breaking news
Srikakulam
-
‘పథకాల అమలులో మనమే ఫస్ట్’
శ్రీకాకుళం కల్చరల్: మహిళా సాధికారతకు సంబంధించి వివిధ పథకాల అమలులో శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గర్వంగా ప్రకటించారు. ఆదివారం అంతర్జాతీ య మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక మున్సిపల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హా జరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మహిళా సంఘాలకు రూ. 2266 కోట్ల క్రెడిట్ లింకేజీ, సీ్త్రనిధి ద్వారా రూ. 312 కోట్లు, ఉన్నతి పథకం కింద రూ. 7 కోట్లు అందించామని తెలిపారు. ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి మాట్లాడుతూ పోలీసు శాఖ మహిళా భ ద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి ఒక్కరూ ‘శక్తి యాప్’ ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో సాయి ప్రత్యూష, మెప్మా పీడీ, డీఆర్డిఏ పీడీ కిరణ్ కుమార్, ఎల్డీఎం శ్రీనివాసరావు మహిళా అ ధ్యక్షురాలు గంగమ్మ, ఐసిడిఎస్ పిడి రూపవతి, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. ఘనంగా రాజమ్మ తల్లి జాతర గార: ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవం వత్సవలస రాజమ్మ తల్లి (రాజరాజేశ్వరి) దర్శనానికి ఆరో వారం అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. దూరప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తమ కుటుంబ సభ్యులుతో రాజమ్మ తల్లికి మొక్కలు తీర్చుకునేందుకు వచ్చారు. శనివారం రాత్రికే వచ్చిన భక్తులు సమీప తో టల్లోనూ, ఆరుబయట బసచేసి రాజరాజేశ్వరి (రాజమ్మతల్లి) పాటు భూలోకమ్మ తల్లికి ఆది వారం ఉదయం మొక్కులు తీర్చుకున్నారు. వేకువ జామున నుంచే సమీపంలోని సముద్రంలో స్నానాలాచరించారు. ఆదివారం వేకువజామునుంచే అధిక సంఖ్యలో సముద్రస్నానాలు ఆచరించగా, ఎస్ఐ చోడిపల్లి గంగరాజు, మైరెన్ సీఐ బూర ప్రసాదరావులు బందోబస్తు చర్యలు చేపట్టారు. కంబిరిగాంలో ఆక్రమణల గుర్తింపుపలాస: పలాస మండలం కంబిరిగాం గ్రామంలో గల సర్వే నెంబరు 18లో 18 సెంట్ల భూమి ఆక్రమణకు గురైనట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఇక్కడి ఆక్రమణలపై ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. ఆదివారం ఉదయం కాశీబుగ్గ పోలీసుల సహకారంతో పలాస తహసీల్దార్ టి.కళ్యాణచక్రవర్తి, ఆర్ఐ ప్రసాద్, సర్వే సిబ్బంది అక్కడకు వెళ్లి పరిశీలించారు. బట్టికి సంబంధించి గతంలోనే 10 సెంట్లు ఆక్రమణకు గురైనట్టు గుర్తించారు. అలాగే వట్టికూల మాధవరావు 6 సెంట్లు, చెల్లూరు మల్లేశ్వరరావు 2 సెంట్లు ఆక్రమించినట్లు గుర్తించారు. ఇద్దరు రైతులు మట్టి తవ్వేందుకు అనుమతి తీసుకున్నారని, అయితే కొన్ని ట్రాక్టర్లకు అనుమతి ఇవ్వగా మొత్తం 3 జేసీబీలు, 10 ట్రాక్టర్లను ఉపయోగించారని అందుకే వాటిని అడ్డుకొని మొత్తం వాహనాలను సీజ్ చేశామని కల్యాణచక్రవర్తి చెప్పారు. మట్టి తవ్వకాల అనుమతులను కూడా రద్దు చేశామని చెప్పారు. వ్యాన్ ఢీకొని ప్రధాన పైపులైను ధ్వంసం శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలోని ముత్యాలమ్మ ఆలయం సమీపంలో ప్రధాన నీటి సరఫరా పైపును ఓ వ్యాను ఆదివారం సాయంత్రం ఢీకొనడంతో పైపులైన్ పూర్తిగా ధ్వంసమైంది. దీంతో తాగునీరంతా వృధా అవుతోంది. నగరపాలక సంస్థ సిబ్బంది వచ్చి చూసిన దానికి మరమ్మతులు చేయడం సాధ్యం కాకపోవడంతో చేసేది లేక అలా ఉండిపోయారు. సోమవారం దీనికి మరమ్మతులు చేసే అవకాశం ఉంది. అప్పటివరకు తాగునీటికి ఇబ్బంది తప్పదు. -
ఒళ్లు గగుర్పొడిచేలా..
● ఆటోను ఢీకొన్న కారు ● ఒకరు మృతి.. 9 మందికి గాయాలు ఎచ్చెర్ల: ఎచ్చెర్ల సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వత్సవలస జాతరకు వచ్చిన భక్తులు ఆటోలో తిరి గి వెళ్తుండగా కారు వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టింది. ఘటనలో ఒకరు మృతి చెందగా.. తొమ్మిది మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన దృశ్యాలు ఒళ్లు గగుర్పా టు కలిగించే విధంగా ఉన్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం ముషినివాడ నుంచి ఆటోలో గార మండలంలోని వత్సలవలస యాత్రకు శనివారం రాత్రి సమయంలో వచ్చిన వారు తిరిగి వెళ్తుండగా ఎచ్చెర్ల సమీపంలో వెనుకనుంచి వచ్చి న కారు వీరి ఆటోను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న రమేష్ (41) మృతి చెందగా మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయాలైన వారిలో ధర్మ వరపు చిన్నిగవరశెట్టి, పార్వతి, గౌతమి, తులసిరెడ్డి, గణపతి, నాగరాణి, తామాడ ధనలక్ష్మీ, తామాడ భారతి, పూడివలస త్రివేణి, మరో పాప ఉన్నారు. వీరిని చికిత్స కోసం రిమ్స్కు తరలించారు. ఉదయం 11.48.44కి జాతీయ రహదారిపై..11.48.45కు నుజ్జునుజ్జయిన ఆటోసపర్యలు చేస్తున్న దృశ్యం -
కేజీబీవీలు పిలుస్తున్నాయి
● ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ● ప్రతి పాఠశాలలో 40 సీట్లు భర్తీ హిరమండలం: కేజీబీవీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఆరో తరగతిలో ప్రవేశానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 25 కేజీబీవీల్లో ఆరో తరగతిలో 1000 సీట్ల ను భర్తీ చేయనున్నారు. అనాథలతో పాటు బడి బయట ఉన్నవారు, బడి మానేసి చదువుకు దూరంగా ఉన్న బాలికలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీలకు రిజర్వేషన్ సదుపాయం కూడా ఉంది. ఇదీ పరిస్థితి.. జిల్లాలోని 30 మండలాల పరిధిలో 25 కేజీబీవీలు ఉన్నాయి. వాటిలో ఆరు నుంచి ఇంటర్మీడియెట్ వరకూ విద్యాబోధన సాగుతోంది. ప్రస్తుతం ఆరో తరగతికి సంబంధించి ఒక్కో పాఠశాలలో 40 సీట్ల ను భర్తీ చేయనున్నారు. ఈ లెక్కన 1000 సీట్లను భర్తీ చేస్తామని అధికారులు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మెనూ ప్రకారం భోజనం, పౌష్టికాహారం, సురక్షిత నీరు, ఉచిత పాఠ్య, నోటు పుస్తకాలు, యూనిఫారం, ఆత్మరక్షణ కోసం అవసరమయ్యే విద్యను సైతం అందిస్తారు. ఈ–విద్యను సైతం బోధిస్తారు. ఇలా చేయాలి.. ఉచిత వసతితో పాటు నాణ్యమైన విద్యను పొందేందుకు ఇది మంచి అవకాశం. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు అర్హులు. ఈ నెల 12 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. http:apkgbv.apcfss.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు తుది గడువు ఏప్రిల్ 1. ఎంపిక జాబితాను ఏప్రిల్ 13న ప్రకటిస్తారు. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్నవారు అర్హులు. వివిధ కారణాలతో చదువు మధ్యలో నిలిపివేసిన బాలికలు సైతం దరఖాస్తు చేసుకోవ చ్చు. కుటుంబ వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ. 1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.44 లక్షలు మించి ఉండకూడదు. ఓసీలకు 15 శాతం అంటే 15 సీట్లు, బీసీలకు 29 శాతం అంటే 10 సీట్లు, ఎస్సీలకు 15 శాతం అంటే 5 సీట్లు కేటాయిస్తారు. మిగతా వర్గాల వారికి మరో 10 సీట్ల కేటాయింపు ఉంటుంది. అనాథ పిల్లలు, బడిబయట ఉన్న పిల్లలు, దివ్యాంగులకు ప్రాధాన్యం ఉంటుంది. మంచి అవకాశం పేద, సామాన్య బాలికలకు ఇదో మంచి అవకాశం. కేజీ బీవీల్లో ఉత్తమ విద్యాబోధన తో పాటు పౌష్టికాహారం అందిస్తాం. సీబీఎస్ఈ బోధనతో పాటు ఆత్మరక్షణకు సంబంధించి విద్యను సైతం అందిస్తాం. – కృష్ణవేణి, కేజీబీవీ ప్రత్యేకాధికారి, హిరమండలం -
రూ.కోట్లకు కుచ్చుటోపీ
● మత్స్యకారులను మోసగించిన ఘనులు ● పోలీసులను ఆశ్రయించిన బాధితులు రణస్థలం: మనం మనం మత్స్యకారులం.. అంటూ ఓ ప్రబుద్ధుడు రూ.కోట్లు కాజేశాడు. స్థానిక మత్స్యకార గ్రామాలకు చెందిన వందలాది మంది లక్షలా ది రూపాయలు కట్టి మోసపోయిన ఘటన రణ స్థలం మండలంలో సంచలనమైంది. నగదు పెట్టుబడి పెడితే రెట్టింపు లాభం, కొత్తవారిని చేర్పి స్తే కార్లు, విల్లాలు కానుకలు ఇస్తామని నమ్మించి అమాయకులపై వల వేశారు. జేఆర్ పురం పోలీస్ స్టేషన్లో నమోదైన ఫిర్యాదు మేరకు... విశాఖప ట్నం కార్పొరేషన్, పెద్ద జాలరిపేటకు చెందిన కొ మర జగన్నాథ రావు (జగదీష్), జిల్లాలోని కొవ్వా డ గ్రామానికి చెందిన సూరాడ రాముడు (కిశోర్) అనే ఇద్దరు రణస్థలం మండలంలోని కోష్ట జంక్షన్లో 2024లో పాతర్లపల్లి రోడ్లోని ఒక రూమ్ తీసుకుని ఒక ఆఫీసులా నడపసాగారు. మత్స్యకారులకు ఓ యాప్ను చూపించి ‘యూనిట్ మెటా టోకెన్’ కంపెనీలో అధిక లాభాలు అంటూ పెట్టుబడులు పెట్టించారు. కొమర జగన్నాథరావు భార్య కొమర లక్ష్మి అకౌంట్లో అధికంగా డబ్బులు వేయించుకున్నారు. రూ.లక్షకు పైచిలుకు పెట్టుబడి పెడితే నెలకు రూ.12 వేలు, మళ్లీ రూ.లక్షకు వడ్డీ కూడా ఇస్తామని ఆశ చూపించారు. ఇలా ప్రతి ఒక్కరికీ రెండేసి, మూడేసి నెలలు వేసి ఆపై టెక్నికల్ సమస్య వచ్చింది మీ డబ్బులు ఎటూ పోవు అంటూ నమ్మించారు. అలా నెలలు గడిపేశారు. వీరి లో సూరాడ రాముడు తన తల్లిదండ్రులతోనే రూ. రెండు లక్షలు కట్టించాడు. తల్లిదండ్రులు అడిగితే ‘మన డబ్బులు పోవు మీరు గ్రామస్తులతో వెళ్లకండి’ అని గదమాయించడం విశేషం. ఒక్క కొవ్వాడలోనే రూ.కోటిన్నర కొవ్వాడ మత్స్యకార గ్రామానికి చెందిన బడి ఎర్ర య్య, రాముడు, మైలపల్లి పాపారావు, కృష్ణంరాజు, సూరాడ జూస్బాబు ఇలా సుమారు 30 మందికి పైగా బాధితులు రూ. 46లక్షలకు పైచిలుకు పెట్టుబడులు పెట్టి మోసపోయారు. ఒక్క కొవ్వాడలోనే రూ.కోటిన్నర వరకు ఉంటుందని గ్రామ పెద్దలు చెబుతున్నారు. ఇంకా పోలాకి మండలంలోని పలు మత్స్యకార గ్రామాలు, విజయనగరం జిల్లా చింతపల్లి మత్స్యకార గ్రామం, విశాఖపట్నం వంటి పట్టణాల్లో వందలాది మంది దగ్గర నాలుగైదు కోట్లకు పైగా టోకరా వేసినట్లు సమాచారం. దిక్కున్న చోట చెప్పుకోండని.. సూరాడ కిశోర్, కొమర జగన్నాథరావులను గ్రామస్తులు మూడు నెలల క్రితం గట్టిగా నిలదీయడంతో రాజాం మండల కేంద్రంలో బాధితులు, గ్రామ పెద్దలతో పంచాయతీ పెట్టించారు. ఆరు మాసాల్లో ఇస్తామని ఈ లోగా చెక్కులు ఇస్తామని రూ. 20 బాండ్ పేపర్ మీద రాసి చెక్కులు ఇవ్వలేదు. దీంతో సూరాడ రాముడు(కిశోర్) కారును గ్రామస్తులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆయన తన కారును బలవంతంగా తీసుకున్నారని విశాఖలోని అరిలోవ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో గ్రామస్తులంతా అక్కడకు వెళ్లి జరిగిందంతా చెప్పా రు. అయినా లాభం లేకపోవడంతో బాధితుల తరఫున గ్రామ పెద్దలు మైలపల్లి పోలీసు, అల్లిపల్లి రాముడు, మైలపల్లి పట్టయ్య, సత్యం జేఆర్ పురం పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. -
● జయహో..
శ్రీకాకుళం 7రోడ్ల జంక్షన్ వద్దటీమిండియా విశ్వ విజేతగా ఆవిర్భవించింది. అభిషేక్ మెరుపు షాట్లు, శాంసన్ కళాత్మక స్ట్రోక్లు, ఇషాన్ దూకుడు, ఆఖరి ఓవర్లో దూబె దంచుడును జిల్లాలోని క్రికెట్ అభిమానులు ఆస్వాదించారు. గురి తప్పని బుమ్రా యార్కర్లు, అక్షర్ పటేల్ వికెట్ల దండయాత్రను తనివి తీరా చూసి తరించారు. టీ20 క్రికెట్ వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్ను జిల్లాలో టీవీలతో పాటు తెరలు కట్టి చూశారు. జిల్లా కేంద్రంలో సినిమా హాల్లో సైతం మ్యాచ్ను ప్రదర్శించారు. ఆల్రౌండ్ ప్రదర్శనతో టీమిండియా కప్ గెలుచుకోవడంతో సంబరాలు అంబరాన్నంటాయి. కెప్టెన్ సూర్య కప్ అందుకున్న క్షణాలను కనులారా చూసి వేడుక చేసుకున్నారు. – శ్రీకాకుళం న్యూకాలనీ, సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం జీటీ రోడ్లో..నరసన్నపేట: కోమర్తి కాలనీ వద్దశ్రీకాకుళంలోని ఓ థియేటర్లో మ్యాచ్ వీక్షిస్తున్న అభిమానులు -
జగన్తోనే సాధ్యం
మహిళా సాధికారత శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): మహిళా సాధికారత వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమవుతుందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన 50శాతం మహిళా రిజర్వేషన్ అమలుచేసిన ఘనత వైఎస్సార్సీపీదేనన్నారు. వైఎస్సార్ సీపీ మహిళా జిల్లా అధ్యక్షురాలు ఉలాల దివ్యభారతి అధ్యక్షతన ప్రపంచ మహిళా దినోత్సవం శ్రీకాకుళం టౌన్హాల్లో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ కుటుంబాలు బాగు ప డాలంటే భార్యాభర్తలు సక్రమంగా కలిసి ఉండాలని, అప్పుడే అభివృద్ది సాధ్యపడుతుందన్నారు. మన దేశం జనాభా పరంగా ప్రపంచంలోనే ముందుంటే చంద్రబాబు ముగ్గురు పిల్లలు కనాలని చెప్పడం దారుణమన్నారు. చంద్రబాబు, లోకేష్లు మాత్రం ఒక్కరినే కని ఆస్తులు, డబ్బులిచ్చి ధనవంతుల లిస్ట్ లో ఉంచేందుకు తాపత్రయ పడతారని మండిపడ్డా రు. తన పాదయాత్రలో ఇల్లు లేని పేదలను చూసిన జగన్ తాను అధికారంలోకి వచ్చాక వారికి భూమి ఇచ్చి ఇళ్లు కట్టిచ్చారని గుర్తు చేశారు. చంద్రబాబు మాత్రం 40 ఏళ్లలో ఒక్క సెంటు భూమైనా ఇవ్వలేదన్నారు. వైఎస్సార్సీపీ ప్రవేశపెట్టిన సంక్షేమాలన్నీ చంద్రబాబు ధ్వంసం చేశారని, రైతుకి బస్తా యూరి యా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితికి వచ్చారని తెలిపారు. ఇసుక, భూములు యథేచ్ఛగా దోచుకోవడమే ఎమ్మెల్యేల వృత్తిగా మారిందన్నారు. జిల్లా కేంద్రంలో 8 మంది డయేరియాతో మృతి చెందితే ఇద్దరికి ఎక్స్గ్రే షియా ఇచ్చి మమ అనిపించేయడం సరికాదన్నారు. ఈ సందర్భంగా రుప్ప దివ్య, అంబటి నిర్మల, పి.సుగుణారెడ్డి, మజ్జి సుధాబాల, మూకళ్ల సుగుణలు మాట్లాడుతూ టీడీపీ కార్యక్రమాల్లో గాని పార్టీలో గానీ మహిళల ఆచూకీ లేదని అన్నారు. 2004లో దివంగత వైఎస్సార్కి ఇళ్ల పట్టాలు మహిళల పేరిట ఇస్తే బాగుంటుందని సలహా ఇచ్చింది మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ పార్లమెంటరీ పరిశీలకులు కుంభా రవిబాబు, జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, కళింగవైశ్యకుల రాష్ట్ర అధ్యక్షులు, పార్టీ నరసన్నపేట నియోజకవర్గ పరిశీలకులు అంధవరపు సూ రిబాబు, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంవీ స్వరూప్, తూర్పుకాపు కుల రాష్ట్ర అధ్యక్షులు మామిడి శ్రీకాంత్, వెలమకుల రాష్ట్ర అధ్యక్షుడు అంబటి శ్రీనివాసరావు, యువ నాయకులు ధర్మాన రామ్మనోహర్నాయుడు, తమ్మినేని చిరంజీవినాగ్, ఎస్ఈసి మెంబర్లు గొండు కృష్ణ, చల్ల శ్రీనివాసరావు, మైనార్టీ సెల్ విభాగం జిల్లా అధ్యక్షులు ఎం.ఏ భేగ్, గ్రీవెన్స్సెల్ జిల్లా అధ్యక్షులు రౌతు శంకరరా వు, మండవల్లి రవి, మూకళ్ల తాతబాబు, పార్టీ నియోజకవర్గాల మహిళా అధ్యక్షురాలు మానస, గురుబెల్లి వెంకట రమణమ్మ, సత్తారు ఉషారాణి, పండా సుజాత యాదవ్, చిగురుపల్లి ధనలక్ష్మి, కాగాన సుశీల, ఆశాలత గుప్తా, హేమలత, చల్లా అలివేలు మంగా, గుంట జ్యోతి, ఆట్ల సరోజనమ్మ, మాధవిలత తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మహిళలు కదంతొక్కే రోజులు దగ్గరపడ్డాయి: మాజీ మంత్రి సీదిరి వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం జగన్ హయాంలోనే పదవులు వైఎస్ జగన్ హయాంలోనే మహిళలకు 50 శాతం పదవులు వచ్చా యి. వీధి బడుల స్వరూపాలన్నీ మారాయి. కేంద్రం 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి పాట్లు పడుతుంటే జగనన్న అంతకుమించి ఇచ్చారు. – పిరియా విజయ సాయిరాజ్, జెడ్పీ చైర్ పర్సన్ చంద్రబాబువి మాయ మాటలు.. చంద్రబాబు ఎన్నికల ముందు మాయ మాటలు చెప్పారు. సున్నావడ్డీ, చేయూత, ఆసరా, సన్నావడ్డీ పథకం, ఇళ్ల పట్టాలు అన్నీ ఎగ్గొట్టేశారు. చంద్రబాబుకు మహిళలు తగిన గుణపాఠం చెబుతారు. – ఉలాల భారతీదివ్య, వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సృష్టికి మూలం మహిళలే సృష్టికి మూలం మహిళ. దివంగత వైఎస్సార్ ప్రతి ఒక్కరి గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటే.. ఆయన తనయుడు మరో పది అడుగులు ముందుకేసి మహిళలకు పెద్దపీట వేసి గౌరవించారు. – తమ్మినేని వాణిశ్రీ, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం సతీమణి టీడీపీ మోసాలు వివరిద్దాం టీడీపీ మోసాల్ని, చంద్రబాబు అరాచకాల్ని అందరికీ వివరిద్దాం. ఇంటా, బయట పనిచేసి కుటుంబాల్ని ముందుకు తీసుకెళ్లగలిగే శక్తి మహిళలకే ఉంది. చంద్రబాబు మహిళలకు చేసిన మోసాల్ని అన్ని గ్రామాల్లో వివరించాలి. – ఎంవీ పద్మావతి, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు జగనన్నను గెలిపిద్దాం.. 2024లో చంద్రబాబు రావడం వల్లే మహిళలు ఈ రోజు బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే మళ్లీ జగనన్నను గెలిపించుకుందాం. మహిళలకు అన్ని అవకాశాలు ఇచ్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. – దువ్వాడ వాణి, వైఎస్సార్సీపీ నాయకురాలు కేక్ కట్ చేస్తున్న వైఎస్సార్ సీపీ మహిళా నాయకులు మహిళలు కదం తొక్కుతారు వైఎస్సార్ సీపీ హయాంలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్ర చరిత్ర మొత్తంలో 44 లక్షల ఇళ్లు ఇస్తే వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలోనే 33.50 లక్షల ఇళ్లు ఇచ్చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రకటనల్లో చంద్రబాబు, లోకేష్ ఫొటో లు తప్ప మహిళా, శిశు సంక్షేమ మంత్రి సంధ్యారా ణి ఫొటో లేకపోవడం వారి చిత్తశుద్ధికి నిదర్శనం. చంద్రబాబు వైఫల్యాలపై మహిళలు కదం తొక్కుతారు. – సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి దిశ వంటి చట్టాలు కావాలి రాష్ట్రంలో మహిళల భద్రత గాల్లో దీపంలా మారింది. జగనన్న దిశ యాప్ తీసుకొ చ్చారు. అలాంటి చట్టాలు మళ్లీ అమలు కావాలి. – సీదిరి శ్రీదేవి, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు సతీమణి -
ఉత్సాహంగా శాప్ లీగ్ పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: శాప్లీగ్ మాస్టర్స్ పోటీలు మొదలయ్యాయి. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వ ర్యంలో జిల్లా కేంద్రంలోని శాంతినగర్కాలనీలో ఉన్న డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఈ జిల్లాస్థాయి పోటీలకు జిల్లా నలుమూలల నుంచి వెటరన్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ హాజరై తమ ప్రతిభ ను నిరూపించుకున్నారు. బ్యాడ్మింటన్ అసోసియేష న్ జిల్లా సీఈఓ సంపతిరావు సూరిబాబు ఈ ఎంపిక పోటీలను పర్యవేక్షించారు. 35 ఏళ్లపైబడిన విభాగం సింగిల్స్లో ఎ.మోహనరావు, డబుల్స్లో ఎ.మోహనరావు–వై.లక్ష్మణరావు జంట విజేతలగా నిలిచారు. అలాగే మిక్స్డ్ డబుల్స్ విభాగంలో కిల్లి హరీష్–ఐ.ఆశాలత జంట విజేతలుగా నిలిచారు. 45 ఏళ్లు పైబడిన విభాగం సింగిల్స్లో నాగేశ్వర్బెనర్జీ బెహర, డబుల్స్లో కె.కిరణ్కుమార్–పి.శ్యామ్సుందరరావు జంట విజేతలుగా నిలిచారు. -
కూటమి ప్రభుత్వానికి.. జిల్లా అభివృద్ధి పట్టదా?
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): జిల్లాలో హిరమండలం ఎత్తిపోతల పథకం, మూలపేట పోర్టు, ఉద్దానం మంచినీటి ప్రాజెక్టు, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం వంటివి వైఎస్సార్ సీపీ హయాంలో ప్రారంభించి కొన్ని పనులు పూర్తిచేయగలిగామని, తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని పూర్తి చేయకుండా వదిలేయడం దారుణమని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. మూలపేట పోర్టు నిర్మాణ పనులు దాదాపుగా 80 శాతం వైఎస్సార్సీపీ హాయాంలోనే పూర్తి చేశామని, రెండేళ్లు గడిచినా మిగిలిన పనులు పూర్తి చేయకపోవడం తగదన్నారు. ప్రజా సమస్యలు, జిల్లాలో ప్రధాన ప్రాజెక్టుల పూర్తిచేసే విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే దిశగా అడుగులు వేసేందుకు సన్నాహక సమావేశం జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్బంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ జిల్లాలో కేంద్ర, రాష్ట్ర మంత్రులున్నా పనులు పూర్తిచేసేందుకు ఒక్క అడుగు ముందుకు వెయ్యకపోవడం దారుణమన్నారు. జిల్లా అభివృద్ధికి కావాల్సిన నిధులు అడిగేందుకు చంద్రబాబు ముందు వణికిపోతున్నారని విమర్శించారు. చంద్రబాబుకు అమరావతి అభివృద్ధి తప్ప మరే ఇతర ప్రాంతాలు అభివృద్ధి అవసరం లేదని, కూటమి నేతలకు కమీషన్లు వచ్చే పనులు తప్ప ఇతర పనులు అవసరం లేదన్నారు. జిల్లాలో ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా ప్రతిపక్ష పాత్ర పోషించాలన్నారు. నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఒడిశా అడ్డంకిగా ఉండడంతో అప్పట్లో ఒడిశా సీఎంతో మాట్లాడేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి, తాను, కృష్ణదాస్ వెళ్లి కొన్ని అడ్డంకులు తొలగించగలిగామన్నారు. ప్రస్తుతం ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ పాలకులతో అనుబంధం ఉన్న కూటమి నేతలు నేరడి బ్యారేజీ అడ్డంకులు తొలగించే దిశగా కనీస ప్రయత్నం కూడా చేయకపోవడం జిల్లా ప్రజలు చేసుకున్న దురదృష్టమన్నారు. ప్రజా సమస్యలపై పోరాడి ప్రజల వద్ద గౌరవం పొందేందుకు ప్రతిపక్షానికి మంచి అవకాశమన్నారు. శ్రీకాకుళం నగరంలో డయేరియాతో పది రోజులుగా వణికిపోతున్నా మంత్రి అచ్చెన్నాయుడు ఒక్కసారి కూడా ఆ ప్రాంతాన్ని పరిశీలించకపోవడం శోచనీయమన్నారు. డయేరియాతో 8మంది మృత్యువాత పడితే ఇద్దరినే పరిగణనలోకి తీసుకుని ఎక్స్గ్రేషియా ప్రకటించడం అన్యాయమన్నారు. కుళాయి నీరు కలుషితమైందని అధికారికంగానే ప్రకటించారని, దీనివల్లే దాదాపుగా 250 మందికి పైగా డయేరియాతో ఆస్పత్రి పాలైయ్యారన్నారు. డయేరియాతో ఇబ్బందిపడ్డ, మృత్యువాత పడిన కుటుంబాలకు న్యాయం జరిగేందుకు కార్యాలయం ముట్టడి, చంద్రబాబు కళ్లు తెరిపించేలా వైఎస్సార్సీపీ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రానున్న నాలుగు నెలల్లో ప్రజా సమస్యలు, ప్రాజెక్టుల సందర్శనపై అనేక కార్యక్రమాలు చేయాల్సి ఉందని, దీనికి వైఎస్సార్సీపీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని కోరారు. పార్టీ పరంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన కార్యక్రమాలు చేస్తూనే జిల్లాలో జరిగిన అన్యాయంపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అండగా నిలవాలని దిశానిర్ధేశం చేశారు. పోలీసులకు వినతిపత్రం.. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ బొడ్డేపల్లి రాజగోపాలరావు వంటి గొప్ప వ్యక్తులు వంశధార ప్రాజెక్టు నిర్మాణానికి ఎంతో కృషి చేస్తే దివంగత నేత వైఎస్సార్ ఫేజ్–2, స్టేజ్–2 పనులకు కోట్లాది రూపాయలు వెచ్చించి వెనుకబడ్డ శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి శ్రీకారం చుట్టారన్నారు. ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో పది అడుగులు ముందుకేసి జిల్లాను అభివృద్ధి సరసన నిలిపేందుకు అనేక పనులు చేశారని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో చేపట్టిన పనులు, వంశధార ప్రాజెక్టు పనులపై దృష్టి సారించాలని కోరుతూ కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడుకు వినతి పత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. అనంతరం నాలుగు నెలల్లో చేపట్టబోయే కార్యక్రమాల్ని విజయవంతం చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ డాక్టర్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సీదిరి అప్పలరాజు, మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్, టెక్కలి, ఆమదాలవలస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల సమన్వయకర్తలు పేరాడ తిలక్, చింతాడ రవికుమార్, సాడి శ్యామ్ప్రసాద్రెడ్డి, పార్టీ ముఖ్య నాయకులు మామిడి శ్రీకాంత్, దుంపల లక్ష్మణరావు, అంధవరపు సూరిబాబు, కేవీజీ సత్యనారాయణ, ఎం.వి.స్వరూప్, ఎన్ని ధనుంజయరావు, గుమ్మడి రాంబాబు, అంబటి శ్రీనివాసరావు, చల్ల రవికుమార్, గొండు కృష్ణమూర్తి, చల్ల శ్రీనివాసరావు, చింతాడ వరుణ్, మార్పు ఫృద్వి, ఉలాల దివ్యభారతి, గేదెల పురుషోత్తం, పొన్నాడ రుషి, ముంజేటి కృష్ణమూర్తి, రౌతు శంకరరావు, కోణార్క్ శ్రీను, సనపల నారాయణరావు, సాధు వైకుంఠరావు, నర్తు నరేంద్రయాదవ్, శ్రీరామ్మూర్తి, ఊన్న నాగరాజు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో కేంద్ర, రాష్ట్ర మంత్రులున్నా ఉపయోగం సున్నా వైఎస్సార్సీపీ హయాంలోనే మూలపేట పోర్టు, ఉద్దానం ప్రాజెక్టు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రజా సమస్యలపై పోరాడేందుకు సన్నద్ధంకండి పార్టీ శ్రేణులకు మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాస్ పిలుపు -
పెళ్లి పత్రికలు పంచి వస్తూ..
● రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ దుర్మరణం ● మరో ఇద్దరికి తీవ్ర గాయాలు ఇచ్ఛాపురం రూరల్: వరుసకు తమ్ముడు పెళ్లిని ఘనంగా జరిపించాలనే ఆనందంతో సెలవు తీసుకొని గ్రామానికి వచ్చిన ఓ జవాన్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఇచ్ఛాపురం రూరల్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. కంచిలి మండలం బొనమాలి గ్రామానికి చెందిన బడ్డి బాలకృష్ణ(28) ఆర్మీ జవాన్గా పనిచేస్తున్నాడు. పెద్దనాన్న కుమారుడు, వరుసకు తమ్ముడైన చంద్రశేఖర్ వివాహం సందర్భంగా సెలవుపై శుక్రవారం స్వగ్రామానికి చేరుకున్నాడు. ఒడిశా రాష్ట్రం జయంతిపురం, పాత్రపురం, సామంతపల్లి ప్రాంతాల్లో బంధువులు ఉండటంతో వారిని పెళ్లికి ఆహ్వానించేందుకు తమ్ముడు బడ్డి సర్వేశుతో కలిసి శనివారం ఉదయం ద్విచక్రవాహనంపై బయల్దేరాడు. పెళ్లి కార్డులు అందించి తిరిగి వస్తుండగా కొత్త శాసనాం హనుమాన్ ఆలయం వద్దకు వచ్చే సరికి ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి గ్రామానికి చెందిన యువకుడు రామిశెట్టి దిలీప్ అదే రోడ్డు గుండా ఒడిశా వెళ్తూ రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆర్మీ జవాన్ బాలకృష్ణ తలకు బలంగా దెబ్బ తగలగడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. చెరో బైక్పై ఉన్న సర్వేశు, దిలీప్లు తీవ్ర గాయాలపాలయ్యారు. వెంటనే స్థానికులు 108లో ఇచ్ఛాపురం సామాజిక ఆసుపత్రికి తరలించారు. బాలకృష్ణకు ఏడాది క్రితం బాడపల్లి గ్రామానికి చెందిన శృతితో వివాహం జరిగింది. ఇంతలోనే మృతిచెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు పార్వతి, దుర్యోధనలతో పాటు కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతదేహాన్ని శవపంచనామాకు ఇచ్ఛాపురం సీహెచ్సీకి తరలించి, కేసు నమోదు చేసినట్లు ఎస్సై జనార్దనరావు తెలిపారు. -
సచివాలయ సర్వేయర్ల నిరసన
శ్రీకాకుళం పాతబస్టాండ్ : గ్రామ సచివాలయ సర్వేయర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అధికారులకు శాంతియుతంగా వినతిపత్రం అందజేస్తే.. అధికారులు వాటిని పరిష్కరించకపోగా సస్పెన్షన్లతో గొంతునొక్కడం తగదంటూ సుమారు నాలుగు వందల మంది సర్వే ఉద్యోగులు శనివారం కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. రాష్ట్ర అధ్యక్షుడిని సస్పెండ్ చేయడం తగదంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వ వైఖరిని, అధికారుల తీరును తప్పుపట్టారు. విషయం తెలుసుకున్న సర్వే శాఖ ఏడీ జోస్లీ తక్షణ చర్యగా గ్రామ సచివాలయం సర్వేయర్ల జిల్లా అధ్యక్షుడు మజ్జి అప్పలనాయుడును సస్పెండ్చేశారు. దీంతో తోటి సర్వేయర్లు నిరసన తీవ్రతరం చేశారు. అందరిని సస్పెండ్ చేయాలని, ప్రస్తుతం విధులకు హాజరయ్యే పరిస్థితి లేదని తేల్చిచెప్పారు. ప్రభుత్వం తక్షణమే సమస్యలు పరిష్కరించాలన్నారు. -
పొలాల్లోకి పెళ్లి వ్యాన్
● 17 మందికి గాయాలు ● నలుగురు పరిస్థితి విషమం హిరమండలం: పొలాల్లోకి పెళ్లి వ్యాన్ దూసుకెళ్లిన ఘటనలో 17 మంది గాయాలపాలయ్యారు. అందులో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. హిరమండలం మండలం పిండ్రువాడ కాలనీ సమీపంలో శనివారం సాయంత్రం జరిగిన ఘటనా వివరాలిలా ఉన్నాయి. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం. సోంపేట మండలం శాసనం గ్రామానికి చెందిన పెళ్లి బృందం వ్యాన్లో పాత హిరమండలం బయలుదేరింది. సరిగ్గా పిండ్రువాడ కాలనీ సమీపంలో మలుపులో అదుపు తప్పి పొలాల్లోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో 17 మందికి గాయాలయ్యాయి. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పరిసర గ్రామాల ప్రజలు వచ్చి క్షతగాత్రులకు సపర్యలు చేశారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తొలుత హిరమండలం పీహెచ్సీకి తరలించారు. ప్రాథమిక వైద్యం అనంతరం మెరుగైన వైద్యంకోసం నలుగురిని శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. హిరమండలం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హర్షవర్ధన్ బెయిల్ రద్దు చేయాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): దళిత మహిళను మోసగించి లైంగిక దాడికి పాల్పడిన న్యాయవాది, జిల్లా న్యాయ సేవాసమితి సభ్యుడు హర్షవర్ధన్ బెయిల్ రద్దు చేసి వెంటనే రిమాండ్కు పంపించాలని విదసం, విస్త్రృత దళిత సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం అంబేద్కర్ విజ్ఞాన మందిర్లో దళిత, ఆదివాసీ, ప్రజాసంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హర్షవర్ధన్ జిల్లా న్యాయ సేవాసంఘంలో సభ్యుడిగా ఉన్న హోదాను అడ్డం పెట్టుకుని 50 రోజులు రిమాండ్కి వెళ్లాల్సిన కేసులో బెయిల్ పొందాడని, ప్రాసిక్యూషన్ స్పందించి బెయిల్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దళిత సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ డి.గణేశ్ మాట్లాడుతూ హర్షవర్ధన్ను లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి, బార్ కౌన్సిల్ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. యడ్ల గోపి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ లాయర్లు అసోసియేషన్ జిల్లా నాయకులు బి.మురళీకృష్ణ, వివిధ సంఘాల నాయకులు బడియా కామరాజు, సవాలపురపు కృష్ణవేణి, రాకోటి రాంబాబు, దండాసి రాంబాబు, అర్జి ఈశ్వరరావు, అర్జి కోటి, వన్నలి లక్ష్మీనారాయణ, టి.రమణ తదితరులు పాల్గొన్నారు. -
కూటమి కుట్రలను తిప్పికొట్టాలి
మెళియాపుట్టి: కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజకు నయవంచనకు గురిచేస్తోందని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ ప్రివిలేజ్ కమిటీ సభ్యురాలు రెడ్డిశాంతి అన్నారు. శనివారం ముక్తాపురంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంతో ఆత్మ గౌరవంతో బతికిన ఆశావర్కర్లను కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు నట్టేట ముంచారని అన్నారు. రూ.3000 వేతనాలతో బతుకులీడుస్తున్న సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారిని ఆదుకుని రూ.10వేలకు జీతాల్ని పెంచారని గుర్తు చేశారు. నేడు కూటమి నాయకులు ఆశా కార్యకర్తలపై రాజకీయ వేధింపులకు పాల్పడటం శోచనీయమన్నారు. కార్యక్రమంలో ముక్తాపురం సర్పంచ్ అలికాన జయప్రద, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఉర్లాన బాలరాజు, నియోజకవర్గ ఎస్సీ విభాగ అధ్యక్షుడు అలికాన మాధవరావు, సీనియర్ నాయకుడు బమ్మిడి ఖగేశ్వరరావు, ఎంపీటీసీ రవికుమార్, జిల్లా కార్యదర్శి సవర సుభాష్, పల్లి యోగి, దువ్వాడ బారాజు తదితరులు పాల్గొన్నారు. -
ఉత్కంఠంగా గోకార్టింగ్ రేస్
టెక్కలి: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో నాలుగు రోజులుగా జరుగుతున్న గోకార్టింగ్ చాంపియన్షిప్ సీజన్–3 జాతీయ స్థాయి పోటీలు శనివారంతో ముగిశాయి. ఆంధ్రా, తెలంగాణా, మహారాష్ట్ర తమిళనాడు రాష్ట్రాల నుంచి మొత్తం 19 బృందాలు తమ వాహనాలతో ఈ పోటీల్లో పాల్గొన్నాయి. సీవీ (కంబస్టన్ వెహికల్), ఈవీ (ఎలక్ట్రికల్ వెహికల్ ) విభాగంలో ఫైనల్ రేసింగ్ ఉత్కంఠ భరితంగా కొనసాగింది. సీవీ విభాగంలో మొదటి స్థానంలో ఆదిత్య కళాశాల, రెండో స్థానంలో అనిడ్స్ కళాశాల విద్యార్థులు విజేతలుగా నిలిచారు. ఈవీ విభాగంలో మొదటి స్థానంలో ఆదిత్య కళాశాల, రెండో స్థానంలో మహారాష్ట్రకు చెందిన ఎస్ఎస్జీఎమ్సీ కళాశాల విద్యార్థులు విజేతలుగా నిలిచారు. కళాశాల డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు, కార్యదర్శి ఎల్.ఎల్.నాయుడు, కోశాధికారి టి.నాగరాజు, ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, డీన్ శ్రీరాములు చేతుల మీదుగా విజేతలకు ట్రోఫీలు అందజేశారు. -
9,10 తేదీల్లో ఆదిత్యుని కిరణ దర్శనం
శ్రీకాకుళం కల్చరల్ : ఈ నెల 9, 10 తేదీలలో అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి కిరణ దర్శనం జరగనుందని ఆలయ ప్రతినిధులు పేర్కొన్నారు. వాతావరణం అనుకూలిస్తే ఉదయం 6 నుంచి 6.30 గంటల వరకు కిరణ దర్శనం ఉంటుందని వెల్లడించారు. రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు సత్యవరం విద్యార్థులు నరసన్నపేట: సత్యవరం ఉన్నత పాఠశాలకు చెందిన ఎ.సంజన, కె.ప్రవీణ్కుమార్లు అండర్–13 విభాగంలో రగ్బీ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని పీడీ జ్యోతీరాణి తెలిపారు. ఆదివారం నుంచి గన్నవరంలో జరిగే ఈ పోటీలకు శ్రీకాకుళం జిల్లా జట్టులో వీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పారు. విద్యార్థులను ఉపాధ్యాయ బృందం అభినందించింది. ఒక గ్రామం..ఆరుగురు వీఆర్ఓలు పలాస: బొడ్డపాడు పంచాయతీ మామిడిపల్లి గ్రామంలో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే చేసేందుకు శనివారం ఏకంగా ఆరుగురు వీఆర్ఓలు రావడంతో గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఇంతమంది ఎందుకొచ్చారా అని ఆరా తీస్తే శనివారం సాయంత్రానికల్లా గ్రామంలో ఉన్న ఇళ్ల మొత్తం సర్వే చేయాలని కలెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చాయని, అందుకే తహశీల్దారు తమను మామిడిపల్లి పంపించారని వీఆర్ఓల సంఘం జిల్లా కార్యదర్శి శ్రావణ్కుమార్ చెప్పారు. ఇక్కడ పనిచేసిన వీఆర్ఓ సరిగా సర్వే చేయలేదని, ఇంకా 90 ఇళ్లు ఉన్నాయని, అందుకే ఆరుగురిని పంపించారని సర్వే సిబ్బంది చెప్పారు. మామిడిపల్లితో పాటు లొద్దబద్రలోనూ సర్వే పూర్తి కాలేదని, అక్కడ కూడా ఇంకా 40 ఇళ్లు ఉండిపోయాయని, అవి కూడా శనివారం సాయంత్రానికి పూర్తి చేశామని తహశీల్దారు కళ్యాణ చక్రవర్తి చెప్పారు. మొత్తానికి రెవెన్యూ ఉద్యోగులు ఒత్తిడి కారణంగా పూర్తి స్థాయిలో ఏ పనీ చేయలేకపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెళ్లి పేరిట మోసగించాడని యువతి నిరసన హిరమండలం: సీఆర్పీఎఫ్ జవానుతో తనను ప్రేమ పేరుతో వంచించి పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఓ యువతి మౌన పోరాటానికి దిగింది. బాధితురాలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హిరమండలం మండలంలోని భగీరథపురం కాలనీకి చెందిన ఓ యువతి(21)కి భామిని మండలం సింగిడి గ్రామానికి చెందిన కొట్నాల చంద్రశేఖర్తో(మహేష్) కొన్నేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. చంద్రశేఖర్ తాతగారిల్లు భగీరథపురం కాలనీకి వచ్చిన సమయంలో ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇటీవల చంద్రశేఖర్కు సీఆర్పీఎఫ్ జవాను ఉద్యోగం రావడంతో యువతిని పక్కన పెట్టాడు. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు హిరమండలం పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేసింది. కానీ వారు పట్టించుకోవడం లేదంటూ శ్రీకాకుళం ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించింది. ఈ క్రమంలో శనివారం దళిత సంఘాల మహిళా ప్రతినిధులతో కలిసి గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగింది. తనకు న్యాయం చేసేవరకూ ఆందోళన కొనసాగిస్తానని స్పష్టం చేసింది. తనకు న్యాయం చేయకుండా నిందితుడికి కొమ్ము కాయడం తగదని ఆవేదన వ్యక్తం చేసింది. -
శ్రీకాకుళం
ఆదివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2026ఆపదలో వుండే మహిళలు శక్తియాప్లో ఫిర్యాదు చేస్తే క్షణాల్లో మా పోలీసులు వెళ్తారు. అత్తింటి, భర్త సాధింపులైతే కౌన్సిలింగ్ చేస్తాం. వీడియో న్యూడ్ కాల్స్ చేయవద్దు. లివింగ్ రిలేషన్ షిప్ పై అప్రమత్తత అవసరం. రాత్రిపూట ఒంటరి గా ఎక్కడైనా చిక్కుకుపోతే షెల్టర్ కల్పిస్తాం. లేదంటే సిబ్బందితో పంపిస్తాం. విమెన్ హెల్ప్ డెస్క్లున్నాయి.. 112కు కాల్చేసినా చాలు. – నారీమణి, సీఐ, శ్రీకాకుళం మహిళా పోలీస్స్టేషన్ శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల అభివృద్ధే ధ్యేయంగా నిరంతరం పాటు పడుతున్నారు డాక్టర్ రోణంకి హరిత. దశాబ్దంన్నర మునుపు డిగ్రీ కళాశాల అధ్యాపకురాలిగా ఏపీపీఎస్సీ ద్వారా రిక్రూట్ అయిన ఈమె వివిధ హోదాల్లో పనిచేస్తూ వచ్చారు. అనేక పరిశోధనలతోపాటు పలు యూనివర్సిటీలకు పాఠ్య పుస్తకాలు రాశారు. అనేక జర్నల్స్ ప్రచురించారు. ప్రఖ్యాత సద స్సులు, సెమినార్లలో ఉత్తమ లెక్చరర్గా తన వాణిని వినిపించారు. కళాశాలకు నాక్ మెరుగైన గ్రేడ్ రావడంలో కీలకభూమిక పోషించి ప్రశంసలు అందుకున్నారు. ఏడేళ్ల నుంచి ఐక్యూఏసీ కోఆర్డినేటర్గా, ప్రస్తుతం వైస్ ప్రిన్సిపాల్గా సేవలు అందిస్తున్నారు. శ్రీకాకుళం కల్చరల్: ‘ఒక రోజు నా సొంత బిజినెస్ ప్రారంభించాలి. అలాగే మిస్ ఇండియా అవ్వాలి.’ ఆమె కన్న కలలు ఇవి. ఆ కలలపై నమ్మకం పెట్టుకున్నారు. ఆ దారిలోనే పయనించారు. అనుకున్నది సాధించి కిరీటం గెలిచే వరకు చేరుకున్నారు. ఆమె మిస్ గ్రాండ్ ఆంధ్రప్రదేశ్ రన్నరప్గా నిలిచిన చింతలపూడి మేఘనారావు. తల్లిదండ్రుల సహకారం ఉండడంతో అనుకున్నది సాధించారు. ఈ ఫిబ్రవరి నెలలో జరిగిన మిస్ గ్రాండ్ ఆంధ్రప్రదేశ్–2026 పోటీలో రన్నరప్గా నిలిచారు. డార్జిలింగ్ మెమోస్ అనే ఫుడ్ బిజినెస్కు ఓనర్గానూ రాణిస్తున్నారు. శ్రీకాకుళానికి చెందిన ఈమె ఇన్ని విజయాలు సాధించడానికి కారణం పట్టుదలే అని చెబుతున్నారు. అమ్మ నవ్వుతూ నడయాడే ఇల్లు.. అమ్మాయి ధైర్యంగా తిరగ్గలిగే ఊరు.. అతివలను ఆదరించి, గౌరవించే ప్రాంతం. ఇంతుల విజయాలకు చిరునామాలుగా ఉంటాయి. అటువంటి పరిస్థితులు ఉన్నందునే మన సిక్కోలు పడతులు గుర్తింపు తెచ్చే విజయాలు సాధిస్తున్నారు. కీర్తి కిరీటాలు అందుకుంటున్నారు. జిల్లా కీర్తిపతాకను ఎగురవేస్తున్నారు. మన ఆడపడుచులు ప్రశంసలు పొందుతున్నారు. వారి విజయాలే స్ఫూర్తి మంత్రాలై ప్రతి ఇంటా ప్రతిధ్వనించాలి. ‘అమ్మా.. జాగ్రత్త’ అని లోగొంతు వినిపించే చోట ‘రేయ్.. జాగ్రత్త’ అన్న కరకు గొంతు కూడా దిక్కులు పిక్కటిల్లజేయాలి. అందుకే మహిళా దినోత్సవం వేళ ‘షి’క్కోలు విజయ వనితల పరిచయమాల. –సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళంటెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన జాతీయ స్థాయి గోకార్టింగ్ పోటీల్లో టీమ్ యాగ్జిలేటర్ గోకార్ట్ వాహనంతో రైడర్, కో రైడర్, కెప్టెన్, వైస్ కెప్టెన్లు బి.పవిత్ర, ఎస్.శివాని, కె.రోహిత్ వర్మ, సిహెచ్.రుచిర యాదవ్ తదితరులు టెక్కలి: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన జాతీయ స్థాయి గోకార్టింగ్ పోటీ ల్లో భాగంగా హైదరాబాద్ బీవీఆర్ఐటీ కళాశాలకు చెందిన యువతులు ప్రత్యేకంగా నిలిచా రు. ఎంతో సాహసోపేతమైన గోకార్టింగ్ పోటీల్లో భాగంగా ‘టీమ్ యాగ్జిలేట ర్’ వాహనానికి వారధులుగా.. సారథులుగా అమ్మాయిలే వ్యవహరించారు. ఈవీ విభాగంలో తయారు చేసిన ఈ వాహనానికి బి.పవిత్ర రైడర్గా, ఎస్. శివాని సహాయ రైడర్గా వ్యవహ రించారు. కె.రోహితవర్మ, సిహెచ్.రుచిర యాదవ్ తదితర విద్యార్థినులు కెప్టెన్లుగా వ్యవహరించారు. ఈ పోటీల్లో అత్యంత ప్రతిభ చూ పడంతో బెస్ట్ ఉమెన్ టీమ్ అవార్డు, ద్రోణాచార్య అవార్డు ఫర్ ఫ్యాకల్టీ అడ్వైజర్, క్వాలిఫై ఫస్ట్ టెక్నిక ల్ ఇన్స్పెక్షన్, లైట్ వెయిట్ వాహనంగా గుర్తింపు, విన్నర్ ఎక్స్లిరేషన్ తదితర విభాగాల్లో విజేతలుగా నిలిచి నగదు ప్రోత్సాహకాన్ని అందుకున్నారు. అందరిలో ప్రత్యేకంగా నిలవాలనే లక్ష్యంగా ఈ గో కార్టింగ్ రైడ్ను ఎంచుకున్నాం. 5 విభాగాల్లో క్వాలిఫైగా నిలిచి నగదు బహుమతి సాధించాం. మా బృందంలో మొత్తం 12 మంది సభ్యులు ఉన్నారు. అందరి సమష్టి కృషితో వాహనాన్ని తయారు చేసి పోటీల్లో పాల్గొంటున్నాం. – టీమ్ యాగ్జిలేటర్ గోకార్ట్ వాహనం రైడర్, కో–రైడర్, కెప్టెన్, వైస్ కెప్టెన్లు బి.పవిత్ర, ఎస్.శివాని, కె.రోహితవర్మ, సీహెచ్ రుచిర యాదవ్ గేదెల దుర్గాప్రశాంతిశ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాకు చెందిన సెపక్తక్రా క్రీడాకారిణి గేదెల దుర్గాప్రశాంతి చరిత్ర సృష్టించింది. శ్రీకాకుళం విజయ కేతనాన్ని శ్రీలంకలో ఎగరేసింది. శ్రీలంకలోని కొలంబో వేదికగా ఫిబ్రవరి 7 నుంచి 9వ తేదీ వరకు జరిగిన 6వ ఏషియన్ మహిళల అంతర్జాతీయ సెపక్తక్రా చాంపియన్ షిప్– 2026 పోటీల్లో భారత జట్టుకు మన సిక్కోలు క్రీడా కుసుమం దుర్గాప్రశాంతి ఎంపికవడమే కాకుండా.. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భారత జట్టు విజేతగా నిలవడంలో కీలకభూమిక పోషించింది. ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి భారత జట్టుకు ఎంపికై న ఏకై క క్రీడాకారిణిగా చరిత్రకెక్కింది. శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు గ్రామానికి చెందిన దుర్గాప్రశాంతి గేదెల నర్సింహులు, పుణ్యావతిల కుమార్తె. శ్రీకాకుళం కల్చరల్: స్వాతీ సోమనాథ్.. పరిచయం అక్కర్లేని పేరు. కూచి పూడి కళలో రాణిస్తూ సిక్కోలు ఖ్యాతిని విదేశాలలో ఎగురవేస్తున్నారు. సంప్రదాయం నృత్య పాఠశాలలో వందలాది మందిని తయారు చేస్తున్నారు. ఆమె సొంతంగా 13 బ్యాలేలు రూపొందించారు. మహిళలు కేవలం భయం వల్లనే ఎన్నో అవకాశాలు వదులుకుంటున్నారని ఆమె చెబుతున్నారు. ఆ భయం వదిలితే లోకాన్ని జయించగలరని అంటున్నారు. శ్రీకాకుళం కల్చరల్: సంకల్ప సిద్ధి ఉంటే ఆశయ సాధన అదే జరుగుతుందని నిరూపించారు కోల రమణి. దివ్యాంగురాలైనా వెరవకుండా వాలీబాల్ పోటీల్లో అదరగొట్టారీమె. గార మండలం అంపోలు గ్రామానికి చెందిన రమణి ఆంధ్రప్రదేశ్ జట్టు తరపున జాతీయ స్థాయి పారాసిటింగ్ వాలీబాల్ పోటీల్లో చైన్నె, రాజస్థాన్, యూపీల్లో జరిగిన పోటీల్లో పాల్గొన్నారు. మరోవైపు టాలీ నేర్చుకుని నగరంలోని ఓ షాపులో అకౌంటెంట్గా పనిచేస్తున్నారు. జి.సిగడాం: తల్లి స్వేదం కుమారుడికి నవ వేదమైంది. అమ్మ కష్టమే కొడుక్కి స్ఫూర్తినిచ్చింది. కష్టపడి పనిచేసి చదివించిన ఆమెకు ‘సివిల్స్ విజేత తల్లి’ అనే అపురూప కానుకను ఇచ్చా డు ఆ బిడ్డ. జి.సిగడాం మండలం నడిమివలస గ్రామానికి చెందిన సౌరోతు లక్ష్మి కుమారుడు సౌరోతు రాము సివిల్స్లో ఆల్ ఇండియాలో 463వ ర్యాంకు సాధించారు. రాము తండ్రి అసిరినాయుడు 2019లో మరణించారు. అప్పట్లో రాము హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగం చేసేవాడు. తర్వాత ఉద్యోగాన్ని వదిలిపెట్టి సివిల్స్పై దృష్టి సారించాడు. తండ్రి లేకపోయినా తల్లే అన్ని విధాలుగా సాయం చేసేవారు. ఆ కష్టం వృధా పోలేదు. రాము సివిల్స్ సాధించి తల్లికి జీవితకాలపు కానుకను ఇచ్చాడు. శ్రీకాకుళం రూరల్: ఆమె దాదాపు 14 వేల మందికి చదువు చెప్పా రు. అందులో పదివేల మంది ఉత్తరాంధ్ర వారే. అందులోనూ దాదాపు ఐదువేల మంది గిరి పుత్రికలే. చదువు చెప్పడంతో పాటు వారి ఆరోగ్యంపైనా శ్రద్ధ తీసుకుని, వారికి ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నారు బొల్లినేని మెడిస్కిల్స్ అకడమిక్ డైరెక్టర్ లక్ష్మీపద్మజ. ఆదివాసీ యువతకు పారామెడికల్ విద్యను నేర్పేందుకు ఆమె కృషి చేస్తున్నారు. ఉన్నత విద్యావంతురాలైన లక్ష్మీ పద్మజ టాటాస్ట్రెవ్, టెక్ మహేంద్ర, హెచ్పీసీఎల్ వంటి కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకుని బడుగుల జీవితాల్లో వెలుగు నింపుతున్నారు. తాను పనిచేస్తున్న సంస్థలో వివిధ కోర్సులను ప్రవేశపెట్టి వాటిని విద్యార్థులకు ఉచితంగా అందజేస్తున్నారు. కోల రమణిపలాస: పేరులో సుకుమారం.. పోరులో కఠినత్వం ఆమె సొంతం. పలాస మండలం బొడ్డపాడు గ్రామాని కి చెందిన పోతనపల్లి కుసు మ ఎక్కడ పోరాటం జరిగి నా ముందు వరుసలో ఉంటారు. ప్రస్తుతం ఆమె ప్రగతిశీల మహిళా సంఘం(పీఓడబ్ల్యూ) జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చూస్తున్నారు. ఆమె తండ్రి రెయ్యి పోలయ్య శ్రీకాకుళం జిల్లా గిరిజన రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని జైలు జీవితం అనుభవించారు. ఆమె మామయ్య పోతనపల్లి అప్పలస్వామి నాటి శ్రీకాకుళం జిల్లా పోరాటంలో పాల్గొని 40 ఏళ్లు అజ్ఞాతంలో ఉండి పోలీసు కాల్పుల్లో చనిపోయా రు. అత్త పోతనపల్లి జయమ్మ కూడా అజ్ఞాత జీవితం గడిపారు. కుసుమ తాత పోతనపల్లి అప్పన్న బ్రిటిష్ ఇండియాలో ఆర్మీలో హవల్దార్గా పనిచేశారు. ఆమె భర్త మాత్రం ఆటో డ్రైవరు కావడం గమనార్హం. ధనిక కుటుంబంలో పుట్టినా పేదల కోసం ఆమె పోరాడుతున్నారు.లక్ష్మీపద్మజ కుసుమ మహిళలు జీవితంలో తీసుకునే ప్రతి నిర్ణయం వారి చేతుల్లోనే ఉండాలి. అప్పుడే ‘ఆమె’కు పూర్తి స్వాతంత్య్రం వచ్చినట్లు. ఇంటిలో బాలికలకే కాదు బాలురుకు కూడా జాగ్రత్తలు చెప్పాలి. ఏ అమ్మాయికి పొరపాటున తగలరాదని, ఇబ్బంది పెట్టకూడదని, కఠిన చట్టాలు, సెక్షన్లు ఉండటంతో జైలు పాలు కావద్దని చెప్పాలి. ప్రపంచమంతా నాకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మా పెద్దక్క అండగా నిలిచింది. – కేవీ మహేశ్వరరెడ్డి, ఎస్పీ -
