాలు జరిగాయి. -
సాంఘికశాస్త్రం.. మోయలేని భారం!
ఇటీవల సిలబస్ మార్పుల నేపథ్యంలో గణితం, భౌతిక, రసాయన, జీవశాస్త్రాల్లో పాఠాలను గణనీయంగా తగ్గించిన విద్యాశాఖ.. సాంఘికశాస్త్రానికి వచ్చేసరికి గుట్టలు, గుట్టలుగా చాప్టర్లు పెంచిందన్న విమర్శలు వస్తున్నాయి. ఉదాహరణకు పదో తరగతి సైన్స్లో భౌతికశాస్త్రంలో 4, రసాయన శాస్త్రంలో 4, జీవశాస్త్రంలో 5 మొత్తం కలిపి 13 పాఠాలు ఉండగా వీటిని వేర్వేలు ఉపాధ్యాయులు బోధించే అవకాశం ఉంది. గణితం 15 అధ్యాయాలు కాగా భాషా సబ్జెక్టులు 10 నుంచి 14 యూనిట్లకు పరిమితం చేశారు. సాంఘికశాస్త్రంలో మాత్రం 22 పాఠాలు ఉండగా వీటిని ఒక్క ఉపాధ్యాయుడే బోధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సిలబస్ను కుదించాలని ఏపీఎస్ఎస్టీఎఫ్ ఫోరం ప్రభుత్వానికి ఇటీవల విజ్ఞప్తి చేసింది. నందిగాం: రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ఇటీవల రూపకల్పన చేసిన సిలబస్లోని అసమానతలు విద్యార్థులు, ఉపాధ్యాయులపై తీవ్ర మానసిక ఒత్తిడిని పెంచుతున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు సిలబస్ మార్చారు. 9,10 తరగతులకు గతేడాది సిలబస్నే నిర్దేశించినా, సాంఘిక శాస్త్రం సిలబస్ను హేతుబద్ధీకరించి భారాన్ని తగ్గిస్తామని గతంలో విద్యాశాఖాధికారులు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో ఉపాధ్యాయుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ఈ ఏడాది ఆరు నుంచి పది తరగతుల వరకు అమలు చేస్తున్న సాంఘికశాస్త్రం సిలబస్ మిగిలిన సబ్జెక్టులతో పోల్చితే అధికంగా ఉంది. దీంతో పాఠాలు బోధించే ఉపాధ్యాయులు, నేర్చుకునే విద్యార్థి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 6 నుంచి 8వ తరగతి వరకు యథాతథంగా సీబీఎస్సీ సిలబస్ను పోలి ఉంటూ వాటికి అదనంగా ప్రాంతీయ అంశాలు ఒక చాప్టర్, ఏఐ ఒక చాప్టర్ జత చేసి రెండు సెమిస్టర్లుగా మార్చారు. 9, 10 తరగతుల పాఠ్యాంశాలు పూర్తిగా సీబీఎస్సీ సిలబస్నే రాష్ట్ర సిలబస్గా పొందుపర్చారు. వీటిలో 6 నుంచి 9 వతరగతి వరకు సెమిస్టర్–1, సెమిస్టర్–2గా విభజించి వాటిలోనే భూగోళశాస్త్రం, చరిత్ర, పౌరశాస్త్రం, అర్ధశాస్త్రం వంటి విభిన్న అంశాలు పొందుపర్చగా, పదో తరతిలో సెమిస్టర్ విధానం లేకుండా పాత పద్ధతిలోనే ఈ నాలుగు విభాగాలు పొందిపరిచారు. సవాల్గా మారిన భోదన.. నేటి విద్యావిధానంలో విద్యార్థుల నిరంతర సమగ్ర మూల్యాంకనం, ప్రాజెక్టుల తయారీ, ఇతర అకడమిక్ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్న ఉపాధ్యాయులకు 22 పాఠాల విస్తృత సిలబస్ను అధికారులు చెప్పినట్లు డిసెంబర్ నాటికి పూర్తి చేయడం సవాల్గా మారింది. నిర్ణీత సమయంలో బోధించడం, రివిజన్ చేయించడం కష్టంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర సబ్జెక్టులతో పోల్చితే సిలబస్ ఎంతో అధికం ఉపాధ్యాయులు, విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడి సిలబస్ తగ్గించాలని ఏపీఎస్ఎస్టీఎఫ్ ఫోరం వినతి -
న్యాయవాదులకు క్షమాపణ చెప్పాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి న్యాయవాదులను అసభ్య పదజాలంతో, న్యాయవాద వృత్తిని కించపరిచేలా మాట్లాడం సరికాదని వైఎస్సార్ సీపీ లీగల్సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టా దామోదరరావు మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేయడం, అధికార పార్టీ దురహంకారానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో మేధావి వర్గానికి చెందిన న్యాయవాదులనే ఇంత దారుణమైన పదజాలంతో, బహిరంగంగా కించపరిచి మాట్లాడితే సామాన్యుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చన్నారు. న్యాయవాదులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతిలో రైతుల కోరిక మేరకు బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీగా వారి బాధలు తెలుసుకోవడానికి వెళ్లిన వారిపై ప్రత్యక్ష దాడులు చెయ్యించడం చూస్తూ ఉంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ చేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. -
సీసీ కెమెరాలో ఏముంది..?
● పోలీసులు నగరంలోని అన్ని సీసీ ఫుటేజీలు పరిశీలించగా ఆర్టీసీ కాంప్లెక్సు బయట వేకువజాము 3.20 గంటలకు అగంతకులు కదలికల దృశ్యాలు కనిపించాయి. తర్వాత ఒకటో పట్టణ పరిధి కార్గిల్ పార్క్ సమీప నీలమ్మగుడి వద్ద ఓ బైక్ను దొంగిలించినట్లు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. అదే బైక్పై సమీపంలోనే మార్నింగ్ వాక్ చేస్తున్న చిల్లా రేణుకాదేవి మెడలోంచి చైన్ తెంపేసి చేతులతో అగంతకుడు పట్టుకెళ్తున్నట్లు సీసీ ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ఆమె ఫిర్యాదు సైతం ఇవ్వలేదని పోలీసులు చెబుతున్నారు. ● కార్గిల్ పార్క్ నుంచి ప్రకాష్బాబు ఓల్డ్బుక్షాపు మీదుగా శివజ్యోతి మెస్ పక్కనే ఉన్న బలిజేపల్లివారి వీధి ఎంటరై విజయ్ రెసిడెన్సీ ఎదురుగా వున్న సందు చివరకి వెళ్లారు. బోయిన గోవిందరావు భార్య సూర్యకుమారి ఇంటి ముందు వాకిలి ఊడ్చుతుండగా అగంతకులిద్దరూ బండిపై వచ్చి చూసి వెళ్లిపోయి మళ్లీ వచ్చి ఆమె తో మాట కలిపినట్టు నటించాడు. అంతలోనే మరో వ్యక్తి వచ్చి 3 తులాల పుస్తెల తాడు తెంపేశాడు. 2 పుస్తెలు, సతుమానం భాగం ఆమె చేతిలోనే ఉండిపోగా మిగతా రెండుతులాల తాడు పట్టుకుపోయారు. అక్కడి నుంచి నేరుగా ప్రకాష్నగర్ చేరి మహలక్ష్మినిలయం మలుపులో మార్నింగ్ వాక్ చేస్తున్న రేగి లక్ష్మి మెడలో పుస్తె తెంపేశారు. ● ఘటనాస్థలికి రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు, ఎస్ఐ హేమంత్కళ్యాణ్, ఒకటో పట్టణ ఎస్ఐ ఎం.హరికృష్ణలు వెళ్లి బాధితుల నుంచి వివరాలు సేకరించి నగరంలో సీసీ పుటేజీలు పరిశీలించారు. ● ఇందులో ఉదయం 5.16 గంటల నుంచి 5.22 గంటల వరకు సీసీ పుటేజీ కనిపించకపోవడం గమనార్హం. అగంతకులు మడపాం టోల్ ప్లాజా దాటినట్లు కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. దారి కాచి దోపిడీశ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని ఖాజీపేట పంచాయతీ పరిధిలో ఆదివారం వేకువజామున దారి దోపిడీ జరిగింది. అదే గ్రామానికి చెందిన పంచిరెడ్డి అప్పలనాయుడు శ్రీకాకుళం నుంచి తన ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో ద్విచక్రవాహనంపై ముగ్గురు వ్యక్తులు వచ్చి అప్పలనాయుడుపై దాడి చేసి అతడి జేబులో నుంచి రూ.20వేలు నగదు పట్టుకొని పారిపోయారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హైస్కూల్ టీచర్ ఆత్మహత్య
పలాస: పలాస ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు జె.రోహిణి (39) అనారోగ్య కారణాల వల్ల తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మెళియాపుట్టి మండలం తూముకొండ గ్రామానికి చెందిన రోహిణి కాశీబుగ్గలోని మారుతీనగర్లో ఒంటరిగా ఉంటున్నారు. భర్త జీవనరావు విజయనగరంలోని జీఎస్టీ కార్యాలయంలో గుమస్తాగా పనిచేస్తున్నారు. ఇద్దరు కుమార్తెలు విశాఖపట్నం, ఇతర ప్రాంతాల్లో చదువుకుంటున్నారు. భర్త వారానికి ఒక రోజు వస్తుంటారు. ఎప్పటిలాగే శనివారం రాత్రి వచ్చేసరికి తలుపు మూసి ఉంది. పక్కింటి వారి సహకారంతో తలుపులు పగలు గొట్టి లోపలికి వెళ్లి చూసే సరికి రోహిణి ఉరికి వేలాడుతూ కనిపించారు. వెంటనే కాశీబుగ్గ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా వెంటనే శనివారం రాత్రి 10 గంటల సమయంలో సీఐ రామకృష్ణ వచ్చి పరిశీలించారు. ఆదివారం ఉదయం పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోహిణికి కొద్ది నెలలుగా అనారోగ్య సమస్యలు ఉన్నాయని, వాటిని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని సీఐ చెప్పారు. -
నాలుగో తరగతి ఉద్యోగుల కార్యవర్గం ఎన్నిక
శ్రీకాకుళం అర్బన్: జిల్లా కేంద్రంలోని ఎన్జీవో కార్యాలయం వద్ద క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ సంఘ భవనంలో ఆదివారం శ్రీకాకుళం జిల్లా నాలుగో తరగతి ఉద్యోగుల అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించారు. ఎలక్షన్ అధికారిగా బి.శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఎలక్షన్ అధికారిగా బి.నవీన్కుమార్ వ్యవహరించారు. అధ్యక్షుడిగా ఎస్.శంకరరావు (సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్), సెక్రటరీగా ఎ.తారకేశ్వరరావు (అగ్రికల్చర్), కోశాధికారిగా టి.సీతారాం (కమర్షియల్ టాక్స్), అసోసియేట్ ప్రెసిడెంట్గా కె.చంద్రమౌళి (రెవెన్యూ), ఉపాధ్యక్షులుగా జి.నాగమణి (డీఎంహెచ్వో ఆఫీస్), పి.సుబ్రహ్మణ్యం (ట్రెజరీ), బి.లక్ష్మి(డీఎంహెచ్వో ఆఫీస్), సంయుక్త కార్యదర్శులుగా జై.రవికుమార్ (కమర్షియల్ టాక్స్), ఎ.పద్మావతి (అగ్రికల్చర్), ఆర్గనైజింగ్ సెక్రటరీగా పి.శ్రీనివాసరావు (రెవెన్యూ), లీగల్ అడ్వైజర్గా సీహెచ్ ఉమాశంకర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉత్తమ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ పదో తరగతిలో 500 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులకు జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు బల్లాడ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. శ్రీకాకుళం నగరంలోని ఎన్జీవో హోమ్లో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం ద్వారా ఒక్కో విద్యార్థికి రూ.3వేలు, మెమెంటో, సర్టిఫికెట్, ఎస్ఆర్ షాపింగ్ మాల్ అధినేత గోపీనాథ్ రెడ్డి తరఫున రూ.2వేలు, గిఫ్ట్ ఓచర్, సర్టిఫికెట్ అందించారు. కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘ నాయకులు దుక్క రాజశేఖరరెడ్డి, బాకీ వేణుగోపాల్రెడ్డి, గౌరవ సలహాదారులు బుచ్చ రామకృష్ణారెడ్డి, దూడ విష్ణుమూర్తిరెడ్డి, పాల వసంత రెడ్డి, బళ్లాడ హేమమాలిని రెడ్డి, పడపాన సుగుణారెడ్డి, మునకాల కిరణ్ కుమార్రెడ్డి, అలపాన త్రినాధ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాత పెన్షన్ మంజూరుకు కృతజ్ఞతలు శ్రీకాకుళం అర్బన్: డీఎస్సీ–2003 ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వ మెమో 57 అనుసరించి పాత పెన్షన్ మంజూరు చేయడానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం లభించినందున కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఏపీ ఎన్జీవో సంఘ పూర్వపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చౌదరి పురుషోత్తమనాయుడు అన్నారు. ఆదివారరం శ్రీకాకుళంలోని ఎన్జీవో కార్యాలయంలో డీఎస్సీ–2003 ఫోరం జిల్లా కన్వీనర్ కొత్తకోట శ్రీహరి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2004 సెప్టెంబర్ ఒకటి ముందు నియామక ప్రక్రియలు పూర్తిచేసుకుని కొన్ని కారణాల వల్ల సీపీఎస్ విధానంలోకి నెట్టవేయబడిన డీఎస్సీ 2003 ఉపాధ్యాయులు, కొంతమంది పోలీస్ కానిస్టేబుళ్లు, గ్రూప్–2 అధికారులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 11,715 మందికి ఉపశమనం లభించిందన్నారు. సమావేశంలో ఎన్జీవో సంఘ జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయి వేణుగోపాల్, జిల్లా కార్యదర్శి చల్లా శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు పూజారి జానికిరాం, బడగల పూర్ణచంద్రరావు, రాష్ట్ర కన్వీనర్ బలగ శ్రీనివాసరావు, జిల్లా కో–కన్వీనర్లు గురుబెల్లి భాస్కరరావు, దుప్పల శివరాం ప్రసాద్, కొత్తపల్లి ప్రకాష్, శ్రీకర్, అట్టాడ తిరుమలేశ్వరరావు, గురుగుబెల్లి చిన్ని కృష్ణంనాయుడు, చదువుల టార్జాన్, దుంపల అనిల్, కె.రామకృష్ణ, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఉద్యమ సభకు సహకరించండి శ్రీకాకుళం అర్బన్: ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధనకు ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణలో భాగంగా జూలై 12న శ్రీకాకుళంలో జరగనున్న మొదటి ఉద్యమ సన్నద్ధత సభ విజయవంతం చేసేందుకు సహకరించాలని జిల్లా చైర్మన్ బీవీవీఎన్ రాజు నేతృత్వంలోని బృందం ఆదివారం ఎన్జీజీవో అధ్యక్షుడు హనుమంతు సాయిరాం, జనరల్ సెక్రటరీ శ్రీనివాసరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.వేణులను కోరారు. సభకు తప్పకుండా హాజరు కావాలని విన్నవించారు. దీనిపై సాయిరాం స్పందిస్తూ తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని ప్రకటించారు. -
నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అర్జీదారులు మీకోసం డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్ వెబ్సైట్లో అర్జీలు నమోదు చేసుకో వచ్చని తెలిపారు. జిల్లా పరిషత్ పాత సమా వేశ మందిరంలో రెవెన్యూ క్లినిక్ ఉంటుందని, ప్రజలు గమనించి రెవెన్యూ క్లినిక్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. శ్రీముఖలింగంలో ఘనంగా మైనాకోత్సవం జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో పాంచరాత్రి కల్యాణ ఉత్సవాల్లో భాగంగా జ్యేష్టమాసం ఐదో ఆదివారం స్వామికి మైనాకోత్సవం ఘనంగా జరిగింది. గణపతి పూజతో ప్రారంభించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి ముందుగా హోమం బలిహరణ అనంతరం పార్వతి పరమేశ్వరులకు తిరువీధి ఉత్సవం నిర్వహించారు. అదే సమయంలో పార్వతీ పరమేశ్వరులు వివాహ మహోత్సవం నచ్చని మైనాకుడు స్వామివారి గృహాన్ని దహనం చేస్తాడు. కార్యక్రమాన్ని మైనాకోత్సవంగా నిర్వహించడం సంప్రదాయంగా పరగణిస్తారు. పాలిసెట్ వెబ్ ఆప్షన్ల నమోదు ప్రారంభం ఎచ్చెర్ల: ఏపీ పాలిసెట్–2026 కౌన్సిలింగ్ ప్రక్రియలో భాగంగా వెబ్ ఆప్షన్ల నమోదు నేటి నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసినప్పుడు సూచనలు తప్పనిసరిగా పాటించాలి. వెబ్ ఆప్షన్లు నమోదు సమయంలో ఉపయోగించే మొబైల్ నంబర్ తప్పనిసరిగా అభ్యర్థి లేదా వారి తల్లిదండ్రు లది ఉండాలి. ఓటీపీలను ఇతరులతో పంచుకోకూడదు. ఒకసారి వెబ్ ఆప్షన్లను ఫ్రీజ్ చేసిన తర్వాత వాటిని తిరిగి మార్చడం, తెరవడం సాధ్యం కాదు. హెల్ప్లైన్ సెంటర్లో కూడా ఓపెన్ చేయడం సాధ్యం కాదు. కాబట్టి అన్ని ఆప్షన్లను పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్ర మే ఫ్రీజ్ చేయాలి. వెబ్ ఆప్షన్లు నమోదు చేయ డానికి ముందు కళాశాలలు, కోర్సులను తమ ప్రాధాన్యత క్రమంలో ఒక కాగితంపై ముందుగా రాసుకుని అనంతరం అదే క్రమంలో వెబ్సైట్లో నమోదు చేయాలి. రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్లో మార్పు అవసరమైతే అభ్యర్థి సంబంధిత హెల్ప్లైన్ సెంటర్ను సంప్రదించి, అవసరమైన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, వాటి సెట్ జిరాక్స్ ప్రతులను సమర్పించాలి. పునరావాస కాలనీలో పనులు సంతబొమ్మాళి: మూలపేట పోర్టు నిర్వాసిత గ్రామమైన విష్ణుచక్రం పునరావాస కాలనీలో పంచాయతీ అధికారులు పనులు చేపట్టారు. ‘ఎవరికి చెప్పినా ఏం లాభం’ అనే శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో ఆదివారం ప్రచురితం కావడంతో అధికారులు స్పందించారు. సెలవు రోజు అయినా పనులను చేపట్టారు. విద్యుత్ స్తంభాలకు వీధి దీపాలు ఏర్పాటు చేసి గ్రామానికి వెలుతురు తెచ్చారు. నిల్వ ఉన్న మురికినీటిని మళ్లించారు. గ్రామాల్లో ఉన్న ఆలయాలకు పునరావాస కాలనీలో 13 సెంట్లు కేటాయించామని తహసీల్దార్ హేమసుందర్రావు తెలిపారు. -
ఎవరికి చెప్పినా.. ఏం లాభం?
● తీవ్ర ఆవేదనలో విష్ణుచక్రం గ్రామస్తులు ● పోర్టు పునరావాస గ్రామంలో కనీస వసతులు కరువు ● అధికారులకు ఎన్నిసార్లు చెబుతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం సంతబొమ్మాళి : పుట్టిన ఊరిని, నివాసమున్న ఇళ్లను వదిలి సర్వం త్యాగం చేసి పునరావాస కాలనీలో తలదాచుకుంటున్న విష్ణుచక్రం గ్రామస్తులు కనీస సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూలపేట పోర్టు పునరావాస ప్రాంతమైన విష్ణుచక్రం గ్రామస్తులను 15 నెలల క్రితం నౌపడ పునరావాస కాలనీకి తీసుకొచ్చారు. ఒక్కో కుటుంబానికి ఐదు సెంట్లు చొప్పున 70 కుటుంబాలకు స్థలాలు కేటాయించారు. అయితే వసతులు కల్పించడం మాత్రం మర్చిపోయారు. వీధి దీపాలు రెండు నెలలుగా వెలగడం లేదు. దీంతో రాత్రి వేళల్లో విషసర్పాలతో భయంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు. బాగా దిగువకు సీసీ రోడ్డు నిర్మాణం చేపడట్టడంతో మట్టి పేరుకుపోయింది. డ్రైనేజీ నిర్మాణం అసంపూర్తిగా ఉండటంతో మురుగు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దీంతో దుర్గంధం వెదజల్లి దోమలు, ఈగలకు నిలయంగా మారింది. కుళాయిల ద్వారా ఎప్పుడు నీరు వస్తుందో తెలియని పరిస్థితి. దీంతో మంచినీటి క్యాన్లు కొనుగోలు చేస్తున్నారు. గుడి, బడి లేక.. పునరావాస కాలనీకి వచ్చి 15 నెలలు కావస్తున్నా విద్యార్థుల కోసం పాఠశాల ఏర్పాటు చేయలేదు. పాఠశాల లేక చిన్నారులను దూరప్రాంతాలకు పంపుతున్నారు. కమ్యూనిటీ హాల్ కూడా లేదు. విష్ణుచక్రం గ్రామంలోని గుడులన్నీ పునరావాస కాలనీలో పునర్నిర్మిస్తామని చెప్పిన అధికారులు తర్వాత పట్టించుకోవడం లేదని పలువురు మండిపడుతున్నారు. దీంతో చెరువు ఒడ్డున కర్రకు దేవుడి జెండా ఏర్పాటు చేసి ప్రతి రోజు పూజలు చేస్తుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే నెల జూలైలో మరిడమ్మ తల్లి సంబరాలు ఉన్నాయని, ఇక్కడ గుడి నిర్మాణం చేయకపోవడంతో ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వగ్రామం విష్ణుచక్రంలో ఉన్న మరిడమ్మ తల్లి దేవాలయానికి వెళ్లి సంబరాలు జరుపుకోవాల్సి వస్తోందంటున్నారు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలని నిర్వాసితులు కోరుతున్నారు.త్యాగాలు మర్చిపోయారు.. పోర్టు కోసం మేము చేసిన త్యాగాలను ప్రజాప్రతినిధులు, అధికారులు మరిచిపోయారు. నిర్వాసిత కాలనీలో కనీస వసతులు లేవు. వీధి దీపాలు నెలల తరబడి వెలగడం లేదు. ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదు. – గిన్ని దాలప్ప, నిర్వాసితుడు, విష్ణుచక్రం సంబరాలు ఎలా.. ? వచ్చే నెలలో మరిడమ్మ తల్లి సబంరాలు జరుగుతాయి. కాలనీలో గుడి నిర్మాణానికి స్థలం కూడా కేటాయించలేదు. సంబరాలు ఎలా జరుపుకోవాలి. గుడి, బడికి సంబంధించి నెలలు గడిచిన డబ్బులు జమ చేయలేదు. – గిన్ని బైరాగి, నిర్వాసితుడు, విష్ణుచక్రం -
హంతకుడిని కఠినంగా శిక్షించాలి
సోంపేట: మండలంలోని గొల్లఊరు గ్రామానికి చెందిన పిన్నింటి ఊర్వశిని హత్య చేసిన హంతకుడిని కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల ప్రతినిధులు శనివారం మృతురాలు ఊర్వశి కుమారులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. ఊర్వశిని హత్య చేసిన శివకుమార్కు కఠిన శిక్ష విధించాలన్నారు. అనాథలుగా మిగిలిన ఇద్దరు పిల్లలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని కోరారు. మాజీ సర్పంచ్ పిన్నింటి ఈశ్వరరావు, ప్రగతి శీల మహిళా సంఘ ప్రతినిధులు బదకల ఈశ్వరమ్మ, మద్దెల ధర్మారావు, జోగు కోందరాం తదితరులు పాల్గొన్నారు. అడ్మిషన్ ఫీజు రద్దు చేయాలి శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ ఫీజు రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు దాసరి సోమశేఖర్ డిమాండ్ చేశారు. శ్రీకాకుళం ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్ద ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ ఫీజు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సోమశేఖర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం పేద విద్యార్థుల దగ్గర అడ్మిషన్ ఫీజు పేరుతో రూ.3 వేలు వసూలు చేయడం సరికాదని దుయ్యబట్టారు. అడ్మిషన్ ఫీజులు కట్టలేక అనేక మంది పేద విద్యార్థులు డ్రాపౌట్స్ అయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ ఫీజు రద్దుచేసి, ఇప్పటికే వసూలు చేసిన అడ్మిషన్ ఫీజులను తిరిగి విద్యార్థులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించి తక్షణమే తగు చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు రాజు, సాయి, మోహన్, పవన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీముఖలింగంలో పండిత సదస్యం
జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో పాంచరాత్రి కల్యాణ ఉత్సవాల్లో భాగంగా జేష్టమాసం నాలుగో రోజు శనివారం అంకుర్పారణ, హోమం, పండిత సదస్యం ఘనంగా నిర్వహించారు. గణపతి పూజతో ప్రారంభించి స్వామివారికి ప్రత్యేక పూజలు, ఏకవార అభిషేకాలు చేపట్టారు. దీనికి ముందు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. కూర్మనాథుని సన్నిధిలో సివిల్ జడ్జి గార: ఆదికూర్మ క్షేత్రం శ్రీకూర్మం కూర్మనాథున్ని బొబ్బిలి సివిల్ జడ్జి ఎ.రాధాకృష్ణమూర్తి కుటుంబ సభ్యులతో శనివారం దర్శించుకున్నారు. ముందుగా గర్భాలయంలో మూలవిరాట్ను దర్శించుకొని, అనంతరం లక్ష్మీ సన్నిధి, దుర్గాదేవి, రెండు ధ్వజస్తంభాలు, తాబేళ్ల పార్కును సందర్శించారు. ఆలయ ఈవో టి.వాసుదేవరావు స్వామి చిత్రపటాన్ని, క్షేత్ర ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆర్చకులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. కోటబొమ్మాళిలో దొంగతనాలు టెక్కలి రూరల్: కోటబొమ్మాళిలో శుక్రవారం అర్ధరాత్రి దొంగతనాలు జరిగినట్లు స్థానికులు శనివారం గుర్తించారు. ఈ మేరకు స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. కోటబొమ్మాళి ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా ఉన్న పలు దుకాణాల్లో శుక్రవారం అర్ధరాత్రి చోరి జరిగినట్లు సమీప షాపు యజమానులు గుర్తించారు. వారి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక వ్యక్తి ఇనుప రాడ్డుతో ముఖానికి మాస్క్ పెట్టుకుని చోరీలకి పాల్పడ్డాడు. సమీపంలో ఉన్న మీసేవా కేంద్రంలో చోరీకి పాల్పడి రూ.20 వేల నగదు దొంగలించినట్లు యజమాని ప్రసాదరావు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే అక్కడే ఉన్న చికెన్ సెంటర్లో రూ.70 వేలు చోరీకి గురైనట్లు షాపు యజమాని గుర్తించారు. అదేవిధంగా సమీప జిరాక్స్ షాపులో సైతం చోరీ జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సత్యనారాయణ ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. గుండెపోటుతో లారీ డ్రైవర్ మృతి టెక్కలి రూరల్: మండలంలోని వీరరామకృష్ణాపురం వద్దనున్న మద్యం గోడౌన్ వద్ద లారీ డ్రైవర్ చదలవాడ లక్ష్మీ నారాయణ రెడ్డి (63) అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. ప్రకాశం జిల్లా నికరంపల్లి గ్రామానికి చెందిన ఈయన మద్యం బాటిళ్ల లోడును లారీలో ఎక్కించుకుని టెక్కలి మండలం వీఆర్కే పురం వద్దనున్న మద్యం గోడౌన్కి వచ్చారు. అనంతరం అక్కడ విశ్రాంతి తీసుకునే సమయంలో గుండెపోటు రావడంతో హుటాహుటిన టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరిక్షించి మృతి చెందినట్లు తెలిపారు. -
అనాథ శవానికి అంత్యక్రియలు
నందిగాం: మండల పరిధిలోని పాత్రునివలసలో ఉన్న పాత షిర్డీ సాయిబాబా మందిరంలో మృతి చెందిన అనాథ శవానికి పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సమక్షంలో శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పాత్రునివలస జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న పాత షిర్డీ సాయిబాబా మందిరం నుంచి శుక్రవారం సాయంత్రం దుర్వాసన వస్తుండటంతో, ఉపాధి హామీ పనులు చేసి వస్తున్న వేతనదారులు గమనించి లోపలకి వెళ్లి చూశారు. అక్కడ ఒక వ్యక్తి మృతి చెంది ఉండడంతో నందిగాం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు పరిశీలించి.. గత కొన్ని రోజులుగా ఆయా గ్రామాల్లో మృతుడు బిచ్చగాడిగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో రెవెన్యూ సిబ్బందికి సమాచారం అందించి గ్రామస్తుల సహకారంతో మందిరం ఆవరణలోనే ఖననం చేశారు. మానవత్వం చాటుకున్న ఏఎస్ఐ ఇచ్ఛాపురం: కంచిలి పోలీస్స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న టి.రామారావు అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ధనరాజుల తులసమ్మ ఆలయం వద్ద భిక్షాటన చేస్తున్న సుమారు 50 ఏళ్ల యాచకుడు ఈనెల 22వ తేదీన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృతి చెందాడు. మృతుడి బంధువులు వస్తారని మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రిలో భద్రపరిచారు. అయితే 5 రోజులైనా ఎవరూ ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న కంచిలి ఏఎస్ఐ రామారావు యాచకునికి అంత్యక్రియలు చేయడానికి ముందుకు రావడంతో రూరల్ పోలీస్లు శవ పంచనామ, పోస్టుమార్టం పూర్తిచేసి మృతదేహాన్ని అప్పగించారు. దీంతో తన సొంత ఖర్చులతో శనివారం సాయంత్రం బాహుదా నది శ్మశానవాటికలో హిందూ సాంప్రదాయ పద్ధతిలో యాచకుని మృతదేహానికి అంత్యక్రియలను స్థానికుల సహకారంతో పూర్తి చేశారు. ఈవిధంగా గడచిన 20 ఏళ్లలో 70 అనాథ శవాలకు అంత్యక్రియలు ఏఎస్ఐ రామారావు అంత్యక్రియలు నర్విహించారు. కార్యక్రమంలో రూరల్ పోలీస్స్టేషన్ కానిస్టేబుల్ రాంబాబు, హనుమ తదితరులు పాల్గొన్నారు. -
జనాగ్రహం
●నౌపడ విద్యుత్ సబ్స్టేషన్ వద్ద శుక్రవారం రాత్రి నిరసన సంతబొమ్మాళి: అసలే ఎండలు మండిపోతున్న వేళ.. ఇష్టానుసారం విద్యుత్ కోతలు విధించడంతో నౌపడ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో కరెంట్ లేకపోవడంతో ప్రజలు మండిపడుతూ సబ్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. ఫోన్ చేసినా లైన్మెన్ స్పందించడం లేదని, అసలు విద్యుత్ సరఫరా ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నిస్తూ నౌపడ విద్యుత్ సబ్స్టేషన్ కు చేరుకొని సిబ్బందిని ప్రశ్నించారు. ఈఎల్ఆర్ అంటూ టెక్కలిలో కరెంట్ తీశారని సిబ్బంది సమాధానమిచ్చారు. రొయ్యల చెరువులకు విద్యుత్ సరఫరా ఎలా ఉంది. మాకెందుకు కట్ చేశారని జనాలు ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా సబ్ స్టేషన్ లోపలికి వెళ్లిపోయారు. అక్కడ నుంచి విద్యు త్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి వచ్చారు. కరెంటు కోసం గొడవ చేస్తారా.. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు కరెంట్ సమస్య ఉంటే పగలు చెప్పుకోవాలని రాత్రిపూట ఏమిటని తిరిగి జనాలపై మండిపడ్డారు. ప్రతి రోజు రాత్రి పూట కరెంటును తీసివేస్తున్నారని జనాలు చెప్పగా.. అలాగైతే సోలార్, ఇన్వెర్టర్ ఏర్పాటు చేసుకోవాలని, కరెంటు కోసం గొడవ చేస్తారా అంటూ పోలీసులు ఆగ్రహించారు. గంటకు పైగా ఇరువురి మధ్య వాగ్వాదం జరగడం ఆ తర్వాత కరెంటు రావడంతో అందరూ వెనుదిరిగారు. -
‘టీడీపీ దోపిడీ తెలిసిపోతుందనే దాడి’
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): అమరావతిలో జరుగుతున్న అవినీతి, అప్పులు, భూములు ఇవ్వని రైతులను చంద్రబాబు ప్రభుత్వం ఎలా వేధిస్తోందో వైఎస్సార్సీపీ ప్రపంచానికి చెబుతోందనే అక్కసుతోనే పార్టీ నేతలపై దాడి చేశారని వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మాజీ మంత్రులు పేర్ని నాని, అంబటి రాంబాబుల బృందాన్ని లక్ష్యంగా చేసుకుని రాళ్లు, కోడిగుడ్లతో దాడులు చేసి వాహనాలను ధ్వంసం చేయడం హేయమైన చర్య అని ధ్వజమెత్తారు. ఈ దాడిలో ఒక పోలీస్ కానిస్టేబుల్కు సైతం గాయాలయ్యాయని తెలిపారు. శ్రీకాకుళంలోని టౌన్హాల్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒకటి రెండు చోట్ల పోలీసులే ఈ దాడిని కో ఆర్డినేట్ చేయడం, అధికార పార్టీ అరాచకాలకు కవచంలా నిలవడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని ఆగ్ర హం వ్యక్తం చేశారు. చంద్రబాబు తన దోపిడీ బయటకు రాకుండా ఉండేందుకే రాజకీయ దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నిర్మించే భవనాలకు చదరపు అడుగుకు సుమారు రూ. 5,587 ఖర్చవుతుంటే, చంద్రబాబు మాత్రం చదరపు అడుగుకు రూ. 20,439 ఖర్చు చేస్తూ భారీ అవినీతికి పాల్పడుతున్నారన్నారు. ఇప్పటికే అమరావతి పేరుతో రూ. 47,385 కోట్లు అప్పులు తెచ్చి రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలను గాలికొదిలేశారని విమర్శించారు. పెనుమాక తదితర గ్రామాల్లో భూ ములివ్వని రైతుల పొలాలను ముంచేస్తూ, సాగు చేసుకోనివ్వకుండా మట్టి దందాలు, ఇసుక దోపిడీలకు తెగబడటం సరికాదన్నారు. రైతు భూమి మీద కన్నేసి, రైతు గొంతు కోసేయడం చంద్రబాబు దుర్మార్గ పాలనకు ప్రతీక అని అన్నారు. టీడీపీకి అమరావతి అంటే ప్రజల రాజధాని కాదు, కాంట్రాక్టర్ల దోపిడీ రాజధాని అని మండిపడ్డారు. రైతులను మోసం చేసి, భయపెట్టిన వారు కచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. వైఎస్సార్సీపీ ఎల్లప్పుడూ బాధితులైన అమరావతి రైతుల పక్షాన నిలబడి పోరాడుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్, రాష్ట్ర పొందర కూరాకుల బీసీ విభాగం అధ్యక్షులు రాజాపు అప్పన్న, ఎస్ఈసీ మెంబర్ చల్ల శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, కిల్లి అజయ్, కనపల అరవింద్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. టెక్కలి మండలం రాధావల్లభపురం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు టీడీపీ వర్గీయుల దాడిలో గాయపడి జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని కృష్ణదాస్, తిలక్ తదితరులు పరామర్శించి ధైర్యం చెప్పారు. -
సూక్ష్మకళ.. అబ్బురపరిచేలా!
