-
No Headline
శాతంఓటేసిన వారుమొత్తం పురుష ఓటర్లు 75.387,01,0169,29,859మొత్తం మహిళా ఓటర్లు 7,39,8529,45,94578.21థర్డ్ జెండర్ ఓట్లు 130శాతం 13.08 పోలైన ఓట్లు 17 -
స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలు భద్రం
ఎచ్చెర్ల క్యాంపస్: జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాలు, పార్లమెంట్ సెగ్మెంట్ వారీగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు చిలకపాలెంలోని శ్రీ శివానీ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రాలకు సోమవారం రాత్రి చేరాయి. అన్ని నియోజకవర్గాల నుంచి సామగ్రి ఇక్కడకు చేరే సరికి అర్ధరాత్రి దాటింది. అనంతరం ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. అధికారులు, రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో మంగళవారం సీళ్లు వేశారు. స్ట్రాంగ్ రూమ్లకు మూడంచల భద్రత ఏర్పాటుచేశారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు సమయంలో రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో సీళ్లు తొలగించి కౌంటింగ్ కేంద్రాలకు ఈవీఎంలు తరలిస్తారు. స్ట్రాంగ్ రూమ్లకు ఈవీఎంల తరలింపు, భద్రపర్చటం, సీట్లు వేయటం వంటి ప్రక్రియలను ఎన్నికల పరిశీలకులు శేఖర్ విద్యార్థి, కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలానీ సమూన్, నియోజక వర్గ ఆర్వోలు పర్యవేక్షించారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు 24 గంటల భద్రత పహారా ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ల వెలుపల వైపు ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. కళాశాల చుట్టు పక్కల సైతం షిఫ్టుల్లో పోలీ స్ భద్రత కొనసాగనుంది. నిరంతరం రాజకీయ పార్టీ అభ్యర్థులు, ఏజెంట్లు పరిశీలించుకునే అవకాశం కల్పించారు. సీసీ కెమెరాలు నిఘా, రికార్డింగ్ వ్యవస్థ, నిరంతరం విద్యుత్ సౌకర్యం వంటివి ఏర్పాటు చేశారు. పోలింగ్ ముగిసిన తర్వాత జోన్లు వారీగా జీపీఎస్ అనుసంధానం చేసిన ట్రాక్లు ఏర్పాటు చేసిన వాహనాల్లో ఈవీఎంలు రిసెప్షన్ కేంద్రాలకు తీసుకువచ్చారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు స్ట్రాంగ్ రూమ్ల్లో భద్రత, ఇతర అంశాలను తమ దృష్టికి తెచ్చి తెలుసుకోవచ్చునని కలెక్టర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎన్నికలు పరిశీలకులు సందీప్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ తమీమ్ అన్సారియా , ఆర్ఓ నూరుల్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు పాల్గొన్నారు. -
మహిళలే నిర్ణేతలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం సార్వత్రిక ఎన్నికలు దిగ్విజయంగా ముగిశాయి. ఈవీఎంల్లో ఓటర్ల తీర్పు నిక్షిప్తమై ఉంది. అభ్యర్థుల భవితవ్యం వాటిలో భద్రమై ఉంది. స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలున్నాయి. ఇక ఫలితాలే మిగిలాయి. కౌంటింగ్కు మరో 20 రోజుల సమ యం ఉంది. దీంతో అభ్యర్థులంతా సోమవారం జరిగిన పోలింగ్ సరళిపై బూత్ల వారీగా సమీక్ష ప్రారంభించారు. కూడికలు, తీసివేతల్లో నిమగ్నమయ్యారు. జిల్లాలో ప్రధాన వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్య పోటీ ఉంది. ఒకచోట వైఎస్సార్సీపీ, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. ఓటర్లు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చారని వైఎస్సార్సీపీ, ఓటర్లు తమవైపు ఉన్నారని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. స్వల్పంగా పెరిగిన ఓటింగ్ జిల్లాలో 2019 ఎన్నికల కంటే పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగింది. ఆ ఎన్నికల్లో 76.35 శాతం పోలింగ్ జరగ్గా ఈ సారి 76.81శాతం ఓటింగ్ నమోదైంది. 0.46శాతం పెరిగింది. జిల్లాలో 18,75,934 మంది ఓటర్లు ఉండగా వారిలో 14,40,885 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం ఓటర్లలో మహిళలు 9,45,945 మంది ఉండగా 7,39,852మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుషుల ఓట్లు 9,29,859 మంది ఉండగా 7,01,016 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుషుల కంటే అదనంగా దాదాపు 40వేల మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. థర్డ్ జెండర్ ఓట్ల విషయానికి వస్తే 130 ఓట్లు ఉండగా కేవలం 17ఓట్లు (13.08 శాతం) మాత్రమే పోలయ్యాయి. జిల్లాలో అత్యధికంగా ఎచ్చెర్లలో 83.28శాతం, నరసన్నపేటలో 82.44 శాతం, ఆమదాలవలసలో 81.42 శాతం నమోదవ్వగా, నరసన్నపేటలో అత్యల్పంగా శ్రీకాకుళంలో 70.22 శాతం, ఇచ్ఛాపురంలో 70.56 పోలింగ్ శాతం నమోదైంది. కూడికలు, తీసివేతల్లో