మాట కలుపుదాం
ఆడ పిల్లలకు చిన్న వయసు నుంచే బిడియం లేకుండా సమాజంలో ప్రతి విషయంపై అవగాహన కలిగే విధంగా పెంచాలి. ఇంటిలో గానీ, పాఠశాలలో గాని ఎక్కడైనా వారికి ఇబ్బంది కలిగే విధంగా ఎదుర్కొన్న వికృత చేష్టలను తల్లిదండ్రులకు ధైర్యంగా చెప్పగలిగే విధంగా వారికి భరోసా ఇవ్వాలి. అలాగే ఇంట్లో పిల్లల విషయంలో ఆడ, మగ అనే తేడాలు చూపకూడదు. ఆడపిల్లలు ఎదుర్కొంటున్న వేధింపులపై సోదరులకు క్షుణ్ణంగా చెప్పాలి. – బి.అన్నపూర్ణమ్మ, విశ్రాంత ఉపాధ్యాయురాలు, టెక్కలి టెక్కలి: ‘అలా చేయకూడదే..’ అని చెప్పే నానమ్మలు.. ‘ఇలా చెయ్యవే.. పర్లేదు’ అని నచ్చజెప్పే అమ్మమ్మల కాలం ఇప్పుడు కనుమరుగైపోయింది. ఇంటిలో పెద్దవాళ్లు ఉన్నంత కాలం వాళ్లే మనకు తెలి యకుండా పిల్లలకు కౌన్సెలింగ్ ఇచ్చేవాళ్లు. మంచి చెడు తేడా చెప్పేవాళ్లు. ఈ సెల్ఫోన్ యుగంలో అది కూడా చిన్న కుటుంబాల జమానాలో పిల్లలకు మంచి చెప్పే వారు, చెడును వివరించే వారు కనుమరుగైపోయారు. అందుకే ఇప్పుడు బాలికలతో మాట కలపాలి.. వారి మనసులో ఉన్న బాధనైనా, సంతోషాన్నైనా పంచుకోవాలి. ●యుక్త వయసులో ఉన్న బాలికల విషయంలో తల్లిదండ్రులకు ఓ భయం ఉంటుంది. అందుకే పిల్ల లు ఏ విషయమైనా ఇంటిలో పంచుకోగలిగే స్వేచ్ఛ ఉండాలి. ●ఎవరు ఎలాంటి వారో తెలుసుకోగలిగే మానసిక పరిపక్వత ఇంటి నుంచే పెంపొందించాలి. ●ఇంకా తమ పిల్లలు చిన్నారులే అనే ఆలోచన నుంచి తల్లిదండ్రులు బయటపడాలి. ●మానవ సంబంధాలు, సమాజంలో జరుగుతున్న అకృత్యాల గురించి చర్చలు అత్యవసరం. ●గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్పే బాధ్యత టీచర్లదే కాదు తల్లిదండ్రులది కూడా. ●ఎవరి నుంచి ఏ విధమైన వేధింపు ఎదురైనా ‘నీ వెనుక మేమున్నాం..’ అనే ధైర్యం కల్పించాలి. ●ఇంటి పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, ఖర్చులు వగైరా గురించి పూర్తి అవగాహన కల్పించాలి. ●అవసరమైనంత వరకే సెల్ఫోన్ వినియోగం శ్రేయోదాయకం. ●బాలికలకే కాదు.. అమ్మాయిలతో ఎలా మసలుకోవాలో ఇంటిలో ఉన్న మగ పిల్లలకు కచ్చితంగా చెప్పాలి. -
అసెంబ్లీ నియోజక వర్గాలకు వైఎస్సార్సీపీ పరిశీలకుల నియామకం
● ఎనిమిది నియోజకవర్గాలకు పేర్లు ఖరారు ● సీనియారిటీ, విధేయత, సమర్థత, పనితీరుకు పెద్దపీట ● పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు నియామక ఉత్తర్వులు జారీ సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ నియోజక వర్గాలకు పరిశీలకుల్ని నియమిస్తూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియామకం చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విధేయత, సీనియారిటీ, సమర్థత, పనితీరు ఆధారంగా నియామకాలు చేపట్టారు. అసెంబ్లీ పరిశీలకులగా నియమితులైన వారంతా పార్టీ రాష్ట్ర కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ రీజినల్ కో ఆర్డినేటర్, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ నియోజక వర్గ పరిశీలకులకు సహాయకారిగా వ్యవహరించాల్సి ఉంటుంది. అసెంబ్లీ నియోజక వర్గాల నియమితులైన వారి వివరాలివి.. ఇచ్ఛాపురం: దుంపల లక్ష్మణరావు ఆమదాలవలస : కరిమి రాజేశ్వరరావు పాతపట్నం : పాలవలస విక్రాంత్ ఎచ్చెర్ల: పెనుమత్స సూర్య నారాయణ రాజు నరసన్నపేట: అంధవరపు సూరిబాబు టెక్కలి: చల్లా రవికుమార్ పలాస : ఎన్ని ధనుంజయ్ శ్రీకాకుళం: పిన్నింటి సాయి సురేష్ కుమార్ -
ఉత్తి కోతలు
ఎత్తి పోతలు..● వంశధార ఎత్తిపోతల పథకం నిర్మాణంలో జాప్యం ● తమ హయాంలో 40 శాతం పనులు పూర్తి చేసిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ● చంద్రబాబు ప్రభుత్వంలో పడకేసిన పనులు ● కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులో మొండిచేయి హిరమండలం: వంశధార సాగునీటి ప్రాజెక్టు వద్ద తలపెట్టిన ఎత్తిపోతల పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయి. వంశధార ఫేజ్–2 రిజర్వాయర్లో నీటి స్థిరీకరణకుగాను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. శరవేగంగా పనులు జరిపించింది. నిధులకు లోటు లేకుండా చేసింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం వ చ్చాక పనులు సాగడం లేదు. నిధుల మంజూరు ప్రకటనలకే పరిమితమైంది. సకాలంలో బిల్లులు చెల్లించక పనులు సక్రమంగా జరగడం లేదు. వైఎస్సార్ హయాంలో.. వంశధార జలాల సంపూర్ణ వినియోగానికి 2005లో వైఎస్సార్ ఉన్నప్పుడు జలయజ్ఞంలో భాగంగా వంశధార రిజర్వాయర్ నిర్మాణానికి సంకల్పించారు. ఒక వైపు ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తూనే.. మరోవైపు వంశధార మిగులు జలాలకు సంబంధించి ఒడిశాతో వివాదాన్ని పరిష్కరించేందుకు చొరవ చూపారు. వైఎస్సార్ మరణానంతరం ఈ పనులు ఆగిపోయా యి. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవ చూపారు. వంశధార రిజర్వాయర్ పనులను పరుగులు పెట్టించడంతో పాటు నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఒడిశాతో సంప్రదింపులు జరిపారు. నేరడి నిర్మాణం ఆలస్యం అవుతుండడంతో గొట్టా బ్యారేజీ కుడి ప్రధాన కాలువ నుంచి 12 టీఎంసీల నీటిని మళ్లించేందుకు వీలుగా ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. 2022 సెప్టెంబరు 14న రూ.176.35 కోట్లు మంజూరు చేశారు. హైదరాబాద్కు చెందిన సంస్థ టెండర్లు దక్కించుకోగా.. పనులను శరవేగంగా పట్టాలెక్కించారు. పనులు కూడా వేగవంతం చేశారు. రెండేళ్లలో దాదాపు 40 శాతం పనులు చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో ప్రగతి.. కేవలం రెండేళ్లలో వైఎస్సార్ సీపీ దాదాపు సగం పనులు పూర్తి చేసింది. చంద్రబాబు ప్రభుత్వం చొర వ చూపి ఉంటే ఈ పాటికి ఈ ప్రాజెక్టు పూర్తయ్యి ఉండేది. కానీ బిల్లులు చెల్లించకపోవడంతో పనులు ముందుకు కదలడం లేదు. ఎత్తిపోతల పథకం పూర్తయితే కానీ రిజర్వాయర్లో నీరు చేరదు. మరోవైపు వంశధార రిజర్వాయర్ చూస్తే దాదాపు 97 శాతం పనులు పూర్తయ్యాయని చెబుతున్నారు. ఇంకా స్పిల్ వే హెడ్ రెగ్యులేటర్ వద్ద గేట్లు అమర్చడం, రిజర్వాయర్ ఎగువ భాగంలోని వరద నీరు చేరే ప్రదేశమైన కొత్తూరు మండలం ఎన్నిరామన్నపేట వద్ద 1.5 కిలోమీటర్ల పొడవున 9 మీటర్ల ఎత్తులో మట్టి గట్టు నిర్మించాల్సి ఉంది. నిధులు మంజూరుకాక ఆ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇంకా పనులు పెండింగ్.. రెండు ప్రభుత్వాలు కలిపి రూ.256 కోట్లు మంజూరు చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల ప్రాప్తికి పనులు పూర్తయ్యాయి. అయితే కూటమి వచ్చిన తర్వాత మంజూరు చేసిన నిధుల విషయంలో ఎంత ఖర్చుచేశారు? నిధుల విడుదల ఎంత? అనేది స్పష్టత లేదు. విద్యుత్ సబ్స్టేషన్ నిర్మించాల్సి ఉంది. ఇందుకుగాను రూ.9.18 కోట్లను ట్రాన్స్కో చెల్లించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం జనరేటర్ల ఆధారంగానే ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు జరిపిస్తున్నారు. పంపు హౌస్ పనులు పెండింగ్లో ఉన్నాయి. 3.2 మీటర్ల డయా 110 పైపులను అమర్చాల్సి ఉంది. రిజర్వాయర్ గట్టుపై ఎత్తిపోతల పథకానికి సంబంధించి డెలివరీ సిస్టమ్కు అనుమతులు రావాల్సి ఉంది. ఎత్తిపోతల పథకం పూర్తయితే కుడి, ఎడమ ప్రధాన కా లువల ద్వారా 2.11 లక్షల ఎకరాల ఆయకట్టుకు పుష్కలంగా సాగునీరు అందుతుంది. నారాయణపురం ఆనకట్ట పరిధిలో 18,577 ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. హెచ్ఎల్సీ అనుసంధానం కాలువల ద్వారా మరో 5 వేల ఎకరాలకు సాగునీరును స్థిరీకరించవచ్చు. ఉద్దానం సమగ్ర మంచినీటి పథకానికి 1.12 టీఎంసీల తాగునీరును తరలించవచ్చు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. నత్తనడకన సాగుతున్న గొట్టా బ్యారేజీలోని ఎత్తిపోతల పథకం పనులు వచ్చే ఏడాదికి పనులు పూర్తి ఎత్తిపోతల పథకానికి సంబంధించి పనులు వేగంగా సాగుతున్నాయి. ఎప్పటికప్పుడు పరిస్థితిని ప్రభుత్వానికి నివేదిస్తున్నాం. పెండింగ్ బిల్లుల అంశం సైతం ప్రభుత్వం దృష్టిలో ఉంది. చిన్నచిన్న ఇబ్బందులు ఉన్నా పనుల విషయంలో మాత్రం జాప్యం జరగడం లేదు. వచ్చే ఏడాది నాటికి అన్ని పనులు పూర్తి చేసి ప్రాజెక్టును అందుబాటులోకి తెస్తాం. సకాలంలో పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం. – బి.రవీంద్ర, ఈఈ, వంశధార కన్స్ట్రక్షన్ డివిజన్ -
వైఎస్సార్సీపీ గెలుపే లక్ష్యం
● పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ● ఇచ్ఛాపురంలో పార్టీ కార్యాలయం ప్రారంభం ఇచ్ఛాపురం: రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త పనిచేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ కోరారు. పట్టణంలోని విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో వైఎస్సార్సీపీ కార్యాలయం ప్రారంభోత్సవం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యామ్ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ధర్మాన కృష్ణదాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కృష్ణదాస్ మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం దయనీయస్థితికి చేరుకుందన్నారు. ఇచ్ఛాపురం సమన్వయకర్తగా ఉన్న శ్యామ్ ప్రసాద్ రెడ్డిని పార్టీ కార్యకర్తలంతా గెలిపించి వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేయాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రముఖ వైద్యు లు డాక్టర్ డి.త్రినాథ్ రెడ్డి వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులను ప్రత్యేకంగా సత్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, పార్టీ కేంద్రం కమిటీ సభ్యులు పిరియా సాయిరాజ్, మాజీ ఎమ్మెల్యే నరేష్కుమార్ అగర్వాలా, నర్తు నరేంద్రయాదవ్, ఉలాల భారతీదివ్య, పిలక రాజలక్ష్మి, బోర పష్ప, పైల దేవదాస్, ప్రత్తి అన్వేష్, నర్తు ప్రేమ్, తడక జోగారావు, సల్లా సుగుణ, ప్రకాశరావు పట్నాయక్, పి.రాజశేఖర్, కడియాల ప్రకాష్, వైద్యులు ఉలాల కోదండరామ్, సర్పంచ్లు, వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఏం చేశారో చెప్పగలరా..? అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ ఏం చేసిందో చెప్పగలదా. ఇప్పుడు ప్రజలు చైతన్యవంతులయ్యారు. వారికి టీడీపీ కల్లబొల్లి కబుర్లు చెబితే కుదరదు. మూడుసార్లు ఎంపీగా గెలిచిన రామ్మోహన్ నాయుడు ఏం చేశారో జిల్లా ప్రజలకు చెప్పాలి. కిడ్నీ రీసెర్చ్సెంటర్, ఉద్దానం తాగునీటి పథకం, మూలపేట పోర్టు, భోగాపురం ఎయిర్పోర్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినవి. అన్ని వర్గాల వారిని ప్రభుత్వం మోసగించింది. మరోసారి వైఎస్సార్సీపీ జెండా ఎగరేయడానికి కార్యకర్తలంతా కృషి చేయాలి. – తమ్మినేని సీతారాం, మాజీ స్పీకర్ ఐక్యంగా ఉండాలి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జనం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. పార్టీ కార్యకర్తలంతా ఐక్యంగా ఉండి ఇచ్ఛాపురాన్ని గెలుచుకోవాలి. దీంతో పాటు జిల్లా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ విజయ కేతనం ఎగరేయాలి. – సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి -
నేడు ఆదిత్యలో గో కార్టింగ్ ఫైనల్ రేస్
టెక్కలి: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి గో కార్టింగ్ పోటీల్లో భాగంగా శనివారం ఫైనల్ రేస్ జరగనుంది. ఈ మేరకు శుక్రవారం సెమీ ఫైనల్ రేసింగ్ పోటీలు నిర్వహించారు. సామర్థ్యపు పరీక్షల నిపుణులు దుర్గాప్రసాద్, ఎం.కిరణ్కుమార్, శివతేజ, పి.హిర్లఖర్, సాగర్ వ్యాస్, ఎం.శంకర్ సాయిరాం, ఎం.కులదీప్కుమార్, జి.వరుణ్రెడ్డి తదితర బృందం సెమీ ఫైనల్ పోటీలను ప్రత్యేకంగా పర్యవేక్షణ చేసి ఆయా వాహనాల సామర్థ్యాలను పరిశీలించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ వీవీ నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్ ఏఎస్ శ్రీనివాసరావు, కన్వీనర్ డి.శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. ఎత్తిపోతల పనుల పరిశీలన హిరమండలం: వంశధార ఎత్తిపోతల పథకం నిర్మాణం వేగవంతంగా జరుగుతున్నట్టు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఆయన శుక్రవారం వంశధార ఫేజ్–2 రిజర్వాయర్తో పాటు ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని అక్కడి అధికారులతో పా టు కాంట్రాక్టర్ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత కొద్దిరోజులుగా ప్రాధాన్యతా ప్రాజెక్టుగా తీసుకొని ఎప్పటికప్పుడు వంశధార ఫేజ్–2 రిజర్వాయర్, ఎత్తిపోతల పథకం నిర్మాణ పనుల గురించి సమీక్షిస్తున్నట్టు తెలిపారు. వచ్చే వర్షాకాలంలో ట్యాంకుల అమరిక, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన పనులు పూర్తిచేస్తామని చెప్పారు. సబ్స్టేషన్ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం నుంచి నగదును ట్రాన్స్కోకు చెల్లించినట్టు తెలిపారు. ఇప్పటివరకూ 55 శాతం పనులు పూర్తయ్యా యన్నారు. మిగతా పనులు వీలైనంత త్వరగా పూర్తిచేస్తామని చెప్పారు. ఈ విషయంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. హిరమండలం ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక ఉన్నట్టు కలెక్టర్ తెలిపారు. వాయుసేనలో కొలువులకు ‘అగ్నివీర్’ శ్రీకాకుళం పాతబస్టాండ్: భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు పోస్టుల భర్తీకి నిర్వహించనున్న ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ నిరుద్యోగ యువతకు ఒక సువర్ణావకాశమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 9, 12వ తేదీల్లో గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వేదికగా ఈ ఎంపిక ప్రక్రియ జరగనుంది. అభ్యర్థులు ముందస్తుగా ఎలాంటి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని, అర్హత కలిగిన వారు నేరుగా ర్యాలీకి హాజరుకావచ్చని ఆయన పేర్కొన్నారు. 9న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రా ష్ట్రాలకు చెందిన మహిళా అభ్యర్థులకు, మార్చి 12న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పురుష అభ్యర్థులకు ఎంపికలు నిర్వహిస్తారు. అభ్య ర్థులు 02.07. 2005 నుంచి 02.01.2009 మధ్య జన్మించి ఉండాలని, కనీసం 152 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలని కలెక్టర్ వివరించారు. విద్యార్హతల విషయానికి వస్తే.. ఇంటర్మీడియె ట్ లేదా డిప్లొమా లేదా ఒకేషనల్ కోర్సుల్లో కనీసం 50 శాతం మార్కులు, అలాగే ఇంగ్లిష్ సబ్జెక్టులో తప్పనిసరిగా 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. 49.99 శాతం మార్కులు ఉన్నా కూడా అనర్హులుగా పరిగణిస్తారని ఆయన గుర్తు చేశారు. ర్యాలీకి వచ్చే అభ్యర్థులు తమ వెంట విద్యార్హత ధ్రువీకరణ పత్రాల ఒరిజినల్స్తో పాటు, ఆధార్ కార్డు, డొమిసైల్ సర్టి ఫికెట్, ఎన్సీపీ (ఉంటే), 10 పాస్పోర్ట్ సైజు ఫొటోలు, ప్రతి సర్టిఫికెట్కు 6 సెట్ల జిరాక్స్ కాపీలను వెంట తెచ్చుకోవాలని సూచించారు. -
తవ్వేది కొండంత!
కంచిలి: మండలంలోని జలంత్రకోట, బూరగాం పంచాయతీల పరిధిలో అక్రమార్కులు కొండలను మాయం చేసేస్తున్నారు. క్వారీయింగ్కు కొంతమేర అనుమతులు పొంది మొత్తం కొండంతా తవ్వేస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం వరకు మైన్స్ శాఖ నుంచి అనుమతులు పొందిన మేరకే క్వారీయింగ్ చేపట్టేవారు. అయితే ఇటీవల కాలంలో కొందరు క్రషర్ యజమానులు పూర్తిగా అనుమతులు లేకుండానే క్వారీయింగ్ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్వే నంబర్ 238లోని కొండ జలంత్రకోట, బూరగాం పంచాయతీల పరిధిలో ఉంది. మొదట్లో సమీప గ్రామాల్లో ఉన్నవారు ఈ కొండలో మాన్యువల్ క్వారీయింగ్ చేసుకొని ఉపాధి పొందేవారు. తర్వాత కాలంలో ఇక్కడ నాలుగు క్రషర్లు ఏర్పడడంతో పెద్ద ఎత్తున కొండలో క్వారీయింగ్ చేపట్టారు. సుమారు రెండు దశాబ్దాల కాలంగా ఇక్కడ పెద్ద ఎత్తున క్వారీయింగ్ జరుగుతోంది. కొన్నాళ్లుగా క్వారీయింగ్కు తక్కువ విస్తీర్ణంలో ఫీజు కట్టి, నలుగురు క్రషర్ యజమానులు కొండను నాలుగు వాటాలుగా పంచుకొని నిరంతరంగా తవ్వేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై జలంత్రకోట సర్పంచ్ ఆధ్వర్యంలో గతేడాది నిరసన తెలియజేయడంతో కొన్నాళ్లపాటు క్వారీయింగ్ ఆపేశారు. కానీ ఆ తర్వాత మళ్లీ ప్రారంభించారు. ఇటీవల సీపీఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు సాలిన నారాయణస్వామి ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు ఈ క్వారీని సందర్శించి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా చర్యలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి. కాలుష్యంతో ఇబ్బందులు.. బూరగాం పంచాయతీలో ఉన్న నాలుగు స్టోన్ క్రషర్ల వల్ల సమీప గ్రామాల్లో నివసిస్తున్నవారు కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నారు. క్రషర్లు వద్ద ఉన్న సుమారు 50 ఎకరాల జీడితోటలు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. ఈ చెట్ల ఆకుల మీద స్టోన్ డస్ట్ పేరుకుపోవడంతో కాపు కాయడం మానేశాయని స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ తోటలు కాలుష్యంతో నాశనమవుతున్నా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. సమీప గ్రామాల్లో ఆందోళన.. అక్రమ క్వారీయింగ్ చేస్తున్న కొండల్లో రాత్రి, పగలు అనే తేడా లేకుండా రాళ్లు పేల్చుతుండడంతో సమీప గ్రామాల్లో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. బాంబులు పేలే సమయంలో మండల కేంద్రం కంచిలి వరకు శబ్దాలకు ఇళ్లు కంపిస్తున్నాయి. సమీప గ్రామాలైన బాసుబంజిరి, జలంత్రకోట, గొల్లకంచిలి, జెన్నాగాయి తదితర గ్రామాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికై నా మైన్స్ అధికారులు ఈ క్వారీలపై విచారణ చేపట్టి, ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. జలంత్రకోట పంచాయతీ పరిధిలో జరుగుతున్న అక్రమ క్వారీయింగ్ వలన సమీప ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇక్కడ పరిమితికి మించి క్వారీయింగ్ చేయడం వలన పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతోంది. వెంటనే వీరిపై చర్యలు చేపట్టాలి. – సాలిన నారాయణస్వామి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు జలంత్రకోట, బూరగాం పంచాయతీల పరిధిలో ఉన్న కొండలో మెటల్ను అక్రమంగా క్వారీయింగ్ చేయడం, ఆ రాళ్లను స్థానిక స్టోన్ క్రషర్లలో ప్రాసెస్ చేయడం వలన సమీప జీడితోటలు నాశనమవుతున్నాయి. చాలాకాలంగా ఇక్కడి జీడి రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. – మడ్డు వెంకటరావు, జీడి రైతు, బూరగాం గ్రామం, కంచిలి మండలం జలంత్రకోట కొండలో ఇష్టారాజ్యంగా క్వారీయింగ్ నాలుగు స్టోన్ క్రషర్ నిర్వాహకుల నిర్వాకం సమీప జీడితోటలపై కాలుష్య ప్రభావం సమీప గ్రామాల్లో భయభ్రాంతులు -
ప్రజారోగ్యం కార్పొరేట్ శక్తులకు తాకట్టు
సోంపేట: పేద ప్రజల ఆరోగ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టే కుట్ర చేస్తోందని వైఎస్సార్సీపీ నాయకులు ధ్వజమెత్తారు. ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్ రెడ్డి పర్యవేక్షణలో బారువ సామాజిక ఆసుపత్రి భవన నిర్మాణ పనులను జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పార్లమెంటరీ సమన్వయకర్త తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ సాయిరాజ్ శుక్రవారం పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో 80 శాతం పనులు పూర్తయినా ఈ ప్రభుత్వం పూర్తి చేయకపోవడంపై విస్మయం వ్యక్తం చేశారు. అనంతరం మాజీ మంత్రి అప్పలరాజు విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ప్రతి మండలంలో రెండు పీహెచ్సీలు, గ్రామాల్లో హెల్త్ క్లినిక్లు ఏర్పాటు జరిగిందని, ఈ క్రమంలో సోంపేట మండలం రెండు సామాజిక ఆస్పత్రులకు కోట్ల రూపాయలు నిధులు మంజూరయ్యాయని చెప్పారు. బారువ సామాజిక ఆస్పత్రికి రూ.6.6 కోట్ల నిధులు మంజూరు చేయగా 80 శాతం పనులు పూర్తి చేశామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మిగిలిన పనులు పూర్తిచేయకపోవడంతో చుట్టూ తుప్పలు పెరిగాయన్నారు. రాష్ట్రంలో అన్ని సామాజిక ఆస్పత్రుల వద్ద ఇదే పరిస్థితి నెలకొందన్నారు. మెడికల్ కళాశాలల మాదిరిగా సామాజిక ఆసుపత్రులను పీపీపీ మోడల్లో అభివృద్ధి చేస్తామని ఆరోగ్య శాఖమంత్రి ప్రకటనలు చేస్తున్నారని, ప్రభుత్వ బినామీలకు ఇలాంటి భవనాలు అప్పగించి పేదల ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టడానికి ప్రభుత్వం పూనుకుందన్నారు. మూడుసార్లు ఎన్నికై న నియోజకవర్గ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలన్నారు. శ్రీకాకుళంలో డయేరియా, రాజమండ్రిలో కల్తీ పాలు తాగి ప్రజలు మృత్యువాత పడుతున్నారని, ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వల్లే ఈ ఘటనలు జరిగాయన్నారు. నియోజకవర్గ సమన్వయకర్త శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 80 శాతం పనులు పూర్తి కాగా, కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు అటకెక్కాయన్నారు. నిర్మాణాలు పూర్తయితే డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందన్నారు. ప్రజలకు మేలు చేకూర్చాలనే ఉద్దేశం ఉంటే ఇప్పటికై నా ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి, కేంద్రమంత్రి స్పందించి పనులు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, జెడ్పీటీసీ తడక యశోద, కంచిలి ఎంపీపీ పైలదేవదాస్ రెడ్డి, పార్టీ నాయకులు బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నర్తు నరేంద్రయాదవ్, తడక జోగారావు, శిలగాన భాస్కరరావు, గురాల శ్రీను, పొడుగు కామేష్, వెంకటరమణ, యర్ర రజని, తామాడ పద్మావతి, పిన్నింటి ఈశ్వరరావు, నర్తు ప్రేమ్, పైల దేవదాస్రెడ్డి, కడియాల ప్రకాష్, సల్లా దేవదాస్, నాగు, బాబూరావు, ధర్మారావు, మాధవరావు, కర్రి సత్యం, అమర లోకనాథం, బుజ్జి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. ఆస్పత్రి పరిశీలనకు వెళ్తున్న పార్టీ నాయకులను సోంపేట సీఐ బి.మంగరాజు, పోలీసు సిబ్బంది అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. నిర్మాణాల పరిశీలనకు కూడా అనుమతులు కావాలా అని నాయకులు ప్రశ్నించడంతో పోలీసులు వెనుదిరిగారు. ఈ క్రమంలో పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్తో పోలీసులు వాగ్వాదానికి దిగారు. -
గంజాయితో ముగ్గురు అరెస్టు
పలాస: ఒడిశా నుంచి గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న చిత్తూరు జిల్లా ఐర్లా మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులను శుక్రవారం కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 6.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ విలేకరులకు వివరాలు వెల్లడించారు. గుండ్లపల్లి గ్రామానికి చెందిన రంబే మునికుమార్, అతని భార్య మెందరికుర్తి నందిని, ఆమె అన్నయ్య మెందరికుర్తి రామకృష్ణలు ఒడిశా నుంచి గంజాయి తీసుకొని వచ్చి పలాస రైల్వే స్టేషన్లోకి వెళ్తుండగా ముందస్తు సమాచారం మేరకు కాశీబుగ్గ ఎస్ఐ ఎన్.సునీల్కుమార్ తన సిబ్బందితో కలిసి శుక్రవారం అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేశామన్నారు. వారి వద్ద నుంచి గంజాయి, మూడు ఫోన్లు, రూ.2,490 నగదు స్వాధీనం చేసుకున్నట్టు సీఐ చెప్పారు. 146 మద్యం బాటిళ్లు స్వాధీనం వజ్రపుకొత్తూరు రూరల్: బెండిగేట్ కూడలిలో అక్రమంగా నిల్వ ఉన్న 146 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం పోలీసులు పలు దుకాణాల్లో తనిఖీలు చేపట్టగా చల్లా వినోద్కుమార్ షాపులో మద్యం సీసాలు అక్రమంగా నిల్వ ఉన్నట్లు గుర్తించారు. దుకాణదారుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ బి.నీహర్ తెలిపారు. -
క్షమాపణ చెప్పాకే జిల్లా రాజకీయాలకు రండి
● నాగబాబు, కూటమి నేతల తీరు సరికాదు ● వైఎస్సార్సీపీ యుజవన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు స్వరూప్ మండిపాటు శ్రీకాకుళం (పీఎన్కాలనీ): శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లోకి వచ్చే ముందు జనసేన నాయకుడు నాగబాబు, కూటమి నాయకులు ప్రజలకు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెంటాడ స్వరూప్ డిమాండ్ చేశారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నుంచి వలసలను ప్రోత్సహిస్తున్న నాగబాబు ముందుగా జిల్లాలో జరిగిన సామాజిక అన్యాయంపై స్పందించి క్షమాపణ చెప్పాల్సిన అసవరం ఉందన్నారు. శుక్రవారం స్వరూప్ నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, అందులో కనీసం 5 నియోజకవర్గాలు కాపు సామాజిక వర్గానికి సీట్లు కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే రాజాం, పాలకొండ నియోజకవర్గాలు ఎస్సీ, ఎస్టీ సోదరులకు రిజర్వేషన్ల వల్ల పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆమదాలవలస నియోజకవర్గంలో కాపులు, కాళింగ సోదరులు సమానంగా ఉన్నప్పటికీ సంప్రదాయం ప్రకారం కాళింగ సామాజిక వర్గం పోటీ చేస్తోందన్నారు. మిగిలిన ఎచ్చెర్ల, పాతపట్నం నియోజకవర్గాలు కాపు సామాజిక వర్గానికి రావాల్సిన పరిస్థితి ఉందన్నారు. గత ఎన్నికల్లో కూటమి నాయకులు ఎచ్చెర్ల సీటును స్థానిక ప్రజల అభిప్రాయాలతో సంబంధం లేకుండా నియోజకవర్గంలో కనీసం 400 ఓట్లు కూడా లేని ఒక సామాజిక వర్గానికి సీటు కేటాయించి కాపు సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. పెత్తందారుల కింద కాపులు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు పని చేయాలా అనే ప్రశ్నను ఆయన లేవనెత్తారని, నాగేంద్రబాబు, కూటమి నాయకులు ముందుగా క్షమాపణ చెప్పిన తర్వాతే ఇక్కడ రాజకీయాలు చేయాలన్నారు. రాబోయే రోజుల్లో గొర్లె కిరణ్కుమార్ నాయకత్వంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం ఎచ్చెర్ల నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి వెళ్లి ఈ విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని స్పష్టం చేశారు. -
కంబిరిగాంలో ‘రియల్’ భూదందా
● మాదర బట్టి కబ్జా ● అడ్డుకున్న రెవెన్యూ అధికారులు పలాస: కంబిరిగాంలో మరో రియల్ ఎస్టేట్ వ్యాపారుల భూదందా శుక్రవారం వెలుగుచూసింది. వందలాది ఎకరాల పంట భూములకు సాగు నీరందించే వరహాల గెడ్డకు అనుసంధానంగా ఉన్న తుప్పల గుడ్డి వద్ద మాదర బట్టి కబ్జాకు గురైంది. రియల్ ఎస్టేటు వెంచర్లకు అడ్డుగా ఉందని భావించి ఆ బట్టిని కూడా అందులో కలుపుకోవడానికి ప్రయత్నించి సగం బట్టీని ఆక్రమణదారులు మట్టితో కప్పేశారు. ప్రొక్లెయినర్లతో ఆ బట్టిని కప్పేసి వారి రియల్ ఎస్టేటు స్థలంలో కలిపేసుకున్నారు. ఇప్పటికే భూముల విలువలు పెరగడంతో రూ.కోట్లు విలువైన ప్రభుత్వ, పోరంబోకు, దేశబట్టిలు, వరద కాలువలను తమ కబంద హస్తాల కిందకు తెచ్చుకొని ఫ్లాట్లుగా విభజించి ఇళ్ల స్థలాలకు విక్రయిస్తున్నారు. ఇప్పటికే కంబిరిగాం గ్రామంలో కొన్ని భూములు వివాదాస్పదంగా మారడంతో పలువురు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా అదే ప్రాంతంలో కొందరు కూటమి ప్రభుత్వం అనుకూల, క్రియాశీలక కార్యకర్తలు, నాయకులు భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆక్రమణలకు సంబంధించి వరుస కథనాలు పత్రికల్లో ప్రచురితమవుతుండటంతో అధికారులు స్పందించి ఆపుతున్నా దందా ఆగకపోవడం గమనార్హం. శుక్రవారం కూడా మాదర బట్టి కబ్జాకు గురైన విషయం తెలుసుకున్న పలాస తహశీల్దారు టి.కళ్యాణ చక్రవర్తి సంబంధిత స్థలానికి వెళ్లి ఆక్రమణ నిలుపుదల చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగునీటి కాలువ కప్పివేసే పనులను అడ్డుకున్నట్లు చెప్పారు. అయితే ఇది కంటి తుడుపు చర్యలేనని, అధికార పార్టీ అండదండలతో దందా నిరంతరాయంగా సాగుతునే ఉంటుందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇటీవల వరుస ఘటనలు దీనికి బలం చేకూర్చుతున్నాయి. పెంటిభద్ర రెవెన్యూలో పత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందించి అక్కడకు వెళ్లి వాహనాలను ఆపినా ఇంత వరకు తగిన చర్యలు తీసుకోలేదు. ఇటీవల కంబిరిగాంలో అక్రమ మట్టి, కంకర తవ్వకాలను ఆపి, వాహనాలను సీజ్ చేశామని చెప్పినా వాటిని చడీ చప్పుడు కాకుండా తీసుకుపోయారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా
శ్రీకాకుళం: ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకాన్ని స్మార్టీ కిచెన్ల పేరుతో ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నాలు విరమించుకోవాలని, మెనూ చార్జీలు, కార్మికుల వేతనాలు పెంచాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరావు, యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షురాలు అల్లు మహాలక్ష్మి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.సుశీల బి.ఉత్తర రాష్ట్ర ప్రభత్వాన్ని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజనం పథకం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం డీఈఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 23 సంవత్సరాలుగా ఈ పథకంలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు , ఇతర సౌకర్యాలు అమలు చేయకపోయినా, ఇదే పనిని నమ్ముకొని పనిచేస్తున్న కార్మికులను నట్టేట ముంచే ప్రయత్నం ఆపాలన్నారు. ప్రైవేట్ సంస్థలకు నిర్వహణ బాధ్యత అప్పగించడం వల్ల పిల్లలు వేడి ఆహారానికి దూరమవుతారని చెప్పారు. ఇప్పటి వరకు ఉపాధి పొందిన పేద కార్మికులు జీవనాధారం కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే అక్షయ పాత్ర, ఇస్కాన్ వంటి ప్రైవేటు సంస్థలు అందిస్తున్న చల్లని, చప్పటి భోజనాన్ని పిల్లలు తినలేక పడేస్తున్నారని గుర్తు చేశారు. అనంతరం సూపరింటెండెంట్ జి.కె.త్రిపాఠీకి వినతి పత్రంఅందజేశారు. ధర్నాలో యూనియన్ జిల్లా నాయకులు ఎ.రాధ, ఆర్.కాంతమ్మ, వి.లక్ష్మి, కె.కౌసల్య, టి.రామానుజమ్మ, జ్యోతి, వై.రత్నం తదితరులు పాల్గొన్నారు. -
గాయపడిన వ్యక్తి మృతి
హిరమండలం: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి చెందాడు. ఎల్ఎన్పేట మండలం అలికాం–బత్తిలి రోడ్డుపై తురకపేట సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సరుబుజ్జిలి మండలం కొండవలస గ్రామానికి చెందిన పాపారావు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఎల్ఎన్పేట నుంచి స్వగ్రామానికి వెళుతుండగా టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో పాపారావు తీవ్రంగా గాయపడ్డాడు. శ్రీకాకుళం రిమ్స్లో ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం హుటాహుటిన విశాఖ కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పాపారావు శుక్రవారం మృతిచెందాడు. మృతుడికి భార్య శాంతమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. సరుబుజ్జిలి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నేడు మదీనాబాబా చందనోత్సవం
గార: కళింగపట్నంలోని మదీనాబాబా దర్గాలో చందనోత్సవం శుక్రవారం సాయంత్రం జరగనుంది. హిందూ–ముస్లింల ఐక్యతకు చిహ్నంగా ఈ దర్గా నిలుస్తోంది. 11 శతాబ్దంలో మక్కా నుంచి మదీనాబాబా గుర్రంపై ఇక్కడికి విచ్చేశాని, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఇక్కడే సమాధి అయ్యారని కథనం. రంజాన్ నెల ప్రారంభమైన 16వ రోజున బాబా సమాధిపైనున్న చందనం తీసి, కొత్త చందనం పూస్తారు. బాబాను దర్శనం చేసుకుంటే కష్టాలు తీరుతాయని, బంగారం వస్తువులతో పాటు డాక్యుమెంట్లు వంటివి పోగొట్టుకొని, దొరకని సమయంలో బాబాను తలుచుకొని ప్రసాదాన్ని పంచిపెడితే వెంటనే దొరుకుతాయని భక్తుల నమ్మకం. ముస్లింలుతో పాటు హిందువులు అధిక సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకుంటారు. -
చిట్టోడు చెరువులో అక్రమ తవ్వకాలు
ఆమదాలవలస: ఆమదాలవలస మున్సిపాలిటీ, శ్రీకాకుళం రూరల్ మండలం పరిధిలోని నందగిరిపేట, నాదానపురం గ్రామాల్లో చిట్టోడు చెరువులో మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. భారీ యంత్రాలు, జేసీబీలు, వాహనాలతో గత కొన్ని రోజులుగా ఇష్టారాజ్యంగా మట్టిని తరలిస్తున్నారు. ఆయా వార్డు, గ్రామాల్లోని కొందరు టీడీపీ కార్యకర్తలు మట్టి మాఫియాగా ఏర్పడి మట్టి తవ్వకాలు చేపడుతూ జేబులు నింపుకొంటున్నారు. గ్రామ స్థాయి రెవెన్యూ అధికారికి తెలిసే ఈ దందా కొనసాగిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. మట్టిదందాను అడ్డుకోవాలని స్థానికులు ప్రయత్నించగా.. ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆదేశాల మేరకు మట్టిని వారికి సంబంధించిన సైట్లలో వేస్తున్నామని, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్కు సంబంధించిన సైట్లలో వేస్తున్నామని టీడీపీ నాయకులు సమాధానం చెబుతున్నట్లు సమాచారం. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ మట్టి తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు. -
32 కేజీల గంజాయితో ఐదుగురు అరెస్టు
ఇచ్ఛాపురం : ఒడిశా నుంచి బెంగళూరుకు 32 కేజీల గంజాయిని తరలిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేయగా వీరిలో నలుగురు మహిళలు ఉన్నట్లు సీఐ మీసాల చిన్నంనాయుడు తెలిపారు. ఇచ్ఛాపురం పోలీస్ సర్కిల్ కార్యాలయంలో గురువారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ సమీపంలో పట్టణ ఎస్సై ఆధ్వర్యంలో గురువారం తనిఖీలు నిర్వహిస్తుండగా ఒడిశా రాష్ట్రం ఫుల్బాని ప్రాంతం నుంచి 32 కేజీల గంజాయితో కందమాల్ జిల్లాకి చెందిన సుస్మి బెహర, సితయ దలచత్ర, ప్రతిమ బెహర, దులై భోయ్, నిమంత కన్హార్లు పట్టుబడ్డారు. వీరిని విచారించగా కందమాల్ జిల్లా తిలారంగి గ్రామానికి చెందిన గంజాయి వ్యాపారి రాధాకాంత దిగల్ అలియాస్ రాధ నుంచి గంజాయిని తీసుకొని బెంగళూరులోని సునీల్కు అందజేయడానికి వెళ్తున్నట్లు చెప్పారు. వీరి వద్ద నుంచి గంజాయి, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సీఐతో పాటు పట్టణ ఎస్సై ముకుందరావు, క్రైమ్ సిబ్బంది రంజిత్ పాల్గొన్నారు. -
టిప్పర్ ఢీకొని యువకుడికి గాయాలు
హిరమండలం: అలికాం–బత్తిలి రహదారిపై ఎల్ఎన్పేట మండలం తురకపేట జంక్షన్ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పాపారావు అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. సరుబుజ్జిలి మండలం కొండవలస గ్రామానికి చెందిన ఎస్.పాపారావు సోదరుడు సూర్యనారాయణతో కలిసి ఎల్ఎన్పేట మండలంలో శుభకార్యానికి హాజరై తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో వీరి బైక్ను టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో పాపారావుకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న సరుబుజ్జిలి పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడ్ని శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖ కేజీహెచ్కు తరలించారు. ఎస్ఐ హైమావతి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రజారోగ్యంపై సర్కారుకు చిత్తశుద్ధి లేదు
కవిటి: ప్రభుత్వానికి ప్రజారోగ్యం పట్ల చిత్తశుద్ధి, బాధ్యత లేదని, ఇచ్ఛాపురం నియోజకవర్గంలో నెలకొన్న ప్రభుత్వ వైద్య సేవలపై గతంలో పలుసార్లు ప్రస్తావించిన అంశాన్ని సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి మరోసారి తెచ్చానని ఎమ్మెల్సీ నర్తు రామారావు అన్నారు. గురువారం బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసనమండలిలో ఎమ్మెల్సీ మాట్లాడారు. బారువ మేజర్ పంచాయతీలో గత ప్రభుత్వం రూ.6 కోట్ల 60 లక్షలతో 30 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు చేపట్టి 90 శాతం నిర్మాణాలు పూర్తిచేసిందని, మెడికల్ సామగ్రి సైతం చేరుకుందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేస్తే, సముద్ర తీరం వెంబడి ఉన్న వేలాది మంది మత్స్యకారులకు వైద్య సదుపాయం అందుతుందన్నారు. పాత ఆసుపత్రి గదుల్ని కిడ్నీ రోగుల కోసం డయాలసిస్ కేంద్రంగా మార్చాలని కోరారు. -
9,10 తేదీల్లో కిరణ దర్శనం
శ్రీకాకుళం కల్చరల్: అరసవల్లి సూర్యనారాయణ స్వామి కిరణ దర్శనానికి వేళయ్యింది. ఈ నెల 9, 10 తేదీల్లో ఉదయం 6 నుంచి 6.30 వరకు కిరణ దర్శనం ఉండవచ్చని ఆలయ వర్గాలు తెలిపాయి. మబ్బులు, పొగమంచు లేకుండా వాతావరణం బాగుంటేనే స్వామి కిరణదర్శనం ఉంటుందని పేర్కొన్నారు. 9న ఐటీఐ అభ్యర్థులకు అప్రెంటిస్ మేళా ఎచ్చెర్ల : ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 9న ప్రధానమంత్రి జాతీయ అంప్రెటిస్ మేళా నిర్వహించనున్నామని ప్రిన్సిపాల్, కన్వీనర్ ఎల్.సుధాకరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని తొమ్మిది ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరవుతున్నారని చెప్పారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో వివిధ ట్రేడ్లలో శిక్షణ పూర్తిచేసిన విద్యార్థులు మూడు బయోడేటాలు, ధ్రువపత్రాలు, ఫొటోలతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని కోరారు. ఎంపికై న వారికి అరబిందో, శ్యాంక్రగ్ పిస్టన్స్, స్మార్ట్కెమ్, కాడ్మ్యాక్స్, బ్లూస్టార్, నోర్డిక్స్ వంటి కంపెనీల్లో అప్రెంటిస్ శిక్షణ ఉంటుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కొబ్బరిమొక్కలు కొందరికే..! కంచిలి: ప్రకృతి వైపరీత్యాలు, వయస్సు పైబడి వ్యాధులబారిన పడిన కొబ్బరి చెట్లను తొలగించి, వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటడం, నిర్వహణ కోసం ఉద్యానశాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కొబ్బరి విస్తరణ పథకాన్ని కొందరు రైతులకే వర్తింపజేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కంచిలి మండలం పెద్దశ్రీరాంపురంలో 67 మంది రైతులు తమకు పథకాన్ని వర్తింపజేయాలని పలుమార్లు దరఖాస్తు చేసుకున్నారు. గడువు దాటిన తర్వాత దరఖాస్తులు వచ్చాయనే నెపంతో ఉద్యానశాఖ యంత్రాంగం వీటిని పక్కన పెట్టేశారు. జనవరి 21న ఈ విషయమై ఫిర్యాదు చేసినా ఇంతవరకు దరఖాస్తుదారులతో గ్రామసభ నిర్వహించలేదు. పైగా ప్రతి ఫిర్యాదుకు చివరి రోజు వచ్చి ఫిర్యాదుదారునితో ఫొటో తీసుకొని వెళ్లిపోతున్నారని ఫిర్యాదుదారుడు బల్లెడ సునీల్ గురువారం తెలిపారు. కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. నాలుగు ఎకరాల గడ్డివాములు దగ్ధం బూర్జ: పాలవలస గ్రామంలో తుమ్మలపల్లి వెంకటనాయుడుకు చెందిన నాలుగు ఎకరాల గడ్డివాము దగ్ధమైంది. గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గ్రామస్తులు పాలకొండ అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సిబ్బంది గ్రామానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టి ఉంటారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఏడాది పాటు పశువులకు సరిపడా గడ్డి వాములు నిల్వ ఉంచుకున్నామని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు విజ్ఞప్తి చేస్తున్నారు. మందుగుండు సామగ్రి పట్టివేత రణస్థలం: లావేరు మండలం వెంకటాపురంలో గేదెల సూర్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లో మందుగుండు సామగ్రిని టాస్క్ఫోర్స్ ఎస్సై నరసింహమూర్తి, సిబ్బంది పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకు గురువారం సాయంత్రం సూర్యనారాయణ ఇంట్లో తనిఖీ చేయగా వత్తుల మందు, తార జువ్వల మందు, తాటిరేకుల కట్ట, చిచ్చు బుడ్డీలు తదితర వస్తువులను స్వాధీనం చేసుకుని లావేరు పోలీసులకు అప్పగించారు. ఎస్సై కె.అప్పలసూరి కేసు నమోదు చేశారు. బార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా న్యాయవాదుల బార్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర బార్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎన్.ద్వారకా రెడ్డి గురువారం షెడ్యూల్ విడుదల చేశారు. మార్చి 9న తుది ఓటరు జాబితా ప్రకటన, 12న ఎన్నికల నోటిఫికేషన్, 13న ఎన్నికల అధికారి నియామకం, 16న నామినేషన్ల స్వీకరణ, 17న నామినేషన్ల పరిశీలన, 18న నామినేషన్ల ఉప సంహరణ, 19న పోటీలో ఉన్నవారి తుది జాబితా విడుదల ఉంటుంది. 27న ఉదయం 10 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఓటింగ్, అనంతరం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. సునీల్కు నోటీసు ఇస్తున్న సచివాలయ వీహెచ్ఏ -
చోద్యం చూస్తున్న యంత్రాంగం.. యథేచ్ఛగా ఆక్రమణల పర్వం..!
