breaking news
Business
-
26,000 మార్కు చేరువలో నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:24 సమయానికి నిఫ్టీ(Nifty) 49 పాయింట్లు పెరిగి 25,985 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 110 పుంజుకొని 84,386 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 96.68బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 69.3 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.14 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.33 శాతం పడిపోయింది.నాస్డాక్ 0.59 శాతం దిగజారింది.Today Nifty position 11-02-2026(time: 9:26 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఆరు ఎన్బీఎఫ్సీ లైసెన్సుల సరెండర్
అనుబంధ సంస్థల్లో విలీనం కావడంతో టాటా మోటర్స్ ఫైనాన్స్, పిరమాల్ ఎంటర్ప్రైజెస్ తమ నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ (ఎన్బీఎఫ్సీ) లైసెన్సులను రిజర్వ్ బ్యాంకుకి సరెండర్ చేశాయి. వీటితో పాటు మరో ఆరు సంస్థలు తమ లైసెన్సులను తిరిగి ఇచ్చేశాయి. ఏఏఆర్ శ్యామ్ ఇండియా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, రామా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, శ్రీ రామచంద్ర ఎంటర్ప్రైజెస్, శ్రీ నిర్మాణ్, అంకిత ప్రతిష్టాన్, మయూఖ ఇన్వెస్ట్మెంట్ ఈ జాబితాలో ఉన్నాయి. టాటా క్యాపిటల్లో టాటా మోటర్స్ ఫైనాన్స్ గతేడాది మే 8న విలీనమైంది. 2025 సెప్టెంబర్లో పిరమాల్ ఫైనాన్స్లో పిరమాల్ ఎంటర్ప్రైజ్ విలీనమైంది.మరోవైపు, నిర్దిష్ట ఎన్బీఎఫ్సీలకు రిజిస్ట్రేషన్ నుంచి మినహాయింపునిచ్చే ప్రతిపాదనకు సంబంధించిన ముసాయిదా సవరణలపై అభిప్రాయాలు తెలపాల్సిందిగా సంబంధిత వర్గాలకు రిజర్వ్ బ్యాంక్ సూచించింది. మార్చి 4 లోగా వీటిని ఆర్బీఐకి సమర్పించాల్సి ఉంటుంది. ప్రతిపాదనల ప్రకారం ప్రజల నుంచి నిధులు స్వీకరించని, కస్టమర్లకోసం ప్రత్యేక ఇంటర్ఫేస్ లేని, అసెట్స్ పరిమాణం రూ. 1,000 కోట్ల లోపు ఉన్న ఎన్బీఎఫ్సీలు ఆర్బీఐ వద్ద రిజిస్టర్ చేయించుకోనక్కరలేదు. చిన్న ఎన్బీఎఫ్సీలకు నో రిజిస్ట్రేషన్ప్రజల నుంచి డిపాజిట్లు సమీకరించని చిన్న ఎన్బీఎఫ్సీలు (బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు) ఇకపై ఆర్బీఐ వద్ద నమోదు (రిజిస్టర్) చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అది కూడా రూ.1,000 కోట్ల లోపు ఆస్తులున్న వాటికి రిజి్రస్టేషన్ నుంచి మినహాయింపును ఆర్బీఐ ప్రతిపాదించింది. వీటిని టైప్–ఐగా వర్గీకరించనుంది. ఈ మేరకు ముసాయి దా సర్క్యులర్ను జారీ చేసింది. వీటిల్లో రిస్క్ తక్కువగా ఉండడం వల్లే ఈ ప్రతిపాదన తెచ్చింది. ఆర్బీఐ చట్టం 1934లోని సెక్షన్ 45ఏఐ కింద ప్రతీ ఎన్బీఎఫ్సీ సేవలు అందించేందుకు రిజి్రస్టేషన్ పొందడం తప్పనిసరి. కాకపోతే రూ.1,000 కోట్లలోపున్నవి తమ సొంత నిధులనే పెట్టుబడులుగా వినియోగిస్తాయి కనుక, వాటితో వ్యవస్థాగత రిస్క్ తక్కువేనని ఆర్బీఐ పేర్కొంది. ఒకవేళ ప్రజల నుంచి డిపాజిట్లు సమీకరిస్తున్నా లేదా కస్టమర్ ఇంటర్ఫేస్ (శాఖలు/యాప్/డిజిటల్ ప్లాట్ఫామ్లు) కలిగి ఉంటే ఇకమీదటా రిజిస్ట్రేషన్ తీసుకోవడం తప్పనిసరి అని ఆర్బీఐ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల అప్డేట్స్ -
ఏఐ వినియోగంలో భారత్ జోరు
దేశీయంగా కృత్రిమ మేథ (ఏఐ) వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ఎంటర్ప్రైజ్ విభాగంలో ఏఐ/ఎంఎల్ (మెషిన్ లెర్నిగ్) కార్యకలాపాలకు సంబంధించి అమెరికా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. క్లౌడ్ సెక్యూరిటీ సేవల దిగ్గజం జీస్కేలర్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. భారత్లో ఏఐ వినియోగం వేగంగా పెరుగుతున్నప్పటికీ భద్రతాపరమైన సవాళ్లు గణనీయంగా ఉంటున్నాయని రిపోర్ట్ పేర్కొంది. ఏజెంటిక్ ఏఐని ఆయుధంగా ఉపయోగించకోవడం, నవకల్పనలు–భద్రత చర్యల మధ్య అంతరం భారీగా ఉండటం మొదలైనవి ఇందులో ఉన్నాయని వివరించింది. 2025 జనవరి–డిసెంబర్ మధ్య జీస్కేలర్ జీరో ట్రస్ట్ ఎక్సే్చంజ్ ప్లాట్ఫాంపై నమోదైన లక్ష కోట్ల ఏఐ, మెషిన్ లెరి్నంగ్ లావాదేవీల విశ్లేషణ ఆధారంగా జీస్కేలర్ ఈ రిపోర్టును రూపొందించింది. ఫిబ్రవరి 16–20 మధ్య భారత్లో ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026 జరగనున్న నేపథ్యంలో ఈ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. ఎని్వడియా సీఈవో జెన్సన్ హువాంగ్, ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మన్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, ఆంథ్రోపిక్ సీఈవో డేరియో, క్వాల్కామ్ సీఈవో క్రిస్టియానో ఎమోన్ తదితర దిగ్గజాలు ఈ సదస్సులో పాల్గోనున్నారు. నివేదిక ప్రకారం..దేశీ కంపెనీలు 2025 జూన్–డిసెంబర్ మధ్య కాలంలో ఏకంగా 8,230 కోట్ల ఏఐ/ఎంఎల్ లావాదేవీలు నిర్వహించాయి. ఆసియా–పసిఫిక్ (ఏపీఏసీ) ప్రాంతంలో నమోదైన మొత్తం ఏఐ లావాదేవీల్లో ఇది 46.2 శాతం కావడం గమనార్హం. దీనితో ప్రాంతీయంగా భారత్ అగ్రస్థానంలో నిలిచింది.డిజిటల్ పరివర్తనకు ప్రభుత్వం దన్నుగా నిలవడంతో పాటు ఏఐ మౌలిక సదుపాయాలు–నైపుణ్యాల అభివృద్ధిపై ప్రభుత్వ–ప్రైవేట్ పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఏఐ సామర్థ్యాలున్న సిబ్బంది పెరుగుతుండటం, ఏఐ సేవలను వేగంగా, భారీ స్థాయిలో వినియోగంలోకి తెచ్చేందుకు వీలు కలి్పంచే క్లౌడ్–ఫస్ట్ విధానాలనేవి గతంతో పోలిస్తే భారత్ చాలా వేగంగా వృద్ధి చెందేందుకు తోడ్పడ్డాయి. దేశీయంగా ఏఐ కార్యకలాపాలకు దన్నుగా నిలుస్తున్న రంగాల్లో టెక్నాలజీ–కమ్యూనికేషన్ (3,130 కోట్ల లావాదేవీలు), తయారీ (1,570 కోట్లు), సరీ్వసులు (1,260 కోట్లు), ఫైనాన్స్–ఇన్సూరెన్స్ (1,220 కోట్ల లావాదేవీలు) ఉన్నాయి. కంపెనీల పర్యవేక్షణ సామర్థ్యాలకు మించిన వేగంతో ఎంటర్ప్రైజ్ ఏఐ వినియోగం పెరుగుతోంది. కానీ చాలా సంస్థల్లో కీలకమైన డేటా ఏ దశలో బహిర్గతమయ్యే అవకాశం ఉందో కనిపెట్టలేని భద్రతపరమైన లోపాలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం నెలకొంది. ఏఐని దేనికోసం వినియోగిస్తున్నారు, ఏ డేటాను షేర్ చేస్తున్నారనే దానిపై ఓ కన్నేసి ఉంచుతూ, లీకేజీలను కట్టడి చేసేందుకు ఎప్పటికప్పుడు తగు చర్యలను అమలు చేస్తూ ఉండాలి. మార్కెట్ డిమాండ్కి తగ్గట్లుగా సురక్షితమైన ఏఐ వైపు మళ్లాలంటే డేటా భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వడం చాలా అవసరం. ప్రతికూల పరిస్థితులను సృష్టించి ఎంటర్ప్రైజ్ ఏఐ సిస్టంలను పరీక్షించినప్పుడు కేవలం నిమిషాల వ్యవధిలోనే వాటి బలహీనతలు బయట పడిపోతుండటమనేది సెక్యూరిటీపరంగా నెల కొన్న రిస్క్లను సూచిస్తోంది.స్వతంత్రంగా ప్రణాళికలు వేసుకుని, చర్యలు కూడా తీసుకోగలిగే సామర్థ్యాలున్న ఏజెంటిక్ ఏఐ వినియోగం పెరుగుతోంది. ఈ టెక్నాలజీని ఇప్పటికే ఆయుధంగా మార్చుకుంటున్నారు. సైబర్క్రిమినల్స్, నిఘా గ్రూప్లు ఏఐని ఉపయోగించుకుని దాడులకు పాల్పడుతున్నాయనడానికి స్పష్టమైన ఆధారాలు తెరపైకి వస్తున్నాయి. ఏఐ ఏజెంట్లు నిఘా, చొరబాటు, విస్తృత దాడుల బాధ్యతలు తీసుకుంటున్నాయి. స్వతంత్రంగా, మెషిన్ వేగంతో, భారీ స్థాయిలో సైబర్ దాడులకు దిగుతున్నాయి. ఏఐ కేవలం ఉత్పాదకతను పెంచుకునేందుకు ఉపయోగపడే సాధనంగానే ఉండటం లేదు, నేరగాళ్లకు ఆయుధంగా కూడా మారుతోంది. డేటా చౌర్యం తీవ్ర ఆందోళనకర అంశంగా మారుతోంది. 2025లో అంతర్జాతీయంగా ఏఐ అప్లికేషన్స్లోకి 18,000 టెరాబైట్స్ డేటా వచ్చి చేరింది. ఇది దాదాపు 360 కోట్ల డిజిటల్ ఫొటోలకు సమానం. ఏజెంటిక్ ఏఐ చొరబడిందంటే, సంప్రదాయ రక్షణ పద్ధతులు అడ్డుకోలేవు. నిమిషాల వ్యవధిలో భారీ స్థాయిలో డేటా చౌర్యం జరిగిపోతుంది. ఈ రిస్క్లను ఎదుర్కొనాలంటే ఏఐని కట్టడి చేసేందుకు కంపెనీలు ఏఐనే ఆయుధంగా మార్చుకోవాలి. దాడులకు ఉపయోగపడే ఆస్కారమున్న అన్ని మార్గాలను మూసివేసేందుకు ప్రతి దశలోనూ భద్రతకు ప్రాధాన్యతనిచ్చే ఇంటెలిజెంట్ జీరో ట్రస్ట్ వ్యవస్థను వినియోగించుకోవాలి.ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల అప్డేట్స్ -
ఎన్ఎస్ఈ, ఇండియా పోస్ట్ జట్టు
మ్యుచువల్ ఫండ్స్ని మరింత అందుబాటులోకి తెచ్చే దిశగా పోస్టల్ శాఖ, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) జట్టు కట్టాయి. ఇందుకోసం ఇండియా పోస్ట్కి చెందిన 1.64 లక్షల పోస్టాఫీసుల విస్తృత నెట్వర్క్ని, ఎన్ఎస్ఈ ఎంఎఫ్ ఇన్వెస్ట్ ప్లాట్ఫాంని ఉపయోగించుకోనున్నాయి. తొలి దశలో చిన్న పథకాలతో మొదలుపెట్టి రెండో దశలో పూర్తి స్థాయి స్కీములు, పోర్ట్ఫోలియో అనలిటిక్స్, ప్రాంతీయ భాషల్లో సపోర్ట్, సలహా సేవలను అందుబాటులోకి తేనున్నాయి.గ్రామీణ, చిన్న పట్టణాల్లోని వారు తమ దగ్గరుండే పొదుపు మొత్తాలను, సంపద సృష్టికి ఉపయోగపడే ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేలా ప్రోత్సహించేందుకు ఈ భాగస్వామ్యం తోడ్పడుతుందని ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ప్రస్తుతం మ్యుచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల పరిమాణం రూ.81 లక్షల కోట్లకు చేరింది.ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల అప్డేట్స్ -
టైటాన్ లాభం హైజంప్
న్యూఢిల్లీ: జ్యువెలరీ, వాచీల తయారీ టాటా గ్రూప్ దిగ్గజం టైటాన్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 61 శాతం జంప్చేసి రూ. 1,684 కోట్లను తాకింది. దేశీయంగా జ్యువెలరీ అమ్మకాలు పుంజుకోవడం ఇందుకు సహకరించింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 1,047 కోట్లు ఆర్జించింది. అమ్మకాలు సైతం 42 శాతం ఎగసి రూ. 24,915 కోట్లను తాకాయి. అయితే మొత్తం వ్యయాలు 41 శాతం పెరిగి రూ. 23,192 కోట్లకు చేరాయి. కాగా.. ఇతర ఆదాయంతో కలసి మొత్తం టర్నోవర్ 43 శాతం బలపడి రూ. 25,567 కోట్లకు చేరింది. తనిక, మియా, జోయా, కేరట్లేన్ బ్రాండ్ల జ్యువెలరీ బిజినెస్ ఆదాయం 46 శాతం జంప్చేసి రూ. 23,492 కోట్లయ్యింది. వీటిపై 11 శాతం మార్జిన్లు సాధించింది. అంతర్జాతీయ అమ్మకాలు 83 శాతం దూసుకెళ్లి రూ. 1,058 కోట్లను తాకాయి. జ్యువెలరీ బిజినెస్లో 49 స్టోర్లను కొత్తగా జత కలుపుకోగా.. వీటిలో 24 కేరట్లేన్ విభాగానివే. 22 కొత్త స్టోర్లను జత చేసుకున్న వాచీలు తదితరాల విభాగం 14 శాతం అధికంగా రూ. 1,295 కోట్ల ఆదాయం అందుకుంది. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు బీఎస్ఈలో 0.25 శాతం బలపడి రూ. 4,267 వద్ద ముగిసింది. -
బంగారమే బిగ్ బాస్
న్యూఢిల్లీ: గోల్డ్, వెండి ఈటీఎఫ్లోకి రికార్డు స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి. జనవరిలో రూ.24,040 కోట్లు గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి రాగా, వెండి ఈటీఎఫ్లు రూ.9,463కోట్లను ఆకర్షించాయి. గత డిసెంబర్లో గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి వచ్చిన రూ.11,647 కోట్లతో పోల్చితే రెట్టింపునకు పైగా పెరిగాయి. అంతేకాదు ఒక నెలలో ఈక్విటీ ఫండ్స్కు మించి బంగారం ఈటీఎఫ్లు పెట్టుబడులను ఆకర్షించడం కూడా చరిత్రలో ఇదే మొదటిసారి. మరోవైపు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి సన్నగిల్లుతూ.. బంగారం, వెండిపైకి మనసు మళ్లుతోంది. జనవరిలో ఈక్విటీ ఫండ్స్ నికరంగా రూ.24,028 కోట్లను ఆకర్షించాయి. డిసెంబర్లో వచ్చిన పెట్టుబడులు రూ.28,054 కోట్లతో పోల్చి చూస్తే 14 శాతం తగ్గినట్టు తెలుస్తోంది. ఈక్విటీ ఫండ్స్లోకి పెట్టుబడుల రాక తగ్గడం వరుసగా ఇది రెండో నెల. గతేడాది నవంబర్లో ఈక్విటీ ఫండ్స్ రూ.29,911 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం గమనార్హం. దీంతో పోల్చితే డిసెంబర్లో 6 శాతం తగ్గాయి. ఇక గతేడాది అక్టోబర్లో వచ్చిన పెట్టుబడులు రూ.24,690 కోట్లుగా ఉన్నాయి. మొత్తం మీద ఈక్విటీ పెట్టుడుల రాక మూడు నెలల కనిష్టానికి చేరింది. కమోడిటీల వైపు అడుగులు.. గత కొన్ని నెలలుగా ఈక్విటీ మార్కెట్లు ఎలాంటి రాబడులు ఇవ్వకపోగా.. బంగారం, వెండి మంచి ర్యాలీ చేస్తున్నాయని.. దీంతో కొంత మేర పెట్టుబడులు కమోడిటీల్లోకి మళ్లినట్టు వీఎస్ఆర్కే క్యాపిటల్ డైరెక్టర్ స్వప్నిల్ అగర్వాల్ తెలిపారు. ఇక నుంచి ఈక్విటీ పథకాల్లోకి పెట్టుబడుల రాక క్రమంగా మెరుగుపడొచ్చని అభిప్రాయపడ్డారు. స్టాక్స్ విలువలు ఆకర్షణీయంగా ఉండడం, స్థిరీకరణ ముగియడంతో ఈ ఏడాది ఈక్విటీలు బలమైన పనితీరు చూపించొచ్చని, దీంతో ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు పుంజుకోవచ్చని అంచనా వేశారు. ⇒ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్/ పన్ను ఆదా ఫండ్స్) పథకాల నుంచి రూ.594 కోట్లను ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు. ⇒ మరోవైపు డెట్ మ్యూచువల్ ఫండ్స్లోకి నికరంగా రూ.74,827 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. డిసెంబర్లో ఇదే విభాగం రూ.1.32 లక్షల కోట్లను కోల్పోవడం గమనార్హం. ⇒ హైబ్రిడ్ ఫండ్స్లోకి (ఈక్విటీ, డెట్ కలసిన) రూ.17,356 కోట్లు.. మల్టీ అసెట్ ఫండ్స్లోకి (ఈక్విటీ, డెట్, బంగారం, వెండి కలసిన) రూ.10,485 కోట్లు చొప్పున వచ్చాయి. ⇒ మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని అన్ని రకాల పెట్టుబడుల విలువ (ఏయూఎం) జనవరి చివరికి రూ.81.01 లక్షల కోట్లకు పెరిగింది. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఈక్విటీ పథకాల్లోకి జనవరిలోనూ రికార్డు స్థాయిలో రూ.31,000 పెట్టుబడులు వచ్చాయి. గోల్డ్, వెండికి డిమాండ్.. గోల్డ్ ఈటీఎఫ్లోకి రూ.24,040 కోట్లు రావడంతో.. ఫండ్స్ నిర్వహణలోని మొత్తం గోల్డ్ ఈటీఎఫ్ ఆస్తుల విలువ రూ.1.84 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి రూ.61,000 కోట్లు రావడం గమనార్హం. మరోవైపు వెండి ఈటీఎఫ్ల్లోకి డిసెంబర్లో రూ.9,463 కోట్లు రావడంతో.. వెండి ఈటీఎఫ్ల నిర్వహణ ఆస్తుల విలువ రూ. 1.16 లక్షల కోట్లకు పెరిగింది. డిసెంబర్లో వచ్చిన 3,962 కోట్లతో పోల్చి చూస్తే ఒక్క నెలలోనే 139 శాతం పెరిగాయి. -
బిలియన్ డాలర్ల...భావోద్వేగాల బిజినెస్
సాక్షి, బిజినెస్ డెస్క్: భారత్లో ఇప్పుడు కొత్త తరహా డిజిటల్ స్నేహితులు అడుగుపెడుతున్నారు. ఏఐ ఆధారిత వర్చువల్ పెట్స్ (ఏఐ పెట్స్) యువతలో వేగంగా ఆదరణ పొందుతున్నాయి. నగర జీవనంలో పెరుగుతున్న ఒంటరితనం, నిజమైన పెంపుడు జంతువుల బాధ్యతలు తీసుకోలేని పరిస్థితుల్లో ఏఐ పెట్స్ ఒక ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. భావోద్వేగంగా స్పందించడం, మాటలతో ఆదుకోవడం వంటి లక్షణాల వల్ల ఇవి యువతను ఆకర్షిస్తున్నాయి. వీటితో యూజర్లు నిజమైన జంతువును పెంచుకుంటున్న అనుభూతి పొందుతారు.వీటితో కూడా రోజువారీ రొటీన్ను ఫాలో అవచ్చు. ఆహారం పెట్టడం, స్నానం చేయించడం, ఆడించడం, నిద్ర షెడ్యూల్ చూసుకోవడం వంటి పనులు చేస్తూ నిజమైన పెంపుడు జంతువును ఆడించినట్లే ఆనందిస్తారు. ఈ పెట్ అప్లికేషన్లలో వినియోగదారులు తమ పెంపుడు జంతువుకు దుస్తులు, ఆభరణాలు కొనుగోలు చేయవచ్చు. నెలకు సగటున రూ. 30 నుంచి రూ. 60 వరకు ఖర్చు చేస్తూ, ఆ ఏఐ పెట్ను సంరక్షించడం, శిక్షణ ఇవ్వడం, భావోద్వేగంగా స్పందించేలా నేరి్పంచడం చేస్తున్నారు. పెరుగుతున్న మార్కెట్ వర్చువల్ పెట్స్ మార్కెట్ విలువ ప్రస్తుతం సుమారు 150 మిలియన్ డాలర్లని అంచనా. వెంచర్ క్యాపిటలిస్టులు ఈ రంగం 35–40 శాతం వార్షిక వృద్ధితో బిలియన్ డాలర్లకు చేరుతుందని ఊహిస్తూ అందుకు అనుగుణంగా పెట్టుబడులు పెడుతున్నారు. ఈ యాప్లు ప్రధానంగా సబ్ర్స్కిప్షన్లు,ఇన్–యాప్ కొనుగోళ్లు, పెట్ యాక్సెసరీస్ ద్వారా ఆదాయం పొందుతున్నాయి. భవిష్యత్తు ఎలా ఉంటుంది? వాయిస్ ఆధారిత ఇంటరాక్షన్, మల్టీప్లేయర్ ఫీచర్లు, వివిధ లొకేషన్లలో పెట్స్ను కలుసుకునే అవకాశాలతో ఈ రంగం మరింత విస్తరిస్తోంది. అయితే ఏఐ పెట్స్ టెక్నాలజీ నిజమైన మానవ సంబంధాల నుంచి మనుషులను దూరం చేస్తుందని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.టమాగోచ్చి నుంచి ఏఐ వరకువాస్తవానికి డిజిటల్ పెట్స్ కాన్సెప్ట్ కొత్తది కాదు. జపాన్లో 1990లలో వచి్చన టమాగోచ్చి వీడియో గేమ్ వర్చువల్ పెట్స్కు బాట వేసింది. ఆ తర్వాత 2000లలో టాకింగ్ టామ్, ఫ్రెండ్స్ యాప్స్, విడ్జెట్స్ వంటి అప్లికేషన్లు పాపులర్ అయ్యాయి. ఇప్పుడు ఏఐ టెక్నాలజీతో ఈ వర్చువల్ పెట్స్ మరింత అడ్వాన్స్డ్గా మారాయి. పాకెట్ పెట్, క్రిప్టో కిట్టీస్, జూమీ వంటి యాప్లు యూజర్లు తమ ఊహలకు అనుగుణంగా పెంపుడు జంతువులను సృష్టించుకునే అవకాశం ఇస్తున్నాయి. -
తడబడిన వెండి ఎగసిన పసిడి
న్యూఢిల్లీ: అమ్మకాల ఒత్తిడికి వెండి నష్టపోగా.. కొనుగోళ్ల మద్దతుతో పసిడి ధరలు పెరిగాయి. ఢిల్లీ మార్కెట్లో మంగళవారం వెండి కిలోకి రూ.7,500 నష్టపోయి రూ.2,64,500 లక్షలకు (పన్నులు కలుపుకుని) పరిమితమైంది. బంగారం 10 గ్రాములకు రూ.2,200 పెరిగి రూ.1,60,700 వద్ద (పన్నులు సహా) స్థిరపడింది. జ్యుయలర్లు, ఇన్వెస్టర్ల నుంచి స్థిరమైన కొనుగోళ్లు వరుసగా రెండో రోజు పసిడి ధరలు పెరగడానికి కారణమని ట్రేడర్లు తెలిపారు. బంగారం, వెండి ధరలు ఒక శ్రేణి పరిధిలో చలించొచ్చని.. ఈ మార్కెట్లు సమీప కాలానికి స్థిరీకరణ దశలోకి ప్రవేశించినట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ విభాగం సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ఔన్స్కు ఒక డాలర్కు పైగా నష్టపోయి రూ.82.16 డాలర్ల స్థాయిలో ట్రేడ్ అయింది. బంగారం స్వల్ప నష్టంతో ఔన్స్ 5,052 డాలర్ల స్థాయిలో కదలాడింది. అమెరికాలో రిటైల్ విక్రయాలు, నిరుద్యోగ డేటా కోసం ఇన్వెస్టర్లు వేచి చూస్తున్నట్టు ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ జతీన్ త్రివేది తెలిపారు. -
మళ్లీ పెరిగిన బంగారం, వెండి: కొత్త ధరలు ఇలా..
భారతదేశంలో బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉన్నాయి. ఈ రోజు (మంగళవారం) ఉదయం స్థిరంగా ఉన్న గోల్డ్ రేటు సాయంత్రానికి స్వల్ప పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో మార్పులు మార్పులు జరిగాయి. ఈ కథనంలో లేటెస్ట్ రేట్లు ఎలా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఉదయం రూ.1,57,910 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్), రూ. 1,44,750 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్) వద్ద ఉన్న గోల్డ్ రేటు సాయంత్రానికి వరుసగా రూ. 1,58,780 (రూ. 870 పెరిగింది) & రూ. 1,45,550 (రూ. 800 పెరిగింది) వద్ద నిలిచాయి. ఇదే ధరలు బెంగళూరు, ముంబైలలో కూడా కొనసాగుతుంది.చెన్నైలో అయితే గోల్డ్ రేటు స్వల్పంగా తగ్గింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,59,060 రూపాయల వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,45,800 రూపాయల వద్ద నిలిచింది.ఇదీ చదవండి: వెండి ధర ఇంకా ఎంత పెరుగుతుందంటే..?ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు పెరిగింది. ఉదయం స్థిరంగా ఉన్న బంగారం ధర సాయంత్రానికి పెరిగింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 158930 రూపాయల (రూ. 870 పెరిగింది) వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,45,700 రూపాయల (రూ. 800 పెరిగింది) వద్ద నిలిచింది.వెండి ధరలుఉదయం కేజీ వెండి రేటు రూ. 2.90 లక్షల వద్ద ఉండేది. అయితే సాయంత్రానికి ఆ రేటు రూ. 3లక్షలకు చేరింది. అంటే కేజీ ధర గంటల వ్యవధిలో రూ. 10వేలు పెరిగిందన్నమాట. -
ఈవీ లవర్స్కి గుడ్న్యూస్.. వచ్చేస్తోంది విడా ఉబెక్స్!
హీరో మోటోకార్ప్ యాజమాన్యంలోని.. ఎలక్ట్రిక్ మొబిలిటీ బ్రాండ్ విడా, భారతదేశంలో తన తొలి ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఉబెక్స్ పేరుతో విడుదల కానున్న ఈ బైక్ డిజైన్కు భారతదేశంలో పేటెంట్ కూడా లభించింది.విడా ఉబెక్స్ ఎలక్ట్రిక్ బైక్ మొదటిసారి EICMA 2025లో కనిపించింది. ఆ సమయంలో ఈ బైక్ ఫ్యూచరిస్టిక్ డిజైన్లో కనిపించినప్పటికీ.. ఇప్పుడు తాజాగా బయటకు వచ్చిన పేటెంట్ చిత్రాలు.. బైక్ సాధారణ వినియోగదారులకు తగిన విధంగా రూపుదిద్దుకుంటున్నట్లు చూపిస్తున్నాయి.సాధారణ స్ట్రీట్ ఫైటర్ డిజైన్ కలిగిన విడా ఉబెక్స్ బైక్.. ఫ్యూయెల్ ట్యాంక్, విశాలంగా కనిపించే సింగిల్ పీస్ స్టెప్ సీటును పొందినట్లు స్పష్టమవుతోంది. ప్రొజెక్టర్ స్టైల్ హెడ్ల్యాంప్, ఎల్ఈడీ డీఆర్ఎల్, అల్లాయ్ వీల్స్, చిన్నగా రూపొందించిన టెయిల్ సెక్షన్ ఉన్నాయి. ఈ బైక్ కొత్తగా కనిపించినప్పటికీ.. రోజువారీ వినియోగానికి అనుకూలంగా ఉండేలా రూపొందించారు. బ్యాటరీ వివరాలు తెలియాల్సి ఉంది.ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక భాగంలో మోనోషాక్ ఉంటుంది. రెండు చక్రాలపై డిస్క్ బ్రేక్లు ఉన్నాయి. కంపెనీ ఈ బైకులో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయో వెల్లడించలేదు. కానీ ఇందులో స్మార్ట్ఫోన్ ఇంటిగ్రేషన్, టర్న్ బై టర్న్ నావిగేషన్తో సహా కనెక్టెడ్ టెక్నాలజీతో కూడిన టీఎఫ్టీ డిస్ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఫెరారీ తొలి ఎలక్ట్రిక్ కారు.. పేరేంటో తెలుసా?హీరో మోటోకార్ప్ ఈ బైకును ఎప్పుడు లాంచ్ చేయనుంది అనే విషయాన్ని వెల్లడించలేదు. అయితే దీనిని ఇండియన్ రోడ్ల మీద టెస్ట్ చేసిన తరువాత దేశీయ విఫణిలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ బైక్ లాంచ్ అయిన తరువాత హీరో ప్రీమియం డీలర్షిప్లు, విడా అవుట్లెట్ల ద్వారా విక్రయించనున్నారు. -
ఏఐ కంపెనీ వీడిన సేఫ్టీ హెడ్.. రాజీనామాలో హెచ్చరిక!
ప్రముఖ ఏఐ కంపెనీ ఆంథ్రోపిక్ మరోమారు వార్తల్లో నిలిచింది. కంపెనీలో సేఫ్గార్డ్ రీసెర్చ్ టీమ్కు నాయకత్వం వహించిన మృణాంక్ శర్మ రాజీనామా చేశారు. ఆయన ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించారు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.మృణాంక్ శర్మ తన పోస్టులో.. ఉపయోగించిన భాష, కవులు రిల్కే & విలియం స్టాఫర్డ్ల ప్రస్తావనలు, ఈ రాజీనామా వెనుక ఉన్న లోతైన కారణాలపై అనేక అనుమానాలకు తావిచ్చాయి. ప్రపంచం ప్రమాదంలో ఉందని చెబుతూ.. దీనికి కారణం కేవలం ఏఐ లేదా బయో వెపన్స్ మాత్రమే కాదు. ఒకదానితో ఒకటి ముడిపడిన అనేక సంక్షోభాల వల్ల ప్రమాదంలో ఉందని పేర్కొన్నారు. అయితే ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయికి మన జ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అప్పుడే మనం ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోగలం అని పేర్కొన్నారు. లేకుంటే.. తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.మృణాంక్ శర్మ తన రాజీనామాకు సంబంధించిన స్పష్టమైన కారణాలను నేరుగా వెల్లడించలేదు. కానీ.. నిరంతర ఒత్తిళ్ల కారణంగా తనకు అత్యంత ముఖ్యమైన విలువలను పక్కన పెట్టాల్సి వచ్చిందని చెప్పారు. ఈ ఒత్తిళ్లు కేవలం తనలోనే మాత్రమే కాకుండా, సంస్థలో కూడా కనిపించాయని, నిర్ణయాలు తీసుకునే సమయంలో విలువల కంటే ఇతర అంశాలకు ప్రాధాన్యం ఇచ్చే పరిస్థితి తరచూ ఎదురవుతుందని పేర్కొన్నారు.ఆంథ్రోపిక్ సంస్థను ప్రముఖ పరిశోధకులు హర్ష్ మెహతా, బెహ్నామ్ నెయ్షబూర్ వంటి వారు ఇప్పటికే విడిచిపెట్టారు. వీరు కొత్తదేదో ప్రారంభించేందుకు వెళుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి సేఫ్గార్డ్ రీసెర్చ్ టీమ్ హెడ్ మృణాంక్ శర్మ చేరారు.Today is my last day at Anthropic. I resigned.Here is the letter I shared with my colleagues, explaining my decision. pic.twitter.com/Qe4QyAFmxL— mrinank (@MrinankSharma) February 9, 2026 -
ఫెరారీ తొలి ఎలక్ట్రిక్ కారు.. పేరేంటో తెలుసా?
సూపర్ కార్లను లాంచ్ చేస్తూ.. గ్లోబల్ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన ఫెరారీ కంపెనీ.. తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారుకు ఫెరారీ లూసే (Ferrari Luce) అనే పేరును అధికారికంగా ధృవీకరించింది. ఫిబ్రవరి 9, 2026న శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఈ ప్రకటన చేసింది.ఫెరారీ లూసే క్యాబిన్ డిజైన్ను మాజీ ఆపిల్ డిజైన్ చీఫ్ అభివృద్ధి చేశారు. దీంతో ఇది రెట్రో డిజైన్ పొందింది. ఈ కారులో టచ్స్క్రీన్లు మాత్రమే కాకుండా.. నాబ్లు & స్విచ్లు కూడా ఉన్నాయి. డ్రైవింగ్ అనుభవాన్ని ఎప్పటిలాగే అందించడానికి ఇలా డిజైన్ చేసినట్లు సంస్థ వెల్లడించింది.త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. ఇది తేలికగా ఉండటమే కాకుండా ప్రీమియం అనుభూతిని ఇస్తుంది. రేంజ్, టూర్ & పెర్ఫార్మెన్స్ వంటి డ్రైవింగ్ మోడ్ల కోసం రోటరీ స్విచ్లు ఉంటాయి. కుడి వైపున ఉన్న ఎరుపు మానెట్టినో డయల్ డ్రైవర్లు.. ఐస్, వెట్, డ్రై, స్పోర్ట్ & ఈఎస్సీ ఆఫ్ వంటి ఛాసిస్ సెట్టింగ్లను టోగుల్ చేయడానికి అనుమతిస్తుంది.12.5 అంగుళాల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంటాయి. బ్యాటరీ స్థితి, పవర్ రీజెనరేషన్, టైర్ ప్రెజర్ & జీ ఫోర్స్ డేటాను ఇందులో చూడవచ్చు. ఫెరారీ లూస్ ప్రత్యేకమైన కంట్రోల్ సిస్టమ్ పొందనుంది. సెంటర్ కన్సోల్లో కప్ హోల్డర్లు, బూట్ & లాక్ ఫంక్షన్ల కోసం భౌతిక బటన్లు, నాలుగు విండోల కోసం స్విచ్లు ఉంటాయి. వెనుక ప్రయాణీకులు స్పీడ్, ల్యాప్ టైమ్స్ తెలుసుకోవడానికి టచ్స్క్రీన్ను పొందుతారు. -
రైలులో అత్యవసర బెర్త్లు ఉంటాయని తెలుసా.. వీటిని ఎవరికి ఇస్తారంటే?
రైలు ప్రయాణం చేయాలనుకునేవారికి అతిపెద్ద సమస్య టికెట్ కర్ఫర్మ్. పండుగలు, సెలవుల్లో ట్రైన్ టికెట్ కర్ఫర్మ్ అవ్వడం అనేది చాలా కష్టం. తత్కాల్ టికెట్లు సైతం కొన్నిసార్లు కష్టమైపోతాయి. అయితే ఇండియన్ రైల్వేలో ఎమర్జెన్సీ కోటా ఒకటి ఉంటుందని బహుశా చాలా మందికి తెలుసుండకపోవచ్చు. దీనిని బుక్ చేసుకోవడానికి ఎవరు అర్హులు?, ఎవరికి కేటాయిస్తారు? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.ఇండియన్ రైల్వేలో ఎమర్జెన్సీ కోటా.. అనేది అత్యవసర ప్రయాణ అవసరాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక రిజర్వేషన్ విధానం. ఇది సాధారణ ప్రయాణికులందరికీ అందుబాటులో ఉండదు. ప్రత్యేక పరిస్థితుల్లో, కొన్ని నిర్దిష్ట వర్గాల వారికి మాత్రమే ఈ కోటా ద్వారా టికెట్లు మంజూరు చేయడం జరుగుతుంది.భారతీయ రైల్వే.. ప్రతిరోజూ అనేక మంది ప్రయాణికుల నుంచి అత్యవసర ప్రయాణ అభ్యర్థనలు స్వీకరిస్తుంది. అలాంటి సందర్భాల్లో.. ముఖ్యమైన వ్యక్తులు లేదా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారి కోసం కొన్ని సీట్లు ముందుగానే కేటాయిస్తుంది. ఈ సీట్లనే ఎమర్జెన్సీ కోటా అంటారు. ఇది ప్రతి రైలులో, ప్రతి క్లాస్లో ఉండకపోవచ్చు. కానీ అవసరాన్ని బట్టి కొన్ని రైళ్లు, కొన్ని తరగతుల్లో మాత్రమే పరిమితంగా ఉంటుంది.రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఈ కోటా ప్రధానంగా హై ఆఫిషియల్ రిక్విజిషన్ (HOR) హోల్డర్ల కోసం ఏర్పాటు చేశారు. వీరిలో కేంద్ర ప్రభుత్వ మంత్రులు, సుప్రీం కోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు, వివిధ రాష్ట్రాల ఉన్నతాధికారులు, పార్లమెంట్ సభ్యులు ఉంటారు. వీరు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నప్పుడు, వారి అత్యవసర ప్రయాణ అవసరాల కోసం ఈ కోటా ఉపయోగిస్తారు.ఉన్నతాధికారులకు మాత్రమే కాకుండా.. రైల్వే శాఖ ఇతర అత్యవసర అభ్యర్థనలను కూడా పరిగణలోకి తీసుకుంటుంది. ఇందులో కుటుంబంలో మరణం, తీవ్రమైన అనారోగ్యం, ముఖ్యమైన ఉద్యోగ ఇంటర్వ్యూలకు హాజరవ్వాల్సిన పరిస్థితులు మొదలైనవి ఉన్నాయి. అంటే వీరికి కూడా ఎమర్జెన్సీ కోటా కింద సీటు అందిస్తారన్నమాట.ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో అంశం ఏమిటంటే.. భారతీయ రైల్వేకు ప్రతిరోజూ అనేక స్థాయిల నుంచి అనేక అభ్యర్థనలు వస్తుంటాయి. ఇందులో ఏ అభ్యర్థనకు ముందు ప్రాధాన్యం ఇవ్వాలి అనే విషయం చాలా ముఖ్యమైనది. ఈ ప్రాధాన్యతను 'వారెంట్ ఆఫ్ ప్రిసిడెన్స్' అనే నియమావళి ఆధారంగా నిర్ణయిస్తారు. అంటే.. పదవి, హోదా, అధికార స్థాయి ఆధారంగా ప్రాధాన్యత క్రమం ఉంటుంది.రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఎమర్జెన్సీ కోటా సీట్లు ముందుగా హై ఆఫిషియల్ రిక్విజిషన్ హోల్డర్లు & పార్లమెంట్ సభ్యుల స్వంత ప్రయాణానికి మాత్రమే కేటాయించడం జరుగుతుంది. అది కూడా వారి హోదా ప్రకారం ఉన్న సీనియారిటీ క్రమాన్ని ఖచ్చితంగా పాటిస్తూ కేటాయిస్తారు. ఆ తర్వాత మిగిలిన సీట్లు ఇతర అభ్యర్థనలను పరిశీలించి.. ప్రయాణికుల అధికారిక హోదా, ప్రయాణ అత్యవసరత వంటి అంశాలను బట్టి కేటాయిస్తారు.ఎమర్జెన్సీ కోటా సెల్స్.. అనేవి జోనల్ & డివిజనల్ హెడ్క్వార్టర్స్లో, అలాగే కొన్ని ముఖ్యమైన నాన్ హెడ్క్వార్టర్ స్టేషన్లలో ఉంటాయి. ఈ సౌకర్యాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు, రైల్వే బోర్డు కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. ఎమర్జెన్సీ కోటా కింద సీట్లు కేవలం రాతపూర్వకంగా వచ్చిన అధికారిక అభ్యర్థనల ఆధారంగానే మంజూరు చేయాలని అన్ని జోనల్ రైల్వేలకు స్పష్టం చేసింది. అంటే అత్యవసరమైన పరిస్థితుల్లో ఉన్న, ముఖ్యమైన బాధ్యతలు కలిగిన వ్యక్తుల కోసం రూపొందించిన ఒక ప్రత్యేక సౌకర్యం.ఇదీ చదవండి: వెండి ధర ఇంకా ఎంత పెరుగుతుందంటే..? -
స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్స్
మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 208.17 పాయింట్ల (0.25 శాతం) లాభంతో 84,273.92 వద్ద, నిఫ్టీ 67.85 పాయింట్ల (0.26 శాతం) లాభంతో 25,935.15 వద్ద ఉన్నాయి.పావ్నా ఇండస్ట్రీస్ లిమిటెడ్, లుమాక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, లక్ష్మి కోట్స్పిన్ లిమిటెడ్, క్షితిజ్ పాలీలైన్ లిమిటెడ్, ఏబీఎమ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. పెర్ల్ గ్లోబల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, లాయల్ టెక్స్టైల్స్ మిల్స్ లిమిటెడ్, కిరి ఇండస్ట్రీస్ లిమిటెడ్, జూబిలెంట్ అగ్రి అండ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, స్పేస్నెట్ ఎంటర్ప్రైజెస్ ఇండియా లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
వెండి ధర ఇంకా ఎంత పెరుగుతుందంటే..?
బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్న తరుణంలో.. ప్రముఖ ఇన్వెస్టర్, ప్రసిద్ధ 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి తాజాగా ఒక ట్వీట్ చేశారు. ఇందులో తాను 600 సిల్వర్ ఈగల్స్ కొనుగోలు చేసినట్లు చెప్పుకొచ్చారు.ఇటీవల నేను మరో 600 యూఎస్ సిల్వర్ ఈగల్స్ కొనుగోలు చేశాను. ఈ రోజు వెండి స్పాట్ ధర ఒక ఔన్సుకు 82 డాలర్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను గమనిస్తే, భవిష్యత్తులో వెండి ధర మరింత పెరిగే అవకాశం ఉందని నా నమ్మకం. ముఖ్యంగా 2026లో వెండి ధర ఒక్క ఔన్సుకు 200 డాలర్లకు చేరుకోవచ్చు, లేదా దానికంటే కూడా ఎక్కువ కావచ్చు అని నేను భావిస్తున్నాను.ఇప్పటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికన్ డాలర్ స్థితి ఆందోళనకరంగా మారుతోంది. అధిక రుణాలు, ద్రవ్యోల్బణం వంటి కారణాల వల్ల డాలర్ విలువ క్రమంగా తగ్గే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో కాగితపు కరెన్సీ (ఫియట్ కరెన్సీ)పై మాత్రమే ఆధారపడే వారు భవిష్యత్తులో నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.Just purchased another 600 US Silver Eagles.Today’s spot is $82 an ounce. Still believe silver will reach $200 an ounce….or more…. in 2026.The US dollar is in trouble.Savers of fiat currency (fake $) biggest losersTake care.— Robert Kiyosaki (@theRealKiyosaki) February 9, 2026ఫియట్ కరెన్సీ విలువ అనేది.. కేవలం ప్రభుత్వ నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. కానీ వెండి, బంగారం వంటి విలువైన లోహాలకు వేల ఏళ్ల చరిత్ర ఉంది. ఇవి ద్రవ్యోల్బణం నుంచి సంపదను కాపాడే సాధనాలుగా పని చేస్తాయి. అందుకే కరెన్సీ విలువ తగ్గుతున్న సమయంలో నిజమైన ఆస్తులైన.. వెండి వంటి లోహాల్లో పెట్టుబడి పెట్టడం తెలివైన నిర్ణయం అని కియోసాకి పేర్కొన్నారు.రాబోయే రోజుల్లో ఆర్థిక అస్థిరత మరింత పెరిగే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో కేవలం డబ్బును దాచుకునేవారి కంటే.. నిజమైన విలువ ఉన్న ఆస్తుల్లో (బంగారం, వెండి మొదలైనవి) పెట్టుబడి పెట్టినవారే లాభపడతారు. ఈ విషయాన్ని గమనించి, భవిష్యత్తు కోసం జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తగా ఉండండి, అని కియోసాకి ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: బంగారం ధర.. ఒక్కసారిగా ఎందుకు పెరిగిందంటే?ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కియోసాకి ఒకేసారి 600 యూఎస్ సిల్వర్ ఈగల్స్ కొనుగోలు చేయడంతో.. వెండి రేటు తప్పకుండా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. కాగా.. ఇండియన్ మార్కెట్లో కూడా వెండి ధరలు పెరుగుతూ.. తగ్గుతూ.. నేడు (ఫిబ్రవరి 10) కేజీ రేటు రూ.3 లక్షలకు చేరుకుంది. అంటే ఒక గ్రాము 300 రూపాయలన్నమాట. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. ఈ రేటు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
జీఎస్టీ అంటే భయమేలా?