నిమగ్నం గత రెండు నెలలుగా మండు వేసవిలో ఎన్నికల కోసం విరామం లేకుండా పనిచేసిన నాయకులంతా ప్రస్తుతం సేద తీరుతున్నారు. హమ్మయ్యా ఎ న్నికలు ముగిశాయని ఊపిరి పీల్చుకుంటున్నారు. నాయకులంతా తమ తమ అభ్యర్థుల వద్దకు వచ్చి పోలింగ్ ఎలా జరిగిందో చెబుతున్నారు. బూత్ల వారీగా ఎవరికెన్ని ఓట్లు వచ్చాయో లెక్కలు వేసుకుంటున్నారు. ఎక్కడ ప్లస్, ఎక్కడ మైనస్ అయిందో తెలుసుకుంటున్నారు. తమ వేగుల ద్వారా బూత్ల వారీగా సర్వేలు కూడా చేయించుకుంటున్నారు. ఎన్ని వస్తాయో అంచనా వేసుకునే పనిలో పడ్డారు. ఒకవైపు తమ కుటుంబ సభ్యులతో గడుపుతూనే మరోవైపు పోలింగ్పై లెక్కలు కట్టుకుంటున్నారు. మహిళా ప్రభంజనం పోలైన ఓట్లలో వారిదే ఆధిక్యం వారితోనే వైఎస్సార్సీపీకి సానుకూలత గతం కంటే పెరిగిన ఓటింగ్ 76.81 శాతం ఓటింగ్ నమోదు భారీగా ఓటు హక్కు వినియోగించుకున్న మహిళలు పురుషుల కంటే దాదాపు 2.83 శాతం అధికం జిల్లాలో మహిళా ఓటర్లు ఓటెత్తారు. పురుషుల కంటే దాదాపు 40వేల మంది సీ్త్రలు అధికంగా ఓట్లేశారు. మండుటెండలు ఇబ్బంది పెట్టినా వెనక్కి తగ్గలేదు. ఎచ్చెర్ల ని యోజకవర్గంలో తప్ప మిగతా అన్ని నియోజకవర్గాల్లో మహిళలే ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అభ్యర్థుల గెలుపోటములపై మహిళల ఓట్లు తప్పనిసరిగా ప్రభావం చూపనున్నాయని తెలుస్తోంది. నియోజకవర్గం పోలైన ఓట్లు పురుషులు మహిళలు ఇచ్ఛాపురం 1,89,238 85,632 1,03,604 పలాస 1,67,632 78,423 89,207 టెక్కలి 1,90,272 93,458 96,812 పాతపట్నం 1,63,044 80,485 82,556 శ్రీకాకుళం 1,91,875 94,098 97,776 ఆమదాలవలస 1,57,848 78,515 79,330 ఎచ్చెర్ల 2,03,831 1,02,681 1,01,147 నరసన్నపేట 1,77,145 87,724 89,420 -
18 నుంచి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
నరసన్నపేట: స్థానిక వేంకటేశ్వరస్వామి ఆల యాన్ని ప్రతిష్టించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 18 నుంచి 27 వరకూ బ్రహ్మోత్సవాలు ఆలయం ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. ఈ మేరకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తుండగా మరో వైపు ఆలయ కమిటీ ప్రతినిధులు ఆహ్వాన పత్రికలు చురుగ్గా పంపిణీ చేస్తున్నారు. ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. 18 నుంచి 27 వరకూ రోజూ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. చామర్తి శ్రీనివాసాచార్యులు కృష్ణమాచార్యులు, ఆలయ ట్రస్టు కమిటీ చైర్మన్ పి.వీరభద్రస్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఓటెత్తిన గిరిజన గ్రామం హిరమండలం: మండలంలోని గొడియపాడు గిరిజన గ్రామంలో సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 316 పోలింగ్ బూత్ పరిధిలో అక్కడి ఓటర్లు 91.07శాతం ఓట్లేశారు. ఈ గ్రామంలో మొత్తం 224 మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 91మంది ఓటు వేయ గా సీ్త్రలు 113 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే లొకొండ గిరిజన గ్రామం 315 పోలింగ్ బూత్లో 90.67శాతం పోలింగ్ నమోదు జరిగింది. గ్రామంలో మొత్తం 193 మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 80మంది, సీ్త్రలు 95మంది ఓటుహక్కు వినియోగించుకుని మండలంలో ద్వితీయ స్థానంలో నిలిచారు. అత్యల్పంగా మేజర్ పంచాయతీ హిరమండలం 298బూత్లో 56.47 శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ 870మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 244మంది, సీ్త్రలు 236 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మార్కెట్లోకి ఉద్దానం మునగ కాశీబుగ్గ: ఉద్దానంలో పండుతున్న దేశీ మునగ మార్కెట్లోకి వచ్చేసింది. ప్రస్తుతం హైబ్రీడ్ మునగకాయులు విరివిగా దొరుకుతున్నప్పటికీ దేశీ మునగకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. దీంతో ఉద్దానం దేశీ మునగను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పలాస, మందస మండలం సముద్ర తీరంలో వ్యాపించి ఉన్న ఉద్దాన దేశీ పంట మార్కెట్కు తీసుకువస్తున్నారు. పలాస, కాశీబుగ్గ,పూండి, మందస,హరిపురం, బ్రాహ్మ ణతర్లా మార్కెట్లో అమ్మకాలు సాగుతున్నాయి. కట్ట రూ.30 మొదలుకొని లభించడంతో కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నరసన్నపేట: వైశాఖ మాసం మొదటి మంగళవారం సందర్భంగా మండల కేంద్రం నరసన్నపేటలో అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. స్థానిక పైడితల్లి, శాంతామణి, నూకాలమ్మ తల్లి అసిరమ్మతల్లి ఆలయాల్లో అమ్మవారికి మహిళలు ముర్రాటు సమర్పించి మామిడి పండ్లతో మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయాల వద్ద రద్దీ నెలకొంది. ఉదయం నుంచి 10 గంటల వరకు ఈ రద్దీ కొనసాగింది. -