● నరసన్నపేటలో విచ్చలవిడిగా ఆక్రమణలు ● కాలువ గట్లపై కబ్జాకోరుల కన్ను ● పట్టించుకోని అధికారులు నరసన్నపేట: నియోజకవర్గ కేంద్రం నరసన్నపేటలో ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పట్టణంలో ని ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురవుతుండగా.. తాజాగా కబ్జాకోరుల దృష్టి వంశధార కాలువలపై పడింది. జమ్ము కూడలి వద్ద నరసన్నపేట బ్రాంచ్ కెనాల్(ఎన్బీసీ), కిళ్లాం చానల్కు ఆనుకొని స్థలాలను యథేచ్ఛగా కొట్టేసే యత్నాలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా వంశధార అధికారులు కనీసం స్పందించడం లేదు. జమ్ము కూడలి వద్ద ఎన్బీసీ చానల్ గట్టుకు ఆనుకొని నిమ్మాడకు చెందిన ఒకరు ఇటీవల అపార్ట్మెంట్ నిర్మించారు. గట్టును తమ అపార్ట్మెంట్కు రోడ్డుగా మార్చుకున్నారు. ఇప్పుడు రోడ్డుకు అపార్ట్మెంట్కు మధ్య ఉన్న స్థలాన్ని ఆక్రమించుకొని ఫిల్లర్స్ వేశారు. ఇది పక్కాగా వంశధారకు చెందిన స్థలమని స్థానికులు అంటున్నారు. అయితే సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోకపోవడంతో ఆక్రమణదారులు మరింత ముందుకు వెళ్తున్నారు. అలాగే దీనికి సమీపంలోనే కిళ్లాం చానల్కు ఆనుకొని ఉన్న స్థలాలను ఆక్రమణదారులు వదలడం లేదు. కాలువను కప్పేసి తమకు నచ్చినవిధంగా ఆక్రమణలకు పాల్పడుతున్నారు. అదేవిధంగా ఇదే చానల్ వద్ద పాత ఎన్హెచ్ రోడ్డుకు ఆనుకొని గతంలో స్థానికులు ఒక దాబా నిర్మించారు. దీంట్లో కూడా కాలువ స్థలం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. అందువలన అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఆక్రమణల విషయం మా దృష్టికి వచ్చింది. దీంతో జేఈలు పరిశీలించారు. తహసీల్దార్కు లెటర్ పెట్టాం. సర్వేయర్ వచ్చి కొలతలు వేస్తే దాని ప్ర కారం మార్కింగ్ చేసి ఆక్రమణలు తొలగిస్తాం. కిళ్లాం చానల్కు ఆనుకొని ఉన్న ఆక్రమణలు కూడా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం. – మురళి, వంశధార డివిజన్ ఈఈ, నరసన్నపేట వంశధార కాలువలు ఎక్కడికక్కడ ఆక్రమణలకు గురవుతున్నాయి. వంశధార అధికారులు సరైన దృష్టి పెట్టడం లేదు. ఇదే పరిస్థితి కొనసా గితే మరింతగా కాలువలు చిక్కిపోయే ప్రమా దం ఉంది. దీనివలన దిగువనున్న రైతులకు సక్రమంగా సాగునీరు అందకపోవచ్చు. ఇప్పటికై నా వంశధార అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలి. – కనలప శేఖరరావు, కోమర్తి నీటి సంఘం మాజీ అధ్యక్షుడు -
వర్సిటీలో యూత్ పార్లమెంట్ పోటీలు
ఎచ్చెర్ల : డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ శాఖ, మేరా యువభారత్ సంయుక్తంగా గురువారం వర్సిటీలో యూత్ పార్లమెంట్ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా స్వామి వివేకానంద చిత్రపటం వద్ద జ్యోతి వెలిగించి నివాళులు అర్పించారు. అనంతరం ప్రజాస్వామ్యం అనే అంశంపై విద్యార్థులు ప్రసంగించారు. జిల్లా ఉపాధి అధికారి కె.సుధ, శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల (పురుషుల) ప్రిన్సిపాల్ యాళ్ల పోలినాయుడు, యూనిర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ అనురాధ, తెలుగుశాఖ అధ్యాపకుడు కె.ఉదయ్కిరణ్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. వర్సిటీతో పాటు శ్రీకాకుళం పట్టణానికి చెందిన డిగ్రీ కళాశాలల విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు హాజరయ్యారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్రస్థాయిలో జరిగే యూత్ పార్లమెంట్కు పంపిస్తామని ఎన్ఎస్ఎస్ పోగ్రామ్ కో–ఆర్డినేటర్ డి.వనజ తెలిపారు. కార్యక్రమంలో వైస్ చాన్సలర్ కె.ఆర్.రజనీ, రిజిస్ట్రార్ బి.అడ్డయ్య, ప్రిన్సిపాళ్లు ఎం.అనూరాధ, కె.స్వప్నవాహిని, ఈసీ సభ్యురాలు పి.సుజాత, సెట్శ్రీ సీఈఓ వి.వి.అప్పలనాయుడు, శ్రీనివాస్ పాల్గొన్నారు. పశువులు పట్టివేత రణస్థలం: శ్రీకాకుళం వైపు నుంచి రణస్థలం వైపు వెళుతున్న పికప్ వ్యాన్లో అక్రమంగా తరలిస్తున్న ఏడు పశువులను లావేరు మండలం రావివలస హైవేపై పోలీసులు బుధవారం అర్ధరాత్రి పట్టుకున్నారు. లావేరు ఎస్సై కె.అప్పలసూరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మాస్టర్స్ పోటీలకు సిద్ధమా!
● జిల్లాస్థాయి శాప్ లీగ్ మాస్టర్స్ క్రీడాపోటీల షెడ్యూల్ ఖరారు ● తొలుత బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, టెన్నిస్ క్రీడాంశాల్లో పోటీలు ● 35 ఏళ్లు దాటిన క్రీడాకారులకు గొప్ప అవకాశం శ్రీకాకుళం న్యూకాలనీ: వెటరన్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్) నడుం బిగించింది. శాప్ లీగ్ – మాస్టర్స్ స్పోర్ట్స్ పేరిట 35 ఏళ్లు పైబడిన మాస్టర్స్(వెటరన్) క్రీడాకారులకు క్రీడా పోటీలను నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో పురుషులు, మహిళలకు జిల్లాస్థాయిలో వేర్వేరుగా పోటీలు జరిపించనున్నారు. ఇక్కడ రాణిస్తే రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తారు. మూడు క్రీడాంశాల్లో పోరు.. శాప్ లీగ్ మాస్టర్స్ క్రీడా పోటీల్లో భాగంగా మొదటి విడతగా బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, టెన్నీస్ క్రీడాంశాల్లో జిల్లాస్థాయి పోటీలను నిర్వహించనున్నారు. ఆసక్తి గల వెటరన్ క్రీడాకారులు స్పోర్ట్స్.ఏపీ.జీవోవి.ఇన్ వెబ్పోర్టల్లో శాప్ లీగ్స్లో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. ● బ్యాడ్మింటన్: 35 ఏళ్లు పైబడిన విభాగంలో పురుషులు, మహిళలకు పోటీలను నిర్వహిస్తుండగా, 45 ఏళ్లుపైబడిన విభాగంలో కేవలం పురుషులకు మాత్రమే పోటీలు నిర్వహించనున్నారు. విజేతలను రాష్ట్రస్థాయిలో మార్చి 14, 15 తేదీల్లో జరిగే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరగనున్నాయి. ● టెన్నిస్: 40 ఏళ్లు పైబడిన విభాగంలో పురుషులు, మహిళలకు పోటీలు నిర్వహించనున్నారు. విజేతలకు మార్చి 22, 23 తేదీల్లో విజయనగరం జిల్లా వేదికగా జరిగే రాష్ట్రపోటీలకు పంపిస్తారు. ● అథ్లెటిక్స్: 35 ఏళ్లు పైబడి, 45 ఏళ్లు పైబడిన విభాగాల్లో పురుషులు, మహిళలకు పోటీలు నిర్వహిస్తారు. ఇక్కడి విజేతలను మార్చి 30, 31 తేదీల్లో గుంటూరు వేదికగా జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తారు. గేమ్ తేదీ ఈవెంట్స్ వేదిక టెన్నిస్ మార్చి 8న సింగిల్స్, డబుల్స్ ఆర్ట్స్ కళాశాల మిక్స్డ్ డబుల్స్ శ్రీకాకుళం బ్యాడ్మింటన్ మార్చి 8న సింగిల్స్, డబుల్స్ ఇండోర్ స్టేడియం మిక్స్డ్ డబుల్స్ శ్రీకాకుళం అథ్లెటిక్స్ మార్చి 24న 100, 400,800, 1500 మీటర్ల పరుగు, కేఆర్ స్టేడియం లాంగ్జంప్, హైజంప్, శ్రీకాకుళం షాట్పుట్, డిస్కస్త్రో, లావెలన్, రిలే పరుగు సద్వినియోగం చేసుకోండి.. 35 ఏళ్లు పైబడిన వెటరన్ క్రీడాకారులకు శాప్ లీగ్ పోటీలు గొప్ప అవకాశం. తమ టాలెంట్ను నిరూపించుకోవడానికి సన్నద్ధంకావాలి. తొలుత టెన్నిస్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్ క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నాయి. ఇక్కడి విజేతలను రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తాం. వివరాలకు 9390352942 నంబర్ను సంప్రదించవచ్చు. – ఎ.మహేష్బాబు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి, శ్రీకాకుళం -
మెగా జాబ్మేళాకు స్పందన
నరసన్నపేట: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నరసన్నపేటలోని ఎల్వీఆర్ డిగ్రీ కళాశాలలో గురువారం నిర్వహించిన జాబ్మేళాకు విశేష స్పందన లభించింది. 15 కంపెనీలకు చెందిన హెచ్ఆర్ ప్రతినిధులు హాజరై 257 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. వీరిలో అర్హత కలిగిన 99 మందిని వివిధ కంపెనీలకు ఎంపిక చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకురాలు బగ్గు అర్చన, కళాశాల కరస్పాండెంట్ ఎల్.లక్ష్మీ ప్రసన్న, ప్రిన్సిపల్ ఎం.ప్రసాదరావు, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి చంద్రమౌళి, అకడమిక్ డైరెక్టర్ జి.వి.జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. -
● ఉత్తరాభిముఖ దర్శనం
గార: శ్రీకూర్మనాథుడి ఉత్తరాభిముఖంగా దర్శనంతో భక్తులు పులకించిపోయారు. శ్రీకూర్మనాథాలయం నుంచి గురువారం ఉదయం స్వామి మూర్తులు (శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి) మాడ వీధుల గుండా గ్రామశివారున గ్రామదేవత మోహినీ భద్రాంబికా ఆలయం సమీపంలోని డోలోమంటపం వద్దకు తీసుకువెళ్లారు. అప్పటికే సిద్ధం చేసిన ‘ఊయల’పై స్వామి ఉత్సవమూర్తులను వేంచింపచేసిన అర్చక బృందం అష్టోత్తర నామార్చన అనంతరం ప్రత్యేకంగా బుక్కా–భర్గుండతో పూజలు జరిపారు. కాసే పు స్వామి ఉత్తరాభిముఖంగా దర్శనమివ్వగా, భక్తులు కూర్మనాథ స్వామి పాదం తాకేందుకు పోటీపడ్డారు. ‘శ్వేతపుష్కరిణి’తో పాటు ‘శ్రీకూర్మ–మత్స్యలేశం’ లోనూ భక్తులు పవిత్ర స్నానా లు చేసి మూలవిరాట్ను దర్శించుకున్నారు. సాయంత్రం వేళ డోలో మంటపం నుంచి తిరిగి స్వామి శ్రీకూర్మనాథాలయానికి చేరుకోవడంతో ఈ ఉత్సవం ముగిసింది. కార్యక్రమంలో ఆలయ ఈఓ టి.వాసుదేవరావు, పాలకమండలి సభ్యు లు కై బాడి కుసుమకుమారి, అర్చకులు గోపినంబాళ్ల దాసుబాబు, కిషోర్బాబు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
విశృంఖలత్వమే కొంప ముంచింది
● వీడిన పొన్నాడ హత్య కేసు మిస్టరీ ● నిందితుడి అరెస్టు ● ఆర్థిక లావాదేవీలు, వ్యక్తిగత సాన్నిహిత్యాలే హత్యకు కారణం ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ వివేకానంద హత్యకు ఉపయోగించిన లావుపాటి కర్ర శ్రీకాకుళంక్రైమ్ : విశృంఖల వాంఛలు ఒకరి ప్రాణా లు తీయగా.. మరొకరిని జైలుపాలు చేశాయి. గత నెల 26న ఎచ్చెర్ల మండలం పొన్నాడ పంచాయతీ వెంకన్నగారిపేట మార్గం రాజీవ్గారి తోటలో పైలా మోహనరావు (43)ను హత్య చేసిన సంగతి తెలిసిందే. మోహన్ను హత్య చేసింది శ్రీకాకుళం హయాతినగరానికి చెందిన అలబోయిన ఢిల్లీశ్వరరావు (21) అని, ఇద్దరి మధ్య విశృంఖల శృంగారం, ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు నిర్ధారించారు. కేసుకు సంబంధించిన వివరాలు శ్రీకాకుళం సబ్డివిజనల్ కార్యాలయంలో డీఎస్పీ సీహెచ్ వివేకానంద మీడియా సమావేశంలో వెల్లడించారు. పరిచయమిలా.. మోహన్ గత 15 ఏళ్లుగా వాంబేకాలనీలో నివసి స్తూ టిఫిన్, కిరాణా వ్యాపారం చేస్తూనే చీటీ పాటలు కూడా నడుపుతుండేవాడు. అంతేకాక జిల్లా హిజ్రా సంఘాలకు నాయకునిగా వ్యవహరిస్తుండేవాడు. ఈ క్రమంలో నగరంలో ఆశీలు వసూలు చేస్తున్న ఢిల్లీశ్వరరావుతో మోహన్కు పరిచయమైంది. నగరంలోనే వీరు వేరేగా గది అద్దెకు తీసుకుని ఉండేవారు. ఢిల్లీ బర్త్డే ఫంక్షన్ను హిజ్రాలతో సెలబ్రేట్ చేసి తన భర్త ఢిల్లీ అని మోహనరావు ప్రకటించాడు కూడా. రూ.10 లక్షలు, ఇల్లు ఇస్తానని.. ఈ క్రమంలో గత ఏడాది డిసెంబరులో ఇద్దరూ మద్యం తాగి ఆ మత్తులో ఒకరిపై ఒకరు దుర్భాషలాడుకున్నారు. మోహన్ తనకుండే ఓ వ్యాధిని ఢిల్లీకి అంటించానని చెప్పడంతోనే ఈ గొడవ జరిగింది. ఢిల్లీ ఈ విషయం మోహన్ కుటుంబసభ్యులకు చెబుతాననగా రూ. 10 లక్షలు, ఇల్లు ఇస్తాను, ఆర్థికంగా అన్ని విధాలా ఆదుకుంటాన ని మోహన్ నచ్చజెప్పాడు. ఎప్పటికీ ఇవ్వకపోవడంతో ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నా వినలేదు. దీంతో కక్ష పెట్టుకున్న ఢిల్లీశ్వరరావు మోహన్ను అంతమొందించాలని ప్లాన్ వేశాడు. అరసవల్లి గుడికని చెప్పి.. ఢిల్లీశ్వరరావుకు వరసకు మేనల్లుడైన పాలకొండకు చెందిన కార్తీక్ను అరసవల్లి గుడికి వెళ్దామని, కారు బుక్చేసుకుని రమ్మని గత నెల 26న పిలిచాడు. కార్తీక్కు తోడుగా అతని మిత్రుడు ప్రశాంత్ను తీసుకురమ్మన్నాడు. వీరితోపాటు డ్రైవర్ సాయి వచ్చా డు. వీరిలో కార్తీక్ ఇంజినీరింగ్ విద్యార్థి కాగా, ప్రశాంత్ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నా డు.మధ్యలో ఒకరు డబ్బులు ఇవ్వాల్సి ఉందని ఢిల్లీ శ్వరరావుచెప్పి ఎచ్చెర్ల తోటపాలెం మార్గంలో కారు లో వచ్చి మద్యం బాటిళ్లు, ఫుడ్ కొని తోటకు వెళ్లా రు. అక్కడ కార్తీక్ తప్ప మిగతా ఇద్దరు మద్యం సేవించారు. ఈలోగా మోహన్కు ఫోన్ చేసి రమ్మనడం.. అతడి బండి స్టార్ట్ కాకపోవడంతో పొన్నాడ వంతెన వద్ద కు వెళ్లి మోహన్ను పికప్ చేసుకున్నారు. కారులోనే కత్తితో పొడిచి.. మోహన్, ఢిల్లీల మధ్య కారులోనే మాటామాటా పెరగడంతో కత్తితో మోహన్పై ఢిల్లీ దాడి చేశాడు. కారులో ఉన్న వారు బెదిరిపోవడంతో డ్రైవింగ్ సీటులో ఉన్న సాయిని కత్తితో చంపేస్తానని బెదిరించి తోట వైపు తీసుకెళ్లమన్నాడు. తోటకు వెళ్లి కారు నుంచి దిగిన వెంటనే మోహన్పై లావుపాటి కర్ర, కత్తితో ఢిల్లీ దాడి చేస్తుండటంతో కార్తీక్, సాయి కారులో పారిపోయారు. అక్కడ ఉన్న ప్రశాంత్ అడ్డుకోబోగా అతడిని సైతం బెదిరించడంతో పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాడు. ఘటనా స్థలిలో ఎవరూ లేకపోవడంతో ఢిల్లీ ఒక్కడే కసి తీరా మోహన్ని చంపేశాడని డీఎస్పీ చెప్పారు. -
మండలి చైర్మన్పై అచ్చెన్న వ్యాఖ్యలు దారుణం
● మండలి చైర్మన్కు క్షమాపణ చెప్పాలి ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ డిమాండ్ నరసన్నపేట: రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజుపై వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, టీడీపీ సభ్యు లు అవమానకరంగా మాట్లాడారని, కుల మతాల పేరుతో దూషించడం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం శాసన మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు పదే పదే మండలి చైర్మన్ మతా న్ని ఎత్తి చూపడాన్ని తీవ్రంగా ఖండించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బాధ్యత కలిగిన మంత్రి ఇలా మండలి చైర్మన్ను కించపరిచే విధంగా మాట్లాడటం అత్యంత హేయమైన చర్య అని అన్నారు. సభను హుందాగా నడిపిస్తున్న మండలి చైర్మన్కు సహకరించాల్సింది పోయి ఇలా వ్యవహరించడాన్ని తప్పు పట్టారు. మొత్తం సభా మర్యాదను మంటగలిపారని అన్నారు. హెరిటేజ్ అవినీతి అంశాలు, కల్తీ నెయ్యి సరఫరా వంటి కీలక విషయాల్లో తెలుగు దేశం బండారం బయట పడుతుందనే భయంతోనే అచ్చెన్నాయుడు ఇలాంటి చిల్లర రాజకీయాలకు తెరలేపారని విమర్శించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే కుల మతాల ప్రస్తావన తెస్తున్నారని విమర్శించారు. విలేకరుల సమావేశంలో కాళింగ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఆరంగి మురళీ ధర్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కరిమి రాజేఽశ్వరరావు, పార్టీ పొందర కూరాకుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాజాపు అప్పన్న, పార్టీ వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు కేసీహెచ్బీ గుప్త పాల్గొన్నారు. -
స్థలం ఎవరిదమ్మా..?
● మిస్సమ్మ.. ● టెక్కలిలో మిస్సమ్మ బంగ్లా స్థలం పై భిన్నమైన వాదనలు ● ఆ స్థలం తమదేనంటున్న ఉత్తర విశాఖ సర్వోదయ సమితి సభ్యులు ● కాదు ప్రభుత్వ స్థలం అంటున్న అధికారులు టెక్కలి: టెక్కలి నడిబొడ్డున మిస్సమ్మ బంగ్లా స్థలంలో ఇటీవల రెవెన్యూ అధికారులు జంగిల్ క్లియరెన్స్ చేయడంపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. కోట్లాది రూపాయలు విలువ కలిగిన ఈ స్థలం పూర్తిగా రెవెన్యూ పోరంబోకు అంటూ ఉన్న తాధికారులు చెబుతుండగా, అది పూర్తిగా ఉత్తర విశాఖ సర్వోదయ సమితికి చెందిన స్థలం అంటూ దశాబ్దాల క్రితం నుంచి సమితి సభ్యులుగా ఉన్న కొంత మంది కుటుంబాలకు చెందిన వ్యక్తులు చెబుతున్నారు. అంతే కాకుండా న్యాయ స్థానాలను ఆశ్రయించారు. అయితే అసలు ఈ స్థలం ప్రభుత్వానిదా, లేక ఉత్తర విశాఖ సర్వోదయ సమితికి చెందినదా అనే చర్చ పట్టణంలో హాట్ టాపిక్గా మారింది. ఇదిలా ఉండగా మిస్సమ్మ బంగ్లా స్థలం ప్రభుత్వానికి చెందినదిగా స్వాధీనం చేసుకుని ఓ పెద్ద నాయకుడికి, ఆయనతో పాటు మరి కొంత మందికి ఆ స్థలాన్ని లీజు పేరుతో కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ మరి కొంత మంది విమర్శలు చేస్తున్నారు. గాంధీజీ ఆశయంతో సమితి ఏర్పాటు మిస్సమ్మ బంగ్లా స్థలంపై ఉత్తర విశాఖ సర్వోదయ సమితికి చెందిన సభ్యుల కుటుంబీకులు చెప్పిన వివరాలు ప్రకారం.. స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా స్వదేశీ దుస్తుల వినియోగం ఉద్యమంలో మెళియాపుట్టికి చెందిన స్వాతంత్య్ర ఉద్యమకారు డు రాజన్న రెడ్డి నేతృత్వంలో గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా 1949 లో ఉత్తర విశాఖ సర్వోదయ సమితిని స్థాపించి 1973లో టెక్కలిలో ప్రస్తుతం ఖాధీ బాండార్గా పిలుస్తున్న స్థలంలో కేవీఐసీ సహకారంతో సుమారు 281 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేశారు. దీని నిర్వహణ కోసం ప్రెసిడెంట్ సుగ్గు శ్రీనివాస్ రెడ్డితో పాటు 9 మంది సభ్యులను ఏర్పాటు చేశారు. ఇందులో చరకా, మగ్గం ద్వారా వస్త్రాలు తయారు చేసే శిక్షణ ద్వారా వందలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించేవారు. మొత్తం స్థలంలో కొంత భాగంలో ప్రస్తుతం ఉన్న స్టేట్బ్యాంక్కు అద్దెకు ఇచ్చారు. కొన్ని దశాబ్దాల కాలంగా సమితి నిర్వహణ కొనసాగింది. ఆ తర్వాత కార్యకలాపాలు నిలిచిపోయా యి. ప్రస్తుతానికి సుమారు 1.75 ఎకరాల్లో స్థలం ఉన్నట్లు చెబుతున్నారు. ‘మిస్సమ్మ బంగ్లా స్థలం ప్రభుత్వానిదే..’ మిస్సమ్మ బంగ్లా స్థలం పూర్తిగా ప్రభుత్వానిదేనని రెవెన్యూ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇటీవల టెక్కలి ఆర్డీఓ నేతృత్వంలో స్థలాన్ని పరిశుభ్రం చేశారు. దీనిపై ఆర్డీఓ మాట్లాడుతూ మిస్సమ్మ బంగ్లా స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నాలు చేయడాన్ని అడ్డుకునేందుకు అ న్ని విధాలుగా ప్రయత్నాలు చేసినట్లు వెల్లడించా రు. స్థలంలో ఎలాంటి ఆక్రమణలు లేకుండా 2019 లో రెవెన్యూ అధికారుల నేతృత్వంలో స్థలాన్ని పరిరక్షించేందుకు సీజ్ చేసిన సంగతిని గుర్తు చేశారు. ప్రభుత్వ స్థలం పరిరక్షణ విషయంలో మంత్రి అచ్చెన్నాయుడు ఎంతగానో సహకరించినట్లు వెల్లడించా రు. ఈ స్థలం ఉత్తర విశాఖ సర్వోదయ సమితికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కొంత మంది న్యాయ స్థానాలను ఆశ్రయించినప్పటికీ వా రికి ఫలితం కనిపించలేదని పేర్కొన్నారు. పట్టణం అభివృద్ధిలో భాగంగా ఈ స్థలాన్ని వాణిజ్య పరంగా అభివృద్ధి చేసి ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే విధంగా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. మంత్రికి అప్పగించేందుకు ప్రయత్నాలు..? టెక్కలిలో కోట్లాది రూపాయల విలువ కలిగిన ఉత్తర విశాఖ సర్వోదయ సమితి స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా స్వాధీనం చేసుకుని ఆ తర్వాత మంత్రి అచ్చెన్నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు, మరి కొంత మంది కార్యకర్తలకు స్థలాన్ని కట్టబెట్టడానికి రెవెన్యూ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవంగా ఆ స్థలం ఉత్తర విశాఖ సర్వోదయ సమితికి చెందిన విషయం అందరికీ తెలిసిందే. సమితి కార్యకలాపాలు నిలిచిపోయిన విషయాన్ని ఆసరాగా చేసుకుని అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారనే వాదన ఉంది. ఇప్పటికే ఆర్టీసీ స్థలాన్ని ఇదే మాదిరిగా దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. టెక్కలి జగతిమెట్టకు ఎదురుగా ఇటీవల వివాదంగా మారిన స్థలాన్ని కూడా కాజేయాలని ప్రయత్నిస్తున్నారు. పట్టణంలో కొన్ని స్థలాలను ప్రభుత్వ స్థలాలుగా స్వాధీనం చేసుకుని వాటిని మంత్రికి దారాదత్తం చేసే ప్రయత్నాల పై ఇప్పటికే క్షేత్ర స్థాయిలో ఆధారాలు సేకరించాం. – పేరాడ తిలక్, వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి -
‘సాంకేతిక సామర్థ్యం పెంచుకోవాలి’
టెక్కలి: వాహనాల తయారీలో సాంకేతిక సామర్థ్యం పెంపొందించుకోవాలని హైదరాబాద్ ఐఐటీకి చెందిన ప్రొఫెసర్ బి.వెంకటేశం సూచించారు. టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న గోకార్టింగ్ పోటీల్లో భాగంగా గురువారం వాహనాల సామర్థ్యపు తనిఖీలు నిర్వహించారు. అనంతరం పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ డాక్టర్ కె.సోమేశ్వరరావు, డైరెక్టర్ వీవీ నాగేశ్వరరావు, కార్యదర్శి ఎల్.ఎల్.నాయుడు, కోశాధికారి టి.నాగరాజు, ప్రిన్సిపాల్ ఏఎస్ శ్రీనివాసరావు, డీన్ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. ఘనంగా శ్రీముఖలింగేశ్వరుని చక్రతీర్థ స్నానాలు జలుమూరు: డోలోత్సవం పురస్కరించుకుని శ్రీముఖలింగేశ్వరుని చక్రతీర్థ స్నానాలు వంశధార నదిలో గురువారం ఘనంగా జరిగాయి. పార్వతీ పరమేశ్వర ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి పల్లకిలో మంగళవాయిద్యాల నడుమ ఊరేగించారు. మహిళలు, భక్తు లు స్వామికి హారతులు ఇవ్వగా వంశధార నదీతీరాన తూర్పు ముఖంగా స్వామికి చక్రతీర్థ స్నానాలు చేయించారు. తర్వాత విగ్రహాలను ఆలయంలో యథాస్థానంలో ఉంచి పూజలు చేశారు. 8న ‘అస్మిత’ మహిళా క్రీడా పోటీలు శ్రీకాకుళం న్యూకాలనీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 8వ తేదీన ’అస్మిత’ పేరిట బాలికలు/మహిళలకు క్రీడా పోటీలను నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూర్తి స్టేడియం వేదికగా జరగనున్న ఈ పోటీలు ఆరోజు ఉదయం 10 గంటల నుంచి మొదలుకానున్నాయి. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ (మేరా యువ భారత్), జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే మహిళా దినోత్సవ క్రీడా పోటీల్లో 13 ఏళ్ల లోపు వారు, 13–18 ఏళ్ల లోపు వారు, 18 ఏళ్లు పైబడిన మూడు వయో విభాగాల్లో బాలిక లు/మహిళలు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. ఏయే పోటీలు జరుగుతాయంటే..? మహిళా దినోత్సవ క్రీడా పోటీల్లో 100 మీట ర్లు, 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందెంతో పాటు టగ్ ఆఫ్ వార్ (తాడు లాగుట), ఫన్ గేమ్స్ నిర్వహించనున్నారు. ఆసక్తి గల బాలికలు/మహిళలు ఎన్ఎస్ఆర్ఎస్.ఖేలోఇండియా.జీవోవి.ఇన్ వెబ్సైట్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచినవారికి పతకాలు అందజేయనున్నారు. అలాగే ఈ పోటీల్లో పాల్గొన్న వారందరికీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా ఆన్లైన్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లను అందజేస్తారు. మహిళా క్రీడా పోటీల్లో బాలికలు, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్ కె.వెంకట్ ఉజ్వల్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎ.మహేష్బాబు కోరారు. -
27న పెళ్లికి ముహూర్తం.. ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి
ఇద్దరూ కూతుళ్లే అని ఆ తల్లిదండ్రులు కుమిలిపోలేదు. భారంగా భావించనూ లేదు. తాహతుకు మించి పెంచారు.. ఉన్నత చదువులు చదివిస్తున్నారు. ఇంజినీరింగ్ చదువుతున్న పెద్దమ్మాయికి పెళ్లి చేసి బాధ్యత నెరవేర్చాలనుకున్నారు. మంచి సంబంధం చూసి పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ చేసిన ఆ తల్లిదండ్రుల ఆనందం అంతలోనే ఆవిరి అయిపోయింది. పెళ్లికూతురి ముస్తాబులో కళకళలాడాల్సిన కుమార్తె పట్టాల మీద ప్రాణాలు కోల్పోయి విగతజీవిగా మారడం వారిని కలచి వేసింది. ఇంతకూ ప్రవల్లిక మరణానికి కారణం ఏమిటి..! బలవన్మరణానికి పాల్పడిందా? పెళ్లి ఇష్టం లేదా?? ఇంకేదైనా బలమైన కారణం ఉందా??? పోలీసు దర్యాప్తులోనే తేలుతుంది.టెక్కలి రూరల్/నందిగాం: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీలో ఐటీ సెకెండియర్ చదువుతున్న కింతలి ప్రవల్లిక(19) బుధవారం రైలు కింద పడి మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. నందిగాం మండలం వేణుగోపాలపురం గ్రామానికి చెందిన కింతలి గోపాలరావు, శిరీష దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె ప్రవల్లిక ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతుండగా, చిన్న కుమార్తె హారిక గుంటూరులో బీఎస్సీ నర్సింగ్ చదువుతోంది. గోపాలరావు తాపీమేస్త్రీ కాగా శిరీష గృహిణి. ప్రవల్లికకు ఈ నెల 27న వివాహం చేసేందుకు నిశ్చయించారు. ఎప్పట్లాగే బుధవారం ఉదయం కాలేజీకి వెళ్లిన ప్రవల్లిక టెక్కలి మండలం తలగాం సమీపంలో సాయంత్రం వచ్చే రాజారాణి ఎక్స్ప్రెస్ రైలు కింద పడి మృతి చెందింది. గమనించిన స్థానికులు ఐడీ కార్డు ఆధారంగా కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయి గుండెలవిసేలా రోదించారు. కొద్ది రోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా ఇలా మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కాగా,కాలేజీకి వెళ్లిన ప్రవల్లిక నందిగాం వైపు రాకుండా నౌపడ రూట్ ఎందుకు వెళ్లింది.. మృతి చెందడానికి కారణాలు ఏంటనే విషయాలు తెలియాల్సి ఉంది. -
విద్వేషాలు రెచ్చగొట్టడం అచ్చెన్నకు తగదు
పాతపట్నం : ఏపీ శాసనమండలిలో తిరుమల లడ్డూపై చర్చ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మండలి చైర్మన్ కొయ్యె మోషేనురాజులను క్రిస్టియన్ అంటూ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేయడం సరికాదని వైఎస్సార్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. బుధవారం పాతపట్నంలోని క్యాంప్ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ తిరుమల లడ్డూ ప్రసాదంపై శాసన మండలిలో చర్చ జరగకుండా అచ్చెన్నాయుడు డైవర్షన్ రాజకీయాలు చేస్తు న్నారని, చర్చకు ప్రభుత్వం భయపడుతుందని చెప్పారు. బీఏసీ సమావేశంలో చర్చకు అంగీకరించి సభలో మాట తప్పడం తగదన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టడం, అసందర్భ వ్యాఖ్యలు చేయడం అచ్చెన్నాయుడుకు సరికాదన్నారు. తప్పుడు వ్యాఖ్యలతో ప్రజల మనోభావాలు దెబ్బతీయవద్దన్నారు. అచ్చెన్నాయుడు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పాతపట్నం, మెళియాపుట్టి, కొత్తూరు మండలాల పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు మిరియబిల్లి శ్యామ్సుందరరావు, ఉర్లాన బాలరాజు, చింతాడ సూర్యనారాయణ, మాజీ జెడ్పీటీసీ లోలుగు లక్ష్మణరావు, పార్టీ మండల అధ్యక్షులు సవిరిగాన ప్రదీప్, పెనుమజ్జి విష్ణుమూర్తి, మీసాల రా మకృష్ణ, గండివల ఆనందరావు, పోలాకి జయమునిరావు, బైపోతు ఉదయ్కుమార్, జి.సంజీవ్, జి. రాము, పి.మోహన్, ఎం.గంగాధర్ పాల్గొన్నారు. -
టెండర్లలో పచ్చపాతం
● కమీషన్ల కక్కుర్తితో అడ్డగోలుగా వ్యవహరిస్తున్న కీలక నేత ● కార్పొరేషన్లో చెప్పినోళ్లకే టెండర్లు ఖరారు చేయాలని ఆదేశం ● ఇతరులు పాల్గొంటే బిడ్ ఓపెన్ చేయకుండా తాత్సారం ● మండిపడుతున్న కాంట్రాక్టర్లు జవాన్ పార్కుకే మరో టెండర్ కూడా పిలిచారు. దాని విలువ రూ.25 లక్షలు. ఈ వర్క్కు కీలక నేతల నుంచి ఒత్తిళ్లు వచ్చినప్పటికీ ముగ్గురు టెండర్లలో పాల్గొన్నారు. తాము చెప్పినా టెండర్లలో పోటీ పడ్డారనే అక్కసుతో ఆ బిడ్ తెరవకుండా నిలిపివేశారు. నెలలు గడుస్తున్నా టెండర్లు ఖరారు చేయలేదు. అలాగని, రద్దు చేయడం లేదు. తాత్సారం చేస్తూ ఏదో ఒక రోజున రద్దు చేసేసి, తమకు కావాల్సిన వారికి కట్టబెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాలుష్య నియంత్రణ మండలి(ఎన్ క్యాప్) కింద మంజూరైన నిధులతో జవాన్ పార్కుకు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ఇటీవల టెండర్లు పిలిచారు. రూ.55 లక్షల విలువైన ఓపెన్ టెండర్లను ఆహ్వానించారు. కానీ, నియోజకవర్గ కీలక నేత అనుచరుడు ఆసక్తి గల కాంట్రాక్టర్లను బెదిరించారు. ఎవరూ టెండర్లు వేయవద్దని ఒత్తిడి చేశారు. దీంతో ఆ కీలక నేత సూచించిన ఒకరే టెండర్ వేశారు. ఎస్టిమేట్ రేట్కు కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. టెండర్లు వేసుకోవడానికి అందరికీ అవకాశమిస్తే ప్రభుత్వానికి సుమారు రూ.10లక్షలు మిగిలి ఉండేది. సింగిల్ టెండర్ వల్ల ఆ అవకాశాన్ని కోల్పోయింది. వాస్తవానికి సింగిల్ టెండర్ పడితే రింగ్ అయ్యారన్న కారణంతో రద్దు చేయాలి. కానీ, ఆ పని చేయలేదు. జిల్లా కోర్టు కాంప్లెక్స్ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ.28.35లక్షలకు టెండర్లు పిలిచారు. దీంట్లో ముగ్గురు పాల్గొన్నారు. ఒకరు మాత్రమే కీలక నేతకు సంబంధించిన వ్యక్తి. దీంతో మిగిలిన ఇద్దరిని తప్పుకోమని హుకుం జారీ చేశారు. అందులో ఒకరు భయపడి తప్పుకున్నారు. ఇంకొకరు ఇంకా తప్పుకోలేదు. ఆ వ్యక్తి కూడా తప్పుకోలేదని సదరు టెండర్ను ఇంకా తెరవలేదు. వాళ్లకు కావల్సిన వ్యక్తికి వచ్చేవరకు ఆ టెండర్ తెరిచే పరిస్థితి కన్పించడం లేదు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం కార్పొరేషన్లో జరుగుతున్న టెండర్ బాగోతాలివి. నియోజకవర్గ కీలక నేత పెద్ద ఎత్తున కక్కుర్తి పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలో జరిగే అభివృద్ధి పనులన్నీ తన మనుషులే చేయాలని.. పర్సంటేజీలు తనకే రావాలని నియంతలా వ్యవహరిస్తున్నారు. ఏదైనా తన ద్వారానే జరగాలని, తాను చెప్పినోళ్లకి పనులు కట్టబెట్టాలని హకుం జారీ చేస్తున్నారు. కాదూ కూడదంటే ఇక్కడ పనిచేయలేవంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఫలితంగా నగరంలో జరిగే అభివృద్ధి పనుల టెండర్లలో పెద్ద ఎత్తున గోల్మాల్ జరుగుతోంది. అంతటా అదే ధోరణి.. శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో కూడా ఇదేరకంగా అభివృద్ధి పనుల టెండర్లలో ఇతరులు పాల్గొన్నారని ఏకంగా రద్దు చేయించారు. ● ఒక్క టెండర్లే కాదు గతంలో చేసిన అభివృద్ధి పనుల బిల్లుల చెల్లింపుల్లో కూడా అదే పచ్చపాత ధోరణి ప్రదర్శిస్తున్నారు. ● తనకు పర్సంటేజీలు ఇచ్చినోళ్లకు, తనకు కావల్సిన వారికి మాత్రమే బిల్లులు చెల్లింపులు చేయిస్తున్నారు. ● మిగతా వాళ్ల బిల్లులకు అడ్డుగా నిలుస్తున్నారు. దీంతో మిగిలిన కాంట్రాక్టర్లు నష్టపోతున్నారు. సొంత డబ్బులతో పనులు చేసి ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● కీలక నేత పేరు గల వ్యక్తులే కార్పొరేషన్లో చక్రం తిప్పుతున్నారు. అన్నీ పనులు ఆ ముగ్గురే చేస్తూ పెద్ద ఎత్తున లబ్ధిపొందుతున్నారు. ● నాసిరకం పనులు చేసి అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. ఎంత దారుణమంటే టెండర్లు పిలవకుండా కూడా కొన్ని పనులు చేయించేశారు. కాలుష్య నియంత్రణ నిధులు పక్కదారి కాలుష్య నియంత్రణ మండలి(ఎన్ క్యాప్) కింద మంజూరైన నిధులు కాలుష్యం తగ్గించే పనులకు మాత్రమే ఖర్చు పెట్టాలి. ఏం చేస్తే నగరంలో కాలుష్యం తగ్గుతుందో వాటికే ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకు భిన్నంగా ఎన్ క్యాప్ నిధులను పార్కు కాంపౌండ్ వాల్ పనులకు ఖర్చు పెడుతున్నారు. దీనివల్ల కాలుష్యం ఎలా తగ్గుతుందో నేతలకు, అధికారులకే తెలియాలి. -
● కంపునీళ్లు.. ఇంకెన్నాళ్లు!
● జిల్లా కేంద్రంలో మారని పైపులైన్ల దుస్థితి ● అధికారుల హడావుడి తగ్గడంతో మళ్లీ పాత పరిస్థితే ● డయేరియా వివరాలు చెప్పేందుకు జనం వెనుకంజ ● పాలకుల తీరుపై మండిపాటు జిల్లా కేంద్రంలో డయేరియా కేసుల నేపథ్యంలో హడావుడి చేసిన అధికారులు మళ్లీ సాధారణ స్థితికి వచ్చేశారు. అయితే కేసులు మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదని సమాచారం. డయేరియాతో బాధపడుతున్నామని చెబితే ఎక్కడ ఆస్పత్రుల్లో ఉంచేస్తారోనన్న భయంతో చాలామంది వాంతులు, విరోచనాలతో ఇబ్బందిపడుతున్నా ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో ఇంటింటా సర్వేలు చేస్తున్నవారికి వివరాలు చెప్పడానికి వెనకడుగు వేస్తున్నారు. మరోవైపు నగరంలో తాగునీటి పైపులైన్ల దుస్థితి ఏమాత్రం మార్పులేదు. పైపులైన్లు ఇంకా మురుగుకాలువలోనే దర్శనమిస్తున్నాయి. ప్రధానంగా రైతుబజారురోడ్డు, రెల్లవీధి, ఆర్టీసీ కాంప్లెక్స్ దరి, దమ్మలవీధి, హయాతినగర్, గుజరాతిపేట, ఇలిసిపురం, రెల్లివీధి, కృష్ణాపార్కు, వైష్ణపు వీధి, గారవీధి, కెల్లవీధి, గుడివీధి, వాంబేకాలనీల్లో పైపులైన్లు దారుణంగా దర్శనమిస్తున్నాయి. ముందే పరిశీలించి ఉంటే.. మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీర్లు, ఎమినిటీ సెక్రటరీలు నగరంలో కుళాయి పైపులైన్లను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం నెలకోసారైనా పరిశీలించి ఉంటే మురుగునీరు కుళాయి పైపులైన్లలోకి చేరే పరిస్థితి ఉండేది కాదని, అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయేది కాదని నగరవాసులు చెబుతున్నారు. ఇప్పటికై నా మేల్కొని కుళాయి పైపులైన్ల లీకులు, హెడ్వాటర్ వర్క్స్ వద్ద పంపుల పనితీరు, ట్యాంకుల పరిశుభ్రత, మంచినీటిలో కలుపుతున్న క్లోరిన్ మోతాదులు పరిశీలన వంటివి క్రమం తప్పకుండా చేపట్టాలని కోరుతున్నారు. –శ్రీకాకుళం (పీఎన్ కాలనీ) ఇంకా కంపు నీళ్లే.. మా ప్రాంతంలో నిరంతరం కంపునీరే వస్తోంది. కుళాయి పైపులైన్లు పూర్తిగా కాలువల్లో కూరుకుపోయాయి. ఈ విషయాన్ని కార్పొరేషన్ అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదు. – ఎం.అసిరినాయుడు, రెల్లవీధి, శ్రీకాకుళం -
కుతంత్రాలకు చెక్
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : రాజకీయ కక్ష సాధింపులతో చేసిన చెక్ పవర్ రద్దును ఎట్టకేలకు అధికారులు ఉపసంహరించుకున్నారు. ఎచ్చెర్ల మండలం బొంతలకోడూరులో సర్పంచ్ పంచిరెడ్డి రాంబాబు వైఎస్సార్ సీపీ సర్పంచ్ అని, గ్రామంలో కూటమి నేతల అక్రమాలకు అడ్డుపడుతున్నారని కక్ష కట్టి చెక్ పవర్ రద్దు చేయించిన సంగతి తెలిసిందే. తాజాగా చెక్ పవర్ రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడమే కాకుండా పంచాయతీలో ఎలాంటి అక్రమాలు, నిధులు దుర్వినియోగం జరగలేదని అధికారులు చెక్ పవర్ కొనసాగింపు ఉత్తర్వుల్లో పేర్కొనడం విశేషం. ఈ విషయమై సర్పంచ్ రాంబాబుతో పాటు ‘సాక్షి’ పత్రిక అధికారుల తీరును, ఎమ్మెల్యే, మంత్రుల ఒత్తిళ్లను కథనాల రూపంలో ఎండగట్టింది. ఈ కథనాలు ఆధారంగా చేసుకుని సర్పంచ్ రాంబాబు కూడా హైకోర్టును ఆశ్రయించారు. పక్కా ఆధారాలు చూపించడంతో హైకోర్టు కూడా సీరియస్గా స్పందించింది. తక్షణమే చెక్ పవర్ పునరుద్ధరించాలని ఆదేశాలిచ్చింది. దీనిపై కూడా అధికారులు తాత్సారం చేశారు. హైకోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడంతో కంటెంప్ట్కు కూడా సర్పంచ్ వెళ్లారు. దీంతో అధికారులు వెనక్కి తగ్గక తప్పలేదు. తీసేసిన చెక్ పవర్ను పునరుద్ధరించడమే కాకుండా ఎటువంటి అక్రమాలు, నిధులు దుర్వినియోగం జరగలేదని చివరికి అంగీకరించారు. ఆ మేరకు చెక్ పవర్ పునరుద్ధరణ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. బొంతల కోడూరు సర్పంచ్ చెక్ పవర్ పునరుద్ధరణ ఇన్నాళ్లూ ఎమ్మెల్యే, మంత్రుల ఒత్తిళ్లతో కక్ష సాధింపు కొన్ని నెలలుగా చెక్ పవర్ లేక నిలిచిపోయిన గ్రామాభివృద్ధి నేతల తీరు, అధికారుల వ్యవహార శైలిపై ‘సాక్షి’లో ప్రత్యేక కథనాలు వాటి ఆధారంగా హైకోర్టును ఆశ్రయించిన సర్పంచ్ రాంబాబు ఎట్టకేలకు దిగొచ్చిన అధికారులు -
ఆగని డయేరియా కేసులు
శ్రీకాకుళం : నగరంలోని మంగువారితోట, దండి వీధి, లెప్రసీ కాలనీ తదితర ప్రాంతాల్లో మళ్లీ డయేరియా కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం రెండు కేసులు ఈ ప్రాంతం నుంచి నమోదై లెప్రసీ కాలనీలోని ఆరోగ్య కేంద్రంలో చికిత్సలు పొందగా బుధవారం వారి ఆరోగ్యం కాస్త కుదుటపడడంతో డిశ్చార్జ్ చేశారు. వారు వెళ్లిన క్షణాల్లోనే లెప్రసీ కాలనీ నుంచి మరో ఇద్దరు వచ్చి ఆరోగ్య కేంద్రంలో చేరారు. ఆ ప్రాంతంలో చాలామందికి డయేరియా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆరోగ్య సిబ్బంది ఇంటింటి సర్వే ప్రారంభించారు. శుక్రవారం సాయంత్రం సరికి ఈ సర్వేను పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. శ్రీకాకుళం న్యూకాలనీ: ఖేలో ఇండియా సౌత్జోన్ పెన్కాక్ సిలాట్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబర్చారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 2 వరకు కేరళలో జరిగిన సౌత్జోన్ అస్మిత ఖేలో ఇండియా పెన్కాక్ సిలాట్ ఉమెన్స్ లీగ్ పోటీల్లో జూనియర్స్ విభాగంలో సాహుకారు సహస్ర, చింతపల్లి హేమసుధ కాంస్య పతకాలు సాధించగా, నేతింటి చరిష్మా, అన్నెపు భార్గవి గట్టి పోటీనిచ్చారు. కోచ్ మాకివలస గౌతమి, అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రేగిడి దయామయ, ప్రధాన కార్యదర్శి నక్క లక్ష్మణ్ నాయుడు క్రీడాకారులను అభినందించారు. -
వణికించేసి వతిలారు
● తిలారు రైల్వేస్టేషన్లో ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్ ● అప్రమత్తమైన అధికారులు జలుమూరు: అందరికీ కళ్లలో భయం.. అందరి ఇళ్లలో భయం. తిలారు మంగళవారం భయంతో వణికింది. ఏ క్షణాన ఏ వార్త వినాల్సి వస్తుందోనని గుండె అరచేతిలో పెట్టుకుని గడిపింది. తిలారు రైల్వే స్టేషన్కు వచ్చిన ఓ గూడ్సు బండిలో ఉన్న ట్యాంకర్ నుంచి గ్యాస్ లీకై ంది. ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో ఊరి వారితో పాటు స్టేషన్ పక్కనే ఉన్న క్వార్టర్స్లోని ప్రజలు కూడా తీవ్ర భయాందోళన చెందారు. అధికారులు వచ్చి లీకేజీ ని అరికట్టడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నరసన్నపేట సీఐ తోపాటు పోలాకి, జలుమూరు, సారవకోట పోలీసు సిబ్బంది వచ్చి ప్రమాద నివా రణ చర్యలు తీసుకున్నారు. టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు, ఆర్డీఓ కె.సాయిప్రత్యూషలు అక్కడకు చేరుకుని గ్యాస్ లీకేజీని నిలుపుదల చేశారు. విశాఖ నుంచి రైల్వే, హెచ్పీసీఎల్ అధికారులు వచ్చి బండి నుంచి లీక్ అవుతున్న వ్యాగన్ను వేరుచేశారు. రైలు నిలుపుదలతో ప్రయాణికుల ఇక్కట్లు ఆమదాలవలస: తిలారు వద్ద గ్యాస్ ట్యాంకర్ లీక్ అయిన ఘటన సందర్భంగా శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషన్లో మంగళవారం సాయంత్రం వందేభారత్ ఎక్స్ప్రె్స్ రైలు నిలుపుదల చేశారు. ఈ రైలు శ్రీకాకుళం రోడ్కు సాయంత్రం 5.10 నిమిషాలకు రావా ల్సి ఉండగా కొద్దిసేపు ఆలస్యంగా సాయంత్రం 5.35 నిమిషాలకు వచ్చింది. రాత్రి 7.45 వరకు శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషన్లోనే ఉంచేశారు. సికింద్రాబాద్ నుంచి షాలిమార్ వీక్లీ ట్రైన్ రెండుగంటలు ఆలస్యంగా నడిచింది. ఈ రైలును కూడా కాసేపు ఆపేశారు. -
అతిసారం కట్టడికి పారిశుద్ధ్య పనులు
శ్రీకాకుళం: నగరంలో డయేరియా పరిస్థితుల నేపథ్యంలో పారిశుద్ధ్య పనులను జిల్లా యంత్రాంగం ముమ్మరం చేసింది. జాయింట్ కలెక్టర్, నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మంగళవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సెవెన్ రోడ్ జంక్షన్లోని అన్నా క్యాంటీన్ను సందర్శించిన ఆయన, అక్కడ పారిశుద్ధ్య నిర్వహణను స్వయంగా పరిశీలించారు. అనంతరం కాజీపేటతో పాటు నగరపాలక సంస్థలోని పలు వార్డుల్లో పర్యటించి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. పారిశుద్ధ్య పనుల కోసం మంగళవారం ఒక్కరోజే మొత్తం 17 జేసీబీలు, 24 ట్రాక్టర్లను రంగంలోకి దించారు. 84 ట్రిప్పుల ద్వారా మొత్తం 147 టన్నుల పూడిక, 39.25 టన్నుల చెత్తను కలిపి మొత్తం 186.25 టన్నుల వ్యర్థాలను నగరం వెలుపలికి తరలించారు. రోడ్లపై పశువుల సంచారం లేకుండా చూసేందుకు మంగళవారం 7 పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రజలు కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు. తగ్గని డయేరియా శ్రీకాకుళం: నగరంలో డయేరియా వ్యాప్తి తగ్గడం లేదు. నిత్యం నగరంలోని ఏదో ఒక చోట కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇటీవల ఉద్ధృతంగా వ్యాధి కనబడిన దమ్మల వీధి, కాకి వీధి తదితర ప్రాంతాల్లో కూడా కేసులు వస్తూనే ఉన్నాయి. తాజాగా వీటిని ఆనుకొని ఉన్న లెప్రసీ కాలనీ దండి వీధి ప్రాంతాల్లో మంగళవారం రెండు కేసులు నమోదయ్యాయి. దండి వీధికి చెందిన ఓ మహిళ, లెప్పర్సీ కాలనీకి చెందిన 12 ఏళ్ల బాలుడు డయేరియాతో బాధపడుతూ రిమ్స్లో చేరారు. చిన్న బొందిలీపురంలో ఇద్దరు బాలబాలికలు డయేరియాతో రిమ్స్లో చేరారు. ఇక ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరుతున్న వారు కూడా ఉన్నారు. ఆరోగ్య శాఖ ఈ వివరాలను ప్రకటించడం లేదు. వృద్ధురాలి మెడలో పుస్తెలతాడు మాయం పొందూరు: మండలంలోని లోలుగు వద్ద అదే గ్రామానికి చెందిన లోలుగు కాంతమ్మ అనే వృద్ధురాలి మెడలోని మూడు తులాల బంగారం పుస్తెలతాడు మంగళవారం మాయమైంది. ఆమె బురిడికంచరాం రహదారిలో ఉన్న పొలా నికి వెళ్తుండగా అటువైపుగా వచ్చిన ఆటో డ్రైవర్ ఎక్కమని చెప్పడంతో ఆటో ఎక్కారు. ఆటో దిగేసరికి మెడలో తాడు కనిపించలేదు. దీంతో కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. ఆటో ఎక్కిన సమయంలో లోపల గుర్తు తెలియని మహిళ ఉందని, ఆ మహిళే తాడును చోరీ చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తూ ఆమె కుమారుడు నూకరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
అలిగితివా అమాత్యా!