దేశవ్యాప్తంగా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలులోకి వచ్చి ఏడేళ్లు దాటినా సామాన్య పన్ను చెల్లింపుదారులు, చిరు వ్యాపారుల్లో దీనిపై నెలకొన్న ఆందోళనలు తగ్గడం లేదు. జీఎస్టీ అంటే కేవలం పన్ను విధానం మాత్రమే కాదు, అది ఒక క్లిష్టమైన సవాల్ అనే భావన బలంగా నాటుకుపోయింది. నిజాయితీగా వ్యాపారం చేసే వారు కూడా నోటీసులు వస్తాయేమోనని భయపడే పరిస్థితి ఎందుకు ఉంది? ప్రభుత్వం నుంచి అందుతున్న అధికారిక సమాచారం ప్రకారం అసలు వాస్తవాలేంటో ఇక్కడ చూద్దాం.జీఎస్టీ ఎందుకు భారంగా అనిపిస్తోంది?చాలా మంది వ్యాపారులు జీఎస్టీ వ్యవస్థను తమకు సహకరించే వ్యవస్థగా కాకుండా కేవలం పన్ను వసూలు చేసే యంత్రాంగంగా మాత్రమే చూస్తున్నారు. దీనికి ప్రధాన కారణాలు..ఆదాయపన్ను రిటర్న్ దాఖలులో చిన్న పొరపాటు జరిగినా లేదా ఆలస్యమైనా ఏటా 18% వడ్డీ భారం పడుతుంది. ఇది చిన్న వ్యాపారుల లాభాలను దెబ్బతీస్తోంది.కొనుగోలుదారు, విక్రేత ఇచ్చే లెక్కల్లో స్వల్ప తేడాలున్నా (జీఎస్టీఆర్-2బీ vs 3బీ) సిస్టమ్ వెంటనే అప్రమత్తం చేయడం వల్ల ఒత్తిడి పెరుగుతోంది.క్షేత్రస్థాయిలో తప్పులు జరిగినప్పుడు సరిదిద్దే మార్గాల కంటే శిక్షించే నిబంధనలే ఎక్కువగా ప్రచారంలో ఉండటం భయానికి కారణం.నోటీసు అంటే భయపడాలా?వ్యాపారులకు జీఎస్టీ నోటీసు అందగానే అదొక క్రిమినల్ కేసులా భావిస్తుంటారు. అధిక శాతం నోటీసులు అధికారులు స్వయంగా పంపేవి కావు. సాఫ్ట్వేర్ ద్వారా డేటాలో తేడాలను గుర్తించి జారీ అయ్యే స్క్రూటినీ నోటీసులు ఎక్కువగా ఉంటాయి. నోటీసు అంటే కేవలం వివరణ కోరడం మాత్రమే. సరైన ఆధారాలు చూపిస్తే చాలా వరకు సమస్యలు అక్కడితోనే ముగుస్తాయి. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాల ప్రకారం.. జీఎస్టీ ప్రారంభ దశలో (2017-19) జరిగిన చిన్న పొరపాట్లకు వడ్డీ, జరిమానాల నుంచి మినహాయింపులు కూడా ఇచ్చారు.జీఎస్టీ చట్టం కింద విధించే జరిమానాల విషయంలో పన్ను చెల్లింపుదారులు అనవసర ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే చట్టం పొరపాట్లకు, మోసాలకు మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని చూపిస్తుంది. సాధారణంగా ఉద్దేశపూర్వకంగా కాకుండా అవగాహన లోపం వల్ల జరిగే సాధారణ తప్పుల విషయంలో శిక్షలు తక్కువగా ఉంటాయి. ఇటువంటి సందర్భాల్లో పన్ను మొత్తంలో 10 శాతం లేదా రూ.10,000.. వీటిలో ఏది ఎక్కువగా ఉంటే ఆ మొత్తాన్ని జరిమానాగా విధిస్తారు. ఇది కేవలం పన్ను చెల్లింపుదారుడిని క్రమశిక్షణలో ఉంచడానికి ఉద్దేశించిన చర్య మాత్రమే.అయితే, పన్నును ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టాలని చూసినా లేదా తప్పుడు లెక్కలతో వ్యవస్థను మోసం చేయాలని ప్రయత్నించినా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అటువంటి సందర్భాల్లో పన్ను మొత్తంలో 100 శాతం వరకు, అంటే పన్నుకు సమానమైన మొత్తాన్ని జరిమానాగా విధించే అధికారం ఉంటుంది. దీనివల్ల నిజాయితీగా ఉండే వ్యాపారులకు రక్షణ కలుగుతుండగా, అక్రమాలకు పాల్పడే వారికి గట్టి హెచ్చరిక అందుతుంది.చాలా మందిలో ఉన్న మరొక ప్రధాన అపోహ ఏమిటంటే.. అధికారులు విధించిన జరిమానాపై అప్పీల్కు వెళ్తే అది మరింత పెరుగుతుందని భయపడుతుంటారు. కానీ ఇది వాస్తవం కాదు. పన్ను చెల్లింపుదారుడి వద్ద సరైన ఆధారాలు ఉండి, చట్టబద్ధంగా వారి వాదన బలంగా ఉంటే అప్పీలేట్ ట్రిబ్యునల్స్ ద్వారా ఉపశమనం పొందే హక్కు వారికి ఉంటుంది. కాబట్టి చట్టంపై సరైన అవగాహన కలిగి ఉండటం వల్ల ఇటువంటి అపోహల నుంచి బయటపడవచ్చు.తెర వెనుక ఏం జరుగుతుంది?జీఎస్టీ వ్యవస్థ ఇప్పుడు పూర్తిగా డేటా అనలిటిక్స్ ఆధారంగా నడుస్తోంది. ఒక వ్యాపారి నిరంతరం తప్పుడు ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ) క్లెయిమ్ చేస్తున్నా లేదా పదే పదే రిటర్న్లు ఎగ్గొడుతున్నా వారిని మాత్రమే వ్యవస్థ హై రిస్క్ కేటగిరీలో ఉంచుతుంది. అధికారుల జోక్యం తగ్గించేందుకు ‘ఫేస్లెస్ అసెస్మెంట్’(పన్ను చెల్లింపుదారుడు, పన్ను అధికారి ప్రత్యక్షంగా ముఖాముఖి కలవాల్సిన అవసరం లేకుండానే పన్ను మదింపు ప్రక్రియను పూర్తి చేసే ఒక ఆధునిక విధానం) వంటి విధానాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.అవగాహనే రక్షణజీఎస్టీ అనేది చట్టం కంటే దానిపై సమాచార లోపం వల్లే ఎక్కువగా క్లిష్టంగా కనిపిస్తోంది. సకాలంలో రిటర్న్లు దాఖలు చేయడం, నోటీసులకు వెంటనే స్పందించడం, నిపుణుల సలహా తీసుకోవడం ద్వారా చాలా సమస్యలను నివారించవచ్చు. వ్యవస్థ వృద్ధి చెందుతున్న కొద్దీ నిజాయితీ గల పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం.- దవనం శ్రీకాంత్ -
నాటి విమర్శలకు పిచాయ్ సమాధానం
టెక్ ప్రపంచంలో ఎవరైతే ముందుగా కొత్త సాంకేతికతను అందిస్తారో వారే విజేతలని అందరూ భావిస్తారు. 2023 ప్రారంభంలో జనరేటివ్ ఏఐ రంగంలో గూగుల్ ప్రత్యర్థుల కంటే వెనుకబడిందని విమర్శలు వెల్లువెత్తినప్పుడు కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ తన ఉద్యోగులకు పంపిన ఒక అంతర్గత ఈమెయిల్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆనాడు ఆయన చెప్పిన మాటలు, నేడు గూగుల్ సాధిస్తున్న రికార్డు స్థాయి విజయాల్లో ప్రతిబింబిస్తున్నాయి.తొందరపాటు వద్దు..ఏఐ రేసులో గూగుల్ వెనుకబడిందన్న వార్తల నేపథ్యంలో సుందర్ పిచాయ్ తన సిబ్బందికి ధైర్యాన్నిస్తూ ఒక సందేశం పంపారు. ‘గూగుల్ ఎప్పుడూ మొదటి స్థానంలో ఉండటానికి తొందరపడలేదు. కానీ అత్యుత్తమంగా నిలవడానికి ప్రయత్నించింది’ అని ఆయన గుర్తు చేశారు. జీమెయిల్, క్రోమ్, ఆండ్రాయిడ్ వంటివి మార్కెట్లోకి వచ్చిన తొలి ఉత్పత్తులు కావు, కానీ వినియోగదారుల సమస్యలను అత్యంత సమర్థవంతంగా పరిష్కరించడం వల్లే అవి ప్రపంచాన్ని శాసించగలిగాయని ఆయన వివరించారు. నాణ్యత, సాంకేతిక బలం, దీర్ఘకాలిక ప్రభావంపైనే దృష్టి పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.జెమిని 3సుందర్ నమ్మిన వ్యూహం నేడు సత్ఫలితాలను ఇస్తోంది. గూగుల్ అత్యాధునిక ఏఐ మోడల్ ‘జెమిని’ విడుదలైన తర్వాత కంపెనీ దశ మారిపోయింది. ప్రస్తుతం గూగుల్ సెర్చ్లో ‘ఏఐ ఓవర్వ్యూ’ ద్వారా జెమిని అన్నింట్లో పాగా వేసింది. ప్రతి నెలా మిలియన్ల మంది వినియోగదారులు జెమిని యాప్ను ఉపయోగిస్తుండగా వ్యాపార సంస్థలు తమ పనితీరును మెరుగుపరుచుకోవడానికి గూగుల్ ఏఐ సాధనాలను స్వీకరిస్తున్నాయి.రికార్డు ఆదాయంఈ వ్యూహాత్మక మార్పుల ఫలితంగా గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ చరిత్ర సృష్టించింది. ఇటీవల కంపెనీ వార్షిక ఆదాయం తొలిసారిగా 400 బిలియన్ డాలర్ల మైలురాయిని దాటింది. కేవలం సాఫ్ట్వేర్ మాత్రమే కాకుండా ఏఐ కోసం ప్రత్యేక చిప్లు, అత్యాధునిక డేటా సెంటర్లను ఏర్పాటు చేయడం ద్వారా గూగుల్ ఒక పూర్తిస్థాయి ఏఐ ఎకోసిస్టమ్ను సిద్ధం చేసింది. ఇది నిర్వహణ ఖర్చులను తగ్గించడమే కాకుండా పనితీరులో ప్రత్యర్థుల కంటే ముందుండడానికి సహాయపడిందని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల అప్డేట్స్ -
‘కంపెనీలకు వ్యాపారమే ముఖ్యం’
కార్పొరేట్ ప్రపంచంలో లాయల్టీ (నమ్మకంగా పని చేయడం) కంటే అడాప్టబిలిటీ (మార్పుకు అనుగుణంగా మారడం) ముఖ్యమని ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ చెబుతున్నారు. ఒకే సంస్థలో దాదాపు 15 ఏళ్ల పాటు సేవలందించి అనూహ్యంగా ఉద్యోగం కోల్పోయిన ఓ 40 ఏళ్ల భారతీయ టెక్కీ తన ఆవేదనను, తాను నేర్చుకున్న పాఠాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.‘దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఉద్యోగం నుంచి తొలగించారు’ అనే శీర్షికతో రెడ్డిట్లో ఓ వ్యక్తి అప్లోడ్ చేసిన పోస్ట్ వైరల్గా మారింది. కొవిడ్-19 తర్వాత సదరు కంపెనీ నిధుల కోసం తీవ్రంగా ప్రయత్నించిందని, అయితే జులైలో నిధులు నిలిచిపోవడంతో పరిస్థితి తలకిందులైందని ఆయన పేర్కొన్నారు. అధికారికంగా లేఆఫ్ ప్రకటించే కంటే స్వచ్ఛందంగా రాజీనామా చేయమని మేనేజ్మెంట్ డిమాండ్ చేయడంతో ఆయన కంపెనీ నుంచి బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు.‘నేను అక్కడ చాలా సౌకర్యవంతంగా ఉన్నాను. కొత్త సవాళ్లు ఉన్నాయి. చాలా సమర్థంగా పని చేసేవాడిని. అందుకే 15 ఏళ్లలో కేవలం బయట ఒకటి రెండు ఇంటర్వ్యూలు మాత్రమే ఇచ్చాను. కానీ ఇప్పుడు వాస్తవం అర్థమవుతోంది’ అని పేర్కొన్నారు. మళ్లీ ఉద్యోగ వేటలో భాగంగా 60-70 కంపెనీలకు దరఖాస్తు చేసుకున్న తర్వాత మార్కెట్ పరిస్థితిని విశ్లేషిస్తూ తోటివారి కోసం ఆయన కొన్ని అంశాలు తెలియజేశారు.కంపెనీకి వ్యాపారమే ముఖ్యం. మిమ్మల్ని ఎప్పుడైనా రీప్లేస్ చేయవచ్చు.ఒకే చోట ఎక్కువ కాలం ఉండకండి.కంపెనీ భవిష్యత్తు గురించి ఎప్పుడూ ఆరా తీస్తూ ఉండండి.కొత్త విషయాలు నేర్చుకోవడం ఆపకండి.మీ మార్కెట్ విలువ తెలుసుకోవడానికి ఇంటర్వ్యూలకు హాజరవుతుండాలి.మీ విజయాలను, ప్రాజెక్టులను ఎప్పటికప్పుడు రికార్డ్ చేసుకోండి.ప్రతి 6-12 నెలలకు లింక్డ్ఇన్, సీవీ అప్డేట్ చేయండి.పరిచయాలను పెంచుకోండి. అవి కష్టకాలంలో ఆదుకుంటాయి.కంపెనీలు రెజెక్ట్ చేస్తున్నా పెద్ద రోల్స్ కోసం ప్రయత్నించండి.ఇంటర్వ్యూ తర్వాత లోపాలను అడిగి తెలుసుకోండి.మీ ఉద్యోగం మాత్రమే మీ గుర్తింపు కాదు.నెటిజన్ల స్పందనఈ పోస్ట్పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘ఒకే కంపెనీలో ఏళ్ల తరబడి ఉండటం వల్ల మీరు రీప్లేస్ కోసం ఉన్న పాత ఫర్నిచర్లా మారిపోతారని ఒక యూజర్ స్పందించారు. మరో యూజర్ తన అనుభవాన్ని పంచుకుంటూ.. ‘నేను 11 ఏళ్లలో 11 ఉద్యోగాలు మారాను. ప్రతిసారీ కొత్త టెక్నాలజీ నేర్చుకుంటూనే ఉన్నాను. కంపెనీ కుటుంబంలా అనిపించవచ్చు కానీ, మన నిజమైన కుటుంబం ఇంట్లోనే ఉంటుంది. ఎప్పుడూ అప్డేటెడ్గా ఉండటమే మనుగడకు మార్గం’ అని సలహా ఇచ్చారు.ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల అప్డేట్స్ -
భారత్కు త్వరలో టెక్ కంపెనీ సీఈఓలు రాక
న్యూఢిల్లీ వేదికగా భారత్లో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సు జరగనుంది. కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో ప్రపంచ గమనాన్ని నిర్దేశించే ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు. న్యూఢిల్లీ ప్రగతి మైదాన్లోని భారత్ మండపంలో జరగనున్న ఈ ఐదు రోజుల సదస్సు గ్లోబల్ సౌత్లో నిర్వహిస్తున్న మొదటి అతిపెద్ద ఏఐ సదస్సుగా రికార్డు సృష్టించనుంది.దిగ్గజ కంపెనీల సారథులుఈ సదస్సులో పాల్గొనేందుకు ప్రపంచ టెక్ రంగంలోని అత్యంత ప్రభావవంతమైన నేతలు ఢిల్లీకి రాబోతున్నారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఎన్విడియా వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్, మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్, బిల్గేట్స్, క్వాల్కామ్ సీఈఓ క్రిస్టియానో అమోన్, గూగుల్ డీప్ మైండ్ సీఈఓ డెమిస్ హసాబిస్ వంటి ప్రముఖులు హాజరవుతున్నారు. ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ సైతం భారత్ చేరుకోనున్నారనే వార్తలొస్తున్నాయి. అధికారిక జాబితాలో తన పేరు లేకపోయినప్పటికీ ఆయన క్లోజ్డ్ డోర్ సమావేశాల్లో పాల్గొంటారని, ఫిబ్రవరి 19న ప్రత్యేక ఓపెన్ఏఐ ఈవెంట్ నిర్వహించే అవకాశం ఉందని సమాచారం.దేశీయంగా కూడా ఈ సమ్మిట్పై భారీ అంచనాలు ఉన్నాయి. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, భారతీ ఎంటర్ ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతీ మిట్టల్, ఇన్ఫోసిస్ నందన్ నీలేకని, సలీల్ పరేఖ్, హెచ్సీఎల్ టెక్ సీఈఓ సి.విజయకుమార్ వంటి దేశీయ పారిశ్రామిక వేత్తలు భారత ఏఐ విజన్ గురించి ప్రసంగించనున్నారు.సదస్సు ప్రత్యేకతలుప్రభుత్వం ఈ సమ్మిట్ను కేవలం చర్చలకే పరిమితం చేయకుండా వాస్తవ ఫలితాల సాధన దిశగా రూపొందించింది. పీపుల్ (ప్రజలు), ప్లానెట్ (భూమి), ప్రోగ్రెస్ (పురోగతి) అనే మూడు అంశాల ఆధారంగా ఈ చర్చలు జరుగుతాయి. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, సుపరిపాలన.. వంటి ఏడు కీలక రంగాల్లో ఏఐ అప్లికేషన్లను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించనున్నారు. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే 35,000కు పైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. 100కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు, 500కు పైగా స్టార్టప్లు ఈ ఈవెంట్లో పాల్గొంటున్నాయి.ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల అప్డేట్స్ -
బంగారం, వెండి ధరల అప్డేట్స్
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
స్టాక్ మార్కెట్లో కొనసాగుతోన్న లాభాలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:34 సమయానికి నిఫ్టీ(Nifty) 52 పాయింట్లు పెరిగి 25,921 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 185 పుంజుకొని 84,269 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 10-02-2026(time: 9:34 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
వాతావరణ విపత్తుల ధాటికి చెక్
భారత్లో పెరుగుతున్న వాతావరణ ముప్పులను ఎదుర్కోవడానికి, డేటా ఆధారంగా పట్టణాల రక్షణను మెరుగుపరచడానికి గాంధీనగర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కీలక ఆవిష్కరణ చేసింది. తన రీసెర్చ్ పార్క్లో కొత్తగా ఏర్పాటు చేసిన ఏఐ రెసిలియన్స్ అండ్ కమాండ్ (ఏఆర్సీ) సెంటర్ను విద్యావేత్తలు, ప్రభుత్వ ఉన్నతాధికారుల సమక్షంలో ఇటీవల ప్రారంభించింది.ఈ సెంటర్ ప్రధానంగా ‘రెయిన్-టు-రెసిలియన్స్’ (వర్షం నుంచి తట్టుకునే పరిస్థితులు) అనే ఫ్రేమ్వర్క్పై పనిచేస్తుంది. ఇది భౌతిక శాస్త్ర నమూనాలను కృత్రిమ మేధతో (ఏఐ) అనుసంధానిస్తుంది. దీని ద్వారా ఐఐటీ గాంధీనగర్ చెప్పిన అంశాల ప్రకారం.. నగరాల్లో వరదలను ముందే అంచనా వేయవచ్చు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలపై పడే ప్రభావాన్ని విశ్లేషించవచ్చు. విపత్తు సమయంలో నిర్ణయాలు తీసుకోవడంలో అధికారులకు వేగంగా సమాచారాన్ని అందించవచ్చు.అత్యాధునిక సాంకేతికతఈ కేంద్రంలో వినియోగిస్తున్న సాధనాలను ఐఐటీ గాంధీనగర్ ఇంక్యుబేటెడ్ డీప్-టెక్ స్టార్టప్ ‘AIResQ ClimSols’ అభివృద్ధి చేసింది. ఇవి వాతావరణ మార్పులకు సంబంధించిన సంక్లిష్ట పరిస్థితులకు అత్యంత వేగంగా స్పందించగలవు. విపత్తు జరగకపోయినా ‘ఒకవేళ ఇలా జరిగితే పరిస్థితి ఏంటి?’ అనే అత్యవసర అంశాలకు ప్రణాళికలను ముందే సిద్ధం చేసుకోవడానికి ఇవి ఎంతగానో దోహదపడతాయి.పట్టణాల్లో..ఐఐటీ గాంధీనగర్లోని మెషీన్ ఇంటెలిజెన్స్ అండ్ రెసిలియన్స్ (ఎంఐఆర్) ల్యాబ్ పరిశోధనల ఫలితంగా ఈ కేంద్రం ఏర్పాటైంది. నగరాల్లో నీటి ఎద్దడి లేదా వరదలు వంటి సవాళ్లను ఎదుర్కోవడంలో ఈ సాంకేతికత కీలకం కానుంది. కేవలం విపత్తు జరిగిన తర్వాత స్పందించడం కాకుండా ముందే ఊహించి నష్టాన్ని నివారించడం ఈ కేంద్రం ప్రధాన లక్ష్యం.సమన్వయంతో..ప్రభుత్వం, టెక్నాలజీ భాగస్వాములను ఒకే తాటిపైకి తీసుకురావడం ద్వారా పరిశోధనలను క్షేత్రస్థాయిలో ప్రజలకు ఉపయోగపడే సాధనాలుగా ఈ కేంద్రం మారుస్తోంది. ఇది భారతీయ నగరాలను మరింత సురక్షితంగా, వాతావరణ మార్పులను తట్టుకోగల సుస్థిర పట్టణాలుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించనుంది.ఇదీ చదవండి: సరికొత్త లుక్లో మార్కెట్లోకి కొత్త ఈవీ -
భారత టెక్ రంగానికి భారీ ఊతం
భారత దేశాన్ని గ్లోబల్ టెక్నాలజీ హబ్గా మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 2025లో ప్రకటించిన పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణ (ఆర్డీఐ) పథకం 2026-27 ఆర్థిక సంవత్సరంలో పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం ఏకంగా రూ.1 లక్ష కోట్ల నిధిని సిద్ధం చేస్తోంది.నిధుల కేటాయింపు.. పురోగతిగత బడ్జెట్లో ఈ పథకం కోసం రూ.20,000 కోట్లు కేటాయించినప్పటికీ సవరించిన అంచనాల ప్రకారం కేవలం రూ.3,000 కోట్లు మాత్రమే వినియోగంలోకి వచ్చాయి. అయితే తాజా బడ్జెట్లో ప్రభుత్వం రూ.20,000 కోట్లను మూలధన వ్యయం కింద కేటాయించింది. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంకి కేటాయించిన మొత్తం రూ.28,049 కోట్లలో అధిక భాగం ఈ పథకానికే దక్కడం విశేషం.ఈ పథకం అమలుకు సంబంధించి కొన్ని అంశాలు..అక్టోబర్ 11న ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ పథకానికి సంబంధించిన నిబంధనలు, పాలన నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ‘అనుసంధాన్’ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ కింద ప్రాథమికంగా నిధిని ఏర్పాటు చేశారు. సెకండ్ లెవల్ ఫండ్ మేనేజ్మెంట్(ఎస్ఎల్ఎఫ్ఎం) నియామక ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ (టీడీబీ), బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బైరాక్)లు ఇప్పటికే నామినేషన్ ప్రాతిపదికన మేనేజర్లుగా నియమితులయ్యాయి.పథకం ప్రధాన ఉద్దేశంప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని పెంపొందించడం ద్వారా డీప్-టెక్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే ఈ ఆర్డీఐ పథకం లక్ష్యం. ఈ విభాగంలోని కంపెనీలకు చాలా తక్కువ లేదా సున్నా వడ్డీతో దీర్ఘకాలిక రుణాలు అందిస్తారు. స్టార్టప్ల్లో నేరుగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. అయితే, ఈ పథకం ద్వారా గ్రాంట్లు లేదా స్వల్పకాలిక రుణాలు మంజూరు చేయరని గమనించాలి. ఈ పథకంలో భాగంగా నేషనల్ క్వాంటం మిషన్, సెమీకండక్టర్ ల్యాబ్ (మొహాలీ), ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ తయారీ, నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ వంటివాటికి నిధులు కేటాయించనున్నారు.సెమీకండక్టర్ రంగానికి బూస్ట్భారతదేశాన్ని సెమీకండక్టర్ తయారీ కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం రూ.8,000 కోట్లను ‘మోడిఫైడ్ ప్రోగ్రామ్ ఫర్ సెమీకండక్టర్స్’ కోసం కేటాయించింది. గతేడాది ఇది రూ.7,000 కోట్లుగా ఉంది. అయితే, భారీ ఎలక్ట్రానిక్స్ తయారీకి ఇచ్చే పీఎల్ఐ పథకానికి కేటాయింపులను రూ.8,885 కోట్ల నుంచి రూ.1,345 కోట్లకు తగ్గించడం గమనార్హం. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే 2026 నాటికి భారత టెక్, రీసెర్చ్ రంగం కొత్త పుంతలు తొక్కేందుకు సిద్ధంగా ఉందని అర్థమవుతోంది.ఇదీ చదవండి: సరికొత్త లుక్లో మార్కెట్లోకి కొత్త ఈవీ -
అరబిందో ఫార్మా లాభం ప్లస్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 8 శాతం ఎగసి రూ. 910 కోట్లను తాకింది. యూరప్, యూఎస్లలో అమ్మకాలు పుంజుకోవడం ఇందుకు సహకరించింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో హైదరాబాద్ కంపెనీ రూ. 846 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 7,979 కోట్ల నుంచి రూ. 8,646 కోట్లకు బలపడింది. ప్రధాన బిజినెస్లలో పటిష్ట ఎగ్జిక్యూషన్, నిలకడైన డిమాండ్, యూఎస్, యూరప్ తదితర కీలక మార్కెట్లలో విస్తరించిన బలమైన డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో వంటి అంశాలు క్యూ3 ఫలితాలను ప్రతిబింబిస్తున్నట్లు కంపెనీ వైస్చైర్మన్, ఎండీ కె.నిత్యానంద రెడ్డి పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు బీఎస్ఈలో 1 శాతం లాభంతో రూ. 1,201 వద్ద ముగిసింది. -
మళ్లీ వెండి వేడి
న్యూఢిల్లీ: విలువైన లోహాల ధరలు మళ్లీ జోరందుకున్నాయి. తాజాగా వెండి కిలో ధర దాదాపు 7 శాతం(రూ. 17,000) జంప్చేసింది. అన్ని పన్నులు కలుపుకుని రూ. 2,72,000కు చేరింది. ఇదే బాటలో బంగారం ధరలు సైతం మెరిశాయి. స్థానిక బులియన్ మార్కెట్లో 99.9 స్వచ్చతగల 10 గ్రాములు రూ. 1,300 బలపడింది. రూ. 1,58,500ను తాకింది. వారాంతాన వెండి కేజీ రూ. 2,55,000 వద్ద, పసిడి 10 గ్రాములు రూ. 1,57,200 వద్ద నిలిచిన విషయం విదితమే. ధరల తాజా పెరుగుదలకు యూఎస్ డాలరు బలహీనపడటం, అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ పుంజుకోవడం కారణమైనట్లు బులియన్ వర్గాలు తెలియజేశాయి. అంతేకా కుండా ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో కొనసాగుతున్న అనిశ్చితికితోడు.. యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకుంటున్న అనూహ్య రాజకీయ, భౌగోళిక చర్యలు వెండి, పసిడి తదితర విలువైన లోహాలకు డిమాండును పెంచుతున్నట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకులు సౌమిల్ గాంధీ పేర్కొన్నారు. విదేశీ మార్కెట్లో అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ స్పాట్ ధర ఔన్స్ 2.8 శాతం(2.2 డాలర్లు) ఎగసింది. 80.21 డాలర్లను తాకింది. మరోపక్క పసిడి ఔన్స్(31.1 గ్రాములు) 1 శాతం పుంజుకుని 5,013 డాలర్లకు చేరింది. -
బ్యాంకులకు లాభాల కళ
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో లాభాల మోత మోగించాయి. ఎస్బీఐ సహా 12 ప్రభుత్వరంగ బ్యాంకులు ఉమ్మడిగా రూ.52,603 కోట్ల నికర లాభాన్ని నమోదు చేశాయి. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.44,473 కోట్లతో పోల్చి చూస్తే 18 శాతం మేర (రూ.8,130 కోట్లు) పెంచుకున్నాయి. → అన్నింటిలోకి ఎస్బీఐ వాటా అధికంగా ఉంది. డిసెంబర్ త్రైమాసికం (క్యూ3)లో ఎస్బీఐ రూ.21,028 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోలి్చతే 24 శాతం పెరిగింది. → చెన్నై కేంద్రంగా పనిచేసే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 35 శాతం అధికంగా రూ.1,365 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. → సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభం 32 శాతం పెరిగి రూ.1,263 కోట్లుగా ఉంది. → లాభంలో అధిక వృద్ధిని చూపించిన వాటిల్లో ఎస్బీఐతోపాటు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (27 శాతం), కెనరా బ్యాంక్ (26 శాతం) ఉన్నాయి. → పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ (19 శాతం) యూకో బ్యాంక్ (16 శాతం), పీఎన్బీ 13 శాతం చొప్పున లాభాన్ని డిసెంబర్ త్రైమాసికంలో పెంచుకున్నాయి. → 12 ప్రభుత్వరంగ బ్యాంక్ల ఉమ్మడి లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్తో ముగిసిన త్రైమాసికంలో 11 శాతం పెరిగి రూ.44,218 కోట్లుగా ఉంది. సెపె్టంబర్ త్రైమాసికంలో 9 శాతం తక్కువగా రూ.49,456 కోట్లుగా ఉండడం గమనించొచ్చు. → ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ చివరి వరకు తొమ్మిది నెలల్లో ప్రభుత్వరంగ బ్యాంకుల లాభం రూ.1,46,277 కోట్లకు చేరింది. అంక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది రూ.1,29,994 కోట్లుగా ఉంది. → ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పీఎస్బీల లాభం రూ.2లక్షల కోట్లను అధిగమిస్తుందన్న ఆశాభావాన్ని కేంద్ర ఆర్థిక సేవల కార్యదర్శి ఎం.నాగరాజు వ్యక్తం చేశారు. -
ఏప్రిల్ 1 విడుదల
న్యూఢిల్లీ: ప్రాపర్టీ, వాహన కొనుగోళ్లు, బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు, ఉపసంహరణలకు ఇకపై ప్రతిసారీ పాన్ సమర్పించాల్సిన అవసరం రాదు! ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చే కొత్త ఆదాయపన్ను చట్టం కింద పాన్ విషయమై పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట దక్కనుంది. ఇందుకు సంబంధించి ముసాయిదా నిబంధనలను ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) సోమవారం విడుదల చేసింది. సంప్రదింపుల అనంతరం తుది నిబంధనలను మార్చి మొదటి వారంలో సీబీడీటీ నోటిఫై చేస్తుంది. క్రిప్టో ఎక్సే్ఛంజ్లు ఆదాయపన్ను శాఖతో సమాచారం పంచుకోవడాన్ని తప్పనిసరి కానుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ఆమోదనీయమైన ఎలక్ట్రానిక్ చెల్లింపుల మాధ్యమంగా మారనుంది. కొత్త నిబంధనలు ఇవే.. → ప్రస్తుతం బ్యాంకుల్లో ఒకరోజులో రూ.50,000కు మించి నగదు డిపాజిట్ చేస్తుంటే పాన్ కాపీ ఇవ్వడం తప్పనిసరి. అలాగే, ఆర్థిక సంవత్సరం మొత్తం మీద జమలు, ఉపసంహరణలు రూ.20 లక్షలు మించినప్పుడు కూడా ఇవ్వాల్సి వచ్చేది. కొత్త నిబంధనల ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరంలో నగదు డిపాజిట్, ఉపసంహరణల మొత్తం రూ.10 లక్షలకు మించినప్పుడే శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) ఇస్తే సరిపోతుంది. ఒక వ్యక్తికి ఒకటికి మించిన ఖాతాలున్నా సరే.. అన్నింటికీ ఉమ్మడిగా రూ.10 లక్షల పరిమితే వర్తిస్తుంది. → ప్రాపర్టీ (ఇల్లు లేదా భూమి) కొనుగోలు లేదా విక్రయం లేదా బహుమతిగా ఇవ్వడం లేదంటే ఉమ్మడిగా అభివృద్ధి చేసేందుకు చేసుకునే ఒప్పందం విలువ రూ.10 లక్షలకు మించితే ప్రస్తుతం పాన్ ఇవ్వాల్సి వస్తోంది. ఇకపై (ఏప్రిల్ 1 నుంచి) రూ.20 లక్షలకు మించినప్పుడే ఈ నిబంధన అమలవుతుంది.→ వాహనం కొనుగోలు విలువ రూ.5లక్షల్లోపు ఉంటే ఇకపై పాన్ అవసరం పడదు. కొనుగోలు ధర రూ.5లక్షలకు మించినప్పుడే పాన్ సమర్పించాల్సి ఉంటుంది. అన్ని వాహనాలకూ ఇకపై ఇదే అమలుకానుంది. ప్రస్తుతం ద్విచక్ర వాహన కొనుగోళ్లకు పాన్ నుంచి మినహాయింపు ఉంది. ఇతర అన్ని వాహనాల కొనుగోళ్ల సమయంలో ధరతో సంబంధం లేకుండా ప్రస్తుతం పాన్ ఇవ్వాలన్న నిబంధన అమల్లో ఉంది. → హోటల్/రెస్టారెంట్ బిల్లు, కన్వెన్షన్ సెంటర్లు లేదా బాంక్వెట్ హాళ్ల (వేడుకల కేంద్రాలు)కు చేసే చెల్లింపులు రూ.లక్షకు మించితే ఇక మీదట పాన్ తప్పనిసరి. హోటల్/రెస్టారెంట్ బిల్లు రూ.50వేలు మించినప్పుడే ప్రస్తుతం పాన్ ఇవ్వాల్సి వస్తోంది. → ఇకపై జీవిత బీమా పాలసీ కొనుగోలు సమయంలో పాన్ ఇవ్వడం తప్పనిసరి. ప్రస్తుతం వార్షిక ప్రీమియం రూ.50,000 మించిన పాలసీలకే ఇది అమలవుతోంది. → ప్రథమ శ్రేణి మెట్రోలుగా హైదరాబాద్, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్లను సైతం గుర్తించింది. ఈ నగరాల్లో నివసించే వారికి ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ)పై మినహాయింపుల పరిమితి రూ.40వేల నుంచి రూ.50వేలకు పెరగనుంది. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నైలకే ఈ గుర్తింపు ఉంది. → అధికారిక వాహనాలు, ఉద్యోగులకు సంస్థలు సమకూర్చే భోజనాలకు సైతం పన్ను మినహాయింపుల పరిమితులు పెరగనున్నాయి. వాహనం కోసం ప్రతి నెలా రూ.8,000, ప్రతి భోజనం రూ.200కు పన్ను ఉండదు. → కొత్త ఆదాయపన్ను చట్టం అమల్లోకి వచి్చన తర్వాత పన్ను రిటర్నుల దాఖలు కూడా సులభతరం కానుంది. → ప్రస్తుతం రూ.2 లక్షలకు మించి చేసే బంగారం కొనుగోళ్లకు (ఆభరణాలు, కాయిన్లు, ఇతర రూపాల్లోని బంగారం) పాన్ తప్పనిసరి. దీనితోపాటు జాబితాలో లేని ఇతర అన్ని లావాదేవీలకు ప్రస్తుత నిబంధనలే కొత్త చట్టం కింద అమలు కానున్నాయి. -
33 ఏళ్ల క్రితం సాధారణ వెబ్ అడ్రస్గా రిజిస్టర్.. ఇప్పుడు రూ. 600 కోట్లు!
పేరులో నేముంది అని అనుకుంటే పొరపాటు. ఒక చిన్న పదం. కేవలం రెండే రెండక్షరాలు. కానీ దాని విలువ భారత కరెన్సీలో అక్షరాల 600 కోట్లు. ఆ రెండక్షరాల పదం ఏంటి? దానిని రూ.600కోట్లకు కొనుగోలు చేయాల్సిన అవసరం ఏంటి? దాని కథా కమా మిషు ఏంటో తెలుసుకుందాం పదండి.ఇంటర్నెట్లో డొమైన్ అడ్రస్ చాలా విలువైంది. వెబ్సైట్ డొమైన ట్రెండింగ్లో ఉన్నా డిమాండ్ ఉండే బిజినెస్కు చెందినదైనా దాని ధర కోట్లు పలుకుతుంది. ఎంత ధరపెట్టైనా సరే దాన్ని కొనుగోలు చేస్తారు. అలాంటి వెబ్సైట్ డొమైన్ కళ్లు చెదిరే ధరకు అమ్ముడుపోయింది. క్రిప్టో.కామ్ వ్యవస్థాపకుడు క్రిస్ మార్జాలెక్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ డొమైన్ ఏఐ డాట్ కామ్ను 70మిలియన్ డాలర్లు వెచ్చించి మరీ కొనుగోలు చేశారు. అంటే భారత కరెన్సీలో అక్షరాల రూ.600కోట్లు.ఇదే అత్యధికర ధర పలికిన డొమైన్లలో తొలి స్థానంలో నిలిచింది.ఏఐ ఇండస్ట్రీలో ప్రవేశించాలనుకున్నా క్రిప్టో.కామ్ సీఈవో క్రిస్ మార్జాలెక్ సూపర్ బౌల్ సమయంలో ఏఐ.కామ్ను అధికారికంగా లాంచ్ చేయనున్నారు. ఈ వెబ్సైట్లో ఏఐ పర్సనల్ అసిస్టెంట్ లాంచ్ కానుంది. ఈ ఏఐ అసిస్టెంట్ పర్సనల్ మెసేజ్లు పంపడంతో పాటు క్రిప్టో ట్రేడింగ్,యాప్స్ మేనేజ్ చేయడంతో పాటు ఇతర కార్యకలాపాల్ని చక్కబెడుతోంది. చాట్జీపీటీ రాకతో టెక్నాలజీ కొంతపుంతలు తొక్కుతోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం ఎప్పటి నుంచో ఉన్నా.. చాట్జీపీటీ రాకతో సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చింది. దీంతో ఏఐ వినియోగం రోజురోజుకి పెరిగిపోతుంది. ప్రతిరంగంలో ఏఐ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఈ తరుణంలో ఏఐ.కామ్ డొమైన్ను అంత భారీ మొత్తంలో వెచ్చించారు. భవిష్యత్ మొత్తం ఏఐదేనని,అన్నీ రంగాల్లో ఏఐ పెత్తనం చెలాయిస్తుందంటున్నారు.ఇది స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ అయినప్పటికీ రానున్న 20ఏళ్లలో పెట్టుబడులు అమాంతం పెరుగుతాయని క్రిస్ చెబుతున్నారు. ఏఐతో ప్రిమీయం డొమైన్లు బ్రాండింగ్ను పెంచుతాయని అంటున్నారు.2016లో క్రిస్.. క్రిప్టో.కామ్ను ప్రారంభించారు. అప్పటికే మార్కెట్లో క్రిప్టోఫ్లాట్ఫారమ్స్ ఉన్నాయి. అయినప్పటికీ కంపెనీ వేగంగా వృద్ధి సాధించింది. ప్రస్తుతం, ఏడాదికి 1.5బిలియన్ డాలర్ల ఆదాయం వస్తోంది. మార్కెటింగ్ బ్రాండింగ్పై భారీ ఇన్వెస్ట్ చేసింది.2021లో స్టేడియం బ్రాండింగ్పై సుమారు 700 మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. ట్రంప్ మీడియాతో బిజినెస్ డీల్స్ కూడా చేసింది. ఇవన్నీ గ్లోబుల్ బ్రాండింగ్ రికగ్నైజేషన్ను పెంచాయి. ఇప్పుడు ఏఐ.కామ్ కొనుగోలుతో సరికొత్త రికార్డులు సృష్టించారు క్రిస్ మార్స్జాలెక్.ఇక క్రిస్ మార్స్జాలెక్ ఏఐ.కామ్ డొమైన్ను మలేషియన్ టెక్ ఎంట్రప్రెన్యూర్ అర్స్యాన్ ఇస్మాయిల్ నుంచి కొనుగోలు చేశారు. ఈ డొమైన్ను ఇస్మాయిల్ 1993లో 100 డాలర్లు చెల్లించి రిజిస్టర్ చేసుకున్నారు. ఆ సమయంలో ఇది సాధారణ వెబ్ అడ్రస్ మాత్రమే. కానీ కాలక్రమేణా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రాధాన్యం పెరిగిన కొద్దీ, ఈ డొమైన్ విలువ ఆకాశాన్ని తాకింది.2025 ఏప్రిల్లో అర్స్యాన్ ఇస్మాయిల్ ఈ డొమైన్ను క్రిస్ మార్జాలెక్కి విక్రయించారు. ధర? అక్షరాల 70 మిలియన్ డాలర్లు.అంటే భారత కరెన్సీలో సుమారు రూ.600 కోట్లు. ఇది ఇప్పటివరకు పబ్లిక్గా వెల్లడైన అత్యధిక ధర పలికిన డొమైన్ ట్రాన్సాక్షన్గా గుర్తింపు పొందింది.ఒకప్పుడు 100 డాలర్ల విలువైన ఈ డిజిటల్ ఆస్తి 30 ఏళ్ల తర్వాత 70 మిలియన్ డాలర్లకు అమ్ముడవడం, ఇంటర్నెట్లో డొమైన్ల ప్రాధాన్యం ఎంత పెరిగిందో చూపించే అద్భుత ఉదాహరణ. ఏఐ భవిష్యత్తు అన్నీ రంగాల్లో ఆధిపత్యం చెలాయిస్తుందని భావిస్తున్న ఈ తరుణంలో ఏఐ.కామ్పై వంటి ప్రీమియం డొమైన్ను సొంతం చేసుకోవడం ఒక వ్యూహాత్మక పెట్టుబడిగా మారింది. ఇది కేవలం ఒక వెబ్ అడ్రస్ కాదు, భవిష్యత్ టెక్నాలజీకి ప్రతీకగా నిలిచే బ్రాండింగ్ ఆస్తి. -
వివో కీలక ప్రకటన.. త్వరలో మడత ఫోన్
ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని చాలా కంపెనీలు.. ఈ విభాగంలో కూడా తమ హవా కొనసాగించడానికి సిద్ధమవుతున్నాయి. ఈ జాబితాలో హానర్, ఒప్పో ముందు వరుసలో ఉన్నాయి. ఈ సంస్థల తరువాత షియోమి కూడా ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ చేయడానికి సిద్దమవుతోంది. కాగా వివో కూడా X ఫోల్డ్ 6 స్మార్ట్ఫోన్ను కూడా త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటించనుంది.వివో లాంచ్ చేయనున్న X ఫోల్డ్ 6 స్మార్ట్ఫోన్ 200-మెగాపిక్సెల్ కెమెరా & మల్టీ-స్పెక్ట్రల్ సెన్సార్తో రానుంది. ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న అన్ని ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ల కంటే ఇది బెస్ట్ కెమెరా ఫీచర్ కలిగి ఉంటుంది. కాగా కంపెనీ దీనికి సంబంధించిన చాలా విషయాలను వెల్లడించాల్సి ఉంది.వివో X ఫోల్డ్ 6 స్మార్ట్ఫోన్ మూడు వేరియంట్లలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మొదట దీనిని చైనా మార్కెట్లో లాంచ్ చేసిన తరువాత.. ఇతర దేశాల్లో కూడా లాంచ్ చేయనున్నారు. కాగా దీని ధరలు, లాంచ్ డేట్ వంటివి తెలియాల్సి ఉంది. అంతే కాకుండా ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ కూడా త్వరలోనే తెలుస్తాయి. -
EPFO 3.0: పీఎఫ్ విత్డ్రా మరింత సులభం!
ఈపీఎఫ్ఓ చందాదారులు.. తమ ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF)ను ఏటీఎం ద్వారా విత్డ్రా చేసుకోవడానికి ఉపయోగపడే ఫీచర్ తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు.. కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయా గతంలోనే వెల్లడించారు. ఇప్పుడు దీనికి సంబంధించిన కొత్త మొబైల్ అప్లికేషన్ను 2026 ఏప్రిల్ నాటికి ప్రారంభించనున్నారు.ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రారంభించనున్న మొబైల్ అప్లికేషన్ ద్వారానే.. 8 కోట్ల మంది సభ్యులు తమ ప్రావిడెంట్ ఫండ్ (EPF)ను యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ద్వారా నేరుగా విత్డ్రా చేసుకోవచ్చు. EPFO 3.0 అప్గ్రేడ్లో భాగంగా తీసుకొస్తున్న ఈ కొత్త విధానం వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ప్రస్తుతం పీఎఫ్ విత్డ్రా చేసుకోవాలనుంటే.. అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి కొంత సమయం పడుతుంది. దీనిని మరింత సులభతరం చేయడానికి యూపీఐ విత్డ్రా తీసుకురావడం జరుగుతోంది. కాగా ఇప్పటికే ఆటో సెటిల్మెంట్ మోడ్ లిమిట్ రూ. లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచారు.ఈపీఎఫ్ఓ సభ్యులు తమ బ్యాంక్ ఖాతాలకు యూపీఐ పిన్ ఉపయోగించి ఎంత మొత్తం విత్డ్రా చేసుకోవడానికి అర్హత కలిగి ఉన్నారో ఆ మొత్తాన్ని వెంటనే విత్డ్రా చేసుకోవచ్చు.ఒకసారికి కేవలం రూ. 25వేలు విత్డ్రా చేసుకోవచ్చు.యాప్లో మీరు ఎంత మొత్తంలో విత్డ్రా చేసుకోవచ్చు అనేది కనిపిస్తుంది.ప్రస్తుతం ఈ విధానం ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవడానికి ట్రయల్ రన్స్ చేస్తున్నారు. తద్వారా ఏదైనా సాంకేతిక సమస్యలు ముందే గుర్తించి పరిష్కరించవచ్చు. కొత్త యాప్ ప్రధాన మొబైల్ ఇంటర్ఫేస్గా యూపీఐ విత్డ్రా కోసం ఉపయోగిస్తారు. అయితే అధికారిక వెబ్సైట్, ఉమాంగ్ యాప్ కూడా ఇతర సేవల కోసం ఉపయోగించుకోవచ్చు. -
హోటల్లో ఒక్క రాత్రికి రూ.30 లక్షలు.. ఎందుకంటే?
భారతదేశంలో కృత్రిమ మేధ (AI) రంగానికి పెరుగుతున్న అంతర్జాతీయ ప్రాధాన్యతను ప్రతిబింబిస్తూ.. ఇండియా 'ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026' న్యూఢిల్లీలో ఫిబ్రవరి 16 నుంచి జరగనుంది. నాలుగు రోజుల పాటు సాగే ఈ సదస్సు ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన నాలుగు ఏఐ సమ్మిట్లలో అతిపెద్దదిగా నిలవనుంది.ఈ సమ్మిట్కు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విస్తృత స్పందన లభించింది. ఇప్పటి వరకు ఈ కార్యక్రమానికి 35,000 మందికి పైగా రిజిస్టర్ చేసుకోగా.. ప్రభుత్వాలు, దేశీయ & అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థలు, యూనివర్సిటీలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు.సుమారు 100 కంటే ఎక్కువ దేశాల నుంచి ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతారని అంచనా. అంతే కాకుండా 15 నుంచి 20 మంది దేశాధినేతలు, 50 మందికి పైగా మంత్రులు, అలాగే ప్రముఖ భారతీయ మరియు అంతర్జాతీయ కంపెనీలకు చెందిన 40 మందికి పైగా సీఈఓలు ఈ సదస్సులో పాల్గొనే అవకాశం ఉంది.ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ప్రారంభం కావడానికి ముందే.. దేశ రాజధానిలో హోటళ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ముఖ్యంగా ఫిబ్రవరి 15 నుంచి 19 వరకు నగరంలోని లగ్జరీ హోటళ్ల గదుల ధరలు భారీగా పెరిగాయి. ఫిబ్రవరి 16న ఢిల్లీలోని ఇంపీరియల్ హోటల్లో ఒక రాత్రి గది ఛార్జీ.. ఒక వ్యక్తి రూ. 1,97,049 ఖర్చవుతుంది. దీనికి అదనంగా రూ. 35,469 పన్ను చెల్లించాలి. తాజ్ ప్యాలెస్లో, ప్రెసిడెన్షియల్ సూట్ ఒక రాత్రికి రూ. 30 లక్షలు అని సమాచారం. సాధారణ రోజుల్లో దీని ధర సుమారు రూ. 2,37,500.హయత్ రీజెన్సీ ఒక రాత్రికి దాదాపు రూ.50,000 వసూలు చేస్తుండగా, లీలా ప్యాలెస్ పన్నులతో సహా రాత్రికి రూ. 78,000 వసూలు చేస్తోంది. ది ఓబెరాయ్ హోటల్లో అయితే కొన్ని గదుల ధరలు రూ.5 లక్షల వరకు ఉండటంతో పాటు, కనీసం రెండు రాత్రులకు బుక్ చేసుకోవాలనే రూల్ కూడా ఉంది. -
ఆదాయపు పన్ను చట్టంలో కొత్త మార్పులు!
కేంద్ర ప్రభుత్వం.. ఆదాయ పన్ను చట్టం 2025ను.. 2026 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఈ తరుణంలో డ్రాఫ్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఫారమ్స్ విడుదల చేసింది. ఇందులో అనేక కొత్త నిబంధనలను ప్రతిపాదించారు.కొత్త నిబంధనలలో ప్రతిపాదించిన అత్యంత ముఖ్యమైన మార్పు ఏమిటంటే.. ఆదాయపు పన్ను ఫారమ్లకు కొత్త సంఖ్యలు ఇవ్వడం. పాత ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం ఉపయోగించిన అనేక ఫారమ్లకు.. ఇప్పుడు కొత్త సంఖ్యలు కేటాయిస్తున్నారు. దీని ప్రధాన ఉద్దేశ్యం పన్ను వ్యవస్థను సరళీకృతం చేయడం, గందరగోళాన్ని తగ్గించడం, కొత్త చట్టానికి అనుగుణంగా ఒకే విధమైన నిర్మాణం తీసుకురావడం.కొత్త మార్పులు➤టాక్స్ ఆడిట్కు సంబంధించిన పాత ఫారమ్లు 3CA, 3CB, 3CD ఇకపై విడివిడిగా ఉండవు. వీటన్నింటిని కలిపి ఫారమ్ 26గా మార్చారు.➤ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ఆడిట్కు ఉపయోగించే ఫారమ్ 3CEB ఇప్పుడు ఫారమ్ 48గా మారుతుంది.➤ట్యాక్స్ రెసిడెన్సీ సర్టిఫికేట్ (TRC) కోసం ఉపయోగించే ఫారమ్ 10FAను ఫారమ్ 42గా మార్చారు.➤ఎమ్ఏటీ సర్టిఫికేషన్ కోసం ఉన్న ఫారమ్ 29B ఇప్పుడు ఫారమ్ 66 అవుతుంది.➤డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ (DTAA) సంబంధిత సమాచారానికి ఉపయోగించే ఫారమ్ 10F ఇకపై ఫారమ్ 41గా ఉంటుంది.TDS & TCSకు సంబంధించిన మార్పులు➤TCS రిటర్న్ కోసం ఉన్న ఫారమ్ 27EQ ఇప్పుడు ఫారమ్ 143 అవుతుంది.➤తక్కువ లేదా నిల్ TDS సర్టిఫికేట్ కోసం ఉపయోగించే ఫారమ్ 13ను ఫారమ్ 128గా మార్చారు.➤నాన్-రెసిడెంట్లకు సంబంధించిన TDS రిటర్న్ (ఫారమ్ 27Q) ఇప్పుడు ఫారమ్ 144గా మారుతుంది.➤జీతభత్యాలపై TDS రిటర్న్ అయిన ఫారమ్ 24Q ఇకపై ఫారమ్ 138 అవుతుంది.➤ఉద్యోగులకు ఇచ్చే శాలరీ టీడీఎస్ సర్టిఫికెట్ (ఫారమ్ 16) ఇప్పుడు ఫారమ్ 130గా మారుతుంది.➤రెసిడెంట్లకు సంబంధించిన టీడీఎస్ రిటర్న్ (ఫారమ్ 26Q)ను ఫారమ్ 140గా మారుతుంది.చారిటబుల్ ట్రస్టులు & NGOలకు ఫారమ్ మార్పులు➤తాత్కాలిక నమోదు కోసం ఇప్పటివరకు ఉపయోగించిన ఫారమ్ 10Aను ఇప్పుడు ఫారమ్ 104గా మార్చారు.➤తుది నమోదు లేదా రెన్యువల్ కోసం ఉన్న ఫారమ్ 10AB.. ఇకపై ఫారమ్ 105 అవుతుంది.➤ఆదాయం నిల్వ కోసం ఉన్న ఫారమ్ 10ను ఫారమ్ 109గా మార్చారు.➤ఆడిట్ రిపోర్టుల కోసం ఉపయోగించే ఫారమ్ 10B, 10BB స్థానంలో ఇప్పుడు ఒకే ఫారమ్ 112 ఉంటుంది.➤డోనీ స్టేట్మెంట్ కోసం ఉన్న ఫారమ్ 10BD ఇప్పుడు ఫారమ్ 113గా మారుతుంది.➤డోనర్ సర్టిఫికేట్ కోసం ఉన్న ఫారమ్ 10BEను.. ఫారమ్ 114గా మార్చారు.ఇతర ముఖ్యమైన ఫారమ్ మార్పులు➤విదేశీ రిమిటెన్సుల కోసం సీఏ సర్టిఫికేట్ అయిన ఫారమ్ 15CB ఇప్పుడు ఫారమ్ 146 అవుతుంది.➤యాన్యువల్ ట్యాక్స్ స్టేట్మెంట్గా ఉపయోగించే ఫారమ్ 26AS ఇకపై ఫారమ్ 168గా మారుతుంది.➤ఆర్థిక లావాదేవీల వివరాల కోసం ఉన్న స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్సియల్ ట్రాన్సక్షన్స్ ఫారమ్ 61Aను ఫారమ్ 165గా మార్చారు.➤విదేశీ రిమిటెన్స్ డిక్లరేషన్కు సంబంధించిన ఫారమ్ 15CA ఇప్పుడు ఫారమ్ 145గా ఉంటుంది.ఈ మార్పుల వల్ల పన్ను వ్యవస్థ మరింత సరళంగా ఉంటుందని.. డిజిటల్కు అనుకూలంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కాబట్టి పన్ను చెల్లింపుదారులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, వ్యాపార సంస్థలు ఈ కొత్త ఫారమ్ సంఖ్యలను ముందుగానే అవగాహన చేసుకుని, 2026 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త చట్టానికి సిద్ధంగా ఉండటం చాలా అవసరం.ఇదీ చదవండి: బంగారం ధర.. ఒక్కసారిగా ఎందుకు పెరిగిందంటే? -
మ్యూచువల్ ఫండ్ కొత్త స్కీములు
ముంబై: కోటక్ మహింద్రా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ.. కోటక్ సర్వీసెస్ ఫండ్ పేరుతో కొత్త పథకాన్ని (ఎన్ఎఫ్వో) ప్రారంభించింది. ఈ నెల 18 వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. దేశ జీడీపీలో 55 శాతం వాటా ఆక్రమిస్తూ, వృద్ధికి కీలక చోదకంగా ఉన్న సేవల రంగంలో పెట్టుబడులకు ఈ పథకం వీలు కల్పిస్తుందని కోటక్ మ్యూచువల్ ఫండ్ ప్రకటించింది.వినియోగ సేవలు, టెలికం, హెల్త్కేర్, లాజిస్టిక్స్, ఆర్థిక సేవలు, ఐటీ, విద్యుత్, ఆయిల్ అండ్ గ్యాస్ తదితర రంగాలతో కూడిన సేవలు దీర్ఘకాల పెట్టుబడులకు మంచి వృద్ధి అవకాశాలను కల్పిస్తాయని పేర్కొంది. మంచి వృద్ధి అవకాశాలు, సహేతుక ధరల వద్దనున్న కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుంది. వ్యాపారం, యాజమాన్యం, కంపెనీ విలువకు ప్రాధాన్యం ఇస్తుంది. అన్ని రకాల మార్కెట్ విలువల్లోనూ పెట్టుబడులు పెడుతుంది.నాణ్యమైన వ్యాపారం, బలమైన నగదు ప్రవాహాలను చూస్తుంది. కనీసం రూ.1,000, అంతకుమించి ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎన్ఎఫ్వో ముగిసిన కొన్ని రోజుల అనంతరం తిరిగి పెట్టుబడులకు అందుబాటులోకి వస్తుంది. వైవిధ్యమైన పోర్ట్ఫోలియోతో, దీర్ఘకాలంలో పెట్టుబడి వృద్ధిని కోరుకునే వారికి ఈ పథకం అనుకూలమని కోటక్ మ్యూచువల్ ఫండ్ పేర్కొంది.360 వన్ ఎంఎఫ్ నుంచి సిఫ్ పథకం సంపన్న ఇన్వెస్టర్ల కోసం 360 వన్ మ్యుచువల్ ఫండ్ తాజాగా డైనాసిఫ్ ఈక్విటీ లాంగ్–షార్ట్ ఫండ్ పేరిట స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (సిఫ్)ని ప్రవేశపెట్టింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ ఫిబ్రవరి 20న ముగుస్తుంది. ఇది కనీసం 80 శాతం నిధులను ఈక్విటీలు, ఈక్విటీ డెరివేటివ్స్కి కేటాయిస్తుంది. ఈక్విటీ డెరివేటివ్స్ ద్వారా 25 శాతం వరకు షార్ట్ ఎక్స్పోజర్ తీసుకునేందుకు, డెట్ అలాగే ఇని్వట్స్లో 20 శాతం వరకు ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు ఉంటుంది.దీనికి బీఎస్ఈ 500 టీఆర్ఐ ప్రామాణికంగా ఉంటుంది. కనీసం రూ. 10 లక్షలు (అక్రెడిటెడ్ ఇన్వెస్టర్లయితే రూ. 1,00,000) ఇన్వెస్ట్ చేయొచ్చు. మ్యుచువల్ ఫండ్స్ పరమైన ట్యాక్సేషన్ ప్రయోజనాలతో పాటు మరింత మెరుగైన రాబడులను అందించే విధంగా ఈ ఫండ్ ఉంటుందని 360 వన్ అసెట్ మేనేజ్మెంట్ సీఈవో రాఘవ్ అయ్యంగార్ తెలిపారు. డీఎస్పీ మల్టీ అసెట్ ఆమ్ని ఎఫ్వోఎఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రక్రియను సరళతరం చేసే దిశగా డీఎస్పీ మ్యుచువల్ ఫండ్ సంస్థ మల్టీ అసెట్ ఆమ్ని ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్వోఎఫ్)ని ప్రవేశపెట్టింది. ఇది ఫిబ్రవరి 19 వరకు అందుబాటులో ఉంటుంది. సంస్థకు చెందిన స్వంత మార్కెట్ ఇంటెలిజెన్స్ ఫ్రేమ్వర్క్ డీఎస్పీ నేత్ర దన్నుతో ఇది పని చేస్తుంది. ఈక్విటీ, డెట్ ఆధారిత స్కీములు, గోల్డ్..సిల్వర్ ఈటీఎఫ్ల్లాంటి కమోడిటీ ఆధారిత స్కీములు మొదలైన వాటిలో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది.మార్కెట్ పరిస్థితులను బట్టి ఈక్విటీ ఆధారిత స్కీముల్లో 25–75 శాతం, డెట్ స్కీముల్లో 15–50 శాతం, గోల్డ్–సిల్వర్ ఈటీఎఫ్లలో 10–50 శాతం మేర ఇది పెట్టుబడులు పెట్టొచ్చు. మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులు ఏర్పడినప్పుడు ఈక్విటీల్లో పెట్టుబడులను కనిష్టంగా 25 శాతానికి కూడా తగ్గించే వెసులుబాటు ఉంటుంది. పెట్టుబడులను వివిధ సాధనాల్లో డైవర్సిఫై చేయడం వల్ల రాబడుల కోసం కేవలం ఒకే సాధనంపై ఆధారపడాల్సిన రిసు్కలు తగ్గుతాయని సంస్థ ప్రోడక్ట్ హెడ్ సాహిల్ కపూర్ తెలిపారు. -
బంగారం ధర.. ఒక్కసారిగా ఎందుకు పెరిగిందంటే?
ఇటీవల కాలంలో బంగారం ధరల్లో భారీ హెచ్చుతగ్గులు కనిపించాయి. చైనా ట్రేడర్ల పాత్ర దీనికి కారణమని, అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ పేర్కొన్నారు. ఈ విషయాలను ఆయన ఫాక్స్ న్యూస్లో ప్రసారమైన సండే మార్నింగ్ ఫ్యూచర్స్ కార్యక్రమంలో వెల్లడించారు.చైనాలో బంగారం ట్రేడింగ్.. కొంచెం నియంత్రణ తప్పిన స్థాయికి చేరిందని బెస్సెంట్ అన్నారు. దీనివల్ల అక్కడి అధికారులు మార్జిన్ నిబంధనలను కఠినతరం చేయాల్సి వచ్చిందని, ఈ పరిణామాలు బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగి, ఆ తర్వాత అకస్మాత్తుగా పడిపోయేలా చేసిందని అన్నారు.బంగారం ధరలు పెరగడానికి కారణాలుబంగారం ధరలు రికార్డు స్థాయికి చేరడానికి పలు కారణాలు ఉన్నాయి. ఇందులో పెట్టుబడులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ స్వతంత్రతపై ఉన్న ఆందోళనలు ప్రధానమైనవి. ఇదే సమయంలో డౌ జోన్స్ ఇండస్ట్రియల్ అవరేజ్ సూచీ 50,000 మార్క్ను తొలిసారి దాటింది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థపై, కార్పొరేట్ లాభాలపై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మరింత పెంచేసింది.భారతదేశంలో బంగారం ధరలుఇండియన్ మార్కెట్లో ఈ రోజు (సోమవారం) బంగారం ధరలు పెరిగాయి. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,55,000 దాటేసింది. 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 1,44,000 క్రాస్ చేసింది. వెండి ధరలు మళ్లీ రూ. 3 లక్షలకు (కేజీ) చేరింది. -
ఈ వారం బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు?
గత వారం బంగారం, వెండి మార్కెట్లు తీవ్రమైన ఊగిసలాటను ఎదుర్కొన్నాయి. ఈ వారం కూడా ధరల్లో భారీ మార్పులు కొనసాగవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అమెరికా నుంచి విడుదలయ్యే కీలక ఆర్థిక గణాంకాలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలపై వ్యాపారుల దృష్టి కేంద్రీకృతమైంది.అమెరికా ద్రవ్యోల్బణ డేటా, జీడీపీ వృద్ధి రేటు, పీఎంఐ, వ్యవసాయేతర ఉపాధి గణాంకాలు వంటి సూచికలు బులియన్ ధరల దిశను నిర్ణయించనున్నాయి. అలాగే చైనా, జర్మనీ, భారత్ నుంచి వచ్చే ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయి. ఫెడరల్ రిజర్వ్ అధికారుల ప్రసంగాలు వడ్డీ రేటు తగ్గింపుల సమయంపై స్పష్టతనిచ్చే అవకాశముండటంతో, వాటిని కూడా వ్యాపారులు నిశితంగా గమనిస్తున్నారు.అంతర్జాతీయ మార్కెట్లో గత వారం కామెక్స్లో బంగారం ధరలు దాదాపు 5 శాతం పెరిగాయి. ఔన్సుకు 4,400 డాలర్ల కనిష్ట స్థాయి నుంచి 5,000 డాలర్ల వరకు కోలుకోవడం గమనార్హం. అయితే వెండి ఫ్యూచర్స్పై ఒత్తిడి కొనసాగింది. గత వారం వెండి ధరలు 2 శాతానికి పైగా తగ్గాయి.జెఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈబీజీ – కమోడిటీ & కరెన్సీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ ప్రణవ్ మేర్ మాట్లాడుతూ.. “బంగారంలో కన్సాలిడేషన్, రికవరీ సంకేతాలు సానుకూలంగా ఉన్నాయి. కానీ వెండి విషయంలో మాత్రం అస్థిరత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తదుపరి దిద్దుబాట్ల పట్ల జాగ్రత్త అవసరం” అని చెప్పారు.దేశీయ మార్కెట్లో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో గోల్డ్ ఫ్యూచర్స్ గత వారం రూ.7,698 లేదా 5.2 శాతం పెరిగాయి. అదే సమయంలో వెండి ధరలు రూ.15,760 లేదా దాదాపు 6 శాతం పడిపోయాయి. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆదివారం కూడా కమోడిటీస్ మార్కెట్ పనిచేయడం విశేషం.మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ విశ్లేషకుడు మానవ్ మోడీ మాట్లాడుతూ.. “డాలర్ బలపడటం, ఫెడ్ అంచనాల్లో మార్పులు, దూకుడు పెట్టుబడుల ఉపసంహరణ కారణంగా బంగారం, వెండి అత్యంత అస్థిర వారాన్ని ఎదుర్కొన్నాయి” అన్నారు. వాషింగ్టన్–టెహ్రాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడం, వాణిజ్య చర్చల్లో పురోగతి, అమెరికా ప్రభుత్వ షట్డౌన్ ప్రమాదం తగ్గడం వంటి అంశాలు సేఫ్-హావెన్ డిమాండ్ను కొంత తగ్గించాయని ఆయన వివరించారు.అయితే, దీర్ఘకాలికంగా బంగారం ఫండమెంటల్స్ బలంగానే ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, ఈటీఎఫ్ పెట్టుబడులు కొనసాగుతుండటం, భౌగోళిక రాజకీయ అనిశ్చితి వంటి అంశాలు బులియన్కు మద్దతునిస్తాయని అభిప్రాయపడుతున్నారు.మొత్తంగా చూస్తే, వచ్చే వారం కూడా బంగారం, వెండి మార్కెట్లలో అస్థిరత కొనసాగవచ్చు. అయినప్పటికీ, ధరలు తగ్గినప్పుడు ముఖ్యంగా బంగారంలో స్వల్పకాలిక కొనుగోలు అవకాశాలు కనిపించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. -
పిల్లలకు ప్రత్యేక బీమా పథకాలు
పిల్లల భవిష్యత్ ప్రణాళికల కోసం ఉపయోగపడేలా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ స్మార్ట్కిడ్ 360 ప్లాన్ని ప్రవేశపెట్టింది. ఇది బీమా ప్రయోజనాలను కల్పించడంతో పాటు దీర్ఘకాలిక పొదుపు పథకంగా కూడా ఉపయోగపడుతుంది. పాలసీదారుకేదైనా జరిగితే ప్రీమియంల నుంచి మినహాయింపు, ప్రయోజనాల కొనసాగింపు, కుటుంబానికి క్రమం తప్పకుండా ఆదాయాన్నిచ్చే ఫ్యామిలీ ఇన్కం బెనిఫిట్ మొదలైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. పిల్లల చదువులు తదితరాలకు మనీబ్యాక్ పొందే వీలుంది. బజాజ్ జనరల్ ఫీటల్ ఫ్లరిష్ ఆరోగ్య బీమా గర్భస్త శిశువు ఆరోగ్యానికి సంబంధించి ‘ఫీటల్ ఫ్లరిష్’ పేరిట బజాజ్ జనరల్ ఇన్సూరెన్స్ ప్రత్యేక ఇన్సూరెన్స్ రైడర్ని ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు మెటర్నిటీ ఇన్సూరెన్స్ పరిధిలోకి రాని అధునాతన ఇన్–యుటెరో ప్రొసీజర్లు, రిస్కులు ఎక్కువగా ఉండే ప్రెగ్నెన్సీలకు కవరేజీ లభిస్తుంది. ‘మై హెల్త్ కేర్ ప్లాన్’, ‘హెల్త్ గార్డ్’ పథకాలతో కలిపి ఈ రైడర్ని తీసుకోవచ్చు. 18–45 ఏళ్ల వయస్సు గల మహిళలకు, ఒక్కో ప్రసవానికి రూ. 2 లక్షల సమ్ ఇన్సూర్డ్తో రెండు ప్రసవాల వరకు వర్తిస్తుంది. ప్రీమియం రూ. 1,025గా ఉంటుంది. -
ఐటీ అన్నదమ్ములు.. భలే కట్టారు ఇల్లు!
కొన్ని ఇళ్లు చూడగానే ఆకట్టుకుంటాయి. బెంగళూరులో ఇద్దరు ఐటీ ఇంజనీర్ సోదరులు నిర్మించిన ఈ అద్భుతమైన 4BHK ట్విన్ హోమ్ సింపుల్ స్టైల్, స్మార్ట్ డిజైన్తో ఆకట్టుకుంటోంది. లోపల విశాలమైన గదులు, సహజ గాలి ప్రవాహం, ఆధునిక ఆలోచనలతో రూపొందిన ఈ ఇంటిని బిల్డ్ ఎ హోమ్ కన్స్ట్రక్షన్ అనే సంస్థ నిర్మించింది. ఫుడ్ అండ్ ట్రావెల్ వ్లాగర్ శివరాయ్ ఈ ఇంటిని సందర్శించి, ఆ హౌస్ టూర్ను ఇటీవల ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. ఈ ఇంట్లో ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్న ప్రత్యేకతలేంటో మనమూ చూద్దామా...రెండు ప్లాట్లు ఒకే ఇల్లు30×40 పరిమాణంలోని రెండు ప్లాట్లను కలిపి, మొత్తం 2,460 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ట్విన్ హోమ్ను నిర్మించారు. తాము పక్కపక్కనే నివసిస్తూ ఒకే కుటుంబంగా ఉండాలనుకున్నామని అందుకే ఇల్లు ఇలా నిర్మించుకున్నట్లు చెప్పారు. బయట నుండి చూస్తే ఇది ఒకే ఆధునిక ఇంటిలా కనిపిస్తుంది. కానీ లోపలికి అడుగుపెడితే, అచ్చు ఒకేలా ఉండే రెండు పోర్షన్లు కనిపిస్తాయి. క్లీన్ డిజైన్, స్మార్ట్ లేఅవుట్, కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చే ఆలోచనలే ఈ ఇంటి ప్రత్యేకత.ఇంటి లోపలి అందండబుల్-హైట్ సీలింగ్తో ఉన్న లివింగ్ రూమ్ ఈ ఇంటికి హైలైట్. సహజ సూర్యకాంతి లోపలికి వెల్లువలా ప్రవహించేలా డిజైన్ చేయడం వల్ల, ఆ స్థలం మరింత విశాలంగా, ఆహ్వానకరంగా అనిపిస్తుంది. ఓపెన్-ప్లాన్ కిచెన్, పూజ గది, చిన్న ఆఫీస్-కమ్-బెడ్రూమ్, హాయిగా కూర్చునే బే విండోతో మాస్టర్ బెడ్రూమ్ ఈ ఇంటి సౌకర్యాన్ని పెంచుతాయి.పిల్లల ప్రతి బెడ్రూమ్కు అటాచ్డ్ బాత్రూమ్, డ్రెస్సింగ్ ఏరియా ఉండటం గోప్యతను, సౌకర్యాన్ని అందిస్తుంది. రెండు ఇళ్లను కలిపే కనెక్టింగ్ హాల్వే ఒక వంతెనలా పనిచేస్తుంది. పై అంతస్తులో గెస్ట్ రూమ్, యుటిలిటీ ఏరియా ఉండటంతో, కుటుంబ సభ్యులతో పాటు అతిథులను కూడా సౌకర్యంగా ఆహ్వానించగలిగేలా ఇంటిని రూపొందించారు. యజమానులు ఈ ఇల్లు కేవలం అందంగా మాత్రమే కాకుండా, ఆచరణాత్మకంగా కూడా ఉండేలా జాగ్రత్తగా ప్లాన్ చేసి నిర్మించుకున్నట్లు తెలిపారు. View this post on Instagram A post shared by Shiva Rai (@_mr.swashbuckler_) -
యాపిల్ ఫోన్నూ మడతెట్టేయొచ్చు..?
శాంసంగ్, వివో, గూగుల్, వన్ ప్లస్ వంటి కంపెనీలన్నీ ఫోల్డబుల్ ఫోన్స్ లాంచ్ చేసి, విక్రయిస్తున్న తరుణంలో.. యాపిల్ కూడా ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ చేయడానికి సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఈ ఏడాది ఐఫోన్ 18 ప్రో & ప్రో మాక్స్ లాంచ్ సమయంలో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.ఇప్పుడు చాలామంది స్మార్ట్ఫోన్ వినియోదాగారులు ఫోల్డబుల్ ఫోన్స్ ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే యాపిల్ కూడా ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ చేయనున్నట్లు చెబుతున్నారు. అయితే.. ఈ విషయంపై కంపెనీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తల ప్రకారం.. ఐఫోన్ ఫోల్డ్ కోసం ఓఎల్ఈడీ డిస్ప్లేలను శాంసంగ్ ఉత్పత్తి చేయనుంది. ఎందుకంటే.. శాంసంగ్ అత్యుత్తమ ఫ్లెక్సిబుల్ డిస్ప్లే టెక్నాలజీ కలిగి ఉంది.ఐఫోన్ ఫోల్డ్ మార్కెట్లో లాంచ్ అయితే దీని ధర కూడా ఎక్కువగా (సుమారు 2399 డాలర్లు) ఉండే అవకాశం ఉందని ప్రముఖ రీసర్చ్ అనలిస్ట్ ఆర్థర్ లియావో పేర్కొన్నారు. ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్ పరంగా రెండు విధాలుగా ఉండవచ్చని అంచనా. ఒకటి బుక్ స్టైల్ ఫోల్డ్(ఫోన్ తెరిస్తే టాబ్లెట్ లాంటి పెద్ద స్క్రీన్), మరొకటి ఫ్లిప్-స్టైల్ ఫోల్డ్ (మడిచినప్పుడు చిన్నదిగా మారే డిజైన్).బ్యాటరీ విషయంలో.. పెద్ద స్క్రీన్కు సరిపడే విధంగా అధిక సామర్థ్యం గల బ్యాటరీతో పాటు, పవర్ ఎఫిషియెన్సీపై యాపిల్ ప్రత్యేక శ్రద్ధ పెట్టే అవకాశం ఉంది. అనుకున్న విధంగా ఐఫోన్ ఫోల్డ్ మార్కెట్లో లాంచ్ అయితే.. దీనికి కూడా మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉందని సమాచారం. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి అదే ఊపుతో ముగిశాయి. సెన్సెక్స్ 485.35 పాయింట్లు పెరిగి 84,065.75 వద్ద, నిఫ్టీ 173.60 పాయింట్ల లాభంతో 25,867.30 వద్ద నిలిచాయి.నీరాజ్ ఇస్పాత్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇజ్మో లిమిటెడ్, అపోలో పైప్స్ లిమిటెడ్, లాయల్ టెక్స్టైల్స్ మిల్స్ లిమిటెడ్, హిటాచీ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. సీఎల్ ఎడ్యుకేట్ లిమిటెడ్, మహేశ్వరి లాజిస్టిక్స్ లిమిటెడ్, ఆశాపురా మినెకెమ్ లిమిటెడ్, సోలారా యాక్టివ్ ఫార్మా సైన్సెస్ లిమిటెడ్, శివ్ ఓమ్ స్టీల్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలోకి చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
రూ.123 ఇవ్వాల్సిన చోట.. రూ.3.62 లక్షల కోట్లు!
