Business
-
క్లచ్తో పనిలేకుండా గేర్లు మార్చుకునే బైక్
గురుగ్రామ్: హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) తన పాపులర్ అడ్వెంచర్ టూరర్ మోడల్ ‘ఎన్ఎక్స్500’ను సరికొత్త ఈ–క్లచ్ టెక్నాలజీతో మార్కెట్లోకి విడుదల చేసింది. క్లచ్తో పనిలేకుండా గేర్లు మార్చుకునే వెసులుబాటు కల్పించే ఈ టెక్నాలజీ బైక్ రైడింగ్ అనుభవాన్ని సరికొత్తగా మార్చనుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆటోమేషన్ సాంకేతికతను భారత రైడింగ్ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించారు. దీని ధరను కంపెనీ రూ. 7,43,900 (ఎక్స్–షోరూమ్ వద్ద)గా నిర్ణయించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న హోండా బిగ్వింగ్ డీలర్షిప్లలో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.ఇందులో 471 సీసీ, లిక్విడ్–కూల్డ్, ప్యారలల్–ట్విన్ ఇంజిన్ను 6–స్పీడ్ ట్రాన్స్మిషన్తో అమర్చారు. ఇది సిటీ రైడింగ్ హైవే టూరింగ్ రెండింటికీ అనువైన బలమైన టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఫీచర్ల విషయానికొస్తే... 5.0 అంగుళాల పూర్తి రంగుల టీఎఫ్టీ (టీఎఫ్టీ) డిస్ప్లే ఉంది. ఇందులో నావిగేషన్, కాల్, మ్యూజిక్ ఫంక్షన్ల కోసం హోండా రోడ్సింక్ కనెక్టివిటీ లభిస్తుంది. భద్రత కోసం డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్, పూర్తి ఎల్ఈడీ లైటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్ మ్యాట్ గన్పౌడర్ బ్లాక్ మెటాలిక్, పెర్ల్ హోరిజోన్ వైట్ అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది.ఈ సందర్భంగా హెచ్ఎంఎస్ఐ అధ్యక్షుడు, సీఈఓ శ్రీ సుత్సుము ఒటాని మాట్లాడుతూ, ఈ–క్లచ్ సాంకేతికత పట్టణ, పర్యటన వాతావరణాలలో రైడర్ అలసటను తగ్గించి, సౌకర్యం, కంట్రోల్ను పెంచుతుందని ధీమా వ్యక్తం చేశారు. చదవండి: ఏడాది పాటు పసిడి కొనొద్దు.. పరిష్కారం ఇదిగో! -
హర్మూజ్ దాటే నౌకలకు సర్వీస్ ఛార్జీ
హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై "సేవా రుసుము" (Service Fee) వసూలు చేసేందుకు ఇరాన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరిదాబాది ధ్రువీకరించినట్లు పలు వార్తా సంస్థలు నివేదించాయి. నౌకల రాకపోకల పర్యవేక్షణ (Navigation), సహాయక చర్యల (Rescue Operations) వంటి సేవలకు ప్రతిఫలంగా ఈ రుసుములను వసూలు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.ఎంపిక చేసిన నౌకలకే అనుమతిహర్మూజ్ జలసంధి గుండా అన్ని నౌకలను కాకుండా, ఎంపిక చేసిన వాటిని మాత్రమే అనుమతిస్తామని ఘరిదాబాది పేర్కొన్నారు. నౌకలపై విధించే ఛార్జీల విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలను, పారదర్శకతను పాటిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో భారత దేశ సహకారాన్ని ఇరాన్ స్వాగతిస్తోందని పేర్కొన్నారు.భారత్కు ప్రాధాన్యత"భారతదేశం మాకు అత్యంత స్నేహపూర్వక దేశం. ఇప్పటికే భారత్కు చెందిన 11 నౌకలకు అనుమతి ఇచ్చాము. మిగిలిన నౌకల అనుమతి ప్రక్రియను కూడా వేగవంతం చేస్తున్నాము" అని ఆయన ఎన్డీటీవీతో చెప్పారు.ప్రాంతీయ ఉద్రిక్తతలపై స్పందిస్తూ, ఇరాన్ కాల్పుల విరమణను కోరలేదని, అమెరికాయే ఆ ప్రతిపాదన తెచ్చిందని గరిదాబాది సంచలన వ్యాఖ్యలు చేశారు. "ప్రస్తుత పరిస్థితి 'శాంతి లేదు - యుద్ధం లేదు' అన్నట్లుగా ఉంది. అందుకే ప్రారంభంలో మేము కాల్పుల విరమణను వ్యతిరేకించాం. అయితే దౌత్యపరమైన పరిష్కారం కోసం చివరికి చర్చలకు అంగీకరించాం," అని ఆయన వివరించారు. -
మోదీ కామెంట్స్ వేళ బంగారం వ్యాపారులు ఏం చేస్తున్నారంటే?
పాత బంగారం మార్పిడి పథకాలపై నగల వ్యాపారులు దృష్టి సారించారు. భారత్లో విదేశీ మారక నిల్వలను పొదుపు చేసుకోవడానికి బంగారం కొనుగోళ్లను ఏడాది పాటు తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు చేసిన విజ్ఞప్తి విషయం తెలిసిందే. దీంతో ఆభరణాల రంగం బంగారం రీసైక్లింగ్, మార్పిడి పథకాల వైపు అడుగులు వేస్తోంది. డిమాండ్ను పూర్తిగా తగ్గించే బదులు ప్రత్యామ్నాయ మార్గాలపై సంస్థలు దృష్టి పెడుతున్నాయి.“దిగుమతి సుంకం సవరణ అనేది అతిపెద్ద విధాన మార్పు. ఇది సరఫరా వ్యవస్థ మొత్తం ఖర్చులను పెంచుతుంది. కానీ వినియోగదారులు బంగారాన్ని ఎలా వినియోగించాలో మళ్లీ ఆలోచించే అవకాశాన్ని కూడా ఇది ఇస్తోంది. పాత బంగారం తీసుకొచ్చి కొత్త నగలతో మార్చుకోవాలని మా వినియోగదారులను బలంగా ప్రోత్సహిస్తున్నాం’’అని వ్యాపారులు చెబుతున్నారు. పెరుగుతున్న ధరల ప్రభావాన్ని తగ్గించుకుంటూ కొత్త డిజైన్లు పొందేందుకు ఇది ఉత్తమ మార్గాల్లో ఒకటని అంటున్నారు.పాత బంగారం మార్పిడిలో ఆఫర్లు తనిష్క్ సంస్థ తన పాత బంగారం మార్పిడి కార్యక్రమాన్ని #ఓల్డ్గోల్డ్న్యూఇండియా ప్రచారంతో పెంచుకుంది. కల్యాణ్ జ్యువెలర్స్ కూడా ఇటీవల ‘నేషన్ ఫస్ట్ - గోల్డ్4ఇండియా ఇనిషియేటివ్’ పేరుతో కార్యక్రమం ప్రారంభించింది. పాత బంగారం మార్పిడి, తక్కువ బరువు ఉన్న 18 క్యారెట్ నగల వినియోగం, గోల్డ్ మానిటైజేషన్ పథకాలు, బంగారం పునర్వినియోగ కార్యక్రమాలపై సంస్థ దృష్టి పెట్టింది.ఈ కార్యక్రమంలో భాగంగా సంస్థకు చెందిన 342 దుకాణాల్లో వినియోగదారులు వాడని, పాడైన, పాత నమూనాల నగలను మార్చుకునేలా ప్రోత్సహిస్తారు. దీంతో కొత్తగా దిగుమతి చేసుకోవాల్సిన బంగారం అవసరం తగ్గుతుంది.ఇటీవల ప్రభుత్వం బంగారం దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయం దిగుమతి ఖర్చులు, ప్రస్తుత ఖాతా లోటు, బంగారం ధరల పెరుగుదలపై ఆందోళనలు మరింత పెంచింది. ప్రస్తుత ఖాతా లోటు అంటే.. విదేశాలకు చెల్లింపులు, విదేశాల నుంచి వచ్చే ఆదాయం మధ్య తేడా వల్ల ఏర్పడే లోటు. భారత్ దిగుమతి బంగారంపై ఎక్కువగా ఆధారపడటంతో, కొత్తగా కొనుగోలు చేయడానికి బదులు ఇళ్లలో వాడని బంగారాన్ని కొత్త నగలుగా మార్చుకోవాలని వ్యాపారులు వినియోగదారులకు సూచిస్తున్నారు.మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం అధిక సుంకం తాత్కాలికంగా బంగారం కొనుగోళ్లపై ప్రభావం చూపొచ్చు. కానీ, ఆర్థిక స్థిరత్వానికి మద్దతు ఇవ్వొచ్చు. “భారత్లో బంగారం దిగుమతి సుంకం పెంపు స్థానిక ధరలను పెంచి, కొంతకాలం కొనుగోళ్లు తగ్గించే అవకాశం ఉంది. కానీ పెట్టుబడిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రపంచ అనిశ్చితి, దేశీయ కరెన్సీ ఒత్తిళ్ల సమయంలో బంగారం సురక్షిత పెట్టుబడిగానే కొనసాగుతుంది” అని నిపుణులు తెలిపారు.గతంలో దిగుమతి సుంకం 15 శాతం ఉన్నప్పుడు కనిపించినట్లే.. అక్రమ రవాణా మళ్లీ పెరిగే అవకాశం ఉందని, అదే సమయంలో దిగుమతి బిల్లు తగ్గి విదేశీ మారక నిల్వలకు తాత్కాలిక మద్దతు లభించొచ్చని చెబుతున్నారు.భారత్ మొత్తం దిగుమతి బిల్లులో బంగారం వాటా దాదాపు 9-10 శాతం ఉండటంతో, కొత్త దిగుమతుల బదులు దేశంలో ఇప్పటికే ఉన్న బంగారాన్ని పునర్వినియోగం చేయడం, మానిటైజేషన్పై దృష్టి పెట్టడం ద్వారా ప్రభుత్వ లక్ష్యాలకు ఆభరణాల రంగం అనుగుణంగా ముందుకు సాగుతోంది.“భారత్లో ఇళ్లలో దాదాపు 25,000 టన్నుల వాడని బంగారం ఉందని అంచనా. అందులో కొంత భాగాన్నైనా నమ్మకమైన మానిటైజేషన్ వ్యవస్థ ద్వారా వినియోగంలోకి తీసుకొస్తే దిగుమతులపై ఆధారపడటం తగ్గి విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గుతుంది” అని నిపుణులు తెలిపారు. -
దేశ ఆర్థిక మూలాలను పటిష్టం చేసుకోవాలి
న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడులపై ఆధారపడటాన్ని తగ్గించుకుని, దీర్ఘకాలంలో రిసు్కలను ఎదుర్కొనేలా దేశీయంగా ఆర్థిక సామర్థ్యాలను పెంపొందించుకోవడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ తెలిపారు. నిధులు, అధికారం కోసం మరొకరిపై ఆధారపడకపోవడమే సిసలైన స్వావలంబన అని పరిశ్రమల సమాఖ్య సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. భారత్ అనేక సంవత్సరాలపాటు విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులపైనే (ఎఫ్పీఐ) ఆధారపడిందని, కరోనా మహమ్మారి తర్వాతే దేశీ ఇన్వెస్టర్లు మన క్యాపిటల్ మార్కెట్లలో కీలక పాత్ర పోషించే ధోరణి పెరిగిందని కోటక్ చెప్పారు.ప్రపంచవ్యాప్తంగా దేశాలు తమ సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో భారత్ కూడా దేశీయంగా ఆర్థిక మూలాలను పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కంపెనీలు త్రైమాసిక ఫలితాలు, షేర్ల ధరల్లాంటి స్వల్పకాలిక అంశాలపై కాకుండా దీర్ఘకాలికంగా సంస్థను తీర్చిదిద్దుకునే వ్యూహాలపై మరింతగా దృష్టి పెట్టాలని సూచించారు.కంపెనీలు తమకొచ్చే లాభాలను తిరిగి వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయాలన్నారు. ప్రభుత్వాలు కూడా ప్రస్తుతమిస్తున్న ట్యాక్స్ ఇన్సెంటివ్స్కే పరిమితం కాకుండా అదనంగా మరిన్ని ప్రోత్సాహకాలిస్తే కొత్తగా పెట్టుబడులకు ఊతం లభించగలదని కోటక్ చెప్పారు. దేశీయంగా ఉత్పత్తిని, ఎగుమతులను పెంచడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం ద్వారా భారత్ తన బ్యాలెన్స్ షీట్ను పటిష్టం చేసుకోవచ్చన్నారు. పరిశ్రమలకు మేల్కొలుపు: మంత్రి పీయుష్ గోయల్ ప్రస్తుత పరిస్థితులు దేశీ పరిశ్రమలకు మేల్కొలుపులాంటిదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే దిశగా దిగుమతులను తగ్గించుకునేందుకు, స్వయం సమృద్ధి సాధించేందుకు, ఉత్పాదకతను పెంచుకునేందుకు, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను సద్వినియోగం చేసుకునేందుకు దీన్నొక అవకాశంగా ఉపయోగించుకోవాలని సూచించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యం, పెట్టుబడుల ప్రవాహంపై ప్రభావం పడిందని ఆయన చెప్పారు. అయితే, ఈ సంక్షోభ పరిస్థితుల్లో మిగతా దేశాలకన్నా మెరుగ్గా రాణించేందుకు భారత్ ముందు చక్కని అవకాశాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.విదేశీ మారక నిల్వలను కాపాడుకునేందుకు విదేశీ విహార యాత్రలపరమైన వినియోగాన్నే మాత్రమే తగ్గించుకోమని ప్రధాని చెప్పారే తప్ప వ్యాపార పర్యటనలను నిలిపివేసుకోవాలనలేదని గోయల్ తెలిపారు. ‘వ్యాపారాన్ని విస్తరించేందుకు పరిశ్రమ వర్గాలు ప్రపంచవ్యాప్తంగా పర్యటించాలి. మరింతగా విదేశీ మారకం వచ్చేలా మరిన్ని ఎగుమతి ఆర్డర్లను దక్కించుకోవాలి. కొంత ఖర్చు చేసి మరింతగా ఆదాయాన్ని పెంచుకోవాలి. మనం 2 లక్షల కోట్ల డాలర్ల ఎగుమతి లక్ష్యాన్ని సాధించాలనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి‘ అని పేర్కొన్నారు. -
మరింత పెరిగిన పాల ధరలు.. ఎంతంటే?
అమూల్, మదర్ డెయిరీ సంస్థలు పాల ధరలను పెంచాయి. కొత్త ధరలు మే 14 నుంచి అమల్లోకి రానున్నాయని తాజాగా ఆయా సంస్థలు విడుదల చేసిన సర్క్యులర్ ద్వారా వెల్లడైంది. పెంచిన ధరలు ఫుల్ క్రీమ్ మిల్క్, టోన్డ్ మిల్క్, కౌ మిల్క్, బఫెలో మిల్క్, ప్రీమియం రకాల పాలపై కూడా వర్తిస్తాయి. గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విక్రయించే అమూల్ పాలు లీటర్కు రూ.1-2 వరకు పెరిగాయి. అమూల్ గోల్డ్ ఒక లీటర్ ప్యాక్ ధర రూ.68 నుంచి రూ.70కి చేరింది. అమూల్ లీటర్ పాలు రూ.55 నుంచి రూ.57కు చేరింది.బఫెలో మిల్క్, కౌ మిల్క్, స్లిమ్ అండ్ ట్రిమ్, టీ స్పెషల్ రకాల ధరలను కూడా అమూల్ పెంచింది. అమూల్ బఫెలో మిల్క్ 500 మిల్లీ లీటర్ల ప్యాక్ ధర రూ.38 నుంచి రూ.39కి చేరింది. కౌ మిల్క్ 500 మిల్లీ లీటర్ల ప్యాక్ ధర రూ.29 నుంచి రూ.30కి చేరింది.మదర్ డెయిరీ ధరలు ఇలా.. మదర్ డెయిరీ కూడా పలు స్టాక్ కీపింగ్ యూనిట్ల ధరలు పెంచింది. మే 13న డిస్ట్రిబ్యూటర్లు, రవాణాదారులకు పంపిన సర్క్యులర్లో ఈ విషయం తెలిపింది. కొత్త ధరల ప్రకారం మదర్ డెయిరీ బఫెలో మిల్క్ ఒక లీటర్ ప్యాక్ ధర రూ.75 నుంచి రూ.80కి పెరిగింది. 500 మిల్లీ లీటర్ల బఫెలో మిల్క్ ప్యాక్ ధర కూడా రూ.76 నుంచి రూ.80కి మారిందని సర్క్యులర్లో పేర్కొన్నారు.మదర్ డెయిరీ ఫుల్ క్రీమ్ మిల్క్ ఒక లీటర్ ప్యాక్ ధర రూ.69 నుంచి రూ.72కి చేరింది. 500 మిల్లీ లీటర్ల ప్యాక్ ధర రూ.70 నుంచి రూ.72కి పెరిగింది. డబుల్ టోన్డ్ మిల్క్, టోన్డ్ మిల్క్, కౌ మిల్క్, ప్రో మిల్క్ రకాల ధరలు కూడా సంస్థ సవరించింది.మే 13 రాత్రి నుంచి సరఫరా అయ్యే పాలపై ఈ కొత్త ధరలు వర్తిస్తాయని, మే 14 ఉదయం నుంచి మార్కెట్లో విక్రయాలు ఈ ధరల ప్రకారమే జరుగుతాయని సర్క్యులర్లో వెల్లడించారు. గత కొన్ని సంవత్సరాలుగా పాల సేకరణ ఖర్చులు, నిర్వహణ వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో రెండు సంస్థలు పలుమార్లు పాల ధరలు సవరించాయి. ఈ ధరల పెంపు వినియోగదారులపై మరింత భారం మోపనుంది.పశువుల మేత, రవాణా, ప్యాకేజింగ్, పాల సేకరణ ఖర్చులు పెరగడంతోనే ధరలు పెంచాల్సి వచ్చిందని పాల సంస్థలు గతంలో వెల్లడించాయి. 2022 నుంచి సహకార సంస్థలు, ప్రైవేట్ సంస్థలు రాష్ట్రాల వారీగా విడతల వారీగా ధరలు సవరించాయి. అమూల్, మదర్ డెయిరీ, నందిని వంటి సంస్థలు ప్రాంతాల వారీగా పాల సేకరణ పరిస్థితులు, ముడి ఖర్చుల ఆధారంగా వేర్వేరు సమయాల్లో ధరలు మార్చాయి.భారత్ ప్రపంచంలోనే అత్యధిక పాలు ఉత్పత్తి చేసే దేశం. పట్టణ కుటుంబాల వినియోగంలో ప్యాకెట్ పాలు కీలక భాగంగా ఉన్నాయి. పాల సహకార సంస్థలు, ప్రైవేట్ సంస్థలు తీసుకునే ధరల నిర్ణయాలు పాల సేకరణ ఖర్చులు, సీజనల్ సరఫరా పరిస్థితులు, పంపిణీ వ్యయాలపై ఆధారపడి ఉంటాయి. -
హైదరాబాద్లో 4 రెట్లు పెరిగిన అమెజాన్ బజార్ కస్టమర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అందుబాటు ధరల్లో ఉత్పత్తులన్నీ ఒకే చోట లభించేలా ఈకామర్స్ దిగ్గజం అమెజాన్లో అంతర్భాగంగా ఉన్న అమెజాన్ బజార్కి (Amazon Bazaar) సంబంధించి అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి. వార్షిక ప్రాతిపదికన ఆర్డర్లు నాలుగు రెట్లు పెరిగినట్లు అమెజాన్ బజార్ హెడ్ సమీర్ లాల్వానీ తెలిపారు. హైదరాబాద్లో కొత్త కస్టమర్ల చేరిక నాలుగు రెట్లు పెరగ్గా, విజయవాడ, గుంటూరు, వరంగల్ తదితర నగరాలు కూడా ముందు వరుసలో ఉన్నట్లు వివరించారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 1,200 మంది పైచిలుకు విక్రేతలు ఉన్నట్లు తెలిపారు. బజార్లో రూ. 99 నుంచి రూ. 600 ధర శ్రేణిలో మూడు కోట్లకు పైగా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని, దేశవ్యాప్తంగా 30,000 పైచిలుకు విక్రేతలు ఉన్నారని పేర్కొన్నారు. మహిళల ఫ్యాషన్, గృహోపకరణలు, కన్జూమర్ ఎల్రక్టానిక్స్ మొదలైన కేటగిరీల్లో మరిన్ని ఉత్పత్తులను అందుబాటులోకి తేవడం, ద్వితీయ.. తృతీయ శ్రేణి పట్టణాల్లోకి మరింత విస్తరణపై దృష్టి పెడుతున్నట్లు లాల్వానీ చెప్పారు. డెలివరీ అసోసియేట్స్కి హెల్త్ కవరేజీ మరోవైపు, దేశవ్యాప్తంగా 90,000 మంది డెలివరీ అసోసియేట్స్కి హెల్త్ కవరేజీని విస్తరిస్తున్నట్లు అమెజాన్ ఇండియా డైరెక్టర్ (ఆపరేషన్స్) సలీమ్ మెమన్ తెలిపారు. రూ. 1.5 లక్షల వరకు మెడిక్లెయిమ్, రూ. 10,000 వరకు ఓపీడీ ప్రయోజనాలు, రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా కవరేజీ మొదలైనవి వీటిలో ఉన్నట్లు వివరించారు. డెలివరీ అసోసియేట్స్ కోసం ఉచిత హెల్త్ క్యాంపులు కూడా నిర్వహించినట్లు తెలిపారు. అసోసియేట్స్ సంక్షేమంపై రూ. 2,800 కోట్ల ఇన్వెస్ట్మెంట్లో భాగంగా వీటిని చేపట్టినట్లు మెమన్ చెప్పారు. -
2030 నాటికి భారత ఆర్థిక వ్యవస్థకు ఏఐ జోష్
భారతదేశం మరో పారిశ్రామిక విప్లవానికి వేదిక కాబోతోంది. 2030 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత దేశ ఆర్థిక వ్యవస్థకు ఏకంగా 500 బిలియన్ డాలర్లకు పైగా అదనపు విలువను జోడించనుందని తాజా నివేదిక వెల్లడించింది. ఐబీఎం ఇన్స్టిట్యూట్ ఫర్ బిజినెస్ వాల్యూ, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన ‘ఇండియాఏఐ’ సంయుక్తంగా రూపొందించిన ‘ప్రామిస్ టు పవర్: హౌ ఏఐ ఈజ్ రిడిఫైనింగ్ ఇండియా ఎకనామిక్ ఫ్యూచర్’ అనే నివేదికలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఆశయం గొప్పదే.. కానీ..భారతదేశం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఏఐ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని నివేదిక ఆశాభావం వ్యక్తం చేసింది. సర్వేలో పాల్గొన్న 73% మంది వ్యాపార దిగ్గజాలు 2030 నాటికి భారత్ ప్రపంచ ఏఐ లీడర్గా అవతరిస్తుందని నమ్ముతున్నారు. ఐదుగురు వ్యాపారవేత్తలలో నలుగురు ఏఐ పెట్టుబడులు నేరుగా దేశ జీడీపీ వృద్ధిని ప్రభావితం చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు.అయితే, వాస్తవ పరిస్థితులు కొంత ఆందోళనకరంగా ఉన్నాయి. సర్వే చేసిన సంస్థల్లో 72% సంస్థలు అంతర్జాతీయ పోటీతో పోలిస్తే తాము ఏఐ అమలులో వెనుకబడి ఉన్నామని అంగీకరించాయి. ఆశయానికి, ఆచరణకు మధ్య ఉన్న ఈ అంతరాన్ని తగ్గించడమే ఇప్పుడు దేశం ముందున్న ప్రధాన సవాలు.35 కోట్ల మంది నిపుణులు అవసరంఈ నివేదిక ప్రధానంగా నైపుణ్యాల కొరతను ఎత్తిచూపింది. ‘ప్రస్తుతం కేవలం 30% మంది ఉద్యోగులకు మాత్రమే ఏఐ పరిజ్ఞానం ఉంది. 2030 నాటికి ఈ అవసరాలు తీరాలంటే దేశవ్యాప్తంగా 350 మిలియన్ల (35 కోట్లు) ఏఐ నిపుణులు అవసరమవుతారు’ అని అంచనా వేసింది. కేవలం సాంకేతికత ఉండటం ముఖ్యం కాదు. ఆ సాంకేతికతను నడిపించే నైపుణ్యం గల మానవ వనరులు ఉండటమే అసలైన విజయమని నివేదిక పేర్కొంది.డేటా సార్వభౌమాధికారండేటా భద్రత, నియంత్రణ విషయంలో భారతీయ కంపెనీలు కఠినంగా ఉన్నాయి. 74% మంది ఎగ్జిక్యూటివ్లు డేటాపై పూర్తి నియంత్రణ ఉండాలని కోరుకుంటున్నారు. ఖర్చును తగ్గించుకుంటూనే పనితీరును మెరుగుపరచుకోవడానికి 10 మందిలో ఏడుగురు హైబ్రిడ్ క్లౌడ్ నమూనా వైపు మొగ్గు చూపుతున్నారు. స్వదేశీ క్లౌడ్ మౌలిక సదుపాయాలు లేకపోవడం (77%), డేటా నాణ్యత సరిగ్గా లేకపోవడం (57%) ఏఐ విస్తరణకు ప్రధాన అడ్డంకులుగా మారాయి.భారతదేశం కేవలం ఏఐ వినియోగదారుగా మాత్రమే కాకుండా సృష్టికర్తగా ఎదగాలంటే ‘ఇండియాఏఐ ఫ్యూచర్ స్కిల్స్’ వంటి కార్యక్రమాలు క్షేత్రస్థాయికి వెళ్లాలి. ముఖ్యంగా టైర్ 2, టైర్ 3 నగరాల్లో ఏఐ ల్యాబ్ల ఏర్పాటు ద్వారా మారుమూల ప్రాంతాల్లోని ప్రతిభను ఒడిసిపట్టాలి. అప్పుడే 500 బిలియన్ డాలర్ల కల సాకారమవుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు సమన్వయంతో పనిచేసి విప్లవాత్మక మార్పులు తెస్తేనే ఈ ఏఐ స్వప్నం సాకారం అవుతుందంటున్నారు.ఇదీ చదవండి: బంగారం షాక్.. దిమ్మతిరిగేలా రేట్లు పెంపు -
మంటెత్తనున్న ఇంధన ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సుదీర్ఘకాలం పాటు అధిక స్థాయిలోనే కొనసాగితే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తప్పకపోవచ్చని భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. బుధవారం స్విట్జర్లాండ్లో స్విస్ నేషనల్ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పెరుగుతున్న చమురు భారంతో భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కోబోయే సవాళ్లను ఆయన ఈ సందర్భంగా విశ్లేషించారు.వినియోగదారులపై ధరల భారం తప్పదా?ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 107 డాలర్ల గరిష్ట స్థాయి వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) ఇప్పటివరకు ఆ భారాన్ని వినియోగదారులపై పడకుండా రక్షిస్తూ వస్తున్నాయని గవర్నర్ పేర్కొన్నారు.అయితే, ఈ ఉపశమనం శాశ్వతం కాకపోవచ్చని ఆయన పరోక్షంగా సూచించారు. ‘ముడి చమురు ధరలు సుదీర్ఘకాలం పాటు ఇలాగే కొనసాగితే ప్రభుత్వం ధరల పెంపును ఆమోదించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. చమురు కంపెనీలు తమ మార్జిన్లను కాపాడుకోవడానికి రిటైల్ ధరలను పెంచే అవకాశం ఉంది’ అని మల్హోత్రా వ్యాఖ్యానించారు.సరఫరా గొలుసులో అంతరాయాలుప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధ వాతావరణం, సంఘర్షణల వల్ల సరఫరా గొలుసులో తలెత్తిన అంతరాయాలు ఇప్పటికే భారతదేశాన్ని ప్రభావితం చేయడం ప్రారంభించాయని గవర్నర్ అంగీకరించారు. ఇలాంటి భారీ సరఫరా షాక్ ఎదురైనప్పుడు కేవలం ద్రవ్యోల్బణ లక్ష్యాల ఫ్రేమ్వర్క్ మాత్రమే సరిపోదని, ప్రభుత్వ ఆర్థిక విధానాలతో సమన్వయం చేసుకోవడం కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలుగతంలోనే ఇంధనాలపై ఎక్సైజ్ సుంకాలు తగ్గించినందున ప్రస్తుత ధరల పెరుగుదలను చమురు కంపెనీలే భరిస్తున్నాయి.ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు 6.9 శాతంగా, ద్రవ్యోల్బణం 4.6 శాతంగా ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేస్తోంది.ఆర్బీఐ ప్రస్తుతం ప్రతి నెలా వచ్చే గణంకాలను నిశితంగా పరిశీలిస్తోంది. తాత్కాలిక ఒడిదుడుకులను భరించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు స్థిరపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.జూన్ 5న వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం?ఏప్రిల్లో జరిగిన ద్రవ్య విధాన సమీక్షలో ఆర్బీఐ కీలకమైన రెపో రేటును 5.25 శాతం వద్ద యథాతథంగా ఉంచిన సంగతి తెలిసిందే. అయితే, పెరుగుతున్న ఇంధన ధరలు ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచే ప్రమాదం ఉందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 5న జరగనున్న తదుపరి ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంతర్జాతీయ పరిస్థితులు ఇలాగే ఉంటే సామాన్యుడిపై అటు ఇంధన ధరలు, ఇటు బ్యాంక్ ఈఎంఐల భారం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.ఇదీ చదవండి: బంగారం షాక్.. దిమ్మతిరిగేలా రేట్లు పెంపు -
జుకర్బర్గ్ రికార్డు బద్దలు..
సాధారణంగా 22 ఏళ్ల వయసు అంటే కెరీర్ను ఇప్పుడిప్పుడే మలుచుకునే దశ. కానీ, భారత సంతతికి చెందిన సూర్య మిధా ఆలోచనలు మాత్రం ప్రపంచ కుబేరుల జాబితాను సవాల్ చేస్తున్నాయి. కృత్రిమ మేధ (ఏఐ) విప్లవాన్ని అందిపుచ్చుకున్న ఈ యువ పారిశ్రామికవేత్త కేవలం 22 ఏళ్లకే సుమారు 2.2 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.18,000 కోట్లు) నికర విలువతో ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన ‘సెల్ఫ్ మేడ్ బిలియనీర్’గా అవతరించారు. ఈ క్రమంలో ఫేస్బుక్ (మెటా) అధినేత మార్క్ జుకర్బర్గ్ నెలకొల్పిన రికార్డును సైతం ఆయన అధిగమించడం విశేషం.జుకర్బర్గ్ కంటే వేగంగా..గతంలో మార్క్ జుకర్బర్గ్ తన 23వ ఏట బిలియనీర్ క్లబ్లో చేరగా సూర్య మిధా అంతకంటే ఒక ఏడాది ముందుగానే (22 ఏళ్లకే) ఈ మైలురాయిని చేరుకున్నారు. ఫోర్బ్స్ 2026 బిలియనీర్ల జాబితా ప్రకారం, ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత పిన్న వయస్కులైన సెల్ఫ్ మేడ్ బిలియనీర్లలో ఒకరిగా ఆయన చరిత్ర సృష్టించారు. వారసత్వంగా వచ్చిన ఆస్తులతో కాకుండా కేవలం తన వినూత్న ఏఐ స్టార్టప్ ద్వారా ఈ స్థాయికి చేరుకోవడం గమనార్హం.విజయానికి బాటలుసూర్య మిధా తన స్నేహితులు బ్రెండన్ ఫుడీ, ఆదర్శ్ హిరేమత్లతో కలిసి స్థాపించిన ‘మెర్కోర్’ సంస్థ ఈ అద్భుత విజయానికి కీలకంగా నిలిచింది. ఇది సాధారణ నియామక సంస్థ కాదు. పూర్తిగా కృత్రిమ మేధస్సు ఆధారంగా పనిచేసే ప్లాట్ఫారమ్. ప్రపంచవ్యాప్తంగా ఏఐ నమూనాలకు శిక్షణ ఇవ్వగల, పరిశోధన చేయగల నిపుణులను గుర్తించి పెద్ద కంపెనీలకు అనుసంధానిస్తుంది. అభ్యర్థుల నైపుణ్యాలను అంచనా వేయడం నుంచి ఇంటర్వ్యూల నిర్వహణ వరకు ప్రతి దశలోనూ ఏఐని ఉపయోగిస్తుంది. ఈ ఆటోమేషన్ ప్రక్రియ వల్ల తక్కువ సమయంలో ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ కంపెనీ వేగంగా వృద్ధి చెందింది.మెరుపు వేగంతో వాల్యుయేషన్పెట్టుబడిదారుల నమ్మకమే మెర్కోర్ విజయ రహస్యం. బెంచ్మార్క్, ఫెలిసిస్, జనరల్ క్యాటలిస్ట్ వంటి దిగ్గజ సంస్థల మద్దతుతో ఈ స్టార్టప్ విలువ ప్రస్తుతం 10 బిలియన్ డాలర్లకు చేరింది. మార్చి 2025లో 100 మిలియన్ డాలర్లుగా ఉన్న కంపెనీ వార్షిక ఆదాయం, సెప్టెంబర్ నాటికే 500 మిలియన్ డాలర్లకు పెరగడం ఏఐ రంగంలోనే ఒక రికార్డు.సిలికాన్ వ్యాలీలో కొత్త ఒరవడిసూర్య మిధా ప్రస్థానం విలక్షణమైనది. చర్చా వేదికల్లో పరిచయమైన ముగ్గురు మిత్రులు తమ స్టార్టప్ కల కోసం కళాశాల చదువును మధ్యలోనే ఆపేసి సిలికాన్ వ్యాలీలో అడుగుపెట్టారు. నేడు ఏఐ రంగం కేవలం చాట్బాట్లకే పరిమితం కాకుండా.. రిక్రూట్మెంట్, హెల్త్కేర్, ఫైనాన్స్ వంటి రంగాల్లో ఎలా విప్లవం తీసుకురాగలదో మెర్కోర్ నిరూపించింది. భవిష్యత్తు అంతా ఏఐదే అని ఐటీ నిపుణులు చెబుతున్న మాటలను సూర్య మిధా నిజం చేసి చూపించారు. భారత సంతతికి చెందిన ఈ యువకుడి విజయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది యువ పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.ఇదీ చదవండి: బంగారం షాక్.. దిమ్మతిరిగేలా రేట్లు పెంపు -
విజయ్ మాల్యాకు ఉద్యోగిని ట్వీట్..
భారతీయ స్టార్టప్ రంగం అంటేనే సాహసోపేతమైన ఆలోచనలు, సరికొత్త ప్రయోగాలు. తాజాగా ఒక స్టార్టప్ ఉద్యోగి చేసిన పని, దానికి తన బాస్ స్పందించిన తీరు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పరారీలో ఉన్న వ్యాపారి విజయ్ మాల్యాకు చెందిన ప్రసిద్ధ కింగ్ ఫిషర్ విల్లాను తమ కంపెనీ ఈవెంట్ కోసం అద్దెకు ఇవ్వాలని కోరుతూ ఒక ఉద్యోగి ఏకంగా మాల్యాకే ట్వీట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.అసలేం జరిగింది?భారతదేశంలో ‘క్రియేటర్ ఎకానమీ’ని విప్లవాత్మకంగా మార్చే లక్ష్యంతో ‘లూప్’ అనే కొత్త ప్రోడక్ట్ను మే 21న లాంచ్ చేసేందుకు ఒక టీమ్ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఆ టీమ్ సభ్యురాలు అనుష్క సింగ్ అనే యువతి, తమ లాంచ్ నైట్ కోసం గోవాలోని ఐకానిక్ కింగ్ ఫిషర్ విల్లా అయితే బాగుంటుందని భావించింది. ఏమాత్రం తటపటాయించకుండా నేరుగా విజయ్ మాల్యాను ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ చేసింది.‘హాయ్ విజయ్ మాల్యా, నా పేరు అనుష్క సింగ్. మే 21న మేము ‘లూప్’ను లాంచ్ చేస్తున్నాము. ఇందుకోసం 1000 మందికి పైగా సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లతో ఒక భారీ ఈవెంట్ నిర్వహించాలనుకుంటున్నాం. ఒక రాత్రి కోసం మీ కింగ్ ఫిషర్ విల్లాను మాకు అద్దెకు ఇవ్వగలరా? మీరు ఎంత అడిగినా చెల్లించడానికి సిద్ధం. ఒకవేళ అది ఇప్పుడు మీ ఆధ్వర్యంలో లేకపోతే ప్రస్తుతం అది ఎవరి ఆధీనంలో ఉందో వారికైనా నన్ను రిఫర్ చేయండి’ అని ఆమె తన పోస్ట్లో పేర్కొంది.అనుమతి లేకుండానే..తన అనుమతి లేకుండా ఉద్యోగి చేసిన ఈ పోస్ట్ను చూసి సదరు కంపెనీ వ్యవస్థాపకుడు, ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి దినేష్ సింగ్ ఆశ్చర్యపోయారు. అయితే, ఆమెను మందలించడానికి బదులు ఆమెలోని ధైర్యాన్ని అభినందిస్తూ ఇంటర్నెట్ వేదికగా ఒక బహిరంగ సవాల్ విసిరారు. ‘నిజాయితీగా చెప్పాలంటే, నేను పని చేయాలనుకుంటున్న టీమ్ ఇలాగే ఉండాలి’ అని పేర్కొంటూ ఆయన రెండు ఆఫర్లను ప్రకటించారు.1. అనుష్క చేసిన పోస్ట్కు లింక్డ్ఇన్, ఎక్స్ (ట్విట్టర్)లో 1,000 రీపోస్టులు వస్తే ఎలాగైనా ఆ విల్లాను బుక్ చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పారు.2. ఒకవేళ రీపోస్టుల సంఖ్య 5,000 దాటితే మొత్తం గ్రోత్ టీమ్ను వారి ఇష్టం వచ్చిన దేశానికి అంతర్జాతీయ పర్యటనకు తీసుకెళ్తానని పేర్కొన్నారు.విజయ్ మాల్యాను ఉద్దేశించి రాస్తూ, ‘మీరు ఇది చదువుతుంటే ఇకపై నిర్ణయం మీదే. ఆమె వయసు కేవలం 22 ఏళ్లు. మా లాంచ్ ఈవెంట్ను ఆమే నడిపిస్తోంది. ఈ ఈవెంట్ కోసం మీ విల్లానే కావాలని ఆమె నిర్ణయించుకుంది’ అని దినేష్ సింగ్ పేర్కొన్నారు.నెటిజన్ల స్పందనఈ ఉదంతంపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఒక నెటిజన్ స్పందిస్తూ ‘ఇది జెన్-జెడ్ నేతృత్వంలోని స్టార్టప్ మార్కెటింగ్ సరికొత్త దశలోకి ప్రవేశించిందని నిరూపిస్తోంది’ అని వ్యాఖ్యానించారు. మరొకరు, ‘ఆ విల్లా ప్రస్తుతం మాల్యా ఆధీనంలో లేకపోయినా ఈ ప్రయత్నం ద్వారా ఆ టీమ్కు లభిస్తున్న పబ్లిసిటీ అమోఘం’ అని రాసుకొచ్చారు.ఇదీ చదవండి: బంగారం షాక్.. దిమ్మతిరిగేలా రేట్లు పెంపు -
నేటి మార్కెట్ ఒడిదొడుకులకు కారణాలు..
భారతీయ స్టాక్ మార్కెట్లు నేడు (మే 13, 2026) తీవ్ర ఒడిదొడుకుల మధ్య స్వల్ప లాభాలతో ముగిశాయి. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న భారీ అమ్మకాల పర్వానికి స్వల్ప విరామం లభించినట్లు కనిపిస్తోంది. ప్రధాన సూచీలు రోజంతా అనిశ్చితికి లోనైనప్పటికీ ముగింపు సమయానికి సానుకూల ధోరణిని ప్రదర్శించాయి.నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి నిఫ్టీ 33 పాయింట్ల స్వల్ప లాభంతో 23,412 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 49 పాయింట్లు పుంజుకుని 74,608 స్థాయిని చేరింది.మార్కెట్ గమనానికి కారణాలుగత సెషన్లలో మార్కెట్ భారీగా పతనం కావడంతో (ముఖ్యంగా మే 12న సెన్సెక్స్ 1,456 పాయింట్లు పడిపోయింది), కొన్ని కీలక షేర్లు ఆకర్షణీయమైన ధరలకు అందుబాటులోకి వచ్చాయి. దీంతో మెటల్, ఎనర్జీ, ఆయిల్, గ్యాస్ రంగాల్లో ఇన్వెస్టర్లు వాల్యూ బయింగ్కు మొగ్గు చూపడం మార్కెట్కు ఊతమిచ్చింది.అమెరికాలో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఏప్రిల్లో 3.8%కి పెరగడం ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపింది. పశ్చిమాసియాలో (ముఖ్యంగా అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు) నెలకొన్న పరిస్థితుల కారణంగా ఇంధన ధరలు పెరగడం, తద్వారా ద్రవ్యోల్బణం వేగవంతం కావడం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తోంది.అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 106 డాలర్ల పైనే కొనసాగుతోంది. భారత్ తన చమురు అవసరాల కోసం దిగుమతులపైనే ఆధారపడుతున్న నేపథ్యంలో ఈ ధరల పెరుగుదల భారత ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే భయాలు నెలకొన్నాయి. ‘మూడీస్’ సంస్థ ఇప్పటికే 2026కి భారత వృద్ధి అంచనాను 6%కి తగ్గించడం గమనార్హం.ఓపెన్ ఏఐ వంటి సంస్థలు ఎంటర్ప్రైజ్ ఏఐ రంగంలోకి ప్రవేశిస్తుండటంతో భారత ఐటీ కంపెనీల సాంప్రదాయ వ్యాపార నమూనా దెబ్బతింటుందనే భయంతో ఐటీ షేర్లలో కొంత ఒత్తిడి కనిపిస్తోంది. అయితే నేడు ఇతర రంగాలు రాణించడంతో నిఫ్టీ పతనాన్ని అడ్డుకోగలిగింది.నిపుణుల విశ్లేషణప్రస్తుత మార్కెట్ పరిస్థితిని చూస్తుంటే ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నట్లు స్పష్టమవుతోంది. నిఫ్టీకి 23,200 నుంచి 23,400 మధ్య బలమైన మద్దతు (సపోర్ట్) కనిపిస్తోంది. ఒకవేళ అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సద్దుమణిగితే తప్ప మార్కెట్ మళ్లీ పూర్తి స్థాయి సానుకూల వృద్ధిలోకి రావడం కష్టమే. ఇన్వెస్టర్లు ప్రస్తుతానికి క్వాలిటీ స్టాక్స్కు మాత్రమే పరిమితం కావడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: బంగారం షాక్.. దిమ్మతిరిగేలా రేట్లు పెంపు -
మీ ఇంట్లో ఉన్న బంగారానికి వడ్డీ.. మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్?
న్యూఢిల్లీ: పసిడి ప్రియులకు కేంద్రం శుభవార్త. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా త్వరలో కేంద్రం కొత్త ‘గోల్డ్ మానిటైజేషన్’ పాలసీని అందుబాటులోకి తేనుంది. తద్వారా ఇంట్లో ఉన్న బంగారంతో వడ్డీ వచ్చేలా ప్రతిపాదించనుంది. వినియోగదారులు వారి వద్ద ఉన్న కనీసం 10 గ్రాముల బంగారం ఉంటే బ్యాంకులో డిపాజిట్ చేయొచ్చు. డిపాజిట్ చేసిన బంగారంపై వార్షిక వడ్డీ రేటు సుమారు 2శాతం నుంచి 2.5శాతం వరకు పొందవచ్చు. భారతీయుల వద్ద సుమారు 30,000 టన్నుల బంగారం నిల్వగా ఉందని అంచనా. దీన్ని వెలికితీసేందుకు ప్రధాని మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్ వేసింది. రూపాయి విలువను బలోపేతం చేయడానికి బంగారం దిగుమతులను తగ్గించే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.మోదీ ప్రభుత్వం తీసుకురానున్న ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో డిపాజిట్ చేసిన బంగారంపై వడ్డీతో పాటు పన్ను మినహాయింపులు పొందే అవకాశం ఉంటుంది. సుమారు 2,000 టన్నుల బంగారం డిపాజిట్ అయితే, మూడేళ్ల వరకు దిగుమతుల అవసరం ఉండదని అంచనా. గోల్డ్ పాలసీలో కీలక మార్పులకు ఆర్థిక శాఖ సిద్ధమవుతోంది. ఈ కొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీపై కేంద్ర ఆర్థిక శాఖ త్వరలో స్పష్టత ఇవ్వనుంది. -
జనరల్ మోటార్స్ సాఫ్ట్వేర్ ప్రక్షాళన
ప్రముఖ అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్ తన ఐటీ విభాగంలో భారీ మార్పులు చేపట్టింది. భవిష్యత్తు అంతా కృత్రిమ మేధ(ఏఐ) చుట్టూనే తిరగనుందని భావిస్తున్న కంపెనీ అందుకు అనుగుణంగా తన శ్రామిక శక్తిని పునర్నిర్మించే పనిలో పడింది. ఈ క్రమంలో తన ఐటీ విభాగం నుంచి సుమారు 600 మందికి పైగా ఉద్యోగులకు లేఆఫ్స్ విధించింది.నైపుణ్యాల మార్పిడి వ్యూహంఈ తొలగింపులు కేవలం ఖర్చు తగ్గించుకోవడానికో లేదా ఉద్యోగుల సంఖ్యను తగ్గించడానికో చేసినవి కావని, ఇది ఒక స్పష్టమైన నైపుణ్యాల మార్పిడి వ్యూహమని విశ్లేషకులు భావిస్తున్నారు. కంపెనీ ఐటీ విభాగంలోని మొత్తం సిబ్బందిలో ఇది 10 శాతం కంటే ఎక్కువ. సాంప్రదాయ ఐటీ పాత్రల కంటే, ఏఐ-కేంద్రీకృత సాంకేతికతలలో ప్రవేశం ఉన్న నిపుణుల కోసం కంపెనీ వెతుకుతోంది. ‘భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో జీఎం భారీ మార్పులు చేస్తోంది’ అని సంస్థ ప్రతినిధి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.ఏఐ వైపు వేగంగా..ఒకవైపు ఉద్యోగులను తొలగిస్తున్నప్పటికీ జీఎం కొత్త నియామకాలను ఆపలేదు. అయితే, ఇప్పుడు కంపెనీ ప్రాధాన్యతలు పూర్తిగా మారిపోయాయి. కంపెనీ ప్రస్తుతం కీలక రంగాల్లో నిపుణుల కోసం వేట సాగిస్తోంది. అందులో.. ఏఐ-నేటివ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజినీర్లు, డేటా ఇంజినీరింగ్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిపుణులు, మెషిన్ లెర్నింగ్ మోడల్స్ తయారీ నిపుణులపై ఫోకస్ పెట్టింది.కొత్త దిశగా అడుగులుగత 18 నెలలుగా జీఎం తన టెక్నాలజీ విభాగంలో ప్రక్షాళన చేస్తూనే ఉంది. 2024 ఆగస్టులో కూడా సుమారు 1,000 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులను తొలగించింది. 2025లో స్టెర్లింగ్ ఆండర్సన్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్గా చేరిన తర్వాత ఈ పరివర్తన మరింత వేగవంతమైంది. సాఫ్ట్వేర్, టెక్నాలజీ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెచ్చే ప్రక్రియను ఆయన ముమ్మరం చేశారు. ఇటీవలే యాపిల్ మాజీ ఉద్యోగి బెహ్రాద్ తోఘిని ఏఐ లీడ్గా, మాజీ క్రూయిజ్ ఎగ్జిక్యూటివ్ రషీద్ హక్ను అటానమస్ వెహికల్స్ వైస్ ప్రెసిడెంట్గా నియమించుకోవడం ద్వారా తన ఉద్దేశాన్ని కంపెనీ చాటిచెప్పింది.ఇదీ చదవండి: బంగారం షాక్.. దిమ్మతిరిగేలా రేట్లు పెంపు -
సిలికాన్ వ్యాలీలో ‘దేశీ’ నెట్వర్క్
సిలికాన్ వ్యాలీలో భారతీయ నిపుణుల ఆధిపత్యంపై మరోసారి చర్చ మొదలైంది. గూగుల్లో పనిచేసిన ఒక మాజీ కాంట్రాక్టర్ చేసిన ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారతీయులు ఒక రహస్య నెట్వర్క్ను నడుపుతున్నారని, అనైతిక మార్గాల్లో తమ వారికి ఉద్యోగాలు కల్పిస్తున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు అటు అమెరికన్లలో, ఇటు భారతీయ టెక్కీలలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.ఏమిటా ఆరోపణలు?జీబీ న్యూస్ రూపొందించిన ‘హెచ్-1బీ డాక్యుమెంటరీ’ కోసం స్టీఫెన్ వివియన్ అనే మాజీ గూగుల్ కాంట్రాక్టర్ మాట్లాడారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గూగుల్లో పనిచేసే భారతీయ ఉద్యోగులు తమ స్నేహితులకు లేదా పరిచయస్తులకు ఇంటర్వ్యూలో అడిగే రహస్య ప్రశ్నలను ముందుగానే లీక్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. భారతీయులు కేవలం ఇండియన్స్నే నియమించుకోవడానికి ఇష్టపడుతున్నారని, దీనివల్ల అర్హత ఉన్న ఇతరులకు అన్యాయం జరుగుతోందని వివియన్ పేర్కొన్నారు. ‘నేను ఒక భారతీయ వ్యక్తితో స్నేహం చేశాను. ఆ క్రమంలోనే నాకు ఈ రహస్యాలు తెలిశాయి. ఇంటర్వ్యూలు పూర్తిగా గోప్యంగా ఉండాలి. కానీ వారు ఆ ప్రశ్నలను పంచుకుంటున్నారు. నిజాయితీ లేని అంశం ఉంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.నెట్టింట ముదిరిన యుద్ధంవివియన్ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. మెజారిటీ నిపుణులు ఆయన మాటలను కొట్టిపారేస్తూ, భారతీయ టెక్కీల ప్రతిభను తక్కువ చేయడమేనని మండిపడుతున్నారు. ‘భారతీయులు ప్రపంచస్థాయి కంపెనీలకు నాయకత్వం వహిస్తున్నారంటే అది వారి సామర్థ్యం. ఒక కఠినమైన జాబ్ మార్కెట్లో పోటీ పడలేక మొత్తం జాతీయతపై నిందలు వేయడం మీ పక్షపాతాన్ని చూపిస్తుంది’ అని ఒక నెటిజన్ స్పందించారు.ప్రముఖ రాజకీయ శాస్త్రవేత్త రిచర్డ్ హనానియా స్పందిస్తూ, ‘ఈ వ్యక్తి ఒక డెలివరీ మేనేజర్ మాత్రమే, గూగుల్లో కీలక నిర్ణయాధికారి కాదు. ఒక కాంట్రాక్టర్ మాటలను పట్టుకుని భారతీయ నిపుణులందరినీ స్కామర్లుగా ముద్ర వేస్తారా?’ అని ప్రశ్నించారు. అయితే, వివియన్కు మద్దతు ఇచ్చే వారు కూడా లేకపోలేదు. ఐటీ రంగంలో భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల వారు తమ వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని కొందరు వాదిస్తున్నారు.ఇదీ చదవండి: బంగారం షాక్.. దిమ్మతిరిగేలా రేట్లు పెంపు -
వర్క్ ఫ్రమ్ హోమ్పై జోహో ప్రకటన
కొవిడ్ పరిణామాల తర్వాత ఐటీ ఉద్యోగులు తిరిగి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ బాట పట్టిన తరుణంలో జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు చేసిన తాజా వ్యాఖ్యలు కార్పొరేట్ ప్రపంచంలో చర్చకు తెరలేపాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపును గౌరవిస్తూ తమ సంస్థలో తిరిగి వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేయడాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.ప్రధాని పిలుపుదేశం ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని, పౌరులు, సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రధాని మోదీ ఇటీవల విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన శ్రీధర్ వెంబు, నేషన్ ఫస్ట్ అనే గ్రాఫిక్ను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అందులో మోదీ తెలిపిన వివరాల ప్రకారం.. అనవసర ప్రయాణాలను తగ్గించడం ద్వారా పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలి. సాధ్యమైనంత వరకు ఇంటి నుంచే పని చేయడాన్ని ప్రోత్సహించాలి. విదేశీ ప్రయాణాలు, వంట నూనె వినియోగం, బంగారం కొనుగోళ్లపై నియంత్రణ అనే అంశాలున్నాయి.‘ఒక సంస్థగా మేము ఇటీవలి కాలంలో పూర్తిస్థాయిలో కార్యాలయం నుంచి పనిచేసే విధానానికి మారాం. అయితే, ప్రధాని విజ్ఞప్తి నేపథ్యంలో మేము మా నిర్ణయాన్ని పునసమీక్షించుకోబోతున్నాం’ అని వెంబు స్పష్టం చేశారు.ఆచరణలో జోహోశ్రీధర్ వెంబు తన పోస్ట్లో జోహో ఇప్పటికే అంతర్గతంగా తీసుకుంటున్న మార్పులను కూడా వివరించారు. ‘సంస్థకు చెందిన పొలాల్లో సహజ సిద్ధమైన సాగు పద్ధతులను అవలంబిస్తున్నాం. డీజిల్ వినియోగాన్ని కనిష్ఠ స్థాయికి తగ్గించే మార్గాలను అన్వేషిస్తున్నాం’ అని చెప్పారు. ఈ పోస్ట్ కొద్ది గంటల్లోనే వైరల్ అయింది.శ్రీధర్ వెంబు ప్రతిపాదన కేవలం ఒక కంపెనీ నిర్ణయంగా చూడలేమని, అది దేశ ఆర్థిక వ్యవస్థపై ఇంధన భారాన్ని తగ్గించే ఒక వ్యూహాత్మక అడుగు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ మరిన్ని ఐటీ దిగ్గజాలు ఇదే బాటలో నడిస్తే భారత విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గడంతో పాటు పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. అయితే, దీనివల్ల ప్రభావితమయ్యే అసంఘటిత రంగ కార్మికులకు సరైన పరిష్కారం అందించాలి.ఇదీ చదవండి: బంగారం షాక్.. దిమ్మతిరిగేలా రేట్లు పెంపు -
బంగారం షాక్.. దిమ్మతిరిగేలా రేట్లు పెంపు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. దాంతోపాటు తాజాగా కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతి సుంకాలను 6 శాతం నుంచి 15 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దాంతో బంగారం ఒకేరోజు భారీగా పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
ఐటీ దిగ్గజం దిక్సూచీ
భారతీయ సమాచార సాంకేతిక (ఐటీ) రంగ ముఖచిత్రాన్ని మార్చివేసిన దార్శనికుడు, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్.నారాయణమూర్తి. భారతీయ ఐటీ పరిశ్రమ పితామహుడుగా కీర్తించబడే ఆయన కేవలం ఒక పారిశ్రామికవేత్త మాత్రమే కాదు, లక్షలాది మంది యువతకు నైతిక విలువల పాఠాలు నేర్పిన గురువు. ‘సాధారణ జీవనం - ఉన్నత ఆలోచన’ అనే సిద్ధాంతాన్ని తూచతప్పకుండా పాటించే మూర్తి పద్మవిభూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలతో దేశ గౌరవాన్ని ఇనుమడింపజేశారు. విజయం, నాయకత్వ లక్షణాలపై ఇటీవల ఆయన పంచుకున్న కొన్ని అంశాలను కింద తెలియజేశాం.మూర్తి టాప్ కోట్స్ఒక గొప్ప నాయకుడికి తన సమక్షంలో ఉన్న ప్రజలను మరింత సమర్థులుగా మార్చగలిగే సామర్థ్యం ఉండాలి.అనుభవం నుంచి నేర్చుకోవడం సంక్లిష్టంగా ఉంటుంది. వైఫల్యం కంటే విజయం నుంచి నేర్చుకోవడం చాలా కష్టం. మనం విఫలమైతే కారణాల గురించి తప్పకుండా ఆలోచిస్తాం, కానీ విజయం మన గత చర్యలన్నింటినీ విచక్షణారహితంగా సరైనవని నమ్మేలా చేస్తుంది.ఎక్కువ వాగ్దానం చేసి తక్కువ ఇవ్వడం కంటే, తక్కువ వాగ్దానం చేసి అంతకు మించి డెలివరీ చేయడం ఉత్తమం. ఇందుకోసం చట్టాలను ఉల్లంఘించాల్సిన అవసరం లేదు.పురోగతి అనేది తరచుగా మనసు, మనస్తత్వం మధ్య ఉండే వ్యత్యాసానికి సమానం.ఓడ షిప్యార్డ్లో ఉన్నప్పుడు చాలా సురక్షితంగా ఉంటుంది. కానీ వాటిని నిర్మించేది అక్కడే ఉండటానికి కాదు. సవాళ్లను ఎదుర్కొన్నప్పుడే ప్రయాణం సాగుతుంది.మీ హోదా వల్ల మీరు స్టార్ అవ్వరు; మీరు కంపెనీకి ఎంత విలువను జోడిస్తున్నారనే దానిపైనే మీ స్టార్ హోదా ఆధారపడి ఉంటుంది.మీరు ఎక్కడ మొదలుపెట్టారు అనేది ముఖ్యం కాదు. మీరు ఎలా, ఏమి నేర్చుకుంటున్నారు అనేదే ముఖ్యం. నేర్చుకునే నాణ్యత బాగుంటే మీ అభివృద్ధి గ్రాఫ్ వేగంగా పెరుగుతుంది.విలువల పునాదిపై నిర్మించిన సామ్రాజ్యం ఎప్పటికీ కూలిపోదు.ఇదీ చదవండి: సామాన్యుడిపై భారమా? దేశాభివృద్ధికి మార్గమా? -
సామాన్యుడికి భారమా? దేశాభివృద్ధికి మార్గమా?