బాస్కెట్బాల్ జట్ల ఎంపికలకు సై
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా బాస్కెట్బాల్ జట్ల ఎంపికలకు రంగం సిద్ధమైంది. జిల్లాస్థాయి అండర్–16 బాలబాలికల బాస్కెట్బాల్ ఎంపిక పోటీలు బుధవారం జరగనున్నాయి. ఇందుకు జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ చైర్మన్ ఎమ్మెస్సార్ కృష్ణమూర్తి నేతృత్వంలో సంఘ ప్రతినిధులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు ఉదయం 9 గంటల నుంచి శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ క్రీడా మైదానం వేదికగా ఎంపిక పోటీలు జరగనున్నాయి. ఇక్కడ ఎంపికై తే రాష్ట్ర పోటీలకు.. ఇక్కడ ఎంపికల్లో రాణించిన క్రీడాకారులను జిల్లా బాస్కెట్బాల్ జట్లకు ఎంపిక చేయనున్నారు. ఎంపిక చేసిన జిల్లా జట్లను త్వరలో జరిగే ఏపీ రాష్ట్ర స్థాయి అండర్–16 బాలబాలికల బాస్కెట్బాల్ చాంపియన్షిప్–2024 పోటీలకు పంపించనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన బాస్కెట్బాల్ క్రీడాకారులు తమ జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్కార్డు, నాలుగు ఫొటోలతో ఎంపికలకు హాజరుకావాలని ఎమ్మెస్సార్ కృష్ణమూర్తి పేర్కొన్నారు. క్రీడామైదానం వద్ద డీఎస్ఏ కోచ్ జి.అర్జున్రావురెడ్డి (సెల్: 99492 91288)ని సంప్రదించాలని ఆయన కోరారు. నేడు జిల్లా అండర్–16 బాలబాలికల ఎంపిక పోటీలు -
No Headline
నియోజకవర్గం మొత్తం ఓట్లు పోలైన ఓట్లు పోలింగ్ శాతం ఆమదాలవలస 1,93,858 1,57,848 81.42 ఎచ్చెర్ల 2,44,760 2,03,831 83.28 ఇచ్ఛాపురం 2,68,202 1,89,238 70.56 నరసన్నపేట 2,14,866 1,77,145 82.44 పలాస 2,19,348 1,67,632 76.42 పాతపట్నం 2,25,313 1,63,044 72.36 శ్రీకాకుళం 2,73,260 1,91,875 70.21 టెక్కలి 2,36,327 1,90,272 80.51 మొత్తం 18,75,934 14,40,885 76.81 -
No Headline
● జిల్లాలో 2019 కంటే ఓటింగ్ శాతం కొంతమేర పెరిగింది. ఎచ్చెర్ల మినహా అన్ని నియోజకవర్గాల్లో ఈ సారి ఓటింగ్ శాతం పెరిగింది. ● శ్రీకాకుళం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో 70.01శాతం ఓటింగ్ జరగ్గా ఈసారి 70.21 శాతం ఓటింగ్ జరిగింది. ● ఇచ్ఛాపురం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో 70.15శాతం ఓటింగ్ జరగ్గా ఈసారి 70.56 శాతం పోలింగ్ అయింది. 0.38శాతం ఓటింగ్ పెరిగింది. ● ఎచ్చెర్ల నియోజకవర్గంలో గత ఎన్నికల్లో 84.30 శాతం ఓటింగ్ జరగ్గా ఈ సారి 83.28 శాతం పోలింగ్ జరిగింది. దాదాపు 1.16 శాతం గతం కంటే తగ్గింది. ● పలాస నియోజకవర్గంలో గత ఎన్నికల్లో 72.92శాతం ఓటింగ్ జరగ్గా ఈసారి 76.42శాతం ఓటింగ్ నమోదైంది. 2.22శాతం ఓటింగ్ పెరిగింది. ● టెక్కలి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో 78.78 శాతం ఓటింగ్ జరగ్గా ఈ సారి 80.51శాతం ఓటింగ్ జరిగింది. ● నరసన్నపేట నియోజకవర్గంలో గత ఎన్నికల్లో 80.00 శాతం ఓటింగ్ జరగ్గా ఈ సారి 82.44శాతం ఓటింగ్ నమోదైంది. ● ఆమదాలవలస నియోజకవర్గంలో గత ఎన్నికల్లో 78.51 శాతం ఓటింగ్ జరగ్గా ఈ సారి 81.42శాతం ఓటింగ్ జరిగింది. ● పాతపట్నం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో 69.47 శాతం ఓటింగ్ జరగ్గా ఈ సారి 72.36శాతం నమోదైంది. -
No Headline
చక్కటి అనుభవం 18 ఏళ్లు నిండిన నేను ఈ సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకోవడం ఓ మంచి అనుభవం. ఆశ్రిత పక్షపాతం, అవినీతి రహితంగా ఓ మంచి వాతావరణంలో ఓటు హక్కును తొలిసారిగా వినియోగించడం భవిష్యత్లో గుర్తించుకోదగ్గ అనుభవం. – బల్లెడ కీర్తన, బొరివంక, కవిటి మండలం నేను సైతం.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు పొందిన భారతదేశంలో ఓటు హక్కు కలిగి ఉండడం ప్రతి ఒక్కరికీ ఓ గొప్ప గౌరవం. నేను ఈ దఫా ఎన్నికల్లో ఆ అవకాశం దక్కించుకున్నాను. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఎన్నికకు నా వంతుగా ఓటు ద్వారా నిర్ణయాన్ని తెలిపాను. – బి.హర్షవర్ధన్, బెజ్జిపుట్టుగ, కవిటి మండలం -
సిబ్బందికి కలెక్టర్ అభినందనలు