● గ్రహణ కాలం● మంత్రి అచ్చెన్నాయుడికి తెలియకుండానే జిల్లాలో వివిధ పరిణామాలు ● కమిషనర్ సస్పెన్షన్ వెనక కారణమేదైనా అచ్చెన్నకు అపవాదు ● బాధితులకు పరిహారం పంపిణీలో కనబడని ప్రాధాన్యం ● అంతా తానై వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే గొండు శంకర్ ● రాజకీయ సర్కిల్లో హాట్ టాపిక్గా మారిన అచ్చెన్న వ్యవహారం కేతుగ్రస్త చంద్ర గ్రహణం జిల్లాలో సుస్పష్టంగా కనిపించింది. మంగళవారం సాయంత్రం దాదాపు 6.26కు మొదలైన ఈ ఖగోళ విన్యాసం దాదాపు 6.55 వరకు కొనసాగింది. నిండు చంద్రుడు చీకటిలో కలిసిపోవడం.. అంతలోనే మళ్లీ ఉదయ భానుడిలా ఎర్రగా మెరిసిపోవడాన్ని చాలామంది ఆసక్తిగా తిలకించారు. మరికొందరు ఈ సమయంలో ఇళ్లకే పరిమితమయ్యారు . – సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళంసాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అలిగారా? ఎమ్మెల్యే గొండు శంకర్తో అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయా? అచ్చెన్నకు తెలియకుండానే గొండు శంకర్ వ్యవహారాలు నడుపుతున్నారా? మంత్రికి తెలియకుండానే జిల్లా కేంద్రంలో పలు పరిణామాలు చోటు చేసుకున్నాయా? తాను అనుకున్నట్టుగా జరగకపోవడం వల్లే అచ్చెన్న జిల్లా కేంద్రంలో అడుగు పెట్టడం లేదా..? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సందేహాలు కలుగుతున్నాయి. ఎందుకీ మౌనం శ్రీకాకుళం నగరాన్ని డయేరియా పట్టి పీడిస్తోంది. ఆరుకి పైగా మరణాలు సంభవించాయి. ప్రభుత్వం తీవ్ర అప్రతిష్టపాలైంది. మున్సిపల్ మంత్రి నుంచి కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వరకు కాస్త ఆలస్యంగానైనా నగరంలో పర్యటించారు. కలెక్టర్, జాయింట్ కలెక్టరైతే నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇంత జరుగుతున్నా మంత్రి అచ్చెన్నాయుడు మాత్రం నగరంలో అడుగు పెట్టలేదు. జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడు జిల్లా కేంద్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ప్రజలంతా కష్టాల్లో ఉన్నప్పుడు పర్యటించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బాధితులను పరామర్శించేందుకు కనీసం ప్రయత్నించలేదు. నగర ప్రజలకు అచ్చెన్నాయుడు తన ముఖమే చూపించలేదు. వ్యాధి ప్రబలిన తొలి రోజుల్లో ఫోన్ల ద్వారానైనా అధికారులతో సమీక్షలు చేసి, అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అది కూడా చేయలేదు. కారణమేంటో? శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్తో విభేదాల కారణంగానే అచ్చెన్న మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరితో ఏమున్నా కష్ట కాలంలో ఉన్న నగర ప్రజలపై కక్ష కట్టినట్టు.. నిర్లక్ష్యంగా ఉండటంపై ఇప్పుడనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రెండు సామాజిక వర్గాల మధ్య పోరులో తాను ఎటూ వెళ్లినా టార్గెట్ అయిపోతున్నారన్న వాదనైతే గట్టిగానే ఉంది. కాళింగ సామాజిక వర్గీయులను రాజకీయంగా అణగదొక్కేస్తున్నారన్న అపవాదును మూటగట్టుకున్నారు. రాజకీయంగా పదవులు సాధించేందుకు అర్హత గల నేతలకు అందలం దక్కకుండా అచ్చెన్నాయుడు వ్యూహత్మకంగా పావులు కదుపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో, నగరంలో ఏం జరిగినా అచ్చెన్నాయుడే బాధ్యుడైపోతున్నారు. రుచించని ఎమ్మెల్యే తీరు.. స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ అంతా తానై వ్యవహరిస్తున్నారు. కార్పొరేషన్లో ప్రతి వ్యవహారాన్ని తానే చూసుకుంటున్నారు. ప్రతీది తనకు తెలిసే జరగాలని, తాను చెప్పినట్టే చేయాలని, పరిపాలన అంతా తన ద్వారానే జరగాలని ఆశిస్తున్నారు. ఆదేశిస్తున్నారు. ఆయన ఒంటెద్దు పోకడల వలనే కార్పొరేషన్లో దయనీయ పరిస్థితి ఏర్పడిందని, యంత్రాంగం సమర్థంగా పనిచేయడం లేదన్న వాదనలు ఉన్నాయి. దీనికి తోడు కూర్మారావు కమిషనర్గా నియమితులవ్వడంపై ఎమ్మెల్యేకు తెలియకుండా జరిగిందని కొందరు.. తెలిసే జరిగిందని కొందరు భావిస్తున్నారు. అదే విధంగా సస్పెన్షన్ విషయంలో కూడా ఎమ్మెల్యేనే కారణమని కొందరు, ఎమ్మెల్యేనే చేయించి ఉంటే కూర్మారావు ఇంటికి వెళ్లి ఎందుకు ఓదార్చుతారని కొందరు, డబుల్ గేమ్ ఆడుతున్నారని మరికొందరు చర్చించుకుంటున్నారు. అచ్చెన్నను పట్టించుకోవడం లేదా? ఎమ్మెల్యే గొండు శంకర్ కూడా కొన్ని విషయాల్లో అత్యుత్సాహంతో వ్యవహరిస్తున్నారని టీడీపీలోనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా డయేరియా బాధితులకు పరిహారం విషయంలో మంత్రులతో పనిలేకుండా నేరుగా ఎమ్మెల్యే పంపిణీ చేయడం కూడా అచ్చెన్నను బాధ పెట్టినట్టు వాదనలు ఉన్నాయి. ఈ పరిణామాలన్నీ అచ్చెన్నకు ఇబ్బందికరంగా మారినట్టు తెలుస్తోంది. కష్టకాలంలో సొంత జిల్లా కేంద్ర ప్రజల్ని అచ్చెన్న పట్టించుకోకపోవడం, పరామర్శించకపోవడం, అండగా నిలిచేలా నగరంలో పర్యటించకపోవడం మాత్రం విమర్శలకు దారితీస్తోంది. అరసవల్లి దేవాలయం ప్రధాన ద్వారం మూసి వేతశ్రీకాకుళం కల్చరల్: కేతు గ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం 9:30 గంటలకు అరసవల్లి దేవాలయ తలుపులు మూసివేశారు. బుధవారం ఉదయం 6:30 గంటల నుంచి సర్వదర్శనాలకు అనుమతిస్తారు. జలుమూరు: శ్రీముఖలింగం ఆలయాన్ని రాత్రి ఏడు తర్వాత ఆలయం శుద్ధి, సంప్రోక్షణ చేసి యథావిధిగా భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించారు. కూర్మనాథాలయంలో సంప్రోక్షణ చేస్తున్న అర్చకులు గార: చంద్రగ్రహణం కారణంగా శ్రీకూర్మనాథుని ఆలయాన్ని మంగళవారం ఉదయం 11 గంటలకు మూసివేసిన తర్వాత సాయంత్రం 7 గంటలకు తెరిచారు. డోలోత్సవాలు సందర్బంగా కామదహనోత్సవం కారణంగా ఆలయాన్ని శుభ్రపరిచారు. అనంతరం రాత్రి కామదహనోత్సవం నిర్వహించారు. అంగన్ వాడీ అరెస్టుల వేడిశ్రీకాకుళం (పీఎన్కాలనీ): అంగన్వాడీలపై ప్రభు త్వ నిర్బంధ కాండ అమానుషమని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు సి.హెచ్.అమ్మన్నాయుడు అన్నా రు. విజయవాడ ధర్నా చౌక్లో తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం కోసం మహాధర్నా నిర్వహిస్తున్న అంగన్వాడీలను రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో వేకువజామున అక్రమ అరెస్టులు చేయడాన్ని నిరసిస్తూ అంగన్వాడీ వర్కర్స్–హెల్పర్స్ యూనియన్, సీఐటీయూ ఆధ్వ ర్యంలో శ్రీకాకుళం ఆర్టీసీ బస్టాండ్ నుంచి డే–నైట్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా కూడా అంగన్వాడీలు ఆందోళనలు నిర్వహించారు. మహిళలు అని చూ డకుండా ఈడ్చి అరెస్టులు చేయడం సరికాదన్నారు. పోలీసుల దాడిలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు బేబీరాణి చెయ్యి విరిగిందని, కొంతమంది స్పృహ తప్పి పడిపోయారన్నారు. చంద్రబాబు నాయుడు చెప్పే మహిళా సాధికారత ఇదేనా అని ప్రశ్నించారు. టీడీపీ జనసేన నాయకులు ఎన్నికలు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్నారు. రెండు తలలతో జన్మించిన దూడ పొలిటికల్ టాక్కమిషనర్ సస్పెన్షన్తో తాజాగా కాళింగ సామాజిక వర్గానికి చెందిన హనుమంతు కూర్మారావు శ్రీకాకుళం నగర మున్సిపల్ కమిషనర్గా నియమితులయ్యారు. ఆయన ఇక్కడకు రావడానికి మంత్రి అచ్చెన్నాయుడు సహకారం ఉందని వాదనలు ఉన్నాయి. అలాగే ఇతరుల సిఫార్సుల మేరకు కూడా కూర్మారావు ఇక్కడికి వచ్చి ఉండవచ్చని ఊహాగానాలు ఉన్నాయి. కానీ డయేరియా కారణంతో బాధ్యతలు స్వీకరించిన 14 రోజుల్లోనే బాధ్యుడిని చేస్తూ హనుమంతు కూర్మారావును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వాస్తవానికి, డయేరియా ప్రబలడానికి ఆయన కారణం కాదు. దానికి సంబంధించి అయితే మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ లేదంటే ఇంజినీర్లు బాధ్యులు కావాలి. వీరిని కాదని కమిషనర్గా కొత్తగా వచ్చిన కూర్మారావును బలి చేశారు. ఇది రెండు సామాజిక వర్గాల మధ్య చిచ్చు రేపింది. కాళింగ సామాజిక వర్గానికి చెందిన కూర్మారావును బలి చేశారని, దీనికి అచ్చెన్నాయుడే కారణమని కాళింగ సామాజిక వర్గీయులు గుర్రుగా ఉన్నారు. దీంతో తాను అనవసరంగా విమర్శలకు గురయ్యాయని, విపరీతమైన చెడ్డ పేరు వచ్చిందని ఆయన అంతర్మధనం చెందుతున్నారని తెలిసింది. -
ఉపాధ్యాయ సమస్యలపై ధర్నా
శ్రీకాకుళం పాతబస్టాండ్ : విద్య, ఉపాధ్యాయరంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీటీఎఫ్ (1938) ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. తొలుత ఈ శిబిరాన్ని సంఘ రాష్ట్ర సహాధ్యక్షుడు, జిల్లా ఇన్చార్జి చింతాడ దిలీప్కుమార్ ప్రారంభించారు. ధర్నాకు ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ హనుమంతు సాయిరాం సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లా గౌరవాధ్యక్షుడు టెంక చలపతిరావు, జిల్లా అధ్యక్షుడు బి.రవి, ప్రధాన కార్యదర్శి బుక్కూరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రెండేళ్లు దాటినా కొత్త వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు. ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయులకు గ్రాట్యుటీ, సరెండర్ లీవ్, ఎన్క్యాష్మెంట్ బకాయిలు చెల్లించడం లేదని, ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు నాలుగు డీఏలు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. -
ప్రభుత్వ బడుల్లోనే పిల్లల్ని చేర్పిద్దాం
శ్రీకాకుళం: ఉపాధ్యాయులతో పాటు ప్రజలందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లల్ని చేర్పించాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సంపత్రావు కిషోర్కుమార్ కోరారు. జిల్లా కేంద్రంలోని యూటీఎఫ్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన జిల్లా భారత్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ బడిని చులకనగా తీసుకోవద్దని, ఎందరో మహానుభావులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివారని గుర్తు చేశారు. మధ్యాహ్న భోజనం, యూనిఫామ్, పుస్తకాలు ఉచితంగా ఇస్తూ పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దుతున్నారని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్థికపరమైన సమస్యల పరిష్కారం కోసం రణభేరీ త్రీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గస్థాయి, జిల్లా కేంద్ర స్థాయి, రాష్ట్రస్థాయిలో నిరాహార దీక్షలు, ఏప్రిల్ 28న చలో సెక్రటేరియట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్.బాబూరావు, బి.శ్రీరామ్మూర్తి, గౌరవాధ్యక్షుడు కె.వైకుంఠరావు, సహాధ్యక్షులు బి.ధనలక్ష్మి, వై.ఉమాశంకర్, కోశాధికారి పి.సూర్యప్రకాశరావు, జిల్లా కార్యదర్శి డి.ప్రకాశరావు, జి.నారాయణరావు, బి.శంకరరావు, జి.సురేష్, టి.భాస్కరరావు, ఎం.మురళి ప్రకాష్, గణపతరావు, జైశ్రీరామ్, ఎం.వి.రమణ, బి.గౌరీశ్వరరావు పాల్గొన్నారు -
ఆరోగ్యం..ఆదాయం
సేంద్రియ సేద్యం.. సారవకోట : ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్తీ, కలుషితమే. తినే తిండి నుంచి పీల్చే గాలి వరకు అన్నింటా అనారోగ్య కారకాలే. ఈ నేపథ్యంలో చాలామంది సేంద్రియ, ప్రకృతి విధానంలో తయారైన ఉత్పత్తుల వినియోగంపై ఆసక్తి చూపుతున్నారు. కారణాలు ఏవైనా సేంద్రియ సాగు చేసే రైతులు మాత్రం మన జిల్లాలో చాలా తక్కువ మంది ఉన్నారనే చెప్పాలి. ఈ నేపథ్యంలో తనకున్న భూమిలో మొత్తం సేంద్రియ విధానంలోనే వ్యవసాయం చేస్తూ మంచి ఆదాయం సాధించడంతో పాటు సమాజానికి ఆరోగ్యకర ఉత్పత్తులు అందిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు సారవకోట మండలం కేళవలస పంచాయతీ పద్మాపురం గ్రామానికి చెందిన రైతు రావాడ మోహనరావు. తనకున్న 23 ఎకరాల భూమిలో సేంద్రియ పద్ధతులతో కూరగాయలు, చిరు ధాన్యాలు, పండ్ల తోటలు సాగు చేస్తున్నారు. కిడిమి గ్రామానికి సమీపంలో కొండలకు ఆనుకుని ఉన్న తన స్థలాన్ని సాగు భూమిగా మార్చి సేంద్రియ పద్ధతులతో వ్యవసాయం చేస్తున్నారు. రసాయనిక ఎరువుల వాడకంతో అటు నేలతల్లికి, మానవులు ఆరోగ్యానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని గ్రహించి ప్రకృతి వ్యవసాయాన్ని ఎంచుకున్నారు. ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, నీమాస్త్రం, అగ్ని హస్త్రంలను ఉపయోగించి సొరకాయలు, వంకాయలు, దొండ, బీర, సారికంద, మిరప, చిక్కుడు, బీన్స్, తోట కూర, క్యారెట్, ముల్లంగి తదితర పంటలను సాగు చేస్తున్నారు. పాడి పెంపకం సైతం.. సేంద్రియ పద్ధతులైన ఘన, ద్రవ జీవాస్త్రాల తయారీకి నాటు ఆవులు అవసరం రావడంతో 50 నాటు ఆవులు, ఇతర జాతులకు చెందిన ఆవులు, కోళ్లను పెంచుతున్నారు. నాటు ఆవుల పేడ, మూత్రం వినియోగించి తయారు చేసిన ఎరువులతో పంటలను సాగు చేస్తున్నారు. మరోవైపు 60 సెంట్లలో ప్రత్యేకించి అంతర పంటలుగా ఒకే చోట ఏడు రకాల కూరగాయలు సొర కాయలు, దొండ, తోటకూర, క్యారెట్, కాకర, బీర, ముల్లంగి పంటలు పండిస్తున్నారు. ఇవేకాక కూరగాయలు పండిస్తున్న పంట పొలాల చుట్టు ఖాళీ ప్రదేశాలలో 600 కొబ్బరి మొక్కలు, మామిడి, సపోట, నిమ్మ, దానిమ్మ, బొప్పాయి పంటలను పండిస్తూ వాటికి సేంద్రియ ఎరువులు వాడుతున్నారు. తనకున్న ఖాళీగా ఉన్న భూమిలో 4 బోర్లు వేసి మూడింటికి సోలార్ పద్ధతిలో నడిచేలా మోటార్లు ఏర్పాటు చేసి స్ప్రింక్లింగ్ విధానంలో నీరు అందిస్తున్నారు. రసాయన ఎరువులు వాడకుండా చిరు ధాన్యాలైన రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు పండిస్తున్నారు. ఇక్కడ పండించిన పంట సారవకోట, అలుదు గ్రామాలతో పాటు నరసన్నపేటలో విక్రయిస్తున్నారు. నాటు ఆవుల గెత్తాన్ని ఇతర ప్రాంతాలకు విక్రయానికి తరలిస్తున్నారు. ప్రస్తుతం రసాయన ఎరువులు వాడకం ఎక్కువైంది. దీంతో నేలతల్లికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఆ నేల తల్లిని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. అటు నేలతల్లికి, ఇటు మానవాళి మనుగడకు సేంద్రియ సాగు ఎంతో అవసరం. ఆహార అలవాట్లు మారడం వల్ల మానవుడు తాను సంపాదిస్తున్న ఆదాయంలో సగం వరకు వైద్య ఖర్చులకు వెచ్చించాల్సి వస్తోంది. – రావాడ మోహనరావు, రైతు, పద్మాపురం -
వర్సిటీలో అక్రమ నియామకాలు రద్దు చేయాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ఎచ్చెర్లలోని డాక్టర్ బి. ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ఇటీవల జరిపిన అక్రమ నియామకాలు తక్షణమే రద్దు చేయా లని జిల్లా తూర్పు కాపు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. మంగళవారం శ్రీకాకుళం నగరంలోని ఇందిరా విజ్ఞాన్ భవన్లో జిల్లా తూర్పు కాపు ఉద్యోగ సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు అంకడాల తవిటన్న, కిల్లారి నారాయణరావు, డాక్టర్ ఎం.రామజోగినాయుడు, వాల్తేటి సత్యనారాయణలు మాట్లాడుతూ విశ్వవిద్యాలయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైస్ చాన్సలర్ కె.ఆర్.రజని నియంతలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజల ద్వారా ఎన్నికై న ప్రజా ప్రతినిధులకు, ఉన్నత అధికారులకు, మంత్రులకు కనీసం గౌరవ మర్యాదలు లేకుండా ప్రవర్తిస్తూ.. జిల్లా పరువు ప్రతిష్టలు మంటగలుపుతున్నారని దుయ్యబట్టారు. వర్సిటీలో పనిచేస్తున్న తూర్పు కాపు ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. అవినీతికి, అవకతవకలకు, అక్రమాలకు నిలయమైన వీసీ వెంటనే డిస్మిస్ చేసి ఆమె హయాంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.అభివృద్ధి పనులు పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని బహిరంగంగా దోచుకుంటున్న అక్రమార్కులపై ప్రభుత్వం శాసనసభ కమిటీని నియమించి సమగ్ర విచారణ జరిపించాని కోరారు. కాగా, ఇటీవల పదోన్నతులు పొందిన ముగ్గురు ఉద్యోగులను సంఘ నాయకులు సత్కరించారు. పదోన్నతులు పొందిన వారిలో టెక్కలి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గొంటి తిరుపతిరావు, ఉపఖజానా శాఖ అధికారులు గార నిర్మల, బోర రవీంద్రలున్నారు. కార్యక్రమంలో తూర్పు కాపు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు శాసపు జోగినాయుడు, మక్కా శ్రీనివాస్, దాసరి రామచంద్రరావు, కర్ణం నరిసింగరావు, లావేటి సుందరరావు, దన్నాన మోహనరావు, కురిటి దుర్గారావు, నేతల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ప్రతినిధులు డిమాండ్ -
కుక్కల దాడిలో 17 గొర్రెలు మృతి
బూర్జ: మండలంలోని కొరగాం గ్రామానికి చెందిన పిన్నింటి వెంకన్న అలియాస్ వెంకటరమణకు చెందిన 17 గొర్రెలు, ఒక మేక కుక్కల దాడిలో మృతి చెందినట్లు గుత్తావల్లి పశువైద్యాధికారి డాక్టర్ సతీష్ మంగళవారం తెలిపారు. సోమవారం రాత్రి గ్రామ సమీపంలో గొర్రెలు, మేకల మందను ఉంచారు. మంగళవారం తెల్లవారుజామున మందపై కుక్కలు దాడికి పాల్పడ్డాయి. మృతి చెందిన జీవాలు విలువ రెండు లక్షల రూపాయలు ఉంటుందని పశువైద్యులు తెలిపారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని బాధిత సభ్యులు కోరుతున్నారు. బొరిగిపేటలో అనుమానితుల కలకలం టెక్కలి రూరల్: బొరిగిపేటలో ఆదివారం అర్ధరాత్రి దాటాక కొందరు అనుమానిత వ్యక్తులు సంచరించడంతో గ్రామస్తులు వెంబడించారు. ఐదుగురిని గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నించగా ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. వెంటనే విద్యుత్ స్తంభానికి కట్టేసి ప్రశ్నించారు. వివరాలు చెప్పకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిర్వాసితుల హామీ నెరవేర్చేదెప్పుడు? కొత్తూరు: వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజీ అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని వంశధార నిర్వాసితుల సంఘం నాయకుడు, మెట్టూరు బిట్–2 సర్పంచ్ యర్లంకి ధర్మారావు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ చింతాడ సూర్యనారాయణ అన్నారు. మెట్టూరులో మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ 2024 ఎన్నికల సమయంలో నిర్వాసితలకు ప్రత్యేక ప్యాకేజి ఇచ్చి ఆదుకుంటామని ప్రస్తుత సీఎం చంద్రబాబు అప్పట్లో ప్రకటించారని, ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. 2019 ఎన్నికల సమయంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు అప్పటి ఎమ్మెల్యే రెడ్డి శాంతి కృషి మేరకు నిర్వాసితులకు అదనపు ప్యాకేజి కింద రూ. 217 కోట్లు నిధులు విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సాంకేతిక కారణాలతో అదనపు ప్యాకేజీలు అందుకోని 30 శాతం నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం అందివ్వాలన్న ఆలోచన లేకపోవడం అన్యాయమన్నారు. సమావేశంలో సర్పంచ్ పెదకోట సాదుబాబు, మురపాక శంకరరావు, పార్టీ నాయకులు నిమ్మగడ్డ కృష్ణారావు, యర్లంకి ధర్మారావు, సవర రమేష్, మఠం పూర్ణ, దుర్యోధన, మణి, రమణ తదితరుఉల పాల్గొన్నారు. -
అంతా అయోమయం!
గ్రంథాలయం.. శ్రీకాకుళం అర్బన్/టెక్కలి: విజ్ఞాన భాండాగారాలుగా భావించే గ్రంథాలయాలు వేలాది మంది నిరుద్యోగ యువతకు ఆసరాగా నిలుస్తుంటాయి. పోటీ పరీక్షల సన్నద్ధతకు తోడ్పాటునందిస్తుంటాయి. అటువంటి గ్రంథాలయాల నిర్వహణపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. ఇందులో పనిచేసే ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు సుమారు మూడు నెలలుగా జీతాలు, పింఛన్లు అందజేయడం లేదు. దీంతో వారంతా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై మండల, జిల్లా స్థాయిలో అధికారులకు, రాష్ట్ర స్థాయిలో ప్రజాప్రతినిధులకు గోడు విన్నవిస్తున్నా కనీస స్పందన కూడా రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్లో పూర్తిగ్రాంటు విడుదల చేయక.. 2025–26 సంవత్సరానికి గాను బడ్జెట్లో సిబ్బంది జీత భత్యాలకు, పెన్షలకు రూ.130కోట్లు కావలసి ఉండగా కేవలం రూ.40 కోట్లు మాత్రమే మంజూరు చేశారు. ఇక జిల్లాకు వచ్చేసరికి ఈ ఏడాది గ్రాంట్ రూపంలో వచ్చిన నిధులు రూ.2.22 కోట్లు మాత్రమే. ఏప్రిల్ 2025 నుంచి నవంబరు 2025 వరకూ 8 నెలల వరకు అదనపు బడ్జెట్ కోసం ప్రతిపాదనలు పంపితే తిరుగు టపాలో పంపించేశారు. గ్రంథాలయపు పన్ను నుంచి లైబ్రరీ సెస్ను వినియోగించుకోమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2025 డిసెంబరు నుంచి 2026 ఫిబ్రవరి వరకూ గ్రంథాలయ ఉద్యోగులకు జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లు నిలిచిపోయాయి. జిల్లాలో గ్రంథాలయ ఉద్యోగులకు, పెన్షనర్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు, పేపర్ బిల్లులకు నెలకు రూ.45లక్షలు అవసరం. జిల్లాలో 20 మంది శాశ్వత ఉద్యోగులు, 60 మంది పింఛనుదారులు, 13 మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది మొత్తంగా 90 మంది పనిచేస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాదికి రూ.5కోట్ల మేర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి గ్రంథాలయ పన్ను వసూలు కావలసి ఉంది. కాని రూ.2కోట్లు మాత్రమే వసూలైంది. గోడు వినేవారేరీ..? గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు, పెన్షనర్లకు మూడు నెలలుగా జీతాలు, పెన్షన్లు అందకపోవడంతో వారంతా దశల వారీగా అధికారులు, ప్రజాప్రతినిధులను కలిసిశారు. అయినా ఎటువంటి స్పందన కనిపించకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వారిలో తక్కువ వేతనాలు, పెన్షన్లు అందుకుంటున్న వారి పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. ఇదిలా ఉండగా ఉద్యోగులు, పెన్షనర్లంతా సెస్ నిధులపై ఆధారపడాలనే సంకేతాలు పాలకులు నుంచి వస్తున్నాయనే ఆందోళన మొదలైంది. ఘనంగా రట్టి వల్లభ నారాయణుని డోలోత్సవం మందస: భేతాళపురం పంచాయతీ రట్టి గ్రామంలో వల్లభ నారాయణుని డోలోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. పరిసర ప్రాంతాలతో పాటు ఒడిశా నుంచి భారీగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. గ్రహణం కారణంగా మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు ఆలయం మూసివేశారు. ఉత్సవం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడు నెలలుగా జీతాలు లేవు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. జేసీ, మున్సిపల్ అధికారులను కలిశాం. శ్రీకాకుళం మున్సిపాలిటీ కట్టాల్సిన సెస్ను త్వరలోనే కట్టించేలా ఏర్పాట్లు చేస్తామని జేసీ చెప్పారు. సెస్ పూర్తిస్థాయిలో వసూలు కావడం లేదు. గ్రంథాలయ ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు ఇచ్చే స్థితిలో లేదని, స్థానిక సంస్థల నుంచే వసూలు చేసుకోవాలని ప్రభుత్వం చెప్పింది. – వి.వి.జి.శంకరరావు, జిల్లా గ్రంథాలయసంస్థ కార్యదర్శి(ఎఫ్ఏసీ) గ్రంథాలయాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపడం మంచిది కాదు. మూడు నెలలుగా జీతాలు, పెన్షన్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు, పెన్షనర్లు ఆకలి చావులకు చేరుకోక మునుపే మాపై కనికరించాలి. గతంలో ఎప్పుడూ ఈ పరిస్థితి లేదు. అదనపు బడ్జెట్కు ప్రతిపాదనలు పంపితే, గ్రంథాలయ పన్ను నుంచి లైబ్రరీ సెస్ వినియోగించుకోమని ఆదేశాలు ఇస్తున్నారు. మా సమస్యలపై జిల్లా అధికారులతో పాటు ఆర్థిక శాఖ మంత్రి, పౌర గ్రంథాలయ శాఖ మంత్రికి విన్నవించినా ఫలితం కనిపించడం లేదు. – టి.వైకుంఠరావు, అధ్యక్షుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ పెన్షనర్ అసోసియేషన్ జిల్లా గ్రంథాలయ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తాం. ఇటీవలే రాష్ట్రస్థాయిలో రివ్యూ మీటింగ్ పెట్టాం. మంత్రి నారా లోకేష్కు సమస్య వివరించాం. ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్ నిధుల కోసం కృషి చేస్తన్నాం. మన జిల్లాలో కూడా ఇళ్లు, పంచాయతీల నుంచి రావాల్సిన నిధులు వచ్చేలా చూస్తాం. – పీరుకట్ల విఠల్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ -
దాతలే దిక్కు
గార : ఆనందంగా సాగిపోతున్న ఆ కుటుంబంపై విధి కన్నెర్ర చేసింది. ఆరు నెలల కిందట తల్లిని, వారం క్రితం తండ్రిని మృత్యువు కబళించింది. ఇద్దరు చిన్నారులను అనాథలుగా మార్చింది. గార మండలం నిజామాబాద్ గ్రామానికి చెందిన శిర్ల చిన్నారావు, చిన్నమ్మడుల దంపతులకు పవన్కుమార్, మౌనిక ఇద్దరు పిల్లలున్నారు. చిన్నమ్మడు ఆరునెలల క్రితం దీర్ఘకాల అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుంచి తండ్రి చిన్నారావే అన్నీ తానై పిల్లలను పెంచుతున్నాడు. ఇంతలో గత బుధవారం గుండెపోటుకు గురికావడంతో చిన్నారావు మృతి చెందాడు. అరునెలల వ్యవధిలోనే తల్లి, తండ్రి చనిపోవడంతో అన్నాచెల్లెళ్లు దిక్కుతోచని స్థితిల్లో పడ్డారు. పెదనాన్న, చిన్నాన్న సాయంతో అంత్యక్రియలు పూర్తి చేశారు. త్వరలోనే పదో తరగతి పరీక్షలు ప్రారంభమవ్వడం, మరోవైపు విషాదంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఇద్దరు పిల్లలున్నారు. పవన్కుమార్ అంపోలు బీసీ హాస్టల్లో పదో తరగతి, మౌనిక పాతపట్నం గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నారు. అనాథలైన ఇద్దరు విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలన్న లక్ష్యమున్నా ఆర్థికంగా అండగా నిలిచేవారు లేక ఇబ్బందులు పడుతున్నారు. సాయం చేయాలనుకునే దాతలు 8309396387 నంబరుకు సంప్రదించాలని చిన్నాన్న శిర్ల రాము విజ్ఞప్తి చేస్తున్నారు. -
అంతా అస్తవ్యస్తం
● జిల్లా కేంద్రంలో అదుపులోకి రాని డయేరియా ● అధికారులపై ఒత్తిడిశ్రీకాకుళం: శ్రీకాకుళం నగరపాలక సంస్థలో అంతా అస్తవ్యస్తంగా తయారైంది. అధికారులు హడావుడి చేస్తున్నా డయేరియా వ్యాధి మాత్రం అదుపులోకి రావడం లేదు. ప్రతిరోజు నగరంలోని ఏదో ఒక ప్రాంతంలో మూడు, నాలుగు కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అధికారులు ఇప్పుడు కాలువలు తీయించడం, ట్యాంకులు శుభ్రం చేయించడం వంటి చర్యలు చేపడుతున్నారు. డయేరియా ప్రబలడానికి కమిషనరే కారణమంటూ 14 రోజులు మాత్రమే బాధ్యతలు నిర్వహించిన కూర్మారావును సస్పెండ్ చేసిన అధికారులు అక్కడితో ఆగలేదు. ఆ తర్వాత వాటర్ వర్క్స్ డీఈని కూడా సస్పెండ్ చేశారు. కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేస్తున్న ఓ శానిటరీ ఇన్ స్పెక్టర్ను విధుల నుంచి తొలగించారు. దీనిపై పారిశుద్ధ్య కార్మికులు మండిపడుతూ సమ్మె దిశగా ఆలోచన చేస్తుండగా.. వారిని తొలగించాలని ఆదేశాలు ఇచ్చారు. దీన్ని కార్మికులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీపాన పాపారావు అనే శానిటరీ ఇన్స్పెక్టర్ ఆందోళనకు గురై ఆస్పత్రి పాలై ఆదివారం డిశ్చార్జి అయ్యారు. -
ఇండియన్ రైల్వే ఉన్నత హోదాలో పూడి హరిప్రసాద్
కవిటి: ఇండియన్ రైల్వేస్లో విశాఖపట్నం కేంద్రంగా ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన సౌత్ కోస్ట్ రైల్వేజోన్ ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ అడ్వైజర్గా కవిటి ఉద్దానంకు చెందిన పూడి హరిప్రసాద్ సోమవారం విశాఖపట్నంలోని రైల్వే జోనల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. కవిటి ఉద్దానం ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఇంతటి పెద్ద హోదా లభించడంపై స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ విశ్రాంత ఉద్యోగి పిరియా రాజారావు అల్లుడు డాక్టర్ పూడి హరిప్రసాద్(ఐఆర్ఏఎస్) 1994 బ్యాచ్ సివిల్ సర్వీసెస్లో ఉత్తీర్ణత పొందారు. మాజీ ఎమ్మెల్యే పిరియా సా యిరాజ్ బావ అయిన హరిప్రసాద్ తన ఉద్యోగ ప్రస్థానం ప్రారంభం నుంచే పలు ఉన్నత పదవులను అలంకరించారు. 8న వైఎస్సార్సీపీ కార్యాలయంలో మహిళా దినోత్సవం శ్రీకాకుళం (పీఎన్కాలనీ): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 8వ తేదీన జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. మహిళా దినోత్సవాన్ని ఎలా నిర్వహించాలన్న దానిపై సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో మహిళా నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. కృష్ణదాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా సాధికారత అంటే వైఎస్సార్, ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన మాత్రమే గుర్తుకొస్తుందన్నారు. మహిళా భద్రత కోసం ప్రవేశపెట్టిన దిశ యాప్, పోలీస్ స్టేషన్లను ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. మహిళలకు రక్షణ కరువు జిల్లా పరిషత్ చైర్మన్ పిరియా విజయ మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా మహిళలకు మొండిచేయి చూప డం చంద్రబాబుకు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఉలాల దివ్యభారతి, ఉపాధ్యక్షురాలు ఎంవీ పద్మావతి, చల్ల అలివేలు మంగ, సుగుణ, ధర్మాన రామ్మనోహర్ నాయుడు, అంధవరపు సూరిబాబు మాట్లాడుతూ.. కూటమి పాలనలో మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు నిత్యకృత్యంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో మహిళలు అదృశ్యమవుతున్నారని గగ్గోలు పెట్టిన పవన్ కల్యాణ్, ఇప్పుడు అధికారంలో ఉండి వారిని ఎందుకు ఇళ్లకు చేర్చడం లేదని నిలదీశారు. సమావేశంలో పి.సుగుణారెడ్డి, టి.కామేశ్వరి, గుంట జ్యోతి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: ఎచ్చెర్లలోని డాక్టర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో ఇటీవల చేపట్టిన అడ్డగోలు నియామకాలు వెంటనే రద్దు చేయాలని, వాటి స్థానంలో నోటిఫికేషన్ వేసి రోస్టరు, మెరిట్ ఆధారంగా అర్హులకు ఉద్యోగాలు కల్పించాలని, ఇలాంటి విధానాల వల్ల విద్యార్థులకు తీవ్రంగా నష్టం జరుగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు ముంజేటి కృష్ణమూర్తి, శ్రీకాకుళం నియోజకవర్గ ఎస్సీసెల్ నాయకులు యజ్జల గురుమూర్తి, జిల్లా గ్రీవెన్స్ విభాగం అధ్యక్షులు రౌతు శంకర్, ఎచ్చెర్ల ఎస్సీ సెల్ నాయకులు బి.శశిభూషణ్, టెక్కలి ఎంపీపీ ప్రతినిధి దళిత యువజన నాయకులు ఆట్ల రాహుల్ కుమార్లు సోమవారం పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. ఎచ్చెర్లలోని యూనివర్సిటీలో ఈ మధ్యకాలంలో సుమారు 40 మందిని వివిధ రకాల ఉద్యోగాల్లో వేశారని, ఈ నియామకాలు ఏ ప్రాతిపదికన జరిగాయో తెలీదని తెలిపారు. అక్రమ నియామకాలపై సమగ్ర విచారణ జరిపి, ఆ నియామకాలను రద్దు పరచి, నోటిఫికేషన్ వేసి, అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో నియామకాలను చేపట్టాలని వారు కోరారు. -
పట్టించుకోని ప్రభుత్వం
ఇచ్ఛాపురం రైతుల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు గాలి హామీలు ఇవ్వడం తప్ప పనులు చేయడం లేదు. – దక్కత నూకయ్యరెడ్డి, రైతు సంఘ నాయకుడు, ఇచ్ఛాపురం మండలం సీఎం హామీకే పత్తా లేదు 2024 నవంబర్ 1న ఈదుపురం గ్రామానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్ఛాపురం రైతాంగాన్ని ఆదుకున్నట్లు, ఆదుకోబోతున్నట్లు అబద్ధపు హామీ ఇచ్చి వెళ్లిపోయారు. అటు గ్రోయిన్స్ నిర్మాణాలు గానీ, ఇటు ఈదుపురం ఎత్తిపోతల పథకం మరమ్మతు చేయలేదు. – డాక్టర్ పూడి కిరణ్కుమార్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఇచ్ఛాపురం నియోజకవర్గం -
ఏబీసీడబ్ల్యూపై మరోసారి ఏసీబీ దాడి
శ్రీకాకుళం క్రైమ్: వెనుకబడిన తరగతుల సహాయ సంక్షేమ అధికారిగా (ఏబీసీడబ్ల్యూ) సోంపేటలో అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న గడ్డి బాలముకుందరావు అవినీతిపై ఏసీబీ అధికారులు సోమ వారం మరోమారు దాడులు చేశారు. జిల్లాకేంద్రంలోని డీసీసీబీ కాలనీలో ఉన్న ఆయన నివాసగృహంతో పాటు చాపురం–3, ఇలిసిపురం–చినబజారు వద్దనున్న బంధువుల ఇళ్లల్లోనూ సోదా లు జరిపారు. జిల్లా ఏసీబీ డీఎస్పీ కెంబూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన సోదాల్లో రాజాం, శ్రీకాకుళం, కొత్తవలస సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 4 స్థిరాస్తులు (శ్రీకాకుళం పట్టణంలో భవనం సహా), సుమారు 322 గ్రాముల బంగారు ఆభరణాలు, 1.75 కిలోల వెండి, నగదు, ఒక మారుతీ సెలెరియా కారు, రెండు ద్విచక్రవాహనాలు, విలువైన గృహోపకరణాలు స్వాధీనం చేసుకున్నారు. గత నెల 28న కంచిలి బీసీ వసతిగృహంలో ఆయనపై విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకుంటున్నారనే ఆరోపణల మీద దాడులు చేశారు. అప్పట్లో రూ.1,84,070 డబ్బు దొరకడంతో పాటు ఆయనపై క్రిమినల్ కేసు కూడా నమోదైంది. డీబీసీడబ్ల్యూపైనా ఆరోపణలు..? ఈ మొత్తం ఎపిసోడ్పై జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారిపైనా పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది మే నెలలో ఉద్యోగ విరమణ చేయనున్న ఏబీసీడబ్ల్యూ బాలగోవిందరావు జనవరి నుంచి ఏప్రిల్ వరకు సెలవు కోరు తూ దరఖాస్తు జిల్లా అధికారికి పెట్టుకున్నారు. దానికి ఆమె సెలవు మంజూరు, పింఛన్కు సంబంధించి ప్రపోజల్స్ పూర్తిగా చేసి ఇవ్వాలంటే సోంపేట డివిజన్ వసతిగృహాల విద్యార్థుల మెస్బిల్లులు మంజూరు చేసినందుకు రావాల్సిన మా మూళ్లు కలెక్ట్చేసి తీసుకురావాలని కోరినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఆక్రమణలు గుర్తింపు
సంతబొమ్మాళి: మండలంలోని నౌపడ పంచాయతీ పాలనాయుడుపేటలో ఎల్పీ నంబర్ 324, 325లో వేసిన లే–అవుట్లో ఆక్రమణలను రెవెన్యూ, పంచాయతీ అధికారులు గుర్తించారు. రియల్ దందా అనే శీర్షికతో ఆదివారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు సోమవారం మండల సర్వేయర్ సుభాష్ ఆధ్వర్యంలో లే అవుట్ను పరిశీలించి సర్వే చేశారు. గ్రామ కంఠంకు సంబంధించి 7 సెంట్లు, వంశధార కాలువకు సంబంధించి 2 సెంట్లు కలిపి మొత్తం 9 సెంట్లు ఆక్రమణలకు గురైనట్లు తేల్చారు. ఆక్రమణకు గురైన స్థలాన్ని మార్కింగ్ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఉప్పాడ ఉమాపతి, విలేజ్ సర్వేయర్ త్రిమూర్తులు ఉన్నారు. కాగా ఎల్పీ నంబర్ 324, 325లో భూములు కోర్టు పరిధిలో ఉన్నాయని, దీనిపై క్రయ, విక్రయాలు చేయకూడదని పీజీఆర్ఎస్లో కె.కుసుమారెడ్డి ఫిర్యాదు చేశారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
పొందూరు: త్వరలో రాష్ట్రస్థాయిలో జరగనున్న సైన్స్ సమగ్ర మహోత్సవ్–2026 పోటీలకు జిల్లా నుంచి పొందూరు కేజీబీవీలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని పాత్రుని ఐశ్వర్య రూపొందించిన ‘ఫార్మర్స్ ఫ్రెండ్లీ లైఫ్ సేవర్స్ స్టిక్’ ప్రాజెక్టు ఎంపికై ందని ప్రిన్సిపాల్ ఎస్.లలిత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో విద్యార్థినిని అధ్యాపక సిబ్బంది అభినందించారు. కౌలు రైతులను పట్టించుకోవడం లేదు సరుబుజ్జిలి: కౌలు రైతుల సంక్షేమం విషయంలో కూటమి ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి హరిబాబు ఆరోపించారు. మండల కేంద్రంలోని ఒక ప్రైవేటు కల్యాణ మండపంలో కౌలు రైతు సంఘం జిల్లా మహాసభలు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ యజమానులతో సంబంధం లేకుండా కౌలు కార్డులు అందించడం ఇంతవరకు ఆచరణలో పెట్టలేదన్నారు. జిల్లాలో 30 శాతం మంది కౌలు రైతులు ఉన్నా.. వారికోసం పట్టించుకున్నవారే కరువయ్యారని ఆవేదనవ వ్యక్తం చేశారు. కౌలు కార్డులకు రుణాలు, అన్నదాత సుఖీభవ అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవంగా నిర్వహించారు. సమావేశంలో కౌలు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోహన్రావు, జిల్లా అధ్యక్షుడు వెలమల రమణ, సీఐటీయూ మండల శాఖ కార్యదర్శి అదపాక రాజేష్, తదితరులు పాల్గొన్నారు. యువకుడిని కాపాడిన మైరెన్ పోలీసులు మందస: మండలంలోని రట్టి గ్రామంలో వల్లభనారాయణ స్వామి డోలోత్సవ యాత్ర జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా సోంపేట పట్టణంలోని గాంధీ నగర్కి చెందిన యువకుడు ఆర్థి వాసుదేవ్ తన స్నేహితులతో కలిసి సోమవారం సముద్ర స్నానాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. దీంతో అక్కడే విధుల్లో ఉన్న బారువ మైరెన్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై యువకుడిని రక్షించి, ప్రథమ చికిత్స అందించి.. 108 వాహనంలో హరిపురం పీహెచ్సీకి తరలించారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని బారువ మైరెన్ సీఐ రమేష్ తెలిపారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ కోదండరావు, హెడ్ కానిస్టేబుల్ ఉమామహేశ్వరరావు, కానిస్టేబుల్ సంఘమేశ్వరరావు, హరిప్రసాద్ రాజు, హోమ్ గార్డ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా జిల్లాస్థాయి బల ప్రదర్శన పోటీలు
సారవకోట: మండలంలోని వడ్డినవలస గ్రామంలో త్రినాథస్వామి ఆలయ 69వ వార్షికోత్సవంలో భాగంగా జిల్లాస్థాయి బలప్రదర్శన పోటీలు నిర్వహించారు. 80 కిలోల విసురుగుండు పోటీల్లో ఒప్పంగి గ్రామానికి చెందిన గేదెల సత్యనారాయణ ప్రథమ, గేదెల రమణ ద్వితీయ బహుమతి పొందారు. అలాగే 100 కిలోల తీత సంగిడి పోటీల్లో గేదెల సత్యనారాయణ ప్రథమ, ఆవల గోవిందరావు ద్వితీయ బహుమతులు పొందారు. పురుషుల వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో ఆవల గోవిందరావు, ముద్దాడ తరుణ్ కుమార్లు ఇద్దరు 160 కిలోలు ఎత్తడంతో ఇద్దరికీ ప్రథమ స్థానం, బిల్లాడ యోగేశ్వరరావును ద్వితీయ స్థానానికి ఎంపిక చేశారు. అలాగే బాలికల వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ఆడవరానికి చెందిన గుజ్జల వర్షిత 103 కిలోలు ఎత్తి ప్రథమ స్థానం, 95 కిలోలు ఎత్తి దూబ హేమశ్రీ ద్వితీయ స్థానంలో నిలిచారు. 203 కిలోల ఈడ్పు గుండు పోటీల్లో ఆవల గోవిందరావు ప్రథమ స్థానం సాధించారు. -
డోలోత్సవానికి వేళాయె..!