భారతీయులకి బంగారం అంటే కేవలం ఒక లోహం మాత్రమే కాదు, అది ఒక సెంటిమెంట్. ఆపత్కాలంలో ఆదుకునే ఆర్థిక భరోసా. అయితే, మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులు, దేశ ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం పసిడి దిగుమతి సుంకాన్ని భారీగా పెంచుతూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు మార్కెట్లో పెను సంచలనం సృష్టిస్తోంది.బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచుతూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది (మే 13, 2026 నుంచి అమలు). ఇందులో 10 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, మరో 5 శాతం అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ (ఏఐడీసీ) ఉన్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు (ఇరాన్-అమెరికా యుద్ధ వాతావరణం), పెరుగుతున్న ముడిచమురు ధరల నేపథ్యంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం.మోదీ పిలుపు: ‘బంగారం కొనుగోళ్లు ఆపండి’ఇటీవల సికింద్రాబాద్లో జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఒక కీలక విన్నపం చేశారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా కనీసం ఒక ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను వాయిదా వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ‘బంగారం దిగుమతి కోసం మనం భారీగా విదేశీ కరెన్సీని వెచ్చించాల్సి వస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతున్న తరుణంలో మన విదేశీ మారక ద్రవ్య నిల్వలను దేశ ప్రయోజనాల కోసం, ఇంధన భద్రత కోసం మళ్లించాల్సిన అవసరం ఉంది’ అని ప్రధాని స్పష్టం చేశారు. ప్రధాని పిలుపునిచ్చిన రెండు రోజులకే ప్రభుత్వం సుంకాన్ని పెంచడం గమనార్హం. ఇది కేవలం విజ్ఞప్తి మాత్రమే కాదని, కఠిన నిర్ణయాల ద్వారా దిగుమతులను నియంత్రించే వ్యూహమని విశ్లేషకులు భావిస్తున్నారు.మార్కెట్పై ప్రభావంబంగారంపై సుంకం పెరగడం వల్ల తక్షణమే దేశీయ మార్కెట్లో ధరలు పెరిగే అవకాశం ఉంది.ధరల పెరుగుదల: 9 శాతం అదనపు సుంకం భారం నేరుగా వినియోగదారుడిపై పడుతుంది. దీనివల్ల పెళ్లిళ్ల సీజన్లో ఉన్న మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భారం తప్పదు.డిమాండ్ తగ్గుదల: పెరిగిన ధరలు, ప్రధాని పిలుపు వెరసి స్వల్పకాలంలో బంగారం కొనుగోళ్లు తగ్గే అవకాశం ఉంది. ఇది దేశ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ (సీఏడీ)ను తగ్గించడానికి దోహదపడుతుంది.స్మగ్లింగ్ ముప్పు: సుంకాలు భారీగా పెరిగినప్పుడు అనధికార మార్గాల్లో (స్మగ్లింగ్) బంగారం దేశంలోకి వచ్చే ప్రమాదం ఉందని జ్యువెలరీ అసోసియేషన్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.స్టాక్ మార్కెట్: ఈ నిర్ణయం వెలువడిన వెంటనే ప్రముఖ జ్యువెలరీ కంపెనీల షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.దేశ ఆర్థిక వ్యవస్థను సుస్థిర పరచడానికి ప్రభుత్వం తీసుకున్న ఈ కఠిన నిర్ణయం సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టేలా ఉన్నా దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ఇది అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముడిచమురు, ఎరువుల దిగుమతుల కోసం విదేశీ కరెన్సీని పొదుపు చేయాల్సిన అనివార్య పరిస్థితిలో భారత్ ఉంది. పసిడి వ్యామోహాన్ని తగ్గించుకుని, పెట్టుబడులను ఇతర ఉత్పాదక రంగాల వైపు మళ్లించడమే ఈ సంక్షోభానికి పరిష్కారంగా కనిపిస్తోంది.ఇదీ చదవండి: కొలువు తీరిన కొంత కాలానికే ఇంటికి! -
మార్కెట్లో కొనసాగుతోన్న నష్టాలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:46 సమయానికి నిఫ్టీ(Nifty) 57 పాయింట్లు తగ్గి 23,325 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 202 పాయింట్లు నష్టపోయి 74,344 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.32బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 106.5 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.46 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.16 శాతం తగ్గింది.నాస్డాక్ 0.71 శాతం నష్టపోయింది.Today Nifty position 13-05-2026(time: 09:46 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సబ్బు నుంచి బిస్కెట్ వరకు.. అన్నింటిపై ధరల మోత
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిణామాల నేపథ్యంలో వినియోగదారులపై ధరల భారం పడుతోంది. ప్రముఖ ఎఫ్ఎమ్సీజీ సంస్థలు కొన్ని ఇప్పటికే తమ ఉత్పత్తుల ధరలను కొంత మేర పెంచడంతోపాటు.. ప్యాక్ల బరువును (పరిమాణం/గ్రాములు) సైతం తగ్గించాయి. ఇప్పుడు మరో విడత, తమ ఉత్పత్తుల ధరలను పెంచడానికి అవి సిద్ధమవుతున్నాయి. దీంతో సబ్బులు, డిటర్జెంట్లు, బిస్కెట్లు, ప్యాకేజ్డ్ ఫుడ్స్, పానీయాల ధరలు మరింత పెరగనున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధంతో ముడి చమురు, గ్యాస్ సరఫరాకు ఆటంకాలు ఏర్పడడం తెలిసిందే. దీంతో వీడి ధరలు గణనీయంగా పెరిగాయి. వీటి ఫలితంగా రవాణా ఖర్చులు, ప్యాకేజింగ్ వ్యయాలు పెరిగిపోయాయి. దీంతో కంపెనీల మార్జిన్లపై ఒత్తిడి పడుతోంది. ముఖ్యంగా ప్లాస్టిక్, ఇతర ప్యాకేజింగ్ వస్తువుల ధరలు 20 నుంచి 40 శాతం వరకు పెరగడం కంపెనీలకు భారంగా మారింది. వీటి తయారీలోకి వినియోగించే ముడిసరుకులకు ముడిచమురు ఆధారం కావడం గమనార్హం. మరోవైపు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా వస్తు సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రూపాయి విలువ క్షీణతతో ముడి సరుకుల వ్యయాలు పెరిగాయి. దీంతో కంపెనీలు లాభాల మార్జిన్లపై ఒత్తిడి పెరిగింది. తమ లాభాల మార్జిన్లను కాపాడుకోవడానికి అవి రేట్ల పెంపుతోపాటు, ప్యాక్ సైజులను తగ్గించేస్తున్నాయి. మొత్తానికి అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఇంటి బడ్జెట్ మరింత భారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ధరల పెంపు.. ఇప్పటికే డాబర్, హెచ్యూఎల్, బ్రిటానియా తదితర సంస్థలు 3 నుంచి 5 శాతం వరకు ధరలను పెంచేశాయి. మరింత పెంచే అవకాశం కూడా ఉందని ఎఫ్ఎంసీజీ కంపెనీలు తమ ఫలితాల వెల్లడి అనంతరం అనలిస్ట్ల కాల్లో పేర్కొన్నాయి. అలాగే, ప్రాచుర్యం పొందిన చిన్న ప్యాకెట్ల (రూ.5, 10, 15 రూపాయల ప్యాకెట్లు) ధరను మార్చకుండా, వాటి పరిమాణాన్ని తగ్గిస్తున్నాయి. తద్వారా తమ విక్రయాలు ప్రభావితం కాకుండా, మార్జిన్లను కాపాడుకునేందుకు ఎఫ్ఎంసీజీ సంస్థలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. డాబర్ ఇండియా ఇప్పటికే ఉత్పత్తుల ధరలను 4 శాతం వరకు పెంచింది. తమపై 10 శాతం మేర ద్రవ్యోల్బణం (ముడి సరుకుల వ్యయాల పెరుగుదల) ప్రభావం ఉన్నట్టు సంస్థ సీఈవో మోహిత్ మల్హోత్రా తెలిపారు. వ్యయ నియంత్రణ చర్యలు తీసుకుంటున్నామని, అమ్మకాల్లో డబుల్ డిజిట్ వృద్ధి (ధరల పెంపు, అమ్మకాల పెంపు రూపంలో) నమోదు చేస్తామని చెప్పారు. ప్యాకేజింగ్, ఇంధన ఖర్చులు 20 శాతం వరకు పెరిగినందున ధరల పెంపుతోపాటు, పరిమాణం తగ్గింపు తప్పనిసరని అని బ్రిటానియా పేర్కొంది. ప్యాకేజింగ్లోకి వాడే లామినేట్స్ ధరల మంట సంస్థపై పడుతోంది. దీనికితోడు ఎల్పీజీ, పీఎన్జీపై ఆధారపడి ఉండడంతో మార్జిన్లపై ఒత్తిడిని ఎదుర్కొంటోంది. తమ ముడి పదార్థాల ధరలు 40–50% పెరిగాయని, ఈ భారాన్ని క్రమంగా వినియోగదారులపై వేయక తప్పదని పిడిలైట్ స్పష్టం చేసింది. ప్రముఖ బ్రాండ్ ఫెవికాల్ ధరలను 12–15% మేర పెంచింది. ఈ సంస్థ ఉత్పత్తులకు ముడిచమురు డెరివేటివ్స్ కీలకం కాగా, వాటి ధరలు సగటున 40–50% వరకు పెరిగాయి. వరుణ్ బెవరేజెస్ వినియోగదారులకు ఇచ్చే రాయితీలను తగ్గిస్తూ వ్యయాలను సర్దుబాటు చేసుకుంటున్నాయి. తమకు కొబ్బరి ధరలు దిగిరావడం కలిసొచి్చందని.. ఇతర ముడి సరుకుల ధరల ఒత్తిళ్లను ఉత్పత్తుల ధరలను క్రమంగా పెంచడం, వ్యయ నియంత్రణ చర్యలతో అధిగమిస్తామని మారికో ఎండీ, సీఈవో సౌగత గుప్తా ప్రకటించారు. ప్యాకేజింగ్, ఎల్పీజీ ధరలు పెరిగిపోవడంతో మార్జిన్లపై ఒత్తిళ్లు ఉన్నట్టు టాటా కన్జ్యూమర్ ఎండీ, సీఈవో సునీల్ డిసౌజ తెలిపారు. వైవిధ్యమైన ఉత్పత్తుల పోర్ట్ఫోలియో కలిగి ఉన్నందున ఈ ఒత్తిళ్లను ప్రస్తుతానికి అధిగమించగలమని చెప్పారు. -
బంగారం, వెండిపై కేంద్రం షాక్
సాక్షి, న్యూఢిల్లీ: బంగారం, వెండి విషయంలో కేంద్రం షాకిచ్చింది. దిగుమతి సుంకాన్ని రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇవాళ (మే 13) అర్ధరాత్రి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఈ నిర్ణయం వల్ల బంగారం, వెండి, ఫ్లాటినం.. ఇతర విలువైన లోహాల ధరలు భారీగా పెరగనున్నాయి. భారత్ ప్రపంచంలో చైనా తర్వాత రెండవ అతిపెద్ద బంగారం దిగుమతిదారుగా ఉంది. ప్రస్తుతం దిగుమతి సుంకం 6 శాతంగా ఉంది. అయితే తాజా నిర్ణయంతో దాన్ని 16 శాతానికి పెంచింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను బంగారం కొనుగోళ్లను కొంతకాలం వాయిదా వేసుకోవాలని కోరారు. ముఖ్యంగా వివాహాలు, పండుగల కోసం ఏడాది పాటు బంగారం కొనకుండా ఉంటే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. దీంతో ఆందోళన వ్యక్తమైంది. ప్రస్తుతం బంగారం ధర రూ. 1,53,990 ఉంది. కిలో వెండి ధర రూ.3 లక్షలుగా ఉంది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఈ ధరలు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.రెవెన్యూ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, బంగారం, వెండి, ప్లాటినంతో పాటు ఆభరణాల తయారీలో ఉపయోగించే హుక్స్, క్లాప్స్, క్లాంప్స్, పిన్లు, స్క్రూ బ్యాక్స్ వంటి వాటిపైనా సుంకాలు పెరిగాయి. బంగారం, వెండి ఫైండింగ్స్పై 5% కస్టమ్స్ సుంకం, ప్లాటినం ఫైండింగ్స్పై 5.4% సుంకం విధించారు. అదే సమయంలో, రీసైక్లింగ్, విలువైన లోహాల రికవరీకి ప్రోత్సాహం ఇవ్వడానికి ఉపయోగించిన ఉత్ప్రేరకాలు, బూడిదతో కూడిన విలువైన లోహాల దిగుమతులపై సుంకాన్ని 4.35%కి తగ్గించారు. అయితే ఇందుకు నిర్దిష్ట నిబంధనలు, అనుమతులు తప్పనిసరిగా పాటించాలి.2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశ బంగారం దిగుమతులు 24% పెరిగి రికార్డు స్థాయిలో 71.98 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, 2026 ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తం దిగుమతుల్లో బంగారం వాటా 9 శాతంగా ఉంది. ఇక బంగారం సరఫరాలో స్విట్జర్లాండ్ 40% వాటాతో మొదటి స్థానంలో ఉండగా, యూఏఈ 16%, దక్షిణాఫ్రికా దాదాపు 10% వాటాతో తదుపరి స్థానాల్లో ఉన్నాయి. -
రూపాయి కొత్త కనిష్టానికి
ముంబై: పశ్చిమాసియా ఉద్రిక్తతల దెబ్బతో రూపాయి మారకం విలువ మరింతగా క్షీణిస్తోంది. తాజాగా మంగళవారం డాలరుతో పోలిస్తే మరో 40 పైసలు పడిపోయి సరికొత్త ఆల్టైమ్ కనిష్ట స్థాయి 95.68కి పతనమైంది. ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్ లో డాలరుతో పోలిస్తే క్రితం ముగింపు (95.28) కన్నా తక్కువగా 95.57 వద్ద ప్రారంభమైన రూపాయి ట్రేడింగ్ ఆ తర్వాత ఒక దశలో 95.74కి కూడా పతనమైంది. చివరికి 40 పైసల క్షీణతతో ముగిసింది. సోమవారం నాడు కూడా దేశీ కరెన్సీ 79 పైసలు క్షీణించిన సంగతి తెలిసిందే. -
డాక్టర్ రెడ్డీస్ లాభం డౌన్
న్యూఢిల్లీ: ఫార్మాస్యూటికల్ రంగ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 86 శాతం క్షీణించి రూ. 221 కోట్లకు పరిమితమైంది. ప్రధానంగా ఉత్తర అమెరికా జనరిక్స్ అమ్మకాలు నీరసించడం ప్రభావం చూపింది. 2024–25 ఇదే కాలంలో రూ. 1,587 కోట్లు ఆర్జించింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 8 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. కాగా.. మొత్తం ఆదాయం సైతం రూ. 8,528 కోట్ల నుంచి రూ. 7,546 కోట్లకు బలహీనపడింది.ఉత్తర అమెరికా జనరిక్స్ విభాగం ఆదాయం 51 శాతం వెనకడుగుతో రూ. 1,756 కోట్లకు చేరింది. అంతక్రితం క్యూ4లో ఇది రూ. 3,559 కోట్లుగా నమోదైంది. అయితే దేశీ జనరిక్స్ విక్రయాలు 20 శాతం వృద్ధితో రూ. 1,566 కోట్లను అధిగమించాయి. అంతక్రితం క్యూ4లో ఇవి రూ. 1,305 కోట్లుకాగా.. యూరప్ బిజినెస్ 14 శాతం ఎగసి రూ. 1,452 కోట్లను తాకింది. ఈ కాలంలో మొత్తం వ్యయాలు సైతం రూ. 7,051 కోట్ల నుంచి రూ. 7,827 కోట్లకు పెరిగాయి. పూర్తి ఏడాదికి మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి డాక్టర్ రెడ్డీస్ నికర లాభం రూ. 5,725 కోట్ల నుంచి రూ. 4,158 కోట్లకు క్షీణించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 32,644 కోట్ల నుంచి రూ. 33,700 కోట్లకు బలపడింది. లెనాలిడోమైడ్ అమ్మకాలు తగ్గడానికితోడు.. అనూహ్య లాభాలు లేకపోవడం ప్రభావం చూపినట్లు కంపెనీ సహచైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ పేర్కొన్నారు. అయితే బ్రాండెడ్ బిజినెస్, కరెన్సీ సానుకూలతలు కొంతమేర ప్రభావాన్ని తగ్గించినట్లు తెలియజేశారు. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు బీఎస్ఈలో 1 శాతం క్షీణించి రూ. 1,270 వద్ద ముగిసింది. -
పడేసిన పొదుపు పిలుపు
ముంబై: పశ్చిమాసియా యుద్ధంతో తలెత్తిన అనిశ్చితులు, ముడి చమురు ధరలు దూసుకెళ్లడంతో మంగళవారం దలాల్ స్ట్రీట్ 2% క్షీణించింది. దేశ ప్రజలు ‘పొదుపు చర్యలు’ పాటించాలంటూ ప్రధాని మోదీ పిలుపు ప్రభావం రెండో రోజూ కొనసాగింది. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, ఫారెక్స్ మార్కెట్లో రూపాయి క్షీణత అంశాలు సెంటిమెంట్ను మరింత దెబ్బతీశాయి. ఫలితంగా సెన్సెక్స్ 1,456 పాయింట్లు కోల్పోయి 74,559 వద్ద ముగిసింది. నిఫ్టీ 436 పాయింట్లు క్షీణించి 23,380 వద్ద నిలిచింది. సూచీలకిది నాలుగోరోజూ నష్టాల ముగింపు. నష్టాలతో మొదలైన సూచీలు క్రమంగా తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఐటీ షేర్లు భారీ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఒకదశలో సెన్సెక్స్ 1566 పాయింట్లు పతనమై 74,449 వద్ద, నిఫ్టీ 468 పాయింట్ల క్రాష్తో 23,348 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. ⇒ ఇరాన్ యుద్ధం సుదీర్ఘంగా కొనసాగొచ్చనే ఆందోళనలు, క్రూడాయిల్ ధరలు పెరగడం, అధిక ద్రవ్యోల్బణ భయాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు నష్టాల బాటపట్టాయి. ఆసియాలో కొరియా (–2.34%), ఇండోనేషియా(–0.68%), చైనా (–0.25%), హాంగ్కాంగ్(–0.22%) నష్టపోయాయి. జపాన్(0.52%), తైవాన్ (0.22%) సింగపూర్(0.07%) లాభపడ్డాయి. యూరప్లో బ్రిటన్(–0.39%), ఫ్రాన్స్(–0.98%), జర్మనీ(–1.52%) పతనమయ్యాయి. అమెరికా స్టాక్ మార్కెట్లు అరశాతం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ⇒ స్టాక్ మార్కెట్ వరుస పతనంలో భాగంగా గడిచిన నాలుగు రోజుల్లో రూ.16.77 లక్షల కోట్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం క్యాపిటలైజేషన్ రూ.456.02 లక్షల కోట్లకు దిగివచి్చంది. మంగళవారం ఒక్కరోజే రూ.10.16 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ⇒ సెన్సెక్స్ 30 షేర్లలో ఎస్బీఐ(0.12%) మాత్రమే లాభంతో గట్టెక్కింది. మిగిలిన 29 షేర్లూ నష్టాలతో ముగిశాయి. టెక్ మహీంద్రా(–4.44%), అదానీపోర్ట్స్ (–4.39%), హెచ్సీఎల్ టెక్ (–4.11%), టీసీఎస్(–3.84%), టైటాన్(–3.06%) షేర్లు అత్యధికంగా పతనమయ్యాయి. ⇒ బీఎస్ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో రియల్టీ 4.22%, ఐటీ 3.61%, సర్విసెస్ 3.51%, కన్జూమర్ డ్యూరబుల్స్ 3.35% పతనమయ్యాయి. ⇒ మార్కెట్ పతనంలో భాగంగా అదానీ గ్రూప్ షేర్లు బేర్మన్నాయి. అదానీ పవర్ 6%, అదానీ గ్రీన్ 5.87%, అదానీ పవర్ 5.63%, ఎన్డీటీవీ 4.78% అదానీ టోటల్ గ్యాస్ 4.77% క్షీణించాయి. అదానీ పోర్ట్స్ 4.39%, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 4.41%, అదానీ ఎంటర్ప్రైజెస్ 3.82% పతనమయ్యాయి. దీంతో అదానీ గ్రూప్ మార్కెట్ విలువ రూ.16.70 లక్షల కోట్లకు దిగివచ్చింది. ⇒ పసిడి కొనుగోళ్లు ఏడాది పాటు వాయిదా వేసుకోవాలంటూ ప్రధాని పిలుపుతో ఆభరణాల షేర్లు రెండోరోజూ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. తంగమయిల్ జ్యువెలరీ 8.32%, సెంకో గోల్డ్ 6.39%, పీసీ జ్యువెలర్ 6.19%, కళ్యాణ్ జ్యువెలరీస్ 6.10%, స్కై గోల్డ్ 5.94%, త్రిభువన్ దాస్ భీంజీ జువేరీ 5.84%, టైటాన్ 3.6% పడ్డాయి. ⇒ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న బేరీష్ ట్రెండ్కు తోడు, ఏఐ–డిఫ్లేషన్, ఓపెన్ఏఐ ‘డిప్లాయ్మెంట్ కంపెనీ’ ప్రకటనతో టెక్ మహీంద్రా(–4.44%), హెచ్సీఎల్ టెక్ (–4.11%), టీసీఎస్(–3.84%), విప్రో(–3.59%), ఇన్ఫోసిస్ (–3.09%), హెక్సావేర్ టెక్ (–1.42%) నష్టపోయాయి. బీఎస్ఈ ఐటీ ఇండెక్సు 3.67 శాతం పతనమైంది.ఇన్వెస్టర్లలో దెబ్బతిన్న విశ్వాసంప్రస్తుత మార్కెట్ పతనం సాధారణ లాభాల స్వీకరణ వల్ల జరిగింది కాదు; మార్కెట్ పట్ల ఇన్వెస్టర్లలో ‘నమ్మకం దెబ్బతినడం’ వల్ల సంభవించిన పతనం ఇది. రాబోయే రోజుల్లో ఆర్థిక సవాళ్లు మరింత కఠినంగా ఉండబోతున్నాయనే సంకేతాలు ఇన్వెస్టర్లను కలవరపెడుతున్నాయి. బ్యారెల్ ముడిచమురు ధర 105–107 డాలర్లకు చేరడం, రూపాయి విలువ జీవితకాల కనిష్టానికి పడిపోవడం, విదేశీ ఇన్వెస్టర్లు వరుసగా విక్రయాలకు పాల్పడటం వంటి అంశాలు మార్కెట్పై తీవ్ర ఒత్తిడిని పెంచాయి.దీనికి తోడు, ఇరాన్ శాంతి ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరిస్తూ, కాల్పుల విరమణ ఒప్పందం (సీజ్ఫైర్) ప్రస్తుతం ‘లైఫ్ సపోర్ట్’పై ఉన్నంత బలహీన స్థితిలో ఉందంటూ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ ఉద్రిక్తతలను పెంచి, మార్కెట్ల పతనానికి ప్రధాన కారణంగా నిలిచాయి – కే. హరిప్రసాద్, లివ్లాంగ్ వెల్త్ ఫౌండర్, -
మోదీ వార్నింగ్తో వణికిన మార్కెట్లు
(సాక్షి, బిజినెస్): ‘ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోండి. పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించుకోవడానికి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి. ఎలక్ట్రిక్ వాహనాలను, ప్రజా రవాణాను మరింతగా ఉపయోగించుకోండి. వంట నూనెలు, ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోండి. విదేశీ వస్తువులు వద్దు... స్వదేశీయే ముద్దు’ అంటూ ప్రధాని మోదీ తాజాగా ఎత్తుకున్న పొదుపు రాగంతో మార్కెట్లు కకావికలం అవుతున్నాయి. ఇరాన్ యుద్ధ ప్రభావంతో చమురు రేట్లు భారీగా ఎగబాకటం.. రూపాయి విలువ పాతాళానికి జారిపోతుండటం.. ద్రవ్యోల్బణం సెగలు రేగటంతో ఇప్పటికే దేశీ స్టాక్ మార్కెట్లలో ‘బేర్’ బాజా మోగుతోంది. అగ్నికి ఆజ్యం పోసినట్లుగా మోదీ పొదుపు సూచనలతో ప్రజల వినిమయం పడిపోయి జీడీపీ వృద్ధికి చిల్లు పడొచ్చని ఆర్థిక నిపుణుల వార్నింగ్లు మొదలయ్యాయి. ఇవన్నీ కలిసి మార్కెట్లను వణికిస్తుండటంతో గత రెండు రోజుల్లోనే ఏకంగా రూ. 16 లక్షల కోట్లకు పైగా సంపద ఆవిరి కావడం ఇన్వెస్టర్లను దిక్కుతోచని స్థితిలోకి నెట్టింది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ముడిచమురు, బంగారం, ఎరువులతో సహా అనేక కమోడిటీల ధరలు ఇప్పటికే భారీగా ఎగిశాయి. ప్రధానంగా దిగుమతులపైనే ఆధారపడిన భారత్పై దీని ప్రభావం తీవ్రంగా పడింది. ముడి చమురు రేటు 100 డాలర్ల పైకి దూసుకెళ్లడంతో దిగుమతుల బిల్లు భారీగా పెరిగిపోతోంది. డాలర్లను అధికంగా వెచ్చించాల్సి రావడంతో మన చేతి ‘చమురు’ వదులుతోంది. విదేశీ మారక నిల్వలు తరిగిపోతున్నాయి. దీంతో రూపాయి ఇంకా పడిపోతోంది. మన దిగుమతుల్లో దాదాపు మూడో వంతు వాటా క్రూడ్, పసిడి, ఎరువులు, వంటనూనెలదే కావడంతో ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. అందుకే మోదీ వీటి కొనుగోళ్లు, వాడకాన్ని తగ్గించేందుకు పొదుపు మంత్రాన్ని జపించారు. ఎకానమీలో నెలకొన్న బలహీనతలకు ఇది అద్దం పడుతోందన్నది నిపుణుల మాట. మార్కెట్లకు షాక్...: మోదీ సూచనలను జరగబోయే పరిణామాలకు వార్నింగ్గా భావించిన మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. రెండు రోజుల్లో సెన్సెక్స్ దాదాపు 3,000 పాయింట్లు, నిఫ్టీ 800 పాయింట్లకు పైగా కుప్పకూలాయి. సోమవారం రూ.6 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరికాగా, మంగళవారం మరో రూ.10 లక్షల కోట్లు ఎగిరిపోయాయి. మోదీ సూచనల ప్రభావానికి తోడు ఇరాన్తో సీజ్ఫైర్ గాల్లో దీపమంటూ.. ట్రంప్ చేసిన ప్రకటనతో మడిచమురు ధరలు భగ్గుమనడం ఈ మార్కెట్ పతనానికి ప్రధాన కారణం. గోల్డ్ రిటైల్ సంస్థలు, ట్రావెల్, వినియోగ వస్తువుల షేర్లు వరుసగా రెండో రోజూ పడిపోవడం గమనార్హం. పసిడి కొనుగోళ్లపై గందరగోళం... బంగారాన్ని ఏడాది పాటు కొనొద్దంటూ స్వయంగా మోదీయే చెప్పడంతో జనానికి ఏం చేయాలో తోచని పరిస్థితి ఎదురైంది. వాస్తవానికి ఈ ఏడాది జనవరిలో తులం రూ.1.85 లక్షల ఆల్టైమ్ రికార్డు స్థాయిని తాకిన పుత్తడి. ఇప్పుడు రూ.1.5 లక్షల స్థాయిలో ఉంది. అంతర్జాతీయంగానూ ఔన్స్ 5,600 డాలర్లను తాకి ప్రస్తుతం 4,600 డాలర్ల వద్ద ఉంది. అయితే, రూపాయి మారకం విలువ భారీగా క్షీణించడంతో దేశీయంగా పసిడి రేట్లు పెద్దగా దిగిరాలేదు. భారతదేశ మొత్తం దిగుమతుల్లో బంగారం వాటా దాదాపు 9 శాతం. మనం వినియోగించే బంగారంలో దిగుమతుల వాటా ఏకంగా 90 శాతం. అంటే ఏటా 700–800 టన్నులు. దీనికి భారీగా డాలర్లు వెచ్చించాల్సి రావటంతో మన ఫారెక్స్ నిల్వలకు గండి పడుతోంది. గడిచిన రెండు నెల్లల్లో దాదాపు 38 బిలియన్ డాలర్లు తగ్గి మన నిల్వలు 690.69 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఇది రూపాయి పతనాన్ని పెంచుతోంది. దీనికి అడ్డకట్టవేయడానికే మోదీ పొదుపు మంత్రం ఎత్తుకున్నారు. కాకపోతే రేటు మరింత పెరిగితే కొనలేమేమోనన్న ఆందోళనలో ఉన్న సామాన్యుల్లో ప్రధాని ప్రకటన గందరగోళాన్ని పెంచింది. యుద్ధం మళ్లీ తీవ్రమైతే బంగారం దూసుకెళ్లే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అందుకే కొనుగోళ్లకు బ్రేక్ వేసేందుకు అవసరమైతే దిగుమతి సుంకాన్ని (ప్రస్తుతం 6 శాతం) కూడా ప్రభుత్వం పెంచవచ్చన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇలా చేస్తే బంగారం రేట్లు దేశీయంగా మరింత భగ్గుమంటాయి. మరోపక్క, పసిడి కొనుగోళ్లను నిరుత్సాహపరిస్తే ఆభరణాల పరిశ్రమపై ప్రభావం పడి, లక్షల మంది ఉపాధి కోల్పోవచ్చన్న ఆందోళనలూ ఉన్నాయి. క్రూడ్ పైపైకి.. త్వరలో పెట్రో వాత! కాల్పుల విరమణ తర్వాత కాస్త శాంతించిన క్రూడ్ రేట్లు మళ్లీ యుద్ధ భయాలతో భగ్గుమన్నాయి. మంగళవారం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 109 డాలర్లను తాకింది. చమురు సెగతో ఎఫ్ఎంసీజీతో సహా ఇప్పటికే దేశీయంగా పలు ఉత్పత్తుల ధరలు ఎగబాకుతున్నాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు రోజుకు దాదాపు రూ.1,700 కోట్ల ఆదాయ నష్టాల నేపథ్యంలో నేడోరోపో పెట్రో వాత ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి. మోదీ రెండు రోజుల క్రితం జపించిన పొదుపు మంత్రం నేపథ్యంలో బుధవారం జరిగే కేంద్ర కేబినెట్ భేటీలో ఏం నిర్ణయాలు తీసుకుంటారోననే ఉత్కంఠ నెలకొంది. పెట్రో రేట్లను పెంచితే ద్రవ్యోల్బణం మరింత ఎగబాకి, వడ్డీ రేట్ల పెంపునకు దారితీస్తుందని.. ఎకానమీ మరింత మందగమనంలోకి జారిపోతుందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. మోదీ పొదుపు సూచనలు ఆర్థిక వ్యవస్థకు తాత్కాలిక ఉపశమనాన్నే ఇస్తాయని.. క్రూడ్ రేట్లు 100 డాలర్ల పైన ఎక్కువ కాలం ఉంటే జీడీపీ వృద్ధిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్తో సహా పలు రేటింగ్ ఏజెన్సీలు ఈ ఏడాది వృద్ధి రేటుకు కోత వేయటం తెలిసిందే. 6– 6.5 శాతానికే వృద్ధి పరిమితమవుతుందన్న అంచనాల నేపథ్యంలో మోదీ పొదుపు పిలుపు ప్రభావంతో 6 శాతం కిందికి పడిపోవచ్చని విశ్లేషకులు లెక్కలేస్తున్నారు. రూపాయి విలవిల.. ఇరాన్ యుద్ధం మొదలైనప్పటి నుంచీ రూపాయి జారుడుబల్లపైనే ఉంది. చమురు రేట్ల దెబ్బతో దిగుమతుల బిల్లు పెరగటం దీనికి ప్రధాన కారణం. మరోపక్క, విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) స్టాక్ మార్కెట్ల నుంచి పెట్టుబడులను భారీగా ఉపసంహరించుకోవడం కూడా దేశీ కరెన్సీని వణికిస్తోంది. ఈ ఏడాది ఇప్పటిదాకా ఏకంగా రూ.2 లక్షల కోట్ల విలువైన షేర్లను ఎఫ్పీఐలు విక్రయించడం గమనార్హం. 2025 చివర్లో డాలర్తో 90 స్థాయిలో ఉన్న రూపాయి... ఇపుడు 95కి చేరింది. ఏడాది కాలంలో దాదాపు 10 శాతం క్షీణించింది. ఈ ఏడాది ఆసియాలో దారుణంగా పడిపోయిన కరెన్సీ మనదే. కాగా, మంగళవారం మరో 40 పైసలు పడ్డ రూపాయి.. సరికొత్త ఆల్టైమ్ కనిష్టమైన 95.68కి జారిపోయింది. రూపాయి ఇలా పతనమవటం దిగుమతుల బిల్లు మరింత పెరిగేలా చేస్తోంది. ఎందుకంటే దిగుమతుల కోసం డాలర్ల రూపంలో చెల్లించడానికి మనం మరిన్ని రూపాయలు ఖర్చు చేయాలి కదా!!. ఎరువులు, వంట నూనెల మంట! యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధిలో రవాణా ఆగిపోవటంతో దేశంలో ఎరువుల రేట్లకు రెక్కలొస్తున్నాయి. మన యూరియా దిగుమతుల్లో 75 శాతం గల్ఫ్ దేశాల నుంచే వస్తున్నాయి. ఇక డీఏపీ దిగుమతుల్లో సౌదీ వాటా 40 శాతం. 2025–26లో భారత్ ఏకంగా 14.5 బిలియన్ డాలర్ల విలువైన ఎరువులను దిగుమతి చేసుకుంది. ఇప్పుడు సరఫరాపరమైన ఇక్కట్లు.. రూపాయి తీవ్ర పతనంతో ఈ దిగుమతులు మరింత భారమై, దేశీయంగా రేట్లు ఎగబాకుతున్నాయి. ఖరీఫ్ సీజన్కు సమాయత్తమవుతున్న రైతులు రేట్ల పెరుగుదలకు తోడు తగినంత సరఫరా ఉంటుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. మరోపక్క, వంటింట్లో వంటనూనెల మంట మండుతోంది. భారత్ వంటనూనెల అవసరాల్లో 60 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. 2025–26లో 19.5 బిలియన్ డాలర్ల విలువైన వంటనూనెలను దిగుమతి చేసుకుంది. రూపాయి వాతతో దేశీయంగా రేట్లు ఇప్పటికే భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే ఎరువులు, వంట నూనెల వాడకాన్ని తగ్గించుకోవాలంటూ మోదీ పిలుపునివ్వడం గమనార్హం. -
రాజకుటుంబం.. డబ్బు కష్టం: జాహ్నవి కుమారి మేవార్
రాజుల గురించి, రాజకుటుంబాల గురించి చాలామంది పుస్తకాల్లో చదువుకుని ఉంటారు. భారతదేశంలో రాజరిక వ్యవస్థ అధికారికంగా అంతరించిపోయినప్పటికీ.. కొన్ని రాజ కుటుంబాలు మాత్రం తమ సంపదను కాపాడుకుంటూ.. కొత్త తరానికి అనుగుణంగా వ్యాపారాలను అభివృద్ధి చేస్తున్నాయి. అలాంటి కుటుంబాల్లో మేవార్ రాజ కుటుంబం ఒకటి.ప్రస్తుతం ఈ కుటుంబం వివిధ వ్యాపారాలు చేస్తూ, పెట్టుబడులు పెడుతూ ముందుకు సాగుతోంది. వీరికి కూడా డబ్బు సమస్య ఉంటుంది. ఈ విషయాన్ని జాహ్నవి కుమారి మేవార్ వెల్లడించారు. ఈమె చదువుకునే రోజుల్లో పలు ఉద్యోగాలు కూడా చేసినట్లు చెప్పారు.వ్యాపార జీవితానికి బలమైన పునాదిజాహ్నవి కుమారి చిన్నప్పటి నుంచే రాజభవన వాతావరణంలో పెరిగింది. ఇతర పిల్లల్లానే ఆమె కూడా సాధారణ బాల్యాన్ని అనుభవించినప్పటికీ, ఆమె చదువు రాజభవనం లోపలే తన బంధువులతో కలిసి సాగింది. చిన్న వయసులోనే ప్రముఖులు, విదేశీ అతిథులను కలవడం వల్ల ఆమెకు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, అనే నైపుణ్యాలు సహజంగానే వచ్చాయి. ఇవే తర్వాత ఆమె వ్యాపార జీవితానికి బలమైన పునాది అయ్యాయి.ఆమె కుటుంబానికి రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ, లాజిస్టిక్స్, వినియోగ వస్తువులు, విద్య వంటి అనేక రంగాల్లో పెట్టుబడులు ఉన్నాయి. చిన్నప్పటి నుంచే తండ్రి ఆఫీస్ పట్ల ఆమెకు ప్రత్యేక ఆసక్తి ఉండేది. తండ్రి కుర్చీలో కూర్చొని ఫైళ్లపై సంతకాలు చేయాలని పట్టుబడే ఆ చిన్నారి, తర్వాత నిజంగా కుటుంబ వ్యాపార బాధ్యతలను చేపట్టింది.మూడు ఉద్యోగాలు చేస్తూ..అయితే.. రాజ కుటుంబానికి చెందిన వారికి కూడా డబ్బు డబ్బు సమస్య ఉంటుందని జాహ్నవి స్పష్టం చేసింది. విదేశాల్లో చదువుతున్న సమయంలో ఆమెకు అవసరమైన ఖర్చులు మాత్రమే కుటుంబం భరించింది. అదనంగా.. ఆమె క్యాటరింగ్, క్లబ్ ప్రమోషన్, టెలిమార్కెటింగ్ వంటి మూడు ఉద్యోగాలు చేస్తూ చదువు కొనసాగించింది. దీని ద్వారా కష్టపడి సంపాదించే విలువ ఆమెకు అర్థమైంది.తన ఇరవై ఏళ్ల ప్రారంభంలోనే.. జాహ్నవి కుటుంబ పెట్టుబడి వ్యవస్థను మార్చడం ప్రారంభించింది. పెట్టుబడుల్లో పారదర్శకత, బాధ్యత, దీర్ఘకాల లాభాలపై ఆమె ఎక్కువ దృష్టి పెట్టింది. ఆమె తీసుకున్న మొదటి నిర్ణయాల్లో ఒకటి.. కుటుంబంతో కలిసి పెట్టుబడులు పెట్టే బంధువులు, స్నేహితులు తమ ఖర్చులను తామే భరించాలి అనేది. మొదట ఆమె తండ్రి దీనికి వ్యతిరేకించినా, తర్వాత అదే నిర్ణయం కుటుంబ ఆర్థిక వ్యవస్థను మరింత క్రమబద్ధం చేసింది.పెట్టుబడి విధానంలో మార్పు!అంతేకాకుండా.. ఆమె పెట్టుబడి విధానాన్ని కూడా పూర్తిగా మార్చింది. మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా పెట్టుబడులు పెట్టడం ప్రారంభించింది. బ్యాంకర్లు, సలహాదారులు, అకౌంటెంట్లు వంటి మధ్యవర్తులు ఖర్చును పెంచుతారని, బాధ్యతను తగ్గిస్తారని ఆమె భావించింది. అందుకే ఆమె కుటుంబాన్ని ప్రపంచవ్యాప్తంగా కొత్త అవకాశాల వైపు మళ్లించింది, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్లపై దృష్టి పెట్టింది.ఒక యువతి, అది కూడా రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో, పెద్దవారి మధ్య తనను తాను నిరూపించుకోవడం ఆమెకు సులభం కాలేదు. చాలామంది ఆమె సామర్థ్యాన్ని అనుమానించారు. అయినప్పటికీ, ఆమె ధైర్యంగా ముందుకు సాగింది. ఆమె జీవితంలో మరో ముఖ్యమైన విషయం “సంపదను ముందుగా కాపాడుకోవాలి, తర్వాతే పెద్ద రిస్క్లు తీసుకోవాలి” అనే పాఠం. ఈ విషయాన్ని ఆమె కుటుంబానికి ఎన్నో సంవత్సరాలుగా సేవ చేసిన అనుభవజ్ఞులైన సలహాదారులు నేర్పారు. సంపదను కేవలం ఖర్చు చేయడం కాదు, దాన్ని తరతరాలకు నిలబెట్టడం ముఖ్యం అని అర్థం చేసుకుంది.ఇదీ చదవండి: బంగారం కొనుగోలుపై.. 1967లో ఇదే జరిగిందా? -
బంగారం కొనుగోలుపై.. 1967లో ఇదే జరిగిందా?
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో.. దేశ ప్రజలు ఏడాది పాటు బంగారం కొనకుండా ఉండాలని సూచించిన ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో 1967లో కూడా ఇందిరా గాంధీ ఇలాంటి ప్రకటన చేశారని, సూచించే ఒక ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.సోషల్ మీడియాలో ఇటీవల.. ఒక పాత న్యూస్ ఫ్రంట్ పేజీ అంటూ ఒక ఫోటో వైరల్ అవుతోంది. ఇందులో 1967 జూన్ 6 తేదీకి చెందిన 'ది హిందూ' పత్రికలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ''బంగారం కొనొద్దు, జాతీయ క్రమశిక్షణ పాటించండి'' అని పిలుపునిచ్చినట్లు చూపించారు. కానీ ఇది పూర్తిగా తప్పుదారి పట్టించే, డిజిటల్గా మార్పు చేసిన ఫోటో అని స్పష్టమైంది.నిజం ఏమిటంటే?సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫేక్ ఫోటోపై ది హిందూ స్వయంగా స్పందించింది. ''జూన్ 6, 1967 నాటి ‘ది హిందూ’ పత్రిక ముఖపత్రం అని చెప్పుకుంటున్న, డిజిటల్గా మార్పులు చేసిన ఒక చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. ఇది మా ఆర్కైవ్స్లోని అసలైన పేజీ కాదని మేము స్పష్టం చేస్తున్నాము. పాఠకులు జాగ్రత్త వహించాలని, షేర్ చేసే ముందు సరిచూసుకోవాలని ‘ది హిందూ’ కోరుతోంది'' అని తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.📢 A digitally altered image purporting to be a front page of The Hindu from June 6, 1967, is currently circulating on social media. We wish to clarify that this is not an authentic page from our archives. The Hindu urges readers to exercise caution and verify before sharing.— The Hindu (@the_hindu) May 12, 2026అసలు 1967 జూన్ 6 నాటి పత్రికలో ఉన్న ప్రధాన వార్త ఏమిటంటే.. ''అప్పట్లో మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ మరియు అరబ్ దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు''. కాబట్టి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో ఫేక్ అని ది హిందూ క్లారిటీ ఇచ్చింది.ఇందిరా గాంధీ బంగారంపై నియంత్రణలు పెట్టారా?వైరల్ అవుతున్న ఫోటో నకిలీదే అయినప్పటికీ.. అప్పటి ప్రభుత్వం బంగారంపై నియంత్రణలు పెట్టిందనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే 1960లలో భారతదేశంలో విదేశీ మారక ద్రవ్య సంక్షోభం, బంగారం స్మగ్లింగ్ సమస్యలు ఉండేవి. ఆ పరిస్థితుల్లో అప్పటి ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ ''గోల్డ్ కంట్రోల్ యాక్ట్'' ప్రవేశపెట్టినట్లు సమాచారం.ఈ చట్టం.. ప్రజలు బంగారు బార్లు, నాణేలు కలిగి ఉండటాన్ని పరిమితం చేసింది. బంగారం కొనుగోలు, నిల్వపై కఠిన నియంత్రణలు అమలు చేసింది. స్మగ్లింగ్ను తగ్గించడానికి చర్యలు తీసుకుంది. అయితే 1990లో ఈ యాక్ట్ రద్దు అయింది.ఇదీ చదవండి: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతోంది! -
100 ఏళ్ల బజాజ్: 1.30 లక్షల ఉద్యోగులు!
భారతదేశపు అత్యంత పురాతన వ్యాపార సంస్థలలో ఒకటిగా, 148 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో అతిపెద్ద గ్రూపులలో ఒకటిగా ఉన్న బజాజ్ గ్రూప్, నేడు 100 ఏళ్ల వ్యాపార ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. భారత స్వాతంత్య్ర ఉద్యమం నుంచి నేటి ఆర్థికాభివృద్ధి వరకు దేశ గమనంతో ముడిపడి ఉన్న ఈ చారిత్రాత్మక మైలురాయిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.స్వాతంత్య్ర సమరయోధుడు, సామాజిక సంస్కర్త, పరోపకారి, పారిశ్రామికవేత్త అయిన జమ్నాలాల్ బజాజ్ 1926లో ముంబైలో ఈ గ్రూప్ను స్థాపించారు. మహాత్మా గాంధీ ఐదవ దత్తపుత్రుడిగా పేరుగాంచిన ఆయన వేసిన పునాదులతో, నేడు బజాజ్ గ్రూప్ దేశంలోని ప్రతి మూడు కుటుంబాలలో ఒకరికి సేవలు అందిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థలో 1,30,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.100 కంటే ఎక్కువ కంపెనీలు, 100 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతులు.. త్వరలో ఆరోగ్య సంరక్షణ (healthcare) రంగంలోకి అడుగుపెట్టబోతున్న బజాజ్ గ్రూప్, ఆటోమొబైల్స్, ఆర్థిక సేవలు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ మరియు ఇంజినీరింగ్ రంగాలలో భారత అత్యంత విశ్వసనీయ బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది. బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, బజాజ్ ఎలక్ట్రికల్స్, ముకంద్ వంటివి ఈ గ్రూపులోని కొన్ని లిస్టెడ్ కంపెనీలు.దేశ నిర్మాణంలో బజాజ్ గ్రూప్ అందించిన సహకారాన్ని గుర్తిస్తూ, బజాజ్ కుటుంబానికి పంపిన సందేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు, "బజాజ్ గ్రూప్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా, ఈ మైలురాయితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ నేను నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఏ సంస్థకైనా వందేళ్ల ప్రయాణం అనేది ఒక ముఖ్యమైన ఘట్టం. ఇది కేవలం ఆ సంస్థ దీర్ఘకాలిక ఉనికిని మాత్రమే కాకుండా, మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతూ, ఆర్థిక వృద్ధికి తోడ్పడుతూ, తరతరాల పాటు తన ప్రాముఖ్యతను కాపాడుకునే సామర్థ్యాన్ని కూడా ప్రతిబింబిస్తుంది.జమ్నాలాల్ బజాజ్ నాయకత్వంలో ప్రారంభమైన బజాజ్ గ్రూప్, మన దేశ అభివృద్ధిలోని అనేక దశలలో భారతదేశ పారిశ్రామిక మరియు ఆర్థిక రంగంలో ఒక భాగంగా ఉంది. ఇది వివిధ రంగాలలో కార్యకలాపాలు సాగిస్తూ.. భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు సేవలు అందించే ఒక వైవిధ్యభరితమైన కంపెనీగా ఎదిగింది.గడిచిన దశాబ్దాలుగా ఉద్యోగ అవకాశాలను కల్పించడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం మరియు సామాజిక అభివృద్ధికి మద్దతు ఇవ్వడం ద్వారా దేశ నిర్మాణంలో బజాజ్ గ్రూప్ ముఖ్యమైన పాత్ర పోషించింది. ఇలాంటి మైలురాళ్లు గతంలో అందించిన కీలక సహకారాలను గుర్తు చేసుకోవడానికి, అలాగే వృద్ధి, సుస్థిరత, అందరినీ కలుపుకునిపోయే పురోగతి పట్ల నిబద్ధతను పునరుద్ధరించుకోవడానికి ఒక గొప్ప అవకాశం.తయారీ రంగం, ఆవిష్కరణలు, ప్రపంచ స్థాయి పోటీతత్వంలో భారత్ నూతన ఆకాంక్షలతో ముందుకు సాగుతోంది. బజాజ్ గ్రూప్ వంటి లోతైన మూలాలు, అనుభవం ఉన్న సంస్థలు 2047 నాటికి వికసిత భారత్ లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషించాల్సి ఉంది.ఈ చిరస్మరణీయ సందర్భంలో బజాజ్ గ్రూప్లోని ప్రతి ఒక్కరికీ మరోసారి నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. రాబోయే కాలంలో కూడా దేశాభివృద్ధిలో ఈ సంస్థ నిరంతర పురోగతిని మరియు అర్థవంతమైన సహకారాన్ని అందిస్తుందని నేను విశ్వసిస్తున్నాను" అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన, శిశు ఆరోగ్యం, విద్య, రక్షణపై దృష్టి సారించిన బజాజ్ గ్రూప్ సామాజిక సేవా కార్యక్రమాలు (CSR), ఇప్పటివరకు 10 మిలియన్ల కంటే ఎక్కువ మంది లబ్ధిదారుల జీవితాలపై సానుకూల ప్రభావాన్ని చూపాయి.ముంబైలోని నేషనల్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన ఈ శతాబ్ది వేడుకల్లో బజాజ్ కుటుంబ సభ్యులు, పారిశ్రామిక దిగ్గజాలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, వ్యాపార భాగస్వాములు పాల్గొన్నారు. ఈ సాయంత్రం వేళ భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో ఆ కుటుంబం పోషించిన పాత్ర నుంచి, వర్తక వ్యాపారం నుంచి తయారీ.. ఆర్థిక సేవల రంగం వైపు సాగిన మార్పు వరకు, అలాగే నేడు వారి వ్యాపారాలు ముందుండి నడిపిస్తున్న సరికొత్త సాంకేతికత వరకు సాగిన సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రదర్శించారు.ఈ కార్యక్రమం ముఖ్యాంశాలలో బజాజ్ కుటుంబ సభ్యుల ప్రసంగాలు, గ్రామీ అవార్డు గ్రహీత మరియు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కంపోజర్ రికీ కేజ్(Ricky Kej) మరియు ఆయన బృందం ప్రత్యేకంగా రూపొందించిన లైవ్ ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. వీటితో పాటు జమ్నాలాల్ బజాజ్ మరియు మహాత్మా గాంధీపై రాజ్కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ‘కథ్నీ కర్నీ ఏక్సీ’ (Kathni Karni Eksi) అనే చిత్రాన్ని ప్రదర్శించారు. ‘100 ఇయర్స్ ఆఫ్ బజాజ్’ లోగోను ఆవిష్కరించారు. -
రానున్న రోజుల్లో.. చమురు ధరలు ఇలా!
అంచనాలను మించి దీర్ఘకాలం కొనసాగుతున్న పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల కారణంగా ముడిచమురు ధరలు గరిష్ట స్థాయిలలోనే కొనసాగే వీలున్నట్లు ఆసియా అభివృద్ధి బ్యాంక్(ఏడీబీ) చీఫ్ ఎకనమిస్ట్ అల్బెర్ట్ పార్క్ పేర్కొన్నారు.వెరసి తాజా అంచనాల ప్రకారం.. 2026లో బ్యారల్ ముడిచమురు 96 డాలర్ల స్థాయిలో కొనసాగవచ్చు. 2027లో బ్యారల్ చమురు 80 డాలర్ల స్థాయిలో కదిలే వీలుంది. వెరసి ముడిచమురు ధరలు అధికస్థాయిలలో కొనసాగనున్నట్లు భావిస్తున్నామని వివరించారు.ఈ నేపథ్యంలో స్పాట్ ధరలతో పోలిస్తే ఫ్యూచర్స్ మార్కెట్లో అధిక(ప్రీమియం) ధరలు పలుకుతున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం చమురు సరఫరాల కొరత ప్రభావం చూపుతున్నట్లు పేర్కొన్నారు. చమురు ధరల ఫలితంగా దేశ జీడీపీ వృద్ధిలో 0.6 శాతం కోత పడవచ్చని వెరసి 6.3 శాతానికి ఆర్థిక పురోగతి పరిమితంకావచ్చని అంచనా వేశారు. -
ఏడాది పాటు పసిడి కొనొద్దు.. పరిష్కారం ఇదిగో
న్యూఢిల్లీ: పశ్చిమ ఆసియా సంక్షోభం నేపథ్యంలో విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకునేందుకు దేశ ప్రజలు ఏడాది పాటు బంగారం కొనకుండా ఉంటే చాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటనపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ చేసిన ప్రకటనపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. ప్రధాని ప్రతిపాదనపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని ప్రకటనను కొంత మంది సమర్థిస్తుండగా, మరి కొంత మంది ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. బంగారం కొనుగోళ్లు ఆపేస్తే నగల పరిశ్రమ నాశమవుతుందని, కోట్లాది మంది ఉపాధికి దూరమవుతారని భయాందోళనలు చెందుతున్నారు.ఈ నేపథ్యంలో బంగారం దిగుమతులను తగ్గించడానికి టైటాన్ సీఎఫ్ఓ అశోక్ సోంతాలియా ఓ పరిష్కారాన్ని సూచించారు. మన దేశంలో పోగుపడి ఉన్న బంగారాన్ని మార్పిడి చేయడం ద్వారా దిగుమతులను తగ్గించవచ్చని ఆయన సలహా ఇచ్చారు. బిజినెస్ టుడేతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ.. ''ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన ప్రభావం బంగారం కొనుగోళ్ల వైపు ఉంటుందా, సరఫరా వైపు మళ్లుతుందా అని వేచిచూస్తున్నాం. బంగారం దిగుమతుల గురించే కేంద్ర సర్కారు ఎక్కువ ఆందోళనగా ఉన్నట్టు కనబడుతోంది. ఒకవేళ అదే నిజమైతే ఈ సమస్యను అధిగమించడానికి స్వల్పకాలిక, దీర్ఘకాలిక పరిష్కారాలు ఉన్నాయి. మన దేశంలో ప్రజల దగ్గర, దేవాలయాలు, లాకర్లలో పెద్ద మొత్తంలో ఉన్న బంగారాన్ని మార్పిడి చేయడం ద్వారా దిగుమతులను గణనీయంగా తగ్గించవచ్చ''ని అశోక్ సోంతాలియా పేర్కొన్నారు.నిశితంగా పరిశీలిస్తున్నాంబంగారం కొనుగోళ్లు హఠాత్తుగా నిలిచిపోతే కోట్లాది మంది ఉపాధికి విఘాతం కలుగుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని అశోక్ సోంతాలియా చెప్పారు. తమ ప్రతిపాదనను వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని అనుకోవడం లేదని స్పష్టం చేశారు. ప్రధాని ప్రకటన ప్రభావం బంగారం కొనుగోళ్లపై ఎలా ఉంటుందో చూడటానికి రెండు వారాలు వేచి చూస్తామన్నారు. అలాగే పసిడి కొనుగోళ్ల నియంత్రణ ప్రభుత్వం ఎలాంటి విధాన ప్రకటన చేస్తుందో చూడాలన్నారు. ఈ రెండు అంశాలను వారం పది రోజుల పాటు నిశితంగా గమనిస్తామన్నారు.చదవండి: ఓబీసీ క్రిమిలేయర్ కిరికిరి తేలింది!పసిడి అమ్మకాల నియంత్రణలో నరేంద్ర మోదీ సర్కారు సమగ్ర దృక్పథంతో వ్యవహరిస్తుందన్న నమ్మకాన్ని అశోక్ సోంతాలియా (Ashok Sonthalia) వ్యక్తం చేశారు. దేశ ప్రయోజనాలతో పాటు నగల పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న వారి ఉపాధిని దెబ్బతీయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు. ఆభరణాల పరిశ్రమ కూడా నష్టపోకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.జీజేసీ అభ్యంతరంకాగా, పుత్తడి కొనుగోళ్లను నియంత్రించాలన్న ప్రధాని మోదీ ప్రకటనపై అఖిల భారత రత్నాలు, ఆభరణాల మండలి (జీజేసీ) అభ్యంతరం వ్యక్తం చేసింది. బంగారం అమ్మకాలు తగ్గితే ప్రత్యక్షంగా, పరోక్షంగా కోట్లాది మందికి ఉపాధి కరవుతుందని ఆందోళన చెందింది. అనేక రంగాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని, దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా భారం పడే అవకాశం ఉందని అభిప్రాయపడింది. బ్యాంకింగ్, బీమా, ఆర్థిక సేవల రంగాలతో పాటు లాజిస్టిక్స్, జ్యుయెల్లరీ డిజైన్, ఈ- కామర్స్ తదితర రంగాలు కూడా దెబ్బతింటాయని అంచనా వేసింది. విదేశీ వద్దు.. స్వదేశీ ముద్దుఅమెరికా- ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇంధన విపత్తు నెలకొందని, దీన్ని అధిగమించడానికి దేశ ప్రజలకు 7 రకాల చర్యలను ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. వర్క్ ఫ్రం హోమ్, బంగారం కొనుగోళ్ల నిలిపివేత, ప్రజా రవాణా వాడకం, పరిమితంగా వంట నూనెలు, విదేశీ వస్తువుల వినియోగం, సేంద్రియ వ్యవసాయం, విదేశీ పర్యటనల రద్దు వంటి అంశాలను ప్రధాని ప్రస్తావించారు. Nation First Duty Above Comfort!PM @narendramodi gave 7 important appeals to strengthen India during challenging global times prioritize work from home wherever possible, reduce fuel consumption, avoid foreign travel for a year, adopt Swadeshi products, cut down cooking oil… pic.twitter.com/jhDGYTarH6— MyGovIndia (@mygovindia) May 10, 2026 -
స్టాక్ మార్కెట్ క్రాష్: రూ.10 లక్షల కోట్లు ఆవిరి!
భారతీయ స్టాక్ మార్కెట్కు ఈ రోజు 'బ్లాక్ ట్యూస్డే'గా మారింది. ఒక్కరోజులోనే భారీ స్థాయిలో అమ్మకాల ఒత్తిడి రావడంతో దలాల్ స్ట్రీట్లో తీవ్ర పతనం చోటు చేసుకుంది. సెన్సెక్స్ 1,450 పాయింట్లకుపైగా కుప్పకూలడంతో, పెట్టుబడిదారుల సంపదలో సుమారు రూ.10 లక్షల కోట్ల నష్టం జరిగింది. ఉదయం వరకు స్థిరంగా కనిపించిన మార్కెట్.. మధ్యాహ్నానికి పూర్తిగా నష్టాల్లోకి జారిపోవడం పెట్టుబడిదారుల్లో భయాందోళనలు పెంచింది. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 467 లక్షల కోట్ల నుంచి రూ. 456.9 లక్షల కోట్లకు పడిపోయింది.ఈ భారీ పతనానికి ప్రధాన కారణం పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. మధ్యప్రాచ్య కాల్పుల విరమణ ఒప్పందం ప్రమాదంలో ఉందని ఆయన హెచ్చరించడంతో.. మళ్లీ యుద్ధ భయం పెరిగింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి పెరిగి, భారత మార్కెట్ కూడా దాని ప్రభావాన్ని ఎదుర్కోవలసి వచ్చింది.అంతేకాకుండా.. ముడి చమురు ధరలు బ్యారెల్కు 100 డాలర్లకు పైగా కొనసాగుతుండటం కూడా భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతోంది. రూపాయి విలువ చరిత్రాత్మక కనిష్ఠ స్థాయికి పడిపోవడం విదేశీ పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగించింది. ఫలితంగా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) భారీగా షేర్లను అమ్ముతూ భారత మార్కెట్ నుంచి డబ్బును వెనక్కి తీసుకుంటున్నారు. మార్చి నెలలోనే వారు రూ.1 లక్ష కోట్లకు పైగా పెట్టుబడులను ఉపసంహరించుకోవడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది.పలు రంగాల షేర్లు ఈ పతనంలో తీవ్రంగా దెబ్బతిన్నాయి. బ్యాంకింగ్ రంగంలో ద్రవ్యోల్బణ ప్రభావంతో రుణాలు తిరిగి రాకపోవచ్చనే భయాలు కనిపించాయి. ఐటీ రంగంలో టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు భారీ పతనాన్ని చూశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి పెద్ద కంపెనీలు కూడా చమురు ధరల అస్థిరత కారణంగా నష్టాలను చవిచూశాయి.మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పశ్చిమాసియా సంక్షోభం ఇలాగే కొనసాగితే, భారత మార్కెట్పై మరింత ఒత్తిడి కొనసాగే అవకాశం ఉంది. సరఫరా వ్యవస్థ దెబ్బతింటే దేశ ఆర్థిక వృద్ధి కూడా మందగించే ప్రమాదం ఉందని బ్రోకరేజ్ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో భయం, అనిశ్చితి, పెట్టుబడిదారుల నమ్మకం కోల్పోవడం వంటి అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.ఇదీ చదవండి: ఉద్యోగులపై నిఘా.. యువతి ఫైర్ (వీడియో) -
మోదీ మాట.. అదే బాటలో ఐటీ కంపెనీలు!
కరోనా విపత్తు రోజుల మాదిరి తిరిగి వర్క్ ఫ్రమ్ హోమ్ (డబ్ల్యూఎఫ్హెచ్) విధానానికి మళ్లాలంటూ ప్రధాని మోదీ పిలుపునిచ్చిన మర్నాడే ఐటీ పరిశ్రమల సంఘం నాస్కామ్ ఇందుకు అనుకూలంగా స్పందించింది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఐటీ కంపెనీలు రిమోట్ లేదా హైబ్రిడ్ వర్క్ నమూనా (కొన్ని రోజులు కార్యాలయం, కొన్ని రోజులు ఇంటి నుంచి)కు వీలుగా చర్యలు చేపడుతున్నట్టు ప్రకటించింది. ఉద్యోగ విధులు, కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వర్క్ ఫ్రమ్ హోమ్, ఆఫీస్లో పనిచేసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది.‘‘పశ్చిమాసియా ఘర్షణల నేపథ్యంలో కంపెనీలు క్యాంపస్లలో ఇంధన నిర్వహణకు సంబంధించి చర్యలు తీసుకుంటున్నాయి. అవసరం లేని వసతుల వినియోగాన్ని క్రమబద్దీకరించుకుంటున్నాయి. అవసరానికి అనుగుణంగా రిమోట్, హైబ్రిడ్ పని నమూనాలతో ఇంధన వినియోగాన్ని తగ్గించుకుంటున్నాయి’’అని నాస్కామ్ తన ప్రకటనలో తెలిపింది. పశ్చిమాసియా పరిణామాలను గమనిస్తున్నామని.. పరిశ్రమ భాగస్వాములు, ప్రభుత్వంతో సంప్రదిస్తూ, సమన్వయంతో దీన్ని అధిగమిస్తామని పేర్కొంది.నాస్కామ్లో 3,500 ఐటీ కంపెనీలు సభ్యులుగా ఉన్నాయి. ప్రధాని మోదీ ఆదివారం హైదరాబాద్లో ఒక కార్యక్రమంలో భాగంగా ప్రజలకు కొన్ని అంశాలపై పిలుపునివ్వడం తెలిసిందే. కరోనా సమయంలో అనుసరించిన వర్చువల్ (ఆన్లైన్) సమావేశాలు, సదస్సులతోపాటు వర్క్ ఫ్రమ్ హోమ్కు మళ్లాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. -
ఇంధన నిల్వలున్నాయి, కానీ.. : పెట్రోలియం మంత్రి కీలక సంకేతాలు
కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇంధన కొరత లేదంటూనే పెంపు సంకేతాలిచ్చారు. మే 12ననిర్వహించిన 'CII వార్షిక బిజినెస్ సమ్మిట్-2026'లో దేశంలోని ఇంధన నిల్వలు, ధరల పెరుగుదలపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఇంధన కొరత లేదని మంత్రి స్పష్టం చేశారు. అయితేనాలుగేళ్లుగా ఇంధన పెంచలేదు, ధరలు పెరగబోవని చెప్పడం లేదంటూ మెలిక పెట్టడం చర్చకు దారి తీసింది.అయిదు రాష్ట్రాల ఎన్నికల తరువాత వంట గ్యాస్, పెట్రోవాత తప్పదనే వివిధ అంచాలన మధ్య దేశంలో ఎక్కడా ఇంధన కొరత లేదని స్పష్టం చేస్తూ, ప్రభుత్వం LPG ఉత్పత్తిని గతంలో ఉన్న సుమారు 35,000 టన్నుల నుండి 54,000 టన్నులకు పెంచిందని కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. పెరిగే అవకాశం లేకపోలేదంటూ సంకేతాలు ఇచ్చారు. మరోవైపు ఇటీవలే ముగిసిన రాష్ట్ర ఎన్నికల కారణంగా ప్రభుత్వం ధరల సవరణను వాయిదా వేసిందన్న ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు.నాలుగేళ్లుగా పెంచలేదుపెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు ,ప్రపంచ మార్కెట్ అస్థిరత ఉన్నప్పటికీ, గత నాలుగేళ్లుగా రిటైల్ ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయని మంత్రి స్పష్టంగా పేర్కొన్నారు. ప్రపంచంలో అలా చేయని ఏకైక దేశం మనదే అని కూడా ప్రకటించారు. ధరలు 50 నుండి 60 శాతం వరకు పెరిగిన అనేక దేశాల మాదిరిగా కాకుండా, భారతదేశం పరిస్థితిని సమర్థవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు. అయినా పెరగవని తాను చెప్పడంలేదంటూ బాంబు పేల్చారు. దీనికి తోడు ఇటీవల ప్రధాని మోదీ డీజిల్, పెట్రోల్ వాడకాన్ని తగ్గించుకోవాలని, పొదుపుగా వాడాలని సూచించడం ప్రమాద హెచ్చరికగా అందరూ భావిస్తున్నారు.రాష్ట్ర ఎన్నికల కారణంగానే ధరల పెంపును వాయిదా వేస్తున్నారనే వాదనను ఆయన తోసిపుచ్చారు. ధరల నిర్ణయానికి, ఎన్నికలకు సంబంధం లేదని స్పష్టం చేశారు.మన దగ్గర 60 రోజులకు సరిపడా ముడి చమురు, 60 రోజులకు సరిపడా LNG, 45 రోజులకు సరిపడా LPG నిల్వలు ఉన్నాయని కేంద్ర మంత్రి వివరించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందనే సంకేతాలిచ్చారు. ప్రస్తుతం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) రోజుకు రూ. 1,000 కోట్ల నష్టాన్ని చవిచూస్తున్నాయని, వినియోగదారులపై భారం పడకుండా ఉండటానికి కంపెనీలు ఈ నష్టాన్ని భరిస్తున్నాయని తెలిపారు. గతేడాది ఆర్జించిన లాభాలన్నీ ప్రస్తుత పరిస్థితుల వల్ల తుడిచిపెట్టుకుపోతున్నాయని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: రూ. లక్ష కోట్ల నష్టం, పెట్రోలు పొదుపు : మోదీ విజ్ఞప్తిలోని మర్మం ఇదేనా?సముద్ర మంథన్ స్కీమ్ ద్వారా దేశీయంగా చమురు ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని మంత్రి వెల్లడించారు. చమురు అన్వేషణ మరియు ఉత్పత్తి కోసం నిధుల కేటాయింపుపై ఆర్థిక శాఖతో చర్చలు తుది దశలో ఉన్నాయన్నారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 90 రోజులకు సరిపడా నిల్వలను కలిగి ఉండాలని, ఆ దిశగా అదనపు స్టోరేజ్ సామర్థ్యాన్ని పెంచుతున్నామని ఆయన చెప్పారు. ఇదీ చదవండి : అంబానీ చిన్నకోడలు, వెనిస్ బినాలే లుక్,స్పెషల్ ఏంటంటే?కాగా అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం మూడో నెలకు చేరుకుంది. శాంతి ప్రయత్నాల్లో భాగంగా ఇరాన్ ఇచ్చిన ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మే 10న తిరస్కరించడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై పడనుందనే ఆందోళన నెలకొంది. ఇదీ చదవండి: ‘ప్రధాని విమానాన్ని అమ్మేయండి’ -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1,456.04 పాయింట్లు లేదా 1.92 శాతం నష్టంతో 74,559.24 వద్ద, నిఫ్టీ 436.30 పాయింట్లు లేదా 1.83 శాతం నష్టంతో 23,379.55 వద్ద నిలిచాయి.బటర్ఫ్లై గాంధీమతి అప్లయన్సెస్ లిమిటెడ్, ఏషియన్ స్టార్ కంపెనీ లిమిటెడ్, జాగల్ ప్రీపెయిడ్ ఓషన్ సర్వీసెస్ లిమిటెడ్, సెమాక్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్, సాస్కెన్ టెక్నాలజీస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. డైనమిక్ కేబుల్స్ లిమిటెడ్, ప్రేమ్కో గ్లోబల్ లిమిటెడ్, జీఏసీఎం టెక్నాలజీస్ లిమిటెడ్, మనోరమ ఇండస్ట్రీస్ లిమిటెడ్, రీగల్ రిసోర్సెస్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
ఉద్యోగులపై నిఘా.. యువతి ఫైర్ (వీడియో)
భారతదేశంలో ఉద్యోగ సంస్కృతి మరింత కఠినమైపోతోందని, కొన్ని సంఘటనల ద్వారా తెలుస్తోంది. ఉద్యోగులు సరిగ్గా పనిచేయడం లేదని కంపెనీలు ఆరోపిస్తుంటే.. సంస్థలు ఉద్యోగులపై తీవ్రమైన ఒత్తిడిని తెస్తున్నాయని ఎంప్లాయిస్ చెబుతున్నారు. ఈ తరుణంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో.. నెట్టింట హల్చల్ చేస్తోంది.గుర్లీన్ అనే మహిళకు, ఒక సంస్థ వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగ అవకాశాన్ని కల్పించినప్పటికీ.. కంపెనీ కఠినమైన పర్యవేక్షణ విధానాల కారణంగా తిరస్కరించింది. ఈ సంఘటన ఆధునిక ఉద్యోగ సంస్కృతి, ఉద్యోగుల గోప్యత, మరియు రిమోట్ వర్క్ భవిష్యత్తుపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది.గుర్లీన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆ కంపెనీ ఉద్యోగులు పని చేస్తున్నంతసేపు కెమెరా (వెబ్క్యామ్) ఎప్పుడూ ఆన్లో ఉంచాలని నిబంధన పెట్టింది. అంతేకాకుండా.. ప్రతి 10 నిమిషాలకు ఉద్యోగి కంప్యూటర్ స్క్రీన్షాట్ తీసి పనితీరును కూడా సంస్థ పరిశీలిస్తుందని వెల్లడించింది.ఉద్యోగులపై ఇలాంటి నిరంతర నిఘా చాలా అసౌకర్యంగా అనిపిస్తుందని, ఒత్తిడి కలిగిస్తున్నదని గుర్లీన్ పేర్కొన్నారు. ఈ విధంగా ఉద్యోగికి శిక్షలాగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. View this post on Instagram A post shared by Gurleen (@sprinkleofgurleen_)వర్క్-ఫ్రం-హోమ్ విధానం అసలు ఉద్దేశం.. ఉద్యోగులకు సౌకర్యం, స్వేచ్ఛ, సమతుల్య జీవనశైలిని అందించడం. కానీ ఇలాంటి కఠినమైన పర్యవేక్షణ వల్ల ఉద్యోగులు భయంతో పనిచేయాల్సి వస్తుంది. ఇది మానసిక ఒత్తిడిని పెంచి, ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే అవకాశం ఉంది. సంస్థలు మనుషులను నియమించుకుంటున్నాయా? లేక రోబోలను నియమించుకుంటున్నాయా? అని ఆమె ప్రశ్నించారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఉద్యోగులపై అధిక నిఘా పెట్టడం అనేది నమ్మకంలేని పని సంస్కృతికి సంకేతమని కొందరు అభిప్రాయపడ్డారు. మరికొందరు.. ఇంటి నుంచే పని చేసే ఉద్యోగాలు కార్యాలయంలో పని చేసే ఉద్యోగాల కంటే ఎక్కువ ఒత్తిడిగా మారుతున్నాయని పేర్కొన్నారు. మరికొందరు కంపెనీల విధానాలను సమర్ధించారు.ఇదీ చదవండి: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతోంది! -
ఈసారి రేట్ల పెంపు తప్పదా?
భారత ఆర్థిక వ్యవస్థకు ద్రవ్యోల్బణ సెగ తగలనుందా? రాబోయే కాలంలో సామాన్యుడిపై వడ్డీ భారాలు మరింత పెరగనున్నాయా? అంటే అవుననే అంటున్నాయి తాజా ఆర్థిక విశ్లేషణలు. అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ఇంధన ధరలు, అస్థిరంగా మారుతున్న వాతావరణ పరిస్థితుల (ఎల్ నినో) నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన కఠిన ద్రవ్య పరపతి విధానాన్ని కొనసాగించే అవకాశం ఉందని ప్రముఖ గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ హెచ్ఎస్బీసీ వెల్లడించింది. 2027 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ రెండు దఫాలుగా వడ్డీ రేట్లను పెంచవచ్చని ఈ నివేదిక స్పష్టం చేసింది.ద్రవ్యోల్బణం గుప్పిట్లో వృద్ధి రేటుద్రవ్యోల్బణ భయాలు గడిచిన కొద్దికాలంగా మార్కెట్లను వెంటాడుతున్నాయి. ముఖ్యంగా ఇంధన ధరలు, వాతావరణ మార్పుల వల్ల ఏర్పడే అంతరాయాలు ఆర్థిక వృద్ధిని మందగింపజేస్తాయని నివేదిక పేర్కొంది. ‘2027 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం సగటున 5.6 శాతంగా నమోదయ్యే అవకాశం ఉంది. ఎల్ నినో వాతావరణ పరిస్థితుల వల్ల ఆహార ద్రవ్యోల్బణానికి అదనంగా 0.5% (50 బేసిస్ పాయింట్లు) తోడయ్యే ప్రమాదం ఉంది’ అని తెలిపింది.‘శక్తి వనరులు, ఎల్ నినో షాక్ల కలయిక వల్ల 2027 ఆర్థిక సంవత్సరం సవాలుగా మారనుంది. ఈ క్రమంలో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ఆర్బీఐ 2026-27 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేట్లను పెంచి రెపో రేటును 5.75 శాతానికి(ప్రస్తుతం 5.25గా ఉంది) చేర్చే అవకాశం ఉంది’ అని హెచ్ఎస్బీసీ నివేదిక పేర్కొంది.ఆహార భద్రత - వాతావరణ సవాళ్లుగత పదేళ్ల సగటు ఉష్ణోగ్రతలతో పోలిస్తే రాబోయే కాలంలో ఉష్ణోగ్రతలు పెరిగితే అది నేరుగా పంట దిగుబడిపై ప్రభావం చూపుతుంది. 2026 తర్వాత ఎల్ నినో పరిస్థితులు బలపడితే ఆ ప్రభావం 2027లో ఆహార ధరల పెరుగుదలకు దారితీస్తుంది. అయితే, ప్రస్తుతం భారత ప్రభుత్వ గిడ్డంగుల్లో ఉన్న అధిక ఆహార ధాన్యాల నిల్వలు కొంతవరకు ఉపశమనాన్ని కలిగించవచ్చని నివేదిక ఆశాభావం వ్యక్తం చేసింది.విధాన రూపకర్తలకు పరీక్షఆర్బీఐ ఒకవైపు పెరుగుతున్న ధరలను అదుపు చేయాలి. మరోవైపు మందగిస్తున్న వృద్ధిని పరుగులు పెట్టించాలి. గ్రామీణ గృహాలు, చిన్న వ్యాపారాలపై ఈ ధరల పెరుగుదల ప్రభావం తీవ్రంగా ఉండనుంది.వృద్ధి మందగిస్తున్న సమయంలో వడ్డీ రేట్లు పెంచడం వల్ల పెట్టుబడులు తగ్గే ప్రమాదం ఉంటుంది. అయినప్పటికీ, ద్రవ్యోల్బణం నియంత్రణకే ఆర్బీఐ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది.ఇదీ చదవండి: కొలువు తీరిన కొంత కాలానికే ఇంటికి! -
వీఐపీ సంస్కృతిపై నిరసన
పెరుగుతున్నచమురు ధరలు, రవాణా కష్టాల నేపథ్యంలో సామాన్య పౌరుడి అసహనం కట్టలు తెంచుకుంటోంది. ఒకవైపు చమురు వినియోగాన్ని తగ్గించాలని, విలాసాలకు దూరంగా ఉండాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంటే, మరోవైపు క్షేత్రస్థాయిలో సామాన్యులు కనీస ప్రయాణ సౌకర్యాల కోసం పశువుల్లా కొట్టుకోవాల్సి వస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో ఈ చర్చను మరోసారి తీవ్రతరం చేసింది.‘మేము ఇంధనాన్ని వృధా చేయడం లేదు'సోషల్ మీడియా వేదిక ఎక్స్(గతంలో ట్విట్టర్) వేదికగా అనురాధ తివారీ అనే యూజర్ షేర్ చేసిన వీడియో ఇప్పుడు చర్చనీయాంశమైంది. కిక్కిరిసిన రైలులోకి ప్రవేశించడానికి ప్రయాణికులు ప్రాణాలకు తెగించి పోరాడుతున్న దృశ్యాలను ఆమె పోస్ట్ చేశారు. ‘సామాన్య ప్రజలు ఇంధనాన్ని వృధా చేయడం లేదు. ఎన్నికల ర్యాలీలు, కిలోమీటర్ల పొడవున వీఐపీ కాన్వాయ్ల్లో, వందలాది కార్లతో ఇంధనాన్ని వృధా చేసేది రాజకీయ నాయకులే. ఈ వీఐపీ సంస్కృతికి స్వస్తి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది’ అని ఆమె ఘాటుగా స్పందించారు.ప్రజల అసహనంచమురు దిగుమతులను తగ్గించి, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసే క్రమంలో.. ప్రజలు ఇంధనాన్ని పొదుపు చేయాలని, వీలైతే వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అనుసరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల పిలుపునిచ్చారు. అయితే, ప్రభుత్వ విజ్ఞప్తులు కేవలం సామాన్యులకేనా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.సోషల్ మీడియా స్పందనలు‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకునే మన దేశంలో సామాన్యులను పశువుల్లాగా, ఉన్నత వర్గాలను రాజుల్లా చూస్తున్నారు’ అని ఒక యూజర్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను ప్రత్యక్ష, పరోక్ష పన్నులు సక్రమంగా చెల్లిస్తున్నాను. ప్రతిఫలంగా నా కుటుంబంతో ఇలాంటి నరకప్రాయమైన ప్రయాణం చేయాలా?’ అని మరొకరు నిలదీశారు. వీఐపీ సంస్కృతిని రద్దు చేయడంతోపాటు రాజకీయ నాయకులను సేవకులుగా చూసేలా ప్రజాస్వామ్య వ్యవస్థలో మార్పు రావాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.Common people are not the ones wasting fuel. They are struggling just to survive.It’s politicians who waste fuel with hundreds of cars in election rallies & long VIP convoys.Time to end this entire VIP culture ! pic.twitter.com/XesgTlZa39— Anuradha Tiwari (@talk2anuradha) May 11, 2026వాస్తవ పరిస్థితులు - సవాళ్లువార్తా విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, దేశంలో ప్రజా రవాణా వ్యవస్థపై ఒత్తిడి విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా భారతీయ రైల్వేలో జనరల్, స్లీపర్ క్లాస్ బోగీల సంఖ్య తగ్గిపోవడం, రద్దీ పెరగడం సామాన్యులకు శాపంగా మారింది. అభివృద్ధి చెందిన దేశాల్లో మంత్రులు, ఉన్నతాధికారులు సైతం సామాన్య ప్రజలతో కలిసి రైళ్లలో ప్రయాణించే సంప్రదాయం ఉంది. మన దేశంలో మాత్రం వీఐపీ అంటేనే ప్రత్యేకమైన ప్రోటోకాల్, సామాన్యులకు ఇబ్బంది కలిగించే ట్రాఫిక్ ఆంక్షలుగా మారిపోయింది. ఇంధన పొదుపు మంత్రం కేవలం సామాన్యుడికే కాకుండా, పాలకులకు కూడా వర్తించినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్నది మేధావులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: కొలువు తీరిన కొంత కాలానికే ఇంటికి! -
నిధుల సమీకరణే మార్గం
భారతదేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి, వనరులను సమర్థవంతంగా పునర్నిర్మించడానికి మెరుగైన బాండ్ మార్కెట్ అభివృద్ధి అత్యవసరమని 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ ప్రెసిడెంట్ ఎన్కే సింగ్ స్పష్టం చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన, దేశ వృద్ధి పథంలో బ్యాంకింగ్ రంగం పోషించాల్సిన పాత్ర, మౌలిక సదుపాయాల రంగానికి అవసరమైన నిధుల సమీకరణపై విశ్లేషణ చేశారు.మౌలిక సదుపాయాల రంగానికి ఊతంప్రస్తుతం మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అవసరమైన భారీ నిధుల కోసం ప్రధానంగా వాణిజ్య బ్యాంకులపైనే భారం పడుతున్నారు. దీనివల్ల బ్యాంకుల వద్ద ఉండాల్సిన నగదు నిల్వలు దీర్ఘకాలిక ప్రాజెక్టులలో చిక్కుకుపోతున్నాయి. మెరుగైన బాండ్ మార్కెట్ అందుబాటులోకి వస్తే మౌలిక సదుపాయాల రంగానికి అవసరమైన దీర్ఘకాలిక ఫైనాన్సింగ్ అక్కడి నుంచే లభిస్తుందని సింగ్ చెప్పారు. దీనివల్ల వాణిజ్య బ్యాంకులు తమ వనరులను ఇతర ప్రాధాన్యత కలిగిన బ్యాంకింగ్ కార్యకలాపాలకు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రుణాలకు మళ్లించే వీలుంటుందన్నారు.‘మౌలిక సదుపాయాలకు నిధులు సమకూర్చడానికి బాండ్ మార్కెట్ను ఉపయోగించుకోవాలి. అప్పుడే వాణిజ్య బ్యాంకులు తమ ప్రధాన బ్యాంకింగ్ రుణ కార్యకలాపాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించగలవు’ అని ఎన్కే సింగ్ పేర్కొన్నారు.బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలుకేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రకటించిన కొత్త బ్యాంకింగ్ కమిటీ ఏర్పాటును సింగ్ స్వాగతించారు. భారత ఆర్థిక వ్యవస్థలో బ్యాంకులు కేవలం రుణదాతలుగానే కాకుండా ఆర్థిక మధ్యవర్తులుగా కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ‘బ్యాంకింగ్ రంగంలో సంస్కరణల ద్వారా పెట్టుబడి వ్యయాన్ని తగ్గించి, సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అమల్లో ఉన్న కొన్ని పాత నిబంధనల వల్ల భారీగా నిధులు స్తంభించిపోతున్నాయి. వీటిని కమిటీ పునసమీక్షించాలి’ అని సూచించారు.ఇదీ చదవండి: కొలువు తీరిన కొంత కాలానికే ఇంటికి! -
సాయంత్రం 6 దాటితే అపరాధ భావం
ఆఫీసు పని అయిపోయింది.. గడియారం ఆరు దాటింది.. కానీ సీటులోంచి లేవాలంటే ఏదో తెలియని భయం. ‘అప్పుడే వెళ్లిపోతున్నావా?’ అని బాస్ అడుగుతాడేమో అన్న సందేహం. రోజంతా కష్టపడి పని చేసినా, ఉదయం ఆఫీస్కు త్వరగా వచ్చినా.. సమయానికి ఇంటికి బయలుదేరితే ‘హాఫ్ డేనా?’ అంటూ సెటైర్లు. ఇదీ సగటు భారతీయ ఉద్యోగి నిత్యం ఎదుర్కొనే మానసిక ఒత్తిడి. సరిగ్గా ఇదే అంశంపై ‘24 నార్త్ స్టార్’ వ్యవస్థాపకురాలు నిస్తా త్రిపాఠి చేసిన లింక్డ్ఇన్ పోస్ట్ ఇప్పుడు కార్పొరేట్ వర్గాల్లో చర్చకు దారితీసింది.యూరప్లో.. భారత్లో..నిస్తా త్రిపాఠి తన పోస్ట్లో భారత్, యూరప్ దేశాల పని సంస్కృతి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎత్తిచూపారు. ఆమె విశ్లేషణ ప్రకారం..యూరోపియన్ స్టైల్: యూరప్ దేశాల్లోని ఆఫీస్ ఉద్యోగులు సాయంత్రం 5 గంటలకే ఎటువంటి సంకోచం లేకుండా ‘రేపు కలుద్దాం’ అని సిస్టమ్స్ లాగ్ ఆఫ్ చేస్తారు. గడువులోగా పనులు పూర్తి చేయడంలో వారు ఏమాత్రం వెనుకబడరు. కానీ పని గంటల తర్వాత వ్యక్తిగత జీవితానికి ప్రాముఖ్యత ఇస్తారు.భారతీయ విధానం: ఇక్కడ ఉద్యోగి ఎంత సామర్థ్యంతో పని చేశాడనే దానికంటే, ఎన్ని గంటలు ఆఫీసులో కూర్చున్నారనే దాన్ని బట్టే వారి అంకితభావాన్ని కొలుస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.పెరుగుతున్న అసహనంభారతీయ బహుళజాతి కంపెనీల్లో (ఎంఎన్సీ) పనిచేసే వారు ఎదుర్కొంటున్న మరో ప్రధాన సమస్య టైమ్ జోన్. అమెరికా, యూరప్ క్లయింట్ల కోసం భారతీయ కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు కూడా మీటింగ్లకు హాజరుకావాల్సి వస్తోంది. దీనివల్ల ఉద్యోగుల వ్యక్తిగత సమయం హరించుకుపోతోందని, 24/7 అందుబాటులో ఉండటం వల్ల ఉత్పాదకత పెరగకపోగా ఉద్యోగుల్లో అసహనం పెరుగుతోందని త్రిపాఠి పేర్కొన్నారు. ‘కంపెనీలు తమ సమయాన్ని, శక్తిని కాపాడుకునే వ్యక్తులను గౌరవించడం నేర్చుకోవాలి’ అని చెప్పారు.ఏం చేయాలంటే..కొత్త తరం ఉద్యోగులు ఇప్పుడు స్మార్ట్ వర్క్ వైపు మొగ్గు చూపుతున్నారు. సంస్థలు తమ పని సంస్కృతిని మార్చుకోకపోతే మేధో వలసలు పెరిగే ప్రమాదం ఉందని ఈ చర్చ హెచ్చరిస్తోంది. ఒక ఉద్యోగి సంతోషంగా ఇంటికి వెళ్లినప్పుడే, మరుసటి రోజు రెట్టింపు ఉత్సాహంతో పని చేయగలడని కార్పొరేట్ దిగ్గజాలు గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది.ఇదీ చదవండి: కొలువు తీరిన కొంత కాలానికే ఇంటికి! -
సెగ పుట్టిస్తున్న పసిడి.. వెండి మళ్లీ రికార్డు దిశగా..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
620 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:56 సమయానికి నిఫ్టీ(Nifty) 171 పాయింట్లు తగ్గి 23,648 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 621 పాయింట్లు నష్టపోయి 75,397 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.11బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 104.9 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.42 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.19 శాతం పెరిగింది.నాస్డాక్ 0.1 శాతం పుంజుకుంది.Today Nifty position 12-05-2026(time: 09:56 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
కొలువు తీరిన కొంత కాలానికే ఇంటికి!
అంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్లో ఇప్పుడు చర్చంతా ‘జెన్ జీ’ గురించే. 1997 నుంచి 2012 మధ్య జన్మించి, ప్రస్తుతం కెరీర్ ప్రారంభించిన ఈ యువతరంపై కార్పొరేట్ ప్రపంచం భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తోంది. పుట్టినప్పటి నుంచే టెక్నాలజీతో సాన్నిహిత్యం ఉన్న ఈ తరంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కంపెనీలకు క్షేత్రస్థాయిలో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తాజాగా వెలువడిన నివేదికలు విస్తుపోయే నిజాలను బయటపెడుతున్నాయి.మూణ్ణాళ్ల ముచ్చటేనా?ప్రముఖ విద్యా, కెరీర్ సలహా సంస్థ ‘ఇంటెలిజెంట్’ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం.. 60 శాతం మంది యజమానులు తాము నియమించుకున్న జెన్ జీ ఉద్యోగులను కేవలం కొద్ది నెలల్లోనే తొలగించారు. దాదాపు 1,000 మంది హైరింగ్ మేనేజర్ల అభిప్రాయాలను సేకరించగా ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.కొత్త గ్రాడ్యుయేట్లను నియమించుకోవడానికి ప్రతి ఆరుగురు యజమానుల్లో ఒకరు వెనకాడుతున్నారు.పనితీరు బాగోలేని 79% మంది జెన్ జీ ఉద్యోగులకు శిక్షణ (పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్) ఇచ్చినప్పటికీ అందులో 60% మంది చివరకు ఉద్యోగాలు కోల్పోయారు.74% మంది మేనేజర్లు ఇతర తరాల వారితో పోలిస్తే జెన్ జీతో పనిచేయడం అత్యంత కష్టమని సర్వేలో చెప్పారు.ఉద్వాసనకు దారితీస్తున్న ప్రధాన కారణాలుకారణంశాతం (సుమారుగా)చొరవ చూపకపోవడం50%ప్రొఫెషనలిజం లోపం46%బలహీనమైన కమ్యూనికేషన్ స్కిల్స్39%విమర్శలను తట్టుకోలేకపోవడం38%సమస్య పరిష్కార సామర్థ్యం లేకపోవడం34%వారానికి 20% మంది ఆలస్యంగా ఆఫీసుకు రావడం, కార్యాలయానికి తగని దుస్తులు ధరించడం, పని ఒత్తిడిని తట్టుకోలేకపోవడం వంటివి యజమానులను కలవరపెడుతున్నాయి.'స్నోఫ్లేక్' సిండ్రోమ్.. ఫీడ్బ్యాక్ అంటేనే భయం!యజమానులు ప్రధానంగా ఫిర్యాదు చేస్తున్న మరో అంశం.. విమర్శలను స్వీకరించలేకపోవడం. మేనేజర్లు ఇచ్చే నిర్మాణాత్మకమైన సలహాలను కూడా వీరు వ్యక్తిగత విమర్శలుగా భావిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. అందుకే వీరిని సోషల్ మీడియాలో ‘స్నోఫ్లేక్’ అని పిలుస్తున్నారు. అంటే చిన్న విషయాలకే కుంగిపోయే మనస్తత్వం కలవారని అర్థం. తమ తొలగింపు ఉదంతాలను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో షేర్ చేస్తూ కొందరు సానుభూతి పొందుతుంటే, మరికొందరు ఆఫీస్ కల్చర్ను తప్పుబడుతున్నారు.ఆధారపడటం పెరిగింది.. ఆత్రుత తగ్గింది!బ్యాంక్రేట్ సర్వే ప్రకారం.. దాదాపు 70% మంది జెన్ జీ యువత ఆర్థికంగా ఇంకా తమ తల్లిదండ్రులపైనే ఆధారపడుతున్నారు. దీనివల్ల కెరీర్లో ఎదగాలనే తపన, స్వతంత్రంగా ఉండాలనే ఆత్రుత వారిలో తగ్గడానికి కారణమవుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. తల్లిదండ్రులు తమ రిటైర్మెంట్ సేవింగ్స్ ఖర్చు చేస్తూ పిల్లలను ఆదుకోవడం వారి వృత్తిపరమైన ఎదుగుదలకు పరోక్షంగా అడ్డంకిగా మారుతోంది.నాణేనికి మరోవైపుజెన్ జీపై ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ భవిష్యత్తు వారిదే. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రకారం, 2025 నాటికి ప్రపంచ శ్రామిక శక్తిలో 25% పైగా వీరిదే వాటా. టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై వీరికి ఉన్న పట్టు కంపెనీలకు ఎంతో కీలకం. అంతేకాకుండా, కేవలం జీతం కోసమే కాకుండా.. మానసిక ఆరోగ్యం, పని-జీవిత సమతుల్యత కోసం వీరు గళం విప్పుతున్నారు. పాతకాలపు కఠినమైన పని పద్ధతులను సవాలు చేస్తూ మరింత స్నేహపూర్వకమైన పని వాతావరణం కావాలని కోరుకుంటున్నారు.కంపెనీల అంచనాలు, కొత్త తరం ఆలోచనల మధ్య ఉన్న ఈ అంతరాన్ని పూడ్చకపోతే భవిష్యత్తులో నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. జెన్ జీ ఉద్యోగులు వృత్తిపరమైన క్రమశిక్షణను అలవర్చుకోవడంతో పాటు కంపెనీలు కూడా వారి మైండ్సెట్కు తగ్గట్టుగా తమ సంస్కృతిని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఇదీ చదవండి: కరెన్సీ మార్కెట్లో ఆర్బీఐ జోక్యం తగ్గాలి -
భారత్ సొంత ఏఐ ఇన్ఫ్రాను నిర్మించుకోవాలి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వ్యవస్థకు సంబంధించి భారత్ సొంతంగా మౌలిక సామర్థ్యాలను నెలకొల్పాల్సిన అవసరం ఉందని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ పిలుపునిచ్చారు. రాబోయే దశాబ్దాల్లో భౌగోళిక రాజకీయ శక్తిగా ఎదగాలంటే ఇంధన భద్రత, డిజిటల్ ఇన్ఫ్రాలే కీలకమని ఆయన పేర్కొన్నారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నిర్వహించిన వార్షిక వ్యాపార సదస్సు–2026లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయపరమైన విభజనల నేపథ్యంలో దశాబ్దాల నాటి గ్లోబలైజేషన్ భావనలకు కాలం చెల్లుతోందన్నారు.‘సెమీకండక్టర్లు ఇప్పుడు రాజకీయ అస్త్రాలుగా మారాయి. డేటాను జాతీయ వనరుగా భావిస్తున్నారు. క్లౌడ్ ఇన్ఫ్రాను ఆయుధంగా మలచుకుంటున్నారు. ఇక ఏఐ సదుపాయాలను డేటా సెంటర్ల రక్షణ గోడల మాటున నిర్మించుకుంటున్నారు’ అని అదానీ పేర్కొన్నారు. ఇటీవల పశ్చిమాసియాలో ఉద్రిక్తతల సమయంలో డిజిటిల్ మౌలిక సదుపాయాలపై దాడుల గురించి ప్రస్తావిస్తూ... ఇంధన భద్రత, డిజిటల్ భద్రత అనేవి ఏ దేశానికైనా రెండు మూల స్తంభాలుగా మారాయని అభిప్రాయపడ్డారు.‘ఇంధన వనరులను నియంత్రించే దేశ పారిశ్రామిక భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. అలాగే డిజిటల్ కంప్యూటింగ్ను కంట్రోల్ చేసే దేశ మేధోపరమైన భవిష్యత్తుకు తిరుగుండదు. ఈ రెండింటినీ నియంత్రించే దేశమే రాబోయే శతాబ్దాన్ని తీర్చిదిద్దుతుంది’ అని అదానీ తెలిపారు.ఏఐని సాఫ్ట్వేర్గా చూడొద్దు...భారత్ ఏఐని కేవలం ఒక సాఫ్ట్వేర్గా మాత్రమే కాకుండా... ఎనర్జీ, డేటా సెంటర్లు, చిప్లు, నెట్వర్క్లు, కంప్యూటింగ్, ప్రతిభ వంటి రంగాల వ్యాప్తంగా ఒక వ్యూహాత్మక ఇన్ఫ్రాగా పరిగణించాలని అదానీ చెప్పారు. ‘భారత్ తన మేధో భవిష్యత్తు కోసం ఈ ఏఐ ఇన్ఫ్రాను అద్దెకు తీసుకుంటే సరిపోదు. స్వదేశంలోనే సొంతంగా నిర్మించుకోవడంతో పాటు, సామర్థ్యాలను విస్తరించాలి’ అని నొక్కిచెప్పారు. తయారీ, రవాణా, మొబిలిటీ, డిజిటల్ సర్వీసుల వ్యాప్తంగా నెలకొన్న భారీ దేశీ డిమాండ్ అనేది పెద్దయెత్తున ఏఐ, ఎనర్జీ ఇన్ఫ్రా నిర్మాణానికి దోహదం చేస్తోందన్నారు.భారత్లో విద్యుదుత్పత్తి సామర్థ్యం ఇప్పటికే 500 గిగావాట్లను అధిగమించిందని, భవిష్యత్తులో భారత్ ఏఐ ఎకానమీ కోసం విద్యుత్, కంప్యూటింగ్ ఎకోసిస్టమ్లలో భారీ స్థాయి పెట్టుబడులు అవసరమవుతాయని వివరించారు. ఏఐని అవకాశాలను హరించే శక్తిగా కాకుండా ఉత్పాదకతను పెంచేదిగా, ఉద్యోగాలను కల్పించేదిగా, ఎంట్రప్రెన్యూర్లకు చేదోడుగా నిలిచేదిగా, భారతీయులు ప్రపంచవ్యాప్తంగా పోటీపడే సాధనాలుగా రూపొందించాలని అదానీ పేర్కొన్నారు. కాగా, అదానీ గ్రూప్ డేటా సెంటర్ బిజినెస్లో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. భారత్లో అతిపెద్ద గిగావాట్ స్లాయి డేటా సెంటర్ క్యాంపస్ను విశాఖలో నిర్మించేందుకు గూగుల్తో జట్టుకట్టిన విషయాన్ని కూడా అదానీ గుర్తుచేశారు. -
మరోసారి భగ్గుమన్న క్రూడాయిల్ ధరలు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ప్రధాని మోదీ పొదుపు చర్యల గురించి చేసిన వ్యాఖ్యలతో దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం దాదాపు 1.5% పతనమైంది. డాలర్తో మారకంలో రూపాయి (95.28) సరికొత్త జీవితకాల కనిష్టానికి దిగిరావడం, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్ను మరింత బలహీనపరిచాయి. సెన్సెక్స్ 1,313 పాయింట్లు క్షీణించి 76,015 వద్ద ముగిసింది. నిఫ్టీ 360 పాయింట్లు కోల్పోయి 23,816 వద్ద నిలిచింది. సూచీలు దాదాపు 2% పతనంతో స్టాక్ మార్కెట్లో రూ.6 లక్షల కోట్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. ఫార్మా, హాస్పిటల్స్ మినహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. రంగాల వారీగా బీఎస్ఈ ఇండెక్సుల్లో కన్జూమర్ డ్యూరబుల్స్ 3.76%, రియల్టీ 2.74%, పీఎస్యూ బ్యాంక్స్ ఇండెక్స్ 2.28%, ప్రైవేట్ బ్యాంక్స్ ఇండెక్స్ 2.60%, కన్జూమర్ డి్రస్కేషనరీ 2.14%, విద్యుత్ 2.13% పతనమయ్యాయి. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 1.09%, 0.44 శాతం నష్టపోయాయి.విదేశీ మారక నిల్వలు పొదుపు లక్ష్యంగా దేశ ప్రజలు ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను వాయిదా వేయాలని ప్రధాని పిలుపుతో ఆభరణాల షేర్ల అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. కళ్యాణ్ జ్యువెలర్స్ 9.23%, శాన్కో గోల్డ్ 8.61%, త్రిభువన్దాస్ భీంజీ జవేరీ 7.52%, టైటాన్ 6.83%, స్కై గోల్డ్ అండ్ డైమండ్స్ లిమిటెడ్స్ 6.63%, తంగమయిల్ జ్యువెలరీ 5.69%, పీసీ జ్యువెలర్ 4.94 శాతం పతనమయ్యాయి.విదేశీ ప్రయాణాల విషయంలో నియంత్రణ పాటించాలని మోదీ కోరడంతో పర్యాటక, ప్రయాణ సంబంధిత సరీ్వసెస్, ఏవియేషన్ షేర్లు నేలచూపులు చూపాయి. యాత్ర ఆన్లైన్ 5.41%, థామస్ కుక్ 3.88%, ఈజీ ట్రిప్ ప్లానర్స్ 3.27% పతనమయ్యాయి. ఇండిగో 4.94%, స్పైస్జెట్ 4.72% నష్టపోయాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ వాడకాన్ని వీలైనంత తగ్గించుకోవాలని ప్రధాని అభ్యర్థనతో ఎలక్ట్రిక్ వాహన కంపెనీల షేర్లకు డిమాండ్ నెలకొంది. ఏథర్ ఎనర్జీ 6%, జేబీఎం ఆటో 4.75%, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ 2.47%, ఒలక్ట్రా గ్రీన్టెక్ 2.16 శాతం రాణించాయి.నష్టాలకు 4 కారణాలుప్రధాని పొదుపు పిలుపుతో కార్పొరేట్ సంస్థల ఆదాయంతో పాటు దేశ ఆర్థిక వృద్ధి కూడా నెమ్మదించే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే కారణంతో మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతిని సూచీలు ప్రభావితమయ్యాయి.అమెరికా–ఇరాన్ శాంతి చర్చలు విఫలం: పశ్చిమాసియాలో నెలరోజులకు పైగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా పంపిన ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించింది. అందుకు ప్రతిస్పందనగా... లెబనాన్లో యుద్ధాన్ని ఆపాలని, యుద్ధ నష్టపరిహారం చెల్లించాలని, తమపై ఉన్న ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలని ఇరాన్ ఎదురు షరతులు విధించింది. అయితే, ఈ ప్రతిపాదనలు ‘అంగీకరించలేనివి అని అధ్యక్షుడు ట్రంప్ చెప్పడంతో చర్చలు విఫలమయ్యాయి. భగ్గుమన్న క్రూడాయిల్ ధరలు: అమెరికా–ఇరాన్ శాంతి చర్చల వైఫల్యంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా ఎగబాకాయి. బ్రెంట్ క్రూడ్ 4 శాతానికి పైగా పెరిగి బ్యారెల్కు 105 డాలర్ల వద్దకు, నైమెక్స్ క్రూడ్ 3 శాతం వృద్ధితో 98 డాలర్లకు చేరుకుంది. తమ చమురు అవసరాల కోసం 85–90 శాతం దిగుమతులపైనే ఆధారపడే భారత్ వంటి దేశాలకు ఈ పరిణామం పెను సవాలుగా మారింది. పెరిగిన ధరల వల్ల ద్రవ్యోల్బణం ఎగసి దేశ స్థూల ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఆగని విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు: దేశీయ స్టాక్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు ఆగడం లేదు. వరుసగా అయిదో రోజూ నికర అమ్మకందారులుగానే కొనసాగారు. తాజాగా సోమవారం రూ. 8,437.56 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు. ఈ నెల తొలి వారంలోనే రూ. 14,231 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.ఇదీ చదవండి: కరెన్సీ మార్కెట్లో ఆర్బీఐ జోక్యం తగ్గాలి -
పెట్రోల్ రేట్ల పెంపు తప్పదా?
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థలు (ఓఎంసీలు) రోజుకు రూ.1,600–1,700 కోట్ల చొప్పున నష్టపోతున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత నుంచి 10 వారాల్లో వీటి నష్టం రూ.లక్ష కోట్లకుపైనే ఉంటుందని అంచనా. అంతర్జాతీయంగా చమురు, గ్యాస్ ధరలు గణనీయంగా పెరిగిపోయినప్పటికీ.. దేశీయంగా వాటి ధరలను సవరించకుండా ఓఎంసీలు (బీపీసీఎల్, ఇండియన్ ఆయిల్, హెచ్పీసీఎల్) విక్రయిస్తుండడంతో వాటిపై మోయలేనంత భారం పడుతోంది.ఒకవైపు అధిక ధరలు కొనుగోలు చేసి, తక్కువ ధరలకు విక్రయించాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని కొంత మేర తగ్గించడం తెలిసిందే. తద్వారా నెలకు రూ. 14,000 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోతోంది. లేదంటే ఓఎంసీలపై ఈ నష్టం మరింతగా ఉండేది. అయితే, ఇలా ఎంత కాలం పాటు అవి ఈ స్థాయిలో భారాన్ని మోస్తాయన్న ప్రశ్న ప్రధానంగా వినిపిస్తోంది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత పెట్రోలియం ఉత్పత్తుల విక్రయ ధరలను పెంచొచ్చన్న వార్తలు వినిపించాయి. అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని కేంద్రం స్పష్టం చేసింది. కానీ, పరిస్థితి చూస్తుంటే ఎంతో కొంత ధరలు పెంచక తప్పనిసరి అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిత్యం వేల కోట్ల నష్టం ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో జపాన్, యూకే తదితర దేశాల్లో పెట్రోల్ ధరలను 30 శాతం వరకు పెంచడం గమనార్హం. అయినప్పటికీ సామాన్యులపై ధరల భారం పడరాదన్న కేంద్రం విధానం మేరకు.. ఇక్కడ ఓఎంసీలు గతం నుంచి ఉన్న ధరలకే ఇంధనాన్ని విక్రయిస్తున్నాయి. గ్యాస్ ధరలను అవి కొంత వరకు సవరించినప్పటికీ.. వాటి కొనుగోలు కంటే వసూలు తక్కువగానే ఉంది. ఫలితంగా ఈ సంస్థలకు రోజుకు సుమారు రూ. 1,600 నుండి 1,700 కోట్ల నష్టం వాటిల్లుతోంది.ఓఎంసీలు సొంత ఆదాయంతోనే ముడి చమురు కొనుగోలు, శుద్ధి చేపడుతుంటాయి. రోజురోజుకూ నష్టాలు పెరుగుతుండడంతో ముడి చమురు కొనుగోలు కోసం అవి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధన ధరల పెంపు అనివార్యమని నిపుణులు భావిస్తున్నారు. అయితే, ఎంత మేరకు పెంచాలి, ఎప్పుడు పెంచాలి? అనేది ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉందంటున్నారు. -
2026–27లో 6.6 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: దేశ జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2026–27) 6.6 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని ఎస్బీఐ అధ్యయన విభాగం నివేదిక అంచనా వేసింది. రూపాయి విలువ క్షీణిస్తుండడం, అధిక ముడి చమురు ధరల నేపథ్యంలో బ్యాలన్స్ ఆఫ్ పేమెంట్స్ (బీవోపీ/క్యాడ్)కు సంబంధించి ప్యాకేజీ అవసరమని పేర్కొంది. రూపాయి ఇటీవలి కాలంలో గణనీయంగా నష్టపోవడం తెలిసిందే. డాలర్తో 95 స్థాయి కంటే దిగువకు పడిపోయింది. ‘‘బ్రెంట్ చమురు ధర బ్యారెల్కు 100 డాలర్లు మించిపోవడంతో.. రవాణా, బీమా ఖర్చులు పెరిగిపోయాయి. కనుక బీవోపీ పరిస్థితులను మెరుగుపరిచేందుకు చర్యలు అవసరం. డాలర్తో రూపాయి 95 స్థాయిలోనే కొనసాగితే ఆర్థిక వ్యవస్థ పరిమాణం 4.04 ట్రిలియన్ డాలర్లకు పడిపోతుంది. దీంతో 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకోవాలన్న స్వప్నం 2029–30లోనే సాధ్యపడుతుంది’’అని ఈ నివేదిక తెలిపింది. రూపాయి వేగంగా విలువను కోల్పోతుండడానికి తోడు తీవ్ర ఆటుపోట్లు ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరించింది. 2025–26 చివరి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతంగా ఉండొచ్చని, 2025–26 పూర్తి ఆర్థిక సంవత్సరానికి 7.5 శాతం వద్ద ఉండొచ్చని అంచనా వేసింది. వృద్ధి 6 శాతమే: హెచ్ఎస్బీసీ ఇంధన ధరల పెరుగుదల/సరఫరా సంక్షోభానికి తోడు, ఎల్నినోతో వర్షపాతం తక్కువగా ఉండొచ్చన్న అంచనాలు, ద్రవ్యలోటు పెరిగే పరిస్థితులతో భారత్ జీడీపీ వృద్ధి 2026–27లో 6 శాతానికి పరిమితం కావొచ్చని అంతర్జాతీయ బ్రోకరేజీ హెచ్ఎస్బీసీ తెలిపింది. ఈ పరిస్థితులతో ద్రవ్యోల్బణం పెరుగుతుందని.. ఫలితంగా ఆర్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేట్లను రెండు సార్లు (వచ్చే డిసెంబర్, మార్చి సమీక్షల్లో) పెంచొచ్చని అంచనా వేసింది. ప్రస్తుత సంక్షోభం సంఘటిత రంగం, చిన్న సంస్థలు, గ్రామీణ గృహాలపై భారం మోపుతుందని హెచ్చరించింది. అధిక ఉష్ణోగ్రతలతో సాగు కార్యకలాపాలపై ప్రభావం పడుతుందని పేర్కొంది. 2026–27లో ద్రవ్యోల్బణం 5.6 శాతానికి చేరొచ్చని అంచనా వేసింది. రెండు త్రైమాసికాల్లో 6 శాతాన్ని మించొచ్చని పేర్కొంది. చమురు మార్కెటింగ్ సంస్థలపై భారం తగ్గించేందుకు పెట్రోల్ లీటర్పై రూ.7 వరకు పెంచొచ్చని అంచనా వేసింది. పెంపు లేకపోతే మాత్రం అప్పుడు ద్రవ్యోల్బణం 5.3 శాతానికి పరిమితం కావొచ్చని తెలిపింది. -
ఈక్విటీ ఫండ్స్లోకి రూ.38,440 కోట్లు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, చమురు ధరల పెరుగుదలతో ఈక్విటీల్లో అస్థిరతలు కొనసాగుతున్న తరుణంలోనూ రిటైల్ ఇన్వెస్టర్లలో మ్యూచువల్ ఫండ్స్ పట్ల నమ్మకం బలంగానే కొనసాగుతుంది. ఏప్రిల్లో రూ.38,440 కోట్ల పెట్టుబడులు నికరంగా ఈక్విటీ పథకాల్లోకి వచ్చాయి. మార్చి నెలలో పెట్టుబడులు రూ.40,450 కోట్లతో పోల్చి చూస్తే 5 శాతం తగ్గగా.. 2025 ఏప్రిల్ నెల పెట్టుబడులు రూ.24,269 కోట్ల కంటే 58 శాతం పెరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన పెట్టుబడులు రూ.25,978 కోట్లుగా ఉన్నాయి. ఈ మేరకు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) ఏప్రిల్ నెల గణంకాలను విడుదల చేసింది. → సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్( సిప్) ద్వారా ఈక్విటీ పథకాల్లోకి ఏప్రిల్లో రూ.31,115 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మార్చిలో వచ్చిన రూ.32,087 కోట్లతో పోల్చితే స్వల్పంగా తగ్గాయి. → సిప్ల నిలిపివేత నిష్పత్తి మార్చిలో 101 శాతంగా ఉంటే, ఏప్రిల్లో 97 శాతానికి తగ్గింది. సిప్ నిర్వహణ ఆస్తులు రూ.16.85 లక్షల కోట్లకు చేరాయి. → మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ ఏప్రిల్లో నికరంగా రూ.3.22 లక్షల కోట్లను వివిధ పథకాల్లోకి ఆకర్షించింది. మార్చిలో పరిశ్రమ నుంచి నికరంగా రూ.2.4 లక్షల కోట్లను ఇన్వెస్టర్లు ఉపసంహరించుకోవడం గమనార్హం. ప్రధానంగా డెట్ ఫండ్స్లోకి రూ.2.5 లక్షల కోట్లు రావడం ఏప్రిల్లో భారీ వృద్ధికి అనుకూలించింది. → మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని మొత్తం ఆస్తుల (ఏయూఎం) విలువ 11 శాతం పెరిగి రూ.81.92 లక్షల కోట్లకు చేరింది. మార్చి చివరికి విలువ రూ.73.73 లక్షల కోట్లుగా ఉంది. మిడ్, స్మాల్క్యాప్ ఫండ్స్ జోరు.. మిడ్క్యాప్ ఫండ్స్ రూ.6,551 కోట్లు, స్మాల్క్యాప్ ఫండ్స్ రూ.6,885 కోట్ల చొప్పున ఆకర్షించాయి. మార్చితో పోల్చితే ఈ రెండు విభాగాల్లోకి 8–10 శాతం మేర అధిక పెట్టుబడులు వచ్చాయి. లార్జ్క్యాప్ ఫండ్స్ రూ.2,525 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. → డెట్ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ఏప్రిల్లో రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులను రాబట్టాయి. ఇందులో లిక్విడ్ ఫండ్స్లోకే రూ.1,65,205 కోట్లు వచ్చాయి. ఓవర్నైట్ ఫండ్స్లోకి రూ.31,240 కోట్లు, మనీ మార్కెట్ ఫండ్స్లోకి రూ.20,643 కోట్ల చొప్పున వచ్చాయి. → బంగారం ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్లు)లోకి పెట్టుబడులు మళ్లీ పుంజుకున్నాయి. మార్చి నెలలో రూ.2,266 కోట్ల పెట్టుబడులకు పరిమితం కాగా, ఏప్రిల్లో రూ.3,040 కోట్లకు పెరిగాయి. → సిల్వర్ ఈటీఎఫ్ల్లోకి కేవలం రూ.127 కోట్ల పెట్టుబడులే వచ్చాయి. → ఫోకస్డ్ ఫండ్స్ రూ.1,194 కోట్లను ఆకర్షించాయి. → ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు నికరంగా రూ.567 కోట్లను ఉపసంహరించుకున్నారు. → హైబ్రిడ్ ఫండ్స్ (ఈక్విటీ, డెట్ కలిసిన)లోకి రూ.20,565 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మార్చిలో ఈ విభాగంలోకి రూ.16,538 కోట్లు రావడం గమనార్హం. → ఏప్రిల్లో 11 కొత్త పథకాలు మార్కెట్లోకి ప్రవేశించి ఇన్వెస్టర్ల నుంచి రూ.828 కోట్లను సమీకరించాయి. -
మోదీ పొదుపు మంత్రం.. ఎకానమీకి శుభసూచకం!
సాక్షి, బిజినెస్ డెస్క్: పశ్చిమాసియా యుద్ధం దెబ్బతో క్రూడ్ రేట్లు భగ్గుమనడంతో మన ఆర్థిక వ్యవస్థకు బాగానే సెగ తగులుతోంది. ముడిచమురు ధరలు 100 డాలర్ల పైకి దూసుకెళ్లడంతో దిగుమతుల బిల్లు తడిసిమోపెడవుతోంది. మరోపక్క, బంగారం రేట్లు కూడా దూసుకెళ్లడంతో విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలు దిగుజారుతున్నాయి. దీని ప్రభావంతో రూపాయి రోజుకో కొత్త కనిష్టానికి దిగజారి నేల చూపులు చూస్తోంది. తాజాగా 95.28 ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు చేసిన సూచన దేశవ్యాప్తంగా అటు పరిశ్రమ వర్గాల్లో ఇటు ప్రజల్లో సంచనలం రేపుతోంది. ఎకానమీకి దన్నుగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం కోసం పొదుపు చర్యలు పాటించాలంటూ మోదీ పిలుపునిచ్చారు. ముఖ్యంగా బంగారం కొనుగోళ్లను ఏడాది పాటు వాయిదా వేసుకోవాలని.. పెట్రోలు, డీజిల్ వాడకాన్ని తగ్గించేందుకు సాధ్యమైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని... ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలన్నారు. అలాగే విదేశీ ప్రయా ణాలను వాయిదా వేసుకోవడం, వంటనూనెలు, ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవాలని కూడా పేర్కొన్నారు. ఈ చర్యలతో ఆర్థిక వ్యవస్థకు లాభంతో పాటు నష్టాలు కూడా ఉంటాయని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. దిగుమతుల భారం తగ్గడంతో కాస్త కరెంట్ ఖాతా లోటు దిగొచ్చి.. రూపాయికి దన్నుగా నిలిచినప్పటికీ, దేశీ యంగా వినిమయం తగ్గడంతో ఎకానమీ మందగించే ప్రమాదం కూడా ఉంటుందని వారు విశ్లేషిస్తున్నారు.బంగారం గుదిబండ...భారతీయులు సహజంగానే పసిడి ప్రియులు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు ఆభరణాల కొనుగోళ్లకు తోడు ఇటీవల పెరిగిన పుత్తడి రేట్లతో పెట్టుబడులకు కూడా మనోళ్లు సై అంటున్నారు. దీంతో బంగారం దిగుమతులు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ఏటా దేశంలోకి 700–800 టన్నుల బంగారం దిగుమతి అవుతోంది. దేశంలో ఉత్పత్తి అవుతున్నది కేవలం 1–2 టన్ను లు మాత్రమే. 90% పైగా దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. దేశ దిగుమతుల్లో ఇది దాదాపు 10% మరోపక్క, ఆపదలో ఆదుకునే సాధనంగా పసిడికి ప్రాముఖ్యత పెరగడంతో సెంట్రల్ బ్యాంకులు కూడా పొలోమంటూ గోల్డ్ నిల్వలు పెంచుకుంటున్నాయి. మన ఆర్బీఐ కూడా టన్ను ల కొద్దీ పోగేసుకుంటోంది. ప్రస్తుతం నిల్వలు 880 టన్నులకు చేరాయి. 2005–26లో 72 బిలియన్ డాలర్లు విలువైన బంగారం దిగుమతైంది. దీనివల్ల భారీమొత్తంలో ఫారెక్స్ నిల్వలు వెచ్చించాల్సి వస్తోంది. అయితే, రేట్లు భారీగా పెరగడంతో ఇటీవల బంగారం దిగుమతులు బాగానే తగ్గుముఖం పట్టాయి. అయితే, రేటు (అంతర్జాతీయంగా ఔన్స్ ప్రస్తుతం 4700 డాలర్లు) అధిక స్థాయిలోనే కొనసాగుతుండటంతో భారీగా డాలర్లు వెచ్చించాల్సి వస్తోంది. మోదీ చెప్పినట్లుగా బంగారం కొనుగోళ్లు తగ్గించుకుంటే, దిగుమతులు దిగొచ్చి.. ఫారెక్స్ నిల్వలకు దన్నుగా నిలుస్తుంది. దీనివల్ల రూపాయి పతనానికి కూడా అడ్డుకట్టపడుతుంది. బంగారం దిగుమతులు 30–40% తగ్గితే 20–25 బిలియన్ డాలర్లు ఆదా అవుతాయి. 50% తగ్గితే 36 బిలియన్ డాలర్లు సేవ్ అవుతాయి. అంటే ప్రజలు బంగారం కొనడం తగ్గిస్తే దేశం నుంచి బయటకు వెళ్లే డాలర్ల ప్రవాహం భారీగా తగ్గుతుంది. అయితే, దేశీయంగా కొనుగోళ్లు మందగించడం వల్ల ఆభరణాల విక్రేతలపై ప్రభావం పడుతుందని పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే, ఫిజికల్ గోల్డ్కు బదులు ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్లు, ఈ–గోల్డ్ రిసీట్స్ వంటి పేపర్ గోల్డ్ రూపంలో కొనుగోలు చేయడం వల్ల అటు దిగుమతుల భారం తగ్గడంతో పాటు పెట్టుబడులకు కూడా కొలిసొచ్చే అంశమని నిపుణులు సూచిస్తున్నారు. ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత ఒక్కసారిగా క్రూడ్ ధరలు భగ్గుమనడం తెలిసిందే. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ రేటు 119 డాలర్లకు దూసుకెళ్లింది. రెండు నెలలుగా సగటున 100 డాలర్ల పైనే కదలాడుతోంది. దీంతో క్రూడ్ దిగుమతుల భారం భారీగా పెరిగిపోతోంది. భారత్ చమురు అవసరాల్లో దాదాపు 90 శాతం మేర దిగుమతి చేసుకోవాల్సి రావడం.. హార్మూజ్ జలసంధిలో అడ్డంకులతో సరఫరా తగ్గడంతో రేట్లు పైపైకి చేరి దిగుమతులు గుదిబండగా మారుతున్నాయి. 2025–26లో మనం 134.7 బిలియన్ డాలర్ల విలువైన క్రూడాయిల్ దిగుమతి చేసుకోవడం గమానార్హం. మన మొత్తం దిగుమతులు 775 బిలియన్ డాలర్లు కాగా, ఇందులో అత్యధిక వాటా క్రూడ్దే. అయితే, ప్రభుత్వం మాత్రం పెట్రోలు, డీజిల్ ధరలు పెంచకుండా ప్రజలపై భారం పడకుండా చూస్తోంది. మరోపక్క, ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించుకుని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (ఓఎంసీలు) కు కొంచెం ఊరటనిచ్చింది. దీనివల్ల కేంద్ర ఖాజానాకు నెలకు రూ.14,000 కోట్ల చిల్లు పడుతోంది. ఇక రేట్లు పెంచకపోవడం వల్ల ఓఎంసీలు రోజుకు సుమారు రూ.1,700 కోట్ల ఆదాయాన్ని నష్టపోతున్నట్లు అంచనా. అంటే గత పది వారాల్లో వాటిపై ఏకంగా రూ. లక్ష కోట్లకు పైగానే భారం పడినట్లు లెక్క. ఈ నేపథ్యంలోనే మోదీ పెట్రోలు, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవడం కోసం ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించుకోవాలని, కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించాలని, కార్ పూలింగ్తో పాటు, మెట్రో రైళ్లు ఇతరత్రా ప్రభుత్వ రవాణా సదుపాయాలను వాడాలంటూ సూచించారు. దీనివల్ల అటు క్రూడ్ దిగుమతులకు కాస్త అడ్డుకట్టపడి.. ఫారెక్స్ నిల్వలపై ఒత్తిడి తగ్గుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. మోదీ పెట్రో పొదుపు మంత్రంతో సోమవారం ఎలక్ట్రిక్ వాహన కంపెనీ షేర్లు రివ్వుమనడం విశేషం. కాగా, క్రూడ్ ధరలు ఇప్పట్లో శాంతించే అవకాశాలు కనిపించకపోవడం.. మోదీ తాజా సూచనలు చూస్తుంటే, సమీప భవిష్యత్తులో పెట్రో ధరలు పెరిగే అవకాశం కూడా లేకపోలేదనేది కొంత మంది పరిశీలకుల మాట! ట్రావెల్ రంగంపై ప్రభావం.. విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలంటూ మోదీ సూచించడం కూడా ఫారెక్స్ నిల్వలు కరిగిపోకుండా చూసుకోవడం కోసమే.. ఎందుకంటే, విదేశాలకు వెళ్లాలంటే డాలర్లను కొనుగోలు చేయాల్సి వస్తుంది. హోటళ్లను బుక్ చేసుకోవాలన్నా డాలర్లు వెచ్చించాల్సిందే. 2025లో 3.27 కోట్ల మంది భారతీయులు విదేశీ ప్రయాణాలకు వెళ్లినట్లు అంచనా. 2024–25 ఆర్థిక సంవత్సరంలో మనోళ్లు విదేశీ ట్రిప్పుల కోసం వెచ్చించిన మొత్తం 31.7 బిలియన్ డాలర్లు. అంటే ఆ మేరకు దేశం నుంచి డాలర్లు బయటికి వెళ్లిపోయాయి. మోదీ సూచన పాటిస్తే, ఈ భారం తగ్గుతుంది. అయితే, విదేశీ ప్రయాణాలు, డెస్టినేషన్ వెడ్డింగ్స్ తగ్గడంతో ట్రావెల్, ఏవియేషన్ కంపెనీలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉంది. మార్కెట్లో ఇప్పటికే దీని సెగ తగిలింది. యాత్రా, థామస్ కుక్ వంటి ట్రావెల్ సంస్థల షేర్లతో పాటు ఇండిగో షేరు కూడా 5 శాతం పైగా పడిపోయాయి. ఫారెక్స్ నిల్వలు తగ్గుముఖం... క్యాడ్ పైపైకి పశ్చిమాసియా యుద్ధం ప్రారంభానికి ముందు అంటే ఫిబ్రవరి చివరల్లో భారత విదేశీ మారక నిల్వలు 728.5 బిలియన్ డాలర్లకు చేరి ఆల్టైమ్ రికార్డును నమోదు చేశాయి. క్రూడ్ ధరలు భగ్గమనడం.. దిగుమతుల బిల్లు పెరిగిపోవడంతో ఆ తర్వాత నుంచి తగ్గుముఖం పడుతూ ప్రస్తుతం సుమారు 690.69 బిలియన్ డాలర్లకు చేరాయి. మరోవైపు ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం 2026లో భారత కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్– దేశంలోకి వచ్చి, పోయే విదేశీ మారక ద్రవ్యం (ప్రధానంగా డాలర్లు) మధ్య వ్యత్యాసం) 84.5 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది. ఇది మన జీడీపీలో 2 శాతానికి సమానం. అంటే దేశంలోకి వచ్చే డాలర్ల కంటే బయటికి వెళ్లే మొత్తం భారీగా పెరిగిపోతుందన్నమాట! దీనివల్ల రూపాయి మరింత క్షీణించే అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. -
56 దేశాల్లో భారతీయులకు బంపర్ ఆఫర్!
వేసవి విడిదికి తోడు ఈద్ సెలవులు దగ్గరపడుతుండటంతో అంతర్జాతీయ పర్యాటకానికి భారతీయులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో భారత పాస్పోర్ట్ శక్తిసామర్థ్యాలపై తాజా 'హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్' ఆసక్తికర గణాంకాలను విడుదల చేసింది. ప్రస్తుతం గ్లోబల్ ర్యాంకింగ్స్లో భారత్ 78వ స్థానంలో నిలిచింది. ఫిబ్రవరిలో ఉన్న 75వ స్థానం నుంచి స్వల్పంగా పడిపోయినప్పటికీ, భారతీయులు వీసా ముందస్తు దరఖాస్తు అవసరం లేకుండానే ప్రపంచవ్యాప్తంగా 56 దేశాలను చుట్టిరావచ్చు.ర్యాంకింగ్లో హెచ్చుతగ్గులు..గ్లోబల్ వీసా విధానాల్లో వస్తున్న మార్పుల వల్ల భారత్ ఈసారి క్యూబా, సెనెగల్ వంటి దేశాలతో కలిసి 78వ స్థానాన్ని పంచుకుంది. అయితే, గమ్యస్థానాల పరంగా చూస్తే భారత్ బలం స్థిరంగానే ఉంది. 2025లో 57 దేశాలకు వీసా లేకుండా ప్రవేశం ఉండేది. అది జనవరి 2026 నాటికి 55 దేశాలకు తగ్గింది. ప్రస్తుతం గాంబియా చేరికతో 56 దేశాలకు వీసాఫ్రీ యాక్సిస్ పెరిగింది.ఎక్కడికి ఎలా వెళ్లొచ్చు?భారత పౌరులకు ప్రస్తుతం 30 దేశాలు పూర్తిస్థాయిలో వీసా రహిత ప్రవేశాన్ని కల్పిస్తుండగా, 23 దేశాలు 'వీసా-ఆన్-అరైవల్' (వచ్చిన తర్వాత వీసా), మరో 3 దేశాలు 'ఈటీఏ' (ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్) పద్ధతిలో అనుమతిస్తున్నాయి.వీసా రహిత ప్రవేశం ఉన్న దేశాల్లో అంగోలా, బార్బడోస్, భూటాన్, బ్రిటిష్ వర్జిన్ దీవులు, కుక్ దీవులు, డొమినికా, ఫిజీ, గ్రెనడా, హైతీ, జమైకా, కజకస్తాన్, కిరిబాటి, మకావో (ఎస్.ఎ.ఆర్ చైనా), మలేషియా, మారిషస్, మైక్రోనేషియా, మోంట్సెరాట్, నేపాల్, నియు, ఫిలిప్పీన్స్, రువాండా, సెనెగల్, సెయింట్ విన్సెంట్ అండ్ ది గ్రెనడైన్స్, థాయ్ లాండ్, ది గాంబియా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, వనాటు ఉన్నాయి.వీసా-ఆన్-అరైవల్ (VOA) అనుమతిస్తున్న దేశాల్లో బురుండి, కంబోడియా, కేప్ వెర్డే దీవులు, కొమొరో దీవులు, జిబౌటి, ఇథియోపియా, గినియా-బిస్సావు, ఇండోనేషియా, జోర్డాన్, లావోస్, మడగాస్కర్, మాల్దీవులు, మార్షల్ దీవులు, మంగోలియా, మొజాంబిక్, మయన్మార్, పలావు దీవులు, ఖతార్, సియెర్రా లియోన్, శ్రీలంక, సెయింట్ లూసియా, టాంజానియా, తైమూర్-లెస్టే, తువాలు, జింబాబ్వే ఉన్నాయి.ఇక కెన్యా, సీషెల్స్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ దేశాలు ఈటీఏ విధానంలో ప్రవేశం కల్పిస్తున్నాయి.పర్యాటకుల చూపు.. 'సమీప' దేశాల వైపు..ఈద్ సెలవుల నేపథ్యంలో తక్కువ ఖర్చుతో, కనీస డాక్యుమెంటేషన్తో ప్రయాణించే వీలున్న ఆసియా, మధ్యప్రాచ్య దేశాలపై భారతీయులు మక్కువ చూపుతున్నారు. ముఖ్యంగా థాయ్లాండ్, మలేషియా, మాల్దీవులు వంటి దేశాలు వీసా సరళీకరణను ప్రకటించడంతో బుకింగ్స్ ఒక్కసారిగా ఊపందుకున్నాయి.ర్యాంకింగ్లో స్వల్ప మార్పు ఉన్నప్పటికీ, ఇది మన పాస్పోర్ట్ బలహీనత కంటే ఇతర దేశాల వీసా విధానాల్లో వస్తున్న మార్పుల వల్ల సంభవించినదేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. విదేశీ ప్రయాణం చేయాలనుకునే వారు సంబంధిత దేశ ఇమ్మిగ్రేషన్ నిబంధనలను ఒకసారి సరిచూసుకోవడం ఉత్తమం. -
సునీల్ మిట్టల్కు సీసీఐ లైఫ్టైమ్ అచీవ్మెంట్ పురస్కారం
భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ సునీల్ భారతీ మిట్టల్కు ప్రతిష్టాత్మకమైన 'సీఐఐ ప్రెసిడెంట్స్ అవార్డ్ ఫర్ లైఫ్టైమ్ అచీవ్మెంట్' పురస్కారం లభించింది. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. భారత ఆర్థిక పురోగతికి మరియు పారిశ్రామిక రంగానికి సునీల్ మిట్టల్ అందించిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేశారు.ఈ సందర్భంగా సునీల్ మిట్టల్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చేతుల మీదుగా అవార్డును స్వీకరించడం చాలా ఆనందంగా ఉందన్నారు. 2007లో తాను సీఐఐ అధ్యక్షుడిగా పనిచేసిన కాలాన్ని గుర్తు చేసుకుంటూ, దేశ ఆర్థిక వ్యవస్థలో సీఐఐ కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. భారతీయ పరిశ్రమలు విదేశీ దిగుమతులపై (ముఖ్యంగా బంగారం) ఆధారపడటం తగ్గించి, స్వదేశీ పెట్టుబడులు, తయారీ (Make in India) పై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు (ముఖ్యంగా మధ్యప్రాచ్యం) ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి తెస్తున్నాయని, ఇలాంటి సమయంలో ప్రధాని మోదీ ఇచ్చిన సందేశాన్ని పరిశ్రమలు పాటించాలని కోరారు. బంగారం దిగుమతులపై వ్యామోహం తగ్గించుకోవాలన్నారు. పునరుత్పాదక ఇంధనం వైపు మళ్లడం, నూతన ఆవిష్కరణల ద్వారా దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని పారిశ్రామికవేత్తలను కోరారు. ఎయిర్టెల్ సంస్థ గడిచిన ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 31,000 కోట్ల భారీ పెట్టుబడులను (CapEx) వెచ్చించినట్లు ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. -
ఒకేసారి 20కిపైగా ప్రొడక్ట్స్ లాంచ్ చేసిన HP India
హెచ్పీ ఇండియా దేశీయ మార్కెట్లో ఒకేసారి 20 కంటే ఎక్కువ ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. ఇందులో ల్యాప్టాప్లు, ప్రింటర్లు, AI ఆధారిత డివైజ్లు ఉన్నాయి.విద్యార్థులు, క్రియేటర్లు, ప్రొఫెషనల్స్, చిన్న వ్యాపారుల వరకు అందరికీ సులభమైన, లేటెస్ట్ టెక్నాలజీని అందించడమే ప్రధాన ఉద్దేశ్యంగా కంపెనీ కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేసింది. ఇందులో ముఖ్యంగా రెండు కొత్త కేటగిరీలు ఉన్నాయి.మొదటిది హెచ్పీ ఓమ్నిపాడ్ 12. ఇది టాబ్లెట్లా ఉపయోగించుకోవచ్చు. కానీ.. పీసీ మాదిరిగా పనితీరును అందించే ఒక కొత్త డివైజ్. తొలిసారి కంప్యూటర్ ఉపయోగించే విద్యార్థులు, చిన్న వ్యాపారాలు, సాధారణ వినియోగదారులకు ఇది ఉపయోగపడుతుంది. దీని ప్రారంభ ధర రూ.48,999.రెండవది హెచ్పీ ఎలైట్ బోర్డ్ G1a Next Gen AI PC. ఇది ప్రపంచంలోనే మొదటి AI కీబోర్డ్ బేస్డ్ కంప్యూటర్. ఆఫీస్ వినియోగం కోసం, తేలికగా ఉపయోగించగలిగే విధంగా ఉంటుంది. ఇది మంచి పనితీరును అందిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.89900.కంపెనీ లాంచ్ చేసిన ఇతర ఉత్పత్తులలో.. ఎలైట్ బుక్, ప్రోబుక్, ఓమ్నిబుక్ సిరీస్ ల్యాప్టాప్లు, AI బేస్డ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్లు, కొత్త ప్రింటింగ్ టెక్నాలజీలు కూడా ఉన్నాయి. ఇవన్నీ హెచ్పి ఆన్లైన్ స్టోర్, అమెజాన్, రిలయన్స్, హెచ్పి వరల్డ్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. -
రూ.10వేల కంటే తక్కువ ధర: సరికొత్త స్మార్ట్ఫోన్!
స్టైలిష్ అండ్ ఇన్నోవేటివ్ స్మార్ట్ఫోన్లకు ప్రసిద్ధి చెందిన 'జెనో సిరీస్' ఇప్పుడు తన కొత్త స్మార్ట్ఫోన్ జెనో 200ను లాంచ్ చేసింది. ఇది అమెజాన్ ఈకామర్స్ వెబ్సైట్లో అమ్మకానికి ఉంది. దీని ధర కేవలం రూ.9,999 మాత్రమే.ఈ ఫోన్లో MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ ఉంది. కాబట్టి సాధారణ బడ్జెట్ ఫోన్లతో పోలిస్తే ఇది చాలా దృఢంగా ఉంటుంది. ఇది IP65 రేటింగ్ ఉండటంతో ధూళి, నీటి నుంచి కూడా రక్షణ లభిస్తుంది. ఇందులో AI అసిస్టెంట్ కూడా ఉండటం వల్ల.. ఇది రోజువారీ పనులను మరింత సులభంగా.. వేగంగా చేయడంలో సహాయపడుతుంది. ఈ ఫోన్ 4+8GB RAM, 128GB స్టోరేజ్తో లభిస్తుంది.జెనో 200 ఫోన్లో 6.75 ఇంచెస్ 120Hz HD+ డిస్ప్లే ఉంది. DTS సౌండ్ సపోర్ట్ వల్ల వీడియోలు, మ్యూజిక్ మరింత అద్భుతమైన అనుభవాన్ని ఇస్తాయి. ఈ ఫోన్ నాలుగేళ్లు పాటు మంచి పనితీరును అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఫోటోగ్రఫీ కోసం 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా లభిస్తుంది. అలాగే IR Blaster ద్వారా TV, AC వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా కంట్రోల్ చేయవచ్చు.ఆక్టా కోర్ యూనిసోక్ టీ7250 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15 గో వంటివి జెనో 200 ఫోన్లో ఉండటం వల్ల, ఇది గేమింగ్, మల్టీటాస్కింగ్, వీడియో కాలింగ్లో మంచి అనుభవాన్ని అందిస్తుంది. ఇందులో 5000mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో దీనిని రోజంతా సౌకర్యంగా ఉపయోగించుకోవచ్చు. ఈ ఫోన్ కామెట్ ఆరంజ్, మీటియోర్ టైటానియం, బ్లూ వంటి రంగులలో లభిస్తుంది.రూ.10 వేలు కంటే తక్కువ ధరలో స్మార్ట్ఫోన్లుటెక్నో స్పార్క్ గో 3: ప్రారంభ ధర రూ.9,999పోకో సి81ఎక్స్: ప్రారంభ ధర రూ.9,999లావా బోల్డ్ N2 ప్రో: ప్రారంభ ధర రూ.7,999టెక్నో పాప్ X: ప్రారంభ ధర రూ.9,299ఏఐ+ పల్స్ 2: ప్రారంభ ధర రూ.8,999 -
ఇదొక్కటి 25 చెట్లకు సమానం!
రోజురోజుకి వాయుకాలుష్యం పెరిగిపోతోంది, ఇతర ప్రమాదకర వాయువులు ఎక్కువకావడంతో.. ఆక్సిజన్ కొరత ఏర్పడుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, పలు కంపెనీలు పరిష్కార మార్గాలను అన్వేషించడంలో బిజీ అయ్యాయి. అయితే తొలిసారి మష్రూమ్ వరల్డ్ గ్రూప్ 'ఆల్గే ట్రీ' (Algae Tree) ఆవిష్కరించింది.మష్రూమ్ వరల్డ్ గ్రూప్ 'ఆల్గే ట్రీ'ను మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరంలోని స్వామి వివేకానంద పార్కులో ఏర్పాటు చేసింది. ఇది వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ను గ్రహించి, దానిని ఆక్సిజన్గా మారుస్తుంది. ఈ ప్రక్రియ సాధారణ మొక్కలు జరిపే' కిరణజన్య సంయోగక్రియ' మాదిరిగా అన్నమాట. అయితే.. తక్కువ స్థలంలో ఎక్కువ కార్బన్ను ఆక్సిజన్గా మార్చడం దీని ప్రత్యేకత.ఒక ఆల్గే ట్రీ సంవత్సరానికి సుమారు 1.5 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ను గ్రహిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఇది దాదాపు 25 పెద్ద చెట్లు గ్రహించే CO₂కు సమానం. నగరాల్లో పెద్ద ఎత్తున చెట్లు నాటడానికి స్థలం లేకపోవడం వల్ల, ఈ విధమైన సాంకేతిక పరిష్కారాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.India's first Algae Tree that converts carbon dioxide into oxygen, equal to 25 trees. It also has solar panels on top and is installed in Bhopal's Swami Vivekananda Park.Credit: Team Update Bus Bhopal, ViaWeb pic.twitter.com/4nBbP5B7qg— Pareekh Jain (@pareekhjain) May 10, 2026ఆల్గే ట్రీ సోలార్ ప్లేట్లను పెపొందుతుంది. కాబట్టి ఇది సౌరశక్తితో పనిచేస్తుంది. అంటే పర్యావరణానికి హాని కలిగించకుండా పునరుత్పాదక శక్తిని వినియోగించడం ద్వారా మరింత అనుకూలంగా ఉంటుందన్నమాట. దీనిని రూపొందించడానికి రెండు సంవత్సరాల సమయం పట్టిందని, 50 మందికి పైగా శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, నిపుణులు కలిసి పనిచేశారని సంస్థ వెల్లడించింది.ప్రస్తుతం భారతదేశంలోని అనేక నగరాలు అధిక ఉష్ణోగ్రతలు, గాలి కాలుష్యం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆల్గే ట్రీ వంటి సాంకేతిక పరిజ్ఞానం నగరాల్లో కార్బన్ స్థాయిలను తగ్గించడంలో, గాలి నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.ఇదీ చదవండి: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతోంది! -
పెట్రోల్, గ్యాస్ కొరత వచ్చేసిందా? మోదీ వ్యాఖ్యలపై కేంద్రం క్లారిటీ
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, ముడి చమురు కొరత లేదని కేంద్ర ప్రభుత్వం సోమవారం తెలిపింది. ప్రపంచంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇంధనం ఆదా చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని చెప్పింది.పశ్చిమాసియాలో పరిస్థితులపై సోమవారం ఢిల్లీలో ప్రభుత్వ అధికారులు మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని చెప్పారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణ ప్రభావం మనపై పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భయంతో అధికంగా కొనుగోలు చేయొద్దు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి (మార్కెటింగ్, ఆయిల్ రిఫైనరీ) శర్మ మాట్లాడుతూ.. దేశంలో ముడి చమురు, ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ నిల్వలు సరిపడా ఉన్నాయని తెలిపారు. భారత్కు వచ్చే ఇంధన దిగుమతుల్లో దాదాపు 90 శాతం గల్ఫ్ ప్రాంతం నుంచే వస్తున్నాయని, అయినా అంతరాయాన్ని తగ్గించే చర్యలు వేగంగా చేపట్టామని చెప్పారు.దేశంలో అన్ని రకాల ఇంధన సరఫరాలు తగినంత ఉన్నాయని, భయంతో అధికంగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని శర్మ తెలిపారు. ప్రపంచ అనిశ్చితి సమయంలో దేశంపై ఆర్థిక భారం తగ్గించడం, ఇంధన పొదుపు లక్ష్యంతోనే ప్రధానమంత్రి వాటిపై ఆదివారం ఆ పిలుపును ఇచ్చారని చెప్పారు. సరఫరాలపై ప్రభావం అత్యల్పంగా ఉండేలా తగిన చర్యలు తీసుకున్నామని తెలిపారు.ఇంధన పొదుపు లక్ష్యంతోనే..అవసరంలేని ప్రయాణాలు తగ్గించి ఇంధనాన్ని ఆదా చేయాలని ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన సందేశాన్ని, సరఫరా కొరతకు ప్రతిస్పందనగా కాకుండా ఇంధన పొదుపు దృష్టితో చూడాలని అధికారులు తెలిపారు. ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపుతున్న సమయంలో బాధ్యతాయుతంగా ఇంధనం వినియోగించాలనే ఉద్దేశంతో ఈ పిలుపు ఇచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది.అనేక దేశాల నుంచి దిగుమతులువిదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ఇంధన సంరక్షణ, సరఫరా చర్యల్లో భాగంగా భారత్ అనేక దేశాల నుంచి ఇంధనం కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఇరాన్ విదేశాంగ మంత్రి భారత్ పర్యటనపై అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. బ్రిక్స్ దేశాలు, భాగస్వామ్య దేశాల విదేశాంగ మంత్రులు భారత్కు వచ్చే అవకాశం ఉందని, ప్రణాళికలు ఖరారైన తర్వాత వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.పశ్చిమాసియా పరిస్థితులపై భారత్ వైఖరిని కూడా ఆయన మరోసారి వెల్లడించారు. మొదటి నుంచే శాంతి, చర్చలకు భారత్ మద్దతు ఇస్తోందని తెలిపారు. భారత నౌకలు సురక్షితంగా తిరుగు ప్రయాణం చేస్తున్నాయని పోర్టులు, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ అధికారి ఒపేష్ శర్మ తెలిపారు. భారత జెండా ఉన్న 10 నౌకలు ఇప్పటివరకు అదనపు రుసుములు చెల్లించకుండా హార్మూజ్ జలసంధి దాటి సురక్షితంగా బయటకు వచ్చాయని చెప్పారు. ఇంకా 13 భారత జెండా నౌకలు ఆ ప్రాంతంలోనే ఉన్నాయని, వాటిని సురక్షితంగా తీసుకురావడానికి చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. నౌక సిబ్బంది సంక్షేమం, వారి అవసరాలను కూడా ప్రతిరోజూ పరిశీలిస్తున్నామని తెలిపారు. కాగా, పెట్రో ధరల పెంపుపై మాత్రం కేంద్ర సర్కారు క్లారిటీ ఇవ్వలేదు. -
వార్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్లకు హెచ్చరిక సంకేతాలు!
ప్రధానంగా పశ్చిమాసియాలో కొనసాగనున్న పరిస్థితులు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్ను నిర్దేశించనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వీటికితోడు ముడిచమురు ధరలు, డాలరుతో రూపాయి మారకానికీ ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. వెరసి ఈ వారం భారీ ఆటుపోట్ల మధ్య మార్కెట్లు ట్రేడ్కానున్నట్లు అంచనా వేశారు. వివరాలు చూద్దాం..కొద్ది వారాలుగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణంపై ఇన్వెస్టర్లు మరింత దృష్టి పెట్టనున్నారు. ప్రధానంగా యూఎస్, ఇరాన్ మధ్య పరిస్థితులు దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు స్టాక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. గత కొద్ది రోజులుగా రెండు దేశాల మధ్య సయోధ్య కుదిరే వీలున్న వాతావరణం నెలకొనడంతో ప్రపంచవ్యాప్తంగా ఆశావహ పరిస్థితులు కనిపించినప్పటికీ ఇటీవల తిరిగి ఉద్రిక్తతలు తలెత్తడంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరగవచ్చని నిపుణులు విశ్లేషించారు. దీంతో గత మూడు వారాలుగా హెచ్చుతగ్గుల మధ్య కన్సాలిడేషన్ బాటలో సాగుతున్న దేశీ స్టాక్ మార్కెట్లు ఇకపైనా తీవ్ర ఆటుపోట్ల మధ్య సానుకూలంగా కదిలే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు అంచనా వేశారు.గణాంకాలపై ఫోకస్12న ఏప్రిల్ నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ), 14న టోకు ధరల వివరాలు(డబ్ల్యూపీఐ) వెల్లడికానున్నాయి. మార్చిలో సీపీఐ 3.2% నుంచి 3.4%కి పెరిగింది. డబ్ల్యూపీఐ మరింత అధికంగా 2.13% నుంచి 3.88 శాతానికి ఎగసింది. దీంతో ఆర్బీఐ భవిష్యత్ పరపతి విధానాలపై ధరలు ప్రభావం చూపనున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. దీనికితోడు పశ్చిమాసియాలో మళ్లీ ఆందోళనలు పెరుగుతుండటంతో ముడిచమురు ధరలు బ్యారల్ 100 డాలర్ల సమీపంలో కదులుతున్నాయి. ఫలితంగా డాలరుతో మారకంలో రూపాయి 95 స్థాయికి బలహీనపడిన సంగతి తెలిసిందే.కాగా.. ఈ నెల 15న ఏప్రిల్ నెలకు వాణిజ్య గణాంకాలు విడుదలకానున్నాయి. మార్చిలో వాణిజ్య లోటు 20.67 బిలియన్ డాలర్లుగా నమోదైంది. మరోపక్క చైనా, యూఎస్.. ద్రవ్యోల్బణం, ఉపాధి, వాణిజ్యం తదితర గణాంకాలు సైతం వెలువడనున్నాయి. ఈ అంశాలు సైతం కీలకంగా నిలవనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు.. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్త్మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా, ఎన్రిచ్ మనీ సీఈవో ఆర్. పొన్మూడి, స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా వివరించారు. అయితే యూఎస్, ఇరాన్ మధ్య ఆశావహ పరిస్థితులు నెలకొంటే చమురు ధరలు దిగివచ్చే వీలున్నట్లు పేర్కొన్నారు. ఇది ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నివ్వగలదని అభిప్రాయపడ్డారు.క్యూ4 జాబితాలోఇప్పటికే ముగింపు దశకు చేరుకున్న 2025–26 చివరి త్రైమాసిక (క్యూ4) ఫలితాల సీజన్లో భాగంగా మరికొన్ని దిగ్గజాలు పనితీరు వెల్లడించనున్నాయి. ఫలితాలు ప్రకటించనున్న జాబితాలో కెనరా బ్యాంక్, టాటా పవర్, ఎయిర్టెల్, డీఎల్ఎఫ్, హెచ్పీసీఎల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇండియన్ హోటల్స్, డాక్టర్ రెడ్డీస్ తదితరాలున్నాయి.హెచ్చు తగ్గుల మధ్య గత వారం మార్కెట్లు స్వల్పంగా బలపడ్డాయి. సెన్సెక్స్ 415 పాయింట్లు(0.53 శాతం), నిఫ్టీ 179 పాయింట్లు(0.75 శాతం) చొప్పున ఎగశాయి. వెరసి 77,328 వద్ద, 24,176 వద్ద ముగిశాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ మరింత అధికంగా 3.4 శాతం, 4.3 శాతం చొప్పున జంప్చేయడం గమనార్హం!ఈ వారం సాంకేతిక నిపుణుల అంచనాల ప్రకారం దేశీ స్టాక్ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య సానుకూలంగా కదిలే వీలుంది. కొద్ది వారాలుగా నిఫ్టీ 23,600–24,700 పాయింట్ల శ్రేణిలో కన్సాలిడేట్ అవుతోంది. ఈ శ్రేణి నుంచి బయటపడితే అంటే 23,600 దిగువన 23,100–23,000 పాయింట్ల వద్ద సపోర్ట్ లభించవచ్చు. ఇలాకాకుండా బలపడి 24,700 పాయింట్లను దాటితే 25,000ను తాకవచ్చు. -
గిఫ్ట్లపై ఐటీ శాఖ నిఘా.. ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి!
ఒకప్పుడు బహుమతులకంటూ ఓ ప్రత్యేక చట్టం ఉండేది. దీని వల్ల ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. కానీ, కొన్ని వేల కేసులు మిగిలాయి కోర్టుల్లో. పైగా ఈ బాధ్యతలను నిర్వహించేవారు సాక్షాత్తు ఇన్కంట్యాక్స్ అధికారులే. చాలా చాలా ఆచరణాత్మకంగా ఆలోచించి, ఈ చట్టంలోని అంశాలను చట్టం రద్దు చేసిన తర్వాత ఆదాయచట్టంలో అంతర్భాగంగా కలిపారు.1961 చట్టంలోనే బహుమతులపై పన్ను భారానికి సంబంధించినవన్నీ ఇమిడిపోయాయి. వాటన్నింటినీ కొత్త చట్టం 2025లో యథాతథంగా పొందుపర్చారు.కట్నాలనుకోండి, కానుకలు అనుకోండి, వర దక్షిణ .. సంప్రదాయం.. ఆనవాయితీ అనుకోండి. బహుమతులు ఇవ్వడం అనాదిగా వస్తున్న ఒక పరంపర. ఇక నుంచి గిఫ్ట్ అని అందాం. గిఫ్ట్ ఇచ్చిన వ్యక్తికి ఎటువంటి పన్నుభారం ఉండదు. అయితే, చాలా మంది ఈ అంశాన్ని ఆసరాగా తీసుకుని ఏదో ఒక దొంగ పేరుతో లేని మనిషిని సృష్టిస్తారు. అయితే, ఇలాంటి గిఫ్టుల విషయంలో మూడు విషయాలను మీరు రుజువులతో నిరూపించవలసి వస్తుంది. నిజంగా దాత ఉన్నాడా లేదా.రెండోది వ్యవహారం జరిగిందా లేదా. అంతే. నాటకం..బూటకం కాదు కదా. బదిలీ కాగితాల పత్రాలు, దస్తావేజులు, రాతలు–కోతలు, బ్యాంకు అకౌంట్లలో పద్దులు అన్నీ ఉండాలి.దాత స్తోమత, ఆదాయ ఆర్జన సామర్థ్యాలు, దానం ఇచ్చేందుకు ‘సోర్స్’ ఉండాలి. ఈ మూడు షరతులు సక్రమంగా ఉన్నట్లయితే, నిరూపిస్తే దాతను వదిలేస్తారు. ఇక బంతి స్వీకర్త చేతిలో పడుతుంది. స్వీకర్త వ్యక్తిగత ఆదాయపు లెక్కల్లో ‘గిఫ్ట్’ గురించి ఆరా తీస్తారు. షరతులకు లోబడి మినహాయింపులిస్తారు లేదా పన్ను భారం వేస్తారు. ఆదాయ వర్గీకరణలో ‘గిఫ్ట్’ని ఇతర ఆదాయం కింద భావిస్తారు.గిఫ్ట్లో వివిధ రకాలు..నగదు, చెక్కు, బ్యాంకు బదిలీకంపెనీలో వాటాలు, బాండ్లు, సెక్యూరిటీలు, బంగారం, వెండి, రత్నాలు, వజ్రాలు, ఆభరణాలు, విలువైన పురాతన వస్తువులు, పెయింటింగ్స్ మొదలైనవిల్యాండ్, బిల్డింగ్, విల్లాలు, అపార్ట్మెంట్స్, ఫ్లాట్లు, మల్గీలు.. ఇలా ఎన్నో స్థిరాస్తులుఎంత వరకు మినహాయింపు..ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 50,000 దాటితే, అన్నింటికి కలిపి, పన్ను భారం ఏర్పడుతుంది. రూ. 50,000 లోపల గిఫ్ట్ల మీద ఎటువంటి పన్ను ఉండదు. లిమిట్ దాటితే మొత్తం బహుమతుల మీద పన్ను పడుతుంది. నగదు అయితే నగదు విలువ మీద ఇది ఉంటుంది.ఇక చరాస్తులైతే వాటి మార్కెట్ విలువ, అది కూడా ఫెయిర్ మార్కెట్ వేల్యూని పరిగణనలోకి తీసుకుంటారు. స్థిరాస్తులైతే రిజి్రస్టేషన్ సందర్భంలో స్టాంపు డ్యూటీ ఎంత మీద చెల్లించారో అంత విలువపైన లెక్కిస్తారు. ఇవన్నీ మీకు తెలిసినవే!మినహాయింపులు వర్తించే గిఫ్టులు..బంధువులు, తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్లు, అన్నదమ్ములు, అనువంశీకుల నుంచి వచ్చే గిఫ్టులు.పెళ్లి సందర్భంలో ఎంత విలువైన గిఫ్టులైనా మినహాయింపు ఇస్తారు. ఒక జాబితా రాసుకోండి. నగదైనా ఫర్వాలేదు. పేరు, బంధుత్వం, విలువ రాయండి. ఆ మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేయండి. కాగితాలు, పత్రాలు భద్రపర్చండి. వీలునామా ద్వారా ఎలాంటి ఆదాయం, ఆస్తి వచ్చినా పన్నుండదు. అయితే, విల్లు ఉండాలి. అది అమల్లోకి రావాలి.చనిపోయే ముందు సెంటిమెంటు, అటాచ్మెంటు, సంప్రదాయం కింద బహుమతులు ఇస్తే పన్ను భారం ఉండదు.గతంలో ఎన్నో ఉదాహరణల ద్వారా మనం ఈ విషయాలు చెప్పాం. తగిన జాగ్రత్త వహించాలి. లాజిక్కులు, మేజిక్కులు వద్దు. అబద్ధాలొద్దు. వ్యవహారాన్ని చక్కగా వ్యక్తపరచి, సరైన పత్రాలతో సంజాయిషీ ఇస్తే, ఎలాంటి చిక్కులూ ఉండవు. వివరణ ఇవ్వకపోతే, మీ ఇన్కం కింద భావించి పన్ను వేస్తారు. బంధువుల మధ్య గిఫ్ట్ వ్యవహారం జరిగినా, కాగితాలు ఉండాలి. ఉదాసీనత వద్దు. మన ఆలోచన ప్రకారమే జరుగుతుందన్న భ్రమ వద్దు. -
భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు!
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయంలో కూడా భారీ నష్టాలను చవిచూశాయి. దీంతో సెన్సెక్స్ 1,312.91 పాయింట్లు లేదా 1.70 శాతం నష్టంతో 76,015.28 వద్ద, నిఫ్టీ 360.30 పాయింట్లు లేదా 1.49 శాతం నష్టంతో 23,815.85 వద్ద నిలిచిఆహాయిజీఏసీఎం టెక్నాలజీస్ లిమిటెడ్, సాస్కెన్ టెక్నాలజీస్ లిమిటెడ్, లాటీస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఎల్ప్రో ఇంటర్నేషనల్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. సికా ఇంటర్ప్లాంట్ సిస్టమ్స్ లిమిటెడ్, జెనెసిస్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ లిమిటెడ్, 3P ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్, శ్రీ రామ మల్టీ-టెక్ లిమిటెడ్, ఆర్తి సర్ఫాక్టెంట్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
రూ. లక్ష కోట్ల నష్టం, పెట్రోలు పొదుపు : మోదీ విజ్ఞప్తిలోని మర్మం ఇదేనా?
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలని, వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ , కార్ పూలింగ్ను ఉపయోగించాలని కోరడం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఇంధన దిగుమతుల భారాన్ని తగ్గించేందుకు , దేశీయంగా ఇంధనాన్ని పొదుపు చేయాలని ప్రధాని మోదీ కోరారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో భారత్లో ఇంధన ధరల పెంపు అనివార్యంగా కనిపిస్తోంది. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలని పౌరులకు చేసిన విజ్ఞప్తి చేశారా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి.ఆర్థిక, పెట్రోలియం మంత్రిత్వ శాఖలు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (OMCలు) మధ్య చర్చలు కొనసాగుతున్నందున, ప్రపంచ ముడి చమురు పోకడలు, ద్రవ్యోల్బణం, ఆర్థిక ఒత్తిళ్లు, ఇంధన ధరలను సమతుల్యం చేయడంలో ప్రభుత్వ వైఖరి ఉండబోతోంది అంటున్నారు విశ్లేషకులు.ఇదీ చదవండి: బిగ్ బాస్ మనీషా రాణి డ్రీమ్ హౌస్ : ధర తెలిస్తే ఫిదానేఅమెరికా-ఇరాన్ ప్రతిష్టంభన మధ్య ముడి చమురు ధరలు పెరగడంతో, చాలాకాలంగా వాయిదా పడుతున్న ఇంధన ధరల పెంపునకు ఇక నాంది పలకవచ్చని అంచనా. ముఖ్యంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ, వినియోగదారులపై భారం పడకుండా చమురు సంస్థలు తక్కువ ధరకే ఇంధనాన్ని విక్రయిస్తున్నాయి. దీనివల్ల ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు రోజుకు సుమారు రూ. 1,000 కోట్ల వరకు నష్టం వాటిల్లుతోందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు.ఈ త్రైమాసికంలో రూ. 2 లక్షల కోట్ల వరకు వసూళ్లలో లోటు ఉంటుందని, సుమారు రూ. 1 లక్ష కోట్ల నష్టాలు నమోదవుతాయని అంచనా వేయడంతో OMC (చమురు కంపెనీ)లపై ఒత్తిడి పెరుగుతోందని, పౌరులకు మోదీ విజ్ఞప్తి చేసిన కొన్ని గంటల తర్వాత మే 10న పెట్రోలియం మరియు సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఒక లింక్డ్ఇన్ పోస్ట్లో రాశారు.ప్రతిరోజూ రిటైల్ స్టేషన్లకు వచ్చే 6 కోట్ల మందికి పైగా వినియోగదారులకు భారం పడకుండా చూసుకోగలిగామన్నారు.. అంతేకాకుండా, మోదీ ప్రభుత్వం రిటైల్ ఇంధనంపై ఎక్సైజ్ సుంకాలను తగ్గించడం వల్ల ఒక నెలలో రూ. 14,000 కోట్ల ఆదాయ నష్టాలను చవిచూసిందని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు యుద్ధం ప్రారంభం కావడానికి ముందు ఫిబ్రవరిలో 69.01 డాలర్లుగా ఉన్న రిఫైనరీలు చమురును దిగుమతి చేసుకునే సగటు ధర, మే నెలలో 104.68 డాలర్లకు పెరిగిందని పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ డేటా వెల్లడించింది. చమురు సంస్థలు ఈ త్రైమాసికంలో సుమారు రూ. 2 లక్షల కోట్ల మేర అండర్-రికవరీలను (నష్టాలను) ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రస్తుతమున్న ధరలతో చమురు విక్రయాలు ఆర్థికంగా భారమని, కాబట్టి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం తప్పనిసరి అని విశ్లేషకులు భావిస్తున్నారు. దేశంలో ప్రస్తుతం దాదాపు 74 రోజులకు సరిపడా చమురు నిల్వలు (స్ట్రాటజిక్ మరియు కమర్షియల్) ఉన్నాయి. డిమాండ్ను తగ్గించడం ద్వారా ఈ సంక్షోభాన్ని అధిగమించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇదీ చదవండి: ఇప్పటికీ ఇండియన్స్ని ‘కూలీ’ అంటారు : నేనేమి సిగ్గుపడనుఫిబ్రవరిలో బ్యారెల్ ముడి చమురు ధర 69.01 డాలర్లు ఉండగా, మే నెల నాటికి అది 104.68 డాలర్లకు చేరుకుంది. యుద్ధ ఉద్రిక్తతల సమయంలో ఇది ఒకానొక దశలో 120 డాలర్లస్థాయిని కూడా దాటేసింది. ముఖ్యంగా ఫిబ్రవరి 28 నుండి హోర్ముజ్ జలసంధి మూతపడటంతో చమురు దిగుమతులు భారత్కు సవాలుగా మారిపోయింది. -
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతోంది!
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు పెట్టుబడులకు సంబంధించిన విషయాలు చెప్పే రాబర్ట్ కియోసాకి.. తాజాగా 2026లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతోందని.. భవిష్యత్తును చూడగలిగే వారికి ఇది శుభవార్త అని పేర్కొన్నారు. ఇంతకీ కియోసాకి ఇలా ఎందుకు అన్నారు?, దీని వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి? అనే విషయాలను వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.ఉత్తమ పెట్టుబడిదారులు భవిష్యత్తును చూడగలరు. ఉదాహరణకు.. నేను 1965లో వెండి ధర చాలా తక్కువ ఉండేది. ఆ సమయంలోనే వెండిని పోగు చేయడం ప్రారంభించాను. అప్పుడు నా వయసు 18 సంవత్సరాలు. ఆ నాటి నుంచి పోగు చేసిన సిల్వర్ ఇప్పుడు నా అత్యుత్తమ పెట్టుబడులలో ఒకటిగా నిలిచిందని కియోసాకి తన ఎక్స్ ఖాతాలో షేర్ పేర్కొన్నారు.కియోసాకి ట్వీట్లో రెండు ప్రశ్నలను కూడా సంధించారు. ఇందులో ఒకటి 'భవిష్యత్తులో ఏమి జరగబోతోందని మీరు భావిస్తున్నారు?'. మరొకటి, భవిష్యత్తులో లాభం పొందడానికి మీరు దేనిలో పెట్టుబడి పెట్టగలరు?'. ఈ ప్రశ్నలకు నెటిజన్లు తమదైన రీతిలో జవాబులు ఇస్తున్నారు.ఇదీ చదవండి: ఉద్యోగ జీవితం.. చివరికి అప్పులు: కియోసాకి వివరణపెట్టుబడుల విషయంలో జాగ్రత్త అని చెబుతూనే.. 2026లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతోంది. భవిష్యత్తును చూడగలిగే వారికి ఇది శుభవార్త. అంధులకు ఇది దుర్వార్త. అని కియోసాకి తన ట్వీట్ ముగించారు.వెండి ధరలు ఇలా..నిజానికి వెండి ధరలు కొన్నాళ్లుగా భారీగా పెరుగుతూనే ఉన్నాయి. 2025 జనవరి రూ.90 వేల వద్ద ఉన్న కేజీ సిల్వర్ ధర, 2026 ప్రారంభంలో రూ.2.34 లక్షలకు చేరింది. ఆ తరువాత రూ.3.85 లక్షలకు చేరి కొనుగోలుదారులకు షాకిచ్చింది. కాగా ఇప్పుడు వెండి ధర రూ.2.85 లక్షల వద్ద ఉంది. దీన్నిబట్టి చూస్తే.. వెండి ధరలలో ఎలాంటి పరిణామాలు జరిగాయో స్పష్టమవుతోంది. రాబోయే రోజుల్లో ఈ ధరలు పెరుగుతాయి అని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు. -
కరెన్సీ మార్కెట్లో ఆర్బీఐ జోక్యం తగ్గాలి
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కరెన్సీ మార్కెట్లో తన జోక్యాన్ని తగ్గించుకోవాలని, రూపాయి విలువలో సహజమైన మార్పులకు అవకాశం కల్పించాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సూచించారు. పెరుగుతున్న దిగుమతి ఖర్చులు, విదేశీ నిధుల ప్రవాహం వంటి సవాళ్ల నేపథ్యంలో మార్కెట్ శక్తులకు అనుగుణంగా మారకపు రేటు ఉండటమే సరైన ఆర్థిక సంకేతాలను పంపుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల ఓ సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన దేశ ఆర్థిక పరిస్థితి, రూపాయి ఒడిదుడుకులపై కీలక వ్యాఖ్యలు చేశారు.2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభ సమయంలో ఆర్బీఐని నడిపించిన సుబ్బారావు, ప్రస్తుత విధానాలపై స్పందిస్తూ.. ‘భారత్ ఒక అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే మన మార్కెట్ ప్లేయర్లు రూపాయి విలువలో పెచ్చుతగ్గులను తట్టుకోవడం నేర్చుకోవాలి. ఆర్బీఐ అతిగా జోక్యం చేసుకోవడం కంటే మార్కెట్ తనంతట తాను సర్దుబాటు చేసుకునేలా చూడటం ఉత్తమం’ అని పేర్కొన్నారు.ఆంక్షల వల్ల తాత్కాలిక ఉపశమనమే..ప్రస్తుత గవర్నర్ నేతృత్వంలోని ఆర్బీఐ, రూపాయి విలువ రికార్డు స్థాయికి పడిపోకుండా అడ్డుకోవడానికి బ్యాంకులపై కొన్ని ఆంక్షలు విధించింది. అయితే, ఇటువంటి దూకుడు చర్యలు కేవలం తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయని సుబ్బారావు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఇరాన్ యుద్ధం వంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల చమురు ధరలు పెరగడం రూపాయిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ ఏడాది డాలర్తో పోలిస్తే రూపాయి సుమారు 5% బలహీనపడి ఆసియాలోనే అత్యంత పేలవమైన ప్రదర్శన కనబరిచిన కరెన్సీగా నిలిచింది.అప్పటి పరిస్థితి వేరు..సుబ్బారావు పదవీకాలంలో (2008-2013) భారతదేశం ఆర్థికంగా బలహీనంగా ఉండేది. తక్కువ విదేశీ మారక నిల్వలతో దేశం ‘ఫ్రెజిల్ ఫైవ్’ దేశాల జాబితాలో ఉండేది. కానీ నేడు పరిస్థితి భిన్నంగా ఉందని ఆయన అన్నారు. ‘అప్పడు నిల్వలు తక్కువ, ద్రవ్యోల్బణం ఎక్కువ. ప్రస్తుతం బలమైన వృద్ధి రేటు, ద్రవ్యోల్బణం కూడా నియంత్రణలో ఉంది. ఈ సానుకూల అంశాల వల్ల రూపాయి విలువ కొంత మేర తగ్గినప్పటికీ దేశం తట్టుకోగలదు’ అని ఆయన భరోసా ఇచ్చారు.వడ్డీ రేట్ల పెంపు చివరి ఆయుధంరూపాయిని కాపాడటానికి వడ్డీ రేట్లను పెంచడం అనేది అంతిమ ప్రయత్నంగా మాత్రమే ఉండాలని హెచ్చరించారు. ‘వడ్డీ రేట్లు పెంచితే అది ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పు పొంచి ఉందనే సంకేతాన్ని మార్కెట్లకు ఇస్తుంది. ఇప్పటికే వృద్ధి రేటుపై రకరకాల ఒత్తిళ్లు ఉన్న నేపథ్యంలో ఆర్బీఐ వృద్ధిని పణంగా పెట్టి రేట్లను పెంచకపోవడమే మంచిది’ అని విశ్లేషించారు. -
మహారాష్ట్రలో టయోటా భారీ ప్లాంట్
ప్రపంచ ఆటోమొబైల్ దిగ్గజం ‘టయోటా కిర్లోస్కర్ మోటార్’ భారత్లో తన ఉనికిని మరింత విస్తరిస్తోంది. మహారాష్ట్రలో కొత్తగా ఒక అత్యాధునిక తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ సోమవారం అధికారికంగా ప్రకటించింది. సుమారు 1,00,000 వాహనాల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మించనున్న ఈ ప్లాంట్ రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చడమే కాకుండా వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలను కల్పించనుందని కంపెనీ తెలిపింది.ముఖ్య విశేషాలుమహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ సమీపంలో ఉన్న బిడ్కిన్ ఇండస్ట్రియల్ ఏరియాలో దీన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం.దీని ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి ఒక లక్ష వాహనాలు.ప్రత్యక్షంగా ఈ ప్లాంట్ ద్వారా సుమారు 2,800 మందికి ఉపాధి లభించనుంది.2029 మొదటి అర్ధభాగం నాటికి ఈ ప్లాంటులో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.కొత్త ఎస్యూవీ మోడల్పై దృష్టిటయోటా ఈ ప్లాంట్లో ప్రధానంగా సరికొత్త ఎస్యూవీ మోడళ్లను తయారు చేయనుంది. ప్రస్తుతం భారత మార్కెట్లో ఎస్యూవీలకు ఉన్న విపరీతమైన ఆదరణను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక సాంకేతికతతో కూడిన వాహనాలను ఇక్కడ రూపొందించనున్నారు. ఇది దేశీయ అవసరాలతోపాటు ఎగుమతులకు కూడా కేంద్రంగా మారే అవకాశం ఉంది.రాష్ట్ర ప్రగతికి ఊతంమహారాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం (ఎంఓయూ) ప్రకారం, ఈ పెట్టుబడి రాష్ట్ర ఆటోమొబైల్ హబ్గా ఉన్న గుర్తింపును మరింత బలోపేతం చేస్తుంది. ఇప్పటికే బిడ్కిన్ పారిశ్రామిక ప్రాంతం మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చెందుతుండగా టయోటా రాకతో మరిన్ని అనుబంధ పరిశ్రమలు ఇక్కడ కొలువుదీరే అవకాశం ఉంది. ‘భారతదేశంలో మా మూడో ప్లాంట్ ఏర్పాటు దిశగా అడుగులు వేయడం సంతోషంగా ఉంది. 2029 నాటికి ఉత్పత్తిని ప్రారంభించాలనే లక్ష్యంతో ఉన్నాం. ఇది కేవలం వాహనాల తయారీ మాత్రమే కాదు. స్థానిక ఆర్థిక వ్యవస్థకు, ఉపాధి రంగానికి పెద్ద పీట వేయడమే మా ఉద్దేశం’ అని టయోటా ప్రతినిధి చెప్పారు. -
తప్పుగా అర్థం చేసుకుంటున్నాయి!
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని భావిస్తున్న తరుణంలో భారతీయ భాషల విషయంలో ప్రస్తుత ఏఐ టూల్స్ డొల్లతనాన్ని ‘హుమిన్ ల్యాబ్స్’ అధ్యయనం బట్టబయలు చేసింది. గూగుల్, ఓపెన్ ఏఐ వంటి అంతర్జాతీయ దిగ్గజాల మోడళ్లు సైతం భారతీయ భాషలను పాఠకులకు స్పష్టంగా తెలియజేయడం(ట్రాన్స్క్రిప్షన్)లో విఫలమవుతున్నాయని ఈ నివేదిక తెలియజేస్తోంది.మూడు పదాల్లో ఒకటి తప్పుఫిజికల్, వాయిస్ ఏఐ డేటా మౌలిక సదుపాయాల రంగంలో సర్వీసులు అందిస్తున్న హుమిన్ ల్యాబ్స్ అధ్యయనం ప్రకారం, ప్రసిద్ధ ఏఐ మోడళ్లు భారతీయ భాషలను వినేటప్పుడు ప్రతి మూడు పదాల్లో ఒకదాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా భారతీయులు సహజంగా మాట్లాడే మిశ్రమ ప్రసంగం(ఇంగ్లీష్+హిందీ లేదా మరేదైనా భాష + ఇంగ్లీష్) విషయంలో ఈ సాధనాలు తడబడుతున్నాయి. వాక్యం మధ్యలో వచ్చే ఆంగ్ల పదాలను ఇవి పూర్తిగా వదిలేయడం లేదా తప్పుగా మార్చడం వల్ల అర్థం పూర్తిగా మారిపోతోంది.‘ప్రస్తుత ఏఐ ప్రొవైడర్లు ఇంటర్నెట్ డేటాతో శిక్షణ పొందిన సెట్లను ఉపయోగించి తమకు తామే మార్కులు వేసుకుంటున్నారు. కానీ గ్లోబల్ సౌత్ (భారత్ వంటి దేశాలు) వినియోగదారులు వాస్తవంగా ఎలా మాట్లాడుతారో ఈ గణాంకాలు ప్రతిబింబించవు. అసంబద్ధమైన వివరాలు చూసి సంస్థలు నిర్ణయాలు తీసుకోవడం ఆందోళనకరం’ అని హుమిన్ ల్యాబ్స్ సహ వ్యవస్థాపకుడు మనీష్ అగర్వాల్ తెలిపారు.బెంచ్ మార్క్ స్కోర్లుహుమిన్ ల్యాబ్స్ రూపొందించిన ‘బ్రిడ్జ్’ అనే గ్లోబల్ ఎవాల్యుయేషన్ బెంచ్ మార్క్ ద్వారా పలు సంస్థల పనితీరును విశ్లేషించారు.ఏఐ మోడల్ / ప్రొవైడర్సెమాంటిక్ గ్యాప్ స్కోర్ (కచ్చితత్వం)ప్రస్తుత పరిస్థితిదీప్ గ్రామ్ నోవా-30.906ప్రస్తుతానికి అగ్రస్థానంలో ఉందిసర్వం ఏఐ (సారస్ V3)20.2% (WER)గ్లోబల్ మోడళ్ల కంటే మెరుగైన 3వ స్థానంఓపెన్ ఏఐ (GPT-4o)< 0.4ఆశాజనకంగా లేదుఅమెజాన్ ట్రాన్స్ స్క్రైబ్0.199అత్యంత బలహీనమైన ప్రదర్శనగమనిక: జెమిని 2.5 ఫ్లాష్, ఎలెవెన్ ల్యాబ్స్ వంటి టూల్స్ కూడా ఈ అధ్యయనంలో భాగంగా ఉన్నాయి.స్వదేశీ టూల్స్ మెరుగైనప్పటికీ.. సవాళ్లు తప్పవుభారతీయ స్టార్టప్ ‘సర్వం ఏఐ’ రూపొందించిన సారస్ వీ3, గూగుల్ జెమిని, మైక్రోసాఫ్ట్ అజూర్ వంటి దిగ్గజాల కంటే మెరుగైన ఫలితాలను చూపడం విశేషం. వర్డ్ ఎర్రర్ రేట్ (డబ్ల్యూఈఆర్) పరంగా ఇది 20.2 శాతంతో మూడో స్థానంలో నిలిచింది. అయితే, మిశ్రమ ప్రసంగం విషయానికి వస్తే ఇది కూడా 0.588 స్కోరులో నిలిచింది.వర్డ్ ఎర్రర్ రేట్ కొలమానం సరిపోదుపరిశ్రమలో సాధారణంగా వాడే వర్డ్ ఎర్రర్ రేట్ భారతీయ భాషల వైఫల్యాలను పట్టుకోవడంలో విఫలమవుతోందని హుమిన్ ల్యాబ్స్ సహ వ్యవస్థాపకుడు ఇశాంక్ గుప్తా అభిప్రాయపడ్డారు. ‘ఇంగ్లీష్ ఫోనాలజీ(భాషలో అర్థాన్ని ఎలా మారుతుంది అనే అంశాలను అధ్యయనం చేసే శాస్త్రాన్నే ఫోనాలజీ అంటారు) కోసం రూపొందించిన స్కోరింగ్ సిస్టమ్తో ఇండిక్ భాషలను మదింపు చేయడం సరికాదు. హిందీలో రాణించిన మోడల్ తెలుగులోనో, తమిళంలోనో రాణించాలని లేదు’ అని ఆయన పేర్కొన్నారు. -
వర్క్ ఫ్రం హోంకు ప్రాధాన్యం!
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో దేశ ఆర్థిక భద్రతను కాపాడుకునేందుకు భారతీయులందరూ ఆర్థిక దేశభక్తిని చాటాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన రాబోయే ఏడాది కాలం పాటు బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని పౌరులను కోరారు. విదేశీ మారక ద్రవ్యాన్ని (ఫారెక్స్) ఆదా చేయడం ద్వారా రూపాయి విలువను స్థిరీకరించి దేశ ఆర్థిక పునాదులను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ విజ్ఞప్తి చేశారు.సంక్షోభ సమయం.. అప్రమత్తత అవసరంపశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణలు, అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ముడి చమురు ధరలు, అంతరాయం కలుగుతున్న సరఫరా గొలుసు వ్యవస్థలను ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘సరఫరా గొలుసుపై ఒత్తిడి ఉన్నప్పుడు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ సవాళ్లు ఎదురవుతాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని ఆర్థికంగా సురక్షితంగా ఉంచడం మనందరి బాధ్యత’ అని ప్రధాని పేర్కొన్నారు.ముఖ్యంగా భారతదేశం తన చమురు అవసరాల్లో దాదాపు 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. యుద్ధ మేఘాల వల్ల ఎరువులు, చమురు ధరలు పెరగడం వల్ల డాలర్ అవుట్ఫ్లో పెరిగి విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలో బంగారం వంటి ‘అంతగా అవసరం లేని’ (డిస్క్రీషనరీ) దిగుమతులను తగ్గించడం వల్ల వాణిజ్య లోటును అదుపులో ఉంచవచ్చని ఆయన ఆకాంక్షించారు.బలమైన స్థితిలో ఫారెక్స్ నిల్వలుప్రధాని ఈమేరకు విజ్ఞప్తి చేసినప్పటికీ దేశ ఆర్థిక పరిస్థితిపై ఆయన పూర్తి భరోసా ఇచ్చారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజా గణాంకాల ప్రకారం, భారత్ ప్రస్తుతం అత్యంత పటిష్టమైన స్థితిలో ఉంది. మార్చి 2026 నాటికి భారత విదేశీ మారక నిల్వలు 691.11 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ నిల్వలు దాదాపు 11 నెలల పాటు దేశ దిగుమతి అవసరాలను తీర్చగలవు. భారత్ వద్ద ప్రస్తుతం 880.52 మెట్రిక్ టన్నుల బంగారం ఉంది. ఇందులో 680.05 మెట్రిక్ టన్నుల బంగారాన్ని ఆర్బీఐ ఇప్పటికే విదేశాల నుంచి స్వదేశానికి రప్పించి భద్రపరిచింది. ఆర్బీఐ వైవిధ్య వ్యూహం వల్ల విదేశీ మారక నిల్వలలో బంగారం వాటా సెప్టెంబర్ 2025లో 13.92% ఉండగా, అది మార్చి 2026 నాటికి 16.7 శాతానికి పెరిగింది.ప్రధాని సూచించిన మార్గదర్శకాలువిదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడానికి కేవలం బంగారం వాయిదా వేయడమే కాకుండా జీవనశైలిలో పలు మార్పులు చేసుకోవాలని ప్రధాని సూచించారు.పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించేందుకు మెట్రో రైలు, కార్ పూలింగ్, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలి.సాధ్యమైన చోట ఇంటి నుంచే పని విధానాన్ని అనుసరించడం ద్వారా ఇంధన వినియోగాన్ని తగ్గించవచ్చు.విదేశీ వస్తువుల కంటే స్థానిక ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇవ్వాలి.వ్యక్తిగత వాహనాల కంటే ప్రభుత్వ రవాణా వ్యవస్థలను, రైల్వే సరుకు రవాణా సేవలను వినియోగించుకోవాలి.రసాయన ఎరువుల దిగుమతి భారాన్ని తగ్గించేందుకు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలి.‘మనం చేసే ప్రతి చిన్న పొదుపు, దేశాన్ని ప్రపంచ ఆర్థిక సమస్యల నుంచి కాపాడుతుంది’ అని ప్రధాని తన ప్రసంగాన్ని ముగించారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ ప్రయోజనాలే పరమావధిగా పౌరులు స్పందించాలని ఆయన కోరారు.ఇదీ చదవండి: నిప్పులపై నీళ్లు చల్లినట్లు.. బంగారం ధరలు -
నిప్పులపై నీళ్లు చల్లినట్లు.. బంగారం ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
930 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:35 సమయానికి నిఫ్టీ(Nifty) 261 పాయింట్లు తగ్గి 23,911 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 938 పాయింట్లు నష్టపోయి 76,395 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.07బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 105.8 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.39 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.84 శాతం పెరిగింది.నాస్డాక్ 1.71 శాతం పుంజుకుంది.Today Nifty position 11-05-2026(time: 09:35 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారీ ఆటుపోట్లకు చాన్స్
ప్రధానంగా పశ్చిమాసియాలో కొనసాగనున్న పరిస్థితులు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్ను నిర్దేశించనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వీటికితోడు ముడిచమురు ధరలు, డాలరుతో రూపాయి మారకానికీ ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. వెరసి ఈ వారం భారీ ఆటుపోట్ల మధ్య మార్కెట్లు ట్రేడ్కానున్నట్లు అంచనా వేశారు. వివరాలు చూద్దాం.. – సాక్షి, బిజినెస్ డెస్క్కొద్ది వారాలుగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణంపై ఇన్వెస్టర్లు మరింత దృష్టి పెట్టనున్నారు. ప్రధానంగా యూఎస్, ఇరాన్ మధ్య పరిస్థితులు దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు స్టాక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. గత కొద్ది రోజులుగా రెండు దేశాల మధ్య సయోధ్య కుదిరే వీలున్న వాతావరణం నెలకొనడంతో ప్రపంచవ్యాప్తంగా ఆశావహ పరిస్థితులు కనిపించినప్పటికీ ఇటీవల తిరిగి ఉద్రిక్తతలు తలెత్తడంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరగవచ్చని నిపుణులు విశ్లేషించారు. దీంతో గత మూడు వారాలుగా హెచ్చుతగ్గుల మధ్య కన్సాలిడేషన్ బాటలో సాగుతున్న దేశీ స్టాక్ మార్కెట్లు ఇకపైనా తీవ్ర ఆటుపోట్ల మధ్య సానుకూలంగా కదిలే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు అంచనా వేశారు.గణాంకాలపై ఫోకస్12న ఏప్రిల్ నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ), 14న టోకు ధరల వివరాలు(డబ్ల్యూపీఐ) వెల్లడికానున్నాయి. మార్చిలో సీపీఐ 3.2% నుంచి 3.4%కి పెరిగింది. డబ్ల్యూపీఐ మరింత అధికంగా 2.13% నుంచి 3.88 శాతానికి ఎగసింది. దీంతో ఆర్బీఐ భవిష్యత్ పరపతి విధానాలపై ధరలు ప్రభావం చూపనున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. దీనికితోడు పశి్చమాసియాలో మళ్లీ ఆందోళనలు పెరుగుతుండటంతో ముడిచమురు ధరలు బ్యారల్ 100 డాలర్ల సమీపంలో కదులుతున్నాయి. ఫలితంగా డాలరుతో మారకంలో రూపాయి 95 స్థాయికి బలహీనపడిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ నెల 15న ఏప్రిల్ నెలకు వాణిజ్య గణాంకాలు విడుదలకానున్నాయి. మార్చిలో వాణిజ్య లోటు 20.67 బిలియన్ డాలర్లుగా నమోదైంది.మరోపక్క చైనా, యూఎస్.. ద్రవ్యోల్బణం, ఉపాధి, వాణిజ్యం తదితర గణాంకాలు సైతం వెలువడనున్నాయి. ఈ అంశాలు సైతం కీలకంగా నిలవనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు.. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్త్మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా, ఎన్రిచ్ మనీ సీఈవో ఆర్. పొన్మూడి, స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా వివరించారు. అయితే యూఎస్, ఇరాన్ మధ్య ఆశావహ పరిస్థితులు నెలకొంటే చమురు ధరలు దిగివచ్చే వీలున్నట్లు పేర్కొన్నారు. ఇది ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నివ్వగలదని అభిప్రాయపడ్డారు.క్యూ4 జాబితాలో ..ఇప్పటికే ముగింపు దశకు చేరుకున్న 2025–26 చివరి త్రైమాసిక (క్యూ4) ఫలితాల సీజన్లో భాగంగా మరికొన్ని దిగ్గజాలు పనితీరు వెల్లడించనున్నాయి. ఫలితాలు ప్రకటించనున్న జాబితాలో కెనరా బ్యాంక్, టాటా పవర్, ఎయిర్టెల్, డీఎల్ఎఫ్, హెచ్పీసీఎల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇండియన్ హోటల్స్, డాక్టర్ రెడ్డీస్ తదితరాలున్నాయి.గత వారమిలాహెచ్చు తగ్గుల మధ్య గత వారం మార్కెట్లు స్వల్పంగా బలపడ్డాయి. సెన్సెక్స్ 415 పాయింట్లు(0.53 శాతం), నిఫ్టీ 179 పాయింట్లు(0.75 శాతం) చొప్పున ఎగశాయి. వెరసి 77,328 వద్ద, 24,176 వద్ద ముగిశాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ మరింత అధికంగా 3.4 శాతం, 4.3 శాతం చొప్పున జంప్చేయడం గమనార్హం!ఎఫ్పీఐల షాక్కొద్ది రోజులుగా భారీ అమ్మకాలతో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) దేశీ స్టాక్ మార్కెట్లకు షాక్నిస్తున్నారు. ఈ నెల తొలి వారంలోనే రూ. 14,231 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. దీంతో 2026లో ఇప్పటివరకూ రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నట్లయ్యింది! వెరసి 2025లో నమోదైన రూ. 1.6 లక్షల కోట్ల విలువైన అమ్మకాలను దాటేశాయి. ఎఫ్పీఐలు గత నెలలో రూ. 60,847 కోట్లు, మార్చిలో ఏకంగా రూ. 1.17 లక్షల కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విషయం విదితమే. అయితే ఫిబ్రవరిలో మాత్రం అంతక్రితం 17 నెలల్లోనే అత్యధికంగా రూ. 22,615 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఇందుకు పశి్చమాసియాసహా చమురు ధరలు తదితర పలు అంశాలు ప్రభావం చూపుతున్నట్లు ఆర్థికవేత్తలు తెలియజేశారు.సాంకేతికంగా చూస్తే..ఈ వారం సాంకేతిక నిపుణుల అంచనాల ప్రకారం దేశీ స్టాక్ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య సానుకూలంగా కదిలే వీలుంది. కొద్ది వారాలుగా నిఫ్టీ 23,600–24,700 పాయింట్ల శ్రేణిలో కన్సాలిడేట్ అవుతోంది. ఈ శ్రేణి నుంచి బయటపడితే అంటే 23,600 దిగువన 23,100–23,000 పాయింట్ల వద్ద సపోర్ట్ లభించవచ్చు. ఇలాకాకుండా బలపడి 24,700 పాయింట్లను దాటితే 25,000ను తాకవచ్చు. -
ఐటీ విజేతలు మారుతున్నాయ్
ఒక స్టార్టప్. రెండేళ్ల కిందట దాని వార్షికాదాయం 10 కోట్ల డాలర్లు. మరిప్పుడు? ఏకంగా 3 వేల కోట్ల డాలర్లకు చేరబోతోంది. అమెరికన్ సిలికాన్ వాలీ దీన్ని పండగ చేసుకుంటుంటే... భారత ఐటీ రంగం వణికిపోతోంది. మన స్టాక్ మార్కెట్లు ఆందోళన చెందుతున్నాయి. ఇంతకీ ఏంటా స్టార్టప్? మన మార్కెట్లతో సంబంధమేంటి? మన ఇన్వెస్టర్లు ఏం చేయాలి? ఇదే ఈ వారం సాక్షి వెల్త్ స్టోరీ. (రమణమూర్తి మంథా)భారత ఐటీ దిగ్గజం టీసీఎస్ షేరు గడిచిన ఏడాదిలో 30 శాతం పడిపోయింది. ఐదేళ్ల దీర్ఘకాలాన్ని తీసుకున్నా నెగెటివ్ రిటర్న్లే చూపిస్తోంది. కారణం... 2004లో లిస్టయిన తరవాత తొలిసారిగా ఈ ఏడాది కంపెనీ ఆదాయంలో వృద్ధి లేదు. పైగా క్షీణించింది. మరో దిగ్గజం ఇన్ఫోసిస్.. వచ్చే ఏడాది తమ ఆదాయ వృద్ధి 1.5 నుంచి 3 శాతాన్ని మించకపోవచ్చంటూ బలహీనమైన గైడెన్స్ ఇచ్చింది. వీటన్నిటినీ మించి ఐటీ రంగంలో హైరింగ్ దారుణంగా పడిపోయింది. వీటన్నిటికీ కారణం... ఆరి్టఫీíÙయల్ ఇంటెలిజెన్స్. సిలికాన్ వాలీ పండగ చేసుకుంటున్నది కూడా ఆంత్రోపిక్ అనే ఏఐ అద్భుతాన్ని చూసి. మన మార్కెట్లను భయపెడుతున్నది కూడా ఈ ఏఐనే. మరిపుడు మన ఇన్వెస్టర్లు ఏం చెయ్యాలి? మన ఐటీ స్టోరీ ముగిసినట్లేనా?ఇది ముగింపు కాదు... కొత్త ఆరంభందీన్ని మన ఐటీ రంగం కథ ముగిసినట్లు కాకుండా కొత్త కథ ఆరంభంగా చూడాల్సిన అవసరముంది. ఎందుకంటే ఏఐ మన దేశంలోనూ కొత్త విజేతల్ని తయారు చేస్తోంది. ఏఐ ఇంజనీరింగ్, డేటా సెంటర్లు, సైబర్ సెక్యూరిటీ, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు (జీసీసీ), ఇండ్రస్టియల్ ఏఐ, చిప్ తయారీ వ్యవస్థలకు సంబంధించిన కంపెనీలు మెల్లగా వెలుగులోకి వస్తు న్నాయి. ఈ కొత్త కంపెనీల రేస్ ఇప్పటికే మొదలైంది కూడా. ఆంత్రోపిక్ వేగానికి తీసిపోకుండా!!. ఉద్యోగాలు రిస్కులో ఉన్నట్లేనా?ఐటీ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఈ రంగంలో కొన్ని విభాగాల ఉద్యోగులు డేంజర్ జోన్లోకి వచ్చేశారు. ఆయా కంపెనీలు ఏఐని వాడటం మొదలుపెట్టే కొద్దీ వీరి అవసరం, ప్రాధాన్యం తగ్గిపోతుంటుంది కనక... ఇప్పుడు కాకుంటే కొన్నాళ్ల తరవాత అయినా వీరి ఉద్యోగం ప్రమాదంలో పడొచ్చన్నది నిపుణుల మాట. ప్రధానంగా టెస్టింగ్, బేసిక్ కోడింగ్, సపోరి్టంగ్ రోల్స్లో ఉండేవారు, డాక్యుమెంటేషన్ చేసేవారు, బీపీఓ వాయిస్ ప్రాసెసింగ్లో ఉండేవారు ఈ ప్రమాదాన్ని త్వరగా ఎదుర్కొంటారనేది ఏఐ నిపుణుల వార్నింగ్.టెస్టింగ్, డాక్యుమెంటేషన్, వాయిస్ ప్రాసెసింగ్ వంటి ఏఐ చేసే పనుల్లో ఉన్నవారు ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉన్నప్పటికీ... ఏఐ ఇంటిగ్రేషన్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ ఇన్ఫ్రా, ఏఐ గవర్నెన్స్ వంటి విభాగాలలో భారీగా కొత్త ఉద్యోగాలు పుట్టుకు రాబోతున్నాయనే ది నిపుణుల మాట. ఎందుకంటే ఏఐ వాడకం పెరుగుతున్న కొద్దీ వీరి అవసరం కూడా పెరుగుతుంది. పైపెచ్చు ఏఐ వాడటంలో ఎదుర య్యే సవాళ్ల నుంచి మరిన్ని విభాగాలు పు ట్టుకొచ్చే అవకాశం కూడా ఉంది. సరే... ఇ దంతా ఉద్యోగాల గురించి అనుకుందాం. మరి కంపెనీల మాటేంటి? ఇన్వెస్టర్ల సంగతేంటి? టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్ వంటి కంపెనీలు వీక్ గైడెన్స్, డీల్స్ నెమ్మదించటం, వృద్ధి తగ్గిపోవటం వంటి కారణాల వల్ల ఇప్పటికే బాగా నష్టపోయాయి. కాకపోతే కొన్ని మధ్య తరహా ఐటీ కంపెనీలు, ఏఐపై దృష్టి పెట్టిన కంపెనీలు ఈ పతనాన్ని తట్టుకుని నిలబడ్డాయి. ఏఐని వేగంగా అందుకోవటం, పాత కాలపు కాంట్రాక్టులను తగ్గించుకోవటం, డిజిటల్పై ఎక్కువగా దృష్టి పెట్టడం వీటిని కొత్త విజేతలుగా మారుస్తున్నాయి. అలాంటి కంపెనీల్లో కొన్ని...పర్సిస్టెంట్ సిస్టమ్స్: బలమైన ఏఐ, క్లౌడ్-డిజిటల్ ఇంజినీరింగ్ఎల్టీఎం (మైండ్ట్రీ): ఏఐ ఆధారిత మార్పును త్వరగా అందుకోవటంకోఫోర్జ్: డిజిటల్పై ఫోకస్, ప్రత్యేకమైన నైపుణ్యంఎంఫసిస్: బీఎఫ్ఎస్ఐ + క్లౌడ్ ట్రాన్స్ఫర్మేషన్ కేపీఐటీ: ఆటో సాఫ్ట్వేర్ + ఎంబెడెడ్ సిస్టమ్స్ఏఐ దిశగా జరుగుతున్న మార్పుల్లో కొన్ని మధ్యశ్రేణి కంపెనీలు దిగ్గజాల్ని మించి పెరిగే అవకాశముందన్నది విశ్లేషకుల మాట. భవిష్యత్ విజేతలు ఇవేనా..?ఏఐ ఇన్ఫ్రా రంగంలోని కంపెనీలు డేటా సెంటర్లు, జీపీయూలు, క్లౌడ్ ఇన్ఫ్రా, నెట్వర్కింగ్, సెమీకండక్టర్ ఎకోసిస్టమ్లోని సంస్థలు ఈ పరిధిలోకి వస్తాయి. నెట్వెబ్ టెక్నాలజీస్, తేజస్ నెట్వర్క్స్, సిర్మా ఎస్జీఎస్ టెక్నాలజీ, కేనెస్ టెక్నాలజీ వంటి సంస్థలు ఈ రంగంలో ఉన్నాయి.ఇంజినీరింగ్, ఆర్ అండ్ డీ కంపెనీలు ఏఐ వృద్ధి చెందాలంటే దానికి చిప్ డిజైన్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఏరోస్పేస్, ఇండ్రస్టియల్ ఆటోమేషన్ కావాలి. కేపీఐటీ టెక్నాలజీస్, టాటా ఎలెక్సీ, సైయంట్ వంటి సంస్థలు ఈ రంగంలో ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీ, ఏఐ గవర్నెన్స్ కంపెనీలు ఏఐని ఉపయోగించటం పెరుగుతున్న కొద్దీ ఏఐ సెక్యూరిటీ, అమలు, గవర్నెన్స్, ఆడిట్ సిస్టమ్స్ వేగంగా పెరగాల్సిన అవసరముంది. దీంతో పాటు వెండర్లకు పనులు ఔట్సోర్సింగ్పై ఇవ్వటం కన్నా గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ల (జీసీసీ) అవసరం పెరుగుతుంది. మొత్తం ప్రాజెక్టుల్ని ఔట్సోర్సింగ్కి ఇచ్చే బదులు భారత కంపెనీలు నేరుగా ఏఐ టీమ్స్ను తయారు చేసుకోవటం మొదలుపెడతాయి. వీటిని ఏ కంపెనీలు త్వరగా అందిపుచ్చుకుంటే అవి విజేతలుగా మారతాయి.దీన్నిబట్టి అర్థమయ్యేది ఒక్కటే. భారత ఐటీ రంగం రికవరీ కాకుండా పోదు. కాకపోతే మునుపటిలా కాదు. ఎక్కువ మంది ఉద్యోగులుంటే ఎక్కువ రెవెన్యూ వస్తుందనే మాదిరి కాకుండా ఏఐని ఎక్కువగా ఏ కంపెనీలైతే అందిపుచ్చుకుంటాయో అవి వేగంగా పెరుగుతాయి. కొత్త ఐటీ విజేతలు పుట్టుకొస్తాయి. పాత మోడల్...ఎక్కువమంది ఉద్యోగులంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. ఎన్ని గంటలు పనిచేస్తే అంత బిల్లింగ్. అంటే ఇక్కడ సమయానికే విలువ. పెద్ద పెద్ద క్యాంపస్లు తప్పనిసరి. క్యాంపస్ సైజును బట్టే కంపెనీకి విలువ.యూనివర్సిటీ, కాలేజీ క్యాంపస్లకు వెళ్లి ఫ్రెషర్స్ను తీసుకోవటం సంప్రదాయం. కొత్త విజేతల తీరు...ఏఐ ప్రొడక్టివిటీని ఎంత పెంచితే... రెవెన్యూ అంత పెరుగుతుంది. ఫలితాన్ని బట్టే బిల్లింగ్. ఆ పనిని గంటల్లో చేసినా... రోజుల్లో చేసినా తేడా లేదు. చిన్న చిన్న ఏఐ టీమ్లుంటాయి. ఆ టీమ్ చేసే పనే కంపెనీ విలువను నిర్దేశిస్తుంది.ఆన్లైన్, ఆఫ్లైన్ ఇలా ఏ విధానమైనా... ఏఐ స్పెషలిస్టుల్నే తీసుకుంటారు. -
ఇంటికి, వ్యాపారానికి బీమా ధీమా
ప్రమాదాలనేవి ఎప్పుడు వస్తాయో చెప్పలేం. అవి ముందస్తు సమాచారం లేకుండానే విరుచుకుపడతాయి. సుదీర్ఘంగా కురిసే వర్షాలు ఇళ్లను ముంచెత్తవచ్చు. ఒక చిన్న అగ్ని ప్రమాదం ఏళ్ల తరబడి కష్టపడి కూడబెట్టిన పెట్టుబడిని రాత్రికి రాత్రే బూడిద చేయవచ్చు. అంతంత మాత్రం ఆదాయాలతో నడిచే కుటుంబాలకు, చిన్న వ్యాపారాలకు ఇవి అప్పుడప్పుడు ఎదురయ్యే అరుదైన సంఘటనలు కావు.నిత్యం ఎదురయ్యే చేదు నిజాలు. ఇలాంటి పరిస్థితుల్లో బీమా అనేది ఆర్థికంగా ఆసరాగా నిలిచేది అయినప్పటికీ దేశీయంగా దీని వినియోగం ఇప్పటికీ తక్కువ స్థాయిలోనే ఉంటోంది. బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ ఐఆర్డీఏఐ వార్షిక నివేదిక ప్రకారం 2023–24లో జీడీపీలో బీమా వాటా కేవలం 3.7 శాతమే. అంతక్రితం ఏడాదిలో నమోదైన 4% కన్నా ఇది తక్కువ కావడంతో పాటు ప్రపంచ సగటు 7% కన్నా చాలా తక్కువ కావడం గమనార్హం. ఇక ఇందులో జనరల్ బీమా వాటా కేవలం 1% మాత్రమే. అసెట్స్ వేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థలో ప్రాపర్టీ, వ్యాపారాల రిస్కులకు కవరేజీ అత్యంత తక్కువగా ఉండటాన్ని ఇది సూచిస్తోంది. దేశ జీడీపీలో సుమారు 30%, ఎగుమతుల్లో 45% వాటా ఉండే ఎంఎస్ఎంఈ రంగంలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. రిటైలర్లు, ఫ్యాబ్రికేషన్ యూనిట్లు, లాజిస్టిక్స్, రిపేర్ వర్క్షాప్ల లాంటి వ్యాపారాల్లో ప్రమాదం జరిగితే నెలల తరబడి పనులు ఆగిపోతాయి. ఇది వ్యాపారాన్ని కోలుకోలేని దెబ్బ తీస్తుంది. వాటిని అధిగమించేందుకే ‘బిజినెస్ ఇంటరప్షన్ ఇన్సూరెన్స్’ రూపొందింది. ఇక గృహాల విషయానికొస్తే వాతావరణ సంబంధ రిస్క్ లు ఎక్కువగా ఉండే దేశాల్లో భారత్ కూడా ఒకటిగా ఉంటోంది. వరదలు, తుఫాన్లు, వడగాల్పుల ప్రభావం భారత్లో ఎక్కువగా ఉంటుందని, తగిన భద్రత వ్యవస్థలు లేకపోతే వాతావరణ షాక్ల వల్ల కోట్ల మంది ప్రజలు పేదరికంలోకి జారిపోయే ముప్పు ఉందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. ఆదాయాలు, గృహాల కొనుగోళ్లు పెరుగుతున్నప్పటికీ స్టాండెలోన్ హోమ్ ఇన్సూరెన్స్ వినియోగం ప్రధాన మెట్రో నగరాల వెలుపల ఇప్పటికీ తక్కువే. అయితే, క్రమంగా ఈ ధోరణి మారుతోంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలు అంతక్రితం ఏడాది కన్నా రెండంకెల స్థాయి వృద్ధితో రూ. 2.9 లక్షల కోట్ల స్థూల ప్రీమియం వసూళ్లను నమోదు చేయడం ఇందుకు నిదర్శనం. సరళతరంగా ఇన్సూరెన్స్.. రుణదాతలు, రిస్క్ కవరేజీని తప్పనిసరి చేస్తుండటంతో ప్రాపర్టీ, కమర్షియల్ ఇన్సూరెన్స్ విభాగం క్రమంగా పుంజుకుంటోంది. పరిశ్రమ కూడా పరిస్థితులకు అనుగుణంగా మారుతోంది. పాలసీ పరిభాష సరళతరంగా మారింది. డిజిటల్గా జారీ వల్ల టర్నెరౌండ్ సమయం తగ్గింది. క్లెయిమ్స్ని రియల్ టైమ్లో ట్రాక్ చేయడం వీలవుతోంది. క్లెయిమ్ సెటిల్మెంట్ పనితీరు కూడా చాలా మెరుగుపడింది. ఇవన్నీ కూడా బీమా విస్తృతి పెరిగేందుకు దోహదపడుతున్నాయి. తక్కువ ప్రీమియంతో లభించే మైక్రో–ఇన్సూరెన్స్ పద్ధతులు చిన్న వ్యాపారాలకు మరియు సామాన్యులకు బీమాను చేరువ చేస్తున్నాయి. ఇది ముఖ్యంగా విపత్తులు సంభవించే ప్రాంతాల్లో అప్పుల పాలు కాకుండా ప్రజలను కాపాడుతుంది. బీమా ఉన్న వ్యాపారాలు త్వరగా కోలుకోవడం వల్ల సరఫరా వ్యవస్థ దెబ్బతినదు, ఉపాధికి విఘాతం కలగదు. ఈ రకంగా బీమా అనేది ఆర్థిక వ్యవస్థకు ఒక ’షాక్ అబ్జార్బర్’ లాగా పనిచేస్తుంది. మౌలిక సదుపాయాలు, ఇళ్లు, వాణిజ్య సముదాయాలు పెరుగుతున్న కొద్దీ ప్రమాదాల తీవ్రత పెరగవచ్చు. ఈ నేపథ్యంలో జనరల్ ఇన్సూరెన్స్ అనేది అదనపు ఖర్చు కాదు, రక్షణ కవచం. భారత ఆర్థిక వృద్ధిలో రిస్క్ ప్రొటెక్షన్ను భాగం చేయ డం అనేది ముందుజాగ్రత్త మాత్రమే కాదు, ఆర్థిక అవసరం కూడా.రమిత్ గోయల్చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్, జనరలి సెంట్రల్ ఇన్సూరెన్స్ -
హెల్త్ క్లెయిమ్ తిరస్కరిస్తే కుదరదిక!
