‘ప్రజల ప్రాణాలతో చెలగాటమా..?’
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): శ్రీకాకుళంలో డయేరియా వ్యాప్తి దారుణమని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ప్రజల ప్రాణాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని మండిపడ్డారు. రోడ్డు మరమ్మతుల పనులు సక్రమంగా నిర్వహించకపోవడం, తాగునీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని ఆయన ఆరోపించారు. ప్రజారోగ్య రక్షణలో వైఫల్యం, ప్రభుత్వ పరిపాలన లోపాలను బయటపెడుతోందన్నారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వెంటిలేటర్పై ఉన్న రోగుల ఆరోగ్యంపై ప్రత్యేక వైద్య బృందాలు పర్యవేక్షణ చేయాలని, అవసరమైతే ఉన్నత స్థాయి నిపుణులను నియమించాలని డిమాండ్ చేశారు.


