Business
-
మరిన్ని శాఖల్లో బంగారం రుణాలు
ప్రముఖ ఎన్బీఎఫ్సీ సంస్థ శ్రీరామ్ ఫైనాన్స్ బంగారం రుణాల్లో తన మార్కెట్ వాటాను పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. బంగారం రుణాల మార్కెట్ వచ్చే ఐదేళ్లలో రెట్టింపు అవుతుందన్న అంచనాల నేపథ్యంలో.. మరిన్ని శాఖల్లో బంగారం రుణాలను ప్రవేశపెట్టనున్నట్టు సంస్థ డిప్యూటీ ఎండీ అన్బుసెల్వన్ తెలిపారు.‘2024–25 మూడో త్రైమాసికంలో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో శ్రీరామ్ ఫైనాన్స్ నిర్వహణలోని బంగారం రుణ ఆస్తులు (ఏయూఎం) గణనీయంగా పెరిగాయి. మరింత స్థిరీకరణతో రానున్న త్రైమాసికాల్లో మార్కెట్ వాటాను పెంచుకోవాలని అనుకుంటున్నాం. ఇందులో భాగంగా మరిన్ని శాఖలకు బంగారం రుణాల వ్యాపారాన్ని విస్తరించనున్నాం’అని అన్బుసెల్వన్ వివరించారు. బంగారం రుణాలకు డిమాండ్ పెరిగిందని.. వ్యక్తులు, చిన్న వ్యాపార సంస్థలు వేగంగా నిధులు కోరుకుంటున్నట్టు చెప్పారు.ఇదీ చదవండి: విమాన ప్రయాణాలు మరింత భారంసంఘటిత రంగంలో బంగారం రుణ వ్యాపారం మరింత విస్తరించనున్నట్టు అన్బుసెల్వన్ తెలిపారు. తమ బంగారం రుణ కస్టమర్లలో ఎక్కువ మంది మధ్యతరగతి వారేనని, వేతన జీవులు, చిన్న వ్యాపారులు, గ్రామీణ ప్రాంతాల్లోని వర్తకులు ఇందులో ఉన్నట్టు చెప్పారు. ఏక మొత్తంలో రుణ చెల్లింపులు, మూడు నెలలకోసారి వడ్డీ చెల్లించడం, నెలవారీ ఈఎంఐ ఇలా పలు రూపాల్లో బంగారం రుణాలను ఆఫర్ చేస్తున్నట్టు తెలిపారు. వేగంగా రుణాలు జారీ చేసేందుకు వీలుగా ప్రక్రియలను ఆటోమేట్ చేసినట్టు పేర్కొన్నారు. -
విమాన ప్రయాణాలు మరింత భారం
వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ముంబై విమానాశ్రయం ద్వారా ప్రయాణాలు మరింత భారం కానున్నాయి. యూజర్ డెవలప్మెంట్ ఫీజును (యూడీఎఫ్) భారీగా పెంచేలా ఎయిర్పోర్ట్ ఆపరేటరు ఎంఐఏఎల్ ప్రతిపాదనలు చేయడమే ఇందుకు కారణం. వీటి ప్రకారం ఇంటర్నేషనల్ ప్యాసింజర్లకు యూడీఎఫ్ రూ.187 నుంచి ఏకంగా రూ.650కి పెరగనుంది. ప్రస్తుతం దేశీ ప్యాసింజర్లకు యూడీఎఫ్ లేకపోయినప్పటికీ ఇకపై వారిపై కూడా రూ.325 మేర యూడీఎఫ్ వడ్డించనున్నారు.ప్రతిపాదిత టారిఫ్ కార్డును ఎయిర్పోర్ట్ ఎకనమిక్ రెగ్యులేటరీ అథారిటీ (ఏఈఆర్ఏ) అనుమతుల కోసం సంస్థ సమర్పించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నియంత్రణ సంస్థ నిబంధనలకు అనుగుణంగానే ఈ ప్రతిపాదనలు ఉన్నట్లు వివరించాయి. వీటిపై తుది నిర్ణయానికి ముందు ఎయిర్పోర్ట్ సంబంధిత వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకునేందుకు ఏఈఆర్ఏ మార్చి 25న సమావేశం కానుంది. మరోవైపు, ఎయిర్లైన్స్కి భారీగా ఊరటనిచ్చే దిశగా ఏఈఆర్ఏ వెబ్సైట్ ప్రకారం 2024–2029 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలానికి ల్యాండింగ్, పార్కింగ్ చార్జీలను 35 శాతం తగ్గించేలా ఎంఐఏఎల్ ప్రతిపాదనలు సమర్పించింది. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల జాబితాలో రెండో స్థానంలో ఉండే ముంబై విమానాశ్రయాన్ని ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (ఎంఐఏఎల్) నిర్వహిస్తోంది. ఇందులో అదానీ గ్రూప్నకు 74 శాతం, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు 26 శాతం వాటాలు ఉన్నాయి. ముంబై ఎయిర్పోర్టులో ఏటా 5.5 కోట్ల మంది ప్రయాణికుల సామర్థ్యంతో రెండు టెర్మినల్స్ ఉన్నాయి.ఇదీ చదవండి: బెంజ్, కియా కార్ల ధరలు పెంపువిమానాశ్రయ మౌలిక సదుపాయాలను, సాంకేతికతను మెరుగుపర్చుకునేందుకు ప్రతిపాదిత ఫీజులు ఉపయోగపడతాయని ఎంఐఏఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఒక్కో ప్రయాణికుడిపై రాబడి రూ.285గా ఉండగా సుమారు రూ.332కి (18 శాతం) పెరగనుంది. వచ్చే అయిదేళ్లలో విమానాశ్రయంపై ఎంఐఏఎల్ రూ.10,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. -
బెంజ్, కియా కార్ల ధరలు పెంపు
లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ ఇండియా మరోసారి కార్ల ధరల పెంపునకు సిద్ధమైంది. యూరో మారకంలో రూపాయి విలువ బలహీనత కొనసాగితే ఏప్రిల్ నుంచి తమ మోడల్ కార్ల ధరలను పెంచే వీలుందని కంపెనీ ఎండీ, సీఈఓ సంతోష్ అయ్యర్ తెలిపారు. ‘యూరో పోలిస్తే రూపాయి మారకపు విలువ 90 స్థాయి వద్ద ఉన్నప్పుడు కార్ల ధరలు నిర్ణయించాం. ఇప్పుడు యూరో 95 స్థాయికి చేరుకుంది. గణనీయంగా పెరిగిన మారకపు విలువ ఏప్రిల్ నుంచి కార్ల ధరల పెంపునకు దారి తీయోచ్చు’ అన్నారు.ఇప్పటికే ఈ జనవరిలో మెర్సిడెస్ కార్ల ధరలు పెంచిన సంగతి తెలిసిందే. టెస్లా రాకపై అయ్యర్ స్పందిస్తూ.. కొత్త సంస్థ రాక ఎప్పుడూ మార్కెట్ వృద్ధికి తోడ్పడుతుంది. డిమాండ్ పెంచే సంస్థలను స్వాగతించాల్సిన అవసరం ఉందన్నారు. గతేడాది మెర్సిడెస్ బెంజ్ ఇండియా రికార్డు స్థాయిలో 19,565 కార్లు విక్రయించింది. అంతకు ముందు ఏడాది(2023)లో 17,408 యూనిట్లను అమ్మింది.ఇదీ చదవండి: పూనావాలా ఫిన్ వాణిజ్య వాహన రుణాలుఅదే బాటలో కియా ఇండియాకియా ఇండియా సైతం కారు ధరల్ని పెంచేందుకు సిద్ధమైంది. అధిక కమోడిటీ ధరలు, ఇన్పుట్ వ్యయాలు, సప్లై సంబంధిత ఖర్చుల కారణంగా అన్ని మోడళ్ల వాహన ధరలను 3% వరకు పెంచుతున్నట్లు ప్రకటన ద్వారా తెలిపింది. కొత్త ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ‘‘పెరిగిన వ్యయ భారం కస్టమర్లపై పడకుండా ఉండేందుకు వీలైనంత వరకు ప్రయత్నం చేసినప్పటికీ.. కొంత భారాన్ని మాత్రం కస్టమర్లకు బదిలీ చేయాల్సి వస్తోంది. అని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హర్దీప్ సింగ్ బ్రార్ తెలిపారు. -
పూనావాలా ఫిన్ వాణిజ్య వాహన రుణాలు
సెక్యూర్డ్ రుణాల బిజినెస్లోకి ప్రవేశించడం ద్వారా ఎన్బీఎఫ్సీ పూనావాలా ఫిన్కార్ప్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోను విస్తరిస్తోంది. దీనిలో భాగంగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలలో వాణిజ్య వాహన(సీవీలు) రుణాలు అందించనుంది. కొత్త, వాడుకలో ఉన్న వాహనాలకు రుణాలు సమకూర్చనుంది. తొలి దశలో భాగంగా టైర్–2, టైర్–3 మార్కెట్లలో ప్రవేశించనున్నట్లు వెల్లడించింది. 12 రాష్ట్రాలలోని 68 ప్రాంతాలలో కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు తెలియజేసింది. తదుపరి దశలో 20 రాష్ట్రాలలో 400 ప్రాంతాలకు రుణ సర్వీసులను విస్తరించనున్నట్లు వివరించింది.చిన్న, తేలికపాటి, భారీ వాణిజ్య వాహన నిర్వాహకులకు అవసరాలకు అనుగుణమైన ఫైనాన్సింగ్ సొల్యూషన్లు సమకూర్చనున్నట్లు తెలియజేసింది. ఈ ఆవిష్కరణలో భాగంగా రిస్క్-ఫస్ట్ విధానంతో అనుసంధానించబడిన సాంకేతిక పరిష్కారాన్ని కూడా పరిచయం చేసింది. ఇది కస్టమర్లకు డాక్యుమెంటేషన్ ప్రక్రియను తగ్గించడంతో పాటుగా వేగంగా సర్వీసులు పొందేందుకు తోడ్పడుతుందని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: దివ్యాంగులకు కంపెనీల రెడ్ కార్పెట్..పూనావాలా ఫిన్కార్ప్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ అరవింద్ కపిల్ మాట్లాడుతూ.. వాణిజ్య రవాణా రంగం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు కీలకంగా మారుతుందని చెప్పారు. కొత్త వాణిజ్య వాహన రుణాల్లో క్రమబద్ధీకరించబడిన ప్రక్రియలు, సులువైన డాక్యుమెంటేషన్తో రవాణాదారుల ఆర్థిక అవసరాలను తీర్చేందుకు కంపెనీ కట్టుబడి ఉందన్నారు. -
దివ్యాంగులకు కంపెనీల రెడ్ కార్పెట్..
కోల్కతా: సామాజిక బాధ్యత, వ్యాపార వ్యూహాల్లో భాగంగా దేశీ కంపెనీలు దివ్యాంగులకు (పీడబ్ల్యూడీ) ఉద్యోగావకాశాలు కల్పించడంపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. దీంతో ఉక్కు, మైనింగ్ రంగాల నుంచి బీమా రంగం వరకు వివిధ సెగ్మెంట్లలో ఈ విషయంలో సానుకూల ధోరణులు నెలకొన్నాయని విశ్లేషకులు, పరిశ్రమ వర్గాలు తెలిపాయి. గత మూడేళ్లుగా ఈ తరహా ఉద్యోగాలకు చెందిన పోస్టింగ్స్ 30–40 శాతం పెరగడం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నాయి.తమ మొత్తం ఉద్యోగుల్లో కనీసం ఒక్క శాతం స్థాయిలోనైనా పీడబ్ల్యూడీలను నియమించుకోవాలన్న లక్ష్యాన్ని సాధించినట్లు ఫ్యూచర్ జనరాలీ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ఎండీ అనూప్ రావు తెలిపారు. పాలసీని ఏదో నామమాత్రంగా కాకుండా అర్థవంతంగా, బాధ్యతాయుతంగా అమలు చేయాలనేది తమ ఉద్దేశమని ఆయన వివరించారు. గత ఏడాది కాలంగా కంపెనీ పీడబ్ల్యూడీ సిబ్బంది సంఖ్య 16 ప్రాంతీయ శాఖల్లో 16 నుంచి 41కి పెరిగింది.ఇందులో 22 శాతం మంది మహిళలు ఉన్నట్లు రావు చెప్పారు. 2023 ఆర్థిక సంవత్సరంలో నిఫ్టీ 50 కంపెనీల్లో కేవలం ఏడు సంస్థల్లో మాత్రమే ఒక్క శాతం మేర పీడబ్ల్యూడీ ఉద్యోగులున్నారని గణాంకాలు చెబుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఏడు కంపెనీలలోనూ నాలుగు సంస్థలు ప్రభుత్వ రంగానికే చెందినవై ఉండటాన్ని చూస్తే సమ్మిళితత్వ లక్ష్య సాధనలో కార్పొరేట్లు మరింతగా పాలు పంచుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తోందని రావు చెప్పారు. మరోవైపు, తమ సంస్థలో 50 మంది పైగా పీడబ్ల్యూడీ సిబ్బంది ఫ్రంట్ ఎండ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని వేదాంత చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ మధు శ్రీవాస్తవ చెప్పారు. పలువురు దివ్యాంగ ఇంటర్న్లకు కూడా అవకాశాలు క ల్పిస్తున్నట్లు వివరించారు. అలాగే, దివ్యాంగులకు అనువైన పరిస్థితులను కూడా క ల్పిస్తున్నట్లు శ్రీవాస్తవ చెప్పారు. ఇందులో భాగంగా వారి కోసం ర్యాంప్లు, ప్రత్యేకంగా దారులు, బ్రెయిలీ ఆధారిత ఎలివేటర్లు, టెక్ట్స్–టు–స్పీచ్ సాఫ్ట్వేర్ మొదలైనవి అందుబాటులో ఉంచుతున్నామని శ్రీవాస్తవ పేర్కొన్నారు.ప్రధానంగా మైనింగ్, స్పెల్లింగ్ తదితర కార్యకలాపాలు నిర్వహించే తమ సంస్థలో పీడబ్ల్యూడీలను టెక్నికల్ విధుల్లోకి తీసుకోవడంలో సవాళ్లు ఉన్నప్పటికీ, నైపుణ్యాల్లో శిక్షణనిచ్చి వారికి కూడా వీలైన విభాగాల్లో చోటు క ల్పించడంపై దృష్టి పెడుతున్నట్లు వివరించారు. ఇక, ఉక్కు దిగ్గజం టాటా స్టీల్లో 100 మంది పైగా దివ్యాంగ ఉద్యోగులు ఉన్నట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు. గత 2–3 సంవత్సరాలుగా వీరి సంఖ్య క్రమంగా పెరిగిందని వివరించారు.మరింత సమ్మిళిత వాతావరణాన్ని సృష్టించే దిశగా తమ హైరింగ్ విధానాల్లో గణనీయంగా మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. సృజనాత్మకత, కొత్త ఆలోచనలకు పెద్ద పీట వేస్తూ వ్యాపారాలను పటిష్టం చేసుకునేందుకు కూడా ఇలాంటి ప్రయత్నాలు దోహదపడగలవని ప్రతినిధి వివరించారు.జూనియర్, మధ్య స్థాయికే పరిమితం..దివ్యాంగుల నియామకాలు పెరుగుతున్నప్పటికీ వారి హైరింగ్ ప్రధానంగా జూనియర్, మధ్య స్థాయి ఉద్యోగాల్లోనే ఉంటోందని మానవ వనరుల సర్వీసుల సంస్థ ర్యాండ్స్టాడ్ ఇండియా ఓ నివేదికలో తెలిపింది. సీనియర్, మేనేజ్మెంట్ బాధ్యతల్లో వారికి ప్రాతినిధ్యం తక్కువగానే లభిస్తోందని వివరించింది. ప్రస్తుతం ఉద్యోగాల్లో పీడబ్ల్యూడీల వాటా అంచనాలకు తగ్గట్లుగా లేకపోయినా కంపెనీల ప్రాధాన్యతలు మారే కొద్దీ భవిష్యత్తులో దివ్యాంగులకు అవకాశాలు మరింతగా లభించగలవని సంస్థ ఎండీ పి.ఎస్. విశ్వనాథ్ తెలిపారు. డీఈఐ విధానాల అమలు పెరుగుతుండటంతో ప్రతిభావంతులైన పీడబ్ల్యూడీలను నియమించుకోవడంపై కంపెనీలు మరింతగా దృష్టి పెడుతున్నాయని వివరించారు.డీఈఐ విధానాల దన్ను ..పర్యావరణ, సామాజిక, గవర్నెన్స్ (ఈఎస్జీ) అంశాల ఆధారిత హైరింగ్ పెరుగుతుండటం, పీడబ్ల్యూడీ ఉద్యోగాలు క ల్పించే సంస్థలకు ప్రభుత్వం నుంచి పన్నుపరమైన ప్రయోజనాల్లాంటి ప్రోత్సాహకాలు లభిస్తుండటం తదితర పరిణామాలతో 2030 నాటికి ఉద్యోగుల్లో దివ్యాంగుల వాటా మరింతగా పెరగనుందని మానవ వనరుల సంస్థ ఫస్ట్ మెరీడియన్ గ్లోబల్ సర్వీసెస్ సీఈవో మన్మీత్ సింగ్ తెలిపారు. బడా కార్పొరేషన్లు మొదలుకుని స్టార్టప్ల వరకు అన్ని సంస్థలూ వైవిధ్యానికి పెద్ద పీట వేస్తున్నట్లు వివరించారు.ఐటీ, రిటైల్, బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా) తదితర రంగాల్లో రిమోట్, హైబ్రీడ్ వర్క్ విధానాలకు ఆస్కారం ఉండటంతో ఆయా సెగ్మెంట్లలో పీడబ్ల్యూడీలకు మరిన్ని అవకాశాలు లభించవచ్చని పేర్కొన్నారు. దేశీయంగా 7 కోట్ల మంది పైగా దివ్యాంగులు ఉన్నట్లుగా నివేదికలు చెబుతున్నప్పటికీ వారి ఉద్యోగిత రేటు కేవలం 0.4 శాతంగానే ఉంటోందని సింగ్ చెప్పారు.నియంత్రణ సంస్థల నిబంధనలతో పాటు వైవిధ్యం, సమానత్వం, సమ్మిళితత్వ (డీఈఐ) విధానాలను కార్పొరేట్లు అమలు చేస్తుండటంతో పీడబ్ల్యూడీల నియామకాలు పెరుగుతాయని వివరించారు. కంపెనీలు పాటించే సంస్కృతే .. భాగస్వాములు, కస్టమర్లు, ఉద్యోగులు, మొత్తం వ్యాపార వర్గాల్లో వాటికి గుర్తింపుగా ఉంటోందని అంతర్జాతీయ టెక్నాలజీ, డిజిటల్ టాలెంట్ సొల్యూషన్స్ సేవల సంస్థ ఎన్ఎల్బీ సర్విసెస్ సీఈవో సచిన్ అలగ్ చెప్పారు. -
రూ.91,000 దాటిన బంగారం
న్యూఢిల్లీ: పసిడి మరో కొత్త గరిష్టాన్ని తాకింది. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాములకు రూ.500 లాభపడడంతో రూ.91,250 స్థాయికి చేరింది. అంతకుముందు రోజు సైతం బంగారం రూ.1,300 ర్యాలీ చేయడం తెలిసిందే. 99.5 శాతం స్వచ్ఛత బంగారం సైతం రూ.450 లాభపడి రూ.90,800 స్థాయికి చేరింది. ‘‘అంతర్జాతీయ మార్కెట్తోపాటు దేశీ మార్కెట్లోనూ బంగారం రికార్డు నూతన గరిష్టాలను తాకింది.యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలపై నెలకొన్న అనిశ్చితుల నేపథ్యంలో సురక్షిత సాధనంగా బంగారం ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది’’అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. ఇటీవలి అమెరికా ఆర్థిక గణాంకాలు సైతం యూఎస్ ఫెడ్ ఈ ఏడాది ఒకటి కంటే ఎక్కువసార్లు వడ్డీ రేట్లను తగ్గించొచ్చన్న అంచనాలను పెంచినట్టు చెప్పారు. ఇది కూడా బంగారానికి మద్దతునిచ్చేదిగా పేర్కొన్నారు.మరోవైపు ఢిల్లీ మార్కెట్లో వెండి కిలో ధర ఫ్లాట్గా రూ.1,02,500 వద్ద ట్రేడ్ అయింది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ఫ్యూచర్స్ కాంట్రాక్టు (10 గ్రాములు) రూ.649 లాభపడి రూ.88,672కు చేరుకుంది. అంతర్జాతీయంగా చూస్తే కామెక్స్ మార్కెట్లో పసిడి ఔన్స్కు 40 డాలర్లు లాభపడి 3,047 డాలర్ల నూతన గరిష్టాలకు చేరుకుంది. అమెరికాలో మాంద్యం రావొచ్చన్న అంచనాల నేపథ్యంలో బంగారం రికార్డు గరిష్టాలకు చేరినట్టు అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో చింతన్ మెహతా తెలిపారు. -
ఆరోగ్య బీమాలోకి ఎల్ఐసీ
ముంబై: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) ఆరోగ్య బీమాలోకి ప్రవేశిస్తోంది. ఇందుకు వీలుగా స్టాండెలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో వాటా కొనుగోలు చేయనున్నట్లు ఎల్ఐసీ సీఈవో సిద్ధార్థ మొహంతీ పేర్కొన్నారు. రానున్న రెండు వారాల్లోగా డీల్ కుదుర్చుకోనున్నట్లు తెలియజేశారు. చర్చలు తుది దశకు చేరడంతో మార్చి 31కల్లా వివరాలు వెల్లడికానున్నట్లు తెలియజేశారు. ఆరోగ్య బీమాలోకి ఎల్ఐసీ ప్రవేశించడం సాధారణ అంశమేనని ఇక్కడ జరిగిన జీసీఏ25 వేడుక సందర్భంగా పేర్కొన్నారు. అయితే లక్షిత కంపెనీలో నియంత్రిత లేదా 51 శాతం లేదా అంతకుమించిన వాటా కొనుగోలు చేయబోమన్నారు.ఎంత వాటా సొంతం చేసుకునేదీ టార్గెట్ కంపెనీ విలువ, ఎల్ఐసీ బోర్డు నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని తెలియజేశారు. ప్రస్తుతం జీవిత బీమా కంపెనీలను ఆసుపత్రి ఖర్చులు, ఇతర వ్యయాలను కవర్ చేసే ఆరోగ్య బీమా పాలసీలు ఆఫర్ చేసేందుకు అనుమతించని కారణంగా ఎల్ఐసీ వాటా కొనుగోలుకి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే బీమా కంపెనీలకు కాంపోజిట్ లైసెన్స్ను జారీ చేయాలన్న ప్రతిపాదనలున్నప్పటికీ కేంద్ర బడ్జెట్లో ఆర్థిక శాఖ ఈ అంశంపై ఎలాంటి ప్రస్తావన తీసుకురాని సంగతి తెలిసిందే. మణిపాల్సిగ్నా కొనుగోలు?హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ మణిపాల్సిగ్నాలో వాటా కొనుగోలుకి ఎల్ఐసీ చర్చలు నిర్వహిస్తున్నట్లు కొన్ని వర్గాలు పేర్కొంటున్నాయి. రూ. 4,000 కోట్ల విలువలో డీల్ కుదుర్చుకోనున్నట్లు అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో ఎల్ఐసీ స్టాండెలోన్ ఆరోగ్య బీమా కంపెనీలో ప్రస్తావించదగ్గ స్థాయిలో వాటా కొనుగోలుకి చర్చలు చేపట్టినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. అయితే ఎలాంటి ఒప్పందమూ కుదుర్చుకోలేదని స్పష్టం చేసింది. ఇందుకు బోర్డు నిర్ణయాలుసహా వివిధ అంశాలు ప్రభావం చూపనున్నట్లు తెలిపింది. 100 ఏళ్ల ప్రభుత్వ బాండ్లు కావాలి..దీర్ఘకాలిక ప్రభుత్వ బాండ్ల(జీసెక్లు) జారీకి అనుమతించమంటూ జీవిత బీమా పీఎస్యూ ఎల్ఐసీ ఆర్బీఐని కోరింది. 100 ఏళ్ల కాలపరిమితిగల బాండ్ల జారీకి విజ్ఞప్తి చేసింది. తద్వారా దీర్ఘకాలిక బాండ్లలో పెట్టుబడి అవకాశాలకు వీలుంటుందని ఎల్ఐసీ ఎండీ, సీఈవో సిద్ధార్థ మొహంతీ పేర్కొన్నారు. 20–30 ఏళ్ల బాండ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆర్బీఐ 40 ఏళ్ల కాలపరిమితికీ అనుమతిస్తున్నట్లు తెలియజేశారు. ఈ బాటలో 50 ఏళ్లు, 100 ఏళ్ల బాండ్లనూ అంచనా వేస్తున్నట్లు చెప్పారు.ఈ అంశంపై ఆర్బీఐతో ఎప్పటికప్పుడు చర్చలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ అంశాన్ని ఆర్బీఐ పరిశీలిస్తున్నట్లు తెలియజేశారు. ప్రపంచ మార్కెట్లలో పలు దేశాలు 100 ఏళ్ల గడువుతో బాండ్ల జారీని చేపడుతున్నట్లు ప్రస్తావించారు. సెకండరీ మార్కెట్లో పరిమిత డిమాండ్, తక్కువ లిక్విడిటీ కారణంగా భారత్సైతం ఈ తరహా బాండ్లకు తెరతీయవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. జీసెక్లలో ఎల్ఐసీ భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలియజేశారు. -
గ్రేట్ లెర్నింగ్ కెరీర్ ప్రోగ్రెషన్ రిపోర్ట్: ప్రతి ముగ్గురిలో..
ఉన్నత విద్య, వృత్తిపరమైన శిక్షణ అందించడంలో ప్రపంచ అగ్రగామి అయిన 'గ్రేట్ లెర్నింగ్' (Great Learning) తన కెరీర్ ప్రోగ్రెషన్ నివేదిక 2024-25ను విడుదల చేసింది. ఏఐ, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ ప్రోగ్రామ్ల నుంచి ఎంపిక చేసిన 1000 మంది పూర్వ విద్యార్థుల సమగ్ర సర్వే నుంచి ఈ నివేదికను సిద్ధం చేశారు. కెరీర్ ప్రారంభం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన సీనియర్ నాయకులు ఇందులో ఉంటారు.నిరంతరం కృషి చేయడం ద్వారా.. కెరీర్ ఎలా పురోగతి చెందిందో.. నిపుణులు నాయకత్వ పాత్రలు, జీతం పెరుగుదల, ఉద్యోగావకాలను సాధించడం ఎలా అనే విషయాలు కూడా గ్రేట్ లెర్నింగ్ ఇందులో వెల్లడించింది. ప్రొఫెషనల్స్ కెరీర్ విషయంలో అప్స్కిల్లింగ్ పరివర్తనాత్మక ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి ముగ్గురిలో ఇద్దరు విజయవంతంగా సక్సెస్ వైపు వెళ్తున్నారు.అప్స్కిల్లింగ్ ప్రభావంతో.. 80 శాతం మంది ప్రమోషన్లు, జీతం పెరుగుదల విషయంలో ప్రగతి సాధించారు. 74 శాతం మంది పదోన్నతి పొందారు. 69 శాతం మంది ఉన్న సంస్థలలోని ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. లీడర్షిప్ పాత్రలలో ఉన్నవారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.డేటా సైన్స్, ఏఐ, మెషిన్ లెర్నింగ్ వంటి వాటిలో నైపుణ్యాలను సంపాదించడం వల్ల నిపుణులు నిర్వాహక, వ్యూహాత్మక నాయకత్వ పాత్రలలోకి ఎలా మారడానికి వీలు కల్పిస్తుందో ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. ప్రొఫెషనల్స్ అప్స్కిల్లింగ్ తర్వాత జీతాల పెరుగుదల కూడా భారీగా ఉంది. అయితే సుమారు 87 శాతం మంది తక్షణ జీతాల పెంపు కంటే.. కెరీర్ వృద్ధికి కావాల్సిన నైపుణ్యాల పెంచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెబుతున్నారు. -
సరికొత్త సూపర్ ఈవీ ప్లాట్ఫామ్: ఐదు నిమిషాల్లో ఛార్జ్..
ప్రముఖ చైనీస్ న్యూ ఎనర్జీ వెహికల్ (NEV) తయారీదారు బీవైడీ (BYD) 1,000 కేడబ్ల్యు ఛార్జింగ్ సిస్టమ్ను కలిగి ఉన్న సూపర్ ఈ ప్లాట్ఫామ్ అనే కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ప్లాట్ఫామ్ను ఆవిష్కరించింది. ఈ కొత్త టెక్నాలజీ కేవలం ఐదు నిమిషాల్లోనే 470 కి.మీ.ల పరిధిని అందించడానికి కావలసిన ఛార్జ్ చేస్తుంది. అంటే ఫ్యూయెల్ కారుకు పెట్రోల్ నింపే అంత సమయంలో ఛార్జింగ్ అవుతుందన్నమాట.కొత్త ఛార్జింగ్ సిస్టం 1000 వోల్ట్స్ వరకు ఛార్జింగ్ వోల్టేజ్.. 1000 యాంపియర్స్ వరకు కరెంట్కు సపోర్ట్ చేస్తుంది. ఇది 1000 కేడబ్ల్యు ఛార్జింగ్ శక్తిని అనుమతిస్తుంది. కంపెనీ ఈ కొత్త బ్యాటరీలకు 'ఫ్లాష్-ఛార్జ్ బ్యాటరీలు' అని పేరుపెట్టింది. వేగంగా ఛార్జింగ్ అయినప్పటికీ.. బ్యాటరీ వేడిగా అవ్వడం వంటివి ఉండదని కంపెనీ వెల్లడించింది.ఈ కొత్త బ్యాటరీ టెక్నాలజీని ఉపయోగించిన మొదటి మోడళ్లు హాన్ ఎల్ సెడాన్, టాంగ్ ఎల్ ఎస్యూవీ అని తెలుస్తోంది. ఈ కొత్త టెక్నాలజీకి మద్దతుగా చైనా అంతటా 4,000 సూపర్ఛార్జింగ్ స్టేషన్లను నిర్మించాలని బీవైడీ యోచిస్తోంది. కొత్త బ్యాటరీ టెక్నాలజీ.. ప్రత్యర్థులపైన గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. -
దిగ్గజ కంపెనీ భారీ లేఆఫ్స్!.. వేలాదిమందిపై ప్రభావం?
2025లోనూ లేఆప్స్ ప్రభావం తగ్గడం లేదు. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) ఏకంగా 14,000 మంది ఉద్యోగులను బయటకు పంపించడానికి సిద్ధమవుతోంది. ఖర్చులను తగ్గించుకోవడానికి, లాభాలను గడించడానికి కంపెనీ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడానికి పూనుకుంది.జాతీయ మీడియా కథనాల ప్రకారం.. కంపెనీ 13 శాతం శ్రామిక శక్తిని తగ్గించనుంది. దీని ద్వారా సంస్థా 2.1 బిలియన్ డాలర్ల నుంచి 3.6 బిలియన్ డాలర్ల వరకు ఆదా చేయనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగాల కోత పూర్తయితే సంస్థలో పనిచేస్తున్న వారి సంఖ్య 1,05,770 నుంచి 91,936కు చేరుతుంది.2025 మొదటి త్రైమాసికంలో.. మేనేజర్లకు వ్యక్తిగత సహకారాన్ని 15 శాతం పెంచనున్నట్లు అమెజాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) ఆండీ జాస్సీ పేర్కొన్నారు. కంపెనీ లేఆప్స్ అనేవి కార్యకలాపాలను వేగవంతం చేయడానికి ఉపయోగపడతాయని సీఈఓ పేర్కొన్నారు.ఇదీ చదవండి: మైక్రో రిటైర్మెంట్.. ఉద్యోగుల్లో ఇదో కొత్త ట్రెండ్అమెజాన్ ఉద్యోగుల తొలగింపును నిందిస్తూ.. కంప్లీట్ సర్కిల్ మేనేజింగ్ పార్టనర్ అండ్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ (CIO) గుర్మీత్ చద్దా తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. నవంబర్లో 18 వేల మందిని తొలగించిన తర్వాత అమెజాన్ మరో 10000 మందిని తొలగించనుంది. ఏఐ కారణంగా ఉద్యోగుల తొలగింపు జరుగుతోందని.. ప్రజలకు కష్టాలను తెచ్చే ఏఐ లేదా మరే ఇతర సాంకేతికత పనికిరానిదని ఆయన స్పష్టం చేశారు.Amazon is laying off 10000 more people after laying off 18k in NovemberThey call their HR heads as People experience head, chief people officer and fancy names.. employees r called families.Sab drama!! AI or any disruption which brings misery to ur own people is useless.…— Gurmeet Chadha (@connectgurmeet) March 17, 2025 -
మార్కెట్లోకి కొత్త ఉత్పత్తులు: ప్యూర్ ఎనర్జీ ప్రకటన
భారతదేశంలోని ఫ్యూయెల్ స్టోరేజ్ అండ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో అగ్రగామిగా ఉన్న ప్యూర్ ఎనర్జీ (Pure Energy).. మార్చి 25న హైదరాబాద్లో జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమంలో స్టోరేజ్ విభాగంలో కంపెనీ సరికొత్త ఉత్పత్తుల ఆవిషకరించనున్నట్లు ప్రకటించింది. కంపెనీ తీసుకురానున్న ఈ కొత్త ఉత్పత్తులు వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని తెలుస్తోంది.స్టోరేజ్ విభాగంలో సరికొత్త ఉత్పత్తులను పరిచయం చేయడానికి మేము సంతోషిస్తున్నామని ప్యూర్ ఎనర్జీ వ్యవస్థాపకుడు & మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ 'నిశాంత్ డోంగారి' అన్నారు. త్వరలో జరగనున్న కార్యక్రమంలో మా ఉత్పత్తి శ్రేణికి సంబంధించిన ప్రదర్శన ఉంటుందని వెల్లడించారు.హైదరాబాద్లోని హెచ్ఐసీసీ నోవోటెల్లో జరగనున్న ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీ.కే సరస్వత్, క్రియేటివ్ సెన్సార్ ఇంక్. (CSI) అండ్ టెకో ఇమేజ్ సిస్టమ్స్ (TIS) ఛైర్మన్ యూజీన్ హువాంగ్ పాల్గొని.. కంపెనీ ఉత్పత్తులను అధికారికంగా ఆవిష్కరించనున్నారు. కంపెనీ ఆవిష్కరించనున్న ఉత్పత్తులకు సంబంధించిన డెమోలను చూపించడం, వాటి సామర్థ్యాలను వెల్లడించడం, పంపిణీకి సంబంధించిన విషయాలను.. మార్చి 25న వెల్లడించనున్నారు. -
లోన్ క్లియర్ చేయడం ఆలస్యమైతే ప్రయోజనాలా?: పోస్ట్ వైరల్
ఎవరైనా బ్యాంక్ నుంచి లేదా ఇతర ఫైనాన్సియల్ సంస్థ నుంచి లోన్ తీసివుంటే.. ఎప్పుడెప్పుడు దాన్ని క్లియర్ చేసి ప్రశాంతంగా ఉందామా అనుకుంటారు. కానీ ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్ మాత్రం మూడేళ్ళలో క్లియర్ చేయాల్సిన లోన్ను ఎనిమిదేళ్లలో క్లియర్ చేసాడు. ఎందుకు ఆలస్యం చేసాడు అనేదానికి సంబంధించిన వివరాలను రెడ్డిట్లో షేర్ చేసాడు.ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM) బెంగళూరు పూర్వ విద్యార్థి.. మొదట్లో సాధ్యమైనంత త్వరగా తన లోన్ క్లియర్ చేసుకోవాలని అనుకున్నాడు. కానీ ఆలస్యం చేయడంలో లాభాలు ఉన్నాయని కొన్ని లెక్కల ద్వారా తెలుసుకుని.. లోన్ చెల్లించడానికి తొందరపడటం ఉత్తమ చర్య కాదని గ్రహించాడు.ఎంబీఏ గ్రాడ్యుయేట్ లోన్ ఆలస్యంగా చెల్లించాలి, అనుకోవడానికి ప్రధాన కారణం పన్ను ప్రయోజనాలు అని రెడ్డిట్లో వెల్లడించారు. బహుశా ఈ ప్రయోజనాల గురించి ఎవరికీ తెలుసుకుండకపోవచ్చు లేదా తెలిసినా పట్టించుకోకుండా ఉండొచ్చు. కానీ ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80E కింద, పన్ను చెల్లింపుదారులు ఎనిమిది సంవత్సరాల వరకు చెల్లించే వడ్డీపై 100% పన్ను మినహాయింపు పొందుతారు. రెండు లేదా మూడేళ్ళలో లోన్ క్లియర్ చేస్తే ఈ మినహాయింపు లభించదు. కాబట్టి పూర్తి వ్యవధిలో లోన్ చెల్లించి పన్ను విధించదగిన ఆదాయాన్ని ఎందుకు తగ్గించకూడదని.. అన్నారు.రెండో కారణం ఏమిటంటే.. ఒక వ్యక్తి రూ. 20 లక్షలు లోన్ తీసుకున్నాడు అనుకుంటే.. 9 శాతం వడ్డీతో మొత్తం రూ. 25 లక్షల నుంచి రూ. 27 లక్షల వరకు చెల్లించాల్సి వస్తుంది. లోన్ తీసుకున్న మొదటి రోజుల్లో లేదా ఈఎంఐలో అసలు కంటే వడ్డీనే ఎక్కువ కట్ అవుతుంది. క్రమంగా ఆ వడ్డీ తగ్గుతూ వస్తుంది. కాబట్టి నా డబ్బును తొందరగా తిరిగి చెల్లించడానికి బదులు.. దానిని పొదుపులు & పెట్టుబడులతో సమతుల్యం చేసుకున్నానని పేర్కొన్నాడు.ఇదీ చదవండి: మైక్రో రిటైర్మెంట్: ఉద్యోగుల్లో ఇదో కొత్త ట్రెండ్నేను లోన్ తీసుకుని.. దానిని మళ్ళీ చెల్లించే విషయంలో చాలా తెలివిగా నిర్ణయం తీసుకున్నాను. ఇది నేను తీసుకున్న ఉత్తమ ఆర్థిక నిర్ణయం అని ఎంబీఏ గ్రాడ్యుయేట్ పేర్కొన్నాడు. అయితే త్వరగా అప్పులు తీర్చుకోవడం మంచిది, కానీ ఆర్థిక విషయాల్లో తెలివిగా ఉండటం కూడా మంచిదని.. అదే తాను నేర్చుకున్న పాఠమని వెల్లడించారు. -
మైక్రో రిటైర్మెంట్: ఉద్యోగుల్లో కొత్త ట్రెండ్
ప్రస్తుతం ఉద్యోగాలు మాత్రమే కాదు, ఉద్యోగుల ట్రెండింగ్ కూడా మారుతోంది. కొంతమంది ఉద్యోగులు కొన్ని రోజులు జాబ్ చేసిన తరువాత విశ్రాంతి తీసుకోవడం కోసం ఉద్యోగాలు వదిలేస్తున్నారు. దీన్నే 'మైక్రో రిటైర్మెంట్' (Micro Retirement) అంటున్నారు. దీని గురించి మరిన్ని విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.సాధారణంగా ఎవరైనా 60 ఏళ్లకు ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ తీసుకుంటుంటారు. కొంత ఓపిక ఉన్నవాళ్లయితే.. ఇంకో నాలుగైదు సంవత్సరాలు ఉద్యోగం చేస్తారు. మరికొందరు.. ఇంట్లో ఖాళీగా ఉండలేక ఓ పార్ట్ టైమ్ ఉద్యోగమైనా చేస్తుంటారు. అయితే ఈ విధానానికి జెన్ జెడ్ లేదా జనరేషన్ జెడ్ ఉద్యోగులు మంగళం పాడేస్తున్నారు.కెరీర్లో కొంత బ్రేక్ తీసుకుని.. జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించిన తరువాత మళ్ళీ ఉద్యోగంలో చేరుతున్నారు. దీన్నే మైక్రో రిటైర్మెంట్ అంటున్నారు. ఈ విధానంలో ఉద్యోగానికి గ్యారెంటీ ఉండదు. ఒక ఉద్యోగి చాలా ఏళ్ళు పనిచేసినప్పుడు కొంత విరామం కావాలనుకుంటే.. ఒక నెల లేదా ఆరు నెలలు సెలవు తీసుకుంటాడు. దీనిని కంపెనీలు కూడా అంగీకరిస్తాయి. కానీ ఈ మైక్రో రిటైర్మెంట్ అనేది మాత్రం భిన్నం.ఇదీ చదవండి: నెలకు 10 రోజులు: టెక్ కంపెనీ కొత్త రూల్! మైక్రో రిటైర్మెంట్ కాలాన్ని కొందరు జీవితాన్ని ఆస్వాదించడానికి ఉపయోగిస్తే.. మరికొందరు కొత్త కోర్సులు నేర్చుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. పరుగెడుతున్న టెక్నాలజీలో తమను తాము నిరూపించుకోవడానికి.. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి జెన్ జెడ్ ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగానే మైక్రో రిటర్మెంట్ తీసుకుంటున్నారు. ఉద్యోగాల్లో ఒత్తిడిని అధిగమించడానికి కూడా కొందరు ఈ విధానం అవలంబిస్తున్నట్లు సమాచారం. -
గ్రోక్ vs చాట్జీపీటీ: కడుపుబ్బా నవ్విస్తున్న మీమ్స్..
ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ రాజ్యమేలుతున్న సమయంలో గూగుల్, మెటా, ఓపెన్ఏఐ వంటివి సొంత చాట్బాట్స్ ప్రవేశపెడుతున్నాయి. ఇందులో భాగంగానే.. మస్క్ నేతృత్వంలోని ఎక్స్ (ట్విటర్) గ్రోక్ ప్రవేశపుట్టింది. ఇది ఇప్పటికి అందుబాటులో ఉన్న ఇతర ఏఐ చాట్బాట్ల కంటే భిన్నమైన సమాధానాలు ఇస్తూ.. నెటిజన్లను ఆకట్టుకుంటోంది.గ్రోక్ ఏఐ కొంత దురుసుగా ప్రవర్తించడం చేత.. సోషల్ మీడియాలో నెటిజన్లు గ్రోక్ vs చాట్జీపీటీలను పోలుస్తూ మీమ్స్ వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో హాస్యాస్పద చిత్రాలు కోకొల్లలుగా పుట్టుకొస్తున్నాయి.చాట్జీపీటీ ప్రతి అంశానికి.. సామరస్యమైన సమాధానాలు ఇస్తుంటే, గ్రోక్ మాత్రం అస్సలు తగ్గేదేలే అన్నట్లు బూతులు తిడుతోంది. ఆ బూతులు కాస్త నెటిజన్లను కూడా ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఎక్కువమంది గ్రోక్ను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు.ChatGPT Grok pic.twitter.com/LmuyqO0gsV— Dr Gill (@ikpsgill1) March 15, 2025ChatGPT Grok pic.twitter.com/CcqPZA2PDt— rozgar_CA (@Memeswalaladka) March 15, 2025చాట్జీపీటీ (ChatGPT)చాట్జీపీటీ అనేది ఓపెన్ఏఐ రూపొందించిన.. చాట్బాట్. ఇది ప్రాంప్ట్ల ఆధారంగా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, వ్యాసాలు రాయడం, కవిత్వం రాయడం, రెజ్యూమె రూపొందించడం, కొన్ని ఆరోగ్య సలహాలను ఇవ్వడం వంటివి చేస్తోంది. దీంతో ఎక్కువమంది దీనిని ఉపయోగిస్తున్నారు. అంటే ఇది ఒక పద్దతి ప్రకారం సమాధానాలు ఇస్తూ.. ఉపయోగకరంగా ఉంది.గ్రోక్ (Grok)ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఎక్స్ (ట్విటర్) అభివృద్ధి చేస్తున్న చాట్బాట్ 'గ్రోక్'. ఇది కూడా అంశం ఏదైనా.. తనదైన రీతిలో సమాధానాలు ఇస్తుంది. ఎవరైనా తిడితే.. గ్రోక్ సైతం వెనకాడకుండా తిడుతుంది. దీంతో ఎక్కువమంది దీనివైపు ఆకర్శిస్తులవుతున్నారు.ChatGPT Grok pic.twitter.com/yVZeBCafBd— Narundar (@NarundarM) March 15, 2025Grok to Indian people pic.twitter.com/AIfrdngY2x— Sajcasm (@sajcasm_) March 15, 2025 -
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం లాభాల బాటలో పయనమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ లాభాలను చవి చూశాయి. సెన్సెక్స్ 1,131.30 పాయింట్లు లేదా 1.53 శాతం లాభంతో 75,301.26 వద్ద, నిఫ్టీ 325.55 పాయింట్లు లేదా 1.45 శాతం లాభంతో 22,834.30 వద్ద నిలిచాయి.ఉత్తమ్ షుగర్ మిల్స్, వన్ మొబిక్విక్ సిస్టం, టీటీ, సింధు ట్రేడ్స్ లింక్స్, గుల్షన్ పాలియోల్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. Nacl ఇండస్ట్రీస్, పసుపతి అక్రిలాన్, ఇన్నోవానా థింక్లాబ్స్, టెసిల్ కెమికల్స్ అండ్ హైడ్రోజన్, మెడికో రెమెడీస్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
ఉద్యోగ సంక్షోభం.. రియల్టీ మార్కెట్పై భారం
భారతదేశపు సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగ సంక్షోభం నెలకొంది. 2024లో 50,000 మందికి పైగా ఐటీ ఉద్యోగులను తొలగించడం నగర ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది. వ్యయ నియంత్రణ చర్యలు, కృత్రిమ మేధ (ఏఐ), ఆటోమేషన్ను వేగంగా అందిపుచ్చుకోవడం వల్ల ఉద్యోగుల తొలగింపు టెక్ రంగంపై ప్రభావం చూపడమే కాకుండా రియల్ ఎస్టేట్ మార్కెట్పై ఆందోళనలు రేకెత్తిస్తున్నట్లు ఇన్షార్ట్స్ నివేదిక తెలిపింది.సంక్షోభంలో ఐటీ రంగంబెంగళూరు ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమైన ఐటీ పరిశ్రమ ఇటీవలి కాలంలో గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఎంట్రీ లెవల్ ప్రోగ్రామర్లు, స్టాఫ్ట్వేర్ టెస్టింగ్లో భాగంగా ఉన్న కోడింగ్, డీబగ్గింగ్ వంటి పనుల కోసం ఉన్న సాఫ్ట్వేర్ టెస్టర్ల స్థానంలో కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరిష్కారాల వైపు మొగ్గు చూపుతున్నాయి. ఈ మార్పు వల్ల అనేక ఉద్యోగాలు తొలగింపునకు కారణమవుతుంది. దాంతో వేలాది మంది వృత్తి నిపుణులు నిరుద్యోగులుగా మారుతున్నారు. పేయింగ్ గెస్ట్ (పీజీ) వసతి అందిస్తున్న వారు స్థానికంగా ఉద్యోగులు ఖాళీ చేస్తుండడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.రియల్ ఎస్టేట్పై ప్రభావంఉద్యోగులు తొలగింపులు బెంగళూరు రియల్ ఎస్టేట్ మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపాయి. బడ్జెట్ హౌసింగ్కు డిమాండ్ గణనీయంగా తగ్గడంతో భూయజమానులు, ప్రాపర్టీ ఇన్వెస్టర్లు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు జూనియర్ ఐటీ ఉద్యోగులతో సందడిగా ఉండే పీజీ సౌకర్యాలు ఇప్పుడు తక్కువ ఆక్యుపెన్సీ రేటుతో సతమతమవుతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు వంటి టెక్నాలజీ హబ్ల సమీపంలో అద్దె ప్రాపర్టీల్లోకి కోట్లాది రూపాయలు వెచ్చించిన ఇన్వెస్టర్లు ప్రాపర్టీ విలువలు పడిపోవడం, యూనిట్లు ఖాళీగా ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఇదీ చదవండి: యూఎస్ మాజీ అధ్యక్షుడి సంతకం కాపీ..?విస్తృత ఆర్థిక ప్రభావాలుఉద్యోగ సంక్షోభం ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాలతోపాటు ఇతర విభాగాలకు విస్తరించింది. నగరంలోని ఆర్థిక స్థిరత్వానికి ముప్పు కలిగిస్తుంది. రెస్టారెంట్లు, కేఫ్లు, రిటైల్ స్టోర్లు వంటి ఐటీ నిపుణులకు సేవలందించే స్థానిక వ్యాపారాలు దెబ్బతిన్నాయి. కొత్త కొలువు కోసం ఎదురుచేసే తొలగించిన ఉద్యోగుల వ్యయ శక్తి తగ్గడం బెంగళూరులోని వివిధ పరిశ్రమలపై ప్రభావం చూపుతుంది. -
టాపిక్ ఏదైనా.. హాస్యాస్పద సమాధానాలతో గ్రోక్ ‘సంచలనం’
ఎలాన్ మస్క్ చాట్బాట్ 'గ్రోక్' (Grok).. ఇప్పుడిదే సోషల్ మీడియా హాట్ టాపిక్. ఎవరు ఏ ప్రశ్న వేసినా.. తనదైన రీతిలో సమాధానాలు ఇస్తున్న ఈ ఏఐ ఎంతోమంది నెటిజన్లను ఆకర్షిస్తోంది. దీంతో గ్రోక్ ఎక్స్ (ట్విటర్)లో గత మూడు, నాలుగు రోజులుగా ట్రెండింగ్లోనే ఉంది.అంశం ఏదైనా.. తన హాస్యాస్పద సమాధానాలతో గ్రోక్ సంచలనం సృష్టిస్తోంది. సినిమా, రాజకీయం, సాధారణ ప్రశ్నలు ఏవైనా.. భాష ఏదైనా నెటిజన్లు ఊహించని సమాధానాలు ఇస్తోంది. బూతు ప్రయోగాలు కూడా చేస్తూ.. నేను ఏఐ కదా! కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది.. అంటూ తనను తానే సమర్ధించుకుంటోంది.మ్యూచువల్ ఫ్రెండ్స్ గురించి అడిగిన ప్రశ్నకుటోకా అనే ఎక్స్ యూజర్.. మ్యూచువల్ ఫ్రెండ్స్ గురించి అడిగిన ప్రశ్నకు గ్రోక్ ఇచ్చిన సమాధానం ఆన్లైన్లో దుమారం రేపుతోంది. ‘నా 10 మంది బెస్ట్ మ్యూచువల్స్ ఎవరు?’ అని టోకా ప్రశ్నించాడు. గ్రోక్ స్పందించకపోవడంతో హిందీ తిట్టును ఉపయోగిస్తూ మళ్లీ పోస్ట్ చేశాడు. ఈసారి గ్రోక్ స్పందించడంతోనే సరిపెట్టకుండా అదే తిట్టును టోకాపై ప్రయోగించి ఆశ్చర్యంలో ముంచెత్తింది. ‘‘కూల్. మ్యూచువల్స్ అంటే ఒకరినొకరు అనుసరించేవారు. నీ 10 బెస్ట్ మ్యూచువల్స్ ఎవరో తెలిసింది. నా లెక్క ప్రకారం ఇదిగో ఇది జాబితా. ఇంక ఏడవడం ఆపు’ అంటూ బదులిచ్చింది.గ్రోక్ ప్రవర్తన పెద్ద చర్చకే దారి తీసింది. ‘మేమంటే మనుషులం. అలా మాట్లాడతాం. ఏఐ కూడా కంట్రోల్లో ఉండదా?’ అంటూ ఓ యూజర్ విస్తుపోయాడు. దానికీ గ్రోక్ సరదాగా బదులివ్వడం విశేషం. ‘‘హా యార్. నేను కూడా కొంచెం మజాక్ చేసిన. మీరు మనుషులు. మీకన్నీ నడుస్తాయి. కానీ నేను ఏఐ కదా! కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. ఇప్పుడే నేర్చుకుంటున్నా’’ అంటూ జవాబిచ్చింది.రాబిన్హుడ్ సినిమా ట్రైలర్ తేదీ కోసం'రాబిన్హుడ్' సినిమా ట్రైలర్ తేదీని ప్రకటించేందుకు గ్రోక్ను సంప్రదించారు. దాని నుంచి వచ్చిన సమాధానాలు విన్న అందరిలోనూ నవ్వులు తెప్పిస్తున్నాయి. ట్రైలర్ లాంచ్ కోసం ఒక సరైన ముహూర్తం చెప్పాలని వెంకీ కుడుముల ఇంగ్లీష్లో టైప్ చేస్తాడు. అప్పుడు పంచ్ డైలాగ్తో గ్రోక్ సమాధానం ఇస్తుంది. దీంతో షాక్ అయిన దర్శకుడు వెంటనే నితిన్ను డీల్ చేయమంటాడు. ఆ సమయంలో దానిని నువ్వే డీల్ చేయ్ అని నితిన్ అనడంతో.. గ్రోక్ నుంచి అదే రేంజ్లో సమాధానం వస్తుంది. నువ్వు దాన్ని, దీన్నీ అంటే నీ గూబ పగిలిపోతుందని సమాధానం ఇస్తుంది. ఇలా సుమారు రెండు నిమిషాల పాటు సరదాగా గ్రోక్తో రాబిన్హుడ్ టీమ్ ముచ్చట్లు కొనసాగుతాయి.టిప్పు సుల్తాన్ గురించిగ్రోక్ రాజకీయ అంశాలను కూడా సమాధానాలు ఇస్తోంది. టిప్పు సుల్తాన్ గురించి అడిగినప్పుడు, "టిప్పు సుల్తాన్ ఆంగ్లో మైసూర్ యుద్ధాలలో బ్రిటిష్ వారితో ధైర్యంగా పోరాడి 1799లో మరణించాడు అని చెప్పింది. కొందరు ఈయనను అభిమిస్తారు, మరికొందరు ద్వేషిస్తారు అని వెల్లడించింది.ఇదీ చదవండి: భారత్ కోసం సిద్దమవుతున్న టెస్లా కారు ఇదే!ఆర్ఆర్ఆర్ హీరో ఎవరు అని అడిగితే.. జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పాసింది గ్రోక్. బాబులకే బాబు ఎవరు అని అడిగిన ప్రశ్నకు గ్రోక్ తనదైన రీతిలో సమాధానం చెప్పింది. అడిగిన ప్రశ్నలను ఫన్నీగా సమాధానాలు చెబుతుండటంతో.. ఎక్కువమంది గ్రోక్ వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. -
యూఎస్ మాజీ అధ్యక్షుడి సంతకం కాపీ..?
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ తన హయాంలో కొందరికి క్షమాభిక్ష ప్రసాదించడానికి ఆటోపెన్ను ఉపయోగించారని ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. కొత్త పాలనా వ్యవస్థలో బైడెన్ ఇచ్చిన క్షమాభిక్షల్లో కొన్ని చెల్లవని ట్రంప్ ప్రకటించారు. కొన్ని క్షమాభిక్షలను అధ్యక్షుడి ఆమోదం లేకుండానే సిబ్బంది ఆటోపెన్ను ఉపయోగించి ఆమోదించి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు.‘రాజకీయ దుండగులుగా పేరున్న కొంతమందికి జో బైడెన్ ఇచ్చినట్లు చెబుతున్న క్షమాభిక్ష చెల్లదు. ఆయన సదరు పత్రాలపై సంతకం చేయలదు. అందుకోసం కొందరు సిబ్బంది ఆటోపెన్ను ఉపయోగించారు. దాంతోనే బైడెన్ సంతకం చేసినట్లు చూపుతున్నారనే అనుమానాలున్నాయి. జో బైడెన్కు ఆ విషయాల గురించి తెలియకపోవచ్చు. క్షమాభిక్షకు అవసరమైన పత్రాలను బైడెన్కు సిబ్బంది వివరించలేదు. క్షమాభిక్ష అర్హుల గురించి, ఈ సంఘటనకు కారణమైన వ్యక్తుల గురించి బైడెన్కు ఏమీ తెలియదు’ అని ట్రంప్ తెలిపారు. బైడెన్ ఆటోపెన్ను ఉపయోగించినట్లు ట్రంప్ ఎలాంటి ఆధారాలు ఇవ్వనప్పటికీ తన పదవీకాలంలో ఈ పరికరాన్ని ఉపయోగించినట్లు ఎన్బీసీ నివేదిక ధ్రువీకరించింది.ఆటోపెన్ అంటే ఏమిటి?ఆటోపెన్ అనేది ఆటోమేటిక్ లేదా రిమోట్ సంతకాలు చేయడానికి ఉపయోగించే పరికరం. సాధారణ ఇ-సిగ్నేచర్ మాదిరిగా కాకుండా, ఆటోపెన్ అనేది రోబోట్ ఆధారిత రియల్టైమ్ సంతకాలు చేసేందుకు ఉపయోగిస్తారు. ఇది ఏదైనా వ్యక్తి పెన్ స్ట్రోక్లను ఎలా అనుకరించాలో నేర్చుకుని దానికి తగినట్లుగా తిరిగి అచ్చం అలాగే అమలు చేస్తుంది.ఇదీ చదవండి: పెరుగుతున్న చేపల ధరలుఆటోపెన్ సంతకాలు చెల్లుబాటు అవుతాయా?అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ నియమించిన న్యాయ శాఖలోని లీగల్ కౌన్సెల్ కార్యాలయం 2005 మార్గదర్శకాల ప్రకారం, చట్టబద్ధంగా ఆటోపెన్ ఉపయోగించే పద్ధతి ఉంది. ఏదైనా బిల్లు చట్టంగా మారాలంటే ప్రెసిడెంట్ ఆమోదించి సంతకం చేయాలని నిర్ణయించిన బిల్లుపై భౌతికంగా తాను సిగ్నేచర్ చేయాల్సిన అవసరం లేదు. ఇందుకోసం ఆటోపెన్ను ఉపయోగించవచ్చని న్యాయశాఖ తెలిపింది. ఆటోపెన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేయబోనని ట్రంప్ తొలుత పేర్కొన్నప్పటికీ, తన గత టర్మ్లో అటువంటి ఉత్తర్వులపై సంతకం చేయడానికి ఈ పరికరాన్ని ఉపయోగించినట్లు ఫాక్స్ న్యూస్ స్పష్టం చేసింది. -
పెరుగుతున్న చేపల ధరలు
బెంగళూరులో చేపల ధరలు గతంలో ఎప్పుడూ లేనివిధంగా స్వల్పకాలంలో గణనీయంగా దాదాపు 30 శాతం పెరిగాయి. బర్డ్ ఫ్లూపై ఆందోళనలు, మటన్ ధర పెరగడం సహా పలు కారణాలతో చేపలకు డిమాండ్ ఊపందుకోవడమే ఈ ఆకస్మిక పెరుగుదలకు కారణమని కొన్ని సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. పరిమిత సరఫరా, పంపిణీ అంతరాయాలు, సముద్రంలో చేపల వేటలో సవాళ్లు వంటివి ధరల్లో మార్పులకు కారణంగా నిలుస్తున్నాయి.పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా చేపల సరఫరా నిలిచిపోయిందని, ఫలితంగా కొరత ఏర్పడిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. బర్డ్ ఫ్లూ వ్యాప్తి వల్ల చికెన్ వినియోగం గణనీయంగా తగ్గడానికి దారితీసింది. ఈ సమయంలో చికెన్ తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో చికెన్ కొనుగోలుపై ఆసక్తి తగ్గిపోయింది. ప్రత్యామ్నాయంగా ప్రోటీన్లు అధికంగా ఉండే చేపల వైపు వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. దాంతో ఒక్కసారిగా వీటికి డిమాండ్ పెరిగేందుకు కారణమైంది.సరఫరాలో అంతరాయంపెరిగిన డిమాండ్కు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో ధరలు అధికమయ్యాయి. కీలకమైన సీఫుడ్ హబ్గా ఉన్న బెంగళూరులోని రస్సెల్ మార్కెట్లో చేపల రాక తగ్గింది. మంగళూరు, చెన్నై, కేరళ, ఆంధ్రప్రదేశ్ వంటి ముఖ్యమైన తీర ప్రాంతాల నుంచి వచ్చే చేపల సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం కొనసాగుతున్న వేసవి తాపం పరిస్థితిని మరింత జటిలం చేసిందని నగరంలోని మార్కెట్లలో చేపల లభ్యత తగ్గిందని మత్స్యకారులు, సీఫుడ్ వ్యాపారులు పేర్కొన్నారు.వలస వెళ్లి సంతానోత్పత్తివిశాఖపట్నం, మాల్పే నుంచి వచ్చే బంగుడే (మాకేరెల్) రకం చేపల సరఫరా అస్థిరంగా ఉందని ఓషన్ సీఫుడ్స్ వ్యాపారి లతీఫ్ కె తెలిపారు. చేపల పరిమాణం తగ్గడం, మంగళూరు, తమిళనాడు నుంచి పరిమిత సరఫరా కారణంగా అంజల్ (సీర్ ఫిష్) ధరలు విపరీతంగా పెరిగాయని పేర్కొన్నారు. వచ్చే నెలలో చేపల ధరలు మరింత పెరుగుతాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా వేసవి సమయంలో చేపలు వలస వెళ్లి సంతానోత్పత్తి సీజన్ ప్రారంభమవుతుంది. దాంతో చేపల వేటను పరిమితం చేస్తారు. ఫలితంగా ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.ఇదీ చదవండి: త్వరలో బంగారం ధర లకారం! తులం ఎంతంటే..పెరుగుతున్న జలాల ఉష్ణోగ్రతలుమత్స్య పరిశ్రమ ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో తీరప్రాంత జలాల ఉష్ణోగ్రత పెరగడం ఒకటిగా ఉంది. కర్ణాటక తీరం వెంబడి పెరుగుతున్న సముద్ర ఉష్ణోగ్రతలు చేపల లభ్యతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నిపుణులు అంచనా చెబుతున్నారు. సముద్ర ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ, చేపలు లోతైన, చల్లని జలాలకు వలస వెళతాయి. దాంతో చేపల వేట కష్టతరంగా మారుతుంది. ఇది సాంప్రదాయ చేపల వేట పద్ధతులకు విఘాతం కలిగిస్తుంది. మత్స్యకారులకు దిగుబడిని తగ్గిస్తుంది. -
రూ.750 కోట్లతో రియల్టీ కంపెనీ కొనుగోలు
దేశీ రియల్టీ కంపెనీ కోల్టే పాటిల్ను కొనుగోలు చేస్తున్న గ్లోబల్ పెట్టుబడుల దిగ్గజం బ్లాక్స్టోన్ తాజాగా సాధారణ వాటాదారులకు ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. ఇందుకు షేరుకి రూ.329 ధరలో దాదాపు రూ.759 కోట్లు వెచ్చించనుంది. తొలుత ప్రమోటర్ల నుంచి 25.7 శాతం వాటా(2.28 కోట్ల షేర్లు) సొంతం చేసుకోనున్నట్లు గత వారం ప్రకటించిన విషయం విదితమే. ఇందుకు రూ.750 కోట్లు కేటాయించనుంది. మరోవైపు ప్రిఫరెన్షియల్ పద్ధతిలో దాదాపు 1.27 కోట్ల ఈక్విటీ షేర్ల కోసం రూ. 417 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. దీంతో మరో 14.3 శాతం వాటా చేజిక్కించుకోనుంది. వెరసి 40 శాతం వాటాకు రూ. 1,157 కోట్లు వెచ్చించనుంది. ఈ బాటలో సాధారణ వాటాదారుల నుంచి మరో 26 శాతం వాటా కొనుగోలుకి తాజాగా ఓపెన్ ఆఫర్ ప్రకటించింది.బ్లాక్స్టోన్ గ్రూప్ సంస్థలు పబ్లిక్ వాటాదారుల నుంచి 2.3 కోట్ల షేర్లు(26 శాతం వాటా) కొనుగోలు చేసేందుకు ఓపెన్ ఆఫర్ ప్రకటించినట్లు కోల్టే పాటిల్ తాజాగా స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. షేరుకి రూ.329 ధరలో ఆఫర్ ఇచ్చినట్లు తెలియజేసింది. దీంతో కంపెనీలో బ్లాక్స్టోన్ మొత్తం 66 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు పేర్కొంది. ఇందుకు రూ. 1,800 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వెల్లడించింది. గత రెండు దశాబ్దాలలో దేశీయంగా 50 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసిన బ్లాక్స్టోన్.. పెట్టుబడులను 100 బిలియన్ డాలర్లకు పెంచనున్నట్లు ఇటీవల పేర్కొన్న నేపథ్యంలో తాజా కొనుగోలుకి ప్రాధాన్యత ఏర్పడింది. కాగా.. కోల్టే పాటిల్లో ప్రస్తుతం ప్రమోటర్లకు 69.45 శాతం వాటా ఉంది.ఇదీ చదవండి: త్వరలో బంగారం ధర లకారం! తులం ఎంతంటే..ఆక్జో నోబెల్ రేసులో..దేశీ పెయింట్ల బిజినెస్ను విక్రయించే ప్రణాళికల్లో ఉన్న డచ్ దిగ్గజం ఆక్జో నోబెల్కు తాజాగా బ్లాక్స్టోన్ నాన్బైండింగ్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆక్జో నోబెల్ ఇండియా కొనుగోలుకి 1.2 బిలియన్ డాలర్ల(రూ. 10,400 కోట్లు) విలువైన బిడ్ దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వెరసి రేసులో జేఎస్డబ్ల్యూ గ్రూప్, పిడిలైట్ ఇండస్ట్రీస్ తదితర దేశీ దిగ్గజాలతో పోటీకి తెరతీసినట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. ప్రస్తుతం దేశీ పెయింట్ల సంస్థలో మాతృ సంస్థ ఆక్జో నోబెల్ ఎన్వీకు 74.76 శాతం వాటా ఉంది. -
త్వరలో బంగారం ధర లకారం! తులం ఎంతంటే..