శ్రీకాకుళం పాతబస్టాండ్ : జిల్లాలో ప్రశాంత ఎన్నికల నిర్వహణలోను, స్వేచ్ఛా శాంతియుత ఓటింగ్ను నిర్వహించిన అన్ని శాఖల ఉద్యోగులకు, అన్ని స్థాయిల సిబ్బందికి కలెక్టర్ మన్జీర్ జిలానీ సమూన్ అభినందనలు తెలియజేశారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యాక జిల్లా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఆయన మాట్లాడుతూ జిల్లాలో సిబ్బంది కలిసికట్టుగా పనిచేసి సజావుగా ఎన్నికల ప్రధాన ఘట్టాన్ని పూర్తిచేశారన్నారు. ఉద్యోగులంతా ఓటింగ్ ప్రక్రియలో నిరంతరాయంగా 14 గంటలకు పైగా పని చేసి విజయవంతం చేశారని ఆయన తెలిపారు. ప్రశాంత ఓటింగ్కు కృషి చేసిన అధికారులు, నోడల్ అధికారులకు అభినందనలు తెలిపారు. 103 ఏళ్ల వయసులో.. మెళియాపుట్టి: ఈ వృద్ధురాలి వయసు 103 ఏళ్లు. మెళియాపుట్టి మండలం పరశురాంపురం పంచాయతీ పరిధి నందవ గ్రామానికి చెందిన సవర ఎగడమ్మ అనే ఈ గిరిజన వృద్ధురాలిని ఆమె మనవళ్లు ఓటు వేయించానికి ఇలా తీసుకెళ్తున్నారు. ఎన్నికల్లో మేము సైతం.. శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళంలో సోమ వారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నేషనల్ క్యాడెట్ కార్ప్స్(ఎన్సీసీ) క్యాడెట్లు మేము సైతం అంటూ భాగస్వాములయ్యారు. ఎన్నికల్లో సేవలు అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. జిల్లా ఎన్నికల అధికారి విజ్ఞప్తి మేరకు ఎన్సీసీ క్యాడెట్లు పోలింగ్ కేంద్రాల్లో సిబ్బందికి, పోలీసులకు తమ వంతు సాయాన్ని అందించారు. ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లను క్యూలో పంపించడంతోపాటు పోలింగ్ కేంద్రం లోపల అవసరమైన సాయా న్ని అందించి తమ సేవా గుణాన్ని మరోసారి చాటుకున్నారు. ఎన్సీసీ క్యాడెట్లతోపాటు జాతీ య సేవా పథకం (ఎన్ఎస్ఎస్) వలంటీర్లు సైతం ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. -
కంట్రోల్ రూమ్లో నిరంతర నిఘా
శ్రీకాకుళం పాతబస్టాండ్: కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెల్ నుంచి వెబ్కాస్టింగ్ ద్వారా ఓటింగ్ సరళిని పర్యవేక్షించారు. ఉదయం 5గంటల నుంచే దాదాపు 600 మంది సిబ్బంది ఈ పనిలో నిమగ్నమయ్యారు. ముందుగా వేకువన ఆయా పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ను పరిశీలించారు. ఒకట్రెండు చోట్ల ఈవీఎంలు సాంకేతిక లోపాల గురించి తెలుసుకుని గరిష్టంగా 15 నిమిషాల్లో కొత్తవాటిని ఏర్పాటు చేయడంలో సఫలీకృతమయ్యారు. రోజంతా ఈవీఎంల్లో ఎక్కడా ఎలాంటి లోపాలు వచ్చినా తక్షణమే పరిష్కరించి అలాంటి సమస్యలు పునరా వృతం కాకుండా చేశారు. చెదురు మదురు ఘటనలు జరిగినా తక్షణమే పరిష్కరించేందుకు చొరవ చూపించారు. సెక్టార్ అధికారులు, పోలీస్ సిబ్బందిని అప్ర మత్తం చేస్తూ కనిపించారు. పొందూరు మండలంలో జరిగిన చిన్నపాటి ఘర్షణవిషయాన్ని అధికారులకంటే ముందే ఆయన నేరుగా సమాచారం తెప్పించుకోవడంలోనూ సిబ్బందికి సూచనలివ్వ డంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. వెబ్కాస్టింగ్లో పోలింగ్ కేంద్రాల్లో ఎవరైనా సెల్ఫోన్లతో ప్రవేశించినా, అనుమానాస్పదంగా కనిపించినా క్యూలైన్ల ని ర్వహణ సరిగా లేకపోయినా, స్క్రీన్ మీద చూసిన వెంటనే పోలింగ్ స్టేషన్ నంబరు నమోదు చేసుకుని నేరుగా ఆర్వోలతో మాట్లాడుతూ సూచనలిస్తూ అప్రమత్తం చేశారు. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడి యాల్లో వస్తున్న వార్తల వివరాలను, స్క్రోలింగ్ల గురించి ఎంసీసీ కమిటీలను అప్రమత్తం చేశారు. కంట్రోల్ రూమ్ వెలుపల ఏర్పాటు చేసిన పోలింగ్ శాతాన్ని, ఇతర సమాచారం తెలుసుకునే సిబ్బంది దగ్గరికి ప్రతి అరగంటకూ తానే వెళ్తూ అప్రమత్తం చేశారు. ఓటరు హెల్ప్లైన్ కోసం 1950 కి వస్తున్న ఫిర్యాదుల గురించి ప్రతి గంటకూ నివేదిక రూపంలో తెప్పించుకుని వంద శాతం ఓటరుకు సాయపడేలా చేశారు. సమయం రాత్రిసాయంత్రంమధ్యాహ్నంఉదయం48.70 % 74.30 % 74.99 % 67.74 % 21.54 % 40.72 % 8.35 % -
● బారులు తీరిన ఓటర్లు
ఉదయం 6 గంటలకు మాక్ పోలింగ్తో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఏడు గంటలకు పోలింగ్ మొదలైంది. అప్పటికే ఓటేసేందుకు ఓటర్లు పోటె త్తారు. వృద్ధులు, మహిళలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. దీంతో పోలింగ్ చకచకా సాగింది. పోలింగ్ రోజున సంక్షేమ పథకాల ప్రభావం స్పష్టంగా కనిపించింది. మహిళలు, వృద్ధులు, రైతులు ఉత్సాహంతో ఓటేసేందుకు తర లివచ్చారు. ఇక ఓటర్లు బారులు తీరి ఉండటంతో పోలింగ్ సమయం ముగిసినా అప్పటికే ఉన్న వారందరికీ ఓటేసే అవకాశం కల్పించారు. దీంతో రాత్రి వరకు పోలింగ్ సాగింది. -
పోటెత్తిన జనం