● మూడు రోజుల పాటు కూర్మనాథుని డోలోత్సవాలు ● నేటి రాత్రి కామ దహనోత్సవం ● అధిక సంఖ్యలో దర్శించుకోనున్న భక్తులుగార: ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీకూర్మం కూర్మనాథాలయంలో మంగళవారం నుంచి డోలోత్సవాలు ప్రారంభమవ్వనున్నాయి. తొలిరోజు రాత్రి 10 గంటల నుంచి కామ దహనోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. ఏటా పాల్గుణ మాస త్రయోదశి నాడు మాఘ నక్షత్రంలో జరిగే ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారు. తొలుత స్వామివారి ఉత్సవమూర్తులను గరుడ వాహనంపై ఉంచి మేళతాళాలతో తిరువీధి నిర్వహిస్తారు. అనంతరం గ్రామ సమీపంలోని కామ దహన మంటపం వద్ద కార్యక్రమాన్ని వేదపండితులు నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే మనసులోని చెడు ఆలోచనలు పటాపంచలవుతాయని, మంచి కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. కామ దహనోత్సవం ముగిసిన తర్వాత బుధవారం వేకువజాము నుంచి సమీప ఎస్.మత్స్యలేశం తీరంలో భక్తులు పవిత్ర స్నానాలచరిస్తారు. మరలా ఆలయంలోని శ్వేత పుష్కరిణిలో పవిత్ర స్నానాలాచరిస్తారు. గురువారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి మూర్తులను మేళతాళాలతో ఊరేగించి, గ్రామదేవత ఆలయం సమీపంలోని డోలో మంటపం వద్దకు తీసుకెళ్లి ఉత్తరాభిముఖంగా స్వామిని వేంజేసింపజేసి బుక్కాభర్గుండతో పూజలు చేస్తారు. ఈ సమయంలో అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. ఇదీ చరిత్ర.. విష్ణుమూర్తి దశావతారాల్లో రెండో అవతారం తాబేలు(కూర్మం) రూపం. ఇక్కడ మూలవిరాట్ను బ్రహ్మ ప్రతిష్టించారని, రాత్రి వేళల్లో దేవతల నిత్యార్చన, పగలు మానవ అర్చనలు జరుగుతుంటాయని చెబుతారు. ఆలయం ఎదురుగానున్న శ్వేత పుష్కరిణి విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో తవ్వగా.. అందులో గరుడ వాహనంపై ఉన్న లక్ష్మీదేవి విగ్రహం లభ్యమై ఆలయంలో కూర్మనాయకిగా కొలువుంది. ఈ ఆలయం కృతయుగంలో నిర్మితమవ్వగా.. 11వ శతాబ్ధంలో రామానుజాచార్యులు తన దిగ్విజయ యాత్ర సందర్భంగా దీన్ని వైష్ణవ క్షేత్రంగా మార్చారని, ఈ విజయానికి చిహ్నంగా పశ్చిమాన విజయ స్థూపాన్ని నిర్మించారని ప్రతీతి. ఈ క్షేత్రాన్ని ఎనిమిదో శతాబ్ధంలో ఆదిశంకరాచార్యులు సందర్శించి స్వామివారికి సాలగ్రామాన్ని సమర్పించారు. 11వ శతాబ్ధంలో రామానుజాచార్యుల సందర్శన, 13వ శతాబ్ధంలో మద్వాచార్యులు శ్రీనరహరితీర్థుల క్షేత్రాన్ని సందర్శించి సీతారామ లక్ష్మణ ఉత్సవమూర్తులను బహుకరించారు. 1512వ సంవత్సరంలో చైతన్య మహాప్రభువులు క్షేత్రాన్ని సందర్శించారు. ఈ దేవాలయం అపురూప శిల్పకళతో ఉంటుంది. 108 రాతి స్తంభాలు ఒకదానితో ఇంకొకటి పోలిక ఉండవు. 600 ఏళ్లనాటి ఆకుపసర చిత్రాలు చూపరులను ఆకట్టుకుంటాయి. పితృమోక్ష క్షేత్రం క్షేత్రం ఆవరణలోని శ్వేత పుష్కరిణిలో చనిపోయిన పెద్దల అస్తికలను కలిపితే ముక్తి లభిస్తుందని ఒక నమ్మకం. ఇందులో కలిపిన మానవ అస్తికలు కొద్ది రోజుల్లో శిలలుగా మారుతాయని భావిస్తారు. మానవుల కోర్కెలు దహించి, స్వామివారిని చేరే అద్భుత ఘట్టమైన కామదహనోత్సవంలో భక్తులు పాల్గొని, సముద్ర స్నానాలాచరించి, స్వామివారిని ఉత్తరాభిముఖంగా దర్శిస్తే ముక్తి లభిస్తుందని క్షేత్ర ప్రాశస్త్యం. మూడు రోజుల ఉత్సవంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలి. – సీహెచ్ సీతారామనృసింహాచార్యులు, ఆలయ ప్రధానార్చకులు, శ్రీకూర్మనాథాలయం మూడు రోజుల పాటు నిర్వహించే ఈ డోలోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం ఉచిత క్యూలైన్ను ఆలయం వెనుక వైపు నుంచి ఏర్పాటు చేశాం. ప్రత్యేక దర్శనం వద్ద అదనపు క్యూలైన్లు ఏర్పాటు జరిగింది. లడ్డూ, పులిహోర ప్రసాదాలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశాం. – టి.వాసుదేవరావు, ఆలయ ఈవో, శ్రీకూర్మనాథాలయం -
హోరెత్తిపోవాలి
● మార్కెట్లో రంగుల విక్రయాలు ● దేవాలయాల్లో డోలోత్సవాలు ● రంగులతో జాగ్రత్త తప్పనిసరి శ్రీకాకుళం కల్చరల్: హోలీ సమయం ఆసన్నమైంది. ఏటా ఫాల్గుణ పౌర్ణమి రోజున హోలీ పండగను జరుపుకుంటారు. అయితే ఈ నెల 3న హోలీ పడినా ఆ రోజు చంద్రగ్రహణం కావడంతో హోలీని మార్వాడీలు 4న జరుపుకుంటున్నారు. కొంతమంది మంగళవారమే చేసుకుంటారు. ఈ రంగుల పండుగ ఎంతటి ఆనందదాయకమో.. అంతటి అపాయం కూడా. రంగుల ఎంపిక నుంచి ర సాయనాల వరకు అన్నీ జాగ్రత్తగా చూసు కుని ఆ తర్వాతే సంబరం జరుపుకోవాలి. ● రక్తచందనం, ఎర్రమందారం, టమాటా, క్యారెట్లతో ఎర్రరంగు తయారు చేయవచ్చు. ● గోరింటాకుతో ఆకుపచ్చని రంగు తయారు చేయవచ్చు. ● పసుపు కొమ్ములను దంచి నీళ్లలో నానబెట్టి పసుపు రంగు చేసుకోవచ్చు. ● మోదుగపూలను నీటిలో నానబెట్టి రంగులను తయారు చేస్తారు. ● గోగుపూలతో బోలెడంత ఎర్రరంగు తయరు చేసుకోవచ్చు. దేవాలయాల్లో వసంతోత్సవం ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి సందర్భంగా పలు దేవాలయాల్లో వసంతోత్సవం పేరుతో స్వామికి డోలోత్సవాలను నిర్వహించనున్నారు. దేశంలోనే ఏకై క దేవాలయమైన అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయంలో డోలోత్సవాలు నిర్వహిస్తున్నారు. ముందు రోజు కామదహనోత్సవం నిర్వహిస్తారు. అనంతరం పడియ సందర్బంగా సముద్ర స్నానాలు చేస్తారు. ఈ సందర్భంగా ఉషా, ఛాయా, పద్మినీ సమేత శ్రీసూర్యనారాయణ స్వామిని రోడ్డు పక్కనున్న డోలో మండపంలో ఉత్తర ముఖంగా భక్తులకు దర్శనమిస్తారు. చంద్ర గ్రహణం కారణంగా 3వ తేదీన ఉదయం 10గంటలలోపు నిర్వహిస్తున్నారు. మార్వాడీల హోలీ.. జిల్లా కేంద్రంలో దాదాపు 150 మార్వాడీ కుటుంబాల వారు ఉన్నారు. వీరు రాజస్థాని మిలన్ మంచ్ ఆధ్వర్యంలో హోలీ నిర్వహిస్తారు. వారి సంప్రదాయం ప్రకారం ముందురోజు రాత్రి న్యూకాలనీలోని బాలాజీ అపార్టు మెంటు వద్ద హోలికా పూజలు చేస్తారు. అతిపెద్ద నెగడు వేసి దాని చుట్టు తిరుగుతూ పాటలు పాడతారు. ఉదయం ఎస్ఆర్ఎంటి కార్యాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ప్రత్యేకంగా టెంట్లు ఏర్పాటు చేసి, ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ హోలీ వేడుకలు జరుపుకుంటారు. హోలీలో సహజమైన రంగులు మాత్రమే వాడాలి. రసాయన రంగులు వాడి ప్రమాదం తెచ్చుకోవద్దు. ప్రమాదకరమైన రంగుల వల్ల కళ్లకు ఎలాంటి హాని జరగకుండా సన్ గ్లాసెస్ ధరించాలి. హోలీ రంగులలో ఉపయోగించే క్రోమియం, సీసం రసాయనాలు క్యాన్సర్ కారకాలు. హోలీ వేడుకల వల్ల గాలిలోకి రంగుల సూక్ష్మ కణాలు చేరుతాయి. దాని వల్ల మనకు తుమ్ములు, దగ్గు వచ్చి శ్వాశకోస సంబంధ ఇబ్బందులు వస్తాయి. రంగులు పూసుకునేటప్పుడు కళ్లు, పెదాలు మూసుకోవాలి. హోలీ ఆడాక గోరు వెచ్చని నీటితో శుభ్రపరచుకోవాలి. -
విద్యుత్ షాక్తో గుర్తు తెలియని యువకుడు మృతి
టెక్కలి రూరల్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఎదురుగా ఉన్న మహాత్మా జ్యోతీబాపూలే గురుకుల పాఠశాల ప్రహరీ వద్ద సోమవారం గుర్తు తెలియని యువకుడు విద్యుత్ షాక్తో మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రహరీ లోపలి భాగంలో గోడ కంటే ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్ వైర్ను గోడపైకి ఎక్కి పట్టుకోవడంతో విద్యుత్ షాక్కు గురైనట్లు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రాము ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని వివరాలు తెలియరాలేదని, సుమారు 38 ఏళ్లు ఉంటాయన్నారు. ఆచూకీ తెలిసిన వారు తమకు తెలియజేయాలని కోరారు. అనంతరం మృతదేహాన్ని టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. పశువులు పట్టివేత రణస్థలం: మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వైపు 5 బొలేరో వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 14 పశువులను జేఆర్పురం ఎస్ఐ ఎస్.చిరంజీవి పట్టుకొని కేసు నమోదు చేశారు. -
వసంతోత్సవం అంటారు
హిందూ సంప్రదాయంలో ఈ ఉత్సవాన్ని వసంతోత్సవంగా పిలుస్తారు. మూడు రోజుల పాటు జరుగుతుంది. మొదటి రోజు కామదహనోత్సవం, రెండో రోజు పడియా సందర్భంగా సముద్ర స్నానాలు చేస్తారు. మూడో రోజున స్వామివారిని తోటలోని డోలో మండపంలో ఉంచి ఊయలలో ఊపుతూ డోలోత్సవం నిర్వహిస్తాం. – ఇప్పిలి శంకరశర్మ, ప్రధాన అర్చకులు, అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం కళ్లకు, చర్మానికి ఎలాంటి ప్రమాదం రాకుండా సహజ రంగులు వాడాలి. రసాయన రంగుల వల్ల కళ్లలో రంగు పడితే ఎరుపుగా అయి కళ్లలో నీరుకారుతుంది. అలాగే చర్మ వ్యాధులు వస్తాయి. జాగ్రత్తలు పాటించాలి. – ఎంఆర్కే దాస్, ఆఫ్తాలమిక్ ఆఫీసర్ హోలీలో కొంత మంది రసాయన రంగులు వినియోగిస్తుంటారు. ఇది చర్మానికి ఎంతో ప్రమాదకరం. ముఖ్యంగా చిన్న పిల్లల చర్మంపై ఎంతో ప్రభావం చూపిస్తాయి. చర్మం అలర్జీలు ఉన్నవారు వీలైనంత మేరకు రంగులు పడకుండా దూరంగా ఉండాలి. – ఆర్.జ్యోతి, చర్మవ్యాధి నిపుణులు, జిల్లా ఆస్పత్రి, టెక్కలి ● -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
● ఇద్దరికి గాయాలు సారవకోట: మండలంలో అలుదు గ్రామ సమీపంలోని జాతీయ రహదారి 326–ఏ పై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎచ్చెర్ల మండలం కొయ్యాం గ్రామానికి చెందిన మజ్జి నరేంద్ర (24) మృతి చెందగా, మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఎచ్చెర్ల మండలంలోని కొయ్యాం నుంచి పెళ్లి కబుర్లు చెప్పేందుకు సారవకోట వైపు ద్విచక్ర వాహనంపై మజ్జి నరేంద్ర, మజ్జి అప్పలనాయుడు వెళ్తున్నారు. అదే సమయంలో పాతపట్నం మండలంలోని సీది నుంచి ఆటోలో గేదెల వరలక్ష్మి, ఆటో డ్రైవర్ కృష్ణ సారవకోట మండలంలోని వడ్డినవలస వెళ్తున్నారు. అలుదు గ్రామం రెల్లివీధి సమీపంలో జాతీయ రహదారిపై రెండు వాహనాలు ఎదురెదురుగా వచ్చి బలంగా ఢీకొనడంతో మజ్జి నరేంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే మజ్జి అప్పలనాయుడుతో పాటు ఆటోలో ఉన్న వరలక్ష్మికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో నరేంద్ర, అప్పలనాయుడు, వరలక్ష్మిలను 108 వాహనంలో నరసన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా.. నరేంద్ర చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
అర్జీలు త్వరితగతిన పరిష్కరించాలి
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ● పీజీఆర్ఎస్కు 99 వినతులు శ్రీకాకుళం పాతబస్టాండ్: అర్జీదారుల నుంచి వచ్చే వినతులను త్వరిగతిన పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)ను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్జీలకు క్షేత్రస్థాయిలో అధికారులు అత్యంత ప్రాధాన్యమివ్వాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో జాప్యం ఉండకూడదని, ప్రతి అర్జీదారుడికి సంతృప్తికరమైన సమాధానం అందాలని స్పష్టం చేశారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 99 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ వినతుల్లో అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 22 అర్జీలు రాగా, పంచాయతీ రాజ్ శాఖకు 19, సెర్ప్ విభాగంలో 13, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలో 10 వినతులు అందాయి. అలాగే జలవనరుల శాఖ, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్ శాఖలకు సంబంధించి చెరో 4 అర్జీలు రాగా, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగంలో 3 ఫిర్యాదులు అందాయి. ఆర్టీసీ, సర్వే సెటిల్మెంట్స్, బీసీ సంక్షేమం, పశుసంవర్ధక, వ్యవసాయ శాఖలపై రెండేసి చొప్పున వినతులు వచ్చాయి. వీటితో పాటు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం, ఎన్టీఆర్ వైద్య సేవ, కాలుష్య నియంత్రణ మండలి సహా మొత్తం 22 విభాగాలకు చెందిన సమస్యలను ప్రజలు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రజా సమస్యలపై అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. అలాగే గ్రీవెన్స్ హాల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక రెవెన్యూ క్లినిక్ వద్ద జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. మండలాల వారీగా ఏర్పాటు చేసిన డెస్క్ల వద్దకు వెళ్లి, అక్కడ ఉన్న దరఖాస్తుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితుల అర్జీలను స్వయంగా పరిశీలించారు. అక్కడికక్కడే రెవెన్యూ సిబ్బందితో కలిసి చర్చించి సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. భయానక పరిస్థితులు నెలకొన్నాయి శ్రీకాకుళం నుంచి ఎచ్చెర్ల మండలంలోని పొన్నాడకు వెళ్లే రోడ్డులో వంతెన వద్ద ఇటీవల భయానక పరిస్థితులు నెలకొన్నాయని కొంగరాం, ముద్దాడ, వెంకన్నగారిపేట తదితర గ్రామాలకు చెందిన ప్రజలు సోమవారం పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. పొన్నాడ తర్వాత సుమారుగా పది గ్రామాలు ఉన్నాయని, వారంతా పగలు, రాత్రి ఆ మార్గం గుండానే ప్రయాణాలు చేస్తుంటారని తెలిపారు. ఇటీవల ఆ బిడ్జి సమీపంలో హత్యలు, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందువలన అధికారులు స్పందించి ప్రజల భద్రతపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
కూటమిది ఈవెంట్ల ప్రభుత్వం
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): కూటమి ప్రభుత్వంలో రైతు సదస్సులు, విద్యా సదస్సులు నిర్వహించరు గానీ ఈవెంట్లకు మాత్రం రూ.కోట్లు ఖర్చు చేస్తారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్) దుంపల లక్ష్మణరావు సోమవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. విశాఖపట్నంలో జరిగిన అంతర్జాతీయ యోగా ఈవెంట్ కోసం రూ.300 కోట్లు ఖర్చు చేయడం అవసరమా అని ప్రశ్నించారు. డీఎస్సీ–2024కి ఎంపికై న అభ్యర్థులకు నియామక పత్రాలు అందించే క్రమంలో విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించి సుమారు రూ.20 కోట్లు ఖర్చు చేశారని మండిపడ్డారు. ప్రతీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరిగే ఈవెంట్లకు అయ్యే ఖర్చు సగటున రూ.20 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు ఉంటోందన్నారు. ఇలా అనేక విధాలుగా ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిధులను వ్యవసాయ రంగానికి లేదా విద్యా రంగానికి లేదా మెడికల్ కళాశాలల అభివృద్ధి కోసం ఖర్చుచేస్తే అన్నివర్గాలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఇలానే పాలన సాగిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. -
ఏబీసీడబ్ల్యూ పై ఏసీబీ దాడులు
శ్రీకాకుళం క్రైమ్: వెనుకబడిన తరగతుల సహాయ సంక్షేమ అధికారిగా (ఏబీసీడబ్ల్యూవో) శ్రీకాకుళం జిల్లా సోంపేటలో అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న గడ్డి బాలముకుందరావు అవినీతిపై ఏసీబీ అధికారులు సోమవారం మరోమారు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న కారణంతోనే జిల్లా కేంద్రంలోని డీసీసీబీ కాలనీలో ఉన్న ఆయన నివాస గృహంతో పాటు చాపురం–3, ఇలిసిపురం–చినబజారు వద్దనున్న బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు జరిపారు. ఈ దాడులను జిల్లా ఏసీబీ డీఎస్పీ కెంబూరి సత్యనారాయణ తమ సిబ్బందితో ఉ.10 నుంచి రాత్రి 7.30 వరకు జరిపారు. సోదాల్లో సుమారు రూ.1.10 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించి సంబంధిత పత్రాలను, విలువైన వస్తువులు, నగదును స్వా«దీనం చేసుకున్నారు. వివరాలివీ.. ముందుగా కంచిలిలో పట్టుబడి.. నరసన్నపేట ఏబీసీడబ్ల్యూగా ఉన్న బాలముకుందరావు సోంపేట ఏబీసీడబ్ల్యూ పాయింట్లో అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. బాలముకుందరావు తన పరిధిలోని వసతిగృహ అధికారుల (వార్డెన్లు) నుంచి మెస్ బిల్లులు మంజూరు చేయించేందుకు ఒక్కో విద్యార్థి నుంచి రూ.15 చొప్పున తీసుకుంటున్నట్లు సమాచారం రావడంతో గత నెల 28న కంచిలి బీసీ వసతిగృహంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు జరిపారు.అందులో బాలముకుందరావుతో పాటు కార్యాలయ సహాయకుడు గుడ్ల రామకృష్ణల వద్ద లెక్కచూపని రూ.1,84,070 నగదును స్వా«దీనం చేసుకుని క్రిమినల్ కేసు నమోదుచేశారు. అయితే, అదే రోజు అన్ అకౌంట్బుల్, అనధికారికంగా మరికొంత సొమ్ము (రూ.1.50 లక్షలు) బాలముకుందరావు వద్ద ఉండటాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. దీంతో ఆర్సీఓ (రిజిస్టర్డ్ కేస్ అదర్స్) కింద మారుస్తూ డీజీపీ అనుమతినివ్వడం, ఎస్సెట్స్ (ఆదాయానికి మించి ఆస్తులు)పై దృష్టిపెట్టాలని చెప్పడంతో సోమవారం ఈ దాడులు జరిపారు. సోదాల్లో గుర్తించినవి.. ∙రాజాం, శ్రీకాకుళం, కొత్తవలస సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో నాలుగు స్థిరాస్తులు (శ్రీకాకుళం పట్టణంలో భవనం సహా). ∙సుమారు 322 గ్రాముల బంగారు ఆభరణాలు, 1.75 కిలోల వెండి, నగదు, ఒక మారుతీ సెలెరియా కారు, రెండు ద్విచక్రవాహనాలు, విలువైన గృహోపకరణాలు. డీబీసీడబ్ల్యూపైనా ఆరోపణలు..? మరోవైపు.. ఈ మొత్తం ఎపిసోడ్పై జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారిపైనా ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ ఏసీబీ అధికారులు మౌనంగా ఉండడం అనుమానాలకు తావిస్తోంది. ఈ ఏడాది మేలో ఉద్యోగ విరమణ చేయనున్న ఏబీసీడబ్ల్యూవో బాలగోవిందరావు జనవరి నుంచి ఏప్రిల్ వరకు సెలవు కోరుతూ జిల్లా అధికారికి దరఖాస్తు పెట్టుకున్నారు. పింఛన్కు సంబంధించి ప్రతిపాదనలను పూర్తిగాచేసి ఇవ్వాలంటే సోంపేట డివిజన్లోని మెస్ బిల్లులు మంజూరు చేసినందుకు బాలముకుందరావు మామూళ్లు వసూలుచేయాలంటూ ఆమె ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి.. జిల్లా వసతి గృహాలన్నింటిలో విద్యార్థుల మెస్ బిల్లులు మంజూరు చేసేందుకు డీబీసీడబ్ల్యూకి రూ.15లు, ఏబీసీడబ్ల్యూవోకి రూ.20లు, కార్యాలయ ఖర్చులకు వసతిగృహం నుంచి రూ.1,000లు ఇవ్వాలన్నది బహిరంగ రహస్యం. -
సైబర్ సెక్యూరిటీ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం
పాతపట్నం: పాతపట్నం ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో స్కిల్ హబ్ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి కౌసిక్ వికాస్ యోజన 4.0 ద్వారా సైబర్ సెక్యూరిటీ కోర్సుకు ఉచితంగా శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కె.చక్రపతి ఆదివారం తెలిపారు. సైబర్ సెక్యూరిటీ కోర్సు మూడు నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 7వ తేదీలోగా సర్టిఫికెట్తో పాటు ఆధార్ కార్డు, ధ్రువీకరణ పత్రాలతో పాతపట్నం డిగ్రీ కళాశాలలో ఉన్న స్కిల్ హబ్ సెంటర్ను సంప్రదించాలని, 9553292734 నంబర్ను సంప్రదించాలని ఆయన కోరారు. జిల్లా స్థాయి ఇంటర్ క్లబ్ స్కేటింగ్ పోటీలు పలాస: పలాసలో జిల్లా స్థాయి ఇంటర్ క్లబ్ స్కేటింగ్ పోటీలు ఆదివారం జరిగాయి. ఈ పోటీలను మున్సిపల్ కమిషనర్ ఇ.శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ స్కేటింగ్ వల్ల ఏకాగ్రత శక్తి పెరుగుతుందన్నారు. ఈ క్రీడాకారులు జాతీ య స్థాయిలో మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో స్కేటింగ్ క్లబ్ నిర్వాహకులు టి.వి ప్రవీణ్, షన్మఖ,కోచ్లు పాల్గొన్నారు. రేపు ఆలయాల మూసివేత అరసవల్లి: కేతుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయా న్ని ఈ నెల 3న మూసివేస్తున్నట్లుగా ఆలయ ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ సంయుక్తంగా ప్రకటించారు. మంగళవారం మధ్యాహ్నం 3.20 గంటల నుంచి సాయంత్రం 6.47 గంటల వరకు చంద్రగ్రహణం కొనసాగుతున్న నేపథ్యంలో ఆదిత్యుని ఆలయంలో మంగళవారం ఉద యం నిత్యార్చన, బాలభోగం అనంతరం ఉద యం 9.30 గంటల నుంచి ఆలయ తలుపులు మూసివేయనున్నట్లుగా వివరించారు. గ్రహణానంతరం సంప్రోక్షణ, శుద్ధి తదితర ప్రక్రి యల అనంతరం అంటే బుధవారం ఉదయం 6.30 గంటల నుంచి తిరిగి సర్వదర్శనాలు మొదలవుతాయని వారు తెలియజేశారు. భక్తులు గ్రహణ నియమాలు పాటించి, విడుపు అనంతరం ఆదిత్యుడిని దర్శించుకోవాలని శంకరశర్మ సూచించారు. 3న శ్రీకూర్మనాథాలయం మూసివేత గార: మూడో తేదీన పౌర్ణమిలో చంద్రగ్రహణం కారణంగా ప్రముఖ వైష్ణవ క్షేత్రం శ్రీకూర్మనాథాలయం ఉదయం 11 గంటల నుంచి మూసివేస్తున్నామని ఆలయ ఈఓ టి.వాసుదేవరావు అన్నారు. మంగళవారం ఉదయం దర్శనాలు అనంతరం మూసివేసి సాయంత్రం 7. 30 గంటల నుంచి సంప్రోక్షణ జరుగుతుందన్నారు. రెండు గంటల తర్వాత భక్తులకు దర్శనాలు ఉంటాయని తెలిపారు. శ్రీముఖలింగంలోనూ ఉదయం 9 గంటలకు ఆలయాన్ని మూసివేయనున్నట్లు అర్చకులు తెలిపారు. ప్రశాంతంగా ప్రవేశ పరీక్షలు శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్వంలో 5, ఇంటర్మీడియెట్ తరగతుల్లో చేరేందుకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 2026–2027 విద్యా సంవత్సరానికి 5వ తరగతి, ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం జిల్లా నందు గల 9 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు. 5వ తరగతి ప్రవేశ పరీక్షకు (09 పరీక్షా కేంద్రాలు) 887 మంది దరఖాస్తు చేసుకోగా 756 మంది హాజర య్యారు. 131 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్మీడియెట్ ప్రవేశ పరీక్షకు జనరల్ కి (09 పరీక్షా కేంద్రాలు) 1201 మంది దరఖాస్తు చేసుకోగా 1093 మంది హాజరుకాగా, 108 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్మీడియెట్ (ఐఐటీ, నీట్) ప్రవేశ పరీక్షకు (09 పరీక్షా కేంద్రాలు) 768 మంది దరఖాస్తు చేసుకోగా 689 మంది హాజ రు కాగా, 79 మంది గైర్హాజరయ్యారు. జిల్లా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ జిల్లా సమన్వయాధికారి వై.యశోద లక్ష్మి పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించారు. -
పారిశుద్ధ్య పనుల పరిశీలన
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ తీరును స్వయంగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక మేధర వీధి, మార్కెట్ ఏరియా, ఇప్పిలి వీధి, చిన్న బజార్, పరిసర ప్రాంతాల్లో ఆదివారం విస్త్రృతంగా పర్యటించారు. డయేరియాను పూర్తి గా అరికట్టేందుకు 20 ప్రత్యేక టీమ్స్తో పర్యవేక్షణ జరుగుతుందని, అందుకు ప్రజలు సహకరించాలని కోరారు. కొంతమంది వ్యాపారులు చికెన్ షాపులను తెరవడంపై కలెక్టర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సచివాలయ సిబ్బందికి, ప్రజలకి మధ్య సమన్వయం ఉండాలనీ, వ్యర్థాలను సేకరించేందుకు వచ్చిన పారిశుద్ధ్య కార్మికులకు సహకరించా లని వర్తకులను, ప్రజలను కోరారు. ఆవులు తిరిగే ప్రదేశంలో పేడ కనిపించడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో డయేరియా బాధితుల సంఖ్య నిలకడగా ఉందని, భయపడాల్సిన పని లేదని కలెక్టర్ తెలిపారు. పర్యటనలో కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, మున్సిపల్ శాఖ అధికారులు, సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
కబ్జా కోరల్లో పగడాల చెరువు
వజ్రపుకొత్తూరు మండలం కొండ వూరు బౌండరీ పరిధిలోకి వచ్చే పగడాల చెరువు విస్తీర్ణం 29.86 ఎకరాలు ఉంటే అందులో 20ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. చెరువు, గుట్టలతో పాటు గర్భమంతా ఆక్రమించేశారు. దాదాపు 200 మంది రైతులకు చెందిన 150 ఎకరాల వరకు ఆయకట్టుగా ఉండే పగడాల చెరువును కళ్ల ముందే రోజురోజుకి కబ్జా చేసేస్తున్నారు. చెరువు సరిహద్దుకు ఆనుకుని జిరాయితీ పొ లాలు ఉండటంతో వాటి ముసుగులో గట్లపై మొక్కలు వేస్తూ అలా చెరువు గర్భంలో చొరబడి ఆక్రమించేశారు. చెరువుకు ఉత్తర, పడమర, దక్షిణ వైపు గట్లు ఏకంగా కనుమరుగయ్యాయి. ఉపాధి హామీ పథకం కింద గట్లు వేసేందుకు ప్రయత్నిస్తుంటే ఆక్రమణదారులు అడ్డుకునేంతవరకు వెళ్లిపోయారు. -
ఇక నివేదన సక్రమంగా..
● ‘సాక్షి’ కథనానికి స్పందించిన అధికారులు అరసవల్లి: ‘సాక్షి’ కథనానికి ఆలయ అధికారులు స్పందించారు. స్వామికి ప్రసాదాల నివేదన సక్రమమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సుమారు రెండున్నరేళ్ల నుంచి బ్రాహ్మణ వంట పంతుల నియామకాన్ని చేపట్టకుండా ప్రసాదాల నివేదన లేకుండానే జరుగుతున్న అపచారానికి ఎట్టకేలకు చెక్ పడింది. లడ్డూ, పులిహోరలను తయారు చేసి ఆదిత్యుని మూలవిరాట్టుకు తొలిగా నివేదించకుండానే... ప్రసాదాల పేరిట విక్రయిస్తూ భక్తుల మ నోభావాలతో ఆటలాడుకున్న వైనాన్ని ‘ప్రసాదమా...అపచారమా...’ పేరిట ‘సాక్షి’లో గత నెల 26న గురువారం కథనం ప్రచురితమైంది. దీనిపై హింధూ ధర్మ పరిరక్షణ సమితి, అర్చక, పురోహిత సంఘాల ప్రతినిధులు తీవ్రంగా స్పందించి దేవదాయ శాఖ ఉన్నతాధికారులకు ఈ కథనం క్లిప్పింగ్స్ను వాట్పాప్ ద్వారా పంపించారు. దీంతో ఉన్న తాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్ ఆలయంలో బ్రాహ్మణ వంట పంతులు తాతావారి సోమేశ్వర శర్మను నియమించా రు. ఈ మేరకు ఆయన ఆలయ నిబంధనల మేరకు ఆచారాలకు తగ్గట్టుగా ఆదివారం ఉదయం నుంచి వండిన పులిహోర, లడ్డూలను ఉదయం 6 గంటలకే గర్భాలయంలోని ఆదిత్యునికి నివేదించి, అనంతరం ప్రసాదాలుగా భక్తులకు విక్రయాలు ప్రారంభించారు. అలాగే భక్తులకు దర్శనానంతరం ఇస్తున్న నిత్యాన్నప్రసాదాలను కూడా ఆయనే స్వయంగా తయారు చేసి వాటిని కూడా స్వామికి నివేదించారు. -
పరిస్థితి దారుణం
మొక్కజొన్న రైతు పరిస్థితి దారుణం. కనీస మద్దతు ధర దక్కలేదు. గత ప్రభుత్వం అయితే రూ.2400 మద్దతు ధర ప్రకటించి రైతుల నుంచి కొనుగోలు చేసింది. కానీ టీడీపీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏ ర్పాటు చేయలేదు. అందుకే దళారులకు రూ.1700కు విక్రయించుకుంటున్న పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో బాగుండేది. ఇప్పుడే తీరని అన్యాయం జరుగుతోంది. మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలి. – కొవగాపు నవీన్, రైతు, తాయిమాంబాపురం శ్రమకు తగిన ఫలితం లేదు.. తక్కువ రోజుల్లో పంట అందుబాటులోకి వస్తుందని భావించి మొక్కజొన్న వేసుకున్నాం. ఆరుగాలం కష్టపడి పంటను సాగుచేస్తే గిట్టుబా టు లేదు. మద్దతు ధర అయితే ప్రకటిస్తున్నారు. కానీ కొనుగోలు చేసిన వారు కరువవుతున్నారు. ఇప్పటికై నా మార్కెటింగ్, రవాణా కల్పించాలి. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలి. – ఎల్.శ్రీనివాసరావు, రైతు, కిట్టాలపాడు -
మందుగుండు సామగ్రి స్వాధీనం
శ్రీకాకుళం రూరల్: మండల పరిధి సింగుపురం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పక్కన గల ఓ భవనంలో క్వారీ రాళ్లకు వాడే మందుగుండు సామగ్రిని శ్రీకాకుళం రూరల్ పోలీసులు ఆదివారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు రూరల్ ఎస్ఐ రాము, సిబ్బందితో కలిసి మాకుమ్మడిగా దాడులు చేసి వంజరాపు రామారావు అనే వ్యక్తి ఇంటిలో నిల్వ ఉంచిన మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఈ సామగ్రిని క్వారీ రాళ్లు పేల్చేందుకు ఉపయోగిస్తున్నట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వివరించారు. స్వాధీనం చేసుకున్న సామగ్రిలో లిక్విడ్ స్టిక్స్ 5 బాక్సులు, ఆర్డినరీ డిటో నేటర్స్ 15 బాక్సులు, ఫ్యూజ్వైర్ 5 కట్టలు, కొండ ఒత్తులు 50 మీటర్లు ఉన్నాయని ఎస్ఐ తెలిపారు. ఈ సామగ్రిని లైసెన్స్డ్ షాపులకు తరలిస్తున్నట్లు తెలిపారు. -
ఖాళీ స్థలం.. కనిపిస్తే వదలం..!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : పలాస నియోజకవర్గంలో ఆక్రమణలకు అడ్డు అదుపూ లేకుండా పోయింది. భూదందాతో కొందరు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ భూములు, కొండలు, గుట్టలు, వాగులు, కాలువలు, గోర్జ, చెరు వులని చూడకుండా కబ్జా చేసేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తులు ఇష్టారీతిన ఆక్రమించేసి, చదును చేసి అనుభవంలోకి తెచ్చుకుంటున్నారు. నియోజకవర్గ కేంద్రమైన పలాస, కాశీబుగ్గలోనే కాకుండా మందస, వజ్రపుకొత్తూరు మండలాల్లో కూడా ప్రభుత్వ భూములను వదలడం లేదు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పాగా వేసేస్తున్నారు. అధికారులు సైతం పట్టించుకోవడం లేదు. కళ్ల ముందే చెరువులు, కాలువలు, గెడ్డలు కబ్జాకు గురవుతుంటే చోద్యం చూస్తున్నారు. అధికారులు ఇలాగే కళ్లు మూసుకుంటే కొండ వూరు పంచాయతీ పరిధిలోకి వచ్చే పగడాల చెరువు, నారాయణపురం నుంచి పెద్ద బొడ్డపాడు వరకు ఉన్న ఎర్రగెడ్డ పూర్తిగా కనుమరుగైనా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇప్పటికే మూడింతల చెరువు గర్భం కబ్జాకు గురైంది. మిగతాది ఆక్రమించే పనిలో అక్రమార్కులు పడ్డారు. ఖాళీగా కనిపిస్తే చాలు ఆక్రమణ పలాస నియోజకవర్గంలో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అక్కడ భూముల ధరలు బంగారం ధరల్లా రోజురోజుకి పెరిగిపోతున్నా యి. దీంతో అక్రమార్కుల కన్ను ఖాళీ భూములపై పడింది. ఎక్కడ ఖాళీ కనిపిస్తే అక్కడ కబ్జా చేసేస్తున్నారు. ఇటీవల కాలంలో జిల్లాలో అత్యధికంగా ప్రభుత్వ భూములు కబ్జాకు గురైన వాటిలో పలాస నియోజకవర్గం అగ్రగామిగా నిలిచింది. రోజురోజుకీ ఆక్రమణలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ భూములను కబ్జా కోరులు కబళించేస్తున్నారు. సా గుకు, వ్యాపారాలకు ఆ ఆక్రమణలను వేదికగా చేసుకుంటున్నారు. ఇక్కడ వందలాది ఎకరాలు అక్రమ లావాదేవీల ద్వారా చేతులు మారిపోయా యి. దాదాపు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఆక్రమణలే కనిపిస్తున్నాయి. ఆ మూడు గ్రామాల వారే.. సర్వే నంబర్ 364పరిధిలో గల పగడాల చెరువు 29.86ఎకరాల విస్తీర్ణంలో ఇప్పటికే 20ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. తొలుత గట్టు తొలగించేసి మొక్కలు వేసేశారు. ఆ తర్వాత చెరువు గర్భంలోకి ప్రవేశించారు. తుంభవానిపేట, కొల్లిపాడు, కొండ వూరుకు చెందిన 17మంది పెద్దలు ఆక్రమించేశారు. ఆక్రమిత భూముల్లో కొబ్బరి మొక్కలు వేసుకుని సాగు చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఆక్రమించిన చెరువు భూములను విక్రయాలకు కూడా పెట్టేశారు. ఇప్పటికే కొందరి చేతులు మారిపోయాయి. సెంటు రూ. 25వేల నుంచి రూ. 30వేల వరకు ఉంది. ఈ లెక్కన ఎకరా రూ. 30లక్షల వరకు ధర పలుకుతోంది. ఎర్రగెడ్డను సైతం వదలని అక్రమార్కులు వజ్రపుకొత్తూరు మండలం నారాయణపురం నుంచి గర్తంవానిపేట మీదుగా పెద్దబొడ్డపాడు వరకు 5కిలో మీటర్ల మేర ఉన్న ఎర్రగెడ్డను ఆక్రమణదారులు వదల్లేదు. ఐదు గ్రామాలకు చెందిన 40మంది వరకు గెడ్డను ఆక్రమించారు. ఎర్రగెడ్డపైన వంశధార 5ఎల్ఆర్ కాలువ ఉండగా, దిగువ వైపు ఎర్రగెడ్డ ఉంటుంది. ఈ గెడ్డనే కాదు ఆనుకుని ఉన్న అటవీ భూములను, కొండ పోరంబోకు భూములను కూడా ఆక్రమించారు. పలాస నియోజకవర్గంలో ఆక్రమణలకు గురవుతున్న ప్రభుత్వ భూములు చెరువులు, గెడ్డలు, కాలువ, కొండలు, వాగుల కబ్జా దర్జాగా చదును చేసి అనుభవంలోకి తెచ్చుకుంటున్న అక్రమార్కులు ఆక్రమణలతో కనుమరుగవుతున్న వజ్రపుకొత్తూరు మండలంలోని పగడాల చెరువు, ఎర్రగెడ్డ -
నిలిచిపోయిన బియ్యం లారీలు
పలాస: పలాస మండలం లొద్దబద్ర గ్రామం వేర్ హౌస్ గోడౌన్ వద్ద గత మూడు రోజులుగా బియ్యం లారీలు నిలిచిపోయాయి. అన్లోడింగ్ కోసం లారీ డ్రైవర్లు అక్కడే నిద్రాహారాలు మాని కాచుకుని ఉన్నారు. కొంతమంది లారీలను అక్క డే విడిచిపెట్టి వెళ్లిపోతున్నారు. వారం రోజుల కిందట జిల్లాలోని వివిధ మిల్లర్లకు శ్రీకాకుళం ఎఫ్సీఐ డీఎం నుంచి వారికి ఆర్డరు కాపీలు అందాయి. పలాస మండలం లొద్దబద్ర తీసుకొని వెళ్లమని తెలియజేశారు. దీంతో నరసన్నపేట, టె క్కలి, నందిగాం, పలాస, సోంపేట, కోటబొ మ్మాళి తదితర ప్రాంతాల నుంచి బియ్యం లారీ లు గత నెల 26 నుంచి క్యూకట్టాయి. మొదటి రోజు కొన్ని లారీలు ఆన్లోడింగ్ చేశారు. ఆ తర్వాత ఏమైందో ఏమో అక్కడ ఉన్న లారీల బియ్యాన్ని దించవద్దని అక్కడ సిబ్బందికి ఆదేశాలు రావడంతో అన్ లోడింగ్ను ఆపేశారు. దీంతో అప్పటి నుంచి మూడు రోజుల నుంచి అక్కడే లారీలతో బియ్యం ఉంటున్నాయి. ప్రస్తుతం ఆదివారానికి 35 లారీల బియ్యం ఉన్నాయి. బయట రోడ్డు మీద కూడా మరో పది వరకు ఉన్నాయి. తప్పని పరిస్థితిలో ఆ బియ్యం లారీలు వెనక్కి వెళ్లలేక, అక్కడ దించలేక డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. లారీలు అక్కడ నిలిచిపోవడంతో రోజుకు రూ.10వేలు నష్టం అవుతోందని మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేశారు. రాజమండ్రికి చెందిన లారీ డ్రైవరు యాకూబ్ మాట్లాడుతూ మూడు రోజులుగా ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చిందని, వంట చేసుకొని తింటున్నామని, కనీసం మంచి నీరు కూడా లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ విషయంపై పలాస వేర్ హౌస్ గొడౌన్ మేనేజరు శ్రీనివాసరావును వివరణ కోరగా తమకు ఇంకా విజయవాడ నుంచి ఆర్డరు కాపీ రావాల్సి ఉందని, అది వస్తే ఈ సమ స్య పరిష్కారం అవుతుందని తెలిపారు. -
ప్రభుత్వానివన్నీ ఆర్భాటపు ప్రకటనలే
మందస : నీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటనలు చేస్తోంది తప్ప నిధులు కేటాయించి నిర్మాణ పనులు పూర్తి చేయడం లేదని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్ అజాశర్మ అన్నారు. హరిపురంలోని మార్పు గ్రంథాలయంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో డాక్టర్ మట్ట ఖగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అజాశర్మ మాట్లాడుతూ కార్గో ఎయిర్పోర్టు పేరిట రైతుల భూముల తీసుకుంటే కుటుంబాలు రోడ్డున పడతాయని, భూములు ఇవ్వడానికి రైతులు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. ఖగేశ్వరరావు మాట్లాడుతు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తేనే ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. వంశధార డివిజనల్ సాధన కమిటీ అధ్యక్షుడు మార్పు మన్మధరావు మాట్లాడుతూ ఇచ్ఛాపురం వరకు రైతులకు సాగునీరు అందించాలని, చెరువులు, గెడ్డలు బాగు చేయాలని కోరారు. కార్యక్రమంలో లండ బాబూరావు, హడ్డి మాస్టారు, జయరాం మల్యా, ఈశ్వరరావు, కొమరాం వాసు, ఎం.గణపతి, దిలీప్కుమార్, వడ్డీ గోపాలకృష్ణ, గణేష్, లక్ష్మీనారాయణ, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. -
హిందీ ప్రతిభారత్న పురస్కారాల ప్రదానం
రణస్థలం: హిందీ సేవాసదన్ (అనంతపురం) ఆధ్వర్యంలో గత నెల రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన హిందీ టాలెంట్ టెస్ట్ జిల్లా స్థాయి విద్యార్థుల ఉత్తరాంధ్ర స్థాయి అభినందన సభ ఆదివారం రణస్థలం భాష్యం స్కూల్ ఆవరణలో నిర్వహించారు. కేంద్రం ఆర్థికశాఖ హిందీ సలహా మండలి సభ్యుడు కోనే శ్రీధర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో కేంద్ర సహకార, భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖల హిందీ సలహా మండలి సభ్యుడు ఎస్.గైబువల్లి హాజరై ఉత్తరాంధ్ర స్థాయిలో ఆరు జిల్లాల టాపర్లకు ప్రతిభారత్న పురస్కారాలు ప్రదానం చేశారు. 60 మందికి ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. హిందీ ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో విశ్రాంత డీఈఓ బలివాడ మల్లేశ్వరరావు, ఏపీ హిందీ ప్రఽచార సభ రాష్ట్ర అధ్యక్షుడు సి.ఎల్.నాయుడు, భాష్యం పాఠశాల ప్రిన్సిపాల్ ఏ.ఈశ్వరరావు, సూర్య హాస్పిటల్ వైద్యుడు డాక్టర్ యశ్వంత్, ఎం.వి.మల్లేశ్వరరావు, హిందీ మంచ్ నాయకులు బాడ మంజుల, రామారావు, హిందీ మంచ్ విజయనగరం జిల్లా గౌరవాధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, విశాఖ జిల్లా కన్వీనర్ మహేంద్రనాథ్, పాడేరు జిల్లా ప్రతినిధి శెట్టి సూరిబాబు, వివిధ జిల్లాల ప్రతినిధులు ఎస్టీపీ శిరీష, ప్రభాకర్, చిన్నాదేవి, ఉమారాణి, ప్రభావతి, పద్మానాభరాజు, ఎస్.సంతోషి పాల్గొన్నారు. -
చందాలు వేసుకుని రోడ్డు పనులు
ఎచ్చెర్ల : తోటపాలేం పంచాయతీ డోలవానిపేటలో గ్రామస్తులు చందాలు వేసుకుని రోడ్డు బాగుచేసుకుంటున్నారు. ఇక్కడ జాతీయ రహదారి నుంచి డోలవానిపేటకు సుమారు కిలోమీటరు మేర రహదారి ఉంది. పొలాల మధ్యలో రోడ్డు ఉండటంతో రహదారి కాస్త పొలం గట్టుగా మారింది. దీంతో రాకపోకలకు ఇబ్బందులు మొదలయ్యాయి. గతంలో రోడ్డు పనులను ప్రారంభించి నిలిపివేశారు. దీంతో గ్రామస్తులు ఇంటికి వెయ్యి రూపాయులు చొప్పున చందాలు వేసి ప్రొక్లెయిన్తో రోడ్డు చదును పనులు చేపడుతున్నారు. అధికారులు స్పందించి తమ గ్రామానికి పక్కా రహదారి నిర్మాణం చేపట్టాలని వారంతా కోరుతున్నారు. -
సాంకేతిక సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): బీపీఎస్, ఎల్ఆర్ఎస్లకు సంబంధించి ఎల్టీపీలు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని వెల్ఫేర్ అసోషియేషన్ ఆఫ్ లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ హారికా ప్రసాద్ కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర 4వ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీపీఎంఎస్ వెబ్సైట్లో సివిల్ 2.0పై వస్తున్న సమస్యలు సైతం పరిష్కరించాలని కోరారు. ఎల్టీపీలకు ఇన్సూరెన్స్ చేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఎల్టీపీలు కలసికట్టుగా ఉండాలన్నారు. సంఘ యూట్యూబ్ చానెల్ త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. సమావేశంలో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, సెక్రటరీ బాకి సురేష్, స్టేట్ ఈసీ మెంబర్ వాండ్రంగి శ్రీనివాసరావు, స్టేట్ చైర్మన్ ఎం.కుమారమంగళం, ప్రెసిడెంట్ ఎస్.రాంబాబు, సెక్రటరీ ఎం.లక్ష్మణ్, ట్రెజరర్ ఐ.ఆదినారాయణ, ఎక్స్ అఫీషియో సభ్యులు నాగ శ్రీనివాస్, చాపరపు శ్రీనివాస్, మదన్ గోపాల్, విజయరామకృష్ణ, శ్రీకాకుళం జిల్లా ఇంజనీర్లు కామేశ్వరరావు, ఈశ్వరరావు, శశికాంత్, రాహుల్, సందీప్, ఎ.శ్రీనివాస్, రవి, కిరణ్, బరాటం రమేష్ పాల్గొన్నారు. -
పాపయ్య చెరువులో మట్టి అక్రమ తరలింపు
నరసన్నపేట: గొట్టిపల్లి రెవెన్యూ పరిధిలోని వంశధార మెయిన్ చానెల్కు ఆనుకొని ఉన్న పాపయ్య చెరువులో మట్టి అక్రమంగా తరలిస్తున్నారు. గడిచిన మూడు రోజులుగా జేసీబీలతో తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ మట్టిని రూ. 600 నుంచి రూ. 800 లకు విక్రయిస్తున్నారు. ఈ చెరువుకు ఆనుకొని వంద ఎకరాలకు పైగా ఆయకట్టు ఉంది. చెరువు గట్టు మట్టిని కూడా తరలిస్తున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదు. ఆగని దోపిడీ ఇచ్ఛాపురం: బాహుదాలో ఇసుక దోపిడీ ఆగడం లేదు. పట్టణంలో బాహుదా నదిలోని వంతెనలకు సమీప ప్రాంతాల నుంచి ఇసుకను తోడేస్తున్నారు. ఇసుకను రెవెన్యూ కార్యాలయం పోలీస్స్టేషన్ మీదుగా ట్రాక్టర్ల ద్వారా తరలిస్తూ పట్టణంలో వ్యాపారం చేసుకుంటూ జేబులు నింపుకుంటున్నారు. రెవెన్యూ సిబ్బంది హెచ్చరిక బోర్డులు పెడుతున్నారు గానీ ఇసుకపై పర్యవేక్షణ చేయడం లేదు. -
బ్యాంకింగ్ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్ర
శ్రీకాకుళం అర్బన్: బ్యాంకింగ్ వంటి ప్రభుత్వరంగ సంస్థలను అదాని, అంబాని వంటి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకే కేంద్రప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బి.ఎస్.రాంబాబు ఆరోపించారు. శ్రీకాకుళంలోని ఓ ప్రవేటు అతిథిగృహంలో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ బ్యాంక్ ఎంప్లాయిస్ కో–ఆర్డినేషన్ కమిటీ, పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్ బ్యాంక్ ఎంప్లాయీస్ కో–ఆర్డినేషన్ కమిటీల ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఐబీఈఏకు ఆంధ్రప్రదేశ్లో 40వేల సభ్యత్వం ఉందన్నారు. బ్యాంక్ ఉద్యోగులకు ఐదురోజుల పనిదినాలు వంటి సమస్యలపై పోరాడుతున్నా కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో ఫెడరేషన్ కామ్రేడ్ టి.రవీంద్రనాథ్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఉదయ్కుమార్, సెంట్రల్ కమిటీ మెంబర్ కమలాకర్, వసంతరావు తదితరులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గమిదే.. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ బ్యాంక్ ఎంప్లాయిస్ కోఆర్డినేషన్ కమిటీ జిల్లా అధ్యక్షుడిగా గిరిధర్ నాయక్, సెక్రటరీగా బి.శ్రీనివాసులు, డిప్యూటీ సెక్రటర గా కామరాజు, ఉపాధ్యక్షులుగా జి.చంద్రమౌలి, ఎం.కిరణ్, జి.రమేష్, ఏ.సూర్య, జాయింట్ సెక్రటరీలుగా కె.రామకృష్ణ, జి.గోవిందరావు, ఎస్.రవికుమార్, బి.గిరిప్రసాద్, కె.హరినాథ్, రాజు, టి.స్వప్న, ఆర్.శ్రావణి, ఎస్.రాజేష్, కోశాధికారిగా పి.ఉపేంద్ర, జాయింట్ ట్రెజరర్గా బి.మౌలి, కమిటీ సభ్యులుగా జి.సూర్యారావు, బి.లోహిదాసు, పి.అన్నాజీరావు, ఎం.రామ్ప్రసాద్, ఎ.దినమణి, డి.సంధ్యారాణి, బి.వినోద్, బి.చంద్రభూషణరావు, జె.సింహాచలం, ఎన్.రమణ, ఎం.మనోజ్, వి.మురళి, ఎం. ఎంకె. రాజు, స్నేహ తదితరులు ఎన్నికయ్యారు. -
గట్టి చేతలు!
చిట్టి చేతులు..● చిన్ననాటి నుంచే సమాజ సేవ ● పీఎంశ్రీ పాఠశాలల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఏర్పాటు ● సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేలా శిక్షణ ● పాఠశాలల్లో మెరుగుపడనున్న సౌకర్యాలు హిరమండలం: నూతన విద్యావిధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ (ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పాఠశాలలను ఏర్పాటుచేసింది. సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు సమకూర్చడంతో పాటు సమాజ సేవా కార్యక్రమాలను చేపడుతోంది. దీనిలో భాగంగా ప్రతి పీఎంశ్రీ పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఏర్పాటుచేస్తున్నారు. సేవాభావంతో పాటు దేశభక్తి, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాల పెంపు, సమాజంలో నడవడిక తదితర రంగాల్లో విద్యార్థులు రాణించేలా తీర్చిదిద్దుతున్నారు. ఇదీ పరిస్థితి.. జిల్లాలో 81 పీఎంశ్రీ పాఠశాలలను ఎంపికచేసి ఆన్లైన్లో నమోదుచేశారు. తొలి విడతలో ఎంపికై న 32, రెండో విడతలో ఎంపికై న 3 పాఠశాలలకు నిధులు విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను సమకూర్చుతుంది. ఇప్పటివరకూ ఆ రెండు విడతల్లో రూ.4.2 కోట్లు నిధులు వెచ్చించినట్టు తెలుస్తోంది. అయితే ఎందుకో మూడు, నాలుగు, ఐదు, ఆరు విడతల్లో పాఠశాలల ఎంపిక జరగలేదు. ఇప్పుడు ఏడో విడతలో మాత్రం ఏకంగా 81 పాఠశాలలను ఎంపిక చేసినట్టు సమాచారం. తొలి రెండు విడతల్లో ఎంపిక చేసిన 35 పాఠశాలల్లో పనులు ఇప్పటికే కొలిక్కి వచ్చాయి. దేశభక్తి పెంచేలా.. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 35 పాఠశాలలకు సంబంధించి స్కౌట్స్ అండ్ గైడ్స్ను ఇప్పటికే ఏర్పాటుచేశారు. ఇందుకుగాను ఒక్కో పాఠశాలకు రూ.50 వేలు వంతున కేటాయించారు. పాఠశాలకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులకు శిక్షణనిచ్చారు. ఇందుకు రూ.5 వేలు కేటాయించారు. ఉపాధ్యాయులు నేర్చుకున్న అంశాలను, మెలకువలను విద్యార్థులతో చేయిస్తారు. ఇప్పటికే దాదాపు 800 మంది విద్యార్థులు స్కౌట్స్ అండ్ గైడ్స్లో చేరారు. ఈ విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటడంతో పాటు సంరక్షించే బాధ్యతలను తీసుకుంటారు. దేవాలయాల వార్షికోత్సవాలు, వివిధ వేడుకల సమయంలో వచ్చే భక్తులను క్యూలైన్లో వెళ్లేలా పర్యవేక్షిస్తారు. తాగునీరు, మజ్జిగ, ప్రసాదాలను పంపిణీ చేస్తారు. స్వాతంత్ర దినోత్సవాలు, రిపబ్లిక్డే వేడుకల్లో భాగస్థులవుతారు. అయితే ప్రాథమిక స్థాయి నుంచే సేవ, దేశభక్తి అలవరచడానికి ఇవి ఎంతగానో దోహదం చేస్తాయంటున్నారు వ్యక్తిత్వ నిపుణులు. కేంద్ర ప్రభుత్వం ఏటా మరిన్ని పాఠశాలలను పీఎంశ్రీకు ఎంపిక చేసేందుకు సన్నాహాలు చేయడం శుభ పరిణామం. సమగ్ర వసతులు.. పీఎంశ్రీ పాఠశాలల్లో ప్రధానంగా క్రీడాంశాలకు ప్రాధాన్యమిస్తారు. క్రీడా కోర్టులు, రన్నింగ్ ట్రాక్లతో పాటు మైదానాలను అభివృద్ధి చేస్తున్నారు. ఇంకుడు గుంతలు, కిచెన్ గార్డులు, ఉద్యానాలు, రక్షణ కంచెలను ఏర్పాటుచేస్తున్నారు. తరగతి గదులకు సంబంధించి ర్యాంపుల నిర్మాణం చేపడుతున్నారు. ప్రయోగశాలలో పరికరాలు, గ్రంథాలయాల్లో పుస్తకాలు ఏర్పాటుచేస్తున్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్కు విద్యార్థులను ఎంపిక చేస్తున్నారు. యూనిఫాం అందిస్తున్నారు. దివ్యాంగులకు ప్రత్యేక మరుగుదొడ్లు ఏర్పాటుచేస్తున్నారు. పాఠశాల నిర్వహణకు సైతం ప్రత్యేక నిధుల కేటాయింపు జరుగుతోంది. విద్యార్థి దశలోనే వ్యక్తిత్వ వికాసం కలిగించాలన్నది పీఎంశ్రీ పాఠశాలల లక్ష్యం. దేశభక్తి, సమాజ సేవను ప్రాథమిక స్థాయిలో అలవరచాలి. తద్వారా నాయకత్వ లక్షణాలు సైతం అలవడుతాయి. భావిభారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఇవి ఎంతగానో దోహదపడుతాయి. – కె.రాంబాబు ఎంఈఓ, హిరమండలం -
రాష్ట్ర వినియోగదారుల సమాఖ్య కో–చైర్మన్గా బగాది
శ్రీకాకుళం పాతబస్టాండ్: శ్రీకాకుళం నగరానికి చెందిన సీనియర్ న్యాయవాది, జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు బగాది రామమోహనరావు రాష్ట్ర సమాఖ్య కో–చైర్మన్గా నియమితులయ్యారు. ఆదివారం విజయవాడలోని అంబేడ్కర్ భవనంలో జరిగిన సమాఖ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈయన మూడేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. బగాది ఎంపిక పట్ల వినియోగదారుల సంఘాల ప్రతినిధులు, న్యాయవాదులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు హర్షం వ్యక్తం సేశారు. పూర్తిస్థాయిలో వైద్యసిబ్బందిని నియమించాలి పలాస: పలాస కిడ్నీ ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో డాక్టర్లు, సిబ్బందిని నియమించాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి అజశర్మ డిమాండ్ చేశారు. పలాస కిడ్నీ ఆసుపత్రిని ఆదివారం సందర్శించారు. సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ నిపుణుల సహకారంతో కిడ్నీ వ్యాధిపై పరిశోధన జరగాలన్నారు. రీసెర్చ్ సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించాలన్నారు. 59 వైద్యులకు గాను 18 మంది డాక్టర్లు మాత్రమే ఉన్నారని చెప్పారు. కిడ్నీ రోగులతో పాటు సహాయకులకు కూడా భోజనం అందించాలని కోరారు. 200 పడకలకు గాను 100 పడకలు మాత్రమే ఉన్నాయన్నారు. ఇంత పెద్ద ఆస్పత్రిలో అంబులెన్స్ అందుబాటులో లేకపోవడం విచారకరమని చెప్పారు. ఆస్పత్రికి బస్సు పాయింట్ దూరంగా ఉందని, ఎలక్ట్రికల్ వాహనం సమకూర్చాలని కోరారు. కార్యక్రమంలో వేదిక నాయకులు పి.ధర్మారావు, కె.మణికుమార్, ఎన్.గణపతి పాల్గొన్నారు. పోరాటాలతోనే సమస్యల పరిష్కారం జి.సిగడాం : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పోరాటాలకు సిద్ధం కావాలని ఏపీసీపీఎస్ఈఏ జిల్లా నాయకులు మొయ్యి జనార్దన్నాయుడు, మక్క సురేష్ అన్నారు. ఆదివారం జి.సిగడాంలో వారు మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పెన్షన్ విధానం అమలయ్యేవరకు పోరాటం ఆగదన్నారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సభ్యులు బాలి రామారావు, సామంతుల సత్యనారాయణ, జాడ వెంకటరమణ, శ్రీనివాస్ పట్నాయక్, వల్లూరు రమణ, జోగిదొర తవిటిరాజు పాల్గొన్నారు. మాజీ సైనికులకు సత్కారం శ్రీకాకుళం కల్చరల్: మాజీ సైనికులు సమాజానికి ముందుకురావాలని జిల్లా మాజీ సైనికుల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు కటకం పూర్ణచంద్రరావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో ఆదివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇటీవల రథసప్తమి నాడు అరసవల్లిలో భక్తుల సేవలో పాల్గొన్న మాజీ సైనికులకు, వీర నారీమణులకు చైర్మన్, విశ్రాంత గ్రూప్ కెప్టెన్ పి.ఈశ్వరరావు సత్కరించారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ వి.సూర్యనారాయణ, ట్రెజరర్ ఎం.సింహాచలం తదితరులు పాల్గొన్నారు. శ్రీకూర్మంలో భక్తుల రద్దీ గార: ఆదికూర్మ క్షేత్రం శ్రీకూర్మంలో కూర్మనాథున్ని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఆలయ ప్రధానార్చకులు సీహెచ్.సీతారామనృసింహాచార్యులు ఆధ్వర్యంలో వేకువ జామున స్వామికి పంచామృతాభిషేకం, విశేష అభిషేకాలు నిర్వహించారు. ఈఓ టి.వాసుదేవరావు భక్తుల క్యూలైన్ పర్యవేక్షించారు, -
అరాచకాలకు వంతెన
శ్రీకాకుళం క్రైమ్ : అభివృద్ధికి చిరునామాగా నిలిచిపోతుందన్న ఉద్దేశంతో నిర్మించిన పొన్నాడ వంతెనను కొందరు మందుబాబులు తమ అడ్డాగా మార్చుకుంటున్నారు. నగరంతో అనుసంధానం కోసం కట్టిన ఈ వంతెనను అసాంఘిక కార్యకలాపాలకు వాడుకుంటున్నారు. ఇటు శ్రీకాకుళం నగరానికి, అటు ఎచ్చెర్ల మండల పరిధి గ్రామాలకు పొన్నాడ వంతెనే దారి. వంతెనకు ఆవల, ఈవల.. ఎటు చూసినా 3 కిలోమీటర్ల పరిధిలోనే మత్తుబాబుల ఆగడాలు మితిమీరుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం సాయంత్రం నగరానికి చెందిన వ్యక్తి పొన్నాడ రాజీవ్గారితోటలోని నిర్మానుష్య ప్రాంతంలో హత్యకు గురికావడం తెలిసిందే.. వంతెనకు ఇవతల.. శ్రీకాకుళం నగరం పొన్నాడ వంతెన ఆరంభ శ్రీరామ మందిరం కూడలి నుంచి ఇటువైపుగా కలెక్టర్ బంగ్లా, వాంబేకాలనీ, 80 ఫీట్రోడ్డు, కేపీహెచ్బీ, కృష్ణాపార్కు, అఫీషియల్ కాలనీలతో పాటు, అటువైపుగా మంగువారితోట, గూనపాలెం, దమ్మలవీధి తదితర ప్రాంతాల్లో మత్తుబాబుల వీరంగం అధికమైంది. విచ్చలవిడిగా గంజాయి, మద్యం మత్తులో యువకులు నాలుగైదు బ్యాచ్లుగా విడిపోయి పేట్రేగిపోతున్నారు. స్పోర్ట్స్ బైక్లపై వేగంగా వెళ్తూ భయపెడుతుంటారు. రాత్రి 9 గంటలు దాటిందంటే ఇటుగా రావడానికి ఎవరైనా భయపడతారు. అనేకమార్లు దాడులు సైతం జరిగాయి. ఇటీవల వాంబే కాలనీ రాజీవ్ గృహకల్పలోని ఓ గదిలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ గదిని కొంతమంది యువకులు అద్దెగా తీసుకుని గంజాయి వంటి మత్తు పదార్థాల క్రయ విక్రయాలకు వాడుతున్నట్లు స్థానికుల నుంచి ఆరోపణలు వచ్చాయి. పొన్నాడ వంతెన చక్కటి సుందర ప్రదేశం. సాయంత్రం వేళ సేద తీరడానికి అనువుగా ఉంటుంది. అదే ఆసరాగా చేసుకున్న కూటమి ప్రభుత్వం నాయకులు సైతం సమీపంలోనే బార్అండ్ రెస్టారెంట్లు, వైన్షాఫులకు అనుమతులు ఇచ్చారు. బ్రిడ్జికి ఆవల రెండు దాబాలు కూడా ఉన్నాయి. వంతెన అవతలివైపు తోటలను మందుబాబులు అడ్డగా మార్చుకున్నారు. బ్రిడ్జి మీద కెమెరాలు పెట్టడంతో తోటల్లోకి వెళ్లిపోతున్నారు. ఎచ్చెర్ల స్టేషన్ పరిధి గ్రామాలైన పెద్ద కొంగరాం, ముద్దాడ, చిన్నకొంగరాం, వెంకన్నగారిపేట మీదుగా తోటపాలెం మార్గంలోని నీలగిరి, మామిడి, జీడి తోటల్లోని నిర్మానుష్య ప్రాంతాల్లోకి వెళ్లి అసాంఘిక కార్యకలాపాలకు తెరలేపుతున్నారు. కొంతమంది కళాశాలల అమ్మాయిలతో సైతం మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో వస్తుంటారని స్థానికులంటున్నారు. కొన్ని ఘటనలు.. ●శుక్రవారం ఇదే ప్రాంతంలో హత్య జరిగింది. ●దాదాపు నెలన్నర క్రితం ఆంజనేయస్వామి టెంపుల్ సమీపంలో ఓ వ్యక్తిని కత్తితో పొడిచేశారు. ●బ్రిడ్జి దాటాక పీడీ కన్వన్షన్ హాల్ వెనుక నగరానికి చెందిన ఓ వ్యక్తిని ఏడాది క్రితం కాల్చారని, అదే కన్వర్షన్ హాల్ సమీప మెకానిక్ షెడ్ పక్కన పొలాల్లో ఆరునెలల క్రితం కొందరు తాగి ఘర్షణ పడి కొంగరాం గ్రామానికి చెందిన మరో వ్యక్తి మరణానికి కారణమయ్యారని గ్రామస్తులు అప్పట్లో ఆరోపించారు. ●శుక్రవారం హత్య జరిగిన ప్రదేశానికి 100 అడుగుల దూరంలో ఉన్న ఎస్ఎంపురం పీఎసీఎస్ బహుళ ప్రయోజన సౌకర్య గోదాం వెనక వైపు ఓ వ్యక్తి పురుగు మందు తాగేశాడు. ●ఇక్కడికి సమీపంలోనే 2023 ఆగస్టు 15న ఓ యువతి అనుమానాస్పదంగా మృతిచెందిందని, ఎక్కడెక్కడో చంపేసి ఇక్కడ పడేస్తుంటారని, ఎక్కడెక్కడివారో ఇక్కడ మత్తులో జోగి హత్యలు, దాడులకు ఎగబడుతున్నారని, ఈ మార్గాల్లో వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందేనని స్థానికులు భయాందోళన వ్యక్తం చేయడం గమనార్హం. కొంగరాం– తోటపాలెం దారిలో రాకపోకలు సాగిస్తున్న విద్యార్థినులు -
పలాస జామి జాతరలో.. నకిలీ పాసుల కలకలం
పలాస : పలాస జామి జాతరలో ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన పాసుల్లో నకిలీవి సైతం చోటు చేసుకున్నాయనే ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లక్షకు పైగా యాత్రికులు, భక్తులు తరలివచ్చిన ఈ యాత్రకు రెండు రకాలు పాసులు ప్రజల్లోకి వెళ్లాయి. ఓ పాసు వెనుక వైపు పచ్చని అక్షరాలు, మరో పాసు వెనుక వైపు నీలం రంగు అక్షరాలు ఉన్నాయి. ఇందులో నీలం రంగు అక్షరాలు ఉన్నవి నకిలీవని గుర్తించి వాటితో వచ్చిన వారిని ఆలయం వద్ద నిర్వాహకులు అడ్డుకున్నారు. మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు బమ్మిడి సంతోష్కుమార్కే ఇదే అనుభవం ఎదురైంది. తనతో పాటు మరికొంతమందికి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ఈ పాసులు ఇచ్చారని చెప్పినా ఫలితం లేకపోయింది. దీంతో ఫోన్పే చేసి దర్శనం టికెట్ కొనుక్కొని వెళ్లారు. ఆ సమయంలో నిర్వాహకులు రశీదు ఇవ్వకపోవడం గమనార్హం. ఇదే పరిస్థితి చాలామందికి ఎదురైంది. వాస్తవానికి ఒరిజినల్ పాసులకు ఎటువంటి రుసుం లేదు. కానీ, కొందరు నకిలీ పాసులు ముద్రించి సులువుగా దర్శనం అయిపోతుందని చెప్పి అమ్ముకున్నట్లు తెలిసింది. -
ఫ్లాట్లపై రేట్ల పెత్తనం..!
పలాస: జిల్లాలో అత్యంత వెనుకబడిన పలాస నియోజకవర్గం అభివృద్ధి చెందాలని, నిరుద్యోగం తగ్గాలనే ఉద్దేశంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కోసం స్థలం కేటాయించడం జరిగింది. మండలంలోని రామకృష్ణాపురం రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 167, 168, 179 తదితర చోట్ల సుమారు 60 ఎకరాల భూమి సేకరించారు. అక్కడ ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణం కోసం తగిన చర్యలు తీసుకున్నారు. స్థలం సేకరించిన సమయంలో అక్కడ ఒక స్క్వేర్ మీటర్ ధర రూ.1,426లుగా నిర్ణయించారు. ఆ తర్వాత కొన్ని కారణాలు వల్ల ప్రభుత్వం మారింది. ఇప్పుడు పెద్ద పారిశ్రామికవేత్తలకు రూ.1కే కావాల్సిన భూమి ఇస్తామని చెబుతున్న ఈ కూటమి ప్రభుత్వం, ఇక్కడ మాత్రం అమాంతంగా మూడురెట్లు ధర పెంచేసింది. తాజాగా ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఈ ఇండస్ట్రియల్ పార్కులో స్క్వేర్ మీటర్ ధర రూ.4,683లు చేసింది. దీంతో ఒక చిన్న పరిశ్రమదారుడు ఇక్కడ పరిశ్రమ పెట్టుకోవాలంటే కేవలం ఒక ఫ్లాటును రూ.కోటి ఇచ్చి ముందు కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో ప్రభుత్వ తీరుపై పలువురు నిప్పులు చెరుగుతున్నారు. ఈ ప్రాంతంలో చాలామంది ఉన్నత సాంకేతిక విద్యనభ్యసించిన నిరుద్యోగులు ఉన్నారు. ఉద్యోగాలు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ప్రాంత ప్రజల నుంచి సేకరించిన భూమి పరిశ్రమల కోసం ఫ్లాట్లు వేశాక ఈ ప్రాంత నిరుద్యోగులకు, చిన్న తరహా పరిశ్రమదారులకు ఉపయోగపడాలి. రూ.కోట్లు ఇచ్చి ఫ్లాట్లు కొనేవారు ఇక్కడ లేరు. ప్రభుత్వం ఆలోచించి పేద, మధ్య తరగతి వర్గాలకు ఉపయోగపడేవిధంగా ఉండాలి. – ఎం.వినోద్, పీడీఎస్యూ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలాస ఆ ప్రాంతంలో జీడి మామిడి ఆధారిత చిన్న తరహా కుటీర పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమలు ఎక్కువ శాతం అద్దె ఫ్యాక్టరీల్లో నడుస్తున్నాయి. కొన్ని చిన్న, చిన్న షెడ్లల్లో ఉన్నాయి. ఇటు వ్యాపారాలు చేసుకోలేక, అటు అద్దెలు కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వారికి ఈ ఫ్లాట్లు ఉపయోగపడాలి. బడా పారిశ్రామికవేత్తలకు రూ.1కే కావాల్సిన భూమి ఇచ్చినప్పుడు.. ఇక్కడ చిన్న వ్యాపారులకు ఈ విధంగా ధరలు పెంచడం సరికాదు. దీంతో ఇక్కడ పరిశ్రమలు తరలిపోయే ప్రమాదం ఉంది. – పి.వి.సతీష్, వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం అధ్యక్షుడు, పలాస ఈ పార్కు స్థలాన్ని అడ్డదారుల్లో పెద్దలకు కట్టబెట్టడానికి కూటమి ప్రభుత్వం చూస్తోందని పలాస చిన్న తరహా పరిశ్రమదారుల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం స్థలంలో రోడ్లు, మురికి కాలువలు, పార్కులు ఇతర నిర్మాణాలు పోగా.. పరిశ్రమల కోసం మొత్తం 78 ఫ్లాట్లును విభజించారు. ఒక్కో ఫ్లాటు స్థలం కనీసం 2 వేల చదరపు స్క్వేర్ మీటర్లు ఉంటుంది. ఒక స్వ్కేర్ మీటర్ ధర ప్రస్తుతం రూ.4,683లు అంటే సుమారు ఒక ఫ్లాటు కోసం దాదాపు రూ.కోటి ఉండాలి. ఈ ప్రాంతంలోని చిన్న, చిన్న వ్యాపారుల వద్ద అంత ఆర్థిక వెసులుబాటు ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఇండస్ట్రీయల్ పార్కులో ఈవిధంగా ధరలు పెంచడం వల్ల పెద్దలు, బడా వ్యాపారుల చేతికి ప్లాట్లు వెళ్లిపోతాయని స్థానిక యువకులు, చిన్న తరహా పరిశ్రమదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందువలన గత ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఫ్లాట్లు కేటాయించి, ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు మొదటి ప్రాధాన్యమివ్వాలని కోరుతున్నారు. రామకృష్ణాపురం ఇండస్ట్రియల్ పార్క్లో రేట్లు పెంచేసిన ప్రభుత్వం గత ప్రభుత్వంలో స్క్వేర్ మీటర్ ధర రూ.1,426లు ప్రస్తుతం స్క్వేర్ మీటర్ ధర రూ.4,683లు నిప్పులు చెరుగుతున్న స్థానికులు -
●వైద్యం కోసం సంప్రదించండి..
కేసుల తీవ్రత దృష్ట్యా డయేరియా లక్షణాలతో బాధపడితే వెంటనే కిమ్స్, జెమ్స్, మెడికవర్, హెల్త్కేర్, సత్యసాయి డే అండ్నైట్, ఏ ఒన్, సింధూర, రిమ్స్తో పాటు అన్ని ప్రభుత్వ ఆసుప త్రుల్లో ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందిస్తామని వైద్య సేవ జిల్లా కో ఆర్డినేటర్ అవని తెలిపారు. ఎటువంటి సహాయం కావాలన్నా.. 92810 68255 92810 68256 92810 68257 92810 68139ఫోన్ నెంబర్లను సంప్రదించాలని కోరారు. -
‘రియల్’ దందా..!
● పాలనాయుడుపేటలో అక్రమ లే అవుట్ ● కోర్టు పరిధిలో ఉన్నా అనధికార అమ్మకాలు ● గ్రామకంఠం భూమి ఆక్రమించారని గ్రామస్తుల ఫిర్యాదు సంతబొమ్మాళి: రియల్ ఎస్టేట్ వ్యాపారులు బరితెగిస్తున్నారు. కోర్టు పరిధిలో ఉందని, గ్రామకంఠం భూమి ఆక్రమించారని వేర్వేరుగా ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోకపోవడంతో పెట్రేగిపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నౌపడ పంచాయతీ పాలనాయుడుపేటలో ఎల్పీ నంబర్ 324, 325లో 80 సెంట్ల భూమిలో లే అవుట్ను వేశారు. ఈ లే అవుట్కు ఎటువంటి పంచాయతీ, రెవెన్యూ అధికారుల అనుమతులు లేకపోయినా.. దర్జాగా రోడ్లువేసి ఫ్లాట్లుగా విభజించి సరిహద్దు రాళ్లను పాతారు. ఈ సర్వే నంబర్పై డిస్ప్యూట్ ఉండడంతో పలువురు కోర్టులో కేసు వేశారు. కోర్టు కాపీతో పాటు భూపత్రాలతో స్పందనలో తహసీల్దార్ హేమసుందర్రావుకు ఫిర్యాదు చేశారు. మరోపక్క గ్రామకంఠం భూమి ఆక్రమించి లేఅవుట్ వేశారని గ్రామానికి చెందిన మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు పిన్నింటి ఎండయ్య రెడ్డి గ్రామ సచివాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సర్వే నంబర్పై ఇన్ని ఫిర్యాదులు ఉన్నా మూలపేట పోర్టును బూచిగా చూపించి లేఅవుట్ను ఫ్లాట్లుగా విభజించి అమ్మకాలు చేపడుతున్నారు. ఈ తతంగం అంతా అధికారులకు తెలిసినా ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంపై గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందువలన ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై తహసీల్దార్ హేమసుందరరావును వివరణ కోరగా లే అవుట్ను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. -
అక్రమ కేసులు రద్దు చేయాలి
సంతబొమ్మాళి : కాకరాపల్లి థర్మల్ ప్లాంట్కు సంబంధించి జీఓ 1108 రద్దు చేయాలని థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం సంతబొమ్మాళి మండలం పోతునాయుడుపేట వద్ద అమరవీరుల స్మారక స్మృతిచిహ్నం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ నాయకులు మాట్లాడుతూ థర్మల్ వ్యతిరేక పోరాటంలో ఉద్యమకారులపై పెట్టిన అక్రమ కేసులు రద్దు చేయాలని కోరారు. తంపరలో భవిష్యత్తులో పారిశ్రామిక పేరిట విధ్వంసక పరిశ్రమలను నెలకొల్పే ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పోరాట కమిటీ ప్రధాన కార్యదర్శి ఎస్.వెంకటరావు, సీపీఐ ఎంఎల్ న్యూడెమొక్రసీ జిల్లా పోరాట కమిటీ కార్యదర్శితాండ్ర ప్రకాష్, అఖిలభారత రైతుకూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంకల మాధవరావు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సోమేష్, ఐఎఫ్యూ జిల్లా నాయకులు సవలాపురపు కృష్ణవేణి, పోరాట కమిటి అధ్యక్షుడు మండపాటి నరసింగరావు, కమిటీ నాయకులు కోత మధు, మండల గన్ను గాయశ్రీ, కగ్గు జగన్నాథం, వడ్డితాండ్ర స్వదేశీ మత్య్సకార సొసైటీ ప్రెసిడెంట్ పద్మనాభం పాల్గొన్నారు. -
రోడ్డుపై విద్యార్థుల నిరసన
ఆమదాలవలస: మండలంలోని దన్నానపేట గ్రామం వద్ద ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు అలికాం – బత్తిలి ప్రధాన రహదారిపై శనివారం బైఠాయించి నిరసన తెలపడంతో కొద్దిసేపు ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ప్రతిరోజూ కళాశాలకు రాకపోకల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. బస్సులు విపరీతమైన రద్దీతో వస్తుండడంతో ఆర్టీసీ డ్రైవర్లు స్టేజీల వద్ద ఆపకుండా వెళ్లిపోతున్నారని వాపోయారు. దీంతో సమయానికి కళాశాలకు చేరుకోలేక చదువుకు ఆటంకం కలుగుతోందన్నారు. కళాశాల ముగిసిన తర్వాత కూడా హిరమండలం నుంచి శ్రీకాకుళం వైపు వెళ్లే బస్సులు, అలాగే శ్రీకాకుళం నుంచి హిరమండలం వైపు వెళ్లే బస్సులు కళాశాల స్టేజీ వద్ద ఆగకపోవడంతో ప్రైవేట్ ఆటోలు, ఇతర వాహనాలపై ఆధారపడాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. విషయం తెలిసిన ఆమదాలవలస ఎస్ఐ సనపల బాలరాజు సిబ్బందితో అక్కడికి చేరుకొని విద్యార్థులతో మాట్లాడారు. జిల్లా ఆర్టీసీ అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. -
డయేరియా కట్టడిలో ప్రభుత్వం విఫలం
శ్రీకాకుళం పాతబస్టాండ్ : రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్న మెడికల్ మాఫియా ప్రజల జీవించే హక్కుపై పరోక్షంగా దాడి చేస్తోందని, నాణ్యత లేని బోగస్ మందులు విచ్చలవిడిగా మార్కెట్లో ప్రవేశించి వేలాదిమంది ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి లండ వెంకటరావు అన్నారు. శ్రీకాకుళం నగరంలో విస్తృతంగా వ్యాపిస్తున్న డయేరియా కేసులను కట్టడి చేయడంలో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోందన్నారు. శనివారం సీపీఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు అవసరం లేని టెస్టులు, శస్త్ర చికిత్సలు సూచిస్తూ లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బొత్స సంతోష్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు, సీపీఐ నాయ కులు చిక్కాల గోవిందరావు, పైడి గోవిందరా వు, ఏఐవైఎఫ్ నాయకులు ఆర్.అరవింద్, వై. వేణు, వసంతరావు, తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం: ‘ప్రజారోగ్యం ప్రమాదంలో ఉన్నప్పుడు క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించాల్సిన వారు ఎందుకు విఫలమవుతున్నారు? ఎవరు చేయాల్సిన పనులు వారు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది..’అంటూ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నగరపాలక సంస్థ కార్యాలయంలో వార్డు ఎమినిటీ స్ సెక్రటరీలు, పబ్లిక్ హెల్త్ అధికారులు, శాని టరీ ఇన్స్పెక్టర్లతో కలెక్టర్, ఎమ్మెల్యే గొండు శంకర్ అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంచినీటి సరఫరా వ్యవస్థలో లోపాలు, అక్రమ పైపులైన్ కనెక్షన్ల విషయంలో అధికారులు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. పారి శుధ్య నిర్వహణలో వైఫల్యాలు కనిపిస్తున్నాయని, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపించడం వల్లే డయేరియా వంటి సమస్యలు తీవ్రమవుతున్నా యని అసహనం వ్యక్తం చేశారు. పనుల్లో నిర్ల క్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ పైపులైన్ల లీకేజీలు, మురుగునీటి కాలువల పూడికతీత పనులను తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బొడ్డేపల్లి రాము తదితరులు పాల్గొన్నారు. ఆమదాలవలస: శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) రైల్వేస్టేషన్లో అమృత్భారత్ రైల్వేస్టేషన్ కింద నిర్వహిస్తున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని రైల్వేశాఖ ఏడీఆర్ఎం కె.రామారావు కాంట్రాక్టర్లను హెచ్చరించారు. రైల్వేస్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనుల ను శనివారం పరిశీలించారు. స్టేషన్ ఆవరణ పరిశుభ్రంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో స్టేషన్ మేనేజర్ బి.జనార్దనరావు, ఏడీ ఈఎన్ వి.ఎస్.మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
శ్రీకాకుళం
ఆదివారం శ్రీ 1 శ్రీ మార్చి శ్రీ 2026దిమ్మడిజోలలో వృద్ధ దంపతులపై ఓ వ్యక్తి దాడిచేసి తీవ్రంగా గాయపర్చాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. రామకృష్ణాపురం ఇండస్ట్రీయల్ పార్క్లో ఫ్లాట్ల రేట్లను ప్రభుత్వం పెంచేసింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో సరఫరా చేసిన మున్సిపల్ తాగునీటిలో ఈ.కోలితో పాటు క్లెబ్సీయల్లా బ్యాక్టీరియా కూడా ఉన్నట్లు శాంపిల్స్ పరీక్షల్లో తేలింది. ●నగర ప్రజలకు అందించిన మంచినీటి శాంపిల్స్ పరీక్షల్లో రోజుకొక బ్యాక్టీరియా బయటపడుతోంది. దీన్నిబట్టి మున్సిపల్ తాగునీరు ఏ స్థాయిలో కలుషితమైందో అర్ధం చేసుకోవచ్చు. క్లెబ్సియెల్లా బ్యాక్టీరియాతో ఊపిరితిత్తులు, మూత్రనాళం, తీవ్రమైన గాయాల ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. -
●రంగంలోకి తనిఖీ బృందాలు
జిల్లాలో ఉన్న ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు విశాఖ నుంచి వచ్చిన పుడ్ సేఫ్టీ అధికారులు నగరంలోని హోటల్స్, పాస్ట్ఫుడ్స్ సెంటర్లు, స్వీట్షాపులను తనిఖీ చేస్తున్నారు. నగరంలోని ఓ హోటల్లో ఫుడ్ శాంపిల్స్ తీసి ఇప్పటికే హైదరాబాద్ ల్యాబ్కు పంపించారు. మరికొన్ని హోటల్స్లో 15 ఇన్ఫార్మల్ శాంపిల్స్ తీశారు. లైసెన్సు లేకుండా నడుతున్న 10 హోటళ్లకు 31 నోటీసులు జారీ చేయగా, పరిశుభ్రంగా లేని 15 హోటళ్లకు 32 నోటీసులు జారీ చేశారు. రంగుల్లేకుండా గడువు ముగిసిన వస్తువులు వాడకుండా చర్యలు తీసుకోవాలని హోటళ్లు, షాపుల నిర్వాహకులకు ఆదేశించారు. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ లక్ష్మీ నారాయణతో పాటు ఫుడ్ ఇన్స్పెక్టర్లు కె.లక్ష్మీ, శ్రీరామమూర్తి, ఆనందరావు తదితరులు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు సాగుతున్నాయి. -
నీళ్లు కాలుష్యం పాలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది. పాలు, మంచినీళ్లలో స్వచ్ఛత కొరవడింది. శ్రీకాకుళంలో కలుషిత మంచినీరు, రాజమహేంద్రవరంలో కల్తీ పాలతో చావులు సంభవించడంతో జిల్లా ప్రజానీకం ఉలిక్కిపడుతోంది. కోరలు చాచిన డయేరియా నేపథ్యంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ రాత్రి, పగలు తేడా లేకుండా సుడిగాలి పర్యటనలు చేసి, ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. లోపాలున్న చోట సిబ్బందిని అప్రమత్తం చేసి, పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. డయేరియా కేసులు విస్తరిస్తున్న వేళ నగరమంతా యంత్రాంగం అప్రమత్తమైంది. మంచినీటి ట్యాంకులతో పాటు ఎక్కడికక్కడ పైపులైన్లు తనిఖీ చేయడమే కాకుండా శానిటేషన్పైనా దృష్టి సారించారు. మురికి కాలువలను స్వయంగా జిల్లా కలెక్టరే పరిశీలిస్తుండటం తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రస్తుతానికి మున్సిపల్ మంచినీళ్లు తాగొద్దని కోరుతున్నారు. మరోవైపు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంపై సీరియస్గా వ్యవహరిస్తున్నారు. విధి నిర్వహణలో అలసత్వం దృష్ట్యా డీఈఈతో పాటు శానిటరీ ఇన్స్పెక్టర్పై చర్యలు తీసుకున్నారు. సంబంధం ఉన్న మున్సిపల్ హెల్త్, ఇతర ఇంజనీర్లను వదిలేసి వీరిపై చర్యలు తీసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నా ఇష్యూ డైవర్షన్ కోసం చర్యలు మాత్రం కొనసాగుతున్నాయి. రాజమహేంద్రవరంలో కల్తీ పాలతో పలువురు చనిపోవడంతో జిల్లాలో కూడా యంత్రాంగం అప్రమత్తమైంది. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో శ్రీకాకుళం డివిజన్లో మూడు మిల్క్ శాంపిల్స్, టెక్కలి డివిజన్లో 9 శాంపిల్స్ సేకరించి హైదరాబాద్ ల్యాబ్కు పంపించారు. పాలులో నీళ్లు, యూరియా, ఆయిల్, ఫార్మాలిన్, పిండి పదార్థాలు ఉన్నాయేమోనన్న అనుమానంతో శాంపిల్స్ తీశారు. హైదరాబాద్ ల్యాబ్ నుంచి పరీక్షా ఫలితాలు వచ్చాక చర్యలు తీసుకుంటామని ఆహార తనిఖీ అధికారులు చెబుతున్నారు. పాలుపైనే కాకుండా కల్తీ ఆయిల్పైనా దృష్టి సారించారు. శ్రీకాకుళం : డయేరియాపై ప్రజలు ఎలాంటి ఆందో ళన చెందవద్దని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ కె.పద్మా వతి వెల్లడించారు. శనివారం డయేరియా ప్రభావిత ప్రాంతాలైన దమ్మలవీధి, కాకివీధి, బోడెమ్మ కోవెల తదితర వీధుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అతిసారం తగ్గుము ఖం పట్టిందన్నారు. కాచి చల్లార్చిన నీటిని తాగాల ని, బయట ఆహార పదార్థాలను తినరాదని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా సర్వజన ఆస్పత్రిని సందర్శించి అతిసార బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆమెతో పాటు జాయింట్ డైరెక్టర్ ఐ.డి.ఎస్.పి డాక్టర్ ఎన్.మల్లేశ్వరి, జిల్లా వైద్యారోగ్యశాఖా ధికారి డాక్టర్ అనిత పాల్గొన్నారు. శ్రీకాకుళం : శ్రీకాకుళం నగరపాలక సంస్థలో నీటి సరఫరా విభాగం డీఈఈగా విధులు నిర్వహిస్తున్న వి.జగన్మోహనరావును సస్పెండ్ చేస్తూ జాయింట్ కలెక్టర్, ఇన్చార్జి కమిషనర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా, దమ్మలవీధి సచివాలయంలో శానిటరీ ఇన్స్పెక్టర్గా ఔట్సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్న ఎన్.శరత్కుమార్ను విధుల నుంచి తొలగించారు. నగరంలో డయేరియా ప్రబలడానికి విధుల్లో వీరు చూపిన నిర్లక్ష్యమే కారణమని పేర్కొంటూ ఈ ఉత్తర్వులను వెలువరించారు. వామనమూర్తి అనే శానిటరీ ఇన్స్పెక్టర్తో పాటు షోకాజ్ నోటీసులు అందుకున్న పలువురు సచివాలయ సిబ్బందిపైనా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. -
అధికారులను బలి పశువులు చేస్తున్నారు
● వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ టెక్కలి: జిల్లా కేంద్రంలో ఇటీవల నామమాత్రంగా చేసిన వివిధ రకాల పనులకు సంబంధించి అడ్డగోలుగా బిల్లులు పాస్ చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్లు అధికారులపై ఒత్తిడి చేశారని, దానికి నిరాకరించడంతో డయేరియా పేరుతో వేటు వేస్తున్నారని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ తీవ్రంగా ఆరోపించారు. శనివారం టెక్కలిలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో డయేరియా వ్యాప్తి విషయంలో కొత్తగా విధుల్లోకి వచ్చిన రోణంకి కూర్మనాథ్పై వేటు వేయడం వెనుక మంత్రి, స్థానిక ఎమ్మెల్యేల అవినీతి బాగోతాలు ఉన్నాయన్నారు. జిల్లా కేంద్రంలో చేపట్టిన వివిధ రకాల పనుల విషయంలో బిల్లుల మంజూరులో గతంలో పనిచేసిన కమిషనర్పై ఒత్తిడి చేశారని, ఆయన నిరాకరించడంతో పాత కమిషనర్ను హఠాత్తుగా బదిలీ చేశారని ఆరోపించారు. ఆ తర్వాత కమిషనర్గా రోణంకి కూర్మనాథ్ విధుల్లోకి చేరడంతో అతనిపై కూడా బిల్లుల కోసం ఒత్తిడి చేశారని, ఆయన సైతం నిరాకరించడంతో డయేరియా వ్యాప్తి నెపంతో అతనిపై సైతం వేటు వేశారని దుయ్యబట్టారు. ఆ తర్వాత మరో అధికారిని నియమించారని, ఈ నియామకంపై జిల్లావ్యాప్తంగా పలు విమర్శలు వెల్లువెత్తుడంతో మరో అధికారిని నియమించారని పేర్కొన్నారు. అడ్డగోలుగా బిల్లులు మంజూరు చేసే విషయంలో నాయకులు అధికారులను బలి పశువులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
క
నగరంలో తాజా పరిస్థితిప్రభావిత ప్రాంతాలు దమ్మల వీధి, కాకి వీధి, మంగువారితోట, గుడి వీధి మొత్తం కేసులు 190 ప్రభావిత ప్రాంతాల నుంచి 05 వివిధ ఆసుపత్రుల్లో చికిత్స 87 డిశ్చార్జిలు 103 నగర వ్యాప్తంగా (ప్రభావిత + సాధారణ వీధులు కలిపి) శనివారం నమోదైన కొత్త కేసులు: ప్రస్తుతం చికిత్స 51 ●పట్టుబడిన మాదకద్రవ్యాల శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో పట్టుబడిన మాదకద్రవ్యాలను (ఎన్డీపీఎస్) అత్యంత భద్రంగా నిల్వ చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా శనివారం వంశధార పాత క్వార్టర్స్లోని భవనాలను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా, ఏఎస్పీ శ్రీనివాసరావు కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇకపై స్వాధీనం చేసుకున్న గంజాయి, ఇతర డ్రగ్స్ను భద్రపరిచేందుకు వీలుగా ఒక భవనాన్ని గుర్తించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భవనం చుట్టూ అత్యున్నత స్థాయి భద్రత ఉండాలని, రాత్రి వేళల్లో కూడా పరిసరాలన్నీ స్పష్టంగా కనిపించేలా ఫ్లడ్ లైట్లను అమర్చాలని ఆర్అండ్బీ ఎస్ఈ సత్యనారాయణకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్డీపీఎస్ కేసుల్లో పట్టుబడిన మాదకద్రవ్యాలను కోర్టు విచారణ పూర్తయ్యే వరకు, డిస్పోజల్ కమిటీ నిర్ణయం తీసుకునే వరకు సురక్షితంగా ఉంచడం కీలకమన్నా రు. కార్యక్రమంలో పలువురు రెవెన్యూ, పోలీస్, ఆర్అండ్బీ అధికారులు పాల్గొన్నారు. ●ఘనంగా ప్రపంచ టైలర్స్ డే శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని చిన్నబజారు జంక్షన్ వద్ద స్టైలెక్స్ టైలర్స్ ఆధ్వర్యంలో ప్రపంచ టైల ర్స్ దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా విలియం హావే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు టైలర్లు మాట్లాడుతూ రెడీమేడ్ దుస్తులు ఎక్కువ కావడంతో.. టైలర్లకు పండగ రోజుల్లో కూడా పనులు లేక ఇబ్బంది పడుతున్నా మని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం మాదిరిగా ఈ ప్రభుత్వం కూడా ఆర్థిక సాయం అందజేయాలని కోరారు. కార్యక్రమంలో గుంటముక్కల పాపారావు, శ్రీనివాస్ పంట, లిబర్టీ రమణ, రాజు, వేణు, భోగేశ్వరరావు, బాబూరావు, గణేష్, ఏ వన్ రాజు టైలర్, రోజీ టైలర్ తిరుమల పాల్గొన్నారు.●పోస్టాఫీసుల్లో శ్రీకాకుళం అర్బన్ : శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ పరిధిలో 19 తపాలా కేంద్రాల్లో పూర్తిస్థాయి ఆధార్ సేవలు లభిస్తున్నాయని పోస్టల్ సూపరింటెండెంట్ వి.హరిబాబు శనివారం తెలిపారు. శ్రీకాకుళం, ఆమదాలవలస, టెక్కలి ప్రధాన కార్యాలయాలతో పాటు రాజాం, పొందూరు, ఎస్.ఆర్.పురం, జె.ఆర్.పురం, అరసవల్లి, గార, హిరమండలం, కొత్తూరు, నరసన్నపేట, కోటబొమ్మాళి, కాశీబుగ్గ, పలాస, సోంపేట, మందస, ఇచ్ఛాపురం, గుజరాతిపేట సబ్ పోస్టాఫీసుల్లో ఈ సేవలు లభిస్తాయని వివరించారు. కొత్త ఆధార్ నమోదుతో పాటు పేరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, ఈ–మెయిల్ ఐడీ వంటి వివరాల్లో మార్పులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. బయోమెట్రిక్ అప్డేట్ (ఫోటో, వేలిముద్రలు, ఐరిస్), పిల్లల తప్పని సరి ఆధార్ నవీకరణ, డాక్యుమెంట్ అప్డేట్ వంటి సదుపాయాలు అన్ని వయసుల వారికి అందుబాటులో ఉన్నాయని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ●లీగల్ ఎయిడ్ క్లినిక్లతో శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో లీగల్ ఎయిడ్ క్లినిక్ల ద్వారా న్యాయపరమైన సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రశాంతి వృద్ధాశ్రమం, ఎంపీఆర్ న్యాయ కళాశాలలోని లీగల్ ఎయిడ్ క్లినిక్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ చాలామంది చిన్నపాటి సమస్యలను పెద్దగా భావించి న్యాయస్థానాల సహాయాన్ని పొందడానికి ముందుకు రారని, అలాంటి వారికి లీగల్ ఎయిడ్ క్లినిక్లు అండగా నిలుస్తాయని చెప్పారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఆర్డీఓ కె.సాయి ప్రత్యూష, ఎంపీఆర్ న్యాయ కళాశాల కళాశాల ప్రిన్సిపాల్ కె.మోసే తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం కల్చరల్: జిల్లా కేంద్రంలోని నానుబాలవీధిలో విజయగణపతి ఆలయం వద్ద శనివారం 5008 పెన్నులతో పూజలు చేశారు. ఆదివారం ఉదయం 8.30 నుంచి 11గంటల వరకూ విద్యార్థులకు పెన్నులు పంపిణీ చేస్తామని అర్చకులు పెంట శ్రీధర్శర్మ, పెంట సూరనగేష్శర్మ తెలిపారు. -
వేణుగోపాలా..
జీవకళ ఉట్టిపడేలా! మెళియాపుట్టిలోని వేణుగోపాల ఆలయం మెళియాపుట్టి: జిల్లాలో అద్భుత శిల్ప కళా సౌందర్యం గల దేవాలయాలలో మెళియాపుట్టిలోని వేణుగోపాలుడి ఆలయం ఒకటి. దైవత్వం, జీవకళ ఉట్టి పడేలా ఇక్కడి విగ్రహాలు చూపరులను కట్టిపడేస్తుంటాయి. 1840లో పర్లాకిమిడి(ఒడిశా) మహారాజు ప్రతాపరుద్రుడి భార్య విష్ణుప్రియ మహారాణి కోరిక మేరకు ఈ ఆలయాన్ని అత్యద్భుతంగా కట్టించారు. గర్భగుడిలో ప్రతిష్టించిన మూలవిరాట్ విగ్రహాలను బృందావనం నుంచి తెప్పించినట్లు పూర్వీకుల కథనం. అప్పట్లో బరంపురం పట్టణానికి సమీపంలోని మతర అనే గ్రామానికి చెందిన శిల్పులతో ఆలయంలోని శిల్పాలను చెక్కించారు. 15 ఏళ్ల పాటు ఆలయ నిర్మాణం కొనసాగింది. మైసూరు నుంచి తెప్పించిన తలుపులు, తుమ్మబంకతో కలిపిన రాళ్లు, ఏనుగులతో తొక్కించి తయారుచేసిన ప్రత్యేక మిశ్రమాన్ని ఆలయ నిర్మాణంలో వినియోగించినట్లు చరిత్రకారులు పేర్కొన్నారు. అడుగడుగునా ప్రత్యేకమే.. పర్లాకిమిడి రాజవంశస్తులకు రెండో ఎస్టేట్గా ఉన్న మెళియాపుట్టిలో 50 గ్రామాల నుంచి వచ్చి న ఫలసాయాన్ని ఆలయంలోని 30 గదుల్లో నిల్వ చేసేవారు. అప్పట్లో 42 మంది అర్చకులు, 25 మంది పనివార్లకు జీతాలు చెల్లించేవారు. స్వామివారికి నిత్యధూప, దీప, నైవేద్యాలకు, సామంతులకు ఇక్కడి నుంచే చెల్లింపులు జరిపేవారు. ఆలయ పరిసరాల్లో లభించే సంపంగి పూలు,జామ, మామిడి తదితర పండ్లతో స్వామివారికి అర్చన చేసేవారు. ఆలయం నుంచి పర్లాకిమిడి బృందావన్ ప్యాలెస్గా పిలువబడే రాజు ల ఉద్యానవనానికి సొరంగం ఉండేదని, దాని ద్వారా ఫలసాయం, బంగారు నాణేలు రవాణా చేసేవారని చెబుతుంటారు. ఇప్పటికీ సొరంగ మార్గం ఆనవాళ్లు కనిపిస్తుంటాయి. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఈ ఆలయంలో ప్రస్తుతం ఒక్క అర్చకుడు మాత్రమే ఉన్నారు. ఏటా ఘనంగా డోలోత్సవాలు ఏటా స్వామివారి సన్నిధిలో డోలోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది మార్చి 2 నుంచి జాతర ప్రారంభంకానుంది. పర్లాఖిమిడి రాజవంశీయులు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు, మఘా కార్యక్రమం నిర్వహించి ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఊరేగిస్తారు. -
వృద్ధ దంపతులపై దాడి
నందిగాం: మండలంలోని దిమ్మడిజోలకు చెందిన వృద్ధ దంపతులపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి దాడిచేసి తీవ్రంగా గాయపర్చాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన సలాన మన్మథరావు, రూపావతి దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. పిల్లలిద్దరూ హైదరాబాద్లో ఉంటుండగా వీరు గ్రామంలోనే నివసిస్తున్నారు. అయితే వారి ఇంటి పక్కనే ఉన్న గొర్లె వాసుదేవరావుతో వీరికి చిన్న పాటి గొడవలు ఉండడంతో శనివారం మాటామాటా పెరిగింది. దీంతో వాసుదేవరావు మన్మథరావు తలపై కర్రతో కొట్టడంతో తీవ్ర రక్తస్రావం అయ్యింది. రక్తం గమనించిన మన్మథరావు భార్య రూపావతి ఎందుకు కొట్టావని వాసుదేవరావును ప్రశ్నించడంతో ఆమె తలపై కూడా కొట్టడంతో తీవ్రగాయాల పాలయ్యంది. అనంతరం గాయాలు పాలైన వృద్ధ దంపతులను గ్రామస్తులు టెక్కలి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించగా అక్కడ ప్రథమ చికిత్స చేసి శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. కాగా వాసుదేవరావు ఇద్దరినీ తీవ్రంగా కొట్టడానికి గల కారణాలు తెలియలేదు. నందిగాం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కోడలే కొడుకై ంది..
రణస్థలం: అనారోగ్యంలో మృతి చెందిన మామకు కోడలై కొడుకై తలకొరివి పెట్టిన ఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జేఆర్పురం పంచాయతీలోని కాపువీధికి చెందిన కరిమజ్జి రామప్పడు అనే వ్యక్తి విద్యుత్ శాఖలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయనకు ఇద్దరు కుమారులు కాగా.. పెద్ద కుమారుడు అప్పన్న 25 ఏళ్ల వయస్సులో విద్యుత్ షాక్తో మరణించారు. రామప్పడు భార్య కూడా అనారోగ్యంతో మరణించారు. అలాగే కొన్ని నెలల క్రితం చిన్న కుమారుడు రాంబాబు ఆకస్మికంగా మృతి చెందాడు. అలాగే తన తొడపుట్టిన తమ్ముడు కరిమజ్జి రామస్వామి ఈ ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన మృతి చెందాడు. దీంతో మనోవేదనకు గురైన రామప్పడు మంచం పట్టాడు. కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం శ్రీకాకుళం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా తుది శ్వాస విడిచాడు. ఇద్దరు కుమారులు, భార్య, తమ్ముడు మృతి చెందడం తలకొరివి పెట్టేందుకు గ్రామస్తులు తర్జనభర్జన పడ్డారు. దీంతో చిన్న కుమారుడి భార్య ఉమా తప్పనిసరి పరిస్థితుల్లో తలకొరివి పెట్టింది. -
నాణ్యమైన వైద్యసేవలందించాలి
శ్రీకాకుళం: ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలందించాలని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. జిల్లాలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఆర్థిక సహకారంతో ఆస్పత్రుల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను గుర్తించి ఫౌండేషన్ డైరెక్టర్ సత్తి శ్రీనివాసరావును విజయవాడలోని మంత్రి కార్యాలయంలో సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ రెడ్డీస్ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలానే లేబర్ రూమ్, ఫార్మసీ, వార్డ్, ల్యాబరేటరీ గార్డెన్లకు అత్యాధునిక సదుపాయలు కల్పించామని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ బద్దెల సురేష్ పాల్గొన్నారు. అక్రమంగా తరలిస్తున్న పశువులు పట్టివేత టెక్కలి రూరల్: స్థానిక జగతిమెట్ట సమీపంలో శనివారం ఉదయం అక్రమంగా పశువులను తరలిస్తున్న నాలుగు బొలేరో వ్యాన్లను టెక్కలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కంచిలి సమీప ప్రాంతాల నుంచి సంతలకు తరలిస్తుండగా సమాచారం అందుకున్న టెక్కలి సీఐ ఎ.విజయ్కుమార్ తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. దీనిలో భాగంగా 4 వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. వాటిలో మూడు వాహనాల్లో మొత్తం 14 గేదెలతో పాటుగా ఒక బొలేరో వాహనంలో 4 ఆవులు ఉన్నాయి. వాహనాలను టెక్కలి స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. పశువులను గోశాలకు తరలించనున్నట్లు తెలిపారు. ఇత్తడి సామగ్రి చోరీపై ఫిర్యాదు టెక్కలి రూరల్: మండంలోని తలగాం గ్రామానికి చెందిన హనుమంతు విద్యాసాగర్ అనే వ్యక్తి తన ఇంట్లో ఉంచిన సామగ్రి కనిపించడం లేదని టెక్కలి పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. విద్యాసాగర్ తెలంగాణలోని భద్రాచలంలో పేపర్ బోర్డులో టెక్నికల్ అడ్వైజరుగా పనిచేస్తున్నారు. అయన ఈనెల 27వ తేదీన తన సొంత గ్రామమైన తలగాంలోని ఇంటికి వచ్చారు. అనంతరం స్టోర్ రూమ్కి వెళ్లి చూడగా అందులో ఉంచిన సుమారు 100 కేజీల ఇత్తడి సామగ్రితో పాటు 3 గ్రాముల బంగారు కాసులు కన్పించడం లేదని తెలిపాడు. ఈ మేరకు సామగ్రి చోరీకి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైతుల వివరాలను నమోదు చేయాలి ● డీపీఎం పూజారి సత్యనారాయణ ఆమదాలవలస: ప్రకృతి వ్యవసాయ విభాగం ఆధ్వర్యంలో కృషి మేపర్ పోర్టల్కు అనుసంధానం కోసం రైతుల వివరాలను ‘ఉర్వి’ యాప్లో నమోదు చేయాలని జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ పూజారి సత్యనారాయణ సూచించారు. మండలంలోని చీమలవలస గ్రామంలో నిర్వహిస్తున్న డేటా ఎంట్రీ ప్రక్రియను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డేటా ఎంట్రీ ప్రక్రియ ఐసీటీఎన్ఎఫ్ఏ శివకృష్ణ పర్యవేక్షణలో కొనసాగుతోందని చెప్పారు. చీమలవలస, కట్యాచార్యులపేట, వంజంగి, జొన్నవలస, దూసి, కలివరం పంచాయతీల పరిధిలోని గ్రామాల్లో సీడీఎఫ్ సురేష్ ఆధ్వర్యంలో వివరాల నమోదు ప్రక్రియను ట్రైనీ ఐసీఆర్పీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది రైతుల భూ వివరాలను ఖచ్చితంగా జియోట్యాగ్ చేసి, రైతుల ఫొటోలను కూడా అప్లోడ్ చేస్తున్నారని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం ప్రతి రైతుకు అందుబాటులో ఉండేలా సాంకేతిక పద్ధతులను వినియోగిస్తూ, ఫీల్డ్ స్థాయిలో సిబ్బంది సమన్వయంతో పర్యవేక్షణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. -
అచ్చెన్నకు ఆటవిడుపు
ప్రజలకు డయేరియా జడుపు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం నగరంలో డయేరియా మరింత విస్తరిస్తోంది. నగరంలో మిగతా ప్రాంతాలకు పాకింది. చాప కింద నీరులా అనే కంటే అంతకంటే ఎక్కువగా విస్తరిస్తోంది. కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఎక్కడ ఏ కేసులున్నాయో కూడా తెలియడం లేదు. అధికారులు కూడా కేసుల విషయాన్ని ధ్రువీకరించడం లేదు. తెలియని మరణాలు సంభవిస్తున్నాయి. మరోవైపు నగరమంతా అధికారుల అలర్ట్ అయ్యారు. గత వారం రోజులుగా ప్రబలుతున్న డయేరియా అదుపులోకి రావడం లేదు సరికదా మరింత ఎక్కువవుతోంది. రోగులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. మంత్రులూ మీకిది తగునా.. వారం రోజులుగా సొంత జిల్లా కేంద్రంలో డయేరియా ప్రబలి.. ప్రజలు మరణిస్తుంటే దగ్గరుండి పరిస్థితిని చక్క దిద్దాల్సిన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు జిల్లాలో అడ్రస్ లేకుండా పోయారు. ఫోన్లతోనే గడిపేస్తున్నారు. డయేరియాతో నగరం అతలాకుతలం అవుతుంటే అమరావతిలో ఆటవిడుపు అంటూ ఆటలాడుకుంటున్నారు. డయేరియా ప్రబలిందని తెలిసినా కూడా జిల్లాకు రాలేదు. రోమ్ నగరం తగలబడుతుంటే చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్న చందంగా అచ్చెన్నాయుడు సేదతీరుతున్నారు. ఒక మంత్రిగా, జిల్లాకు చెందిన నేతగా బాధ్యతగా వ్యవహరించాల్సిన వ్యక్తి ప్రజలకు అందుబాటులో లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లా మంత్రే కాదు ఇన్చార్జీ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు కూడా అదే తరహాలో వ్యవహరించారు. ఆయన కూడా బాధ్యతగా శ్రీకాకుళం నగరంలో పర్యటించి బాధితులకు అండగా నిలవాల్సింది పోయి చోద్యం చూస్తున్నారు. విస్తరిస్తున్న అతిసార వ్యాధి రోజురోజుకీ పెరుగుతున్న కేసులు కిటకిటలాడుతున్న ఆస్పత్రులు సరిపోని సర్కారు సాయం మంచి నీటి ట్యాంక్లో ఏం లభ్యమైంది..? ఆటవిడుపులో మంత్రి అచ్చెన్నాయుడు నగరానికి నీరు అందించే ఒక ట్యాంక్లో ఏదో జరిగిందని.. మరేదో బయట పడిందని నగరమంతా ప్రచారం జరుగుతోంది. దాని వల్ల మంచి నీళ్లు కలుషితమై ఈ పరిస్థితి ఏర్పడిందని చర్చ నడుస్తోంది. దీనిపై వివరణ ఇవ్వాల్సిన అధికారులు నోరు మెదపడం లేదు. మరో వైపు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విస్తృతంగా నగరమంతా పర్యటిస్తున్నారు. కొత్త కొత్త ప్రాంతాలకు వెళ్లి పరిశీలించడం వల్ల ఏదో జరుగుతోందనే చర్చతో పాటు ఆందోళనకర పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరణాల నుంచి రోగుల సంఖ్య వరకు అంతా గోప్యంగా ఉంచుతున్నారు. -
ప్రజారోగ్యంతో చెలగాటం
● చంద్రబాబు పాలనలో అన్ని వ్యవస్థలు అధ్వానం ● వైఎస్సార్ సీపీ టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్ టెక్కలి: చంద్రబాబు పాలనలో నీళ్లు, పాలు కల్తీతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మాట్లాడు తూ అధికారం చేపట్టినప్పటి నుంచి అడ్డదారిలో ఎలా దోపిడీ చేయాలనే ఆలోచన తప్ప చిత్తశుద్ధిగా ప్రజా సంక్షేమం కోసం పాలన అందజేయడం లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తున్న ప్రతిసారీ రాష్ట్రంలో ఏదో ఒక విధంగా అల్లర్లు సృష్టిస్తున్నారని తిలక్ మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు పూర్తిగా పదవుల ను ఎంజాయ్ చేస్తున్నారు తప్ప ప్రజలకు అవసరమైన సంక్షేమం కోసం ఆలోచన చేయడం లేదని తిలక్ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీవారి లడ్డూ వ్యవహారం, ఇందాపూర్–హెరిటేజ్ ఒప్పందాలపై శాసనమండలిలో ప్రతిపక్ష ఎమ్మెల్సీలు నిలదీసే క్రమంలో అధికార పార్టీ సభ్యులు తప్పించుకునే ప్రయత్నాలు చేయడం చంద్రబాబు నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. అమరావతిలో భూ మాఫియా చేస్తున్నారని ఆ విషయం బయటకు తెలియకుండా ప్రజల్ని తప్పుదారి పట్టించే విధంగా వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలకు నిత్యవసరమైన పాలు కల్తీ జరిగి ఎంతో మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని, దీనిపై హెరిటేజ్ సంస్థలో ఎందుకు తనిఖీలు నిర్వహించడం లేదని తిలక్ నిలదీశారు. కేవలం నామమాత్రంగా కొన్ని డెయిరీల్లో తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారని దుయ్యబట్టారు. జిల్లా కేంద్రంలో మంచినీరు సైతం కల్తీ జరిగి డయేరియా విజృంభించి ప్రాణాలు కోల్పోతుంటే, మంత్రి అచ్చెన్నాయుడు మాత్రం ఆటలు ఆడుకుంటున్నారని తిలక్ ఎద్దేవా చేశారు. జిల్లా కేంద్రంలో ప్రతి క్షణం డయేరియా నివారణ చర్యల్లో పనిచేయాల్సిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు తప్పించుకుని తిరుగుతున్నారని విమర్శించారు. -
వసతి గృహాల్లో నీరుత్సాహ వైఖరి..