● గాజు సీసాల్లో చెక్కతో కళాకృతులు ● టెక్కలి కార్పెంటర్ సోమేశ్వరరావు నైపుణ్యంటెక్కలి : ఒకప్పుడు అగ్గిపెట్టెలో పట్టేంత చీర నేసేవారని గొప్పగా చెప్పుకునే వారు. ఆధునికీకరణ, సరైన ప్రోత్సాహం లేకపోవడం, ఇతరత్రా కారణాలతో ఎంతోమంది అద్భుత కళాకారులు కనుమరుగైపోయారు. ఇలాంటి పరిస్థితిలో టెక్కలి మెట్టవీధికి చెందిన కార్పెంటర్ సింహాద్రి సోమేశ్వరరావు తన సూక్ష్మ కళా నైపుణ్యంతో వివిధ రకాల ఆకృతులను తయారు చేసి అబ్బురపరుస్తున్నారు. చిన్నతనం నుంచి సూక్ష్మ కళపై ఉన్న ఆసక్తిని అభిరుచిగా మార్చుకున్నారు. కార్పెంటర్ పని ముగిశాక తీరిక వేళల్లో సూక్ష్మ కళాకృతులను తయారుచేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. సీసాలో మంచం నుంచి స్టాండ్ వరకు... సోమేశ్వరరావు తన సూక్ష్మ కళావిద్యతో గాజు సీసాలో మంచం, గాజుల స్టాండ్, నెయిల్ పాలిష్ సీసాలో స్వస్తిక్ ముద్ర, టూత్ పిక్తో గొలుసు తదితర వస్తువులను తయారు చేశారు. ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందజేస్తే మరిన్ని అద్భుతమైన కళా కృతులు తయారు చేయడమే కాకుండా మరికొందరికి శిక్షణ అందజేస్తానని సోమేశ్వరరావు చెబుతున్నారు. టూత్ పిక్తో రూపొందించిన గొలుసు గాజు సీసాలో గాజుల స్టాండ్ గాజు సీసాలో మంచం కళాకృతి -
చుక్కల పండగ
● నేటి నుంచి పల్స్ పోలియో ● జిల్లాలో 1096 బూత్ల్లో 84 మొబైల్ బృందాల నియామకాలు అరసవల్లి: జిల్లాలో ఆదివారం నుంచి పల్స్ పోలి యో కార్యక్రమం మొదలు కానుంది. 28, 29,30 తేదీల్లో పల్స్పోలియో చుక్కలు వేయనున్నారు. ఇందుకోసం జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో పక్కా ఏర్పాట్లు చేశారు. ఐసీడీఎస్, విద్యాశాఖ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖ, యూత్, మహిళా సంఘాల కోఆర్డినేటర్లు, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని లక్ష్యాన్ని చేరుకునేలా చర్యలు చేపట్టనున్నారు. జిల్లాలో మొత్తం 30 మండలాల్లో ఐదేళ్ల లోపు వయసు గల చిన్నా రులు సుమారుగా 1,80,879 మందిని గుర్తించి, అందరికీ ఈ మూడు రోజుల్లో టీకా చుక్కలు వేయించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం చర్యలకు దిగింది. ఇంటింటికీ లక్ష్యంగా.. జిల్లాలో పోలియో నియంత్రణకు గాను మొత్తం 71 పీహెచ్సీలు, 13 యూపీహెచ్సీల పరిధిలో నేటి నుంచి మూడు రోజుల పాటు పోలియో చుక్కలను వేయించేందుకు వైద్య శాఖ అన్ని ఏర్పా ట్లు చేసింది. మొదటి రోజు ఆదివారం నాడు ప్రాథమిక పాఠశాలలు తెరుచుకునేలా ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీంతో మొత్తం 1096 పోలియో బూత్లను సిద్ధం చేయగా.. తొలిరోజు ఈ బూత్ల వద్ద పోలి యో చుక్కలను వేయనున్నారు. అలాగే తర్వాత 29, 30 తేదీల్లో బూత్ల్లో టీకాలు వేయించుకోని వారిని గుర్తించేందుకు సుమారు 6,11,630 ఇళ్లను సందర్శించి ఇంటింటికీ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలనే లక్ష్యంతో వైద్యశాఖ సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ఆశవర్కర్లు, అంగన్వాడీలు, వైద్యశాఖ సిబ్బంది, ఏఎన్ఎంలు, హెల్త్అసిస్టెంట్లు ఇలా అన్ని స్థాయిలో సిబ్బంది ఈ వ్యాక్సినేషన్కు సిద్ధం చేస్తున్నారు. అలాగే వీధులు, పొలాలు, ఆట స్థలాల్లో పిల్లల కోసం 84 మొబైల్ బృందాలను, ప్రయాణికులకు వీలుగా రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, సంతలు, దేవాలయాల వద్ద కూడా 40 ట్రాన్సిట్ బూత్లను ఏర్పాటు చేశారు. ఈ మొత్తం కార్యక్రమం కోసం 7,430 మంది సిబ్బంది, పర్యేవేక్షణకు 122 మందిని నియమించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల చిన్నారులకు పోలియో టీకాలను వేయించేలా అన్ని చర్యలు చేపట్టాం. మొత్తం 1,80,879 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయించేందుకు గాను మొత్తం 2.90 లక్షల డోసులను డీప్ ఫ్రీజర్లులో ఉంచుతూ పంపిణీ చేశాం. 28న దాదాపుగా ఈ పోలియో చుక్కలను అందరికీ వేయించాలనే లక్ష్యంతో చర్యలు చేపట్టాం. తర్వాతి రెండు రోజులు ఇంటింటికీ తిరిగి మిగిలిన వారికి టీకాలు వేయించాలని ఆదేశించాం. – డాక్టర్ కె.అనిత, డీఎంహెచ్ఓ -
రేటు..
శ్రీకాకుళంఆదివారం శ్రీ 28 శ్రీ జూన్ శ్రీ 2026ఒక్క ఏడాది వ్యవధి.. సగటు సిక్కోలు జీవి సంపాదనలో ఎలాంటి మార్పు లేదు. కానీ నూనె ప్యాకెట్ ధర దాదాపు రెండింతలైంది. కిలో కొనాల్సిన చోట అరకిలో కందిపప్పుతో సర్దుకుపోవాల్సి వస్తోంది. శనగల నుంచి పోపుల వరకు, సబ్బుల నుంచి ఇంటి సామాన్ల వరకు దాదాపు అన్నింటి ధరలు కనీసం యాభై శాతం పెరిగాయి. కూరగాయల ధరలూ వీటికి జత కలిశాయి. ఫలితంగా పేదవాడి బడ్జెట్ తల్లకిందులైంది. కాసిన్ని రాళ్లు వెనకేసుకునే భాగ్యం లేకుండా పోయింది. సేవింగ్స్కు దూరంగా.. అప్పులకు దగ్గరగా బతుకు బండి సాగుతోంది. 7 -
9 కేసుల్లో రూ.1.50 లక్షల జరిమానా
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆహార భద్రతా ప్రమాణాల అమలులో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ ఉండబోదని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ స్పష్టం చేశారు. ఆహార భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించిన హోటళ్లు, స్వీట్ షాపులు, రెస్టారెంట్లు, కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లపై నమోదైన కేసులను శనివా రం జాయింట్ కలెక్టర్ కోర్టులో విచారించి మొత్తం 9 పెండింగ్ కేసులను పరిష్కరించారు. ఈ కేసుల్లో ఆహార భద్రతా నిబంధనలను పాటించని ఆహార వ్యాపార నిర్వాహకులకు మొత్తం రూ.1,50,000లు జరిమానా విధించా రు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ఆహార వ్యాపార సంస్థలు తప్పనిసరిగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ప్రతి చిన్న, పెద్ద ఆహార వ్యాపార సంస్థ చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ కలిగి ఉండాల ని, లైసెన్స్ లేకుండా వ్యాపారాలు నిర్వహించ డం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం ప్రకారం నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, అవసరమైతే సంబంధిత లైసెన్సులను కూడా రద్దు చేస్తామ ని హెచ్చరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ లక్ష్మినారాయణ, ఫుడ్ సేఫ్టీ అధికారులు కె.లక్ష్మి, జి.శ్రీరాములు ఉన్నారు. రణస్థలం: చెరువులకు అనుసంధానంగా ఉన్న కాలువలను బాగు చేయించాలని రాష్ట్ర భూగ ర్భ జల డైరెక్టర్ కేఎస్ శాస్త్రి అన్నారు. మండలంలోని కొండములగాం పెద్ద చెరువు పనుల ను, కొండ కిందకు వచ్చే కాలువలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువులు, బావుల్లో ప్రసుత్త నీటిమట్టం ఏ స్థాయిలో ఉంది. వర్షాలు పడిన తర్వాత ఏ స్థాయిలో పెరిగిందో స్పష్టమైన నివేదిక తయా రు చేసి పంపించాలని ఉపాధి హామీ సిబ్బంది ని ఆదేశించారు. కాలువలు బాగు చేయడం వల్ల రైతులు పంట పొలాలకు నేరుగా మళ్లించుకోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో డీడీ ఎన్వీకే దుర్గాప్రసాద్, ఎంపీడీఓ ఎం.ఈశ్వరరావు, ఏపీఓ ఎం.శ్రీనివాసనాయుడు ఉన్నారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంఘటిత పోరాటాలు తప్పనిసరిగా మారాయని ఏపీజేఏసీ అమరావతి జిల్లా అధ్యక్షుడు బీవీఏ రాజు తెలిపారు. జూలై 12వ తేదీన జరిగే మొదటి ఉద్యమ సన్నద్ధం సభ విజయవంతం చేయడానికి అన్ని శాఖల ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అన్ని శాఖల ఉద్యోగుల మద్దతు కూడగట్టుకోవడంలో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలోని ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, డిసేబుల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ డీఆర్డీఏ, డ్వామా ఎంపవర్మెంట్, ఏపీఈడబ్ల్యూడీసీ శాఖల ఉద్యో గులను కలిసి మద్దతు కోరారు. వారంతా మద్ద తు ఇస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో ఏపీ జేఏసీ అమరావతి శ్రీకాకుళం జిల్లా మహి ళా విభాగం చైర్ పర్సన్ కె.ప్రవల్లిక ప్రియ, ఏపీఆర్ఎస్ఏ జిల్లా కార్యదర్శి డి.సోనికిరణ్, జాయింట్ సెక్రటరీలు కె.రాధిక, ఎం.గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్ఐఆర్ను సద్వినియోగం చేసుకోవాలి
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శ్రీకాకుళం రూరల్: ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ జాబితా(ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. మండల పరిధిలోని సింగుపురం గ్రామంలో శనివారం ఆయన పర్యటించి బీఎల్వోల పనితీరుపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల సంఘం, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాన్ని జిల్లాలో పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 8 శాసనసభ నియోజకవర్గాల్లోని 30 మండలాల పరిధిలో 2,358 మంది బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏ)లు కుడా బీఎల్వోలతో కలిసి సమన్వయంగా కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు చెప్పారు. ఓటరు జాబితాలో నమోదైన ప్రతీ ఓటరు వివరాలను, కుటుంబ వివరాలతో అనుసంధానం (మ్యాపింగ్) చేసే ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోందన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 88 శాతం మ్యాపింగ్ పూర్తి కావడంతో రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా అగ్రస్థానంలో నిలిచిందన్నారు. నిరక్షరాస్యులు, వృద్ధులు, సమయం లేని ఓటర్లకు సాయంగా అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు ఇతర శాఖల సిబ్బంది సహకారంతో ఫారాలు పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి స్వరూపారాణి, ఎంపీడీవో ప్రకాశ్రావు, ఈవోపీఆర్డీ సూర్యనారాయణ, మాజీ సర్పంచ్ ఆదిత్యనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
గోవాలో మత్య్సకారుడు మృతి
సంతబొమ్మాళి: మండలంలోని కె.లింగూడు పంచాయతీ ఎం.సున్నాపల్లి గ్రామానికి చెందిన మోసా గురుమూర్తి (48) అనే మత్య్సకారుడు గోవాలో సముద్రపు వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. స్థానికంగా ఉపాధి లేకపోవడంతో వారం రోజులు క్రితం తోటి మత్య్సకారులతో కలిసి గోవా వెళ్లాడు. శుక్రవారం సాయంత్రం సముద్రంలో చేపల వేట చేస్తున్న సమయంలో ప్రమాదానికి గురై మృతి చెందాడని కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందింది. మృతుడికి భార్య గిరమ్మ, కుమారులు రామకృష్ణ, వివేక్లు ఉన్నారు. మరణవార్త విని గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఆర్థికంగా ఆదుకోవాలని మత్య్సకారులు కోరుతున్నారు. ఇరువర్గాలపై కేసులు నమోదు కొత్తూరు: మండలంలోని మహాసింగి గ్రామ సమీపంలో పంట భూమి విషయమై కర్లెమ్మ పంచాయతీ పరిధి అఫీషియల్ కాలనీకి చెందిన పొందూరు తేజేశ్వరరావు కుటుంబ సభ్యులు, మహాసింగి గ్రామానికి చెందిన కొవ్వాడ గోపాలు కుటుంబ సభ్యులకు మధ్య శుక్రవారం కొట్లాట జరిగింది. అనంతరం ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కె.వెంకటేష్ శనివారం తెలిపారు. -
పైడిగాంపై పోరుబాట..!
● ప్రాజెక్టు ఆధునీకరణకు వైఎస్సార్సీపీ డిమాండ్ ● నేడు ‘పైడిగాం పోదాం పదండి’ కార్యక్రమం ● విజయవంతం చేయాలని పిలుపు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన చంద్రబాబు హయాంలో గానీ.. మూడుసార్లు స్థానిక ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన బెందాళం అశోక్ హయాంలో గానీ పైడిగాం ప్రాజెక్టు అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయలేదు. ఈ ప్రాంత రైతులపై కూటమి పాలకులకు ఎటువంటి ప్రేమ ఉందో దీని ప్రకారం తెలుసుకోవచ్చు. ఇప్పటికై నా పైడిగాం ప్రాజెక్టు ఆధునీకరణ పనులు చేపట్టి ఈ ప్రాంత రైతులకు న్యాయం చేయాలి. – సాడి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త, ఇచ్ఛాపురం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించనున్న పైడిగాం పోదాం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ప్రాజెక్టు అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో, వైఎస్సార్సీపీ హయాంలో నిధులు మంజూరు చేసి పనులు చేపట్టడం జరిగింది. టీడీపీ హయాంలో రైతులకు న్యాయం జరగలేదు. ఒక్క రూపాయి నిధులు కూడా విడుదల కాలేదు. ప్రభుత్వం స్పందించి ఆధునీకరణ పనులు చేపట్టి రైతులకు న్యాయం చేయాలి. – డాక్టర్ నిమ్మన దాస్, ఎంపీపీ, సోంపేట సోంపేట: మండలంలోని చిన్ననీటి ప్రాజెక్టు అయిన పైడిగాం ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టి, పంటలకు సకాలంలో సాగునీరు అందజేసేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ‘పైడిగాం పోదాం పదండి’ కార్యక్రమాన్ని ఆదివారం చేపట్టనున్నారు. రైతులకు న్యాయం జరగాలనే సదుద్దేశంతో పోరు చేపడుతున్నట్లు ఇచ్ఛాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అధికారంలోకి వస్తే పైడిగాం ప్రాజెక్టు ఆధునీకరణ పనులు చేపడతామని ఎన్నికల సమయంలో కూటమి నాయకులు హామీలు గుప్పించారు. అయితే అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇంతవరకు కనీసం ఒక్క పైసా నిధులు కూడా మంజూరు చేయకపోవడం దారుణమని స్థానిక రైతులు, వైఎస్సార్సీపీ నాయకులు విమర్శిస్తున్నారు. ప్రాజెక్టు ఆధునీకరణకు నోచుకోకపోవడంతో పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల పరిధిలోని మూడు మండలాల రైతులకు సకాలంలో సాగునీరు అందడం ప్రశ్నార్థకంగా మారింది. కంచిలి, సోంపేట, మందస మండలాల పరిధిలోని 67 చెరువులకు సాగునీరు సకాలంలో అందడం లేదు. అదే కాలువలకు పూర్తి రాతి కట్టడం నిర్మిస్తే రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. అందువలన ప్రభుత్వం స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. ఇదీ చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 1958–63 సంవత్సరాల మధ్య నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా.. అప్పటి సమితి అధ్యక్షుడు గన్ని పద్మనాభం కృషితో పైడిగాం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జరిగింది. సోంపేట, కంచిలి, మందస మండలాల పరిధిలో 5 వేల ఎకరాలకు సాగునీరు అందజేయాలనే ఉద్దేశంతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ప్రత్యక్షంగా 5 వేల ఎకరాలకు అయినా.. పరోక్షంగా మరో 10 వేల ఎకరాలకు సాగునీరు సరఫరా జరుగుతుంది. అనంతరం 2014 – 19లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కాలువలకు రాతి కట్టడం నిర్మాణం కోసం రూ.14 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో 16.4 కిలోమీటర్ల కాలువలో 6.2 కిలోమీటర్ల కాలువకు రాతికట్టడం పూర్తి చేశారు. అయితే మిగతా కాలువకు రాతికట్డడం నిర్మాణం చేపట్టాల్సి ఉంది. కాగా 2018లో తిత్లీ తుఫాన్ ప్రభావంతో పైడిగాం ప్రాజెక్టు ఆనకట్ట ఆనవాలు లేకుండా పోయింది. దీంతో 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ ఆధ్వర్యంలో రూ.20 లక్షల నిధులు మంజూరు చేసి ఆనకట్ట మరమ్మతులు చేపట్టారు. దీంతో రైతులకు కొంత ఉపశమనం కలిగింది. -
ఒక్కసారికి వదిలేయండి సర్..!
జిల్లా కేంద్రంలోని డేఅండ్నైట్ ప్రాంతం.. సమయం శుక్రవారం ఉదయం 10.22 గంటలు.. ఒకే ద్విచక్రవాహనంపై ముగ్గురు మైనరు బాలురు..అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుళ్లు రౌతు ఈశ్వరరావు, ఎస్.శ్రీహరిలు బండిని ఆపారు. కానిస్టేబుళ్లు పక్కకు తీసుకెళ్లగానే బాలురు నోటి వెంబడి వచ్చిన ఒకే మాట చివరి వరకూ కొనసాగింది.. ‘‘మాకేం తెలియదు..ఈ ఒక్కసారికి వదిలేయండి..!’’ కానిస్టేబుల్: ఏం చదువుతున్నారు.. ? బండి నడిపిన బాలుడు : సర్.. నేను ఐటీఐ చదువుతున్నాను.. మిగతా బాలురు : నేను, వీడు ఇంటర్ చదువుతున్నాం.. కానిస్టేబుల్ : ఏ ఊరు..? ఇటేం వచ్చారు..? బాలురు : ఖాజీపేట అండి. సెలవు కదా అని దుస్తులు కొనేందుకు వచ్చేశాం. బండి ఎవరిది : మా నాన్నది అండి.. గొర్రెలు మేపేందుకు వెళ్లిపోయాడు. తెలియకుండా తెచ్చేశా.. కానిస్టేబుల్ : మరి మీరు చిన్నోళ్లు కదా.. ఎవరైనా మీ బండిని ఢీకొట్టినా.. మీరు ఢీకొట్టినా చాలా ప్రమాదం కదా.. ఈ విషయం మీకు తెలియదా..! బాలురు : మాకేం తెలియదండి.. ఈ ఒక్కసారికి వదిలేయండి.. ప్లీజ్.. తక్షణమే కానిస్టేబుళ్లు ద్విచక్రవాహనాన్ని ట్రాఫిక్ స్టేషన్కు తరలించేసి బాలురును ఇంటికి పంపించి తల్లిదండ్రులను తీసుకురమ్మన్నారు. ఈ విషయమై ట్రాఫిక్ సీఐ రామారావు మాట్లాడుతూ మైనర్లకు వాహనాలు ఇవ్వడం నేరమని, ఇచ్చే వాహన యజమానికి రూ. 5 వేలు జరిమానా విధిస్తామని చెప్పారు.-శ్రీకాకుళం -
ఐఆర్ ప్రకటనలో జాప్యం తగదు
శ్రీకాకుళం: పీఆర్సీ కాల పరిమితి ముగిసి మూడేళ్లయినా రాష్ట్ర ప్రభుత్వం కరువు భత్యం ప్రకటించకుండా తాత్సారం చేయడం తగదని, ఇందుకు మూల్యం చెల్లించుకోకతప్పదని ఎస్టీయూ సంఘం రాష్ట్ర కార్యదర్శి పడాల అమ్మినాయుడు అన్నారు. ఎస్టీయూ జిల్లా ద్వితీయ కార్యవర్గ సమావేశం శుక్రవారం శ్రీకాకుళంలోని క్రాంతిభవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే 30 శాతం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. జేఏసీ వైస్ చైర్మన్ ఎస్వీ రమణమూర్తి మాట్లాడుతూ ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి టెట్ అవసరమా ? అని ప్రశ్నించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి గురువు శ్రీనివాస్ మాట్లాడుతూ వర్క్ అడ్జెస్ట్మెంట్ పేరుతో ప్రభుత్వం ఉపాధ్యాయులలో గందరగోళ పరిస్థితి సృష్టిస్తోందని దుయ్యబట్టారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు కంచరాన తేజేశ్వరరావు, మానెం సన్యాసిరావు, పేడాడ రామకృష్ణ, మురళీకృష్ణ, కృష్ణ, కూన కృష్ణారా వు, బొడ్డేపల్లి రమేష్, రామచంద్ర, మొయ్యి తేజేశ్వరరావు, పేడాడ అన్నాజీరావు తదితరులు పాల్గొన్నారు. -
కల్యాణ వైభోగమే..!
శ్రీకాకుళం కల్చరల్ : హిందూ సంప్రదాయంలో ఏ పని తలపెట్టిన శుభ ముహూర్తాలు చూసుకోవడం ఆనవాయితీ. కొత్త వస్తువులు, వాహనాలు కొనాలన్నా మంచి రోజులు ఉండాల్సిందే. అలాంటిది జీవితంలో అత్యంత ప్రధానమైన వివాహాలు, గృహప్రవేశాల విషయంలో నక్షత్ర, రాశి బలాలకు సరిపడా ముహుర్తాలపై ప్రజలకు అచంచల విశ్వాసం ఉంటుంది. అయితే గత మే 14న అధిక జ్యేష్టమాసం ప్రారంభం కావడంతో నెల రోజులుగా శుభకార్యాలకు బ్రేక్ పడింది. తాళికట్టు శుభవేళ.. ఈ నెల 15తో శూన్యమాసం ముగిసింది. 16 నుంచి నిజ జ్యేష్టమాసం ప్రారంభమైంది. జూన్ 27, 28, జూలై 1, 2, 3, 4, 5, 8, 9 తేదీలలో అత్యంత బలమైన ముహూర్తాలు ఉన్నాయని జ్యోతిష పండితులు చెబుతున్నారు. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్ మాసాల్లోనూ మంచి ముహుర్తాలు ఉన్నాయని అంటున్నారు. వ్యాపారాలు కళకళ.. నెలరోజులుగా ముహూర్తాలు లేకపోవడంతో కల్యాణ మండపాలు, కేటరింగ్, టెంట్ హౌస్లు, డెకరేషన్, పూల వ్యాపారులు, పురోహితులు, బంగారం షాపులు, వస్త్రవ్యాపారులు, ఫొటోగ్రాఫర్ల వ్యాపారాలు మందగించాయి. చాలా మంది కార్మికులకు ఉపాధి కరువైంది. జూన్ 19 నుంచి మళ్లీ సీజన్ ప్రారంభం కానుండటంతో ఈ అనుబంధ వ్యాపారాలన్నీ ఊపందుకుంటాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రెండు వేల వరకు వివాహాలు నెల రోజుల తర్వాత ముహూర్తాలు మొదలవడంతో జిల్లా వ్యాప్తంగా సుమారు 2వేల వరకు పెళ్లిళ్లు జరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో వధూవరులకు కావలసిన వస్త్రాలు, పట్టుచీరలు కొనేందుకు తల్లిదండ్రులు, బంధువులు షాపులకు క్యూ కడుతున్నారు. కిరాణా దుకాణాలలో కూడా వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. ‘బంగారం’ లాంటి చాన్స్ పెళ్లికి ముఖ్యమైనది బంగారం. దాని ఖరీదు పెరుగుతున్నా తప్పని సరిగా బంగారం పెట్టాల్సిందే. స్వర్ణాభరణాల ధరలు పెరుతున్నా పెళ్లికి అతిముఖ్యంగా కావలసిన తాళిబొట్టు, మట్టెలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో కొందరు బంగారం షాపుల వద్ద చేరి వీటిని ముందుగా ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటున్నారు. మరికొందరు బంగారం ముక్క కొనుగోలు చేసి తమకు తెలిసిన తయారీదారుని వద్ద వెళ్లి ఆర్డర్ ఇస్తున్నారు. జ్యేష్టమాసం విశేషమైంది జ్యేష్టమాసం అన్ని మాసాలలోకి విశేషమైంది. బ్రహ్మదేవునికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. నిజ జ్యేష్ట మాసంలో వివాహాది శుభ కార్యక్రమాలు యధావిధిగా నిర్వహిస్తారు. చాలా మంది వివాహాలు చేసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. – తెన్నేటి విక్రమశర్మ, ప్రకాశరాయ జ్యోతిషాలయం ముహూర్తాల కోసం వస్తున్నారు.. నెలరోజులుగా ముహూర్తాలు లేక చేతిలో పనులు లేవు. ఎట్టకేలకు శుభ ముహూర్తాలు మొదలు కావడంతో వివాహాది శుభకార్యాలు చేయించుకునేందుకు మావద్దకు వస్తున్నారు. తేదీలు ముందుగా బుక్ చేసుకుంటున్నారు. – పి.నర్సింహమూర్తి, పురోహితులు, శ్రీకాకుళం -
క్రికెటర్లు క్లీన్బౌల్డ్
● జిల్లా అండర్–19 బాలికల ఎంపికల్లో బండారం బట్టబయలు ● క్రికెట్ సంఘం గేట్కు తాళాలు ● అవస్థలు పడిన క్రీడాకారులు, తల్లిదండ్రులు ఉక్కిరిబిక్కిరి శ్రీకాకుళం న్యూకాలనీ: క్రీడాకారులకు బాసటగా నిలవాల్సిన క్రీడా సంఘాలు వారితో ఆటాడుకుంటున్నాయి.క్రికెట్ క్రీడాకారుల భవిషత్ను ప్రశ్నార్థకం చేస్తూ వ్యవహరిస్తున్నాయి. జిల్లా క్రికెట్ సంఘంలో రోజురోజుకూ గొడవలు ముదురుతున్నాయి. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ వర్సెస్ జిల్లా క్రికెట్ సంఘం అన్నంట్టుగా అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. సెలక్షన్స్ కోసం వస్తే.. తాళాలు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం శుక్రవారం అండర్–19 మహిళల సెలక్షన్స్, పురుషుల మల్టీడేస్ జట్ల సర్టిఫికెట్ పరిశీలన నిర్వహించాల్సి ఉంది. అయితే జిల్లా క్రికెట్ సంఘం భవనం గేటుకు అదనంగా తాళాలు వేయడంతో క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు కంగు తిన్నారు. జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు ఉదయం 7.30 గంటలకే శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదానంలోని జిల్లా క్రికెట్ సంఘం కార్యాలయానికి చేరుకున్నారు. ఏసీఏ నియమించిన సెలెక్టర్లు, తాత్కాలిక సమన్వయ కమిటీ సభ్యులు కూడా వచ్చారు. అయితే, కార్యాలయ గేటుకు ముందే తాళాలు ఉండగా, వాటికి అదనంగా డబుల్ లాక్ వేయడంతో సెలక్షన్ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. సుమారు రెండున్నర గంటల పాటు సెలెక్టర్లు, క్రీడాకారులు, తల్లిదండ్రులు గేట్ బయటే వేచి చూసినా తాళాలు తీయకపోవడంతో తల్లిదండ్రులు, క్రీడాకారుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. దీంతో అక్కడ జరుగుతున్న తతంగాన్ని జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ దృష్టికి కొంతమంది తల్లిదండ్రులు తీసుకెళ్లగా, ఆయన వెంటనే గేట్లు తెరవాలని ఆదేశించారు. దీంతో ఎట్టకేలకు ఉదయం 10 గంటల తర్వాత గేట్లు తెరుచుకోవడంతో సర్టిఫికెట్ పరిశీలన, నెట్ ప్రాక్టీస్ ద్వారా అండర్–19 బాలికల జట్టు ఎంపికలు పూర్తి చేసి మమ అనిపించారు. క్రీడాకారులకు నష్టం తప్పదా..? ఘటనపై ఏసీఏ తాత్కాలిక సమన్వయ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సెలక్షన్ ప్రక్రియను జిల్లా క్రికెట్ సంఘంలో చక్రం తిప్పుతున్న కొంతమంది ఉద్దేశపూర్వకంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. మరోపక్క జిల్లా క్రికెట్ సంఘం వ్యవహరిస్తున్న తీరుపై అటు ఏసీఏతోపాటు ఇటు క్రీడాకారుల తల్లిదండ్రులు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దుశ్చర్యలు, సంఘటనల వల్ల ఏసీఏ సెలెక్షన్లలో, అంతర్జిల్లాల క్రికెట్ టోర్నీల్లో జిల్లా ప్రాతినిధ్యమే కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘కూన’ ఎన్నిక అనంతరం రోజుకో రచ్చ.. జిల్లా క్రికెట్ సంఘానికి అధ్యక్షునిగా ఎమ్మెల్యే కూన రవికుమార్ ఎన్నికై నప్పటి నుంచి జిల్లా క్రికెట్ సంఘంలో రోజుకో యవ్వారం, పూటకో సంఘటన అన్నట్టుగా అగ్గి రాజుకుంటోంది. కూనపై అక్కసుతో జిల్లాలో కింజరాపు వర్గం ఏసీఏలో కీలక వ్యక్తులతో చేతులు కలిపి తెరవెనక తతంగాలు నడిపిస్తున్నారనే విషయం సైతం చక్కర్లు కొడుతోంది. ఏసీఏ పెద్దలు కేసినేని చిన్ని, సానా సతీష్లతో కింజరాపు బాబాయ్, అబ్బాయ్ టచ్లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే.. జిల్లా క్రికెట్ సంఘంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఒకరిద్దరు వల్లే జిల్లా క్రికెట్ సంఘం మొత్తం బజారున పడుతోందని క్రీడాకారుల తల్లిదండ్రులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 28వ తేదీన జరగాల్సిన జిల్లా అండర్–19 మల్టీటేస్ క్రికెట్ జట్టు ఎంపికల ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందోనన్న మీమాంస సర్వత్రా నెలకొంది. -
మాదకద్రవ్యాల రహిత జిల్లాయే లక్ష్యం
శ్రీకాకుళం క్రైమ్ : మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే పోలీసుల లక్ష్యమని శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా డీఎస్పీ ఆధ్వర్యంలో ఎస్పీ కార్యాలయం నుంచి డే అండ్నైట్ వరకు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సీహెచ్ రామచంద్రకుమార్, సీఐలు పి.ఈశ్వరరావు, వి.రామారావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
తొమ్మిది కిలోల గంజాయి స్వాధీనం
మందస: స్థానిక కొర్రాయిగేటు జంక్షన్ వద్ద శుక్రవారం 9 కిలోల గంజాయిని తరలిస్తుండగా సీఐ ఎం.తిరుపతిరావు, ఎస్ఐ కె.కృష్ణ ప్రసాద్ పట్టుకున్నారు. వారు తెలిపిన వివరాల మేరకు.. పూణెకు చెందిన శ్రీరామ్ జిలేబి షాప్ పెట్టుకుని వ్యాపారం చేస్తున్నాడు. ఒడిశాకు చెందిన రంజాన్ అనే వ్యక్తి తో అతనికి పరిచయమైంది. ఆర్థిక స్థితి బాగోకపోవడంతో రంజాన్ గంజాయి వ్యాపారం గురించి శ్రీరామ్కు చెప్పాడు. కానీ శ్రీరామ్ ఆసక్తి చూపించలేదు. వైజాగ్లో జిలేబీ వ్యాపారం చేద్దామని వెళ్లి.. అక్కడ అనువుగా లేక విజయనగరం వచ్చాడు. అక్కడ స్కూటీ దొంగతనం చేసి.. అదే స్కూటీతో బరంపురం వచ్చి అక్కడి నుంచి రైలులో పూణె వెళ్లిపోయాడు. అక్కడ వేరే స్నేహితుడితో గంజాయి అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. పూణేలోనే ఓ మైనర్ను తోడుగా తీసుకువచ్చి 8 ప్యాకెట్ల గంజాయిని గురువారం ఉదయం బరంపురంలో తీసుకున్నాడు. పూణె వెళ్లడం కోసం పలాస రైల్వే స్టేషన్కు వస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు. -
‘ఉద్యమాలకు ఉద్యోగులు సన్నద్ధం’
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో జూలై 12 వ తేదీన జిల్లాలో జరగను న్న మొదటి ఉద్యమ సన్నద్ధం సభకు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల సంపూర్ణ మద్దతును ఇ చ్చారు. ఈ మేరకు శుక్రవారం ఏపీజేఏసీ జిల్లా అధ్యక్షులు బీవీఎన్ రాజును రెవెన్యూ వసతి గృహంలో కలిసి ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పెండింగ్ డీఏలను ప్రకటించటం, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, ఐఆర్ను ప్రకటించడం, సరెండర్ లీవుల మంజూరు, నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వడం, కంట్రిబ్యూటరీ పింఛన్ పథకం రద్దు చేయడం తదితర సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నట్లు సచివాలయ ఉ ద్యోగులు తెలిపారు. కార్యక్రమంలో ఏపీఆర్ఎస్ఏ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి జీకే శ్రీనివాసరావు, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. -
నాలుగేళ్ల ఐటీఈపీ కోర్సు.. దరఖాస్తుల ఆహ్వానం
ఎచ్చెర్ల: నాలుగేళ్ల బీఈడీ కోర్సులకు సంబంధించి సమీకృత ఉపాధ్యాయ విద్యా కార్య క్రమం (ఐటీఈపీ)లో ప్రవేశానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ ఈ విద్యా సంవ్సరానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోందని రిజిస్ట్రార్ ఆచార్య బి.అడ్డయ్య తెలిపారు. ఎన్టీఏ జాతీయ స్థాయిలో నిర్వహించిన ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత చెందిన వారు దరఖాస్తులు చేయడానికి అర్హులని తెలియజేశారు. చెరో 50 సీట్లతో బీఎస్సీ, బీఈడీ, బీఏబీఈడీ కోర్సులను డాక్టర్ బీఆర్ఏయూ ఆఫర్ చేస్తుందని తెలిపారు. దరఖాస్తులు వచ్చే నెల 4 వ తేదీవరకూ యూనివర్సిటీకి అందజేయవచ్చని తెలి పారు. ఈ వివరాల కోసం యూనివర్సిటీ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్యూ.బీఆర్ఏయూ.ఈడియూ.ఇన్ను సందర్శించి తెలుసుకోవచ్చని రిజిస్ట్రార్ బి.అడ్డయ్య సూచించారు. జాతీయ స్థాయి సైక్లింగ్ పోటీలకు జీవన్ కుమార్ జలుమూరు: జాతీయ స్థాయి సైక్లింగ్ పోటీలకు పాగోడు ప్రాథమిక పాఠశాల విద్యార్థి కె.జీవన్కుమార్ అర్హత సాధించాడు. గుంటూరులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ చూపి ఏపీ నుంచి ఒకే ఒక్క విద్యార్థి ఎంపికయ్యాడు. దీనిపై పాగోడుతోపాటు స్వగ్రామం బోరవాని పేట గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల విజయవాడలో జరిగిన పోటీల్లో జిల్లా నుంచి జీవన్ కుమార్ ప్రథమ స్థానంలో నిలిచాడు. జీవన్ కుమార్ తల్లి రోహిణిది వ్యవసాయ కూలి కుటుంబం. డిసెంబర్ నెలలో మధ్య ప్రదేశ్ జబల్పూర్లో జరగనున్న ఈ సైక్లింగ్ పోటీల్లో జీవన్ కుమార్ పాల్గొననున్నాడు. ఈ విద్యార్థి ఇటీవలే 1200 సీడ్బాల్స్ తయారు చేసి సోషల్ మీడియాతోపాటు పలు ప్రచార మాధ్యమాల్లో వైరల్ అయ్యాడు. ‘ప్రతి వాహనం తనిఖీ చేయాలి’ ఇచ్ఛాపురం: అంతర్రాష్ట్ర చెక్ పోస్టుకు ఒడిశా నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని విశాఖపట్నం రేంజ్ పోలీస్ ఐజీ గోపీనాథ్ జెట్టీ సూచించారు. ఆయన శుక్ర వారం సరిహద్దులోని పురుషోత్తపురం అంతర్రాష్ట్ర చెక్పోస్టుని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, గంజాయి రవాణాపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని తెలిపారు. కార్యక్రమంలో సీఐ మీసాల చిన్నంనాయుడు, ఎస్ఐ ఎం.ముకుందరావు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ‘ఆశ్రమ పాఠశాలలు మూసివేస్తే ఉద్యమమే’ శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): రేషనలైజేషన్ పేరుతో గిరిజన ఆశ్రమ పాఠశాలలను కుదించే కుట్రకు కూటమి ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకోవాలని లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించక తప్పదని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాబ యోగి హెచ్చరించా రు. శ్రీకాకుళం నగరంలో ఇలిసిపురంలోని అంబేడ్కర్ విజ్ఞాన భవన్లో శుక్రవారం రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వాబ యోగి మాట్లాడుతూ గిరిజన సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గత ఏడాది మే 15న జారీ చేసిన మెమోను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. రేషనలైజేషన్ చేస్తే చాలా ఆశ్రమ పాఠశాలలు మూతపడతాయని, కొండ కోనల్లో సమాజానికి దూరంగా ఉన్న ఆదివాసీలను విద్యకు దూరం చేయాలన్న చంద్రబాబు కుట్రను తిప్పికొడతామన్నారు. గిరిజనులపై కూటమి ప్రభుత్వానికి చిన్నచూపు తగదన్నా రు. ఆదివాసీలకు ఇచ్చిన సీఆర్టీ ఉద్యోగాలు పోతాయని, ఏజెన్సీలో ప్రత్యేక డీఎస్సీ నిర్వహించే పరిస్థితి ఉండదని, ఆదివాసీ నిరుద్యోగ యువత ఉపాధికి దూరమైపోతారన్నారు. సమావేశంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర కోశాధికారి యడ్ల సూరినారాయణ, పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వినోద్, ఏపీటీడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గేదెల శేషగిరి, సన్నశెట్టి రాజేశేఖర్ తదితరులు మాట్లాడారు. -