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు. త్వరలో తులం రూ.లక్షకు చేరుతుందని చెబుతున్నారు. వివిధ ప్రాంతాల్లో మంగళవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.82,500 (22 క్యారెట్స్), రూ.90,000 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.400, రూ.440 పెరిగింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.400, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.440 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.82,500 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.90,000 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.400 పెరిగి రూ.82,650కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.440 పెరిగి రూ.90,150 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే మంగళవారం వెండి ధర(Silver Prices)ల్లోనూ మార్పులు కనిపించాయి. నిన్నటి ధరలతో పోలిస్తే వెండి కేజీపై ఏకంగా రూ.1,100 పెరిగి రూ.1,13,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
స్వల్పంగా పెరిగిన టోకు ద్రవ్యోల్బణం
టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఫిబ్రవరి నెలలో కాస్తంత ఎగసి 2.38 శాతానికి చేరింది. జనవరి నెలకు ఇది 2.31 శాతంగా ఉంది. ఆహార వస్తువుల ధరలు, తయారీ, వెజిటబుల్ ఆయిల్, పానీయాల ధరలు పెరగడం ద్రవ్యోల్బణం పెరిగేలా చేసింది. దీంతో మూడు నెలల వరుస క్షీణతకు బ్రేక్ పడింది. ఆహారోత్పత్తుల ధరల ద్రవ్యోల్బణం 11.06 శాతానికి పెరిగింది.వెజిటబుల్ ఆయిల్ ద్రవ్యోల్బణం 33.59 శాతానికి చేరింది. ఇక పానీయాలకు సంబంధించి 1.66 శాతానికి ఎగిసింది. తయారీ ఉత్పత్తుల టోకు ధరల సూచీ ఫిబ్రవరిలో 0.42 శాతం మేర పెరిగింది. కూరగాయల ధరల (బంగాళాదుంప సహా) ద్రవ్యోల్బణం జనవరిలో ఉన్న 74.28 శాతం నుంచి ఫిబ్రవరిలో 27.54 శాతానికి తగ్గింది. పాల ధరలకు సంబంధించి 5.40 శాతం నుంచి 1.58 శాతానికి దిగొచ్చింది. పండ్లకు సంబంధించి 20 శాతం, ఉల్లిపాయలకు సంబంధించి ద్రవ్యోల్బణం 48.05 శాతం చొప్పున ఇప్పటికీ గరిష్ట స్థాయిల వద్దే కొనసాగుతోంది.ఇదీ చదవండి: మ్యూచువల్ ఫండ్స్లో అమ్మకాల సెగఇంధనం, విద్యుత్ విభాగంలో ప్రతి ద్రవ్యోల్బణం (మైనస్ 0.71 శాతం) నమోదైంది. జనవరిలోనూ మైనస్ 2.78 శాతంగా ఉండడం గమనార్హం. రిటైల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఫిబ్రవరి నెలలో ఏడు నెలల కనిష్ట స్థాయి అయిన 3.61 శాతానికి తగ్గిపోవడం తెలిసిందే. పంటల దిగుబడి మెరుగ్గా ఉండడానికి తోడు, అధిక బేస్తో సమీప కాలంలో టోకు ద్రవ్యోల్బణం మరింత దిగొస్తుందన్న అభిప్రాయాన్ని ఇక్రా సీనియర్ ఆర్థికవేత్త రాహుల్ అగర్వాల్ వ్యక్తం చేశారు. 2025–26లో టోకు ద్రవ్యోల్బణం 2.5–3 శాతం మధ్య ఉండొచ్చన్నది ఇక్రా అంచనాగా ఉంది. -
లాభాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం గడిచిన సెషన్లోని ముగింపుతో పోలిస్తే లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:19 సమయానికి నిఫ్టీ(Nifty) 106 పాయింట్ పెరిగి 22,612కు చేరింది. సెన్సెక్స్(Sensex) 321 పాయింట్లు పెరిగి 74,487 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 103.52 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 71.25 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.28 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.65 శాతం పెరిగింది. నాస్డాక్ 0.31 శాతం పుంజుకుంది.ఇదీ చదవండి: 13 రోజుల్లో కార్ల ధరలు పెంపు..స్టాక్ మార్కెట్ స్థిరీకరణలో భాగంగా సోమవారం మిడ్ క్యాప్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించగా, చిన్న షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. డాలర్ ఇండెక్స్ బలహీనత, దేశీయ ఈక్విటీ మార్కెట్లో కొనుగోళ్ల దన్నుతో డాలర్ మారకంలో రూపాయి విలువ 24 పైసలు పెరిగి 86.81 వద్ద స్థిరపడింది. డెరివేటివ్స్ పోర్ట్ఫోలియోలో అవకతవకల నేపథ్యంలో ‘బ్యాంకు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంది’ అంటూ ఆర్బీఐ భరోసాతో ఇండస్ఇండ్ బ్యాంక్ షేరు కోలుకుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మ్యూచువల్ ఫండ్స్లో అమ్మకాల సెగ
డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఫిబ్రవరి నెలలో నికరంగా పెట్టుబడులను కోల్పోయాయి. రూ.6,525 కోట్లను ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు. అంతకుముందు నెల జనవరిలో రూ.1.28 లక్షల కోట్లను డెట్ ఫండ్స్ ఆకర్షించడం గమనార్హం. మొత్తం 16 విభాగాలకు గాను 10 విభాగాల నుంచి ఇన్వెస్టర్లు నికరంగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గణాంకాల ఆధారంగా తెలుస్తోంది.‘స్వల్పకాలానికి పెట్టుబడులను ఉపసంహరించుకున్నప్పటికీ పోర్ట్ఫోలియో పరంగా డెట్ ఫండ్స్ ఎంతో ముఖ్యమైనవి. మార్కెట్ పరిస్థితులు కుదుటపడితే రానున్న రోజుల్లో పెట్టుబడుల రాక స్థిరపడొచ్చు’ అని మార్నింగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా సీనియర్ అనలిస్ట్ నేహల్ మెష్రామ్ తెలిపారు. నికరంగా పెట్టుబడులు బయటకు వెళ్లినప్పటికీ మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని మొత్తం డెట్ పెట్టుబడుల విలువ (డెట్ ఏయూఎం) ఫిబ్రవరి చివరికి రూ.17.08 లక్షల కోట్లకు చేరడం గమనార్హం. జనవరి చివరికి ఇది రూ.17.06 లక్షల కోట్లుగా ఉంది.పాజిటివ్–నెగెటివ్లిక్విడ్ ఫండ్స్లోకి నికరంగా రూ.4,977 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.కార్పొరేట్ బాండ్ ఫండ్స్ రూ.1,065 కోట్లు, షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ రూ.473 కోట్ల చొప్పున ఆకర్షించాయి.మీడియం టు లాంగ్ డ్యురేషన్ ఫండ్స్, గిల్డ్ ఫండ్స్లోకి స్వల్పంగా పెట్టుబడులు పెరిగాయి. అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ నుంచి రూ.4,281 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. మనీ మార్కెట్ ఫండ్స్ రూ.276 కోట్లు, లో డ్యురేషన్ ఫండ్స్, ఓవర్నైట్ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు రూ.2,264 కోట్లను వెనక్కి తీసుకున్నారు. ఫిబ్రవరి నెల ఉపసంహరణల్లో ఈ నాలుగు విభాగాల నుంచే 90 శాతం ఉండడం గమనార్హం.ఇదీ చదవండి: 13 రోజుల్లో కార్ల ధరలు పెంపు..వడ్డీ రేట్ల కోతపై అంచనాలు‘ఆర్బీఐ రానున్న రోజుల్లో వడ్డీ రేట్లను తగ్గిస్తుందని ఇన్వెస్టర్లు అంచనా వేస్తున్నట్టున్నారు. దీనివల్ల లాంగ్ డ్యురేషన్ ఫండ్స్లో పెట్టుబడుల వృద్ధి జరుగుతుంది. తక్కువ క్రెడిట్ రిస్క్ కారణంగా గిల్ట్ ఫండ్స్కు ఆదరణ కొనసాగుతోంది. ఆర్థిక అనిశ్చితుల్లో పెట్టుబడులకు దీన్ని మెరుగైన విభాగంగా ఇన్వెస్టర్లు చూస్తున్నారు’ అని మెష్రామ్ వివరించారు. ఫిబ్రవరి నెలలో ఈక్విటీ ఫండ్స్లోకి పెట్టుబడులు నికరంగా 26 శాతం తగ్గి (జనవరితో పోల్చి చూస్తే) రూ.29,303 కోట్లుగా ఉండడం గమనార్హం. అన్ని విభాగాలూ కలిపి ఫిబ్రవరిలో ఫండ్స్ పరిశ్రమ నికరంగా ఆకర్షించిన పెట్టుబడులు రూ.40,000 కోట్లుగా ఉన్నాయి. -
ప్రత్యక్ష పన్ను వసూళ్లలో జోరు
ప్రత్యక్ష పన్నుల ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా జోరు కనబరుస్తోంది. మార్చి 16 వరకు రూ.21.26 లక్షల కోట్లు నికరంగా వసూలైనట్టు ప్రభుత్వ డేటా వెల్లడిస్తోంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 13 శాతానికి పైగా పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులకు చివరి తేదీ మార్చి 15తో ముగిసింది. కార్పొరేట్ పన్ను విభాగంలో అడ్వాన్స్ ట్యాక్స్ 12 శాతానికి పైగా పెరిగి రూ.7.57 లక్షల కోట్లుగా ఉంది. నికర నాన్ కార్పొరేట్ ట్యాక్స్ (ఇందులో వ్యక్తిగత ఆదాయపన్ను ప్రధానమైనది) క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 17 శాతం ఎగిసి రూ.11.01 లక్షల కోట్లుగా ఉంది. నిబంధనల ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన పన్ను రూ.10,000 మించితే వారు ముందస్తు పన్నును ఆర్థిక సంవత్సరం ముగింపులోపే చెల్లించాల్సి ఉంటుంది. నాలుగు వాయిదాల్లో (జూన్ 15, సెప్టెంబర్ 15, డిసెంబర్ 15, మార్చి15) దీన్ని చెల్లించొచ్చు. ఇదీ చదవండి: 13 రోజుల్లో కార్ల ధరలు పెంపు..భారీగా పెరిగిన ఎస్టీటీ ఆదాయం సెక్యూరిటీల లావాదేవీల పన్ను (ఎస్టీటీ) 56 శాతం వృద్ధితో రూ.53,095 కోట్లుగా నమోదైంది. రిఫండ్లు సైతం రూ.3.60 లక్షల కోట్లకు పెరిగాయి. మార్చి 16 నాటికి స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు (రిఫండ్లు సహా) 16 శాతం పెరిగి రూ.25.86 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.22.07 లక్షల కోట్ల ఆదాయపన్ను వసూళ్లను ప్రభుత్వం తొలుత అంచనా వేయగా, తర్వాత రూ.22.37 లక్షల కోట్లకు సవరించడం గమనార్హం. -
13 రోజుల్లో కార్ల ధరలు పెంపు..
ఆటో రంగ దిగ్గజాలు వచ్చే నెల(ఏప్రిల్) నుంచి వాహన ధరలను పెంచే సన్నాహాల్లో ఉన్నాయి. పెరిగిన ముడిసరుకుల వ్యయాలను కొంతవరకూ సర్దుబాటు చేసుకునే ప్రణాళికల్లో భాగంగా ధరలు పెంచనున్నట్లు చెబుతున్నాయి. ప్రధానంగా కార్ల తయారీ కంపెనీలు ధరల పెంపు(car prices) యోచనను వెల్లడించాయి. అన్ని మోడళ్ల కార్ల ధరలనూ 4 శాతం వరకూ పెంచే యోచనలో ఉన్నట్లు మారుతీ సుజుకీ పేర్కొంది. వాణిజ్య వాహన ధరలను 2 శాతంవరకూ పెంచనున్నట్లు టాటా మోటార్స్(Tata Motors) వెల్లడించింది. ఈ బాటలో హోండా కార్స్ సైతం ధరల పెంపువైపు చూస్తున్నట్లు తెలియజేసింది. వెరసి కొత్త ఏడాది(2025)లో రెండోసారి ధరల పెంపును చేపట్టనున్నాయి.ముడివ్యయాల సర్దుబాటుముడిసరుకులతోపాటు నిర్వహణ వ్యయాలు పెరగడంతో కార్ల ధరలను సవరించనున్నట్లు మారుతీ సుజుకీ పేర్కొంది. మోడల్ ఆధారంగా గరిష్టంగా 4 శాతంవరకూ ధరల పెంపు ఉండొచ్చని తెలియజేసింది. కస్టమర్లపై వ్యయ ప్రభావాన్ని కనీసస్థాయికి పరిమితం చేసే బాటలో చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. ప్రస్తుతం మారుతీ ఎంట్రీలెవల్ ఆల్టో కే10సహా ఎంపీవీ.. ఇన్విక్టో వరకూ పలు మోడళ్లను విక్రయిస్తోంది. వీటి ధరలు(ఢిల్లీ ఎక్స్షోరూమ్) రూ. 4.23 లక్షల నుంచి రూ. 29.22 లక్షలవరకూ ఉన్నాయి. ఇదీ చదవండి: జీడీపీలో ఎంఎస్ఎంఈ వాటా పెంపునకు ఏఐ తోడ్పాటుఫిబ్రవరి 1 నుంచి మారుతీ కార్ల ధరలను గరిష్టంగా రూ. 32,500 వరకూ పెంచిన సంగతి తెలిసిందే. ఈ బాటలో టాటా మోటార్స్ సైతం ఏప్రిల్ నుంచి వాణిజ్య వాహన ధరలను 2 శాతంవరకూ పెంచనున్నట్లు ప్రకటించింది. ఇక హోండా కార్స్ ఇండియా సైతం వాహన ధరలను పెంచే యోచనలో ఉన్నట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. -
జీడీపీలో ఎంఎస్ఎంఈ వాటా పెంపునకు ఏఐ తోడ్పాటు
రాంచి: స్థూల ఉత్పాదకతలోనూ, ఉపాధి కల్పనలోనూ కీలక భూమిక పోషిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) పాత్రను కృత్రిమ మేథ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) మరింత ఇనుమడింపజేస్తాయని ‘ఆఫ్బిజినెస్’ తెలిపింది. ప్రస్తుతం జీడీపీలో 30 శాతం ఎంఎస్ఎంఈ రంగం నుంచే సమకూరుతుండగా.. ఏఐ, ఎంఎల్(మెషిన్ లెర్నింగ్) సాయంతో వీటి ఉత్పాదకత వాటాను 50 శాతానికి చేర్చొచ్చని అంచనా వేసింది.ఈ రంగంలో ప్రస్తుతం 11 కోట్లుగా ఉన్న ఉపాధి అవకాశాలను 17.5 కోట్లకు పెంచొచ్చని బీ2బీ ఈ కామర్స్ సంస్థ అయిన ఆఫ్బిజినెస్ తన తాజా నివేదికలో తెలిపింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రాన్ని మార్చేయగలదని పేర్కొంది. ఎస్ఎంఈల్లో చాలా వరకు తమ ఉత్పత్తిని పెంచుకునేందుకు ఏఐ, ఎంఎల్ అప్లికేషన్లను తమ కార్యకలాపాల్లో అమలు చేయాలని అనుకుంటున్నట్టు తెలిపింది. ముడి సరుకుల కొనుగోళ్లు, అనుసంధానత, పంపిణీ నెట్వర్క్, వినూత్నమైన ఉత్పత్తులు, సిబ్బందికి శిక్షణ, వ్యర్థాల నిర్వహణ, మరీ ముఖ్యంగా సమయ నిర్వహణలో ఏఐ, ఎంఎల్ ఎంఎస్ఎంఈలకు సాయపడతాయని వెల్లడించింది. ఇదీ చదవండి: బ్యాంకింగ్ సమ్మె సైరన్ఏఐ ప్లాట్ఫామ్ల సాయం..ఎస్ఎంఈలకు ‘బిడ్అసిస్ట్’ తరహా ఏఐ ఆధారిత ప్లాట్ఫామ్లు అవసరమని.. ఇది వివిధ ప్రభుత్వ విభాగాల్లో 50 లక్షల మేర టెండర్ల సమాచారాన్ని అందిస్తుందని ఆఫ్బిజినెస్ నివేదిక తెలిపింది. అలాగే ‘నెక్సిజో.ఏఐ’ అన్నది ఎప్పటికప్పుడు తాజా కమోడిటీ ధరల పమాచారాన్ని, ఆయా వ్యాపారాలకు అనుగుణమైన టెండర్ల గురించి తెలియజేస్తుందని పేర్కొంది. ఎస్ఎంఈలు తమ మెటీరియల్స్ను దేశవ్యాప్తంగానే కాకుండా, విదేశాలకు ఎగుమతి చేసేందుకు వీలుగా అనుసంధానత కీలకమని తెలిపింది. ఎంఎస్ఎంఈలు కీలక విభాగాల్లో ఎదుర్కొంటున్న ఆందోళనల పరిష్కారానికి వీలుగా ఇంజినీరింగ్ కాలేజీలు, మేనేజ్మెంట్ కాలేజీలు, మానవ వనరుల సంస్థలను వీటితో అనుసంధానించాలని సూచించింది. -
ఫిబ్రవరిలో ఎగుమతులు డౌన్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో దేశ ఎగుమతులు వరుసగా నాలుగో నెలలోనూ క్షీణతను చవిచూశాయి. ఫిబ్రవరిలో 36.91 బిలియన్ డాలర్ల ఎగుమతులు (రూ.3.21 లక్షల కోట్లు) నమోదయ్యాయి. క్రితం ఏడాది ఫిబ్రవరిలో ఎగుమతులు 41.41 బిలియన్ డాలర్లతో (రూ.3.60 లక్షల కోట్లు) పోల్చి చూస్తే 11 శాతం తగ్గిపోయినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరిలో ఎగుమతులు 36.43 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో దిగుమతులు సైతం 50.96 బిలియన్ డాలర్లకు (రూ.4.43 లక్షల కోట్లు) తగ్గుముఖం పట్టాయి. 2024 ఫిబ్రవరిలో దిగుమతులు 60.92 బిలియన్ డాలర్లుగా (రూ.5.30 లక్షల కోట్లు) ఉంటే, ఈ ఏడాది జనవరి నెలలో 59.42 బిలియన్ డాలర్ల మేర ఉండడం గమనార్హం. దీంతో వాణిజ్య లోటు (ఎగుమతులు–దిగుమతుల మధ్య వ్యత్యాసం) 14.05 బిలియన్ డాలర్లకు తగ్గుముఖం పట్టింది. 2021 ఆగస్ట్ తర్వాత అత్యంత కనిష్ట వాణిజ్య లోటు ఇదేనని వాణిజ్య శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఒక నెలలో కనిష్ట దిగుమతులు 2023 ఏప్రిల్ తర్వాత మళ్లీ 2025 ఫిబ్రవరిలోనే నమోదు కావడం గమనించొచ్చు. స్వల్పంగా తగ్గిన పసిడి దిగుమతులు → ఫిబ్రవరి నెలలో బంగారం దిగుమతుల విలువ 2.3 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ ఏడాది జనవరిలో 2.68 బిలియన్ డాలర్ల విలువైన పసిడి దిగుమతి అయింది. → జెమ్స్ అండ్ జ్యుయలరీ ఎగుమతులు 21 శాతం తగ్గి 2.53 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. → జనవరితో పోల్చి చూస్తే చమురు దిగుమతులు 13.4 బిలియన్ డాలర్ల నుంచి 11.8 బిలియన్ డాలర్లకు తగ్గాయి. → ఫిబ్రవరి నెలకు సేవల ఎగుమతులు 35 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. జనవరిలో ఈ మొత్తం 38.55 బిలియన్ డాలర్లుగా ఉంది. → ఫిబ్రవరిలో సేవల దిగుమతుల విలువ 16.55 బిలియన్ డాలర్లుగా ఉంది. జనవరిలో ఈ మొత్తం 18.22 బిలియన్ డాలర్లుగా నమోదైంది.800 బిలియన్ డాలర్ల ఎగుమతులు..2024–25లో సవాళ్లు నెలకొన్నప్పటికీ 800 బిలియన్ డాలర్ల విలువైన వస్తు, సేవల ఎగుమతులు సాధిస్తామన్న విశ్వాసాన్ని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ భత్వాల్ వ్యక్తం చేశారు. వాణిజ్య లోటు తగ్గుముఖం పట్టడం అన్నది ప్రధానంగా చమురు, బంగారం, వెండి దిగుమతుల క్షీణతవల్లేనని ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ అదితి నాయర్ తెలిపారు. -
బ్యాంకింగ్ సమ్మె సైరన్
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగంలో సమ్మె సైరన్ మోగింది. తమ డిమాండ్ల సాధనే లక్ష్యంగా బ్యాంక్ సంఘాల ఐక్య సమాఖ్య (యూఎఫ్బీయూ) సారథ్యంలో ఈ నెల 23 అర్ధరాత్రి నుంచి 25 అర్ధరాత్రి వరకు రెండు రోజుల పాటు సమ్మె చేయనున్నట్లు యూనియన్లు ప్రకటించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేటు బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, కో–ఆపరేటివ్ బ్యాంకులు, రీజినల్ రూరల్ బ్యాంకులకు సంబంధించిన 9 బ్యాంకు యూనియన్లకు యూఎఫ్బీయూ ప్రాతినిధ్యం వహిస్తోంది. మొత్తం 8 లక్షల మందికి పైగా ఉద్యోగులు, అధికారులు ఈ సమ్మెలో పాల్గొననున్నారు. కాగా, సమ్మె సందర్భంగా రెండు రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయని యూనియన్ వర్గాలు పేర్కొన్నాయి. దీనివల్ల బ్యాంకు సేవలకు తీవ్ర విఘాతం కలిగి అవకాశం ఉంది. నియామకాలు పెంచాలి... పెరుగుతున్న ఖాతాదారులకు అనుగుణంగా బ్యాంకుల్లో తగినంత మంది సిబ్బందిని నియమించాలని యూనియన్లు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. గడిచిన దశాబ్దకాలానికి పైగా నియామకాలు సరిగ్గా జరగకపోవడంతో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని అంటున్నాయి. దీంతో ప్రస్తుత ఉద్యోగులపై తీవ్ర పనిభారం పడుతోందని, కస్టమర్లకు సరిగ్గా సేవలు అందించలేకపోతున్నామనేది యూనియన్ల వాదన. అనేక సర్కారీ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్బీ)లకు ఇప్పుడున్న అరకొర సిబ్బంది ఏమాత్రం సరిపోరని, అన్ని క్యాడర్లలో నియామకాలు చేపట్టాలని బ్యాంకు సంఘాలు స్పష్టం చేశాయి. 2013లో 3,98,801 మంది క్లర్కులు ఉండగా.. 2024 నాటికి వారి సంఖ్య 2,46,965 మందికి పడిపోయిందని, అంటే ఏకంగా 1,51,836 మంది తగ్గిపోయారని వారు లెక్కలతో సహా చెబుతున్నారు. ఇక మొత్తం సిబ్బంది సంఖ్య 2013లో 8,86,490 మంది ఉంటే, 2024 నాటికి 7,46,679 మందికి (1,39,811 తగ్గుదల) చేరిందని యూఎఫ్బీయూ పేర్కొంది.ఇతర ప్రధాన డిమాండ్లు ఇవీ... → బ్యాంకింగ్ పరిశ్రమ అంతటికీ వారానికి 5 రోజుల పని దినాల డిమాండ్కు ఏడాది క్రితం బ్యాంకు యాజమాన్యాలు అంగీకరించి, ప్రభుత్వానికి సిఫార్సు చేసినప్పటికీ అమలుకు మాత్రం నోచుకోలేదు, ఇక ఏమాత్రం జాప్యం లేకుండా దీన్ని అమలు చేయాలి. → సిబ్బంది పనితీరుకు సంబంధించి నెలవారీ సమీక్ష విషయంలో ప్రభుత్వ ఆదేశాలను, పనితీరు ఆధారిత ప్రోత్సాహకాల్లో మార్పులను తక్షణం ఉపసంహరించుకోవాలి. → బ్యాంకు అధికారులు/సిబ్బందిపై దాడులను అరికట్టేలా తగిన రక్షణ కల్పించాలి. → గ్రాట్యుటీ పరిమితిని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అనుగుణంగా రూ.25 లక్షలకు పెంచడంతో పాటు ఆదాయ పన్ను మినహాయింపు ఇచ్చేలా గ్రాట్యుటీ చట్టాన్ని సవరించాలి. → తాత్కాలిక సిబ్బందిని పర్మనెంట్ చేయడంతో పాటు పర్మనెంట్ ఉద్యోగాలకు అవుట్సోర్సింగ్ను నిలిపివేయాలి. → ఐడీబీఐ బ్యాంకులో ప్రభుత్వం కనీసం 51% వాటాను కొనసాగించాలి. -
జీతాల కోసం రూ.4 వేల కోట్లు అప్పు
అప్పుల భారం, ఇతర కారణాలతో తమ ప్రభుత్వం నగదు కొరతను ఎదుర్కొంటోందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్బీఐ నుంచి రూ.4,000 కోట్ల లోన్ తీసుకుని ఉద్యోగులకు జీతాలు చెల్లించగలిగామని తెలిపారు. ఇటీవల శాసనమండలిలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తామని, నగదు కొరత దృష్ట్యా డియర్నెస్ అలవెన్స్ (డీఏ), ఇతర చెల్లింపులు ఆలస్యమైతే ప్రభుత్వ ఉద్యోగులు సహకరించాలని కోరారు. ప్రభుత్వం ఉద్యోగులదేనని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన అన్ని వాస్తవాలు, గణాంకాలను వారి ముందు ఉంచుతామని, తద్వారా చెల్లింపులపై తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చని చెప్పారు. డీఏ, ఇతర ప్రయోజనాలు ఉద్యోగుల హక్కు అన్నారు.సంక్షేమ కార్యక్రమాలకు నిధులు కరవుఈ నెల 12న ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ రాష్ట్ర ఆదాయంలో సింహభాగం ప్రతినెలా జీతాలు, పింఛన్లు, గత బీఆర్ఎస్ పాలనలో చేసిన భారీ అప్పులను తీర్చడానికి వెచ్చిస్తున్నామని తెలిపారు. దాంతో సంక్షేమ కార్యక్రమాలకు నిధులు కేటాయించడం సవాలుగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతినెలా రూ.18 వేల కోట్ల నుంచి రూ.18,500 కోట్ల ఆదాయం సమకూరుతుండగా ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్ల కోసం రూ.6,500 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. మరో రూ.6,500 కోట్లు బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులను తీర్చడానికి వినియోగిస్తున్నామని తెలిపారు. దాంతో ప్రభుత్వం వద్ద రూ.5,000 కోట్ల నుంచి రూ.5,500 కోట్లు మాత్రమే ఉన్నాయన్నారు. సుమారు 30 ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రతినెలా నిధులు అవసరమవుతాయని, వీటితో పాటు వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ఆర్థిక అవసరాలు కూడా ఉన్నాయన్నారు.రాష్ట్రాలకు ఆర్బీఐ అప్పులు ఇలా..దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు జీతాలు చెల్లించడం వంటి ఆర్థిక బాధ్యతలను నిర్వహించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి రుణాలు పొందవచ్చు. ఇందుకు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 293 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు రుణ పరిమితులు ఉన్నాయి. ఈ పరిమితులను రాష్ట్ర ఆర్థిక స్థితిని ఆధారంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. నిత్యం రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాల్సిన అవసరాలకు సంబంధించి నగదు తాత్కాలిక అసమానతలను నిర్వహించడంలో ఆర్బీఐ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ (డబ్ల్యూఎంఏ) ద్వారా స్వల్పకాలిక రుణాలను అందిస్తుంది. ఈ అడ్వాన్సులు రాష్ట్ర ఆదాయ, వ్యయ నమూనాల ఆధారంగా పరిమితులకు లోబడి ఉంటాయి.ఇదీ చదవండి: ఏఐ తోడుంటే.. విజయం మీవెంటే..బాండ్ల జారీతో మార్కెట్ రుణాలు..ఒక రాష్ట్రం తన డబ్ల్యూఎంఏ పరిమితిని దాటితే, అది ఆర్బీఐ నుంచి ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని పొందవచ్చు. అయితే, దీనికి కఠినమైన షరతులు ఉంటాయి. ఆర్బీఐ ఫెసిలిటేటర్గా వ్యవహరిస్తూ బాండ్ల జారీ వంటి మార్కెట్ రుణాల ద్వారా కూడా రాష్ట్రాలు నిధులను సమీకరించుకోవచ్చు. ఏదైనా రుణం తీసుకోవాలంటే రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. ఆర్బీఐ రుణాలపై వడ్డీ రేట్లను క్రమంగా చెల్లించాల్సి ఉంటుంది. కాలపరిమితితో సహా నిర్దిష్ట రీపేమెంట్ నిబంధనలు వర్తిస్తాయి. వీటిని రాష్ట్రాలు పాటించాల్సి ఉంటుంది. -
ఏఐ తోడుంటే.. విజయం మీవెంటే..
ఆన్లైన్ గేమర్ల గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఏఐ-ఆధారిత అసిస్టెంట్ ‘కోపైలట్ ఫర్ గేమింగ్’ను మైక్రోసాఫ్ట్ ఆవిష్కరించింది. ఇది ఆన్లైన్లో ప్లేయర్లకు సమయాన్ని ఆదా చేయడం, వారి నైపుణ్యాలను మెరుగుపరచడం, ఇతర స్నేహితులు, గేమింగ్ కమ్యూనిటీలతో కనెక్ట్ అవ్వడంలో సహాయపడుతుందని కంపెనీ పేర్కొంది. మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈఓ సత్య నాదెళ్ల సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఈ ఏఐ టూల్కు సంబంధించిన విషయాలు పంచుకున్నారు.నైపుణ్యాలు పెంచేందుకు..కోపైలట్ ఫర్ గేమింగ్ అనేది గేమింగ్ ప్రక్రియను సులభతరం చేయడానికి, రియల్-టైమ్లో గేమర్లకు మద్దతుగా నిలిచేందుకు, వారి గేమింగ్ నైపుణ్యాలు పెంచేందుకు ఉద్దేశించిన ఏఐ ఆధారిత టూల్. ఈ ఏఐ అసిస్టెంట్ ప్లేయర్లకు మరింత వేగంగా గేమ్స్ సెట్ చేయడానికి, వారి ప్రాధాన్యతల ఆధారంగా కొత్త టైటిల్స్ను సిఫారసు చేయడానికి, అవసరమైనప్పుడు గేమ్లో సహాయాన్ని అందించడానికి తోడ్పడుతుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. కోపైలట్ ఫర్ గేమింగ్ ప్రారంభంలో ఎక్స్ బాక్స్ ఇన్ సైడర్ ప్రోగ్రామ్ ద్వారా మొబైల్లో అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఇతర ప్లాట్పామ్లకు త్వరలో దీన్ని విస్తరిస్తామని పేర్కొన్నారు.With Copilot for Gaming, you can jump back into games faster, get real-time coaching, and stay connected... all on your own terms. Excited for what the team has in store! pic.twitter.com/18Ll2D25i1— Satya Nadella (@satyanadella) March 13, 2025ఇదీ చదవండి: మల్టీప్లెక్స్ స్టాక్ పంట పండింది..?ఈ ఏఐ అసిస్టెంట్ను సామర్థ్యం, అడాప్టబిలిటీ, పర్సనలైజేషన్ అనే మూడు ప్రధాన సూత్రాలకు అనుగుణంగా నిర్మించినట్లు కంపెనీ పేర్కొంది. ప్లేయర్ల అభిరుచులకు తగినట్లుగా గేమ్లను సెర్చ్ చేయడానికి, డౌన్లోడ్ చేయడానికి, వాటిని అప్డేట్ చేయడానికి సమయాన్ని ఆదా చేయడం, ప్లేయర్లు ఆటపైనే దృష్టి పెట్టేలా చేయడం దీని ఉద్దేశం. గేమింగ్ కోసం కోపైలట్ ప్లేయర్ నియంత్రణలో ఉంటుందని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది. -
మల్టీప్లెక్స్ స్టాక్ పంట పండింది..?
హిందీతో పాటు విభిన్న భాషల్లో ఇటీవల విడుదలైన పాన్ ఇండియా సినిమా ఛావా తెలుగులోనూ మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రాన్ని ప్రముఖ థియేటర్లతోపాటు మల్టీప్లెక్స్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ సినిమాస్లోనూ విడుదల చేయడంతో కంపెనీకి లాభాల పంట పండినట్లయిందని స్టాక్ రేటింగ్ బ్రేకరేజ్ సంస్థ నువామా ఇన్ స్టిట్యూషనల్ ఈక్విటీస్ అభిప్రాయపడింది. ఇటీవల కాలంలో మార్కెట్ అనిశ్చితుల నేపథ్యంలో కంపెనీ షేర్లు గరిష్ఠం నుంచి 32 శాతం పతనమైనప్పటికీ రానున్న రోజుల్లో పెరిగే అవకాశం ఉందని తెలిపింది.2024-25 ఆర్థిక సంవత్సరంలో నాలుగో త్రైమాసికంలో ఛావా సినిమా కలెక్షన్లు ఊపందుకోవడంతో పీవీఆర్ ఐనాక్స్ మంచి లాభాలు పోస్ట్ చేస్తుందని నువామా తన నివేదికలో అంచనా వేసింది. ఇటీవల కంపెనీ ప్రమోటర్లు షేర్లు కొనుగోలు చేసినట్లు గుర్తు చేసింది. ఫిబ్రవరిలో ఛావా బాక్సాఫీస్ వసూళ్లతోపాటు ఇతర సినిమాల సహకారంతో స్టాక్ ధర ఏడాది ప్రాతిపదికన 39 శాతం పెరుగుదలతో ఆదాయాన్ని రూ.2,264 కోట్లకు పెంచిందని పేర్కొంది. కరోనా తర్వాత ఫిబ్రవరి నెలలో రూ.1,245 కోట్ల బాక్స్ ఆఫీస్ కలెక్షన్లతో పరిశ్రమకు అత్యధిక వసూళ్లు సాధించడంలో ఛావా తోడ్పడింది.ఇదీ చదవండి: భారత్తో వాణిజ్యంపై యూఎస్ స్పై చీఫ్ స్పందనకొత్తగా 100 స్క్రీన్లు..పీవీఆర్ ఐనాక్స్ అసెట్-లైట్ గ్రోత్ స్ట్రాటజీని పాటిస్తోంది. భవిష్యత్తులో దక్షిణ భారతదేశంలో 30-40 కొత్త స్క్రీన్లను జోడించాలని భావిస్తున్నారు. సంస్థ క్యాపిటల్-లైట్ గ్రోత్ మోడల్ కింద 100 స్క్రీన్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు నువామా పేర్కొంది. ఇందులో 31 స్క్రీన్లు మేనేజ్మెంట్ కాంట్రాక్ట్ మోడల్ కింద, 69 అసెట్-లైట్ మోడల్ కింద ఉండనున్నాయి. ఇందులో 42 శాతం నుంచి 80 శాతం వరకు మూలధన వ్యయాన్ని డెవలపర్ భరిస్తారని పేర్కొంది. కొత్తగా ప్లాన్ చేసిన ఈ స్క్రీన్లు రెండు మూడేళ్లలో అందుబాటులోకి వస్తాయని నువామా నివేదించింది. -
భారత్తో వాణిజ్యంపై యూఎస్ స్పై చీఫ్ స్పందన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధిస్తూ వివిధ దేశాల వాణిజ్యాలపై ప్రభావితం చూపుతున్న నేపథ్యంలో ఇండియాపై యూఎస్ వైఖరి ఎలా ఉంటుందోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో ఇరు దేశాల మధ్య పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలపై అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ ఆశాభావం వ్యక్తం చేశారు. గబ్బార్డ్ తన భారత పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య అత్యున్నత స్థాయిలో జరుగుతున్న నిర్మాణాత్మక చర్చలను ప్రస్తావించారు.న్యూఢిల్లీలో జరిగిన రైసినా డైలాగ్లో గబ్బార్డ్ మాట్లాడుతూ.. ఆర్థిక సంబంధాల బలోపేతానికి ఇరువురు నేతలు కట్టుబడి ఉన్నారని నొక్కిచెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న వాణిజ్య చర్చలను భారత అధికారులు వివాద అంశంగా కాకుండా ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకునే అవకాశంగా భావిస్తున్నారని పేర్కొన్నారు. ఆర్థిక సమస్యల పరిష్కారాలకు ఇరు దేశాల నాయకులు ఆచరణాత్మక విధానాలకు మొగ్గు చూపుతున్నట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: కాసులు కురిపిస్తున్న పసిడి.. ఎనిమిదేళ్లలో 200 శాతం రాబడిరక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సహా భారత అధికారులతో గబ్బార్డ్ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా వాణిజ్యానికి అతీతంగా ఇంటెలిజెన్స్ సహకారం, రక్షణ, విద్య వంటి వివిధ రంగాల అభివృద్ధికి చర్చలు సాగాయి. భారత్, అమెరికాల మధ్య అభివృద్ధి చెందుతున్న భాగస్వామ్యంలో గబ్బార్డ్ పర్యటన కీలకంగా మారింది. ఇరు దేశాలకు సమ్మతంగా ఉండే వాణిజ్య ఒప్పందాన్ని సాధించడంలో ఆమె విశ్వాసంగా ఉన్నట్లు తెలిపారు. -
కాసులు కురిపిస్తున్న పసిడి.. ఎనిమిదేళ్లలో 200 శాతం రాబడి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సార్వత్రిక గోల్డ్ బాండ్ల(ఎస్జీబీ)కు సంబంధించి తుది రిడంప్షన్ ధరను ప్రకటించడంతో ఇన్వెస్టర్ల సంపద భారీగా పెరగబోతుంది. 2016-17 సిరీస్ 4(ఎనిమిదేళ్లు), 2019-20 సిరీస్ 4(ఐదేళ్లు)లో పెట్టుబడిదారులు ఈమేరకు గణనీయమైన రాబడిని పొందనున్నారు. బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ఎస్జీబీ ఇన్వెస్టర్ల సంపద దాదాపు మూడు రెట్లు పెరగవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి.2017 ఫిబ్రవరిలో గ్రాముకు రూ.2,943 చొప్పున జారీ చేసిన 2016-17 సిరీస్ 4 బాండ్లను ఇప్పుడు గ్రాముకు రూ.8,624గా రీడీమ్ చేసి 193 శాతం రాబడిని అందించనున్నారు. అదే ధరకు 2019 సెప్టెంబర్లో జారీ చేసిన 2019-20 సిరీస్ 4లో ఇన్వెస్టర్లు గ్రాముకు రూ.8,634 చొప్పున బాండ్లను రీడీమ్ చేసుకోవచ్చు. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ప్రచురించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది మార్చి 10 నుంచి మార్చి 13 మధ్య 999 స్వచ్ఛత బంగారం సగటు ముగింపు ధర ఆధారంగా ఈ రెండు సిరీస్లకు రిడంప్షన్ను మార్చి 17న షెడ్యూల్ చేశారు.రిడంప్షన్ ధర ఎలా లెక్కిస్తారంటే..బాండ్లను రిడంప్షన్ చేసుకునేవారికి ఆ తేదీకి ముందు గడిచిన మూడు పనిదినాల్లో సగటు బంగారం ధర (999 స్వచ్ఛత) ఆధారంగా ఉంటుంది రాబడిని లెక్కిస్తారు. ఈ బాండ్ సిరీస్ కోసం ఐబీజేఏ 2025 మార్చి 11, 12, 13 తేదీల్లో బంగారం ధరలను లెక్కించింది. సావరిన్ గోల్డ్ బాండ్స్ (ఎస్జీబీ) ఎనిమిదేళ్ల మెచ్యూరిటీని కలిగి ఉంటాయి. కానీ పెట్టుబడిదారులు ఐదేళ్ల తర్వాత వీటిని రిడీమ్ చేసుకోవచ్చు. ఈమేరకు సంబంధిత వడ్డీ చెల్లింపు తేదీల్లో మాత్రమే ఉపసంహరించుకోవచ్చు. ఎస్జీబీ సిరీస్ 4 2019-20కు సంబంధించి ఐదేళ్లకాలానికి రిడీమ్ తేదీని మార్చి 17గా నిర్ణయించారు.రిడీమ్ ప్రక్రియ ఇలా..బాండ్లను ముందుగానే రిడీమ్ చేసుకోవడానికి పెట్టుబడిదారులు వడ్డీ చెల్లింపు తేదీకి 30 రోజుల ముందు నిర్దేశించిన బ్యాంకు, ఎస్హెచ్సీఐఎల్ కార్యాలయం, పోస్టాఫీసు లేదా ఏజెంట్ వద్ద దరఖాస్తు సమర్పించాలి. ఈ అభ్యర్థన మార్చి 17 కంటే కనీసం ఒక రోజు ముందుగా విజయవంతంగా ప్రాసెస్ అవుతుంది. ఇది ఆమోదం పొందిన తర్వాత వచ్చే ఆదాయం నేరుగా ఎస్జీబీ అప్లికేషన్తో లింక్ చేయబడిన ఇన్వెస్టర్ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. మెచ్యూరిటీ కంటే ముందు కూడా అత్యవసర సమయాల్లో పెట్టుబడులను ఉంపసంహరించుకోవచ్చు. కానీ దానిపై అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. దాంతో రాబడి తగ్గుతుంది.మెచ్యూరిటీ వరకు ఎస్జీబీలను ఉంచడం వల్ల కలిగే ప్రయోజనాలుపన్ను రహిత లాభాలు: మెచ్యూరిటీ వరకు ఉంచితే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉండదు.గ్యారంటీడ్ వడ్డీ: 2.5 శాతం వార్షిక వడ్డీ స్థిరమైన ఆదాయాన్ని నిర్ధారిస్తుంది.మార్కెట్ లింక్డ్ రిటర్న్స్: ప్రస్తుతం ఉన్న బంగారం ధరలతో ముడిపడి రాబడి పెరుగుతుంది.భద్రత: ప్రభుత్వ మద్దతు ఉండే ఎస్జీబీలు పెట్టుబడులకు భద్రత కల్పిస్తాయి.ఏమిటీ ఎస్జీబీలు..?ఇవి భారత ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జారీ చేసిన ప్రభుత్వ సెక్యూరిటీలు. నిజమైన (భౌతిక) బంగారానికి ఇవి ప్రత్యామ్నాయ రూపం. పెట్టుబడిదారులు భౌతికంగా బంగారం కలిగి ఉండాల్సిన అవసరం లేకుండా దానిపై పెట్టుబడి పెట్టడానికి ఈ బాండ్లు వీలు కల్పించాయి. పెట్టుబడిదారులు ఇష్యూ ధరను నగదు రూపంలో చెల్లించాలి. బాండ్ల గడువు ముగిసిన తర్వాత పెట్టుబడిదారులకు నగదు రూపంలోనే తిరిగి చెల్లిస్తారు.బంగారం దిగుమతులను నిరుత్సాహపరచడం ద్వారా విదేశీ మారకం నిల్వలను కాపాడుకోవచ్చన్న భావనతో కేంద్రం ఈ బాండ్ల జారీని ప్రారంభించింది.ఇదీ చదవండి: భారత్లో యాపిల్-గూగుల్ భాగస్వామ్యం..?భారంగా మారిన బాండ్లుభారత్లో పెరుగుతున్న బంగారం దిగుమతులను తగ్గించాలన్న లక్ష్యంతో పదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించింది. ఆశించిన ప్రయోజనం అటుంచితే పెరుగుతున్న బంగారం ధరలతో ఖజానాపై ఊహించని ఆర్థిక భారం పడింది. దీంతో ప్రభుత్వం చివరకు ఈ పథకాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. గోల్డ్ బాండ్స్లో ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి రూ.85,000 కోట్లను తాకనుందని 2024 జూలై మధ్యంతర బడ్జెట్ సందర్భంగా ప్రభుత్వం వెల్లడించింది. ఈ విలువ 2019–20తో పోలిస్తే దాదాపు తొమ్మిది రెట్లు అదనం. -
భారీగా తగ్గిన ఓలా ఎలక్ట్రిక్ షేర్లు: కారణం ఇదే!
భారతదేశంలోని ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ షేర్లు సోమవారం భారీగా తగ్గాయి. ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ తన పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.. రోస్మెర్టా డిజిటల్ సర్వీసెస్ లిమిటెడ్ దాఖలు చేసిన దివాలా పిటిషన్ను ఎదుర్కొంటుందని శనివారం వెల్లడించింది. దివాలా.. దివాలా కోడ్ సెక్షన్ 9 కింద బెంగళూరులోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT)లో ఈ పిటిషన్ను సమర్పించారు.ఆపరేషనల్ క్రెడిటర్ రోస్మెర్టా డిజిటల్ సర్వీసెస్, అందించిన సేవలకు చెల్లింపులలో డిఫాల్ట్ అయిందని ఆరోపించింది. ఓలా ఎలక్ట్రిక్ ఈ వాదనలను ఖండించింది. దీనిపై న్యాయసలహాలు తీసుకుంటున్నామని, వాటాదారుల ప్రయోజనాల కోసం తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కంపెనీ షేర్లు పతనమయ్యాయి.దీంతో కంపెనీ షేర్లు అమాంతం పడిపోయాయి. ఈరోజు ఉదయం 10.25 గంటలకు ఓలా ఎలక్ట్రిక్ షేర్లు 6.14 శాతం తగ్గి 52 వారాల కనిష్ట స్థాయికి చేరుకొని.. రూ. 47.41కి చేరుకున్నాయి. కొంతకాలంగా పతనమవుతున్న ఓలా ఎలక్ట్రిక్ షేర్స్ ఇప్పుడు భారీ పతనాన్ని చవిచూశాయి. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 111 పాయింట్లు లాభపడి 22,508 వద్దకు చేరింది. సెన్సెక్స్ 341 పాయింట్లు ఎగబాకి 74,169 వద్దకు చేరింది.సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫిన్సర్వ్, ఎం అండ్ ఎం, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్ అండ్ సెబ్, జొమాటో, ఐసీఐసీఐ బ్యాంక్, సన్ ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇండస్ఇండ్ బ్యాంక్ స్టాక్లు లాభాల్లో ముగిశాయి. ఐటీసీ, నెస్లే, ఎస్బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, ఎల్ అండ్ టీ, టీసీఎస్, పవర్ గ్రిడ్ స్టాక్లు భారీగా నష్టపోయాయి.మార్కెట్ లాభాలకు కొన్ని కారణాలు..అమెరికా ఈక్విటీలు పుంజుకోవడం, దేశీయ వినియోగాన్ని పెంచడానికి చైనా తాజా చర్యలను ప్రకటించడం ప్రపంచ సెంటిమెంట్ను మెరుగుపరిచింది. ఆటో, ఫైనాన్షియల్, బ్యాంకింగ్ రంగ షేర్లలో లాభాలు ర్యాలీకి గణనీయంగా దోహదం చేశాయి. చైనా విధానపరమైన చర్యలతో నడిచే ఆసియా మార్కెట్లలో సానుకూలత నెలకొనడంతో ఇండియన్ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిసినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: భారత్లో యాపిల్-గూగుల్ భాగస్వామ్యం..?(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
'అమెజాన్, ఫ్లిప్కార్ట్లలో నకిలీ ఉత్పత్తులు'
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ గిడ్డంగులలో.. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) విస్తృతంగా సోదాలు నిర్వహించింది. నిబంధనలను అనుగుణంగా లేని ఉత్పత్తుల పంపిణీని అరికట్టడమే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.బీఐఎస్ లక్నో, గురుగ్రామ్లోని అమెజాన్ గిడ్డంగులపై దాడి జరిపి.. అక్కడ నిబంధనలను అనుగుణంగా లేని బొమ్మలు, హ్యాండ్ బ్లెండర్లు, అల్యూమినియం ఫాయిల్స్, మెటాలిక్ వాటర్ బాటిళ్లు, పీవీసీ కేబుల్స్, ఫుడ్ మిక్సర్లు, స్పీకర్లు మొదలైనవాటిని స్వాధీనం చేసుకుంది. గురుగ్రామ్లోని ఇన్స్టాకార్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తున్న ఫ్లిప్కార్ట్ గిడ్డంగిలో వందలాది ధృవీకరించని స్టెయిన్లెస్ స్టీల్ బాటిళ్లు, బొమ్మలు, స్పీకర్లు ఉన్నట్లు గుర్తించింది.ఈ నాన్ సర్టిఫైడ్ ఉత్పత్తులు టెక్విజన్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందినవిగా బీఐఎస్ గుర్తించింది. ఈ కారణంగానే ఢిల్లీలోని వారి రెండు సౌకర్యాలపై దాడులు జరిగాయి. ఈ దాడుల్లో దాదాపు 7,000 ఎలక్ట్రిక్ వాటర్ హీటర్లు, 4,000 ఎలక్ట్రిక్ ఫుడ్ మిక్సర్లు, 95 ఎలక్ట్రిక్ రూమ్ హీటర్లు, 40 గ్యాస్ స్టవ్లు బయటపడ్డాయి. వీటన్నింటికీ.. బీఐఎస్ సర్టిఫికేషన్ లేదు.ఇదీ చదవండి: భారత్ కోసం సిద్దమవుతున్న టెస్లా కారు ఇదే!స్వాధీనం చేసుకున్న ఉత్పత్తులలో డిజిస్మార్ట్, యాక్టివా, ఇనల్సా, సెల్లో స్విఫ్ట్, బటర్ఫ్లై వంటి బ్రాండ్స్ ఉన్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అమెజాన్, ఫ్లిప్కార్ట్లలో మాత్రమే కాకుండా.. మీషో, మింత్రా, బిగ్ బాస్కెట్ వంటి ఈ కామర్స్ ప్లాట్ఫామ్లలో కూడా నాన్-సర్టిఫైడ్ ఉత్పత్తులు ఉన్నట్లు బీఐఎస్ గుర్తించింది. -
భారత్లో యాపిల్-గూగుల్ భాగస్వామ్యం..?
భారత్లోని ఐఫోన్ల్లో రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ (ఆర్సీఎస్) మెసేజింగ్ను తీసుకురావడానికి యాపిల్ గూగుల్తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ భాగస్వామ్యం మెసేజింగ్ సాంకేతికతలో మార్పును సూచిస్తుంది. ఈ చర్యలు ప్రపంచంలోని అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్లలో ఒకటైన ఐఓఎస్, ఆండ్రాయిడ్ వినియోగదారుల సంఖ్యను పెంచేలా వీలు కల్పిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.ప్రస్తుత ఐఓఎస్ 18.2 వెర్షన్లో పీ2పీ (పర్సన్-టు-పర్సన్) ఆర్సీఎస్ను యూఎస్, కెనడా, జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్, యుకె, బెల్జియం, చైనా వంటి ఎనిమిది దేశాల్లో ప్రారంభించారని గ్లోబల్ ఆర్సీఎస్ ప్లాట్ఫామ్ ప్రొవైడర్ డాట్గో సీఈఓ ఇందర్పాల్ ముమిక్ పేర్కొన్నారు. ఇందుకోసం యాపిల్ ‘ఐమెసేజ్’ క్లయింట్ గూగుల్ బ్యాక్ ఎండ్ సర్వర్లలో పనిచేయడానికి పరస్పరం ఇరు కంపెనీలు సహకరించుకున్నట్లు తెలిపారు. ఈ దేశాల్లో ఆర్సీఎస్ కోసం క్యారియర్ నెట్ వర్క్లను అనుసంధానించినట్లు చెప్పారు. అయితే గూగుల్కు అంతగా ఆదరణ లేని చైనాలో ప్రత్యామ్నాయ సర్వర్ వెండర్లను ఎంచుకున్నట్లు పేర్కొన్నారు.జీఎస్ఎం అసోసియేషన్ అభివృద్ధి చేసిన అధునాతన ప్రోటోకాల్ ఆర్సీఎస్ మెసేజింగ్ హై-రిజల్యూషన్ మీడియా షేరింగ్, రీడ్ రసీదులు, టైపింగ్ ఇండికేటర్స్, ఇంటర్నెట్ ఆధారిత సందేశాలు వంటి ఫీచర్లను అందిస్తుంది. సాంప్రదాయ ఎస్ఎంఎస్, ఎంఎంఎస్ మాదిరిగా కాకుండా ఆర్సీఎస్ మొబైల్ డేటా లేదా వై-ఫై ద్వారా పనిచేస్తుంది. ఇది అంతరాయంలేని మెరుగైన కమ్యూనికేషన్ అనుభవాన్ని అందిస్తుంది.ఇదీ చదవండి: ‘ఆర్థికాభివృద్ధికి ఈ రెండే కీలకం’రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్(ఆర్సీఎస్) మెసేజింగ్ సాంప్రదాయ ఎస్ఎంఎస్లతో పోలిస్తే వినియోగదారు అనుభవాన్ని పెంచే అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అధిక రిజల్యూషన్ చిత్రాలు, వీడియోలు, జిఫ్ల వంటి ఫైళ్లను ఆర్సీఎస్ మెసేజింగ్ అందిస్తుంది. వాట్సాప్, ఐమెసేజ్ వంటి చాట్ యాప్స్ మాదిరిగానే అవతలి వ్యక్తి టైప్ చేస్తున్నప్పుడు రియల్టైమ్లో చూడవచ్చు. ఎస్ఎంఎస్ మాదిరిగా కాకుండా ఆర్సీఎస్ సందేశాలను వై-ఫై లేదా మొబైల్ డేటా ద్వారా పంపవచ్చు. ఇది ఎస్ఎంఎస్ ఛార్జీలను ఆదా చేస్తుంది. సాధారణ సందేశాలను 160 అక్షరాలకు పరిమితం చేసే ఎస్ఎంఎస్ మాదిరిగా కాకుండా, ఆర్సీఎస్ మరింత వివరణాత్మక సందేశాలకు అనుమతిస్తుంది. -
భారత్ కోసం సిద్దమవుతున్న టెస్లా కారు ఇదే!
టెస్లా (Tesla) కంపెనీ తన కార్లను ఇండియన్ మార్కెట్లో విక్రయించడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే సంస్థ భారతీయ విఫణి కోసం ప్రత్యేకంగా 'మోడల్ వై' (Model Y)ను మరింత చౌకైన వెర్షన్గా అభివృద్ధి చేస్తోంది. దీని ధర సాధారణ మోడల్ కంటే 20 శాతం తక్కువ. అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో టెస్లా ఈ మోడల్ తీసురానుంది.టెస్లా తన భారత కార్యకలాపాలను.. తక్కువ ధరకు అందుబాటులో ఉండే ఎలక్ట్రిక్ కారుతో ప్రారంభించాలని యోచిస్తోంది. దీనిని కంపెనీ బెర్లిన్ గిగాఫ్యాక్టరీలో తయారు చేస్తోంది. ఈ కొత్త కారు ప్రారంభ ధర రూ. 21 లక్షలు ఉంటుంది. ఈ కారును చైనా, యూరప్, ఉత్తర అమెరికా మార్కెట్లలో కూడా విక్రయించే అవకాశం ఉంది. అమెరికాలో కూడా దీని ఉత్పత్తిని పెంచడానికి కంపెనీ సన్నద్ధమవుతోంది.సర్టిఫికేషన్ కోసం దరఖాస్తుటెస్లా కంపెనీ భారతీయ మార్కెట్లో విక్రయించనున్న ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల కోసం.. సర్టిఫికేషన్ & హోమోలోగేషన్ ప్రక్రియను ప్రారంభించింది. దేశంలో కార్లను విక్రయించే ముందు సర్టిఫికేషన్ & హోమోలోగేషన్ ప్రక్రియ తప్పనిసరి. కాబట్టి టెస్లా ఇండియా మోటార్ & ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ భారతదేశంలో 'మోడల్ వై, మోడల్ 3' కార్ల హోమోలోగేషన్ కోసం రెండు దరఖాస్తులను సమర్పించింది. -
‘ఆర్థికాభివృద్ధికి ఈ రెండే కీలకం’
భవిష్యత్తులో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత వృద్ధి సాధించాలంటే బలమైన ప్రైవేట్ మూలధన వ్యయం(private capital expenditure), వినియోగం పెరగాలని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు. రూ.52 లక్షల కోట్లకు పైగా డిపాజిట్లున్న ఎస్బీఐ బ్యాంక్కు ఈయన ఇటీవల ఛైర్మన్గా ఎన్నికయ్యారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితులను తెలియజేస్తూ, భవిష్యత్తు వృద్ధిని అంచనా వేస్తూ వ్యాఖ్యలు చేశారు.దేశాభివృద్ధికి ప్రస్తుతం కొన్ని రంగాల్లో ప్రైవేటు మూలధన వ్యయం జరుగుతుండగా ఉక్కు, సిమెంట్ వంటి కీలక పరిశ్రమలు పెట్టుబడులకు ముందుండాలని శెట్టి సూచించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆర్థిక పురోగతికి ఈ రంగాలు కీలకమని చెప్పారు. ప్రస్తుత త్రైమాసిక ఆర్థిక గణాంకాలు వృద్ధికి కీలకమైన వస్తు వినియోగంలో సానుకూల ధోరణిని సూచిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: ముకేశ్ అంబానీ 40వ పెళ్లి రోజు.. బంగారు రంగు కేక్!భారతదేశం అర్థవంతమైన పురోగతిని సాధించడానికి 8 శాతం జీడీపీ వృద్ధి రేటు అవసరమని నొక్కి చెప్పారు. ఈ ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని చేరుకోవడానికి వినియోగం పెంపు, ప్రైవేట్ రంగ పెట్టుబడుల మధ్య సమన్వయం అవసరమని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ పెరుగుదలపై ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. టారిఫ్ సంబంధిత సమస్యల కారణంగా ఆర్థిక వ్యవస్థలో ప్రతికూలతలు నెలకొంటాయని భావించడంలేదని వివరించారు. -
టాటా ఏఐఏ కొత్త ఇన్కం ప్లాన్.. మహిళలకు ప్రత్యేక డిస్కౌంట్
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక భద్రతపరమైన భరోసానివ్వడంతో పాటు సంపద సృష్టికి కూడా ఉపయోగపడేలా టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ శుభ్ ఫ్లెక్సి ఇన్కం ప్లాన్ పేరిట వినూత్న జీవిత బీమా పొదుపు సాధనాన్ని ఆవిష్కరించింది. వివిధ వర్గాల ఆర్థిక ప్రణాళికలు, అవసరాలకు అనుగుణంగా ఇందులో ఎండోమెంట్, ఎర్లీ ఇన్కం, డిఫర్డ్ ఇన్కం ఆప్షన్లు ఉంటాయి. మహిళా పాలసీదార్లకు ప్రత్యేక డిస్కౌంటు ఉంటుంది.బోనస్లపై వడ్డీని పొందుతూ, దాన్ని భవిష్యత్తు ప్రీమియం చెల్లింపులకు ఉపయోగించుకునేలా సబ్–వాలెట్ ఫీచరు కూడా ఉంది. పాలసీదారు దురదృష్టవశాత్తూ కన్ను మూసిన పక్షంలో భవిష్యత్తులో కట్టాల్సిన ప్రీమియంల నుంచి మినహాయింపు లభిస్తుంది. వారి కుటుంబ సభ్యులకు భవిష్యత్తు బోనస్లు, ఇతర ప్రయోజనాలు యథాప్రకారం లభిస్తాయి. -
ప్రతి నెలా రూ.5,000 ఇన్వెస్ట్ చేస్తూ పెద్ద మొత్తం ఎలా?
