breaking news
Business
-
చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు
ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పట్టిపీడిస్తున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయకపోతే తీవ్ర పర్యవసానాలు తప్పవని, అమెరికా కేంద్రీయ బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ తక్షణమే కీలక వడ్డీ రేట్లను పెంచాలని భారత రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కుండబద్దలు కొట్టారు. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా? అన్నట్లు, గ్లోబల్ మార్కెట్లో అమెరికా తీసుకునే నిర్ణయాలు ప్రపంచదేశాల ఆర్థిక గమనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఈ నేపథ్యంలో ఫెడ్ ముందస్తుగా వడ్డీ రేట్లను పెంచి ధరల మంటను అదుపులోకి తేకపోతే ముప్పు తప్పదని ఆయన హెచ్చరించారు.అమెరికాలోని జాక్సన్ హోల్లో జరిగిన ప్రతిష్టాత్మక సెంట్రల్ బ్యాంకర్ల సదస్సులో ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజన్ తన విశ్లేషణను పంచుకున్నారు. ఫెడ్ నిర్ణయాలను సమీక్షించే ప్రత్యేక టాస్క్ఫోర్స్లో సభ్యుడిగా ఉన్న ఆయన ఫెడ్ హాకిష్(వడ్డీ రేట్లు తగ్గింపు) ద్రవ్య విధానాన్ని అనుసరించాలని స్పష్టం చేశారు. పెరిగిన ద్రవ్యోల్బణం కారణంగా బాండ్ ఈల్డ్లు గత ఇరవై ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరాయి. దాంతోపాటు ఇవి మార్కెట్లలో అనిశ్చితిని పెంచుతున్నాయని పేర్కొన్నారు.పెరుగుతున్న ద్రవ్యోల్బణంచేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు కాకుండా పరిస్థితి చేజారక ముందే తగిన చర్యలు తీసుకోవడమే సమర్థవంతమైన నాయకత్వ లక్షణమని రాజన్ గుర్తుచేశారు. ఫెడ్ ప్రస్తుత విధానాల కంటే కఠినమైన వైఖరి అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. పెరుగుతున్న వినియోగదారుల ధరల సూచీకి అడ్డుకట్ట వేయడానికి ఫెడ్ రేట్ల పెంపు మార్గాన్నే ఎంచుకోవాలి. ఈ ఏడాది ఆఖరు నాటికి ఫెడ్ వడ్డీ రేట్లను పెంచవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ద్రవ్యోల్బణ నియంత్రణ పట్ల ఫెడ్ స్పష్టమైన కార్యాచరణను ప్రకటించకపోతే అంతర్జాతీయ మార్కెట్లలో ఊగిసలాట మరింత ఎక్కువవుతుందని కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: ఒకేరోజు భారీగా తగ్గిన గోల్డ్ రేటు! -
ఒకేరోజు భారీగా తగ్గిన గోల్డ్ రేటు!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
గ్రీన్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:57 సమయానికి నిఫ్టీ(Nifty) 69 పాయింట్లు పెరిగి 24,158 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 292 పాయింట్లు పెరిగి 77,226 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.14బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 88.1 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.68 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.72 శాతం పెరిగింది.నాస్డాక్ 1.57 శాతం ఎగబాకింది.Today Nifty position 28-08-2026(time: 09:57 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
గూగుల్తో విప్రో బిగ్ ప్లాన్
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా గ్లోబల్ ఐటీ దిగ్గజం విప్రో సంచలన నిర్ణయం తీసుకుంది. గూగుల్ క్లౌడ్ టెక్నాలజీ ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ వ్యాపార సంస్థలకు అత్యాధునిక సేవలందించేందుకు ఏకంగా 10,000 మంది ఏఐ సర్టిఫైడ్ స్పెషలిస్టులను తయారు చేయాలని నిర్ణయించింది. గూగుల్ మల్టీమోడల్ ఏఐ మోడల్ ‘జెమినీ’ ఆధారిత సొల్యూషన్స్ను రూపొందించడమే లక్ష్యంగా ఈ భారీ మానవ వనరుల శిక్షణా కార్యక్రమాన్ని చేపడుతోంది.ఈ బృందంలో ప్రత్యేకంగా 1,500 మంది ఫార్వర్డ్ డిప్లాయ్డ్ ఇంజినీర్లు ఉంటారు. వీరు నేరుగా క్లయింట్ ఆఫీస్ ప్రాంగణాలలోనే (ఆన్-సైట్) అందుబాటులో ఉంటూ సాంకేతిక సవాళ్లను తక్షణమే పరిష్కరించడంతో పాటు వ్యాపార ప్రక్రియల డిజిటలైజేషన్లో కీలక పాత్ర పోషిస్తారు.విప్రో సొంత ఏఐ ప్లాట్ఫామ్ ‘విప్రో ఇంటెలిజెన్స్’కు గూగుల్ జెమినీ శక్తిని జత చేయడం ద్వారా క్లయింట్ కంపెనీలు తమ ఉత్పాదకతను, పనితీరును గణనీయంగా పెంచుకోగలవని విప్రో లిమిటెడ్ మేనేజింగ్ పార్ట్నర్ కన్వర్ సింగ్ వెల్లడించారు. జనరేటివ్ ఏఐ సేవలకు మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్ను అందుకోవడానికి ఈ వ్యూహాత్మక అడుగు ఎంతో దోహదపడుతుందని ఐటీ నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఇదీ చదవండి: మోటార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేయలేదా? -
2047 నాటికి అందరికీ బీమా
కెనడా ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులను ఆకర్షించే దిశగా పలు కెనడియన్ ఆర్థిక సంస్థలతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అయ్యారు. భారత్లో పెట్టుబడులను మరింతగా పెంచాలని కోరారు. మంత్రితో సమావేశమైన సంస్థల్లో సన్ లైఫ్ ఫైనాన్షియల్, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు (సీపీపీఐబీ) మొదలైనవి ఉన్నాయి. ఈ సందర్భంగా భారత్లో బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 74 శాతం నుంచి 100 శాతానికి పెంచడం, 2047 నాటికి అందరికీ బీమా కల్పించాలంటూ భారత్ లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం తదితర అంశాలను వివరించారు.భారత్ పటిష్ట వృద్ధి, విస్తృత మార్కెట్, స్థూల ఆర్థిక పరిస్థితులు స్థిరంగా ఉండటం, డిజిటల్..ఫిజికల్ మౌలిక సదుపాయాలు వేగంగా వృద్ధి చెందుతుండటం మొదలైనవి దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు కల్పించడంపై చర్చించినట్లు సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఎక్స్లో ఆర్థిక శాఖ పోస్ట్ చేసింది. బీమా, అసెట్ మేనేజ్మెంట్, మౌలిక సదుపాయాలు మొదలైన విభాగాల్లో కార్యకలాపాలను విస్తరించేందుకు సన్ లైఫ్కి మరింతగా అవకాశాలు ఉన్నాయని మంత్రి వివరించినట్లు పేర్కొంది.ఇదీ చదవండి: మోటార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేయలేదా? -
వచ్చే ఐదేళ్లలో ప్రపంచంలోనే నంబర్ 1
భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) మార్కెట్ 2030 నాటికి రూ.20 లక్షల కోట్ల స్థాయికి ఎదుగుతుందనే అంచనాలు ఉన్నాయని కేంద్ర రహదారి రవాణా, హైవేస్ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. అలాగే దాదాపు 5 కోట్ల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని చెప్పారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ–ఐటీసీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు.ప్రస్తుతం దేశీయంగా రిజిస్టర్ అయిన ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య 57 లక్షల పైగా ఉందని, వీటి మార్కెట్ వాటా 7 శాతంగా ఉందని పేర్కొన్నారు. రెండు దేశీ దిగ్గజాలు బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్ తాము ఉత్పత్తి చేసే వాహనాల్లో 50 శాతం పైగా వాహనాలను ఎగుమతి చేస్తున్నాయని చెప్పారు. భారత్లో ఏటా ఒక లక్ష ఎలక్ట్రిక్ బస్సులకు డిమాండ్ ఉన్నప్పటికీ, కేవలం 50,000–60,000 బస్సులను మాత్రమే తయారు చేయగలుగుతున్నామని వివరించారు. భారత్లో వాహనాల తయారీ వ్యయం తక్కువగా ఉంటుందని, నాణ్యత అత్యుత్తమంగా ఉంటుందని గడ్కరీ చెప్పారు. అందుకే టాప్ ఆటోమొబైల్ దిగ్గజాలన్నీ భారత్లో కార్యకలాపాలు సాగిస్తున్నాయని వివరించారు. అయిదేళ్లలో నంబర్ వన్ లక్ష్యం..వచ్చే ఐదేళ్లలో భారత్ను ప్రపంచంలోనే నంబర్ వన్ ఆటోమొబైల్ పరిశ్రమగా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెప్పారు. ‘సుశిక్షితులైన సిబ్బంది పెద్ద సంఖ్యలో ఉన్న నేపథ్యంలో మన ఆటోమొబైల్ పరిశ్రమ భవిష్యత్తు చాలా బాగా ఉండబోతోంది. వచ్చే ఐదేళ్లలో భారత్ను ప్రపంచంలోనే నంబర్ 1 ఆటోమొబైల్ పరిశ్రమగా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇది కొంత కష్టం కావచ్చు కానీ అసాధ్యం కాదు’ అని ఆయన తెలిపారు. ‘నేను రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు భారత ఆటోమొబైల్ పరిశ్రమ పరిమాణం రూ. 14 లక్షల కోట్లుగా ఉండేది. ఇప్పుడది రూ. 22 లక్షల కోట్లకు చేరుకుంది’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికా ఆటోమొబైల్ పరిశ్రమ రూ. 78 లక్షల కోట్లుగా ఉండగా చైనా (రూ. 47 లక్షల కోట్లు), భారత్ (రూ. 22 లక్షల కోట్లు) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకోవడంపై భారత్ లక్షల కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తోందని, వీటి వల్ల కాలుష్య సమస్య కూడా తలెత్తుతోందని గడ్కరీ చెప్పారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు, లాజిస్టిక్స్ వ్యయాలు తగ్గకపోతే అంతర్జాతీయ మార్కెట్లలో పోటీపడటం కష్టమవుతుందని ఆయన పేర్కొన్నారు. అందుకే ఈ వ్యయాలను 8 శాతం స్థాయికి తగ్గించాలని కేంద్రం నిర్దేశించుకున్నట్లు వివరించారు. దేశీయంగా ఎక్స్ప్రెస్వేలు, ఎకనమిక్ కారిడార్లను నిర్మించడమనేది దేశీయంగా లాజిస్టిక్స్ వ్యయాలను 16 శాతం స్థాయి నుంచి 10 శాతానికి తగ్గించేందుకు దోహదపడినట్లు ఐఐటీ చెన్నై, ఐఐటీ కాన్పూర్, ఐఐఎం బెంగళూరు రూపొందించిన నివేదికలో వెల్లడైనట్లు చెప్పారు.ఇదీ చదవండి: మోటార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేయలేదా? -
అప్పుల ఊబిలో అమెరికా?.. కియోసాకి చెప్పిన సంచలన నిజం
ప్రముఖ రచయిత, పెట్టుబడుల నిపుణుడు 'రాబర్ట్ కియోసాకి' చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశానికీ అప్పులు ఉన్నాయని ఆయన చెబుతున్నారు. అమెరికా, చైనా, జపాన్, ఫ్రాన్స్, భారత్ వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థలు కూడా భారీ అప్పులను కలిగి ఉన్నాయి. అయితే.. ఒక దేశం ఎంత అప్పు తీసుకుంది అనేదాని కంటే, ఆ అప్పుపై ఎంత వడ్డీ చెల్లించాల్సి వస్తోంది? దాన్ని భరించే సామర్థ్యం ఎంత ఉంది? అనేదే అసలు విషయమని కియోసాకి చెబుతున్నారు.అమెరికా పరిస్థితి ఎందుకు భిన్నం?అమెరికా ప్రస్తుతం భారీగా అప్పులు కలిగి ఉంది. ఈ అప్పులపై ప్రతి సంవత్సరం చెల్లించాల్సిన వడ్డీ కూడా భారీగా పెరుగుతోంది. కియోసాకి చెప్పిన లెక్కల ప్రకారం అమెరికా ఏడాదికి సుమారు 1.1 ట్రిలియన్ డాలర్లను వడ్డీగా చెల్లిస్తోంది. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు కొత్తగా తీసుకునే అప్పుల ఖర్చు కూడా పెరుగుతుంది. దీంతో ప్రభుత్వ ఖజానాపై మరింత భారం పడుతుంది. అంటే పాత అప్పుల వడ్డీ చెల్లించేందుకే భారీ మొత్తంలో డబ్బు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.అప్పు పెరిగితే ఏం జరుగుతుంది?అధిక రేట్లు అంటే అధిక వడ్డీ చెల్లింపులుఅధిక చెల్లింపులు అంటే పెద్ద లోటు అని అర్థంపెద్ద లోటు అంటే ఎక్కువ అప్పు చేయాల్సి రావడంఎక్కువ అప్పు అంటే ఎక్కువ రుణంఎక్కువ అప్పు అంటే ఎక్కువ వడ్డీకియోసాకి ప్రకారం.. ఒక రకమైన అప్పు చక్రంలా మారుతుంది. వడ్డీ రేట్లు పెరిగితే ప్రభుత్వ వడ్డీ భారం పెరుగుతుంది. వడ్డీ చెల్లింపులు పెరగడంతో బడ్జెట్ లోటు ఎక్కువవుతుంది. ఆ లోటును పూడ్చేందుకు ప్రభుత్వం మరింత అప్పు తీసుకోవాల్సి వస్తుంది. కొత్త అప్పు పెరిగితే భవిష్యత్తులో చెల్లించాల్సిన వడ్డీ కూడా పెరుగుతుంది. ఇలా అప్పు.. వడ్డీ.. మరింత అప్పు.. మరింత వడ్డీ అనే చక్రం కొనసాగుతుందని ఆయన హెచ్చరిస్తున్నారు. -
చైనాలో దుమ్మురేపుతున్న కారు.. భారత్లోకి వస్తే సంచలనమే!
షియోమి, సోనీల తర్వాత.. హువావే కంపెనీ తీసుకొచ్చిన 'మాక్స్ట్రో ఎస్800' (Maextro S800) కారు ఆటోమోటివ్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. దీనిని సంస్థ తన ఆటో తయారీ భాగస్వాములతో కలిసి రూపొందించింది. ప్రస్తుతం చైనా మార్కెట్లో మాత్రమే అమ్మకానికి ఉంది. దీని ధర పది లక్షల యువాన్లు. భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.1.19 కోట్లు.హువావే కంపెనీ చైనాలోని లగ్జరీ కార్ల మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్, రోల్స్ రాయిస్, బెంట్లీ వంటి దిగ్గజ బ్రాండ్లకు పోటీ ఇవ్వడమే లక్ష్యంగా మాక్స్ట్రో ఎస్800 కారును తీసుకొచ్చింది. రోల్స్-రాయిస్ డిజైన్, మెర్సిడెస్ మేబ్యాక్ వంటి విలాసవంతమైన అంశాలను కలిగిన మాక్స్ట్రో ఎస్800 అత్యాధునిక టెక్నాలజీని పొందింది. అంతే కాకుండా ఇది 838 Bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.మాక్స్ట్రో ఎస్800 డిజైన్ను చూస్తే ఖరీదైన లగ్జరీ కార్లను గుర్తుకు తెస్తుంది. ముందు భాగంలో క్లోజ్డ్ ప్యానెల్తో పాటు ఇరువైపులా సన్నని ఎల్ఈడీ హెడ్ల్యాంప్స్ ఉన్నాయి. బంపర్పై సిల్వర్ కలర్ మెష్, పెద్ద మల్టీ స్పోక్ అల్లాయ్ వీల్స్, క్రోమ్ ఫినిషింగ్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, కూపే తరహా రూఫ్లైన్ వంటివి కారుకు ప్రీమియం లుక్ ఇస్తాయి. విండ్షీల్డ్ పైభాగంలో LiDAR సెన్సార్ కూడా కనిపిస్తుంది. అందుకే ఈ కారు రోల్స్ రాయిస్ తరహా లుక్, మెర్సిడెస్ మేబ్యాచ్ స్థాయి లగ్జరీ కలయికతో వచ్చిందని స్పష్టమవుతోంది.కారు లోపలికి వెళ్లిన తర్వాత లగ్జరీ అనుభూతి మరింత స్పష్టంగా కనిపిస్తుంది. రోల్స్ రాయిస్ కారులో కనిపించే స్టార్రీ స్కై తరహా క్రిస్టల్ షిమ్మర్ సీలింగ్ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. క్యాబిన్లో ట్రిపుల్ స్క్రీన్ డ్యాష్బోర్డ్ను అందించారు. అంతేకాకుండా.. రాడార్, LiDAR, కెమెరాలతో కలిపి 32కు పైగా ఏడీఏఎస్ సెన్సర్లు ఉన్నాయి. ఇవి హువావే అభివృద్ధి చేసిన అధునాతన డ్రైవర్-అసిస్టెన్స్ టెక్నాలజీకి సహాయపడతాయి.లగ్జరీతో పాటు పనితీరులోనూ మాక్స్ట్రో ఎస్800 తగ్గేదేలే అన్నట్లుగా ఉంది. ఈ కారు గరిష్ఠంగా 838 bhp పవర్ ఉత్పత్తి చేయగలదని కంపెనీ పేర్కొంది. ప్రత్యేకంగా రూపొందించిన ప్లాట్ఫామ్పై ఈ కారును నిర్మించారు. ఇందులో పలు రకాల పవర్ట్రెయిన్ ఆప్షన్లు అందుబాటులో ఉండనున్నాయి.హర్ష్ గోయెంకా ట్వీట్హువావే, జేఏసీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన Maextro S800, చైనాలో అత్యధికంగా అమ్ముడవుతున్న అల్ట్రా-లగ్జరీ సెడాన్. ఇది బీఎండబ్ల్యూ, ఆడి, మెర్సిడెస్ వంటి అగ్రశ్రేణి మోడళ్లతో పోటీ పడుతోందని హర్ష్ గోయెంకా ట్వీట్ చేశారు. కారుకు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేశారు. ఇది డబ్బుకు తగిన విలువను అందిస్తుందని, ఒకవేళ భారతదేశానికి ఈ కారు వస్తే.. లగ్జరీ మార్కెట్ను పూర్తిగా ఆక్రమించుకుంటుందని అన్నారు.Maextro S800, developed by Huawei and JAC, is the top-selling ultra-luxury sedan in China, competing with the top end models of BMW, Audi and Mercedes. Good value for money and will sweep the luxury market if it ever comes here. pic.twitter.com/LsywfZ07RG— Harsh Goenka (@hvgoenka) August 25, 2026 -
ఫ్యాంటసీ గేమ్స్కి డ్రీమ్11 గుడ్బై
న్యూఢిల్లీ: ప్యూర్ ప్లే ఫ్యాంటసీ స్పోర్ట్స్ కార్యకలాపాల నుంచి వైదొలిగినట్లు డ్రీమ్11 వెల్లడించింది. ఇకపై పూర్తి స్థాయి గ్లోబల్ స్పోర్ట్స్ ఎంగేజ్మెంట్ ప్లాట్ఫాంగా మారనున్నట్లు తెలిపింది. స్పోర్ట్స్ కంటెంట్, లైవ్ స్ట్రీమింగ్, స్టాటిస్టిక్స్, స్కోర్స్, కామెంటరీ మొదలైన వాటిపై దృష్టి పెట్టనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. యూజర్లకు ఇష్టమైన క్రీడలు, జట్లు, ఆటగాళ్లకు సంబంధించిన కంటెంట్ను వ్యక్తిగత స్థాయిలో అందించేలా ఏఐ–ఫస్ట్ ప్లాట్ఫాంగా రూపొందుతున్నట్లు వివరించింది. -
అందుకే.. ‘టాటా.కార్స్’ పేరుతో కొత్త బ్రాండ్!
న్యూఢిల్లీ: టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (టీఎంపీవీ) తన ప్యాసింజర్ వాహనాల పోర్ట్ఫోలియోకు కొత్త బ్రాండ్ గుర్తింపుగా ‘టాటా.కార్స్’ను గురువారం ఆవిష్కరించింది.యువ కార్ల కొనుగోలుదారులను ఆకర్షించే లక్ష్యంతో ఈ కొత్త బ్రాండ్ ఐడెంటిటీని తీసుకొచ్చినట్లు తెలిపింది. ఇకపై హ్యాచ్బ్యాక్లు, సెడాన్లు, ప్రీమియం ఎస్యూవీలు, ఈవీలను ఒకే బ్రాండ్ కిందకు తీసుకురానున్నారు. ‘నథింగ్స్ టూ ఫార్’ నినాదంతో రూపొందిన ఈ బ్రాండ్ వినియోగదారులకు కొత్త అవకాశాలను చేరువ చేస్తుందని టీఎంపీవీ ఎండీ, సీఈవో శైలేష్ చంద్ర తెలిపారు. -
‘వైజెడ్ఎఫ్–ఆర్2’ వచ్చేసింది.. రూ.10 వేలతో బుకింగ్!
ద్విచక్ర వాహన తయారీ సంస్థ యామహా మోటార్ తన సూపర్స్పోర్ట్ పోర్ట్ఫోలియోను విస్తరిస్తూ గురువారం నూతన ‘వైజెడ్ఎఫ్–ఆర్2’ బైక్ను విడుదల చేసింది. చెన్నై యూనిట్లో ఉత్పత్తి అవుతున్న ఈ లైట్వెయిట్ స్పోర్ట్స్బైక్ ధరను రూ.2.30 లక్షలుగా (ఎక్స్–షోరూమ్) కంపెనీ నిర్ణయించింది.పదివేల రూపాయల టోకెన్ అమౌంట్తో ఈ బైక్ ముందస్తు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఇందులో కొత్తగా అభివృద్ధి చేసిన 200సీసీ లిక్విడ్–కూల్డ్ ఇంజిన్ను అమర్చారు. ఇది 26.5 బీహెచ్పీ పవర్, 19.1 ఎన్ఎమ్ పీక్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ కేటీఎమ్ ఆర్సీ 200, సుజుకీ గిక్సర్ ఎస్ఎఫ్ 250, రాబోయే హోండా సీబీఆర్300ఆర్ మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. -
ధరల మంటలు.. కుటుంబ బడ్జెట్ బేజారు
సాక్షి, హైదరాబాద్: నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడి వంటింటి బడ్జెట్ను తలకిందులు చేస్తున్నాయి. కూరగాయలు, ఉల్లిగడ్డ, పప్పులు, ఇతరత్రా కిరాణా వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మధ్యతరగతిపై భారం పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ధరల పెరుగుదల కొనసాగుతున్నప్పటికీ... రాష్ట్రంలో అది మరికొంత అధికంగా ఉండటం ఆందోళనను కలిగిస్తోంది. ప్రధాన రాష్ట్రాల్లో దేశంలోనే అత్యధికంగా తెలంగాణ రిటైల్ ద్రవ్యో ల్బణం 6.32% నమోదవడం కలవరం రేపుతోంది. కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వినియోగదారుల ధరల సూచీ గణాంకాల్లో ఈ పరిస్థితి వెల్లడైంది. తెలంగాణ తరువాత ఏపీలో ద్రవ్యోల్బణం 5.72% ఉండగా, తమిళనాడులో 5.44%, మధ్యప్రదేశ్లో 4.91%, కర్ణాటకలో 4.89%గా ఉంది. దేశం సగటు ద్రవ్యోల్బణం 4.45%గా నమోదైంది. ఈ పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల కన్నా తెలంగాణలోనే కూరగాయలతోపాటు నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆహార ద్రవ్యోల్బణం కన్నా ఎక్కువగా.. జూలైలో దేశవ్యాప్తంగా రిటైల్ ద్రవ్యోల్బణం 4.45%గా ఉండగా, ఆహార వస్తువుల ధరలను ప్రతిబింబించే ఆహార ద్రవ్యోల్బణం 5.52%గా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆహార ద్రవ్యోల్బణం మరింత ఎక్కువగా 5.79 శాతంగా నమోదైంది. దీనికి భిన్నంగా తెలంగాణలో మొత్తం ద్రవ్యోల్బణం 6.32%గా ఉండటం రాష్ట్ర ప్రజలపై ధరల భారం ఏ స్థాయిలో ఉందో స్పష్టం చేస్తోంది. దేశ సగటుతో పోలిస్తే తెలంగాణలో ధరల పెరుగుదల అధికంగా ఉంది. ప్రతి కుటుంబం నెలవారీ వంటింటి ఖర్చులో కనిపిస్తున్న అదనపు భారానికి ఇది అద్దం పడుతోందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లలో ఉల్లిగడ్డ కిలో రూ.50–55 పలుకుతోంది. బోయిన్పల్లి హోల్సేల్ మార్కెట్లో అదే ఉల్లి రూ.30–35 మధ్య లభిస్తుండగా, రైతుబజార్లలో రూ.40–44 విక్రయిస్తున్నారు. అదే రిటైల్ మార్కెట్కు చేరే కొద్దీ ధర గణనీయంగా పెరుగుతోంది. అలాగే, క్యారట్, చిక్కుడు, బీన్స్, వంకాయలు తదితరాల ధరలు కూడా భారీగా పెరగడంతో కుటుంబాల నెలవారీ కూరగాయల ఖర్చు భారీగా పెరిగింది. పప్పుల ధరలు సైతం సామాన్యుడికి భారంగా మారుతున్నాయి. బియ్యం ధరలు సైతం బెంబేలెత్తిస్తున్నాయి. మూడు నెలల క్రితం సన్న బియ్యం ధర కిలో రూ.48–55 ఉండగా, ఇప్పుడు 65–70 వరకు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ జోక్యం అవసరం రాష్ట్రంలో హాకా, రైతుబజార్ల ద్వారా సబ్సిడీ ధరలకు ఉల్లి, ఇతర నిత్యావసరాలను అందుబాటులోకి తేవాలనే డిమాండ్ పెరుగుతోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదు. ఉత్పత్తి లేకపోవడంతో ధరలు పెరిగాయని చెబుతున్న అధికారులు రేట్ల తగ్గింపునకు సంబంధించి ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు చేయకపోవడం గమనార్హం. పండుగల సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ధరలపై మరింత ఒత్తిడి నెలకొనే అవకాశం ఉంది. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్లోకి ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలను పెంచడం, రైతుబజార్లలో నిల్వలు పెంచడం, హోల్సేల్–చిల్లర ధరల వ్యత్యాసాన్ని పర్యవేక్షించడం, అక్రమ నిల్వలు–కృత్రిమ కొరతపై నిఘా పెంచాల్సిన అవసరం ఉంది. ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు ⇒ మునుపటి పంట నిల్వలు తగ్గిపోవడం, కొత్త పంట మార్కెట్కు రావడానికి ఇంకా సమయం ఉండటం. ఉత్పత్తి తగ్గిన సమయంలో డిమాండ్ పెరగడంతో ధరలపై ఒత్తిడి పెరిగింది. ⇒ పలు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా పంట దెబ్బతినడం, పొలాల నుంచి మార్కెట్లకు సరుకు రవాణాలో ఆలస్యం ఏర్పడటం. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రధాన ఉత్పత్తి రాష్ట్రాల్లో వర్షాలు పంటల కోత, రవాణాపై ప్రభావం చూపుతున్నాయి. ⇒ శ్రావణ మాసం, రాబోయే వినాయక చవితి వేళ స్వీట్లు, పిండివంటల తయారీ పరిశ్రమలు, హోటళ్లు, గృహాల నుంచి వినియోగం ఒక్కసారిగా పెరగడం. ⇒ అంతర్రాష్ట్ర రవాణా వ్యయం పెరగడం వల్ల మహారాష్ట్ర, కర్ణాటక వంటి ప్రధాన మార్కెట్ల నుంచి వచ్చే సరుకుపై అదనపు భారంపడింది. ⇒ భారత్ దిగుమతి చేసుకునే ముడి పామాయిల్, సన్ఫ్లవర్ నూనెలపై అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు పెరగడం, దిగుమతి సుంకాల్లో మార్పులు. ఇంటి ఖర్చులకే సరిపోక..హైదరాబాద్లోని అంబర్పేటలో రవికిరణ్ అనే ప్రైవేటు ఉద్యోగి భార్య, ఇద్దరు పిల్లలతో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. నెలసరి వేతనం రూ.50 వేలు. గతంలో ఇంటి అద్దె, టూవీలర్ ఖర్చు, కిరాణా, కూరగాయలు, పాలు, పిల్లల చదువు, విద్యుత్, రవాణా, ఇతర ఖర్చులకు కలిపి సుమారు రూ.45 వేలు ఖర్చయ్యేవి. నెలకు రూ.5 వేలు పొదుపు చేసుకునేవారు. ఇప్పుడు కూరగాయలు, ఉల్లి, పప్పులు, నూనె, పాల ధరలు పెరగడంతో నెల ఖర్చు రూ.50 వేలకుపైగా అవుతోంది. ముఖ్యంగా కూరగాయలు, కిరాణాపై నెలకు రూ.3వేల వరకు అదనంగా ఖర్చవుతోంది. దీంతో గతంలో పొదుపు చేసిన రూ.5 వేలు ఇప్పుడు ఇంటి ఖర్చులకే సరిపోని పరిస్థితి. పిల్లల వినోదం, కొత్త దుస్తులు, బయట భోజనాలు తగ్గించడంతోపాటు పొదుపును కూడా వదులుకోవాల్సి వస్తోంది. -
బంగారం కొనేందుకు ఇది మంచి ఛాన్స్.. ఎందుకంటే?
బంగారం ధరల వరుస తగ్గుదల నమోదైంది. గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల రేటు రూ.770 తగ్గి 1,63,130 రూపాయలకు చేరింది. అంతకు ముందు రోజు ఈ రేటు రూ.1,63,900 వద్ద ఉంది. అయితే వెండి మాత్రమే స్థిరంగా ఉండటంతో.. కేజీ సిల్వర్ రేటు రూ.2.60 లక్షల వద్ద నిలిచింది.రాఖీ పండుగకు ముందుశుక్రవారం రాఖీ పండుగ జరగనున్న నేపథ్యంలో బంగారం ధరలు తగ్గడం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా రాఖీ పండుగ సమయంలో అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకుంటారు. ఈ సందర్భంగా బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేసే వారు కూడా ఉంటారు. అందువల్ల పండుగకు ఒక రోజు ముందు బంగారం ధర తగ్గడం వినియోగదారులకు కొంత ఊరట కలిగించే అంశంగా చెప్పవచ్చు.బంగారం ధర తగ్గడానికి కారణంబంగారం ధర తగ్గడానికి ప్రధాన కారణాల్లో అమెరికా డాలర్ బలపడటం ఒకటి. అమెరికాలో అంచనాల కంటే ఎక్కువగా ద్రవ్యోల్బణం నమోదవడంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విషయంలో కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందనే అంచనాలు పెరిగాయి. దీంతో అమెరికా డాలర్తో పాటు ట్రెజరీ బాండ్ యీల్డ్స్ కూడా పెరిగాయి. సాధారణంగా బాండ్ యీల్డ్స్ పెరిగినప్పుడు వడ్డీ ఆదాయం ఇవ్వని బంగారం ఆకర్షణ కొంత తగ్గుతుంది. ఈ కారణంగానే అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరపై ఒత్తిడి కనిపించింది.వెండి మాత్రం స్థిరంబంగారం తగ్గినప్పటికీ.. దేశీయ మార్కెట్లో వెండి ధర రూ.2,60,000 వద్ద స్థిరంగా కొనసాగింది. ప్రారంభంలో కొంత అమ్మకాల ఒత్తిడి కనిపించినప్పటికీ తర్వాత వెండి ధర నిలదొక్కుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం వెండి కొంత మెరుగైన ప్రదర్శన చేసింది. స్పాట్ సిల్వర్ ధర 0.31 శాతం పెరిగి ఔన్స్కు 68.32 డాలర్లకు చేరింది.అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండిప్రపంచ మార్కెట్లో కూడా స్పాట్ గోల్డ్ స్వల్పంగా తగ్గి ఔన్స్కు 4,585.88 డాలర్ల వద్ద ట్రేడైంది. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాల తర్వాత డాలర్ సూచీ బలపడటం, ఫెడ్ వడ్డీ రేట్లపై కఠిన వైఖరి ఉండవచ్చనే అంచనాలు బంగారం ధరను ప్రభావితం చేశాయి. అయితే వెండికి మాత్రం సురక్షిత పెట్టుబడుల కోసం ఉన్న డిమాండ్ కొంత మద్దతు ఇచ్చింది. అందుకే అంతర్జాతీయ మార్కెట్లో వెండి బంగారం కంటే మెరుగ్గా నిలిచింది.కెవిన్ వార్ష్ ప్రసంగంపై మార్కెట్ దృష్టిఇప్పుడు పెట్టుబడిదారుల దృష్టి అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్ కెవిన్ వార్ష్ శుక్రవారం చేయనున్న జాక్సన్ హోల్ ప్రసంగంపై ఉంది. వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణంపై ఫెడ్ వైఖరి ఎలా ఉండబోతోందనే విషయంలో ఆయన చేసే వ్యాఖ్యలు మార్కెట్కు ముఖ్యమైన సంకేతాలు ఇవ్వవచ్చు. ఫెడ్ కఠినమైన వైఖరిని సూచిస్తే డాలర్, ట్రెజరీ యీల్డ్స్ మరింత బలపడే అవకాశం ఉంది. అప్పుడు బంగారం ధరపై మరింత ఒత్తిడి రావచ్చు. -
పర్పుల్ స్టైల్ ల్యాబ్స్ @ రూ. 546–575
న్యూఢిల్లీ: పర్పుల్ స్టైల్ ల్యాబ్స్ పబ్లిక్ ఇష్యూకి రూ. 546–575 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 31న ప్రారంభమై సెప్టెంబర్ 2న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 28న షేర్లను ఆఫర్ చేయనుంది. ఇష్యూలో భాగంగా పెర్నియాస్ పాపప్ షాప్ మాతృ సంస్థ రూ. 680 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా రూ. 680 కోట్లు సమీకరించే యోచనలో ఉంది.మల్టీబ్రాండ్ లగ్జరీ ఫ్యాషన్ ఓమ్నీ చానల్ ప్లాట్ఫామ్ నిర్వాహక కంపెనీ ఐపీవో నిధులలో రూ. 371 కోట్లు సొంత అనుబంధ సంస్థ పీఎస్ఎల్ రిటైల్లో ఇన్వెస్ట్ చేయనుంది. వీటిని ఎక్స్పీరియన్స్ సెంటర్ల లీజ్ చెల్లింపులతోపాటు.. దేశీయంగా బ్యాకెండ్ ఆఫీసుల ఏర్పాటుకు వెచి్చంచనుంది. మరో రూ. 139 కోట్లు సేల్స్, మార్కెటింగ్ వ్యయాలకు కేటాయించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.లిస్టింగ్లో కంపెనీ విలువ రూ. 4,600 కోట్లుగా నమోదయ్యే వీలుంది. కంపెనీ రిటైల్గా పెరి్నయాస్ పాపప్ షాప్ల ద్వారా సంప్రదాయ దుస్తులు, వ్యక్తిగత విలాసవంత వస్తువులు తదితరాలను విక్రయిస్తుంది. కంపెనీలో ఇప్పటికే సెలబ్రిటీలు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, మాధురీ దీక్షిత్, సచిన్ తెండూల్కర్, మహేష్ బాబు తదితరులు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! -
‘షార్క్ ట్యాంక్’ తరహా సిరీస్ చేయాలి
టోక్యో: భారత్–జపాన్ అంకుర సంస్థలను అనుసంధానం చేసేందుకు ’షార్క్ ట్యాంక్’ తరహా సిరీస్ను చేయొచ్చని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుుష్ గోయల్ తెలిపారు. తద్వారా ఇరు దేశాల స్టార్టప్లను ఇన్వెస్టర్లు, వ్యాపార భాగస్వాములతో కలిపేందుకు వీలవుతుందని పేర్కొన్నారు.డిజిటల్ కనెక్టివిటీని ఉపయోగించుకుని ఇలాంటి సెషన్లను వర్చువల్గా ఏర్పాటు చేయొచ్చని స్టార్టప్లతో నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో మంత్రి వివరించారు. పెట్టుబడులు, వ్యాపార భాగస్వామ్య అవకాశాలను దక్కించుకునేందుకు వీటి ద్వారా భారత్, జపాన్ స్టార్టప్లు ఇరు దేశాల ఇన్వెస్టర్లకు తమ ఐడియాలను వివరించవచ్చని చెప్పారు. తద్వారా ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధాలు కూడా మరింత బలోపేతమవుతాయని తెలిపారు.భారత్తో కలిసి పని చేయాలంటూ జపాన్ వ్యాపార సంస్థలు, స్టార్టప్లను మంత్రి ఆహ్వానించారు. రెండు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యం బలోపేతం అయితే సమగ్రాభివృద్ధికి విస్తృత అవకాశాలు లభిస్తాయని గోయల్ చెప్పారు. అలాగే, యూనివర్సిటీలు, ఇన్క్యుబేటర్లు, వెంచర్ ఫండ్స్ మధ్య కూడా పరస్పర సహకారం మరింత పెరగాలని పేర్కొన్నారు. -
రూ. 7,600 కోట్ల ఐపీవోకు అవాడా ఎలక్ట్రో రెడీ
న్యూఢిల్లీ: సోలార్ తయారీ కంపెనీ అవాడా ఎలక్ట్రో లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా అప్డేటెడ్ ప్రాస్పెక్టస్ను సిద్ధం చేసింది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా వీటిని దాఖలు చేసింది. వీటి ప్రకారం కంపెనీ రూ. 7,600 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఐపీవోలో భాగంగా రూ. 1,600 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది.మరో రూ. 6,000 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ సంస్థ అవాడా వెంచర్ విక్రయానికి ఉంచనుంది. పీఈ దిగ్గజం బ్రూక్ఫీల్డ్కు పెట్టుబడులున్న అవాడా గ్రూప్ ఈక్విటీ జారీ ద్వారా సమీకరించే నిధుల్లో రూ. 1,200 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. కంపెనీ తొలుత 2025 అక్టోబర్లో గోప్యతా మార్గంలో ఐపీవోకు దరఖాస్తు చేసింది. 2026 ఏప్రిల్లో అనుమతి పొందింది. కంపెనీ వివరాలివీ 2021లో ఏర్పాటైన అవాడా ఎలక్ట్రో ప్రధానంగా సోలార్ సెల్స్, మాడ్యూల్స్ తయారీని చేపడుతోంది. వీటిని ఎన్ల్యూమ్, ఇంటెగ్లో బ్రాండ్లతో వీటిని మార్కెటింగ్ చేస్తోంది. 2026 జూలై31కల్లా కంపెనీ 8.5 గిగావాట్ల సోలార్ మాడ్యూల్ నిర్వహణా తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అంతేకాకుండా మరో 3 గిగావాట్ల నిర్వహణా టాప్కాన్ సోలార్ సెల్ తయారీని సైతం చేపడుతోంది. 2027–28కల్లా సోలార్ మాడ్యూల్ సామర్థ్యాన్ని 13.6 గిగావాట్లకు, సోలార్ సెల్ సామరŠాధ్యన్ని 12 గిగావాట్లకు పెంచుకునే యోచనలో ఉంది.ఈ బాటలో 3 గిగావాట్ల ఇన్గాట్, వేఫర్ సామర్థ్యాలను అందుకోవాలని భావిస్తోంది. తద్వారా సమీకృత తయారీ వ్యవస్థ(ఎకోసిస్టమ్)కు తెరతీసే లక్ష్యంతో ఉంది. వీటితోపాటు అవాడా హాలో బ్రాండుతో ఎనర్జీ స్టోరేజీ సొల్యూషన్లు అందించే ప్రణాళికల్లో ఉంది. ఈపీసీ, ఓఅండ్ఎం కార్యకలాపాలలోకి సైతం ప్రవేశించాలని చూస్తోంది.యూపీలోని దాద్రిలో, మహారాష్ట్రలోని నాగ్పూర్లో తయారీ యూనిట్లను నిర్వహిస్తోంది. గతేడాది(2025–26) ఆదాయం రూ. 5,304 కోట్లకు చేరగా.. నికర లాభం రూ. 889 కోట్లను తాకింది. ఏడాది కాలంలోనే కంపెనీ మాడ్యూల్ సామర్థ్యం 1.5 గిగావాట్ల నుంచి 8.5 గిగావాట్లకు జంప్చేయగా.. ఆర్డర్బుక్ 7 రెట్లు ఎగసి 2,555 మెగావాట్ల నుంచి 19,106 మెగావాట్లకు చేరింది. -
శామ్సంగ్కు షాక్.. భారీ నష్టపరిహారానికి ఆదేశం
శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్కు భారీ షాక్ తగిలింది. ప్రముఖ స్విస్ వాచ్ తయారీ సంస్థ స్వాచ్ గ్రూప్ ఏజీకి శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ భారీ మొత్తంలో నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది. స్వాచ్ గ్రూప్కు చెందిన బ్రెగ్యూట్, బ్లాంక్పెయిన్, ఒమేగా, లాంగిన్స్, టిస్సోట్ వంటి లగ్జరీ వాచ్ బ్రాండ్ల డిజైన్లను పోలిన స్మార్ట్వాచ్ వాచ్-ఫేస్ యాప్లను తన గెలాక్సీ యాప్ స్టోర్లో అందుబాటులో ఉంచినందుకు శామ్సంగ్ 11.6 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1.16 కోట్లు) చెల్లించాలని లండన్ హైకోర్టు ఆదేశించింది.ఈ వివాదం 2015 అక్టోబర్ నుంచి 2019 ఫిబ్రవరి మధ్య కాలానికి సంబంధించినది. స్వాచ్ గ్రూప్ వాచ్ల డయల్స్, డిజైన్లు, ట్రేడ్మార్క్లను పోలిన డిజిటల్ వాచ్ ఫేస్ యాప్లను శామ్సంగ్ గెలాక్సీ యాప్ స్టోర్లో థర్డ్ పార్టీ డెవలపర్లు అందుబాటులో ఉంచారు. ఈ యాప్లు శామ్సంగ్ స్వయంగా రూపొందించినవి కాకపోయినా, వాటిని యాప్ స్టోర్లో అనుమతించడం, ప్రదర్శించడం ద్వారా ట్రేడ్మార్క్ ఉల్లంఘనకు శామ్సంగ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని కోర్టు తేల్చింది.ఈ కేసులో స్వాచ్ గ్రూప్ తొలుత సుమారు 170 మిలియన్ డాలర్ల నష్టపరిహారం కోరింది. అయితే శామ్సంగ్ మాత్రం నష్టం చాలా స్వల్పమని, గరిష్ఠంగా సుమారు 300 డాలర్లు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని వాదించింది. ఈ వాదనను కోర్టు అంగీకరించలేదు. న్యాయమూర్తి మార్కస్ స్మిత్ ప్రకారం, స్వాచ్ బ్రాండ్లను తక్కువ లేదా ఎలాంటి ధర లేకుండా డౌన్లోడ్ చేసుకునే యాప్ల రూపంలో శామ్సంగ్ యాప్ స్టోర్లో ప్రదర్శించడం ఆ బ్రాండ్ల విలువకు గణనీయమైన నష్టం కలిగించింది.మొత్తం నష్టపరిహారంలో సుమారు 10 మిలియన్ డాలర్లు శామ్సంగ్ యాప్ స్టోర్లో స్వాచ్ బ్రాండ్లను ప్రదర్శించడం వల్ల కలిగిన నష్టానికి కేటాయించినట్లు నివేదికలు వెల్లడించాయి. అదనంగా, ఉల్లంఘనకు సంబంధించిన వాచ్-ఫేస్ యాప్లు యూకే, యూరోపియన్ యూనియన్లో సుమారు 1.6 లక్షల సార్లు డౌన్లోడ్ అయిన అంశాన్ని కూడా న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్నారు.తాజా తీర్పుపై శామ్సంగ్ స్పందిస్తూ.. కోర్టు నిర్ణయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని, అప్పీల్తో సహా అన్ని చట్టపరమైన మార్గాలను పరిశీలిస్తామని తెలిపింది. మరోవైపు, శామ్సంగ్ ఉల్లంఘన తీవ్రతను పదేపదే తగ్గించి చూపేందుకు ప్రయత్నించిందని స్వాచ్ గ్రూప్ విమర్శించింది. ఇదే 10 స్వాచ్ బ్రాండ్లు శామ్సంగ్పై అమెరికాలో దాఖలు చేసిన ప్రత్యేక కేసు కూడా పెండింగ్లో ఉంది.ఇదీ చదవండి: రూ.22 వేల కోట్ల అప్పులు.. రూ.6.5 కోట్లతో చెల్లు! -
రూ.22 వేల కోట్ల అప్పులు.. రూ.6.5 కోట్లతో చెల్లు!
జీ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఎస్సెల్ గ్రూప్ మాజీ అధినేత సుభాష్ చంద్ర వ్యక్తిగత దివాలా కేసులో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులకు, రుణ సంస్థలకు బకాయి ఉన్న రూ.22,006.57 కోట్ల మేర రుణాలకు బదులుగా కేవలం రూ.6.5 కోట్లు చెల్లించి పరిష్కరించుకునే రీపేమెంట్ ప్లాన్ను ట్రిబ్యునల్ ఆమోదించింది. దీంతో రుణదాతలు దాదాపు 99.97 శాతం నష్టపోవాల్సి వస్తోంది. అంటే క్లెయిమ్ చేసిన ప్రతి రూ.100కు సుమారు 3 పైసలు మాత్రమే తిరిగి వచ్చే పరిస్థితి.అందరూ ఒప్పుకొన్నారు కానీ..సుభాష్ చంద్ర ప్రతిపాదించిన రీపేమెంట్ ప్లాన్కు 2024 నవంబర్లో జరిగిన రుణదాతల ఓటింగ్లో 80.814 శాతం ఓటింగ్ షేర్ మద్దతు లభించింది. అయితే ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ తదితర సంస్థలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. వ్యతిరేకించిన రుణదాతల ఓటింగ్ వాటా మాత్రం 20 శాతం కంటే తక్కువగా ఉంది.ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్కు ఎంత రావాలి?ఈ వ్యవహారంలో అత్యంత నష్టపోతోంది ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్. ఈ సంస్థకు సుమారు రూ.1,322.39 కోట్ల ఆమోదిత క్లెయిమ్ ఉండగా, రీపేమెంట్ ప్లాన్ ప్రకారం దానికి అందేది కేవలం రూ.38.09 లక్షలు మాత్రమే. అంటే దాని క్లెయిమ్లో దాదాపు 0.028 శాతం మాత్రమే తిరిగి పొందే అవకాశం ఉంది. అందుకే ఈ ప్రతిపాదనను సంస్ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ తీవ్రంగా వ్యతిరేకించింది.ప్లాన్ను ఎన్సీఎల్టీ ఎందుకు ఆమోదించింది?ఈ కేసులో మొదటి ఇద్దరు ఎన్సీఎల్టీ సభ్యుల మధ్య విభేదాలు రావడంతో విషయం మూడో సభ్యుడు నీలేశ్ శర్మ వద్దకు వెళ్లింది. ఆయన ఐబీసీలోని సెక్షన్ 114 కింద రీపేమెంట్ ప్లాన్కు ఆమోదం తెలిపారు. రుణదాతలు మెజారిటీతో తీసుకున్న వాణిజ్య నిర్ణయాన్ని, అది చట్టపరమైన నిబంధనల పరిధిలో ఉన్నంత వరకు, ట్రిబ్యునల్ తన సొంత అంచనాతో భర్తీ చేయలేదని స్పష్టం చేశారు.ట్రిబ్యునల్ పరిశీలనలో మరో కీలక అంశం సుభాష్ చంద్ర వ్యక్తిగత ఆస్తుల విలువ. రీపేమెంట్ ప్లాన్లో ప్రతిపాదించిన మొత్తంతో పోలిస్తే ఆయన ఆస్తుల నుంచి వచ్చే రికవరీ పరిమితంగానే ఉంటుందని ఎన్సీఎల్టీ పేర్కొంది. ప్లాన్ను తిరస్కరించి చంద్రను దివాలా ప్రక్రియలోకి నెట్టడం వల్ల రుణదాతలకు మరింత తక్కువ మొత్తమే దక్కే అవకాశం ఉందని కూడా ట్రిబ్యునల్ అభిప్రాయపడింది.నాకు మాత్రం అన్యాయం: విజయ్ మాల్యాసుభాష్ చంద్ర రుణాల రీపేమెంట్ ప్లాన్కు ఎన్సీఎల్టీ ఆమోదం వార్తలపై వ్యాపారవేత్త విజయ్ మాల్యా స్పందించారు. అదే నిజమైతే సుభాష్ చంద్రకు అభినందనలు అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగవేసి.. దేశం నుంచి పారిపోయి బ్రిటన్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యా.. రూ.6203 కోట్ల బకాయిలకు గానూ బ్యాంకులు, ప్రభుత్వం తన దగ్గర నుంచి 14,100 కోట్లు వసూలు చేశాయన్నారు. చాలామంది రుణగ్రహీతలు తక్కువ మొత్తాలు చెల్లించి, తమ రుణాలను పరిష్కరించుకుంటున్నారని, తనకు మాత్రం అన్యాయం జరిగిందన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించారు. -
స్టాక్ మార్కెట్కు సిమెంట్ షేర్ల దెబ్బ..
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. మిశ్రమ ప్రపంచ సంకేతాల మధ్య మెటల్, పీఎస్యూ బ్యాంక్, సిమెంట్ షేర్లు క్షీణించడంతో బెంచ్ మార్క్ సూచీలకు వరుసగా రెండో రోజూ నష్టాలు తప్పలేదు. సెన్సెక్స్ 539.35 పాయింట్లు లేదా 0.7 శాతం క్షీణించి 76,933.59 వద్ద, నిఫ్టీ 50 116.90 పాయింట్లు లేదా 0.48 శాతం క్షీణించి 24,090.85 వద్ద స్థిరపడ్డాయి.హిందాల్కో ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా నిఫ్టీ 50 ఇండెక్స్లో టాప్ లూజర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ వరుసగా 0.1 శాతం, 0.13 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ సిమెంట్ 1 శాతానికి పైగా నష్టపోయింది. నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ రియల్టీ షేర్లు మెరుగైన పనితీరు కనబరిచాయి. -
జపాన్లో విదేశీయులకు బిగ్ షాక్.. ఫీజులు భారీగా పెంపు
జపాన్లో దీర్ఘకాలికంగా స్థిరపడాలని, శాశ్వత నివాస హోదా పొందాలని భావిస్తున్న విదేశీయులకు భారీ షాక్ తగలనుంది. 2026 అక్టోబర్ 1 నుంచి విదేశీయుల రెసిడెన్సీ సంబంధిత దరఖాస్తుల ఫీజులను గణనీయంగా పెంచేందుకు జపాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా శాశ్వత నివాసం (Permanent Residence) కోసం దరఖాస్తు చేసే వారు ఇప్పటివరకు చెల్లిస్తున్న 10,000 యెన్లకు (సుమారు రూ.6 వేలు) బదులుగా 200,000 యెన్లు (సుమారు రూ.1.2 లక్షలు) చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఫీజు ఏకంగా 1900 శాతం లేదా 20 రెట్లు పెరగనుంది.అక్టోబర్ 1 నుంచే కొత్త ఫీజులుజపాన్ కేబినెట్ ఆగస్టు 25న కొత్త ఫీజుల విధానాన్ని అధికారికంగా ఆమోదించింది. నివాస హోదాను మార్చుకోవడం లేదా ప్రస్తుత రెసిడెన్సీ వ్యవధిని పొడిగించుకోవడానికి చేసే దరఖాస్తుల్లో ఇకపై ఒకే ఫీజు కాకుండా, మంజూరయ్యే నివాస కాలాన్ని బట్టి రుసుము నిర్ణయిస్తారు. ప్రస్తుతం ఇలాంటి దరఖాస్తులకు కౌంటర్ ద్వారా చేస్తే సాధారణంగా 6,000 యెన్ల ఫీజు ఉంది.కొత్త ఫీజుల వివరాలు ఇవే..మూడు నెలల వరకు నివాస కాలానికి: 10,000 యెన్లుఒక సంవత్సరం కాలానికి: 33,000 యెన్లుమూడు నుంచి ఐదేళ్లలోపు కాలానికి: 64,000 యెన్లుఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలానికి: 75,000 యెన్లుశాశ్వత నివాస అనుమతి కోసం: 200,000 యెన్లుఅంటే ప్రస్తుతం 6,000 యెన్లుగా ఉన్న రెసిడెన్సీ పొడిగింపు లేదా హోదా మార్పు ఫీజు గరిష్ఠంగా 75,000 యెన్లకు చేరనుంది. శాశ్వత నివాస దరఖాస్తు ఫీజు మాత్రం 10,000 నుంచి 200,000 యెన్లకు పెరుగుతుంది.ఆన్లైన్ దరఖాస్తులకు కొంత తక్కువకౌంటర్లో నేరుగా దరఖాస్తు చేయడంతో పోలిస్తే ఆన్లైన్లో చేసే కొన్ని రెసిడెన్సీ దరఖాస్తులకు తక్కువ ఫీజు ఉంటుంది. మంజూరయ్యే కాలాన్ని బట్టి ఆన్లైన్ ఫీజు 10,000 నుంచి 65,000 యెన్ల మధ్య ఉండనుంది. అయితే శాశ్వత నివాస అనుమతి దరఖాస్తు మాత్రం ఆన్లైన్లో కాకుండా సంబంధిత కార్యాలయంలోనే చేయాల్సి ఉంటుంది.ఫీజుల పెంపునకు కారణమేంటి?జపాన్లో విదేశీ నివాసితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఇమ్మిగ్రేషన్కు సంబంధించిన పరిపాలనా వ్యయాలను భర్తీ చేయడమే ఫీజుల పెంపు వెనుక ప్రధాన కారణంగా ప్రభుత్వం పేర్కొంది. ఈ మార్పులకు మార్గం సుగమం చేస్తూ జపాన్ పార్లమెంట్ మే 2026లో ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని సవరించింది. ఆ చట్టం ద్వారా నివాస హోదా మార్పు లేదా పొడిగింపు ఫీజుకు గరిష్ఠ పరిమితిని 100,000 యెన్లకు, శాశ్వత నివాస దరఖాస్తు ఫీజుకు గరిష్ఠ పరిమితిని 300,000 యెన్లకు పెంచారు. అయితే ప్రభుత్వం ప్రస్తుతం అమల్లోకి తీసుకురానున్న వాస్తవ ఫీజులు వరుసగా 75,000, 200,000 యెన్లుగా ఉన్నాయి.అందరికీ ఒకే భారం కాదుఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు, మానవతా కారణాలతో ప్రత్యేక పరిగణన అవసరమైనవారికి ఫీజు తగ్గింపునకు అవకాశం కల్పించారు. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం తగ్గింపు ఫీజులకు అర్హత పొందే వర్గాలను కూడా ప్రభుత్వం విస్తరించింది. ఇందులో కొంతమంది జపాన్ పౌరుల లేదా ప్రత్యేక శాశ్వత నివాసితుల పిల్లలను ఒంటరిగా పెంచుతున్న విదేశీయులు, అలాగే నివాస అనుమతి నిరాకరణ మానవతా దృష్ట్యా అనుచితంగా భావించబడే వ్యక్తులు కూడా ఉన్నారు.ఈ ఫీజుల మార్పు 2026 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ముఖ్యంగా కొత్త ఫీజులు దరఖాస్తు తేదీ ఆధారంగా వర్తిస్తాయి. అంటే అక్టోబర్ 1కు ముందే దరఖాస్తు చేసిన వారికి పాత ఫీజులే వర్తిస్తాయి. నిర్ణయం అక్టోబర్ 1 తర్వాత వెలువడినా కొత్త ఫీజు వర్తించదు.ఇదీ చదవండి: కేంద్ర బ్యాంకులు భయపడుతున్నాయ్.. -
ఎన్నారై డిపాజిట్లు 23 శాతం డౌన్
ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో ప్రవాస భారతీయుల (ఎన్నారై) డిపాజిట్లు 2.775 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధితో పోలిస్తే 23.2 శాతం క్షీణించినట్లు వివరించింది.2025–26 తొలి త్రైమాసికంలో 3.614 బిలియన్ డాలర్ల ఎన్నారై డిపాజిట్లు వచ్చినట్లు పేర్కొంది. తాజా డిపాజిట్లు నెమ్మదించినప్పటికీ ఎన్ఆర్వో, ఎఫ్సీఎన్ఆర్ (బి) డిపాజిట్ల దన్నుతో మొత్తం ప్రవాసుల డిపాజిట్ల పరిమాణం 168.327 బిలియన్ డాలర్ల నుంచి 168.506 బిలియన్ డాలర్లకు చేరినట్లు ఆర్బీఐ వివరించింది.ఇదీ చదవండి: చిన్న బ్యాంకుల విలీనం.. పెద్ద బ్యాంకుల ఏర్పాటు! -
మోటార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేయలేదా? ఏం అవుతుందంటే..
వాహనదారులకు బీమా అనేది కేవలం చట్టపరమైన నిబంధన మాత్రమే కాదు, అత్యవసర సమయాల్లో రక్షణ కవచం. అయితే వివిధ కారణాల వల్ల చాలా వరకు వెహికిల్ ఇన్సూరెన్స్ను రెన్యువల్ చేయించడానికి పెద్దగా ఆసక్తి చూపించరు. బిజీ లైఫ్స్టైల్ లేదా నిర్లక్ష్యం వల్ల రెన్యూవల్ గడువు ముగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.గడువు దాటితే ఎదురయ్యే సమస్యలుపాలసీ గడువు ముగిసిన మరుసటి క్షణం నుంచే బీమా రక్షణ నిలిచిపోతుంది. ఆ తర్వాత వాహనానికి ప్రమాదం జరిగినా, దొంగతనానికి గురైనా కంపెనీ ఎలాంటి పరిహారం చెల్లించదు.మోటార్ వాహనాల చట్టం ప్రకారం థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి. లేకపోతే తొలిసారి రూ.2,000, పునరావృతమైతే రూ.4,000 వరకు జరిమానా లేదా 3 నెలల జైలు శిక్ష పడే అవకాశముంది.ఇన్సూరెన్స్ లేనప్పుడు మీ వాహనం వల్ల మూడో వ్యక్తికి నష్టం వాటిల్లితే కోర్టు నిర్ణయించే లక్షల రూపాయిల నష్టపరిహారాన్ని మీ సొంత జేబు నుంచే చెల్లించాల్సి ఉంటుంది.క్లెయిమ్ చేయనందుకు ప్రీమియంలో లభించే 20% నుంచి 50% నో క్లెయిమ్ బోసన్ డిస్కౌంట్, గడువు దాటిన 90 రోజులలోపు రెన్యూ చేయకపోతే పూర్తిగా రద్దవుతుంది.లాప్స్ అయిన పాలసీని పునరుద్ధరించాలంటే ఇన్సూరెన్స్ సంస్థలు భౌతిక లేదా డిజిటల్ వాహన తనిఖీని నిబంధనగా పెడతాయి.తక్షణమే ఏం చేయాలి?ఇన్సూరెన్స్ లేనప్పుడు డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదకరం. ఇన్సూరెన్స్ పోర్టల్స్ లేదా యాప్ల ద్వారా ఆన్లైన్ ప్రాసెస్ ప్రారంభించండి. ప్రస్తుతం చాలా కంపెనీలు స్మార్ట్ఫోన్ ద్వారా ఇన్స్పెక్షన్ సౌకర్యం కల్పిస్తున్నాయి. ప్రీమియంలో స్వల్ప పొదుపు కోసం చూడకుండా గడువుకు ముందే రెన్యూవల్ చేసుకోవడం లేదా ఆటో-రెన్యూవల్ ఎంచుకోవడం శ్రేయస్కరం.ఇదీ చదవండి: ఒక్కరోజులో మారిన బంగారం ధరలు.. తులం ఎంతంటే.. -
అమెరికాలో క్లాస్ యాక్షన్.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లపై ఒత్తిడి!
భారతీయ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు అమెరికాలో చోటుచేసుకున్న పరిణామాలతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. బ్యాంక్తో పాటు దాని టాప్ ఎగ్జిక్యూటివ్లపై న్యూయార్క్ కోర్టులో ‘క్లాస్ యాక్షన్’ సెక్యూరిటీస్ దావా నమోదవడంతో మదుపర్ల సెంటిమెంట్ దెబ్బతింది. జులై 17, 2023 నుంచి మే 26, 2026 మధ్య కాలంలో బ్యాంక్ అమెరికన్ డిపాజిటరీ షేర్లు కొనుగోలు చేసిన ఇన్వెస్టర్ల తరఫున ఈ పిటిషన్ దాఖలైంది.ఈ వ్యాజ్యంలో బ్యాంక్ సీఈఓ శశిధర్ జగదీశన్, సీఎఫ్ఓ శ్రీనివాసన్ వైద్యనాథన్ల పేర్లను నిందితులుగా చేర్చారు. మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఎస్ఆర్డీసీ) నుంచి భారీ కార్పొరేట్ డిపాజిట్లను ఆకర్షించేందుకు సాధారణ సేవింగ్స్ రేటు (3.5%) కంటే అధికంగా 6.01% వడ్డీని ఆఫర్ చేశారనేది ప్రధాన ఆరోపణ. అదనంగా చెల్లించిన ఈ మొత్తాన్ని నిబంధనలకు విరుద్ధంగా మార్కెటింగ్ ఖర్చులు (సుమారు రూ.45 కోట్లు) కింద దాచిపెట్టారని, తద్వారా నికర వడ్డీ ఆదాయాన్ని తప్పుగా చూపించారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసులో లీడ్ ప్లాంటిఫ్గా చేరేందుకు ఇన్వెస్టర్లకు అక్టోబర్ 13, 2026 వరకు గడువు ఉంది.బ్యాంకు స్పందనఅయితే ఈ ఆరోపణలపై హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్పందిస్తూ అమెరికా మార్కెట్లలో షేరు ధర తగ్గినప్పుడు ఇలాంటి క్లాస్ యాక్షన్ దావాలు సర్వసాధారణమని కొట్టిపారేసింది. ఈ పిటిషన్లో ఎటువంటి వాస్తవం లేదని, ఈ వ్యవహారంపై న్యాయస్థానంలో పోరాడతామని స్పష్టం చేసింది. ఇటీవలే బ్యాంక్ గిఫ్ట్ సిటీ బ్రాంచ్ ద్వారా 1.75 బిలియన్ డాలర్ల నోట్ల జారీని విజయవంతంగా పూర్తి చేసిందని, ఫండమెంటల్స్ బలంగా ఉన్నాయని తెలిపింది.ఈ పరిణామాల నేపథ్యంలో బీఎస్ఈలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు ధర 2 శాతానికి పైగా క్షీణించి ఒత్తిడికి లోనైంది. ఎల్ఐసీ తన వాటాను పెంచుకోవడానికి ఆర్బీఐ ఆమోదం లభించడం సానుకూలాంశమైనప్పటికీ కార్పొరేట్ గవర్నెన్స్ ఆందోళనల కారణంగా సమీప భవిష్యత్తులో షేరు పరిమిత శ్రేణిలోనే కదిలే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: ఒక్కరోజులో మారిన బంగారం ధరలు.. తులం ఎంతంటే.. -
ఒక్కరోజులో మారిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
ఉల్లి ధరల దూకుడుకు కారణాలేంటో..
దేశవ్యాప్తంగా ఉల్లిపాయ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుల నుంచి కొనుగోలు చేస్తున్న ధరలు, వినియోగదారులకు అమ్మే రిటైల్ ధరల మధ్య పెరుగుతున్న అంతరాన్ని తగ్గించే మార్గాలను కనుగొనాలని ఆయన ఐసీఏఆర్ను ఆదేశించారు. మహారాష్ట్ర రైతులు ఇప్పటికే తక్కువ ధరలకు పంటను విక్రయించారని, ఇప్పుడు నిల్వ లేకపోయినా ధరలు పెరగడం అనుమానాస్పదమని తెలిపారు.గణాంకాలు చెబుతున్న వాస్తవందేశవ్యాప్తంగా మోడల్ ధర: ₹50/kgపంజాబ్: రూ.53 కేజీ (మూడు నెలల్లో 130% పెరుగుదల)ఢిల్లీ: రూ.55 కేజీ (ఒక నెలలో 22%, మూడు నెలల్లో 83% పెరుగుదల)చెన్నై: రూ.60 కేజీ (గత సంవత్సరం రూ.35తో పోలిస్తే)కోల్కతా: రూ.60 కేజీ (గత సంవత్సరం రూ.32తో పోలిస్తే)ముంబై: రూ.48 కేజీ (గత సంవత్సరం రూ.32తో పోలిస్తే) ప్రభుత్వ చర్యలు ధరల పెరుగుదల నియంత్రణ కోసం ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా రైతుల వద్ద ఉల్లిపాయలను రూ.15-20/kg ధరకు కొనుగోలు చేసింది. ఢిల్లీలో వినియోగదారులకు రూ.35/kg ధరకు ఉల్లిపాయలు విక్రయించేందుకు సిద్ధమైంది. నాసిక్ నుంచి కాందా ఎక్స్ప్రెస్ ద్వారా 800 టన్నుల బఫర్ స్టాక్ ఢిల్లీకి చేరుకోనుంది. నాఫెడ్, ఎన్సీసీఎఫ్, కేంద్రీయ భండార్ స్టోర్లు, మొబైల్ వాన్ల ద్వారా నేరుగా వినియోగదారులకు విక్రయం జరగనుంది.ఇదీ చదవండి: పసిడి, వెండి ధరల హొయలు.. నేటి ధరలు ఇలా.. -
‘మోసం.. అని చెప్పేముందు జాగ్రత్త’
పన్ను చెల్లింపుదారులకు జారీ చేసే సెక్షన్ 74 జీఎస్టీ షోకాజ్ నోటీసులపై అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. నోటీసులో ‘మోసం, వాస్తవాలను సమర్పించలేకపోవడం లేదా దాగిన సత్యాలు’ అనే చట్టబద్ధమైన పదాలను జాగ్రత్తగా ఉపయోగించాలని స్పష్టం చేసింది. పన్ను ఎగవేతకు పన్ను చెల్లింపుదారులు ఎలాంటి కుట్ర పన్నారో ప్రాథమిక సాక్ష్యాధారాలతో నోటీసులోనే స్పష్టంగా పేర్కొనాలని తెలిపింది.జస్టిస్ బె.బి.పార్దీవాలా, జస్టిస్ కె.వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ‘మోసం లేదా దాగిఉన్న వాస్తవాలు’ అనే సందేహస్పద పదజాలాన్ని ప్రయోగించినంత మాత్రాన గడువు పొడిగింపు నిబంధనలను సవరించే వీల్లేదని కోర్టు స్పష్టం చేసింది. అసెస్సింగ్ ఆఫీసర్ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పుడే ఎక్ట్సెండెడ్ లిమిటేషన్ వ్యవధిని వర్తింపజేయాలని పేర్కొంది.మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన అప్పీల్పై విచారణ సందర్భంగా.. నోటీసులోని శబ్దజాలం అసెస్సింగ్ ఆఫీసర్ల అనిశ్చితిని స్పష్టం చేస్తోందని, ‘మోసం లేదా కప్పిపుచ్చడం’ అనే పదాల వాడకంలో స్పష్టమైన నిర్ధారణ లేదని కోర్టు పేర్కొంది.ఈ తీర్పుపై స్పందించిన డెలాయిట్ పార్టనర్ హర్ప్రీత్ సింగ్.. ‘ఇది పన్ను చెల్లింపుదారులకు దక్కిన గొప్ప ఉపశమనం. చట్టపరమైన పదాలను కేవలం పునరావృతం చేస్తూ నోటీసులు పంపే ధోరణికి ఈ తీర్పు చెక్ పెడుతుంది’ అని వ్యాఖ్యానించారు. అధికారులు తమ నిర్లక్ష్య వైఖరిని వదిలి ఆధారాలతో సహా వివరమైన సమాచారాన్ని అందించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ తీర్పు ద్వారా పన్ను యంత్రాంగంలో బాధ్యత, పారదర్శకత పెరుగుతాయని ఆర్థిక రంగానికి చెందిన నిపుణులు భావిస్తున్నారు. నిజాయతీ కలిగిన పన్ను చెల్లింపుదారులకు ఈ తీర్పు రక్షణ కల్పిస్తుందని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: రూ.లక్షల కోట్ల ఆదా సరే.. మైలేజ్ కోతకు పరిష్కారమేది? -
ఫ్లాట్గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:24 సమయానికి నిఫ్టీ(Nifty) 19 పాయింట్లు పెరిగి 24,225 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 3 పాయింట్లు పెరిగి 77,484 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.14బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 87.3 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.65 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.02 శాతం తగ్గింది.నాస్డాక్ 0.08 శాతం దిగజారింది.Today Nifty position 27-08-2026(time: 09:24 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
రూ.లక్షల కోట్ల ఆదా సరే.. మైలేజ్ కోతకు పరిష్కారమేది?