పూండిలో చైన్స్నాచర్ల హల్చల్
● ఓ వృద్ధురాలు, మరో మహిళ నుంచి బంగారు ఆభరణాల చోరీ వజ్రపుకొత్తూరు: పూండిలో చైన్స్నాచర్లు హల్చల్ సృష్టిస్తున్నారు. వ్యాపార కేంద్రం కావడంతో ఒంటరిగా ఉన్న ఇల్లే లక్ష్యంగా చేసుకుని రెక్కీ నిర్వహిస్తున్నారు. ఎవరూ లేని సమయంలో మహిళలు, వృద్ధుల మెడలోని ఆభరణాలు దోచేస్తున్నారు. దోపిడీకి గురైన వారు అరగంట తర్వాత స్పృహలోకి వస్తున్నారు. పూండిలో గురువారం సాయంత్రం, శుక్రవారం మధ్యాహ్నం జరిగిన సంఘటనలే ఇందుకు నిదర్శనం. పూండి – పీఎంపురం రహదారిలో నివాసముంటున్న వృద్ధురాలు కోట లక్ష్మీ గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇంటి ముందున్న పూలు ఏరుతున్న సమయంలో చైన్స్నాచర్లు వచ్చి మెడలోని ఐదు తులాల బంగారం గొలుసు ఎత్తుకుపోయారు. దీంతో ఆమె కుమారుడు కోట తవిటినాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం దున్న జగదీశ్వరి అనే మహిళ బార్రూం నుంచి బయటకు వచ్చే సమయంలో ఆమె మెడలో సుమారు 4.50 తులాల బంగారం పుస్తెల తాడు తెంచుకుపోయారు. ఈ సమయంలో జగదీశ్వరి కుమార్తె ఫోన్ చేసినా ఆమె లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి తండ్రి రవికుమార్కు ఫోన్ చేసింది. ఆయన ఇంటికి వచ్చి చూసే సరికి బాత్రూం వద్ద ఆమె స్పృహ కోల్పోయి ఉండటాన్ని గమనించారు. కొంత సేపటి తర్వాత తేరుకుని భర్తకు విషయం చెప్పింది. వెనుక నుంచి ఎవరో తలపై కొట్టడంతో కింద పడిపోయానని, ఆ తర్వాత తనకు ఏం జరిగిందో తెలియదని చెప్పడంతో కుటుంబ సభ్యులంతా ఆందోళనకు గురయ్యారు. వీరి కుటుంబానికి పూండి బస్టాండ్ రోడ్డులో బంగారం షాపు, ఫ్రూట్, పాన్ షాపు ఉన్నాయి. గత ఏడాది జనవరి 23న రవికుమార్కు చెందిన బంగారం షాపులోనే సుమారు రూ.70 లక్షలు విలువైన వెండి బంగారం నగలు చోరికీ గురయ్యాయి. ఇంకా ఆ చోరీ కేసు తేలనే లేదు. ఆ సొత్తు రికవరీ కాకపోగా మళ్లీ సంఘటన జరగడంతో వారు బోరున విలపిస్తున్నారు. సీసీ ఫుటేజీల పరిశీలన.. వజ్రపుకొత్తూరు ఎస్ఐ బి.నిహార్ బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి పరిసర ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఇంకా ఫిర్యాదు అందలేదని, ప్రాథమిక సమాచారం మేరకు సీసీ టీవీల ఫుటేజీ, ఘటనా ప్రాంతాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. -
స్వాతంత్య్ర స్ఫూర్తిజ్వాల ‘వందేమాతరం’
శ్రీకాకుళం అర్బన్ : వందేమాతర గేయం స్వాతంత్రోద్యమంలో భారతీయులకు స్ఫూర్తి జ్వాలగా నిలిచిందని గాంధీ మందిర కమిటీ వక్తలు పేర్కొన్నారు. బ్రిటీష్ పాలకుల దురాగతాలను ఎదిరించేందుకు వందేమాతరం నినాదం అందరినీ ఏకం చేసిందన్నారు. జిల్లా కేంద్రంలోని గాంధీ మందిరం స్వాతంత్య్ర సమరయోధుల స్మృతివనంలో వందేమాతరం గేయ రచయిత బంకించంద్ర ఛటోపాధ్యాయ 188వ జయంతి శుక్రవారం నిర్వహించారు. విగ్రహదాత డాక్టర్ నిక్కు అప్నన్నతో పాటు గాంధీ మందిర ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు పూలమాలలు వేసి వందేమాతరం గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో సురంగి మోహన్రావు, ఎం.ప్రసాదరావు, జామి భీమశంకర్, పైడి హరనాధరావు, చౌదరి రాధాకృష్ణ, కొంక్యాన మురళీధర్, కొంక్యాన వేణుగోపాల్, పొన్నాడ రవికుమార్, మహిబుల్లాఖాన్, పందిరి అప్పారావు, గుత్తు చిన్నారావు, జి.నాగేశ్వరరావు, పెంకి చైతన్యకుమార్, బుడుమశీరు సూర్యారావు, శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ఇచ్ఛాపురం: ఆంధ్రా ఒడిశా సరిహద్దు ఇచ్ఛాపురం సమీపంలో సుర్లా వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణానికి చెందిన నిరంజన్ మహరణ(48) మృతిచెందాడు. ఒడి శా నుంచి ఇచ్ఛాపురం వస్తుండగా గుర్తు తెలి యని వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన నిరంజన్ను స్థానికులు చికిత్స నిమిత్తం బరంపురం తరలించినా ఫలితం లేకపోయింది. ఒడిశా పోలీసులు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నారు. నిరంజన్ పట్టణంలోని దానంపేటలో ఈ–సేవా కేంద్రం, ఫ్లెక్సీ యూనిట్ నిర్వహిస్తున్నాడు. భార్య సుజ్ఞాని, కుమారుడు శుభమ్ ఉన్నారు. నిరంజన్ మృతితో పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గుర్తు తెలియని వ్యక్తి మృతి టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం కుజ్జిపేట గ్రామ సమీపంలోని తాలిచెరువు గట్టుపై శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. గురువారం ఉదయం గ్రామస్తులు ఉపాధి హామీ పనుల కోసం చెరువు గట్టుపై వెళ్తుడగా గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని ఫీల్డ్ అసిస్టెంట్ గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి మెడ చుట్టూ టవల్ చుట్టి ఉండటం, చెవులు, ముక్కు నుంచి రక్తం వచ్చిన ఆనవాళ్లు గుర్తించారు. ఎవరైనా చంపి పడేశారా, ఇంకేదైనా కా రణముందా అనేది తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం టెక్కలి ప్ర భుత్వ ఆసుపత్రికి తరలించారు. కోటబొమ్మాళి ఎస్ఐ వి.సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అభివృద్ధిపై మాట్లాడే అర్హత అచ్చెన్నకు లేదు టెక్కలి: టెక్కలి నియోజకవర్గంలో అభివృద్ధిపై మాట్లాడే కనీస అర్హత మంత్రి అచ్చెన్నాయుడు కు లేదని వైఎస్సార్ సీపీ సమన్వయకర్త పేరాడ తిలక్ మండిపడ్డారు. ఇటీవల సంతబొమ్మాళి మండలం బోరుభద్రలో మంత్రి చేసిన వ్యాఖ్యలపై తిలక్ శుక్రవారం ఘాటుగా స్పందించారు. వారసత్వ రాజకీయాలతో ఎదిగి వేలాది కోట్ల రూపాయలు అవినీతి సంపాదన చేసిన అచ్చెన్నాయుడు ఈ రోజు అభివృద్ధి చేశామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఒకే కుటుంబం రాజకీయ పబ్బం గడుపుతూ నియోజకవర్గంలో ఏ ఒక్క శాశ్వతమైన పథకం తీసుకువచ్చారా అని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపడుతున్న రోడ్లు, జలజీవన్ మిషన్ పథకాలకు సొంత పేర్లు పెట్టుకుంటున్నారు తప్పా శాశ్వత కార్యక్రమాలు చేయడం లేదని దుయ్యబట్టారు. ప్రస్తుతం చేస్తున్న జలజీవన్ మిషన్ పథకం గత వైఎస్సార్సీపీ హయాంలో ప్రతిపాదనలు చేసినవేనని గుర్తు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న సీసీ రోడ్లు, బీటీ రోడ్లలో పెద్ద ఎత్తున కమీషన్లు దండుకుంటున్నారని, దీనిపై దర్యాప్తు చేయిస్తామని తిలక్ పేర్కొన్నారు. గత వైఎస్సార్సీపీ హయాంలో టెక్కలి నియోజకవర్గంలో మూలపేట పోర్టు నియోజకవర్గ చరిత్రలో తలమానికంగా నిలిచిందన్నారు. నిమ్మాడ గ్రామంలో పీహెచ్సీకి రూపకల్పన చేసిన సంగతిని మంత్రి మరిచారని ఎద్దేవా చేశారు. నిమ్మాడ నుంచి చిట్టెయ్యవలస వరకు వైఎస్సార్సీపీ హయాంలోనే రోడ్లు వేశారని గుర్తు చేశారు. టీడీపీలో నియంతగా మరొకరికి రాజకీయంగా అవకాశం ఇవ్వకుండా అవినీతి సంపాదన చేస్తున్న అచ్చెన్నాయుడు నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన గుణపాఠం తప్పదని తిలక్ హెచ్చరించారు. పేరాడ తిలక్ -
మాజీ సైనికుల ఔదార్యం
శ్రీకాకుళం కల్చరల్: జిల్లా పరిషత్ సమీపంలోని కంపోస్టు కాలనీలో అనాథ వృద్ధురాలికి ఆశ్రయం కల్పించేందుకు డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం ఆధ్వర్యంలో రూ.21,000ను చెక్ రూపంలో అందజేశామని సంఘ అధ్యక్షుడు పూర్ణచంద్రరావు కటకం తెలిపారు. శుక్రవారం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చేతుల మీదుగా వృద్ధురాలికి ఈ సాయం అందించామని చెప్పారు. కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ పైడి మురళీధరరావు, కోశాధికారి ముదిల సింహాచలం, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ సనపల రామకృష్ణ, హానరరీ ప్రెసిడెంట్ సవర లక్ష్మణరావు, అడ్వైజర్ పైడి రామారావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు బోర రాంబాబు, బట్న కామేశ్వరరావు, సిక్కోలు సైనికుడు నర్సింగ్ పాల్గొన్నారు. -
ఆనందం..‘ఆహ్లాద్’కరం
టెక్కలి : టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో సిల్వర్ జూబ్లీ కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన ఆహ్లాద్–2కే26 కార్యక్రమాలను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. కళాశాల డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు, కార్యదర్శి ఎల్.ఎల్.నాయుడు, ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, కార్యక్రమాల కో ఆర్డినేటర్ డి.యుగంధర్ నేతృత్వంలో జ్యోతి ప్రజ్వళనతో కార్యక్రమాలు ప్రారంభించారు. వివిధ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు తమ కళా నైపుణ్యాలను ప్రదర్శించేందుకు రెండు రోజుల పాటు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. శనివారం ముగింపు సందర్భంగా భారత మాజీ క్రికెటర్ ఎం.ఎస్.కె.ప్రసాద్, వర్ధమాన సినీ నటి రాశీసింగ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నాయకత్వ లక్షణాలు, కళాత్మక అభిరుచులు, వివిధ క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు తమ కళాశాలలో కొత్తగా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించినట్లు డైరెక్టర్ వెల్లడించారు. కళాశాలలో నిర్వహించిన ఆహ్లాద్ కార్యక్రమాలతో కళాశాల ప్రాంగణంలో సందడి వాతావరణం చోటుచేసుకుంది. -
‘ఆదిత్య’లో ఆహ్లాద్–2026
టెక్కలి: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో ఈ నెల 26, 27 తేదీలలో ఆహ్లాద్–2026 పేరిట సాంస్కృతిక మహోత్సవం నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు తెలిపారు. గురువారం కార్యక్రమ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలకు ఏపీ, తెలంగాణా, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, కళా ప్రతిభను వెలికితీసేందుకు నృత్యం, సంగీతం, ఫ్యాషన్షో, సాహిత్యం, సాంస్కృతిక పోటీలు, వినోదాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. శనివారం జరిగే ముగింపు కార్యక్రమాలకు సినీ నటి రాశీసింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. -
‘ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ కీలకం’
నరసన్నపేట: జిల్లా వ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) జరుగుతోందని, దీనిపై వైఎస్సార్సీపీకి చెందిన బీఎల్ఏలు శ్రద్ధగా దృష్టి పెట్టాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సూచించారు. ప్రధానంగా ఎన్యూమరేషన్ ఫారంల డిజిటలైజేషన్పై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందన్నారు. పోలాకి మండలం మబగాంలో గురువారం బీఎల్ఓ కృష్ణదాస్కు ఎన్యూమరేషన్ ఫారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ‘సర్’ కార్యక్రమంపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 8 నియోజకవర్గాల్లో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ఇప్పటికీ పూర్తి కాలేదని, తొందరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని అధికారులకు కోరారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి కాకపోతే వాటిని నింపి ఓటరు తిరిగి మళ్లీ ఎప్పుడు బీఎల్ఓలకు ఇస్తారు, వాటిని డిజిటలైజేషన్ ఎప్పుడు చేస్తారు అని ఆందోళన వ్యక్తం చేశా రు. బీఎల్ఓలకు పలుచోట్ల ఇతర బాధ్యతలు అప్పగిస్తున్నారని, ఇలాగైతే సర్పై ఎలా దృష్టి పెట్టగలరని ప్రశ్నించారు. ఈ 15 రోజులైనా బీఎల్ఓలను ఇతర బాధ్యతల నుంచి తప్పించాలని సూచించారు. నరసన్నపేట నియోజకవర్గంలో మరింత పగడ్బందీగా సర్ కార్యక్రమం నిర్వహించాలని, దీనిపై బూత్ కమిటీ జిల్లా అధ్యక్షుడు దోమ మన్మధరావు, నియోజకవర్గ బూత్ కమిటీ అద్యక్షులు సురంగి నర్శింరావులకు సూచించారు. తరచుగా గ్రామాల్లో పర్యటించి సర్ కార్యక్రమం సకాలంలో పూర్తి చేసి అర్హత కలిగిన ఓటర్లు అందరికీ ఓటు హక్కు ఉండే విధంగా చూడాలని కోరారు. -
గ్రామసభ బహిష్కరణ
సరుబుజ్జిలి: ఇనాం భూములను నిషేధిత జాబితాల నుంచి తొలగిస్తామని మాయ మాటలు చెప్పి, భూములను సంబంధం లేని వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలను సహించబోమని రొట్టవలస గ్రామానికి చెందిన రైతులు అధికారులను నిలదీశారు. ఈ మేరకు గ్రామంలో గురువారం ఏర్పాటు చేసిన గ్రామసభను రైతులు బహిష్కరించారు. రొట్టవలస గ్రామ పరిధిలో ఇనాం పేరుతో ఉన్న భూములను సుమారు 300 మంది చిన్న,సన్నకార రైతులు 200 ఏళ్లగా సాగు చేస్తున్నారు. వీరికి అడంగల్ను అధికారులు ఇవ్వగా రుణాలు, పంట నష్టపరిహారం, భూములు క్రమవిక్రయా లు జరుపుకునే వారమని రైతులు తెలిపారు. అయితే తమ గ్రామంలో సాగుహక్కులో ఉన్న భూములపై తమకు సర్వహక్కులు ఉన్నప్పటికీ తమకు పట్టాలు ఇవ్వకుండా భూములకు సంబంధం లేని మగటపల్లి సాంబమూర్తికి రీసర్వే పే రుతో అధికారులు ధారాదత్తం చేస్తున్న ప్రయత్నాలు ఆపాలని స్పష్టం చేశారు. దీంతో అధికారులు చేసేది లేక గ్రామసభ నిర్వహించకుండా వెనుదిరిగారు. సమస్యను ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్తానని తహసీల్దార్ నళినాక్షి తెలిపారు. -
అరసవల్లి గోశాలలో రెండు ఆవులు మృతి
డయారియాతోనే మృతి ఆలయానికి చెందిన రెండు ఆవులకు డయారియా సోకింది. గురువారం ఉదయం 8 గంటలకు ఆలయం నుంచి ఫోన్ సమాచారం రాగానే వెళ్లి చూశాం. శరీర ఉష్ణోగ్రత 101.45 ఫారన్హీట్ ఉండాలి. కానీ ఒక ఆవుకు 97.5 ఫారన్హీట్, రెండో ఆవుకు 98.2 ఫారన్హీట్ ఉష్ణోగ్రతలు మాత్రమే ఉన్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో పాటు డయారియా తీవ్రంగా ఉండడంతో మృతిచెందాయి. ఫుడ్ పాయిజన్కు కారణాలు లేకపోలేదు. – డాక్టర్ జి. దిలీప్, పశువైద్యుడు, అరసవల్లి అరసవల్లి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి గోశాలలో ఉన్న రెండు ఆవులు గురువారం మృతి చెందాయి. ఇందులో ఒకటి సాయంత్రమే మృతి చెందగా.. రెండోది రాత్రి వేళలో కన్ను మూసింది. ఇది స్థానికంగా చర్చనీయాంశమైంది. గురువారం ఉదయానికి గోశాలలో ఉండే రెండు ఆవుల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో స్థానిక పశువైద్యుడు దిలీప్కు సమాచారం ఇచ్చినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆవుల మృతి విషయం బయటకు పొక్కకుండా ఆలయ అధికారులు గోప్యత పాటించినప్పటికీ.. గురువారం సాయంత్రం ఓ ఆవు కళేబరాన్ని ఖననం చేయడంతో ఒక్కసారిగా సమాచారం దావానంలా వ్యాపించింది. దీంతో హుటాహుటిన ఆలయ ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్ ఆలయానికి చేరుకుని సంబంధిత విభాగ బా ధ్యులతో చర్చించి తదుపరి చర్యలపై చర్చించినట్లుగా తెలిసింది. అయితే ఒకేసారి రెండు ఆవుల మృతి వెనుక నిర్వహణ లోపమే ప్రధానమని స్పష్టమవుతోంది. గతంలోనూ ఇక్కడ ఓ ఆవు, దూడ మృతి చెందాయి. ఒకేసారి రెండు ఆవులకు డయారియా ఆదిత్యాలయం గోశాలలో మొత్తం 13 ఆవులుండగా,ఇందులో గురువారం రెండు ఆవులు మృతిచెందడం సంచలనంగా మారింది. వైద్యనిపుణుల అభిప్రాయం ప్రకారం వీటికి డయా రియా సోకిందని, అలాగే శరీర ఉష్ణోగ్రతలు పూర్తిగాతగ్గిపోవడంతో తట్టుకోలేకపోయాయ ని నిర్ధారణకు వచ్చారు. గురువారం ఉదయం రెండు ఆవుల పరిస్థితులను చూసి ఏఈఓ అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది కూలర్లు పెట్టి మరీ గోశాలలో ఆవులకు సపర్యలు చేయించారు. పశువైద్యుడు దిలీప్ ఆధ్వర్యంలో ఆవులకు సైలెన్లు ఎక్కించి మందులు పెట్టారు. అయి నా లాభం లేకపోయింది. నిర్వహణ లోపమే శాపమా గోశాల నిర్వహణలో లోపాలున్నాయని, గడ్డి, తవుడు ఆహారం అందిస్తున్న నిర్వహణదారుల నిర్లక్ష్యమే ఆవుల పాలిట శాపాలుగా మారిపోయాయనే విమర్శలు వినిపిస్తున్నా యి. బడ్జెట్లో రూ.లక్షలాది రూపాయలు గోశాలకు ఖర్చులు చూపిస్తూ టెండర్లు ఖరారు చేసుకుంటూ జేబులు నింపుకుంటున్నారనే చర్చ స్థానికంగా గుప్పుమంటోంది. ఇదిలావుంటే డయారియా అని వైద్యులు నిర్ధారణకు రావడంతో అసలు డయేరియా కు ఫుడ్ పాయిజన్ కారణమంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుళ్లిన పదార్థాలను ఆహారంగా పెట్టడం, అధికంగా అరటి పళ్లు భుజించడంతో గత ఏడాది ఆవు మృతిచెందిన సంగతి విదితమే. మిగిలిన గోవుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఫుడ్ పాయిజన్ కారణమంటూ చర్చ గతంలోనూ ఒక ఆవు, దూడ మృతి డయారియాతో మరణాలు నిర్ధారించిన పశు వైద్యులు -
శ్రీకాకుళం
పేటలో దాసుకోలేనన్ని గొడవలు హాట్ టాపిక్శుక్రవారం శ్రీ 26 శ్రీ జూన్ శ్రీ 2026సాక్షి ప్రతినిఽధి, శ్రీకాకుళం: నరసన్నపేట టీడీపీలో గొడవలు ఎప్పటికప్పుడు బయటపడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎలాగైనా బరిలోకి దిగాలని కేంద్ర రాష్ట్రమంత్రులకు మేనల్లుడు, బావ మరిది వరసైన మెండ దాసునాయుడు ఉవ్విళ్లూరుతున్నారు. తానే ఓ పవర్ సెంటర్లా మారాలని తాపత్రయపడుతున్నారు. ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తికి మరో ఛాన్స్ రాదనే సంకేతాలతో తెగ హడావుడి చేస్తున్నారు. కానీ బగ్గు రమణమూర్తి కుమార్తె అర్చన ముందు దాసునాయుడు పప్పులుడకడం లేదు. ఆయన వేసే ప్రతి ఎత్తుగడను తిప్పికొడుతున్నారు. దాసుకు అంత సీన్ లేదని తీసి పారేస్తున్నారు. ఆయన చేసే యాక్షన్కు చెక్ పెట్టి, కేంద్ర, రాష్ట్ర మంత్రుల ముందే పరువు తీసేస్తున్నారు. వీరి వ్యవహారం నరసన్నపేట టీడీపీలో రచ్చరచ్చగా మారింది. నాయుడి షో.. తెలుగు యువత అధ్యక్షుడిగా దాసనాయుడు చేసే షో అంతా ఇంతా కాదు. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర మంత్రులు జిల్లాకు వస్తే అంతా తానే అన్నట్టు వ్యవహరిస్తారని పార్టీ వర్గాలే అంటుంటాయి. అవతల వ్యక్తుల నుంచి స్పందన లేకపోయినా వారంతా విష్ చేసినట్టు తనకే తాను బిల్డప్ ఇస్తూ హల్చల్ చేస్తుంటారు. నలుగురైదుగురిని వెంటేసుకుని, బలమైన నాయకుడిగా, కేంద్రరాష్ట్ర మంత్రుల సొంతమనిషిగా శ్రీకాకుళం, నరసన్నపేట నియోజకవర్గంలో అధికార దర్పాన్ని ప్రదర్శిస్తుంటారు. ఆ మధ్య ‘సాక్షి’ కార్యాలయం ఎదుట కూడా ఇలాగే అత్యుత్సాహం ప్రదర్శించారు. టీడీపీ కేడర్, తోటి నాయకుల దగ్గర తన మేకపోతు గాంభీర్యం చూపిస్తుంటారని అంటుంటారు. ఎత్తుకు పై ఎత్తులు ఈ క్రమంలో తనకో నియోజకవర్గం కావాలని నరసన్నపేటను ఎంచుకున్నారు. వచ్చే ఎన్నికల నాటికి బలం పెంచుకుని, అక్కడ పోటీ చేయాలని పావులు కదుపుతున్నారు. చిన్నా చితక నాయకులు, కార్యకర్తలను వెంట బెట్టుకుని నియోజకవర్గంలో తిరుగుతున్నారు. రెండో పవర్ సెంటర్గా అక్కడ షో చేస్తున్నారు. దాసునాయుడు చేస్తున్న యాక్షన్ చూసి ప్రస్తుత ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తితో పాటు ఆయన కుమార్తె ఎప్పటికప్పుడు చెక్ పెడుతున్నారు. వేసే ప్రతి అడుగును ముఖ్యంగా అర్చన తిప్పికొడుతున్నారు. నువ్వు ఎక్కడేదో చేసుకో.. ఇక్కడ పప్పులుడకవని చేతల ద్వారా చూపిస్తున్నారు. పలుసార్లు అవమానపరిచారు కూడా. ఒక కార్యక్రమంలోనైతే కేంద్ర, రాష్ట్ర మంత్రుల ముందే మెండ దాసునాయుడును ‘యూజ్ లెస్ ఫెలో’ అని అర్చన బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం అందరికీ తెలిసిందే. అదే రకంగా ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ప్లెక్సీలతో డామినేట్ చేద్దామని చూస్తే పీకి పారేశారు. వ్యూహాలు.. ప్రతి వ్యూహాలు నరసన్నపేటలోనే రాజకీయంగా ఎదగాలని తన నియోజకవర్గంలో ఒక ఇళ్లు నిర్మించుకున్నారు. ఆ పెట్టుబడి ఎక్కడిది అన్నది పక్కన పెడితే అక్కడే ఉండి భవిష్యత్ రాజకీయాలు నెరపాలని ప్లాన్ చేస్తున్నారు. బగ్గు రమణమూర్తిపైన, వారి కుమార్తె పేరున పలువురి వ్యక్తులతో సోషల్ మీడియా వేదికగా దుయ్య బట్టడం, పలు ఆరోపణలు గుప్పించడం వంటివి వ్యూహత్మకంగా జరుగుతున్నాయి. ఇవన్నీ బగ్గు వర్గాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయి. అదే దిశగా దాసునాయుడ్ని లక్ష్యంగా చేసుకుని అటు వైపు నుంచి కౌంటర్లు పడుతున్నాయి. మనోడి సంగతి స్థానిక సంస్థల ఎన్నికల్లో తేల్చేద్దామనే ధోరణిలో ప్రత్యర్థి శిబిరం కూడా వ్యూహాత్మకంగా వెళ్తోంది. ఆయనకంత సీన్ లేదని, సొంత మండలమైన పోలాకిలోనే నమ్మరని, ఆయన సోదరుడిపై వచ్చిన వసూళ్ల ఆరోపణలు ప్రతి ఒక్కరికీ తెలుసని, అలాంటి వ్యక్తిని నరసన్నపేట ప్రజలు నమ్మరని బగ్గు వర్గం గట్టిగా నమ్ముతోంది. మొత్తానికి బగ్గు వర్సెస్ మెండ రాజకీయ యుద్ధం నరసన్నపేటలో హాట్ టాపిక్గా మారింది. నరసన్నపేట టీడీపీలో అంతర్గత పోరు పవర్సెంటర్గా ఎదగాలని మెండ దాసునాయుడు తాపత్రయం కింజరాపు బంధుత్వాన్ని వాడుకుంటున్న వైనం దాసు ఎత్తుగడలు తిప్పికొడుతున్న బగ్గు ఫ్యామిలీ -
మార్కెట్ కమిటీ.. పరిస్థితి ఏమిటి..?
పారదర్శకత కోసమే.. మార్కెట్ కమిటీల్లో పారదర్శకమైన పాలన అందించేందుకే ఈ పర్మిట్ విధానం అమలు చేయనున్నాం. ఉత్పత్తుల రవాణా, మార్కెటింగ్ సులభతరం కానుంది. వాణిజ్య లావాదేవీలు పెరుగుతాయి. వ్యాపారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – బి.రవికిరణ్, మార్కెటింగ్ శాఖ ఏడీ, శ్రీకాకుళం హిరమండలం: జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. ఒకప్పుడు స్థానిక సంస్థల అభివృద్ధి, మౌలిక వసతులకు నిధులు అందేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏఎంసీల ద్వారా ఏటా పశువైద్య శిబిరాలు జరిగేవి. పాడి రైతులకు ఉచితంగా మందులు కూడా అందించేవారు. ఇప్పుడు అవి కూడా నిలిచిపో యాయి. దీనికి తోడు తనిఖీ కేంద్రాలతో పాటు గోదాముల నిర్వహణలో కొంతమంది సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇదీ పరిస్థితి.. జిల్లాలో 12 మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఇచ్ఛాపురం, కంచిలి, పలాస, టెక్కలి, కోటబొమ్మాళి, నరసన్నపేట, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, పొందూరు, హిరమండలం, పాతపట్నం, ఆమదాలవలస, జలుమూరులో ఏఎంసీలు ఉన్నాయి. ఈ ఏడాది ఆదాయ లక్ష్యం రూ.22.96 కోట్లు కాగా.. ఏప్రిల్, మే నెలలో రూ.2.18 కోట్లు సమకూరింది. జిల్లా వ్యాప్తంగా మార్కెట్ కమిటీలకు సంబంధించి 11 తనిఖీ కేంద్రాలు ఉన్నాయి. ప్రధానంగా వ్య వసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు, సెస్ వసూ లు, చెక్పోస్టుల వద్ద వసూళ్ల ద్వారా ఏఎంసీలకు ఆదాయం సమకూరుతుంది. ఆదాయం వరకూ బాగానే ఉంది. కానీ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అటు వ్యవసాయ అనుబంధరంగాల వారికి అంతంతమాత్రంగానే ప్రోత్సాహం అన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటివరకూ మాన్యువల్.. మార్కెట్ కమిటీల్లో సిబ్బంది చేతివాటం నియంత్రించేందుకు జూలై నుంచి ఈ–పర్మిట్ విధానాన్ని అమలుచేస్తున్నారు. ఇప్పటివరకూ మాన్యువల్ విధానం అమల్లో ఉంది. అక్కడే ఎక్కువగా అవి నీతి జరుగుతోందని గుర్తించారు. అందుకే ఆన్లైన్ చెల్లింపులను ప్రోత్సహిస్తూ ఈ–పర్మిట్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆన్లైన్లో డబ్బులు చెల్లించాక ప్రత్యేక క్యూఆర్ కోడ్తో కూడి న ఈ–పర్మిట్ వస్తుంది. తనిఖీ కేంద్రాల వద్ద దా న్ని స్కాన్ చేయగానే సమగ్ర వివరాలు వస్తాయి. జిల్లాలో ఇప్పటికే వీటికి సంబంధించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. 670 మందికిపైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. లైసెన్స్ తప్పనిసరి ప్రతి వ్యాపారి ఈ–ట్రాన్స్పోర్టు పర్మిట్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలి. వారికి వ్యక్తిగత లాగిన్, పాస్వర్డులు కేటాయిస్తారు. వాటి ద్వారా కొనుగోలు చేసిన వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ఆన్లైన్లో పర్మిట్ జారీచేస్తారు. బ్యాంకుల ద్వారా సెస్ చెల్లింపులకు 15 రోజుల గడువు ఉంటుంది. ఈలోపు డబ్బులు చెల్లించకపోతే మాత్రం ప్రక్రియ నిలిచిపోతుంది. తనిఖీ కేంద్రాల వద్ద ట్రేడ్ లైసెన్స్ లేకుండా పంట దిగుబడులు తరలించే వ్యాపారుల నుంచి నాన్ ట్రేడర్స్ లైసెన్స్ కింద సెస్ వసూలు చేస్తారు. అయితే అలా మూడుసార్లు మాత్రమే అవకాశం ఉంటుంది. ఈలోగా సదరు వ్యాపారితో లైసెన్స్ కోసం దరఖాస్తు చేయిస్తారు. మూడుసార్లు దాటితే మాత్రం సరుకు విలువ బట్టి జరిమానా కూడా వసూలు చేస్తారు. జూలై నుంచి ఈ–పర్మిట్ విధానం చెల్లింపులన్నీ ఆన్లైన్లోనే పారదర్శకత కోసమే అంటున్న అధికారులు వ్యాపారులు వినియోగించుకోవాలని విన్నపం -
నిర్మాణంలో ఉన్న ఇల్లు కూల్చివేత
నిర్మాణంలో ఉన్న ఇల్లువీరభద్రాపురంలో ఉద్రిక్త పరిస్థితిపలాస: పలాస మండలం వీరభద్రాపురం గ్రామంలో గురువారం రాత్రి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గ్రామంలో బమ్మిడి విమలకుమారి అనే ఒక మహిళ ఇల్లు నిర్మించుకుంటున్నారు. శ్లాబ్ వరకు వచ్చింది. ఏమైందో ఏమో గానీ గురువారం రాత్రి పలాస తహసీల్దార్ బి.శ్రీదేవితో పాటు రెవెన్యూ యంత్రాంగం అక్కడకు వెళ్లి పొక్లెయినర్తో ఇంటిని కూల్చివేశారు. స్థానికులంతా మూకుమ్మడిగా వెళ్లి అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ, పోలీసు సిబ్బంది అక్కడకు వెళ్లి పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. పసుపు కుంకుమ కింద బమ్మిడి కృష్ణారావు తన చెల్లెలు విమలకుమారికి ఈ స్థలం ఇచ్చారు. ఆ స్థలంలో ఆమె ఇల్లు కట్టుకుంటుండగా కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు అది ప్రభుత్వం భూమి అని, అందులో ఇల్లు క ట్టుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో ఎ లాంటి నోటీసు లేకుండా అధికారులు ఆగమేఘాల మీద అక్కడకు వెళ్లి ఇంటిని కూల్చేశారు. దీనిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఘనంగా ఆదిత్యుని కల్యాణం
అరసవల్లి: అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వా మి వారి కల్యాణ సేవ గురువారం ఉదయం ఘనంగా జరిగింది. నిజ జ్యేష్ట శుద్ధ ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీ ఉషా పద్మిని ఛాయాదేవేరులతో శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఉత్సవమూర్తులను కల్యాణ మూర్తులుగా అలంకరించి అనివెట్టి మండపంలో ఆగమశాస్త్రం ప్రకారం కల్యాణాన్ని జరిపించారు. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో క్రతువు జరిగింది. ‘పారదర్శకంగా ఓటరు జాబితా రూపొందిద్దాం’ శ్రీకాకుళం పాతబస్టాండ్: పారదర్శకంగా, అత్యంత కచ్చితత్వంతో ఓటర్ల జాబితా అందించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)–2026 ప్రక్రి యపై జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి గురువారం ఆయన ఈఆర్వోలతో సమావేశం నిర్వహించారు. జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ అనంతరం జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు క్లెయిమ్లు, అబ్జెక్షన్ల స్వీకరణ ఆ తర్వాత వీటిని ప రిష్కరించి ఈ ఏడాది సెప్టెంబర్ 22న తుది జాబితాను ప్రచురించడం వరకు ప్రతి కార్యక్ర మం సకాలంలో పూర్తి చేసేందుకు సన్నద్ధతతో ఉండాలని ఆదేశించారు. బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) తప్పనిసరిగా ప్రతి ఇంటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయాలని సూచించారు. 28న పల్స్ పోలియో శ్రీకాకుళం పాతబస్టాండ్: పోలియో రహిత సమాజ నిర్మాణం మనందరి బాధ్యతని, జూన్ 28న జిల్లాలో నిర్వహించనున్న జాతీయ పల్స్ పోలియో టీకా కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పిలుపునిచ్చారు. స్థానిక కలెక్టరేట్లో జిల్లా టాస్క్ ఫోర్స్ సభ్యులు లయన్ పొన్నాడ రవికుమార్, లయన్ నటుకుల మోహన్ నేతృత్వంలో రూపొందించిన పోలియో అవగాహన వాల్పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లిదండ్రులందరూ తప్పనిసరిగా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు. బాలుడిపై కుక్కల దాడి పలాస: కాశీబుగ్గ శ్రీనివాసనగర్కు చెందిన పదేళ్ల బాలుడు మడ్డు రోహిన్పై కుక్కలు దాడి చేయడంతో గా యాలపాలయ్యాడు. వీధిలో ఆడుకుంటుండగా ఒక్క సారి కొన్ని కుక్కలు అతనిపై దాడి చేశాయి. ఆ సమయంలో స్థానికులు వెంటనే చూసి కుక్కలను త రిమేయడంతో అతనికి ప్రాణాపాయం తప్పింది. మున్సిపాలిటీలో విచ్చలవిడిగా కుక్కలు తి రుగుతున్నాయని, మున్సిపల్ అధికారులు తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మాదకద్రవ్యాలతో జీవితం నాశనం శ్రీకాకుళం పాతబస్టాండ్: డ్రగ్స్, మద్యం, ధూమపానం వంటి వ్యసనాల బారిన పడి జీవితం నాశనం చేసుకోవద్దని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు యు వతకు సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం బలగలోని రిమ్స్ వైద్య కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ‘మాదక ద్రవ్యాలు వద్దు – జీవితం ముద్దు’ అనే నినాదంతో విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థుల న్యాయ విజ్ఞానం కోసం లీగల్ లిటరసీ క్లబ్ ఏర్పాటు చేసి, న్యాయవాదిని, పారా లీగల్ వలంటీర్ను ని యమించారు. -
పొలంలోనే ప్రాణం వదిలి..