దక్షిణ కొరియాలోని ప్రముఖ క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్ బిథంబ్ (Bithumb)లో ఒక టెక్నికల్ ఎర్రర్ వచ్చింది. దీంతో లక్షల కోట్ల బదిలీ జరిగింది. వినియోగదారులకు చిన్న మొత్తంలో ప్రోత్సాహక బహుమతులు ఇవ్వాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ సంఘటన జరిగింది.సాధారణంగా విజేతలకు సుమారు 2,000 కొరియన్ వోన్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.123) మాత్రమే ఇవ్వాల్సి ఉండగా.. సిస్టమ్లో జరిగిన పొరపాటు వల్ల ప్రతి విజేత ఖాతాకు 2,000 బిట్కాయిన్లు జమయ్యాయి. మొత్తం 695 ఖాతాలకు ఇలా బిట్కాయిన్లు పంపించడంతో, సుమారు 6,20,000 బిట్కాయిన్లు అనుకోకుండా బదిలీ అయ్యాయి. నేటి మార్కెట్ విలువ ప్రకారం.. వీటి విలువ సుమారు రూ.3.62 లక్షల కోట్లు (దాదాపు 40 బిలియన్ డాలర్లు).పొరపాటు జరిగిందనే విషయం తెలుసుకున్న వెంటనే.. సంస్థ నిమిషాల వ్యవధిలోనే సంబంధిత ఖాతాల్లో ట్రేడింగ్ & విత్డ్రాయల్స్ను నిలిపివేసింది. అనుకోకుండా పంపిన బిట్కాయిన్లను తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియను ప్రారంభించింది. మొత్తానికి 99.7 శాతం బిట్కాయిన్లను తిరిగి రాబట్టగలిగింది.ఈ ఘటనపై స్పందించిన బిథంబ్.. వినియోగదారులకు క్షమాపణలు చెప్పింది. ఇది హ్యాకింగ్ లేదా భద్రతా లోపం వల్ల జరిగిన తప్పిదం కాదని, కేవలం బహుమతుల పంపిణీ ప్రక్రియలో జరిగిన సాంకేతిక పొరపాటు మాత్రమేనని స్పష్టం చేసింది. అంతే కాకుండా సంస్థకు సంబంధించిన భద్రతా వ్యవస్థలు బాగానే ఉన్నాయని, వినియోగదారుల ఆస్తులకు ఎలాంటి ప్రమాదం లేదని కూడా వెల్లడించింది.ఇదీ చదవండి: 2026లో బంగారం, వెండి భవిష్యత్తు ఇదే!: బాబా వంగాబిథంబ్ ప్లాట్ఫారమ్లో జరిగిన ఈ తప్పిదం.. బిట్కాయిన్ ధరపై తీవ్రమైన ప్రభావం చూపించింది. దీంతో బిట్కాయిన్ విలువ 17 శాతం తగ్గింది. ఈ ఘటనపై దక్షిణ కొరియా బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ అయిన ఫైనాన్షియల్ సూపర్వైజరీ సర్వీస్ (FSS) ఒక సమావేశం నిర్వహించి విచారణ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ విషయంలో బిథంబ్ సంస్థ పూర్తిగా సహకరిస్తామని వెల్లడించింది. -
సరికొత్త లుక్లో మార్కెట్లోకి కొత్త ఈవీ
ఎలక్ట్రిక్ వాహన రంగంలో దూసుకుపోతున్న ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన పాపులర్ మోడల్ ‘పంచ్ ఈవీ’లో సరికొత్త 2026 ఎడిషన్ను ఆవిష్కరించింది. అత్యాధునిక ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్తో రూపొందిన ఈ మోడల్ ఈ నెల 20వ తేదీన అధికారికంగా మార్కెట్లోకి విడుదల కానుంది.కొత్తదనంతో..కొత్త పంచ్ ఈవీ ఔటర్ బాడీలో టాటా మోటార్స్ కీలక మార్పులు చేసింది. మునుపటి మోడల్లో హెడ్ ల్యాంప్లను కలుపుతూ ఉండే బ్లాక్ స్ట్రిప్ను ఈ కొత్త మోడల్లో తొలగించారు. ఇది కారుకు మరింత క్లీన్, ప్రీమియం లుక్ను ఇస్తుందని కంపెనీ తెలిపింది. కొత్తగా తీసుకొచ్చిన సన్ లిట్ యెల్లో షేడ్ వాహనాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది. దీనికి తోడు కొత్త డిజైన్ కలిగిన అల్లాయ్ వీల్స్ చూపరులను ఆకట్టుకుంటున్నాయని చెప్పింది.హైటెక్ ఫీచర్లుకారు లోపలి భాగంలో మరింత టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. 12.3 ఇంచుల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ను అందిస్తున్నారు. 360 డిగ్రీ కెమెరా, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఇందులో ప్రత్యేకంగా నిలువనున్నాయి. యాంబియంట్ లైటింగ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.బ్యాటరీ రేంజ్ వివరాలుఈ కారును రెండు వేరియంట్లలో తీసుకొచ్చారు. 25 కిలోవాట్హవర్ (స్టాండర్డ్) వేరియంట్ ఒకసారి ఛార్జ్ చేస్తే 265 కిలోమీటర్ల రేంజ్ను ఇస్తుందని కంపెనీ తెలిపింది. 35 కిలోవాట్హవర్ (లాంగ్ రేంజ్) వేరియంట్ ఒకసారి ఛార్జ్ చేస్తే 365 కిలోమీటర్లు రేంజ్ ఇస్తుందని పేర్కొంది.ధర ఎంతంటే..ఈ సరికొత్త మోడల్ ధర మధ్యతరగతి వినియోగదారులకు అందుబాటులో ఉండేలా టాటా మోటార్స్ ప్లాన్ చేస్తోంది. దీని ఎక్స్-షోరూమ్ ధర వేరియంట్ను అనుసరించి సుమారుగా రూ.9,99,000 నుంచి రూ.14,44,000 వరకు ఉండవచ్చని అంచనా. మార్కెట్లో ఇంకా విభిన్న కంపెనీలకు చెందిన వివిధ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. వాటితో పోల్చుకొని, ఆటోమొబైల్ నిపుణుల సలహా తీసుకొని వాహనదారులు కార్ల కొనుగోలు విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని గమనించాలి.ఇదీ చదవండి: రిస్క్ లేకుంటే రాబడి లేదు! -
బంగారానికి బదులుందా? బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఏది?
ప్రముఖ ఇన్వెస్టర్, ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి పెట్టుబడుల విషయమై తన అభిప్రాయాలను మరోసారి స్పష్టం చేశారు. బంగారం, వెండి, బిట్కాయిన్.. మూడింటినీ కలిపి పెట్టుబడులు పెట్టడం మంచిదేనని చెప్పిన ఆయన, ఒక్క ఆస్తినే ఎంచుకోవాల్సి వస్తే మాత్రం తాను బిట్కాయిన్కే ప్రాధాన్యం ఇస్తానన్నారు.ఇటీవల చేసిన వ్యాఖ్యల్లో, బిట్కాయిన్కు ఉన్న పరిమిత సరఫరానే దాని అతిపెద్ద బలమని కియోసాకి వివరించారు. బంగారం ధర పెరిగినప్పుడు మరిన్ని గనులు తవ్వడం ద్వారా సరఫరా పెరిగే అవకాశం ఉందని, తాను స్వయంగా గోల్డ్ మైనర్ కావడంతో ఇది తనకు తెలుసని అన్నారు.“బంగారం ధర పెరిగితే మరిన్ని గనులు తవ్వుతారు. అంటే సరఫరా పెరుగుతుంది. కానీ బిట్కాయిన్ విషయంలో అలా కాదు. దాని డిజైన్ ప్రకారం గరిష్టంగా 21 మిలియన్ బిట్కాయిన్లే ఉంటాయి” అని కియోసాకి (Robert Kiyosaki) తెలిపారు. బిట్కాయిన్ ప్రోటోకాల్ ప్రకారం 21 మిలియన్లకు మించి ఒక్క బిట్కాయిన్ కూడా సృష్టించలేమని, ఆ స్థాయికి మెల్లగా చేరుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ విధమైన నిర్మాణాత్మక కొరత బిట్కాయిన్ను ప్రత్యేకంగా నిలబెడుతుందని అన్నారు.ఇది చదివారా? కియోసాకీకి కోపమొచ్చింది!“21 మిలియన్ల తర్వాత కొత్త బిట్కాయిన్లు రావు. ఇది అద్భుతమైన డిజైన్. అందుకే దీర్ఘకాలంలో బిట్కాయిన్ ధర పెరుగుతుందని నేను నమ్ముతున్నాను” అని కియోసాకి వ్యాఖ్యానించారు. తాను బిట్కాయిన్ను ప్రారంభ దశలోనే కొనుగోలు చేశానని, అదే సమయంలో గోల్డ్ మైనింగ్, చమురు తవ్వకాలు వంటి సంప్రదాయ పెట్టుబడులను కూడా కొనసాగిస్తున్నానని తెలిపారు.ఫియాట్ కరెన్సీలపై తనకు నమ్మకం లేదని, ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితుల నుంచి రక్షణనిచ్చే “హార్డ్ అసెట్స్”కే తాను మద్దతు ఇస్తానని కియోసాకి మరోసారి స్పష్టం చేశారు. అయితే నిపుణులు మాత్రం, కేవలం కొరత మాత్రమే ధరలు పెరగడానికి హామీ ఇవ్వదని, డిమాండ్, నియంత్రణలు, మార్కెట్ ఊగిసలాటలు కూడా కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడుతున్నారు.అయినప్పటికీ, బిట్కాయిన్ను బంగారానికి ప్రత్యామ్నాయంగా చూసే ఇన్వెస్టర్ల సంఖ్య పెరుగుతోందని కియోసాకి వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.I am often asked:Which is a better investment?Gold or Bitcoin.Obviously I would say both for diversification of assets and add silver.Yet if I had to choose only one asset I would choose Butcoin.Why?Because gold is in theory infinite. When the price of gold rises…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 9, 2026 -
ఇళ్లు..పెళ్లిళ్లూ ఒకేసారి! సొంతింటికి కొత్త దారి!!
ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు.. అనేది సామెత. అక్షర సత్యం కూడా. ఈరోజుల్లో ఇల్లు కట్టాలన్నా.. పెళ్లి చేసుకోవాలన్నా మాటలు కాదు.. రూ.లక్షలు.. కోట్లు కావాలి. సగటు వేతన జీవి, మధ్య తరగతి వ్యక్తికి సొంతిల్లు జీవితకాల కల. అయితే ఈ జంట కొత్త జీవితంలోకి.. కొత్త ఇంట్లోకి ఒకేసారి అడుగు పెట్టే కొత్త మార్గాన్ని చూపించారు.ఆడంబరం కంటే ఆర్థిక భద్రతకు ప్రాధాన్యతఇంటర్నేషనల్ డెస్టినేషన్లు, డిజైనర్ దుస్తులు, రోజుల తరబడి జరిగే వేడుకలతో ‘బిగ్ ఫ్యాట్ ఇండియన్ వెడ్డింగ్స్’ ట్రెండ్ ఊపందుకుంటున్న వేళ ఈ జంట మాత్రం దీర్ఘకాలిక ఆర్థిక భద్రతను ఎంచుకుంది. ఇటీవల ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసిన వీడియో ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది.ఖరీదైన వివాహ వేడుకకు బదులుగా, పెళ్లి కోసం పొదుపు చేసిన మొత్తాన్ని తమ మొదటి ఇంటి కొనుగోలుకు ఉపయోగించినట్లు తెలిపింది. అంతేకాదు, ఆ కొత్త ఇంట్లోనే సాంప్రదాయబద్ధంగా నిరాడంబరంగా వివాహం చేసుకుని జీవితానికి అర్థవంతమైన ఆరంభం ఇచ్చిందా జంట. పెరుగుతున్న పెళ్లి ఖర్చులు స్థిరంగా లేవని భావించిన ఈ జంట, తాత్కాలిక వేడుకకన్నా దీర్ఘకాలిక ఆస్తినే ప్రాధాన్యంగా చూసింది.సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురిసింది. “భవిష్యత్తుకు సరైన ఉదాహరణ”, “తెలివైన జంట”, “జీవితానికి అద్భుతమైన ఆరంభం” అంటూ నెటిజన్లు అభినందనలు తెలిపారు. “మా కుటుంబాలు కూడా ఇలా ఆలోచిస్తే బాగుంటుంది” అన్న వ్యాఖ్యలు కూడా కనిపించాయి. అయితే కొందరు సంప్రదాయవాదులు మాత్రం “పెళ్లి జీవితంలో ఒక్కసారే వచ్చే సందర్భం” అంటూ ఘనంగా జరపాల్సిందేనని అభిప్రాయపడ్డారు.హోమ్ లోన్ ప్లానింగ్తో సాధ్యమైన సొంతిల్లుసాధారణంగా ఇంటి కొనుగోలులో బ్యాంకులు 75–80 శాతం వరకు హోమ్ లోన్ ఇస్తాయి. మిగతా 20–25 శాతం డౌన్ పేమెంట్ను కొనుగోలుదారులు చెల్లించాలి. ఈ డౌన్ పేమెంట్నే చాలా మంది యువ జంటలకు ప్రధాన అడ్డంకిగా మారుతోంది. ఈ జంట మాత్రం పెళ్లి కోసం దాచుకున్న లక్షల రూపాయలను డౌన్ పేమెంట్గా ఉపయోగించి, హోమ్ లోన్ భారం తగ్గించుకున్నారు.అద్దెకు బదులు ఈఎంఐపెళ్లి అనంతరం అద్దె ఇంట్లో ఉండటం బదులు, నేరుగా సొంతింట్లోకి మారడం ద్వారా ఈ జంట నెలవారీ అద్దెను ఈఎంఐ (EMI)గా మార్చుకుంది. రియల్ ఎస్టేట్ నిపుణుల ప్రకారం.. మెట్రో నగరాలు, టయర్-2 పట్టణాల్లో అద్దె, ఈఎంఐ మధ్య తేడా క్రమంగా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో అద్దెకు వెళ్లే డబ్బు ఆస్తి సృష్టికి ఉపయోగపడుతుంది. దీర్ఘకాలంలో రియల్ ఎస్టేట్ విలువ పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబానికి ఆర్థిక స్థిరత్వం, భద్రత లభిస్తుంది.ఇది చదివారా? శంషాబాద్కు కొత్త ఫేమ్.. ఇక మరో రియల్ ఎస్టేట్ బూమ్!పెళ్లి వర్సెస్ ప్రాపర్టీ.. కొత్త ట్రెండ్!ఖరీదైన వివాహాలు కొన్ని రోజుల్లో ముగిసిపోయే ఖర్చులు మాత్రమే. కానీ అదే డబ్బుతో కొన్న ఇల్లు జీవితాంతం ఉపయోగపడే ఆస్తిగా ఉంటుంది. పిల్లల భవిష్యత్తుకు భద్రత, ఆర్థిక స్థిరత్వానికి పునాదిగా ఉంటుందనే కోణంలో యువత ఆలోచిస్తోంది. ఈ జంట నిర్ణయం అదే ఆలోచనకు ఉదాహరణగా మారింది. జెన్ జెడ్, మిలీనియల్స్లో తిరిగిరాని పెళ్లి ఖర్చులపై చర్చ పెరుగుతోంది.పెరుగుతున్న ప్రాపర్టీ ధరలు, హోమ్ లోన్ వడ్డీలు, జీవన వ్యయం నేపథ్యంలో మైక్రో వెడ్డింగ్స్, కోర్టు మ్యారేజ్లు, పెళ్లి + ఇల్లు ప్లానింగ్ వంటి ట్రెండ్స్ ఊపందుకుంటున్నాయి. రియల్ ఎస్టేట్ నిపుణులు కూడా పెళ్లి ఖర్చులను డౌన్ పేమెంట్గా మార్చుకోవడం యువ జంటలకు సరైన ఫైనాన్షియల్ స్ట్రాటజీగా అభిప్రాయపడుతున్నారు. View this post on Instagram A post shared by Shreeom Kumar (@iasworldofficial) -
భారీ ధరకు ఫ్లాట్ కొనుగోలు చేసిన నటుడు
ముంబైలోని అత్యంత విలాసవంతమైన ప్రాంతమైన పాలి హిల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇషాన్ ఖట్టర్ పాలి హిల్లో ఉన్న ఒక ఖరీదైన ఫ్లాట్ను దాదాపు రూ.29.4 కోట్లకు కొనుగోలు చేశారు. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం.. ఈ విలాసవంతమైన ఫ్లాట్ పాలి హిల్లోని నవ్రోజ్ అపార్ట్మెంట్లో ఉంది.ఈ లావాదేవీకి సంబంధించిన వివరాలు..విక్రయ ధర: రూ.29.37 కోట్లురిజిస్ట్రేషన్ తేదీ: ఫిబ్రవరి 5, 2026స్టాంప్ డ్యూటీ: రూ.1.76 కోట్లుఅమ్మినవారు: కపిల్ ఎం.మహతానీఈ అపార్ట్మెంట్ 2,989.05 చదరపు అడుగుల కార్పెట్ విస్తీర్ణాన్ని కలిగి ఉంది. మార్కెట్లో పలికిన ధర ప్రకారం చదరపు అడుగుకు సుమారు రూ.98,000 చొప్పున ఈ డీల్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాంద్రా, పాలి హిల్ మైక్రో మార్కెట్లలో ఉన్న రేట్లకు అనుగుణంగానే ఈ ధర నిర్ణయించారు. ముంబైలోని పశ్చిమ శివారు ప్రాంతాల్లో బాంద్రాలోని పాలి హిల్ అత్యంత ప్రతిష్టాత్మకమైనది. బాలీవుడ్ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు (హెచ్ఎన్ఐ) ఇక్కడ నివసించడానికి ఆసక్తి చూపుతారు. ఈ ప్రాంతంలో లగ్జరీ అపార్ట్మెంట్ల ధరలు చదరపు అడుగుకు రూ.80,000 నుంచి రూ.1.30 లక్షల వరకు పలుకుతున్నాయి.ఇదీ చదవండి: రిస్క్ లేకుంటే రాబడి లేదు! -
దేశవ్యాప్తంగా కోటి మందికి ఆధార్ అప్డేట్ పూర్తి
దేశంలోని పాఠశాల విద్యార్థుల ఆధార్ డేటా అప్డేట్ ప్రక్రియలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) కీలక మైలురాయిని అధిగమించింది. దేశవ్యాప్తంగా సుమారు 83,000 పాఠశాలల్లో చదువుతున్న కోటి మందికి పైగా విద్యార్థులకు ‘తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్స్’ (ఎంబీయూ) పూర్తి చేసినట్లు అధికారికంగా ప్రకటించింది.ఎందుకు ఈ అప్డేట్ తప్పనిసరి?సాధారణంగా ఐదేళ్లలోపు పిల్లలకు ఆధార్ నమోదు చేసే సమయంలో కేవలం ఫొటో, పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలను మాత్రమే సేకరిస్తారు. ఆ వయసులో పిల్లల వేలిముద్రలు, కనుపాప (ఐరిస్) గుర్తులు పూర్తిగా పరిపక్వం చెందవు కాబట్టి వాటిని తీసుకోరు. అయితే 5 ఏళ్లు, 15 ఏళ్లు దాటిన తర్వాత పిల్లలు తమ బయోమెట్రిక్ వివరాలను ఆధార్లో అప్డేట్ చేయడం అత్యవసరం. ఈ వివరాలు అప్డేట్ చేయకపోతే భవిష్యత్తులో నీట్, జేఈఈ, సీయూఈటీ వంటి పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడానికి కూడా ఈ అప్డేట్ తప్పనిసరి.ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశంవిద్యార్థులకు వీలుగా యూఐడీఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లలోపు పిల్లలకు అక్టోబర్ 1 నుంచి ఏడాది పాటు ఈ బయోమెట్రిక్ అప్డేట్ను ఉచితంగా అందిస్తోంది. పాఠశాలల్లో నిర్వహించే ప్రత్యేక శిబిరాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆధార్ కేంద్రాల్లో కూడా ఈ సదుపాయాన్ని పొందవచ్చు. ఇప్పటికే కేంద్రాల ద్వారా సుమారు 1.3 కోట్ల అప్డేట్లు పూర్తయ్యాయి.సాంకేతికతతో వేగవంతంసెప్టెంబర్ 2025లో యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (యూడీఐఎస్ఈ+) అప్లికేషన్తో ఆధార్ డేటాను అనుసంధానం చేయడం వల్ల ఈ ప్రక్రియ వేగవంతమైంది. దీని ద్వారా ఏ విద్యార్థికి అప్డేట్ అవసరమో సులభంగా గుర్తించి నేరుగా పాఠశాలల్లోనే శిబిరాలు నిర్వహిస్తున్నారు. ‘దేశంలోని అన్ని పాఠశాలలు కవర్ అయ్యే ఈ ప్రక్రియ కొనసాగుతుంది’ అని యూఐడీఏఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ఉడాయ్ సీఈఓ భువనేష్ కుమార్.. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాస్తూ పాఠశాలల్లో శిబిరాల నిర్వహణకు సహకరించాలని కోరారు.ఇదీ చదవండి: రిస్క్ లేకుంటే రాబడి లేదు! -
ముకేశ్ అంబానీకి నో చెప్పిన రోహిత్ శర్మ!
టీమిండియా దిగ్గజ కెప్టెన్గా పేరొందాడు రోహిత్ శర్మ. భారత్కు 2024లో టీ20 ప్రపంచకప్ అందించిన హిట్మ్యాన్.. 2025లో చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలిచాడు. ఇక ఇప్పటికే అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్, టెస్టులకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ కేవలం వన్డేలలో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే.. 2007లో టీ20 ప్రపంచకప్ టోర్నీ మొదలుకాగా ఇప్పటి వరకు అన్ని ఎడిషన్లలోనూ రోహిత్ భాగమయ్యాడు. అయితే, రిటైర్మెంట్ నేపథ్యంలో తొలిసారి టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో హిట్మ్యాన్ ప్రేక్షకుడిగా మిగిలిపోయాడు. ఇక పొట్టి ఫార్మాట్లో సత్తా చాటి తానేంటో నిరూపించుకున్న రోహిత్ శర్మను ఐసీసీ ఈసారి వరల్డ్కప్ అంబాసిడర్గా నియమించింది.వాంఖడేలో వరల్డ్కప్ ట్రోఫీతో ఎంట్రీఈ నేపథ్యంలో శనివారం ఈ మెగా ఈవెంట్కు తెరలేవగా.. సొంత మైదానం ముంబైలోని వాంఖడేలో వరల్డ్కప్ ట్రోఫీతో ఎంట్రీ ఇచ్చాడు రోహిత్ శర్మ. అమెరికాతో మ్యాచ్ నేపథ్యంలో డిఫెండింగ్ చాంపియన్ టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెప్పి.. మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించాడు.అంబానీ కుటుంబం ఆప్యాయతఇక భారత వ్యాపార దిగ్గజం, కుబేరుడు ముకేశ్ అంబానీ కుటుంబం కూడా ఈ మ్యాచ్కు హాజరైంది. భార్య నీతా, కుమారుడు ఆకాశ్ అంబానీ తదితరులతో కలిసి ముకేశ్ మ్యాచ్కు విచ్చేశారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ పక్కకు వెళ్లాలని చూడగా.. ముకేశ్ అంబానీ మాత్రం అతడి చేయి పట్టుకుని ఆపి మరీ ఆకాశ్కు- తనకు మధ్య కూర్చోబెట్టుకున్నారు.ముకేశ్ అంబానీ స్వయంగా ఛాయ్ ఇవ్వగాఅంతేకాదు.. మధ్యలో టీతో పాటు స్నాక్స్తో కూడిన సాసర్ను ముకేశ్ అంబానీ రోహిత్ శర్మకు అందించారు. అయితే, రోహిత్ మాత్రం సున్నితంగా తిరస్కరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.Last night, Rohit Sharma was going to sit beside Ritika, but Mukesh Ambani asked him to sit next to him instead 🤍 pic.twitter.com/d9YEMXajlv— Kusha Sharma (@Kushacritic) February 8, 2026కాగా 2011 నుంచి రోహిత్కు అంబానీ కుటుంబంతో ప్రత్యేక అనుబంధం ఉంది. అంబానీల యాజమాన్యంలోని ముంబై ఇండియన్స్కు కెప్టెన్గా వ్యవహరించిన హిట్మ్యాన్ ఐదుసార్లు ట్రోఫీ అందించాడు. 2013 నుంచి పదేళ్లపాటు సారథిగా కొనసాగిన రోహిత్ శర్మను తప్పించి.. 2023లో హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది ముంబై ఇండియన్స్. అయితే, రోహిత్ మాత్రం ఆటగాడిగా అదే జట్టుతో కొనసాగుతుండటం విశేషం.చదవండి: Gautam Gambhir: సతీసమేతంగా టీమిండియాకు ఘన స్వాగతం.. వీడియో వైరల్ -
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం.. టెస్లాకు దక్కని ఊరట!
భారత్-అమెరికా మధ్య ఇటీవల కుదిరిన వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో దేశీయ ఆటోమొబైల్ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. అయితే ఈ ఒప్పందం లగ్జరీ కార్ల ప్రియులకు తీపి కబురు అందించినప్పటికీ, ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం టెస్లాకు మాత్రం నిరాశే ఎదురైంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే హై-ఎండ్ లగ్జరీ కార్లపై భారత్ దిగుమతి సుంకాలను 110 శాతం నుంచి 30 శాతానికి తగ్గించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ఉన్నప్పటికీ ఎలక్ట్రిక్ వాహనాలను ఈ రాయితీ పరిధి నుంచి మినహాయించడం గమనార్హం. దీనివల్ల ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లాకు భారత మార్కెట్లో తక్కువ ధరకు కార్లను విక్రయించే అవకాశం ప్రస్తుతానికి లేకుండా పోయింది.ఒప్పందంలోని ముఖ్యాంశాలు3,000 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న సాంప్రదాయ పెట్రోల్ కార్లపై సుంకాలు 10 ఏళ్ల కాలపరిమితిలో క్రమంగా 30 శాతానికి తగ్గుతాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో పలుమార్లు ప్రస్తావించిన హార్లే డేవిడ్సన్ వంటి ప్రీమియం బైక్లపై దిగుమతి సుంకాలను భారత్ పూర్తిగా తొలగించనుంది. 800-1,600 సీసీ సామర్థ్యం గల బైక్లకు ఈ ప్రయోజనం కలుగుతుంది.భారత ఎగుమతులపై సుంకాలను అమెరికా 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించనుంది. ప్రతిఫలంగా భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గించి, అమెరికా నుంచి దాదాపు 500 బిలియన్ డాలర్ల విలువైన ఇంధనం, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి అంగీకరించింది.మార్చి 2026లో ఇరు దేశాలు అధికారికంగా సంతకాలు చేసిన తర్వాత ఈ కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి.భారత్లో టెస్లా పరిస్థితి ఏమిటి?భారతదేశం తన దేశీయ పరిశ్రమను రక్షించుకోవడానికి ఈవీలను ఈ ఒప్పందం నుంచి దూరంగా ఉంచింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, టెస్లా కోసం ప్రత్యేకంగా తక్కువ సుంకం మార్గాన్ని ప్రవేశపెట్టే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. ప్రస్తుతం భారత్లో టెస్లా విక్రయాలు ఆశించిన స్థాయిలో లేవు. జనవరి 15, 2026 నాటికి నెల మొదటి పదిహేను రోజుల్లో కేవలం 16 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. దీనికి భిన్నంగా, చైనా కంపెనీ బీవైడీ 83 వాహనాలను విక్రయించింది. బీఎండబ్ల్యూ 351 యూనిట్లు, బెంజ్ 70 యూనిట్లను విక్రయించాయి.ప్రభుత్వ పథకం..భారత ప్రభుత్వం స్థానిక తయారీని ప్రోత్సహించేందుకు ఎస్పీఎంఈపీసీఐ (Scheme to Promote Manufacturing of Electric Passenger Cars in India) అనే పథకాన్ని తెచ్చింది. దీని ప్రకారం కనీసం 500 మిలియన్ డాలర్లను స్థానికంగా పెట్టుబడి పెట్టి ప్లాంట్ ఏర్పాటు చేస్తేనే దిగుమతి సుంకాల్లో రాయితీ లభిస్తుంది. అయితే, టెస్లా ఇప్పటివరకు ఈ పథకంలో చేరకపోవడం వల్ల ఆ కంపెనీకి దిగుమతి సుంకాల భారం తప్పడం లేదు. మేక్ ఇన్ ఇండియా నిబంధనలకు కట్టుబడితే తప్పా విదేశాల నుంచి దిగుమతి అయ్యే ఎలక్ట్రిక్ కార్లపై భారీ రాయితీలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని స్పష్టమవుతోంది.ఇదీ చదవండి: రిస్క్ లేకుంటే రాబడి లేదు! -
Income Tax: ఆదాయం కరెక్టుగా రిపోర్ట్ చేయండి
రూల్ 114బీ ప్రకారం ఫారం ‘60’ ఇవ్వాలి. వ్యక్తులు.. అంటే మనం అందరం మనకు పర్మనెంట్ అకౌంట్ నంబరు లేకపోతే, నిర్దేశించిన హై–వేల్యూ ఆర్థిక వ్యవహారాలు జరపాలంటే, ఈ ఫారం 60ని సబ్మిట్ చేసి ఆ వ్యవహారాన్ని అయ్యిందనిపిస్తాం.నిర్దేశిత ఆర్థిక వ్యవహారాలేమిటంటే ▪️ బ్యాంకులో ఖాతా తెరవడం ▪️ డీమ్యాట్ ఖాతా తెరవడం ▪️ బ్యాంకులో రూ. 50,000 దాటి నగదు డిపాజిట్ చేసినప్పుడు ▪️ రూ. 10 లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ స్థిరాస్తి క్రయ, విక్రయాలు ▪️ రెండు చక్రాల బండి తప్ప ఇతర ఏ మోటర్ వాహనం కొన్నా ▪️ రూ. 50,000 దాటి ఫిక్స్డ్ డిపాజిట్లు, బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్ కొన్నా ▪️ విదేశీ మారకం/యాత్ర రూ. 50,000 దాటితే ▪️ జీవిత బీమా ప్రీమియం రూ. 50,000 దాటితేతీసుకోవాల్సిన జాగ్రత్తలు ▪️ పాన్ లేని వారు ఫారం 60 సబ్మిట్ చేసి వ్యవహారం పూర్తి చేయొచ్చు. పాన్ ఉన్నవారు కాదు. ▪️ ఫారం 60లో చాలా అంశాలుంటాయి. మీ వివరాలు సరిగ్గా ఇవ్వాలి. వివరాలకు ఆధారాలుండాలి. వాటితో సరిపోవాలి. అలా ఇవ్వకపోతే వ్యవహారం ఆగిపోవచ్చు. ▪️ అసలు అర్హత ఉందా. అవసరం లేకుండా అబద్ధాలు చెప్పి దాఖలు చేయొద్దు. ▪️ మీ వ్యక్తిగత వివరాలు ఇవ్వాలి. ▪️ మీకు పాన్ ఎందుకు లేదో కారణాలు తెలియజేయాలి ▪️ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలి ▪️ జాయింటు వ్యవహారాలు అయితే, అందరి వివరాలు ఇవ్వాలి ▪️ మైనర్ తరఫున అయితే, తల్లిదండ్రులు, గార్డియన్ ఇవ్వాలితప్పుడు ధ్రువీకరణలు ఇస్తే.. తప్పుడు సమాచారం, తప్పు ధృవీకరణలు ఇచ్చిన పక్షంలో కఠిన కారాగార శిక్షలుంటాయి. తప్పించుకోలేరు. పన్ను ఎగవేత మొత్తం నుంచి రూ. 25,00,000ల వరకు పెనాల్టీ వేస్తారు. కారాగారంతో పాటు ఫైన్ కూడా వేస్తారు. మరో ఫారం 61. ఈ ఫారం అనేది వ్యక్తులకు, కేవలం వ్యవసాయ ఆదాయం ఉండి, ఏ ఇతర ఆదాయం లేని వారు దాఖలు చేయాలి. ఫారం 60 వ్యవసాయేతర ఆదాయం ఉన్నవారికి వర్తిస్తుంది. ఫారం 60, వ్యవహారం జరిపే ముందు ఇవ్వాలి. ఫారం 61 అనేది ప్రతి సంవత్సరంలో రెండుసార్లు, ఆర్నెల్లకోసారి ఇవ్వాలి. రెండు ఫారం విషయాల్లోను తప్పులు దొర్లితే శిక్షకు అర్హులే. కఠిన కారాగార శిక్ష, పెనాల్టీ, ఫైన్ మామూలే. మిస్రిపోర్టింగ్ జరిగితే 50 శాతం నుంచి 200 శాతం వరకు పెనాల్టీ వేస్తారు. ‘‘మన తక్షణ కర్తవ్యం ఏమిటి’’ అనే ప్రశ్నకు జవాబుగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ రవి అగర్వాల్ చాలా స్పష్టంగా ఇచ్చిన జవాబు సారాంశం ఏమిటంటే, ఈ సంవత్సరం పెండింగ్, లిటిగేషన్ తగ్గిస్తారు. అసెస్మెంట్ ప్రొసీడింగ్స్, పెనాల్టీ ప్రొసీడింగ్స్ కలిపి ఒకేసారి పూర్తి చేస్తారు. విడిగా అసెస్మెంట్ని 4–5 సంవత్సరాల సమయం, పెనాల్టీకి 7–8 సంవత్సరాలు పడుతోంది. ఒకేసారి ఆర్డర్ పాస్ చేస్తే సమయం కలిసి వస్తుంది. అసెస్మెంట్ తర్వాత, మీకో అవకాశం ఇస్తారు... రివైజ్ చేసుకునేందుకు. దీన్నే అప్డేట్ చేసుకోవాలి. శాంతిని పొందాలి. అప్పీలుకు వెళ్లడం వల్ల ఖర్చు, కాలయాపన, వడ్డీ, పెనాల్టీలు అవుతాయి. న్యూ రూల్స్ ఇంకా నోటిఫై చేయలేదు. ఫారం 60బీకి సంబంధించి ఉదాహరణగా ఒకప్పుడు బ్యాంకులు కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్/సిస్టమ్స్ లేనప్పుడు పాన్ లేనివారికి ఫారం 60 తీసుకున్నవారు. ఇప్పుడు అన్ని బ్యాంకుల్లో సీబీఎస్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ సందర్భానికి ఫారం 60 విషయంలో తగిన మార్పులు చేయొచ్చు. అలాగే ఆడిట్ రిపోర్టులోని అంశాల్లో రిటర్నులు ముందే నింపేలా చేయొచ్చు.అంటే స్మార్ట్ ఫారంల ద్వారా వారికి కావల్సిన సమాచారాన్ని రాబట్టుకుంటారు. ఫారాలు, రిపోర్టులు ఉన్న సమాచారం, రిటర్నుల్లో ముందే వచ్చేలా ఆలోచిస్తున్నారు. దీన్నే ఆటోమేటిక్ ప్రీ–పాపులేట్ అంటారు. ఈ డేటా వల్ల అర్థవంతమైన (అర్థపరమైన) విశ్లేషణకు దారి సుగమం. ఇదే కొత్త మంత్రం. ఇన్కం కరెక్టుగా రిపోర్ట్ చేయండి. అప్పుడు వారికి చెకింగ్ టైమ్ తగ్గుతుంది. మంచివారిని వదిలేసి ‘దేశముదురు’లను.. అంటే పన్ను ఎగవేసే వారి మీద దృష్టి పెట్టొచ్చు. -
బంగారం, వెండి.. షాకింగ్ షాపింగ్! ఒక్క గ్రాము కొనాలంటే..
బంగారం, వెండి ధరలు మళ్లీ షాకిచ్చాయి. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో మార్పులు వస్తున్నాయి. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:23 సమయానికి నిఫ్టీ(Nifty) 127 పాయింట్లు పెరిగి 25,822 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 419 పుంజుకొని 84,002 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 97.61బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 67.3 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.22 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.97 శాతం పెరిగింది.నాస్డాక్ 2.18 శాతం పుంజుకుంది.Today Nifty position 09-02-2026(time: 9:24 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
రిస్క్ లేకుంటే రాబడి లేదు!
క్యాలెండర్ మారి నెల దాటిపోయింది. ఫిబ్రవరి కూడా గడిచిపోతోంది. ఈక్విటీలు స్థిరంగా లేవు. ఇండెక్స్లు ఆల్టైమ్ గరిష్ఠాలకు దగ్గర్లో కనిపిస్తున్నా.. 80–90 శాతం షేర్లు కనిష్ఠ స్థాయిల్లో ట్రేడవుతున్నాయి. ఇక ఎఫ్డీలను చూస్తే వడ్డీలు తగ్గి రాబడుల్లేవు. సురక్షితమని బంగారం, వెండి వంటి లోహాలవైపు వెళితే... వాటి ఎగుడుదిగుళ్లకి ఊపిరాడని పరిస్థితి. మొత్తంగా ఇప్పటివరకూ 2026 చెబుతున్నదొక్కటే. రిస్క్ తీసుకోకుంటే రాబడుల్లేవు. అలాగని రిస్క్ తీసుకున్నా నిద్ర లేదు. మరేం చేద్దాం? ఇలాంటి పరిస్థితుల్లో సురక్షితమైన దారేది? కనీసం ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులనిచ్చే సాధనాలేంటి? వీటి విశ్లేషణే ఈ వారం ‘వెల్త్ ప్లస్’ స్టోరీ...కొందరిది రిస్క్కు దూరంగా ఉండే ధోరణి. కొందరిదైతే దూకుడుగా రిస్క్ గురించి ఆలోచించకుండా ముందుకెళ్లే ధోరణి. వాస్తవానికి ఇలాంటి ఏకపక్ష విధానాలు ఎప్పుడో తప్ప కలిసిరావు. ఈ సంవత్సరం ఇలాంటి విధానాలు అస్సలు కలిసొచ్చేలా లేవు. కాబట్టి ప్రతి ఒక్క ఇన్వెస్టర్ తమ పెట్టుబడుల సామర్థ్యం, కాల వ్యవధి, రాబడుల ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ సాధనాల మధ్య కేటాయింపులు సమతుల్యం చేసుకోవాలి. ‘బ్యాలన్స్’గా నడుచుకోవడం తప్పనిసరి. ఎందుకంటే గతేడాది కూడా (2025–26లో) సంప్రదాయ ఎఫ్డీలు ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడులను ఇవ్వలేకపోయాయి. ఈక్విటీ మార్కెట్లలో ఆటుపోట్లూ పెరిగాయి. జీడీపీలో ఆర్థిక పొదుపులు 47 ఏళ్ల కనిష్టానికి చేరాయి. జీవన వ్యయాలేమో పెరిగిపోతున్నాయి. మధ్యతరగతి ప్రజలకిది పెద్ద సవాలే. కాబట్టి ఏం చేయాలంటే...వేటి ప్రాధాన్యం వాటిదే..మనం ఆహారంలో భాగంగా బియ్యం/గోధుమలకే పరిమితం కాలేం. కూరగాయలు, పండ్లు, పప్పులు, గుడ్లు, మాంసం ఇలా అన్నింటినీ తీసుకుంటాం. ఎందుకంటే ఒక్కోదానిలో ఉండే పోషకాలు వేరు. సమతుల్య ఆహారం మానసిక, శారీరక ఆరోగ్యాన్నిస్తుంది. పెట్టుబడులకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. తమ నికర ఆర్జన ఎంత? అందులో ఖర్చులు ఎంత? మిగిలేది ఎంత? భవిష్యత్ లక్ష్యాలు ఏవి? వాటికి ఎంత మొత్తం సమకూరాలి? ఇందుకోసం ఎంత రాబడి అవసరం? ఈ అంశాల ఆధారంగా ఎఫ్డీలు/డెట్ ఫండ్స్–ఈక్విటీలు–పసిడి/వెండి ఇలా వివిధ సాధనాలకు కేటాయింపులు చేసుకోవాలి. దీన్నే అసెట్ అలోకేషన్ అని కూడా అంటుంటారు. ఏదో ఒక సాధనం కాకుండా, స్వల్పకాల అవసరాల కోసం డెట్, మధ్య కాల అవసరాలకు డెట్–ఈక్విటీ, దీర్ఘకాల అవసరాలకు ఈక్విటీ, బంగారం సాధనాలకు కేటాయింపులు ప్లాన్ చేసుకోవాలి. దీని వల్ల వైవిధ్యం ఉంటుంది. ఒక విభాగంలో ప్రతికూలతలు ఉన్న సమయంలో మరో విభాగంలోని పెట్టుబడులు మంచి పనితీరుతో ప్రయోజనం పొందొచ్చు. వేటికి ఎంత..? సంపాదనలో 35 శాతం అయినా (మూడింట ఒక వంతు) ఆదా చేయాలి. ఆదా చేసిన మొత్తంలో 30–35 శాతాన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా చిన్న మొత్తాల పొదుపు పథకాలు, లేదా లిక్విడ్, మనీ మార్కెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి.కనీసం 50–60 శాతాన్ని ఈక్విటీల్లో దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేసుకోవాలి. బంగారం, వెండిలో 10–15 శాతం మించకుండా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈక్విటీ, బంగారం, వెండిపై పెట్టుబడులకు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) మంచి సాధనం. రక్షణ–రాబడులుఎఫ్డీలు, డెట్ ఫండ్స్తో సంపద సృష్టి సాధ్యం కాదు. కానీ, పెట్టుబడికి రక్షణ ఉంటుంది. స్వల్పకాలంలో పెట్టుబడి కాపాడుకోవడమే ముఖ్యం.ఈక్విటీలతో సంపద సృష్టి సాధ్యం. అది దీర్ఘకాలంలో, క్రమశిక్షణతో నడుచుకున్నప్పుడే.కమోడిటీలు మిగిలిన పెట్టుబడులకు హెడ్జింగ్గా పనిచేస్తాయి. అదే సమయంలో మెరుగైన రాబడికీ మార్గం చూపుతాయి. ప్రీమియం లోహాలు..బంగారం, వెండి ర్యాలీ ఏ స్థాయిలో ఉంటుందో గత కొన్నేళ్ల అనుభవాలు చూస్తే అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా గడిచిన ఏడాది కాలంలో అయితే పసిడి, వెండి ధరలు రెట్టింపయ్యాయి. దీన్ని చూసి ఇన్వెస్టర్లు పసిడి, వెండిలోనూ పెద్ద ఎత్తున పెట్టుబడులు కుమ్మరిస్తున్నారు. కాకపోతే ఈ ఏడాది ఊగిసలాట మామూలుగా లేదు. తాజాగా వెండి గరిష్ఠానికి చేరటం... భారీగా పతనమవటం అంతా నెలలో జరిగిపోయింది. మిగిలిన పెట్టుబడి సాధనాల నుంచి వైదొలిగి మొత్తం వీటిలోనే కుమ్మరించిన వారి పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది. ‘అతి సర్వత్ర వర్జయేత్’ అన్నది వీటికీ వర్తిస్తుంది. బంగారం, పసిడి ఏటా స్థిరంగా రాబడినిస్తాయన్న భరోసా లేదు. ఇవి ఒక సైకిల్ ప్రకారం చలిస్తుంటాయి. కొన్నేళ్ల పాటు అతి తక్కువ రాబడి, స్థిరీకరణ తర్వాత కొద్ది కాలంలోనే ఎక్కువ ర్యాలీ చేయడం వీటి స్వభావం. కనుక ఏటా స్థిరంగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లడమే మెరుగైన విధానం.స్టాక్స్లో మాదిరి వీటిపై డివిడెండ్, బోనస్లు వంటివేవీ ఉండవు.బంగారం కంటే వెండిలో ఆటుపోట్లు ఎంతో ఎక్కువ. ఆర్థిక వ్యవస్థలు గొప్పగా పనిచేస్తున్న కాలంలో ఇవి దీర్ఘకాలం పాటు ర్యాలీకి దూరంగా ఉంటాయి. ఇన్వెస్టర్ల హెడ్జింగ్ కోసం, సెంట్రల్ బ్యాంకుల మారకం నిల్వల స్థిరత్వానికి పసిడికి డిమాండ్ ఎక్కువ. పారిశ్రామిక వినియోగం, ఇన్వెస్టర్ల పెట్టుబడిగానూ వెండికి డిమాండ్ పెరుగుతోంది.కానీ, ఇప్పటి వరకు చరిత్ర చూస్తే 1950 నుంచి ఇప్పటి వరకు పసిడి, వెండిపై రాబడి 10–11 శాతం (వార్షికంగా) చొప్పున ఉంది.పసిడి, వెండిపై పెట్టుబడులకు చార్జీలు, లిక్విడిటీ పరంగా ఈటీఎఫ్లు లేదా మ్యూచువల్ ఫండ్స్ పథకాలే మెరుగైనవి. ఫిక్స్డ్ డిపాజిట్లు భద్రమే కానీ..ఎఫ్డీలపై 6.5–7 శాతం రాబడి పేపర్పై కనిపించేంత వరకే. మన దగ్గర ద్రవ్యోల్బణం సగటున 5–6 శాతం మధ్య ఉంటోంది. అంటే ఎఫ్డీ ఇచ్చిన రాబడిని ద్రవ్యోల్బణమే తినేస్తున్నట్లు లెక్క. ఇక ఇన్వెస్టర్కు మిగిలేది ఏముంటుంది? కొన్ని సందర్భాల్లో ద్రవ్యోల్బణం 6 శాతాన్ని దాటిపోతోందన్నది కూడా గుర్తు పెట్టుకోవాలి. ఒకవేళ 30 శాతం ఆదాయపన్ను పరిధిలో ఉంటే ఎఫ్డీఐపై వచ్చే 6–7 శాతం రాబడిపై కూడా 30 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుంది. అప్పుడు అసలు రాబడి రాకపోగా... పన్ను అనంతరం స్వల్పంగా నష్టపోవాల్సి వస్తుంది. దీనివల్ల కాలానుగుణంగా ఆ డిపాజిట్కు ఉన్న విలువ తగ్గిపోతుందని గమనించాలి. ఫిక్స్డ్ డిపాజిట్ అన్నది ఎంతో సులభమైన పెట్టుబడి సాధనం. కాల వ్యవధి తీరే నాటికి ఎంత వస్తుందన్నది ముందుగానే తెలిసిపోతుంది. పైగా ఇంటి సమీపంలోని బ్యాంక్లో డిపాజిట్ చేసుకుని, కావాల్సినప్పుడు అదే రోజు వెనక్కి తీసుకోగల సౌలభ్యం ఉంటుంది. ఎఫ్డీలో పెట్టుబడికి భద్రత ఎక్కువ. ఒక డిపాజిటర్కు ఒక బ్యాంక్ పరిధిలో రూ.5 లక్షల వరకు బీమా ఉంటుంది కనుక నిశ్చింత ఎక్కువ. కానీ, భద్రత కోసమని, సౌకర్యం ఉందని చెప్పి నికరంగా రూపాయి కూడా రాబడి లేని (ఎఫ్డీ రేటు నుంచి ద్రవ్యోల్బణం తీసేయగా) సాధనంలో ఉన్నదంతా పెట్టేస్తే ముఖ్యమైన లక్ష్యాలను సాధించడమెలా అన్నది ఆలోచించాలి. పైగా ఆర్బీఐ ఇటీవలి కాలంలో 1.25 శాతం మేర రెపో రేటును తగ్గించేసింది. భవిష్యత్తులోనూ తగ్గించొచ్చు. అలాంటప్పుడు ఎఫ్డీఐలపై రాబడి మరింత తగ్గిపోతుందని అర్థం చేసుకోవాలి. కాలానుగుణంగా మన పెట్టుబడి విలువ కూడా పెరగాలి. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఏటా విద్య, వైద్యం, గృహ అద్దె, నిత్యాసవరాల ధరలు కూడా పెరుగుతుంటాయి. ఈ స్థాయిలో లేదంటే ఇంతకుమించి పెట్టుబడిని వృద్ధి చేసుకోవాల్సిందే. ఇక్కడే ఈక్విటీల పాత్ర కీలకం అవుతుంది. ఈక్విటీలు మెరుగే కానీ..ఈక్విటీలు ఇతర సంప్రదాయ సాధనాలకు మించి రాబడులను ఇస్తాయన్నది చారిత్రక వాస్తవం. కానీ, అది దీర్ఘకాలంలోనే సాధ్యం. పదేళ్లకు మించిన కాలంలో ఈక్విటీ ఫండ్స్లో రాబడి 12– 15 శాతం మధ్య ఉంది. స్మాల్, మిడ్క్యాప్ ఫండ్స్లో అయితే ఈ రాబడి 30 శాతం వరకు ఉంది. స్వల్పకాలానికి ఈక్విటీల పనితీరు ఎలా ఉంటుందో అంచనా వేయలేం. ఆర్థిక వృద్ధి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య అనిశ్చితులు, కరెన్సీ విలువలు, దేశాల రుణ భారాలు, వడ్డీ రేట్లు, వాతావరణ మార్పులు ఇలా ఎన్నో అంశాల ఆధారంగా ఈక్విటీలు కదులుతూ ఉంటాయి. ఇలాంటి ప్రతికూలతలను జీర్ణం చేసుకుంటూ మధ్య కాలం నుంచి దీర్ఘకాలంలో ఈక్విటీలు మెరుగైన పనితీరు చూపిస్తుంటాయి.క్రమశిక్షణ, అనుభవం కలిగిన ఇన్వెస్టర్లు సైతం ఈక్విటీల పతనాలను చూసి ఆందోళన చెందుతుంటారు. ప్రతి ర్యాలీ తర్వాత దిద్దుబాటు కచ్చితంగా ఉంటుందన్నది వాస్తవం.దీంతో ఈక్విటీ పెట్టుబడులపై నిశ్చింత, ప్రశాంతత అన్నది అన్ని సందర్భాల్లో ఉండదు. ముఖ్యంగా మధ్యతరగతి ఇన్వెస్టర్లలో ఎక్కువ మంది తక్షణ రాబడుల కోసం ఫ్యూచర్స్, ఆప్షన్స్ (ఎఫ్అండ్వో), ఇంట్రాడే ట్రేడింగ్ వైపు అడుగులు వేస్తుంటారు. సరైన పరిశోధన, ఆయా సాధనాల పనితీరు, రిస్క్లు ఇవన్నీ తెలుసుకోకపోవడం ఫలితంగా నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఎఫ్డీల మాదిరి (రూ.5లక్షలు) ఈక్విటీ పెట్టుబడులకు ఎలాంటి గ్యారంటీ ఉండదు. స్వల్పకాలంలో పెట్టుబడి విలువ కూడా తగ్గిపోవచ్చన్నది గుర్తు పెట్టుకోవాలి. ఒక్కోసారి మెరుగైన రాబడుల కోసం మార్కెట్ సైకిల్ మారే వరకూ వేచి చూడాల్సి రావచ్చు. ఈక్విటీ ఫండ్స్లో పెట్టుబడులతో కంపెనీలు జారీ చేసే డివిడెండ్ సైతం తిరిగి పెట్టుబడిగా మారుతుంది. దీర్ఘకాలంలో కాంపౌండింగ్తో రాబడి మరింత ఇతోధికం అవుతుంది. లిక్విడిటీ ఎక్కువ. సులభంగా క్రయ, విక్రయాలు చేసుకోవచ్చు. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని అధిగమించేందుకు ఈక్విటీ పెట్టుబడులు బలంగా పనిచేస్తాయి. దీంతో కొనుగోలు శక్తి తగ్గదు.ఇదీ చదవండి: భారత్-యూఎస్ ట్రేడ్ డీల్పై రైతు సంఘాల ఆగ్రహం -
ఆరోగ్య ఖర్చుల కోసం ఎన్పీఎస్ ‘స్వస్థ్య’
రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత కల్పించే నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) ఇప్పుడు ఆరోగ్య అవసరాలు తీర్చేందుకు సిద్ధమైంది. పెరుగుతున్న వైద్య ఖర్చులను దృష్టిలో ఉంచుకుని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) ‘ఎన్పీఎస్ స్వస్థ్య’ అనే కొత్త పెన్షన్ స్కీమ్ను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ఇది పూర్తిస్థాయి ఆరోగ్య బీమాకు ప్రత్యామ్నాయం కానప్పటికీ వైద్య ఖర్చుల కోసం ఒక ప్రత్యేక వాలెట్లా పనిచేస్తుంది.ప్రస్తుతం ఈ పథకాన్ని ‘రెగ్యులేటరీ సాండ్బాక్స్’ విధానంలో పరిశీలిస్తున్నారు. అంటే, ఈ పథకం క్షేత్రస్థాయిలో ఎంతవరకు విజయవంతమవుతుందో టెక్నాలజీ, కస్టమర్ రక్షణ పరంగా ఎదురయ్యే సవాళ్లేమిటో ఈ ట్రయల్ ద్వారా పర్యవేక్షిస్తారు.ఎలా పనిచేస్తుంది?ఎన్పీఎస్ స్వస్థ్య అనేది సాధారణ ఎన్పీఎస్ ఖాతాకు అనుబంధంగా ఉండే ఒక ప్రత్యేక ఖాతా. ఈ ఖాతా తెరవాలంటే సభ్యుడికి కనీసం ఒక సాధారణ ఎన్పీఎస్ ఖాతా ఉండాలి. సభ్యులు తమ ఇష్టానుసారం ఇందులో నగదు జమ చేయవచ్చు. ఈ నిధులను పెన్షన్ ఫండ్ మేనేజర్లు వివిధ పథకాల్లో పెట్టుబడిగా పెడతారు. ఓపీడీ ఖర్చులు, ఆసుపత్రిలో చేరి చికిత్సల కోసం ఈ నిధులను వాడుకోవచ్చు.40 ఏళ్లు దాటిన వారికి..ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన ప్రభుత్వేతర ఉద్యోగులకు ఈ పథకం కీలకమని చెప్పవచ్చు. వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని తమ సాధారణ ఎన్పీఎస్ ఖాతాలోని కార్పస్ నుంచి 30 శాతం వరకు నిధులను ‘స్వస్థ్య’ ఖాతాకు బదిలీ చేసుకునే అవకాశం కల్పించారు. దీనివల్ల అదనపు పొదుపు చేయకపోయినా పాత పొదుపునే ఆరోగ్య అవసరాలకు మళ్లించుకోవచ్చు.ఉపసంహరణ నిబంధనలుమొదటిసారి ఉపసంహరణ చేయాలంటే ఖాతాలో కనీసం రూ.50,000 ఉండాలి. ఉపసంహరణల సంఖ్యపై ఎటువంటి పరిమితి లేదు. ఒకవేళ ఆసుపత్రి బిల్లులు మొత్తం నిధిలో 70 శాతం దాటితే సభ్యుడు పూర్తి మొత్తాన్ని ఒకేసారి విత్డ్రా చేసుకోవచ్చు. ఈ పథకంలో బిల్లుల చెల్లింపు నేరుగా సభ్యుడికి కాకుండా హెల్త్ బెనిఫిట్ అడ్మినిస్ట్రేటర్ (హెచ్బీఏ) లేదా థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ (టీపీఏ) ద్వారా జరుగుతుంది. దీనివల్ల నిధుల దుర్వినియోగం తగ్గుతుంది.సవాళ్లు.. నిపుణుల అభిప్రాయంఈ పథకం క్రమశిక్షణతో కూడిన పొదుపును ప్రోత్సహిస్తున్నప్పటికీ కొన్ని పరిమితులు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎన్పీఎస్లో రూ.50,000 కనీస నిధి ఉండాలనే నిబంధన సామాన్యులకు ఇబ్బందిగా మారవచ్చు. క్లెయిమ్ ప్రాసెసింగ్ ఫీజులు, ఉపసంహరణలపై పన్ను విధింపు విషయంలో ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ఇది మార్కెట్ ఆధారిత పథకం కావడంతో వైద్య ద్రవ్యోల్బణంకు తగ్గట్టుగా రాబడులు వస్తాయా లేదా అన్నది సందేహమే.ఇదీ చదవండి: భారత్-యూఎస్ ట్రేడ్ డీల్పై రైతు సంఘాల ఆగ్రహం -
బ్రేకవుట్కు చాన్సుందా?
సార్వత్రిక బడ్జెట్సహా.. యూఎస్తో ట్రేడ్ డీల్ తదితర అంశాల నేపథ్యంలో గత వారం మార్కెట్లు నికరంగా బలపడ్డాయి. బడ్జెట్లో ఎస్టీటీ పెంపుతో ఆదివారం అమ్మకాలు పోటెత్తగా.. యూఎస్ డీల్ వార్తలతో ఒక్కసారిగా పరుగందుకున్నాయి. వెరసి సాంకేతిక విశ్లేషణల ప్రకారం సమీప భవిష్యత్లో బ్రేకవుట్కు చాన్సున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వివరాలు చూద్దాం..ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్బ్యాంక్ వారాంతాన ప్రస్తుత ఏడాది(2025–26) మూడో త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. ఈ బాటలో మరికొన్ని దిగ్గజాలు సైతం ఈ వారం అక్టోబర్–డిసెంబర్(క్యూ3) పనితీరు వెల్లడించనున్నాయి. దీంతో ఈ వారం ఫలితాల ఆధారంగా ఆయా స్టాక్లపై అమ్మకాల, కొనుగోళ్ల ప్రభావం కనిపించనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. నేడు(9న) ఎస్బీఐ కౌంటర్ యాక్టివ్గా ట్రేడ్కానున్నట్లు పేర్కొన్నారు. ఈ వారం క్యూ3 ఫలితాలు ప్రకటించనున్న జాబితాలో ఆటో దిగ్గజాలు ఎంఅండ్ఎం, అశోక్ లేలాండ్, పీఎస్యూ దిగ్గజం ఓఎన్జీసీ, టైటన్ కంపెనీ, ఐషర్ మోటార్స్, బజాజ్ ఎలక్ట్రికల్స్, అంబర్ ఎంటర్ప్రైజెస్, అరబిందో, బాటా, గ్లాక్సో, ఫైజర్, ఎస్కార్ట్స్, కర్ణాటక బ్యాంక్, మదర్సన్ తదితరాలున్నాయి. ద్రవ్యోల్బణంపై దృష్టి 2026 జనవరి వినియోగ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు గురువారం(12న) విడుదలకానున్నాయి. 2025 డిసెంబర్లో సీపీఐ 1.33 శాతం పెరిగింది. అంతకుముందు నెలలో ఇది 0.71 శాతంకాగా.. గత వారం చేపట్టిన పాలసీ సమీక్షలో ఆర్బీఐ యథాతథ రేట్ల అమలుకే కట్టుబడిన సంగతి తెలిసిందే. దీంతో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు 5.25 శాతంవద్ద కొనసాగుతోంది. ఈ బాటలో 13న గత నెల టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) వివరాలు వెల్లడికానున్నాయి. 2025 డిసెంబర్లో డబ్ల్యూపీఐ 0.32 శాతం నుంచి 0.83 శాతానికి ఎగసింది. ఈ అంశాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ట్రేడ్ డీల్ జోష్ యూఎస్తో మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి మార్గదర్శకాలు(ఫ్రేమ్వర్క్) సిద్ధమైనట్లు వారాంతాన ప్రభుత్వం ప్రకటించడంతో సెంటిమెంటుకు ప్రోత్సాహం లభించనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేసేందుకు భారత్ అంగీకరించడంతో 25 శాతం అదనపు సుంకాలను రద్దు చేస్తున్నట్లు యూఎస్ ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఎగుమతి ఆధారిత రంగాలు, కంపెనీలకు జోష్నివ్వనున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఇప్పటికే యూరోపియన్ దేశాలతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఎగుమతి రంగాలు వెలుగులో నిలిచే వీలున్నట్లు వెల్లడించారు. అయితే విస్తరిస్తున్న ఏఐ టూల్స్ ప్రభావంతో దేశీ ఐటీ రంగంలో అలజడి తలెత్తిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో గత వారం ఐటీ దిగ్గజాల కౌంటర్లు భారీ అమ్మకాలతో డీలాపడ్డాయి. ఈ ప్రభావం ప్రాథమికస్థాయి ఐటీ ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని ఆందోళనలు తలెత్తాయి. యూఎస్ ధరలు.. జనవరి నెలకు బుధవారం(11న), శుక్రవారం(13న) చైనా విభిన్న ద్రవ్యోల్బణ గణాంకాలు, హౌసింగ్ డేటా విడుదల చేయనుంది. ఈ బాటలో 2025 డిసెంబర్ నెలకు యూఎస్ రిటైల్ అమ్మకాలు 10న వెల్లడికానుండగా.. 11న వ్యవసాయేతర ఉపాధి, నిరుద్యోగ గణాంకాలు వెలువడనున్నాయి. 12న జనవరి గృహ విక్రయ వివరాలు తెలియనున్నాయి. జనవరి ద్రవ్యోల్బణ గణాంకాలు 13న విడుదలకానున్నాయి. ఈ అంశాలకు సైతం మార్కెట్లలో ప్రాధాన్యత ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. భారత్తో వాణిజ్య ఒప్పందం కారణంగా తక్కువ సుంకాలతో అమెరికా నుంచి వ్యవసాయోత్పత్తులు, వైన్, లిక్కర్, ప్రాసెస్డ్ పండ్లు తదితరాలు దిగుమతికానున్నాయి.ఆటుపోట్లు తప్పవా?ఇప్పటికే దేశీ స్టాక్ మార్కెట్లు కేంద్ర బడ్జెట్, ఆర్బీఐ పాలసీ నిర్ణయాలపై తగినరీతిలో స్పందించినట్లు నిపుణులు పేర్కొన్నారు. తాజాగా యూఎస్ ట్రేడ్ డీల్ తొలి దశ ఒప్పందం ఖరారుకావడంతో ఈ ప్రభావం మార్కెట్లపై కనిపించనున్నట్లు అభిప్రాయపడ్డారు. అయితే కొనసాగుతున్న రాజకీయ, భౌగోళిక అనిశి్చతులు, కరెన్సీ బలహీనతలు, కమోడిటీలలో అమ్మకాలు తదితర అంశాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. అయితే ఈ నెలలో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు వీడి కొనుగోళ్లకు దిగడం సానుకూల అంశమని ప్రస్తావించారు. దీంతో ఈ వారం సైతం మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కన్సాలిడేట్ కావచ్చని తదుపరి బ్రేకవుట్కు వీలున్నదని అంచనా వేశారు. సాంకేతిక అంశాల ప్రకారం చూస్తే.. → ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలిగా 25,500–25, 450 పాయింట్ల వద్ద మద్దతు లభించవచ్చు. ఇంతకంటే దిగువన 25,100 వద్ద సపోర్ట్కు అవకాశముంది. ఒకవేళ బలపడితే 26,300– 26,400 పాయింట్లకు చేరే వీలుంది. వీటిని అధిగమిస్తే 26,800ను తాకవచ్చు. → బీఎస్ఈ సెన్సెక్స్ నీరసిస్తే తొలుత 82,800–82,300 పాయింట్ల వద్ద మద్దతు కనిపించే వీలుంది. తదుపరి 81,200 వద్ద సపోర్ట్ లభించవచ్చు. ఏస్థాయిల నుంచైనా జోరందుకుంటే 85,800–86,000 పాయింట్లకు చేరే అవకాశముంది.గత వారం అప్ గత వారం(1–6) నికరంగా సెన్సెక్స్ 1,311 పాయింట్లు(1.6 శాతం) జంప్చేసి 83,580 వద్ద ముగిసింది. నిఫ్టీ 373 పాయింట్లు(1.5 శాతం) ఎగసి 25,694 వద్ద స్థిరపడింది. అయితే చిన్న షేర్లలో అమ్మకాలతో బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్స్ 0.1–0.4 శాతం మధ్య నీరసించాయి. బడ్జెట్ రోజును మినహాయించి చూస్తే సెన్సెక్స్ 2,857 పాయింట్లు, నిఫ్టీ 868 పాయింట్లు(3.5 శాతం) చొప్పున జంప్చేశాయి. ఎఫ్పీఐల యూటర్న్ రూ. 8,100 కోట్ల పెట్టుబడులు దేశీ స్టాక్ మార్కెట్లలో 2025 కేలండర్ ఏడాదిసహా జనవరిలోనూ పెట్టుబడులు వెనక్కి తీసుకునేందుకే అధిక ప్రాధాన్యత ఇచ్చిన విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) ఈ నెలలో తాజాగా కొనుగోళ్ల యూటర్న్ తీసుకున్నారు. వెరసి ఈ నెల 6వరకూ రూ. 8,129 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. 2026 జనవరిలో రూ. 35,692 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. 2025లో రూ. 1.66 లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్న విషయం విదితమే. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
వాయిదాల వార్నింగ్!
ఆదాయాలు పెరుగుతున్నాయి. మధ్య తరగతి ఎదిగి... ఎగువ మధ్య తరగతిగా మారుతోంది. కాకపోతే ఈ ఆదాయాలతో పాటు ఆకాంక్షలూ పెరుగుతున్నాయి. ఇది సహజమే. ఇందులో తప్పేమీ లేదు. కాకపోతే చిక్కల్లా... మధ్య తరగతి పొదుపు తగ్గుతుండటమే. ఎందుకంటే దేశంలో పొదుపు మొత్తాల శాతం దశాబ్దాల కనిష్ఠానికి చేరిపోతోంది. ఇది నిశ్శబ్దంగా విస్తరిస్తున్న ప్రమాదకరమైన ధోరణికి సంకేతంగా కనిపిస్తోంది. అదేంటంటే... ఈఎంఐల ఉచ్చు. ఇళ్లు, కార్లు, గ్యాడ్జెట్లు, విహారయాత్రలు, విద్య... ఇలా ప్రతిదీ ఇపుడు ‘సులభతరమైన’ నెలవారీ వాయిదాల్లో దొరికేస్తోంది. దీనికి కంపెనీలు పెడుతున్న ముద్దుపేరు బీఎన్పీఎల్. ఇప్పుడు కొనండి... తరువాత చెల్లించండి. ఈ ఈజీ కొనుగోళ్ల మాయలో పడి ఆర్థిక ప్రణాళికలను, క్రమశిక్షణను అటకెక్కించే పరిస్థితి ఏర్పడుతోంది. దీన్నుంచి బయటపడకపోతే ఉచ్చులో చిక్కుకుని ఊబిలో కూరుకుపోయే ప్రమాదం పొంచి ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడాలంటూ హెచ్చరిస్తున్నదే ఈ ‘వెల్త్ స్టోరీ’.ఈఎంఐల సమస్య ఎకాయెకిన కాకుండా నెమ్మదిగా, ఒక్కొక్కటిగా మొదలవుతోంది. క్రమంగా పెనుభారంగా మారి కుటుంబాలను అస్తవ్యస్తం చేస్తోంది. తామరతంపరగా పెరిగిపోయే ఈఎంఐలు, నెలవారీ ఆదాయంలో సింహభాగాన్ని తినేస్తున్నాయి. అప్పులకు, ఇంటి అవసరాలకు చెల్లించేయగా.. చివరికి పొదుపు చేసేందుకు పైసా మిగ లని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ఎప్పటికప్పుడు పొదుపు వాయిదా పడిపోతుంది. ఇది ఒక స్థాయిని చేరాక పొదుపు సంగతి పక్కనబెడితే ఖర్చులకూ సరిపోని పరిస్థితి. వీటికి తోడు ఊహించని విధంగా ఏ చిన్న కుదుపు వచ్చినా (ఉద్యోగం పోవడం, వైద్యం ఖర్చుల్లాంటివి) అప్పుల కోసం హైరానా పడిపోయే పరిస్థితి. ప్రస్తుతం చాలా కుటుంబాల పరిస్థితి ఇలాగే ఉంటోంది. గృహ రుణం ఈఎంఐ, కారు రుణం ఈఎంఐ, వ్యక్తి గత రుణం లేదా క్రెడిట్ కార్డ్ ఈఎంఐ, విద్యారుణం ఈఎంఐ ఇలా ప్రతి దానికి ఈఎంఐలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి.లెక్కేసుకుంటే.. .సాధారణంగా ఈఎంఐల గురించి ఫైనాన్షియల్ ప్లానర్లు చెప్పే సూత్రం ఒకటి ఉంది. నెలవారీ ఆదాయంలో ఈఎంఐల భారం 30–35 శాతానికి మించకూడదు. కానీ వాస్తవంగా పట్టణ ప్రాంతాల్లోని చాలా కుటుంబాల్లో వాయిదాల భారం 50–60 శాతం పైగా ఉంటోంది. ఇక క్రెడిట్ కార్డ్ రోలోవర్స్ గురించి చెప్పనక్కర్లేదు. ప్రతి నెలా అలా పెరుగుతూనే ఉంటోంది. డిఫాల్ట్ ముప్పును అటుంచితే కనీసం ఊపిరి కూడా తీసుకోలేని ఆందోళనకర పరిస్థితి నెలకొంటోంది.ఈ సమస్య ఎందుకింత వేగంగా పెరుగుతోంది.. అప్పులు, ఈఎంఐల సమస్య వేగంగా పెరుగుతుండటానికి చాలా కారణాలు ఉంటున్నాయి. వీటిలో కొన్ని... రుణాలు సులువుగా దొరకడం ఇప్పుడు రుణం తీసుకోవడమనేది గతంలోలాగా సుదీర్ఘ ప్రక్రియగా ఉండటం లేదు. క్షణాల్లో లోన్స్ కి అప్రూవల్ లభిస్తోంది. నిమిషాల్లో క్రెడిట్ అయి పోతోంది. జీవన విధానంపరమైన ద్రవ్యోల్బణం జీతం పెరిగిందంటే చాలు లైఫ్ స్టయిల్ని కూడా మార్చేసే ధోరణి ఉంటోంది. దానికి తగ్గట్లుగా లోన్ తీసుకోవడం, ఇంకో కొత్త ఈఎంఐని జోడించుకోవడం చక చకా జరిగిపోతోంది. ‘‘నో–కాస్ట్ ఈఎంఐ’’ భ్రమ అసలు వడ్డీ ప్రసక్తే ఉండదు.. తీసుకున్నంతే కట్టొచ్చు అని ఆర్థిక సంస్థలు ఊరిస్తుంటాయి. కానీ మన లెక్కకు అందని, మనకు తెలియని వడ్డీ ఎంతో కొంత ఉంటుందనేది అర్థం చేసుకోవాలి. సామాజిక ఒత్తిళ్లు వచ్చినదానితో ఇంట్లో ఎంతగా సర్దుకుని ఉందామనుకున్నా హంగులు, ఆర్భాటాలు లేకపోతే ఉపయోగం లేదు అనే రకంగా సామాజిక ఒత్తిడి ఉంటోంది. ఖరీదైన ఇళ్లు, కార్లు, గ్యాడ్జెట్స్ లాంటివి విజయానికి గుర్తుల్లాగా ఉంటున్నాయి. చెల్లించుకోక తప్పదు మూల్యం.. ఈఎంఐలు అడ్డదిడ్డంగా పెరిగిపోవడం వల్ల చాలా దుష్పరిణామాలు కూడా ఎదురవుతాయి. ఎమర్జెన్సీ నిధి అనేది ఎప్పటికీ ఏర్పాటు చేసుకోలేం. పిల్లల చదువులకు సంబంధించిన ప్రణాళికలు దెబ్బతింటాయి. రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక అవసరాల కోసం పొదుపు చేద్దామనుకున్నా నిరవధికంగా వాయిదా పడుతూనే ఉంటుంది. వీటన్నింటి వల్ల శాశ్వత ప్రాతిపదికన ఒకే ఒక్కటి లభిస్తుంది. అదేంటంటే మానసిక ఒత్తిడి. చాలా కుటుంబాలు ఆర్థికంగా స్థిరంగానే ఉన్నట్లు కనిపిస్తుంటాయి. కానీ ట్రబుల్ అనేది ఆసుపత్రి వ్యయాల రూపంలో కూతవేటు దూరంలోనే ఉంటుంది.మూడు ప్రశ్నలు.. ఏ రుణం తీసుకోవాలన్నా ముందుగా మీకు మీరు ఓ మూడు ప్రశ్నలు వేసుకోండి. అవేంటంటే.. → ఈ ఈఎంఐ తీసుకున్న తర్వాత కూడా పొదుపును యథాప్రకారం కొనసాగించగలనా? → ఒక 3 నెలల పాటు ఆదాయం రాకపోయినా కూడా ఈఎంఐలను కట్టగలనా? → ఈఎంఐపై కొనుక్కుంటున్నదేదైనా సరే నా భవిష్యత్తును మెరుగుపర్చుకోవడానికి ఉపయోగపడుతుందా, లేక కేవలం లైఫ్స్టయిల్కే పనికొచ్చేదా? వీటిల్లో దేనికైనా సరే జవాబు ‘‘నో’’ అని వస్తే.. కాస్త ఆలోచించండి. చివరిగా చెప్పేదేమిటంటే.. రుణాలు, ఈఎంఐలనేవి చెడ్డవి కావు. కాకపోతే ఈఎంఐలు మరీ ఎక్కువైపోతే ఆర్థిక స్వాతంత్య్రాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా అనిశ్చితి నెలకొన్న తరుణంలో షో కోసం అప్పు మీద కొని పెట్టుకునేవాటికంటే పొదుపు చేయడం, చేతిలో డబ్బు ఆడటమే చాలా ముఖ్యమని గుర్తెరగాలి.బయటపడేదిలా.. పీకల్లోతు ఈఎంఐల ఊబిలో కూరుకుపోతున్న పరిస్థితి నెలకొన్నప్పటికీ కాస్తంత సరిగ్గా ప్లాన్ చేసుకుంటే దాన్నుంచి తప్పించుకోవడం కష్టమేమీ కాదు. అదెలాగో చూద్దాం.. 1. ఈఎంఐలకు ఒక పరిమితి విధించుకోవాలి → మొత్తం ఈఎంఐల భారం నెలకు నికరంగా వచ్చే ఆదాయంలో మూడో వంతు స్థాయికి మించకుండా చూసుకోవాలి. → ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడకూడదని డిసైడ్ కావాలి. 2. ముందుగా ఎమర్జెన్సీ ఫండ్ని ఏర్పాటు చేసుకోండి. → ఎటు పోయి ఎటొచ్చినా కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడేంత నిధిని పక్కన పెట్టుకోవాలి. → ఆ తరువాతే కొత్త లోన్స్ గురించి ఆలోచించాలి. 3. అధిక వడ్డీ రుణాల నుంచి బైటపడాలి → ముందుగా వడ్డీ భారం ఎక్కువగా ఉండే క్రెడిట్ కార్డులపై రుణాలు, వ్యక్తిగత రుణాలను తీర్చేసుకోవడంపై దృష్టి పెట్టాలి. → కాస్త కాస్త చొప్పున ప్రీపేమెంట్ చేసినా, భారీగా వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు. 4. ‘‘అవసరం’’, ‘‘అప్గ్రేడ్’’కి మధ్య వ్యత్యాసం.. → సాధారణంగా మనకి అవసరమైనవి కొన్ని ఉంటాయి. స్థాయిని చూపించుకునేందుకు తీసుకునేవి కొన్ని ఉంటాయి. ఈ రెండింటి మధ్య తేడాను అర్థం చేసుకుంటే చాలు. ఉదాహరణకు సొంత ఇల్లు అనేది ఒక అవసరం. కానీ ఖరీదైన కార్లు, కొత్త గ్యాడ్జెట్స్కు మారుతుండటమనేది అప్గ్రేడ్ కావాలనే తాపత్రయానికి నిదర్శనం. -
రికార్డు దిశగా ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభాలు
భారత ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) అద్భుతమైన ఆర్థిక ప్రగతితో పటిష్టంగా ఉన్నాయని ఆర్థిక సేవల కార్యదర్శి ఎం.నాగరాజు ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ బ్యాంకుల ఉమ్మడి లాభం రూ.2 లక్షల కోట్ల మార్కును దాటుతుందని ఆయన అంచనా వేశారు.ఆర్థిక బలం - వృద్ధి గణాంకాలుతాజాగా ఓ సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన బ్యాంకింగ్ రంగ వృద్ధిని విశ్లేషించారు. ‘ఈ ఏడాది ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణ వృద్ధి 12 శాతంగా నమోదైంది. డిపాజిట్ల వృద్ధి కూడా 10 శాతం వద్ద ఆశాజనకంగా ఉంది. 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.1.05 లక్షల కోట్లు ఉన్న లాభం, 2023-24లో రూ.1.41 లక్షల కోట్లకు, 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.78 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలోనే దాదాపు రూ. 1 లక్షల కోట్లు లాభాన్ని బ్యాంకులు ఆర్జించాయి’ అన్నారు.‘ఆర్బీఐ పటిష్టమైన పర్యవేక్షణలో మన బ్యాంకింగ్ వ్యవస్థ చాలా సురక్షితంగా ఉంది. అంతర్జాతీయ అంశాలు మన బ్యాంకులపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆందోళన చెందడం లేదు’ అని నాగరాజు పేర్కొన్నారు.ఇదీ చదవండి: భారత్-యూఎస్ ట్రేడ్ డీల్పై రైతు సంఘాల ఆగ్రహం -
కారు మైలేజ్ కోసం.. ముఖ్యం ఈ వేగం!
పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న సమయంలో.. చాలామంది కార్ల కొనుగోలుదారులు ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లను కొనుగోలు చేస్తుంటారు. ఎంత మైలేజ్ ఇచ్చే కారును కొనుగోలు చేసినప్పటికీ.. కొన్ని రోజుల తరువాత తగ్గిపోతుంటుంది. మైలేజ్ తగ్గడానికి కారణాలు చాలానే ఉన్నపటికీ.. ఒక నిర్దిష్టమైన వేగం, డ్రైవింగ్ విధానం ఫాలో అయితే బెస్ట్ మైలేజ్ లభిస్తుంది.సాధారణంగా కార్లు ఎక్కువ మైలేజ్ ఇవ్వాలంటే స్థిరమైన వేగంలో డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కారును 50 నుంచి 80 కిమీ వేగంతో నడిపితే ఇంధనం కొంత పొదుపు అవుతుంది, తద్వారా కొంత ఎక్కువ మైలేజ్ లభిస్తుంది. ఈ స్పీడ్ ఇంజిన్ మీద ఎక్కువ ప్రభావం చూపించదు. కాబట్టి ఇంధన వృథా తగ్గుతుంది.కారును 100 కిమీ వేగంతో డ్రైవ్ చేస్తే.. ఎయిర్ డ్రాగ్ ఎక్కువ అవుతుంది. దీంతో ఇంజిన్ ఎక్కువ శక్తిని వినియోగించాల్సి ఉంటుంది. కాబట్టి ఇంధనం ఎక్కువ ఖర్చు అవుతుంది. తద్వారా.. మైలేజ్ కొంత ఎక్కువ లభిస్తుంది. అయితే చాలా నెమ్మదిగా లేదా తక్కువ గేర్లో కారును నడపడం కూడా మంచిది కాదు. అలా చేస్తే ఇంజిన్పై అదనపు ఒత్తిడి పడుతుంది.స్థిరమైన వేగం మైలేజ్కు చాలా ముఖ్యం. తరచూ స్పీడ్ పెంచడం, తగ్గించడం వంటివి ఇంధన వినియోగాన్ని పెంచుతాయి. కాబట్టి ఒకే స్పీడ్ను కొనసాగిస్తూ డ్రైవ్ చేయడం మంచిది. ముఖ్యంగా హైవే ప్రయాణాల్లో 60-70 కిలోమీటర్ల వేగం చాలా కార్లకు ఉత్తమ మైలేజ్ ఇస్తుంది.ఎక్కువ మైలేజ్ కోసం కేవలం వేగాన్ని మాత్రమే కాకుండా.. టైర్లలో కూడా ఉండాల్సిన మోతాదులో గాలి ఉండేలా చూసుకోవాలి. కారును ఎప్పటికప్పుడు సర్వీస్ చేసుకోవాలి. వీలైనంత వరకు ఎక్కువ బరువు వేయకపోవడం ఉత్తమం. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎక్కువసేపు ఇంజిన్ ఆన్లో ఉంచకూడదు. -
నెలకు రూ. 5వేలుతో.. రూ. 8లక్షలు చేతికి!
ఎంత డబ్బు సంపాదించే వారికైనా పొదుపు చేయడం తప్పనిసరి. ఆర్ధిక క్రమశిక్షణ లేకుండా.. దుబారా ఖర్చు చేస్తే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం పెట్టుబడికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇందులో కొంత రిస్క్ కూడా ఉంటుంది. అయితే రిస్క్ లేకుండా.. ప్రభుత్వ హామీతో సురక్షితమైన లాభం ఆశించేవారికి పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ ఓ మంచి ఎంపిక అవుతుంది.నెలకు రూ.5000 చొప్పున పోస్టాఫీస్ రికరింగ్ ఖాతాలో జమ చేస్తూ.. ఐదేళ్లు ఇన్వెస్ట్ చేయలి. ఇలా చేసుకుంటూ పోతే.. మీ పెట్టుబడి రూ.3 లక్షలు అవుతుంది. ప్రభుత్వం దీనికి 6.7 శాతం వార్షిక వడ్డీ ఇస్తుంది. ఐదేళ్ల కాలం మీరు చేసిన డబ్బుకు మొత్తం రూ. 3,56,830 లభిస్తుంది.దీనిని మీరు పదేళ్లు పొడిగించుకుంటే.. మొత్తం పెట్టుబడి రూ. 6,00,000 (5000 x 120 నెలలు). దీనికి 6.7 శాతం వడ్డీ అనుకుంటే రూ. 2,54,272 వస్తుంది. వడ్డీ, అసలు కలిపితే మొత్తం రూ. 8,54,272 అవుతుంది.నిజానికి ఒక సాధారణ వ్యక్తికి లేదా ఒకేసారి పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టలేని వారికి ఈ పోస్టాఫీస్ రికరింగ్ స్కీమ్ బెస్ట్ అనే చెప్పాలి. పిల్లల చదువుకు, పెళ్లి వంటి అవసరాలకు ఇది కొంత ఉపయోగకరంగా ఉంటుంది.ఇదీ చదవండి: 2026లో బంగారం, వెండి భవిష్యత్తు ఇదే!: బాబా వంగా -
‘అమెరికాకు భారత్ తలొగ్గలేదు’
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై వస్తున్న విమర్శలను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తీవ్రంగా ఖండించారు. 18 శాతం సుంకానికి అంగీకరించడం ద్వారా భారత్ అమెరికాకు తలొగ్గిందన్న వాదనల్లో నిజం లేదని స్పష్టం చేశారు. చైనా ఎగుమతులు 35 శాతం సుంకాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో భారత ఎగుమతులకు లభించే 18 శాతం సుంకం దేశానికి పెద్ద ఊరటనిస్తుందని విశ్లేషించారు. ఇటీవల కుదిరిన ఈ ఒప్పందం అనంతరం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గోయల్ కొన్ని అంశాలను వెల్లడించారు.బలమైన ఆర్థిక శక్తిగా భారత్ప్రస్తుతం భారత్ నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎంతో ఆత్మవిశ్వాసంతో చర్చల్లో పాల్గొంటోందని గోయల్ అన్నారు. ‘2047 నాటికి భారత్ 30-35 ట్రిలియన్ డాలర్ల అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది. భవిష్యత్తులో మనం అందించే భారీ మార్కెట్ అంతర్జాతీయ వాణిజ్య చర్చల్లో దేశానికి అతిపెద్ద బలం’ అని ఆయన అభివర్ణించారు.అమెరికా నుంచి కొనుగోళ్లువచ్చే ఐదేళ్లలో అమెరికా నుంచి 500 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను కొనుగోలు చేయడంపై భారత్ సంసిద్ధత వ్యక్తం చేసింది. దీనిపై మంత్రి స్పందిస్తూ.. ‘భారతదేశం పెరుగుతున్న అవసరాల దృష్ట్యా ఈ లక్ష్యం చాలా తక్కువ. మొత్తం రెండు ట్రిలియన్ డాలర్ల దిగుమతి డిమాండ్లో అమెరికా వాటా కొంత భాగమే. ప్రస్తుతం ఇతర దేశాల నుంచి కొంటున్న 300 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను, పోటీతత్వాన్ని బట్టి అమెరికా సరఫరాదారుల నుంచి తీసుకునే అవకాశం ఉంది. విమానయాన రంగం, ఇంధనం, సాంకేతిక ఉత్పత్తులు, కోకింగ్ కోల్ వంటి వాటికి భారత్ ప్రాధాన్యత ఇస్తుంది’ అన్నారు.వ్యూహాత్మక చర్చలువాణిజ్య చర్చలంటే కేవలం అంకెలు కాదని, అవి దేశ ప్రజల భవిష్యత్తును ప్రభావితం చేస్తాయని గోయల్ పేర్కొన్నారు. ‘మేము వివిధ దేశాలతో ఇప్పటివరకు కుదుర్చుకున్న తొమ్మిది ఒప్పందాల్లో ఎక్కడా జాతీయ ప్రయోజనాల విషయంలో రాజీ పడలేదు. చర్చల్లో ప్రశాంతత ఎంత ముఖ్యమో, అవసరమైనప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరించడం కూడా అంతే ముఖ్యం’ అని ఆయన వెల్లడించారు.భారత్-ఈయూ ఒప్పందంపై మాట్లాడుతూ, ప్రధాని మోదీకి ప్రపంచ దేశాధినేతలతో ఉన్న సాన్నిహిత్యం వల్ల కూటమిలోని 27 దేశాల నుంచి సానుకూల స్పందన లభిస్తోందని ఆయన తెలిపారు. ప్రధాని మార్గదర్శకత్వంలో హోం మంత్రి అమిత్ షా, కేబినెట్ సహకారంతో గ్లోబల్ ట్రేడ్ మార్కెట్లో భారత్ కీలకంగా మారుతుందని గోయల్ అన్నారు.ఇదీ చదవండి: భారత్-యూఎస్ ట్రేడ్ డీల్పై రైతు సంఘాల ఆగ్రహం -
మొన్న హ్యుందాయ్.. నేడు టాటా: పెరగనున్న కార్ల ధరలు
మారుతి సుజుకి, టయోటా కంపెనీలు తమ కార్ల ధరలు పెంచిన తరువాత.. దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ కూడా తన కార్ల రేట్లను పెంచనున్నట్లు ప్రకటించింది. పెరుగుతున్న వస్తువుల ధరలు, ఖర్చులు కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. అయితే కొత్త ధరలు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు.కంపెనీ దాదాపు ఒక సంవత్సరం నుంచి అధిక ఇన్పుట్ ఖర్చులను ఎదుర్కొంటోంది. ఈ ప్రభావం ఇప్పుడు ధర సవరణకు కారణమైందని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ (TMPVL) యోచిస్తోందని దాని మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ శైలేష్ చంద్ర పేర్కొన్నారు.టాటా మోటార్స్ ఏ కారు ధరలను ఎంత శాతం పెంచనుంది అనే విషయాలను అధికారికంగా వెల్లడించలేదు. కొత్త ధరలను బహుశా త్వరలోనే వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. ధరల పెరుగుదల అమ్మకాలపై ప్రభావం చూపుతుందా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. కాగా హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇప్పటికే తమ కార్ల ధరలను జనవరిలో పెంచింది. -
జియో రూ.198 రీఛార్జ్ ప్లాన్: రోజుకు 2 జీబీ డేటా..
భారతదేశపు అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన రిలయన్స్ జియో.. తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త 5జీ రీఛార్జ్ ప్లాన్లను పరిచయం చేస్తూనే ఉంది. ఇందులో సరసమైన రీఛార్జ్ ప్లాన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.రూ.198 రీఛార్జ్ ప్లాన్ఇది రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం అందిస్తున్న సరసమైన రీఛార్జ్ ప్లాన్. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. రోజుకు 2జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు, అపరిమిత వాయిస్ కాలింగ్ వంటివి పొందవచ్చు. అయితే దీని వ్యాలిడిటీ కేవలం 14 రోజులు మాత్రమే.రూ.349 రీఛార్జ్ ప్లాన్ఈ ప్లాన్ ద్వారా రోజుకు 2 జీబీ హైస్పీడ్ డేటా పొందవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. దీని వ్యాలిడిటీ 28 రోజులు. జియో హాట్స్టార్, జియోసావన్ ప్రో సబ్స్క్రిప్షన్లతో పాటు.. మూడు నెలలు జొమాటో గోల్డ్ కూడా పొందవచ్చు. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి వాటికి యాక్సెస్ కూడా పొందవచ్చు.ఇదీ చదవండి: కొత్త రీఛార్జ్ ప్లాన్.. ఫిబ్రవరి 24 వరకే! -
భారత్-యూఎస్ ట్రేడ్ డీల్పై రైతు సంఘాల ఆగ్రహం
భారత్-యూఎస్ మధ్య ప్రతిపాదిత మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై దేశంలోని కొన్ని రైతు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం), దాని రాజకీయేతర విభాగం, ఆల్ ఇండియా కిసాన్ సభ (ఏఐకేఎస్) సహా పలు సంఘాలు ఈ ఒప్పందాన్ని భారత వ్యవసాయ రంగాన్ని అమెరికన్ బహుళజాతి సంస్థలకు అప్పగించే చర్యగా అభివర్ణించాయి. దీనికి నిరసనగా వచ్చే వారం దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు ప్రకటించాయి.ప్రధానాంశాలు.. ఆరోపణలుఇటీవల విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో రైతు నేతలు కేంద్ర ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ ఒప్పందంలోని నిబంధనలు భారతీయ రైతులకు గొడ్డలిపెట్టుగా మారతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకటనలోని అంశాలు కింది విధంగా ఉన్నాయి.మధ్యంతర ఒప్పందం ప్రకారం, అమెరికా నుంచి దిగుమతి అయ్యే అన్ని పారిశ్రామిక వస్తువులు, ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ సుంకాలను తొలగించడం లేదా భారీగా తగ్గించాల్సి ఉంటుంది.భారత్ నుంచి అమెరికాకు వెళ్లే వస్త్రాలు, తోలు, ప్లాస్టిక్, యంత్రాలు వంటి వస్తువులపై అమెరికా 18 శాతం పరస్పర సుంకాన్ని వర్తింపజేయనుంది. ఇది భారతీయ ఎగుమతిదారులపై భారం మోపుతుంది.కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ దేశ ప్రయోజనాలను పణంగా పెట్టారని ఆరోపిస్తూ.. ఆయన తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఎస్కేఎం డిమాండ్ చేసింది.ఫిబ్రవరి 12న నిరసనరైతు సంఘాల పిలుపు మేరకు ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు జరగనున్నాయని ప్రకటనలో తెలిపారు. అదే రోజు కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన సాధారణ సమ్మెకు ఎస్కేఎం పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు.వ్యవసాయంపై ప్రభావంఏఐకేఎస్ నేత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘అమెరికా నుంచి సోయాబీన్ నూనె, ఎర్ర జొన్న, పశువుల దాణా వంటివి భారత్లోకి వెల్లువలా వస్తాయి. దీనివల్ల స్థానిక మార్కెట్ దెబ్బతింటుంది. ఇప్పటికే అప్పుల ఊబిలో ఉన్న రైతులు ఈ ఒప్పందం వల్ల మరింత సంక్షోభంలోకి వెళ్తారు’ అని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రభుత్వ వాదనమరోవైపు వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. పాల ఉత్పత్తులు, పౌల్ట్రీ, మాంసం, ధాన్యాలు, పండ్లు (నారింజ, స్ట్రాబెర్రీ వంటివి) వంటి సున్నితమైన రంగాల్లో భారత్ ఎలాంటి రాయితీలు ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలే పరమావధిగా చర్చలు సాగుతున్నాయని, ఎక్కడా లొంగిపోయే ప్రసక్తే లేదని ఆయన ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: ఆండ్రాయిడ్ యూజర్లకు హెచ్చరిక -
ఏఐ రేసులో భారత్.. మూడేళ్లలో రూ.6 లక్షల కోట్లు!
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో ప్రపంచ దేశాల మధ్య పోటీ వేగంగా పెరుగుతున్న వేళ.. పెట్టుబడుల పరంగా భారత్ కూడా ఈ రేసులో ముందంజలోనే ఉందని వరల్డ్ ఎకనమిక్ ఫోరం వెల్లడించింది. 2010 నుంచి 2024 వరకు ఏఐలో అత్యధిక పెట్టుబడులు (జీడీపీలో శాతంగా లెక్కించినప్పుడు) పెట్టిన 11 దేశాల జాబితాలో భారత్కు 8వ స్థానం దక్కింది. మరోపక్క.. ఏఐ మనదేశ ఆర్థిక వ్యవస్థకు భారీ ఊతమివ్వనుందని పీడబ్ల్యూసీ ఇండియా తెలిపింది. 2035 నాటికి ఏఐ వల్ల దేశ జీడీపీలోకి సుమారు రూ.50 లక్షల కోట్లు అదనంగా చేరే అవకాశం ఉందని అంచనా వేసింది.ఇటీవల దావోస్లో.. ప్రముఖ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ బెయిన్ అండ్ కంపెనీతో కలిసి వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఓ శ్వేత పత్రం విడుదల చేసింది. దాని ప్రకారం.. 2010 నుంచి 2024 వరకు ఏఐలో పెట్టుబడుల పరంగా అమెరికా, సింగపూర్, దక్షిణ కొరియా, చైనా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఇదే సమయంలో.. భారత్లో ఏఐ పెట్టుబడులు జీడీపీలో 1.2 నుంచి 1.8 శాతం వరకు ఉన్నాయి. అమెరికాలో ఇది రికార్డు స్థాయిలో 3.4 నుంచి 5.1 శాతం, సింగపూర్లో 3.1 నుంచి 4.6 శాతం వరకు ఉంది.అమెరికా, చైనా దూకుడు2010–2024 మధ్య కాలంలో ఏఐ రంగంలో పెట్టుబడులు ఏడాదికి సగటున 33 శాతం చొప్పున పెరిగాయని శ్వేతపత్రం తెలిపింది. ఏఐ రంగం అత్యంత ఖరీదైనదనీ, భారీగా పెట్టుబడులు అవసరమైనప్పటికీ తక్షణ లాభాలపై స్పష్టత లేదని పేర్కొనడం విశేషం. కానీ, అమెరికా, చైనా ఈ రంగంలో భారీ పందాలు కాస్తున్నాయి. 2010 నుంచి ఇప్పటివరకు పెట్టిన మొత్తం ఏఐ పెట్టుబడుల్లో 65 శాతం ఈ రెండు దేశాలదే కావడమే అందుకు నిదర్శనం.మూడేళ్లలో రూ. 6 లక్షల కోట్లుభారత్లో వచ్చే మూడేళ్లలో రూ.6.14 లక్షల కోట్లకుపైగా ఏఐ పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చనున్నాయని వరల్డ్ ఎకనమిక్ ఫోరం అంచనా వేసింది. అలాగే ఏఐకి అవసరమైన అధునాతన చిప్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, హార్డ్వేర్ రంగంలో పెట్టుబడులు ఏటా 15 నుంచి 25 శాతం వరకు పెరిగే అవకాశముందని తెలిపింది.ఆర్థిక వ్యవస్థకూ ఊతంభారత్ ఆర్థిక వ్యవస్థకు ఏఐ భారీ ఊతమివ్వనుందని పీడబ్ల్యూసీ ఇండియా అంచనా వేసింది. 2035 నాటికి ఏఐ వల్ల దేశ జీడీపీలోకి రూ.50 లక్షల కోట్లకుపైగా అదనంగా వచ్చి చేరే అవకాశం ఉందని వెల్లడించింది. వ్యవసాయం, విద్య, ఇంధనం, ఆరోగ్యం, తయారీ రంగాల్లో ఏఐ వినియోగం వేగంగా పెరిగితే ఈ వృద్ధి సాధ్యమవుతుందని పేర్కొంది. 2050 నాటికి 160 కోట్ల జనాభాకు ఆహారం అందించాలంటే వ్యవసాయ ఉత్పత్తిని 70 శాతం వరకు పెంచాల్సి ఉంటుందని, దీనికి డిజిటల్ సాంకేతికతలు, ముఖ్యంగా ఏఐ అవసరమని పేర్కొంది. అలాగే విద్య, వైద్య రంగాల్లోనూ ఏఐ కీలకపాత్ర పోషించనుందని వివరించింది. -
ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయాలా?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సామాన్య పెట్టుబడిదారులను దృష్టిలో ఉంచుకుని ప్రవేశపెట్టిన ‘ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్’ మొబైల్ యాప్ భారతీయ ఆర్థిక రంగంలో విప్లవాత్మక మార్పుగా చెప్పవచ్చు. గతంలో కేవలం బ్యాంకులు, పెద్ద సంస్థలకే పరిమితమైన ప్రభుత్వ సెక్యూరిటీల మార్కెట్ను సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకురావడం ఈ యాప్ ప్రధాన ఉద్దేశం. దీన్ని ప్రారంభించి చాలా రోజులైనా దీని గురించి చాలా మందికి సరైన అవగాహన లేదు. దీర్ఘకాలంలో కచ్చితమైన రాబడులను ఇస్తూ ప్రభుత్వ ఆధ్వర్యంలోని బాండ్లను కొనుగోలు చేసేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది.ఈ యాప్ ద్వారా పెట్టుబడిదారులు కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలు, రాష్ట్ర ప్రభుత్వ బాండ్లు (ఎస్డీఎల్), ట్రెజరీ బిల్లులు (T-Bills), సావరిన్ గోల్డ్ బాండ్ల (SGB)లో నేరుగా పెట్టుబడి పెట్టవచ్చు. దీని కోసం ఆర్బీఐ వద్ద ‘రిటైల్ డైరెక్ట్ గిల్ట్’ ఖాతాను తెరవాల్సి ఉంటుంది.లాభాలుఇవి ప్రభుత్వ బాండ్లు కాబట్టి మీ పెట్టుబడికి ప్రభుత్వం గ్యారెంటీ ఉంటుంది. అంటే అసలు, వడ్డీ తిరిగి వస్తుందనే నమ్మకం ఉంటుంది.ఈ ఖాతా తెరవడానికి, దాన్ని నిర్వహించడానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. బ్రోకరేజ్ ఛార్జీలు కూడా ఉండవు.మధ్యవర్తులు లేకుండా నేరుగా ఆర్బీఐ నిర్వహించే ప్రైమరీ మార్కెట్ వేలంలో సామాన్యులు కూడా బిడ్లు దాఖలు చేయవచ్చు.ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే కొన్నిసార్లు మెరుగైన వడ్డీ రేట్లను పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఇది సాధ్యమవుతుంది.సావరిన్ గోల్డ్ బాండ్ల ద్వారా ఫిజికల్ గోల్డ్ కంటే తక్కువ ధరకు, అదనపు వడ్డీతో బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చు. (ఇటీవల కాలంలో బంగారం భారీగా పెరగడంతో ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్లను నిలిపేసిందని గమనించాలి)పరిమితులుషేర్ మార్కెట్తో పోలిస్తే ప్రభుత్వ బాండ్లలో సెకండరీ మార్కెట్ లావాదేవీలు తక్కువగా ఉంటాయి. అంటే అత్యవసరంగా అమ్మాలనుకున్నప్పుడు కొనుగోలుదారులు త్వరగా దొరక్కపోవచ్చు.మార్కెట్లో వడ్డీ రేట్లు పెరిగితే, మీరు గతంలో తక్కువ వడ్డీకి కొన్న బాండ్ల విలువ తగ్గుతుంది. దీన్ని మార్కెట్ రిస్క్ అంటారు.బాండ్ల ద్వారా వచ్చే వడ్డీపై మీ ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఎఫ్డీల మాదిరిగానే దీనికి పన్ను మినహాయింపులు తక్కువ.యాప్ను వాడటం, బిడ్డింగ్ వేయడం వంటి ప్రక్రియలు గ్రామీణ లేదా తక్కువ అవగాహన ఉన్నవారికి కొంచెం క్లిష్టంగా అనిపించవచ్చు.ఎవరికి మేలు?రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారికి, తమ డబ్బు సురక్షితంగా ఉండాలనుకునే వారికి ఇది మెరుగైన వేదిక.నెలవారీ లేదా వార్షిక ఆదాయం కోసం దీర్ఘకాలిక ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి పెట్టడం ప్రయోజనకరం.కేవలం స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్పైనే ఆధారపడకుండా తమ పెట్టుబడులను వైవిధ్యపరచాలనుకునే ఇన్వెస్టర్లకు ఇది సరైనది.పిల్లల చదువులు లేదా పెళ్లిళ్ల కోసం 10-30 ఏళ్ల కాలపరిమితితో పెట్టుబడి పెట్టేవారికి ఇది ఉత్తమం. దీర్ఘకాలంలో ఈక్విటీ మార్కెట్లతో పోలిస్తే ప్రభుత్వ బాండ్లు తక్కువ మొత్తాన్ని సమకూర్చే అవకాశం ఉంది.ప్రభుత్వ సెక్యూరిటీల రకాలుట్రెజరీ బిల్లులు.. ఇవి స్వల్పకాలిక పెట్టుబడులు (మెచ్యురిటీ పీరియడ్ 91 రోజులు, 182 రోజులు లేదా 364 రోజులు).ప్రభుత్వ బాండ్లు.. ఇవి దీర్ఘకాలిక పెట్టుబడులు (5 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు ఉంటాయి). వీటికి స్థిరమైన వడ్డీ వస్తుంది.రాష్ట్ర అభివృద్ధి రుణాలు.. రాష్ట్ర ప్రభుత్వాలు తమ అవసరాల కోసం జారీ చేసే బాండ్లు.వడ్డీ ఎంత?ప్రభుత్వ సెక్యూరిటీలపై వడ్డీ రేటు స్థిరంగా ఉండదు. ఇది మార్కెట్ పరిస్థితులు, ఆర్బీఐ రెపో రేటు, కాలపరిమితిపై ఆధారపడి మారుతూ ఉంటుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం.. సాధారణంగా వీటిపై వడ్డీ 7% నుంచి 7.5% మధ్యలో ఉండే అవకాశం ఉంది (ఇది మారుతూ ఉండవచ్చు). దీర్ఘకాలిక బాండ్లపై వడ్డీని (దీన్ని కూపన్ అంటారు) సాధారణంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి మీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ట్రెజరీ బిల్లులపై నేరుగా వడ్డీ ఉండదు. ఉదాహరణకు రూ.100 విలువైన బిల్లును ప్రభుత్వం రూ.98 కి అమ్ముతుంది. గడువు తీరాక మీకు రూ.100 ఇస్తుంది. ఆ రూ.2 మీ లాభం.ఇదీ చదవండి: ఆండ్రాయిడ్ యూజర్లకు హెచ్చరిక -
రూ.15 వేలకోట్ల పెట్టుబడి.. మహీంద్రా కీలక ప్రకటన
తయారీ సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నంలో భాగంగా.. మహీంద్రా & మహీంద్రా మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లాలో ఆటోమొబైల్స్ & ట్రాక్టర్ల కోసం తన అతిపెద్ద ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించాలని ప్రకటించింది. దీనిని ఏర్పాటు చేయడానికి కంపెనీ రూ. 15,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైంది.మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ.. విదర్భలో 1,500 ఎకరాల విస్తీర్ణంలో ఈ అత్యాధునిక సౌకర్యాన్ని అభివృద్ధి చేయనుంది. దీనికి అనుబంధంగా శంభాజీనగర్లో 150 ఎకరాల సప్లయర్ పార్క్ కూడా ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కర్మాగారం ఏడాదికి ఐదు లక్షల వాహనాలు & లక్ష ట్రాక్టర్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. నాగ్పూర్లో జరిగిన అడ్వాంటేజ్ విదర్భ సమ్మిట్ సందర్భంగా కంపెనీ ఈ ప్రకటన చేసింది. ఈ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం & మహీంద్రా అండ్ మహీంద్రా మధ్య ఒక అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. -
ఆండ్రాయిడ్ యూజర్లకు హెచ్చరిక
ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 కోట్ల మంది ఆండ్రాయిడ్ వినియోగదారులకు గూగుల్ షాకింగ్ వార్తను అందించింది. ఆండ్రాయిడ్ 12 (Android 12) లేదా అంతకంటే పాత వెర్షన్లపై పనిచేస్తున్న స్మార్ట్ఫోన్లకు ఇకపై అధికారికంగా సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్లు అందవని ధ్రువీకరించింది. దీనివల్ల దాదాపు 42.1% ఆండ్రాయిడ్ ఫోన్లు సైబర్ దాడులు, మాల్వేర్, స్పైవేర్ బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అసలు సమస్య ఇదే!తాజా గణాంకాల ప్రకారం కేవలం 57.9% పరికరాలు మాత్రమే ఆండ్రాయిడ్ 13 లేదా అంతకంటే కొత్త వెర్షన్లను వాడుతున్నాయి. ఆండ్రాయిడ్ వ్యవస్థలోని ‘ఫ్రాగ్మెంటేషన్’ సమస్యే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. గూగుల్ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ను రూపొందించినప్పటికీ గూగుల్ పిక్సెల్ ఫోన్లు మినహా మిగిలిన కంపెనీలపై (శాంసంగ్, షావోమి, ఒప్పో, మోటరోలా మొదలైనవి) అప్డేట్ల విషయంలో గూగుల్కు పూర్తి నియంత్రణ ఉండదు. ఫోన్ తయారీదారులు తమ సొంత షెడ్యూల్స్ పాటిస్తూ కొన్ని సంవత్సరాల తర్వాత పాత మోడళ్లకు అప్డేట్లు నిలిపివేస్తున్నారు. యాపిల్ తన హార్డ్వేర్, సాఫ్ట్వేర్ రెండింటినీ నియంత్రిస్తుంది కాబట్టి, పాత ఐఫోన్లకు కూడా అప్డేట్లు వేగంగా అందుతాయి. ఉదాహరణకు ఐఓఎస్ 26 ఇప్పటికే 50% ఐఫోన్ల్లో నడుస్తుండగా ఆండ్రాయిడ్ లేటెస్ట్ వెర్షన్ కేవలం 7.5%ఫోన్లలో మాత్రమే ఉంది.ఏ వెర్షన్లు సురక్షితం? ఏవి కావు?ప్రస్తుతం సెక్యూరిటీ అప్డేట్లు పొందుతున్న, నిలిపివేసిన వెర్షన్ల జాబితా ఇక్కడ ఉంది.భద్రతా అప్డేట్ ఉన్నవిసాఫ్ట్వేర్ అప్డేట్ నిలిపేసినవిఆండ్రాయిడ్ 16ఆండ్రాయిడ్ 12ఆండ్రాయిడ్ 15ఆండ్రాయిడ్ 11ఆండ్రాయిడ్ 14ఆండ్రాయిడ్ 10ఆండ్రాయిడ్ 13ఆండ్రాయిడ్ 9, అంతకంటే పాతవి ముప్పులేమిటి?సెక్యూరిటీ అప్డేట్లు లేని ఫోన్ వాడటం అంటే తాళం లేని ఇంట్లో ఉండటమే. మాల్వేర్ దాడుల వల్ల కొన్ని నష్టాలు సంభవించవచ్చు.మీ యూజర్ నేమ్స్, పాస్వర్డ్ల చోరీ.బ్యాంకింగ్, ట్రేడింగ్ యాప్స్ హ్యాకింగ్.ఓటీపీ సందేశాలను అడ్డగించడం.మీ ఆర్థిక ఖాతాల నుంచి డబ్బు మాయం కావడం.గూగుల్ ప్లే ప్రొటెక్ట్ సరిపోదా?ఆండ్రాయిడ్ 7 నుంచి అన్ని వెర్షన్లలో ‘ప్లే ప్రొటెక్ట్’ రియల్ టైమ్ మాల్వేర్ స్కానింగ్ అందిస్తుందని గూగుల్ తెలిపింది. అయితే ఇది కేవలం యాప్స్ స్థాయిలోనే రక్షణ ఇస్తుంది. సిస్టమ్ స్థాయిలో ఉండే లోపాలను (Security Patches) ఇది సరిదిద్దలేదు. కాబట్టి పాత ఫోన్లు ప్రమాదంలో ఉన్నట్లేనని గమనించాలి.ఇప్పుడేం చేయాలి?మీ ఫోన్ సురక్షితంగా ఉందో లేదో తనిఖీ చేయండి.1. ఫోన్లో Settings ఓపెన్ చేయండి.2. తర్వాత About Phone కు వెళ్లండి.3. Android Versionను తనిఖీ చేయండి.ఒకవేళ మీ ఫోన్ ఆండ్రాయిడ్ 12 లేదా అంతకంటే పాతది అయితే దాన్ని అప్గ్రేడ్ చేయడం శ్రేయస్కరం. గూగుల్ సలహా ప్రకారం.. మీ ఫోన్ ఖరీదైన ఫ్లాగ్షిప్ ఫోన్ కానవసరం లేదు. కనీసం ఆండ్రాయిడ్ 13 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్ ఉన్న ఫోన్ కొనుగోలు చేసినా మీకు భద్రత లభిస్తుంది.ఇదీ చదవండి: ఎలాన్ మస్క్ ‘ఇడియట్ ఇండెక్స్’ -
2026లో బంగారం, వెండి భవిష్యత్తు ఇదే!: బాబా వంగా
ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన జ్యోతిష్కురాలు.. బాబా వంగా పేరు మరోసారి వార్తల్లో నిలిచారు. బాల్కన్ ప్రాంతపు నోస్ట్రడామస్ అని పిలువబడే ఈమె.. అనేక దేశాలు, ప్రముఖ వ్యక్తులు, ప్రపంచ పరిణామాలపై చెప్పిన మాటలు నిజమయ్యాయని ప్రజలు నమ్మడం వల్ల ఆమె పేరు ఇప్పటికే అంతర్జాతీయంగా ప్రఖ్యాతి పొందింది.ప్రపంచంలోని చాలా దేశాలు.. కరెన్సీ హెచ్చుతగ్గులు, ద్రవ్యోల్బణం వంటివి ఎదుర్కొంటున్నాయి. ఈ తరుణంలో బాబా వంగా ప్రపంచ ఆర్థిక సంక్షోభం గురించి చెప్పిన మాటలు చర్చకు దారితీసాయి. కాగితపు కరెన్సీ దాని విలువను కోల్పోతుంది. దీనివల్ల ప్రపంచంలో తీవ్రమైన నగదు కొరత ఏర్పడుతుందని పేర్కొన్నారు. దీంతో ప్రజల్లో భయం, ఆందోళనను మొదలైపోయాయి.కరెన్సీకి ఎప్పుడైతే విలువ తగ్గిపోతుందో.. అలాంటి పరిస్థితుల్లో బంగారం, వెండి, రాగి వంటి లోహాలే భద్రమైన ఆస్తులుగా మిగులుతాయని, వాటి విలువ ఈ ఏడాది మరింత పెరుగుతుందని బాబా వంగా వెల్లడించారు.2026 ప్రారంభమైన తరువాత బంగారం ధరలు అమాంతం పెరిగి తులం రేటు రూ.1.80 లక్షలకు చేరుకుంది. వెండి ధర రూ. 4 లక్షలకు చేరింది. గోల్డ్, సిల్వర్ రేట్లు ఇంతలా పెరగడం చరిత్రలో ఎప్పుడూ కనిపించలేదని ఆర్ధిక నిపుణులు సైతం వెల్లడించారు. ఇప్పుడు పరిస్థితులు కొంత సాధారణ స్థితికి వచ్చేసాయి. దీంతో రేట్లు కూడా వరుసగా తగ్గుముఖం పట్టాయి.బాబా వంగా చెప్పిన మాటలు కేవలం అంచనా మాత్రమే. ఇవన్నీ తప్పకుండా జరుగుతాయని చెప్పలేము. కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. కరెన్సీ విలువ తగ్గిపోతుందని భావించి, ముందుగానే బంగారం, వెండి వంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలనుకోవడం సరైంది కాదు. అయితే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు తప్పకుండా ఓసారి ఆలోచించాలి. ఎందుకంటే.. అన్ని వేళలా లాభాలే రావు, నష్టాలను కూడా కొన్ని సార్లు భరించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆలోచించాల్సిందే! -
ఎలాన్ మస్క్ ‘ఇడియట్ ఇండెక్స్’
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తన వినూత్న వ్యాపార శైలితో మరోసారి వార్తల్లో నిలిచారు. క్లిష్టమైన పరిశ్రమలను సైతం అత్యంత వేగంగా, తక్కువ ఖర్చుతో నిర్వహించవచ్చని ఆయన నిరూపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రాచుర్యంలోకి తెచ్చిన ‘ఇడియట్ ఇండెక్స్’ అనే భావన ఇప్పుడు పారిశ్రామిక వర్గాల్లో చర్చనీయాంశమైంది.ఏమిటీ ఇడియట్ ఇండెక్స్?ఇది అధికారిక ఆర్థిక గణాంకం కానప్పటికీ మస్క్ కంపెనీలైన టెస్లా, స్పేస్ ఎక్స్ పనితీరును నిర్దేశించే ఒక అనధికారిక కొలమానం. దీని ప్రకారం.. ఒక ఉత్పత్తిని తయారు చేయడానికి అయ్యే ముడి పదార్థాల మొత్తం ధర, ఆ ఉత్పత్తి విక్రయించే తుది ధర మధ్య వ్యత్యాసాన్నే మస్క్ ‘ఇడియట్ ఇండెక్స్’ అని పిలుస్తారు. ఉదాహరణకు ఒక యంత్రం తయారీకి వాడే ఉక్కు, అల్యూమినియం ఖర్చు చాలా తక్కువగా ఉండి తుది యంత్రం ధర విపరీతంగా ఎక్కువగా ఉంటే ఆ మధ్యలో ఉన్న వ్యత్యాసం వ్యవస్థలోని అసమర్థతను సూచిస్తుందని మస్క్ వాదిస్తున్నారు. ఇంజినీరింగ్ క్లిష్టత లేదా భద్రతా కారణాలు లేకుండా ఈ వ్యత్యాసం ఎక్కువగా ఉంటే అక్కడ వ్యవస్థలో లోపం ఉందని లేదా కాలం చెల్లిన పద్ధతులు వాడుతున్నారని ఆయన నమ్ముతున్నట్లు చెప్పారు.స్పేస్ ఎక్స్, ఎక్స్ఏఐ విలీనం2026 ప్రారంభంలో మస్క్ తీసుకున్న ఒక సంచలన నిర్ణయం వ్యాపార రంగంలో మైలురాయిగా నిలిచింది. తన కృత్రిమ మేధ సంస్థ ఎక్స్ఏఐని అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్ ఎక్స్లో విలీనం చేయడం ద్వారా ఆయన సాంకేతిక సమగ్రతను కొత్త స్థాయికి తీసుకెళ్లారు.ఈ విలీనం వెనుక కారణాలుఏఐ శిక్షణకు అవసరమైన భారీ విద్యుత్, డేటా కేంద్రాల నిర్వహణకు స్పేస్ ఎక్స్ స్టార్లింక్ నెట్వర్క్ తోడ్పడుతుంది.ఏఐ ఇంజినీర్లు, రాకెట్ శాస్త్రవేత్తలు ఒకే గొడుగు కింద పనిచేయడం వల్ల సంస్థాగత జాప్యం తగ్గుతుంది.బాహ్య సరఫరాదారులపై ఆధారపడకుండా ఏఐ నుంచి రాకెట్ తయారీ వరకు అంతా అంతర్గతంగానే నిర్వహించేందుకు వీలవుతుంది.విమర్శలు, వాస్తవాలుమస్క్ పద్ధతులు ఎంత విజయవంతమైనా అవి విమర్శలకు అతీతం కాదు. ఉద్యోగులపై విపరీతమైన పని ఒత్తిడి, కఠినమైన టార్గెట్లు వంటి అంశాలపై మాజీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఫలితాల పరంగా చూస్తే స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్లు, టెస్లా గిగాఫ్యాక్టరీలు పారిశ్రామిక రంగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పాయనడంలో సందేహం లేదు. మొత్తానికి ‘ఇడియట్ ఇండెక్స్’ ద్వారా అసమర్థతను తొలగించి వేగమే ప్రధానంగా మస్క్ తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నట్లు తెలుస్తుంది. 2026 నాటి ఈ పరిణామాలు భవిష్యత్తులో సాంకేతిక రంగం ఏ దిశగా వెళ్తుందో సూచిస్తున్నాయి.ఇదీ చదవండి: కియోసాకీకి కోపమొచ్చింది! -
కాగ్నిజెంట్ ఉద్యోగులకు బొనాంజా.. 100% బోనస్
సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం కాగ్నిజెంట్ తన ఉద్యోగులకు 100 శాతం భారీ బోనస్ ప్రకటించింది. 2025లో అంచనాలను మించి ఆదాయ ఫలితాలను సాధించిన తరువాత ఈ బంపర్ బొనాంజా ప్రకటించింది. దీంతో ఉద్యోగుల్లో ఆనందోత్సాహం నిండింది.కాగ్నిజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) రవి కుమార్ ఎస్ గత కొన్నేళ్లుగా "విజేత సర్కిల్"లోకి ప్రవేశించాలనే సంస్థ లక్ష్యం గురించి చాలాసార్లు మాట్లాడారు. ఫలితాల విడుదల సందర్భంగా 2025లో పటిష్ట పనితీరుకు కారణమైన 3.5 లక్షలమంది సిబ్బందిని సీఈవో ప్రశంసించారు. నాస్డాక్ లిస్టెడ్ కంపెనీ దేశీయంగా భారీ స్థాయిలో ఉద్యోగులను కలిగి ఉన్న విషయం విదితమే. డిసెంబర్31కల్లా కంపెనీ సిబ్బంది సంఖ్య 14,800 పెరిగి 3.51 లక్షలకు చేరింది.లాభం జూమ్కాగ్నిజెంట్ గత ఆర్థిక సంవత్సరం(2025) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 19 శాతం జంప్చేసి 64.8 కోట్ల డాలర్లను తాకింది. అంతక్రితం ఏడాది(2024) ఇదే కాలంలో కేవలం 54.6 కోట్ల డాలర్లు ఆర్జించింది. కంపెనీ కేలండర్ ఏడాదిని ఆర్థిక సంవత్సరంగా పరిగణించే సంగతి తెలిసిందే. మొత్తం ఆదాయం సైతం 5 శాతం ఎగసి 533.3 కోట్ల డాలర్లకు చేరింది. అంతక్రితం క్యూ4లో 508.2 కోట్ల డాలర్ల టర్నోవర్ అందుకుంది. ఈ కాలంలో 12 భారీ డీల్స్ కుదుర్చుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. కాగా.. డిసెంబర్తో ముగిసిన పూర్తిఏడాది(2025)కి ఆదాయం 7 శాతం వృద్ధితో 21.1 బిలియన్ డాలర్లను తాకింది.ఆదాయ అంచనాలు గుడ్ ప్రస్తుత ఏడాది(2026)కి కాగ్నిజెంట్ 5–7.4 శాతం అధికంగా 22.14–22.66 బిలియన్ డాలర్ల ఆదాయ అంచనాలు(గైడెన్స్) ప్రకటించింది. ఈ బాటలో తొలి క్వార్టర్(జనవరి–మార్చి)కు 5.36–5.44 బిలియన్ డాలర్ల ఆదాయం ఆశిస్తున్నట్లు తెలియజేసింది. 2.7–4.2 శాతం వృద్ధి అంచనాలివి. -
కియోసాకీకి కోపమొచ్చింది!
‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకీ, తాను బిట్కాయిన్ను 6,000 డాలర్లకి కొనుగోలు చేశానన్న వ్యాఖ్యలపై వచ్చిన విమర్శలకు స్పందించారు. బిట్కాయిన్ కొనుగోలు చేసిన తేదీపై అనవసరంగా దృష్టి పెట్టడం ఇన్వెస్టర్ల అసలు లక్ష్యాన్ని తప్పుదారి పట్టిస్తుందని ఆయన అన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’లో వరుస ట్వీట్లు చేశారు.తనను “అబద్ధం చెబుతున్నాడు” అంటూ ఆరోపించిన వ్యక్తి, బిట్కాయిన్ను ఏ తేదీన కొనుగోలు చేశానన్న అంశాన్ని ప్రశ్నిస్తున్నాడని కియోసాకీ పేర్కొన్నారు. అయితే తాను గుర్తుంచుకునేది కొనుగోలు చేసిన ధర (strike price) మాత్రమేనని, తేదీ తనకు ప్రాధాన్యం కాదని చెప్పారు.“నేను ఏ తేదీన బిట్కాయిన్ కొన్నానో అతడికి ఎందుకు అంత ఆసక్తి?” అని ప్రశ్నించిన కియోసాకీ, ఆ విమర్శల వెనుక వ్యక్తిగత అజెండా ఉండవచ్చని ఆరోపించారు.బిట్కాయిన్ ధర మళ్లీ 6,000 డాలర్లకి పడితే మరోసారి కొనుగోలు చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఆ సమయంలో తేదీ ఏమిటన్నది తనకు ఎలాంటి ప్రాధాన్యం లేదన్నారు. ప్రస్తుతం తాను మరింత బంగారం కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్నానని కూడా వెల్లడించారు.తన విమర్శకులను ఉద్దేశించి, వారు ఎన్ని బిట్కాయిన్లు, బంగారం, వెండి లేదా ఈథీరియం కలిగి ఉన్నారో చెప్పాలని సవాలు విసిరారు. అలాగే అద్దె ఇళ్లు, చమురు బావులు వంటి వాస్తవ ఆస్తులపై కూడా ప్రశ్నించారు. “నేను ఈ ఆస్తులు ఎప్పుడు కొనుగోలు చేశానో నాకు గుర్తులేదు. కానీ వాటిని కొనుగోలు చేశానన్నది మాత్రం ఆనందంగా ఉంది” అని కియోసాకీ అన్నారు.అలాగే 2026 సంవత్సరానికి చెందిన 60 అమెరికన్ సిల్వర్ ఈగిల్స్ నాణేలు, 20 మిశ్రమ తేదీల గోల్డ్ ఈగిల్స్ కొనుగోలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. వెండి మార్కెట్లో ఉన్న కల్లోలం కారణంగా 2026 సిల్వర్ ఈగిల్స్ భవిష్యత్తులో కలెక్టర్ కాయిన్లుగా మారవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.చివరగా, తనను అనుసరించే ఇన్వెస్టర్లకు కియోసాకీ ఒక సూచన చేశారు. “ఆస్తి విలువ, సంఖ్య కంటే కొనుగోలు చేసిన తేదీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి. దీర్ఘకాలిక సంపద ఆస్తుల సేకరణతోనే వస్తుంది, తేదీలతో కాదు.” అని ముగించారు.To the person who said I was lying that I bought Bitcoin at $6000…. I know my strike price not the date he falsely accuses me of the date I bought Bitcoin on.Why would he care what date I bought it on?Does he have a personal agenda for calling me a liar?If Bitcoin hits…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 7, 2026 -
చైనా దూకుడు.. ఆపకుండా బంగారం కొంటున్న డ్రాగన్!
బంగారం, వెండి ధరలు ఇటీవల రికార్డు స్థాయిలను తాకిన అనంతరం తగ్గుముఖం పట్టాయి. ఈ పరిణామం ప్రపంచ కమోడిటీ మార్కెట్లలో కొత్త కదలికలకు దారితీసింది. ధరలు తీవ్ర అస్థిరతను చూపుతున్నప్పటికీ, చైనా మాత్రం బంగారం కొనుగోలును దూకుడుగా కొనసాగిస్తోంది. చైనా కేంద్ర బ్యాంక్ అయిన పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (PBoC) వరుసగా 15వ నెల కూడా తన బంగారం నిల్వలను పెంచుకుంది.2,307 మెట్రిక్ టన్నుల బంగారంపీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా విడుదల చేసిన డేటా, రాయిటర్స్ నివేదికల ప్రకారం.. గత జనవరి నెలలో కూడా చైనా బలమైన బంగారం కొనుగోళ్లను కొనసాగించింది. జనవరి చివరి నాటికి చైనా మొత్తం బంగారం నిల్వలు 74.19 మిలియన్ ఫైన్ ట్రాయ్ ఔన్సులకు (ఒక ఫైన్ ట్రాయ్ ఔన్సు అంటే 31.1035 గ్రాములు మొత్తం 2,307.56 మెట్రిక్ టన్నులు) చేరాయి. ఇది డిసెంబర్ చివర్లో నమోదైన 74.15 మిలియన్ ట్రాయ్ ఔన్సులతో పోలిస్తే స్వల్ప పెరుగుదలే అయినప్పటికీ, నిల్వల మొత్తం విలువ మాత్రం గణనీయంగా పెరిగింది.ఆర్థిక వ్యవస్థను రక్షించుకునేందుకే?జనవరి చివరి నాటికి చైనా బంగారం నిల్వల మొత్తం విలువ 369.58 బిలియన్ డాలర్లకు చేరింది. గత నెలలో ఇది 319.45 బిలియన్ డాలర్లుగా ఉండటం గమనార్హం. ఈ భారీ పెరుగుదలకి ప్రధాన కారణాలుగా నెల ప్రారంభంలో ఉన్న అధిక బంగారం ధరలు, అలాగే చైనా నిరంతర కొనుగోలు వ్యూహాన్ని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, పెరుగుతున్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక ప్రమాదాల నేపథ్యంలో చైనా తన ఆర్థిక వ్యవస్థను రక్షించుకునే భాగంగా బంగారం నిల్వలను పెంచుకుంటోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.చైనా నుంచి వచ్చిన బలమైన డిమాండ్, అలాగే ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో జరిగిన స్పెక్యులేటివ్ ట్రేడింగ్ కారణంగా జనవరిలో బంగారం ధరలు ఔన్సుకు 5,600 డాలర్ల చారిత్రక గరిష్టాన్ని తాకాయి. అయితే ఈ ర్యాలీ ఎక్కువ కాలం కొనసాగలేదు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్లో తదుపరి కీలక నాయకత్వ పాత్రకు కెవిన్ వార్ష్ను పరిగణనలోకి తీసుకుంటున్నారన్న వార్తలు వెలువడడంతో మార్కెట్ సెంటిమెంట్ ఒక్కసారిగా మారిపోయింది. ఫలితంగా స్పాట్ గోల్డ్ ధరలు గణనీయంగా పడిపోయాయి.ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు 4,887 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ దిద్దుబాటు కొనుగోలుదారులకు కొంత ఊరటనిచ్చినప్పటికీ, రాబోయే రోజుల్లో ధరల దిశపై అనేక ప్రశ్నలను కూడా లేవనెత్తుతోంది.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చైనా సెంట్రల్ బ్యాంక్ భారీగా బంగారం కొనుగోలు చేస్తుండగా, అదే సమయంలో దేశీయ వినియోగదారుల బంగారం వినియోగం మాత్రం వరుసగా రెండో ఏడాది కూడా తగ్గుముఖం పట్టింది.భారత్ పసిడి నిల్వలు ఇలా..జనవరి 2026 నాటికి, భారతదేశ కేంద్ర బ్యాంకు తన విదేశీ మారక నిల్వలలో సుమారు 880 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కలిగి ఉంది. తాజా విదేశీ నిల్వల డేటా ప్రకారం జనవరి చివరి నాటికి భారతదేశ మొత్తం రిజర్వ్ వాల్యుయేషన్కు ఆర్బీఐ బంగారం హోల్డింగ్స్ సుమారు 123 బిలియన్ డాలర్లు దోహదపడ్డాయి. ప్రపంచ ధరల లాభాలతో భారతదేశ బంగారం నిల్వ విలువ గణనీయంగా పెరిగినప్పటికీ, రిజర్వ్ బ్యాంక్ తాజా పసిడి కొనుగోళ్లు గణనీయంగా మందగించాయి. -
ఓపెన్ ఏఐ మరో షాక్.. ఇక స్మార్ట్ ఫోన్లకు చెక్!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) తన నూతన ఆవిష్కరణలతో ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా దూసుకుపోతోంది. ఇప్పటివరకూ సాఫ్ట్వేర్ వరకే పరిమితమైందనుకుంటున్న ఓపెన్ ఏఐ ఇప్పుడు హార్డ్వేర్ రంగంలోకీ గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. ‘డైమ్’ (Dime) అనే కోడ్ నేమ్తో కంపెనీ తన మొట్టమొదటి హార్డ్వేర్ ఉత్పత్తిగా ఏఐ ఆధారిత ఇయర్బడ్స్ను తీసుకురానున్నట్లు ‘మింట్’తన కథనంలో పేర్కొంది.‘డైమ్’ ఇయర్ బడ్స్ కేవలం సంగీతం వినడానికే పరిమితం కాకుండా, వాయిస్ కమాండ్స్ ద్వారా ఏఐ మోడళ్లను నియంత్రించేలా, హ్యాండ్స్-ఫ్రీ అసిస్టెన్స్ను అందించేలా రూపొందించారు. ఈ ఏడాది చివరిలో వీటిని ప్రపంచానికి పరిచయం చేసి, 2027 ప్రారంభంలో మార్కెట్లోకి వీటిని విడుదల చేసే అవకాశం ఉంది. ‘స్మార్ట్ పికాచు’ అందించిన సమాచారం ప్రకారం చైనాలో ఇటీవల దాఖలైన ఒక పేటెంట్ ఫైలింగ్లో ‘డైమ్’ అనే పేరు వెలుగులోకి వచ్చింది.భారీ స్థాయిలో హార్డ్వేర్ పరికరాలను నేరుగా మార్కెట్లోకి తెచ్చే కంటే, వినియోగదారులకు అందుబాటులో ఉండేలా ఇయర్బడ్స్ లాంటి సాధారణ పరికరంతో రంగప్రవేశం చేయాలని ఓపెన్ ఏఐ భావిస్తోంది. తక్కువ ఖర్చుతో సాంకేతిక ఇబ్బందులు లేకుండా హార్డ్వేర్ మార్కెట్ను చేజిక్కించుకోవడమే కంపెనీ వ్యూహమని తెలుస్తోంది. ఇవి వాయిస్ ఇంటరాక్షన్లపై దృష్టి సారిస్తూ, వినియోగదారులకు రియల్ టైమ్ ఏఐ సేవలను నేరుగా చెవి దగ్గరికే చేర్చనున్నాయి.గతంలో ఓపెన్ ఏఐ స్మార్ట్ఫోన్ తరహాలో ఉండే శక్తివంతమైన ఏఐ డివైజ్ను తీసుకువస్తుందనే ప్రచారం జరిగింది. అయితే హై బ్యాండ్విడ్త్ మెమరీ (హెచ్బీఎం)కొరత కారణంగా విడిభాగాల ధరలు విపరీతంగా పెరగడంతో ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం వాయిదా పడినట్లు సమాచారం. తయారీ వ్యయం కారణంగా కంపెనీ ప్రస్తుతానికి తన నిర్ణయాన్ని మార్చుకుని, 2026లో సరళమైన వెర్షన్ (డైమ్ ఇయర్బడ్స్)ను లాంచ్ చేయాలని నిశ్చయించుకుందని సమాచారం.ఓపెన్ ఏఐ చీఫ్ గ్లోబల్ అఫైర్స్ ఆఫీసర్ క్రిస్ లెహనే గతంలోనే కంపెనీ తొలి హార్డ్వేర్ ఉత్పత్తిపై పనిచేస్తున్నట్లు ప్రకటించారు. అయితే అప్పట్లో దాని ఆకారం లేదా ఫీచర్ల గురించి ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ ఏడాదిలోనే ఆ పరికరాన్ని ఆవిష్కరిస్తామని ఆయన పేర్కొన్నప్పటికీ, లాంచ్ తేదీని వెల్లడించలేదు. ప్రస్తుతం ‘డైమ్’ బ్రాండింగ్తో వస్తున్న ఇయర్బడ్స్ వార్తలపై ఓపెన్ ఏఐ ఇంకా స్పందించాల్సి ఉంది. ఆపిల్ మాజీ డిజైన్ హెడ్ జోనీ ఐవ్ నేతృత్వంలో ఈ నూతన పరికరాలు రూపుదిద్దుకుంటున్నాయనే వార్తలు టెక్ ప్రపంచంలో సంచలనంగా మారాయి. కాగా డైమ్ ఇయర్బడ్స్ అందుబాటులోకి వస్తే, అవి స్మార్ట్ ఫోన్ల వినియోగానికి చెక్ పెట్టనున్నాయనే వాదన వినిపిస్తోంది.ఇది కూడా చదవండి: ‘వాషింగ్టన్ పోస్ట్’లో మరో సంచలనం.. ఇప్పుడు సీఈఓ వంతు.. -
జీరో ట్యాక్స్.. భారీగా తగ్గనున్న హార్లే డేవిడ్సన్ బైకుల ధరలు
న్యూఢిల్లీ: భారత్–అమెరికాల మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారుతో యూఎస్కు చెందిన ప్రీమియం బైకుల తయారీ సంస్థ హార్లే డేవిడ్సన్కు భారీ ప్రయోజనం చేకూరనుంది. ట్రేడ్ డీల్లో భాగంగా 800–1600 సీసీతో పాటు అంతకు మించి ఇంజిన్ సామర్థ్యం కలిగిన అమెరికా మోటార్స్సైకిళ్లపై దిగుమతి సుంకం సున్నా(జీరో టాక్స్) శాతానికి తగ్గాయి. దీంతో తమ కంపెనీకి భారీ ఊరట లభించిందని హార్లే డేవిడ్సన్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.‘‘ఒప్పందం అమలు రోజు నుంచి మోటార్ సైకిళ్లపై ఎలాంటి సుంకాలు ఉండవు. ప్రీమియం బైక్ల విభాగంలో భారత్ చిన్న మార్కెట్ అయినప్పటికీ, ఈ నిర్ణయం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచుతుంది’’ అన్నారు. హార్లే డేవిడ్సన్కు గతేడాదిలోనూ ప్రభుత్వం ఊరట కల్పించింది. 1,600 సీసీ వరకు ఇంజిన్ సామర్థ్యం ఉన్న మోటార్సైకిళ్లపై దిగుమతి సుంకాన్ని 50 %నుంచి 40 శాతానికి, 1,600 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న కస్టమ్స్ డ్యూటీ 50% నుంచి 30 శాతానికి సవరించింది.భారత్–అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైనట్లు ఇరుదేశాలు ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఈ డీల్ 2026 మార్చిలో చట్టబద్దం కానుంది. తాజాగా ట్రేడ్ డీల్ భాగంగా అమెరికా నుంచి దిగుమతయ్యే 3000 సీసీ ఇంజిన్ సామర్థ్యం కలిగిన పెట్రోల్ కార్లు, 2500 సీసీ ఇంజిన్ కలిగిన డిజిల్ కార్లపై సుంకాలను భారత్ తగ్గించింది. -
రీట్, ఇన్విట్ల్లో పెట్టుబడులు.. సెబీ కీలక మార్పులు
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్)ల నియంత్రణల్లో కీలక మార్పులను సెబీ ప్రతిపాదించింది. వీటిల్లో లిక్విడ్ ఫండ్స్ పెట్టుబడులకు అనుమతించడం ఇందులో కీలకమైనది. ఇతర పెట్టుబడుల’ కింద 20 శాతం పరిమితికి లోబడి లిక్విడ్ ఫండ్స్ రీట్లు, ఇన్విట్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.ఇన్విట్లు స్పెషల్ పర్పస్ వెహికల్స్ (ఎస్పీవీలు)ను వాటి రాయితీ కాలం ముగిసిన తర్వాత కూడా కొనసాగించేందుకు అనుమతించనుంది. ప్రైవేటు ఇన్విట్లు తమ ఆస్తుల్లో 10 శాతం వరకు గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు సైతం ప్రతిపాదించింది. అలాగే ఇన్విట్ల ఆస్తుల విలువలో నికర రుణ భారం 49 శాతం మించినప్పుడు, తాజా రుణాల వినియోగ పరిధినీ విస్తృతం చేయాలన్నది మరో ప్రతిపాదన.ఆస్తుల కొనుగోలు, అభివృద్ధి కోసమే కాకుండా... మూలధన విస్తరణ, ఆస్తుల నిర్వహణ కోసం సైతం ఇన్విట్లు తాజా రుణ సమీకరణకు అనుమతించనుంది. ఇందుకు సంబంధించి చర్చా పత్రాన్ని సెబీ విడుదల చేసింది. దీనిపై ఈ నెల 26 వరకు అభిప్రాయాలు తెలియజేయాలని సెబీ కోరింది. -
ఏఐతో టెక్ సర్వీసుల్లో సరికొత్త మార్పులు
న్యూఢిల్లీ: అధునాతన కృత్రిమ మేథ (ఏఐ) రాకతో దేశీ టెక్నాలజీ సరీ్వసుల రంగంలో విపత్కర పరిణామాలు ఉంటాయన్న ఆందోళనలను ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ తోసిపుచ్చింది. ఇది పరిశ్రమను సరికొత్తగా తీర్చిదిద్దుతుందని పేర్కొంది. దేశీ ఐటీ కంపెనీలు సంక్లిష్టమైన టెక్నాలజీలపై అంతర్జాతీయ సంస్థలతో కలిసి పని చేస్తుంటాయని వివరించింది.ఏఐ నుంచి సిసలైన ప్రయోజనాలు పొందాలంటే మనుషులతో కూడా సమన్వయం చేసుకోవడం కీలకంగా ఉంటుందని తెలిపింది. వారికి పరిశ్రమపైన, నిర్దిష్ట వ్యాపారాలపైన లోతైన అవగాహన అవసరమని నాస్కామ్ పేర్కొంది. ఏఐని ప్రయోగాత్మకంగా పరీక్షించడం నుంచి భారీ స్థాయిలో వినియోగంలోకి తేవడం వైపు మళ్లించడంలో టెక్నాలజీ సేవల సంస్థలు తోడ్పడతాయని వివరించింది. -
రిలయన్స్ జియో రూ. 1,984 కోట్లు బాకీ..
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం (2024–25) నాటికి టెలికం కంపెనీలు సవరించిన స్థూల రాబడిపరంగా (ఏజీఆర్) ప్రభుత్వానికి కట్టాల్సిన బాకీలు రూ. 1.77 లక్షల కోట్లకు చేరాయి. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపయిన వొడాఫోన్ ఐడియా రూ. 89,952 కోట్లు, భారతి గ్రూప్ రూ. 51,091 కోట్లు, టాటా గ్రూప్ రూ. 20,426 కోట్లు, ఎంటీఎన్ఎల్ రూ. 14,462 కోట్లు, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ రూ. 1,984 కోట్లు కట్టాల్సి ఉంది.పార్లమెంటుకు సమర్పించిన అధికారిక డేటాలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వొడాఫోన్ ఐడియా కేసులో 2006–2018 ఆర్థిక సంవత్సరాల మధ్యకాలంలో కట్టాల్సిన బాకీలను రూ. 87,695 కోట్ల స్థాయికి పరిమితం చేసి, చెల్లించేందుకు మరింత గడువును ఇచ్చిన సంగతి తెలిసిందే. -
స్వగృహ ప్లాట్లకు భలే డిమాండ్.. రూ. 56 కోట్లు ఆదాయం
సాక్షి, సిటీబ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్పోర్టుకు సమీపంలో బహదూర్పల్లి, కుర్మల్ గూడ ప్రాంతాల్లోని ఓపెన్ ప్లాట్ల విక్రయంతో రూ. 56 కోట్ల మేర ఆదాయం వచ్చిందని రాజీవ్ స్వగహ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి. గౌతం తెలిపారు. శనివారం బాటసింగారంలో నిర్వహించిన వేలంలో 70 ప్లాట్లను విక్రయించారు. చదరపు గజం కనీస ధర (అప్సెట్ ప్రైస్) రూ.25 వేలుగా నిర్ణయించగా, కొన్ని ప్లాట్లను రూ.45 వేలు, 43 వేలు, 41 వేలకు కొనుగోలు చేశారు. మొత్తమ్మీద సగటున చదరపు గజానికి రూ.31 వేలకు అమ్ముడు పోయాయి.కాగా.. ఆదివారం తొర్రూర్ లేఅవుట్లోని 35 ఓపెన్ ప్లాట్లకు, బహదూర్ పల్లి, కుర్మల్ గూడలోని మరో 32 ఓపెన్ ప్లాట్లకు బహిరంగ వేలం నిర్వహించనున్నారు. బండ్లగూడలోని 15 ఫ్లాట్లు, పోచారం ప్రాంతంలో 56 ఫ్లాట్లను లాటరీ ప్రక్రియలో కేటాయించడంతో రాజీవ్ స్వగహ కార్పొరేషన్కు రూ.11 కోట్ల ఆదాయం సమకూరింది.ఇదీ చదవండి: శంషాబాద్కు కొత్త ఫేమ్.. ఇక మరో రియల్ ఎస్టేట్ బూమ్! -
ఎంఎస్ఎంఈలకు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు
న్యూఢిల్లీ: భారత్–అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందంతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈలు)కు అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తి, సరఫరా, మార్కెటింగ్ వ్యవస్థల్లో అవకాశాలు లభిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం తెలిపారు. వ్యాపారాలు, కస్టమర్లపై వ్యయాల భారం గణనీయంగా తగ్గుతుందన్నారు. ట్రేడ్ డీల్తో పశుపోషణ, మసాల, ప్రధాన ఆహార ఉత్పత్తులకు పూర్తి రక్షణ కలి్పంచడంతో భారతీయ రైతుల ఆదాయాలు పెరుగుతాయన్నారు. ఇరు దేశాల మధ్య పరస్పర సాంకేతిక సహకారం ద్వారా కృత్రిమ మేధ (ఏఐ), డేటా, డిజిటల్ సేవల కేంద్రంగా భారత్ స్థానం మరింత సుస్థిరం అవుతుందని సీతారామన్ అభిప్రాయపడ్డారు. -
ఎస్బీఐ లాభాలకు ‘డివిడెండ్’ దన్ను
ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) డిసెంబర్ త్రైమాసికంలో రికార్డు లాభాలు నమోదు చేసింది. తన అసెట్ మేనేజ్మెంట్ అనుబంధ సంస్థ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ రూ.2,200 కోట్ల ప్రత్యేక డివిడెండ్ కలుపుకొని... కన్సాలిడేషన్ ప్రాతిపదికన రూ.21,317 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది క్యూ3లో నమోదైన రూ.18,853 కోట్ల నికర లాభంతో పోలిస్తే 13.06 శాతం వృద్ధి నమోదైంది. బ్యాంకు చరిత్రలోనే ఒక క్వార్టర్లో ఇదే అత్యధిక నికర లాభం కావడం విశేషం. మొత్తం వయ్యాలు రూ.1.04 లక్షల కోట్ల నుంచి రూ.1.08 లక్షల కోట్లకు చేరాయి. ఇదే క్యూ3లో నికర వడ్డీ ఆదాయం 9.04% పెరిగి రూ.41,446 కోట్ల నుంచి రూ.45,190 కోట్లకు చేరింది. దేశీయ నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) స్వల్పంగా 0.03% తగ్గి 3.12 శాతంగా నమోదైంది. డివిడెండ్ను కలుపుకొని వడ్డీయేతర ఆదాయం 15.65% పెరిగి రూ. 8,404 కోట్లకు చేరింది. → ఆస్తుల నాణ్యతలో బ్యాంకు మెరుగైన పనితీరు కనబరిచింది. డిసెంబర్ 31 నాటికి స్థూల ఎన్పీఏ(మొండి బకాయిలు)లు 2.2% నుంచి 1.57 శాతానికి పరిమితమయ్యాయి. కాగా, సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ స్థూల ఎన్పీఏలు 1.74% గా ఉన్నాయి. స్లిప్పేజీలు రూ.3,823 కోట్ల నుంచి రూ.4,458 కోట్లకు పెరిగినప్పట్టకీ.., మొత్తం ఎన్పీఏలు నియంత్రణలోనే ఉన్నాయని బ్యాంకు చెప్పుకొచ్చింది. → మొండి బకాయిలకు కేటాయింపులు (ప్రొవిజన్లు) రూ.911 నుంచి రూ.4,507 కోట్లకు పెరిగాయి. భవిష్యత్తు అనిశి్చతులను దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా ఈ కేటాయింపులు చేసినట్లు బ్యాంకు తెలిపింది. → డిసెంబర్ త్రైమాసికంలో రుణాలు 15.14 శాతం పెరిగాయి. ఇందులో కార్పొరేట్ రుణాలు 13.3% వృద్ధి సాధించగా, రిటైల్ రుణ విభాగం కూడా నిలకడగా కొనసాగింది. డిపాజిట్లు 9.02% పెరిగాయి. క్రిడెట్–డిపాజిట్ నిష్పత్తి 72 శాతంగా అనువైన స్థితిలో ఉంది. ఆర్థిక ఫలితాల ప్రకటన సందర్భంగా ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి మాట్లాడుతూ.... ‘‘రుణవృద్ధి గణనీయంగా పెరగడం, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ రూ.2,200 కోట్ల ప్రత్యేక డివిడెండ్ అంశాలు బ్యాంకు నికర లాభాల వృద్ధికి దోహదపడ్డాయి. కార్పొరేట్ రుణాలు తిరిగి పుంజుకోవడం, రిటైల్ రుణ విభాగం నిలకడైన ప్రదర్శనతో ప్రస్తుత ఆర్థిక సంవత్సర రుణాల వృద్ధి లక్ష్యాన్ని 13–15 శాతానికి పెంచుతున్నాము. భారత్–అమెరికా ట్రేడ్ డీల్ ఖరారుతో బ్యాంకులు రుణ వృద్ధి మరింత పుంజుకోవచ్చు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్(రీట్స్)కు రుణాలిచ్చేందుకు బ్యాంకులను అనుమతించాలనే ఆర్బీఐ ప్రతిపాదనను, మోసాలకు గురైన ఖాతాదారులకు రూ. 25,000 వరకు పరిహారం చెల్లింపు నిర్ణయాలను స్వాగతిస్తున్నాము. ఎస్బీఐ ‘‘డిజిటల్–ఫస్ట్’’ బ్యాంకుగా మారే దిశగా ముందుకెళ్తోంది’’ అన్నారు. -
లిస్టింగ్కు 8 కంపెనీలు రెడీ
ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, భౌగోళిక అనిశ్చితులు కొనసాగుతున్న నేపథ్యంలోనూ దేశీయంగా ప్రైమరీ మార్కెట్లు దూకుడు చూపుతున్నాయి. ఓవైపు సెకండరీ మార్కెట్లు ఆటుపోట్ల మధ్యనే కదులుతున్నప్పటికీ పలు కంపెనీలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యేందుకు క్యూ కడుతున్నాయి. తాజాగా 8 కంపెనీల ప్రాస్పెక్టస్లకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. వివరాలు చూద్దాం.. న్యూఢిల్లీ: ఐపీవో చేపట్టేందుకు వీలుగా గతేడాది(2025) సెపె్టంబర్– నవంబర్ మధ్య కాలంలో సెబీకి 9 కంపెనీలు ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. వీటిలో మన్ ఫ్లీట్ పార్ట్నర్స్ ప్రాస్పెక్టస్ను వెనక్కి తీసుకోగా.. మిగిలిన 8 కంపెనీలకు సెబీ ఆమోదముద్ర వేసింది. జాబితాలో ఇన్క్రెడ్ హోల్డింగ్స్సహా.. ఆర్వీ ఇంజినీరింగ్, ఎలివేట్ క్యాంపసస్, శంకేష్ జ్యువెలర్స్, ఆర్మీ ఇన్ఫోటెక్, ఆర్డీ ఇండస్ట్రీస్, సెడెమాక్ మెకట్రానిక్స్, లేజర్ పవర్ అండ్ ఇన్ఫ్రా చేరాయి. ప్రాస్పెక్టస్ల ప్రకారం ఇవన్నీ కలసి ఉమ్మడిగా రూ. 10,000 కోట్లవరకూ సమీకరించే ప్రణాళికల్లో ఉన్నాయి. ఇప్పటికే కొత్త ఏడాది(2026)లో భారత్ కోకింగ్ కోల్, షాడోఫ్యాక్స్ టెక్నాలజీస్, అమాగీ మీడియా ల్యాబ్స్ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్కాగా.. మొత్తం రూ. 4,766 కోట్లు సమీకరించిన విషయం విదితమే. ఎన్బీఎఫ్సీ నుంచి.. ఎన్బీఎఫ్సీ ఇన్క్రెడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనుబంధ సంస్థ ఇన్క్రెడ్ హోల్డింగ్స్ గోప్యతా మార్గంలో సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసి అనుమతి పొందింది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఇష్యూ ద్వారా రూ. 3,000–4,000 కోట్ల మధ్య సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఎడ్యుకేషన్ ద్వారా విద్యార్ధుల వసతి(స్టూడెంట్ ఎకామడేషన్), కే–12 ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ ఎలివేట్ క్యాంపసస్ ఐపీవో ద్వారా రూ. 2,550 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. దీనిలో భాగంగా కొత్తగా ఈక్విటీ జారీతోపాటు.. ప్రస్తుత వాటాదారులు షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. కే–12 సంస్థల కొనుగోలు, క్యాంపస్ల ఏర్పాటు, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు నిధులు వెచ్చించనుంది. కేబుళ్ల తయారీ కేబుళ్లు, కండక్టర్ల తయారీ కంపెనీ లేజర్ పవర్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్ ఐపీవో ద్వారా రూ. 1,200 కోట్లు అందుకోవాలని చూస్తోంది. ఇందుకు అనుగుణంగా రూ. 800 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 400 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఆటో విడిభాగాలు పవర్ట్రెయిన్ నియంత్రిత వ్యవస్థలు, ఆటో విడిభాగాల తయారీ కంపెనీ సెడెమాక్ మెకట్రానిక్స్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 800–1,000 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇందుకు అనుగుణంగా కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు 80,43,300 షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. లెడ్ అలాయ్స్ లెడ్ స్మెల్టర్ కంపెనీ ఆర్డీ ఇండస్ట్రీస్ ఐపీవోలో భాగంగా రూ. 320 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 3.76 కోట్ల షేర్లను ప్రమోటర్లు విక్రయించనున్నారు. ఈక్విటీ జారీ నిధులను వర్కింగ్ క్యాపిటల్, కార్పొరేట్ అవసరాలు, రుణ చెల్లింపులకు వెచ్చించనుంది. కంపెనీ ప్రధానంగా అత్యున్నత నాణ్యతగల లెడ్ అలాయ్స్ను తయారు చేస్తోంది. ఐటీ ఇన్ఫ్రా.. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్లు అందించే ఆర్మీ ఇన్ఫోటెక్ ఐపీవో ద్వారా రూ. 250 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. ఇందుకు అనుగుణంగా రూ. 250 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ఐపీవో నిధులను రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఇన్ఫ్రా కన్సెల్టెన్సీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్సల్టెన్సీ సరీ్వసుల కంపెనీ ఆర్వీ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ పబ్లిక్ ఇష్యూలో భాగంగా రూ. 203 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. మరో 67.5 లక్షల ఈక్విటీ షేర్లను ప్రమోటర్ విక్రయానికి ఉంచనున్నారు. బంగారు ఆభరణాలు బంగారు ఆభరణాల తయారీ కంపెనీ శంకేష్ జ్యువెలర్స్ ఐపీవోలో భాగంగా రూ. 3 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. మరో కోటి షేర్లను ప్రస్తుత వాటా దారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులలో రూ. 158 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 38 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వెచ్చించనుంది. -
కొత్త రీఛార్జ్ ప్లాన్.. ఫిబ్రవరి 24 వరకే!
ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్-ఐడియా వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ఓ కొత్త ఆఫర్ తీసుకొచ్చింది. ఈ లేటెస్ట్ ఆఫర్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.దేశ్ కా నెట్వర్క్, దేశ్ కా భరోసా అంటూ.. బీఎస్ఎన్ఎల్ ఏడాది ప్లాన్ తీసుకొచ్చింది. 2,626 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే.. 365 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది. రోజుకు 2.6 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు పొందవచ్చు. అపరిమిత కాల్స్ యధావిధిగా లభిస్తాయి. అయితే ఈ ఆఫర్ కేవలం ఫిబ్రవరి 24 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని సంస్థ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.Desh ka network, Desh ka bharosa. BSNL Bharat Connect 26 PlanEnjoy 2.6GB data/day, unlimited calls, 100 SMS/day & 365 days validity all at just ₹2626.That’s why millions trust BSNL Bharat Connect 26 Plan.Recharge smart via #BReX 👉 https://t.co/41wNbHpQ5c Offer valid… pic.twitter.com/cmJE1pTXxR— BSNL India (@BSNLCorporate) February 7, 2026 -
సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆలోచించాల్సిందే!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే అంశంపై దేశంలో విస్తృత చర్చ జరుగుతోంది. ఈ సమయంలో.. భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వీ. అనంత నాగేశ్వరన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.ఏఐ ఉద్యోగాలపైన ఎలాంటి ప్రభావం చూపిస్తుందో.. ఖచ్చితమైన అంచనాలు వేయడం కష్టం. అయినప్పటికీ.. దీని పురోగతి వల్ల కోడింగ్ వంటి ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని ఆయన హెచ్చరించారు. ఉద్యోగుల తొలగింపులకంటే ఎక్కువగా.. నియామకాలపై ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ మార్పు కొంతకాలంగా మొదలైందని.. శ్రీధర్ వెంబు వంటి వారు కూడా ఏఐ సాధనాలు కోడింగ్లో చాలా బాగా ఉపయోగపడుతున్నాయని చెప్పిన మాటలు గుర్తు చేశారు.సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసేవారు తమ భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని అనంత నాగేశ్వరన్ అన్నారు. ఏఐ ప్రభావానికి గురికాని ఉద్యోగాలు కూడా ఉన్నాయని ఆయన వెల్లడించారు.ఇందులో టూరిస్ట్ గైడ్స్, కేర్ ఎకానమీ (వృద్ధులు, పిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారి సంరక్షణ), ఆరెంజ్ ఎకానమీ (సంస్కృతి, సృజనాత్మకత, కంటెంట్ ఆధారిత రంగాలు) ఉన్నాయని పేర్కొన్నారు.ఇదీ చదవండి: భారత్ - అమెరికా డీల్.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన!రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ పూనమ్ గుప్తా మాట్లాడుతూ.. ఏఐ మొత్తం ఉద్యోగాలపై సానుకూల ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు. కొన్ని ఉద్యోగాలు నశించినా, కొత్త అవకాశాలు కూడా ఏర్పడతాయని అన్నారు. ముఖ్యమైన సవాలు ఏమిటంటే.. ఈ మార్పును సక్రమంగా నిర్వహిస్తూ.. యువత సిద్ధంగా ఉండాలని తెలిపారు.#NDTVProfitConclave2026 | V. Anantha Nageswaran, Chief Economic Adviser to @TamannaInamdar on AI and its impact Co-presented by: @NSEIndiaCo-powered by: @LICIndiaForever & @apollotyres Special Partners: @Niva_Bupa, APIS & Adani AirportsEnergy Partner: @kpgroupgujarat NBFC… pic.twitter.com/2LBMuPNI54— NDTV (@ndtv) February 7, 2026 -
బంగారం, వెండి ధరల్లో ఇంతమార్పా!
బంగారం, వెండి ధరలు పెరుగుతూ.. తగ్గుతూ.. మార్కెట్లో సంచనలం సృష్టిస్తున్నాయి. వారం రోజులుగా గోల్డ్ రేటు ఏ స్థాయిలో తగ్గిందో.. అదే స్థాయిలో పెరిగింది కూడా. ఈ కథనంలో ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు అంటే.. ఆదివారం నుంచి శనివారం వరకు ధరలు ఎలా మారాయి, ప్రస్తుతం ఎలా ఉన్నాయనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఆదివారం (ఫిబ్రవరి 1) రూ. 1,60,580 వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం బంగారం ధర శనివారం (ఫిబ్రవరి 7) నాటికి రూ. 1,56,600 వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో 3980 రూపాయలు తగ్గిందన్నమాట. 22 క్యారెట్ల గోల్డ్ విషయానికి వస్తే.. రూ. 1,47,200 నుంచి రూ. 1,43,550 వద్దకు (రూ.3650 తగ్గింది) చేరింది.చెన్నైలో రూ.1,62,550 వద్ద (ఫిబ్రవరి 1) ఉన్న 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు శనివారం నాటికి (ఫిబ్రవరి 7) రూ. 1,57,310 వద్దకు (రూ. 5,240 తగ్గింది) చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,49,000 నుంచి రూ. 1,44,200 వద్దకు (రూ. 4,800 తగ్గింది) చేరింది.ఇదీ చదవండి: బంగారం పింక్ పేపర్లోనే ఎందుకిస్తారో తెలుసా?.. సీక్రెట్ ఇదే!ఢిల్లీ విషయానికి వస్తే.. దేశ రాజధాని నగరంలో వారం రోజుల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల రేటు 1,60,730 రూపాయల నుంచి రూ. 1,56,750 వద్దకు (రూ. 3980 తగ్గింది) చేరింది. 22 క్యారెట్ల రేటు కూడా రూ. 1,47,350 రూపాయల నుంచి రూ. 1,43,700 వద్దకు (రూ. 3650 తగ్గింది) చేరింది.వెండి ధరలుబంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరల్లో కూడా భారీ మార్పు కనిపించింది. ఫిబ్రవరి 1న రూ. 3.20 లక్షల వద్ద కేజీ సిల్వర్ రేటు.. నేటికి (శనివారం) రూ. 2.85 లక్షలకు చేరింది. అంటే ఏడు రోజుల్లో కేజీ ధర రూ. 35వేలు తగ్గిందన్న మాట. -
ఇళ్లకు ఫుల్ డిమాండ్.. ఎనిమిది శాతం పెరిగిన రేట్లు
హైదరాబాద్లో ఇళ్ల ధరలు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి. 2024తో పోలిస్తే.. గత ఏడాది నగరంలో ప్రరాపార్టీల రేట్లు 8 శాతం మేర పెరిగాయని ఓ కన్సల్టెన్సీ నివేదిక వెల్లడించింది.➤2024లో గ్రేటర్లో అపార్ట్మెంట్ల ధరలు చ.అ.కు సగటున రూ.7,053గా ఉండగా.. 2025 నాటికి అది రూ.7,644కు వృద్ధి చెందింది.➤ఇదిలా ఉండగా.. దేశంలోని 8 ప్రధాన నగరాల గణాంకాలు చూస్తే.. 2023తో పోలిస్తే 2024లో ప్రాపరీ్టల ధరలు 17 శాతం మేర పెరగగా.. 2024తో పోలిస్తే 2025లో 6 శాతం మాత్రమే వృద్ధి చెందాయి. చదరపు అడుగుల్లో చూస్తే.. గతేడాది 8 నగరాలలో అపార్ట్మెంట్ల చ.అ.ధర సగటు రూ.7,874లుగా ఉండగా.. 2023లో రూ.7,451గా ఉంది. ఇక, ధరల పెరుగుదల, స్థిరమైన త్రైమాసిక ఇంక్రిమెంట్లు, నియంత్రిత సరఫరా వంటి కారణాలతో అమ్మకానికి సిద్ధంగా ఉన్న యూనిట్లు(ఇన్వెంటరీ) విక్రయించేందుకే డెవలపర్లు దృష్టిసారించారు. గత ఏడాది కొత్త యూనిట్ల లాంచింగ్స్ క్షీణించగా.. అమ్మకాలు పెరిగాయి.➤2024లో 3,85,221 యూనిట్లు సప్లై కాగా.. 2025లో 3,61,096 యూనిట్లు సరఫరా అయ్యాయి.➤2025లో 8 నగరాలలో 3,86,365 యూనిట్లు, 2024లో 4,36,992 యూనిట్లు అమ్ముడయ్యాయి. -
50 లక్షల మంది.. రూ.26.55 కోట్లు దాటిన లావాదేవీలు!
2025 ఆగస్టు 15 నుంచి 'ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్' (FASTag Annual Pass) ప్రారంభమైంది. ఇది అమలులోకి వచ్చిన మొదటి రోజు సాయంత్రం 7:00 గంటల వరకు.. సుమారు 1.4 లక్షల మంది వినియోగదారులు వార్షిక పాస్ను కొనుగోలు చేసి యాక్టివేట్ చేసుకున్నారు. టోల్ ప్లాజాలలో దాదాపు 1.39 లక్షల లావాదేవీలు నమోదయ్యాయి. ఆ తరువాత కూడా ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్కు డిమాండ్ భారీగా పెరిగిపోయింది. ఇప్పుడు తాజాగా 50 లక్షల మంది దీనిని కొనుగోలు చేసినట్లు.. ప్రారంభించిన ఆరు నెలల్లోనే 26.55 కోట్లకు పైగా లావాదేవీలు నమోదయ్యాయని ప్రభుత్వం తెలిపింది.అగ్రస్థానంలో చండీగఢ్రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) వివరాల ప్రకారం.. ప్రస్తుతం జాతీయ రహదారుల (NH) నెట్వర్క్లో కార్ల ద్వారా జరిగే మొత్తం లావాదేవీల్లో సుమారు 28 శాతం ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్ ద్వారానే జరుగుతున్నాయి. ప్రాంతాల వారీగా చూస్తే, చండీగఢ్ ఈ పాస్ వినియోగంలో అగ్రస్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా జరిగిన మొత్తం వార్షిక పాస్ లావాదేవీల్లో 14 శాతం చండీగఢ్ నుంచే నమోదయ్యాయి. తర్వాతి స్థానాల్లో తమిళనాడు (12.3 శాతం) & ఢిల్లీ (11.5 శాతం) ఉన్నాయి.టోల్ ప్లాజాల విషయానికి వస్తే.. ఢిల్లీ ఎన్సీఆర్లోని బిజ్వాసన్ ఫీ ప్లాజా అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ దాదాపు 57 శాతం కార్ల రాకపోకలు యాన్యువల్ పాస్ ద్వారానే జరుగుతున్నాయి. ముండకా ఫీ ప్లాజా (ఢిల్లీ ఎన్సీఆర్) & జిన్ఝోలీ ఫీ ప్లాజా (సోనిపట్) వద్ద కూడా సుమారు 53 శాతం నాన్-కమర్షియల్ వాహనాలు ఈ పాస్ను ఉపయోగిస్తున్నాయి.1,150 టోల్ ప్లాజాల్లో.. యాన్యువల్ పాస్నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులు & ఎక్స్ప్రెస్వేలలోని సుమారు 1,150 టోల్ ప్లాజాలలో ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్ను అమలు చేసింది.వాహనదారులు ఫాస్టాగ్లో డబ్బులు అయిపోయిన ప్రతిసారి రీచార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఒకేసారి రూ.3 వేలు చెల్లించి వార్షిక ఫాస్టాగ్ రీచార్జ్ చేసుకుంటే 200 ట్రిప్పులు లేదంటే ఏడాది గడువుతో (ఏది ముందు అయితే అది) ఈ పాస్ వర్తిస్తుంది. వాహనదారులు కొత్తగా ఫాస్టాగ్ కొనాల్సిన అవసరం లేకుండా.. ప్రస్తుతం వాహనంపై అతికించిన ఫాస్టాగ్కే ఆ మొత్తాన్ని రీచార్జ్ చేసుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం రాజ్మార్గ్ యాత్ర యాప్ను అందుబాటులోకి తెచ్చింది.ఇదీ చదవండి: భారత్ - అమెరికా డీల్.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన! -
భారత్ - అమెరికా డీల్.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన!
భారత్ - అమెరికా మధ్య జరిగిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం తరువాత.. దేశీయ ఉత్పత్తులపై ఉన్న 50 శాతం సుంకాన్ని 18 శాతానికి తగ్గిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఈ సందర్భంగా.. ఈ ఒప్పందానికి సంబంధించిన కీలక విషయాలను కేంద్ర వాణిజ్య & పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ వెల్లడిస్తూ.. సుంకాల తగ్గింపులు, జీరో డ్యూటీ వస్తువులు, ఎగుమతులు మొదలైన విషయాలను పేర్కొన్నారు.సున్నా టారిఫ్ఈ ఒప్పందంతో అనేక భారత ఉత్పత్తులు అమెరికాకు సున్నా టారిఫ్తో ఎగుమతి చేయవచ్చని మంత్రి చెప్పారు. ముఖ్యంగా స్మార్ట్ఫోన్లు, రత్నాలు, వజ్రాలు, ఔషధ ఉత్పత్తులు వంటి వాటికి ఇది వర్తిస్తుంది. అలాగే మసాలాలు, టీ, కాఫీ, కొబ్బరి, కొబ్బరి నూనె, జీడిపప్పు, పలు పండ్లు, కూరగాయలు వంటి వ్యవసాయ ఉత్పత్తులపై కూడా అమెరికా సున్నా టారిఫ్ విధించనుంది.అమెరికాకు ఎగుమతి చేసే అనేక వ్యవసాయ ఉత్పత్తులపై సుంకం ఉండదు. ఇందులో సుగంధ ద్రవ్యాలు, టీ, కాఫీ, కొబ్బరికాయలు, కొబ్బరి నూనె, జీడిపప్పు మాత్రమే కాకుండా అనేక రకాల పండ్లు & కూరగాయలు ఉన్నాయి. ఈ ఒప్పందం వల్ల దేశంలోని రైతులకు ఎలాంటి నష్టం జరగదని మంత్రి స్పష్టంగా చెప్పారు.The India-US Trade Deal will not only provide greater access to the US market for Indian products but also support our labour intensive sectors. Additionally, it will give a big boost to our digital infrastructure.#IndiaUSJointStatement pic.twitter.com/AAUB8x9MGM— Piyush Goyal (@PiyushGoyal) February 7, 2026ఎగుమతులకు ప్రోత్సాహంఅదేవిధంగా అరటి, స్ట్రాబెర్రీ, చెర్రీ, సిట్రస్ పండ్లకు కూడా ఎలాంటి రాయితీలు ఇవ్వలేదని తెలిపారు. గ్రీన్ టీ, కాబూలీ చన, పెసరపప్పు, నూనెగింజలు, వేరుశెనగలు, మాల్ట్ & మాల్ట్ ఆధారిత ఉత్పత్తులు, మద్యంలేని పానీయాలు, స్టార్చ్, ఎథనాల్, పొగాకు వంటి ఉత్పత్తులకు కూడా ఈ ఒప్పందంలో రాయితీలు లేవని గోయల్ పేర్కొన్నారు. మొత్తం , ఈ వాణిజ్య ఒప్పందం భారత ఎగుమతులను ప్రోత్సహిస్తూ, దేశీయ రైతులు మరియు ఉత్పత్తిదారుల ప్రయోజనాలను కాపాడేలా రూపొందించబడిందని ఆయన స్పష్టం చేశారు.భారత్లోకి జన్యుమార్పిడి (జీఎం) ఉత్పత్తులను దిగుమతి చేయబోమని గోయల్ స్పష్టం చేశారు. అంతే కాకుండా మన దేశంలో పండే అరటి, స్ట్రాబెర్రీ, చెర్రీ, సిట్రస్ పండ్లకు ఎలాంటి రాయితీలు ఇవ్వలేదని, వీటి దిగుమతులు అనుమతించబోమని చెప్పారు. గ్రీన్ టీ, కాబూలీ చనా, పెసలు, నూనె గింజలు, వేరుశెనగ, మాల్ట్, మాల్ట్ ఆధారిత ఉత్పత్తులు, మద్యంలేని పానీయాలు, స్టార్చ్, ఎథనాల్, పొగాకు వంటి వాటికీ ఎలాంటి టారిఫ్ సడలింపులు లేవని తెలిపారు.వీటిపై 18 శాతం సుంకంభారత్ ఎగుమతి చేసే వస్త్రాలు, దుస్తులు తోలు, పాదరక్షలు, ప్లాస్టిక్ & రబ్బరు ఉత్పత్తులు, సేంద్రీయ రసాయనాలు, గృహాలంకరణ, చేతివృత్తుల ఉత్పత్తులు & కొన్ని యంత్రాలపై అమెరికా 18 శాతం సుంకం విధించింది.సుంకాల తగ్గింపుతో.. భారత ఎగుమతిదారులకు అమెరికా మార్కెట్లో స్వల్ప ప్రయోజనం చేకూరనుంది. పొరుగు దేశాలైన చైనా (35 శాతం), బంగ్లాదేశ్ (20 శాతం), ఇండోనేషియా (19 శాతం) కూడా భారత్ (18 శాతం) కంటే ఎక్కువ సుంకాలను ఎదుర్కొంటున్నాయి. ఇదీ చదవండి: మీ దగ్గరున్న వెండి స్వచ్ఛమైనదా, కాదా?: తెలుసుకోండిలా.. -
భయంకరమైన భవిష్యత్తు! రానున్నది ‘ఆకలి రాజ్యం’మేనా?
వైట్ కాలర్ ఉద్యోగాలకు గడ్డుకాలం మొదలైందా? రానున్నది ‘ఆకలి రాజ్యం’మేనా? విజృంభిస్తున్న ‘ఏఐ(AI) మహమ్మారి’ మానవ ఉద్యోగాలను మింగేస్తోందన్న భయాలు నిజమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఐటీ దిగ్గజాలను సైతం వణికిస్తున్న ‘ఆంథ్రోపిక్’ సీఈవో డారియో అమోడేయి చేసిన తాజా హెచ్చరికలు ఉద్యోగ మార్కెట్ భవిష్యత్తుపై భయాన్ని రేకెత్తిస్తున్నాయి.ఉద్యోగ అవకాశాల్లో తీవ్ర పతనంఅమోడేయి వ్యాఖ్యల తర్వాత విడుదలైన యూఎస్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ తాజా గణాంకాలు ఆయన అంచనాలకు అనూహ్యంగా సరిపోలడం ఆందోళనలను మరింత పెంచుతున్నాయి. తాజా లేబర్ డేటా ప్రకారం.. గత డిసెంబర్ ఆఖరు నాటికి అమెరికాలో ఉద్యోగ ఖాళీలు 65.4 లక్షలకు పడిపోయాయి. 2020 సెప్టెంబర్ తర్వాత ఇదే అత్యల్ప స్థాయి కావడం గమనార్హం.ఏఐ వల్ల భారీ ఉద్యోగ నష్టంజనవరి చివరలో అమోడేయి “ది అడోలెసెన్స్ ఆఫ్ టెక్నాలజీ” అనే పేరుతో సుమారు 20,000 పదాల సుదీర్ఘ వ్యాసాన్ని ప్రచురించారు. అందులో ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు ఇవీ..“రాబోయే 1–5 సంవత్సరాల్లో ఏఐ వల్ల ఎంట్రీ-లెవల్ వైట్ కాలర్ ఉద్యోగాల్లో 50 శాతం వరకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. అంతేకాదు, 1–2 సంవత్సరాల్లో మనుషుల కంటే ఎక్కువ సామర్థ్యం గల ఏఐ కూడా సాధ్యమే”2021లో ఆంథ్రోపిక్ను సహ-వ్యవస్థాపకుడిగా స్థాపించిన అమోడేయి, ఏఐ అభివృద్ధి వేగం కారణంగా లేబర్ మార్కెట్లో ‘అసాధారణ, బాధాకరమైన షాక్’ తప్పదని హెచ్చరించారు.“ఏఐ పురోగతి వేగం గతంలో వచ్చిన ఇతర సాంకేతిక విప్లవాల కన్నా వేగంగా ఉంది. ఉద్యోగం చేసే విధానం మారడమే కాదు, కొత్త ఉద్యోగాలకు మారాల్సిన అవసరం కూడా ప్రజలకు తీవ్ర సవాల్గా మారుతుంది”ఏఐ ఏదో ఒక్క ఉద్యోగాన్ని భర్తీ చేయడం కాదు.. ‘మానవ కార్మిక శక్తికే ప్రత్యామ్నాయం’గా మారుతోంది’ అని ఆయన స్పష్టం చేశారు. న్యాయ శాఖ, ఫైనాన్స్, కన్సల్టింగ్ వంటి రంగాలు కూడా దీని ప్రభావానికి లోనవుతాయని హెచ్చరించారు.తరువాత ఎన్బీసీ న్యూస్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలోనూ, ఉద్యోగ మార్కెట్పై ఏఐ ప్రభావం తీవ్రంగానే ఉంటుందని ఆయన తన అభిప్రాయాన్ని పునరుద్ఘాటించారు.నియామకాలు కనిష్టానికి.. తొగింపులు గరిష్టానికి..ఈ వారం విడుదలైన తాజా డేటా, కోవిడ్-19 మహమ్మారి తర్వాత ఉద్యోగ మార్కెట్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభాన్ని సూచిస్తోంది. 2025 డిసెంబర్ చివరి నాటికి ఉద్యోగ ఖాళీలు మళ్లీ 65.4 లక్షలకే పరిమితమయ్యాయి. అదే రోజు విడుదలైన ‘ఛాలెంజర్, గ్రే & క్రిస్మస్’ నివేదిక ప్రకారం.. జనవరిలో యూఎస్ కంపెనీలు కేవలం 5,306 నియామక ప్రణాళికలను మాత్రమే ప్రకటించారు. 2009 నుంచి డేటా సేకరణ ప్రారంభించిన తర్వాత ఇదే అత్యల్ప సంఖ్య.ఇదిలా ఉండగా, జనవరి 31తో ముగిసిన వారంలో 2.31 లక్షల మంది తాము నిరుద్యోగులుగా ఉన్నట్లు క్లెయిమ్ చేశారు. ఇది గత వారంతో పోలిస్తే 22,000 పెరుగుదల. అమెజాన్, యూపీఎస్ వంటి సంస్థలు ప్రకటించిన భారీ తొలగింపులు ఈ జనవరిని గ్రేట్ రిసెషన్ తర్వాత మళ్లీ అంత చెత్త నెలగా మార్చాయని ఛాలెంజర్ నివేదిక పేర్కొంది.నెలవారీ గణాంకాల ప్రకారం.. జనవరిలో యూఎస్ కంపెనీలు 1,08,435 ఉద్యోగ కోతలను ప్రకటించాయి. ఇది డిసెంబర్తో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ కాగా, 2025 జనవరితో పోలిస్తే రెండింతలకుపైగా ఉంది. ఈ తొలగింపుల్లో అమెజాన్, యూపీఎస్ సంస్థల వాటా 40 శాతం. రవాణా, టెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ, రసాయనాలు, ఆర్థిక రంగాల్లో ఈ కోతలు ఎక్కువగా నమోదయ్యాయి.ఏఐ పాత్ర ఎంతవరకు?ఏఐ కారణంగా నేరుగా 7,624 ఉద్యోగ కోతలు జరిగినట్లు నివేదిక పేర్కొంది. అయితే, “తొలగింపులపై ఏఐ ప్రభావం ఎంతవరకు ఉందో ఖచ్చితంగా చెప్పడం కష్టం” అని ‘ఛాలెంజర్, గ్రే & క్రిస్మస్’ ఛీఫ్ రెవెన్యూ ఆఫీసర్ ఆండీ ఛాలెంజర్ చెప్పారు. అయినా, చాలా సంస్థలు ఏఐ అమలుపై దృష్టి పెడుతున్నాయని, మార్కెట్ కూడా ఏఐని ప్రస్తావించే కంపెనీలను ప్రోత్సహిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
గ్రీన్ గోదాంలకే డిమాండ్.. ఈ ఏడాది భారీ లీజులు!
భవనాలే కాదు గిడ్డంగులు కూడా హరిత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని భావిస్తున్నారు. తక్కువ విద్యుత్ వినియోగం, నీరు, వ్యర్థాల రీసైక్లింగ్, సౌర విద్యుత్ వంటి సౌకర్యాలు ఉండే గ్రీన్ గిడ్డంగులకు ఆదరణ క్రమంగా పెరుగుతోంది. సమర్థవంతమైన ఇంధన వినియోగం, వ్యర్థాలు, కార్బన్ ఉద్గారాలు తగ్గించే పర్యావరణ ఉత్పత్తులు, పునరుత్పాదక శక్తి, ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్, స్మార్ట్ బిల్డింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్, తాపన/శీతలీకరణ అవసరాలను తగ్గించేందుకు మెరుగైన ఇన్సులేషన్, సహజ కాంతి, వెంటిలేషన్ను వినియోగించే వీలు కల్పించే నిర్మాణ సామగ్రి, డిజైన్లను ఉపయోగించడం వంటి స్థిరమైన, పర్యావరణ అనుకూల విధానాలకు ప్రాధాన్యత ఇచ్చే గిడ్డంగులకు ఉజ్వల భవిష్యత్తు ఉండనుంది. పర్యావరణ, సామాజిక, పాలన(ఈఎస్జీ)లకు ప్రాధాన్యత ఇచ్చే దీర్ఘకాలిక పెట్టుబడుల ప్రాపర్టీగా గ్రీన్ గిడ్డంగులు ఆకర్షణగా నిలుస్తాయని ఓ కన్సల్టెన్సీ నివేదిక వెల్లడించింది. – సాక్షి, సిటీబ్యూరోపెరిగిన దేశీయ వినియోగం, మెరుగైన స్థూల ఆర్థిక స్థిరత్వం, సులువైన రుణ ప్రక్రియలతో ఈ ఏడాది గిడ్డంగులు, లాజిస్టిక్స్ రంగంలో డిమాండ్ అధికమైంది. పరిశ్రమ అంచనాల ప్రకారం 2026లో ఈ రంగం వార్షిక శోషణ 4–4.5 కోట్ల చ.అ.లకు చేరుకుంటుంది. మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్లు, ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు, ఇండస్ట్రియల్ నోడ్స్ సహా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం నిరంతరం దృష్టి సారించడంతో ఈ రంగం నిర్మాణాత్మకంగా అభివృద్ధి చెందుతుంది.పట్టణాల్లోనూ.. తయారీ ఆధారిత డిమాండ్, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం(పీఎల్ఐ) పథకాలు, చైనా+1 వ్యూహం వంటి చొరవలతో ఈ రంగానికి మద్దతు లభిస్తుంది. దీంతో పెద్ద ఫార్మాట్, గ్రేడ్–ఏ గిడ్డంగులు, పారిశ్రామిక సౌకర్యాలకు ఆదరణ పెరుగుతుంది. మరోవైపు ఈ–కామర్స్ వినియోగం పెరగడం, మెరుగైన మౌలిక సదుపాయాలు, అందుబాటులో భూముల ధరలు ఉండటం, వేగవంతమైన నిర్మాణ అనుమతులు తదితర కారణాలతో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు కూడా గిడ్డంగులు, లాజిస్టిక్స్ రంగానికి కీలక వృద్ధి కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయి.హైదరాబాద్లో.. గత ఏడాది దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో 3.87 కోట్ల చ.అ. గిడ్డంగుల స్థలం లీజుకు పోయింది. 2024లో జరిగిన 4.49 కోట్ల చ.అ.లతో పోలిస్తే ఇది 14 శాతం తక్కువ. బెంగళూరు, చెన్నై మినహా అన్ని నగరాల్లోనూ వేర్హౌస్ లీజులు క్షీణించాయి. 2025లో అత్యధికంగా ముంబైలో 1.52 కోట్ల చ.అ. వేర్హౌస్ స్థలం లావాదేవీలు జరిగాయి. హైదరాబాద్లో 22 లక్షల చ.అ. స్పేస్ లీజుకు పోయింది. 2024లో నగరంలో 32 లక్షల చ.అ. లీజులతో పోలిస్తే ఏడాదిలో ఏకంగా 31 శాతం లావాదేవీలు తగ్గాయి. దేశీయ స్థాయిలో గిడ్డంగుల లావాదేవీలలో నగరం వాటా 2024లో 7 శాతంగా ఉండగా.. 2025 నాటికి 6 శాతానికి తగ్గింది. లీజు కార్యకలాపాలు మందకొడిగా ఉన్నప్పటికీ నగరంలో గిడ్డంగుల అద్దెలు మాత్రం ఏడాదిలో 10 శాతం పెరిగాయి. ప్రస్తుతం నెలకు చ.అ.కు రూ.20.8గా ఉంది. -
‘ఐటీ వాళ్లు వేరే పని వెతుక్కోవాల్సిందే’
ఐటీ ఉద్యోగుల భవిష్యత్తుపై ఆన్లైన్లో కొత్త చర్చను రేకిత్తించారు జోహో కోఫౌండర్ శ్రీధర్ వెంబు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడళ్లు కోడ్ రాయడంలో వేగంగా పురోగతి సాధిస్తున్న నేపథ్యంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ల పాత్రపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.ఒక్క లైన్ కోడ్ కూడా రాయకుండా ఏఐ సహాయంతో భగవద్గీత యాప్ను అభివృద్ధి చేసిన విషయంపై ‘ఎక్స్’ (ట్విట్టర్)లో వచ్చిన ఒక పోస్ట్కు స్పందించిన వెంబు, “కోడ్ రాయడంపై ఆధారపడి బతుకుతున్నవారు ప్రత్యామ్నాయ జీవనోపాధుల గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది” అని అన్నారు. ఇది తనకు కూడా వర్తిస్తుందన్న ఆయన, ఇది భయాందోళనలతో కాకుండా ప్రశాంతంగా అంగీకరించాల్సిన వాస్తవమని పేర్కొన్నారు.“ఆ పోస్ట్లో చెప్పింది కేవలం భగవద్గీత యాప్ మాత్రమే కాదు. ఆంథ్రోరోపిక్ (Anthropic) సంస్థ వారి క్లాడ్ ఏఐ (Claude AI)తో మొత్తం సీ కంపైలర్ను నిర్మించింది. ఇదేదో చిన్న ఇంజినీరింగ్ ఫీట్ కాదు” అని వెంబు రాసుకొచ్చారు.ప్రపంచం వేగంగా మారుతున్న నేపథ్యంలో, ఏఐ విప్లవం భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థను ఎలా రూపుదిద్దుతుందన్న విషయంపై గూగుల్ జెమినీ చాట్బాట్తో తాను లోతైన చర్చ నిర్వహించానని వెంబు వెల్లడించారు. ఆ సంభాషణలో, కార్మికుల అవసరం తగ్గిన తర్వాతి ఆర్థిక వ్యవస్థ (post-labor economy)లో సమాజం ఎలా అభివృద్ధి చెందగలదో చర్చించడమే కాకుండా, ఏఐ తన సొంత సమాధానాలను కూడా విమర్శించవచ్చంటూ సవాలు చేసినట్లు చెప్పారు.ఈ సంభాషణల ఆధారంగా, భవిష్యత్తు రెండు విధాలుగా ఉండవచ్చని వెంబు అభిప్రాయపడ్డారు. ఏఐపై యాజమాన్యం ఎవరి చేతిలో ఉంటుందన్నదే కీలకమని పేర్కొంటూ టెక్నాలజీ మానవ జీవితంలో ఒక చిన్న భాగంగా మాత్రమే ఉండి, మనుషులకు కుటుంబం, ప్రకృతి, కళ, సంగీతం, సంస్కృతి, క్రీడలు, పండుగలు, విశ్వాసంపై ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఇస్తుందని ఆశావాద దృక్కోణంలో చెప్పుకొచ్చారు. ఇక నిరాశావాద దృక్కోణంలో.. ఈ టెక్నాలజీ ‘కేంద్రీకృత నియంత్రణ’కు దారి తీస్తుందని హెచ్చరించారు.శ్రీధర్ వెంబు చేసిన ఈ వ్యాఖ్యలు వెంటనే వైరల్గా మారాయి. సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది వెంబు అంచనాలతో ఏకీభవించగా, మరికొందరు విభేదిస్తూ ఏఐ కోడింగ్ మానవ మేధస్సుకు ముగింపు కాదని వాదించారు.Examples are now pouring in about AI-assisted Code Engineering productivity. The quoted post is a Bhagwad Gita app. Anthropic has built an entire C compiler with their Claude AI. That is not an easy engineering feat at all.At this point, it is best for those of us who… https://t.co/KbgVX8G9nU— Sridhar Vembu (@svembu) February 6, 2026 -
పసిడి ఆశలకు బ్రేక్.. మళ్లీ రేటెక్కిన బంగారం
వరుస తగ్గుదలతో ఆనందంలో ఉన్న పసడి ప్రియుల ఆశలకు బ్రేక్ పడింది. బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో మార్పులు వస్తున్నాయి. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
శంషాబాద్కు కొత్త ఫేమ్.. ఇక మరో రియల్ ఎస్టేట్ బూమ్!
భాగ్యనగరానికి దక్షిణ ద్వారంగా పిలిచే శంషాబాద్.. ఇకముందు దేశానికే ఏరోట్రోపోలిస్ హబ్గా నిలవనుంది. బెంగళూరు, చెన్నై, పుణె, ముంబై.. దేశంలోని నాలుగు మెట్రోపాలిటన్ సిటీలను కలిపే ఏకైక హైస్పీడ్ రైల్వే కారిడార్ నగరంగా శంషాబాద్ అభివృద్ధి చెందనుంది. ఇక్కడ హైస్పీడ్ టరి్మనల్ ఏర్పాటు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటనతో.. శంషాబాద్ ఇక శివారు ప్రాంతం కాదు.. దక్షిణ భారత ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బిందువుగా మారనుంది. – సాక్షి, సిటీబ్యూరోఇప్పటికే రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతో ఏరోస్పేస్ హబ్గా అభివృద్ధి చెందిన శంషాబాద్.. తాజా ప్రకటనతో అటు ఏరోస్పేస్, ఇటు ట్రయిన్ నెట్వర్క్ మిశ్రమంతో ఏరోట్రోపోలిస్ హబ్గా శంషాబాద్ అభివృద్ధి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. ఏ నగరంలోనైనా సరే రోడ్డు కనెక్టివిటీ ఉన్న ప్రాంతం సాధారణంగానే శరవేగంగా అభివృద్ధి చెందుతుంది.కానీ, శంషాబాద్ ప్రాంతానికి మెరుగైన రోడ్లతో పాటు విమానయానం, రైలు మార్గం.. అన్ని రకాల మెరుగైన రవాణా సదుపాయాలతో అనుసంధానమై ఉన్నాయి. అంతేకాదు శంషాబాద్కు తెలంగాణలోని సగానికి పైగా జిల్లాలతో అనుసంధానమైన ఔటర్ రింగ్ రోడ్డు కనెక్టివిటీ కూడా ఉంది. అలాగే భవిష్యత్తులో మెట్రో రైలు, రీజినల్ రింగ్ రోడ్(త్రిబుల్ ఆర్)తో కూడా అనుసంధానమవుతుంది.ఐటీ హబ్లతో అనుసంధానం.. దేశంలో అత్యంత రద్దీగా ఉండే ఎయిర్పోర్ట్లలో రాజీవ్గాంధీ విమానాశ్రయం ఒకటి. ఇక్కడి నుంచి సుమారు వందకు పైగా నగరాలు అనుసంధానమై ఉన్నాయి. ఏటా 2.7 కోట్లకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇటీవలే ప్రభుత్వం శంషాబాద్ వరకూ మెట్రో విస్తరించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రధాన నగరంతో పాటు గచ్చిబౌలి, హైటెక్ సిటీ వంటి ఐటీ కేంద్రాలకు ప్రయాణం సులువవుతుంది.విమానాశ్రయ కారిడార్ సమీపంలోని ఇళ్లు, హోటళ్లు, వాణిజ్య ప్రాపర్టీలకు డిమాండ్ ఏర్పడుతోంది. అలాగే దేశంలోని ప్రధాన ఐటీ హబ్లైన బెంగళూరు, చెన్నై, పుణె, హైదరాబాద్ నగరాలను ఈ హైస్పీడ్ రైలు అనుసంధానించనుంది. ఐటీ ఉద్యోగులు ఒకే పని దినంలో ఒక నగరం నుంచి మరొక నగరానికి సులువుగా రాకపోకలు సాగించే వీలుంటుంది. తద్వారా విద్య, వైద్యం, పర్యాటక రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయి.ఈ ప్రాంతాలకు డిమాండ్.. 2–3 ఏళ్లలో శంషాబాద్, ఔటర్ వెంట ఉన్న ప్రాంతాలలో భూముల ధరలు 15–25 శాతం మేర పెరిగాయి. విమానాశ్రయం, గిడ్డంగులు, లాజిస్టిక్ హబ్లు, ప్రతిపాదిత మెట్రో మార్గానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందాయి. తాజా ప్రకటనతో శంషాబాద్ నుంచి 20 కి.మీ. దూరంలో ఉన్న ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మణికొండ, హైటెక్ సిటీ, కోకాపేట ప్రాంతాలలో భారీ నివాస సముదాయాలు వస్తాయి.సమగ్ర అభివృద్ధి దిశగా..ఈ ప్రాంతంగా అభివృద్ధి చెందాలంటే కేవలం హైరైజ్ అపార్ట్మెంట్లు వస్తే చాలదు. ఆస్పత్రులు, పాఠశాలలు, రిటైల్, ఇతర పౌర సౌకర్యాలు కూడా అదే స్థాయిలో రావాల్సిన అవసరం ఉంది. లేకపోతే రోజువారీ అవసరాల కోసం ప్రధాన నగరంపై ఆధారపడాల్సి వస్తుంది. దీంతో ఒత్తిడి పెరుగుతుంది.ప్రస్తుతం శంషాబాద్లో అపార్ట్మెంట్ల ధరలు చ.అ.కు రూ.6–8 వేలుగా ఉండగా.. భూముల ధరలు గజానికి రూ.55–60 వేలుగా ఉన్నాయి. ఇప్పటికే ప్రధాన సంస్థలు శాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణం కోసం శంషాబాద్, చుట్టు పక్కల ప్రాంతాల వైపు దృష్టిసారించాయి. 2027 నాటికి ఏటా 10–17 శాతం వృద్ధి చెందే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.సీ–సూట్ ట్రాన్సిట్ ఆఫీస్గా..స్థిరాస్తి రంగంలో పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు కనెక్టివిటీకి అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఏరోట్రోపోలిస్ హబ్తో శంషాబాద్ ఒక ప్రత్యేకమైన ఆర్థిక ఇంజిన్ను సృష్టిస్తుంది. ఇతర మెట్రో నగరాలకు ప్రయాణ సమయం తగ్గుతుండటంతో ఈ ప్రాంతం ఎగ్జిక్యూటివ్లకు, కార్పొరేట్లకు సీ–సూట్కు ట్రాన్సిట్ ఆఫీస్గా మారుతుంది. ఫైవ్స్టార్ హాస్పిటాలిటీ, కన్వెన్షన్ సెంటర్లకు డిమాండ్ ఏర్పడుతుంది. అలాగే మెరుగైన రవాణా సదుపాయాలతో ఏవియేషన్, ఫార్మా వంటి పారిశ్రామిక కారిడార్లు, లగ్జరీ రెసిడెన్షియల్ క్లస్టర్లుగా అభివృద్ధి చెందుతాయి. -
వచ్చే నెలలో ఆడి కొత్త స్పోర్ట్స్ కార్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే నెలలో భారత్లో కొత్త స్పోర్ట్స్ కారును ప్రవేశపెట్టడం ద్వారా తమ పోర్ట్ఫోలియోను మరింత పటిష్టం చేసుకోనున్నట్లు లగ్జరీ కార్ల దిగ్గజం ఆడి ఇండియా బ్రాండ్ డైరెక్టర్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. రూపాయి క్షీణత పరిణామాల నేపథ్యంలో కార్ల రేట్లను మరోసారి పెంచే అవకాశం ఉందన్నారు.ప్రోగ్రెసివ్ షోరూమ్ కాన్సెప్ట్ కింద శుక్రవారమిక్కడ ఆడి హైదరాబాద్ సెంట్రల్ షోరూమ్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు వివరించారు. హైదరాబాద్లో ఇది తమకు రెండో షోరూమ్ అని, జాతీయ సగటుకన్నా రెట్టింపుగా తెలంగాణలో తమకు 8–10% స్థాయిలో మార్కెట్ వాటా ఉంటోందని బల్బీర్ సింగ్ తెలిపారు.నగరంలో లగ్జరీ కార్ల సెగ్మెంట్ గణనీయంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో కస్టమర్లకు సరీ్వసులు అందించడంపై దృష్టి పెట్టనున్నట్లు డీలర్ ప్రిన్సిపల్ వికాస్ చౌదరి, వీవీసీ గ్రూప్ చైర్మన్ వీవీ రాజేంద్ర ప్రసాద్ చౌదరి తెలిపారు. -
కరుగుతున్న వెండి.. బంగారం
న్యూఢిల్లీ: వెండి, పసిడిలో లాభాల స్వీకరణ కొనసాగడంతో ధరలు వరుసగా రెండో రోజూ తగ్గాయి. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో వెండి కిలో రేటు రూ.13,000 (5 శాతం) తగ్గి రూ. 2,55,000కు దిగివచ్చింది. అటు 99.9 శాతం స్వచ్ఛత గల పసిడి ధర రూ. 3,400 (2 శాతం) క్షీణించి రూ. 1,57,200కి తగ్గింది.అయితే అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో ఔన్సు (31.1 గ్రాములు) సిల్వర్ ధర 3.02 డాలర్లు పెరిగి 74 డాలర్లకు చేరింది.ఇంట్రాడేలో 10 శాతం పతనమై 64.08 డాలర్ల స్థాయిని కూడా తాకింది. అటు ఇంట్రాడేలో 4,654.86 డాలర్ల కనిష్టాన్ని తాకిన బంగారం తర్వాత 106.74 డాలర్లు పెరిగి 4,887.30 డాలర్లకు ఎగిసింది. -
రేట్లకు బ్రేక్.. వృద్ధే టార్గెట్ రెపోరేటు యథాతథం
ముంబై: అంచనాలకు అనుగుణంగా కీలక పాలసీ రేట్లలో ఎలాంటి మార్పులకు వెళ్లకుండా, ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ యథాతథ స్థితినే కొనసాగించింది. బడ్జెట్లో మూలధన వ్యయాలు పెంచడంతో వృద్ధిపై విశ్వాసం వ్యక్తం చేస్తూ, ద్రవ్యోల్బణం నియంత్రణల్లోనే ఉంటుందన్న అంచనాలు వ్యక్తం చేస్తూ.. అంతర్జాతీయంగా అనిశి్చతుల నేపథ్యంలో రెపో రేటు తగ్గింపు చేపట్టకుండా తటస్థ వైఖరిని కొనసాగిస్తూ నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ అంచనాలను పెంచింది. బ్యాంకు కస్టమర్లు మోసపోతే తక్షణ పరిహారం కింద రూ.25 వేలు ఇవ్వాలని నిర్ణయించడం ఖాతాదారులకు ఊరటనిచ్చేది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లకు (రీట్లు) సైతం బ్యాంక్ల నుంచి రుణ వితరణకు పచ్చజెండా ఊపింది. ఎంఎస్ఈలకు పూచీకత్తులేని రుణ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచడం మరో కీలక నిర్ణయం. అలాగే, కొన్ని రకాల ఎన్బీఎఫ్సీలకు సైతం నిబంధనల పరంగా వెసులుబాటు కల్పించింది.పాలసీలోని ముఖ్యాంశాలు..→ రెపో రేటును (ఆర్బీఐ నుంచి బ్యాంక్లు తీసుకునే నిధులపై వసూలు చేసే రేటు) 5.25 శాతం వద్దే కొనసాగించాలని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన గల ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా నిర్ణయించింది. గత డిసెంబర్ సమీక్షలో రెపో రేటును ఆర్బీఐ పావు శాతం తగ్గించడం తెలిసిందే. అంతేకాదు 2025 ఫిబ్రవరి నుంచి మొత్తం మీద రెపో రేటును 125 బేసిస్ పాయింట్లు (1.25 శాతం) తగ్గించడం గమనార్హం. రివర్స్ రెపో (బ్యాంకుల నుంచి ఆర్బీఐ తీసుకునే నిధులపై చెల్లించే రేటు) రేటు 3.35 శాతంగా కొనసాగనుంది. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్డీఎఫ్) 5 శాతం, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్) 5.50 శాతం రేట్లలోనూ మార్పు చేయలేదు.→ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26)లో 2.1 శాతంగా (గత అంచనా 2 శాతం) కొనసాగుతుందని ఆర్బీఐ ఎంపీసీ పేర్కొంది. 4 శాతానికి పరిమితం చేయాలన్నది ఆర్బీఐ లక్ష్యం. 2025–26 క్యూ4లో 3.2 శాతం (గత అంచనా 2.9 శాతం), 2026–27 క్యూ1లో 4 శాతానికి, 2026–27 క్యూ2లో 4.2 శాతానికి పెరుగుతుందని అంచనాలకు వచి్చంది. 2026–27 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనాలను తదుపరి ఏప్రిల్ సమీక్ష సందర్భంగా ప్రకటిస్తామని ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా తెలిపారు.→ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాలను 7.3 శాతం నుంచి 7.4 శాతానికి ఆర్బీఐ ఎంపీసీ పెంచింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2026–27) క్యూ1 (ఏప్రిల్–జూన్), క్యూ2 (జూలై–సెప్టెంబర్) వృద్ధి అంచనాలను 6.8 శాతం నుంచి 6.9 శాతానికి సవరించింది. రియల్ జీడీపీ సిరీస్ను ఈ నెల చివర్లో విడుదల చేయనుండడంతో పూర్తి ఆర్థిక సంవత్సరం జీడీపీ అంచనాలను ఏప్రిల్లో ప్రకటిస్తామని మల్హోత్రా పేర్కొన్నారు. → సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఈ) ఆర్థిక భరోసా కల్పిస్తూ పూచీకత్తు లేని రుణ పరిమితిని ప్రస్తుతమున్న రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచింది. 2026 ఏప్రిల్ 1 నుంచి కొత్తగా తీసుకునే రుణాలతోపాటు గత రుణాల పునరుద్ధరణలకూ ఇది వర్తిస్తుంది.→ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లకు (రీట్లు) బ్యాంకుల రుణ వితరణను అనుమతించే ప్రతిపాదనను ఆర్బీఐ ఎంపీసీ తీసుకొచి్చంది. రియల్ ఎస్టేట్ రంగానికి మరింత రుణ వితరణను ప్రోత్సహించేందుకు వీలుగా కొన్ని రక్షణ చర్యలతో రీట్లకు బ్యాంకుల రుణాలను అనుమతించే ప్రతిపాదన చేసింది. → కార్పొరేట్ బాండ్ల మార్కెట్ను మరింత విస్తృతం చేసేందుకు వీలుగా.. 2026–27 బడ్జెట్ ప్రకటనకు అనుగుణంగా, కార్పొరేట్ బాండ్ సూచీల డెరివేటివ్స్కు నియంత్రణ పరమైన కార్యాచరణను ఆర్బీఐ విడుదల చేయనుంది. → తదుపరి ఆర్బీఐ ఎంపీసీ భేటీ ఏప్రిల్ 6 నుంచి 8 వరకు జరుగుతుంది. ఎన్బీఎఫ్సీలకు వెన్నుదన్నురూ.1,000 కోట్ల కంటే తక్కువ ఆస్తులున్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు), ప్రజల నుంచి నిధులు సమీకరించని వాటిని కొన్ని షరతుల మేరకు తప్పనిసరి రిజి్రస్టేషన్ నుంచి మినహాయింపు కల్పించాలని ఆబీఐ ఎంపీసీ ప్రతిపాదించింది. బంగారంపై రుణాలు ఇచ్చే ఎన్బీఎఫ్సీలు–ఇన్వెస్ట్మెంట్ అండ్ క్రెడిట్ కంపెనీలు (ఐసీసీలు), 1,000 శాఖలకు మించి ఉన్నవి కొత్త శాఖల విస్తరణకు ఇకపై ఆర్బీఐ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక బంగారం రుణాల విషయంలో ఎంలాంటి ఆందోళనల్లేవని, సౌకర్యంగానే ఉన్నామని ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా స్పష్టం చేశారు. ఆస్తుల లోన్ టు వ్యాల్యూ (ఎల్టీవీ/ బంగారం ధరపై రుణ వితరణ) తాము నిర్దేశించిన పరిమితులకు దిగువనే ఉన్నట్టు చెప్పారు. బంగారంపై రుణాలు సహా ఎన్బీఎఫ్సీల రుణాల పోర్ట్ఫోలియోలను ఆర్బీఐ సమీక్షించినట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 2026–27లో రుణ సమీకరణను రూ.17.2 లక్షల కోట్లకు పెంచడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న క్రమంలో.. నికర రుణ సమీకరణను చూడాలని సూచించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే రూ.20,000 కోట్లే ఎక్కువన్నారు.డిజిటల్ మోసాలకు పరిహారంబ్యాంక్ కస్టమర్ ప్రమేయంతో, ఓటీపీ తెలుసుకుని లేదా కస్టమర్ ప్రమేయం లేకుండా జరిగే డిజిటల్ మోసాల్లో ఎలాంటి ప్రశ్నలు లేకుండా బ్యాంక్ రూ.25,000ను పరిహారం కింద చెల్లిస్తుంది. కాకపోతే కస్టమర్ ఉద్దేశపూర్వక పాత్ర ఉండకూడదు. కస్టమర్ తన వంతుగా 15 శాతం నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. ఒకవేళ అధిక విలువ కలిగిన మోసాల్లో పరిహారం రూ.25 వేలకు పరిమితం అవుతుంది. డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ నుంచి ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. -
బంగారం ధరల్లో మార్పు!.. స్వల్ప వ్యవధిలోనే..
బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారిపోతూ.. పసిడి ప్రియులలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఉదయం కనిపించిన రేటు, సాయంత్రానికి మారిపోతోంది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లోని లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనే విషయం చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ఉదయం రూ. 1,39,650 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. సాయంత్రానికి 1,40,900 రూపాయల వద్దకు చేరింది. అదే విధంగా రూ. 1,53,710 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. 1,53,710 రూపాయల వద్ద నిలిచింది. దీన్ని బట్టి చూస్తే.. గంటల వ్యవధిలో బంగారం రేటు ఎలా మారిపోయిందో స్పష్టంగా అర్థమవుతోంది.ఢిల్లీలో కూడా బంగారం ధరలలో స్వల్ప మార్పులు జరిగాయి. 1,39,800 రూపాయల నుంచి 22 క్యారెట్ల తులం గోల్డ్ రూ. 1,41,050 వద్దకు చేరింది. 24 క్యారెట్ల పసిడి కూడా రూ. 1,52,500 నుంచి 1,53,860 రూపాయల వద్దకు చేరింది.ఇక చెన్నై విషయానికి వస్తే.. ఇక్కడ కూడా గోల్డ్ రేటు మారింది. ఉదయం 1,41,200 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల తులం పసిడి ధర సాయంత్రానికి రూ. 1,42,500 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1,54,040 రూపాయల వద్ద నుంచి రూ. 1,55,460కు చేరింది. అయితే వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ రేటు రూ. 2.80 లక్షల వద్ద ఉంది. -
లక్ష బుకింగ్స్.. ఈ కారుకు ఫుల్ డిమాండ్!
టాటా మోటార్స్ ఇటీవల ప్రారంభించిన సియెర్రా.. ఏకంగా లక్ష కంటే ఎక్కువ బుకింగ్స్ సొంతం చేసుకుంది. దీంతో సంస్థ డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తిని, సరఫరాను పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించింది.టాటా సియెర్రా కోసం బుకింగ్స్ ప్రారంభమైన మొదటి రోజే 70వేల బుకింగ్స్ లభించాయి. ఆ తరువాత కూడా బుకింగ్స్ పెరుగుతూ లక్ష దాటేసిందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ శైలేష్ చంద్ర పేర్కొన్నారు. బుక్ చేసుకున్నవారికి తొందరగా డెలివరీలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.మార్కెట్లో లాంచ్ అయిన టాటా సియెర్రా ప్రారంభ ధర రూ. 11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది నాలుగు వేరియంట్లు, మూడు పవర్ ట్రెయిన్ ఆప్షన్లు, ఆరు కలర్ స్కీంలలో లభిస్తుంది. వాహన కొనుగోలు కోసం డిసెంబర్ 16 నుంచి బుకింగ్స్ ప్రారంభమ్యాయి.సియెర్రా క్యాబిన్ కర్వ్వి మాదిరిగానే ఉంటున్నప్పటికీ.. టాటా డిజైన్ లాంగ్వేజ్కు ట్రిపుల్-స్క్రీన్ లేఅవుట్, సౌండ్ బార్తో 12-స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, హెచ్యూడీ, సెంటర్ కన్సోల్ వంటి వాటిలో కొత్తదనాన్ని జోడిస్తుంది. డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, లెవల్ 2 ADAS, 360-డిగ్రీల కెమెరా, పవర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. ఐకానిక్ ఆల్పైన్ పైకప్పును ఆధునిక కాలానికి అనుగుణంగా మార్పు చేశారు. సన్ రూఫ్ కాస్త విశాలంగా ఇచ్చారు.టాటా సియెర్రా అన్ని వెర్షన్లలో ఆరు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇది 4.6 మీటర్ల వీల్ బేస్ తో 2.7 మీటర్ల వీల్ బేస్ ను కలిగి ఉంటుంది. టాటా సియెర్రా ఆరు ఎక్స్టీరియర్, మూడు ఇంటీరియర్ కలర్ స్కీమ్లలో వస్తోంది. -
మీ దగ్గరున్న వెండి స్వచ్ఛమైనదా, కాదా?: తెలుసుకోండిలా..
వెండి ధరలు గణనీయంగా పెరిగి.. కేజీ రేటు రూ.3 లక్షలకు చేరింది. ఇలాంటి సమయంలో కొంతమంది వ్యాపారస్తులు నకిలీ వెండి లేదా ఇతర మిశ్రమాలు ఎక్కువగా కలిసి ఉండే సిల్వర్ విక్రయించే అవకాశం ఉంటుంది. ఇలా జరిగినప్పుడు మీరు కొన్నది నిజమైనదా.. కాదా? తెలుసుకోవడం కష్టం అనుకోవచ్చు. కానీ.. కొన్ని చిట్కాల ద్వారా ఇంట్లోనే వెండిని టెస్ట్ చేసుకోవచ్చని బహుశా చాలామందికి తెలిసుండకపోవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. మ్యాగ్నెట్ టెస్ట్: నిజమైన వెండిని మ్యాగ్నెట్ను ఆకర్శించదు. ఒకవేలా మ్యాగ్నెట్ వెండిని లేదా వెండి వస్తువును ఆకర్శించిందంటే.. అది నిజమైన వెండి కాదు. అయితే ఈ పరీక్షతోనే దానిని ప్యూర్ సిల్వర్ అని నిర్దారించలేము. మరిన్ని టెస్టులు చేయాల్సి ఉంది. ఇది ఒక బేసిక్ టెస్ట్ మాత్రమే.ఐస్ టెస్ట్: ఇది నిజమైన వెండిని గుర్తించడానికి చేసే మరో టెస్ట్. సిల్వర్ అనేది మంచి ఉష్ణ వాహకం (హీట్ కండక్టర్). ఐస్ మీద వెండిని ఉంచినప్పుడు.. అది వెంటనే కరిగితే అలాంటి వెండి నిజమైనదని, ఒకవేలా ఐస్ నెమ్మదిగా కరిగితే అందులో ఇతర మిశ్రమాలు కలిసి ఉన్నయనడానికి సూచన.స్మెల్ టెస్ట్ (వాసన ద్వారా టెస్ట్): నిజమైన వెండికి ప్రత్యేకమైన వాసన ఉండదు. సిల్వర్ వస్తువును తేలికగా రుద్ది మీ ముక్కు దగ్గరకు తీసుకువచ్చినప్పుడు.. ఏదైనా వాసన వస్తే.. అందులో ఇతర మిశ్రమాలు ఉన్నట్లు. రాగి లేదా ఇతర లోహాలను కలిపినప్పుడే వెండికి ఒక స్మెల్ వస్తుంది. దీని ద్వారా కూడా నిజమైన వెండిని గుర్తించవచ్చు.క్లాత్ టెస్ట్: వెండిని శుభ్రమైన తెల్లటి వస్త్రంతో సున్నితంగా రుద్దండి. ఆక్సీకరణ కారణంగా నిజమైన వెండి మందమైన నలుపు లేదా బూడిద రంగు గుర్తులను ఏర్పరుస్తుంది. ఎటువంటి గుర్తు కనిపించకపోతే.. అలాంటిది మిశ్రమం కలిసి ఉండొచ్చు అని అర్థం చేసుకోవాలి.వాటర్ టెస్ట్: సాధారణంగా వెండి కొంత బరువుగా ఉంటుంది. కాబట్టి దీనిని నీటిలో వేయగానే వేగంగా కిందికి వెళ్తుంది. ఒకవేలా వేగంగా కిందికి వెళ్లకపోతే.. అది నకిలీదని గుర్తించాలి. వెండిలో కొన్ని లోహాలు కలిసి ఉన్నప్పుడే.. అది నెమ్మదిగా నీటి అడుగు భాగానికి చేరుకుంటుంది.సౌండ్ టెస్ట్: వెండిని ఇతర మెటల్ వస్తువుతో తాకినప్పుడు.. ఎక్కువ శబ్దం చేస్తుంది. నకిలీ వెండి అయితే.. సున్నితమైన శబ్దం చేస్తుంది.వెండి ధరలు భారీగా పెరుగుతున్న సమయంలో కొనుగోలుదారులు.. సిల్వర్ కొనే ఆతృతలో పెద్దగా జాగ్రత్తలు తీసుకోకపోవచ్చు. ఇలాంటి సమయంలోనే.. విక్రయదారులు వారిని మోసం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి స్వచ్ఛమైన వెండిని.. వివిధ రకాలుగా టెస్ట్ చేసి, అది నిజమైనదా.. కాదా? అని తెలుసుకోవచ్చు.వెండికి హాల్ మార్క్భారతదేశంలో బంగారు ఆభరణాలు మాత్రమే కాకుండా.. వెండికి కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ కారణంగానే సిల్వర్ రేటు కూడా భారీగా పెరిగింది. ఇలాంటి సమయంలో కొంతమంది నకిలీ లేదా కల్తీ వెండి ఆభరణాలను విక్రయించే అవకాశం ఉంటుంది. ఈ మోసాల నుంచి వినియోగదారులను కాపాడటానికి వెండి ఆభరణాలకు కూడా హాల్ మార్క్ అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.ఇదీ చదవండి: ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో ఆందోళన.. మైఖేల్ బరీ హెచ్చరిక!బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెండి ఆభరణాలకు 900, 800, 835, 925, 970, 990 వంటి స్వచ్ఛత స్థాయిలను బట్టి ప్రత్యేకమైన 6 అంకెల హాల్మార్క్ సంఖ్యతో హాల్మార్క్ చేయడానికి మార్గదర్శకాలను జారీ చేసింది. హాల్మార్కింగ్ ప్రవేశపెట్టిన తరువాత వినియోగదారులు కూడా స్వచ్ఛమైన వెండిని కొనుగోలు చేయవచ్చు.హాల్మార్కింగ్ అంటే: బంగారు, వెండి వంటి విలువైన లోహాలతో చేసిన వస్తువుల స్వచ్ఛతను, నాణ్యతను ధృవీకరించే ప్రక్రియ. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తుంది. హాల్మార్క్ చేసిన వస్తువులు నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని స్పష్టం చేస్తుంది. తద్వారా నాణ్యమైన ఆభరణాలను కొనుగోలు చేయవచ్చు. -
ఒప్పో కొత్త స్మార్ట్ఫోన్: ధర ఎంతంటే?
స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో ఇండియా తాజాగా రెనో 15సీ ఫోన్ని ఆవిష్కరించింది. ట్రావెలర్లు, క్రియేటర్లు, ఫొటోగ్రఫీపై మక్కువ గల వారి కోసం దీన్ని తెచ్చినట్లు తెలిపింది. ఇందులో 7000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80వాట్స్ సూపర్వూక్ ఫాస్ట్ చార్జింగ్, 6.57 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, 50 ఎంపీ అల్ట్రా క్లియర్ మెయిన్ కెమెరా, తదితర ఫీచర్లు ఉన్నాయి. ధర రూ. 34,999 నుంచి ప్రారంభమవుతుంది.ఒప్పో రెనో 15c ఫిబ్రవరి 5 నుంచి భారతదేశంలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఇది ఆఫ్టర్గ్లో పింక్ & ట్విలైట్ బ్లూ అనే రెండు రంగు ఎంపికలలో లభిస్తుంది. 8GB RAM & 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 34,999 కాగా.. 12GB RAM & 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 37,999. ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఒప్పో ఆన్లైన్ స్టోర్, ఆఫ్లైన్ రిటైల్ అవుట్లెట్ల ద్వారా అమ్మకానికి ఉంది.కెమెరాల విషయానికొస్తే.. రెనో 15c 50MP మెయిన్ రియర్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP మాక్రో సెన్సార్తో వస్తుంది. ముందు భాగంలో 50MP అల్ట్రా-వైడ్ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ ముందు & వెనుక కెమెరాలలో 4K వీడియో రికార్డింగ్కు సపోర్ట్ చేస్తుంది. -
అందుకే.. అమెజాన్ 200 బిలియన్ డాలర్ల పెట్టుబడి!
కృత్రిమ మేధస్సు (AI), రోబోటిక్స్, కస్టమ్ చిప్స్, లో-ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ వంటి సాంకేతిక రంగాల్లో.. అమెజాన్ దాదాపు 200 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ ఖర్చు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే.. 50 శాతం కంటే ఎక్కువ కావడం గమనార్హం.అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ యాజమాన్యంలోని.. ది వాషింగ్టన్ పోస్ట్ తన ఉద్యోగులలో దాదాపు మూడింట ఒక వంతు మందిని తొలగించాలని తన నిర్ణయాన్ని వెల్లడించిన ఒక రోజు తర్వాత ఈ భారీ పెట్టుబడికి సంబంధించిన ప్రకటన వచ్చింది. కాగా సంస్థ నాల్గవ త్రైమాసిక ఆదాయం 14 శాతం పెరిగినట్లు వెల్లడించింది.పెట్టుబడికి సంబంధించిన విషయాలను గురించి.. అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ మాట్లాడుతూ, ఈ ఖర్చు ప్రధానంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) కోసం ఉపయోగిస్తామని తెలిపారు. AWS అనేది సంస్థలు, ప్రభుత్వాలు, మొబైల్ యాప్స్కు క్లౌడ్ సేవలు అందించే విభాగం. ఇది సంస్థను ఏఐ రంగంలో అగ్రగామిగా నిలబడటానికి ఉపయోగపడుతుందని అన్నారు.ఇదే సమయంలో, ది వాషింగ్టన్ పోస్ట్ తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటోంది. పత్రిక మొత్తం ఉద్యోగుల్లో సుమారు 30 శాతం.. అంటే 300 మందికి పైగా జర్నలిస్టులను తొలగించింది. ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మ్యాట్ ముర్రే ప్రకారం.. పత్రిక చాలాకాలంగా నష్టాల్లో నడుస్తోంది. అందుకే ఈ ఉద్యోగాల తొలగింపు తప్పనిసరి అయిందని ఆయన చెప్పారు.భవిష్యత్తులో పత్రిక జాతీయ వార్తలు, రాజకీయాలు, వ్యాపారం, ఆరోగ్యం వంటి అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టనుంది. కాగా క్రీడలు, పుస్తకాలు వంటి విభాగాలను పూర్తిగా మూసివేయనుంది.. రోజువారీ పాడ్కాస్ట్ 'పోస్ట్ రిపోర్ట్స్' కూడా నిలిపివేయనుంది. -
నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం స్వల్ప నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 266.47 శాతం లాభంతో.. 83,580.40 వద్ద, నిఫ్టీ 50.90 పాయింట్ల లాభంతో 25,693.70 వద్ద నిలిచాయి.నీరాజ్ ఇస్పాత్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఐజెడ్ఎంఓ లిమిటెడ్, అపోలో పైప్స్ లిమిటెడ్, లాయల్ టెక్స్టైల్స్ మిల్స్ లిమిటెడ్, హిటాచీ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. సీఎల్ ఎడ్యుకేట్ లిమిటెడ్, మహేశ్వరి లాజిస్టిక్స్ లిమిటెడ్, ఆశాపురా మినెకెమ్ లిమిటెడ్, సోలారా యాక్టివ్ ఫార్మా సైన్సెస్ లిమిటెడ్, శివ్ ఓమ్ స్టీల్స్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
ఆర్బీఐ కీలక నిర్ణయం.. వారికి పరిహారంగా రూ.25 వేలు!
టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో సైబర్ నేరాలు కూడా ఎక్కువవుతున్నాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టడానికి బ్యాంకులు ప్రజలలో అవగాహన పెంచుతున్నాయి. దీనికోసం బ్యాంకింగ్ సంస్థలు ప్రత్యేకంగా సైబర్ ఫ్రాడ్ ప్రొటెక్షన్ ప్లాన్స్ కూడా తీసుకొస్తున్నాయి. సైబర్ ఇన్యూరెన్స్లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి సమయంలో.. సైబర్ మోసాలకు బాధితులవుతున్న వారికి అండగా నిలిచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక ప్రకటన చేసింది. గవర్నర్ సంజయ్ మల్హోత్రా ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం ముగింపు రోజున ఈ ప్రకటన చేశారు.వినియోగదారుల రక్షణలో భాగంగా.. డిజిటల్ మోసాల వల్ల నష్టపోయిన కస్టమర్లకు తక్షణ ఆర్థిక సాయంగా గరిష్టంగా రూ.25,000 వరకు పరిహారం చెల్లించనున్నట్లు ఆర్బీఐ ప్రతిపాదించింది. త్వరలో దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించి విడుదల చేయనున్నారు. డిజిటల్ చెల్లింపులు వేగంగా విస్తరిస్తున్న ఈ కాలంలో, ఇలాంటి చర్యలు ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇలాంటి సమయాల్లో పరిహారం..బ్యాంకింగ్ సంస్థల నిర్లక్ష్యం లేదా సిస్టం లోపల వల్ల ప్రజలు సైబర్ నేరాలకు గురైతే.. రిజర్వ్ బ్యాంక్ పరిహారం అందించనుంది. అంతే కాకుండా.. చిన్న మొత్తంలో నష్టపోయినవారికి మాత్రమే ఈ పరిహారం అందించడం జరుగుతుంది. భారీ మొత్తంలో సైబర్ మోసాలకు గురైనప్పుడు.. ఈ పరిహారం లభించదు.ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ బీఎల్ఎస్ ఈ సర్వీసెస్ సీఎఫ్ఓ రాహుల్ శర్మ.. చిన్న మోసాల వల్ల కలిగే నష్టాలకు ఈ పరిహారం కొంత ఉపశమనం కలిగిస్తుందని ఆన్నారు. వెల్స్ ఫార్గో మాజీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ గ్లోబల్ బ్యాంకింగ్ లీడర్ సంతాను సెంగుప్తా కూడా ఈ నిర్ణయాన్ని డిజిటల్ ఫైనాన్షియల్ ఎకోసిస్టమ్లో విశ్వాసాన్ని పెంచుతుందని వెల్లడించారు. -
హైదరాబాద్ రియల్ ఎస్టేట్: పెరిగిన ఇళ్ల ధరలు
భారతదేశ గృహ రియల్ ఎస్టేట్ రంగంలో 2025లో ధరల పెరుగుదల గణనీయంగా మందగించింది. దేశంలోని టాప్ ఎనిమిది నగరాల్లో ఇళ్ల సగటు ధరలు 2025లో కేవలం 6 శాతం మాత్రమే పెరిగాయి. కాగా 2024లో ఈ వృద్ధి 17 శాతంగా నమోదైంది. ఈ విషయాన్ని ప్రాప్టైగర్ విడుదల చేసిన ‘రియల్ ఇన్సైట్ – రెసిడెన్షియల్ CY 2025’ నివేదిక వెల్లడించింది.అయితే, అమ్మకాలు తగ్గినప్పటికీ, సరఫరాపై నియంత్రణ, ధరల స్థిరత్వం కారణంగా గృహ మార్కెట్ బలహీనపడలేదని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాలు డిమాండ్ను నిలుపుకొంటూ స్థిరమైన ప్రదర్శన చూపించాయి.హైదరాబాద్లో 8 శాతం ధరల వృద్ధి2025లో హైదరాబాద్లో గృహాల సగటు ధరలు 8 శాతం పెరిగాయి. ఇది బెంగళూరుతో కలిసి దేశంలోనే మెరుగైన పనితీరు చూపిన మార్కెట్లలో ఒకటిగా హైదరాబాద్ను నిలిపింది. ఐటీ, సేవా రంగాల ఆధారంగా ఉన్న ఎండ్-యూజర్ డిమాండ్ హైదరాబాద్ మార్కెట్కు ప్రధాన బలం అని నివేదిక తెలిపింది.ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో ధరలు ఇంకా అందుబాటులో ఉండటం, మెరుగవుతున్న రహదారి మౌలిక సదుపాయాలు, కొత్త నివాస కారిడార్ల అభివృద్ధి కూడా డిమాండ్ను నిలబెట్టిన కీలక కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు. స్పెక్యులేటివ్ కొనుగోళ్ల కంటే స్వయంగా నివసించేందుకు కొనుగోలు చేసే వారి వాటా ఎక్కువగా ఉండటం మార్కెట్కు స్థిరత్వాన్ని ఇచ్చింది.బెంగళూరు ముందంజదేశంలోని టాప్ ఎనిమిది నగరాల్లో బెంగళూరు 13 శాతం ధరల పెరుగుదలతో అగ్రస్థానంలో నిలిచింది. 2025 చివరి త్రైమాసికానికి బెంగళూరులో చదరపు అడుగుకు సగటు ధర రూ.9,500కు చేరి, ఢిల్లీ-ఎన్సీఆర్ (రూ.9,167)ను దాటి దేశంలో రెండో అత్యంత ఖరీదైన గృహ మార్కెట్గా అవతరించింది. మొదటి స్థానంలో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (రూ.14,000) ఉంది.ఇతర నగరాల్లో ధరల వృద్ధి పరిమితంగానే నమోదైంది. ముంబై ఎంఎంఆర్లో 4 శాతం, ఢిల్లీ-ఎన్సీఆర్, కోల్కతాల్లో 6 శాతం, అహ్మదాబాద్లో 8 శాతం పెరుగుదల కనిపించింది. పుణేలో కేవలం 1 శాతం, చెన్నైలో ఎలాంటి పెరుగుదల లేకపోవడం గమనార్హం.అమ్మకాలు, సరఫరాలో తగ్గుదల2025లో దేశవ్యాప్తంగా గృహ అమ్మకాలు 12 శాతం తగ్గి 3.86 లక్షల యూనిట్లకు పరిమితమయ్యాయి. ఇది 2022 తర్వాత నమోదైన కనిష్ట స్థాయి. కొత్త గృహ ప్రాజెక్టుల ప్రారంభాలు కూడా 6 శాతం తగ్గి 3.61 లక్షల యూనిట్లకు చేరాయి.అయితే, 2025 చివరి త్రైమాసికంలో సరఫరా స్వల్పంగా మెరుగుపడింది. Q4లో కొత్త లాంచ్లు 4 శాతం పెరగడం డెవలపర్లలో మెల్లగా విశ్వాసం పెరుగుతున్న సంకేతంగా నివేదిక పేర్కొంది. హైదరాబాద్లో సరఫరా నియంత్రితంగా ఉండటంతో ఇన్వెంటరీ ఒత్తిడి తక్కువగానే కొనసాగింది.2026పై అంచనాలుప్రాప్టైగర్ నివేదిక ప్రకారం, హైదరాబాద్, బెంగళూరు వంటి ఎండ్-యూజర్ ఆధారిత నగరాలు 2026లోనూ స్థిరమైన ప్రదర్శన కొనసాగించే అవకాశముంది. పరిమిత సరఫరా, నియంత్రిత ఇన్వెంటరీతో గృహ రంగం ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. “అమ్మకాలు తగ్గినప్పటికీ ధరల స్థిరత్వం కొనసాగుతోంది. డెవలపర్లు స్వయంనియంత్రిత సరఫరాతో ధరల సమగ్రతను కాపాడుతున్నారు” అని ఆరమ్ ప్రాప్టెక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఓంకార్ షెట్టి పేర్కొన్నారు. -
బంగారం, వెండి కొనడం ఆపేసిన కియోసాకి..
“రిచ్ డాడ్ పూర్ డాడ్” రచయిత రాబర్ట్ కియోసాకి, ధరలు కొత్త మార్కెట్ దిగువ స్థాయికి చేరుకునే వరకు బిట్కాయిన్ (BTC), బంగారం, వెండిని మరింతగా కొనుగోలు చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లకు అసలైన ప్రమాదం ధరల ఊగిసలాట కంటే, పెరుగుతున్న అమెరికా రుణ భారం అని ఆయన అభిప్రాయపడ్డారు.‘ఎక్స్’(ట్విట్టర్)లో చేసిన పోస్ట్లో, అమెరికా ఆర్థిక పరిస్థితిని పెట్టుబడిదారులు ఎదుర్కొంటున్న “అత్యంత పెద్ద సమస్య”గా కియోసాకి అభివర్ణించారు. అమెరికా జాతీయ రుణం సుమారు 38 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా, సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ వంటి పథకాలతో సంబంధం ఉన్న భవిష్యత్ బాధ్యతలను కలిపితే మొత్తం భారం 250 ట్రిలియన్ డాలర్ల వరకు పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. “ఫెడ్, అసమర్థ నాయకులు, నకిలీ డాలర్లతో ప్రజలను దోచుకునే క్రిమినల్ బ్యాంకర్లే అసలైన సమస్య” అని కియోసాకి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఇప్పుడే కొనేది లేదువెండి ధర 60 డాలర్లు, బిట్కాయిన్ 6,000 డాలర్లు, బంగారం 300 డాలర్లు వద్ద ఉన్నప్పటి నుంచి తాను కొనుగోలు చేయడం ఆపేశానని కియోసాకి తెలిపారు. “నేను కొన్ని బిట్కాయిన్లు, కొంత బంగారం విక్రయించాను. కానీ నాకు అమ్మడం నచ్చదు ఎందుకంటే మూలధన లాభాల పన్ను చెల్లించడం నాకు ఇష్టం లేదు” అని చెప్పారు. కొత్తగా పెట్టుబడి పెట్టే ముందు, ఈ రెండు ఆస్తుల్లోనూ కొత్త దిగువ స్థాయిల కోసం “ఓపికగా వేచి చూస్తున్నాను” అని అన్నారు.గురువారం సెషన్లో బిట్కాయిన్ ధర 60,100 డాలర్ల వరకు పడిపోయి, రాత్రికి 65,600 డాలర్లకు చేరింది. అయినప్పటికీ, గత 24 గంటల్లో ఇది ఇంకా 6.6% తగ్గుదలలోనే ఉంది. స్టాక్ట్విట్స్ ప్రకారం.. బిట్కాయిన్పై రిటైల్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ఏడాది కనిష్టానికి చేరి ‘అత్యంత బేరిష్’ జోన్లోకి వెళ్లింది. చర్చల స్థాయి మాత్రం ‘అత్యధికం’గా ఉంది.బంగారం, వెండి మార్కెట్ పరిస్థితిగురువారం రాత్రి బంగారం ఔన్స్కు సుమారు 4,400 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతూ, గత రోజుతో పోలిస్తే 1.95% లాభపడింది. అయితే, స్పైడర్ గోల్డ్ షేర్స్ ఈటీఎఫ్ (GLD) రెగ్యులర్ ట్రేడింగ్లో 2.66% పడిపోయిన తర్వాత, ఆఫ్టర్ అవర్స్లో మరో 0.92% తగ్గింది. స్టాక్ట్విట్స్లో పసిడిపై సెంటిమెంట్ ‘అత్యంత బుల్లిష్’ నుంచి ‘బుల్లిష్’ స్థాయికి తగ్గింది.ఇదీ చదవండి: క్రాష్.. క్రాష్.. మళ్లీ పడిపోయిన బంగారం, వెండిఇక వెండి ధరలు గురువారం రాత్రి 4.4% పెరిగి 73.8 డాలర్లకు చేరుకున్నాయి. రెగ్యులర్ సెషన్లో 15.77% పతనం తర్వాత, ఐషేర్స్ సిల్వర్ ట్రస్ట్ (SLV) ఆఫ్టర్ అవర్స్లో మరో 4.63% తగ్గింది. వెండి చుట్టూ రిటైల్ సెంటిమెంట్ కూడా ‘అత్యంత బుల్లిష్’ నుంచి ‘బుల్లిష్’ స్థాయికి దిగింది. చర్చల తీవ్రత ‘చాలా ఎక్కువ’ నుంచి ‘ఎక్కువ’కు తగ్గింది.సమయం, సహనం కీలకంధరలు తక్కువ స్థాయికి చేరేవరకు వేచి ఉండాలని కియోసాకి మరోసారి స్పష్టం చేశారు. వెండి ధర 74 డాలర్లకి, బంగారం 4,000 డాలర్లకు పడితే కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తన పోర్ట్ఫోలియోలో ప్రస్తుతం తగినంత ఎథీరియం ఉందని, భవిష్యత్తులో ఆ వాటాను పెంచుకోవడాన్ని పరిశీలిస్తానని తెలిపారు.“లాభం మీరు కొనుగోలు చేసినప్పుడు వస్తుంది… అమ్మినప్పుడు కాదు,” అని రిచ్ డాడ్ నుంచి నేర్చుకున్న ముఖ్యమైన పాఠాన్ని ఆయన గుర్తు చేశారు. తాను మళ్లీ కొనుగోళ్లు ప్రారంభించినప్పుడు బహిరంగంగా ప్రకటిస్తానని, ధరల ర్యాలీలను వెంబడించవద్దని ఇన్వెస్టర్లను హెచ్చరించారు. చివరగా, ఆయన తరచూ చెప్పే “పందులు లావవుతాయి… కానీ అత్యాశ పందులు మాంసంగా మారుతాయి” అన్న మాటను మరోసారి గుర్తుచేశారు.AS I POSTED on X earlier. I stopped buying silver at $60.I stopped buying Bitcoin at $6000.I stopped buying gold at $300.I have sold some Bitcoin and some gold. I hate selling because I hate paying capital gain taxes.Today…. I wait patiently for new bottoms for gold…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 6, 2026 -
హైదరాబాద్లో మరో కొత్త జీసీసీ.. భారీగా ఉద్యోగాలు
హైదరాబాద్: దిగ్గజ వెల్ మేనేజ్మెంట్ ఎల్పీఎల్ ఫైనాన్షియల్ సంస్థ హైదరాబాద్లో ఎల్పీఎల్ ఫైనాన్షియల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ని ప్రారంభించినట్లు వెల్లడించింది. అలాగే కొత్త కార్యకలాపాలకు హెడ్గా రమేష్ కాజాను నియమించుకున్నట్లు తెలిపింది.ఎల్పీఎల్ ఫైనాన్షియల్ తమ టెక్నాలజీ, కార్యకలాపాలను విస్తరించే క్రమంలో ఆర్థిక సేవల్లో విస్తృతంగా ప్రతిభావంతుల లభ్యత, పటిష్టమైన మౌలిక సదుపాయాలు, వ్యాపారాన్ని కొనసాగించేందుకు సంబంధించిన సానుకూలాంశాలు ఉన్న హైదరాబాద్ నగరాన్ని ఎంచుకుంది.భారీగా ఉద్యోగావకాశాలువచ్చే మూడు నుంచి అయిదేళ్ల వ్యవధిలో టెక్నాలజీ, ఆపరేషన్స్, ప్రోడక్ట్ డెవలప్మెంట్, డేటా అండ్ అనలిటిక్స్, రిస్క్ మేనేజ్మెంట్ విభాగాలకు సంబంధించి హైదరాబాద్లో ఎల్పీఎల్ వందల కొద్దీ ఉద్యోగాలను కల్పించనుంది.ఎల్పీఎల్ ఫైనాన్షియల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ప్రస్తుతం తమ టీమ్ కోసం ప్రతిభావంతులను నియమించుకునే ప్రక్రియలో ఉంది. నెట్వర్క్ సెక్యూరిటీ, కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏఐ ఇంజినీరింగ్, డేటా ప్లాట్ఫామ్స్, మిడిల్వేర్ మరియు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్వ్యాప్తంగా నిపుణులైన ఇంజినీర్లు, టెక్నాలజిస్టులు వీరిలో ఉండనున్నారు.భారత్లోని ఎల్పీఎల్ ఫైనాన్షియల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లో ఉద్యోగావకాశాల కోసం ఎల్పీఎల్ ఫైనాన్షియల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ లింక్డ్ఇన్ (LinkedIn) పేజీ, ఎల్పీఎల్ ఫైనాన్షియల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ కెరియర్స్ సైట్ని సందర్శించాలని కంపెనీ సూచించింది.ఎల్పీఎల్ ఫైనాన్షియల్ గురించి..ఫార్చూన్ 500 కంపెనీ అయిన ఎల్పీఎల్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ (Nasdaq: LPLA) అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న వెల్త్ మేనేజ్మెంట్ సంస్థల్లో ఒకటి. 32,000 మందికి పైగా ఫైనాన్షియల్ అడ్వైజర్లకు, 1,200కు పైగా ఆర్థిక సంస్థల వెల్త్ మేనేజ్మెంట్ విధానాలకు సపోర్ట్ అందిస్తూ దాదాపు 80 లక్షల మందికి సంబంధించి 2.4 ట్రిలియన్ డాలర్ల నిధులను నిర్వహిస్తోంది.అధునాతన ఫైనాన్షియల్ టెక్నాలజీ సాధనాలు, అప్లికేషన్ల వినూత్న ప్లాట్ఫాం దన్నుతో, ఆర్థిక సలహాదారులు తమ క్లయింట్లకు వ్యక్తిగతీకరించిన ఆర్థిక ప్రణాళికలను అందించడానికి ఉపయోగించే ఇన్వెస్ట్మెంట్ సొల్యూషన్స్ , వెల్త్ మేనేజ్మెంట్ ప్రోడక్టులను ఎల్పీఎల్ ఫైనాన్షియల్ అందిస్తోంది. -
క్రాష్.. క్రాష్.. మళ్లీ పడిపోయిన బంగారం, వెండి
బంగారం, వెండి ధరలు మళ్లీ క్రాష్ అయ్యాయి. మరోసారి భారీగా పడిపోయాయి. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో మార్పులు వస్తున్నాయి. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఆర్బీఐ వడ్డీ రేట్లు యథాతథం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన విధాన నిర్ణయాన్ని ప్రకటించింది. గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని సెంట్రల్ బ్యాంక్ ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) సమావేశం ఫిబ్రవరి 4 నుంచి 6 వరకు జరిగింది. 2026 ఆర్థిక సంవత్సరానికి ఇది చివరి విధాన సమీక్ష.కీలక రెపో రేటును 5.25 శాతంగా కొనసాగించాలని ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ నిర్ణయించింది. ఈ ఏడాది ప్రారంభంలో వరుస రేటు తగ్గింపుల తర్వాత ఇప్పుడు తటస్థ వైఖరి తీసుకుంది. గత ఫిబ్రవరి నుండి ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ వరుసగా మూడు కోతల ద్వారా రెపో రేటును మొత్తం 100 బేసిస్ పాయింట్లు (బిపిఎస్) తగ్గించింది.గత ఫిబ్రవరిలో 6.5 శాతంగా ఉన్న పాలసీ రేటును జూన్ లో 5.5 శాతానికి తగ్గించింది. ఒక బేసిస్ పాయింట్ అంటే ఒక పర్సెంటేజ్ పాయింట్ లో వందవ వంతుకు సమానం. రెపో రేటు తగ్గింపుతో పాటు, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్ డిఎఫ్) రేటును 5 శాతంగా ఉంచారు. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు (ఎంఎస్ ఎఫ్) రేటు, బ్యాంక్ రేటు రెండూ 5.50 శాతంగా నిర్ణయించింది. ద్రవ్యోల్బణం టాలరెన్స్ బ్యాండ్ కంటే తక్కువగా ఉంది. అధిక ఫ్రీక్వెన్సీ సూచికలు ఈ సంవత్సరం మరియు అంతకు మించి బలమైన వృద్ధి వేగాన్ని కొనసాగించాలని సూచిస్తున్నాయి.యూరోపియన్ యూనియన్, యుఎస్ తో మైలురాయి వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయడం వల్ల వృద్ధి వేగం ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉంది. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఘర్షణ ప్రస్తుత ప్రపంచ క్రమాన్ని విప్పుతోంది. ఆర్థిక స్థిరత్వ ఆందోళనలను ప్రతిబింబించే బాండ్ మార్కెట్ సెంటిమెంట్లు బేరిష్ గా ఉన్నాయి.డిసెంబర్ ఎంపీసీ సమావేశంలో ఏం జరిగిందంటే..డిసెంబర్ పాలసీ సమావేశంలో, ఎంపీసీ ఏకగ్రీవంగా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.5 శాతం నుండి 5.25 శాతానికి తగ్గించింది. ఆ సమయంలో, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (SDF) రేటును 5.00 శాతంగా నిర్ణయించారు, అయితే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF) రేటు, బ్యాంక్ రేటును 5.50 శాతంగా నిర్ణయించారు. -
ఆర్బీఐ ఏం చెప్తుందో.. స్వల్ప నష్టాల్లో మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం స్వల్ప నష్టాల్లో ప్రారంభమయ్యాయి. మదుపరులు ఆర్బీఐ పాలసీ డే కోసం సన్నద్ధమవుతున్నారు. ఆర్బీఐ ఏం చెప్తుందో అని ఎదురు చూస్తున్నారు. బీఎస్ఈ సెన్సెక్స్ శుక్రవారం సెషన్ ను 64.61 పాయింట్లు లేదా 0.08 శాతం నష్టపోయి 83,249.32 వద్ద ప్రారంభించగా, ఎన్ ఎస్ ఈ నిఫ్టీ 50 37 పాయింట్లు లేదా 0.14 శాతం నష్టపోయి 25,605.80 వద్ద ప్రారంభమైంది.సెన్సెక్స్ ప్యాక్ లో, బజాజ్ ఫైనాన్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ట్రెంట్, బజాజ్ ఫిన్సర్వ్, పవర్ గ్రిడ్ 1.29 శాతం వరకు పెరిగాయి. ఎన్టీపీసీ, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, మారుతి సుజుకి ఇండియా 1.28 శాతం వరకు నష్టపోయాయి.విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 మరియు నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.20 శాతం, 0.41 శాతం తగ్గాయి. ఎన్ ఎస్ ఈలో సెక్టోరల్ సూచీలు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి, నిఫ్టీ ఐటి ఇండెక్స్ 1 శాతానికి పైగా నష్టపోయింది. ఫార్మా, ఆటో, మెటల్, మీడియా సూచీలు 0.80 శాతం వరకు తగ్గుముఖం పట్టగా, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్, ప్రైవేట్ బ్యాంక్, రియల్టీ, ఎఫ్ఎంసీజీ, సెలెక్ట్ ఫైనాన్షియల్స్ 0.33 శాతం వరకు లాభాలు సాధించాయి. -
ఐటీ జీతాల కంటే అర్బన్ కంపెనీలో అధిక సంపాదన!