భారతదేశం ఇంధన స్వాలంబన వైపు వేగంగా అడుగులు వేస్తోంది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ (పీపీఏసీ) ప్రకారం, 2013-14లో 1.53% ఉన్న ఇథనాల్ బ్లెండింగ్ 2025-26 నాటికి 20% (E20)కి చేరింది. దీనివల్ల రూ.1.97 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవ్వడంతోపాటు రైతులకు రూ.1.66 లక్షల కోట్లకు పైగా చెల్లింపులు జరిగాయి.అయితే, హారాల్డ్ లాస్వెల్ (1956), చార్లెస్ లిండ్బ్లోమ్ (1959) సిద్ధాంతాలు(ప్రభుత్వం ఎలా నిర్ణయాలు తీసుకోవాలో చెప్పే సిద్ధాంతాలు) పేర్కొన్నట్లు.. విధాన రూపకల్పనలో కేవలం లక్ష్య సాధనే కాకుండా, అమలులో ఎదురయ్యే అనుభవాల ఆధారంగా సర్దుబాట్లు చేసుకోవడం చాలా ముఖ్యం.ప్రధాన సవాళ్లు.. వినియోగదారుల భారంపాత వాహనాల్లో ఈ20 అనుకూలతపై స్పష్టమైన అంచనా లేదని, వీటిలో మైలేజ్ 3–5% తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం రాజ్యసభలో తెలిపింది. బంకుల్లో పాత ఇంధనం దొరక్కపోవడంతో వినియోగదారులు మైలేజ్ కోతను, విడిభాగాల అరుగుదల వ్యయాన్ని తప్పనిసరిగా భరించాల్సి వస్తోంది. ఇథనాల్ శాతాన్ని పెంచడానికే ప్రాధాన్యమివ్వడంతో వాహనదారుల ప్రయోజనాలు, వాహనాల సన్నద్ధత ప్రాధాన్యం కోల్పోయాయి.అంతర్జాతీయ పాఠాలుబ్రిటన్ E10ను ప్రవేశపెట్టినప్పుడు పాత వాహనాల కోసం E5ని ‘ప్రొటెక్షన్ గ్రేడ్’గా కొనసాగించి వాహన అనుకూలతను సరిచూసుకునే సదుపాయం కల్పించింది. వినియోగదారులు లేవనెత్తుతున్న మైలేజ్, వారంటీ సమస్యలను అపోహలుగా కొట్టిపారేయకుండా ప్రభుత్వం వాటిని పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం కేవలం ఇంధనంలో ఇథనాల్ కలిపే శాతాన్నే కాకుండా నీటి వినియోగం, ఇతర ఉద్గారాలను ప్రాతిపదికగా తీసుకోవాలని సూచిస్తున్నారు. అనుభవాల ఆధారంగా విధానాన్ని సరళంగా సవరించుకోవడమే నిజమైన పరిపాలనా సామర్థ్యమని చెబుతున్నారు.ఇదీ చదవండి: పసిడి, వెండి ధరల హొయలు.. నేటి ధరలు ఇలా.. -
భారత్లో పెట్టుబడులు పెట్టండి
వాషింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశాల్లో ఒకటైన భారత్లో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ నేపథ్యంలో భారత్లో ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు రావాలని కెనడా ఇన్వెస్టర్లను ఆహా్వనించారు. పెద్ద సంఖ్యలో యువ జనాభాతో నిలకడగా వృద్ధి సాధిస్తూ భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశంగా నిలుస్తోందన్నారు. దేశీయంగా వినియోగం భారీగా పెరుగుతోందని, క్యాపిటల్ మార్కెట్లు కూడా విస్తరిస్తున్నాయని వివరించారు. ‘దీర్ఘకాలిక కోణంలో ఆలోచిస్తున్న కెనడా ఇన్వెస్టర్లకు భారత్లో అసమానమైన అవకాశాలు ఉన్నాయి. భారీ స్థాయి, సుస్థిర వృద్ధి, యువ జనాభా, పెరుగుతున్న వినియోగం మొదలైన సానుకూలాంశాలు ఉన్నాయి‘ అని టొరంటోలో పరిశ్రమ దిగ్గజాలతో భేటీ సందర్భంగా ఆమె చెప్పారు. పెరుగుతున్న మధ్య తరగతి వర్గం, ప్రపంచ స్థాయి డిజిటల్ మౌలిక సదుపాయాలు, పట్టణీకరణ వేగవంతం అవుతుండటం తదితర కారణాలతో ఎకానమీలోని ప్రతి రంగంలోనూ కొత్త అవకాశాలు వస్తున్నాయన్నారు. పటిష్టమైన డిజిటల్ వ్యవస్థతో ఆర్థిక, వాణిజ్య సేవలు ప్రజలకు మరింత అందుబాటులోకి వచ్చాయని మంత్రి చెప్పారు. లావాదేవీలపరంగా చూస్తే ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ టైమ్ పేమెంట్స్ సిస్టమ్గా యూపీఐ ఎదిగిందని, ఆర్థిక సమ్మిళితత్వం, వినూత్నతకు నిదర్శనంగా నిలుస్తోందన్నారు. -
భవిష్యత్తులో మరింత బలమైన వృద్ధికి సిద్ధం
ముంబై: భవిష్యత్తులో మరింత బలమైన వృద్ధిని నమోదు చేయడానికి సిద్ధంగా ఉన్నామని దేశీయ ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం ‘ఇమామి’ వ్యవస్థాపకుడు, నాన్–ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎస్ గోయెంకా ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామీణ మార్కెట్లలో వినియోగం మళ్లీ ఊపందుకోవడంతో పాటు, పట్టణ ప్రాంతాల్లో నాణ్యమైన ఉత్పత్తులకు డిమాండ్ (ప్రీమియమైజేషన్) పెరుగుతుండటం కంపెనీకి కలిసివస్తుందన్నారు. కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) వాటాదారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. గ్రామీణ రికవరీతో అధిక లబ్ధి అనుకూలమైన వర్షపాతం, మెరుగైన వ్యవసాయ రాబడులు, పెరుగుతున్న కొనుగోలు శక్తి వల్ల గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం మళ్లీ వేగం పుంజుకుంటోందని గోయెంకా పేర్కొన్నారు. ‘‘ఇమామి వ్యాపారంలో అత్యధిక భాగం గ్రామీణ భారతంతోనే ముడిపడి ఉంది. అక్కడ మా బ్రాండ్లకు దశాబ్దాల నమ్మకం ఉంది. జీఎస్టీ సవరణల వల్ల సంఘటిత రంగానికి చెందిన ఉత్పత్తులు సులభంగా అందుబాటులోకి వస్తున్నాయి. ఈ రికవరీ ద్వారా అత్యధిక లబ్ధి పొందేందుకు ఇమామి వ్యూహాత్మకంగా సిద్ధంగా ఉందనే నమ్మకం ఉంది’’ అని వివరించారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో డిజిటల్ వినియోగం పెరగడం, ఆరోగ్యం–వెల్నెస్పై అవగాహన పెరగడం తమకు కొత్త అవకాశాలను సృష్టిస్తోందని వివరించారు. నాన్–సీజనల్ ఉత్పత్తులను బలోపేతం చేయడం, కొత్త తరం కన్జూమర్ ప్లాట్ఫారమ్లలోకి విస్తరించడం ద్వారా కంపెనీని మరింత బలోపేతం చేసినట్లు చెప్పారు. వ్యూహాత్మక పెట్టుబడుల భాగస్వామ్యం హెల్త్ అండ్ వెల్నెస్ సంస్థ ‘యాక్సియమ్ ఆయుర్వేద’తో పాటు ‘ఇంక్నట్ డిజిటల్’కు చెందిన డిజిటల్–ఫస్ట్ బ్రాండ్లు ‘వేదిక్స్’, ‘స్కిన్క్రాఫ్ట్’లలో సాధించిన వాటాలు కంపెనీ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని గోయెంకా తెలిపారు. తమ వ్యూహాత్మక పెట్టుబడులు గత ఆర్థిక సంవత్సరం (ఎఫ్వై26) కన్సాలిడేటెడ్ టర్నోవర్లో దాదాపు ఆరు శాతం వాటాను అందించాయని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (ఎఫ్వై27)లో ఈ వాటా 16 శాతానికి, ఎఫ్వై30 నాటికి 25 శాతానికి (నాలుగో వంతు) చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు స్పష్టం చేశారు. అంతర్జాతీయ వ్యాపార విస్తరణ ప్రపంచవ్యాప్తంగా అనిశి్చతులు ఉన్నప్పటికీ స్వదేశీ వినియోగం, మౌలిక సదుపాయాల కల్పన, విధానపరమైన స్థిరత్వంతో భారత్ స్థిరమైన వృద్ధిని సాధిస్తోందన్నారు. బంగ్లాదేశ్, పశి్చమాసియా, ఆఫ్రికా వంటి అంతర్జాతీయ మార్కెట్లలో తమ ఉత్పత్తులకు మంచి భవిష్యత్తు ఉందని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక తయారీ సామర్థ్యం, వినియోగదారుల కేంద్రీకృత వ్యూహాలతో ఆయా ప్రాంతాల్లో పెట్టుబడులు కొనసాగిస్తామన్నారు. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొంటూ బ్రాండ్ల బలం, కస్టమర్ల నమ్మకంతో ఇమామి ముందంజలో ఉంటుందని పేర్కొన్నారు. -
కార్పొరేట్ కొనుగోళ్లు రెట్టింపు
ముంబై: ఇతర కంపెనీల కొనుగోళ్లలో దేశీ కార్పొరేట్ దిగ్గజాలు భారీ ఆసక్తి చూపుతున్నట్లు దేశీ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తాజా నివేదికలో పేర్కొంది. 2016–17 ఆర్థిక సంవత్సరం నుంచి చూస్తే కొనుగోళ్లు రెట్టింపైనట్లు వెల్లడించింది. అయితే వీటిలో మూడోవంతు అనుకున్న ఫలితాలు సాధించలేకపోయినట్లు తెలియజేసింది. విభిన్న కారణాలతో కంపెనీలు ఇతర సంస్థల కొనుగోళ్లను చేపడుతున్నట్లు క్రిసిల్ ఎండీ సుబోధ్ రాయ్ తెలియజేశారు. వృద్ధిని పెంచుకోవడంలో వేగం, మార్కెట్లలో మరింత విస్తరించడం, కొనుగోళ్ల సామర్థ్యాలకు పదును పెట్టుకోవడం తదితరాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. నివేదిక విశ్లేషణ ప్రకారం 2017 నుంచి డీల్స్ సంఖ్య రెట్టింపైంది. 20 రంగాల నుంచి విడిగా రూ. 500 కోట్లకుపైగా విలువైన 600 డీల్స్ను నివేదిక విశ్లేషించింది. అయితే విశ్లేషణలో ఫైనాన్షియల్ సరీ్వసులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరీ్వసుల రంగాలలోని లావాదేవీలను మినహాయించింది. ప్రయివేట్ ఈక్విటీ(పీఈ) దిగ్గజాలు దేశీయంగా చేపట్టే డీల్స్కు సైతం చోటివ్వలేదు. కారణాలు వేరువేరు.. క్రిసిల్ నివేదిక ప్రకారం ఫార్మాస్యూటికల్స్, హెల్త్కేర్, ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, కన్జూమర్ బిజినెస్లు టెక్నాలజీల అనుసంధానం, నైపుణ్యాలు, మేథోసంపత్తిని సమకూర్చుకోవడం తదితరాల కోసం కొనుగోళ్లను చేపడుతున్నాయి. సిమెంట్, మెటల్స్ రంగాలలోని పరిశ్రమలు.. కన్సాలిడేషన్, ప్లాంట్ల నిర్మాణ సమయాన్ని తగ్గించుకోవడం తదితరాలపై దృష్టితో కొనుగోళ్లకు తెరతీస్తున్నాయి. తద్వారా 4–6 ఏళ్ల కాలాన్ని ఏడాది నుంచి మూడేళ్లకు తగ్గించుకుంటున్నాయి. రుణ సమీకరణతో చేపట్టిన 100కుపైగా భారీ డీల్స్ మూడింటిలో రెండు అంచనాలను అందుకున్నట్లు రాయ్ పేర్కొన్నారు. కొన్ని డీల్స్ ఏకీకృతంకావడంలో విఫలంకాగా.. నియంత్రణ సంస్థల ఆలస్యాలు, దేశ సరిహద్దులనుదాటి(క్రాస్బోర్డర్) చేపట్టే కొనుగోళ్లు కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నట్లు వివరించారు. కొనుగోళ్లు, విలీనాలనేవి వ్యూహాత్మక నిర్ణయాలతోనే విజయవంతంకాబోవని, క్రమశిక్షణాయుత ఏకీకృత చర్యలు, సమయానుగుణంగా సొంతం చేసుకోవడం, వనరుల సమర్థవంత వినియోగం తదితరాలు ఇందుకు సహకరించనున్నట్లు అభిప్రాయపడ్డారు. -
చిన్న బ్యాంకుల విలీనం.. పెద్ద బ్యాంకుల ఏర్పాటు!
పలు చిన్న బ్యాంకులను విలీనం చేసి కొన్ని భారీ బ్యాంకులను ఏర్పాటు చేయడంపై భారత్ దృష్టి పెట్టాలని ప్రధాని ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) ఒక చర్చాపత్రంలో ప్రతిపాదించింది. అదే సమయంలో మార్కెట్లో పోటీ తగ్గిపోకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. 2017లో ఎస్బీఐలో అనుబంధ బ్యాంకులను, 2019లో బ్యాంక్ ఆఫ్ బరోడా-విజయ బ్యాంక్-దేనా బ్యాంకులను, 2020లో 10 బ్యాంకులను 4 బ్యాంకులుగా కన్సాలిడేట్ చేయడం వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 27 నుంచి 12కి తగ్గిందని వివరించింది.కన్సాలిడేషన్ వల్ల స్థాయి, కార్యకలాపాల నిర్వహణ సామర్థ్యాలు పెరిగాయని ఈఏసీ–పీఎం తెలిపింది. దేశీ బ్యాంకింగ్ రంగంలో సమర్ధత, ఉత్పాదకతను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం, ఆర్బీఐ చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చాయని పేర్కొంది. భవిష్యత్తులో కృత్రిమ మేథ (ఏఐ), బ్యాంక్ డిజిటైజేషన్ కూడా కలిస్తే సమర్ధత మరింతగా పెరుగుతుందని వివరించింది. 2015–2026 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో (12 ఏళ్లు) 47 బ్యాంకులను అధ్యయనం చేసిన మీదట ఈఏసీ-పీఎం ఈ పత్రాన్ని రూపొందించింది. -
గోల్డ్, సిల్వర్పై పన్ను తగ్గే ఛాన్స్.. కారణం ఇదే!
బంగారం, వెండిపై భారీగా ఉన్న దిగుమతి సుంకాలను తగ్గించే అంశంపై కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న అధిక పన్నుల కారణంగా.. చట్టబద్ధంగా దిగుమతి చేసుకునే బంగారం కంటే, అక్రమ మార్గాల్లో వచ్చే బంగారం చౌకగా మారే పరిస్థితి ఏర్పడుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని.. సుంకం తగ్గిస్తే స్మగ్లింగ్ను అడ్డుకోవచ్చా?, అనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే.. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. బులియన్ వ్యాపారులు, జ్యువెలరీ రంగం మాత్రం ప్రస్తుత 15 శాతం సుంకాన్ని.. 6 శాతానికి తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతోంది. ఇదే జరిగితే ధరలు కొంత తగ్గే అవకాశం ఉంటుంది.సుంకం ఎందుకు పెంచారు?బంగారం దిగుమతులు భారీగా పెరగడంతో దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతుందన్న ఆందోళనతో ప్రభుత్వం మే 13, 2026న దిగుమతి సుంకాన్ని పెంచింది. భారత్ ప్రతి ఏడాది సుమారు 700-800 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. సుంకం పెంచడానికి ముందు ఏప్రిల్లో బంగారం దిగుమతులు ఏకంగా 82 శాతం పెరిగాయి. ఎక్కువగా బంగారం దిగుమతి చేసుకుంటే డాలర్లకు డిమాండ్ పెరగడంతో పాటు కరెంట్ అకౌంట్ లోటు కూడా పెరుగుతుంది. దీంతో రూపాయిపై ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంటుంది.పన్ను పెంచినా దిగుమతులు తగ్గలేదే?ప్రభుత్వం సుంకాన్ని పెంచినప్పటికీ బంగారం దిగుమతులు పూర్తిగా తగ్గలేదు. మేలో దిగుమతులు దాదాపు 34 శాతం పెరిగాయి. ఆ తర్వాత జూన్, జూలై నెలల్లో కలిపి బంగారం దిగుమతుల విలువ 5.5 శాతం పెరిగి 6.13 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో అధిక సుంకం విధించడం ద్వారా దిగుమతులను నియంత్రించాలన్న ప్రభుత్వ లక్ష్యం ఎంతవరకు నెరవేరిందనే ప్రశ్నలు వస్తున్నాయి.స్మగ్లింగ్ ఎందుకు పెరుగుతోంది?పరిశ్రమ వర్గాల వాదన ప్రకారం.. అధిక పన్ను కారణంగా చట్టబద్ధంగా దిగుమతి చేసుకునే బంగారం ఖరీదుగా మారుతుంది. అదే సమయంలో అక్రమ మార్గంలో వచ్చే బంగారంపై ఇలాంటి పన్ను ఉండదు. దీంతో రెండు మార్గాల మధ్య ధర వ్యత్యాసం పెరుగుతుంది. ఈ పరిస్థితి స్మగ్లింగ్కు ప్రోత్సాహం ఇవ్వొచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అందుకే సుంకాన్ని తగ్గిస్తే చట్టబద్ధమైన దిగుమతులు పెరగడంతో పాటు అక్రమ మార్గాల్లో బంగారం వచ్చే ప్రోత్సాహం కూడా తగ్గవచ్చని వారు భావిస్తున్నారు.వెండి, ప్లాటినంపైనా ప్రభావంకేంద్రం కేవలం బంగారం గురించే కాకుండా వెండి, ప్లాటినం దిగుమతి సుంకాలపై కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. వీటికి ఆభరణాల రంగంతో పాటు పారిశ్రామికంగా కూడా భారీ డిమాండ్ ఉంది. వెండిని సౌర విద్యుత్ పరికరాలు, ఎలక్ట్రానిక్స్ తయారీలో ఉపయోగిస్తారు. ప్లాటినం ఆటోమొబైల్, వైద్య రంగాల్లో కీలకంగా ఉంటుంది. కాబట్టి వీటిపై అధిక సుంకాలు విధించడం వల్ల పరిశ్రమలకు ముడి పదార్థాల ఖర్చులు పెరిగి, చివరకు ఉత్పత్తుల ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.ప్రస్తుతం ప్రభుత్వం ఒకవైపు దేశ విదేశీ మారక నిల్వలను కాపాడుకోవాలని చూస్తోంది. మరోవైపు అధిక పన్నుల వల్ల స్మగ్లింగ్ పెరగడం, పరిశ్రమల ఖర్చులు పెరగడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. అందుకే.. సుంకాలను తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే 15 శాతం నుంచి 6 శాతానికి సుంకం తగ్గిస్తారా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు. ఒకవేళ సుంకం తగ్గిస్తే అధికారిక మార్గంలో బంగారం దిగుమతులు పెరగవచ్చు. అదే సమయంలో స్మగ్లింగ్ తగ్గుతుందా, విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి ఎలా ఉంటుంది అనేది కీలకంగా మారనుంది.ఇదీ చదవండి: బంగారం ధరలకు బ్రేక్.. ఒక్కరోజులో భారీ పతనం! -
కొత్త రంగంలోకి రిలయన్స్.. అదానీకి పోటీగా భారీ ప్లాన్!
న్యూఢిల్లీ: దేశీయంగా అల్యూమినియం ఉత్పత్తి విభాగంలో పోటీ తీవ్రతరమవుతోంది. ఇప్పటికే అదానీ గ్రూప్ 11.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ప్రతిపాదించగా, తాజాగా మరో దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఎంట్రీ అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఒడిస్సాలోని కర్లాపట్ బాక్సైట్ బ్లాక్ టెండర్ డాక్యుమెంట్లను కూడా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 3,100 హెక్టార్లలో విస్తరించిన ఈ బ్లాకులో 200 మిలియన్ టన్నులకు పైగా బాక్సైట్ నిల్వలు ఉన్నట్లు అంచనా. వాస్తవానికి రిలయన్స్, అదానీ గ్రూప్ తదితర కంపెనీలు దీనిపై ఆసక్తిగా ఉన్నప్పటికీ 175 శాతం ప్రీమియంను ఆఫర్ చేయడం ద్వారా వేదాంత అల్యూమినియం అనుబంధ సంస్థ బాల్కో ప్రిఫర్డ్ బిడ్డరుగా నిలిచింది.కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు దన్ను..రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే తొలి సమగ్ర అండర్గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంటును చేపడుతోంది. వచ్చే 30 ఏళ్లలో దీనిపై రూ. 2.73 లక్షల కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు ప్రకటించింది. అల్యూమినియం పరిశ్రమలో శుద్ధి, స్మెలి్టంగ్ తదితర ప్రక్రియలకు చాలా భారీ స్థాయిలో విద్యుత్ అవసరమవుతుంది. కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల్లో బొగ్గును సింథసిస్ గ్యాస్ (సిన్గ్యాస్)గా మార్చి, విద్యుత్తును ఉత్పత్తిచేసేందుకు లేదా పారిశ్రామిక ఇంధనంగాను ఉపయోగిస్తారు.లోహాల మార్కెట్లో ఎంట్రీకి దీన్నొక అవకాశంగా మల్చుకోవాలని రిలయన్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతిపాదిత బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్ ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్ను లోహాల తయారీకి ఉపయోగించుకోవడం ద్వారా లాభదాయకతను పెంచుకోవచ్చనే ఆలోచనతోనే అల్యూమినియంపై కంపెనీ దృష్టి పెడుతుండవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కోల్ గ్యాసిఫికేషన్ను భారీ స్థాయి లోహాలు, ఖనిజాల ప్రాసెసింగ్ కోసం వినియోగించుకునేందుకు అవకాశం ఉందని వివరించాయి. అయితే, కంపెనీ ఇంకా అన్ని అవకాశాలను పరిశీలిస్తోందని, ఇంకా ఏదీ ధృవీకరణ కాలేదని వివరించాయి.ఇప్పటికే భారీగా ఉత్పత్తి...ఇప్పటికే అల్యూమినియం రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీల ఉత్పత్తి సామర్థ్యం బోలెడంత ఉన్న తరుణంలో మరో రెండు దిగ్గజాలు కూడా బరిలోకి దిగనుండటంతో పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం 25 లక్షల టన్నుల వార్షిక తయారీ సామర్థ్యంతో వేదాంత అల్యూమినియం ప్రస్తుతం భారత్లో అతి పెద్ద ఉత్పత్తి సంస్థగా కార్యకలాపాలు సాగిస్తోంది.ఆదిత్య బిర్లా గ్రూప్నకు చెందిన హిందాల్కో ఇండస్ట్రీస్ ఉత్పత్తి సామర్థ్యం 14 లక్షల టన్నులుగా ఉండగా, ప్రభుత్వ రంగ నాల్కో సామర్థ్యం 5 లక్షల టన్నులుగా ఉంది. ఈ పరిస్థితుల్లో యూఏఈకి చెందిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీతో కలిసి ఒడిశాలో 20 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్య అల్యూమినియం ప్రాజెక్టును చేపడుతున్నట్లు, ఇందుకోసం 11.5 బిలియన్ డాలర్లు వెచ్చించనున్నట్లు అదానీ ఎంటర్ప్రైజెస్ సంస్థ జూలైలో ప్రకటించడం గమనార్హం. -
ఎంజీ హెక్టార్ తొమాహాక్ లాంచ్: ధర ఎంతంటే?
ఆటోమొబైల్ సంస్థ ‘జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా’ భారత మార్కెట్లోకి నూతన మల్టీ-ఎనర్జీ వెహికల్ ‘హెక్టార్ తొమాహాక్’ ను అధికారికంగా ఆవిష్కరించింది. కంపెనీ కొత్తగా అభివృద్ధి చేసిన ‘అడ్వాన్స్డ్ డ్రైవ్ ఆర్కిటెక్చర్ ప్లాట్ఫామ్ టెక్నాలజీ (ఏడీఏపీటీ)’ పై రూపొందిన తొలి మోడల్ ఇదేనని తెలిపింది. అలాగే, భారత్లో న్యూ ఎనర్జీ వెహికల్ ప్లాట్ఫామ్పై రూపొందిన తొలి ఉత్పత్తిగా కూడా పేర్కొంది. ఎక్స్ షోరూం వద్ద ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) వెర్షన్ ప్రారంభ ధర రూ.19.49 లక్షలుగా ఉంది. ప్లగ్–ఇన్ హైబ్రిడ్ (పీహెచ్ఈవీ) వెర్షన్ ధర రూ. 25.70 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.కారు ఆవిష్కరణ సందర్భంగా కంపెనీ డైరెక్టర్ పార్థ్ జిందాల్ మాట్లాడుతూ విస్తరణ ప్రణాళికలను వెల్లడించారు. ‘‘దేశంలో తమ తయారీ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచేందుకు కంపెనీ, దాని భాగస్వామ్య వెండర్లు కలిసి రూ.6,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనున్నాము’’ అని తెలిపారు. ఇందులో కంపెనీ వాటా రూ.3,500 కోట్లు కాగా, వెండర్లు దాదాపు రూ.2,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత విస్తరణ ప్రణాళికకు అవసరమైన నిధులు కంపెనీ వద్ద ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని తెలిపారు.హలోల్ ప్లాంట్ విస్తరణకు భారీ ప్రణాళిక మొత్తం రూ.6 వేల కోట్ల పెట్టుబడిలో కొంత భాగాన్ని గుజరాత్లోని హలోల్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు వినియోగించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం హలోల్ ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 1.10 లక్షల యూనిట్లుగా ఉందని, వచ్చే ఏడాది మార్చి నాటికి దీనిని 1.60 లక్షల యూనిట్లకు, 2028 జనవరి నాటికి 2.20 లక్షల యూనిట్లకు పెంచనున్నట్లు వివరించారు. రాబోయే 3–4 ఏళ్లలో కొత్త ప్రాంతంలో మరో ప్లాంట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం ఉన్న హలోల్ ప్లాంట్లోనే వార్షిక సామర్థ్యాన్ని 4 లక్షల యూనిట్ల వరకు పెంచుకునే అవకాశం ఉందన్నారు.భారీ వృద్ధి లక్ష్యాలు కంపెనీ ఏటా 35–40 శాతం వార్షిక వృద్ధి రేటును లక్ష్యంగా పెట్టుకుందని పార్థ్ జిందాల్ చెప్పారు. మార్కెట్లో డిమాండ్ కంటే సరఫరా తక్కువగా ఉండటమే ప్రధాన సవాలు అన్నారు. గతేడాది 71,000 కార్లను విక్రయించగా, ఈ ఏడాది 1,00,000 కార్ల విక్రయాల మార్కును దాటతామనే ధీమా వ్యక్తం చేశారు. భారత్లో బ్యాటరీ సెల్స్ తయారీపై కంపెనీ ఆసక్తి చూపుతున్నప్పటికీ, లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (ఎల్ఎఫ్పీ) టెక్నాలజీ చైనా వెలుపల పరిమితంగా అందుబాటులో ఉందన్నారు. అయితే బ్యాటరీ స్టోరేజ్ కోసం జేఎస్డబ్ల్యూ ఎనర్జీకి, ఎంజీ వాహనాల కోసం సెల్–టు–ప్యాక్ సదుపాయాలను ఇప్పటికే ప్రారంభించినట్లు చెప్పారు.వాటా కొనుగోలుపై చర్చలు జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియాలో అదనపు వాటా కొనుగోలుపై జేఎస్డబ్ల్యూ గ్రూప్, ఎస్ఏఐసీ మోటార్ మధ్య చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని, ఈ అంశంపై ఇప్పటివరకు ఎ లాంటి నిర్ణయం తీసుకోలేదని పార్థ్ జిందాల్ స్పష్టం చేశారు. ప్రస్తుతం కంపెనీలో ఎస్ఏఐసీ మోటార్కు 49%, జేఎస్డబ్ల్యూ గ్రూప్కు 35% వాటా ఉండగా, మిగిలిన వాటాను ఇతర భారతీయ పెట్టుబడిదారులు, డీలర్లు, ఉద్యోగులు కలి గి ఉన్నారు. భారత్ను తమ తదుపరి కీలక వృద్ధి మార్కెట్గా ఎస్ఏఐసీ మోటార్ చూస్తోందన్నారు. -
ఎస్బీఐ హోమ్ లోన్స్లో సరికొత్త రికార్డు!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్బ్యాంక్(ఎస్బీఐ) గృహ రుణ పోర్ట్ఫోలియో రూ. 10 లక్షల కోట్ల మైలురాయిని దాటనున్నట్లు చైర్మన్ సీఎస్ శెట్టి తాజాగా వెల్లడించారు. హౌసింగ్ ఫైనాన్స్కు పెరుగుతున్న డిమాండ్ కారణంగా ప్రస్తుత త్రైమాసికం(జూలై-సెప్టెంబర్)లో మార్టిగేజ్ పోర్ట్ఫోలియో ఈ ఫీట్ను సాధించే వీలున్నట్లు తెలియజేశారు.గత ఆర్థిక సంవత్సరం(2025-26)లో ఎస్బీఐ రూ. 9 లక్షల కోట్ల హోమ్ లోన్ పోర్ట్ఫోలియోను అధిగమించినట్లు ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. గృహ రుణ విభాగంలో ఎస్బీఐ మార్కెట్ వాటా 28 శాతంకాగా.. దేశవ్యాప్తంగా వీటిని అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.దేశవ్యాప్తంగా 460కుపైగా గృహ రుణ ప్రాసెసింగ్ కేంద్రాలు పనిచేస్తున్నట్లు వెల్లడించారు. తద్వారా హౌసింగ్ ఫైనాన్స్ ప్రొడక్టుల అందుబాటును విస్తరిస్తున్నట్లు తెలియజేశారు. పారదర్శకత, వడ్డీ రేట్లలో బ్యాంక్ విధానాలపట్ల కస్టమర్లకు విశ్వాసమున్నట్లు పేర్కొన్నారు. డాక్యుమెంటేషన్, బిల్డర్లపై నివేదికలు తదితరాలు కస్టమర్లను బ్యాంకువైపు ఆకర్షిస్తున్నట్లు తెలియజేశారు.ఆర్థిక వ్యవస్థకు దన్నుగా..గృహ రుణాలనేవి కేవలం బ్యాంకింగ్ ప్రొడక్టులగానే చూడకూడదని, వీటివల్ల ఆర్థికపరమైన యాక్టివిటీకితోడు సంబంధిత పలు పరిశ్రమలపైనా సానుకూల ప్రభావం పడుతుందని ఎస్బీఐ చైర్మన్ శెట్టి వివరించారు. ఆర్థిక వ్యవస్థకు హోమ్ లోన్ అత్యంత కీలక విభాగమని అభిప్రాయపడ్డారు. రెసిడెన్షియల్, కమర్షియల్ రియల్టీ రంగంపై 200కుపైగా పరిశ్రమలు ఆధారపడి ఉన్నట్లు పేర్కొన్నారు.వెరసి హోమ్ లోన్ స్టాండెలోన్ ప్రొడక్ట్గా కాకుండా దేశ ఆర్థిక వృద్ధిలో భాగంగా భావించాలని వ్యాఖ్యానించారు. గృహ రుణాల సెక్యూరిటైజేషన్పై స్పందిస్తూ పరిశ్రమస్థాయిలో రూ. 30 లక్షల కోట్లకుపైగా ఔట్స్టాండింగ్ రుణాలున్నట్లు తెలియజేశారు. అయితే ఇవి లిక్విడ్ ఆస్తులుకావని, దీంతో రీసైకిల్ క్యాపిటల్ను సమకూర్చుకోవడం, విస్తారిత రుణ మంజూరీ వంటి అంశాలలో బ్యాంకుల అవకాశాలు పరిమితమవుత్నుట్లు వివరించారు. అంతర్జాతీయంగా మారి్టగేజ్ బుక్ అత్యంత లిక్విడిటీని కలిగి ఉన్నప్పటికీ దేశీయంగా కొద్దిపాటి సెక్యూరిటైజేషన్కు వీలున్నప్పటికీ అత్యధికశాతం ఇల్లిక్విడ్ కిందకే వస్తాయని తెలియజేశారు. -
సుజుకి సరికొత్త ఎలక్ట్రిక్ కారు.. ధర ఎంతంటే?
యునైటెడ్ కింగ్డమ్తో సహా అంతర్జాతీయ మార్కెట్ల కోసం రూపొందించిన, ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ అయిన ఈ-స్కైని సుజుకి ఆవిష్కరించింది. ఇది నిబంధనలకు అనుగుణంగా అభివృద్ధి చేసిన, పట్టణ వాతావరణాలకు అనువైన కాంపాక్ట్ పరిమాణాన్ని కొనసాగిస్తూనే, బాక్స్ ఆకారంలో రూపుదిద్దుకుంది.యునైటెడ్ కింగ్డమ్లో, సుజుకి ఈ-స్కై ధరలు 20,000 పౌండ్ల (రూ. 26.08 లక్షలు) కంటే తక్కువ నుంచి ప్రారంభమవుతాయి. ఇది గత సంవత్సరం టోక్యో మోటార్ షోలో ప్రదర్శించిన కాన్సెప్ట్కు చాలా దగ్గరగా ఉన్నప్పటికీ.. ప్రొడక్షన్ మోడల్ కోసం కొన్ని ముఖ్యమైన మార్పులు చేసినట్లు తెలుస్తోంది.సుజుకి ఈ-స్కై ఎలక్ట్రిక్ కారులో సుమారు 63 bhp పవర్ ఉత్పత్తి చేసే ఒకే ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఎలక్ట్రిక్ మోటార్ను అమర్చనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ మోడల్ సుమారు 310 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ను అందిస్తుందని సమాచారం.సుజుకి ఈ-స్కై 3,395 మిమీ పొడవు, 1,475 మిమీ వెడల్పు, 1,625 మిమీ ఎత్తు, వీల్బేస్ 2,460 మిమీ వరకు ఉంటుంది. చల్లని వాతావరణంలో క్యాబిన్ను వేడి చేయడానికి శక్తి సామర్థ్యాన్ని పెంచడానికి మరియు విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి రూపొందించిన డైరెక్ట్ హీట్-పంప్ సిస్టమ్ మరియు ఎయిర్-హీటెడ్ ఎలక్ట్రిక్ హీటర్ను సుజుకి ఈ మోడల్లో అమర్చింది.సుజుకి ఈ-స్కైలో 10.1-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఈవీకి ప్రత్యేకమైన రూట్ ప్లానింగ్తో కూడిన కనెక్టెడ్ నావిగేషన్ ఉన్నాయి. ఈ నావిగేషన్ సిస్టమ్, మార్గాలను,ఛార్జింగ్ ప్రదేశాలను సూచించేటప్పుడు బ్యాటరీ ఛార్జ్ స్థాయిలను మరియు ట్రాఫిక్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటుంది.సుజుకి ఈ-స్కై ఎలక్ట్రిక్ కారు భారతదేశంలో లాక్ అవుతుందా?, లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఒకవేళ సుజుకి భారత మార్కెట్లోకి తీసుకువస్తే, అది టాటా టియాగో ఈవీ మరియు ఎంజీ కామెట్ ఈవీ వంటి సరసమైన ఎలక్ట్రిక్ కార్లకు ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది. -
ఎలాన్ మస్క్కు ఉక్రెయిన్ అత్యున్నత పురస్కారం!
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ, ప్రముఖ వ్యాపారవేత్త, స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ను ‘ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్’ పురస్కారంతో సత్కరించారు. మనుషుల ప్రాణాలు, స్వేచ్ఛను కాపాడటంలో చేసిన సేవలు, అలాగే ఉక్రెయిన్-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన చేసిన కృషికి ఈ అవార్డును అందించారు. ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో మస్క్ అందించిన స్టార్లింక్ సేవలు ఉక్రెయిన్కు ఎంతో ఉపయోగపడ్డాయి.2022లో రష్యా దాడి తర్వాత ఉక్రెయిన్లో అనేక కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఆ సమయంలో స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ఉక్రెయిన్ సైనికులు, కమాండర్లు, పౌరులకు కీలక కమ్యూనికేషన్ మార్గంగా మారింది. సైనిక కార్యకలాపాల్లో కూడా స్టార్లింక్ విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా డ్రోన్లను నియంత్రించడం, దూర ప్రాంతాల్లో వాటితో కనెక్షన్ కొనసాగించడం వంటి కార్యకలాపాలకు ఇది సహాయపడుతోంది. దీంతో రష్యా సైనిక సరఫరా, లాజిస్టిక్స్పై ఉక్రెయిన్ ఒత్తిడి పెంచగలిగింది.అయితే.. మస్క్ పాత్ర ఉక్రెయిన్కు ప్రయోజనంతో పాటు కొన్ని సమస్యలను కూడా తీసుకొచ్చింది. ప్రస్తుతం ఉక్రెయిన్ తన భూభాగంలో స్టార్లింక్ను ఉపయోగించగలుగుతున్నప్పటికీ, రష్యా భూభాగంలో దాని వినియోగంపై పరిమితులు ఉన్నాయి. రష్యాపై దూరప్రాంత డ్రోన్ దాడులకు కూడా స్టార్లింక్ ఉపయోగించుకునే అవకాశం ఇవ్వాలని జెలెన్స్కీ కోరుతున్నారు. కానీ.. మస్క్ మాత్రం అలా చేయడం యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. అంతేకాకుండా.. రష్యా దళాలు అనధికారికంగా ఉపయోగిస్తున్న కొన్ని స్టార్లింక్ టెర్మినల్స్ను బ్లాక్ చేయడానికి స్పేస్ఎక్స్ చర్యలు తీసుకుంది. -
బంగారం ధరలకు బ్రేక్.. ఒక్కరోజులో భారీ పతనం!
బుధవారం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి తగ్గాయి. పసిడి ధరలు భారీగా పెరిగి మే 14 తర్వాత అత్యధిక స్థాయికి చేరుకున్నప్పటికీ, బుధవారం మాత్రం ధరల తగ్గుదల నమోదైంది. దీనికి తోడు అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, వడ్డీ రేట్లపై అంచనాలు, డాలర్ బలపడటం వంటి అంశాలు కూడా బంగారం ధరపై ప్రభావం చూపాయి.అమెరికా ద్రవ్యోల్బణంఅమెరికాలో ద్రవ్యోల్బణ పరిస్థితిని అంచనా వేయడానికి ఫెడరల్ రిజర్వ్ ఉపయోగించే ముఖ్యమైన సూచికల్లో పీసీఈ ప్రైస్ ఇండెక్స్ ఒకటి. జూలై వరకు 12 నెలల్లో పీసీఈ ద్రవ్యోల్బణం 3.7 శాతంగా నమోదైంది. అయితే.. మార్కెట్ నిపుణులు దీనిని 3.6 శాతంగా అంచనా వేశారు. అంటే.. ద్రవ్యోల్బణం అంచనాల కంటే కొద్దిగా ఎక్కువగా నమోదైంది. దీంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వచ్చే నెలలో వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాలు కొంత బలపడ్డాయి.వడ్డీ రేట్లు పెరిగితేబంగారం ఎలాంటి వడ్డీ ఆదాయం ఇవ్వదు. అందువల్ల వడ్డీ రేట్లు పెరిగినప్పుడు పెట్టుబడిదారులు బంగారం కంటే వడ్డీ వచ్చే బాండ్లు, ఇతర ఆర్థిక సాధనాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఇదే కారణంగా అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు అవకాశాలు పెరిగినప్పుడు బంగారం ధర తగ్గుతుంది. అయితే వచ్చే నెలలో రేట్లు పెరిగే అవకాశం 38 శాతంగా ఉంటుందని మార్కెట్ అంచనా వేస్తోంది.డాలర్ బలపడటంబంగారం అంతర్జాతీయంగా అమెరికన్ డాలర్లలోనే ధర నిర్ణయించబడుతుంది. బుధవారం డాలర్ విలువ 0.3 శాతం పెరిగింది. డాలర్ బలపడితే ఇతర దేశాల కరెన్సీలు ఉపయోగించే వారికి బంగారం ఖరీదుగా మారుతుంది. దీంతో బంగారం కొనుగోళ్లపై కొంత ప్రభావం పడుతుంది. అందుకే డాలర్ పెరుగుదల కూడా బంగారం ధర తగ్గడానికి ఒక కారణం అని తెలుస్తోంది.బంగారం ధర ఎంత తగ్గింది?బుధవారం స్పాట్ గోల్డ్ ధర 1.3 శాతం తగ్గి ఔన్సుకు 4,594.84 డాలర్లకు చేరింది. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ కూడా 0.9 శాతం తగ్గి 4,650.90 డాలర్లకు చేరాయి. అయితే దీనిని చూసి బంగారం భారీగా పతనమవుతోందని భావించాల్సిన అవసరం లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా ధరలు బాగా పెరగడంతో పెట్టుబడిదారులు తమ లాభాలను కొంతవరకు తీసుకోవడం కూడా ఈ తగ్గుదలకు కారణం.మళ్లీ 5,000 డాలర్లకు బంగారంధరలు ప్రస్తుతం తగ్గినప్పటికీ, బంగారం దీర్ఘకాలికంగా మళ్లీ పెరిగే అవకాశం ఉందని కొందరు నిపుణులు భావిస్తున్నారు.పీటర్ గ్రాంట్ ప్రకారం.. ప్రస్తుత తగ్గుదల ఒక తాత్కాలిక స్థిరీకరణ మాత్రమే కావచ్చు. బంగారం మళ్లీ 5,000 డాలర్ల స్థాయిని దాటే అవకాశం ఈ ఏడాదిలోనే ఉంది అని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే 2027 రెండో త్రైమాసికం నాటికి బంగారం కొత్త రికార్డు గరిష్ఠాలను నమోదు చేసే అవకాశం కూడా ఉందని ఆయన చెప్పారు.ప్రపంచ రాజకీయ పరిస్థితుల ప్రభావంబంగారం ధరను కేవలం అమెరికా వడ్డీ రేట్లు మాత్రమే నిర్ణయించవు. ప్రపంచంలో జరిగే రాజకీయ పరిణామాలు కూడా ప్రభావం చూపుతాయి. ఇరాన్, ఒమన్ మధ్య 'హర్ముజ్'కు సంబంధించిన ఆదాయ పంపకంపై ఒప్పందం కుదిరినప్పటికీ, అమెరికా తమ షరతులను అంగీకరించకపోతే ఈ కీలక సముద్ర మార్గాన్ని తిరిగి తెరవబోమని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ పేర్కొన్నాయి.ఇలాంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగినప్పుడు ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి పెరుగుతుంది. అప్పుడు పెట్టుబడిదారులు సాధారణంగా బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా చూస్తారు. కాబట్టి ఇలాంటి పరిణామాలు భవిష్యత్తులో బంగారం ధరకు మద్దతు ఇవ్వవచ్చు.ఇతర లోహాల పరిస్థితివెండి: 1.1 శాతం తగ్గి 67.91 డాలర్లకు చేరిందిప్లాటినం: 1.2 శాతం తగ్గి 1,837.78 డాలర్లకు చేరిందిపల్లాడియం: 0.1 శాతం తగ్గి 1,325.10 డాలర్లకు చేరింది -
మెటాకు రూ. 1.43 లక్షల కోట్ల భారీ జరిమానా!
వాషింగ్టన్: ఇన్స్టాగ్రామ్, మెటా(ఫేస్బుక్)వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లతో పిల్లలను వ్యసనపరులుగా మారుస్తున్నారనే తీవ్ర ఆరోపణలపై టెక్ దిగ్గజం మెటాకు భారీ షాక్ తగిలింది. ఈ వివాదానికి తెరదించేందుకు ఏకంగా 17 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1,43,000 కోట్లు) సెటిల్మెంట్ కింద చెల్లించేందుకు ఆ సంస్థ అంగీకరించింది. బిగ్ టెక్ చరిత్రలోనే ఇది అత్యంత భారీ జరిమానాల్లో ఒకటిగా నిలిచింది.ఎండ్లెస్ స్క్రోలింగ్, బ్యూటీ ఫిల్టర్లు, లైక్ల కౌంట్ వంటి వ్యసనపూరిత ఫీచర్లను మెటా ఉద్దేశపూర్వకంగా డిజైన్ చేసిందని వ్యాజ్యంలో పేర్కొన్నారు. దీనివల్ల పిల్లలు, టీనేజర్లలో ఆందోళన, డిప్రెషన్, నిద్రలేమి వంటి తీవ్రమైన మానసిక సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు హెచ్చరించారు. ఈ ముప్పును మెటా సంస్థ గోప్యంగా ఉంచి, ప్రజలను తప్పుదోవ పట్టించిందని ఆరోపణలు గుప్పించారు.అమెరికాలోని 47 రాష్ట్రాలు, వాషింగ్టన్ డీసీ, ప్యూర్టో రికో, అమెరికన్ సమోవా, నార్తర్న్ మరియానా ఐలాండ్స్ అటార్నీ జనరల్స్, ప్రభుత్వాలు సంయుక్తంగా మెటాపై ఈ సంచలన వ్యాజ్యాలు దాఖలు చేశాయి. ఈ చారిత్రక కేసు విచారణ, సెటిల్మెంట్ ఆమోద ప్రక్రియ యూనైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఫర్ ది నార్తర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియా కోర్టులో ముగిశాయి.వర్జీనియా అటార్నీ జనరల్ జే జోన్స్ ఈ కేసులో వర్జీనియా తరఫున కీలక పాత్ర పోషించారు. అటార్నీ జనరల్ జోన్స్ ప్రకటన ప్రకారం.. మెటా ప్లాట్ఫామ్స్ సుమారు రూ.1,43,000 కోట్లు చెల్లించేందుకు అంగీకరించింది. ఇందులో వర్జీనియా రాష్ట్రానికి గ్యారంటీగా 353 మిలియన్ డాలర్లు అందనున్నాయి. 1990ల నాటి బిగ్ టొబాకో సెటిల్మెంట్ల తర్వాత రాష్ట్ర స్థాయి వినియోగదారుల పరిరక్షణ చరిత్రలో ఇదే అతిపెద్ద సెటిల్మెంట్లలో ఒకటి. ఈ చెల్లింపుతో పాటు, ఇన్స్టాగ్రామ్, మెటాలలో పిల్లలను రక్షించేందుకు వీలుగా మెటా కొన్ని కఠినమైన భద్రతా ఫీచర్లను అమలు చేయాల్సి ఉంటుంది.వర్జీనియా అటార్నీ జనరల్ కార్యాలయానికి చెందాల్సిన 353 మిలియన్ డాలర్లతో పాటు, 2016 ఎన్నికల సమయంలో కేంబ్రిడ్జ్ అనలిటికా వంటి థర్డ్ పార్టీలకు మెటా యూజర్ల సమాచారాన్ని షేర్ చేసినందుకు అదనంగా 11 మిలియన్ డాలర్లు వర్జీనియాకు అందనున్నాయి.ఇన్స్టాగ్రామ్, మెటాలలో కలిపి రోజుకు గరిష్టంగా రెండు గంటల సమయ పరిమితి ఉంటుంది. ఎండ్లెస్ స్క్రోలింగ్కు అడ్డుకట్ట వేసేందుకు నిరంతరం 15 నిమిషాలు వాడిన తర్వాత, అలాగే 60, 90 నిమిషాల వద్ద తప్పనిసరి పాజులు వస్తాయి. రాత్రి 12:00 గంటల నుంచి ఉదయం 6:00 గంటల వరకు రాత్రివేళ బ్లాకింగ్ ఉంటుంది.పాఠశాల విద్యార్థులకు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 8:00 గంటల నుంచి మధ్యాహ్నం 3:00 గంటల వరకు పుష్ నోటిఫికేషన్లు ఉండవు. యువ వినియోగదారుల వయస్సును మరింత కచ్చితంగా ధృవీకరించే పద్ధతులు, వేధింపులు, ఈటింగ్ డిజార్డర్స్, ఆత్మహత్య, స్వీయ-హానిని ప్రోత్సహించే కంటెంట్పై బలమైన రక్షణలు, మరింత పటిష్టమైన, తల్లిదండ్రులు సులభంగా ఉపయోగించుకునే నియంత్రణ టూల్స్ అందుబాటులోకి వస్తాయి.పిల్లలు, టీనేజర్లలో మానసిక ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే బ్యూటీ ఫిల్టర్లు, కనిపించే లైక్స్ కౌంట్పై పరిమితులు ఉంటాయి. ఈ ఫీచర్ల అమలు, పనితీరును ఒక స్వతంత్ర ఆడిటర్ క్రమం తప్పకుండా పరిశీలిస్తారు.2021 నుంచి దేశంలోని దాదాపు అటార్నీ జనరల్లందరూ ఏకమై, హానికరమని తెలిసినప్పటికీ పిల్లలు, టీనేజర్ల కోసం సోషల్ మీడియాను డిజైన్ చేస్తున్న తీరుపై దర్యాప్తు చేపట్టారు. ఈ చారిత్రక ఒప్పందంలో అలబామా, అలాస్కా, కాలిఫోర్నియా, న్యూయార్క్, టెక్సస్తో సహా అనేక రాష్ట్రాలు భాగస్వామ్యమయ్యాయి. -
అమెరికా టారిఫ్లపై ఆర్బీఐ క్లారిటీ!
దేశీయంగా డిమాండు, పుంజుకున్న పారిశ్రామిక కార్యకలాపాల దన్నుతో గ్లోబల్ సవాళ్లను భారత ఎకానమీ మెరుగ్గా ఎదుర్కొనగలిగిందని రిజర్వ్ బ్యాంక్ తాజా ఆగస్టు బులెటిన్లో వెల్లడించింది. అంతర్జాతీయంగా ప్రతికూల పవనాలు వీస్తున్నప్పటికీ దేశ పరిస్థితి ఆశావహంగానే కనిపిస్తోందని పేర్కొంది. చైనా, ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే అమెరికా మనపై మరో 10 శాతం టారిఫ్లు అధికంగా విధించినప్పటికీ ఆ ప్రభావం పెద్దగా ఉండబోదని వివరించింది.అగ్రరాజ్యానికి అత్యధికంగా ఎగుమతి చేసే స్మార్ట్ఫోన్లు, పెట్రోలియం ఉత్పత్తులు, ఫార్మా మొదలైన వాటికి ఇవి వర్తించవని ఆర్బీఐ తెలిపింది. ఈ ఏడాది మే నెలతో పోలిస్తే జూన్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) రాక గణనీయంగా పెరిగిందని పేర్కొంది. ఈక్విటీల్లోకి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో సింగపూర్, నెదర్లాండ్స్, అమెరికా, కెనడా వాటా 74 శాతంగా ఉన్నట్లు వివరించింది.ఇదీ చదవండి: పసిడి, వెండి ధరల హొయలు.. నేటి ధరలు ఇలా.. -
మార్కెట్ భద్రత కోసం సెబీ బిగ్ స్టెప్!
సెక్యూరిటీల మార్కెట్లో సైబర్ భద్రతను మరింత బలోపేతం చేసేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సోమవారం ‘సైబర్ సురక్ష పోర్టల్’ను ప్రారంభించింది. సైబర్ భద్రతకు సంబంధించిన సర్క్యులర్లు, వ్యవస్థల్లోని భద్రతా లోపాలపై హెచ్చరికలు, సైబర్ ఘటనలకు సంబంధించిన విశ్లేషణలను ఒకేచోట అందించే వన్–స్టాప్ హబ్గా ఇది పనిచేస్తుందని సెబీ తెలిపింది.‘‘సెక్యూరిటీల మార్కెట్లో సైబర్ భద్రతకు సంబంధించిన కీలక పరిజ్ఞానాన్ని, సమాచారాన్ని పంచుకోవడానికి ఈ వేదిక సమగ్ర, కేంద్రీకృత కేంద్రంగా ఉపయోగపడుతుంది’’ అని ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ పోర్టల్ ద్వారా మార్కెట్ భాగస్వాములు తాజా సైబర్ భద్రతా సర్క్యులర్లు, భద్రతా లోపాలపై హెచ్చరికలు, సైబర్ ఘటనలకు సంబంధించిన వివరాలను నేరుగా పొందవచ్చని సెబీ తెలిపింది.ఇదీ చదవండి: పసిడి, వెండి ధరల హొయలు.. నేటి ధరలు ఇలా.. -
హైదరాబాద్కు ‘ఎన్విడియా’ పవర్
ఏఎం గ్రూప్లో భాగమైన ఏఎం ఇంటెలిజెన్స్ (ఏఎంఐ) తాజాగా ఎన్విడియా నుంచి 9,000 జీపీయూలను కొనుగోలు చేసేందుకు బైండింగ్ ఆర్డరు ఇచ్చినట్లు వెల్లడించింది. ఈ ‘వెరా రూబిన్ ఎన్వీఎల్72 ర్యాక్ స్కేల్ సిస్టం’లు 2027 తొలి త్రైమాసికంలో అందుబాటులోకి రాగలవని వివరించింది. విస్తృత ప్రణాళికల్లో భాగంగా తొలి దశలో హైదరాబాద్లో 30 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న ఏఐ ఫ్యాక్టరీలో వీటిని వినియోగించనున్నట్లు కంపెనీ వివరించింది.అంతర్జాతీయంగా ఏఐ కంప్యూట్ మౌలిక సదుపాయాల నిర్మాణంపై 8 బిలియన్ డాలర్లపైగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు పేర్కొంది. భారత్, అమెరికా, ఫిన్లాండ్, మలేషియాలో తలపెట్టిన 1 గిగావాట్ కంప్యూట్–యాజ్–ఎ–సర్వీస్ ప్లాట్ఫాం ప్రణాళికల కింద మొదటి విడతలో హైదరాబాద్ ప్రాజెక్టు ఉంటుందని సంస్థ తెలిపింది. సమీప భవిష్యత్తులో ప్రాథమికంగా 200 మెగావాట్ల ఏఐ కంప్యూట్ సామర్థ్యాన్ని అందుబాటులోకి తేనున్నట్లు ఏఎంఐ చైర్మన్ అనిల్ చలమలశెట్టి వివరించారు. భారత్, అమెరికా, యూరప్లో 5 గిగావాట్ల ఏఐ డేటాసెంటర్లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.ఇదీ చదవండి: పసిడి, వెండి ధరల హొయలు.. నేటి ధరలు ఇలా.. -
మీ తోబుట్టువుకు ఉపయోగపడే క్రేజీ గిఫ్ట్స్ ఇవే!
అనురాగానికి ఆప్యాయత తోడై అన్నాతమ్ముళ్లు-అక్కాచెల్లెళ్ల అనుబంధాన్ని పండగలా జరుపుకునే వేడుక రాఖీ పౌర్ణమి. కాలం మారింది. దాంతోపాటు బంధాల వ్యక్తీకరణ తీరూ మారింది. ఒకప్పుడు రాఖీ కట్టి తీపి తినిపిస్తే సరిపోయేది. ఆ తర్వాత ఫోటో ఫ్రేమ్లు, గ్రీటింగ్ కార్డ్ల కాలం వచ్చింది. కానీ నేటి డిజిటల్ యుగంలో తోబుట్టువుకు ఇచ్చే బహుమతి కేవలం ఒక వస్తువుగా మిగిలిపోకూడదు. అది వారి భవిష్యత్తుకు ఉపయోగపడేలా, వారి జీవితంలో భాగమయ్యేలా ఉండాలన్నది నేటి యూత్ ఆలోచన. ఈ పండుగ మరింత గుర్తుండిపోయేలా ఉండేలా కొన్ని వినూత్న, ఉపయోగకరమైన గిఫ్టింగ్ ఐడియాలు చూద్దాం.ఆర్థిక భద్రతనిచ్చే బహుమతులుతీపి పదార్థాలు ఇచ్చే సంతోషం తాత్కాలికమే, కానీ ఆర్థిక భద్రత ఇచ్చే ధీమా శాశ్వతం.చెల్లెలి లేదా తమ్ముడి పేరిట ప్రతి నెలా చిన్న మొత్తంలో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టే ఎస్ఐపీని ప్రారంభించవచ్చు.సాంప్రదాయ బంగారానికి ప్రత్యామ్నాయంగా డిజిటల్ గోల్డ్ లేదా గోల్డ్ బాండ్స్ ఇవ్వడం వల్ల భవిష్యత్తులో మంచి రిటర్న్స్ వస్తాయి.మీ సోదరి, సోదరుడి పేరిట ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం చెల్లించడం ద్వారా వారికి ఆరోగ్య భద్రతను బహుమతిగా ఇవ్వవచ్చు.స్మార్ట్ అండ్ గాడ్జెట్ వేవ్సాంకేతికతతో ముడిపడిన జీవితంలో రోజువారీ పనులను సులభతరం చేసే స్మార్ట్ బహుమతులకు ప్రాధాన్యం పెరుగుతోంది.ఆరోగ్యాన్ని ట్రాక్ చేసే స్మార్ట్వాచ్లు నేటి తరానికి ఎంతగానో ఉపయోగపడతాయి.పుస్తకపఠనంపై ఆసక్తి ఉన్నవారికి ఈ-బుక్ సబ్స్క్రిప్షన్లు అందించడం అద్భుతమైన ఎంపిక.ఆఫీస్ పనులు, ప్రయాణాలు లేదా ఆన్లైన్ క్లాసులకు నాయిస్ క్యాన్సిలేషన్ ఇయర్ఫోన్స్ / ఇయర్బడ్స్ ఎంతో సహాయపడతాయి.అనుభూతులను పంచే గిఫ్ట్స్నిరంతరం పనులతో అలసిపోయే అక్క లేదా చెల్లెలికి ఒక చిన్న సోలో ట్రిప్ లేదా వెకేషన్ ప్యాకేజీ గిఫ్ట్గా ఇవ్వడం.వారికి ఇష్టమైన ఫోటోగ్రఫీ, కోడింగ్, ఫారిన్ లాంగ్వేజ్ లేదా మ్యూజిక్ కోర్సులకు సంబంధించి ఆన్లైన్ సబ్స్క్రిప్షన్ ఇవ్వొచ్చు.అనుబంధానికి వెలకట్టలేం. కానీ, ఇచ్చే బహుమతిలో వారి పట్ల మనకున్న శ్రద్ధ, వారి భవిష్యత్తు పట్ల మనకున్న బాధ్యత ప్రతిబింబించాలి. ఈ రాఖీ పౌర్ణమికి కేవలం ఒక బహుమతినే కాదు.. వారి ఎదుగుదలకు తోడ్పడే నమ్మకాన్ని కానుకగా ఇద్దాం.ఇదీ చదవండి: పసిడి, వెండి ధరల హొయలు.. నేటి ధరలు ఇలా.. -
భార్యను కాదని పిల్లలకు పెన్షన్ రాసేయొచ్చా?
సహధర్మచారిణిగా భార్యకు జీవితంలోనూ, ఆర్థిక భద్రతలోనూ ప్రాథమిక హక్కు ఉంటుందనేది జగమెరిగిన సత్యం. మరి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న భర్త, తన భార్యను పూర్తిగా మినహాయించి (Exclude) కేవలం పిల్లలకే ఫ్యామిలీ పెన్షన్ దక్కేలా నామినేషన్ చేయవచ్చా? కుటుంబంలో మనస్పర్థలు, కలహాలు వచ్చినా చట్టపరంగా భార్యకు దక్కాల్సిన హక్కును భర్త ఏకపక్షంగా కాలరాయవచ్చా? అంటే, కేంద్ర సీసీఎస్ (పెన్షన్) నిబంధనలు ఏం చెబుతున్నాయో కింద చూద్దాం.మొదటి ప్రాధాన్యత ఎవరికంటే..కేంద్ర సివిల్ సర్వీసెస్ (పెన్షన్) నిబంధనలు, 2021 (సీసీఎస్ పెన్షన్ రూల్స్)లోని రూల్ 50 ప్రకారం.. ఒక ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ మరణిస్తే ఆయన పొందే ఫ్యామిలీ పెన్షన్పై పూర్తి హక్కు చట్టబద్ధమైన భార్యకే ఉంటుంది. భర్త తన సర్వీస్ రికార్డుల్లో లేదా నామినేషన్ ఫారమ్లో భార్య పేరు కాదని పిల్లల పేర్లు రాసినప్పటికీ సాంకేతికంగా అది చెల్లదు. భర్త తన ఇష్టారాజ్యంగా నామినేషన్ మార్చడానికి వీల్లేదు. పెన్షన్ డిస్బర్సింగ్ అథారిటీ చట్టబద్ధ నిబంధనల ప్రకారమే నడుచుకుంటుంది. భార్య మరణించినా లేదా చట్టబద్ధంగా విడాకులు పూర్తయినా లేక ఆమె పెన్షన్కు అనర్హురాలైనా రెండో ప్రాధాన్యతగా 25 ఏళ్లలోపు ఉన్న పిల్లలకు (లేదా దివ్యాంగులైన సంతానానికి) ఆ ఫ్యామిలీ పెన్షన్ అందుతుంది.మహిళా ఉద్యోగులకే ఆ ప్రత్యేక మినహాయింపు!ఇక్కడ ఒక ముఖ్యమైన చట్టపరమైన సవరణను గమనించాలి. 2024 ప్రారంభంలో కేంద్ర పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ నిబంధనల్లో ఒక మార్పు తెచ్చింది. దాంపత్య వివాదాలు, విడాకుల పిటిషన్లు లేదా గృహహింస చట్టం కింద కేసులు నడుస్తున్న సందర్భాల్లో.. మహిళా ఉద్యోగులు తమ భర్తను మినహాయించి, తమ పిల్లలకు ఫ్యామిలీ పెన్షన్ వెళ్లేలా ముందస్తుగా అభ్యర్థించే వెసులుబాటు కల్పించారు. అయితే ఈ మినహాయింపు కేవలం మహిళా ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. పురుష ఉద్యోగులకు తమ భార్యను నామినేషన్ నుంచి తొలగించే హక్కును చట్టం ఎక్కడా ఇవ్వలేదు.అవగాహన లేకపోతే తీవ్ర నష్టం!చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు పరిస్థితి చేయిదాటాక బాధపడేకంటే పెన్షన్ నిబంధనలపై స్పష్టత కలిగి ఉండటం శ్రేయస్కరం. భార్యాభర్తల మధ్య ఎన్ని అభిప్రాయభేదాలు ఉన్నప్పటికీ చట్టబద్ధమైన విడాకుల డిక్రీ కోర్టు నుంచి పొందే వరకు భార్య పెన్షన్ హక్కుదారుగానే ఉంటుంది. కాబట్టి నామినేషన్ల విషయంలో సొంత నిర్ణయాలు చెల్లవని న్యాయ నిపుణులు తేల్చిచెబుతున్నారు.ఇదీ చదవండి: పసిడి, వెండి ధరల హొయలు.. నేటి ధరలు ఇలా.. -
ప్రపంచస్థాయి కంపెనీలను ఏలుతున్న ఇండియన్స్
సిలికాన్ వ్యాలీ నుంచి వాల్స్ట్రీట్ వరకు ప్రపంచ వాణిజ్య యవనికపై భారత్, భారత సంతతికి చెందిన నాయకులు తమ ఆధిపత్యాన్ని చాటుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, బిలియన్ డాలర్ల విలువైన బహుళ జాతి సంస్థలకు నాయకత్వం వహిస్తూ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను దిశానిర్దేశం చేస్తున్నారు.సాంకేతిక రంగంలో గూగుల్ (అల్ఫాబెట్) అధిపతి సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ల, ఐబీఎమ్ చీఫ్ అరవింద్ కృష్ణ, యూట్యూబ్ చీఫ్ నీల్ మోహన్, అడోబ్ నాయకుడు శంతను నారాయణ్ గ్లోబల్ టెక్ వ్యూహాలను శాసిస్తున్నారు. సైబర్ భద్రత, క్లౌడ్, నెట్వర్కింగ్ రంగాల్లో నికేష్ అరోరా (పాలో ఆల్టో), జయశ్రీ ఉల్లాల్ (అరిస్టా), జార్జ్ కురియన్ (నెట్యాప్) ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇక భారతీయ ఐటీ రంగానికి ఐకాన్గా నిలిచిన ఇన్ఫోసిస్ సీఈఓగా సలీల్ పరేఖ్, కాగ్నిజెంట్ సారథిగా రవికుమార్ ఎస్ ఐటీ సేవల విప్లవాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.భారతీయ, భారత సంతతికి చెందిన ప్రముఖ కంపెనీలు, సీఈఓల వివరాలుAlphabet (Google): సుందర్ పిచాయ్Microsoft: సత్య నాదెళ్లYouTube: నీల్ మోహన్Adobe: శంతను నారాయణ్Procter & Gamble (P&G): శైలేష్ జెజూరీకర్T-Mobile US: శ్రీని గోపాలన్World Bank Group: అజయ్ బంగా (ప్రెసిడెంట్ & సీఈఓ)IBM: అరవింద్ కృష్ణInfosys: సలీల్ పరేఖ్NetApp: జార్జ్ కురియన్Palo Alto Networks: నికేష్ అరోరాArista Networks: జయశ్రీ ఉల్లాల్Novartis: వసంత్ నరసింహన్Micron Technology: సంజయ్ మెహ్రోత్రాHoneywell: విమల్ కపూర్Flex: రేవతి అద్వైతిWayfair: నీరజ్ షాChanel: లీనా నాయర్Cognizant: రవికుమార్ ఎస్Vertex Pharmaceuticals: రేష్మా కేవల్రమణిMolson Coors Beverage Company: రాహుల్ గోయల్ఇదీ చదవండి: పసిడి, వెండి ధరల హొయలు.. నేటి ధరలు ఇలా.. -
పీపీఎఫ్ కాంపౌండింగ్ మ్యాజిక్ తెలుసా?
‘గింజ నాటిన వెంటనే నీడ రాదు.. విత్తనం మొలకెత్తి వృక్షం కావడానికి కాలం పడుతుంది’ ఆర్థిక ప్రణాళికలోనూ ఇది అక్షర సత్యం. ఆనంద్ అనే ఒక సగటు తండ్రి తన కుమార్తె పుట్టిన 11వ రోజే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఖాతా తెరిచాడు. పెట్టుబడుల్లో నిపుణుడు కాకపోయినా చిన్నతనంలోనే పొదుపు చేయాలని భావించాడు. మూడేళ్ల తర్వాత తన ఖాతా స్టేట్మెంట్ చూసుకున్నప్పుడు కాంపౌండింగ్ (చక్రవడ్డీ) శక్తేంటో ఆయనకు స్పష్టంగా అర్థమైంది.మైనర్ పీపీఎఫ్ ఖాతా.. నియమాలుపిల్లల ఉన్నత చదువులు, భవిష్యత్ అవసరాల కోసం పీపీఎఫ్ ఒక నమ్మకమైన నిధి. 1968లో ప్రారంభమైన ఈ ప్రభుత్వ మద్దతు గల పథకం భారతీయ కుటుంబాలకు (కేంద్ర ప్రభుత్వ హామీ) భద్రతను ఇస్తుంది.ఖాతా నిర్వహణ: 18 ఏళ్ల లోపు ఉన్న మైనర్ బిడ్డ పేరిట తల్లి లేదా తండ్రి (ఒకరు మాత్రమే గార్డియన్గా) ఖాతా తెరవవచ్చు. తపాలా కార్యాలయం లేదా గుర్తింపు పొందిన బ్యాంకుల ద్వారా దీనిని ప్రారంభించవచ్చు.డిపాజిట్ పరిమితులు: ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్ఠంగా రూ.500 నుంచి గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు జమ చేయవచ్చు. ఇక్కడ గమనించాల్సిన కీలకమైన అంశం ఏమిటంటే.. తల్లిదండ్రుల సొంత పీపీఎఫ్, మైనర్ పిల్లల ఖాతా రెండూ కలిపి గరిష్ఠ వార్షిక పరిమితి రూ.1.5 లక్షలు మించకూడదు.కాలపరిమితి.. ఉపసంహరణలు: ఈ పథకం లాక్-ఇన్ పీరియడ్ 15 సంవత్సరాలు. ఖాతా తెరిచిన 3వ సంవత్సరం నుంచి 6వ సంవత్సరం వరకు రుణం పొందే సౌకర్యం ఉంది. 7వ సంవత్సరం నుంచి పాక్షిక విత్డ్రావల్స్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. మెచ్యూరిటీ తర్వాత ప్రతి 5 ఏళ్ల బ్లాక్ చొప్పున గడువును పొడిగించుకోవచ్చు.ప్రస్తుత వడ్డీ రేటువడ్డీని ప్రతి నెలా 5వ తేదీ నుంచి నెలాఖరు వరకు ఉన్న అతి తక్కువ నిల్వ (లోయెస్ట్ బ్యాలెన్స్) ఆధారంగా లెక్కిస్తారు. అయితే, ఈ వడ్డీ మార్చి 31న వార్షికంగా ఖాతాలో జమ అవుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతి మూడు నెలలకొకసారి (త్రైమాసిక ప్రాతిపదికన) పీపీఎఫ్ వడ్డీ రేట్లను సమీక్షించి ప్రకటిస్తుంది. ప్రస్తుతం ఏటా 7.1 శాతం వడ్డీ ఉంది.పన్ను మినహాయింపుపీపీఎఫ్ పథకానికి ఆదాయపు పన్ను చట్టం కింద ఈఈఈ (Exempt-Exempt-Exempt) హోదా ఉంది. సెక్షన్ 80సీ కింద డిపాజిట్లకు పన్ను మినహాయింపు దక్కడంతో పాటు వడ్డీ, మెచ్యూరిటీ మొత్తం పూర్తి పన్ను రహితం. షేర్ మార్కెట్ ఒడుదొడుకులకు దూరంగా సురక్షితమైన ఆర్థిక ప్రయాణాన్ని కోరుకునే వారికి పీపీఎఫ్ మంచి అవకాశమని నిపుణులు చెబుతున్నారు. పిల్లలు పెద్దయ్యే సరికి వారి ఉన్నత విద్యకు ఆర్థికంగా డోకా లేకుండా చేయడానికి పీపీఎఫ్ ఒక మెరుగైన సాధనం.ఇదీ చదవండి: పసిడి, వెండి ధరల హొయలు.. నేటి ధరలు ఇలా.. -
సిరిసంపదలు కొందరికేనా? పేదరికం పోవాలంటే..
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం నేడు ఒక విచిత్రమైన, తీవ్రమైన ఆర్థిక వైరుధ్యాన్ని ఎదుర్కొంటోంది. ఫోర్బ్స్ 2026 నివేదిక ప్రకారం అమెరికా (989), చైనా (539) తర్వాత 229 మంది బిలియనీర్లతో(సుమారు రూ.8,300 కోట్లకు పైగా ఆస్తి కలిగినవారిని బిలియనీర్లు అంటారు) భారత్ ప్రపంచంలోనే అత్యధిక కుబేరులున్న మూడో దేశంగా నిలిచింది. కానీ, నాణేనికి మరోవైపు చూస్తే.. పేదరికం, నిరుద్యోగం, ఆకలిచావులు, ఆరోగ్య సమస్యలు.. పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు కుబేరుల సంపద ఆకాశాన్నంటుతుంటే మరోవైపు సామాన్యుడి బతుకు తాటాకు చప్పుడు-తమలపాకు భోజనం అన్న చందంగా మారుతోంది.ఆర్థిక అసమానతల కఠిన వాస్తవాలువరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ 2026 ప్రకారం, భారతదేశ సంపదలో 40 శాతం పైగా కేవలం అత్యంత ధనవంతులైన 1 శాతం మంది చేతుల్లోనే కేంద్రీకృతమై ఉంది. అదే సమయంలో దిగువన ఉన్న 50 శాతం జనాభా కేవలం 15 శాతం ఆదాయంతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. దేశ జీడీపీ గణాంకాలు పెరుగుతున్నప్పటికీ యువతకు తగిన సంఖ్యలో నాణ్యమైన ఉద్యోగాలు లభించడం లేదు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్, ఆరోగ్య సూచీల్లో భారత్ ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే వెనుకబడి ఉంది.ఈ పరిస్థితులకు కారణాలు ఏమిటి?నిపుణుల అభిప్రాయం ప్రకారం.. భారత్లో ఈ అసమానతలు ఆర్థిక రంగాన్ని కుదేలు చేస్తున్నాయి. మన ఆర్థిక వ్యవస్థ మూలధన ఆధారిత శ్రమకు ఎక్కువ ప్రతిఫలాన్ని, మానవ శ్రమకు తక్కువ విలువను ఇస్తోంది. నాణ్యమైన విద్య, వైద్యం పేదలకు అందని ద్రాక్షగా మారడం వల్ల పేదరికం తరతరాలుగా కొనసాగుతోంది. సంపద పన్ను (వెల్త్ ట్యాక్స్) లేకపోవడం, పరోక్ష పన్నుల భారం సామాన్యులపై ఎక్కువగా పడటం ఆర్థిక అసమానతలను మరింత పెంచుతోంది.పరిష్కార మార్గాలు.. ఏం చేయాలి?సంపద సృష్టి కొందరు వ్యక్తులకు మాత్రమే పరిమితం కాకుండా ఉపాధి కల్పించే తయారీ రంగానికి పెద్దపీట వేయాలి. ప్రభుత్వ విద్య, వైద్య రంగాలకు జీడీపీలో కనీసం 6% నిధులు కేటాయించి నాణ్యమైన సేవలు అందించాలి. అత్యంత ధనవంతులపై సరైన పన్నులు విధించి ఆ నిధులతో సామాజిక భద్రతా పథకాలను మెరుగుపరచాలి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పి స్థానిక ఉపాధిని ప్రోత్సహించాలి.దేశం కేవలం బిలియనీర్ల సంఖ్యతో గొప్పది కాబోదు; సమాజంలో చిట్టచివరి నిరుపేద సాధించే ఆర్థిక ప్రగతిలోనే అసలైన ప్రగతి దాగి ఉంది. సిరి ఉంటే సరిపోదు.. అందరికీ పోషకాలతో కూడిన పట్టెడన్నం దొరికిననాడే అసలైన సమృద్ధి అనే సూత్రాన్ని గుర్తుంచుకోవాలి. ఈ విషయంలో పాలకులు స్పష్టమైన వ్యూహాత్మక మార్పు తీసుకురావాలి.ఇదీ చదవండి: పసిడి, వెండి ధరల హొయలు.. నేటి ధరలు ఇలా.. -
పసిడి, వెండి ధరల హొయలు.. నేటి ధరలు ఇలా..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
భారత్లో షుగర్ ఎక్కువ.. విదేశాల్లో తక్కువ ఎందుకు?
చెప్పేవి శ్రీరంగ నీతులు... చేసేవి దొంగ పనులు అన్నట్లుగా దిగ్గజ బహుళజాతి కంపెనీలు భారత వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. లండన్లో విక్రయించే ఒక ఫాంటా క్యాన్లో కేవలం 63 క్యాలరీలు, తక్కువ పంచదార ఉంటే అదే మనదేశంలో లభించే పానీయంలో మాత్రం ఏకంగా మూడు రెట్లు అధికంగా షుగర్ను దట్టించి విక్రయిస్తున్నారు. యూరోప్లో కృత్రిమ రంగుల (E110 Sunset Yellow) వాడకంపై సీసాల ముందు భాగంలోనే హెచ్చరిక బొమ్మలు తప్పనిసరి చేశారు. కాగా, మన దేశంలో మాత్రం ప్యాకెట్ వెనుక వైపు కంటికి కనిపించనంత చిన్న అక్షరాలతో సరిపెట్టడం గమనార్హం.ఈ లోపాన్ని ఆధారంగా చేసుకుని బహుళజాతి కంపెనీల వ్యవహారంపై ప్రజారోగ్య నిపుణులు స్పందిస్తూ బాటిళ్ల ముందు భాగంలోనే ఎరుపు, పచ్చ రంగుల నాణ్యతా ముద్రలు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు కాకుండా ముందే చర్యలు తీసుకోవాల్సిన 'ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా' (ఎఫ్ఎస్ఎస్ఏఐ), కార్పొరేట్ కంపెనీల ఒత్తిళ్లకు తలొగ్గి ఈ హెచ్చరికల ప్రతిపాదనను పక్కనబెట్టడం తీవ్ర ఆందోళనకరమని కొందరు నిపుణులు చెబుతున్నారు.ఎలాంటి రంగులు లేని సాధారణ పట్టికలతో వీటి గుర్తింపును సరిపెడతామని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొనడంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతం ఇటీవల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘భారత పౌరుల ఆరోగ్యం పట్ల దేశానికి శ్రద్ధ ఉందనే విషయం ప్రపంచానికి తెలియాలి’ అని వ్యాఖ్యానించింది. ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యం అన్న ప్రాథమిక సూత్రాన్ని విస్మరించి లాభార్జనే ధ్యేయంగా సాగుతున్న ఈ కార్పొరేట్ ధోరణులను అరికట్టకపోతే రాబోయే రోజుల్లో భారత్ తీవ్ర ఊబకాయం, మధుమేహ సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయమని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: మొదటిసారి ఇల్లు కొంటున్నారా? -
మిశ్రమంగా ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం మిశ్రమంగా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 10:24 సమయానికి నిఫ్టీ(Nifty) 28 పాయింట్లు తగ్గి 24,301 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 71 పాయింట్లు పుంజుకొని 77,719 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.99బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 86.5 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.64 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.32 శాతం పెరిగింది.నాస్డాక్ 0.66 శాతం పుంజుకుంది.Today Nifty position 26-08-2026(time: 10:24 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
1999 రిపీట్ అవుతుందా?.. మార్కెట్ క్రాష్ తప్పదా?
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించే చర్చ జరుగుతోంది. ఏఐ కంపెనీల్లో పెట్టుబడులు పెడితే భారీగా డబ్బు సంపాదించవచ్చని చాలామంది పెట్టుబడిదారులు నమ్ముతున్నారు. అయితే.. ఈ ఉత్సాహాన్ని చూసి రాబర్ట్ కియోసాకి 1999 నాటి పరిస్థితులను గుర్తు చేస్తున్నారు.అప్పట్లో ఇంటర్నెట్ కంపెనీలపై కూడా ఇలాగే భారీ అంచనాలు ఉండేవి. ఏఓఎల్, నెట్స్కేప్, పెట్స్ డాట్ కామ్ వంటి సంస్థలను భవిష్యత్తు కంపెనీలుగా భావించారు. కానీ.. కొంతకాలానికే డాట్కామ్ బబుల్ పేలడంతో అనేక కంపెనీల విలువలు కుప్పకూలాయి. పెట్టుబడిదారులు భారీగా నష్టపోయారు.జిమ్ రికార్డ్స్ ఏమంటున్నారు?ఆర్థిక విశ్లేషకుడు, రచయిత జిమ్ రికార్డ్స్ ప్రకారం.. ఏఐ రంగంలో భారీ స్థాయిలో పెట్టుబడులు, అధిక వాల్యుయేషన్లు ఏర్పడ్డాయని, ఇవి ఒక దశలో తీవ్రమైన దిద్దుబాటుకు దారితీయవచ్చని హెచ్చరించారు. ఏఐ రంగంలో సుమారు 1.4 ట్రిలియన్ డాలర్ల విలువకు ప్రమాదం ఉందని, పరిస్థితి తీవ్రంగా మారితే స్టాక్ మార్కెట్లో భారీ పతనం సంభవించే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.ఎన్విడియాపైనా జాగ్రత్త అంటున్నారా?ఏఐ రంగంలో ప్రస్తుతం ఎన్విడియా వంటి కంపెనీలు అత్యంత కీలకంగా మారాయి. ఏఐ మోడళ్లకు అవసరమైన చిప్లకు భారీ డిమాండ్ ఉండటంతో కంపెనీపై పెట్టుబడిదారుల ఆసక్తి కూడా పెరిగింది. అయితే.. జిమ్ రికార్డ్స్ మాత్రం ఇలాంటి అధిక అంచనాలున్న కంపెనీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. ఏఐ రంగంలో బబుల్ ఏర్పడితే కొన్ని ప్రముఖ కంపెనీల షేర్లు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని అన్నారు. అందుకే మార్కెట్ పడిపోయినా.. తట్టుకోగల పెట్టుబడులపై దృష్టి పెట్టాలని సూచిస్తోంది.1999తో పోలిక ఎందుకు?ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. ఏఐ నిజంగా ఉపయోగపడే టెక్నాలజీనా? అనే ప్రశ్న కాదు. అది ఇప్పటికే అనేక రంగాల్లో ఉపయోగపడుతోంది. కానీ ఆ టెక్నాలజీపై ఉన్న అంచనాలు, కంపెనీల షేర్ ధరలు వాటి వాస్తవ వ్యాపార ఫలితాల కంటే చాలా ముందుకు వెళ్లాయా? అన్నదే ప్రశ్న. 1999లో కూడా ఇంటర్నెట్ నిజమైన భవిష్యత్తే. కానీ ఆ పేరుతో వచ్చిన ప్రతి కంపెనీ విజయవంతం కాలేదు. చివరికి బబుల్ పేలినప్పుడు మంచి కంపెనీలు కూడా మార్కెట్ పతనానికి గురయ్యాయి. ఏఐ విషయంలోనూ ఇదే పరిస్థితి వస్తుందేమోనన్న భయమే ఇప్పుడు కొందరు నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.పెట్టుబడిదారులు ఏం చేయాలి?మార్కెట్ 80 శాతం పడిపోతుంది, 1.4 ట్రిలియన్ డాలర్లు ఆవిరవుతాయి వంటి అంచనాలను ఖచ్చితంగా జరగబోయే విషయాలుగా చూడాల్సిన అవసరం లేదు. ఇవి ఊహించి చేస్తున్న హెచ్చరికలు మాత్రమే. ఏఐ రంగం భవిష్యత్తులో మరింత పెద్దదయ్యే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రస్తుతం ఏ కంపెనీ షేరు ఎంత విలువకు ట్రేడవుతోంది, ఆ కంపెనీకి నిజంగా ఎంత ఆదాయం వస్తోంది, లాభాలు ఎలా ఉన్నాయి, అప్పులు ఎంత ఉన్నాయి వంటి విషయాలను పరిశీలించడం ముఖ్యం.ఇదీ చదవండి: చాణక్య నీతి: ఈ 5 విషయాల కోసం ఖర్చు చేస్తే.. ఆర్థిక కష్టాలు తప్పవు! -
చాణక్య నీతి: ఈ 5 విషయాల కోసం ఖర్చు చేస్తే.. ఆర్థిక కష్టాలు తప్పవు!
జీవితంలో డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో.. దాన్ని ఎలా ఖర్చు చేస్తున్నామన్నది కూడా అంతే ముఖ్యం. అవసరాలకు ఉపయోగించడం, కొంత మొత్తాన్ని పొదుపు చేయడం, భవిష్యత్ కోసం ముందుగానే ప్రణాళిక వేసుకోవడం ఆర్థికంగా చాలా అవసరం. అయితే.. చాలామంది ఇతరులు ఏమనుకుంటారో అనే ఆలోచనతో అవసరం లేని వాటిపై డబ్బు ఖర్చు చేస్తుంటారు. చాణక్య నీతి ప్రకారం.. ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసే అలవాట్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.ఆడంబరాలు కోసం ఖర్చు చేయొద్దుఖరీదైన ఫోన్లు, బట్టలు, వాహనాలు లేదా ఇతర వస్తువులు కొనుగోలు చేసి తమ స్థాయిని ఇతరులకు చూపించుకోవాలని కొందరు భావిస్తారు. కానీ కేవలం ప్రశంసల కోసం చేసే ఖర్చు నిజమైన సంపదకు గుర్తు కాదు. మన ఆర్థిక పరిస్థితికి మించి ఖర్చు చేస్తే పొదుపు తగ్గిపోవడంతో పాటు భవిష్యత్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఇతరులతో పోల్చుకోవడం కంటే.. మన అవసరాలు, ఆదాయానికి అనుగుణంగా ఖర్చు చేయడం మంచిది.పనికిరాని సంబంధాల కోసం ఖర్చు చేయొద్దుమన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మన మంచిని కోరుకుంటారని అనుకోవడం సరికాదు. మనకు గౌరవం ఇవ్వని, అవసరమైన సమయంలో అండగా నిలవని వ్యక్తులను మెప్పించేందుకు పదేపదే డబ్బు ఖర్చు చేయడం వల్ల మనకే నష్టం కలుగుతుంది. సంబంధాల్లో ప్రేమ, ఆప్యాయత ఎంత ముఖ్యమో.. పరస్పర గౌరవం, నమ్మకం కూడా అంతే ముఖ్యం. అందుకే ఎవరి కోసం ఎంత ఖర్చు చేయాలనే విషయంలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.‘లోకులు ఏమనుకుంటారు?’ అనే ఆలోచన వద్దుచాలామంది సమాజంలో తమ పరువు తగ్గకూడదనే ఉద్దేశంతో తమ స్థాయికి మించి ఖర్చు చేస్తుంటారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాలు, వేడుకల సమయంలో ఇతరులతో పోటీ పడుతూ అప్పులు చేసి మరీ భారీగా ఖర్చు చేయడం కనిపిస్తుంది. కానీ కొద్దిసేపటి ప్రశంసల కోసం భవిష్యత్ ఆర్థిక పరిస్థితిని ఇబ్బందుల్లోకి నెట్టుకోవడం తెలివైన నిర్ణయం కాదు. మన సామర్థ్యానికి తగ్గట్టుగా ఖర్చు చేయడమే నిజమైన ఆర్థిక క్రమశిక్షణ.తాత్కాలిక ప్రశంసల కోసం ఖర్చు చేయొద్దుఎక్కువ డబ్బు ఖర్చు చేస్తేనే గౌరవం, గుర్తింపు వస్తాయని భావించడం కూడా ఒక రకమైన అపోహే. మన వ్యక్తిత్వం, ప్రవర్తన, సామర్థ్యం వల్ల వచ్చే గౌరవం ఎక్కువకాలం ఉంటుంది. కానీ డబ్బు ఖర్చు చేసి పొందే ప్రశంసలు ఎక్కువగా తాత్కాలికమే. అందుకే ఇతరుల మెప్పు కోసం అనవసరంగా ఖర్చు చేయడం కంటే.. అదే డబ్బును పొదుపు చేయడం లేదా భవిష్యత్కు ఉపయోగపడే విధంగా పెట్టుబడి పెట్టడం మంచిది.డిస్కౌంట్ ఉందని కొనేయడం తప్పేఆఫర్ ఉంది, లేదా డిస్కౌంట్ ఉంది, అంటూ అవసరం లేని వస్తువులు కొనడం చాలామందికి అలవాటుగా మారింది. నిజానికి డిస్కౌంట్ రావడం అంటే డబ్బు ఆదా అయినట్లు కాదు. మనకు అవసరం లేని వస్తువుపై ఒక్క రూపాయి ఖర్చు చేసినా అది ఖర్చే. కాబట్టి ఏదైనా వస్తువు కొనేముందు అది నిజంగా అవసరమా? లేక ఆఫర్ చూసి మాత్రమే కొనాలనిపిస్తోందా? అనే ప్రశ్న వేసుకోవడం మంచిది.పొదుపు కూడా సంపదలో భాగమేఎక్కువ సంపాదించడం మాత్రమే ఆర్థిక విజయానికి గుర్తు కాదు. సంపాదించిన డబ్బులో కొంత పొదుపు చేయడం, అవసరమైన చోట మాత్రమే ఖర్చు చేయడం, భవిష్యత్ అవసరాల కోసం ముందుగానే ప్రణాళిక చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. చాణక్య నీతి చెప్పే ప్రధాన సందేశం కూడా ఇదే. ఇతరులు ఏమనుకుంటారనే దాని కంటే.. మన భవిష్యత్ ఎలా ఉండాలనే దానిపై దృష్టి పెట్టాలి. ఈరోజు నియంత్రించుకున్న అనవసర ఖర్చే రేపు మన ఆర్థిక భద్రతకు బలంగా మారుతుంది. -
బ్రాండ్ల కంటే ఫీచర్లకే ఓటు..!
న్యూఢిల్లీ: ల్యాప్టాప్లు కొనుగోలు చేసేవారిలో 87 శాతం మంది ప్రాసెసర్ పనితీరుకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ మంగళవారం విడుదల చేసిన ‘బెస్ట్ ఇన్ టెక్’ సర్వే వెల్లడించింది. ట్యాబ్లెట్ కొనేవారిలో 74 శాతం డిప్ప్లే నాణ్యతకు మొగ్గుచూపుతున్నారని తెలిపింది. సుమారు 40,000 మందికి పైగా వినియోగదారుల స్పందనల ఆధారంగా రూపొందించిన ఈ నివేదిక ప్రకారం.. కొనుగోలుదారులు బ్రాండ్ల కంటే స్పేసిఫికేషన్లు, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫీచర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు సర్వేలో తేలింది. సర్వేలోని ముఖ్యమైన ముఖ్యాంశాలు ⇒ కొనుగోలుదారులు ఏఐ ఫీచర్లపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. దాదాపు 58 శాతం మంది రాబోయే ఏఐ ఫీచర్లు తమ ఉత్పాదకతను పెంచడంలో ‘‘ఎంతో ఉపయోగపడతాయని’’ భావిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఆన్–డివైస్ ఏఐ అసిస్టెంట్లు (28%), ఏఐ–ప్రాసెసింగ్ చిప్లు (25%) మొదటి స్థానంలో నిలిచాయి. ⇒ బ్రాండ్ల కంటే స్పెసిఫికేషన్లకే ఓటు వేస్తున్నారు. 53 శాతం మంది వినియోగదారులు ఒకే ధరలో మెరుగైన స్పెసిఫికేషన్లు లభిస్తే వేరే బ్రాండ్కు మారడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. దీనిబట్టి బ్రాండ్ కంటే సాంకేతిక ఫీచర్లే కీలక పాత్ర పోషిస్తున్నాయని స్పష్టమవుతోంది. ⇒ ప్రతి నలుగురిలో ముగ్గురు ల్యాప్టాప్ కొనుగోలుదారులు రూ. 40,000 కంటే ఎక్కువ ధర ఉన్న డివైజ్లను పరిశీలిస్తున్నారు. వీరిలో 50 శాతం మంది రూ. 40,000 నుండి రూ. 80,000 బడ్జెట్ను, 26 శాతం మంది రూ. 80,000 కంటే ఎక్కువ ఉన్న ప్రీమియం కేటగిరీని ఎంచుకుంటున్నారు. ⇒ కొనుగోలు చేసేముందు ప్రాడెక్టుల గురించి సు«దీర్ఘమైన రీసెర్చ్ చేస్తున్నారు. పావువంతు (25%) మంది కొనుగోలుదారులు ల్యాప్టాప్ కొనే ముందు రెండు నెలలకు పైగా రీసెర్చ్ చేస్తున్నారు. 48 శాతం మంది కనీసం రెండు నుండి మూడు బ్రాండ్లను సరిపోల్చి చూసుకుంటున్నారు. ట్యాబ్ కొనుగోలుదారుల ప్రాధాన్యతలు ఇవి... ట్యాబ్ల విషయంలో 74 శాతం మందికి డిస్ప్లే సైజు, క్వాలిటీయే ప్రధాన అంశంగా మారింది. ధర (12%), ప్రాసెసర్ (9%) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. దాదాపు 59 శాతం మంది రూ. 20,000 నుండి రూ. 35,000 బడ్జెట్లో ట్యాబ్లను కొనుగోలు చేయాలని చూస్తున్నారు. వీటిని ప్రధానంగా ల్యాప్టాప్కు ప్రత్యామ్నాయంగా (29%), మీడియా కన్సప్షన్ (21%), తేలికగా తీసుకెళ్లే సదుపాయం (17%) కోసం ఎంచుకుంటున్నారు. ‘‘కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో ‘ల్యాప్టాప్లు’ అధిక ధర కలిగిన ఉత్పత్తులు కావడంతో కొనుగోలుదారులు ఎక్కువ రీసెర్చ్ చేస్తున్నారు. తమ అవసరాలు, వినియోగానికి అనుగుణంగా నిర్దిష్ట స్పెసిఫికేషన్లు, సామర్థ్యాలను కోరుకుంటారు. అంతేకాకుండా, ల్యాప్టాప్లను ఎక్కువ కాలం పాటు ఉపయోగిస్తారు కావున కొనుగోలు నిర్ణయం తీసుకునే ముందు క్షుణ్ణంగా భిన్న బ్రాండ్లతో సరిపోల్చి చూసుకుంటారు. కొనుగోలుదారులకు బ్రాండ్ పేరు కంటే స్పెసిఫికేషన్లే అత్యంత ముఖ్యమని ఈ సర్వే స్పష్టం చేస్తోంది. ఇది ప్రతీ ల్యాప్టాప్ తయారీదారు సంస్థకు ఒక గొప్ప అవకాశమని చెప్పవచ్చు’’ అని అమెజాన్ ఇండియా కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ జుబాఖాన్ తెలిపారు. -
55 ట్రిలియన్ డాలర్ల దిశగా భారత్!
న్యూఢిల్లీ: అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), వృద్ధిలోకి వస్తున్న కీలక రంగాల అధిపత్యం, వివిధ రంగాలలో రాణిస్తున్న యువత కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ 2047కల్లా 55 లక్షల కోట్ల డాలర్లకు చేరనున్నట్లు మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి వి.సుబ్రమణ్యన్ తాజాగా అంచనా వేశారు. 8 శాతం వాస్తవిక(రియల్) జీడీపీ వృద్ధి కొనసాగనున్నట్లు ‘ఇండియా 2047 లీడర్స్ టాక్’ పేరుతో ఏర్పాటు చేసిన సదస్సులో అభిప్రాయపడ్డారు. ఇందుకు దేశ కీలక ఆర్థిక మూలాల రంగాలలో వ్యూహాత్మక పెట్టుబడుల వినియోగం వీలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.2047కల్లా 55 ట్రిలియన్ డాలర్ల వికసిత్ భారత్ను నిర్మించడం వాస్తవికంగా సాధించదగినదేనని అభిప్రాయపడ్డారు. వార్షికంగా పురోగతి పథంలో ఉన్న ఎకానమీ, బాధ్యతాయుత సంపద సృష్టి, వివిధ రంగాలకు ప్రోత్సాహాన్నిచ్చే నిర్మాణాత్మక విధానాలతో ఇది సాధ్యపడుతుందని వివరించారు.పటిష్ట, దీర్ఘకాలిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకట్టుకోవడంతోపాటు గ్లోబల్ వేల్యూ చైన్తో సమీకృతమయ్యేలా ప్రపంచస్థాయి ఎల్రక్టానిక్స్ అభివృద్ధి, పారిశ్రామిక తయారీ ఇందుకు తోడ్పాటునివ్వనున్నట్లు తెలియజేశారు. అత్యున్నత నైపుణ్యతకలిగిన యువతను ప్రోత్సహించడం, ఏఐలో సామర్థ్యాలు వీటికి జత కలవనున్నట్లు వివరించారు. 2026 ఏప్రిల్ వరల్డ్ ఎకనమిక్ ఔట్లుక్లో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) 2025–26లో దేశ నామినల్ జీడీపీ 3.92 లక్షల కోట్ల డాలర్లుగా పేర్కొనడంతోపాటు.. ప్రపంచంలోనే ఆరో పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించినట్లు ప్రస్తావించారు. -
H-1B ఫీజు షాక్.. నాస్కామ్ కీలక వ్యాఖ్యలు!
గత ఐదేళ్లుగా అమెరికన్ హెచ్-1బీ వీసాలపై భారతీయ టెక్నాలజీ సంస్థలు ఆధారపడటం గణనీయంగా తగ్గిందని దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ తెలిపింది. మన కంపెనీలు అక్కడి స్థానికులనే నియమించుకోవడం పెరిగిందని పేర్కొంది. వీసాల ఫీజుల పెంపు అంశాన్ని అమెరికాలో నిపుణుల కొరతను పరిష్కరించే దిశగా తీసుకుంటున్న చర్యల కోణంలో చూడాలని వివరించింది. భారతీయ టెక్నాలజీ పరిశ్రమ అమెరికాలో స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్) విభాగంపై 1.1 బిలియన్ డాలర్ల పైగా ఇన్వెస్ట్ చేసినట్లు నాస్కామ్ వివరించింది.ఈ క్రమంలో 29 లక్షల మందికి పైగా విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేందుకు, 2.55 లక్షల మంది ఉద్యోగులకు కొత్త నైపుణ్యాల్లో శిక్షణనిచ్చేందుకు 130 పైగా యూనివర్సిటీలు, కాలేజీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు పేర్కొంది. తమ దేశ వ్యాపార సంస్థల్లో ఉద్యోగాలు చేసేందుకు తొలిసారిగా హెచ్-1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారిపై అదనంగా 1,03,265 డాలర్ల ఫీజును విధించేలా అమెరికా ప్రతిపాదించిన నేపథ్యంలో నాస్కామ్ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా గణాంకాల ప్రకారం ఇటీవలి కాలంలో ఆమోదం పొందిన హెచ్–1బీ వీసా దరఖాస్తుల్లో భారతీయుల వాటా ఏకంగా 71 శాతంగా ఉంది. -
ఇన్ఫ్రా ఖర్చులకు రెక్కలు.. రూ.3.4 లక్షల కోట్ల భారం!
న్యూఢిల్లీ: మౌలిక(ఇన్ఫ్రా) సదుపాయాల ప్రాజెక్టుల వ్యయాలు భారీగా పెరిగిపోయినట్లు నెలవారీ ప్రభుత్వ నివేదిక పేర్కొంది. రూ. 150 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులపై ఉమ్మడిగా రూ. 3.4 లక్షల కోట్లమేర వ్యయాల భారం పడినట్లు 2026 జూలైకు విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. 17 కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల ద్వారా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మొత్తం 1,775 ప్రాజెక్టుల వ్యయాలు రూ. 33,70,138 కోట్ల నుంచి రూ. 37,10,642 కోట్లకు చేరినట్లు వివరించింది.అయితే.. ఎన్ని ప్రాజెక్టులలో అంచనాలకు మించి వ్యయాలు పెరిగిందీ వెల్లడించలేదు. వీటిపై మొత్తం రూ. 19.26 లక్షల కోట్లు వెచ్చించగా.. సవరించిన అంచనా వ్యయాలలో ఇవి 51.91 శాతానికి సమానమని గణాంకాలు, పథకాల అమలు శాఖ విడుదల చేసిన నివేదిక తెలియజేసింది. నిలకడగా ప్రాజెక్టుల అభివృద్ధి జరుగుతున్నట్లు పేర్కొంది. ప్రాజెక్టులలో అధిక భాగం చివరి దశకు చేరుకున్నట్లు తెలియజేసింది. 675(38 శాతం) ప్రాజెక్టు పనులు నిర్మాణపరం(ఫిజికల్)గా 80 శాతం పూర్తికాగా.. మరో 305(17 శాతం) ప్రాజెక్టులు ఫైనాన్షియల్గా 80 శాతానికి మించి పూర్తయినట్లు వెల్లడించింది.ప్రాజెక్టుల వివరాలివీరవాణా, లాజిస్టిక్స్ రంగంలో అత్యధికంగా 1,246 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉండగా.. రూ. 19.81 లక్షల కోట్ల సవరించిన అంచనాలు కనెక్టివిటీ ఆధారిత మౌలికసదుపాయాలకు ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తున్నట్లు వివరించింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 1,775 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో రూ. 1,000 కోట్లకుపైబడిన మెగా ప్రాజెక్టులు 735 ఉన్నట్లు వెల్లడించింది.వీటి అసలు అంచనా వ్యయాలు రూ. 28.77 లక్షల కోట్లుకాగా.. 1,040 ప్రధాన(రూ. 1,000 కోట్ల నుంచి రూ. 150 కోట్లవరకూ) ప్రాజెక్టుల అంచనా వ్యయాలు రూ. 4.93 లక్షల కోట్లుగా తెలియజేసింది. రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ అధిక సంఖ్యలో 993(56 శాతం) ప్రాజెక్టులను కలిగి ఉంది. మొత్తం సవరించిన ప్రాజెక్టుల అంచనా వ్యయాలలో వీటి వాటా రూ. 9.62 లక్షల కోట్లు(26 శాతం)గా తెలియజేసింది. ఇది జాతీయస్థాయిలో మౌలిక సదుపాయాల అభివృద్ధిని పట్టిచూపుతున్నట్లు పేర్కొంది.ఇతర శాఖల ద్వారా.. గణాంకాల శాఖ నివేదిక ప్రకారం రైల్వే శాఖ 190 ప్రాజెక్టులను(11 శాతం) అభివృద్ధి చేస్తోంది. వీటి మొత్తం సవరించిన అంచనా వ్యయాలు రూ. 6.38 లక్షల కోట్లు(17 శాతం). బొగ్గు శాఖ ప్రాజెక్టులు 121(7 శాతం)కాగా.. వీటి సవరించిన ప్రాజెక్టు వ్యయాలు రూ. 2.22 లక్షల కోట్లు(6 శాతం). పెట్రోలియం, సహజవాయువు, విద్యుత్, గృహాలు, పట్టణ వ్యవహారాలు, నీటి వనరులు, నదుల అభివృద్ధి తదితర శాఖలు వరుసగా 103, 98, 50, 38 ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నాయి.వీటి సవరించిన అంచనా వ్యయాలు వరుసగా రూ. 4.23 లక్షల కోట్లు, రూ. 6.08 లక్షల కోట్లు, రూ. 3.78 లక్షల కోట్లు, రూ. 2.01 లక్షల కోట్లు. మిగిలిన 182 ప్రాజెక్టుల(10 శాతం) అంచనా వ్యయాలు రూ. 2.78 లక్షల కోట్లు(8 శాతం)కాగా.. ఇవి ఉన్నత విద్య, పౌర విమానయానం, స్టీల్, టెలికమ్యూనికేషన్స్, కారి్మకులు, ఉపాధి, పోర్టులు, షిప్పింగ్, జల రవాణా, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, గనులు, డీపీఐఐటీ, క్రీడల శాఖల ఆధ్వర్యంలో నిర్మితమవుతున్నట్లు నివేదిక పేర్కొంది. -
ప్రయాణికులే కాదు.. ఇప్పుడు హోస్టులుగా Gen Z
భారత్లో జెన్ జీ యువత ప్రయాణించే విధానంలోనే కాదు.. ఇతరులకు ఆతిథ్యం ఇచ్చే విషయంలోనూ కొత్త ట్రెండ్ తీసుకొస్తోంది. ఎయిర్బీఎన్బీ తాజా గణాంకాల ప్రకారం, 2026 తొలి ఆరు నెలల్లో భారత్లో జెన్ జీ హోస్టుల సంఖ్య గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే దాదాపు 40 శాతం పెరిగింది. కొత్తగా ఎయిర్బీఎన్బీ లో హోస్టులుగా చేరుతున్న వారిలో దాదాపు ఐదుగురిలో ఇద్దరు 18 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్నవారే. అంటే యువత కేవలం కొత్త ప్రాంతాలకు వెళ్లి అనుభవాలు పొందడమే కాకుండా.. ఇప్పుడు తమ ఇళ్లను ఇతరులకు అందుబాటులో ఉంచి ఆదాయం పొందేందుకు కూడా ఆసక్తి చూపుతోంది.పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల వరకు..బెంగళూరు, ఢిల్లీ, గురుగ్రామ్, ముంబై, నోయిడాతో పాటు ఇండోర్లో కూడా జెన్ జీ హోస్టింగ్ వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఇండోర్లో యువ హోస్టుల సంఖ్య ఏకంగా 120 శాతానికి పైగా పెరిగింది. హైదరాబాద్, డెహ్రాడూన్, గువాహటి, కొచ్చి, లక్నో, మథుర వంటి నగరాల్లోనూ ఈ ట్రెండ్ కనిపిస్తోంది. అంతేకాదు.. గ్రామీణ ప్రాంతాల్లో జెన్ జీ హోస్టుల సంఖ్య 60 శాతం, తక్కువ జనసాంద్రత ఉన్న పట్టణ ప్రాంతాల్లో దాదాపు 70 శాతం పెరిగింది. దీంతో పర్యాటకం కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాకుండా.. చిన్న పట్టణాలు, గ్రామాలకు కూడా విస్తరించే అవకాశం కనిపిస్తోంది.హోస్టింగ్తో ఆదాయం.. సొంతంగా కెరీర్!జెన్ జీ యువతకు ఎయిర్బీఎన్బీ హోస్టింగ్ కేవలం సరదా లేదా పార్ట్టైమ్ పనిగా కాకుండా.. ఆదాయ మార్గంగా కూడా మారుతోంది. 2026 తొలి ఆరు నెలల్లో భారత్లో జెన్ జీ హోస్టులు ఎయిర్బీఎన్బీ ద్వారా పొందిన ఆదాయం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 60 శాతానికి పైగా పెరిగింది. డెహ్రాడూన్కు చెందిన శ్రేయ ఇందుకు మంచి ఉదాహరణ. ఇంట్లో ఖాళీగా ఉన్న అంతస్తును అతిథుల కోసం సిద్ధం చేసి హోస్టింగ్ ప్రారంభించిన ఆమె.. దీని ద్వారా కుటుంబంతో సమయం గడుపుతూనే సంపాదించడంతో పాటు ప్రయాణాలు, సస్టైనబుల్ టూరిజంపై తన ఆసక్తిని కొనసాగిస్తున్నట్లు తెలిపింది. యువ హోస్టుల్లో దాదాపు ఏడుగురిలో ఒకరు ఎయిర్బీఎన్బీ సూపర్ హోస్ట్ గుర్తింపు పొందడం కూడా వారు సేవల నాణ్యతకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని చూపిస్తోంది.యువతతో మారుతున్న భారత పర్యాటకంఎయిర్బీఎన్బీ ప్రకారం.. భారత జెన్ జీ ఇప్పుడు ప్రయాణికులుగా మాత్రమే కాకుండా హోస్టులు, ఎంటర్ప్రెన్యూర్లుగా కూడా మారుతోంది. తమ ఇళ్లు, స్థానిక సంస్కృతి, ప్రాంతీయ ప్రత్యేకతలను ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులకు పరిచయం చేస్తూ కొత్త అవకాశాలను సృష్టించుకుంటోంది. దీనివల్ల యువతకు ఆదాయం రావడంతో పాటు స్థానిక రెస్టారెంట్లు, దుకాణాలు, రవాణా వంటి వ్యాపారాలకు కూడా పరోక్షంగా ప్రయోజనం కలగవచ్చు. మొత్తంగా చూస్తే.. భారత జెన్ జీ తమ ప్రయాణ అనుభవాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్లి, తమ ఇంటి తలుపులు తెరిచి ప్రపంచాన్ని ఆహ్వానిస్తూ.. కొత్త ఆదాయ మార్గాలను సృష్టిస్తోంది. -
అమెజాన్, ఫ్లిప్కార్ట్ కొత్త రూల్స్.. సెల్లర్లకు కొత్త టెన్షన్!
పండుగల సీజన్ షాపింగ్ మొదలవుతున్న తరుణంలో ఈ–కామర్స్ సంస్థలు తమ ప్లాట్ఫాంలపై విక్రయించే సెల్లర్స్కి షాకిచ్చాయి. ఆర్డర్ల రద్దుకు సంబంధించి సెల్లర్ ఫీజులు, పెనాల్టీలు పెరిగే విధంగా విధానాలను సవరించాయి. అమెజాన్ ఇండియా తమ సెల్లర్ ఫోరంలో ఉంచిన నోటీసు ప్రకారం కంపెనీ తమ ఈజీ షిప్, సెల్ఫ్ షిప్ సర్వీసులను ఉపయోగించుకునే సెల్లర్లకు సంబంధించి ఆర్డర్ క్యాన్సిలేషన్ ఫీజులను లెక్కించే విధానాన్ని మార్చింది. ఇది ఆగస్టు 17 నుంచి అమల్లోకి తెచ్చింది.ఈజీ షిప్ కింద విక్రేతలు తమ ఉత్పత్తులను తామే నిల్వ చేసుకుని, ఆర్డరు వచ్చినప్పుడు ప్యాక్ చేసి, ఈజీ షిప్ పికప్ ఎగ్జిక్యూటివ్కి అందిస్తారు. వారు ఆ ప్రోడక్టును సకాలంలో డెలివరీ అయ్యేలా చూస్తారు. ఇక సెల్ఫ్ షిప్ విషయానికొస్తే విక్రేత స్వయంగా తమ కొరియర్ లేదా డెలివరీ సర్వీసును ఉపయోగించి కొనుగోలుదారులకు ప్రోడక్టును చేరవేస్తారు. ఇందులో అమెజాన్ లాజిస్టిక్స్ ప్రమేయమేమీ ఉండదు. ఇప్పటివరకు కేటగిరీ రిఫరల్ చార్జీ ఆధారంగా ఉండే ఫీజులు, ఇకపై ఆర్డరు విలువలో ఇంత శాతం అని లెక్కించనున్నట్లు అమెజాన్ ఇండియా పేర్కొంది.సవరించిన విధానం ప్రకారం రూ. 10,000 లోపు విలువ చేసే ఆర్డర్లపై 10 శాతం చార్జీ ఉంటుంది. రూ. 10,001 నుంచి రూ. 50,000 వరకు ఆర్డర్లపై 8 శాతంగా, అక్కడి నుంచి రూ. 1,00,000కు విలువ చేసే ఆర్డర్లపై 5 శాతం, అంతకు మించిన వాటిపై 2 శాతంగా చార్జీలు ఉంటాయి. 18 శాతం జీఎస్టీ అదనంగా ఉంటుంది. కొనుగోలు అభ్యర్ధన మేరకు కాకుండా ఇతరత్రా ఏవైనా కారణాల వల్ల విక్రేత క్యాన్సిల్ చేసినా ఈ చార్జీలు వర్తిస్తాయి. ముందుగా పేర్కొన్న షిప్పింగ్ తేదీకి 24 గంటల్లోపల విక్రేత పంపించకపోతే ఆర్డర్ ఆటోమేటిక్గా రద్దయిపోతుంది.క్లోజింగ్ ఫీజు పెంపు..ఫుల్ఫిల్మెంట్ సెంటర్, ఈజీ షిప్, సెల్లర్ ఫ్లెక్స్ మాధ్యమాలవ్యాప్తంగా సెప్టెంబర్ 7 నుంచి క్లోజింగ్ ఫీజులను పెంచనున్నట్లు అమెజాన్ ఇండియా తెలిపింది. ఉత్పత్తి ధర శ్రేణిని బట్టి అమెజాన్లో ఉత్పత్తిని విక్రయించిన ప్రతిసారి క్లోజింగ్ ఫీజును కంపెనీ విధిస్తుంది. రూ. 500 వరకు ధర ఉండే ఉత్పత్తులపై ఫీజు రూ. 1 చొప్పున, రూ. 500కి మించిన ధర ఉండే వాటిపై రూ. 3 చొప్పున పెంపు ఉంటుంది. ఇంధన, లాజిస్టిక్స్ వ్యయాలు పెరగడం ఇందుకు కారణమని సంస్థ తెలిపింది.మరోవైపు, ఆర్డర్ ఫుల్ఫిల్మెంట్లో లోపాలకు సంబంధించి మూడంచెల పెనాల్టీ విధానానాన్ని ఫ్లిప్కార్ట్ ఆగస్టు 23 నుంచి అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం హామీ ఇచ్చిన డిస్పాచ్ డేట్ (డీబీడీ) కల్లా పికప్ చేసుకోవడానికి ఉత్పత్తిని సిద్ధం చేయకపోతే, ప్రతి షిప్మెంట్పై రూ. 30 జరిమానా ఉంటుంది. ఆర్డరును విక్రేత క్యాన్సిల్ చేసినా, లేదా మూడు సార్లు డిస్పాచ్ గడువు దాటిపోయి క్యాన్సిల్ అయిపోయినా ఒక్కో షిప్మెంట్కి రూ. 60 పెనాల్టీ ఉంటుంది. ఒకవేళ ఆర్డరులో జాప్యం జరిగి, తదుపరి రద్దయిపోతే పెనాల్టీ రూ. 90కి పెరుగుతుంది. గతంలోనైతే డీబీడీని ఉల్లంఘిస్తే కొంత సమయం పాటు విక్రేత అకౌంటును లాక్ చేసేసేవారు.ఫలితంగా విక్రేత వ్యాపారంపై గణనీయంగా ప్రభావం పడేది. ఫ్లిప్కార్ట్లో కొత్తగా చేరిన విక్రేతలకు తాజా విధానం వర్తించదు. సెల్లర్లు మరింత మెరుగ్గా ప్లాన్ చేసుకునేందుకు, కస్టమర్ అనుభూతిని మరింత మెరుగుపర్చేందుకే ఈ మార్పులు, చేర్పులను ఉద్దేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. డీబీడీ నిబంధనలు సరిగ్గా పాటించే వారికి వేగంగా చెల్లింపులు జరపడం, కాంప్లిమెంటరీగా అడ్వరై్టజింగ్ క్రెడిట్స్ ఇవ్వడం మొదలైన రూపాల్లో ప్రయోజనాలు కూడా ఉంటాయని వివరించాయి.‘మా ప్లాట్ఫాం ద్వారా కస్టమర్లు ఇచ్చే ఆర్డర్లను విక్రేతలు విశ్వసనీయంగా డెలివరీ చేయాలని మేము ఆశిస్తాం. సకాలంలో, విశ్వసనీయతతో ఫుల్ఫిల్మెంట్ ఉండేలా చూసేందుకే ఈజీ షిప్, సెల్ఫ్–షిప్ సెల్లర్లకు సంబంధించిన క్యాన్సిలేషన్ ఫీజులను సవరించాం. దీనికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆర్డరును విక్రేత క్యాన్సిల్ చేసినప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది. అలాంటి సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి. అమెజాన్డాట్ఇన్లో వచ్చే ఆర్డర్లలో వీటి వాటా 1 శాతం కన్నా తక్కువే. విక్రేతల పరిధిలో లేని అంశాల వల్ల ఆర్డరు రద్దయిన పక్షంలో వారు నష్టపోకుండా చూసేందుకు తగు జాగ్రత్త చర్యలు కూడా అమలు చేస్తున్నాం‘ అని అమెజాన్ ప్రతినిధి తెలిపారు.మాపై భారం సరికాదు.. ఒకోసారి డెలివరీ సిబ్బంది సకాలంలో రాకపోవడం వల్ల కూడా ఆర్డరు రద్దయ్యే అవకాశం ఉంటుందని, ఇలా తమ పరిధిలో లేని అంశాలకు కూడా తమనే బాధ్యులను చేస్తే ఎలా అని కొత్త విధానాలను కొందరు విక్రేతలు అంటున్నారు. అలాంటి సందర్భాల్లో క్యాన్సిలేషన్ ఫీజులను తమపైనే మోపడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా ఒకే ఉత్పత్తికి సంబంధించి అమెజాన్కి చెందిన ఫుల్ఫిల్మెంట్ నెట్వర్క్ను ఉపయోగించుకునే విక్రేతలు, ఈజీ షిప్ని ఉపయోగించుకునే సెల్లర్లు కట్టే ఫీజుల మధ్య ఒక్కో యూనిట్కి దాదాపు రూ.45 మేర వ్యత్యాసం ఉంటుందని, దీనివల్ల విక్రేతలకు సమాన అవకాశాలు లభించవని వారు పేర్కొన్నారు.అత్యుత్తమ సర్వీస్ ప్రమాణాల ఆవశ్యకతను విక్రేతలు అర్థం చేసుకోగలరని, కాకపోతే సరిగ్గా పండుగ సీజన్ ముందు క్యాన్సిలేషన్ తదితర పెనాల్టీలను ఈ–కామర్స్ సంస్థలు పెంచేయడమనేది ఆందోళనకరమైన విషయమని ఫోరం ఫర్ ఇంటర్నెట్ రీసెల్లర్స్, సెల్లర్స్ అండ్ ట్రేడర్స్ (ఫస్ట్ ఇండియా) ట్రస్టీ వినోద్ కుమార్ తెలిపారు. చాలా తక్కువ మార్జిన్లు, పెరుగుతున్న ఖర్చులతో సతమతమవుతున్న చిన్న, మధ్య తరహా సంస్థలపై దీని ప్రభావం భారీగా ఉంటుదన్నారు. ఆర్డర్లు రద్దు కావడానికి, జాప్యానికి సంబంధించి ప్రతి దానికీ విక్రేతే కారణం కాబోరని.. లాజిస్టిక్స్ వైఫల్యం, ప్లాట్ఫాంలో సమస్యలు, డిమాండ్ ఒక్కసారిగా పెరగడం, కస్టమర్ల వైపు నుంచి ఉండే సవాళ్లు కూడా కారణంగా ఉంటాయని వివరించారు. -
పసిడి పరుగు.. వెండి వెనకడుగు!
పసిడి పరుగు నాన్స్టాప్గా కొనసాగుతోంది. వరుసగా నాలుగో సెషన్లోనూ అదే జోరు కొనసాగిస్తూ మరో రూ. 2,700 పెరిగింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం 10 గ్రాముల రేటు రూ. 1,67,100కి చేరింది.మరోవైపు, మూడు రోజుల ర్యాలీ అనంతరం ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో వెండి జోరు కాస్త ఆగింది. కేజీ ధర రూ. 3,500 తగ్గి రూ. 2,50,000కి పరిమితమైంది. అటు అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లలో బంగారం ధర ఔన్సుకి (31.1 గ్రాములు) 11.87 డాలర్లు (సుమారు 0.26 శాతం) క్షీణించి 4,639.51 డాలర్లకు, వెండి 1.04 శాతం తగ్గి 67.88 డాలర్లకు దిగి వచ్చాయి. -
అమెరికాకు కెనడా స్ట్రాంగ్ కౌంటర్!
అమెరికా, కెనడా మధ్య వాణిజ్య వివాదం రోజురోజుకూ ముదురుతోంది. అమెరికా విధించిన భారీ టారిఫ్లకు కెనడా కూడా గట్టిగా స్పందించింది. సుమారు 20 బిలియన్ డాలర్ల విలువైన 700 అమెరికా వస్తువులపై 15 నుంచి 50 శాతం వరకు ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు కెనడా ప్రకటించింది. ఈ టారిఫ్లు సెప్టెంబర్ 8 నుంచి అమల్లోకి రానున్నాయి.స్టీల్ నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు..కెనడా విధించే కొత్త సుంకాల ప్రభావం అమెరికాకు చెందిన పలు కీలక రంగాలపై పడనుంది. ముఖ్యంగా స్టీల్, డెయిరీ, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు ఈ టారిఫ్ల పరిధిలోకి రానున్నాయి. అమెరికా ఏ స్థాయిలో సుంకాలు విధించిందో, దానికి అనుగుణంగానే తమ టారిఫ్లు ఉంటాయని కెనడా అధికారులు స్పష్టం చేశారు.కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ షాంపేన్ మాట్లాడుతూ.. తమ దేశానికి ఇది ఎన్నడూ ఎదురుకాని సవాలని, అయితే ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు కెనడా సిద్ధంగా ఉందని చెప్పారు. అమెరికా చర్యకు ప్రతిస్పందించే విషయంలో దేశ ప్రజలంతా ఐక్యంగా ఉన్నారని తెలిపారు.చర్చల నుంచి కెనడా వైదొలగింపుఅమెరికా, కెనడా మధ్య టారిఫ్లపై జరిగిన చర్చలు సఫలం కాలేదు. అమెరికా ప్రతిపాదించిన కొత్త వాణిజ్య నిబంధనలు కెనడాకు అనుకూలంగా లేవని ప్రధాని మార్క్ కార్నీ అభిప్రాయపడ్డారు.ఆ ప్రతిపాదనలు ఆర్థికంగా అన్యాయంగా ఉండటంతో పాటు కెనడాకు దక్కాల్సిన ప్రయోజనాలను తగ్గించేలా ఉన్నాయని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా ఆటోమొబైల్, స్టీల్, అల్యూమినియం వంటి తమ ప్రధాన పరిశ్రమలను దెబ్బతీసే విధంగా అమెరికా ప్రతిపాదనలు ఉన్నాయని కార్నీ అన్నారు. అందుకే అమెరికా ఇచ్చిన ఒప్పందాన్ని అంగీకరించకుండా చర్చల నుంచి బయటకు వచ్చామని స్పష్టం చేశారు.ట్రంప్ హెచ్చరికమరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా కెనడాపై తన వైఖరిని మరింత కఠినతరం చేశారు. కెనడా అమెరికా నిర్ణయాలకు అనుగుణంగా వ్యవహరించాలని, లేకపోతే ఇప్పటికే విధించిన టారిఫ్ల కంటే మరింత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అంతేకాకుండా.. కెనడా ఆటోమొబైల్ పరిశ్రమపై వచ్చే ఏడాది నుంచి మరిన్ని టారిఫ్లు విధించే అవకాశం ఉందని ట్రంప్ ప్రకటించారు.కెనడా ఎన్నో సంవత్సరాలుగా అమెరికాను వాణిజ్యపరంగా నష్టపరుస్తోందని ట్రంప్ ఆరోపించారు. ముఖ్యంగా అమెరికా రైతుల ఉత్పత్తులపై కెనడా విధిస్తున్న అధిక సుంకాలను ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో రెండు దేశాలు ఒకదానిపై మరొకటి టారిఫ్లు విధించుకుంటుండటంతో స్టీల్, ఆటోమొబైల్, వ్యవసాయం, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలపై ప్రభావం పడే అవకాశం ఉంది.ప్రస్తుతం అమెరికా-కెనడా మధ్య టారిఫ్ల పోరు మరింత తీవ్రంగా మారింది. అమెరికా విధించిన సుంకాలకు కెనడా ప్రతీకార చర్యలు తీసుకోవడం, మరోవైపు ట్రంప్ మరిన్ని టారిఫ్ల హెచ్చరికలు చేయడంతో పరిస్థితి సంక్లిష్టంగా మారింది. ఇరు దేశాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటాయా?, లేక టారిఫ్ల పోరు మరింత పెరుగుతుందా?, అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వాణిజ్య యుద్ధం కొనసాగితే చివరికి దాని ప్రభావం రెండు దేశాల పరిశ్రమలతో పాటు వినియోగదారులపైనా పడే అవకాశం ఉంది. -
మొదటిసారి ఇల్లు కొంటున్నారా?
ప్రతి ఒక్కరి జీవితంలో సొంతిల్లు అనేది ఒక అపురూపమైన స్వప్నం. అయితే, ఆకర్షణీయమైన బ్రోచర్లు, రంగురంగుల అడ్వర్టైజ్మెంట్లు చూసి తొందరపడి బిల్డర్ చేతిలో అడ్వాన్స్ పెడితే తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. కాబట్టి తొలిసారి ఇల్లు కొనుగోలు చేసేవారు చేతులు కాలాక ఆకులు పట్టుకునే పరిస్థితి రాకుండా ఉండాలంటే బిల్డర్కు డబ్బు చెల్లించే ముందే కొన్ని ప్రశ్నలు నిలదీయక తప్పదు.రేరా నమోదు ఉందా?ప్రాజెక్టుకు ‘రేరా’(భారత రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకతను పెంచడానికి, బిల్డర్ల మోసాల నుంచి ఇళ్లు కొనుగోలు చేసే వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి భారత ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది) అనుమతి ఉందో లేదో కచ్చితంగా నిర్ధారించుకోవాలి. కేవలం మాటల గారడీకి మోసపోకుండా ప్రాజెక్ట్ రేరా రిజిస్ట్రేషన్ నంబర్, పురపాలక/పట్టణాభివృద్ధి సంస్థల ఆమోదిత ప్లాన్ను ప్రత్యక్షంగా పరిశీలించాలి.కార్పెట్ ఏరియా ఎంత?ఆస్తి విస్తీర్ణం లెక్కల్లో బిల్డర్లు చూపే సూపర్ బిల్టప్ ఏరియా మాయాజాలంలో పడకూడదు. అసలైన ‘కార్పెట్ ఏరియా’ (నివసించే స్థలం) ఎంత వస్తుందో తేల్చుకోవాలి. లేకపోతే కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు అవుతుంది.దాగి ఉన్న రుసుములుకేవలం బేస్ ప్రైస్ మాత్రమే కాకుండా కార్ పార్కింగ్, క్లబ్హౌస్, ప్లాన్ అప్రూవల్, ప్రీయారిటీ ల్యాండ్ ఛార్జీలు, జీఎస్టీ వంటి అదనపు రుసుముల వివరాలను పైసాతో సహా ముందే లిఖితపూర్వకంగా తీసుకోకపోతే బడ్జెట్ తలకిందులవుతుంది.చెల్లింపుల ప్రణాళికఒక్కసారే పెద్దమొత్తంలో చెల్లించకుండా నిర్మాణ పురోగతికి అనుగుణంగా చెల్లించే కన్స్ట్రక్షన్ లింక్డ్ ప్లాన్ ఎంచుకోవడమే క్షేమదాయకం.స్వాధీన తేదీ.. పరిహారంప్రాజెక్టు పూర్తి చేసి ఇల్లు అప్పగించే తేదీ, ఒకవేళ నిర్మాణంలో ఆలస్యమైతే బిల్డర్ చెల్లించే పరిహారంపై బయ్యర్-బిల్డర్ అగ్రిమెంట్ (బీబీఏ)లో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయో లేదో చూసుకోవడం ఉత్తమం.ఇదీ చదవండి: తాతముత్తాతల ఆస్తి హక్కులు పొందడం ఎలా? -
మరో ఆరు రోజుల్లో చౌకగా విమాన ప్రయాణం
నింగిలో విహరించాలనుకునే సామాన్య మధ్యతరగతి ప్రయాణికులకు విమానాశ్రయాల ఆర్థిక నియంత్రణ సంస్థ (ఏఈఆర్ఏ) తీపి కబురు అందించింది. అందినంత పిండుకో అనే దోరణికి చెక్ పెడుతూ శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) నుంచి పయనమయ్యే ప్రయాణికులపై యూజర్ డెవలప్మెంట్ ఫీజు (యూడీఎఫ్) భారాన్ని గణనీయంగా తగ్గించింది. సెప్టెంబరు 1, 2026 నుంచి ప్రారంభమయ్యే నాలుగో పర్యవేక్షణ కాలానికి (2026-2031) గాను ఈ సవరించిన టారిఫ్లు అమలులోకి రానున్నాయి.ఇప్పటివరకు దేశీయ విమాన ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్న రూ.750 యూడీఎఫ్ను ఏఈఆర్ఏ రూ.515కు తగ్గించింది. విమానాశ్రయ నిర్వాహక సంస్థ జీఎంఆర్(బీహెచ్ఐఏఎల్) రూ.580 కోరినప్పటికీ ప్రయాణికుల ప్రయోజనాలే పరమావధిగా భావించి రూ.515 వద్దే నిర్ణయించడం విశేషం. అలాగే, అంతర్జాతీయ ప్రయాణికుల రుసుమును రూ.1,500 నుంచి రూ.1,030కి తగ్గించింది. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ప్రయాణించే వారిలో దాదాపు 82 శాతం మంది దేశీయ ప్రయాణికులే కావడంతో ఈ నిర్ణయం వారికి ఊరటనివ్వనుంది.ముందుగానే నియంత్రణ!బీహెచ్ఐఏఎల్ ఏకంగా రూ.27,851 కోట్ల ఆదాయ అవసరాలు ప్రతిపాదించగా ఏఈఆర్ఏ పక్కాగా సమీక్షించి రూ.11,683.49 కోట్లకు కుదించి ఆమోదముద్ర వేసింది. విమానాల ల్యాండింగ్ చార్జీలను టన్నుకు రూ.435 (దేశీయ), రూ.630 (అంతర్జాతీయ)గా నిర్ణయించింది. విమానయాన సంస్థలను ప్రోత్సహించేందుకు వేరియబుల్ టారిఫ్ ప్లాన్ (వీటీపీ) పేరుతో ల్యాండింగ్ ప్రోత్సాహకాలను సైతం తీసుకొచ్చింది. మొత్తానికి, విమాన ప్రయాణం కేవలం సంపన్నులకే కాకుండా సగటు మానవుడికి సైతం చేతికందే పండులా మారనుండటం హర్షణీయం.ఇదీ చదవండి: తాతముత్తాతల ఆస్తి హక్కులు పొందడం ఎలా? -
ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తుంటే జాగ్రత్త!