● విద్యుత్ షాక్తో కౌలు రైతు మృతి మెళియాపుట్టి: దుర్భలాపురం గ్రామానికి చెందిన రైతు పెద్దింటి మోహన్ (55) విద్యుత్ షాక్కు మృత్యువాతపడ్డాడు. పోలీసులు తెలిపి న వివరాల ప్రకారం.. మోహన్ బుధవారం సాయంత్రం గ్రామ పరిధిలోని పొలంలో సారికంద పంటకు నీరు కట్టడానికి వెళ్లాడు. విద్యుత్ శాఖ సిబ్బంది ఇటీవల కురిసిన వర్షాలకు తెగిన కరెంట్ వైర్లను చుట్టి పొలంలో వేశారు. వాటికి అదే పొలంలోని పంపుషెడ్ విద్యుత్ తీగ అంటుకుని ఉంది. ఆ విషయం గమనించని మోహన్ కరెంట్ వైర్లను పక్కకు వేయాలని ప్రయత్నించగా షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మోహన్కు భార్య తవిటమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కార్గో ఎయిర్పోర్టు పేరుతో విధ్వంసం
పలాస : ఉద్దానం ప్రాంతంలో కార్గో ఎయిర్ పోర్టు పేరుతో విధ్వంసం సృష్టించడం తగదని, నిర్మాణ ప్రతిపాదనను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ జూలై 15న పలాస ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టనున్నట్లు కార్గో ఎయిర్ పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పలాసలో బుధవారం వివిధ ప్రజాసంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తీర ప్రాంతాన్ని రక్షించి పర్యావరణాన్ని కాపాడాల్సిన ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు కార్పొరేటు కంపెనీలకు పచ్చని ఉద్దానాన్ని అప్పగించాలని చూడటం ఇక్కడి ప్రజలను మోసగించడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. నిజంగా కార్గో ఎయిర్పోర్టు కట్టాలనే చిత్త శుద్ధి ఉంటే మూలపేట వద్ద ప్రభుత్వం సేకరించిన భూమి చాలా ఉందని, అక్కడ నిర్మించుకోవాలని కోరారు. సమావేశంలో సి.పి.ఎం.జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సి.పి.ఐ.ఎం.ఎల్ న్యూడెమొక్రసీ రాష్ట్ర నాయకులు వంకల మాధవరావు, లిబరేషన్ నాయకులు మద్దిల రామారావు, తామాడ సన్యాసిరావు, కోనారి మోహనరావు, సీ.హెచ్ రవికుమార్(సి.పి.ఐ), కొమర వాసు, జోగి అప్పారావు, పౌరహక్కుల సంఘం నాయకుడు పత్తిరి దానేసు, ఎన్.గణపతి, పి.కుసుమ, జుత్తు వీరాస్వామి, జి.బాలకృష్ణ, పి.నాగేశ్వరరావు, కోనేరు రమేస్, ఎం.వినోద్కుమార్, ఎస్.వీరాస్వామి, సోమనాధం పాల్గొన్నారు. -
28న పల్స్ పోలియో
శ్రీకాకుళం పాతబస్టాండ్: పల్స్ పోలియో ఈ నెల 28న జరగనున్న నేపథ్యంలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం పల్స్ పోలియో నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం సెలవు దినమైనప్పటికీ పోలియో చుక్కలు వేసేందుకు పాఠశాలలు తెరిచి ఉంచాలన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ తదితర చోట్ల ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయాలన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ కె.అనిత మాట్లాడుతూ 1,80,879 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.అనిత, అదనపు డీఎంహెచ్ఓ శ్రీకాంత్, డీఐఓ రామదాసు, విద్యాశాఖ అసిస్టెంట్ కమిషనర్ అటవీ శాఖ అధికారి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీముఖలింగంలో కల్యాణోత్సవాలు ప్రారంభం జలుమూరు: అధిక జేష్ఠ మాసం సందర్భంగా ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో బుధవారం ముఖలింగేశ్వర సహిత వారాహి అమ్మవారి పాంచరాత్రి కల్యాణ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అర్చకులు ధ్వజారోహణ నిర్వహించి పుణ్యాహవచనం, మంటపారాధన, బలిహారణ అనంతరం మంగళం పలికారు. కార్యక్రమంలో ఈఓ ఏడుకొండలు, పురోహితులు బంకుపల్లి ఫణేంద్రశర్మ, అర్చకులు శేషాద్రి వెంకటాచలం, నాయుడుగారి రాజశేఖర్, నారాయణమూర్తి, శివాజి, సింహాచలం, భక్తులు పాల్గొన్నారు. పొలంలో మోహన్ మృతదేహం -
ఆటోను ఢీకొన్న కారు
మందస: మండలంలోని మకరజోల సమీపంలో జాతీయ రహదారిపై ఆటోను కారు ఢీకొనడంతో ఆటో బోల్తాపడింది. ఇచ్ఛాపురం నుంచి పలాస వైపు వెళ్తున్న కారు మార్గమధ్యలో ఆటోను ఢీకొంది. ఆటోలో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆటో డ్రవర్కు స్వల్పగాయాలయ్యాయి. విషయం తెలిసిన వెంటనే హైవే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. శ్రీకాకుళం న్యూకాలనీ: ఉత్తరాంధ్రకే ప్రఖ్యాతిగాంచిన శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల అభివృద్ధికి ఇక్కడ పనిచేస్తున్న ప్రిన్సిపాల్, అధ్యాపకులంతా సమష్టిగా కృషి చేయాలని కాలిజియేట్ ఎడ్యుకేషన్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పీవీ కృష్ణాజీ పేర్కొన్నారు. బుధవారం కళాశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం అధ్యాపకులతో కలిసి సమావేశం నిర్వహించారు. వివిధ విభాగాల పనితీరు, ఫలితాలు, అడ్మిషన్ల తీరు గురించి ప్రిన్సిపాల్ డాక్టర్ యాళ్ల పోలినాయుడును అడిగి తెలుసుకున్నారు. కళాశాలకు పూర్వ వైభవాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు. కళాశాలలో అడ్మిషన్లు పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలు వివరించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రోణంకి హరిత, ఐక్యూఏసీ కో–ఆర్డినేటర్ జి.రాజశేఖర్, అకడమిక్ కో–ఆర్డినేటర్ డాక్టర్ సంపతిరావు శశిభూషణ్, డాక్టర్ రామకృష్ణ, రామమూర్తి తదితరులు పాల్గొన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించండి శ్రీకాకుళం పాతబస్టాండ్: అపరిష్కృతంగా ఉన్న మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్, ఏఐటీయూసీ అనుబంధ సంఘం రాష్ట్ర సమితి పిలుపు మేరకు బుధవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్కు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.తిరుపతిరావు, మున్సిపల్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కల్యాణి అప్పలరాజు మాట్లాడుతూ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈనెల 20వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే జూలై 7న చలో విజయవాడ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. గ్రానైట్ క్వారీలో ప్రమాదం ● యువకుడు మృతి సారవకోట: మండలంలోని గోవర్ధనపురం రెవెన్యూ పరిధి అనవీర్ గ్రానైట్ క్వారీలో బుధవారం జరిగిన ప్రమాదంలో ఒడిశాకు చెందిన యువకుడు జె.శ్రీకాంత్ రెడ్డి (23) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రానైట్ క్వారీలో ఎప్పటిలాగే బుధవారం విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్ రెడ్డి ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో సమీపంలో ఉన్న రాయి నీడలో సేద తీరేందుకు కూర్చున్నాడు. అయితే అదే రాయి ప్రమాదవశాత్తు ఆయనపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిది ఒడిశాలోని గంజాం జిల్లా నరసింగపూర్గా గుర్తించారు. నరసన్నపేట సీఐ ఎం.శ్రీనివాసరావు, ఎస్ఐ అనిల్ కుమార్, క్లూస్ టీం సంఘటనా స్థలాన్ని పరిశీలించి శవపంచనామ నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం కోటబొమ్మాళి తరలించారు. మృతుడి తండ్రి సుబ్బారావు రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
జూలై 11, 12 తేదీల్లో సాహితీ సమ్మేళనం
శ్రీకాకుళం కల్చరల్: జూలై 11, 12 తేదీల్లో విజయవాడలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో సాహితీ స్రవంతి, మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రం సంయుక్తంగా రాష్ట్రస్థాయి సాహిత్య సమ్మేళనం నిర్వహించనున్నట్లు ఎంబీ విజ్ఞాన కేంద్రం బాధ్యులు గుండు నారాయణరావు, సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి చీకటి దివాకర్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని యూటీఎఫ్ కార్యాలయంలో కథా రచయిత అట్టాడ అప్పలనాయుడు, సీనియర్ జర్నలిస్ట్ నల్లి ధర్మారావులతో కలిసి విలేకరుల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అన్ని జిల్లాల నుంచి ప్రసిద్ధ కవులు, రచయితలతో పాటు యువకులు, వర్దమాన రచయితలు సుమారు 300 మందికి పైగా ఈ సమ్మేళనంలో పాల్గొంటారని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రచయితలు, కవులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో సాహితీ స్రవంతి జిల్లా కన్వీనర్ కేతవరపు శ్రీనివాస్, నెట్టిమి రమణారావు, గరిమెళ్ల విజ్ఞాన కేంద్రం బాధ్యులు పి.సుధాకరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఉత్త కోతలే..!
ఏళ్లుగా నిర్మాణంలో ఉన్న పంపు హౌస్ 2 కూటమి ప్రభుత్వ వైఫల్యం ఈ రెండేళ్లలో ఎత్తిపోతల పథకం పూర్తిచేయలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉండడం దారుణం. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుచూపుతో వ్యవహరించి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో సగానికి పైగా పనులు కూడా పూర్తయ్యాయి. వాటిని సైతం పూర్తిచేయలేకపోయింది ఈ ప్రభుత్వం. ఇంతకంటే వైఫల్యం ఉంటుందా..? – రెడ్డి శాంతి, మాజీ ఎమ్మెల్యే, పాతపట్నం హిరమండలం: ఆర్భాటం ఎక్కువ.. పని తక్కువ అన్నట్టు ఉంది కూటమి ప్రభుత్వం తీరు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా జిల్లాలో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు నిర్మాణం కూడా పూర్తిచేయలేకపోయింది. బీఆర్ఆర్ వంశధార ఫేజ్–2 రిజర్వాయర్, ఎత్తిపోతల పథకం, ఉద్దానం సమగ్ర మంచినీటి పథకం.. ఇలా ఏ పథకాన్ని కూడా రెండేళ్లలో పూర్తిచేసి ప్రజలకు పూర్తిస్థాయిలో అందించలేకపోయింది. ప్రధానంగా వంశధార ప్రాజెక్టు పరిధిలోని హిరమండలం ఎత్తిపోతల పథకం ఇప్పట్లో పూర్తయ్యేలా లేదు. దీంతో జిల్లాకు సాగు, తాగునీరు అందించాలన్న లక్ష్యం దెబ్బతినేలా ఉంది. ఇదీ జరిగింది... వంశధార ఫేజ్–2 రిజర్వాయర్కు నేరడి బ్యారేజీ నిర్మాణం కీలకం. దీనికోసం ఒడిశాతో జల వివాదం నేపథ్యంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దూరదృష్టితో వ్యవహరించారు. ఈ మేరకు అప్పటి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ చర్చలు జరిపారు. వంశధార నదిలో హిరమండలం వద్ద ఎత్తిపోతల పథకం నిర్మించడానికి నిర్ణయించారు. గొట్టా బ్యారేజీ కుడి ప్రధాన కాలువ నుంచి 12 టీఎంసీల నీటిని వంశధార జలాశయంలోకి చేర్చడమే లక్ష్యంగా పనులు ప్రారంభించారు. ఇందుకుగాను రూ.176.35 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశారు. రూ.140.17 కోట్లకు పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ వైఎస్సార్సీపీ హయాంలో శరవేగంగా పనులు ప్రారంభించారు. రెండేళ్లలో సగానికిపైగా పనులు పూర్తి చేశారు. కానీ తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం మాటలతో కాలం గడిపిందే తప్ప.. పనులు మాత్రం సజావుగా ముందుకు తీసుకెళ్లలేకపోయింది. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిధుల విడుదలలో తాత్సారం కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. ఎత్తిపోతల పథకానికిగాను విద్యుత్ సబ్స్టేషన్ అవసరం. కానీ ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా తాత్సారం చేస్తూ వచ్చింది. గత నెలలో ఏపీ ట్రాన్స్కోకు సబ్స్టేషన్ నిర్మాణానికిగాను రూ.9.18 కోట్లు చెల్లించినట్టు అధికారులు చెబుతున్నారు. కానీ ఇంకా సబ్స్టేషన్ పనులు మొదలుకాలేదు. 132 కేవీ విద్యుత్ లైన్లు సారవకోట, పాతపట్నం, హిరమండలం నుంచి మొత్తం 75 టవర్లు ఏర్పాటు చేసి సబ్స్టేషన్కు అనుసంధానం చేయాలి. వీటి ఏర్పాటుకు సంబంధించి భూములను గుర్తించాలి. రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి. కానీ ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు. సబ్స్టేషన్ నిర్మాణాన్ని సైతం ప్రారంభించలేదు. దీంతో ఎత్తిపోతల పథకం నిర్మాణంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ప్రకటనలకే పరిమితం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఎత్తిపోతల పథకం ద్వారా 2026 ఖరీఫ్నకు రైతులకు సాగునీరు అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటన చేశారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు గమినిస్తే వచ్చే ఏడాది ఖరీఫ్నకు కూడా ఇది సాధ్యమవుతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఎత్తిపోతల పథకం అందుబాటులోకి వచ్చి రిజర్వాయర్లో నీటిని స్థిరీకరిస్తే.. వంశధార కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా 2.11 లక్షల ఎకరాల భూములకు సాగునీరు అందుతుంది. నారాయణపురం ఆనకట్ట కింద 18,527 ఎకరాలు, హెచ్ఎల్సీ కింద ఉన్న 5 వేల ఎకరాలకు సాగునీటి స్థిరీకరణ జరుగుతుంది. ఆపై ఉద్దానం ప్రాజెక్టుకు 1.12 టీఎంసీల తాగునీరు అందించవచ్చు. కానీ క్షేత్రస్థాయిలో ఎత్తిపోతల పథకం పూర్తయితే కానీ ఈ పనులు చేయలేం. కానీ ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. ఇప్పటికై నా జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. ఎత్తిపోతల పథకంలో ఎడతెగని జాప్యం విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణంపై నిర్లక్ష్యం ప్రచార ఆర్భాటంతోనే గడిపేసిన కూటమి ప్రభుత్వం ఈ ఖరీఫ్లో వంశధార నీరు లేనట్టే -
ఆదర్శనీయం
● తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించిన ఉపాధ్యాయుడు మందస: ప్రభుత్వ బడుల్లోని అనుభవం కలిగిన ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో నాణ్యమైన విద్య అందుతోందని, తల్లిదండ్రులు విధిగా తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు, కొత్తపల్లి ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు గవ్వ భీమారావు కోరారు. ఈ మేరకు మండలంలోని కొత్తపల్లి ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో తన చిన్న కుమారుడు గవ్వ తరుణ్ను 1వ తరగతిలో చేర్పించారు. పెద్ద కుమారుడు గవ్వ గిరీష్ కూడా అదే పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. దీంతో ఆయనను పలువురు అభినందించారు. -
తవ్వారు.. వదిలేశారు..!
కొత్తూరు: కూటమి ప్రభుత్వంలో హడావుడిగా నాయకులు రోడ్ల పనులను ప్రారంభించి.. సకాలంలో ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఫలితంగా స్థానికులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని రాయల గ్రామం నుంచి ఎర్రటిగూడ వరకు రోడ్డు పనులు మంజూరు చేశారు. దీంట్లో భాగంగా పనులు ప్రారంభించారు. ఈ రోడ్డు ఊరు చెరువు గట్టుపై నుంచి వెళ్లాల్సి ఉండడంతో చెరువు గట్టుకు రక్షణ గోడ నిర్మాణం కోసం మూడు నెలల క్రితం గాడిని తవ్వారు. అయితే అనంతరం గోడ నిర్మాణం చేపట్టకుండా వదిలేయడంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది. నెలలు గడుస్తున్నా రక్షణ గోడ నిర్మాణ పనులు చేయకపోవడంతో ఇటీవల కురుస్తున్న వర్షాలకు గాడిలో నీరు చేరుతోంది. ఫలితంగా చెరువు గట్టు బలహీనపడింది. ఈ చెరువు కొండల దిగువ భాగాన ఉన్నందున చిన్నపాటి వర్షాలకు చెరువులోకి నీరు చేరడం వలన గాడిలో నీరు ఎక్కువవుతోంది. దీంతో గట్టు పలుచోట్ల బలహీనపడడంతో కూలిపోయే అవకాశం ఉంది. ఒకవేళ గట్టు కూలిపోయినట్లయితే చెరువులో నీరు పొలాల్లోకి చేరుతుంది. ఫలితంగా మొలక దశలో ఉన్న వరినారు, వరి వెదలు నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉంది. మరోవైపు గాడి తవ్వడం వలన రోడ్డు మీద మట్టి నిండిపోవడంతో రోడ్డు మీద ప్రయాణం ప్రమాదకరంగా మారింది. వర్షం కురిసే సమయంలో ఈ రోడ్డు నుంచి రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఈ రక్షణ గోడ నిర్మాణం చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులకు రైతులు పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదని వాపోతున్నారు. రోడ్డు పనుల కోసం చెరువు గట్టు తవ్వేశారు. అయితే సకాలంలో పూర్తి చేయకపోవడంతో గట్టు పూర్తిగా బలహీనపడింది. పలుచోట్ల బీటలు వారింది. వర్షాలకు చెరువులో ఎక్కువ నీరు చేరినట్లయితే చెరువు గట్టు కొట్టుకుపోయి పంట పొలాల్లోకి నీరుచేరే ప్రమాదం ఉంది. తవ్విన గాడి పూడ్చకపోతే ఈ ఏడాది పంట చేతికొచ్చే అవకాశం లేదు. – రాగాల సులోచన, ఆయకట్టు రైతు, రాయల గ్రామం -
నిధుల కాజేతే లక్ష్యం..!
● పంచాయతీల నిధులపై కూటమి నేతల కన్ను ● సర్పంచ్లు లేకపోవడంతో అదునుగా భావిస్తున్న నాయకులు ● అధికారులపై రాజకీయ ఒత్తిడి తెస్తున్న వైనం హిరమండలం: పంచాయతీల్లోని నిధులపై కూటమి నేతలు కన్నేశారు. గ్రామ పంచాయతీల ఖాతాల్లో ఉన్న నిధులను ఏదో రూపంలో బయటకు తీయాలని కొందరు వ్యూహాలు రచిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. గ్రామాల అవసరాలకు వినియోగించాల్సిన నిధులను మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో 912 పంచాయతీలున్నాయి. ఏప్రిల్తో గ్రామ సర్పంచుల పదవీ కాలం ముగియడంతో ప్రస్తుతం నిర్ణయాధికారం ప్రత్యేకాధికారుల చేతుల్లోకి వచ్చింది. దీంతో గ్రామాల్లో రాజకీయ నాయకుల జోక్యం తగ్గుతుందని భావించినప్పటికీ.. పరిస్థితులు దీనికి భిన్నంగా కనిపిస్తున్నాయి. నేరుగా నిర్ణయాలు తీసుకునే అధికారం లేకపోయినా, అధికారులపై ఒత్తిళ్లు తెచ్చి తమకు అనుకూలంగా పనులు మంజూరు చేయించుకోవాలనే ప్రయత్నాలు కూటమి నేతలు చేస్తున్నట్లు సమాచారం. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పంచాయతీలు, ప్రత్యేక అధికారుల మ్యాపింగ్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. దీంతో కొత్త పనులకు అనుమతులు, బిల్లుల చెల్లింపులు, నిధుల బదిలీల విషయంలో అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితి కొందరు కూటమి నేతల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది. నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని వినియోగించే అవకాశం లేకపోవడంతో, వాటిపై సరికొత్త వ్యూహ రచన చేసినట్లు తెలుస్తోంది. ఇలా ఒత్తిళ్లు..! కొన్ని మండలాల్లో పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. గ్రామాల్లో చేయాల్సిన పనుల జాబితాలను నేతలే సిద్ధం చేసి అధికారులకు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం వ్యవహరించే అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తమ అనుచరులతో ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు అతిక్రమించి నిధులు ఖర్చు చేస్తే భవిష్యత్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండడంతో పలువురు అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో పంచాయతీలో ఒక పనికి ఒకరిద్దరూ కాకుండా ఏకంగా కూటమిలోని నలుగురు, ఐదుగురు చొప్పున పోటీపడటంతో అధికారులు, పంచాయతీ కార్యదర్శులకు తలనొప్పి తెచ్చిపెడుతోంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే నిధులను ఎలాగైనా స్వాహా చేయాలని చూస్తున్న నేతల ప్రయత్నాలు, ఒత్తిళ్లుకు అధికారులు తలొగ్గకుండా నిధులను పరిరక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. పనుల పేరుతో నిధులు కాజేసే ప్లాన్ గ్రామాల్లో మురుగు నీటి కాలువలు, రోడ్ల మరమ్మతులు, విద్యుత్, పారిశుద్ధ్య పనులు ఇలాంటి చిన్నపాటి పనులు పేరుతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి అవసరం లేని పనులను కూడా అత్యవసరంగా చూపించి నిధులు ఖర్చుచేసే మార్గాలు వెదుకుతున్నారనే విమర్శలొస్తున్నాయి. కొన్నిచోట్ల పనులు చేయకనే బిల్లు గురించి చర్చలు మొదలయ్యాయని, మరికొన్ని చోట్ల పనులు పూర్తయ్యాయని చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. గ్రామ ప్రజల అవసరాలకంటే నేతలకు లబ్ధి కల్పించడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. -
విద్యుత్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
శ్రీకాకుళం అర్బన్: విద్యుత్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ వై.అప్పయ్య, కె.దశరథలు డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రైవేట్పరం చేయడాన్ని నిరసిస్తూ రెండో రోజైన బుధవారం శ్రీకాకుళంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యుత్ బస్సులను ఆర్టీసీ సొంతంగా నిర్వహించాలని, విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీని దశలవారీగా ప్రైవేటుపరం చేయాలన్న ప్రభుత్వ ఆలోచన విరమించుకోవాలని కోరారు. ప్రజా రవాణా వ్యవస్థ ప్రభుత్వ ఆధీనంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి.తేజేశ్వరరావు మాట్లాడుతూ ఆర్టీసీ విలువైన ఆస్తులను ప్రైవేటు ఆపరేటర్లకు కట్టబెట్టే ఆలోచనను విరమించుకోవాలని, జీవో నంబర్ 88ని రద్దు చేయాలన్నారు. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 10 వేల పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఆర్టీసీలో ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆప్కాస్ ద్వారా జీతాలు చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని విన్నవించారు. కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు జి.త్రినాథరావు కె.బాబురావు, జి.కామేశ్వరరావు, ఎస్వీ రమణ, ఎన్వీఆర్ మూర్తి, పీవీఆర్ఎల్ కామేశ్వరి, ఎం.వైకుంఠం, నవీన్, బీఆర్ కృష్ణ, ఎం.ఆర్.మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ఆశ్రమ పాఠశాలలు కుదించే నిర్ణయాన్ని మార్చుకోవాలి
పలాస: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు తక్కువ ఉన్నారనే నెపంతో వాటిని కుదించే నిర్ణయాన్ని ప్రభుత్వం మార్చుకోవాలని పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సూదికొండ కాలనీలోని పీడీఎస్యూ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రేషనలైజేషన్ పేరుతో విద్యార్థులు తక్కువగా ఉన్నారనే నెపంతో 8, 9, 10 తరగతులను కుదించి, వారిని సమీప పాఠశాలలకు పంపించాలనే ఆలోచన సరైనది కాదన్నారు. దీనివల్ల ఆర్థిక భారం వలన ఇతర పాఠశాలలకు విద్యార్థులు వెళ్లలేక మధ్యలో చదువుకు స్వస్తి పలికే అవకాశాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల ఆదివాసీ పిల్లలు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, అభివృద్ధికి అధిక నిధులు కేటాయించాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, వంటమనిషి, వాచ్మెన్ తదితర పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. ఆయనతో పాటు పీడీఎస్యూ స్థానిక నాయకులు విజయ్, రాజు, గణేష్ తదితరులు ఉన్నారు. -
శివకుమార్ను కఠినంగా శిక్షించాలి
పలాస: సోంపేట మండలం గొల్లూరు గ్రామానికి చెందిన శివకుమార్ను కఠినంగా శిక్షించాలని, అతని కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన పిల్లలకు తగిన న్యాయం చేయాలని పౌరహక్కుల సంఘం, ఇతర ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గొల్లూరులో జరిగిన దారుణ ఘటనపై అంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో వివిధ ప్రజాసంఘాల నాయకుల నిజ నిర్ధారణ కమిటీ మంగళవారం ఆ గ్రామానికి వెళ్లి పరిశీలించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శివకుమార్ ఇంట్లో ఉన్న ఊర్వశిని ఆస్తి తగాదాల నేపథ్యంలో కక్ష పెంచుకొని అతి దారుణంగా హత్య చేసి పారిపోయాడన్నారు. అందువలన నిందుతుడిని కఠినంగా శిక్షించాలని డిమాండు చేశారు. అలాగే అనాథలైన చిన్నారులకు న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పత్తిరి దానేసు, జిల్లా కమిటీ నాయకులు సోమనాథం, వైకుంఠరావు, జోగారావు, వివిధ ప్రజాసంఘాల నాయకులు మద్దిల ధర్మారావు, పుచ్చ దుర్యోధనరావు, సాలిన వీరాస్వామి, బొడ్డు నాగమణి, సరస్వతి, దాసరి శ్రీరాములు, వాసుదేవరావు, బొడ్డు జగన్ తదితరులు పాల్గొన్నారు. -
వేదన మిగిలింది
కల కరిగింది● రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం ● కుమారుడి మృతదేహంపై పడి బోరున విలపించిన తండ్రి కుమారుడి మృతదేహం వద్ద రోదిస్తున్న తండ్రి అప్పారావు టెక్కలి రూరల్: చేతికి అందివచ్చిన కుమారుడు ఇక లేడని తెలిసి ఆ తండ్రి కుప్పకూలిపోయాడు. కలలన్నీ చెదిరిపోవడంతో గుండెలవిసేలా రోదించాడు. తనలా కూలి పని చేయకూడదనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి ఇంజినీరింగ్ చదివిస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడటంతో కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఈ విషాద ఘటన విక్రంపురం జంక్షన్ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సంతబొమ్మాళి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన కర్రి జగదీష్(19) కె.కొత్తూరు సమీపంలోని ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. ప్రతి రోజు ద్విచక్రవాహనంపై కళాశాలకు వెళ్లేవాడు. ఎప్పట్లాగే మంగళవారం కూడా ద్విచక్ర వాహనంపై బయలుదేరి టెక్కలి నుంచి కోటబొమ్మాళి వైపు వెళ్తుండగా విక్రాంపురం జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై ప్రమాదానికి గురయ్యాడు. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టడమో లేక గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయిందో అనే విషయమై స్పష్టత రావడం లేదు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన జగదీష్ని హైవే అంబులెన్స్లో టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. విషయం తెలుసుకున్న తండ్రి అప్పారావు ఆస్పత్రికి చేరుకుని కుమారుడిపై పడి బోరున విలపించడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. జగదీష్కు తల్లి కన్నమ్మ, అన్నయ్య ఉన్నారు. టెక్కలి పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇన్ని లోపాలు ఏంటి సర్?
కవిటి: కవిటి బెహరావీఽధిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ లోపభూయిష్టంగా జరుగుతోందని వైఎస్సార్సీపీ ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం పార్టీ రాష్ట్ర బీసీ విభాగం కార్యదర్శి నర్తు నరేంద్రయాదవ్, సల్ల దేవరాజ్తో కలిసి కవిటి బెహరావీధిలోని పలు పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన ఓటర్ల ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడారు. ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా బీఎల్వోలు విధులు నిర్వహించడం తగదన్నారు. 89వ పోలింగ్స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో ఆరుగురు ఓటర్లు ఉండగా వారిలో కేవలం ముగ్గురికే ఎస్ఐఆర్ ఫారాలు అందించి మిగిలిన వారికి ఇవ్వలేదన్నారు. బీఎల్ఏగా ఉన్న బెందాళం రమణమూర్తికి కూడా ఒక్క ఫారం మాత్రమే అందజేశారని చెప్పారు. బీఎల్ఏకే ఇలా జరిగితే నిరక్ష్యరాస్యులైన ఓటర్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇంటింటికి వెళ్లకుండా అందరినీ ఒకేచోటికి రప్పించడం నిబంధనలకు విరుద్ధమన్నారు. 92వ పోలింగ్ కేంద్రం బీఎల్ఓ జానకిరావు.. నాగుల గిరిదాస్ అనే వ్యక్తి ఇంట్లో ఐదుగురు ఓటర్లకు గాను ఇద్దరికే ఫారాలు ఒక్కొక్కటి ఇచ్చారని, దీనిపై ప్రశ్నించగా రెండు ఇస్తే పోగొట్టుకుంటారని తన వద్ద ఉంచేశానని చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కవిటి మండల కేంద్రంలోనే ఈ తరహా పనితీరు కనిపిస్తుంటే ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చన్నారు. ఇటీవల కలెక్టర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సైతం తహసీల్దార్ టి.కల్యాణచక్రవర్తి మాట్లాడుతూ బీఎల్ఓలను నియంత్రించలేకపోతున్నానని చెప్పడం గమనార్హం. 23 ఓట్ల తొలగింపునకు కుట్ర! సారవకోట: చిన్నకిట్టాలపాడు పంచాయతీ బొంతుగూడలో 23 మంది గిరిజనుల ఓట్లు తొలగించేందుకు స్థానిక టీడీపీ నాయకులు ప్రయత్నాలు చేశారు. మంగళవారం విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ మండల కమిటీ ఉపాధ్యక్షుడు బొంగు కొండయ్య, డీఎల్డీఏ చైర్మన్ నక్క తులసీదాస్లు గ్రామానికి చేరుకుని బీఎల్ఏలతో మాట్లాడారు. దీంతో గిరిజనులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. 23 మంది ఓటర్ల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని, తుది జాబితాలో వారి పేర్లు లేకపోతే పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పోలాకి జెడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని నాయకులు స్పష్టం చేశారు. -
నేడు జాబ్మేళా
శ్రీకాకుళం న్యూకాలనీ : శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ (అటానమస్) కళాశాలలో ‘ఉన్నతి’ ఫౌండేషన్ సహకారంతో బుధవారం మెగా జాబ్మేళా నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సూర్యచంద్రరావు, ఉన్నతి ఫౌండేషన్ ప్లేస్మెంట్ అండ్ ట్రైనింగ్ కోఆర్డినేటర్ బి.రంజిత్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నస్ ఇన్స్ట్రూమెంట్స్, వోల్టాస్, అపోలో ఫార్మసీ, దూత్ ట్రాన్స్మిషన్స్, టీవీఎస్, డాటా క్రాప్, విస్ట్రాన్ వంటి 15 కంపెనీలు పాల్గొంటున్నాయని చెప్పారు. సుమారు 600 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లమో, ఎంఎల్టీ, ఫార్మసీ తదితర అర్హతలు కలిగిన యువతీ యువకులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. అభ్యర్థులు బయోడేటా, ఒరిజినల్ ధ్రువపత్రాలు, జిరాక్స్ కాపీలు, ఆధార్ కార్డు, రెండు పాస్ఫొటోలతో ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణం వద్దకు చేరుకోవాలని సూచించారు. ఉత్తీర్ణత శాతం పెరగాలి నరసన్నపేట: రెసిడెన్షియల్ కళాశాలల్లో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత శాతం పెరగాలని ఏపీఎస్డబ్ల్యూ ఆర్ఐఈఎస్ జాయింట్ సెక్రటరీ కె.రాజ్యలక్ష్మి అన్నారు. తామరాపల్లిలోని మహిళా రెసిడెన్సియల్ కళాశాలను మంగళవారం తనిఖీ చేశారు. భోజన వసతి, తరగతుల నిర్వహణ తదితర అంశాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కళాశాల సిబ్బందికి, వంట ఏజెన్సీ ప్రతినిధులకు తగు సూచనలు చేశారు. ఉత్తమ ఫలితాల సాధనకు ప్రత్యేక కార్యాచరణ అవసరమన్నారు. ఐఐటీ, నీట్ వంటి పోటీ పరీక్షలకు తీర్చిదిద్దాలన్నారు. ఈమె వెంట డీసీఓ వై.యశోదలక్ష్మి ఉన్నారు. పారా లీగల్ వలంటీర్లకు శిక్షణ శ్రీకాకుళం పాతబస్టాండ్: ఖైదీలకు, వన్యప్రాణుల దాడి బాధితులకు చట్టప్రకారం సకాలంలో న్యాయ సహాయం అందించడంలో పారా లీగల్ వలంటీర్ల పాత్ర కీలకమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. మంగళవారం జిల్లా కార్యాలయంలో వలంటీర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ నూతనంగా ప్రవేశపెట్టిన పలు పథకాలపై వలంటీర్లకు దిశానిర్దేశం చేశారు. జైళ్లలో ఉన్న ముద్దాయిలు, విచారణ ఎదుర్కొంటున్న ఖైదీ ల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ‘స్పృహ’ పథ కం గురించి వివరిస్తూ.. ఖైదీలపై ఆధారపడిన వారి కుటుంబ సభ్యులకు, ఖైదీలకు నడుమ వలంటీర్లు సమన్వయకర్తలుగా వ్యవహరించాలన్నారు. ఉచిత న్యాయవాదిని నియమించడంలో సహాయం చేయాలని సూచించారు. అడవుల సరిహద్దు ప్రాంతాల్లో జరిగే మానవ – వన్యప్రాణి సంఘర్షణల వల్ల నష్టపోయే బాధితులకు ఈ నూతన పథకం ద్వారా న్యాయం పొందేలా తగిన అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు. -
ట్రిపుల్ ఐటీలో కౌన్సెలింగ్ ప్రారంభం
ఎచ్చెర్ల : ఎస్ఎంపురంలోని శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో ప్రవేశాలకు మంగళవారం కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి విద్యార్థులు, తల్లిందండ్రులు హాజరయ్యారు. మొదటి అడ్మిషన్ పొందిన పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం కాశీపట్నం గ్రామానికి చెందిన వి.ప్రీతి, అనకాపల్లి జిల్లాకు చెందిన సీహెచ్ దీక్షిత్ ధర్మతేజలకు డైరెక్టర్ గిరిధర్ మద్రాసు ధ్రువీకరణ పత్రాలను అందించారు. ఈ సందర్భంగా కౌన్సెలింగ్ కన్వీనర్ అమరేంద్రకుమార్ మాట్లాడుతూ ఈ నెల 24 వరకు కౌన్సెలింగ్ కొనసాగుతుందన్నారు. తొలి రోజు 500 మందికి గాను 319 మంది అమ్మాయిలు, 104 మంది అబ్బాయిలు మొత్తం 423 మంది అడ్మిషన్లు పొందారని వివరించారు. 24వ తేదీన 500 మందికి కౌన్సెలింగ్ జరుగుతుందని వివరించారు. కార్య క్రమంలో ట్రిపుల్ ఐటీ పరిపాలనాధికారి ముని రామకృష్ణ, డీన్ శివరామకృష్ణ పాల్గొన్నారు. -
● రోడ్డు ప్రమాదంలో తాపీమేస్త్రి..
పలాస: పలాస మున్సిపాలిటీకి చెందిన కుమ్మరి రామారావు(60) సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కాశీబుగ్గ పోలీసులు, బంధువులు ఇచ్చిన వివరాలు ప్రకారం.. ఆయన పలాస–కాశీబుగ్గ పట్టణంలో తాపీ మేసీ్త్రగా పనిచేస్తున్నా రు. ఉదయం పూట కూలీలను తీసుకొని వెళ్లి పనికి అప్పగించి ఇంటికి ప్రతి రోజు వస్తుంటారు. సాయంత్రం వేళల్లో మళ్లీ వారు పనిచేసే చోటకు వెళ్లి పరిశీలించి తిరిగి ఇంటికి వస్తుంటారు. రోజూ మాదిరిగానే సోమవారం కూడా కాశీబుగ్గ నుంచి తిరిగి బైకుపై వస్తుండగా పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని మద్యం దుకాణం వద్ద మున్సిపాలిటీకి చెందిన చెత్తను సేకరించే ట్రాక్టరు ఆగి ఉంది. ఆ ట్రాక్టర్ డ్రైవర్ మద్యం సేవించి ఆ పక్కనే ఉన్న పండ్ల దుకాణం వద్ద నిలబడి ఉన్నాడు. రామారావు ఆ ట్రాక్టర్ను బలంగా ఢీకొన్నారు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆయనను అంబులెన్స్లో పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా మృతి చెందారు. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తు ప్రాణాలు తీసినట్లు చెబుతున్నారు. -
వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై పచ్చమూకల దాష్టీకం
టెక్కలి: రాధావల్లభపురం గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు యర్ర శ్యామలరావు, తమ్మినేని రమణమూర్తి తదితరులపై గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు సోమవారం రాత్రి దాడికి పాల్పడ్డారు. దాడిలో తీవ్రంగా గాయపడిన వారి ని కుటుంబ సభ్యులు 108 వాహనంలో టెక్కలి ఆస్పత్రికి తరలించారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. రాత్రి సమయంలో గ్రామానికి వెళ్తుండగా గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు బొడ్డేపల్లి వెంకటేష్, సనపల కృష్ణమూర్తి ఇరువురూ దారి కాచి దాడి చేశారు. ఈ దాడిలో శ్యామలరావు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకోగా.. రమణమూర్తి చేయి విరిగిపోయింది. దాడి విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్, రాధావల్లభపురానికి చెందిన నాయకులు అజయ్కుమార్, సనపల కృష్ణారావు తదితరులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి జరిగిందనే సమాచారం తెలుసుకున్న నాయకులు కర్ణిక జీవన్, బడ్డ రాజేష్, ఆట్ల రాహుల్, బర్ల కార్తీక్, చింతాడ జీవన్, కవిటి చిన్న, బగాది జయరాం, మెండ భాస్కర్ తదితరులు కూడా ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. గతంలో గ్రామంలోని ఓ కేసు విషయమై సాక్షులుగా ఉన్న తమను బెదిరించడమే కాకుండా దాడికి పాల్పడ్డారని బాధితులు తెలియజేశారు. మరో 8 మందికి కొడతామని బెదిరించారని, కిల్లి అజయ్ను చంపేస్తామని అన్నారని తెలిపారు. దాడి ఘటనపై తిలక్ మాట్లాడుతూ గ్రామాల్లో రెచ్చిపోతున్న టీడీపీ కార్యకర్తలను వదిలిపెట్టేది లేదని, టెక్కలి నియోజకవర్గంలో మంత్రి అచ్చెన్నాయుడు అండతో దాడులకు తెగబడుతున్నారని ఆయన మండిపడ్డారు. దాడికి పాల్పడిన వారిపై పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. -
ఈ ‘ఆదాయ’ పైత్యాన్ని ఏమందురు..?