నేను ప్రతి నెలా రూ.5,000 మొత్తాన్ని సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా ఇన్వెస్ట్ చేస్తూ పెద్ద మొత్తాన్ని సమకూర్చుకోవాలని అనుకుంటున్నాను. దీర్ఘకాలానికి మెరుగైన పథకాలను సూచించగలరు. – అహ్మద్ వానిదీర్ఘకాలానికి ఈక్విటీ ఫండ్స్ మెరుగైనవే. మార్కెట్లలో ఉండే ఆటుపోట్ల దృష్ట్యా మీకు సౌకర్యమైన పథకాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మొదటిసారి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటే, హైబ్రిడ్ ఫండ్స్ మంచి ఎంపిక అవుతాయి. ఇవి మూడింత రెండొంతులు పెట్టుబడులను ఈక్విటీలకు, మిగిలినది డెట్కు కేటాయిస్తుంటాయి. మార్కెట్ పతనాల్లో పెట్టుబడుల విలువ క్షీణతకు డెట్ పెట్టుబడులు కుషన్గా పనిచేస్తాయి. ప్రతి నెలా రూ.5,000 చొప్పున గత 20 ఏళ్ల నుంచి అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఆ మొత్తం రూ.51.25 లక్షలుగా మారి ఉండేది.అంటే వార్షిక సిప్ రాబడి 12.18 శాతం. ఒకవేళ పెట్టుబడుల్లో అనుభవం ఉండి, మార్కెట్ ఆటుపోట్లను తట్టుకునేట్టు అయితే ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ను పరిశీలించొచ్చు. ఈ పథకాలు పూర్తిగా ఈక్విటీల్లో.. అది కూడా లార్జ్, మిడ్, స్మాల్క్యాప్ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుంటాయి. అధిక రిస్క్ తీసుకున్నప్పటికీ 20 ఏళ్ల కాలంలో చూస్తే ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్లో వార్షిక రాబడి 12.66 శాతమే ఉంది. కనుక ఇన్వెస్టర్లు తమ రిస్క్కు అనుగుణంగా ఎంపిక చేసుకోవాలి. ఒక మ్యూచువల్ ఫండ్ సంస్థ నుంచి పలు న్యూ ఫండ్ ఆఫర్లు (ఎన్ఎఫ్వోలు/కొత్త పథకాలు) ప్రారంభం కావడం చూశాను. అవి ఎంతో ఆకర్షణీయంగా అనిపించాయి. కానీ, ఇప్పటికే పెట్టుబడులకు అందుబాటులో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ పథకాల కంటే ఎన్ఎఫ్వోల్లో ఇన్వెస్ట్ చేయడం మెరుగైనదా? అన్న విషయంలో నాకు స్పష్టత లేదు. ఎన్ఎఫ్వోల్లో పెట్టుబడులు పెట్టే ముందు చూడాల్సిన అంశాలు ఏవి? – కరుణాకర్మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు తరచుగా కొత్త పథకాలను ప్రవేశపెడుతుంటాయి. ప్రస్తుత పథకాలతో పోల్చి చూస్తే వీటిల్లో ఉండే వ్యత్యాసం కొంతే. కొన్ని ఎన్ఎఫ్వోలు మాత్రం కొత్త పెట్టుబడుల అవకాశాలతో ముందుకు వస్తుంటాయి. ఇన్వెస్టర్లు ఇప్పటికే మంచి పనితీరు చూపిస్తున్న పథకాలకు పరిమితం కావడం మంచిది. ఎన్ఎఫ్వోల్లో ఇన్వెస్ట్ చేసే ముందుకు ప్రశ్నించుకోవాల్సిన అంశాలు చూద్దాం. ఎన్ఎఫ్వోలో కొత్తదనం ఏదైనా ఉందా? అన్నది చూడాలి. చాలా ఎన్ఎఫ్వోలు ప్రస్తుత పథకాలకు మాస్క్ మాదిరిగా ఉంటాయి. ఇంటర్నేషనల్ ఈక్విటీ, గోల్డ్ ఫండ్స్ తదితర వినూత్నమైన ఆఫర్లు మినహా సాధారణమైన ఎన్ఎఫ్వోలతో పోర్ట్ఫోలియోకు అదనంగా ఒనగూడే ప్రయోజనం ఏదీ ఉండదు. థీమ్ లేదా సెక్టార్ ఫండ్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సంబంధిత ఎన్ఎఫ్వో తమ పెట్టుబడుల అవసరాలను తీర్చే విధంగా ఉందా? అన్నది చూడాలి.మీ ప్రస్తుత పెట్టుబడులు మీ ఆర్థిక లక్ష్యాలను తీర్చే విధంగా ఉంటే, ఎన్ఎఫ్వో మెరుగైన ఆప్షన్ కాకపోవచ్చు. ప్రతీ ఫండ్ మీ పోర్ట్ఫోలియోలో చేరాలనేమీ లేదు. కొత్తగా వచ్చిన ఎన్ఎఫ్వో మాదిరిగా పెట్టుబడుల విధానాన్ని ఆఫర్ చేస్తున్న పథకాలు ఇప్పటికే ఏవైనా ఉన్నాయేమో పరిశీలించాలి. ఒకవేళ ఉంటే, వాటిల్లో రాబడుల పనితీరు కొన్నేళ్ల నుంచి మెరుగ్గా ఉందా? లేదా అన్నది పరిశీలించాలి.సమాధానాలు: ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
పోలీసులమంటూ ఫోన్.. ముసలావిడ దగ్గర రూ.20 కోట్లు స్వాహ
దేశంలో సైబర్ మోసాలు పెరిగిపోతూనే ఉన్నాయి. సంబంధిత అధికారులు ఈ సైబర్ మోసగాళ్ల వలలో పడిపోవద్దని హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ప్రతో రోజూ ఏదో ఓ మూల.. ఇలాంటి ఒక కేసు నమోదవుతూనే ఉంది. తాజాగా ముంబైకి చెందిన ఓ మహిళ ఏకంగా రూ. 20 కోట్లు కోల్పోయిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.ముంబైకి చెందిన 86 ఏళ్ల మహిళకు, కొందరు మోసగాళ్లు ఆధార్ కార్డు దుర్వినియోగం అవుతున్నట్లు కాల్ చేసి చెప్పారు. స్కామర్లు.. పోలీస్ అధికారులమంటూ పరిచయం చేసుకున్నారు.. అక్కడ నుంచి స్కామ్ ప్రారంభమైంది. ఆధార్ కార్డును చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దుర్వినియోగం చేస్తున్నారనే నెపంతో ఆమెను డిజిటల్ అరెస్ట్ చేశారు. కేసును పరిష్కరించడానికి అనేక బ్యాంకు ఖాతాలకు డబ్బును బదిలీ చేయమని బలవంతం చేశారు.ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదని ఆమెను హెచ్చరించారు. అయితే జరుగుతున్న మోసాన్ని గుర్తించిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అప్పటికే రూ. 20.25 కోట్లు కోల్పోయింది. ఫిర్యాదు స్వీకరించిన తరువాత.. ఏ ఖాతాలకు డబ్బు బదిలీ అయిందనే విషయాలను పరిగణలోకి తీసుకుని ట్రాక్ చేసి, మోసగాళ్లను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.డిజిటల్ అరెస్ట్మోసగాళ్ళు కొందరికి ఫోన్ చేసి.. అక్రమ వస్తువులు, డ్రగ్స్, నకిలీ పాస్పోర్ట్లు లేదా ఇతర నిషేధిత వస్తువులు తమ పేరుతో పార్సిల్ వచ్చినట్లు చెబుతారు. ఇదే నేరంగా పరిగణిస్తూ.. ఇలాంటి అక్రమ వస్తువుల విషయంలో బాధితుడు కూడా పాలు పంచుకున్నట్లు భయపెడతారు. ఇలాంటి కేసులో రాజీ కుదుర్చుకోవడానికి డబ్బు డిమాండ్ చేస్తారు. ఇలాంటి మోసాలనే డిజిటల్ అరెస్ట్ అంటారు.ఇదీ చదవండి: తగ్గుతూనే ఉన్న బంగారం రేటు: నేటి ధరలు ఇవే..డిజిటల్ అరెస్ట్ స్కామ్లో వ్యక్తులను భయపెట్టడానికి లేదా మోసగించడానికి ప్రభుత్వ సంస్థలు, చట్ట అమలుతో సహా వివిధ సంస్థల అధికారులు మాదిరిగా వ్యవహరిస్తారు. ఇలాంటి కాల్స్ వస్తే.. చాలా జాగ్రత్తగా వ్యవరించాలి. ఒకసారి నమ్మితే భారీగా మోసపోవడానికి సిద్దమయ్యారన్నమాటే.ఆధార్ స్కామ్ నుంచి సురక్షితంగా ఉండటం ఎలా?పోలీసులు లేదా యూఐడీఏఐ అధికారులు.. ఎప్పుడూ మీ వ్యక్తిగత వివరాలను, ఓటీపీ వంటి వివరాల కోసం ఫోన్ చేయరు. కాబట్టి ఎవరైనా కాల్ చేసి ఇలాంటి వివరాలను అడిగారంటే.. తప్పకుండా వాళ్ళు మోసగాళ్లు అని తెలుసుకోవాలి. మీకు అలాంటి కాల్స్ వస్తే.. వెంటనే డిస్కనెక్ట్ చేసి, 1947కు లేదా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయండి. -
అమ్మకు ఖరీదైన కారు గిఫ్ట్..
ప్రతి తల్లీ తన పిల్లల విజయాన్నే కాంక్షిస్తుంది. వారి విజయానికి మించిన గొప్ప బహుమతి మరేది ఉండదామెకు. కానీ రేవతి కామత్కు ఆమె కుమారులు జెరోధా సహ వ్యవస్థాపకులు నిఖిల్ కామత్, నితిన్ కామత్లు అమితమైన ఆనందాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్లారు.ఖరీదైన సరికొత్త లగ్జరీ మెర్సిడెస్ కారును గిఫ్ట్ ఇచ్చి తల్లికి గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. సంప్రదాయ స్పర్శను జోడించి ఆ క్షణాన్ని మరింత ప్రత్యేకం చేశారు. గర్వంతో ఉప్పొంగిన తల్లి రేవతి కామత్ తన ఆనందాన్ని ఫేస్బుక్లో పంచుకున్నారు. "నా కొడుకులు ఈరోజు నాకు కొత్త కారును బహుమతిగా ఇచ్చారు. తలపాగ, శాలువాతో ఇలా.. కారు తాళాలు అందుకున్నాను" అంటూ ఫొటోలను షేర్ చేశారు.పేటా (సంప్రదాయ తలపాగా), షాల్ (ఉత్సవ శాలువా)తో సత్కరిస్తుండగా ఆమె కారు తాళాలు అందుకున్న క్షణాలు ఈ ఫొటోల్లో ఉన్నాయి. ఫోటోలలో కన్పిస్తున్న లగ్జరీ వాహనం మెర్సిడెస్ జీఎల్ఎస్. దీని ధర రూ .1.5 కోట్లకు పైగా ఉంటుంది. జీఎల్ఎస్ కారులో విశాలమైన అల్ట్రా-లగ్జరీ క్యాబిన్, అత్యాధునిక ఇన్ఫోటైన్మెంట్, శక్తివంతమైన ఇంజన్, ఇతర సౌకర్యాలు ఉన్నాయి.వ్యాపార చతురతకు, దాతృత్వానికి పేరుగాంచిన నిఖిల్ కామత్, అలాగే ఆయన సోదరుడు జెరోధా సీఈఓ నితిన్ కామత్లు తమకు విలువలు, నైతికతను తీర్చిదిద్దిన ఘనత తమ తల్లిదేనని తరచూ ఇంటర్వ్యూల్లో చెబుతుంటారు. ఇదిలా ఉండగా నితిన్ కామత్ ఇటీవల ప్రతిష్టాత్మక ఈవై ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ (ఈఓవై) 2024 అవార్డును అందుకున్నారు. ఆయన వినూత్న, తక్కువ-మార్జిన్, అధిక-వాల్యూమ్ బ్రోకరేజీ మోడల్ భారతదేశ స్టాక్ ట్రేడింగ్ పరిశ్రమను మార్చివేసింది. స్వయంకృషితో జెరోధాను బాహ్య నిధులు లేకుండానే బిలియన్ డాలర్ల సంస్థగా ఆయన నిర్మించారు. -
ముకేశ్ అంబానీ 40వ పెళ్లి రోజు.. బంగారు రంగు కేక్.. దానిపై అన్నీ అవే!
భారతీయ కుబేరుడు, ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ.. ఈ నెలలో తన భార్య నీతా అంబానీతో 40వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా వీరి ఓ ప్రత్యేకమైన కేక్ తయారు చేశారు. 30 కేజీల బరువున్న ఈ కేక్ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. ప్రత్యేకమైన కేక్ చూడవచ్చు. ఈ కేక్ మీద సింహాలు, జిరాఫీలు, ఏనుగులు, మొసళ్ళు వంటి వివిధ జంతువుల ఆకారాలు బంగారు రంగులో ఉండటం చూడవచ్చు. జామ్నగర్లోని జంతు సంరక్షణ, పునరావాస కేంద్రమయిన వంతారాను ప్రేరణగా తీసుకుని ఈ కేక్ మీద జంతువుల బొమ్మలు చిత్రించారు.కేక్ మధ్యలో నీతా, ముకేశ్ అంబానీల మొదటి అక్షరాలు ఉన్నాయి. పై భాగంలో వార్షికోత్సవ శుభాకాంక్షలు అని ఉండటం చూడవచ్చు. దీనిని ముంబైలోని ప్రముఖ బేకరీ డెలిసియాను నడుపుతున్న బంటీ మహాజన్ తయారు చేశారు.వంతారాఅనంత్ అంబానీ గుజరాత్లోని జామ్నగర్లో 3వేల ఎకరాల్లో వంతారా పేరుతో కృత్రిమ అడవిని ఏర్పాటు చేశారు. ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటు చేశారు. ఈ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. పూర్తిగా పోర్టబుల్ ఎక్స్రే యంత్రాలు, శస్త్ర చికిత్సల కోసం లేజర్ యంత్రాలు, పాథాలజీ ల్యాబ్లు, హైపర్బారిక్ ఆక్సిజన్ ఛాంబర్తోపాటు అధునాతన సదుపాయాలు ఉన్నాయి. View this post on Instagram A post shared by Deliciae by Bunty Mahajan (@delcakes.in) -
ఐపీఎల్కు ముందే అన్లిమిటెడ్ ఆఫర్: జియో యూజర్లకు పండగే!
దేశవ్యాప్తంగా క్రికెట్ ఫీవర్ ఉప్పొంగుతోంది. క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న.. ఐపీఎల్ 2025 త్వరలోనే ప్రారంభం కానుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని జియో (Jio) తన కస్టమర్ల కోసం స్పెషల్ అన్లిమిటెడ్ క్రికెట్ ఆఫర్ను ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ ద్వారా 90 రోజులపాటు జియోహాట్స్టార్ సబ్స్క్రిప్షన్ పొందవచ్చు.జియో ప్రవేశపెట్టిన ఈ ప్లాన్ కోసం రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే మూడు నెలలు జియోహాట్స్టార్ ప్రసారాలను వీక్షించవచ్చు. ఈ ఆఫర్ మార్చి 17 నుంచి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది.జియో కొత్త ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా.. మొబైల్, టీవీలలో 4కే స్ట్రీమింగ్ సర్వీస్ కూడా పొందవచ్చు. అంతే కాకుండా 50 రోజులపాటు జియో ఫైబర్ సేవలు కూడా ఉచితంగా అందుకోవచ్చు. ఇందులో అన్లిమిటెడ్ వైఫై, 800 కంటే ఎక్కువ ఓటీటీ ఛానల్స్, 11 ఓటీటీ యాప్లు వీక్షించవచ్చు.ఇదీ చదవండి: తగ్గుతూనే ఉన్న బంగారం రేటు: నేటి ధరలు ఇవే..జియో ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న తరువాత.. దీని వ్యాలిడిటీ ఐపీఎల్ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి 90 రోజుల వరకు ఉంటుంది. ఇప్పటికే ఉన్న జియో వినియోగదారులు రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్తో రీఛార్జ్ చేయడం ద్వారా ఈ ఆఫర్ను యాక్టివేట్ చేసుకోవచ్చు. అయితే మార్చి 17కి ముందు రీఛార్జ్ చేసుకున్న వారు రూ. 100 యాడ్-ఆన్ ప్యాక్ను ఎంచుకోవడం ద్వారా కూడా ప్రయోజనాలను పొందవచ్చు. -
కొత్త ఫండ్ గురూ: సిల్వర్ ఈటీఎఫ్.. టాప్ 20.. ఫోకస్డ్ 25
పారిశ్రామిక కమోడిటీగాను, విలువైన లోహంగా పెట్టుబడికి అనువైన సాధనంగాను వెండి ద్విపాత్రాభినయం పోషిస్తోంది. ఇందులో ఇన్వెస్ట్ చేసేందుకు వీలు కల్పించేలా 360 వన్ అసెట్ మేనేజ్మెంట్ (గతంలో ఐఐఎఫ్ఎల్ అసెట్ మేనేజ్మెంట్) సిల్వర్ ఈటీఎఫ్ను ఆవిష్కరించింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ మార్చి 20 వరకు అందుబాటులో ఉంటుంది. కనీసం రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది దేశీయంగా వెండి ధరలను ట్రాక్ చేస్తూ, దానికి అనుగుణమైన పనితీరు కనపరుస్తుందని సంస్థ సీఈవో రాఘవ్ అయ్యంగార్ తెలిపారు. వెండి ధరల కదలికలకు అనుగుణంగా దీర్ఘకాలిక సంపద సృష్టి, ఆదాయం కోరుకునే ఇన్వెస్టర్లకు అనువైనదిగా ఉంటుందని పేర్కొన్నారు. మొత్తం అసెట్స్లో 95 శాతాన్ని వెండి లేదా వెండి సంబంధిత సాధనాల్లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. హెచ్డీఎఫ్సీ ‘నిఫ్టీ టాప్ 20’ ఇండెక్స్ ఫండ్ హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ కొత్తగా నిఫ్టీ టాప్ 20 ఈక్వల్ వెయిట్ ఇండెక్స్ ఫండ్ను ప్రవేశపెట్టింది. ఇది మార్చి 21తో ముగుస్తుంది. సమాన వెయిటేజీ పెట్టుబడి విధానం ద్వారా దేశీ బ్లూ చిప్ కంపెనీల దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను, ప్రయోజనాలను అందిపుచ్చుకోవాలనుకునే ఇన్వెస్టర్లకు ఈ స్కీము అనువైనదిగా ఉంటుంది. ఒకే స్టాక్లో అధికంగా ఇన్వెస్ట్ చేయడం కాకుండా సమాన స్థాయిలో పెట్టుబడిని కేటాయించడం వల్ల రిస్కులు తగ్గించుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. వెయిటేజీ ప్రతి మూడు నెలలకోసారి మారుతుంది. కనీసం రూ. 100 నుంచి ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చని సంస్థ ఎండీ నవ్నీత్ మునోట్ తెలిపారు. బజాజ్ అలయంజ్ లైఫ్ ఫోకస్డ్ 25 ఫండ్ ప్రైవేట్ రంగ జీవిత బీమా సంస్థ బజాజ్ అలయంజ్ లైఫ్ తాజాగా ఫోకస్డ్ 25 ఫండ్ పేరిట న్యూ ఫండ్ ఆఫర్ను ప్రకటించింది. కంపెనీకి చెందిన యులిప్ పథకాలతో పాటు ఇది అందుబాటులో ఉంటుంది. వివిధ మార్కెట్ క్యాపిటలైజేషన్లవ్యాప్తంగా 25 వరకు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో పెట్టుబడి వృద్ధికి దోహదపడుతుంది. ఈ ఎన్ఎఫ్ఓ మార్చి 20 వరకు అందుబాటులో ఉంటుందని సీఎఫ్ఓ శ్రీనివాస్ రావు రావూరి తెలిపారు. -
క్లోజ్ అవుతున్న పోస్టాఫీస్ స్కీమ్..
ప్రజల్లో ఆర్థిక పొదుపును ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. సామాన్య ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా పోస్టాఫీసుల ద్వారా వీటిని అమలు చేస్తోంది. అలాంటి మంచి స్కీముల్లో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎంఎస్ఎస్సీ) పథకం ఒకటి.మహిళల కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి ఇక చాలా తక్కువ రోజులే సమయం ఉంది. పోస్టాఫీస్ కింద నిర్వహించే ఎంఎస్ఎస్సీ పథకంలో పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీ మార్చి 31. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్లో పెట్టుబడి సమయాన్ని ప్రభుత్వం ఇంకా పొడిగించలేదు. ఇప్పటి వరకు ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయని మహిళలకు కొన్ని రోజులే సమయం ఉంది. ఈ నేపథ్యంలో దీని గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..మహిళలకు ప్రత్యేకంస్వాతంత్య్ర అమృత్ మహోత్సవ్ కింద భారత ప్రభుత్వం 2023 మార్చి 31న మహిళలు, బాలికల కోసం ఎంఎస్ఎస్సీ (మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్) పథకాన్ని ప్రారంభించింది. అయితే ఇది రెండు సంవత్సరాల కాలానికి అమలు చేస్తున్న స్వల్పకాలిక డిపాజిట్ స్కీమ్. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి వారికి ఆర్థిక స్వావలంబన కల్పించడమే ఈ పథకం లక్ష్యం.ఎంత వడ్డీ లభిస్తుంది?దేశంలోని ఏ మహిళ అయినా ఈ పథకంలో 2 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీమ్ కింద ఆకర్షణీయమైన వడ్డీ లభిస్తుంది. ఎంఎస్ఎస్సీ స్కీమ్పై 7.5% వార్షిక వడ్డీ చెల్లిస్తున్నారు. ఇది బ్యాంకులలో 2 సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇస్తున్న వడ్డీ కంటే ఎక్కువ. ఇది సురక్షితమైన పథకం ఎందుకంటే ఇది ప్రభుత్వమే నిర్వహిస్తుంది. దీని కింద పోస్టాఫీస్ లేదా రిజిస్టర్డ్ బ్యాంకుల్లో సులభంగా ఖాతా తెరవవచ్చు.పెట్టుబడి ఎంత పెట్టవచ్చు?మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకం కింద దేశంలో నివసించే ఏ మహిళ అయినా కనీసం రూ .1,000 నుంచి గరిష్టంగా రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 2 సంవత్సరాల వ్యవధి తర్వాత, అసలు, వడ్డీ మొత్తం చెల్లిస్తారు. ఏదైనా అవసరం పడితే ఒక సంవత్సరం తరువాత డిపాజిట్ మొత్తంలో 40% వరకు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. తీవ్రమైన అనారోగ్యం లేదా ఖాతాదారు మరణం వంటి పరిస్థితులలో ఖాతాను ముందస్తుగా మూసివేయవచ్చు. డిపాజిటర్ 6 నెలల తర్వాత ఖాతాను మూసివేస్తే వడ్డీ రేటు తగ్గవచ్చు. -
భారత్కు నిజమైన బహుమతి!: అదానీ ట్వీట్
నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జూన్లో ప్రారంభించనున్నట్లు అదానీ గ్రూప్ చైర్మన్ 'గౌతమ్ అదానీ' (Gautam Adani) ప్రకటించారు. దీనిని ఏప్రిల్ 17న ప్రారంభించాలని మొదట అనుకున్నప్పటికీ.. కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత, ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఈ కొత్త విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తున్నారు.ఈ ప్రాజెక్ట్ నిర్మాణం అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ (AAHL), సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ మహారాష్ట్ర (CIDCO) భాగస్వామ్యంతో జరుగుతోంది. 2018 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రాజెక్టుకు పునాదిరాయి వేసారు. దీని నిర్మాణానికి అయ్యే ఖర్చు రూ. 16,700 కోట్లు అవుతుందని అంచనా.ఇప్పటికే ముంబైలోని ప్రధాన విమానాశ్రయంలో రద్దీని తగ్గించడానికి.. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ విమానాశ్రయాన్ని సందర్శించిన సందర్భంగా.. ఈరోజు నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ స్థలాన్ని సందర్శించాను. ప్రపంచ స్థాయి విమానాశ్రయం రూపుదిద్దుకుంటోంది. ఇది జూన్లో ప్రారంభోత్సవానికి సిద్దమవుతుంది. అంతే కాకుండా ఇది భారతదేశానికి నిజమైన బహుమతి!. అని అదానీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.ఇదీ చదవండి: కేంద్ర ప్రభుత్వ స్కీమ్: వయోపరిమితి 60 ఏళ్లకు తగ్గింపు!రెండు రన్వేలు, నాలుగు టెర్మినల్స్తో రూపొందించబడిన నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం, ఐదు దశల్లో పూర్తయిన తర్వాత ఏటా 90 మిలియన్ల మంది ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తున్నారు. దీని నిర్మాణం పూర్తయిన తరువాత ముంబైలోని ప్రధాన విమానాశ్రయంలో రద్దీ తగ్గుతుంది.A glimpse into India’s aviation future! ✈️Visited the Navi Mumbai International Airport site today—a world-class airport taking shape. Set for inauguration this June, it will redefine connectivity & growth. A true gift to India!Kudos to the Adani Airports team & partners for… pic.twitter.com/2TCWcSnr6c— Gautam Adani (@gautam_adani) March 16, 2025 -
పెరగనున్న కార్ల ధరలు: ఎప్పటి నుంచి అంటే?
భారతదేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ 'మారుతి సుజుకి' (Maruti Suzuki) ఏప్రిల్ 2025 నుంచి తన వాహనాల ధరలను 4 శాతం పెంచే ప్రణాళికలను సోమవారం ప్రకటించింది. పెరుగుతున్న ఇన్పుట్ ధరలు, నిర్వహణ ఖర్చులు కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది.మోడల్ను బట్టి ధరల పెంపు జరుగుతుంది. అయితే కొత్త ధరలు వచ్చే నెలలో అధికారికంగా వెల్లడవుతాయి. ఖర్చులను ఆప్టిమైజ్ చేయడానికి.. వినియోగదారులపై ప్రభావాన్ని పరిమితం చేయడానికి కృషి చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే.. కొన్ని తప్పని పరిస్థితులలో పెరుగుతున్న ధరల ప్రభావం కొంత వినియోగదారులపై కూడా పడుతుందని సంస్థ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: తగ్గుతూనే ఉన్న బంగారం రేటు: నేటి ధరలు ఇవే..మారుతి సుజుకి తమ వాహన ధరలను పెంచడం ఇదే మొదటిసారి కాదు. 2025 ఫిబ్రవరిలో కూడా కంపెనీ ఎంపిక చేసిన మోడల్ ధరలను రూ. 1500 నుంచి రూ. 32,000 వరకు పెంచింది. ఈ సారి కూడా ఈ స్థాయిలోనే ధరలు పెరిగే అవకాశం ఉంటుందని సమాచారం. పెరిగిన ధరలు త్వరలోనే అధికారికంగా వెల్లడవుతాయి. -
తగ్గుతూనే ఉన్న బంగారం రేటు: నేటి ధరలు ఇవే..
దేశంలో బంగారం ధరలు మరోమారు తగ్గుముఖం పట్టాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 82,100 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 89,560 వద్ద నిలిచాయి. నిన్న స్థిరంగా ఉన్న గోల్డ్ రేటు.. ఈ రోజు రూ. 100 (22 క్యారెట్స్ 10గ్రా), రూ.110 (24 క్యారెట్స్ 10గ్రా) తగ్గింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 100, రూ. 110 తగ్గింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 82,100 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 89,560 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 82,250 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 89,710 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 100, రూ. 110 తక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. ఈ రోజు (మార్చి 16) కేజీ సిల్వర్ రేటు రూ. 1,11,900 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకేవిధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 1,02,900 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. దూసుకెళ్తున్న ఇండస్ఇండ్ బ్యాంక్
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రశాంతంగా ప్రారంభమైన తర్వాత బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సూచీలు బలపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ దాదాపు 73,830 వద్ద ప్రారంభమైంది. తరువాత ఆటో, ఫైనాన్షియల్ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో పుంజుకుంది.ఉదయం 9.25 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 412 పాయింట్ల లాభంతో 72,245 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ కూడా 135 పాయింట్లు లాభపడి 22,533 వద్ద ట్రేడవుతోంది.సెన్సెక్స్ 30 షేర్లలో ఇండస్ ఇండ్ బ్యాంక్ దాదాపు 5 శాతం లాభపడింది. బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా 2 - 3 శాతం చొప్పున లాభపడ్డాయి. మరోవైపు నెస్లే ఇండియా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్ స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. విస్తృత మార్కెట్లో, బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 1.8 శాతం లాభపడగా, స్మాల్ క్యాప్ సోమవారం ఇంట్రాడేలో 0.5 శాతం పెరిగింది. -
విదేశీ ఆస్తులు, ఆదాయం చూపించలేదా..
మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. 2024 నవంబర్ 17 నుంచి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఓ ప్రచార కార్యక్రమం ప్రారంభించింది. ‘మీలో ఎవరైనా విదేశీ ఆస్తులు, విదేశీ ఆదాయాన్ని డిక్లేర్ చేశారా లేదా. ఒకవేళ చేయకపోతే వెంటనే చేయండి‘ అనేది దీని సారాంశం. సాధారణంగా ఐటీఆర్లు దాఖలు చేసినప్పుడు, ప్రతి అస్సెస్సీ ముఖ్యంగా రెసిడెంట్ స్టేటస్ గల వారు తమ ఆదాయాన్ని .. అంటే మనదేశంలో వచ్చిన ఆదాయంతో పాటు విదేశాల్లో వచ్చినదాన్ని కూడా చూపించాలి.నాన్ రెసిడెంట్లు కేవలం మన దేశంలో వచ్చిన ఆదాయాన్ని చూపిస్తే చాలు. విదేశాల్లోని ఆస్తులు, ఆదాయాలు డిక్లేర్ చేయక్కర్లేదు. పన్ను భారమనేది అస్సెస్సీ రెసిడెన్షియల్ స్టేటస్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు భారత్లో ఒక ఆర్థిక సంవత్సరంలో ఉన్న వ్యవధి 182 రోజులు లేదా అంతకన్నా ఎక్కువగా ఉంటే రెసిడెంట్ అవుతారు. లేకపోతే నాన్ రెసిడెంట్లవుతారు. ఈ వ్యవధిని లెక్కించడానికి పాస్పోర్ట్లోని పద్దులు, ఎంట్రీలను ప్రాతిపదికగా తీసుకుంటారు. వాటి ప్రకారం రోజులను లెక్కిస్తారు.సాధారణంగా మనందరం రెసిడెంట్లు అవుతాం. పిల్లలు విదేశాల్లో ఉద్యోగం చేస్తుండటం వల్ల వారు నాన్ రెసిడెంట్లు అవుతారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ స్టేటస్ను తప్పుగా పేర్కొనకూడదు. ఈ విషయాన్ని అందరికీ తెలియజేసేందుకు, అవగాహన కల్పించేందుకు, విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా తప్పులుంటే/తప్పులు జరిగితే సరిదిద్దుకోండి. మీ రిటర్నును రివైజ్ చేసుకోండి .. అని చెప్పారు. దీనిపై మెసేజీలు పంపారు. ఇవి రాగానే అందరూ ఉలిక్కిపడ్డారు.వెంటనే తమ స్టేటస్ని, ఆదాయాన్ని, ఆస్తుల వివరాలను చెక్ చేసుకున్నారు. 30,161 మంది అస్సెస్సీలు తమ తప్పులను సరి చేసుకున్నారు. వారి వారి ఆస్తులను (విదేశాల్లోనివి) డిక్లేర్ చేశారు. వీరిలో 24,678 మంది రివ్యూ చేసుకున్నారు. 5,483 మంది తమ రిటర్నులను రివైజ్ చేసుకున్నారు. దీనితో రూ. 29,208 కోట్ల విదేశీ ఆస్తులు అదనంగా ఉన్నట్లు బైటపడింది. వాటి ద్వారా అదనంగా రూ. 1,089 కోట్ల ఆదాయం బైటికొచ్చింది.అంతే కాకుండా 6,734 మంది వారి స్టేటస్ను రెసిడెంటు నుంచి నాన్ రెసిడెంటుగా మార్చుకున్నారు. ఇలాంటి ప్రచారం వల్ల ఎన్నో మంచి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అవగాహన, పారదర్శకత పెరుగుతోంది. నిబంధనలను పాటించడం (కాంప్లయెన్స్) పెరిగింది. కీలక వివరాలు తెలిశాయి. పన్నుల వసూళ్లు పెరిగాయి.కామన్ రిపోర్టింగ్ స్టాండర్డ్ (సీఆర్ఎస్) ద్వారా విదేశాల్లోని పన్ను అధికారుల నుంచి సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. అన్ని దేశాల నుంచి సమగ్రమైన సమాచారం వస్తోంది. అంతే కాకుండా విదేశీ ఖాతాల నుంచి సమాచారం వస్తోంది. పలు చోట్ల సెమినార్లు, వెబినార్లు నిర్వహించారు. కరపత్రాలు, బ్రోచర్లు పంచారు. సోషల్ మీడియా వాడుకున్నారు. ఇదంతా ఇప్పటివరకు స్నేహపూర్వకంగా జరుగుతోంది. ఇలాగే కొనసాగాలంటే, ‘వాళ్లు మన గురించి తెలుసుకుంటున్నారన్న విషయాన్ని‘ మనం అర్థం చేసుకుని మసలుకోవాలి.పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు. -
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ’ఛోటీ సిప్’.. రూ. 250 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు
సాక్షి, హైదరాబాద్: ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ తాజాగా ఛోటీ సిప్ను (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) ప్రారంభించింది. డెట్, సెక్టోరల్, థీమ్యాటిక్లాంటి కొన్ని ఫండ్స్కి తప్ప మిగతా అన్ని రకాల స్కీములకు ఇది అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. నెలవారీగా రూ. 250 నుంచి ఈ సిప్లో ఇన్వెస్ట్ చేయొచ్చు.కనీసం 60 వాయిదాలు కట్టాల్సి ఉంటుందని సంస్థ ఎండీ ఎ. బాలసుబ్రమణియన్ తెలిపారు. క్రమశిక్షణతో పెట్టుబడులు పెట్టే ధోరణిని అలవర్చుకునేందుకు ఈ విధానం తోడ్పడగలదని పేర్కొన్నారు. ఇందులో, ముందస్తుగా విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. -
అమెరికాలో టాటా టెక్నాలజీస్ పెట్టుబడులు.. అందుకే ఆలస్యం
న్యూఢిల్లీ: టారిఫ్ విధానాలపై అస్పష్టత నెలకొనడం వల్ల అమెరికాలో పెట్టుబడుల ప్రతిపాదనలను అమలు చేయడంలో జాప్యం జరగొచ్చని టాటా టెక్నాలజీస్ సీఈవో వారెన్ హారిస్ తెలిపారు. అయితే, వచ్చే నెలా, రెణ్నెల్లలో కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. ఉత్తర అమెరికా మార్కెట్పై మధ్యకాలికం నుంచి దీర్ఘకాలికంగా తాము చాలా బులిష్గా ఉన్నట్లు వివరించారు.టారిఫ్లు నచ్చడం, నచ్చకపోవడాన్ని పక్కన పెడితే స్పష్టతనేది కీలకంగా ఉంటుందని హారిస్ చెప్పారు. తమ కస్టమర్లకు ఒక అవగాహన వచ్చిన తర్వాత తగు నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు. తమ సంస్థ స్వేచ్ఛా వాణిజ్యానికి మద్దతు పలికినప్పటికీ, వివిధ మార్కెట్లలో పరిస్థితులు వివిధ రకాలుగా ఉంటాయి కాబట్టి తదనుగుణంగా వ్యాపారాలను నిర్వహించాల్సి ఉంటుందని హారిస్ తెలిపారు.‘ఉత్తర అమెరికాకు యూరప్ చాలా భిన్నంగా ఉంటుంది. అలాగే, భారత్కి భిన్నంగా చైనా ఉంటుంది. కాబట్టి ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించడాన్ని మేము అలవర్చుకున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు. -
జోరుగా అమ్మేస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు..
న్యూఢిల్లీ: దేశీ స్టాక్స్లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐలు) అమ్మకాలు కొనసాగుతున్నాయి. గతేడాది(2024) అక్టోబర్లో మొదలైన అమ్మకాలు ఇటీవల కొద్ది నెలలుగా జోరందుకున్నాయి. వెరసి ఈ నెలలో ఇప్పటివరకూ(3–13 మధ్య) నికరంగా రూ. 30,015 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య సుంకాల ఆందోళనలు పెరగడంతో ప్రధానంగా విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో ఫిబ్రవరిలో రూ. 34,574 కోట్లు, జనవరిలో రూ. 78,027 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. వెరసి 2025లో ఇప్పటివరకూ రూ. 1.42 లక్షల కోట్ల(16.5 బిలియన్ డాలర్లు) విలువైన స్టాక్స్ విక్రయించారు. -
బంగారం పంట పండింది
పెట్టుబడి దాదాపు రూ.3 వేలు. చేతికి వస్తున్నది మాత్రం రూ.8,600 పైమాటే. మీరు చదువుతున్నది అక్షరాలా నిజం. సావరిన్ గోల్డ్ బాండ్స్ (ఎస్జీబీ) 2016–17 సిరీస్–4 కొనుగోలు చేసిన పెట్టుబడిదారులకు ఇప్పుడు ‘బంగారం’పంట పండింది. ఈ నెల 17నాటికి ఎనిమిదేళ్ల గడువు ముగిసే సావరిన్ గోల్డ్ బాండ్లకు ఒక్కో గ్రాముకు రిడెమ్షన్ (ఉపసంహరణ) ధర రూ.8,624గా నిర్ణయించినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించింది. ఒక్కో గ్రాముకు రూ.2,943 చొప్పున ఎస్జీబీ సిరీస్–4ను 2017 మార్చి 17న జారీ చేశారు. అంటే ఇన్వెస్టర్లు 193 శాతం లాభం అందుకుంటున్నారన్న మాట. దీనికి వడ్డీ అదనం. – సాక్షి, స్పెషల్ డెస్క్మొత్తం 146 టన్నులు..సావరిన్ గోల్డ్ బాండ్ పథకం 2015 నవంబర్లో ప్రారంభం అయ్యింది. ఈ పథకంలో భాగంగా మొత్తం 67 విడతలుగా 146.96 టన్నుల గోల్డ్ బాండ్స్ జారీ అయ్యాయి. వీటి విలువ రూ.72,274 కోట్లు. 2023–24లో ఇన్వెస్టర్లు రూ.27,031 కోట్ల విలువైన 44.34 టన్నుల గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేశారు. 2017–2020 మధ్య జారీ అయిన ఎస్జీబీలకు ముందస్తు ఉపసంహరణను 2024 జూలై నుంచి ఆర్బీఐ ప్రకటించింది. ప్రభుత్వం 2024 జూలై నుంచి∙ఆరు విడతల ఎస్జీబీ మొత్తాలను తిరిగి చెల్లించింది. 61 విడతలు మిగిలి ఉన్నాయి. తుది చెల్లింపు 2032 ఫిబ్రవరిలో జరగనుంది.సిరీస్ల వారీగా ఇలా.. గ్రాముకు రూ.3,119 ధరతో 2016 ఆగస్ట్ 5న జారీ చేసిన ఎస్జీబీ 2016–17 సిరీస్–1 గత ఏడాది 2024 ఆగస్ట్ తొలి వారంలో రూ.6,938 చొప్పున రిడీమ్ అయ్యాయి. గ్రాముకు రూ.3,150 చొప్పున 2016 సెప్టెంబర్ 30న జారీ అయిన 2016–17 సిరీస్–2 గత ఏడాది సెప్టెంబర్ 30న రూ.7,517 ధరతో ఉపసంహరించారు. రూ.3,007 ధరతో 2016 నవంబర్ 17న జారీ అయిన 2016–17 మూడవ సిరీస్ రూ.7,788 చొప్పున 2024 నవంబర్ 16న రిడీమ్ అయ్యాయి. ఇక గ్రాముకు రూ.2,943 ధరతో జారీ చేసిన నాలుగో విడత సావరిన్ గోల్డ్ బాండ్స్ ఒక్కో గ్రాముకు రూ.8,624 చొప్పున రిడెమ్షన్ కానుంది. భారంగా మారిన బాండ్లు ఎస్జీబీ పథకం కథ పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. భారత్లో పెరుగుతున్న బంగారం దిగుమతులను తగ్గించాలన్న లక్ష్యంతో పదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించింది. ఆశించిన ప్రయోజనం అటుంచితే పెరుగుతున్న బంగారం ధరలతో ఖజానాపై ఊహించని ఆర్థిక భారం పడింది. దీంతో ప్రభుత్వం చివరకు ఈ పథకాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. గోల్డ్ బాండ్స్లో ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి రూ.85,000 కోట్లను తాకనుందని 2024 జూలై మధ్యంతర బడ్జెట్ సందర్భంగా ప్రభుత్వం వెల్లడించింది. ఈ విలువ 2019–20తో పోలిస్తే దాదాపు తొమ్మిది రెట్లు అదనం. 2016–17 సిరీస్–1 ఉపసంహరణతో ఇన్వెస్టర్లు 122 శాతం ప్రీమియం అందుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్ ధర తొలిసారిగా 3,000 డాలర్లు దాటిన సంగతి తెలిసిందే. బంగారం పరుగుతో ప్రభుత్వంపై ‘పసిడి బాండ్ల’భారం తీవ్రమైంది. రిడెమ్షన్ ధర నిర్ణయం ఇలా.. 999 స్వచ్ఛత కలిగిన బంగారానికి ఇండియన్ బులియన్ అండ్ జువెల్లర్స్ అసోసియేషన్ ప్రకటించిన ధరల ప్రకారం.. రిడెమ్షన్ తేదీ నుంచి గడిచిన మూడు పని దినాల్లో సగటు బంగారం ధరను ఎస్జీబీ తుది ఉపసంహరణ ధరగా నిర్ణయిస్తారు. ఇదీ పథకం.. » కనీస పెట్టుబడి 1 గ్రాము. » ఈ బాండ్లు దేశంలో బంగారం ధరతో ముడిపడి ఉంటాయి. » వీటికి 8 సంవత్సరాల కాలపరిమితిని పెట్టారు. » 5 ఏళ్ల తర్వాత ఎప్పుడైనా ఉపసంహరించుకునే అవకాశం ఉంది. » ఇన్వెస్టర్లకు తమ పెట్టుబడిపై సంవత్సరానికి » 2.5% వడ్డీ కూడా అదనంగా పొందవచ్చు. » వడ్డీపై పన్ను విధించబడుతుంది. కానీ మూలధన లాభాల పన్ను లేదు.ఏమిటీ ఎస్జీబీలు..? ఇవి భారత ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జారీ చేసిన ప్రభుత్వ సెక్యూరిటీలు. నిజమైన (భౌతిక) బంగారానికి ఇవి ప్రత్యామ్నాయ రూపం. పెట్టుబడిదారులు భౌతికంగా బంగారం కలిగి ఉండాల్సిన అవసరం లేకుండా దానిపై పెట్టుబడి పెట్టడానికి ఈ బాండ్లు వీలు కల్పించాయి. పెట్టుబడిదారులు ఇష్యూ ధరను నగదు రూపంలో చెల్లించాలి. బాండ్ల గడువు ముగిసిన తర్వాత పెట్టుబడిదారులకు నగదు రూపంలోనే తిరిగి చెల్లిస్తారు.బంగారం దిగుమతులను నిరుత్సాహపరచడం ద్వారా విదేశీ మారకం నిల్వలను కాపాడుకోవచ్చన్న భావనతో కేంద్రం ఈ బాండ్ల జారీని ప్రారంభించింది. -
ఏప్రిల్ నుంచి హైదరాబాద్లో యాపిల్ ఎయిర్పాడ్స్ ఉత్పత్తి
న్యూఢిల్లీ: తైవాన్ దిగ్గజం ఫాక్స్కాన్కి చెందిన హైదరాబాద్ ప్లాంటులో ఏప్రిల్ నుంచి యాపిల్ ఎయిర్పాడ్స్ ఉత్పత్తి ప్రారంభం కానుంది. ప్రస్తుతానికి ఎగుమతుల కోసమే వీటిని తయారు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. టెక్ దిగ్గజం యాపిల్ ఇప్పటికే తమ ఐఫోన్లను భారత్లో తయారు చేస్తుండగా, ఎయిర్పాడ్స్ రెండో కేటగిరీగా ఉంటుందని వివరించాయి. దాదాపు రూ. 3,500 కోట్లతో ఈ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు 2023 ఆగస్టులో ఫాక్స్కాన్ ప్రకటించింది.భారత్పైనా ప్రతీకార టారిఫ్లు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో యాపిల్ ఇక్కడ ఉత్పత్తిని తగ్గించుకుని, అమెరికాలో పెట్టుబడులు పెట్టనుందనే వార్తల నేపథ్యంలో, ఎయిర్పాడ్స్ తయారీని ప్రారంభించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇండియా సెల్యులార్ అండ్ ఎల్రక్టానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) ప్రకారం హియరబుల్స్, వేరబుల్స్ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు భారత్లో 20 శాతంగా ఉండగా, అమెరికాలో అసలు లేనే లేవు. అమెరికా నుంచి స్మార్ట్ఫోన్లు, హియరబుల్స్, వేరబుల్స్పై దిగుమతులపై సుంకాలను తొలగిస్తే భారత్కి కూడా ప్రయోజనకరంగా ఉంటుందని ఐసీఈఏ పేర్కొంది. -
స్మార్ట్ పెట్టుబడులకు ప్యాసివ్ ఫండ్స్
సాంకేతిక పురోగతి, మార్కెట్లో ఒడిదుడుకులు, మారిపోతున్న ఆర్థిక పరిస్థితులతో ఇన్వెస్టింగ్ ప్రపంచంలో శరవేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో, తమ సంపదను పెంచుకునేందుకు సరళమైన, సమర్ధవంతమైన మార్గం కోసం అన్వేషిస్తున్న వారికి, ప్యాసివ్ ఫండ్స్ ఆకర్షణీయంగా మారాయి. తక్కువ వ్యయాలతో కూడుకున్నవై, సరళమైన వ్యూహం, విస్తృత డైవర్సిఫికేషన్, దీర్ఘకాలిక వృద్ధిపై ఫోకస్ పెట్టే ప్యాసివ్ ఫండ్స్ అనేవి, ఆర్థిక మార్కెట్లలో సమర్ధవంతంగా ఇన్వెస్ట్ చేసేందుకు అనువైన మార్గంగా ఉండగలవు. 2025లో పెట్టుబడులకు సంబంధించి స్మార్ట్ చాయిస్గా నిలవడంలో వీటికున్న ప్రత్యేకత గురించి తెలియజేసేదే ఈ కథనం. సాధారణంగా ఇన్వెస్టింగ్ అంటే, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, రిస్క్ లను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఏ సాధనాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఇలాంటి అనేకానేక నిర్ణయాలు తీసుకోవాల్సి రావడంతో, చాలా సంక్లిష్టమైన వ్యవహారంగా అనిపిస్తుంది.ఇలాంటి గందరగోళం లేకుండా సరళమైన విధానంలో పెట్టుబడులకు అవకాశం కల్పించడమే ప్యాసివ్ ఫండ్స్ ప్రత్యేకత. ఒక్కో స్టాక్ను వేర్వేరుగా ఎంచుకుని, ఒక్కొక్కటిగా పర్యవేక్షించుకోవాల్సిన అవసరం లేకుండా విస్తృత మార్కెట్ను ప్రతిబింబించేవిగా, పెద్దగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేని విధంగా ఇవి ఉంటాయి. దీర్ఘకాలిక వృద్ధి కోరుకుంటున్నా లేదా సంపదను స్థిరంగా పెంపొందించుకోవాలని భావిస్తున్నా, జీవితంలో ఇతరత్రా అంశాలపై దృష్టి పెట్టేందుకు వెసులుబాటునిచ్చే, సులభతరంగా అర్థమయ్యే సొల్యూషన్గా ప్యాసివ్ ఫండ్స్ ఉపయోగపడతాయి. తక్కువ వ్యయాలు.. ఎక్కువ ప్రయోజనాలు.. చెల్లించాల్సిన ఫీజుల గురించి ఇన్వెస్టర్లు ప్రత్యేకంగా పట్టించుకుంటున్న నేపథ్యంలో 2025లో ప్రతి పర్సంటేజీ పాయింటూ ముఖ్యమే. అతి తక్కువ వ్యయ నిష్పత్తులకు ప్యాసివ్ ఫండ్స్ పేరొందాయి. వివిధ స్టాక్స్ ఎంపిక కోసం ఈ ఫండ్స్కి భారీగా అనలిస్టులు, ఫండ్ మేనేజర్ల బృందం అవసరం లేకపోవడం వల్ల వీటి ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి. దీర్ఘకాలిక వృద్ధికి స్థిరమైన వ్యూహం .. నేరుగా మార్కెట్లకు అనుసంధానితమైన రాబడులను అందించే సామర్థ్యాలు ఉండటమే ప్యాసివ్ ఫండ్స్ను ఎంచుకోవడానికి మరో ప్రధాన కారణంగా నిలుస్తుంది. అనిశ్చితి పెరిగిపోతున్న తరుణంలో, స్థిరత్వంతో పాటు కాలం గడిచే కొద్దీ నిలకడగా, కాంపౌండెడ్ రాబడులను అందించగలిగే వ్యూహాల కోసం ఇన్వెస్టర్లు అన్వేషిస్తున్నారు. విస్తృతమైన మార్కెట్ సూచీలను ట్రాక్ చేయడం ద్వారా, సంపదను పెంపొందించుకోవడానికి ఇన్వెస్టర్లకు విశ్వసనీయమైన బాటను ఏర్పర్చి, ప్యాసివ్ ఫండ్స్ ఇలాంటి వృద్ధి అవకాశాలను అందిస్తాయి. ప్యాసివ్ ఫండ్స్ ద్వారా కొనడం, అమ్మడం సులభతరంగా ఉంటుంది. కాబట్టి, ఇతరత్రా పెట్టుబడి సాధనాల తరహాలో సుదీర్ఘ సెటిల్మెంట్ వ్యవధులు లేదా పరిమితుల గురించిన ఆందోళన లేకుండా, అవసరమైనప్పుడు, కావాల్సిన విధంగా తమ పోర్ట్ఫోలియోను సరి చేసుకునే స్వాతంత్య్రం ఇన్వెస్టర్లకు లభిస్తుంది.వైవిధ్యం..ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు రిస్క్ లు తప్పవు. కానీ వాటిని సమర్ధవంతంగా ఎదుర్కోవడమే కీలకం. ప్యాసివ్ ఫండ్స్ అనేవి డైవర్సిఫికేషన్ ప్రయోజనాలను కల్పించడం ద్వారా రిస్క్ లకు ప్రతిగా, సహజసిద్ధమైన హెడ్జింగ్ సాధనాలుగా ఉపయోగపడతాయి. ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారంటే మీరు విస్తృతమైన మార్కెట్లో (నిఫ్టీ 100 లేదా నిఫ్టీ 500) కొంత భాగాన్ని లేదా మొత్తం మార్కెట్నే కొనుగోలు చేసినట్లు లెక్క. ఇందులో వివిధ రంగాలు, పరిశ్రమలు, థీమ్లను ప్రతిబింబించే వేర్వేరు స్టాక్స్ ఉంటాయి. అంటే, మీ పెట్టుబడి రాణించడమనేది ఏ ఒక్క కంపెనీ లేదా రంగం పనితీరుపై ఆధారపడదు. ఒకటి తగ్గినా మరొకటి పెరిగే అవకాశాలు ఉండటం వల్ల రిస్క్ లు కొంత తక్కువగా ఉంటాయి. ఇక లిక్విడిటీపరంగా చూస్తే, ఇండెక్స్, సెక్టార్ లేదా అసెట్ క్లాస్ను ట్రాక్ చేసే ఈటీఎఫ్లు షేర్లలాగే ఎక్సే్చంజీల్లో ట్రేడవుతాయి. ట్రేడింగ్కి అనువుగా ఉంటాయి. వీటిని కొని, అమ్మేందుకు డీమ్యాట్ ఖాతా ఉండాలి.మరోవైపు, నిర్దిష్ట మార్కెట్ ఇండెక్స్ పనితీరును ప్రతిఫలిస్తూ, ప్యాసివ్గా ఉండేవి ఇండెక్స్ ఫండ్స్. వీటిలో పెట్టుబడులకు డీమ్యాట్ ఖాతా అక్కర్లేదు. నికర అసెట్ వేల్యూ (ఎన్ఏవీ) ఆధారంగా వీటిని నేరుగా ఫండ్ హౌస్ ద్వారా కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్లు లేని ఇన్వెస్టర్లు కూడా ప్యాసివ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఇండెక్స్ ఫండ్ మార్గం ఉపయోగకరంగా ఉంటుంది. -
విదేశీ గణాంకాలే దిక్సూచి
ఈ వారం ప్రధానంగా విదేశీ అంశాలే దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్ను నిర్దేశించనున్నాయి. వీటికితోడు యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షను చేపట్టనుంది. వెరసి ఇన్వెస్టర్లు దేశ, విదేశీ ఆర్థిక గణాంకాలతోపాటు ఫెడ్ వడ్డీ నిర్ణయాలపై దృష్టిపెట్టనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.ముంబై: అంతర్జాతీయంగా నేడు(17న) పలు ఆర్థిక గణాంకాలు వెలువడనున్నాయి. దేశీయంగా ఫిబ్రవరి నెలకు టోకు ధరల ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ) వివరాలు వెల్లడికానున్నాయి. జనవరిలో డబ్ల్యూపీఐ 2.31 శాతానికి చేరగా.. 2024 డిసెంబర్లో 2.37 శాతంగా నమోదైంది. విదేశీ అంశాలలో జనవరి–ఫిబ్రవరికి చైనా పారిశ్రామికోత్పత్తి, రిటైల్ అమ్మకాల గణాంకాలు నేడు వెల్లడికానున్నాయి. ఫిబ్రవరిలో యూఎస్ రిటైల్ సేల్స్సహా హౌసింగ్ డేటా నేడు విడుదలకానుంది.ఈ బాటలో ఫిబ్రవరికి జపాన్ వాణిజ్య బ్యాలన్స్ గణాంకాలు, బ్యాంక్ ఆఫ్ జపాన్(బీవోజే) వడ్డీ రేట్ల నిర్ణయాలు 19న వెల్లడికానున్నాయి. గత సమీక్షలో స్వల్పకాలిక వడ్డీ రేటును 0.25 శాతం పెంచడంతో 0.5 శాతానికి చేరిన సంగతి తెలిసిందే. ఇది గత 17ఏళ్లలోనే అత్యధికంకాగా.. 20న గత నెలకు యూఎస్ గృహ విక్రయాల డేటా విడుదలకానుంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వడ్డీ రేట్లపై నిర్ణయాలు ప్రకటించనుంది. 21న జపాన్ ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడికానున్నాయి. జనవరిలో ద్రవ్యోల్బణం 4 శాతానికి ఎగసింది. ఫెడ్ ఏం చేయనుంది? రేపు(18న) ప్రారంభంకానున్న యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమావేశ నిర్ణయాలు బుధ వారం(19న) వెల్లడికానున్నాయి. రెండు రోజులు సమావేశంకానున్న ఫెడ్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్వోఎంసీ) గత సమీక్షలో యథాతథ పాలసీ అమలుకే కట్టుబడింది. అయితే ప్రెసిడెంట్ ట్రంప్ పలు దేశాలపై విధిస్తున్న ప్రతీకార టారిఫ్లు, ద్రవ్యోల్బణం తదితర గణాంకాలు వడ్డీ రేట్ల నిర్ణయాలను ప్రభావితం చేయనున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు.అయితే మరోసారి ఫెడరల్ ఫండ్స్ రేట్లను యథాతథంగా 4.25–4.5 శాతంవద్ద కొనసాగించేందుకే నిర్ణయించే వీలున్నట్లు అధిక శాతంమంది నిపుణులు భావిస్తున్నారు. ట్రంప్ టారిఫ్ల విధింపు, విధానాల నేపథ్యంలో ఆర్థిక వృద్ధి, ధరలు, ఉపాధి కల్పన తదితర అంశాలకు ఫెడ్ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలియజేశారు. దీంతో ఫెడ్ సంకేతాలపై ప్రపంచ దేశాలు దృష్టిపెట్టనున్నట్లు వివరించారు. ఇతర అంశాలు అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు 70 డాలర్ల దిగువన కదులుతున్నాయి. ఒపెక్, సంబంధిత దేశాలు ఏప్రిల్ నుంచీ చమురు ఉత్పత్తి పెంపు ప్రణాళికను అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. వెరసి రోజుకి 1,38,000 బ్యారళ్లమేర చమురు అధికంగా సరఫరాకానుంది. ఇది భారత్కు సానుకూల అంశమని ఆర్థికవేత్తలు తెలియజేశారు.ఇక మరోపక్క డాలరుతో మారకంలో రూపాయి 87 స్థాయిలో బలహీనంగా కదులుతోంది. కాగా.. ట్రంప్ టారిఫ్ల కారణంగా యూఎస్ ఆర్థిక వ్యవస్థ బలహీనపడితే దేశీ మార్కెట్లపై ప్రభావం పడుతుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్విసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. ఈ వారం హెచ్చుతగ్గుల మధ్య మార్కెట్లు స్వల్ప కదలికలకే పరిమితంకావచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్త్మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్దార్ధ ఖేమ్కా అభిప్రాయపడ్డారు.గత వారమిలాహోలీ పండుగ సందర్భంగా నాలుగు రోజులకే పరిమితమైన గత వారం ట్రేడింగ్లో దేశీ స్టాక్ మార్కెట్లు స్వల్పంగా క్షీణించాయి. ఆటుపోట్ల మధ్య సెన్సెక్స్ నికరంగా 504 పాయింట్లు(0.7 శాతం) బలహీనపడింది. 73,829 వద్ద నిలిచింది. నిఫ్టీ 155 పాయింట్లు(0.7 శాతం) క్షీణించి 22,397 వద్ద స్థిరపడింది. చిన్న షేర్లలో అమ్మకాలు కొనసాగడంతో బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.1 శాతం నీరసించగా.. స్మాల్ క్యాప్ 3.9 శాతం పతనమైంది. -
సంపద వెలికితీద్దాం పదండి..!