● జిల్లా కేంద్రంలో భయం గుప్పిట్లో హాస్టల్ విద్యార్థులు ● శుద్ధజలం అందక ఇక్కట్లు ● వార్డెన్లతో సమావేశమైనా నిర్వహించని ఉన్నతాధికారులు శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా కేంద్రంలో డయేరియా ప్రబలుతుంటే.. హాస్టల్ విద్యార్థులు వణికిపోతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలోనూ తమకు శుద్ధమైన తాగునీరు ప్రశ్నార్థకంగానే ఉందని విద్యార్థులు చెబుతున్నారు. సంబంధిత శాఖాధికారులు కూడా నిర్లక్ష్యంగా ఉండడంతో వసతి గృహ విద్యార్థులు అతిసారం బారిన పడుతున్నారు. శుక్రవారం కొందరు విద్యార్థులకు డయేరియా సోకినట్లు నిర్ధారించారు. జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ పరిధిలో ప్రీ మెట్రిక్లో బాలురు వసతి గృహం ఒకటి ఉంది. కళాశాల పరిధిలో బాలికలకు నాలుగు, బాలురకు రెండు వసతి గృహాలు ఉన్నాయి. సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో కళాశాల స్థాయిలో పురుషులకు రెండు, మహిళలకు మూడు వసతి గృహాలు ఉన్నాయి. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ప్రీ మెట్రిక్లో బాలురుకి ఒకటి, కళాశాల మహిళా వసతి గృహాలు రెండు, పురుషుల వసతి గృహాలు రెండు ఉన్నాయి. వీటిలో పాటు గురుకులాలు ఉన్నాయి. తాగునీరు ఉందా..? జిల్లా కేంద్రంలోని సంక్షేమ వసతి గృహాల్లో తాగునీరు దొరకడం లేదు. దీంతో వారు నగర పాలక సంస్థ కుళాయిలు, బోర్లపైనే ఆధారపడుతున్నారు. అయితే ఇటీవల నగరంలో పైప్లైన్లు లీక్ కావడంతో నీరు స్వచ్ఛత లేకుండాపోయింది. దీంతో నగర వాసులతో పాటు వసతి గృహ విద్యార్థులు కూడా నగర పాలక సంస్థ పంపిణీ చేసిన తాగునీటినే వాడడంతో విద్యార్థులు అస్వస్థతకు గుర య్యారని తెలుస్తోంది. ఆపత్కాలంలోనైనా ట్యాంకర్ల నీటిని వినియోగించాల్సి ఉన్నా వార్డెన్లు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. పర్యవేక్షణ లోపం ఈ వసతి గృహాలను పర్యవేక్షించాల్సిన ఆ శాఖ ఉన్నతాధికారిణి కేవలం కార్యాలయం పనులు, వారి సొంత పనులు తప్ప సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగరంలో పరిస్థితి తీవ్రతను గుర్తించిన అధికారులు కనీసం వార్డెన్లకు సమావేశం నిర్వహించి తాగునీరు, పారిశుద్ధ్యం, ఇతర వసతులపై మాట్లాడిన సందర్భమూ లేదు. దీంతో బీసీ, ఇతర సంక్షేమ వసతి గృహాల్లో నిర్లక్ష్యం తాండవిస్తోంది. హాస్టల్ పిల్లలు కూడా రోజూ నగరంలో ఇతర పనులకు వెళ్తున్నట్లు సమాచారం. పర్యవేక్షణ లోపం వల్ల పిల్లలు కేటరింగ్ పనులకు వెళ్తున్నా పట్టించుకోవడం లేదు. -
ఉపాధికి కొత్తరూపు..!
శ్రీకాకుళం పాతబస్టాండ్: గ్రామాల్లో వలసల నివారణకు ఇదివరకు ఉన్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రూపురేఖలు మారనున్నాయి. ఈ చట్టంలో పలు మార్పులు తీసుకు రావడంతో పాటు పథకం పేరును మారుస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. ఎన్ఆర్ఈజీఎస్ను వీబీ–జీ రామ్–జీ పథకంగా (వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్–గ్రామీణ్) పేరును మార్పు చేసింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో ఇక ఈ పథకం ద్వారా వచ్చే నిధుల శాతం కూడా మారనుంది. 2026–27 ఆర్థిక సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా నూతన ఉపాధి హామీ చట్టం అమల్లోకి రానుంది. ఇప్పటికే ఈ నూతన చట్టానికి సంబంధించి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఏడాదికి 125 రోజుల పనిదినాలు కొత్తగా వస్తున్న వీబీ–జీ రామ్–జీ పథకం ద్వారా కూలీలకు ఏడాదికి 125 రోజులు పని దినాలు కల్పించనున్నారు. గతంలో ఏడాదికి 100 పని దినాలు ఉండేవి. వాటికి అదనంగా 25 రోజులు పెంచారు. ఇక రోజువారీ వేతనం రూ.311ల వరకు అందించనున్నారు. గతంలో పని అడిగితే జాబ్ కార్డు ఉన్న వారందరికీ పని కల్పించేవారు. జాబ్ కార్డు లేని కుటుంబాలకు జాబ్ కార్డును కూడా అందజేసేవారు. ఎంత పనినైనా చేసే అవకాశం ఉండేది. అయితే ప్రస్తుత నూతన చట్టంలో కొన్ని మార్పులు తీసుకొచ్చారు. గ్రామ పంచాయతీల్లో కూలీల ఆధారంగా బడ్జెట్ కేటాంచనున్నారు. నిర్ణీత సమయంలో ఉపాధి కల్పించకపోతే 15 రోజుల్లో కూలీలకు నిరుద్యోగ భృతి అందించే విధంగా చట్టంలో మార్పులను చేశారు. ఎక్కువ రోజులు పనిచేసేందుకు అవకాశం లేదు. ముందుగా నిర్ణయించిన మేరకే పనులు చేయాల్సి ఉంటుంది. పనికి హాజరైతేనే వేతనాలు కొత్త చట్టంలో నూతన సాంకేతిక విధానంతో కూడిన పర్యవేక్షణ చేయనున్నారు. కూలీల బయోమెట్రిక్, జియో ట్యాగింగ్, రియల్ టైం డాష్ బోర్డులతో సాంకేతికతతో కూడిన పర్యవేక్షణ ఉంటుంది. ఈ సాంకేతిక విధానంలో దొంగ మస్తర్లకు కాలం చెల్లినట్టే. పని చేస్తున్న ప్రదేశాన్ని జియో ట్యాగింగ్ చేస్తారు. అక్కడికి వెళ్లి కూలీలు బయోమెట్రిక్ వేస్తేనే హాజరు నమోదు అవుతుంది. దీంతో పాటు ఫొటో, పని ముగిసిన వెంటనే మరోసారి బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది. ఈ విధానంలో పనులకు వస్తేనే వేతనం అందించే విధంగా మార్పులు చేపట్టారు. 10 రోజుల్లోనే వేతనాలు కొత్తచట్టంలో పనులకు హాజరయ్యే కూలీలకు 10 రోజుల్లోనే వేతనాలు ఖాతాలకు జమ చేస్తారు. పనులకు హాజరైన వెంటనే వారి వివరాలు వీబీ–జీ రామ్–జీ నూతన యాప్లో నమోదవుతాయి. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక బడ్జెట్లను కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను కేటాయిస్తే.. కేంద్ర ప్రభుత్వం 60 శాతం మేర నిధులను కేటాయించే విధంగా చట్టంలో మార్పులు చేశారు. రాష్ట్ర వాటా చెల్లిస్తేనే కేంద్రం వాటా నిధులు విడుదల చేస్తారు. అలాగే పనిచేసే చోట మౌలిక వసతులు కల్పించాలి, లేకుంటే ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. ఇందుకు ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేయనున్నారు. ఏప్రిల్ నుంచి అమల్లోకి... ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా నూతన ఉపాధి చట్టం వీబీ–జీ రామ్–జీ అమల్లోకి రానుంది. పెంచిన పనిదినాలతో జిల్లావ్యాప్తంగా 5 లక్షల మంది కూలీలకు ప్రయోజనం చేకూరనుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నిధులు సకాలంలో చెల్లించే అవకాశం ఉండదని, దీని వలన పని దినాలు ఉన్నా, పనికి వేతనం అందించడంలో ఇబ్బందులు వస్తాయని ప్రజా సంఘాలు, రైతుల కూలీ సంఘాలు ఈ కొత్త చట్టంపై విమర్శలు చేస్తున్నాయి. నేటి నుంచి అవగాహన సదస్సులు నూతన ఉపాధి చట్టం ప్రకారం జిల్లావ్యాప్తంగా శనివారం నుంచి విస్తృతంగా అవగాహన కల్పించనున్నట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) ప్రాజెక్టు డైరెక్టర్ బి.లవరాజు తెలిపారు. భారత ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఆరు వారాల పాటు ‘జన్–సంవాద్’ పేరుతో క్షేత్రస్థాయిలో చైతన్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వారాల వారీగా కార్యాచరణ మొదటి వారం: మీడియా సమావేశాల ద్వారా అపోహల తొలగింపు. కొత్త చట్టం విశిష్టతపై కరపత్రాల పంపిణీ. రెండో వారం: గ్రామాల్లో ‘హక్కుల రక్షణ ప్రతిజ్ఞ’ కార్యక్రమాలు. మూడో వారం: గ్రామసభల్లో రచ్చబండ కార్యక్రమాలు, గోడ పత్రికల ద్వారా ప్రచారం. నాలుగో వారం: పాఠశాల విద్యార్థులకు పోటీ లు, గాంధీజీ సూక్తులతో అవగాహన ర్యాలీలు. ఐదో వారం: పంచాయతీరాజ్ ప్రతినిధులతో సదస్సులు. ఆరో వారం: కనీసం 100 రోజుల పని పూర్తి చేసిన శ్రామికులకు సన్మానం. పేరు మార్పుచేస్తూ కొత్తచట్టం ఇక నుంచి 125 పనిదినాలు మారనున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల శాతం కొత్తచట్టంపై పలువురి విమర్శలు -
చేపల ఉత్పత్తులతో అధిక లాభాలు
ఆమదాలవలస: చేపలతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీతో అధిక లాభాలు పొందవచ్చునని శాస్త్రవేత్త, శిక్షణా నిపుణులు డాక్టర్ వీరాంజనేయులు, డాక్టర్ కోటేశ్వర్లు సూచించారు. జాతీయ మత్స్య అభివృద్ధి మండలి మరియు కృషి విజ్ఞాన కేంద్రంలో చేపలు, రొయ్యలతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై 5 రోజుల శిక్షణ కార్యక్రమం శుక్రవారం ప్రారంభించారు. చేపలు, రొయ్యలు పరిశుభ్ర పరిస్థితుల్లో పెంపకాలు చేపడితే వాటి నాణ్యత తక్కువ కాకుండా ఉంటుందని సూచించారు. కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ డాక్టర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ చేపలను వివిధ రూపాలలో నాణ్యత కోల్పోకుండా మార్కెట్ చేసుకోవడం ద్వారా మత్స్యకారులకు ఆదాయం, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ సీహెచ్ బాలకృష్ణ మాట్లాడుతూ చేపలు మానవ ఆహారంలో చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటాయన్నారు. నాణ్యతగా వినియోగదారులకు అందించే విధానాన్ని తెలిపారు. కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు, సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు. -
రక్తసంబంధీకులు..!
● సామాజిక దృక్పథం చాటుకుంటున్న విద్యార్థులు ● ఉపాధ్యాయుల స్ఫూర్తితో రెడ్క్రాస్ సభ్యులుగా సేవలు ● 8 ఏళ్లుగా రక్తదాన శిబిరాలు నిర్వహణ శ్రీకాకుళం కల్చరల్: విద్యతో పొందిన జ్ఞానం సమాజానికి ఉపయోగపడితేనే అది నిజమైన విద్య అన్నటువంటి సూక్తిని నగరంలోని పీఎన్ కాలనీలో ఉన్నటువంటి న్యూ సెంట్రల్ స్కూల్ ఉపాధ్యాయులు చాటి చెబుతున్నారు. గత 8 ఏళ్లుగా విద్యార్థులకు సామాజిక దృక్పథం అలవర్చుచుకునేలా బోధన చేస్తున్నారు. వారిచ్చిన స్ఫూర్తితో 473 మంది విద్యార్థులు జూనియర్ రెడ్క్రాస్ సభ్యులుగా సేవలందిస్తున్నారు. వీరంతా ప్రతీ ఏడాది తమ తల్లిదండ్రులను, తమకు తెలిసిన వారిని మోటివేట్ చేస్తూ మరింతగా ముందుకెళ్తున్నారు. పాఠశాల వార్షికోత్సవంలో... పాఠశాల విద్యార్థుల్లో సామాజిక బాధ్యత నేర్పే క్రమంలో ప్రతి ఏడాది మార్చి మొదటి వారంలో జరిగే పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తారు. దీనిలో భాగంగా రక్తదానంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించి, భారీస్థాయిలో రక్తపు యూనిట్లు సేకరించి రెడ్క్రాస్ సంస్థకు అందజేస్తారు. రక్తదాన శిబిరాలు ప్రారంభించిన సంవత్సరం నుంచి 95 యూనిట్లు సేకరిస్తే.. గత సంవత్సరం 258 యూనిట్లు రక్తాన్ని సేకరించడం జరిగింది. అంటే ఈ మహా యజ్ఞంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భాగస్వాములవుతున్న పరిణామం ఆదర్శనీయం. ఈ ఏడాది కూడా మార్చి 1వ తేదీన స్కూల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నారు. 23 యూనిట్స్ అందించాం స్కూల్లో చదువుతున్న మేము మా ఉపాధ్యాయుల సూచ నల మేరకు ఇప్పటివరకు 23 యూనిట్స్ మా ద్వారా ఇచ్చాం. ఎంతో ఆనందంగా ఉంది. మేము రెడ్క్రాస్లో సభ్యులుగా ఉన్నాం. – పి.జూహిత్రాజ్, జెస్వీ మా ద్వారా 12 యూనిట్లు ఇప్పటివరకు మా ద్వారా 12 యునిట్లు సేకరించాం. రెడ్క్రాస్ సభ్యులుగా మా తల్లిదండ్రులు, మా చుట్టాలకు రక్తదానంపై అవగాహన కల్పిస్తున్నాం. వారితో రక్తదానం చేయిస్తున్నాం. – బి.కార్తికేయ, రేణు రెహన్షి మేమూ సమాజ సేవలో మా చిన్నతనం నుంచి సేవాభావాన్ని మాలో నింపిన యాజమాన్యానికి ధన్యవాదాలు. మేము కూడా జూనియర్ రెడ్క్రాస్ సభ్యత్వం తీసుకొని ఇప్పటివరకు 8 యూనిట్ల రక్తం సేకరించాము. దీనికి మాకు సంతోషంగా ఉంది. – జె.జస్వంత్, జె.ప్రభాస్ 1న రక్తదాన శిబిరం ఈ ఏడాది కూడా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాం. గతేడాది చాలా మంది వచ్చి రక్తదానంలో పాల్గొన్నారు. మా విద్యార్థులకు సామాజిక దృక్పథం అవసరమని సూచిస్తున్నాం. దాని ఫలితంగా గతేడాది ఎక్కువ రక్తం యూనిట్లు సేకరణ చేశాం. ఈ ఏడాది కూడా మరలా మార్చి 1వ తేదీన పాఠశాలలో రక్తదాన శిబిరం నిర్వహిస్తాం. – పి.శ్రీకాంత్, న్యూ సెంట్రల్ స్కూల్ డైరెక్టర్ -
భారీ ట్యూమర్ తొలగింపు
శ్రీకాకుళం క్రైమ్: అప్పటికే గుండెకు బైపాస్ సర్జరీ జరిగిన 78 ఏళ్ల వృద్ధురాలి పొత్తి కడుపులో పెరిగిన 10 కిలోల బరువున్న భారీ ట్యూమర్ను శ్రీకాకుళంలోని మెడికవర్ ఆస్పత్రి వైద్యులు తొలగించారు. దీనికి సంబంధించి సర్జికల్ అంకాలజిస్టు డాక్టర్ బమ్మిడి సందీప్ మాట్లాడుతూ రోగిలో ట్యూమర్ పరిమాణం పెద్దదిగా ఉండడంతో పొత్తి కడుపులోని ఇతర అవయవాలపై ఒత్తిడి పెరిగి ప్రాణాపాయం జరిగేదన్నారు. వృద్ధురాలు కావడం, అప్పటికే గుండె బైపాస్ సర్జరీ జరిగి ఉండటంతో మళ్లీ శస్త్ర చికిత్స చేయడం హైరిస్క్గా భావించామని, అయినప్పటికీ బహుళ విభాగాల వైద్య బృందం సమన్వయంతో ట్యూమర్ను తొలగించగలిగామని చెప్పారు. శస్త్ర చికిత్సకు ముందు గుండె పనితీరును పూర్తిగా అంచనా వేసి, ఆపరేషన్ సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నామని, ప్రస్తుతం గుండె పనితీరు స్థిరంగా ఉందన్నారు. రేపు జిల్లాస్థాయి ఆర్చరీ ఎంపిక పోటీలుశ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి ఆర్చరీ క్రీడాకారుల ఎంపిక పోటీలు ఆదివారం శ్రీకాకుళం జిల్లా ఆర్చరీ అసోసియేషన్, డీఎస్ఏ సంయుక్త ఆధ్వర్యంలో జరగనున్నాయని ఆ సంఘ ప్రధాన కార్యదర్శి లోపింటి చిట్టిబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని అరసవల్లి రోడ్డులోని ఆదిత్య ఆర్చరీ అకాడమీ, కొయ్యన కన్నయ్యనగర్ వేదికగా ఎంపిక పోటీలు ఉదయం 10.30 గంటల నుంచి మొదలవుతాయని చెప్పారు. మినీ అండర్ –10, అండర్–13, అండర్ –15, ఇండియన్ రౌండ్, రికర్వే, కాంపౌండ్ విభాగాల్లో క్రీడాకారుల ఎంపిక పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. కృష్ణ జిల్లా నూజివీడులో ఈనెల 11వ తేదీన జరగనున్న ఏపీ రాష్ట్రస్థాయి ఆర్చరీ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారుల ఎంపికలను ఇక్కడ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్కార్డు, నాలుగు పాస్ ఫొటోలు, ఎంట్రీ ఫీజుతో హాజరుకావాలని కోరారు. మరిన్ని వివరాలకు 94406 77201, 99899 78727 నంబర్లను సంప్రదించాలని సూచించారు. చికిత్స పొందుతూ మహిళ మృతి బూర్జ: మండలంలోని ఓవీపేట గ్రామానికి చెందిన సాకేటి అమ్మన్నమ్మ (58) విశాఖపట్టణంలోని కేజీహెచ్లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. స్థానిక పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. ఈనెల 25వ తేదీన సాయంకాలం వర్షం పడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆ సమయంలో ఆమె వెలుగు కోసం కొవ్వొత్తి వెలిగించింది. వెలిగించిన కొవ్వొత్తి దుస్తులకు అంటుకోవడంతో ప్రమాదంతో ఆమె శరీరం కాలిపోయింది. వెంటనే శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. అనంతరం అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం విశాఖపట్టణంలోని కేజీహెచ్లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమెకు వివాహమైన కూతురు, కొడుకు ఉన్నారు. ఫిర్యాదు మేరకు స్థానిక ఇన్చార్జి ఎస్ఐ బి.హైమావతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య ఇచ్ఛాపురం: పట్టణంలో గత 15 ఏళ్లుగా తాపీమేసీ్త్రగా జీవనం సాగిస్తున్న పైడి డిల్లేశ్వరరావు(50) అప్పుల బాధ తాళలేక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పొందూరు మండలం కింతలి గ్రామానికి చెందిన డిల్లేశ్వరరావు తాపీమేసీ్త్రగా జీవనం సాగిస్తుండేవాడు. ఇతను స్థానికంగా పనులు చేసుకుంటూ స్వగ్రామంలో ఉంటున్న కుటుంబ సభ్యులకు డబ్బులు పంపేవాడు. ఈ క్రమంలో ఇతని ఇద్దరు కుమార్తెలకు వివాహం చేసేందుకు కొంతమొత్తంలో పట్టణంలో అప్పులు చేశాడు. తాను చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోవడంతో చేసిన అప్పులు తీరకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి భోజనం చేసి ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయాడు. అనంతరం పట్టణంలోని సురంగిరాజావారి కోట వెనుక భాగంలో ఉన్న తోటలో చెట్టుకి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. చెట్టుకి వేలాడుతున్న మృతదేహాన్ని చూసిన స్థానికులు పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక సీహెచ్సీకి మృతదేహాన్ని తరలించారు. పట్టణ ఎస్ఐ ముకుందరావు కేసు నమోదు చేశారు. -
స్వప్నం.. సాకారం
● తొలి ప్రయత్నంలో 3 బ్యాంకుల్లో ఉద్యోగాలు గార: పట్టుదలే పెట్టుబడిగా.. క్రమశిక్షణే ఆయుధంగా ఓ సాధారణ ఇల్లాలు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు బ్యాంకు ఉద్యోగాలు సాధించారు. కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదంటూ రుజువు చేశారు. మండలంలోని జొన్నలపాడుకి చెందిన ఎం.స్వప్న సాధారణ కుటుంబంలో పుట్టి డిగ్రీ వరకు చదువుకున్నారు. పెళ్లయిన తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టి.. ఉద్యోగ సాధనే లక్ష్యంగా కష్టపడ్డారు. ఆ కష్టానికి ఫలితంగా ఇటీవల విడుదలపై ఐపీబీఎస్ పీవో (బ్యాంకు ఆఫ్ బరోడా), ఆర్ఆర్బీ పీవో (తెలంగాణ గ్రామీణ బ్యాంకు), శుక్రవారం విడుదలైన స్టేట్బ్యాంకు ఆఫ్ ఇండియాలో జూనియర్ అసోసియేట్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. స్వప్న భర్త సాక్షి దినపత్రికలో సబ్ ఎడిటర్గా పనిచేస్తుండగా, అత్త, మామలది చేనేత కుటుంబం. ఆమె స్వస్థలం విశాఖపట్నం.స్వప్న -
రోజుకో ఇన్చార్జి కమిషనర్
శ్రీకాకుళం: శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్గా రోజుకొకరిని మున్సిపల్ శాఖ నియమిస్తోంది. కమిషనర్ను సస్పెండ్ చేసిన తర్వాత వచ్చిన ఉత్తర్వుల్లో మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ను ఇన్చార్జిగా నియమించారు. ఆయన ఆరోగ్యం సరిగా లేదని చెప్పడంతో ఆయన స్థానంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ను ఇన్చార్జి కమిషనర్గా నియమించారు. ఆయనకు సహాయకునిగా జీవీఎంసీ కమిషనర్ నల్లనయ్యను నియమిస్తూ శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్ర మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు జారీ అయిన గంటలోనే దాన్ని రద్దు చేస్తూ జీవీఎంసీలో కమిషనర్గా పనిచేస్తున్న బొడ్డేపల్లి రామును కమిషనర్కు సహాయకునిగా నియమిస్తున్నట్లు మళ్లీ ఉత్తర్వులు వెలువరించింది. రోజుకో పేరుతో ఎందుకంత గందరగోళం సృష్టిస్తున్నారో నగర వాసులకు అర్థం కావడం లేదు. నల్లనయ్యకు శ్రీకాకుళం నగరంపై మంచి పట్టు ఉండడం వల్ల తొలుత ఆయనను నియమించారు. అయితే ఆయన నియామకాన్ని ఎందుకు రద్దు చేశారన్నది అర్థం కావడం లేదు. కొత్తగా ఇన్చార్జి కమిషనర్ సహాయకునిగా వస్తున్న రాము కేవలం పారిశుద్ధ్యం, తాగునీరు సరఫరా వంటి వాటిని మాత్రమే పర్యవేక్షిస్తారని తెలుస్తోంది. ● శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్కు సహాయకునిగా బొడ్డేపల్లి రాము ● అంతకుముందు నల్లనయ్య పేరిట ఉత్తర్వులు వెలువరించి ఉపసంహరించుకున్న అధికారులు -
చిట్టీల వ్యాపారమే కారణమా..?
● హత్య కేసులో పోలీసుల అదుపులో అనుమానితులు? శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని పొన్నాడ వంతెన సమీప వెంకన్నగారిపేట రాజీవ్గారి తోటలో గురువారం జరిగిన హత్య కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఎచ్చెర్ల పరిధిలో ఈ హత్య జరగడంతో విచారణాధికారిగా జేఆర్పురం సీఐ ఎం.అవతారం సమక్షంలోని ఓ బృందంతో పాటు ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆదేశాలతో మరో రెండు బృందాలు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాయి. అయితే హత్యకు గురైన పైలా మోహన్ చిట్టీల వ్యాపారం చేస్తుంటాడని, ఆ వ్యాపార లావాదేవీల్లో జరిగిన తేడా వలనే ఈ హత్య జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఆ కోణంలో ఇప్పటికే ఇద్దరి అనుమానితులను కాల్డేటా, సీసీ ఫుటేజీ, ఇతర సాంకేతిక ఆధారాల సాయంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. వీరిలో ఒకరిది విశాఖపట్నం కాగా, మరొకరు నగరానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. కారులో నలుగురొచ్చారా..? హత్య జరిగిన ప్రదేశానికి సమీపంలో ఉన్న వైన్షాపులో నిందితులు మద్యం బాటిళ్లను కొనుగోలు చేశారని, శుక్రవారం రాత్రే నిర్ధారణకొచ్చిన పోలీసుల అక్కడి సీసీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. దాబాలు, బ్రిడ్జివైపు ఉన్న సీసీ కెమెరాలు కూడా పరిశీలించారు. హత్యకు గురైన మోహన్, ఇంటి నుంచి బయల్దేరిన సమయంలో ఎవరెవరితో ఫోన్లో మాట్లాడారన్నది కాల్డేటా తీయడం.. అప్పటికే పరిశీలించిన సీసీ ఫుటేజీలో కారులో నలుగురు వ్యక్తులు రావడం, వారితో కలిసి మోహన్ వెళ్లడం పోలీసులు పరిశీలించినట్లు తెలుస్తోంది. ముందుగా వైన్షాపులో మద్యం బాటిళ్లు కొని, తర్వాత సమీప దాబాలో ఫుడ్ కట్టించుకుని తోటలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. హత్యకు గురైన వ్యక్తి హిజ్రాల సంఘానికి జిల్లా నాయకునిగా ఉన్నారు. ఎప్పటికప్పుడు వారిలో పోలీసులకు పట్టుబడిన విశాఖ వ్యక్తే ఇక్కడికొచ్చి పార్టీలిస్తున్నట్లు స్థానికంగా అనుకుంటున్నారు. ఆర్థిక లావాదేవీల్లో తేడా కారణంతోనే తుదముట్టించారన్న దిశగానే పోలీసుల దర్యాప్తు సాగుతుందన్నది విశ్వసనీయ సమాచారం. ఘటనా స్థలం పరిశీలన ఎచ్చెర్ల: పైల మోహన్ హత్య జరిగిన సంఘటన స్థలాన్ని డీఎస్పీ వివేకానంద శుక్రవారం ఉదయం పరిశీలించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలను సేకరించారు. ఆయనతోపాటు ఎచ్చెర్ల ఎస్ఐ జి.లక్ష్మణరావు ఉన్నారు. -
● ఆమె నేత్రాలు సజీవం
శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని కాకివీధికి చెందిన జంగేటి ఆదిలక్ష్మి(85) మరణించారు. దీంతో ఆమె నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. దీంతో కుటుంబ సభ్యులు నేత్రదానం కోసం రెడ్క్రాస్ చైర్మన్ను సంప్రదించారు. మగటపల్లి కల్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్ పూతి సుజాత, పి.చిన్నికృష్ణల ద్వారా ఆమె కార్నియాలు సేకరించి విశాఖపట్నంలోని ఎల్వీ ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు. ప్రస్తుత కాలంలో నేత్రదానంపై అవగాహన, చైతన్యం ప్రజల్లో పెరుగుతుందని, ఈ విధంగా నేత్రదానం ద్వారా మరొకరికి ఈ ప్రపంచాన్ని చూసే అవకాశం కలుగుతుందని చైర్మన్ జగన్మోహన్రావు, కార్యదర్శి బి.మల్లేశ్వరరావు, కోశాధికారి కె.దుర్గా శ్రీనివాస్లు అన్నారు. నేత్రదానం చేయాలనుకునేవారు 78426 99321 నంబర్ను సంప్రదించాలన్నారు. -
ఇవేం పనులు..?
● అభివృద్ధి పనుల్లో నాణ్యతకు తిలోదకాలు ● కొరవడిన పర్యవేక్షణ ఆమదాలవలస: శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) రైల్వేస్టేషన్ను అమృత్ భారత్ రైల్వేస్టేషన్గా ఎంపిక చేసి ఏడాది కాలంగా రూ.కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. దీనిలో భాగంగా స్టేషన్ వెనుక భాగంలో గదుల నిర్మాణాలకు పిల్లర్లు వేశారు. అయితే పిల్లర్స్ మధ్యలో నిబంధనల ప్రకారం ఇసుకతో గానీ.. కంకరతో గానీ ఫిల్లింగ్ చేయాల్సి ఉండగా, స్టేషన్ పక్కనుంచి పారుతున్న మురుగు కాలువలో మట్టిని తీసి వేస్తున్నారు. దీంతో పనులు నాణ్యత దెబ్బతింటుందని స్థానికులు చర్చించుకుంటున్నారు. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడి కనుసైగలతో నిర్వహిస్తున్న ఈ పనుల్లో నాణ్యతకు తిలోదకాలిస్తున్నారని అంటున్నారు. ఈ పనుల పర్యవేక్షణలో రైల్వే అధికారులు కూడా మంత్రి ఆదేశాలతో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. భవనం నిర్మాణ సమయంలో పునాది లెవెల్లో ఇలా నాణ్యతా ప్రమాణాలు పాటించకుంటే భవిష్యత్లో భవనాలు కూలే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడా లేనివిధంగా కాంట్రాక్టర్కు కాసులు మిగలడంతో పాటు తాబేదారులకు ముడుపులు చెల్లించేందుకు ఇలాంటి మురికి మట్టిని ఫిల్లింగ్ చేసి నాసిరకం పనులు చేస్తున్నట్లు ప్రయాణికులు మండిపడుతున్నారు. ఇప్పటికై నా ఈ పనులపై సమగ్రమైన పరిశీలన జరిపి ప్రజలకు ఉపయోగపడే విధంగా పనులు నిర్వహించాలని కోరుతున్నారు. -
సంక్షేమం లేదు.. అభివృద్ధి జరగడం లేదు
● పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి పాతపట్నం: రాష్ట్రంలో రెండేళ్లుగా ఎటువంటి సంక్షేమం లేదని, అలాగే అభివృద్ధి జరగడం లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆరోపించారు. పాతపట్నంలోని తన క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని, సంపద సృష్టిస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన సీఎం చంద్రబాబు, ఆ తర్వాత ఆ విషయాన్నే మర్చిపోయారని ఎద్దేవా చేశారు. సంపద సృష్టి మాట దేవుడెరుగు.. అప్పుల్లో మాత్రం కొత్త రికార్డులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. 20 నెలల కాలంలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తమైందని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు, ఇతర సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో డీబీటీ పద్ధతిలో ఐదేళ్లలో ఏకంగా రూ.2,73,756 కోట్లు రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా అందాయని గుర్తు చేశారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో మెళియాపుట్టి పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు ఉర్లాన బాలరాజు, పార్టీ మండల అధ్యక్షుడు సవిరిగాన ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీకాకుళం జిల్లాలో అదుపులోకి రాని డయేరియా
శ్రీకాకుళం: జిల్లాలో డయేరియా ఇంకా అదుపులోకి రాలేదు. ఇటీవల డయేరియా ప్రబలి పలువురు ఆస్పత్రిలో చేరగా, తాజాగా రెల్లి వీధి బీసీ హాస్టల్లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలతో ముగ్గురు విద్యార్థులు ఆస్పత్రిలో చేరారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల నిర్లిప్తత వల్ల గత ఆరు రోజుల నుంచి శ్రీకాకుళంలో డయేరియా విజృంభిస్తోంది. కలుషిత నీరు తాగి ప్రజలు వ్యాధి బారిన పడుతున్నారు. ఇప్పటివరకు అతిసారంతో నలుగురు దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఇద్దరు మంగళవారం ఒక్కరోజునే మరణించడం వ్యాధి తీవ్రతకు అద్దంపడుతోంది. మరో 68 మంది తీవ్ర అస్వస్థతకు గురై వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇవన్నీ అధికారిక లెక్కలే. వాస్తవానికి డయేరియా బాధితుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని, నగరంలో సగం డయేరియా విషకోరల్లో చిక్కుకుందని సమాచారం. డయేరియా ప్రబలుతున్నా.. ప్రజలు మరణిస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోలేదు. సోమవారం మధ్యాహ్నం వరకు కేసుల వివరాలు బయట పెట్టలేదు. అయితే దమ్మల వీధికి చెందిన మడ్డు లక్ష్మణ(61) వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ఆదివారం చనిపోయాడు. మోణింగి సంతోష్(41) కూడా వాంతులు, విరేచనాలతో సోమవారం ఉదయం మరణించాడు. ఆస్పత్రికి వెళ్లే వరకైనా వీరి ప్రాణాలు నిలబడలేదు. ఆ తర్వాత ఒక్కసారిగా కేసులు పెరగడంతో విషయం వెలుగులోకి వచ్చింది. -
పర్యవీక్షణకు ఫలితమిది..
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలో పనిచేసేందుకు కావాల్సినంత మంది ఇంజినీర్లు ఉన్నారు. అంతకు మించి శానిటేషన్ పర్యవేక్షణకు, ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్లు ఉన్నాయి. శ్రీకాకుళం కార్పొరేషన్లో అందరికీ సురక్షితమైన మంచినీరు అందించేందుకు, పారిశుద్ధ్యాన్ని కాపాడేందుకు పుష్కలంగా అధికారులు ఉన్నా నగరవాసులకు నరకయాతన తప్పడం లేదు. 2025 డిసెంబర్ నెలలో బలగలో ఓ వ్యక్తి డయేరియాతో మృతి చెందాడు. అయినప్పటికి మున్సిపల్ అధికారులు మేలుకోలేదు. వీరి నిర్లక్ష్యమే దమ్మలవీధిలో జరిగిన సంఘటనలో నలు గురి ప్రాణాలు గాల్లో కలిసిపోడానికి కారణమైంది. ప్రభుత్వ ఆస్పత్రిలో అయితే ఒకేచోట లెక్క దొరికిపోతుందన్న ఆలోచనతో రిమ్స్, కిమ్స్, జెమ్స్, సింధూర వంటి ఆస్పత్రుల్లో డయేరియా బాధితుల్ని అడ్మిట్ చేసి లెక్కకు దొరక్కుండా అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం కేసుల వివరాలు దాచి పెట్టే ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ సుమారు 150కి పైగా కేసులున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎందుకీ మౌనం..? గత పది రోజులుగా కుళాయిల్లోంచి మురుగునీరు వస్తున్నా, స్థానికులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం దారుణం. ఇంజినీరింగ్ విభాగంలో ఎంఈ, డీఈ, వాటర్సప్లై ఏఈలు ఉన్నప్పటికీ వారెవ్వరు పట్టించుకోలేదు. అసలు కుళాయి పైపులైన్లు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని కాలువల్లో ఉన్న పైపు లైన్లు పర్యవేక్షించిన దాఖలాలు లేవు. ఇంజినీర్లంతా కార్యాలయంలో తమకు కేటాయించిన సీట్లకే పరిమితమవ్వడమే తప్ప క్షేత్రస్థాయిలో పరిశీలన, పర్యవేక్షణ చేసిన సందర్భాలు లేవని నగర వాసులు మండిపడుతున్నారు. నగరంలో రోడ్ల విస్తరణ, కాలువల నిర్మాణ పనులు జరుగుతున్నప్పుడు ప్ర త్యామ్నాయ ఏర్పాట్లు చేయడం, కుళాయిలు పాడైపోకుండా, వాటిలో మురుగునీరు కలిసిపోకుండా చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అసవరం ఉంది. అవేమీ చేయకపోవడం వల్లే కాలువల్లో నీరు కుళా యి పైపు లైన్లలోకి వెళ్లిపోవడంతో డయేరియా వ్యాపించిందని నగరవాసులు మండిపడుతున్నా రు. అంతేకాకుండా పంపుహౌస్, ఇన్ఫిల్టరేషన్ వద్ద పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. ఆదివారంపేట పంపుహౌస్కి తలుపులు లేకుండా ఓ రేకు అడ్డుపెట్టి ఉంచారు. అక్కడ మిషనరీ విచ్చలవిడిగా పడేశారు. ఇంజినీర్లు ఫుల్.. పర్యవేక్షణ నిల్ ఇంజినీరింగ్ విభాగంలో మున్సిపల్ ఇంజినీర్ (ఎమ్ఈ)–1, డిప్యూటి ఇంజినీర్లు (డీఈలు)– 3, అసిస్టెంట్ ఇంజినీర్లు (ఏఈలు)– 4, ఎమినిటి సెక్రటరీలు– 18మంది ఉన్నారు. కానీ వారంతా గ్రౌండ్లెవల్లో పర్యవేక్షణ మాత్రం చేయడం లేదు. కమీషన్లు వచ్చే పనులపైనే దృష్టి సారించి ప్రజల ప్రాణాలకు ముప్పుగా ఉండే కుళాయిలపైన, మంచినీరు సరఫరా చేయడంపైనా దృష్టి సారించలేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు నగరంలో నిరంతరం పారిశుద్ధ్యాన్ని పర్యవేక్షించాల్సిన హెల్త్ ఆఫీసర్ నిర్లక్ష్యం వల్లే ఈ రోజు వందలాది మంది డయేరియా బారిన పడ్డారని నగర వాసులే ఆరోపిస్తున్నారు. ఇంజినీరింగ్, ప్రజారోగ్య శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిన సంఘటనకు ఇటీవల వచ్చిన మున్సిపల్ కమిషనర్ని బలిచేసి సస్పెండ్ చేసిన ప్రభుత్వ తీరుపై అధికార వర్గాలు, సామాన్య ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమే ప్రజల ప్రాణం తీసింది శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఇంజినీరింగ్, శానిటేషన్ సిబ్బంది కావాల్సినంతమంది ఉన్నారు. కానీ పర్యవేక్షణ లోపం వల్లే నగరంలో డయేరియా ప్రబలి నలుగురు మృతి చెందారు. వందలాది మంది ఆస్పత్రుల పాలయ్యారు. మృతుల కుటుంబాలకు రూ.25లక్షలు ఎక్స్గ్రేసియా ఇవ్వాలి. – టి.తిరుపతిరావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి -
మరొకరు మృతి..?
● డయేరియాతో ● అతిసారం అరికట్టేందుకు చర్యలు శ్రీకాకుళం: నగరంలో డయేరియా మృతుల సంఖ్య పెరుగుతోంది. అధికారికంగా మాత్రం ఒకరే డయేరియాతో చనిపోయారని అధికారులు చెబుతున్నారు. తాజాగా మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మరొకరు మృతి చెందారు. కోటేశ్వరరావు అనే 61 ఏళ్ల వ్యక్తి ఆదివారం సాయంత్రం నుంచి మెడికవర్లో చికి త్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మృతి చెందారు. ఆస్పత్రి వర్గాలు మాత్రం కోటేశ్వరరావు డయేరియాతో చనిపోలేదని చెబుతుండ డం గమనార్హం. ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధి తో తమ వద్దకు వచ్చాడని కిడ్నీకి మాత్రమే తాము వైద్యం చేస్తుండగా గురువారం గుండెపోటు వచ్చి చనిపోయాడని చెబుతున్నారు. సంబంధిత రోగి రిమ్స్ నుంచి రిఫరై వచ్చినప్పటికీ.. రోగి బంధువులు తమ వద్దకు తీసుకురావడంతో చేర్చుకున్నామని చెబుతున్నారు. రిమ్స్లో డయే రియాతో చేరి చికిత్స పొందినట్లు తమకు రోగి బంధువులు ఎవరూ చెప్పలేదని, తమ ఆస్పత్రికి వచ్చేసరికే ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. శ్రీకాకుళం: నగర పాలక సంస్థ పరిధిలో అతిసార వ్యాప్తిని అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతోందని జాయింట్ కలెక్టర్, ఇన్చార్జి కమిషనర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ము ఖ్యంగా వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉన్న దమ్మ ల వీధి, కాకి వీధి, మంగువారి తోట, మేదర వీధి, గుడి వీధి ప్రాంతాల్లో పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు ఫాస్ట్ ఫుడ్, మాంసం దుకాణాల వంటి ఆహార వ్యాపార సంస్థలు తమ కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించా రు. ఈ నిబంధనలను అతిక్రమించి వ్యాపారా లు కొనసాగించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పశువుల యజమానులు తమ ఆవులను, ఇతర మూగజీవాలను రోడ్లపైకి వదలకుండా ఇళ్లలోనే ఉంచాలని స్పష్టం చేశారు. ఈ ఆంక్షల ను ధిక్కరించే పశువుల యజమానులపై చట్టప్రకారం జరిమానాలు విధిస్తామన్నారు. జనం కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఇంటి పరిసరాలను, వాటర్ ట్యాంకులను శుభ్రంగా ఉంచుకోవాలని అభ్యర్థించారు. విరేచనాలు, వాంతులు లేదా జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా సమీప ప్రభుత్వ ఆస్పత్రిని సంప్రదించాలని లేదా కార్పొరేషన్ హెల్ప్ లైన్ నంబర్ 08942–228090 కు కాల్ చేయాలని తెలిపారు. -
‘నీటి పంపిణీ వ్యవస్థ ఆధునికీకరించాలి’
శ్రీకాకుళం: శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో డయేరియా ప్రబలడంపై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పందించారు. గురువారం ఉదయం ఢిల్లీ నుంచి శ్రీకాకుళం నగరం చేరుకున్న రామ్మోహన్ నాయుడు నగరంలోని ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. సాయంత్రం జిల్లా యంత్రాంగం, నగరపాలక సంస్థ అధికారులతో సమీక్ష నిర్వహించారు. భవిష్యత్లో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీ సుకోవాలని సూచించారు. మున్సిపల్ శాఖ నుంచి విడుదల కాబోతున్న నిధులు, సుడా నుంచి మంజూరైన రెండు కోట్లతో డ్రెయిన్లు, పారిశుద్ధ్యం నిర్వహించాలన్నారు. నీటి పంపిణీ వ్యవస్థను ఆధునికీకరించాలన్నారు. దీనికోసం సమగ్ర రిపోర్టును సిద్ధం చేయాలని ఆదేశించారు. -
నిర్లక్ష్యం ముంచెత్తగా..
శ్రీకాకుళంఆదర్శ పాఠశాలల్లో..ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మార్చి 31లోగా దరఖాస్తు చేసుకోవాలి. –8లో● మురుగుతో మగ్గిపోతున్న జిల్లా కేంద్రం ● దృష్టంతా ఒక ప్రాంతం పైనే.. ● పెరుగుతున్న డయేరియా కేసులు ● రోడ్ల విస్తరణ, కాలువల నిర్మాణాల్ని పర్యవేక్షించని ఇంజినీర్లు ● పంపు హౌస్, ఇన్ఫిల్టర్ల వద్ద అధ్వాన పరిస్థితులు శుక్రవారం శ్రీ 27 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026కారణం తేలలేదట.. బాధ్యుడు మాత్రం కమిషనరే! ● అధికారుల వింత వాదన శ్రీకాకుళం: నగరంలో డయేరియా ప్రబలడానికి ప్రధాన కారణం నిర్ధారణ కాలేదని అధికారులు, మంత్రులు, శాసన సభ్యులు ప్రకటిస్తూనే బాధ్యుడు మాత్రం కమిషనరే అని భా వించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దమ్మల వీధి పరిసర ప్రాంతాల్లో డయేరియా ప్రబలిందని తొలుత కార్పొరేషన్లోని ఆరోగ్య విభాగానికి సమాచారం వచ్చినప్పటికీ.. వారు సరిగా స్పందించలేదు. ఫలితంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. డయేరియాతో పాటు ఎలాంటి వ్యాధి ప్రబలినా సంబంధిత వార్డు సచివాలయాల ఆరోగ్య సిబ్బంది ద్వారా కార్పొరేషన్లోని ఆరోగ్యాధికారికి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు చెందిన అధికారులకు సమాచారం అందుతుంది. వీరు సరిగా స్పందించకపోవడం వల్లనే వ్యాధి ఉద్ధృతమైందని వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో జనం విమర్శిస్తున్నారు. వాస్తవానికి సస్పెండ్ అయిన కమిషనర్ కూర్మారావు గతంలో జిల్లాలో డ్వామా పీడీగా పనిచేసే జిల్లా ఖ్యాతిని జాతీయ స్థాయిలో నిలబెట్టారు. ఈయన రాష్ట్రస్థాయిలో మంచి స్థాయిలో ఉండగా ఈయనను ఒప్పించి ఇక్కడకు తీసుకువచ్చి చేయని తప్పునకు సస్పెండ్ చేయడాన్ని నగరవాసులు తప్పు పడుతున్నారు. ఇప్పటికే వాట్సాప్ గ్రూపుల ద్వారా అంతర్లీనంగా ఉద్య మం ప్రారంభమైంది. వీటిని ముఖ్యమంత్రికి పంపించాలన్న ఆలోచనలో కూడా పలువురు ఉన్నారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో వెట్టి చాకిరీని పూర్తిగా రూపు మాపే దిశగా అందరం కలిసికట్టుగా పనిచేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా పిలుపునిచ్చారు. ఆయన గురువారం శ్రీకాకుళం జిల్లా కోర్టు ప్రాంగణంలో వెట్టి చాకిరీ వ్యవస్థ నిర్మూలన చట్ట చేసి నేటికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజల్లో అవగాహన పెంచేందుకు సంచార వాహనాన్ని ప్రారంభించారు. అంతకుముందు వెట్టిచాకిరీ వ్యవస్థ నిర్మూలన పోస్టర్లను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబుతో కలిసి ఆవిష్కరించారు. రుణం తీసుకున్నందుకు ప్రతిఫలంగా తక్కువ వేత నం లేదా వేతనం లేకుండా బలవంతంగా పనిచేయించడం నేరమన్నారు. చట్టం ప్రకారం వెట్టిచాకిరీ కింద ఉన్న పాత అప్పులన్నీ రద్దు అవుతాయని వివరించారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది గేదల ఇందిరా ప్రసాద్, ‘నేచర్’ డైరెక్టర్ ఎస్.వికాస్, సిబ్బంది చైతన్య, దుర్గ, శ్రీను, తదితరులు పాల్గొన్నారు . గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు 1న పరీక్షలు శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా పరిధిలో ఏపీఎస్డబ్ల్యూఆర్ఈ సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలలో 2026–2027 విద్యాసంవత్సరానికి 5వ తరగతి, జూనియర్ ఇంటర్ (జనరల్ –ఐఐటి, నీట్) ప్రవేశ పరీక్షలు మార్చి 1న జరగనున్నట్లు జిల్లా కో ఆర్డినేటర్ వై.యశోదలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. 5వ తరగతి ప్రవేశ పరీక్ష మార్చి 1 ఉదయం 9.30 నుంచి 11 గంటలు వరకు ఉంటుందని, ఇంటర్మీడియట్ (జనరల్) మధ్యాహ్నం 12 గంటల 1.30 వరకు, ఐఐటి/నీట్ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉంటుందని ఆమె ఆ ప్రకటనలో పేర్కొన్నారు. హాల్టికెట్లు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఇంటర్మీడియెట్ (జనరల్), ఐఐటీ, నీట్ పరీక్షల కు పరీక్షా కేంద్రాలు ఒకటే ఉంటాయని తెలిపారు. జిల్లాలో గల 5వ తరగతి, జూనియర్ ఇంటర్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు, తల్లిదండ్రులు గమనించాలని కో రారు. వివరాలకు 9701736862, 83310 05217 నంబర్లను సంప్రదించాలని కోరారు. శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): జిల్లా కేంద్రంలో పారిశుద్ధ్యం పడకేసింది. ఈ వైఖరే డయేరియా ప్రబలడానికి కారణమైందని నగర వాసులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా డయేరియాతో నలుగురు మృతి చెందిన ప్రాంతమైన దమ్మలవీధిలోనే పారిశుద్ధ్య కార్మికులంతా పనిచేస్తున్నారే తప్ప నగరమంతటినీ పట్టించుకోవడం లేదు. శ్రీకాకుళం మున్సిపల్ కా ర్పొరేషన్లో సిబ్బంది సరిపడకపోతే జిల్లాలో ఆమదాలవలస, పలాస, ఇచ్ఛాపురం మున్సిపాలిటీల నుంచి సిబ్బందిని తీసుకొచ్చి శుభ్రం చేసేందుకు అవకాశం ఉంది. అయినప్పటికి అలాంటి ప్రయ త్నం ఏమీ చేయడం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రజారోగ్యం, పారిశుద్ధ్యానికే తొలి ప్రాధాన్యత ఉండేది. చెత్త సేకరణ అనేది ఓ డ్రైవ్లా నిరంతరం జరిగేది. కూటమి ప్రభుత్వంలో మాత్రం అవేమీ కానరావడం లేదు. అప్పుడప్పుడు పచ్చదనం–పరిశుభ్రత, స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర పేరుతో నేరుగా అధికారుల చేత చెత్తను సేకరించేలా ఫొటోలకు ఫోజులివ్వడం ఆన్లైన్లో అప్లోడ్ చేయడం తర్వాత వదిలేయడం పరిపాటిలా మారింది. చెత్తను రోడ్లపై వేయకుండా, డస్ట్బిన్లలో చెత్త పేరుకుపోకుండా ఉండేందుకు చెత్త సేకరణ వాహనాలను నిరంతరం ఇంటింటికి తిప్పడం వంటివి చేయాల్సిన అవసరం ఉంది. అలా చేయకుండా వదిలేయడం వల్ల వచ్చిన పర్యవసానమే శ్రీకాకుళం నగరంలో డయేరియా. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇంటింటికీ మూడు రకాల డస్ట్ బిన్లు ఇచ్చి, క్లీన్ వెహికల్స్, క్లాప్ వెహికల్స్ పెట్టి ప్రతి రోజూ చెత్త సేకరిస్తే అంతా హేళన చేశారు. అదే సమయంలో కరోనా వస్తే శానిటేషన్ ప్రక్రియ పకడ్బందీగా చేయడం వల్లే ఎంతో మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఇప్పుడు పూడుకుపోయిన కాలువలు, పేరుకుపోతున్న చెత్త వల్ల వ్యాధులు ప్రబలుతున్నాయి. ఒకేచోట కేంద్రీకృతం దమ్మలవీధిలో డయేరియా ప్రబలడంతో మంత్రు లు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, కలెక్టర్లు పలుమార్లు ఈ ప్రాంతాన్ని పరిశీలించేందుకు వస్తుండడంతో పారిశుద్ధ్య కార్మికులంతా ఆ ప్రాంతంలోనే కేంద్రీకృతమైపోయారు. అక్కడ తీసిన కాలువలే తీసి, తీసిన చెత్తనే తీసి, వేసిన చోటే బ్లీచింగ్ మళ్లీ మళ్లీ వేసి శుభ్రం చేస్తున్నారు. నగరంలో బలగ, వాంబేకాలనీ, కాకివీధి, దండివీధులతో పాటు మిగిలిన ప్రాంతాల్లో శానిటేషన్ పూర్తిగా గాలికొదిలేశారు. కుళాయి పైపు లైన్ల లీకులు సైతం పట్టించుకోవడం లేదు. దీంతో డయేరియా అనేది మెల్లగా మి గిలిన ప్రాంతాలకు పాకుతోందని నగరంలో చర్చ జరుగుతోంది. దమ్మలవీధి ప్రాంతానికే ట్యాంకర్లతో తాగునీటిని సరఫరా చేస్తూ మిగిలిన ప్రాంతాల్లో కుళాయిలు నచ్చిన సమయానికి నచ్చినట్లు ఇస్తున్నారు. కనీసం ముందస్తు సమాచారం ఇవ్వడం లేదని నగర వాసులంతా గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికై నా అన్ని ప్రాంతాలపై దృష్టి సారించాలని కోరుతున్నారు. ఇళ్లలో ఉండలేకపోతున్నాం.. కాలువల్లో తీసిన చెత్తను, బురదను రోడ్డుపై వేసి వదిలేయడంతో మళ్లీ అవి కాలువల్లో పడుతున్నాయి. అంతేకాకుండా లోపల ఉన్నదాన్ని తీసి రోడ్డుపై వేసేయడంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. చెత్త కుప్పల చుట్టూ పందులు, కుక్కలు మూగుతున్నాయి. ఎప్పటికప్పుడు చెత్తను తీసుకెళ్తే మా ఆరోగ్యాలు బాగుంటాయి. – ఎం.అప్పలనర్సమ్మ, బలగ, శ్రీకాకుళం నగరం -
పలాసలో ఆగని గ్రావెల్ దందా
● రాత్రి పూట తవ్వకాలు ● మాయమవుతున్న కొండలు పలాస: పలాస నియోజకవర్గంలో గ్రావెల్ అక్రమ తవ్వకాల దందా ఆగడం లేదు. ఎప్పుడు ఎక్కడ ఎవరికి అనుకూలంగా ఉంటే అప్పుడు ఇష్టారాజ్యంగా కంకర తవ్వకాలు చేపడుతున్నారు. రూ.కోట్లు విలువైన కంకరను రోజూ వందలాది టిప్పర్లు ద్వారా తరలించుకు పోతున్నారు. తాజాగా పలాస మండలం రామకృష్ణాపురం రెవెన్యూ పరిధిలోని లలితా చారిటబుల్ ట్రస్ట్ వృదా్ధ్శ్రమం వెనుక సర్వే నంబరు 157లో ప్రభుత్వ భూమిలో కంకర తవ్వకాలు చేపడుతున్నారు. ఆ పక్కనే జిల్లాలోనే అతి పెద్దదైన జగనన్న కాలనీ కూడా ఉంది. ప్రస్తుతం కంకర తవ్వుతున్న భూమి కూడా గతంలో జగనన్న కాలనీ కోసం సేకరించిన స్థలమని అక్కడి స్థానికులు చెబుతున్నారు. రెవెన్యూ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇచ్చిన స్థలమని కూడా కొందరు అంటున్నారు. మొత్తానికి స్థలం ఎవరిదైనా ఎటువంటి అనుమతులు లేకుండా కంకర తవ్వకాలను యథేచ్ఛగా సాగిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా మందస మండలం కుంటికోట, రట్టి కొండలు, పలాస మండలం కంబిరిగాం వద్ద కూడా కంకర అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు. అధికారులకు ఫిర్యాదులు వెళ్లినప్పుడు మాత్రమే అక్కడికి వెళ్లి తూతూమంత్రంగా చర్యలు చేపట్టి తర్వాత విడిచి పెట్టేస్తున్నారని విమర్శలు వినిస్తున్నాయి. అందుకు తాజా ఉదాహరణ పెంటిభద్ర రెవెన్యూలోని 410 సర్వేలో కంకర తవ్వకాలు చేపట్టిని వారిపై తగిన చర్యలు తీసుకోలేదని, కేవలం కంకర తవ్వకాన్ని ఆపేసి చేతులు దులుపుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటువంటి అక్రమార్కులపై గట్టి చర్యలు తీసుకొని భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. -
ఘనంగా అభయాంజనేయ ఆలయ ప్రతిష్టాపనోత్సవం
ఎచ్చెర్ల : ముద్దాడ గ్రామంలో ముద్దాడ లక్ష్మీశంకర్ కుటుంబం నిర్మించిన అభయాంజనేయస్వామి ఆలయ ప్రతిష్టాపనోత్సవం గురువారం ఘనంగా జరిగింది. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్లు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో పార్టీ జనరల్ సెక్రటరీ సనపల నారాయణరావు, బీసీ విభాగం జనరల్ సెక్రటరీ జరుగుళ్ల శంకరరావు, పంచాయతీరాజ్ వింగ్ అధ్యక్షుడు నేతింటి నీలమప్పడు, నక్క కృష్ణమూర్తి, శంకర్ పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో కూర్మనాథుని తిరువీధి
గార: డోలోత్సవం ముందు ఫాల్గుణ దశమి పురస్కరించుకొని శ్రీకూర్మనాథుని తిరువీధి ఉత్సవం భక్తిశ్రద్ధలతో గురువారం నిర్వహించారు. సాయంత్రం శ్రీకూర్మనాథాలయం నుంచి రెండు పల్లకీలపై శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి, సీతారామ లక్ష్మణులను మాడవీధుల్లో ఊరేగించారు. రావివలస నాయుడు మంటపం వద్ద వేంచిపచేసిన అర్చక బృందం నాయుడు గోత్రనామాలతో ప్రత్యేక పూజలతో పాటు విష్ణుసహస్ర నామ పారాయణం జరిపారు. అనంతరం ఆలయం నుంచి వచ్చిన నైవేద్యాన్ని సమర్పించి, మంగళశాసనాలు జరిపారు. కార్యక్రమంలో ఈఓ టి.వాసుదేవరావు, ఆలయ ప్రధానార్చకులు సీహెచ్. సీతారామనృసింహాచార్యులు, కూర్మినాయుడు, స్థానాచార్యులు శ్రీభాష్యం పద్మనాభాచార్యులు, కిషోర్బాబు భక్తులు పాల్గొన్నారు. -
ప్రత్యేక ఐటీడీఏ ఏర్పాటు చేయాల్సిందే
● చలో అసెంబ్లీకి పిలుపునిస్తాం ● ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాల విభజనలో ఐటీడీఏను కోల్పోయిన శ్రీకాకుళం జిల్లాకు మెళియాపుట్టి కేంద్రంగా ప్రత్యేక ఐటీడీఏ ఏర్పాటు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి డిమాండ్ చేశారు. ఐటీడీఏ ఏర్పాటుపై గురువారం శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఆదివాసీలకు జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇచ్ఛాపురం నుంచి కొత్తూరు వరకున్న ఆదివాసీల కోసం ఐటీడీఏ ఏర్పాటుకు అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు. చంద్రబాబు దీనిపై హామీ ఇచ్చి మర్చిపోయారని విమర్శించారు. అవసరమైతే చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిస్తామన్నారు. ధర్నాకు సంఘీభావంగా బహుజన కళామండలి రాష్ట్ర అధ్యక్షుడు పాటల తూట ఉదయభాస్కర్, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంకల మాధవరావు పాల్గొన్నారు. -
మేమున్నామని..!