ఓటెత్తిన చైతన్యం జిల్లా వ్యాప్తంగా భారీగా సానుకూల ఓటింగ్సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం జిల్లాలో ఓటేసేందుకు జనం పోటెత్తారు. ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి వరకు జిల్లాలో పలుచోట్ల పోలింగ్ కొనసాగింది. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్కు అంతరాయం కలిగిలింది. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. సమయం ముగిసినా ఓటర్లు క్యూలైన్లలో బారులు తీరి కనిపించడంతో నిర్ణీత సమయం లోపు క్యూలో చేరిన వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. పోలింగ్లో టీడీపీ నాయకులు చెలరేగిపోయారు. పలుచోట్ల దౌర్జన్యాలకు, దాడులకు దిగారు. చెదురుమదురు ఘటనలు.. జిల్లాలో టీడీపీ నాయకులు దౌర్జన్యానికి దిగారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు చేశారు. ● పొందూరు మండలం గోకర్నపల్లి గ్రామంలో పోలింగ్ బూత్ ఏజెంట్ విషయంలో తలెత్తిన వివాదంలో వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ నాయకులు దాడి చేశారు. ఈ ఘటనలో వైఎస్సార్సీపీ నాయకులు చింతాడ జీవరత్నం, యతేంద్ర, సంపతిరావు సూర్యనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. ● లావేరు మండలం బెజ్జిపురం పోలింగ్ కేంద్రంలో ఇరుపార్టీల మధ్య గొడవ జరిగింది. కంచిలి మండలం గోకర్నపురంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగడంతో పోలీసులు రంగ ప్రవేశంతో సద్దుమణిగింది. ● సోంపేట మండలం ఎర్రముక్కాం గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ నాయకులు దాడి చేశారు. ● పలాస గవర్నమెంట్ హైస్కూల్ పోలింగ్ స్టేషన్ లోపలకు వెళ్లేందుకు విధుల్లో ఉన్న సీఐ అవకాశం ఇస్తున్నారని వైఎస్సార్సీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి సీఐ డౌన్ డౌన్ అంటూ నిరసన తెలిపాయి. ● శ్రీకాకుళం బాలికల ఉన్నత పాఠశాలలో శ్యాంపాలెంకు చెందిన టీడీపీ కార్యకర్త, వైఎస్సార్సీపీ కార్యకర్తకు వాగ్వాదం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ 20మంది అనుచరులతో వచ్చి దాడి చేసేందుకు యత్నించారు. ● సమాచారం అందుకున్న ఎస్పీ రాధిక అక్కడికొచ్చి గలాటా సృష్టిస్తున్న వారిని చెదరగొట్టారు. ● గుజరాతీపేటలో రాజీనామా చేసిన వలంటీర్ను ఏజెంట్గా నియమించడంతో టీడీపీ కార్యకర్త అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనితో ఇరువురి మధ్య వాగ్వాదం జరగడంతో అక్కడికి కూడా అనుచరవర్గంతో గొండు శంకర్ వచ్చి గొడవ చేయబోయారు. ఇంతలో మంత్రి ధర్మాన ప్రసాదరావు అక్కడికొచ్చి రాజీనామా చేసిన వలంటీర్ ఏజెంట్గా ఉంటే తప్పేంటని నిలదీశారు. ఈ క్రమంలో వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఎస్పీ రాధిక జోక్యం చేసుకుని పరిస్థితిని సద్దుమణిగించారు. కోడ్ ఉల్లంఘనలు.. శ్రీకాకుళం టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ అడుగడుగునా కోడ్ ఉల్లంఘించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లతో ఫొటోలు దిగారు. టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి రామ్మోహన్నాయుడు సైతం అదే రకంగా ఫొటోలు దిగి నియామవళిని ఉల్లంఘించారు. గొండు శంకర్ ఎక్కడికి వెళ్లితే అక్కడ న్యూసెన్స్ అయింది. ఇక, జిల్లా వ్యాప్తంగా టీడీపీ అభ్యర్థులు సూపర్ సిక్స్ పథకాలతో కూడిన స్లిప్పులను ఓటర్లకు ఇచ్చి నియామవళిని ఉల్లంఘించారు. పోలింగ్ కేంద్రాల వద్దకు ఆ స్లిప్పులు తీసుకొచ్చినా అధికారులు చర్యలు తీసుకోలేదు. కనీసం తీసుకురాకూడదని నియంత్రించలేదు. పోలింగ్ ప్రశాంతం అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు రాత్రి వరకు కొనసాగిన పోలింగ్ పేట్రేగిపోయిన టీడీపీ నాయకులు యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘన -
No Headline
నియోజకవర్గం మొత్తం ఓట్లు పోలైన ఓట్లు పోలింగ్ శాతం ఆమదాలవలస 1,93,858 1,53,972 79.43 ఎచ్చెర్ల 2,44,760 2,00,227 81.81 ఇచ్ఛాపురం 2,68,202 1,87,061 69.75 నరసన్నపేట 2,14,866 1,73,029 80.53 పలాస 2,19,348 1,64,384 74.94 పాతపట్నం 2,25,313 1,58,298 70.26 శ్రీకాకుళం 2,73,260 1,84,186 67.40 టెక్కలి 2,36,327 1,85,694 78.58 మొత్తం 18,75,934 14,06,851 74.99 -
పలాసలో ఉద్రిక్తత
కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పలాస హైస్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద సోమవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎక్కువ సంఖ్యలో టీడీపీ నాయకులు చేరుకుని ఓటర్లకు ఇబ్బందులకు గురిచేశారు. పోలింగ్ మిషన్ల వద్దకు వెళ్లనీయకుండా అలజడి సృష్టించారు. ఒకానొక సమయంలో తోపులాట చేసుకోవడంతో పోలీసు ఉన్నతాధికారులు చర్యలకు దిగారు. బీఎస్ఎఫ్ బెటాలియన్, ఆర్పీఎఫ్ కమాండర్ ఎం.చోహన్తో పాటు పోలీసులు ఇరుపక్షాలను చెదరగొట్టారు. రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు సందీప్ కుమార్ స్వయంగా పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. -
● ఈవీఎంల మొరాయింపు