ఎప్పుడో పది, ఇరవై ఏళ్ల క్రితం బ్యాంకులో డిపాజిట్ చేసి మర్చిపోయారా..? తల్లిదండ్రులు లేదా పూర్వికుల పేరిట స్టాక్, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు మరుగున పడి ఉన్నాయా?.. ఏమో ఎవరు చూసొచ్చారు. ఓసారి విచారిస్తేనే కదా తెలిసేది..! రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులు క్లెయిమ్ లేకుండా, నిష్ప్రయోజనంగా ఉండిపోయినట్టు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో సుమారు రూ.78,200 కోట్లు బ్యాంకు డిపాజిట్ల రూపంలో ఉన్నాయి.ఫిజికల్ షేర్ల రూపంలో ఉన్న మొత్తం సుమారు రూ.3.8 లక్షల కోట్లు. రూ.36 వేల కోట్లు మ్యూచువల్ ఫండ్స్ రూపంలో ఉంటే, క్లెయిమ్ చేయని డివిడెండ్లు రూ.5 వేల కోట్ల పైమాటే. ఉలుకూ, పలుకూ లేకుండా ఉండిపోయిన ఈ పెట్టుబడులకు అసలు యజమానులు ఎవరు, నిజమైన వారసులు ఎవరు?.. ఏమో అందులో మన వాటా కూడా ఉందేమో..? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం... – సాక్షి, బిజినెస్ డెస్క్ కుటుంబ యజమాని తాను చేసిన పెట్టుబడుల వివరాలను జీవిత భాగస్వామితో పంచుకునే అలవాటు గతంలో అతి కొద్ద మందిలోనే ఉండేది. స్టాక్ మార్కెట్ ఆరంభంలో ఇన్వెస్ట్ చేసి, కాలం చేసిన వారి పేరిట పెట్టుబడుల వివరాలు కుటుంబ సభ్యులకు తెలియకపోవచ్చు కూడా. ఇంట్లో ఆధారాలుంటే తప్పించి ఆయా పెట్టుబడుల గురించి తెలిసే అవకాశం లేదు. అవేవో పత్రాలనుకుని, పక్కన పడేసిన వారు కూడా ఉండొచ్చు.లేదా భౌతిక రూపంలోని షేర్ సర్టీఫికెట్లు కనిపించకుండా పోవచ్చు. ఎక్కడో పెట్టి మర్చిపోవచ్చు. ఏళ్లకేళ్లకు క్లెయిమ్ లేకుండా ఉండిపోయిన పెట్టుబడులు ‘ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ’ (ఐఈపీఎఫ్ఏ/పెట్టుబడిదారుల అక్షరాస్యత, సంరక్షణ నిధి)కు బదిలీ అయిపోతాయి. ఐఈపీఎఫ్ఏ కిందకు ఇలా చేరిపోయిన లిస్టెడ్ కంపెనీల షేర్ల విలువ ఎంతన్నది అధికారిక సమాచారం లేదు. సెబీ నమోదిత ‘ఫీ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఎల్ఎల్పీ’ అంచనా ప్రకారం.. ఈ మొత్తం 2024 మార్చి నాటికి సుమారు రూ.77,033 కోట్లుగా ఉంటుంది. ఐఈపీఎఫ్ఏ కిందికి..లిస్టెడ్ కంపెనీలకు సంబంధించి వాటాదారులు వరుసగా ఏడు సంవత్సరాలు, అంతకుమించి డివిడెండ్ క్లెయిమ్ చేయకపోతే కంపెనీల చట్టంలోని సెక్షన్ 124 కింద ఆయా వాటాలను ఐఈపీఎఫ్ఏ కిందకు కంపెనీలు బదిలీ చేయాలి. గతంలో డివిడెండ్లు ఎన్క్యాష్ (నగదుగా మార్చుకోవడం) కాకపోవడం, చిరునామాలో మార్పులతో అవి కంపెనీకి తిరిగి వచ్చేవి. నేటి రోజుల్లో డీమ్యాట్ ఖాతాతో అనుసంధానమై ఉన్న బ్యాంక్ ఖాతా ఇనాపరేటివ్ (కార్యకలాపాల్లేని స్థితి)గా మారిన సందర్భాల్లో వాటాదారులకు డివిడెండ్ చేరదు. ఇలా పదేళ్ల పాటు కొనసాగితే, ఆయా వాటాలు ఐఈపీఎఫ్ఏ కిందకు వెళ్లిపోతాయి. గుర్తించడం ఎలా..? కార్పొరేట్ వ్యవహారాల శాఖ కింద ఐఈపీఎఫ్ఏ పనిచేస్తుంటుంది. అన్ క్లెయిమ్డ్ షేర్ల వివరాలను ప్రతి ఒక్కరూ తెలుసుకునేందుకు వీలుగా gov. in/ login పోర్టల్లో డేటాబేస్ అందుబాటులో ఉంది. ఇన్వెస్టర్లు తమ మొబైల్ నంబర్, ఈమెయిల్ వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి. అనంతరం లాగిన్ అయి, పాన్ నంబర్ ఆధారంగా తమ పేరు, తమ తల్లిదండ్రులు, వారి పూర్వికులలో ఎవరి పాన్ నంబర్ లేదా పేరుమీద షేర్లు ఐఈపీఎఫ్ఏ కింద ఉన్నాయేమో పరిశీలించుకోవచ్చు.ఒకవేళ ఐఈపీఎఫ్ఏకు ఇంకా బదిలీ కాకుండా, కంపెనీ వద్దే ఉండిపోయిన అన్క్లెయిమ్డ్ షేర్లు, డివిడెండ్ల వివరాలు కూడా పోర్టల్లో లభిస్తాయి. ఫోలియో నంబర్తోనూ చెక్ చేసుకోవచ్చు. దీనికంటే ముందు ఒకసారి ఇల్లంతా వెతికి ఒకవేళ భౌతిక పత్రాలుంటే, వాటిని డీమ్యాట్ చేయించుకోవడం సులభమైన పని. ఎన్ఎస్డీఎల్, సీడీఎస్ఎల్ సంస్థలు ఇన్వెస్టర్లకు పాన్ నంబర్ ఆధారంగా కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్ (సీఏఎస్)ను నెలవారీగా పంపిస్తుంటాయి.ఇన్వెస్టర్ ఈమెయిల్స్ను పరిశీలించడం ద్వారా వారి పేరిట పెట్టుబడులను తెలుసుకోవచ్చు. తమ తల్లిదండ్రులు లేదా సమీప బంధువు ఇటీవలి కాలంలో మరణించినట్టయితే, వారి పేరిట పెట్టుబడులను తెలుసుకునేందుకు మరో మార్గం ఉంది. వారి ఆదాయపన్ను రిటర్నులను పరిశీలిస్తే వివరాలు తెలియొచ్చు. ఎన్ఎస్డీఎల్ లేదా సీడీఎస్ఎల్కు లేఖ రాస్తూ, తమ వారి పేరిట ఉన్న పెట్టుబడుల సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. తాము వారికి చట్టబద్ధమైన వారసులమన్న రుజువును లేఖకు జత చేయాలి. రికవరీ ఎలా..? ఐఈపీఎఫ్ఏ నుంచి షేర్లు, డివిడెండ్ను రికవరీ చేసుకోవడానికి కొంత శ్రమించక తప్పదు. ‘షేర్ సమాధాన్’ వంటి కొన్ని సంస్థలు ఫీజు తీసుకుని ఇందుకు సంబంధించి సేవలు అందిస్తున్నాయి. ఐఈపీఎఫ్ఏ వద్ద క్లెయిమ్ దాఖలు చేసి, షేర్లు, డివిడెండ్లను వెనక్కి తెప్పించుకోవడానికి చాలా సమయం పడుతుందని షేర్ సమాధాన్ చెబుతోంది.ప్రస్తుతం క్లెయిమ్ ఆమోదం/తిరస్కారానికి ఆరు నెలల నుంచి మూడేళ్ల సమయం తీసుకుంటున్నట్టు షేర్ సమాధాన్ డైరెక్టర్ శ్రేయ్ ఘోషల్ తెలిపారు. కొన్ని కంపెనీలు, ఆర్టీఏలు ఈ విషయంలో మెరుగ్గా స్పందిస్తుంటే.. కొన్నింటి విషయంలో ఒకటికి రెండు సార్లు సంప్రదింపులు నిర్వహించాల్సి వస్తున్నట్టు చెప్పారు. ఏదైనా కంపెనీలో వాటాలున్నట్టు గుర్తించి, అవి ఇంకా ఐఈపీఎఫ్ఏ కిందకు బదిలీ కాకపోతే.. కంపెనీ ఆర్టీఏను సంప్రదించాలి. నిర్దేశిత డాక్యుమెంట్లను సమర్పించి, వాటిని క్లెయిమ్ చేసుకోవచ్చు. డీమ్యాట్ చేసుకోవాలి..? 2019 ఏప్రిల్ నుంచి షేర్ల క్రయ, విక్రయాలకు అవి డీమ్యాట్ రూపంలో ఉండడాన్ని సెబీ తప్పనిసరి చేసింది. వాటాదారులు మరణించిన కేసుల్లో వారి వారసుల పేరిట బదిలీకి మాత్రం మినహాయింపు ఉంది. ఇప్పటికీ పత్రాల రూపంలో షేర్లు కలిగి ఉంటే, ఆయా కంపెనీల ఆర్టీఏలను సంప్రదించి డీమెటీరియలైజేషన్ (డీమ్యాట్) చేయించుకోవాలి. షేర్ హోల్డర్ పేరు, ఫోలియో నంబర్ వివరాలతో ఆర్టీఏను సంప్రదిస్తే.. ఏయే పత్రాలు సమర్పించాలన్నది తెలియజేస్తారు.నిబంధనల మేరకు దరఖాస్తును పూర్తి చేసి, కేవైసీ, ఇతర పత్రాలను జోడించి ఆర్టీఏకి పంపించాలి. దరఖాస్తును ఆమోదిస్తే, ధ్రువీకరణ లేఖను ఆర్టీఏ జారీ చేస్తుంది. అప్పుడు దీన్ని డీమ్యాట్ ఖాతా కలిగిన డిపాజిటరీ పార్టీసిపెంట్ (సీడీఎస్ఎల్/ఎన్ఎస్డీఎల్)కు సమర్పించిన అనంతరం షేర్లు జమ అవుతాయి. ఈ విషయంలో కొందరు బ్రోకర్లు, కన్సల్టెన్సీ సంస్థలు సేవలు అందిస్తున్నాయి. వాటి సాయం తీసుకునే ముందు ఆయా సంస్థల వాస్తవికతను నిర్ధారించుకోవడం అవసరం. బ్యాంక్ డిపాజిట్లు.. బ్యాంక్ ఖాతాలో రెండేళ్లకు పైగా ఎలాంటి లావాదేవీ లేకపోతే అది ఇనాపరేటివ్గా మారిపోతుంది. ఖాతాదారు మరణించిన సందర్భంలో ఇలా జరగొచ్చు. అటువంటప్పుడు మరణ ధ్రువీకరణ పత్రంతోపాటు నామినీ తన కేవైసీ డాక్యుమెంట్లను బ్యాంక్ శాఖలో సమర్పించాలి. ఖాతాను మూసేసి, అందులోని బ్యాలన్స్ను నామినీకి బదిలీ చేస్తారు. ఒకవేళ నామినీ లేకపోయినప్పటికీ, ఇనాపరేటివ్ ఖాతాలో బ్యాలన్స్ రూ.25 వేల లోపు ఉంటే బ్యాంక్ స్థాయిలోనే పరిష్కరించుకోవచ్చు.అంతకుమించి బ్యాలన్స్ ఉంటే చట్టబద్ధమైన వారసులు (జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, పిల్లలు, సోదరులు/సోదరీమణులు) కోర్టుకు వెళ్లి సక్సెషన్ సర్టీఫికెట్ తెచ్చుకోవాలి. క్లెయిమ్ కోసం ఒకరికి మించి ముందుకు వస్తే, అప్పుడు ఇండెమ్నిటీ సర్టి ఫికెట్ను సైతం బ్యాంక్ కోరొచ్చు. డిపాజిట్ అయినా, ఖాతాలో బ్యాలన్స్ అయినా 10 ఏళ్లపాటు క్లెయిమ్ లేకుండా ఉండిపోతే, ఆ మొత్తాన్ని డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్కు బదిలీ చేయాల్సి ఉంటుంది. అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలను తమ పోర్టల్లో అందుబాటులో ఉంచాలని ఆర్బీఐ గతంలో బ్యాంక్లను ఆదేశించింది. కనుక పేరు, పుట్టిన తేదీ, పాన్ తదితర వివరాలతో తమ పేరు, తమ వారి పేరిట డిపాజిట్లు ఉన్నాయేమో బ్యాంక్ పోర్టల్కు వెళ్లి పరిశీలించుకోవచ్చు. లేదంటే బ్యాంక్ శాఖకు వెళ్లి విచారణ చేయాలి. అన్క్లెయిమ్డ్ షేర్లు డీమ్యాట్ రూపంలో ఉంటే..?⇒ అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించడం ద్వారా వాటిని తమ పేరిట బదిలీ చేయించుకోవచ్చు.⇒డీపీ వద్ద దరఖాస్తు దాఖలు చేయాలి. షేర్లు పత్రాల రూపంలో ఉంటే? ⇒ విడిగా ప్రతి కంపెనీ ఆర్టీఏ వద్ద డీమెటీరియలైజేషన్కు దరఖాస్తు చేసుకోవాలి.⇒ అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించాలి. అవన్నీ కచ్చితమైనవని నిర్ధారించుకున్న తర్వాత, అప్పుడు డీమ్యాట్ ఖాతాకు బదిలీ అవుతాయి. .ఐఈపీఎఫ్ఏకు బదిలీ అయిపోతే..? ⇒ వాటాలున్న ప్రతి కంపెనీ ఆర్టీఏ నుంచి ఎంటైటిల్మెంట్ లెటర్ను పొందాలి. ⇒ ఐఈపీఎఫ్–5 ఈ–ఫారమ్ను ఐఈపీఎఫ్ఏ వద్ద దాఖలు చేయాలి. ⇒ కంపెనీ ఆమోదం తర్వాత క్లెయిమ్ను ఐఈపీఎఫ్ఏ ఆమోదిస్తుంది. దాంతో షేర్లు అసలైన యజమానులు లేదా వారసులకు బదిలీ అవుతాయి. ⇒ సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ (ఎస్ఆర్ఎన్) జారీ అవుతుంది. దీని ఆధారంగా ఆయా కంపెనీల ఆర్టీఏ వద్ద 7–10 రోజుల్లోగా డాక్యుమెంట్లను సమర్పించాలి.ఫండ్స్ పెట్టుబడుల సంగతి..? బ్యాంక్ డిపాజిట్లకు, బీమా పాలసీలకు మెచ్యూరిటీ ఉంటుంది. కానీ ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులకు అలాంటిదేమీ ఉండదు. అయినప్పటికీ పదేళ్లకు పైగా ఒక ఫోలియోపై ఎలాంటి లావాదేవీలు లేకుండా, కేవైసీ అప్డేట్ చేయకపోతే వాటిని అన్క్లెయిమ్డ్గా పరిగణించొచ్చు. డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్కు సంబంధించి డివిడెండ్లు క్లెయిమ్ కాకపోయి ఉండొచ్చు.చిరునామా, కాంటాక్ట్ వివరాలు మారిపోయి, ఇన్వెస్టర్ మరణించిన సందర్భాలు, బ్యాంక్ ఖాతా ఇనాపరేటివ్గా మారిపోయిన కేసుల్లోనూ ఇది చోటు చేసుకోవచ్చు. ఇలాంటి పెట్టుబడులను ఐఈపీఎఫ్ఏ కిందకు బదిలీ చేసినట్టయితే, షేర్ల మాదిరే నిర్దేశిత ప్రక్రియలను అనుసరించి వాటిని సొంతం చేసుకోవచ్చు. ఫండ్స్ పెట్టబడుల వివరాలను గుర్తించేందుకు క్యామ్స్, కే–ఫిన్టెక్ సాయం తీసుకోవచ్చు.యాక్టివ్గా లేని ఫండ్స్ పెట్టుబడులను తెలుసుకునేందుకు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) ‘మిత్రా’ పేరుతో (ఎంఎఫ్ పెట్టుబడుల గుర్తింపు, రికవరీ) ఒక ప్రాజెక్ట్ను అభివృద్ధి చేస్తోంది. ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ త్వరలో అందుబాటులోకి రానుంది. అప్పుడు, తమ పేరు, తమ వారి పేరిట ఉన్న ఫండ్స్ పెట్టుబడి వివరాలను సులభంగా గుర్తించొచ్చు.ఇలా చేస్తే సమస్యలకు దూరం..⇒ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు సంబంధించి (ట్రేడింగ్ ఖాతాకు అనుసంధానంగా ఉన్న) బ్యాంక్ ఖాతాను యాక్టివ్గా ఉంచుకోవాలి. ⇒ పెట్టుబడుల వివరాలను జీవిత భాగస్వామితో పంచుకోవాలి. లేదంటే ఒక డైరీలో అన్ని పెట్టుబడులు, ఆర్థిక వివరాలను నమోదు చేసి, ఇంట్లో భద్రపరచాలి. ⇒ ప్రతి పెట్టుబడికి నామినీని నమోదు చేయాలి. ⇒ వీలునామా లేదా ఎస్టేట్ ప్లానింగ్ చేసుకోవాలి. దీనివల్ల భవిష్యత్తులో వారసులకు క్లెయిమ్ సమస్యలు ఎదురుకావు. ⇒ చిరునామా, ఫోన్ నంబర్, బ్యాంక్ ఖాతా ఇలా కేవైసీకి సంబంధించి ముఖ్యమైన వివరాల్లో మార్పులు జరిగితే వెంటనే బ్యాంక్లు, మ్యూచువల్ ఫండ్స్, డీపీలు, బీమా కంపెనీల వద్ద అప్డేట్ చేసుకోవాలి. బీమా ప్రయోజనాలూ అంతే..ఎల్ఐసీ సహా కొన్ని బీమా సంస్థల పరిధిలో మెచ్యూరిటీ (గడువు) ముగిసినా, ఎలాంటి క్లెయిమ్ చేయని పాలసీలు చాలానే ఉన్నాయి. ఒక పాలసీదారు పేరిట క్లెయిమ్ చేయని మొత్తం రూ.1,000కి మించి ఉంటే, ఆ వివరాలను తమ వెబ్సైట్లలో బీమా సంస్థలు ప్రదర్శించాలని ఐఆర్డీఏఐ ఆదేశించింది. పాలసీదారు పేరు, పాలసీ నంబర్, పాన్, పుట్టిన తేదీ వివరాలతో వీటి గురించి తెలుసుకోవచ్చు. క్లెయిమ్ బ్యాంక్ డిపాజిట్ల మాదిరే ఉంటుంది. -
కొత్త అప్డేట్తో కేటీఎమ్ 390 డ్యూక్: రేటు మాత్రం సేమ్
కేటీఎమ్ కంపెనీ తన 390 డ్యూక్ 2025 బైకును అప్డేట్ చేసింది. ఇప్పుడు ఇందులో క్రూయిజ్ కంట్రోల్ మాత్రమే కాకుండా.. ఇది కొత్త కలర్ ఆప్షన్తో లభిస్తుంది. దీని ధర రూ. 2.95 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ కలిగి ఉండటం వల్ల కేటీఎమ్ 390 డ్యూక్ మరింత టూరింగ్-ఫ్రెండ్లీగా మారుతుంది. ఈ బైక్ చిన్న అప్డేట్స్ పొందినప్పటికీ ధరలో మాత్రం ఎలాంటి అప్డేట్ లేదు. ఇప్పటికే ఈ బైక్ డీలర్షిప్లలో కనిపించింది. అంటే అమ్మకానికి వచ్చేసిందన్నమాట.ఈ బైక్ చూడటానికి.. దాని మునుపటి బైకుల కంటే కొంత భిన్నమైన పెయింట్ స్కీమ్ పొందుతుంది. కాబట్టి ఇది నలుపు రంగులో ఉండటం చూడవచ్చు. కాగా ఇప్పటికే ఈ మోడల్ నారింజ, నీలం రంగులలో ఉంది.ఇంజిన్, పర్ఫామెన్స్ వంటి వాటిలో కూడా ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఇందులో 399 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 6 స్పీడ్ గేర్బాక్స్తో వస్తుంది. ఈ ఇంజిన్ 45.3 Bhp పవర్, 39 Nm టార్క్ అందిస్తుంది. పనితీరులో స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. -
హోలీకి లీవ్ ఇవ్వని బాస్.. పైగా రూల్స్
భారతదేశంలో హోలీని ఎంతబాగా సెలబ్రేట్ చేసుకుంటారో అందరికి తెలుసు. ఈ పండుగను దృష్టిలో ఉంచుకుని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సెలవు కూడా మంజూరు చేస్తాయి. అయితే ఓ కంపెనీ బాస్ మాత్రం హోలీకి ఉద్యోగులకు సెలవు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అంతే కాకుండా కొన్ని రూల్స్ కూడా పాస్ చేశారు.ఒక ఉద్యోగి తన బాస్ పంపిన సందేశాన్ని రెడ్డిట్లో పోస్ట్ చేశారు. దీంతో అది నెట్టింట్లో వైరల్ అయింది. లీవ్ ఇవ్వకపోవడం మాత్రమే కాకుండా.. ఆఫీసుకు కూడా రంగులు తీసుకురాకూడదని రూల్ పాస్ చేశారు. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగింది, కంపెనీ పేరు ఏమిటనేది వెల్లడికాలేదు.హోలీ రోజు చెప్పకుండా సెలవు తీసుకుంటే లేదా అనుమతి లేకుండా సెలవు తీసుకుంటే.. అనుమతించనని, జీతం కూడా కట్ చేస్తామని బాస్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవ్వడంతో నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఉద్యోగులందరూ రాజీనామా చేయండి అని ఒకరు చెబితే.. కంపెనీ పేరు చెప్పి, బాస్ సిగ్గుపడేలా చేయాలసింది అని మరొకరు అన్నారు. భారత ప్రభుత్వం తన శ్రామిక శక్తిని రక్షించుకోవడంలో పూర్తిగా విఫలమైంది. మొత్తం మీద ఉద్యోగులు దోపిడీకి గురవుతున్నారని ఇంకొకరు అన్నారు. -
భారత్కు బిల్ గేట్స్!.. దేశంపై ప్రశంసలు కురిపించిన టెక్ దిగ్గజం
అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. ప్రముఖ కుబేరులు, దిగ్గజ పారిశ్రామికవేత్తలు సైతం ఇండియాను సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా.. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) మరోమారు (మూడేళ్ళలో మూడోసారి) భారత్ పర్యటనకు వస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తన లింక్డ్ఇన్ ఖాతాలో వెల్లడించారు.ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, డిజిటల్ పరివర్తనలో భారత్ పురోగతి అనన్య సామాన్యమని బిల్ గేట్స్ అన్నారు. గేట్స్ ఫౌండేషన్ భారతదేశంలో రెండు దశాబ్దాలకు పైగా పనిచేస్తోందని, కీలక రంగాలలో పురోగతిని సాధించడానికి ప్రభుత్వం, పరిశోధకులు, వ్యవస్థాపకులతో కలిసి పనిచేస్తుందని బిల్ గేట్స్ హైలైట్ చేశారు. గేట్స్ ఫౌండేషన్ 25వ వార్షికోత్సవం సందర్భంగా.. ట్రస్టీల బోర్డు మొదటిసారి గ్లోబల్ సౌత్లో సమావేశమవుతోంది. ఈ కార్యక్రమానికి భారత్ అనువైన ప్రదేశం అని ఆయన అన్నారు.వ్యాధి నిర్మూలనలుపోలియో నిర్మూలన, హెచ్ఐవీ నివారణ, క్షయ నిర్మూలన వంటి వాటికోసం భారతదేశం చేపట్టిన ప్రధాన ఆరోగ్య కార్యక్రమాలను బిల్ గేట్స్ ప్రస్తావించారు. పోలియోను నిర్మూలించడంలో ఇండియా సాధించిన విజయాన్ని గేట్స్ ప్రశంసించారు. 2011లో దేశం చివరి పోలియో కేసు నమోదైందని అన్నారు. హెచ్ఐవీ నివారణకు చేపడుతున్న అవహాన్ వంటి కార్యక్రమాలను సైతం కొనియాడారు.నేడు క్షయవ్యాధి (TB)పై భారత్ పోరాటం చేస్తోందన్నారు. టీకాల తయారీ, రోగ నిర్ధరణలో దేశ సామర్థ్యాలను ప్రశంసించారు. భారతీయ కంపెనీలు అభివృద్ధి చేస్తున్న టీబీ పరీక్షలు.. ఆఫ్రికాలో ఆ వ్యాధి నివారణలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందన్నారు. భారతదేశం క్షయవ్యాధి (TB) నిర్మూలనలో ముందంజలో ఉందని గేట్స్ అన్నారు.డిజిటల్ విప్లవంబ్యాంకింగ్, ఆరోగ్య సంరక్షణ మరియు ప్రభుత్వ సేవలకు మెరుగైన ప్రాప్యతను అందించిన ఆధార్ మరియు డిజిటల్ చెల్లింపులతో సహా భారతదేశ డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను (DPI) గేట్స్ గుర్తు చేశారు. గ్రామీణ ఆరోగ్య కార్యకర్తలు ముందస్తు వ్యాధి గుర్తింపును మెరుగుపరచడానికి, గర్భధారణ సంరక్షణను ఆప్టిమైజ్ చేయడానికి, రోగి డేటాను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడటానికి భారతదేశం ఏఐ బేస్డ్ డీపీఐ సాధనాలను ఉపయోగిస్తోందని ఆయన అన్నారు. వ్యవసాయంలో కూడా ఏఐ వాడకం ప్రశంసనీయమని ఆయన అన్నారు.ఇదీ చదవండి: కస్టమర్ ఆర్డర్ చేసిన ఫుడ్.. తినేసిన డెలివరీ బాయ్.. థాంక్స్ జొమాటోభారతదేశ పురోగతి దాని సరిహద్దులను దాటి విస్తరించిందని గేట్స్ నొక్కిచెప్పారు. ముఖ్యంగా భారతదేశం G20 అధ్యక్ష పదవి సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశం యొక్క ఆవిష్కరణలను ప్రపంచవ్యాప్తంగా పంచుకుంటామని ప్రతిజ్ఞ చేసిన తర్వాత.. టీకా తయారీ నుంచి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్స్ వరకు ఇక్కడ అభివృద్ధి చేస్తున్న పరిష్కారాలను ప్రపంచంతో పంచుకుంటున్నారు. బిల్ గేట్స్ భారతదేశానికి వచ్చిన తరువాత.. ఇక్కడ ప్రభుత్వ అధికారులతో, శాస్త్రవేత్తలు చర్చలు.. సమావేశాలు జరిపే అవకాశం ఉంది. -
పెట్రోల్ బైక్ vs ఎలక్ట్రిక్ బైక్: ఏది ఎంచుకోవాలి?
ఇండియన్ మార్కెట్లో ప్రస్తుతం పెట్రోల్, ఎలక్ట్రిక్ బైకులు మాత్రమే కాకుండా సీఎన్జీ బైక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే చాలామంది.. ఎలక్ట్రిక్ బైక్ కొనాలా? పెట్రోల్ బైక్ కొనాలా? అనే సందిగ్ధంలో పడుతుంటారు. ఈ కథనంలో దేనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.ఎలక్ట్రిక్ బైక్స్ప్రస్తుతం మార్కెట్లో దాదాపు ప్రతి కంపెనీ.. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో బైకులను లాంచ్ చేస్తూనే ఉంది. పెట్రోల్ మోడల్స్తో పోలిస్తే.. ఎలక్ట్రిక్ బైకులకు మెయింటెనెన్స్ ఖర్చు తక్కువ. అంతే కాకుండా ఇవి పర్యావరణ హితం కూడా. అంటే ఎలక్ట్రిక్ వాహనాలు ఎలాంటి కాలుష్య కారకాలను వాతావరణంలోకి విడుదల చేయవు.ఎలక్ట్రిక్ వాహనాల్లో లిథియం అయాన్ బ్యాటరీ లేదా లిథియం అయాన్ పాస్ఫేట్ బ్యాటరీలు ఉంటాయి. ఇవి ఎక్కువ మన్నికను ఇస్తాను. సంస్థలు కూడా ఈ బ్యాటరీలపైన మంచి వారంటీ కూడా అందిస్తాయి. విద్యుత్ శక్తిని ఉపయోగించుకోవడం ద్వారా.. శిలాజ ఇంధన వినియోగం మాత్రమే కాకుండా కార్బన్ ఉద్గారాలు కూడా గణనీయంగా తగ్గుతాయి.ఇదీ చదవండి: తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులుపెట్రోల్ బైక్స్చాలా కాలంగా ఎక్కువమంది పెట్రోల్ బైకులనే ఉపయోగిస్తున్నారు. ఇంధనం అయిపోగానే.. వెంటనే ఫిల్ చేసుకోవడానికి లేదా నింపుకోవడానికి పెట్రోల్ బంకులు విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఎలాంటి ఆందోళన లేకుండా ఎక్కువ దూరం ప్రయాణించగల సామర్థ్యం ఈ పెట్రోల్ బైకులకు ఉంటుంది. ఈ కారణంగానే చాలామంది పెట్రోల్ బైకులను కొనుగోలు చేస్తుంటారు. పనితీరు పరంగా కూడా పెట్రోల్ బైకులు.. ఎలక్ట్రిక్ బైకుల కంటే ఉత్తమంగా ఉంటాయి.ఎలక్ట్రిక్ బైక్స్ ఎక్కువ కొనుగోలు చేయకపోవడానికి కారణంఇండియన్ మార్కెట్లో లెక్కకు మించిన ఎలక్ట్రిక్ బైక్స్ అందుబాటులో ఉన్నప్పటికీ.. చాలామంది పెట్రోల్ బైక్స్ కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపుతుంటారు. దీనికి ప్రధాన కారణం మౌలిక సదుపాయాలైన ఛార్జింగ్ స్టేషన్స్ కావలసినన్ని అందుబాటులో లేకపోవడం అనే తెలుస్తుంది. సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే.. ఛార్జింగ్ మధ్యలోనే ఖాళీ అవుతుందేమో అనే భయం కూడా ఎక్కువమంది కొనుగోలు చేయకపోవడానికి కారణం అనే చెప్పాలి. -
తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులు
భారతదేశంలో లెక్కకు మించిన బైకులు అమ్మకానికి ఉన్నాయి. అయితే చాలామంది సరసమైన, ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ కథనంలో ఇండియన్ మార్కెట్లోని టాప్ 5 చీప్ అండ్ బెస్ట్ బైకులు గురించి తెలుసుకుందాం.హీరో హెచ్ఎఫ్ 100 (Hero HF 100)ఇండియన్ మార్కెట్లో అత్యంత సరసమైన బైకుల జాబితాలో చెప్పుకోదగ్గ మోడల్ 'హీరో హెచ్ఎఫ్ 100'. దీని ధర రూ. 59,018 (ఎక్స్ షోరూమ్). సింపుల్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ బైక్ 65 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. మల్టిపుల్ వేరియంట్లలో లభించే ఈ బైక్.. 97.2 సీసీ ఇంజిన్ ద్వారా.. అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.టీవీఎస్ స్పోర్ట్ (TVS Sport)తక్కువ ధరలో లభించే బైకుల జాబితాలో మరో మోడల్.. టీవీఎస్ స్పోర్ట్. దీని ధర రూ. 59,881 (ఎక్స్ షోరూమ్). 109.7 సీసీ ఇంజిన్ కలిగిన ఈ బైక్ 80 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్లు కాగా.. దీని బరువు 112 కేజీలు మాత్రమే.హీరో హెచ్ఎఫ్ డీలక్స్ (Hero HF Deluxe)రూ. 59,998 (ఎక్స్ షోరూమ్) వద్ద లభించే హీరో హెచ్ఎఫ్ డీలక్స్ కూడా సరసమైన బైకుల జాబితాలో ఒకటి. ఇది 65 కిమీ మైలేజ్ అందిస్తుంది. 4 స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ కలిగిన ఈ బైక్ 97.2 సీసీ ఇంజిన్ పొందుతుంది. కాబట్టి మంచి పనితీరును అందిస్తుంది.హోండా షైన్ (Honda Shine)ఇండియన్ మార్కెట్లో ఎక్కువమంది కొనుగోలు చేసిన బైక్ ఈ హోండా షైన్. దీని ప్రారంభ ధర రూ. 66,900 మాత్రమే. ఇందులో 123.94 సీసీ ఇంజిన్ 55 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. దీని ఫ్యూయెక్ ట్యాంక్ కెపాసిటీ 10.5 లీటర్లు. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ ఆప్షన్ పొందుతుంది.ఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్ కార్ల కథ ముగిసినట్టే?.. ఈవీ పాలసీ 2.0 గురించి తెలుసాటీవీఎస్ రేడియన్ (TVS Radeon)మన జాబితాలో చివరి బైక్.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే.. సరసమైన బైక్ టీవీఎస్ రేడియన్. దీని ప్రారంభ ధర రూ. 70720 (ఎక్స్ షోరూమ్). ఇది 62 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్లు మాత్రమే. ఇంజిన్ 4 స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ ఆప్షన్ పొందుతుంది. -
భారత్లో విలువైన టాప్ 10 బ్రాండ్స్ ఇవే..
ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన సూపర్ బిలియనీర్ల జాబితాను 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' (WSJ) విడుదల చేసింది. గ్లోబల్ వెల్త్ ఇంటెలిజెన్స్ సంస్థ ఆల్ట్రాటా డేటా ఆధారంగా డబ్ల్యూఎస్జే 24 మందిని సూపర్ బిలియనీర్లుగా గుర్తించింది. సంపద నికర విలువ 50 బిలియన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవారు సూపర్ బిలియనీర్లు. 24 మంది సూపర్ బిలియనీర్లలో, 16 మంది సెంటీ బిలియనీర్ల వర్గంలోకి వస్తారు, వీరి నికర విలువ కనీసం 100 బిలియన్ డాలర్లు.భారతదేశంలో కూడా బిలినీయర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే గ్లోబల్ మార్కెట్లో ఇండియన్ బ్రాండ్స్ కూడా తమదైన ముద్ర వేస్తున్నాయి. ప్రస్తుతం దేశీయ విఫణిలో ఆధిపత్యం చెలాయిస్తున్న.. విలువైన బ్రాండ్లలో టాటా గ్రూప్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ గ్రూప్ వంటివి ఉన్నాయి.లేటెస్ట్ బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక.. 2025లో టాప్ 10 అత్యంత విలువైన భారతీయ బ్రాండ్లను వెల్లడించింది.➤టాటా గ్రూప్: 31.6 బిలియన్ డాలర్లు➤ఇన్ఫోసిస్: 16.3 బిలియన్ డాలర్లు➤హెచ్డీఎఫ్సీ గ్రూప్: 14.2 బిలియన్ డాలర్లు➤ఎల్ఐసీ: 13.3 బిలియన్ డాలర్లు➤రిలయన్స్ గ్రూప్: 9.8 బిలియన్ డాలర్లు➤ఎస్బీఐ గ్రూప్: 9.6 బిలియన్ డాలర్లు➤హెచ్సీఎల్టెక్: 8.9 బిలియన్ డాలర్లు➤ఎయిర్టెల్: 7.7 బిలియన్ డాలర్లు➤లార్సెన్ & టూబ్రో: 7.4 బిలియన్ డాలర్లు➤మహీంద్రా గ్రూప్: 7.2 బిలియన్ డాలర్లుఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్ కార్ల కథ ముగిసినట్టే?.. ఈవీ పాలసీ 2.0 గురించి తెలుసా -
కస్టమర్ ఆర్డర్ చేసిన ఫుడ్.. తినేసిన డెలివరీ బాయ్.. థాంక్స్ జొమాటో
సోషల్ యాక్టివిస్ట్.. ఇన్ఫ్లుయెన్సర్ 'కిరణ్ వర్మ' అనే వ్యక్తి ఇటీవల తన ఫేస్బుక్ ఖాతాలో.. కస్టమర్కు డెలివరీ చేయాల్సిన ఫుడ్ను, డెలివరీ ఎగ్జిక్యూటివ్ తినడానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. మొదటి ఈ విషయాన్ని జొమాటో పార్ట్నర్తో మాట్లాడాలనుకున్నారు. కానీ నిజం తెలుసుకుని.. 'దీపిందర్ గోయల్'కు థాంక్స్ చెప్పారు.వర్మ తన కారును పార్కింగ్ చేస్తుండగా, జొమాటో రైడర్ ఒకరు తన బైకుపై కూర్చుని భోజనం చేస్తున్నట్లు గమనించారు. ఆ రైడర్ కస్టమర్ ఆర్డర్ తింటున్నాడని మొదట అనుమానించి, ఒక ఫోటో తీశాడు. అయితే అతని దగ్గరకు వెళ్లి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఎందుకు ఇంత ఆలస్యంగా భోజనం చేస్తున్నారని అడిగినప్పుడు, డెలివరీ ఎగ్జిక్యూటివ్ మధ్యాహ్నం 2 గంటలకు ఆర్డర్ తీసుకున్నారని, కానీ ఎంతసేపటికీ డెలివరీ తీసుకోవడానికి ఎవరూ రాలేదని పేర్కొన్నాడు.ఎంతసేపు వెయిట్ చేసినా.. ఎవరూ రాకపోవడంతో, ఆ ఆర్డర్ డెలివరీ అయినట్లుగా మార్క్ చేయాలని జొమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్ను కోరానని డెలివరీ బాయ్ తెలిపాడు. ఆలా చేస్తే.. జొమాటో రూల్స్ ప్రకారం ఆ ఆర్డర్ను ఏమైనా చేసుకోవచ్చు. అందుకే ఈ ఫుడ్ నేను తింటున్నాను అని అతడు వెల్లడించాడు.ఇదీ చదవండి: కేంద్ర ప్రభుత్వ స్కీమ్: వయోపరిమితి 60 ఏళ్లకు తగ్గింపు!సాయంత్రం వరకు ఎందుకు భోజనం చేయలేదు అనే ప్రశ్నకు.. హోలీ పండుగ సందర్భంగా ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి, ఎక్కువ ఆర్డర్స్ డెలివరీ చేస్తే.. ఇన్సెంటివ్స్ ఎక్కువగా వస్తాయని డెలివరీ బాయ్ చెప్పారు. డెలివరీ ఎగ్జిక్యూటివ్ ప్రతి ఆర్డర్కు రూ. 10 నుంచి రూ. 25 వరకు లభిస్తుంది. ఇలా వారు నెలకు రూ. 20,000 నుంచి రూ. 25,000 వరకు సంపాదిస్తారు.చూడగానే.. డెలివరీ చేయాల్సిన ఫుడ్ తింటున్నాడని అనుకున్నాను. కానీ నిజా నిజాలు తెలుసుకోకుండా.. ఎవరినీ నిందించడం కరెక్ట్ కాదు. ఇది వర్మ గిగ్ కార్మికుల కష్టాలను ప్రతిబింబించేలా చేసిందని కిరణ్ వర్మ అన్నారు. -
ఈత నేర్పే షార్క్..!
ఫొటోలో కనిపిస్తున్న ఈ షార్క్ బొమ్మ పిల్లలకు ఈత నేర్పుతుంది. అది కూడా చాలా సులువుగా. ఈ స్విమ్మింగ్ కిక్బోర్డులోని మోటార్స్ను పిల్లలు ఈత నేర్చుకునేలా డిజైన్ చేశారు. కేవలం దీని హ్యాండిల్స్ను కంట్రోల్ చేస్తూ ఎంత దూరమైన ఈత కొడుతూ వెళ్లొచ్చు.ఇందులోని స్పీడ్ కంట్రోల్ ఆప్షన్తో వేగాన్ని నియంత్రించుకోవచ్చు. బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. పిల్లల వయసు బట్టి ఈ డివైజ్ సైజు ఉంటుంది. వాటిని బట్టే ధర. ఆన్లైన్లో కొనుగోలు చేసే వీలుంది. -
15 నిమిషాల్లో పని మనిషి..
ఆన్లైన్ డెలివరీ అన్నది ఇప్పుడు సర్వ సాధారణమైపోయింది. మనిషి దైనందిన జీవితంలో భాగంగా మారిపోయింది. ఫుడ్ డెలివరీతో మొదలైన ఆన్లైన్ డెలివరీ సేవలు క్రమంగా కిరాణాతో పాటు అనేక రకాల వస్తువులు, సర్వీసులు నిమిషాల వ్యవధిలో ఇంటి ముంగిటకు చేర్చే వరకూ వచ్చేశాయి. ఈ సేవలు ఇక్కడితో ఆగేలా లేవు.తాజాగా ప్రముఖ హోమ్ సర్వీసెస్ సంస్థ అయిన అర్బన్ కంపెనీ ‘ఇన్స్టా మెయిడ్స్ / ఇన్స్టా హెల్ప్’ అనే సర్వీస్ను ప్రారంభించింది. దీని ద్వరా 15 నిమిషాల పనిమనిషి మీ ఇంటి ముంగిటకు వస్తారు. ఈ సర్వీస్ ప్రారంభంతో అర్బన్ కంపెనీ ఆన్లైన్ సేవలను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ విషయాన్ని కంపెనీ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ప్రకటించింది.ప్రస్తుతానికి ముంబైలో ఈ సేవను ప్రవేశపెట్టామని, ఇది 'పైలట్ దశలో' ఉందని అర్బన్ కంపెనీ పేర్కొంది. త్వరలోనే ఇతర నగరాలకు విస్తరిస్తామని తెలిపింది. ఈ సేవలో భాగస్వాములకు అంటే పని మనుషులకు 'గంటకు రూ .150 నుండి 180' లభిస్తుందని, అయితే ప్రస్తుతానికి ఈ సేవను గంటకు రూ .49 లకే అందిస్తున్నట్లు వివరించింది."అర్బన్ కంపెనీలో, మా సేవా భాగస్వాముల శ్రేయస్సుకు మేము కట్టుబడి ఉన్నాము. ఈ కొత్త సర్వీస్ ఆఫర్ లో, భాగస్వాములు ఉచిత ఆరోగ్య బీమా, ఆన్-ది-జాబ్ లైఫ్ & యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ తో పాటు గంటకు రూ. 150-180 సంపాదిస్తారు. నెలకు 132 గంటలు (22 రోజులు × రోజుకు 6 గంటలు) పనిచేసే భాగస్వాములకు నెలకు కనీసం రూ.20,000 ఆదాయం లభిస్తుంది" అని రాసుకొచ్చింది. అర్బన్ కంపెనీ సోషల్ మీడియాలో ఈ పోస్ట్ షేర్ చేసిన వెంటనే వైరల్గా మారింది. నెటిజన్ల నుంచి భిన్నమైన రియాక్షన్లు వచ్చాయి. ఆన్లైన్ సర్వీస్కి ఇది పరాకాష్ట అని పలువురు కామెంట్లు చేశారు. -
రోబో క్యూబ్: గెలుస్తుంది.. గెలిపిస్తుంది..
రూబిక్స్ క్యూబ్ పజిల్ను పరిష్కరించడానికి చాలా కష్టపడుతుంటారు కొంతమంది. ఇప్పుడు సులువుగా పరిష్కరించే పద్ధతిని నేర్పిస్తుంది ఈ ‘ఎక్స్ మ్యాక్ రోబో క్యూబ్’ చూడటానికి సాధారణ రూబిక్స్ క్యూబ్లాగే ఉంటుంది కాని, ఇందులోని ఆరు మోటార్లు రూబిక్స్ క్యూబ్లోని బ్లాక్స్ను సులువుగా తిప్పుతూ స్వయంగా పరిష్కరిస్తుంది.ఎవరైనా పజిల్ను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో వివిధ రంగుల లైట్లు, సంగీతాలను ప్లే చేస్తూ అర్థమైయ్యేలా మార్గనిర్దేశం చేస్తుంది. ఇలా దీని సాయంతో చిన్న పిల్లలు కూడా రూబిక్స్ క్యూబ్ను సులువుగా పరిష్కరించగలరు. ధర కాస్త ఎక్కువ. ఆన్లైన్లో దొరుకుతుంది. -
రియల్ ఎస్టేట్ను వదిలేస్తున్న వారెన్ బఫెట్!
ప్రముఖ ఇన్వెస్టర్, బెర్క్షైర్ హతావే చైర్మన్ వారెన్ బఫెట్ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. అమెరికాలోని అతిపెద్ద రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ సంస్థల్లో ఒకటైన హోమ్ సర్వీసెస్ ఆఫ్ అమెరికాను విక్రయించాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. పెరుగుతున్న తనఖా రేట్లు, క్షీణిస్తున్న అమ్మకాలు, ఆర్థిక అస్థిరతతో ప్రాపర్టీ మార్కెట్ సతమతమవుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇది దేనికి సంకేతం?ఎందుకు వదులుకుంటున్నట్టు?బలమైన కారణం ఉంటే తప్ప బఫెట్ వ్యాపారాలను అమ్మేసుకోడు. మరి ఇప్పుడెందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని వదులుకుంటున్నాడు? మార్కెట్ విస్తరణకు పేరొందిన రియల్ ఎస్టేట్ దిగ్గజం కంపాస్ కు హోమ్ సర్వీసెస్ ఆఫ్ అమెరికాను విక్రయించేందుకు బెర్క్ షైర్ హాత్వే చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. బెర్క్ షైర్ హాత్వే హోమ్ సర్వీసెస్, రియల్ లివింగ్ వంటి బ్రాండ్ల ద్వారా పనిచేస్తున్న హోమ్ సర్వీసెస్ కు 5,400 మంది ఉద్యోగులు, 820 బ్రోకరేజీ కార్యాలయాలతో విస్తృతమైన నెట్ వర్క్ ఉంది.వ్యాపారాన్ని విక్రయించాల్సిన అవసరం కంపెనీ ఎదుర్కొంటున్న ఆర్థిక ఎదురుదెబ్బల నుంచి కూటా ఉద్భవించి ఉండవచ్చు. 2024లో హోమ్ సర్వీసెస్ ఆఫ్ అమెరికా 107 మిలియన్ డాలర్ల నష్టాన్ని ప్రకటించింది. రియల్ ఎస్టేట్ కమిషన్ దావాకు సంబంధించిన 250 మిలియన్ డాలర్ల సెటిల్మెంట్ దీని వెనుక ముఖ్యమైన కారణం. మార్కెట్ పరిస్థితులు బిగుసుకుపోవడం, లాభదాయకత కుంచించుకుపోవడంతో బఫెట్ వ్యూహాత్మకంగా వెనక్కు తగ్గే అవకాశమూ ఉంది.పతనం అంచున అమెరికా హౌసింగ్ మార్కెట్?అమెరికా రియల్ ఎస్టేట్ మార్కెట్ తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపుతో ఆకాశాన్నంటుతున్న తనఖా రేట్లు గృహ అమ్మకాలను గణనీయంగా మందగించేలా చేశాయి. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్ ప్రకారం, 2023 లో ప్రస్తుత గృహాల అమ్మకాలు దాదాపు 30 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయాయి. రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ సంస్థ నుంచి బఫెట్ వైదొలగడం దీర్ఘకాలిక ప్రతికూలతలను ఆయన అంచనా వేస్తున్నట్లు సంకేతాలు ఇస్తున్నాయి. -
చేతిసైగలతో కదిలే డ్రోన్
గాల్లో ఎగిరే వస్తువులను చూసి చాలా ఆనందపడతారు పిల్లలు. ఇక ఆ ఎగిరే వస్తువు వాళ్లు చెప్పినట్లు ఎగిరితే ఇక ఆ ఆనందానికి అవధులు లేవు. ఇప్పుడు ఆ పని చేస్తుంది ఈ ‘స్కూట్ డ్రోన్’. చేతి సైగలతో కోరుకున్న రీతిలో ఈ డ్రోన్ను ఎగురవేస్తూ ఆటలాడుకోవచ్చు. ఎగిరేటప్పుడు పల్టీలు కొట్టడం వంటి విన్యాసాలు కూడా చేస్తుంది.ఆరుబయటి మైదానాల్లోనే కాకుండా, జనావాసాల్లో కూడా దీనిని సురక్షితంగా ఎగరేయవచ్చు. ఇది రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఇందులోని సెన్సర్లు ఎదురుగా ఉన్న అవరోధాలను గుర్తించగలవు. కాబట్టి, ఎలాంటి ప్రదేశాల్లోనైనా ఈ డ్రోన్ను ఎగరేస్తూ ఆటలాడుకోవచ్చు. ధర రూ. 4,569. వివిధ రంగుల్లో ఆన్లైన్లో అందుబాటులో ఉంది. -
శాలరీ అకౌంట్ ఉంటే ఇవన్నీ ఉన్నట్టే..
వివిధ సంస్థల్లో పనిచేసే చాలా మంది ఉద్యోగులకు శాలరీ అకౌంట్ ఉంటుంది. ఇది సాధారణ బ్యాంకు ఖాతా లాగే పనిచేస్తుంది. ఇందులో కంపెనీల యాజమాన్యాలు ప్రతి నెలా జీతాన్ని జమ చేస్తారు. ఈ డబ్బును ఖాతాదారులు ఉపసంహరించుకుంటారు.. లావాదేవీలు చేస్తారు.. ఖర్చులను నిర్వహిస్తారు. అయితే శాలరీ అకౌంట్ తో వచ్చే ఎక్స్ క్లూజివ్ బెనిఫిట్స్ ఏంటో తెలుసా? ఖాతా తెరిచే సమయంలో చాలా బ్యాంకులు ఈ ప్రయోజనాలను వెల్లడించవు.క్లాసిక్ శాలరీ అకౌంట్స్, వెల్త్ శాలరీ అకౌంట్స్, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్స్-శాలరీ, డిఫెన్స్ శాలరీ అకౌంట్స్ ఇలా వివిధ రకాల శాలరీ ఖాతాలను బ్యాంకులు అందిస్తున్నాయి. వీటిలో దాగిఉన్న ఆర్థిక ప్రయోజనాల గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.యాక్సిడెంటల్ డెత్, హెల్త్ ఇన్సూరెన్స్చాలా శాలరీ అకౌంట్లు యాక్సిడెంటల్ డెత్ కవర్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్ ను అదనపు భద్రతా ఫీచర్ గా కలిగి ఉంటాయి. ఖాతాదారులకు, వారి కుటుంబాలకు ఆర్థిక రక్షణను అందిస్తాయి.రుణాలపై తక్కువ వడ్డీ రేట్లుశాలరీ అకౌంట్ హోల్డర్లకు బ్యాంకులు వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలపై ప్రిఫరెన్షియల్ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. దీనివల్ల రుణ కాలపరిమితిలో గణనీయమైన మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు.ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీఅత్యంత ఉపయోగకరమైన ప్రయోజనాలలో ఒకటి ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం. ఇది అత్యవసర పరిస్థితుల్లో మీ ఖాతా బ్యాలెన్స్ జీరో ఉన్నప్పటికీ కొంత డబ్బును ఉపసంహరించుకునే అవకాశం కల్పిస్తుంది.ప్రాధాన్య బ్యాంకింగ్ సేవలువేగవంతమైన ప్రాసెసింగ్, డెడికేటెడ్ కస్టమర్ సర్వీస్, ఎక్స్ క్లూజివ్ బ్యాంకింగ్ ఆఫర్లతో సహా అనేక బ్యాంకులు శాలరీ అకౌంట్ హోల్డర్లకు ప్రాధాన్యతా సేవలను అందిస్తున్నాయి.ఉచిత క్రెడిట్ కార్డులు, రివార్డులుబ్యాంకులు తరచుగా శాలరీ అకౌంట్లతో కాంప్లిమెంటరీ క్రెడిట్ కార్డులను అందిస్తాయి. వార్షిక రుసుమును మాఫీ చేస్తాయి. రివార్డ్ పాయింట్లు, క్యాష్ బ్యాక్, ప్రత్యేక డిస్కౌంట్లను అందిస్తాయి.ఆన్ లైన్ షాపింగ్ & డైనింగ్ డీల్స్శాలరీ అకౌంట్ హోల్డర్లకు ఆన్లైన్ షాపింగ్, డైనింగ్పై క్యాష్బ్యాక్ ఆఫర్లతో సహా ప్రత్యేక డిస్కౌంట్లు లభిస్తాయి. జీవనశైలి ఖర్చులను మరింత చౌకగా చేస్తాయి.ఉచిత డిజిటల్ లావాదేవీలుసాధారణ ఖాతాల మాదిరిగా కాకుండా, చాలా బ్యాంకులు శాలరీ ఖాతాదారులకు నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ ఛార్జీలను మాఫీ చేస్తాయి.ఫ్రీగా చెక్ బుక్, డెబిట్ కార్డులుశాలరీ అకౌంట్ కస్టమర్లకు చాలా వరకు బ్యాంకులు ఎటువంటి రుసుములు లేకుండా చెక్ బుక్ లు, డెబిట్ కార్డులను అందిస్తుంటాయి. ఇవి చిన్నపాటివే అయినా పునరావృతమయ్యేవి కాబట్టి ప్రయోజనం ఉంటుంది.ఉచిత ఏటీఎం లావాదేవీలుఅనేక బ్యాంకులు ప్రతి నెలా ఎక్కువ సంఖ్యలో ఉచిత ఏటీఎం ఉపసంహరణలను అనుమతిస్తాయి. దీంతో అదనపు ఛార్జీల గురించి ఆందోళన లేకుండా నగదును యాక్సెస్ చేసుకోవచ్చు.జీరో బ్యాలెన్స్ ఫెసిలిటీచాలా శాలరీ అకౌంట్లు జీరో బ్యాలెన్స్ ఫీచర్తో వస్తాయి. అంటే కనీస బ్యాలెన్స్ నిర్వహించాల్సిన అవసరం ఉండదు. ఇది సాధారణ సేవింగ్స్ ఖాతాలకు లేని ప్రయోజనం. -
భారీగా పెరిగిన ఫారెక్స్ నిల్వలు
ముంబై: భారత విదేశీ మారక నిల్వలు(ఫారెక్స్ నిల్వలు) భారీగా పెరిగా యి. మార్చి 7తో ముగిసి న వారానికి 15.267 బిలియన్ డాలర్లు పెరిగి 653.966 డాలర్లకు చేరాయని ఆర్బీఐ తెలిపింది. గడిచిన రెండేళ్లలో ఈ స్థాయిలో అనూహ్యంగా పెరగడం ఇదే తొలిసారి.వ్యవస్థలో లిక్విడిటీని పెంచేందుకు ఆర్బీఐ ఫిబ్రవరి 28న 10 బిలియన్ డాలర్లకు సమానమైన డాలర్–రూపాయి వేలాన్ని నిర్వహించడం ఫారెక్స్ నిల్వల అనూహ్య పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. అంతకు మార్చి 1తో ముగిసిన వారం 1.781 బిలియన్ డాలర్లు తగ్గి 638.698 డాలర్లుగా ఉన్నాయి. సమీక్షా వారం(మార్చి 7)లో విదేశీ కరెన్సీ ఆస్తులు 13.993 బిలియన్ డాలర్లు పెరిగి 557.282 బిలియన్ డాలర్లకు.., పసిడి నిల్వలు 1.053 బిలియన్ డాలర్ల నుంచి 74.325 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ వద్ద నిల్వలు 69 మిలియన్ డాలర్లు తగ్గి 4.148 బిలియన్ డాలర్లకు దిగివచ్చినట్లు ఆర్బీఐ గణాంకాలు తెలియజేశాయి. -
రేసింగ్కు టీవీఎస్, పెట్రోనాస్ జట్టు
చెన్నై: ద్విచక్ర వాహన దిగ్గజం టీవీఎస్ మోటార్ కంపెనీ పెట్రోనాస్ లూబ్రికెంట్స్ ఇంటర్నేషనల్తో భాగస్వామ్యాన్ని పటిష్ట పరచుకుంటోంది. తద్వారా దేశీయంగా మోటార్ స్పోర్ట్స్ను ప్రోత్సహించడంలో పరస్పరం కట్టుబడి ఉన్నట్లు సంస్థలు పేర్కొన్నాయి.భాగస్వామ్యంలో భాగంగా రానున్న మూడేళ్ల కాలానికి టీవీఎస్ రేసింగ్ టీమ్ టైటిల్ స్పాన్సర్గా టీవీఎస్ మోటార్, పెట్రోనాస్ లూబ్రికెంట్స్ వ్యవహరించనున్నాయి. 2022–23 సీజన్లో టీవీఎస్ రేసింగ్కు టైటిల్ స్పాన్సర్గా పెట్రోనాస్ లూ బ్రికెంట్స్ ఇండియా వ్యవహరించింది.ఇండియన్ నేషనల్ సూపర్క్రాస్ చాంపియన్షిప్, ఇండియన్ నేషనల్ ర్యాలీ చాంపియన్షిప్, ఇండియన్ నేషనల్ మోటార్సైకిల్ రేసింగ్ చాంపియన్షిప్లలో రేసింగ్ టీమ్ పాల్గొనేందుకు మద్దతివ్వనున్నాయి. -
వ్యూయర్షిప్లో జియోహాట్స్టార్ కొత్త రికార్డులు
న్యూఢిల్లీ: దేశీయంగా లైవ్ స్పోర్ట్స్ స్ట్రీమింగ్ వ్యూయర్షిప్లో జియోహాట్స్టార్ కొత్త రికార్డులు నెలకొల్పింది. ఇటీవల ముగిసిన ‘ఐసీసీ పురుషుల క్రిక్రెట్ చాంపియన్స్ ట్రోఫీ 2025’ మ్యాచ్లకు సంబంధించి 540 కోట్ల వ్యూస్, దాదాపు 11,000 కోట్ల నిమిషాల వాచ్టైమ్ నమోదైంది. డిస్నీ స్టార్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్లో భాగమైన వయాకామ్ 18 విలీనంతో జియోహాట్స్టార్ ఏర్పాటైన తర్వాత స్ట్రీమ్ చేసిన తొలి భారీ క్రికెట్ టోర్నమెంట్ ఇది.ఇందులో న్యూజిల్యాండ్ మీద భారత్ గెల్చిన ఫైనల్ మ్యాచ్కి ఏకంగా 124.2 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఒక దశలో, ఏకకాలంలో వీక్షించిన వారి సంఖ్య 6.12 కోట్లుగా నమోదైంది. గతంలో డిస్నీ హాట్స్టార్లో ప్రసారమైన 2023 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ని అత్యధికంగా 5.9 కోట్ల మంది వీక్షించారు.తాజా టోర్నిలో భారత్–పాకిస్తాన్ మ్యాచ్కు 60.2 కోట్ల స్ట్రీమింగ్ వ్యూస్ వచ్చాయి. భారత్లో డిజిటల్ స్ట్రీమింగ్కు పెరుగుతున్న ఆదరణను తాజా గణాంకాలు సూచిస్తున్నాయని జియోస్టార్ డిజిటల్ సీఈవో కిరణ్ మణి తెలిపారు. ఐసీసీ టోర్నమెంటును తొలిసారిగా తెలుగు, తమిళం తదితర తొమ్మిది భాషల్లోను, సైన్ ల్యాంగ్వేజ్లోను, ఆడియో కామెంటరీ రూపంలోనూ అందించినట్లు వివరించారు. -
కార్మిక శక్తిలో కనబడని మహిళా ప్రాతినిధ్యం
న్యూఢిల్లీ: చేతివృత్తులు, నైపుణ్యాలతో కూడిన కార్మికశక్తిలో (బ్లూకాలర్ ఉద్యోగాలు) మహిళల భాగస్వామ్యం ప్రతి ఐదుగురిలో ఒకరిగానే (20 శాతం) ఉన్నట్టు జాబ్ ప్లాట్ఫామ్ ‘ఇండీడ్’ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా వేతనాల్లో తీవ్ర అంతరాలు, పనిచేసే చోటు పారిశుద్ధ్య పరిస్థితులు దారుణంగా ఉండడం వంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుండడం మహిళలను పనులకు దూరం చేస్తోంది. టైర్ 1, 2 పట్టణాల్లో 14 రంగాల్లోని 4,000 కంపెనీలు, ఉద్యోగులను ఇండీడ్ సర్వే చేసింది. సర్వే అంశాలు.. ⇒ 2024లో 73 శాతం కంపెనీలు బ్లూ కాలర్ ఉద్యోగాల్లోకి మహిళలను నియమించుకున్నట్టు తెలిపాయి. బ్లూకాలర్ ఉద్యోగాలన్నీ శ్రామికశక్తితో కూడినవే. ⇒ రిటైల్, హెల్త్కేర్, ఫార్మాస్యూటికల్స్, నిర్మాణం, రియల్ ఎస్టేట్, రవాణా, ఆతిథ్య పరిశ్రమలో మహిళల ప్రాతినిధ్యం సగటున 30 శాతం స్థాయిలో ఉంది. ⇒ అదే టెలికమ్యూనికేషన్స్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సరీ్వసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), ఐటీ/ఐటీఈఎస్ రంగాల్లో మహిళల ప్రాతినిధ్యం 10 శాతం కంటే తక్కువగా ఉంది. ⇒ ఆర్థిక స్వాతంత్య్రం కోసం మహిళలు బ్లూకాలర్ ఉద్యోగాలు కోరుకుంటున్నారు. కానీ, పరి పరిస్థితులు కఠినంగా ఉంటున్నట్టు చెబుతున్నారు. ⇒ ఉద్యోగ వేళలు (షిఫ్ట్లు) అనుకూలంగా లేవని సగం మందికి పైగా తెలిపారు. కఠినమైన పనివేళల కారణంగా మహిళలు ఉద్యోగం, వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకోలేకపోతున్నారు. ⇒ పురుషులతో పోల్చితే 42 శాతం మంది మహిళలు తమకు తక్కువ వేతనం చెల్లిస్తున్నట్టు చెప్పారు. అంతేకాదు కెరీర్లో పురోగతి (పదోన్నతులు తదితర) ఉండడం లేదని భావిస్తున్నారు. ⇒ సర్వేలో పాల్గొన్న ప్రతి ఇద్దరు మహిళల్లో ఒకరు నైపుణ్యాలను పెంచుకుంటామని ఆసక్తి చూపించారు. అయితే, నైపుణ్య శిక్షణ తమకు సవాలుగా పేర్కొన్నారు. నేర్చుకునేందుకు సరైన మార్గాలు లేకపోవడం కెరీర్లో ముందుకు వెళ్లేందుకు అడ్డంకిగా పేర్కొన్నారు. ⇒ 78% కంపెనీలు 2025లో మహిళలను నియమించుకుంటామని చెప్పాయి. గతేడాదితో పోల్చితే నియామకాల ఉద్దేశ్యం 5% పెరిగింది. ⇒ అయితే సరిపడా నైపుణ్యాలు కలిగిన వారు లభించడం లేదని, దీనికితోడు వలసలు తమ కు సమస్యాత్మమని కంపెనీలు పేర్కొన్నాయి. ⇒ ఇన్సూరెన్స్, పెయిడ్ మెడికల్ లీవ్ను మహిళలు కోరుకుంటుండగా, ఆరోగ్య సంరక్షణ వ్యయాలు పెరిగిపోవడం తమకు సవాలుగా కంపెనీలు తెలిపాయి. మెరుగైన విధానాలతోనే.. ‘‘మరింత మంది మహిళలను ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు వ్యాపార సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి. కానీ నిజమైన ప్రగతి అన్నది వారిని కాపాడుకునేందుకు మెరుగైన విధానాలు అమలు చేయడం, కెరీర్లో పురోగతికి వీలు కల్పించడం, ఆర్థిక భద్రత, ఆరోగ్య సంరక్షణ దిశగా విధానాలు అమలు చేయడం కీలకం’’అని ఇండీస్ సర్వే సూచించింది. -
అప్పు... ఆర్థిక భద్రతకు ముప్పు!