● గుడులు, బడుల వద్ద మద్యం విక్రయాలు ● బరి తెగిస్తున్న వ్యాపారులు ● కొత్తూరు జంక్షన్లో గిరిజన బాలికల వసతి గృహం పక్కనే రెండు వైన్షాపులు ● శ్రీకాకుళం, కాశీబుగ్గలో గుడులకు ఎదురుగా వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు శ్రీకాకుళంలో పొన్నాడ వంతెన బస్ షెల్టర్ సమీపంలో శ్రీరామమందిరం గుడికి ఎదురుగా 100 మీటర్ల లోపు ఉన్న మధు బార్ అండ్ రెస్టారెంట్ దృశ్యమిది. టీడీపీ నాయకుడు ఇప్పిలి మధుకు చెందిన బార్ అండ్ రెస్టారెంట్ ఇది. దీని పై ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకోవడం లేదు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ప్రభుత్వం ఆదాయమే పరమావధిగా పెట్టుకుంది. దీనికి మద్యాన్నే మార్గంగా ఎంచుకుంది. ఇంకేముంది గుడి, బడి అని చూడటం లేదు. ఎక్కడ కావాలంటే అక్కడ మందు షాపులు పెట్టుకోవడానికి అనుమతులు ఇచ్చేస్తున్నారు. దీంతో శాంతిభద్రతల సమస్య పెచ్చుమీరుతోంది. నిత్యం రాకపోకలు సాగించే ప్రాంతంలో వైన్షాపులుంటే అక్కడున్న బాలికల రక్షణ దేవుడికెరుక. అలాంటిది మందుబాబులు సంచరించే ఏరియాలో బాలికల వసతి గృహాలు ఉంటే పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అనుమతి ఎలా ఇచ్చారో..! ● కొత్తూరు జంక్షన్లో ఉన్న గిరిజన బాలికల వసతి గృహాన్నే తీసుకోండి.. ఒక వైన్షాపు పక్కనున్న కాంప్లెక్స్లో గిరిజన బాలికల వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఏర్పాటు చేసిన కొన్ని నెలలకు మరో వైన్షాపు అక్కడ పెట్టారు. ● వైన్షాపు పక్కన గిరిజన బాలికల వసతి గృహం ఏర్పాటుకు సంబంధిత అధికారులు అనుమతి ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది. ● బాలికల వసతి గృహం ఉన్న దగ్గరలో కొత్తగా మరో వైన్షాపు ఏర్పాటు చేసేందుకు ఎకై ్సజ్ అధికారులు అనుమతి ఇవ్వడం మరింత విచిత్రం. ● ఇక్కడ ఇరు శాఖల అధికారుల తప్పులూ ఉన్నాయి. ● టీడీపీకి చెందిన వ్యక్తి వైన్షాపు కావడంతోనే అనుమతులు వచ్చేశాయని అంటున్నారు. మొత్తానికి పైఅంతస్తులోని వసతి గృహంలో ఉంటున్న బాలికలు కిందకి దిగి ప్రతి రోజూ ఆ వైన్షాపుల ముందు నుంచే వెళ్లాల్సి వస్తోంది. గుడి.. బడి.. ఏదైతే మాకేంటి..! గుడుల వద్ద వైన్షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లకు కొదవ లేదు. దేవదాయ శాఖ పరిధిలోకి రాలేదని చెప్పి జిల్లాలో పలు దేవాలయాల పక్కన, ఎదురుగా వైన్షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లకు ఎకై ్సజ్ అధికారులు అనుమతులిచ్చేశారు. అవన్నీ టీడీపీ నేతలకు చెందినవి కావడంతో స్థానికులు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు. పవిత్రమైన దేవాలయాల వద్దకు వెళ్లే భక్తులకు వైన్షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు దర్శనం ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. ఎక్కడా స్థలం లేనట్టు దేవాలయాల దగ్గర వైన్షాపులు పెట్టడానికి వ్యాపారులకై నా మనసు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. డబ్బు కోసం దేవాలయాలు, విద్యాలయాలు కూడా వదలరా అన్న చర్చ జరుగుతోంది. కాశీబుగ్గ పాత జాతీయ రహదారిపై రైల్వే స్టేషన్కు ఎదురుగా రామాలయం, షిర్డీ సాయి ఆలయాలు ఉన్నాయి. వాటి ఎదురుగా ఒక వైన్షాపు, ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. ఇందులో ఒకటి నగర టీడీపీ నాయకుడిది. -
● అర్ధరాత్రి మృత్యుకేళి
వజ్రపుకొత్తూరు: ఎప్పుడో తోడును కోల్పోయిన ఆ తల్లికి కొడుకు మాత్రమే ఆధారం.. కొడు కు సంపాదనే బతుకు బండిని నడిపిస్తోంది. ఒకే ఒక్క ప్రమాదం ఆ అమ్మను అనాథను చేసింది. ఒక రోజు కిందటే ఇంటికి వచ్చిన మరో యువకుడి భవిష్యత్ను అంధకారంలోకి నెట్టేసి ఆ కుటుంబానికి శోకం మిగిల్చింది. ఉత్సవాలు చూద్దామని ఉత్సాహంగా వెళ్లిన ఆ ఇద్దరు యువకులు శవాలై ఇంటికి చేరారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. వజ్రపుకొత్తూరు మండలం ఉద్దానం గోపీ నాథపురానికి చెందిన కర్ని తులసీరావు (కోదండరావు) (27), కొండవూరు పంచాయతీ గర్తంవానిపేటకు చెందిన గర్తం మణికంఠ(24) ఆదివారం రాత్రి మండలంలోని సైనూరులో జరుగుతున్న చింతలపోలమ్మ తల్లి ఉత్సవాలు చూద్దామని వెళ్లారు. రాత్రి అక్కడ వినోద కార్యక్రమం జరగడంతో అది తిలకించి తిరిగి వస్తుండగా.. ఉద్దానం రామకృష్ణాపురం రహదారిలో పాతటెక్కలి వద్ద స్కూటీతో విద్యుత్ స్తంభాన్ని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. ఆదివారం రాత్రి సుమారు 12 నుంచి 2.30 గంటల సమ యంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ముళ్లపొదల్లో పడి ఉన్న యువకుల మృతదేహాలను సో మవారం తెల్లవారు జామున గుర్తించిన స్థానికులు వజ్రపుకొత్తూరు పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబాల్లో కన్నీరు.. కోదండరావు తండ్రి మోహనరావు చాలా ఏళ్ల కిందట మృతి చెందగా తల్లి రాజేశ్వరి ఉన్నారు. ఉపాధి కోసం విదేశాలకు వలస వెళ్లే కోదండరావు మృతితో ఆ తల్లి గుండెలవిసేలా రోదించారు. మణికంఠ ఒక రోజు కిందటే నెల్లూరు నుంచి వచ్చాడు. అతడికి తల్లిదండ్రులు గంగాధర్, నీలవేణిలతో పాటు ఓ తమ్ముడు ఉన్నారు. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన బైక్ ఇద్దరు యువకుల దుర్మరణం చింతలపోలమ్మ ఉత్సవాలకు వెళ్లి వస్తుండగా ఘటన -
పైడి భీమవరం.. సొమ్ములకు క్షవరం
పైడిభీమవరం గ్రామ సచివాలయంరణస్థలం: జిల్లాలో అధిక రాబడి సాధించే పైడి భీమవరం పంచాయతీకి అవినీతి మరకలు అంటుకున్నాయి. పంచాయతీలో 2025–26లో ఉన్న సాధారణ నిధులు రూ.9,43,08,960 ఏడాది లోపే వివిధ పనులు, అడ్వాన్స్ రూపంలో ఖర్చు చేయడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందులో దాదాపు రూ.3 కోట్లు ఎలాంటి పత్రాలు లేకుండా అడ్వాన్స్ రూపంలో ఆ గ్రామ సర్పంచ్ ప్రతినిధి, టీడీపీ నాయకుడు రౌతు శ్రీనివాసరావు మింగేయడం విస్మయం కలిగిస్తోంది. నియోజకవర్గ కీలక ప్రజాప్రతినిధికి కూడా ముడుపులు అందినట్లు ప్రచారం జరుగుతోంది. కంపెనీల డబ్బే.. జిల్లా ముఖద్వారమైన పైడిభీమవరం పంచాయతీలో గల పారిశ్రామికవాడలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు 28 వరకు ఉన్నాయి. అందులో 12 కంపెనీల నుంచి నేరుగా పన్నుల రూపంలో పంచాయతీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. మిగతా కంపెనీలు ఏపీఐఐసీకి పన్నులు చెల్లించినా మళ్లీ ఏపీఐఐసీ నుంచి 30శాతం పంచాయతీకే వస్తుంది. ఏడాదికి సుమారు రూ 2.5కోట్ల వరకు పైడిభీమవరం పంచాయతీకి నిధులు వస్తాయి. వైఎస్సార్ సీపీ హయాంలో పకడ్బందీగా.. 2021లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి సర్పంచ్ పదవి రాగా, 14 వార్డు మెంబర్ల స్థానాల్లో వైఎస్సార్సీపీ 10, టీడీపీ 4 వార్డు మెంబర్లు గెల్చుకున్నారు. దీంతో పంచాయతీ డబ్బును ఇష్టానుసారం ఖర్చు పెట్టే వీల్లేకుండా పోయింది. ప్రతి పనీ పద్ధతిగా జరిగింది. 2024 జూన్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. పరిస్థితులు ఒక్కొక్కటిగా తమకు అనుకూలంగా మార్చుకున్నారు. మింగేశారిలా.. 2025లో పంచాయతీ తీర్మానం లేకపోయినా ఒకే ఏడాది రూ. 9.43 కోట్లు పైచిలుకు నిధులు అడ్డగోలు లెక్కలు చూపించి విత్డ్రా చేశారు. అందులో ప్రధానంగా సీసీ రోడ్డులు, కాలువలు, కుళాయిలు, విద్యుత్ సామాన్లు, డ్రైనేజ్ పైపులు రూపంలో ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. కానీ అవసరం లేని చోట ప్రైవేటు లే–అవుట్లకు ప్రభుత్వ సొమ్ముతో సీసీ రోడ్లు వేశారు. ఎక్కడా బ్లీచింగ్ పౌడర్ కనిపించకపోయినా, ట్రాక్టర్ మరమ్మతులు, ఇతర మౌలిక సదుపాయల పేరుతో భారీగా నిధులు స్వాహా చేశారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆ టీడీపీ నాయకుడి అకౌంట్లో.. పంచాయతీ రాజ్ చట్ట ప్రకారం రూ. 5లక్షలు దాటి నిధులు డ్రా చేయాలంటే మండల ఉన్నతాధికారుల సంతకాలు కావాలి. అలాంటిది ఎలాంటి అర్హత లేని ఆ గ్రామ సర్పంచ్ ప్రతినిధినని చెప్పుకునే టీడీపీ నాయకుడు రౌతు శ్రీనివాసరావు అకౌంట్లో నేరుగా రెండు నెలల వ్యవధిలో అడ్వాన్స్ రూపంలో రూ. 2.52 కోట్లు నిధులు జమ చేయడం హాట్ టాపిక్గా మారింది. ఆ డబ్బులతోనే ఇటీవల పెట్రోల్ బంకు నిర్మించాడనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. అలాగే తాగునీటి పైపులు, కుళాయి ట్యాపులు, ప్లంబింగ్ పనులు రూపంలో సుమారు రూ.2కోట్లు నిధులు బొక్కేశారు. బాసిన లక్ష్మణరావు అనే ప్లంబర్పైన తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఒక్క రౌతు శ్రీనుకే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏడాదిలో సుమారు రూ. 5కోట్లు ముట్టినట్లు సచివాలయ ఉద్యోగుల టాక్. ఇక సీఎం పర్యటనల పేరుతోనూ బొక్కేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమాలపై సీఎంఓకు ఫిర్యాదు వెళ్లింది. కూటమి, నాయకులతోపాటు అధికారుల పాత్ర ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిగ్గు తేల్చాలి.. కూటమి పాలన కాలంలో పైడి భీమవరంలో జరిగిన ఆర్థిక లావాదేవీలపై నిగ్గు తేల్చాలి. మా పంచాయతీలో అక్కడక్కడా మొక్కుబడిగా రోడ్లు వేశారు తప్ప రూ.9 కోట్ల నిధులు ఖర్చు చేసేంత పనులు జరగలేదు. గోల్మాల్ జరిగింది. వీటిపై దర్యాప్తు చేసి నిగ్గు తేల్చాలి. – పైడిభీమవరం గ్రామ పెద్దలు పైడిభీమవరం పంచాయతీలో సాధారణ నిధులు గోల్మాల్ ఏడాదిలో రూ.9.43 కోట్ల నిధులు మాయం అడ్వాన్స్ రూపంలో నిధులు స్వాహా చేసిన టీడీపీ నేత సీఎంఓకు ఫిర్యాదుతో విషయం బహిర్గతం మేం సంతకాలు చేయలేదు గత ఐదేళ్ల పంచాయతీ పాలనలో వైఎస్సార్సీపీ తరఫున 10మంది వార్డు మెంబర్లు ఉన్నాం. అందులో నేనే ప్రతి సమావేశానికి హాజరయ్యాను. వాళ్లు నిధులు అడ్డగోలుగా ఖర్చు చేస్తామంటే ఎప్పుడూ మా 10మంది ఒప్పుకోలేదు. మరి ఇంత భారీగా ఎలా నిధులు ఎలా స్వాహా చేశారో అర్థం కావటం లేదు. – చింతపల్లి చిన్నా, మాజీ 2వ వార్డ్ మెంబర్, పైడిభీమవరం పంచాయతీ విచారణ జరపాలి పైడిబీమవరం పంచాయతీలో గత ఏప్రిల్ నాటికి రూ.9కోట్లకు పైగా నిధులు ఉండేవి. అందులో చివరి రెండు మీటింగ్లకు వెళ్లలేదు. కానీ ఇప్పుడు చూస్తే నిధులన్నీ ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. మేము ఎక్కడా సంతకాలు చేయలేదు. పంచాయతీలో ఎక్కడా పనులు జరగలేదు. – ఎం.శ్రీను, మాజీ వార్డు మెంబర్, పైడిభీమవరం విచారణ చేస్తాం పైడిభీమవరం పంచాయతీలో నిధులు దుర్వినియోగంపై ఫిర్యాదులు వచ్చాయి. పూర్తి స్థాయిలో ఎంకై ్వరీ చేసి వివరాలు వెల్లడిస్తాం. – ఆర్.స్వరూపరాణి, జిల్లా పంచాయతీ అధికారి -
2008 డీఎస్సీ ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్
● 1998 డీఎస్సీ ఉపాధ్యాయుల ఆందోళన ● మొత్తం ఖాళీలు చూపించడం లేదని ఆవేదన శ్రీకాకుళం: జిల్లాలో 2008 డీఎస్సీ ఉపాధ్యాయులు 108 మందికి జిల్లా విద్యాశాఖ అధికారి ఎ.రవిబాబు సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించి పాఠశాలలను కేటాయించారు. ప్రతిఏటా వీరికి కౌన్సెలింగ్ నిర్వహించి పాఠశాలలను కేటాయిస్తూ ఉంటారు. దీనిలో భాగంగా సోమవారం వీరికి కౌన్సెలింగ్ నిర్వహించారు. వీరితోపాటు 1998 ఎంటీఎస్ ఉపాధ్యాయులకు కూడా కౌన్సెలింగ్ కోసం పిలిచారు. వీరంతా కలిసి 321 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. అయితే 1998 డీఎస్సీకి చెందిన ఉపాధ్యాయులకు రాష్ట్ర అధికారులు ఇచ్చిన హామీ మేరకు కౌన్సెలింగ్ జరగలేదంటూ వారు ఆందోళన చేపట్టారు. కౌన్సెలింగ్ హాల్ ఎదుట పెద్ద ఎత్తున నినాదాలు చేసి జిల్లా విద్యాశాఖ అధికారిని నిలదీశారు. జిల్లాలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను చూపించాలని డిమాండ్ చేశారు. అయితే జిల్లా విద్యాశాఖ అధికారులు రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు 321 ఖాళీలను మాత్రమే చూపించారు. దీనికి 1998 ఉపాధ్యాయులు అంగీకరించకుండా అన్ని ఖాళీలు చూపించాల్సిందేనని పట్టుబట్టి కౌన్సెలింగ్ బహిష్కరించారు. అధికారుల చర్యలు సరికాదు ఈ సందర్భంగా 1998 డీఎస్సీ ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. ఇప్పటికే ప్రతి ఉపాధ్యాయుడు 50 నుంచి 150 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారని, ఎటువంటి అలవెన్సులు లేకుండా అతి తక్కువ జీతానికి పనిచేస్తున్న తమకు మరింత దూరం వెళ్లేలా జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడం సరికాదని వాపోయారు. 321 స్థానాలు మాత్రమే ఖాళీగా చూపిస్తే.. తమకంటే ముందు నియమించబడిన 2008 ఉపాధ్యాయులు 108 మంది ఉన్నారని, వారంతా దగ్గరలోని ఖాళీలను కోరుకుంటే తాము సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. శాసనమండలి సభ్యులు రాష్ట్ర అధికారులతో మాట్లాడినప్పుడు అన్ని ఖాళీలను చూపిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు. రాత్రి 8 గంటల వరకు ఈ వ్యవహారం ఒక కొలిక్కి రాలేదు. ఇదిలా ఉండగా వీరి డిమాండ్కు తలొగ్గి అన్ని ఖాళీలను చూపిస్తే 2008 ఉపాధ్యాయులకు రీ కౌన్సిలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. -
సంబరాలు చాలు.. ఉద్యోగాలు ఇవ్వండి
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి ప్రభుత్వ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారని, ఈ రెండేళ్లలో ఏం సాధించారో చెప్పి సంబరాలు జరుపుకోవాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.సంతోష్, కొన్న శ్రీనివాస్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరంలో సూర్య మహల్ జంక్షన్ వద్ద సో మవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండేళ్లలో నాలు గు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఇంతవరకు ఎన్ని ఉద్యోగాలు ప్రకటించారో చెప్పాలన్నారు. నిరుద్యోగ యువత రోడ్లపై తిరుగుతుంటే.. సంబరాలు చేసుకోవడం సరికాదన్నారు. నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. డీఎస్సీలో జరిగిన అవకతవకలపై వెంటనే విచారణ చేపట్టాలని, 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీచ్ షాక్స్ పేరుతో రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్గా మార్చడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల 30 వేల పైచిలుకు ఉద్యోగాలతో సమగ్ర మెగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 19,000 పోస్టులను భర్తీ చేసి అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 35 ఏళ్లకు పెంచాలని, ఇతర అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలని కోరారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ టౌన్ కన్వీనర్ వేణు, నాయకులు వసంత్, హేమంత్, జగదీశ్, రామోజీ తదితరులు పాల్గొన్నారు. -
● వ్యక్తి అనుమానాస్పద మృతి
నందిగాం: మండలంలోని నౌగాం పంచాయతీ హుకుంపేటలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందారు. గ్రామస్తులు తెలిపిన సమాచారం మేరకు.. సోమవారం సాయంత్రం గ్రామంలోని ఉపాధి వేతనదారులు పనికి వెళ్లిపోయాక.. గ్రామానికి చెందిన దాసరి సింహాచలం(37) తన ఇంటికి రెండిళ్ల దూరంలో ఉన్న మరొకరి ఇంటిలో గొంతులో తీవ్ర రక్తస్రావమై పడి ఉన్నాడు. బంధువులు ఆయనను గమనించి 108లో టెక్కలి ఆస్పత్రికి తరలిస్తుండగా ఆయన మృతి చెందాడు. ఆయన మృతి చెందిన విధానంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సింహాచలం తన తల్లి సూరమ్మ, భార్య మణెమ్మతో కలిసి ఉంటున్నాడు. అయితే భార్యతో నిత్యం గొడవపడుతూ ఉండేవాడని సమాచారం. మృతికి గల కారణం పోలీసు దర్యాప్తు పూర్తయితేనే తెలుస్తుంది. -
ఐదో అంతస్తు నుంచి కింద పడి యువతి మృతి
మియాపూర్: అపార్ట్మెంట్ ఐదో అంతస్తు టెర్రస్ పై నుంచి కిందపడి ఓ యువతీ మృతి చెందిన విషాద ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ శిరీషారెడ్డి తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళానికి చెందిన బుద్ధ వెంకటప్రతాప్రెడ్డి, ప్రశాంతి దంపతులకు ఓ కుమార్తె బుద్ధ శ్రీ ప్రాణమ్య(20), ఓ కుమారుడు ఉన్నారు. వెంకటప్రతాప్రెడ్డి కుమారునితో పాటు అమెరికాలో ఉంటున్నారు. ప్రశాంతి కూతురు ప్రాణమ్యతో కలిసి అమెరికా నుంచి ఇండియాకు వచ్చారు. మియాపూర్ మయూరీనగర్ కాలనీలోని బొమ్మరిల్లు అపార్ట్మెంట్లో తల్లిదండ్రుల ఇంటిలో ఉంటున్నారు. సోమవారం మధ్యాహ్నం సమయంలో ప్రాణమ్య వారు ఉంటున్న అపార్ట్మెంట్ ఐదో అంతస్తు టెర్రస్ పైకి ఫోన్ మాట్లాడేందుకు వెళ్లింది. టెర్రస్ గోడకు అనుకొని మాట్లాడుతుండగా అదుపుతప్పి గ్రౌండ్ ఫ్లోర్లో పడి పోయింది. అదే సమయంలో ప్రాణమ్య తల్లి ప్రశాంతి బయటికి వెళ్లి అపార్ట్మెంట్కు చేరుకుంది. అక్కడ ఉన్న వాచ్మెన్ చూసి మీ కూతురు భవనం పై నుంచి కిందపడిందని సమాచారం ఇవ్వడంతో దగ్గరకు వెళ్లి చూడగా కూతురు ప్రాణమ్య తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో ఉంది. స్థానికుల సహాయంతో దగ్గరలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా డాక్టర్లు పరిశీలించి ప్రాణమ్య మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతురాలి ప్రాణమ్య ఆన్లైన్లో డిగ్రీ చదువుతోంది. బొమ్మరిల్లు అపార్ట్మెంట్ దగ్గరలోనే ఓ అపార్ట్మెంట్లో ప్రశాంతి సొంత ఫ్లాట్ ఉంది. రెండు, మూడు రోజుల్లో ఆ ఇంటికి వెళ్లేందుకు క్లీనింగ్ ఇతర ఏర్పాట్లను చేసుకున్నారని సమాచారం. ప్రాణమ్య భవనం నుంచి కింద పడిపోవడానికి ముందు తల్లితో మాట్లాడింది. ఈ విషయాలన్నీ గుర్తు చేసుకొని ఆ తల్లి కన్నీటి పర్యంతమయ్యారు. మియాపూర్ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతురాలి తల్లి ప్రశాంతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
● తాత మనవడి ఆఖరి ప్రయాణం
పూసపాటిరేగ / కంచిలి: ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు కంచిలి నుంచి విశాఖపట్నానికి సోమవారం ఉదయం కారులో బయలుదేరారు. తాత, అమ్మమ్మ, మనవలు, కుమార్తె కబుర్లలో మునిగిపోయారు. అల్లుడే డ్రైవింగ్ కావడంతో నిశ్చింతగా ప్రయాణిస్తున్నారు. భోగాపురం మండలం పోలిపల్లి ఫ్లైఓవర్పై కనురెప్పపాటులో కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని ఆవలవైపు ఉన్న రోడ్డుపైకి చేరింది. అంతే... అదే సమయంలో శ్రీకాకుళం వైపు వస్తున్న లారీ కారును బలంగా ఢీకొని 80 మీటర్ల మేర ఈడ్చుకుపోయింది. ప్రమాదంలో తాతా మనవడు దుర్మరణం చెందగా, నలుగురు గాయపడ్డారు. పోలీసులు, స్థానికు లు తెలిపిన వివరాల ప్రకారం... కంచిలిలో నివసిస్తున్న మన్యాల సూరిబాబు (60), లక్ష్మి.. ఇంటికి అల్లుడు రాపాక కిశోర్కుమార్, కుమార్తె ఉమామహేశ్వరి, మనవడు రాపాక సాత్విక్ రిహాన్సుహాసన్ (ఏడాదిన్నర), మరో మనవరాలు, అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు కొయ్య నేహశ్రీ ఇటీవల కారులో వచ్చారు. అక్కడ పనులు ముగించుకుని రాజమండ్రిలో శుభకార్యానికి హాజరయ్యేందుకు అందరూ బయల్దేరారు. తొలుత విశాఖపట్నం మధురవాడలో నివసిస్తున్న అల్లుడు కిశోర్కుమార్ ఇంటికి చేరుకోవాలనుకున్నారు. మరో అరగంట సమయంలో ఇంటికి చేరుకుంటారనగా.. పోలిపల్లి వద్ద జాతీయరహదారిపై ఉన్న ఫ్లై ఓవర్పై జరిగిన ప్రమాదంలో సూరిబాబు, మనవడు సాత్విక్రిహాన్సుహాసన్ దుర్మరణం చెందారు. మిగిలిన నలుగురు గాయపడ్డారు. -
ఊర్వశిది హత్యే
● ఆస్తి గొడవలతో హత్య చేసిన మరిది ● నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులుసోంపేట: మండలంలోని గొల్లవూరు గ్రామంలో ఈనెల 18వ తేదీన పిన్నింటి ఊర్వశిని ఆస్తి గొడవల కారణంగా మరిదే హత్య చేసినట్లు కాశీబుగ్గ డీఎస్సీ టి.భవానీ వెల్లడించారు. సోంపేట సర్కిల్ పోలీస్స్టేషన్లో స్థానిక సీఐ బి.మంగరాజుతో కలిసి సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ టి.భవానీ మాట్లాడుతూ.. మందస మండలం రట్టి గ్రామానికి చెందిన గోకర్ల లోకనాథం తన రెండో కుమార్తె పిన్నింటి ఊర్వశి మృతిపై అనుమానం ఉందని బారువ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లోకనాథం ఫిర్యాదు మేరకు బారువ ఎస్ఐ హరిబాబు నాయుడు కేసు నమోదు చేశారు. సోంపేట సీఐ బి.మంగరాజు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేయడం జరిగిందన్నారు. మృతురాలి భర్త రాజారావుకు అన్న జయరాం, తమ్ముడు శివకుమార్ ఉన్నారు. రాజారావు కుటుంబానికి, మిగతా కుటుంబ సభ్యులకు ఆస్తి తగాదాలు ఉన్నాయి. పెద్దల సమక్షంలో సమావేశాలు నిర్వహించినా మృతురాలి మరిది శివకుమార్ పెద్దల తీర్పునకు అంగీకరించలేదు. ఈ క్రమంలో మృతిరాలి భర్త మూడు నెలల క్రితం మృతి చెందాడు. అప్పటినుంచి ఆస్తుల గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల మృతురాలు ఊర్వశి భూ సమస్యల పరిష్కారం కోసం బావ జయరాం, మరిది శివకుమార్, తోటికోడలు పిన్నింటి యశోదకు లాయర్ నోటీసులు పంపించింది. అవి వారికి 17వ తేదీన అందాయి. – దాడిచేసి హత్య నోటీసులు రావడంతో మృతురాలి మరిది శివకుమార్ కక్ష పెంచుకుని 18వ తేదీ ఉదయం మృతురాలిని ఏమైనా చేస్తానని గ్రామ పెద్దల వద్ద బెదిరించాడు. అనంతరం ఉదయం 9.30 గంటల సమయంలో మృతురాలి ఇంటి నుంచి కంగారుగా వస్తూ పారిపోయినందున శివకుమార్ను పోలీసులు అనుమానితుడిగా గుర్తించారు. 22వ తేదీన మందస మండలంలోని జిల్లుండి వద్ద శివకుమార్ను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో 18 తేదీన ఉదయం 9.10 గంటల నుంచి 9.30 గంటల ప్రాంతంలో మృతురాలిపై దాడిచేసి హత్య చేసినట్లు అంగీకరించాడు. ఆమె మృతిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి, సాధ్యం కాకపోవడంతో మంచంపై మృతదేహాన్ని వదిలి పారిపోయినట్లు వాంగ్మూలం ఇచ్చాడు. ముద్దాయి నుంచి నేరం చేసిన సమయంతో ధరించిన రక్తం మరకల దుస్తులు, ఉపయోగించిన స్కూటీ, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుడు సీఆర్పీఎఫ్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తుండడం విశేషం. సమావేశంలో బారువ ఎస్ఐ ఎస్.హరిబాబు నాయుడు ఉన్నారు. -
త్వరితగతిన అర్జీలు పరిష్కరించాలి
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ● పీజీఆర్ఎస్లో 155 అర్జీలు స్వీకరణ శ్రీకాకుళం పాతబస్టాండ్: పీజీఆర్ఎస్కు వచ్చే అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి సోమవారం అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిరోజూ అర్జీలపై అధికారులు సమీక్షించుకోవాలని సూచించారు. మొత్తం 155 ఆన్లైన్ అర్జీలు స్వీకరించగా.. వాటిలో రెవెన్యూ 52, పంచాయతీ రాజ్ 22, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ 14, వ్యవసాయ శాఖ 9, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ 7, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ 6, హోం శాఖ 6, ఏపీఈపీడీసీఎల్ 6, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 5, గ్రామీణ నీటి సరఫరా 5, వాటర్ రిసోర్సెస్ ఈఎన్సీ 4, మైన్స్ అండ్ జియాలజీ 3, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 2, బీసీ సంక్షేమం 2, పబ్లిక్ హెల్త్ 2, పౌర సరఫరాలు, మెడికల్ ఎడ్యుకేషన్, గ్రామీణాభివృద్ధి తదితర శాఖలు నుంచి ఒక్కొక్కటి చొప్పున స్వీకరించారు. అర్జీల స్వీకరణలో అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండ్య, డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం రెడ్క్రాస్కు సంబంధించి కృత్రిమ చేతుల ఉచిత పంపిణీ శిబిరం చేయూత గోడ పత్రికను ఆవిష్కరించారు. పలు వినతులు పరిశీలిస్తే... ● విశ్రాంత ఉద్యోగుల పింఛన్ బకాయిలు, ఇతర బకాయిలు చెల్లించాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు పీజీఆర్ఎస్ లో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అధ్యక్షుడు శ్యామ్, జనరల్ సెక్రటరీ కేటీ నాయు డు, కోశాధికారి వాసుదేవరావు, కార్యదర్శి వెంకట్రావు, ఎగ్జిక్యూటివ్ సభ్యులు పాల్గొన్నారు. ● ఆర్టీసీ ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వినతి అందజేశారు. అంతకుముందు వారు జెడ్పీ ముందు నిరసన తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు, ప్రజల పాలిట కూటమి ప్రభుత్వం కర్కశత్వంతో వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2015–16 ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య 59,300 ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 43,300కు తగ్గిందన్నారు. ఒకప్పుడు అద్దె బస్సులతో కలిపి ఆర్టీసీలో 12,500 బస్సులు ఉంటే, ఇప్పుడు 10,700 మాత్రమే ఉన్నాయని తెలిపారు. 2023లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సుమారు రూ.700 కోట్లు నిధులు వెచ్చించి 1,459 బస్సులు కొనుగోలు చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అధ్యక్షుడు డొప్ప రాము తదితరులు పాల్గొన్నారు. ● ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించాలని ఏఐవైఎఫ్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. మందుగా వారు ఎన్జీవో హోం నుంచి ర్యాలీగా పీజీఆర్ఎస్ వద్దకు వచ్చి నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ రెండేళ్లలో కూటమి నాయకులు ఏమి సాధించారో చెప్పి సంబరాలు జరుపుకోవాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.సంతోష్, కొన్న శ్రీనివాస్లు ప్రభుత్వానికి సూచించారు. ● విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పుస్తకాలు, ఫీజుల పేరుతో రూ.లక్షలు వసూలు చేస్తున్న ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు వినతిపత్రం అందజేశారు. -
ఇళ్లు కేటాయించని డిపాజిట్లు వెనక్కి
శ్రీకాకుళం: టిడ్కో ఇళ్ల కోసం డిపాజిట్లు కట్టి, గృహాలు పొందలేకపోయిన లబ్ధిదారులకు వాటిని వెనక్కి ఇచ్చేందుకు కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సుమారు దశాబ్ధ కాలం క్రితం నగరవాసులు టిడ్కో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 3,820 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి ఇళ్లను కేటాయించేందుకు నిర్ణయించారు. వీరి నుంచి కేటగిరీల వారీగా రూ.25,000, రూ.50,000, రూ.లక్ష డిపాజిట్లుగా తీసుకున్నారు. అయితే వీరిలో 1,904 మందికి మాత్రమే ఇళ్లను కేటాయించారు. అప్పటినుంచి మిగిలిన 1,916 మంది తమకు ఇళ్లను కేటాయించాలని, లేనిపక్షంలో డిపాజిట్లు వెనక్కి ఇవ్వాలని కోరుతూ వచ్చారు. దీంతో ప్రభుత్వం ఆ డిపాజిట్లను వెనక్కి ఇచ్చేందుకు నిధులను కేటాయించింది. ఇదిలా ఉంటే తమకు ఎటువంటి వడ్డీ లేకుండా పన్నెండేళ్ల తర్వాత డిపాజిట్లను వెనక్కి ఇస్తున్నారని, అదే బ్యాంకులో వేస్తే ప్రతీ ఐదేళ్లకు ఒకసారి రెట్టింపు అవుతుందని, ఈ లెక్కన తమ డిపాజిట్ డబ్బు రెండుసార్లు రెట్టింపు అయ్యేదని లబ్ధిదారులు అంటున్నారు. వడ్డీతో సహా చెల్లించాలని కోరుతున్నారు. కాగా కార్పొరేషన్ అధికారులు లబ్ధిదారుల నుంచి ఆధారాలను సేకరిస్తున్నారు. లబ్ధిదారులకు సంబంధించిన ఆధార్ కార్డుతో పాటు డిపాజిట్ చెల్లించినప్పుడు కార్పొరేషన్ నుంచి ఇచ్చిన రశీదును కార్పొరేషన్ కార్యాలయంలో గానీ, సచివాలయాల్లో గానీ అందజేయాలని సూచిస్తున్నారు. అయితే సగం మంది లబ్ధిదారుల వద్ద అప్పట్లో ఇచ్చిన రశీదు లేకపోవడంతో వారంతా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రెవెన్యూ క్లినిక్లో 60 అర్జీలు స్వీకరణ శ్రీకాకుళం పాతబస్టాండ్: స్థానిక జిల్లా పరిషత్ పాత సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్ను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పరిశీలించారు. పీజీఆర్ఎస్లో భాగంగా సోమవారం రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్ను ఏర్పాటు చేశారు. కలెక్టర్తో పాటు అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండ్య అక్కడ ఏర్పాటు చేసిన అన్ని కౌంటర్లను పరిశీలించారు. రెవెన్యూ క్లినిక్లో 60 అర్జీలు స్వీకరించారు. అర్జీల స్వీకరణలో జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, కలెక్టరేట్ పరిపాలన అధికారి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గురుకుల పాఠశాల సందర్శన శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని పెదపాడు గురుకుల పాఠశాలను ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయ సంస్థ జాయింట్ సెక్రటరీ రాజ్యలక్ష్మి సోమవారం సందర్శించారు. పాఠశాలలో విద్యా ప్రమాణాలు, విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు, ఉపాధ్యాయుల పనితీరును పరిశీలించారు. భోజన శాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని రుచి చూశారు. పాఠశాలలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని, వెంటనే పరిష్కరించాలని స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ దేవికి సూచించారు. ఆమెతో పాటు పాఠశాల సిబ్బంది ఉన్నారు. సోంపేట: మండలంలోని తోటవూరు గ్రామానికి చెందిన రిక్కభరత్(21) శనివారం రాత్రి హైదరాబాద్లో అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతుడు చందానగర్లోని వీఆర్ షటిల్ కోచింగ్ సెంటర్లో షటిల్ కోచ్గా విధులు నిర్వహిస్తున్నాడు. షేర్లింగపల్లిలోని ఒక లాడ్జిలో అనుమానాస్పదంగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు ఆదివారం సమాచారం అందింది. మృతదేహం సోమవారం తోటూరు గ్రామానికి చేరింది. అయితే మృతుడి తండ్రి ఇదివరకే మరణించడంతో.. కొడుకు మృతదేహానికి తల్లి లీలావతి అంత్యక్రియలు నిర్వహించారు. భరత్ మృతితో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. -
అప్రమత్తతే కీలకం..!