● పొందూరు మండలం గోకర్నపల్లి, తాడివలస, బురిడికంచరాం గ్రామాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ● వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్ల పేట పోలింగ్ స్టేషన్లో 223 బూత్లో పురుషులకు కేటాయించిన ఈవీఎం మొరాయించింది. దీంతో రెండు గంటలకు పైగా పోలింగ్ ఆగిపోయింది. ● గార మండల కేంద్రంలోని 57వ పోలింగ్ స్టేషన్లో కాలికి ఈవీఎం వైరు తగలడంతో ఈవీఎం మొరాయించింది. 10 నిమిషాల పాటు పోలింగ్ ఆగింది. ● పలాస సాయికాలనీలో పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించింది. 15 నిమిషాల పాటు పోలింగ్ నిలిచిపోయింది. -
ఇతర పార్టీల ఏజెంట్ల ముసుగులో టీడీపీ నేతలు
కాశీబుగ్గ: పలాస నియోజకవర్గంలో పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లును ప్రభావితం చేయడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇతర పార్టీల ఏజెంట్లు అవతారమెత్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నియోజకవర్గంలో అనేక పోలింగ్ కేంద్రాలను తిరుగుతూ ఓటర్లను ప్రభావితం చేశారు. దీంతో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఎక్కడికక్కడ నిలదీసి ఎన్నికల అధికారులకు, పోలీసు ఉన్నత అధికారుల దృష్టికి సమస్య తీసుకెళ్లారు. 23వ వార్డు కౌన్సిలర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు భారతచైతన్య యువజన పార్టీ తరఫున అప్పలరాజు మోటూరు అనే అభ్యర్థికి జనరల్ ఏజెంట్గా ఉంటూ పోలింగ్ కేంద్రాలను తిరిగారు. 24వ వార్డు కౌన్సిలర్ సప్ప అమ్మోజీ కుమారుడు, టీడీపీ యువజన నాయకుడు సప్ప నవీన్ సైతం అదే పార్టీకి ఏజెంట్ రిలీవర్ గుర్తింపుకార్డును పట్టుకుని ఓటర్లను ప్రభావితం చేశారు. దీంతో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సీదిరి అప్పలరాజు కాశీబుగ్గ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, పలాస ఎన్నికల అధికారి భరత్నాయక్ దృష్టికి తీసుకెళ్లి నాయకులను నిలదీశారు. -
పలాసలో వైఎస్సార్సీపీ నేతల నిరసన..
కాశీబుగ్గ : పలాస పురుషోత్తపురం హైస్కూల్ వద్ద పోలింగ్ బూత్ వద్దకు టీడీపీ నాయకులను ఇష్టారాజ్యంగా విడిచిపెడుతున్నారని వైఎస్సార్ సీపీ నాయకులు నిరసన వ్యక్తంచేశారు. ఏజెంట్ల పేరుతో గది నిండా టీడీపీ నాయకులు చేరడంతో పోలీసులను నిలదీశారు. అప్పటికీ తీరుమారకపోవడంతో రోడ్డుపై బైఠాయించారు. టీడీపీ నాయకుడు సప్ప నవీన్ను బయటకు పంపాలని కోరుతూ వైఎస్సార్ సీపీ నాయకులు బడగల బల్లయ్యనాయుడు, జోగి సతీష్ తదితరులు నిరసన వ్యక్తం చేశారు. టీడీపీకి కొమ్ము కాయడం తగదని చెప్పారు. దీంతో పోలీసులు నాయకులను చెదరగొట్టారు. -
జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాం
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ సోమవారం ప్రశాంతంగా జరిగిందని, ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపట్టామని విశాఖపట్నం రేంజి డీఐజీ విశాల్ గున్నీ స్పష్టం చేశారు. సోమవారం జిల్లాలో పలు చోట్ల ఎన్నికల సరళిని ఆయన పరిశీలించిన సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడారు. గతంతో పోల్చితే జిల్లాలో ఈసారి ఎక్కడా ఇబ్బందికర సంఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ సరళిని అడ్డుకోకుండా పూర్తిస్థాయి బందోబస్తును ఏర్పాటుచేశామని వివరించారు. పటిష్ట బందోబస్తుతో నిర్వహణ: ఎస్పీ పోలీసుతో పాటు కేంద్ర పారామిలిటరీ దళాలు, బలగాలతో బందోబస్తు నిర్వహించడంతో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎస్పీ రాధిక స్పష్టం చేశారు. డీఐజీ విశాల్ గున్నీ -
రెచ్చిపోయిన పచ్చమూకలు
● గోకర్నపల్లిలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడి ● రిమ్స్లో చికిత్స పొందుతున్న బాధితులు పొందూరు: ఎన్నికల వేళ టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు దిగారు. వైఎస్సార్ సీపీ నాయకులపై దాడులకు పాల్పడ్డారు. పొందూరు మండలం గోకర్నపల్లిలో పోలింగ్ ప్రారంభమైన కాసేపటికే కొట్లాట జరగడంతో 15 నిమిషాల పాటు ఓటింగ్ నిలిచిపోయింది. పోలింగ్ బూత్లో ఏజెంట్ల మధ్య తలెత్తిన వివాదం టీడీపీ, వైఎస్సార్సీసీ మధ్య కొట్లాటకు దారితీసింది. దీంతో వైఎస్సార్సీపీ నాయకులు చింతాడ జీవరత్నం, యతేంద్ర, సంపతిరావు సూర్యనారాయణలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఇరుపార్టీల నాయకులను అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రులను శ్రీకాకుళం రిమ్స్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం సతీమణి వాణి గోకర్నపల్లి గ్రామానికి చేరుకుని ఆర్ఓ నవీన్కుమార్తో మాట్లాడారు. ఎస్పీ జీఆర్ రాధిక కూడా గోకర్నపల్లితో పాటు పలు గ్రామాలను సందర్శించారు. పిల్లలవలస, లోలుగు, బురిడికంచరాం, కింతలి, తోలాపి తదితర గ్రామాల్లోనూ స్వల్ప వివాదాలు, తోపులాటలు జరిగాయి. అంధవరంలో దాడి జలుమూరు: మండలంలోని అంధవరం పోలింగ్ కేంద్రంలో వైఎస్సార్సీపీ కార్యకర్త సవలాపురం రాముపై అదే గ్రామానికి చెందిన పల్లి శంకరరావు, తిరుమలరావులు దాడికి పాల్పడ్డారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఓట్లు పడటంతో ఓర్వలేని టీడీపీ వర్గీయులు రెచ్చకొట్టే మాటలు ఆడుతూ ఓటు వేసి వచ్చిన రామును నేలపై దొర్లించి రాయితో కంటి కింద గాయం చేశారు. స్థానిక వైద్యసిబ్బంది ప్రథమ చికిత్స నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ మధుసూదనరావు సిబ్బందితో వెళ్లి పరిస్థితి సద్దుమణిగించారు. -