భారతీయులకు అత్యంత సురక్షితమైన, నమ్మకమైన పెట్టుబడి మార్గం అనగానే ముందు గుర్తొచ్చేది ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ). స్థిరమైన రాబడి కోసం మెజారిటీ ప్రజలు ఎఫ్డీలనే ఆశ్రయిస్తుంటారు. అయితే, ఎలాంటి ముందస్తు ప్రణాళిక, పరిశోధన లేకుండా నిశ్చింతగా చేసే ఎఫ్డీ పెట్టుబడులు ఒక్కోసారి అసలుకే ఎసరు తెచ్చి తీవ్ర నిరాశను మిగిల్చే అవకాశం ఉంది. ఎఫ్డీల్లో డబ్బు దాచే ముందు ప్రతీ పెట్టుబడిదారు తప్పక గుర్తుంచుకోవాల్సిన ఐదు కీలకమైన పొరపాట్లు, వాటి పరిష్కారాలు ఇక్కడ పరిశీలిద్దాం..పన్ను పరిణామాలను విస్మరించడంఎఫ్డీలపై వచ్చే వడ్డీ రాబడి పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. మీ ఇన్కమ్ టాక్స్ స్లాబ్ ప్రకారమే పన్ను వర్తిస్తుంది. ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రూ.40,000 (సీనియర్ సిటిజన్లకు రూ.50,000) దాటితే బ్యాంకులు మూలం వద్దే పన్ను మినహాయింపు (టీడీఎస్) చేస్తాయి. టాక్స్ పరిగణనలోకి తీసుకోకుండా వచ్చే వడ్డీ మొత్తాన్ని నికర లాభంగా భావించడం పెద్ద పొరపాటు.ద్రవ్యోల్బణం ప్రభావాన్ని అంచనా వేయకపోవడంద్రవ్యోల్బణం పెరిగే కొద్దీ రూపాయి కొనుగోలు శక్తి వేగంగా తగ్గుతుంది. మీ ఎఫ్డీ వడ్డీ రేటు 7 శాతం ఉండి, మార్కెట్లో ద్రవ్యోల్బణం కూడా 6–7% ఉంటే.. పన్నులు పోను మీ నికర వాస్తవ రాబడి సున్నాకే సమానం. కేవలం ఎఫ్డీలపైనే ఆధారపడకుండా ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే ఇతర మార్గాలనూ పరిశీలించాలి.గడువుకు ముందే ఉపసంహరణఅత్యవసర నిధి వేరుగా ఉంచుకోకుండా మొత్తం సొమ్మును దీర్ఘకాలిక ఎఫ్డీల్లో పెడితే హఠాత్తుగా డబ్బు అవసరమైనప్పుడు ఎఫ్డీని గడువు తీరకుండానే ఉపసంహరించుకోవాల్సి వస్తుంది. దీనివల్ల బ్యాంకులు 0.5%-1% వరకు జరిమానా విధించడమే కాకుండా వడ్డీ రేటును తగ్గిస్తాయి.ఎఫ్డీ లాడరింగ్ విధానం పాటించకపోవడంమొత్తం సొమ్మును ఒకే ఎఫ్డీలో ఒకే కాలపరిమితికి లాక్ చేయడం వల్ల భవిష్యత్తులో వడ్డీ రేట్లు పెరిగినప్పుడు ఆ అవకాశాన్ని కోల్పోతారు. అలాకాకుండా సొమ్మును విడదీసి వేర్వేరు గడువులతో (1 సంవత్సరం, 2 ఏళ్లు, 3 ఏళ్లు) డిపాజిట్ చేసే లాడరింగ్ పద్ధతి పాటిస్తే ద్రవ్యలభ్యత పెరగడంతో పాటు అధిక రాబడి లభిస్తుంది.బ్యాంకుల వడ్డీ రేట్లను పోల్చి చూడకపోవడంకేవలం అలవాటు పడిన ఒకే బ్యాంకులోనే పెట్టుబడి పెట్టడం మరొక పొరపాటు. ప్రైవేట్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అందించే వడ్డీ రేట్లతో పోల్చి చూసి ఆర్బీఐ డిపాజిట్ ఇన్సూరెన్స్ పరిమితులను (రూ.5 లక్షల వరకు భద్రత) దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలి.ఇదీ చదవండి: తాతముత్తాతల ఆస్తి హక్కులు పొందడం ఎలా? -
కార్బోసల్ఫాన్పై పూర్తి నిషేధం.. కేంద్రం ప్రతిపాదన
రైతులకు వాతావరణ సవాళ్లు ఒకవైపు చుట్టుముడుతుంటే, పంటలను ఆశించే పురుగుల సంహారానికి వాడే రసాయనాలు మరొకవైపు ప్రాణసంకటంగా మారుతున్నాయి. వ్యవసాయ రంగంలో విరివిగా ఉపయోగిస్తున్న కార్బోసల్ఫాన్ (Carbosulfan) కీటకనాశిని ఉత్పత్తి, దిగుమతి, విక్రయం, వాడకంపై పూర్తి నిషేధం విధించాలని కేంద్ర వ్యవసాయ శాఖ తాజాగా ముసాయిదా ఉత్తర్వులు జారీ చేసింది. 1968 కీటకనాశినుల చట్టం ప్రకారం ఈ విషపూరిత రసాయనాన్ని శాశ్వతంగా రద్దు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.నిపుణుల కమిటీ నివేదికనిపుణుల కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కార్బోసల్ఫాన్ భూమిలోకి లేదా మొక్కల్లోకి చేరిన తర్వాత అత్యంత ప్రమాదకరమైన 'కార్బోఫ్యూరాన్'గా రూపాంతరం చెందుతుంది. దీనివల్ల మానవులతో పాటు పెంపుడు జంతువులకు తీవ్రమైన విషప్రయోగం జరుగుతుందని పరిశోధనల్లో తేలింది. అత్యంత ఆందోళనకరమైన విషయమేమిటంటే.. ఈ రసాయనం ప్రభావానికి గురైతే తక్షణమే కోలుకోవడానికి నిర్దిష్టమైన విరుగుడు కూడా అందుబాటులో లేదు. ముందు జాగ్రత్త కన్నా నివారణే మేలు అన్న చందంగా జీవవైవిధ్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్న ఈ రసాయనానికి స్వస్తి పలకడమే శ్రేయస్కరమని సర్కారు భావించింది.వరి, పత్తి పంటల్లో..ముఖ్యంగా వరి, పత్తి పంటలలో నివారణకు వాడే ఈ మందును నిషేధిస్తే ప్రత్యామ్నాయంగా రసాయన రహిత పురుగుమందులను (బయో ఫెస్టిసైడ్స్) ప్రోత్సహించాల్సి ఉంటుంది. పర్యావరణానికి వినాశకరంగా మారిన కార్బోసల్ఫాన్పై పడుతున్న ఈ ఎఫెక్ట్ వల్ల యూపీఎల్ వంటి ప్రముఖ అగ్రోకెమికల్ కంపెనీల మార్కెట్పై ప్రభావం పడనుంది. చేతులు కాలకముందే ఆకులు పట్టుకోవడం మంచిది కాబట్టి విషపూరిత పురుగుమందుల స్థానే పర్యావరణ హితమైన ప్రత్యామ్నాయాలను త్వరితగతిన రైతులకు అందుబాటులోకి తేవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కొందరు నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: తాతముత్తాతల ఆస్తి హక్కులు పొందడం ఎలా? -
రూ.1.4 కోట్ల జీతం ఉన్నా.. ప్రశాంతత సున్నా!
‘అడియాసలు మోయలేక అల్లాడిపోవుటకంటే.. ఆశలు తగ్గించుకొని ప్రశాంతంగా బతకడం మేలు!’ అన్న సామెత నేటి కార్పొరేట్ రంగానికి చక్కగా సరిపోతుంది. ఆకాశమే హద్దుగా జీతభత్యాలు పెంచుకోవాలనే తపనతో రేయింబవళ్లు శ్రమిస్తున్న నేటి యువతరానికి రెడిట్ వేదికగా ఒక టెక్ ఉద్యోగి పంచుకున్న అనుభవం చర్చనీయాంశంగా మారింది.కేవలం మూడేళ్ల వ్యవధిలోనే తన వార్షిక వేతనాన్ని రూ.9 లక్షల నుంచి ఏకంగా రూ.1.4 కోట్లకు (16 రెట్లు) పెంచుకున్నట్లు ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ వెల్లడించారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నట్లుగా నిరంతరం కొత్త నైపుణ్యాలు పెంపొందించుకోవడం, చురుకైన ఆఫర్లు సాధించడంతో ఆర్థికంగా అసాధారణ ప్రగతి సాధించినట్లు తెలిపారు. అయితే, ఈ ప్రక్రియలో అత్యధిక జీతం అందుకుంటున్నప్పటికీ తీవ్రమైన బర్నౌట్ (మానసిక ఒత్తిడి, అలసట)కు గురయ్యానని, మనశ్శాంతి కరువైందని సదరు ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు.జీతం ఊరిస్తున్నా.. నాణేనికి మరోవైపు..కార్పొరేట్ జగత్తులో ఐదంకెల జీతం నుంచి కోట్లలో ప్యాకేజీకి ఎదగడం వినడానికి ఎంతో ఊరిస్తున్నా నాణేనికి మరోవైపున్న చేదు నిజాన్ని ఈ కథనం ఎత్తిచూపుతోంది. వారాంతాల్లో సైతం విశ్రాంతి లేని పని గంటలు, లక్ష్యాల ఒత్తిడి, స్థిరమైన ఉద్యోగ భద్రత లేకపోవడం వంటి అంశాలు నిద్రలేమి, తీవ్ర ఆందోళనలకు దారితీస్తున్నాయని బాధిత ఉద్యోగి పేర్కొన్నారు. చేతిలో డబ్బున్నా.. అనుభవించడానికి ఆరోగ్యం, సమయం లేకపోతే ఆ సంపాదన నిరుపయోగం అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ప్యాకేజీల పరుగు పందెంలో పడి..కెరీర్ నిర్మాణంలో ఆర్థిక పురోగతి ఎంత ముఖ్యమో శారీరక, మానసిక ఆరోగ్యాల మధ్య సమతుల్యత సాధించడం అంతకంటే ప్రధానం. జీతం ప్యాకేజీల పరుగు పందెంలో పడి జీవితాన్ని గుల్ల చేసుకోవడం చేతులారా చేసుకున్న చేటు అవుతుంది. కార్పొరేట్ కంపెనీలు సైతం ఉద్యోగుల మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యమిచ్చేలా పని సంస్కృతిని పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: తాతముత్తాతల ఆస్తి హక్కులు పొందడం ఎలా? -
స్వదేశీ పరిశ్రమలకు డీఆర్డీఓ క్షిపణి పరిజ్ఞానం!
భారత రక్షణ సామర్థ్యాన్ని స్వయంసమృద్ధి దిశగా వేగవంతం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) అభివృద్ధి చేసిన అన్ని రకాల సాంప్రదాయ (కన్వెన్షనల్) క్షిపణి వ్యవస్థల సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశీయ రక్షణ పరిశ్రమలకు బదిలీ చేసేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. పరిశోధన స్థాయి నుంచి పారిశ్రామిక స్థాయి క్షిపణి ఉత్పత్తి వైపు అడుగులు వేయడంలో ఈ నిర్ణయం ఒక ప్రధాన మైలురాయిగా నిలవనుంది.చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ముందే మేల్కొనడం శ్రేయస్కరం అనే చందంగా.. మారుతున్న సరిహద్దు భౌగోళిక రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ తన సైనిక సన్నద్ధతను మునుపెన్నడూ లేనంతగా బలోపేతం చేస్తోంది. విదేశీ దిగుమతులపైనే నిరంతరం ఆధారపడితే తాను తవ్విన గోతిలో తానే పడక తప్పదు అనే చేదు నిజాన్ని గ్రహించిన ప్రభుత్వం స్వదేశీ రక్షణ రంగానికి పెద్దపీట వేస్తోంది. ఈ క్రమంలో డీఆర్డీఓ సాంకేతికత అందుబాటులోకి రావడం వల్ల భారతీయ ప్రైవేట్ దిగ్గజాలతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) క్షిపణి తయారీ సప్లై చైన్లో చురుగ్గా భాగస్వామ్యం కానున్నాయి.దేశీయ సాంకేతిక ప్రతిభ అడవి కాచిన వెన్నెల కాకుండా పారిశ్రామిక స్థాయి ఉత్పత్తిగా మారడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రారంభ దశ నుంచే పరిశ్రమలను భాగస్వామ్యం చేయడం వల్ల నాణ్యతా ప్రమాణాలు మెరుగుపడి వేగవంతమైన ఉత్పత్తి సాధ్యమవుతుంది. రక్షణ రంగంలో ఆత్మనిర్భరత సాధించడంతో పాటు కంటికి రెప్పలా దేశ సరిహద్దులను కాపాడుకోవడంలో, రక్షణ ఎగుమతులను పెంచడంలో ఈ స్వదేశీ సాంకేతిక విప్లవం అత్యంత కీలక పాత్ర పోషించనుందని నిపుణులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: తాతముత్తాతల ఆస్తి హక్కులు పొందడం ఎలా? -
పైలట్లకు డోపింగ్ పరీక్షలు!
భారత విమానయాన రంగాన్ని భద్రతా పరంగా మరింత బలాపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విమాన పైలట్లు, క్యాబిన్ క్రూ సభ్యుల శారీరక, మానసిక ద్రుడత్వాన్ని, ప్రయాణికుల సురక్షిత ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకుని 100 శాతం ర్యాండమ్ డోపింగ్ (ఆల్కహాల్/మత్తు పదార్థాలు) పరీక్షలు నిర్వహించే దిశగా కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ ముమ్మరంగా అడుగులు వేస్తోంది. 'పాము చావకుండా, కర్ర విరగకుండా' ఉన్న పాత నిబంధనలకు స్వస్తి పలికి భద్రతలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పడమే దీని ప్రధాన ఉద్దేశం.ఇప్పటివరకు కేవలం కొంత శాతం సిబ్బందికి మాత్రమే పరిమితమైన ప్రీ-ఫ్లైట్ లేదా పోస్ట్-ఫ్లైట్ పరీక్షలను నిర్వహించేవారు. ఇకపై విమానాశ్రయాల్లో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఈ పరీక్షలు నిర్వహించేందుకు రోడ్మ్యాప్ సిద్ధమవుతోంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రతిపాదించిన ఈ కొత్త మార్గదర్శకాలు అగ్నికి ఆజ్యం తోడైనట్లు కొన్నిసార్లు పైలట్ల నిర్లక్ష్యం వల్ల ఎదురయ్యే ముప్పును ప్రాథమిక దశలోనే తుంచేస్తాయి. తీగ లాగితే డొంక కదిలినట్లు ఒకసారి సిబ్బంది అలసత్వం వహిస్తే వేలమంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారుతాయనే హెచ్చరికలతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అత్యంత వేగంగా పరిశీలిస్తోంది.ఈ కొత్త నిబంధనల ప్రకారం... నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(నాడా) మార్గదర్శకాలకు అనుగుణంగా అత్యంత కచ్చితత్వంతో కూడిన ల్యాబ్ టెక్నాలజీ ద్వారా రక్త, ఉమ్మి, మూత్ర నమూనాలను సేకరించి డ్రగ్స్, ఆల్కహాల్ ప్రభావాన్ని గుర్తిస్తారు. కాలం చెల్లిన పద్ధతులకు పాతరేసి పారదర్శకమైన డిజిటల్ ట్రాకింగ్ విధానాన్ని తీసుకురానున్నారు. ఒకవేళ ఏ పైలట్ అయినా ఈ పరీక్షల్లో దోషిగా తేలితే అతడి లైసెన్స్ను తాత్కాలికంగా రద్దు చేయడం నుంచి తీవ్రమైన సందర్భాల్లో శాశ్వతంగా రద్దు చేసే వరకు కఠిన చర్యలు ఉంటాయి.ప్రయాణికుల క్షేమమే పరమావధిగా సాగుతున్న ఈ కసరత్తు ఏవియేషన్ రంగంలో నూతన శకానికి నాంది పలకనుంది. ముందు జాగ్రత్త కన్నా మించిన మందు లేదు అనే నానుడిని నిజం చేస్తూ భారత ఆకాశ మార్గాల్లో సురక్షిత ప్రయాణానికి ఈ 100 శాతం ర్యాండమ్ పరీక్షలు ఓ రక్షణ కవచంలా నిలవనున్నాయి.ఇదీ చదవండి: తాతముత్తాతల ఆస్తి హక్కులు పొందడం ఎలా? -
మార్కెట్లలో మురిపించిన రికవరీ
గత కొన్ని రోజులుగా ఆచితూచి అడుగులు వేస్తున్న భారత స్టాక్ మార్కెట్ ఈరోజు ఆరంభంలో నష్టాల్లోకి జారినా మార్కెట్ ముగిసే సమయానికి ‘అంతకంటే తీపి లేదు’ అన్నట్లుగా ఆశాజనక వాతావరణంలో లాభాల బాట పట్టింది. ఆగస్టు 25, 2026 నాటి ట్రేడింగ్లో దేశీయ ప్రధాన సూచీలు రికవరీని సాధించాయి. తీవ్ర ఒడుదొడుకుల మధ్య సాగిన ఈనాటి సెషన్లో నిఫ్టీ 115 పాయింట్లు పుంజుకొని 24,334 వద్ద ముగియగా, సెన్సెక్స్ 286 పాయింట్లు ఎగబాకి 77,656 పాయింట్ల స్థాయికి చేరింది.గ్లోబల్ సెంటిమెంట్.. మార్కెట్ గమనంఅంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో ఉదయం అడుగడుగునా గండం అన్నట్లు ప్రారంభమైన మార్కెట్లు, మధ్యాహ్న సమయానికి కొనుగోళ్ల మద్దతుతో ఊపందుకున్నాయి. పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు, ఇరాన్పై అమెరికా తాజా ఆంక్షల హెచ్చరికల నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్కు 90 డాలర్లకు పైగా ట్రేడ్ అవ్వడం మన మార్కెట్లను మొదట్లో భయపెట్టింది. అయితే అంతర్జాతీయంగా అమెరికా బాండ్ ఈల్డ్స్ తగ్గడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ మున్ముందు వడ్డీ రేట్ల తగ్గింపుపై సానుకూల ధోరణి కనబరచవచ్చన్న అంచనాలు మార్కెట్కు ఊపిరి పోశాయి.మద్దతుగా విదేశీ నిధులుఇన్వెస్టర్లు సురక్షితమైన లార్జ్క్యాప్ కంపెనీల వైపే మొగ్గు చూపారు. విదేశీ రంగానికి చెందిన ప్రముఖ కంపెనీల షేర్లలో భారీగా సాగిన షార్ట్ కవరింగ్, ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్ బ్యాంక్, టైటాన్, ఎయిర్లైన్ దిగ్గజం ఇండీగో షేర్లు లాభాలు.. వంటివి సూచీల రికవరీకి కారణమయ్యాయి. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు తిరిగి నికర కొనుగోలుదారులుగా మారడం కూడా మార్కెట్ సెంటిమెంట్ను బలపరిచింది.విశ్లేషకుల అభిప్రాయంఅంతర్జాతీయ జియోపోలిటికల్ ఉద్రిక్తతలు ‘చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లు’ తాత్కాలికంగా ఇన్వెస్టర్లలో ఆందోళన రేపినా భారత ఆర్థిక వ్యవస్థలోని బలమైన ప్రాథమిక సూచికలు ఆసియా మార్కెట్లలో మన స్థానాన్ని మళ్లీ అగ్రభాగాన నిలబెడుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. భవిష్యత్తులో క్రూడ్ ఆయిల్ ధరల ఊగిసలాటపై దృష్టి పెట్టాలని, గుడ్డిగా పెట్టుబడులు పెట్టకుండా ‘అడుసు తొక్కనేల.. కాలు కడగనేల’ అన్న రీతిలో ముందస్తు వ్యూహంతో అడుగులు వేయాలని సూచిస్తున్నారు.ఇదీ చదవండి: తాతముత్తాతల ఆస్తి హక్కులు పొందడం ఎలా? -
8th Pay Commission: ఉద్యోగుల పంట పండినట్లే!!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ కేంద్ర వేతన సంఘం (8th Central Pay Commission) ప్రక్రియ వేగంగా సాగుతోంది. కొత్త వేతన సవరణలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉండబోతుందనే అంశంపైనే ఉద్యోగుల్లో ప్రధాన చర్చ జరుగుతోంది. ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ నిర్ణయించిన తర్వాత తమ కనీస వేతనం రూ.69 వేలకు పెరుగుతుందని ఉద్యోగులు భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం లేదా 8వ వేతన సంఘం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను అధికారికంగా ఖరారు చేయలేదు.రూ.69,000 వరకు బేసిక్ పే?8వ వేతన సంఘంతో గత ఏప్రిల్ 28న జరిగిన సమావేశంలో నేషనల్ కౌన్సిల్–జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ (NC-JCM) ఉద్యోగుల తరఫున పలు కీలక ప్రతిపాదనలు చేసింది. ఇందులో ప్రస్తుతం ఉన్న కనీస ప్రాథమిక వేతనం రూ.18,000ను రూ.69,000కు పెంచాలని, అందుకు అనుగుణంగా 3.833 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ లెక్క 18,000 × 3.833 ఆధారంగా రూపొందింది. అంటే ఇది ఉద్యోగ సంఘాల డిమాండ్ మాత్రమే. 8వ వేతన సంఘం తుది సిఫార్సులు, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వచ్చినప్పుడే కొత్త వేతనాలు ఎంత ఉంటాయో స్పష్టమవుతుంది.ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏమిటి?ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది ప్రస్తుత ప్రాథమిక వేతనాన్ని గుణించి సవరించిన ప్రాథమిక వేతనాన్ని నిర్ణయించేందుకు ఉపయోగించే గుణకం. ఉదాహరణకు ప్రస్తుతం లెవెల్-1 ఉద్యోగికి రూ.18,000 ప్రాథమిక వేతనం ఉంది. ఒకవేళ 3.833 ఫ్యాక్టర్నే అమలు చేస్తే అది సుమారు రూ.68,994 అవుతుంది. ఉద్యోగ సంఘాల రూ.69,000 కనీస వేతన డిమాండ్కు ఇది దగ్గరగా ఉంటుంది.అదే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57గా ఉంటే రూ.18,000 ప్రాథమిక వేతనం రూ.46,260 అవుతుంది. 2.00 అయితే రూ.36,000, 1.83 అయితే రూ.32,940గా ఉంటుంది. అయితే ఈ లెక్కలు ప్రాథమిక వేతనానికి మాత్రమే వర్తిస్తాయి. చేతికి వచ్చే మొత్తం జీతం ఇంతే శాతంలో పెరుగుతుందని భావించకూడదు. డీఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్సులు, కొత్త పే మ్యాట్రిక్స్ వంటి అంశాలపై తుది వేతనం ఆధారపడి ఉంటుంది.3.833పై ఎందుకు ఆశలు?ఉద్యోగ సంఘాల లెక్కల ప్రకారం జీవన వ్యయం, కుటుంబ అవసరాలు, ద్రవ్యోల్బణం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని కనీస వేతనాన్ని రూ.69,000గా నిర్ణయించాలనే ప్రతిపాదన వచ్చింది. దీనికి అనుగుణంగానే 3.833 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను సూచించారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లలో వార్షిక ఇన్క్రిమెంట్ను ప్రస్తుత 3 శాతం నుంచి 6 శాతానికి పెంచాలన్న ప్రతిపాదన కూడా ఉంది.8వ వేతన సంఘం తుది నిర్ణయం ఎప్పుడు?8వ కేంద్ర వేతన సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం 2025 నవంబర్ 3న ఏర్పాటు చేసింది. కమిషన్కు తన నివేదిక సమర్పించేందుకు 18 నెలల గడువు ఇచ్చారు. ప్రస్తుతం ఉద్యోగులు, పెన్షనర్లు, ఉద్యోగ సంఘాలు, వివిధ సంస్థల నుంచి అభిప్రాయాలు, డిమాండ్లను సేకరించే ప్రక్రియ కొనసాగుతోంది.కమిషన్ 2026 ఆగస్టు 31–సెప్టెంబర్ 1 తేదీల్లో జైపూర్లో ఉద్యోగ, పెన్షనర్ సంఘాలతో సమావేశాలు నిర్వహించనుంది. అనంతరం దేశంలోని పలు ప్రాంతాల్లో సంప్రదింపులు కొనసాగనున్నాయి.ఇదీ చదవండి: ఐటీ కంపెనీ ఉద్యోగులకు బోనస్.. జీతాల పెంపుపై అప్డేట్ -
లెన్స్కార్ట్లో సాఫ్ట్బ్యాంక్ వాటాల విక్రయం
న్యూఢిల్లీ: టెక్నాలజీ సంస్థల్లో ఇన్వెస్ట్ చేసే సాఫ్ట్బ్యాంక్ గ్రూప్ తాజాగా లెన్స్కార్ట్ సొల్యూషన్స్లో వాటాలను మరింతగా తగ్గించుకుంది. ఓపెన్ మార్కెట్లో 2.6 శాతం వాటాలను రూ. 2,888 కోట్లకు విక్రయించింది. జూన్లో 3.25 శాతం వాటాలను సాఫ్ట్బ్యాంక్ రూ. 2,873 కోట్లకు విక్రయించింది.తాజాగా ఒక్కో షేరుకి సగటున రూ. 641.75 రేటుతో తమ అనుబంధ సంస్థ ఎస్వీఎఫ్ టూ లైట్బల్బ్ (కేమ్యాన్) ద్వారా మొత్తం 4.5 కోట్ల షేర్లను అమ్మేసింది. దీనితో కంపెనీలో సాఫ్ట్బ్యాంక్ వాటా 9.86 శాతం నుంచి 7.28 శాతానికి దిగి వచ్చింది. -
ఐటీ కంపెనీ ఉద్యోగులకు బోనస్.. జీతాల పెంపుపై అప్డేట్
దేశంలోని ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ ఉద్యోగులకు ఏప్రిల్–జూన్ త్రైమాసికానికి సగటున 70 శాతం పనితీరు ఆధారిత బోనస్ (వేరియబుల్ పే) చెల్లించినట్లు సమాచారం. ఉద్యోగుల పనితీరు, జాబ్ లెవల్ను బట్టి ఈ చెల్లింపు సుమారు 65 శాతం నుంచి 80 శాతం మధ్య ఉన్నట్లు కంపెనీ వర్గాలను ఉటంకిస్తూ పలు నివేదికలు వెల్లడించాయి. తాజా చెల్లింపు గత త్రైమాసికంతో పోలిస్తే మారలేదు. అయితే గతేడాది ఇదే కాలంలో ఇచ్చిన 80 శాతంతో పోలిస్తే 10 శాతం పాయింట్లు తగ్గింది.జాబ్ లెవల్స్ (JL) 4, 5లోని ఉద్యోగులకు లెవల్6తో పోలిస్తే కొంత మెరుగైన వేరియబుల్ పే లభించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అత్యుత్తమ పనితీరు కనబరిచిన లెవల్4 ఉద్యోగులకు 80 శాతం, లెవల్5 ఉద్యోగులకు 78 శాతం వరకు చెల్లింపు జరిగినట్లు సమాచారం. అయితే ఉద్యోగుల వ్యక్తిగత పనితీరు రేటింగ్, అర్హత వంటి అంశాల ఆధారంగా వాస్తవ చెల్లింపు మారవచ్చు.ఈసారి వేరియబుల్ పే చెల్లింపులు ఐటీ రంగంలో కొనసాగుతున్న సవాళ్ల మధ్య వచ్చాయి. క్లయింట్ల విచక్షణాధికార వ్యయం మందగించడం, స్థూల ఆర్థిక అనిశ్చితి, అలాగే కృత్రిమ మేధ (AI) కారణంగా వ్యాపార నమూనాల్లో వేగంగా వస్తున్న మార్పులు టెక్ కంపెనీలపై ఒత్తిడి పెంచుతున్నాయి. గత త్రైమాసికంలోనూ ఇన్ఫోసిస్ సగటున 70 శాతం వేరియబుల్ పే చెల్లించింది.రూ.7,769 కోట్ల నికర లాభంఇదిలా ఉండగా, జూన్తో ముగిసిన తొలి త్రైమాసికంలో ఇన్ఫోసిస్ పనితీరు మిశ్రమంగా ఉంది. కంపెనీ ఏకీకృత నికర లాభం ఏడాది ప్రాతిపదికన 12.2 శాతం పెరిగి రూ.7,769 కోట్లకు చేరింది. ఆదాయం 14 శాతం పెరిగి రూ.48,211 కోట్లుగా నమోదైంది. అయితే స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఆదాయ వృద్ధి 2.4 శాతంగా మాత్రమే ఉంది.త్రైమాసికం ముగిసే నాటికి ఇన్ఫోసిస్ ఉద్యోగుల సంఖ్య 3,28,062గా ఉంది. ఇది మార్చి త్రైమాసికంతో పోలిస్తే 532 తగ్గింది. మరోవైపు, ఉద్యోగుల వాలంటరీ అట్రిషన్ రేటు 13 శాతానికి పెరిగింది. AI ఆధారిత సేవలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక నైపుణ్యాలున్న ఉద్యోగులపై కంపెనీ దృష్టి సారిస్తోంది. రాబోయే సంవత్సరాల్లో ఫార్వర్డ్ డిప్లాయ్డ్ ఇంజినీర్ల సంఖ్యను 6,000కు పెంచే ప్రణాళికను కూడా ఇన్ఫోసిస్ ప్రకటించింది.జీతాల పెంపు ఎప్పటి నుంచి?ఇక ఉద్యోగులు ఎదురుచూస్తున్న వార్షిక వేతన సవరణలపై కూడా కంపెనీ ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. అర్హత కలిగిన ఉద్యోగులకు జీతాల పెంపును 2026 అక్టోబర్, 2027 జనవరిలో దశలవారీగా అమలు చేయనున్నట్లు ఇన్ఫోసిస్ తెలిపింది. అందువల్ల లెవల్4, లెవల్5 స్థాయిల్లోని అర్హులైన ఉద్యోగులకు అక్టోబర్లో, సీనియర్ స్థాయిల్లోని ఉద్యోగులకు జనవరిలో వేతన సవరణలు అందే అవకాశం ఉంది.ఇదీ చదవండి: TCS రూ. 3,574 కోట్ల డీల్.. -
బంగారం, వెండిపై బిగ్ న్యూస్.. ఎట్టకేలకు తగ్గుముఖం
దేశంలో బంగారం ధరలు ఎట్టకేలకు తగ్గుముఖం పట్టాయి. గత ఐదు రోజులుగా వరుసగా పెరిగిపోయిన పసిడి ధరలు నేడు దిగివచ్చాయి. దీంతో పుత్తడి కొనుగోలుదారులకు ఈరోజు ఉపశమనం లభించింది. ఇక వెండి ధరలు కూడా శాంతించాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
రూ.999కే ఇంటిపై సోలార్.. టాటా పవర్ కొత్త స్కీమ్
పెరుగుతున్న విద్యుత్ బిల్లులకు ప్రత్యామ్నాయంగా ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవాలని చాలామంది భావిస్తుంటారు. అయితే భారీగా ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాల్సి రావడం అడ్డంకిగా మారుతోంది. ఈ నేపథ్యంలో టాటా పవర్ బీహార్లో ‘ఘర్ ఘర్ సోలార్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా అర్హత ఉన్న గృహ వినియోగదారులు కేవలం రూ.999 ప్రారంభ చెల్లింపుతో రూఫ్టాప్ సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తోంది.టాటా పవర్ సోలార్ రూఫ్ (Solaroof) ద్వారా అందిస్తున్న ఈ ప్రత్యేక ఫైనాన్సింగ్ సదుపాయంలో సిస్టమ్ ఖర్చుకు 100 శాతం వరకు రుణ సౌకర్యం అందుబాటులో ఉండొచ్చు. రుణ కాలపరిమితి గరిష్ఠంగా 60 నెలల వరకు ఉంటుంది. అయితే వడ్డీ రేటు, అర్హత, ఈఎంఐ వంటి అంశాలు వినియోగదారుడి ప్రొఫైల్, సిస్టమ్ సామర్థ్యం, ఫైనాన్సింగ్ భాగస్వామిని బట్టి మారవచ్చు. టాటా పవర్ ప్రస్తుతం సోలార్ ఫైనాన్సింగ్ కోసం బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలతో కలిసి పనిచేస్తోంది.5 ఏళ్ల వరకు ఈఎంఐబీహార్లో ప్రకటించిన ఈ ఆఫర్లో రూ.999ను ప్రారంభ చెల్లింపుగా చెల్లించి మిగిలిన మొత్తాన్ని ఈఎంఐల రూపంలో చెల్లించే అవకాశం ఉంది. కొన్ని సోలార్ సిస్టమ్లపై 60 నెలల వరకు కాలపరిమితి ఉండొచ్చు. ఫైనాన్సింగ్ నిబంధనలు, వడ్డీ, సబ్సిడీ, సిస్టమ్ ధర ఆధారంగా వాస్తవ ఈఎంఐ మారుతుంది.టాటా పవర్ తాజా బీహార్ కార్యక్రమం ద్వారా రాబోయే మూడేళ్లలో 5 లక్షల ఇళ్లకు రూఫ్టాప్ సోలార్ చేరవేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. బీహార్లో ఇప్పటివరకు సుమారు 25 వేల రూఫ్టాప్ సోలార్ ఇన్స్టాలేషన్లు జరిగిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని కంపెనీ భావిస్తోంది. ఇందుకోసం 18 బ్యాంకులతో భాగస్వామ్యం చేసుకున్నట్లు, సుమారు 100 మంది భాగస్వాములు, రిటైలర్లతో కలిసి పనిచేయనున్నట్లు వెల్లడించింది.కేంద్ర, రాష్ట్ర సబ్సిడీతో మరింత ప్రయోజనంరూఫ్టాప్ సోలార్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన కింద సబ్సిడీ అందిస్తోంది. ప్రస్తుతం 1 కిలోవాట్ సోలార్ సిస్టమ్కు రూ.30,000, 2 కిలోవాట్లకు రూ.60,000, 3 కిలోవాట్లు లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యానికి గరిష్ఠంగా రూ.78,000 వరకు కేంద్ర సబ్సిడీ లభిస్తుంది.బీహార్ ప్రభుత్వం కూడా అదనపు సాయం ప్రకటించినట్లు టాటా పవర్ తెలిపింది. రాష్ట్ర సబ్సిడీ 1 కిలోవాట్కు రూ.10,000, 2 కిలోవాట్లకు రూ.20,000గా ఉండగా, కేంద్ర-రాష్ట్ర సబ్సిడీలతో కలిపి 1 కిలోవాట్కు రూ.40,000, 2 కిలోవాట్లకు రూ.80,000, 3 కిలోవాట్లు లేదా అంతకంటే ఎక్కువకు రూ.98,000 వరకు మొత్తం ప్రయోజనం లభించవచ్చని కంపెనీ వెల్లడించింది.ఇదీ చదవండి: పోస్టల్ శాఖ గుడ్ న్యూస్.. ఇక మరింత మందికి ఆ బెనిఫిట్ -
Stock Market Updates: నష్టాల్లో నిఫ్టీ, సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 10:05 సమయానికి నిఫ్టీ(Nifty) 72 పాయింట్లు తగ్గి 24,146 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 148 పాయింట్లు క్షీణించి 77,220 వద్ద ట్రేడవుతోంది.నిఫ్టీ 50 ఇండెక్స్ లో సిప్లా, హిందాల్కో ఇండస్ట్రీస్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ టాప్ లూజర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.02 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.06 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఆటో అత్యధికంగా క్షీణించగా, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ అత్యధికంగా పెరిగాయి.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.02బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 92.42 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.72 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.28 శాతం నష్టపోయింది.నాస్డాక్ 0.76 శాతం నష్టపోయింది.Today Nifty position 25-08-2026(time: 10:07 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
TCS రూ. 3,574 కోట్ల డీల్..
సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సరీ్వసెస్(టీసీఎస్) తాజాగా జర్మనీ స్పోర్ట్స్ కార్ల తయారీ దిగ్గజం పోర్షే ఏజీకి చెందిన ఐటీ యూనిట్ కొనుగోలుకి ఒప్పందం కుదుర్చుకుంది. పోర్షే అనుబంధ సంస్థ ఎంహెచ్పీ మేనేజ్మెంట్–యూఎన్డీ ఐటీ–బెరాటంగ్ జీఎంబీహెచ్ (ఎంహెచ్)లో 100% వాటా సొంతం చేసుకోనున్నట్లు టీసీఎస్ పేర్కొంది. 32 కోట్ల యూరోల(రూ. 3,574 కోట్లు) ఎంటర్ప్రైజ్ విలువలో డీల్ కుదిరినట్లు వెల్లడించింది.తాజా కొనుగోలు జర్మన్ దిగ్గజంతో 1.25 బిలియన్ యూరోల విలువైన ఐదేళ్ల వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగమని తెలిపింది. సొంత అనుబంధ కంపెనీ టీసీఎస్ నెదర్లాండ్స్ బీవీ ద్వారా ఎంహెచ్పీని కొనుగోలు చేయనున్నట్లు పేర్కొంది. కాగా.. ప్రభుత్వ రంగంతోపాటు ఆటోమోటివ్, తయారీ, ఏరోస్పేస్, డిఫెన్స్, ఎనర్జీ రంగాల్లో మేనేజ్మెంట్, ఐటీ కన్సల్టెన్సీ సేవలను ఎంహెచ్పీ అందిస్తోంది. కంపెనీ సిబ్బంది సంఖ్య 4,500కాగా.. 2025లో 74.2 కోట్ల యూరోల ఆదాయం ఆర్జించింది.పోర్షేకు సెంటర్తాజా సహకారంలో భాగంగా పోర్షే కోసం ప్రత్యేకించిన ఏఐ మొబిలిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(కేంద్రాన్ని) టీసీఎస్ ఏర్పాటు చేయనుంది. ఏఐ, సాఫ్ట్వేర్, డేటా ద్వారా ఆటోమోటివ్ పరిశ్రమలో మార్పులకు తెరలేవనున్న నేపథ్యంలో టీసీఎస్కున్న ఏఐ, ఇంజినీరింగ్, టెక్, బిజినెస్ ట్రాన్స్ఫార్మేషన్ సామర్థ్యాలకు ఎంహెచ్పీకిగల పటిష్ట ఆటోమోటివ్ కన్సల్టింగ్ నైపుణ్యాలు జతవనున్నాయి. రెండింటి సమన్వయంతో పోర్షేకు ఏఐని మరింత విస్తృతంగా అందించనున్నట్లు టీసీఎస్ సీఈవో కె.కృతివాసన్ చెప్పారు. -
క్విక్ కామర్స్ సంస్థల ఫుడ్ లైసెన్సులు సస్పెండ్
క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్లపై విషపూరిత దతూర (ఉమ్మెత్త) పండ్లు, విత్తనాలను మానవ వినియోగానికి అనువైన ఆహార ఉత్పత్తులుగా విక్రయించినట్లు గుర్తించిన కర్ణాటక ఆహార భద్రత, ఔషధ పరిపాలనా విభాగం కీలక చర్యలు తీసుకుంది. అమెజాన్, స్విగ్గీ ఇన్స్టామార్ట్, బిగ్బాస్కెట్లకు జారీ చేసిన ఫుడ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్లను తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.విషపూరిత ఉత్పత్తులను క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్ల ద్వారా విక్రయిస్తున్నారన్న ఫిర్యాదులు రావడంతో అధికారులు దతూర ఉత్పత్తుల విక్రయం, ఆన్లైన్ లిస్టింగ్లపై విచారణ చేపట్టారు. దర్యాప్తులో కొన్ని ప్లాట్ఫామ్లలో దతూర పండ్లు, విత్తనాలు ఆహార ఉత్పత్తులుగా కనిపించడంతో పాటు వాటిపై FSSAI ఫుడ్ లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్లు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొన్ని ప్యాకెట్లను గిడ్డంగుల్లో నిల్వ ఉంచి ఆన్లైన్ ఆర్డర్ల ద్వారా విక్రయించేందుకు సిద్ధంగా ఉంచినట్లు వెల్లడైంది.తింటే తీవ్ర ఆరోగ్య ముప్పుదతూరను సాధారణంగా ‘థోర్న్ యాపిల్’గా పిలుస్తారు. ఇందులో సహజంగా విషపూరిత ఆల్కలాయిడ్లు ఉండటంతో దీనిని తినడం తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. అధికారులు ప్రత్యేకంగా శుద్ధి చేయని దతూరను వినియోగించడం ప్రజారోగ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. తీవ్రమైన విషప్రభావం ఏర్పడితే కోమా వంటి పరిస్థితులు, అత్యంత తీవ్ర సందర్భాల్లో మరణం కూడా సంభవించే అవకాశం ఉందని వైద్యపరమైన హెచ్చరికలు ఉన్నాయి.కంపెనీల వివరణలపై అసంతృప్తిఈ వ్యవహారంపై సంబంధిత సంస్థల ప్రతినిధులు అధికారుల ఎదుట హాజరయ్యారు. ఉత్తర్వుల ప్రకారం, అమెజాన్ తన వివరణను సమర్పించలేదు. ఇన్స్టామార్ట్ తనవైపు తీసుకున్న చర్యలకు సంబంధించిన పత్రాలను సమర్పించేందుకు మరింత సమయం కోరింది. మరోవైపు బిగ్బాస్కెట్ దతూర పండ్ల ఆన్లైన్ విక్రయాన్ని నిలిపివేసినట్లు తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి ఉత్పత్తులపై ‘మానవ వినియోగానికి కాదు’ అనే హెచ్చరికను స్పష్టంగా ముద్రించేలా లేబులింగ్ను సరిచేస్తామని పేర్కొంది. అయితే ఈ వివరణలు సంతృప్తికరంగా లేవని ఆహార భద్రతా విభాగం తేల్చింది.సెల్లర్లపైనా చర్యలుదతూరను ఆహారంగా నిల్వ చేయడం, విక్రయించడం లేదా పంపిణీ చేయడం అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్లాట్ఫామ్లకు ఉత్పత్తులను సరఫరా చేస్తున్న విక్రేతలు, సరఫరాదారుల ఫుడ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్లను కూడా తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు. అలాగే దతూర పండ్లు లేదా విత్తనాలను ఆహారం/మానవ వినియోగం కోసం అందిస్తున్న అన్ని ఆన్లైన్ లిస్టింగ్లు, ప్రకటనలను తొలగించాలని లేదా నిలిపివేయాలని సంబంధిత ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లను ఆదేశించారు.ఇదీ చదవండి: ఈ జలుబు మందులు బ్యాన్.. నిషేధించిన కేంద్రం -
షుగర్ రేటు వింటే బీపీ
దేశంలో చక్కెర ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. చెరకు పంట నష్టం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల దేశీయంగా ఉత్పత్తి అంచనాలు తగ్గడం, పండుగల సీజన్ నేపథ్యంలో డిమాండ్ భారీగా ఎగబాకడంతో ధరలు దూసుకెళ్తున్నాయి. నెల రోజుల్లోనే 30 % ఎగసిన రిటైల్ రేటు ప్రస్తుతం సగటున కేజీ రూ. 63 స్థాయికి చేరింది. దీంతో సరఫరా పెంచి ధరలను అదుపులో ఉంచేందుకు దశాబ్దకాలం తర్వాత కేంద్రం తొలిసారి దిగుమతులకు తలుపులు తెరిచింది. అక్రమ నిల్వలకు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగింది. మరోవైపు చక్కెర కొరతకు ప్రభుత్వ ఇథనాల్ పాలసీ కూడా కారణమంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సాక్షి, బిజినెస్ డెస్క్: చక్కెర ఉత్పత్తిలో ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న భారత్.. దాదాపు పదేళ్ల తర్వాత దిగుమతుల బాట పట్టింది. సరఫరా తగ్గడంతోపాటు పండుగలు,వివాహాల సీజన్ దగ్గరపడుతుండటంతో చక్కెరకు డిమాండ్ జోరందుకుంది. ఇళ్లలో వినియోగంతోపాటు స్వీట్లు, బేకరీలు, పానీయాలు, ఇతర ఆహార ఉత్పత్తుల తయారీలోనూ చక్కెర అవసరం పెరుగుతోంది. దీంతో రిటైల్గా కిలో చక్కెర ధర జూలై 20న రూ. 48 స్థాయిలో ఉండగా తాజాగా రూ. 63 (దేశవ్యాప్త సగటు)కు చేరింది. అంటే ఒక్క నెలలోనే దాదాపు 30 శాతం పెరిగింది. ఏడాదిలో దాదాపు 35 శాతం జంప్ చేసింది. కొందరు వ్యాపారులు, ఉత్పత్తిదారులు నిల్వలు పెంచుకోవడం కూడా సరఫరాపై ప్రభావం చూపుతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ధరలను అదుపులో ఉంచడంతోపాటు మార్కెట్లో సరఫరా కొరతకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలకు తెరతీసింది. ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు 10 లక్షల టన్నుల ముడి చక్కెరను సుంకాల్లేకుండా దిగుమతి చేసుకోవడానికి అనుమతించింది. మిగులు నుంచి కొరతలోకి... భారత్ సాధారణంగా ఏడాదికి 3.2–3.4 కోట్ల టన్నుల చక్కెరను ఉత్పత్తి చేస్తుంది. దేశీయంగా వినియోగం 2.8–2.9 కోట్ల టన్నుల వరకు ఉంటుంది. అంటే పంట బాగా పండితే నికరంగా మిగులు ఉంటుంది. ఎగుమతులు, కొంత ఇథనాల్కు మళ్లింపు ద్వారా దీన్ని పరిశ్రమ మేనేజ్ చేస్తూ వస్తోంది. అయితే ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా మారింది. పంచదార ఉత్పత్తి అంచనాలు తొలుత 3.43 కోట్ల టన్నులుగా ఉండగా తాజాగా ప్రభుత్వం దాన్ని 3.06 కోట్ల టన్నులకు కుదించింది. దీంతో దేశీ వినియోగం కోసం సరిపడా సరఫరా ఉన్నప్పటికీ అదనంగా అందుబాటులో ఉండే నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. తక్కువ దేశీయ ఉత్పత్తి, పెరిగిన సీజనల్ డిమాండ్తోపాటు అకాల వర్షాలు, పంట తెగుళ్ల కారణంగా చెరకు పంట దెబ్బతినడం, అంతర్జాతీయంగా సరఫరా తగ్గడం వంటి అంశాలు కూడా ధరలపై ప్రభావం చూపుతున్నాయి. నిల్వలపై కేంద్రం నిఘా కొందరు వ్యాపారులు, ఫ్యాక్టరీలు చక్కెరను అవసరానికి మించి నిల్వ చేస్తున్నాయన్న సమాచారం నేపథ్యంలో కేంద్రం చర్యలు చేపట్టింది. ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు దేశవ్యాప్తంగా చక్కెర డీలర్లకు 400 టన్నుల నిల్వ పరిమితి విధించింది. దీన్ని 200 టన్నులకు తగ్గించాలని కూడా ఐఎస్ఎంఏ డిమాండ్ చేస్తోంది. బల్క్ వినియోగదారులు (పానియాలు, చాక్లెట్లు, స్వీట్లు–బేకరీ తయారీ తదితర సంస్థలు) 15 రోజుల అవసరానికి మించి నిల్వ చేసుకోకుండా సెప్టెంబర్ 1 నుంచి నియంత్రణలు అమల్లోకి రానున్నాయి. మరోవైపు కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నాలను అడ్డుకోవడమే లక్ష్యంగా నిఘా పెంచింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చక్కెర ఫాక్టరీల్లో నిల్వల తనిఖీపై దృష్టిపెట్టారు. ముందస్తు క్రషింగ్... చక్కెర దిగుమతులతోపాటు దేశీయ ఉత్పత్తిని త్వరగా మార్కెట్లోకి తీసుకురావడంపైనా ప్రభుత్వం దృష్టిపెట్టింది. సాధారణంగా ప్రారంభమయ్యే సమయం కంటే ముందే అక్టోబర్ 15 నుంచి చెరకు క్రషింగ్ ప్రారంభించాలని రాష్ట్రాలు, చక్కెర కర్మాగారాలకు సూచించింది. ముందస్తు క్రషింగ్ వల్ల అక్టోబర్లో చక్కెర ఉత్పత్తి సాధారణంగా ఉండే 3–4 లక్షల టన్నుల నుంచి 10 లక్షల టన్నులకుపైగా పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అంతర్జాతీయంగానూ ధరలు పైపైకి దేశీయ ఉత్పత్తి తగ్గడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా కూడా చక్కెర సరఫరా తగ్గుముఖం పట్టింది. 2026–27లో ప్రపంచవ్యాప్తంగా 33 లక్షల టన్నుల మేర చక్కెర కొరత ఉండొచ్చని ప్రభుత్వం అంచనా వేసింది. కాగా, అంతర్జాతీయంగా చక్కెర ధర జూన్ 30న టన్నుకు 474 డాలర్ల నుంచి ఆగస్టు 20 నాటికి 552 డాలర్లకు పెరిగింది. అంటే రెండు నెలల్లోనే 16 శాతానికిపైగా ఎగసింది. ఈ నేపథ్యంలో భారత్ దిగుమతులకు తెరతీయడం వల్ల దేశీయంగా సరఫరా పెరిగినా.. అంతర్జాతీయంగా చక్కెర ధరలు పెరగడం వల్ల, రూపాయి క్షీణత కారణంగా దిగుమతులు భారంగా మారొచ్చనేది మార్కెట్ వర్గాల మాట. ఇథనాల్కు మళ్లింపు ప్రభావం? చక్కెరను ఇథనాల్ తయారీకి మళ్లించడం వల్లే ప్రస్తుత కొరత ఏర్పడిందన్న విమర్శలు జోరందుకున్నాయి. భారతీయ చక్కెర, బయో ఇందన తయారీదారుల సంఘం (ఐఎస్ఎంఏ) 2025–26 సీజన్ (అక్టోబర్–సెప్టెంబర్)లో నికరంగా చక్కెర ఉత్పత్తి 2.9 కోట్ల టన్నులుగా లెక్కగట్టింది. దీనికి ప్రధానంగా 31 లక్షల టన్నుల చక్కెరకు సమానమైన ఫీడ్స్టాక్ ఇథనాల్ కోసం మళ్లిస్తున్నట్లు వెల్లడించింది. దేశీయంగా చెరకు పంటలో ఇది 10 శాతంగా అంచనా. అయితే దేశీయంగా చక్కెర కొరత లేదని రానున్న రోజుల్లో రిటైల్ ధరలు దిగొస్తాయని ఐఎస్ఎంఏ పేర్కొంది. మరోవైపు కేంద్రం ఇథనాల్పై వస్తున్న విమర్శలను కొట్టిపారేస్తోంది. ఇథనాల్ కోసం చక్కెర (చెరకు రసం, సిరప్, మొలాసిస్) మళ్లింపు వాటా 2022–23లో సుమారు 12 శాతం ఉండగా 2025–26లో అది 9 శాతానికి తగ్గినట్లు చెబుతోంది. అంతేకాకుండా ప్రస్తుతం దేశంలో తయారయ్యే ఇథనాల్లో దాదాపు మూడొంతుల ఫీడ్స్టాక్ ధాన్యాల నుంచి ముఖ్యంగా మొక్కజొన్న నుంచి వస్తోందని స్పష్టం చేసింది. ప్రస్తుత చక్కెర ధరల పెరుగుదల ఇథనాల్ తయారీ కోసం చక్కెరను మళ్లించడం వల్ల కాదనేది కేంద్రం వాదన. దేశంలో చక్కెర నిల్వలేమీ అడుగంటలేదని.. ఉత్పత్తి తగ్గడంతోపాటు పండుగల ముందు పెరిగిన డిమాండ్తో సాధారణంగా ఉండే అదనపు నిల్వలు తగ్గిపోవడమే ప్రస్తుత సమస్యకు ప్రధాన కారణమని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
కియోసాకి హెచ్చరిక.. డాలర్పై ఆందోళన!
ప్రముఖ రచయిత, పెట్టుబడులపై అవగాహన కల్పించే రాబర్ట్ కియోసాకి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమెరికా ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తుండటం, డబ్బు సరఫరా పెరగడం, ద్రవ్యోల్బణం కొనసాగడం వంటి పరిణామాలు భవిష్యత్తులో డాలర్ విలువపై ప్రభావం చూపవచ్చని ఆయన హెచ్చరిస్తున్నారు.ప్రభుత్వాలు అవసరానికి మించి డబ్బును సృష్టించినప్పుడు.. కాలక్రమంలో ఆ కరెన్సీ కొనుగోలు శక్తి తగ్గుతుందని కియోసాకి అభిప్రాయపడుతున్నారు. గతంలో జర్మనీ, జింబాబ్వే, వెనిజులా వంటి దేశాల్లో చోటుచేసుకున్న తీవ్ర ద్రవ్యోల్బణ పరిస్థితులను దీనికి ఉదాహరణలుగా చూపిస్తూ.. చరిత్ర అబద్ధం చెప్పదని అన్నారు.డాలర్లు దాచుకుంటే..మన సంపద మొత్తాన్ని నగదు రూపంలోనే ఉంచుకోవద్దన్నది కియోసాకి చెబుతున్నారు. ద్రవ్యోల్బణం పెరిగితే బ్యాంకులో ఉన్న డబ్బు సంఖ్య మారకపోయినా.. ఆ డబ్బుతో కొనగల వస్తువుల విలువ తగ్గిపోవచ్చు. అందుకే.. ఆదాయం ఇచ్చే ఆస్తులను కలిగి ఉండటం ముఖ్యమని ఆయన చెబుతున్నారు. అద్దె ఆదాయం వచ్చే ప్రాపర్టీలు, నగదు ప్రవాహం ఉన్న వ్యాపారాలు వంటి వాటిని ఆయన ఉదాహరణలుగా ప్రస్తావిస్తున్నారు.బంగారం, వెండి, బిట్కాయిన్ ఎందుకు?కియోసాకి చాలాకాలంగా బంగారం, వెండి, బిట్కాయిన్ వంటి ఆస్తులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రభుత్వాలు అవసరమైనంత బంగారం లేదా వెండిని సులభంగా సృష్టించలేవని, అందువల్ల కరెన్సీ విలువ పడిపోయే సమయంలో ఇవి ప్రత్యామ్నాయ ఆస్తులుగా ఉపయోగపడవచ్చని ఆయన భావిస్తున్నారు. బిట్కాయిన్ను కూడా పరిమిత సరఫరా ఉన్న డిజిటల్ ఆస్తిగా చూస్తున్నారు.అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. బంగారం, వెండి, బిట్కాయిన్ లేదా రియల్ ఎస్టేట్ ఎప్పుడూ పెరుగుతాయని చెప్పలేం. వీటి ధరల్లో కూడా భారీ హెచ్చుతగ్గులు ఉండొచ్చు. కాబట్టి కియోసాకి సూచనలను పెట్టుబడి హామీగా కాకుండా.. వైవిధ్యమైన ఆర్థిక ప్రణాళిక అవసరమనే కోణంలో చూడటం మంచిది.కియోసాకి సందేశంలో అసలు హైలైట్ “Hope is not a strategy” అనే మాట. అంటే భవిష్యత్తులో అంతా బాగానే జరుగుతుందని ఆశిస్తూ కూర్చోవడం కంటే.. ఏ పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేలా ముందుగానే సిద్ధంగా ఉండాలని ఆయన చెబుతున్నారు. ఒకే ఉద్యోగం లేదా ఒకే ఆదాయ వనరుపై ఆధారపడకుండా అదనపు ఆదాయ మార్గాలను ఏర్పాటు చేసుకోవాలని, సంపదను వివిధ రకాల ఆస్తుల్లో విభజించుకోవాలని సూచిస్తున్నారు.డాలర్ నిజంగానే కుప్పకూలుతుందా?ఇక్కడ కాస్త జాగ్రత్తగా చూడాల్సిన అంశం ఉంది. డాలర్ తప్పకుండా కుప్పకూలుతుంది, అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది అనేది నిర్ధారిత వాస్తవం కాదు. అది కియోసాకి వ్యక్తిగత అంచనా మాత్రమే.అమెరికా ఆర్థిక వ్యవస్థ, డాలర్ ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా ఉన్న స్థానం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే భవిష్యత్తును ఖచ్చితంగా అంచనా వేయడం అంత సులభం కాదు. ఆర్థిక పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కాబట్టి సంపాదించడం మాత్రమే కాకుండా, సంపదను ఎలా కాపాడుకోవాలి, ఆదాయానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎలా సృష్టించుకోవాలి అనే దానిపై కూడా ముందుగానే ఆలోచించాలని కియోసాకి ఉద్దేశం.ఇదీ చదవండి: ట్రంప్ సర్కార్ కొత్త ప్లాన్.. భారతీయులకు భారీ షాక్? -
యూపీఐ పేమెంట్స్.. పదేళ్లలో ఊహించని వృద్ధి!
దేశీయంగా డిజిటల్ చెల్లింపులకు ఊతమిచ్చే దిశగా కేంద్రం ఏకీకృత చెల్లింపు విధానాన్ని (యూపీఐ) ప్రవేశపెట్టి పదేళ్లవుతోంది. 2016 ఆగస్టు 25న అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు యూపీఐ లావాదేవీల పరిమాణం ఏకంగా 13,000 రెట్లు పెరిగింది. 2016-17లో 1.78 కోట్లుగా ఉన్న పరిమాణం 2025-26 నాటికి ఏకంగా 24,162 కోట్లకు చేరినట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదే వ్యవధిలో లావాదేవీల విలువ రూ. 7,000 నుంచి సుమారు 4,000 రెట్లు పెరిగి రూ. 314 లక్షల కోట్లకు చేరినట్లు వివరించింది.రిజర్వ్ బ్యాంక్ పర్యవేక్షణలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) రూపొందించిన యూపీఐ ఇటు లావాదేవీల పరిమాణం, అటు విలువపరంగా కూడా గత పదేళ్లలో అసాధారణ స్థాయిలో పెరిగినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. యూపీఐ ప్రస్థానంలో 2026 కీలక మైలురాయిగా నిలిచినట్లు వివరించింది. ఈ ఏడాది మేలో నెలవారీ లావాదేవీలు తొలిసారిగా 2,300 కోట్లు దాటి 2,320 కోట్లకు చేరాయని పేర్కొంది. జూలైలో ఇది మరింతగా పెరిగి 2,366 కోట్ల లావాదేవీలకు చేరినట్లు వివరించింది. మరిన్ని ప్రత్యేకతలు..తొలి ఏడాది 2016–17లో యూపీఐలో చేరిన బ్యాంకుల సంఖ్య 44గా ఉండగా ప్రస్తుతం అది 703కి చేరింది.దేశీయంగా డిజిటల్ చెల్లింపుల కోసం తీర్చిదిద్దిన ఆవిష్కరణ నేడు సీమాంతర లావాదేవీలకు కూడా విస్తరించింది. ప్రస్తుతం 11 దేశాల్లో యూపీఐ వినియోగంలో ఉంది. యూఏఈ, ఫ్రాన్స్, భూటాన్, శ్రీలంక, నేపాల్, సింగపూర్, మారిషస్, ఖతర్, కాంబోడియా, గ్రీస్, మాల్దీవులు ఈ జాబితాలో ఉన్నాయి.అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ప్రకారం 2025లో గ్లోబల్గా రియల్టైమ్ చెల్లింపు లావాదేవీల పరిమాణంలో యూపీఐ వాటా దాదాపు 49 శాతంగా నమో దైంది.From your morning chai to your daily essentials, from college canteens to fuel stops and festive shopping, UPI has become a trusted part of everyday life.As we celebrate #10yearsofUPI, we thank every citizen, merchant, student, professional, and entrepreneur who made digital… pic.twitter.com/ncET2e07Yj— Ministry of Finance (@FinMinIndia) August 22, 2026 -
విమాన ప్రయాణికులకు ఊరట.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్!
న్యూఢిల్లీ: దేశీ విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్రయాణికుల ఇమిగ్రేషన్ క్లియరెన్స్కి ఇకపై ఫిజికల్ బోర్డింగ్ పాస్ల అవసరం ఉండదు. ప్రయాణికులు తమ స్మార్ట్ఫోన్ల్లోని ఈ–బోర్డింగ్ పాస్ చూపిస్తే సరిపోతుంది. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లపై ఫిజికల్ స్టాంపింగ్ ప్రక్రియను తొలగించడం ఇందుకు కారణం. సెప్టెంబర్ 1 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని ఇమిగ్రేషన్ బ్యూరో (బీవోఐ) వెల్లడించింది.హోమ్ శాఖలో భాగమైన బీవోఐ సోషల్ మీడియా ఎక్స్లో ఈ మేరకు పోస్ట్ చేసింది. ఎఫ్టీఐ–టీటీపీ (ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్–ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రాం) కింద నమోదు చేసుకున్న ప్రయాణికులు కూడా ఈ–గేట్స్ వద్ద ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని తెలిపింది. పేపర్రహితమైన, సాఫీ ప్రయాణానికి ఈ విధానం దోహదపడగలదని బీవోఐ వివరించింది.⚠️ IMPORTANT ADVISORY!Starting 1st September 2026, go digital! 👉🏽 e-BOARDING PASSES NOW ACCEPTED🔸 International travellers can use e-boarding passes displayed on their smartphones during immigration clearance.🔸 FTI-TTP enrolled travellers can also use them at e-Gates.… pic.twitter.com/9os2Eg0nP2— Bureau of Immigration, Government of India (@BOIndiaOfficial) August 24, 2026 -
ట్రంప్ సర్కార్ కొత్త ప్లాన్.. భారతీయులకు భారీ షాక్?
అమెరికాలో ఉద్యోగాలు, చదువుల కోసం వెళ్లే భారతీయులకు ట్రంప్ ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్త నిబంధనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా H-1B వీసా, F-1 ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) ప్రోగ్రామ్లపై భారీ ఫీజులు విధించే ప్రతిపాదనలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ నిబంధన ప్రకారం.. H-1B వీసా ఫీజు ఏకంగా 1,03,265 డాలర్లకు (దాదాపు రూ.98.91 లక్షలు) పెరిగే అవకాశం ఉంది. గతంలో 1 లక్ష డాలర్ల ఫీజును ప్రతిపాదించినప్పటికీ, ఆ నిర్ణయంపై కోర్టులో వివాదం కొనసాగుతోంది.భారతీయులపై ప్రభావంఈ ప్రతిపాదనలు భారతీయులకు చాలా కీలకం. ఎందుకంటే.. అమెరికా H-1B వీసా లబ్ధిదారుల్లో 70 శాతానికి పైగా భారతీయులే ఉన్నారు. 2024లో అమెరికా USCIS సుమారు 3,99,402 H-1B పిటిషన్లను ఆమోదించగా, అందులో ఇండియాలో జన్మించిన వారికి సంబంధించిన లబ్ధిదారుల వాటా దాదాపు 71 శాతంగా ఉంది. అందువల్ల H-1B ఫీజు భారీగా పెరిగితే అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకునే భారతీయ నిపుణులు, వారిని స్పాన్సర్ చేసే కంపెనీలపై ఆర్థిక భారం గణనీయంగా పెరగవచ్చు.OPTపై కూడా భారీ ఫీజు?H-1Bతో పాటు F-1 విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత అమెరికాలో ఉద్యోగ అనుభవం పొందేందుకు ఉపయోగించే ఓపీటీ కార్యక్రమంపైనా కొత్త ఫీజు విధించే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ఈ ఫీజు సుమారు 1 లక్ష డాలర్ల వరకు ఉండవచ్చనే అంచనాలు ఉన్నాయి. అయితే అసలు ఫీజు ఎంత, ఎవరికి వర్తిస్తుంది వంటి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ ప్రతిపాదన ప్రస్తుతం వైట్హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ పరిశీలన దశలో ఉన్నట్లు ఇమ్మిగ్రేషన్ సంస్థలు చెబుతున్నాయి.H-1B ఉద్యోగులకు కొత్త రూల్కొత్త ఫీజులతో పాటు H-1B ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్ను తొలగించే ప్రతిపాదనను కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ తీసుకొచ్చింది. ప్రస్తుతం H-1B ఉద్యోగం కోల్పోయినవారు కొన్ని పరిస్థితుల్లో 60 రోజుల వరకు కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నిబంధన తొలగిస్తే.. ఉద్యోగం ముగిసిన వెంటనే కొత్త మార్గం చూసుకోవాల్సి రావచ్చు. లేదంటే అమెరికాలో ఇమ్మిగ్రేషన్ స్టేటస్ ఉల్లంఘనకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఉద్యోగులపై మాత్రమే కాకుండా వారి డిపెండెంట్లపైనా దీని ప్రభావం పడే అవకాశం ఉంది.అయితే..ఈ నిబంధనలన్నీ ఇప్పటికీ ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. తుది నిర్ణయం తీసుకుని అధికారికంగా అమలు చేసే వరకు ఫీజులు లేదా నిబంధనలు ఖరారైనట్లుగా చెప్పలేం. అయినప్పటికీ H-1Bపై ఆధారపడుతున్న భారతీయ టెక్ నిపుణులు, అమెరికాలో చదువుతున్న విద్యార్థులు, వారిని నియమించుకునే కంపెనీల్లో ఈ ప్రతిపాదనలు తీవ్ర చర్చకు దారితీశాయి. అమెరికాలో భారతీయ మూలాలున్న వారి సంఖ్య 52 లక్షలకు పైగా ఉండటంతో, ఇమ్మిగ్రేషన్ విధానాల్లో వచ్చే మార్పులు భారతీయులపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది.ఇదీ చదవండి: దూసుకెళ్తున్న బిట్కాయిన్.. కారణాలివే! -
ఐదు నెలల గరిష్ఠానికి బంగారం ధర!
అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్స్, అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తత వల్ల డిమాండ్ పుంజుకోవడంతో పసిడి ధరలు మళ్లీ పరుగులు తీస్తున్నాయి. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర మరో రూ. 900 పెరిగి రూ. 1,64,400కి చేరింది. ఇది ఐదు నెలల గరిష్ట స్థాయి.చివరిసారిగా మార్చి 9న పుత్తడి రేటు రూ. 1,64,300 పలికింది. అటు వెండికూడా వరుసగా మూడో సెషన్లోనూ పెరిగింది. కేజీకి రూ. 3,500 పెరిగి రూ. 2,53,500కి చేరింది. అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో బంగారం రేటు ఔన్సుకి (31.1 గ్రాములు) 42.45 డాలర్లు (1 శాతం) పెరిగి 4,646.54 డాలర్లు పలికినట్లు కోటక్ సెక్యూరిటీస్ ఏవీపీ (కమోడిటీ రీసెర్చ్) కైనాత్ చైన్వాలా తెలిపారు.వెండి ధర ఫ్లాట్గా 69 డాలర్ల వద్ద ట్రేడయినట్లు పేర్కొన్నారు. బంగారం కీలకమైన 4,650 డాలర్ల చేరువకు వచ్చిన నేపథ్యంలో తదుపరి కదలికలు భౌగోళిక-రాజకీయ పరిస్థితుల కన్నా ద్రవ్యోల్బణంపైనే ఆధారపడి ఉంటాయని వివరించారు.ఇదీ చదవండి: దూసుకెళ్తున్న బిట్కాయిన్.. కారణాలివే! -
దూసుకెళ్తున్న బిట్కాయిన్.. కారణాలివే!
క్రిప్టో మార్కెట్లో బిట్కాయిన్ మరోసారి దూకుడు పెంచింది. సోమవారం బిట్కాయిన్ ధర సుమారు 2 శాతం పెరిగి 80,000 డాలర్లకు చేరువలో ట్రేడైంది. మే తర్వాత ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. బిట్కాయిన్తో పాటు ఈథర్ కూడా దాదాపు 2 శాతం లాభపడి 2,500 డాలర్లకు చేరుకుంది. దీంతో క్రిప్టోకు సంబంధించిన కంపెనీల షేర్లు కూడా లాభాల్లో ట్రేడయ్యాయి.మూడు రోజుల్లో 20 శాతానికి..గత కొంతకాలంగా బిట్కాయిన్ ధర పరిమిత శ్రేణిలోనే కదులుతోంది. అయితే.. ఇటీవల మూడు రోజుల్లోనే 20 శాతానికి పైగా పెరగడంతో మార్కెట్లో ఒక్కసారిగా ఉత్సాహం పెరిగింది. బిట్కాయిన్లో భారీగా షార్ట్ పొజిషన్లు తీసుకున్న ట్రేడర్ల స్థానాలు మూసివేయబడటం కూడా.. ఈ ర్యాలీకి మరింత బలం ఇచ్చింది. మొత్తం 4 బిలియన్ డాలర్లకు పైగా బేరిష్ క్రిప్టో పొజిషన్లు లిక్విడేట్ అయినట్లు సమాచారం.ETFల్లోకి భారీగా పెట్టుబడులుబిట్కాయిన్ ర్యాలీకి మరో ముఖ్యమైన కారణం.. పెట్టుబడిదారుల నుంచి పెరిగిన డిమాండ్. గత వారం స్పాట్ బిట్కాయిన్ ETFల్లోకి సుమారు 1.92 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. గత అక్టోబర్ తర్వాత ఒక వారంలో వచ్చిన అత్యధిక పెట్టుబడులు ఇవే. దీంతో పెద్ద ఇన్వెస్టర్లు మళ్లీ క్రిప్టోపై ఆసక్తి చూపుతున్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి.ఆర్థిక ఆందోళనలు కూడా కారణమేఅమెరికా ద్రవ్యోల్బణం, ప్రభుత్వ ఆర్థిక లోటు, పెరుగుతున్న రుణభారం వంటి అంశాలు కూడా బిట్కాయిన్కు అనుకూలంగా మారుతున్నాయి. అమెరికా ట్రెజరీ దీర్ఘకాలిక ప్రభుత్వ బాండ్ల కొనుగోళ్లను పెంచనున్నట్లు ప్రకటించడంతో బాండ్ ఈల్డ్స్ కొంత తగ్గాయి. దీంతో బిట్కాయిన్, బంగారం వంటి ప్రత్యామ్నాయ ఆస్తులపై పెట్టుబడిదారుల ఆసక్తి పెరిగింది.ర్యాలీ కొనసాగుతుందా?బిట్కాయిన్ ప్రస్తుత ర్యాలీ నిజంగా కొత్త అప్ట్రెండ్కు సంకేతమా, లేక తాత్కాలిక పెరుగుదల మాత్రమేనా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. 2023 జనవరిలో కూడా బిట్కాయిన్ మూడు రోజుల్లో సుమారు 20 శాతం పెరిగింది. అయితే ఆ సమయంలో ర్యాలీ ఎక్కువ కాలం కొనసాగలేదు. ప్రస్తుతం కూడా అదే పరిస్థితి వస్తుందా అనే విషయంలో మార్కెట్ నిపుణులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.రే డాలియో కీలక వ్యాఖ్యలుప్రముఖ పెట్టుబడిదారుడు రే డాలియో ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలు రాబోయే సంవత్సరాల్లో సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు తమ పోర్ట్ఫోలియోలో కొంత మొత్తాన్ని బిట్కాయిన్లో ఉంచుకోవచ్చని ఆయన సూచించారు. దీంతో బిట్కాయిన్ భవిష్యత్తుపై చర్చ మరింత వేడెక్కింది. మొత్తం మీద.. ETF పెట్టుబడులు, షార్ట్ స్క్వీజ్, ఆర్థిక ఆందోళనలు కలిసి బిట్కాయిన్ ర్యాలీకి ప్రస్తుతం మద్దతుగా నిలుస్తున్నాయి.ఇదీ చదవండి: ద్రవ్యోల్బణం ముప్పు తప్పదా?.. పీటర్ షిఫ్ సంచలన వ్యాఖ్యలు -
కొత్త లుక్తో 2026 పల్సర్ బైక్స్ లాంచ్: ధరలు, ఫీచర్లు ఇవే..
బజాజ్ ఆటో భారతదేశంలో 2026 పల్సర్ 125, పల్సర్ 150 మోటార్సైకిల్స్ లాంచ్ చేసింది. ఈ రెండు బైక్లు అప్డేటెడ్ డిజైన్, వెడల్పైన ఫ్యూయల్ ట్యాంకులతో వస్తున్నాయి.2001లో తొలిసారిగా లాంచ్ అయినప్పటి నుంచి పల్సర్ సిరీస్ భారతీయ రైడర్లకు అత్యంత ఇష్టమైన బైకులలో ఒకటిగా నిలిచింది. సంవత్సరాలు గడిచేకొద్దీ.. ఈ శ్రేణిలో ఫుల్లీ ఫెయిర్డ్ అండ్ నేకెడ్ స్ట్రీట్ బైక్లు కూడా చేరాయి. బజాజ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 20 మిలియన్లకు పైగా పల్సర్ మోటార్సైకిళ్లను విక్రయించి, దేశంలో అత్యంత విశ్వసనీయమైన మోటార్సైకిల్ బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది.2026 బజాజ్ పల్సర్ 125 & పల్సర్ 1502026 పల్సర్ 125 రెండు కాస్మెటిక్ వేరియంట్లలో, విభిన్న సీటింగ్ ఆప్షన్లతో వస్తుంది. ప్రీమియం కార్బన్ ఫైబర్ స్ప్లిట్ సీట్ వేరియంట్ ధర రూ. 94,518, కాగా సింగిల్ సీట్ ఆప్షన్ ధర రూ. 92,341. ఈ మోటార్సైకిల్ బ్లాక్ గోల్డ్, బ్లాక్ సియాన్ బ్లూ, బ్లాక్ డార్క్ గ్రే, బ్లాక్ రేస్ రెడ్, మరియు రేసింగ్ రెడ్ టాన్ బీజ్ రంగులలో లభిస్తుంది. కేవలం సింగిల్ సీట్లో మాత్రమే వచ్చే ఎంట్రీ-లెవల్ నియాన్ ట్రిమ్ ధర రూ. 90,494 (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్). బ్లాక్ గోల్డ్ షేడ్ మినహా, ఇది కార్బన్ ఫైబర్ మోడల్ మాదిరిగానే అదే రంగులను కలిగి ఉంటుంది.ఇక 2026 పల్సర్ 150 విషయానికి వస్తే.. ఇది బ్రేకింగ్ కాన్ఫిగరేషన్ల ఆధారంగా మూడు వేరియంట్లలో వస్తుంది. సింగిల్ డిస్క్ (SD) వేరియంట్ ధర రూ. 1.11 లక్షలు, సింగిల్ డిస్క్ అప్గ్రేడ్ ధర రూ. 1.14 లక్షలు, ట్విన్ డిస్క్ అప్గ్రేడ్ ధర రూ. 1.17 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్). అన్ని మోడళ్లు బ్లాక్ గోల్డ్, ఎబోనీ బ్లాక్ చెర్రీ రెడ్, ఎబోనీ బ్లాక్ ఇంక్ బ్లూ అనే నాలుగు రంగులలో లభిస్తాయి.2026 బజాజ్ పల్సర్ 125 విశేషాలు2026 పల్సర్ 125 కొత్త 124.38 సీసీ ఇంజన్ను పొందుతుంది, ఇది ఇప్పుడు 11.93 bhp పవర్ అవుట్పుట్ను ఉత్పత్తి చేస్తుంది. 5-అంగుళాల TFT స్క్రీన్, గూగుల్ మ్యాప్స్ నావిగేషన్, పూర్తి ఎల్ఈడీ లైటింగ్, హజార్డ్ లైట్లు, USB-టైప్ సీ ఛార్జింగ్ పోర్ట్, మల్టిపుల్ రైడింగ్ మోడ్లతో సహా అనేక కొత్త ఫీచర్లతో వస్తుంది.మంచి రైడింగ్ కోసం.. ఈ మోటార్సైకిల్కు క్లిప్ ఆన్ హ్యాండిల్బార్లు, వెనుక భాగంలో గ్యాస్ ఛార్జ్డ్ మోనోషాక్ సస్పెన్షన్ కూడా లభిస్తాయి. దీనిలోని ప్రత్యేక ఫీచర్లలో ఒకటి 'క్రావల్ టెక్', ఇది ఈ సెగ్మెంట్లో మొదటిది. ఇది రైడర్లు థ్రాటిల్ను తాకకుండానే బైక్ను నెమ్మదిగా కదిలించడానికి అనుమతిస్తుంది, ఇది రద్దీగా ఉండే ట్రాఫిక్లో లేదా ఇరుకైన ప్రదేశాలలో ఉపయోగపడుతుంది.2026 బజాజ్ పల్సర్ 150 విశేషాలు2026 పల్సర్ 150, దాని మునుపటి మోడల్లో ఉన్న అదే 149.5 సీసీ ఇంజన్ ద్వారా 13.8 bhp పవర్ అందిస్తుంది. అయితే.. ఇప్పుడు ఇది మల్టిపుల్ రైడ్ మోడ్లు, క్లిప్-ఆన్ హ్యాండిల్బార్లు మరియు మరింత స్పోర్టీ లుక్ కోసం బెల్లీ పాన్ వంటి అనేక కొత్త అదనపు ఫీచర్లతో వస్తుంది.కొత్త పల్సర్ 125 మాదిరిగానే, 150లో కూడా 5-అంగుళాల TFT డిస్ప్లే, గూగుల్ మ్యాప్స్ నావిగేషన్, పూర్తి ఎల్ఈడీ లైటింగ్, హజార్డ్ లైట్లు, USB-టైప్ సీ ఛార్జింగ్ పోర్ట్ మరియు గ్యాస్ ఛార్జ్డ్ మోనోషాక్ సస్పెన్షన్ ఉన్నాయి. కొత్త క్రావల్ టెక్ ఫీచర్ కూడా ఉంది. -
వారానికి ఐదు రోజుల పనేనా?
దేశంలోని బ్యాంకు ఉద్యోగులు, అధికారుల సంఘాల ఉమ్మడి వేదికైన యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీయూ) వారానికి 5 రోజుల పనిదినాల అమలు డిమాండ్తో మరోసారి సమ్మెకు సిద్ధమైంది. 12వ ద్వైపాక్షిక ఒప్పందం (12th Bipartite Settlement), 9వ జాయింట్ నోటిఫై 2024పై మార్చి 8నే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ), యూనియన్లు సంతకాలు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఆమోదం ఇంకా లభించకపోవడమే ఈ ఆందోళనకు ప్రధాన కారణం.ఈ ఒప్పందం ప్రకారం శని, ఆదివారాలు సెలవు దినాలుగా ప్రకటిస్తూ దానికి పరిహారంగా సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు 40 నిమిషాల అదనపు పనివేళలను పెంచేందుకు యూనియన్లు అంగీకరించాయి. అయితే ప్రభుత్వ ఆలస్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ యూఎఫ్బీయూ మూడు దశల ఆందోళన కార్యక్రమాలను ప్రకటించింది. అందులో భాగంగా సెప్టెంబర్ 11న ఒక రోజు దేశవ్యాప్త సమ్మె, సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు 3 రోజుల సమ్మె, అప్పటికీ డిమాండ్లు నెరవేరకపోతే అక్టోబర్ 26 నుంచి అనిశ్చిత కాల సమ్మె చేపడతామని స్పష్టం చేసింది.వారానికి 5 రోజుల బ్యాంకింగ్తో పాటు ప్రభుత్వ ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) తీసుకొచ్చిన విచక్షణాయుతమైన పనితీరు ఆధారిత ప్రోత్సాహకాల విధానాన్ని వెనక్కి తీసుకోవాలని, దానికి సమానమైన పీఎల్ఐని వర్తింపజేయాలని యూనియన్లు కోరుతున్నాయి. అలాగే పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ, పెన్షన్ అప్డేషన్, డీఏ ఫార్ములాను ఏకీకృతం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.నేటి డిజిటల్ యుగంలో నెట్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చినందున బ్యాంకింగ్ రంగంలో 5 రోజుల పనిదినాల అమలు వల్ల కస్టమర్ సేవలకు ఎటువంటి విఘాతం కలగదని బ్యాంకింగ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. పైగా, ఉద్యోగులలో వర్క్-లైఫ్ సమతుల్యత పెరిగి వారి మానసిక ఒత్తిడి తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన స్పందించి ఈ సుదీర్ఘ డిమాండ్పై నిర్ణయం తీసుకోకుంటే పండుగల సీజన్లో బ్యాంకింగ్ సేవలకు తీవ్ర విఘాతం కలిగే అవకాశం ఉంది.ఇదీ చదవండి: తాతముత్తాతల ఆస్తి హక్కులు పొందడం ఎలా? -
వైఫై, బ్లూటూత్, నెట్తో ఈవీఎంలను కనెక్ట్ చేయొచ్చా?
భారత ఎన్నికల ప్రక్రియలో ఉపయోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంలు) పూర్తి సురక్షితమైనవని, వాటికి ఎలాంటి వైఫై, బ్లూటూత్ లేదా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండదని కేంద్ర ముఖ్య ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. లఖ్నవూలోని కాళ్వీన్ తాలుక్దార్స్ కళాశాలలో విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా ఈవీఎంలపై వచ్చే పలు అనుమానాలకు సమాధానమిస్తూ భారతదేశంలో ఉపయోగించే ఈవీఎంలను ప్రభుత్వ రంగ సంస్థలే తయారు చేస్తాయని వెల్లడించారు. ఇవి ఇతర వైర్లెస్ సాంకేతికతలతో అనుసంధానం కావు కాబట్టి వీటిని హ్యాక్ చేయడం లేదా ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని తెలిపారు.సోషల్ మీడియా ప్రచారాలపై అప్రమత్తతసామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందే సమాచారాన్ని గుడ్డిగా నమ్మవద్దని విద్యార్థులకు జ్ఞానేష్ కుమార్ సూచించారు. ఏ సమాచారాన్నైనా స్వీకరించే ముందు లేదా ఇతరులతో పంచుకునే ముందు దాని మూలం, ప్రామాణికతను తనిఖీ చేయడం ఎంతో అవసరమని అన్నారు. భారతదేశంలో సుమారు 100 కోట్ల మందికి పైగా ఓటర్లు ఉన్నారని, ఇంత భారీ స్థాయిలో ఎన్నికలు నిర్వహించడం ఒక బృహత్తర కార్యమని చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326ను ప్రస్తావిస్తూ, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ డిజిటల్ ప్లాట్ఫారమ్ల ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. యువత భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం మరింత బలోపేతమవుతుందని ఆకాంక్షించారు.అమెరికా వంటి దేశాల్లో భారత ఓటింగ్ విధానం, ఓటరు గుర్తింపు కార్డుల నిర్వహణపై ఇటీవల ప్రశంసలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీఈసీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎన్నికల విధానాలపై ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ ఓటింగ్ ఆధారాలపై ఓటర్లు అవగాహన పెంపొందించుకోవాలని పౌరులకు సూచించారు.ఇదీ చదవండి: తాతముత్తాతల ఆస్తి హక్కులు పొందడం ఎలా? -
ఐపీఓకి సిద్ధమవుతున్న ఫ్రీడమ్ ఆయిల్స్ మాతృ సంస్థ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ వంటనూనెల తయారీ సంస్థ ఫ్రీడమ్ ఆయిల్స్ మాతృ కంపెనీ ‘జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ (జీఈఎఫ్ఎల్)’ పబ్లిక్ ఇష్యూకి (ఐపీవో) సిద్ధమవుతోంది. పరిశ్రమ దిగ్గజం ప్రదీప్ కుమార్ చౌదరి సారథ్యంలో వేగంగా విస్తరిస్తున్న ఈ సంస్థ ఐపీవోలో భాగంగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా 4.115 కోట్ల షేర్లను విక్రయించనుంది.విక్రయదారుల్లో బ్లాక్ రివర్ ఫుడ్ 2 (3.086 కోట్ల షేర్లు), ఇన్వెస్ట్మెంట్ అండ్ కమర్షియల్ ఎంటర్ప్రైజ్ (61.7 లక్షల షేర్లు), ప్రమోటర్ అల్కా చౌదరి, జీఏఐఈ (చెరో 20.6 లక్షల షేర్లు) ఉన్నారు.ఆర్థిక వృద్ధి.. తయారీ సామర్థ్యంవంటనూనెలు, స్పెషాలిటీ ఫ్యాట్స్ తయారీ, ట్రేడింగ్, మార్కెటింగ్లో పట్టు సాధించిన జీఈఎఫ్ఎల్ వినియోగ ఉత్పత్తుల సమగ్ర ప్లాట్ఫామ్గా ఎదిగేందుకు మసాలా దినుసులు, కన్వీనియెన్స్ ఫుడ్స్ను పోర్ట్ఫోలియోలోకి తెచ్చింది. డీఆర్హెచ్పీలోని సమాచారం ప్రకారం, 2020-2025 ఆర్థిక సంవత్సరాల మధ్య బ్రాండెడ్ ఆదాయం ఏటా 20.5% కాంపౌండ్ వృద్ధిని నమోదు చేసింది. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.9,053.84 కోట్లుగా ఉన్న కంపెనీ మొత్తం ఆదాయం, 2026 ఆర్థిక సంవత్సరం నాటికి 16.83% వార్షిక వృద్ధితో రూ.12,650 కోట్లకు చేరుకుంది.ఉత్పత్తి కేంద్రాలు..ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ (రెండు ప్లాంట్లు), కృష్ణపట్నం (ఒక ప్లాంట్)ల్లో ఉన్న మూడింటి ఉమ్మడి రిఫైనింగ్ సామర్థ్యం వార్షికంగా 12.22 లక్షల మెట్రిక్ టన్నులు కాగా 2026 నివేదిక ప్రకారం 6.66 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని సాధించింది.తదుపరి వ్యూహందక్షిణాది ప్యాకేజ్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రిటైల్ విపణిలో ఆదాయంపరంగా 22.2% వాటాతో జీఈఎఫ్ఎల్ అగ్రస్థానంలో ఉంది. 1,600 డిస్ట్రిబ్యూటర్లు, 3 లక్షలకు పైగా రిటైల్ ఔట్లెట్లు, 60కి పైగా వేర్హౌస్ల బలమైన నెట్వర్క్తో దాదాపు 31.8 కోట్ల మంది వినియోగదారులకు కంపెనీ చేరువైందని ప్రతినిధులు చెప్పారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లో మార్కెట్ లీడర్షిప్ను కాపాడుకుంటూనే తెలంగాణ, కర్ణాటకలతో పాటు కేరళ, పశ్చిమ బెంగాల్, ఇతర రాష్ట్రాల్లోని మార్కెట్లకు తమ నెట్వర్క్ను విస్తరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని తెలిపారు.ఇదీ చదవండి: తాతముత్తాతల ఆస్తి హక్కులు పొందడం ఎలా? -
త్వరలోనే తెలంగాణ ప్రభుత్వ సొంత ‘రైడ్-హెయిలింగ్’ యాప్!
తెలంగాణలో ఆటో, క్యాబ్ డ్రైవర్ల సంఘాలు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జరిపిన చర్చలు సఫలం కావడంతో డ్రైవర్లు సమ్మెను విరమించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ల సంక్షేమం, ఆదాయ మార్గాల పెంపు లక్ష్యంగా ప్రభుత్వం కొన్ని సంచలనాత్మక నిర్ణయాలను వెల్లడించింది.సొంత యాప్ రూపకల్పనఓలా, ఊబర్ వంటి ప్రైవేట్ అగ్రిగేటర్ సంస్థలకు ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వమే ప్రత్యేకంగా ఒక 'రైడ్-హెయిలింగ్ యాప్'ను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. దీనిద్వారా ప్రైవేట్ యాప్ల కమిషన్ల భారం తగ్గి డ్రైవర్ల నికర ఆదాయం పెరిగే అవకాశముందని చెప్పారు.2012 తర్వాత తొలిసారిగా ఛార్జీల పెంపురవాణా రంగ కార్మికుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ 2012 తర్వాత మొదటిసారిగా ఆటో ఛార్జీల సవరణకు ప్రభుత్వం నిర్ణయాత్మకంగా ఆమోదం తెలిపింది. కొత్త ఛార్జీలకు సంబంధించి త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.ఈవీ కన్వర్షన్కు రూ.1.50 లక్షల సాయంహైదరాబాద్లో కాలుష్య నియంత్రణతో పాటు ఇంధన భారాన్ని తగ్గించేందుకు డీజిల్, పెట్రోల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు (రెట్రోఫిట్టింగ్) ఒక్కో వాహనానికి రూ.1.50 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు స్పష్టం చేశారు.బైక్ ట్యాక్సీలు.. సంక్షేమంపై స్పష్టతవాణిజ్య అవసరాలకు మాత్రమే ఉపయోగించే ‘పసుపు రంగు నంబర్ ప్లేట్’ ఉండే ద్విచక్రవాహనాలను మాత్రమే బైక్ ట్యాక్సీలుగా అనుమతించే అంశంపై త్వరలోనే స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే, ఎన్నికల హామీ ప్రకారం ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12,000 ఆర్థిక సహాయం అందించే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి వివరించారు. సంక్షేమ బోర్డు ఏర్పాటుకు కూడా ప్రభుత్వం అంగీకరించింది.ఇదీ చదవండి: తాతముత్తాతల ఆస్తి హక్కులు పొందడం ఎలా? -
తాతముత్తాతల ఆస్తి హక్కులు పొందడం ఎలా?
తండ్రి లేదా తాతలు, ముత్తాతల నుంచి సంక్రమించిన ఆస్తికి సంబంధించి ఒరిజినల్ సేల్ డీడ్ (క్రయపత్రం) లేకపోవడం, చట్టబద్ధమైన విల్లు రాయకుండానే వారు మరణించడం భారతీయ కుటుంబాల్లో తరచూ ఎదురయ్యే ప్రధాన సమస్య. ఇటువంటి సందర్భాల్లో చట్టబద్ధమైన యాజమాన్య హక్కులను ఎలా నిరూపించుకోవాలి? ఆ ఆస్తిపై వచ్చే అద్దె ఆదాయానికి సంబంధించి ఎలాంటి నిబంధనలు పాటించాలనే దానిపై న్యాయ, పన్ను నిపుణులు స్పష్టమైన దిశానిర్దేశం చేస్తున్నారు.యాజమాన్య హక్కుల నిర్ధారణఒరిజినల్ సేల్ డీడ్ పోయినట్లు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు (ఎఫ్ఐఆర్) చేసి నాన్-ట్రేసబుల్ సర్టిఫికేట్ పొందాలి. అనంతరం రెండు పత్రికల్లో (ఒక ఇంగ్లీష్, ఒక ప్రాంతీయ భాష) బహిరంగ ప్రకటన ఇవ్వాలి.సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి లింక్ డాక్యుమెంట్లు, ‘సర్టిఫైడ్ కాపీ’ పొందాలి. ఇది ఒరిజినల్ పత్రంతో సమానమైన న్యాయపరమైన గుర్తింపు కలిగి ఉంటుంది.విల్లు లేనందున వారసులందరూ తమ హక్కులను నిరూపించుకోవడానికి తహసీల్దార్ ద్వారా లీగల్ హెయిర్ సర్టిఫికేట్ లేదా సివిల్ కోర్టు నుంచి సక్సెషన్ సర్టిఫికేట్ పొందడం తప్పనిసరి.రెవెన్యూ/మున్సిపల్ రికార్డుల్లో పేరు మార్పిడి (మ్యుటేషన్) చేయించాలి. వారసుల్లో ఎవరైనా తమ వాటాను వదులుకోవాలనుకుంటే ‘రిలీజ్ డీడ్’ రిజిస్టర్ చేయాలి.ఇదీ చదవండి: ట్రంప్ ఆరోగ్యంపై నిజనిజాలు! -
ఇండోనేషియా ప్రభుత్వంతో వంతారా భాగస్వామ్యం
ఆసియా ఖండంలో వన్యప్రాణుల ఆరోగ్య రక్షణ, క్షేత్రస్థాయి సంరక్షణ దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ స్థాపించిన వన్యప్రాణి సంరక్షణ సంస్థ వంతారా ఇండోనేషియా ప్రభుత్వంతో కలిసి భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. స్థానిక ‘ఫౌనా ల్యాండ్ గ్రూప్’ భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్ట్ వివరాలను ఇండోనేషియా అటవీ శాఖ మంత్రి రాజా జూలీ ఆంటోనీ జకార్తాలోని విలేకరుల సమావేశంలో వెల్లడించారు.కీలక సంస్కరణలు.. ఆధునిక మౌలిక వసతులుఈ భాగస్వామ్యం కింద వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలను చేపడుతున్నట్లు మంత్రి చెప్పారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..అడవుల్లోని వన్యప్రాణులకు తక్షణ వైద్యం అందించేందుకు 10 సంచార జంతు ఆసుపత్రులను అందుబాటులోకి తెస్తున్నారు.వే కాంబస్ ప్రాంతంలోని ఏనుగుల ఆసుపత్రిని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ‘ఎలిఫెంట్ ట్రీట్మెంట్ అండ్ కేర్ సెంటర్’గా ఆధునీకరిస్తున్నారు. ఇది సంరక్షణలో ఉన్న 62 సుమత్రన్ ఏనుగులతో పాటు, పరిసర ప్రాంతాల్లోని దాదాపు 100 అడవి ఏనుగులకు సేవలందిస్తుంది.ఏనుగుల సంరక్షకులు, పశువైద్యులు, అటవీ శాఖ అధికారులకు అంతర్జాతీయ స్థాయి సాంకేతిక పరిజ్ఞానంలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు.‘వన్యప్రాణుల రక్షణ మా ప్రాథమిక బాధ్యత. వంతారా అనుభవం, వనరుల సహకారంతో మా సొంత మౌలిక వసతులను బలోపేతం చేసుకుంటున్నాం. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయిలో ఇండోనేషియా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నడుస్తాయి’ అని రాజా జూలీ ఆంటోనీ తెలిపారు.అంతర్జాతీయ స్థాయిలో వంతారా విస్తరణవంతారా ఇటీవల ప్రకటించిన ఐదేళ్ల ప్రణాళికలో భాగంగా జూమ్నగర్ కేంద్రంగా అభివృద్ధి చేసిన వైద్య నైపుణ్యాలను అంతర్జాతీయ స్థాయికి విస్తరిస్తోంది. CITES నిబంధనలకు కట్టుబడి వన్యప్రాణుల సహజసిద్ధ ఆవాసాల్లోనే వాటి సంరక్షణకు (in-situ) శ్రీకారం చుట్టింది. వంటార సీఈఓ వివాన్ కరానీ మాట్లాడుతూ, ఇండోనేషియా జీవవైవిధ్యాన్ని కాపాడటంలో భాగస్వామ్యం కావడం గర్వకారణమని పేర్కొనగా, ఫౌనా ల్యాండ్ సీఈఓ డెన్నీ గుణలెన్ ఈ నిర్ణయం స్థానిక అటవీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: ట్రంప్ ఆరోగ్యంపై నిజనిజాలు! -
బ్యాంకులు, అప్పులవారి కన్నుపడని ఆర్థిక కానుక!
ప్రస్తుత రోజుల్లో కుటుంబ ఆర్థిక భద్రత కోసం టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం ప్రతి ఒక్కరికీ అనివార్యంగా మారింది. అయితే, పాలసీదారుడు అకాల మరణం చెందితే ఆ బీమా పరిహారం నిజంగానే ఆయన భార్యాపిల్లలకు అందుతుందా? లేక పాలసీదారులకు ఉన్న అప్పులు, వ్యాపార బాధ్యతల కింద బ్యాంకులకు చెల్లుతుందా? ఈ ప్రశ్నకు చట్టపరమైన పరిష్కారమే ‘మ్యారీడ్ ఉమెన్స్ ప్రాపర్టీ (ఎండబ్ల్యూపీ) యాక్ట్, 1874’. దీని గురించి తెలుసుకుందాం.మనం టర్మ్ ఇన్సూరెన్స్ అప్లికేషన్ ఫారమ్ నింపే సమయంలో ‘I would like to buy this policy under Married Women’s Property Act’ అనే ఒక చెక్ బాక్స్ కనిపిస్తుంది. దీన్ని ఎంచుకోవడం వల్ల పాలసీ ద్వారా వచ్చే డెత్ బెనిఫిట్ (బీమా పరిహారం) పూర్తిగా ఒక ప్రత్యేక లీగల్ ట్రస్ట్గా మారుతుంది. 1874 నాటి ఈ చట్టం (సెక్షన్ 6) ప్రకారం, ఈ నిధులపై కేవలం భార్య, పిల్లలకు మాత్రమే సంపూర్ణ హక్కులు ఉంటాయి.ఎండబ్ల్యూపీ యాక్ట్తో లభించే ప్రయోజనాలుపాలసీదారుడి పేరు మీద గృహ రుణాలు, బిజినెస్ లోన్లు లేదా వ్యక్తిగత అప్పులు ఎంత ఉన్నప్పటికీ ఆయన మరణానంతరం బ్యాంకులు గానీ, అప్పు ఇచ్చినవారు గానీ ఈ బీమా సొమ్మును జప్తు చేయడానికి కోర్టుల ద్వారా కూడా వీల్లేదు.విల్లు లేదా ఇతర వారసత్వ వివాదాలతో సంబంధం లేకుండా ఇతర కుటుంబ సభ్యులు (Extended Family) ఈ సొమ్ముపై ఎలాంటి హక్కులు కోరలేరు. పరిహారం నేరుగా నామినేట్ చేసిన భార్యాపిల్లలకే చేరుతుంది.ఒకసారి పాలసీని ఎండబ్ల్యూపీ యాక్ట్ కింద తీసుకుంటే భవిష్యత్తులో పాలసీదారుడు కూడా లబ్ధిదారులను మార్చడానికి వీలుండదు. ఇది లబ్ధిదారుల హక్కును శాశ్వతంగా కాపాడుతుంది.ఎవరికి ఇది అత్యవసరం?ముఖ్యంగా సొంత వ్యాపారం చేసేవారు, భారీగా రుణాలు ఉన్న ఉద్యోగులు, ఉమ్మడి కుటుంబాల్లో నివసించేవారు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఈ ఆప్షన్ను ఎంచుకోవడం శ్రేయస్కరం. అయితే.. టర్మ్ పాలసీ కొనుగోలు చేసేటప్పుడు మాత్రమే ఈ చెక్ బాక్స్ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఒకసారి పాలసీ జారీ అయిన తర్వాత దీన్ని జోడించడం సాధ్యం కాదు. చిన్న అజాగ్రత్తతో కుటుంబ భవిష్యత్తును ప్రమాదంలో పడేయకుండా టర్మ్ పాలసీతో పాటు ఎండబ్ల్యూపీ యాక్ట్ ఆప్షన్ను ఎంచుకుని భార్యాపిల్లల ఆర్థిక స్వతంత్రతను కాపాడటం కుటుంబ పెద్ద బాధ్యత అని గమనించాలి.ఇదీ చదవండి: ట్రంప్ ఆరోగ్యంపై నిజనిజాలు! -
ట్రంప్ ఆరోగ్యంపై నిజనిజాలు!
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తుల శారీరక, మానసిక ఆరోగ్యం నిరంతరం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. డొనాల్డ్ ట్రంప్ శారీరక పరిమాణం, బరువు పెరుగుదల, ఆరోగ్య ముప్పులపై అంతర్జాతీయ మీడియాలో భిన్న కథనాలు వెలువడుతున్నాయి. కొన్నేళ్లుగా ఆయన బరువులో చోటుచేసుకున్న మార్పులపై వెలువడుతున్న వార్తల నేపథ్యంలో వైట్ హౌస్ విడుదల చేసిన అధికారిక వైద్య నివేదికలు ఏం చెబుతున్నాయో చూద్దాం.హెల్త్ రిపోర్టులు.. నిజనిజాలుమే నెలలో ట్రంప్ బరువు 238 పౌండ్లు, అంటే సుమారు 107.9 కిలోలు అని వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. జార్జియాలో ఎన్నికల జోక్యం కేసులో ఆయనపై అభియోగాలు మోపినప్పుడు ఆగస్టు 2023లో నమోదైన 215 పౌండ్లు, అంటే సుమారు 97.5 కిలోల బరువుతో పోలిస్తే అధికం. మూడు సంవత్సరాల కంటే తక్కువ కాలంలో సుమారు 23 పౌండ్లు లేదా 10.4 కిలోగ్రాముల పెరుగుదలను ఇది సూచిస్తుంది.గుండె ఆరోగ్యం.. జీవక్రియల పనితీరువైద్య పరీక్షల్లో ఆయన రక్తపోటు (సుమారు 128/74), కొలెస్ట్రాల్, గ్లూకోజ్ స్థాయిలు సాధారణ పరిమితుల్లోనే ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. కొలెస్ట్రాల్ నియంత్రణ కోసం ఆయన రెగ్యులర్గా 'రోసువాస్టాటిన్', గుండె ఆరోగ్య రక్షణకు తక్కువ మోతాదు 'యాస్ప్రిన్' ఉపయోగిస్తున్నారు. కొరోనరీ సీటీ యాంజియోగ్రామ్, ఎకోకార్డియో గ్రామ్ పరీక్షల్లో ఎలాంటి గుండె నరాల అడ్డంకులు లేవని, గుండె సమర్థవంతంగా పనిచేస్తోందని తేలింది.వైద్య నిపుణుల హెచ్చరికలుట్రంప్ ఎత్తు (6 అడుగుల 3 అంగుళాలు) ప్రకారంగా ఆయన ప్రస్తుత బీఎంఐ సుమారు 28 నుంచి 29.5 వద్ద ఉంది. వైద్య పారామితుల ప్రకారం 25 దాటిన బీఎంఐని అధిక బరువుగా పరిగణిస్తారు. వయోవృద్ధులలో అధిక బరువు ఉండటం వల్ల భవిష్యత్తులో కార్డియోవాస్క్యులర్ సమస్యలు, మధుమేహం లేదా కీళ్ల నొప్పుల ముప్పు పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.మాంట్రీల్ కాగ్నిటివ్ అసెస్మెంట్ పరీక్షలో 30/30 స్కోరు సాధించడంతో పాటు అన్ని రకాల న్యూరోలాజికల్, శారీరక పరీక్షల్లో ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని, దేశాధినేత బాధ్యతలను నిర్వర్తించడానికి తగిన సామర్థ్యం కలిగి ఉన్నారని అధికారిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. నిరంతర ఆహార నియమాలు, క్రమబద్ధమైన వ్యాయామం ద్వారా బరువును మరింత అదుపులో ఉంచుకోవడం అవసరమని వైద్యులు సూచించారు.ఇదీ చదవండి: టాటా సన్స్.. ఛైర్మన్ పీఠంపై ఉత్కంఠ -
టాటా సన్స్.. ఛైర్మన్ పీఠంపై ఉత్కంఠ
భారతీయ కార్పొరేట్ దిగ్గజం టాటా సన్స్ బోర్డు సెప్టెంబర్ 17న అత్యంత ప్రాధాన్యత కలిగిన సమావేశాన్ని నిర్వహించనుంది. ప్రస్తుత ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ తన పదవీ కాలం ముగిసిన తర్వాత (ఫిబ్రవరి 2027) మరొకసారి ఆ పదవిలో కొనసాగడానికి మొగ్గు చూపడం లేదని ప్రకటించిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.ప్రతిపాదిత సమావేశం నేపథ్యంబాంబే హౌస్లో జరగనున్న ఈ భేటీలో చంద్రశేఖరన్ వైదొలగే ప్రకటనను బోర్డు అధికారికంగా నమోదు చేయడంతో పాటు తదుపరి అధికారి ఎంపిక ప్రక్రియపై కీలక చర్చలు జరగనున్నాయి. ఆగస్టు 12న చంద్రశేఖరన్ బోర్డుకు లేఖ రాస్తూ.. ఫిబ్రవరి 2027తో ముగిసే తన పదవీ కాలం నాటికి కొత్త నాయకుడికి బాధ్యతలు అప్పగించేందుకు వీలుగా ముందస్తుగా ఎంపిక ప్రక్రియ ప్రారంభించాలని కోరారు.టాటా ట్రస్ట్స్ ప్రభావం.. ఐపీఓ సవాళ్లుఈ నాయకత్వ మార్పులో ముఖ్య వాటాదారులైన నోయెల్ టాటా నాయకత్వంలోని టాటా ట్రస్ట్స్ కీలక పాత్ర పోషించనుంది. అంతర్గత వర్గాల ప్రకారం, గత పాలనాపరమైన విధానాలు, నిర్ణయాల్లో ఏకగ్రీవ మద్దతు లభించకపోవడమే చంద్రశేఖరన్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. మరొకవైపు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం టాటా సన్స్ కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీగా ఐపీఓకు వెళ్లాల్సి ఉండగా దాని నుంచి మినహాయింపు పొందేందుకు అప్పులను తీర్చివేసే ప్రక్రియలో కంపెనీ ఉంది.భవిష్యత్తు దిశసెప్టెంబర్ 17 భేటీలో బోర్డు సభ్యులు చంద్రశేఖరన్ను తమ నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని కోరతారా లేదా కొత్త చైర్మన్ ఎంపిక కోసం 5 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక ప్యానెల్ను ఏర్పాటు చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. చంద్రశేఖరన్ పదేళ్ల నాయకత్వంలో టాటా గ్రూప్ ఈ-కామర్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్లు వంటి సరికొత్త రంగాలలోకి వేగంగా విస్తరించింది. ఈ దృష్ట్యా, రాబోయే కొత్త నాయకత్వం టాటా గ్రూప్ భవిష్యత్తు వ్యూహాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందనే అంశంపై స్టాక్ మార్కెట్ నిపుణులు, కార్పొరేట్ వర్గాలు నిశితంగా గమనిస్తున్నాయి.ఇదీ చదవండి: అనలాగ్ పన్నీర్పై నిషేధం -
లాభాల స్వీకరణతో దేశీయ సూచీలపై ఒత్తిడి
భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఈవారం ఆరంభంలో ఒడిదొడుకులకు లోనయ్యాయి. ఈరోజు (ఆగస్టు 24, 2026) ట్రేడింగ్ ముగిసే సమయానికి బెంచ్మార్క్ సూచీ నిఫ్టీ 32 పాయింట్లు నష్టపోయి 24,219 వద్ద, సెన్సెక్స్ 171 పాయింట్లు క్షీణించి 77,369 వద్ద ముగిశాయి. ఆరంభంలో స్వల్ప లాభాలతో ముందంజ వేసినప్పటికీ గ్లోబల్ మార్కెట్ ప్రతికూలతలు, మదుపరుల లాభాల స్వీకరణతో సూచీలు చివరకు నష్టాల్లో ముగిశాయి.సెంటిమెంట్ను దెబ్బతీసిన అంశాలుగ్లోబల్ మార్కెట్లలో బాండ్ ఈల్డ్స్ గరిష్ఠ స్థాయిల్లో నిలకడగా కొనసాగడం, దానికి తోడు పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి పెట్టుబడిదారుల్లో రిస్క్ అపెటైట్ను (ఆసక్తిని) తగ్గించింది. డాలర్ బలపడటంతో రూపీపై ఒత్తిడి పెరిగింది. ఫలితంగా ఇటీవల విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుంచి నిధులను ఉపసంహరించుకోవడం సూచీలను దిగువకు లాగుతోంది. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా రంగాల కీలక షేర్లలో భారీగా విక్రయాలు జరిగాయి. ముఖ్యంగా అధిక వాల్యుయేషన్ల వద్ద లాభాలను స్వీకరించేందుకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలలోని హెచ్చుతగ్గులు ద్రవ్యోల్బణ సంబంధిత ఆందోళనలను పెంచి మార్కెట్ స్థిరత్వాన్ని దెబ్బతీశాయి.మదుపరులకు సూచనసాంకేతికపరంగా నిఫ్టీకి 24,000–24,100 వద్ద బలమైన సపోర్ట్ ఉంది. మార్కెట్ తిరిగి కోలుకోవాలంటే నిఫ్టీ 24,400 స్థాయిని అధిగమించాల్సి ఉంటుంది. ప్రస్తుత అనిశ్చిత వాతావరణంలో రిటైల్ ఇన్వెస్టర్లు తొందరపడి బల్క్ ఇన్వెస్ట్మెంట్లు చేయకుండా నాణ్యమైన షేర్లలో క్రమానుగతంగా పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: అనలాగ్ పన్నీర్పై నిషేధం -
కేంద్ర బ్యాంకులు భయపడుతున్నాయ్: కియోసాకి
కృత్రిమ మేధ (AI) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచ కేంద్ర బ్యాంకుల విధాన నిర్ణయాలు మరింత క్లిష్టంగా మారుతున్నాయని ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన ఫేస్బుక్ ఖాతాలో చేసిన ఓ పోస్ట్లో బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (BIS) నివేదికను ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.కేంద్ర బ్యాంకుల విధాన నిర్ణయాలను ఏఐ ప్రభావితం చేస్తోందని కియోసాకి పేర్కొన్నారు. జూలై 28న BIS విడుదల చేసిన విశ్లేషణలో.. ఏఐ ఒకేసారి ఆర్థిక వ్యవస్థలో డిమాండ్, సరఫరా రెండింటినీ ప్రభావితం చేయడం వల్ల సాధారణ ఆర్థిక సంకేతాలు స్పష్టత కోల్పోతున్నాయని ఆర్థికవేత్తలు పేర్కొన్నట్లు ఆయన వివరించారు. దీంతో ఆర్థిక వ్యవస్థలో అసలు పరిస్థితులను అంచనా వేయడం, దానికి అనుగుణంగా ద్రవ్య విధానాన్ని నిర్ణయించడం కేంద్ర బ్యాంకులకు కష్టతరమవుతోందని తెలిపారు.దీన్ని కియోసాకి తనదైన శైలిలో విశ్లేషించారు. కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచినా, తగ్గించినా వాటి ప్రభావం ఆర్థిక వ్యవస్థపై కనిపించడానికి కొంత సమయం పడుతుందని అన్నారు. అయితే ఏఐ వేగవంతమైన మార్పుల కారణంగా ఈ ‘లాగ్’ తగ్గిపోతోందని పేర్కొన్నారు. కేంద్ర బ్యాంకులు నిర్ణయం తీసుకునేలోపే ఏఐ కారణంగా మార్కెట్లు, వ్యాపార కార్యకలాపాలు వేగంగా మారిపోయే పరిస్థితి ఏర్పడుతోందని అభిప్రాయపడ్డారు.డేటా సెంటర్లు, చిప్లపై భారీ పెట్టుబడులు ఆర్థిక వ్యవస్థలో వేడి పెరుగుతోందన్న సంకేతాలుగా కనిపించవచ్చని, అయితే అవి భవిష్యత్ ఉత్పాదకతను పెంచే దీర్ఘకాలిక పెట్టుబడులు కూడా కావచ్చని కియోసాకి వివరించారు. అదే సమయంలో ఏఐ ద్వారా ఉత్పాదకత పెరగడం వల్ల ఆర్థిక వ్యవస్థలో ఉన్న డిమాండ్ ఒత్తిళ్లు బయటకు కనిపించకుండా పోయే అవకాశం ఉందన్నారు. ఫలితంగా ద్రవ్యోల్బణ పరిస్థితులను అంచనా వేయడం మరింత కష్టమవుతుందని పేర్కొన్నారు.భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావాన్ని కూడా ఏఐ కొంతమేర సమతుల్యం చేస్తోందని కియోసాకి అన్నారు. ముఖ్యంగా ఇరాన్ యుద్ధం కారణంగా ఇంధన ధరలు పెరిగినప్పటికీ, ఏఐ ఆధారిత పెట్టుబడులు, ఉత్పాదకత వంటి అంశాలు ఆ ప్రభావాన్ని కొంతమేర ఎదుర్కొంటున్నాయని ఆయన పేర్కొన్నారు.‘పాలసీ మిస్క్యాలిబ్రేషన్’ అంటే విధాన నిర్ణయాలు తప్పుగా ఉండే ప్రమాదం పెరగడమేనని కియోసాకి వ్యాఖ్యానించారు. కేంద్ర బ్యాంకులు ఆర్థిక వ్యవస్థను నియంత్రించేందుకు ఉపయోగించే కాలవ్యవధి, ఆలస్యం వంటి అంశాలపై ఏఐ ప్రభావం చూపుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.తన ‘రిచ్ డాడ్’ చెప్పిన మాటలను కూడా కియోసాకి ఈ సందర్భంగా గుర్తుచేశారు. డబ్బును నియంత్రించే వ్యక్తులకే అది ఎలా పనిచేస్తుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడినప్పుడే అత్యంత ప్రమాదకరమైన ఆర్థిక సమయం మొదలవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచం అలాంటి దశలోనే ఉందేమోనని ఆయన సందేహం వ్యక్తం చేశారు. -
ఇన్వెస్టర్స్.. ఇవిగో న్యూ ఫండ్ ఆఫర్స్
నిర్దిష్ట యులిప్స్ ద్వారా దీర్ఘకాలికంగా పెట్టుబడుల అవకాశాలను అందించేలా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్తగా బీఎస్ఈ 500 మొమెంటం వేల్యూ 50 ఇండెక్స్ ఫండ్ని ప్రవేశపెట్టింది. ఇది ఆకర్షణీయమైన వేల్యూయేషన్స్తో పాటు సానుకూల మొమెంటం కూడా ఉన్న స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. మారే మార్కెట్ వేల్యుయేషన్స్, ట్రెండ్స్ని బట్టి ప్రతి మూడు నెలలకోసారి దీన్ని సమీక్షించి, పోర్ట్ఫోలియోలో మార్పులు చేర్పులు చేస్తారు.తద్వారా పెట్టుబడుల విషయంలో క్రమశిక్షణ పాటిస్తూనే దీర్ఘకాలికంగా ఈక్విటీల వృద్ధి ప్రయోజనాలను కూడా పొందేందుకు ఇన్వెస్టర్లకు ఇది ఉపయోగపడుతుందని సంస్థ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ మనీష్ కుమార్ తెలిపారు. బీఎస్ఈ 500లోని 50 వైవిధ్యమైన కంపెనీలను నిర్దిష్ట రూల్స్కి లోబడి ఈ ఫండ్ ఎంచుకుని ఇన్వెస్ట్ చేస్తుంది. దీన్ని ఐసీఐసీఐ ప్రూ స్మార్ట్కిడ్ అష్యూర్, సిగ్నేచర్ అష్యూర్, సిగ్నేచర్ ఆన్లైన్ తదితర యులిప్స్ పథకాలతో తీసుకోవచ్చు. 2026 జూన్ 30 నాటికి కంపెనీ నిర్వహణలో రూ. 3.34 లక్షల కోట్ల అసెట్స్ ఉన్నాయి.క్వాంటమ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్వివిధ మార్కెట్ క్యాప్లవ్యాప్తంగా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ను క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ ఆవిష్కరించింది. ఇది సెప్టెంబర్ 4 వరకు అందుబాటులో ఉంటుంది. బాటమ్–అప్ సెలెక్షన్ పద్ధతిలో ఎంపిక చేసిన లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో పెట్టుబడి వృద్ధికి దోహదపడేలా ఈ ఫండ్ ఉంటుంది. వ్యాపార నాణ్యత, మేనేజ్మెంట్ సామర్థ్యాలు, నిలకడగా ఆదాయార్జన అవకాశాలు, కార్పొరేట్ గవర్నెన్స్లాంటి అంశాలను ఇందుకు ప్రాతిపదికగా ఉంటాయి. సముచితమైన ధరకు లభిస్తూ, వృద్ధి చెందే అవకాశాలు ఉన్న స్టాక్స్పై ఇది దృష్టి పెడుతుంది. సీఐవో చిరాగ్ మెహతా, ఫండ్ మేనేజర్ కేతన్ గుజరాతీ దీన్ని నిర్వహిస్తారు. కనీసం రూ. 500 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. -
11న బ్యాంకుల సమ్మె.. నాలుగు రోజులు బంద్!
దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు మరోసారి అంతరాయం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం అమలులో జాప్యం, పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకం (PLI)పై విభేదాలు, పెన్షన్కు సంబంధించిన డిమాండ్లు పరిష్కారం కాకపోవడాన్ని నిరసిస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) సెప్టెంబర్ 11న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. సమ్మె అమల్లోకి వస్తే ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల శాఖల కార్యకలాపాలపై ప్రభావం పడే అవకాశం ఉంది.నాలుగు రోజుల పాటు ప్రభావం?సెప్టెంబర్ 11 శుక్రవారం. ఆ తర్వాత సెప్టెంబర్ 12 రెండో శనివారం, 13 ఆదివారం కావడంతో బ్యాంకింగ్ సేవలకు వరుసగా అంతరాయం ఏర్పడొచ్చు. మరోవైపు సెప్టెంబర్ 14న గణేశ్ చతుర్థి సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లో బ్యాంకు శాఖలు వరుసగా నాలుగు రోజులపాటు మూసి ఉండే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది.సెప్టెంబర్లో మరో భారీ సమ్మెసెప్టెంబర్ 11తో ఆందోళన ఆగదని యూనియన్స్ ఫోరం స్పష్టం చేసింది. డిమాండ్లపై పురోగతి లేకపోతే సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల దేశవ్యాప్త సమ్మెకు దిగుతామని ప్రకటించింది. ఈ సమ్మె సెప్టెంబర్ 28–30 తేదీల్లో జరగనుంది. సెప్టెంబర్ 28న అర్ధవార్షిక ముగింపు కార్యకలాపాలు ఉండటం వల్ల బ్యాంకింగ్ రంగంపై దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉండొచ్చని యూనియన్లు భావిస్తున్నాయి. ఇక డిమాండ్లు పరిష్కారం కాకపోతే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లాలని యూనియన్స్ ఫోరం నిర్ణయించింది.ఖాతాదారులు ఏం చేయాలి?సెప్టెంబర్లో వరుస సమ్మె పిలుపుల నేపథ్యంలో చెక్కులు, నగదు లావాదేవీలు, బ్యాంకు శాఖల్లో చేయాల్సిన ఇతర అత్యవసర పనులను ముందుగానే పూర్తి చేసుకోవడం మంచిది. అయితే UPI, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం వంటి డిజిటల్ సేవలు సాధారణంగా బ్యాంకుల సమ్మె ఉన్నప్పటికీ పనిచేసే అవకాశం ఉంటుంది. అత్యవసర లావాదేవీల కోసం ఖాతాదారులు ప్రత్యామ్నాయ డిజిటల్ మార్గాలను సిద్ధంగా ఉంచుకోవడం మంచిది.ఇదీ చదవండి: ఈ వారం బ్యాంకులకు సెలవులు.. 4 రోజులు బంద్! -
Income Tax: రిటర్నులు వేశాక ఏం చేయాలి..
2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను 2026 జూలై 31 గడువు లోపలే ఆదాయపు పన్ను రిటర్నులు వేసినందుకు సంతోషం. ఒక పెద్ద పని అయిపోయింది. నిజమే..ఒక పెద్ద బాధ్యత నెరవేర్చినట్లే. అయితే, ‘‘ఇల్లు అలకగానే పండుగ కాదు’’ అనే పాతకాలం సామెతలాగా, ఫైల్ చేయడం పూర్తయిపోయినా.. ఇంకా చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. యువకిశోరం అర్జున్ జూలైలో గడువు ముగిసేలోగానే ఫారంని క్లిక్ చేసి, సబ్మిట్ చేసేశాడు. కానీ, పాన్, ఆధార్ కార్డుతో అనుసంధానం కాకపోవడం వల్ల ఫారం V మీద సంతకం పెట్టి, బెంగళూరులో అధికారులకు పంపడం మాత్రం మరిచిపోయాడు. 30 రోజుల్లోపల ‘వేలిడేట్’ చేయకపోవడం వల్ల రిటర్ను చెల్లదు. డిఫెక్టివ్ రిటర్న్ అవుతుంది.రిటర్న్ వేయటానికి ముందే పాన్, ఆధార్ లింక్ చేసుకోవాలి. లేదా కనీసం రిటర్న్ వేసిన వెంటనే లింక్ చేసి, ఓటీపీ ద్వారా రిటర్నులను ‘వేలిడేట్’ చేసుకోవచ్చు. ఏదైనా సాంకేతిక కారణాల వల్ల జాప్యం అయితే, వెంటనే ఫారం V.. అంటే ’అక్నాలెడ్జ్మెంట్’ను స్వయంగా సంతకం పెట్టి, ఆ కాగితాన్ని బెంగళూరుకు పంపాలి. 30లోపల వారికి అందాలి. ఫారం Vలో అన్ని వివరాలు స్పష్టంగా ఉన్నాయి. ఇలా ‘వెరిఫికేషన్’ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయండి.నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎల్రక్టానిక్గా వేలిడేట్ చేసుకోవచ్చు. బ్యాంకు అకౌంటుని ముందుగానే తెలియజేసి, తద్వారా కూడా వేలిడేట్ చేయొచ్చు. డీమ్యాట్ ద్వారా ఒక మార్గం. ఇక పాన్–ఆధార్ అనుసంధానం మంచి మార్గం. ఇవీ కాకుంటే ఫారం Vని సంతకం పెట్టి పోస్ట్ చేయడం మరో మార్గం.వెరిఫై అయితేనే ప్రాసెసింగ్.. రిటర్ను వేసినప్పటి నుంచి ఘడియలు లెక్కపెడతారు కొందరు .. రిఫండు కోసం. రిఫండు ఇంకా రాలేదని వాపోతారు మరికొంత మంది. వెరిఫై అయిన తర్వాతే మొదలవుతుంది అసెస్మెంటు. అంతవరకూ ముట్టుకోరు. ఏవైనా తప్పులు దొర్లాయా.. గడువు తేదీ నాడు వేసేయాలన్న తొందరలో ఏవైనా తప్పులు దొర్లాయా? ఏదైనా ఆదాయం మరచిపోయారా? టీడీఎస్ తక్కువ జమ అయిందా.. ఆదాయ వర్గీకరణలో తప్పు జరిగిందా.. మీ యజమానికి లెక్కల్లో పొరపాట్లు ఏర్పడ్డాయా.. క్యాపిటల్ గెయిన్స్ లెక్కల్లో తప్పులు దొరికాయా.. ఇలాంటి ఎన్నో పరిస్థితులు ఏర్పడితే గాభరాపడొద్దు. మీరు మీ రిటర్నులను రివైజ్ చేసుకోవచ్చు.ఒక ఉదాహరణ.. ప్రాక్టికల్ కేసు. ఒక అసెస్సీ బ్యాంకులో జూలై 31నాడు సెల్ఫ్ అసెస్మెంట్ చలానాలను ఉదయం 10 గంటలకు బ్యాంకులో జమచేశారు. కానీ సాయంకాలం రికార్డులలో అప్డేట్ కాలేదు. అయితే అన్ని వివరాలను పొందుపరుస్తూ, చలాన్ చెల్లించినట్లు రిటర్న్ వేసేశారు. దీని వల్ల లేటు ఫీజు పడలేదు. ఆగస్టు 1నాడు రికార్డుల్లో అప్డేట్ అయిన తర్వాత రిటర్న్ రివైజ్ చేసి, దాఖలు చేశారు. ఎలాంటి అదనపు ఖర్చు లేదు. రివైజ్ చేయడం వల్ల పన్ను భారం పెరిగితే దాన్ని చెల్లించాలి. ఇందుకు గడువు తేది 2026 డిసెంబర్ 31. ఇక డిపార్టుమెంటు వారి వంతు. బంతి వారి చేతిలో ఉంది. వారు ప్రాసెసింగ్ మొదలుపెట్టి, ఆర్డర్లు పాస్ చేస్తారు. ఈ విషయాన్ని తెలిపే ఆర్డరు/వర్తమానం.. పాత చట్టం ప్రకారం 143 (1).. కొత్త చట్టంలో 270 (1) కింద వస్తుంది. వారానికొకసారి మీరు పోర్టల్లో ఈ సమాచారం కోసం ఎదురుచూడండి. ముందుగా మీకు మెసేజ్ వస్తుంది. ఈ సమాచారంలో ప్రాసెసింగ్ పూర్తి అయ్యిందని, సమాచారం పంపుతామని ఉంటుంది. అలా అన్న వెంటనే పంపరు కానీ.. తొందరలోనే వస్తుంది.ఇప్పుడేం చేయాలి.. మీరు వేసిన రిటర్నుల్లో ఆదాయం, పన్ను భారంలో ఎలాంటి తేడాలు లేకపోతే, మీరు వేసిన దానితో సమ్మతిస్తున్నట్లు చెప్తారు. పన్నుభారం కన్నా ఎక్కువ పన్ను చెల్లిస్తే మీకు రిఫండు ఇస్తారు. రిఫండు తగ్గొచ్చు, పెరగవచ్చు. అయితే ప్రతి మార్పుకి/తేడాకి వివరణ ఇస్తారు. ఆదాయంలో మార్పులు రావొచ్చు. లెక్కింపుల్లో తప్పులు రావొచ్చు. పన్ను భారం మారవచ్చు. చెల్లించిన పన్నుల ఎంట్రీలు పూర్తిగా ఉండకపోవచ్చు. ఆ మేరకు లెక్కలు మారవచ్చు.ఏయే మార్పులు వచ్చాయో వాటిని గమనించండి. వాటిని విశ్లేషించండి. అవి తప్పనిపిస్తే వాటితో విభేదించండి. అయితే, ప్రతి దానికి, వివరణ, సంజాయిషీ ఉండాలి. రిఫండు వస్తే సంతోషం. లేదా కారణాలను విశ్లేషించండి. సరైన జవాబు ఇవ్వండి. దీనితో ఈ కథ ముగిసినట్లే. కథ కంచికి. మనం ఇంటికి. అంతటితో ఆ కథకు ముగింపు పలికి, ప్రస్తుతం నడుస్తున్న ఆర్థిక సంవత్సరం గురించి ఆలోచిద్దాం. -
అంతకంతకూ పెరిగిపోతున్న బంగారం! ఇప్పుడు తులం..
దేశంలో బంగారం ధరలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. వరుసగా మూడు రోజులు పెరిగి క్రితం రోజున నిలకడగా ఉన్న పసిడి ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. దీంతో పుత్తడి కొనుగోలుదారులకు ఈరోజు కూడా నిరాశ తప్పలేదు. ఇక వెండి ధరలు కూడా ఇదే రీతిలో కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.ఇదీ చదవండి: బంగారం భారీ ధరలు.. కియోసాకి కామెంట్స్ -
పుంజుకున్న స్టాక్మార్కెట్లు.. లాభాల్లో ఐటీ షేర్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:47 సమయానికి నిఫ్టీ(Nifty) 24 పాయింట్లు పెరిగి 24,276 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 121 పాయింట్లు పుంజుకొని 77,662 వద్ద ట్రేడవుతోంది.ఇన్ఫోసిస్, హిందాల్కో ఇండస్ట్రీస్, హెచ్సీఎల్ టెక్ నిఫ్టీ 50 ఇండెక్స్ లో టాప్ గెయినర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.17 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.33 శాతం పెరిగాయి. రంగాల వారీగా నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మీడియా మెరుగైన పనితీరు కనబరిచగా, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ హెల్త్ కేర్ తక్కువ పనితీరు కనబరిచాయి.ఇదీ చదవండి: ఈ చిట్కాలతో.. మహిళలకూ ట్రేడింగ్ సులువే.. అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.80బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 90.48 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.71 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.43 శాతం పెరిగింది.నాస్డాక్ 0.43 శాతం పుంజుకుంది.Today Nifty position 24-08-2026(time: 9:52 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఈ చిట్కాలతో.. మహిళలకూ ట్రేడింగ్ సులువే..
చాలా మంది గృహిణులకు ‘ఫ్రీ టైమ్’ అంటే గంటలు.. గంటలు దొరకదు. బోలెడన్ని పనుల మధ్యలో.. కొద్ది కొద్దిగా నిమిషాల రూపంలో దొరుకుతుంది. పొద్దున్నే పనులు.. ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్ తయారీ.. అటు పైన పిల్లలు స్కూళ్ల నుంచి రావడం..అక్కణ్నుంచి వాళ్లకు ప్రిపరేషన్లు.. వీటిన్నింటి మధ్య అప్పుడప్పుడు కాస్తంత విరామం లభిస్తుంటుంది. ఇదంతా నిమిషాల వ్యవధిలోనే ఉంటుంది. ఇన్వెస్టింగ్ కావచ్చు..ట్రేడింగ్ కావొచ్చు.. వీటికి గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నా ఇంత హడావుడి మధ్యలో అంతంత సమయం వెచ్చించలేములే అని పక్కన పెట్టేసే పరిస్థితులు ఉంటాయి. అయితే, నిజం చెప్పాలంటే దీని కోసం గంటలు గంటలు స్క్రీన్పై వెచ్చించాల్సిన అవసరం లేదు. ఫైనాన్స్ డిగ్రీ అక్కర్లేదు. మీకు ఆసక్తి ఉండి, ఒక్క అరగంట సేపు ప్రశాంతంగా కాన్సెంట్రేట్ చేయగలిగితే స్ట్రెస్ ఫ్రీగా మార్కెట్ గురించి నేర్చుకోవచ్చు. దీనిపై పట్టు సాధించవచ్చు. ఇందుకోసం సింపుల్ కొన్ని చిట్కాలు ఉన్నాయి.చిన్నగా ప్రారంభించాలి.. ట్రేడింగ్ మొదలుపెట్టాలంటే బోలెడంత డబ్బుండాల్సిందే అనే అపోహ ఒకటుంది. నిజానికి అలాంటిదేమీ లేదు. చిన్న చిన్న మొత్తాలతో కూడా మొదలుపెట్టొచ్చు. వంద రూపాయలు కావొచ్చు.. వెయ్యి రూపాయల నుంచి కూడా ప్రారంభించవచ్చు. ఇప్పుడిప్పుడే ప్రారంభిస్తున్నారు కాబట్టి దీన్ని లెర్నింగ్ కోసం కేటాయించిన బడ్జెట్లాగా భావించాలే తప్ప ఇన్వెస్టింగ్ బడ్జెట్గా అనుకోవద్దు. ఈ దశలో ప్రధాన లక్ష్యం ఏమిటంటే.. నేర్చుకోవడం. అంతే తప్ప ఎకాయెకిన లాభాలను సాధించేయడం కాదు. ముందుగా యాప్ ఎలా పని చేస్తుంది. ఆర్డర్లు ఎలా పెట్టాలి. రేట్లు ఏ రకంగా మారుతూ ఉంటాయి. ఇలాంటి వాటి గురించి తెలుసుకోవడంపైనే దృష్టి పెట్టాలి. ఇందులోని సాధకబాధకాల గురించి అర్థం చేసుకునేందుకు చిన్న మొత్తాన్ని కేటాయిస్తేనే మంచిది. అప్పుడే మనస్సూ ప్రశాంతంగా ఉంటుంది. నేర్చుకోవడమూ సులభంగా, సరదాగా ఉంటుంది.ఫోకస్ ముఖ్యం .. మల్టీ టాస్కింగ్ వద్దు.. మహిళలు సహజంగానే మల్టీటాస్కర్లు. ఏకకాలంలో బోలెడన్ని పనులు చక్కబెట్టేస్తుంటారు. అయితే, ట్రేడింగ్ విషయానికొస్తే.. గుర్తుపెట్టుకోవాల్సిందేమిటంటే.. వంట చేస్తూనో, ఇల్లు శుభ్రం చేసుకుంటూనో.. లేదా టీవీ చూస్తూనో.. ట్రేడింగ్ను కూడా చుట్టబెట్టేయొచ్చు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే మిగతా పనుల్లాగా కాకుండా మార్కెట్టు, ట్రేడింగు అంటే ప్రత్యేకంగా దానిపైనే ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. అది కొద్ది నిమిషాలే కావచ్చు. ఏకాస్త ఫోకస్ తప్పినా ... ఏదో పనిలో హడావిడిగా ఉండి.. మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చినా లేదా ఎగ్జిట్ అయినా తీవ్ర ఫ్ర్రస్టేషన్కి దారి తీయొచ్చు. అందుకే మిగతా ఏ పనులూ లేనప్పుడు, మెదడు ప్రశాంతంగా ఉన్నప్పుడు, ఫోకస్గా ఉండగలిగినప్పుడు ఒక్క 15–30 నిమిషాల స్లాట్ని కేవలం దీని కోసమే కేటాయించాలి. ఒక రకంగా మీకు అత్యంత ఇష్టమైన హాబీ విషయంలో మీరు ఎలా ఉంటారో దీన్ని కూడా అలాగే భావించి, సమయం వెచ్చించాలి. పూర్తి ఫోకస్తో ఉండే ఆ కాస్తంత సమయంలో మీరు తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత ఉంటుంది. ఆత్మవిశ్వాసమూ వస్తుంది.ఫస్ట్ ట్రేడ్ కోసం బడ్జెట్ పెట్టుకోవాలి.. ఇది చాలా చాలా ముఖ్యమైన రూల్. ఎప్పుడూ కూడా ఇంటి అవసరాల కోసం ఉద్దేశించిన డబ్బుతో ట్రేడింగ్ చేయనే కూడదు. మీరు ట్రేడింగ్ మొదలుపెట్టదల్చుకున్నప్పుడు ముందుగానే, దాని గురించి తెలుసుకునేందుకు, నేర్చుకునేందుకు నెలవారీగా ఇంత అని కాస్త మొత్తాన్ని పక్కన ఉంచుకోండి. అది అయిదు వందల రూపాయలైనా కావచ్చు.. దాన్ని వేరుగానే ఉంచండి. ఇంటి అవసరాల ఖర్చులు, ట్రేడింగ్పై ఇన్వెస్ట్మెంట్ని కలగాపులగం చేయొద్దు. దేనికదే వేరుగా ఉండాలి. సరిహద్దులు స్పష్టంగా ఉండాలి. అప్పుడు ట్రేడింగ్ అనేది ఆర్థికంగా ఒక రిస్కీ వ్యవహారంగా కాకుండా వ్యక్తిగతంగా చేపట్టిన ఒక ప్రాజెక్టులాగా అనిపిస్తుంది. ఆందోళనకు ఆస్కారం ఉండదు. నిత్యావసరాలు, ఫీజులు, ఇంటి ఖర్చులు.. ఇలాంటి వాటి కోసం ఉద్దేశించిన డబ్బు జోలికి వెళ్లనే వెళ్లొద్దు.15 నిమిషాల రొటీన్..రొటీన్గా ప్రతిరోజు పాటించే చిన్న చిన్న విషయాలే చాలా పెద్ద ప్రయోజనాలను చేకూరుస్తుంటాయి. కాబట్టి దీని విషయంలోనూ రోజూ ఒక పదిహేను నిమిషాల సేపు కేటాయించండి. ఒక ఐదు నిమిషాలు బేసిక్ ట్యుటోరియల్స్ను చూసేందుకు, నేర్చుకునేందుకు కేటాయించండి. ఇంకో ఐదు నిమిషాల పాటు సింపుల్ చార్ట్ను పరిశీలించండి. మీరు పరిశీలించిన, తెలుసుకున్న విషయాలను మననం చేసుకునేందుకు, రాసిపెట్టుకునేందుకు చివరి ఐదు నిమిషాలను కేటాయించండి. ఇలా వారాల తరబడి, కాస్త కాస్తంతగా తెలుసుకున్న విషయాలతో మార్కెట్పై కొంత చెప్పుకోతగ్గ స్థాయిలో అవగాహన వస్తుంది. చూస్తుండగానే మార్కెట్ ట్రెండ్స్, క్యాండిల్స్, ఎంట్రీలు, ఎగ్జిట్ల విషయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ట్రేడింగ్ అనేది ఆందోళన కలిగించేది వ్యవహారంగా ఉండనక్కర్లేదు. ప్రశాంతంగా, మీకు సమయం చిక్కినప్పుడు నెమ్మదిగా నైపుణ్యాలను పెంచుకునే విధంగా ఉండాలి. భారీగా కాకుండా, చిన్న మొత్తాన్ని కేటాయించి, స్పష్టమైన సరిహద్దులు పెట్టుకుని, ఏకాగ్రతతో నేర్చుకునేందుకు కొద్ది నిమిషాలు కేటాయించగలిగితే.. నెమ్మదిగా అడుగులు వేస్తూ ముందుకెళ్తే మార్కెట్ గురించి తెలుసుకోవచ్చు. సానుకూల ఫలితాలనే కాకుండా ప్రయాణాన్నీ ఆస్వాదించవచ్చు.అలర్ట్లను ఉపయోగించుకోవాలి..ట్రేడింగ్ తీరుతెన్నులు తెలుసుకోవడం కోసం మీరు గంటలు గంటలు స్క్రీన్ ముందే కూర్చుని ఉండనక్కర్లేదు. ఇప్పుడు ఆధునిక ట్రేడింగ్ యాప్స్లో చాలా వెసులుబాట్లు ఉంటున్నాయి. మీరు ఆసక్తిగా గమనిస్తున్న షేరు ధర, మీరు అంచనా వేసే స్థాయికి చేరుకున్నప్పుడు తక్షణం నోటిఫై చేసేందుకు వీటిల్లో ప్రైస్ అలర్టులు ఉంటున్నాయి. అంటే, మీరు మీ రోజువారీ పనులు చేసుకోవడం కొనసాగిస్తూనే, అలర్టు వచ్చినప్పుడు ఒకసారి యాప్ చేసుకుంటే చాలు. దీనివల్ల స్క్రీన్ టైమ్ తగ్గుతుంది. భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకుని, ఆ తర్వాత అవి తప్పయితే చింతించే పరిస్థితి తప్పుతుంది. పైగా ఎలాంటి ఒత్తిడి, ఆందోళన లేకుండా స్థిమితంగా నేర్చుకునేందుకు వీలవుతుంది.సాధారణంగానే మహిళా ఇన్వెస్టర్లు డిసిప్లిన్గా ఉంటారని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే వారు అతిగా ట్రేడింగ్ చేయరు. డబ్బు వ్యవహారాల్లో ఎలా తోస్తే అలా నిర్ణయాలు తీసుకోరు. రిసు్కల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. దూకుడుగా నిర్ణయాలు తీసుకునే వారికన్నా బోలెడంత సహనంతో, నిలకడగా ఉండే వారికే ట్రేడింగ్ లాభాలనిస్తుంది. మహిళల్లో సహజసిద్ధంగానే ఈ స్వభావం ఉంటుంది కాబట్టి వారికి అదొక సానుకూలాంశం. ఆలోచనాత్మకంగా వ్యవహరిస్తే అనుకూల ఫలితాలను సాధించగలమనే విషయాన్ని విశ్వసించాలి. -
SBI: రూ. 200 లక్షల కోట్ల టర్నోవర్!