హెల్త్ ఇన్సూరెన్స్ రీయింబర్స్మెంట్ క్లెయిమ్ను సకాలంలో దాఖలు చేయకపోతే బీమా సంస్థలు నిర్మొహమాటంగా నో చెప్పేస్తుంటాయి. కానీ, ఇకపై అలా కుదరదు. నిర్ణీత గడువులోపు సాధ్యపడక, ఆలస్యంగా ఫైల్ చేసినా.. నిబంధనలకు అనుగుణంగా మదింపు చేయాల్సిందే. రూపాయితో సహా చెల్లించాల్సిందే. ఏప్రిల్ 20న బొంబే హైకోర్టు ఈ దిశగా ఇచ్చిన తీర్పు పాలసీదారులకు ఆర్థిక ఉపశమనం కాగా.. నిబంధనలు పాలసీదారులకు అనుకూలంగా ఉన్నా, ఇంతకాలం తమకు అనుకూలంగా మలుచుకుంటున్న బీమా సంస్థలకు కనువిప్పే. అసలైన క్లెయిమ్ దరఖాస్తులను ఆలస్యంగా దాఖలు చేశారని చెప్పి తిరస్కరించడం కుదరదని హైకోర్టు స్పష్టంగా తేల్చి చెప్పింది. కనుక అర్థం పర్థం లేని కారణాలతో హెల్త్ క్లెయిమ్కు తిరస్కారం ఎదురైతే.. మిన్నకుండిపోవక్కర్లేదు. కారణం తెలుసుకుని బీమా సంస్థను నిలదీయొచ్చు. బిల్లు మొత్తాన్ని రాబట్టుకోవచ్చు. బొంబే హైకోర్టు తీర్పు పాలసీదారుల హక్కులను పరిరక్షించేదిగా నిపుణులు అభివరి్ణస్తున్నారు. సీపీ రవీంద్రనాథ్ మీనన్ అనే వ్యక్తి తన హెల్త్ రీయింబర్స్మెంట్ క్లెయిమ్ను బీమా సంస్థ పెట్టిన నిర్దేశిత గడువు దాటిన తర్వాత దాఖలు చేశాడు. నిబంధనల్లో పేర్కొన్నట్టు 90 రోజుల్లోగా క్లెయిమ్ దాఖలు చేయనందున దరఖాస్తును తిరస్కరిస్తున్నట్టు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ సమాధానం ఇచ్చింది. దీంతో పాలసీదారుడు న్యాయం కోసం కోర్టు మెట్లెక్కాల్సి వచ్చింది. కేవలం ఆలస్యంగా క్లెయిమ్ దాఖలు చేశారంటూ తిరస్కరించడం చట్టం కింద చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ తరహా నిబంధనలు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, 1872లోని సెక్షన్ 28(బి)ని ఉల్లంఘించడమేనని పేర్కొంది. చట్టపరిధిలో అర్హత కలిగిన క్లెయిమ్ను సాంకేతిక కారణాలతో తిరస్కరించరాదని తేల్చి చెప్పింది. హెల్త్ పాలసీలకు సంబంధించి సమయ నిబంధనలు చెల్లనివి, అమలు చేయరానివిగా పేర్కొంది. ఒప్పంద నిబంధనలు నిజమైన హక్కులను రద్దు చేయలేవంటూ భారత సర్వోన్నత న్యాయస్థానం గతంలో చెప్పిన తీర్పు ఆధారంగా బొంబే హెకోర్టు ఈ కేసులో బీమా సంస్థ వాదనను తోసిపుచ్చింది. పాలసీదారుడి క్లెయిమ్కు చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా చెల్లింపులు చేయాలని, ఆ మొత్తంపై 6 శాతం వడ్డీ కూడా చెల్లించాలని తీర్పు జారీ చేసింది.నగదు రహితం – రీయింబర్స్మెంట్నగదు రహితం: ఇందుకు సంబంధించి ఆస్పత్రులు 2024/2026 ఐఆర్డీఏఐ మాస్టర్ సర్క్యులర్ను అనుసరిస్తున్నాయి. దీని ప్రకారం బీమా సంస్థ నగదు రహిత క్లెయిమ్కు ముందస్తు అనుమతి అన్నది గంటలోపు మంజూరు చేయాలి. డిశ్చార్జ్ క్లెయిమ్కు 3 గంటల్లోపు అనుమతి జారీ చేయాలి. ఆలస్యం చేస్తే.. ఆ సమయంలో ఆస్పత్రిలో ఉండేందుకు అయ్యే వ్యయాలను సైతం బీమా సంస్థ చెల్లించాల్సిందే. రీయింబర్స్మెంట్ క్లెయిమ్: ముందుగా సొంత పాకెట్ నుంచి చెల్లింపులు చేసి, తర్వాత బీమా సంస్థ వద్ద రీయింబర్స్మెంట్ కోసం క్లెయిమ్ దాఖలు చేసుకోవడం. సాధారణంగా 30 రోజులు మించకుండా ఈ క్లెయిమ్ను దాఖలు చేయాల్సి ఉంటుంది.ఎందుకు కాల పరిమితులు? → క్లెయిమ్లకు సంబంధించి బీమా కంపెనీలు కాల పరిమితులు నిర్ణయించడం వెనుక.. వీలైనంత త్వరలో వాటిని మదింపు చేయడం ద్వారా వాస్తవ సమాచారాన్ని గుర్తించడం సులభతరమవుతుందనే. → ఒకవేళ, క్లెయిమ్ దాఖలు ఆలస్యం అవడం వెనుక సహేతుక కారణాలుంటే తిరస్కరించడానికి కుదరదని నిబంధనలు సైతం చెబుతున్నాయి. → ఒంటరి వ్యక్తులు ఐసీయూలో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ కావొచ్చు. అలాంటప్పుడు వారు కోలుకుని ఫైల్ దాఖలు చేయడానికి సమయం తీసుకోవచ్చు. అలాంటప్పుడు క్లెయిమ్ తిరస్కరించడం సహేతుకం కానేకాదు. → ఆరు నెలల తర్వాత క్లెయిమ్ దాఖలు చేసినా సరే, అందుకు సరైన కారణం ఉంటే బీమా సంస్థ అర్హతలకు లోబడి మదింపు చేయాలి. అంతేకానీ కాలహరణం పేరుతో తిరస్కరించకూడదు. ఒకవేళ పాలసీదారుడు మోసం చేసేందుకే జాప్యం చేశాడని బీమా సంస్థ నిరూపిస్తే తప్ప క్లెయిమ్కు తిరస్కారం కుదరదు. → బీమా సంస్థలు, థర్డ్ పార్టీ అడ్మిని్రస్టేటర్లు (టీపీఏలు/బీమా తరఫున క్లెయిమ్ వ్యవహారాలు చూసే సంస్థలు) క్లెయిమ్కు సంబంధించి, ఏవైనా అదనపు డాక్యుమెంట్లు అవసరమైతే నేరుగా ఆస్పత్రుల నుంచి తీసుకోవాలని ఐఆర్డీఏఐ ఆదేశించడం గమనార్హం. → ఆరోగ్య బీమా రక్షణ అన్నది అవసరంలో ఆదుకోవడానికే. కానీ, సాంకేతిక కారణాలు చూపి నో చెప్పేందుకు కాదని కోర్టు తీర్పు స్పష్టం చేస్తోంది. ఆలస్యం అయితే..?→ ఆందోళన చెందాల్సిన పనే లేదు. డిలే కండోనేషన్ లెటర్ను క్లెయిమ్ పత్రాలకు జత చేయండి. → అందులో పాలసీ నంబర్, పేషెంట్ పేరు స్పష్టంగా ఉండాలి. → ఆలస్యం అయినందుకు కారణాన్ని వివరించండి. → న్యాయమైన క్లెయిమ్లను సాంకేతిక కారణాల పేరుతో తిరస్కరించరాదన్న ఐఆర్డీఏఐ మార్గదర్శకాలు, బొంబే హైకోర్టు తీర్పును ఉదహరించండి. సకాలంలో స్పందించండి..→ క్లెయిమ్ దాఖలు ఆలస్యం అయినా అర్హత ఉంటుందని చెప్పి నిర్లక్ష్యం పనికిరాదు. → డిశ్చార్జ్ అయిన తర్వాత వీలైనంత త్వరగా క్లెయిమ్ దాఖలుకు ప్రయత్నించండి. → క్లెయిమ్ దాఖలుకు సమయం పట్టేట్టు ఉంటే బీమా సంస్థకు ముందుగానే దానిపై సమాచారం ఇవ్వండి. → ఒంటరి వ్యక్తులు అయితే ఈ విషయంలో మరొకరి సహకారం తీసుకోవడం మంచిది. → డిశ్చార్జ్ సమ్మరీ నుంచి, ప్రతి బిల్లు ఒరిజినల్ కాపీలు, పాలసీదారుడి ఆధార్, పాన్ కాపీల వరకు ఇలా అన్నింటినీ సిద్ధం చేసుకోవాలి. గతంలో తిరస్కరించినవి అయితే..?→ క్లెయిమ్ను ఆలస్యంగా దాఖలు చేశారన్న కారణంతో లోగడ తిరస్కరించినట్టయితే.. తాజాగా మరోసారి రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. → బొంబే హైకోర్టు తీర్పును ప్రస్తావించండి. తన క్లెయిమ్ను తిరిగి మదింపు వేయాలని కోరొచ్చు. → ఇప్పటి వరకు అర్హత కలిగిన దరఖాస్తులను సైతం ఆలస్యంగా దాఖలు చేశారన్న కారణంగా బీమా సంస్థలు తిరస్కరిస్తూ వచ్చాయి. కానీ, ఇకపై కొంత మార్పును ఆశించొచ్చు. పాలసీదారులు సైతం కాల నియమాల గురించి అవగాహనతో, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించడం మంచిది. తిరస్కరిస్తే..?→ ఆలస్యాన్ని కారణంగా చూపిస్తూ రీయింబర్స్మెంట్ క్లెయిమ్ను తిరస్కరిస్తే బీమా కంపెనీలోని గ్రీవెన్స్ సెల్ను సంప్రదించాలి. → స్పందన లేకపోతే బీమా అంబుడ్స్మన్ దృష్టికి తీసుకెళ్లాలి. → అప్పటికీ ఉపయోగం లేకపోతే కోర్టును ఆశ్రయించడమే మార్గం. – సాక్షి, వెల్త్ డెస్క్ -
తగ్గిన నష్టాలు.. దూసుకెళ్తున్న స్విగ్గీ!
ఫుడ్ డెలివరీ, క్విక్కామర్స్ (ఇన్స్టామార్ట్) సంస్థ స్విగ్గీ మార్చి త్రైమాసికంలో పనితీరును బలోపేతం చేసుకుంది. కన్సాలిడేటెడ్ నష్టం రూ.800 కోట్లకు తగ్గింది. అంతకు ముందు ఆర్ధిక సంవత్సరం చివరి త్రైమాసికంలో సంస్థ నష్టం రూ.1,081 కోట్లుగా ఉండడం గమనార్హం. ఆదాయం.. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 45 శాతం పెరిగి రూ.6,383 కోట్లకు చేరింది. వ్యయాలు రూ.5,610 కోట్ల నుంచి రూ.7,448 కోట్లకు పెరిగిపోయాయి.స్విగ్గీ ఫుడ్ డెలివరీ వ్యాపారం స్థూల ఆర్డర్ విలువ (జీవోవీ) 15 త్రైమాసికాల గరిష్ట స్థాయికి చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే 22.6 శాతం పెరిగి రూ.9,006 కోట్లుగా నమోదైంది.ఫుడ్ డెలివరీ విభాగంలో వార్షిక ఎబిట్డా రూ.1,000 కోట్లను దాటింది.‘ఇన్స్టామార్ట్’ (క్విక్ కామర్స్) ఆదాయం స్థూల ఆర్డర్ విలువ 68 శాతం పెరిగి రూ.7,881 కోట్లకు చేరింది.స్నాక్స్, పానీయాలు, రెడీ టు ఈట్ ఫుడ్స్ను వేగంగా డెలివరీ చేసేందుకు ప్రత్యేకంగా ప్రారంభించిన ‘స్నాక్’ను మూసివేసినట్టు వాటాదారులకు రాసిన లేఖలో స్విగ్గీ తెలిపింది. అధిక డిమాండ్తోనే ఈ వ్యాపారం నిర్వహణ సాధ్యమని పేర్కొంది.మధ్యకాలానికి ఇన్స్టామార్ట్ ఆర్డర్ల విలువ రూ.లక్ష కోట్లకు, 4–5 శాతం ఎబిట్డాకి చేరుకుంటుందని అంచనా వేసింది. -
తల్లి కోపం.. బఫెట్ విజయ రహస్యం!
ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పెట్టుబడిదారుడు వారెన్ బఫెట్ గురించి చాలామందికి తెలుసు. అయితే ఈయన ఇంత గొప్ప ఇన్వెస్టర్ ఎలా అయ్యారు?, దాని వెనుక ఆయన తల్లి పాత్ర ఎంత వరకు ఉంది? అనే ఆసక్తికరమైన విషయాలు 'మదర్స్ డే' సందర్భంగా ఈ కథనంలో చూసేద్దాం.ప్రపంచంలో విజయవంతమైన, ధనవంతులైన ఇన్వెస్టర్లలో ఒకరైన వారెన్ బఫెట్ వ్యక్తిగత జీవితం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన చిన్న తనం నుంచి కఠినమైన క్రమశిక్షణలో పెరిగారు. తల్లి లీలా స్టాల్ బఫెట్ కనుసన్నల్లో ఎదిగిన వారెన్ బఫెట్ చిన్ననాటి నుంచే ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఉపయోగించేవారు. ఎందుకంటే తల్లి వృధా ఖర్చులను ప్రోత్సహించేది కాదు.లీలా స్టాల్ బఫెట్ చాలా క్రమశిక్షణ గల, కఠిన స్వభావం కలిగి ఉండటం వల్ల.. ఆమె కోపానికి వారెన్ బఫెట్ భయపడేవారు. ఇంట్లో వాతావరణం చాలా క్రమశిక్షణతో ఉండేది. కాబట్టి చిన్న చిన్న విషయాలకు కూడా ఒత్తిడి ఏర్పడేదని 'ద స్నోబాల్' (The Snowball) పుస్తకంలో వెల్లడించారు.ఒకసారి భోజన సమయంలో చిన్న విషయంపై.. తల్లి కోపగించుకున్నప్పుడు ఇంట్లో నిశ్శబ్దం నెలకొందని బఫెట్ పేర్కొన్నారు. ఆ సమయంలో తాను చాలా అసౌకర్యంగా ఫీలై డైనింగ్ టేబుల్ వదిలి తన గదికి వెళ్లిపోయినట్లు చెప్పుకున్నారు. అలాంటి అనుభవాలు ఆయన బాల్యంపై గాఢమైన ప్రభావం చూపాయి.బఫెట్ చిన్న వయసులోనే చూయింగ్ గమ్ అమ్మడం, కోకా కోలా బాటిళ్లు విక్రయించడం, న్యూస్ పేపర్ వేయడం వంటి పనులు చేసి డబ్బు సంపాదించేవారు. ఆ డబ్బును వృధాగా ఖర్చు చేయకుండా.. పొదుపు చేసి తిరిగి పెట్టుబడి పెట్టేవాడు. వారెన్ బఫెట్ విజయానికి కేవలం తెలివి మాత్రమే కారణం కాదు. ఆయన సహనం, నియంత్రణ, ఆలోచన కూడా కారణాలే.ఇదీ చదవండి: ఉద్యోగ జీవితం.. చివరికి అప్పులు: కియోసాకి వివరణబిలియనీర్ అయినప్పటికీ బఫెట్ జీవనశైలిలో పెద్ద మార్పు లేదు. ఆయన ఇప్పటికీ చాలా సాదాసీదాగా జీవిస్తారు. దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన ఇంట్లోనే ఆయన నివాసం ఉంటున్నారు. విలాసవంతమైన జీవితం కన్నా సాదాసీదా జీవితాన్నే ఆయన ఎక్కువగా ఇష్టపడతారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. దీన్నిబట్టి చూస్తే.. చిన్నతనంలో తల్లి వల్ల ఏర్పడిన క్రమశిక్షణే నేటికీ ఆయనపై ప్రభావం చూపుతోందని స్పష్టమవుతోంది. -
యాక్సిస్ బ్యాంక్ ప్రత్యేక సొల్యూషన్స్
ప్రైవేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ తమ కరెంట్ అకౌంట్హోల్డర్స్ కోసం రెండు కొత్త సొల్యూషన్స్ని ప్రవేశపెట్టింది. ఏఐ ఆధారిత రీకేవైసీ, ఏఐ ఆధారిత డిజిటల్ బిజినెస్ ప్రొఫైల్ అప్డేట్ సర్వీసెస్ వీటిలో ఉన్నాయి.వ్యక్తిగతేతర కరెంట్ అకౌంట్ కస్టమర్లు ఒకే పీడీఎఫ్ ద్వారా సమర్పించే పలు డాక్యుమెంట్స్ నుంచి అవసరమైన కేవైసీ వివరాలను సేకరించి, అప్డేట్ చేసేందుకు రీకేవైసీ సహాయకరంగా ఉంటుంది. అటు డిజిటల్, పేపర్రహిత ప్రక్రియ ద్వారా వ్యాపార స్వరూపంలాంటి వివరాలను అప్డేట్ చేసేందుకు ప్రొఫైల్ అప్డేట్ సర్వీస్ ఉపయోగపడుతుంది. -
ఉద్యోగ జీవితం.. చివరికి అప్పులు: కియోసాకి వివరణ
పెట్టుబడుల గురించి, ఆర్థికపరమైన విషయాలను చెప్పే 'రాబర్ట్ కియోసాకి'.. ఇప్పుడు ఉద్యోగుల గురించి, వారి భవిష్యత్తు గురించి వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఉద్యోగి ప్రతి వారం ఐదు రోజులు చాలా కష్టపడి పనిచేస్తాడు. ఉదయం నిద్రలేచి ఆఫీసుకు వెళ్లడం, ట్రాఫిక్లో ప్రయాణించడం, ఎప్పటికీ ముగియని పనులను పూర్తి చేయడం. ఇవన్నీ చేస్తూ.. చేస్తూ చివరికి అలసట మాత్రమే మిగులుతుంది. ఇలాంటి సమయంలో 'జీవితాంతం ఇలాగే కొనసాగాలా?' అనే ప్రశ్న మనసులో పుడుతుంది.అంటే.. దీని అర్థం పని చేయకుండా ఉండటం కాదు. సోమరితనం అంతకంటే కాదు, కృతఙ్ఞతలేకపోవడం కూడా కాదు. నీ కష్టం అంతా మరొకరి కలలను నిజం చేయడానికి వెళ్తోందనే భావన వల్ల కలిగే అలసట మాత్రమే అని కియోసాకి పేర్కొన్నారు.ఆర్థిక ప్రపంచంలో నాలుగు (E, S, B, I) ప్రధానమైన విభాగాలు మాత్రమే ఉన్నాయని, వీటి గురించి కియోసాకి వివరంగా వివరించారు.E – Employee (ఉద్యోగి)S – Self-Employed (స్వయం ఉపాధి పొందినవాడు)B – Business Owner (వ్యాపార యజమాని)I – Investor (పెట్టుబడిదారు)చాలామంది జీవితాంతం E విభాగంలోనే ఉంటారు. అంటే.. ఉద్యోగం చేస్తూ జీతం మీద ఆధారపడతారు. కానీ ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. వీళ్లే ఎక్కువ పన్నులు చెల్లిస్తుంటారు. జీతం చేతికి రాకముందే ప్రభుత్వం పన్ను తీసుకుంటుంది. తరువాత మిగిలిన డబ్బుతోనే ఎంప్లాయ్ జీవించాలి.ఈ సమయంలో కియోసాకి పూర్ డాడ్ గురించి పేర్కొన్నాడు. ఆయన చాలా చదువుకున్నవారు, ప్రభుత్వ ఉద్యోగం చేశారు. చాలా కష్టపడే వ్యక్తి. మంచి ఉద్యోగమే భద్రత అని నమ్మేవారు. కానీ జీవితాంతం కష్టపడి పనిచేసినా.. చివరికి అప్పులు మిగిలాయి.ఇదీ చదవండి: 2008లోనే చూశాను.. రియల్ ఆస్తులు ఏవంటే?రిచ్ డాడ్ ఆలోచన మాత్రం.. పూర్ డాడ్ ఆలోచనకు భిన్నంగా ఉంటుంది. ఈయన B, I విభాగాలను ప్రధాన్యత ఇచ్చారు. ఇందులోనే జీవించారు. అంటే వ్యాపారాలు నిర్మించారు, పెట్టుబడులు కూడా పెట్టారు. ఈయన డబ్బుకోసం పనిచేయలేదు, తన కోసం పనిచేసే వ్యవస్థలను నిర్మించాడు. అందువల్ల పన్నుల చట్టాలు కూడా ఆయనకు అనుకూలంగా పనిచేశాయి.ఒక ఉద్యోగి సంపాదించిన డబ్బులో ఎక్కువ భాగం పన్నులుగా వెళ్లిపోతాయి. కానీ ఒక వ్యాపారవేత్త అదే డబ్బును వ్యాపారంలో తిరిగి పెట్టుబడి పెట్టి, ఆస్తులు పెంచుకుని, చివర్లో మాత్రమే పన్నులు చెల్లిస్తాడు. అంటే ఒకే దేశం, ఒకే ఆర్థిక వ్యవస్థ అయినా.. నియమాలు అందరికీ ఒకేలా పనిచేయవు.Facebook Story ReferenceThis content is shared via Facebook Story (temporary content).Open Story on Facebook -
హీట్ బీటర్స్.. కూల్గా ఉంచే బెస్ట్ గాడ్జెట్స్!
వేసవిలో ఎండ ఎంత పెరిగినా, మిమ్మల్ని మాత్రం కూల్గా ఉంచే బెస్ట్ హెల్పర్సే ఈ చిన్న గాడ్జెట్స్! ఇవి వేసవి కాలంలో చాలా ఉపయోగపడతాయి. ధర కూడా కొంత తక్కువగానే ఉండటం గమనార్హం. వీటి గురించి మరిన్ని వివరాలు ఇక్కడ..చల్లని టచ్తో గ్లోయింగ్ స్కిన్!వేసవిలో కూడా మీ ఫేస్ ఎప్పుడూ ఫ్రెష్గా, గ్లోయింగ్గా కనిపించాలని అనుకుంటున్నారా? అయితే ఈ చిన్న ఐస్ రోలర్ బ్యూటీ టూల్ మీ డైలీ స్కిన్ కేర్లో ఒక సూపర్ హెల్పర్ అవుతుంది. దీనిని ఫ్రిజ్లో కొద్దిసేపు పెట్టి, తర్వాత ముఖంపై నెమ్మదిగా రోల్ చేస్తే చల్లని థెరపీ లభిస్తుంది. ఇది ముఖానికి రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఇచ్చి, పఫీనెస్ తగ్గించడంలో, స్కిన్ మరింత ఫ్రెష్గా కనిపించడంలో సహాయపడుతుంది. సిలికాన్తో తయారైన ఈ రోలర్ మళ్లీ మళ్లీ వాడుకునేలా డ్యూరబుల్గా డిజైన్ చేశారు. నీళ్లు లేదా గ్రీన్ టీ, రోజ్ వాటర్ లాంటి వాటితో ఫ్రీజ్ చేసి మీకు నచ్చిన విధంగా ఉపయోగించుకోవచ్చు. ధర కేవలం రూ. 140 మాత్రమే!మెడలోనే రక్షణ కవచం!బయట అడుగు పెడితే చాలు... దుమ్ము, ధూళి, పొగతో ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉందా? అయితే వేరబుల్ పోర్టబుల్ ఎయిర్ ప్యూరిఫైయర్ మీ దగ్గర ఉండాల్సిందే! ఇది మీ మెడలో ఉంటే చాలు, మీరు ఎక్కడికి వెళ్లినా చల్లని, స్వచ్ఛమైన గాలి మీ వెంటే ఉంటుంది! గాలిలోని అత్యంత సూక్ష్మమైన కాలుష్య కణాలను, పొగను సెకన్లలో తొలగించి, ఇది గాలిని 99 శాతం స్వచ్ఛంగా మారుస్తుంది. పైగా ఫిల్టర్ మార్చాల్సిన అవసరం లేకుండా సులభంగా వాడుకునేలా డిజైన్ చేశారు. ట్రావెల్లో, ఆఫీస్లో లేదా బయట ఎక్కువసేపు ఉండాల్సిన వారికి ఇది ఒక స్మార్ట్ సపోర్ట్. ధర కేవలం రూ. 3,200.కూల్గా గేమ్ ఆడండి!వీడియో గేమ్స్ ఆడేటప్పుడు లేదా వీడియోలు ఎక్కువసేపు చూస్తుంటే ఫోన్ వేడెక్కి స్లో అవుతుందా? అయితే ఈ చిన్న ‘ఫోన్ కూలర్’ మీకు ఒక సూపర్ సొల్యూషన్. ఈ కూలర్ను ఫోన్కు జత చేస్తే చాలు, వేడి త్వరగా తగ్గించి ఫోన్ను కూల్గా ఉంచుతుంది. రెండు పవర్ మోడ్స్ ఉండటంతో అవసరానికి తగ్గట్టు కూలింగ్ లెవల్ను ఎంచుకోవచ్చు. గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ లేదా లాంగ్ కాల్స్ సమయంలో ఇది మంచి సపోర్ట్గా ఉంటుంది. చిన్న సైజ్లో ఉండటం వల్ల ఫోన్ పట్టుకున్నప్పుడు ఏ అసౌకర్యం కలగదు. పైగా ఎక్కువ శబ్దం చేయకుండా నిశ్శబ్దంగా పనిచేస్తుంది. ధర కేవలం రూ. 1,100. -
భవిష్యత్తు భారత్లోనే.. అమెరికాలో కాదు!
చేయడానికి ఒక ఉద్యోగం, మంచి జీతం వస్తే చాలు, అనుకునేవాళ్లే సంఘంలో చాలామంది ఉన్నారు. ఇందులో కొందరికి సొంతంగా ఏదైనా బిజినెస్ లేదా నచ్చినపని చేయాలని ఉన్నప్పటికీ.. భయం లేదా ఇతరత్రా కారణాల వల్ల ముందడుగు వేయరు. కానీ.. అమన్ గోయల్ అనే యువకుడు అమెరికాలో లక్షల జీతం వచ్చే ఇంటర్న్షిప్ వదిలి, సొంతగడ్డపై స్టార్టప్ ప్రారంభించాలని స్వదేశానికి వచ్చేసాడు.ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబేలో చదువుతున్నప్పుడే అమన్ గోయల్.. కేవలం 20 సంవత్సరాల వయసులో అమెరికాలోని రుబ్రిక్ అనే ప్రముఖ టెక్నాలజీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఇంటర్న్షిప్ చేసే అవకాశం పొందాడు. ఆ సమయంలో ఆయన జీతం నెలకు 8,000 డాలర్లు (రూ.7.5 లక్షలు). కానీ ఇది అతనికి అంతగా నచ్చలేదు.తన భవిష్యత్తు అమెరికాలో కాకుండా.. భారతదేశంలో ఉందని అమన్ గోయల్ గ్రహించాడు. నేను కూడా ఒక కంపెనీని నిర్మించాలి, నా దేశంలోనే ఎదగాలి అనే ఆలోచన అతనిలో బలపడింది. అందుకే తిరిగి భారతదేశానికి వచ్చి, కేవలం ఇంజనీరింగ్ జ్ఞానంతో సరిపెట్టుకోకుండా.. వ్యాపారం నిర్మాణం గురించి కూడా నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు.Ten years ago, I landed in San Francisco as a 20-year-old kid from IIT Bombay, headed to Palo Alto to intern at @rubrikInc's Software Engineering Team.I was earning $8,000 a month. It felt like a dream.My mentor was an @CSE_IITBombay senior, who made me fall in love with… pic.twitter.com/EjphbHWNs9— Aman Goel (@amangoeliitb) May 9, 2026కాలేజీలో చదువుతున్న చివరి సంవత్సరంలోనే వ్యాపార నిర్వహణ, మార్కెటింగ్, ప్రొడక్ట్ డిజైన్, సేల్స్ వంటి విషయాలను అభ్యసించాడు. “ఇంజనీరింగ్ నా బలం అయినా, వ్యాపారం నిర్మించడం నా అసలు లక్ష్యంగా మారింది” అని అమన్ గోయల్ చెప్పాడు.ఇదీ చదవండి: ఉద్యోగులకు సీఈఓ మదర్స్ డే గిఫ్ట్!కొన్ని సంవత్సరాల తరువాత, అతడు స్థాపించిన GreyLabs AI అనే సంస్థ 85 మందికి పైగా ఉద్యోగులతో పెద్ద స్థాయికి చేరుకుంది. ఈ సంస్థ దాదాపు 100 కోట్ల రూపాయల పెట్టుబడులు సమీకరించి, ప్రతి సంవత్సరం మూడు రెట్లు వృద్ధిని సాధిస్తోంది. అయితే ఇది అనుకున్నంత సులభంగా వృద్ధిలోకి రాలేదు. ఎన్నో రిస్కులు, కష్టాలు, అనిశ్చితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే గొప్ప వృద్ధిని సాధించగలిగింది. -
హోండా సీబీ1000 హార్నెట్ బైకులకు రీకాల్!
హోండా మోటార్సైకిల్ & స్కూటర్ ఇండియా (HMSI) తన 'సీబీ1000 హార్నెట్ ఎస్పీ' మోడళ్లకు రీకాల్ ప్రకటించింది. కంపెనీ రీకాల్ ప్రకటించడానికి కారణం ఏమిటి?, ఈ ప్రభావం ఎన్ని బైకులపై పడుతుంది? అనే విషయాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.2024 సెప్టెంబర్ 30 నుంచి 2025 ఆగస్టు 22 మధ్య తయారైన CB1000 హార్నెట్ SP మోడళ్లను హోండా మోటార్సైకిల్ స్వచ్ఛందంగా రీకాల్ జారీ చేసినట్లు వెల్లడించింది. ఫ్యూయల్ ఫీడ్ హోస్ అమరిక, ఇంజిన్ ఆయిల్ వినియోగ స్థాయిలకు సంబంధించిన సమస్యల కారణంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఎన్ని బైకులు ఈ ప్రభావానికి లోనయ్యాయనే విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు.రీకాల్ క్యాంపెయిన్లో భాగంగా, హోండా ప్రభావిత మోటార్సైకిళ్లను తనిఖీ చేసి, పరిష్కరిస్తుంది. ఇందులో ఫ్యూయల్ హోస్ రూటింగ్ను సరిచేయడం, అవసరమైతే ఇంజిన్కు సంబంధించిన భాగాలను మార్చడం వంటివి చేస్తుంది. సంస్థ వారంటీతో సంబంధం లేకుండా తనిఖీ, మరమ్మతులు వంటివి ఉచితంగానే చేస్తుంది.ఏ బైకులు ఈ సమస్యకు గురయ్యాయో.. ఆ బైక్ వినియోగదారులను కంపెనీ డీలర్షిప్ల ద్వారా నేరుగా సంప్రదించనుంది. అయితే వినియోగదారులు హోండా అధికారిక వెబ్సైట్లో వెహికల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (VIN)ను నమోదు చేయడం ద్వారా, తమ మోటార్సైకిల్ రీకాల్ క్యాంపెయిన్ పరిధిలోకి వస్తుందో లేదో చెక్ చేసుకోవచ్చు.హోండా CB1000 హార్నెట్ SPహోండా మోటార్సైకిల్ కంపెనీ తన CB1000 హార్నెట్ SP బైకును మే 2025లో లాంచ్ చేసింది. దీని ధర రూ.13.29 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది 1000 సీసీ ఇన్-లైన్-ఫోర్ ఇంజన్ ద్వారా 11000 rpm వద్ద 155 bhp పవర్, 9000 rpm వద్ద 107 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజన్ 6 స్పీడ్ గేర్బాక్స్, బై-డైరెక్షనల్ క్విక్షిఫ్టర్ వంటివి పొందుతుంది. ఈ బైక్ టాప్ స్పీడ్ గంటకు 230 కిమీ కావడం గమనార్హం.ఇదీ చదవండి: నెక్సాన్ కొత్త వేరియంట్ లాంచ్: ధర ఎంతంటే? -
ప్రాపర్టీ కొంటున్నారా.. ‘సర్కిల్ రేటు’ తెలుసా?
ఇంటి స్థలం, ఫ్లాట్ లేదా ఏదైనా కమర్షియల్ ప్రాపర్టీ కొంటున్నారా? అయితే రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో సరైన అవగాహన లేకపోతే, కొనుగోలుదారులు భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ముఖ్యంగా “సర్కిల్ రేటు” (Circle Rate) అనే కీలక అంశం గురించి తెలియక చాలామంది అదనపు పన్నులు, స్టాంప్ డ్యూటీలు చెల్లిస్తూ మోసపోతున్నారు. అందుకే ఆస్తి కొనుగోలు చేసే ముందు సర్కిల్ రేటు, మార్కెట్ రేటు మధ్య తేడా ఏమిటి? ప్రభుత్వం దీనిని ఎందుకు నిర్ణయిస్తుంది? అనే విషయాలను పూర్తిగా అర్థం చేసుకోవడం అవసరం.సర్కిల్ రేటు అంటే ఏమిటి?సర్కిల్ రేటును కొన్ని రాష్ట్రాల్లో “గైడ్లైన్ వాల్యూ”, “రెడీ రెకనర్ రేట్”, “గవర్నమెంట్ వాల్యూ” అని కూడా పిలుస్తారు. ఇది ఒక ప్రాంతంలో భూమి లేదా భవనం కనీస ప్రభుత్వ విలువను సూచిస్తుంది. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ లేదా రిజిస్ట్రేషన్ శాఖలు ప్రాంతాల వారీగా ఈ రేట్లను నిర్ణయిస్తాయి.ఆస్తి రిజిస్ట్రేషన్ సమయంలో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు వంటి చార్జీలను ప్రధానంగా ఈ సర్కిల్ రేటు ఆధారంగానే లెక్కిస్తారు.ప్రభుత్వ ఆదాయాన్ని రక్షించడం, తక్కువ ధర చూపించి పన్ను ఎగవేతను నివారించడం దీని ప్రధాన ఉద్దేశం.తక్కువ ధరకు కొనుగోలు చేసినా.. పన్ను మాత్రం ఎక్కువే!ఉదాహరణకు, ఒక ప్రాంతంలో ప్రభుత్వం నిర్ణయించిన సర్కిల్ రేటు ప్రకారం స్థలం విలువ రూ.50 లక్షలు ఉందనుకుందాం. కానీ విక్రేతతో ఒప్పందం కుదుర్చుకుని మీరు రూ.42 లక్షలకు ఆస్తిని కొనుగోలు చేసినా, రిజిస్ట్రేషన్ శాఖ మాత్రం రూ.50 లక్షల విలువ ఆధారంగానే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేస్తుంది.అంటే, “కొనుగోలు ధర” కంటే “ప్రభుత్వ సర్కిల్ రేటు” ఎక్కువగా ఉంటే, ప్రభుత్వ విలువకే ప్రాధాన్యం ఉంటుంది. ఈ విషయం తెలియక చాలామంది తర్వాత అదనపు ఖర్చులతో నష్టపోతున్నారు.మార్కెట్ రేటుకు, సర్కిల్ రేటుకు తేడా ఏమిటి?రియల్ ఎస్టేట్ మార్కెట్లో అసలు విక్రయ ధరను “మార్కెట్ రేటు” అంటారు. ఇది పూర్తిగా డిమాండ్, లొకేషన్, మౌలిక వసతులు, భవిష్యత్ అభివృద్ధి అవకాశాలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.ప్రధాన నగరాలు, అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో మార్కెట్ రేటు సాధారణంగా సర్కిల్ రేటు కంటే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కొనుగోలుదారు-విక్రేత పరస్పర చర్చల ద్వారా తుది ధర నిర్ణయమవుతుంది. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం మార్కెట్ రేటు సర్కిల్ రేటుకు దగ్గరగా ఉండొచ్చు.సర్కిల్ రేట్లు ఎందుకు మారుతాయి?రాష్ట్ర ప్రభుత్వాలు కాలానుగుణంగా సర్కిల్ రేట్లను సవరిస్తుంటాయి. మెట్రో నగరాల విస్తరణ, కొత్త రోడ్లు, మెట్రో రైలు, ఐటీ పార్కులు, పారిశ్రామిక అభివృద్ధి వంటి అంశాలు భూముల విలువను ప్రభావితం చేస్తాయి. దీంతో ప్రభుత్వాలు ప్రాంతాల వారీగా కొత్త గైడ్లైన్ విలువలను ప్రకటిస్తాయి. అందువల్ల, కొన్ని నెలల క్రితం ఉన్న రేట్లు ప్రస్తుతం మారిపోయి ఉండే అవకాశం ఉంది. పాత సమాచారంపై ఆధారపడి ఒప్పందాలు చేసుకోవడం ప్రమాదకరం.కొనుగోలుదారులు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన అంశాలుఆస్తి కొనుగోలు ముందు సంబంధిత ప్రాంతానికి వర్తించే తాజా సర్కిల్ రేటును అధికారిక రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ లేదా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తెలుసుకోవాలి.స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, మున్సిపల్ చార్జీలు, లీగల్ వెరిఫికేషన్ వంటి మొత్తం ఖర్చులను ముందుగానే లెక్కించాలి.మార్కెట్ ధర కంటే చాలా తక్కువకు ఆస్తి అమ్ముతున్నారంటే అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి డీల్స్లో లీగల్ సమస్యలు లేదా పన్ను ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది.బ్యాంక్ లోన్ తీసుకునే ముందు ఆస్తి ప్రభుత్వ విలువ, మార్కెట్ విలువ మధ్య వ్యత్యాసాన్ని పరిశీలించడం మంచిది.రిజిస్ట్రేషన్కు ముందు న్యాయ నిపుణులు లేదా చార్టర్డ్ అకౌంటెంట్ సలహా తీసుకోవడం భవిష్యత్ వివాదాలను నివారిస్తుంది.అవగాహన ఉంటేనే సురక్షిత పెట్టుబడిరియల్ ఎస్టేట్లో చిన్న నిర్లక్ష్యమే పెద్ద ఆర్థిక భారంగా మారొచ్చు. ముఖ్యంగా సర్కిల్ రేటు గురించి అవగాహన లేకుండా ఆస్తి కొనుగోలు చేస్తే అదనపు పన్నులు, లీగల్ చిక్కులు, రిజిస్ట్రేషన్ సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. అందుకే “చౌకగా దొరికింది” అని ఆకర్షణకు లోనుకాకుండా, ప్రభుత్వ విలువలు, మార్కెట్ పరిస్థితులను పూర్తిగా పరిశీలించిన తర్వాతే ఆస్తి కొనుగోలు నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. -
బంగారం ‘8 గ్రాములే’ ఎందుకు?
సామాన్యుల జీవితాల్లో బంగారం అనేది కేవలం ఆభరణం మాత్రమే కాదు, అది ఒక ఆర్థిక భరోసా. ఇటీవల తమిళనాడు ఎన్నికల మేనిఫెస్టోలో తెరపైకి వచ్చిన ‘8 గ్రాముల బంగారం’ హామీ ఇప్పుడు బులియన్ మార్కెట్, ఆర్థిక వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. అసలు ఈ 8 గ్రాముల సంఖ్య వెనుక ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం దీని విలువ ఎంత? అన్న వివరాలను ఒకసారి పరిశీలిద్దాం.ఎందుకు 8 గ్రాములు?దక్షిణ భారతదేశంలో బంగారాన్ని గ్రాముల కంటే ‘సవరం’ లెక్కన కొలవడం ఒక ఆనవాయితీ. 8 గ్రాముల బంగారాన్ని ఒక సవరంగా పిలుస్తారు. వివాహ సమయంలో ‘మంగళసూత్రం’ (తాళి) తయారు చేయడానికి కనీసం ఒక సవరం బంగారం ఉండాలని సెంటిమెంట్గా భావిస్తారు.ఒక మధ్యతరగతి లేదా పేద కుటుంబానికి వివాహ ఖర్చుల్లో అతిపెద్ద భారం బంగారం. ప్రభుత్వం సరిగ్గా ఒక సవరం (8 గ్రాములు) హామీ ఇవ్వడం ద్వారా, ఆ కుటుంబానికి ప్రాథమిక వివాహ అవసరాన్ని తీర్చినట్లు అవుతుందనేది ఈ సంఖ్య వెనుక ఉన్న వ్యూహం.నేరుగా బంగారమే ఇస్తారా? నగదు ఇస్తారా?హామీల అమలు తీరు ఆయా పార్టీల విధానాలపై ఆధారపడి ఉంటుంది. తమిళనాడులో సీఎం విజయ్ పార్టీ టీవీకే (Vijay TVK ) తమ హామీలో నేరుగా 8 గ్రాముల బంగారంతోపాటు పట్టుచీరను అందిస్తామని పేర్కొన్నాయి. గతంలో జయలలిత హయాంలో కూడా లబ్ధిదారులకు బంగారు నాణేలనే పంపిణీ చేసేవారు.అయితే, బంగారం పంపిణీలో నాణ్యత లోపాలు, అవినీతి వంటి ఆరోపణలు వచ్చే అవకాశం ఉండటంతో.. అస్సాం వంటి రాష్ట్రాలు ‘అరుంధతి’ పథకం కింద బంగారం కొనుగోలుకు సరిపడా నగదును నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నాయి. ఇది ప్రభుత్వానికి నిర్వహణ పరంగా సులభతరం అవుతుంది.ఎన్ని క్యారెట్లు ఇస్తారు?సాధారణంగా ప్రభుత్వాలు ఇలాంటి పథకాల కింద 22 క్యారెట్ల బంగారాన్నే పంపిణీ చేస్తాయి. మన దేశంలో మంగళసూత్రాలు లేదా ఇతర ఆభరణాలను 22 క్యారెట్ల బంగారంతోనే తయారు చేస్తారు. ఇది ఆభరణాలకు అవసరమైన గట్టిదనాన్ని కలిగి ఉంటుంది. గతంలో ఇదే తమిళనాడు ప్రభుత్వం అమలు చేసిన 'తాళికి తంగం' పథకం కింద లబ్ధిదారులకు 22 క్యారెట్ల బంగారు నాణేలనే (Gold Coins) పంపిణీ చేసేవారు. విజయ్ పార్టీ హామీ కూడా అదే పద్ధతిని అనుసరించే అవకాశం ఉంది.ఇక ధరల పరంగా చూసినా 24 క్యారెట్లతో పోలిస్తే 22 క్యారెట్ల ధర గ్రాముకు సుమారు రూ.1000 పైనే వ్యత్యాసం ఉంటుంది. ప్రస్తుతం (మే 10, 2026 నాటికి) 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.14,150 ఉంది. అంటే 8 గ్రాములకు రూ.1,13,200 అవుతుంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే గ్రాముకు రూ.15,437 ఉంది. ఇది 8 గ్రాములకు రూ.1,23,864 అవుతుంది. ప్రభుత్వం లక్షలాది మందికి పంపిణీ చేసేటప్పుడు, ఈ ధరల వ్యత్యాసం బడ్జెట్పై వందల కోట్ల ప్రభావం చూపుతుంది. -
లాభాలు పెరిగిన బ్యాంకులు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) 2025–26 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.3,016 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. అంతకు ముందు 2024–25 ఇదే క్యూ4లో ప్రకటించిన రూ.2,626 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 15 శాతం అధికం.సమీక్షించిన త్రైమాసికంలో బ్యాంకు మొత్తం ఆదాయం రూ.21,751 కోట్ల నుంచి రూ.22,685 కోట్లకు చేరింది. వడ్డీ ద్వారా ఆదాయం రూ.18,323 నుంచి రూ.19,476 కోట్లకు పెరిగింది. బ్యాంకు ఆస్తుల నాణ్యత మెరుగుపడింది. వార్షిక ప్రాతిపదికన స్థూల ఎన్పీఏ(మొండి బకాయిలు) 3.27% నుంచి 1.98 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్పీఏలు సైతం 0.82% నుంచి 0.56 శాతానికి దిగివచ్చాయి.సౌత్ ఇండియన్ బ్యాంక్ లాభం ప్లస్ప్రయివేట్ రంగ సంస్థ సౌత్ ఇండియన్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 19 శాతం ఎగసి రూ. 407 కోట్లను అధిగమించింది. వడ్డీ ఆదాయం పుంజుకోవడం, ప్రొవిజన్లు తగ్గడం ఇందుకు దోహదపడింది. అంతక్రితం ఏడాది(2024–25) ఇదే కాలంలో రూ. 342 కోట్లు ఆర్జించింది. వాటాదారులకు బ్యాంక్ బోర్డ్ షేరుకి రూ. 0.45 చొప్పున డివిడెండ్ ప్రకటించింది.కాగా.. క్యూ4లో నికర వడ్డీ ఆదాయం 5 శాతం వృద్ధితో రూ. 915 కోట్లను తాకింది. అంతక్రితం క్యూ4లో రూ. 868 కోట్ల వడ్డీ ఆదాయం అందుకుంది. మొత్తం ఆదాయం మాత్రం ఫ్లాట్గా రూ. 2,945 కోట్లకు పరిమితమైంది. నికర వడ్డీ మార్జిన్లు త్రైమాసికవారీగా 2.86 శాతం నుంచి 2.95 శాతానికి మెరుగుపడ్డాయి. వార్షికంగా 3.21 శాతం నుంచి నీరసించాయి. స్థూల డిబకాయిలు(ఎన్పీఏలు) 3.2 శాతం నుంచి 1.43 శాతానికి, నికర ఎన్పీఏలు 0.92 శాతం నుంచి 0.29 శాతానికి దిగివచ్చాయి. ప్రొవిజన్లు రూ. 224 కోట్ల నుంచి రూ. 34 కోట్లకు భారీగా తగ్గాయి. -
ట్రంప్ కంపెనీకి భారీ నష్టం.. వందల మిలియన్లు లాస్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చెందిన సోషల్ మీడియా సంస్థ 'ట్రంప్ మీడియా & టెక్నాలజీ గ్రూప్'కు (TMTG) ఈ ఏడాది ఆర్థికంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2026 మొదటి త్రైమాసికానికి (Q1) సంబంధించి కంపెనీ విడుదల చేసిన ఆర్థిక ఫలితాల్లో ఏకంగా 405.9 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 3,400 కోట్లు) నికర నష్టాన్ని నమోదు చేసింది. ప్రధానంగా క్రిప్టోకరెన్సీ పెట్టుబడుల విలువ పడిపోవడమే ఈ భారీ నష్టానికి కారణమని నివేదిక వెల్లడించింది.అవాస్తవిక నష్టాల వెల్లువట్రూత్ సోషల్ మాతృ సంస్థ అయిన టీఎంటీజీ, గతేడాది మార్కెట్ గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు క్రిప్టోకరెన్సీలలో భారీగా పెట్టుబడులు పెట్టింది. అయితే, ప్రస్తుత త్రైమాసికంలో డిజిటల్ ఆస్తులు, ఈక్విటీలలో ఏర్పడిన 370 మిలియన్ డాలర్ల వాస్తవీకరించని నష్టాలు కంపెనీ బ్యాలెన్స్ షీట్ను దెబ్బతీశాయి.కంపెనీ ఖజానాలో ప్రస్తుతం 9,500 బిట్కాయిన్లు ఉన్నాయి. గత జూలైలో బిట్కాయిన్ విలువ గరిష్టంగా ఉన్నప్పుడు, ఒక్కో కాయిన్ను సగటున 1,08,519 డాలర్లు వెచ్చించి కొనుగోలు చేశారు. అయితే ఫిబ్రవరి చివరలో బిట్కాయిన్ ధర 70,000 డాలర్ల కంటే తక్కువగా ఉన్న సమయంలో కంపెనీ 2,000 బిట్కాయిన్లను విక్రయించింది. దీనివల్ల భారీగా పెట్టుబడి నష్టపోవాల్సి వచ్చింది.ప్రస్తుతం బిట్కాయిన్ విలువ 80,000 డాలర్ల మార్కు వద్ద ఊగిసలాడుతోంది. గత అక్టోబర్లో 1,26,000 డాలర్ల వద్ద ఉన్న ధర, ఫిబ్రవరి నాటికి 60,000 డాలర్లకు పడిపోవడం కంపెనీ అంచనాలను తలకిందులు చేసింది.ఆర్థిక పునాది పటిష్టమేనా?భారీ నష్టాలు పీడిస్తున్నప్పటికీ, కంపెనీ వద్ద ఉన్న నగదు నిల్వలు మాత్రం ఆశాజనకంగానే ఉన్నాయి. ఏడాది క్రితంతో పోలిస్తే కంపెనీ ఆర్థిక ఆస్తులు మూడు రెట్లు పెరిగి 2.1 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గత త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 17.9 మిలియన్ డాలర్లుగా నమోదైంది.క్రిప్టో మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి వల్ల ప్రస్తుతానికి కాగితంపై నష్టాలు కనిపిస్తున్నప్పటికీ, కంపెనీ వద్ద తగినంత లిక్విడిటీ ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.కుప్పకూలుతున్న స్టాక్.. సీఈఓ నిష్క్రమణఒకవైపు ఆర్థిక నష్టాలు, మరోవైపు నాయకత్వ మార్పులు కంపెనీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 2022లో ఒకానొక దశలో 97.54 డాలర్ల వద్ద ఉన్న కంపెనీ షేర్ విలువ, ప్రస్తుతం ఏకంగా 90% పైగా క్షీణించి 8.93 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. కంపెనీ సీఈఓ, మాజీ రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు డెవిన్ న్యూన్స్ ఈ ఏడాది ఏప్రిల్ 22న తన పదవికి రాజీనామా చేశారు. ఇది పెట్టుబడిదారుల్లో మరింత ఆందోళన కలిగించింది.జనవరి 6, 2021న అమెరికా క్యాపిటల్ భవనంపై జరిగిన అల్లర్ల తర్వాత అప్పటి ట్విట్టర్ (ప్రస్తుత X) ట్రంప్పై నిషేధం విధించింది. దీనికి ప్రత్యామ్నాయంగా ట్రంప్ సొంతంగా 'ట్రూత్ సోషల్' నెట్వర్క్ను ప్రారంభించారు. రాజకీయంగా ఆదరణ ఉన్నప్పటికీ, ఆర్థికంగా లాభాల బాట పట్టడంలో ఈ సంస్థ ఇంకా సవాళ్లను ఎదుర్కొంటూనే ఉంది. -
ఒబెన్ ఎలక్ట్రిక్ కొత్త బైక్.. రూ.లక్షకే ఆఫర్!
న్యూఢిల్లీ: విద్యుత్ మోటర్సైకిల్స్ తయారీ సంస్థ ఒబెన్ ఎలక్ట్రిక్ తమ సరికొత్త రోర్ ఈవో వాహనాన్ని ఆవిష్కరించింది. తొలి 10,000 మంది కస్టమర్లకు దీన్ని రూ. 99,999 (ఎక్స్ షోరూం) ప్రత్యేక ధరకి అందిస్తున్నట్లు సంస్థ ఫౌండర్ మధుమిత అగ్రవాల్ తెలిపారు. ఆ తర్వాత రేటు రూ. 1,24,999గా (ఎక్స్ షోరూం) రూ. 777 చెల్లించి బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.జూన్ నుండి టెస్ట్ రైడ్స్, డెలివరీలు ప్రారంభమవుతాయి. దీని సర్టిఫైడ్ రేంజి 180 కి.మీ.గా, టాప్ స్పీడ్ గంటకి 110 కి.మీ.గా ఉంటుంది. స్మార్ట్ఐక్యూ ఫీచరు వల్ల డ్రైవింగ్ తీరుతెన్నులను బట్టి 15 శాతం అధిక రేంజి లభిస్తుంది. మోటర్సైకిల్స్లో తొలిసారిగా సీట్ కింద 10 లీటర్ల స్టోరేజీ ఉంటుంది. -
నష్టాలు తగ్గించుకున్న స్విగ్గీ
న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ, క్విక్కామర్స్ (ఇన్స్టామార్ట్) సంస్థ స్విగ్గీ మార్చి త్రైమాసికంలో పనితీరును బలోపేతం చేసుకుంది. కన్సాలిడేటెడ్ నష్టం రూ.800 కోట్లకు తగ్గింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో సంస్థ నష్టం రూ.1,081 కోట్లుగా ఉండడం గమనార్హం. ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 45 శాతం పెరిగి రూ.6,383 కోట్లకు చేరింది. వ్యయాలు రూ.5,610 కోట్ల నుంచి రూ.7,448 కోట్లకు పెరిగిపోయాయి. స్విగ్గీ ఫుడ్ డెలివరీ వ్యాపారం స్థూల ఆర్డర్ విలువ (జీవోవీ) 15 త్రైమాసికాల గరిష్ట స్థాయికి చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే 22.6 శాతం పెరిగి రూ.9,006 కోట్లుగా నమోదైంది. ఫుడ్ డెలివరీ విభాగంలో వార్షిక ఎబిట్డా రూ.1,000 కోట్లను దాటింది.‘ఇన్స్టామార్ట్’ (క్విక్ కామర్స్) ఆదాయం స్థూల ఆర్డర్ విలువ 68 శాతం పెరిగి రూ.7,881 కోట్లకు చేరింది. స్నాక్స్, పానీయాలు, రెడీ టు ఈట్ ఫుడ్స్ను వేగంగా డెలివరీ చేసేందుకు ప్రత్యేకంగా ప్రారంభించిన ‘స్నాక్’ను మూసివేసినట్టు వాటాదారులకు రాసిన లేఖలో స్విగ్గీ తెలిపింది. అధిక డిమాండ్తోనే ఈ వ్యాపారం నిర్వహణ సాధ్యమని పేర్కొంది. మధ్యకాలానికి ఇన్స్టామార్ట్ ఆర్డర్ల విలువ రూ.లక్ష కోట్లకు, 4–5 శాతం ఎబిట్డాకి చేరుకుంటుందని అంచనా వేసింది. -
మోంట్రా నుంచి రెండు ఎలక్ట్రిక్ ట్రక్లు
చెన్నై: మురుగప్ప గ్రూప్లో భాగమైన మోంట్రా ఎలక్ట్రిక్ తాజాగా రెండు విద్యుత్ ట్రక్ వేరియంట్లను ప్రవేశపెట్టింది. ఎవియేటర్ 350 (32కేడబ్ల్యూహెచ్), ఎవియేటర్ 350ఎల్ (50కేడబ్ల్యూహెచ్) వీటిలో ఉన్నాయి. మొదటిది రోజుకు 140 కి.మీ. వరకు స్వల్ప దూర ప్రయాణాలకు అనువుగా ఉంటుందని సంస్థ తెలిపింది.ఇక రెండోది దూరం ఎక్కువగా ఉండే నగరాల మధ్య లాజిస్టిక్స్ సేవల కోసం ఉపయోగపడుతుంది. దీని సరి్టఫైడ్ రేజ్ 300 కి.మీ.గా ఉండగా, వాస్తవ పరిస్థితుల్లో దాదాపు 200 కి.మీ పైగా రేంజిని ఇస్తుంది. వీటి ప్రారంభ ధరలు వరుసగా రూ. 14.58 లక్షలు, రూ. 16.86 లక్షలుగా ఉంటాయని సంస్థ వివరించింది. -
సెయిల్ సీఎండీగా ఏకే పాండా బాధ్యతలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఉక్కు దిగ్గజం స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టరుగా అశోక్ కుమార్ పాండా బాధ్యతలు స్వీకరించారు. దీనికి ముందు ఆయన ఫైనాన్స్ డైరెక్టరుగా వ్యవహరించారు. ఏప్రిల్ 1తో పదవీకాలం ముగిసిన అమరేందు ప్రకాశ్ స్థానంలో ఆయన నియమితులయ్యారు. 1992లో మేనేజ్మెంట్ ట్రైనీగా (టెక్నికల్) సెయిల్లో పాండా కెరియర్ ప్రారంభించారు. వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 35 మిలియన్ టన్నులకు పెంచుకునే దిశగా తదుపరి దశ విస్తరణ పనులు యథాప్రకారం కొనసాగుతున్నాయని పాండా తెలిపారు -
వృద్ధి రేటు 6.6తగ్గొచ్చు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2026–27) భారత్ జీడీపీ వృద్ధి రేటు 6.6 శాతానికి తగ్గే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఎస్అండ్పీ గ్లోబల్ తెలిపింది. గతంలో 7.1 శాతం వృద్ధి అంచనాను ప్రకటించడం గమనార్హం. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇంధన, ఆహార భద్రత రంగాల్లో సంస్కరణలు అవసరమని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎస్అండ్పీ గ్లోబల్, క్రిసిల్ సంయుక్తంగా ఒక నివేదికను విడుదల చేశాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణల వల్ల ఇంధన సరఫరాలో అంతరాయాలు, ముడి చమురు ధరల పెరుగుదల, రూపాయి విలువ పతనం వంటి సవాళ్లను భారత్ ఎదుర్కొంటోందని తెలిపింది. వీటిని అధిగమించేందుకు భారత్ తగినన్ని ఇంధన నిల్వలు సమకూర్చుకోవాలంటూ.. ఇందుకు వీలుగా ఒక సమగ్రమైన విధానాన్ని రూపొందించుకోవాలని సూచించింది. చమురు ధరలు పెరగడం, రూపాయి బలహీనపడటం ఆర్థిక వృద్ధిపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తాయని క్రిసిల్ ముఖ్య ఆర్థికవేత్త ధర్మకీర్తి జోషి పేర్కొన్నారు. ఆహార భద్రతకు రిస్క్ పశ్చిమాసియా సంక్షోభం ఇలాగే కొనసాగితే ఎరువుల కొరత ఏర్పడే అవకాశం ఉందని ఈ నివేదిక అంచనా వేసింది. ముఖ్యంగా శీతాకాలం పంటలకు ఎరువుల కొరత ఏర్పడొచ్చని జోషి అంచనా వేశారు. భారత్ ఇంధన, ఆహార భద్రత, ఎరువుల రంగంపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. భారత్ వివిధ దేశాలతో ఇటీవల కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్టీఏ) ద్వారా తగిన ప్రయోజనాలను అందుకోవాలంటే.. అంతర్జాతీయ స్థాయిలో మరింత పోటీతత్వాన్ని పెంపొందించుకోవాలని.. ఎఫ్టీఏలతో మరిన్ని మార్కెట్ అవకాశాలు లభించినప్పటికీ, వివిధ రంగాల్లో సంస్కరణలు చేపట్టినప్పుడే పూర్తిస్థాయి ఫలితాలు వస్తాయని నివేదిక తెలిపింది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు బ్యారెల్కు ఒక దశలో 126 డాలర్ల వరకు వెళ్లగా, ప్రస్తుతం 100 డాలర్ల స్థాయిలో ఉండడం గమనార్హం. యుద్ధానికి ముందు 60–70 డాలర్ల మధ్యే ఉంది. ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా ఉంచడం ద్వారా వినియోగదారులపై భారం పడకుండా చూస్తోంది. ఎక్సైజ్ ట్యాక్స్ వరకు తగ్గించడం తెలిసిందే. టోకు ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ), రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ)పై అధిక చమురు ధరల ప్రభావం ఏ మేరకు ఉంటుందన్న ప్రశ్నకు జోషి స్పందిస్తూ.. అంతర్జాతీయంగా అధిక ధరలు ఉన్నప్పటికీ భారత్లో వినియోగదారులకు దాన్ని బదిలీ చేయనట్టు చెప్పారు. దీని కారణంగా టోకు ద్రవ్యోల్బణం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. మార్చి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం ఏడాది గరిష్ట స్థాయి అయిన 3.4 శాతానికి పెరగ్గా.. టోకు ద్రవ్యోల్బణం 38 నెలల గరిష్ట స్థాయి 3.88 శాతానికి చేరడం తెలిసిందే. -
ఆరు ఐపీఓలకు గ్రీన్ సిగ్నల్
ముంబై: పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు భారత్తో సహా ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నప్పటికీ, దేశీయ ఐపీఓ మార్కెట్ మాత్రం ఆశావహ సంకేతాలు ఇస్తోంది. రుణ భారాన్ని తగ్గించుకోవడం, కార్యకలాపాలను విస్తరించుకోవడం, డైవర్సిఫికేషన్ లక్ష్యాలతో ఐపీఓల ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమైన ఆరు కంపెనీలకు తాజాగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతులు లభించాయి. తద్వారా ‘మూలధన సమీకరణకు మార్గాలు మూసుకుపోలేదు’ అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మార్కెట్ ఒడిదుడుకులను లెక్కచేయకుండా, ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా ఈ ఐపీఓలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. విభిన్న రంగాలకు చెందిన జెప్టో, ధూత్ ట్రాన్స్మిషన్, హొరైజన్ ఇండ్రస్టియల్ పార్క్స్, సర్జివేర్, క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్, హోటల్ పోలో టవర్స్ అక్టోబర్–ఫిబ్రవరి మధ్య కాలంలో సెబీకి ముసాయిదా పత్రాలు సమరి్పంచాయి. మే 4 నుంచి 8 మధ్య ఈ దరఖాస్తులను పరిశీలించిన సెబీ, పబ్లిక్ ఇష్యూలకు అనుమతులు మంజూరు చేసింది. ఐపీఓలు విజయవంతమైతే ఈ కంపెనీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ కానున్నాయి. రాబోయే ఐపీవోల వివరాలివీ.. జెప్టో రూ.11,000 కోట్ల ఇష్యూ క్విక్ కామర్స్ యూనికార్న్ సంస్థ జెప్టో ప్రస్తుతం మార్కెట్లో బ్లింకిట్, స్విగ్గీ ఇన్స్టామార్ట్ వంటి దిగ్గజాలతో పోటీపడుతోంది. త్వరలో స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రాథమిక మార్కెట్ నుంచి దాదాపు రూ.11 వేల కోట్లు సమీకరించాలనే లక్ష్యంతో పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. సెబీ తాజా అనుమతులతో షేరు ధరల శ్రేణి, సబ్ర్స్కిప్షన్ తేదీలు, లిస్టింగ్ వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకునేందుకు కంపెనీ సన్నద్ధం కానుంది. ప్రపంచవ్యాప్తంగా టెక్, స్టార్టప్ ఐపీఓలపై పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్న వేళ జెప్టో పబ్లిక్ ఆఫర్కు రావడం గమనార్హం. లిస్టింగ్ పూర్తైతే ఇప్పటికే స్టాక్ ఎక్సే్చంజీల్లో ఉన్న జొమాటో, స్విగ్గీ సరసన జెప్టో చేరనుంది. ధూత్ ట్రాన్స్మిషన్ ఆటో ఉపకరణాల తయారీ సంస్థ ధూత్ ట్రాన్స్మిషన్ ఐపీఓ ద్వారా దాదాపు 250 మిలియన్ డాలర్లు (సుమారు రూ.2,258 కోట్లు) సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తాజా షేర్ల జారీతో పాటు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కూడా ఇందులో భాగంగా ఉంటుంది. అయితే ప్రమోటర్లు ఓఎఫ్ఎస్ ద్వారా తమ వాటాలను విక్రయించబోరని సమాచారం. కంపెనీలో బెయిన్ క్యాపిటల్ పెట్టుబడులు ఉన్నాయి. → జెప్టో, ధూత్ ట్రాన్స్మిషన్ సంస్థలు ‘కాని్ఫడెన్షియల్ ప్రీ–ఫైలింగ్ రూట్’ను ఎంచుకున్నాయి. ఈ విధానం ద్వారా ముసాయిదా పత్రాలను బహిరంగపరచకుండానే సెబీ నుంచి ప్రాథమిక అనుమతులు పొందే అవకాశం లభిస్తుంది. హొరైజన్ ఇండస్ట్రియల్ పార్క్స్బ్లాక్స్టోన్ పెట్టుబడులున్న హొరైజన్ ఇండ్రస్టియల్ పార్క్స్ ఐపీఓ ద్వారా రూ.2,600 కోట్లు సమీకరించనుంది. ఇది పూర్తిగా తాజా ఈక్విటీ షేర్ల జారీ రూపంలో ఉంటుంది. ఓఎఫ్ఎస్ లేదు. సమీకరించే నిధుల్లో సుమారు రూ.2,250 కోట్లను రుణాల చెల్లింపులకు వినియోగించనుంది. సర్జివేర్ఉత్తరప్రదేశ్కు చెందిన మెడికల్ డివైసెస్ తయారీ సంస్థ సర్జివేర్ తన వ్యాపార విస్తరణ ప్రణాళికలో భాగంగా ఐపీఓకు సిద్ధమైంది. తాజా ఈక్విటీల జారీ ద్వారా రూ. 370 కోట్లు సమీకరించనుంది. ప్రమోటర్ ఘనశ్యామ్ దాస్ అగర్వాల్ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా మరో రూ.370 కోట్ల ఈక్విటీలను విక్రయించనున్నారు. తాజా షేర్ల జారీ ద్వారా సమీకరించే నిధులను కొత్త యంత్రాల కొనుగోలు, తయారీ సామర్థ్యాల పెంపు, రుణాల చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ వ్యవసాయ పంటల రక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థ క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ రూ.600 కోట్ల తాజా షేర్ల జారీతో ఐపీఓకు రానుంది. అదనంగా ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు 74.05 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించనున్నారు. ఇందులో ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఐఎఫ్సీ ఎమర్జింగ్ ఆసియా ఫండ్ వాటాలను విక్రయించనున్నాయి. సమీకరించే నిధులను రుణాల చెల్లింపు, అనుబంధ సంస్థ సఫైర్ క్రాప్ సైన్స్ మూలధన అవసరాలు, భవిష్యత్ కొనుగోళ్లు, వ్యూహాత్మక విస్తరణకు వినియోగించనుంది. హోటల్ పోలో టవర్స్ హాస్పిటాలిటీ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న హోటల్ పోలో టవర్స్ సంస్థ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూలో భాగంగా రూ.300 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్ల జారీ చేయనుంది. ప్రమోటర్లు ఓఎఫ్ఎస్ ద్వారా 71.2 లక్షల షేర్లను అమ్మకానికి పెట్టనున్నారు. తాజా షేర్ల జారీ ద్వారా సమీకరించే నిధులను కొత్త హోటల్ ప్రాజెక్టుల అభివృద్ధి, అప్పుల తగ్గింపు, మౌలిక సదుపాయాల విస్తరణ, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించే అవకాశముందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సంస్థ ప్రధానంగా ఈశాన్య, తూర్పు, ఉత్తర భారతదేశాల్లో ‘పోలో’, ‘మ్యాక్స్’ బ్రాండ్ల పేరుతో అప్స్కేల్, మిడ్స్కేల్ హోటళ్లు, రిసార్ట్స్ను అభివృద్ధి చేసి నిర్వహిస్తోంది.మే 12న ఆర్ఎఫ్బీఎల్ ఫ్లెక్సీ ఇష్యూ షురూ.. ఫ్లెక్సిబుల్ ప్యాకింగ్ మెటీరియల్స్ తయారీదారు ఆర్ఎఫ్బీఎల్ ఫ్లెక్సీ ప్యాక్ ఐపీఓ ఈ నెల 12న ప్రారంభమై 14న ముగియనుంది. ధరల శ్రేణి రూ. 47–50గా కంపెనీ నిర్ణయించింది. కంపెనీ రూ.35.32 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఈ ఇష్యూకు వస్తోంది. ఇష్యూ ద్వారా కంపెనీ 70.65 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయించి రూ.35.32 కోట్ల సమీకరించనుంది. మే 11న యాంకర్ ఇన్వెస్టర్ బిడ్డింగ్ ఉంటుంది. -
హ్యుందాయ్ కొత్త ప్లాన్: ఏంటో తెలుసా?
టాటా మోటార్స్, మహీంద్రా వంటి స్వదేశీ బ్రాండ్ల కారణంగా.. హ్యుందాయ్ తన పట్టును కోల్పోతూ, భారతీయ ప్యాసింజర్ వాహన విభాగంలో తన రెండవ స్థానం నుంచి కిందికి జారిపోతోంది. ఈ కార్ల తయారీ సంస్థ తిరిగి పుంజుకోవడానికి సన్నద్ధమవుతూ.. కోల్పోయిన స్థానాన్ని తిరిగి పొందడానికి ఒక ప్రణాళికను రూపొందించింది.కంపెనీ క్యూ4 ఆదాయాల ప్రకటన సందర్భంగా.. 2027 ఆర్థిక సంవత్సరంలో భారత మార్కెట్లో రెండు కొత్త ఎస్యూవీలను విడుదల చేయాలని యోచిస్తున్నట్లు హ్యుందాయ్ ప్రకటించింది. వీటిలో టాటా పంచ్ ఈవీకి పోటీగా నిలుస్తుందని భావిస్తున్న ఇన్స్టర్ ఈవీ, బేయాన్ ఆధారిత క్రాస్ఓవర్ ఉండే అవకాశం ఉంది.హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండీ & సీఈఓ తరుణ్ గార్గ్ ప్రకారం.. ఈ ఆర్థిక సంవత్సరంలో, రెండు పూర్తిగా కొత్త నేమ్ప్లేట్లను ప్రవేశపెట్టబోతున్నారు. వాటిలో ఒకటి కాంపాక్ట్ ఎస్యూవీ విభాగం, మరొకటి ఐసీఈ ఎస్యూవీ విభాగంలో ఉండనున్నాయి. భారతదేశంలోని ప్యాసింజర్ వాహన విభాగంలో పెద్ద భాగాన్ని ఆక్రమించిన, అత్యధిక డిమాండ్ ఉన్న వాహన విభాగాలైన కాంపాక్ట్ SUV, మిడ్-సైజ్ SUVలలో ఈ రెండు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టనున్నారు. -
బంగారం, వెండి ధరలు: వారం రోజుల్లో ఊహించని మార్పు!
బంగారం వెండి ధరలు ఎప్పుడెలా ఉంటాయో ఊహకందకుండాపోయింది. ఈ రోజు తగ్గితే.. రేపు పెరిగిపోతున్న పరిస్థితులు వారం రోజుల్లో కళ్లకు కట్టినట్లు కనిపించాయి. ఈ కథనంలో ఏడు రోజుల్లో (మే 3 నుంచి మే 9 వరకు) పసిడి ధరలు ఎలా మారాయి. ప్రస్తుతం ఏ మార్క్ దగ్గర ఉన్నాయనే వివరాలు చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడ నగర్లో మే 3న (ఆదివారం) 1,50,930 రూపాయల వద్ద ఉన్న తులం గోల్డ్ రేటు నేటికి (శనివారం) 1,52,350 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో రూ.1420 పెరిగిందన్నమాట. 22 క్యారెట్ల ధర ఈ సమయంలోనే 1,38,350 రూపాయల దగ్గర నుంచి రూ.1,39,650 వద్దకు (రూ.1300 పెరిగింది) చేరింది.ఇక చెన్నై నగరంలో వారం రోజుల్లో బంగారం ధరలు భారీగానే పెరిగాయి. మే 3న రూ.152730 వద్ద ఉన్న 10 గ్రాముల గోల్డ్ రేటు..154370 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల తులం బంగారం రేటు 1,40,000 రూపాయల దగ్గర నుంచి 141500 రూపాయల వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే పసిడి ధర వారం రోజుల్లో ఎంతలా పెరిగిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.దేశ రాజధాని నగరం ఢిల్లీలో 1,51,230 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు 1,52,500 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.1,38,500 నుంచి రూ.1,39,800 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే.. వెండి ధరలు కూడా అమాంతం పెరిగాయి. మే 3న రూ.2.70 లక్షల వద్ద ఉన్న కేజీ సిల్వర్ రేటు.. ఈ రోజు రూ.2.80 లక్షల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే వెండి రేటు వారం రోజుల్లో రూ.10 వేలు పెరిగినట్లు స్పష్టమవుతోంది. -
ఉద్యోగులకు సీఈఓ మదర్స్ డే గిఫ్ట్!
సాధారణంగా కొంతమంది కంపెనీ అధినేతలు, తమ ఉద్యోగులకు దీపావళి లేదా దసరా సందర్భంగా గిఫ్ట్స్ లేదా బోనస్ వంటివి అందిస్తుంటారు. అయితే ఢిల్లీకి చెందిన ఒక వ్యాపారవేత్త మాత్రం 'మదర్స్ డే' సందర్భంగా ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు.ఉద్యోగులు తమ తల్లిదండ్రులతో సమయం గడపడానికి మూడు రోజులు సెలవు ఇవ్వడంతో పాటు.. రూ.10వేలు నగదు కూడా ఇవ్వనున్నట్లు పబ్లిక్ రిలేషన్స్ సంస్థ ఎలైట్ మార్క్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ రజత్ గ్రోవర్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు.తల్లిదండ్రులు పిల్లల నుంచి ఏమీ ఆశించకుండా.. మనకోసం ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు వారికి ఉన్న చిన్న చిన్న కోరికలను తీర్చే సమయం వచ్చేసింది. వాటిని తప్పకుండా నెరవేర్చండి. తల్లిదండ్రులు ఎన్నాళ్లు మనతో ఉంటారో తెలియదు. కాబట్టి సమయం దొరికినప్పుడు వారితో గడపడానికి సమయం కేటాయించడానికి ప్రయత్నించండి అని రజత్ గ్రోవర్ పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Rajat Grover (@rajat_grover30) -
ఇక మూడింది మిడిల్ మేనేజర్లకే.. సీఈఓ వార్నింగ్
కృత్రిమ మేధస్సు (AI) విప్లవం కార్పొరేట్ ప్రపంచంలో పెను మార్పులకు నాంది పలుకుతోంది. ముఖ్యంగా కేవలం పర్యవేక్షణకే పరిమితమయ్యే "ప్యూర్ పీపుల్ మేనేజర్ల" మనుగడ ఇకపై కష్టమేనని ఎయిర్బీఎన్బీబి (Airbnb) సీఈఓ బ్రియాన్ చెస్కీ హెచ్చరించారు. పనిలో ప్రత్యక్షంగా భాగస్వాములు కాకుండా, కేవలం సిబ్బందిని మేనేజ్ చేసే పాత పద్ధతులకు కాలం చెల్లిందని ఆయన అభిప్రాయపడ్డారు.పని చేయని వారికి చోటు లేదు!ఇటీవల ఒక పాడ్కాస్ట్లో మాట్లాడిన చెస్కీ, ఏఐ యుగంలో నెట్టుకురావాలంటే మేనేజర్లు తమ పనితీరును మార్చుకోవాలని సూచించారు. ఇకపై మేనేజర్లు కేవలం మీటింగ్లు, పర్ఫార్మెన్స్ రివ్యూలకే పరిమితం కాకూడదు. ప్రాజెక్టుల లోతుపాతులను అర్థం చేసుకుంటూ టీమ్తో కలిసి పని చేయాలి. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా అప్డేట్ అవ్వని వారు, ఏఐ వినియోగాన్ని వ్యతిరేకించే వారు కెరీర్ రేసులో వెనుకబడిపోతారని ఆయన స్పష్టం చేశారు.ఎయిర్బీఎన్బీలో 60% కోడింగ్ ‘ఏఐ’తోనే..ఎయిర్బీఎన్బీ ఇప్పటికే ఏఐ వినియోగంలో ముందుంది. కంపెనీలో దాదాపు 60% కోడింగ్ ఇప్పుడు ఏఐ ద్వారానే జరుగుతోందని, దీనివల్ల ఉత్పత్తులను వేగంగా మార్కెట్లోకి తీసుకురావడమే కాకుండా, తక్కువ మందితో సమర్థవంతంగా పనిచేయడం సాధ్యమవుతోందని కంపెనీ వెల్లడించింది.తగ్గుతున్న ‘మేనేజ్మెంట్’ పొరలుఒక్క ఎయిర్బీఎన్బీ మాత్రమే కాదు, అనేక దిగ్గజ టెక్ సంస్థలు ఇప్పుడు "ఫ్లాటర్ స్ట్రక్చర్" (తక్కువ మేనేజ్మెంట్ స్థాయిలు) వైపు మొగ్గు చూపుతున్నాయి.మెటా ఇప్పటికే మేనేజ్మెంట్ పొరలను తొలగించి నిర్ణయ ప్రక్రియను వేగవంతం చేసింది. బ్లాక్ సీఈఓ జాక్ డోర్సే కూడా శాశ్వత మిడిల్ మేనేజ్మెంట్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాయిన్బేస్ సీఈఓ బ్రియాన్ ఆర్మ్స్ట్రాంగ్ సైతం "ప్యూర్ మేనేజర్" పాత్రలను తొలగిస్తున్నట్లు ప్రకటించారు.వస్తున్నది ‘ప్లేయర్-కోచ్’ల కాలంనివేదికలు, షెడ్యూలింగ్, పనితీరును ట్రాక్ చేయడం వంటి పనులను ఏఐ సులభంగా చేసేస్తోంది. కాబట్టి, కేవలం ఆర్డర్లు వేసే మేనేజర్ల కంటే, సాంకేతిక పరిజ్ఞానం ఉండి ప్రాజెక్టులో నేరుగా పాల్గొనే "ప్లేయర్-కోచ్" తరహా నాయకులకే భవిష్యత్తులో డిమాండ్ ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.జూనియర్ల విషయంలో జాగ్రత్త!అయితే, ఏఐ మోజులో పడి కొత్త గ్రాడ్యుయేట్లు, ఇంటర్న్ల నియామకాలను ఆపవద్దని చెస్కీ హెచ్చరించారు. ఎంట్రీ లెవల్ ఉద్యోగాలను పూర్తిగా తొలగిస్తే, భవిష్యత్తులో కంపెనీలను నడిపించే నాయకులు తయారుకారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐని ఉత్పాదకత పెంచుకోవడానికి వాడుకోవాలి తప్ప, నైపుణ్యం కలిగిన మానవ వనరుల పైప్లైన్ను దెబ్బతీసేలా ఉండకూడదని ఆయన సూచించారు. -
గూగుల్ బంపరాఫర్: నియామకాల్లో కొత్త ట్రెండ్కు శ్రీకారం!
ఇదివరకు ఇంటర్వ్యూల సమయంలో చాలామంది అభ్యర్థులు ఏఐ ఉపయోగిస్తున్నారని చెప్పిన గూగుల్, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ నియామక ప్రక్రియలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగానికి అవకాశం కల్పించేందుకు సిద్ధమవుతోంది.అభ్యర్థులు ఇంటర్వ్యూల సమయంలో AI టూల్స్ను ఉపయోగించేందుకు అనుమతించడం అనేది.. టెక్ రంగంలో పెద్ద మార్పుగా భావిస్తున్నారు. కంపెనీ అభివృద్ధి చేసిన జెమిని ఏఐ (Gemini AI) అసిస్టెంట్ను కొంతమంది అభ్యర్థులు కోడింగ్ రౌండ్లలో ఉపయోగించేలా ఇంటర్వ్యూలు నిర్వహించడానికి సంస్థ సిద్ధమవుతోంది.ఈ పైలట్ ప్రోగ్రామ్ను ఈ ఏడాది చివర్లో అమెరికాలోని కొన్ని గూగుల్ క్లౌడ్ టీమ్లలో ప్రారంభించే అవకాశం ఉంది. ముందుగా జూనియర్, మిడ్ లెవల్ ఇంజినీరింగ్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులపై ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ముఖ్యంగా 'కోడ్ కంప్రిహెన్షన్' రౌండ్లో అభ్యర్థులు కోడ్ను చదవడం, లోపాలను గుర్తించడం, మెరుగుపరచడం వంటి పనుల్లో జెమిని సహాయం తీసుకోవచ్చు. అయితే తుది నిర్ణయం మాత్రం.. అభ్యర్థి ఆలోచనా విధానం, సమస్య పరిష్కార సామర్థ్యాన్ని పరిశీలించిన తర్వాతే ఉంటుంది.ఇదీ చదవండి: జెన్ జీ ఉద్యోగులపై ఆసక్తికర వ్యాఖ్యలు!గూగుల్ ఈ విధానాన్ని 'హ్యూమన్ లెడ్, AI అసిస్టెడ్'గా పేర్కొంటోంది. అంటే.. నిర్ణయం మనుషులదే అయినా, ఏఐ ఒక సహాయక సాధనంగా పనిచేస్తుంది. ప్రస్తుతం టెక్ రంగంలో ఏఐ ఆధారిత కోడింగ్ వేగంగా పెరుగుతోంది. కోడ్ రాయడం, పరీక్షించడం, మెరుగుపరచడం వంటి పనుల్లో ఇంజినీర్లు ఇప్పటికే ఏఐ టూల్స్ ఉపయోగిస్తున్నారు. అందువల్ల ఉద్యోగ ఇంటర్వ్యూలు దానికి తగిన విధంగా ఉండేలా గూగుల్ తగిన చర్య తీసుకుంటోంది. -
హ్యుందాయ్ రూ.7,500 కోట్ల పెట్టుబడులు
ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటర్ ఇండియా.. దేశీ ప్యాసింజర్ వాహనాల మార్కెట్లో రెండో స్థానాన్ని తిరిగి దక్కించుకోవడంపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 7,500 కోట్ల మేర ఇన్వెస్ట్ చేయనుంది. 45–50 శాతం భాగాన్ని కొత్త ఉత్పత్తులపై, మిగతా మొత్తాన్ని చెన్నై, పుణెలోని ప్లాంట్ల విస్తరణపై వెచ్చించనుంది. అలాగే రెండు కొత్త ఎస్యూవీలను ప్రవేశపెట్టనుంది. వీటిలో ఒక ఎలక్ట్రిక్ ఎస్యూవీ కూడా ఉంటుందని కంపెనీ ఎండీ, సీఈవో తరుణ్ గర్గ్ తెలిపారు.క్యూ1లో లాభం 22 శాతం డౌన్..గత ఆర్థిక సంవత్సరం (2025–26) నాలుగో త్రైమాసికంలో హ్యుందాయ్ లాభం రూ. 1,256 కోట్లుగా (కన్సాలిడేటెడ్గా) నమోదైంది. అంతక్రితం క్యూ4లో నమోదైన రూ. 1,614 కోట్లతో పోలిస్తే సుమారు 22 శాతం తగ్గింది. ఆదాయం రూ. 17,940 కోట్ల నుంచి రూ. 18,916 కోట్లకి పెరిగింది. వ్యయాలు రూ. 15,974 కోట్ల నుంచి రూ. 17,572 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో షేరుపై రూ. 21 డివిడెండు ప్రకటించిది. బీఎస్ఈలో హ్యుందాయ్ షేరు స్వల్పంగా పెరిగి రూ. 1,852 వద్ద ముగిసింది. -
ఇండక్షన్ స్టవ్తో జాగ్రత్త..
పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఇళ్లలోనే కాకుండా హోటళ్లు, రెస్టారెంట్లలో కూడా గ్యాస్ సమస్య ఏర్పడింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల వినియోగంపై అప్రమత్తత పెరిగింది. ఎలక్ట్రిక్ కుక్కర్లు, ఇండక్షన్ స్టవ్ల వినియోగం పెరిగింది. అయితే ఇండక్షన్ స్టవ్ వినియోగంలో జాగ్రత్తలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.ఏమరపాటుగా ఉంటే భారీ మూల్యం తప్పదని హెచ్చరిస్తున్నారు. విద్యుత్ శక్తిని ఉష్ణశక్తిగా మారుస్తూ వంటింటి చికాకులకు ఇండక్షన్ స్టవ్తో ఫుల్స్టాప్ పెట్టొచ్చు. అయితే ఈ కరెంట్ పొయ్యి వాడకంలో కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. కొన్ని టిప్స్ పాటిస్తే సేఫ్.. మెటల్ ప్యానెల్ ఉన్న పాత్రలనే వాడాలి. వంట పూర్తయిన తర్వాత స్టవ్ పైనుంచి పాత్రలను తీసేటప్పుడు స్విచ్ఛాఫ్ చేయడం మరిచిపోవద్దు. ఇండక్షన్ స్టవ్ నుంచి తీవ్రమైన వేడి వెలువడుతుంది. స్టవ్ దగ్గర్లో ప్లాస్టిక్ వస్తువులు, దుస్తులు ఉంటే ప్రమాదకరం. వండే సమయంలో స్టవ్పై నీళ్లు, ఇతర ద్రవ పదార్థాలు పడకుండా చూసుకోవాలి. లేకపోతే స్టవ్ మన్నిక తగ్గడంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. క్లీన్ చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. మెత్తటి పొడి గుడ్డతో శుభ్రం చేయాలి. నీరు లేదా తడిబట్టతో క్లీన్ చేయవద్దు. మన్నికైన స్వీచ్బోర్డ్ ద్వారా కరెంట్ సరఫరా అయ్యేలా చూసుకోవాలి. ఎక్స్టెన్షన్ బాక్స్ల వాడటం ఏమాత్రం మంచిది కాదు. వంట పూర్తయిన తర్వాత కేవలం స్విచ్ఛాఫ్ చేసేసి ఊరుకోవద్దు. పిన్ నుంచి ప్లగ్ను తొలగించడం కూడా తప్పనిసరి. -
పోస్టాఫీసు డిపాజిట్లపై ఐటీ నిఘా..
పోస్టాఫీసు పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టే వారికి కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఆదాయపు పన్ను (IT) నిబంధనలు-2026 ప్రకారం, పోస్టాఫీసు ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం కఠినమైన నిబంధనలను అమలులోకి తెచ్చింది. ఇకపై ఖాతా తెరవడం నుంచి డిపాజిట్లు, ఉపసంహరణల వరకు ప్రతి కీలక లావాదేవీకి శాశ్వత ఖాతా సంఖ్య (PAN) కోట్ చేయడం తప్పనిసరి అయింది.చిన్న మొత్తాల పొదుపు పథకాలను అధికారిక పన్ను రిపోర్టింగ్ వ్యవస్థ పరిధిలోకి తీసుకురావడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (MIS), రికరింగ్ డిపాజిట్లు (RD), టైమ్ డిపాజిట్లపై ఈ నిబంధనల ప్రభావం పడనుంది.పాన్ కార్డు లేకపోతే 'ఫారం 97'గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లోని చిన్న పొదుపుదారులు, పెన్షనర్ల సౌకర్యార్థం ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచించింది. ఒకవేళ డిపాజిటర్ వద్ద పాన్ కార్డు లేకపోతే గతంలో ఉన్న ఫారం 60 స్థానంలో ఇప్పుడు ఫారం 97 సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో డిపాజిటర్ పేరు, చిరునామా, లావాదేవీ స్వభావం, మొత్తం, సంబంధిత గుర్తింపు పత్రాలను పొందుపరచాలి. దీనివల్ల పాన్ కార్డు లేని లావాదేవీలు కూడా పన్ను శాఖ రికార్డుల్లో నమోదవుతాయి.15G, 15H స్థానంలో 'ఫారం 121'పన్ను మినహాయింపు కోసం గతంలో ఉపయోగించే ఫారం 15G (60 ఏళ్లలోపు వారికి), ఫారం 15H (సీనియర్ సిటిజన్లకు)లను ప్రభుత్వం రద్దు చేసింది. వీటి స్థానంలో ఏకీకృత 'ఫారం 121'ని ప్రవేశపెట్టింది. అన్ని వర్గాల వారు ఇకపై ఒకే ప్రామాణిక ఫారమ్ను ఉపయోగించాల్సి ఉంటుంది. ప్రతి ఆర్థిక సంవత్సరానికి విడివిడిగా ఈ ఫారమ్ను సమర్పించాలి.ఏడేళ్ల పాటు రికార్డుల భద్రతకొత్త నిబంధనల ప్రకారం పోస్టాఫీసులపై బాధ్యత పెరిగింది. డిపాజిటర్లు సమర్పించే పత్రాలను పోస్టాఫీసు సిబ్బంది అంతర్గతంగా ధ్రువీకరించాలి. అలాగే, ఈ రికార్డులను, సపోర్టింగ్ డాక్యుమెంట్లను కనీసం ఏడు సంవత్సరాల పాటు భద్రపరచడం ఇప్పుడు తప్పనిసరి. సాంకేతిక వ్యవస్థలు పూర్తిగా అప్గ్రేడ్ అయ్యే వరకు, పాత ఫారాలు (15G, 15H) తాత్కాలికంగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. -
నెక్సాన్ కొత్త వేరియంట్ లాంచ్: ధర ఎంతంటే?
టాటా మోటార్స్.. నెక్సాన్ ప్యూర్ ప్లస్ పీఎస్ వేరియంట్ను లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ.9.59 లక్షలు (ఎక్స్ షోరూమ్). కంపెనీ పది లక్షల నెక్సాన్ల అమ్మకాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కొత్త వేరియంట్ లాంచ్ చేసింది.టాటా నెక్సాన్ ప్యూర్ PS వేరియంట్.. రోజువారీ వినియోగానికి అనుకూలంగా ఉంటుంది. కంపెనీ అందుబాటు ధరకే ఇందులో అనేక ప్రీమియం ఫీచర్లను అందిస్తుంది. విశాలమైన, ఓపెన్ క్యాబిన్ అనుభూతిని కలిగించే వాయిస్ అసిస్టెడ్ పనోరమిక్ సన్రూఫ్, నిరంతరాయ కనెక్టివిటీ కోసం వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లేలకు సపోర్ట్ చేసే 10.25-అంగుళాల హార్మన్ టచ్స్క్రీన్ ఉన్నాయి.ఆరు-స్పీకర్ల ఆడియో సెటప్, క్రూజ్ కంట్రోల్, రెయిన్-సెన్సింగ్ వైపర్లు కూడా ఈ కొత్త వేరియంట్లో ఉన్నాయి. ఆటో ఎల్ఈడీ హెడ్లైట్లు, డైనమిక్ గైడ్లైన్స్, పార్కింగ్ సెన్సార్లతో కూడిన HD రివర్స్ కెమెరా, ఆటో ఫోల్డ్ ఫంక్షనాలిటీతో కూడిన ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ORVMలు, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్లు, పుష్-బటన్ స్టార్ట్ వంటివి కూడా ఉన్నాయి. -
జెన్ జీ ఉద్యోగులపై ఆసక్తికర వ్యాఖ్యలు!
నేటి ఉద్యోగ ప్రపంచంలో 'జెన్ జీ' (Gen Z) తరం గురించి ఒక చర్చ జరుగుతోంది. కొంతమంది వ్యాపారవేత్తలు, యువత పనిపట్ల చాలా నిర్లక్ష్యంగా ఉంటారని, ఆఫీస్ రూల్స్ కూడా పాటించరని చెబుతున్నారు. దీనిపై యువ పారిశ్రామికవేత్త రోహిత్ ఆర్యన్ స్పందిస్తూ ట్వీట్ చేశారు. ఇందులో తన అనుభవాన్ని పంచుకుంటూ.. జెన్ జీ ఉద్యోగులు నిజానికి ఎంతో కష్టపడే వారు అని స్పష్టం చేశారు.''రెండు నెలల క్రితం ఒక జెన్ జీ యువతిని ఉద్యోగంలోకి తీసుకున్నాను. మొదట్లో నేను కూడా.. అందరూ చెప్పినట్లే ఈ తరం గురించి కొన్ని సందేహాలు పెట్టుకున్నాను. కానీ ఆమె పనితీరును దగ్గరగా గమనించిన తరువాత, తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని వెల్లడించారు. ఆమె నిజాయితీగా పనిచేయడం, బాధ్యతగా వ్యవహరించడం, తన పనిపట్ల ఆసక్తి చూపించడం ఆయనను ఆకట్టుకున్నాయని వెల్లడించారు.జెన్ జీ ఉద్యోగులు పని చేయరని మాట తప్పు.. ఎందుకంటే వారు పని చేసే విధానం చాలా భిన్నంగా ఉంటుంది. పాత తరాల ఉద్యోగులు సంప్రదాయ పద్ధతుల్లో పనిచేయడాన్ని ఇష్టపడితే.. జెన్ జీ యువత కొత్త ఆలోచనలు, స్వేచ్ఛ, సౌకర్యవంతమైన వాతావరణాన్ని కోరుకుంటారు. వారు పని - వ్యక్తిగత జీవితాల మధ్య సమతుల్యత ముఖ్యమని భావిస్తారు. ఇది వాళ్ల బలహీనత కాదు, మారుతున్న కాలానికి అనుగుణంగా వచ్చిన కొత్త దృక్పథం అని రోహిత్ ఆర్యన్ పేర్కొన్నారు.Hired a GenZ girl 2 months back, and honestly she works with full heart, super sincere. That whole "GenZ doesn't work hard" thing is totally wrong. You just need to understand how they work - their style, their way of communicating is a bit different, but that's completely fine.…— Rohit Aryan (@RohitAryannn) May 6, 2026జెన్ జీ ఉద్యోగులు తమ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పడంలో ముందుంటారు. అవసరమైతే 'ఇది సరైనది కాదు' అని ధైర్యంగా చెప్పగలరు. కొందరు దీనిని అహంకారంగా భావించినా, వాస్తవానికి అది వారి ఆత్మవిశ్వాసానికి సూచిక. సరైన ప్రోత్సాహం, గౌరవం, అర్థం చేసుకునే నాయకత్వం లభిస్తే.. వారు సంస్థకు ఎంతో విలువైనవారిగా మారగలరని ఆయన అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: 2008లోనే చూశాను.. రియల్ ఆస్తులు ఏవంటే?రోహిత్ ఆర్యన్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. చాలామంది ఆర్యన్ అభిప్రాయానికి మద్దతు తెలిపారు. తాము కూడా జెన్ జెడ్ ఉద్యోగులతో మంచి అనుభవాలు పొందామని చెప్పారు. సరైన మార్గదర్శనం, స్వేచ్ఛ, నమ్మకం ఇస్తే ఈ తరం అద్భుతమైన ఫలితాలు ఇస్తుందని పేర్కొన్నారు. -
కార్పొరేట్ ఆసుపత్రిలో ఉచిత వైద్యం
దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం భారంగా మారుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ - ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎం-జేఏవై) ఒక సంజీవనిలా పనిచేస్తోంది. ఈ పథకం ద్వారా లభించే ‘ఆయుష్మాన్ కార్డు’ ఉంటే చాలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో సైతం ఉచితంగా చికిత్స పొందే వీలుంది.ఆయుష్మాన్ భారత్ కార్డు అంటే ఏమిటి?ఆయుష్మాన్ భారత్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆర్థిక సాయంతో నడిచే ఆరోగ్య బీమా పథకం. ఈ పథకం కింద అర్హులైన ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం లభిస్తుంది. ఈ సదుపాయాన్ని పొందడానికి ఇచ్చే డిజిటల్ గుర్తింపు కార్డునే ‘ఆయుష్మాన్ కార్డు’ లేదా ‘పీఎం-జేఏవై కార్డు’ అంటారు.కార్డు వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలుఆసుపత్రిలో చేరినప్పుడు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. సుమారు 1,900 పైగా వ్యాధులు, శస్త్రచికిత్సలకు ఇందులో కవరేజీ ఉంటుంది. ఆసుపత్రిలో చేరడానికి 3 రోజుల ముందు నుంచి, డిశ్చార్జ్ అయిన 15 రోజుల వరకు అయ్యే పరీక్షలు, మందుల ఖర్చులు కూడా పథకంలో వర్తిస్తాయి. మీరు ఏ రాష్ట్రంలో ఉన్నా ఈ పథకం కింద నమోదైన ఏ ఆసుపత్రిలోనైనా (ప్రభుత్వ లేదా ప్రైవేట్) చికిత్స పొందవచ్చు.ఆయుష్మాన్ కార్డు ఎలా పొందాలి?ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను చాలా సరళతరం చేసింది. మీ స్మార్ట్ఫోన్ ద్వారానే స్వయంగా దరఖాస్తు చేసుకోవచ్చు.ముందుగా ఆయుష్మాన్ భారత్ అధికారిక వెబ్సైట్ (https://beneficiary.nha.gov.in) ను సందర్శించండి లేదా ‘Ayushman App’ డౌన్లోడ్ చేసుకోండి.వెబ్సైట్లో ‘Beneficiary’ ఆప్షన్ను ఎంచుకోండి.మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి వచ్చిన OTP ద్వారా లాగిన్ అవ్వండి.మీ రాష్ట్రం, పథకం పేరు (పీఎంజేఏఐ) ఎంచుకోండి.మీ జిల్లాను ఎంచుకున్న తర్వాత.. ఆధార్ నంబర్ లేదా రేషన్ కార్డ్ ద్వారా మీ పేరును సెర్చ్ చేయండి.లిస్టులో మీ పేరు పక్కన ఉన్న ‘Identify’ లేదా ‘e-KYC’ బటన్పై క్లిక్ చేయండి.ఆధార్ OTP లేదా ఫేస్ అథెంటికేషన్ ద్వారా కేవైసీ పూర్తి చేయండి.మీ ప్రస్తుత ఫోటోను లైవ్లో క్యాప్చర్ చేసి అప్లోడ్ చేయండి. మీ ఆధార్లోని వివరాలు, ప్రస్తుత వివరాలు సరిపోలితే వెంటనే ఆమోదం లభిస్తుంది.అప్రూవల్ అయిన తర్వాత ‘Download Card’ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మీ డిజిటల్ ఆయుష్మాన్ కార్డును ప్రింట్ తీసుకోవచ్చు.ఇటీవలే కేంద్ర ప్రభుత్వం 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ (వారి ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా) ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుంది. వీరు ప్రత్యేకంగా ‘వయో వందన’ కార్డు కోసం పైన పేర్కొన్న పద్ధతిలోనే దరఖాస్తు చేసుకోవచ్చు.ఏవైనా సందేహాలుంటే లేదా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇబ్బందులు ఎదురైతే ప్రభుత్వ హెల్ప్లైన్ నంబర్ 14555 కు కాల్ చేయవచ్చు లేదా సమీపంలోని మీ-సేవా కేంద్రాలను సంప్రదించవచ్చు.ఇదీ చదవండి: సుప్రీంకోర్టులో వాడివేడి వాదనలు -
ATM నుంచి EPF.. ఎప్పటి నుంచంటే..
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన చందాదారులకు భారీ ఊరటనిచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేయాలంటే నెలల తరబడి వేచి చూడటం, కార్యాలయాల చుట్టూ తిరగడం వంటి ఇబ్బందులు ఉండేవి. కానీ, ఇకపై ఆ అవసరం లేకుండా నేరుగా ఏటీఎం కార్డులు లేదా యూపీఐ (UPI) ద్వారా డబ్బులు తీసుకునే వెసులుబాటు కల్పించనుంది. 'ఈపీఎఫ్ఓ 3.0' అప్గ్రేడ్లో భాగంగా ఈ సరికొత్త డిజిటల్ విప్లవం ఈనెల (మే 2026) చివరికల్లా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వార్తా సంస్థ ఈటీ నౌ ఉటంకించిన వర్గాల సమాచారం.ఏటీఎం నుంచి సగమే!కొత్త వ్యవస్థ ప్రకారం, చందాదారుల పీఎఫ్ ఖాతాలకు అనుసంధానించిన ప్రత్యేక ఏటీఎం కార్డులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల దరఖాస్తులు, డాక్యుమెంట్ల తతంగం లేకుండానే అవసరమైనప్పుడు నిధులను డ్రా చేసుకోవచ్చు. అయితే, ఈ విధానంలో మొత్తం పీఎఫ్ బ్యాలెన్స్లో 50 శాతం వరకు మాత్రమే విత్ డ్రా చేసుకునేలా పరిమితి విధించే అవకాశం ఉందని సమాచారం.విత్డ్రాకు కావాల్సినవి..యాక్టివ్ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN).ఆధార్, పాన్ కార్డ్ అనుసంధానం.బ్యాంక్ ఖాతా వివరాలు, సరైన IFSC కోడ్.నిబంధనల సరళీకరణగతంలో ఉన్న సంక్లిష్టమైన 13 రకాల ఉపసంహరణ నిబంధనలను ఈపీఎఫ్ఓ కేవలం మూడు ప్రధాన వర్గాలుగా కుదించింది.అత్యవసరాలు: వైద్య అత్యవసరాలు, పిల్లల చదువులు, వివాహ ఖర్చులు. ఇందులో విద్యా రుణం కోసం 10 సార్ల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. వివాహ ఖర్చుల కోసం 5 సార్ల వరకు నిధులు తీసుకునేందుకు అనుమతి ఉంటుంది.గృహ అవసరాలు: ఇల్లు కొనడం, నిర్మాణం, ఇంటి మరమ్మతులు లేదా హోమ్ లోన్ చెల్లింపులు.ప్రత్యేక పరిస్థితులు: ప్రకృతి వైపరీత్యాలు లేదా ఇతర ఆకస్మిక ఆర్థిక ఇబ్బందులు.ఈపీఎఫ్ఓ 3.0: మరిన్ని కీలక మార్పులుసర్వీస్ పరిమితి తగ్గింపు: కేవలం 12 నెలల సర్వీస్ ఉన్నా సరే పాక్షిక ఉపసంహరణలకు అనుమతి ఇచ్చేలా రూల్స్ మారుతున్నాయి.ఎక్కువ మొత్తం విత్ డ్రా: గతంలో కేవలం ఉద్యోగి వాటా మాత్రమే వచ్చేది. ఇప్పుడు యజమాని వాటా, దానిపై వడ్డీని కూడా కలిపి విత్ డ్రా చేసుకునే వెసులుబాటు కలుగుతుంది.ఉద్యోగం కోల్పోతే: ఉద్యోగం పోయిన వెంటనే 75% బ్యాలెన్స్ తీసుకోవచ్చు. ఏడాది పాటు నిరుద్యోగిగా ఉంటే మిగిలిన 25% కూడా విత్ డ్రా చేసుకోవచ్చు.పూర్తి విత్ డ్రాయల్: 55 ఏళ్ల పదవీ విరమణ, వైకల్యం, విదేశాలకు వెళ్లడం వంటి సందర్భాల్లో పూర్తి మొత్తం తీసుకోవచ్చు.రికార్డు స్థాయిలో క్లెయిమ్ల పరిష్కారంకేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపిన వివరాల ప్రకారం.. ఈపీఎఫ్ఓ డిజిటలైజేషన్ వేగవంతమైంది. 2024-25లో 6.01 కోట్లుగా ఉన్న క్లెయిమ్ల పరిష్కారం, 2025-26 నాటికి 8.31 కోట్లకు చేరింది.త్వరలో రాబోయే ఈ 'ఈపీఎఫ్ఓ 3.0'తో సామాన్య ఉద్యోగులకు తమ సొంత డబ్బుపై పూర్తి నియంత్రణ లభించడమే కాకుండా, అత్యవసర సమయాల్లో పీఎఫ్ కార్యాలయాల చుట్టూ తిరిగే కష్టాలు తప్పుతాయని భావిస్తున్నారు.ఇదీ చదవండి: EPFO: రూ.7500లకు గనక పెంచితే.. -
సామ్ను కాపాడింది సత్య సర్..
టెక్ ప్రపంచాన్ని కుదిపేసిన ‘ఓపెన్ ఏఐ’ హైడ్రామాపై ఎట్టకేలకు తెర వీడింది. సరిగ్గా రెండేళ్ల క్రితం సంస్థ సహ వ్యవస్థాపకుడు సామ్ ఆల్ట్మాన్ను అర్ధరాత్రి పూట సీఈఓ పదవి నుంచి తొలగించడం, ఆపై వారం రోజుల్లోనే ఆయన మళ్లీ పగ్గాలు చేపట్టడం వెనుక జరిగిన ఆసక్తికర పరిణామాలు ఇప్పుడు బహిర్గతమయ్యాయి. ఎలాన్ మస్క్ దాఖలు చేసిన తాజా కోర్టు కేసు విచారణలో భాగంగా అప్పటి తాత్కాలిక సీఈఓ మీరా మురాటి, సామ్ ఆల్ట్మాన్ మధ్య జరిగిన అంతర్గత సందేశాలు బయటపడ్డాయి. ఈ సందేశాలు ఆనాటి గందరగోళాన్ని కళ్లకు కడుతున్నాయి.అసలేం జరిగింది? బోర్డు ఆరోపణలేంటి?నవంబర్ 17, 2023న ఓపెన్ఏఐ బోర్డు అనూహ్య నిర్ణయం తీసుకుంది. సామ్ ఆల్ట్మాన్పై నమ్మకం పోయిందని పేర్కొంటూ ఆయనను పదవి నుంచి తొలగించింది. లాభాపేక్ష లేని సంస్థ లక్ష్యాలకు ఆల్ట్మాన్ శైలి విరుద్ధంగా ఉందని బోర్డు భావించింది.మీరా మురాటి వ్యాఖ్యలుఆల్ట్మాన్ వెళ్లిపోయిన వెంటనే అప్పటి సీటీఓ మీరా మురాటిని తాత్కాలిక సీఈఓగా బోర్డు నియమించింది. ఆ సమయంలో సామ్ ఆల్ట్మాన్ తిరిగి రావడానికి ప్రయత్నిస్తూ.. పరిస్థితి ఎలా ఉందని మీరాను ఆరా తీసినట్లు చెప్పారు. ఆల్ట్మాన్ ఒక్కో వ్యక్తికి ఒక్కో రకమైన విషయాలు చెబుతూ సంస్థలో గందరగోళం సృష్టించారని మురాటి అన్నారు. తదుపరి సీఈఓ ఎవరనే విషయాలు కూడా తెలుసుకునేందుకు ప్రయత్నం చేశారని తెలిపారు.రక్షకుడిగా నిలిచిన సత్య నాదెళ్లఓపెన్ఏఐలో బిలియన్ల కొద్దీ పెట్టుబడులు పెట్టిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, ఈ సంక్షోభం సమయంలో చాకచక్యంగా వ్యవహరించారు. బోర్డు మొండిగా వ్యవహరిస్తున్న తరుణంలో ఆల్ట్మాన్, ఆయన బృందాన్ని మైక్రోసాఫ్ట్లో చేర్చుకుంటున్నట్లు ప్రకటించి ఒక్కసారిగా సీన్ మార్చారు. ‘సామ్ ఆల్ట్మాన్, గ్రెగ్ బ్రోక్మ్యాన్ మా కొత్త అడ్వాన్స్డ్ ఏఐ పరిశోధన బృందానికి నాయకత్వం వహించడానికి మైక్రోసాఫ్ట్లో చేరుతున్నారు’ అని సత్య నాదెళ్ల ఎక్స్లో పోస్ట్ చేశారు.ఈ ఒక్క ప్రకటనతో దాదాపు 90 శాతం మంది ఓపెన్ఏఐ ఉద్యోగులు ఆల్ట్మాన్ వెంట నడుస్తామని రాజీనామా లేఖలు సిద్ధం చేశారు. సంస్థ కుప్పకూలిపోతుందని భయపడిన బోర్డు, చివరకు తలొగ్గి ఆల్ట్మాన్ను తిరిగి సీఈఓగా ఆహ్వానించింది. ఇదిలాఉండగా, ప్రస్తుతం మీరా మురాటి ఓపెన్ఏఐ నుంచి తప్పుకుని ‘థింకింగ్ మెషిన్స్ ల్యాబ్’ అనే సొంత సంస్థను స్థాపించారు.ఇదీ చదవండి: భయం వద్దు.. నైపుణ్యమే హద్దు -
భారతీయ కళలను ప్రపంచానికి చాటేందుకే అమ్మ ఇలా..
వెనిస్ వేదికగా జరిగిన 61వ అంతర్జాతీయ కళా ప్రదర్శన భారతీయ కళా వైభవం ప్రపంచ దేశాలను కట్టిపడేసింది. ఈ ప్రదర్శనలో భాగంగా ఏర్పాటు చేసిన ‘ఇండియా పెవిలియన్’ ప్రారంభోత్సవం సందర్భంగా నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్ఎంఏసీసీ) నిర్వహించిన ప్రత్యేక విందు కార్యక్రమం సాంస్కృతిక వారధిగా నిలిచింది.చారిత్రక నగరమైన వెనిస్లోని ‘స్కూలా గ్రాండే డెల్లా మిసెరికార్డియా’ వేదికగా భారతీయ సంస్కృతి, కళలు కొత్త పుంతలు తొక్కాయి. 61వ వెనిస్ బిన్నాలేలో భారత పెవిలియన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఇషా అంబానీ తన తల్లి నీతా అంబానీతో కలిసి నిర్వహించిన ప్రత్యేక విందు కార్యక్రమం ప్రపంచ స్థాయి కళాకారులు, సాంస్కృతిక వేత్తలు, ఫ్యాషన్ రంగ ప్రముఖులను ఒకే తాటిపైకి తెచ్చింది.అమ్మ కల.. కళాకారుల గళంఈ కార్యక్రమంలో ఇషా అంబానీ తన తల్లి నీతా అంబానీకి కృతజ్ఞలు తెలిపారు. ఒక క్లాసికల్ డ్యాన్సర్గా, విద్యావేత్తగా ప్రస్థానాన్ని ప్రారంభించిన నీతా అంబానీ భారతీయ కళాకారుల ప్రతిభను అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించాలనే లక్ష్యంతోనే ఎన్ఎంఏసీసీని స్థాపించారని ఇషా పేర్కొన్నారు. ‘భారతదేశపు అత్యుత్తమ కళలను ప్రపంచానికి పరిచయం చేయడం, ప్రపంచంలోని అద్భుతమైన కళలను భారత్కు తీసుకురావడమే మా లక్ష్యం’ అని ఆమె స్పష్టం చేశారు.భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఈ పెవిలియన్ ‘జియోగ్రఫీస్ ఆఫ్ డిస్టెన్స్: రిమెంబరింగ్ హోమ్’ అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమం సాగింది. డాక్టర్ అమీన్ జాఫర్ దీనికి క్యూరేటర్గా వ్యవహరించారు. అల్వార్ బాలసుబ్రమణ్యం, రంజని శెట్టార్, సుమక్షి సింగ్, స్కర్మ సోనమ్ తాషి, అసిమ్ వకీఫ్ తమ సృజనాత్మకతతో ఈ ప్రదర్శనను నిర్వహించారు.వారసత్వానికి.. ఆధునికతకు మధ్య వారధిఈ వేడుక కేవలం విందుకే పరిమితం కాకుండా గతాన్ని, వర్తమానాన్ని అనుసంధానించే ఒక చర్చా వేదికగా మారింది. భారతీయ హస్తకళల నైపుణ్యాన్ని గౌరవిస్తూ సృజనాత్మకతను సజీవంగా ఉంచే ప్రేక్షకులకు ఈ కార్యక్రమాన్ని అంకితమిచ్చారు. భారతీయ సంప్రదాయ రుచులు, కళాత్మక అలంకరణలతో కూడిన ఈ ఈవెంట్ ఒక మధుర జ్ఞాపకంగా నిలిచింది.ఇదీ చదవండి: భయం వద్దు.. నైపుణ్యమే హద్దు -
వీఆర్ఎస్.. ఉద్యోగుల కోరిక మేరకేనా?
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఇటీవల ప్రకటించిన స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్ఎస్) కార్పొరేట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇది కేవలం వ్యయ నియంత్రణ కోసం చేపట్టిన చర్య అని వస్తున్న విశ్లేషణలను కంపెనీ యాజమాన్యం తోసిపుచ్చింది. ఈ పథకం పూర్తిగా ఉద్యోగ సంఘాల (యూనియన్ల) విజ్ఞప్తి మేరకు, వారి ప్రయోజనాల కోసమే ప్రవేశపెట్టామని కంపెనీ స్పష్టం చేసింది.యాజమాన్యం వివరణసాధారణంగా ఏ కంపెనీ అయినా వీఆర్ఎస్ ప్రకటిస్తే అది శ్రామిక శక్తిని తగ్గించుకోవడానికో లేదా నష్ట నివారణ కోసమో అని భావిస్తారు. అయితే, టాటా మోటార్స్ దీనిపై భిన్నమైన వాదనను వినిపించింది. ‘వివిధ ప్లాంట్ల వద్ద ఉన్న ఉద్యోగులు, యూనియన్ల నుంచి వచ్చిన విజ్ఞప్తులకు స్పందనగానే ఈ పథకాన్ని రూపొందించాం. ఇది హెడ్ కౌంట్ తగ్గించడానికో లేక ఖర్చులను హేతుబద్ధీకరించడానికో చేపట్టిన పథకం కాదు’ అని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.గత నాలుగేళ్లలో టాటా మోటార్స్ చేపట్టిన మూడో వీఆర్ఎస్ ఇది. ముఖ్యంగా, అక్టోబర్ 2025 నుంచి ప్యాసింజర్ వెహికల్ (పీవీ), కమర్షియల్ వెహికల్ (సీవీ) విభాగాలుగా కంపెనీ విడిపోతున్న నేపథ్యంలో చేపట్టిన మొదటి ప్రధాన ఉద్యోగ సంస్కరణ కావడం గమనార్హం.భవిష్యత్ అవసరాల కోసమేనా?కంపెనీ దీన్ని స్వచ్ఛందమైనదిగా పేర్కొంటున్నప్పటికీ పరిశ్రమ విశ్లేషకులు మాత్రం ఆటో రంగంలో వస్తున్న సాంకేతిక మార్పులతో దీనికి ముడిపెడుతున్నారు. ప్రస్తుతం ఆటోమొబైల్ రంగం ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ఐసీఈ) నుంచి ఎలక్ట్రిక్ వాహనాలవైపు వేగంగా మారుతోంది. సంప్రదాయ ఇంజిన్ల తయారీతో పోలిస్తే ఈవీల తయారీలో కదిలే భాగాలు తక్కువగా ఉంటాయి. దీనివల్ల అసెంబ్లీ లైన్లలో తక్కువ మంది కార్మికులు సరిపోతారు. దశాబ్దాల కాలంగా పనిచేస్తున్న శాశ్వత ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు, వైద్య ప్రయోజనాల రూపంలో కంపెనీకి అయ్యే వ్యయం ఎక్కువ. వన్-టైమ్ సెటిల్మెంట్ ద్వారా దీర్ఘకాలికంగా బ్యాలెన్స్ షీట్ను మెరుగుపరుచుకోవడానికి కంపెనీలు ఇలాంటి పథకాలను ఎంచుకుంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ప్రతిస్పందనటాటా మోటార్స్ వద్ద మొత్తం 58,442 మంది ఉద్యోగులు ఉండగా తాజా గణాంకాల ప్రకారం సుమారు 750 మంది ఈ పథకానికి అర్హులుగా తేలారు. అయితే, వారిలో కేవలం 275 నుంచి 300 మంది మాత్రమే వీఆర్ఎస్ ఎంచుకున్నట్లు సమాచారం. ఉద్యోగ భద్రతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మెజారిటీ కార్మికులు విధుల్లోనే కొనసాగడానికి మొగ్గు చూపడం విశేషం.ఇదీ చదవండి: భయం వద్దు.. నైపుణ్యమే హద్దు -
ఇళ్ల అమ్మకాలు.. కుదేలు!
పశ్చిమ ఆసియా సంక్షోభం నేపథ్యంలో జనవరి–మార్చి త్రైమాసికంలో తొమ్మిది ప్రధాన నగరాల్లో గృహాల అమ్మకాలు వార్షికంగా 13 శాతం తగ్గి 98,761 యూనిట్లకు పడిపోయాయని ప్రముఖ రియల్ ఎస్టేట్ పరిశోధన సంస్థ ప్రాప్ ఈక్విటీ వెల్లడించింది. ఇటీవలి కాలంలో 18 త్రైమాసికాల తర్వాత అమ్మకాలు లక్ష యూనిట్ల మార్కు కంటే దిగువకు పడిపోయాయని ప్రాప్ ఈక్విటీ తేల్చింది. దేశంలో అలాంటి అమ్మకాల తగ్గుదల చూసిన తొమ్మిది ప్రధాన నగరాలైన ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, నవీ ముంబై, థానే, బెంగళూరు, పుణె, హైదరాబాద్, చెన్నై, కోల్కతా ఉన్నట్లు తెలిపింది.నగరాల వ్యాప్తంగా పరిస్థితి ఇదీ.. ప్రాప్ ఈక్విటీ డేటా ప్రకారం.. చెన్నైలో గృహాల అమ్మకాలు 4 శాతం తగ్గాయి. హైదరాబాద్లో 16 శాతం పడిపోయాయి. ముంబైలో 20, నవీ ముంబైలో 14 శాతం, థానెలో 24 శాతం, పుణెలో 25 శాతం పడిపోయాయి. చివరగా కోల్కతాలో గృహాల విక్రయాలు 8 శాతం తగ్గాయి. బెంగళూరులో 3 శాతం కొనుగోళ్లు పెరిగాయి. ఢిల్లీ–ఎన్సీఆర్లో గృహ విక్రయాలు 13 శాతం పెరిగాయి. మొత్తంగా చూస్తే.. గత ఏడాది జనవరి–మార్చి కాలంలోని 1,13,602 యూనిట్లతో పోలిస్తే, ఈ ఏడాది నివాస గృహాల అమ్మకాలు 13 శాతం తగ్గి 98,761 యూనిట్లకు పడిపోయాయి. తొమ్మిది నగరాల్లో మొత్తం అమ్మకాలు గత త్రైమాసికంలోని(అక్టోబర్–డిసెంబర్ 2025) 1,05,527 యూనిట్లతో పోలిస్తే 6 శాతం తగ్గాయి. అయితే ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరు నగరాలు దీనికి మినహాయింపుగా నిలిచాయి.డిమాండ్కు తగ్గ సరఫరా లేక.. గత ఏడాది జనవరి–మార్చి కాలంతో పోలిస్తే 2026 మొదటి త్రైమాసికంలో దాదాపు 22 వేల యూనిట్లు తక్కువగా సరఫరా అయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో 1,14,718 యూనిట్లతో పోలిస్తే, కొత్త గృహాల సరఫరా 19 శాతం తగ్గి 92,411 యూనిట్లకు పడిపోయింది. కొత్త ప్రాజెక్టుల ప్రారంభం తగ్గడానికి పశ్చిమ ఆసియా యుద్ధంతో ఏర్పడిన అనిశ్చితి కొనుగోలు సెంటిమెంట్ను ప్రభావితం చేసిందని పరిశ్రమ నిపుణులు అంటున్నారు. -
సుప్రీంకోర్టులో వాడివేడి వాదనలు
రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) నిధుల మళ్లింపునకు సంబంధించి రూ.27,300 కోట్ల భారీ బ్యాంకు మోసం కేసులో సుప్రీంకోర్టు కీలక విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అనిల్ అంబానీ తరఫు న్యాయవాదులు వినిపించిన వాదనలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. వివాదాస్పద లావాదేవీల్లో అనిల్ అంబానీ ఎవరినీ మోసం చేయలేదని, బహుశా అతనే మోసపోయి ఉండవచ్చునని న్యాయస్థానం ముందు పేర్కొన్నారు.దర్యాప్తు సంస్థల నివేదికఈ కేసులో సీబీఐ, ఈడీ దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించాయి. రూ.27,300 కోట్ల నిధుల మళ్లింపుపై విచారణ సరైన దిశలోనే సాగుతోందని సీబీఐ స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేశామని, తదుపరి విచారణలో మరిన్ని కీలక అరెస్టులు జరిగే అవకాశం ఉందని ఏజెన్సీ వెల్లడించింది. అయితే, నిధుల మళ్లింపులో అంబానీ పాత్రపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని ఆరోపిస్తున్న పిటిషనర్, ఇప్పటివరకు ఆయనను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు.సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుపిటిషనర్ వాదనలపై స్పందించిన సుప్రీంకోర్టు, దర్యాప్తు ప్రక్రియను సంచలనాత్మకం చేయవద్దని హెచ్చరించింది. ‘అరెస్టు చేయాలని ఆదేశించడానికి కోర్టు సంకోచిస్తోంది. కస్టోడియల్ విచారణ అవసరమా లేదా అనేది దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలే నిర్ణయించాలి. ఆ బాధ్యత వారిదే’ అని ధర్మాసనం అభిప్రాయపడింది.ఆస్తుల అటాచ్మెంట్పై అభ్యంతరంఢిల్లీలో విద్యుత్ సరఫరా చేసే బీఎస్ఈఎస్ రాజధాని పవర్ లిమిటెడ్, యమునా పవర్ లిమిటెడ్లలోని రూ.1,575 కోట్ల విలువైన షేర్లను దర్యాప్తు సంస్థలు అటాచ్ చేయడంపై అంబానీ తరఫు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకే గ్రూపునకు చెందిన కంపెనీలు కావడమే ఈ చర్యకు కారణమని, ఇది ఉద్దేశపూర్వకమని వాదించారు. అటాచ్మెంట్ వల్ల వర్కింగ్ క్యాపిటల్ స్తంభించిపోతుందని, తద్వారా దేశ రాజధానిలోని కోట్లాది మంది వినియోగదారులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.కేసు నేపథ్యంరిలయన్స్ కమ్యూనికేషన్స్, దాని అనుబంధ సంస్థలకు చెందిన బ్యాంకు నిధులను ఇతర అవసరాలకు మళ్లించారని, తద్వారా బ్యాంకులకు భారీ నష్టం వాటిల్లిందని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈ భారీ ఆర్థిక కుంభకోణంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ కొనసాగుతోంది. తదుపరి విచారణలో దర్యాప్తు సంస్థలు సమర్పించే నివేదికలు అనిల్ అంబానీ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.ఇదీ చదవండి: భయం వద్దు.. నైపుణ్యమే హద్దు -
మళ్లీ అదే రిలీఫ్! బంగారంపై గుడ్ న్యూస్
దేశంలో బంగారం ధరల తగ్గుదల కొనసాగుతోంది. వరుసగా రెండో రోజూ పుత్తడి ధరలు దిగివచ్చాయి. దీంతో నేడు కూడా పసిడి కొనుగోలుదారులకు కాస్త ఊరట కలుగుతోంది. ఇక వెండి ధరల విషయానికి వస్తే నేడు ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రస్తుతం బంగారం (Today Gold Rate), వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో ఈ కింద తెలుసుకుందాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
వైట్ కాలర్ ఉద్యోగాలకు ఏఐ గ్రహణం?
కంప్యూటర్ పుట్టుకొచ్చిన తొలినాళ్లలో చాలా రంగాల్లో సిబ్బంది అవసరం తగ్గిపోయింది. కానీ అప్పట్లో ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథంలో ఉండటంతో ఆ శ్రమశక్తి ఇతర రంగాల్లోకి మళ్లింది. కానీ నేడు మనం ఎదుర్కొంటున్న పరిస్థితి వేరు. ‘ఏజెంటిక్ ఏఐ’ రూపంలో వస్తున్న సాంకేతిక విప్లవం, అస్థిరమైన భౌగోళిక రాజకీయ పరిస్థితులు కలిసి ప్రపంచవ్యాప్తంగా వైట్ కాలర్ ఉద్యోగాలను తుడిచిపెట్టే ప్రమాదం కనిపిస్తోంది.నిర్ణయం దానిదే.. అమలు దానిదే!2024లో తెరపైకి వచ్చిన ఏజెంటిక్ ఏఐ కేవలం ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమే కాదు, ఒక పనిని ఎలా చేయాలో స్వయంగా నిర్ణయించుకుని పూర్తి చేయగలదు. ఆంత్రోపిక్ క్లాడ్ వంటి టూల్స్ ఎంత వేగంగా విస్తరిస్తున్నాయో చూస్తుంటే భయం కలగక మానదు. ‘ముందు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కానీ కొన్ని రంగాలు పూర్తిగా కనుమరుగవుతాయి’ అని ఓపెన్ ఏఐ చీఫ్ సామ్ ఆల్ట్మాన్ హెచ్చరించడం గమనార్హం.ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడీ అంచనా ప్రకారం.. కోడింగ్, ఫైనాన్స్, లా వంటి రంగాల్లో నైపుణ్యం కలిగిన వారి ఉద్యోగాల్లో 20 శాతం కోత పడే అవకాశం ఉంది. ఇది కేవలం సామాన్య ఉద్యోగులకే కాదు, మధ్యతరగతికి కీలకంగా మారే ఎంట్రీ లెవల్ వైట్ కాలర్ ఉద్యోగాలకు ఎసరు పెడుతోంది.భారత ఐటీ రంగానికి రెడ్ అలర్ట్భారతదేశం ప్రపంచానికి బ్యాక్ ఆఫీస్గా గుర్తింపు పొందింది. లక్షలాది మంది యువత ఐటీ సేవల ద్వారా ఉపాధి పొందుతున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి.కాగ్నిజెంట్ ఇప్పటికే భారత్లో అధిక వాటా ఉండేటా 15,000 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.సేల్స్ఫోర్స్ సంస్థలో సగం సపోర్ట్ సర్వీసులను ఏఐ చూసుకోవడంతో 4,000 ఉద్యోగాల్లో కోత పడింది.ఫ్రెష్వర్క్స్ తన కోడింగ్లో సగానికి పైగా ఏఐతో చేయిస్తూ 11 శాతం సిబ్బందిని తగ్గించుకుంది.డ్యుయోలింగో (ట్రాన్స్లేషన్), చెగ్ (ఎడ్యుకేషన్), హెచ్పీ వంటి దిగ్గజాలు కూడా ఏఐ కారణంగా సిబ్బందిని తగ్గిస్తున్నాయి.నందన్ నిలేకని చెప్పినట్లుగా కంపెనీలు ఇప్పుడు ‘టాప్-టు-బాటమ్’ పునర్నిర్మాణం చేసుకోవాల్సిన స్థితిలో ఉన్నాయి. గతంలో ఒక పనికి వందల మంది ఇంజినీర్లు అవసరమయ్యే వారు. ఇప్పుడు ఏఐ సాయంతో చిన్న టీమ్లు అదే పనిని నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి.యుద్ధ క్షేత్రంలోనూ రోబోలదే రాజ్యంసాంకేతికత కేవలం ఆఫీసులకే పరిమితం కాలేదు. రక్షణ రంగాన్ని కూడా మార్చేస్తోంది. ఉక్రెయిన్ యుద్ధంలో డ్రోన్లు, అటానమస్ రోబోల వినియోగం పెరిగింది. చైనా తన విమాన దళంలో మానవరహిత విమానాలను ప్రవేశపెడుతోంది. దీనిని గమనించిన భారత్ కూడా అప్రమత్తమైంది.బీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డ్రోన్ లాబొరేటరీలను ఏర్పాటు చేసింది. ఐఐటీల సహకారంతో విద్యార్థులకు, గ్వాలియర్ వంటి కేంద్రాల్లో సైనికులకు డ్రోన్ ఆపరేటింగ్, డిఫెన్స్లో శిక్షణ ఇస్తున్నారు.భారత్ ముందున్న సవాలుఒకవైపు శ్రమశక్తి విపరీతంగా పెరుగుతోంది. మరోవైపు శ్రమను నిర్వహించే ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు ఏఐ వల్ల ఆవిరవుతున్నాయి. ఒకప్పుడు అవుట్సోర్సింగ్ ద్వారా భారత్కు వచ్చే కాంట్రాక్ట్లు ఇప్పుడు ఆయా దేశాల్లోనే ఏఐ సాఫ్ట్వేర్ల ద్వారా పూర్తవుతున్నాయి. ప్రస్తుతానికి మాత్రం వైట్ కాలర్ ఉద్యోగులు తమ నైపుణ్యాలను అత్యున్నత స్థాయికి పెంచుకోకపోతే ప్రమాదంలో పడతారని గ్రహించాలి.ఇదీ చదవండి: భయం వద్దు.. నైపుణ్యమే హద్దు -
ఇంధన మంట షురూ!
కొంతకాలంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నప్పటికీ స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు ఇకపై పెరిగే అవకాశం కనిపిస్తోంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధి వద్ద ఏర్పడిన అంతరాయాల కారణంగా ముడి చమురు ధర ఇటీవల బ్యారెల్కు 70 డాలర్ల నుంచి 110 డాలర్లకుపైగా పెరిగింది. ఈ నేపథ్యంలో మే 15 లోపు చమురు కంపెనీలు ధరల పెంపునకు మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.ప్రపంచం అతలాకుతలం.. భారత్ పరిస్థితి ఏంటి?ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. ప్రపంచ చమురు సరఫరాలో 20% వాటా కలిగిన హార్మూజ్ జలసంధిలో వారాల తరబడి నెలకొన్న అంతరాయం గ్లోబల్ ఎనర్జీ షాక్కు దారితీసింది. పొరుగు దేశాలైన బంగ్లాదేశ్ ఇంధన రేషనింగ్ను ప్రవేశపెట్టగా, శ్రీలంక, పాకిస్థాన్ పనిదినాలను తగ్గించి ఇంధనాన్ని ఆదా చేసే ప్రయత్నం చేస్తున్నాయి. దక్షిణ కొరియా దశాబ్దాల తర్వాత ధరలపై పరిమితులు విధించింది. అయితే, భారత్ మాత్రం ఇప్పటివరకు ఎక్కడా కొరత లేకుండా పరిస్థితిని అదుపు చేయగలిగింది.చమురు కంపెనీల నష్టాలుప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ధరలు పెరగకపోవడంతో ఇవి నెలకు సుమారు రూ.30,000 కోట్ల మేర నష్టాన్ని భరిస్తున్నాయి. ముడి చమురు ధరలు గరిష్ట స్థాయికి చేరినప్పుడు ప్రభుత్వం, ఈ సంస్థలు కలిసి పెట్రోల్పై రూ.24, డీజిల్పై రూ.30 భారాన్ని వినియోగదారులపై పడకుండా తామే భరించాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటికీ అంతర్జాతీయ ఒత్తిడి దృష్ట్యా ధరల పెంపు అనివార్యంగా కనిపిస్తోంది. సంక్షోభాన్ని తట్టుకొని..ఇలాంటి పరిస్థితుల్లోనూ భారత్ ఇంధన భద్రతను కాపాడుకోగలగడానికి కారణం ప్రభుత్వ వ్యూహాత్మక చర్యలే.దేశీయగా ఎల్పీజీ ఉత్పత్తిని రోజుకు 36,000 టన్నుల నుంచి 54,000 టన్నులకు యుద్ధ ప్రాతిపదికన పెంచారు.రష్యా, యూఎస్, పశ్చిమ ఆఫ్రికా వంటి దేశాల నుంచి దిగుమతులు పెంచి సరఫరాను స్థిరీకరించారు. ముడి చమురు సోర్సింగ్(మన దేశానికి ఎగుమతులు చేసేవి) దేశాల సంఖ్య 27 నుంచి 40కి పెరిగింది.గత దశాబ్ద కాలంలో ఎల్పీజీ టెర్మినల్స్ రెట్టింపు అవ్వడం, ఇథనాల్ మిశ్రమం 1.5% నుంచి 20%కి పెరగడం భారత్కు రక్షణ కవచంగా నిలిచింది.దేశీయ రిఫైనరీలు ప్రస్తుతం 100% మించిన సామర్థ్యంతో పనిచేస్తూ నిరంతరాయంగా ఇంధనాన్ని అందిస్తున్నాయి.అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగిన ప్రతిసారీ సామాన్యుడిపై భారం పడకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. అయితే చమురు కంపెనీల ఆర్థిక స్థిరత్వం దెబ్బతినకుండా ఉండాలంటే రాబోయే వారం రోజుల్లో ధరల సర్దుబాటు తప్పకపోవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. పశ్చిమాసియాలో శాంతి నెలకొంటే తప్ప చమురు సెగ తగ్గేలా లేదు.ఇదీ చదవండి: భయం వద్దు.. నైపుణ్యమే హద్దు -
భారత్లో ఎడోబ్ విస్తరణ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టెక్ దిగ్గజం ఎడోబ్ భారత్లో తన కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా నోయిడాలో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. కంపెనీకి ఇది దేశీయంగా ఏడో ఆఫీసు. ఇందులో 700 మంది పైగా ఉద్యోగులు ఉంటారు. 1997లో ఇంజినీరింగ్ ఆర్అండ్డీ సెంటరుగా భారత్లో కార్యకలాపాలను ప్రారంభించినప్పటి నుంచి ఎడోబ్ కార్యకలాపాలు గణనీయంగా విస్తరించింది. ప్రస్తుతం అమెరికా వెలుపల చూస్తే ఇక్కడే అత్యధికంగా 8,000 మందికి పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. దేశీ మార్కెట్లో కంపెనీ ఇటీవలి కాలంలో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. అక్రెడిషన్ ఉన్న సంస్థల విద్యార్థులకు ఫైర్ఫ్లై, ఫొటోషాప్, యాక్రోబ్యాట్లాంటి ఏఐ ఆధారిత టూల్స్ని ఉచితంగా అందించేలా 2026 ఫిబ్రవరిలో కంపెనీ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. అలాగే టెలికం దిగ్గజం ఎయిర్టెల్కి చెందిన 36 కోట్ల మంది యూజర్లకు ఎడోబ్ ఎక్స్ప్రెస్ ప్రీమియంను ఉచితంగా అందించేలా ఒప్పందం కుదుర్చుకుంది. -
ఎస్బీఐ లాభం 6% అప్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ అగ్రగామి స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆసక్తికరమైన ఫలితాలను ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (2025–26, క్యూ4)లో స్టాండెలోన్ (బ్యాంకు కార్యకలాపాలు మాత్రమే) ప్రాతిపదికన రూ.19,684 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.18,643 కోట్లతో పోలిస్తే 6 శాతం వృద్ధి నమోదైంది. మొండి బకాయిలు కాస్త శాంతించినప్పటికీ... నికర వడ్డీ మార్జిన్, ట్రెజరీ ఆదాయం తగ్గడంతో లాభాల జోరుకు బ్రేక్ పడింది. కాగా, క్యూ4 మొత్తం ఆదాయం 2.5 శాతం దిగజారి రూ. 1,43,876 కోట్ల నుంచి రూ.1,40,412 కోట్లకు చేరడం గమనార్హం. బ్యాంకు నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) 4.13 శాతం మాత్రమే పెరిగి రూ.44,380 కోట్లకు పరిమితమైంది. ఇక నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) 3.14 శాతం నుంచి 2.93 శాతానికి తగ్గింది. ఎన్పీఏలు తగ్గాయ్... ఎస్బీఐ మొండిబకాయిలు (ఎన్పీఏ) తగ్గుముఖం పట్టాయి. క్యూ4లో స్థూల ఎన్పీఏలు 1.49 శాతానికి చేరాయి. అంతక్రితం ఏడాది క్యూ4లో ఇవి 1.82 శాతంగా ఉన్నాయి. నికర ఎన్పీఏలు సైతం 0.47 శాతం నుంచి 0.39 శాతానికి తగ్గాయి. మొండిబకాయిలకు కేటాయింపు (ప్రొవిజనింగ్) రూ.3,964 కోట్ల నుంచి రూ.3,140 కోట్లకు దిగొచ్చింది. అయితే, క్యూ4లో కొత్తగా రూ.5,521 కోట్ల రుణాలు ఎన్పీఏలుగా మారాయి. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఇవి రూ.4,222 కోట్లు. కన్సాలిడేటెడ్గా చూస్తే... అనుబంధ సంస్థలన్నింటితో కలిపి కన్సాలిడేటెడ్గా ఎస్బీఐ 2025–26, క్యూ4 నికర లాభం స్వల్పంగా పెరిగి రూ.19,649 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్లో నికర లాభం రూ.19,600 కోట్లుగా ఉంది. 2025–26 డిసెంబర్ క్వార్టర్ (క్యూ3)లో నమోదైన రూ.21,317 కోట్లతో పోలిస్తే నికర లాభం తగ్గడం గమనార్హం. ఇక మొత్తం ఆదాయం కూడా స్వల్ప పెరుగుదల (0.85%)తో రూ.1,79,562 కోట్ల నుంచి రూ.1,81,079 కోట్లకు చేరింది. పూర్తి ఏడాదికి ఇలా... 2025–26 పూర్తి ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ స్టాండెలోన్ నికర లాభం 13 శాతం జంప్ చేసింది. రూ.80,032 కోట్లకు ఎగబాకింది. 2024–25లో నికర లాభం రూ.70,901 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం రూ.5,24,172 కోట్ల నుంచి రూ.5,51,647 కోట్లకు చేరింది. బ్యాంకు రుణాలు 16.87 శాతం వృద్ధి చెందగా... డిపాజిట్లు 11.03 శాతం పుంజుకున్నాయి. డివిడెండ్ రికార్డ్ తేదీ మే 16... గత ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 1 ముఖ విలువ గల ఒక్కో షేరుకు బ్యాంకు డైరెక్టర్ల బోర్డు రూ.17.35 చొప్పున డివిడెండ్ను ప్రకటించింది. దీనికి మే 16ను రికార్డు తేదీగా నిర్ణయించింది. కాగా, డివిడెండ్ చెల్లింపు జూన్ 4న జరగనున్నట్లు బ్యాంకు తెలిపింది.షేరు 7 శాతం క్రాష్... ఫలితాల నేపథ్యంలో ఎస్బీఐ షేరు బీఎస్ఈలో దాదాపు 6.6% క్షీణించి రూ.1,020 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 7.4 శాతం మేర పడింది. దీంతో శుక్రవారం ఒక్కరోజే బ్యాంకు మార్కెట్ విలువ రూ.66,691 కోట్లు ఆవిరై... రూ.9,41,108 కోట్లకు దిగొచ్చింది. కొత్తగా 6,000 కొలువులు.. ఎస్బీఐ కొత్తగా 6,000 మంది సిబ్బందిని నియమించుకోనుందని బ్యాంక్ చైర్మన్ సీఎస్ శెట్టి వెల్లడించారు. ప్రస్తుతం 2.45 లక్షల మంది ఉద్యోగులు ఉన్నట్లు తెలిపారు. టెక్నాలజీ నిపుణుల్లో ప్రధానంగా సైబర్ సెక్యూరిటీ లో హైరింగ్ ఎక్కువగా ఉంటుందన్నారు. ఆంత్రోపిక్ మైథోస్ ఏఐ సవాళ్లను ఎదుర్కోవడానికి బ్యాంకులన్నీ ఆర్బీఐతో కలిసి పనిచేస్తున్నాయని ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ (ఐబీఏ) సారథిగా కూడా ఉన్న శెట్టి పేర్కొన్నారు. సైబర్ సెక్యూరిటీపై ఎస్బీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేస్తుందని చెప్పారు.సవాళ్లున్నా 13–15% రుణ వృద్ధి... పశ్చిమాసియా యుద్ధం వంటి ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రస్తుత 2026–27 ఆర్థిక సంవత్సరంలో 13–15 శాతం రుణ వృద్ధి లక్ష్యాన్ని కొనసాగిస్తున్నాం. యుద్ధం వల్ల తలెత్తిన సవాళ్లు మరో ఆరు నెలల పాటు కొనసాగితే దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. మా మొండిబకాయిలు అదుపులోనే ఉన్నాయి. ఈ ఏడాది 3 శాతం ఎన్ఐఎం సాధించాలనేది టార్గెట్. కాగా, 2026–27లో ఆర్బీఐ రెపో రేటులో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. – సీఎస్ శెట్టి, ఎస్బీఐ చైర్మన్ -
వియత్నాం విమానయాన సంస్థ కీలక ఒప్పందాలు
హైదరాబాద్: భారత్, వియత్నాం దేశాల మధ్య విమానయాన మౌలిక సదుపాయాలు, సాంకేతికత, అనుసంధానాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో వియత్నాంకు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ వియెట్జెట్ (Vietjet), భారతీయ దిగ్గజ సంస్థలైన జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్ (GMR), బర్డ్ గ్రూప్లతో వ్యూహాత్మక ఒప్పందాలను కుదుర్చుకుంది. వియత్నాం అధ్యక్షుడు తో లామ్ భారత పర్యటనలో భాగంగా నిర్వహించిన 'ఇండియా – వియత్నాం బిజినెస్ ఫోరమ్'లో ఈ ఒప్పందాలు జరిగాయి.ఈ సహకారం ద్వారా వియెట్జెట్, జీఎంఆర్ సంస్థలు విమానాశ్రయాల అభివృద్ధి, లాజిస్టిక్స్, స్మార్ట్ ఎయిర్పోర్ట్ టెక్నాలజీ రంగాల్లో కలిసి పనిచేయనున్నాయి. అలాగే, బర్డ్ గ్రూప్తో కుదుర్చుకున్న ఒప్పందం గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలు, శిక్షణ, విమానయాన సాంకేతికతను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తుంది. ఈ భాగస్వామ్యాలు రెండు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య, పర్యాటక సంబంధాలను మరింత పటిష్టం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని వియెట్జెట్ ఫస్ట్ వైస్ ఛైర్మన్ దిన్ వియెట్ పువాంగ్ పేర్కొన్నారు.ప్రస్తుతం వియెట్జెట్ సంస్థ ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రధాన నగరాల నుండి వియత్నాంకు వారానికి సుమారు 80 విమానాలను నడుపుతోంది. ఇప్పటివరకు 2.5 మిలియన్ల మంది ప్రయాణికులను చేరవేసిన ఈ సంస్థ, తన నెట్వర్క్ను మరింత విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచ స్థాయి భద్రతా ప్రమాణాలు కలిగిన వియెట్జెట్, ఈ కొత్త ఒప్పందాల ద్వారా ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో తన ప్రాధాన్యతను మరింత పెంచుకోనుంది. -
ఆ అబద్ధమే ఇంకా చెబుతున్నారు.. కియోసాకి ఆందోళన
ఇన్వెస్టర్ గురూ, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) తాజాగా చేసిన ఫేస్బుక్ పోస్టులో ఉద్యోగ భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. “స్కూల్కి వెళ్లి, ఉద్యోగం సంపాదిస్తే భద్రత ఉంటుంది” అనే అత్యంత ఖరీదైన అబద్ధాన్ని ఇప్పటికీ 2026లోనూ తల్లిదండ్రులు తమ పిల్లలకు చెబుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.కియోసాకి పేర్కొన్న వివరాల ప్రకారం, 2025 సంవత్సరం ఉద్యోగుల పాలిట అత్యంత కఠినమైన కాలంగా మారింది. ఆ ఒక్క సంవత్సరంలోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు 12 లక్షల ఉద్యోగాల కోతలు నమోదయ్యాయని, ఇది 2020 తర్వాత అత్యధికమని ఆయన తెలిపారు. అలాగే 2026 జనవరిలోనే 1,08,435 ఉద్యోగాలు ఊడిపోయాయనిఇ చెప్పారు.టెక్నాలజీ రంగంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందని కియోసాకి పేర్కొన్నారు. 2026లో ప్రతిరోజూ సగటున 1,003 మంది టెక్ ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోతున్నారన్నారు. అమెజాన్ జనవరిలో 16 వేల ఉద్యోగాలను తొలగించగా, మెటా మే నెలలో మరో 8 వేల ఉద్యోగాల కోతకు సిద్ధమవుతోందని చెప్పారు. చెవ్రాన్ 8 వేల మందిని, డెల్ 11 వేల మందిని, సిటీగ్రూప్ 20 వేల మందిని తొలగించిందని, స్పిరిట్ ఎయిర్లైన్స్ మూతపడటంతో 17 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారని ఆయన వివరించారు.ఈ పరిస్థితులకు కృత్రిమ మేధస్సు (AI) ప్రధాన కారణంగా మారుతోందని కియోసాకి అభిప్రాయపడ్డారు. ఒక్క 2025లోనే ఏఐ కారణంగా అమెరికాలో 55 వేల ఉద్యోగాలు పోయాయని, 2026 ఏప్రిల్లో జరిగిన ఉద్యోగ కోతల్లో 26 శాతం ఏఐ కారణంగానే జరిగాయని ఆయన పేర్కొన్నారు.“ఇవేవీ విఫలమైన కంపెనీలు కావు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సంస్థలు. అయినా అత్యంత చదువుకున్న, నైపుణ్యం కలిగిన ఉద్యోగులే తొలగింపులకు గురవుతున్నారు” అని కియోసాకి వ్యాఖ్యానించారు. ఉద్యోగ భద్రత అనేది అసలు ఎప్పుడూ నిజం కాదని, ఉద్యోగంపై మాత్రమే ఆధారపడటం ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు.తన తండ్రి ఉదాహరణను ప్రస్తావిస్తూ, “నా తండ్రి పీహెచ్డీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగి. ఒక్కరోజు కూడా పని మానలేదు. అయినా చివరికి అప్పులతోనే మరణించారు” అని ఆయన అన్నారు. విద్యాసంస్థలు మంచి ఉద్యోగులుగా తయారు చేస్తాయని, కానీ డబ్బు ఎలా పనిచేస్తుందో మాత్రం నేర్పవని విమర్శించారు. డబ్బు వ్యవస్థపై మాట్లాడుతూ, “సేవింగ్స్లో డబ్బు ఉంచడం వల్ల ద్రవ్యోల్బణం నెమ్మదిగా దాన్ని తినేస్తుంది. ఉద్యోగుల ఆదాయం ఆగిపోయినప్పుడు వారికి ఆదాయం ఇచ్చే ఆస్తులు లేకపోవడమే అసలు సమస్య” అని ఆయన తెలిపారు.తన చిన్నప్పుడే “రేపు ఉద్యోగం పోతే నీ ఆస్తుల ద్వారా ఎంతకాలం జీవించగలవు?” అని తన ‘రిచ్ డ్యాడ్’ అడిగిన ప్రశ్నను గుర్తుచేసుకున్న కియోసాకి, ఉద్యోగ భద్రత గురించి ఆలోచించే వారికంటే, “నేను ఏ ఆస్తిని నిర్మిస్తున్నాను?” అని ఆలోచించే వారే భవిష్యత్తులో నిలబడతారని పేర్కొన్నారు.“ప్రపంచం మారిపోయింది. కానీ పాత సలహాలు మాత్రం మారలేదు. ఏఐ విప్లవం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది” అని కియోసాకి తన పోస్టులో హెచ్చరించారు. -
మళ్లీ ఎంఎంటీసీ.. రూ.10కే డిజిటల్ గోల్డ్, సిల్వర్!