ఐటీ రంగంలో ఆరంభ స్థాయి ఉద్యోగుల వేతనాలకు సమానమైన, కొన్ని సందర్భాల్లో అంతకంటే అధిక ఆదాయాన్ని తమ ప్లాట్ఫామ్పై గిగ్వర్కర్లు (తాత్కాలిక కార్మికులు, నిపుణులు) పొందుతున్నారని అర్బన్ కంపెనీ తెలిపింది. అర్బన్ కంపెనీతో భాగస్వాములైన నిపుణులు సగటున ప్రతినెలా రూ.28,322 చొప్పున ఆర్జిస్తున్నారని పేర్కొంది.బహిరంగంగా అందుబాటులో ఉన్న పరిశ్రమ డేటా, గ్లాస్డోర్ అంచనాల ఆధారంగా ఈ విషయాలు వెల్లడిస్తున్నట్టు పేర్కొంది. ఈ డేటా ఆధారంగా ఐటీ, ఐటీఈఎస్ రంగంలో ఆరంభ స్థాయి వార్షిక వేతనం రూ.4లక్షలుగా ఉన్నట్టు తెలిపింది. ఈ పోలికలు సూచనాత్మకమేనని, సందర్భానుసారం పేర్కొంటున్నట్టు స్పష్టం చేసింది.తమ ప్లాట్ఫామ్లపై కొందరు అత్యధికంగా రూ.51,673 వరకు నెలవారీ ఆర్జిస్తున్నట్టు, ఐటీ రంగం ఆరంభ స్థాయి వేతనం కంటే 60 శాతం అధికమని అర్బన్ కంపెనీ తెలిపింది. తన ప్లాట్ఫామ్పై టాప్–20 సేవల నిపుణులు నెలవారీ సగటున రూ.42,418 చొప్పున.. టాప్–10 శాతం మంది రూ.47,471 చొప్పున, టాప్–5 శాతం మంది రూ.51,673 చొప్పున ఆదాయం పొందుతున్నట్టు వెల్లడించింది.ఒక్కో భాగస్వామి ప్రతి నెలా 91 గంటల సమయాన్ని వెచ్చిస్తున్నట్టు పేర్కొంది. ఈ ప్రకారం ప్రతి గంటకు రూ.313 వరకు ఆదాయం లభిస్తోందంటూ.. చట్టపరంగా కనీస వేతనం కంటే ఎక్కువని పేర్కొంది. -
ఎల్ఐసీకి మంచి లాభం! కలిసొచ్చిన ‘కొత్త బిజినెస్’
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 17 శాతం జంప్చేసి రూ. 12,958 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 11,056 కోట్లు ఆర్జించింది.ప్రీమియం ఆదాయం రూ. 1,06,891 కోట్ల నుంచి రూ. 1,25,613 కోట్లకు ఎగసింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2,01,994 కోట్ల నుంచి రూ. 2,33,984 కోట్లకు బలపడింది. నికర కమిషన్ చెల్లింపులు రూ. 5,966 కోట్ల నుంచి రూ. 6,011 కోట్లకు పెరిగాయి. తొలి ఏడాది ప్రీమియం(కొత్త బిజినెస్) రూ. 7,285 కోట్ల నుంచి రూ. 10,605 కోట్లకు ఎగసింది. ఫలితాల నేపథ్యంలో ఎల్ఐసీ షేరు బీఎస్ఈలో 0.7 శాతం బలపడి రూ. 840 వద్ద ముగిసింది. ఈ త్రైమాసికంలో వ్యయ నియంత్రణ, పెట్టుబడి ఆదాయం మెరుగుపడటం, అలాగే కొత్త పాలసీల విక్రయాలు పెరగడం ఎల్ఐసీ పనితీరుకు ప్రధానంగా తోడయ్యాయి. పాలసీదారుల సంఖ్య పెరగడం, డిజిటల్ సేవల విస్తరణ, కస్టమర్ సర్వీస్ మెరుగుదల వంటి చర్యలు సంస్థకు దీర్ఘకాల వృద్ధికి బలమివ్వనున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాబోయే త్రైమాసికాల్లోనూ స్థిరమైన వృద్ధి కొనసాగుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. -
భారత్లో ‘ఐకియా’కు మరిన్ని నష్టాలు
న్యూఢిల్లీ: స్వీడన్కు చెందిన ఫర్నిచర్, గృహ ఫర్నిషింగ్ రిటైల్ కంపెనీ ‘ఐకియా’ ఇండియా ప్రైవేటు లిమిటెడ్కు భారత్లో నష్టాలు మరింత అధికమయ్యాయి. 2024–25 సంవత్సరానికి రూ.1,325 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. విక్రయాల ద్వారా ఆదాయం 3.33 శాతం తగ్గి రూ.1,749 కోట్లకు పరిమితమైంది. ఈ సంస్థ అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో (2023–24) రూ.1,810 కోట్ల ఆదాయంపై రూ.1,299 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఒకవైపు భారీ నష్టం ఎదురవుతున్నా కానీ, గత ఆర్థిక సంవత్సరంలో ప్రకటనలపై 14 శాతం అధికంగా రూ.224 కోట్లు ఖర్చు చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఈ రూపంలో చేసిన వ్యయం రూ.196 కోట్లు, ఐకియా ఇండియా రుణ భారం రూ.8,335 కోట్లకు పెరిగింది. 2024 మార్చి నాటికి రుణ భారం రూ.7,060 కోట్లుగానే ఉంది. -
ఏసీసీ బ్యాటరీలకు భారీగా డిమాండ్
దేశీయంగా అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) బ్యాటరీలకు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. 2025లో ఇది 28 జీడబ్ల్యూహెచ్ (గిగావాట్అవర్)గా ఉండగా 2040 మధ్య నాటికి 700 జీడబ్ల్యూహెచ్ స్థాయికి చేరనుంది. ఇండియా బ్యాటరీ మాన్యుఫాక్చరింగ్, సప్లై చెయిన్ (ఐబీఎంఎస్సీఎస్) సదస్సు సందర్భంగా ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.దీని ప్రకారం 2025లో మొత్తం బ్యాటరీల డిమాండ్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా దాదాపు 60 శాతంగా ఉండగా, 2047 నాటికి 74–77 శాతానికి పెరగొచ్చని అంచనా. 2035 నాటికి దేశీయంగా ఈవీల మార్కెట్ వార్షిక ప్రాతిపదికన 30 శాతం మేర వృద్ధి చెందనుంది. ఎలక్ట్రిక్ టూవీలర్లు, త్రీవీలర్లు దీనికి సారథ్యం వహించనుండగా, ప్యాసింజర్ వాహనాలు, కమర్షియల్ వాహనాలు ఆ తర్వాత స్థానాల్లో ఉండనున్నాయి. బ్యాటరీల తయారీదారులు, ఇన్వెస్టర్ల కోసం పటిష్టమైన వ్యవస్థను రూపొందిస్తున్నట్లు తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్కే శర్మ తెలిపారు.ఎనర్జీ స్టోరేజీ విప్లవం వల్ల వ్యవస్థవ్యాప్తంగా భాగస్వామ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని పునరుత్పాదక శక్తి శాఖ సంయుక్త కార్యదర్శి రాజేశ్ కుల్హారి తెలిపారు. రెండు రోజుల ఈ సదస్సులో చైనా, జపాన్, అమెరికా తదితర దేశాల నుంచి 250పైచిలుకు కంపెనీలు, 600 మందికి పైగా డెలిగేట్లు, పరిశ్రమ దిగ్గజాలు పాల్గొంటున్నారు. -
ఇక స్టార్టప్ అంటే రూ. 200 కోట్లు!
న్యూఢిల్లీ: అంకుర సంస్థల నిర్వచనాన్ని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. టర్నోవరు పరిధిని రూ. 100 కోట్ల నుంచి రూ. 200 కోట్లకు పెంచింది. డీప్ టెక్ స్టార్టప్ల పరిధిని కూడా విస్తరించింది. ఇకపై రిజిస్టరయిన 20 ఏళ్ల వరకు, వాటిని స్టార్టప్లుగా పరిగణిస్తారు. ఇప్పటివరకు ఇది పదేళ్లుగా ఉంది.టర్నోవరు పరిమితిని కూడా రూ. 300 కోట్లకు ప్రభుత్వం పెంచింది. డీప్ టెక్ సంస్థలకి భారీ స్థాయిలో పెట్టుబడులు కావాల్సి ఉంటుందని, వ్యాపార కార్యకలాపాలను పూర్తి స్థాయిలో విస్తరించేందుకు సుదీర్ఘ సమయం పట్టేయొచ్చని డీపీఐఐటీ నోటిఫికేషన్లో పేర్కొంది. వ్యవసాయం, అనుబంధ రంగాలు తదితరాల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించే దిశగా నిర్దిష్ట కోఆపరేటివ్ ఎంటర్ప్రైజ్లకు కూడా స్టార్టప్ గుర్తింపునివ్వనుంది.ఇదే సమయంలో ఈ మార్పులతో స్టార్టప్ వ్యవస్థకు మరింత ఊతం లభిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టర్నోవరు, కాలపరిమితుల పెంపుతో ఎక్కువ సంస్థలు స్టార్టప్ హోదా పొందే అవకాశం ఏర్పడనుంది. దీంతో పన్ను రాయితీలు, ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలు, ఫండింగ్ అవకాశాలు విస్తరించనున్నాయి. ముఖ్యంగా డీప్ టెక్, అగ్రి టెక్, క్లైమేట్ టెక్ వంటి రంగాల్లో పరిశోధన, ఆవిష్కరణలకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గ్రామీణ, సహకార రంగాల్లోనూ సాంకేతికత ఆధారిత వ్యాపారాలు పెరగడానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని వారు భావిస్తున్నారు. -
నష్టాల రోడ్పై టాటా మోటార్స్ పీవీ
న్యూఢిల్లీ: ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్(టీఎంపీవీఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో లాభాలను వీడి నష్టాలలోకి ప్రవేశించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో రూ. 3,843 కోట్ల నికర నష్టం ప్రకటించింది.లగ్జరీ కార్ల బ్రిటిష్ అనుబంధ కంపెనీ జేఎల్ఆర్పై సైబర్ దాడి ప్రధానంగా ప్రతికూల ప్రభావం చూపింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 5,485 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 94,472 కోట్ల నుంచి రూ. 70,108 కోట్లకు క్షీణించింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 89,698 కోట్ల నుంచి రూ. 74,880 కోట్లకు తగ్గాయి. జేఎల్ఆర్ ఎఫెక్ట్ జేఎల్ఆర్ సైబర్ దాడి కారణంగా రూ. 800 కోట్లతోపాటు.. కొత్త కార్మిక చట్టాల అమలుతో రూ. 400 కోట్లు, స్టాంప్ డ్యూటీకి రూ. 400 కోట్లు చొప్పున మొత్తం రూ. 1,600 కోట్లమేర అనుకోని నష్టాలు నమోదు చేసినట్లు టీఎంపీవీఎల్ వెల్లడించింది. ఈ కాలంలో జేఎల్ఆర్ 29.8 కోట్ల పౌండ్ల నష్టం ప్రకటించింది. ఆదాయం సైతం 39 శాతం బలహీనపడి 4.5 బిలియన్ పౌండ్లకు పరిమితమైంది.సైబర్ దాడి, యూఎస్ టారిఫ్లతో హోల్సేల్ అమ్మకాలు పడిపోయినట్లు కంపెనీ పేర్కొంది. వీటికితోడు ప్రణాళికలకు అనుగుణంగా జేఎల్ఆర్ ఉత్పత్తిని సైతం కొద్ది రోజులు నిలిపివేసినట్లు సీఈవో పీబీ బాలాజీ వెల్లడించారు. కాగా.. టాటా ప్యాసింజర్ వాహనాల ఆదాయం 24 శాతం జంప్చేసి రూ. 15,300 కోట్లను తాకింది. పీవీ, ఈవీల టోకు అమ్మకాల పరిమాణం 22 శాతం ఎగసి 1.71 లక్షల యూనిట్లకు చేరాయి.ఒక త్రైమాసికంలో ఇవి కంపెనీ చరిత్రలోనే అత్యధికంకాగా.. జీఎస్టీ రేట్ల తగ్గింపు, విభిన్న ప్రొడక్టుల విడుదల ఇందుకు సహకరించాయి. ఈ బాటలో తొలిసారి రిటైల్ అమ్మకాలు 2 లక్షల మార్క్ను దాటినట్లు కంపెనీ ఎండీ, సీఈవో శైలేష్ చంద్ర వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు బీఎస్ఈలో నామమాత్ర నష్టంతో రూ. 374 వద్ద ముగిసింది. -
సిల్వర్ క్రాష్.. రూ. 2.68 లక్షలకు డౌన్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అమ్మకాలు వెల్లువెత్తడం, డాలరు బలపడటంలాంటి కారణాలతో గురువారం వెండి ధరలు పతనమయ్యాయి. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం.. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలో వెండి రేటు 10 శాతం క్షీణించి (రూ. 30,300)రూ. 2.68 లక్షలకు పడిపోయింది.అటు 99.9 శాతం స్వచ్ఛత గల పసిడి ధర 10 గ్రాములకు రూ. 4,500 క్షీణించి (3 శాతం) రూ. 1,60,600కి తగ్గింది. మళ్లీ అమ్మకాల ఒత్తిడి, ఒడిదుడుకులు పెరగడంతో వెండి, పసిడి రేట్ల రెండు రోజుల ర్యాలీకి బ్రేక్ పడిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ చెప్పారు. అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో ఔన్సు (31.1 గ్రాములు) సిల్వర్ ధర 11.94 డాలర్లు (సుమారు 14 శాతం) తగ్గి 76.26 డాలర్లకు చేరింది. పసిడి సైతం 137.32 డాలర్లు (దాదాపు 3 శాతం) క్షీణించి 4,826.99 డాలర్లకు పరిమితమైంది. చైనా ఫ్యూచర్స్ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో, గ్లోబల్ మార్కెట్లు దానికి తగ్గట్లుగా స్పందించినట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనా న్షియల్ సరీ్వసెస్ అనలిస్ట్ మానవ్ మోదీ తెలిపారు. ఫ్యూచర్స్లో: దేశీయంగా ఎంసీఎక్స్ వెండి మార్చి డెలివరీ కాంట్రాక్టు రూ. 26,850 తగ్గి రూ. 2,42,000 వద్ద ట్రేడయ్యింది. అటు ఏప్రిల్ కాంట్రాక్టు బంగారం ధర రూ. 2,310 తగ్గి రూ. 1,50,736కి పడిపోయింది. అంతర్జాతీయంగా కామెక్స్లో సిల్వర్ మార్చ్ కాంట్రాక్టు ఔన్సుకి 8.85 డాలర్లు క్షీణించి 75.55 డాలర్లకు దిగి వచ్చింది. పసిడి 80 డాలర్లు పడి 4,870.9 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. -
లాజిస్టిక్స్ రంగంలో 47 లక్షల ఉద్యోగ అవకాశాలు
న్యూఢిల్లీ: దేశ లాజిస్టిక్స్ రంగంలో 2030 నాటికి అదనంగా 47 లక్షల మంది సిబ్బంది అవసరం అవుతారని లాజిస్టిక్స్ రంగ నైపుణ్య మండలి సీఈవో రవికాంత్ యమర్తి అన్నారు. రవాణా, గోదాములు, సరఫరా వ్యవస్థ వ్యాప్తంగా సిబ్బంది అవసరం ఉంటుందన్నారు. ఈ తక్షణ, పెరుగుతున్న డిమాండ్ను అధిగమించేందుకు నైపుణ్యాల కల్పనకు సంబంధించి భారీ సంస్కరణలు అవసరమని పేర్కొన్నారు. లాజిస్టిక్స్ రంగంలో నియామకాలు బలంగా ఉన్నాయంటూ, 2025 ద్వితీయ ఆరు నెలల్లో 10.8 శాతం పెరిగినట్టు చెప్పారు. పరిశ్రమ విస్తరిస్తున్న కొద్దీ ఎన్నో ఖాళీలు భర్తీ అవుతుండడాన్ని ఇది తెలియజేస్తోందన్నారు. ముంబైలో జరిగిన లాజిమ్యాట్ ఇండియా 2026 ఆరంభ కార్యక్రమంలో భాగంగా రవికాంత్ మాట్లాడారు. నైపుణ్యాల అంతరాన్ని అధిగమించేందుకు లాజిమ్యాట్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 350 అంతర్జాతీయ బ్రాండ్లు పాల్గొంటున్నాయి. లాజిస్టిక్స్ ఆవిష్కరణలు, సహకారం పరంగా అంతర్జాతీయ కేంద్రంగా భారత్ ప్రాధాన్యం పెరుగుతున్నట్టు ల్యాండెస్మెస్సే స్టగర్ట్ జీఎంబీహెచ్ అండ్ కేజీ వైస్ ప్రెసిడెంట్ బెర్న్హర్డ్ ముల్లర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. లాజిస్టిక్స్ రంగంలో మరింత మంది మహిళలు భాగస్వాములు అయినప్పుడు లాజిస్టిక్స్ రంగ వృద్ధి మరింత వేగాన్ని సంతరించుకుంటుందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ శ్యామ్ జగన్నాథన్ అభిప్రాయపడ్డారు. -
ఆఫీస్ మార్కెట్కు అడ్డా.. హైదరాబాద్
హైదరాబాద్: ఆఫీస్ మార్కెట్కు ఆకర్షణీయ కేంద్రంగా హైదరాబాద్ మారుతోంది. స్థిరమైన డిమాండ్, ఆఫీస్ వసతుల ఖాళీలు తగ్గుతుండడం, అద్దె ధరల్లో స్థిరమైన పెరుగుదులతో హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్ తదుపరి వృద్ధి దశలోకి అడుగుపెట్టినట్టు రేటింగ్ సంస్థ ఇక్రా తెలిపింది. 2025–26లో చివరి త్రైమాసికం (2026 జనవరి–మార్చి) నుంచి 2026–27 ఆర్థిక సంవత్సరం చివరికి కొత్తగా 18–19 మిలియన్ చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) గ్రేడ్–ఏ ఆఫీస్ వసతులు అందుబాటులోకి వస్తాయని అంచనా వేసింది. ఇందులో పావు వంతు (23 శాతం) వసతులకు లీజింగ్ ఒప్పందాలు ఇప్పటికే కుదిరినట్టు తెలిపింది. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితుల్లోనూ హైదరాబాద్ ఆఫీస్ వసతుల పట్ల కిరాయిదారుల్లో స్థిరమైన విశ్వాసానికి దీన్ని నిదర్శనంగా పేర్కొంది. లీజింగ్ భళా.. 2025–26లో మొదటి తొమ్మిది నెలల్లో హైదరాబాద్తోపాటు దేశవ్యాప్తంగా ఆఫీస్ వసతుల మార్కెట్ బలమైన పనితీరు చూపించింది. ఈ కాలంలో హైదరాబాద్ మార్కెట్లో 8.4 మిలియన్ ఎస్ఎఫ్టీ గ్రేడ్–ఏ స్పేస్ అదనంగా అందుబాటులోకి వచి్చంది. ఇక ఆఫీస్ వసతుల నికర స్వీకరణ 8.5 మిలియన్ ఎస్ఎఫ్టీగా ఉందని ఇక్రా తెలిపింది. ముఖ్యంగా ఐటీ–బీపీఎం, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) సంస్థల నుంచి డిమాండ్ నెలకొంది. దీంతో 2025 డిసెంబర్ నాటికి ఖాళీ వసతులు 17 శాతానికి తగ్గాయి. 2024 మార్చి నాటికి ఖాళీలు 18.2 శాతంగా ఉండడం గమనార్హం. కొత్త వసతులు అందుబాటులోకి వచి్చనా కానీ ఆఫీస్ స్పేస్ మార్కెట్ మూలాలు బలంగా ఉన్నట్టు, వసతుల భర్తీ రేటు 2027 మార్చి నాటికి 82.5–83 శాతానికి పెరుగుతుందని ఇక్రా అంచనా వేసింది. ఆఫీస్ మార్కెట్లో కింగ్.. దేశవ్యాప్తంగా టాప్–6 నగరాల్లోని గ్రేడ్–ఏ ఆఫీస్ వసతుల్లో హైదరాబాద్ మార్కెట్ గత ఐదేళ్లలో వేగవంతమైన విస్తరణ చూసినట్టు ఇక్రా నివేదిక ఆధారంగా తెలుస్తోంది. పోటీ మార్కెట్లలో వసతులు ఏటా 7 శాతం మేర పెరిగితే, హైదరాబాద్లో 14 శాతం అధికమవుతూ వచ్చాయి. టాప్–6 నగరాల్లోని వసతుల్లో హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్ వాటా 2021 మార్చి నాటికి 13 శాతంగా ఉంటే, 2025 డిసెంబర్ నాటికి 16 శాతానికి చేరింది. హైటెక్ సిటీ/మాదాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్ ప్రాంతాల్లోని ఆఫీస్ వసతులు నగరంలోని మొత్తం ఆఫీస్ స్పేస్ సరఫరాలో 63 శాతం వాటా కలిగి, సరఫరాకు కీలకంగా ఉన్నాయి. హైటెక్ సిటీలో 2026–27లో పరిమిత సరఫరానే ఉండే పరిస్థితుల్లో ఇక్కడ ఖాళీలు తక్కువగానే ఉండొచ్చని.. అయితే గచి్చ»ౌలి, ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్లో ఖాళీలు స్థిరంగా ఉండొచ్చని ఇక్రా పేర్కొంది. లీజు ధరలు క్రమంగా పెరుగుతున్నాయంటూ, ఈ మూడు సూక్ష్మ మార్కెట్లలో గత ఐదేళ్లలో ఏటా 3–4 శాతం చొప్పున పెరుగుతూ వచ్చాయని ఇక్రా నివేదిక వెల్లడించింది. 2025–26 క్యూ4 నుంచి 2026–27 వరకు ఇదే స్థాయిలో లీజు ధరలు పెరుగుతాయని అంచనా వేసింది. స్థిరమైన డిమాండ్, బలమైన లీజింగ్ కార్యకలాపాలు మధ్య కాలానికి హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్కు మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది. -
ఎయిర్టెల్ వీక్ సిగ్నల్
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం రంగ దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 55 శాతం పడిపోయి రూ. 6,631 కోట్లకు పరిమితమైంది. నెట్వర్క్ నిర్వహణ వ్యయాలతోపాటు, ఉద్యోగ వ్యయాల పెరుగుదల, ప్రభుత్వ ఫీజులు ప్రభావం చూపాయి. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 14,781 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 20 శాతం జంప్చేసి రూ. 53,982 కోట్లను తాకింది. గత క్యూ3లో కేవలం రూ. 45,129 కోట్ల టర్నోవర్ సాధించింది. దీనిలో దేశీ ఆదాయం 13 శాతం పుంజుకుని రూ. 39,226 కోట్లయ్యింది. ఈ కాలంలో పెట్టుబడి వ్యయాలు 28 శాతం ఎగసి రూ. 11,787 కోట్లకు చేరగా.. వీటిలో దేశీ వాటా 16 శాతం అధికంగా రూ. 9,250 కోట్లకు చేరింది. లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రమ్ చార్జీలు 7 శాతం పెరిగి రూ. 3,846 కోట్లయ్యాయి. ఉద్యోగ వ్యయాలు సైతం 12 శాతం అధికమై రూ. 1,958 కోట్లను తాకాయి. కస్టమర్ల సంఖ్య అప్ తాజా సమీక్షా కాలంలో ఎయిర్టెల్ ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) 5.7 శాతం మెరుగుపడి రూ. 259ను తాకింది. కస్టమర్ల సంఖ్య 12 శాతం వృద్ధితో 57.6 కోట్లకు చేరింది. దేశీయంగా ఇది 13 శాతం పుంజుకుని 41.38 కోట్లకు చేరగా.. ఆఫ్రికాలో 10 శాతం బలపడి 17.93 కోట్లుగా నమోదైంది. ఫలితాల నేపథ్యంలో ఎయిర్టెల్ షేరు బీఎస్ఈలో 1.7 శాతం బలహీనపడి రూ. 1,992 వద్ద ముగిసింది. -
మార్చికల్లా మొదటి అడుగు
న్యూఢిల్లీ: మొదటి దశ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై మార్చి మధ్య నాటికి భారత్, అమెరికా సంతకాలు చేస్తాయని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. అనంతరం భారత వస్తు దిగుమతులపై అమెరికా సుంకాలు తగ్గిస్తుందని చెప్పారు. అలాగే, అమెరికా నుంచి వచ్చే ఉత్పత్తులపైనా భారత్ సుంకాలు తగ్గిస్తుందన్నారు. తొలి దశ వాణిజ్య ఒప్పందంపై వచ్చే 4–5 రోజుల్లో రెండు దేశాలు ఉమ్మడి ప్రకటనను విడుదల చేస్తాయని చెప్పారు. అనంతరం భారత ఉత్పత్తులపై సుంకాలు 18 శాతానికి దిగొస్తాయని చెప్పారు. ప్రస్తుతం భారత వస్తువులపై 50 శాతం టారిఫ్లను అమెరికా అమలు చేస్తోంది. దీన్ని 18 శాతానికి తగ్గించనున్నట్టు ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం తెలిసిందే. ఇందులో 25 శాతం, రష్యాపై చమురు కొంటున్న కారణంగా విధించినది. ‘‘ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం(బీటీఏ) మొదటి దశ దాదాపు సిద్ధమైంది. వచ్చే నాలుగైదు రోజుల్లో దీన్ని ఖరారు చేసి, సుంయక్త ప్రకటన విడుదల చేస్తాం. దీని ఆధారంగా భాగస్వామ్యం తొలి దశ మొదలవుతుంది’’అని గోయల్ వివరించారు. భారత ఉత్పత్తులపై 18 శాతం సుంకాలన్నవి అమెరికా జారీ చేసే అధికారిక ఉత్తర్వు ద్వారా అమల్లోకి వస్తాయన్నారు. 500 బిలియన్ డాలర్ల కొనుగోళ్లు.. 500 బిలియన్ డాలర్ల విలువైన కొనుగోళ్లపై గోయల్ స్పందిస్తూ.. భారత్ చాలా వేగంగా వృద్ధి సాధిస్తోందంటూ.. ఇందుకు పెద్ద మొత్తంలో ఇంధనం, డేటా సెంటర్ల ఎక్విప్మెంట్, ఐసీటీ ఉత్పత్తులు అవసరం అవుతాయని చెప్పారు. ఈ ప్రకారం రూ.500 బిలియన్ డాలర్లు అన్నది ఒక అంచనా అని.. అమెరికా నుంచి వచ్చే ఐదేళ్లలో ఈ స్థాయిలో కొనుగోళ్లు జరుగుతాయని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. -
వస్తున్నాయ్ కొత్త కార్లు.. ఈ నెలలో లాంచ్ అయ్యే మోడల్స్ ఇవే!
సాధారణంగా ఎవరైనా కొత్త కార్లు కొనాలంటే.. జనవరి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తారు. అయితే ఈసారి జనవరి కంటే ఫిబ్రవరిలో లాంచ్ అయ్యే కొత్త కార్ల సంఖ్య ఎక్కువగా ఉంది.నిస్సాన్ టెక్టెన్: నిస్సాన్ కంపెనీ తన ఫ్లాగ్షిప్ మోడళ్లలో ఒకటైన టెక్టెన్ను ఈ నెల 4న (ఫిబ్రవరి 4) ఆవిష్కరించింది. మిడ్-సైజ్ ఎస్యూవీ విభాగానికి చెందిన ఈ కారు.. అమ్మకాల్లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి వాటితో పోటీ పడుతుంది. ఇది రెండు ఇంజిన్ ఎంపికలతో లభిస్తుంది. ఒకటి 100 బీహెచ్పీ పవర్ అందించే.. 1.0 లీటర్ త్రీ లీటర్ టర్బో పెట్రోల్. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ DCTతో లభిస్తుంది. మరొకటి 163 బీహెచ్పీ పవర్ ప్రొడ్యూస్ చేసే 1.3 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో మాత్రమే అందుబాటులో ఉంటుంది.ఎంజీ మెజెస్టర్: భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన.. ఎంజీ మోటార్ ఇండియా కూడా ఈ నెల 12 (ఫిబ్రవరి 12) మెజెస్టర్ కారును ఆవిష్కరించనుంది. కంపెనీ ఈ కారును మొదటిసారి 2025 ఆటోఎక్స్పోలో ప్రదర్శించింది. దీని డిజైన్, ఫీచర్స్ అన్నీ కూడా.. ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న గ్లోస్టర్ మాదిరిగా ఉన్నప్పటికీ, కొన్ని తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇంజిన్లో కూడా ఎటువంటి మార్పు లేదు. గ్లోస్టర్ కారులోని అదే 2.0-లీటర్ డీజిల్ ట్విన్-టర్బో ఇంజిన్ ఉంటుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో లభిస్తుంది. రియర్ వీల్ డ్రైవ్, ఆల్-వీల్ డ్రైవ్ ఫెసిలిటీలు ఉన్నాయి.బీఎండబ్ల్యూ ఎక్స్-3 30 ఎక్స్డ్రైవ్ ఎం స్పోర్ట్స్ ప్రో: బీఎండబ్ల్యూ కూడా ఈ నెల 16న.. ఎక్స్-3 విభాగంలో 30 ఎక్స్డ్రైవ్ ఎం స్పోర్ట్స్ ప్రో లాంచ్ చేయనుంది. ఇది సాధారణ స్పోర్ట్స్ వేరియంట్ మాదిరిగానే.. 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్తో పనిచేస్తుంది. అయితే ఈ వేరియంట్లో 48V మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ను కొనసాగించారు. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ ఆప్షన్ ఉంటుంది. 6.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అయ్యే ఈ కారు.. 14.61 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.మారుతి సుజుకి ఈ-విటారా: మిడ్-సైజ్ ఎస్యూవీ విభాగంలో మారుతి సుజుకి.. ఎలక్ట్రిక్ కారు ఈ విటారా, ఈ నెలలోనే లాంచ్ అవుతుంది. ఇది మహీంద్రా బీఈ6, హ్యుందాయ్ క్రెటా ఈవీ, ఎంజీ జెడ్ఎస్ ఈవీ, విన్ఫాస్ట్ వీఎఫ్6 వంటి మొదళ్లకు ప్రత్యర్థిగా నిలుస్తుంది. ఈ కారు ఒక ఫుల్ ఛార్జితో 543 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. రియల్ వరల్డ్ రేంజ్ అనేది కొంత తగ్గుతుంది.ఫోక్స్వ్యాగన్ టైరోన్: ఫోక్స్వ్యాగన్ టైరోన్ కూడా ఈ నెలలోనే విడుదలవుతుంది. ఇది 204 బీహెచ్పీ పవర్ అందించే 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్తో పనిచేస్తుంది. 7 స్పీడ్ డీసీటీ ట్రాన్స్మిషన్ ఉంటుంది. ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం ఉంటుంది. ఇందులో 15 ఇంచెస్ సెంట్రల్ టచ్స్క్రీన్, 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 3-జోన్ క్లైమేట్ కంట్రోల్, మెమరీ, హీటింగ్, వెంటిలేషన్ అండ్ మసాజ్ ఫంక్షన్లతో కూడిన పవర్డ్ ఫ్రంట్ సీట్లు, హెడ్-అప్ డిస్ప్లే, యాంబియంట్ లైటింగ్, పవర్డ్ టెయిల్గేట్ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి.టాటా సియెర్రా ఈవీ: ఇప్పటికే పెట్రోల్ ఇంజిన్ ఎంపికలో అందుబాటులో ఉన్న టాటా సియెర్రా.. ఈ నెలలో ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ అవుతుంది. దీని డిజైన్.. సాధారణ కారు కంటే కొంత భిన్నంగా ఉంటుంది. ప్రధానంగా ఫ్రంట్ గ్రిల్ డిజైన్ కొంత ప్రత్యేకంగా ఉంటుంది. హారియర్ ఈవీ ప్లాట్ఫామ్పై నిర్మితమైన ఈ కారు.. ఆల్ వీల్ డ్రైవ్, రియర్ వీల్ డ్రైవ్ ఎంపికలలో అందుబాటులో ఉంటుంది. -
బంగారం పింక్ పేపర్లోనే ఎందుకిస్తారో తెలుసా?.. సీక్రెట్ ఇదే!
సాధారణంగా చాలామంది గోల్డ్ కొనుగోలు చేసినప్పుడు.. విక్రయదారులు బంగారాన్ని పింక్ కలర్ పేపర్లో చుట్టి ఇస్తుంటారు. బహుశా కొందరికి అనుమానం కూడా వచ్చి ఉండొచ్చు.. ఎందుకు ఈ రంగు కాగితంలోనే చుట్టి ఇస్తున్నారని. మీ సందేహానికి సమాధానమే ఈ కథనం..బంగారాన్ని సాధారణంగా పింక్ కలర్ పేపర్లోనే చుట్టి ఇవ్వడం వెనుక స్పష్టమైన శాస్త్రీయ కారణం కన్నా.. సంప్రదాయం, మానసిక ప్రభావం, వ్యాపారానికి సంబంధించిన ఆచారం కలిసి ఉన్నాయనే చెప్పాలి. పసిడి మన భారతీయ సంస్కృతిలో అత్యంత విలువైన లోహం. అది కేవలం ఆభరణంగా మాత్రమే అనుకోవడం పొరపాటు. ఎందుకంటే ఇది సంపదకు, శుభానికి, స్థిరత్వానికి ప్రతీకగా భావిస్తారు. అంతటి విలువైన వస్తువును అందించే సమయంలో.. ఒక ప్రత్యేకత ఉండాలనే భావనతో వ్యాపారులు పింక్ కలర్ పేపర్లో చుట్టి ఇస్తూ వస్తున్నారు.రంగుఇతర రంగుల కంటే.. పింక్ కలర్ మృదుత్వం, శుభ్రత, సౌమ్యతను సూచిస్తుంది. చూడగానే హాయిని ఇచ్చే ఈ రంగు.. మనసులో సానుకూల భావనను కలిగిస్తుంది. బంగారం లాంటి మెరిసే లోహాన్ని పింక్ పేపర్ మీద పెట్టినప్పుడు అది మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కొనుగోలుదారు కూడా నేను చాలా విలువైన లోహాన్ని కొనుగోలు చేశాననే సంతృప్తిని ఇస్తుంది.సాంప్రదాయంచాలాకాలం నుంచి ఆభరణాల దుకాణాల్లో పింక్ లేదా లైట్ రెడ్ కలర్ పేపర్ ఉపయోగించడం అలవాటుగా మారిపోయింది. ఒక ఆచారం మొదలైందంటే.. అది అలాగే కొనసాగుతూ ఉంటుంది. ఆలాగే బంగారం విషయంలో పేపర్ రంగు నేటికీ కొనసాగుతోంది. బంగారం అంటే పింక్ పేపర్ అన్న భావన మనకు తెలియకుండానే మనసులో స్థిరపడిపోయింది.ఇదీ చదవండి: ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో ఆందోళన.. మైఖేల్ బరీ హెచ్చరిక!వ్యాపారంఇతర పేపర్లతో పిలిస్తే.. పింక్ కలర్ పేపర్ మురికి, మడతలు వంటి వాటిని అంత త్వరగా కనిపించనివ్వదు. అంతే కాకుండా ఇది పెద్దగా ఖరీదైంది కాదు కూడా. ఎప్పుడైనా.. ఎక్కడైనా ఒకే రంగు వాడటం వల్ల దాని గుర్తింపు ప్రత్యేకమవుతుంది. అందుకే దుకాణదారులు కూడా గోల్డ్ అంటే.. పింక్ రంగునే వాడుతుంటారు.మానసిక ప్రభావంప్రజలు ఎప్పుడైనా శుభం జరగాలనే కోరుకుంటారు. పింక్ పేపర్లో చుట్టి ఇవ్వడం వల్ల.. అది మరింత శుభంగా భావిస్తారు. పైన చెప్పుకున్నట్లు.. పింక్ రంగు మనసుకు ఆహ్లాదం కలిగిస్తుంది కూడా. ఇలా.. మొత్తం మీద గోల్డ్ అంటే పింక్ పేపర్ అని అందరూ పిక్స్ అయిపోయారు. -
డబ్బుతో ఆనందం కొనలేము: మస్క్ ట్వీట్
ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' తన ఎక్స్ ఖాతాలో చేసిన ట్వీట్.. సోషల్ మీడియాలో భారీ చర్చకు దారి తీసింది. ఎప్పడూ సంచనల వ్యాఖ్యలు చేసే ఈయన.. ఇప్పుడు ఒక భావోద్వేగ పోస్ట్ చేశారు. "డబ్బుతో ఆనందాన్ని కొనలేము" అని ఒక ఎమోజీ యాడ్ చేశారు. ఇది నెటిజన్ల దృష్టిని ఆకట్టుకుంది.ఎలాన్ మస్క్ మాటలతో కొందరు ఏకీభవించగా.. మరికొందరు తన సంపదను దృష్టిలో ఉంచుకుని సరదాగా కూడా వ్యాఖ్యానించారు. అంటే మీరు సంతోషంగా లేరా? అని ఒకరు ప్రశ్నించగా.. మరొకరు, ముందు నాకు 1 బిలియన్ డాలర్లు ఇవ్వండి, నేనూ అనుభవించి చెబుతాను అని అన్నారు. ఇంకొకరు బిలియనీర్గా బాధపడటం, బిలియనీర్ కాకుండా బాధపడటం కంటే మెరుగైనదే.. అంటూ వ్యంగ్యంగా స్పందించారు.సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా.. ఈ చర్చలో ప్రముఖ అమెరికన్ హెడ్జ్ ఫండ్ మేనేజర్ బిల్ అక్మన్ కూడా పాల్గొనడం మరో ముఖ్యమైన అంశం. మీరు ఇప్పటికే చాలామందికి సహాయం చేశారు. అంతేకాదు.. జీవిత భాగస్వామితో దీర్ఘకాలికమైన, స్థిరమైన సంబంధం కూడా నిజమైన ఆనందానికి కారణమవుతుందని ఆయన వ్యక్తిగత సలహా ఇవ్వడం గమనార్హం.ఇదీ చదవండి: ఆదాయంలో గూగుల్ సరికొత్త రికార్డ్.. మస్క్ రియాక్షన్ ఇదే!సోషల్ మీడియాలో ఈ చర్చ జరుగుతున్న సమయంలో.. ఎలాన్ మస్క్ మరో రికార్డ్ సృష్టించారు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. 800 బిలియన్ డాలర్లకుపైగా సంపద కలిగిన తొలి వ్యక్తిగా ఆయన నిలిచారు. స్పేస్ఎక్స్, xAI వంటి సంస్థల విస్తరణ, వాటి విలువ పెరుగుదల మస్క్ సంపదను ఆ స్థాయికి తీసుకెళ్లాయి.ప్రపంచ కుబేరుడు అయినప్పటికీ.. డబ్బుతో ఆనందాన్ని కొనలేము అని మస్క్ వ్యాఖ్యానించడం చాలామందిని ఆలోచనల్లోకి నెట్టేసింది. మానవ సంబంధాలు, ఇతరులకు ఉపయోగపడే పనులు అన్నీ నిజమైన సంతోషాన్ని ఇస్తాయని కొందరు మరోసారి గుర్తు చేశారు.Whoever said “money can’t buy happiness” really knew what they were talking about 😔— Elon Musk (@elonmusk) February 5, 2026 -
వాలెంటైన్స్ డే ఆఫర్.. ఐఫోన్ 17పై భారీ డిస్కౌంట్లు
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా యాపిల్ భారత మార్కెట్లో వాలెంటైన్స్ డే సేల్ను ప్రారంభించింది. ఈ ప్రత్యేక ఆఫర్లో భాగంగా లేటెస్ట్ ఐఫోన్ 17 సిరీస్పై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు అందిస్తోంది. ఈ వాలెంటైన్స్ డే సేల్ ప్రస్తుతం యాపిల్ ఇండియా అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంది.ఈ సేల్లో భాగంగా యాపిల్ ఎప్పటిలానే నేరుగా ధరలు తగ్గించకుండా, బ్యాంక్ ఆధారిత ఇన్స్టంట్ క్యాష్బ్యాక్లు, క్రెడిట్ కార్డు డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ ఆఫర్లు ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్, అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డులపై వర్తిస్తాయి. చెక్అవుట్ సమయంలో అర్హత కలిగిన కార్డును ఉపయోగించిన వెంటనే ఇన్స్టంట్ క్యాష్బ్యాక్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దీంతో ఫోన్ ధర తగ్గుతుంది. డిస్కౌంట్ తప్ప, మిగతా కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి మార్పులు ఉండవు. డెలివరీ అంచనాలు, స్టోర్ పికప్ ఆప్షన్లు, చెల్లింపు విధానం యథాతథంగా ఉంటాయి.ఐఫోన్ 17 స్పెసిఫికేషన్లు, ధరఐఫోన్ 17లో 6.3 అంగుళాల సూపర్ రెటీనా XDR OLED డిస్ప్లే ఉంది. ఇది A19 చిప్, 8GB ర్యామ్, 256GB / 512GB స్టోరేజ్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.ఫోటోగ్రఫీ కోసం ఇందులో 48MP డ్యూయల్ ఫ్యూజన్ కెమెరా సిస్టమ్ ఉండి, 10x డిజిటల్ జూమ్కు సపోర్ట్ చేస్తుంది.వాలెంటైన్స్ డే సేల్ సందర్భంగా ఈ ఫోన్ రూ.77,900 ప్రారంభ ధరకు లభిస్తోంది. దీనిపై రూ.5,000 ఇన్స్టంట్ బ్యాంక్ క్యాష్బ్యాక్ అందుబాటులో ఉంది.ఐఫోన్ 17 ప్రో స్పెక్స్.. ఆఫర్లు ఇలా..ఐఫోన్ 17 ప్రోలో 6.3 అంగుళాల LTPO సూపర్ రెటీనా XDR డిస్ప్లే ఉంది. ఇది 120Hz ప్రోమోషన్, ఆల్వేస్-ఆన్ ఫీచర్తో వస్తుంది. ఈ మోడల్లో A19 ప్రో చిప్ (6-కోర్ CPU, 6-కోర్ GPU, 16-కోర్ న్యూరల్ ఇంజిన్), 12GB ర్యామ్ ఉన్నాయి. అలాగే 48MP కెమెరా అరే, 5x ఆప్టికల్ జూమ్, 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ లభిస్తుంది. టైటానియం ఫ్రేమ్, USB-C పోర్ట్, అధునాతన AI ఫీచర్లు, అలాగే 33 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.వాలెంటైన్స్ డే సేల్లో ఈ ఫోన్ రూ.1,29,900 తగ్గింపు ధరకు లభిస్తుంది. దీనిపై కూడా రూ.5,000 ఇన్స్టంట్ క్యాష్బ్యాక్ వర్తిస్తుంది.ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ప్రత్యేకతలు, ధరఐఫోన్ 17 ప్రో మ్యాక్స్లో 6.9 అంగుళాల LTPO సూపర్ రెటీనా XDR డిస్ప్లే ఉంది. ఇది 120Hz ప్రోమోషన్, ఆల్వేస్-ఆన్ ఫీచర్తో పాటు 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను అందిస్తుంది. ఈ మోడల్ A19 ప్రో చిప్, 12GB ర్యామ్తో శక్తివంతమైన పనితీరు, మెరుగైన AI సామర్థ్యాలను అందిస్తుంది. ఫోటోగ్రఫీ కోసం ఇందులో ట్రిపుల్ 48MP కెమెరా సెటప్, LiDAR సెన్సార్, 5x టెలిఫోటో జూమ్, 8K వీడియో సపోర్ట్ ఉన్నాయి.వాలెంటైన్స్ డే సేల్ సందర్భంగా ఈ ఫోన్ రూ.1,44,900 ప్రత్యేక ధరకు లభిస్తుంది. దీనిపైనా రూ.5,000 ఇన్స్టంట్ బ్యాంక్ క్యాష్బ్యాక్ అందుబాటులో ఉంది. -
రిటైర్మెంట్ వయసు పెరగనుందా?
ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు అంశం 2026లో మరోసారి చర్చకు వచ్చింది. పెరుగుతున్న ఆయుర్దాయం, పెన్షన్ బాధ్యతల భారం నేపథ్యంలో ఈ విషయం విధాన నిర్ణేతలు, ఉద్యోగులు, న్యాయస్థానాల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం 58–60 సంవత్సరాల మధ్య ఉన్న పదవీ విరమణ వయస్సును సమీప భవిష్యత్తులో సవరించే అవకాశం ఉందని అనేక రాష్ట్రాలు, రంగాల వారీగా వస్తున్న ప్రతిపాదనలు సూచిస్తున్నాయి. అయితే, దేశవ్యాప్తంగా వర్తించే ఏకరీతి నిర్ణయం ఇప్పటివరకు అధికారికంగా తీసుకోలేదు.సానుకూలంగా రాష్ట్ర ప్రభుత్వాలు!దేశవ్యాప్తంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు, ఉద్యోగ సంఘాలు సంప్రదాయ పదవీ విరమణ నిబంధనలను పునఃపరిశీలించే దిశగా అడుగులు వేస్తున్నాయి. పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలా వద్దా అన్నది ప్రభుత్వ విధాన నిర్ణయమని, ఇందులో న్యాయవ్యవస్థ జోక్యం అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవల స్పష్టం చేసింది. మరోవైపు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ వ్యయాన్ని నియంత్రించేందుకు రాష్ట్ర ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 64 నుంచి 65 సంవత్సరాలకు పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే, ఈ విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.కార్మికుల పదవీ విరమణ వయస్సును పొడిగించాలా అనే అంశంపై జాతీయ స్థాయిలో విస్తృత చర్చ జరుగుతున్న తరుణంలో ఈ ప్రతిపాదనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ప్రామాణిక పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాలే అయినప్పటికీ, ఆరోగ్యకరమైన దీర్ఘకాలిక పని జీవితం, పెరుగుతున్న పెన్షన్ ఖర్చులను దృష్టిలో ఉంచుకుని దానిని 62 లేదా అంతకంటే ఎక్కువకు పెంచాలా అనే దానిపై విధాన, మేధావి వర్గాలు చురుకుగా చర్చిస్తున్నాయి.నిరుద్యోగ సమస్యపదవీ విరమణ వయస్సు పెంపు ప్రభావం కేవలం పెన్షన్ వ్యయాలకే పరిమితం కాదు. ఇది మొత్తం శ్రామిక శక్తి సమీకరణంపైనా ప్రభావం చూపుతుంది. అనుభవజ్ఞులైన ఉద్యోగులను ఎక్కువకాలం సేవలో కొనసాగించడం ద్వారా కొన్ని రంగాల్లో నైపుణ్యాల కొరతను తగ్గించవచ్చని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అయితే, ఇదే సమయంలో యువతకు ఉద్యోగ అవకాశాలు తగ్గే ప్రమాదం ఉందని, నిరుద్యోగ సమస్య మరింత తీవ్రమవుతుందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. -
వెనుకబడ్డ టెస్లా.. అమ్మకాల్లో ఫోక్స్వ్యాగన్
అమెరికన్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా.. యూరోపియన్ మార్కెట్లో అమ్మకాల పరంగా వెనుకబడింది. రిజిస్ట్రేషన్ డేటా ప్రకారం.. టెస్లా జనవరి 2026 నుంచి మోడల్ వై కార్లను కేవలం 62 మాత్రమే విక్రయించింది. ఇది మొత్తం కొత్త కార్ల అమ్మకాలలో 2.8 శాతం మాత్రమే.టెస్లా ఈ ఏడాది మొత్తం 83 కార్లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెల అమ్మకాలతో పోలిస్తే ఇది 88 శాతం తక్కువ. ఇప్పుడు అమ్మకాల్లో ఫోక్స్వ్యాగన్ అగ్రస్థానంలో ఉంది. టెస్లా కంటే ఐదు రేటు ఎక్కువ అమ్మకాలు సాధించింది.టెస్లా సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ.. నార్వేలోని ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. దీనివల్ల టెస్లా అమ్మకాలు కొంత ఆశాజనకంగానే ఉన్నాయి. గత నెలలో నార్వేలో జరిగిన అన్ని కొత్త వాహనాల అమ్మకాలలో 94 శాతం ఈవీలు ఉన్నాయి. డీజిల్ కార్లు 98 కాగా, పెట్రోల్ కార్ల అమ్మకాలు కేవలం 7 మాత్రమే.మోడల్ ఎక్స్, ఎస్ నిలిపివేత!అమెరికన్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా.. తన పాపులర్ మోడల్స్ 'ఎస్, ఎక్స్' ఎలక్ట్రిక్ కార్లను దశలవారీగా నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. బదులుగా.. హ్యూమనాయిడ్ రోబోలను ఉత్పత్తి చేయడానికి కాలిఫోర్నియా ఫ్యాక్టరీని తిరిగి ఏర్పాటు చేస్తామని సీఈఓ ఎలాన్ మస్క్ తెలిపారు.2012, 2015లో మార్కెట్లో విడుదలైన టెస్లా మోడల్ ఎస్, మోడల్ ఎక్స్ కార్లను అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందాయి. స్టార్టప్ నుంచి టెస్లా ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటోమేకర్గా ఎదగడానికి ఇవి దోహదపడ్డాయి. అలాంటి కార్లను కంపెనీ నిలిపివేయడానికి సిద్ధమైంది. పెట్టుబడిదారులు & వాల్ స్ట్రీట్ విశ్లేషకులతో జరిగిన సమావేశం తరువాత మస్క్ ఈ ప్రకటన చేశారు. -
బిట్కాయిన్ పతనం.. మైఖేల్ బరీ హెచ్చరిక!
బంగారం, వెండి ధరలు మాత్రమే కాకుండా.. బిట్కాయిన్ ధర కూడా అమాంతం పడిపోతోంది. ఇది ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో ఆందోళనను కలిగిస్తోంది. ఈ తరుణంలో ప్రముఖ హెజ్ ఫండ్ మేనేజర్ 'మైఖేల్ బరీ' కీలక వ్యాఖ్యలు చేశారు.బిట్కాయిన్ పతనం కేవలం క్రిప్టో మార్కెట్కే పరిమితం కాదు. ఇది బంగారం, వెండి వంటి సంప్రదాయ పెట్టుబడులపై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉందని.. మైఖేల్ బరీ హెచ్చరించారు. బిట్కాయిన్లో పెద్ద నష్టాలు వస్తే, పెట్టుబడిదారులు నగదు కోసం ఇతర ఆస్తులను కూడా అమ్మకానికి పెట్టే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.బిట్కాయిన్ ఇప్పుడు ప్రధాన ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారింది. స్పాట్ బిట్కాయిన్ ETFలు, అలాగే కొన్ని పెద్ద కంపెనీలు తమ ట్రెజరీలో బిట్కాయిన్ను నిల్వ చేసుకోవడం వల్ల, క్రిప్టో మార్కెట్లో జరిగే మార్పులు మిగతా మార్కెట్లను ప్రభావితం చేస్తాయి. ETFల నుంచి పెట్టుబడులు బయటకు వెళ్తే.. ఆ ఫండ్స్ తమ వద్ద ఉన్న బిట్కాయిన్ను అమ్మాల్సి వస్తుంది. దీని వల్ల ధరలు మరింత పడిపోతాయని మైఖేల్ బరీ పేర్కొన్నారు.బిట్కాయిన్ మరింత పడిపోతే, మైక్రోస్ట్రాటజీ వంటి బిట్కాయిన్పై భారీగా ఆధారపడిన సంస్థలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉందని బరీ హెచ్చరించారు. ముఖ్యంగా బిట్కాయిన్ ధర 50,000 డాలర్ల వరకు పడితే.. కొంతమంది దివాలా తీయవచ్చని, అలాగే టోకనైజ్డ్ మెటల్స్ (డిజిటల్ గోల్డ్, సిల్వర్) మార్కెట్లో కొనుగోలుదారులు తగ్గిపోతారని చెప్పారు. ఇది ఆయన చెప్పినట్లుగా ఒక 'డెత్ స్పైరల్'.. అంటే ఒక సమస్య మరో సమస్యకు దారితీసే ప్రమాదకరమైన పరిస్థితి.బ్లూమ్బర్గ్ నివేదిక ప్రకారం.. బిట్కాయిన్ ద్రవ్యోల్బణానికి రక్షణగా పనిచేస్తుందనే వాదనను బరీ ఖండించారు. అంతే కాకుండా.. బిట్కాయిన్.. S&P 500 స్టాక్ సూచీ మధ్య పెరుగుతున్న సంబంధం కూడా ఆందోళన కలిగించే అంశంగా ఆయన పేర్కొన్నారు.ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. బరీ చెప్పిందే జరుగుతుందని కచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే.. గతంలో కూడా క్రిప్టో మార్కెట్ భారీ పతనాల తర్వాత వేగంగా కోలుకున్న సందర్భాలు ఉన్నాయి. కాగా బంగారం, వెండి ధరలు సాధారణంగా.. వడ్డీ రేట్లు, డాలర్ బలం, నియంత్రణ మార్పులు వంటి అంశాలపై కూడా ఆధారపడి ఉంటాయి. కేవలం క్రిప్టో అమ్మకాల వల్ల బంగారం ధరల్లో భారీ మార్పులు సంభవించే అవకాశం లేదు.ఇదీ చదవండి: ఆదాయంలో గూగుల్ సరికొత్త రికార్డ్.. మస్క్ రియాక్షన్ ఇదే! -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 514.66 పాయింట్ల లాభంతో.. 83,303.02 వద్ద, నిఫ్టీ 135.30 పాయింట్ల లాభంతో 25,640.70 వద్ద నిలిచాయి.మహేశ్వరి లాజిస్టిక్స్ లిమిటెడ్, నీరాజ్ ఇస్పాత్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, లాయల్ టెక్స్టైల్స్ మిల్స్ లిమిటెడ్, బార్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్, టిజారియా పాలీపైప్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. సరళ పెర్ఫార్మెన్స్ ఫైబర్స్ లిమిటెడ్, బయోఫిల్ కెమికల్స్ & ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, జువారీ ఆగ్రో కెమికల్స్ లిమిటెడ్, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
‘ఏంటి మేడమ్ ఇది.. పసిడి పన్ను న్యాయమేనా?’
దేశ ప్రజలను భౌతిక బంగారం నుంచి పేపర్ గోల్డ్ వైపు మళ్లించేందుకు ఒకప్పుడు ఫ్లాగ్షిప్ పథకంగా నిలిచిన సావరిన్ గోల్డ్ బాండ్ (SGB) ఇప్పుడు ఆర్థిక బిల్లులో ప్రతిపాదించిన కొత్త పన్ను మార్పుల నేపథ్యంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. సంవత్సరాల తరబడి పన్ను-సమర్థ పెట్టుబడిగా ప్రచారం చేసిన ఈ బాండ్లపై ఇప్పుడు ప్రభుత్వ విధాన స్థిరత్వమే ప్రశ్నార్థకంగా మారిందని విమర్శకులు అంటున్నారు.ఈ నేపథ్యంలో పెట్టుబడిదారుల అసంతృప్తికి స్వరం ఇచ్చారు చార్టర్డ్ అకౌంటెంట్ కరణ్ భాల్. ఆయన సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు విస్తృత చర్చకు దారి తీశాయి. “వావ్! ఇప్పుడు PPF, EPF ఉపసంహరణల్లో కూడా ప్రభుత్వానికి వాటా కావాలా? NPS లాభాలపై కూడా పన్నా? ‘నువ్వు డబ్బు సంపాదిస్తే, నాకూ వాటా ఎందుకు వద్దు?’ అనడం ఇది ఏం లాజిక్ మేడమ్? (ఆర్థిక మంత్రి నిర్మిలా సీతారామన్), ఎలాంటి పన్ను సమస్యలు లేకుండా గోల్డ్ బాండ్లు కొనాలని మీ ప్రభుత్వమే చెప్పింది. పెట్టుబడిదారులు లాభపడితే విధానాలనే మార్చేస్తారా?” అంటూ భాల్ మండిపడ్డారు.గోల్డ్ బాండ్ కొత్త ట్యాక్స్ ఫ్రేమ్వర్క్ఆర్థిక బిల్లులో ప్రతిపాదించిన మార్పుల ప్రకారం.. ఇకపై సావరిన్ గోల్డ్ బాండ్లపై పన్ను విధానం ఇన్వెస్టర్ దాన్ని ఎప్పుడు, ఎలా కొనుగోలు చేశారు, ఎప్పుడు నిష్క్రమించారు అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. లాంచ్ సమయంలో చందా పొంది, పూర్తి 8 సంవత్సరాల మెచ్యూరిటీ వరకు ఉన్నవారికి మాత్రమే ఇప్పటికీ మూలధన లాభాలపై పన్ను మినహాయింపు ఉంటుంది.అదే సెకండరీ మార్కెట్లో సావరిన్ గోల్డ్ బాండ్లను కొనుగోలు చేసినవారికి మూలధన లాభాలపై పన్ను వర్తిస్తుంది. అలాగే, అసలు చందాదారులు ఐదేళ్ల తర్వాత కానీ ఎనిమిదేళ్లకు ముందే కానీ రీడీమ్ చేస్తే వారికి కూడా పన్ను వర్తిస్తుంది.2015లో ప్రారంభమైన సావరిన్ గోల్డ్ బాండ్ పథకం ఇప్పటివరకు 67 విడతల్లో సుమారు 147 టన్నుల బంగారానికి బాండ్లు జారీ చేసింది. అయితే బంగారం ధరలు పెరగడంతో, 2024 తర్వాత కొత్తగా వీటి జారీని నిలిపేసింది. దీంతో సెకండరీ మార్కెట్లో లావాదేవీలు పెరిగాయి. అవే ఇప్పుడు పన్నుల వలలో చిక్కాయి.మరోవైపు రిస్క్ తీసుకున్నప్పటికీ తమ మొత్తం పోర్ట్ఫోలియో XIRRలు (ఎక్స్టెండెడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్) ఇప్పటికీ ప్రారంభ రెండంకెల్లోనే ఉన్నాయని, ఈటీఎఫ్లతో పోలిస్తే సావరిన్ గోల్డ్ బాండ్లకు సెకండరీ మార్కెట్లో లిక్విడిటీ సమస్యలు ఎక్కువ అని సీఏ కరణ్ భాల్ వాదిస్తున్నారు.WOW!The government will deserve its share of your PPF, EPF withdrawals too.It'll deserve its share of your NPS gains too.And what logic is this? "If you are making a killing, why shouldn't I get something?"Madam, your government only told us to go ahead and buy SGBs… pic.twitter.com/8KYhZ2Kxx9— Kanan Bahl (@BahlKanan) February 4, 2026 -
ఆదాయంలో గూగుల్ సరికొత్త రికార్డ్.. మస్క్ రియాక్షన్ ఇదే!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్.. ఆదాయం విషయంలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించారు. దీనిపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ స్పందించారు.''మా సంస్థకు సంబంధించిన 2025 ఆర్ధిక సంవత్సరం నాలుగవ త్రైమాసికం ఆర్థిక ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలు మా ప్రయాణంలో ఒక చారిత్రక మైలురాయిగా నిలిచాయి. మా భాగస్వాములు & ఉద్యోగుల అంకితభావం, కృషి వల్ల ఈ త్రైమాసికం విజయవంతంగా ముగిసింది. ముఖ్యంగా.. మా వార్షిక ఆదాయం తొలిసారిగా 400 బిలియన్ డాలర్లను అధిగమించడం.. గర్వించదగ్గ విషయం'' అని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు.సుందర్ పిచాయ్ పోస్టుపై స్పందించిన ఎలాన్ మస్క్..'వెల్ డన్' అని రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.2025 ఆర్ధిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో.. సెర్చ్ & ఇతర యాడ్స్ విభాగం 17 శాతం వృద్ధిని సాధించింది. జెమిని యాప్ నెలకు 750 మిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్లను కలిగి ఉంది. 2025లో యూట్యూబ్ యాడ్స్ & సబ్స్క్రిప్షన్ ద్వారా 60 బిలియన్ డాలర్లకు పైగా ఆదాయం వచ్చింది. ఇలా విభాగాల వారీగా గూగుల్ కంపెనీ మంచి వృద్ధిని నమోదు చేసింది.Well done— Elon Musk (@elonmusk) February 5, 2026 -
ఆర్బీఐ మానిటరీ పాలసీ.. వడ్డీ రేట్లు యథాతథం?
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి, మారుతున్న ద్రవ్యోల్బణ గణాంకాలు, దేశీయ బాండ్ మార్కెట్ ఒత్తిళ్ల మధ్య ఆర్బీఐ తన ఫిబ్రవరి పాలసీలో వడ్డీ రేట్లను మార్చకపోవచ్చని తెలుస్తోంది. గతేడాది నుంచి దేశీయంగా వడ్డీ రేట్లు తగ్గుతున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులు మరింత అప్రమత్తంగా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి 4 నుంచి 6 వరకు జరిగే ఆర్బీఐ మానిటరీ సమావేశంలోని అంశాలు రేపు ఉదయం వెలువడనున్నాయి.అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలుగత పాలసీ సమావేశం తర్వాత జరిగిన అతిపెద్ద పరిణామం భారత్-అమెరికా, భారత్-యూరప్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాలు. దీని ఫలితంగా భారతీయ వస్తువులపై సుంకాలు గతంలో ఉన్న 50% నుంచి 18%కి గణనీయంగా తగ్గాయి. ప్రస్తుతం ఆసియా దేశాల్లోనే అతి తక్కువ టారిఫ్ రేట్లు కలిగిన దేశాల్లో ఒకటిగా భారత్ నిలిచింది. ఇది మన ఎగుమతిదారుల పోటీతత్వాన్ని భారీగా పెంచనుంది.ప్రపంచ ఆర్థిక అనిశ్చితిఅంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు ఇంకా సందిగ్ధంలోనే ఉన్నాయి. ‘జియో-ఎకనామిక్స్ స్ట్రెస్ ఇండెక్స్’ ప్రకారం అంతర్జాతీయ అనిశ్చితి పెరిగిన 3-4 నెలల తర్వాత ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం కనిపిస్తుంది. మరోవైపు గత వారం భారీ పతనాన్ని చూసిన లోహాల ధరలు తిరిగి కోలుకోవడం గమనార్హం.అమెరికా ఫెడ్ రేట్ల కోత సంకేతాలుఅమెరికాలో లేబర్ మార్కెట్ మందగించడం, వాస్తవ ఆదాయం స్థిరంగా ఉండటం, ద్రవ్యోల్బణ ప్రభావం తగ్గడంతో.. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది. ఇది ప్రపంచ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది.రూపాయి ఒడిదుడుకులుగత రెండు నెలలుగా రూపాయి విలువ డాలర్తో పోలిస్తే రూ.89-92 మధ్య ఊగిసలాడుతోంది. ఏప్రిల్ 2025లో అమెరికా సుంకాలను పెంచినప్పటి నుంచి రూపాయి 5.8% మేర క్షీణించింది. అయితే ఇటీవలి భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తర్వాత రూపాయి విలువ కోలుకోవడం సానుకూలాంశం.ద్రవ్యోల్బణంద్రవ్యోల్బణ గణనలో భాగంగా కొత్త సీపీఐ వెయిటేజీలను ప్రవేశపెట్టారు. దీని ప్రకారం సాధారణ సమయంలో ద్రవ్యోల్బణం 20-30 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశం ఉండగా.. ఆహార ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్న నెలల్లో మాత్రం కొత్త లెక్కల ప్రకారం సీపీఐ 20-30 బేసిస్ పాయింట్లు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.పైన పేర్కొన్న మిశ్రమ పరిస్థితుల నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని కమిటీ ప్రస్తుతానికి కీలక వడ్డీరేట్ల మార్పులపై వేచి చూసే ధోరణిని అవలంబిస్తుదని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: వ్యక్తిగత సంపదలో 75 శాతం విరాళం -
ఐటీ ఉద్యోగమా.. ఊడిగమా?
ఐటీ కంపెనీల్లో పని గంటలు, ఉద్యోగులపై పని ఒత్తిడి ఆందోళనలు ఇటీవల ఎక్కువయ్యాయి. హైదరాబాద్లో ఓ ప్రముఖ బహుళజాతి ఐటీ సంస్థ తనను ఏళ్ల తరబడి ఓవర్టైమ్ చెల్లించకుండా అధిక పని గంటలు చేయమని బలవంతం చేసిందని ఆరోపిస్తూ ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి తెలంగాణ కార్మిక శాఖను ఆశ్రయించాడు. దేశంలో పని గంటలపై పరిశ్రమ పెద్దలు చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ఫిర్యాదు ప్రాధాన్యం సంతరించుకుంది.రోజుకు 16 గంటల పనిటైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన కథనం ప్రకారం.. ఫిర్యాదుదారు శ్రీధర్ మేరుగు తన 14 ఏళ్ల ఉద్యోగ కాలంలో చాలా సార్లు రోజుకు 16 గంటలకు పైగా పనిచేయాల్సి వచ్చిందని తెలిపారు. అదనంగా పనిచేసిన గంటలకు తగిన పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.తగిన వేతనం లేకుండా అధిక షిఫ్టుల్లో పనిచేయాలని ఆశించడం అన్యాయమని, కార్మిక చట్టాలను సంస్థ ఉల్లంఘించిందని శ్రీధర్ ఆరోపించారు. ఓవర్టైమ్ వేతనాలు చెల్లించకుండా నిరాకరించడంతో ఈ వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ను కూడా ఆయన ఆశ్రయించారు.అనారోగ్యంలోనూ పనిభారంతాను అనారోగ్యానికి గురైన సమయంలో పరిస్థితి మరింత దారుణంగా మారిందని, అయినప్పటికీ పని కొనసాగించాల్సిందిగా ఒత్తిడి తెచ్చారని శ్రీధర్ తెలిపారు. అర్ధరాత్రి, తెల్లవారుజామున షిఫ్ట్ భత్యాలను కూడా కంపెనీ నిరాకరించిందని ఆయన ఆరోపించారు.సిబ్బంది కొరతను కారణంగా చూపుతూ నిరంతరం ఒత్తిడి పెంచారని, మూడు నుంచి నాలుగు నెలల పాటు రోజుకు 16 గంటలకు పైగా పని చేసిన తర్వాతే ఈ సమస్యను అధికారికంగా లేవనెత్తినట్లు చెప్పారు. అయితే చట్టవిరుద్ధమైన పని పరిస్థితుల్లో పనిచేయడానికి నిరాకరించాడనే కారణంతోనే 2025 సెప్టెంబర్లో తనను ఉద్యోగం నుంచి తొలగించారని శ్రీధర్ ఆరోపిస్తున్నారు.చట్టబద్ధమైన వడ్డీ, జరిమానాలతో పాటు పెండింగ్లో ఉన్న ఓవర్టైమ్ బకాయిలను చెల్లించాలని యూఎస్ కేంద్రంగా పనిచేస్తున్న ఆ కంపెనీని ఆదేశించాలని శ్రీధర్ కార్మిక శాఖకు విజ్ఞప్తి చేశారు.హైదరాబాద్ ఐటీ రంగంలో పెరుగుతున్న ఆందోళనహైదరాబాద్కు చెందిన ఇతర ఐటీ ఉద్యోగులు కూడా వారానికి 40 గంటలకంటే ఎక్కువగా పని చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. చట్టపరమైన హక్కు ఉన్నప్పటికీ చాలా మంది ఉద్యోగులు ఓవర్టైమ్ క్లెయిమ్ చేయడానికి వెనుకాడుతున్నారు.దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉన్న ఐటీ ప్రొఫెషనల్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ, ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత వేతనం లేని వారాంతపు, సెలవు రోజుల పని సాధారణంగా మారిపోయిందని తెలిపారు. పొడిగించిన పని గంటలను పాటించలేకపోతే పరోక్ష ఒత్తిడి, ఉద్యోగం కోల్పోతామన్న భయం ఉద్యోగులను వెంటాడుతోందని ఆయన అన్నారు.పని ఒత్తిడితో పోతున్న ప్రాణాలుపని ఒత్తిడిని తట్టుకోలేక హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి సతీష్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. అలాగే హైదరాబాద్కు చెందిన మరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయశాంతి రెడ్డి, ఇంటర్ చదువుతున్న తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన కూడా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనల వెనుక కూడా తీవ్రమైన పని ఒత్తిడే కారణమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
రుణ మోసాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం
రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్కామ్), దాని గ్రూప్ కంపెనీలతో ముడిపడి ఉన్న వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాల మోసాలపై దర్యాప్తులో జరుగుతున్న ఆలస్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై విచారణను వేగవంతం చేయాలని కేంద్ర దర్యాప్తు సంస్థలను కోర్టు ఆదేశించింది.ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుసుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయల్య బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం.పంచోలిలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. సీనియర్ అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ను కోర్టు ఆదేశించింది. నిర్ణీత కాలవ్యవధిలోగా ఈ దర్యాప్తును ముగించాలని ఈడీ, సీబీఐలకు స్పష్టం చేసింది.కోర్టు కీలక వ్యాఖ్యలు, ఆదేశాలుఒకే ఎఫ్ఐఆర్పై ప్రశ్నలు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఫిర్యాదు మేరకు సీబీఐ ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు కోర్టుకు తెలిపింది. అయితే బహుళ బ్యాంకుల నుంచి ఫిర్యాదులు ఉన్నప్పటికీ కేవలం ఒకే ఒక ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రతి ఫిర్యాదు వెనుక విభిన్న లావాదేవీలు ఉన్నాయని గుర్తు చేసింది.బ్యాంకు అధికారుల పాత్ర.. నిధుల మళ్లింపులో బ్యాంకు అధికారులు, ప్రభుత్వ అధికారులు, సంస్థల మధ్య ఏదైనా కుట్ర జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించింది.నాలుగు వారాల గడువు.. దర్యాప్తు పురోగతిపై తదుపరి నాలుగు వారాల్లోగా సమగ్రమైన స్టేటస్ రిపోర్టులను సమర్పించాలని రెండు ఏజెన్సీలను కోర్టు ఆదేశించింది.వాదోపవాదాలుప్రశాంత్ భూషణ్ (పిటిషనర్ తరఫు): రూ.పదివేల కోట్ల ప్రజల సొమ్ము దోపిడీకి గురైందని ఇంత తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ ప్రధాన నిందితులను ఇంకా అరెస్టు చేయకపోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.ముకుల్ రోహత్గీ (అనిల్ అంబానీ తరఫు): రిలయన్స్ గ్రూప్ బకాయిలను చెల్లించడానికి ప్రయత్నిస్తోందని, వ్యాపారంలో వచ్చే సాధారణ డిఫాల్ట్లను నేరపూరిత చర్యలుగా చూడకూడదని వాదించారు. నిందితులు విదేశాలకు పారిపోతారనే భయాల్లో నిజం లేదని ఆయన హామీ ఇచ్చారు.తుషార్ మెహతా (సొలిసిటర్ జనరల్): నకిలీ బ్యాంకు గ్యారెంటీలకు సంబంధించిన ఆధారాలను ఈడీ గుర్తించిందని, యెస్ బ్యాంక్ పెట్టుబడులపై కూడా విచారణ జరుగుతోందని కోర్టుకు వివరించారు.ఇప్పటివరకు చేపట్టిన చర్యలుఇటీవలే ఈడీ సుమారు రూ.1,885 కోట్ల విలువైన ఆస్తులను మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద తాత్కాలికంగా జప్తు చేసింది. నిధుల మళ్లింపు ఆరోపణలపై ఆర్సీఓఎం మాజీ డైరెక్టర్ పునీత్ గార్గ్ను కూడా అరెస్టు చేశారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరిగిన తీరును బట్టి చూస్తే తక్షణమే కాలపరిమితితో కూడిన దర్యాప్తు అవసరమని భావించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.ఇదీ చదవండి: వ్యక్తిగత సంపదలో 75 శాతం విరాళం -
ఐటీ పెట్టుబడిదారుల్లో ఆందోళన
కృత్రిమ మేధ (ఏఐ) విభాగంలో ఆంథ్రోపిక్ సంస్థ తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పు భారత ఐటీ రంగాన్ని వణికిస్తోంది. ఆంథ్రోపిక్ తన ‘క్లాడ్ కోవర్క్’ ఏజెంట్ కోసం సరికొత్త ఆటోమేషన్ ప్లగ్ఇన్లను విడుదల చేసింది. దాంతో శ్రమ ఆధారిత సర్వీసులపై ఆధారపడిన భారత ఐటీ కంపెనీల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ పరిణామం ఫలితంగా స్టాక్ మార్కెట్లో ఇటీవల ఐటీ షేర్లు భారీగా కుప్పకూలాయి.ఐటీ రంగానికి సవాలు..ఆంథ్రోపిక్ విడుదల చేసిన కొత్త ప్లగ్ఇన్లు కేవలం సాధారణ చాటింగ్ కోసం మాత్రమే కాదు, ఒక సంస్థలోని కీలక విభాగాలను స్వయంచాలకంగా నిర్వహించేలా రూపొందించారు. వీటి ప్రభావం ప్రధానంగా కింది విభాగాలపై ఉండనుంది.లీగల్, ఫైనాన్స్: కాంట్రాక్ట్ రివ్యూ, కంప్లయన్స్ వంటి సంక్లిష్ట ప్రక్రియలను ఏఐ వేగంగా పూర్తి చేస్తుంది.కస్టమర్ సపోర్ట్: టికెట్ల వర్గీకరణ, సమాధానాలు ఇవ్వడం.. వంటి అంశాలపై మనుషుల ప్రమేయం లేకుండానే సమస్యల పరిష్కారాన్ని క్లాడ్ నిర్వహిస్తుంది.సేల్స్, మార్కెటింగ్ వ్యూహాలను రూపొందించి వాటిని సమర్థంగా అమలు చేస్తుంది.ఎంటర్ప్రైజ్ సెర్చ్: ఒక కంపెనీలోని ఈ-మెయిల్లు, క్లౌడ్ స్టోరేజ్, చాట్ డేటాను విశ్లేషించి నివేదికలు తయారు చేస్తుంది.ఇప్పటివరకు ‘సాస్’ ఆధారిత సర్వీసుల ద్వారా పై పనులను నిర్వహించేవారు. ఏదైనా సాఫ్ట్వేర్ను మన కంప్యూటర్ లేదా ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోకుండా, నేరుగా ఇంటర్నెట్ ద్వారా వాడుకోవడాన్ని సాస్ అంటారు. ఇప్పుడు చర్చల్లో ఉన్న క్లాడ్ కోవర్క్ వంటి ఏఐ సాధనాలు వస్తే భవిష్యత్తులో సాప్ వంటి ప్రత్యేక సాఫ్ట్వేర్ల అవసరం లేకుండా ఏఐతోనే పనులు చేయిస్తారని ఇన్వెస్టర్లు భయపడుతున్నారు.భారత ఐటీ రంగంపై ప్రభావం..భారత ఐటీ కంపెనీల ప్రధాన ఆదాయ వనరు ‘అవుట్సోర్సింగ్’. అంటే విదేశీ కంపెనీలకు అవసరమైన కస్టమర్ సపోర్ట్, డేటా ఎంట్రీ, సాఫ్ట్వేర్ టెస్టింగ్ వంటి పనులను తక్కువ ఖర్చుతో కూడిన మానవ వనరుల ద్వారా అందిస్తున్నారు. ఆంథ్రోపిక్ క్లాడ్ వంటి ఏఐ వ్యవస్థలు ఇప్పుడు నేరుగా ఈ పనులనే తక్కువ ఖర్చుతో, వేగంగా పూర్తి చేస్తున్నాయి.గతంలో ఏఐని ఒక కేవలం ఒక సహాయక సాధనంగా చూసిన కంపెనీలు ఇప్పుడు దాన్ని ఒక ప్రత్యామ్నాయంగా భావిస్తున్నాయి.ఏఐ వాడకం పెరిగితే క్లయింట్లు ఐటీ కంపెనీలకు ఇచ్చే ప్రాజెక్టుల విలువ తగ్గించే అవకాశం ఉంది.భారత కంపెనీలు ప్రధానంగా సర్వీసులపై దృష్టి పెట్టాయి కానీ, సొంత ఏఐ ఉత్పత్తులను తయారు చేయడంలో వెనుకబడి ఉన్నాయి.ఇదీ చదవండి: వ్యక్తిగత సంపదలో 75 శాతం విరాళం -
పసిడి, వెండి గుడ్న్యూస్.. రేట్లు రివర్స్!!
పుంజుకున్న బంగారం, వెండి ధరలు తిరుగుటపా కట్టాయి. భారీగా క్షీణించాయి. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో మార్పులు వస్తున్నాయి. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయాలు ఇవేనా..
దేశంలో వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా త్వరలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రిజిస్ట్రేషన్, ఆడిట్, రిఫండ్ ప్రక్రియలను భారీగా సరళీకరించేందుకు సిద్ధమవుతోంది. పన్ను చెల్లింపుదారులకు ఊరటనిస్తూ వ్యవస్థలో పారదర్శకత పెంచడమే లక్ష్యంగా ఈ కీలక నిర్ణయాలు ఉండబోతున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.గత ఏడాది సెప్టెంబర్ 3న జరిగిన సమావేశం తర్వాత, ప్రస్తుత బడ్జెట్ ఆమోద ప్రక్రియ ముగిశాక ఈ కీలక భేటీ జరగనుంది. వచ్చే నెలలో లేదా ఏప్రిల్ ప్రారంభంలో కౌన్సిల్ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారుల స్థాయిలో రెండు విడతలుగా చర్చలు పూర్తికాగా ప్రాథమిక అజెండా సిద్ధమైంది.రిఫండ్లలో ఇబ్బందుల తొలగింపుప్రస్తుతం వస్తువులు, సర్వీసులకు మధ్య ఉన్న విభజన కారణంగా సేవల రంగంలో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్(ఐటీసీ) రిఫండ్లు పొందడంలో వ్యాపారవేత్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనివల్ల వర్కింగ్ క్యాపిటల్ నిలిచిపోతోంది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రిఫండ్లు అంటే.. ఒక వ్యాపారి తన బిజినెస్ కోసం వస్తువులు లేదా సేవలను కొనుగోలు చేసినప్పుడు చెల్లించిన పన్నును, తిరిగి ప్రభుత్వం నుంచి వెనక్కి పొందడం లేదా తదుపరి పన్ను చెల్లింపుల్లో తగ్గించుకోవడం.ఈ నేపథ్యంలో సర్వీసులపై పేరుకుపోయిన ఐటీసీ రిఫండ్లను సులభతరం చేయాలనే ప్రతిపాదన ఉంది. దీనివల్ల వ్యాపారాల్లో నగదు లభ్యత పెరిగి ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం అవుతాయి.ప్రభుత్వ విధానం ఇదే..బడ్జెట్, ఫైనాన్స్ బిల్లులో ప్రతిపాదించిన కొత్త నిబంధనలు ‘పన్ను చెల్లింపుదారులపై నమ్మకం’ అనే సూత్రంపై ఆధారపడి ఉన్నాయని సదరు అధికారి తెలిపారు. ముఖ్యంగా ఇప్పటికే సవరించిన రిటర్న్ల విషయంలో ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందన్నారు. వీటి ప్రకారం..సెక్షన్ 148 కింద నోటీసు వచ్చినా వివాదాస్పద పన్ను, వడ్డీ చెల్లించి రిటర్న్లను అప్డేట్ చేస్తే ఆ ప్రక్రియను అక్కడితోనే ముగించే అవకాశం ఉంది.ఆడిట్ పరిధిలోకి రానివారు ఏడాదిలోపు సవరించిన రిటర్న్ దాఖలు చేయవచ్చు. అయితే డిసెంబర్ 31 తర్వాత దాఖలు చేస్తే రూ.1,000 నుంచి రూ.5,000 వరకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.గతంలో రిటర్న్లు దాఖలు చేయకపోయినా సంబంధిత ఆర్థిక సంవత్సరం ముగిసిన నాలుగేళ్ల వరకు అప్డేటెడ్ రిటర్న్లను దాఖలు చేసే వెసులుబాటు కల్పించారు.జరిమానాల నుంచి మినహాయింపుఆదాయపు పన్ను చట్టం 2025లోని సెక్షన్ 440 కింద రక్షణ పరిధిని విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆదాయాన్ని తప్పుగా నివేదించిన సందర్భాల్లో నిర్దేశిత అదనపు పన్ను చెల్లిస్తే భారీ జరిమానాల నుంచి మినహాయింపు పొందే అవకాశం పన్ను చెల్లింపుదారులకు లభించనుంది. ‘నిబంధనలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు వాటిని అమలు చేయడమే తదుపరి అంశం. అధికారులపై పనిభారం పెరిగినప్పటికీ పన్ను చెల్లింపుదారులకు మేలు చేయడమే మా ప్రాధాన్యత’ అని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి తెలిపారు.ఇదీ చదవండి: వ్యక్తిగత సంపదలో 75 శాతం విరాళం -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:24 సమయానికి నిఫ్టీ(Nifty) 86 పాయింట్లు తగ్గి 25,691 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 251 నష్టపోయి 83,568 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 05-02-2026(time: 9:24 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
వ్యవసాయ, పాడి పరిశ్రమలకు పూర్తి రక్షణ: కేంద్ర మంత్రి
భారత్, అమెరికా మధ్య కుదిరిన ట్రేడ్ డీల్పై కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంటులో స్పష్టతనిచ్చారు. దేశంలోని అత్యంత సున్నితమైన రంగాలైన వ్యవసాయం, పాడి పరిశ్రమల ప్రయోజనాలను ఈ ఒప్పందంలో పూర్తిగా కాపాడినట్లు ఆయన స్పష్టం చేశారు. మంగళవారం ప్రతిపక్షాల ఆందోళనల మధ్య వాయిదా పడిన ఈ ప్రకటనను ఆయన తర్వాత ఉభయ సభల్లో చదివి వినిపించారు.ఒప్పందంలోని ప్రధానాంశాలు..ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన చర్చల ఫలితంగా ఈ ఒప్పందం ఒక కొలిక్కి వచ్చిందని గోయల్ తెలిపారు. ఈ ఒప్పందంలోని ముఖ్యాంశాలు..అమెరికాకు భారత్ చేసే ఎగుమతులపై సుంకాన్ని 18 శాతానికి తగ్గిస్తున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇది ఇతర పోటీ దేశాలపై అమెరికా విధిస్తున్న సుంకాల కంటే తక్కువ కావడం గమనార్హం.రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై గతంలో విధించిన 25 శాతం ప్రతీకార సుంకాన్ని అమెరికా పూర్తిగా తొలగించింది.భారత దిగుమతులపై ఉన్న 25 శాతం పరస్పర సుంకాన్ని కూడా 18 శాతానికి తగ్గించేందుకు అమెరికా అంగీకరించింది.కీలక రంగాలకు ఊతంఆగస్టు 2025 నుంచి అమలులో ఉన్న 50 శాతం అధిక సుంకాల కారణంగా వస్త్రాలు, తోలు వస్తువులు, సముద్ర ఉత్పత్తుల వంటి కార్మిక ఆధారిత రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తాజా తగ్గింపులతో ఈ రంగాలకు అంతర్జాతీయ మార్కెట్లో తిరిగి పోటీతత్వం లభిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశ ఇంధన భద్రతపై వస్తున్న సందేహాలకు మంత్రి సమాధానమిస్తూ, 140 కోట్లు భారతీయుల ఇంధన అవసరాలను తీర్చడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా చమురు, ఇంధన వనరులను వివిధ మార్గాల ద్వారా సేకరించడం భారత వ్యూహంలో భాగమని చెప్పారు.ఇంధనం, విమానయానం, డేటా సెంటర్లు, అణుశక్తి వంటి రంగాల్లో అమెరికా అగ్రగామిగా ఉందని, ఈ రంగాల్లో వాణిజ్య సహకారం పెంచుకోవడం ద్వారా మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలు నెరవేరుతాయని ఆయన వివరించారు. ఫిబ్రవరి 2025లో ప్రధాని మోదీ అమెరికా పర్యటన తర్వాత ఇరు దేశాల మధ్య విస్తృత చర్చలు జరిగాయి. ప్రస్తుతం సాంకేతిక ప్రక్రియలు, పత్రాల తయారీ తుది దశలో ఉందని, అవి పూర్తయిన వెంటనే ఒప్పందం పూర్తి వివరాలను తెలియజేస్తామని గోయల్ చెప్పారు.ఇదీ చదవండి: వ్యక్తిగత సంపదలో 75 శాతం విరాళం -
హోండా టూవీలర్ స్పెషల్ ఎడిషన్లు
హోండా మోటార్సైకిల్–స్కూటర్ ఇండియా తన పోర్ట్ఫోలియో విస్తరణలో భాగంగా ‘షైన్ 125 లిమిటెడ్’, ‘డియో 125 ఎక్స్–ఎడిషన్’లను మార్కెట్లోకి విడుదల చేసింది. హోండా పాపులర్ బ్రాండ్ ‘షైన్’ దేశ వ్యాప్తంగా మంచి ప్రజాదారణ పొందింది. మారుతున్న ట్రెండ్స్ను దృష్టిలో ఉంచుకుని, కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు తాజాగా హోండా షైన్ ‘125 లిమిటెడ్ ఎడిషన్’ను విడుదల చేసింది. మినిమలిస్ట్ థీమ్తో పెర్ల్ సైరెన్ బ్లూ కలరులో అందుబాటులో ఉండే ఈ ఎడిషన్, పైరైట్ బ్రౌన్ ఆలాయ్ వీల్స్తో వస్తుంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ ఇంజిన్ ఎలాంటి మార్పులు చేయలేదు. ధర ఢిల్లీ ఎక్స్ షోరూం వద్ద రూ.86,211గా ఉంది. హోండా డియో 125 ఎక్స్–ఎడిషన్యువతను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడిన ఆధునిక స్కూటర్. ప్యానెల్లపై ప్రత్యేక గ్రాఫిక్స్తో ఈ ఎడిషన్ సైబర్ డ్రిఫ్ట్ థీమ్ ప్రేరణతో తీర్చిదిద్దారు. నగర ప్రయాణాలకు సరైన మైలేజ్, స్మూత్ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇంజిన్లో ‘ఇండ్లింగ్ స్టాప్ సిస్టమ్’ ఉండటం వల్ల ట్రాఫిక్లో నిలిచినప్పుడు ఆటోమేటిక్గా ఆఫ్ అవుతూ ఇంధనాన్ని ఆదా చేస్తుంది. ధర విషయానికొస్తే..., ఢిల్లీ ఎక్స్ షోరూం వద్ద రూ.87,733గా ఉంది. ఇప్పటికే ఈ స్పెషల్ ఎడిషన్ బుకింగ్లు మొదలయ్యాయి. కస్టమర్లు ఈ మోడళ్లను కంపెనీ ఆన్లైన్లో కంపెనీ వెబ్సైట్ ద్వారా, ఆఫ్లైన్లో దగ్గర్లోని డీలర్షిప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి రెండో వారం నుంచి డెలివరీ తీసుకోవచ్చు.ఇదీ చదవండి: వ్యక్తిగత సంపదలో 75 శాతం విరాళం -
భారత్ కంటెయినర్ షిప్పింగ్ లైన్ ఏర్పాటుకు వీలుగా ఒప్పందం
ముంబై: అంతర్జాతీయంగా షిప్పింగ్కు డిమాండ్ పెరుగుతున్న క్రమంలో.. దేశంలో సమగ్ర కంటెయినర్ ఎకోసిస్టమ్ నిర్మాణానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. భారత్ కంటెయినర్ షిప్పింగ్ లైన్ (బీసీఎస్ఎల్) ఏర్పాటుకు వీలు కలి్పంచే ఒప్పందంపై సంతకం చేసినట్టు ప్రకటించింది. ఈ పథకం స్ఫూర్తికి అనుగుణంగా ఈ చర్య తీసుకున్నట్టు తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్తో పోటీపడే కంటెయినర్ తయారీ వ్యవస్థను దేశీయంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించడం గమనార్హం. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ (జేఎన్పీఏ), వీవో చిదంబరనార్ పోర్ట్ అథారిటీ, చెన్నై పోర్ట్ అథారిటీ, సాగరమాల ఫైనాన్స్ కార్పొరేషన్ మధ్య అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. -
నియామకాలను శాసిస్తున్న ఏఐ!
ముంబై: కృత్రిమ మేథ (ఏఐ) నియామకాల ప్రక్రియను మరింత సమర్థవంతం, సులభతరం చేస్తోంది. సరైన నైపుణ్యాలతో కూడిన అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం రిక్రూటర్లకు (నియామకాలు చేపట్టేవారు) సవాలు కాగా.. వీరు ఏఐ సాయాన్ని తీసుకుంటున్నారు. తమకు కావాల్సిన సరైన అర్హతలు, నైపుణ్యాలు దాగి ఉన్న అభ్యర్థులను గుర్తించేందుకు ఏఐ సాయపడుతున్నట్టు రిక్రూటర్లు లింక్డ్ఇన్ సర్వేలో భాగంగా తెలిపారు. ఒత్తిళ్ల మధ్య ఏఐని పరిష్కారంగా వారు భావిస్తున్నారు. 2025 నవంబర్ 13 నుంచి 28 మధ్య 19,113 మంది అభిప్రాయాలను, నవంబర్ 10 నుంచి 27 మధ్య 6,554 అంతర్జాతీయ హెచ్ఆర్ నిపుణులను లింక్డ్ఇన్ సర్వే చేసి వివరాలు విడుదల చేసింది. → గతంలో తాము గుర్తించలేని నైపుణ్యాలు కలిగిన అభ్యర్థుల నియామకానికి ఏఐ సాయపడుతున్నట్టు 71 శాతం మంది చెప్పారు. → అభ్యర్థుల నైపుణ్యాలను మరింత లోతుగా విశ్లేíÙంచేందుకు ఏఐ ఉకపరిస్తున్నట్టు 80 మంది పేర్కొన్నారు. → నియామకాలను ఏఐ వేగవంతం చేసిందని 76 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. → నియామకాలు కరోనా ముందునాటితో పోలి్చతే 40 శాతం పెరిగినా.. అర్హులైన అభ్యర్థులను గుర్తించడంలో ఇబ్బంది పడుతున్నట్టు 74 శాతం మంది రిక్రూటర్లు తెలిపారు. → ఏఐ ఆధారిత దరఖాస్తులు పెరిగినట్టు 53 శాతం మంది తెలిపారు. → కావాల్సిన నైపుణ్యాల్లో లోటు ఉంటున్నట్టు 47 శాతం రిక్రూటర్లు పేర్కొన్నారు. → తప్పుదోవ పట్టించే, తక్కువ నాణ్యత కలిగిన వాటి నుంచి నిజమైన దరఖాస్తులను వడబోయడంలో ఏఐ సాయపడుతున్నట్టు 48 శాతం మంది చెప్పారు. → 2026లోనూ ఇంటర్వ్యూల ముందస్తు స్క్రీనింగ్కు, వేగవంతమైన నియామకాలకు, మెరుగైన అభ్యర్థుల ఎంపికకు ఏఐని ఉపయోగించనున్నట్టు మెజారిటీ రిక్రూటర్లు తెలిపారు. -
హైదరాబాద్లో యాపిల్ స్టోర్
న్యూఢిల్లీ: అమెరికన్ టెక్ దిగ్గజం యాపిల్ భారత్లో తమ రిటైల్ స్టోర్స్ని విస్తరిస్తోంది. హైదరాబాద్లోనూ కొత్త స్టోర్ ప్రారంభించడంపై కసరత్తు చేస్తోంది. ఇందుకోసం స్టోర్ లీడర్, సీనియర్ మేనేజర్ మొదలైన ఉద్యోగాలను తమ కెరియర్ పోర్టల్లో పోస్ట్ చేసింది. సాధారణంగా స్టోర్ని ప్రారంభించడానికి యాపిల్ సుమారు ఏడాది ముందు నుంచి రిక్రూట్మెంట్ చేపడుతుందని, దీన్ని బట్టి చూస్తే హైదరాబాద్ స్టోర్ 2027 తొలి నాళ్లలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. 2020లో భారత్లో ఆన్లైన్ స్టోర్ని ప్రారంభించిన యాపిల్ ఆ తర్వాత ముంబై, ఢిల్లీలో ఆఫ్లైన్ స్టోర్స్ని ఏర్పాటు చేసింది. -
ఒక్కటి కాదు.. వస్తున్నాయ్ 100 రిలయన్స్లు
ముంబై: దేశాభివృద్ధికి శాంతి భద్రతలు, స్థిరమైన నాయకత్వం కీలకమని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చెప్పారు. భారత్ నిలకడగా రెండంకెల స్థాయి వృద్ధిని సాధించడం సాధ్యమేనని స్పష్టం చేశారు. జియోబ్లాక్రాక్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. పటిష్టమైన ఆర్థిక ప్రగతికి 15–20 ఏళ్ల పాటు శాంతి భద్రతలు, సామాజిక సామరస్యత అవసరమని తెలిపారు. సమాచారం, వినియోగం, వాణిజ్యంలాంటి అంశాల్లో పరివర్తనకు భారత్ సాంకేతికతను ఉపయోగించుకుంటున్న తీరు స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో 100 కంపెనీలు కొత్తగా రిలయన్స్ స్థాయికి ఎదిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అంబానీ చెప్పారు. ఏఐ గురించి ఆందోళన వద్దు: ఏఐ గురించి భయపడనక్కర్లేదని, పారిశ్రామిక విప్లవంతో కొంత ఆందోళనకర పరిస్థితి ఏర్పడినా, మానవాళి ముందుకే సాగిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. దేశీయంగా ప్రతి గ్రామంలోనూ 5జీ నెట్వర్క్ ఉందని, మిగతా ఏ దేశంతో పోలి్చనా మెరుగ్గా, చౌకగా 5జీ సేవలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. మార్కెట్తోనే సంపద సాధ్యం: ల్యారీ ఫింక్: రాబోయే రోజుల్లో పది సంవత్సరాలకు పైగా భారత్ ఏటా 8–10 శాతం వృద్ధి చెందుతుందని, ఇది భారత్ శకం అని గ్లోబల్ అసెట్ మేనేజ్మెంట్ దిగ్గజం బ్లాక్రాక్ చైర్మన్ ల్యారీ ఫింక్ చెప్పారు. భారతీయులు డబ్బంతా బ్యాంక్ డిపాజిట్లలోనే ఉంచకుండా క్యాపిటల్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అధిక ప్రయోజనం పొందవచ్చని ఆయన తెలిపారు. ఇందుకు అమెరికానే నిదర్శనమని ఫింక్ చెప్పారు. వచ్చే అయిదేళ్లలో దేశీయంగా మ్యుచువల్ ఫండ్స్ ఏయూఎం ప్రస్తుత రూ. 80 లక్షల కోట్ల నుంచి రెట్టింపు స్థాయికి పెరుగుతుందని జియో ఫైనాన్షియల్ సరీ్వసెస్ చైర్మన్ కేవీ కామత్ చెప్పారు. టెక్నాలజీ, ఆర్థిక రంగాల్లో మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో బ్యాంకులు తమను తాము సరికొత్తగా తీర్చిదిద్దుకోవాల్సి ఉంటుందన్నారు. -
ఇండియా టీచింగ్..వరల్డ్ లెర్నింగ్
దేశీ ఎడ్టెక్ కంపెనీలు అంతర్జాతీయంగా అవకాశాలను అందిపుచ్చుకునే క్రమంలో విదేశాల బాట పడుతున్నాయి. పశ్చిమాసియా, ఆగ్నేయాసియా దేశాలకు విద్యా వ్యాపారాన్ని దూకుడుగా విస్తరిస్తున్నాయి. అప్గ్రాడ్, సింప్లీలెర్న్, బ్రైట్చాన్స్ మొదలైనవి ఈ లిస్టులో ఉన్నాయి. మన ఎడ్టెక్ కంపెనీలు ప్రధానంగా ఆగ్నేయాసియా, దక్షిణాసియాపై దృష్టి పెడుతున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, వియత్నాం, థాయ్ల్యాండ్, ఇండొనేసియా, ఫిలిప్పీన్స్లాంటి మార్కెట్లలో విస్తరిస్తున్నాయి. ఆయా మార్కెట్లలో వినియోగదారుల ప్రొఫైల్ దాదాపు మన దేశం తరహాలోనే ఉండటం ఇందుకు కారణమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. థాయ్, వియత్నాంలో అప్గ్రాడ్: టీమ్లీజ్ గణాంకాల ప్రకారం ఆగ్నేయాసియా, ఆఫ్రికా తదితర మార్కెట్లలో 35 ఏళ్ల లోపు వయస్సు గల వారు 2 కోట్ల మంది పైగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా ప్రాంతాలపై మన సంస్థలు దృష్టి పెడుతున్నాయి. బెంగళూరుకు చెందిన అప్గ్రాడ్ సంస్థ థాయ్ల్యాండ్, వియత్నాంలో కార్యకలాపాలు విస్తరించింది. అలాగే యూఏఈ, మేనా ప్రాంతంలో (మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా) వర్క్ఫోర్స్ శిక్షణకు సంబంధించి వివిధ సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకుంది. నైపుణ్యాల్లో శిక్షణనిచ్చే సింప్లీలెర్న్ కంపెనీ వివిధ సంస్థలు, ప్రభుత్వాల భాగస్వామ్యాలతో అమెరికా, బ్రిటన్, పశ్చిమాసియావ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇక కిడ్స్ లెర్నింగ్ ప్లాట్ఫాం అయిన బ్రైట్ఛాంప్స్ సంస్థ ఏకంగా 30 పైగా దేశాల్లో విస్తరించింది. యూఏఈ, సౌదీ అరేబియా, వియత్నాం మొదలైనవి వీటిలో ఉన్నాయి. ఆకర్షణీయంగా ఆగ్నేయాసియా: వియత్నాం, థాయ్ల్యాండ్ లాంటి ఆగ్నేయాసియా దేశాలు వేగంగా డిజిటల్ ఎకానమీలుగా వృద్ధి చెందుతున్నాయి. దీంతో కెరియర్ పురోగతికి సంబంధించిన కోర్సులను నేర్చుకోవడంపై పెరుగుతున్న ఆసక్తిని అవకాశంగా మల్చుకోవడంపై ఎడ్టెక్ కంపెనీలు దృష్టి పెడుతున్నాయి. 2024–25లో అప్గ్రాడ్ ఆదాయంలో అంతర్జాతీయ మార్కెట్ల వాటా 20–25 శాతంగా నమోదైంది. అటు సింప్లీలెర్న్ అంతర్జాతీయ యూజర్లలో 11 శాతం మంది బ్రిటన్, పశ్చిమాసియాలో ఉన్నారు. ఇక తమ గ్లోబల్ యూజర్లలో 30 శాతం మంది ఆగ్నేయాసియా, దక్షిణాసియా వారు ఉన్నారని బ్రైట్ఛాంప్స్ పేర్కొంది. అంతర్జాతీయంగా పోటీ: మన కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ఎదుగుతున్నప్పటికీ అంతర్జాతీయ దిగ్గజాల నుంచి పోటీ ఎదుర్కొనాల్సి వస్తోంది. యుడెమి, ఎరుడైటస్, యుడాసిటీ, కోర్సెరాలాంటి గ్లోబల్ సంస్థలు కూడా ఈ ప్రాంతాల్లో దూకుడుగా విస్తరిస్తున్నాయి. తమకు విదేశీ మార్కెట్లలో కోర్సెరా, ఎరుడైటస్ నుంచి పోటీ ఉంటోందని అప్గ్రేడ్ వర్గాలు తెలిపాయి. పశ్చిమాసియాలో ఎమెరిటస్, కోర్సెరా, యుడాసిటీలను సింప్లీలెర్న్ ఢీకొంటోంది. మిగతా సంస్థలతో పోలిస్తే తక్కువ వ్యయాలతో, స్థానిక అవసరాలకు అనుగుణంగా, నాణ్యమైన శిక్షణ అందించడం ద్వారా దేశీ కంపెనీలు.. ఆయా మార్కెట్లలో పటిష్టపడేందుకు ప్రయతి్నస్తున్నాయి. లీడ్ గ్రూప్ ఈ ఏడాది 1,200 పాఠశాలలతో భాగస్వామ్యాలను లక్ష్యంగా పెట్టుకుంది.సాక్షి, బిజినెస్డెస్క్ -
ఆ దేశాల్లో ఇండియన్ బైక్లకు యమా క్రేజ్..!
సమాజంలో ఓ స్థాయి ఆర్థిక స్తోమత ఉన్నవారు ఇంపోర్టెడ్ బైకులు, కార్లు వాడడం తెలిసిందే..! అయితే.. ఆఫ్రికాలోని పేదదేశాలతోపాటు.. లాటిన్ అమెరికా వంటి దేశాల్లో సాధారణ ప్రజలు కూడా ఇంపోర్టెడ్ బైకులు వాడుతారంటే మీరు నమ్ముతారా? పేదరికం ఎక్కువగా ఉండే బుర్కినాఫాసో, ఐవరీ కోస్ట్, గ్వాటెమాలా, హోండురాస్ వంటి దేశాల్లో ఇంపోర్టెడ్ బైకులకు క్రేజ్ చాలా ఎక్కువ. సెకండ్ హ్యాండ్ బైక్లైనా.. విదేశీవే వాడుతారు. అయితే.. ఆ దేశాలకు బైక్లను ఎగుమతి చేసేది మాత్రం మన దేశమే..! నైజీరియా, కొలంబియా, బ్రెజిల్లోనూ భారత తయారీ బైకులకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది.43 లక్షల బైక్ల ఎగుమతిభారత్లో ఎకానమీ ద్విచక్రవాహనాలు ఏ బ్రాండ్లో ఎక్కువగా ఉంటాయంటే.. ఠక్కున వచ్చే సమాధానాలు బజాజ్, హీరో, టీవీఎస్ అనే..! ఇప్పుడు ఆఫ్రికన్ దేశాల్లో ఈ వాహనాలకే అత్యధిక క్రేజ్ ఉంది. గత ఏడాది ఏకంగా 43 లక్షల ద్విచక్ర వాహనాలను భారత్ ఎగుమతి చేసింది. నైజీరియా, కొలంబియా, బ్రెజిల్ వంటి దేశాల్లో పౌరులు వాడే ప్రతీ 10 బైకుల్లో.. ఏడు మన దేశానికి చెందినవే..! నిజానికి ఒకప్పుడు ఈ ఘనతను జపాన్, చైనా తమ పేరిట నమోదు చేసుకున్నాయి. అయితే.. గడిచిన 15 ఏళ్లుగా భారత్ ఆ రికార్డులను తారుమారు చేస్తూ వస్తోంది.వాస్తవానికి భారత్ నుంచి ద్విచక్ర వాహనాల ఎగుమతికి పెద్ద చరిత్రే ఉంది. రెండు దశాబ్దాల క్రితం వరకు ఈ రంగంలో చైనా ఆధిపత్యం ఉండేది. అంతకు ముందు జపాన్ బైకులకు క్రేజ్ ఉండేది. అయితే.. భారత్ వ్యూహాత్మకంగా ఆలోచించి, ఆఫ్రికన్ దేశాలకు బైకుల ఎగుమతిని ప్రారంభించింది. క్రమంగా ఈ ఎగుమతులను లాటిన్ అమెరికా, ఇతర ఆసియా దేశాలకు విస్తరించింది. ఇప్పుడు ఈ దేశాల్లో ఎలక్ట్రిక్ బైకుల విషయంలో చైనా జోరు ఉన్నా.. భారత్ దాన్ని కూడా క్రమంగా అధిగమించే సూచనలు కనిపిస్తున్నాయి.ఇందుకు అనేక కారణాలున్నాయి. జపాన్ బైకుల రేట్లు పెరిగాయి. చైనా బైకుల్లో నాణ్యతాపరమైన లోపాలు ఉంటున్నాయి. కానీ, భారత బైకులు మాత్రం అటు నాణ్యతాపరంగా.. ఇటు ధరలపరంగా ఆయా దేశాల పౌరుల మన్ననలు అందుకుంటున్నాయి. నిజానికి ఆయా దేశాల్లో జపాన్ బైకుల ధరలు 1500 డాలర్ల నుంచి 5 వేల డాలర్ల వరకు.. చైనా బైకుల ధరలు 800 డాలర్ల నుంచి 1200 డాలర్ల ఉన్నాయి. భారత్ మధ్యేమార్గంగా.. ఈ రెండిటికీ మధ్యలో 900 డాలర్ల నుంచి 1500 డాలర్ల మధ్య ధరలను నిర్ణయించి, ఆయా మార్కెట్లలోకి ప్రవేశించింది. నాణ్యత విషయంలో జపాన్ బైకులకు సమానంగా ఉండడంతో.. వీటికి ఆదరణ పెరిగింది.ఆకట్టుకుంటున్న మోడల్స్ఇక బైకుల మోడల్స్ విషయంలోనూ భారత్ ద్విచక్ర వాహనాలు ఆయా దేశాల వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. జపాన్ హోండా మాదిరి మోడళ్లను మన హీరో కంపెనీ తయారు చేస్తుండగా.. సుజికీ వంటి మోడళ్లను టీవీఎస్ రూపొందిస్తోంది. దీంతో.. జపాన్ బైకుల స్థానాన్ని భారత్ ఆక్రమించింది. చైనా బైకుల విషయానికి వస్తే.. చూడ్డానికి బాగానే ఉన్నా.. ఊరూపేరూ లేని కంపెనీలు కావడం.. విడిభాగాల సపోర్టు లేకపోవడంతో కొన్న ఏడాదికే అవి తుక్కుగా మారుతున్నాయనే విమర్శలు ఆయా దేశాల వినియోగదారుల నుంచి ఎదురవుతున్నాయి. దాంతో.. భారత్కు చెందిన హీరో, టీవీఎస్, బజాజ్ కంపెనీలు విదేశాలకు బైకుల ఎగుమతిలో ఆధిపత్యాన్ని సాధించాయి.భారత బైకుల పట్ల మోజు పెరగడానికి కారణాల్లో అత్యంత కీలకమైనది సపోర్టింగ్..! మన కంపెనీలు ఆయా దేశాలకు నిరంతరాయంగా.. డిమాండ్ని బట్టి ఎయిర్ ఫిల్టర్, బ్రేక్ లైనర్లు, డిస్కులు, క్లట్చ్, గేర్ వైర్లు, కేబుళ్లను సరఫరా చేస్తాయి. అంతేకాదు.. అక్కడి డీలర్లకు నిరంతర సపోర్ట్ని అందజేస్తాయి. ఆయా దేశాల మెకానిక్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తాయి. అందుకే అక్కడి డీలర్లు భారతీయ బైకులను ఆదరిస్తారు. ఒక్క పేద దేశాలే కాదు.. అమెరికాలో మన ఎన్ఫీల్డ్కు చాలా క్రేజ్ ఉంది. హార్లే-డేవిడ్సన్ డిమాండ్ ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో కూడా అమెరికాలో ఎన్ఫీల్డ్కు విపరీతమైన ఆదరణ ఉంది. అమెరికాలోని 47 రాష్ట్రాల్లో ఎన్ఫీల్డ్కు 152 డీలర్షిప్లు ఉండడం ఇందుకు నిదర్శనం. క్లాసిక్-350, హిమాలయన్-45, ఇంటర్సెప్టార్-650, కాంటినెంటల్ జీటీ-650, సూపర్ మెటియోర్-650 వంటి మోడళ్లను అమెరికన్లు ఆదరిస్తున్నారు. ఐరోపాలో కూడా హార్లే-డేవిడ్సన్కు మన బుల్లెట్ గట్టి పోటీని ఇస్తోంది. చూశారా.. విదేశీ మార్కెట్లలో భారత బైకుల హవా?? -
పాస్పోర్ట్ కొత్త రూల్స్.. పది రోజుల్లో అమల్లోకి!
భారత ప్రభుత్వం 2026 సంవత్సరానికి సంబంధించి కొత్త పాస్పోర్ట్ నిబంధనలను ప్రకటించింది. దరఖాస్తు ప్రక్రియను మరింత సరళంగా మార్చడం, భద్రతను బలోపేతం చేయడం, అలాగే దేశవ్యాప్తంగా సేవలను వేగవంతం చేయడం ఈ మార్పుల ప్రధాన లక్ష్యం. ఫిబ్రవరి 15 తర్వాత ఈ నిబంధనలు పూర్తిగా అమల్లోకి రానున్నాయి.దీంతో పాస్పోర్ట్ పొందడం లేదా పునరుద్ధరించుకోవడం మరింత సమర్థవంతంగా మారనుంది. చివరి నిమిషంలో దరఖాస్తు తిరస్కరణలు లేదా ఆలస్యాలు ఎదురుకాకుండా ఉండేందుకు, దరఖాస్తుదారులు ముందుగానే కొత్త నియమాలపై అవగాహన కలిగి ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.సరళీకృత పత్రాలు, వేగవంతమైన ధ్రువీకరణకొత్త ఫ్రేమ్వర్క్ ప్రకారం.. పాస్పోర్ట్ దరఖాస్తుకు అవసరమైన పత్రాల జాబితాను క్రమబద్ధీకరించారు. పేపర్వర్క్ను తగ్గించేందుకు ప్రక్రియను పూర్తిగా డిజిటల్ చేశారు. ఆధార్ వంటి ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు పత్రాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల, తక్కువ సర్టిఫికెట్లతోనే దరఖాస్తు పూర్తి చేసే అవకాశం కలుగుతుంది. దీంతో పాస్పోర్ట్ కార్యాలయాలకు తరచుగా వెళ్లాల్సిన అవసరం తగ్గనుంది.అయితే అసంపూర్ణం లేదా తప్పుగా అప్లోడ్ చేసిన పత్రాలతో చేసే దరఖాస్తులు మాత్రం పూర్తిగా తిరస్కరించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఆన్లైన్లో పత్రాలు అప్లోడ్ చేసే సమయంలో అత్యంత జాగ్రత్త అవసరం.పోలీస్ వెరిఫికేషన్లో కీలక మార్పులుపాస్పోర్ట్ జారీ ప్రక్రియలో ఎక్కువ సమయం తీసుకునే పోలీస్ ధ్రువీకరణను కూడా సవరించారు. ఇకపై ఇది ప్రధానంగా డిజిటల్ మార్గాల్లోనే జరగనుంది. సమన్వయ వ్యవస్థల ద్వారా అనేక సందర్భాల్లో వారాల పాటు పట్టే ధ్రువీకరణను కొన్ని రోజుల్లోనే పూర్తిచేయవచ్చు. కొన్ని సందర్భాల్లో పాస్పోర్ట్ ముందుగా జారీ చేసి, తరువాత వెరిఫికేషన్ చేసే విధానాన్ని కూడా అమలు చేయనున్నారు. దీంతో మొత్తం ప్రక్రియ మరింత వేగవంతం అవుతుంది.మరింత సులభమైన ఆన్లైన్ సేవలుప్రభుత్వ పాస్పోర్ట్ పోర్టల్ను యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లతో అప్గ్రేడ్ చేశారు. దరఖాస్తుదారులు మధ్యవర్తులు లేకుండానే ఫారమ్లు పూరించడం, పత్రాలు అప్లోడ్ చేయడం, అపాయింట్మెంట్ స్లాట్లను బుక్ చేయడం చేయవచ్చు. రియల్ టైమ్ నోటిఫికేషన్లతో దరఖాస్తు స్థితిని సులభంగా ట్రాక్ చేసే అవకాశం కలుగుతుంది.మైనర్లకు సంబంధించి తల్లిదండ్రుల సమ్మతి, డిజిటల్ జనన ధ్రువీకరణ పత్రాలు లేదా పాఠశాల ఐడీలను సులభంగా అంగీకరించేలా నిబంధనల్లో స్పష్టత తీసుకొచ్చారు. దీని వల్ల పిల్లల పాస్పోర్ట్ జారీకి పట్టే సమయం గణనీయంగా తగ్గనుంది.గ్రామీణ ప్రాంతాలకు మరింత చేరువగా సేవలుదేశవ్యాప్తంగా పాస్పోర్ట్ సేవా కేంద్రాల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. దీని ద్వారా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా పాస్పోర్ట్ సేవలు సులభంగా అందుబాటులోకి రానున్నాయి. -
కొత్త రుణాలపై ఎస్బీఐ ఫోకస్
దేశ ఆర్థిక పరివర్తనలో కీలక పాత్ర పోషించే కొత్త తరం రంగాలకి రుణ లభ్యతను పెంచే దిశగా చక్ర–సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని (సీవోఈ) ప్రారంభించినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ప్రధానంగా రెన్యువబుల్ ఎనర్జీ, అడ్వాన్స్డ్ సెల్ కెమిస్ట్రీ–బ్యాటరీ స్టోరేజ్, ఎలక్ట్రిక్ మొబిలిటీ, సెమీకండక్టర్లులాంటి ఎనిమిది వర్ధమాన రంగాలపై దృష్టి పెడుతున్నట్లు పేర్కొంది.2030 నాటికి ఈ ఎనిమిది రంగాలు దాదాపు రూ. 100 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తాయన్న అంచనాలు ఉన్నట్లు తెలిపింది. రాబోయే దశాబ్దాల్లో కొత్త ఆవిష్కరణలు, అధునాతన తయారీ సామర్థ్యాల దన్నుతో భారత్ వృద్ధి చెందుతుందని ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు.శ్వేతపత్రాలు, సెక్టార్ రిపోర్టులు, పరిశ్రమ రౌండ్ టేబుల్ సమావేశాల నిర్వహణ మొదలైన మార్గాల్లో క్లయింట్లు, ఇన్వెస్టర్లు, విధాననిర్ణేతలు నిర్ణయాలు తీసుకునేందుకు చక్ర సెంటర్ తోడ్పడుతుందని వివరించారు. డెవలప్మెంట్ ఫైనాన్స్ సంస్థలు, బహుళపక్ష ఏజెన్సీలు, పరిశ్రమ సమాఖ్యలు, స్టార్టప్ల మధ్య సంప్రదింపులకు ఇది సహాయకరంగా ఉంటుందన్నారు. -
మారిన బంగారం ధరలు.. సాయంత్రానికి కాస్త ఊరట!
బంగారం ధరలు వేగంగా మారిపోతున్నాయి. గంటల్లోనే రూ.వేలల్లో వ్యత్యాసాన్ని నమోదు చేస్తున్నాయి. బుధవారం ఉదయం అత్యంత భారీగా పెరిగిన బంగారం ధరలు.. సాయంత్రానికి కాస్త ఊరటనిచ్చాయి.హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల (తులం) ధర బుధవారం ఉదయం రూ.6050 పెరిగి రూ. 1,47,150 లకు చేరుకోగా సాయంత్రానికి ఆ పెరుగుదల రూ.5050లకే పరిమితమై రూ.1,46,150లకు దిగివచ్చింది.ఇక 24 క్యారెట్ల పసిడి తులం ధర బుధవారం ఉదయం రూ.6600 ఎగిసి రూ. 1,60,530 లను తాకగా సాయంత్రానికి పెరుగుదల రూ.5510 లకు నెమ్మదించి రూ.1,59,440లకు చేరుకుంది.అంతర్జాతీయ అనిశ్చితులు అంతకంతకూ పెరుగుతుండటంతో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగానే బంగారం ధరల్లో ఈ స్థాయిలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఇంటి పొదుపును ఇన్వెస్ట్మెంట్గా మారుస్తాం: అంబానీ
భారతదేశంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న దీర్ఘకాలిక పొదుపు సంస్కృతి ఉన్నప్పటికీ, అది ఇప్పటివరకు ఉత్పాదక సంపద సృష్టిగా పూర్తిగా మారలేదన్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ. గృహ పొదుపులను పెట్టుబడుల వైపు మళ్లించడంలో జియో–బ్లాక్రాక్ కీలక పాత్ర పోషించే అవకాశముందని ఆయన పేర్కొన్నారు.ముంబైలో నిర్వహించిన జియో–బ్లాక్రాక్ ఫైర్సైడ్ చాట్లో బ్లాక్రాక్ సీఈవో లారీ ఫింక్తో సంభాషిస్తూ అంబానీ ఈ వ్యాఖ్యలు చేశారు. భారతీయులు గత ఐదు నుంచి ఆరు దశాబ్దాలుగా క్రమంగా పొదుపు చేస్తున్నప్పటికీ, ఆ మూలధనం ఎక్కువగా దీర్ఘకాలిక రాబడులు అందించే విధంగా ఉపయోగించబడలేదని ఆయన తెలిపారు. రాబోయే 20-30 ఏళ్లలో భారతదేశం 25 నుండి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారే అవకాశం ఉందని, ఈ కాలం దేశంలోని యువ తరానికి అద్భుతమైన పెట్టుబడి అవకాశాన్ని అందిస్తుందని అన్నారు. పొదుపుదారులను పెట్టుబడిదారులుగా మారుస్తూ, పనికిరాని పొదుపును ఆదాయం తీసుకొచ్చే ఆస్తులుగా మార్చే మార్గాలను అందించడంలో జియో–బ్లాక్రాక్కు పెద్ద అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. “భారతీయులను కేవలం పొదుపు చేయడానికే కాదు, ఆ పొదుపులను సంపాదనగా మార్చుకునే ఎంపికలు అందించడమే మా లక్ష్యం” అని అంబానీ చెప్పారు.రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్లాక్రాక్ మధ్య ఉన్న భాగస్వామ్య తత్వాన్ని కూడా అంబానీ ప్రస్తావించారు. మూలధన కేటాయింపునకు సంబంధించిన విస్తృత దృష్టికోణంపై లారీ ఫింక్తో జరిగిన చర్చను గుర్తు చేస్తూ, “బ్లాక్రాక్ లక్ష్యం కేవలం స్వల్పకాలిక లాభాలు లేదా పెట్టుబడిదారులకు రాబడులు ఇవ్వడం మాత్రమే కాదు. ఆ మూలధనం సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడితేనే ఆ లక్ష్యం పూర్తైనట్టుగా భావిస్తారు. అదే తత్వం రిలయన్స్లో కూడా ఉంది” అని అంబానీ అన్నారు. -
బ్లేడ్ బ్యాటరీతో కొత్త బస్సులు
అధునాతన బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీతో కొత్త ఎలక్ట్రిక్ బస్సుల ఉత్పత్తిని వచ్చే త్రైమాసికం నుంచి ప్రారంభించనున్నట్లు ఒలెక్ట్రా గ్రీన్టెక్ తెలిపింది. దేశీయంగా ఎలక్ట్రిక్ బస్సుల రంగంలో తొలిసారిగా తాము రూపొందించిన ఈ ప్యాక్కి సర్టిఫికేషన్ లభించడం కంపెనీ ప్రస్థానంలో కీలక మైలురాయని సంస్థ ఎండీ మహేష్ బాబు చెప్పారు.మౌలిక రంగ దిగ్గజం ఎంఈఐఎల్ అనుబంధ సంస్థ అయిన ఒలెక్ట్రా గ్రీన్టెక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ. 46.68 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఆదాయం 29 శాతం వృద్ధితో రూ. 663.60 కోట్లకు చేరుకుంది. నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడం వల్ల ఆకర్షణీయమైన ఫలితాలను సాధించినట్లు మహేష్ బాబు తెలిపారు.ఒక్క త్రైమాసికంలోనే అత్యధికంగా 385 ఎలక్ట్రిక్ వాహనాలను డెలివరీ చేసి కొత్త రికార్డును నెలకొల్పినట్లు వివరించారు. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 37 శాతం పెరిగినట్లు చెప్పారు. ఇప్పటివరకు 3,639 వాహనాలను డెలివరీ చేయగా, 9,439 వాహనాలకు ఆర్డర్ బుక్ ఉన్నట్లు కంపెనీ తెలిపింది. -
Stock Market: ఐటీ షేర్లు తలకిందులు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతో ఫ్లాట్గా ముగిశాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో పురోగతి గురించి ఆందోళనలు ఇన్వెస్టర్లను భయపెట్టడంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) స్టాక్స్ అమ్మకాల ఒత్తిడితో తలకిందులయ్యాయి. మార్కెట్ ముగింపు సమయానికి నిఫ్టీ 48.45 పాయింట్లు లేదా 0.19 శాతం లాభంతో 25,776.00 వద్ద, సెన్సెక్స్ 78.56 పాయింట్లు లేదా 0.09 శాతం లాభపడి 83,817.69 వద్ద ముగిసింది. ఏఐ స్టార్టప్ ఆంత్రోపిక్ అంతర్గత న్యాయవాదుల కోసం ఉత్పాదకత సాధనాన్ని విడుదల చేసిన తరువాత వాల్ స్ట్రీట్ సాఫ్ట్ వేర్ సంస్థల షేర్లు పడిపోవడంతో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 6 శాతం పడిపోయింది. అటువంటి ఏఐ సాధనాల అభివృద్ధి సాఫ్ట్వేర్ కంపెనీలను దెబ్బతీస్తుందని, పరిశ్రమ అంతటా లాభదాయకతను దెబ్బతీస్తుందని పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. సెన్సెక్స్ లో ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్ర, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ టాప్ లూజర్స్గా నిలిచాయి. మరోవైపు ఎటర్నల్, ట్రెంట్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, అదానీ పోర్ట్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.63 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.27 శాతం పెరిగాయి. నిఫ్టీ ఐటీని పక్కన పెడితే నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 0.34 శాతం నష్టపోయింది. నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ వరుసగా 2.6 శాతం, 2 శాతం లాభాలతో అగ్రస్థానంలో ఉన్నాయి. -
ఐటీ రిటర్న్స్ గడువు పెంపు అందరికీనా?
ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఐటీఆర్ దాఖలు గడువును ఆగస్టు 31 వరకు పెంచుతున్నట్లు ఇటీవల 2026-27 బడ్జెట్లో ప్రకటించడంతో, ఈ పొడిగింపు పన్ను చెల్లింపుదారులందరికీ వర్తిస్తుందని చాలామంది భావిస్తున్నారు. కానీ అది పూర్తిగా నిజం కాదు.పీక్ ఫైలింగ్ సీజన్లో ఒత్తిడిని తగ్గించేందుకు ప్రభుత్వం దశలవారీ ఫైలింగ్ టైమ్లైన్ను ప్రవేశపెట్టింది. అయితే ఈ సడలింపు ఎంపిక చేసిన కొన్ని కేటగిరీల ట్యాక్స్ పేయర్స్కు మాత్రమే పరిమితం. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలోనే, అదనపు సమయం నిర్దిష్ట పన్ను చెల్లింపుదారులకు మాత్రమే ఉంటుందని, మిగతావారు ప్రస్తుత గడువునే పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.జూలై 31 గడువు ఎవరికీ వర్తిస్తుంది?వేతన పన్ను చెల్లింపుదారులు, పెన్షనర్లు, ఐటీఆర్-1 లేదా ఐటీఆర్-2 దాఖలు చేసే వ్యక్తులు, జీతం, వడ్డీ లేదా మూలధన లాభాల ద్వారా ఆదాయం పొందేవారికి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్కు జూలై 31 గడువే కొనసాగుతుంది. వీరికి ఎలాంటి గడువు పొడిగింపు లేదు. అందువల్ల, వారు మునుపటిలాగే తమ ఫైలింగ్ ప్రణాళికలను కొనసాగించాలి.ఆగస్టు 31 ఎవరికి?ఆడిట్ అవసరం లేని వ్యాపార సంస్థలు, ఫ్రీలాన్సర్లు, డాక్టర్లు, కన్సల్టెంట్లు వంటి వృత్తి నిపుణులు (నాన్-ఆడిట్ బిజినెస్ కేసులు), అర్హత కలిగిన కొన్ని ట్రస్టులు మాత్రమే జూలై 31కి బదులుగా ఆగస్టు 31 వరకు ఐటీఆర్ దాఖలు చేయవచ్చు. ఆదాయపు పన్ను చట్టం, 2025 లోని సెక్షన్ 263(1)(c) కింద ఈ పొడిగింపు వర్తిస్తుంది.ఎప్పటి నుంచి అమల్లోకి..?ఈ కొత్త గడువు పన్ను సంవత్సరం 2026–27 నుంచి వర్తిస్తుంది. ఆదాయపు పన్ను చట్టం, 2025 కింద సవరణలు 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. 2026–27 అసెస్మెంట్ సంవత్సరానికి, ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టం, 1961లో కూడా ఇదే మార్పులు అమలు చేస్తారు.