విద్యుత్ ప్రమాదం.. సమాచారం ఇవ్వాలి వర్షాకాలంలో విద్యుత్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదాల బారినపడే అవకాశాలున్నాయి. వీధిలో గాలి, వర్షాలకు తీగలు తెగిపడితే వెంటనే అధికారులకు సమాచారం అందించాలి. మరమ్మతులు చేయిస్తాం. విద్యుత్ సమస్యలపై వెంటనే సమచారం ఇవ్వాలి. – జి.ప్రసాదరావు, విద్యుత్ శాఖ ఏడీ, పాతపట్నం పాతపట్నం: ప్రస్తుతం ఉరుములు, మెరుపులు, పిడుగులతో అకస్మాత్తుగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇటువంటి సమయాల్లో విద్యుత్ ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇళ్లు, రోడ్లు, కార్యాలయాలు, వ్యవసాయ బావుల వద్ద ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఏమ్రాతం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణ, ఆస్తి నష్టాలు తప్పవు. ముఖ్యంగా పొలాల్లో వ్యవసాయ పనులు చేసే రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు. వర్షంలో వైర్లు తెగిపడినట్లు గుర్తిస్తే వాటి దగ్గరకు వెళ్లకుండా విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ● తడి చేతులతో విద్యుత్ తీగలు, స్విచ్లు తాకవద్దు. ● విద్యుత్ సంబంధిత మరమ్మతులు సొంతంగా చేయకూడదు. ● సిబ్బంది సెల్ఫోన్ నంబర్లు దగ్గర ఉంచుకోవాలి. ● వీధుల్లో, పొలాల్లో తడిచిన విద్యుత్ స్తంభాలను తాకకూడదు. ● తోటలు, పొలాలు వంటి ప్రదేశాల్లో విద్యుత్ తీగలు పడితే 1912కు కాల్ చేయాలి. ● విద్యుత్ తీగలపై బట్టలు ఆరవేయకూడదు. ● విద్యుదాఘాతం సంభవిస్తే వెంటనే సరఫరా నిలిపివేయాలి. బాధిత వ్యక్తిని ప్లాస్టిక్ లేదా ఎండిన కర్రతో వేరుచేయాలి. వానాకాలంలో జాగ్రత్తలు అవసరం లేకుంటే ప్రాణాలకే ప్రమాదం జాగ్రత్తలు పాటించాలని అధికారుల సూచన -
బైక్ల చోరీ కేసులో నిందితుడు అరెస్టు
● 13 ద్విచక్ర వాహనాలు స్వాధీనం పలాస: మండలంలోని పెదంచల గ్రామానికి చెందిన నాతిమిరి రఘునాథన్ను బైకుల చోరీ కేసులో అరెస్టు చేసినట్టు జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. కాశీబుగ్గ పోలీసుస్టేషన్ ఆవరణలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. రఘునాథన్ ఇంటర్ వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత చదువు మానేసి వెల్డింగ్ పనులు నేర్చుకున్నాడు. అనంతరం బెంగాల్, అబుదాబిలో పనిచేసి 2019లో విశాఖపట్నం చేరుకున్నాడు. పరవాడ ప్రాంతంలోని ఒక ఫార్మా కంపెనీలో వెల్డింగ్ పనులను 2021 వరకు చేశాడు. ఈ సమయంలో ఇతను చెడు అలవాట్లుకు బానిసయ్యాడు. ఆర్థిక పరిస్థితులు తనకు అనుకూలంగా లేకపోవడంతో బైకుల దొంగతనాలకు పాల్పడ్డాడు. కొన్ని బైకులు అతని సొంతానికి వాడుకున్నాడు. ఈ క్రమంలోనే పలాసలోని ఒక ఇంటి ముందు ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ను గత నెల 30వ తేదీన దొంగలించాడు. సోమవారం మరో బండిని దొంగతనం చేయడానికి వస్తుండగా కాశీబుగ్గ పోలీసులు పలాస మండలం కంబిరిగాం కూడలి వద్ద రెక్కీ నిర్వహిస్తుండగా చిక్కాడు. – మొత్తం 18 కేసులు పట్టుబడిన రఘునాథన్ను విచారించగా అతనిపై మొత్తం 18 కేసులు ఉన్నట్లు స్పష్టమయ్యాయి. బైకుల దొంగతనం కేసుల్లో ఆమదాలవలస, అనకాపల్లి, విజయనగరం, పరవాడ తదితర పోలీసుస్టేషన్లలో కేసులు ఉన్నాయి. 2024 సెప్టెంబర్ 29న పర్లాకిమిడిలో అరైస్టె.. విశాఖపట్నం సెంట్రల్ జైలుకు వెళ్లి తిరిగి ఈ ఏడాది జనవరి 8న బయటకు వచ్చాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత మరలా దొంగతనాలు మొదలుపెట్టాడు. ఈ క్రమంలో పలాసలో బైకు దొంగతనం చేయడానికి వస్తూ పట్టుబడ్డాడు. అతడి వద్ద నుంచి 13 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో కాశీబుగ్గ డీఎస్పీ టి.భవానీ, సీఐ వై.రామకృష్ణ, ఎస్ఐలు ఆర్.నర్సింహమూర్తి, ఎన్.సునీల్, సీసీసీ ఎస్ఐ భరత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రిమ్స్ సూపరింటెండెంట్ బాధ్యతల స్వీకరణ
శ్రీకాకుళం: శ్రీకాకుళం రిమ్స్ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్గా డాక్టర్ సౌమిని బాధ్యతలు స్వీకరించారు. ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రసన్న కుమార్ నుంచి బాధ్యతలు తీసుకున్నారు. కేజీహెచ్లో ప్రసూతి విభాగం హెచ్ఓడీగా పనిచేస్తున్న ఈమెను కొద్ది రోజుల కిందట రిమ్స్లో పదోన్నతి పై నియమించిన విషయం పాఠకులకు తెలిసిందే. తర్జనభర్జన అనంతరం ఆమె బాధ్యతలు తీసుకున్నారు. మంగళవారం నుంచి ఆమె పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండనున్నారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో అర్హులైన చేతులు లేని దివ్యాంగులను గుర్తించి, ఆగస్టు 16న విజయనగరంలో జరిగే ఉచిత కృత్రిమ చేతుల అమరిక శిబిరానికి వారిని పంపించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమానికి సంబంధించిన వాల్పోస్టర్ను జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు, వికలాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి.దేవరాజుతో కలిసి కలెక్టర్ విడుదల చేశారు. విజయనగరం వెళ్లే ముందు జిల్లాలో ఒక స్క్రీనింగ్ క్యాంప్ ఏర్పాటు చేసి, మోచేతి దిగువన నాలుగు అంగుళాల చేయి ఉన్నవారిని గుర్తించేందుకు స్క్రీనింగ్ శిబిరాన్ని ఏర్పాటు చేయాలన్నారు. -
మాస్టార్లూ..అభినందనలు..
మందస : మందస మండల కేంద్రంలోని శ్రీ రాజా శ్రీనివాస స్మారక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు తమ పిల్లలను కూడా అదే బడిలో చేర్పించి ఆదర్శంగా నిలిచారని ప్రధానోపాధ్యాయుడు మక్కా శ్రీనివాసరావు అన్నారు. తోటి ఉపాధ్యాయులు డి.నాగేశ్వరరావు, జ్ఞానేశ్వర్ గౌడ, డి.ఢిల్లీ, అరుణ్కుమార్ పాడి, కిషోర్గౌడ్లు తమ పిల్లలను ప్రభుత్వ బడిలో చదివించడం మిగిలిన వారికీ స్ఫూర్తిగా ఉంటుందని అభినందించారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్యా బోధన అందుతుందని పేర్కొన్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి రణస్థలం: గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్ట(నదీ ప్రవాహం)లో పోతిరెడ్డి మురళి(24) అనే యువకుడు సరదాగా ఈతకు దిగి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. దీంతో స్వగ్రామం లావేరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. మురళి హైదరాబాద్లోని విప్రో కంపెనీలో సాఫ్ట్వేరు ఇంజినీర్గా పని చేస్తున్నాడు. తన స్నేహితుడి సోదరికి నీట్ పరీక్ష కేంద్రాన్ని విజయవాడలో కేటాయించారు. దీంతో ముగ్గురూ విజయవాడ వచ్చాడు. ఆదివారం ఆమె పరీక్ష రాసేందుకు వెళ్లగా.. పక్కనే కరకట్టలో ఈత కొట్టేందుకు మురళి దిగాడు. ప్రమాదవశాత్తు మునిగిపోయి చనిపోయాడు. స్థానికులు గమనించి మృతదేహాన్ని బయటకు తీశారు. దీంతో స్వగ్రామం లావేరులో విషాదఛాయలు అలముకున్నాయి. మురళి తండ్రి వెంకటరమణ ఉప్పు వ్యాపారం చేస్తుంటారు. తల్లి సరళ గృహిణి. సోదరి ప్రసన్నకు వివాహం నిశ్చయమైనట్లు స్థానికులు చెబుతున్నారు. ఒక్కగానొక్క కుమారుడు మరణవార్త తెలియగానే కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడ బయలుదేరి వెళ్లారు. ఆంజనేయ గుడిలో చోరీ బూర్జ: సింగన్నపాలెం గ్రామ సమీపంలో పాలకొండ–శ్రీకాకుళం రోడ్డులోని ఆంజనేయ ఆలయంలో శనివారం రాత్రి హుండీ చోరీ జరిగింది. మూడేళ్ల నుంచి గ్రామస్తులు ఈ హుండీని తెరవలేదు. ఆదివారం ఉదయం గ్రామస్తులు ఆలయం వద్దకు వెళ్లెసరికి హుండీ చోరీ జరిగిన విషయం గుర్తించారు. ఈ విషయమై గ్రామానికి చెందిన తులగాపు శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ ఎం.ప్రవల్లిక, సిబ్బంది పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
కళింగాంధ్ర తొలి దళిత ఆత్మఘోష ‘ఈర్నం’
శ్రీకాకుళం కల్చరల్ : ‘తెలుగు సాహిత్యరంగానికి నాయకత్వం వహించే స్థాయిలో కళింగాంధ్ర ఉంది. దళిత కవితాత్వికతలో చాలా వెలితి కన్పించేది. కలమట దాసు బాబు తాజాగా రచించిన ‘ఈర్నం’ చదివిన తర్వాత అది భర్తీ చేసే తరం ప్రారంభమైందన్న సంతృప్తి కలిగింది’ అని ప్రముఖ కవి, విమర్శకుడు గుంటూరు లక్ష్మీనరసయ్య అన్నారు. ఆదివారం శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు సమావేశ మందిరంలో శ్రీకాకుళ సాహితీ, సాహితీ స్రవంతి సంయుక్త ఆధ్వర్యంలో ఈర్నం కవితా సంకలనం ఆవిష్కరించారు. పుస్తక ప్రచురణ బాధ్యత స్వీకరించిన చిగురుపల్లి చంద్రకళ స్మారక వేదిక చైర్మన్ సీహెచ్.ప్రభాకరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి గంటేడ గౌరునాయుడు సంకలనాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు ఈ కవితా సంపుటిపై ప్రముఖ కవి బాల సుధాకర్ ‘దళిత కళింగం’ పేరుతో రచించిన పరిశీలనాత్మక వ్యాసాన్ని ప్రముఖ రచయిత అట్టాడ అప్పలనాయుడు ఆవిష్కరించారు. కార్యక్రమంలో దాసరి రామచంద్రరావు (కథా నిలయం), చీకటి దివాకర్, కె.శ్రీనివాస్ (సాహితీ స్రవంతి), అల్లాడ లక్ష్మి (ఐద్వా), నల్లి ధర్మారావు, సిరికి స్వామినాయుడు (అరసం), పక్కి రవీంద్రనాథ్ (స్నేహ కళా సాహితి, పార్వతీపురం), పి.వి.నరసింహులు( విశ్వసాహితి, ఆమదాలవలస), అల్టి మోహనరావు (రాజాం రచయితల వేదిక) తదితరులు పాల్గొన్నారు. -
లక్షలు వ్యయం..లక్ష్యం శూన్యం!
కొత్తూరు: మండల కేంద్రం కొత్తూరులో ఏపీజీవీబీ బ్రాంచి వద్ద అలికాం–బత్తిలి రోడ్డు గోతులమయంగా మారింది. నిత్యం రద్దీగా ఉన్న ఈ రోడ్డు పాడైపోవడంతో ఇటీవలే సుమారు రూ. 26 లక్షలతో సీసీ రోడ్డు నిర్మించారు. అయితే రోడ్డుకు ఓ వైపు కాలువ లేకపోవడం, మరో వైపు ఉన్న కాలువ ఎత్తుగా ఉన్నందున రోడ్డుపైనే వర్షపునీరు నిలిచిపోతోంది. దీంతో వాహనచోదకులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్అండ్బీ, పంచాయతీ అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
జాతీయ పెన్కాక్ సిలాట్ పోటీలకు ఎంపిక
టెక్కలి: నాసిక్లో ఈ నెల 26 నుంచి 28 వరకు జరగనున్న జాతీయ స్థాయి పెన్కాక్ సిలాట్ మార్షల్ ఆర్ట్స్ పోటీలకు కోటబొమ్మాళి గౌతమ్ మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులు ఎంపికై నట్లు కోచ్ సామ గౌతమ్ ఆదివారం తెలిపారు. ముంగి అర్జున్, గొండు భవి భాస్కర్నాయుడు తదితరులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు వెల్లడించారు. వీరిని అసోసియేషన్ ప్రతినిధులు ఆర్.దయామయ, ఎన్.లక్ష్మణ్నాయుడు, ఎం.గౌతమి అభినందించారు. వైన్షాపులో చోరీ హిరమండలం: మేజర్ పంచాయతీ హిరమండలంలో ఎస్బీ వైన్ షాపులో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు షాపులోకి ప్రవేశించి రూ.2.30 లక్షల నగదు దోచుకుపోయారు. ఉదయం సిబ్బంది వచ్చి చూడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న హిరమండలం పోలీసులు, క్లూస్టీమ్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. హెచ్సీ సర్వేశ్వరరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆటోను ఢీకొన్న బైక్ రణస్థలం: లావేరు మండలం రావివలస సమీపంలో ఆదివారం ఉదయం ఆటోను ఓ బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న షేక్ షాయిబ్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108 అంబులెన్సులో రణస్థలం సీహెచ్సీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆటో రాంగ్ రూట్లో రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. బైక్లో ఉన్న గొర్రె చర్మాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. కాంప్లెక్స్ కిటకిట శ్రీకాకుళం అర్బన్ : శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆదివారం ప్రయాణికులతో రద్దీగా కనిపించింది. నీట్ పరీక్ష రాసే అభ్యర్థులు, పలువురు ప్రయాణికులతో కాంప్లెక్స్ కళకళలాడింది. సరిపడా బస్సులు లేక నిరీక్షణ తప్పలేదు. బస్లు ఫుట్పాత్ వద్దకు చేరుకున్న వెంటనే సీట్ల కోసం ఎగబడ్డారు. -
కార్మిక సమస్యల పరిష్కారానికి కృషి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ)/శ్రీకాకుళం అర్బన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ల రద్దు కోసం సమరశీల పోరాటాలను సాగించాల ఇఫ్టూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఏపీఎన్జీవో కార్యాలయంలో ఆదివారం ఇఫ్టూ నూతన కార్యవర్గ ఎన్నిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఎన్నికై న జిల్లా కమిటీ సమస్యలపై రాజీలేని పోరాటాలు సాగించాలని కోరారు. పోరాటాల ద్వారా సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న లక్ష్యంతో ముందుకెళ్లాలన్నారు. సమావేశంలో పలు ప్రజా సంఘాల నాయకులు తాండ్ర ప్రకాష్, సన్నశెట్టి రాజశేఖర్, మామిడి క్రాంతి, జుత్తు వీరాస్వామి, సవలాపురపు కృష్ణవేణి పాల్గొన్నారు. నూతన కార్యవర్గమిదే.. జిల్లా అధ్యక్షుడిగా మామిడి క్రాంతి, ఉపాధ్యక్షుడిగా జుత్తు వీరాస్వామి, ప్రధాన కార్యదర్శిగా సవలాపురపు కృష్ణవేణి, కార్యదర్శిగా దంత వెంకన్న, కోశాధికారిగా పోతనపల్లి మల్లేశ్వరరావు, కార్యవర్గ సభ్యులుగా బర్ల గోపి, పి.ఆనందరావు, పి.షణ్ముఖరావు, కిర్రు దానేసు, కురమాన నాగమణి, ఎచ్చెర్ల పుణ్యవతిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
అరసవల్లిలో భానుసప్తమి సందడి
అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో భానుసప్తమి పర్వదినం సందర్భంగా భక్తుల సందడి కనిపించింది. స్థానికులతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా భారీగా భక్తులు తరలిరావడంతో ఆలయ క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకబృందం రూ.300 వీఐపీ టికెట్లు కొనుగోలు భక్తులకు అంతరాలయ దర్శనాన్ని చేయించారు. ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్, ఏఈవో అప్పలనాయుడు ఆధ్వర్యంలో భక్తులకు మౌలిక సౌకర్యాలు కల్పించారు. సీఎంఆర్ గ్రూప్ యాజమాన్యం ఉచితంగా పరమాన్నం, పెసల మొలకలు ప్రసాదాలు పంపిణీ చేశారు. సిబ్బంది చేతివాటం.. కేశఖండన శాలలో తలనీలాల మొక్కులు చెల్లించుకునేందుకు వెళ్లిన భక్తుల నుంచి కనీసంగా రూ.50 నుంచి రూ.100 వరకు వసూళ్లు అదనంగా చేస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్టు ధర రూ.40 కాగా.. అదనంగా డబ్బులు వసూళ్లు చేస్తున్నారని, లేదంటే గుండుపై చిన్నపాటి గాయాలయ్యేలా చేస్తున్నారంటూ మండిపడ్డారు. మరుగుదొడ్లు, స్నానాల గదులు, రావిచెట్టుకు దీపం పెట్టిన చోట, కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం వద్ద కూడా డబ్బులు వసూళ్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కేశఖండన శాల వద్ద అక్రమ వసూళ్లుపై ఈఓకు పలు ఫిర్యాదులు చేరడంతో అక్కడ పనిచేస్తున్న ఒకరిద్దరిని రెండు వారాల పాటు సస్పెండ్ చేశారు. అయినప్పటికీ సిబ్బందిలో మార్పులు కనిపించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. క్యూలైన్లలో భక్తులు -
రైతు బేజారు
ప్రజలకు తక్కువ ధరలకే కూరగాయలు అందించాలన్న ఉద్దేశంతో నేరుగా రైతుల ద్వారానే విక్రయాలు జరిపేందుకు పట్టణాల్లో ఏర్పాటు చేసిన రైతుబజార్లు సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. అటు విక్రేతలతో పాటు ఇటు కొనుగోలుదారులు నిత్యం సమస్యలతో సతమతమవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రైతుబజారు ద్వారా ప్రభుత్వానికి మంచి ఆదాయం సమకూరుతున్నా సదుపాయాలు మాత్రం కల్పించడం లేదు. ఆమదాలవలస మున్సిపాలిటీలో నిర్వహణ కొరవడి రైతుబజారు మూతపడింది. ఇక, పలాస, ఇచ్ఛాపురం మున్సిపాలిటీల్లో రైతుబజారు కలగానే మిగిలిపోయింది. కాగితాలకే పరిమితం.. ఆదరణ కరువై.. ఆదాయం ఫుల్..అభివృద్ధి నిల్ శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): జిల్లా కేంద్రంలోని రైతు బజారులో మొత్తం 96 షాపులున్నాయి. అందులో సుమారు 25 వరకు అద్దెలు వచ్చే షాపులున్నాయి. వాటి ద్వారా ప్రతి నెలా రూ.1,73,640 సొమ్ము అద్దె రూపేనా వస్తోంది. ఏటా సుమారు రూ.20లక్షలకు పైగా ఆదాయం సమకూరుతుంది. ఇంత మొత్తం వస్తున్నా ప్రభుత్వం రైతు బజారులో సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదు. సరైన సదుపాయాలు లేక ఇప్పటికే సగానికి పైగా షాపులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం రెండు గేట్లకు ఎదురుగా ఉండే 20 షాపుల్లోనే పూర్తిస్థాయిలో కూరగాయలు అమ్మకాలు జరగుతున్నాయి. మిగిలిన షాపుల యజమానులకు వ్యాపారాలు లేక అసలు దుకాణాలే తియ్యడం లేదు. కనీస సౌకర్యాలు కరువు.. రైతుబజారులో వ్యాపారుల నుంచి అద్దెలు వసూలు చేస్తున్నప్పుడు వారికి కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించకపోవడం విమర్శలకు తావిస్తోంది. కంప్యూటర్ కాటాలకు చార్జింగ్ పెట్టుకునేందుకు ప్లగ్పిన్లు కూడా లేవు. ఫ్యాన్లు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు, మూడు షాపులకు ఒక లైటుతో చాలీచాలనీ విద్యుత్ కాంతితో చీకటిపడితే వ్యాపారాలు చేయలేని పరిస్థితి. మరుగుదొడ్ల పరిస్థితి మరింత దారుణం. పురుషులకు ఆరు మరుగుదొడ్లకు గాను రెండు మాత్రమే తెరిచి ఉన్నాయి. మహిళల మరుగుదొడ్లదీ అదే పరిస్థితి. చినుకుపడితే చెరువే.. రైతుబజారును ఎత్తుచేయాలని, మార్కెట్ మధ్యలో నిలిచిపోయిన వర్షం నీరు బయటకు వెళ్లేలా చేయాలని టీడీపీ ప్రభుత్వ హయాంలో పలుమార్లు నిధులు మంజూరు చేయడం..అరకొర పనులు చేసి నిధులు స్వాహా చేయడం వంటివి చేస్తున్నారు. గతంలో రైతుబజారు ఆధునికీకరణ పేకట సుమారు రూ.40లక్షలు నిధులు ఖర్చుచేసి నాణ్యతలేని పనులు చేసి మమా అనిపించేశారు. దీంతో కొద్దిపాటి వర్షం కురిసినా రైతుబజారులోకి వెళ్లలేని పరిస్థితి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి రైతుబజారు అభివృద్ధిపై దృష్టి సారించాలని రైతులు, వ్యాపారులు, కొనుగోలుదారులు కోరుతున్నారు -
ఉపయోగాలెన్నో..
● ఘనంగా యోగా దినోత్సవం శ్రీకాకుళం కల్చరల్: ఒత్తిడి, ఆందోళన, అనారోగ్య సమస్యలను అధిగమించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా డచ్ భవనం వద్ద ఆదివారం భారీ ఎత్తున యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యకర జీవన విధానాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి మాట్లాడుతూ యువత యోగా చేయడం అలవాటు చేసుకుంటే భవిష్యత్లో వారికి ఆరోగ్యకరమైన జీవనానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. యోగా సోలో, సింక్రనైజ్డ్, యోగ స్లోగన్, వ్యాసరచన, తదితర యోగా పోటీల్లో గెలుపొందిన వారికి సర్టిఫికెట్లు, మెమెంటోలను బహూకరించారు. సాంస్కృతిక ప్రదర్శనలో భాగంగా శ్రీకాంత్ శిష్యబృందం నృత్య ప్రదర్శన, యోగా పై గిరిజన సంక్షేమ శాఖ ఉద్యోగి పాట పాడి వినిపించారు. యోగా గురువులు పాండ్రంకి మురళీకృష్ణ, పతంజలి నుంచి చినబాబు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ నుంచి సుధారాణి తదితరుల యోగాసనాలను తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, ఆర్డీఓ కె.సాయి ప్రత్యూష, జిల్లా పరిషత్ సీఈఓ వెంకటరామన్, డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హెచ్.కూర్మారావు, డీఎంహెచ్ఓ డాక్టర్ కె.అనిత, జిల్లా విద్యాశాఖ అధికారి ఎ.రవిబాబు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ వినాయక, ఆర్ అండ్ ఎస్ఈ ఉద్యోగులు, విద్యార్థులు, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
శ్రీకాకుళం
కలెక్టర్ సారూ.. ఇదేం తీరు..!సోమవారం శ్రీ 22 శ్రీ జూన్ శ్రీ 2026నువ్వు పనికి రావు.. అర్జెంట్గా రిజైన్ చేసి వెళ్లిపో... పొమ్మనడానికి మీరెవరు సార్.. ఒక్క క్షణమైనా తీరిక ఇస్తున్నారా..? ఏమనుకుంటున్నావ్.. ఉద్యోగం చేయాలని ఉందా..? లేదా..? పనులు చేయమంటారు.. డబ్బులు మాత్రం ఇప్పించరు.. ఇవేమీ సినిమా డైలాగులు కావు.. సాక్షాత్తు కలెక్టర్, ఉద్యోగుల మధ్య జరుగుతున్న కోల్డ్వార్కు నిదర్శనాలు. కలెక్టర్ వ్యవహార శైలిపై జిల్లా ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. విపరీతమైన ఒత్తిడి పెడు తుండడంతో పాటు మాట విసిరేస్తుండడంతో కింది స్థాయి ఉద్యోగులు మనస్తాపం చెందుతున్నారు. ఇది చినికి చినికి గాలివానలా మారుతోంది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : కలెక్టర్ మాట చేటు తెస్తోంది. ఆయన ఆగ్రహావేశాలకు ఉద్యోగులు బాధ పడుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల సమీక్షల పేరుతో జరుగుతున్న సమావేశాలు కాస్తా ఉద్యోగులపై చిందులు తొక్కే వేదికలుగా మారుతున్నాయనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అధికారిక సమీక్ష సమావేశాల్లో, గ్రీవెన్స్ సెల్లో ఉద్యోగులు, అధికారులపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తీవ్రంగా మండిపడుతున్నట్టు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పులు ఉంటే సరిదిద్దడం, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం విధి నిర్వహణలో భాగమే. కానీ, దానికి భిన్నంగా అందరి ముందూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నా రన్న ఆరోపణలు ఉన్నాయి. కేవలం కింది స్థాయి సిబ్బందిపైనే కాకుండా బాధ్యతాయుతమైన జిల్లా స్థాయి అధికారులపై కూడా పరుష పదజాలం వాడుతుండటంపై ఉద్యోగులు మనస్తాపం చెందు తున్నారు. జిల్లాను నడిపిస్తున్న వ్యక్తిగా కలెక్టర్ అందరినీ కలుపుకుంటూ పోవాలి. కానీ ఆ కలుపుగోలుతనం ఇప్పుడు కనిపించడం లేదు. జిల్లాకు వచ్చిన తొలినాళ్లతో మంచిపేరే సంపాదించుకున్నా.. ప్రస్తుతం మాత్రం ఉద్యోగులు ఆయనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి నెలకొంది. అందరి ముందూ.. కొన్నాళ్ల కిందట టెక్కలికి చెందిన ద్వితీయ శ్రేణి అధికారిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం సమీక్షలో ప్రగతి నివేదికపై మాట్లాడుతూ ‘నువ్వు పనికి రావు. అర్జంట్గా రిజైన్ చేసి వెళ్లిపో’ అంటూ కటువుగా మాట్లాడారు. ‘కష్టపడి చదువుకుని ఉద్యోగం సాధించాను. పొమ్మనడానికి మీరెవరు సార్. అయినా ఒక్క క్షణమైనా తీరిక ఇస్తున్నారా? టాస్క్ల మీద టాస్క్లతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా రు’ అని ఆ అధికారి ఎదురు తిరిగారు. దీంతో మరింత మండిపడుతూ ‘వెళ్లిపో.. నువ్వు మాట్లాడకు..’ పక్కనున్న సహాయకులను పిలిచి ‘చార్జెస్ ఫ్రేమ్ చేయండి. త్రీమెన్ కమిటీ వేయండి’ అని ఆదేశించారు. దానికి ఆ అధికారిణి బదులిస్తూ ‘ఉద్యోగం తీయడం కుదరదు సార్. ట్రిబ్యునల్ లేవా?న్యాయస్థానాల్లేవా? చూసుకుందాం’ అని ఎదురు తిరిగారు. ఏదైనా పనిచేయకపోతే ‘అరేయ్ బాబు.. ఏమనుకుంటున్నావ్. ఉద్యోగం చేయాలని ఉందా? లేదా? పనిచేస్తే చేయ్.. లేదంటే వెళ్లిపో. లేదంటే పైకి రాస్తాను’ అంటూ పలు శాఖల అధికారులపై తీవ్ర స్వరంతో ఆగ్రహించిన సందర్భాలు ఉన్నాయి. బిల్లులు కావు.. కానీ అరసవల్లి రథసప్తమి వేడుకల ఏర్పాట్ల బిల్లులు, జలుమూరులో జరిగిన శివరాత్రి ఉత్సవాల బిల్లు లు, బారువ బీచ్ ఫెస్టివల్ ఏర్పాటు బిల్లులు, యోగాంధ్ర బిల్లులకు సంబంధించిన నిధులను సకాలంలో విడుదల చేయకపోవడం వల్ల సంబంధిత అధికారులు, ఉద్యోగులకు అప్పగించిన పను లు సకాలంలో చేయలేని పరిస్థితుల్లోనైతే కలెక్టర్ ఆగ్రహం మామూలుగా ఉండదని ఉద్యోగ వర్గాలు అంటున్నాయి. ‘డబ్బులు ఇవ్వకపోతే మేం ఎలా చేస్తాం. ఒకటి రెండు సార్లు కాంట్రాక్టర్లను బుజ్జగించి చేయిస్తాం. ప్రతి సారి ఇదే పనేంటి? మీరు డబ్బులు ఇవ్వరు.. వాళ్లు పనిచేయరు.. మధ్యలో మేం నలిగిపోతున్నాం’ అంటూ కలెక్టర్తో కాస్త గట్టిగా మాట్లాడారన్న వాదనలు ఉన్నాయి. ఆ మ ధ్య ఓ యూనివర్సిటీ అధికారిణిపై ఒక ప్రారంభోత్సవ విషయంలో కఠినంగా మాట్లాడారన్న చర్చ జరిగింది. ఇన్ని సమీక్షలా..? ప్రభుత్వం పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమం తానే బాగా చేయాలన్న తపన ఆయనలో ఎక్కువని, కానీ దానికి తగ్గట్టుగా నిధులు ఇవ్వడం లేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ‘అధికార పార్టీ నేతలంటే ప్రేమ. వారు చెప్పిన ప్రతి పనిచేయడానికి మొగ్గు చూపుతారు. ఈ సందర్భంలో అధికారులపై ఒత్తిడి పెడతారు. ఆ సమయంలో చేయకపోతే సీరియస్ అవు తారు’ అంటున్నారు. 24 గంటల్లో ఒకే శాఖపై భౌతికంగా, జూమ్లో, వాట్సాప్ కాన్ఫరెన్స్, టెలీ కాన్ఫరెన్స్ల ద్వారా మూడు, నాలుగు సార్లు రివ్యూలు చేస్తారు.’ అన్న వాదనలూ ఉన్నాయి. కార్గో ఎయిర్పోర్టు విషయంలోనూ కేవలం మంత్రి ఆదేశాల మేరకే నడుచుకుంటున్నారు గానీ క్షేత్రస్థాయి సిబ్బంది సమస్యలు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. సమయ పాలన పేరిట అదనపు గంటల పా టు ఉంచుకోవడం, నిర్దేశిత సమయం తర్వాత కూడా సమీక్షలు నిర్వహించడం, గంటల తరబడి టెలీకాన్ఫరెన్స్, జూమ్ కాన్ఫరెన్స్లు, ఫోన్ కాన్ఫరెన్స్లు నిర్వహించడం ఉద్యోగులకు తలనొప్పిగా మారింది. పీజీఆర్ఎస్, సమీక్ష సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్లలో అందరి ముందే ఉద్యోగులు, అధికారులపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేయడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. కలెక్టర్ వైఖరిపై గుర్రుగా ఉన్న ఉద్యోగులు మాట విసిరేస్తున్నారని మనస్తాపం ఒత్తిడికి లోనవుతున్నామంటున్న సిబ్బంది పనిచేయమంటారు.. డబ్బులు ఇప్పించరంటూ గగ్గోలు -
పరీక్ష ముగిసింది
● జిల్లాలో ప్రశాంతంగా సాగిన నీట్–2026 రీఎగ్జామ్ ● వానతో ఇబ్బంది పడిన విద్యార్థులు శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో నీట్ రీ ఎగ్జామ్ యూజీ–2026 పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. వర్షాల తో పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి విద్యార్థులు ఆపసోపాలు పడ్డారు. వర్షపు నీటిలోనే తడుచుకుంటూ లోపలికి ప్రవేశించారు. సుదూర ప్రాంతాల నుంచి నిర్ణీత సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోలేక జిల్లాలో ముగ్గురు విద్యార్థులను పరీక్ష కేంద్రం లోపలకు అనుమతించకపోవడంతో వారంతా నిరాశగా వెనుదిరిగారు. 2103 మందికి 183 మంది గైర్హాజరు.. జిల్లాలో నీట్ రీ ఎగ్జామ్కు ఏర్పాటు చేసిన నాలు గు పరీక్ష కేంద్రాలకు మొత్తం 2103 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 1920 మంది పరీక్ష రాశారు. వివిధ కారణాలతో 183 మంది విద్యార్ధులు గైర్హాజరయ్యారు. కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జిల్లా ఎప్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించారు. అలాగే అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండ్య, శ్రీకాకుళం ఆర్డీఓ సాయి ప్రత్యూష, డీఎస్పీలు సీహెచ్ వివేకనంద, దాసరి లక్ష్మణరా వు, స్థానిక తహసీల్దార్ గణపతిరావు, శ్రీకాకుళం సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్సైలు, ఇతర పోలీసు అధికారులు పరీక్ష కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. శ్రీకాకుళం సబ్ డివిజన్ పరిధిలో సుమారు 150 మంది వరకు పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరమే లోపలికి అనుమతించారు. పరీక్ష నియమానుసారం కేంద్రానికి వస్తున్న ఓ విద్యార్థినిసమయాభావం కావడంతో విద్యార్థినులకు గొడుగులు వేసి పరీక్ష కేంద్రం లోపలికి తీసుకువెళ్తున్న శ్రీకాకుళం టూటౌన్ సీఐ ఈశ్వర్ప్రసాద్ ఎగ్జామ్కు వెళ్లే ముందు కుమార్తె చెవికి ఉన్న దిద్దులను తీస్తున్న తల్లి పరీక్షా కేంద్రాలవారీగా హాజరు పరీక్ష కేంద్రం పరీక్ష రాయాల్సిన హాజరైంది గైర్హాజరు వారి సంఖ్యఆర్జీయూకేటీ 720 659 61 ఆర్ట్స్ కళాశాల 696 639 57 కేంద్రీయ విద్యాలయం 447 406 41 పాలిటెక్నిక్ కాలేజ్ 240 216 24 మొత్తం 2103 1920 183 -
అభాగ్యులకు ఆశ్రయం
కంచిలి: సోంపేట రైల్వేస్టేషన్ ఆవరణలో కొన్నాళ్లుగా అనాథలుగా కాలం గడుపుతున్న తల్లీబిడ్డలకు సీతయ్య ఫౌండేషన్ వారు ఆశ్రయం కల్పించారు. వారితో పాటు దుర్భర పరిస్థితుల్లో ఉన్న మానసిక దివ్యాంగురాలిని కూడా ఆదుకున్నారు. వీరిని మండపల్లి గ్రామం వద్ద వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వానప్రస్థాశ్రమంలో చేర్పించారు. కవిటి మండలం దూగానపుట్టుగ వద్ద బారపుట్టుగ గ్రామవాసి దేవర హేమ రాజమండ్రిలో ఓ వ్యక్తిని ప్రేమించింది. అతడు పెళ్లి చేసుకున్నాక మోసం చేసి వదిలేశాడు. దీంతో చంటి బిడ్డతో ఆమె రైల్వే స్టేషన్లోనే మూడు నెలలుగా ఉంటోంది. దీంతో పాటు మరో మహిళ కంచిలిలో స్థానికుల ఆదరణ మీదే బతుకుతోంది. వీరిని సీతయ్య ఫౌండేషన్ అక్కున చేర్చుకుంది. -
ఇంధన ధరలు ఎందుకు తగ్గించరు..?