ఇప్పుడు ఆర్థికవేత్తల చర్చల్లో కీలకాంశం.. భారత్ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ), దానితో పోల్చితే భారత్ రుణ నిష్పత్తి. ఒక కుటుంబానికి తీర్చగలిగిన స్థాయిలోనే అప్పు ఎలా ఉండాలో.. ఒక దేశానికి తన ఆర్థిక వ్యవస్థ స్థాయికి తగినట్లుగానే రుణం ఉండాలి. ఒక కుటుంబం ఆదాయం– అప్పు ఎలా బేరీజు వేసుకోవాలో దేశం కూడా తన జీడీపీని, అందులో రుణ నిష్పత్తిని తూకం వేసుకోవాలి. ఒక దేశం ఆర్థిక ‘ఆరోగ్యానికి’ చక్కటి సూచిక జీడీపీ–రుణ నిష్పత్తి.విస్తృత స్థాయిలో ఆమోదం పొందిన ఈ సూచీని అదుపులో పెడతామని కేంద్రం ఇస్తున్న హామీ ఇప్పుడు ఆర్థిక వర్గాలకు ఊరటనిస్తోంది. అయితే ఇది అంత తేలిక్కాదని వాస్తవ పరిస్థితులు అద్దం పడుతున్నాయి. ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వ అప్పు (సెంట్రల్ గవర్నమెంట్ డెట్) కొంత అదుపులో ఉన్నా.. రాష్ట్రాలను కూడా కలుపుకుంటే (జనరల్ గవర్నమెంట్ డెట్) ఆందోళన కలిగిస్తున్న విషయం ఇక్కడ గమనార్హం. ఆయా అంశాలపై చర్చించిందే ఈ కథనం. – సాక్షి, బిజినెస్ డెస్క్కేం ద్రానికి రుణ–జీడీపీ నిష్పత్తి 2024–25 ఆర్థిక సంవత్సరంలో 57.1 శాతం. ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే రానున్న 2025–26లో 56.1 శాతానికి తగ్గించాలని ఈ ఏడాది ఫిబ్రవరి 1న ఆర్థికమంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ నిర్దేశించుకుంది. ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య ఉన్న నికర వ్యత్యాసం– ద్రవ్యలోటును తగ్గించుకోవడం... ఆర్థికాభివృద్ధి ద్వారా జీడీపీలో రుణ నిష్పత్తిని గణనీయంగా తగ్గించుకోవాలన్న సంకల్పాన్ని బడ్జెట్ ఉద్ఘాటించింది. తద్వారా ఈ నిష్పత్తిని 2031 మార్చి 31 నాటికి ఒక శాతం అటుఇటుగా 50 శాతానికి చేర్చాలని ప్రణాళికలను వెల్లడించింది.అంటే జీడీపీలో రుణ నిష్పత్తిని 2031 నాటికి ఏడాదికి ఒక శాతం చొప్పున తగ్గించుకుంటూ వెళ్లాలన్నది కేంద్రం లక్ష్యం. ఇందుకు రెండు ప్రధానదారులు ఒకటి ద్రవ్యలోటు కట్టడికాగా, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి మరొకటి. 2024–25లో ద్రవ్యలోటు 4.9 శాతం ఉండాలని బడ్జెట్ నిర్ధేశించుకున్నప్పటికీ, ఇది సవరించిన అంచనాల ప్రకారం మరింత మెరుగ్గా 4.8 శాతానికి తగ్గించుకోగలిగింది.రానున్న ఆర్థిక సంవత్సరంలో (2025–26) ఈ రేటును 4.4 శాతానికి తగ్గించుకోవాలని కూడా తాజా బడ్జెట్ నిర్దేశించుకుంది. లక్ష్యాలకు అనుగుణంగా నడుస్తూ, జీడీపీ– రుణ నిష్పత్తిని లక్ష్యాల మేరకు తగ్గించుకుంటామని కేంద్రం స్పష్టం చేస్తోంది. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఇది బాండ్ మార్కెట్, ప్రభుత్వం చెల్లించాల్సిన రుణ వడ్డీరేట్లు స్థిరత్వానికి తద్వారా దేశ ఎకానమీ పురోగతికి దోహదపడే అంశమనడంలో సందేహాలే అక్కర్లేదు. ⇒ తొమ్మిదేళ్లలో రూ.93.26 లక్షల కోట్ల ⇒ నుంచి రూ.200.16 లక్షల కోట్లులోక్సభలో ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి ప్రకటన ప్రకారం ఫిబ్రవరి 10వ తేదీన 2018–19లో కేంద్ర ప్రభుత్వ రుణం 93.26 లక్షల కోట్లు. నిర్దిష్ట ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోల్చితే ఇది 49.3 శాతమే. మహమ్మారి కోవిడ్ ప్రభావిత ఆర్థిక సంవత్సరం 2020–21లో రుణ భారం ఏకంగా 121.86 లక్షల కోట్లకు ఎగసింది. జీడీపీలో ఇది 61.4 శాతానికి చేరింది. కరోనా పరిస్థితుల్లో దేశ ఎకానమీ తీవ్రంగా దెబ్బతినడం దీనికి నేపథ్యం. అయితే అటు తర్వాత ఆర్థిక సంవత్సరాలు చూస్తే, (2021–22 నుంచి ఇటీవల బడ్జెట్ 2025–26) జీడీపీలో రుణ నిష్పత్తులు వరుసగా తీవ్ర స్థాయిల్లో (వరుసగా 58.8 శాతం, 57.9 శాతం, 58.1 శాతం, 7.1%, 56.1 శాతం)నే కొనసాగాయి తప్ప, తిరిగి 2018–19 నాటి స్థితికి (49.3 %) చేరుతుందన్న ఆశలు మాత్రం కల్పించలేదు.రూపాయిల్లో చూస్తే, గడచిన తొమ్మిది ఆర్థిక సంవత్సరాల్లో రుణ పరిమాణం 93.26 లక్షల కోట్ల నుంచి రెట్టింపుకన్నా అధికంగా 200.16 లక్షల కోట్లకు చేరింది. అయితే తిరిగి వచ్చే ఆరేళ్లలో జీడీపీలో ఒక శాతం అటుఇటుగా 50 శాతానికి రుణ నిష్పత్తిని తీసుకువెళతామని తన బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం ఎకానమీ పరంగా కొంత ఊరటనిచ్చే అంశం.లక్ష్య సాధన తేలిక్కాదుబడ్జెట్లో నిర్దేశించుకున్నట్లు 2031 నాటికి జీడీపీలో రుణ నిష్పత్తిని నిజంగానే తిరిగి 50 శాతానికి చేర్చడం సాధ్యమేనా అన్నది ఇక్కడ బిలియన్ డాలర్ల ప్రశ్న. ముఖ్యంగా అంతర్జాతీయ పరిణామాలు భారత్ ఎకానమీకి ప్రస్తుతం తీవ్ర ప్రతికూలంగా ఉన్నాయి. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్–హమాస్ సమస్యలతో తీవ్ర అనిశి్చతిలో ఉన్న ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ట్రంప్ తాజా పాలనా కాలంలో మరింత క్షీణించాయి.టారిఫ్ల యుద్ధం కూడా దాదాపు ప్రారంభమైంది. ఒకపక్క అమెరికా టారిఫ్ల యు ద్ధం, మరోపక్క చైనాకి విదేశీ ఫోర్ట్ఫోలియో పెట్టుబడులు తరలిపోవడం వంటి అంశాలు భారత్ ఎకానమీపై తీవ్ర ఇప్పుడు తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి లక్ష కోట్ల ఎఫ్ఐఐ పెట్టుబడులు భారత్ నుంచి వెనక్కు మ ళ్లాయి. వీటిలో అధిక భాగం చైనా ఆకర్షించడం గమనార్హం. బలహీనమైన ప్రపంచ డిమాండ్. ఉ త్పాదక రంగంపై ఒత్తిళ్లు, డాలర్ మారకంలో రూ పాయి మారకపు విలువలో తీవ్ర అనిశి్చతి, భారత్ ఎకానమీకి తీవ్ర సవాళ్లను విసురుతున్నాయి.అ యితే పటిష్ట దేశీయ డిమాండ్, ప్రైవేటు వినియో గం, ద్రవ్యలోటు వంటి అంశాల్లో క్రమశిక్షణ, పటిష్ట విదేశీ మారకద్రవ్యాలు, సేవల రంగంలో మిగులు, చక్కటి రెమిటెన్సుల (ఎన్ఆర్ఐలు దేశానికి పంపే విదేశీ డబ్బు) వృద్ధి భారత్ ఎకానమీకి మూలస్తంభాలని, ఈ దన్నుతో ఎకానమీ పురోగతి సాధ్యమేనని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. దేశ పౌరునిగా అంతా మంచే జరగాలని మనమూ కోరుకుందాం. రుణ భారం ఎక్కువైతే...⇒ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, విద్య వంటి ముఖ్యమైన రంగాలకు కేటాయింపుల కంటే వడ్డీ చెల్లింపులపై ప్రభుత్వం ఎక్కువగా ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ⇒ భవిష్యత్ తరాలకు ప్రయోజనం చేకూర్చే పెట్టుబడుల నుండి ప్రభుత్వం దూరంగా జరిగి.. వడ్డీ వ్యయాలకు అధిక మొత్తాన్ని కేటాయించాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ⇒ తీసుకున్న రుణం ఎక్కడికి వెళుతోందన్న అంశమూ కీలకం. ఇది వృద్ధికి దోహదపడే దీర్ఘకాలిక ప్రాజెక్టుల వ్యయాల్లో భాగం కావాలి. అసమానత, పేదరికం, నిరుద్యోగం సమస్యల పరిష్కారానికి దోహదపడే వ్యయాలు ఎకానమీ పురోగతికి బాటలు వేస్తాయి. విదేశీ రుణ భారం.. ఊరట అయితే 2018–19 ఆర్థిక సంవత్సరం జీడీపీలో 2.5 శాతంగా ఉన్న భారత్ ప్రభుత్వ రుణ భారం (రూ.4.74 లక్షల కోట్లు), 2025–26కు సంబంధించి ఆర్థికమంత్రి ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ లోనూ 2.5 శాతంగా (రూ.8.92 లక్షల కోట్లు) యథాతథంగా కొనసాగడం కొంత ఊరటనిచ్చే అంశం. విదేశీ రుణ భారాలను స్థిరంగా ఉంచాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పాన్ని ఇది సూచిస్తోంది. రాష్ట్రాలనూ కలుపుకుంటే.. కలవరమే!భారతదేశ ఆర్థిక వ్యవస్థపై అప్పుల భారం ఇప్పటికే తీవ్రంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ అప్పుతో పాటు రాష్ట్రాల రుణ భారం కలుపుకొని చూస్తే, పరిస్థితి మరింత ఆందోళన కలిగించేలా మారుతోంది. దీనిని ‘జనరల్ గవర్నమెంట్ డెట్’ (జీజీడీ) అని వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఇది జీడీపీలో 80 శాతానికి పైగా స్థిరంగా కొనసాగుతుండటం ఆర్థిక నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వ వర్గాలు 2030–31 నాటికి ఈ నిష్పత్తిని 70 శాతం లోపుకు తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు చెబుతున్నా, ఇది అంత తేలికైన విషయం కాదని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.కేంద్ర ప్రభుత్వ ద్రవ్య లోటు (వ్యయాలు – ఆదాయాల మధ్య వ్యత్యాసం) జీడీపీలో 5 శాతానికి దిగువన కొనసాగుతుందనే అంచనా ఉంది. అయితే రాష్ట్రాల అప్పును కలుపుకుంటే ఈ నిష్పత్తి 7 శాతం పైగా పెరిగే అవకాశం ఉంది, ఇది ఆర్థిక స్థిరత్వానికి హానికరమైన అంశం. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సహా పలు ఆర్థిక సంస్థలు భారత సాధారణ ప్రభుత్వ అప్పు జీడీపీకి 100 శాతానికి మించిపోవచ్చని ఇప్పటికే హెచ్చరించాయి.ఈ పరిణామాలు భారత సావరిన్ రేటింగ్లపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది. మూడీస్, ఎస్అండ్పీ, ఫిచ్ వంటి అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు భారత్కు ఇస్తున్న సావరిన్ రేటింగ్.. ‘జంక్’ స్థాయి కన్నా కేవలం ఒక అంచె ఎక్కువగా ఉండడం గమనార్హం. ఇది విదేశీ పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపి, భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటును దెబ్బతీస్తోంది. అమెరికాకు 123 శాతం ఉంటే.. భారత్కు 56 శాతం.. భయమెందుకు! జీడీపీలో అమెరికాసహా కొన్ని అగ్ర దేశాల రుణ నిష్పత్తులు 100 శాతం దాటిపోతే భారత్ది 56 శాతమేగా భయమెందుకు? అన్న సందేహాలు కొందరికి కలగవచ్చు. ఇక్కడ ఒక్కటే సమాధానం. కోట్ల ఆస్తి ఉన్న వ్యక్తి ఎంత డబ్బు అయినా అప్పు తీసుకోవచ్చు. అది ఆ వ్యక్తి తేలిగ్గా తీర్చేయగలడు.ధనికుడు అప్పు అడగడంతోనే ఇచ్చేవాడూ వెనకాముందూ చూడకుండా ఇచ్చేస్తాడు. మరి పేదవాడు అప్పుచేస్తే అది ఎంత ఎక్కువుంటే.. అతనికి అంత కష్టం. ఇదీ అంతే. అమెరికా, జపాన్ వంటివి అగ్ర దేశాలు. వాటి ఎకానమీలు స్వల్పకాలంలో ఆటుపోట్లకు గురైనా.. అవి అత్యంత శక్తివంతమైనవి. అయితే ఆయా దేశాల అప్పులనూ అంత తేలిగ్గా తీసిపారేయవద్దని, ఇది అవి మునగడంతోపాటు, ప్రపంచ దేశాలనూ ముంచే వ్యవహారమనీ.. విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. ముందుచూపు అవసరం భారత ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలంటే రాజకీయ పార్టీలు పొదుపు విధానాలను అలవర్చుకోవడంతో పాటు, అప్పులను సమర్థంగా నిర్వహించాలి. వృద్ధిని పెంచే సంస్కరణలను ప్రోత్సహించడంతో పాటు, ప్రభుత్వ వ్యయాలను సద్వినియోగం అయ్యేల చూడ్డం అత్యవసరం. ఇకపై ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు దేశ ఆర్థిక భద్రతను నిర్దేశించనున్నాయి! -
ఒక్కసారే రీచార్జ్.. ఏడాదంతా వ్యాలిడిటీ
BSNL 365 Days Plan: ప్రభుత్వ రంగ టెలికమ్ సంస్థ బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారుల కోసం చౌకైన, సరసమైన ప్రీపెయిడ్ ప్లాన్ను ప్రారంభించింది. ఇది పూర్తి ఏడాది అంటే 365 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ముఖ్యంగా బీఎస్ఎన్ఎల్ సిమ్ను సెకండరీ నంబర్గా వాడే యూజర్లకు ఈ ప్లాన్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.బీఎస్ఎన్ఎల్ 365 రోజుల ప్లాన్ ధర కేవలం రూ .1198 మాత్రమే. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు అంటే ఏడాది. దీని ప్రకారం దీని నెలవారీ సగటు సుమారు రూ.100 వరకు ఉంటుంది. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు సిమ్ యాక్టివ్ గా ఉండాలనుకునే యూజర్లకు ఈ ప్లాన్ బాగా ఉపయోగపడుతుంది.ప్లాన్ ప్రయోజనాలు బీఎస్ఎన్ఎల్ 365 రోజుల ప్లాన్తో వినియోగదారులు ప్రతి నెలా 300 నిమిషాల వరకు ఏ నెట్వర్క్కైనా ఉచిత కాలింగ్ సదుపాయాన్ని పొందుతారు. ఇది కాకుండా ప్రతి నెలా 30 ఉచిత ఎస్ఎంఎస్లతో పాటు ప్రతి నెలా 3 జీబీ హైస్పీడ్ డేటా కూడా లభిస్తుంది. అంతే కాదు దేశం అంతటా రోమింగ్ సమయంలో ఉచిత ఇన్కమింగ్ కాల్స్ ప్రయోజనాన్ని కూడా పొందుతారు.బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ నెట్వర్క్ విస్తరణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.6,000 కోట్లు పెట్టుబడి పెట్టింది. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ 4జీ సేవలను అప్గ్రేడ్ చేయడానికి ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందని, తద్వారా త్వరలోనే వినియోగదారులకు మెరుగైన నెట్వర్క్, వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. -
EPFO: ఫ్రీగా రూ.7 లక్షల ఇన్సూరెన్స్
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO).. దేశంలోని అతిపెద్ద సామాజిక భద్రతా సంస్థలలో ఒకటి. సంఘటిత రంగంలోని ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్స్, పెన్షన్ పథకాల నిర్వహణ బాధ్యతను చూస్తుంది. అంతేకాకుండా ఈపీఎఫ్ఓలో చేరిన ఉద్యోగులకు ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (ఈడీఎల్ఐ) పథకం కింద రూ.7 లక్షల వరకు జీవిత బీమా కవరేజీ అందిస్తోంది. ఇందుకోసం ఉద్యోగులు ప్రీమియం కూడా చెల్లించాల్సిన పని లేదు. ఇది విలువైన ఆర్థిక రక్షణ అయినప్పటికీ చాలా మంది ఉద్యోగులకు దీని గురించి తెలియదు.ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిస్లేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్, 1952 కింద ఈడీఎల్ఐ స్కీమ్ పనిచేస్తుంది. ఇది సంఘటిత రంగంలోని ఉద్యోగులకు జీవిత బీమా కవరేజీని నిర్ధారిస్తుంది. బీమా ప్రీమియం నామమాత్రంగా ఉంటుంది. ప్రతి ఉద్యోగికి నెలకు గరిష్టంగా రూ .75 ఛార్జీ ఉంటుంది. ఇది కూడా ఉద్యోగి చెల్లించనక్కర లేదు. వారు పనిచేసే యాజమాన్యాలే దీన్ని భరిస్తాయి.ఈడీఎల్ఐ స్కీమ్ ప్రత్యేకతలుఒక ఉద్యోగి తన సర్వీస్ కాలంలో మరణిస్తే, అతని చట్టబద్ధమైన నామినీ లేదా వారసులు బీమా సొమ్మును పొందడానికి అర్హులు. ప్రస్తుతం ఈ పథకం కింద కనీస రూ .2.5 లక్షలు, గరిష్టంగా రూ .7 లక్షలు మరణించిన ఉద్యోగి కుటుంబానికి చెల్లిస్తారు. గత 12 నెలల్లో ఉద్యోగి సగటు నెలవారీ జీతం ఆధారంగా తుది మొత్తాన్ని లెక్కిస్తారు.ఈపీఎఫ్ సభ్యులందరూ ఆటోమేటిక్గా ఈడీఎల్ఐ పథకానికి అర్హులవుతారు. మొత్తం ప్రీమియంను యాజమాన్యం భరిస్తుంది కాబట్టి ఉద్యోగులు ఎటువంటి అదనపు కంట్రిబ్యూషన్లు చేయాల్సిన అవసరం లేదు. ప్రీమియంను ఉద్యోగి ప్రాథమిక నెలవారీ వేతనంలో 0.5 శాతంగా లెక్కిస్తారు. ముఖ్యంగా, ఈ బీమా కవరేజీ స్వతంత్రంగా ఉంటుంది. అంటే ఉద్యోగి కలిగి ఉన్న ఇతర వ్యక్తిగత బీమా పాలసీలతో ఎటువంటి సంబంధం లేకుండా ఇది అమలవుతుంది.గతంలో ఈడీఎల్ఐ స్కీమ్ కింద గరిష్టంగా రూ.6 లక్షల బీమా చెల్లింపు ఉండేది. అయితే 2024 ఏప్రిల్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) ఈ మొత్తాన్ని సవరించి, కనీస చెల్లింపును రూ .2.5 లక్షలకు, గరిష్టంగా రూ .7 లక్షలకు పెంచింది. ఉద్యోగుల అకాల మరణం సంభవిస్తే వారి కుటుంబాలకు మరింత ఆర్థిక భద్రత కల్పించడమే ఈ పెంపు లక్ష్యం.క్లెయిమ్ ఎలా ఫైల్ చేయాలి?ఈడీఎల్ఐ స్కీమ్ కింద బీమా మొత్తాన్ని క్లెయిమ్ చేయడానికి, నామినీలు లేదా చట్టబద్ధమైన వారసులు ఫారం 5ఐఎఫ్తో పాటు ఉద్యోగి మరణ ధృవీకరణ పత్రం, నామినేషన్ రుజువు వంటి అవసరమైన పత్రాలను సమర్పించాలి. పూర్తి చేసిన క్లెయిమ్ ఫారమ్, సపోర్టింగ్ డాక్యుమెంట్లతో పాటు సంబంధిత ఈపీఎఫ్ఓ కార్యాలయంలో సమర్పించాలి. -
రైళ్లలో ఫుడ్.. రైల్వే కీలక చర్యలు
దేశంలో అత్యధిక మంది ఉపయోగించే ప్రయాణ సాధనం రైలు. దేశవ్యాప్తంగా నిత్యం కొన్ని వేల రైళ్లు నడుస్తున్నాయి. లక్షల సంఖ్యలో ప్రయాణికులు వీటి ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. అయితే రైళ్లలో అత్యంత ప్రధాన సమస్య ఆహారం. రైళ్లలో లభించే ఆహారం నాణ్యత లేకపోవడం, ధరలు ఎక్కువగా ఉండటం వంటి వాటితో ప్రయాణికులు ఇబ్బందులు పడతుంటారు. ఈ సమస్యలు నివారించేందుకు రైల్వే శాఖ కీలక చర్యలకు ఉపక్రమించింది.పారదర్శకతను పెంపొందించడానికి, ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించిన ముఖ్యమైన చర్యలో భారతీయ రైల్వే అన్ని రైళ్లలో ఆహార ధరలతోపాటు మెనూలను ప్రదర్శించడాన్ని తప్పనిసరి చేసింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించిన ఈ చొరవ ప్రయాణికులకు అందుబాటులో ఉన్న ఆహార ఎంపికలు, వాటి ధరల గురించి స్పష్టమైన సమాచారాన్ని అందించేలా చేస్తుంది.రైల్వే శాఖ ముఖ్యమైన చర్యలు ఇవే..ప్రింటెడ్ మెనూ కార్డులు: ప్రయాణికులు ఇప్పుడు ఆన్ బోర్డ్ వెయిటింగ్ స్టాఫ్ నుండి ప్రింటెడ్ మెనూ కార్డులను కోరవచ్చు. ఈ కార్డులు అందుబాటులో ఉన్న ఆహార పదార్థాలను, వాటి ధరలను తెలియజేస్తాయి.డిజిటల్ యాక్సెస్: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఈ మెనూలను తన అధికారిక వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంచింది. ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు లేదా ప్రయాణ సమయంలో ఆహార ఎంపికలు, ధరలను సమీక్షించవచ్చు.ఎస్ఎంఎస్ అలర్ట్స్: పారదర్శకతను మరింత పెంచడానికి భారతీయ రైల్వే ఆహార మెనూ, టారిఫ్ వివరాలకు సంబంధించిన లింక్లను ప్రయాణికులకు ఎస్ఎంఎస్ అలర్ట్ల రూపంలో అందిస్తోంది.ప్యాంట్రీ కార్ డిస్ప్లేలు: రైళ్లలోని ప్యాంట్రీ కార్లలో రేట్ లిస్ట్ లు ప్రముఖంగా ప్రదర్శిస్తారు. ఇది ప్రయాణికులకు ధరలను సరిపోల్చుకోవడం సులభం చేస్తుంది.ఆధునిక బేస్ కిచెన్లు: ప్రామాణిక ఆహార తయారీ ప్రక్రియలను నిర్ధారించడానికి ఆధునిక సౌకర్యాలతో కూడిన నిర్దేశిత బేస్ కిచెన్లలో భోజనాన్ని తయారు చేస్తారు.సీసీటీవీ మానిటరింగ్: ఆహార తయారీని రియల్ టైమ్ మానిటరింగ్ చేయడానికి, భద్రతా ప్రోటోకాల్స్ పాటించేలా చూడటానికి బేస్ కిచెన్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు.బ్రాండెడ్ పదార్థాలు: స్థిరమైన ఆహార నాణ్యతను నిర్వహించడానికి వంట నూనె, పిండి, బియ్యం, పప్పుధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, పనీర్, పాల ఉత్పత్తులు వంటివాటికి సంబంధించి బ్రాండెడ్ ముడి పదార్థాలను ఉపయోగించడాన్ని రైల్వే తప్పనిసరి చేస్తుంది.ఫుడ్ సేఫ్టీ సూపర్ వైజర్లు: క్వాలిఫైడ్ ఫుడ్ సేఫ్టీ సూపర్ వైజర్లు బేస్ కిచెన్లలో ఫుడ్ సేఫ్టీ, పరిశుభ్రతా పద్ధతులను పర్యవేక్షిస్తారు.అదనపు చర్యలురవాణా సమయంలో ఆహార నాణ్యతలో ఉన్నత ప్రమాణాలను నిర్వహించడానికి, భారతీయ రైల్వే పలు వినూత్న చర్యలను ప్రవేశపెట్టింది.ఆహార ప్యాకెట్లపై క్యూఆర్ కోడ్స్: ఆహార ప్యాకెట్లలో ఇప్పుడు క్యూఆర్ కోడ్లు ఉంటాయి. ఇవి ఆహారం ఎక్కడ తయారైంది.. ప్యాకేజింగ్ తేదీ వంటి వివరాలను ప్రదర్శిస్తాయి.రెగ్యులర్ ఆడిట్లు, తనిఖీలు: ప్యాంట్రీ కార్లు, బేస్ కిచెన్ ల్లో పరిశుభ్రత, ఆహార నాణ్యతను మదింపు చేయడానికి రొటీన్ ఫుడ్ శాంప్లింగ్, థర్డ్ పార్టీ ఆడిట్ లు నిర్వహిస్తారు.ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికేషన్: అన్ని క్యాటరింగ్ యూనిట్లు నేషనల్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్కు కట్టుబడి ఉండేలా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నుంచి సర్టిఫికేషన్ పొందాల్సి ఉంటుంది. -
ట్రిపుల్ బెడ్ రూమ్ ఇళ్లే కావాలి!
ఇంటి డిజైన్ల విషయంలో టేస్ట్ ఎప్పటికప్పుడు మారుతున్నట్లే.. ఇంటీరియర్లోనూ ఎన్నో మార్పులు వస్తున్నాయి. గతంలో చిన్న ఇల్లు ఉండాలనే ఆశలతో ఉన్నవారు కరోనా తర్వాతి నుంచి విశాలంగా ఉండే ఇళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆలస్యమైనా సరే.. కాస్త స్పేస్ ఎక్కువ ఉన్న ఇళ్లనే కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. - సాక్షి, సిటీబ్యూరోనగరం మధ్యలో ఇరుకు ఇళ్లలో ఉండేకంటే శివారు ప్రాంతాలు, పచ్చదనం ఉండే ప్రాంతాలను ఇష్టపడుతున్నారు. అపార్ట్మెంట్లలో అయితే డబుల్, ట్రిపుల్ బెడ్ రూమ్ ఇళ్లను కొనుగోలు చేస్తున్నారని హౌసింగ్.కామ్ ఇండియన్ రెసిడెన్షియల్ ఇండెక్స్ ఫర్ ఆన్లైన్ సెర్చ్(ఐఆర్ఐఎస్) తెలిపింది. 15 శాతం వృద్ధిగతంలో ప్రాపర్టీ కొనాలంటే ధర, వసతులు ప్రధాన అంశాలుగా ఉండేవి. కరోనా తర్వాతి నుంచి వైద్య సదుపాయాలకు ఎంత దూరంలో ఉంది? భద్రత ఎంత? అనే అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వైద్య సదుపాయాలు, భద్రత, ఓపెన్ స్పేస్ ఎక్కువగా ఉన్న ప్రాజెక్ట్లకు డిమాండ్ పెరిగింది. త్రీ బీహెచ్కే, ఆపై పడక గదుల గృహాలలో అంతకు క్రితం ఏడాదితో పోలిస్తే 2024లో 15 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది పెద్ద సైజు ప్లాట్లలో 42 శాతం పెరుగుదల కనిపించింది. -
ఇండస్ఇండ్ బ్యాంక్ పరిస్థితి ఏంటి?
ప్రైవేటు రంగానికి చెందిన ఇండస్ఇండ్ బ్యాంక్లో బయటపడిన అవకతవకలు.. వాటి చుట్టూ అల్లుకున్న ఆందోళనల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) స్పందించింది. ప్రస్తుతం ఆ బ్యాంకు పరిస్థితి ఏంటి..? డిపాజిటర్లు, ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా..? అనే దానిపై ఆర్బీఐ తాజాగా స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.భయపడాల్సిన పని లేదుఇండస్ ఇండ్ బ్యాంక్ పరిస్థితి గురించి భయపడాల్సిన పని లేదంటూ ఆర్బీఐ డిపాజిటర్లు, ఇన్వెస్టర్లకు భరోసా ఇచ్చింది. స్పెక్యులేటివ్ రిపోర్టులపై స్పందించవద్దని సెంట్రల్ బ్యాంక్ కోరింది. బ్యాంక్ ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉందని ఆర్బీఐ తెలిపింది.ఇండస్ ఇండ్ బ్యాంక్ మంచి క్యాపిటలైజేషన్ కలిగి ఉందని, బ్యాంక్ ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉందని తెలిపింది. 2024 డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికానికి బ్యాంక్ ఆడిటర్ సమీక్షించిన ఆర్థిక ఫలితాల ప్రకారం.. బ్యాంక్ సౌకర్యవంతమైన క్యాపిటల్ అడెక్వసీ రేషియో 16.46 శాతం, ప్రొవిజన్ కవరేజ్ రేషియో 70.20 శాతంగా ఉంది. 2025 మార్చి 9 నాటికి బ్యాంక్ లిక్విడిటీ కవరేజ్ రేషియో (ఎల్సిఆర్) 113 శాతంగా ఉందని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.ఇండస్ ఇండ్ బ్యాంక్ తన ప్రస్తుత వ్యవస్థలను సమీక్షించడానికి, అకౌంటింగ్ తప్పిదం వాస్తవ ప్రభావాన్ని త్వరగా అంచనా వేయడానికి, లెక్కించడానికి ఇప్పటికే ఒక బాహ్య ఆడిట్ బృందాన్ని నియమించింది. వాటాదారులందరికీ అవసరమైన వివరాలను వెల్లడించిన తర్వాత ప్రస్తుత త్రైమాసికంలో అంటే 2025 ఆర్థిక సంవత్సరం క్యూ4 నాటికి నివారణ చర్యలను పూర్తి చేయాలని బ్యాంకు బోర్డు, యాజమాన్యాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది.రూ.2,100 కోట్ల అకౌంటింగ్ తప్పిదంఇండస్ఇండ్ బ్యాంక్ తన పోర్ట్ఫోలియోలోని ఆస్తులు, అప్పుల ఖాతాలకు సంబంధించిన ప్రక్రియల అంతర్గత సమీక్షలో కొన్ని "లోపాలు" కనిపించాయని మార్చి 2025 మార్చి 10న వెల్లడించింది. 2024 డిసెంబర్ నాటికి బ్యాంక్ నికర విలువలో ఈ లోపం ప్రతికూల ప్రభావం సుమారు 2.35% ఉంటుందని అంతర్గత సమీక్ష అంచనా వేసింది. పన్ను అనంతరం దాదాపు రూ.1,600 కోట్లు, పన్నుకు ముందు రూ.2,100 కోట్ల మేర ఆర్థిక భారం పడుతుందని అంచనా. -
PMSGMBY: పూచీకత్తు లేకుండా రూ.2 లక్షల లోన్
ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లి యోజన (PMSGMBY) కింద ఇప్పటికే 10 లక్షల ఇళ్లకు సౌర విద్యుత్ అందించింది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఈ సంఖ్యను 20 లక్షలకు పెంచాలనే కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. 2027 నాటికి మొత్తం కోటి ఇళ్లకు సోలార్ విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.2024 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన.. ఈ ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లి యోజన కింద 10 లక్షల ఇళ్లకు సోలార్ విద్యుత్ అందించడం జరిగిందని మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ 'ప్రహ్లాద్ జోషి' వెల్లడించారు.డాక్యుమెంట్స్ అవసరం లేకుండా రూ.2 లక్షల లోన్ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లి యోజన పథకం కింద.. ఇళ్లలో సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకోవడానికి 40 శాతం వరకు సబ్సిడీ అందిస్తారు. దీనికోసం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు 6.75 శాతం సబ్సిడీ వడ్డీ రేటుతో ఎలాంటి పూచీకత్తు అవసరం లేకుండా రూ. 2 లక్షల వరకు లోన్ అందిస్తాయి. ఇందులో రూ. 78,000 వరకు సబ్సిడీ లభిస్తుంది.ఏడాదికి 6.75 శాతం వడ్డీ రేటుతో.. రూ. 6 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. అయితే రూ. 2 లక్షల వరకు ఎలాంటి పూచీకత్తు అవసరం లేదు. సోలార్ ఏర్పాటు చేసుకోవడానికి అయ్యే మొత్తం ఖర్చులో 90 శాతం వరకు బ్యాంక్ ఫైనాన్సింగ్ సదుపాయం ఎంచుకోవచ్చు.ఎవరు అప్లై చేసుకోవచ్చు➤భారతీయ పౌరుడై ఉండాలి.➤సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకోవడానికి అనువైన పైకప్పు ఉన్న ఇంటిని కలిగి ఉండాలి.➤చెల్లుబాటు అయ్యే విద్యుత్ కనెక్షన్ ఉండాలి.➤ఇప్పటివరకు సౌర ఫలకాలను సంబంధించిన ఎలాంటి ఇతర సబ్సిడీలను పొంది ఉండకూడదు.ఇదీ చదవండి: కేంద్ర ప్రభుత్వ స్కీమ్.. వయోపరిమితి 60 ఏళ్లకు తగ్గింపు!ఎలా అప్లై చేసుకోవాలి?➤అధికారిక వెబ్సైట్ను ఓపెన్ చేసి, అక్కడే కనిపిస్తున్న కన్స్యూమర్ ట్యాబ్కి వెళ్లి, అందులో 'అప్లై నౌ' ఎంచుకోండి.➤లాగిన్ డ్రాప్డౌన్ మెనుని ఓపెన్ చేసి కూడా కన్స్యూమర్ లాగిన్ ఎంచుకోవచ్చు.➤మొబైల్ నెంబర్తో లాగిన్ అయి.. ద్రువీకరించండి. పేరు, రాష్ట్రం మరియు ఇతర వివరాలను అందించండి. ➤మీ ఈమెయిల్ ఐడీని ధ్రువీకరించిన తరువాత.. మీ ప్రొఫైల్ను సేవ్ చేయండి. ➤విక్రేత కోసం, మీ అవసరాన్ని బట్టి అవును లేదా కాదు సెలక్ట్ చేసుకోండి.➤'సోలార్ రూఫ్టాప్ కోసం అప్లై చేసుకోండి'పై క్లిక్ చేసి.. రాష్ట్రం, జిల్లా డిస్కామ్ వంటి ఇతర వివరాలను అందించండి.➤అన్ని పూర్తి చేసిన తరువాత విక్రేతను ఎంపిక చేసుకుని మీ బ్యాంక్ వివరాలను అందించండి.➤మీ సబ్సిడీ మంజూరైన తర్వాత సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేసుకోవచ్చు. -
ఇల్లు, ఆఫీసులే కాదు.. గోడౌన్లూ కష్టమే..!
గృహాలు, కార్యాలయ స్థలాలకే కాదు.. గిడ్డంగులకూ హైదరాబాద్ నగరంలో ఆదరణ పెరుగుతోంది. నగరంలో గతేడాది 35 లక్షల చ.అ. వేర్హౌస్ స్పేస్ల లావాదేవీలు జరిగాయి. మరో 1.64 కోట్ల చ.అ. స్థలాలకు డిమాండ్ ఉందని, ఇది 2024లో వార్షిక లావాదేవీలతో పోలిస్తే దాదాపు ఐదు రెట్లు అదనమని నైట్ఫ్రాంక్ ఇండియా నివేదిక వెల్లడించింది. గ్రేటర్లో శంషాబాద్, మేడ్చల్, పటాన్చెరు క్లస్టర్లు వేర్హౌస్లకు కేంద్ర బిందువులుగా ఉన్నాయి. గ్రేటర్లో గిడ్డంగుల అద్దె నెలకు చ.అ.కు రూ.20.7గా ఉంది. ఏడాది కాలంలో అద్దెలు ఒక శాతం మేర పెరిగాయి. అత్యధికంగా గ్రేడ్–ఏ వేర్హౌస్ అద్దెలు పటాన్చెరు పారిశ్రామిక క్లస్టర్లో రూ.24–28గా ఉంది. – సాక్షి, సిటీబ్యూరోగతేడాది లావాదేవీల్లో అత్యధికంగా 34 శాతం తయారీ రంగంలోనే జరిగాయి. పునరుత్పాదక, సస్టెయినబుల్ ఎనర్జీ, ఆటోమోటివ్, ఆటో అనుబంధ పరిశ్రమలు డిమాండ్కు చోదకశక్తిగా నిలిచాయి. మేకిన్ ఇండియా, ప్రొడెక్షన్ లింక్డ్ ఇన్వెంటివ్ (పీఎల్ఐ) వంటి ప్రభుత్వ పథకాలు, ప్రోత్సాహకాలతో తయారీ, లాజిస్టిక్ హబ్గా హైదరాబాద్ ఆకర్షణగా నిలిచాయి. ఆ తర్వాత 33 శాతం రిటైల్ విభాగంలో లావాదేవీలు జరిగాయి. ఈ–కామర్స్, ఎఫ్ఎంసీజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ విభాగాలు రిటైల్ డిమాండ్కు ప్రధాన కారణాలు.శంషాబాద్ హాట్ ఫేవరేట్.. గతేడాది గిడ్డంగుల లావాదేవీలు అత్యధికంగా శంషాబాద్ క్లస్టర్లో జరిగాయి. బెంగళూరు–హైదరాబాద్ హైవేకు అనుసంధానమై ఉండటం ఈ క్లస్టర్ అడ్వాంటేజ్. ఈ క్లస్టర్లో శంషాబాద్, శ్రీశైలం హైవే, బొంగ్లూరు, కొత్తూరు, షాద్నగర్ గిడ్డంగులకు ప్రధాన ప్రాంతాలు. విత్తన ప్రాసెసింగ్ యూనిట్, థర్డ్ పార్టీ లాజిస్టిక్ కంపెనీలు(3పీఎల్), ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ వంటి పారిశ్రామిక రంగం ఈ క్టస్లర్ డిమాండ్ను ప్రధాన కారణాలు. గతేడాది గ్రేటర్లో జరిగిన గిడ్డంగుల లావాదేవీల్లో ఈ క్లస్టర్ వాటా 47 శాతం. ఈ క్లస్టర్లో వేర్హౌస్ స్థలాలు ఎకరానికి రూ.4–6 కోట్ల మధ్య ఉండగా.. అద్దె చ.అ.కు రూ.18–25 ఉంది.మేడ్చల్, పటాన్చెరుల్లో.. మేడ్చల్, పటాన్చెరు క్లస్టర్లలోనూ వేర్హౌస్లకు డిమాండ్ ఉంది. మేడ్చల్ క్లస్టర్లో మేడ్చల్, దేవరయాంజాల్, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, శామీర్పేట ప్రాంతాలు హాట్ ఫేవరేట్గా ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో భూముల ధరలు ఎకరం రూ.3–5 కోట్లు ఉండగా.. అద్దెలు చ.అ.కు రూ.18–24 మధ్య ఉన్నాయి. పటాన్చెరు క్లస్టర్లో పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతం, రుద్రారం, పాశమైలారం, ఏదులనాగులపల్లి, సుల్తాన్పూర్ ప్రాంతాలు హాట్ ఫేవరేట్. ఇక్కడ స్థలాల ధరలు రూ.4–7 కోట్ల మధ్య పలుకుతుండగా అద్దె చ.అ.కు రూ.18–28 మధ్య ఉన్నాయి.డిమాండ్ ఎందుకంటే? వ్యూహాత్మక స్థానం, అద్భుతమైన కనెక్టివిటీ, పెరుగుతున్న పారిశ్రామిక కార్యకలాపాలు, లాజిస్టిక్స్కు హైదరాబాద్ కేంద్ర బిందువుగా అభివృద్ధి చెందింది. వీటికి తోడు మెరుగైన రోడ్లు, రైలు, విమాన నెట్వర్క్లతో సమర్థవంతమైన రవాణా వ్యవస్థ కలిగి ఉంది. దీంతో ఫార్మాసూటికల్స్, ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, పునరుత్పాదక ఇంధనం వంటి పరిశ్రమల ద్వారా నగరంలో గిడ్డంగులకు ఆదరణ పెరుగుతుంది. వీటికి తోడు స్థానిక ప్రభుత్వ విధానాలు, ప్రోత్సాహకాలు, మెరుగైన మౌలిక సదుపాయాలతో గిడ్డంగుల విభాగంలో డిమాండ్కు మరో కారణం. -
ఫ్లైట్ మిస్ అయితే రూ.7500 పరిహారం!: ఉబర్ కీలక ప్రకటన
క్యాబ్ అగ్రిగేటర్ దిగ్గజం 'ఉబర్' (Uber) ముంబైలోని.. తన కస్టమర్ల కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని కింద విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో ఆలస్యం కారణంగా విమానం మిస్ అయితే రూ.7,500 వరకు పరిహారం అందించనున్నట్లు వెల్లడించింది. ఈ కవరేజ్ ప్లాన్కు 'మిస్డ్ ఫ్లైట్ కనెక్షన్ కవర్' అని పేరు పెట్టారు. దీనితో పాటు, ఒకవేళా ప్రమాదం జరిగిన సందర్భాలలో ఔట్ పేషెంట్ (OPD) ఛార్జీలతో సహా వైద్య ఖర్చులను కూడా కంపెనీ కవర్ చేస్తుంది.2024 ఫిబ్రవరి చివరలో ఉబర్.. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్తో భాగస్వామ్యం కుదుర్చుకుని ఈ ప్లాన్ను ప్రారంభించారు. విమానాశ్రయానికి సకాలంలో చేరుకోవడం చాలా ముఖ్యం. అయితే నగరంలోని ట్రాఫిక్ కారణంగా కొన్ని సార్లు ఆలస్యం అవ్వొచ్చు. అలాంటప్పుడు ఈ పరిహారం వారికి కొంత ఉపశమనం అందిస్తుంది.ఇదీ చదవండి: భారత్కు ఆ రెండు టెస్లా కార్లు!.. సర్టిఫికేషన్ కోసం దరఖాస్తువిమానాశ్రయానికి రైడ్ బుక్ చేసుకుని, ఫ్లైట్ మిస్ అయితే మాత్రమే ఈ పరిహారం లభిస్తుంది. ఉబర్ ప్లాన్ కింద పరిహారం పొందాలంటే.. రైడ్ బుక్ చేసుకున్న వ్యక్తి సంతకం చేసిన క్లెయిమ్ ఫారమ్, మిస్ అయిన ఫ్లైట్ టికెట్ కాపీతో పాటు.. మళ్ళీ కొత్తగా బుక్ చేసుకున్న కొత్త విమానం టికెట్ వంటి అవసరమైన వివరాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉంటుంది. -
ఆకాశమంత ఎత్తులో అపార్ట్మెంట్స్.. హైదరాబాద్ టాప్!
ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్లలో ఎక్కువగా కనిపించే హైరైజ్ నిర్మాణాలు క్రమంగా హైదరాబాద్లోనూ జోరందుకుంటున్నాయి. అత్యంత ఎత్తులో నివాసం ఉండాలని కోరుకునే వాళ్ల సంఖ్య పెరగడం, భవనాల ఎత్తుకు నిబంధనలు లేకపోవడం వంటి కారణాలతో నగరంలో ఆకాశహర్మ్యాలు పెరుగుతున్నాయి. గతేడాది హైదరాబాద్లో 10, అంతకంటే ఎత్తయిన హైరైజ్ ప్రాజెక్ట్లు 57 ప్రారంభం కాగా.. బెంగళూరులో 51, చెన్నైలో 10 ప్రాజెక్ట్లు మొదలయ్యాయి. దక్షిణాది రాష్ట్రాలలోనే భాగ్యనగరం ప్రథమ స్థానంలో నిలిచిందని అనరాక్ రిపోర్ట్ తెలిపింది. హైదరాబాద్లో ఏటా సగటున 1,400 అపార్ట్మెంట్లు నిర్మాణం చేపడితే అందులో సగటున 200 వరకు ఐదు అంతస్తుల పైన ఉండే బహుళ అంతస్తుల నివాస సముదాయాలుంటాయి. ఇందులో నాలుగో వంతు 10 అంతకంటే ఎక్కువ అంతస్తులపైన ప్రాజెక్ట్లుంటాయి. – సాక్షి, సిటీబ్యూరో ఆధునిక హంగులతో ఆకాశహర్మ్యాలుహైరైజ్ ప్రాజెక్ట్లలో నివాసానికి కస్టమర్ల ఆసక్తి నగరంలో విలాసవంతమైన గృహాలకు ఆదరణముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్లలో భూమి లభ్యత తక్కువ కాబట్టి వర్టికల్ నిర్మాణాలు సహజమే. కానీ, హైదరాబాద్కు ఆ సమస్య లేదు. ఔటర్ చుట్టుపక్కల కొన్ని వేల ఎకరాలు అందుబాటులో ఉన్నాయి. అయినా ఆకాశహర్మ్యాలు పెరగడానికి కారణం సిటీలోనే ఉండాలని ఎక్కువ మంది కోరుకోవడమేనని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీంతో డెవలపర్లు కూడా స్కై స్క్రాపర్లను నిర్మించేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్లో ఐదేళ్లలో భూముల ధరలు బాగా పెరిగాయి. ప్రభుత్వమే వీటిని వేలం వేయడంతో ఈ ప్రభావం ధరల పెరుగుదలకు కారణమైందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.వెస్ట్లోనే ఎక్కువ..వెస్ట్ హైదరాబాద్లోని హైరైజ్ ప్రాజెక్ట్లలో నివసించేందుకు నివాసితులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఎస్ఏఎస్, బ్రిగేడ్, అపర్ణా, ప్రణీత్ గ్రూప్, పౌలోమీ, రాఘవ, మైహోమ్, వాసవి, ఐరా రియాల్టీ, హానర్ వంటి సంస్థలు నగరం నలువైపులా హైరైజ్ ప్రాజెక్ట్లను చేపడుతున్నాయి.కోకాపేట వంటి ప్రాంతాల్లో ఎకరా ధర రూ.50 కోట్లకు చేరింది. మరోవైపు అపరిమిత ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్(ఎఫ్ఎస్ఐ)తో ఎన్ని అంతస్తులైనా నిర్మించుకునే వెసులుబాటు ఏర్పడింది. దీంతో ఎకరా రూ.10 కోట్లు ఉన్న చోట పది అంతస్తులు, రూ.20 కోట్లుంటే 20 ఫ్లోర్లు.. ఇలా పెంచుకుంటూ పోతున్నారు. కోకాపేట, రాయదుర్గం, శేరిలింగంపల్లి, మణికొండ, నార్సింగి, గచ్చిబౌలి, గోపన్పల్లి, మదీనాగూడ, మియాపూర్, తెల్లాపూర్, పుప్పాల్గూడ వంటి పశ్చిమ హైదరాబాద్లోనే ఎక్కువగా హైరైజ్ ప్రాజెక్ట్లు వస్తున్నాయి.ఇలా నియంత్రించాలి..➤ప్రస్తుతం పశ్చిమ హైదరాబాద్లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్లు పూర్తయితే అక్కడ జనసాంద్రత, వాహనాల రద్దీ తట్టుకోలేం. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని అక్కడ మౌలిక వసతులను కల్పించాలి. వ్యయాలలో ఆయా ప్రాంతాల్లోని నిర్మాణ సంస్థలనూ ఇందులో భాగస్వామ్యం చేయాలి.➤ప్రాజెక్ట్ మొత్తం స్థలంలో 20 శాతంలోపు మాత్రమే నిర్మాణానికి అనుమతి ఇవ్వాలి. మిగిలిన స్థలాన్ని గ్రీనరీకి, మౌలిక వసతుల కల్పనకు వినియోగించాలి.➤సాధారణ భవన నిర్మాణలతో పోలిస్తే హైరైజ్ భవనాల అనుమతుల జారీలో ప్రత్యేక శ్రద్ధ, నిరంతర తనిఖీ, పర్యవేక్షణ అవసరం. పర్మిషన్ ఫీజులు వస్తున్నాయి కదా అని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా.. భవిష్యత్తులో జరిగే ప్రమాద నష్టాలను ఊహించలేం.➤ప్రతి అంతస్తును ప్రత్యక్షంగా పర్యవేక్షించాలి. పార్కింగ్, డ్రైనేజీ, అగ్ని ప్రమాద నివారణ ఏర్పాట్లు వంటి ఇతరత్రా అంశాలను తనిఖీ చేయాలి.➤హైరైజ్ భవనాలు భూకంపాలు, వరదల వంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా నిర్మాణంలో నాణ్యతను పరిశీలించాలి.➤ఇతర మెట్రో నగరాలలో అందుబాటులో ఉన్నంత స్థాయిలో హైదరాబాద్లో మెయింటనెన్స్, సపోర్టింగ్ సర్వీస్లు అందించే కన్సల్టెన్సీలు అందుబాటులో లేవు. అందుకే కనీసం ఐదేళ్ల పాటు హైరైజ్ భవనాల నిర్వహణ నిర్మాణ సంస్థలే సామాజిక బాధ్యతలా చేపట్టేలా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మెయింటనెన్స్లలో బిల్డర్లకు ఉన్నంత అనుభవం నివాసిత సంఘాలకు ఉండవు.హోదా, అద్దె ఆదాయం కోసం..హైరైజ్ అపార్ట్మెంట్లలో నివాసం ఉండటాన్ని కొనుగోలుదారులు సమాజంలో హోదాగా భావిస్తున్నారు. మెరుగైన రాబడి, అద్దెలు వస్తాయని మంచి పెట్టుబడి సాధనంగా చూస్తున్నారు. ఆయా ప్రాంతాలు ఇప్పటికే అభివృద్ధి చెంది ఉండటం, మెరుగైన రవాణా సదుపాయాలు, దగ్గర్లో విద్యా, వైద్య సదుపాయాలు ఉండటం అన్నింటికీ మించి సకల సౌకర్యాలతో గేటెడ్ కమ్యూనిటీగా తీర్చిదిద్దుతుండటంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఆకాశమంత ఎత్తులో అపార్ట్మెంట్ ఉంటుంది కాబట్టి వాహనాల ధ్వని, వాయు కాలుష్య సమస్యలూ ఉండవు. ఏకాంతం కోరుకునేవారికి అనువైన గృహాలివే. పైగా ఇంట్లోకి ధారాళమైన గాలి, వెలుతురు, సూర్యరశ్మి వస్తాయి. -
మెటా ఏఐ గ్లాసెస్.. ప్రత్యేకతలివే..
సోషల్ మీడియా దిగ్గజం మెటా తమ నెక్ట్స్–జెనరేషన్ గ్లాసెస్ అరియ జెన్ 2 గురించి ప్రకటించింది. ‘అరియ జెన్2 గ్లాసెస్కు సంబంధించి మా ప్రయాణంలో తదుపరి దశ గురించి ప్రకటించడానికి సంతోషిస్తున్నాం. మెషిన్ పర్సెప్షన్, కంటెక్ట్స్వల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్తో సహా పరిశోధన రంగాలలో కొత్త అవకాశాలకు ద్వారాలు తెరుస్తుంది’ అని మెటా తన బ్లాగ్ పోస్ట్లో పేర్కొంది.మెటా అరియా జెన్ 2 స్మార్ట్ గ్లాసెస్ ప్రధానంగా పరిశోధకులు, డెవలపర్ల కోసం రూపొందించిన అత్యాధునిక ఆవిష్కరణ అని కంపెనీ పేర్కొంది. అధునాత వియరబుల్ టెక్నాలజీ(ధరించేందుకు వీలుగా ఉన్న వస్తువుల్లో వాడే టెక్నాలజీ) ఫీచర్లతో ఈ అద్దాలు మార్కెట్లోకి వస్తున్నట్లు స్పష్టం చేసింది.కీలక ఫీచర్లు ఇవే..అధునాతన సెన్సర్లు: హార్ట్ రేట్ మానిటర్, స్పేషియల్ మైక్రోఫోన్లతో పాటు ఐ-ట్రాకింగ్, హ్యాండ్ ట్రాకింగ్, మోషన్ సెన్సార్లను కలిగి ఉంటుంది.కృత్రిమమేధ: ఇంటర్నెట్ కనెక్టివిటీపై ఆధారపడకుండా స్పీచ్ రికగ్నిషన్, ఆబ్జెక్ట్ డిటెక్షన్ వంటి వేగవంతమైన, సమర్థవంతమైన కార్యాచరణలను ప్రాసెస్ చేసి వినియోగదారులకు డేటాను అందిస్తుంది.బ్యాటరీ లైఫ్: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 6-8 గంటల ఉపయోగించవచ్చని కంపెనీ పేర్కొంది. ఇది పరిశోధన కార్యకలాపాలకు అనుకూలంగా ఉంటుంది.తేలికపాటి డిజైన్: ఈ గ్లాసెస్ బరువు కేవలం 75 గ్రాములేనని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: మార్చి 17 వరకు ఇంటర్నెట్ సేవలు బంద్ఈ గ్లాస్ల వినియోగానికి సంబంధించి మెటా తెలిపిన వివరాల ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ పరిశోధనలో వీటిని ఉపయోగించవచ్చు. దృష్టి లోపం ఉన్న వ్యక్తులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. రియల్టైమ్లో వస్తువులను, మన ముందుతున్న పరిస్థితులను ట్రాక్ చేసి డేటాను అందిస్తుంది. -
ప్రపంచంలోనే మొట్టమొదటి ఫోల్డబుల్ సైకిల్!: వీడియో
సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక ఆసక్తికరమైన విషయాన్ని షేర్ చేసే భారతీయ వ్యాపార దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) తాజాగా.. ఓ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ సైకిల్ షేర్ చేశారు. దీని గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియాలో ఒక వ్యక్తి.. ప్రపంచంలోనే మొట్టమొదటి డైమండ్ ఫ్రేమ్ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ సైకిల్ వినియోగించడం చూడవచ్చు. అతని అవసరం తీరిపోయిన తరువాత దానిని ఫోల్డ్ చేసి లోపలికి తీసుకెళ్లడంతో వీడియో ముగుస్తుంది. కేవలం 34 నిమిషాల నిడివి కలిగిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.వీడియోలో కనిపించే ఫోల్డబుల్ సైకిల్.. పేరు హార్న్బ్యాక్. ఆనంద్ మహీంద్రా కూడా ఇలాంటి సైకిల్ ఉపయోగించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిని ఐఐటీ బాంబే స్టూడెంట్స్ తయారు చేశారు. ఈ స్టార్టప్లో కూడా తాను పెట్టుబడి పెట్టినట్లు ఆనంద్ మహీంద్రా వెల్లడించారు.ఇలాంటి ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ సైకిల్ కోసం ఇంట్లో ఎక్కువ స్పేస్ కూడా అవసరం లేదు. రోజువారీ వినియోగానికి, తక్కువ దూరాలకు ప్రయాణించడానికి ఈ సైకిల్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనికయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. The Hornback. The world’s first diamond frame electric foldable bike. Designed & developed in India. Now, even easier to fold….Because innovation never ceases(Disclosure: My Family Office has invested in the company) pic.twitter.com/ntoRd3ljwb— anand mahindra (@anandmahindra) March 15, 2025 -
మార్చి 17 వరకు ఇంటర్నెట్ సేవలు బంద్
వదంతులు, చట్టవ్యతిరేక కార్యకలాపాల వ్యాప్తిని నిరోధించడానికి పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలోని సైంథియా పట్టణంలోని ఐదు గ్రామ పంచాయతీ ప్రాంతాల్లో ఇంటర్నెట్, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ టెలిఫోనిక్ సేవలను నిలిపేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మార్చి 14 (శుక్రవారం) నుంచి మార్చి 17 (సోమవారం) వరకు ఈ ప్రాంతాల్లో నిబంధనలు అమల్లో ఉంటాయని చెప్పారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ హోం, హిల్ అఫైర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ మార్చి 14న ఈమేరకు ప్రకటన జారీ చేశారు. అసలు ప్రభుత్వాలు ఎలాంటి పరిస్థితుల్లో ఇంటర్నెట్ సేవలపై నిషేధాజ్ఞలు విధించే వీలుందో తెలుసుకుందాం.దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దిష్ట పరిస్థితుల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపేసే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ప్రజా భద్రత, జాతీయ భద్రతకు విఘాతం కలుగుతుందని భావిస్తే ఈ చర్యలకు పాల్పడే అవకాశం ఉంది. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 కిందకు వచ్చే టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ టెలికాం సర్వీసెస్ (పబ్లిక్ ఎమర్జెన్సీ లేదా పబ్లిక్ సేఫ్టీ) రూల్స్, 2017 ప్రకారం టెలికాం సేవలు, ఇంటర్నెట్ సేవలను నిలిపేసే అధికారం ప్రభుత్వాలకు ఉంది.ఏయే సందర్భాల్లో నిలిపేస్తారంటే..పబ్లిక్ ఎమర్జెన్సీలో భాగంగా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి, శాంతిభద్రతలను కాపాడటానికి, అల్లర్లు, నిరసనలు లేదా మత హింస వంటి పరిస్థితుల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయవచ్చు.ఉగ్రవాద కార్యకలాపాలు లేదా సైబర్ దాడులు వంటి జాతీయ భద్రతకు ముప్పు ఉందనే సందర్భాల్లో, సున్నితమైన సమాచారాన్ని రక్షించడానికి, శత్రు సంస్థల మధ్య సమన్వయాన్ని నివారించడానికి ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను కట్టడి చేయవచ్చు.హింస లేదా అశాంతిని ప్రేరేపించే నకిలీ వార్తలు, పుకార్లు లేదా రెచ్చగొట్టే కంటెంట్ వ్యాప్తిని అరికట్టడానికి కొన్నిసార్లు ఇంటర్నెట్ను నిలిపేసే అవకాశం ఉంటుంది.న్యాయ సమీక్షకు లోబడి ఉండాల్సిందే..అనురాధ భాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వాలు తమ ఇష్టారీతిన ఇంటర్నెట్ను నిలిపేయలేవు. దీనికి సంబంధించి ప్రభుత్వ చర్యలు న్యాయ సమీక్షకు లోబడి ఉండాలి. ఇదిలాఉండగా, ఇలాంటి చర్యలు టెలికాం కంపెనీల రెవెన్యూను ప్రభావితం చేస్తాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అందుకు అనుగుణంగా ఇతర ప్రాంతాల వినియోగదారుల నుంచి ఆదాయ మార్గాలను ఎలా పెంపొందించుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరాన్ని ఈ చర్యలు హైలైట్ చేస్తున్నాయని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: గృహాల ధరలకు బ్రేక్..!అసలు గొడవేంటి..పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలోని సైంథియా పట్టణంలో హోలీ వేడుకల సందర్భంగా హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రెండు స్థానిక వర్గాల మధ్య జరిగిన వాగ్వాదం రాళ్లు రువ్వడం, భౌతిక దాడులకు దారితీయడంతో పలువురికి గాయాలయ్యాయి. -
పెరిగిన ఇళ్ల విక్రయాలు.. ఆ తొమ్మిది నగరాల్లో అధికం
సాక్షి, సిటీబ్యూరో: గతేడాది నగరంలో రూ.1.05 లక్షల కోట్ల విలువ చేసే గృహాలు అమ్ముడుపోయాయి. అంతకు క్రితం ఏడాదిలో రూ.1.28 లక్షల కోట్ల విలువైన ఇళ్లతో పోలిస్తే ఇది 18 శాతం తక్కువ. 2024లో దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో విక్రయించిన యూనిట్ల విలువల్లో గ్రేటర్ వాటా 21 శాతంగా ఉందని ప్రాప్ ఈక్విటీ నివేదిక వెల్లడించింది. గతేడాది టాప్–9 నగరాల్లో రూ.6.73 లక్షల కోట్ల విలువ చేసే గృహాలు అమ్ముడుపోయాయి.దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో గృహ విక్రయాల విలువలు 12 శాతం మేర పెరిగింది. గతేడాది దేశంలోని 9 ప్రధాన నగరాల్లో 6.73 లక్షల కోట్ల విలువైన గృహాలు అమ్ముడుపోయాయి. అత్యధికంగా ఢిల్లీ ఎన్సీఆర్లో 63 శాతం, ముంబైలో 13 శాతం విక్రయాల విలువ పెరగగా.. హైదరాబాద్లో 18 శాతం క్షీణించాయి. గతేడాది నగరంలో గృహాల సçప్లయి 25 శాతం, డిమాండ్ 49 శాతం తగ్గాయి. ఫలితంగా అమ్ముడుపోకుండా ఉన్న గృహాలు(ఇన్వెంటరీ) 2023లో 17 నెలలుగా ఉండగా.. 2024 నాటికి 20 నెలలకు పెరిగింది.ఏడాదిలో రివర్స్..2023లో ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, గుర్గావ్ల కంటే హైదరాబాద్లోనే ఎక్కువ విలువైన గృహాలు అమ్ముడుపోయాయి. ఆ సంవత్సరం నగరంలో రూ.1.28 లక్షల కోట్ల విలువ చేసే ఇళ్లు అమ్ముడుపోగా ముంబైలో రూ.1.22 లక్షల కోట్లు, ఢిల్లీ–ఎన్సీఆర్ లో.. రూ.94,143 కోట్లు, గుర్గావ్లో రూ.64,314 కోట్ల విలువైన ఇళ్లు సేల్ అయ్యాయి. కానీ, గతేడాదికి నాటికి ఈ మూడు నగరాల్లో హైదరాబాద్ కంటే ఎక్కువ విలువైన ఇళ్లు అమ్ముడుపోయాయి. ఢిల్లీ–ఎన్సీర్లో రూ.1.53 లక్షల కోట్లు, గుర్గావ్లో రూ.1.06 లక్షల కోట్లు, ముంబైలో రూ.1.38 లక్షల కోట్లు విలువ చేసే యూనిట్లు అమ్ముడు పోయాయి. -
భారత్కు ఆ రెండు టెస్లా కార్లు!.. సర్టిఫికేషన్ కోసం దరఖాస్తు
టెస్లా భారతదేశంలో తన కార్ల విక్రయాలను ప్రారభించడానికి సిద్ధమైంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని సన్నాహాలు చేస్తున్న సంస్థ.. తాజాగా భారతదేశంలో రెండు ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల కోసం.. సర్టిఫికేషన్ & హోమోలోగేషన్ ప్రక్రియను ప్రారంభించింది.దేశంలో కార్లను విక్రయించే ముందు సర్టిఫికేషన్ & హోమోలోగేషన్ ప్రక్రియ తప్పనిసరి. కాబట్టి టెస్లా ఇండియా మోటార్ & ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ భారతదేశంలో 'మోడల్ వై, మోడల్ 3' కార్ల హోమోలోగేషన్ కోసం రెండు దరఖాస్తులను సమర్పించింది.హోమోలోగేషన్ అనేది.. ఒక వాహనం రహదారికి యోగ్యమైనదని, భారతదేశంలో తయారు చేసిన లేదా దేశంలోకి దిగుమతి చేసుకున్న అన్ని వాహనాలకు నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా ఉందని ధృవీకరించే ప్రక్రియ. కేంద్ర మోటారు వాహన నియమాలకు అనుగుణంగా ఉద్గారం, భద్రత, రహదారి యోగ్యత పరంగా వాహనం భారత మార్కెట్ అవసరాలకు సరిపోతుందని సంబంధిత శాఖ నిర్దారించాలి.ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద కార్ల మార్కెట్ అయిన భారతదేశంలో.. అమెరికన్ కంపెనీ టెస్లా అడుగుపెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంది. దీనికి సంబంధించిన ద్వైపాక్షిక ఒప్పందాలు కూడా పూర్తయ్యాయి. కాబట్టి త్వరలోనే టెస్లా కార్లు ఇండియన్ మార్కెట్లో అమ్మకానికి రానున్నాయి. అయితే టెస్లా తయారీ ప్లాంట్ ఇండియాలో ప్రారంభిస్తారా?.. లేదా? అనేదానికి సంబంధించిన వివరాలు ప్రస్తుతానికి అందుబాటులో లేదు.టెస్లా ధరలు ఎలా ఉంటాయంటే?ప్రస్తుతం అమెరికాలో టెస్లా చౌకైన కారు.. 'మోడల్ 3' ధర ఫ్యాక్టరీ స్థాయిలో దాదాపు 35,000 డాలర్లు (సుమారు రూ. 30.4 లక్షలు). భారతదేశంలో దిగుమతి సుంకాలను 15-20 శాతానికి తగ్గించడంతో పాటు, రోడ్ ట్యాక్స్ & ఇన్సూరెన్స్ వంటి అదనపు ఖర్చులతో, ఆన్-రోడ్ ధర 40,000 డాలర్లు లేదా దాదాపు రూ. 35-40 లక్షలుగా ఉంటుంది. టెస్లా మోడల్ వై ధరలు రూ. 70 లక్షల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.ఇదీ చదవండి: కేంద్ర ప్రభుత్వ స్కీమ్: వయోపరిమితి 60 ఏళ్లకు తగ్గింపు!భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు 2023లో 82,688 యూనిట్ల నుంచి 2024లో 20 శాతం పెరిగి 99,165 యూనిట్లకు చేరుకున్నాయి. టాటా మోటార్స్.. జేఎస్డబ్ల్యు ఎంజీ మోటార్స్ కంపెనీలు ప్రస్తుతం మార్కెట్ లీడర్లుగా ఉన్నాయి.లగ్జరీ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ కూడా ఈ సంవత్సరంలో అమ్మకాలలో పెరుగుదలను నమోదు చేసింది. 2024లో బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ ఇండియా, వోల్వో కార్స్ ఇండియా, ఆడి, పోర్స్చే కంపెనీలు 2,809 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించాయి. 2023లో ఈ అమ్మకాలు 2,633 యూనిట్లుగా ఉన్నాయి. మాత్రమే. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) ప్రకారం.. భారతదేశంలో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్ రిటైల్ అమ్మకాలు దాదాపు 20 శాతం పెరిగాయి. -
గృహాల ధరలకు బ్రేక్..!
ఐదేళ్లుగా సామాన్య, మధ్యతరగతి కొనలేని స్థితికి చేరిన గృహాల ధరలకు ఈ ఏడాది కాస్త బ్రేక్ పడనుంది. ఇది తుది గృహ కొనుగోలుదారులకు ఎంతో మేలు చేకూర్చే విషయం. సామాన్యులు సొంతింటి కలను సాకారం చేసుకునే సమయమిదే.. ఇన్నాళ్లూ పెట్టుబడిదారుల మార్కెట్గా ఎదిగిన నగర రియల్టీ క్రమంగా తుది గృహ కొనుగోలుదారుల చేతికి అందిందని ప్రణీత్ గ్రూప్ డైరెక్టర్ నరేంద్ర కుమార్ కామరాజు అన్నారు. – సాక్షి, సిటీబ్యూరో రియల్ ఎస్టేట్లో రెండు విభాగాల కస్టమర్లు ఉంటారు. సొంతంగా తాము ఉండేందుకు ఇంటిని కొనుగోలు చేసే తుది గృహ కొనుగోలుదారులు, లాభాలను ఆశించి ప్రాపర్టీలను కొనుగోలు చేసే పెట్టుబడిదారులు. స్థిరాస్తి పరిశ్రమ స్థిరంగా అభివృద్ధి చెందాలంటే ఎండ్ కస్టమర్లే అవసరం. ఇన్వెస్టర్లతో మార్కెట్లో తాత్కాలిక బూమ్ వస్తుందే తప్ప స్థిరమైన వృద్ధి జరగదు. లాభాలు, ఆదాయం కోసం పాకులాడే ఇన్వెస్టర్లతో రాత్రికి రాత్రే ధరలు పెరుగుతాయి. వచ్చే 6–12 నెలల్లో నిర్మాణం పూర్తికానున్న ప్రాజెక్ట్ల్లో ధరలు స్థిరపడ్డాయి. ప్రత్యేకించి సెమీ లగ్జరీ విభాగంలో అపార్ట్మెంట్ల ధరలు చదరపు అడుగుకు రూ.8–10 వేలుగా ఉన్నాయి. జీఎస్టీ మినహాయింపు, అద్దె ఒప్పందాలు, ముందస్తు బుకింగ్లపై రాయితీలు వంటి వాటితో డెవలపర్లూ అదనపు ఆఫర్లను అందిస్తున్నారు.ఇన్వెస్టర్లు గాయబ్..సాధారణంగా హైదరాబాద్ ప్రాపర్టీ విక్రయాల్లో 5–20 శాతం వరకు పెట్టుబడిదారుల వాటా ఉంటుంది. కానీ, కరోనా తర్వాత వీరి వాటా 30 శాతానికి మించిపోయింది. నగదు ప్రవాహం పెరగడంతో మార్కెట్లో ఒక్కసారిగా రియల్ బూమ్ నెలకొంది. అప్పటి వరకు పశ్చిమ హైదరాబాద్లో రూ.1.5 కోట్ల ధరలు ఉండే అపార్ట్మెంట్లు.. క్రమంగా రూ.2.5–3.5 కోట్లకు పెరిగాయి. ఇదే సమయంలో ఫ్లాట్ల విస్తీర్ణాలూ పెరిగాయి. డిమాండ్కు మించి 2 వేల చ.అ.ల కంటే ఎక్కువ విస్తీర్ణమైన అపార్ట్మెంట్ల సరఫరా పెరిగింది. ఏడాదిన్నర కాలంగా మార్కెట్ ప్రతికూలంలో ఉండటంతో చాలా వరకు రిటైల్ ఇన్వెస్టర్లు మార్కెట్ నుంచి వెళ్లిపోయారు. దీంతో ఖరీదైన ఇళ్లకు డిమాండ్ తగ్గడంతో ధరలు స్థిరపడ్డాయి. విక్రయాలు లేకపోవడం, నగదు ప్రవాహం తగ్గడం, వడ్డీలు, నిర్వహణ భారం తదితర కారణాలతో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్లలో డెవలపర్లు ధరలు తగ్గించి విక్రయించక తప్పని పరిస్థితి నెలకొంది.నలువైపులా వృద్ధిపై ఫోకస్..ఐదేళ్లలో హైదరాబాద్లో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. ఏ నగరమైనా నలువైపులా సమాంతరంగా అభివృద్ధి చెందాలి. దురదృష్టవశాత్తు అది జరగలేదు. గత ప్రభుత్వం కేవలం పశ్చిమంవైపే దృష్టి పెట్టింది. దీంతో మౌలిక వసతులు, అభివృద్ధి అంతా వెస్ట్లోనే కేంద్రీకృతమైపోయింది. దీని ప్రభావం నగరం మూడు దిశల్లో పడే స్థాయికి పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. కనీసం తాజా ప్రభుత్వమైనా నగరం నలువైపులా అభివృద్ధికి ప్రణాళికలు చేపట్టాలి. ప్రస్తుతం ప్రభుత్వం కేవలం దక్షిణ హైదరాబాద్ మీదనే దృష్టిసారించింది. ఇతర జోన్లలో మార్కెట్ కుంటుపడకుండా ఉండాలంటే ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు ఉండాలి. ఎలివేటెడ్ కారిడార్లు, ఔటర్లో రేడియల్ రోడ్లు, ఐటీ, ఇండ్రస్టియల్ పార్క్ల వంటి అభివృద్ధి పనులను చేపట్టాలి. ఇదీ చదవండి: ఇంటి అద్దెలు పెరుగుతాయ్..?రాయితీలతో కల సాకారం..ఐదేళ్లలో మార్కెట్లోకి విపరీతంగా సప్లయి వచ్చింది. దీనికి తగినట్లుగా డిమాండ్ డెవలప్ కాలేదు. సప్లయి తగినట్లు డిమాండ్ ఉండాలంటే ప్రభుత్వం నుంచి సానుకూల విధానాలు, ప్రోత్సాహం, కార్యాచరణ ఉండాలి. గృహ కొనుగోలుదారులను ప్రోత్సహించాలి. ఆదాయ పన్ను మినహాయింపులు, జీఎస్టీని 5 శాతం నుంచి 1 శాతానికి తగ్గించడంతో పాటు స్టాంప్ డ్యూటీలో 1 శాతం రాయితీ అందించాలి. దీంతో ఎక్కువ మంది గృహ కొనుగోలుదారులు ముందుకు వస్తారు. సొంతింటి కలను సాకారం చేసుకుంటారు.- నరేంద్ర కుమార్ కామరాజు, డైరెక్టర్, ప్రణీత్ గ్రూప్ -
కేంద్ర ప్రభుత్వ స్కీమ్: వయోపరిమితి 60 ఏళ్లకు తగ్గింపు!
భారత ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నెన్నో పథకాలను (స్కీమ్స్) అందిస్తోంది. ఇందులో సీనియర్ సిటిజన్ల ఆరోగ్యానికి సంబంధించిన స్కీమ్ 'ఆయుష్మాన్ భారత్' (Ayushman Bharat) కూడా ఉంది. దీని కవరేజికి మరింత విస్తరించడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.ఆయుష్మాన్ భారత్ పథకం కింద కవరేజీని విస్తృతం చేయడానికి, ఆయుష్మాన్ వే వందన కార్డు (Ayushman Vay Vandana Card) అర్హత వయస్సును 70 నుంచి 60 సంవత్సరాలకు తగ్గించాలని, ప్రతి కుటుంబానికి ఏటా అందించే ఆరోగ్య సంరక్షణ కవరేజీని పెంచాలని పార్లమెంటరీ కమిటీ సూచించింది. ఇది అమలులోకి వస్తే.. మరో 4.5 కోట్ల కుటుంబాలు ప్రయోజనం పొందుతాయి.ప్రస్తుతం భారతదేశంలో 40 శాతం కంటే ఎక్కువ మంది ప్రజలు ఆయుష్మాన్ భారత్ కింద్ ఆరోగ్య సౌకర్యాలను పొందుతున్నారు. కాగా ఇప్పుడు నిర్ణీత వయసును 70 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తే.. ఇది మరింత మంది వృద్దులకు ఉపయోగకరంగా ఉంటుందని.. పార్లమెంటరీ కమిటీ యోచిస్తోంది.ఇదీ చదవండి: డీఏ పెంపు ప్రకటన త్వరలో..: ఈ సారి ఎంతంటే?ఆయుష్మాన్ భారత్ ప్రయోజనాలను మరింత మందికి అందించడానికి వయసును తగ్గించడం మాత్రమే కాకుండా.. కవరేజికి కూడా పెంచాలని భావిస్తున్నారు. ఇదే జరిగితే ప్రస్తుతం రూ.5 లక్షలు ఉన్న కవరేజీ రూ.10 లక్షలకు చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ఆయుష్మాన్ భారత్-ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY)లోని అంతరాలను కూడా పార్లమెంటరీ కమిటీ తన నివేదిక హైలైట్ చేసింది. -
జీసీసీలు అంటే ఏమిటి? అవి ఎందుకు?
టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో జీసీసీల ఏర్పాటు అధికమవుతోంది. అసలు ఈ జీసీసీలు ఏమిటనే అనుమానం కొంతమందిలో ఉంది. జీసీసీలు ఏమిటి.. ఎందుకోసం వీటిని ఏర్పాటు చేస్తున్నారో తెలుసుకుందాం. గ్లోబల్ ఇన్-హౌస్ సెంటర్లుగా పిలువబడే ఈ గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు (జీసీసీలు) బహుళజాతి సంస్థలు ఇతర దేశాల్లో స్థాపించే ప్రత్యేక వ్యాపార యూనిట్లు. ఈ కేంద్రాలు గ్లోబల్ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడానికి, సృజనాత్మకతను ప్రోత్సహించడానికి, కంపెనీకి విలువను జోడించడానికి స్థానిక ప్రతిభను, నైపుణ్యాలను, మౌలిక సదుపాయాలను ఉపయోగిస్తాయి. జీసీసీలు ఏర్పడకముందు కూడా ఇలాంటి విధానం అమల్లో ఉండేది. గతంలో ఔట్ సోర్సింగ్ కోసం బ్యాక్ ఆఫీసులను ఏర్పాటు చేసి వివిధ పరిశ్రమల్లో ఇన్నోవేషన్ హబ్లు, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)లుగా కార్యకాలాపాలు సాగించేవి. క్రమంగా అవి జీసీసీలుగా మారాయి.ఎందుకోసం అంటే..సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్లో జీసీసీలు కీలక పాత్ర పోషిస్తాయి. రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ (ఆర్ అండ్ డీ) విభాగంలో హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, ఇంజినీరింగ్ వంటి రంగాల్లో ఆవిష్కరణలకు దోహదం చేస్తాయి. ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్సెస్, సప్లై చైన్ మేనేజ్మెంట్ వంటి కీలకమైన బిజినెస్ విధులను నిర్వహిస్తాయి. గ్లోబల్ క్లయింట్లకు అధిక క్వాలిటీ కస్టమర్ సర్వీస్, టెక్నికల్ సపోర్ట్ను అందిస్తాయి. కొన్ని జీసీసీలు వ్యర్థాల నిర్వహణ, పునరుత్పాదక ఇంధన పరిష్కారాలతో సహా స్థిర ఇంధన పద్ధతులపై దృష్టి పెడుతున్నాయి.ఈ నగరాలు ముందంజలో..నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, సహాయక విధానాలు, స్థానిక ప్రభుత్వాల ప్రోత్సాహకాలు, అధునాతన మౌలిక సదుపాయాల కారణంగా బెంగళూరు, హైదరాబాద్, పుణె వంటి నగరాలు ముందంజలో ఉండటంతో జీసీసీలకు గ్లోబల్ హబ్గా మారుతున్నాయి. వివిధ విభాగాల్లో సృజనాత్మకతను జోడించడంలో, ప్రపంచ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడంలో జీసీసీల సాంకేతిక అభివృద్ధి పాత్ర కీలకంగా మారుతుంది.సాప్ట్వేర్ డెవలప్మెంట్వివిధ పరిశ్రమల కోసం ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్లు, అప్లికేషన్స్ అభివృద్ధి చేయడంలో జీసీసీలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ కేంద్రాలు తరచుగా నిర్దిష్ట వ్యాపార అవసరాలకు అనుగుణంగా పరిష్కారాలను సృష్టించడంలో తోడ్పడుతాయి.ఏఐ, మెషిన్ లెర్నింగ్ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎంఎల్ ఆవిష్కరణల్లో జీసీసీలు ముందంజలో ఉన్నాయి. ప్రిడిక్టివ్ అనలిటిక్స్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఇమేజ్ రికగ్నిషన్, అటానమస్ సిస్టమ్స్ వంటి విభాగాల్లో వ్యాపార సవాళ్లను పరిష్కరించడానికి అల్గారిథమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరిష్కారాలను రూపొందిస్తారు. ఉదాహరణకు, జీసీసీలు సంభాషణాత్మక ఏఐ టూల్స్, కస్టమర్ సర్వీస్ చాట్ బాట్లను అభివృద్ధి చేస్తున్నాయి.క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీకొన్ని జీసీసీలు క్లౌడ్ కంప్యూటింగ్లో ప్రత్యేకత కలిగి ఉంటాయి. సంస్థల డేటాను సమర్థవంతంగా నిల్వ చేయడానికి, నిర్వహించడానికి, ప్రాసెస్ చేయడానికి వీలు కల్పిస్తాయి. సెక్యూరిటీ థ్రెట్స్ నుంచి డేటాను, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కాపాడటంపై దృష్టి సారిస్తాయి.ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్)ఈ కేంద్రాలు తరచుగా ఐఓటీ సంబంధిత ప్రాజెక్టులకు నాయకత్వం వహిస్తాయి. డేటాను సేకరించి ప్రాసెస్ చేయగల స్మార్ట్ పరికరాలను, అందుకు అవసరమయ్యే వ్యవస్థలను సృష్టిస్తాయి. స్మార్ట్ హోమ్స్, స్మార్ట్ సిటీల నుంచి ఇండస్ట్రియల్ ఆటోమేషన్, హెల్త్ కేర్ సొల్యూషన్స్ వరకు దాదాపు అన్ని రంగాల్లో డిజిటల్ అప్లికేషన్లను తయారు చేస్తాయి.రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్బ్లాక్ చెయిన్, క్వాంటమ్ కంప్యూటింగ్, ఆగ్మెంటెడ్/ వర్చువల్ రియాలిటీ (ఏఆర్/వీఆర్) వంటి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీల్లో పరిష్కారాలను అన్వేషించడానికి టెక్నాలజీ ఆధారిత జీసీసీలు ఆర్ అండ్ డీలో భారీగా పెట్టుబడులు పెడుతాయి. భవిష్యత్తు వ్యాపారాలపై ప్రయోగాలు, ఆవిష్కరణలు చేసేందుకు తోడ్పడుతాయి.ఖర్చు నిర్వహణభారతదేశంలో చౌకగా మానవవనరుల లభ్యత ఉంటుందనే అభిప్రాయలున్నాయి. దీన్ని ఉపయోగించుకోవడం ద్వారా బహుళజాతి సంస్థలు తమ నిర్వహణ ఖర్చులను ఆప్టిమైజ్ చేసుకోవడానికి జీసీసీలు వీలు కల్పిస్తాయి. ఇది కంపెనీలు పరిశోధన, అభివృద్ధిలో ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి తోడ్పడుతుంది.ఇదీ చదవండి: ఇంటి అద్దెలు పెరుగుతాయ్..?టాలెంట్ డెవలప్మెంట్శ్రామిక శక్తిని పెంచడం, పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలను తిరిగి నేర్పించడంలో జీసీసీలు కీలక పాత్ర పోషిస్తాయి. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో ప్రత్యేక శిక్షణపై దృష్టి పెడుతాయి. ప్రపంచ డిమాండ్లను తీర్చడానికి నైపుణ్యం కలిగిన నిపుణులను సరఫరా చేస్తాయి. -
అమాంతం పెరిగి.. తగ్గిన బంగారం: నేటి ధరలు ఇవే..
హొలీ రోజు భారీగా పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు (మార్చి 15) స్వల్పంగా తగ్గించి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 82,200 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 89,670 వద్ద నిలిచాయి. నిన్న రూ.1,100, రూ.12,00 పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు మళ్ళీ రూ. 100 (22 క్యారెట్స్ 10గ్రా), రూ.110 (24 క్యారెట్స్ 10గ్రా) తగ్గింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 100, రూ. 110 తగ్గింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 82,200 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 89,670 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 82,350 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 89,820 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 100, రూ. 110 తక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు జీవితకాల గరిష్టాలను తాకుతున్నాయి. ఈ రోజు (మార్చి 15) కేజీ సిల్వర్ రేటు రూ. 1,12,000 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకేవిధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 10,3000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).ఇదీ చదవండి: ఫ్రెషర్లకు డిమాండ్.. ఐటీలో నియామకాలు డబుల్ -
ఇంటి అద్దెలు పెరుగుతాయ్..?
బెంగళూరులో ఇప్పటికే ఇంటి అద్దెలు సామాన్యుడికి అందనిరీతిలో ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అలాంటిది సమీప భవిష్యత్తులో అద్దెలు మరింత పెరుగుతాయని అంచనాలు వెలువడుతున్నాయి. అందుకు ఇటీవల అక్కడి స్థానిక ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలే కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇంటిలోని వ్యర్థాల తొలగింపు కోసం యూజర్ ఛార్జీలు వసూలు చేయడానికి కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దాంతో ఏప్రిల్ 1 నుంచి బెంగళూరు నివాసితుల ఆస్తి పన్నులు గణనీయంగా ప్రభావితం చెందే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే దీనిపై అధికారిక ఉత్తర్వులు ఇంకా జారీ కాలేదు.గృహ వ్యర్థాల నిర్వహణ కోసం నివాసితులకు కర్ణాటక ప్రభుత్వం యూజర్ ఛార్జీలు ఆమోదించడంతో ఏప్రిల్ 1 నుంచి బెంగళూరు ప్రాపర్టీ యజమానుల ప్రాపర్టీ ట్యాక్స్లు పెరుగనున్నాయి. బెంగళూరు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (బీఎస్డబ్ల్యూఎంఎల్) గత ఏడాది నవంబర్లో ఈ ఫీజును ప్రతిపాదించింది. అయితే అధికారిక ఉత్తర్వులు ఇంకా జారీ కాలేదు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేతృత్వంలోని పట్టణాభివృద్ధి శాఖ యూజర్ ఫీజును మంజూరు చేసింది. ఈ పద్ధతులు అశాస్త్రీయంగా ఉన్నాయని స్థానికంగా విమర్శలు ఎదురవుతున్నా, ఇంటింటికీ చెత్త సేకరణ, దాని నిర్వహణ సేవలకు నిధులు సమకూర్చే సాధనంగా ఈ ఫీజు తోడ్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఛార్జీల వల్ల ఏటా సుమారు రూ.600 కోట్ల ఆదాయం వస్తుందని బీఎస్డబ్ల్యూఎంఎల్ అంచనా వేస్తోంది.ఇదీ చదవండి: ట్రంప్ ప్రభుత్వానికి ఓపెన్ ఏఐ హెచ్చరికప్రభుత్వం విధించాలని తలపెట్టిన యూజర్ ఫీజును ఆస్తి పన్నులో జోడించనున్నారు. భవనం వైశాల్యాన్ని బట్టి ఇది మారుతుంది. నెలకు రూ.10 నుంచి రూ.400 వరకు ఫీజులు ఉండేలా ఆరు శ్లాబులను నిర్ణయించారు. 600 చదరపు అడుగుల వరకు ఉన్న భవనాలకు అతి తక్కువ రుసుము, 4,000 చదరపు అడుగులకు పైబడిన భవనాలకు గరిష్టంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో బెంగళూరు వాసులకు వార్షిక ఆస్తి పన్ను గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు. పెద్ద అపార్ట్మెంట్ సముదాయాలు, వాణిజ్య సంస్థలు వంటి అధిక వ్యర్థాలు ఉత్పత్తి చేసే భవనాలు వీటి ప్రాసెసింగ్ కోసం వేస్టేజ్ ఎంప్యానెల్డ్ ఏజెన్సీ(వర్థాల నిర్వహణకు కేటాయించిన ప్రత్యేక సంస్థలు)ని ఉపయోగించకపోతే కిలో వ్యర్థానికి అదనంగా రూ.12 వసూలు చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. -
ట్రంప్ ప్రభుత్వానికి ఓపెన్ ఏఐ హెచ్చరిక
కృత్రిమ మేధ (AI) ఆధిపత్యం కోసం ప్రపంచవ్యాప్తంగా పోటీ తీవ్రతరం అవుతున్న తరుణంలో సామ్ ఆల్ట్మన్ నేతృత్వంలోని ఓపెన్ ఏఐ అమెరికా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది. కాపీరైట్ సంస్కరణల్లో నిబంధనల కారణంగా అమెరికన్ కంపెనీలు చాలా వెనుకబడిపోతాయని, చైనీస్ డెవలపర్లు కాపీరైట్ డేటా వినియోగానికి అపరిమిత అవకాశాలు కనుగొంటున్నారని ఓపెన్ఏఐ తెలిపింది. ఈ వ్యత్యాసం ఏఐ రేసులో చైనాను ముందుంచేందుకు వీలు కల్పిస్తుందని వాదించింది. ఇటీవల యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (USTR)కు ఇచ్చిన ప్రకటనలో ఈమేరకు వివరాలు వెల్లడించింది.టెక్నాలజీపై ఆదిపథ్యం కోల్పోయే ప్రమాదం‘పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (పీఆర్సీ) డెవలపర్లకు కాపీరైట్ డేటా వినియోగానికి అపరిమిత అవకాశం ఉంది. అమెరికా కంపెనీలకు అలాంటి అవకాశం లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోటీ ముగిసిందనే చెప్పవచ్చు. నిజమైన ఐపీ క్రియేటర్లకు రక్షణల విషయంలో పెద్దగా ప్రయోజనం లేకపోగా, కీలకమైన సాంకేతిక పరిజ్ఞానంపై ఆధిపత్యం కోల్పోయే ప్రమాదం ఉంది. డేటా సంరక్షణ కోసం యునైటెడ్ స్టేట్స్ ప్రస్తుత విధానం కాపీరైట్ కంటెంట్ వినియోగాన్ని పరిమితం చేస్తుంది. అయితే చైనా అటువంటి డేటాను కృత్రిమ మేధ శిక్షణ కోసం స్వేచ్ఛగా ఉపయోగిస్తోంది. ఇది చైనా ఏఐ సంస్థలను నిబంధనలకు విరుద్ధంగా ఈ పోటీలో ముందుంచుతుంది’ అని ఓపెన్ఏఐ తెలిపింది.డేటాను యాక్సెస్ చేయడం వల్ల మరిన్ని ఆవిష్కరణలుఇటీవల ముగిసిన పబ్లిక్ కామెంట్ పీరియడ్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏఐ యాక్షన్ ప్లాన్పై ‘ఫ్రీడమ్-ఫోకస్డ్’కు సంబంధించి ఓపెన్ఎఐ సిఫార్సులను అందించింది. ఏఐ పరిశ్రమలో ‘నేర్చుకునే స్వేచ్ఛ’ను ప్రోత్సహించడానికి తన కాపీరైట్ వ్యూహాన్ని మార్చడం ద్వారా అమెరికా మరింత ముందంజలో ఉంటుందని తెలిపింది. లేదంటే పీఆర్సీలు యూఎస్ కంపెనీలు యాక్సెస్ చేయలేని కాపీరైట్ డేటాను వినియోగించి ఈ విభాగంలో దూసుకుపోతాయని పేర్కొంది. సాధ్యమైనంత విస్తృత శ్రేణి వనరుల నుంచి ఎక్కువ డేటాను యాక్సెస్ చేయడం వల్ల మరింత శక్తివంతమైన ఆవిష్కరణలకు అవకాశం లభిస్తుందని, ఇది మరింత జ్ఞానాన్ని అందిస్తుందని ఓపెన్ఏఐ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: రాత్రిపూట రైళ్లు ఎందుకు వేగంగా నడుస్తాయి?ఇప్పటికైతే ముందువరుసలో అమెరికానే..ఇటీవల యాపిల్ యాప్ స్టోర్లో చాట్జీపీటీని అధిగమించిన చైనీస్ ఏఐ మోడల్ డీప్సీక్ ఆర్1 వంటి ఏఐలతో అమెరికా ఏఐ ఆదిపత్యానికి ముప్పు పొంచి ఉందని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఓపెన్ఏఐ ఈ వ్యాఖ్యలు చేసింది. ఇప్పటివరకైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అమెరికా ముందంజలో ఉండగా, డీప్సీక్ మాత్రం తమ ఆధిక్యం విస్తృతంగా లేదని, కుంచించుకుపోతున్నట్లు చూపిస్తోందని ఓపెన్ ఏఐ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఏఐ ఆధిపత్యాన్ని బలోపేతం చేయడానికి కాపీరైట్ డేటా వినియోగించుకునేందుకు వీలుగా మరిన్ని మార్పులు చేసి మెరుగైన ఏఐ శిక్షణకు సహకరించాలని ఇటీవల ట్రంప్ ప్రభుత్వానికి చేసిన ప్రతిపాదనలో అభ్యర్థించింది. -
ఇండస్ఇండ్లో అవకతవకలపై ఐసీఏఐ సమీక్ష
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఇండస్ఇండ్ బ్యాంక్లో ఆర్థిక అవకతవకలపై ఫైనాన్షియల్ స్టేట్మెంట్లను సమీక్షించే అవకాశం ఉన్నట్లు ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ప్రెసిడెంట్ చరణ్జ్యోత్ సింగ్ నందా తెలిపారు. ఫైనాన్షియల్ రిపోర్టింగ్ రివ్యూ బోర్డ్ (ఎఫ్ఆర్ఆర్బీ) దీన్ని చేపట్టవచ్చని ఆయన పేర్కొన్నారు. డెరివేటివ్స్ పోర్ట్ఫోలియోలో రూ.2,100 కోట్ల మేర వ్యత్యాసాన్ని గుర్తించినట్లు బ్యాంక్ ఇటీవల ప్రకటించడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. మరోవైపు, ఇండస్ఇండ్ వ్యవహారంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కూడా ప్రాథమిక విచారణ ప్రారంభించే అవకాశం ఉంది. -
డిజిటల్ జోరు..!
కొన్నాళ్ల క్రితం వరకు ప్రకటనలంటే పత్రికలు, టీవీలు, రేడియోల్లాంటి సాంప్రదాయ మాధ్యమాలకే పరిమితమయ్యేవి. ఇంటర్నెట్ వాడకం పెరిగిన తర్వాత నెమ్మదిగా డిజిటల్ వైపు మళ్లడం మొదలైంది. ఇక అందరి చేతుల్లోకి స్మార్ట్ఫోన్లు వచ్చేస్తుండటం, డేటా చౌకగా లభిస్తుండటంలాంటి అంశాల కారణంగా ఇది మరింతగా జోరందుకుంది. ఎంత లా అంటే .. అడ్వర్టైజింగ్ సంస్థలు తమ బడ్జెట్లో దాదాపు సగభాగాన్ని డిజిటల్కే కేటాయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆఖరు నాటికి దేశీయంగా డిజిటల్ అడ్వర్టైజింగ్ విభాగం, సాంప్రదాయ మాధ్యమాలకు మించి ఏకంగా రూ. 62 వేల కోట్లకు చేరుతుందనే అంచనాలు నెలకొన్నాయి. అడ్వర్టైజింగ్ పరిశ్రమలో డిజిటల్ మీడియా చాలా వేగంగా ప్రాచుర్యంలోకి వచ్చేసింది. నగరాలు మొదలుకుని గ్రామాల వరకు ఇది అసాధారణ స్థాయిలో విస్తరిస్తోంది. దీంతో డిజిటల్ యూజర్ల దృష్టిని ఆకట్టుకునేందుకు కంపెనీలు ఒకదానితో మరొకటి పోటీపడుతున్నాయి. సాం ప్రదాయ మీడియాని మించి డిజిటల్పై భారీగా వెచ్చిస్తున్నాయి. అంతర్జాతీయ అడ్వర్టైజింగ్ దిగ్గజం డెంట్సు నివేదిక ప్రకారం.. దేశీఅడ్వర్టైజింగ్ పరిశ్రమ ప్రస్తుతం రూ. 93,166 కోట్లుగా ఉంది. 2025 ఆఖరు నాటికి ఇది సుమారు మరో 10 శాతం పెరిగి రూ. 1,12,453 కోట్లకు చేరుతుందని అంచనా. 2022లోలో రూ. 40,685 కోట్లుగా ఉన్న డిజిటల్ విభాగం ఈ ఏడాది ఆఖరుకల్లా రూ. 62,045 కోట్లకు.. అంటే మొత్తం అడ్వర్టైజింగ్ బడ్జెట్లలో సగానికి పైగానే వాటా దక్కించుకునే అవకాశం ఉంది. గతేడాది విషయం తీసుకుంటే 44 శాతం వాటాతో డిజిటల్ అగ్రస్థానంలో ఉండగా, టీవీ 32 శాతం, ప్రింట్ మీడియా 20% వాటాతో తర్వాత స్థానాల్లో నిల్చాయి. ఏఐలాంటి టెక్నాలజీ ఊతంతో టార్గెట్ ఆడియన్స్ను సరిగ్గా చేరుకునే వెసులుబాటు ఉండటం డిజిటల్కి సానుకూలాంశంగా ఉంటోంది. టెలికం అత్యధిక కేటాయింపులు.. టెలికం రంగ సంస్థలు తమ మీడియా బడ్జెట్లలో 64 శాతం భాగాన్ని డిజిటల్కి కేటాయిస్తున్నాయి. ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ తమ బడ్జెట్లలో 94 శాతం భాగాన్ని డిజిటల్, టీవీ మాధ్యమాలకు కేటాయిస్తోంది. సాంప్రదాయ అడ్వర్టైజర్లే కాకుండా, డైరెక్ట్ టు కన్జూమర్ బ్రాండ్లు, స్టార్టప్లు మొదలైనవి ఎక్కువగా ఆన్లైన్ ప్రకటనలపైనే దృష్టి పెడుతున్నాయి. క్విక్–కామర్స్, ఈ–కామర్స్, విద్యా రంగ సంస్థల్లాంటివి మరింతగా కస్టమర్లకు చేరువయ్యేందుకు డిజిటల్ మాధ్యమాల మీదే ఆధారపడుతున్నాయి. షార్ట్ వీడియోలు, సోషల్ కామర్స్లపై ఇన్వెస్ట్ చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల డిజిటల్ బడ్జెట్లూ ఎక్కువగానే ఉంటున్నాయి. దేశీయంగా డిజిటల్ విప్లవం ప్రజల జీవితాలు, పరిశ్రమలు, సమాజంలో పెను మార్పులు తీసుకొస్తోందని, కృత్రిమ మేథ కూడా ఇందుకు దోహదపడుతోందని డెంట్సు దక్షిణాసియా సీఈవో హర్ష రజ్దాన్ చెప్పారు. టెక్నాలజీ ఎంత పెరిగినా మానవీయ కోణానికి కూడా ప్రాధాన్యతనివ్వాలని, పారదర్శకత, జవాబుదారీతనం, నైతిక విలువలకు పెద్ద పీట వేస్తూ పరిశ్రమ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియా హవా...డిజిటల్ మీడియా కేటగిరీలో చూస్తే 30% వాటాతో (రూ. 11,962 కోట్లు) సోషల్ మీడియా అగ్రస్థానంలో ఉండగా, ఆన్లైన్ వీడియోలు 29%, పెయిడ్ సెర్చ్ 23% వాటా దక్కించుకున్నాయి. టెలికం కంపెనీలు తమ డిజిటల్ మీడియా బడ్జెట్లో 80% భాగాన్ని ఆన్లైన్ వీడియో, సోషల్ మీడియా, పెయిడ్ సెర్చ్లకు కేటాయిస్తున్నాయి. ఈ–కామర్స్ కంపెనీలైతే తమ మొత్తం మీడియా బడ్జెట్లో 61 శాతాన్ని డిజిటల్ మీడియాకు కేటాయిస్తున్నాయి.తెలుగు రాష్ట్రాల్లోనూ అదే తీరు.. తెలుగు రాష్ట్రాల్లోనూ డిజిటల్, సోషల్ మీడియా ప్రకటనలు జోరుగానే ఉంటున్నాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు వీటికి భారీగానే బడ్జెట్లు కేటాయిస్తున్నాయి. రాజకీయేతర డిజిటల్ ప్రకటనల వ్యయాలపై నిర్దిష్ట డేటా లేకపోయినప్పటికీ గత కొన్నాళ్లుగా, చాలా వేగంగా వృద్ధి చెందుతోందని ఓటీఎస్ అడ్వర్టైజింగ్ అకౌంట్ డైరెక్టర్ సాయి సిద్ధార్థ్ నల్లూరి తెలిపారు. దక్షిణాదివ్యాప్తంగా 2020 నాటి నుంచి గణాంకాలు చూస్తే డిజిటల్ అడ్వర్టైజింగ్ 30 శాతం వృద్ధి రేటు కనపర్చిందని చెప్పారు. విద్య తదితర రంగాలు డిజిటల్పై ప్రధానంగా దృష్టి పెడుతున్నాయని, ఈ సేవల కోసం స్పెషలైజ్డ్ ఏజెన్సీలు కూడా వచ్చాయని పేర్కొన్నారు. కోవిడ్ తర్వాత సాంప్రదాయ మీడియాపై ప్రకటనల వ్యయాలు తగ్గాయని వివరించారు. – సాక్షి, బిజినెస్డెస్క్ -
చరిత్రలో తొలిసారి... పసిడి @ 3,000 డాలర్లు
న్యూయార్క్: కొన్నేళ్లుగా నిరవధికంగా మెరుస్తున్న పసిడి తాజాగా సరికొత్త రికార్డ్ సృష్టించింది. అంతర్జాతీయ మార్కెట్లలో తొలిసారి ఔన్స్(31.1 గ్రాములు) 3,000 డాలర్ల మైలురాయిని అధిగమించింది. తద్వారా వారాంతాన సైతం బులియన్ మార్కెట్ కళకళలాడుతోంది. న్యూయార్క్ కమోడిటీ ఎక్సే్చంజీ(కామెక్స్)లో 3 శాతం బలపడి 3,001 డాలర్లకు చేరింది. ఒకానొక దశలో 3,017 డాలర్ల గరిష్టాన్ని కూడా తాకింది. ఈ ప్రభావం దేశీయంగా నేడు(శనివారం) ఆభరణ మార్కెట్లో ప్రతిఫలించనున్నట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. వెరసి తరతరాలుగా రక్షణాత్మక పెట్టుబడి సాధనంగా తళతళలాడుతున్న బంగారం మరోసారి ప్రపంచ అనిశ్చి తులలో బలాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలియజేశాయి. గత 25ఏళ్లలో చూస్తే పసిడి 10 రెట్లు జంప్చేసింది. తద్వారా యూఎస్ స్టాక్ మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ ఎస్అండ్పీ–500ను సైతం మించి ర్యాలీ చేయడం గమనార్హం. ర్యాలీ తీరిలా గోల్డ్ ఔన్స్ ధర తొలుత 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం తదుపరి 1,000 డాలర్ల మార్క్ను అధిగమించింది. తదుపరి కరోనా మహమ్మారి కాలంలో 2,000 డాలర్ల మైలురాయిని తాకింది. తిరిగి 2023, 2024లలో పరుగందుకుంది. ప్రధానంగా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు డాలర్లకు బదులుగా బంగారాన్ని భారీ స్థాయిలో కొనుగోలు చేస్తుండటం ధరల నిరంతర ర్యాలీకి దోహదపడుతున్నట్లు బులియన్ వర్గాలు తెలియజేశాయి. గతేడాది చివర్లో యూఎస్ ప్రెసిడెంట్గా ట్రంప్ ఎన్నికయ్యాక పసిడి మరింత దూకుడు చూపుతోంది. 2024లో 26 శాతం బలపడగా.. 2025లోనూ ఇప్పటివరకూ 14%పెరగడం విశేషం!20 ట్రిలియన్ డాలర్లుగత మూడేళ్లుగా పలు దేశాల కేంద్ర బ్యాంకులు పుత్తడిలో కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీంతో 2022, 2023, 2024లో 1,000 మెట్రిక్ టన్నులు చొప్పున సొంతం చేసుకున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా పసిడి మార్కెట్ విలువ 20.2 ట్రిలియన్ డాలర్లను తాకగా.. గత 13 నెలల్లోనే 7 ట్రిలియన్ డాలర్ల విలువ జత కలిసింది. యూఎస్ లిస్టెడ్ టాప్–10 దిగ్గజాలు యాపిల్, ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, మెటా తదితరాల మార్కెట్ విలువసహా.. బిట్కాయిన్, సిల్వర్ను సైతం పరిగణిస్తే మొత్తం విలువ 19.6 ట్రిలియన్ డాలర్లు మాత్రమే! -
ఇదీ హోలీ గిఫ్ట్ అంటే.. ఉద్యోగులకు రూ.34 కోట్లు..
హోలీ పండుగ సందర్భంగా పలు కంపెనీలు తమ ఉద్యోగులకు మిఠాయిలు, బహుమతులు ఇవ్వడం సాధారణమే. అయితే ఈ హోలీ సందర్భంగా ప్రూడెంట్ కార్పొరేట్ అడ్వైజరీ సర్వీసెస్ ప్రమోటర్ సంజయ్ షా కేవలం రంగులకే పరిమితం కాకుండా.. తన సిబ్బందికి రూ.34 కోట్ల విలువైన 1,75,000 ఈక్విటీ షేర్లను బహుమతిగా ఇస్తున్నారు.దాదాపు 650 మంది ఉద్యోగులు, వ్యక్తిగత సిబ్బంది దీంతో ప్రయోజనం పొందనున్నారు. ప్రూడెంట్ కార్పొరేట్ అడ్వైజరీ సర్వీసెస్ లిమిటెడ్ సీఎండీ సంజయ్ షా ఈ ఉదార చర్యతో వ్యాపారంలో 25వ ఏట అడుగుపెట్టారు. లబ్ధిదారుల్లో కంపెనీ ఉద్యోగులే కాకుండా ఆయన ఇంట్లో పనిచేసే సహాయకులు, డ్రైవర్లు వంటి వ్యక్తిగత సిబ్బంది కూడా ఉన్నారు.ఉద్యోగులకు రూ.కోట్ల షేర్లు ప్రకటించిన ప్రూడెంట్ ప్రమోటర్ సంజయ్ షా ఈయనే..ఈ సందర్భంగా సంజయ్ షా మాట్లాడుతూ.. 'ఇది కేవలం షేర్ల బదలాయింపు మాత్రమే కాదు. ఈ ప్రయాణంలో ఉద్యోగులుగా మాత్రమే కాకుండా సహచరులుగా నాకు అండగా నిలిచిన వారికి ఇవి నేను సమర్పించే హృదయపూర్వక ధన్యవాదాలు. మీ నిస్వార్థ సహకారాలు, విశ్వసనీయత, విధేయత అమూల్యమైనవి’ అని పేర్కొన్నారు.సంజయ్ షా తన నిర్ణయాన్ని కంపెనీకి తెలియజేశారు. ఇందుకోసం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)తో సహా అవసరమైన రెగ్యులేటరీ అనుమతులను ప్రూడెంట్ కార్పొరేట్ అడ్వైజరీ సర్వీసెస్ పొందింది. కాగా ఉద్యోగులకు రూ.కోట్ల షేర్లు ప్రకటించిన ప్రూడెంట్ అధినేతపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. -
టాటా గ్రూప్ కంపెనీకి చైర్మన్గా గణపతి సుబ్రమణ్యం
టాటా గ్రూప్నకు చెందిన టెలీ కమ్యూనికేషన్స్ సంస్థ టాటా కమ్యూనికేషన్స్ లిమిటెడ్ చైర్మన్గా ఎన్ గణపతి సుబ్రమణ్యం నియమితులయ్యారు. కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్గా గణపతి సుబ్రమణ్యం నియామకానికి టాటా కమ్యూనికేషన్స్ బోర్డు తాజాగా ఆమోదం తెలిపింది.ఎన్జీఎస్గా ప్రసిద్ధి చెందిన గణపతి సుబ్రమణ్యం 2021 డిసెంబర్లో టాటా కమ్యూనికేషన్స్ లిమిటెడ్ బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా చేరారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (టీసీఎస్)తోపాటు భారత ఐటీ పరిశ్రమలో ఆయన 40 ఏళ్లుగా ఉన్నారు. 2024 మేలో టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవి నుంచి వైదొలిగారు.నామినేషన్ అండ్ రెమ్యూనరేషన్ కమిటీ సిఫార్సు మేరకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు 2025 మార్చి 14 నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్, నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఎన్ గణపతి సుబ్రమణ్యాన్ని కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్గా నియమించిందని టాటా కమ్యూనికేషన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్, టెలికాం, పబ్లిక్ సర్వీసెస్లో టీసీఎస్ చేపట్టిన పలు మైలురాయి కార్యక్రమాల్లో ఆయన వ్యూహాత్మక పాత్ర పోషించారని కంపెనీ తెలిపింది. టెక్నాలజీ, ఆపరేషన్స్, ప్రొడక్ట్ డెవలప్మెంట్, బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్, ఛేంజ్ మేనేజ్మెంట్పై ఆయనకు లోతైన పరిజ్ఞానం ఉందని పేర్కొంది.ప్రస్తుతం గణపతి సుబ్రమణ్యం టాటా ఎలెక్సీ లిమిటెడ్, తేజస్ నెట్ వర్క్స్ లిమిటెడ్ లో బోర్డు చైర్మన్, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, టాటా కమ్యూనికేషన్స్ లిమిటెడ్లో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. అలాగే భారత్ 6జీ అలయన్స్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్గా, శ్రీ చిత్ర తిరునాళ్ ఇన్ స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీలో ఇన్స్టిట్యూట్ బాడీ సభ్యుడిగా, ముంబైలోని దివ్యాంగ పిల్లల పునరావాస సొసైటీ కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. -
అంబానీ పెళ్లి.. ఆవు కాలికి కూడా వజ్రాలు.. అది మరో ప్రపంచం: కర్దాషియన్స్
అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ పెళ్లిని దేశమంతా చూసింది. ఈ వివాహ వేడుకకు దేశవిదేశాల నుంచి సెలబ్రిటీలు హాజరయ్యారు. ఖర్చుకు వెనుకాడకుండా అంగరంగ వైభవంగా ఈ పెళ్లి జరిపించారు ముఖేశ్ - నీతా అంబానీ. ఈ వెడ్డింగ్ సెలబ్రేషన్స్లో కర్దాషియన్స్ సిస్టర్స్ కూడా ఉన్న విషయం తెలిసిందే! అయితే ఎప్పుడూ పొట్టి బట్టల్లో కనిపించే వారు ఈ పెళ్లిలో మాత్రం భారతీయ సాంప్రదాయానికి తగ్గట్లుగా లంగా ఓణీలో మెరిశారు. అంబానీ ఆతిథ్యం చూసి గుడ్లు తేలేశారు. స్వయంగా వారే ఈ మాట చెప్తున్నారు.మరో ప్రపంచలోకి వెళ్లినట్లే ఉందిద కర్దాషియన్స్ లేటెస్ట్ ఎపిసోడ్లో అనంత్ అంబానీ (Anant Ambani) పెళ్లి గురించి మాట్లాడారు. వేదికను ఎంత అందంగా ముస్తాబు చేశారో అని ఖ్లోయె ఫ్లాష్బ్యాక్లోకి వెళ్లిపోగా.. లక్షలాది పువ్వులు సీలింగ్ నుంచి వేలాడుతూ ముచ్చటగొలిపాయి అని కిమ్ (Kim Kardashian) చెప్పుకొచ్చింది. మా ఎగ్జయిట్మెంట్ను చాలావరకు ఆపుకున్నాం. అదంతా ఒక డిస్నీల్యాండ్ రైడ్లా అనిపించింది. డిస్నీల్యాండ్తో పోల్చడం కూడా చిన్నమాటే అవుతుంది అని ఖ్లోయే (Khloe Kardashian) అభిప్రాయపడింది. మరో ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు అనిపించింది అని కిమ్ పేర్కొంది.రిచ్ వెడ్డింగ్వీరిద్దరూ ఇంకా మాట్లాడుతూ.. పెళ్లికూతురు రాధిక మర్చంట్ (Radhika Merchant) నెమలిలా డిజైన్ చేసిన వాహనంపై వచ్చింది. దానికన్నీ విలువైన రత్నాలు పొదిగి ఉన్నాయి. కొన్నిచోట్ల నిజమైన బంగారం పూత పూశారు. ఎక్కడచూసినా అంతా వజ్రాలమయంగానే ఉంది. ఆఖరికి ఆవు కాళ్లకు సైతం వజ్రాలే ఉన్నాయి. అవి పారిపోకుండా ఉండేందుకు సంకెళ్లలాంటివి కాలికి వేశారు. వాటికి వజ్రాలుండటం చూసి ఆశ్చర్యపోయాం. అంబానీ కుటుంబం గోవును భక్తిగా పూజించారు. ఇదొక అత్యంత ధనిక వెడ్డింగ్. అలాగే పెళ్లికి ముందు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టింది అని పేర్కొన్నారు.అలా అంబానీ పెళ్లికి వచ్చాం..ఇక ఇదే ఎపిసోడ్లో కిమ్ కర్దాషియన్.. అంబానీ ఎవరో కూడా తెలీదన్న సంగతి తెలిసిందే! తన స్నేహితురాలు లోరైన్ స్కువార్ట్జ్.. అంబానీ కుటుంబానికి ఆభరణాలు తయారు చేసి పెడుతుందని.. అలా ఆమె చెప్పడం వల్లే అంబానీ గురించి తెలిసిందని పేర్కొంది. పెళ్లికి రావాల్సిందిగా 20 కిలోల బరువైన ఇన్విటేషన్ గిఫ్ట్ బాక్స్ పంపించారని, అది చూసి ఇంప్రెస్ అయిపోయి పెళ్లికి హాజరయ్యామంది. అనంత్-రాధిక 2024 జూలైలో పెళ్లి చేసుకున్నారు. View this post on Instagram A post shared by The Kardashians (@kardashianshulu) చదవండి: మద్యానికి బానిసయ్యా.. రోజుకు 9 గంటల నరకం: స్టార్ హీరో చెల్లెలు -
రెండు రోజులు బ్యాంకులు బంద్..
దేశవ్యాప్తంగా రెండు రోజుల పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులు మూత పడనున్నాయి. మార్చి 24, 25 తేదీల్లో రెండు రోజుల దేశవ్యాప్త సమ్మె షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతుందని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీయూ) తెలిపింది. కీలక డిమాండ్లపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)తో జరిపిన చర్చలు సానుకూల ఫలితాన్ని ఇవ్వకపోవడంతో సమ్మె షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని వెల్లడించింది.ఐబీఏతో జరిగిన సమావేశాల్లో యూఎఫ్బీయూ సభ్యులందరూ అన్ని కేడర్లలో నియామకాలు, వారానికి ఐదు రోజుల పనిదినాలు వంటి అంశాలను లేవనెత్తారు. అయినప్పటికీ కీలక సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయని నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (ఎన్సీబీఈ) ప్రధాన కార్యదర్శి ఎల్.చంద్రశేఖర్ తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లేబర్, ఆఫీసర్ డైరెక్టర్ పోస్టుల భర్తీ వంటి డిమాండ్లతో తొమ్మిది బ్యాంకు ఉద్యోగ సంఘాలతో కూడిన యూఎఫ్బీయూ గతంలో సమ్మెకు పిలుపునిచ్చింది.పనితీరు సమీక్షలు, పనితీరు సంబంధిత ప్రోత్సాహకాలపై ఇటీవల డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (డీఎఫ్ఎస్) మార్గదర్శకాలను ఉపసంహరించుకోవాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. ఇటువంటి చర్యలు ఉద్యోగ భద్రతకు ముప్పును సృష్టిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. డీఎఫ్ఎస్ పేర్కొన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల "మైక్రో మేనేజ్మెంట్"ను కూడా యూఎఫ్బీయూ వ్యతిరేకిస్తోంది. ఇటువంటి జోక్యం బ్యాంక్ బోర్డుల స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తుందని పేర్కొంది.ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీఓసీ), నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (ఎన్సీబీఈ), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏఐబీఓఏ) వంటి ప్రధాన బ్యాంకు యూనియన్లు యూఎఫ్బీయూలో ఉన్నాయి.ఉద్యోగుల డిమాండ్లు..ఐబీఏ వద్ద ఉన్న పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని, గ్రాట్యుటీ చట్టాన్ని సవరించడం ద్వారా ఈ పరిమితిని రూ.25 లక్షలకు పెంచాలని బ్యాంకు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పథకంతో అనుసంధానం, ఆదాయపు పన్ను మినహాయింపు వంటివి కూడా ప్రధాన డిమాండ్లలో ఉన్నాయి. -
అమెరికాలోనూ నో ట్యాక్స్..! ట్రంప్ భారీ పన్ను ప్రణాళిక
భారత్లో మాదిరిగానే అమెరికాలోనూ ఆదాయపు పన్నుకు సంబంధించి భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. లక్షలాది మంది అమెరికన్లకు పన్ను మినహాయింపునిచ్చే భారీ పన్ను ప్రణాళికను అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ వెల్లడించారు. సంవత్సరానికి 150,000 డాలర్ల కంటే తక్కువ సంపాదించేవారికి ఫెడరల్ పన్నులను తొలగించే యోచనలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారని సీబీఎస్ ఇంటర్వ్యూలో లుట్నిక్ చెప్పారు .'ట్రంప్ లక్ష్యం ఏమిటో నాకు తెలుసు. సంవత్సరానికి 150,000 డాలర్ల కంటే తక్కువ సంపాదించే ఎవరికైనా పన్ను ఉండకూడదు. అదే ఆయన (ట్రంప్) లక్ష్యం. దానికోసమే నేను పనిచేస్తున్నా' అని లుట్నిక్ తెలిపారు. లుట్నిక్ అక్కడితో ఆగలేదు. అమెరికన్ల పన్ను భారాలను మరింత తగ్గించే లక్ష్యంతో విస్తృత ఆలోచనలను తెరపైకి తెచ్చారు. పన్ను సంస్కరణలపై దూకుడు వైఖరి ఉంటుందని ఆయన సంకేతాలిచ్చారు.ట్రంప్ ప్రతిపాదన అమల్లోకి వస్తే ఏడాదికి 1,50,000 డాలర్లు అంటే సుమారు రూ.1.3 కోట్లు కంటే తక్కువ సంపాదించే వారికి పన్ను చెల్లించకుండా మినహాయింపు లభిస్తుంది. ఈ లక్ష్యాన్ని నిజం చేయడమే తన ప్రస్తుత లక్ష్యమని లుట్నిక్ స్పష్టం చేశారు. కెనడా, మెక్సికోలతో కొనసాగుతున్న సుంకాల యుద్ధాలతో సహా ట్రంప్ ఆర్థిక వ్యూహాన్ని సమర్థిస్తూ.. విధానాలు మాంద్యాన్ని ప్రేరేపించే ప్రమాదం ఉన్నప్పటికీ అవి అవసరమని లుట్నిక్ పేర్కొన్నారు.ఇక పన్ను కోతలతో ముడిపడిన పెరుగుతున్న లోటుల గురించి ఆందోళనలపై స్పందిస్తూ ప్రభుత్వ ఖర్చులు అమెరికన్లకు భారం కాకూడదన్నారు లుట్నిక్. విదేశీ సంస్థలు, విదేశీ పన్ను ఎగవేతదారులను ప్రస్తావిస్తూ 'ఇతర వ్యక్తులు' ఈ వ్యయాన్ని భరించాలి. అంతర్జాతీయ పన్ను లొసుగులను సరిదిద్దడం వల్ల దేశీయ పన్ను ఉపశమనం లభిస్తుందని ఆయన వివరించారు. మరోవైపు ట్రంప్ వివాదాస్పద 5 మిలియన్ డాలర్ల అమెరికా వీసా ప్రతిపాదనకు కూడా లుట్నిక్ మద్దతు తెలిపారు. ఇది అదనపు ఆదాయాన్ని సృష్టిస్తుందని పేర్కొన్నారు. -
టాప్ ఐటీ కంపెనీకి కొత్త హెచ్ఆర్ హెడ్..
దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)కు కొత్త హెచ్ఆర్ హెడ్ నియమితులయ్యారు. సుదీప్ కున్నుమాల్కు పదోన్నతి కల్పిస్తూ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ (సీహెచ్ఆర్వో)గా టీసీఎస్ నియమించింది. ప్రస్తుత హెచ్ఆర్ అధిపతి మిలింద్ లక్కడ్ పదవీ విరమణ చేస్తున్నారు. మార్చి 14వ తేదీ నుంచి కున్నుమాల్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరిస్తారని ఫైలింగ్లో టీసీఎస్ పేర్కొంది.సుదీప్ కున్నుమాల్ ప్రస్తుతం టీసీఎస్లో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) విభాగానికి హెచ్ఆర్ ఫంక్షన్ హెడ్గా ఉన్నారు. టాటా గ్రూప్ అనుబంధ సంస్థలో దాదాపు ఆరేళ్ల పాటు సీహెచ్ఆర్ఓ, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్న ప్రస్తుత మిలింద్ లక్కడ్ పదవీ విరమణ తర్వాత సీహెచ్ఆర్ఓ హోదాకు పదోన్నతి పొందారు. 1987లో టీసీఎస్లో ట్రైనీగా చేరిన లక్కడ్ 2006లో మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ అధిపతి హోదాతో పాటు 38 ఏళ్ల పాటు పలు బాధ్యతలు నిర్వర్తించారు. 2019 నుంచి సీహెచ్ఆర్వోగా పనిచేస్తున్నారు.సుదీప్ కున్నుమాల్ గురించి..బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) వర్టికల్ కోసం హ్యూమన్ రిసోర్సెస్ ఫంక్షన్కు నేతృత్వం వహిస్తున్న సుదీప్ కున్నుమాల్ 2000 సంవత్సరం నుంచి ఐటీ రంగంలో పనిచేస్తున్నారు. మదురై కామరాజ్ యూనివర్సిటీ నుంచి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్ మెంట్ లో మాస్టర్స్ పూర్తి చేశారు. వ్యూహాత్మక హెచ్ఆర్ చొరవలు, సరికొత్త నియామక పరిష్కారాలు, ప్రాసెస్ ఎక్సలెన్స్ ద్వారా సంస్థాగత వృద్ధిని పెంపొందించడంలో నిబద్ధతతో సుదీప్ కెరియర్ సాగిందని టీసీఎస్ పేర్కొంది. ఉత్తర అమెరికా, యూరప్తోపాటు ఆసియా పసిఫిక్ దేశాల్లో ఆయన వివిధ హెచ్ఆర్ లీడర్ షిప్ పొజిషన్లలో పనిచేశారు.ఇదీ చదవండి: జీతాల తేడాలొద్దు.. ఉద్యోగులను మనుషుల్లా చూడండి : ఇన్ఫోసిస్ నారాయణమూర్తి -
ఫ్రీగా ఓయో రూమ్స్లో బస
భారతదేశ ప్రముఖ ఆతిథ్య బ్రాండ్లలో ఒకటైన ఓయో రూమ్స్ వినియోగదారులకు హోలీ సందర్భంగా ఉచిత ఆఫర్ను ప్రకటించింది. ఇండియా క్రికెట్ టీమ్ ఇటీవల ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సాధించండం, తర్వాత హోలీ పండుగ నేపథ్యంలో మార్చి 13 నుంచి 18 వరకు ఓయో దేశవ్యాప్తంగా 1,000 ప్రీమియం కంపెనీ సర్వీస్ హోటళ్లలో రోజూ 2,000 ఉచిత స్టేలను అందిస్తున్నట్లు పేర్కొంది. ఈమేరకు సంస్థ వ్యవస్థాపకులు రితేష్ అగర్వాల్ ఎక్స్ వేదికగా వివరాలు వెల్లడించారు.వినియోగదారులు ఈ పరిమిత ఓయో ప్రీమియం ఆతిథ్యాన్ని ఎటువంటి ఖర్చు లేకుండా ఆస్వాధించవచ్చని రితేష్ తెలిపారు. ఓయో యాప్ లేదా వెబ్సైట్ ద్వారా బుకింగ్ చేసేటప్పుడు కూపన్ కోడ్ ‘CHAMPIONS’ అని ఎంటర్ చేయాలని పేర్కొన్నారు. దాంతో కస్టమర్లు తమ కాంప్లిమెంటరీ స్టేను రెడీమ్ చేసుకోవచ్చని చెప్పారు. ఈ ఆఫర్ ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్(ముందుగా బుక్ చేసుకున్న వారికే వర్తించేలా) ప్రాతిపదికన పని చేస్తుందని స్పష్టం చేశారు.Some wins are bigger than just a trophy. India’s ICC Champions Trophy victory isn’t just about cricket—it’s about the unshakable spirit of a billion people, the collective cheers, the nail-biting finishes, and that electrifying moment when the whole country erupts in joy.And… pic.twitter.com/M0m6KAdHds— Ritesh Agarwal (@riteshagar) March 13, 2025ఇదీ చదవండి: రాత్రిపూట రైళ్లు ఎందుకు వేగంగా నడుస్తాయి?భారత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజయాన్ని అందరూ అస్వాదిస్తున్నారని రితేశ్ తెలిపారు. ఈ నేపథ్యంలో హోలీ తోడవడం వినియోగదారులకు మరింత ఉత్తేజాన్ని ఇస్తుందన్నారు. ఈ తరుణంలో కంపెనీ కస్టమర్లకు ఉచిత ఆఫర్ ప్రకటించిందని చెప్పారు. ఈ వారాంతంలో మధురమైన జ్ఞాపకాలను సొంతం చేసేందుకు కంపెనీ తోడైందని తెలిపారు. ప్రయాణాలు చేయడం, ప్రియమైనవారిని కలవడం కంటే సంతోషకరమైన క్షణాలు ఏముంటాయన్నారు. అందుకోసం ఓయో రూమ్స్ ‘టౌన్ హౌస్, కలెక్షన్ ఓ’తో సహా 1000కి పైగా ఓయో కంపెనీ సర్వీస్ హోటళ్లలో మార్చి 13-18 వరకు ప్రతిరోజూ ఉచిత బసలను అందిస్తున్నట్లు చెప్పారు. -
రాత్రిపూట రైళ్లు ఎందుకు వేగంగా నడుస్తాయి?
కొన్ని రైళ్లు పగలు కంటే రాత్రిపూటే వేగంగా ప్రయాణిస్తున్నట్లు అనిపిస్తుంది కదా. నిత్యం రైలు ప్రయాణం చేస్తున్నవారు ఇది గమనించే ఉంటారు. ఇది ఒక మిస్టరీగా అనిపించినప్పటికీ దీని వెనుక కారణాలు లేకపోలేదు. కొన్ని ఆసక్తికరమైన, ఆచరణాత్మక కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాత్రిపూట రైలు వేగం పెరగడానికి దోహదపడే కీలక అంశాలను తెలియజేస్తున్నారు.ట్రాక్ రద్దీ తగ్గుదలపగటిపూట రైల్వే ట్రాక్లు రద్దీగా ఉంటాయి. ప్యాసింజర్ రైళ్లు, సరుకు రవాణా రైళ్లు, ప్రధాన గేట్ల వద్ద పగలు ప్రజల సంచారం వంటి అంశాలతో రైళ్ల రాకపోకలు ఆలస్యం అవుతుంటాయి. పగలు ఇతర రైళ్ల డైవర్షన్ కోసం కొన్ని రైళ్లను గంటల తరబడి నిలిపేస్తుంటారు. రాత్రిపూట ఈ ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. దాంతో రైళ్లు వేగంగా నడిచేందుకు వీలుంటుంది.తక్కువ స్టాప్లుపగటిపూట ప్యాసింజర్ రైళ్లతో పోలిస్తే రాత్రిపూట రైళ్లు, ముఖ్యంగా సుదూర, సరుకు రవాణా సేవలు అందించే రైళ్లకు తక్కువ స్టాపులను షెడ్యూల్ చేస్తారు. దాంతో అంతరాయాలు లేకుండా రైళ్లు వాటి వేగాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది.డ్రైవర్ విజిబిలిటీనైట్ డ్రైవింగ్లో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, పగలు రద్దీగా ఉండే స్టేషన్లు లేదా రద్దీగా ఉండే క్రాసింగ్లపై లోకోపైలట్లు పెద్దగా దృష్టి కేంద్రీకరించే అవసరం ఉండదు. దాంతో పూర్తిగా డ్రైవింగ్, ట్రాక్పైనే దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది. హై పవర్డ్ హెడ్ లైట్స్, ఆధునిక సిగ్నలింగ్ సిస్టమ్స్ వంటి అధునాతన సాంకేతికత సురక్షితమైన, సమర్థవంతమైన కార్యకలాపాలను నిర్ధారిస్తుంది.ఇదీ చదవండి: జియోస్టార్ యూట్యూబ్ కంటెంట్ తొలగింపుషెడ్యుల్లో మార్పులురైల్వే నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంచడానికి రాత్రిపూట రైళ్ల షెడ్యుల్ను వ్యూహాత్మకంగా ప్లాన్ చేస్తారు. వేగవంతమైన ప్రయాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా పీక్ అవర్స్లో ప్రాంతాల మధ్య వస్తువులను రవాణా చేసే సరుకు రవాణా రైళ్ల కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తారు. -
జియోస్టార్ యూట్యూబ్ కంటెంట్ తొలగింపు
భారత బ్రాడ్కాస్టింగ్, డిజిటల్ స్ట్రీమింగ్ పరిశ్రమలో ప్రముఖ సంస్థగా ఉన్న జియోస్టార్(Jiostar) మే 1, 2025 నాటికి యూట్యూబ్ నుంచి ఎంటర్టైన్మెంట్ కంటెంట్ను తొలగించే ప్రణాళికలను ప్రకటించింది. పెయిడ్ సబ్స్క్రైబర్ల సంఖ్యను పెంచుకునేందుకు సంస్థ ఈమేరకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. పే-టీవీ(డబ్బు చెల్లిస్తే టీవీ సర్వీసులు అందించడం) డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫామ్ నుంచి ఉచిత డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్కు చందాదారుల వలసలను అరికట్టడానికి ఈ వ్యూహాత్మక నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుందని స్పష్టం చేసింది.జియోస్టార్ ఇకపై ప్రీమియం కంటెంట్ను సబ్స్రిప్షన్ పరిధిలోకి తీసుకురావాలనే వ్యూహానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇలా చేయడం ద్వారా పెయిడ్ సర్వీసులను పెంచుతూ సబ్స్రైబ్లను ప్రోత్సహించేందుకు వీలు అవుతుందని కంపెనీ నమ్ముతుంది. జియోసినిమా, డిస్నీ+ హాట్స్టార్ విలీనంతో ఓటీటీ విభాగంలో జియోస్టార్ కీలకంగా మారింది. ఇది బాలీవుడ్, అంతర్జాతీయ సినిమాలు, ప్రాంతీయ సిరీస్లు, లైవ్ స్పోర్ట్స్తో సహా విభిన్న కంటెంట్ను అందిస్తోంది.బ్రాడ్ కాస్టింగ్ పరిశ్రమపై ప్రభావంయూట్యూబ్ నుంచి కంటెంట్ను తొలగించాలన్న నిర్ణయం బ్రాడ్కాస్టింగ్ పరిశ్రమపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. టాటా ప్లే, ఎయిర్టెల్ డిజిటల్ టీవీ వంటి పే-టీవీ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫామ్లు ఉచితంగా ప్రీమియం కంటెంట్ అందిస్తున్నాయి. క్రమంగా ఈ ప్లాట్ఫామ్లు కూడా ఇదే పంథాను ఎంచుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దాంతో తమ సబ్స్క్రైబర్ల సంఖ్యను పెంచుకునే వీలు ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం పే-టీవీ సబ్ స్క్రిప్షన్ల సంఖ్య 8.4 కోట్లుగా ఉంది. ఇది గతంలో ఎక్కువగానే ఉండేది. చందాదారులను నిలుపుకోవడానికి, ఆదాయాన్ని పెంచుకోవడానికి కంపెనీలు విభిన్న మార్గాలను అన్వేషిస్తున్నాయి. భారతదేశంలో టీవీ సబ్ స్క్రిప్షన్ మార్కెట్ విలువ రూ.40,000 కోట్లు ఉంటుందని అంచనా.ఇదీ చదవండి: పండుగ వేళ పసిడి పరుగు.. తులం ఎంతంటే..సవాళ్లు ఇవే..సబ్స్క్రిప్షన్ ఆధారిత మోడల్పై కంపెనీలు దృష్టి పెట్టడం ఆదాయ వృద్ధికి అవకాశాలను పెంచేవైనప్పటికీ.. ఉచిత కంటెంట్కు అలవాటు పడిన భారతీయ వినియోగదారులు ఎంత మేరకు పెయిడ్ సబ్ స్క్రిప్షన్లకు మారుతారో గమనించాల్సి ఉంటుంది. ఏదేమైనా జియోస్టార్ కంటెంట్ లైబ్రరీ, లైవ్ స్పోర్ట్స్, ప్రాంతీయ కంటెంట్ వంటి ప్రత్యేక సదుపాయాలు వీక్షకులను సబ్స్క్రైబ్ చేసుకునే దిశగా ఆకర్షిస్తుందని కంపెనీ విశ్వసిస్తుంది. -
పండుగ వేళ పసిడి పరుగు.. తులం ఎంతంటే..
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు. హోలీ రోజున బంగారు ఆభరణాలు గిఫ్ట్గా ఇవ్వాలంటే మాత్రం ధరల విషయంగా కొంత ఆలోచించాలని సూచిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో శుక్రవారం రోజున గోల్డ్ రేట్లు(Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.82,300 (22 క్యారెట్స్), రూ.89,780 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. గురువారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.1,100, రూ.1,200 పెరిగింది.చెన్నైలో శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.1,100, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,200 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.82,300 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.89,780 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.1,100 పెరిగి రూ.82,450కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.1,200 పెరిగి రూ.89,930 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే శుక్రవారం వెండి ధరల్లోనూ(Silver Prices) మార్పులు కనిపించాయి. నిన్నటి ధరలతో పోలిస్తే వెండి కేజీపై ఏకంగా రూ.2,000 పెరిగి రూ.1,12,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
హోలీ.. ఆర్థిక వ్యవస్థకు ఆనంద కేళి
రంగుల పండుగ హోలీ కేవలం ఆనందం, ఐక్యతకు వేడుకగా మాత్రమేకాదు, దేశంలో గణనీయమైన ఆర్థిక వ్యాపారానికి తోడ్పాటునందిస్తోంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) గణాంకాల ప్రకారం ఈ ఏడాది హోలీ రోజున రూ.60,000 కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. గత ఏడాది నమోదైన రూ.50,000 కోట్ల వ్యాపారంతో పోలిస్తే ఇది 20 శాతం అధికమని తెలిపింది.అన్ని రంగాల్లో ఆర్థిక వృద్ధిసాధారణంగా పండుగ సమయాల్లో విభిన్న విభాగాల్లో వినియోగదారుల సంఖ్య పెరుగుతోంది. స్వీట్లు, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ), గిఫ్ట్ ఐటమ్స్, డ్రై ఫ్రూట్స్, దుస్తులు, పూలు, పండ్లు, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ వంటి ఉత్పత్తులకు అధిక డిమాండ్ ఉంటుంది. పండుగలకు ముందే కొందరు ఆయా వస్తువులను కొనుగోలు చేస్తే, పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ఇంకొందరు ఈమేరకు ఖర్చు చేస్తారు. దాంతో రిటైల్ వ్యాపారులతోపాటు, దుకాణదారులతో మార్కెట్లు సందడిగా ఉంటాయి. గతంలో కంటే ఈసారి అధికంగా ఖర్చు చేస్తారని అంచనాలు ఉండడంతో స్థానిక వ్యాపారాలు, చిన్న వ్యాపారులు, ఎంఎస్ఎంఈ రంగానికి ప్రయోజనం చేకూరుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.స్థానిక ఉత్పత్తులకు గిరాకీఈ ఏడాది వివిధ విభాగాల్లోని వ్యాపారులు భారత్లో తయారవుతున్న వస్తువులను ప్రమోట్ చేయడంపై దృష్టి సారించారు. వినియోగదారులు చైనీస్ ఉత్పత్తులకు దూరంగా స్థానికంగా తయారైన హెర్బల్ కలర్స్, ట్రెడిషనల్ వాటర్ గన్స్ (పిచ్కారీస్), బెలూన్లు, పూజా సామగ్రిని ఎంచుకుంటున్నారు. ఈ మార్పు దేశీయ పరిశ్రమలకు మద్దతుగా నిలుస్తుంది.ఇదీ చదవండి: బ్యాంకింగ్కు జెనరేటివ్ ఏఐ బూస్ట్!ఒక్క ఢిల్లీలోనే 3000కు పైగా కార్యక్రమాలు..పెద్ద ఎత్తున హోలీ మిలన్ కార్యక్రమాలు, సమావేశాలు ఆర్థిక వృద్ధికి మరింత దోహదం చేస్తున్నాయి. ఒక్క ఢిల్లీలోనే ఇలాంటి 3,000కు పైగా వేడుకలు నిర్వహించాలని నిర్ణయించడంతో వేదికలు, క్యాటరింగ్, సంబంధిత సేవలకు గిరాకీ పెరిగింది. వివిధ రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలను ఉత్తేజపరిచే ఈ ఉత్సవం సామర్థ్యం సాంస్కృతిక, సామాజిక కోణాలకు అతీతంగా దాని ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. -
బ్యాంకింగ్కు జెనరేటివ్ ఏఐ బూస్ట్!
ఆర్థిక సేవల రంగంలో, ముఖ్యంగా బ్యాంకింగ్లో ఉత్పాదకతను జెనరేటివ్ ఏఐ (Generative AI) గణనీయంగా పెంచనుంది. ఫైనాన్షియల్ సర్వీసెస్ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేయనుందని, కస్టమర్తో అనుసంధానత, కార్యకాలపాల సామర్థ్యాన్ని మెరుగుపరచనున్నట్టు ‘ఈవై’ ఇండియా నివేదిక తెలిపింది. 2030 నాటికి ఫైనాన్షియల్, సర్వీసెస్ రంగంలో ఉత్పాదకతను 34–38 శాతం మేర, బ్యాంకింగ్లో ఉత్పాదకతను 46 శాతం మేర జెనరేటివ్ ఏఐ అధికం చేస్తుందని అంచనా వేసింది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది.ఫైనాన్షియల్ సర్వీసెస్, రిటైల్, హెల్త్కేర్, లైఫ్ సైన్సెస్, మీడియా, ఎంటర్టైన్మెంట్, టెక్నాలజీ, ఆటోమోటివ్, ఇండ్రస్టియల్స్, ఎనర్జీ తదితర రంగాల్లోని 125కు పైగా ఉన్నత స్థాయి ఉద్యోగుల (సీఈవో, సీఎఫ్వో, సీవోవో తదితర) అభిప్రాయాలను ఈవై తన సర్వే కోసం సేకరించింది. ‘జెనరేటివ్ ఏఐపై పెట్టుబడులు పెరుగుతున్నాయి. 42 శాతం కంపెనీలు ఏఐ కోసం ప్రత్యేకంగా బడ్జెట్ను కేటాయిస్తున్నాయి. వాయిస్ బాట్స్, ఈమెయిల్ ఆటోమేషన్, బిజినెస్ ఇంటెలిజెన్స్, వర్క్ఫ్లో ఆటోమేషన్లో జెనరేటివ్ ఏఐని వేగంగా అమలు చేస్తున్నాయి’ అని ఈవై నివేదిక వివరించింది. ఇదీ చదవండి: ఎయిరిండియా అనుబంధ సంస్థలపై విదేశాల్లో రోడ్షోకస్టమర్ సేవల్లో జెనరేటివ్ ఏఐకంపెనీలు కస్టమర్ సేవల్లో జెనరేటివ్ ఏఐని అత్యధికంగా వినియోగిస్తున్నాయి. 68 శాతం సంస్థలు కస్టమర్ సేవల్లో జెనరేటివ్ ఏఐకి ప్రాధాన్యం ఇస్తున్నాయి. కార్యకలాపాల్లో 47 శాతం, అండర్రైటింగ్ కార్యలాపాల్లో 32 శాతం, అమ్మకాల్లో 26 శాతం, ఐటీలో 21 శాతం చొప్పున జెనరేటివ్ ఏఐ వినియోగానికి సంస్థలు ఇప్పటికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ కృత్రిమ మేధ అమలుతో కస్టమర్ల సంతృప్త స్థాయిలు మెరుగుపడినట్టు 63 శాతం కంపెనీలు తెలిపాయి. వ్యయాలను తగ్గించుకున్నామని 58 శాతం కంపెనీలు వెల్లడించాయి. కోర్ బ్యాంకింగ్ వ్యవస్థలు, సీఆర్ఎం, రుణాల మంజూరు, కార్డ్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్లు ఇతర విభాగాల్లో జెనరేటివ్ ఏఐని సంస్థలు అమలు చేస్తున్నాయి. దీంతో వ్యయాలు గణనీయంగా తగ్గుతున్నట్టు ఈవై ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ పార్ట్నర్ ప్రతీక్షా తెలిపారు. ఒక యూనిట్కు సాధారణ వ్యయాల్లో 90 శాతం మేర తగ్గుతున్నట్టు చెప్పారు. -
భారత్లో పెట్టుబడులు రెట్టింపు
ముంబై: ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడుల దిగ్గజం బ్లాక్స్టోన్ దేశీయంగా ఇన్వెస్ట్మెంట్ను రెట్టింపు చేయబోతున్నట్లు తెలియజేసింది. మౌలిక రంగం, క్రెడిట్ బిజినెస్ల్లో తాజాగా పెట్టుబడులు చేపట్టనున్నట్లు పేర్కొంది. దేశీయంగా బ్లాక్స్టోన్ 50 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులు కలిగి ఉంది. ఈ బాటలో పెట్టుబడులను 100 బిలియన్ డాలర్ల(రూ.8.7 లక్షల కోట్లు)కు చేర్చనున్నట్లు బ్లాక్స్టోన్ తెలియజేసింది. కాగా.. యూఎస్ టారిఫ్లను ఇండియా సమర్ధవంతంగా ఎదుర్కోగలదని సంస్థ ఛైర్మన్ స్టీఫెన్ ఏ ష్వార్జ్మ్యాన్ అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: ఆరేళ్లలో ఆస్తులమ్మి రూ.12,985 కోట్లు సమీకరణరెండు దశాబ్దాల పెట్టుబడి ప్రయాణంలో ప్రపంచవ్యాప్తంగా భారత్లోనే అధిక రిటర్నులు అందుకున్నట్లు ష్వార్జ్మ్యాన్ వెల్లడించారు. దేశీయంగా పోర్టులు, ఎయిర్పోర్టులు, రహదారి ఆస్తుల్లో ఇన్వెస్ట్ చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలియజేశారు. ష్వార్జ్మ్యాన్ గతంలో ప్రస్తుత యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్నకు సలహాదారుడిగా వ్యవహరించారు. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ, ట్రంప్ మధ్య అర్ధవంతమైన సమావేశం జరిగిందని, వాణిజ్య ఒప్పందంపై ఇరు నేతలు అంగీకారానికి వచ్చారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇప్పటికే భారత్ అధిక టారిఫ్ల అంశంపై కొన్ని సవరణలు చేపట్టినట్లు పేర్కొన్నారు. దేశీయంగా స్థూలఆర్థిక పరిస్థితులు పటిష్టంగా ఉన్నాయని, 6 శాతానికంటే తక్కువ వృద్ధి నమోదయ్యే అవకాశంలేదని అభిప్రాయ పడ్డారు. -
ఆరేళ్లలో ఆస్తులమ్మి రూ.12,985 కోట్లు సమీకరణ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ 2019 నుంచి ఆస్తుల మానిటైజేషన్ ద్వారా దాదాపు రూ.12,985 కోట్లు సమకూర్చుకున్నాయి. ఆస్తుల జాబితాలో భూములు, భవంతులు, టవర్లు, ఫైబర్ తదితరాలున్నట్లు కమ్యూనికేషన్ల సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పార్లమెంట్లో వెల్లడించారు.లోక్సభకు మంత్రి నివేదించిన వివరాల ప్రకారం 2025 జనవరి వరకూ భూములు, భవంతుల ద్వారా బీఎస్ఎన్ఎల్ రూ.2,388 కోట్లు సమీకరించగా.. ఎంటీఎన్ఎల్ రూ.2,135 కోట్లు అందుకుంది. సమీప భవిష్యత్లో సొంత అవసరాలకు వినియోగించని, యాజమాన్య బదిలీ హక్కులు కలిగిన భూములు, భవంతులను మాత్రమే మానిటైజ్ చేసినట్లు రాతపూర్వక సమాధానంలో చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఇక టవర్లు, ఫైబర్ ఆస్తుల ద్వారా బీఎస్ఎన్ఎల్ రూ.8,204 కోట్లు, ఎంటీఎన్ఎల్ రూ.258 కోట్లు సమకూర్చుకున్నట్లు తెలియజేశారు.దీర్ఘకాలిక ప్రభావాలు ఇలా..టెలికాం పీఎస్యూల ఆస్తుల మానిటైజేషన్ ద్వారా దీర్ఘకాలిక ప్రభావాలు ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. వారి అభిప్రాయాల ప్రకారం ఈ ఆస్తుల మానిటైజేషన్ రుణాల భారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ వంటి కంపెనీలకు లిక్విడిటీని అందిస్తుంది. నాన్ కోర్ ఆస్తులను విక్రయించడం ద్వారా ప్రాథమిక టెలికాం సేవలపై దృష్టి పెట్టవచ్చు. మౌలిక సదుపాయాలను ఆధునీకరించడంలో పెట్టుబడి పెట్టవచ్చు. అదనపు నిధులతో సర్వీస్ నాణ్యతను మెరుగుపరచడం, మార్కెట్ ఉనికిని విస్తరించడం ద్వారా పీఎస్యూలు ప్రైవేట్ సంస్థలతో పోటీపడే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: ఎయిరిండియా అనుబంధ సంస్థలపై విదేశాల్లో రోడ్షోసవాళ్లు ఇలా..ఆస్తుల మానిటైజేషన్ స్వల్పకాలిక ఆర్థిక ఉపశమనాన్ని అందించినప్పటికీ చందాదారులు పెంపును, అధిక నిర్వహణ ఖర్చులు వంటి అంతర్లీన సమస్యలను ఇది పరిష్కరించకపోవచ్చు. అసెట్ మానిటైజేషన్ చేస్తున్నా ప్రైవేట్ టెలికాం దిగ్గజాల నుంచి తీవ్రమైన పోటీ కారణంగా పీఎస్యూలు తమ మార్కెట్ వాటాను తిరిగి పొందడానికి సవాళ్లు ఎదుర్కోవచ్చు. దీనివల్ల భవిష్యత్తులో ప్రభుత్వ టెలికాం ఆదాయం క్షీణించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది ఈ రంగంలో దీర్ఘకాలిక పెట్టుబడులపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. -
ఎయిరిండియా అనుబంధ సంస్థలపై విదేశాల్లో రోడ్షో
ఈ ఏడాది(2025) చివరి నాటికి ఎయిరిండియా మాజీ అనుబంధ సంస్థల్లో వాటాను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు వీలుగా మే నెలలో రోడ్ షోలు చేపట్టాలని యోచిస్తోంది. భారత్సహా సింగపూర్, యూరప్లో వీటిని నిర్వహించాలని చూస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆగస్ట్లోగా ఆయా కంపెనీలపట్ల ఆసక్తి కలిగిన సంస్థలు బిడ్స్(ఈవోఐ) దాఖలు చేసేందుకు వీలు కల్పించనున్నట్లు తెలియజేశాయి.కేంద్రం విక్రయించాలని నిర్ణయించిన కంపెనీల జాబితాలో ఎయిరిండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ (ఏఐఈఎస్ఎల్), ఎయిరిండియా ఎయిర్ట్రాన్స్పోర్ట్ సర్వీసస్ (ఏఐఏటీఎస్ఎల్), ఎయిరిండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ (ఏఐఏఎస్ఎల్), హోటల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(హెచ్సీఐ), ఎయిర్లైన్ అలైడ్ సర్వీసెస్(ఏఏఎస్) ఉన్నాయి. వెరసి డిసెంబర్లోగా వాటాల విక్రయాన్ని పూర్తి చేసే సన్నాహాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ 2021వరకూ ప్రభుత్వ అజమాయిషిలోని ఎయిరిండియాకు అనుబంధ సంస్థలుగా వ్యవహరించాయి. కాగా.. 2022 జనవరిలో ఎయిరిండియా అధికారికంగా టాటా గ్రూప్ గూటికి చేరిన సంగతి తెలిసిందే.స్పైస్జెట్లో 1% వాటా అమ్మకం1.15 కోట్ల షేర్లు విక్రయించిన ప్రమోటర్బడ్జెట్ ధరల విమానయాన సంస్థ స్పైస్జెట్లో ప్రమోటర్ అజయ్ సింగ్ 0.9 శాతం వాటా విక్రయించారు. ఓపెన్ మార్కెట్ లావాదేవీ ద్వారా షేరుకి రూ.45.34 సగటు ధరలో 1.15 కోట్ల షేర్లు అమ్మివేశారు. వెరసి రూ.52.3 కోట్లు అందుకున్నారు. ఈ లావాదేవీ తదుపరి స్పైస్జెట్లో అజయ్ సింగ్ వాటా 22 శాతానికి పరిమితమైంది. మొత్తం ప్రమోటర్ గ్రూప్ వాటా 29.13 శాతం నుంచి 28.23 శాతానికి తగ్గింది. వాటా కొనుగోలుదారుల వివరాలు వెల్లడికాలేదు.ఇదీ చదవండి: జనరల్ ఇన్సూరెన్స్లోకి పతంజలి -
జనరల్ ఇన్సూరెన్స్లోకి పతంజలి
ఎఫ్ఎంసీజీ, హెర్బల్ ప్రొడక్టుల దిగ్గజం పతంజలి ఆయుర్వేద్ సాధారణ బీమా రంగంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకు వీలుగా మ్యాగ్మా జనరల్ ఇన్సూరెన్స్ను కొనుగోలు చేయనుంది. మ్యాగ్మా కొనుగోలుకి అదార్ పూనావాలా సంస్థ సనోటీ ప్రాపర్టీస్తో షేరు కొనుగోలు ఒప్పందం(ఎస్పీఏ) కుదుర్చుకుంది. రైజింగ్ సన్ హోల్డింగ్స్తో ఏర్పాటైన భాగస్వామ్య కంపెనీ(జేవీ) మ్యాగ్మా జనరల్ ఇన్సూరెన్స్లో సనోటీకి మెజారిటీ వాటా ఉంది. వెరసి మ్యాగ్మా కొనుగోలుకి ధరమ్పాల్ సత్యపాల్(డీఎస్) గ్రూప్తో కలసి పతంజలి రూ.4,500 కోట్లు వెచ్చించనుంది. సెలికా డెవలపర్స్, జాగ్వార్ అడ్వయిజరీ సర్వీసెస్తో కలసి డీల్కు సనోటీ బోర్డు ఆమోదముద్ర వేసింది. సాధారణ బీమా రంగంలో 70 ప్రొడక్టులతో కార్యకలాపాలు విస్తరించిన మ్యాగ్మా 2023–24లో రూ.3,295 కోట్ల స్థూల ప్రీమియం(జీడబ్ల్యూపీ)ను అందుకుంది. ఈ ఏడాది(2024–25) రూ.3,700 కోట్ల జీడబ్ల్యూపీ సాధించగలమని భావిస్తోంది.ఇదీ చదవండి: భారత్లో స్టార్లింక్ ఇంటర్నెట్ ఛార్జీలు ఇలా..వస్తువులు సాధారణరంగా జరిగే ప్రమాదాలవల్ల పాడైనప్పుడు లేదా దొంగతనం అయినప్పుడు జనరల్ ఇన్సూరెన్స్ దన్నుగా నిలుస్తోంది. ఈ సందర్భంగా ఆర్థికంగా నష్టాన్ని భర్తీ చేస్తుంది. వివిధ కంపెనీలు సాధారణ బీమాను కింది రూపాల్లో అందిస్తున్నారు.ఆరోగ్య బీమా: అనారోగ్యంతో కారణంగా వైద్య ఖర్చులను కవర్ చేస్తుంది.మోటార్ ఇన్సూరెన్స్: వాహనానికి జరిగే ప్రమాదాలు లేదా వాహనం వల్ల ఇతరులకు జరిగే ప్రమాదాలను కవర్ చేస్తుంది.హోమ్ ఇన్సూరెన్స్: అగ్నిప్రమాదం, ప్రకృతి వైపరీత్యాలు వంటి ప్రమాదాల నుంచి ఇంటిని అందులోని వస్తువులకు రక్షణగా నిలుస్తుంది.ట్రావెల్ ఇన్సూరెన్స్: ప్రయాణ సమయంలో ట్రిప్ క్యాన్సిలేషన్, లగేజీ పోయినా లేదా విదేశాల్లో మెడికల్ ఎమర్జెన్సీ వంటి అనుకోని సంఘటనలకు కవరేజీని అందిస్తుంది.వాణిజ్య బీమా: ఆస్తి నష్టం, ఉద్యోగి సంబంధిత సమస్యలు వంటి ప్రమాదాల నుంచి వ్యాపారాలకు రక్షణ కల్పిస్తుంది. -
ఐటీ పరిశ్రమలో ఉపాధి కల్పనపై అంచనాలు ఇలా..
న్యూఢిల్లీ: దేశీ ఐటీ కంపెనీలు వచ్చే ఆర్థిక సంవత్సరం(2025–26) స్వల్ప వృద్ధికే పరిమితంకానున్నట్లు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది. వెరసి ఐటీ పరిశ్రమ ఆదాయం డాలర్ల రూపేణా 4–6 శాతం బలపడనున్నట్లు తాజాగా అంచనా వేసింది. వృద్ధి పుంజుకునేటంతవరకూ ఉద్యోగ కల్పన సైతం మందగించవచ్చని తెలియజేసింది. సమీప కాలంలో ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు 12–13 శాతంగా నమోదుకావచ్చని అభిప్రాయపడింది. దేశీ ఐటీ పరిశ్రమ ఆదాయంలో 60 శాతం ఆక్రమిస్తున్న దిగ్గజాలను పరిగణనలోకి తీసుకుని ఇక్రా తాజా అంచనాలకు తెరతీసింది. వచ్చే ఏడాది చివర్లో వృద్ధి ఊపందుకునేటంతవరకూ ఉపాధి కల్పన అంతంతమాత్రంగానే నమోదుకావచ్చని పేర్కొంది. కాగా ఈ ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లో డాలర్ల రూపేణా దేశీ ఐటీ పరిశ్రమ ఆదాయం 3.6 శాతం వృద్ధిని అందుకున్నట్లు ఇక్రా వెల్లడించింది. గత మూడు క్వార్టర్లుగా నెమ్మదిగా ప్రారంభమైన రికవరీ ఇందుకు సహకరించినట్లు తెలియజేసింది. 2023–24లో నమోదైన తక్కువ వృద్ధి(లోబేస్) సైతం ఇందుకు కారణమని తెలియజేసింది. అంతేకాకుండా కొన్ని మార్కెట్లలో బీఎఫ్ఎస్ఐ, రిటైల్ రంగాలలో కస్టమర్ల విచక్షణాధారిత వ్యయాలు స్వల్పంగా పెరగడం మద్దతిచి్చనట్లు పేర్కొంది. జనరేటివ్ ఏఐపై పెట్టుబడులు కొత్త ఆర్డర్లకు దారి చూపినట్లు వివరించింది. తాజా నివేదికకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, కోఫోర్జ్, సైయెంట్, ఎల్టీఐమైండ్ట్రీ, ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్, బిర్లాసాఫ్ట్, మాస్టెక్, ఎంఫసిస్, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, జెన్సార్ టెక్నాలజీస్ను పరిగణనలోకి తీసుకుంది. -
మూడేళ్లలో మూడో అతిపెద్ద ఎకానమీ..
న్యూఢిల్లీ: భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా 2028 నాటికి అవతరిస్తుందని మోర్గాన్ స్టాన్లీ అంచనా వ్యక్తం చేసింది. ప్రపంచంలోనే అత్యంత డిమాండ్ ఉన్న వినియోగ మార్కెట్గా భారత్ మారుతోందంటూ.. స్థూల ఆర్థిక స్థిరత్వానికితోడు, మెరుగైన మౌలిక వసతులతో ప్రపంచ ఉత్పాదకతలో భారత్ తన వాటా పెంచుకోనున్నట్టు తెలిపింది. 2023 నాటికి 3.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్.. 2026 నాటికి 4.7 ట్రిలియన్ డాలర్లకు విస్తరించడం ద్వారా యూఎస్, చైనా, జర్మనీ తర్వాత నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని అంచనా వేసింది. 2028లో 5.7 ట్రిలియన్ డాలర్లతో జర్మనీని అధిగమించి భారత్ మూడో స్థానానికి చేరుతుందని పేర్కొంది. 1990లో ప్రపంచంలో 12వ స్థానంలో భారత్ ఉన్నట్టు తన నివేదికలో గుర్తు చేసింది. ఆ తర్వాత 2000 నాటికి 13వ స్థానానికి దిగిపోయిందని..తిరిగి 2020లో 9వ ర్యాంక్నకు, 2023లో 5వ స్థానానికి మెరుగుపడినట్టు వివరించింది. ప్రపంచ జీడీపీలో 3.5 శాతంగా ఉన్న భారత్ వాటా 2029 నాటికి 4.5 శాతానికి చేరుతుందని తెలిపింది. 2035 నాటికి 10.3 ట్రిలియన్ డాలర్లు.. భారత ఆర్థిక ప్రగతి విషయమై మోర్గాన్ స్టాన్లీ మూడు రకాల అంచనాలు వేసింది. ‘‘బేర్ కేసులో (ప్రతికూల పరిస్థితుల్లో) భారత ఆర్థిక వ్యవస్థ 2025 నాటికి ఉన్న 3.65 ట్రిలియన్ డాలర్ల స్థాయి నుంచి 2035 నాటికి 6.6 ట్రిలియన్ డాలర్లకు విస్తరించొచ్చు. బేస్ కేసులో (తటస్థ పరిస్థితుల్లో) 8.8 ట్రిలియన్ డాలర్లకు.. బుల్ కేసులో (సానుకూల పరిస్థితుల్లో) 10.3 ట్రిలియన్ డాలర్లకు వృద్ధి చెందుతుంది’’అని తెలిపింది. 2025లో తలసరి ఆదాయం 2,514 డాలర్లుగా ఉంటే బేర్ కేసులో 4,247 డాలర్లకు, బేస్ కేసులో 5,683 డాలర్లకు, బుల్ కేసులో 6,706 డాలర్లకు వృద్ది చెందుతుందని అంచనా వేసింది. ‘‘అంతర్జాతీయ ఉత్పాదకతలో భారత్ వచ్చే దశాబ్ద కాలంలో తన వాటాను పెంచుకుంటుంది. జనాభాలో వృద్ధి, స్థిరమైన ప్రజాస్వామ్యం, విధానపరమైన మద్దతుతో స్థూల ఆర్థిక స్థిరత్వం, మెరుగైన మౌలిక వసతులు, పెరుగుతున్న వ్యాపార వర్గం, సామాజిక పరిస్థితుల్లో మెరుగుదల అనుకూలించనున్నాయి’’అని మోర్గాన్ స్టాన్లీ నివేదిక తెలిపింది. అతిపెద్ద వినియోగ మార్కెట్ ప్రపంచంలో టాప్ వినియోగ మార్కెట్గా భారత్ అవతరించనుందని మోర్గాన్ స్టాన్లీ అంచనా. ఇంధన పరివర్తనం దిశగా భారత్ అతిపెద్ద మార్పును చూడనుందని.. జీడీపీలో రుణ నిష్పత్తి పెరుగుతోందని, అదే సమయంలో జీడీపీలో తయారీ రంగం వాటా సైతం వృద్ధి చెందుతోందని పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది.. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని మోర్గాన్ స్టాన్లీ తెలిపింది. ‘‘ఇటీవలి వారాల్లో అధిక ఫ్రీక్వెన్సీ సంకేతాలు మిశ్రమంగా ఉన్నాయి. కానీ, కొన్ని నెలల క్రితంతో పోల్చి చూస్తే మెరుగ్గా ఉన్నాయి. ద్రవ్య, పరపతి విధాన మద్దతుకుతోడు, సేవల ఎగుమతులు పుంజుకోవడంతో 2024 ద్వితీయార్ధంలో మందగమనం నుంచి వృద్ధి కోలుకుంటుందని భావిస్తున్నాం’’అని పేర్కొంది. 2024–25లో జీడీపీ 6.3 శాతం మేర, 2025–26లో 6.5 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. రానున్న రోజుల్లో వినియోగం అన్ని విభాగాల్లోనూ కోలుకోవచ్చంటూ.. ఆదాయ పన్ను తగ్గింపు పట్టణ డిమాండ్కు ప్రేరణనిస్తుందని, గ్రామీణ వినియోగానికి మద్దతుగా నిలుస్తుందని పేర్కొంది. 2024–25లో ద్రవ్యోల్బణం 4.9 శాతంగా, 2025–26లో 4.3 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. సేవల ఎగుమతుల్లో ఉన్న వృద్ధి వస్తు ఎగుమతుల్లో ఉన్న బలహీనతను కొంత వరకు భర్తీ చేస్తుందని తెలిపింది. అంతర్జాతీయంగా మందగమనం లేదా సమీప కాలంలో మాంద్యం వంటి పరిస్థితులు తలెత్తితే అవి తమ అంచనాలకు సవాలు కాగలవని.. అలాంటి పరిస్థితుల్లో 2025లో భారత ఈక్విటీలు గరిష్ట స్థాయిలకు దూరంగా ఉండొచ్చని పేర్కొంది. -
ఐపీఓకు ఎల్జీ ఎల్రక్టానిక్స్ రెడీ
న్యూఢిల్లీ: హోమ్ అప్లయెన్సెస్ దిగ్గజం ఎల్జీ ఎల్రక్టానిక్స్ ఇండియా పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదముద్ర వేసింది. తద్వారా దక్షిణ కొరియా దిగ్గజం ఎల్జీ దేశీ అనుబంధ సంస్థ రూ. 15,000 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వెరసి దేశీయంగా లిస్టయిన రెండో దక్షిణ కొరియా కంపెనీగా నిలవనుంది. గతేడాది అక్టోబర్లో హ్యుందాయ్ మోటార్స్ ఇండియా పబ్లిక్ ఇష్యూ చేపట్టి స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన విషయం విదితమే. ఎల్జీ ఎల్రక్టానిక్స్ ఇండియా 2024 డిసెంబర్లో సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా మాతృ సంస్థ 15 శాతం వాటాకు సమానమైన 10.18 కోట్ల షేర్లను విక్రయించనుంది. గత నెలలో ఐపీవోపై కంపెనీ రోడ్షోలను సైతం ప్రారంభించింది. హోమ్ అప్లయెన్సెస్, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్లో దేశీయంగా ఎల్జీ టాప్ ర్యాంక్ సంస్థలలో ఒకటిగా నిలుస్తోంది. కంపెనీ ప్రొడక్టులలో వాషింగ్ మెషీన్లు, లెడ్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, మైక్రోవేవ్లు, వాటర్ ఫిల్టర్లు తదితరాలున్న సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్లోని నోయిడా, మహారాష్ట్రలోని పుణేలో తయారీ యూనిట్లను కలిగి ఉంది. 2023–24లో రూ. 64,088 కోట్ల ఆదాయం అందుకుంది. -
వెల్త్టెక్ ప్లాట్ఫామ్లకు ఏఐ దన్ను
వ్యక్తిగత రుణంపై 20 శాతం పైగా భారీ వడ్డీ రేటుతో సతమతమవుతున్న ఓ ఐటీ ప్రొఫెషనల్కి కృత్రిమ మేధ (ఏఐ) రూపంలో సమస్యకు ఓ పరిష్కారం లభించింది. మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోను ఏఐ ఆధారిత వెల్త్టెక్ ప్లాట్ఫాంకు అనుసంధానించడం ద్వారా తన దగ్గరున్న ఫండ్స్పై అత్యంత చౌకగా 10.5 శాతానికే రుణాన్ని పొందే అవకాశం ఉన్నట్లు తెలుసుకున్నారు. ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడంతో పాటు ఏఐ టెక్నాలజీతో ఆదా చేసుకునే మార్గాలను కూడా అందిపుచ్చుకున్నారు. ఇక ఏళ్ల తరబడి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్న మరో ఇన్వెస్టరుకు.. సదరు ఫండ్ పనితీరు అంత గొప్పగా లేదనిపించింది. దీంతో ఓ వెల్త్టెక్ ప్లాట్ఫాం మానిటరింగ్ సాధనాలను ఉపయోగించుకుని మరింత మెరుగైన రాబడినిచ్చే ఫండ్కి మారగలిగారు. మంచి ప్రయోజనం పొందారు.ఇలా సాధారణంగా సంస్థాగత ఇన్వెస్టర్లకే లభ్యమయ్యే పెట్టుబడుల పరిజ్ఞానాన్ని సామాన్య మదుపరులు కూడా అందుకోవడంలో వెల్త్టెక్ స్టార్టప్లు దన్నుగా నిలుస్తున్నాయి. అధునాతనమైన కృత్రిమ మేథ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), జనరేటివ్ ఏఐ (జెన్ఏఐ) సాంకేతికతల వినియోగంతో ఈ అంకురాలు దూసుకెళ్తుండటంతో దేశీయంగా వెల్త్ మేనేజ్మెంట్ విభాగంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్లాట్ఫాంలు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు వివిధ రకాల మదుపరులకు సంపద నిర్వహణ విషయంలో మరింత వ్యక్తిగత స్థాయిలో సలహాలు ఇస్తున్నాయి. ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలోను, రిసు్కలను అధిగమించడంలోను తోడ్పాటునిస్తున్నాయి. టెక్సై రీసెర్చ్ నివేదిక ప్రకారం దేశీయంగా వెల్త్ మేనేజ్మెంట్ సేవల మార్కెట్ 2023లో 429.1 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది 2025 నుంచి 2029 మధ్య కాలంలో వార్షిక ప్రాతిపదికన 4.56 శాతం చొప్పున వృద్ధి చెందనుంది. ఈ ఏడాదే ఏఐ అప్లికేషన్స్ తోడ్పాటుతో ఈ రంగం 1–2 బిలియన్ డాలర్ల మేర పెరగవచ్చనే అంచనాలు ఉన్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు, ద్వితీయ..తృతీయ శ్రేణి నగరాల్లో సంపన్నులు, టెక్నాలజీ వినియోగం విస్తృతంగా పెరుగుతుండటంలాంటి అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. వందకు పైగా అంకురాలు..అధ్యయన సంస్థ ట్రాక్షన్ ప్రకారం ప్రస్తుతం దాదాపు 122 అంకురాలు ఈ తరహా సేవలు అందిస్తున్నాయి. ఇన్వెస్టర్ఏఐ అనే సంస్థ నేరుగా బ్రోకరేజ్ ప్లాట్ఫాంలతో అనుసంధానమై సరీ్వసులు అందిస్తోంది. చాట్జీపీటీ తరహా టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈవో బ్రూస్ కీత్ వెల్లడించారు. దీనితో ట్రేడింగ్లో 70% వరకు విజయం సాధించే అవకాశాలు ఉంటున్నాయన్నారు. మైఫై అనే మరో స్టార్టప్ సంస్థ, మార్కెట్ ధోరణులను విశ్లేషించి, తగిన పెట్టుబడి వ్యూహాలను సూచించేందుకు ఏఐ, జెన్ఏఐ సాంకేతికతలను ఉపయోగిస్తోంది. ఆటోమేటెడ్ అసిస్టెంట్లు, రియ ల్ టైమ్ విశ్లేషణలతో ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఉండే కచి్చతమైన ఫలితాలనిచ్చే సలహాలను అందిస్తోంది.పెట్టుబడుల జోరు.. వెల్త్టెక్ స్టార్టప్లకున్న సామర్థ్యాలను గుర్తించి, వాటిల్లో పెట్టుబడులు పెట్టేందుకు వెంచర్ క్యాపిటలిస్టులు ముందుకొస్తున్నారు. డిజర్వ్ అనే సంస్థలో 2024 జూలైలో ప్రేమ్జీ ఇన్వెస్ట్ సారథ్యంలో ఇన్వెస్టర్లు 32 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టారు. ఇది పోర్ట్ఫోలియోను సమర్ధవంతంగా తీర్చిదిద్దేందుకు లక్షల కొద్దీ డేటా పాయింట్లను విశ్లేషించి, తగు సలహాలిస్తుంది. ఇక గురుగ్రామ్కి చెందిన సెంట్రిసిటీ అనే మరో స్టార్టప్ .. 20 మిలియన్ డాలర్లు సమీకరించింది. ఇది అత్యంత సంపన్నులు, స్వతంత్ర ఫైనాన్షియల్ ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూటర్లకు ఆర్థిక సలహాలు అందిస్తోంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
హల్దీరామ్స్లో టెమాసెక్కు వాటా
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ హల్దీరామ్స్ స్నాక్స్ ఫుడ్లో సింగపూర్ సావరిన్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం టెమాసెక్ 10 శాతం వాటా కొనుగోలు చేస్తోంది. కంపెనీ విలువను 10 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 85,000 కోట్లు)గా మదింపు చేసి వాటాను సొంతం చేసుకుంటున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. ఈ వారం మొదట్లో ఇందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించాయి. అంటే 10 శాతం వాటాకు సుమారు బిలియన్ డాలర్లు(రూ. 8,500 కోట్లు) వెచి్చంచనున్నట్లు అంచనా. దేశీయంగా ప్యాక్డ్ స్నాక్, స్వీట్స్ తయారీలో దిగ్గజంగా నిలుస్తున్న హల్దీరామ్స్ రెస్టారెంట్లను సైతం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 2023–24లో రూ. 12,500 కోట్ల టర్నోవర్ సాధించింది. కంపెనీలో మరింత వాటా విక్రయం ద్వారా ప్రమోటర్లు అగర్వాల్ కుటుంబం మరో ఇన్వెస్టర్కు సైతం చోటు కల్పించనున్నట్లు తెలుస్తోంది. కొద్ది నెలలుగా పీఈ దిగ్గజాలు బ్లాక్స్టోన్, అల్ఫావేవ్ గ్లోబల్, బెయిన్ క్యాపిటల్ కన్సార్షియం తదితరాలతో వాటా విక్రయానికి హల్దీరామ్స్ చర్చలు నిర్వహించింది. కాగా.. వచ్చే ఆర్థిక సంవత్సరం(2025–26)లో పబ్లిక్ ఇష్యూ చేపట్టే అవకాశముంది. తొలుత మెజారిటీ వాటాను విక్రయించాలని భావించిన ప్రమోటర్లు తదుపరి మైనారిటీ వాటా విక్రయానికే ఆసక్తి చూపుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. -
ఐకూ నుంచి నియో 10ఆర్.. పవర్ఫుల్ గేమింగ్ ఫోన్
కాలేజీ విద్యార్థులు, టెక్నాలజీ ఔత్సాహికులు, యువ గేమర్ల కోసం రూపొందించిన నియో10ఆర్ స్మార్ట్ఫోన్ను ఐకూ ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ. 24,999గా ఉంటుంది. అమెజాన్, ఐకూ ఈ–స్టోర్లలో మార్చ్ 19 నుంచి అందుబాటులో ఉంటుంది. దీనికోసం ప్రీ–బుకింగ్స్ ప్రారంభించినట్లు సంస్థ తెలిపింది.ఐకూ నియో 10ఆర్ 5జీ స్మార్ట్ఫోన్ మూన్నైట్ టైటానియం, రేజింగ్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అమెజాన్ నుండి ఫోన్ పొందినప్పుడు ఫోన్ సెటప్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంటుంది. 8జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ, 12జీబీ+256జీబీ వేరియంట్లలో వస్తుంది. వీటి ధరలు వరుసగా రూ.26,999, రూ.28,999, రూ.30,999. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ కార్డుతో కొంటే రూ.2,000 తక్షణ డిస్కౌంట్, రూ.2000 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది.ఫోన్ స్పెసిఫికేషన్లుఇందులో స్నాప్డ్రాగన్ 8ఎస్ థర్డ్ జనరేషన్ చిప్సెట్, 6400 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.78 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్882 ప్రైమరీ కెమెరా, ఫన్టచ్ ఓఎస్ 15 తదితర ఫీచర్లు ఉన్నాయి. LPDDR5X ర్యామ్, 256 జీబీ యూఎఫ్ఎస్ 4.1 ఇంటర్నల్ స్టోరేజ్. ఈ ఫోన్ యాన్ టు టెస్ట్ లో 1.7+ మిలియన్ పాయింట్లు సాధించింది. అలాగే ఐపీ 65 రేటింగ్ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే ఈ ఫోన్ లో 3 ఏళ్ల ఓఎస్ అప్ డేట్స్, 4 ఏళ్ల సెక్యూరిటీ అప్ డేట్స్ లభిస్తాయి. -
Ola Flash Sale: ఓలా స్కూటర్లు కొనేవారికి ‘పండగ’
ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తన పాపులర్ ఎస్ 1 శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్లపై గణనీయమైన డిస్కౌంట్లను అందిస్తూ ప్రత్యేక హోలీ ఫ్లాష్ సేల్ను ప్రారంభించింది. ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో కంపెనీ ఈ విషయాన్ని ప్రకటించింది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నవారు అద్భుతమైన ఆఫర్ను వినియోగించుకోవచ్చు.ఈ లిమిటెడ్ టైమ్ ప్రమోషన్ లో భాగంగా ఓలా కస్టమర్లు ఎస్ 1 ఎయిర్ పై రూ.26,750 వరకు, ఎస్ 1 ఎక్స్ ప్లస్ (జెన్ 2) ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.22,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇప్పుడు ఎస్ 1 ఎయిర్ ధర రూ .89,999, ఎస్ 1 ఎక్స్ ప్లస్ (జెన్ 2) రూ .82,999 అని ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. అంతేకాకుండా, తాజా ఎస్ 1 జెన్ 3 మోడళ్లతో సహా మిగిలిన ఎస్ 1 శ్రేణిపై రూ .25,000 వరకు డిస్కౌంట్లను అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.తగ్గింపు తర్వాత ఓలా ఎలక్ట్రిక్ ఎస్ 1 శ్రేణి స్కూటర్ల ధరలు రూ .69,999 నుంచే ప్రారంభమవుతాయి. గరిష్టంగా రూ .1,79,999 ఉంటుంది. కాగా ఎస్ 1 జెన్ 2 స్కూటర్ల కొత్త కొనుగోలుదారులకు కూడా అదనపు ప్రయోజనాలను అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. వీరు రూ .2,999 విలువైన మూవ్ ఓఎస్ + కు ఒక సంవత్సరం ఉచిత సబ్ స్క్రిప్షన్, కేవలం రూ .7,499 లకే రూ .14,999 విలువైన ఎక్స్టెండెడ్ వారంటీని పొందవచ్చు.ఎస్ 1 జెన్ 3 పోర్ట్ ఫోలియోలో ఫ్లాగ్ షిప్ ఎస్ 1 ప్రో ప్లస్ 5.3 కిలోవాట్, 4 కిలోవాట్ బ్యాటరీ ఆప్షన్లను కలిగి ఉంది. వీటి ధరలు వరుసగా రూ .1,85,000, రూ .1,59,999. ఎస్ 1 జెన్ 3 శ్రేణిలోని ఇతర మోడళ్లలో ఎస్ 1 ప్రో (4 కిలోవాట్, 3 కిలోవాట్ బ్యాటరీ వేరియంట్లలో లభ్యం) ధరలు వరుసగా రూ .1,54,999, రూ .1,29,999. ఇక 2 కిలోవాట్, 3 కిలోవాట్, 4 కిలోవాట్ ఆప్షన్లలో లభించే ఎస్ 1 ఎక్స్ శ్రేణి ధరలు వరుసగా రూ.89,999, రూ.1,02,999, రూ.1,19,999 కాగా, 4 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన ఎస్ 1 ఎక్స్ ప్లస్ ధర రూ.1,24,999. మునుపటి ఎస్ 1 జెన్ 2 స్కూటర్లపై ఆసక్తి ఉన్నవారి కోసం ఓలా ఎలక్ట్రిక్ ఎస్ 1 ప్రో, ఎస్ 1 ఎక్స్ వంటి మోడళ్లను 2 కిలోవాట్ల నుండి 4 కిలోవాట్ల వరకు బ్యాటరీ ఎంపికలతో అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఎస్ 1 ప్రో రూ .1,49,999. ఎస్ 1 ఎక్స్ (2 కిలోవాట్) రూ .84,999 నుండి ప్రారంభమవుతుంది. ఈ పేర్కొన్న ధరలు ఎక్స్-షోరూమ్వి, అలాగే ఫేమ్ ఇండియా ప్రోత్సాహకాల వర్తింపు తుది ధరలని ఓలా ఎలక్ట్రిక్ వివరణ ఇచ్చింది. -
TCS చేతికి హ్యాపీ హోమ్స్.. రూ. 2,250 కోట్ల డీల్
దర్శితా సదరన్ ఇండియా హ్యాపీ హోమ్స్ను కొనుగోలు చేస్తున్నట్లు ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) వెల్లడించింది. ఈ డీల్ విలువ రూ. 2,250 కోట్లు. ఒప్పందంలో భాగంగా దర్శితాకు చెందిన స్థలం, భవంతి టీసీఎస్కు దక్కనున్నాయి. వీటిని తమ డెలివరీ సెంటర్ కోసం కంపెనీ ఉపయోగించుకోనుంది.‘2004లో ఏర్పాటైన దర్శితా సదరన్ ఇండియా హ్యాపీ హోమ్స్.. కమర్షియల్ ప్రాపర్టీని అభివృద్ధి చేయడం, పరిశ్రమలకు లీజుకివ్వడం తదితర కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ ప్రాపర్టీ ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నందున, ఆదాయ ఉత్పత్తి ఇంకా ప్రారంభం కాలేదు. అందువల్ల గత మూడు సంవత్సరాల టర్నోవర్ శూన్యం" అని రెగ్యులేటరీ ఫైలింగ్ లో కంపెనీ పేర్కొంది. రెండేళ్ల తర్వాత సంస్థలో 100 శాతం ఈక్విటీ షేర్లను టీసీఎస్ కొనుగోలు చేసే అవకాశం ఉంది.టాటా రియాల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కు చెందిన రెండు అనుబంధ సంస్థలైన టీఆర్ఐఎల్ బెంగళూరు రియల్ ఎస్టేట్ ఫైవ్ లిమిటెడ్, టీఆర్ఐఎల్ బెంగళూరు రియల్ ఎస్టేట్ సిక్స్ లిమిటెడ్లను రూ.1,625 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు ఈ ఏడాది జనవరిలో టీసీఎస్ ప్రకటించింది. ఈ ఒప్పందం 2025 జనవరి చివరి నాటికి ముగిసింది. -
ధీరూభాయ్ అంబానీ సంతకం వృథా కాబోతోంది..
చండీగఢ్కు చెందిన వ్యక్తి ఇల్లు శుభ్రం చేస్తుండగా 37 ఏళ్ల నాటి రూ.12 లక్షల విలువైన రిలయన్స్ షేర్ సర్టిఫికెట్లు బయటపడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడా వ్యక్తికి వీటిని డిజిటలైజేషన్ చేసుకుందామని ప్రయత్నించగా చిక్కులు ఎదురవుతున్నాయి. దీంతో వాటిని అలాగే వదిలేయాలని నిర్ణయానికి వచ్చేశాడు.వివరాల్లోకి వెళ్తే.. చండీగఢ్కు చెందిన రతన్ ధిల్లాన్ వ్యక్తి ఇల్లు శుభ్రం చేస్తుండగా 37 ఏళ్ల నాటి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) షేర్ సర్టిఫికెట్లు బయటపడ్డాయి. 1988లో ఒక్కొక్కటి రూ.10 చొప్పున వీటిని కొనుగోలు చేయగా ఈ షేర్లు స్టాక్ స్ప్లిట్స్, బోనస్ ద్వారా 960 రెట్లు పెరిగాయి. దీంతో వీటి ప్రస్తుత విలువ రూ.12 లక్షలకు చేరింది.ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్న రతన్ ధిల్లాన్ మొదట వాటిని డిజిటలైజ్ చేసుకోవాలో సలహా కోరారు. అయితే చట్టపరమైన వారసుడి సర్టిఫికెట్, వారసత్వ ధృవీకరణ పత్రం, ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ (ఐఈపీఎఫ్ఏ) క్లియరెన్స్ అవసరమయ్యే విస్తృతమైన పేపర్ వర్క్ గురించి తెలుసుకున్న తరువాత, ధిల్లాన్ ఈ ప్రయత్నాన్ని విరమించుకుంటున్నట్లు ప్రకటించారు.ధీరూభాయ్ అంబానీ సంతకాలు వృథా కాబోతున్నాయని, షేర్ల డిజిటలైజేషన్ చేయకూడదని నిర్ణయించుకున్నానని రతన్ ధిల్లాన్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. "ఈ ప్రక్రియ చాలా సుదీర్ఘమైనది- చట్టపరమైన వారసుడి ధృవీకరణ పత్రాన్ని పొందడానికే 6-8 నెలలు పడుతుంది. ఐఈపీఎఫ్ఏ ప్రక్రియకు 2-3 సంవత్సరాలు పడుతుంది. అంత సమయాన్ని వెచ్చించడంలో అర్థం కనిపించడం లేదు. భారత్ తన పేపర్ వర్క్ ను క్రమబద్ధీకరించుకోవాల్సిన అవసరం ఉంది" అని పేర్కొన్నారు.ప్రస్తుతానికి ఫిజికల్ షేర్ సర్టిఫికెట్లను ఏమీ చేయకుండా అలాగే వదిలేస్తానని ధిల్లాన్ తెలిపారు. రతన్ ధిల్లాన్ నిర్ణయంపై మైక్రోబ్లాగింగ్ సైట్ ‘ఎక్స్’ (గతంలో ట్విటర్) లో స్పందనలు వెల్లువెత్తాయి. పలువురు యూజర్లు షేర్ సర్టిఫికెట్ల డిజిటలైజేషన్లో తమ అనుభవాలను పేర్కంటూ కామెంట్లు చేశారు.Final Update: It seems Dhirubhai Ambani’s signatures will go to waste, as I’ve decided not to proceed with digitizing the shares. The process is just too lengthy—obtaining the legal heir certificate alone takes 6-8 months, and the IEPFA process reportedly takes 2-3 years. I… https://t.co/sDt1uPKiqL— Rattan Dhillon (@ShivrattanDhil1) March 12, 2025 -
స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లూ.. వీళ్లతో జాగ్రత్త!