శ్రీకాకుళం కల్చరల్: స్వచ్ఛంద సంస్థలు అంటే సామాజిక సేవా దృక్పథంతో పనిచేసే లాభాపేక్షలేనివి. ఇందులోని సభ్యులు విద్య, ఆరోగ్యం, పేదరికం, పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత వంటి రంగాలలో సమాజ అభివృద్ధికి సహాయపడతారు. ఇవి చట్టబద్ధంగా రిజిస్టర్ కాబడి, దాతల విరాళాల ద్వారా కార్యకలాపాలు చేపడుతుంటాయి. ఆపదలో ఉన్న వారికి మేమున్నామంటూ అండగా నిలుస్తుంటాయి. వీరి సేవలను గుర్తిస్తూ ఏటా ఫిబ్రవరి 27న ప్రపంచ స్వచ్ఛంద సేవకుల దినోత్సవం జరుపుతుంటారు. ‘అందరి కలయికతో సమాజ గౌరవాన్ని పునరుద్ధరించడం’ అనేది ఈ ఏడాది వీరి లక్ష్యం.ఉద్దేశ్యం: లాభాపేక్ష రహితంగా, సమాజంలోని స మస్యలను పరిష్కరించడం, పేదలకు సహాయం చేయడం. విద్య, వైద్య సేవలను అందించడంసేవా రంగాలు: విద్య, ఆరోగ్యం, అత్యవసర సేవ లు (విపత్తుల సమయం), పర్యావరణం, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాల నిర్వహణ.రిజిస్ట్రేషన్: చాలా సంస్థలు సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం, ట్రస్ట్ చట్టం, ఎన్జీవోలుగా రిజిస్టర్ అవుతాయి.నిధులు: ప్రభుత్వ గ్రాంట్లు, వ్యక్తిగత దాతలు, కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల ద్వారా వీటికి నిధులు సమకూరుతాయి.లక్ష్యాలు: విద్య, ఆరోగ్య రంగాలలో మార్పు తీసుకురావడం. స్వచ్ఛంద సేవ ద్వారా నాయకత్వ నైపుణ్యాలు, సామాజిక బాధ్యతలను పెంపొందిస్తారు. విపత్తుల సమయంలో బాధితులకు అండగా నిలుస్తారు.జిల్లాలో వందకుపైగా సంస్థలుజిల్లాలో స్వచ్ఛంద సంస్థలుగా నమోదు చేసుకున్నవి వందకుపైగా ఉన్నాయి. నమోదు కాకుండా సేవలు చేసే వారూ ఉన్నారు. ఎన్నో విపత్కర పరిస్థితులలో ముందుకొచ్చి ఎంతోమంది నిస్సహాయకులకు సేవలు అందిస్తున్నారు. వీరిలో రెడ్క్రాస్, లైన్స్ క్లబ్, రోటరీ సంస్థ, జేసీస్, హర్షవల్లి లయన్స్ క్లబ్ తదితర సంస్థలు ముందంజలో ఉన్నాయి.సమాజ సేవలో..మా సంస్థ ఎల్లప్పుడు సమాజ సేవలో ఉంటుంది. ఎక్కడ ఏ అవసరం ఉన్నా అక్కడ ముందుగా ఉంటాం. సేవే పరమావధిగా భావిస్తుంటాం. – నటుకుల మోహన్, మెంటార్, లైన్స్క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్కృత్రిమ అవయవాలు..క్లబ్ ద్వారా దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందిస్తున్నాం. హెచ్ఐవీ బాధితులకు ఎనర్జీ ఫుడ్ ప్యాకెట్లు అందించాం. మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. – హారికా ప్రసాద్, హర్షవిల్లి లయన్స్ క్లబ్మహిళా సాధికారతమహిళా సాధికారత, యువత అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తున్నాం. వారిలో నైపుణ్యాలు పెంపొందించేందుకు కృషి చేస్తున్నాం. మహిళలకు కుట్టు మిషన్లు వంటివి పంపిణీ చేస్తున్నాం.– తమ్మినేని ఉషారాణి, ప్రెసిడెంట్, జేసీస్పర్యావరణ పరిరక్షణ..పర్యావరణ పరిరక్షణ బాధ్యతలు నెరవేరుస్తున్నాం. పలు ప్రాంతాల్లో మొక్కలు నాటడం, మట్టి విగ్రహాలు పంపిణీ వంటి పర్యావరణ హితమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.– పొన్నాడ రవికుమార్, పర్యావరణ ఇన్చార్జి, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ -
ఆదర్శ పాఠశాలల్లోకి.. ఆహ్వానం
పాతపట్నం: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచితంగా ఇంగ్లిష్ మీడియం విద్యను అందించాలని మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పట్లో సంకల్పించారు. ఆయన మరణానంతరం 2013లో అప్పటి ప్రభుత్వం ఆదర్శ పాఠశాల(మోడల్ స్కూల్)లను ప్రవేశపెట్టింది. ప్రవేశ పరీక్షలో కనబర్చిన ప్రతిభ ఆధారంగా అడ్మిషన్లు కల్పిస్తూ అత్యుత్తమ బోధన అందిస్తున్నారు. ఆరో తరగతిలో ప్రవేశించిన విద్యార్థులకు ఇంటర్మీడియెట్ వరకు ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన సాగిస్తున్నారు. కంప్యూటర్ ల్యాబ్, సైన్సు ల్యాబ్, డిజిటల్ క్లాస్రూమ్స్, గ్రంథాలయాలు, మరెన్నో సౌకర్యాలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.ఇదీ పరిస్థితి..జిల్లాలో 13 ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. జి.సిగడాం, పొందూరు, రణస్థలం, ఎచ్చెర్ల, తామాడ, ఓవీపేట, ఈదులవలస, సోంపేట, ఎంఎస్పల్లి, రాజపురం, పురుషోత్తపురం, కరవంజ, పాతపట్నంలోని ఒక్కో పాఠశాలలో 6వ తరగతిలో ఏటా 80 మంది విద్యార్థులకు 6వ తరగతిలో ప్రవేశాలు కల్పించేవారు. గత వైస్సార్సీపీ ప్రభుత్వంలో అదనంగా 20 సీట్లు పెంచి మొత్తం 100 మందికి ప్రవేశాలు కల్పిస్తున్నారు.దరఖాస్తు ఇలా..2026 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వ తరగతి చదివిన వారై ఉండాలి. విద్యార్థులు ఏపీ ఆన్లైన్, ఇంటర్నెట్ సెంటర్లలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.200, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.125 ఫీజు చెల్లించాలి. దరఖాస్తుతో పాటు ఆధార్, కులం ఆదాయం సర్టిఫికెట్లు, రేషన్కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫొటో, విద్యార్హత సర్టిఫికెట్ను ఆదర్శ పాఠశాలల్లో అందజేయాలి. మార్చి 31లోపు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి.రిజర్వేషన్లు ఇలా..15 శాతం ఎస్సీలకు, 6 శాతం ఎస్టీలకు, 20 శాతం బీసీలకు (7 శాతం బీసీ–ఎ, 10 శాతం బీసీ–బి, ఒక శాతం బీసీ–సీ, 7 శాతం బీసీ–డీ, ఒక శాతం బీసీ–ఈకు సీట్ల కేటాయింపులు ఉంటాయి. దివ్యాంగులకు మూడు శాతం, బాలికలకు 33.33 శాతం సీట్లు కేటాయిస్తారు. నిర్దేశించిన విభాగాల్లో అభ్యర్థులు లేకపోతే ఇతర గ్రూపుల నుంచి సీట్లు భర్తీ చేస్తారు. 50 శాతం సీట్లు ఇతర కులాలకు కేటాయించారు.అధునాతన వసతి గృహాలు..ఏపీ మోడల్ స్కూల్లో చేరిన విద్యార్థినులకు ఆధునాతన వసతి గృహాలను ఏర్పాటు చేశారు. విద్యార్థినులకు మోడరన్ మంచాలు, దుప్పట్లు, బెడ్షీట్లు అందిస్తున్నారు. హాస్టల్లో వంద మంది విద్యార్థినులకు ప్రవేశాలు కల్పిస్తారు. హాస్టల్లో ప్రత్యేక ట్యూటర్లను ఏర్పాటు చేస్తారు. బాలురుకు హాస్టల్ సదుపాయం ఉండదు.ప్రవేశ పరీక్ష ఇలా..ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 12న ఏపీ మోడల్ పాఠశాలలో ఆఫ్లైన్ పద్ధతిలో నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు ఆబ్జెక్టివ్ పద్ధతిలో తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో పరీక్ష ఉంటుంది.పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించే దిశగా ప్రభుత్వం ఆదర్శ పాఠశాలలను నెలకొల్పింది. ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశం చక్కని అవకాశంగా విద్యార్థులు, తల్లిదండ్రులు భావిస్తున్నారు. అర్హత ఉన్న వారందరూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.– కె.వి.రత్నకుమారి, ప్రిన్సిపాల్, ఏపీ మోడల్ స్కూల్, పాతపట్నం -
5న కూర్మనాథుని డోలోత్సవం
గార: ఆది కూర్మక్షేత్రం శ్రీకూర్మంలో కూర్మనాథుని డోలోత్సవం మార్చి 3 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న నేపథ్యంలో ఉత్సవాల పోస్టర్ను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్లు ఆవిష్కరించారు. గురువారం మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఎంతో విశిష్టత కలిగిన డోలోత్సవంలో భక్తులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 3న కామదహనోత్సవం, 4న పడియ, 5న డోలోత్సవం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ టి.వాసుదేవరావు, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. -
అసంబద్ధ ఉత్తర్వులు సరిచేయాలి
శ్రీకాకుళం: పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ల నియామక ఉత్తర్వుల్లో అసంబద్ధ విధానాలను సరిచేయాలని డీటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు పేడాడ కృష్ణారావు, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పూజారి హరిప్రసన్న, ఎన్ని వెంకట ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. డివిజన్ పరిధి దాటి కొంతమంది ప్రధానోపాధ్యాయులను నియమించడం, సీనియర్లను విస్మరించి జూనియర్లను నియమించడం, మినహాయింపు అడిగిన వారి బాధలను పట్టించుకోకుండా బలవంతంగా నియమించడం వంటివి సరిచేయాలని కోరారు. ఐచ్చిక సెలవులు, స్థానిక సెలవుల విషయంలో జిల్లా విద్యాశాఖ అధికారులను కాదని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు జోక్యం చేసుకోవడం తగదన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 28న ఆదిత్యలో రాష్ట్రస్థాయి హ్యాకథాన్ టెక్కలి : టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో ఈ నెల 28న రాష్ట్ర స్థాయిలో ఐగానిట్ 3.0 రాష్ట్ర స్థాయి హ్యాకథాన్ సాంకేతిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కాలేజీ డైరక్టర్ వి.వి.నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు గురువారం పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికితీసేందుకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల నుంచి సుమారు 150 జట్లు పాల్గొంటున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, డీన్ ప్రసన్నలక్ష్మి, కన్వీనర్ రమేష్నాయుడు, స్వప్నరేఖ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం హిరమండలం: లక్ష్మీనర్సుపేట ఇందిరానగర్ కాలనీలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. మండాది తవిటయ్యకు చెందిన ఇల్లు కాలిపోయింది. నిత్యావసరాలతో పాటు రూ.30 వేల నగదు కాలిపోయింది. తవిటయ్య దంపతులు పొలం పనులకు వెల్లినప్పుడు విద్యుత్ షార్ట్సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. సర్పంచ్ దివాకర్నాయుడు, వీఆర్వో రమణమ్మ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తాగునీటి నమూనాల సేకరణ గార: శ్రీకాకుళం నగరంలో డయేరియా వ్యాప్తి నేపథ్యంలో నీటి నమూనాల సేకరణను జిల్లా పంచాయతీ అధికారి గోపిబాల గురువారం పరిశీలించారు. మేజర్ పంచాయతీ శ్రీకూర్మంలో వాటర్ ట్యాంకు పరిశుభ్రత, నీటి శాంపిల్స్ సేకరణపై ఆరా తీశారు. ట్యాంకు వద్ద పరిశుభ్రత చేసిన తేదీలను నమోదు చేయాలని, క్లోరినేషన్ పక్కాగా జరగాలన్నారు. ఆయన వెంట ఆర్డబ్ల్యూఎస్ జేఈఈ చంద్రకళ, పంచాయతీ సెక్రటరీ రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. సమాచార హక్కు చట్టంపై అవగాహన శ్రీకాకుళం: పంచాయతీలను పర్యవేక్షించే డిప్యూటీ ఎంపీడీఓలు సమాచార హక్కు చట్టాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలని జెడ్పీ సీఈఓ సత్యనారాయణ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అన్ని మండలాల ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు, పరిపాలన అధికారులకు గ్రామ పంచాయతీ అభివృద్ధి పథకం శిక్షణలో భాగంగా సమాచార హక్కు చట్టం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో ప్రజలు స.హ.చట్టం దరఖాస్తులు ఎక్కువగా గ్రామ పంచాయతీలకు పంపిస్తున్నారని, సరైన అవగాహన లేక సమాచారం ఇవ్వడంలో జాప్యం జరిగి సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రతిఒక్కరూ చట్టంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. రిసోర్స్ పర్సన్ కొమ్మాజోస్యుల వసంతకుమార్ సమాచార హక్కు చట్టం నిబంధనలు, ఇతర అంశాలను వివరించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి గోపిబాల, జిల్లా పంచాయతీ వనరుల కేంద్ర అధికారి నిశ్చల పాల్గొన్నారు. కాలిపోయిన ఇల్లు -
కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు అంగన్వాడీలకు వెంటనే వేతనాలు పెంచాలని, లేకుంటే సమ్మె తప్పదని సీఐటీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సీహెచ్.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు కె.నాగమణి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.సుధ అన్నారు. అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26000 ఇవ్వాలని, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా శ్రీకాకుళం కలెక్టరేట్ సమీపంలోని మహాత్మా జ్యోతిబా పూలే పార్కు వద్ద అంగన్వాడీలు చేపట్టిన నిరాహార దీక్షలు గురువారం కూడా కొనసాగాయి. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు అల్లు సత్యనారాయణ, ఆర్.ప్రకాశరావు, ఎ.రాజు, అంగన్వాడీ యూనియన్ ప్రతినిధులు పి.లతాదేవి, బి.జ్యోతి, పి.భూలక్ష్మి, బి.సునీత, సింహాచలం తదితరులు పాల్గొన్నారు. -
రుణ లబ్ధిదారులకు శిక్షణ
ఎచ్చెర్ల : ఎచ్చెర్లలోని రూరల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో పీఎంఈజీసీ, పీఎంఎఫ్ఎం లబ్ధిదారులకు ఆఫ్లైన్ ఈడీపీ శిక్షణను గురువారం ప్రారంభించారు. 35 మంది లబ్ధిదారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా లీడ్బ్యాంక్ మేనేజర్ పేడాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ రూ.5 లక్షల లోపు రుణం తీసుకున్న వారు ఐదు రోజులు, అంతకంటే ఎక్కువ తీసుకున్న వారు పది రోజులు శిక్షణలో పాల్గొని ఈడీపీ సర్టిఫికెట్లు పొందాలన్నారు. వాటిని సంబంధిత బ్యాంక్ల్లో సమర్పించాలన్నారు. మార్చి 8లోగా యూనిట్లు గ్రౌండ్చేసి ప్రారంభించాలన్నారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ రామ్జీ, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.కిరణ్కుమార్, నాబార్డు జిల్లా అభివృద్ధి మేనేజర్ రమేష్కృష్ణ, డీపీఎంలు, ఏపీఎంలు, బ్యాంక్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
సారా నిర్మూలనకు కృషి
పాతపట్నం: నాటుసారా నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తోందని, సారా రహిత గ్రామాలున్న మండలంగా పాతపట్నం ఎంపికై ందని శ్రీకాకుళం ప్రొహిబిషన్, ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ డి.శ్రీకాంత్ రెడ్డి అన్నారు. పాతపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని ఒడిశా–ఆంధ్ర చెక్పోస్ట్, మెళియాపుట్టి మండలం వసుంధర చెక్పోస్ట్లను బుధవారం పరిశీలించారు. సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒడిశా నుంచి ఆంధ్రకు నాటు సారా, మద్యం రవాణాకు ఆస్కారమున్న ప్రాంతాల్లో తనిఖీలు విస్తృతం చేయాలన్నారు. అనంతరం పాతపట్నంలోని మద్యం షాపును తనిఖీ చేశారు. ఆయనతో పాటు పాతపట్నం ఎకై ్సజ్ సీఐ కె.కృష్ణారావు, ఎస్ఐ శ్రీనివాసరావు ఉన్నారు. -
అంగనాడీల సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: అంగన్వాడీలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని, లేకుంటే ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతామని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, ఎ.పి.అంగన్వాడీ వర్కర్స్ – హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.సుధ అన్నారు. అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26000 ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా బుధవారం శ్రీకాకుళం కలెక్టరేట్ సమీపంలోని మహాత్మా జ్యోతిబా పూలే పార్కు వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్–హెల్పర్స్ సీఐటీయూ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఐసీడీఎస్కు బడ్జెట్, అంగన్వాడీలకి వేతనాలు పెంచాలని కోరుతూ మార్చి 2న విజయవాడలో జరిగే మహా ధర్నాలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ దీక్షలకు ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.అమరావతి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు అల్లు సత్యనారాయణ, ఎన్.వి రమణ, ఆర్.ప్రకాశరావు, ఎం. గోపి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ – హెల్పర్స్ యూనియన్ నాయకులు ఎన్.హైమావతి, బి.జ్యోతి, కె.మాధవి, పి.భూలక్ష్మి, బి.సునీత, బి.రమణమ్మ, బి.హైమావతి, బి.ఆదిలక్ష్మి, కె.రాధిక, వై.విజయలక్ష్మి, కె.జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
విశాఖ డెయిరీలో తనిఖీలు
టెక్కలి: టెక్కలి విశాఖ డెయిరీలో బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న కల్తీ పాల వ్యవహారంపై స్థానికంగా జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీరాములు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి శాంపిల్స్ను సేకరించారు. ఎక్కడైనా ఆహారం కల్తీ జరిగినట్లు తెలిస్తే తక్షణమే సమాచారం అందజేయాలని వెల్లడించారు. అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత మందస: బాలిగాం జంక్షన్ జాతీయ రహదారిపై రెండు వ్యాన్లలో అక్రమంగా తరలిస్తున్న పశువులను మందస ఎస్ఐ కె.కృష్ణప్రసాద్ పట్టుకున్నారు. ఒక బండిలో ఆరు పశువులు, మరో బండిలో ఏడు పశువులు మొత్తం 13 పశువులు పట్టుకుని వాహనాలపై కేసులు నమోదుచేసి గోశాలకు తరలించారు. ఇంటర్ పరీక్షలకు 737 మంది గైర్హాజరు శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. జిల్లాలో 71 కేంద్రాల్లో జరుగుతున్న ఈ పరీక్షల్లో బుధవారం ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు సెట్–1తో కూడిన ఇంగ్లిష్ పరీక్ష రాశారు. ఈ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 21,101 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. 20,364 (96.51శాతం) మంది పరీక్ష రాశారు. వివిధ కారణాలతో 737 మంది గైర్హాజరయ్యారు. జిల్లా అధికారులతోపాటు డీఈసీ కమిటీ, సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు వేరువేరుగా విడిపోయి ఆకస్మిక తనిఖీలతో హడలెత్తిస్తున్నారు. అయితే జిల్లాలో 71 కేంద్రాలకుగాను బుధవారం 42 కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు. సెల్ఫ్ సెంటర్లపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నారు. సీసీ కెమెరాల స్ట్రీమింగ్ను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఫస్టియర్ ఇంగ్లిష్ పరీక్ష రోజున జిల్లాలో ఎలాంటి మాల్ప్రాక్టీసు కేసులు నమోదుకాలేదని జిల్లా ఆర్ఐఓ రేగ సురేష్కుమార్ ధ్రువీకరించారు. -
దేవునల్తాడలో విషాదం
వజ్రపుకొత్తూరు రూరల్: దేవునల్తాడ గ్రామానికి చెందిన వలస కూలి బుడగట్ల మోహన్రావు(46) దుబాయ్లో అనారోగ్యంతో మృతి చెంది 17 రోజుల తర్వాత బుధవారం స్వగ్రామానికి మృతదేహం చేరుకోవడంతో గ్రామం శోకసంద్రంగా మారింది. నాలుగు నెలల క్రితం అదే కుటుంబానికి చెందిన మృతుని సోదరుడు బుడగట్ల చినబాబు సముద్రంలో తెప్ప బోల్తా పడి మృతి చెందారు. పొట్ట చేతపట్టుకొని ఎన్నో ఆశలతో వలసకూలీగా దుబాయ్ వెళ్లిన మోహన్రావు నేడు విగతజీవిగా గ్రామానికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మోహన్రావుకు భార్య ధనలక్ష్మీ, కుమారులు రాజేష్, నితిన్ ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కు మృతితో రోడ్డున పడిన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
● నేటి నుంచే రట్టి వల్లభ నారాయణుడి యాత్ర
మందస: ఉద్దానం ప్రాంతమైన మందస మండలం రట్టి గ్రామంలో వల్లభనారాయణుడి రట్టియాత్ర ఈ నెల 26 నుంచి మార్చి 3 వరకు ఐదురోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనుంది. సింహాచలంలో సింహాద్రి అప్నన్న, రట్టిలో వెలసిన వల్లభనారాయణ స్వామి ఒక్కరేనని ఇక్కడి భక్తుల నమ్మకం. జిల్లాతో పాటు ఒడిశా నుంచి వేలాది మంది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. శుక్రవారం రాత్రి 9 గంటలకు అంకురార్పణ, 27న పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు, 28న ధ్వజారోహణ, విశేణ హోమాలు, మార్చి 1న తిరువీధి మహోత్సవాలు, 2న స్వామివారికి ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు, 3న డోలో పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానం, మఘ, కామదానం, కోలసేవ వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఇక్కడి వివేకానంద యువజన సేవా సంఘం, గ్రామ అభివృద్ధి కమిటీ, గ్రామ పెద్దలు, యువత ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎంతో ప్రత్యేకత.. ఆలయ ప్రాంగణంలోని గరుడ స్తంభాన్ని నూతన దంపతులు ఆలింగనం చేసుకుంటే ఉత్తమ సంతానం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. దేవుని సన్నిధి లో ఉన్న తులసికోట వద్ద చాలామంది నేస్తరికం కట్టుకుంటారు. ఈ ప్రాంత ప్రజలు వేర్వేరు చోట్ల పుణ్య క్షేత్రాలు దర్శించి చివరిగా మత్స్యవల్లభనారాయణ స్వామిని దర్శించుకుంటే సంపూర్ణ యాత్ర చేసినట్లు అవుతుందని ప్రగాఢ నమ్మకం. -
రేషన్ డీలర్ల కమీషన్ పెంచాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: రేషన్ డీలర్లకు ఇస్తున్న కమీషన్ను పెంచాలని రేషన్ డీలర్లు సంఘం జిల్లా అధ్యక్షుడు వడగ భాస్కరరావు, ప్రధాన కార్యదర్శి షణ్ముఖరావు కోరారు. ఈ మేరకు బుధవారం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్, జిల్లా పౌర సరఫరాల అధికారి జి.సూర్యప్రకాశరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమీషన్ పెంపు జరగక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. షాపు అద్దె, డోర్ డెలివరీ అవుతున్న ఖర్చులు, సహాయకుడికి వేతనం, ఇతర ఖర్చులకు సరిపోవడం లేదన్నారు. ఐ.వి.ఆర్.ఎస్.సర్వేలో రేషన్ డీలర్లకు సంబంధం లేని అంశాలు చెప్పడం వల్ల డీలర్లు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సర్వే ప్రకారం డీలర్లపై చర్యలు తీసుకోవద్దని, అవసరమైతే లబ్ధిదారుల వద్ద నుంచి నేరుగా అభిప్రాయం తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ బి.రవికుమార్, రణస్థలం వెంకటరావు, శిమ్మినాయుడు, రామ్మూర్తినాయుడు, మురళీమోహన్, పోలాకి జగన్, మూర్తి, పలాస మోహనరావు, శ్రీను, రామకృష్ణ, పంచిరెడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్రసాదమా.. అపచారమా!
అరసవల్లి: ఆలయాల్లో తయారు చేసిన పులిహోర, లడ్డూలను దేవునికి ముందుగా నివేదించిన తర్వాతే అవి ప్రసాదాలుగా భావించి భక్తులు కళ్లకద్దుకుని తీసుకుంటారు.. నలుగురికి పంచుతారు కూడా..! ఇదే హిందూ సంప్రదాయంలో భాగం. కానీ అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఈ విధానం కొన్నాళ్లుగా కనిపించడం లేదు. గతంలో ముందుగా స్వామి వారికి నివేదించి ప్రసాదాల పేరిట విక్రయాలు చేపట్టేవారు. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. దేవునికి నివేదించకుండానే విక్రయాలా..! ఆలయాల్లో బ్రాహ్మణ వంట పంతులు కచ్చితంగా దేవునికి ప్రసాదాలను తయారు చేయాల్సి ఉంది. ఈయన ఆధ్వర్యంలోనే దిట్టం ప్రకారం నాణ్యమైన రసవర్గాలతో తయారు చేసిన పులిహోర, లడ్డూలను రోజూ గర్భాలయంలో కొలువైన శ్రీసూర్యనారాయణ స్వామి వారి మూలవిరాట్టుకు నివేదించాల్సి ఉంది. అయితే బ్రాహ్మణ వంట పంతులు నియామకం జరగకపోవడంతో ఇప్పటికే ఆలయ పరిస్థితులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వంట పంతులు చేతుల మీదుగా స్వామికి నివేదించిన నివేదనా వస్తువులే ప్రసాదంగా మారుతుంది. వీటిని అప్పటికే సిద్ధమైన తయారి పులిహోర లడ్డూ పూసలో కలుపుతారు. దీంతో మొత్తం ఈ పదార్థాలన్నీ ప్రసాదాలుగా ప్యాకెట్లకు సర్దేసి భక్తులకు విక్రయాలు చేయాల్సి ఉంది. ఇదే విధానం గత ప్రభుత్వ పాలన వరకు అరసవల్లిలో కొనసాగింది. కూటమి ప్రభుత్వం రాగానే శాశ్వత అన్నదాన ప్రసాదాల మండపాలన్నీ కూల్చివేయడంతో ప్రసాదాలను నివేదించే సంప్రదాయం కూడా కనుమరుగైంది. రెండున్నరేళ్ల నుంచి బ్రాహ్మణ వంట పంతులు నియామకాలు జరుగకపోవడంతో తయారు వస్తువులను ప్రసాదాలుగా నివేదించే నాథుడే కరువయ్యాడు. నమూనా విగ్రహానికి నివేదిస్తూ...! ఆలయ వర్గాలు భక్తుల విశ్వాసాలు దెబ్బతినకుండా ఉండేలా వైజయంతి ఉత్సవ వేదిక వద్ద అలంకారంగా ఉన్న నమూనా ఆదిత్యుని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహం వద్ద రోజూ ఇక్కడ తయారు చేసిన పులిహోర, లడ్డూలతో పాటు అన్నం, కూరలను కూడా నివేదించి చేతులు దులుపుకుంటున్నారు. వాస్తవానికి అసలైన మూలవిరాట్టుకు మాత్రమే ప్రసాదాలు, భోగాన్ని నివేదించాల్సి ఉంది. అలా చేయకపోవడంతో ఇదెక్కడి సంప్రదాయమంటూ భక్తులు మండిపడుతున్నారు. ఇప్పటికై నా ఆలయ అధికారులు బ్రాహ్మణ సామాజిక వంట పంతులును నియమించి ఆయన ద్వారా స్వామి వారికి ప్రసాదాలను తయారు చేయించి నేరుగా స్వామివారి గర్భాలయంలోనే నివేదించి ఆ తర్వాతే ప్రసాదాల విక్రయాలకు సిద్ధం చేయాలని భక్తులు కోరుతున్నారు. అరసవల్లిలో దేవునికి నివేదించకుండానే లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయాలు నమూనా విగ్రహానికి నివేదన చేయడంపై విమర్శలు ఇదేం పద్ధతంటూ భక్తుల మండిపాటు గతంలో ఉన్న విధానానికి స్వస్తి పలికిన వైనం శాశ్వత భవనాల కూల్చివేతతో సంప్రదాయాలకు మంగళం నివేదించకపోతే ఎలా? స్వామికి నివేదించకుండా పులిహోర, లడ్డూలను విక్రయించడం దారుణం. అలా చేస్తే అవి ప్రసాదాలే కాదు. మామూలుగా మనం ఇంట్లో చేసుకునే వస్తువులుగానే చూడాల్సి వస్తుంది. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవస్థలు పని చేయకూడదు. – శ్రీపతి మురళీరావు, శ్రీకాకుళం -
కుటుంబానికి సాయంగా లేనని..
● మనస్థాపంతో యువకుడు ఆత్మహత్య శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని వాంబేకాలనీలో బుధవారం ఉదయం ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒకటో పట్టణ ఎస్ఐ ఎం.హరికృష్ణ, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. యడగళ్ల పవన్కుమార్ (26) వాంబేకాలనీలోని రాజీవ్ గృహకల్పలో 9వ నెంబరు బ్లాక్లో తల్లి తిరుమలతో కలసి నివాసముంటున్నాడు. తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో తల్లి కూలి పనులకు వెళ్తూ, చీకులు అమ్ముతూ జీవనం సాగిస్తోంది. పవన్ ఆటో నడుపుతుండగా అతని సోదరుడు నగరంలో ఓ వాటర్ప్లాంట్లో పనిచేస్తున్నాడు. ఆటోకి సరిగా బేరాలు రావడంలేదని, చిన్నపాటి ఉద్యోగముంటే బాగుండేదని, కుటుంబానికి సాయం చేయలేకపోతున్నానని ఇటీవల తల్లి వద్ద పవన్ అనేవాడు. ఆ క్రమంలోనే మంగళవారం స్నేహితుల వద్దకు వెళ్తానని చెప్పి వెళ్లిన పవన్ రాత్రయినా తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. స్నేహితులు, తెలిసినవారందరికీ వాకబు చేసినా ఫలితం లేదు. బుధవారం ఉదయం అదే వాంబేకాలనీ రాజీవ్గృహకల్ప 17వ బ్లాకులో పవన్.. చీరతో ఉరివేసుకుని ఉండటం స్థానికులు గమనించి కుటుంబసభ్యులకు సమాచారమందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు పవన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. ఇదిలా ఉండగా పవన్ కొన్ని కేసుల్లో నిందితుడిగా, సస్పెక్ట్ షీట్ సైతం ఉన్నట్లు పోలీసులు అంటున్నారు. -
● నిర్లక్ష్యమే కారణం..
శ్రీకాకుళం పాతబస్టాండ్: శ్రీకాకుళంలో డయేరియా ప్రబలడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ను వైఎస్సార్ సీపీ నాయకులు బుధవారం ఆయన చాంబర్లో కలిసి విన్నవించారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కలెక్టర్తో మాట్లాడుతూ బలగలో డయేరియా వచ్చినప్పుడు ఒకరు చనిపోయారని, అప్పుడే స్పందించి ఉంటే ఇప్పుడు నాలుగు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదన్నారు. వందలాది మంది ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. నిర్లక్ష్యమే ప్రాణాలు తీసిందన్నారు. దీనికి బాధ్యులైన నగరపాలక సంస్థ హెల్త్ అధికారి, వాటర్ సప్లై అధికారులను ఎందుకు ఉపేక్షిస్తున్నారని ప్రశ్నించారు. డయేరియా మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. గార తదితర ప్రాంతాల్లో, వంశధార నదీ తీర గ్రామా ల్లో, తీర ప్రాంతాల్లో ఇసుకను మంత్రి లోకేష్ మనషులమంటూ దోచేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఇన్ఫిల్టరేషన్ బావులు పాడైపోయాయని, బురద నీరు వస్తోందన్నారు. కలెక్టర్ను కలిసిన వారిలో మాజీ మంత్రులతో పాటు పార్టీ నాయకులు మామిడి శ్రీకాంత్, అంధవరపు సూరిబాబు, ఎంవీ స్వరూప్, చింతాడ వరుణ్, గేదెల పురుషోత్తం, సాధు వైకుంఠరావు, కోణార్క్ శ్రీను, రౌతు శంకరరావు, తదితరులు ఉన్నారు. -
ప్రభుత్వానికి మానవత్వం ఉందా..?
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): జిల్లా కేంద్రంలో డయేరియా బాధితులను మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి, పార్టీ డాక్టర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సీదిరి అప్పలరాజు తదితరులు బుధవారం పరామర్శించారు. డయేరియా ప్రభావిత ప్రాంతాలైన దమ్మలవీధి, కండ్రవీధి, గుడివీధి ప్రాంతాల్ని పరిశీలించారు. మృతుల కు టుంబ సభ్యులతో మాట్లాడి వాస్తవ పరిస్థితులు తెలుసుకున్నారు. నలుగురుచనిపోతే ఒక్కరే చనిపోయారని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు ప్రజారోగ్యంపై నిర్ల క్ష్యం నశించాలి, మంచినీరు ఇవ్వలేని కూటమి ప్రభుత్వాన్ని తక్షణమే గద్దె దింపాలని నినదించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు సూరాడ కన్నబాబు, అల్లుబిల్లి విజయ, హజీభయ్యాలతో పాటు మున్సిపల్ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ మహిళావిభాగం జిల్లా ఉపాధ్యక్షురాలు ఎంవీ పద్మావతి, వైఎస్సార్సీపీ తూర్పుకాపు, కళింగవైశ్యకుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్, అంధవరపు సూరిబాబు, ఎస్ఈసీ మెంబర్లు చల్ల శ్రీనివాసరావు, గొండు కృష్ణమూర్తి, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంవీ స్వరూప్, డాక్టర్స్ సెల్ జిల్లా అధ్యక్షులు చింతాడ వరుణ్, గ్రీవెన్స్సెల్ అధ్యక్షులు రౌతు శంకరరావు, పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్రకార్యదర్శి పొన్నాడ రుషి, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, మైనార్టీసెల్ విభాగం జిల్లా అధ్యక్షులు ఎం.ఏ భేగ్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ముత్తా విజయ్కుమార్, యువ జన విభాగం జిల్లా అధ్యక్షులు మార్పు పృథ్వీ, నగర అధ్యక్షుడు సాధు వైకుంఠరావు, కోణార్క్ శ్రీనివాసరావు, గద్దిబోయిన శ్రీనివాసయాదవ్, డాక్టర్ శ్రీనివాసపట్నాయక్, మూకళ్ల తాతబాబు, ఎండ రమేష్, తారక్, కింజరాపు రమేష్, భైరి మురళి, అంధవరపు రామారావు, గుడ్ల దామోదరరావు, అలపాన త్రినాధరెడ్డి, వైశ్యరాజు మోహన్లతో పాటు అధిక సంఖ్యలో వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. రూ.60 కోట్లు సరదాలకు ఖర్చు చేస్తారా..? 21వ తేదీన డయేరియా మొదలైతే మంగళవారం వరకు నియంత్రణ చర్యలు లేవు. డయేరియా వల్లే తమ కుటుంబ సభ్యులు చనిపోయారని చెబుతుంటే అనారోగ్యం వల్ల చనిపోయారని కూటమి నేతలు చెప్పడం హాస్యాస్పదం. అసలు నీరు కలుషితం కావడానికి కారణమైన మున్సిపల్ హెల్త్ ఆఫీసర్, నీటిసరఫరా విభాగం ఏఈలను సస్పెండ్ చేయాలి. చంద్రబాబుకు దోపిడీ తప్ప మరే ఆలోచన ఉండదు. బలగలో డయేరియా వచ్చినప్పుడు జాగ్రత్త పడి ఉంటే ఇప్పుడు ఈ అవస్థ ఉండేది కాదు. నా హయంలో రూ.40 కోట్లతో నగరమంతా మంచినీరు అందిస్తే దాన్ని కాపాడుకోలేకపోయారు. కోవిడ్ వంటి పరిస్థితుల్లోనూ వైఎస్సార్సీపీ సమర్థంగా పని చేసింది. ఇప్పుడు వందమందికిపైగా డయేరియా బాధితులు ఉన్నారు. వారికి మంచి వైద్యం అందించాలి. మేము అధికారం నుంచి దిగిపోయే నాటికి మున్సిపాలిటీకి రూ.60 కోట్లు ఇస్తే దాన్ని పూర్తిగా సరదాలకు ఖర్చుచేసి పూర్తిగా మున్సిపాలిటీలో డబ్బులు లేకుండా చేసేయడం సిగ్గుచేటు. తాను చెప్పిన వారికే కాంట్రాక్టులు ఇవ్వాలని ఎమ్మెల్యే చెప్పడం సిగ్గుచేటు. మీ పత్రికల్లో రాసే అబద్ధాలు నమ్మే స్థితిలో జనం లేరు. – ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి ప్రజారోగ్యాన్ని పక్కనపెట్టారుప్రజారోగ్యం, వైద్య, విద్యను ప్రభుత్వం పక్కన పెట్టేసింది. డయేరియాతో మృతి చెందారని స్వయంగా కుటుంబ సభ్యులే చెబుతుంటే దాన్ని కూటమి నేతలు వక్రీకరిస్తున్నారు. ప్రజలకిచ్చిన హామీలను పక్కనపెట్టేసి కేవలం వేలాది కోట్లు రాజధాని నిర్మాణానికి వెచ్చించడం సరికాదు. నీళ్లు తోడడానికి కోట్లాది రూపాయలు ఖర్చుచేయడం సరికాదు. ప్రశ్నించే వారిపై అక్రమకేసులు బనాయించి రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. గతంలో ఇలాంటి దారుణమైన పరిస్థితి శ్రీకాకుళం మున్సిపాలిటీలో ఎన్న డూ లేదు. అధికారులు, కూటమి నేతల నిర్లక్ష్యం వల్లే నలుగురు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. – ధర్మాన కృష్ణదాస్, పార్టీ జిల్లా అధ్యక్షుడు మృతుందరినీ డయేరియా మృతులుగా పరిగణించాలి శ్రీకాకుళం చరిత్రలో ఇలాంటి సంఘటనలు జరగలేదు ప్రభుత్వ తీరుపై మండిపడిన వైఎస్సార్సీపీ నాయకులు డయేరియా బాధితులకు పరామర్శ -
బాధ్యులు ఒకరు.. చర్యలు మరొకరిపై!
● శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్పై సస్పెన్షన్ వేటు ● డయేరియా ఘటనకు బాధ్యుడిని చేస్తూ చర్యలు ● రెండు వారాల కిందటే వచ్చిన అధికారి ● డయేరియాకు బాధ్యులైన అధికారులపై ఉదాసీనత సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లా కేంద్రంలో డయేరియా ప్రబలడంతో నగరపాలక కమిషనర్ హనుమంతు కూర్మారావును బాధ్యుడిని చేస్తూ సస్పెన్షన్ వేటు వేశారు. కానీ ఆయన రెండు వారాల కిందటే బాధ్యతలు తీసుకోవడం గమనార్హం. పరిస్థితులు అర్థం చేసుకునేలోగానే ఆయనను బలి చేశారు. తమకు కావాల్సిన వారిని కాపాడుకోవడానికి మున్సిపల్ కమిషనర్ను సస్పెండ్ చేశారనే ఆరోపణ బలంగా వినిపిస్తోంది. మంగళవారం రాత్రంతా విధుల్లో ఉన్న కమిషనర్ కూర్మారావు బుధవారం ఉదయం 5.53గంటలకు కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చేసరికి సస్పెన్షన్ ఉత్తర్వులు టేబుల్ మీద ఉన్నాయి. ఆయన స్థానంలో విశాఖపట్నం ఆర్డీ వి.రవీంద్రను ఇన్చార్జిగా నియమించడంతో కూర్మారావు హుటీహుటీన విధుల నుంచి తప్పుకున్నారు. రెండు వారాలు కాకముందే హనుమంతు కూర్మారావు ఫిబ్రవరి 11వ తేదీన కార్పొరేషన్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. విధుల్లోకి వచ్చి రెండు వారాలు కూడా పూర్తి కాలేదు. వచ్చిన దగ్గరి నుంచి కార్పొరేషన్పై అవగాహన పెంచుకుంటున్నారు. వార్డు పర్యట నలు చేస్తున్నారు. ఇంతలో డయేరియా ప్రబలింది. కారణాలు అన్వే షించి, అదుపులోకి తెచ్చేందుకు తనవంతు ప్రయ త్నం చేస్తున్నారు. కానీ ఆయనపై వేటు వేశారు. బాధ్యులు వారు కాదా? డయేరియా ప్రబలడానికి ప్రధాన కారణం తాగునీరు కలుషితమే. ఇది ప్రజారోగ్యానికి సంబంధించిన వ్యవహారం. దీన్ని పర్యవేక్షించాల్సింది మున్సిప ల్ హెల్త్ ఆఫీసర్. ఆయన పనితీరుపై ఇప్పటికే విమర్శలు ఉన్నాయి. పలు ఆరోపణలు కూడా ఉన్నాయి. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారన్న వాద నలు ఉన్నాయి. తాగునీరు కలుషితమే ప్రధాన కారణమైతే దానికి బాధ్యులైన మున్సిపల్ హెల్త్ ఆఫీసర్పై చర్యలు తీసుకోవాలి. ఒకవేళ తాగునీరు కలుషితం కావడానికి పైపులైన్లు కారణమైతే, దానికి సంబంధించిన ఇంజనీరింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఇక్కడదేమి చేయకుండా రెండు వారా ల క్రితం వచ్చిన కమిషనర్ కూర్మారావుపై చర్యలు తీసుకుంది. ఇప్పుడిదే నగరంలో చర్చనీయాంశంగా మారింది. అసలైన బాధ్యుల వెనక ఎవరున్నారు..? కమిషనర్ను బలి చేసి, మిగతా అధికారులను కాపాడుతున్నదెవరు? అన్నదానిపై ప్రస్తుతం పెద్ద చర్చ జరుగుతోంది. డయేరియా ప్రబలడానికి కారణమైన శాఖలకు చెందిన అధికారులపై కనీసం చర్యలు తీసుకోకపోవడం వెనక మంత్రుల హస్తం ఉందన్న వాదనలు ఉన్నాయి. సదరు అధికారులకు పెద్దల అండదండలు ఉండటంతో ఇష్టారీతిన వ్యవహరించడమే కాకుండా తనది కాని వాటిలో తల దూర్చి పెత్తనం చెలాయిస్తారన్న ఆరోపణలూ ఉన్నాయి. తాజా చర్యలు ఆ ఆరోపణలకు బలం చేకూర్చాయి. -
ఆటలు ఆడుకుంటారా
జిల్లా కేంద్రంలో డయేరియా వ్యాపించి నగరమంతా అట్టుడికిపోతుంటే కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యే రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడు, గొండు శంకర్లు విజయవాడలో కబడ్డీ ఆడుకోవడం సిగ్గుచేటు. కలుషిత నీరు తాగి మనుషులు చనిపోతే వాటిని పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడం సరికాదు. డయేరియాని కంట్రోల్ చెయ్యడం చేతకాక సహజ మరణాలు అని చెప్పడం విడ్డూరం. కనీసం మున్సిపాలిటీ డాక్టర్లు రాలేదని స్థానికులు బండబూతులు తిడుతున్నారంటే ప్రజారోగ్యం పట్ల కూటమి పాలకులకు ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తోంది. – సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి -
అధికారికంగా ఒకరే..
శ్రీకాకుళం పాతబస్టాండ్: నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రబలిన అతిసారంపై సామాజిక మాధ్యమాలు, ఇతర మార్గాల్లో వస్తున్న అవాస్తవాలను నమ్మవద్దని, ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అతిసారం కారణంగా అధికారికంగా ఇప్పటివరకు ఒక్కరు మాత్రమే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మిగిలిన మరణాలకు గల ఇతర కారణాలను విశ్లేషిస్తున్నామని, పరిస్థితిని ప్రభుత్వం పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తోందని తెలిపారు. కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు 50కి పైగా వైద్య బందాలు నిరంతరం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. వ్యాధి మూలాలను గుర్తించేందుకు సచివాలయ సిబ్బంది, ఆశా/ఏఎన్ఎంలతో కూడిన బృందాలు ఇంటింటికీ వె ళ్లి సర్వే నిర్వహిస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. రోగులకు మంత్రి నారాయణ పరామర్శ శ్రీకాకుళం: శ్రీకాకుళంలో డయేరియా ప్రబలడానికి కారణం గుర్తించేందుకు రాష్ట్రస్థాయి నుంచి నిపుణుల బృందాన్ని తీసుకువచ్చినట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. ఆయన బుధవారం శ్రీకాకుళంలో పర్యటించి బాధితులను కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. వ్యాధి ప్రబలడా నికి కారణం నీరు కలుషితం కావడమా.. ఆహారంలో ఎక్కడైనా కల్తీ జరిగిందా అన్నది గుర్తించాల్సి ఉందన్నారు. గురువారానికి వివరాలు తెలుస్తాయన్నారు. మొత్తం 102 మంది వ్యాధి బారిన పడ్డారని తెలిపారు. ఇందులో 19 మంది డిశ్చార్జ్ అయ్యారని, మిగిలిన వారిలో ఇద్దరి పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉందని చెప్పారు. ఒకరికి మాత్రమే ఎక్స్గ్రేషియా ప్రకటించారని మీడియా ప్రశ్నించగా మరొకరికి సంబంధించి పోస్టుమార్టం నివేదిక వచ్చిన వెంటనే మరణానికి కల కారణాన్ని తెలుసుకొని తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా ఆస్పత్రుల్లో బాధితులను పరామర్శించారు. నగరంలో అతిసార వ్యాప్తికి కారణమైన పాత తాగునీటి పైపులైన్లు, అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థలను యుద్ధప్రాతిపదికన ప్రక్షాళన చేస్తా మని మంత్రి పి.నారాయణ తెలిపారు. సమీక్ష సమా వేశంలో మాట్లాడుతూ నగరంలో డ్రైనేజీ ల పునరుద్ధరణ, మరమ్మతుల కోసం తక్షణమే రూ. 12 కోట్లు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో రూ. 2 కోట్లను అతిసార ప్రభావిత ప్రాంతాల్లోని కచ్చా డ్రైన్ల పనుల కోసం కేటాయించాలని అధికారులను ఆదేశించారు. నగరవ్యాప్తంగా ఇంటింటికీ సురక్షిత మంచినీటిని అందించేందుకు రూ. 60 కోట్లతో చేపట్టే పనులను మార్చి నెలలో మొదలు పెడతామని స్పష్టం చేశారు. నిలిచిపోయిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనుల కోసం రూ. 23 కోట్లు, అమృత్–1 పథకం కింద డ్రైనేజీల నెట్వర్క్ కోసం రూ. 35 కోట్లు వెచ్చిస్తున్నట్లు మంత్రి తెలిపారు. -
‘ప్రజల ప్రాణాలతో చెలగాటమా..?’
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): శ్రీకాకుళంలో డయేరియా వ్యాప్తి దారుణమని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ప్రజల ప్రాణాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని మండిపడ్డారు. రోడ్డు మరమ్మతుల పనులు సక్రమంగా నిర్వహించకపోవడం, తాగునీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని ఆయన ఆరోపించారు. ప్రజారోగ్య రక్షణలో వైఫల్యం, ప్రభుత్వ పరిపాలన లోపాలను బయటపెడుతోందన్నారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వెంటిలేటర్పై ఉన్న రోగుల ఆరోగ్యంపై ప్రత్యేక వైద్య బృందాలు పర్యవేక్షణ చేయాలని, అవసరమైతే ఉన్నత స్థాయి నిపుణులను నియమించాలని డిమాండ్ చేశారు. -
వ్యాధి వ్యాప్తి ఎలా ఉంది..?
అధికారిక లెక్కల ప్రకారం మంగళవారం నాటికి 68 కేసులు నమోదైతే బుధవారానికి ఆ కేసులు 102కి చేరుకున్నాయి. అనధికారిక లెక్కల ప్రకారం 162 మంది అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. 10 నెట్వర్క్ ఆస్పత్రుల్లో ప్రస్తుతం డయేరియా రోగులు ఉన్నారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఆరుగురి పరిస్థితి సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. వైద్యం ఇలా..? జిల్లాలో విభృంజిస్తున్న డయేరియా బాధితులకు ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా ఉచిత వైద్యం అందించేలా చర్యలు చేపడుతున్నట్లుగా ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ అవని (9281068139) తెలియజేశారు. డయేరియా లక్షణాలు కనిపించిన రోగులంతా ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆస్పత్రుల్లో చేరాలని, ఉచిత వైద్యం పొందాలని ఆయన ప్రకటించారు. అలాగే ఈ మేరకు సహాయం కోసం మూడు బృందాలు పనిచేస్తున్నాయని, 9281068255, 9281068256, 9281068257 నంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు. కిమ్స్లో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులు