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): క్రూడ్ ఆయిల్ ధర తగ్గినా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధర ఎందుకు తగ్గించలేదని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, సీపీఎం జిల్లా కా ర్యదర్శి డి.గోవిందరావు ప్రశ్నించారు. శ్రీకాకు ళం నగరంలో పాలిటెక్నిక్ కాలేజీ రోడ్డులో శ్రీకాకుళం కళాసీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ధరల వల్ల కార్మికులు, పేద, మధ్యతరగతి ప్రజల నిజ వేతనం పాతాళంలో కి పడిపోయిందన్నారు. అంబానీ, అదానీలకు వేల కోట్ల రూపాయలు రాయితీలిచ్చి పేద మధ్యతరగతి ప్రజలపై భారం మోపడం సరికాదన్నారు. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుంటే ఉద్యమాలు చేస్తామన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా బి. చిన్నారావు, అధ్యక్షులు ఎం.వెంకటరావు, ప్రధాన కార్యదర్శి పళ్ల అప్పలరాజు, కోశాధికారి పంగ సత్యనారాయణ, ముత్యాలమ్మ వెజిటేబుల్ మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా వేలాద్రి దుర్గారావుతో పాటు 15 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. పిడుగుపాటుకు ఆవు మృతిహిరమండలం: ఎల్ఎన్పేట మండలం డొంకలబడవంజలో శనివారం రాత్రి పిడుగుపడింది. ఈ ఘటనలో గేదెల జనార్దనరావుకు చెందిన ఆవు మృతి చెందింది. పశువుల శాలకు సమీపంలో ఉండగా పిడుగు పడడంతో ఘటనాస్థలంలోనే మృతి చెందింది. దీంతో బాధిత రైతు కన్నీటిపర్యంతమయ్యాడు. మృతిచెందిన ఆవు రూ.50 వేలు వరకూ ఉంటుందని, ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు. -
కూటమిపై వ్యతిరేకతతోనే పార్టీలో చేరికలు
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన బారువ గ్రామానికి చెందిన కూటమి పార్టీల కార్యకర్తలు, నాయకులు పార్టీలో చేరిన బారువ కొత్తూరుకు చెందిన టీడీపీ, జనసేన పార్టీల నాయకులు సోంపేట: రాష్ట్రంలో కూటమి పాలనపై ఆ పార్టీ నాయకులకే విరక్తి వచ్చిందని, అందుకే వైఎస్సార్ సీపీలో చేరుతున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. మండలంలోని బారువ మేజర్ పంచాయతీలో తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ వైస్ ఎంపీపీ సానా రాజేష్ కన్నా ఆధ్వర్యంలో 70 కుటుంబాల వారు ఆదివారం వైఎస్సార్ సీపీలో చేరారు. వీరికి ధర్మాన కృష్ణదాస్ కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కృష్ణదాస్ మా ట్లాడుతూ ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కూటమిలోని పార్టీలు మోసం చేశాయని మండిపడ్డారు. సానా రాజేష్ కన్నాతో పాటు బారువ నుంచి సానా సోమేశ్వరరావు, సానా ముకుందరావు, కీలు తిరవయ్య, పొందర వల్లభరావు, బత్తిన పాపారావు, దుమ్ము దనరాజు, దున్న యాదవరావు, దున్న జగన్నాయకులు, తెలుకుల కృష్ణారావు, వనిమిన బాలరాజు, గురాల పురుషోత్తం, సాన ధర్మరాజు, యజ్జల వాసు, బెవర జగన్నాయకులు, పడాల సతీష్, కర్రి చిట్టెయ్య, టి.సురేష్, పి.కేశవరావు, కూ ర్మారావు, సోమయ్య, బీజేపీకి చెందిన కాళ్ల చంద్రయ్య తదితరులు చేరారు. బారువ కొత్తూరు గ్రా మం నుంచి టీడీపీకి చెందిన యర్ర బాపనమ్మ, గొరక హేమరాజు, తోట పురుషోత్తం, జనసేనకు చెందిన దంగ పాపారావు, సి.మోహనరావు, కర్రి కొర్లయ్య, డొంక సునీల్, బడే రాజేష్ , గొరక సోమయ్య తదితర కుటుంబాల వారు చేరారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తురామారావు, పార్టీ సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్ రెడ్డి, పార్టీ పరిశీలకులు దుంపల లక్ష్మణరావు, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నర్తు నరేంద్ర యాదవ్, ఎంపీపీ డాక్టర్ నిమ్మన దాస్, జెడ్పీటీసీ తడక యశోద, కంచిలి ఎంపీపీ పైల దే వదాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ ఇప్పిలి కృష్ణారావు, పార్టీ నాయకులు శిలగాన భాస్కరరావు, తడక జోగారావు, గురాల శ్రీను,యర్ర రజని ఉన్నారు. -
ఆగని ఆక్రమణలు
● జగనన్న కాలనీలో ఆక్రమణలకు గురవుతున్న ఖాళీ స్థలాలు ● పట్టించుకోని రెవెన్యూ అధికారులు సర్టిఫికెట్లు మంజూరు చేయలేదు మండలంలో ఈ మూడేళ్ల లో ఎవరికీ ఎలాంటి పొజిషన్ సర్టిఫికెట్లు మంజూరు చేయలేదు. కేవలం జగనన్న కాలనీకి సంబంధించిన లబ్ధిదారుల వివరాలు, ఆన్లైన్లో ఉన్న లబ్ధిదారుల వివరాలు సరి చూసి వారి అవసరమైన అనుమతులు ఇస్తున్నాం. ఆక్రమణలకు పాల్పడితే చర్యలు తీసుకుంటాం. – ఎన్.వెంకటరావు, తహసీల్దార్, ఇచ్ఛాపురం ఇచ్ఛాపురం: పురపాలక సంఘం పరిధిలో పేద ల కోసం గత ప్రభుత్వం హయాంలో ఇచ్చిన జగనన్న కాలనీలో ఖాలీ స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయి. దీనిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్ఛాపురం పురపాలక సంఘం రత్తకన్న పరిధిలోని ఐదు లేఅవుట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసి 1210 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను కేటాయించింది. ఈ లేఅవుట్లలో కాలనీ భవిష్యత్ అవసరాల కోసం పార్కులు, కమ్యూనిటీ భవనాలు నిర్మించేందుకు అనువుగా కొంత స్థ లాలను విడిచి పెట్టి కాలనీ నిర్మాణాలకు అవసరమైన వసతులను కల్పించింది. ఈ క్రమంలో ఈ రత్తకన్న లేఅవుట్లలో ఇప్పటికే 70 శాతం నిర్మాణాలు పూర్తి చేశారు. కూటమి ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించకపోవడంతో కొన్ని నిర్మాణాలు అసంపూర్తిగా మిగిలిపోగా.. మరి కొన్నింటిలో నిర్మాణ పనులు ప్రారంభించలేదు. కొన్ని చోట్ల ఖాళీ స్థలాలు ఉండగా.. వాటిపై టీడీపీ నాయకుల కన్ను పడింది. దీంతో జేసీబీలతో చదును చేయించి వాటిని స్వాహా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పట్టా లేకుండా నిర్మాణాలు ఎందుకు ప్రారంభించారని ప్రశ్నిస్తే.. నన్ను అడగడానికి మీరెవరు అంటూ ఎదురు తిరుగుతున్నారు. రెవెన్యూ సిబ్బంది పొజిషన్ సర్టిఫికెట్ జారీ చేశారని, అందుకే ఈ నిర్మాణాలు చేపడుతున్నట్లు టీడీపీ నాయకులు చెప్పుకొస్తున్నారు. అధికారులు పట్టించుకోవ డం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
శ్రీకాకుళం
ఆదివారం శ్రీ 21 శ్రీ జూన్ శ్రీ 2026నీటి మూటలు పట్టుకున్న నీలి మబ్బులు ఆకాశ వీధి నుంచి సిక్కోలుకు గొడుగు పట్టాయి. శనివారం సంధ్య వేళలో ఇలా కట్ట కట్టుకుని వచ్చిన మేఘాలు నగరాన్ని కమ్ముకున్నాయి. కానీ కాసిన్ని చినుకులు మాత్రమే చిలకరించి ఆశలపై నీళ్లు వదిలాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం నిలబడి చేసే ప్రాథమిక ఆసనాల్లో ఒకటి. దీన్ని క్రమం తప్పకుండా చేయడం వల్ల శరీర సమతుల్యత మెరుగవుతుంది. ఏకాగ్రత పెరిగి జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుంది. ఆసనంలో స్థిరంగా ఉండడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శరీరానికి మనస్సుకి ప్రశాంత ఇస్తుంది. ఈ ఆసనాన్ని రోజూ సాధన చేయడం వల్ల ఒత్తిడి తగ్గడం, జీర్ణక్రియ మెరుగుపడటం వంటి అనేక రకాల ఆరోగ్య ప్ర యోజనాలు ఉన్నాయి. నాడీ వ్యవస్థను ప్రశాంత పరుస్తుంది.భుజాల నుంచి చేతి వేళ్ల వరకు యాక్టివేషన్ జరుగుతుంది. తల కిందకి ఉండడం వల్ల మెదడు ఉత్తేజితమవుతుంది. వెన్నెముక, కాళ్లకు, చేతులకు బలం కలుగుతుంది. భుజాలు శక్తివంతమవుతాయి. కొవ్వు కరుగుతుంది. అతిమూత్రం, రక్తపోటు నివారిస్తుంది. పొట్ట పెరగకుండా అరికడుతుంది. వెన్నుపాముకు శిరస్సుకు రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. జీర్ణశక్తి వృద్ధి అవుతుంది. శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా కేంద్రంలో సో మవారం ఒలింపిక్ డే రన్ ర్యాలీని నిర్వహించనున్నట్టు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ప్రధాన కార్యదర్శి ఎం.సాంబమూర్తి, సలహాదారు పి.సుందరరావు తెలిపారు. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 22వ తేదీన ఉదయం 6 గంటలకు ఈ ఒలింపిక్ డే రన్ ర్యాలీ జరుగుతుందని చెప్పా రు. శ్రీకాకుళం నగరంలోని పొట్టి శ్రీరాములు జంక్షన్ నుంచి కళింగ రోడ్, వైఎస్సార్ సర్కిల్, పాలకొండ రోడ్, కృష్ణాపార్క్, డే అండ్ నైట్, అంబేడ్కర్ జంక్షన్ మీదుగా కోడిరామ్మూర్తి స్టేడియం వరకు ఈ ర్యాలీ కొనసాగుతుందన్నా రు. సమావేశం అనంతరం రన్ ముగుస్తుందని కృష్ణదాస్, సాంబమూర్తి తెలిపారు. ఆమదాలవలస: పట్టణంలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో అన్నదాత సుఖీభవ చెక్కును శనివారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, రాష్ట్ర పీయూసీ చైర్మన్ ఎమ్మెల్యే కూన రవికుమార్ రైతులకు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వీరు వీక్షించి అనంతరం నియోజకవర్గానికి చెందిన పలువురు రైతులకు అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం కింద మంజూరైన సహాయానికి సంబంధించిన పత్రాలు, నమూనా చెక్కులను సంయుక్తంగా పంపిణీ చేశారు. నరసన్నపేట: స్థానిక 108 వాహన సిబ్బంది విశ్రాంతి తీసుకు నే గదిలో శనివా రం విషసర్పం హల్చల్ చేసింది. దీంతో పెదిలాపు రమణయ్యతో పాటు ఇతర సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. భయంతో పామును హతమార్చారు. ఎప్పటికప్పుడు తాము ఉంటున్న వంశధార క్వార్టర్స్లోని గదిలోకి పాములు వస్తున్నాయని, గది శిథిలమైందని, వర్షం పడితే కారుతోందని, ఇక్కడ ఉండేందుకు భయంగా ఉందని సిబ్బంది అంటున్నారు. మరో మంచి గదిని కే టాయించాలని కోరుతున్నారు. శనివారం సా యంత్రం ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తికి విజ్ఞాపన పత్రమిచ్చామని రమణయ్య తెలిపారు. నరసన్నపేట: కేసులు రాజీ మార్గంలో పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ మంచి వేదిక అని ఫ్యామిలీ జిల్లా కోర్టు, మూడో అదనపు జిల్లా జడ్జి సీహెచ్ వివేకానంద్ శ్రీనివాస్ అన్నా రు. స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో శనివారం న్యాయవాదులు, పోలీసు అధికారులకు లోక్ అదాలత్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ జూలై 11 న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని, ఇందులో నరసన్నపేట కోర్టుకు సంబంధించిన కేసులు వీలైనన్ని పరిష్కరించే విధంగా చూడాలని సూచించారు. సబ్జైల్ పరిశీలన.. అవగాహన కార్యక్రమం అనంతరం స్థానిక సబ్జైల్ను జిల్లా న్యాయసేవాధికార సంస్థ కా ర్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి హరిబాబుతో కలిసి పరిశీలించారు. జైల్లో రిమాండ్ ఖైదీలకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెనుక స్థానిక సివిల్ జడ్జి కోర్టు జడ్జి ఎస్.వాణి, జైలు సూపరింటెండెంట్ విజయకుమార్ తదితరులు ఉన్నారు. మెదడు నిండా ఆలోచనలు.. మనసు నిండా భయాలు.. లేనిపోని ఆందోళనలు.. కొత్త తరం ఎదుర్కొంటున్న సమస్యలివి. డిప్రెషన్, నిద్ర లేమి, అతిగా ఆలోచించడం, ఏకాగ్రత లేకపోవడం.. ఇలాంటి సమస్యలన్నీ ఇదివరకు కంటే బాగా పెరిగిపోయాయి. వీటన్నంటికీ యోగా చక్కటి సమాధానమని నిపుణులు సూచిస్తున్నారు. నేడు యోగా దినోత్సవం. ఆసనాలతో ఆలోచనలు మారుతాయని, యోగాతో జీవన శైలి మెరుగవుతుందని చెబుతున్నారు. – శ్రీకాకుళం కల్చరల్ గత 39 ఏళ్లుగా యోగా సాధన చేస్తున్నాను. వందల మందికి యోగా నేర్పించాను. 78 ఏళ్లు వచ్చినా యువకులతో సమానంగా 108 సూర్య నమస్కారాలు చేయిస్తుంటాను. – ఎంవీ రామారావు, విశ్రాంత ఏఈ, బీఎస్ఎన్ఎల్, శ్రీకాకుళం యోగాతో ఎలాంటి ఆరోగ్య సమస్యలనైనా ఎదుర్కోవచ్చు. అన్ని ఆరోగ్య సమస్యలకు ప్రత్యేక యోగాభ్యాసాలు ఉన్నాయి. డాక్టర్లు కూడా యోగ విద్యను అభ్యసిస్తున్నారు. – మావురి నాగేశ్వరరావు, యోగా గురువు శ్రీకాకుళం రూరల్: ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ శాఖ బృందం సభ్యులు హెచ్చరించారు. శుక్రవారం సింగుపురంలోని గౌతమి ట్రేడర్స్ షాపులో తనిఖీలు నిర్వహించారు. ఎరువుల ధరల పట్టికలు ఏర్పాటు చేయాలని, రోజువారీ విక్రయాలను మండల వ్యవసాయాధికారికి తెలియజేయాలన్నారు. ఎరువులతోపాటు ఇతర వస్తువులు అంటగట్టరాదని, బిల్లుపుస్తం, ఇన్వాయిస్లు తప్పనిసరిగా షాపులో అందుబాటులో ఉంచాలని సూచించారు. -
నీట్ రీ–ఎగ్జామ్కు ఏర్పాట్లు పూర్తి
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో ఆదివారం జరగనున్న నీట్– 2026 రీ–ఎగ్జామ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలో నాలుగు పరీక్ష కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. శ్రీకాకు ళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీ, కేంద్రీయ విద్యాల యం పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి. పరీక్ష కేంద్రంలో వసతులు, ఫర్నీచర్, సీసీ కెమెరాల నిఘా, భద్రతా ఏర్పాట్లను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, ఇతర అధికారులు పరిశీలించారు. నాలుగు పరీక్ష కేంద్రాల్లో మొత్తం 2,112 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారు. ట్రిపుల్ ఐటీ లో 720 మంది, ఆర్ట్స్ కళాశాలలో 696 మంది, కేంద్రీయ విద్యాలయంలో 447 మంది, ప్రభుత్వ పాలిటెక్నిక్లో 240 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. మే 3వ తేదీన నీట్–2026 ఎగ్జామ్ జరగగా.. పరీక్ష ప్రశ్నాపత్రాలు లీకేజీ అయిన ఉదంతంతో పరీక్షను రద్దుచేసిన విషయం తెలిసిందే. దీంతో ఎట్టకేలకు మళ్లీ నీట్ రీ–ఎగ్జామ్ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఉదయం 11 నుంచి లోపలకు అనుమతి.. నీట్ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు జరగనుంది. అభ్యర్థులను ఉదయం 11 గంటల నుండి లోపలకు అనుమతించనున్నారు. మ ధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే లోపలకు అనుమతిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. మధ్యాహ్నం 1.30 దాటిన తర్వాత నిమిషం ఆలస్యమైనా ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి రానిచ్చేది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కేంద్రం లోపల కేవలం చీఫ్ సూపర్వైజర్కు మా త్రమే మొబైల్ అనుమతిస్తున్నారు. విద్యార్థులు ఎలక్ట్రానిక్ వస్తువులు, పరికరాలు తీసుకురావడానికి వీల్లేదని అధికా రులు హెచ్చరిస్తున్నారు. మౌలిక సదుపాయాలు తప్పనిసరి.. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థుల సౌకర్యార్థం తాగునీరు, ఎండదెబ్బ తగలకుండా టెంట్లు, ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షలు అత్యంత పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు విద్యార్థులంతా అధికారులకు సహకరించాలని కలెక్టర్ కోరారు. నీట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట భద్రత శ్రీకాకుళం క్రైమ్ : నీట్ (యూజీ) –2926 పునఃపరీక్షను ప్రశాంతంగా, పారదర్శకంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా జరిపేందుకు పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్తో కలసి ఎస్పీ ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీ, ప్రభుత్వ పాలిటెక్నిక్, కేంద్రీయ విద్యాలయ, ఆర్ట్స్ కళాశాలలోని పరీక్ష కేంద్రాలను సందర్శించారు. సీసీ కెమెరాలు, నిఘా, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నాలుగు పరీక్ష కేంద్రాలకు డీఎస్పీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో ప్రతి కేంద్రానికి ఓ సీఐ, ఎస్ఐ స్థాయి అధికారులతో పాటు పోలీసు సిబ్బందిని నియమిస్తామన్నారు. అభ్యర్థులు ముందుగా రావాలి.. సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు వంటి పరికరాలు అనుమ తి లేకుండా కేంద్రాల వద్ద డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు ద్వారా తనిఖీలు నిర్వహించి అభ్యర్థులకు లోపలికి అనుమతిస్తామన్నారు. కేంద్రాల సమీపంలో జిరాక్స్ షాపులు, అనధికార కార్యకలాపాలు జరగకుండా ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఆమదాలవలస రైల్వేస్టేషన్, శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేశామని తెలిపారు. అభ్యర్థులకు తోడుగా వచ్చేవారు గూమిగూడకుండా సహకరించాలని, ఎవరైనా అనుమానాస్పదంగా వ్యవహరించినా పరీక్ష నిబంధనలు ఉల్లంఘించేందుకు ప్రయత్నించినా చట్టపరమైన చర్యలుంటాయన్నారు. హాల్టికెట్లలో పేర్కొన్న నియమాలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, చిన్న ఘటనలు జరిగినా తక్షణమే 112కు సమాచారమివ్వాలని ఎస్పీ తెలిపారు. -
సునీల్కుమార్ అరెస్టు ఓ చీకటి దినం
● బీసీలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వేధింపులు ● వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంవి. స్వరూప్ శ్రీకాకుళం (పీఎన్కాలనీ): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, బీసీ నాయకుడు కానుమూరి సునీల్కుమార్ అరెస్ట్ ఓ చీకటి దినంగా భావిస్తున్నామని పార్టీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంవీ స్వరూప్ అన్నా రు. శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో స్వరూప్ మాట్లాడు తూ మద్యాన్ని అక్రమంగా రవాణా చేశారంటూ బీసీ వర్గం యాదవ కులానికి సునీల్కుమార్ను అరెస్టు చేయడం దారుణమని మండిపడ్డారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేస్తే కూట మి ప్రభుత్వంలో ఆయావర్గాల ప్రజలను అణచి వేయడం దుర్మార్గమన్నారు. 2019లో బీసీ వర్గానికి చెందిన కానుమూరు నాగేశ్వరరావు మంత్రిగా గొ ప్ప సేవలందించారని, ఆయన కుమారుడు సునీల్ కుమార్ ఉన్నత విద్యావంతుడని చెప్పారు. అలాంటి వారిని జైల్లో పెట్టి మానసికంగా, ఆర్థికంగా దెబ్బ కొట్టడం సరికాదన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో 200 ఓట్లు కూడా లేని చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు అందించి బీసీలకు అన్యాయం చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో కాపుల్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని, ఇదే పరిస్థితి కొనసాగిస్తే కాపుల నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. ●యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మార్పు పృథ్వీరాజ్ మాట్లాడుతూ ఇవి నకిలీ మద్యం కేసులు కాదని, నారా నకిలీ కేసులని పేర్కొన్నారు. 30 శాతం వైన్ షాపులను తగ్గించి బెల్ట్ షాప్ అనేది లేకుండా చేసిన ఘనత జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. ●యువజన విభాగం జిల్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోత సతీష్ మాట్లాడుతూ ఎన్నికల హామీలు అమలుచేయడం చేతకాక ప్రశ్నించేవారిపై కేసులు పెడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. సమావేశంలో యువజన విభాగం శ్రీకాకుళం నగర అధ్యక్షుడు ఎం.భరద్వాజ్, పవన్ కళ్యాణ్, రౌతు సూర్యనారాయణ, బాలి శ్రీనివాసులునాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ఇచ్ఛాపురం.. ఇష్టానుసారం!
● ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ‘సర్’ నిర్వహణ తీరుపై అనుమానాలు ● అధికారులను ఆశ్రయించిన వైఎస్సార్ సీపీ నేతలు కంచిలి: ఇచ్ఛాపురం నియోజకవర్గంలో జరుగుతున్న ‘సర్’ కార్యక్రమంలో పారదర్శకతపై అనుమానా లు వ్యక్తమవుతున్నాయి. ఫారాల పంపిణీలో జా ప్యం, టీడీపీ నేతల మితిమీరిన జోక్యం, వారికి సంబంధించిన బీఎల్ఏల రుబాబు.. కలగలిపి ‘సర్’ నిర్వహణ తీరును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఎంతో పారదర్శకంగా చేపట్టాల్సిన సర్ ప్రక్రియ కొందరు బీఎల్ఓలు మెతక వైఖరి, టీడీపీ నేతల అజమా యిషీతో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇచ్ఛాపురం నియోజకవర్గం పరిధిలో సోంపేట పట్టణంలో వైఎస్సార్ సీపీ బూత్ లెవెల్ ఏజెంట్లకు వారు దరఖాస్తులో కోరిన చోట కాకుండా వేరే చోట్ల బూత్లు కేటాయించారు. తీరా అక్కడకు వెళ్తే టీడీపీ బీఎల్ఏలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సోంపేటలో అయితే ఓ టీడీపీ నేత బూతులు తిట్టాడు. పైగా అతడు బూత్ ఏజెంట్ కూడా కాదు. కంచిలి మండలం పురుషోత్తపు రం పంచాయతీ పరిధి ఆర్.గెద్దలపాడు గ్రామంలో 37 ఇళ్లకు ఇప్పటికీ ఫారాలు ఇవ్వలేదు. ఓ మండపంపై కూర్చుని అందరినీ అక్కడికే పిలిపించుకోవ డం కనిపించింది. పెద్దశ్రీరాంపురం గ్రామంలో ఓటర్కు ఇచ్చిన రెండు ఫారమ్స్ నింపిన వాటిని బీఎల్ఓ తీసుకెళ్లి, వాటిని అప్లోడ్ చేసి తిరిగి ఇస్తా మని చెబుతున్నారు. వాస్తవానికి ఆ ఫారమ్స్ను ఓటరు ఇంటి వద్దే అప్లోడ్ చేసి, అక్నాలెడ్జ్ మెంట్ను తిరిగి ఓటరుకు ఇవ్వాల్సి ఉంది. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఈ విషయమై ఇచ్ఛాపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్రెడ్డి సోంపేట తహసీల్దార్ అప్పలస్వామిని శుక్రవారం సాయంత్రం కలిసి పరిస్థితిని వివరించారు. మరోవైపు కంచిలి ఎంపీపీ పైల దేవదాస్రెడ్డి ఆర్.గెద్దలపాడు గ్రామంలో బీఎల్ఓ తీరును స్థానిక తహసీల్దార్ ఎన్. రమేష్కుమార్ దృష్టిలో పెట్టినట్లు తెలిపారు. సర్ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా చేపట్టాలి. ఓటర్లకు అవగాహన కల్పిస్తూ ప్రక్రియ కొనసాగించాలి. ఎటువంటి పక్షపాత వైఖరి లేకుండా అధికారులు నడిపించాలి. – సాడి శ్యాంప్రసాద్రెడ్డి, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, ఇచ్ఛాపురంకంచిలి మండల పరిధిలో సర్ ప్రక్రియ లోపభూయిష్టంగా ఉంది. పలు గ్రామా ల్లో ఇప్పటికీ ఎన్యుమరేషన్ ఫారమ్స్ పంపిణీ చేపట్టలే దు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఆర్.గెద్దలపాడు గ్రామంలో 37 కుటుంబాలకు ఇప్పటికీ ఎన్యుమరేషన్ ఫారమ్స్ బీఎల్ఓ పంపిణీ చేయలేదు. – పైల దేవదాస్రెడ్డి, ఎంపీపీ, కంచిలి -
30 కిలోల గంజాయితో ఇద్దరు అరెస్టు
ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ సమీపంలో గంజాయిని అక్రమంగా తరలించేందుకు ప్రయ త్నించిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు సీఐ మీసాల చిన్నంనాయుడు తెలిపారు. తన కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడా రు. మహారాష్ట్ర అహిల్యనగర్ జిల్లా, జామ్ఖేద్ కి చెందిన శంకర్ చంద్రకాంత్ పవార్, నవీముంబై థా నే జిల్లా, భుతవాలీగామ్ కి చెందిన సునీత విజయ్ కాలే అనే మహిళ ఇద్దరూ కలసి లగేజి బ్యాగ్లతో ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్కి వస్తుండగా తనిఖీలు నిర్వహిస్తున్న పట్టణ పోలీసులకు పట్టుబడ్డారు. వీరి ఆర్థి క పరిస్థితి బాగులేకపోవడంతో ముంబైలో గంజా యి వ్యాపారం చేసే దీపక్ అశోక్ పవార్ అనే వ్యక్తిని ఆశ్రయించారు. ఒడిశా నుంచి గంజాయి వ్యాపారి సూచించిన వ్యక్తి వద్ద నుంచి గంజాయి తీసుకొచ్చి తనకి అందజేస్తే తీసుకొచ్చిన ప్రతి సారి రూ.10 వేలు ఇస్తానన్నాడు. దీనికి నిందితులు ఇద్దరూ అంగీకరించి ఒడిశాలో మార్షల్ లిమ్మా అలియాస్ రాజే ష్ వద్ద నుంచి గంజాయిని తీసుకెళ్లి ఇప్పటికే మూ డు సార్లు గంజాయి వ్యాపారికి అందజేశారు. ఇదే క్రమంలో ఈనెల 12 వ తేదీన గంజాయి కోసం విశాఖపట్టణం చేరుకున్నారు. అక్కడి నుంచి గంజా యి సరఫరా చేసే వ్యక్తికి ఫోన్ చేయగా బరంపురంలో పోలీసులు తనిఖీలు ఎక్కువగా ఉన్నాయని 20 వ తేదీన ఇచ్ఛాపురంలో ఉంటే అక్కడికి తీసు కొచ్చి సరుకు అందజేస్తానని చెప్పాడు. దీనికి వీరు విశాఖపట్టణంలో ఐదు రోజులు ఉండి అక్కడి నుంచి బ రంపురం చేరుకున్నారు. బరంపురంలో రెండు రోజులు బస చేసి శనివారం ఇచ్ఛాపురం చేరుకున్నా రు. వీరు గంజాయి సరఫరా చేసే వ్యక్తి రాజేష్కి ఫో న్ చేయగా ఉదయం ఒక లగేజి బ్యాగ్, రెండు చేతి బ్యాగ్లతో 30.600 కిలోల గంజాయిని ఎల్సీగేట్ వద్ద అందజేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వీరిద్ద రూ లగేజ్తో రైల్వేస్టేషన్కి వస్తుండగా పట్టణ పోలీసులకు తనిఖీల్లో పట్టుబడ్డారు. వీరి నుంచి రెండు సెల్ఫోన్లు, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. -
జీవనాధారమే ప్రాణం తీసింది
● గొర్రెలను రక్షించబోయి కాపరి మృతి ● ప్రాణాలు కోల్పోయిన 30 గొర్రెలు ● రెడ్డిపేటలో విషాద ఛాయలు పొందూరు: జీవనాధారమే ఆ కాపరి ప్రాణాలు పోయేలా చేసింది. 40 ఏళ్లుగా గొర్రెల పెంపకాన్ని నమ్ముకుని బతుకుతున్న ఆ వ్యక్తి ఆ గొర్రెలను రక్షించే క్రమంలో తన ప్రాణాలు కోల్పోయారు. పొందూరు– జి.సిగడాం మండలాల సరిహద్దు రైలు పట్టాలకు సమీపంలో ఉన్న గొర్రెల మందలో నుంచి కొన్ని గొర్రెలు అకస్మాత్తుగా రైలు పట్టాలపైకి వెళ్లడంతో శనివారం ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 30 గొర్రెలు, గొర్రెల కాపరి అక్కడికక్కడే మృతి చెందారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. పొందూరు మండలంలోని రెడ్డిపేట(పుల్లాజీపేట) గ్రామానికి చెందిన శనగల పోతయ్య(47) గొర్లె కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. సుమారు 4 దశాబ్దాలుగా ఇదే వృత్తిలో ఉన్నారు. ఎప్పటిలాగానే ఆయన శనివారం గొర్రెల మందను వాండ్రంగి సమీపంలోని రైలు పట్టాల వద్దకు మేత కోసం తీసుకెళ్లారు. అకస్మాత్తుగా కొన్ని గొర్రెలు రైలు పట్టాలమీదకు వెళ్లిపోయాయి. అదే సమయంలో అతివేగంగా వస్తున్న రైలును గమనించి పోతయ్య పరుగు పరుగున పట్టాలపైకి వెళ్లారు. గొర్రెలను రక్షించే క్రమంలో తన సంగతి మర్చిపోయాడు. రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. 30 గొర్రెలూ చనిపోయాయి. మృతునికి భార్య మంగమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోతయ్య మృతి విషయాన్ని తెలుసుకున్న భార్య కుమారులు పట్టాల వద్దకు వచ్చి కన్నీరుమున్నీరుగా విలపించారు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. -
34 బెల్టుషాపులపై కేసులు
● 40.32 లీటర్ల అనధికార మద్యంసీజ్ ● బహిరంగంగా మద్యం సేవిస్తున్న 9 మందిపై కేసులు శ్రీకాకుళం క్రైమ్ : సాక్షి దినపత్రికలో ఈ నెల 19న వచ్చిన ‘నేతలు.. మేతలు’ కథనానికి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ యంత్రాగం స్పందించింది. మద్యం ఎమ్మార్పీపై అదనపు వసూలు, బెల్టుషాపుల్లో విక్రయాలు, అడుగడుగునా అక్రమ మద్యం, అక్రమ వసూళ్లు, నేతలు దర్జాగా దోచేస్తున్న వైనంపై శనివారం ఒక్కరోజే జిల్లావ్యాప్తంగా 34 బెల్టుషాపులపై ఎకై ్సజ్ శాఖ కేసులు నమోదు చేశారు. 40.32 లీటర్ల అక్రమ మద్యాన్ని సీజ్ చేశారు. బహిరంగంగా మద్యం సేవిస్తున్న 9 మందిపై కేసులు నమోదు చేశారు. నెలాఖారువరకు స్పెషల్ డ్రైవ్.. రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కమిషనర్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆదేశాలతో ఈ నెలాఖరు వరకు అనధికార మద్యం అమ్మకాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా డిప్యూటీ కమిషనర్ డి.శ్రీకాంత్రెడ్డిత తెలిపారు. అసిస్టెంట్ కమిషనర్ పి.రామచంద్రరావు పర్యవేక్షణలో జిల్లా ఎకై ్సజ్ అధికారి సీహెచ్ తిరుపతినాయుడు ఆధ్వర్యంలో ఈ డ్రైవ్ జరుగుతుందన్నారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్ఫలితాలపై ప్రజలకు ముఖ్యంగా యువతకు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తామన్నారు. ఇందులో భాగంగా చర్చలు, సమావేశాలు, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. -
మోసపోతే మౌనమెందుకు?