న్యూఢిల్లీ: స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 2030లో 75వ వ్యవస్థాపక దినోత్సవం (ప్లాటినం జూబ్లీ) జరుపుకునే నాటికి మొత్తం వ్యాపారం రూ. 200 లక్షల కోట్లకు చేరుకోవచ్చని బ్యాంక్ చైర్మన్ సీఎస్ శెట్టి చెప్పారు. ప్రస్తుత వృద్ధిని పరిగణనలోకి తీసుకుంటే టర్నోవర్ రెట్టింపయ్యే అవకాశం ఉందన్నారు. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యకలాపాల బదిలీ సహా ఇతర అంశాల కోసం పార్లమెంటులో చట్టం ద్వారా 1955 జూలై 1న ఎస్బీఐ ఆవిర్భవించింది.దేశంగా అతిపెద్ద బ్యాంకుగా నిలుస్తున్న ఎస్బీఐ మొత్తం వ్యాపారం (మొత్తం రుణాలు, అడ్వాన్సులు) గత ఆర్థిక సంవత్సరం (2025–26) రెండో త్రైమాసికంలో తొలిసారి రూ.100 లక్షల కోట్ల మైలురాయిని దాటింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్ నాటికి ఇది రూ.110.01 లక్షల కోట్లకు ఎగబాకింది. కాగా, ప్లాటినం జూబ్లీ నాటికి నిర్దిష్ట టార్గెట్ ఏదీ బ్యాంకు నిర్దేశించుకోలేదని, అయితే, ప్రస్తుత వృద్ధి ప్రకారం చూస్తే టర్నోవర్ రూ.170–180 లక్షల కోట్లుగా ఉండొచ్చని, గరిష్టంగా రూ.200 లక్షల కోట్లను కూడా తాకే చాన్సుందని చెప్పారు. అది మరో కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు.ఎకానమీతో పాటే... ఎస్బీఐ కార్యకలాపాలు భారత ఎకానమీ పనితీరుతో ముడిపడి ఉన్నాయని శెట్టి పేర్కొన్నారు. ‘మన ఆర్థిక వ్యవస్థ ఏటా 7–8 శాతం మేర గనుక వృద్ధి చెందితే, ఎస్బీఐ బ్యాలెన్స్ షీట్ కూడా 11–12 శాతం వార్షిక వృద్ధి రేటును సాధించే సామర్థ్యం ఉంటుంది. అంటే, ప్రతి ఆరేళ్లకు బ్యాలెన్స్ షీట్ రెట్టింపవుతుంది. దీని ప్రకారం చూస్తే 2030 కల్లా ఎస్బీఐ మొత్తం బిజినెస్ రూ. 200 లక్షల కోట్లకు చేరవచ్చు‘ అని ఆయన వివరించారు. కస్టమర్లు, ఉద్యోగులు, వాటాదారులు, అలాగే ఆర్బీఐతో సహా ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు... ఈ నాలుగు పక్షాల ప్రయోజనాలు లేదా అవసరాలను తీర్చేవిధంగా బ్యాంకు కార్యకలాపాలను విస్తరించే లక్ష్యంతో విజన్ 2030పై ఫోకస్ చేస్తున్నామని కూడా ఎస్బీఐ చైర్మన్ తెలిపారు. -
పసిడి రుణాలు @ రూ. 1.5 లక్షల కోట్లు
చెన్నై: గోల్డ్ లోన్స్కి డిమాండ్ గణనీయంగా ఉంటున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి తమ పసిడి రుణాల పోర్ట్ఫోలియో రూ. 1.5 లక్షల కోట్లను అధిగమిస్తుందని అంచనా వేస్తున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఇండియన్ బ్యాంక్ ఎండీ బినోద్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఇది రూ. 1.25 లక్షల కోట్లుగా ఉన్నట్లు వివరించారు.పసిడి రుణాల సెగ్మెంట్ 20 శాతం మేర పెరగవచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు మొత్తం రుణాల్లో ఆర్ఏఎం (రిటైల్, వ్యవసాయం, ఎంఎస్ఎంఈ) వాటా 65 శాతంగా ఉండగా, మిగతా 35 శాతం వాటా కార్పొరేట్ రంగానిది ఉంటోందని వివరించారు. వ్యవసాయం, ఎంఎస్ఎంఈల దన్నుతో ఆర్ఏఎం విభాగ వృద్ధికి గణనీయంగా అవకాశాలు ఉన్నాయని కుమార్ తెలిపారు.ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కాసా (కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్) 15.30 శాతం వృద్ధి చెందినట్లు చెప్పారు. సేవింగ్స్ డిపాజిట్లు 13.54 శాతం, కరెంట్ అకౌంట్ డిపాజిట్లు 26.33 శాతం పెరిగినట్లు పేర్కొన్నారు. -
అంతర్జాతీయ సంకేతాలు కీలకం..
ముంబై: అంతర్జాతీయ పరిణామాలు ఈ వారం భారత స్టాక్ మార్కెట్ దిశను నిర్దేశించే అవకాశం ఉందని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. జాక్సన్ హోల్ సింపోజియంలో ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ కెవిన్ వార్‡్ష ప్రసంగం, ఎన్వీడియా త్రైమాసిక ఫలితాలు, పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు ట్రేడింగ్పై ప్రభావం చూపవచ్చని చెబుతున్నారు. అగ్రరాజ్యం అమెరికా విడుదల చేసే కీలక ఆర్థిక గణాంకాలపై కూడా ఇన్వెస్టర్లు దృష్టి సారించనున్నారు. దేశీయంగా విదేశీ పెట్టుబడుల ప్రవాహం, రూపాయి కదలికలు, లిక్విడిటీ పరిస్థితులను మార్కెట్ వర్గాలు పరిశీలించే అవకాశం ఉంది. ‘‘ఇన్వెస్టర్లు రియల్టీ, మెటల్, ప్రైవేట్ బ్యాంకింగ్ రంగాల వైపు మొగ్గు చూపుతుండటం, విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) భారత మార్కెట్లలో కొనుగోళ్లు కొనసాగిస్తుండటం ఊరటనిచ్చే అంశం. రాబోయే రోజుల్లో బ్రెంట్ క్రూడ్ ధరలు 90 డాలర్ల కిందకు దిగువ వస్తే, దేశీయ ఈక్విటీ మార్కెట్లో కన్సాలిడేషన్ చోటుచేసుకునే అవకాశం ఉంది’’ అని రిలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ హెడ్ అజిత్ మిశ్రా తెలిపారు. ఫెడరల్ రిజర్వ్ చైర్మన్పై దృష్టి ఈ వారం జాక్సన్ హోల్ సింపోజియం ఇన్వెస్టర్లకు కీలకంగా మారనుంది. ముఖ్యంగా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ కెవిన్ వార్‡్ష ప్రసంగంపై ప్రపంచ మార్కెట్లు దృష్టి సారించనున్నాయి. సెపె్టంబర్లో జరగనున్న ఫెడ్ పాలసీ సమావేశానికి ముందు ద్రవ్యోల్బణం, ఉపాధి పరిస్థితులు, వడ్డీ రేట్ల భవిష్యత్ దిశపై ఆయన ఎలాంటి సంకేతాలిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అమెరికాలో వడ్డీ రేట్లపై అంచనాలు మారితే ప్రపంచ మార్కెట్లతో పాటు భారత ఈక్విటీలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. పశ్చిమాసియా పరిణామాలు, క్రూడ్ ధరలపై కన్ను...పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఈ వారం కూడా మార్కెట్లకు కీలకంగా మారనున్నాయి. హర్మూజ్ జలసంధి గుండా చమురు రవాణాకు ఏర్పడిన అంతరాయం కారణంగా ముడి చమురు సరఫరాపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 90 డాలర్ల ఎగువన కొనసాగడం భారత మార్కెట్కు ప్రధాన ఆందోళనగా మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ముడి చమురు ధరలు మరింత పెరిగితే దిగుమతి వ్యయం, ద్రవ్యోల్బణంపై ఆందోళనలు పెరిగి మార్కెట్పై ఒత్తిడి పడే అవకాశం ఉంది.గత వారం స్వల్ప నష్టాలు గత వారంతో స్టాక్ మార్కెట్ పరిమితి శ్రేణిలో ట్రేడవుతూ, స్వల్ప అమ్మకాల ఒత్తిడికి లోనైంది. వారాంతంలో శుక్రవారం కోలుకున్నప్పటికీ, మొత్తం వారానికి సెన్సెక్స్ 468 పాయింట్లు (0.60%), నిఫ్టీ 114 పాయింట్లు (0.46%) నష్టపోయాయి. పెరుగుతున్న ముడి చమురు ధరలు, ప్రపంచ బాండ్లపై రాబడులు పెరుగుదల గత వారం మార్కెట్ సెంటిమెంట్పై ప్రభావం చూపాయి. సాంకేతిక అంశాలు... నిఫ్టీలో గత రెండు వారాలుగా కరెక్షన్ కొనసాగిన నేపథ్యంలో, స్వల్ప కాంలో మార్కెట్ కొంత స్థిరీకరణతో పాటు స్వల్పంగా కోలుకునే అవకాశం ఉంది. సాంకేతికంగా నిఫ్టీ పరిమిత శ్రేణిలో ట్రేడవ్వొచ్చు.దిగువ స్థాయిలో 24,200 వద్ద తక్షణ మద్దతు ఉండగా, ఈ స్థాయిని కోల్పోతే 24,000 వరకు కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు, 24,350 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే నిఫ్టీ 24,500 దిశగా కదిలే అవకాశం ఉందని సాంకేతిక విశ్లేషకులు భావిస్తున్నారు.అమెరికా గణాంకాలూ కీలకమే అమెరికా జీడీపీ అంచనాలు, డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్లు, వినియోగదారుల విశ్వాస సూచీతో పాటు పీసీఈ ద్రవ్యోల్బణ గణాంకాలను కూడా ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలించనున్నారు. ఈ గణాంకాలు అమెరికా ఆర్థిక వ్యవ స్థ స్థితిగతులపై స్పష్టత ఇవ్వడంతో పాటు, ఫెడరల్ రిజర్వ్ తదుపరి విధాన నిర్ణయాలపై మార్కెట్ అంచనాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ వారంలో ఎనీ్వడియా త్రైమాసిక ఫలితాలు కూడా అంతర్జాతీయ టెక్నాలజీ షేర్ల కదలికలకు కీలకంగా మారవచ్చు.భారత మార్కెట్లో విదేశీ పెట్టుబడుల జోరు ఆగస్టులో రూ.23,544 కోట్ల పెట్టుబడులు భారత ఈక్విటీ మార్కెట్లపై విదేశీ పెట్టుబడిదారుల ఆసక్తి మళ్లీ పెరుగుతోంది. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) ఆగస్టు లో ఇప్పటివరకు (21 తేదీ వరకు) భారత ఈక్విటీల్లో రూ.23,544 కోట్ల పెట్టుబడులు పెట్టారు. కార్పొరేట్ కంపెనీలు ఆకర్షణీయమైన ఆర్థిక త్రైమాసిక ఫలితాలు ప్రకటన, రూపాయి స్థిర త్వం, మార్కెట్పై సానుకూల వృద్ధి అంచనాలు ఇందుకు కారణమయ్యాయి. జూలైలో రూ.20,200 కోట్ల పెట్టుబడుల తర్వాత వరుసగా రెండో నెల కూడా విదేశీ నిధుల ప్రవాహం కొనసాగుతుండటం విశేషం. ‘‘కార్పొరేట్ లాభాల వృద్ధి పుంజుకోవడం, క్యూ1 ఫలితాల్లో కనిపించిన మెరుగుదల, ఇతర అంతర్జాతీయ మార్కెట్ల నుంచి విదేశీ నిధుల మళ్లింపు, రూపా యి స్థిరత్వం తదితర అంశాలు ఎఫ్పీఐలను మళ్లీ భారత మార్కెట్ వైపు ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం ఎఫ్పీలులు ఆకర్షణీయమైన వ్యాల్యుయేషన్లలో లభిస్తున్న బ్యాంకింగ్, ఐటీ దిగ్గజాల షేర్లను కొనుగోలు చేయడం లేదు. అధిక వ్యాల్యుయేషన్లు ఉన్నప్పటికీ ఎంపిక చేసిన మిడ్క్యాప్ స్టాక్స్పైనే దృష్టి సారిస్తున్నారు’’ అని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ వ్యూహకర్త వీ.కే. విజయకుమార్ తెలిపారు. ఈక్విటీలతో పాటు డెట్ (రుణ) మార్కెట్పైనా విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. సమీక్షించిన కాలంలో ‘ఎఫ్ఏఆర్’ మార్గంలో రూ.852 కోట్ల పెట్టుబడులు రాగా, సాధారణ పద్ధతిలో రూ.995 కోట్లు కోట్ల నిధులు వెనక్కి వెళ్లినట్లు సీడీఎస్ఎల్ గణాంకాలు వెల్లడించాయి. -
ఎఫ్ అండ్ ఓ... ముంచేస్తోంది!
స్మోకింగ్ కిల్స్... అని హెచ్చరించినా సిగరెట్లు తాగుతూనే ఉంటారు. మద్యపానం హానికరం అన్నా... తాగేవారు మానరు. స్టాక్ మార్కెట్ డే ట్రేడింగ్ కూడా అలాంటిదే. ప్రతి 10 మందిలో 9 మంది నష్టపోతున్నారనే సెబీ వార్నింగ్ డే ట్రేడర్లకు పట్టదు. ఎందుకంటే ఇదో వ్యసనం. గతేడాది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో జనం పోగొట్టుకున్నది ఏకంగా 91,685 కోట్లు. దీన్లో రూ.20వేల కోట్లు పన్నులు, ఎక్సే్ఛంజీల చార్జీలు, బ్రోకరేజీ సంస్థల ఫీజలుకు పోతే... మరో 72 వేల కోట్లు నికరంగా పోగొట్టుకున్నవి. విచిత్రమేంటంటే చరిత్రలో తొలిసారిగా మన మార్కెట్లలో డే–ట్రేడర్ల సంఖ్య గతేడాది తగ్గిపోయింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 20 లక్షల మంది తగ్గిపోయారు. అంటే.. పోగొట్టుకున్నవారంతా మౌనంగా మార్కెట్ల నుంచి నిష్క్రమిస్తున్నారన్న మాట. మార్కెట్లలో ఎందరు నష్టపోతున్నారు? ఎందరు లాభపడుతున్నారు? అసలు ట్రేడింగ్ ధోరణి ఎలా ఉంది? ఏ వయసు వారు ట్రేడింగ్లోకి వస్తున్నారు? మూలధనం ఎంత పెడుతున్నారు? అసలు షేర్లు కొంటున్నారా? ట్రేడింగ్ మాత్రమే చేస్తున్నారా? అనే అంశాలపై ‘సెబీ’ రెండు అధ్యయనాల్ని విడుదల చేసింది. డే–ట్రేడర్లకు కనువిప్పు కలిగించే ఈ అధ్యయనాల సమాహారమే ఈ ‘సాక్షి వెల్త్’ స్టోరీ..నెలకోసారి ఎక్స్పైరీ ఉండే ఆప్షన్లు వారానికోసారి ఎక్స్పైరీతో ఫ్రెష్గా ముస్తాబవుతున్నాయి. నిఫ్టీ, సెన్సెక్స్లే కాకుండా క్రూడ్ ఆయిల్, గోల్డ్, సిల్వర్లో సైతం ఆప్షన్లు జోరందుకున్నాయి. ఖాతాలో పదివేలున్నా సరే ట్రేడింగ్ చేయొచ్చునంటూ కొన్ని బ్రోకరేజీ సంస్థలు యువతను ఆకర్షిస్తున్నాయి. డీమ్యాట్ ఖాతాల్లో గనక షేర్లుంటే... డబ్బులు లేకపోయినా మార్జిన్తో ట్రేడింగ్ చేసుకోవచ్చని ఊరిస్తున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ వాల్యూమ్ విపరీతంగా పెరిగింది. కానీ ఫలితమైతే మారలేదు. నష్టాలు తప్పటంలేదు. డే ట్రేడింగ్ చేసిన ప్రతి 10 మందిలో 9 మంది నష్టపోతున్నారనే సత్యాన్ని సెబీ తాజా అధ్యయనం ద్వారా మరోసారి చెప్పింది. కాకపోతే కొన్నేళ్లుగా ప్రతి ఏటా విపరీతంగా పెరుగుతూ వచ్చిన ట్రేడర్ల సంఖ్య... గతేడాది మాత్రం తొలిసారిగా తగ్గింది. అదికూడా మామూలు తగ్గుదల కాదు. ఏకంగా 20 శాతం. ఈ అధ్యయనం ప్రకారం... → 2026 ఆర్థిక సంవత్సరంలో 87.7% మంది ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్లో ఏకంగా రూ.72,000 కోట్లు పోగొట్టుకున్నారు. అదికూడా ఎక్సే్ఛంజీలకు, బ్రోకరేజీలకు చెల్లించిన ఛార్జీలు కాకుండా. ఈ ఛార్జీలు రూ.20వేల కోట్లు కలిపితే మొత్తంగా వీరు నష్టపోయింది రూ.92 వేల కోట్లు పైనే. → ఎక్సే్ఛంజీ చార్జీలు, బ్రోకరేజీలు కాకుండానే 2025లో పోగొట్టుకున్న రూ.1.11 లక్షల కోట్లతో పోలిస్తే ఇది తక్కువే. కాకపోతే ట్రేడర్ల సంఖ్య కూడా 98 లక్షల నుంచి 78 లక్షలకు పడిపోయింది. → సగటు ట్రేడరు పోగొట్టుకున్న మొత్తం మాత్రం రూ.1.13 లక్షల నుంచి రూ.1.16 లక్షలకు పెరిగింది. → గడిచిన ఐదేళ్లతో పోలిస్తే ట్రేడర్ల సంఖ్య తగ్గిపోవడమన్నది ఇదే తొలిసారి.మార్కెట్లకు దూరమవుతున్నదెవరు? తొలిసారి 20% మంది మార్కెట్లను వదిలేశాక.. మనం సమాధానం వెతకాల్సిన ప్రశ్న ఎందరు నష్టపోతున్నారన్నది కాదు. ఇంకా ఎవరు ట్రేడింగ్ చేస్తున్నారన్నది. సెబీ అధ్యయనంలో దీనిక్కొంత సమాధానం దొరికింది. అదేంటంటే ఇపుడు రిటైల్ ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్లో యువత సంఖ్యే ఎక్కువని. చిన్న ఇన్వెస్టర్లు, ఆర్థిక సంస్థలతో సంబంధంలేని మామూలు ట్రేడర్లు వీరికి తోడవుతున్నారు. ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ చేసే రిటైలర్లలో 43% మంది 30 ఏళ్ల లోపు వారే. వీరిలో 90% మంది గతేడాది నష్టపోయిన వారే. ఈ యువ ట్రేడర్లు వారి ఖాతాల్లోని షేర్లకన్నా 93 రెట్లు ఎక్కువ మొత్తాన్ని ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్లో పెడుతున్నారు. అంటే... రూ. 1,000 షేర్లలో ఉంటే 93 వేలు ఎఫ్ అండ్ ఓలో ట్రేడింగ్కు వాడుతున్నారన్న మాట. అంటే వీళ్లెవరూ తమ షేర్లలో రిస్క్ తగ్గించుకోవటానికి ఎఫ్ అండ్ ఓను ఉపయోగించుకోవట్లేదు. జస్ట్ దాన్నో బెట్టింగ్ సాధనంగా చూస్తున్నారు. అంతే! వాస్తవమేంటంటే ఓ ఇన్వెస్టరుకు తన ఖాతాలో రూ.లక్ష విలువైన షేర్లున్నాయనుకోండి. వాటిపై వచ్చే మార్జిన్తో కోట్ల రూపాయల ఎఫ్ అండ్ఓ ట్రేడింగ్ చేయగలడు. అది చాలా ఎక్కువ మొత్తం కనక నష్టం వస్తే ఈ లక్షలో రూపాయి కూడా మిగలకపోవచ్చు. తక్కువ ట్రేడింగ్... ఎక్కువ లాభం లాభాలు ఆర్జించిన వారి విషయంలోనూ అదే సూత్రం వర్తిస్తోంది. ఏడాదికి రూ.5 లక్షల లోపు ఆదాయాన్ని సంపాదిస్తున్న ట్రేడర్లు వారి ఖాతాల్లోని షేర్ల విలువకన్నా ఏకంగా 73 రెట్లు ఎక్కువ ఎఫ్ అండ్ ఓ టర్నోవర్ చేస్తున్నారన్నది సెబీ తేలి్చన వాస్తవం. కానీ ఏడాదికి రూ.కోటికన్నా ఎక్కువ సంపాదించేవారు మాత్రం తమ పోర్టుఫోలియోకన్నా 14 రెట్లు మాత్రమే అధికంగా ఎఫ్ అండ్ ఓ టర్నోవర్ చేస్తున్నారు. అంటే ఎక్కువ సంపాదించేవారు తక్కువ ట్రేడింగ్ చేస్తున్నారు. తక్కువ సంపాదించేవారు, నష్టపోతున్న వారు మాత్రమే అత్యధికంగా ట్రేడింగ్ చేస్తున్నారు. ముగ్గురిలో ఒకరు.. అలాంటివారే! కొంతమంది ట్రేడర్లకు ఇన్వెస్ట్మెంట్లతో ఏమాత్రం సంబంధం ఉండటం లేదు. వారి ఖాతాల్లో జీరో షేర్లున్నా సరే... ఎఫ్ అండ్ ఓ మాత్రం జోరుగా చేస్తున్నారు. ప్రతి ముగ్గురిలో ఒకరు ఇలా పూర్తి స్పెక్యులేషన్ ట్రేడింగ్నే చేస్తున్నారట. వాస్తవానికి ఎఫ్ అండ్ ఓ ట్రేడర్లలో 78 శాతం మంది తమ ఖాతాల్లో రూ.లక్ష కన్నా తక్కువ షేర్లున్నవారే. కానీ ట్రేడర్లు పోగొట్టుకుంటున్న మొత్తంలో 70 శాతం వీళ్లదే. అంటే.. వీళ్లు తమ షేర్లతో సంబంధం లేకుండా ఎఫ్ అండ్ ఓ చేస్తున్నారు. భారీగా పోగొట్టుకుంటున్నారు. ఆప్షన్స్... అదే ఆకర్షణ ఎఫ్ అండ్ ఓ అంటే... ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. కానీ ఫ్యూచర్స్లో ట్రేడ్ చెయ్యాలంటే భారీగా డబ్బులుండాలి. నష్టమైనా, లాభమైనా సమ పాళ్లలోనే ఉంటుంది. కానీ ఆప్షన్స్లో అలాకాదు. రూ.100, వెయ్యితో కూడా ఆప్షన్స్ చేయొచ్చు. అప్పటికప్పుడే వెయ్యి డబుల్ అయిపోవచ్చు. సున్నా కూడా అయిపోవచ్చు. ఇదే అసలైన ఆకర్షణ. ఈ ఆకర్షణ ఎంతలా పెరిగిందంటే... 2020లో ఎఫ్ అండ్ ఓలో రూ.100 టర్నోవర్ జరిగితే అందులో రూ.5 మాత్రమే ఆప్షన్స్ది. మిగతా మొత్తం ఫ్యూచర్స్దే. కానీ 2025 వచ్చేసరికి ఈ 5 ఏకంగా రూ.41కి చేరింది. నిజానికి ఆప్షన్ కొనటమంటే షేరు కొన్నట్లు కాదు. ఎందుకంటే షేర్లకు ఎక్స్పైరీ ఉండ దు. పడినా మళ్లీ కోలుకుంటాయి. కానీ ఆప్షన్లకు ఎక్స్పైరీ ఉంటుంది. ఎక్స్పైరీ గడు వు దగ్గరకొస్తున్నకొద్దీ ఆప్షన్ ప్రీమియం కరిగిపోతుంది. చివరికి సున్నా అయిపోతుంది. అలాగని ఆప్షన్లు కొనటం మాత్రమే రిస్కనుకుంటే అదీ పొరపాటే. ఆప్షన్లు కొనేవారి కన్నా అమ్మే వారిలో నష్టపోయేవారు తక్కువే. కానీ వారి నష్టాలు మాత్రం బీభత్సం. అప్షన్లు కొనేవారి సగటు నష్టాలు రూ.4.6 లక్షలు ఉంటే... అమ్మేవారి సగటు నష్టాలు రూ.51.7 లక్షలు. దీన్నిబట్టే రిస్క్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.సెబీ ప్రయోగం ఫలించిందా? నిజానికి ఎఫ్ అండ్ ఓ నిబంధనల్ని కఠినం చేయటాన్ని సెబీ 2024లోనే మొదలుపెట్టింది. → వీక్లీ ఆప్షన్ల సంఖ్యను తగ్గించింది. కొన్ని మాత్రమే అందుబాటులో ఉంటే ట్రేడింగ్ను నియంత్రించవచ్చనేది సెబీ వ్యూహం. → కాంట్రాక్టు సైజుల్ని పెంచింది. అంటే కొనటానికి అవసరమయ్యే మొత్తాన్ని బాగా పెంచింది. ఇలా చేయటం వల్ల లాభమైనా, నష్టమైనా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి చాలామంది దూరంగా ఉంటారన్నది సెబీ ఆలోచన. → ఆప్షన్ ప్రీమియంలను కొనటానికైనా, అమ్మటానికైనా కావలసిన మొత్తాన్ని పూర్తిగా ముందే చెల్లించటమనే నిబంధన తెచ్చింది. → పొజిషన్ల పరిమితుల్ని ఇంట్రాడేలో పర్యవేక్షించటం... ఎక్సే్ఛంజీలన్నింటినీ ఒక తాటిమీదికి తెస్తూ ఎక్స్పైరీ తేదీల్ని హేతుబద్ధం చేయటం వంటివి చేసింది. కాకపోతే తాజా అధ్యయనాన్ని పరిశీలిస్తే కొన్ని కోణాల్లో సెబీ చర్యలు ఫలితాలనిచ్చాయి. రిటైలర్ల టర్నోవర్ తగ్గింది. వాళ్ల సంఖ్య తగ్గింది. నష్టాలు తగ్గాయి. కానీ దీనివల్ల.. నష్టపోయే ట్రేడర్లేమైనా తగ్గారా అంటే అలాంటిదేమీ జరగలేదు. నష్టపోయేవారి సంఖ్య అసాధారణంగానే ఉంది. పైపెచ్చు వారి నష్టాలు పెరిగాయి. కాబట్టి నాణ్యమైన ట్రేడర్లు పెరగటమన్నదే ఇపుడు సెబీ ముందున్న అతిపెద్ద సవాలు.ఆ 23 శాతం మందే...సెబీ వివరాల ప్రకారం... ట్రేడింగ్లో నష్టాల్లో 90 శాతం వరకూ కేవలం 23 శాతం మంది నుంచే వస్తున్నాయి. అంటే... మొత్తంగా 78 లక్షల మంది రూ.91వేల కోట్లు పోగొట్టుకుంటే... అందులో రూ.82 వేల కోట్లు పోగొట్టుకున్నది 18 లక్షల మందే. దీన్నిబట్టి కొందరు ఈ ట్రాప్లో ఇరుక్కుని అత్యధికంగా పోగొట్టుకుంటున్నారని అర్థమవుతుంది. వీళ్ల ధోరణిని విశ్లేషిస్తే బయటపడ్డ అంశాలు నివ్వెరపరిచేలా ఉన్నాయి. అవి... → వీళ్లు తమ ఆదాయానికి మించి అత్యధికంగా టర్నోవర్ నమోదు చేస్తున్నారు. → పదేపదే నష్టాలొచ్చినా డబ్బులు తెచ్చి పెడుతున్నారు. → ఎక్స్పైరీ డేనాడు అత్యధికంగా ట్రేడ్ చేస్తున్నారు. → వీరి టర్నోవర్కు–పోర్టుఫోలియోకు పొంతన లేదు. → పదేపదే ఆప్షన్లు కొనటం... లాట్ సైజు పెంచుకుంటూ పోయి పోగొట్టుకోవటం.మెట్రోలకే పరిమితం కాదిప్పుడు... మొబైల్ యాప్లు, టెక్నాలజీ షేర్ల ట్రేడింగ్ను సమూలంగా మార్చేశాయి. పలితం... ఈ ఎఫ్ అండ్ ఓ ఆకర్షణ ఇప్పుడు మెట్రో నగరాలకే పరిమితం కావటం లేదు. దేశంలో ప్రధానంగా గుర్తించిన 30 మెట్రో నగరాలను మినహాయిస్తే... వాటి వెలుపలున్న ప్రాంతంలోనే ట్రేడింగ్ ఎక్కువగా జరుగుతోంది. 2024 ఆర్థిక సంవత్సరంలోనే ఏకంగా 72 శాతం ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ మెట్రోలకు వెలుపల జరుగుతున్నట్లు వెల్లడయింది. అంటే నష్టపోతున్నవారిలో ఎక్కువ మంది టైర్–2, టైర్–3 పట్టణాలు, గ్రామాలకు చెందినవారన్న మాట. అది ఆందోళనకరమన్నది నిపుణుల మాట. అసలు లాభపడ్డది ఎవరు? సెబీ అధ్యయనం ప్రకారం చూస్తే రిటైల్ ట్రేడర్లు రూ.72వేల కోట్లు పోగొట్టుకుంటే... సంస్థాగత ఇన్వెస్టర్లు, సంస్థలు రూ.72వేల కోట్లు లాభాలను ఆర్జించాయి. ప్రొప్రయిటరీ ట్రేడర్లు అత్యధికంగా రూ.44వేల కోట్లు లాభపడగా, ఎఫ్పీఐలు రూ.14వేల కోట్లు, కార్పొరేట్లు రూ.8వేల కోట్లు, మ్యూచువల్ ఫండ్లు రూ.3వేల కోట్లు, ఎల్ఎల్పీ/పార్ట్నర్షిప్ సంస్థలు రూ.3వేల కోట్లు ఆర్జించాయి. ఇది రిటైలర్లు పోగొట్టుకున్న రూ.72వేల కోట్లకు సమానం. ఇక మిగిలిన మొత్తంలో ఎన్ఎస్ఈ రూ.11,366 కోట్లు, బీఎస్ఈ రూ.3,134 కోట్లు చార్జీల రూపంలో వసూలు చేశాయి. కొంత మొత్తం ప్రభుత్వానికి సెక్యూరిటీ లావాదేవీల పన్ను రూపంలో చేరింది. కొంత సెబీకి ఛార్జీల రూపంలో చేరగా... మిగిలింది బ్రోకరేజీ రూపంలో బ్రోకరేజీ సంస్థలకు దక్కింది. అయితే ఇదంతా ట్రేడర్లు పోగొట్టుకున్న లెక్క మాత్రమే. లాభాలను ఆర్జించినట్లు చెబుతున్న సంస్థలు కూడా బ్రోకరేజీ, కొంత ఎస్టీటీ, కొంత ఎక్సే్ఛంజీలకు చార్జీలుగా చెల్లిస్తాయి. అంటే ఈ ట్రేడింగ్ వ్యవస్థపై ఫీజులు, పన్నులు, బ్రోకరేజీల రూపంలో పోతున్నదే ఎక్కువ భాగమన్నమాట!రమణమూర్తి మంథా -
రూ.2 లక్షల జీతం.. అయినా కష్టాలే!
సాధారణంగా నెలకు రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల జీతం అంటే చాలామందికి మంచి ఆదాయమే. ఇలాంటి జీతం వస్తే హాయిగా జీవించొచ్చని అనుకుంటారు. కానీ.. పెద్ద నగరాల్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుందని ఓ మహిళ చెబుతోంది. నెలకు రూ.1-2 లక్షలు సంపాదిస్తున్నా.. ఖర్చులు పోగా చేతిలో పెద్దగా డబ్బు మిగలడం లేదని పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఏమిటీ 'శాలరీ ట్రాప్'ఇన్స్టాగ్రామ్లో నిధి కుష్వాహా అనే మహిళ ఈ విషయంపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. టైర్-1 నగరాల్లో నెలకు రూ.1-2 లక్షలు సంపాదించే వాళ్లు కూడా ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని వివరించారు.ఆమె చెప్పిన లాజిక్ కూడా చాలామందికి కనెక్ట్ అవుతోంది. ఈ జీతం తక్కువ ఆదాయంతో జీవించే స్థాయి నుంచి బయటపడటానికి సరిపోతుంది. కానీ.. ఖరీదైన జీవనశైలిని ఎలాంటి ఆలోచన లేకుండా కొనసాగించడానికి మాత్రం సరిపోదు. అంటే.. జీతం బాగానే ఉంటుంది, కానీ నెలాఖరుకు బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే మాత్రం నిరాశే మిగులుతుంది.పెద్ద నగరాల్లో ఖర్చులుఇక్కడ ప్రధాన సమస్య జీవన వ్యయం. టైర్-1 నగరాల్లో ఇంటి అద్దె ఒక్కటే జీతంలో పెద్ద భాగాన్ని తీసుకుపోతుంది. దానికి తోడు కరెంట్, ఇంటి ఖర్చులు, కారు లేదా బైక్ ఈఎంఐ, పెట్రోల్, పిల్లల స్కూల్ ఫీజులు, వైద్యం, బయట తినడం, షాపింగ్ ఇలా ఒక్కో ఖర్చు కలుస్తూ పోతుంది.ఉదాహరణకు నెలకు రూ.1.5 లక్షలు జీతం వస్తే.. అందులో రూ.30-40 వేలు ఇంటి అద్దెకే వెళ్లొచ్చు. పిల్లలున్న కుటుంబాల్లో స్కూల్ ఫీజులు, వైద్య ఖర్చులు అదనంగా ఉంటాయి. కారు ఈఎంఐ లేదా హోమ్ లోన్ ఉంటే మరో పెద్ద మొత్తం అక్కడే పోతుంది. చివరికి పొదుపు చేయడానికి అనుకున్న డబ్బు చాలా తక్కువగా మిగలొచ్చు.జీతం పెరిగితే ఖర్చులు కూడాఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం లైఫ్స్టైల్ ఇన్ఫ్లేషన్. జీతం పెరిగినప్పుడు మన అవసరాలు మాత్రమే కాదు.. మన కోరికలు కూడా పెరుగుతాయి.మంచి జీతం రావడంతో ఖరీదైన ఇల్లు, కొత్త కారు, ఎక్కువ ట్రావెల్స్, రెస్టారెంట్లు, బ్రాండెడ్ వస్తువులు ఇలా ఖర్చులు పెరగొచ్చు. మొదట్లో ఇవన్నీ చిన్న ఖర్చుల్లానే అనిపిస్తాయి. కానీ నెలాఖరుకు చూస్తే మొత్తం పెద్దదైపోతుంది. అందుకే కొంతమందికి జీతం రూ.80 వేల నుంచి రూ.1.5 లక్షలకు పెరిగినా.. పొదుపు మాత్రం పెద్దగా పెరగదు.ఇతరులతో పోల్చుకోవడం మరో సమస్యసోషల్ మీడియా వల్ల ఈ సమస్య మరింత పెరుగుతోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మన చుట్టూ ఉన్నవాళ్లు కొత్త కారు కొంటున్నారు, విదేశాలకు వెళ్తున్నారు, ఖరీదైన రెస్టారెంట్లకు వెళ్తున్నారు అని చూసి మనం కూడా అదే స్థాయిలో జీవించాలనుకుంటాం. కానీ వాళ్ల ఆదాయం ఎంత?, వాళ్ల అప్పులు ఎంత?, వాళ్లు ఎంత పొదుపు చేస్తున్నారు?, అనేది మనకు తెలియదు. అయినా వాళ్ల జీవనశైలిని చూసి మన ఆర్థిక పరిస్థితికి సరిపోని ఖర్చులు చేస్తే సమస్యలు మొదలవుతాయి.నెటిజన్ల స్పందననిధి కుష్వాహా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు వచ్చాయి. కొందరు ఆమె చెప్పింది నిజమేనని అన్నారు. తమ స్నేహితులు కూడా ఇలాంటి ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని కొందరు చెప్పారు. అయితే.. మరికొందరు మాత్రం సమస్య జీతంలో కంటే మన ఖర్చు చేసే విధానంలో ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. మనకు నిజంగా ఏం అవసరమో తెలుసుకోకుండా ఇతరుల జీవనశైలిని అనుసరించడం ఆర్థికంగా ఇబ్బందులకు దారితీయొచ్చని అన్నారు. View this post on Instagram A post shared by Nidhi Kushwaha | Money, Mindset & Real Perspectives (@nidhi_kushwaa) -
తల్లిదండ్రులకు అలర్ట్.. పిల్లల ఆధార్పై బిగ్ అప్డేట్!
పిల్లలకు ఆధార్ కార్డు ఉంది అంటే.. మాత్రమే సరిపోదు. వాళ్లు పెరుగుతున్న కొద్దీ.. ఆధార్లోని బయోమెట్రిక్ వివరాలను కూడా తప్పకుండా అప్డేట్ చేయాలి. చిన్న పిల్లలకు ఆధార్ తీసుకునే సమయంలో వేలిముద్రలు, కంటి ఐరిస్ వివరాలు నమోదు చేయరు. కాబట్టి, పిల్లలకు 5 ఏళ్లు వచ్చిన తర్వాత వీటిని అప్డేట్ చేయడం తప్పనిసరి.ఇటీవల యూఐడీఏఐ దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంలో 2 కోట్లకు పైగా మాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్స్ (MBU) పూర్తయ్యాయి. 2025 సెప్టెంబర్లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా 1.56 లక్షలకు పైగా పాఠశాలలను కూడా కవర్ చేశారు.MBU అంటే ఏంటి?చిన్న పిల్లలకు ఆధార్ నమోదు చేసేటప్పుడు సాధారణంగా వారి పేరు, పుట్టిన తేదీ, చిరునామా వంటి వివరాలతో పాటు ఫొటో తీసుకుంటారు. కానీ.. ఐదేళ్లలోపు పిల్లల వేలిముద్రలు, ఐరిస్ వివరాలను నమోదు చేయరు. పిల్లలు పెరిగే కొద్దీ వారి బయోమెట్రిక్ వివరాలను ఆధార్లో చేర్చాల్సి ఉంటుంది. దీనినే మాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్స్ అంటారు.పిల్లలకు ప్రధానంగా రెండుసార్లు బయోమెట్రిక్ అప్డేట్ చేయాలి. మొదట 5 ఏళ్లు పూర్తయిన తర్వాత, రెండోసారి 15 ఏళ్లు పూర్తయిన తర్వాత అప్డేట్ చేయాలి. ఈ సమయంలో వేలిముద్రలు, ఐరిస్ స్కాన్తో పాటు లేటెస్ట్ ఫొటోను కూడా ఆధార్లో అప్డేట్ చేస్తారు.పిల్లలకు ఉచితమేనా?ప్రస్తుతం 5 నుంచి 17 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలకు బయోమెట్రిక్ అప్డేట్పై ఫీజు మినహాయింపు ఉంది. 2026 సెప్టెంబర్ 30 వరకు వర్తించే నిబంధనల ప్రకారం ఈ అప్డేట్ను ఉచితంగా చేసుకోవచ్చు.2025 అక్టోబర్ 1 నుంచి 7-15 ఏళ్ల పిల్లలకు MBU ఛార్జీలను ఒక సంవత్సరం పాటు యూఐడీఏఐ మాఫీ చేసింది. 5-7 ఏళ్లు, 15-17 ఏళ్ల పిల్లలకు కూడా MBU ఉచితంగానే కొనసాగుతోంది. కాబట్టి.. ప్రస్తుతం అర్హత ఉన్న పిల్లల తల్లిదండ్రులు బయోమెట్రిక్ అప్డేట్ కోసం అదనంగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు.అప్డేట్ చేయకపోతే ఇబ్బందులు వస్తాయా?పిల్లల ఆధార్ బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేయకపోతే భవిష్యత్తులో కొన్ని సందర్భాల్లో అథెంటికేషన్ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.ఉదాహరణకు ప్రభుత్వ పథకాలు, స్కాలర్షిప్లు, విద్యకు సంబంధించిన సేవలు, అలాగే NEET, JEE, CUET వంటి పరీక్షల సమయంలో ఆధార్ ఆధారిత గుర్తింపు అవసరం కావచ్చు. కేవైసీ వంటి ఇతర సేవల్లోనూ ఆధార్ అథెంటికేషన్ ఉపయోగిస్తారు. పిల్లలు పెరిగిన తర్వాత పాత బయోమెట్రిక్ వివరాలతో అథెంటికేషన్ చేయడంలో సమస్యలు రాకుండా ఉండేందుకు సరైన సమయంలో MBU చేయించడం మంచిది.ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ ఎలా చేయాలి?➤ఈ ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్లో చేయలేరు. పిల్లలను తప్పనిసరిగా ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్కు తీసుకెళ్లాలి.➤కాబట్టి.. ముందుగా సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని గుర్తించాలి. దీనికోసం భువన్ ఆధార్ పోర్టల్ ఉపయోగించవచ్చు. ➤కేంద్రానికి వెళ్లేటప్పుడు పిల్లల ఆధార్ నెంబర్ను వెంట తీసుకెళ్లడం మంచిది. ➤అక్కడ పిల్లల వేలిముద్రలు, ఐరిస్ స్కాన్, ఫొటో తీసుకుంటారు.అప్డేట్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి?బయోమెట్రిక్ అప్డేట్ చేసిన వెంటనే ఆధార్లో మార్పులు కనిపించకపోవచ్చు. సాధారణంగా కొన్ని వారాల సమయం పట్టవచ్చు. కాబట్టి.. యూఆర్ఎన్ నెంబర్ ఉపయోగించి యూఐడీఏఐ వెబ్సైట్లో అప్డేట్ స్టేటస్ను చెక్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: PF విత్డ్రా చేస్తే ట్యాక్స్ పడుతుందా? -
PF విత్డ్రా చేస్తే ట్యాక్స్ పడుతుందా?
పీఎఫ్ (PF) డబ్బు అంటే.. ఉద్యోగులకు భవిష్యత్ అవసరాల కోసం ఉపయోగపడే ముఖ్యమైన పొదుపు. అందుకే, చాలా మంది పీఎఫ్ బ్యాలెన్స్ను పూర్తిగా సురక్షితమైనదిగా భావిస్తుంటారు. అయితే.. పీఎఫ్ మొత్తాన్ని ఎప్పుడు పడితే అప్పుడు విత్డ్రా చేసుకుంటే మాత్రం పన్ను నిబంధనలు వర్తించే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు ఎంతకాలం ఉద్యోగంలో కొనసాగారు?, పీఎఫ్ను ఎప్పుడు విత్డ్రా చేస్తున్నారు? అనే అంశాలపై ట్యాక్స్ ఆధారపడి ఉంటుంది.ఐదేళ్లలోపు పీఎఫ్ విత్డ్రా చేస్తే..మీరు ఒకే సంస్థలో లేదా వేర్వేరు సంస్థల్లో కలిపి ఐదేళ్ల నిరంతర సర్వీస్ పూర్తి చేయకముందే పీఎఫ్ మొత్తాన్ని విత్డ్రా చేసుకుంటే, కొన్ని సందర్భాల్లో ఆ మొత్తం పన్ను పరిధిలోకి వస్తుంది.ఉదాహరణకు.. మీరు ఒక కంపెనీలో మూడేళ్లు పనిచేసి, తర్వాత మరో కంపెనీకి మారారని అనుకుందాం. మొదటి కంపెనీ పీఎఫ్ను రెండో కంపెనీ పీఎఫ్ ఖాతాకు ట్రాన్స్ఫర్ చేస్తే, ఈ సర్వీస్ కాలం సాధారణంగా కొనసాగింపుగానే పరిగణిస్తారు. కాబట్టి కంపెనీ మారినంత మాత్రాన ఐదేళ్ల సర్వీస్ మళ్లీ మొదటి నుంచి లెక్కించరు. కానీ.. ఐదేళ్లు పూర్తికాకముందే పీఎఫ్ను విత్డ్రా చేస్తే ట్యాక్స్ నిబంధనలు వర్తించవచ్చు.TDS కూడా కట్ అవుతుందిఐదేళ్ల సర్వీస్ పూర్తి కాకముందే పీఎఫ్ విత్డ్రా చేసినప్పుడు, కొన్ని పరిస్థితుల్లో టీడీఎస్ కూడా కట్ అయ్యే అవకాశం ఉంది. పాన్ వివరాలు అందుబాటులో ఉంటే.. సాధారణంగా 10 శాతం టీడీఎస్ వర్తించే అవకాశం ఉంటుంది. పాన్ ఇవ్వకపోతే ఎక్కువ రేటుతో టీడీఎస్ కట్ అవుతుంది. అందుకే.. పీఎఫ్ విత్డ్రా చేసే ముందు మీ పాన్ వివరాలు యూఏఎన్ ఖాతాలో సరిగ్గా అప్డేట్ అయ్యాయా లేదా చూసుకోవడం మంచిది.ఐదేళ్లు పూర్తయితే ట్యాక్స్ ఉండదా?సాధారణంగా ఐదేళ్లు ఉద్యోగం పూర్తయిన తర్వాత పీఎఫ్ విత్డ్రా చేసుకుంటే.. పన్ను మినహాయింపు లభిస్తుంది. ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ను కొత్త ఖాతాకు ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వెళ్తే సర్వీస్ కొనసాగింపును కాపాడుకోవచ్చు. అందుకే అత్యవసరం లేకపోతే కేవలం ఉద్యోగం మారిన కారణంతో పీఎఫ్ మొత్తాన్ని వెంటనే విత్డ్రా చేసుకోవడం కంటే, కొత్త ఉద్యోగంలోని పీఎఫ్ ఖాతాకు ట్రాన్స్ఫర్ చేయడం ప్రయోజనకరంగా ఉండొచ్చు.మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఒక ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగి వాటా రూ.2.5 లక్షల కంటే ఎక్కువ ఉంటే, అదనపు మొత్తంలో వచ్చే వడ్డీపై పన్ను విధిస్తారు. అందువల్ల పెద్ద జీతాలు పొందే ఉద్యోగులు, ఎక్కువ మొత్తంలో పీఎఫ్ కాంట్రిబ్యూషన్ చేసే వారు తమ పీఎఫ్ స్టేట్మెంట్లో కాంట్రిబ్యూషన్, వడ్డీ వివరాలను గమనించడం మంచిది.ఫారమ్ 15G, 15H ఎప్పుడు ఉపయోగపడతాయి?కొన్ని సందర్భాల్లో ఫారమ్ 15G లేదా ఫారమ్ 15H సమర్పించడం ద్వారా టీడీఎస్ కట్ కాకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఫారాలను ప్రతి ఒక్కరూ ఇవ్వలేరు. ఆదాయం, వయస్సు, పన్ను బాధ్యత వంటి అర్హతలను బట్టి ఇవి వర్తిస్తాయి. అందుకే పెద్ద మొత్తంలో పీఎఫ్ విత్డ్రా చేయబోతున్నవారు ముందుగా తమ పన్ను పరిస్థితిని పరిశీలించడం మంచిది.ఇదీ చదవండి: EPFO బిగ్ అప్డేట్.. ఉద్యోగులకు గుడ్న్యూస్! -
దూసుకెళ్తున్న రేటు.. వచ్చేవారం బంగారం ధరలు ఇలా!
బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరుగుతున్న వేళ.. నిపుణులు కొత్త అంచనాలు వెల్లడించారు. వచ్చే వారం కూడా ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. అయితే.. ఇప్పటికే ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో కొంతమంది పెట్టుబడిదారులు లాభాలను తీసుకునే అవకాశం ఉంది.దేశీయ మార్కెట్లో బంగారం ధర ఒక్క వారంలోనే సుమారు రూ.7,900 పెరిగి 10 గ్రాములకు రూ.1.63 లక్షలకు చేరుకుంది. అంటే దాదాపు 5.13 శాతం పెరిగింది. వెండి కూడా అంతే జోరుగా పెరిగింది. కేజీ రేటు రూ.2.70 లక్షలకు చేరుకుంది.బంగారం ధర పెరగడానికి ప్రధాన కారణాల్లో పెట్టుబడిదారుల కొనుగోళ్లు పెరగడం, అమెరికా బాండ్ యీల్డ్స్ తగ్గడం, మార్కెట్లో నగదు లభ్యత మెరుగుపడటం వంటివి ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. అమెరికా మార్కెట్లో బంగారం ధర సుమారు 5.5 శాతం, వెండి ధర దాదాపు 7 శాతం పెరిగాయి.అయితే.. వచ్చే వారం బంగారం ధరల దిశను నిర్ణయించడంలో అమెరికా ఆర్థిక గణాంకాలు చాలా కీలకం కానున్నాయి. ముఖ్యంగా అమెరికా కోర్ పర్సనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్స్, జీడీపీ డేటాపై మార్కెట్లు దృష్టి పెట్టనున్నాయి. అమెరికా ఆర్థిక పరిస్థితి, ద్రవ్యోల్బణం ఆధారంగా.. వడ్డీ రేట్లపై పెట్టుబడిదారులు తమ అంచనాలను మార్చుకోవచ్చు. దీని ప్రభావం డాలర్, బాండ్ యీల్డ్స్తో పాటు బంగారం ధరలపైనా పడుతుంది.పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలు కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు, హర్ముజ్ పరిస్థితి మార్కెట్లకు చాలా కీలకం. ప్రపంచంలో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగినప్పుడు చాలామంది పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు. కాబట్టి పసిడి ధరలు పెరిగే అవకాలు మెండుగా ఉన్నాయి.ఇక ఆగస్టు 27 నుంచి 29 వరకు జరిగే జాక్సన్ హోల్ సమావేశంపైనా మార్కెట్ దృష్టి ఉంటుంది. ఫెడరల్ రిజర్వ్ ఛైర్ కెవిన్ వార్ష్ అక్కడ చేసే ప్రసంగంలో అమెరికా వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, ఆర్థిక వ్యవస్థపై ఏమైనా సంకేతాలు ఇస్తే.. వాటిని పెట్టుబడిదారులు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు. ఇది బంగారం ధరలను తప్పకుండా ప్రభావితం చేస్తుంది.ఇదీ చదవండి: ద్రవ్యోల్బణం ముప్పు తప్పదా?.. పీటర్ షిఫ్ సంచలన వ్యాఖ్యలు -
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై కీలక ప్రకటన!
భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారైందని, భారత్లోని అమెరికా రాయబారి సెర్జియో గోర్ తెలిపారు. శనివారం జరిగిన ది ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరమ్లో మాట్లాడిన ఆయన.. ఒప్పందానికి సంబంధించిన ప్రధాన అంశాలపై ఇరు దేశాలు సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చాయని చెప్పారు.ప్రస్తుతం మిగిలింది ప్రధానంగా ఒప్పందంలోని చట్టపరమైన, సాంకేతిక పదజాలాన్ని తుది రూపంలోకి తీసుకురావడమే అని వివరించారు. అందుకే ఒప్పందం ఖరారు కావడానికి కొంత సమయం పడుతోందని ఆయన పేర్కొన్నారు.రష్యా చమురుపై అమెరికా వైఖరిరష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు టారిఫ్లు విధించే ప్రతిపాదన అమెరికా కాంగ్రెస్లో వస్తున్న నేపథ్యంలో.. గోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్లో డెమొక్రాట్లు, రిపబ్లికన్లు కలిసి మద్దతు ఇస్తున్నప్పటికీ, ట్రంప్ ప్రభుత్వం స్వయంగా ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లడం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే.. ఇలాంటి చట్టం అమల్లోకి వస్తే భారత్పై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని అంగీకరించారు. ఇదే సమయంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంపైనే అధ్యక్షుడు ట్రంప్ ప్రధానంగా దృష్టి పెట్టారని గోర్ చెప్పారు.మోదీ-ట్రంప్ మధ్య సంబంధాలుఅమెరికా రాయబారి భారత్ ప్రధాని నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధాలపై కూడా ప్రశంసలు కురిపించారు. ఇద్దరు నేతలు ఫలితాలపై దృష్టి పెట్టే వ్యక్తులని, త్వరగా నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయాలని కోరుకుంటారని అన్నారు.ముఖ్యంగా 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత ట్రంప్ అధికారంలో లేని సమయంలో కూడా మోదీ ఆయనకు మద్దతుగా నిలిచారని, ఆ సమయంలో మోదీ చూపిన స్నేహాన్ని ట్రంప్ గుర్తుంచుకున్నారని గోర్ పేర్కొన్నారు. ఈ పరస్పర నమ్మకం ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు.భారత్కు అమెరికా ప్రాధాన్యంప్రపంచ రాజకీయ, ఆర్థిక వ్యవస్థలో భారత్కు అమెరికా ఎంతో ప్రాధాన్యం ఇస్తోందని గోర్ అన్నారు. అందుకే.. అమెరికా ప్రభుత్వం నుంచి అత్యున్నత స్థాయి అధికారులు భారత్ను సందర్శిస్తున్నారని తెలిపారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మేలో ఐదు రోజుల పాటు భారత్లో పర్యటించారని, అక్టోబర్లో మరోసారి పలు రోజుల పర్యటనకు రానున్నారని గోర్ చెప్పారు. ఇంత స్థాయిలో ఒక దేశ అధికారి తరచుగా భారత్ను సందర్శించడం అసాధారణమని ఆయన వ్యాఖ్యానించారు. -
ద్రవ్యోల్బణం ముప్పు తప్పదా?.. పీటర్ షిఫ్ సంచలన వ్యాఖ్యలు
అమెరికన్ స్టాక్ బ్రోకర్, ఆర్థిక వ్యాఖ్యాత, యూరో పసిఫిక్ అసెట్ మేనేజ్మెంట్ సీఈఓ 'పీటర్ షిఫ్' (Peter Schiff) తన ట్వీట్లో అమెరికా ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా ఫెడరల్ రిజర్వ్ (Fed)పై పెట్టుబడిదారుల్లో పెరుగుతున్న అనుమానాల గురించి పేర్కొన్నారు. బంగారం, వెండి, చమురు, బిట్కాయిన్ ధరలను ఉదాహరణగా తీసుకుని.. ప్రజలు తమ డబ్బును ద్రవ్యోల్బణం నుంచి కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయ పెట్టుబడుల వైపు వెళ్తున్నారని ఆయన చెబుతున్నారు.సాధారణంగా ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు డబ్బు విలువ తగ్గుతుందనే ఆందోళనతో కొంతమంది బంగారం వంటి ఆస్తులను సురక్షితమైన ఆస్తులుగా ఎంచుకుంటారు. ఇందులోనే పెట్టుబడులు పెడుతుంటారు.షిఫ్ అభిప్రాయం ప్రకారం.. ఫెడ్ ద్రవ్యోల్బణాన్ని 2 శాతానికి తిరిగి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, అమెరికా ప్రభుత్వ భారీ రుణభారం, అధిక వడ్డీ రేట్ల ప్రభావం వంటి కారణాల వల్ల అది కష్టంగా మారే అవకాశం ఉంది. అందుకే ఫెడ్ చివరికి ద్రవ్యోల్బణాన్ని పూర్తిగా అణచివేయడం కంటే కొంత ఎక్కువ ద్రవ్యోల్బణాన్ని సహించాల్సి రావచ్చని ఆయన భావిస్తున్నారు. అయితే ఇది ఫెడ్ అధికారిక ప్రకటన కాదు.. షిఫ్ చేసిన ఆర్థిక విశ్లేషణ మాత్రమే.పెట్టుబడిదారులు తమ డబ్బును కాపాడుకునేందుకు తమకు నచ్చిన ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటున్నారు. కొందరు బంగారం, వెండి వైపు వెళ్తే, మరికొందరు బిట్కాయిన్ ఎంచుకోవచ్చు. మొత్తం మీద.. ఫెడ్ మీద నమ్మకం తగ్గుతున్న కొద్దీ, ద్రవ్యోల్బణం నుంచి తమ సంపదను కాపాడుకోవడానికి పెట్టుబడిదారులు ప్రత్యామ్నాయ ఆస్తుల వైపు చూస్తున్నారని షిఫ్ స్పష్టం చేశారు.Gold hitting $4,600, silver near $70, oil over $87, and Bitcoin's earlier spike above $79K show the Fed has lost all credibility on its commitment to returning inflation to 2%. Treasury made it clear the Fed will choose inflation, so investors are choosing their preferred hedge.— Peter Schiff (@PeterSchiff) August 21, 2026 -
సంతకం చేయనందుకు ఉద్యోగం పోయిందా?
మెటా ప్లాట్ఫామ్స్కు చెందిన మాజీ ప్రొడక్ట్ డిజైన్ మేనేజర్ 'జేమ్స్ టిల్లింగ్హాస్ట్'.. తనను కంపెనీ అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించిందని ఆరోపిస్తూ కేసు దాఖలు చేశారు. తన సహోద్యోగి గ్రీన్ కార్డు దరఖాస్తుకు సంబంధించిన ఒక ఇమ్మిగ్రేషన్ డాక్యుమెంట్ మీద సంతకం చేయడానికి నిరాకరించిన తర్వాతే సమస్యలు మొదలయ్యాయని ఆయన పేర్కొన్నారు.వివాదం ఎలా మొదలైంది?న్యూజెర్సీ ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టులో దాఖలు చేసిన దావా ప్రకారం.. 2024లో మెటా ఇమ్మిగ్రేషన్ లీగల్ టీమ్, తన విభాగంలోని ఒక ఉద్యోగికి సంబంధించిన గ్రీన్ కార్డ్ దరఖాస్తుకు (EB-2 నేషనల్ ఇంటరెస్ట్ వేవర్) మద్దతుగా ఒక సిఫార్సు లేఖపై సంతకం చేయమని టిల్లింగ్హాస్ట్ను కోరడంతో ఈ వివాదం ప్రారంభమైంది.ముసాయిదా లేఖలో ఆ ఉద్యోగి మెటా కోసం సుమారుగా 638 మిలియన్ డాలర్ల అదనపు ప్రకటనల ఆదాయాన్ని సంపాదించిపెట్టాడని, కీలకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అల్గారిథం సాధనాలను నేరుగా అభివృద్ధి చేశాడని, పెద్ద బహుళ-కార్యాత్మక బృందాలకు నాయకత్వం వహించాడని ఆరోపించినట్లు తెలుస్తోంది.లేఖలోని విషయాలపై అభ్యంతరంఆ లేఖలోని కొన్ని విషయాలు అతిశయోక్తిగా, వాస్తవ ఆధారాలు లేనివిగా టిల్లింగ్హాస్ట్కు అనిపించాయి. అందుకే తాను నిజమని నమ్మి ధృవీకరించగలిగే అంశాలను మాత్రమే ఉంచేలా లేఖను మార్చినట్లు ఆయన చెబుతున్నారు. అయినప్పటికీ, ఆ లేఖపై సంతకం చేయడానికి ఆయన నిరాకరించారు. తరువాత మరో మేనేజర్ ఆ లేఖను అప్రూవ్ చేసినట్లు సమాచారం.USCISకి తప్పు సమాచారం ఇవ్వకూడదని నిర్ణయంటిల్లింగ్హాస్ట్ తన నిర్ణయం వెనుక ఎలాంటి వ్యక్తిగత ఉద్దేశం లేదని చెబుతున్నారు. తనకు నిజం కాదని తెలిసిన సమాచారాన్ని యూఎస్సీఐఎస్ (యూ.ఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్)కు సమర్పించే ఇమ్మిగ్రేషన్ ప్రొసీడింగ్స్లో ధృవీకరించడం సరైనది కాదని భావించానని ఆయన పేర్కొన్నారు.ఆ తర్వాత ఉద్యోగంలో ఏమైంది?తన అభ్యంతరాలు వ్యక్తం చేసిన కొద్దికాలానికే మెటాలోని తన ఇంటర్నల్ యాక్సెస్ తొలగించినట్లు టిల్లింగ్హాస్ట్ పేర్కొన్నారు. ఆ తరువాత సెప్టెంబర్ 2024లో ఉద్యోగం కోల్పోయారు.మెటా తనను పర్ఫామెన్స్ ఇస్స్యూ కారణంగా తొలగించిందని చెప్పినప్పటికీ, టిల్లింగ్హాస్ట్ మాత్రం ఆ కారణం నిజం కాదని అంటున్నారు. తనకు ఇంతకుముందు ఎలాంటి నెగిటీవ్ పర్ఫామెన్స్ రికార్డ్స్ లేదని, ఇమ్మిగ్రేషన్ డాక్యుమెంట్ మీద సంతకం చేయడానికి నిరాకరించినందుకు ప్రతీకార చర్యగా తనను తొలగించారని ఆయన ఆరోపిస్తున్నారు.తనకు జరిగిన ఆర్థిక నష్టానికి 1 మిలియన్ కంటే ఎక్కువ నష్టపరిహారం కావాలని టిల్లింగ్హాస్ట్ కోర్టును కోరుతున్నారు. ఇందులో ఉద్యోగం కోల్పోవడం వల్ల వచ్చిన శాలరీ లాస్ మాత్రమే కాకుండా స్టాక్ ఈక్విటీకి సంబంధించిన నష్టాలు కూడా ఉన్నాయి.అయితే ఈ కేసులో అసలు ప్రశ్న.. టిల్లింగ్హాస్ట్ పనితీరు సరిగా లేకపోవడం వల్లనే కంపెనీ తొలగించిందా?, లేదా ఇమ్మిగ్రేషన్ డాక్యుమెంట్ మీద సంతకం చేయకపోవడమే కారణమా?, అనే విషయాలు తెలియాల్సి ఉంది. దీనిపై కంపెనీ అధికారికంగా స్పందించలేదు.ఇదీ చదవండి: EPFO బిగ్ అప్డేట్.. ఉద్యోగులకు గుడ్న్యూస్! -
డాలర్లు వస్తున్నాయ్.. జాగ్రత్త!
అమెరికా మరోసారి క్వాంటిటేటివ్ ఈజింగ్ (QE) పేరుతో డాలర్లను ముద్రించేందుకు సిద్ధమవుతోందని ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ (X) ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. అమెరికా ట్రెజరీ తీసుకునే ఇలాంటి చర్యలతో డాలర్ కొనుగోలు శక్తిని సూచించే డీఎక్స్వై (DXY) సూచీ పడిపోతుందని, ఫలితంగా ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు.డాలర్లలో పొదుపు చేసుకునే వారే అధికంగా నష్టపోతారని కియోసాకి హెచ్చరించారు. ఆర్థికంగా అవగాహన ఉన్న పెట్టుబడిదారులు విలువ పెరిగే బంగారం, వెండి, బిట్కాయిన్, కొంత రియల్ ఎస్టేట్ వంటి ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టి సంపదను పెంచుకుంటారని చెప్పారు. ఆర్థిక పరిజ్ఞానం లేని వారు విలువ కోల్పోయే ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టి నష్టపోతారని పేర్కొన్నారు.ఇదీ చదవండి: బంగారం భారీ ధరలు.. కియోసాకి కామెంట్స్‘ఆర్థిక విద్య ఖరీదైనదని మీరు భావిస్తే.. ఆర్థిక అజ్ఞానానికి చెల్లించే మూల్యం ఎంత?’ అని గతంలో తాను చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా కియోసాకి గుర్తుచేశారు. ఆర్థిక విద్య కోసం వెచ్చించే సమయం, డబ్బు కంటే.. ఆర్థిక అవగాహన లేకపోవడం వల్ల సంపాదించలేని డబ్బే అతిపెద్ద ఖర్చు అని తన ‘రిచ్ డాడ్’ చెప్పేవారని ఆయన పేర్కొన్నారు.PRINTING MORE FAKE $US Treasury announces another round of QE (Quantatative Easing) aka printing fake $.DXY (index of purchasing power of dollars) CRASHES, which means INFLATION Booms….which means savers of fake $ are the biggest losers.Don’t be a Loser.As stated in my…— Robert Kiyosaki (@theRealKiyosaki) August 22, 2026 -
టెకీల దెబ్బ.. పడిపోయిన రియల్ ఎస్టేట్!
దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇళ్ల విక్రయాలు రెండో త్రైమాసికంలో కొంత మందగించాయి. టెక్నాలజీ రంగంలో ఉద్యోగాల కోతలు, ఏఐ ఆధారిత ఉద్యోగ పునర్వ్యవస్థీకరణ, భౌగోళిక ఉద్రిక్తతలు, రుతుపవనాల ముందు ఉండే కాలానుగుణ ప్రభావాలు కొనుగోలుదారుల సెంటిమెంట్పై ప్రభావం చూపినట్లు ప్రాప్టైగర్ తాజా ‘రియల్ ఇన్సైట్ రెసిడెన్షియల్’ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా టెక్ ఆధారిత బెంగళూరు, పుణె మార్కెట్లలో ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది.ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో 91,729 ఇళ్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే కాలంలో నమోదైన 97,674 యూనిట్లతో పోలిస్తే అమ్మకాలు 6.1 శాతం తగ్గాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికంతో పోల్చినా విక్రయాలు 4.4 శాతం క్షీణించాయి. అయితే కొత్త ఇళ్ల ప్రారంభాలు మాత్రం వార్షిక ప్రాతిపదికన 6 శాతం పెరిగి 89,161 యూనిట్లకు చేరాయి. అంటే కొత్త సరఫరా కంటే విక్రయాలు 2,568 యూనిట్లు అధికంగా ఉండటంతో, మార్కెట్లో అమ్ముడుకాని ఇళ్ల నిల్వ గణనీయంగా పెరగలేదని నివేదిక పేర్కొంది.పుణెలో భారీ పతనంఎనిమిది ప్రధాన మార్కెట్లలో పుణెలో ఇళ్ల అమ్మకాలు అత్యధికంగా తగ్గాయి. గతేడాదితో పోలిస్తే విక్రయాలు 20.8 శాతం తగ్గి 12,642 యూనిట్లకు చేరాయి. అహ్మదాబాద్లో 20.2 శాతం తగ్గి 7,541 యూనిట్లకు, బెంగళూరులో 9.2 శాతం తగ్గి 14,186 యూనిట్లకు చేరాయి. ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్ (MMR), ఢిల్లీ-ఎన్సీఆర్ మార్కెట్లలోనూ అమ్మకాలు సుమారు 7 శాతం చొప్పున తగ్గాయి.టెక్నాలజీ రంగంపై ఆధారపడిన నగరాల్లో ఉద్యోగ భద్రతపై నెలకొన్న అనిశ్చితి, ముఖ్యంగా రూ.1 కోటి లోపు ఇళ్లను కొనుగోలు చేయాలనుకునే వారిని మరింత జాగ్రత్తగా వ్యవహరించేలా చేసిందని ప్రాప్టైగర్ అంచనా వేసింది. అయితే టెక్ రంగంలోని పరిణామాలే అమ్మకాలు తగ్గడానికి ఏకైక కారణం కాదని, అంతర్జాతీయ అనిశ్చితి, సీజనల్ ప్రభావాలు కూడా డిమాండ్పై ప్రభావం చూపాయని నివేదిక స్పష్టం చేస్తోంది.హైదరాబాద్, చెన్నైలో భిన్నమైన పరిస్థితిఇతర ప్రధాన నగరాలకు భిన్నంగా హైదరాబాద్, చెన్నై మార్కెట్లు మంచి వృద్ధిని నమోదు చేశాయి. హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాలు 14.6 శాతం పెరిగి 13,196 యూనిట్లకు చేరాయి. చెన్నైలో ఏకంగా 36 శాతం పెరిగి 7,183 యూనిట్లకు చేరడం ఎనిమిది నగరాల్లో అత్యధిక వార్షిక వృద్ధిగా నిలిచింది. కోల్కతాలోనూ తొలి త్రైమాసికంతో పోలిస్తే అమ్మకాలు 22 శాతం పెరిగి బలమైన రికవరీని చూపించాయి. అయితే వార్షిక ప్రాతిపదికన అక్కడ విక్రయాలు 8.6 శాతం తగ్గాయి.అమ్మకాలు తగ్గినా.. ధరలు మాత్రం పైకేఇళ్ల విక్రయాల సంఖ్య తగ్గినప్పటికీ ధరల విషయంలో మాత్రం మార్కెట్ బలంగానే ఉంది. ఎనిమిది నగరాల్లో విక్రయాల ఆధారిత సగటు నివాస ధర త్రైమాసిక ప్రాతిపదికన 1 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ.10,153కి చేరింది. వరుసగా రెండో త్రైమాసికంలోనూ ఈ ధర రూ.10,000 మార్క్ పైనే కొనసాగింది. ఇది తక్కువ సంఖ్యలో ఇళ్లు అమ్ముడవుతున్నప్పటికీ అధిక విలువ కలిగిన ఇళ్లకు డిమాండ్ కొనసాగుతున్నట్లు సూచిస్తోంది.బెంగళూరులో ధరలు వార్షికంగా 26 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ.9,931కు చేరాయి. ముంబైలో చదరపు అడుగుకు సగటు ధర రూ.15,422గా ఉండగా, వార్షికంగా 20.4 శాతం పెరిగింది. పుణెలో ధర తొలిసారిగా రూ.8,000 మార్క్ను దాటి రూ.8,084కు చేరింది. అహ్మదాబాద్ మాత్రం ఎనిమిది ప్రధాన మార్కెట్లలో అత్యంత అందుబాటు ధరలున్న నగరంగా నిలిచింది. అక్కడ సగటు ధర చదరపు అడుగుకు రూ.5,295గా ఉంది.పండుగ సీజన్పై ఆశలుముందు రోజుల్లో పండుగ సీజన్ గృహ డిమాండ్కు కీలక పరీక్షగా నిలవనుంది. పండుగల సందర్భంగా కొనుగోళ్లు ఊపందుకోవడం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, స్థిరమైన గృహ రుణ పరిస్థితులు మార్కెట్కు మద్దతు ఇవ్వవచ్చని ప్రాప్టైగర్ అంచనా వేస్తోంది. బెంగళూరులో మెట్రో ఫేజ్-3, పుణెలో లైన్-3 విస్తరణ, చెన్నై మెట్రో ఫేజ్-2 వంటి ప్రాజెక్టులు కూడా ఆయా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ డిమాండ్కు ఊతమివ్వగలవు.అయితే స్థోమత (affordability) ప్రధాన సవాలుగా మారే అవకాశం ఉంది. నగరాలను బట్టి ధరలు 4.4 శాతం నుంచి 26 శాతం వరకు పెరుగుతున్న నేపథ్యంలో మధ్యతరగతి కొనుగోలుదారులపై గృహ రుణ భారం పెరగవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తంగా చూస్తే.. భారత రియల్ ఎస్టేట్ మార్కెట్లో డిమాండ్ పూర్తిగా బలహీనపడలేదని, కానీ కొనుగోలుదారులు గతంతో పోలిస్తే మరింత ఎంపిక చేసుకుని నిర్ణయం తీసుకుంటున్నారని తాజా గణాంకాలు సూచిస్తున్నాయి.ఇదీ చదవండి: ఇంటితోనే ఇంకో ఇల్లు కొనచ్చు: కియోసాకి కిటుకు -
బంగారం, వెండి ధరలు ఇలా..
దేశంలో బంగారం ధరలకు బ్రేక్ పడింది. మూడు రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు నేడు (Today Gold Rate) నిలకడగా ఉన్నాయి. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో ఈరోజు బంగారం, వెండి కొనేవాళ్లకు ఉపశమనం లభించింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం..ఇదీ చదవండి: బాండ్లు అమ్మేయండి.. బంగారం కొనేయండి: బిలియనీర్ ఇన్వెస్టర్ హెచ్చరిక.. సూచన -
స్టాక్మార్కెట్ ట్రేడింగ్లో ట్రంప్ దూకుడు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెట్టుబడుల పోర్ట్ఫోలియోలో జూన్ నెలలో భారీ కదలికలు చోటుచేసుకున్నాయి. ఆయనకు సంబంధించిన పెట్టుబడి ఖాతాల నుంచి ఏకంగా 1,051 సెక్యూరిటీస్ లావాదేవీలు జరిగినట్లు తాజా ఆర్థిక వెల్లడి నివేదికలో వెల్లడైంది. ఈ లావాదేవీల మొత్తం విలువ కనీసం 78.1 మిలియన్ డాలర్ల నుంచి గరిష్ఠంగా 263.1 మిలియన్ డాలర్ల మధ్య ఉన్నట్లు అమెరికా ప్రభుత్వ నైతిక వ్యవహారాల కార్యాలయం (OGE) వెల్లడించిన పత్రాలు చెబుతున్నాయి. అయితే ఒక్కో లావాదేవీకి ఖచ్చితమైన మొత్తం కాకుండా నిర్దిష్ట విలువల పరిధినే ఫైలింగ్లో పేర్కొన్నారు.జూన్లో ట్రంప్ పోర్ట్ఫోలియోలోకి ప్రముఖ కంపెనీల షేర్లు భారీగా వచ్చాయి. ముఖ్యంగా బెర్క్షైర్ హాత్వే, వీసా, మాస్టర్కార్డ్, సింటాస్ షేర్లలో ఒక్కో కంపెనీకి 1 మిలియన్ డాలర్ల నుంచి 5 మిలియన్ డాలర్ల పరిధిలో కొనుగోళ్లు జరిగినట్లు వెల్లడైంది. అదే సమయంలో మెటా ప్లాట్ఫామ్స్, మోటరోలా సొల్యూషన్స్లోనూ 1 మిలియన్ డాలర్ల నుంచి 5 మిలియన్ డాలర్ల రేంజ్లో షేర్లను విక్రయించారు.భారీ విక్రయం.. వాన్గార్డ్ ఈటీఎఫ్జూన్ 22న జరిగిన లావాదేవీల్లో అత్యంత పెద్దది వాన్గార్డ్ గ్రూప్కు చెందిన డివిడెండ్ అప్రిషియేషన్ ఇండెక్స్ ఫండ్ ఈటీఎఫ్ షేర్ల విక్రయం. దీని విలువ 5 మిలియన్ డాలర్ల నుంచి 25 మిలియన్ డాలర్ల మధ్య ఉన్నట్లు ఫైలింగ్ పేర్కొంది. అదే రోజున ఫిడెలిటీ నేషనల్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (FIS), హోమ్ డిపో షేర్లను కూడా కొనుగోలు చేసినట్లు వివరాలు వెల్లడయ్యాయి.పలాంటీర్లోనూ కొనుగోళ్లు, అమ్మకాలుసాఫ్ట్వేర్ సంస్థ పలాంటీర్ షేర్ల విషయంలోనూ ట్రంప్ పెట్టుబడి ఖాతాలు పలుమార్లు లావాదేవీలు జరిపాయి. జూన్ 3న 1,001–15,000 డాలర్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగా, జూన్ 16న 15,001–50,000 డాలర్లు, జూన్ 18న 500,000–1 మిలియన్ డాలర్లు విలువైన షేర్లను విక్రయించారు. అనంతరం జూన్ 23, 24 తేదీల్లో మళ్లీ పలాంటీర్లో కొనుగోళ్లు జరిగాయి.2025లోనూ 21 వేలకు పైగా ట్రేడ్స్ట్రంప్ పెట్టుబడులపై ఇలాంటి చురుకుదనం కొత్తది కాదు. 2025లో ఆయనకు సంబంధించిన ఖాతాల నుంచి 21,000కు పైగా సెక్యూరిటీస్ లావాదేవీలు జరిగాయి. వాటి మొత్తం విలువ 600 మిలియన్ నుంచి 1.86 బిలియన్ డాలర్ల మధ్య ఉన్నట్లు గతంలో వెల్లడైన ఫైలింగ్ తెలిపింది. కొన్ని సందర్భాల్లో ఒకే రోజున ఒకే సెక్యూరిటీని కొనుగోలు చేయడంతోపాటు విక్రయించిన లావాదేవీలు కూడా నమోదయ్యాయి.స్వతంత్ర నిర్వహణలోనే పెట్టుబడులుట్రంప్ పెట్టుబడుల విషయంలో ప్రయోజనాల సంఘర్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నప్పటికీ.. వైట్హౌస్ మాత్రం ఆయనకు పెట్టుబడి నిర్ణయాలపై ప్రత్యక్ష నియంత్రణ లేదని చెబుతోంది. ట్రంప్ కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం, ఆస్తులను స్వతంత్ర మేనేజర్లు నిర్వహిస్తున్నారు. కంప్యూటర్ ఆధారిత మోడల్ పోర్ట్ఫోలియోల ద్వారా ప్రముఖ సూచీలను అనుసరించే విధంగా పెట్టుబడులు నిర్వహిస్తున్నారని వైట్హౌస్ ప్రతినిధి డేవిస్ ఇంగ్లే తెలిపారు. ట్రంప్ కుమారుడు ఎరిక్ ట్రంప్ కూడా ఆస్తులు బ్లైండ్ ట్రస్ట్ పరిధిలో ఉన్నాయని గతంలో పేర్కొన్నారు.అయితే పెట్టుబడుల సమయం, భారీ లావాదేవీల సంఖ్య కారణంగా నైతికతపై చర్చ కొనసాగుతోంది. ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే ట్రంప్ పెట్టుబడి ఖాతాలు వేల సంఖ్యలో కొనుగోళ్లు, అమ్మకాలు జరిపినట్లు గతంలో వెల్లడైంది.ఇదీ చదవండి: బాండ్లు అమ్మేయండి.. బంగారం కొనేయండి: బిలియనీర్ ఇన్వెస్టర్ హెచ్చరిక.. సూచన -
ఇప్పుడు ఎలాంటి స్మార్ట్ఫోన్లు కావాలంటే..
ఏఐ ఫీచర్లు ఇప్పుడు 82% స్మార్ట్ ఫోన్ కొనుగోలుదారుల ఎంపికను ప్రభావితం చేస్తున్నాయి. ఆ తర్వాత పెర్ఫార్మెన్స్, బ్యాటరీ జీవిత కాలం, కెమెరా సామర్థ్యం వంటివి వరుసగా నిలిచాయి. స్మార్ట్ ఫోన్ ఎంపికలో వినియోగదారులపై ప్రభావం చూపుతున్న అంశాలపై అధ్యయనాన్ని బెస్ట్ ఇన్టెక్ సర్వే పేరిట అమెజాన్ డాట్ ఇన్ నిర్వహించింది.హైదరాబాద్తో పాటు పలు చిన్న, మధ్య తరహా పట్టణాల వ్యాప్తంగా నిర్వహించిన ఈ అధ్యయన ఫలితాల ప్రకారం.. 87% మంది. పెర్ఫార్మెన్స్ వేగం 79% మంది బ్యాటరీ జీవిత కాలం 77% మంది నాణ్యతలను కోరుకుంటున్నారని ఏఐ రాకతో వినియోగదారుల ప్రాధాన్యతల్లో ఆసక్తికరమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని అమెజాన్ ఇండియా. కంజ్యూమర్ ఎల్రక్టానిక్స్, డైరెక్టర్, జేబా ఖాన్ అభిప్రాయపడ్డారురేటింగ్స్కే ప్రథమ ప్రాధాన్యం.. దిగువ మధ్యతరగతి, పేద జనాభా ఎక్కువగా ఉండే మన దేశంలో రూ.15వేల లోపు ధర కలిగిన ఫోన్లకు 7 శాతం మాత్రమే ఎంచుకుంటున్నారని అధ్యయనం వెల్లడించడం విశేషం. అత్యధిక డిమాండ్ (42 శాతం మంది) రూ.25 వేల నుంచి రూ.50 వేల మధ్య ధర కలిగిన ఫోన్లకు ఉందని, రూ.75 వేల లోపు ఖరీదు చేసే ఫోన్లను 15 శాతం మంది, అంతకంటే ఎక్కువ ధర కలిగిన ఫోన్లను 17 శాతం మంది ఎంచుకుంటున్నారు.రూ.15వేల నుంచి రూ.25 వేల మధ్య ధర కలిగిన ఫోన్లను 19 శాతం మంది ఓటేశారు. ఫోన్ వినియోగదారుల్లో 54శాతం మంది తమ ఫోన్లను రెండేళ్లు అంతకంటే ఎక్కువ కాలం ఉపయోగిస్తున్నారు. వచ్చే మూణ్నెళ్లలో ఫోన్ మారుస్తామని 48 శాతం మంది చెప్పారు. ఫోన్ల ఎంపికలో డిస్కౌంట్ల కంటే రేటింగ్స్కే వీరు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. కొనుగోలు చేసేటప్పుడు రేటింగ్స్కి మొదటి ప్రాధాన్యమిస్తామని 47శాతం మంది చెప్పగా, డిస్కౌంట్లు, బెస్ట్ డీల్స్కే ఓటేస్తామని 35శాతం మంది వెల్లడించారు.ఇదీ చదవండి: జియో రీచార్జ్ ప్లాన్: 98 రోజులు అదిరిపోయే బెనిఫిట్స్! -
ఈ వారం బ్యాంకులకు సెలవులు.. 4 రోజులు బంద్!
దేశ ప్రజల దైనందిన జీవితంలో బ్యాంకులు భాగమైపోయాయి. ఏదో ఒక పని నిమిత్తం బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం చాలా మందికి వస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో బ్యాంకుల పనిదినాలు, సెలవుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వారం ఆగస్టు 24 నుంచి 30 వరకు దేశంలోని పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) హాలిడే క్యాలెండర్ ప్రకారం ఈ వారంలో ప్రాంతీయ పండుగలు, ప్రత్యేక సందర్భాల కారణంగా కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకు శాఖలు మూతపడనున్నాయి. సాధారణ పనిదినాల్లో బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి.ఈ వారం బ్యాంకు సెలవులుఆగస్టు 25, మంగళవారం: మిలాద్-ఉన్-నబీ, మిలాద్-ఇ-షెరీఫ్ సందర్భంగా కేరళ, ఆంధ్రప్రదేశ్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. కేరళలో తొలి ఓణం వేడుకల కారణంగానూ బ్యాంకు శాఖలు మూసి ఉంటాయి.ఆగస్టు 26, బుధవారం: ఈద్-ఎ-మిలాద్, బరావాఫత్, మిలాద్-ఉన్-నబీ, తిరుఓణం వేడుకల కారణంగా మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, తెలంగాణ, మణిపూర్, జమ్మూకశ్మీర్, ఉత్తరప్రదేశ్, కేరళ, ఢిల్లీ, బిహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.ఆగస్టు 28, శుక్రవారం: రక్షా బంధన్ సందర్భంగా గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, రాజస్థాన్, జమ్మూకశ్మీర్, ఉత్తరప్రదేశ్, కేరళ, హిమాచల్ప్రదేశ్లోని బ్యాంకులకు సెలవు ఉంటుంది.ఆగస్టు 30, ఆదివారం: దేశవ్యాప్తంగా బ్యాంకులకు సాధారణ వారాంతపు సెలవు ఉంటుంది. కాగా, ఆగస్టు 29 శనివారం కావడంతో ఆ రోజు బ్యాంకులు సాధారణంగా తెరిచి ఉంటాయి.అందుబాటులో డిజిటల్ బ్యాంకింగ్ సేవలుబ్యాంకు సెలవు రోజుల్లో భౌతిక శాఖల్లో సేవలు అందుబాటులో ఉండవు. అయితే డిజిటల్ బ్యాంకింగ్ సేవలను వినియోగదారులు యథావిధిగా పొందవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, ఏటీఎం వంటి సేవలు సాధారణంగా 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. అలాగే ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ వంటి ఆన్లైన్ లావాదేవీ సేవలను కూడా వినియోగించుకోవచ్చు.ఇదీ చదవండి: బాండ్లు అమ్మేయండి.. బంగారం కొనేయండి: బిలియనీర్ ఇన్వెస్టర్ హెచ్చరిక.. సూచన -
ఉసేన్ బోల్ట్ రికార్డును బీట్ చేసిన రోబో!
రోబోలు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఫ్యాక్టరీల్లో పనులు చేసే యంత్రాలు మాత్రమే. కానీ.. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ రోబోలు కూడా మనుషుల్లా నడవడం, పరుగెత్తడం, క్రీడల్లో పాల్గొనడం నేర్చుకుంటున్నాయి. ఇప్పుడు చైనాలో తయారైన ఓ హ్యూమనాయిడ్ రోబో ఏకంగా ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన స్ప్రింటర్గా పేరున్న ఉసేన్ బోల్ట్ రికార్డును మించిన వేగంతో పరుగెత్తి అందరినీ ఆశ్చర్యపరిచింది.100 మీటర్లు.. కేవలం 9.32 సెకన్లలో!చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ హానర్ అభివృద్ధి చేసిన ఈ హ్యూమనాయిడ్ రోబో పేరు 'లైట్నింగ్' (Lightning). బీజింగ్లో శనివారం ప్రారంభమైన రెండో వరల్డ్ హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్కు ముందు నిర్వహించిన సన్నాహక కార్యక్రమంలో లైట్నింగ్ 100 మీటర్ల పరుగులో ఈ సంచలన ప్రదర్శన చేసింది.రోబో కేవలం 9.32 సెకన్లలో 100 మీటర్ల పరుగును పూర్తి చేసింది. ఈ క్రమంలో గరిష్ఠంగా సెకనుకు 14.5 మీటర్ల వేగాన్ని అందుకుంది.బోల్ట్ రికార్డు కంటే కూడా వేగం అన్నమాట.జమైకా స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ 2009లో బెర్లిన్లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 100 మీటర్ల పరుగును 9.58 సెకన్లలో పూర్తి చేశాడు. ఇప్పటివరకు పురుషుల 100 మీటర్ల పరుగులో ఇదే ప్రపంచ రికార్డుగా ఉంది. అయితే లైట్నింగ్ 9.32 సెకన్లలో రేసును పూర్తి చేయడంతో.. బోల్ట్ రికార్డు కంటే 0.26 సెకన్లు వేగంగా పరుగెత్తినట్లయింది.అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఇది హ్యూమన్ అథ్లెటిక్స్లో జరిగిన ప్రపంచ రికార్డు కాదు. రోబో సాధించిన వేగాన్ని బోల్ట్ ప్రపంచ రికార్డుతో పోల్చినది మాత్రమే.హాఫ్ మారథాన్లోనూ సత్తా'లైట్నింగ్'కు పరుగులో ఇది మొదటి రికార్డ్ మాత్రమే కాదు. ఎందుకంటే.. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన బీజింగ్ హాఫ్ మారథాన్లో కూడా ఈ రోబో పాల్గొంది. అక్కడ 21 కిలోమీటర్ల దూరాన్ని 50 నిమిషాల 26 సెకన్లలో పూర్తి చేసింది. హ్యూమన్ అథ్లెట్ల అత్యుత్తమ ప్రపంచ రికార్డు స్థాయి వేగంతో పోల్చినా ఇది చాలా వేగమైన ప్రదర్శన కావడం విశేషం.🔴 Çinli teknoloji şirketi Honor'un robotu “Lightning”, Pekin'deki Dünya İnsansı Robot Oyunları öncesi testte 100 metreyi 9,32 saniyede koşarak Usain Bolt'un 9,58 saniyelik rekorunu geride bıraktı. pic.twitter.com/lO0cDz4ZCm— Piyasa Türkiye ✰ (@PiyasaTturkiye) August 22, 2026హాఫ్ మారథాన్ సమయంలో రోబో ఎత్తు 169 సెంటీమీటర్లు ఉండగా, దాని కాళ్ల పొడవు 95 సెంటీమీటర్లు. అయితే ఆ తర్వాత పరిశోధకులు రోబో పరుగును మరింత మెరుగుపరిచేందుకు దాని కాళ్లను 10 సెంటీమీటర్లు పొడిగించారు. ఇప్పుడు లైట్నింగ్ కాళ్ల పొడవు 1.05 మీటర్లకు చేరింది. దీని వల్ల రన్నింగ్లో మరింత వేగం, స్థిరత్వం సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు.రోబోలపై చైనా ఫోకస్చైనా ప్రస్తుతం హ్యూమనాయిడ్ రోబోట్లను భవిష్యత్తులో కీలకమైన టెక్నాలజీ రంగంగా చూస్తోంది. ఏఐ, రోబోటిక్స్, హార్డ్వేర్ రంగాల్లో జరుగుతున్న అభివృద్ధిని ఉపయోగించుకుని ఈ రోబోలను వివిధ రంగాల్లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా తయారీ పరిశ్రమ, లాజిస్టిక్స్, వినియోగదారుల సేవలు వంటి రంగాల్లో హ్యూమనాయిడ్ రోబోల వినియోగం పెంచే దిశగా చైనా అడుగులు వేస్తోంది.రోబోటిక్స్లో కొత్త దశకు సంకేతమా?ఒకప్పుడు రోబోలు మనుషులు చేసే పనులను అనుకరించడం కూడా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు అవే రోబోలు మనుషుల్లా నడవడం, పరుగెత్తడం మాత్రమే కాకుండా క్రీడా పోటీల్లో పాల్గొనే స్థాయికి చేరుకున్నాయి. లైట్నింగ్ 100 మీటర్లను 9.32 సెకన్లలో పూర్తి చేయడం రోబోటిక్స్ రంగంలో గొప్ప మైలురాయి. భవిష్యత్తులో ఏఐ, హ్యూమనాయిడ్ రోబోటిక్స్ మరింత అభివృద్ధి చెందితే.. మనుషులు, రోబోల సామర్థ్యాల మధ్య తేడా ఇంకా ఎంత తగ్గుతుందో చూడాలి. -
5G కోసం బెస్ట్ రీఛార్జ్ ఏది? జియో, ఎయిర్టెల్ ప్లాన్స్ ఇవే!
స్మార్ట్ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరూ.. మంచి స్పీడ్తో పాటు తక్కువ ధరలో, ఎక్కువ డేటా, ఎక్కువ వ్యాలిడిటీ ఇచ్చే రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తుంటారు. భారత్లో 5జీ సేవలు అందిస్తున్న ప్రధాన టెలికాం కంపెనీల్లో రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్ ముందున్నాయి. అయితే జియోలో రూ.198 ప్లాన్, ఎయిర్టెల్లో రూ.349 ప్లాన్ తీసుకుంటే ఏది ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తుంది?, రెండింటి మధ్య అసలు తేడా ఏంటి? ఇప్పుడు చూద్దాం.జియో రూ.198 ప్లాన్తక్కువ బడ్జెట్లో 5జీ కావాలనుకునే వారికి జియో రూ.198 ప్లాన్ బాగుంటుంది. ఈ ప్లాన్ 14 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ రీఛార్జ్తో రోజుకు 2జీబీ డేటా, 100 SMSలు, అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ లభిస్తాయి. ఎక్కువగా వీడియోలు చూసేవారు, సోషల్ మీడియా ఉపయోగించేవారు, భారీ ఫైళ్లను డౌన్లోడ్ చేసేవారికి ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. అదనంగా.. జియో టీవీ, జియోఏఐక్లౌడ్ వంటి ప్రయోజనాలు కూడా ఈ ప్లాన్లో ఉన్నాయి.ఎయిర్టెల్ రూ.349 ప్లాన్ఎయిర్టెల్ రూ.349 ప్లాన్ ధర జిఓ కంటే ఎక్కువే, అయితే ఇందులో వ్యాలిడిటీ 28 రోజులు లభిస్తుంది. ఇందులో రోజుకు 1.5జీబీ డేటా, 100 SMSలు, అన్లిమిటెడ్ కాలింగ్ లభిస్తాయి. అదనపు బెనిఫిట్స్ విషయానికి వస్తే.. 12 నెలల పాటు అడోబ్ ఎక్స్ప్రెస్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. అలాగే యాపిల్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ కూడా ఈ ప్లాన్లో భాగంగా అందుతోంది.జియో, ఎయిర్టెల్ మధ్య తేడా!రెండు ప్లాన్లను పరిశీలిస్తే.. ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. జియో రూ.198 ప్లాన్ చౌకగా ఉండటంతో పాటు రోజువారీ డేటా కూడా ఎక్కువగా ఇస్తుంది. కానీ దీని వ్యాలిడిటీ కేవలం 14 రోజులు. అదే.. ఎయిర్టెల్ రూ.349 ప్లాన్కు 28 రోజుల వ్యాలిడిటీ ఉంది. అంటే జియో ప్లాన్తో పోలిస్తే రెట్టింపు కాలం రీఛార్జ్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. అయితే రోజువారీ డేటా 1.5GB మాత్రమే.మరి ఏ ప్లాన్ తీసుకోవాలి?మీకు తక్కువ ధరలో 5జీ కావాలి, ఎక్కువగా 5జీ డేటా ఉపయోగించాలి అనుకుంటే.. జియో రూ.198 ప్లాన్ గురించి ఆలోచించవచ్చు. తక్కువ కాలానికి రీఛార్జ్ చేసుకుని అవసరానికి తగ్గట్టుగా ఉపయోగించుకోవచ్చన్నమాట. అయితే 28 రోజుల వ్యాలిడిటీ, రోజువారీ డేటా, అదనపు సబ్స్క్రిప్షన్లు కావాలంటే ఎయిర్టెల్ రూ.349 ప్లాన్ మెరుగైన ఎంపిక అనే చెప్పాలి. -
EPFO బిగ్ అప్డేట్.. ఉద్యోగులకు గుడ్న్యూస్!
ఉద్యోగుల భవిష్యత్ భద్రత కోసం ఈపీఎఫ్(ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్) చాలా అవసరం. ఎందుకంటే.. ప్రతి నెల జీతం నుంచి కొంత మొత్తం పీఎఫ్ ఖాతాలో జమ అవుతూ, ఉద్యోగి రిటైర్ అయినప్పుడు, లేదా అవసరమైన సమయంలో ఈ మొత్తం ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతుంది. అయితే.. కొన్ని సందర్భాల్లో అర్హత ఉన్న ఉద్యోగులు ఈపీఎఫ్ పరిధిలోకి రాకుండా ఉండిపోయారు. ఇలాంటి వారికి ఇప్పుడు EPFO ఒక ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తోంది. అదే ఎంప్లాయీస్ ఎన్రోల్మెంట్ క్యాంపెయిన్ 2026 (EEC 2026).EEC 2026 ఉద్దేశంగతంలో ఈపీఎఫ్ కవరేజీకి దూరంగా ఉన్న అర్హులైన ఉద్యోగులను తిరిగి ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకురావడమే ఈ క్యాంపెయిన్ ప్రధాన ఉద్దేశం. అంటే.. తమ సంస్థలో అర్హత ఉన్నప్పటికీ ఈపీఎఫ్లో నమోదు కాని ఉద్యోగులు.. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.ఎప్పటి వరకు అవకాశం2026 జూన్ 29 నుంచి ఈ క్యాంపెయిన్ అమల్లోకి వచ్చింది. అక్టోబర్ 31, 2026 వరకు అర్హత ఉన్న ఉద్యోగులను నమోదు చేసుకోవచ్చు. అయితే.. సంస్థలు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా, తమ ఉద్యోగుల రికార్డులను ముందుగానే పరిశీలించుకోవాలని ఈపీఎఫ్ఓ సూచించింది.ఎవరు అర్హులు?ఈపీఎఫ్ పరిధిలోకి రావాల్సి ఉన్నప్పటికీ.. గతంలో నమోదు కాని ఉద్యోగులను ఈ క్యాంపెయిన్ ద్వారా చేర్చుకోవచ్చు. అయితే కొన్ని షరతులు ఉన్నాయి. ముఖ్యంగా.. యజమాని ఉద్యోగిని డిక్లేర్ చేసే తేదీకి ఆ ఉద్యోగి జీవించి ఉండటంతో పాటు, అదే సంస్థలో ఉద్యోగం చేస్తూ ఉండాలి. అలాగే ఈఈసీ 2026 కింద నిర్దేశించిన ఇతర నిబంధనలను కూడా పాటించాల్సి ఉంటుంది.ఉద్యోగులకు ప్రయోజనం ఏమిటి?ఒక ఉద్యోగి EPFలో చేరితే భవిష్యత్తు కోసం పొదుపు మాత్రమే కాకుండా, నిబంధనలకు అనుగుణంగా పెన్షన్, ఇన్సూరెన్స్ వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలు కూడా లభించే అవకాశం ఉంటుంది.ప్రతి ఉద్యోగి ఉమాంగ్ (UMANG) యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ ఆధారిత యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)ను రూపొందించాలి. ఆ తరువాత తరఫున ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్లను ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్ (ECR) ద్వారా చెల్లించాలి.యజమానులు ఏం చేయాలి?సంస్థలు ముందుగా తమ ఉద్యోగుల వివరాలను పరిశీలించాలి. ముఖ్యంగా గతంలో EPFలో నమోదు కాకుండా మిగిలిపోయిన అర్హులైన ఉద్యోగులు ఎవరైనా ఉన్నారా? అనే విషయాన్ని గుర్తించాలి. దీని కోసం ఉద్యోగుల జీతాల రికార్డులు, ఎంప్లాయ్మెంట్ వివరాలు, EPF రికార్డులను పరిశీలించడం అవసరం. అర్హత ఉన్న ఉద్యోగులు కనిపిస్తే EEC 2026 కింద అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలి.ఇదీ చదవండి: పసిడి ప్రియులకు షాక్.. భారమైపోతున్న బంగారం! -
టాటా కార్ల ధరల పెంపు!
దేశీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' (Tata Motors) తన కార్ల ధరలను రూ. 25,000 వరకు పెంచనున్నట్లు వెల్లడించింది. సవరించిన రేట్లు 2026 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి.కంపెనీ ప్రకారం.. పెరుగుతున్న ముడిసరుకుల ఖర్చులు మరియు కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితి మధ్య ద్రవ్యోల్బణం కారణంగా ధరల పెంపు జరిగింది. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ICE), ఎలక్ట్రిక్ వాహనాలు (EV) రెండింటికీ కొత్త ధరలు వర్తిస్తాయి. ధరల పెంపు మోడల్, వేరియంట్ను బట్టి మారుతూ ఉంటుంది.వేరియంట్ల వారీగా ఖచ్చితమైన ధరల వివరాలు వెల్లడి కాలేదు. డీలర్షిప్ విధానాలు, బుకింగ్ తేదీలను బట్టి, సెప్టెంబర్ 1వ తేదీకి ముందు టాటా కారు లేదా SUVని బుక్ చేసుకోవాలనుకుంటున్న కస్టమర్లు ప్రస్తుత ధరలనే పొందగలిగే అవకాశం ఉంది.కాగా.. హ్యుందాయ్ కూడా వచ్చే నెల నుంచి తన మోడల్ శ్రేణి అంతటిపైనా ధరల పెంపును ప్రకటించగా, మారుతి సుజుకి 2026 ఆగస్టు ప్రారంభంలోనే తన మోడళ్ల ధరలను పెంచింది. -
జియో రీచార్జ్ ప్లాన్: 98 రోజులు అదిరిపోయే బెనిఫిట్స్!
మొబైల్ రీఛార్జ్ విషయంలో ఎక్కువ వ్యాలిడిటీతో పాటు రోజువారీ డేటా, అపరిమిత 5జీ, కాలింగ్, ఎస్ఎంఎస్, ఎంటర్టైన్మెంట్, ఏఐ సేవలు అందించే ప్లాన్లకు ప్రస్తుతం వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో అందిస్తున్న రూ.999 ప్రీపెయిడ్ ప్లాన్ పలు ప్రయోజనాలతో ఆకట్టుకుంటోంది. ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే 98 రోజుల పాటు సేవలు పొందొచ్చు.98 రోజుల వ్యాలిడిటీ.. 196 జీబీ డేటారూ.999 ప్లాన్లో 98 రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజూ 2 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. అంటే మొత్తం వ్యాలిడిటీ కాలంలో 196 జీబీ డేటాను వినియోగించుకోవచ్చు. దీంతో పాటు ఏ నెట్వర్క్కైనా అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు అందిస్తారు. తరచూ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా దాదాపు మూడు నెలల పాటు ఈ సేవలను పొందవచ్చు.5జీ యూజర్లకు అపరిమిత డేటా5జీ స్మార్ట్ఫోన్తో పాటు జియో 5జీ నెట్వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతంలో ఉన్న వినియోగదారులకు ఈ ప్లాన్తో అపరిమిత 5జీ డేటా ప్రయోజనం లభిస్తుంది. 5జీ సేవలు అందుబాటులో లేకపోతే రోజువారీ 2 జీబీ హైస్పీడ్ డేటా వినియోగం పూర్తయ్యాక ఇంటర్నెట్ వేగం 64 కేబీపీఎస్కు తగ్గుతుంది.జియోహాట్స్టార్, గూగుల్ ఏఐ ప్రోఈ ప్లాన్లో వినోదం కోసం జియోహాట్స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. అంతేకాకుండా గూగుల్ ఏఐ ప్రో ప్రయోజనం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇందులో 5,000 జీబీ గూగుల్ క్లౌడ్ స్టోరేజ్, జెమిని ప్రో యాక్సెస్తో పాటు నానో బనానా సహా పలు ఏఐ ఫీచర్లను వినియోగించుకునే అవకాశం ఉంటుంది. జియో క్లౌడ్ ద్వారా అదనంగా 50 జీబీ క్లౌడ్ స్టోరేజ్ ప్రయోజనం కూడా లభిస్తుంది.సబ్స్క్రిప్షన్ కొనసాగాలంటే ఇదే కీలకంఅయితే జియోహాట్స్టార్, గూగుల్ ఏఐ ప్రో ప్రీమియం ప్రయోజనాలకు కొన్ని షరతులు వర్తిస్తాయి. ఈ ప్రయోజనాలను యాక్టివ్గా కొనసాగించేందుకు తదుపరి నెలల్లో కనీసం రూ.349 లేదా అంతకంటే ఎక్కువ విలువైన జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తే 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా, అపరిమిత కాలింగ్, 5జీ డేటాతో పాటు ఎంటర్టైన్మెంట్, ఏఐ సేవలను ఒకే ప్లాన్లో కోరుకునే వారికి రూ.999 రీఛార్జ్ ఆసక్తికరమైన ఆప్షన్గా నిలుస్తోంది. -
రూ. 4,896 కోట్ల ఎఫ్డీఐలు..
న్యూఢిల్లీ: ఆటోమాటిక్ మార్గంలో లభించిన 29 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐలు) సమాచారం అందినట్లు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. వీటి విలువ రూ. 4,896 కోట్లుకాగా.. మే నెలలో ప్రభుత్వం చైనాకు వాటాగల ఎఫ్డీఐలపై మార్గదర్శకాలను సవరించింది. తద్వారా చైనా కంపెనీలకు 10 శాతంలోపు వాటాగల విదేశీ సంస్థలు ఆటోమాటిక్ మార్గంలో దేశీయంగా ఇన్వెస్ట్ చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. వెరసి మే 1 నుంచి 2026 ఆగస్ట్ 20కల్లా 29 ప్రతిపాదనల వివరాలు దాఖలైనట్లు వాణిజ్యం, పరిశ్రమల శాఖ తెలియజేసింది.ఐటీ, ఏఐ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్, తయారీ, ఫార్మాస్యూటికల్స్, డేటా సెంటర్లు, రవాణా సరీ్వసులలో తాజా పెట్టుబడులు నమోదైనట్లు వెల్లడించింది. పెట్టుబడులు మారిషస్, యూఎస్, కొరియా, జపాన్, సింగపూర్, లక్సెమ్బర్గ్, కేమన్ ఐలాండ్స్ నుంచి లభించినట్లు పేర్కొంది. మే నెలకంటే ముందు భారత్తో సరిహద్దును పంచుకునే దేశాల కంపెనీలకు వాటా కలిగిన విదేశీ సంస్థలు ఏ రంగంలోనైనా పెట్టుబడులు చేపట్టేందుకు తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి తీసుకోవలసి ఉండేది. మేలో చేపట్టిన మార్గదర్శకాల సవరణల తదుపరి ఆటోమాటిక్ మార్గంలో పెట్టుబడులకు అనుమతి లభిస్తోంది. అయితే ప్రభుత్వానికి రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. -
పసిడి ప్రియులకు షాక్.. భారమైపోతున్న బంగారం!
బంగారం ధరలకు రెక్కలొచ్చాయా అన్నట్లుగా.. గోల్డ్ రేటు రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ రోజు కూడా గరిష్టంగా రూ.1520 పెరిగిన పసిడి ధర.. వారం రోజుల్లో ఏకంగా రూ.7,960 పెరిగి, జీవితకాల గరిష్టాలను తాకింది. ఈ కథనంలో ఏడు (ఆగస్టు 16 నుంచి 22 వరకు) రోజుల్లో బంగారం ధర ఏ నగరంలో ఎంత పెరిగిందనే వివరాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఆగస్టు 16న రూ.1,55,130 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర, ఆగస్టు 22 నాటికి 1,63,090 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో పెరిగిన గోల్డ్ రేటు రూ. 7960 అన్నమాట. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు విషయానికి వస్తే.. ఏడురోజుల్లో 1,42,200 రూపాయల నుంచి రూ.1,49,500 వద్దకు (రూ.7300 పెరిగింది) చేరింది.చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,55,130 నుంచి రూ. 1,63,090 వద్దకు చేరింది. అంటే ఏడురోజుల్లో రూ. 7960 పెరిగింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,42,200 నుంచి రూ.1,49,500 (రూ.7300 పెరిగింది) వద్దకు చేరింది.దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో గణనీయమైన మార్పు కనిపించింది. ఇక్కడ రూ.1,55,280 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,63,240 వద్దకు (రూ.7960 పెరిగింది) చేరింది. 22 క్యారెట్ల రేటు రూ.1,42,350 నుంచి రూ.1,49,650 వద్దకు (రూ.7300 పెరిగింది) చేరింది.ఇదీ చదవండి: బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్! -
ఈ జలుబు మందులు బ్యాన్.. నిషేధించిన కేంద్రం
చిన్నారుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్లోర్ఫెనిరామైన్ మేలేట్ (Chlorpheniramine Maleate), ఫినైలెఫ్రైన్ హైడ్రోక్లోరైడ్ (Phenylephrine Hydrochloride) కలిగిన అన్ని ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ (FDC) మందులను నాలుగేళ్లలోపు పిల్లలకు వినియోగించకుండా కేంద్రం ఆంక్షలు విధించింది. ఈ రెండు పదార్థాలతో కూడిన మందుల తయారీ, విక్రయం, పంపిణీపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజా నోటిఫికేషన్ జారీ చేసింది.ఇక ప్యాక్పై హెచ్చరిక తప్పనిసరితాజా ఆదేశాల ప్రకారం.. ఈ కాంబినేషన్తో కూడిన మందుల తయారీదారులు లేబుల్, ప్యాకేజీ ఇన్సర్ట్, ప్రచార సామగ్రిపై ‘నాలుగేళ్లలోపు పిల్లలకు ఈ ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ను ఉపయోగించకూడదు’ అనే హెచ్చరికను స్పష్టంగా ముద్రించాలి. ఈ నోటిఫికేషన్ అధికారిక గెజిట్లో ప్రచురితమైన తేదీ నుంచే అమల్లోకి వస్తుంది.2025లోనే తొలిసారి ఆంక్షలుఈ నిర్ణయం పూర్తిగా కొత్తదేమీ కాదు. 2025 ఏప్రిల్ 15న కేంద్రం ఇదే క్లోర్ఫెనిరామైన్ మేలేట్–ఫినైలెఫ్రైన్ హైడ్రోక్లోరైడ్ కాంబినేషన్పై ఆంక్షలు విధించింది. నిపుణుల కమిటీ, డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు (DTAB) సిఫార్సుల మేరకు నాలుగేళ్లలోపు పిల్లల్లో వీటి వినియోగం వల్ల ప్రమాదాలు ఉండొచ్చని, సురక్షితమైన ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం అప్పట్లో పేర్కొంది.తాజా చర్య ద్వారా గత ఆంక్షల పరిధిని మరింత స్పష్టం చేస్తూ ఈ రెండు పదార్థాలు కలిగిన అన్ని సంబంధిత ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ ఫార్ములాలకు నాలుగేళ్లలోపు పిల్లల విషయంలో ఇదే నిషేధం/వినియోగ పరిమితిని వర్తింపజేశారు.జలుబు, ముక్కుదిబ్బడకు ఉపయోగించే కాంబినేషన్క్లోర్ఫెనిరామైన్ మేలేట్ అనేది యాంటీహిస్టమైన్ కాగా, ఫినైలెఫ్రైన్ ముక్కులోని రక్తనాళాల వాపును తగ్గించేందుకు ఉపయోగించే డీకంజెస్టెంట్. ఈ రెండింటినీ కలిపిన మందులను సాధారణంగా జలుబు, ముక్కు కారడం, ముక్కుదిబ్బడ వంటి లక్షణాల ఉపశమనానికి ఉపయోగిస్తారు. అయితే చిన్నారుల్లో ఇలాంటి కాంబినేషన్ మందులను ఉపయోగించే విషయంలో వయస్సు, మోతాదు, వైద్యుడి సూచనలను అత్యంత జాగ్రత్తగా పాటించాల్సిన అవసరం ఉంది.నిపుణుల సిఫార్సుల ఆధారంగా నిర్ణయంఈ కాంబినేషన్ వల్ల నాలుగేళ్లలోపు పిల్లలకు సంభావ్య ఆరోగ్యపరమైన ప్రమాదాలు ఉండవచ్చని నిపుణుల కమిటీ, DTAB అభిప్రాయపడటంతో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా పిల్లలకు అందుబాటులో ఉన్న సురక్షితమైన ప్రత్యామ్నాయాలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. ఈ ఆంక్షలను డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, 1940లోని సెక్షన్ 26A కింద ప్రజారోగ్య ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం అమలు చేస్తోంది.ఇదీ చదవండి: భారీగా పెరిగిన చక్కెర ధరలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం -
ప్రముఖ కార్ల కంపెనీ సంచలన నిర్ణయం!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) ఏకంగా 30 లక్షల కార్లకు రీకాల్ ప్రకటించింది. ఈ విషయాన్ని చైనా అధికారులు వెల్లడించారు. కంపెనీ రీకాల్ ప్రకటించడానికి కారణం ఏమిటనే విషయాన్ని ఈ కథనంలో చూసేద్దాం.డోర్ హ్యాండిల్ భద్రతకు సంబంధించిన సమస్య కారణంగా.. అమెరికా కార్ల తయారీ సంస్థ మోడల్ 3, మోడల్ వై, మోడల్ ఎక్స్, మోడల్ ఎస్ సహా చైనాలో తయారైన, దిగుమతి చేసుకున్న సుమారు 29.8 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను రీకాల్ చేస్తోందని చైనా స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ మార్కెట్ రెగ్యులేషన్ తెలిపింది.చైనా మీడియా ప్రకారం.. ఈ సంవత్సరంలో ఇదే అతిపెద్దదైన ఈ రీకాల్. టెస్లా ఎలక్ట్రిక్ వాహనాలు, అనేక చైనీస్ ఈవీ మోడళ్లలో సాధారణంగా కనిపించే లోపలికి ఉన్న కార్ డోర్ హ్యాండిల్స్ను వచ్చే ఏడాది నుంచి నిషేధిస్తామని చైనా అధికారులు ఫిబ్రవరిలో ప్రకటించిన తర్వాత ఈ భారీ రీకాల్ ప్రకటన వెల్లడైంది.దేశంలో అనేక చోట్ల జరిగిన ఈవీల ప్రమాదాల నేపథ్యంలో.. చైనా ఇటీవల ఫ్లష్ కార్ డోర్ హ్యాండిల్స్పై నిఘాను ముమ్మరం చేసింది. ఈ ప్రమాదాలలో కార్లలోని ఎలక్ట్రానిక్ డోర్లు విఫలమై, ప్రజలు లోపల చిక్కుకుపోయారు.చైనా నియంత్రణ సంస్థ వెబ్సైట్లోని ఒక ప్రకటనలో.. భద్రతకు సంబంధించిన ప్రమాదాన్ని ప్రస్తావించింది. ఎలక్ట్రిక్ వ్యవస్థ వైఫల్యానికి కారణమయ్యే తీవ్రమైన ప్రమాదం వంటి తీవ్రమైన పరిస్థితులలో.. కారు హ్యాండిల్స్, కారు వినియోగదారులు తప్పించుకోవడానికి తలుపులు త్వరగా ఓపెన్ కాకుండా అడ్డుకోవచ్చని, లేదా కారు బయట ఉన్న సహాయక సిబ్బంది లోపలికి ప్రవేశించకుండా నిరోధించవచ్చని ఆ ప్రకటన పేర్కొంది. పరిశ్రమలోని కొంతమంది నిపుణులు వాహన తయారీదారులు డిజైన్ కంటే భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.చైనా ప్యాసింజర్ కార్ అసోసియేషన్ అధిపతి కుయ్ డోంగ్షు, ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ అభివృద్ధిలో ఈ రీకాల్ను 'ఒక అనివార్యమైన అడుగు' అని అభివర్ణించారు. వాహన తయారీదారులు మరింత విశ్వసనీయమైన, భద్రతకు ప్రాధాన్యతనిచ్చే విధానం వైపు పయనిస్తూ.. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.ప్రమాదాలను తగ్గించడానికి టెస్లా వాహనాలకు సాఫ్ట్వేర్ అప్డేట్లను నిర్వహిస్తుంది. ఇదే సమయంలో బీజింగ్కు చెందిన చైనా టెక్నాలజీ దిగ్గజం షియోమీ, 3,90,000కు పైగా వాహనాలను రీకాల్ చేస్తోంది. హాంగ్జౌకు చెందిన లీప్మోటార్ 3,70,000కు పైగా కార్లను రీకాల్ చేస్తోంది. గీలీ, ఎక్స్పెంగ్ సహా ఇతర చైనా కార్ల తయారీ సంస్థలు కూడా కొన్ని వాహనాలను రీకాల్ చేస్తున్నాయి. ఈ కంపెనీలన్నీ రీకాల్ ప్రకటించడానికి కారణం కారు డోర్ హ్యాండిల్స్కు సంబంధించిన సమస్యలే అని తెలుస్తోంది. -
1 పైసా బిడ్తో రూ.755 కోట్ల కాంట్రాక్ట్
తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘తాయ్మామన్ తంగ మోదిరం’ (మేనమామ బంగారు ఉంగరం) పథకానికి సంబంధించి నిర్వహించిన గ్లోబల్ టెండర్లలో ప్రముఖ ఆభరణాల సంస్థ జోయాలుక్కాస్ సంచలన బిడ్తో ఎల్1 స్థానాన్ని కైవసం చేసుకుంది. సుమారు రూ.755.83 కోట్ల విలువైన ఈ ప్రాజెక్ట్లో ఒక గ్రామ్ 22 క్యారెట్ల బంగారు ఉంగరానికి కేవలం ‘1 పైసా’ మాత్రమే సర్వీస్ / తయారీ రుసుము (మేకింగ్ ఛార్జీలు, ట్రాన్స్పోర్ట్, ఇన్సూరెన్స్, హాల్మార్కింగ్)గా ఖరారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.ఈ పోటీలో పాల్గొన్న 11 ప్రముఖ సంస్థల్లో జీఆర్టీ జ్యువెలర్స్ రూ.410.97 (L2), వుమ్మిడి బంగారు జ్యువెలర్స్ రూ.822.97 (L3) ప్రతిపాదించగా జోయాలుక్కాస్ కోట్ చేసిన వ్యయం ఎవరికీ ఊహకందని విధంగా నిలిచింది. తమిళనాడు టెండర్ల పారదర్శకత చట్టం ప్రకారం, తక్కువ ధరను మ్యాచ్ చేసేందుకు ఇతర కంపెనీలకు అవకాశం ఇవ్వగా ఒక్క కల్యాణ్ జ్యువెల్లర్స్ మాత్రమే ముందుకు వచ్చింది. దాంతో ఈ మొత్తం ఆర్డర్లో 70 శాతం కోటాను జోయాలుక్కాస్కు, మిగిలిన 30 శాతాన్ని కల్యాణ్ జ్యువెలర్స్కు కేటాయిస్తూ టీఎన్ఎంఎస్సీ ఉత్తర్వులు జారీ చేసింది.తమిళనాడులోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించే దాదాపు 4.41 లక్షల మంది నవజాత శిశువులకు ఒక్కో గ్రాము బంగారు ఉంగరాన్ని సెప్టెంబర్ 15 నుంచి పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం బంగారం అసలు ధరకు అయ్యే వ్యయాన్ని భరిస్తుండగా తయారీ, పంపిణీ బాధ్యతలను ఈ సంస్థలు నిర్వర్తిస్తాయి. వాణిజ్య లాభాల కంటే ప్రజారోగ్య సంక్షేమ పథకానికి మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతోనే రూపాయి రహిత లాభాల మార్జిన్తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జోయాలుక్కాస్ అధినేత జోయ్ ఆలుక్కాస్ వెల్లడించారు.మరోవైపు, ఒక పైసాకే ఎలా పనులు చేపడతారంటూ ప్రతిపక్ష ఏఐఏడీఎంకే ఈ ప్రక్రియపై సందేహాలు వ్యక్తం చేయగా, తమిళనాడు ఆరోగ్య శాఖ నిబంధనల ప్రకారమే పారదర్శకంగా అత్యంత నాణ్యమైన బీఐఎస్ హాల్మార్క్ బంగారాన్ని సేకరిస్తున్నామని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: అనలాగ్ పన్నీర్పై నిషేధం -
రూ.450 కోట్ల ఇష్యూ.. ఐపీవో బాటలో ఆటమ్బర్గ్
న్యూఢిల్లీ: గృహోపకరణాల(హోమ్ అప్లయెన్సెస్) తయారీ కంపెనీ ఆటమ్బర్గ్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 450 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 7.65 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఏ91 పార్ట్నర్స్, వీసైన్స్ ఇన్వెస్ట్మెంట్స్(టెమాసెక్), జంగిల్ వెంచర్స్, స్టెడ్వ్యూ క్యాపిటల్ మారిషస్ తదితర సంస్థలు షేర్లను ఆఫర్ చేయనున్నాయి. నిధుల వినియోగమిలా ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 150 కోట్లు బ్రాండ్ ప్రమోషన్, మార్కెటింగ్కు కేటాయించనుండగా.. మరో రూ. 100 కోట్లు పరిశోధన, అభివృద్ధి(ఆర్అండ్డీ)పైనా వెచి్చంచనుంది. ఈ బాటలో రుణ చెల్లింపులకు రూ. 90 కోట్లు, మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. 2012లో మనోజ్ మీనా కంపెనీని ఏర్పాటు చేయగా.. 2013లో శివవ్రత దాస్ సహవ్యవస్థాపకుడిగా చేరారు. కంపెనీ ప్రధానంగా టెక్నాలజీ ఆధారిత కన్జూమర్ అప్లయెన్సెస్ రూపొందిస్తోంది.మిక్సర్ గ్రైండర్స్, వాటర్ ప్యూరిఫయర్స్, కోల్డ్ ప్రెస్డ్ జ్యూసర్స్ తదితరాలను ఆటమ్బర్గ్ బ్రాండ్తో తయారు చేస్తోంది. అనుబంధ సంస్థ ఆటమ్బర్గ్ ఇన్నొవేషన్స్ మోటార్లు, కంట్రోలర్లు తదితర కీలక విడిభాగాల డిజైన్, సరఫరా చేపడుతోంది. కంపెనీ కస్టమర్లలో వోల్టాస్, గోద్రెజ్, బ్లూ స్టార్ తదితర దిగ్గజాలున్నాయి. గతేడాది(2025–26)లో ఆదాయం రూ. 1,294 కోట్లకు చేరగా.. రూ. 149 కోట్ల నికర నష్టం ప్రకటించింది. కంపెనీ ప్రధానంగా కన్జూమర్ అప్లయెన్సెస్, కీలక విడిభాగాల విభాగాలలో కార్యకలాపాలు విస్తరించింది.ఇదీ చదవండి: స్టాక్మార్కెట్లో కొత్త ప్రయత్నం.. ‘డబుల్ ట్రేడింగ్’! -
బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్!
డిజిటల్ చెల్లింపులు, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ.. బ్యాంక్ చెక్కుల వినియోగం మాత్రం పూర్తిగా తగ్గలేదు. ముఖ్యంగా వ్యాపార లావాదేవీలు, ఆస్తుల కొనుగోలు, లేదా పెద్ద మొత్తాల చెల్లింపుల కోసం ఇప్పటికీ చెక్కులను ఉపయోగిస్తున్నారు. దీంతో.. చెక్కుల భద్రతపై బ్యాంకులు మరింత దృష్టి పెడుతున్నాయి. ఇందులో భాగంగానే కొత్త భద్రతలను ప్రవేశపెడుతున్నాయి.చెక్కుల్లో కొత్త భద్రతలు ఎందుకు?చెక్కుల ద్వారా జరిగే మోసాలను తగ్గించేందుకు బ్యాంకులు కొత్త భద్రతా విధానాలను ప్రవేశపెడుతున్నాయి. చెక్కును మార్చడం, నకిలీ చెక్కులు ఉపయోగించడం వంటి మోసాలను అరికట్టేందుకు ప్రత్యేక కోడ్లు, ఇతర భద్రతలను చేర్చుతున్నారు.ఉదాహరణకు.. బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) కొత్త చెక్ లీఫ్లపై అక్షరాలు, సంఖ్యల కలయికతో కూడిన అల్ఫాన్యూమరిక్ కోడ్ను ప్రవేశపెట్టింది. ఈ కోడ్ ద్వారా చెక్ను సులభంగా గుర్తించడంతో పాటు, దాని వివరాలను ధృవీకరించడంలో బ్యాంకుకు సహాయం అవుతుంది.అల్ఫాన్యూమరిక్ కోడ్ అంటే ఏమిటి?అల్ఫాన్యూమరిక్ కోడ్ అంటే.. అక్షరాలు, సంఖ్యలు కలిపి ఉండే ఒక ప్రత్యేక గుర్తింపు కోడ్. ఇది చెక్ లీఫ్ను గుర్తించడానికి, చెక్ క్లియరింగ్ సమయంలో ధృవీకరణను మరింత బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. పాత చెక్బుక్లో ఈ కోడ్ లేనప్పటికీ చెల్లుబాటు అవుతాయి. అయితే.. ప్రతి బ్యాంకు దీనికి సంబంధించి తన ఖాతాదారులకు వేర్వేరు సూచనలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా సందేహం ఉంటే.. మీ బ్యాంకు ద్వారా అధికారిక సమాచారం తెలుసుకోవడం మంచిది.ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలుచెక్కుల క్లియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చెక్ ట్రంకేషన్ సిస్టమ్(CTS)ను అమలు చేస్తోంది. ఈ విధానంలో చెక్ను ఫిజికల్గా ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంకుకు పంపకుండా.. చెక్ ఎలక్ట్రానిక్ ఇమేజ్, అవసరమైన సమాచారాన్ని చెల్లింపు బ్యాంకుకు పంపిస్తారు. దీంతో చెక్ క్లియరింగ్ ప్రక్రియ వేగంగా, సురక్షితంగా జరుగుతుంది.డిసెంబర్ 31, 2026 గడువుఅల్ఫాన్యూమరిక్ కోడ్ లేని కొన్ని చెక్కులకు, ముఖ్యంగా రూ.50,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన చెక్కులకు, 2026 డిసెంబర్ 31 గడువు ఉందని కొన్ని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే.. ఇది అన్ని బ్యాంకులకు వర్తించే సాధారణ RBI గడువు అని భావించకూడదు. ఖాతాదారులు తమ బ్యాంకు నుంచి వచ్చిన అధికారిక సమాచారాన్ని మాత్రమే ఆధారంగా చేసుకోవాలి.పాత చెక్బుక్ను మార్చాల్సిన అవసరం ఉందా?, ఏదైనా చివరి తేదీ ఉందా?, అనే విషయాలను బ్యాంకు శాఖను సంప్రదించడం లేదా బ్యాంకు అధికారిక వెబ్సైట్ చూడడం ద్వారా తెలుసుకోవచ్చు.ఇదీ చదవండి: SBI ఖాతాదారులకు షాక్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్!కొత్త చెక్బుక్కు ఛార్జీలు ఉంటాయా?కొత్త చెక్బుక్ కోసం వసూలు చేసే ఛార్జీలు బ్యాంకు, ఖాతా రకాన్ని బట్టి మారుతాయి. ఉదాహరణకు.. బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవింగ్స్ ఖాతాదారులకు ఒక ఆర్థిక సంవత్సరంలో 25 లీఫ్లను ఉచితంగా అందిస్తుందని పేర్కొంది. అదనపు చెక్ లీఫ్లకు బ్యాంకు నిర్ణయించిన ఛార్జీలు వర్తించవచ్చు. అందువల్ల కొత్త చెక్బుక్ తీసుకునే ముందు మీ బ్యాంకు తాజా ఛార్జీల వివరాలను తెలుసుకోవడం మంచిది.చెక్ ఎంతకాలం చెల్లుతుంది?సాధారణంగా.. ఒక చెక్పై ఉన్న తేదీ నుంచి మూడు నెలల వరకు చెల్లుబాటు అవుతుంది. అందువల్ల చెక్ను ఎక్కువ కాలం ఉంచకుండా.. మూడు నెలల లోపే బ్యాంకులో జమ చేయాలి. చెక్ బౌన్స్ అయితే పరిస్థితులను బట్టి ఆర్థిక, చట్టపరమైన సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881లోని సెక్షన్ 138 కింద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. -
‘బాండ్లు అమ్మేయండి.. బంగారం కొనేయండి’
అమెరికా భారీగా పెరుగుతున్న ప్రభుత్వ రుణభారం భవిష్యత్తులో తీవ్ర ఆర్థిక సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందని బిలియనీర్ ఇన్వెస్టర్, బ్రిడ్జ్వాటర్ అసోసియేట్స్ వ్యవస్థాపకుడు రే డాలియో హెచ్చరించారు. ప్రస్తుత ఆర్థిక విధానాల్లో మార్పు రాకపోతే అమెరికా రుణ సంక్షోభం మరో మూడు సంవత్సరాల్లో ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమెరికా బాండ్లలో తమ పెట్టుబడులను తగ్గించి, పోర్ట్ఫోలియోలో 10–15 శాతం వరకు బంగారానికి కేటాయించాలని సూచించారు. అలాగే కొంతమేర బిట్కాయిన్ను కూడా కలిగి ఉండటం ద్వారా పెట్టుబడుల రిస్క్ను తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు.శుక్రవారం లింక్డ్ఇన్లో చేసిన పోస్టులో డాలియో.. బలమైన ఆర్థిక స్థితి ఉన్న దేశాలు, వివిధ రకాల ఆస్తుల్లో పెట్టుబడులను విస్తరించుకోవాలని సూచించారు. ముఖ్యంగా ప్రభుత్వ బాండ్లపై అధికంగా ఆధారపడటం కంటే బంగారం, ఇతర ప్రత్యామ్నాయ ఆస్తులను కలిగి ఉండటం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.మూడు సంవత్సరాల్లో సంక్షోభం?అమెరికా రుణభారం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వానికి వడ్డీ చెల్లింపుల భారమూ భారీగా పెరుగుతోంది. అమెరికా ఫెడరల్ ప్రభుత్వ నికర వడ్డీ వ్యయం 2026లోనే సుమారు 1 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని కాంగ్రెస్ బడ్జెట్ కార్యాలయం (CBO) అంచనా వేసింది. 2026లో ప్రభుత్వ ఆదాయం సుమారు 5.6 ట్రిలియన్ డాలర్లుగా ఉండొచ్చని CBO అంచనా వేస్తోంది.డాలియో దృష్టిలో ఇది సాధారణ రుణ సమస్య మాత్రమే కాదు. ప్రభుత్వ రుణాన్ని తీర్చేందుకు చెల్లించాల్సిన వడ్డీ వ్యయం పెరుగుతూనే ఉండటం, అదే సమయంలో భారీగా కొత్త రుణాలు సమీకరించాల్సి రావడం ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతుందని ఆయన చాలాకాలంగా హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ రుణానికి తగినంత డిమాండ్ లేకపోతే అధిక వడ్డీ రేట్లను అంగీకరించాల్సి రావచ్చు లేదా కేంద్ర బ్యాంకు ద్వారా మరింత డబ్బు సృష్టించే పరిస్థితి రావచ్చని ఆయన అభిప్రాయం. అటువంటి పరిణామాలు కరెన్సీపై ఒత్తిడి, ద్రవ్యోల్బణం వంటి సమస్యలను పెంచే అవకాశం ఉందనేది ఆయన విశ్లేషణ.బాండ్ల మార్కెట్లో ఒత్తిడిడాలియో వ్యాఖ్యలు వెలువడుతున్న సమయంలోనే అమెరికా ట్రెజరీ బాండ్ మార్కెట్లో ఒత్తిడి పెరిగింది. ఆగస్టు 21న 30 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్ 5.27 శాతానికి చేరగా, వారంలో అది 2007 తర్వాతి అత్యధిక స్థాయిలకు సమీపించింది. అమెరికా ప్రభుత్వ రుణభారం 40 ట్రిలియన్ డాలర్లను దాటడం కూడా పెట్టుబడిదారుల ఆందోళనకు కారణమవుతోంది.పరిస్థితిని చక్కదిద్దేందుకు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ దీర్ఘకాలిక ప్రభుత్వ బాండ్ల బైబ్యాక్లను పెంచే ప్రణాళికను ప్రకటించారు. అయితే ఈ చర్యతో ఈల్డ్స్లో వచ్చిన ప్రారంభ తగ్గుదల నిలవలేదు. దీంతో మార్కెట్లో ఇది తాత్కాలిక పరిష్కారమే తప్ప, అమెరికా ద్రవ్య లోటు, రుణభారం వంటి మూల సమస్యలను పరిష్కరించదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.బంగారం, బిట్కాయిన్కు డిమాండ్అమెరికా రుణభారం, డాలర్పై ఆందోళనలు పెరగడంతో ఈ వారం మదుపరులు బంగారం, బిట్కాయిన్ వంటి ప్రత్యామ్నాయ ఆస్తులవైపు మొగ్గుచూపారు. ఆగస్టు 21న స్పాట్ గోల్డ్ ఔన్స్కు 4,623.94 డాలర్ల వరకు పెరిగి మూడు నెలల గరిష్ఠాన్ని తాకింది. ఈ వారంలో పసిడి ధర 5 శాతానికి పైగా పెరిగింది.ఇదే సమయంలో బిట్కాయిన్ 79,000 డాలర్లకు సమీపంలోకి వెళ్లి, అనంతరం 77,000 డాలర్ల ప్రాంతంలో ట్రేడైంది. ఈ వారంలో క్రిప్టోకరెన్సీ సుమారు 23 శాతం వరకు లాభపడింది. 2023 మార్చి తర్వాత ఇదే అత్యంత బలమైన వారపు ర్యాలీగా నిలిచింది.లోటును తగ్గించాలిఅమెరికా బడ్జెట్ లోటును స్థూల దేశీయోత్పత్తి (GDP)లో సుమారు 3 శాతానికి తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని డాలియో సూచించారు. ఇందుకోసం ప్రభుత్వ వ్యయాల్లో కోతలు, అధిక పన్ను ఆదాయం, తక్కువ వడ్డీ రేట్లు వంటి చర్యల కలయిక అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే తరహా రుణ, ఆర్థిక ఒత్తిళ్లు బ్రిటన్, చైనా, జపాన్ వంటి దేశాల్లోనూ ఉన్నాయని పేర్కొన్నారు.ఇదీ చదవండి: బంగారం భారీ ధరలు.. కియోసాకి కామెంట్స్ -
మెటా సామ్రాజ్యానికి డిజిటల్ చెక్!
సోషల్ మీడియా దిగ్గజం మెటా (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్) ప్లాట్ఫారమ్లు పిల్లలు, యువకుల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయంటూ అమెరికాలోని 29 రాష్ట్రాలు సంయుక్తంగా దాఖలు చేసిన దావా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. లాభార్జనే ధ్యేయంగా యూజర్లను అడిక్ట్ చేసే ఆల్గారిథమ్లు, ఇన్ఫినిట్ స్క్రోలింగ్, పుష్ నోటిఫికేషన్లను మెటా ఉద్దేశపూర్వకంగా రూపొందించిందని, చిన్నారుల వ్యక్తిగత డేటాను చట్టవిరుద్ధంగా సేకరించిందనేవి ప్రధాన ఆరోపణలు.అమెరికాలోని ఓక్లాండ్ ఫెడరల్ కోర్టులో విచారణకు వచ్చిన ఈ కేసు టెక్ ప్రపంచంలో ఒక చారిత్రాత్మక ఘట్టం. ఈ విచారణ ముగింపు కేవలం అమెరికాకే పరిమితం కాకుండా భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా బిగ్టెక్ కంపెనీల నియంత్రణకు దిశానిర్దేశం చేయనుంది.ప్రపంచంపై ప్రభావంఅమెరికా కోర్టు మెటాపై కఠిన పరిమితులు విధిస్తే యూరోపియన్ యూనియన్, భారత్ వంటి దేశాలు కూడా తమ వద్ద ఉన్న డిజిటల్ భద్రతా చట్టాలను మరింత కఠినతరం చేసేందుకు ఇది బలమైన నమూనాగా మారుతుంది.ఇన్ఫినిట్ స్క్రోలింగ్ తొలగింపు, వయసు గుర్తింపు నిబంధనలు, ఆటోమేటిక్ టైమ్ లిమిట్స్ వంటి ప్రతిపాదనలను మెటా అమలు చేయాల్సి వస్తే ఆ మార్పులు గ్లోబల్ కోడింగ్లో భాగంగా ఇతర దేశాల యూజర్లకూ వర్తిస్తాయి.అత్యధిక సోషల్ మీడియా వినియోగదారులు ఉన్న భారత్లో ‘డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ చట్టం (డీపీడీపీ)’ అమలులోకి వస్తున్న తరుణంలో పిల్లల డేటా రక్షణపై ఈ తీర్పు కీలక సూచికగా నిలుస్తుంది.ఈ విచారణలో మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ కూడా సాక్ష్యమివ్వనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. సురక్షితమైన డిజిటల్ సమాజం వైపు ప్రపంచం వేస్తున్న అడుగుల్లో ఈ చట్టపరమైన పోరాటం ఒక కీలక మైలురాయి కానుందని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: అనలాగ్ పన్నీర్పై నిషేధం -
దేశీ స్టాక్ మార్కెట్కు తగ్గిన ప్రాధాన్యం
ప్రస్తుతం ఆసియాలోకెల్లా భారత్ స్టాక్ మార్కెట్కు అత్యల్ప ప్రాధాన్యమిస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ అమెరికా(బీవోఎఫ్ఏ) చేపట్టిన సర్వే పేర్కొంది. ఈ నెల 7–13 మధ్య ఆసియా ఫండ్ మేనేజర్లతో నిర్వహించిన సర్వేలో ఈ అంశం వెల్లడైనట్లు నివేదికలో బీవోఎఫ్ఏ సర్వేలో తెలియజేసింది. దీంతో ఇండొనేసియా స్థానంలో భారత్ను చేర్చినట్లు వెల్లడించింది. ఇది గ్లోబల్ ఇన్వెస్టర్లలో పెరుగుతున్న ఆందోళనను ప్రతిబింబిస్తున్నట్లు పేర్కొంది. 272 బిలియన్ డాలర్లకుపైగా ఆస్తులను నిర్వహిస్తున్న 98 ఫండ్ మేనేజర్లతో నిర్వహించిన సర్వేలో బీవోఏ మరిన్ని అంశాలను పేర్కొంది. వివరాలు ఇలా..27 శాతానికి డౌన్ భారత్తో పోలిస్తే ఇన్వెస్టర్ల సెంటిమెంటు ఇండొనేసియావైపు మొగ్గు చూపుతోంది. జూలైలో 32 శాతంగా నమోదైన నెట్ అండర్వెయిట్(పెట్టుబడుల ప్రాధాన్యం) ఆగస్ట్ రెండోవారానికల్లా 27 శాతానికి క్షీణించింది. ఇదే సమయంలో ఇండొనేసియాకు ప్రాధాన్యం పెరిగింది. ఆసియా ప్రాంతంలో తైవాన్, జపాన్ మార్కెట్లకు ఇన్వెస్టర్లు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. వెరసి భారత్ చైనా, ఫిలిప్పీన్స్కంటే వెనుకబడినట్లు సర్వే పేర్కొంది.ఏఐలో వెనుకబాటుప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో పటిష్టస్థాయిలో ఎక్స్పోజర్ లేకపోవడానికితోడు.. బలహీన ఆర్థిక వృద్ధి దేశీ ఈక్విటీలపట్ల సమస్యాత్మకంగా భావిస్తున్నట్లు బీవోఎఫ్ఏ సర్వే పేర్కొంది. సంస్కరణలలేమి, షేర్ల అధిక ధరలు, రూపాయి బలహీనత సైతం ప్రతికూలంగా పరిణమించినట్లు వివరించింది. గత రెండు వారాలుగా దేశీ స్టాక్ మార్కెట్లు డీలాపడిన సందర్భంలో సర్వే వివరాలు వెలువడటం గమనార్హం! అయితే ఇటీవల విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు పెట్టుబడులు చేపడుతుండటం, కంపెనీల ఆర్జన అంచనాలు మెరుగుపడటం, మార్కెట్ అంతర్గత మూలాలు మెరుగుపడుతుండటం తదితర సానుకూలతలను ఈ సందర్భంగా విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనూ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా స్పందించినట్లు సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి. తొలి 6 నెలలు డీలా..ఈ క్యాలండర్ ఏడాది(2026) తొలి ఆరు నెలలు విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకే అత్యధిక ప్రాధాన్యమిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. తాజా త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ–50లో భాగమైన కంపెనీల సగటు ఆర్జన వార్షికంగా 18 శాతం పుంజుకోగా.. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంచనాలు 10 శాతాన్ని మించడం గమనార్హం! కాగా.. ఇంతక్రితం మే నెలలోనూ బీవోఎఫ్ఏ సర్వేలో ఇండియా అత్యల్ప ప్రాధాన్యతగల మార్కెట్గా నిలిచింది. ఇందుకు యూఎస్ ఇరాన్ యుద్ధం కారణంగా చమురు ధరలు పెరగడం ప్రభావం చూపింది. దీంతో ఇంధన వ్యయాల భారంతో ఆర్థిక వృద్ధిపై ఒత్తిడి పెరిగినట్లు సర్వే అభిప్రాయపడింది.దీనికితోడు రెండు దేశాల మధ్య నెలకొన్న వివాదాలకు సమీప భవిష్యత్లో పరిష్కారం కనిపించకపోవడం, పెరుగుతున్న చమురు ధరలు ఇన్వెస్టర్లలో ఆందోళనలకు కారణమయ్యాయి. అయితే మార్చిలో నమోదైన కనిష్టం నుంచి 8 శాతం రికవరీ అయినప్పటికీ ఈ ఏడాది దేశీ స్టాక్ మార్కెట్లు నికరంగా 8 శాతం క్షీణించాయి. దీంతో ఆసియాలో బలహీనపడిన ప్రధాన మార్కెట్లలో ఒకటిగా భారత్ నిలిచినట్లు సర్వే తెలియజేసింది. ఇదే కాలంలో ఇండొనేసియా మార్కెట్లు బలపడుతూ వచ్చాయి. జకార్తా కాంపోజిట్ ఇండెక్స్ జూన్ కనిష్టం నుంచి 20 శాతం పుంజుకున్నట్లు పేర్కొంది. ఇందుకు ఆ దేశ కరెన్సీ నిలకడకు కేంద్ర బ్యాంకు తీసుకున్న చర్యలు కొంతమేర దోహదపడినట్లు ప్రస్తావించింది. ఇదీ చదవండి: స్టాక్మార్కెట్లో కొత్త ప్రయత్నం.. ‘డబుల్ ట్రేడింగ్’! -
అనలాగ్ పన్నీర్పై నిషేధం
కల్తీ ఆహార ఉత్పత్తులు, నకిలీ డెయిరీ పదార్థాల బారి నుంచి ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ఆహార భద్రత ప్రాధికారిక సంస్థ (ఎఫ్డీఏ) విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. పాలు, పాల పదార్థాల స్థానంలో వృక్షసంబంధిత కొవ్వులు (పాల్మ్ ఆయిల్), మైదా, స్టార్చ్, ఎమల్సిఫైయర్లు ఉపయోగించి కృత్రిమంగా తయారుచేసే ‘అనలాగ్ పన్నీర్’ (కృత్రిమ/నాన్-డెయిరీ పన్నీర్) తయారీ, నిల్వ, రవాణా, విక్రయాలపై ఏడాది పాటు పూర్తిస్థాయి నిషేధం విధిస్తూ నిర్ణయం వెలువడింది.వినియోగదారుల హక్కులు - ఆరోగ్య సమస్యలుసాధారణంగా స్వచ్ఛమైన పన్నీర్ పాలలోని ప్రొటీన్లు, క్యాల్షియం కలిగిన అత్యంత పోషకాహారం. అయితే, ఖర్చు తగ్గించుకోవడమే లక్ష్యంగా అనేక హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సర్వీసులు, క్లౌడ్ కిచెన్లు కస్టమర్లకు తెలియకుండా అనలాగ్ పన్నీర్ను అసలైన పన్నీర్గా వడ్డిస్తున్నాయి. ఇది ఆహార భద్రత, ప్రమాణాల చట్టం ప్రకారం తీవ్రమైన అనుచిత వ్యాపార విధానం కిందకు వస్తుంది. నాసిరకం నూనెలు, ప్రాసెస్ చేసిన కెమికల్స్ వాడటం వల్ల గుండె సంబంధిత సమస్యలు, కొలెస్ట్రాల్ పెరగడం, జీర్ణకోశ వ్యాధులు వస్తాయని పోషకాహార నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కఠిన చర్యలు.. జరిమానాలువినియోగదారులను మోసం చేస్తూ అనలాగ్ పన్నీర్ను అసలు పన్నీర్గా విక్రయించే రెస్టారెంట్లు, వ్యాపారులపై అధికారులు సర్ప్రైజ్ రైడ్లు నిర్వహించనున్నారు. ఈ నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారికి చట్టపరంగా ఆరు నెలల నుంచి జీవిత ఖైదు వరకు శిక్షలతో పాటు రూ.10 లక్షల వరకు భారీ జరిమానా విధించే అవకాశముంది. ఇటీవల నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా అనలాగ్ ఉత్పత్తుల విక్రయాలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి స్పష్టత కోరడం ఈ అంశం ప్రాధాన్యతను చాటుతోంది.ప్రజలు తాము కొనుగోలు చేసే పన్నీర్ నాణ్యతను గుర్తించి గుర్తింపు పొందిన బ్రాండ్లు, సురక్షితమైన ప్రదేశాల నుంచే కొనుగోలు చేయాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆహార భద్రతలో రాజీ పడేది లేదని, ప్రజారోగ్య రక్షణే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని ఎఫ్డీఏ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: వ్యాపార నిర్వహణలో భావోద్వేగాలు వద్దు! -
పండుగ షాపింగ్కు ధరల షాక్!
పండుగ సీజన్ వస్తోందంటే దేశంలో కొనుగోళ్ల సందడి మొదలవుతుంది. అయితే ఈసారి స్మార్ట్ఫోన్లు, టీవీలు, ఇతర గృహోపకరణాల (కన్జూమర్ డ్యూరబుల్స్) ధరలు గణనీయంగా పెరిగాయి. ఈ తరుణంలో ‘వినియోగదారుల కొనుగోలు ఉత్సాహం కొనసాగుతుందా’ అనేది పరిశ్రమకు అసలు పరీక్షగా మారింది. అయినప్పటికీ డిస్కౌంట్లు, సులభమైన ఈఎంఐ ఫైనాన్సింగ్, ప్రీమియం ఉత్పత్తులపై పెరుగుతున్న ఆసక్తి అమ్మకాలకు ఊతమిస్తాయని రిటైలర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.గత ఏడాదితో పోలిస్తే ఈ పండుగ సీజన్లో 8–10 శాతం వృద్ధి నమోదవుతుందని విజయ్ సేల్స్ అంచనా వేస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవ సేల్ మంచి ఆరంభాన్ని ఇచ్చిందని సంస్థ తెలిపింది. ధరల పెరుగుదల ప్రభావం అన్ని వర్గాల వినియోగదారులపై ఒకేలా ఉండదని క్రోమా స్టోర్లను నిర్వహించే ఇని్ఫనిటీ రిటైల్ తెలిపింది. అధునాతన ఫీచర్లు, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సాంకేతికత కలిగిన ప్రీమియం ఉత్పత్తులపై వినియోగదారుల ఆసక్తి బలంగానే ఉందని పేర్కొంది.ప్రీమియం ఉత్పత్తుల వైపు మొగ్గు అమెజాన్ ఇండియా జూన్లో నిర్వహించిన ‘ప్రైమ్ డే సేల్’లో రూ.35,000కు పైబడిన ప్రీమియం టీవీల అమ్మకాలు గత ఏడాది(2025)తో పోలిస్తే రెట్టింపు అయ్యాయి. ముఖ్యంగా 65 అంగుళాలు, అంతకంటే పెద్ద స్క్రీన్లకు డిమాండ్ పెరిగింది. ఈ సేల్లో అమ్ముడైన ప్రతి అయిదు విండోస్ ల్యాప్టాప్లలో ఒకటి ఏఐ ఆధారిత పీసీ కావడం విశేషం. రోబోటిక్ వాక్యూమ్లు, కాఫీ మెషీన్లు, ఐస్ మేకర్ల వంటి కొత్త తరహా వంటగది ఉత్పత్తుల డిమాండ్ 4.3 రెట్లు పెరిగింది. స్మార్ట్ఫోన్లు, ఎల్రక్టానిక్స్, హోమ్, కిచెన్ విభాగాల్లో కొనుగోళ్లు సాధారణ రోజు కంటే రెండింతలకు పైగా నమోదయ్యాయని అమెజాన్ ఇండియా తెలిపింది. వినియోగదారులు మరింత ప్రీమియం ఉత్పత్తుల వైపు మొగ్గు చూపుతున్నారని అమెజాన్ ఇండియా తెలిపింది.పెరిగిన ధరల సవాల్ స్మార్ట్ఫోన్లు, టీవీలు, ఇతర గృహోపకరణాల ధరలు పెరగడం ఈ పండుగ సీజన్లో పరిశ్రమకు ప్రధాన సవాలుగా మారింది. ఈ ఏడాది తొలి త్రైమాసికం చివరి నాటికి స్మార్ట్ఫోన్ల ధరలు సుమారు 15 శాతం పెరిగాయని ఆనంద్ రాఠీ అడ్వైజర్స్ తెలిపింది. భారత మొబైల్ మార్కెట్లో సగటు విక్రయ ధర కూడా 2026 రెండో త్రైమాసికంలో 14.4 శాతం పెరిగి రికార్డు స్థాయిలో 315 డాలర్లకు(సుమారు రూ.30,000) చేరినట్లు ఐడీసీ పేర్కొంది. కన్జూమర్ డ్యూరబుల్స్లోనూ ధరల పెంపు కనిపిస్తోంది. ఏప్రిల్–జూన్ మధ్య ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా రెండు దఫాల్లో తన ఉత్పత్తుల ధరలను 16–17 శాతం పెంచగా, బ్లూ స్టార్ 5 శాతం మేర పెంచింది. క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జూమర్ ఎలక్ట్రికల్స్ కూడా పలు ఉత్పత్తుల ధరలను పెంచింది.కొనుగోళ్లపై ప్రభావం ఎంత? ధరలు పెరిగినప్పటికీ వినియోగదారులు కొనుగోళ్లను పూర్తిగా తగ్గించుకునే అవకాశం లేదు, అయితే ఖర్చుల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా మధ్యస్థాయి, ఎంట్రీ–లెవల్ విభాగాల్లోని, టైర్–2, ఇతర చిన్న పట్టణాల వినియోగదారులు కొనుగోళ్లను వాయిదా వేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే పెద్ద స్క్రీన్ టీవీలు, సైడ్–బై–సైడ్ రిఫ్రిజిరేటర్ల వంటి ఖరీదైన ఉత్పత్తుల కొనుగోళ్లు కొంతవరకు పండుగ సీజన్కు వాయిదా పడ్డాయని సత్య ఏజెన్సీస్ తెలిపింది. అయితే ఎక్సే్చంజ్ ఆఫర్లు, ఈఎంఐ ఫైనాన్సింగ్ పెరిగిన ధరల భారాన్ని కొంత తగ్గించవచ్చని అంచనా. మరోవైపు, కిచెన్ అప్లయెన్సులు, ఎంట్రీ–లెవల్ స్మార్ట్ఫోన్ల డిమాండ్ కొంత స్థిరంగా ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: బంగారం భారీ ధరలు.. కియోసాకి కామెంట్స్సుదీర్ఘమైన పండగ సీజన్పై ఆశలు ఈ ఏడాది దీపావళి నవంబర్లో రావడం పరిశ్రమకు మరో అనుకూల అంశంగా కనిపిస్తోంది. సాధారణంగా ఆగస్టులో స్వాతంత్య్ర దినోత్సవం, రక్షాబంధన్తో ప్రారంభమయ్యే పండుగ సీజన్ దీపావళి వరకు కొనసాగుతుంది. ఈసారి సెపె్టంబర్ నుంచి నవంబర్ మధ్య వరకు సుదీర్ఘంగా ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహించేందుకు బ్రాండ్లు, ఆన్లైన్ మార్కెట్ప్లేస్లు, రిటైలర్లకు ఎక్కువ సమయం లభించనుంది. ‘దీపావళి నవంబర్లో వచ్చిన ప్రతిసారీ సేల్స్ విపరీతంగా పెరిగాయి’ అని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ సంజయ్ చిత్రకారా తెలిపారు. గత ఏడాది ప్రధాన గృహోపకరణాలపై జీఎస్టీ తగ్గింపు పరిశ్రమకు కొంత ఊరటనిచ్చింది. అయితే ప్రస్తుతం రాగి, అల్యూమినియం వంటి ముడిసరుకుల ధరల పెరుగుదల తయారీ సంస్థలపై ఒత్తిడి పెంచుతోంది.గత ఏడాదితో పోలిస్తే రాగి ధరలు సుమారు 45 శాతం, అల్యూమినియం ధరలు 25 శాతం పెరిగాయని పరిశ్రమ అంచనా. దీంతో కంపెనీలు ధరల పెంపుతో పాటు కొత్త ఫీచర్లు, ఏఐ ఆధారిత సాంకేతికత కలిగిన ప్రీమియం ఉత్పత్తులను ప్రవేశపెట్టి వినియోగదారులను అప్గ్రేడ్ కొనుగోళ్ల వైపు మళ్లించేందుకు ప్రయతి్నస్తున్నాయి. మొత్తంగా, పెరిగిన ధరలు పండుగ సీజన్లో పరిశ్రమకు సవాలుగా ఉన్నప్పటికీ, ప్రీమియం ఉత్పత్తులపై కొనసాగుతున్న ఆసక్తి, డిస్కౌంట్లు, ఈఎంఐ సదుపాయాలు, సుదీర్ఘ సేల్స్ సీజన్ అమ్మకాలకు ఊతమిస్తాయని పరిశ్రమ ఆశిస్తోంది. సెప్టెంబర్ నుంచి దీపావళి వరకు కొనుగోళ్లు ఎంత మేర పుంజుకుంటాయన్నదే ఈ ఏడాది కన్జూమర్ డ్యూరబుల్స్ రంగం వృద్ధిని నిర్ణయించనుంది. -
యాపిల్లో ఉద్యోగాల కోత
సాంకేతిక ప్రపంచంలో ప్రత్యేక ముద్ర వేసిన ప్రముఖ ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ తన వ్యాపార ప్రాధాన్యతల్లో మార్పులు చేస్తోంది. కృత్రిమ మేధ సవాళ్లు, మార్కెట్ ప్రతికూలతల నేపథ్యంలో కంపెనీలో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. సిరి, విజన్ ప్రో ఇమ్మర్సివ్ వీడియో, గేమింగ్ విభాగాల నుంచి సుమారు 200 మంది ఉద్యోగులను తొలగిస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది.కంపెనీ ఉత్పత్తులు, సర్వీసుల నాణ్యతను పెంచేందుకు నిర్వహించే పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగానే ఈ చర్యలు చేపట్టినట్లు యాపిల్ అధికారికంగా ధ్రువీకరించింది. మారిన ప్రాధాన్యతలకు అనుగుణంగా కొన్ని పాత హోదాలను రద్దు చేస్తూనే సరికొత్త విభాగాల్లో నూతన అవకాశాలను సృష్టిస్తున్నట్లు తెలిపింది. బాధితులకు అవసరమైన మద్దతు అందిస్తామని పేర్కొంది.తొలగింపుల్లో విజన్ ప్రో విభాగానికి చెందిన వారు 100 మంది ఉండగా, సిరి, సాఫ్ట్వేర్ టీమ్ల నుంచి మరో 100 మంది ఉన్నారు. 3,699 డాలర్ల డివైజ్గా అత్యంత ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన విజన్ ప్రో హెడ్సెట్కు ఆశించిన స్థాయిలో వినియోగదారులు లభించకపోవడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణం. కోట్లాది డాలర్ల వ్యయంతో రూపొందించే '3డీ ఇమ్మర్సివ్ వీడియో' కంటెంట్ తయారీ ఖర్చులను తగ్గించుకోవాలని యాపిల్ భావిస్తోంది. అలాగే విజన్ ప్రో గేమింగ్ విభాగాన్ని దాదాపుగా మూసివేస్తోంది. ఇకపై ఈ విధమైన కంటెంట్ను థర్డ్ పార్టీ డెవలపర్ల ద్వారా ప్రోత్సహించాలని నిర్ణయించింది.అటు సిరి వాయిస్ అసిస్టెంట్ను మరింత ఆధునిక ఆర్కిటెక్చర్తో, కొత్త ఏఐ మోడల్స్ ఆధారంగా పునర్నిర్మించేందుకు యాపిల్ సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా పాత సాంకేతిక నైపుణ్యాలు ఉన్న ఉద్యోగుల స్థానంలో నూతన ఏఐ నిపుణులను నియమించుకోవాలని భావిస్తోంది.ఈ పరిణామాలు విజన్ ప్రో భవిష్యత్తుపై సందేహాలు రేకెత్తించినప్పటికీ, 'విజన్ ఓఎస్' మనుగడలోనే ఉంటుందని యాపిల్ స్పష్టం చేసింది. తక్షణమే స్మార్ట్ గ్లాసెస్ ఆధారిత పరికరాలపై దృష్టి సారిస్తూ 2028 నాటికి కొత్త విజన్ ప్రో మోడల్ను పరిచయం చేసే ఆలోచనలో ఉంది. ఏఐ పోటీని తట్టుకుని నిలబడేందుకు యాపిల్ తీసుకుంటున్న ఈ కఠిన నిర్ణయాలు గ్లోబల్ టెక్ రంగంలో కొత్త చర్చకు దారితీశాయి.ఇదీ చదవండి: వ్యాపార నిర్వహణలో భావోద్వేగాలు వద్దు! -
పసిడి మోత.. మూడో రోజూ మరింత..
దేశంలో బంగారం ధరల పెరుగుదల కొనసాగింది. వరుసగా మూడో రోజూ పసిడి ధరలు భారీగా ఎగిశాయి. దీంతో పుత్తడి కొనుగోలుదారులకు ఈరోజు కూడా నిరాశ తప్పలేదు. ఇక వెండి ధరలు మాత్రం నేడు శాంతించాయి. ఎటువంటి మార్పు లేకుండా నిలకడగా కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.ఇదీ చదవండి: బంగారం భారీ ధరలు.. కియోసాకి కామెంట్స్ -
ఆర్బీఐ బోర్డులోకి ఎస్.సోమనాథ్, ఆనంద్ మహీంద్రా
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నెన్స్ విభాగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇస్రో మాజీ ఛైర్మన్ ఎస్.సోమనాథ్ను ఆర్బీఐ సెంట్రల్ బోర్డులో పార్ట్టైమ్, నాన్-అఫీషియల్ డైరెక్టర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను ఆగస్టు 20, 2026 నుంచి నాలుగేళ్ల కాలపరిమితికి నియమించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రాను మరొక పదవీకాలానికి (నాలుగేళ్లు) నాన్-అఫీషియల్ డైరెక్టర్గా పునర్నియమించారు.బ్యాంకింగ్ నియంత్రణ చట్టాల ప్రకారం ఆర్బీఐ వ్యవహారాలను నడిపే సెంట్రల్ బోర్డులో రంగాలవారీ నిపుణులను భాగస్వాములను చేయడం ఆనవాయితీ. అంతరిక్ష రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన సోమనాథ్ సాంకేతిక పరిజ్ఞానం, ఆనంద్ మహీంద్రా పారిశ్రామిక అనుభవం ఆర్బీఐ బోర్డు నిర్ణయాలకు మరింత దిశానిర్దేశం చేస్తాయని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ఈ సెంట్రల్ బోర్డులో డిప్యూటీ గవర్నర్లు స్వామినాథన్ జె, పూనమ్ గుప్తా, శిరీష్ చంద్ర ముర్ము, రోహిత్ జైన్లతో పాటు రివతి అయ్యర్, ప్రొఫెసర్ సచిన్ చతుర్వేది వంటి ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు. తాజా నియామకాలతో బోర్డు బలం 11కి చేరింది.ద్రవ్యోల్బణ నివారణ, సాంకేతిక మార్పులకు అనుగుణంగా డిజిటల్ కరెన్సీ విస్తరణ, సైబర్ భద్రత వంటి కీలక సవాళ్లను బ్యాంకింగ్ వ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో వ్యూహాత్మక సాంకేతిక పరిజ్ఞానం, పారిశ్రామిక రంగ అనుభవం ఉన్న నిపుణుల భాగస్వామ్యం ఆర్బీఐకి ఎంతో ప్రయోజనకరంగా మారనుంది.ఇదీ చదవండి: వ్యాపార నిర్వహణలో భావోద్వేగాలు వద్దు! -
వ్యాపార నిర్వహణలో భావోద్వేగాలు వద్దు!
వృత్తిపరమైన జీవితానికి, వ్యక్తిగత అనుబంధాలకు నడుమ స్పష్టమైన సరిహద్దులు ఎంత అవసరమో చెప్పే ఆసక్తికర సంఘటన ఇది. ముంబైకి చెందిన డిజిటల్ క్రియేటర్, పారిశ్రామికవేత్త అవంతి నగ్రాల్ తన తల్లిని బిజినెస్ మేనేజర్గా నియమించుకుంది. కేవలం రెండు వారాల్లోనే ఆ పదవి నుంచి తల్లిని తొలిగించినట్లు వెల్లడించిన వివరాలు ఇప్పుడు కార్పొరేట్, స్టార్టప్ వర్గాల్లో చర్చకు దారితీసింది.హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చేరడానికి ముందు సంగీతం, నాటకరంగం, వినోద రంగానికి సంబంధించిన ప్రోగ్రామ్లతో బిజీగా ఉన్న సమయంలో తన షెడ్యూళ్లు, ఒప్పందాలు, ఈమెయిళ్లు చూసుకోవడానికి అవంతి తన తల్లిని మేనేజర్గా నియమించుకున్నారు. విభిన్న రంగాల్లో అనుభవం ఉన్న తల్లి సరైన నిర్ణయాలు తీసుకోగలదని భావించినా అది రెండు వారాల కంటే ఎక్కువ కాలం సాగలేదు.రక్షణే అడ్డంకిగా మారిన వేళతల్లిని బాధ్యతల నుంచి తప్పించడానికి కారణం ఆమె నిర్లక్ష్యం కాదని, కుమార్తెపై ఉన్న అమితమైన ప్రేమేనని అవంతి పేర్కొన్నారు. ‘నా తల్లి కెరీర్ను మేనేజ్ చేయడం లేదు, నాకు రక్షణగా నిలుస్తోంది’ అని గ్రహించడమే దీనికి ప్రధాన కారణం. రాత్రివేళల్లో జరిగే షోలు, తెలియని నగరాల్లో టూర్లు, భద్రత అంచనా వేయలేని ప్రదేశాలకు వెళ్లే అవకాశాలను తల్లి తిరస్కరించడం వల్ల వ్యాపార పురోగతికి అడ్డంకులు ఏర్పడ్డాయి. దీంతో బాధ్యతల నుంచి తల్లిని తప్పించి ప్రొఫెషనల్ ఏజెన్సీలను ఆశ్రయించాల్సి వచ్చింది.సృజనాత్మక రంగంలో మౌలిక వసతుల కొరతఈ అనుభవం ద్వారా క్రియేటివ్ రంగానికి చెందిన వారు ఎదుర్కొంటున్న ప్రధాన లోపాన్ని అవంతి ఎత్తిచూపారు. భారతదేశంలో కళాకారులకు, స్వతంత్ర క్రియేటర్లకు వృత్తిపరమైన మేనేజ్మెంట్ సపోర్ట్, కాంట్రాక్ట్ చర్చలు నడిపే సరైన వ్యవస్థలు లేకపోవడంతో చాలామంది బంధువులు లేదా స్నేహితులపైనే ఆధారపడుతున్నారు. ఇది తరచూ వ్యక్తిగత సంబంధాలు దెబ్బతినడానికి లేదా వ్యాపార నష్టాలకు దారితీస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏ ప్రొఫెషనల్ వ్యాపారంలోనైనా భావోద్వేగాల కంటే ప్రాక్టికాలిటీ, మార్కెట్ అవసరాలు ముఖ్యాంశాలకు పెద్దపీట వేయాలి.ఇదీ చదవండి: ఓణం పండగొచ్చె.. టీ ధరలకు రెక్కలొచ్చె! -
బీఎమ్డబ్ల్యూ ఎక్స్1 ఎల్డబ్ల్యూబీ వచ్చేసింది..!
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘బీఎమ్డబ్ల్యూ’ భారత్లో సరికొత్త ‘ఎక్స్1 లాంగ్ వీల్బేస్ (ఎల్డబ్ల్యూబీ)’ ఎస్యూవీని శుక్రవారం ఆవిష్కరించింది. ఎక్స్షోరూమ్ ప్రారంభ ధర రూ.49.9 లక్షలు. తొలిసారి లగ్జరీ కారు కొనే కస్టమర్లను ఆకట్టుకునేలా ఆకర్షణీయమైన డిజైన్, విలాసవంతమైన ఇంటీరియర్, అధునాతన ఫీచర్లతో తీర్చిదిద్దారు. సాధారణ వేరియంట్తో పోలిస్తే వెనుక సీటు ప్రయాణికులకు విశాలమైన లెగ్రూమ్, అదనపు స్పేస్ అందించడం విశేషం. ఈ ఎస్యూవీ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ‘ఎక్స్1 కొనుగోలుదారులలో 50 శాతానికి పైగా కస్టమర్లు తొలిసారిగా లగ్జరీ కార్ల విభాగంలోకి వస్తున్నవారే. కావున అదనపు స్పేస్, సౌకర్యాలతో కూడిన వెర్షన్ను తీసుకురావడం సరైన నిర్ణయం. రెండో ఎలక్ట్రిక్ కారు ‘ఐ5 లాంగ్ వీల్బేస్ సెడాన్’ త్వరలో వస్తుంది’ అని బీఎమ్డబ్ల్యూ గ్రూప్ ఇండియా చైర్మన్, సీఈఓ హర్దీప్ సింగ్ బ్రార్ చెప్పారు -
బ్లూకాలర్ బూమ్!
ఒకప్పుడు డిగ్రీ ఉంటేనే భవిష్యత్ అనేవారు. ఇప్పుడు నైపుణ్యం ఉన్నవారికే భవిష్యత్ అనే కొత్త వాస్తవం రూపుదిద్దుకుంటోంది. ఏఐ యుగంలో ఉద్యోగాలు అంతరించిపోవడం కాదు, వాటి స్వరూపం మారుతోంది. కంప్యూటర్ను ఆదేశించే వ్యక్తికన్నా ఆ కంప్యూటర్ పనిచేసే వ్యవస్థను నిర్మించే, నిర్వహించే ఎలక్ట్రీషియన్, టెక్నీషియన్, రోబోటిక్స్ నిపుణులే రేపటి ఉద్యోగ మార్కెట్లో అత్యంత విలువైన వ్యక్తులుగా నిలవనున్నారు. కృత్రిమ మేధ (ఏఐ) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న వేళ మరో కీలక పరిణామం నిశ్శబ్దంగా చోటుచేసుకుంటోంది. కంప్యూటర్ ముందు కూర్చునే ఉద్యోగాలకంటే చేతివృత్తులు, సాంకేతిక నైపుణ్యాలున్న బ్లూకాలర్ ఉద్యోగాలకు ఇప్పుడు భారీ డిమాండ్ ఏర్పడుతోంది. ఎల్రక్టీషియన్స్, ప్లంబర్లు, రోబోటిక్స్ టెక్నీషియన్లు, హెచ్వీఏసీ నిపుణులు, యంత్రాల నిర్వహణ సిబ్బంది వంటి వృత్తి నిపుణుల కోసం కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఏఐ విప్లవం వెనక అసలు బలం మానవ నైపుణ్యాలేనని తాజా అధ్యయనం స్పష్టం చేస్తోంది. ఏఐకి వెన్నెముకగా బ్లూకాలర్ ఉద్యోగాలు ప్రపంచవ్యాప్తంగా ఏఐ, డేటా సెంటర్లు, ఆటోమేటెడ్ ఫ్యాక్టరీలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇవన్నీ సక్రమంగా పనిచేయాలంటే భారీ విద్యుత్ వ్యవస్థలు, శీతలీకరణ యంత్రాంగం, రోబోటిక్ పరికరాలు, నిర్వహణ సిబ్బంది అవసరం. అందుకే ఎల్రక్టీషియన్లు, మెకానిక్లు, వెల్డర్లు, ప్లంబర్లు, రోబోటిక్స్ నిపుణుల అవసరం ప్రపంచవ్యాప్తంగా గణనీయంగా పెరుగుతోంది. టాలెంట్ సంస్థ రాండ్స్టాడ్ విశ్లేషణ ప్రకారం 5 కోట్లకు పైగా ఉద్యోగ ప్రకటనలను పరిశీలించి విశ్లేషించగా గత నాలుగేళ్లలో ఎలక్ట్రిషియన్ల డిమాండ్ 242%, హెచ్వీఏసీ టెక్నీషియన్ల డిమాండ్ 200%, రోబోటిక్స్ టెక్నీషియన్ల అవసరం గణనీయంగా పెరిగినట్లు తేలింది. 93 శాతం ఉద్యోగాల పెరుగుదల 2022 నుంచి 2026 మధ్య కాలంలో భారత దేశంలో బ్లూకాలర్ ఉద్యోగాల సంఖ్య 93% పెరిగింది. అదే సమయంలో వైట్ కాలర్ ఉద్యోగాల వృద్ధి 40% వద్దే నిలిచింది. ఇది దేశ కారి్మక మార్కెట్లో పెద్ద మార్పునకు సంకేతంగా నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటివరకు డిగ్రీ, ఐటీ ఉద్యోగాలకే ప్రాధాన్యం ఉండేది. కానీ ప్రస్తుతం పరిశ్రమలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, డేటా సెంటర్లు, సెమీకండక్టర్ యూనిట్లు, ఎలక్టిక్ వెహికిల్ (ఈవీ) తయారీ కేంద్రాలు పెరగడంతో సాంకేతిక నైపుణ్యాలున్న కార్మికుల అవసరం మరింత పెరిగింది. వేతనాల్లోనూ బ్లూకాలర్ ఆధిక్యం ఉద్యోగాల్లోనే కాదు వేతనాల్లో కూడా బ్లూకాలర్ ఉద్యోగులు ముందంజలో ఉన్నారు. బ్లూకాలర్ ఉద్యోగుల జీతాలు ఏటా సగటున 5.7 శాతం పెరుగుతున్నాయి. ఎంట్రీ లెవెల్ వైట్ కాలర్ ఉద్యోగాల్లో పెరుగుదల 4 శాతం మాత్రమే నమోదైంది. రోబోటిక్స్ నిర్వహణ, ప్రత్యేక యంత్రాల మెయింటినెన్స్ మెకానిక్ల వార్షిక వేతనం సగటున రూ. 8లక్షలకు పైగా ఉండగా ప్లాంట్ ఆపరేటర్లు రూ.7 లక్షలు, నిర్మాణ రంగ సిబ్బంది రూ.5 లక్షలు, ఎల్రక్టీషియన్లు సుమారు రూ.3 లక్షలకుపైగా సంపాదిస్తున్నారు. దీనికి విరుద్ధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్లు, జూనియర్ అకౌంటింగ్ వంటి ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల్లో వేతనాలు తక్కువగా ఉండడమే కాకుండా వారిపై ఆటోమేషన్ ప్రభావం కూడా ఎక్కువగా కనిపిస్తోంది. భారత్కు డబుల్ ధమాకా అమెరికా, యూరప్ వంటి దేశాల్లోని కంపెనీల్లో కార్యాలయ ఉద్యోగాలు తగ్గుతున్నప్పటికీ భారత్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఒకవైపు బ్లూకాలర్ ఉద్యోగాలు వేగంగా పెరుగుతుండగా, మరోవైపు వైట్ కాలర్ రంగంలోనూ 40 శాతం వృద్ధి నమోదవుతోంది.అయితే భవిష్యత్తులో డేటా ఎంట్రీ, ప్రాథమిక అకౌంటింగ్, సాధారణ పరిపాలనా ఉద్యోగాలపై మాత్రం ఏఐ ప్రభావం ఉండొచ్చని హెచ్చరికలు వినిపిస్తున్నాయి. రాండ్స్టాండ్ సీఈఓ విశ్వనాధ్ పీఎస్ అభిప్రాయం ప్రకారం ‘ ప్రతి ఏఐ ఆవిష్కరణ వెనక ఒక భౌతిక వ్యవస్థ ఉంటుంది. విద్యుత్ గ్రిడ్లు అప్ గ్రేడ్ కావాలి, కూలింగ్ సిస్టమ్లు నిర్మించాలి, ఫ్యాక్టరీలు ఆటోమేట్ కావాలి, ప్రతి స్మార్ట్ యంత్రం వెనక అత్యంత నైపుణ్యం కలిగిన మనుషులే ఉంటారు.బ్లూకాలర్కి డిమాండ్ ఎందుకు? ఏఐ అంటే కేవలం సాఫ్ట్వేర్ మాత్రమే కాదు, దానికి భారీ మౌలిక సదుపాయాలు అవసరం. ఉదాహరణకు డేటా సెంటర్లకు అధిక విద్యుత్ సరఫరా అవసరం సర్వర్లను చల్లబరిచేందుకు భారీ హెచ్వీఏసీ(హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషన్) వ్యవస్థలు కావాలి. తయారీ రంగంలో రోబోట్ల వినియోగం పెరుగుతోంది. ఈవీ పరిశ్రమల్లో ఆటోమేటెడ్ అసెంబ్లీ లైన్లు విస్తరిస్తున్నాయి స్మార్ట్ ఫ్యాక్టరీ నిర్వహణకు ప్రత్యేక నైపుణ్యాలున్న వ్యక్తుల అవసరం విపరీతంగా పెరుగుతోంది.అందువల్ల ఏఐ ఎంత అభివృద్ధి చెందినా వాటిని నిర్మించే, నిర్వహించే, మరమ్మతులు చేసే మానవ నైపుణ్యం అవసరం అంతే స్థాయిలో పెరుగుతోందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ప్లీజ్ భారత్ మా చక్కెర కొనవా?: పాకిస్థాన్
సాక్షి,న్యూఢిల్లీ: పండగల సీజన్లో అమాంతం పెరుగుతున్న చక్కెర ధరల్ని నియంత్రించేందుకు సరఫరాను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ప్రకటన ప్రకారం.. అక్టోబర్ 31, 2026 వరకు ఎలాంటి సుంకం లేకుండా 10 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చక్కెరను దిగుమతి చేసుకునేందుకు వీలుగా విధానాన్ని సవరించింది. గత ఏడాదితో పోలిస్తే రిటైల్ ధరలు సుమారు 13 శాతం పెరగడం, మిల్లుల వద్ద ఎక్స్-మిల్ ధరలు రికార్డు స్థాయికి చేరడం దీనికి ప్రధాన కారణం. ఇప్పుడు ఇదే అంశంపై పాక్.. భారత్ను అర్రులు చాస్తోంది. తమ వద్ద ఉన్న షుగర్ కొనులు చేసి ఆర్థికంగా తమని ఆదుకోవాలనే ప్రతిపాదనలు చేసే యోచనలో ఉందంటూ ఆదేశ మీడియా సంస్థలు పలు కథనాల్ని ప్రచురించాయి. .భారత్ దిగుమతికి మార్గం సుగమం చేయడంతో పాకిస్థాన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ దీనిని ఒక అవకాశంగా మలచుకోవాలని భావిస్తోంది. ఈక్రమంలో హుంజా షుగర్ మిల్స్ ప్రతినిధి పీఎస్ఎంఏ సీనియర్ సభ్యుడు చౌదరి ముహమ్మద్ వహీద్ మాట్లాడుతూ.. పాకిస్థాన్లో ప్రస్తుతం 12 లక్షల టన్నులకు పైగా మిగులు నిల్వలు ఉన్నాయి. వచ్చే చెరుకు పంట చేతికొచ్చే సమయానికి ఈ నిల్వలను విక్రయించకపోతే కొత్త పంట కొనుగోలు చేయడానికి మిల్లులకు ఇబ్బందులు ఎదురవుతాయి.భారత్కు సమీపంలో ఉండటం వల్ల రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు, ఎగుమతుల ద్వారా విదేశీ మారకద్రవ్యం లభిస్తుందని. మిల్లుల ద్రవ్యత మెరుగుపడి రైతులకు సకాలంలో బకాయిలు చెల్లించడానికి వీలవుతుందని పాకిస్థాన్ వర్గాలు భావిస్తున్నాయి.వాణిజ్య సంబంధాల సవాళ్లుఇరు దేశాల మధ్య గతంలోనే రాజకీయ, భద్రతా ఉద్రిక్తతల కారణంగా వాణిజ్య మార్గాలు (అటారీ-వాఘా సరిహద్దు, విమాన మార్గాలు) మూతపడ్డాయి. ప్రస్తుతం ఉన్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల ప్రకారం పాకిస్థాన్ నేరుగా భారత్కు చక్కెర ఎగుమతి చేయడం లేదు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మిల్లులు తమ ప్రభుత్వాన్ని ప్రత్యేక అనుమతులు కోరుతున్నాయి. అందువల్ల భారత్ తీసుకున్న దిగుమతి నిర్ణయం తక్షణ వాణిజ్య ఒప్పందంగా కాకుండా, కేవలం ఒక ఆరంభంగానే చూడాల్సి ఉంది.ఇథనాల్ ప్రభావం..ప్రభుత్వ వాదనభారత్లో చక్కెర ధరల పెరుగుదలకు కేవలం ఇథనాల్ వైపు చెరకు మళ్లింపు మాత్రమే కారణం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. పెట్రోల్లో 20శాతం ఇథనాల్ కలపాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత్, బయోఫ్యూయల్ రంగాన్ని బలోపేతం చేయడానికి గత కొన్ని సీజన్లలో లక్షలాది టన్నుల చక్కెరను ఇథనాల్ వైపు మళ్లించింది. అయితే ప్రస్తుత ధరల అస్థిరతకు మార్కెట్లో కొంతమంది చేసే అసాధారణ నిల్వలు, ఊహాజనిత లావాదేవీలే కారణమని ఆహార, ప్రజా పంపిణీ శాఖ పేర్కొంది. -
ఓణం పండగొచ్చె.. టీ ధరలకు రెక్కలొచ్చె!
కేరళలో అతిపెద్ద పండుగైన ‘ఓణం’ సమీపిస్తున్న తరుణంలో దక్షిణాది టీ మార్కెట్లో డిమాండ్ గణనీయంగా పెరిగింది. కొచ్చి టీ వేలం(ఆక్షన్)లో డస్ట్, ఆర్థోడాక్స్(సాంప్రదాయ పద్ధతిలో తేయాకు రెమ్మలను యంత్రాల ద్వారా నలిపి, ఎండబెట్టి తయారుచేసే టీ రకం) రకాల ధరలు స్థిరమైన వృద్ధిని కనబరుస్తున్నాయని తాజా అధికారిక వేలం వర్గాలు వెల్లడించాయి.డిమాండ్తో పుంజుకున్న ధరలుకొచ్చి కేంద్రంగా జరిగిన విక్రయాల్లో సీటీసీ డస్ట్తో పాటు ఆర్థోడాక్స్ రకం కేజీకి రూ.10 నుంచి రూ.15 వరకు పెరిగింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల తేయాకు తోటల ఉత్పత్తి తగ్గడం ఒక కారణమైతే, పండుగ వేళ స్థానిక ప్రాసెస్ డ్రింక్ తయారీదారులు, రిటైల్ ప్యాకేజింగ్ కంపెనీలు అధికమొత్తంలో కొనుగోళ్లు చేయడం మరో ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.ఎగుమతులు, ప్రాసెస్డ్ డిమాండ్స్థానిక అవసరాలతో పాటు పశ్చిమాసియా (గల్ఫ్) దేశాల నుంచి ఆర్థోడాక్స్ రకం తేయాకుకు లభించిన ఎగుమతి ఆర్డర్లు మార్కెట్కు మరింత ఊతమిచ్చాయి. వ్యాపారులు ముందస్తుగా నిల్వలు పెంచుకోవడానికి ప్రాధాన్యమివ్వడంతో వేలంలో కొనుగోలు వ్యూహాలు వేగవంతమయ్యాయి. అధిక ధరలు నమోదైనప్పటికీ విక్రయాలు శాతంలో ఎలాంటి క్షీణత కనిపించకపోవడం గమనార్హం.మార్కెట్ భవిష్యత్ సరళిరాబోయే రెండు మూడు వారాల పాటు పండుగ సీజన్ డిమాండ్ కొనసాగే అవకాశం ఉన్నందున టీ బోర్డ్ నియంత్రణలోని దక్షిణాది లీలాం కేంద్రాల్లో (కూర్గ్, కొచ్చి, కొయంబత్తూర్) ధరల శ్రేణి ఇదే రీతిలో స్థిరంగా లేదా స్వల్ప వృద్ధితో కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. తేయాకు ఉత్పత్తి పెరిగి కొత్త సరఫరాలు ఊపందుకునే వరకు కొనుగోలుదారులకు అధిక ధరల భారం తప్పకపోవచ్చని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: టీసీఎస్ ఉద్యోగుల ల్యాప్టాప్ల్లో కొత్త టూల్ -
సెంట్రల్ బ్యాంక్ నుంచి బంపర్ లోన్ ఆఫర్లు!
తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ రుణ వ్యాపారాన్ని బలోపేతం చేయడం, ఖాతాదారులతో నేరుగా అనుసంధానం కావడం లక్ష్యంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ ఎత్తున రిటైల్ అవుట్రీచ్ కార్యక్రమాలను నిర్వహించింది. హైదరాబాద్, విజయవాడ, నరసరావుపేటల్లో శుక్రవారం నిర్వహించిన ఈ ప్రచార కార్యక్రమాల్లో భారీగా రుణ మంజూరు పత్రాలు అందించడంతో పాటు కీలకమైన పండుగ ఆఫర్లను బ్యాంక్ అధికారులు ప్రకటించారు.హైదరాబాద్ రీజియన్లో..హైదరాబాద్లో నిర్వహించిన మెగా అవుట్రీచ్ కార్యక్రమంలో బ్యాంక్ కార్పొరేట్ ఆఫీస్ జనరల్ మేనేజర్ ఏ.డి. శ్రీనివాస్, రీజినల్ హెడ్ గజేంద్ర సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ ప్రత్యేక ప్రచార కాలంలో ఇన్-ప్రిన్సిపల్ ఆమోదాలతో కలిపి మొత్తం రూ.172 కోట్ల రిటైల్ రుణాలు మంజూరు చేయగా అందులో రూ.125 కోట్లు నేరుగా ఖాతాదారులకు పంపిణీ చేశారు. అదనంగా రూ.24 కోట్ల విలువైన తాజా బిజినెస్ లీడ్స్ సాధించారు.‘మాకున్న బలమైన ‘సీఏఎస్ఏ’ బేస్, తగిన నిధుల లభ్యత కారణంగానే పరిశ్రమలోనే అత్యంత పోటీ వడ్డీ రేట్లను అందించగలుగుతున్నాం. గృహలక్ష్మి, హోమ్, గోల్డ్, వెహికల్ లోన్లలో ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా ఉత్తమ పథకాలు అందుబాటులో ఉన్నాయి’ అని ఏ.డి. శ్రీనివాస్ చెప్పారు.విజయవాడ, నరసరావుపేటల్లో..విజయవాడలో రీజినల్ హెడ్ ఈ.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రుణ అవగాహన క్యాంప్ జరిగింది. ప్రజల ఆర్థిక అవసరాలను తీర్చడమే కాకుండా పారదర్శకమైన బ్యాంకింగ్ సేవలు అందించడమే తమ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు.అలాగే, నరసరావుపేట శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రీజినల్ హెడ్ జి.రమణారావు పాల్గొని, అర్హులైన లబ్ధిదారులకు సుమారు రూ.2 కోట్ల విలువైన గృహ రుణ మంజూరు పత్రాలను అందజేశారు. రాబోయే పండుగ సీజన్ను పురస్కరించుకుని డిసెంబర్ 2026 వరకు గృహ రుణాలు, కారు రుణాలపై 100 శాతం ప్రాసెసింగ్ ఛార్జీల మినహాయింపు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు.సులభతర బ్యాంకింగ్‘మీ కలలకు మా సంకల్పం’ అనే నినాదానికి కట్టుబడి రిటైల్ బ్యాంకింగ్ విస్తరణలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నిబద్ధతను మరోసారి చాటుకుంటున్నట్లు బ్యాంకు అధికారులు చెప్పారు. అర్హులైన ప్రజలంతా సమీప శాఖలను సంప్రదించి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఇదీ చదవండి: టీసీఎస్ ఉద్యోగుల ల్యాప్టాప్ల్లో కొత్త టూల్ -
ఎయిర్లిఫ్ట్ ద్వారా వంతారాలో ‘జాయ్మతి’కి వైద్యం
ఈశాన్య రాష్ట్రాల్లో ఇటీవల సంభవించిన వరదల్లో కొట్టుకుపోయి తీవ్రంగా గాయపడిన 53 ఏళ్ల ‘జాయ్మతి’ అనే ఆడ ఏనుగుకు అత్యవసర వైద్యం అందించేందుకు వంతారా రంగంలోకి దిగింది. నాగాలాండ్లోని నామ్సాంగ్ ప్రాంతంలో దికో నదిలో వరద ఉధృతికి కొట్టుకుపోయి, అస్సాంలోని శివసాగర్ జిల్లా బిహుబోర్ వద్ద ఒడ్డుకు చేరిన ఈ ఏనుగును అధికారులు, స్థానికులు కాపాడారు. అయితే, వరద ఉధృతి కారణంగా జాయ్మతి శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి.ఎయిర్లిఫ్ట్ ఎందుకంటే..వరద నీటిలో కొట్టుకుపోవడం వల్ల జాయ్మతి నుదురు, చెవులు, పొత్తికడుపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. కొన్ని అవయవాల వద్ద తీవ్రమైన పుండ్లు ఏర్పడగా, కుడి కన్ను దెబ్బతిని దృష్టి కోల్పోయింది. అంతేకాకుండా, గతంలో ఎడమ కాలు విరగడం వల్ల నడవలేక ఇబ్బంది పడుతోంది. వయసు పైబడటం, తీవ్రమైన గాయాల నేపథ్యంలో రోడ్డు మార్గంలో సుదీర్ఘ ప్రయాణం ఏనుగుకు మరింత శ్రమ కలిగిస్తుందని నిపుణులు భావించారు. దాంతో అత్యవసర వైద్యం కోసం గుజరాత్లోని జామ్నగర్లో ఉన్న వంతారా ఏనుగుల ఆస్పత్రికి ఎయిర్లిఫ్ట్ ద్వారా తరలించాలని నిర్ణయించారు.అస్సాంలో వైద్య కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనవంతారా ప్రతినిధులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. జాయ్మతి తరలింపు కేవలం తాత్కాలిక అత్యవసర వైద్యం కోసమేనని, కోలుకున్నాక తాన భద్రతను పర్యవేక్షిస్తారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఈశాన్య ప్రాంతంలో ఇటువంటి అత్యవసర పరిస్థితులను స్థానికంగానే ఎదుర్కొనేందుకు అస్సాం అటవీ శాఖ ఆధ్వర్యంలో స్వతంత్రంగా పనిచేసేలా మూడు ప్రత్యేక వన్యప్రాణి వైద్య కేంద్రాలను (ప్రత్యేకంగా ఏనుగుల కోసం ఒక కేంద్రాన్ని) ఏర్పాటు చేయడానికి వంతారా ముందుకు వచ్చింది.ఇదీ చదవండి: టీసీఎస్ ఉద్యోగుల ల్యాప్టాప్ల్లో కొత్త టూల్ -
భారత్ను ముంచెత్తిన చక్కెర సంక్షోభం!
ప్రపంచంలోనే అతిపెద్ద చక్కెర వినియోగదారుగా, రెండో అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉన్న భారతదేశం ప్రస్తుతం తీవ్రమైన చక్కెర సంక్షోభం ఎదుర్కొంటోంది. గడిచిన దశాబ్ద కాలంగా ప్రపంచ దేశాలకు చక్కెరను ఎగుమతి చేసిన భారత్, ఇప్పుడు మళ్లీ దిగుమతిదారుగా మారాల్సిన విచిత్ర పరిస్థితి దాపురించింది. రాబోయే పండుగల సీజన్లో దేశీయంగా కొరత ఏర్పడకుండా ధరలను అదుపులో ఉంచేందుకు దాదాపు 10 లక్షల టన్నుల ముడి చక్కెరను సుంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేసింది.ధరల భగభగలు.. అడుగంటిన నిల్వలుదేశీయంగా చక్కెర ధరలు ఆల్-టైమ్ రికార్డు స్థాయికి చేరాయి. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి ప్రధాన కేంద్రాల్లో ఎక్స్-మిల్ ధరలు క్వింటాలుకు రూ.5,400 దాటగా చిల్లర మార్కెట్లో కిలో ధర రూ.60-రూ.65కు పెరిగింది. సాధారణంగా దేశంలో 60 లక్షల టన్నుల వరకు బఫర్ నిల్వలు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం అది 32 లక్షల టన్నులకు పడిపోవడం వ్యాపార వర్గాల్లో కలకలం రేపింది.సంక్షోభానికి ప్రధాన కారణాలుపెట్రోల్లో 20% ఇథనాల్ కలపాలనే గ్రీన్ ఎనర్జీ లక్ష్యంలో భాగంగా లక్షలాది టన్నుల చక్కెర సమానమైన చెరకు రసాన్ని ఇథనాల్ తయారీకి మళ్లించారు. 2025-26 సీజన్ ఆరంభంలో ఉత్పత్తి సమృద్ధిగా ఉందనే అంచనాతో ప్రభుత్వం సుమారు 8 లక్షల టన్నుల ఎగుమతులకు అనుమతి ఇవ్వడం దేశీయ నిల్వలను దెబ్బతీసింది. వినాయక చవితి, దసరా, దీపావళి సీజన్ల దృష్ట్యా చక్కెర వినియోగం ఒక్కసారిగా పెరిగింది.దిద్దుబాటు చర్యలు.. భవిష్యత్తు సవాళ్లుపరిస్థితి తీవ్రతను గ్రహించిన ప్రభుత్వం ఇప్పటికే చక్కెర ఎగుమతులను పూర్తిగా నిషేధించడమే కాక వ్యాపారులు, బల్క్ వినియోగదారులపై (కన్ఫెక్షనరీ, స్వీట్స్, కూల్ డ్రింక్స్ సంస్థలు) కఠిన స్టాక్ పరిమితులు విధించింది. ఇథనాల్ లక్ష్య సాధనకు ప్రాధాన్యమిస్తూనే దేశీయ ఆహార భద్రతను కాపాడుకోవడం మధ్య సమతుల్యత దెబ్బతినడమే ఈ ప్రస్తుత సంక్షోభానికి ప్రధాన కారణం. సుంకాలులేని దిగుమతుల ద్వారా తాత్కాలికంగా ధరలను తగ్గిస్తున్నారు. అయితే, దీర్ఘకాలికంగా వ్యవసాయ-ఇంధన విధానాల మధ్య సమగ్ర సమన్వయం సాధించకపోతే ఇలాంటి ధరల ప్రకంపనలు పునరావృతమవుతూనే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: టీసీఎస్ ఉద్యోగుల ల్యాప్టాప్ల్లో కొత్త టూల్ -
రూ.62,500 కోట్లతో మేక్ ఇన్ ఇండియా ధమాకా
భారత్ను గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ హబ్గా తీర్చిదిద్దే దిశగా కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్రణాళికను అమల్లోకి తెచ్చింది. రూ.62,500 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా ప్రకటించిన ‘మొబైల్ ఫోన్ మేన్యుఫాక్చరింగ్ స్కీమ్’ (ఎంపీఎంఎస్) మార్గదర్శకాలను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఈ పథకం 2026 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చింది.ఈ మార్గదర్శకాల ప్రకారం, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్ఐ) పొందడానికి ప్రస్తుత మొబైల్ తయారీ సంస్థలు, కాంట్రాక్ట్ తయారీదారులు 2025-26 ఆర్థిక సంవత్సరంలో (FY26) కనీసం రూ.10,000 కోట్ల టర్నోవర్ కలిగి ఉండటం తప్పనిసరి. అదే సమయంలో 51 శాతం స్వదేశీ భాగస్వామ్యం ఉన్న ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ (ఈఎంఎస్) కంపెనీలకు టర్నోవర్ పరిమితిని రూ.1,000 కోట్లుగా నిర్దేశించారు.భారతీయ బ్రాండ్లకు ప్రోత్సాహకాలుకేవలం అసెంబ్లీ రంగానికే పరిమితం కాకుండా దేశీయ బ్రాండ్లను ప్రోత్సహించడం, డిజైన్, పరిశోధన-అభివృద్ధి రంగాల్లో భారత్ సాధికారత సాధించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ మార్గదర్శకాల్లో భాగంగా.. మార్కెట్లో ఉన్న బ్రాండ్లు తమ ఐదేళ్ల కాలవ్యవధిలో ఏటా FY26 విక్రయాల కంటే అదనంగా రూ.5,000 కోట్ల విక్రయాల వృద్ధి (ఇంక్రిమెంటల్ సేల్స్) నమోదు చేయాలి. కొత్తగా వచ్చే బ్రాండ్లు రూ.10,000 కోట్ల వార్షిక విక్రయాలు సాధించాలి. అర్హత సాధించిన విక్రయాలపై 2.25%-2.75% వరకు ప్రోత్సాహక సాయం అందుతుంది. డిస్ప్లే మోడ్యూల్స్, బ్యాటరీలు, ఛార్జర్లు వంటి భాగాలను దేశీయంగా సేకరిస్తే అదనంగా 1.5% ప్రోత్సాహకం, డిజైన్, ఆర్ అండ్ డీ చేపట్టే భారతీయ బ్రాండ్లకు మరో 3% అదనపు ప్రయోజనం కల్పిస్తారు. ఐదేళ్ల వ్యవధిలో దేశంలో రూ.39 లక్షల కోట్ల విలువైన మొబైల్ ఫోన్ల ఉత్పత్తి సాధించడం, అలాగే దాదాపు 60,000 ప్రత్యక్ష ఉపాధి అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. -
భారతీయ విద్యార్థులకు గూగుల్ బిగ్ ఆఫర్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను ఉన్నత చదువు అభ్యసిస్తున్న విద్యార్థులకు మరింత చేరువ చేసే దిశగా దిగ్గజ టెక్ సంస్థ గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశంలోని కళాశాల విద్యార్థులకు ఏడాది పాటు ఉచితంగా ‘గూగుల్ ఏఐ ప్లస్’ సబ్స్క్రిప్షన్ను అందిస్తున్నట్లు ప్రకటించింది. సాధారణంగా నెలకు రూ.399 చొప్పున, ఏడాదైతే దాదాపు రూ.4,800 విలువ చేసే ఈ ప్రీమియం సేవలను అర్హులైన విద్యార్థులు ఎలాంటి రుసుము చెల్లించకుండా పొందే వెసులుబాటు కల్పించింది.ప్రధాన ప్రయోజనాలు.. ఫీచర్లుఈ ఆఫర్ ద్వారా విద్యార్థులకు గూగుల్ అత్యంత సామర్థ్యమున్న ‘జెమిని ఓమ్ని’ (Gemini Omni) మోడల్ యాక్సెస్ లభిస్తుంది. సాధారణ పరిమితుల కంటే రెండు రెట్లు ఎక్కువ వినియోగ పరిమితితో పాటు ప్రాజెక్టులు, డాక్యుమెంట్ల భద్రత కోసం 400 బీజీ క్లౌడ్ స్టోరేజ్ అందుబాటులోకి వస్తుంది. చదువును మరింత సులభతరం చేసేందుకు ప్రత్యేకంగా ఒక స్టూడెంట్ హబ్ను గూగుల్ ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా..స్టడీ నోట్బుక్స్: అకడమిక్ నోట్స్ లేదా సిలబస్ను అప్లోడ్ చేసి విశ్లేషణాత్మక క్విజ్లు రాయవచ్చు. ఏ అంశాల్లో వెనుకబడి ఉన్నారో గుర్తించి సూక్ష్మ స్థాయి లెసన్ ప్లాన్లను జెమిని సిద్ధం చేస్తుంది.3డీ ఇంటరాక్టివ్ విజువలైజేషన్స్: కష్టమైన శాస్త్రీయ అంశాలను సులభంగా అర్థం చేసుకునేందుకు 3డీ మోడల్స్, సిమ్యులేషన్లను సృష్టిస్తుంది.జెమిని లైవ్, డీప్ రీసెర్చ్: సుదీర్ఘమైన పరిశోధనా నివేదికలను వాయిస్ సంభాషణల ద్వారా చర్చించే సదుపాయం ఉంటుంది.ఈ ఆఫర్ను ఎలా పొందాలి?భారత్లోని కాలేజీ విద్యార్థులు గూగుల్ స్టూడెంట్ హబ్ (https://gemini.google.com/students)లోకి వెళ్లి తమ విద్యార్థి గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా ఈ 12 నెలల ఉచిత ప్లాన్ను ఆక్టివేట్ చేసుకోవచ్చు. డిజిటల్ లెర్నింగ్ యుగంలో భారతీయ యువతకు ఇది మంచి అవకాశంగా పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: టీసీఎస్ ఉద్యోగుల ల్యాప్టాప్ల్లో కొత్త టూల్ -
రూ.35 లక్షల వేతనం.. అయినా మానసిక క్షోభ!
ప్రఖ్యాత కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం.. వార్షిక ప్యాకేజీ రూ.35 లక్షలు.. మౌలిక వసతులు.. ఇవన్నీ చూసి ఆ ఉద్యోగి కెరీర్ అత్యున్నత దశలో ఉందనుకుంటే పప్పులో కాలేసినట్లే! అధిక వేతనాలు అందుతున్నప్పటికీ కార్పొరేట్ రంగంలో విపరీతంగా పెరుగుతున్న టాక్సిక్ వర్క్ కల్చర్ (విషతుల్యమైన పని వాతావరణం) ఉద్యోగులను మానసికంగా, శారీరకంగా పాతాళానికి నెట్టివేస్తోంది. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఒక టెక్కీ వేదన ఈ చేదు నిజాలను మరోసారి హైలైట్ చేసింది.టెక్కీ పంచుకున్న వివరాలు..‘సుదీర్ఘ పని గంటలు, శని-ఆదివారాలు కూడా పనిచేయడంపై నా మేనేజర్లతో మాట్లాడగా.. రోజుకు 14 గంటలు పనిచేయడమే ఈ కంపెనీ సంస్కృతి.. అని తేల్చి చెప్పారు. నెలల తరబడి కష్టపడి నేను విజయవంతంగా పూర్తి చేసిన ఒక ప్రాజెక్ట్ను ఉన్నతాధికారుల వద్ద మేనేజర్ ప్రదర్శిస్తూ.. నేను 3 నెలల పాటు ఏ పనీ చేయలేదని, అతనే ప్రతిదీ సరిచేశాడని అబద్ధాలు చెప్పారు. అంతేకాకుండా, నేను రూపొందించిన మోడల్ వల్ల కంపెనీకి 10కి పైగా కొత్త ప్రాజెక్టులు వచ్చాయి. కానీ ఆ శ్రమనంతటినీ వారి ఖాతాలో వేసుకున్నారు’ అని చెప్పాడు.‘తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి మూడు రోజులు చికిత్స పొందుతున్న సమయంలోనూ విశ్రాంతి ఇవ్వలేదు. కేటీ (Knowledge Transfer) ఇచ్చి ఆ తర్వాత నీ పనులు చేసుకో అంటూ 10 సార్లు ఫోన్ చేసి వేధించారు. వన్-ఆన్-వన్ సమావేశాల్లో ప్రోత్సహించాల్సింది పోయి, 'నువ్వు కేవలం ఫిర్యాదులు చేస్తావు.. ఏ పనీ చేయవు' అని నిందించారు. నన్ను తప్పుగా చిత్రీకరిస్తూ బలవంతంగా రాజీనామా చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని వెల్లడించారు.ప్యాకేజీలు భారీగానే ఉన్నాయి.. ఆరోగ్యం ఏది?సాధారణంగా భారీ జీతాలు లభించే ఉద్యోగాల్లో అన్ని సదుపాయాలు ఉంటాయని భావిస్తారు. కానీ, నిరంతర ఒత్తిడి, అపరిమితమైన పని గంటలు, సెలవు రోజుల్లో కూడా పనులు చేయడం, అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాల్సి రావడం వంటి అంశాలు ఉద్యోగులను మనోవేదనకు గురిచేస్తున్నాయి. దీనికి తోడు పండుగల వేళల్లో కూడా విశ్రాంతి లేకపోవడం, హెచ్ఆర్ విభాగాల కఠిన వైఖరి ఉద్యోగుల్లో భయాందోళనలు, తీవ్రమైన మానసిక అలసట, ఆందోళనకు దారితీస్తున్నాయి.లేఆఫ్ల భయం.. అనిశ్చితిలో భవిష్యత్తుఅధిక వేతనాలు తీసుకుంటున్న ఉద్యోగులకు మరో వైపు లేఆఫ్ భయం ఎల్లప్పుడూ వెంటాడుతూనే ఉంది. కేవలం ఒక 10-15 నిమిషాల హెచ్ఆర్ సంభాషణతో ఏళ్ల శ్రమ తుడిచిపెట్టుకుపోతోందని, ఎంతటి ప్రతిభ ఉన్నప్పటికీ కంపెనీ బడ్జెట్ గణాంకాల ముందు ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ జీతాలు మానసిక ప్రశాంతతకు ప్రత్యామ్నాయం కాజాలవు. ఉద్యోగులు తమ మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ అత్యవసర నిధులు, ప్రత్యామ్నాయ రంగాలు, బలమైన నెట్వర్కింగ్ను పెంపొందించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: టీసీఎస్ ఉద్యోగుల ల్యాప్టాప్ల్లో కొత్త టూల్