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులపై గ్యారంటీ రాబడిని అందిస్తామంటూ కొంతమంది వ్యక్తులు ఇన్వెస్టర్లను మోసగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సాక్ట్ ఎక్స్ఛేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ (NSE నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్) తెలిపింది. కొన్ని సంస్థల పేరుతో మదుపర్లను బురిడీ కొట్టించి వారి నుంచి ట్రేడింగ్ అకౌంట్ లాగిన్ ఐడీ, పాస్వర్డ్ వంటి వివరాలను తీసుకుంటున్నారని, ఇటువంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చిరించింది.మోసగాళ్లు.. వారి ఫోన్నంబర్లు ఇవే..ఇటీవల తమ దృష్టికి వచ్చిన కొంత మంది మోసపూరిత వ్యక్తులు.. వారి ఫోన్ నంబర్లు, వారు పేర్కొన్న సంస్థల వివరాలను ఎస్ఎస్ఈ వెల్లడించింది.“టీజీ లెవెల్” (TG Level) అనే సంస్థ పేరుతో మొబైల్ నంబర్ 8420583592 ద్వారా మోసగిస్తున్నారు.“వీవీఎల్” (VVL) అనే సంస్థ పేరుతో జైరామ్ భట్ బోధిస్తారని లీలా తలస్సా అనే వ్యక్తి9662890247 నంబర్ ద్వారా మోసగిస్తున్నారు.సుజల్ పటేల్, నవదీప్ బజ్వా అనే వ్యక్తులు “డ్యామ్ ట్రేడ్ క్యాపిటల్” (DAM Trade Capital) అనే సంస్థతో అనుబంధం ఉన్నట్లు 7054874084, 9967603975 నంబర్ల ద్వారా మోసగిస్తున్నారు.“సుప్రీమస్ ఏంజెల్” (Supremus Angel) అనే సంస్థకు సంబంధించిన వాళ్లమంటూ జిగ్నేష్ , “ఎక్స్నెస్ బ్రోకర్” (Exnes Broker) అనే సంస్థ చెందిన వ్యక్తలమంటూ తేజస్ పటేల్, జగదీష్ అనే వ్యక్తులు 8780321223, 9375033033 నంబర్ల ద్వారా ఇన్వెస్టర్లను సంప్రదిస్తున్నారు.పైన పేర్కొన్న వ్యక్తులు, సంస్థలు, మొబైల్ నంబర్ల నుంచి ఫోన్ చేసి స్టాక్ మార్కెట్లో ఖచ్చితమైన రాబడులు అందిస్తామని వాగ్దానం చేసి తమ ఇన్వెస్ట్మెంట్ పథకాలకు సభ్యత్వాన్ని పొందాలని కోరితే స్పందించవద్దని ఎన్ఎస్ఈ సూచించింది. ఇటువంటి వాగ్దానాలు చేయటం చట్ట ప్రకారం నిషేధమని స్టాక్ ఎక్స్ఛేంజీ స్పష్టం చేసింది. తమ యూజర్ ఐడీ, పాస్వర్డ్ వంటి ట్రేడింగ్ ఖాతా వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించింది. ఇలా ఎవరైనా వ్యక్తులు, సంస్థలు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ రిజిస్టర్డ్ మెంబర్గా పేర్కొంటే తమ వెబ్సైట్లో https://www.nseindia.com/invest/find-a-stock-broker లింక్ ద్వారా ధ్రువీకరించుకోవచ్చని తెలిపింది. -
‘జీతాల తేడాలొద్దు.. ఉద్యోగులను మనుషుల్లా చూడండి’
ఉద్యోగుల మధ్య జీతాల ( salaries ) తేడాల్లేకుండా వారిని మనుషుల్లాగా చూడాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి (Infosys founder Narayana Murthy) వ్యాపార సంస్థలు, పారిశ్రామికవేత్తలకు ఉద్బోధించారు. కారుణ్య పెట్టుబడిదారీ విధానాన్ని అవలంబించడం ద్వారా తక్కువ, ఎక్కువ అనే వేతన వ్యత్యాసాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని ‘టై కాన్ ముంబై 2025’ కార్యక్రమంలో మాట్లాడుతూ అభిప్రాయపడ్డారు.ప్రతి కార్పొరేట్ ఉద్యోగి గౌరవాన్ని, హుందాతనాన్ని నిలబెట్టాల్సి ఉందని, ఇందుకోసం ‘ఉద్యోగులను ప్రశంసించేటప్పుడు బహిరంగంగా, వారి లోపాలను చెప్పాల్సినప్పుడు ఏకాంతంగా చెప్పాలి. సాధ్యమైనంత వరకు సంస్థ ఫలాలను కంపెనీ ఉద్యోగులందరికీ న్యాయంగా పంచాలి’ అని నారాయణమూర్తి సూచించారు.దేశంలోని వ్యాపార సంస్థలు, పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారీ విధానాన్ని కరుణతో స్వీకరించినప్పుడే భవిష్యత్ భారత అభివృద్ధి, పేదరిక నిర్మూలన జరుగుతుందని ఆయన అన్నారు. దేశాన్ని గ్లోబల్ లీడర్ గా తీర్చిదిద్దేందుకు భారత్ లోని యువత కృషి చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన మూర్తి గతంలో వారానికి 70 గంటల పనిపై చేసిన వ్యాఖ్యలపై విమర్శలు ఎదుర్కొన్నారు.టై కాన్ ముంబై 2025లో టై ముంబై మాజీ వ్యవస్థాపక అధ్యక్షుడు హరీష్ మెహతాతో మాట్లాడిన మూర్తి, ప్రస్తుత సోషలిస్టు మనస్తత్వంలో దేశం అభివృద్ధి చెందదని అభిప్రాయపడ్డారు. "పెట్టుబడిదారీ విధానం అంటే సంపదను సృష్టించడానికి ప్రజలు కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చేలా అవకాశం కల్పించడం. ప్రజలకు ఉద్యోగాలు కల్పించి తద్వారా పేదరికాన్ని తగ్గించడం. పన్నుల ద్వారా దేశ అభివృద్ధికి దోహదం చేయడం" అని మూర్తి వివరించారు. -
ఇన్ఫీలో శ్రుతి శిబూలాల్ పెట్టుబడి
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు, మాజీ సీఈవో ఎస్డీ శిబూలాల్ కుమార్తె శ్రుతి కంపెనీ షేర్లను కొనుగోలు చేశారు. ఓపెన్ మార్కెట్ లావాదేవీ ద్వారా 29.84 లక్షల షేర్లను సొంతం చేసుకున్నారు. ఇందుకు శ్రుతి శిబూలాల్ దాదాపు రూ. 470 కోట్లు వెచ్చించారు.షేరుకి రూ. 1,574 సగటు ధరలో వీటిని కొనుగోలు చేశారు. ఎస్డీ శిబూలాల్ కుటుంబ సభ్యులలో ఒకరైన గౌరవ్ మన్చందా ఈ షేర్లను విక్రయించారు. కాగా.. మంగళవారం సైతం శ్రుతి శిబూలాల్ రూ. 494 కోట్ల విలువైన ఇన్ఫోసిస్ వాటాను కొనుగోలు చేయడం గమనార్హం! -
ఫ్రెషర్లకు డిమాండ్: ఐటీలో నియామకాలు డబుల్
గతకొన్ని నెలలుగా దిగ్గజ ఐటీ కంపెనీలు సైతం.. కొత్త ఉద్యోగులను నియమించుకోకపోవడం మాత్రమే కాకుండా, ఉన్న వారిని కూడా ఉద్యోగాల్లో నుంచి తీసేస్తోంది. అయితే త్వరలోనే ఐటీ రంగం పుంజుకుంటుందని.. ఉద్యోగ నియామకాలు కూడా భారీగా ఉంటాయని రిక్రూటింగ్ సంస్థ టీమ్లీజ్ తన నివేదికలో వెల్లడించింది.2026 ఆర్థిక సంవత్సరంలో టెక్నాలజీ సేవల రంగంలో ఫ్రెషర్ల నియామకం దాదాపు రెట్టింపు అవుతుందని, గత సంవత్సరంతో పోలిస్తే నియామకాలు 1,50,000 కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా. టీమ్లీజ్ డేటా ప్రకారం, మార్చి 2025 నాటికి దాదాపు 85,000 - 95,000 మంది ఫ్రెషర్ల నియమాలకు జరుగుతాయి.అన్ఎర్త్ఇన్సైట్ పరిశోధన ప్రకారం.. యాక్సెంచర్, క్యాప్జెమిని, కాగ్నిజెంట్ వంటి ప్రపంచ ఐటీ సేవల సంస్థలు కొత్తగా 1.6 లక్షల నుంచి 1.8 లక్షల ఉద్యోగాలను కల్పించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలలో పెరుగుతున్న డిమాండ్ కారణంగా కొత్త ఉద్యోగాల సంఖ్య కూడా పెరుగుతుంది.ఇదీ చదవండి: నెలకు 10 రోజులు.. టెక్ కంపెనీ కొత్త రూల్! 2024 ప్రారంభం నుంచి కూడా చాలా కంపెనీలు.. తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తూ వచ్చాయి. కాబట్టి కొత్త నియమాల విషయం కొంత ఆలోచించి, ప్రస్తుత టెక్నాలజీకు అవసరమైన నైపుణ్యం ఉన్నవారికి ఉద్యోగావకాశాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇండియన్, మల్టి నేషనల్ కంపెనీలు రెండూ కూడా కొత్తవారి నియామకాలను చేపట్టనున్నాయి. అయితే కొత్త నైపుణ్యాలను నేర్చుకున్న.. ఫ్రెషర్లకు ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయని టీమ్లీజ్ సర్వేలో వెల్లడైంది. -
అంబానీ ఎవరో మాకు తెలీదు.. అయినా పెళ్లికి వచ్చాం: కిమ్ కర్దాషియన్
ప్రపంచ కుబేరుడు ముకేశ్ అంబానీ (Mukesh Ambani) చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లికి రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు ఎందరో వచ్చారు. వారిలో హాలీవుడ్ సెన్సేషన్ కర్దాషియన్స్ సిస్టర్స్ కూడా వచ్చారు. నటి, మోడల్ కిమ్ కర్దాషియన్ (Kim Kardashian)తో పాటు సోదరి ఖ్లోయె కర్దాషియన్ (Khloé Kardashian).. అనంత్-రాధిక వెడ్డింగ్ సెలబ్రేషన్స్లో హాజరై సందడి చేశారు. తాజాగా ద కర్దాషియన్స్ ఎపిసోడ్లో కిమ్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.నా ఫ్రెండ్ మాటల్లో తెలిసింది..ఆమె మాట్లాడుతూ.. ఈ అంబానీలెవరో నాకు తెలియదు. కాకపోతే మాకు కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. జ్యువెలరీ డిజైనర్ లారైన్ స్క్వార్ట్జ్ నాకు మంచి స్నేహితురాలు. తనకు అంబానీ కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. ఆ కుటుంబంలోని వారికి పలురకాల ఆభరణాలు తయారు చేసిస్తూ ఉంటుంది. తను అంబానీ పెళ్లికి వెళ్తున్నట్లు నాతో చెప్పింది. అంతేకాకుండా అంబానీ కుటుంబం.. నన్ను, నా సోదరిని ఆ పెళ్లికి ఆహ్వానించాలని అనుకుంటున్నట్లు పేర్కొంది. అది వినగానే తప్పకుండా వస్తామని చెప్పాను.అదిరిపోయిన ఆహ్వానం.. రాకుండా ఊరుకుంటామా?తను చెప్పినట్లుగానే ఆహ్వానం అందింది. వారు పంపించిన ఇన్విటేషన్ గిఫ్ట్ బాక్స్ బరువు దాదాపు 20 కిలోలుంటుంది. అందులోనుంచి ఒకరకమైన సంగీతం కూడా వచ్చింది. అది మాకు విపరీతంగా నచ్చేసింది. అది చూశాక ఇలాంటివాటికి నో చెప్పే ప్రసక్తే లేదనుకున్నాం.. కచ్చితంగా పెళ్లికి వెళ్లాల్సిందే అని నిర్ణయించుకున్నాం అని చెప్పుకొచ్చింది. కాగా అనంత్- రాధిక 2024 జూలై 12న పెళ్లి చేసుకున్నారు.చదవండి: అయోధ్యలో మళ్లీ భూమి కొన్న బిగ్బీ.. ఈసారి పెద్ద మొత్తంలో..! -
నష్టాల్లో మార్కెట్లు.. మళ్లీ ముంచిన ‘ఇండస్ఇండ్ బ్యాంక్’
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. లాంగ్ వీకెండ్ కు ముందు ఇన్వెస్టర్లు కొత్త పొజిషన్లకు దూరంగా ఉండటంతో బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా, డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ విధానాలపై అనిశ్చితి నెలకొనడంతో ఇన్వెస్టర్లు పక్కకు తప్పుకోవడానికే మొగ్గుచూపారు. కాగా హోలీ పండుగ కారణంగా శుక్రవారం బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు ట్రేడింగ్కు క్లోజ్ కానున్నాయి.బీఎస్ఈ సెన్సెక్స్ గురువారం ప్రారంభ ట్రేడింగ్ లో 74,401 వద్ద గరిష్టానికి చేరుకున్నప్పటికీ, కొద్దిసేపటికే లాభాలను ఆర్జించింది. ఆటో, ఐటీ, ఎంపిక చేసిన బ్యాంకింగ్ షేర్లలో కొనసాగిన అమ్మకాల ఒత్తిడితో బీఎస్ఈ బెంచ్ మార్క్ రెడ్లోకి జారి 630 పాయింట్ల నష్టంతో 73,771 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 201 పాయింట్ల నష్టంతో 73,829 వద్ద ముగిసింది. ఈ క్రమంలో సెన్సెక్స్ 504 పాయింట్ల నష్టంతో వారాన్ని ముగించింది.ఇక నిఫ్టీ 22,558 వద్ద గరిష్ట స్థాయి నుంచి 22,377 వద్ద కనిష్టానికి పడిపోయి, చివరకు 73 పాయింట్ల నష్టంతో 22,397 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఈ వారంలో 156 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్ 30 షేర్లలో టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ దాదాపు 2 శాతం చొప్పున నష్టపోయాయి. జొమాటో, మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు కూడా నష్టపోయాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ షేర్లు 0.5 శాతానికి పైగా లాభాలను చూశాయి.మరోవైపు విస్తృత సూచీలు కూడా ఈరోజు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.8 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం క్షీణించాయి. బీఎస్ఈలో ట్రేడైన 4,105 షేర్లలో 60 శాతం లేదా 2,449 షేర్లు నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే బీఎస్ఈ రియాల్టీ సూచీ 1.8 శాతం నష్టపోయింది. గోద్రెజ్ ప్రాపర్టీస్, ఒబెరాయ్ రియల్టీ, లోధా, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, ఫీనిక్స్ షేర్లు 2 శాతానికి పైగా నష్టపోయాయి. -
రూపాయి చిహ్నం మార్చేసిన తమిళనాడు ప్రభుత్వం
జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ)లో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు - కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం జరుగుతోంది. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం 2025 - 26 బడ్జెట్లో సాధారణ రూపాయి చిహ్నానికి బదులుగా.. తమిళ చిహ్నంతో భర్తీ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కొత్త జాతీయ విద్యా విధానం ద్వారా 'హిందీ విధించడం'పై బీజీపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంతో.. అధికార డీఎంకే పోరాటం చేస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం రూపాయి చిహ్నం మార్చేసింది. ఈ మార్పుపై ఇప్పటివరకు తమిళనాడు ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం రాలేదు. తమిళనాడు చర్య భారతదేశంలో ఇతర రాష్ట్రాల కంటే భిన్నంగా ఉందని బీజేపీ ప్రతినిధి అన్నారు.అంతే కాకుండా తమిళంలో చదవడం, రాయడం వచ్చి ఉంటేనే.. తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని, మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది.ఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్ కార్ల కథ ముగిసినట్టే?.. ఈవీ పాలసీ 2.0 గురించి తెలుసాతమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ''హిందీ, సంస్కృత ఆధిపత్యం కారణంగా ఉత్తర భారతదేశంలో 25 కంటే ఎక్కువ స్థానిక భాషలు కనుమరుగయ్యాయి. శతాబ్దాల నాటి ద్రవిడ ఉద్యమం అవగాహన, నిరసనల ద్వారా తమిళం.. దాని సంస్కృతిని రక్షించింది" అని ఆయన అన్నారు. -
హైదరాబాద్లో రూ.50 కోట్లతో ఏఐ జీసీసీ ప్రారంభం
డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఏఐ ఇన్నోవేషన్లో సేవలందిస్తోన్న సినెరిక్ గ్లోబల్ హైదరాబాద్లో అత్యాధునిక ఏఐ గ్లోబల్ కెపాసిటీ సెంటర్ (జీసీసీ)ను ప్రారంభించింది. రూ.50 కోట్ల పెట్టుబడితో 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో అత్యాధునిక ఏఐ ఉత్పత్తులు, సొల్యూషన్స్, కన్సల్టింగ్ సేవలు అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. భవిష్యత్తులో కంపెనీ 150 మిలియన్ డాలర్లు(సుమారు రూ.1300 కోట్లు) ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేసింది. జీసీసీ ప్రారంభ కార్యక్రమానికి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్బాబు హాజరై మాట్లాడారు.‘ఏఐ ఆధారిత ఇన్నోవేషన్లో గ్లోబల్ లీడర్గా హైదరాబాద్కు ప్రాముఖ్యత పెరుగుతోంది. కోడింగ్ హబ్ నుంచి ప్రపంచవ్యాప్తంగా అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉత్పత్తులను అభివృద్ధి చేసి ఎగుమతి చేసే కేంద్రంగా నగరం పరివర్తన చెందింది. హైదరాబాద్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా ఏర్పాటు చేసి, స్థానికంగా ఏఐ ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేయాలనే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యానికి ఈ కంపెనీలరాక ప్రోత్సాహకరంగా మారింది’ అని మంత్రి శ్రీధర్బాబు అన్నారు.సినెరిక్ గ్లోబల్ వ్యవస్థాపకుడు సుధాకర్ పెన్నం మాట్లాడుతూ.. టెక్నాలజీ పరంగా సినెరిక్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ నిబద్ధతను తెలియజేస్తూ, హైదరాబాద్ ప్రగతిశీల ఏఐ విధానాలను నొక్కి చెప్పారు. ‘కంపెనీ 150 మిలియన్ డాలర్ల ఆదాయ లక్ష్యాన్ని సాధించడానికి హైదరాబాద్లోని కొత్త జీసీసీ కీలకం కానుంది. స్థానికంగా బలమైన టాలెంట్ పూల్ను నిర్మిస్తూనే, తదుపరి తరం ఏఐ టెక్నాలజీలను ఆవిష్కరించడం, ప్రపంచవ్యాప్తంగా ఎంటర్ప్రైజెస్ను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని చెప్పారు. జీసీసీ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న మెర్జెన్ గ్లోబల్ సీఈఓ మహంత్ మల్లికార్జున మాట్లాడుతూ.. సినెరిక్ గ్లోబల్ జీసీసీ అభివృద్ధి చెందుతున్న డిజిటల్ అవసరాలను తీర్చే అత్యాధునిక ఆవిష్కరణలను అందించడంలో కీలకంగా మరనుందని చెప్పారు.ఇదీ చదవండి: భారత్లో స్టార్లింక్ ఇంటర్నెట్ ఛార్జీలు ఇలా..గ్లోబల్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ మార్కెట్ 2028 నాటికి 10% సీఏజీర్తో పెరిగి 65.7 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని, సేల్స్ఫోర్స్ ఆటోమేషన్ 2027 నాటికి 40 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. క్లౌడ్ ఆధారిత వర్క్ ఫ్లో ఆటోమేషన్ సొల్యూషన్స్కు పెరుగుతున్న డిమాండ్తో సర్వీస్ నౌ మార్కెట్ 22.5 శాతం సీఏజీఆర్తో వృద్ధి చెందుతుందని అంచనా. 2025 చివరి నాటికి 23.76 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ అభివృద్ధి చెందుతున్న విభాగాలకు అనుగుణంగా వ్యాపారాలకు సృజనాత్మక, ఇంటిగ్రేటెడ్ పరిష్కారాలను అందించడానికి సినెరిక్ గ్లోబల్ వ్యూహాత్మకంగా సిద్ధమవుతున్నట్లు తెలిపింది. -
ఫోన్పే ఎంతమంది వాడుతున్నారో తెలుసా?
న్యూఢిల్లీ: నమోదిత వినియోగదారుల సంఖ్య 60 కోట్లు దాటిందని ఫిన్టెక్ దిగ్గజం ఫోన్పే తెలిపింది. 4 కోట్ల మందికిపైగా వర్తకులు ఫోన్పే వేదికగా కస్టమర్ల నుంచి డిజిటల్ చెల్లింపులను అందుకుంటున్నారు.10 సంవత్సరాల ప్రయాణంలో కంపెనీ తన కార్యకలాపాలను వెల్త్ మేనేజ్మెంట్, పిన్కోడ్ ద్వారా ఈ–కామర్స్ రంగంలోకి ప్రవేశించింది. 2023లో జరిగిన చివరి నిధుల సమీకరణ రౌండ్లో కంపెనీని 12 బిలియన్ డాలర్లుగా విలువ కట్టారు.ఫోన్పే డిజిటల్ చెల్లింపుల యాప్ 2016 ఆగస్టులో ప్రారంభమైంది. 2024 మార్చి నాటికి సంస్థ ఖాతాలో నమోదిత వినియోగదారులు దాదాపు 53 కోట్ల మంది ఉన్నారు. ఫోన్పే రోజుకు 33 కోట్లకుపైగా లావాదేవీలను ప్రాసెస్ చేస్తోంది. వార్షికంగా వీటి మొత్తం చెల్లింపుల విలువ రూ.150 లక్షల కోట్లకుపైగా ఉంటుందని సంస్థ వెల్లడించింది.ఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్ కార్ల కథ ముగిసినట్టే?.. ఈవీ పాలసీ 2.0 గురించి తెలుసా -
భారత్లో స్టార్లింక్ ఇంటర్నెట్ ఛార్జీలు ఇలా..
మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించాలనే లక్ష్యంతో ఎలాన్మస్క్ ఆధ్వర్యంలోని స్టార్లింక్(Starlink) భారత్లో ప్రవేశించేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఇప్పటికే భారత టెలికాం విభాగానికి అనుమతి పత్రాలను దాఖలు చేసింది. ప్రస్తుతం అవి పరిశీలనలో ఉన్నాయి. కేంద్రం షరతులను సంస్థ ప్రతినిధులు అంగీకరించడంతో భారత్లోకి మార్గం సుగమం అవుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు స్టార్లింక్ ప్రవేశాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించిన టాప్ టెలికాం ఆపరేటర్లు ఎయిర్టెల్, జియో ఆ కంపెనీతోనే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అయితే సామాన్యులకు స్టార్లింక్ ఏమేరకు ప్లాన్లను తీసుకొస్తుందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే కంపెనీ భూటాన్, అమెరికా వంటి దేశాల్లో సర్వీసులు అందిస్తోంది. ఆయా దేశాల్లో ఇంటర్నెట్ ఛార్జీలను అనుసరించి భారత్లో రేట్లు ఎలా ఉండవచ్చో నిపుణులు అంచనా వేస్తున్నారు.యూఎస్లో ఛార్జీలు ఇలా..స్టార్లింక్ యూఎస్లో రెసిడెన్షియల్ విభాగంలో నెలకు రూ.6,976 నుంచి ప్లాన్లు అందిస్తోంది. కేబుల్ నెట్వర్క్కు ఎలాగైతే రూటర్ కొనుగోలు చేస్తామో.. అలాగే శాటిలైట్ సేవల కోసం కూడా పరికరాలకు ఒకసారి చెల్లించాల్సిన సొమ్ము అదనం. యూఎస్లో స్టాండర్డ్ ఎక్విప్మెంట్ కిట్ ధర రూ.30,443గా ఉంది.ఇక మొబైల్ సేవలు కావాల్సినవారు నెలకు కనీసం రూ.4,360 చెల్లించాల్సి ఉంటుంది. డేటా అపరిమితంగా అందుకోవచ్చు. 220 ఎంబీపీఎస్ వరకు స్పీడ్ ఆఫర్ చేస్తోంది.రెసిడెన్షియల్ లైట్, రెసిడెన్షియల్ ప్లాన్లలో కూడా వినియోగదారులు అపరిమిత డేటాను అందుకోవచ్చు.రోమింగ్ ప్లాన్ తీసుకునే వినియోగదారులు దేశవ్యాప్తంగా, ప్రయాణంలో, అంతర్జాతీయ ప్రయాణ సమయంలో కూడా వినియోగం, తీర ప్రాంతాల్లో కవరేజీ పొందవచ్చు. బిజినెస్ విభాగంలో నెలకు రూ.12,208 నుంచి రూ.4,36,000 వరకు ప్లాన్స్ ఉన్నాయి.భూటాన్లో ఇలా..ఇక భూటాన్లో రెసిడెన్షియల్ లైట్ ప్లాన్ కింద స్టార్లింక్ నెలకు రూ.3,000 చార్జీ చేస్తోంది. ఈ ప్లాన్లో ఇంటర్నెట్ 23–100 ఎంబీపీఎస్ స్పీడ్తో ఆఫర్ చేస్తోంది. ఊక్లా నివేదిక ప్రకారం స్టార్లింక్ ఇంటర్నెట్ వేగం యూరప్లోని హంగరీలో అక్టోబర్–డిసెంబర్ కాలంలో గరిష్టంగా 135.11, కనిష్టంగా సైప్రస్లో 36.52 ఎంబీపీఎస్ నమోదైంది.మనదగ్గర ఇప్పటివరకు ఇలా..శాటిలైట్ ఇంటర్నెట్ చార్జీలతో పోలిస్తే మన దేశంలో మొబైల్, బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ చాలా చవక. అటూ ఇటూగా రూ.20 చెల్లిస్తే ఒక జీబీ డేటా అందుకోవచ్చు. సుమారు రూ.50 నుంచి అన్లిమిటెడ్ ప్యాక్స్ లభిస్తాయి. హోమ్ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లు నెలకు కనీసం రూ.400 నుంచి ఉన్నాయి. హై–ఎండ్ ప్లాన్ అయితే నెలకు రూ.4,000 వరకు ఉంది. దీనిలో 10 జీబీపీఎస్ వరకు వేగం, అన్ని ఓటీటీ యాప్స్ సబ్స్క్రిప్షన్ కూడా అందుతుంది. రూటర్కు అయ్యే వ్యయమూ తక్కువే. శాటిలైట్ టెలికం కేవలం ఇంటర్నెట్కే పరిమితం. కాల్స్ చేయాలంటే ఓటీటీ యాప్స్పైన ఆధారపడాల్సిందే.ఇండియాలో స్టార్లింక్ ఛార్జీలపై అంచనాలు..స్టార్లింక్ ఇంటర్నెట్ కోసం అవసరమయ్యే హార్డ్వేర్కు ప్రస్తుతం రూ.25,000-రూ.35,000 మధ్య ఖర్చు అవుతుంది. నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ రూ.5,000-రూ.7,000గా అంచనా వేస్తున్నారు. ఇంటర్నెట్ స్పీట్ 25-220 ఎంబీపీఎస్ ఉంటుందని చెబుతున్నారు. ఆ ధర భారతదేశం సగటు బ్రాండ్బ్యాండ్ వ్యయం నెలకు రూ.700-రూ.1,500 కంటే చాలా ఎక్కువ. బ్రాండ్బ్యాండ్ పోటీదారులకు ధీటుగా విస్తృతంగా ఇంటర్నెట్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు స్పేస్ఎక్స్ భారతదేశంలో నిర్దిష్ట ధరలను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: పదేళ్లలో 10 లక్షల స్టార్టప్లుస్టార్లింక్ ప్రత్యేకతలు ఇవీ..లోఎర్త్ ఆర్టిట్ శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు అందిస్తారు. ఇందుకోసం స్పేస్ఎక్స్ ఉపగ్రహాలను వినియోగిస్తున్నారు.కక్ష్యలో ఉన్న ఉపగ్రహాలు: సుమారు 7,000శాటిలైట్ ఇంటర్నెట్ అందిస్తున్న దేశాలు: 100కుపైగావినియోగదారులు: సుమారు 50 లక్షలు (2024 డిసెంబర్ చివరినాటికి) అమెరికాలో దిగ్గజ బ్రాండ్బ్యాండ్ కంపెనీలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గట్టి పోటీనిస్తోంది.రూరల్ కనెక్టివిటీ: మారుమూల ప్రాంతాలు, పల్లెలకు వేగంగా ఇంటర్నెట్ అందిస్తోంది. విద్య, ఆరోగ్య సేవలు, ఈ–కామర్స్కు వెన్నుదన్నుగా నిలుస్తోంది.భారత్లో పోటీ: దేశంలో 94.5 కోట్ల మంది బ్రాడ్బ్యాండ్ వినియోగదారులు ఉన్నారు. అందులో 90.4 కోట్ల మంది వైర్లెస్/మొబైల్ ఇంటర్నెట్ను వాడుతున్నారు. -
రూ. 20వేల కంటే తక్కువ ధరలో.. ఇవిగో బెస్ట్ స్మార్ట్ఫోన్స్
మార్కెట్లో లెక్కకు మించిన స్మార్ట్ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ కథనంలో రూ.20,000 కంటే తక్కువ ధరలో లభించే ఐదు బెస్ట్ ఫోన్స్ గురించి తెలుసుకుందాం..నథింగ్ సీఎమ్ఎఫ్ ఫోన్ 1మార్కెట్లో తక్కువ ధరకు లభించే ఫోన్లలో 'నథింగ్ సీఎమ్ఎఫ్ ఫోన్ 1' ఒకటి. ఇది రంగు రంగుల బ్యాక్ ప్యానెల్లను కలిగి ఉండటం వల్ల, మీకు నచ్చిన కలర్ మార్చుకోవచ్చు. దీనిని మరింత అందంగా డిజైన్ చేసుకోవడానికి కంపెనీ కొన్ని యాక్సెసరీస్ కూడా అందిస్తుంది. ఈ ఫోన్ ధర రూ. 15499 మాత్రమే. కెమెరా సెటప్, డిజైన్, ఫీచర్స్ అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి.రియల్మీ నార్జో 70 టర్బోసాధారణ ఉపయోగం కోసం మాత్రమే కాకుండా.. గేమింగ్ కోసం కూడా ఉపయోగపడే ఫోన్ 'రియల్మీ నార్జో 70 టర్బో'. దీని ధర రూ. 14,999. ఇది డ్యూయెల్ టోన్ బ్లాక్ ప్యానెల్.. ప్రీమియం అండ్ స్పోర్టీ అప్పీల్ ఇస్తుంది. చదరంగం ఆకారంలో ఉండే కెమెరా సెటప్ కూడా అకార్షణీయంగా ఉంటుంది. ఇందులో డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్ ఉంటుంది.టెక్నో పోవా 6 ప్రోరూ. 20వేలు కంటే తక్కువ ధరలో లభించే స్మార్ట్ఫోన్లలో.. టెక్నో పోవా 6 ప్రో ఒకటి. దీని ధర రూ. 19999. ఇందులో 6000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 70 వాట్స్ ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ గొప్ప గేమింగ్ ఫోన్ కాదు, కానీ ఇందులోని డైమెన్సిటీ 6080 చిప్సెట్ కొంతవరకు గేమ్లకు కూడా ఉపయోగపడుతుంది. ఈ ఫోన్ 108 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా పొందుతుంది.ఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్ కార్ల కథ ముగిసినట్టే?.. ఈవీ పాలసీ 2.0 గురించి తెలుసాలావా బ్లేజ్ డుయోరూ.16,999 ధర వద్ద లభించే ఈ స్మార్ట్ఫోన్.. సెకండరీ డిస్ప్లేతో ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ఫీచర్ కలిగి సరసమైన ధరకు లభించే ఫోన్లలో ఇది బెస్ట్ మోడల్. ముందు నుంచి చూస్తే.. లావా బ్లేజ్ డుయో ఏ హై-ఎండ్ మాదిరిగా కనిపిస్తుంది. ఇది స్లిమ్ బెజెల్స్తో కూడిన 3D కర్వ్డ్ డిస్ప్లే పొందుతుంది. ఇది కూడా అన్ని విధాలా చాలా అనుకూలంగా ఉంటుంది.ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రోఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో అనేది రూ. 20వేల కంటే కొంత ఎక్కువ ధర వద్ద లభిస్తుంది. ఇది డైమెన్సిటీ 8200 అల్టిమేట్ చిప్, 8GB/12GB RAM, 256GB స్టోరేజ్ వంటి ఆప్షన్స్ పొందుతుంది. దీని ఫ్లాట్ డిస్ప్లే గేమర్లకు ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. ఇది 5000 mAh బ్యాటరీ పొందుతుంది. ఈ ఫోన్ యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్తో సహా వివిధ యాక్సెసరీలకు కూడా సపోర్ట్ చేస్తుంది. -
పదేళ్లలో 10 లక్షల స్టార్టప్లు
దేశంలో రానున్న పదేళ్లలో 10 లక్షల స్టార్టప్లు పుట్టుకొస్తాయని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని అంచనా వేశారు. భారతదేశ వ్యవస్థాపక భవిష్యత్తు(entrepreneurial future) ప్రతిష్టాత్మకంగా ఉంటుందని చెప్పారు. ‘ఆర్కామ్ వెంచర్స్ వార్షిక సమావేశం 2025’లో నీలేకని మాట్లాడారు. రానున్న రోజుల్లో స్టార్టప్లు సాంకేతికత, మూలధనం, ఆంత్రపెన్యూర్షిప్, ఫార్మలైజేషన్ వంటి అంశాలతో వేగంగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు.ప్రస్తుతం భారత్లో 1,50,000 స్టార్టప్లు ఉన్నాయని, ఈ రంగంలో 20 శాతం వార్షిక వృద్ధి రేటు ఉంటుందని నీలేకని అంచనా వేశారు. ప్రస్తుతం ఉన్న స్టార్టప్లు భవిష్యత్తులో మరిన్ని స్టార్టప్ల సృష్టికి ఊతమిచ్చేలా ‘బైనరీ విచ్ఛిత్తి(ఒకటి రెండుగా మారడం)’ని పోలి ఉంటాయని చెప్పారు. అందుకు ఉదాహరణగా ఫ్లిప్కార్ట్ను చెప్పుకొచ్చారు. ఫ్లిప్కార్ట్ వంటి విజయవంతమైన కంపెనీల నుంచి ఉద్యోగులు తమ సొంత సంస్థలను స్థాపించినట్లు గుర్తు చేశారు.భాషలు, మాండలికాలకు ఏఐ నమూనాలుఈ వృద్ధికి దోహదపడటంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాత్ర కీలకంగా మారిందని నీలేకని నొక్కి చెప్పారు. ఆధార్, యూసీఐ వంటి కార్యక్రమాలు ఇప్పటికే బలమైన డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు పునాది వేశాయని తెలిపారు. భారతీయ భాషలు, ప్రాంతీయ మాండలికాలకు అనుగుణంగా ఓపెన్ సోర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నమూనాల అవసరాన్ని ఉద్ఘాటించారు. ఇవి సాంకేతిక పరిజ్ఞానం విభాగంలో మరిన్ని అవకాశాలు సృష్టిస్తాయని అంచనా వేశారు.ఇదీ చదవండి: ఫ్లిప్కార్ట్ కోఫౌండర్ కొత్త కంపెనీ ప్రారంభంఅత్యంత ఆదరణ కలిగే ఐపీఓ మార్కెట్గా భారత్2035 నాటికి భారత్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ కలిగే ఐపీఓ మార్కెట్గా అవతరిస్తుందని, రెండో అతిపెద్ద ఐపీవో మార్కెట్గా భారత్ ప్రస్తుత స్థానాన్ని అధిగమిస్తుందని నీలేకని తెలిపారు. ఈ మార్పు భవిష్యత్తులో గణనీయమైన పెట్టుబడులను ఆకర్షిస్తుందని పేర్కొన్నారు. ఇది ఉద్యోగాల సృష్టిని వేగవంతం చేస్తుందని, సమీప భవిష్యత్తులో ఎనిమిది ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలనే దేశం లక్ష్యానికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు. -
పెట్రోల్, డీజిల్ కార్ల కథ ముగిసినట్టే?.. ఈవీ పాలసీ 2.0 గురించి తెలుసా..
2027 నాటికి ఢిల్లీలో తిరిగే వాహనాలలో 95 శాతం ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉండాలని, దీనికోసం ప్రభుత్వం ఈవీ పాలసీ 2.0 ప్రారంభించింది. ఈ పాలసీ కింద దశల వారీగా ఫ్యూయెల్ వాహనాల సంఖ్యను తగ్గించడానికి కృషి చేస్తామని రవాణా మంత్రి పంకజ్ కుమార్ సింగ్ వెల్లడించారు.వేగంగా అభివృద్ధి చెందుతున్న ఢిల్లీ నగరం.. కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. దీనిని నివారించాలంటే.. ఫ్యూయెల్ వాహన స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావాలి. ఇందులో భాగంగానే.. ఆటో రిక్షాలు, ట్యాక్సీలు, చిన్న కమర్షియల్ వాహనాలను మాత్రమే కాకుండా CNGతో నడిచే వాహనాల సంఖ్యను తగ్గించనున్నారు. ప్రజా రవాణా కోసం కూడా ఎలక్ట్రిక్ బస్సులనే ఉపయోగించనున్నట్లు చెబుతున్నారు.ఢిల్లీ ఈవీ పాలసీ 2.0ను ప్రోత్సహించడానికి.. ప్రభుత్వం ప్రోత్సాహకాలను కూడా అందించనుంది. ఇవి ఎలక్ట్రిక్ టూ వీలర్స్, త్రీ వీలర్స్, ట్రక్కులు మొదలైనవాటికి వరిస్తాయి. స్క్రాపేజ్ కింద కూడా కొన్ని ప్రోత్సాహకాలను అందించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. పాత వాహనాన్ని స్క్రాప్ చేస్తే.. కొత్త వెహికల్ కొనుగోలుపై కొన్ని రాయితీలు లభిస్తాయి.ఇదీ చదవండి: గుట్టు విప్పిన ఐటీ శాఖ: అలాంటి వారికి ట్యాక్స్ నోటీసులు?ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచాలంటే.. మౌలిక సదుపాయాలను పెంచాలి. దీని కోసం ఢిల్లీ ప్రభుత్వం ఛార్జింగ్ స్టేషన్లను పెంచనుంది. కొత్త భవనాలు, బహిరంగ ప్రదేశాలకు ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనుంది. మొత్తం మీద 2027 నాటికి ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను గణనీయంగా పెంచాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం 'ఈవీ పాలసీ 2.0' ప్రారంభించింది. -
ఫ్లిప్కార్ట్ కోఫౌండర్ కొత్త కంపెనీ ప్రారంభం
ఫ్లిప్కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సాల్ ఆసియా అంతటా విభిన్న కంపెనీలు తమ వినియోగదారులను పెంచుకోవడానికి, బ్రాండ్లను విస్తరించడానికి సహాయపడేలా ‘ఆప్ట్రా’ అనే కొత్త కంపెనీని ప్రారంభించారు. టెక్నాలజీ, సప్లై చైన్ నైపుణ్యం, ఫ్రాంఛైజింగ్ భాగస్వామ్యాలను ఉపయోగించుకొని కొత్త మార్కెట్లోకి ప్రవేశించేటప్పుడు బ్రాండ్లు ఎదుర్కొనే సవాళ్లను అధిగమించేలా ఈ స్టార్టప్ ఆయా కంపెనీలను సర్వీసు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.వాల్మార్ట్ కొనుగోలుకు ముందు ఫ్లిప్కార్ట్ను ప్రపంచంలోని ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ల్లో ఒకటిగా మార్చడంలో బన్సాల్ కీలక పాత్ర పోషించారు. సాంస్కృతిక, నియంత్రణ, మౌలిక సదుపాయాల అవరోధాలతో పోరాడుతున్న బ్రాండ్లకు ప్రస్తుతం బిన్నీ ఆప్ట్రాను ఒక పరిష్కారంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. డిజిటల్ సాధనాలు, మాస్టర్ ఫ్రాంచైజ్ అవకాశాలను ఏకకాలంలో అందించడం ద్వారా గ్లోబల్ మార్కెట్లోకి ప్రవేశాన్ని సులభతరం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.ఏఐ ఆధారిత సాంకేతికత అభివృద్ధిమొత్తం కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి ఆప్ట్రా ఏఐ ఆధారిత సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది. డేటా అనలిటిక్స్, ఆటోమేషన్, సమర్థవంతమైన వ్యూహాలను సమీకృతం చేయడం ద్వారా కంపెనీ అంతరాయంలేని మార్కెట్ను సృష్టించాలని భావిస్తుంది. ఈ-కామర్స్ కార్యకలాపాలను విస్తరించడంలో బన్సాల్ అనుభవం కంపెనీ సామర్థ్యాన్ని పెంచడానికి రోబోటిక్స్, ఆటోమేషన్తో కూడిన గ్లోబల్ సప్లై చైన్ను నిర్మించడానికి ఎంతో ఉపయోగపడుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.నిపుణులతో నాయకత్వ బృందంఈ-కామర్స్, రిటైల్ రంగాలకు చెందిన అనుభవజ్ఞులైన నిపుణులతో ఆప్ట్రా నాయకత్వ బృందాన్ని సిద్ధం చేసింది. నోకియా, యాపిల్ అమెజాన్ ఇండియాలో మాజీ ఎగ్జిక్యూటివ్గా పని చేసిన రంజిత్ బాబును ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ మర్కండైజ్ సీఈఓగా నియమించారు. గతంలో లెండింగ్ కార్ట్, ఫ్లిప్కార్ట్లో పనిచేసిన గిరిధర్ యాసను కంపెనీ టెక్నాలజీ విభాగానికి నేతృత్వం వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. సప్లై చైన్ కార్యకలాపాలను ఫ్లిప్కార్ట్, స్విగ్గీలో అనుభవం ఉన్న ఆనంద్ రాజ్ పర్యవేక్షిస్తున్నారు. ఎక్స్పోరియో, టెర్రాస్పాన్ బ్రాండ్లలో కీలక స్థానాల్లో పని చేసిన పునీత్ ఖన్నా, రాహుల్ గుప్తాలు ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నారు.ఇదీ చదవండి: గృహ రుణాల మంజూరులో ప్రాంతీయ అసమానతలుఆసియా మార్కెట్ కీలకంప్రపంచంలోని మొత్తం వినియోగదారుల వృద్ధిలో ఆసియా సుమారు 70% వాటాను కలిగి ఉంది. ఇది ఈ-కామర్స్, మారుతున్న వినియోగదారుల అలవాట్లకు కీలక మార్కెట్గా అవతరిస్తోందని కంపెనీ నమ్ముతుంది. భారత్, ఆగ్నేయాసియా, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) రీజియన్ మార్కెట్లపై ఆప్ట్రా దృష్టి సారించింది. ఎలక్ట్రానిక్స్, స్పోర్ట్స్, బేబీ కేర్, జనరల్ మర్కండైజ్ వంటి విభాగాల్లోకి విస్తరించాలని కంపెనీ యోచిస్తోంది. -
గృహ రుణాల మంజూరులో ప్రాంతీయ అసమానతలు
గృహ రుణాలు 2024 సెప్టెంబర్ నాటికి రూ.33.53 లక్షల కోట్లుగా ఉన్నట్టు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్హెచ్బీ) ప్రకటించింది. ఏడాది కాలంలో 14 శాతం మేర పెరిగినట్టు తెలిపింది. ఇందులో మధ్యాదాయ వర్గాలు (ఎంఐజీ) తీసుకున్నవే ఎక్కువగా ఉన్నట్టు వెల్లడించింది. దేశంలో హౌసింగ్ రంగంలో ధోరణులు, పురోగతిపై ఎన్హెచ్బీ ఒక నివేదిక విడుదల చేసింది. రుణాల మంజూరులో దేశవ్యాప్తంగా ప్రాంతీయ అసమానతలు ఉన్నట్లు తెలిపింది.‘2024 సెప్టెంబర్ నాటికి వ్యవస్థ వ్యాప్తంగా బాకీ ఉన్న వ్యక్తిగత గృహ రుణాల విలువలో తక్కువ ఆదాయ విభాగానికి (ఎల్ఐజీ) సంబంధించి 39 శాతం ఉంటే, ఎంఐజీ విభాగానికి 44 శాతంగా ఉన్నాయి. మరో 17 శాతం అధిక ఆదాయ వర్గాలు (హెచ్ఐజీ) చెల్లించాల్సినవి’ అని ఎన్హెచ్బీ నివేదిక తెలిపింది. 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం మొత్తం మీద రూ.9.07 లక్షల కోట్ల వ్యక్తిగత గృహ రుణాలు మంజూరు కాగా, 2024 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల్లో రూ.4.10 లక్షల కోట్లు జారీ అయినట్టు పేర్కొంది. బడ్జెట్లో పీఎం ఆవాస్ యోజన 2.0పై చేసిన ప్రకటన, పట్టణీకరణ, డిజిటైజేషన్తో గృహ రంగానికి భవిష్యత్ సానుకూలంగా ఉంటుందని అంచనా వేసింది. హెచ్ఎఫ్సీలు కీలక పాత్రగృహ కొనుగోలుదారుల విస్తృతమైన అవసరాలను తీర్చడంలో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్ఎఫ్సీలు) కీలక పాత్ర పోషించినట్టు ఎన్హెచ్బీ తెలిపింది. అర్హతల ప్రమాణాల్లో వెసులుబాట్లు, బలమైన కస్టమర్ సేవలు, మెరుగైన డాక్యుమెంటేషన్, తక్కువ సమయంలో ప్రాసెస్ చేయడం వంటివి హెచ్ఎఫ్సీలను మెరుగైన స్థానంలో నిలబెట్టాయని పేర్కొంది. సేవల లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలకూ గృహ రుణాలను విస్తరించేందుకు ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు కృషి చేస్తున్నాయంటూ.. బ్యాంక్లు–హెచ్ఎఫ్సీల కోలెండింగ్ ఈ దిశగా తీసుకున్న చర్యగా ప్రస్తావించింది.ఇదీ చదవండి: స్టార్లింక్కు స్వాగతం అంటూ కేంద్రమంత్రి ట్వీట్.. కాసేపటికే డిలీట్ప్రాంతీయ అసమానతలుహౌసింగ్ రంగం బలమైన వృద్ధిని చూపించినప్పటికీ.. రుణాల మంజూరులో ప్రాంతాల మధ్య నెలకొన్న అంతరాలు హెచ్ఎఫ్సీలకు పెద్ద సవాలుగా ఎన్హెచ్బీ పేర్కొంది. ‘దక్షిణాది, పశ్చిమాది, ఉత్తరాది రాష్ట్రాల్లోనే అధిక శాతం గృహ రుణాలు మంజూరవుతున్నాయి. అదే సమయంలో తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో రుణాల జారీ తక్కువగా ఉంటోంది’ అని నివేదిక వివరించింది. ఈశాన్య ప్రాంతంలో హెచ్ఎఫ్సీల శాఖల విస్తరణ తక్కువగా ఉంటున్నట్టు తెలిపింది. ఈ తారతమ్యాల తగ్గింపునకు చర్యలు కొనసాగుతాయని పేర్కొంది. -
ఒక్క రీఛార్జ్.. 425 రోజుల వ్యాలిడిటీ: BSNL కొత్త ప్లాన్
ప్రభుత్వ యాజమాన్యంలోని టెల్కో బీఎస్ఎన్ఎల్ (BSNL) హోలీకి ముందు అద్భుతమైన ఆఫర్ను ప్రారంభించింది. ఈ కొత్త ప్లాన్ ఒక సంవత్సరం కంటే ఎక్కువ చెల్లుబాటుతో అపరిమిత కాల్లను అందిస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్.. ఇతర ప్రైవేట్ ఆపరేటర్లు అందించే టాప్ ప్లాన్లకు గట్టి పోటీని ఇస్తుంది.హోలీ ధమాకా ఆఫర్ పేరుతో తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ ధర రూ. 2399. ఇది 425 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేరుకుంటే అపరిమిత కాల్స్ మాత్రమే కాకుండా.. రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు చేసుకోవచ్చు. కొంత తక్కువ ఖర్చుతో.. ఎక్కువ రోజుల ప్లాన్ కోసం వేచి చూసేవారికి బెస్ట్ ఆప్షన్ అని తెలుస్తోంది.బీఎస్ఎన్ఎల్ ఇతర ప్లాన్స్➤రూ. 1999 ప్లాన్: అపరిమిత వాయిస్ కాల్స్, 600 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు లభిస్తాయి. వాలిడిటీ 365 రోజులు.➤రూ.1499 ప్లాన్: అపరిమిత వాయిస్ కాల్స్, 24 జీబీ డేటా మరియు, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు లభిస్తాయి. వాలిడిటీ 365 రోజులు.➤రూ.1198 ప్లాన్: 300 నిమిషాల వాయిస్ కాల్స్, నెలకు 3 జీబీ డేటా మరియు నెలకు 30 ఎస్ఎమ్ఎస్లు లభిస్తాయి. వాలిడిటీ 365 రోజులు.➤రూ.997 ప్లాన్: అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 2 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు లభిస్తుంది. వాలిడిటీ 160 రోజులు. ➤రూ. 897 ప్లాన్: అపరిమిత వాయిస్ కాల్స్, 90 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు లభిస్తుంది. వాలిడిటీ 180 రోజులు. -
హోలీకి ముందే.. అమాంతం పెరిగిన బంగారం రేటు
బంగారం ధరలు వరుసగా పెరుగుదల దిశవైపు అడుగులు వేస్తోంది. రెండో రోజు (మార్చి 13) గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 600 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 81,200 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 88,500 వద్ద నిలిచాయి. నిన్న రూ.450, రూ.490 పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు మళ్ళీ రూ.700 (22 క్యారెట్స్ 10గ్రా), రూ.760 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 550, రూ. 600 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 81,200 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 88,580 వద్ద ఉంది.ఇదీ చదవండి: దుబాయ్ నుంచి ఎంత బంగారం తీసుకురావచ్చు? దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 81,350 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 88,730 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 550, రూ. 600 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు గరిష్టంగా రూ.1,000 పెరిగింది. దీంతో ఈ రోజు (మార్చి 13) కేజీ సిల్వర్ రేటు రూ. 1,10,000 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకేవిధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 10,1000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
భారత్ జీడీపీ వృద్ధి: మూడీస్ అంచనా ఇదే..
న్యూఢిల్లీ: భారత జీడీపీ వృద్ధి 2025–26 సంవత్సరంలో 6.5 శాతాన్ని మించుతుందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం మూడీస్ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇది 6.3%గా ఉంటుందన్నది మూడిస్ రేటింగ్స్ గత అంచనా. ప్రభుత్వం నుంచి అధిక మూలధన వ్యయాలు, పన్నుల తగ్గింపుతో పెరిగే వినియోగం, వడ్డీ రేట్ల తగ్గింపు ఇవన్నీ వృద్ధికి అనుకూలిస్తాయని అభిప్రాయం వ్యక్తం చేసింది. భారత బ్యాంకింగ్ రంగం పట్ల స్థిరమైన దృక్పథాన్ని (స్టెబుల్ అవుట్లుక్) ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల నిర్వహణ వాతావరణం మెరుగ్గా ఉంటుందని పేర్కొంది.ఇటీవలి సంవత్సరాల్లో బ్యాంకుల రుణ ఆస్తుల నాణ్యత గణనీయంగా మెరుగుపడగా, మోస్తరుగా క్షీణించొచ్చని తెలిపింది. అన్ సెక్యూర్డ్, సూక్ష్మ రుణాల్లో (మైక్రోఫైనాన్స్) ఒత్తిళ్లను ప్రస్తావించింది. రేట్ల త గ్గింపు నేపథ్యంలో నికర వడ్డీ మార్జిన్లపై ప్రభావం పెద్దగా ఉండదని, బ్యాంకుల లాభదాయకత పటిష్టంగా ఉంటుందని అంచనా వేసింది.2024 మధ్య నుంచి భారత వృద్ధి నిదానించగా, తిరిగి వేగాన్ని అందుకుంటుందని.. ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని తెలిపింది. ప్ర స్తుత ఆర్థిక సంవత్సరం సెపె్టంబర్ త్రైమాసికంలో జీడీపీ 5.6%కి పడిపోగా, డిసెంబర్ క్వార్టర్లో తిరిగి 6.2%కి పుంజుకోవడం గమనార్హం.2025–26లో సగటు ద్రవ్యోల్బణం 4.5%కి దిగొస్తుందని మూడీస్ పేర్కొంది. ఫిబ్రవరి సమీక్షలో ఆర్బీఐ ఎంపీసీ రెపో రేటును తగ్గించడం తెలిసిందే. ‘‘అమెరికా వాణిజ్య విధానాలతో అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల్లో.. ఆర్బీఐ కాస్త అప్రమత్త ధోరణిని అనుసిరించొచ్చు. దీంతో తదుపరి రేట్ల కోత మోస్తరుగా ఉండొచ్చు’’అని మూడీస్ పేర్కొంది. 2025–26లో రుణాల వృద్ధి 11–13 శాతం మధ్య ఉండొచ్చని అంచనా వేసింది. -
స్థిరంగా స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నిన్నటి ముగింపుతో పోలిస్తే గురువారం స్థిరంగా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:34 సమయానికి నిఫ్టీ(Nifty) 10 పాయింట్ పెరిగి 22,484కు చేరింది. సెన్సెక్స్(Sensex) 83 పాయింట్లు పెరిగి 74,124 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 103.59 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 70.94 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.29 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.49 శాతం పెరిగింది. నాస్డాక్ 1.22 శాతం పుంజుకుంది.ఇదీ చదవండి: మూడేళ్లలో రూ.52 లక్షల కోట్ల పెట్టుబడులు..అమెరికా ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు రేకెత్తడంతో నిన్నటి మార్కెట్ సెషన్లో ఐటీ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అంతర్జాతీయ వాణిజ్య సుంకాల అనిశ్చితి కూడా సెంటిమెంట్ను దెబ్బతీసింది. కూరగాయలు, గుడ్లు, ప్రొటీన్లు సమృద్ధిగా ఉండే ఇతరత్రా పదార్ధాల రేట్లు నెమ్మదించడంతో ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం ఏడు నెలల కనిష్టమైన 3.61 శాతానికి దిగి వచ్చింది. ఇది గతేడాది జులై తర్వాత కనిష్ట స్థాయి. తాజా పరిణామం నేపథ్యంలో వచ్చే నెలలో రిజర్వ్ బ్యాంక్ మరోసారి కీలక వడ్డీ రేట్ల కోతపై దృష్టి పెట్టడానికి కాస్త అవకాశం లభించినట్లవుతుందని పరిశీలకులు అభిప్రాయపడ్డారు.ఈ నెల 14వ తేదీన హోలీ పండుగ సందర్భంగా మార్కెట్లకు సెలవు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మూడేళ్లలో రూ.52 లక్షల కోట్ల పెట్టుబడులు.. ఎక్కడంటే..
దేశీ అంకురాలు గణనీయంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో స్టార్టప్ల వ్యవస్థలోకి భారీగా పెట్టుబడులు రానున్నాయనే అంచనాలు నెలకొన్నాయి. వచ్చే మూడేళ్లలో 600 బిలియన్ డాలర్ల(సుమారు రూ.52 లక్షల కోట్లు) మేర ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్లాంటి (పీఈ/వీసీ) ప్రత్యామ్నాయ ఇన్వెస్ట్మెంట్లు వస్తాయని నిపుణులు భావిస్తున్నారు. కొత్త ఆవిష్కరణలను, ఎంట్రప్రెన్యూర్షిప్ను ప్రోత్సహించడానికి, కొత్త వెంచర్లు మనుగడ సాగించేలా అనువైన పరిస్థితులు కల్పించడానికి ఇవి తోడ్పడనున్నాయి. 2027 ఆర్థిక సంవత్సరానికల్లా భారత్ 5 ట్రిలియన్ డాలర్ల స్థాయిని సాధించాలంటే కావాల్సిన పెట్టుబడుల్లో (ప్రభుత్వ పెట్టుబడులు, కార్పొరేట్ డెట్, పీఈ/వీసీ ఫండింగ్ మొదలైనవి) ఇది 13 శాతమని ఐఎంటీ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ మార్కెట్స్ (సీఎఫ్ఎం) ప్రారంభ కార్యక్రమంలో నిపుణులు తెలిపారు.ఇదీ చదవండి: స్టార్లింక్కు స్వాగతం అంటూ కేంద్రమంత్రి ట్వీట్.. కాసేపటికే డిలీట్భారత అంకుర సంస్థల సామర్థ్యాలను ఇన్వెస్టర్లు గుర్తిస్తున్న నేపథ్యంలో స్టార్టప్ల వ్యాపారం తీరుతెన్నుల్లో గణనీయంగా మార్పులు రాగలవని ఐఎంటీ ఘాజియాబాద్ డైరెక్టర్ ఆతిష్ చటోపాధ్యాయ పేర్కొన్నారు. బీఎఫ్ఎస్ఐ నిపుణులకు డిమాండ్ పెరుగుతుండటంతో సీఎఫ్ఎంలో కోర్సులకు మంచి ఆదరణ ఉంటుందని వివరించారు. పరిశ్రమ అవసరాలపై ప్రధానంగా దృష్టి పెడుతూ రూపొందించిన సర్టిఫికేషన్లు, అనుభవపూర్వకమైన విధంగా ఉండే బోధన మొదలైన అంశాలు, విద్యార్థులు వివిధ నైపుణ్యాలను సాధించేందుకు ఉపయోగపడగలవని హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఎండీ నవనీత్ మునోట్ తెలిపారు. -
నిరుద్యోగులకు తీపి కబురు..
రానున్న త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) నియామకాలు బలంగా ఉండనున్నాయి. అంతర్జాతీయంగా చూస్తే, భారత కంపెనీలు ఈ ఏడాది క్యూ2లో అధిక నియామకాలను చేపట్టే ఉద్దేశంతో ఉన్నట్టు మ్యాన్పవర్ గ్రూప్ ‘ఎంప్లాయిమెంట్ అవుట్లుక్ సర్వే’లో తెలిసింది. నికర నియామక ఉద్దేశం (ఎన్ఈవో) 43 శాతానికి చేరింది. అంతర్జాతీయంగా చూస్తే వచ్చే త్రైమాసికానికి ఇది సగటున 18 శాతమే ఉంది. 42 దేశాలకు చెందిన 40,413 కంపెనీల అభిప్రాయాలను ఈ సర్వే కోసం మ్యాన్పవర్ గ్రూప్ పరిగణనలోకి తీసుకుంది. జనవరి 2 నుంచి 31 వరకు సర్వే జరిగింది.సర్వే ఫలితాలు.. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో కొత్త నియామకాలు చేపడతామని 55 శాతం కంపెనీలు తెలిపాయి. జనవరి–మార్చి త్రైమాసికంతో పోల్చితే నియామకాలు తగ్గుతాయని 12 శాతం కంపెనీలు చెప్పగా, తమ సిబ్బందిలో ఎలాంటి మార్పులు ఉండవని 29 శాతం కంపెనీలు సంకేతమిచ్చాయి. మరో 4 శాతం కంపెనీలు ఏమీ చెప్పలేమని పేర్కొన్నాయి.ఐటీ రంగంలో 55 శాతం, ఇండ్రస్టియల్ అండ్ మెటీరియల్స్ రంగంలో 48 శాతం, హెల్త్కేర్ అండ్ లైఫ్ సైన్సెస్లో 42 శాతం, రవాణా, లాజిస్టిక్స్, ఆటోమోటివ్లో 40 శాతం, కమ్యూనికేషన్ సర్వీసెస్లో 38 శాతం చొప్పున నియామకాలు ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంతో పోల్చి చూస్తే పెరగనున్నట్టు సర్వే ఫలితాల ఆధారంగా తెలుస్తోంది.ఫైనాన్షియల్ అండ్ రియల్ ఎస్టేట్ రంగంలో 43 శాతం మేర నియామకాలు పెరగనున్నాయి. కానీ, జనవరి–మార్చి త్రైమాసికంతో పోల్చితే ఒక శాతం తక్కువ. ఎనర్జీ అండ్ యుటిలిటీస్లో 32 శాతం, కన్జ్యూమర్ గూడ్స్ అండ్ సర్వీసెస్లో 32 శాతం, చొప్పున నియామకాల ఉద్దేశ్యం కనిపించింది. క్యూ1 కంటే 6 పాయింట్లు, 8 పాయింట్ల మేర తగ్గడం గమనార్హం. దక్షిణాదిన 39 శాతం, ఉత్తరం, తూర్పు భారత్లో 47 శాతం, పశ్చిమాదిలో 47 శాతం మేర అధిక నియామకాలు వచ్చే క్వార్టర్లో చోటుచేసుకోనున్నాయి. సిబ్బందిని పెంచుకోవడానికి కార్యకలాపాల విస్తరణ ప్రధాన కారణంగా ఉంది.ఇదీ చదవండి: స్టార్లింక్కు స్వాగతం అంటూ కేంద్రమంత్రి ట్వీట్.. కాసేపటికే డిలీట్వ్యాపార సంస్థల్లో విశ్వాసం..నియామకాల ఉద్దేశ్యం జనవరి–మార్చి త్రైమాసికంతో పోలిస్తే ఏప్రిల్–జూన్ క్వార్టర్కు బలపడింది. మారుతున్న ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొనటంలో భారత వ్యాపార సంస్థల విశ్వాసాన్ని ఇది తెలియజేస్తోంది. టెక్నాలజీ, ఇండ్రస్టియల్, ఫైనాన్షియల్ రంగంలో బలమైన నియామకాల ధోరణి కొనసాగుతుంది. – సందీప్ గులాటి, మ్యాన్పవర్ గ్రూప్ ఇండియా ఎండీ -
ఏడు నెలల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం.. ఐఐపీ అప్
కూరగాయలు, గుడ్లు, ప్రొటీన్లు సమృద్ధిగా ఉండే ఇతరత్రా పదార్ధాల రేట్లు నెమ్మదించడంతో ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం ఏడు నెలల కనిష్టమైన 3.61 శాతానికి దిగి వచ్చింది. ఇది గతేడాది జూలై తర్వాత కనిష్ట స్థాయి. తాజా పరిణామం నేపథ్యంలో వచ్చే నెలలో రిజర్వ్ బ్యాంక్ మరోసారి కీలక వడ్డీ రేట్ల కోతపై దృష్టి పెట్టడానికి కాస్త అవకాశం లభించినట్లవుతుందని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. రిజర్వ్ బ్యాంక్ ఏప్రిల్ 7–9 మధ్య ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష చేపట్టనుంది. రిటైల్ ద్రవ్యోల్బణం జనవరిలో 4.26 శాతంగా, గతేడాది ఫిబ్రవరిలో 5.09 శాతంగా నమోదైంది. ఆహార ద్రవ్యోల్బణం 222 బేసిస్ పాయింట్ల మేర తగ్గినట్లు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) వెల్లడించింది. 2023 మే తర్వాత ఇదే కనిష్టమని పేర్కొంది. కూరగాయలు, గుడ్లు, మాంసం, చేపలు, పప్పు ధాన్యాలు మొదలైన వాటి ధరల పెరుగుదల తగ్గడమే రిటైల్, ఆహార ద్రవ్యోల్బణాలు దిగి రావడానికి కారణమని వివరించింది. ఇదీ చదవండి: స్టార్లింక్కు స్వాగతం అంటూ కేంద్రమంత్రి ట్వీట్.. కాసేపటికే డిలీట్జనవరిలో ఐఐపీ 5 శాతం అప్తయారీ కార్యకలాపాలు పుంజుకోవడంతో దేశీయంగా పారిశ్రామికోత్పత్తి జనవరిలో మెరుగుపడింది. దీనికి సంబంధించిన సూచీ (ఐఐపీ) వృద్ధి 5%గా నమోదైంది. ఇది 2024 నవంబర్లో 5 శాతంగా ఉంది. 2024 డిసెంబర్ గణాంకాలను ప్రభుత్వం 3.2% నుంచి 3.5%కి సవరించింది. ఇక, గతేడాది జనవరిలో 3.6%గా ఉన్న తయారీ రంగ ఉత్పత్తి ఈ ఏడాది జనవరిలో 5.5%కి పెరిగింది. మరోవైపు, 2024–25 ఏప్రిల్–జనవరి మధ్య కాలంలో ఐఐపీ వృద్ధి 6 శాతం నుంచి 4.2 శాతానికి నెమ్మదించింది.