శ్రీకాకుళం క్రైమ్ : కొన్నాళ్ల క్రితం జిల్లా డీఎంహెచ్వో కార్యాలయంలో ఓ హెల్త్ అసిస్టెంట్ ఓ వివాహిత వద్ద రూ.4.50 లక్షలు తీసుకుని ఫేక్ ఆర్డర్ కాపీ ఇచ్చి ఉద్యోగమని నమ్మించాడు. అక్కడే ఓ జూనియర్ అసిస్టెంట్గా పనిచేసే మహిళ వద్ద రోజూ ఫేక్ అటెండెన్సు రిజిస్టర్లో సంతకాలు పెట్టించి కొన్నాళ్లు జీతం ఇచ్చి ఆపై జాబిచ్చానన్న నెపంతో సదరు మహిళను శారీరకంగా లోబర్చుకున్నాడు. ఉద్యోగానికి సంబంధించి విధులు లేకుండా ఇలా చేస్తుండటంతో అనుమానమొచ్చిన బాధితురాలు డీఎంహెచ్వోను కలిశాక అసలు విషయం బయటపడింది.. అతనిచ్చింది జాబ్కాదని.. ఆ నెపంతో తనను మోసం చేశాడని తెలుసుకుని నిర్ఘాంతపోయింది. ఇదే పరిస్థితి అనేక చోట్ల ఉంది. దాదాపు అనేక ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థల్లో మహిళలు, విద్యార్థినులు నిత్యం ఇలాంటి లైంగిక వేధింపుల సమస్యలు ఎదుర్కొంటున్నా బయటకు చెప్పుకోలేక.. ఫిర్యాదు చేసినా న్యాయం జరుగుతుందో లేదోనని, అనవసరంగా పరువు పోతుందేమోనని భయపడుతున్నారు. ఇంటి నుంచి కాలు బయటపెట్టింది మొదలు ఆకతాయిల నుంచి టార్చర్ మొదలు. మరి మహిళల భద్రతకు చట్టం ఎలా నిలుస్తుదన్నది ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఆవవ్యకత ఎంతైనా ఉంది.. చట్టం కిందకు వచ్చేవివే.. లైంగిక వ్యాఖ్యలు, అసభ్య దూషణ, అసభ్య చూపులు, అవసరం ఉన్నా లేకున్నా అనుమతి లేకుుండా తాకరాదు. ఫోన్లో ఎస్ఎంఎస్, వాట్సాప్, ఈ–మెయిల్, ఫేస్బుక్, ఇన్స్ర్ట్రాగామ్లో అసభ్య, అభ్యంతరకర సందేశాలు పంపరాదు. ఉద్యోగం, పదోన్నతి కల్పన ఆసర చేసుకుని లైంగిక అనుకూలతలుగా మార్చుకోవడం వేధింపుల చట్టం కిందే వస్తాయి. కమిటీలూ ఉంటాయి.. ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు, కర్మాగారాలు, పాఠశాలలు, కళాశాలలు, షాపింగ్మాల్స్, దుకాణాలు, ఇతరత్రా రంగాల్లో 10 మంది కంటే ఎక్కువ మంది పనిచేస్తే అక్కడ అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయాలి. కమిటీలో చైర్పర్సన్గా సీనియర్ మహిళా అధికారి, ఇద్దరు సభ్యులు, సామాజిక కార్యకర్త ఉంటారు. పనిచేసే చోట లైంగిక వేధింపులకు గురైతే విచారణ చేపట్టడం, ఆరోపణ నిర్ధారణ అయితే చర్యలు సూచించడం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఈ కమిటీల విధులు. న్యాయం జరుగుతుందిలా..! బాధితురాలు ఘటన జరిగిన మూడు నెలల్లోపు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. లైంగిక వేధింపుల నివారణ హెల్ప్లైన్ నెంబర్ 181కు కాల్ చేసి వివరాలు తెలియజేయవచ్చు. ఫిర్యాదు అందుకున్న 90 రోజుల్లో కమిటీ విచారణ పూర్తి చేసి నివేదికను ఉన్నతాధికారికి అందిస్తుంది. నేరం నిర్ధారణ అయ్యిందంటే నేరస్థితిని బట్టి హెచ్చరించడం, సస్పెన్షన్, తొలగింపు వంటివి చేస్తారు. ఉద్యోగోన్నతి, శాలరీ నిలుపుదల చేసి బాధితురాలికి నష్టపరిహారం అందిస్తారు.. -
‘నిబంధనలు ఉల్లంఘిస్తే సహించేది లేదు’
నరసన్నపేట: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎస్ఐఆర్ కార్యక్రమం జరుగుతుందని దీంట్లో పోలింగ్ బూత్ స్థాయి అధికారు లు, ఆపై అధికారులు నిబంధనలు ఉల్లంఘిస్తే చూస్తూ ఊరుకోబోమని ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ ‘సర్’ కార్యక్రమం జిల్లా ఇన్చార్జి కుంబా రవిబాబు అన్నారు. నరసన్నపేట నియోజకవర్గ పరిధిలోని పోలాకి మండలం కుసుమపోలవలస, నరసన్నపే ట మండలం సత్యవరం గ్రామాల్లో సర్ కార్యక్ర మం క్షేత్ర స్థాయిలో జరుగుతున్న తీరును ఆయన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్తో కలసి శనివారం పరిశీ లించారు. బీఎల్ఓను అడిగి సర్ కార్యక్రమం నిర్వహిస్తున్న తీరును తెలుసుకున్నారు. నిబంధనలు పాటించాలని, అర్హులను ఓటరు జాబితా నుంచి తొలగిస్తే మాత్రం ఊరుకోబోమని హెచ్చరించా రు. పార్టీ బూత్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఓటర్లకు ఇచ్చే ఎన్యూమరేషన్ ఫారాలు ఒకటి ఓటరు వద్దే ఉండాలని, అప్పుడే మనకు బలం అని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి పౌరుని కీ ఓటు హక్కు ఉండాలన్నారు. వారి వెంట మాజీ డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, ఎంపీపీ ఆరంగి మురళి, పార్టీ బూత్ కమిటీ జిల్లా అధ్యక్షులు దోమ మన్మధరావు ఉన్నారు. -
రెవెన్యూ శాఖ సేవలు భేష్
శ్రీకాకుళం పాతబస్టాండ్: కాగితంపై ఉండే వివరాలు, క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులను సరిగ్గా బేరీజు వేసి ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావడంలో రెవెన్యూ వ్యవస్థ సమర్థంగా పని చేస్తోందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు. శనివారం శ్రీకాకుళం నగరంలోని బాపూజీ కళామందిర్లో రెవెన్యూ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, ఫలితాల ఆధారిత సేవలందించడమే ప్రతి రెవెన్యూ ఉద్యోగి లక్ష్యంగా ఉండాలన్నారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ మాట్లాడుతూ బాధ్యతాయుతంగా, పారదర్శకంగా విధులు నిర్వర్తించాలన్నారు. అనంతరం ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. సమావేశంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, ఆర్డీఓ కె.సాయిప్రత్యూష, డిప్యూటీ కలెక్టర్లు పద్మావతి, జి.జయదేవి, సివిల్ సప్లయ్ డీఎం వేణుగోపాల్, కలెక్టరేట్ పరిపాలన అధికారి సూర్యనారాయణ, రిటైర్డ్ జేసీ–2 రజనీకాంతరావు, రిటైర్డ్ ఆర్డీఓ పీఎంజే బాబు, సెక్షన్ సూపరింటెండెంట్ నాగేశ్వరరెడ్డి, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు గణపతిరావు, తదితరులు పాల్గొన్నారు. -
పారదర్శక ఓటరు జాబితా లక్ష్యం
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)–2026 కార్యక్రమంలో భాగంగా బూత్ లెవెల్ అధికారులు ఇంటింటా సర్వేలు చేసి కచ్చితమైన ఓటరు జాబితా రూపొందించేందుకు కృషి చేయాలని శ్రీకాకుళం రెవెన్యూ డివిజినల్ అధికారి కె.సాయిప్రత్యూష అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జూలై 14 వరకు సర్వే కొనసాగుతుందన్నారు. ఓటర్లకు ఫారాలు అందించి నిబంధనల ప్రకారం వివరాలు నమోదు చేయాలన్నారు. ఈ క్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకారం అందించాలని కోరారు. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ జూలై 21న ఉంటుందని, తర్వాత అభ్యంతరాలు తెలియజేయవచ్చన్నారు. అభ్యంతరాలపై జిల్లా ఎన్నికల అధికారి, ప్రధాన ఎన్నికల అధికారికి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. సమావేశంలో అర్బన్ ఏపీసీ జానకి, ఎన్నికల డీటీ జి.కె.శ్రీనివాసరావు, నాయకులు ఐ.టి.కుమార్, రమేష్, పైడి వేణుగోపాల్, ఈశ్వరి, పి.ఎం.జె.బాబు, శంకర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
యోగాతో ఆరోగ్యకర సమాజం
శ్రీకాకుళం కల్చరల్: ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ యోగాసనాలను జీవితంలో భాగం చేసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు అన్నాదొరై పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని కార్గిల్ పార్కులో గిరిజన సంక్షేమ శాఖ, ఏపీఈపీడీసీఎల్ శాఖల ఆధ్వర్యంలో ఆయుష్ శాఖ సమన్వయంతో ప్రత్యేక యోగ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాతో మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు. ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ జీఎన్ ప్రసాద్ మాట్లాడుతూ నిరంతరం యోగాసనాలు సాధన చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా రోజంతా ఉత్సాహంగా ఉంటుందన్నారు. జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ ఉత్తమ్రాజ్ రాణా మాట్లాడుతూ రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఒత్తిడి, ఆందోళనలను తగ్గించడంలో యోగా, ధ్యానం కీలక పాత్ర పోషిస్తాయన్నారు. సమావేశంలో అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
సునీల్కుమార్ అరెస్టు అక్రమం
కంచిలి : మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు, బీసీ యువ నాయకుడు సునీల్ను అక్రమంగా అరెస్టు చేయడం తగదని ఎమ్మెల్సీ నర్తు రామారావు ఆరోపించారు. కంచిలిలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనపై నిప్పులు చెరిగారు. టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ ప్రజల దృష్టిని మళ్లించేందుకు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం శోచనీయమన్నారు. కారుమూరి సునీల్కుమార్ను అరెస్ట్ చేయటం దుర్మార్గ చర్యగా అభివర్ణించారు. లేని మద్యం కుంభకోణాన్ని సృష్టించి వైఎస్సార్ సీపీ నేతలను వేధిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ హయాంలో మద్యం విక్రయాలు పారదర్శకంగానే జరిగాయని చెప్పారు. 2014–19 మధ్య కాలంలో రాష్ట్రంలో అంతులేని మద్యం అక్రమాలు జరిగాయని, వాటి నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రస్తుతం లేని మద్యం స్కామ్ సృష్టించి అక్రమ కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయికృష్ణ లాకప్డెత్, క్రాంతికుమార్ ఆత్మహత్య, డీఎస్సీ–25లో అంతులేని అక్రమాలు, అవినీతి, అమరావతిలో వేలాది మంది రైతుల్లో వ్యతిరేకత, ఆక్వా రైతుల ఉద్యమాలు.. ఇలా టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు నీచ రాజకీయాలకు తెగబడ్డారని మండిపడ్డారు. టీడీపీ అక్రమ అరెస్టులు ఆపకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. సమావేశంలో పార్టీ నేతలు రామదాసు తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి వేతనదారులపై తేనెటీగల దాడి
సంతబొమ్మాళి : నౌపడలో ఒరేమాడు చెరువులో శనివారం ఉపాధి హామీ పథకం పనులు చేస్తుండగా 16 మంది వేతనదారులపై తేనెటీగలు దాడి చేశాయి. బాధితులను నౌపడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించగా స్టాఫ్ నర్సులు ధనలక్ష్మి, అమర వైద్యం అందించారు. ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. రైలులో గుర్తు తెలియని వ్యక్తి మృతి పలాస: పలాస రైల్వే స్టేషన్ పరిధిలో గుణుపూర్–కటక్ ప్యాసింజర్ రైలులో గుర్తు తెలియని వ్యక్తి శనివారం ప్రయాణిస్తూ ఆకస్మికంగా మృతిచెందాడు. మృతుడి వయస్సు 45 నుంచి 50 ఏళ్లు ఉంటుందని, ఎరుపు టీ షర్ట్, నలుపు ఫ్యాంట్ ధరించాడని రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. గాలివాన బీభత్సం హిరమండలం: ఎల్.ఎన్.పేట, హిరమండలం మండలాల్లో శనివారం గాలివాన బీభత్సం సృష్టించింది. పలు గ్రామాల్లో చెట్లు విరిగిపడ్డాయి. పొలాల్లో భారీగా నీరు చేరింది. ఇప్పటికే ఖరీఫ్లో జల్లిన విత్తనాలు నీట మునిగాయి. దబ్బగూడలో పూరిల్లు నేలకొరిగింది. ఎంటీఎస్ టీచర్లను ఇబ్బందిపెట్టొద్దు శ్రీకాకుళం : డీఎస్సీ–2008, 1998 ఎంటీఎస్ టీచర్ల నియామకం జరిగినప్పటి నుంచి రాష్ట్ర విద్యాశాఖ ప్రతి సంవత్సరం వారిని వర్క్ అడ్జెస్ట్మెంట్, బదిలీల పేరుతోనూ స్థాన చలనం చేయడం తగదని డీటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు పేడాడ కృష్ణారావు, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పూజారి హరిప్రసన్న, ఎన్ని వెంకటప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరంలోనూ జూన్ 22లోపు వారి స్థాన చలనం కోసం రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల అభ్యంతరం చేశారు. ప్రతిసారీ సుదూర ప్రాంతాల పాఠశాలలకు పంపించడంతో వారి కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మొదట్లో నియామకం చేసినప్పుడు వారి సొంత మండలంలోనే పోస్టింగ్ ఇచ్చారని, ఆ తర్వాత పక్క మండలాలు, డివిజన్ కూడా దాటి పంపించడం సరికాదన్నారు. విద్యా శాఖ అవసరాన్ని బట్టి జిల్లాలో ఎక్కడికి వేస్తారో తెలియని పరిస్థితి నెలకొనడంతో ఆందోళన చెందుతున్నారని, వారికి ఇచ్చే జీతం తక్కువ కావడం, మిగిలిన సర్వీస్ కూడా తక్కువే ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి సాయం శ్రీకాకుళం క్రైమ్ : గుండెపోటుతో మరణించిన ఇచ్ఛాపురం హెడ్ కానిస్టేబుల్ తమ్మినేని ప్రసాద్ కుటుంబానికి జిల్లా పోలీస్ అసోసియేషన్ డెత్ రిలీఫ్ ఫండ్ నుంచి రూ. లక్ష ఆర్థిక సాయం అందించారు. ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.కృష్ణంనాయుడు ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులు శనివారం నగరంలోని సంపత్బాలాజీనగర్లో నివాసముంటున్న ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించారు. సతీమణి లక్ష్మికి ధైర్యం చెబుతూ అసోసియేషన్, జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ట్రెజరర్ కె.భుజంగరావు పాల్గొన్నారు. -
21 డచ్ భవనం వద్ద ప్రపంచ యోగా దినోత్సవం
శ్రీకాకుళం పాతబస్టాండ్: డచ్ భవనం వద్ద ఈ నెల 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం తెలిపారు. 21వ తేదీన ఉదయం 6.30 గంటలకు యోగా కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, విద్యార్థులు, ప్రజలు పాల్గొని ప్రపంచ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ పాతపట్నం: ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచాలని సాంఘిక సంక్షే మ గురుకుల జిల్లా సమన్వయాధికారి(డీసీఓ) వై.యశోద లక్ష్మి అన్నారు. మండలంలోని ప్రహారాజపాలెంలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలను శుక్రవా రం తనిఖీ చేశారు. భోజనాలను పరిశీలించా రు. వంటశాల, నిత్యావసర సరుకులు, ఎక్స్పైరీ డేట్లను తనిఖీ చేశారు. వంటగదిని నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి ఆదేశించారు. ఆమెతో పాటు ప్రిన్సిపాల్ పి. పద్మావతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పోలీసుల సంక్షేమమే ముఖ్యం శ్రీకాకుళం క్రైమ్ : పోలీసు సిబ్బందిలో ఆత్మవిశ్వాసం, సంక్షేమమే డయల్ యువర్ ఎస్పీ పోలీసు గ్రీవెన్స్ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఫోన్లో నేరుగా సిబ్బందితో మాట్లాడి వృత్తిపరమైన, వ్యక్తిగత సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ‘భోగాపురం తర్వాత ఆస్పత్రిపై దృష్టి పెడతా’ శ్రీకాకుళం : రిమ్స్ను జిల్లాలోనే ఉత్తమ సేవలు అందించే ఆస్పత్రిగా తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. బల గలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి అక్షర సమావేశ మందిరంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి రూ.4 కోట్ల ముప్పై లక్షల సీఎస్సార్ నిధులతో ఏర్పాటు చేయనున్న వైద్య పరికరాలకు సంబంధించి మెమొరాండం ఆఫ్ అగ్రిమెంట్ను జీజీహెచ్ అధికారులతో కలిసి శుక్రవారం మార్చుకున్నారు. భోగాపురం పూర్తయ్యాక.. ఆస్పత్రిపై దృష్టి పెడతానని అన్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ కేవలం ఆరు రోజుల్లోనే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ లాంటి ఒక భారీ ప్రభుత్వ రంగ సంస్థ రూ.4.51 కోట్లు మంజూరు చేయడం గొప్ప విషయమన్నారు. ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్ టేబుల్ ల్యాంప్స్ కూడా లేవని స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. బొడ్డపాడు లేఅవుట్ ప్లాట్లకు ఈ–వేలం శ్రీకాకుళం పాతబస్టాండ్: పలాస మండలం బొడ్డపాడు ఎన్.టి.ఆర్. స్మార్ట్ టౌన్షిప్ లేఅవుట్లలో మిగిలి ఉన్న ప్లాట్లను ఈ–వేలం ద్వారా విక్రయించనున్నట్లు సుడా వైస్ చైర్మన్, జా యింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ శనివారం తెలిపారు. గతంలో అమలు చేసిన ఈ–లాటరీ విధానానికి స్వస్తి పలికి ప్రభుత్వం జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం ఈసారి ‘భూ కొనుగోలు’ పోర్టల్ ద్వారా ఈ–వేలం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఫేజ్–1లో ఖాళీగా ఉన్న 200 ప్లాట్లు, ఫేజ్–2లో అందుబాటులో ఉన్న 361 ప్లాట్లను కొనుగోలుదారుల కోసం సిద్ధం చేశామని చెప్పారు. చదరపు గజం ధర రూ.5,700 గా నిర్ణయించామని వివరించారు. ఆసక్తి గల వారు జూన్ 20 ఉదయం 10 నుంచి జూలై 12 రాత్రి 10గంటల లోపు konugolu.ap.gov.in వెబ్సైట్లో తమ ఆధార్, పాన్కార్డ్ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ప్లాట్ఫామ్ ఫీజు రూ.500, ప్రాసెసింగ్ ఫీజు రూ. 2,000తో పాటు లక్ష రూపాయల డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న వారితో జూలై 15న వేలం నిర్వహిస్తామని పేర్కొన్నారు. -
ఇలా ఐతే ఎలా..?
● పాతపట్నంలో మూతపడిన నేత్ర పరీక్ష కేంద్రం ● రెండేళ్లుగా తెరుచుకోని వైనం ● అవస్థలు పడుతున్న రోగులు పాతపట్నం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్యం రంగం నీరుగారిపోతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందని పరిస్థితి నెలకొంది. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో నేత్ర పరీక్ష కేంద్రం రెండేళ్లుగా తెరచుకోవడమే లేదు. వైఎస్సార్ హయాంలో ఇక్కడ ఐ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీంతో పాతపట్నం, మెళియాపుట్టి, హిరమండలం, సావరకోట, ఎల్.ఎన్ పేట మండలాల ప్రజలకు అందుబాటులో ఉండేది. నేత్ర సంబంధమైన సమస్యలు తలెత్తితే ఐ కేంద్రానికి వచ్చి పరీక్షలు చేసి అవసమైన వారికి ఉచితంగా మందులు, కంటి అద్దాలను అందజేసే వారు. అలాగే ప్రతి ఆరు నెలలకు నేత్ర వైద్య శిబిరాలను సైతం గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసేవారు. పాతపట్నం సామాజిక ఆస్పత్రిలో కంటి వైద్యుడు గతంలో ఉండేవారు. ఇప్పుడు సీహెచ్సీలో కంటి వైద్యుడు కూడా లేకపోవడం, కూట మి ప్రభుత్వం నియంచకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే నేత్ర వైద్య సేవలు 2024 సెప్టెంబర్ 16వ తేదీ నుంచి నిలిచిపోయాయి. వృద్ధులు, పేదలు ఆస్పత్రికి వచ్చి నేత్ర పరీక్ష కేంద్రంలో సేవలు అందకపోవడంతో ఉసూరుమంటూ వెనుదిరిగి ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికై నా వైద్యాధికారులు దృష్టి సారించి నేత్ర పరీక్ష కేంద్రం ద్వారా సేవలు పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. నేత్ర వైద్య సేవలు అవసరం వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాతపట్నం సామాజిక ఆస్పత్రి లో ఐ సెంటర్ను ఏర్పాటు చేశారు. రెండేళ్ల కిందటి వరకు సక్రమంగా సేవలు అందేవి. – సవిరిగాన ప్రదీప్, వైస్ ఎంపీపీ, పాతపట్నం ఉన్నతాధికారులకు తెలియజేశాం పాతపట్నం ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలోని నేత్ర పరీక్ష కేంద్రం ద్వారా సేవలు పునరుద్ధరించాల ని జిల్లాఉన్నతాధికారులకు విన్న వించాం. కౌన్సిలింగ్లో కంటి వైద్యులను నియమిస్తామన్నారు. – డాక్టర్ దాము లీలాకుమార్, సీహెచ్సీ సూపరిండెంటెంట్ -
శ్రీకాకుళం
ఎన్నాళ్లీ ఎదురు చూపులుఆఫ్షోర్ నిర్వాసితులకు ఎదురు చూపులు తప్పడం లేదు. ఆర్ఆర్ కాలనీలో వసతులు లేవు. –8లోహృదయ విదారకం : రైలు పట్టాలపై మృతదేహాలు అంత పెద్ద రైలు ఎదురుగా వస్తుంటే ఆ చిన్ని గుండెలు ఎంత భయపడ్డాయో.. కాస్త కింద పడితేనే తట్టుకోలేని ఆ దేహాలు ఛిద్రమైన దశలో ఎంత యాతన అనుభవించాయో.. బతుకంటే తెలీని పసి వయసులో చావు ఎంత వణికించిందో. ఊపిరి పోసిన అమ్మ ఉసురు తీస్తుందని వారు ఊహించలేదు. అమ్మ ఆవేశం తమ ఆయువు తీస్తుందని వారు అనుకుని ఉండరు. తాళభద్ర రైల్వే గేటుపై నిశిరాత్రి పూట ఈ రక్తపు మరక పడింది. క్షణికావేశంలో ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలతో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. తన ప్రాణాలు తీసుకోవడంతో పాటు కన్నపేగులను బలిపెట్టింది. పలాస, టెక్కలి: పలాస రైల్వే స్టేషన్కు సమీపంలోని తాళభద్ర రైల్వే గేటుకు కొద్ది దూరంలో గురువారం రాత్రి కోటబొమ్మాళి మండలం చలమయ్యపేటకు చెందిన గేదెల పూజ (26), ఆమె కుమారుడు కుశాంత్వర్మ(6), కుమార్తె దీక్షిత(4)లు రైలు కింద పడి మృతి చెందినట్టు రైల్వే పోలీసులు గుర్తించారు. ఇది పలాసలో సంచలనంగా మారింది. పట్టాలపై విగత జీవు లుగా పడి ఉన్న తల్లీబిడ్డలను చూసిన వారి కళ్లు చెమ్మగిల్లాయి. అర్ధరాత్రి ఘటన జరిగాక తెల్లవారుజామున పట్టాలపై మృతదేహాలను చూసి రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగు చూసింది. పలాస రైల్వే పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు.. చలమయ్యపేట గ్రామానికి చెందిన గేదెల వెంకట్, భార్య పూజ, ఇద్దరు పిల్లలు కుశాంత్, దీక్షితతో విజయవాడలో ఎలక్ట్రికల్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఇటీవల వెంకట్ తల్లి పాపమ్మకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. అప్పటి వరకు సపర్యలు చేసిన వెంకట్ సో దరి తన కుటుంబ సమస్యల నేపథ్యంలో అత్తవారింటికి వెళ్లిపోయారు. దీంతో అమ్మకు సపర్యలు చేయ డం కోసం వెంకట్ భార్యాపిల్లలను చలమయ్యపేట తీసుకుని వచ్చారు. భార్యా పిల్లలను ఇక్కడే విడిచిపెట్టి తాను ఒక్కడే విజయవాడ వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. దీనిపై దంపతుల మధ్య గొడవలు జరిగేవి. గ్రామ పెద్దలు సైతం పలుమార్లు కలుగజేసుకుని సర్దిచెప్పారు. ఈ క్రమంలో గురువారం పూజ భావనపాడు లోని తన కన్నవారింటికి పిల్లలను తీసుకుని వెళ్లిపోతానని బయల్దేరారు. ఈ క్రమంలో వెంకట్ భావనపాడు గ్రామంలో ఉన్న తన అత్తకు గురువారం సా యంత్రం 5 గంటలకు ఫోన్ చేసి పిల్లలను తీసుకెళ్లమని సమాచారం ఇచ్చాడని మృతురాలి బావ జోజేశ్వరరావు తెలిపారు. దీంతో పూజ తల్లిదండ్రు లు కంగారు పడి బస్సులో బయల్దేరి చలమయ్య పేట వెళ్లారు. వారు ఇంటికి వెళ్లే సరికి తల్లీపిల్లలు కనిపించలేదు. వెంటనే కోటబొమ్మాళి పోలీస్స్టేషన్కు వెళ్లారు. పోలీసులు తాము ఇప్పుడేమీ చేయలేమని, సీసీ పుటేజీలు, ఇతర సమాచారం సేకరించి చెబుతామని వారిని పంపించేశారు. వారు రాత్రంతా తల్లీపిల్లల కోసం గాలించారు. తెల్లారే సరికి పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని తాళభద్ర రైల్వే గేటుకు సమీపంలో రైలు పట్టాలపై విగత జీవులుగా కనిపించారు. ఈ అఘాయిత్యానికి కారణం ఏమై ఉంటుందని రైల్వే పోలీసులు విచారిస్తున్నారు. కుటుంబ కలహాల కారణంగా క్షణికావేశంలో ఆ తల్లి ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నా రు. మృతదేహాలు ఉన్న పలాస ప్రభుత్వ ఆస్పత్రికి మృతురాలి స్వగ్రామం భావనపాడు నుంచి, ఆమె బావ ఉన్న మాకన్నపల్లి నుంచి పెద్ద ఎత్తున బంధువులు, ఇతరులు వచ్చినప్పటికీ చలమయ్యపేట నుంచి కనీసం ఒక్కరు కూడా చేరుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసును పలాస జీఆర్పీ సీఐ రవికుమార్ దర్యాప్తు చేస్తున్నారు. శనివారం శ్రీ 20 శ్రీ జూన్ శ్రీ 2026 ఇద్దరు బిడ్డలతో రైలుకిందపడి తల్లి ఆత్మహత్య పలాస రైల్వేస్టేషన్ పరిధి తాళభద్ర సమీపంలో ఘటన అత్తకు సపర్యలు చేసే విషయంలో భర్తతో వివాదం కోటబొమ్మాళి మండలం చలమయ్యపేటలో విషాద ఛాయలు -
చంద్రబాబు పాలనలో దళితులకు రక్షణ కరువు
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): చంద్రబాబు రెండేళ్ల పాలనలో దళితులకు, బీసీలకు రక్షణ కరువైందని, గాదె సాయికృష్ణ ఉదంతం పూర్తికాకుండానే విజయవాడ కృష్ణలంకలో దళిత మాదిగ యువకుడు క్రాంతికుమార్ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నాడ రుషి అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆత్మహత్య చేసుకోక ముందు సెల్ఫీ మరణ వాంగ్మూలం రికార్డ్ చేస్తూ మరణించిన తీరు చూస్తుంటే, చంద్రబాబు పాలనలో దళితులకు రక్షణ లేదని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. దళితులకు ఈ రాష్ట్రంలో జీవించే హక్కు.. భద్రత లేదా? అని ప్రశ్నించారు. దళిత యువకుడు వేధింపులకు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటే అది ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనం కాదా? అని ప్రశ్నించారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగ నిర్మాణాన్ని పక్కనపెట్టి.. రెడ్బుక్ రాజ్యాంగం అమలుచేయడం ఎంతవరకు సమంజసమన్నారు. -
ఉక్కపోతతో విలవిల
● కూటమి సభలో అర్ధంతరంగా వెనుదిరిగిన కూటమి కార్యకర్తలుశ్రీకాకుళం : జిల్లా కేంద్రంలోని ఏడు రోడ్ల కూడలిలో శుక్రవారం నిర్వహించిన కూటమి ప్రభుత్వ విజయోత్సవ సభకు హాజరైన వారంతా ఉక్కపోతతో విలవిల్లాడిపోయారు. వేదికపై కూలర్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేసినప్పటికీ సభా ప్రాంగణంలో ఉన్నవారికి ఎటువంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో వేడి, ఉక్కపోతను తట్టుకోలేక కార్యకర్తలు సభ మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. కనీసం తాగునీటి సౌకర్యం కూడా కల్పించకపోవడంతో కొందరు వడదెబ్బ బారినపడి ఇంటి ముఖం పట్టారు. మరోవైపు జిల్లా స్థాయి విజయోత్సవ సభకు సంబంధించిన బ్యానర్లపై ఎన్టీఆర్ ఫొటో కనిపించకపోవడంతో ఆయన అభిమానులు, తొలి నుంచి పార్టీలో ఉన్న నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. -
22న చేనేత కార్మికుల ధర్నా
రణస్థలం : రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22న కలెక్టరేట్ వద్ద చేపట్టనున్న ధర్నాను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్.వి.రమణ పిలుపునిచ్చారు. ఈ మేరకు లావేరులో చేనేత కార్మికులతో కలిసి ధర్నా కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీ మేరకు నేతన్న నేస్తం కింద సంవత్సరానికి రూ.25వేలు ఎప్పటిలోగా అమలు చేస్తారో నేతన్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డి.వెంకట్, యు.శంకరయ్య, ఎ.గడ్డియ్య, యు.పెంటలింగ, ఏ.ఉమా, కె.జాంబ, ఎన్.రుద్రయ్య, యు.కాశి, ఏ.వేణు తదితరులు పాల్గొన్నారు. -
పర్యవేక్షణ శూన్యం..!
సీజనల్ భయం..పశు సంవర్ధక ఽశాఖ అధికారులు దిగువ స్థాయిలో సిబ్బందిపై పశువైద్య సేవల బాధ్యతలు పెట్టకుండా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తే సమస్యలు గుర్తించవచ్చు. సీజనల్గా వచ్చే వ్యాధులు గురించి పాడి రైతులకు గ్రామాల్లో అవగాహన కల్పించాలి. సిబ్బంది పనితీరు మెరుగుపరచాలి. – పైడి మోహనరావు, మతలబుపేట, సరుబుజ్జిలి పశువులకు సీజనల్గా వ్యాపించే అంటువ్యాధులపై పాడి రైతులకు అంతగా అవగాహన ఉండడం లేదు. దీనివలన తరుచూ పశువులకు వ్యాపిస్తున్న వ్యాధులతో నానా ఇక్కట్లు పడుతున్నాము. పశువైద్య శాఖ అధికారులు పశువుల పెంపకం, సంక్రమించే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించాలి. లంపిస్కిన్ వ్యాధితో అప్పట్లో చాలావరకు పశునష్టం చవిచూశాం. – చల్ల యర్రయ్య, చిగురువలస, సరుబుజ్జిలి సరుబుజ్జిలి: ఇటీవల పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు గోతుల్లో నీరు చేరింది. దీంతో మనుషులు మాదిరిగా పశువులకు కూడా అనేక రకాల అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు అధికంగా ఉన్నాయి. సీజనల్గా వచ్చే వ్యాధులపై పాడి రైతులు అప్రమత్తంగా ఉండి పలు ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే వ్యాధుల నివారణకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పాడి రైతులకు అవగాహన కల్పించడంలో శ్రద్ధ చూపడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. గతంలో లంపిస్కిన్(ముద్దచర్మ వ్యాధి) వ్యాపించి చాలావరకు పశువుల నష్టాలు జరిగాయి. అలాంటి నష్టాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. కార్యాలయాలకే పరిమితం వాస్తవానికి పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్గా(ఏడీ) ఉన్న ఉద్యోగి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి తమ సిబ్బందిని అప్రమత్తం చేయాలి. ఈవిధంగా తరుచూ పర్యటించి సీజనల్గా పశువులకు వ్యాపిస్తున్న అంటువ్యాధులు, వాటి నివారణా చర్యలు గురించి పాడి రైతులకు అవగాహన కల్పించాలి. గ్రామాల్లో పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి. అప్పుడు దిగువ స్థాయి సిబ్బంది కూడా సక్రమంగా పనిచేస్తారు. అయితే ఏడీ స్థాయిలో ఉన్న ఉద్యోగులు మండల పశువైద్య కార్యాలయం నుంచి బయటకు కదలకపోవడంవలన పశువైద్యం ఆశించిన స్థాయిలో అందడం లేదన్న విమర్శలు పాడి రైతుల నుంచి వ్యక్తమవుతున్నాయి. దీనిపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించాలని పాడి రైతులు కోరుతున్నారు. పశువులకు సంక్రమించే వ్యాధులు చిటుకు వ్యాధి గొర్రెల్లో చిటుకువ్యాధి అధికంగా వస్తుంది. ఇది బ్యాక్టీరియా వలన వస్తుంది. ఉన్నటుండి గాలిలో ఎగిరి గొర్రెలు చనిపోతాయి. దీని నివారణకు ముందుగా నీరసంగా ఉన్న గొర్రెలను మంద నుంచి వేరుచేయాలి. వ్యాధి నివారణకు పెన్సిలిన్ వేయించాలి. వ్యాధి సోకని వాటికి వ్యాక్సిన్ వేయించాలి. నీలి నాలుక నీలి నాలుక గొర్రెలు, మేకల్లో వస్తుంది. ఈ వ్యాధి సోకిన జీవాలకు జ్వరం అధికంగా వస్తుంది. నోటి నుంచి చొంగ కారుస్తూ, గిట్టలకు పుండ్లు ఏర్పడతాయి. ఈ వ్యాధి నివారణకు యాంటీ బయాటిక్స్, లివర్ టానిక్ ఉపయోగించాలి. జీవాలను మంద నుంచి వేరు చేయాలి. గొంతువాపు వ్యాధి ఈ వ్యాధి అన్ని వయస్సుల ఆవులు, గేదెల్లో కనిపిస్తుంది. 105 నుంచి 108 డిగ్రీల జ్వరం వస్తుంది. నోటి నుంచి చొంగలు కారి, నోటి నుంచి గాలి పీల్చుకుంటాయి. గొంతవద్ద వాపు వలన మేత తీసుకోలేవు. నివారణకు సల్పాడిమిడిన్ వాడుతూ, 4 నెలలు దాటిన జీవాలకు వ్యాక్సినేషన్ చేయించాలి. గాలికుంటు వ్యాధి ఇది అన్ని జీవాల్లో కనిపిస్తుంది. నోటి, గిట్లల్లో పుండ్లు, ఎక్కువగా జ్వరం ఉంటుంది. నివారణకు బోరిక్ గ్లిజరిన్ ఆయింట్మెంట్ను నోటిలో పూత పూయాలి. పీపీ ద్రావణంతో కాలిగిట్ల మధ్య కడగాలి. ప్రతిఏటా ముందస్తుగా ఏప్రిల్, మే నెలల్లో వ్యాక్సిన్ వేయించాలి. -
27న రెడ్క్రాస్ వార్షిక సమావేశం
శ్రీకాకుళం కల్చరల్: ఇండియన్ రెడ్క్రాస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 27న జెడ్పీ సమావేశ మందిరంలో వార్షిక సమావేశం నిర్వహిస్తున్నట్లు రెడ్క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సమావేశానికి సభ్యులంతా హాజరుకావాలని కోరారు. విరాళాలు అందచేసిన దాతలకు, రక్తదాన శిబిరాలు నిర్వాహకుల కు, నేత్ర మోటివేటర్లకు, వలంటీర్లకు సేవా ప తకం, అవార్డులు అందిస్తామని పేర్కొన్నారు. చెట్టు నుంచి జారిపడి వ్యక్తికి గాయాలు టెక్కలి రూరల్: పెద్దరోకళ్లపల్లి గ్రామానికి చెందిన రాంప్రాతుని చంద్రశేఖర్ అనే యువకుడు శుక్రవారం చెట్టు పైనుంచి జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో ఉన్న కొబ్బరి చెట్టు ఎక్కి కాయలు తీస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడటంతో కుడిచెయ్యి విరిగిపోయింది. వెంటనే బాధితుడిని టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి శ్రీకాకుళం రిమ్స్కు తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఇంటి నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నారు సంతబొమ్మాళి : ఇంటి నిర్మాణం చేయకుండా అడ్డుకుంటున్నారని.. తమ స్థలంలో చెట్లను జేసీబీతో తొలగించి దౌర్జన్యం చేస్తున్నారంటూ ఉమిలాడ గ్రామానికి చెందిన బాధితులు మైలపిల్లి ఓంకార్, తల్లి లావణ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం గ్రామ పెద్దలను కలిసి గోడు వినిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామం పక్కన ఉన్న పోలాకి మండలం గుప్పెడుపేట పంచాయతీ చిన్నకొరివిపేటలో పూర్వం నుంచి సొంత ఆస్తులు ఉన్నాయని, పూరిల్లు కూలిపోవడంతో కొత్త ఇల్లు నిర్మాణం చేయడానికి ప్రయత్నించగా అధికార పార్టీ కార్యకర్తలు సురపతి నీలయ్య, మెరుగు చిరంజీవి, పొన్నాడ లక్ష్మణరావు, సురపతి లక్ష్మణరావు, పొన్నాడ తాతారావు, కొమర జంగమయ్య, గుంటూ పోలరావు, చోడుపిల్లి దుర్గారావులు అడ్డుకున్నారని చెప్పారు. దౌర్జన్యం చేసి జేసీబీతో చెట్లు తొలగించి ఇసుక తరలించుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నీలయ్య అనే టీడీపీ కార్యకర్త ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడి చంపుతానని బెదిరించాడని వాపోయారు. ఈ విషయమై పోలాకి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని, తిరిగి తనపైనే బైండోవర్ నమోదు చేస్తామని చెప్పడంతో ఎస్పీకి ఫిర్యాదు చేశామని బాధితులు వివరించారు. -
కూర్మనాథాలయ ప్రాంగణంలో యోగా
ఉక్కపోతకు గురైన వృద్ధురాలుగార: యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ అన్నారు. శుక్రవారం ప్రముఖ విష్ణు క్షేత్రం శ్రీకూర్మనాథాలయ ప్రాంగణలో యోగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజు వారి ఒత్తిడి నుంచి ఉపశమనం పొంది శారీరక, మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ప్రస్తుత రోజుల్లో జీవితంలో ప్రతి ఒక్కరికీ శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత కోసం యోగా ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా డచ్ భవనం వద్ద భారీ యోగా కార్యక్రమం చేపడతామన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ కె.సాయిప్రత్యూష, జిల్లా ఆయుష్ అధికారి ఉత్తమ్రాజ్ రాణా, తహశీల్దార్ ఎం.చక్రవర్తి, ఎంపీడీఓ ఎస్.శ్రీనివాసులు, దేవదాయ శాఖ ఏసీ ప్రసాద్ పట్నాయక్, ఆలయ ఈఓ టి.వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డునపడ్డాం
ప్రమాదంలో మా బోటు కాలిపోయింది. దీంతో నేను.. నాతో పాటు వేటకు వస్తున్న మరో ఆరుగురి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మాది పెద్ద ఫ్యామిలీ. ప్రస్తుతం ఎటువంటి ఆధారం లేకుండా పోయింది. లక్షల్లో ఆస్తినష్టం జరిగిపోయింది. ప్రభుత్వం స్పందించి మా అందరినీ ఆదుకుంటే ఈ కష్టం నుంచి బయటపడగలం. – గండుపల్లి బాబూరావు, బాధితుడు, పెద్ద కర్రవానిపాలెం ప్రభుత్వం ఆదుకోవాలి వలలు, బోట్లు దగ్ధమవ్వడంతో మత్స్యకారులంతా తీవ్రంగా నష్టపోయారు. ఇంత భారీ ప్రమాదం జరగడంతో ఈ బోట్లుపై ఆధారపడిన దాదాపు 60 కుటుంబాలు వరకు రోడ్డున పడ్డాయి. ప్రభుత్వం, అధికారులు వేగవంతంగా స్పందించి బాధితులకు నష్ట పరిహారం అందజేయాలి. – కర్రి గోపయ్య, ఎంపీటీసీ, పెద్ద కర్రివానిపాలెం -
ప్రైవేటీకరణ ప్రయత్నాలు విరమించుకోవాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు, పట్టణ ప్రజలకు నష్టదాయకమైన ప్రైవేటీకరణ ప్రయత్నాలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి అల్లు సత్యనారాయణ, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.బలరాం, శ్రీకాకుళం పట్టణ పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ ఎం.గోవర్ధనరావు డిమాండ్ చేశారు. పట్టణాలలో పౌరసేవలను ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యం పేరుతో ప్రైవేట్ సంస్థలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్–ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగర మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ రంగంలో వాటర్ సప్లయ్, వీధిలైట్లు, పార్కులు, రోడ్లు, వాహనాలు తదితర 14 కీలక విభాగాలను పీపీపీ పేరుతో ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తూ ప్రభు త్వం జారీ చేసిన 975, 673 జీవోలను తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ప్రజలు గౌరవప్రదంగా జీవించేలా తగిన విధానాలను రూపొందించి అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదని స్పష్టం చేశారు. ప్రస్తుతం కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వాలు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రైవేటు సంస్థలకు పెద్దపీట వేస్తున్నాయని మండిపడ్డారు. అనంతరం మున్సిపల్ హెల్త్ అధికారి పి.సుధీర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నగర కమిటీ నాయకులు ఏ.జ్యోతిప్రసాద్, ఎం.రాఘవ, ధనాల చిట్టి, ఆకుల మోహన్, ఆర్.యుగంధర్, జె.మాధవి, ఎన్. పార్వతి, వి.సరోజ, డి.గంగ తదితరులు పాల్గొన్నారు. -
ఒడిశాలో కొని.. కాశీబుగ్గకు బస్సులో తెచ్చి
● గంజాయితో పట్టుబడిన పశ్చిమబెంగాల్ వాసి ● గోవా, ఒడిశాలకు చెందిన మరో ఇద్దరితో లింక్ పలాస, శ్రీకాకుళం క్రైమ్ : ఒడిశాలో 5.160 కిలోల గంజాయి కొని.. కాశీబుగ్గకు బస్సులో తెచ్చి.. గోవా వెళ్లేందుకు ట్రైన్కని రైల్వేస్టేషన్కు వెళ్తూ పశ్చిమబెంగాల్వాసి పోలీసులకు పట్టుబడ్డాడు. కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. ముగ్గురిదీ ఒక్కో రాష్ట్రం. వీరిలో ముస్తాక్ అలమ్ అలియాస్ బంటిది పశ్చిమబెంగాల్ హౌరా కాగా ఓమ్ నాయక్ది ఒడిశాలో జయపూర్ సమీప నౌరంగాపూర్. మూడోవాడైన సుమిత్ అలియాస్ విక్కీది గోవాలో కేంథోలిమ్. తొలినుంచే ఒడిశాలోని ఓంనాయక్ గోవాలో ఓ హోటల్లో పనిచేసే విక్కీకి పరిచయాలున్నాయి. నాయక్ ఊరి సమీప అడవు ల్లో దొరుకుతున్న గంజాయిని ప్యాకెట్లుగా మార్చి ప్యాకెట్లుగా పంపడం, అక్కడ అధిక ధరలకు అమ్మడం అలవాటు. ఇదే క్రమంలో సుమిత్ పనిచేసిన హోటల్లోనే హౌరాకు చెందిన బంటి చేరి పరిచయం కావడంతో.. నాయక్ వద్ద గంజాయి మాల్ కొనుక్కుని తెస్తే డబ్బులిస్తానని చెప్పడంతో బంటి వెళ్లాడు. నాయక్ వద్ద నౌరంగాపూర్లో మాల్ తీసుకుని బస్సు ఎక్కి ఎవరికీ అనుమానం రాకుండా కాశీబుగ్గలో దిగాడు. రైల్వేస్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా నడుస్తుండగా అదుపులోకి తీసుకున్నామని, బ్యాగులో గంజాయి ఉండటంతో స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని సీఐ చెప్పారు.