డిజిటల్ రూపంలో బంగారం, వెండిని నేరుగా కొనుగోలు చేసుకునేందుకు వీలుగా ఎంఎంటీసీ–పీఏఎంపీ ప్లాట్ఫామ్ తిరిగి ప్రారంభమైంది. ఎంఎంటీసీపీఏఎంపీ వెబ్సైట్, ఆండ్రాయిడ్ యాప్ నుంచి, అలాగే గూగుల్ పే, పేటీఎం, ఫోన్పే యాప్స్ నుంచి కూడా కొనుగోలు చేసుకోవచ్చని సంస్థ ప్రకటించింది.ఈ సంస్థ డిజిటల్ గోల్డ్ ప్లాట్ఫామ్ను మొదటిసారి 2017లో, డిజిటల్ వెండి కొనుగోళ్లకు 2023లో అవకాశం కల్పించింది. మరింత మెరుగైన అనుభవానికి వీలుగా వెబ్సైట్ను నవీకరించేందుకు 2024 చివర్లో ఈ సేవలను నిలిపివేసింది. ఈ కాలంలో థర్డ్ పార్టీ (ఫోన్పే తదితర) యాప్స్ ద్వారా కొనుగోళ్లకు అవకాశం కల్పించింది. నవీకరించిన వెబ్సైట్ను తాజాగా ప్రారంభించినట్టు సంస్థ ప్రకటించింది.కనీసం రూ.10 నుంచి డిజిటల్ గోల్డ్, సిల్వర్ కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది. ప్రతీ కొనుగోలు విలువకు సరిపడా భౌతిక బంగారం, వెండిని బీమా రక్షణతో కూడిన ఖజానాల్లో ఎంఎంటీసీ–పీఏఎంపీ భద్రపరుస్తుంది. బంగారం, వెండిపై పెట్టుబడులకు ఇటీవలి కాలంలో ఎక్కువ మంది ఇన్వెస్టర్లు మొగ్గు చూపిస్తున్న నేపథ్యంలో ఎంఎంటీసీ తిరిగి ఈ ప్లాట్ఫామ్ను తీసుకురావడం గమనార్హం. -
హైదరాబాద్లో ఏరోస్పేస్ & డిఫెన్స్ ఎంఎస్ఎంఈ సదస్సు
తెలంగాణను 2030 నాటికి దేశీ విమానయాన, రక్షణ రంగాల రాజధానిగా మార్చడమే లక్ష్యంగా హైదరాబాద్లో 'ఎంఎస్ఎంఈ స్పార్క్ 3.0' (MSME Spark 3.0) సదస్సును ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్లోని తాజ్ డెక్కన్ వేదికగా ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FTCCI), తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమల శాఖ సంయుక్తంగా ఈ సదస్సును ఏర్పాటు చేశాయి.ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తన పూర్వపు ఫైటర్ పైలట్ అనుభవాలను గుర్తు చేసుకున్నారు. 2030 నాటికి తెలంగాణను విమానయాన, రక్షణ రంగాల్లో తిరుగులేని అగ్రగామిగా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో ఉన్న డీఆర్డీఓ (DRDO) ల్యాబ్లు, అత్యాధునిక తయారీ కేంద్రాలు, సుమారు 1,500 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఈ రంగానికి వెన్నెముకగా ఉన్నాయన్నారు.జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడు, డీఆర్డీఓ మాజీ ఛైర్మన్ డా. జి. సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఆధునిక యుద్ధ తంత్రాలలో డ్రోన్ టెక్నాలజీ ప్రాధాన్యత పెరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.3.5 లక్షల కోట్ల విలువైన రక్షణ కొనుగోళ్లకు ఆమోదం తెలిపిందని, 220 తేజస్ విమానాలకు ఆర్డర్లు లభించాయని వివరించారు. 2028 నాటికి రక్షణ రంగ ఎగుమతులు రూ.50,000 కోట్లకు చేరుకుంటాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.డీఆర్డీఓ డైరెక్టర్ జనరల్ డా. చంద్రికా కౌశిక్ మాట్లాడుతూ, రక్షణ రంగంలో ఆత్మనిర్భరత సాధించడంలో ఎంఎస్ఎంఈల పాత్ర కీలకమన్నారు. 'టెక్నాలజీ ట్రాన్స్ఫర్ పాలసీ 2025' ద్వారా డీఆర్డీఓ పేటెంట్లను రాయల్టీ లేకుండా ఎంఎస్ఎంఈలకు అందిస్తున్నట్లు తెలిపారు. 'ఆపరేషన్ సిందూర్' ద్వారా దేశీయ రక్షణ సామర్థ్యం నిరూపితమైందని, ఆకాశ్ క్షిపణి వంటి ప్రాజెక్టులలో ఎంఎస్ఎంఈలు గొప్పగా కృషి చేస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. -
కాబోయే సీఎం విజయ్ దూసుకెళ్తున్న ఎలక్ట్రిక్ కారు..
తమిళ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన 'దళపతి' విజయ్ (TVK chief Vijay), తన రాజకీయ ప్రస్థానాన్ని ఎంత వేగంగా కొనసాగిస్తున్నారో, ఆయన ప్రయాణించే వాహనం కూడా అంతే వేగవంతమైనది, విలాసవంతమైనది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకే (TVK) అతిపెద్ద పార్టీగా అవతరించి రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఈ క్రమంలో జీవనశైలి, ఆస్తుల గురించి ప్రజల్లో ఆసక్తి పెరిగింది.టీవీకే అధినేత విజయ్, ఇటీవల తన రాజకీయ కార్యక్రమాలకు జర్మన్ లగ్జరీ బ్రాండ్ బీఎండబ్ల్యూకి చెందిన ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ సెడాన్ బీఎండబ్ల్యూ ఐ7 (BMW i7)ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. పర్యావరణ హితంతో పాటు రాజసం ఉట్టిపడేలా ఉండే ఈ కారు ధర భారత మార్కెట్లో సుమారు రూ. 2.05 కోట్లు (ఎక్స్-షోరూమ్).రూ. 624 కోట్ల సామ్రాజ్యంఎన్నికల సంఘానికి సమర్పించిన వివరాల ప్రకారం, విజయ్ ఆస్తుల విలువ తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఆయన మొత్తం నికర ఆస్తులు రూ. 624 కోట్లు. ఇందులో చరాస్తులు రూ. 404 కోట్లు, స్థిరాస్తులు రూ. 220 కోట్లు. విజయ్ గ్యారేజీలో ఈ బీఎండబ్ల్యూ ఐ7 తో పాటు లగ్జరీ ఎస్యూవీ లెక్సస్ 350, హై-ఎండ్ ఎంపీవీ టయోటా వెల్ఫైర్ వంటి ఖరీదైన వాహనాలు కూడా ఉన్నాయి.చక్రాల మీద నడిచే విలాసంఈ కారు కేవలం ప్రయాణానికే కాదు, ఒక కదిలే లగ్జరీ ఆఫీసులాంటి సౌకర్యాలను అందిస్తుంది. ఇందులో ఉన్న ముఖ్యమైన ఫీచర్లు ఇవే..థియేటర్ ఎక్స్పీరియన్స్: వెనుక సీట్లో కూర్చునే వారి కోసం 31.3-అంగుళాల భారీ 8K రిజల్యూషన్ గల 'బీఎండబ్ల్యూ థియేటర్ స్క్రీన్' ఉంటుంది.లాంజ్ సెట్టింగ్: ఎగ్జిక్యూటివ్ లాంజ్ సీటింగ్ ప్యాకేజీతో మసాజ్ ఫంక్షన్, వెంటిలేషన్ సౌకర్యం ఉంది. సుదీర్ఘ రాజకీయ పర్యటనల్లో అలసట తెలియకుండా ఇది సహాయపడుతుంది.డిజిటల్ టెక్నాలజీ: స్మార్ట్ఫోన్ ద్వారానే పార్కింగ్ చేసే ఫీచర్, డిజిటల్ కీ ప్లస్, అత్యుత్తమ కనెక్టెడ్ టెక్నాలజీ ఇందులో ఉన్నాయి.పనితీరులో 'సూపర్ ఫాస్ట్'విజయ్ వాడుతున్న ఈ ఎలక్ట్రిక్ సెడాన్ వేగంలోనూ రారాజే. రేంజ్: ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 603 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.పవర్: ఇది 449 బీహెచ్పీ శక్తిని, 650 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.పికప్: కేవలం 4.7 సెకన్లలోనే సున్నా నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.ఛార్జింగ్: హై-పవర్ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా కేవలం 34 నిమిషాల్లోనే 10% నుండి 80% వరకు బ్యాటరీ నిండుతుంది. -
రియల్ఎస్టేట్లోకి వెల్లువెత్తిన పెట్టుబడులు
దేశీ రియల్ ఎస్టేట్ రంగంలోకి గత రెండేళ్లుగా భారీ స్థాయిలో పెట్టుబడులు వెల్లువెత్తాయి. 2024 నుండి 2026 తొలి త్రైమాసికం వరకు 30.7 బిలియన్ డాలర్లు వచ్చాయి. డిమాండ్ పటిష్టంగా ఉన్న నేపథ్యంలో మరి కొన్నేళ్ల పాటు ఇదే తీరు కొనసాగొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. రియల్టీ సేవల సంస్థ సీబీఆర్ఈ, పరిశ్రమల సమాఖ్య సీఐఐ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.దీని ప్రకారం రాబోయే రోజుల్లో భారత రీట్ (రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్) మార్కెట్ మరింత విస్తరించనుంది. పెద్ద ఎత్తున రీట్స్ లిస్టింగ్కి రానుండటంతో డెవలపర్స్కి నిధుల లభ్యత పెరగనుంది. పరిశ్రమ రుణ రూపంలో సమకూర్చుకున్న నిధుల పరిమాణం 2024–2026 తొలి త్రైమాసికం మధ్య కాలంలో 146 బిలియన్ డాలర్ల స్థాయిని దాటింది. ట్రస్టీ షిప్స్, బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, ఇతరత్రా సంస్థలు ఈ నిధులను సమకూర్చాయి.రిపోర్ట్లో మరిన్ని విశేషాలు..మొత్తం రుణాల్లో మూడు ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరు వాటా 60 శాతం పైగా ఉంది. ప్రథమ శ్రేణిలోకి రాని నిర్దిష్ట నగరాల వాటా 8 శాతంగా ఉంది. మెట్రోల పరిధి దాటి ఇతర ప్రాంతాలపైనా ఇన్వెస్టర్ల ఆసక్తి పెరుగుతోందనడానికి ఇది నిదర్శనం. కమర్షియల్ రియల్ ఎస్టేట్కి బ్యాంకు రుణాలు 2025 మార్చి నుంచి 2026 ఫిబ్రవరి మధ్యకాలంలో వార్షిక ప్రాతిపదికన 16 శాతం పెరిగాయి. ఎన్బీఎఫ్సీలు ఇచ్చిన రుణాలు 2025 సెప్టెంబర్ నాటికి అయిదేళ్ల గరిష్ట స్థాయి అయిన రూ. 1 లక్ష కోట్ల మార్కును దాటాయి. రియల్ ఎస్టేట్ వ్యవస్తకు రీట్స్ కీలకంగా మారుతున్నాయి. దేశీయంగా పెట్టుబడులు స్థిరంగా వస్తుండటం, భౌగోళికరాజకీయ అనిశి్చతుల నడుమ గ్లోబల్ ఇన్వెస్టర్లు కూడా కొంత మేర ఇన్వెస్ట్ చేస్తుండటంలాంటి అంశాలు పెట్టుబడుల రాకకు దోహదపడనున్నాయి. ఆఫీస్, లాజిస్టిక్స్, డేటా సెంటర్స్ మొదలైన వాటిల్లో దీర్ఘకాలికంగా పెట్టుబడుల వృద్ధికి అవకాశాలు ఉన్నాయి. ధరల పెరుగుదల, అంతర్జాతీయంగా అనిశి్చతిలాంటి సవాళ్లు ఉన్నప్పటికీ పరిశ్రమ నిర్మాణాత్మకంగా పరివర్తన చెందుతుండటం, పారదర్శకత మెరుగుపడుతుండటం, వివిధ వనరుల ద్వారా నిధులు లభిస్తుండటంలాంటి అంశాల వల్ల పెట్టుబడులకు రియల్టీ రంగం ఆకర్షణీయమైన గమ్యస్థానంగా కొనసాగనుంది. -
కుప్పకూలిన SBI షేరు.. రూ. 68 వేల కోట్లు లాస్!
స్టాక్ మార్కెట్లో దేశీయ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా (SBI) షేర్లు శుక్రవారం తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. త్రైమాసిక ఫలితాలు మార్కెట్ అంచనాలను అందుకోలేకపోవడంతో పెట్టుబడిదారులు భారీగా అమ్మకాలకి దిగారు. దీంతో ఎస్బీఐ మార్కెట్ క్యాపిటలైజేషన్లో సుమారు రూ.67,932 కోట్ల మేర కోత పడింది.ఇంట్రాడే ట్రేడింగ్లో ఎస్బీఐ షేరు 7.4 శాతం వరకు క్షీణించి రూ.1,011.30 వద్దకు పడిపోయింది. అనంతరం కొంత కోలుకున్నప్పటికీ, బీఎస్ఈలో 6.6 శాతం నష్టంతో రూ.1,019.60 వద్ద ముగిసింది. చివరికి షేరు రూ.1,018.40 వద్ద స్థిరపడింది.ఈ పతనంతో ఎస్బీఐ మార్కెట్ విలువ రూ.9.40 లక్షల కోట్లకు తగ్గిపోయింది. 2024 జూన్ 4 తర్వాత ఎస్బీఐ షేరుకు ఇది అతిపెద్ద సింగిల్డే క్షీణతగా నమోదైంది.లాభాలు పెరిగినా.. అంచనాలను అందుకోని ఫలితాలుమార్చి 31తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో ఎస్బీఐ రూ.19,684 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 5.6 శాతం వృద్ధి. అయితే మార్కెట్ విశ్లేషకులు రూ.20,030 కోట్ల లాభాన్ని అంచనా వేసిన నేపథ్యంలో ఫలితాలు నిరాశ పరిచాయి.బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం కూడా 3.8 శాతం పెరిగి రూ.44,386 కోట్లకు చేరింది. కానీ విశ్లేషకుల అంచనా అయిన రూ.46,940 కోట్లను అందుకోలేకపోయింది.ఇక బ్యాంకుల లాభదాయకతకు కీలకమైన నికర వడ్డీ మార్జిన్ మార్చి త్రైమాసికంలో 2.93 శాతంగా నమోదైంది. మార్జిన్లలో బలహీనత కనిపించడం కూడా పెట్టుబడిదారుల సెంటిమెంట్పై ప్రతికూల ప్రభావం చూపింది.52 వారాల గరిష్టం నుంచి 17% క్షీణతప్రస్తుతం ఎస్బీఐ షేరు 2026 ఫిబ్రవరి 24న నమోదైన 52 వారాల గరిష్ట స్థాయి రూ.1,234.70తో పోలిస్తే 17.52 శాతం దిగువన ట్రేడ్ అవుతోంది. అయితే 2025 మే 9న నమోదైన 52 వారాల కనిష్ట స్థాయి రూ.755.50తో పోలిస్తే ఇంకా 34.80 శాతం ఎగువన ఉంది.వారం వ్యవధిలో ఎస్బీఐ షేరు 4.68 శాతం క్షీణించగా, అదే సమయంలో నిఫ్టీ-50 సూచీ 0.74 శాతం లాభపడింది. నెలరోజుల వ్యవధిలో కూడా షేరు 4.06 శాతం పడిపోగా, నిఫ్టీ 0.75 శాతం పెరిగింది.అయితే దీర్ఘకాలికంగా చూస్తే ఎస్బీఐ షేరు మంచి రాబడులు అందించింది. 2026లో ఇప్పటివరకు 3.42% లాభం ఇచ్చింది. ఏడాది కాలంలో 32.43% పెరుగుదల నమోదు చేసింది. మూడేళ్లలో 74.50%, ఐదేళ్లలో 184.27% ర్యాలీ చేసింది.గ్లోబల్ టెన్షన్.. బలహీనంగా ముగిసిన మార్కెట్లుఅమెరికా-ఇరాన్ మధ్య తాజా ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపగా, భారతీయ ఈక్విటీ మార్కెట్లు కూడా ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. నిఫ్టీ-50 సూచీ 150.50 పాయింట్లు లేదా 0.62 శాతం పడిపోయి 24,176.15 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 516.33 పాయింట్లు లేదా 0.66 శాతం నష్టపోయి 77,328.19 వద్ద స్థిరపడింది.నిఫ్టీ-50లో టైటాన్, అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్, ఏషియన్ పెయింట్స్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్క్యాప్ 0.15 శాతం, నిఫ్టీ స్మాల్క్యాప్ 0.22 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ మిడ్క్యాప్ 100 సూచీ 62,113.85 వద్ద కొత్త ఆల్టైమ్ హైని నమోదు చేసింది.రంగాల వారీగా చూస్తే నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్, బ్యాంక్ సూచీలు భారీ నష్టాలు చవిచూశాయి. మరోవైపు నిఫ్టీ ఐటీ సూచీ మాత్రం మెరుగైన ప్రదర్శన కనబరిచింది. -
క్రికెటర్ సూర్యకుమార్ లగ్జరీ ఇల్లు, కార్లు, విలువ ఎంతో తెలుసా?
క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ (SKY),అతని భార్య, దేవిషా సూర్యకుమార్ యాదవ్ తమకు ఆడబిడ్డ పుట్టిందన్న శుభవార్తను (మే 7, 2026న ) ఫ్యాన్స్తో ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. ఆ పోస్ట్ క్యాప్షన్లో, "కిలకిల నవ్వులు, శుభాకాంక్షలు,నెరవేరబోయే కలలతో - మా ఆడబిడ్డకు స్వాగతం పలుకుతున్నాము" అంటూ తమ క్తిగత జీవితంలో సంతోషాన్ని ప్రకటించారు. పాపాయి లేలేత చేయిని పట్టుకున్న ఫోటోను కూడా షేర్ చేశారు. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ ముంబైలోని తన విలాసవంతమైన ఇంటి విశేషాలువైరల్గా మారాయి.సూర్యకుమార్ పోస్ట్కు స్పందించిన పలువురు సెలబ్రిటీలు,తోటి క్రీడాకారులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా సారా టెండూల్కర్ నుండి రణవీర్ సింగ్ వరకు, సెలబ్రిటీలు అభినందన సందేశాలతో కామెంట్స్ సెక్షన్ను నింపేశారు. ఈజంటకు పెంపుడు జంతువులంటే చాలా ప్రేమ, ఇపుడిక చిన్నారి బోసినవ్వులతో కళ కళలాడనున్న లగ్జరీ అపార్ట్మెంట్ విశేషాలను పరిశీలిద్దాం.విశాలమైన లివింగ్ రూమ్ సూర్య ఇల్లు ఆధునికతకు, మినిమలిజంకు (సరళతకు) అద్దం పడుతుంది. ఇల్లంతా వైట్ థీమతో గోడలుప్రశాంతమైన లుక్లో ఆకర్షణీయంగా అలరిస్తోంది. లివింగ్రూమ్ (Living Room)లో బ్లూ టోన్ సోఫా సెట్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. అక్కడక్కడ పసుపు రంగు టచ్తో ఇంటికి ఒక కొత్త కళ వచ్చిందనడంలో సందేహం లేదు. వీటికి హ్యాండ్ మేడ్ కళాఖండాలు, అందమైన లైటింగ్ ,చక్కటి ఉడ్వర్క్ (Woodwork) ఇంటికి రాయల్ లుక్ని తీసుకొచ్చాయి. బాల్కనీలోనే జిమ్ ముంబై వంటి నగరంలో విశాలమైన బాల్కనీ ఉండటమే ఒక అదృష్టం. సూర్య తన బాల్కనీని చాలా తెలివిగా ఉపయోగించుకుని బాల్కనీ లోనే జిమ్ ఏర్పాటు చేసుకోవడం విశేషం. బాల్కనీలో కృత్రిమ గడ్డి పర్చిన ఈ బాల్కనీలోనే సూర్య వ్యాయామం చేయడానికి అవసరమైన డంబెల్స్, ఇతర పరికరాలు ఉన్నాయి. అంతేకాదు వ్యాయామం చేస్తూనే ముంబై తాజా గాలిని ఆస్వాదించేలా ఈ బాల్కనీ జిమ్ను రూపొందించారు.క్రికెటర్ అంటే ఆ మాత్రం ఉండాలిగాఒక క్రికెటర్ ఇల్లు అంటే ట్రోపీలకు, అవార్డులకు ప్లేస్ లేకపోతే ఎలా? అందుకే సూర్య ఇంట్లో ఒక ప్రత్యేకమైన గోడపై ఆయన గెలుచుకున్న ట్రోఫీలు, క్రికెట్ జ్ఞాపకాలను ఎంతో అందంగా ప్రదర్శించారు. టెక్స్చర్డ్ వాల్స్ నేపథ్యం ఈ అవార్డులకు మరింత మెరుగులు దిద్దింది.దీంతోపాటు, రియల్ ఎస్టేట్లో కూడా జంట భారీ పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం. 2025 మార్చిలో, సూర్య , దేవిషా జంట ముంబైలో రెండు అపార్ట్మెంట్లను కొనుగోలు చేశారు. వీటి విలువ సుమారు రూ. 21.1 కోట్లు అని సమాచారం సూర్య భార్య. మొత్తానికి, సూర్య ఇల్లు ఆధునిక హంగులతో, వెచ్చని వాతావరణంతో ఇప్పుడు తమ చిన్నారి రాకతో మరింత సందడిగా మారనుంది.నెట్వర్త్ కాగా 2025 నాటికి సూర్యకుమార్ యాదవ్ అంచనా వేసిన నికర ఆస్తి విలువ దాదాపు రూ. 55- 65 కోట్లుగా అంచనా. 2026 ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న సూర్యకుమార్ ఆస్తులు మరింత పెరగనున్నాయి. అతని ప్రస్తుత వార్షిక ఫ్రాంచైజీ జీతం సుమారు రూ. 16.35. మొత్తం ఐపీఎల్ సంపాదన దాదాపు రూ.72.60 కోట్లుగా అంచనా.గ్యారేజీలో లగ్జరీ కార్లు, బైక్స్విలాసవంతమైన సెడాన్లతో పాటు ఇతర పవర్ఫుల్ కార్లు కూడా ఉన్నాయిమెర్సిడెస్-బెంజ్, ల్యాండ్ రోవర్ (రేంజ్ రోవర్ వెలార్తో సహా), ఆడి, BMW, పోర్షే,యు నిస్సాన్ వంటి కంపెనీల వాహనాలు. అలాగే సుజుకి, హార్లీ-డేవిడ్సన్ మరియు BMW సూపర్బైక్ విభాగం నుండి వచ్చిన బైక్లు న్నాయి. అతని బ్యాటింగ్ లాగే, ఈ గ్యారేజీ కూడా వైవిధ్యంగా ఉంటుందంటారు నిపుణులు.20.5 మిలియన్ల ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లను సంపాదించుకున్న సూర్య ఒక్కో డీల్కు రూ. 60–70 లక్షల మధ్య ఎండార్స్మెంట్ ఫీజును వసూలు చేస్తున్నట్లు సమాచారం. అతని పోర్ట్ఫోలియోలో రీబాక్, డ్రీమ్11, లెన్స్కార్ట్, జియోసినిమా, రాయల్ స్టాగ్, పింటోలా , బౌల్ట్ ఆడియో ఉన్నాయి. -
కేపీఐటీ కంపెనీ చైర్మన్ రవి పండిట్ కన్నుమూత
ప్రముఖ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ సంస్థ కేపీఐటీ టెక్నాలజీస్ ఫౌండర్, చైర్మన్ ఎస్బీ రవి పండిట్ కన్నుమూశారు. ఈ విషయాన్ని సంస్థ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా అధికారికంగా వెల్లడించింది. ఆటోమోటివ్ ఇంజినీరింగ్ పరిష్కారాల్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కేపీఐటీ టెక్నాలజీస్ను స్థాపించి, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో రవి పండిట్ కీలక పాత్ర పోషించారు.మూడు దశాబ్దాలకుపైగా వ్యాపార, సాంకేతిక రంగాల్లో సేవలందించిన రవి పండిట్ పుణె కేంద్రంగా కేపీఐటీ టెక్నాలజీస్ను ప్రారంభించి, సంస్థ కార్యకలాపాలను 15 దేశాలకు విస్తరించారు. అలాగే 1,200 మందికిపైగా నిపుణులతో పనిచేస్తున్న ప్రముఖ భారతీయ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ కీర్తానే అండ్ పండిట్ చార్టర్డ్ అకౌంటెంట్స్ (KPCA) కు కూడా ఆయన నాయకత్వం వహించారు.సామాజిక, విద్యా రంగాల అభివృద్ధికీ ఆయన విశేషంగా కృషి చేశారు. పుణె ఇంటర్నేషనల్ సెంటర్, జన్వానీ సంస్థలకు సహ వ్యవస్థాపకుడిగా పనిచేసిన ఆయన, గోఖలే ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ (GIPE) లోని సెంటర్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్కు మార్గనిర్దేశం చేశారు. జ్ఞాన ప్రబోధిని సంస్థ అధ్యక్షుడిగా యువ నాయకత్వ వికాసానికి తోడ్పడ్డారు.రవి పండిట్ అమెరికాలోని ఎంఐటీ స్లోన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ పూర్వ విద్యార్థి. బంగారు పతక విజేత చార్టర్డ్ అకౌంటెంట్గా గుర్తింపు పొందిన ఆయన, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ ఫెలోగా కూడా సేవలందించారు. అంతేకాదు.. రచయితగానూ రవి పండిట్ గుర్తింపు పొందారు. పురస్కారం పొందిన ‘లీప్ఫ్రాగింగ్ టు పోల్-వాల్టింగ్’ అనే గ్రంథానికి ఆయన సహ రచయితగా వ్యవహరించారు. -
భయం వద్దు.. నైపుణ్యమే హద్దు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచాన్ని శాసిస్తోంది. కోడింగ్ నుంచి కంటెంట్ క్రియేషన్ వరకు, కస్టమర్ సర్వీస్ నుంచి రిక్రూట్మెంట్ వరకు ప్రతి రంగాన్ని ఏఐ తన గుప్పిట్లోకి తీసుకుంటోంది. ఈ వేగవంతమైన మార్పులను చూసి ఒకవైపు యువత ఆందోళన చెందుతుంటే, మరోవైపు దీనిని అవకాశంగా మలుచుకుని అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారు కొందరు నిపుణులు. పాకిస్థాన్కు చెందిన యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఐజా ఉస్మాన్ కథ దీనికి ఒక నిదర్శనం. ప్రపంచంలోని టాప్ ఏఐ కంపెనీలలో ఒకటిగా పేరొందిన ఆంత్రోపిక్లో ఉద్యోగం సాధించిన ఐజా, తన ప్రయాణాన్ని వివరిస్తూ.. ఏఐ పట్ల భయం కంటే దాన్ని అర్థం చేసుకోవడమే నేటి అవసరమని నొక్కి చెప్పారు.ఎందుకు ఆంత్రోపిక్?ప్రస్తుతం గూగుల్, మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ వంటి దిగ్గజ సంస్థలు శక్తివంతమైన ఏఐ మోడల్స్ కోసం పోటీ పడుతున్న వేళ ఐజా మాత్రం ఆంత్రోపిక్ను ఎంచుకోవడానికి ఒక ప్రత్యేక కారణం ఉందని చెప్పింది. ‘చాలా కంపెనీలు కేవలం వేగం, శక్తివంతమైన వ్యవస్థల వైపు పరుగులు తీస్తుంటే ఆంత్రోపిక్ మాత్రం ఏఐ భద్రత, బాధ్యతాయుతమైన అభివృద్ధిపై దృష్టి పెడుతోంది. మానవాళికి సురక్షితమైన ఏఐని అందించడమే కంపెనీ లక్ష్యం. అదే నన్ను ఆకర్షించింది’ అని ఆమె పేర్కొన్నారు.సాధారణ విద్యార్థినిగా పాకిస్థాన్ నుంచి అమెరికాకు వెళ్లిన ఐజా న్యూయార్క్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్లో తనకున్న పట్టుతో క్రమంగా ఏఐ వైపు మొగ్గు చూపారు. ముఖ్యంగా ప్రస్తుత ఏఐ బూమ్కు కారణమైన జనరేటివ్ ఏఐ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ట్రాన్స్ఫార్మర్ సిస్టమ్స్పై ఆమె ప్రత్యేక పరిశోధన చేశారు. కేవలం చదువుకే పరిమితం కాకుండా ఒక ఫిన్టెక్ స్టార్టప్లో ఏఐ ఏజెంట్లు తయారీపై ఆమె చేసిన ప్రాజెక్ట్ ఆంత్రోపిక్ వంటి అగ్రశ్రేణి సంస్థలో ఉద్యోగం సాధించడానికి కీలకమైందని వెల్లడించారు.యువతకు సూచనలుఏఐ ఇప్పుడు కేవలం టెక్నికల్ టీమ్స్కే పరిమితం కాలేదు. హెల్త్కేర్, ఫైనాన్స్, ఎడ్యుకేషన్ వంటి ప్రతి రంగంలోనూ ఇది భాగమైంది. అందుకే దాని నుంచి తప్పించుకోవడం కంటే దాన్ని నేర్చుకోవడమే ఉత్తమం.కొత్త సాధనాలను ఎంత త్వరగా వాడటం నేర్చుకుంటే భవిష్యత్తు మార్కెట్లో అంతగా రాణించవచ్చు.ఏఐ అనేది మీ పనిని సులభతరం చేసే సాధనమే తప్ప, మీకు శత్రువు కాదు. దాని పనితీరును అర్థం చేసుకుంటే మీ కెరీర్ మరింత భద్రంగా ఉంటుంది.అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మనల్ని మనం ఎలా మలుచుకోవాలో నిత్యం నేర్చుకోవాలి.గ్లోబల్ జాబ్ మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే పాత పద్ధతులకు అంటిపెట్టుకోకుండా కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. -
కేంద్ర ప్రభుత్వ పథకం కింద ఎస్బీఐ రుణాలు
ముంబై: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘అత్యవసర రుణ హామీ పథకం (ECLGS) 5.0’ కింద ఎస్బీఐ కస్టమర్లకు పెద్ద మొత్తంలో రుణ సాయం లభించనుంది. ఈ పథకం కింద తమ కస్టమర్లకు రూ.70,000 నుంచి రూ.80,000 కోట్ల వరకు రుణాలు అందుబాటులో ఉంటాయని ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి ప్రకటించారు.విడుదలైన మార్గదర్శకాలు ప్రకారం.. తమ కస్టమర్లలో ఎవరికి ఈ పథకం కింద రుణ అర్హత ఉందో తెలిసిందన్నారు. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులతో నౌకా రవాణాకు ఆటంకాలు ఏర్పడి, సమస్యలను ఎదుర్కొంటున్న పరిశ్రమలకు మూలధన నిధుల మద్దతుకు గాను కేంద్ర ప్రభుత్వం రూ.2.55 లక్షల కోట్లతో ఈసీఎల్జీఎస్ 5.0 పథకాన్ని మంగళవారం ప్రకటించడం తెలిసిందే.ఈ పథకం కింద ఎయిర్లైన్స్కు రూ.5,000 కోట్లను పక్కన పెట్టగా, మిగిలిన రూ.2.50 లక్షల కోట్లను ఎంఎస్ఎంఈలతోపాటు, సమస్యలను ఎదుర్కొంటున్న ఇతర వ్యాపార సంస్థల రుణాల కోసం కేటాయించారు. పశ్చిమాసియా ఘర్షణల ప్రభావం చాలా రంగాలపై విస్తృతంగా ఉన్నట్టు శెట్టి చెప్పారు. ఈసీఎల్జీఎస్ పథకాన్ని సకాలంలో తీసుకొచ్చిన చురుకైన చర్యగా పేర్కొన్నారు. అయితే, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ రుణం తీసుకుంటారని చెప్పలేమన్నారు.ఈ పథకానికి అమలుకు సంబంధించి నిర్వహణ అంశాలను బ్యాంక్లు వచ్చే 8–10 రోజుల్లో పరిష్కరించుకుంటాయని తెలిపారు. బ్యాంకింగ్ అంతటా మొత్తం మీద 1.1 కోట్ల మంది లబ్దిదారులు ఈ పథకం కింద ప్రయోజనం పొందుతారని చెప్పారు. సాధారణంగా ఎంఎస్ఎంఈలకు వర్తించే దానికంటే తక్కువ వడ్డీ రేటు ఈ పథకం కింద ఉంటుందన్నారు. -
విశ్వవేదికపై భారతీయ కళా వైభవం
ప్రపంచ కళా రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన వెనిస్ బినాలే వేదికపై భారతీయ ప్రాభవం మరోసారి మెరవనుంది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్ఎంఏసీసీ) మధ్య కుదిరిన చారిత్రాత్మక భాగస్వామ్యంతో 61వ అంతర్జాతీయ కళా ప్రదర్శనలో ‘ఇండియా పెవిలియన్’ను ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్నారు. మన దేశ అద్భుతమైన కళా సంపదను, హస్తకళల వైవిధ్యాన్ని ప్రపంచ దేశాల ప్రతినిధుల ముందు ప్రదర్శించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం.సాంస్కృతిక రాయబారిగా..కళలు, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో అగ్రగామిగా ఉన్న రిలయన్స్ ఫౌండేషన్ ఈ అంతర్జాతీయ వేదిక ద్వారా భారతీయ కళాకారులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రతిష్టాత్మక ఒప్పందంపై కళా రంగ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఒక ప్రదర్శన మాత్రమే కాదని, భారతీయ ఆత్మను అంతర్జాతీయ వేదికపై ఆవిష్కరించే ఒక సాంస్కృతిక విప్లవమని అభివర్ణిస్తున్నారు.అభివృద్ధి చెందుతున్న సాంస్కృతిక సంభాషణ: ఇషా అంబానీ61వ అంతర్జాతీయ కళా ప్రదర్శనలో భారత జాతీయ పెవిలియన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఇషా అంబానీ భారతదేశం, ప్రపంచ దేశాల మధ్య మారుతున్న సాంస్కృతిక సంబంధాలపై తన ఆలోచనలను పంచుకున్నారు. ఈ సందర్భంగా తన తల్లి నీతా అంబానీ దార్శనికతను కొనియాడారు. భారతదేశంలోని ఉత్తమమైన వాటిని ప్రపంచానికి పరిచయం చేయడం, ప్రపంచంలోని ఉత్తమ కళలను భారతీయులకు చేరువ చేయడమే ఎన్ఎంఏసీసీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. భారతదేశాన్ని ఒక సొంత ఇల్లు అనే భావనతో పోల్చిన ఆమె వెనిస్, భారతదేశం మధ్య సుదీర్ఘమైన, అర్థవంతమైన సాంస్కృతిక సంభాషణ జరగాలని ఆకాంక్షించారు. ఈ ప్రయత్నం మన పూర్వీకులు గర్వపడేలా ఉండడంతోపాటు మన భవిష్యత్ తరాలకు ఒక గొప్ప వారసత్వంగా నిలవాలని ఆమె పేర్కొన్నారు.Ms. Isha Ambani reflects on India’s evolving cultural dialogue with the world at the opening of the National Pavilion of India at the 61st International Art Exhibition – La Biennale di Venezia. Representing the Nita Mukesh Ambani Cultural Centre, she acknowledged her mother… pic.twitter.com/u7u5Qkd4ha— Reliance Foundation (@ril_foundation) May 7, 2026కళాకారులకు గ్లోబల్ విండోఈ భాగస్వామ్యం వల్ల భారతీయ గ్రామీణ హస్తకళాకారులు మొదలుకొని సమకాలీన కళాకారుల వరకు అందరికీ అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ గుర్తింపు లభించనుంది. -
కాస్త కూల్ అయిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
290 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:29 సమయానికి నిఫ్టీ(Nifty) 90 పాయింట్లు తగ్గి 24,238 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 296 పాయింట్లు నష్టపోయి 77,546 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.2బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 101.1 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.39 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.38 శాతం తగ్గింది.నాస్డాక్ 0.13 శాతం నష్టపోయింది.Today Nifty position 08-05-2026(time: 09:30 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
చదువు మధ్యలో వదిలేశారా? ఆందోళన వద్దు..
దశాబ్దాలుగా మన దేశంలో ఇంజినీరింగ్ అంటే ఒక సురక్షితమైన భవిష్యత్తుకు భరోసా. కానీ, ఏటా లక్షలాది మంది విద్యార్థులు ఈ డిగ్రీ మాయాజాలంలో చిక్కుకుని తీరా కొంతకాలం చదివాక తమ దారి తప్పిందని గ్రహిస్తున్నారు. ఇటీవల 21 ఏళ్ల యువకుడు రెడ్డిట్ వేదికగా పంచుకున్న అంశాలు నేటి తరం విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణకు అద్దం పడుతోంది. మెకానికల్ ఇంజినీరింగ్ థర్డ్ ఇయర్లో డ్రాపౌట్ అయిన ఆ యువకుడి కథ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ అయింది.రెడ్డిట్ పోస్ట్లోని వివరాల ప్రకారం.. 17 ఏళ్ల వయసులో సమాజం, తల్లిదండ్రుల ఒత్తిడితో మెకానికల్ ఇంజినీరింగ్ ఎంచుకున్నాడు. కానీ 21 ఏళ్లకు వచ్చేసరికి ఆ సబ్జెక్టులు అతనికి చాలా కష్టంగా అనిపించాయి. చేసే పనిపై ఇష్టం లేనప్పుడు ఆ ఒత్తిడి శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపడం ప్రారంభించింది. ఒకవైపు కోర్సు పూర్తికాకపోవడం, మరోవైపు బయట గ్రాడ్యుయేట్లు కూడా ఉద్యోగాల కోసం ఇబ్బంది పడుతుండటం అతన్ని భయపెట్టాయి. పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్థిక మందగమనం వల్ల ఏ రంగం సురక్షితమో తెలియని అయోమయం అతడిని చుట్టుముట్టింది. తనకు పెద్ద పెద్ద హోదాల కంటే ఆచరణాత్మకమైన జీవితం కావాలి. కనీసం 40,000 డాలర్ల(సుమారు రూ.33 లక్షలు) వార్షిక ఆదాయం, గౌరవప్రదమైన సామాజిక వృత్తి ఉంటే చాలని అతను కోరుకుంటున్నాడు. కానీ ఇంజినీరింగ్ మానేశాక, ఆ స్థాయికి ఎలా వెళ్లాలో తెలియక పార్ట్-టైమ్ ఉద్యోగంతో కాలం వెళ్లదీస్తున్నాడు. అయితే తన సోషల్ స్కిల్స్, కమ్యూనికేషన్ పట్ల చాలా నమ్మకంగా ఉన్నాడు.భావోద్వేగాల కంటే దిశానిర్దేశం ముఖ్యంచాలామంది ఇంజినీరింగ్ మధ్యలో ఆపేయడాన్ని ఒక వ్యక్తిగత వైఫల్యంగా భావిస్తారు. కానీ వాస్తవానికి, భవిష్కత్తుపై స్పష్టమైన సంకేతం. ఆ యువకుడి విషయంలో కూడా అదే జరిగింది. ల్యాబ్లు, కఠినమైన కోర్సు వర్క్ అతనికి సరిపడలేదు.డ్రాపౌట్ అవ్వడం అంటే కెరీర్ ముగిసిపోవడం కాదు. అది కేవలం ఒక రీసెట్ బటన్ మాత్రమే. విశ్లేషణల కంటే ఆచరణాత్మక మార్పు కీలకం.డిగ్రీ లేదు సరే.. నైపుణ్యాల మాటేమిటి?సదరు యువకుడు తన సోషల్ స్కిల్స్, కమ్యూనికేషన్ పట్ల నమ్మకంగా ఉన్నాడు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇంజినీరింగ్ పూర్తి చేయకపోయినా అతనికి ఉన్న టెక్నికల్ పరిజ్ఞానం ఇతర రంగాల్లో ప్లస్ పాయింట్ అవుతుంది. సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్(సాస్) సాంకేతికతపై అవగాహన ఉండి బాగా మాట్లాడితే ఈ రంగంలో ఏడాదికి 40,000 డాలర్లు (సుమారు రూ.33 లక్షలు) కంటే ఎక్కువే సంపాదించవచ్చు. మెకానికల్ ఇంజినీరింగ్ చదివిన వారికి వైద్య రంగంలోని యంత్రాల గురించి త్వరగా అవగాహన కలుగుతుంది. రియల్ ఎస్టేట్, బిజినెస్ రంగంలో కస్టమర్లతో డీల్ చేయగలిగే నేర్పు ఉంటే ఇక్కడ ఆకాశమే హద్దు.ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణకేవలం వైట్ కాలర్ ఉద్యోగాలకే పరిమితం కాకుండా 'ట్రేడ్ స్కిల్స్' వైపు చూడటం కూడా మంచి మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. లో-వోల్టేజ్ టెక్నీషియన్, ఏవియేషన్ మెకానిక్స్ వంటి రంగాల్లో అప్రెంటిస్షిప్ ద్వారా నేరుగా ఆదాయం పొందవచ్చు. సర్టిఫికేషన్ కోర్సుల్లో భాగంగా అకౌంటింగ్ లేదా డేటా అనలిటిక్స్ వంటి స్వల్పకాలిక కోర్సులు పూర్తి చేసి త్వరగా స్థిరపడవచ్చు.కెరీర్ పునర్నిర్మాణానికి..ఆందోళనను పక్కన పెట్టి గత అనుభవాన్ని విశ్లేషించుకోవడం.మీకు ఉన్న బలాలు (ఉదా: సేల్స్, డ్రాయింగ్, కోడింగ్) గుర్తించడం.ఎంచుకున్న రంగంలో ఎంట్రీ లెవల్ ఉద్యోగంలో చేరడం.కృత్రిమ మేధ వంటి మార్పులను గమనిస్తూ నిరంతరం నేర్చుకోవడం.డిగ్రీ ఒక అధ్యాయం మాత్రమే..ఇంజినీరింగ్ మధ్యలో వదిలేశాను అన్న మాట వినడానికి కాస్త కఠినంగా ఉండవచ్చు. కానీ, ప్రపంచ ప్రఖ్యాత విజేతలు చాలామంది తమ కెరీర్ ప్రారంభంలో ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నవారే. డ్రాపౌట్ అవ్వడం వల్ల అవకాశాలు తగ్గిపోవు. కానీ, కొత్త నైపుణ్యాలు నేర్చుకోకపోవడం వల్ల మాత్రమే ఎదుగుదల ఆగిపోతుంది. ఆర్థిక స్థిరత్వం అనేది కేవలం డిగ్రీతోనే రాదు. మనం చేసే పనిలో చూపే ప్రతిభతో వస్తుందని గుర్తుంచుకోవాలి.ఇదీ చదవండి: రూ.28 లక్షల జాబ్ వదులుకున్న మేనేజర్ -
జాబ్ స్కాములపై అప్రమత్తంగా ప్రొఫెషనల్స్
న్యూఢిల్లీ: ఉద్యోగావకాశాల పేరిట జరిగే స్కాముల గురించి భారతీయ ప్రొఫెషనల్స్లో అవగాహన పెరుగుతోంది. 82 శాతం మంది ఉద్యోగార్థులు దరఖాస్తు చేసుకునే ముందు సదరు జాబ్ విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ సైట్ లింక్డ్ఇన్ రూపొందించిన జాబ్ సెర్చ్ సేఫ్టీ పల్స్ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఉద్యోగం నిఖార్సయినదేనా లేదా ఏదైనా కుంభకోణం అయి ఉంటుందా అని ఆలోచించి, అడుగేసే ప్రొఫెషనల్స్ సంఖ్య పెరుగుతోంది. అయితే, వేగం, పోటీ తీవ్రంగా ఉండే మార్కెట్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవడం కష్టతరమైన వ్యవహారంగా ఉంటోంది. ముఖ్యంగా కెరియర్ తొలినాళ్లలో ఉన్న వారికి ఇది మరింత సవాలుతో కూడుకున్నదై ఉంటోంది. ఈ నేపథ్యంలో జాబ్ ప్లాట్ఫాంలు, కంపెనీలు, ఉద్యోగార్థులు.. అందరూ జవాబుదారీతనంతో వ్యవహరించే విధంగా, ఉద్యోగావకాశాల వ్యవస్థను విశ్వసనీయమైనదిగా తీర్చిదిద్దడం అవసరమని లింక్డ్ఇన్ ఇండియా హెడ్ (లీగల్, పబ్లిక్ పాలసీ) అదితి ఝా తెలిపారు. 2026 మార్చి 16–30 మధ్య భారత్తో పాటు బ్రిటన్, అమెరికా, జర్మనీ, బ్రెజిల్లో నిర్వహించిన ఈ సర్వేలో 8,512 మంది పాల్గొన్నారు. నివేదికలో మరిన్ని విశేషాలు.. → ఉద్యోగాన్ని దక్కించుకోవాలనే ఒత్తిడి వల్ల కొన్ని సందర్భాల్లో అప్రమత్తతను పక్కన పెట్టేయాల్సిన పరిస్థితి ఉంటోంది. ముఖ్యంగా కెరియర్ని అప్పుడప్పుడే మొదలుపెట్టే ఉద్యోగార్థుల్లో ఇలాంటి ధోరణి ఎక్కువగా ఉంటోంది. చాలా మంచి అవకాశంగా భావించి హెచ్చరిక సంకేతాలను పట్టించుకోకపోయిన సందర్భాలు కూడా ఉన్నాయని 54 శాతం మంది జెన్ జెడ్ ఉద్యోగార్థులు తెలిపారు. జెన్ జెడ్ ప్రొఫెషనల్స్లో దాదాపు సగం మంది 49 శాతం జాబ్ స్కాము నుంచి తృటిలో తప్పించుకున్నట్లు పేర్కొన్నారు. జెన్ ఎక్స్లో ఇలాంటి వారి సంఖ్య 36 శాతంగా ఉంది. → ఉద్యోగం కోసం బ్రౌజ్ చేస్తున్నప్పుడు అనుకోకుండా తారసపడే అవకాశాలు (20 శాతం), సరైన వివరాలేమీ ఉండని, నమ్మశక్యంగా అనిపించని రిక్రూటర్ /కంపెనీ స్వయంగా సంప్రదించిన పరిస్థితుల్లో (18 శాతం) .. స్కామ్ అయి ఉంటుందేమోననే సందేహాలు ఉంటున్నాయి. → చర్చల పేరిట ఉద్యోగార్థులను విశ్వసనీయమైన ప్లాట్ఫాంల నుంచి వేరే వేదికల వైపు మళ్లించి, స్కామర్లు మోసగించే ప్రయత్నం చేస్తున్నారు. 90 శాతం స్కామ్లలో, మెంబర్లను వ్యక్తిగత మెసేజింగ్ యాప్ల వైపు మళ్లిస్తున్నారు. -
టెలికాం ఫిర్యాదుల పరిష్కారానికి కొత్త నిబంధనలు
సాక్షి, న్యూఢిల్లీ: ఫోన్ కాల్స్ డ్రాప్ అవుతున్నాయా? డేటా స్పీడ్ రావడం లేదా? బిల్లుల్లో తప్పులున్నాయా? ఇకపై ఇలాంటి టెలికాం ఫిర్యాదుల పరిష్కారం కోసం గంటల తరబడి కస్టమర్ కేర్ ప్రతినిధి కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ప్రతిపాదించిన ’టెలికాం వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార (నాల్గవ సవరణ) నిబంధనలు–2026’ వినియోగదారుడికి మరింత ఉపశమనం ఇవ్వనున్నాయి. ఇందుకు సంబంధించిన నిబంధనలను విడుదల చేసినట్లు గురువారం కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ ప్రకటనలో తెలిపింది. గతంలో నిమిషాల కొద్దీ వెయిటింగ్ నెట్వర్క్ సమస్యలు, డేటా సమస్యల పరిష్కారం కోసం గతంలో ఫిర్యాదు చేయాలంటే కేవలం కాల్ సెంటర్కు ఫోన్ చేయడం లేదా ఎస్ఎంఎస్ పంపడం మాత్రమే ప్రధాన మార్గాలుగా ఉండేవి. ఫిర్యాదు చేసిన తర్వాత దాని పరిస్థితి ఏమిటో తెలుసుకోవడానికి కస్టమర్ కేర్కు మళ్లీ మళ్లీ ఫోన్ చేయాల్సిన అవసరం ఉండేది. ఓ పక్క పరిష్కారం కాకపోవడం, మరోపక్క ఫిర్యాదు నమోదు అయ్యిందో లేదో తెలుసుకునేందుకే గంటల కొద్దీ ఐవీఆర్ కాల్లో వెయిట్ చేయాల్సి వచ్చేది. చేసిన ఫిర్యాదు ఎన్ని రోజులకు పరిష్కారం అవుతుందో తెలియని పరిస్థితులు ఉండేవి. కొత్త నిబంధనలు ఇలా కొత్త నిబంధనల ప్రకారం.. ప్రతి టెలికాం కంపెనీ తప్పనిసరిగా తమ మొబైల్ యాప్, అధికారిక వెబ్సైట్, ఏఐ ఆధారిత చాట్బాట్ల ద్వారా ఫిర్యాదులను స్వీకరించాలి. వినియోగదారుడు ఏ మాధ్యమం ద్వారా ఫిర్యాదు చేసినా, దానికి ఒకే విధమైన ’యూనిక్ ఫిర్యాదు నెంబర్ను కేటాయించాలి. రియల్ టైమ్ ట్రాకింగ్ ద్వారా మనం చేసిన ఫిర్యాదు ఏ దశలో ఉందో తెలుసుకోవచ్చు. కస్టమర్ కేర్కు మళ్లీ ఫోన్ చేయాల్సిన అవసరం లేకుండా.. ఆన్–లైన్ పోర్టల్ లేదా యాప్ ద్వారా ఫిర్యాదు ఏ దశలో ఉంది, ఎవరు పర్యవేక్షిస్తున్నారు, ఎప్పటిలోపు పరిష్కారం అవుతుంది అనేది లైవ్ స్టేటస్ ద్వారా చూసుకోవచ్చు. పరిష్కార ప్రక్రియ మరింత పటిష్టం ముసాయిదా నిబంధనల ప్రకారం పరిష్కార ప్రక్రియను మరింత పటిష్టం చేశారు. మొదటి దశలో.. వినియోగదారుడు చేసిన ఫిర్యాదును నిర్ణీత గడువులోపు పరిష్కరించాలి. ఒకవేళ ఇక్కడ పరిష్కారం లభించకపోయినా లేదా కంపెనీ ఇచి్చన సమాధానం నచ్చకపోయినా వెంటనే తదుపరి దశకు వెళ్లవచ్చు. ఇక రెండవ దశలో.. అప్పీలేట్ అథారిటీ వద్ద అప్పీల్ చేసుకునే విధానాన్ని ఇప్పుడు మరింత సులభతరం చేశారు. వినియోగదారులకు స్పష్టతనిచ్చేలా, ఎటువంటి గందరగోళం లేకుండా అప్పీల్ ఫారమ్లను డిజిటల్గా అందుబాటులో ఉంచుతారు. ఆటోమేటెడ్ అలర్ట్స్ – రిమైండర్స్ ఫిర్యాదు నమోదు కాగానే వినియోగదారుడికి ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా నిర్ధారణ సందేశం రావడంతో పాటు, పరిష్కార గడువు ముగిసేలోపు కంపెనీ ప్రతినిధులు వినియోగదారుడిని సంప్రదించేలా ఆటోమేటెడ్ సిస్టమ్ను ఏర్పాటు చేయాలని ట్రాయ్ సూచించింది. జవాబుదారీతనంలో భాగంగా.. ఫిర్యాదుల పరిష్కారంలో విఫలమైనా లేదా నిబంధనలు ఉల్లంఘించినా టెలికాం ఆపరేటర్లపై కఠిన చర్యలు తీసుకునేలా ట్రాయ్ ఈ సవరణలో నిబంధనలను పొందుపరిచింది. కంపెనీలు తమ వద్ద నమోదైన ఫిర్యాదులు, పరిష్కరించిన కేసులు, పెండింగ్లో ఉన్న వాటిపై త్రైమాసిక నివేదికలను బహిరంగపరచాల్సి ఉంటుంది. -
గంటల వ్యవధిలో మారిపోయిన బంగారం ధరలు!
మే 2026 ప్రారంభం నుంచి తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు.. మళ్లీ పెరుగుదల దిశగా అడుగులు వేసాయి. ఈ రోజు 24 గంటల వ్యవధిలోనే గోల్డ్ ధరలు మరోమారు ఎగబాకాయికి. దీంతో దేశంలోని ప్రధాన నగరాలలో పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.ఈ రోజు (శుక్రవారం) ఉదయం హైదరాబాద్, విజయవాడలలో 1,39,750 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. సాయంత్రానికి 1,40,250 వద్దకు చేరాయి. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1,52,460 నుంచి 1,53,000 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే 24 గంటలు గడవకముందే పసిడి ధరల్లో ఎంత మార్పు జరిగిందో స్పష్టంగా తెలుస్తోంది.ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,53,150 వద్దకు, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,40,400 వద్దకు చేరింది. అయితే చెన్నైలో మాత్రం ధరలు కేవలం తులం మీద 10 రూపాయలు మాత్రమే తగ్గింది. దీంతో ఇక్కడ బంగారం ధరల్లో చెప్పుకోదగ్గ మార్పు కనిపించలేదు.ఇదీ చదవండి: 2008లోనే చూశాను.. రియల్ ఆస్తులు ఏవంటే? -
2008లోనే చూశాను.. రియల్ ఆస్తులు ఏవంటే?
రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి' తాజాగా ఎలాంటి ఆస్తులు స్థిరంగా ఉంటాయనే విషయాన్ని చర్చించారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు చాలా మంది జీవితకాలంగా కూడబెట్టుకున్న సేవింగ్ కొన్ని వారాల్లోనే కరిగిపోవడం నేను చూశాను. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, రిటైర్మెంట్ సేవింగ్స్ వంటి వాటిలో పెట్టిన పెట్టుబడులు అన్నీ కూడా 40 శాతం నుంచి 60 శాతం వరకు పడిపోయాయి. ఇదే సమయంలో రియల్ ఎస్టేట్ వంటి భౌతిక ఆస్తులు స్థిరంగా నిలిచాయని కియోసాకి పేర్కొన్నారు.పేపర్ ఆస్తులుకియోసాకి ప్రకారం.. స్టాక్లు, బాండ్లు, నగదు వంటివాటిని ''పేపర్ ఆస్తులు''. ఇవి నిజంగా భౌతికంగా ఉండే వస్తువులు కావు, ఇవి కొన్ని వాగ్దానాలపై ఆధారపడతాయి.➤స్టాక్ అంటే ఒక కంపెనీ లాభదాయకంగా కొనసాగుతుందనే నమ్మకం➤బాండ్ అంటే ప్రభుత్వం లేదా సంస్థ అప్పు తిరిగి చెల్లిస్తుందనే నమ్మకం➤డబ్బు అంటే కేంద్ర బ్యాంక్ దాని విలువను స్థిరంగా ఉంచుతుందనే నమ్మకంఅంటే.. ఇవన్నీ మన నియంత్రణలో కాకుండా, వ్యవస్థపై ఆధారపడిన ఉంటాయన్నమాట. రియల్ ఆస్తులురాబర్ట్ కియోసాకి దృష్టిలో భూమి, ఇళ్లు, బంగారం, వెండి వంటి వాటిని రియల్ ఆస్తులు. ఇవి భౌతికంగా ఉండే వస్తువులు కాబట్టి, ఆర్థిక వ్యవస్థ కుదేలైనప్పటికీ వాటి విలువ పూర్తిగా తగ్గే అవకాశం లేదు.భూమి ఎప్పుడూ ఉంటుంది, బంగారం అనేక శతాబ్దాలుగా విలువను నిలుపుకుంది. అద్దె ఇల్లు ఉంటే ప్రతి నెల ఆదాయం వస్తుంది. కాబట్టి సంక్షోభ సమయాల్లో ఇవి నిలకడగా ఉంటాయి.ఇదీ చదవండి: అప్పుడే ఊహించా.. సమాజానికి పెద్ద సవాలు: కియోసాకిప్రతి ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు.. స్టాక్స్, పేపర్ ఆస్తులు వేగంగా పడిపోతాయి. ఎందుకంటే ప్రజల్లో భయం పెరుగుతుంది. ఇలాంటి సమయంలో ప్రజలు భయంతో స్టాక్స్ అమ్మేస్తారు. అప్పు చేసి పెట్టుబడి పెట్టిన వారు ఎక్కువ నష్టపోతారు. రియల్ ఆస్తులు మాత్రం స్థిరంగా ఉండడం లేదా పెరగడం జరుగుతుంది. అందుకే.. అనుభవజ్ఞులు సంక్షోభం రాకముందే తమ పెట్టుబడులను భౌతిక ఆస్తుల వైపు మార్చుకుంటారు.ఏ ప్రభుత్వం ఏర్పడక ముందే భూమి ఉంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఉంది. ఒక బంగారు నాణెం రోమన్ సామ్రాజ్యాన్ని, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని, వాటి మధ్య వచ్చిన ప్రతి కరెన్సీ సంక్షోభాన్ని తట్టుకుని నిలిచింది. కాబట్టి నిజమైన వస్తువులకు ఉండే శాశ్వతత్వం కాగితపు వస్తువులకు ఎప్పటికీ ఉండదని రాబర్ట్ కియోసాకి విశ్వసిస్తున్నారు. -
పదేళ్లలో గ్లోబల్ సిటీగా హైదరాబాద్
అంతర్జాతీయ పెట్టుబడులను భారీగా ఆకర్షించేలా.. పదేళ్లలో హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మహా నగరాల అభివృద్ధిలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా.. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యమిస్తోందని వివరించారు. గురువారం ముంబైలో నిర్వహించిన ‘నాస్కామ్ జీసీసీ సమ్మిట్ 2026’లో ‘బియాండ్ పాలసీ: డిజైన్డ్ టు విన్ ది గ్లోబల్ జీసీసీ రేస్’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచాలనే సంకల్పంతో ‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047’కు శ్రీకారం చుట్టామని వివరించారు. ప్రపంచంలోని అనేక నగరాలు అస్తవ్యస్త పట్టణీకరణ వల్ల ‘అర్బన్ కొలాప్స్’ కోరల్లో చిక్కుకున్నాయని, అలాంటి చారిత్రక తప్పిదాన్ని హైదరాబాద్ విషయంలో తాము చేయాలనుకోవడం లేదన్నారు.అందుకే.. భవిష్యత్తు కోసం ఎదురు చూడకుండా, దాన్ని నిర్మించే బాధ్యతను తీసుకున్నామన్నారు. ఆ దిశగానే భారత్ ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, మెట్రో విస్తరణ, కొత్త విమానాశ్రయాల అభివృద్ధి, ఆర్ఆర్ఆర్, మూసీ ప్రక్షాళన, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఐకం ఇన్నోవేషన్ హబ్ తదితర కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామన్నారు. కేవలం టెక్ కంపెనీలే కాకుండా.. బ్యాంకింగ్, లైఫ్ సైన్సెస్, సెమీ కండక్టర్లు, రక్షణ రంగం, ఎఫ్ఎంసీజీ, స్పేస్ టెక్, ఆతిథ్యం తదితర బహుళ రంగాలకు చెందిన దిగ్గజ సంస్థలు జీసీసీల ఏర్పాటుకు హైదరాబాద్ ను తమ మొదటి ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నాయన్నారు.గతేడాది 70కి పైగా జీసీసీలు ప్రారంభమయ్యాయని, దేశంలో ఇదే అత్యధికమని వివరించారు. ఈ ఏడాది కొత్తగా 100 జీసీసీలను ప్రారంభించి... వాటిల్లో కొత్తగా లక్ష మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. జీసీసీలను కేవలం బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్లకే పరిమితం చేయకుండా.. వాటిని ‘గ్లోబల్ వాల్యూ సెంటర్లు’గా మార్చేలా ప్రత్యేక ‘కాంప్రహెన్సివ్ రోడ్డు మ్యాప్’ను సిద్ధం చేస్తున్నామన్నారు.పారిశ్రామికాభివృద్ధికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను మంత్రి శ్రీధర్ బాబు కోరారు. హైదరాబాద్లో ఉన్న ‘సిలికాన్ డెన్సిటీ (విభిన్న రంగాల నిపుణుల లభ్యత)’ని అందిపుచ్చుకుని ‘మేడిన్ తెలంగాణ’ బ్రాండ్ ను విశ్వవ్యాప్తం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో నాస్కాం ఛైర్మన్ శ్రీకాంత్, ప్రెసిడెంట్ రాజేష్ నంబియార్ తదితరులు పాల్గొన్నారు. -
యూనికార్న్ క్లబ్లోకి హైదరాబాద్ స్కైరూట్
హైదరాబాద్కు చెందిన ప్రైవేటు ఏరోస్పేస్ ‘స్కైరూట్’ 60 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 570 కోట్లు) నిధులను సమీకరించి సరికొత్త చరిత్ర సృష్టించింది. దీంతో కంపెనీ దేశంలోనే తొలి స్పేస్-టెక్ 'యూనికార్న్' హోదాను దక్కించుకుంది. ఈ లేటెస్ట్ ఫండింగ్తో కంపెనీ మొత్తం విలువ 1.1 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 8,300 కోట్లు) చేరుకుంది.సాధారణంగా ఒక స్టార్టప్ విలువ 1 బిలియన్ డాలర్లను దాటితే.. దాన్ని యూనికార్న్గా పరిగణిస్తారు. భారత అంతరిక్ష రంగంలో.. ఇది గొప్ప విజయంగా భావిస్తారు. దీన్నిబట్టి చూస్తే భారతీయ స్పేస్ కంపెనీల వృద్ధి ఎలా ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.ఈ పెట్టుబడి రౌండ్కు షెర్పలో వెంచర్స్, జీఐసీ నాయకత్వం వహించాయి. అంతే కాకుండా గ్రీన్కో గ్రూప్ వ్యవస్థాపకులు, ఆర్కామ్ వెంచర్స్ వంటి ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారులు కూడా ఇందులో పాల్గొన్నారు. ప్రపంచ ప్రఖ్యాత టెక్ ఇన్వెస్టర్, అలాగే గూగుల్ తొలి పెట్టుబడిదారులలో ఒకరు, బోర్డు సభ్యుడైన రామ్ శ్రీరామ్ కూడా ఇందులో చేరనున్నారు.కంపెనీ కొత్తగా సేకరించిన నిధులను మూడు ప్రధాన లక్ష్యాల కోసం వినియోగించనుంది. మొదటగా, 'విక్రమ్-1' రాకెట్ ప్రయోగాలను తరచుగా నిర్వహించే సామర్థ్యాన్ని పెంచుతుంది. రెండవది, రాకెట్ తయారీ ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించనుంది. మూడవది, మరింత శక్తివంతమైన 'విక్రమ్-2' రాకెట్ అభివృద్ధిపై దృష్టి పెట్టనుంది.ఈ రాకెట్ ఒక టన్ను వరకు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లగల సామర్థ్యంతో రూపొందుతుంది. అధునాతన క్రయోజెనిక్ ఇంజిన్తో ఇది మరింత పెద్ద మిషన్లకు ఉపయోగపడనుంది.ప్రస్తుతం స్కైరూట్ సంస్థ 'విక్రమ్-1' ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఇది భారత్లో పూర్తిగా ప్రైవేట్గా అభివృద్ధి చేసిన తొలి ఆర్బిటల్ రాకెట్గా గుర్తింపు పొందుతోంది. ఈ రాకెట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాటిలైట్ ఆపరేటర్లకు తక్కువ ఖర్చుతో, అనుకూలమైన స్పేస్ లాంచ్ సేవలను అందించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. -
ఫోర్స్ సరికొత్త 'ట్రావెలర్ ఎన్' సిరీస్
భారతీయ అతిపెద్ద వ్యాన్ తయారీ సంస్థ ఫోర్స్ మోటార్స్, తన ఐకానిక్ ట్రావెలర్ ప్లాట్ఫారమ్ను మరింత మెరుగుపరుస్తూ కొత్త ‘ఫోర్స్ ట్రావెలర్ ఎన్’ సిరీస్ని ఆవిష్కరించింది. అంబులెన్స్లు, స్కూల్ బస్సులు, డెలివరీ వాహనాల కోసం రూపొందించిన ఈ కొత్త శ్రేణితో ‘షేర్డ్ ప్యాసింజర్’ మొబిలిటీ విభాగంలో తన ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.కొత్త ‘ట్రావెలర్ ఎన్’లో డిజిటల్ క్లస్టర్, 9–అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, మెరుగైన ఎన్వీహెచ్ (నాయిస్, వైబ్రేషన్, హార్‡్షనెస్) టెక్నాలజీ, అధునాతన హెచ్వీఏసీ సిస్టమ్, ఎర్గోనామిక్ సీట్లు వంటి ఫీచర్లను అందుబాటులోకి తెచి్చంది. అలాగే రోబోటిక్ మాన్యుఫ్యాక్చరింగ్, ఆటోమేటెడ్ డోర్ హెమ్మింగ్ టెక్నాలజీ ద్వారా బిల్డ్ క్వాలిటీ, స్ట్రక్చరల్ ఇంటిగ్రిటీని పెంచింది.ఈ వాహనాల్లో బీఎస్–4 స్టేజ్2 ఉద్గార ప్రమాణాలకు అనుగుణమైన ఎఫ్ఎం 2.6 సీఆర్ ఇంజిన్ను అమర్చారు. వాహన యజమానుల కోసం ‘ఫోర్స్ కేర్’ కింద పొడిగించిన వారంటీ, ‘ఐ–పల్స్’ ద్వారా రియల్–టైమ్ వెహికల్ ట్రాకింగ్ వంటి సేవలను సంస్థ అందిస్తోంది. ఈ నెల(మే) రెండోవారం నుంచి బుకింగ్లు ప్రారంభం కానున్నాయి. -
స్మార్ట్ఫోన్ అమ్మకాలకు బ్రేక్: కారణం ఇదే!
మెమొరీ చిప్ల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా స్మార్ట్ఫోన్ల అమ్మకాలు ఈ ఏడాది 10–12 శాతం మేర క్షీణించే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ రీసెర్చ్ సంస్థ సైబర్మీడియా రీసెర్చ్ (సీఎంఆర్) ఒక నివేదికలో తెలిపింది.ధరలపరమైన ఒత్తిళ్లు, డిమాండ్ నెమ్మదించడం ఇందుకు కారణమని పేర్కొంది. ‘డీఆర్ఏఎం, ఎన్ఏఎన్డీ ధరలు పెరగడంతో డివైజ్ల ధర పెరిగింది. దీనితో మాస్ సెగ్మెంట్కి సంబంధించిన ఉత్పత్తులు భారంగా మారాయి. వాటితో పోలిస్తే ప్రీమియం సెగ్మెంట్పై ప్రభావం తక్కువగా ఉంది‘ అని సీఎంఆర్ వీపీ ప్రభు రామ్ తెలిపారు. నివేదిక ప్రకారం ఈ ఏడాది తొలి త్రైమాసికంలో షిప్మెంట్లు రెండు శాతం తగ్గాయి. రిపోర్ట్లో మరిన్ని విశేషాలు..ట్రాన్షన్, వన్ప్లస్ అమ్మకాలు వరుసగా 30 శాతం, 28 శాతం క్షీణించాయి.టాప్ 5 బ్రాండ్లలో వివో, ఒప్పో అమ్మకాలు వరుసగా 1 శాతం, 12 శాతం పెరిగాయి. శాంసంగ్, షావోమీ, రియల్మీ విక్రయాలు వరుసగా 8%, 7%, 12 శాతం క్షీణించాయి.చైనా స్మార్ట్ఫోన్ బ్రాండ్ వివో 21 శాతం వాటాతో స్మార్ట్ఫోన్ మార్కెట్లో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో శాంసంగ్ (17 శాతం), ఒప్పో (14 శాతం), షావోమీ (12 శాతం), రియల్మీ (10 శాతం) ఉన్నాయి.ఐఫోన్ 16 దన్నుతో యాపిల్ షిప్మెంట్లు 6 శాతం పెరగ్గా, సంస్థ మార్కెట్ వాటా 9 శాతంగా నమోదైంది.ఫీచర్ ఫోన్ సెగ్మెంట్లో చైనా బ్రాండ్ ఐటెల్ మొబైల్ అమ్మకాలు 26 శాతం పడిపోయినప్పటికీ 35 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో కొనసాగింది. ఆ తర్వాత స్థానాల్లో లావా (34 శాతం వాటా), హెచ్ఎండీ (18 శాతం వాటా) ఉన్నాయి.చిప్సెట్స్ తయారీ సంస్థల్లో భారత్లో మీడియాటెక్ 48 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుంది. ప్రీమియం సెగ్మెంట్లో (రూ. 25,000 పైబడిన ఫోన్లు) క్వాల్కామ్ 36 శాతం వాటాను దక్కించుకుంది. -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు!
గురువారం ఉదయం స్వల్ప లాభాల వద్ద ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 114.00 పాయింట్లు లేదా 0.15 శాతం నష్టంతో 77,844.52 వద్ద నిలిచాయి. నిఫ్టీ 4.30 పాయింట్లు లేదా 0.018 శాతం నష్టంతో 24,326.65 వద్ద నిలిచాయి.ఎంబసీ డెవలప్మెంట్స్ లిమిటెడ్, గోద్రెజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, అప్కోటెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, వి విన్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. సాకర్ హెల్త్కేర్ లిమిటెడ్, హెచ్బి ఎస్టేట్ డెవలపర్స్ లిమిటెడ్, గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, రూబికాన్ రీసెర్చ్ లిమిటెడ్, భిల్వారా టెక్నికల్ టెక్స్టైల్స్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలోకి చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
గడ్కరీ కీలక ప్రకటన.. టోల్ ప్లాజాలు మాయం!
జాతీయ రహదారులపై వాహనాలు వేచి ఉండే సమయాన్ని, రద్దీని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పడికప్పుడు తగిన చర్యలు తీసుకుంటూనే ఉంది. ఇందులో భాగంగానే ఫాస్ట్ట్యాగ్ అమల్లోకి వచ్చింది. ఈ విధానంలో కూడా వాహనాలు టోల్ ప్లాజా వద్ద వేచి ఉండాల్సి వస్తోంది. తద్వారా రోడ్డుపై కొంత ట్రాఫిక్ ఏర్పడుతోంది. దీనిని కూడా నివారించడానికి ప్రభుత్వం ఎంఎల్ఎఫ్ఎఫ్ (MLFF) సిస్టం తీసుకొస్తోంది.హైవేలపై రద్దీని తగ్గించాలనే ఉద్దేశ్యంతో.. భారతదేశంలో త్వరలోనే టోల్ ప్లాజాలను పూర్తిగా తొలగించనున్నట్లు కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. టైమ్స్ డ్రైవ్ ఆటో సమ్మిట్ అండ్ అవార్డ్స్ 2026 కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. 2026 చివరి నాటికి భారత రహదారులపై టోల్ ప్లాజాలను తొలగించే అవకాశం ఉంది.అయితే.. 2026 చివరి నాటికి ఎంఎల్ఎఫ్ఎఫ్ (మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో) అనే కొత్త టోల్ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే అవకాశముందని గడ్కరీ తెలిపారు. ఈ విధానంలో వాహనాలు టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు. రహదారిపై ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్యాంట్రీలు, కెమెరాలు, సెన్సార్లు, ఫాస్ట్ట్యాగ్ రీడర్లు వాహనాలను గుర్తించి.. టోల్ మొత్తాన్ని ఆటోమేటిక్గా డిజిటల్ పద్ధతిలో వసూలు చేస్తాయి.ఈ విధానం వల్ల టోల్ గేట్ల వద్ద ఉండే భారీ క్యూలు తగ్గిపోతాయి. ముఖ్యంగా పండుగలు, సెలవుల సమయంలో టోల్ ప్లాజాల వద్ద గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండదు. వాహనాలు ఆగకుండా ప్రయాణించడం వల్ల ఇంధన వినియోగం తగ్గుతుంది. దీని ద్వారా కాలుష్యం కూడా తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రయాణ సమయం తగ్గి, హైవే ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుంది.ప్రస్తుతం ఉన్న టోల్ ప్లాజాలు హైస్పీడ్ ఎక్స్ప్రెస్వేలకు అంతగా అనుకూలంగా లేవని ప్రభుత్వం భావిస్తోంది. వాహనాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఫాస్ట్ట్యాగ్ ఉన్నప్పటికీ ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. చాలాసార్లు టోల్ చెల్లింపుల విషయంలో వాదనలు, సాంకేతిక సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ఈ సమస్యలను పూర్తిగా తొలగించేందుకు ప్రభుత్వం పూర్తిగా ఆటోమేటెడ్, బ్యారియర్లెస్ టోల్ విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది.ఈ కొత్త విధానములో కూడా ఫాస్ట్ట్యాగ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వాహనంలో సరైన ఫాస్ట్ట్యాగ్ లేకపోతే లేదా బ్యాలెన్స్ తక్కువగా ఉంటే వాహన యజమానికి యధావిధిగా ఈ-నోటీసులు అందుతాయి. నిర్ణీత సమయంలో టోల్ చెల్లించకపోతే రెట్టింపు జరిమానా విధించే అవకాశం కూడా ఉంది. అందువల్ల ప్రతి వాహనదారుడు తన ఫాస్ట్ట్యాగ్ యాక్టివ్గా ఉండేలా చూసుకోవాలి.ఇదీ చదవండి: అప్పుడే ఊహించా.. సమాజానికి పెద్ద సవాలు: కియోసాకి -
రూ.28 లక్షల జాబ్ వదులుకున్న మేనేజర్
కార్పొరేట్ ప్రపంచంలో ప్రమోషన్ అనేది ఒక అపురూపమైన మైలురాయి. హోదా, భారీ వేతనం, సమాజంలో గుర్తింపు.. వీటి కోసం ఉద్యోగులు అహర్నిశలు శ్రమిస్తుంటారు. కానీ, ఆ ఊహల పల్లకీ ఒక్కోసారి ఊపిరి సలపని ఉచ్చుగా మారుతుందని హర్మన్ జోత్ కౌర్ ఉదంతం నిరూపిస్తోంది. ఏడాదికి రూ.28 లక్షల వేతనం వచ్చే సీనియర్ మేనేజర్ పదవిని తృణప్రాయంగా వదులుకుని ఆమె తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.ఎనిమిదేళ్ల నిరీక్షణ.. తీరా చూస్తే?హర్మన్ జోత్ కౌర్ ఎనిమిదేళ్ల పాటు సంస్థ కోసం తీవ్రంగా పనిచేసింది. ఆమె కష్టానికి ఫలితంగా 2025లో ఆమెకు సీనియర్ మేనేజర్గా పదోన్నతి లభించింది. రూ.28 లక్షల భారీ ప్యాకేజీ. తల్లిదండ్రుల కళ్లలో ఆనందం, స్నేహితుల అభినందనలు. తను అనుకున్న గమ్యాన్ని చేరానన్న తృప్తి ఆమెలో ఉండేది. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు.పదవి తెచ్చిన ప్రమోషన్ ట్రాప్కొత్త బాధ్యతలు పెరగడంతో ఆమె జీవితం ఒక్కసారిగా అస్తవ్యస్తమైంది. ఈ మార్పును వివరిస్తూ.. ‘రోజుకు 14 నుంచి 16 గంటల పాటు పనిలోనే గడపాల్సి వచ్చేది. పని ఒత్తిడిలో పడి నా కుమార్తె మొదటి స్కూల్ ఫంక్షన్కు కూడా వెళ్లలేకపోయాను. నిరంతర ఆందోళన కారణంగా బీపీ, షుగర్ వంటి సమస్యలు చుట్టుముట్టాయి. మీటింగ్లకు వెళ్లేముందు భయాందోళనలు మొదలయ్యాయి. వృత్తిపరమైన ఒత్తిడి ప్రభావం వైవాహిక జీవితంపై పడి అది విచ్ఛిన్నమయ్యే స్థాయికి చేరుకుంది. ఒకరోజు ఆఫీస్ వాష్రూమ్లో ఒంటరిగా ఏడ్చేశాను. ఆ క్షణమే నిర్ణయించుకున్నాను. చేతిలో మరో ఉద్యోగం లేకపోయినా అదే వారంలో రాజీనామా చేశాను’ అని కౌర్ తన ఆవేదనను పంచుకున్నారు.వెనక్కి తగ్గుదాం..రాజీనామా చేసిన రెండు నెలల తర్వాత ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ఆమె పంజాబ్లో సొంతంగా ఒక చిన్న ఏఐ సర్వీస్ స్టార్టప్ను నడుపుతున్నారు. ‘మునుపటి కంటే ఇప్పుడు సంపాదన తక్కువే కావచ్చు. కానీ ప్రశాంతంగా నిద్రపోతున్నాను. నా కుటుంబంతో గడుపుతున్నాను. నేను వెంబడించిన ఆ ప్రమోషన్ నేను నిర్మించుకున్న ఒక పంజరంగా అనిపించింది’ అని ఆమె పేర్కొన్నారు.🚨 The promotion I worked 8 years for almost destroyed me.2025: Finally promoted to Senior Manager - ₹28 LPA.Everyone congratulated me. Parents were proud. I thought I had “arrived”.6 months later:• 14–16 hour days became normal• Missed my daughter’s first school…— Harmanjot Kaur (@itsharmanjot) May 5, 2026మనశ్శాంతి ముఖ్యంఈ వార్తపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఒక యూజర్ వ్యాఖ్యానిస్తూ, ‘అసలైన సంపద మీ ఆఫర్ లెటర్లో ఉండే అంకెలు కాదు.. మీ సమయం, మీ మనశ్శాంతిపై మీకు ఉండే నియంత్రణ’ అని పేర్కొన్నారు. కార్పొరేట్ నిచ్చెన ఎక్కే క్రమంలో ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసం అనే చర్చను హర్మన్ జోత్ కథ మరోసారి తెరపైకి తెచ్చింది. కెరీర్ ఎదుగుదల ముఖ్యమే, కానీ అది ఒక బంగారు పంజరం కాకూడదని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: మేనేజర్లకు కాలం చెల్లిందా? -
50 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా స్వచ్ఛంద విరమణ
సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా సుదీర్ఘకాలం సేవలందించిన ఉద్యోగుల కోసం ‘స్వచ్ఛంద నిష్క్రమణ’ ప్రోగ్రామ్ను అధికారికంగా ప్రకటించింది. ఖర్చుల తగ్గింపు కోసం గతంలో లే-ఆఫ్స్ (ఉద్యోగుల తొలగింపు) చేపట్టిన కంపెనీ ఈసారి ఉద్యోగుల గౌరవప్రదమైన వీడ్కోలు కోసం భారీ ఆర్థిక ప్యాకేజీతో కూడిన ఆఫర్ను తెరపైకి తెచ్చింది.అర్హత ఎవరికి? (రూల్ ఆఫ్ 70)ఈ పథకం అందరికీ వర్తించదు. మైక్రోసాఫ్ట్ దీని కోసం రూల్ ఆఫ్ 70 అనే నిబంధనను విధించింది. దీని ప్రకారం.. ఉద్యోగి ప్రస్తుత వయస్సు + మైక్రోసాఫ్ట్లో వారు పనిచేసిన కాలం (సర్వీస్) కలిపి 70 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి.ఉదాహరణకు 50 ఏళ్ల వయస్సు ఉండి, కంపెనీలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న వారు లేదా 55 ఏళ్ల వయస్సు ఉండి 15 ఏళ్ల సర్వీస్ ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. ప్రాథమిక అంచనాల ప్రకారం, అమెరికాలోని మైక్రోసాఫ్ట్ వర్క్ఫోర్స్లో దాదాపు 7 శాతం మంది (సుమారు 8,750 మంది) ఈ ఆఫర్ను వినియోగించుకునే అవకాశం ఉంది.నగదు, బీమా, స్టాక్స్స్వచ్ఛందంగా తప్పుకోవాలనుకునే ఉద్యోగుల కోసం మైక్రోసాఫ్ట్ అత్యంత ఆకర్షణీయమైన ఎగ్జిట్ ప్యాకేజీని రూపొందించింది.ఆరోగ్య సంరక్షణ: ఉద్యోగం వదులుకున్న తొలి ఏడాది మెడికల్, డెంటల్, విజన్, వెల్నెస్ ఖర్చులను కంపెనీయే 100% భరిస్తుంది. ఆ తర్వాతి నాలుగు ఏళ్ల వరకు (మొత్తం ఐదేళ్లు) ఉద్యోగులు స్వల్ప ప్రీమియంతో ఈ సౌకర్యాన్ని పొందే వెసులుబాటు కల్పించింది.నగదు చెల్లింపు: లెవల్ 64 వరకు ప్రతి ఆరు నెలల సర్వీస్కు ఒక వారం మూల వేతనాన్ని అందిస్తారు. లెవల్ 65 - 67 (సీనియర్ హోదాలు) వారికి ప్రతి ఆరు నెలల సర్వీస్కు రెండు వారాల వేతనాన్ని ఇస్తారు. అయితే, ఏ కేటగిరీలోనైనా గరిష్టంగా 39 వారాల వేతనాన్ని మాత్రమే చెల్లిస్తారు.స్టాక్ ప్రయోజనాలు: సాధారణంగా వచ్చే స్టాక్ రివార్డులకు అదనంగా మరో 6 నెలల వెస్టింగ్ పీరియడ్ ప్రయోజనాన్ని కల్పిస్తారు. ఒకవేళ 24 ఏళ్లు పైబడి సర్వీస్ ఉంటే ఏకంగా 12 నెలల వెస్టింగ్ ప్రయోజనం లభిస్తుంది.ఒక రోజు ఆదాయం.. ఉద్యోగుల కోసం!మైక్రోసాఫ్ట్ ఈ కార్యక్రమం కోసం దాదాపు 900 మిలియన్ డాలర్లను (సుమారు రూ.7,500 కోట్లు) కేటాయించినట్లు సమాచారం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ భారీ మొత్తం కంపెనీ కేవలం ఒక్క రోజు ఆదాయంతో సమానం. ఈ ఆఫర్పై నిర్ణయం తీసుకోవడానికి అర్హులైన ఉద్యోగులకు 30 రోజుల సమయం ఇచ్చారు. ‘అర్హులైన ఉద్యోగులు కంపెనీ అందించే ఉదారమైన మద్దతుతో తమ తదుపరి జీవితంలోకి అడుగు పెట్టడానికి ఇదొక మంచి అవకాశం’ అని మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (హెచ్ఆర్) అమీ కోల్మన్ అన్నారు.అంతర్గత మార్పులు.. పనితీరుకే పట్టంరిటైర్మెంట్ ప్లాన్తో పాటు కంపెనీ తన అంతర్గత రివార్డుల వ్యవస్థలో కూడా మార్పులు చేసింది. ఉద్యోగుల మూల్యాంకన కేటగిరీలను 9 నుంచి 5కి తగ్గించారు. దీనివల్ల పనితీరు అంచనా వేగంగా జరుగుతుంది. స్టాక్ రివార్డులను కేవలం నగదు బోనస్లతో ముడిపెట్టకుండా ప్రతిభావంతులను గుర్తించే విషయంలో మేనేజర్లకు అదనపు అవకాశాలు కల్పించారు.ఇదీ చదవండి: మేనేజర్లకు కాలం చెల్లిందా? -
ఇండియా క్లీన్ ఎనర్జీలోకి యాపిల్ ఎంట్రీ
టెక్ దిగ్గజం యాపిల్ తన సుస్థిరత లక్ష్యాల దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో తన తయారీ కార్యకలాపాలను పెంచుకోవడంతోపాటు పర్యావరణ హితమైన ఇంధన వనరుల వినియోగంలోనూ అగ్రగామిగా నిలవాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా ముంబైకి చెందిన పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ ‘క్లీన్ మ్యాక్స్’తో చేతులు కలిపింది. దాదాపు రూ.100 కోట్ల ఉమ్మడి పెట్టుబడితో 150 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్, విండ్ ప్రాజెక్టులను నిర్మించడమే లక్ష్యంగా ఈ ఒప్పందం కుదిరింది.ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టిగతంలో యాపిల్ తన కార్యాలయాలు, రిటైల్ స్టోర్ల కోసం కేవలం రూఫ్టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు పరిమితం కాగా తాజా ఒప్పందం మరింత కీలకంగా మారనుంది. కేవలం విద్యుత్తును కొనుగోలు చేయడం కాకుండా, విద్యుత్ ఉత్పత్తి చేసే ఆస్తుల నిర్మాణంలో నేరుగా మూలధనాన్ని పెట్టుబడిగా పెట్టడం ఈ డీల్లోని ప్రత్యేకత. దేశవ్యాప్తంగా ఉన్న వాణిజ్య, పారిశ్రామిక కేంద్రాలకు పునరుత్పాదక ఇంధనాన్ని అందించడం ఈ ఒప్పందం లక్ష్యం. ఈ 150 మెగావాట్ల సామర్థ్యం అందుబాటులోకి వస్తే సుమారు 1.5 లక్షల కుటుంబాల వార్షిక విద్యుత్ అవసరాలను తీర్చేంత శక్తి ఉత్పత్తి అవుతుంది.2030 లక్ష్యం దిశగా ప్రయాణం2030 నాటికి తన గ్లోబల్ సప్లై చైన్, ఉత్పత్తుల వినియోగం మొత్తాన్ని కార్బన్ న్యూట్రల్(వాతావరణంలోకి మనం విడుదల చేసే కార్బన్ ఉద్గారాలను అంతే పరిమాణంలో తిరిగి తొలగించడం)గా మార్చాలని యాపిల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో భారత్ ఇప్పుడు కేవలం ఒక తయారీ కేంద్రం మాత్రమే కాకుండా, పర్యావరణ హితమైన ఆవిష్కరణలకు ప్రయోగశాలగా మారుతోంది.‘భారతదేశ గ్రీన్ ఎనర్జీ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు పెట్టడం, దేశంలోని సహజ వనరులను రక్షించడం మాకు గర్వకారణం. మా పర్యావరణ లక్ష్యాలు ఆవిష్కరణలకు చోదకశక్తిగా పనిచేస్తాయి’ అని యాపిల్ సప్లై చైన్ ఇన్నోవేషన్, వైస్ ప్రెసిడెంట్ సారా చాండ్లర్ అన్నారు. క్లీన్ మ్యాక్స్ వ్యవస్థాపకుడు కుల్దీప్ జైన్ మాట్లాడుతూ, కార్పొరేట్ సంస్థలకు నెట్-జీరో భాగస్వామిగా ఉండటమే తమ లక్ష్యమని, యాపిల్ వంటి దిగ్గజంతో పనిచేయడం వల్ల పర్యావరణ వ్యవస్థలో పెనుమార్పులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: మేనేజర్లకు కాలం చెల్లిందా? -
మేనేజర్లకు కాలం చెల్లిందా?
టెక్ ప్రపంచంలో ఇప్పుడు వినిపిస్తోన్న ఒకే మంత్రం ‘పని చేయండి లేదా పక్కకు తప్పుకోండి’. ఒకప్పుడు కేవలం పర్యవేక్షణకే పరిమితమైన మేనేజర్ల పాత్ర ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. కృత్రిమ మేధ ఉత్పాదకతను విప్లవాత్మకంగా మారుస్తున్న తరుణంలో ఐటీ, టెక్ దిగ్గజాలు తమ సంస్థాగత నిర్మాణాన్ని సమూలంగా మారుస్తున్నాయి. కాయిన్బేస్, బ్లాక్, స్నాప్ వంటి సంస్థల్లో జరుగుతున్న తాజా పరిణామాలు ఈ మార్పుకు సాక్ష్యాలు.కాయిన్బేస్ సంచలనంప్రముఖ క్రిప్టో ఎక్స్ఛేంజ్ కాయిన్బేస్ ఇటీవల తన ప్రపంచవ్యాప్త శ్రామిక శక్తిలో 14% (సుమారు 700 మంది) ఉద్యోగులను తొలగించింది. అయితే, ఈ తొలగింపుల వెనుక ఉన్న కారణం ఖర్చుల తగ్గింపుతోపాటు సంస్థను ఏఐ-ఆధారితంగా మార్చడమేనని ఆ సంస్థ సీఈఓ బ్రియాన్ ఆర్మ్స్ట్రాంగ్ స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్లో ఆయన చేసిన సుదీర్ఘ పోస్ట్ మేనేజర్ల భవిష్యత్తుపై చర్చకు దారితీసింది. ‘కాయిన్బేస్లో ప్రతి నాయకుడు కూడా ఒక బలమైన వ్యక్తిగత కంట్రిబ్యూటర్ అయి ఉండాలి. మేనేజర్లు కేవలం పక్కన నిలబడి సూచనలిచ్చే వారు కాదు. వారు ప్లేయర్-కోచ్లా ఉండాలి. అంటే, జట్టును నడిపిస్తూనే స్వయంగా పనిలో తలమునకలు కావాలి’ అన్నారు.క్యూ కట్టిన టెక్ దిగ్గజాలుబ్లాక్ (Block): కంపెనీ సీఈఓ జాక్ డోర్సే ఇప్పటికే 40% సిబ్బంది కోతను ప్రకటించారు. మేనేజర్లను ప్లేయర్-కోచ్లుగా మారాలంటున్నారు.స్నాప్ (Snap): కంపెనీ చీఫ్ ఇవాన్ స్పీగెల్ ఏఐ ఆధారిత చిన్న ‘స్క్వాడ్స్’ ఏర్పాటులో భాగంగా 1,000 ఉద్యోగాలను తొలగించారు.మెటా, అట్లాసియన్: మార్క్ జుకర్బర్గ్ వంటి నాయకులు సైతం ‘ఇయర్ ఆఫ్ ఎఫిషియన్సీ’ పేరుతో మేనేజర్ల సంఖ్యను తగ్గించి సంస్థను పునర్నిర్మించే ప్రక్రియలో ఉన్నారు.పేపాల్ (PayPal): ఏఐ పరివర్తన ద్వారా రాబోయే రెండేళ్లలో 1.5 బిలియన్ల డాలర్లు ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా 20% సిబ్బంది తగ్గింపు జరిగే అవకాశం ఉందని సమాచారం.అలాంటివారికి కష్టమే..హ్యూమన్ రిసోర్స్ విశ్లేషకుడు జోష్ బెర్సిన్ అభిప్రాయం ప్రకారం, పారిశ్రామిక విప్లవం నాటి ‘పర్యవేక్షణ మాత్రమే చేసే మేనేజర్’ పాత్రకు ఇక ముగింపు పలకాల్సిందే. ‘2026 నాటికి మేనేజర్గా కొనసాగాలంటే, మీరు కేవలం మనుషులను మాత్రమే కాదు, ఏఐ ఏజెంట్లను కూడా నిర్వహించాల్సి ఉంటుంది. ఒక మేనేజర్ కంటే ఏఐ ఏజెంట్కే ఎక్కువ విషయాలు తెలిసే అవకాశం ఉంది. కాబట్టి, నాయకులు స్వయంగా ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలి’ అని ఆయన విశ్లేషించారు. దీనినే ఇప్పుడు మెగామేనేజర్ సంస్కృతిగా పిలుస్తున్నారు.నైపుణ్యం లేకపోతే నిష్క్రమణే!క్రిప్టోజాబ్స్ లిస్ట్ వ్యవస్థాపకుడు రామన్ షాలుపౌ మాటల్లో చెప్పాలంటే, ఇది ఒక అనివార్యమైన మార్పు. కంపెనీలు ఏఐ వాషింగ్ (అత్యాధునికంగా కనిపించే ప్రయత్నం) చేస్తున్నాయా లేదా నిజంగా ఉత్పాదకత పెరుగుతోందా అనేది పక్కన పెడితే, ఉద్యోగంలో కొనసాగాలంటే ఏఐ నైపుణ్యాలు కలిగి ఉండటం ఇప్పుడు తప్పనిసరి.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన -
వేడి పెంచుతున్న పసిడి.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
విజయానికి మంత్రం ఇదే..
నేటి వేగవంతమైన ప్రపంచంలో విజయం సాధించాలంటే కేవలం మేధస్సు, వనరులు ఉంటే సరిపోదు.. అంతకుమించి వేగం అత్యంత అవసరమని ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా స్పష్టం చేశారు. ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఆయన పంచుకున్న ఒక ఆలోచనాత్మకమైన కోట్ ఇప్పుడు వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశమైంది.అతిగా ఆలోచించకండి..విజయవంతమైన వ్యక్తుల జీవనశైలిని నిశితంగా గమనించిన గోయెంకా వారిలో ఒకే రకమైన సామాన్య లక్షణం కనిపిస్తుందని పేర్కొన్నారు. ‘విజయవంతమైన వ్యక్తులు అతిగా ఆలోచించరు, అతిగా ప్లాన్ చేయరు లేదా సరైన సమయం కోసం వేచి ఉండరు. వారు కేవలం ముందుకు సాగిపోతుంటారు. ఇతరులు చర్చలు, పరిశోధనలతో సమయం గడుపుతున్నప్పుడు.. వీరు ఇప్పటికే పని మొదలుపెట్టి, అందులో ఎదురయ్యే సవాళ్లను నేర్చుకుంటూ, సర్దుబాటు చేసుకుంటూ ముందుకు సాగిపోతుంటారు’ అని ఆయన వివరించారు.పరిపూర్ణత కంటే కార్యాచరణే మిన్నచాలామంది పర్ఫెక్ట్ ప్లాన్ కోసం ఎదురుచూస్తూ నెలల తరబడి సమయాన్ని వృథా చేస్తారని, దానివల్ల అవకాశాలు చేజారిపోయే ప్రమాదం ఉందని గోయెంకా హెచ్చరించారు. ఆరు నెలల తర్వాత అమలు చేసే పరిపూర్ణ ప్రణాళిక కంటే ఈరోజే అమలు చేసే మంచి ప్రణాళికే అత్యుత్తమ ఫలితాలను ఇస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన -
ఫ్లాట్గా కదలాడుతున్న మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:40 సమయానికి నిఫ్టీ(Nifty) 17 పాయింట్లు పెరిగి 24,348 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 18 పాయింట్లు పుంజుకొని 77,974 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 97.98బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 102.01 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.35 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.46 శాతం పెరిగింది.నాస్డాక్ 2.02 శాతం పుంజుకుంది.Today Nifty position 07-05-2026(time: 09:40 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్పేస్ఎక్స్తో ఆంత్రోపిక్ మెగా డీల్!
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రముఖ ఏఐ స్టార్టప్ ఆంత్రోపిక్, ఎలాన్ మస్క్కు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్ఎక్స్తో భారీ డేటా సెంటర్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తమ క్లాడ్ ఏఐ సేవలకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ను తట్టుకోవడానికి అవసరమైన కంప్యూటింగ్ శక్తిని పొందే లక్ష్యంతో ఆంత్రోపిక్ ఈ నిర్ణయం తీసుకుంది.కొలోసస్ 1ఈ ఒప్పందం ప్రకారం, టెన్నెసీలోని మెంఫిస్లో ఉన్న స్పేస్ఎక్స్ ‘కొలోసస్ 1’ డేటా సెంటర్ పూర్తి కంప్యూటింగ్ సామర్థ్యాన్ని ఇకపై ఆంత్రోపిక్ వినియోగించుకోనుంది. వాస్తవానికి ఈ కేంద్రాన్ని మస్క్ తన సొంత ఏఐ సంస్థ ఎక్స్ఏఐ కోసం నిర్మించారు. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో ఇది ఆంత్రోపిక్ చేతుల్లోకి వెళ్తోంది. ఇది 2,20,000 ఎన్విడియా ఏఐ చిప్ల మద్దతుతో, దాదాపు 300 మెగావాట్ల కంటే ఎక్కువ విద్యుత్ సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ పనిచేస్తుంది. ఈ డేటా సెంటర్ వల్ల క్లాడ్ ప్రో, క్లాడ్ మాక్స్ చందాదారులకు వేగవంతమైన సేవలు అందనున్నాయి. సాఫ్ట్వేర్ రాయడం, ఎడిటింగ్, డీబగ్గింగ్ చేయగల క్లాడ్ కోడ్ పరిమితులను కంపెనీ రెట్టింపు చేసింది. ఇకపై బిజీ సమయాల్లోనూ ఎటువంటి అంతరాయం లేకుండా యూజర్లు దీనిని వాడుకోవచ్చు.శత్రువుల మధ్య స్నేహంఈ ఒప్పందం టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. గతంలో ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోదీపై, ఆ సంస్థ సిద్ధాంతాలపై మస్క్ తీవ్ర విమర్శలు చేశారు. ఆంత్రోపిక్ సంస్థ పాశ్చాత్య నాగరికతను ద్వేషిస్తుందని, అది ఒక కపట సంస్థ అని గత ఫిబ్రవరిలో మస్క్ ఎక్స్ వేదికగా దుమ్మెత్తిపోశారు. అయితే, తాజాగా చేసిన మస్క్ పోస్ట్ భిన్నంగా ఉంది. ‘గత వారం ఆంత్రోపిక్ సీఈఓ, తమ సిబ్బందితో సమయం గడిపాను. వారి సామర్థ్యం చూసి ముచ్చటేసింది. వారు సరైన పని చేయడంపై చాలా శ్రద్ధ వహిస్తున్నారు’ అని ప్రశంసించారు. మరో కీలక ప్రకటన చేస్తూ, ఎక్స్ఏఐని స్వతంత్ర సంస్థగా రద్దు చేస్తున్నానని ఇకపై అది స్పేస్ఎక్స్ ఏఐగా మాత్రమే కొనసాగుతుందని స్పష్టం చేశారు.వివాదాల కేంద్రంగా మెంఫిస్ డేటా సెంటర్ఈ ఒప్పందంలో భాగమైన మెంఫిస్ డేటా సెంటర్ ప్రస్తుతం వివాదాల్లో ఉంది. భారీ స్థాయిలో సహజ వాయువును మండించే టర్బైన్లను ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతోందని పౌర హక్కుల సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. ఫెడరల్ అనుమతులు లేకుండానే వీటిని నడుపుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన -
ఎయిరిండియా సంచలన నిర్ణయం
టాటా గ్రూప్ నేతృత్వంలోని ఎయిరిండియా అంతర్జాతీయ ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. విమాన ఇంధన (ఏటీఎఫ్) ధరలు విపరీతంగా పెరగడం, నిర్వహణ వ్యయం భారంగా మారడంతో మే నెలలో పలు కీలక అంతర్జాతీయ రూట్లలో విమాన సర్వీసులను భారీగా తగ్గించింది. వివిధ మార్గాల్లో 5 శాతం నుంచి ఏకంగా 25 శాతం వరకు విమానాల రద్దు జరిగినట్లు పరిశ్రమ వర్గాల సమాచారం.ముఖ్యమైన రూట్లలో కోతలు ఇలా..చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) మే 1 నుంచి అంతర్జాతీయ విమాన ఇంధన ధరలను 5 శాతం పెంచడంతో ఎయిరిండియా ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.ఉత్తర అమెరికా: ఈ మార్గంలో కార్యకలాపాలను 20 శాతం తగ్గించారు. షెడ్యూల్ చేసిన 200 విమానాల్లో సుమారు 40 విమానాలను రద్దు చేశారు.యూరోప్: పారిస్, కోపెన్హాగన్, జ్యూరిచ్ వంటి నగరాలకు వారంతపు సర్వీసులను తగ్గించారు. మొత్తం 450 విమానాల్లో దాదాపు 20 విమానాలు రద్దు అయ్యాయి.ఆస్ట్రేలియా: మెల్బోర్న్, సిడ్నీ రూట్లలో వారానికి నడిచే ఏడు విమానాల్లో రెండింటిని నిలిపివేశారు.ఆగ్నేయ ఆసియా: ఈ ప్రాంతానికి సర్వీసులను 10 శాతం వరకు కుదించారు.కారణాలేమిటి?.. సీఈఓ వివరణనెట్వర్క్ ఆప్టిమైజేషన్, డిమాండ్లో మార్పులు, పెరుగుతున్న ఇంధన ధరలే ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలని తెలుస్తోంది. ఎయిరిండియా సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ క్యాంప్బెల్ విల్సన్ ఉద్యోగులకు రాసిన లేఖలో ప్రస్తుత పరిస్థితులను వివరించారు. ‘పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇంధన ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. విమాన మార్గాల మూసివేత వల్ల ప్రయాణ కాలం పెరగడం, కరెన్సీ మార్పిడి రేట్లలో హెచ్చుతగ్గుల వల్ల అనేక అంతర్జాతీయ సర్వీసులు నష్టాల్లో నడుస్తున్నాయి’ అని చెప్పారు.దేశీయ విమాన సర్వీసులపై ప్రభుత్వ జోక్యం వల్ల ధరల ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ అంతర్జాతీయ రూట్లలో మాత్రం భారం తప్పడం లేదని ఆయన పేర్కొన్నారు. జూన్, జులై నెలల్లో కూడా పరిస్థితులను బట్టి షెడ్యూల్లో మార్పులు ఉండొచ్చని సూచించారు.ఇండిగో, అంతర్జాతీయ సంస్థల పరిస్థితిమరోవైపు, ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ప్రస్తుతం వేచి చూసే ధోరణిని అవలంబిస్తోంది. మే నెలలో అంతర్జాతీయ సర్వీసులను యథాతథంగా కొనసాగిస్తున్నప్పటికీ గతేడాదితో పోలిస్తే గల్ఫ్ దేశాలకు సర్వీసులను ఇప్పటికే 10 శాతం తగ్గించింది. అంతర్జాతీయంగా చూస్తే.. లుఫ్తాన్సా మే నుంచి అక్టోబర్ మధ్య ఏకంగా 20,000 విమానాలను రద్దు చేయగా క్వాంటాస్ భారత్కు నడిపే తన సర్వీసులను అక్టోబర్ వరకు తగ్గించుకుంది.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన -
ఇథనాల్ వినియోగంపై మోటర్ నిబంధనలకు సవరణలు
దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునే క్రమంలో ఇథనాల్, ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని గణనీయంగా పెంచే దిశగా కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం సెంట్రల్ మోటర్ వెహికల్స్ రూల్స్ 1989లో ఉద్గారాల నిబంధనలను సవరించేందుకు పలు ప్రతిపాదనలు చేసింది. ఈ85 (85 శాతం ఇథనాల్ కలిసిన పెట్రోల్), ఈ100 (పూర్తిగా ఇథనాల్ మీదే నడిచే వాహనాలు), బీ100 బయోడీజిల్, హైడ్రోజెన్–సీఎన్జీ మేళవించిన ఇంధన వినియోగానికి కూడా చోటు కల్పించేలా ఇవి ఉన్నాయి. ఇంధన దిగుమతులను, కర్బన ఉద్గారాలపరమైన కాలుష్యాన్ని తగ్గించుకునేందుకు ఇవి దోహదపడనున్నాయి.ఇప్పటికే దేశీయంగా ఈ20 (20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్) ఇంధనాన్ని వినియోగంలోకి తెచ్చిన సంగతి తెలిసిందే. తాజా ప్రతిపాదనలపై 30 రోజుల పాటు ప్రజలతో సంప్రదింపులు జరిపిన మీదట సవరణలు చేయనున్నట్లు కేంద్ర రహదారి రవాణా, హైవేస్ శాఖ ఏప్రిల్ 27న ఒక గెజిట్ నోటిఫికేషన్లో తెలిపింది. వాహన కాలుష్య నిబంధనలకు సంబంధించి తేలికపాటి వాణిజ్య వాహనాల బరువు పరిమితిని అంతర్జాతీయ ప్రమా ణాలకు అనుగుణంగా 3,000 కేజీల నుంచి 3,500 కేజీలకు పెంచడం మొదలైనవి ఈ ప్రతిపాదనల్లో ఉన్నాయి. ఈ సవరణతో అన్ని విభాగాల్లోను ఫ్లెక్స్ ఫ్యూయల్, పూర్తిగా బయోఫ్యుయల్ వాహనాలను ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమం అవుతుంది.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన -
ప్రపంచ వేదికపై భారతీయ కళా వైభవం
ప్రపంచ కళా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘వెనిస్ బినాలే’ వేదికపై భారతీయ ప్రాభవం మెరవనుంది. భారత ప్రభుత్వ కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖతో నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్ఎంఏసీసీ) భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా ‘ఇండియా పెవిలియన్’ను తిరిగి వెనిస్ బినాలేకు తీసుకువెళ్లడంతోపాటు మన దేశ అద్భుతమైన కళా సంపదను, హస్తకళలను ప్రపంచ దేశాల ప్రతినిధుల ముందు ప్రదర్శించనున్నారు.సాంస్కృతిక వారసత్వానికి అద్దం పట్టే వేదికకళలు, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో ముందుండే రిలయన్స్ ఫౌండేషన్ ఈ అంతర్జాతీయ వేదిక ద్వారా భారతీయ కళాకారులకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ముందడుగుపై కళా రంగ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఒక ప్రదర్శన మాత్రమే కాదని, భారతీయ సంస్కృతిని అంతర్జాతీయ వేదికపై ఆవిష్కరించే అద్భుత ఘట్టమని చెబుతున్నారు. ‘ప్రపంచంలోని గొప్ప వేదికల్లో ఒకటైన వెనిస్లో మన దేశ కళ, సంస్కృతి, హస్తకళలను వేడుకగా జరుపుకోవడం ప్రతి భారతీయుడికి గర్వకారణం’ అని ఓ సీనియర్ ఆర్ట్ క్రిటిక్ అన్నారు.కళాత్మక హొయలతో నీతా అంబానీఈ చారిత్రాత్మక క్షణాన్ని పురస్కరించుకుని రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్ పర్సన్ నీతా అంబానీ తన వస్త్రధారణతో భారతీయ హస్తకళల ప్రాముఖ్యతను చాటిచెప్పారు. ప్రముఖ డిజైనర్ అనామికా ఖన్నా రూపొందించిన షిఫాన్-జార్జెట్ చీరలో ఆమె మెరిసిపోయారు. దీనికి జతగా బనారసీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ లేస్ బ్లౌజ్ ధరించారు. మన నేత కళకు నిదర్శనమైన ‘స్వదేశ్’ రూపొందించిన, చేతితో నేసిన బుటిదార్ సోజ్ని శాలువా ఆమె రాజసాన్ని మరింత పెంచింది. ప్రఖ్యాత జ్యువెలరీ ఆర్టిస్ట్ వాలెస్ చాన్ రూపొందించిన ఇయర్ రింగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన -
భారత్ స్టాక్స్లో పెట్టుబడులకు ప్రవాసుల ఆసక్తి
న్యూఢిల్లీ: గల్ఫ్ దేశాల్లోని ప్రవాస భారతీయులు స్వదేశానికి పంపిస్తున్న నిధుల్లో (రెమిటెన్స్లు) స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. సంపాదనలో మిగులు నిధులను మాతృదేశానికి పంపడాన్ని ఒక తప్పనిసరి బాధ్యతగా వారి ఇప్పుడు చూడడం లేదు. వ్యూహాత్మకంగా సంపద సృష్టించుకోవాలన్న ప్రణాళికతో స్వదేశంలో పెట్టుబడులు పెడుతున్నారు. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు నెలకొన్నప్పటికీ, ఎన్ఆర్ఐలు పెట్టుబడుల దృష్టితో మాతృదేశానికి నిధులు పంపిస్తున్నట్టు ఈక్విరస్ వెల్త్ సర్వే నివేదిక వెల్లడించింది. గల్ఫ్ ప్రాంతంలోని (జీసీసీ) 8,300 మంది ఎన్ఆర్ఐల అభిప్రాయాల ఆధారంగా ఈక్విరస్ ఈ వివరాలు విడుదల చేసింది. దీని ప్రకారం.. గల్ఫ్ ప్రాంత ఎన్ఆర్ఐలకు సంపద సృష్టి కేంద్రంగా భారత్ స్థానం స్థిరపడుతోంది. అక్కడి వారు భారత్కు పంపిస్తున్న నిధుల్లో సగం పెట్టుబడులు, రిటైర్మెంట్ ప్రణాళికల కోసమే ఉంటున్నాయి. సర్వే అంశాలు.. → జీసీసీ దేశాల ఎన్ఆర్ఐలు భారత్కు పంపిస్తున్న మొత్తం నిధుల్లో 27 శాతం పెట్టుబడుల కోసం ఉద్దేశించినవే. → ఆ తర్వాత 22 శాతం రెమిటెన్స్లు రిటైర్మెంట్ ప్రణాళిక కోసం ఉంటున్నాయి. → ఇక 26 శాతం మేర నిధులు భారత్లోని తమ కుటుంబాల జీవన అవసరాల కోసం పంపిస్తున్నారు. → ప్రవాస భారతీయుల పెట్టుబడి ధోరణిలోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతంలో భూములు, ఇళ్ల కొనుగోలు పట్ల ఆసక్తి చూపించగా, ఇప్పుడు ఆర్థిక సాధనాల వైపు ఆకర్షితులవుతున్నారు. → 40% మంది రియల్ ఎస్టేట్ (స్థిరాస్తి) నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. → 73% మంది భారత స్టాక్ మార్కెట్లలో తమ పెట్టుబడులను క్రమంగా పెంచుకుంటున్నారు. → 75% మంది దీర్ఘకాల చురుకైన ఇన్వెస్టర్లుగా వ్యవహరిస్తున్నారు. భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావం ప్రాంతీయ అస్థిరతలు నెలకొన్నప్పటికీ, ప్రవాస భారతీయులు తమ పొదుపు మొత్తాలను పెంచుకోవడంపైనే దృష్టి పెట్టినట్టు ఈక్విరస్ వెల్త్ నివేదిక వెల్లడించింది. 83 శాతం మంది భౌగోళిక రాజకీయ పరిస్థితులు తమ ఆర్థిక నిర్ణయాలపై ప్రభావం చూపిస్తాయని అంగీకరించారు. ప్రాంతీయ అస్థిరతలపై 41 శాతం మంది ఆందోళన చెందుతుండగా.. 23 శాతం మంది ద్రవ్యోల్బణంపై, 13 శాతం మంది అంతర్జాతీయ మార్కెట్లలో అస్థిరతల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చారిత్రకంగా గల్ఫ్ ప్రాంత ఎన్ఆర్ఐలకు ఉద్యోగ భద్రత, వీసా ప్రాధాన అంశాలుగా ఉంటుండగా.. ఇప్పుడు ఈ అంశాలపై కేవలం 12 శాతం మందే ఆందోళన చెందుతున్నారు. తమ ఆదాయ స్థిరత్వంపై వారిలో పెరిగిన నమ్మకాన్ని ఇది తెలియజేస్తున్నట్టు ఈక్విరస్ వెల్త్ నివేదిక పేర్కొంది. -
అమెరికాలో భారత్ కంపెనీలు: ఒక్కరోజే భారీ పెట్టుబడులు!
అమెరికాలో జరిగిన 2026 సెలెక్ట్ యూఎస్ఏ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో భారతదేశం నుంచి వచ్చిన భారీ పెట్టుబడులు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. వివిధ కంపెనీలు.. మొత్తం సుమారు 20.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులను యూఎస్లో పెట్టడానికి సన్నద్ధమవుతున్నాయి.''అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వంలో అమెరికాలోకి రికార్డు స్థాయిలో పెట్టుబడులు తిరిగి వస్తున్నాయి. భారతీయ కంపెనీలు టెక్, తయారీ, ఫార్మాస్యూటికల్స్ వంటి వివిధ రంగాలలో 20.5 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టడానికి ప్రణాళిక వేస్తున్నాయి. ఇందులో, ఈరోజే 1.1 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ప్రకటించిన 12 భారతీయ కంపెనీలు కూడా ఉన్నాయి. దీని ద్వారా అమెరికాలో ఉద్యోగాలు పెరుగుతాయి. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి వ్యాపారం చేసినప్పుడు అందరూ గెలుస్తారనడానికి ఇదే నిదర్శనం'' అని అమెరికాలో భారత రాయబారి సెర్గియో గోర్ స్పష్టం చేశారు.Under President Trump’s leadership investment is flowing back into the United States at record levels! Indian companies plan to invest over $20.5 billion in various sectors including tech, manufacturing, and pharmaceuticals. This includes the 12 Indian companies who announced…— Ambassador Sergio Gor (@USAmbIndia) May 6, 2026ఈ పెట్టుబడుల్లో అత్యధిక భాగం భారత ఫార్మా రంగం నుంచే వచ్చింది. సుమారు 19.1 బిలియన్ డాలర్లు.. అమెరికాలో తయారీ యూనిట్లు, పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు, కొత్త ఫ్యాక్టరీల కోసం పెట్టుబడి పెట్టనున్నారు. ఇది ఔషధ రంగంలో అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలపరుస్తుంది. అదేవిధంగా ఉక్కు పరిశ్రమ, ఇంధన సరఫరా వ్యవస్థలు, కనెక్టివిటీ ప్రాజెక్టులు కూడా ఈ పెట్టుబడుల్లో భాగమయ్యాయి.సెర్జియో గోర్ మాట్లాడుతూ.. 2030 నాటికి భారత్-అమెరికా మధ్య వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచే లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్యం ద్వారా రెండు దేశాలకు సమానంగా లాభం కలిగేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. -
అందుకేనా.. బంగారం ఇంతలా పెరిగింది!
బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు ఊహకందని మార్పులు జరుగుతూనే ఉన్నాయి. అమెరికా - ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం సాధ్యమవుతుందనే ఆశలు పెరగడంతో, డాలర్ విలువ, చమురు ధరలు తగ్గాయి. దీంతో ద్రవ్యోల్బణ భయం తగ్గింది. గోల్డ్ రేటు ఊపందుకుంది.స్పాట్ గోల్డ్ ధర 3.4 శాతం పెరిగి ఔన్సుకు సుమారు 4,708 డాలర్ల స్థాయికి చేరుకుంది. ఇది గడిచిన వారం రోజుల్లో అత్యధికం అనే చెప్పాలి. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ కూడా గణనీయంగా పెరిగాయి. సాధారణంగా బంగారం ధరలు పెరగడానికి ప్రపంచ అనిశ్చితి, డాలర్ బలహీనత, వడ్డీ రేట్ల అంచనాలు ప్రధాన కారణాలు.చమురు ధరలు తగ్గితే ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గుతుంది. దీని ఫలితంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంటుంది. తక్కువ వడ్డీ రేట్లు ఉన్నప్పుడు బంగారం వంటి వాటిపై పెట్టుబడులు పెరుగుతాయి. అందుకే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఇదే సమయంలో గ్లోబల్ స్టాక్ మార్కెట్లు కూడా చమురు ధరలు తగ్గడంతో పెరుగుదల చూపాయి. ఇది పెట్టుబడిదారులలో విశ్వాసాన్ని పెంచింది. మరోవైపు డాలర్ విలువ తగ్గడం వల్ల బంగారం ఇతర కరెన్సీలు కలిగిన వారికి మరింత చౌకగా మారింది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. వెండి, ప్లాటినం, పల్లాడియం వంటి విలువైన లోహాల ధరలు కూడా పెరగడం గ్లోబల్ మార్కెట్లో బలమైన డిమాండ్ను సూచిస్తోంది.ఇదీ చదవండి: అప్పుడే ఊహించా.. సమాజానికి పెద్ద సవాలు: కియోసాకి -
ఎఫ్డీఐలతో బీమాకు మేలే..
బీమా రంగంలోకి వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డీఐ) అనుమతించడమనేది పరిశ్రమకు ప్రయోజనం చేకూరుస్తుందని ఆరోగ్య బీమా రంగ దిగ్గజం స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ ఎండీ ఆనంద్ రాయ్ తెలిపారు. దీనితో మరిన్ని పెట్టుబడులు, మెరుగైన సాంకేతికత అందుబాటులోకి వస్తాయని, ఇన్సూరెన్స్ రంగ విస్తృతి మరింత పెరుగుతుందని మంగళవారమిక్కడ విలేకరుల సమావేశంలో చెప్పారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.24,000 కోట్ల మేర స్థూల రిటెన్ ప్రీమియం (జీడబ్ల్యూపీ) సాధించాలని నిర్దేశించుకున్నట్లు పేర్కొన్నారు. గతేడాది ఇది సుమారు రూ.20,400 కోట్లుగా ఉండగా, 2028 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.30,000 కోట్ల స్థాయికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాయ్ వివరించారు. చిన్న పట్టణాల్లో మరింతగా విస్తరించడం ద్వారా దీన్ని సాధించనున్నట్లు చెప్పారు. బీమాను ప్రజలకు మరింత చేరువలోకి తెచ్చే దిశగా చిన్న పట్టణాల్లోని వారి కోసం తక్కువ ప్రీమియంలతో ఈ ఆర్థిక సంవత్సరం కొత్త పథకాలను ప్రవేశపెట్టడంపై కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో 15 శాతం వాటా లక్ష్యంసంస్థ వ్యాపారంలో రెండు తెలుగు రాష్ట్రాల వాటా దాదాపు 10 శాతంగా ఉన్నట్లు రాయ్ చెప్పారు. వచ్చే మూడు, నాలుగేళ్లలో దీన్ని 12–15 శాతానికి పెంచుకోనున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో గత ఆర్థిక సంవత్సరంలో రూ. 1,254 కోట్లు విలువ చేసే 1.8 లక్షల క్లెయిమ్లను పరిష్కరించామని, అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 24 శాతం అధికమని రాయ్ వివరించారు. జాతీయ స్థాయిలో 30.6 లక్షల క్లెయిమ్లకు సంబంధించి రూ. 11,903 కోట్లు సెటిల్ చేసినట్లు చెప్పారు. టెక్నాలజీపై ఏటా రూ. 200–250 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు. బీమా ప్రీమియంలు గరిష్ట సింగిల్ డిజిట్ స్థాయిలో పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. -
భారత్ 'మిషన్ దృష్టి' సక్సెస్: మస్క్ ట్వీట్!
బెంగళూరుకు చెందిన స్టార్టప్ గెలాక్సీఐ (GalaxEye) రూపొందించిన 'మిషన్ దృష్టి' ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. ఈ విజయంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించగా.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా అభినందనలు తెలిపారు.కాలిఫోర్నియా నుంచి స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా మిషన్ దృష్టి ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఇది ప్రపంచంలోనే మొదటి 'ఆప్టోసార్' శాటిలైట్గా గుర్తింపు పొందింది. ఇది ఎలక్ట్రో ఆప్టికల్ (EO), సింథటిక్ అపర్చర్ రాడార్ (SAR) సాంకేతికతల కలయికతో రూపొందింది.EO సిస్టమ్ ద్వారా.. స్పష్టమైన, వాతావరణంలోని హై క్వాలిటీ ఫోటోలను పొందవచ్చు. SAR సాంకేతికత ద్వారా వర్షం, మబ్బులు, రాత్రి వంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా సమాచారాన్ని సేకరించవచ్చు. ఈ రెండు టెక్నాలజీలు కలిసి ఉండటం వల్ల.. భూమి పరిశీలనలో ఉన్న పరిమితులను అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల వ్యవసాయం, రక్షణ, విపత్తు నిర్వహణ, సముద్ర పర్యవేక్షణ, మౌలిక వసతుల ప్రణాళిక వంటి అనేక రంగాలకు ఉపయోగకరమైన డేటా లభిస్తుంది.Congratulations! 🇮🇳— Elon Musk (@elonmusk) May 5, 2026ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ ప్రాజెక్ట్ను భారత యువత ప్రతిభకు నిదర్శనంగా పేర్కొన్నారు. దేశ అభివృద్ధికి సాంకేతికత ఎంత ముఖ్యమో ఈ ప్రాజెక్ట్ స్పష్టంగా చూపిస్తుందని అన్నారు. భారత అంతరిక్ష సంస్థలతో పాటు ప్రైవేట్ రంగం కూడా ముందుకు రావడం దేశానికి మరింత బలం చేకూరుస్తోంది.భవిష్యత్తులో.. గెలాక్స్ఐ సంస్థ ఈ వ్యవస్థను మరింత విస్తరించి 2030 నాటికి 10 ఉపగ్రహాల సమూహాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా భారతదేశం స్వంతంగా బలమైన భూ పరిశీలన వ్యవస్థను నిర్మించుకోవాలని భావిస్తోంది.ఇదీ చదవండి: అప్పుడే ఊహించా.. సమాజానికి పెద్ద సవాలు: కియోసాకి -
అమ్మకాల్లో రికార్డ్.. ఒక్క నెలలో 26 లక్షల వాహనాలు!
భారత ఆటోమొబైల్ రంగం 2026-27 ఆర్థిక సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించింది. దేశీయంగా వాహన రిటైల్ విక్రయాలు ఈ ఏప్రిల్లో ఆల్టైమ్ రికార్డును సృష్టించాయి. గత నెలలో మొత్తం 26,11,317 వాహనాలు అమ్ముడయ్యాయి. గత ఏడాది (2025) ఇదే నెలలో నమోదైన 23,12,221 యూనిట్లతో పోలిస్తే ఇది 12.94 శాతం వృద్ధి అని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) మంగళవారం వెల్లడించింది. జీఎస్టీ 2.0 అమలు, ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు, రబీ పంటల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన నగదు లభ్యత, వివాహాల సీజన్ వంటి అంశాలు ఈ వృద్ధికి ప్రధాన కారణాలని ఫాడా వివరించింది.రికార్డుల జోరుతో ఆటో రంగం బోణీ: ఫాడా ఉపాధ్యక్షుడుభారత ఆటో రిటైల్ రంగం 2026–27 ఆర్థిక సంవత్సరాన్ని బలంగా ప్రారంభించిందని ఫాడా ఉపాధ్యక్షుడు సాయి గిరిధర్ తెలిపారు. 2026 ఏప్రిల్లో మునుపెన్నడూ లేని విధంగా 26,11,317 యూనిట్ల విక్రయాలతో దాదాపు 13 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషమన్నారు. ఈ గణాంకాలు కేవలం సంఖ్యలు మాత్రమే కావని, భారత వినియోగ మార్కెట్లో వస్తున్న కీలక మార్పులకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘గత కొన్నాళ్లుగా మెట్రో నగరాలకే పరిమితమైన వాహనాల జోరు ఇప్పుడు పల్లెలకు పాకింది. పట్టణ ప్రాంతాల్లో 7.11 శాతం వృద్ధి నమోదైతే, గ్రామీణ ప్రాంతాల్లో ఏకంగా 20.40 శాతం వృద్ధి కనిపించడం విశేషం. ఎస్యూవీల హవా కొనసాగుతున్నప్పటికీ, చిన్న కార్ల విభాగంలో మళ్లీ కొనుగోళ్లు పెరగడంతో ‘వ్యక్తిగత మొబిలిటీ’ విభాగం పుంజుకుంది. వినియోగదారులు కేవలం పెట్రోల్, డీజిల్పైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మొగ్గు చూపుతున్నారు. విక్రయాల్లో సీఎన్జీ (సీఎన్జీ) వాటా 22.62% ఉండగా, ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వాటా 5.77 శాతానికి మెరుగుపడటం సానుకూల పరిణామం’’ అని వెల్లడించారు.అప్రమత్తతతో కూడిన ఆశావాదం: ఫాడా అంచనాలురాబోయే మూడు నెలల్లో వాహన విక్రయాల వృద్ధిపై సగానికి పైగా (50.90 శాతం) డీలర్లు ధీమాతో ఉన్నారని ఫాడా తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన నగదు లభ్యత, ఖరీఫ్ సీజన్ సానుకూలతలు ద్విచక్ర వాహన విభాగానికి ఊతమిస్తాయని అంచనా వేసింది. మే నెలలో వివాహాల సీజన్ కారణంగా ప్యాసింజర్ వాహనాల బుకింగ్లు బలంగా ఉంటాయని, జూన్–జూలై నెలల్లో విక్రయాలు సాధారణ స్థితికి చేరుకోవచ్చని పేర్కొంది. అయితే, తీవ్రమైన వడగాల్పులు, పశి్చమ ఆసియా ఉద్రిక్తతల వల్ల పెరిగే ఇంధన ధరలు మరియు వాణిజ్య వాహనాల విభాగంలో నగదు లభ్యత (లిక్విడిటీ) వంటి సవాళ్లను నిశితంగా గమనించాల్సి ఉంటుందని ఫాడా స్పష్టం చేసింది.