మహిళపై టీడీపీ ఏజెంట్ల దౌర్జన్యం
టెక్కలి: స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో 113,114 పోలింగ్ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ ఏజంట్ రెయ్యి భువనేశ్వరిపై టీడీపీ ఏజంట్ రెయ్యి ప్రీతీష్తో పాటు మరికొంత మంది దౌర్జన్యానికి దిగారు. టీడీపీ ఏజెంట్ తో పాటు వారి మద్దతుదారులు పోలింగ్ కేంద్రం వద్ద మహిళా ఓటర్లను బెదిరిస్తున్న నేపథ్యంలో దానికి అడ్డుపడిన వైఎస్సార్సీపీ ఏజంట్ భువనేశ్వరిని అసభ్య పదజాలతో దూషించారు. దీంతో ఆమె స్థానిక మేజర్ పంచాయతీ సర్పంచ్ గొండేల సుజాత, వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు చింతాడ మంజు సాయంతో టెక్కలి డీఎస్పీ బాలచంద్రారెడ్డి, పోలింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. సుంకు డిల్లేశ్వరరావు, సుంకు గోపి, సుంకు శ్యామ్, కొమ్ము హేమంత్, కొమ్ము తరుణ్, కొమ్ము నాయుడు, కొమ్ము నవీన్కుమార్, రెయ్యి ప్రీతీష్, పేర మురళీ తదితరులు తనపై దాడి చేసి అసభ్యకరంగా మాట్లాడినట్లు ఫిర్యాదు చేశారు. -
No Headline
ఎన్నికల సిబ్బంది జిల్లా వ్యాప్తంగా పోలింగ్ స్టేషన్లు 2358 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు 520 షాడో పోలింగ్ స్టేషన్లు 36 పోలింగ్ కోసం ఏర్పాటు చేసిన బృందాలు 115 పోలింగ్ సిబ్బంది 362 మంది పోలింగ్ అధికారులు 5647 అదర్పోలింగ్ సిబ్బంది 1128 మైక్రో పరిశీలకులు 671 రూట్ అధికారులు 268 కంట్రోల్ రూముల్లో సిబ్బంది 72 వెబ్ కాస్టింగ్ జరిగే కేంద్రాలు 1626 అదనపు కెమెరామెన్లు 333 దివ్యాంగుల కోసం కుర్చీలు 1800 ఈవీఎం, వీవీ ప్యాట్లు 15,228 భద్రతా సిబ్బంది సివిల్ పోలీసులు 1244 హోమ్ గార్డులు 365 స్టేట్ ఆర్మ్డ్ పోలీసులు 44 కంపెనీలు సెంట్రల్ ఆర్మ్డ్ సిబ్బంది 11 కాయిల్స్ ఎక్స్ సర్వీస్ మెన్ 264 ఎన్సీసీ 335 ఎన్ఎస్ఎస్ 954 -
నేడే పోలింగ్
● జిల్లాలో 18,75,934 మంది ఓటర్లు ● గ్రామాలకు చేరిన ఎన్నికల సామగ్రి ● ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ శ్రీకాకుళం పాతబస్టాండ్: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయం రానే వచ్చేసింది. సోమవారం ఉద యం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ సిద్ధమయ్యాయి. జిల్లావ్యాప్తంగా ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 2358 పోలింగ్ స్టేషన్లలో 18,75,934 మంది ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకో నున్నారు. ఆదివారం ఉదయం నుంచి అన్ని నియో జకవర్గాల్లోనూ పోలింగ్ సామగ్రి పంపిణీ జరిగింది. ఎన్నికల సిబ్బంది పోలింగ్ సామగ్రితో వారికి కేటాయించిన బస్సుల్లో నిర్దేశించిన ప్రదేశాలకు వెళ్లారు. వీరు వెళ్లిన వాహనాలకు జీపీఎస్ వ్యవస్థను ఏర్పా టు చేశారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 44,000 మంది సిబ్బంది ఎన్నికల కోసం పనిచేస్తున్నారు. ఈ ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి 13 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే ఎని మిది అసెంబ్లీ నియోజకవర్గాలకు 73 మంది బరిలో ఉన్నారు. ఇచ్ఛాపురంలో 9 మంది, పలాసలో 10 మంది, టెక్కలిలో ఏడుగురు, పాతపట్నంలో 10 మంది, శ్రీకాకుళంలో ఏడుగురు, ఆమదాలవలసలో 13 మంది, ఎచ్చెర్లలో 10 మంది, నరసన్నపేటలో ఏడుగురు పోటీ పడుతున్నారు. -
జలయజ్ఞంకు ఊపిరి
ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు పరుగులు తీస్తున్నాయి. వంశధార ఫేజ్ 2లోని స్టేజ్ 2పనులు పూర్తి చేయడమే కాకుండా నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఉన్న అడ్డంకులు కారణంగా ఈలోపు మొత్తం ఆయకట్టును సస్యశ్యామలం చేసేందుకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మంజూరు చేశారు. రూ. 176.35కోట్లు మంజూరు చేయడమే కాకుండా ఇటీవల శంకుస్థాపన కూడా చేశారు. 26వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, పలాస పట్టణానికి తాగునీరు అందించేందుకు మహేంద్రతనయ వద్ద రూ. 852.45కోట్లతో ఆఫ్షోర్ ప్రాజెక్టును పూర్తి చేస్తున్నారు. పలాసలో రూ.80కోట్లకు పైగా వ్యయంతో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, కిడ్నీ వ్యాధుల రీసెర్చ్ సెంటర్, అతిపెద్ద డయాలసిస్ సెంటర్ను నిర్మించారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులకు ప్రధాన కారణం తాగునీరుగా భావిస్తున్న నేపథ్యంలో 807గ్రామాలకు ఉపరితల రక్షిత మంచినీరు అందించేందుకు రూ.700 కోట్లతో ప్రాజెక్టు నిర్మించారు. సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న జిల్లాలో మత్స్య పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు మూలపేట పోర్టు నిర్మాణం పను లు శరవేగంగా జరుగుతున్నాయి. మత్స్యకారుల కోసం రూ. 365.81కోట్లతో బుడగట్లపాలెంలో పిషింగ్ హార్బర్ నిర్మిస్తున్నారు. వజ్రపుకొత్తూరు మండలంలోని నీళ్లపేటలో రూ.11.95కోట్లతో జెట్టీ నిర్మిస్తున్నారు. దానిని ఫిషింగ్ హార్బర్గా అప్గ్రేడ్ చేసి, పనులు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించారు. ఉద్దానం కోసం మత్స్యకార సంక్షేమం, ఎగుమతుల అభివృద్ధి కోసం -
ఎండలకు తట్టుకునేలా ఏర్పాట్లు: కలెక్టర్
శ్రీకాకుళం పాతబస్టాండ్: పోలింగ్ కేంద్రాల వద్ద ఎండలకు తట్టుకునేలా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సమూ న్ చెప్పారు. జిల్లాలోని 2,358 పోలింగ్ స్టేషన్లలో సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో అన్ని రకాల ఓటర్లకు తగినట్టుగా ఏర్పాట్లు చేశామన్నారు. ది వ్యాంగుల కోసం వీల్చైర్లు, ప్రత్యేక క్యూలు, రవాణా సౌకర్యం కోసం వాహనాలు, సీనియర్ సిటిజ న్లు, విజువల్, లోకోమోటివ్ వైకల్యాలు ఉన్న వ్యక్తులు, బలహీనమైన కదలికతో బాధపడుతున్న ఓటర్లకు సహాయం చేయడానికి ఎన్సీసీ/ఎన్ఎస్ఎస్ సహాయకులను అన్ని పోలింగ్ స్టేషన్లలో ఏర్పా టు చేసినట్లు తెలిపారు. పోలింగ్స్టేషన్ల వద్ద టెంట్లు, ఫ్యాన్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, వైద్య బృందాలు, పా రా మెడికల్ సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. ఈ ఎండల్లో మహిళా ఓటర్లు తమతో పాటు పిల్లలను పోలింగ్ స్టేషన్లకు తీసుకురావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కమిషన్ ఆమోదించిన ఏదైనా గుర్తింపు కార్డుతో పాటు సంబంధిత పోలింగ్ స్టేషన్కు ఓటు వేయాలని సూచించారు. -
వీధి బడుల పిల్లల కోసం
‘జగనన్న విద్యా కానుక’తో సీఎం వైఎస్ జగన్ వేలాది నిరుపేద కుటుంబాలకు భారం త గ్గించారు. అంతే కా దు పిల్లల్లో ప్రభుత్వ బడుల పట్ల ఉండే చిన్న చూపును పోగొట్టారు. పాఠశాలలు, విద్యా లయాలు, రెసిడెన్షియల్ స్కూల్స్, వసతి గృహాలు ఇలా.. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ జగనన్న విద్యాకానుకను అందించారు. పిల్లల చేతిలో కొత్త పుస్తకాలు పెట్టి, వేసుకోవడానికి మూడు జతల యూనిఫారాలు ఇచ్చి దానికి బెల్టు, సాక్సులను తోడుగా జోడించి, అవి పెట్టుకోవడానికి బ్యాగు సమకూరుస్తున్నారు. జిల్లాలో నాలుగేళ్లలో 9,87,692 (9.88లక్షల)మంది విద్యార్థులకు జగనన్న విద్యాకానుక(జేవీకే) కిట్లను రాష్ట్రప్రభు త్వం అందజేసింది. ఇందుకోసం రూ. 198.09 కో ట్ల నిధులను ఖర్చు చేసింది. జేవీకే కిట్లో స్కూల్ బ్యాగుతోపాటు మూడు జతల చొప్పున యూని ఫాం క్లాత్లు, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, బూట్లు, 2 జతల సాక్సులు, బెల్టు, వర్క్బుక్స్, డిక్షనరీ ఇలా 9 వస్తువులు ఉంటాయి. –శ్రీకాకుళం న్యూకాలనీ
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
‘పీవోకే’ భారత్లో భాగమే.. మేం దానిని చేజిక్కించుకుంటాం
YSRCPకి ఓటు వేశాడని తండ్రిపై కొడుకు దాడి..
T20 WC: సంజూ వద్దు.. పంత్ బెటర్!.. తుదిజట్టులో ఆడించినా..
డీజిల్తో పరాటా చేయడమా? చివరికి యజమాని..
మెహరీన్పై తప్పుడు వార్తలు.. క్షమాపణ చెప్పాలంటూ ఫైర్
ప్లాటినమ్ కలర్ శారీలో ‘రాములమ్మ’ హొయలు.. జింగ్ జింగ్ అమేజింగ్ శ్రీ!
8 ఏళ్ల పాప.. ఈ ఘటన మనసును కలిచివేసింది..
రేపటి నుండి AP EAPCET ఎక్సమ్స్
సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
తప్పక చదవండి
- సైకో థ్రిల్లర్గా 'దక్షిణ'.. ట్రైలర్తోనే భయపెట్టారు!
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
- రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు.. అభ్యర్థులకు అలర్ట్
- టీడీపీ మూకలకు మంత్రి మేరుగ వార్నింగ్
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- MS Dhoni: ఎల్లలు దాటిన అభిమానం.. వామ్మో ఇలా కూడా చేస్తారా?
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement