breaking news
Business
-
కార్ల అమ్మకాల రికార్డ్
న్యూఢిల్లీ: దేశీయ ప్యాసింజర్ వాహనాల (కార్ల) అమ్మకాలు ఈ ఏడాది జూన్ నెలలో సరికొత్త రికార్డు సృష్టించాయి. మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, మహీంద్రా దిగ్గజ కంపెనీల అద్భుత ప్రదర్శనతో మొత్తం విక్రయాలు దాదాపు 25 శాతం వృద్ధితో 4 లక్షల యూనిట్లకు చేరినట్లు అంచనా. జీఎస్టీ 2.0 అనుకూలత, రూ.12 లక్షల వరకు ఐటీ మినహాయింపులు, ఆర్బీఐ రెపో రేట్ల తగ్గింపు వంటి అంశాలు మార్కెట్లో డిమాండ్ను భారీగా పెంచాయి.అయితే, పశ్చిమాసియా యుద్ధ వాతావరణం, ఇంధన ధరల భారం, దేశంలో రుతుపవనాల లోటు వంటి ప్రతికూలతలు భవిష్యత్తు డిమాండ్పై కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. పెట్రోల్ భారాన్ని తట్టుకోవడానికి కస్టమర్లు సీఎన్జీ, ఈవీల వైపు వేగంగా మొగ్గు చూపుతున్నారు. రాబోయే పండుగల సీజన్ నాటికి ఈ వృద్ధి స్థిరంగా కొనసాగాలంటే అంతర్జాతీయ ఉద్రిక్తతలు అదుపులోకి రావడం, వర్షాలు సమృద్ధిగా కురవడం అత్యంత కీలకమని ఆటో పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. -
రూపాయిపై ‘డాలర్’ ఒత్తిడి
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా ‘డాలర్ ఇండెక్స్’ బలోపేతం కావడం దేశీయ కరెన్సీపై తీవ్ర ఒత్తిడి పెంచింది. ఫలితంగా డాలర్ మారకంలో రూపాయి విలువ 60 పైసలు క్షీణించి 95.16 వద్ద ముగిసింది.డాలర్ పుంజుకోవడంతో పాటు ఇతర ఆసియా కరెన్సీల బలహీనత, దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ మూలధనం (పెట్టుబడులు) నిరంతరాయంగా తరలిపోవడం రూపాయి పతనానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ఉదయం ఫారెక్స్ మార్కెట్లో 94.67 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించిన రూపాయి... ఇంట్రాడేలో 94.60 – 95.29 శ్రేణిలో కదలాడింది. -
జీఎస్టీ వసూళ్లు 14 శాతం అప్
న్యూఢిల్లీ: దేశీయంగా సరఫరా పెరగడంలాంటి సానుకూల అంశాల నేపథ్యంలో జూన్లో వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) స్థూల వసూళ్లు రూ. 1.95 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది జూలోలో నమోదైన రూ. 1.71 లక్షల కోట్లతో పోలిస్తే ఇది సుమారు 14% అధికం. ఈ ఏడాది మే నెలలో స్థూల వసూళ్లు రూ. 1.94 లక్షల కోట్లు. కేంద్రం విడుదల చేసిన డేటా ప్రకారం దేశీయ లావాదేవీలపై స్థూల కలెక్షన్ 6.5% పెరిగి రూ. 1.35 లక్షల కోట్లకు చేరింది.ఇందులో కేంద్ర, రాష్ట్ర, సమీకృత జీఎస్టీ వసూళ్లు వరుసగా రూ. 37,376 కోట్లు, రూ. 45,116 కోట్లు, రూ. 52,282 కోట్లుగా ఉన్నాయి. దిగుమతులపై జీఎస్టీ ఆదాయం 34.6% ఎగిసి రూ. 60,038 కోట్లుగా నమోదైంది. మొత్తం రిఫండ్లు 29% పెరిగి రూ. 32,436 కోట్లుగా ఉంది. రిఫండ్లు పోగా నికరంగా వసూళ్లు 11.2% పెరిగి రూ. 1.62 లక్షల కోట్లుగా ఉన్నాయి.ఇటీవలి గణాంకాలు చూస్తే కలెక్షన్లు మధ్యమధ్యలో ఒక్కసారిగా పెరగడం కాకుండా, నెమ్మదిగా ఒక స్థాయిలో స్థిరపడుతున్నట్లుగా కనిపిస్తోందని ఏకేఎం గ్లోబల్ లీడ్ (ఇన్డైరెక్ట్ ట్యాక్స్) ఇకేష్ నాగ్పాల్ తెలిపారు. పశి్చమాసియా ఉద్రిక్తతలతో ఆర్థిక పరిస్థితులపై ప్రభావాలు పడుతున్నా జీఎస్టీ నెలవారీ వసూళ్లు క్రమంగా రూ. 2 లక్షల కోట్ల మార్కుకి చేరువవుతున్నాయని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ ఎంఎస్ మణి చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో స్థూల జీఎస్టీ వసూళ్లు 8.4% పెరిగి రూ. 6.32 లక్షల కోట్లకు చేరాయి. -
అనలాగ్ ఏఐతో ‘మేఘ’ జట్టు
సాక్షి, బిజినెస్ ప్రతినిధి; ఇన్ఫ్రా రంగ దిగ్గజం ‘మేఘ ఇంజనీరింగ్ (ఎంఈఐఎల్)’ ‘ఏఐ’లోకి ఎంట్రీ ఇచ్చింది. అబుదాబి కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఫిజికల్ ఇంటెలిజెన్స్ సంస్థ ‘అనలాగ్ ఏఐ’తో కలిసి కొత్త భాగస్వామ్య సంస్థను ఏర్పాటు చేసింది. ఈ జేవీలో ఇద్దరికీ చెరో 50 శాతం వాటా ఉంటుందని మేఘ సంస్థ ఎండీ పి.వి.కృష్ణారెడ్డి వెల్లడించారు. బుధవారమిక్కడ అనలాగ్ సీఈఓ అలెక్స్ కిప్మాన్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే రెండు మూడేళ్లలో తాము ఈ జేవీలో రూ.3,000 కోట్ల నుంచి 4,500 కోట్ల వరకూ పెట్టుబడి పెడతామని, అనలాగ్ భారత కార్యకలాపాలను పూర్తిగా ఈ జేవీయే చూస్తుందని చెప్పారాయన. కొత్త కంపెనీ పేరు, లోగో తదితర వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా అలెక్స్ కిప్మాన్ చెప్పారు. ఫిజికల్ ఏఐ... అవకాశాలు అపారం మూడేళ్ల కిందట అబుదాబి టెక్నాలజీ దిగ్గజం జీ24తో కలిసి అలెక్స్ కిప్మాన్ అనలాగ్ ఏఐని ఆరంభించారు. ఇది ప్రశ్నలకు టెక్ట్స్ రూపంలో సమాధానాలు చెప్పే ఫౌండేషనల్ ఏఐ కాదు. ఫిజికల్ ఏఐ. యంత్రాలు, పవర్ ప్రాజెక్టులు, వాహనాలు సహా భౌతిక వస్తువుల్ని సెన్సర్లతో అనుసంధానించి వాటి డిజిటల్ ట్విన్స్ను తయారు చేస్తుంది. వాటి సాయంతో దూరంగా ఉండికూడా వీటిని పర్యవేక్షించొచ్చు. యంత్రాల సామర్థ్యం పెరగటంతో పాటు ప్రమాదాల నివారణ, మెయింటెనెన్స్ అవసరాల్ని ముందే తెలుసుకోవచ్చు. స్మార్ట్ సిటీల్లో వాటర్ ఫ్లోను, ట్రాఫిక్ను సైతం దీనిద్వారా సమర్థంగా నిర్వహించవచ్చు.ఇలా చాలా ప్రయోజనాలుండటం వల్ల భారత్లో దీనికి అపార అవకాశాలున్నాయని కృష్ణారెడ్డి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘ఇది అత్యాధునిక టెక్నాలజీ. రిఫైనరీలతో సహా అన్నిచోట్లా వినియోగించొచ్చు. మా గ్రూపు సంస్థ ఒలెక్ట్రా త్వరలో బ్యాటరీ తయారీ, ప్యాసింజర్ కార్ల తయారీలోకి ప్రవేశిస్తోంది. దానిక్కూడా అనలాగ్ ఫిజికల్ ఇంటెలిజెన్స్ పనికొస్తుంది’ అని స్పష్టంచేశారు. ఈ జేవీ భారతదేశమంతటా సేవలందిస్తుందని, ఒక్క ఎంఈఐఎల్కే కాదని, ఇప్పటికే తమకు చాలామంది క్లయింట్లున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా కిప్మాన్ చెప్పారు. అబుదాబిలో చాలాచోట్ల దీన్ని వాడుతున్నారని, డేటా సెంటర్లు, పవర్ ప్రాజెక్టుల్లోనూ మోహరించామని చెప్పారాయన.హైదరాబాద్లో డెవలప్మెంట్ సెంటర్ తమ భాగస్వామ్య సంస్థ సారథ్యంలో హైదరాబాద్లో ఇండియా డెవలప్మెంట్ సెంటర్ను త్వరలో ఏర్పాటు చేస్తామని కిప్మాన్ చెప్పారు. ఉద్యోగుల సంఖ్య మొదట్లో తక్కువే ఉంటుందని, మెల్లగా విస్తరిస్తూ వెళతామని తెలియజేశారు. వచ్చే 3 నెలల్లో తమ భారత సేవలు వాణిజ్యపరంగా మొదలవుతాయని, పైలట్ ప్రాజెక్టులు ఇప్పటికే కొనసాగుతున్నాయని చెప్పారాయన. కార్యక్రమంలో మేఘ సంస్థ డైరెక్టర్లు పి.వి.ప్రణవ్ రెడ్డి, మానస్ రెడ్డి, అనలాగ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యెన్సీ స్మిత్ పాల్గొన్నారు. -
30 ఏళ్లలోపే వ్యాపార సామ్రాజ్యాలు..
భారత స్టార్టప్ ఎకోసిస్టమ్ యువతరం వైపు మరింతగా అడుగులు వేస్తోందని ‘అవెండస్ వెల్త్–హురున్ ఇండియా అండర్30 లిస్ట్ 2026’ (Avendus-Hurun India U30 List 2026 102) స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా 30 ఏళ్లలోపు వయస్సున్న 102 మంది యువ పారిశ్రామికవేత్తలు, నవ తరం వ్యాపార వారసులను ఈ జాబితా గుర్తించింది. గత ఏడాది 80 మందితో పోలిస్తే ఈసారి జాబితాలో చోటు దక్కించుకున్న వారి సంఖ్య 28 శాతం పెరగడం విశేషం. ఈ యువ నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థల మొత్తం విలువ సుమారు రూ.2.9 లక్షల కోట్లుగా నమోదైంది. ఈ జాబితా ‘అవెండస్ వెల్త్–హురున్ ఇండియా’ వివిధ వయసు క్యాటగిరీల సిరీస్లో తొలి భాగం కాగా, తరువాత అండర్35, అండర్40 జాబితాలు కూడా విడుదల కానున్నాయి.స్వయం ప్రతిభతో ఎదిగినవారే అధికంఈ ఏడాది జాబితాలో చోటు దక్కించుకున్న వారిలో 84 శాతం మంది ఫస్ట్ జనరేషన్ ఎంట్రాప్రెన్యూర్లు. కుటుంబ వ్యాపారాల వారసుల కంటే స్వయంగా సంస్థలను ప్రారంభించి విజయవంతం చేసిన యువతే ఎక్కువగా ఉండటం భారత స్టార్టప్ రంగంలో వస్తున్న మార్పుకు నిదర్శనంగా నిలిచింది. జాబితాలో చోటు పొందిన వారి సగటు వయస్సు 28 సంవత్సరాలు కావడం మరో విశేషం.డీప్టెక్, ఏఐ, స్పేస్టెక్ హవాఈసారి జాబితాలో ప్రతి నలుగురిలో ఒకరు డీప్టెక్ లేదా హార్డ్టెక్ రంగాలకు చెందినవారే. మొత్తం 27 మంది ఈ విభాగాల నుంచి ఎంపికయ్యారు. ఇందులో ఏఐ & మెషిన్ లర్నింగ్కు చెందినవారు 8 మంది, ఈవీ & ఆటో కాంపోనెంట్స్ రంగానికి చెందినవారు ఏడుగురు, స్పేస్ టెక్ నుంచి ఆరుగురు, ఏరోస్పేస్ & డిఫెన్స్ నుంచి నలుగురు, సైబర్ సెక్యూరిటీ నుంచి ఇద్దరు ఉన్నారు. ఏఐ ఆధారిత స్టార్టప్ల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే దాదాపు రెట్టింపైంది.20 ఏళ్లకే జాతీయ గుర్తింపుఈ ఏడాది జాబితాలో అత్యంత పిన్న వయస్కులు 20 ఏళ్ల ఒంకార్ సింగ్ బాత్రా (Apolink), ధ్రవ్య షా (Supermemory). వీరిద్దరూ ఒకరు స్పేస్టెక్, మరొకరు ఏఐ రంగాల్లో స్టార్టప్లను నిర్మిస్తున్నారు. గత ఏడాది అత్యంత చిన్న వయస్కులు 22 ఏళ్ల వారు కాగా, ఈసారి ఆ రికార్డు 20 ఏళ్లకు చేరింది.మహిళా పారిశ్రామికవేత్తల ముద్రఈ ఏడాది ఆరుగురు మహిళా పారిశ్రామికవేత్తలు జాబితాలో చోటు సంపాదించారు. అంజలి సర్దానా (Pronto), శ్రేయా మిట్టల్, రియా మిట్టల్ (Cava Athleisure), దేవికా ఘోలాప్ (OptraSCAN), దేవాంశి కేజ్రీవాల్ (Skillmatics), సురమ్యా జైన్ (RAS Luxury Skincare) ఇందులో ఉన్నారు. వీరిలో నలుగురు తొలిసారిగా జాబితాలోకి వచ్చారు.బెంగళూరు అగ్రస్థానంస్టార్టప్ల కేంద్రంగా బెంగళూరు తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఈసారి 21 మంది యువ వ్యాపారవేత్తలు అక్కడి నుంచే ఎంపికయ్యారు. గత ఏడాది ఈ సంఖ్య కేవలం 7 మాత్రమే. అదే సమయంలో మెట్రో నగరాల వెలుపల నుంచి 40 మంది యువ వ్యాపారవేత్తలు ఎంపిక కావడం దేశవ్యాప్తంగా పారిశ్రామిక విస్తరణకు సంకేతంగా నిలిచింది.బిట్స్ పిలానీ మరోసారి టాప్విద్యాసంస్థల పరంగా బిట్స్ పిలానీ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. గత ఏడాది ఏడుగురు ఉండగా, ఈసారి ఆ సంస్థ పూర్వ విద్యార్థుల సంఖ్య 11కు పెరిగింది.జెప్టో, భారత్పే ముందంజఅండర్30 జాబితాలోని టాప్-10 సంస్థలు కలిపి 3.5 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులు సమీకరించాయి. ఇందులో జెప్టో (Zepto) ఒక్కటే 2.3 బిలియన్ డాలర్లు, భారత్పే(BharatPe) సుమారు 650 మిలియన్ డాలర్లు సమీకరించి అగ్రస్థానాల్లో నిలిచాయి. మొత్తం జాబితాలోని యువ పారిశ్రామికవేత్తలు కలిపి 75 వేల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నారు.లింక్డ్ఇన్లో ఆదిత్ పాలిచా హవాజెప్టో సహవ్యవస్థాపకుడు ఆదిత్ పాలిచాకు లింక్డ్ఇన్లో సుమారు 3.77 లక్షల మంది ఫాలోవర్లు ఉండగా, అదే ఈ జాబితాలో అత్యధికం. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన వై కాంబినేటర్, గూగుల్ వంటి సంస్థలతో పాటు అనేక ప్రముఖ ఇన్వెస్టర్ల మద్దతు ఈ యువ సంస్థలకు లభించడం విశేషం. పిక్సెల్, జెప్టో, బోల్డ్ కేర్ వంటి స్టార్టప్లు అత్యధిక పెట్టుబడిదారులను ఆకర్షించిన సంస్థలుగా నిలిచాయి.భారత స్టార్టప్ రంగంలో కొత్త ధోరణిఈ ఏడాది నివేదికలో ప్రధానంగా కనిపించిన మార్పు సాఫ్ట్వేర్ ఆధారిత స్టార్టప్ల నుంచి డీప్టెక్, స్పేస్టెక్, ఎలక్ట్రిక్ వాహనాలు, డిఫెన్స్ టెక్నాలజీ వంటి హార్డ్టెక్ రంగాల వైపు యువ వ్యవస్థాపకులు వేగంగా మళ్లడం. దీంతో భారత స్టార్టప్ ఎకోసిస్టమ్ మరింత సాంకేతికత ఆధారిత, ప్రపంచ స్థాయి పోటీకి సిద్ధమవుతోందని నివేదిక విశ్లేషించింది. -
వాట్సాప్ యూజర్నేమ్ వ్యవహారం.. కేంద్రం నోటీసులు
మొబైల్ నంబర్ను వెల్లడించకుండా వాట్సాప్లో సంభాషణలు ప్రారంభించేలా రూపొందించిన ‘యూజర్నేమ్’ ఫీచర్పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ కొత్త వ్యవస్థ సైబర్ నేరాలు, ఫిషింగ్, ఇంపర్సనేషన్, ‘డిజిటల్ అరెస్ట్’ తరహా మోసాలకు అవకాశం కల్పించే ప్రమాదం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటాకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ ఫీచర్పై నియంత్రణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY) భారత కార్యకలాపాలకు సంబంధించిన వాట్సాప్ చీఫ్ కంప్లయన్స్ అధికారికి పంపిన లేఖలో, యూజర్నేమ్ ఫీచర్ను ప్రపంచవ్యాప్తంగా దశలవారీగా ప్రవేశపెడుతున్నట్లు కంపెనీ ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ మొబైల్ నంబర్కు బదులుగా ప్రత్యేక యూజర్నేమ్ను ఉపయోగించి కొత్త వ్యక్తులతో చాట్ ప్రారంభించవచ్చు. పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాత మొదటిసారి సంప్రదించే వారికి ఫోన్ నంబర్ కనిపించకుండా ఉండేలా ఈ వ్యవస్థ రూపొందించారు. అదనపు భద్రత కోసం ఐచ్ఛికంగా ‘యూజర్నేమ్ కీ’ని కూడా సెట్ చేసుకునే అవకాశం ఉంటుందని వాట్సాప్ వెల్లడించింది.అయితే, ఈ ఫీచర్ను సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు లేదా ప్రముఖుల పేర్లను పోలిన యూజర్నేమ్లతో నకిలీ ఖాతాలు సృష్టించి ప్రజలను మోసగించే ప్రమాదం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే దేశంలో పెరుగుతున్న ఆన్లైన్ మోసాల దృష్ట్యా ఈ ఫీచర్ను జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉందని కేంద్రం స్పష్టం చేసింది.తాజా పరిణామాల ప్రకారం, సంప్రదింపుల ప్రక్రియ పూర్తయ్యే వరకు భారత్లో యూజర్నేమ్ ఫీచర్ను అమలు చేయవద్దని కూడా మెటాకు కేంద్ర ప్రభుత్వం సూచించినట్లు సమాచారం. మెటా నుంచి వచ్చే వివరణను పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి -
బంగారం అమ్మేసుకుంటున్నారు..
బంగారం ధరలు ఇటీవలి నెలల్లో రికార్డు స్థాయిని తాకిన తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టడంతో భారతీయ కుటుంబాల పసిడి కొనుగోలు ధోరణిలో ఆసక్తికర మార్పు కనిపిస్తోంది. సాధారణంగా పాత బంగారు ఆభరణాలను కొత్త నగలుగా మార్చుకునే వినియోగదారులు, ఇప్పుడు వాటిని నేరుగా విక్రయించి నగదుగా మార్చుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. భవిష్యత్తులో ధరలు మరింత తగ్గే అవకాశం ఉందనే అంచనాలే ఈ ధోరణికి ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి.3 నెలల్లో 50 టన్నుల బంగారంఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) గణాంకాల ప్రకారం.. 2026 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశవ్యాప్తంగా దాదాపు 50 టన్నుల పాత బంగారం మార్కెట్లోకి వచ్చింది. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 43 శాతం అధికం. పాత ఆభరణాలను అమ్మి నగదు పొందేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారని పలు నివేదికలు వెల్లడించాయి.మార్కెట్ విశ్లేషకుల ప్రకారం.. ఈ ఏడాది ప్రారంభంలో 10 గ్రాముల బంగారం ధర కొన్ని సందర్భాల్లో రూ.1.8 లక్షల వరకు చేరుకోగా, ప్రస్తుతం అది సుమారు రూ.1.4 లక్షల స్థాయికి దిగివచ్చింది. ధరలు ఇంకా రూ.1.2 లక్షల వరకు పడిపోవచ్చనే అంచనాలతో చాలామంది ఇప్పుడే విక్రయించి లాభాలను సొంతం చేసుకోవాలనే నిర్ణయానికి వస్తున్నారు.బంగారం అధిక ధరలను నగదుగా మార్చుకునే అవకాశంగా వినియోగదారులు చూస్తున్నారని ఐబీజేఏ జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా పేర్కొన్నారు. గతంలో పాత నగలను ఇచ్చి కొత్త ఆభరణాలు తీసుకునే పద్ధతి ఎక్కువగా ఉండేదని, ప్రస్తుతం మాత్రం నేరుగా విక్రయించి నగదు పొందడానికే ప్రాధాన్యం పెరిగిందన్నారు.రీసైక్లింగ్ పరిశ్రమకు ఊతంఈ పరిణామం దేశంలోని సంఘటిత బంగారం రీసైక్లింగ్ పరిశ్రమకు కూడా ఊతమిస్తోంది. ఇళ్లలో ఉపయోగం లేకుండా పడి ఉన్న బంగారం తిరిగి మార్కెట్లోకి రావడం వల్ల దిగుమతులపై ఆధారపడే అవసరం కొంత మేర తగ్గే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు, అధిక ధరల కారణంగా కొత్త బంగారు ఆభరణాల కొనుగోళ్లు మాత్రం మందగించినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. -
స్టాక్ మార్కెట్: ఎవరికి లాభాలు.. ఎవరికి నష్టాలు?
ప్రపంచ మార్కెట్లలో సానుకూల సంకేతాలు, ముడిచమురు ధరలు తగ్గడం వంటి కారణాలతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండు సెషన్ల నష్టాల తర్వాత బుధవారం బలంగా పుంజుకున్నాయి. కొనుగోళ్ల మద్దతుతో సూచీలు లాభాల్లో ముగిశాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 443.97 పాయింట్లు (0.58%) పెరిగి 76,922.64 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 631 పాయింట్లకుపైగా పెరిగి 77,110.08 గరిష్టాన్ని తాకింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 140.10 పాయింట్లు (0.59%) లాభంతో 24,005.85 వద్ద ముగిసింది. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్షియల్, రియల్టీ రంగాలు సూచీల ర్యాలీకి ప్రధాన మద్దతు ఇచ్చాయి. సెన్సెక్స్, నిఫ్టీ 50 సూచీల్లో ఈరోజు టాప్ గెయినర్లు ఏవి, టాప్ లూజర్లు ఏవి.. ఈ కింద చూద్దాం..సెన్సెక్స్ టాప్ గెయినర్లుకంపనీప్రస్తుత ధర (రూ.)మార్పు% మార్పుఎటర్నల్279.70+15.10+5.71%ఏషియన్ పెయింట్స్2,716+80.70+3.07%హెచ్యూఎల్2,182+63.80+3.02%కోటక్ బ్యాంక్400.45+8.20+2.10%అదానీ పోర్ట్స్1,848+38.00+2.10%ఎం&ఎం3,130+61.20+2.00%ఎస్బీఐ1,047+20.50+2.00%మారుతి సుజుకి14,395+280.00+1.99%అల్ట్రాటెక్ సిమెంట్11,456+203.00+1.81%యాక్సిస్ బ్యాంక్1,369+23.00+1.71%సెన్సెక్స్ టాప్ లూజర్లుకంపనీప్రస్తుత ధర (రూ.)మార్పు% మార్పుహెచ్సీఎల్ టెక్1,034-37.60-3.51%టెక్ మహీంద్రా1,362-42.50-3.03%టీసీఎస్1,983-48.91-2.41%టాటా స్టీల్185.17-2.90-1.54%ఇన్ఫోసిస్985.30-15.11-1.51%ఎల్ & టీ4,093-50.80-1.23%హెచ్డీఎఫ్సీ బ్యాంక్796.15-1.81-0.23%టైటాన్4,399-5.40-0.13%నిఫ్టీ 50 టాప్ గెయినర్లుకంపనీప్రస్తుత ధర (రూ.)మార్పు% మార్పుఎటర్నల్279.70+15.10+5.71%అదానీ ఎంటర్ప్రైజెస్3,144+108.00+3.55%నెస్లే ఇండియా1,454+48.60+3.46%ఏషియన్ పెయింట్స్2,716+80.70+3.07%హెచ్యూఎల్2,182+63.80+3.02%కోటక్ బ్యాంక్400.45+8.20+2.10%అదానీ పోర్ట్స్1,848+38.00+2.10%ఎం&ఎం3,130+61.20+2.00%ఎస్బీఐ1,047+20.50+2.00%మారుతి సుజుకి14,395+280.00+1.99%నిఫ్టీ 50 టాప్ లూజర్లుకంపనీప్రస్తుత ధర (రూ.)మార్పు% మార్పుహెచ్సీఎల్ టెక్1,034-37.60-3.51%టెక్ మహీంద్రా1,362-42.50-3.03%టీసీఎస్1,983-48.91-2.41%హిందాల్కో939.70-16.90-1.77%టాటా స్టీల్185.17-2.90-1.54%ఇన్ఫోసిస్985.30-15.11-1.51%డాక్టర్ రెడ్డీస్1,340-17.20-1.27%టాటా మోటార్స్347.80-4.40-1.25%ఎల్ & టీ4,093-50.80-1.23%హెచ్డీఎఫ్సీ లైఫ్569.95-5.90-1.03%మొత్తంగా, గ్లోబల్ సెంటిమెంట్ మెరుగుపడటం, చమురు ధరలు తగ్గడం మార్కెట్కు బలాన్నిచ్చాయి. అయితే ఐటీ రంగంలో అమ్మకాల ఒత్తిడి కొనసాగడం వల్ల కొన్ని భారీ స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. -
కియా కొత్త కార్లు.. మార్కెట్లోకి టాప్ వేరియంట్లు
కియా ఇండియా (Kia India) తన పాపులర్ ఎస్యూవీ సెల్టోస్ లైనప్ను మరింత బలోపేతం చేస్తూ కొత్తగా జీటీఎక్స్(ఓ) (GTX(O)), ఎక్స్-లైన్(ఓ) (X-Line(O)) అనే టాప్ వేరియంట్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ ప్రకటన ప్రకారం.. ఈ కొత్త వేరియంట్ల ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 21.56 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. దీంతో, ఇప్పటివరకు టాప్లో ఉన్న GTX(A), X-Line(A) వేరియంట్ల స్థానాన్ని ఇవి భర్తీ చేశాయి.సెల్టోస్ ప్రస్తుత బేస్ మోడల్ ధర రూ. 10.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద కొనసాగుతుండగా, కొత్త టాప్ వేరియంట్లు ప్రీమియం ఫీచర్లు, సేఫ్టీ టెక్నాలజీతో మరింత హైఎండ్ సెగ్మెంట్ను లక్ష్యంగా చేసుకున్నాయి.ఈ కొత్త వేరియంట్లలో ప్రధాన ఆకర్షణగా ADAS Level 2 F+ సూట్ అందుబాటులోకి వచ్చింది. ఇందులో మొత్తం 28 అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లు ఉన్నాయి. జంక్షన్ క్రాస్ కొలిజన్ కంట్రోల్, లేన్ చేంజ్ అలర్ట్స్, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, హైవే డ్రైవింగ్ అసిస్ట్ వంటి సేఫ్టీ టెక్నాలజీలు ఇందులో భాగంగా ఉన్నాయి. ఇవి డ్రైవింగ్ను మరింత సురక్షితంగా మార్చేలా రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.ఫీచర్ల పరంగా కూడా ఈ వేరియంట్లు మరింత ప్రీమియంగా ఉన్నాయి. కనెక్టెడ్ కార్ నావిగేషన్ కాక్పిట్, ప్రాంతీయ భాషల్లో వాయిస్ కమాండ్స్ సపోర్ట్, డిజిటల్ కీ, హెడ్-అప్ డిస్ప్లే (HUD), AQI డిస్ప్లే ఉన్న స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్, అలాగే మొబైల్ యాప్ ద్వారా నియంత్రించగల ఫ్రంట్–రియర్ డాష్క్యామ్లు వంటి ఆధునిక సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా రైన్-సెన్సింగ్ వైపర్లు, వన్-టచ్ పవర్ విండోస్, కియా కనెక్ట్ 2.0 ద్వారా 85కు పైగా కనెక్టెడ్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.మార్కెట్లో ఈ అప్గ్రేడ్తో సెల్టోస్ పోటీ మరింత పెరిగింది. ఇది మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, హ్యుందాయ్ క్రెటా, హోండా ఎలివేట్ వంటి ప్రముఖ మిడ్-సైజ్ ఎస్యూవీలతో నేరుగా పోటీ పడుతోంది.ఇంజిన్ ఆప్షన్ల విషయానికి వస్తే, సెల్టోస్లో 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ (115 బిహెచ్పి), 1.5 లీటర్ డీజిల్ (116 బీహెచ్పీ), 1.5 లీటర్ టర్బో పెట్రోల్ (160 బీహెచ్పీ) ఇంజిన్ ఆప్షన్లు కొనసాగుతున్నాయి. ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో మాన్యువల్, సివిటి, ఆటోమేటిక్, iMT, 7-స్పీడ్ DCT వంటి వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. -
జీఎస్టీ వసూళ్లు: ఒక్క నెలలో రూ.1.94 లక్షల కోట్లు
దేశ జీఎస్టీ వసూళ్లు గడిచిన జూన్లో బలమైన వృద్ధిని నమోదు చేశాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. స్థూల జీఎస్టీ ఆదాయం 13.9 శాతం పెరిగి రూ.1,94,812 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే నెలలో ఇది రూ.1,71,105 కోట్లుగా ఉండటం గమనార్హం.నికరంగా (రిఫండ్లు మినహాయించిన తరువాత) జీఎస్టీ వసూళ్లు 11.2 శాతం పెరిగి రూ.1,62,377 కోట్లుగా నమోదయ్యాయి. అదే సమయంలో నెలలో రీఫండ్లు గణనీయంగా పెరిగి రూ.32,436 కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 29.1 శాతం అధికం.కేంద్ర జీఎస్టీ (CGST) వసూళ్లు 8 శాతం పెరిగి రూ.37,376 కోట్లకు చేరగా, రాష్ట్ర జీఎస్టీ (SGST) 4 శాతం వృద్ధితో రూ.45,116 కోట్లుగా నమోదైంది. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (IGST)లోనూ బలమైన పెరుగుదల కనిపించింది. దేశీయ లావాదేవీల ద్వారా వచ్చిన ఐజీఎస్టీ రూ.52,282 కోట్లుగా ఉండగా, దిగుమతులపై వసూళ్లు 34.6 శాతం భారీ వృద్ధితో రూ.60,038 కోట్లకు చేరాయి.దేశీయ స్థూల ఆదాయాలు మొత్తం 6.5 శాతం పెరిగి రూ.1,34,774 కోట్లుగా నమోదయ్యాయి. ఇది దేశీయ వినియోగం, సేవల రంగంలో కొనసాగుతున్న స్థిరమైన డిమాండ్ను సూచిస్తోందని ఆర్థిక వర్గాలు పేర్కొంటున్నాయి.రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్ర 9 శాతం వృద్ధితో రూ.30,714 కోట్ల జీఎస్టీ వసూళ్లను నమోదు చేసి మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్ 19 శాతం వృద్ధితో రూ.9,165 కోట్లు సాధించింది. గుజరాత్ రూ.11,743 కోట్లు (12% వృద్ధి), కర్ణాటక రూ.12,937 కోట్లు (10% వృద్ధి), హర్యానా రూ.10,065 కోట్లు (9% వృద్ధి) నమోదు చేశాయి. అయితే తమిళనాడు మాత్రం స్వల్పంగా 2 శాతం తగ్గుదలతో రూ.9,776 కోట్లకు పరిమితమైంది. -
క్లాడ్ ఏఐ మోడళ్లపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా
ఆంత్రోపిక్ సంస్థకు చెందిన శక్తివంతమైన ఏఐ మోడళ్లు ‘క్లాడ్ ఫేబుల్ 5’ (Claude Fable 5), ‘మైథోస్ 5’(Mythos 5)లపై విధించిన విదేశీ యాక్సెస్ ఆంక్షలను అమెరికా ఎత్తివేసింది. అమెరికా వాణిజ్య శాఖ తన నియంత్రణలను తొలగించినట్లు ధ్రువీకరించిన అనంతరం ఈ మోడళ్ల సేవలను పునరుద్ధరిస్తున్నట్లు ఆంత్రోపిక్ అధికారికంగా ప్రకటించింది. ‘మా వినియోగదారుల సహనానికి, అలాగే మోడళ్లను తిరిగి అందుబాటులోకి తీసుకురావడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’ అని ఆంత్రోపిక్ సంస్థ ఎక్స్ వేదికగా పేర్కొంది.భద్రతా హామీలతో లభించిన ఊరటఆన్లైన్లో విస్తృతంగా ప్రసారమైన ఒక లేఖలో అమెరికా వాణిజ్య శాఖ కార్యదర్శి హోవార్డ్ లుత్నిక్ ఈ నిర్ణయానికి గల కారణాలను స్పష్టం చేశారు. ఆంత్రోపిక్ సంస్థ ఇకపై ప్రత్యేక ఎగుమతి లైసెన్స్ పొందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఏఐ మోడళ్లతో ముడిపడి ఉన్న భద్రతా ప్రమాదాలను ముందస్తుగా గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ఆంత్రోపిక్ అంగీకరించడమే ఇందుకు ప్రధాన కారణం. దీనితో పాటు, రాబోయే ఏఐ మోడళ్ల ప్రమాణాలపై ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి, ఎలాంటి హానికరమైన కార్యకలాపాలు జరిగినా వెంటనే ప్రభుత్వానికి తెలియజేయడానికి సంస్థ అంగీకరించింది.అసలేం జరిగింది? ఆంక్షల నేపథ్యం ఇదే..గత నెలలో(జూన్) డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా యంత్రాంగం ఆంత్రోపిక్ సంస్థకు ఊహించని షాక్ ఇచ్చింది. కంపెనీ ఉద్యోగులతో సహా విదేశీ పౌరులు ఎవరూ ఈ మోడళ్లను యాక్సెస్ చేయకుండా నిరోధించాలని ఆదేశించడంతో సంస్థ అకస్మాత్తుగా ఫేబుల్ 5, మైథోస్ 5 సేవలను నిలిపివేసింది. ఆ సమయంలో ప్రభుత్వం నిర్దిష్ట కారణాలేవీ చెప్పనప్పటికీ ఫేబుల్ 5లోని భద్రతా అంశాలపై అధికారులు ఆందోళన చెందడమే ఇందుకు కారణమని భావించారు.అయితే, గత శుక్రవారం క్లిష్టమైన మౌలిక సదుపాయాలను నిర్వహించే అమెరికా సంస్థలకు మాత్రమే వీటిని ఉపయోగించేందుకు అనుమతి లభించింది. ఇప్పుడు తాజాగా సాధారణ ప్రజలకు కూడా పూర్తిస్థాయి యాక్సెస్ ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ట్రంప్ ప్రభుత్వం వర్సెస్ ఆంత్రోపిక్ట్రంప్ పరిపాలనా యంత్రాంగానికి, ఆంత్రోపిక్ సంస్థకు మధ్య కొంతకాలంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఆంక్షలు ఆ ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోశాయి. గత మార్చిలో ఆంత్రోపిక్ ఏఐ సంస్థ రక్షణ శాఖ (పెంటగాన్)పై దావా వేసింది. తమ ఏఐ సాధనాలను సామూహిక నిఘా లేదా స్వయంప్రతిపత్త ఆయుధాల కోసం ఉపయోగించబోమని స్పష్టమైన హామీలు ఇవ్వనందుకు పెంటగాన్ ఈ సంస్థను సప్లై చెయిన్ రిస్క్గా లేబుల్ చేసింది. దీనిపై సంస్థ న్యాయపోరాటానికి దిగింది.మరోవైపు, చాట్ జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐ సైతం తమ తాజా మోడల్ సిరీస్ ‘జీపీటీ-5.6’ను మొదట కేవలం ‘విశ్వసనీయ భాగస్వాముల చిన్న సమూహం’ కోసం మాత్రమే విడుదల చేయనున్నట్లు గత వారం ప్రకటించింది.నిపుణులు ఏమంటున్నారు?ఈ పరిణామాలపై సిడ్నీ విశ్వవిద్యాలయంలోని ఏఐ, ట్రస్ట్ అండ్ గవర్నెన్స్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ ఫ్రాన్సిస్కో బైలో స్పందిస్తూ, టెక్ వర్గాల్లో ఈ ఆంక్షల ఎత్తివేత ఊహించిందేనని అన్నారు. ‘పరిశోధకులు ఫేబుల్ 5ను జైల్బ్రేక్(ఏఐ మోడళ్లకు వాటిని తయారు చేసిన కంపెనీలు కొన్ని భద్రతా నియమాలను, నైతిక పరిమితులను విధిస్తాయి. ప్రమాదకరమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఈ ఏఐ మోడళ్లను నియంత్రిస్తారు) చేయగలిగారనే నివేదికలు వాస్తవ తీవ్రత కంటే ఎక్కువగా ప్రచారమయ్యాయి. అమెరికా ప్రభుత్వం అతిగా స్పందించిందని ఆలస్యంగా గ్రహించింది. ఇటువంటి నిర్ణయాలు పరిశ్రమలో గందరగోళాన్ని సృష్టిస్తాయి. ఒకవేళ ఫేబుల్, మైథోస్లను నిషేధిస్తే భవిష్యత్తులో మార్కెట్లోకి వచ్చే ఇతర పోటీ నమూనాలను కూడా నిషేధించాల్సి వస్తుంది’ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: బంగారం ధరలు కూల్ఆఫ్! -
దిగొచ్చిన ఇంధన ధరలు!
కొంతకాలంగా పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) ఉద్రిక్తతలతో అల్లాడిపోతున్న ఇంధన వినియోగదారులకు అంతర్జాతీయ మార్కెట్ నుంచి ఊరట లభించింది. ఇరాన్ వివాదం సడలడం, కీలకమైన సముద్ర రవాణా మార్గాలు పునప్రారంభం కావడంతో అంతర్జాతీయంగా ముడిచమురు, ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) సరఫరాలు మళ్లీ గాడిలో పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అంతరాయాలపై ఆందోళనలు తొలగిపోవడంతో చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా తగ్గిన ముడిచమురు ధరల ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తూ ప్రైవేట్ రంగ ఇంధన రిటైలర్ నయారా ఎనర్జీ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న తమ రిటైల్ నెట్వర్క్లో పెట్రోల్ ధరను లీటరుకు రూ.5, డీజిల్ ధరను లీటరుకు రూ.3 చొప్పున తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గిన తర్వాత ఇంధన ధరలను తగ్గించిన మొదటి రిటైలర్గా నయారా నిలిచింది. దేశవ్యాప్తంగా ఉన్న నయారాకు చెందిన 7,000 ఇంధన స్టేషన్లలో ఈ సవరించిన ధరలు తక్షణమే అమలులోకి వచ్చాయి. అయితే, స్థానిక పన్నులు (వ్యాట్) ఆధారంగా ఆయా రాష్ట్రాల్లో తుది రిటైల్ ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు.మార్చి నాటి పెంపు ఉపసంహరణగతంలో ఇరాన్ వివాదంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఎగబాకడంతో.. మార్చి 26న నయారా సంస్థ పెట్రోల్పై రూ.5, డీజిల్పై రూ.3 పెంచింది. తాజా తగ్గింపుతో ఆ పెంపును సంస్థ పూర్తిగా వెనక్కి తీసుకున్నట్లయింది. గ్లోబల్ మార్కెట్ స్థిరీకరణ తర్వాత ఇంధన ధరల్లో వచ్చిన మొదటి తగ్గుదల సవరణ ఇదే కావడం గమనార్హం. ప్రస్తుతం గుజరాత్లోని వడినార్లో తమ 20 మిలియన్ టన్నుల (వార్షిక సామర్థ్యం) రిఫైనరీ టర్నరౌండ్ను పూర్తి చేసుకుని దేశీయ డిమాండ్ను అందుకునేందుకు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.ప్రభుత్వ రంగ సంస్థల్లో మార్పు లేదు!ప్రైవేట్ రంగ సంస్థ నయారా ధరలను తగ్గించినప్పటికీ ప్రభుత్వ రంగ ఇంధన రిటైలర్లు మాత్రం ఇంకా పాత ధరలనే కొనసాగిస్తున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు దేశంలోని లక్షకు పైగా ఇంధన స్టేషన్లలో 90 శాతానికి పైగా వాటాను కలిగి ఉన్నాయి. కాగా, ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.102.12 గాను, డీజిల్ ధర లీటరుకు రూ.95.20 గాను కొనసాగుతోంది.ఇదీ చదవండి: బంగారం ధరలు కూల్ఆఫ్! -
బంగారం ధరలు కూల్ఆఫ్!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
మైక్రోసాఫ్ట్లో మరోసారి ఉద్యోగాల కోత?
ప్రపంచ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోమారు భారీగా ఉద్యోగాల తొలగింపునకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఖర్చులను నియంత్రించడమే లక్ష్యంగా పెట్టుకున్న కంపెనీ, త్వరలోనే కొత్త రౌండ్ లే-ఆఫ్స్ను ప్రకటించవచ్చని ప్రముఖ మీడియా సంస్థ బిజినెస్ ఇన్సైడర్ అంచనా వేసింది. ముఖ్యంగా కంపెనీకి చెందిన ఎక్స్బాక్స్ గేమింగ్ విభాగంతో పాటు సేల్స్, కన్సల్టింగ్ విభాగాల్లోని వేలాది ఉద్యోగాలపై ఈ ప్రభావం పడనుందని పేర్కొంది.గత ఏడాది (2025) మే నెలలో 6,000 మందిని, జులైలో సంస్థ మొత్తం సిబ్బందిలో 4 శాతానికి సమానమైన 9,000 మంది ఉద్యోగులను మైక్రోసాఫ్ట్ తొలగించిన సంగతి తెలిసిందే. అయితే, గత ఏడాదితో పోలిస్తే ఈసారి జరగబోయే కోతలు కొంత తక్కువగానే ఉండవచ్చని సమాచారం. కంపెనీకున్న మొత్తం 2,20,000 మంది ఉద్యోగుల్లో ఈ తాజా లే-ఆఫ్స్ ప్రభావం 2.5% కంటే తక్కువగానే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే నిర్ణయం?సాధారణంగా మైక్రోసాఫ్ట్ తన కొత్త ఆర్థిక సంవత్సరాన్ని జులై 1 నుంచి ప్రారంభిస్తుంది. ఈ నేపథ్యంలోనే వచ్చే వారం నాటికి ఈ ఉద్యోగాల కోతపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. అయితే, ఈ గడువులో స్వల్ప మార్పులు ఉండవచ్చు. ఈ ప్రక్రియలో ప్రభావితమయ్యే కొంతమంది ఉద్యోగులకు అంతర్గతంగా వెంటనే కొత్త బాధ్యతలను అప్పగించే యోచనలో కూడా కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది.ఏఐపై పెరుగుతున్న ఖర్చుఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతపై మైక్రోసాఫ్ట్ భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఏఐ అప్లికేషన్లు, సాఫ్ట్వేర్ సేవల విస్తరణకు వ్యయం పెరుగుతుండటంతో ఇతర విభాగాల్లో ఖర్చులను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు భవిష్యత్తులో ఏఐ సాఫ్ట్వేర్ సాంకేతికత వల్ల కొన్ని సంప్రదాయ సాఫ్ట్వేర్ సేవల అవసరం తగ్గుతుందనే ఆందోళనలతో అమెరికా స్టాక్ మార్కెట్ నుంచి కంపెనీపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే గత నెలలో మైక్రోసాఫ్ట్ స్టాక్ సుమారు 17 శాతం మేర క్షీణించింది.గేమింగ్ విభాగంలో రీసెట్ వ్యూహంమైక్రోసాఫ్ట్ ఎక్స్బాక్స్ గేమింగ్ విభాగంలో ఈ మార్పులు ఊహించినవేనని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎక్స్బాక్స్ నూతన సీఈఓ ఆశా శర్మ ఇటీవల ఉద్యోగులకు పంపిన అంతర్గత మెమోలో.. వ్యాపారాన్ని సరికొత్తగా రీసెట్ చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ రీస్ట్రక్చరింగ్లో భాగంగానే గేమింగ్ విభాగంలో ఉద్యోగాల కోత విధిస్తున్నట్లు స్పష్టమవుతోంది.స్వచ్ఛంద పదవీ విరమణ అస్త్రంగత ఏడాదితో పోలిస్తే ఈసారి లే-ఆఫ్స్ ప్రభావం తగ్గడానికి కంపెనీ ప్రవేశపెట్టిన స్వచ్ఛంద పదవీ విరమణ కార్యక్రమం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలోనే అమెరికాలోని ఉద్యోగుల కోసం మైక్రోసాఫ్ట్ ఒక ప్రత్యేక బై-అవుట్ ఆఫర్ను ప్రకటించింది. వయస్సు, సర్వీస్ కాలం ఆధారంగా రూపొందించిన ఈ పథకానికి అమెరికాలోని సంస్థ మొత్తం వర్క్ఫోర్స్ (1,25,000 మంది)లో సుమారు 7 శాతం (దాదాపు 9,000 మంది) ఉద్యోగులు అర్హత సాధించారు.కంపెనీ అంచనాలకు అనుగుణంగానే అర్హులైన వారిలో మూడింట ఒక వంతు మంది ఉద్యోగులు ఈ స్వచ్ఛంద విరమణను ఎంచుకున్నారు. ఫలితంగా సంస్థకు సహజంగానే ఉద్యోగుల సంఖ్య తగ్గింది. అయితే, కమీషన్ ఆధారిత వేతనాలు పొందే సేల్స్ ఉద్యోగులకు మాత్రం ఈ వీఆర్ఎస్ ఆఫర్ వర్తించలేదని కంపెనీ అంతర్గత పత్రాల ద్వారా వెల్లడైంది. అందుకే ఇప్పుడు నేరుగా సేల్స్, కన్సల్టింగ్ విభాగాల్లో ఉద్యోగాల తగ్గింపునకు మైక్రోసాఫ్ట్ సిద్ధమవుతోంది.ఇదీ చదవండి: బంగారం ధరలు ఢమాల్! -
నిఫ్టీ, సెన్సెక్స్ నష్టాలకు బ్రేక్..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:18 సమయానికి నిఫ్టీ(Nifty) 39 పాయింట్లు పెరిగి 23,911 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 154 పాయింట్లు పుంజుకొని 76,643 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 101.27బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 73.6 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.37 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.18 శాతం పెరిగింది.నాస్డాక్ 2.07 శాతం పుంజుకుంది.Today Nifty position 01-07-2026(time: 09:18 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
కాలంతో ప్రయాణం.. క్రమశిక్షణతో లాభం!
షేర్ మార్కెట్లో అసాధారణ లాభాల కోసం వెంపర్లాడటం కంటే క్రమశిక్షణతో కూడిన సాధారణ పెట్టుబడి సూత్రాలను పాటించడమే సంపద సృష్టికి అసలైన రహస్యమని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జెరోధా సహ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ స్పష్టం చేశారు. చాలా మంది పెట్టుబడిదారులు విస్మరించే ఈ సరళమైన ఆర్థిక సూత్రాన్ని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా పంచుకున్నారు. ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి సంక్లిష్టమైన వ్యూహాలు లేదా నిరంతరం స్టాక్స్ మార్చడం వంటివి అవసరం లేదన్నారు. దీర్ఘకాలిక ప్రణాళికే ఉత్తమ ఫలితాలను ఇస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, ఆయన పంచుకున్న కొన్ని అంశాలను కింద చూద్దాం.నితిన్ కామత్ పెట్టుబడి ఫార్ములా..మీ ఆర్థిక లక్ష్యం, కాలపరిమితిని బట్టి ఈక్విటీ, డెట్, గోల్డ్ వంటి విభాగాల్లో సరైన నిష్పత్తిలో పెట్టుబడి పెట్టాలి.విడివిడిగా స్టాక్స్ ఎంచుకుంటూ రిస్క్ తీసుకునే బదులు తక్కువ ఖర్చుతో కూడిన ఇండెక్స్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్లను ఎంచుకోవడం ఉత్తమం.మార్కెట్ హెచ్చుతగ్గులను పట్టించుకోకుండా క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టాలి.ఆదాయం పెరిగే కొద్దీ పెట్టుబడి పెట్టే మొత్తాన్ని కూడా క్రమంగా పెంచుకుంటూ పోవాలి.నిర్ణీత కాల వ్యవధిలో మీ పోర్ట్ఫోలియోను రీబ్యాలెన్స్ చేసుకోవడం ముఖ్యం.ఇది వినడానికి చాలా సరళంగా అనిపించవచ్చు, కానీ ఆచరణలో పెట్టడం అంత సులభం కాదు. చాలా మంది ఇక్కడే విఫలమవుతుంటారని నితిన్ కామత్ అన్నారు.ఇన్వెస్టర్ల గందరగోళం.. మార్కెట్ సంక్లిష్టతసాధారణ ఇన్వెస్టర్లు పోర్ట్ఫోలియో నిర్మాణంలో ఎదుర్కొనే ప్రధాన సవాళ్లను కామత్ ప్రస్తావించారు.ఈక్విటీల్లో ఎంత ఉంచాలి?డెట్ (రుణం) విభాగంలో ఎంత పెట్టుబడి పెట్టాలి?బంగారం ఎంత శాతం ఉండాలి?లక్ష్యాలు దగ్గరపడుతున్నప్పుడు ఆస్తి కేటాయింపులను ఎలా మార్చాలి?ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఇన్వెస్టర్లను వేధిస్తుంటాయి. వీటికి తోడు మార్కెట్లో వందలాది మ్యూచువల్ ఫండ్లు, ఈటీఎఫ్లు అందుబాటులో ఉండటంతో గందరగోళం మరింత పెరుగుతుంది. ఈ సంక్లిష్టత కారణంగానే చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు మార్కెట్ వైపు రాకుండా తక్కువ రిటర్న్స్ ఇచ్చే ఫిక్స్డ్ డిపాజిట్లు, సాంప్రదాయక బీమా పథకాల వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన విశ్లేషించారు.పరిష్కారంగా లైఫ్ సైకిల్ ఫండ్స్ఈ సవాళ్లకు, గందరగోళానికి చెక్ పెట్టేందుకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఇటీవల భారతదేశంలో ‘లైఫ్ సైకిల్ ఫండ్స్’ను ప్రవేశపెట్టింది. రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడి నిర్ణయాలను ఆటోమేట్ చేయడం ద్వారా ఈ ఫండ్స్ మెరుగైన పరిష్కారాన్ని అందిస్తాయని కామత్ అభిప్రాయపడ్డారు.ఇవి ఎలా పనిచేస్తాయి?ఇన్వెస్టర్లు తమ ఆర్థిక లక్ష్యానికి (ఉదాహరణకు రిటైర్మెంట్ లేదా పిల్లల చదువు) సరిపోయే కాలపరిమితి గల ఫండ్ను ఎంచుకుంటే సరిపోతుంది. మిగతా బాధ్యత అంతా ఆ ఫండే చూసుకుంటుంది. ప్రారంభంలో (వయసు లేదా కాలపరిమితి ఎక్కువగా ఉన్నప్పుడు) ఈక్విటీల్లో ఎక్కువ పెట్టుబడి పెడుతూ లక్ష్యం దగ్గరపడే కొద్దీ రిస్క్ తగ్గించడం కోసం క్రమంగా డెట్ (రుణ) విభాగానికి పెట్టుబడులను మళ్లిస్తుంది. ఈ విధానం వల్ల ఇన్వెస్టర్ల వయస్సు, రిస్క్ ప్రొఫైల్కు అనుగుణంగా పోర్ట్ఫోలియో రీబ్యాలెన్స్ అవుతుంది. -
ఊరట.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర
పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో వరుసగా పెరుగుతూ వచ్చిన కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలకు కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించింది. తాజాగా ఒక్కో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్పై రూ.183 మేర తగ్గింపు ప్రకటించింది. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిర్ణయంతో హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సంస్థలు, చిన్న వ్యాపారులకు కొంత ఉపశమనం లభించింది.ఇటీవల ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తతలు, పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ ఎల్పీజీ సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో గత కొన్ని నెలలుగా కమర్షియల్ గ్యాస్ ధరలు వరుసగా పెరిగాయి. మే నెలలో భారీ పెంపు నమోదు కాగా, జూన్లోనూ మరోసారి ధరలు పెరగడంతో వ్యాపార రంగంపై అదనపు భారం పడింది.తాజాగా పరిస్థితులు కొంత మెరుగుపడటంతో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో ఇప్పటి వరకు రూ.3,113.50గా ఉన్న 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర ఇప్పుడు రూ.2,930కు తగ్గింది. దేశవ్యాప్తంగా ఇదే తరహాలో ధరల సవరణ అమలులోకి వచ్చింది.పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం.. దేశీయ ఉత్పత్తి మెరుగుపడటం, దిగుమతి ఎల్పీజీ కార్గోల రాక ప్రారంభం కావడంతో సరఫరా పరిస్థితులు స్థిరపడుతున్నాయి. దీంతో గతంలో విధించిన కమర్షియల్ ఎల్పీజీ సరఫరా పరిమితులను పూర్తిగా తొలగించి, యుద్ధానికి ముందు స్థాయికి సరఫరాను పునరుద్ధరించినట్లు తెలిపింది.సంక్షోభ సమయంలో భారీగా ప్రభావితమైన సరఫరా వ్యవస్థను క్రమంగా పునరుద్ధరించేందుకు ప్రభుత్వం దశలవారీ చర్యలు తీసుకుంది. ప్రారంభంలో 50 శాతం స్థాయికి పడిపోయిన బల్క్ ఎల్పీజీ సరఫరా ఇప్పుడు మళ్లీ 70 శాతం వరకు చేరిందని అధికారులు తెలిపారు. అలాగే రిఫైనరీలను ఎక్కువగా ఎల్పీజీ ఉత్పత్తికి మళ్లించడం ద్వారా దేశీయ సరఫరాను పెంచారు.ఈ తగ్గింపు కేవలం కమర్షియల్ వినియోగానికి మాత్రమే వర్తిస్తుంది. గృహ వినియోగం కోసం ఉపయోగించే 14.2 కేజీల సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం దేశీయ ఎల్పీజీ ఉత్పత్తిని రోజుకు 40,000 టన్నుల కంటే ఎక్కువగా నిలబెట్టేలా చర్యలు కొనసాగుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.ప్రధాన నగరాల్లో తాజా కమర్షియల్ సిలిండర్ ధరలు ఇలా ఉన్నాయి:* ఢిల్లీ: రూ.2,930* హైదరాబాద్: రూ.3,178* విజయవాడ: రూ.3,115ధర తగ్గింపు నేపథ్యంలో హోటల్, రెస్టారెంట్ రంగాలకు కొంత ఊరట లభించినప్పటికీ, గత నెలల పెంపుల ప్రభావం ఇంకా కొనసాగుతుందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఓయో ఐపీవో@ రూ. 6,650 కోట్లు
న్యూఢిల్లీ: ఓయో మాతృ సంస్థ ప్రిజమ్ .. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 6,650 కోట్లు సమీకరించనుంది. ఇందుకు సంబంధించి అప్డేట్ చేసిన ముసాయిదా పత్రాలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. ఇది పూర్తిగా తాజా షేర్ల జారీ రూపంలో ఉండనుంది.ప్రీ–ఐపీవో ప్లేస్మెంట్ కింద రూ. 1,330 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉన్నట్లు, ఒకవేళ ఇది విజయవంతమైతే ఆ మేరకు తాజా షేర్ల జారీ పరిమాణం తగ్గనున్నట్లు సంస్థ తెలిపింది. సంస్థ వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ (30.52% వాటా)తో పాటు సాఫ్ట్బ్యాంక్ (40.04% వాటా)తదితర షేర్హోల్డర్లు తమ వాటాలను విక్రయించడం లేదని వివరించింది. -
విజింజం పోర్టులో ఎంఎస్సీకి 49 శాతం వాటా
న్యూఢిల్లీ: అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఏపీఎస్ఈజెడ్)కు చెందిన కేరళలోని విజింజం పోర్టులో 49% వాటాను స్విట్జర్లాండ్కు చెందిన ఎమ్ఎస్సీ గ్రూప్ కొనుగోలు చేయనుంది.ప్రపంచంలోనే అతిపెద్ద షిప్పింగ్, లాజిస్టిక్స్ సంస్థ అయిన ఎమ్ఎస్సీ తన అనుబంధ సంస్థ టెర్మీనల్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ (టీఐఎల్) ద్వారా 1.4 బిలియన్ డాలర్లు (సుమారు రూ.11,800 కోట్లు) పెట్టుబడి పెట్టనుంది. భారత పోర్టు రంగంలో ఇదే అతిపెద్ద విదేశీ ప్రైవేటు పెట్టుబడిగా అదానీ పోర్ట్స్ పేర్కొంది. -
వర్షాల రాకపై వ్యాపారం !
స్టాక్ మార్కెట్ అంటే షేర్లు.. బంగారం.. కమోడిటీలు.. కరెన్సీలు మాత్రమే అనుకునే రోజులు మారుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వాతావరణం, కార్బన్ క్రెడిట్లు, నీటి వినియోగం, విద్యుత్ ధరలు వంటి అంశాలపై కూడా ఫైనాన్షియల్ ఉత్పత్తులు వస్తున్నాయి. అదే దారిలో భారత్లో కూడా ‘‘వెదర్ డెరివేటివ్స్’’ అనే కొత్త కాన్సెప్ట్ ఇన్వెస్టర్లకు అందుబాటులోకి వచ్చింది. ముంబై వర్షపాతం ఆధారంగా ‘రెయిన్ ముంబై’ అనే వెదర్ డెరివేటివ్ను నేషనల్ కమోడిటీ డెరివేటివ్ ఎక్స్చేంజ్ (ఎన్సీడెక్స్) ప్రారంభించింది. వాతావరణ శాఖ (ఐఎండీ) డేటా ఆధారంగా, మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ పర్యవేక్షణలో ఈ కాంట్రాక్టులు ట్రేడ్ అవుతాయి. రైతులకు మాత్రమే సంబంధించినవిగా పరిగణించే రుతుపవనాలు ఇప్పుడు ఫైనాన్షియల్ మార్కెట్లలో కూడా ‘ట్రేడింగ్ థీమ్’గా అందుబాటులోకి వస్తున్నాయి. ఇన్వెస్టర్ల ఆసక్తిని బట్టి ముందు ముందు దేశవ్యాప్తంగా వెదర్ డెరివేటివ్స్ని ప్రారంభించేందుకు కమోడిటీ ఎక్సే్చంజ్ కసరత్తు చేస్తోంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ఏమిటీ రెయిన్ ముంబై?రెయిన్ ముంబై ఫ్యూచర్ కాంట్రాక్టు వర్షపాతం ఎక్కువా? తక్కువా? అన్న డేటాపై ఆధారపడి ట్రేడయ్యే ఒక ఫైనాన్షియల్ కాంట్రాక్ట్ . రైతులు, పవర్ కంపెనీలు, నిర్మాణ సంస్థలు, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు ఇలా వర్షాల ప్రభావానికి లోనయ్యే అన్ని రంగాలకు ఇది రిస్క్ మేనేజ్మెంట్ సాధనంగా ఉపయోగపడుతుంది. అదే సమయంలో మార్కెట్ను అర్థం చేసుకునే ఇన్వెస్టర్లకు కొత్త అవకాశాలను అందిస్తుందని నిపుణులు అంచనావేస్తున్నారు. ఇప్పటివరకు వాతావరణ సంబంధిత ప్రమాదాలు జరిగినపుడు బాధితులకు బీమా మాత్రమే ప్రస్తుతం నష్టపరిహారంగా అందుబాటులో ఉంది. ఇప్పుడు మార్కెట్ ఆధారిత ‘వెదర్ ట్రేడింగ్’ వారికి కొత్త రక్షణ కవచంగా నిలుస్తుందనేది మార్కెట్ వర్గాలు అంచనా.ప్రపంచానికి పాతవే..ప్రపంచ మార్కెట్లలో ఇలాంటి డెరివేటివ్స్ కొత్త విషయమేం కాదు. అమెరికా, యూరప్లలో ఇప్పటికే ఉష్ణోగ్రతలు, గ్యాస్ ధరలు, విద్యుత్ వినియోగం వంటి అంశాలపై ట్రేడింగ్ ఉత్పత్తులు ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉన్నాయి. కార్బన్ క్రెడిట్ మార్కెట్లు అయితే బిలియన్ డాలర్ల వ్యాపారంగా మారాయి. ఈకోవలోనే వాతావరణ మార్పులు పెరుగుతున్న సమయంలో ‘‘క్లైమేట్ ఫైనాన్స్’’ వేగంగా విస్తరిస్తోంది.ఇది పెట్టుబడులకు మాత్రమే కాకుండా, ధరల మార్పులు , వ్యాపార రిస్క్ల నుంచి రక్షణ పొందేందుకు కూడా ఉపయోగపడుతుంది. భారత్లో ఇప్పటివరకు ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ఫిక్స్డ్ డిపాజిట్లు, బంగారం, రియల్ ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్స్ వరకే పరిమితమయ్యారు. కానీ భవిష్యత్తులో యువ ఇన్వెస్టర్లు లక్ష్యంగా డేటా ఆధారిత కొత్త తరహా ఫైనాన్షియల్ ఉత్పత్తులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా యువ ఇన్వెస్టర్లు, మార్కెట్పై అవగాహన ఉన్నవారు ఇలాంటి విభిన్న ట్రేడింగ్ ఉత్పత్తులపై ఆసక్తి చూ పుతున్నారని మార్కెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.కొత్తగా అందుబాటులోకి వచ్చిన ‘ఆల్టర్నేటివ్ డెరివేటివ్స్’⇒ వాతావరణం ⇒ కార్బన్ క్రెడిట్లు ⇒ విద్యుత్ వినియోగం ⇒ నీటి హక్కులు ⇒ ఈఎస్జీ/ సస్టెయినబిలిటీ ఇండెక్స్లు (పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యత, మరియు పారదర్శక పాలనా ప్రమాణాల ఆధారంగా కంపెనీల పనితీరును అంచనా వేసే సూచీలు.) ⇒ పునరుత్పాదక ఇంధన వనరుల పత్రాలురిస్క్ ఎక్కువేడెరివేటివ్స్ అంటే అధిక రిస్క్ సాధనాలు. అవగాహన లేకుండా పెట్టుబడులు పెట్టకూడదు. మార్కెట్ ఎలా పనిచేస్తుంది? ఒడిదుడుకులు ఎలా ఉంటాయి? వంటి అంశాలు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే ప్రవేశించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. రిస్క్ అంచనాలతో సాధారణ రిటైల్ ఇన్వెస్టర్లు ఈ మార్కెట్లో ప్రవేశించాలని హెచ్చరిస్తున్నారు. -
షాక్లున్నా ఎకానమీ ఓకే
ముంబై: అంతర్జాతీయంగా ఎదురవుతున్న షాక్లను దీటుగా ఎదుర్కొనేలా ఆర్థిక సంస్థల బ్యాలెన్స్ షీట్లు మెరుగ్గా ఉన్న నేపథ్యంలో దేశీ ఎకానమీ పటిష్టంగా ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. మూలధనం, లిక్విడిటీ సమృద్ధిగా ఉండటం, అసెట్ క్వాలిటీ మెరుగుపడుతుండటం, లాభదాయకత స్థిరంగా ఉండటంలాంటి అంశాల దన్నుతో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు (ఎస్సీబీ) సురక్షితంగా ఉన్నాయని పేర్కొంది.మంగళవారం విడుదల చేసిన ఆర్థిక స్థిరత్వ నివేదిక (ఎఫ్ఎస్ఆర్)లో రిజర్వ్ బ్యాంక్ ఈ విషయాలు వెల్లడించింది. షాకుల్లాంటివి ఏవైనా తలెత్తినా, తట్టుకుని నిలబడే సత్తా బ్యాంకింగ్ సిస్టమ్కు ఉన్నట్లు స్ట్రెస్ టెస్టుల్లో వెల్లడైనట్లు వివరించింది. అటు నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థల అసెట్ క్వాలిటీ, లాభదాయకత కూడా మెరుగుపడుతోందని వివరించింది.‘భారీ స్థాయిలో అంతర్జాతీయంగా షాక్లు ఎదురవుతున్నప్పటికీ భారత ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ చెప్పుకోతగ్గ స్థాయిలో పటిష్టంగా నిలుస్తున్నాయి. పటిష్ట వృద్ధి, ద్రవ్యోల్బణం తక్కువగా ఉండటం, నిధుల లభ్యత పుష్కలంగా ఉండటంలాంటి అంశాలు స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడంలో తోడ్ప డుతున్నాయి’ అని ఎఫ్ఎస్ఆర్ ముందుమాటలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. నివేదికలోని మరిన్ని విశేషాలు.. ⇒ సైబర్ ముప్పులపరంగా చూస్తే సమీప భవిష్యత్తులో ఏఐ ఆధారిత సైబర్ దాడుల రిస్కులు చాలా కీలకంగా ఉండబోతున్నాయి. ⇒ ఉద్రిక్తతలు, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు కొనసాగుతున్నప్పటికీ ఉత్పాదకతపరంగా ఏఐతో ప్రయోజనాలు ఒనగూరవచ్చన్న ఆశాభావంతో గ్లోబల్ ఎకానమీ పటిష్టంగానే ఉంది. ⇒ భారతీయ బ్యాంకుల్లో స్థూల మొండిబాకీలు పలు దశాబ్దాల కనిష్ట స్థాయి 1.8%కి తగ్గాయి. పరిస్థితులు ఎంత దిగజారినా 2028 మార్చి ఆఖరు నాటికి 1.9%కి మాత్రమే పెరగొచ్చు. -
పసిడి ప్రియులకు షాక్.. ఒక్కసారిగా పెరిగిన ధరలు!
బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు ఊహకందని మార్పు జరుగుతున్నాయి. అయితే నేడు (మంగళవారం) పసిడి ధరల తగ్గుదలకు బ్రేక్ పడింది. దీంతో ఒక్కసారిగా గోల్డ్ రేటు పెరిగిపోయింది. ఈ కథనంలో లేటెస్ట్ ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడలలో ఈ రోజు (జూన్ 30) ఉదయం రూ.1,28,450 వద్ద ఉన్న 22 క్యారెట్ల తులం బంగారం ధర.. సాయంత్రానికి రూ.1,30,200 రూపాయల వద్దకు చేరింది. అంటే గంటల వ్యవధిలోనే పసిడి ధరల్లో భారీ మార్పు (రూ.1750 పెరిగింది) జరిగిందని స్పష్టమవుతోంది. 24 క్యారెట్ల ధర రూ.1,40,130 నుంచి రూ.1,42,040 (రూ.1910 పెరిగింది) వద్దకు చేరింది.ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో మార్పు సంభవించింది. ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,28,600 రూపాయల నుంచి రూ.1,30,350 వద్దకు, 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.1,40,280 నుంచి రూ.1,42,190 వద్దకు చేరింది.అయితే చెన్నైలో మాత్రం బంగారం ధరలు తగ్గాయి. ఇక్కడ 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.1000 తగ్గి రూ.1,32,000 వద్ద, 24 క్యారెట్ల రేటు రూ.1090 తగ్గి రూ.1,44,000 వద్ద నిలిచాయి.మొత్తం మీద దేశంలో గోల్డ్ రేటు తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పెరుగుదల దిశగా అడుగులు వేయడం వల్ల, పసిడి ప్రియులలో ఆందోళన మొదలైంది. అయితే రాబర్ట్ కియోసాకి వంటి నిపుణులు మాత్రం రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. -
స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. జూలైలో 8 రోజుల సెలవు!
జూలై నెలలో మొత్తం 8 రోజులు స్టాక్ మార్కెట్లకు సెలవు. ఇవి సాధారణ వారాంతపు సెలవులు మాత్రమే. ఇందులో 4 శనివారాలు, 4 ఆదివారాలు ఉన్నాయి. తేదీల ప్రకారం చూస్తే జూలై 4, 11, 18, 25 శనివారాలు కాగా, జూలై 5, 12, 19, 26 ఆదివారాలు మార్కెట్ సెలవులు అవుతాయి.సాధారణ వారాంతపు సెలవుల కారణంగా ఎన్ఎస్ఈ, బీఎస్ఈ క్లోజ్ అవుతాయి. కాబట్టి జూలై 2026లో తమ ట్రేడింగ్ షెడ్యూల్ను ప్లాన్ చేసుకుంటున్న పెట్టుబడిదారులు ఈ నెలలో వారపు రోజులలో స్టాక్ మార్కెట్ సెలవులు లేవని గమనించాలి. ఎందుకంటే.. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) రెండూ అన్ని ట్రేడింగ్ రోజులలో యధావిధిగా పనిచేస్తాయి.ఎన్ఎస్ఈ క్యాలెండర్ ప్రకారం.. 2026లో తదుపరి వర్కింగ్ డే సెలవు సెప్టెంబర్ 14న వస్తుంది. ఆ రోజు గణేష్ చతుర్థి కారణంగా మార్కెట్ క్లోజ్.2026 సంవత్సరంలో మొత్తం 16 వర్కింగ్ డే సెలవులు షేర్ మార్కెట్కు ఉన్నాయి. రాబోయే నెలల్లో వివిధ జాతీయ, మతపరమైన పండుగల కారణంగా ట్రేడింగ్ ఉండదు. అవి..అక్టోబర్ 2: గాంధీ జయంతిఅక్టోబర్ 20: దసరానవంబర్ 10: దీపావళినవంబర్ 24: శ్రీ గురు నానక్ జయంతిడిసెంబర్ 25: క్రిస్మస్కొన్ని ముఖ్యమైన పండుగలు వారాంతాల్లో రావడంతో అదనపు సెలవులు ఉండవు. ఉదాహరణకు, ఆగస్టు 15 (స్వాతంత్ర్య దినోత్సవం) శనివారం కావడం వల్ల అదనపు ట్రేడింగ్ సెలవుగా ఉండదు. అలాగే దీపావళి లక్ష్మీ పూజ కూడా ఆదివారం రావడం వల్ల సాధారణ సెలవు ఉండదు. అయితే ఆ రోజున ప్రత్యేకంగా ముహూర్త ట్రేడింగ్ సెషన్ నిర్వహించే అవకాశం ఉంటుంది. -
665 కిమీ రేంజ్.. టాటా సియెర్రా ఈవీ లాంచ్!
టాటా మోటార్స్ ఎట్టకేలకు తన సియెర్రా EVను దేశీయ విఫణిలో లాంచ్ చేసింది. ఈ ఎస్యూవీ ధరలు రూ.18.79 లక్షల నుంచి రూ.24.79 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. కంపెనీ ఈ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. డెలివరీలు జులై 15 నుంచి మొదలవుతాయని సమాచారం.కొత్త సియెర్రా ఈవీ.. స్టాండర్డ్ మోడల్ కంటే కొంత భిన్నమైన డిజైన్ పొందుతుంది. ఇందులో బాడీ రంగులో ఉండే క్లోజ్డ్ ఫ్రంట్ గ్రిల్, కొత్తగా డిజైన్ చేసిన బంపర్, కొన్ని ప్రత్యేకమైన విజువల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కూడా కొత్త డిజైన్ పొందాయి. కాగా ఇది రిషికేష్ రాపిడ్స్, నైనిటాల్ నాక్టర్న్, ప్రిస్టీన్ వైట్, అండమాన్ అడ్వెంచర్, ప్యూర్ గ్రే, బెంగాల్ రూజ్, కూర్గ్ క్లౌడ్ అనే మల్టిపుల్ కలర్ ఎంపికలలో లభిస్తుంది.ఇంటీరియర్ విషయానికి వస్తే.. దీని లేఅవుట్ సాధారణ మోడల్ మాదిరిగానే అనిపిస్తుంది. అయితే ఇందులో 10.25 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 12.3 అంగుళాల ప్యాసింజర్ డిస్ప్లేతో కూడిన ట్రిపుల్-స్క్రీన్ సెటప్ ఉండటం చూడవచ్చు.ఫీచర్స్ జాబితాలో.. వైర్లెస్ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్, అటానమస్ పార్కింగ్ అయిన ఈ-వ్యాలెట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, రియర్ సన్బ్లైండ్లు, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ టెయిల్గేట్ వంటివన్నీ ఉన్నాయి. అంతే కాకుండా.. ఈ కారులో స్టాండర్డ్, ఇమ్మర్సివ్, పర్సనల్, స్నో అనే నాలుగు డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి. భద్రతా ఫీచర్ల జాబితాలో, ఈ కారు ADAS లెవెల్ 2 ఫీచర్లు, ESP, ఆరు ఎయిర్బ్యాగ్లు, 540-డిగ్రీ కెమెరా ఉన్నాయి.ఇదీ చదవండి: తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్!టాటా సియెర్రా EV రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో వస్తుంది. వీటిలో వెనుక భాగంలో 175 kW మోటార్, ముందు భాగంలో 103 kW మోటార్ ఉన్నాయి. వెనుక మోటార్ 240 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తే.. ముందు మోటార్ 164 Nm టార్క్ అందిస్తుంది. దీని ఫలితంగా మొత్తం 504 Nm గరిష్ట టార్క్ లభిస్తుంది..ఇది 75 kWh, 63 kWh బ్యాటరీ ప్యాక్ల ఎంపికలలో లభిస్తుంది. 75 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఒకే ఛార్జ్పై 665 కి.మీ. రేంజ్ అందిస్తే, 63kWh వెర్షన్ 565 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. రియల్ వరల్డ్ రేంజ్ తగ్గుతుంది. ఈ బ్యాటరీలను 120 kW, 7.2 kW, 3.3 kW ఛార్జర్లను ఉపయోగించి ఛార్జ్ చేయవచ్చు. -
మస్క్ హెచ్చరిక.. టిమ్ కుక్ షాక్!
కృత్రిమ మేధస్సు (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తోంది. అయితే ఈ సాంకేతిక విప్లవం కొత్త అవకాశాలను మాత్రమే కాదు, కొత్త సవాళ్లను కూడా తీసుకొస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మెమరీ చిప్ల కొరత తీవ్రమవడంతో యాపిల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామం వినియోగదారులపై నేరుగా ప్రభావం చూపుతోంది.యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఈ పరిస్థితిని 'వందేళ్లలో ఒకసారి వచ్చే వరద'తో పోల్చారు. గత 40 ఏళ్లలో ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు టెస్లా సీఈఓ ఇలాన్ మస్క్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, తాను ఇప్పటివరకు చూసిన వాటిలో ఇదే అతిపెద్ద ధరల పెరుగుదల అని చెప్పారు. దీన్నిబట్టి చూస్తే.. ప్రస్తుతం మెమరీ చిప్ల కొరత ఎంత తీవ్రంగా ఉందో స్పష్టమవుతోంది.ఈ సమస్యకు ప్రధాన కారణం ఏఐ రంగం వేగంగా విస్తరించడం. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు భారీ డేటా సెంటర్ల నిర్మాణానికి వందల బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడం. ఈ డేటా సెంటర్లకు అధిక సామర్థ్యం గల మెమరీ చిప్లు అవసరం అవుతున్నాయి. ఫలితంగా చిప్ తయారీ సంస్థలు తమ ఉత్పత్తిని ఎక్కువగా ఏఐ సర్వర్ల కోసం కేటాయిస్తున్నాయి. దీంతో ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్ఫోన్ల వంటి వినియోగదారుల ఉత్పత్తులకు అవసరమైన మెమరీ చిప్ల సరఫరా తగ్గిపోయింది.ప్రస్తుతం DRAM (యాప్లు పనిచేయడానికి ఉపయోగించే మెమరీ), NAND (ఫొటోలు, వీడియోలు, ఫైళ్లను నిల్వ చేసే స్టోరేజ్ చిప్లు) ధరలు గత ఏడాదితో పోలిస్తే దాదాపు నాలుగు రెట్లు పెరిగాయి. ఈ భారీ ధరల పెరుగుదల కారణంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ వ్యయం కూడా గణనీయంగా పెరిగింది.ఈ పరిస్థితుల్లో యాపిల్ చాలా కాలం వరకు అదనపు ఖర్చును వినియోగదారులపై మోపకుండా భరించింది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి సాధ్యం కాకపోవడంతో కంపెనీ మ్యాక్బుక్, ఐమ్యాక్, ఐప్యాడ్, హోమ్ప్యాడ్, యాపిల్ టీవీ వంటి ఉత్పత్తుల ధరలను 15 నుంచి 25 శాతం వరకు పెంచింది.ఉదాహరణకు, మ్యాక్బుక్ ఎయిర్ ధర 200 డాలర్లు పెరిగి 1,299 డాలర్లకు చేరగా, మ్యాక్బుక్ ప్రో ధర 300 డాలర్లు పెరిగి 1,999 డాలర్లకు చేరింది. అలాగే ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ ప్రో ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. మైక్రోసాఫ్ట్ కూడా తన Xbox గేమింగ్ కన్సోళ్ల ధరలను 100 నుంచి 150 డాలర్ల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. అంటే మెమరీ చిప్ల కొరత ప్రభావం మొత్తం టెక్నాలజీ పరిశ్రమపైనే పడుతోంది.ఈ సమస్యను పరిష్కరించాలంటే మెమరీ చిప్ల ఉత్పత్తిని భారీగా పెంచాలని ఎలాన్ మస్క్ సూచించారు. భవిష్యత్తులో ఏఐ అభివృద్ధికి మెమరీ చిప్లే అతిపెద్ద అడ్డంకిగా మారే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. అందుకే టెస్లా, స్పేస్ఎక్స్, ఇంటెల్ కలిసి అత్యాధునిక చిప్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రణాళికను కూడా ప్రకటించారు.ఇదీ చదవండి: మైక్రోసాఫ్ట్కు భారీ నష్టం.. కారణం ఇదేనా? -
ప్రపంచాన్ని మార్చిన ఆలోచన.. అలా పుట్టింది ATM పిన్!
ప్రస్తుతం జేబులో పర్సు లేకపోయినా, చేతిలో ఒక చిన్న ప్లాస్టిక్ కార్డు.. దానికి తోడు నాలుగు అంకెల రహస్య కోడ్ (PIN) ఉంటే చాలు, ప్రపంచంలో ఎక్కడైనా నిమిషాల్లో నగదును చేతిలోకి తెచ్చుకోవచ్చు. బ్యాంకుల చుట్టూ తిరిగే పని లేకుండా, మన డబ్బుకు కొండంత భద్రతను ఇచ్చే ఈ 'ఏటీఎం పిన్' వెనుక ఓ ఆసక్తికరమైన, మరెంతో ఆశ్చర్యకరమైన చరిత్ర దాగుంది. కోట్లాది రూపాయల లావాదేవీలను కాపలా కాసే ఈ అద్భుత సాంకేతికతను కనిపెట్టిన మేధావికి అప్పట్లో దక్కిన పారితోషికం ఎంతో తెలిస్తే ఎవరైనా ముక్కున వేలేసు కోవాల్సిందే!1960ల కాలంలో బ్యాంకుల నుంచి నగదు విత్డ్రా ప్రక్రియను సులభతరం చేసేందుకు అంతర్జాతీయంగా పరిశోధనలు జరిగాయి. ఆ సమయంలో బ్రిటన్కు చెందిన ఒక ఇంజనీరింగ్ సంస్థలో పనిచేస్తున్న జేమ్స్ గుడ్ఫెలో అనే స్కాటిష్ ఇంజనీర్ ఒక సరికొత్త ఆలోచన చేశారు. వినియోగదారుడి గుర్తింపును మానవ ప్రమేయం లేకుండా, యంత్రమే స్వయంగా ధృవీకరించేలా ఒక ప్లాస్టిక్ కార్డును, దానికి అనుసంధానంగా ఒక రహస్య సంఖ్యను (Personal Identification Number - PIN) కలిపి పనిచేసే సాంకేతికతను ఆయన 1966లో అభివృద్ధి చేశారు.కేవలం 10 పౌండ్ల బహుమతి!జేమ్స్ గుడ్ఫెలో కనిపెట్టిన ఈ పిన్ వ్యవస్థ బ్యాంకింగ్ రంగాన్నే మార్చేసింది. నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ఏటీఎం కేంద్రాలు ఈ భద్రతా సూత్రం ఆధారంగానే నడుస్తున్నాయి. కానీ, ఇంతటి విప్లవాత్మక ఆవిష్కరణ చేసినందుకు గాను, ఆ రోజుల్లో ఆయన పనిచేస్తున్న సంస్థ ఆయనకు అందించిన బోనస్ ఎంతో తెలుసా? కేవలం 10 పౌండ్లు మాత్రమే!ప్రస్తుత భారతీయ కరెన్సీ విలువ ప్రకారం చూస్తే ఇది సుమారు వెయ్యి రూపాయల లోపే ఉంటుంది."ఆవిష్కరణ నాదే అయినా, కంపెనీ నిబంధనల ప్రకారం నాకు దక్కిన బోనస్ కేవలం పది పౌండ్లు మాత్రమే" అని జేమ్స్ గుడ్ఫెలో తర్వాతి కాలంలో ఒక ఇంటర్వ్యూలో పేర్కొనడం గమనార్హం. లండన్లో మొదలైన ప్రస్థానం..జేమ్స్ గుడ్ఫెలో ఈ సాంకేతికతను రూపొందించిన మరుసటి సంవత్సరమే, అంటే 1967లో లండన్ నగరంలో ప్రపంచంలోనే మొట్టమొదటి నగదు పంపిణీ యంత్రాన్ని (Cash Machine) ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఈ సాంకేతికత ఖండంతరాలు దాటి విస్తరించింది. 1973 జూన్ 4న ఈ వ్యవస్థకు అమెరికాలో అధికారికంగా పేటెంట్ లభించడంతో, ఆధునిక ఏటీఎంల యుగం ఊపందుకుంది. భద్రతకు కేరాఫ్ అడ్రస్!.నేడు మనం ఏటీఎం సెంటర్కు వెళ్లినప్పుడు తప్పుడు పిన్ నంబర్ను వరుసగా మూడు సార్లు నమోదు చేస్తే కార్డు బ్లాక్ అయిపోతుంది. మన ఖాతాలోని సొమ్ము సైబర్ నేరగాళ్ల పాలు కాకుండా అడ్డుకునే ఈ పటిష్టమైన భద్రతా వలయానికి పునాది వేసింది ఆ 10 పౌండ్ల ఆవిష్కరణే కావడం విశేషం. ఆర్థిక రంగాన్ని డిజిటల్ వైపు నడిపించిన ఈ స్కాటిష్ మేధావి సేవలను గుర్తించిన బ్రిటన్ ప్రభుత్వం, 2006లో ఆయనకు ప్రతిష్టాత్మక 'ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్' (OBE) గౌరవాన్ని అందించింది. పారితోషికం చిన్నదైనా, ఆయన అందించిన సాంకేతికత మాత్రం ప్రపంచ మానవాళికి అందించి సేవ అమూల్యమైనది అనడంలో ఎలాంటి సందేహం లేదు!.- పసుపులేటి వెంకటేశ్వరరావు. -
మైక్రోసాఫ్ట్కు భారీ నష్టం.. కారణం ఇదేనా?
మైక్రోసాఫ్ట్ ప్రపంచంలోనే అత్యంత విలువైన టెక్నాలజీ కంపెనీలలో ఒకటి. అయితే.. ఇటీవల ఈ కంపెనీ షేర్లు భారీగా పడిపోవడం పెట్టుబడిదారులను ఆశ్చర్యానికి గురి చేసింది. జూన్ నెలలో మాత్రమే మైక్రోసాఫ్ట్ షేర్లు దాదాపు 17 శాతం పడిపోగా, కంపెనీ మార్కెట్ విలువలో 570 బిలియన్ డాలర్లకు (రూ.53.9 లక్షల కోట్లు) పైగా తగ్గుదల నమోదైంది. డిసెంబర్ 2000 తర్వాత సంస్థకు ఇదే అతిపెద్ద నెలవారీ క్షీణత కావడం గమనార్హం.కంపెనీకి ఈ పరిస్థితి రావడానికి ప్రధాన కారణం.. కృత్రిమ మేధస్సు (AI)పై మైక్రోసాఫ్ట్ పెడుతున్న భారీ పెట్టుబడులు. గత కొన్నేళ్లుగా సంస్థ డేటా సెంటర్లు, ఏఐ చిప్స్, క్లౌడ్ సర్వీసులు, అలాగే కోపైలెట్ వంటి ఏఐ ఉత్పత్తుల అభివృద్ధి కోసం బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తోంది. ఈ పెట్టుబడులు భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇస్తాయని కంపెనీ నమ్ముతున్నప్పటికీ, పెట్టుబడిదారులు మాత్రం ఆ లాభాలు ఎప్పుడు వస్తాయనే విషయంలో ఆందోళన చెందుతున్నారు.ఇటీవల విడుదలైన త్రైమాసిక ఫలితాల్లో అజూర్ క్లౌడ్ సేవల వృద్ధి మార్కెట్ అంచనాల కంటే కొంత తక్కువగా ఉండడం కూడా పెట్టుబడిదారుల్లో నిరాశను కలిగించింది. అంతేకాకుండా.. రాబోయే నెలల్లో కూడా కంపెనీ భారీ స్థాయిలో పెట్టుబడులు కొనసాగిస్తామని ప్రకటించింది. దీంతో ఖర్చులు పెరుగుతున్నా, లాభాలు మాత్రం అదే వేగంతో పెరగడం లేదనే భావన మార్కెట్లో ఏర్పడింది.ఏఐ అనేది మైక్రోసాఫ్ట్కు ఒక గొప్ప అవకాశం అయినప్పటికీ, అదే సమయంలో ఒక సవాలుగా కూడా మారింది. భవిష్యత్తులో ఏఐ కారణంగా సంప్రదాయ సాఫ్ట్వేర్లపై డిమాండ్ తగ్గే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే ఏఐ రంగంలో ముందుండాలంటే కంపెనీ నిరంతరం భారీగా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. ఈ రెండు అంశాలు ప్రస్తుతం పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.అయితే.. ఈ షేర్ పతనాన్ని అందరూ ప్రతికూలంగా చూడడం లేదు. కొంతమంది ప్రముఖ పెట్టుబడిదారులు, విశ్లేషకులు కొనుగోలుకు ఇది మంచి అవకాశమని భావిస్తున్నారు. గతంలో 2008 ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే అంచనా వేసి ప్రసిద్ధి చెందిన పెట్టుబడిదారు మైఖేల్ బరీ కూడా మైక్రోసాఫ్ట్ షేర్లపై దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టడం మార్కెట్లో చర్చనీయాంశమైంది. ఆయన నిర్ణయం వల్ల కంపెనీ షేర్లు కొంత మేర కోలుకున్నాయి.మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, మైక్రోసాఫ్ట్ ఆదాయం రాబోయే సంవత్సరాల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. ఏఐ రంగంలో కంపెనీకి ఉన్న బలమైన స్థానం వల్ల దీర్ఘకాలంలో మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఇంకా ఉన్నాయి. అయితే ఇప్పుడు పెట్టుబడిదారులు కేవలం భారీ పెట్టుబడులు పెట్టడాన్ని కాకుండా, వాటి ద్వారా నిజంగా ఎంత లాభం వస్తుందో చూడాలని కోరుకుంటున్నారు.మైక్రోసాఫ్ట్ షేర్లు పడిపోవడం అంటే ఏఐ భవిష్యత్తు బలహీనపడిందని అర్థం కాదు. ఇది పెట్టుబడిదారుల ఆలోచనా విధానంలో వచ్చిన మార్పుకు సంకేతం మాత్రమే. ఒకప్పుడు ఏఐలో పెట్టుబడి పెడితే చాలు అనుకునే మార్కెట్, ఇప్పుడు ఆ పెట్టుబడుల వల్ల లాభాలు వస్తున్నాయా? అనే ప్రశ్నకు సమాధానం కోరుతోంది. అందుకే మైక్రోసాఫ్ట్కు ప్రస్తుతం ఎదురవుతున్న సవాలు ఏఐలో ముందుండటం మాత్రమే కాదు, ఆ పెట్టుబడులను స్థిరమైన లాభాలుగా మార్చి పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మళ్లీ గెలుచుకోవడం కూడా. ఇదీ చదవండి: నా అంచనా తప్పింది.. కియోసాకి ట్వీట్! -
టెక్కీల ఆత్మగౌరవాన్ని కాలరాస్తున్న సీఈఓ!
సాఫ్ట్వేర్ రంగం అంటేనే విలాసవంతమైన జీవితం, లక్షల్లో జీతాలు అనుకునే వారికి ఐటీ పరిశ్రమలోని మరో చీకటి కోణం షాక్కు గురిచేస్తోంది. ప్రాజెక్ట్ డెడ్లైన్ల పేరిట ఉద్యోగుల మానసిక ప్రశాంతతను హరిస్తూ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న ఒక టాక్సిక్ (విషపూరిత) సీఈఓ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వారాంతాలతో (ఆదివారాలు) కలిపి రోజుకు 14 గంటల పాటు గొడ్డుచాకిరీ చేయించుకోవడమే కాకుండా.. ఉద్యోగుల విద్య, సామర్థ్యం, చివరికి వారి కుటుంబాలను లాగుతూ వ్యక్తిగత దూషణలకు దిగుతున్న ఒక సీఈఓ దారుణ ప్రవర్తనను ఓ సాఫ్ట్వేర్ డెవలపర్ రెడ్డిట్ వేదికగా పంచుకున్నారు.ఆ ప్రాజెక్ట్ ముగిసేలోపే ఇంకోదానికి..కంపెనీలో చేరినప్పటి నుంచి తనకు ఎదురవుతున్న నరకాన్ని సదరు టెక్కీ సుదీర్ఘ పోస్ట్లో వివరించారు. సంస్థలో జాయిన్ అయినప్పటి నుంచి ఒక ప్రాజెక్ట్ పూర్తికాకముందే మరో దానికి మారుస్తున్నారని, దీనివల్ల దేనిపైనా స్పష్టత లేకుండా పోతోందని పేర్కొన్నారు. ‘గత నెల రోజులుగా నేను ఒక క్లయింట్-ఫేసింగ్ డేటా-మ్యాపింగ్ ప్రాజెక్ట్లో బృందంతో కలిసి పని చేస్తున్నాను. మా కంపెనీ సీఈఓనే మాకు మేనేజర్గా వ్యవహరిస్తున్నారు. ఆయనే మాకు ఒక నిర్దిష్ట లాజిక్ ఇచ్చారు. అందుబాటులో ఉన్న డేటాను బట్టి మేము ఆ లాజిక్ను వర్తింపజేసి, విశ్లేషణను పూర్తి చేసి అవుట్పుట్ సమర్పించాం. తీరా చూస్తే, ఆ మ్యాపింగ్ తప్పని క్లయింట్ చెప్పారు’ అని టెక్కీ తెలిపారు.ఉద్యోగులపై నింద!కంపెనీకి క్లయింట్ ఇచ్చిన డేటానే అసంపూర్ణంగా ఉన్నప్పటికీ సీఈఓ మాత్రం మొత్తం నిందను బృందంపైనే నెట్టేసినట్లు డెవలపర్ ఆరోపించారు. ‘గత వారం రోజులుగా మీటింగుల్లో ఆయన ప్రవర్తన చాలా వ్యక్తిగతంగా, అవమానకరంగా మారింది. ఇది ఇక పనికి సంబంధించిన ఫీడ్బ్యాక్ కాదు. మా విద్య, సామర్థ్యాలు, కుటుంబాలు, విలువపై ఆయన దాడి చేస్తున్నారు. మేము సాంకేతిక పరిమితులను వివరించడానికి ప్రయత్నించినా లేదా ఇప్పటికే పూర్తి చేసిన పనిని చూపించినా ఆయన అసలు వినడం లేదు’ అన్నారు. బృందంలోని వారందరినీ ఉద్యోగాల్లోంచి తీసేస్తానంటూ సదరు సీఈఓ నిరంతరం బెదిరింపులకు పాల్పడుతున్నట్లు టెక్కీ వాపోయారు.ఆదివారాలూ వదలకుండా 14 గంటల చాకిరీఈ సంస్థలో పని గంటలు ఊహకందని విధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆదివారాలతో సహా నిరంతరం పని చేయించుకుంటున్నారని తెలిపారు. ‘ఇటీవలే మా టీమ్ మొత్తం ఆదివారం కూడా రాత్రి దాకా పని చేసింది. కానీ సోమవారం ఉదయం మీటింగ్కు వచ్చిన సీఈఓ.. మేము అసలు మాట వినడం లేదని, సరిగా పని చేయడం లేదని మమ్మల్ని నిందించారు. నేను మానసికంగా, శారీరకంగా పూర్తిగా అలసిపోయాను. కనీసం విశ్రాంతి తీసుకోవడానికి, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి లేదా మరో ఉద్యోగానికి ఇంటర్వ్యూలు ఇవ్వడానికి కూడా నాకు సమయం దొరకడం లేదు’ అని సదరు టెక్కీ తెలిపారు. ఈ ప్రతికూల వాతావరణంలో కొనసాగాలా లేక రాజీనామా చేయాలా అని ఆన్లైన్ కమ్యూనిటీని సలహా కోరారు.నెటిజన్ల సలహాఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారడంతో ఐటీ నిపుణులు, సోషల్ మీడియా వినియోగదారులు సదరు సీఈఓ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఆ ఉద్యోగాన్ని వదిలేయాలంటూ టెక్కీకి మద్దతుగా నిలిచారు. ‘ఆ సీఈఓకు వ్యక్తిత్వ సమస్య ఉంది. బహుశా అతనికి థెరపీ అవసరం. ఆర్థికపరమైన కట్టుబాట్లు లేకపోతే అక్కడ ఒక్క క్షణం కూడా ఉండటం వృథా’ అని ఒక యూజర్ స్పందించారు. ‘మీరు వెంటనే రాజీనామా చేయండి’ అని మరో యూజర్ చెప్పారు.కార్పొరేట్ రంగంలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి చర్చ జరుగుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఇలాంటి నరకప్రాయమైన మేనేజ్మెంట్ సంస్కృతి ఇంకా కొనసాగుతూనే ఉందనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని, ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి సాధించే విజయాలు ఏ కంపెనీకైనా శాశ్వతం కాదనే సత్యాన్ని సంస్థలు గ్రహించాలని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: బంగారం ధరలు ఢమాల్! -
కరుగుతోన్న పసిడి కాంతులకు కారణాలు ఇవే..
గడిచిన కొన్ని నెలలుగా రికార్డు స్థాయిలకు చేరుకుంటూ సామాన్యులకు చుక్కలు చూపించిన పసిడి ధరలు, ఇటీవల అనూహ్యంగా కిందికి దిగివస్తున్నాయి. ఈ రోజు (జూన్ 30, 2026) హైదరాబాద్తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు సుమారు రూ.1,40,000 మార్కు వద్ద ట్రేడ్ అవుతుండగా, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర సుమారు రూ.1,29,000 స్థాయికి దిగివచ్చింది. గత వారంతో పోలిస్తే ఇది భారీ పతనమనే చెప్పాలి. ఈ ఆకస్మిక మార్పునకు గల ఆర్థిక కారణాలు, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, భవిష్యత్తులో బంగారంపై రాబడులు అందుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై విశ్లేషణాత్మక కథనం మీకోసం.ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలుపసిడి మార్కెట్ ఒడిదుడుకులను గమనిస్తే ప్రస్తుతం మూడు ప్రధానాంశాలు ఈ పతనానికి కారణమవుతున్నట్లు స్పష్టమవుతోంది.1. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వైఖరిఅమెరికా కేంద్రీయ బ్యాంక్ (యూఎస్ ఫెడరల్ రిజర్వ్) వడ్డీ రేట్లను తగ్గిస్తుందని ఈ ఏడాది ఆరంభంలో అంచనా వేసినప్పటికీ తాజా పాలసీ సమావేశంలో వడ్డీ రేట్ల తగ్గింపును 2027కు వాయిదా వేసింది. అంతేకాకుండా, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి వడ్డీ రేట్ల పెంపు ఉండొచ్చనే సంకేతాలు ఇచ్చింది. వడ్డీ రేట్లు పెరిగితే బాండ్లు, ఇతర స్థిర ఆదాయ వనరులపై రాబడి పెరుగుతుంది. దీంతో వడ్డీ లేదా డివిడెండ్ ఇవ్వని బంగారం వైపు నుంచి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు.2. బలపడుతున్న అమెరికన్ డాలర్, బాండ్ ఈల్డ్స్ఫెడ్ నిర్ణయాలతో అంతర్జాతీయ మార్కెట్లో యూఎస్ డాలర్ ఇండెక్స్ ఏడాది కాలంలోనే గరిష్ట స్థాయికి చేరుకుంది. సాధారణంగా డాలర్ బలపడితే ఇతర కరెన్సీలలో బంగారం కొనడం ఖరీదైనదిగా మారుతుంది. తద్వారా డిమాండ్ తగ్గి ధరలు క్షీణిస్తాయి. గ్లోబల్ గోల్డ్ ఈటీఎఫ్ల నుంచి, ముఖ్యంగా ఆసియా మార్కెట్ల నుంచి పెట్టుబడులు వెనక్కి వెళ్లడం దీనికి అద్దం పడుతోంది.3. పశ్చిమాసియాలో సడలిన ఉద్రిక్తతలుగత కొద్ది నెలల్లో బంగారం ధరలు భారీగా పెరగడానికి రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా (ఇరాన్-అమెరికా/ఇజ్రాయెల్) సంక్షోభాలు ప్రధాన కారణం. అయితే ఇటీవల ఇరాన్, అమెరికాల మధ్య శాంతి చర్చల సరళి, కీలకమైన హార్ముజ్ జలసంధి పాక్షికంగా తెరచుకోవడం వంటి పరిణామాల వల్ల గ్లోబల్ మార్కెట్లో ముడిచమురు ధరలు దాదాపు 30% తగ్గాయి. దాంతో అంతర్జాతీయ ఒడిదొడుకులు తగ్గి సురక్షిత పెట్టుబడిగా బంగారానికి ఉన్న డిమాండ్ ప్రీమియం ఒక్కసారిగా ఆవిరైపోయింది.భవిష్యత్తులో ఇన్వెస్ట్మెంట్ మార్గాలుప్రస్తుత ధరల తగ్గుదల అనేది దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఒక అవకాశంగా ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే కేంద్ర బ్యాంకుల వద్ద డీ-డాలరైజేషన్ (డాలర్పై ఆధారపడటం తగ్గించడం) ప్రక్రియలో భాగంగా బంగారాన్ని నిల్వ చేసుకునే ధోరణి ఇంకా కొనసాగుతోంది. అయితే కేవలం భౌతిక బంగారం (నగలు) రూపంలో కాకుండా కొన్ని మార్గాల్లో పెట్టుబడి పెడితే మెరుగైన రాబడులు సాధించవచ్చు.గోల్డ్ ఈటీఎఫ్లు: స్టాక్ మార్కెట్ ద్వారా డిజిటల్ రూపంలో బంగారం కొనుగోలు చేయడానికి ఇది ఉత్తమ మార్గం. ఇందులో ఎలాంటి మేకింగ్ ఛార్జీలు, తరుగు ఉండవు. మనకు నచ్చినప్పుడు కరెంట్ మార్కెట్ ధరకే విక్రయించుకోవచ్చు. లాకర్ ఖర్చులు, దొంగతనం భయాలు ఉండవు.సవరీన్ గోల్డ్ బాండ్లు: ప్రభుత్వం/ఆర్బీఐ జారీ చేసే ఈ బాండ్లు దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు వరం. దీని ద్వారా బంగారం ధర పెరిగితే వచ్చే లాభంతో పాటు, ఏటా స్థిర వడ్డీ (అదనపు ఆదాయం) లభిస్తుంది. అంతేకాకుండా గడువు ముగిసిన తర్వాత వచ్చే లాభాలపై ఎలాంటి క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ ఉండదు. అయితే, ప్రస్తుతానికి ఈ బాండ్లను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపేసింది.డిజిటల్ గోల్డ్: మొబైల్ వాలెట్లు, సర్టిఫైడ్ ప్లాట్ఫారమ్ల ద్వారా కేవలం రూ.100తో కూడా పెట్టుబడిని ప్రారంభించవచ్చు. క్రమానుగత పెట్టుబడి విధానం ద్వారా ప్రతి నెలా కొద్దికొద్దిగా బంగారం జమ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.భౌతిక బంగారం (కాయిన్స్/బిస్కెట్లు): ఒకవేళ ఫిజికల్ గోల్డ్ కావాలనుకుంటే నగల రూపంలో కాకుండా 24 క్యారెట్ల హాల్మార్క్ ఉన్న కాయిన్స్ లేదా బిస్కెట్లు కొనడం మేలు. దీనివల్ల రీసేల్ (తిరిగి అమ్మే) సమయంలో పూర్తి విలువ లభిస్తుంది.మీ మొత్తం ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో బంగారానికి 10% నుంచి 15% వరకు మాత్రమే పరిమితం చేయడం మంచిది. మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకోవడానికి ఒకేసారి కాకుండా ప్రస్తుత ధరల పతనాన్ని ఆసరాగా చేసుకుని విడతల వారీగా పెట్టుబడులు పెట్టడం ద్వారా భవిష్యత్తులో స్థిరమైన, సురక్షితమైన రాబడులను అందుకోవచ్చు.ఇదీ చదవండి: బిగ్ రిలీఫ్.. బంగారం ధరలు ఢమాల్! -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 249.70 పాయింట్లు లేదా 0.33 శాతం నష్టంతో 76,478.67 వద్ద, నిఫ్టీ 80.50 పాయింట్లు లేదా 0.34 శాతం నష్టంతో 23,865.75 వద్ద నిలిచాయి.ఏవీజీ లాజిస్టిక్స్ లిమిటెడ్, సుప్రీం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా లిమిటెడ్, దివ్గి టార్క్ట్రాన్స్ఫర్ సిస్టమ్స్ లిమిటెడ్, దేవ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లిమిటెడ్, బిల్కేర్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. మహాలక్ష్మి ఫ్యాబ్రిక్ మిల్స్ లిమిటెడ్, ష్నైడర్ ఎలక్ట్రిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, జీనస్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్, ఎలక్ట్రోథర్మ్ (ఇండియా) లిమిటెడ్, AION-TECH సొల్యూషన్స్ లిమిటెడ్ వంటివి నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్కు రూ.38.63 లక్షల జరిమానా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ రెరా) రియల్ ఎస్టేట్ సంస్థ ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్కు రూ.38.63 లక్షల జరిమానా విధించింది. రెరాలో నమోదు చేయని పలు ప్రాజెక్టులను ప్రకటనలు, ప్రచారం చేయడంతో పాటు, రియల్ ఎస్టేట్ ఏజెంట్గా నమోదు కాకుండానే ఒక ప్రాజెక్టు విక్రయాలను నిర్వహించినందుకు ఈ చర్యలు తీసుకుంది.ఖమ్మం జిల్లాకు చెందిన రాము ఫిర్యాదు మేరకు టీజీ రెరా సుమోటో విచారణ ప్రారంభించింది. సంస్థ వెబ్సైట్, బ్రోచర్లను పరిశీలించిన అనంతరం షోకాజ్ నోటీసు జారీ చేసింది. కొన్ని ప్రాజెక్టులకు రెరా నమోదు ఉందని, మరికొన్ని తమవి కావని, సంస్థ వివరణ ఇచ్చింది. రెరా సభ్యులు జన్ను లక్ష్మీనారాయణ, శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం, ప్రాజెక్టు నమోదు లేకుండా విక్రయాలు చేపట్టడం నిషేధమని స్పష్టం చేసింది. చదవండి: జీఎంఆర్ ఏరోస్పేస్ పార్కులో ‘ఫిరాన్’ తయారీ కేంద్రం -
హైదరాబాద్లో ‘ఫిరాన్’ తయారీ కేంద్రం
హైదరాబాద్: కాక్పిట్, ఇంటర్ఫేస్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను తయారు చేసే ఫిరాన్ టెక్నాలజీ గ్రూప్ భారత్లో తొలి తయారీ కేంద్రాన్ని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని జీఎంఆర్ ఏరోస్పేస్ పార్కులో ఉన్న జీఎంఆర్ ఏవియేషన్ సెజ్లో ప్రారంభించింది.ఏరో స్పేస్, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాల్లో దిగ్గజంగా పేరుగాంచిన ఫిరాన్ టెక్నాలజీ (Firan Technology Group).. భారత్లో తయారీ కేంద్రాన్ని ప్రారంభించడం దేశీయ ఏరోస్పేస్ రంగంలో మరో మైలురాయి అని జీఎంఆర్ ఎయిర్పోర్టు ల్యాండ్ డెవలప్మెంట్ సీఈఓ అమన్కపూర్ అన్నారు. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలన్నీ తమ సెజ్లో ఉన్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.చదవండి: తెలుగు రాష్ట్రాల్లోకి గోద్రెజ్ నింజా -
కాందిశీకుల కలలపై ‘ఖర్చు’ల కత్తి!
బ్రిటన్లో అక్రమ వలసల నియంత్రణే లక్ష్యంగా అధికార లేబర్ పార్టీ ప్రభుత్వం కీలకమైన నూతన ఆశ్రయ నిబంధనలను ప్రకటించింది. దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న ఈ నిర్ణయం ప్రకారం.. భవిష్యత్తులో బ్రిటన్లో ఆశ్రయం పొందే, శాశ్వత నివాసం (పీఆర్) కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే శరణార్థులు ప్రభుత్వం తమపై చేసే ఖర్చును తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.నిబంధనలు ఎవరికి వర్తిస్తాయి?బ్రిటన్ హోం శాఖ విడుదల చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం, దేశంలో శాశ్వత నివాసం పొందాలంటే అంతకుముందు ప్రభుత్వం తమ వసతి, జీవన భత్యం కోసం ఖర్చు చేసిన 10,000 పౌండ్లు (సుమారు రూ.11 లక్షలు) తిరిగి చెల్లించడం తప్పనిసరి. అయితే ఈ నిబంధనల అమలుపై ప్రభుత్వం కొన్ని మినహాయింపులు ఇచ్చింది.భవిష్యత్తులో బ్రిటన్కు వచ్చే, ఈ మొత్తాన్ని చెల్లించగల ఆర్థిక స్థోమత ఉన్న వయోజనులకు మాత్రమే ఇది వర్తిస్తుంది.ఈ నిబంధనలు గతంలో ఆశ్రయం పొందిన వారికి వర్తించవు. అలాగే చిన్నారులకు దీని నుంచి పూర్తిగా మినహాయింపు ఇచ్చారు.శరణార్థులు ఈ డబ్బు చెల్లించడం వల్ల పూర్తిగా పేదరికంలోకి జారిపోకుండా ఉండేందుకు తగిన రక్షణ చర్యలు కూడా చట్టంలో పొందుపరిచారు.బ్రిటన్ హోం శాఖ అంచనాల ప్రకారం ఆశ్రయం కోరుకునేవారికి తాత్కాలిక వసతి కల్పించేందుకు సగటున ఒక్కో వ్యక్తికి రోజుకు 23.25 పౌండ్లు(సుమారు రూ.2,600), హోటళ్లలో ఉంచితే రోజుకు 144 పౌండ్ల(రూ.16,000) వరకు ఖర్చవుతోంది. దీనికి అదనంగా వారానికి జీవన భత్యం కూడా చెల్లించాల్సి వస్తోంది. గత ఏడాది ఆశ్రయ వసతి, సంబంధిత సాయం కోసం బ్రిటన్ సుమారు 400 కోట్ల పౌండ్లు(సుమారు 44,000 కోట్ల రూపాయలు) ఖర్చు చేయడం గమనార్హం.ఈ నేపథ్యంలో బ్రిటన్ హోం సెక్రటరీ షబానా మహమూద్ మాట్లాడుతూ.. ‘బ్రిటన్ పన్ను చెల్లింపుదారులపై పడుతున్న ఈ భారాన్ని తగ్గించడమే ప్రభుత్వ ప్రాధాన్యత. ఆశ్రయ సాయం పొందడం కేవలం హక్కు మాత్రమే కాదు, అది ఒక బాధ్యత కూడా. శరణార్థులకు ఆర్థిక స్థోమత చేకూరిన తర్వాత బ్రిటన్ ప్రజలకు ప్రతిగా వారు దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడాలి’ అన్నారు.రాజకీయ ఉద్రిక్తతలు - లేబర్ పార్టీ వ్యూహంబ్రిటన్ రాజకీయాల్లో వలసల అంశం అత్యంత సున్నితమైనది. ఎన్నికల్లో ఓటర్ల తీర్పును ప్రభావితం చేసే ప్రధానాంశాల్లో ఇది ఒకటిగా మారింది. కొన్ని ప్రాంతాల్లో ఇది స్థానిక ఉద్రిక్తతలు, నిరసనలకు కూడా కారణమవుతోంది.ప్రస్తుతం అధికారంలో ఉన్న సెంటర్ లిఫ్ట్-లేబర్ పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన రాజకీయ వ్యూహం ఉందని కొందరు భావిస్తున్నారు. నైజెల్ ఫరాజ్ నేతృత్వంలోని రైట్ వింగ్-రిఫార్మ్ యూకే పార్టీ దేశంలో రోజురోజుకూ ప్రజాదరణ పొందుతోంది. దేశంలోని సుమారు ఆరు లక్షల మంది శరణార్థులను వెనక్కి పంపించేస్తామంటూ రిఫార్మ్ యూకే ఇస్తున్న హామీలు స్థానిక ఓటర్లను ఆకర్షిస్తున్నాయి. దీన్ని తిప్పికొట్టేందుకే లేబర్ పార్టీ ఈ చర్యలకు పూనుకుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.ఇదీ చదవండి: బంగారం ధరలు ఢమాల్! -
పెట్రోల్, డీజిల్పై ఆంక్షలు ఎత్తివేత
దేశంలోని ఇంధన వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై విధించిన అన్ని రకాల తాత్కాలిక ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా వెలువడిన ఈ ఆదేశాల ప్రకారం.. జులై 1 (బుధవారం) నుంచి రిటైల్, కమర్షియల్, పారిశ్రామిక వినియోగదారులు ఎలాంటి పరిమితులు లేకుండా ఇంధనాన్ని కొనుగోలు చేయవచ్చు.దేశీయంగా ఇంధన సరఫరా వ్యవస్థ సాధారణ స్థితికి చేరుకోవడంతో గతంలో విధించిన ‘మోటార్ స్పిరిట్ అండ్ హై-స్పీడ్ డీజిల్ (రిటైల్ అవుట్లెట్ల ద్వారా సరఫరా తాత్కాలిక నియంత్రణ) ఆర్డర్, 2026’ నిబంధనలను ప్రభుత్వం ఉపసంహరించుకుంది.ప్రధాన మార్పులు ఇవే..కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో క్షేత్రస్థాయిలో కింది మార్పులు అమలులోకి రానున్నాయి.రిటైల్ ఫ్యూయల్ స్టేషన్లలో (పెట్రోల్ బంకుల్లో) ఒకే వాహనానికి రోజుకు గరిష్టంగా 200 లీటర్ల డీజిల్ మాత్రమే విక్రయించాలనే నిబంధన ఇకపై ఉండదు. జులై 1, 2026 నుంచి వాహనదారులు తమ అవసరానికి తగినంత డీజిల్ను స్వేచ్ఛగా కొనుగోలు చేయవచ్చు.వాణిజ్య, పారిశ్రామిక రంగానికి చెందిన కొనుగోలుదారులు రిటైల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు. దీనివల్ల వారు కేవలం తమ సొంత కన్జ్యూమర్ పంపుల నుంచే కాకుండా సాధారణ రిటైల్ బంకుల నుంచి కూడా ఇంధనాన్ని సేకరించుకోవచ్చు.ఆంక్షలు విధించడానికి కారణం..పశ్చిమాసియాలో తలెత్తిన యుద్ధ వాతావరణం, అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి మూసివేత వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ సంక్షోభంతో దేశీయంగా ఇంధన కొరత రాకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం జూన్ 12న అత్యవసరంగా ఈ తాత్కాలిక నియంత్రణలను ప్రవేశపెట్టింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సరసమైన ధరలకు ఇంధనాన్ని సమానంగా పంపిణీ చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.ధరల వ్యత్యాసంతో పెరిగిన డిమాండ్అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినప్పటికీ సాధారణ వినియోగదారులపై భారం పడకుండా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు రిటైల్ ధరలను నియంత్రించాయి. ఉదాహరణకు ఢిల్లీలో రిటైల్ బంకుల వద్ద డీజిల్ ధర లీటరుకు రూ.95.20 ఉండగా బల్క్ (భారీ) కొనుగోలుదారులకు లీటరుకు రూ.134.50గా ఉంది.ఈ భారీ ధరల వ్యత్యాసం (లీటరుకు దాదాపు రూ.39) కారణంగా భారీ పారిశ్రామిక వినియోగదారులు నేరుగా రిటైల్ బంకులను ఆశ్రయించారు. ఫలితంగా జూన్ ప్రారంభంలో చమురు సంస్థలకు డీజిల్పై లీటరుకు రూ.36.5, పెట్రోల్పై రూ.9 చొప్పున ఆదాయ నష్టం వాటిల్లింది. కొన్ని ప్రాంతాల్లో అసాధారణంగా డిమాండ్ పెరిగి కృత్రిమ కొరత ఏర్పడింది.టెలికాం టవర్లు, ట్రక్కింగ్ కంపెనీలు, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) బస్సులు, విద్యుత్ ఉత్పాదక పరిశ్రమలు రిటైల్ బంకుల వైపు మళ్లడంతో.. బ్లాక్ మార్కెటింగ్, హోర్డింగ్ (నిల్వ ఉంచడం) అరికట్టేందుకు ప్రభుత్వం ఈ పరిమితిని విధించాల్సి వచ్చింది.ఇప్పుడు ఎందుకు ఎత్తివేశారు?పెట్రోలియం మంత్రిత్వ శాఖ సమీక్ష ప్రకారం.. ప్రస్తుతం భారతదేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా సంతృప్తికరంగా ఉంది. దేశీయ సరఫరా వ్యవస్థ పూర్తిగా మెరుగుపడటంతో పాటు సాధారణ పంపిణీ ఏర్పాట్లు పునరుద్ధరించారు. అందువల్ల జూన్ 12 నాటి ఆర్డర్ను కొనసాగించాల్సిన అవసరం లేదని భావించిన ప్రభుత్వం ఆంక్షలను ఉపసంహరించుకుంది.ఇదీ చదవండి: బంగారం ధరలు ఢమాల్! -
రూ.9.3 కోట్లు ప్యాకేజీని వదులుకుని.. ఏఐ వైపు అడుగులు
సాంకేతిక ప్రపంచాన్ని కుదిపేస్తోన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవం.. కేవలం సరికొత్త ఆవిష్కరణలకే కాదు, ఐటీ నిపుణుల ఆలోచనా ధోరణిలో వస్తోన్న మార్పులకు కూడా వేదికవుతోంది. నెలకు లక్షల జీతం, చేతినిండా స్టాక్ ఆప్షన్లు, గూగుల్ లాంటి గ్లోబల్ టెక్ కంపెనీలో సురక్షితమైన ఉద్యోగం... సగటు ఉద్యోగి కల ఇది. కానీ, ఏటా దాదాపు రూ.9.3 కోట్ల భారీ ప్యాకేజీని సైతం కాదనుకుని ఏఐ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సిలికాన్ వ్యాలీలో హాట్ టాపిక్గా మారింది.గూగుల్లో అకౌంట్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసిన 41 ఏళ్ల యూసఫ్ ఇమ్రాన్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి సొంతంగా ఏఐ స్టార్టప్ను ప్రారంభించారు. ఏఐ టెక్నాలజీ సామాన్యులకు కూడా అద్భుతమైన అవకాశాలను అందిస్తోందంటూ ఆయన పంచుకున్న అనుభవాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.రూ.9.3 కోట్ల ప్యాకేజీ.. ఎలా సాధ్యమైంది?సేల్స్ రంగంలో దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న ఇమ్రాన్ 2020లో గూగుల్ సంస్థలో చేరారు. క్లయింట్లకు గూగుల్ ‘ఏఐ మెషిన్ లెర్నింగ్’ సొల్యూషన్స్ను చేరవేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన బేసిక్ శాలరీ దాదాపు 1,70,000 డాలర్లు (సుమారు రూ.1.6 కోట్లు) కాగా, కస్టమర్ డీల్స్ ద్వారా వచ్చిన కమీషన్లే ఆయన ఆదాయాన్ని పెంచాయి. డబ్ల్యూ2 ఎర్నింగ్స్(అలవెన్స్లు) ద్వారా గతేడాది ఆయన వార్షిక సంపాదన దాదాపు 9,86,000 డాలర్లు (సుమారు రూ. 9.3 కోట్లు)గా ఉంది.‘నాకు ఐదేళ్ల వయసున్నప్పుడు మా కుటుంబం బంగ్లాదేశ్ నుంచి న్యూయార్క్కు వలస వచ్చింది. ఆ వలసదారుల కష్టపడే తత్వమే నన్ను ఈ స్థాయికి చేర్చింది. మార్కెట్ అవసరాలు, ఏఐ టెక్నాలజీపై పట్టు సాధించడం వల్లే నేను అంతటి కమీషన్లు సాధించగలిగాను’ అని ఇమ్రాన్ పేర్కొన్నారు.భారీ జీతాన్ని వదులుకోవడానికి కారణంమార్కెట్లో ఓపెన్ ఏఐ (ChatGPT), ఆంత్రోపిక్ (Claude) వంటి సంస్థలు సృష్టిస్తున్న సంచలనాలు ఇమ్రాన్లో ఫోమో (ఎక్కడ తాను వెనుకబడిపోతానో అనే ఆందోళన)ను రేకెత్తించాయి. గూగుల్ సురక్షితమైనదే అయినప్పటికీ భవిష్యత్తు అంతా ఏఐ స్టార్టప్లదేనని, వాటిలో ఈక్విటీ (భాగస్వామ్యం) కలిగి ఉండటం లాభదాయకమని ఆయన భావించారు. మరోవైపు, గూగుల్లో ఇటీవలి కాలంలో జరిగిన ఉద్యోగుల తొలగింపులు కూడా ఆయన ఆలోచనా విధానాన్ని మార్చాయి. ఎంత ప్రతిభావంతులైనా కార్పొరేట్ కొలువుల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొనడంతో సొంతంగా రిస్క్ తీసుకోవడమే ఉత్తమమని ఇమ్రాన్ నిర్ణయించుకున్నారు.రాత్రిపూట ఏఐ సాధన..సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినప్పటికీ ఇమ్రాన్ వెనకడుగు వేయలేదు. పగలు ఉద్యోగం చేస్తూనే.. రాత్రులు, వారాంతాల్లో చాట్జీపీటీ, క్లాడ్, జెమిని వంటి ఏఐ టూల్స్ సాయంతో కోడింగ్ నేర్చుకుంటూ ప్రాజెక్ట్లు డిజైన్ చేశారు. ఈ క్రమంలోనే గత ఏప్రిల్లో గూగుల్కు గుడ్ బై చెప్పి ‘మాంగోస్టీన్ స్టూడియో’ అనే స్టార్టప్ను ప్రారంభించారు. ఇది సేల్స్ నిపుణుల కోసం ప్రత్యేక ఏఐ ఆధారిత టూల్స్ను రూపొందిస్తుంది. ఆవేశంతో కాకుండా పూర్తి ఆర్థిక ప్రణాళికతోనే ఇమ్రాన్ ఉద్యోగాన్ని వదిలేసినట్లు ఇమ్రాన్ చెప్పారు.ఇదీ చదవండి: బంగారం ధరలు ఢమాల్! -
బంగారం ధరలు ఢమాల్!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా పసిడి ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
జూలై 1 నుంచి బజాజ్ ఆటో షేర్ల బైబ్యాక్
న్యూఢిల్లీ: బజాజ్ ఆటో రూ.5,632 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్ ప్రక్రియ జూలై 1 నుంచి ప్రారంభం కానుంది. బైబ్యాక్లో భాగంగా దాదాపు 46.94 లక్షల ఈక్విటీ షేర్లను కంపెనీ తిరిగి కొనుగోలు చేయనుంది. ప్రతి షేరు ధరను రూ.12,000 గా నిర్ణయించారు. ఈ ఆఫర్ జూలై 7న ముగుస్తుందని సంస్థ రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించింది. ఈ ప్రతిపాదనకు బజాజ్ ఆటో బోర్డు మే 6న ఆమోదం తెలపగా... మే 14న పోస్టల్ బ్యాలెట్ ద్వారా షేర్హోల్డర్లు ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించారు. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:52 సమయానికి నిఫ్టీ(Nifty) 84 పాయింట్లు నష్టపోయి 23,865 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 239 పాయింట్లు తగ్గి 76,498 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 101.27బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 73.6 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.37 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.18 శాతం పెరిగింది.నాస్డాక్ 2.07 శాతం పుంజుకుంది.Today Nifty position 30-06-2026(time: 09:52 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
తెలుగు రాష్ట్రాల్లోకి గోద్రెజ్ నింజా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గోద్రెజ్ పెట్ కేర్ (జీపీసీ) సంస్థ పెంపుడు శునకాల కోసం ఉద్దేశించిన ఆహారోత్పత్తి గోద్రెజ్ నింజాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మార్కెట్లలో ప్రవేశపెట్టింది. శునకాల జీర్ణకోశం ఆరోగ్యకరంగా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుందని సంస్థ సీవోవో నితిన్ జైన్ తెలిపారు. దీని ధర రూ. 20 నుంచి ప్రారంభమవుతుంది.ఇప్పటికే తమిళనాడులో దీన్ని ప్రవేశపెట్టినట్లు, తెలుగు రాష్ట్రాల తదుపరి ఇతర మార్కెట్లలోకి కూడా విస్తరించనున్నట్లు జైన్ చెప్పారు. త్వరలో ఇతరత్రా పెంపుడు జంతువుల ఆహారోత్పత్తులను కూడా ప్రవేశపెడతామన్నారు. నాసిక్లో 35,000 టన్నుల వార్షిక సామర్థ్యంతో తయారీ ప్లాంటు సిద్ధమవుతోందని ఆయన వివరించారు. పెట్ కేర్ ఉత్పత్తుల పోర్ట్ఫోలియో విస్తరణపై దాదాపు రూ. 500 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు జైన్ చెప్పారు. దేశీయంగా పెట్ ఫుడ్ విభాగం దాదాపు రూ. 5,000 కోట్లు కాగా, దక్షిణాది వాటా రూ. 2,000 కోట్లుగా ఉంటుందన్నారు. కర్ణాటక వాటా 15%గా, తెలుగు రాష్ట్రాల వాటా 8 శాతంగా ఉందని జైన్ వివరించారు. -
దక్షిణాదిలో స్మిటెన్ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సౌందర్య సాధనాలు, లైఫ్ స్టయిల్ ఉత్పత్తులు మొదలైన వాటిని కొనుగోలుకు ముందే ట్రయల్ చేసేందుకు వీలు కల్పించే స్మిటెన్ తాజాగా దక్షిణాదిలో కార్యకలాపాల విస్తరణలో భాగంగా హైదరాబాద్లో స్టోర్ ప్రారంభించింది. కంపెనీకి ఇది ఎనిమిదో స్టోర్. 2027 నాటికి రూ. 100 కోట్ల ఆదాయం, 50 పైచిలుకు స్టోర్స్ స్థాయికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ తెలిపింది. విశాఖపట్నం, చెన్నై, హుబ్లి, బెంగళూరు తదితర కీలక దక్షిణాది మార్కెట్లలోను రిటైల్ నెట్వర్క్ మరింత పటిష్టం చేసుకునే యోచనలో ఉన్నట్లు సంస్థ తెలిపింది. -
పోస్కోతో ఈబీజీ గ్రూప్ ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్లో డేవూ బ్రాండ్ ఉత్పత్తుల తయారీకి సంబంధించి దక్షిణ కొరియన్ సంస్థ పోస్కో ఇంటర్నేషనల్తో బ్రాండ్ లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం ఈబీజీ గ్రూప్ వెల్లడించింది. దీని ప్రకారం భారత్లో డేవూ బ్రాండ్ ఉపకరణాల అభివృద్ధి, తయారీ, పంపిణీ, మార్కెట్ విస్తరణను ఈబీజీ గ్రూప్ నిర్వహిస్తుంది.ఇందుకోసం రాబోయే మూడేళ్లలో సుమారు రూ. 100 కోట్లు ఇన్వెస్ట్ చేస్తోంది. తొలి దశలో ఫ్రిజ్లు, వాషింగ్ మెషిన్లు మొదలైనవాటిపై దృష్టి పెడుతుంది. ఢిల్లీలో మొదిట ఫ్లాగ్íÙప్ ఎక్స్పీరియన్స్ స్టోర్ త్వరలో ప్రారంభం కానుండగా, మరో మూడు ఔట్లెట్స్ సిద్ధమవుతున్నాయి. 2027 నాటికి 100 స్టోర్ల నెట్వర్క్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ తెలిపింది. అలాగే డేవూ వన్ పేరిట సమగ్ర స్మార్ట్ హోమ్ ఎకోసిస్టమ్ని కూడా ప్రవేశపెట్టాలనే యోచన ఉన్నట్లు వివరించింది. -
వాట్సాప్ భారీ అప్డేట్.. కొత్త ఫీచర్ వచ్చిందా చెక్ చేస్కోండి!
ప్రపంచంలోనే అత్యధిక మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కీలక ఫీచర్ను తీసుకొస్తోంది. ఇప్పటి వరకు వాట్సాప్లో ఎవరితోనైనా మాట్లాడాలంటే తప్పనిసరిగా ఫోన్ నంబర్ను షేర్ చేయాల్సి వచ్చేది. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడినప్పుడు ఇది చాలా మందికి ప్రైవసీ పరంగా అసౌకర్యంగా అనిపించేది. ఇకపై ఆ సమస్యకు చెక్ పడనుంది. ఫోన్ నంబర్ కాకుండా యూజర్ Username ద్వారానే ఇతరులతో చాట్ చేసే అవకాశం వాట్సాప్ కల్పించనుంది. ఈ విషయాన్ని సీఈవో కునాల్ షా అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు.. "మీకు నచ్చిన పేరును ఇప్పుడే రిజర్వ్ చేసుకోండి" అంటూ వినియోగదారులకు సూచించారు. ఈ ఫీచర్ను జూన్ 29 నుంచి దశలవారీగా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తుండగా.. ఈ ఏడాది చివరినాటికి అందరికీ అందుబాటులోకి రానుంది.నంబర్ అవసరం లేదు.. కొత్త ఫీచర్తో ఇకపై కొత్త వ్యక్తులకు మీ ఫోన్ నంబర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. మీరు ఎంచుకున్న ప్రత్యేకమైన పేరును మాత్రమే షేర్ చేస్తే సరిపోతుంది. ఆ Username ద్వారా అవతలి వ్యక్తి మీతో చాట్ ప్రారంభించగలుగుతారు. కాలేజీ స్నేహితులు, ఆఫీస్ పరిచయాలు, వ్యాపార సంబంధాలు, ఈవెంట్లలో కలిసిన వ్యక్తులు లేదా గ్రూప్ల్లోని కొత్త సభ్యులతో నంబర్ పంచుకోకుండా కనెక్ట్ అయ్యేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని వాట్సాప్ తెలిపింది.ప్రైవసీకే పెద్దపీటఈ ఫీచర్ను సోషల్ మీడియా తరహాలో రూపొందించలేదని వాట్సాప్ స్పష్టం చేసింది. ఇన్స్టాగ్రామ్ లేదంటే ఎక్స్ యూజర్నేమ్ల కోసం పబ్లిక్ సెర్చ్ లేదంటే డైరెక్టరీ ఉండదు. ఎవరైనా మీకు మెసేజ్ పంపాలంటే మీ ఖచ్చితమైన Username వారికి తెలిసి ఉండాలి. దీంతో అనవసర మెసేజ్లు, స్పామ్లను తగ్గించే అవకాశం ఉంటుంది.అదనపు భద్రత ఏంటంటే.. యూజర్నేమ్తో పాటు వాట్సాప్ మరో కొత్త భద్రతా ఫీచర్ను కూడా తీసుకొస్తోంది. యూజర్నేమ్ కీ(Username Key) పేరుతో వచ్చే ఈ ఆప్షన్ను యూజర్లు ఐచ్ఛికంగా ఉపయోగించుకోవచ్చు. ఈ ఫీచర్ను ఆన్ చేస్తే.. తొలిసారి మీకు మెసేజ్ పంపాలనుకునే వ్యక్తి యూజర్నేమ్తో పాటు మీరు సెట్ చేసిన ప్రత్యేక కీను కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. అవసరమైతే ఈ కీని ఎప్పుడైనా మార్చుకోవచ్చు. దీంతో అవాంఛిత వ్యక్తుల నుంచి మరింత రక్షణ లభిస్తుంది.ఎలా రిజర్వ్ చేసుకోవాలి?యూజర్నేమ్ రిజర్వ్ చేసుకోవడానికి ఈ స్టెప్స్ను అనుసరించండి.వాట్సాప్ను తాజా వెర్షన్కు అప్డేట్ చేయండి.సెట్టింగ్స్ను Settings ఓపెన్ చేయండి.అకౌంట్ Accountపై ట్యాప్ చేయండి.యూజర్నేమ్ Username ఆప్షన్ను ఎంచుకోండి.మీకు అందుబాటులో ఉన్న పేరును ఎంపిక చేసి కన్ఫర్మ్ చేయండి.అయితే ఈ ఆప్షన్ ప్రస్తుతం దశలవారీగా విడుదల అవుతోంది. కాబట్టి అందరికీ ఒకేసారి కనిపించకపోవచ్చు.నిబంధనలుగరిష్ఠంగా 35 అక్షరాలు ఉండవచ్చు.అవసరమైతే ఎప్పుడైనా మార్చుకోవచ్చు లేదంటే తొలగించుకోవచ్చు.ప్రముఖులు, సెలబ్రిటీలు, సంస్థలకు సంబంధించిన కొన్ని యూజర్నేమ్లను వాట్సాప్ ముందుగానే రిజర్వ్ చేస్తుంది. దీంతో నకిలీ ఖాతాలు (Impersonation) సృష్టించే అవకాశాలు తగ్గుతాయి.వ్యాపార సంస్థలు, క్రియేటర్లు తమ ఇన్స్టాగ్రామ్ లేదంటే ఫేస్బుక్ అకౌంట్కు అనుగుణంగా Username పొందే అవకాశం కూడా ఉంటుంది.పాత చాట్లపై ప్రభావం?ఈ కొత్త ఫీచర్ వచ్చినా ప్రస్తుతం ఉన్న చాట్లు, కాంటాక్ట్లు, బ్లాక్, రిపోర్ట్, ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ వంటి సదుపాయాల్లో ఎలాంటి మార్పు ఉండదని వాట్సాప్ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఎలా ఉపయోగిస్తున్నారో అలాగే కొనసాగించవచ్చు.ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?యూజర్నేమ్ రిజర్వేషన్ ఫీచర్ ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రారంభమైంది. రాబోయే నెలల్లో దశలవారీగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించనుంది. మీ ప్రాంతంలో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన వెంటనే వాట్సాప్ యాప్లో నోటిఫికేషన్ వస్తుంది. ఈ ఏడాది చివరినాటికి అన్ని యూజర్లకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. -
24,000 కిందికి నిఫ్టీ..
ముంబై: పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, క్రూడాయిల్ ధరలు పెరగడంతో సోమవారం స్టాక్ మార్కెట్ అరశాతం నష్టంతో ముగిసింది. ఐటీ, ఆటో, చమురు రంగాల షేర్లలో అమ్మకాలతో పాటు కీలక షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫలితంగా సెన్సెక్స్ 372 పాయింట్లు నష్టపోయి 76,728 వద్ద స్థిరపడింది.నిఫ్టీ 110 పాయింట్లు కోల్పోయి 24,000 స్థాయి దిగువన 23,946 వద్ద నిలిచింది. ఫ్లాటుగా ప్రారంభమైన సూచీలు రోజంతా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. నిఫ్టీ 50 రీబ్యాలెన్సింగ్, బీఎస్ఈ సెన్సెక్స్ నెలవారీ ఎక్స్పైరీ అంశాలు ట్రేడింగ్పై ప్రభావాన్ని చూపాయి. నేడు నిఫ్టీ వీక్లీ, మంత్లీ ఎక్స్పైరీలతో పాటు బ్యాంక్ నిఫ్టీ నెలవారీ ఎక్స్పైరీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ఈ క్రమంలో సెన్సెక్స్ 478 పాయింట్లు పతనమై 76,622 వద్ద, నిఫ్టీ 131 పాయింట్లు కోల్పోయి 23,925 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి.అంతర్జాతీయ మార్కెట్లు: ఆసియాలో చైనా 1.14%, జపాన్ 0.15%, హాంకాంగ్ 1.5%, తైవాన్ 0.9% పెరిగాయి. యూరప్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశా యి. అమెరికా సూచీ లు భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి.ఇండెక్సుల వారీగా: బీఎస్ఈలో ఆటో (–2.11%), ఆయిల్ అండ్ గ్యాస్ (–1.40%), సర్వీసెస్ (–1.21%), ఐటీ (–1.04%) రంగాలు పతనమయ్యాయి. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.65%, 0.60 శాతం నష్టపోయాయి.పర్సిస్టెంట్ సిస్టమ్స్: జర్మనీకి చెందిన డిజిటల్ ఇంజినీరింగ్ సంస్థ నగారో ఎస్ఈని కొనుగోలు చేసుకుంటామని ప్రకటించడంతో పర్సిస్టెంట్ సిస్టమ్స్ షేరులో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. బీఎస్ఈలో ఈ షేరు 11% నష్టపోయి రూ.4,298 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 11.63% కోల్పోయి రూ.4,277 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకింది.కోటక్ మహీంద్రా బ్యాంక్: ఎండీ, సీఈవోగా అశోక్ వాస్వానీ తమ పునర్నియామకాన్ని కోరడం లేదని స్పష్టం చేయడంతో కోటక్ బ్యాంకు షేరు అమ్మకాల ఒత్తిడికి లోనైంది. బీఎస్ఈలో 3.2% నష్టపోయి రూ.396 వద్ద ముగిసింది. ఒక దశలో 3.6% పతనమై రూ.394 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. దీంతో బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.13,177 కోట్లు హరించుకుపోయి రూ. 3.93 లక్షల కోట్లకు దిగివచి్చంది.టర్టిల్మింట్ లిస్టింగ్.. ప్చ్ఇన్సూరెన్స్ కంపెనీ టర్టిల్మింట్ ఫిన్టెక్ సొల్యూషన్ షేరు లిస్టింగ్లో నిరాశపరిచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర (రూ.152)తో పోలిస్తే 10.39% డిస్కౌంటుతో రూ.136 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 13% క్షీణించి రూ.132 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 11% నష్టంతో రూ.135 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.3,987 కోట్లుగా నమోదైంది. -
ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లోకి జీరోధా
న్యూఢిల్లీ: ఆన్లైన్ బ్రోకరేజ్ సంస్థ జీరోధా క్రమంగా ఇతర ఆర్థిక సేవల్లోకి కార్యకలాపాలు విస్తరిస్తోంది. ఇందులో భాగంగా మర్చంట్ బ్యాంకింగ్ లైసెన్సు కోసం మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తు సమర్పించింది. డేటా ప్రకారం జీరోధా కార్పొరేట్ అడ్వైజర్స్ ఏప్రిల్ 27న ఫైల్ చేసింది.ప్రస్తుతం ఇది సెబీ పరిశీలనలో ఉంది. ఒకవేళ లైసెన్సు లభిస్తే ఇనీíÙయల్ పబ్లిక్ ఆఫర్ల (ఐపీవో) నిర్వహణ, నిధుల సమీకరణలో కంపెనీలకు సలహాలివ్వడం, ఇతరత్రా మర్చంట్ బ్యాంకింగ్ సర్వీసులు మొదలైనవి కంపెనీ అందించవచ్చు. ప్రస్తుతం జీరోధాకి 1.6 కోట్ల మంది పైగా కస్టమర్లు ఉండగా, కంపెనీ ప్లాట్ఫాంపై ఏటా వందల కోట్ల ఆర్డర్లు నమోదవుతుంటాయి.జీరోధా ఏఎంసీ పేరిట సంస్థకి సొంతంగా మ్యూచువల్ ఫండ్ కార్యకలాపాలు కూడా ఉన్నాయి. మర్చంట్ బ్యాంకింగ్ లైసెన్సు కోసం ఇన్క్రెడ్ క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, నియో వెల్త్ మేనేజ్మెంట్, సొసైటీ జనరాలీ సెక్యూరిటీస్ ఇండియా తదితర 12 సంస్థలు కూడా దరఖాస్తు చేసుకున్నాయి. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చైర్మన్గా రాజీవ్ కుమార్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొత్త పార్ట్టైమ్ చైర్మన్గా కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి రాజీవ్ కుమార్ని బ్యాంక్ బోర్డు ఎంపిక చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆమోదించిన నాటి నుంచి మూడేళ్ల పాటు ఆయన పదవీకాలం ఉంటుంది. ఈ ఏడాది మార్చి నెలలో అకస్మాత్తుగా వైదొలిగిన అతాను చక్రవర్తి స్థానంలో రాజీవ్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే జూన్ 30 నుంచి నాలుగేళ్ల పాటు ఆయన స్వతంత్ర డైరెక్టరుగా ఉంటారు. రిజర్వ్ బ్యాంక్ ఆమోదముద్రకు లోబడి రాజీవ్ కుమార్ నియామకం ఉంటుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు, ఆర్థిక రంగానికి పునరుజ్జీవం కల్పించిన వ్యక్తిగా ఆయన పేరొందారు. 2017లో ఆర్థిక సేవల విభాగం కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ కుమార్.. నిర్ణయాత్మక విధానాలతో బ్యాంకింగ్ను గాడిలో పెట్టారు. ఆయన 25వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా కూడా సేవలు అందించారు. -
ఐఐపీకి తయారీ బూస్ట్
న్యూఢిల్లీ: తయారీ రంగం పనితీరు మెరుగ్గా ఉండటంతో మే నెలలో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 5.1 శాతం వృద్ధి నమోదు చేసింది. అంతక్రితం నెల ఇది 4.9 శాతంగా ఉంది. 2022–23ని బేస్ ఇయర్గా మార్చాకా, కొత్త సిరీస్ ప్రాతిపదికన ఐఐపీ గణాంకాలను ప్రకటించడం ఇది వరుసగా రెండో నెల. ఐఐపీ సూచీలో 463 ఐటమ్ గ్రూప్లు ఉంటాయి. 234 గ్రూప్లకు మొత్తం సూచీ వెయిటేజీలో 36.02 శాతం వాటా ఉంది. తాజాగా మైనింగ్, క్వారీయింగ్ రంగం వృద్ధి మైనస్ 1.6 శాతంగా ఉండగా, తయారీ రంగం 5.5 శాతం, విద్యుత్–గ్యాస్ సరఫరా విభాగం 9.9 శాతం వృద్ధి చెందినట్లు జాతీయ గణాంకాల కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. తయారీ రంగంలో అంతర్గతంగా 23 గ్రూప్లలో 16 గ్రూప్లు సానుకూల పనితీరు కనపర్చాయి. మోటర్ వాహనాలు (14.5%), ఎలక్ట్రికల్ పరికరాలు (20.8 %), బేసిక్ మెటల్స్ (4.6%) టాప్ 3 విభాగాలుగా నిల్చాయి. బేస్ ఎఫెక్ట్ కారణంగా జూన్లో ఐఐపీ వృద్ధి 5.7%కి మెరుగుపడొచ్చని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్ మేఘా ఆరోరా తెలిపారు. -
తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్!
భారతదేశంలో ద్విచక్ర వాహన మార్కెట్ ఎప్పుడూ బడ్జెట్ వినియోగదారుల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఎక్కువ మంది కొనుగోలుదారులు తక్కువ ధరలో మంచి మైలేజ్, నమ్మకమైన పనితీరు, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు ఉన్న బైకులను కోరుకుంటారు. ఈ కారణంగానే కమ్యూటర్ బైక్స్ చాలాకాలంగా మంచి ఆదరణ పొందుతున్నాయి. ఈ కథనంలో రూ.1 లక్ష కంటే తక్కువ ధరలో లభించే బైకుల గురించి తెలుసుకుందాం.టీవీఎస్ స్పోర్ట్ (రూ.55,500 - రూ.57,500)టీవీఎస్ స్పోర్ట్ అనేది బడ్జెట్ సెగ్మెంట్లో అత్యంత తక్కువ ధరలో లభించే కమ్యూటర్ బైక్లలో ఒకటి. ఇది ముఖ్యంగా రోజువారీ ఆఫీస్ వెళ్లేవాళ్లు, ఎక్కువ దూరం ప్రయాణించే వినియోగదారుల కోసం రూపొందించారు. ఇది 109.7cc ఇంజిన్తో 8.1 హార్స్ పవర్ అందిస్తుంది. పెద్దగా స్పోర్టీ ఫీచర్లు లేకపోయినా, దీని అసలు బలం మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులోనే ఉంటుంది. సిటీ ట్రాఫిక్లో సులభంగా నడపగలిగేలా ఇది చాలా లైట్గా ఉంటుంది.హీరో హెచ్ఎఫ్ డీలక్స్ (రూ.58,977 - రూ.71,470)హీరో హెచ్ఎఫ్ డీలక్స్ భారతదేశంలో అత్యంత పాపులర్ కమ్యూటర్ బైక్లలో ఒకటి. దీని సింపుల్ డిజైన్, నమ్మకమైన పనితీరు దీన్ని చాలా మంది మొదటి ఎంపికగా మార్చాయి. ఇందులోని 97.2cc ఇంజిన్ 7.9 హార్స్ పవర్ అందిస్తుంది. మంచి మైలేజ్ అందించే ఈ బైక్ మెయింటెనెన్స్ ఖర్చు కూడా తక్కువే. ఇందులో ఎల్ఈడీ హెడ్లైట్, స్టార్ట్/స్టాప్ టెక్నాలజీ కూడా ఉన్నాయి.బజాజ్ ప్లాటినా 100 (రూ.65,407)బజాజ్ ప్లాటినా 100 అనేది కంఫర్ట్ రైడింగ్ కోసం రూపొందించిన సింపుల్ కమ్యూటర్ బైక్. దీని 99.59cc ఇంజిన్ సుమారు 7.9hp పవర్ అందిస్తుంది. ఈ బైక్ సాఫ్ట్ సస్పెన్షన్, మంచి గ్రౌండ్ క్లియరెన్స్ పొందుతుంది. రోడ్లు కొంత కఠినంగా ఉన్నప్పటికీ ఇది సౌకర్యవంతంగా ప్రయాణించడానికి సహాయపడుతుంది.బజాజ్ ప్లాటినా 110 (రూ.69,284)బజాజ్ ప్లాటినా 110 అనేది ప్లాటినా 100 కంటే కొంచెం అప్గ్రేడ్ వెర్షన్. ఇందులో 115.45cc ఇంజిన్ ఉంటుంది, ఇది 8.6hp పవర్ అందిస్తుంది. ఇందులో 5-స్పీడ్ గేర్బాక్స్ ఉండటం వల్ల హైవే రైడింగ్ కూడా కొంచెం స్మూత్గా ఉంటుంది. సస్పెన్షన్ కూడా మెరుగ్గా ఉండటం వల్ల ఎక్కువ దూరం ప్రయాణానికి ఇది అనుకూలంగా ఉంటుంది.బజాజ్ పల్సర్ 125 (రూ.79,048 - రూ.87,527)పల్సర్ 125 ఈ జాబితాలో స్పోర్టీ లుక్ కలిగిన బైక్. ఇది 124.4cc ఇంజిన్తో 11.8hp పవర్ అందిస్తుంది. ఇది కేవలం కమ్యూటర్ బైక్ మాత్రమే కాదు, కొంచెం స్టైల్ అండ్ రోడ్ ప్రెజెన్స్ కూడా ఇస్తుంది. డిజైన్ కూడా పెద్ద పల్సర్ 150 మాదిరిగా ఉంటుంది. యువతకు బాగా నచ్చిన బైకుల్లో ఇది ఒకటి. -
జులైలో బ్యాంక్ హాలిడేస్: 12 రోజులు సెలవు!
జూలై 2026 సమీపిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా బ్యాంక్ ఖాతాదారులు తమ పనులను ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నెలకు సంబంధించిన సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసింది. ఇందులో ప్రాంతీయ పండుగలు, జాతీయ స్థాయి ఆచారాలు, అలాగే ప్రతి వారం వచ్చే వారాంతపు సెలవులు కూడా ఉన్నాయి.జూలై 6న మిజోరాంలో ఎంహెచ్ఐపీ డే సందర్భంగా బ్యాంకులకు సెలవుజూలై 9న మేఘాలయలో బెహ్ డెయిన్ఖ్లామ్ పండుగ కారణంగా బ్యాంకులు పనిచేయవుజూలై 16న ఒడిశా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో రథయాత్ర, హరేలా వంటి పండుగల కారణంగా బ్యాంక్ సేవలు రద్దుజూలై 17న మేఘాలయలో యూ తిరోత్ సింగ్ వర్ధంతిజూలై 18న సిక్కింలో డ్రుక్పా త్షే-జి బౌద్ధ పండుగజూలై 22న త్రిపురలో ఖార్చి పూజ సందర్భంగా బ్యాంకులకు సెలవుఇవి కాకుండా ప్రతి ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి. 2026 జూలైలో ఆదివారాలు జూలై 5, 12, 19, 26 తేదీలకు వస్తాయి. అలాగే రెండో శనివారం జూలై 11, నాలుగో శనివారం జూలై 25న కూడా బ్యాంక్ కార్యకలాపాలు ఉండవు. మొత్తం మీద బ్యాంకులకు 12 రోజులు సెలవులన్నమాట.ఈ సెలవుల కారణంగా బ్యాంక్ బ్రాంచ్ సేవలు అందుబాటులో ఉండకపోయినా, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు మాత్రం కొనసాగుతాయి. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, డెబిట్ మరియు క్రెడిట్ కార్డులు, అలాగే ఏటీఎం సేవలు సాధారణంగా పనిచేస్తాయని రిజర్వ్ బ్యాంక్ సూచించింది. -
రూ.7000 కోట్ల బడ్జెట్.. అమల్లోకి 'ఢిల్లీ ఈవీ పాలసీ'!
ఢిల్లీ ప్రభుత్వం 'ఢిల్లీ ఈవీ పాలసీ 2026'ను అధికారికంగా అమల్లోకి తీసుకొచ్చింది. ఇది భారత్లో ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహానికి తీసుకున్న అన్ని చర్యలలో ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. ఈ విధానం 2030 మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది. దీని ప్రధాన లక్ష్యం అంతర్గత దహన ఇంజిన్ (పెట్రోల్, డీజిల్, సీఎన్జీ) వాహనాలను దశలవారీగా తగ్గించి, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం.ఈ పాలసీకి ప్రభుత్వం సుమారు రూ.7,000 కోట్ల బడ్జెట్ కేటాయించింది. దీని ద్వారా వినియోగదారులు ఈవీలను కొంత తక్కువ ఖర్చుతో కొనుగోలు చేయవచ్చు.పాలసీ ప్రకారం.. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్, రోడ్ ట్యాక్స్పై 100 శాతం మినహాయింపు లభిస్తుంది. అయితే.. ఈ ప్రయోజనం రూ.30 లక్షల లోపు ధర ఉన్న ఎలక్ట్రిక్ కార్లకు మాత్రమే వర్తిస్తుంది. అంటే లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేస్తే సాధారణ పన్నులు చెల్లించాల్సి ఉంటుందన్నమాట.ప్రభుత్వం నేరుగా కొనుగోలుదారులకు సబ్సిడీ కూడా అందిస్తోంది. ఇందులో ఎలక్ట్రిక్ టూవీలర్లకు రూ.30,000 వరకు, త్రీ-వీలర్లకు రూ.50,000 వరకు, అలాగే చిన్న ఎలక్ట్రిక్ ట్రక్కులకు రూ.1,00,000 వరకు సహాయం అందుతుంది.ఈ పాలసీ ప్రధాన లక్ష్యం.. ICE వాహనాలపై దశలవారీ నిషేధం. ఇందులో భాగంగానే 2027 జనవరి 1 నుంచి ఆటో రిక్షాలు, చిన్న సరకు రవాణా చేసే వాహనాల కొత్త రిజిస్ట్రేషన్లు నిలిపివేయనున్నారు. 2028 ఏప్రిల్ 1 నుంచి ఢిల్లీలో కొత్త పెట్రోల్, డీజిల్, సీఎన్జీ టూవీలర్ల రిజిస్ట్రేషన్ పూర్తిగా రద్దు చేస్తారు. కాబట్టి రానున్న రోజుల్లో ఢిల్లీలో రోడ్డుపై కేవలం ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే కనిపించే అవకాశం ఉంది.పాత వాహనాలను స్క్రాప్ చేయడానికి కూడా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది. నాలుగు చక్రాల వాహనాలకు రూ.1,00,000, టూవీలర్లకు రూ.10,000, త్రీ వీలర్లకు రూ.25,000 వరకు ప్రోత్సాహం ఇవ్వబడుతుంది.పెద్ద సరకు రవాణా వాహనాల కోసం ప్రత్యేక నిబంధనలు కూడా ఉన్నాయి. కొత్తగా కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ ట్రక్కులకు కొన్ని నగర ప్రవేశ ఆంక్షల నుంచి మినహాయింపు లభిస్తుంది. అంతే కాకుండా పాఠశాల వాహనాలను కూడా దశలవారీగా ఈవీలుగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఎలక్ట్రిక్ వాహనాలను పెంచడం మాత్రమే కాకుండా.. చార్జింగ్ మౌలిక వసతుల అభివృద్ధికి చేయడానికి కూడా ప్రభుత్వం కావలసిన ఏర్పాట్లను చేస్తోంది. ఇందులో భాగంగానే.. ఢిల్లీ అంతటా 30,000కు పైగా చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక వేసింది. దీని ద్వారా EV వినియోగదారులకు ఛార్జింగ్ సమస్య తగ్గే అవకాశం ఉంది.The Delhi Cabinet has approved the new Delhi EV Policy 2026, a landmark initiative to curb vehicular pollution and accelerate the transition towards clean, sustainable mobility in the national capital.The policy will come into effect on 1 July 2026 and remain in force until 31… pic.twitter.com/mDvXdhVHTN— CMO Delhi (@CMODelhi) June 29, 2026 -
దాతృత్వంపై ఎలాన్ మస్క్ ట్వీట్!
ప్రపంచ కుబేరుడు, ప్రముఖ వ్యాపారవేత్త 'ఎలాన్ మస్క్' జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకెంజీ స్కాట్ చేస్తున్న దాతృత్వ కార్యక్రమాలపై చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమయ్యాయి.అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకెంజీ స్కాట్ చేసిన భారీ దాతృత్వ కార్యక్రమం సమాజానికి మేలు చేయడం కంటే కీడు చేస్తున్నాయని మస్క్ అభిప్రాయపడ్డారు.మెకెంజీ స్కాట్ ఇప్పటివరకు సుమారు 26.3 బిలియన్ డాలర్లకు పైగా వివిధ చారిటీలకు అందించారు. ఇది వ్యక్తిగత స్థాయిలో చూస్తే.. చరిత్రలోనే అత్యంత పెద్ద దానాలలో ఒకటిగా నిలిచింది. ఆమె 2019లో జెఫ్ బెజోస్తో విడాకులు తీసుకున్న తరువాత.. వచ్చిన అమెజాన్ వాటా సంపదలో ఎక్కువ భాగాన్ని సమాజ సేవ కోసం వినియోగించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే 'యీల్డ్ గివింగ్' పేరుతో ఆమె ప్రపంచవ్యాప్తంగా సుమారు 2,700కు పైగా నాన్ప్రాఫిట్ సంస్థలకు సహాయం చేశారు. వీటిలో హోవార్డ్ యూనివర్సిటీతో పాటు పలు వాతావరణ, సామాజిక అభివృద్ధి సంస్థలు ఉన్నాయి.Sadly, yes— Elon Musk (@elonmusk) June 28, 2026అయితే.. ఈ విస్తృత దానాలపై ఎలాన్ మస్క్ స్పందిస్తూ, అవి సమాజానికి హానికరంగా మారుతున్నాయని పేర్కొన్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఒక యూజర్ చేసిన వ్యాఖ్యకు సమాధానంగా ఆయన స్పందించడం, ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. దీనిని చాలా మంది మెకెంజీ స్కాట్ దానాలపై పరోక్ష విమర్శగా భావించారు.ఇక 2024లో కూడా మస్క్ చేసిన ఒక పోస్ట్ ఈ చర్చను మరింత పెంచింది. అప్పట్లో ''మాజీ భార్యలు తమ మాజీ భర్తలను ద్వేషిస్తూ.. చేసే దానాలు పాశ్చాత్య నాగరికత క్షీణతకు కారణాలలో ఒకటి' అనే అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యానించారు. ఆ పోస్ట్లో తాను ఎవరి పేరును ప్రస్తావించకపోయినా, అది మెకెంజీ స్కాట్ను ఉద్దేశించి చేసినదేనని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీయడంతో తరువాత ఆ పోస్ట్ తొలగించడం జరిగింది.ఎవరెన్ని విధాలుగా మాట్లాడినా, విమర్శించినా.. మెకెంజీ స్కాట్ మాత్రం తన దాతృత్వ విధానాన్ని కొనసాగిస్తూ, సమాజంలో వెనుకబడిన వర్గాలకు సహాయం చేయడమే తన లక్ష్యమని చెబుతున్నారు. ఆమె 'నా సంపద పూర్తిగా అయిపోయే వరకు దానం చేస్తూనే ఉంటాను' అని గతంలో ప్రకటించారు. అయితే.. ఎలాన్ మస్క్ వ్యాఖ్యలు దాతృత్వం ప్రభావం సమాజంపై ఎలా ఉంటుందనే విషయంపై కొత్త చర్చను దారితీసాయి. -
నా అంచనా తప్పింది.. కియోసాకి ట్వీట్!
బంగారం, వెండి ధరలు పెరుగుతాయని సూచించే రాబర్ట్ కియోసాకి.. ఇప్పుడు ధరలు తగ్గుతాయని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.తాను బంగారం ధరల విషయంలో చేసిన అంచనా తప్పిందని, ధరలు ఇంకా తగ్గిపోతాయని కియోసాకి నిజాయితీగా అంగీకరించారు. అయితే.. మార్కెట్లు ఎప్పుడూ ఒకే దిశలో కదలవని, పెరుగుదలతో పాటు పతనం కూడా సహజమేనని పేర్కొన్నారు. బంగారం ధరలు వరుసగా తగ్గుతున్న వేళ ఈ ట్వీట్ చేశారు.పెట్టుబడుల్లో అసలు లాభం అమ్మే సమయంలో కాకుండా, సరైన సమయంలో కొనుగోలు చేసినప్పుడే ఏర్పడుతుందని కియోసాకి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం బంగారం ధరలు తగ్గుతున్నప్పటికీ, రాబోయే ఐదేళ్లలో అవి 35 వేల డాలర్ల (ఔన్సు) స్థాయికి చేరుతాయని తెలిపారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులు పెట్టే వారే నిజమైన సంపదను సృష్టించగలరని, రోజువారీ ధరల మార్పులను చూసి నిర్ణయాలు తీసుకోవడం సరైన విధానం కాదని సూచించారు.అంతే కాకుండా.. తప్పులు చేయడం సహజమని, వాటి నుంచి పాఠాలు నేర్చుకోవడమే విజయానికి దారి తీస్తుందని చెప్పారు. ఎలాంటి తప్పులు చేయని వారు కొత్త విషయాలు నేర్చుకోలేరని, పెట్టుబడిదారులు ఓర్పు, దీర్ఘకాలిక ఆలోచన, అనుభవాల నుంచి నేర్చుకునే మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలని రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు.భారతదేశంలో బంగారం ధరలుమన దేశంలో బంగారం ధరల తగ్గుదల కొనసాగుతూనే ఉంది. ఈ రోజు (జూన్ 29) కూడా 10 గ్రాముల గోల్డ్ రేటు వరుసగా రూ.850 (22 క్యారెట్స్), రూ.930 (24 క్యారెట్స్) తగ్గింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో పసిడి ధరలు కొంత పతనమయ్యాయి.I was wrong. Gold still crashing!Thats real life. RD Lesson: Profuts are made when you buy…. Not when you sell.I still believe gold will be $35 k in about 5-years.But that is real life: All markets go up and down.Another RD lesson: The richest investors invest for…— Robert Kiyosaki (@theRealKiyosaki) June 29, 2026 -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
సోమవారం ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 372.10 పాయింట్లు లేదా 0.48 శాతం లాభంతో 76,728.37 వద్ద, నిఫ్టీ 109.75 శాతం లేదా 0.46 శాతం నష్టంతో 23,946.25 వద్ద నిలిచాయి.ప్రకాష్ పైప్స్ లిమిటెడ్, బజాజ్ హెల్త్కేర్ లిమిటెడ్, మాక్పవర్ సిఎన్సి మెషీన్స్ లిమిటెడ్, సినీవిస్టా లిమిటెడ్, బోరోసిల్ సైంటిఫిక్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. నెట్వెబ్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్, టార్టిల్మింట్ ఫిన్టెక్ సొల్యూషన్స్ లిమిటెడ్, క్రెబ్స్ బయోకెమికల్స్ & ఇండస్ట్రీస్ లిమిటెడ్, అటల్ రియల్టెక్ లిమిటెడ్, కన్సాలిడేటెడ్ కన్స్ట్రక్షన్ కన్సార్టియం లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఇన్వెస్టర్లకు కొత్త అవకాశాలు.. ఇవిగో కొత్త ఫండ్స్!
పెట్టుబడుల్లో వైవిధ్యం కోరుకునే ఇన్వెస్టర్ల కోసం హెచ్డీఎఫ్సీ, జేఎం ఫైనాన్షియల్ కొత్త మ్యూచువల్ ఫండ్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఆటో రంగంతో పాటు మల్టీ అసెట్ విభాగంలో పెట్టుబడులకు ఇవి అవకాశం కల్పిస్తున్నాయి.హెచ్డీఎఫ్సీ నిఫ్టీ ఆటో ఇండెక్స్ ఫండ్: దేశ ఎకానమీకి, తయారీ రంగ వృద్ధికి, ఉపాధి కల్పనకు, ఎగుమతులకు ఆటోమొబైల్ పరిశ్రమ దన్నుగా ఉంటోంది. ఆటోమొబైల్, ఆటో విడిభాగాల రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉపయోగపడేలా హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ తాజాగా నిఫ్టీ ఆటో ఇండెక్స్ ఫండ్ ప్రారంభించింది. ఇది జూలై 3 వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో కనీసం రూ. 100 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు.నిఫ్టీ ఆటో ఇండెక్స్ (టీఆర్ఐ)లోని దిగ్గజ ప్యాసింజర్ వెహికల్స్, ద్విచక్ర వాహనాలు, వాణిజ్య వాహనాలు, ఆటో విడిభాగాల తయారీ సంస్థల స్టాక్స్లో ఇది ఇన్వెస్ట్ చేస్తుంది. నిఫ్టీ500 నుంచి ఎంపిక చేసిన 15 స్టాక్స్ ఈ సూచీలో ఉంటాయి.జేఎం మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్: ఆర్థిక సేవల సంస్థ జేఎం ఫైనాన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ తాజాగా మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ని ఆవిష్కరించింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ జూలై 8న ముగుస్తుంది. ఇది ఈక్విటీలు, ఈక్విటీ సంబంధ సాధనాలు, డెట్..మనీ మార్కెట్ సెక్యూరిటీలు, పసిడి–వెండి సంబంధ సాధనాలు, ఇతరత్రా ఎక్స్చేంజ్ ట్రేడెడ్ కమోడిటీ డెరివేటివ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. తద్వారా ఒకే ఫండ్ ద్వారా పెట్టుబడుల్లో వైవిధ్యాన్ని పాటించేందుకు ఉపయోగపడుతుంది. -
ఐవెకో కొనుగోలుతో 10 లక్షల వాహనాలు లక్ష్యం!
భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ అంతర్జాతీయ వాణిజ్య వాహన (కమర్షియల్ వెహికల్స్) మార్కెట్లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. ఇటలీకి చెందిన ప్రముఖ ‘ఐవెకో’ కొనుగోలు ప్రక్రియ తుది దశకు చేరిన నేపథ్యంలో.. రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే వార్షిక అమ్మకాల్లో మిలియన్ (10 లక్షలు) యూనిట్ల మార్కును అధిగమించాలని కంపెనీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. జూన్ 29న జరిగిన కంపెనీ రెండో వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) వాటాదారులను ఉద్దేశించి టాటా మోటార్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ కొన్ని విషయాలను వెల్లడించారు.కమర్షియల్ వెహికల్ బిజినెస్ ప్రత్యేకంగా విడిపోయి స్వతంత్ర సంస్థగా లిస్ట్ అయిన తర్వాత జరిగిన ఈ సమావేశంలో చంద్రశేఖరన్ ప్రసంగిస్తూ ప్రతిపాదిత ఐవెకో కొనుగోలు టాటా మోటార్స్ అంతర్జాతీయ ఆశయాలకు వేగాన్ని ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు.‘ఐవెకో గ్రూప్ ఏకీకరణతో ప్రాథమికంగానే మా ఉమ్మడి వ్యాపారం 6,00,000 వాహనాల వార్షిక వాల్యూమ్తో ప్రారంభమవుతుంది. రాబోయే సంవత్సరాల్లో 10 లక్షల వాహనాల మార్కును సులభంగా దాటగలము. ఈ వ్యూహాత్మక చర్యతో ప్రపంచవ్యాప్తంగా టాప్-4 అతిపెద్ద కమర్షియల్ వెహికల్ తయారీదారుల సరసన టాటా మోటార్స్ నిలుస్తుంది’ అని ఎన్.చంద్రశేఖరన్ అన్నారు.రెండో త్రైమాసికంలో డీల్ పూర్తిప్రస్తుతం ఈ కొనుగోలుకు సంబంధించి తుది విడత రెగ్యులేటరీ అనుమతుల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నాటికి ఈ డీల్ పూర్తిగా ముగుస్తుందని చంద్రశేఖరన్ స్పష్టం చేశారు. ఈ ఒప్పందం ద్వారా ఐవెకోకు ఉన్న అధునాతన పవర్ ట్రెయిన్, నెక్స్ట్ జనరేషన్ సాంకేతికతలపై టాటా మోటార్స్కు పూర్తి పట్టు లభిస్తుంది. తద్వారా కంపెనీ గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్, ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో మరింత బలోపేతం కానుందని చెప్పారు.ఇదీ చదవండి: పసిడి పరుగుకు పగ్గాలు.. దిగొచ్చిన ధరలు -
క్రేజీ ఆలోచనలతోనే సరిహద్దుల్లేని విజయాలు
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అసాధారణ విజయాల వెనుక ఉన్న అసలు రహస్యం బయటపడింది. గూగుల్లో పిచాయ్తో కలిసి పనిచేసిన అగ్రశ్రేణి టెక్ నిపుణులు, ‘రూబ్రిక్’, ‘గ్లీన్’ సంస్థల సహ వ్యవస్థాపకుడు అరవింద్ జైన్ ఇటీవల ఫార్చ్యూన్ మ్యాగజైన్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రపంచం వెర్రి ఆలోచన అని కొట్టిపారేసిన క్రోమ్ బ్రౌజర్ ప్రాజెక్ట్ను పిచాయ్ ఎలా విజయతీరాలకు చేర్చారో, ఆయన పనితీరు నుంచి తాను నేర్చుకున్న పాఠాలేమిటో జైన్ వివరించారు.భారతదేశంలోని ఒక చిన్న పట్టణం నుంచి అమెరికాకు వెళ్లిన అరవింద్ జైన్ ప్రారంభంలో గూగుల్లో చేరినప్పుడు తీవ్రమైన ఆత్మన్యూనతా భావానికి లోనైనట్లు అంగీకరించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన అత్యంత నిపుణులైన సహోద్యోగుల మధ్య తానొక ‘మోసగాడిలా’ (అర్హత లేకపోయినా వచ్చినట్లు) భావించానని చెప్పారు. అయితే, ఆ ప్రతిభావంతుల మధ్య కొందరు మాత్రమే ఎందుకు అత్యున్నత శిఖరాలకు చేరుకుంటున్నారనే విషయాన్ని ఆయన గమనించడం ప్రారంభించారు. అలా ఆయన దృష్టిని ఆకర్షించిన అగ్రగామి నాయకుడే సుందర్ పిచాయ్.‘నేను, సుందర్ గూగుల్లో చాలా కాలం కలిసి పని చేశాం. కంపెనీలో ఒక సాధారణ ఉద్యోగిగా చేరినప్పటి నుంచి సుందర్ నాకు తెలుసు. గూగుల్లో బెస్ట్ స్కూల్స్ నుంచి వచ్చిన ఎందరో మేధావులు ఉన్నా వారందరూ ఉన్నతంగా రాణించలేకపోయారు. అప్పుడే అసలు విజయ సూత్రం ఏంటో తెలుసుకోవాలనుకున్నాను. చాలా కాలం కిందట ఆన్లైన్ బ్రౌజర్ల విభాగం పూర్తిగా మైక్రోసాఫ్ట్ గుత్తాధిపత్యంలో ఉండేది. అప్పటికే నెట్స్కేప్ వంటి దిగ్గజాలు విఫలమవడంతో గూగుల్ క్రోమ్ ప్రాజెక్టుపై పెద్దగా నమ్మకం లేదు. దాంతో నేను కూడా ఇది చాలా చెడ్డ ఆలోచన అని భావించాను. ఎందుకంటే నేను అంత లోతుగా ఆలోచించలేకపోయాను’ అని జైన్ పేర్కొన్నారు.అప్పట్లో మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టీవ్ బాల్మర్ సైతం క్రోమ్ను ఒక సాధారణ ‘రౌండింగ్ ఎర్రర్’ (లెక్కలోకి తీసుకోనవసరం లేని పొరపాటు) అని బహిరంగంగా కొట్టిపారేశారు. అందరూ అసాధ్యం అనుకున్నచోటే పిచాయ్ తన పట్టుదల, ఆత్మవిశ్వాసంతో క్రోమ్ను ముందుకు నడిపారు. ఫలితంగా 2012 నాటికి క్రోమ్ ప్రపంచంలోనే అత్యంత విస్తృతంగా ఉపయోగించే బ్రౌజర్గా అవతరించి ప్రత్యర్థులను వెనక్కి నెట్టింది. ఈ విజయమే ఆగస్టు 2015లో పిచాయ్ గూగుల్ సీఈఓగా ఎదగడానికి బలమైన పునాది వేసింది.పిచాయ్ విజయ సూత్రాలుఅరవింద్ జైన్ విశ్లేషణ ప్రకారం, సుందర్ పిచాయ్ శైలి నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు ఇవే..కేవలం కష్టపడి పనిచేయడం మాత్రమే సరిపోదు, లక్ష్యం పట్ల విపరీతమైన పట్టుదల ఉండాలి.గూగుల్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్ల తరహాలోనే పిచాయ్ మనసులో సాధ్యసాధ్యాలపై ఎలాంటి పరిమితులు లేవు.ప్రతి ఒక్కరూ తెలివితక్కువది, బహుశా వాస్తవాలకు దూరంగా ఉందని భావించే పనిని మనం చేయబోతున్నాం అని నమ్మినప్పుడే మ్యాజిక్ జరుగుతుంది.రూబ్రిక్, గ్లీన్ సంస్థలతో జైన్ సంచలనాలుసుందర్ పిచాయ్ నుంచి నేర్చుకున్న ఈ క్రేజీ థాట్స్ పాఠాలే అరవింద్ జైన్ను తదుపరి కాలంలో ఒక విజయవంతమైన బిలియనీర్గా మార్చాయి. తాను గూగుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జైన్ స్థాపించిన క్లౌడ్ డేటా మేనేజ్మెంట్ కంపెనీ రూబ్రిక్, 2024లో న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో సుమారు 5.6 బిలియన్ డాలర్లతో లిస్ట్ అయింది. అనంతరం ఆయన ప్రారంభించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ 'గ్లీన్' ప్రస్తుతం 7.2 బిలియన్ డాలర్ల విలువైన కంపెనీగా దూసుకుపోతోంది.జెన్-జీ నుంచి నిరంతర అభ్యాసంప్రస్తుతం ఇంతటి అంతర్జాతీయ స్థాయి విజయాన్ని అందుకున్నప్పటికీ జైన్ తన సంస్థల్లోని యువతరం(జెన్ జీ) నుంచి నిరంతరం నేర్చుకుంటూనే ఉన్నానని తెలిపారు. యువత సరికొత్త దృక్పథాలను, వినూత్న ఆలోచనలను తీసుకువస్తుందని, నేటి వేగవంతమైన టెక్ ప్రపంచంలో అప్డేట్గా ఉండటానికి వారి ఆలోచనలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు.ఇదీ చదవండి: పసిడి పరుగుకు పగ్గాలు.. దిగొచ్చిన ధరలు -
లీగల్ రివ్యూను ప్రశ్నించిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మాజీ ఛైర్మన్
దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో ఇటీవలి పరిణామాలు కార్పొరేట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తన రాజీనామాపై బ్యాంక్ యాజమాన్యం జరిపించిన చట్టపరమైన సమీక్షను బ్యాంక్ మాజీ ఛైర్మన్ అతాను చక్రవర్తి ప్రశ్నించారు. ఈ సమీక్ష అంతా ఒక పద్ధతి ప్రకారం జరిగిందే తప్ప, ఇందులో వాస్తవాలు లేవని ఆరోపించారు. ఇటీవల ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను పంచుకున్నారు.న్యాయ సంస్థల నివేదికపై అసంతృప్తితన రాజీనామా ప్రకటనను సమీక్షించడానికి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నియమించిన బాహ్య న్యాయ సంస్థలు (External Law Firms) సమర్పించిన నివేదికను అతాను చక్రవర్తి తప్పుపట్టారు. ఈ నివేదిక కేవలం ‘పరిమిత పరిధి/షరతులతో కూడిన నివేదిక’ అన్నారు. అంతర్గత అధికారుల ఇంటర్వ్యూల నుంచి సేకరించిన కొన్ని అంశాలు, బోర్డు సమావేశాల మినిట్స్పైనే ఈ నివేదిక ప్రధానంగా దృష్టి సారించిందని విమర్శించారు. బ్యాంక్లోని కొన్ని వ్యాపార పద్ధతులకు, తన వ్యక్తిగత విలువలకూ మధ్య వచ్చిన వైరుధ్యం వల్లే తాను రాజీనామా చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. అయితే, న్యాయ సంస్థలు ఈ ప్రాథమికాంశాన్ని వదిలేసి కేవలం కొన్ని అంశాలపైనే దృష్టి పెట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమీక్ష కోసం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ‘వాడియా గాంధీ’, ‘విల్సన్ సోనీ’ అనే న్యాయ సంస్థలను నియమించినట్లు తెలుస్తోంది.బోర్డు తీరుపై ప్రశ్నలు‘నా నియామకం, రాజీనామా రెండూ కంపెనీల చట్టం, బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టానికి లోబడే జరిగాయి. అలాంటప్పుడు ఈ సమీక్ష దేనికి? సమీక్ష కోసం న్యాయవాదులను నియమించడానికి గల నిబంధనలు లేదా చట్టపరమైన ఫ్రేమ్వర్క్ ఏమిటో చెప్పాలని నేను బోర్డును పదేపదే కోరాను. కానీ, నా అభ్యర్థనలను బోర్డు పట్టించుకోలేదు. ఆ నిబంధనలను నాతో పంచుకోలేదు’ అని అతాను చక్రవర్తి అన్నారు.ఈ చట్టపరమైన నివేదికలను ఆయన అనవసరమైనవిగా కొట్టిపారేశారు. తన పదవీకాలంలో జరిగిన ‘ఏటీ-1 బాండ్ మిస్సెల్లింగ్’ కేసుపై బ్యాంక్ వేగంగానే స్పందించిందని చెప్పారు. అయితే, బోర్డు రూమ్ విషయాలు బోర్డు రూమ్లోనే ఉండాలనే నియమానికి కట్టుబడి తన రాజీనామాకు దారితీసిన నిర్దిష్ట వ్యాపార పద్ధతులు ఏమిటనేది మాత్రం ఆయన వెల్లడించలేదు.త్వరలో కొత్త ఎండీ, సీఈఓఈ వివాదాల నడుమే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన కార్పొరేట్ గవర్నెన్స్ను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. బ్యాంకుకు శాశ్వత ఛైర్మన్ నియామకాన్ని వేగవంతం చేయడంతో పాటు ప్రస్తుత ఎండీ, సీఈఓ శశిధర్ జగదీషన్ను తిరిగి నియమించే కసరత్తును ముమ్మరం చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. త్వరలోనే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నూతన ఛైర్మన్ ఎవరనేది అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇది బ్యాంక్ భవిష్యత్తు వ్యూహాలకు ఎంతో కీలకం కానుంది.ఇదీ చదవండి: పసిడి పరుగుకు పగ్గాలు.. దిగొచ్చిన ధరలు -
రూ.45 లక్షల ప్యాకేజీ.. నెలాఖరుకు చేతిలో సున్నా!
సంవత్సరానికి రూ.45 లక్షల భారీ ప్యాకేజీ.. సమాజంలో గౌరవప్రదమైన పొజిషన్.. కానీ, నెలాఖరు వచ్చేసరికి చేతిలో రూపాయి మిగలడం లేదు! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది బెంగళూరులో నివసిస్తున్న ఒక సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ పరిస్థితి. గతేడాది మ్యూచువల్ ఫండ్ కన్సల్టెంట్ అన్షుమన్ శర్మతో సూర్య అనే టెక్కీ మాట్లాడిన పాత ఇంటర్వ్యూ క్లిప్ ఇప్పుడు మళ్లీ సామాజిక మాధ్యమం ఎక్స్లో వైరల్గా మారింది.గత 14 ఏళ్లుగా బెంగళూరులో స్థిరపడిన సూర్య.. తన భార్య, మూడున్నరేళ్ల బాబుతో కలిసి నివసిస్తున్నాడు. ఏడాదికి రూ.45 లక్షల ప్యాకేజీ ఉన్నప్పటికీ పన్నుల చెల్లింపుల తర్వాత ప్రతి నెలా అతని చేతికి వచ్చే నికర జీతం రూ.2,45,000. ఈ భారీ మొత్తం చేతికి వస్తున్నా పొదుపు చేయడం తనకు చాలా కష్టంగా మారిందని సూర్య వాపోయాడు.ఒక ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ..‘ప్రస్తుతం నేను ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఏంటంటే.. నెలాఖరు వచ్చేసరికి నా డబ్బు ఎక్కడికి వెళ్తుందో నాకే అర్థం కావడం లేదు. చేతిలో ఏమీ మిగలడం లేదు. పెళ్లయి బాబు పుట్టిన తర్వాత ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. దీనివల్ల నా సిప్ పెట్టుబడులను కూడా పెంచలేకపోతున్నాను’ అని చెప్పాడు.ఖర్చుల లెక్కలు ఇవే..సూర్య తన నెలవారీ ఖర్చుల వివరాలను కన్సల్టెంట్కు వివరించగా అందులో సింహభాగం హోమ్లోన్కే వెళ్తున్నట్లు చెప్పారు. అతని నెలవారీ ఖర్చుల విభజన ఇలా ఉంది.హోమ్ లోన్ ఈఎంఐ: రూ. 63,000 (ఇది అతని నికర ఆదాయంలో 30% కంటే తక్కువలోనే ఉండటం గమనార్హం)కుమారుడి స్కూల్ ఫీజు: రూ.11,000 (దీనికి అదనంగా రూ.3 లక్షల ప్రవేశ రుసుము ఉంది)ఆహారం, కిరాణా సామాగ్రి: రూ. 12,000ఇతర గృహ ఖర్చులు: రూ. 20,000షాపింగ్, ట్రిప్పులు, ఔటింగ్స్: రూ.32,000నెటిజన్ల మధ్య భిన్నాభిప్రాయాలుఈ ఇంటర్వ్యూ క్లిప్ ఎక్స్లో రీపోస్ట్ అవ్వడమే ఆలస్యం.. నెటిజన్లు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు. ‘భారతదేశంలో ద్రవ్యోల్బణం కంటే పేలవమైన ఆర్థిక ప్రణాళికే పెద్ద సమస్య. నెలకు రూ.2.45 లక్షలు సంపాదిస్తూ కేవలం షాపింగ్, ట్రిప్పుల కోసమే రూ.32 వేలు ఖర్చు చేయడం ఏంటి? బాబు నర్సరీ ఫీజులకే అంత పెడుతుంటే ఇక డబ్బు ఎలా మిగులుతుంది?’ అని ఒక యూజర్ చెప్పారు. మరోవైపు, ఈ వాదనను వ్యతిరేకిస్తూ కొంతమంది సూర్యకు మద్దతుగా నిలిచారు. ‘ఇందులో తప్పు పట్టడానికి ఏముంది? ఒక వ్యక్తి కష్టపడి సంపాదిస్తూ, తన పిల్లలకు మంచి చదువు చెప్పించి, కాస్త విలాసాల కోసం ఖర్చు పెట్టుకుంటే తప్పేంటి?’ అని కౌంటర్ ఇచ్చారు.ఈ బెంగళూరు టెక్కీ ఉదంతం కేవలం ఒక్కరి సమస్య కాదు. భారతదేశంలోని మెట్రో నగరాల్లో అధిక వేతనాలు పొందుతున్న మెజారిటీ ఐటీ ఉద్యోగుల మానసిక, ఆర్థిక పరిస్థితికి ఇది అద్దం పడుతోంది. ఆదాయం పెరిగే కొద్దీ దానికి అనుగుణంగా జీవన ప్రమాణాలు, ఖర్చులు పెంచుకుంటూ పోవడాన్ని ఆర్థిక పరిభాషలో ‘లైఫ్స్టైల్ ఇన్ఫ్లేషన్’ అంటారు. రూ.45 లక్షల ప్యాకేజీ ఉన్నా ఏమీ మిగలడం లేదు అనే భావన కలగడానికి కారణం.. భవిష్యత్తు కోసం చేసే పొదుపును ముందే పక్కన పెట్టకుండా, ఖర్చులు పోగా మిగిలినదాన్ని దాచుకుందాం అనుకోవడమేనని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: పసిడి పరుగుకు పగ్గాలు.. దిగొచ్చిన ధరలు -
పసిడి పరుగుకు పగ్గాలు.. దిగొచ్చిన ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
ఫ్లాట్గా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:26 సమయానికి నిఫ్టీ(Nifty) 12 పాయింట్లు ఎగబాకి 24,067 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 64 పాయింట్లు తగ్గి 77,033 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 101.34బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 72.4 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.38 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.05 శాతం తగ్గింది.నాస్డాక్ 0.24 శాతం నష్టపోయింది.Today Nifty position 29-06-2026(time: 09:26 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
గ్లోబల్ ఏఐ రేసులో వెనుకబడిన దేశాలు
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవం స్టాక్ మార్కెట్లను శాసిస్తున్న వేళ ఆసియా ఆర్థిక వ్యవస్థల్లో ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. గ్లోబల్ ఏఐ రేసులో ఆధిపత్యం చెలాయించే స్పష్టమైన ఏఐ విజేతలు లేకపోవడంతో భారత్, చైనా, హాంకాంగ్ మార్కెట్లు తమ అగ్రశ్రేణి కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటాను కోల్పోయాయి. ఏడాది క్రితంతో పోలిస్తే ఈ దేశాల ప్రధాన సూచీల్లో టాప్-10 కంపెనీల మూలధన వ్యయం తగ్గడం గమనార్హం.క్షీణించిన ఆధిపత్యంప్రస్తుత గ్లోబల్ ట్రెండ్ను పరిశీలిస్తే భారత్, చైనా, హాంకాంగ్ మార్కెట్లలో టాప్ కంపెనీల వాటా తగ్గింది. మిగిలిన ప్రధాన మార్కెట్లలో ఏఐ ఆధారిత టెక్ దిగ్గజాలు సూచీలను ముందుకు నడిపిస్తున్నాయి.టాప్-10 దేశాల మార్కెట్ క్యాప్ వాటా (ఏడాది క్రితం.. ప్రస్తుతం)దేశం / మార్కెట్ఏదాది క్రితం వాటాప్రస్తుత వాటామార్కెట్ సరళిచైనా26%19%క్షీణతభారతదేశం22%19%క్షీణతహాంకాంగ్10%9.8%స్వల్ప మార్పుతైవాన్49%56%భారీ వృద్ధిదక్షిణ కొరియా~ 32%65%రెట్టింపు వృద్ధి‘ఆసియా టెక్నాలజీ మార్కెట్లో ఏఐ, మెమరీ చిప్ విజేతలు ఇండెక్స్లను లీడ్ చేస్తుంటే.. భారత్, చైనా, హాంకాంగ్లలో ఏ ఒక్క ఆధిపత్య ఏఐ విన్నింగ్ కంపెనీ లేకపోవడంతో టాప్ సంస్థల వాటా పడిపోతోంది’ అని సాక్సో మార్కెట్స్ (సింగపూర్) చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ చారు చనానా అన్నారు.తైవాన్, దక్షిణ కొరియా దేశాల దూకుడుఏఐ సరఫరా గొలుసులో కీలక పాత్ర పోషిస్తున్న కంపెనీలు ఉన్న మార్కెట్లు ఊహించని రీతిలో లాభపడ్డాయి. చిప్ తయారీ దిగ్గజం ‘తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కో’ (టీఎస్ఎంసీ) అద్భుతమైన లాభాల బాటలో పయనించడంతో తైవాన్ బెంచ్మార్క్ సూచీ ఈ ఏడాది ఏకంగా 54% పెరిగింది. అక్కడ టాప్-10 కంపెనీల వాటా 56%కి చేరింది.దక్షిణ కొరియాలో హై-బ్యాండ్ విడ్త్ మెమరీ లీడర్స్ అయిన ఎస్కే హైనిక్స్ ఇంక్, శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ లీడ్తో కొరియా కోస్పి ఇండెక్స్ దాదాపు రెట్టింపు అయింది.భారత మార్కెట్ స్థితిగతులుభారతదేశ విషయానికి వస్తే నిఫ్టీ 50 బెంచ్మార్క్ ఈ ఏడాది 8% మేర క్షీణించింది. దీనికి ప్రధాన కారణం ఇండెక్స్లో సాంప్రదాయ దిగ్గజాలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ల ఆధిపత్యం ఎక్కువగా ఉండటమే. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్ వంటి భారతీయ ఐటీ దిగ్గజాలు ఇంకా సాంప్రదాయ సాఫ్ట్వేర్ సేవల్లోనే ఎక్కువగా పాతుకుపోయి ఉన్నాయి. ఇవి ఏఐ వల్ల భవిష్యత్తులో అంతరాయాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సూచీలో భారీ వెయిటేజీ ఉన్న కంపెనీలు ఇండెక్స్ను ముందుకు లాగలేకపోతుండగా వాటిని భర్తీ చేసే కొత్త తరం ఏఐ ఇంజిన్లు ఇంకా మన మార్కెట్లో పుట్టుకురాలేదని చెబుతున్నారు.ఇదీ చదవండి: గార్డెన్ సిటీ 'గార్బేజ్ సిటీ'గా మారిందా? -
గార్డెన్ సిటీ 'గార్బేజ్ సిటీ'గా మారిందా?
ఒకప్పుడు దేశ విదేశీయులను ఆకర్షించిన గార్డెన్ సిటీ (ఉద్యాన నగరం) బెంగళూరు.. ఇప్పుడు అస్తవ్యస్త ప్రణాళికలు, కాంక్రీట్ జంగిల్గా మారుతున్న వైనంతో తన ఉనికిని కోల్పోతోందా? బయోకాన్ వ్యవస్థాపకురాలు, ప్రముఖ పారిశ్రామికవేత్త కిరణ్ మజుందార్షా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా చేసిన తాజా వ్యాఖ్యలు ఐటీ కారిడార్లో చర్చకు దారితీశాయి. బెంగళూరును ఆమె నేరుగా గార్బేజ్ సిటీ(చెత్త నగరం) అని సంబోధించడం, అక్కడి పట్టణ ప్రణాళిక వైఫల్యాలను ఎండగట్టడం ఐటీ నిపుణులు, సామాన్య ప్రజల్లో చర్చకు తెరలేపింది.గ్రాఫిక్ చిత్రం ఏం చెబుతోంది?నగర రోడ్ల దుస్థితిని వివరిస్తూ కిరణ్ ఒక ఆసక్తికరమైన గ్రాఫిక్ చిత్రాన్ని షేర్ చేశారు. ‘మన గార్డెన్ సిటీని ప్రతిబింబించేలా మన రోడ్లను ఈ విధంగా రూపొందించాలి, ప్లాన్ చేయాలి. దురదృష్టవశాత్తు పచ్చదనం తగ్గుతూ చెత్త నగరంగా మారింది’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ గ్రాఫిక్ ఎలివేటెడ్ రోడ్ కారిడార్కు సంబంధించిన రెండు విభిన్న వెర్షన్లను పోల్చి చూపించింది.మనం నిర్మించింది (What We Built): కాంక్రీట్ విస్తరణతో కూడిన ప్రస్తుత దుస్థితి. రోడ్ల విస్తరణ పేరుతో చెట్లను పూర్తిగా తొలగించడం, పాదచారుల ఫుట్పాత్లు, సర్వీస్ రోడ్లను తుడిచిపెట్టడం, ప్రజలకు కనీస సౌకర్యాలు లేకుండా చేయడం ఇందులో కనిపించింది.మనం నిర్మించాల్సింది (What We Could Have Built): పర్యావరణ అనుకూల ప్రణాళిక. అదే కారిడార్లో పాత చెట్లను కాపాడుకుంటూనే సైక్లింగ్ ట్రాక్లు, విశాలమైన ఫుట్పాత్లు, వీధి దీపాలు, బెంచీలు, చెత్త డబ్బాలు వంటి ఆధునిక పౌర సౌకర్యాలతో తిరిగి రూపకల్పన చేయవచ్చని ఆ చిత్రం చూపించింది.నెటిజన్ల స్పందనఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారడమే కాకుండా, నగర పౌరుల నుంచి తీవ్ర స్పందన తీసుకొచ్చింది. బెంగళూరులో క్షీణిస్తున్న మౌలిక సదుపాయాలకు పేలవమైన ప్రణాళిక, బలహీనమైన పాలన, అవినీతి, అధికారుల జవాబుదారీతనం లేకపోవడమే కారణమని నెటిజన్లు ఏకిపారేశారు. ‘ఈ నగరాన్ని దోచుకోవడానికి నిర్వాహకులు, రాజకీయ నాయకులు చేతులు కలిపారు. ఐరన్, సిమెంట్ మొదలైన వాటిలో ఎక్కువ కమీషన్లు దండుకోవచ్చు కాబట్టే కాంక్రీట్ రోడ్లపై ఆసక్తి కనబరుస్తారు. వారు నాటిన చెట్లలో కమీషన్లు రావు కదా!’ అని ఒక యూజర్ స్పందించారు.This is how we need to design & plan our roads that reflects our garden city image. Unfortunately it’s now a garbage city with shrinking greenery pic.twitter.com/EG29LPZd2j— Kiran Mazumdar-Shaw (@kiranshaw) June 27, 2026మరికొందరు నెటిజన్ల అభిప్రాయాలు ఇలా..భారతీయ నగరాలు ఏమాత్రం నిలకడగా లేవు. అంతర్జాతీయ నగరాల మాదిరిగా పన్నులు, ఖర్చులు వసూలు చేస్తారు. కానీ కనీస సౌకర్యాలు లేక పేద దేశంగా జీవించాల్సి వస్తోంది. సిగ్గుచేటు.ఉన్నవాటిని సరిగ్గా నిర్వహించడం, చట్టాలను కఠినంగా అమలు చేస్తే చాలు. ప్రజలు సహనం కోల్పోయారు, ఎవరూ ఏ నియమాన్ని పాటించడం లేదు. గార్డెన్ సిటీ చెత్త నగరంగా మారుతున్న విషయం ప్రభుత్వానికి, అడ్మినిస్ట్రేషన్కు తెలియదా?మొత్తం బడ్జెట్ నుంచి కమీషన్లు ఎలా పొందాలో ప్రభుత్వ ఉద్యోగులు, నిర్వాహకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. బాధ్యత, జవాబుదారీతనం లేనంత వరకు ఏదీ మెరుగుపడదు. బెంగళూరు అభివృద్ధి కోసం ఎవరైనా నిజాయితీగా ప్లాన్ చేస్తారని ఆశించడం అత్యాశే. -
అప్పు తిరిగి చెల్లించినా ‘సోర్స్’ ఉండాల్సిందే..
నేను తెలంగాణ ప్రభుత్వోద్యోగిని. నా ఆదాయం రూ.5 లక్షలు. రిటర్ను వేశాను. రిటర్న్ ప్రాసెస్ అయిపోయింది. గత సంవత్సరం మా బాబాయి వ్యాపారం కోసం బంగారం మీద రూ.15,00,000 లోన్ తీసుకున్నాను. ఈ సంవత్సరం మా బాబాయి ఆ మొత్తాన్ని రిటర్న్ చేస్తే, నేను లోన్ తీర్చివేస్తాను. ఈ వ్యవహారంలోని పన్ను చిక్కులు, ఇతర చిక్కులు తెలపండి. – రమేష్ రెడ్డి, ఈ–మెయిల్ ద్వారామీరు ప్రభుత్వోద్యోగి. మీ సంవత్సరాదాయం రూ. 5,00,000. ఇతరత్రా ఎటువంటి ఆదాయం లేదంటున్నారు. దీనికి సంబంధించిన రిటర్ను వేశారు. అది ప్రాసెస్ అయ్యింది. ఇదే సంవత్సరం బంగారం తాకట్టు పెట్టి రూ.15,00,000 లోన్ తీసుకుని, ఆ మొత్తాన్ని మీ బాబాయికి ఇచ్చారు. ఇందులో రెండు వ్యవహారాలు ఉన్నాయి. మీరు లోన్ తీసుకోవడం మొదటిదయితే, రెండోది మీరు మీ బాబాయిగారికి అప్పు ఇవ్వడం. ఈ రెండూ బ్యాంకు ద్వారా జరిగాయని అనుకుంటున్నాం. లోన్ వచ్చినప్పుడు మీ బ్యాంకు అకౌంటులో జమ, ఆ తర్వాత మీరు మీ బాబాయికి ఇచ్చినప్పుడు ఖర్చు/డెబిట్. ఈ మేరకు కాగితాలు/డాక్యుమెంట్లు, సంతకాలు, పద్దులు ఉన్నాయి కదా! (బదులుగా రెండు నగదు వ్యవహారాలయితే మాత్రం ఎంతో ముప్పు ఉంది. నగదు తీసుకోవడం, నగదు ఇవ్వడం రెండూ తప్పే. పెనాల్టీలు పడతాయి). ఇంతవరకు ఎటువంటి భయం లేదు. ఆ తర్వాత సంవత్సరం మీ బాబాయి మీకు చెక్కు ద్వారా ఇచ్చి, ఆ మొత్తం మీ బ్యాంకు అకౌంట్లో క్రెడిట్ అయ్యి, అటుపైన మీరు అదే మొత్తాన్ని బంగారం కంపెనీకి అప్పు తీర్చినట్లయితే, మీ అకౌంటులో డెబిట్/ఖర్చు కనబడాలి. ఇలాగే జరిగితే, ఆ మేరకు కాగితాలు, డాక్యుమెంట్లు, సంతకాలు, పద్దులు, అవసరం అయితే కాగితాల ద్వారా వివరణ, కన్ఫర్మేషన్ ఉంటే ఎటువంటి భయం లేదు. ‘లోన్’ని ఆదాయంగా పరిగణించరు. జమని ‘లోన్’గా కాగితాల ద్వారా, థర్డ్ పార్టీ కన్ఫర్మేషన్ ద్వారా ధ్రువీకరించాలి. అలా చేస్తే ఈ వ్యవహారంలో జమల్ని ఆదాయంగా పరిగణించరు. అప్పుడు ఎటువంటి సంకోచం లేకుండా దాన్ని ఆదాయంగా పరిగణించనవసరం లేదు. అయితే, ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ఈ లావాదేవీలలో వడ్డీ ఉందా లేదా అని. వడ్డీ ఉంటే మీ ఆదాయంలో ఆ వడ్డీని ఆదాయంగా పరిగణిస్తారు. వడ్డీ లేకపోతే మీరిద్దరూ రాతపూర్వకంగా ధ్రువీకరించాలి. నేను రాష్ట్ర ప్రభుత్వంలో రిటైర్ అయ్యాను. పెన్షన్ వస్తుంది. నా భర్త లేనందున వారి పెన్షన్ నా ఆదాయంలో ‘ఫ్యామిలీ పెన్షన్’గా వస్తుంది. నా భర్త పెన్షన్, పన్ను భారం మొదలైన వ్యవహారాలన్నీ నా పాన్ నంబరు మీద నడుస్తున్నాయి. 2020–21 ఆర్థిక సంవత్సరం నా భర్తకు వచ్చిన ఎరియర్స్ పన్నుకి గురి కావడం వల్ల పన్ను రికవరీ చేసి ఆ మేరకు చెల్లించి నాకు ఫారం 16 ఇచ్చారు. అప్పుడు ఆ పన్ను చెల్లింపులు నా అకౌంటులో కనిపించడం లేదని, వడ్డీతో సహా చెల్లించాలని నోటీసులు పంపారు. –కె. శారద, బెంగళూరుఇటువంటివి ఈ మధ్య చాలా జరుగుతున్నాయి. పన్ను రికవరీలు జరిగి, గవర్నమెంటు ఖజానాకు చెల్లించినప్పటికీ ఆ మేరకు ఫారం 16లో సర్టిఫై అయినప్పటికీ, ఈ పద్దులు డిపార్టుమెంటు వారి దగ్గర వారు నిర్వహిస్తున్న 26ఏఎస్లో కనబడకపోతే/ఎంటర్ అవ్వకపోతే డిపార్టుమెంటు వారు పట్టించుకోరు. 26ఏఎస్లో కనిపించకపోతే ‘మనం చెల్లించలేదని’ వారి వాదన. అందుకే ఇటువంటి నోటీసులు పంపిస్తారు. ఇటువంటి నోటీసులు రాగానే ముందుగా నోటీసులో డిమాండ్ అంశాన్ని/భారాన్ని ఒప్పుకోకండి. ‘డూ యూ ఎగ్రీ’ అన్న ప్రశ్నకు ‘నో’ అని చెప్పండి.ఇప్పుడు మీ భర్తగారు రిటైర్ అయిన సంస్థకు వెళ్లి సమాచారం సేకరించండి. ఫారం 16 అడగండి. అందులో అన్ని వివరణలు ఉంటాయి. ఎంత ఎరియర్స్ వచ్చాయి, పన్ను ఎంత, అది ఎలా చెల్లించారు, ఏ బ్యాంకు ద్వారా చెల్లించారు, లాన్ నంబరు, ఏ తేదీనాడు చెల్లించారు.. ఈ వివరణలతో ఫారం 16ని సేకరించి, డిపార్టుమెంటు వారి పోర్టల్కి వెళ్లి వివరంగా జవాబు ఇవ్వండి. డిమాండ్ నోటీసుని ఉపసంహరించమని అడగండి. డిపార్టుమెంటు వారు అవసరమైతే మిమ్మల్ని సంబంధిత అధికారులను కలవమని చెప్పవచ్చు.. లేదా వారికి నేరుగా కాగితాలను సబ్మిట్ చేయమని చెప్పవచ్చు. దీనితో మీ సమస్యలు సమసిపోవచ్చు. ఇంకా డిమాండు విత్డ్రా కాకపోతే ‘గ్రీవెన్స్ సెల్’కి రిపోర్ట్ చేయొచ్చు. అప్పుడు ఫారం 16 కాపీని అప్లోడ్ చేయొచ్చు. కాస్త సమయం పడుతుంది. అందాకా మీకు టెన్షన్ ఉండొచ్చు. కానీ ఫారం 16లోని అంశాలు కరెక్టుగా ఉన్నంత వరకు ఎటువంటి పొరపాటు జరగదు. జాప్యం ఉండొచ్చేమో .. తప్పు జరగదు. అందుకనే ఒక సలహా. ఇన్కం ట్యాక్స్ రిటర్నులకు సంబంధించిన అన్ని వివరాలు, కాగితాలు, చలాన్లు మొదలైన వాటన్నింటిని ఎప్పుడూ భద్రపర్చుకోవాలి. -
హైదరాబాద్..ఖరీదైన జీసీసీ మార్కెట్!!
దేశీయంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు (జీసీసీ) సంబంధించి అద్దెల విషయంలో హైదరాబాద్ అత్యంత ఖరీదైన ఆఫీస్ మార్కెట్గా నిలుస్తోంది. ఐఐఎం బెంగళూరు, సీఆర్ఈ మ్యాట్రిక్స్ విడుదల చేసిన 2026 తొలి త్రైమాసిక నివేదిక ప్రకారం జీసీసీ–సీపీఆర్ఈ సూచీలో 212.1 స్కోరుతో అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ ఇతర సంస్థలతో పోలిస్తే జీసీసీ కంపెనీలు 15 శాతం అధికంగా అద్దెలు చెల్లిస్తున్నాయి. ఈ విషయంలో పుణె, బెంగళూరు వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిల్చాయి. 210.7 స్కోరు దక్కించుకున్న పుణెలో జీసీసీ కంపెనీలు, ఇతర సంస్థలతో పోలిస్తే సుమారు 21 శాతం అధికంగా చెల్లిస్తున్నాయి. ఇక దేశంలోనే అతి పెద్ద జీసీసీ ఆఫీస్ మార్కెట్గా తన స్థానాన్ని నిలుపుకొన్న బెంగళూరు స్కోరు 190గా ఉంది. జాతీయ స్కోరు 165 వద్ద స్థిరంగా కొనసాగుతున్నట్లు నివేదిక పేర్కొంది. భారీ డీల్స్, సుదీర్ఘ కాలానికి లీజులు..భారతీయ కమర్షియల్ రియల్ ఎస్టేట్ రంగంలో జీసీసీల అద్దె పోకడలను అంచనా వేయడానికి ఇది ఉపయోగకరంగా ఉండగలదని సీఆర్ఈ మ్యాట్రిక్స్, ఇండెక్స్ట్యాప్ సీఈవో అభిషేక్ కిరణ్ గుప్తా తెలిపారు. గత కొన్నేళ్లుగా మిగతా కిరాయిదార్లతో పోలిస్తే జీసీసీల ధోరణి కాస్త భిన్నంగా ఉంటోందని వివరించారు. భారీ డీల్స్, సుదీర్ఘ కాలానికి లీజులతో మొత్తం మ్యాక్రో మార్కెట్లను శాసించేలా వాటి నిర్ణయాలు ఉంటున్నాయని తెలిపారు. రవాణా సౌకర్యాలుల బాగుండి, గ్రేడ్–ఏ ఆఫీస్ క్లస్టర్లు ఉన్న ప్రాంతాలకి ప్రాధాన్యత పెరుగుతోందని పేర్కొన్నారు.పశ్చిమ భారతదేశంలోని మైక్రోమార్కెట్లలో కూడా అద్దెలు గణనీయంగా పెరుగుతున్నట్లు నివేదిక వివరించింది. నవీ ముంబైలో రెంటల్ వృద్ధి వార్షిక ప్రాతిపదికన గత మూడేళ్లలో 13.4 శాతంగా నమోదైంది. మెరుగైన రవాణా, గ్రేడ్–ఏ కార్యాలయాలు ఉన్న ముంబై సెంట్రల్ శివార్లలో, చెన్నై నగర ఉత్తర ప్రాంత శివార్లలో ఇది ఏకంగా 22 శాతంగా రికార్డయింది. దేశవ్యాప్తంగా 100 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్, 19,000 లీజు లావాదేవీల విశ్లేషణ ఆధారంగా ఈ సూచీని రూపొందించారు.ఇదీ చదవండి: లాకర్.. సేఫేనా? -
లాకర్.. సేఫేనా?
ఏళ్ల తరబడి కూడబెట్టిన బంగారం. వారసత్వంగా వస్తున్న కుటుంబ నగలు, విలువైన ఆస్తిపత్రాలు లాకర్లో ఉంటే చాలు ఇక టెన్షన్ లేదు అనే నమ్మకం భారతీయ కుటుంబాల్లో బలంగా ఉంది. విలువైన సంపదనంతా లాకర్లో దాచేసి తాళం చెవిని చూసుకుంటూ అంతా సేఫ్ అనుకునే రోజులు పోయాయి. దేశంలోని పలు నగరాల్లో ఇటీవలి కాలంలో వరుసగా వెలుగుచూసిన బ్యాంక్ లాకర్ వివాదాలు ప్రజల నమ్మకాన్ని ప్రశ్నిస్తున్నాయి. లాకర్లో ఉంచిన నగలు మాయమైతే బ్యాంకు బాధ్యత పరిమితమే అనే విషయం లాకర్లో వస్తువులు మాయమయ్యాక తెలుస్తోంది. నష్టపోయిన వస్తువులకు బ్యాంకులు చెల్లించే పరిహారం పోగొట్టుకున్న వాటి పూర్తి విలువలో పావువంతు కూడా ఉండదన్న విషయం అనేకమందికి చేతులు కాలాక కానీ అవగాహనకి రావడంలేదు. లాకర్ నిజంగా మీ విలువైన వస్తువులకు భద్రత ఇస్తుందా... ఇస్తే అది ఎంత భద్రత ఇస్తుంది? బంగారం, ఆస్తి పత్రాలను పూర్తిగా కాపాడుకోవాలంటే ఇంకేం చేయాలి అని వివరించి గైడ్ చేసే వెల్త్ స్టోరీ...బెంగళూరులో ఒక డాక్టర్ బ్యాంక్ లాకర్లో దాచుకున్న రూ.24 లక్షల విలువైన బంగారం పోయింది. మరో కేసులో ఢిల్లీలో ఓ కుటుంబం లాకర్లో ఎప్పటినుంచో పెడుతున్న రూ.60 లక్షల నగలు ఒకసారి కనిపించకుండా పోయాయి. సీసీటీవీలు ఉన్నాయి. ఫుటేజీల్లో పోయిన విషయం వెల్లడైంది. అయినా బాధితులకు న్యాయం అందలేదు. ఇక్కడ అసలు షాక్ ఏమిటంటే బ్యాంక్కు మీ నష్టాన్ని పూర్తిగా భర్తీ చేయాల్సిన బాధ్యత లేదు. ఆర్బీఐ రూల్స్ ప్రకారం మీకు తెలియాల్సిన నిజం ఏమిటంటే ,బ్యాంకు మార్గదర్శకాల ప్రకారం బ్యాంకు బాధ్యత లాకర్ రెంట్కు వంద రెట్లు మాత్రమే.. లాకర్లో వస్తువులు పోతే కస్టమర్ చెల్లించే లాకర్ రెంటుకు వంద రెట్లు నష్టపరిహారం మాత్రమే బ్యాంకు చెల్లిస్తుంది. అంటే ఒక లాకర్కు ఏడాదికి రూ.7000 అద్దె కడుతుంటే నష్టపోయినపుడు దక్కే పరిహారం రూ.7 లక్షలు మాత్రమే. పోగొట్టుకున్న మీ సంపద 70 లక్షలకు పైగా ఉన్నా దక్కేది అదే..అంటే బ్యాంక్ లాకర్ మాత్రమే విలువైన వస్తువులకు సేఫ్ కాదు. మరి బంగారాన్ని, ఇతర వస్తువులు, డాక్యుమెంట్లు ఎలా రక్షించుకోవాలి? అందుకు మల్టీ లేయర్ స్ట్రాటజీ పాటించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకే ఒక రక్షణ పద్ధతిపై మాత్రమేఆధార పడటం ప్రమాదకరం. ఫైనాన్స్ నిపుణులు సూచిస్తున్నది కూడా మల్టీలేయర్ ప్రొటెక్షన్ స్ట్రాటజీనే అదేమీ బంగారం, డాక్యుమెంట్స్కు అసలైన భద్రత.జ్యువెలరీ ఇన్సూరెన్స్ఎక్కువ మంది పట్టించుకోని పెద్ద రక్షణభారతదేశంలో నగలు కొనేవారు ఇంటికి ఒకరు చొప్పున కోట్లలో ఉన్నా కొన్న నగలకు ఇన్సూరెన్స్ చేసే వారు మాత్రం అరుదే. లక్షల విలువ చేసే నగలు కొనగానే బీమా చేస్తే దొంగతనం జరిగినపుడు అది ఇంట్లో అయినా, బయట అయినా. లాకర్ లో జరిగినా పూర్తిగా నష్టపరిహారం బీమా రూపంలో అందుతుంది. అగ్ని ప్రమాదాలు, వరదలు, భూకంపాలు, ప్రయాణాల్లో నగలు పోగొట్టుకున్నా బీమా భద్రత పూర్తిగా లభిస్తుంది.ఇది బ్యాంకు తప్పిదంవల్ల జరిగిన నష్టానికి అందే పరిహారం కంటే ఎక్కువ. బ్యాంక్ కవరేజ్ లిమిట్ను దాటి, అసలు విలువను రక్షించేది ఇదే.ప్రీమియం ఎంత? సంవత్సరానికి 0.3శాతం నుంచి 1శాతం లోపే రూ.10 లక్షల బంగారానికి రూ.3,000 రూ.10,000 వరకు మాత్రమే అయితే ఇక్కడ కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. పాలసీలో మీరు డిక్లేర్ చేసిన నగలకు మాత్రమే కవరేజ్ లభిస్తుంది. బీమా చేశాక నగలు కొత్తగా కొంటే వాటిని బీమాలో అప్డేట్ చేయాలిజ్యువెలరీ వాల్యుయేషన్చిన్న తప్పు, పెద్ద నష్టంమీ నగల విలువను ప్రతి సంవత్సరం తప్పనిసరిగా మదుపు చేయించాలి. అదీ పాత బిల్లుతో కాదు. ప్రస్తుత మార్కెట్ విలువతో ఇన్సూర్ చేయించాలి. ఎందుకంటే పదేళ్ల క్రితం కొన్న బంగారం విలువ ప్రస్తుతం అనేక రెట్లు పెరిగి ఉంటుంది. పాత విలువతో బీమా చేయిస్తే పోగొట్టుకున్నప్పుడు లభించే బీమా క్లెయిమ్ తక్కువే ఉంటుంది. అందుకే నగలను ఎప్పటికప్పుడు సర్టిఫైడ్ జ్యువెలర్తో వాల్యుయేషన్ చేయించాలి. కనీసం రెండు మూడు సంవత్సరాలకు ఒకసారైనా అప్డేట్ చేసుకోవాలి.హోమ్ సేఫ్ ఏర్పాటుఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ప్రతి ఇంట్లో ఉండాల్సిన మినీ వాల్ట్ ఉండాలి. రోజువారీ క్యాష్, నగల కోసం ఇంట్లో ఒక మంచి హోమ్ సేఫ్ ఏర్పాటు చేసుకోవాలి. అది ఎలా ఉండాలంటే దృఢమైన స్టీల్ బాడీతో తయారు చేసినదై ఉండాలి. పిన్/ ఫింగర్ ప్రింట్ లాక్ సౌకర్యం ఉండాలి. అగ్ని ప్రమాదాలను తట్టుకునేలా ఫైర్ రెసిస్టెంట్ అయి ఉండాలి. గోడకు కానీ నేలకు కానీ బిగించాలి. రూ.5000 నుంచి 25000 ఖర్చుతో సేఫ్ ఏర్పాటు చేసుకుని తరచూ వేసుకునే నగలతోపాటు, లాకర్లో పెట్టిన వస్తువుల కాపీలు, రసీదులు, డాక్యుమెంట్ల జిరాక్సులు రెడీగా ఉంచుకోవాలి.హోమ్ ఇన్సూరెన్స్ అండర్ రేటెడ్ కవరేజ్చాలా మందికి హోమ్ ఇన్సూరెన్స్ ఉండదు. ఫరి్నచర్, ఎల్రక్టానిక్స్ వస్తువులతో పాటు, నగలు కూడా (సబ్ లిమిట్)తో బీమా చేయించాలి. జువెలరీ లిమిట్ ని అదనంగా పెంచుకోవచ్చు.డిజి లాకర్డాక్యుమెంట్లకు డిజిటల్ రక్షణభారత ప్రభుత్వం పౌరులందరికి అందిస్తున్న ఫ్రీ సర్వీస్ ఈ డిజిలాకర్.. డ్రైవింగ్ లైసెన్సులు, పాన్ కార్డులు, రిజి్రస్టేషన్ కార్డులు వంటి డాక్యుమెంట్లను డిజిటల్ రూపంలో ఇక్కడ దాచుకో?వచ్చు. ఇవన్నీ ఎక్కడైనా లీగల్గా వాలిడిటీ కలిగి ఉంటాయి. ఎక్కడైనా, ఎక్కడినుంచైనా ఇంటర్ నెట్ ద్వారా, ఫోన్లో కూడా యాక్సెస్ చేయచ్చు. అయితే ఒకవిషయం గుర్తుంచుకోవాలి. డిజి లాకర్లో అప్ లోడ్ చేసిన డాక్యుమెంట్లు స్కాన్ కాపీలు మాత్రమే. రిఫరెన్స్ కోసమే. ఒరిజినల్స్ను మరోచోట సేఫ్ గా భద్రపరచుకోవాలి.ప్రాపర్టీ డాక్యుమెంట్స్స్మార్ట్ హ్యాండ్లింగ్ తప్పనిసరిఇళ్లు, స్థలాలకు సంబంధించిన ప్రాపర్టీ డాక్యుమెంట్లు పోతే వాటిని తిరిగి పొందడానికి, కనీసం డూప్లికేట్ కాపీలు సంపాదించడానికి సంవత్సరాలు సాగుతాయి. అందువల్ల డాక్యుమెంట్ కాపీలను మల్టిపుల్ కాపీలు గా చేసి లాకర్తో పాటు, ఇంట్లో, దగ్గరి బంధువులు, స్నేహితులు దగ్గర ఒక కాపీ ఉంచాలి. హైక్వాలిటీ స్కాన్ చేయించి గూగుల్ డ్రైవ్లో, డిజిలాకర్లో అప్లోడ్ చేయాలి. ఒక కాపీని పర్సనల్ మెయిల్కి పంపుకుని సేవ్ చేసి ఉంచుకోవాలి?డాక్యుమెంటేషన్పోయిన వస్తువుల, నగల క్లెయిమ్కు ఇదే బేస్కొన్న ప్రతి నగకు ఫోటోలు తీయించాలి. వాటి వెయిట్, ప్యూరిటీ నోట్ చేసి ఉంచాలి. బిల్లులు అన్నీ ఎక్స్ ట్రా కాపీ భద్రంగా ఉంచాలి. ఎక్కడ ఉంచారో రికార్డు చేయాలి. ఈ రికార్డు లేకపోతే బీమా క్లెయిమ్ రిజెక్ట్ అయే చాన్స్ ఎక్కువ.లాకర్లో నగలు మాయమైతే ఏం చేయాలి? బ్యాంకు అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలి. సీసీటీవీ ఫుటేజ్ అడిగి తీసుకోవాలి, వెంటనే బీమా కంపెనీకి సమాచారం అందించాలి. నగలకు సంబంధించిన ఫొటోలు, విలువకు సంబంధించిన పత్రాల కాపీలు అందించాలి. బెంగళూరు, ఢిల్లీ కేసులు యాదృచ్ఛికం కాదు నిర్లక్ష్యానికి హెచ్చరిక. అన్ని వస్తువులకు బ్యాంకు లాకరే భద్రత కాదు. అసలు భద్రత సిస్టమ్ ప్లస్ ప్లానింగ్. సేఫ్టీ అనేది ప్రమాదం సంభవించిన తర్వా త కాదు. ముందే నిర్మించుకోవాల్సిన విషయం. -
మళ్లీ పశ్చిమాసియా టెన్షన్!
పశ్చిమాసియాలో మళ్లీ అగ్గి రాజుకుంది. సీజ్ఫైర్ను ఉల్లంఘించారంటూ... ఇరాన్–అమెరికా దాడులు, ప్రతిదాడులతో ఈ ప్రాంతం మళ్లీ అట్టుడికింది. తాజా భౌగోళిక రాజకీయ పరిణామాల సెగ ముడిచమురు ధరలపై చూపే ప్రభావం ఈ వారం మార్కెట్ల గమనాన్ని నిర్దేశించనుందనేది విశ్లేషకులు అభిప్రాయం. సూచీలు తీవ్ర ఆటుపోట్లకు గురయ్యే అవకాశం ఉందంటున్నారు. అలాగే, దేశీయంగా వెలువడే పలు స్థూల ఆర్థిక గణాంకాలు, రూపాయి మారకంలో హెచ్చుతగ్గులు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, రుతుపవనాల కదలికలపై కూడా ఇన్వెస్టర్లు ఫోకస్ చేయనున్నారు. హార్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకపై ఇరాన్ డ్రోన్ దాడి చేయడంతో అమెరికా అగ్గిమీద గుగ్గిలమైంది. ఇరాన్లోని మిసైల్, డ్రోన్ నిల్వ కేంద్రాలే లక్ష్యంగా అమెరికా ఎటాక్ చేసింది. మరోమారు సీజ్ఫైర్ను ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని అగ్రరాజ్యం హెచ్చరించింది. మరోపక్క ఇరాన్ కూడా ప్రతిదాడులకు దిగింది. దీంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలకు దారితీస్తోంది. వెరసి ఈ వారం క్రూడ్ ధరలపై ఇది ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. శాంతి ఒప్పందంపై ఆశలతో ముడిచమురు ధరలు చల్లారిన సంగతి తెలిసిందే. బ్రెంట్ క్రూడ్ 75 డాలర్ల దిగువకు, అంటే యుద్ధం పూర్వపు స్థాయికి చేరింది. తాజా పరిణామాలతో క్రూడ్ ధరలు మళ్లీ పుంజుకోవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో మార్కెట్లలో తీవ్ర ఒడిదుడులకులు ఉండొచ్చనేది నిపుణుల విశ్లేషణ. ‘పశ్చిమాసియాలో తాజా టెన్షన్లను ఇన్వెస్టర్లు నిశితంగా గమనించనున్నారు. ఒకపక్క శాంతి చర్చల ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ... అమెరికా, ఇరాన్ మధ్య చోటు చేసుకున్న దాడులతో భౌగోళిక రాజకీయ రిసు్కలు ఇంకా తొలగిపోలేదని మార్కెట్లకు సంకేతాలిస్తున్నాయి. చర్చల్లో సానుకూల ఫలితాలు, ఉద్రిక్తతలు సద్దుమణిగితే రిస్క్ సెంటిమెంట్ మెరుగవుతుంది ఒకవేళ దాడులు తీవ్రమైతే ప్రపంచ వృద్ధి, ఇంధన మార్కెట్లపై అంచనాలు తారుమారవుతాయి’ అని ఆన్లైన్ ట్రేడింగ్, వెల్త్టెక్ సంస్థ ఎన్రిచ్ మనీ సీఈఓ పోన్ముడి ఆర్ పేర్కొన్నారు. గణాంకాలపై ఫోకస్... ఈ వారం దేశీయంగా విడుదల కానున్న కొన్ని కీలక గణాంకాలు మన మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయి. పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ)తో పాటు హెచ్ఎస్బీసీ తయారీ సేవల పీఎంఐ డేటా వెలువడనుంది. మరోపక్క, జూన్ నెల ఆటోమొబైల్ అమ్మకాలను కూడా కంపెనీలు జూలై 1న వెల్లడించనున్నాయి. ఇవన్నీ మన ఆర్థిక వ్యవస్థ తాజా పరిస్థితిని తెలియజేయనున్న నేపథ్యంలో మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేస్తాయని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (రీసెర్చ్) అజిత్ మిశ్రా అభిప్రాయపడ్డారు. మరోపక్క, అమెరికా తయారీ రంగ పనితీరును సూచించే డేటా కూడా మార్కెట్లకు కీలకమేనని మోతీలాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ రీసెర్చ్ హెడ్ (వెల్త్ మేనేజ్మెంట్) సిద్ధార్థ్ ఖేమ్కా చెప్పారు. రూపాయి.. రుతుపవనాలు ముడిచమురు ధరలు దిగిరావడం, డాలర్ల ప్రవాహాన్ని పెంచేందుకు ఆర్బీఐ, ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఇటీవల రూపాయి కాస్త పుంజుకుంది. డాలర్ మారకంలో ఆల్టైమ్ కనిష్టం 96.96 స్థాయి నుంచి 94.20 వరకు బలపడింది. ప్రస్తుతం 94.50 వద్ద కదలాడుతోంది అయితే, పశ్చిమాసియాలో తాజా ఉద్రిక్తతలతో క్రూడ్ ఎగబాకితే.. రూపాయికి దాని సెగ తగులుతుందని.. మళ్లీ బలహీనపడే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. మరోపక్క, జూన్ నెల ముగుస్తున్నా.. ఇంకా రుతుపవనాలు పూర్తిగా విస్తరించలేదు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు గనుక ఇలాగే ముఖం చాటేస్తే.. ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం ఉంటుందని.. రానున్న రోజుల్లో నైరుతి రుతుపవనాల కదలికలపై ఇన్వెస్టర్లు గట్టిగా ఫోకస్ చేస్తారని పోన్ముడి పేర్కొన్నారు. గతవారమిలా... శుక్రవారం మన మార్కెట్లకు మొహర్రం సెలవు కారణంగా ఆసియా మార్కెట్లలో టెక్, చిప్ స్టాక్స్లో వెల్లువెత్తిన అమ్మకాలు ప్రతిబింబించలేదు. గతవారం ట్రేడింగ్ నాలుగు రోజుల్లో బీఎస్ఈ సెన్సెక్స్ 298 పాయింట్లు (0.38%) పెరిగింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 43 పాయింట్లు (0.17%) లాభపడి 24,056 వద్ద ముగిసింది.సాంకేతికంగా చూస్తే... పశ్చిమాసియా ప్రభావంతో మార్కెట్లు గనుక వెనకంజ వేస్తే... నిఫ్టీకి ఈ వారం 23,800 వద్ద తొలి మద్దతు లభించవచ్చు. మరింత దిగజారితే 23,640 రెండో మద్దతు స్థాయిగా నిలుస్తుంది. ఇక నిఫ్టీ పెరిగితే.. 24,200–24,300 స్థాయిలో తొలి నిరోధం ఎదుర్కొంటుంది. 24,300 స్థాయిని గనుక అధిగమించగలిగితే.. 24,500 దిశగా పయనిస్తుందనేది మార్కెట్ విశ్లేషకుల అంచనా. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
మీ రూపాయికీ చిల్లు పడుతోందా?
బంగారాన్ని కొనవద్దంటూ ఆంక్షలు విధించినా... దిగుమతి సుంకం అమాంతం పెంచేసినా... అదంతా మన దిగుమతుల బిల్లు భారం తగ్గించుకోవటానికే. విదేశీ ప్రయాణాలు వద్దని సాక్షాత్తూ ప్రధానమంత్రి సూచించటం ఒకెత్తయితే... దేశీయంగా పెట్రోలు వాడకాన్ని తగ్గించడానికి అందులో కలిపే ఇథనాల్ మోతాదును పెంచటం కూడా చేస్తోంది ప్రభుత్వం. పైపెచ్చు 100 శాతం ఇథనాల్ అంటూ కొత్త వాహనాలను, ఇంధనాన్ని మార్కెట్లోకి తెస్తున్నారు కూడా. ఇదంతా ఎందుకంటే దిగుమతుల బిల్లు తగ్గించుకోవటానికి. అంతకంతకూ కరిగిపోతున్న రూపాయి విలువను కాస్తయినా పటిష్ఠంగా ఉంచడానికి. కానీ డాలర్తో మారకంలో రూపాయి ఇప్పటికే భారీగా పతనమైపోయింది. ఎల్రక్టానిక్ గాడ్జెట్లతో సహా తప్పనిసరిగా దిగుమతి చేసుకోవాల్సిన చాలా వస్తువుల ధరలు పైకి ఎగిశాయి. దేశీయంగా పెట్రోలు ధరలు పెరగటం ఫలితంగా చాలా వస్తువుల ధరలు పెరిగిపోయాయి. వెరసి సామాన్యుడి బడ్జెట్ తల్లకిందులయింది. ఈ నేపథ్యంలో ఏ వర్గంపై ఎలాంటి ప్రభావం పడుతోంది? వారు బయటపడాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అని వివరించేదే ఈ సాక్షి వెల్త్ స్టోరీ...ఐటీ, ఫైనాన్స్, స్టార్టప్లవ్యాప్తంగా ఒకప్పుడు పుష్కలంగా కొలువులు వచి్చనా... ఇప్పుడు ఉద్యోగమే ప్రశ్నార్థకంగా మారింది. నెలంతా అప్పులతో నెట్టుకొచ్చి జీతం రాగానే చెల్లించేసే చాలా మంది వేతన జీవులకు ఈ అనిశ్చితి సమస్యాత్మకంగా ఉంటోంది. వివిధ అవసరాల కోసం తీసుకున్న రుణాల ఈఎంఐలు గుదిబండగా మారుతున్నాయి. జీతాలు పెరిగినా పెరగకపోయినా.. పెరిగిపోయే స్కూలు, కాలేజీ ఫీజులు కట్టడమెలా అని తలపట్టుకుంటున్నారు. అటు పదవీ విరమణ చేసిన వారి సంగతి తీసుకుంటే వైద్యం ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. ఆర్థికంగా ఆసరాగా ఉంటుంది కదా అని ఫిక్స్డ్ డిపాజిట్లలో కాస్తో కూస్తో దాచుకున్నా.. దానిపై వచ్చే వడ్డీ అంతంతమాత్రమే. ఈ వడ్డీ పెరిగే ధరల భారాన్ని తట్టుకునేందుకు సరిపోయేట్లు ఏమాత్ర ఉండటం లేదు. ఇక చిరు వ్యాపార వర్గాలను చూస్తే.. రవాణా ఖర్చులు, మెటీరియల్ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. పైపెచ్చు వినియోగదారులు కొనుగోళ్లను తగ్గించుకుంటూ ఉండటంతో అమ్మకాలు పడిపోతూ పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతోంది. అయిదు హెచ్చరిక సంకేతాలు.. పరిస్థితి అదుపు తప్పుతోందనడానికి ఓ అయిదు హెచ్చరిక సంకేతాలు కనిపిస్తాయి. అవి కనిపించగానే, వెంటనే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాలి. ఇంతకీ ఆ హెచ్చరిక సంకేతాలేమిటంటే..1. క్రెడిట్ కార్డు బాకీలను ప్రతి నెలా క్యారీ ఫార్వార్డ్ చేస్తుండటం 2. ఈఎంఐల భారం ఆదాయంలో 40 శాతానికి పైగా ఉండటం 3. అత్యవసర నిధి అంటూ లేకపోవడం 4. వచ్చే ఆదాయంలో పొదుపు మొత్తం 10% కూడా లేకపోవడం5. ఆరోగ్య బీమా లేకపోవడం ఇలా చేద్దాం.. పరిష్కారం 1: ఒక ఏడాదికి సరిపడే అత్యవసర నిధి గతంలో ఎలాంటి అత్యవసరాన్నైనా ఎదుర్కోవాలంటే ఒక ఆరు నెలల ఖర్చులకు సరిపడా దాచిపెట్టుకుంటే సరిపోయేది. కానీ జాబ్ మార్కెట్లో అనిశ్చితి నెలకొనడం, హెల్త్ ఎమర్జెన్సీలు తలెత్తుతుండటం, ధరలు పరుగులు తీస్తున్న తరుణంలో కనీసం 9–12 నెలల అవసరాలకు సరిపోయేంత మొత్తాన్ని తక్షణం తీసుకోవటానికి వీలుగా పక్కన పెట్టుకోవడం అనివార్యం. ఈ మొత్తాన్ని లిక్విడ్ ఫండ్స్, సేవింగ్స్ అకౌంట్స్, ఫిక్సిడ్ డిపాజిట్ల రూపంలో భద్రపరుచుకోవచ్చు. పరిష్కారం 2: కొత్త భారీ రుణాలకు దూరం.. సాధ్యమైనంత వరకు భారీ స్థాయి రుణాలకు అంటే.. లగ్జరీ కార్ లోన్స్, వ్యక్తిగత రణాలు, ఈఎంఐలతో క్రెడిట్ కార్డుల మీద పెద్ద మొత్తాల్లో కొనుగోళ్లు చేయటం వంటి వాటికి దూరంగా ఉండటం శ్రేయస్కరం. పైగా వడ్డీ రేటు అధికంగా ఉండే అప్పును తీర్చేయడం లక్ష్యంగా పెట్టుకుంటే మరీ మంచిది. వడ్డీ రూపంలో కట్టాల్సిన ఒక్క రూపాయిని ఆదా చేసినా.. పన్నుల భారం లేకుండా కాస్త అదనపు ఆదాయాన్ని అందుకున్నట్లే.పరిష్కారం 3: ఈక్విటీల్లో క్రమంగా పెట్టుబడులుచారిత్రకంగా చూస్తే కరెన్సీ బలహీనపడినప్పుడల్లా బంగారం ఆదుకుంటూ వస్తోంది. పెరిగే ధరలను ఎదుర్కొనగలిగేలా ఈక్విటీలు.. అంటే షేర్లు మెరుగైన రాబడులు అందిస్తూ వస్తున్నాయి. కాబట్టి మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయనే కారణంతో పెట్టుబడులను ఆపేయకుండా సిప్ మార్గంలో ఇన్వెస్ట్ చేసే వారు.. కొనసాగిచడమే మంచిది. పరిష్కారం 4: బంగారంలో 10–15% పెట్టుబడి.. పసిడిలో ఎంతో కొంతైనా పెట్టుబడి పెడితే కష్టకాలంలో ఉపయోగపడుతుంది. కనుక మొత్తం పోర్ట్ఫోలియోలో ఓ 10–15% బంగారానికి కేటాయించండి. గోల్డ్ ఈటీఎఫ్లు, సావరీన్ గోల్డ్ బాండ్లలో (మళ్లీ ప్రవేశపెడితే) ఇన్వెస్ట్ చేయొచ్చు. కుటుంబ అవసరాల మేరకే ఫిజికల్ గోల్డ్ తీసుకోవచ్చు. లేకపోతే ఎల్రక్టానిక్ పద్ధతిలో కొనుక్కోవడమే శ్రేయస్కరం. సాధారణంగా రూపాయి బలహీనపడినప్పుడు, అంతర్జాతీయంగా అనిశ్చితి పెరిగినప్పుడు పసిడికి డిమాండ్ పెరుగుతుంది. పరిష్కారం 5: బీమా కవరేజీని సమీక్షించుకోవాలిప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్య బీమా, అలాగే ఆర్జించే కుటుంబ సభ్యుల పేరిట టర్మ్ పాలసీని తప్పనిసరిగా తీసుకోవాలి. అంతే కాదు.. కవరేజీ కూడా సరిపోయేంతగా ఉందో లేదో చూసుకోవాలి. ఎందుకంటే, ఏదైనా సంక్షోభం ముంచుకొస్తే తప్ప చాలా మందికి .. తాము తీసుకున్న బీమా కవరేజీ.. తమ అవసరాలకు సరిపోయేంతగా లేదనే విషయం తెలియదు. కాబట్టి పాలసీ తీసుకుని మర్చిపోవడం కాకుండా.. ప్రతి సంవత్సరం కవరేజీని సమీక్షించుకుంటూ, అవసరాన్ని బట్టి పెంచుకుంటూ ఉండాలి. పరిష్కారం 6: కొత్త నైపుణ్యాలు.. అనిశ్చితిని ఎదుర్కొనేందుకు ఇది అన్నింటికంటే ముఖ్యమైన పరిష్కారం. 40 ఏళ్ల పైబడిన ప్రొఫెషనల్స్ ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటూ, తమను తాము అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. ఏఐ గురించి తెలుసుకోవాలి. డిజిటల్ మార్కెటింగ్, డేటా అనలిటిక్స్, ఫైనాన్షియ్లల్ ప్లానింగ్ సర్టిఫికేషన్లు, తాము చేసే రంగాలకు సంబంధించి నైపుణ్యాలను పెంపొందించుకుంటూ ఉండాలి. తద్వారా పెట్టుబడులపై రాబడులు ఎలా ఉన్నా ఆదాయం అధికంగా ఉంటే ధరల దాడిని కొంత మేర అయినా సమర్ధంగా ఎదుర్కొనవచ్చు. పరిష్కారం 7: వివిధ ఆదాయ మార్గాలు కేవలం జీతం మీదే ఆధారపడితే సరిపోదు. వేరే వేరే ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టాలి. కన్సలి్టంగ్, ఫ్రీలాన్సింగ్, కంటెంట్ క్రియేషన్, ట్యూషన్లు, ఆన్లైన్ సరీ్వసులు.. ఇలా అదనంగా కనీసం ఒక్క ఆదాయ మార్గమైనా పక్కన ఉంటే... ఆర్థికంగా స్ట్రెస్ కాస్త తగ్గుతుంది. పరిష్కారం 8: ‘విదేశీ’ తగ్గించుకోవాలి రూపాయి పతనం వల్ల విదేశీ ప్రయాణాలు, చదువులు, దిగుమతి చేసుకున్న గ్యాడ్జెట్లు.. చాలా ఖరీదైన వ్యవహారంగా మారతాయి. కాబట్టి అనవసరమైన అప్గ్రేడ్స్ జోలికి వెళ్లకూడదు. వీలైనంత వరకు వాయిదా వేసుకోతగిన వాటి కొనుగోళ్లను వాయిదా వేసుకోవడం మంచిది. పరిష్కారం 9: నాణ్యమైన కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయాలి అనిశ్చితి నెలకొన్న వేళ.. పెట్టుబడుల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. బ్యాలెన్స్ షీటు పటిష్టంగా ఉన్నవి, స్థిరంగా క్యాష్ ఫ్లో ఉన్నవి, క్రమం తప్పకుండా డివిడెండ్లు చెల్లించే కంపెనీలను పరిశీలించి, అలాంటి షేర్లలో ఇన్వెస్ట్ చేయాలి. భారీగా రుణభారం ఉన్న స్పెక్యులేటివ్ స్టాక్స్ జోలికి పోవద్దు. పరిష్కారం 10: బిజినెస్లాగే బడ్జెట్ వ్యాపారం చేస్తుంటే ప్రతిదీ ఎలా లెక్కేస్తామో ఇంటి బడ్జెట్లోనూ అలాగే ఉండాలి. ఇంటి ఈఎంఐలు, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు, రవాణా, వినోదం ఇలా అన్నింటినీ ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. అనవసరమైన సబ్్రస్కిప్షన్లు, ఫుడ్ డెలివరీలు, ఆత్రం కొద్దీ కొనేసే వాటివల్ల ఎంత దుబారా అవుతోందనేది చాలా కుటుంబాలు గ్రహించవు. ఇలాంటి ఖర్చులను నివారిస్తే బోలెడు ఆదా అయినట్లే. -
కొత్త బీఎండబ్ల్యూ కారు: ధర ఎంతంటే?
బీఎండబ్ల్యూ కంపెనీ ఇండియన్ మార్కెట్లో 'ఎక్స్6 ఎమ్60ఐ ఎక్స్డ్రైవ్'ను లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 1.78 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఇది భారతదేశానికి సీబీయూ (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గం ద్వారా దిగుమతి అవుతుంది.బీఎండబ్ల్యూ ఎక్స్6 ఎమ్60ఐ ఎక్స్డ్రైవ్ కారు 4.4 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ వీ8 పెట్రోల్ ఇంజన్, 48V మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్ పొందుతుంది. ఇది 530 bhp పవర్, 750 Nm టార్క్ అందిస్తుంది. ఇది 4.3 సెకన్లలో 0-100 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ 250కిమీ/గం. ఇంజిన్ 8 స్పీడ్ స్టెప్ట్రానిక్ స్పోర్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పొందుతుంది.కొత్త బీఎండబ్ల్యూ ఎక్స్6 ఎమ్60ఐ ఎక్స్డ్రైవ్ కొంత అప్డేటెడ్ డిజైన్ పొందుతుంది. ఈ కారు ముందు భాగంలో ఎం షాడోలైన్ డీటైలింగ్తో కూడిన సన్నని అడాప్టివ్ ఎల్ఈడీ హెడ్లైట్స్, వర్టికల్ డబుల్ స్లాట్లు వంటివి మాత్రమే కాకుండా.. ప్రకాశవంతమైన M లోగోతో కూడిన బ్లాక్ కిడ్నీ గ్రిల్, గ్లాస్ బ్లాక్ ఎమ్ ఎక్స్టీరియర్ మిర్రర్స్, ఎమ్ స్పెషల్ సైడ్ స్కర్ట్లను కలిగి ఉంది. వెనుక వైపు.. సన్నని ఎల్ ఆకారపు ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్లు ఉన్నాయి. ఈ SUV రన్ ఫ్లాట్ టైర్లతో కూడిన 21 అంగుళాల ఎమ్ లైట్-అల్లాయ్ వీల్స్పై నడుస్తుంది.లోపలి భాగంలో.. ఒకే గ్లాస్ ప్యానెల్ కింద 12.3-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 14.9-అంగుళాల సెంట్రల్ టచ్స్క్రీన్ ఉంటాయి. ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ సరికొత్త బీఎండబ్ల్యూ ఆపరేటింగ్ సిస్టమ్ 8.5తో పనిచేస్తుంది, ఇది బీఎండబ్ల్యూ ఇంటెలిజెంట్ పర్సనల్ అసిస్టెంట్ ద్వారా టచ్, వాయిస్ నియంత్రణలకు మద్దతు ఇస్తుంది.సేఫ్టీ విషయానికి వస్తే.. ఈ కారులో ఆరు ఎయిర్బ్యాగ్లు, బ్రేక్ అసిస్ట్తో కూడిన ఏబీఎస్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్, ఆటో హోల్డ్తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్లు, క్రాష్ సెన్సార్లు, సైడ్-ఇంపాక్ట్ ప్రొటెక్షన్, ఎలక్ట్రానిక్ వెహికల్ ఇమ్మొబిలైజర్ ఉన్నాయి. -
మోదీ మాట.. రూ.13 వేలు తగ్గిన గోల్డ్ రేటు!
భారతదేశంలో ఇటీవల బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. పౌరులను ఒక సంవత్సరం పాటు బంగారం కొనుగోళ్లను వాయిదా వేయాలని చేసిన సూచన తర్వాత ఈ మార్పు చోటుచేసుకుందని నిపుణులు చెబుతున్నారు.మే 10న ప్రధానమంత్రి బంగారం కొనుగోలును ఒక ఏడాది వాయిదా వేయాలని చెప్పినప్పుడు, 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు సుమారు రూ.1,53,140గా ఉండగా, వెండి ధర కేజీ సుమారు రూ.2,62,350గా ఉంది. అయితే నేటికి (జూన్ 28) ఆ ధర బంగారం ధర రూ.1,39,873కి తగ్గగా, వెండి ధర రూ.2,16,541కి పడిపోయింది. అంటే.. మోదీ ప్రకటన తరువాత గోల్డ్ రేటు సుమారు రూ.13,267 తగ్గగా, వెండి దాదాపు రూ.45,809 తగ్గింది.భారత్లో బంగారం దిగుమతులు ఎక్కువగా ఉండటం వల్ల విదేశీ మారక ద్రవ్యంపై భారీ ఒత్తిడి పడుతోంది. ఈ పరిస్థితుల్లో విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి ప్రధాని మోదీ ప్రజలను ఉద్దేశించి అవసరం ఉంటే తప్పా.. బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలను వాయిదా వేయాలని కోరారు.ప్రధాని విజ్ఞప్తి తరువాత ప్రభుత్వం బంగారం, వెండి దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. దీని ద్వారా దిగుమతులను తగ్గించడంతో పాటు.. దేశీయ మార్కెట్పై నియంత్రణ సాధించాలని భావించారు. అనుకున్న విధంగానే.. ఈ నిర్ణయం వినియోగదారులపై తక్షణ ప్రభావం చూపించిందని తెలుస్తోంది. -
క్విడ్ ఫేస్లిఫ్ట్.. లాంచ్ డేట్ ఫిక్స్!
రెనాల్ట్ తన ఎంట్రీ-లెవల్ హ్యాచ్బ్యాక్ అయిన అప్డేటెడ్ క్విడ్ ఫేస్లిఫ్ట్ను జూలై 3న భారతదేశంలో విడుదల చేయనుంది. దశాబ్దానికి పైగా దేశంలో అమ్ముడవుతున్న క్విడ్ కారు కంపెనీకి చెందిన పాపులర్ మోడల్గా కొనసాగుతూ, దాని లైనప్లో కీలక పాత్ర పోషిస్తుంది.క్విడ్ ఫేస్లిఫ్ట్ కారుకు సంబంధించిన వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే.. ఇటీవల టెస్టింగ్ సమయంలో కనిపించిన స్పై షాట్లు ఫేస్లిఫ్ట్ క్విడ్ పూర్తిస్థాయి రీడిజైన్కు బదులుగా సూక్ష్మమైన స్టైలింగ్ మార్పులను పొందుతుందని సూచిస్తున్నాయి. వెహికల్ ముందు భాగం, రెనాల్ట్ బ్యాడ్జ్, టెయిల్ ల్యాంప్ల చుట్టూ క్యామోఫ్లాజ్తో కనిపించాయి. కాబట్టి ఇది కీలకమైన విజువల్ ఎలిమెంట్స్లో అప్డేట్లను సూచిస్తుంది.అప్డేటెడ్ మోడల్లో కొత్త గ్రిల్, బంపర్లు, కొత్త లైటింగ్ అంశాలు ఉంటాయని భావిస్తున్నారు. ఈ డిజైన్ డాసియా స్ప్రింగ్ ఈవీ నుంచి ప్రేరణ పొందవచ్చని, తద్వారా క్విడ్ను.. రెనాల్ట్ అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ డిజైన్ లాంగ్వేజ్కు అనుగుణంగా మార్చవచ్చని కూడా నివేదికలు సూచిస్తున్నాయి.లోపలి భాగంలో.. మొత్తం క్యాబిన్ అనుభవాన్ని మెరుగుపరచడానికి క్విడ్ ఫేస్లిఫ్ట్ కొన్ని చిన్న అప్డేట్లను పొందుతుందని సమాచారం. అధికారిక ఫీచర్ల జాబితా ఏదీ వెల్లడించనప్పటికీ, అప్డేటెడ్ మోడల్లో పెద్ద టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లభించే అవకాశం ఉంది.ఇంజిన్ పరంగా.. క్విడ్ ఫేస్లిఫ్ట్లో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. ఇది ప్రస్తుతం ఉన్న 1.0-లీటర్, త్రీ సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్తోనే కొనసాగుతుందని భావిస్తున్నారు. ఈ ఇంజిన్ 65 bhp పవర్, 96 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్మిషన్ ఆప్షన్లు కూడా అలాగే ఉంటాయని అంచనా వేస్తున్నారు, కొనుగోలుదారులు 5 స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్, 5 స్పీడ్ AMT మధ్య ఎంచుకోవచ్చు.కంపెనీ ఈ కారు ధరలను లాంచ్ సమయంలో వెల్లడించనుంది. ఇది ఎంట్రీ-లెవల్ హ్యాచ్బ్యాక్ విభాగంలో మారుతి సుజుకి ఆల్టో కె10, మారుతి సుజుకి సెలెరియో వంటి ప్రత్యర్థులతో పోటీని కొనసాగించనున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: E100 ఇంధనం.. నితిన్ గడ్కరీ కీలక ప్రకటన! -
ప్రపంచ కుబేరుడి విజయ గాథ!
ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన ఎలాన్ మస్క్ తన 55వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. సాంకేతికత, అంతరిక్ష పరిశోధనలు, ఎలక్ట్రిక్ వాహనాలు, కృత్రిమ మేధ (AI) వంటి రంగాల్లో చూపిన దూరదృష్టి ప్రపంచవ్యాప్తంగా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. వ్యాపారవేత్తగా మాత్రమే కాకుండా.. భవిష్యత్ సాంకేతిక ప్రపంచాన్ని రూపొందిస్తున్న వ్యక్తిగా కూడా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.బాల్యం, విద్యఎలాన్ మస్క్ 1971 జూన్ 28న దక్షిణాఫ్రికాలో జన్మించారు. చిన్నప్పటి నుంచే కంప్యూటర్లు, టెక్నాలజీపై ఆసక్తి పెంచుకున్న ఆయన 1989లో ఉన్నత విద్య కోసం కెనడాకు వెళ్లారు. అనంతరం అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్రం, ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీకి చేరినప్పటికీ, కేవలం రెండు రోజుల్లోనే దాన్ని వదులుకుని వ్యాపార రంగంలో అడుగుపెట్టారు.వ్యాపార ప్రస్థానం ప్రారంభం1995లో తన సోదరుడితో కలిసి 'జిప్2' అనే ఆన్లైన్ సిటీ గైడ్ సంస్థను స్థాపించారు. ఈ సంస్థను 1999లో విక్రయించడంతో మస్క్కు భారీ ఆర్థిక లాభం వచ్చింది. అయితే ఆ డబ్బును ఖర్చు చేయకుండా మరో వినూత్న ఆలోచనకు పెట్టుబడిగా పెట్టారు. ఆ తర్వాత 'X.com' అనే ఆన్లైన్ ఆర్థిక సేవల సంస్థను ప్రారంభించారు. తరువాత అది 'కాన్ఫినిటీ' సంస్థతో విలీనం చెంది ప్రపంచ ప్రఖ్యాత 'పేపాల్'గా మారింది. పేపాల్ను ఈబే కొనుగోలు చేయడంతో మస్క్కు వందల మిలియన్ల డాలర్లు లభించాయి.సాంకేతిక రంగంలో విప్లవాత్మక ప్రయాణంపేపాల్ ద్వారా సంపాదించిన సంపదను మస్క్ కొత్త ఆవిష్కరణల కోసం వినియోగించారు. అంతరిక్ష ప్రయాణాన్ని చౌకగా మార్చాలనే లక్ష్యంతో స్పేస్ఎక్స్ను స్థాపించారు. అదే సమయంలో విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లాను ప్రపంచంలోనే అగ్రస్థానానికి తీసుకెళ్లారు. అనంతరం ట్విట్టర్ను కొనుగోలు చేసి దానికి 'X'గా పేరు మార్చారు. కృత్రిమ మేధ అభివృద్ధి కోసం xAI సంస్థను కూడా స్థాపించారు.రిస్క్ తీసుకునే ధైర్యమే విజయ రహస్యంఎలాన్ మస్క్ విజయానికి ప్రధాన కారణం కొత్త ఆలోచనలను అమలు చేయడంలో ఆయన చూపిన ధైర్యం. ఇతరులు వెనుకడుగు వేసే పరిస్థితుల్లో కూడా ఆయన భారీ పెట్టుబడులు పెట్టి కొత్త అవకాశాలను సృష్టించారు. అందుకే ఆయన వ్యాపార ప్రయాణాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది యువ పారిశ్రామికవేత్తలు ఆదర్శంగా తీసుకుంటున్నారు.ఎలాన్ మస్క్ ప్రయాణం విజయాలతో పాటు వివాదాలకు కూడా వేదికైంది. రాజకీయ వ్యాఖ్యలు, సోషల్ మీడియా పోస్టులు, వ్యాపార నిర్ణయాల కారణంగా పలుమార్లు విమర్శలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ కొత్త సాంకేతిక ఆవిష్కరణలపై ఆయన దృష్టి మాత్రం మారలేదు. -
134 కోట్లకు టెలికం చందాదారులు
కొత్త టెలికం కస్టమర్లను ఆకర్షించడంలో ఎప్పటి మాదిరే ఎయిర్టెల్ ముందుంది. మే నెలలో 29.8 లక్షల మంది కొత్త సబ్స్క్రయిబర్లను (చందాదారులు/కస్టమర్లు) సొంతం చేసుకుంది.ఇందులో 29.26 లక్షల మంది మొబైల్ విభాగం నుంచి రాగా, 53,809 మంది కస్టమర్లు ఫిక్స్డ్లైన్ వినియోగదారులుగా ఉన్నారు. రిలయన్స్ జియో నెట్వర్క్ కిందకు 22.55 లక్షల మంది కొత్తగా వచ్చి చేరారు. ఇందులో 21.54 లక్షల మంది మొబైల్ విభాగం నుంచి రాగా, మిగిలిన వారు ఫిక్స్డ్ లైన్ విభాగం నుంచి ఉన్నారు. -
E100 ఇంధనం.. నితిన్ గడ్కరీ కీలక ప్రకటన!
ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని పెంచేందుకు భారత్ మరో కీలకమైన అడుగు వేసింది. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఈ100 (E100) ఇంధనానికి సంబంధించిన నిబంధనలకు ఆమోదం తెలిపారు. దీంతో మన దేశంలో ఇథనాల్ ఆధారిత వాహనాల వినియోగానికి మార్గం సుగమమైంది. ఇప్పటికే మారుతి సుజుకి, టయోటా, ఎంజీ, హ్యుందాయ్ వంటి ప్రముఖ వాహన తయారీ సంస్థలు E100 ఇంధనంతో నడిచే వాహనాలను అభివృద్ధి చేస్తున్నాయి.E100 ఇంధనంఈ100 అనేది దాదాపు 100 శాతం ఎథనాల్తో తయారైన ఇంధనం. ఇందులో సాధారణ పెట్రోల్ ఉండదు. ఇథనాల్ అనేది పునరుత్పాదక ఇంధనం. దీనిని చెరకు, మొక్కజొన్న, ధాన్యాలు, వ్యవసాయ వ్యర్థాలు వంటి వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారు చేస్తారు. ఈ ఇంధనంతో వాహనం పనిచేయాలంటే.. ప్రత్యేకంగా రూపొందించిన ఇంజిన్ ఉండాలి.ఈ100 ఇంధనం వల్ల లాభాలు➤విదేశీ చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది.➤దేశంలోనే ఉత్పత్తి అయ్యే ఇథనాల్ వినియోగం పెరుగుతుంది.➤రైతులకు చెరకు, మొక్కజొన్న వంటి పంటలకు మంచి డిమాండ్ ఏర్పడుతుంది.➤గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.➤దేశానికి ఇంధన భద్రత మెరుగుపడుతుంది.#WATCH | Nagpur, Maharashtra: Union Minister Nitin Gadkari says, “Last night at 8 PM, I signed the file, finalising the regulations to legally authorise the use of 100% ethanol. I am delighted to share that I, along with Hardeep Singh Puri, had the opportunity to launch the 100%… pic.twitter.com/BDIyTZGZF4— ANI (@ANI) June 13, 2026ప్రభుత్వం తెలిపిన ప్రకారం.. ఇథనాల్ మిశ్రమ ఇంధన విధానం వల్ల ఇప్పటికే రూ.1 లక్ష కోట్లకు పైగా విదేశీ చమురు దిగుమతి వ్యయం ఆదా కాగా, రైతులకు సుమారు రూ.80 వేల కోట్ల ఆదాయం లభించింది.E100 ఇంధనం పెట్రోల్ను పూర్తిగా భర్తీ చేయగలదా?భవిష్యత్తులో E100 పెట్రోల్కు ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉన్నప్పటికీ, అది వెంటనే సాధ్యం కాదు. ఎందుకంటే ప్రస్తుతం భారతదేశంలో ఉన్న కోట్లాది కార్లు, బైకులు, స్కూటర్లు ఈ100 ఇంధనాన్ని ఉపయోగించుకునే విధంగా తయారవ్వలేదు. కొన్ని ఈ20 ఇంధనం మాత్రమే ఉపయోగించుకోగలవు. కాబట్టి కొంతకాలం పాటు పెట్రోల్, E100 రెండూ కలిసి ఉపయోగంలో ఉంటాయి. భవిష్యత్తులో ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల సంఖ్య పెరిగే కొద్దీ E100 వినియోగం కూడా పెరుగుతుంది.E100 ఇంధనాన్ని సాధారణ వాహనాల్లో ఉపయోగించలేము. ఎందుకంటే ఇథనాల్ రసాయనిక లక్షణాలు పెట్రోల్ కంటే భిన్నంగా ఉంటాయి. అందువల్ల వాహనాల్లో ప్రత్యేక ఇంజిన్ ట్యూనింగ్ అవసరం. కొత్త ఇంజెక్టర్లు, బలమైన ఫ్యూయల్ పంపులు, ప్రత్యేక ఫ్యూయల్ పైపులు, ఇథనాల్ను తట్టుకునే భాగాలు అవసరం.ఇప్పటికే మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ నమూనాను అభివృద్ధి చేసింది. అలాగే టయోటా, ఎంజీ, హ్యుందాయ్, సుజుకి సంస్థలు కూడా ఇలాంటి వాహనాలను తయారు చేస్తున్నాయి. ద్విచక్ర వాహనాల్లో హీరో మోటోకార్ప్ స్ప్లెండర్, హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడళ్లను పరిచయం చేసింది.E100 ఇంధనం వల్ల వచ్చే సమస్యలు➤ఇథనాల్ శక్తి.. పెట్రోల్తో పోలిస్తే తక్కువ. కాబట్టి అదే దూరం ప్రయాణించడానికి ఎక్కువ ఇంధనం అవసరమవుతుంది.➤ప్రస్తుతం ఉన్న సాధారణ వాహనాల్లో ఈ100 ఉపయోగించలేము. ప్రత్యేక ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలే అవసరం.➤దేశవ్యాప్తంగా ఈ100 అందించాలంటే పెట్రోల్ బంకుల్లో కొత్త నిల్వ ట్యాంకులు, పంపులు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయాలి.భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లు➤దేశమంతటా ఈ100 అందించే ఇంధన కేంద్రాలను ఏర్పాటు చేయాలి.➤ఎక్కువ సంఖ్యలో ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలను మార్కెట్లోకి తీసుకురావాలి.➤ఇథనాల్ ఉత్పత్తిని స్థిరంగా పెంచుతూ వ్యవసాయ అవసరాలకు కూడా నష్టం కలగకుండా చూడాలి.➤ప్రజల్లో ఈ100 ఇంధనం గురించి అవగాహన పెంచాలి.భారతదేశం తన అవసరాలకు కావలసిన ముడి చమురులో ఎక్కువ భాగాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఇథనాల్ వినియోగాన్ని గణనీయంగా ప్రోత్సహిస్తోంది. -
ఆధార్, క్రెడిట్ కార్డులు.. జూలై 1 నుంచి కీలక మార్పులు
వచ్చే జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా పలు కీలక ఆర్థిక మార్పులు అమల్లోకి రానున్నాయి. ఇవి ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, ఆధార్ కార్డుదారులు, క్రెడిట్ కార్డు వినియోగదారులు, పాస్పోర్ట్ దరఖాస్తుదారులు, బ్యాంకు ఖాతాదారులపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా ఆధార్లో ఈమెయిల్ అప్డేట్కు ఉచిత అవకాశం, క్రెడిట్ కార్డుల రివార్డ్ పాయింట్లు, లాంజ్ యాక్సెస్ నిబంధనల్లో మార్పులు, పాస్పోర్ట్ ఫీజుల పెంపు, బ్యాంకుల మిస్-సెల్లింగ్పై ఆర్బీఐ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి.ఐటీఆర్ దాఖలుకు జూలై 31 చివరి తేదీ2025-26 ఆర్థిక సంవత్సరానికి (అసెస్మెంట్ ఇయర్ 2026-27) సంబంధించిన ఐటీఆర్-1, ఐటీఆర్-2 రిటర్నులు దాఖలు చేయడానికి జూలై 31, 2026 చివరి గడువు. గడువు దాటితే ఆలస్య రుసుములు, కొన్ని పన్ను విధానాలను ఎంచుకునే అవకాశాలపై పరిమితులు, అర్హత ఉన్న నష్టాలను తదుపరి సంవత్సరాలకు క్యారీ ఫార్వర్డ్ చేయడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.ఆధార్లో ఈమెయిల్ అప్డేట్యూఐడీఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఆధార్ మొబైల్ యాప్ ద్వారా నమోదిత ఈమెయిల్ చిరునామాను అప్డేట్ చేసుకునే సేవను పూర్తిగా ఉచితంగా అందించనుంది. దీని కోసం ఇప్పటి వరకు రూ.75 రుసుము ఉండేది. అయితే ఈ రాయితీ కేవలం అధికారిక ఆధార్ మొబైల్ యాప్ ద్వారా చేసే అప్డేట్లకే వర్తిస్తుంది.ఎస్బీఐ కార్డుల రివార్డ్ నిబంధనల్లో మార్పులుఫోన్పే ఎస్బీఐ క్రెడిట్ కార్డు PURPLE, SELECT BLACK కార్డులకు సంబంధించిన రివార్డ్ పాయింట్ల విధానంలో మార్పులు అమల్లోకి రానున్నాయి. రివార్డ్ పాయింట్లు పొందే లావాదేవీలపై కొత్త పరిమితులు విధించడంతో పాటు, పాయింట్లు లభించని లావాదేవీల జాబితాను కూడా విస్తరించారు.హెచ్డీఎఫ్సీ లాంజ్ యాక్సెస్హెచ్డీఎఫ్సీ బ్యాంకు క్రెడిట్ కార్డుదారులు ప్రతి క్యాలెండర్ త్రైమాసికంలో మూడు ఉచిత దేశీయ విమానాశ్రయ లాంజ్ సందర్శనలను పొందాలంటే, అంతకుముందు త్రైమాసికంలో కనీసం రూ.60,000 ఖర్చు చేసి ఉండాలి. ఉదాహరణకు జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి లాంజ్ సదుపాయం పొందాలంటే ఏప్రిల్-జూన్ మధ్య ఈ ఖర్చు పూర్తిచేయాల్సి ఉంటుంది.పాస్పోర్ట్ ఫీజుల పెంపుజూలై 1 నుంచి సాధారణ, తత్కాల్ పాస్పోర్ట్ల ఫీజులు పెరుగుతున్నాయి. తాజా నోటిఫికేషన్ ప్రకారం 36 పేజీల సాధారణ పాస్పోర్ట్ ఫీజు రూ.1,500 నుంచి రూ.2,500కు, తత్కాల్ ఫీజు రూ.3,500 నుంచి రూ.5,000కు పెరిగింది. ఇతర కేటగిరీల ఫీజులను కూడా కేంద్ర ప్రభుత్వం సవరించింది.బ్యాంకుల మిస్-సెల్లింగ్పై ఆర్బీఐ కఠిన చర్యలుబ్యాంకులు ఆర్థిక ఉత్పత్తులను తప్పుదోవ పట్టిస్తూ విక్రయించే ఘటనలను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ కొత్త ఫ్రేమ్వర్క్ను అమల్లోకి తెస్తోంది. ఈ నిబంధనల ప్రకారం మిస్-సెల్లింగ్కు గురైన వినియోగదారులు పూర్తి రీఫండ్తో పాటు జరిగిన నష్టానికి తగిన పరిహారం పొందే హక్కు కలిగి ఉంటారు. బ్యాంకులు ఉత్పత్తుల విక్రయంలో మరింత పారదర్శకత పాటించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు కూడా జూలై 1 నుంచే అమల్లోకి వస్తాయి. -
డెడ్లైన్ అలర్ట్: ఈ-కేవైసీ, ఐటీ రిటర్న్.. ఇంకా..
జూన్ నెల ముగింపునకు వచ్చేసింది. జూన్ 30 పలు కీలక విషయాలకు గడువు తేదీ. ఎల్పీజీ సబ్సిడీ పొందుతున్న లబ్ధిదారుల ఈ-కేవైసీ నుంచి ఆదాయపు పన్ను శాఖ పరిశీలన (స్క్రూటినీ) నోటీసుల వరకు, అలాగే త్రైమాసిక ముగింపు నేపథ్యంలో వ్యాపారాల జీఎస్టీ, టీడీఎస్ సంబంధిత సన్నాహాల వరకు పలు ముఖ్యమైన గడువులు ఈ నెలాఖరుతో ముగియనున్నాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే ఆర్థిక నష్టాలు లేదా పరిపాలనా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.ఎల్పీజీ సబ్సిడీ నిలిచిపోయే అవకాశంప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులు ప్రతి సంవత్సరం ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ఈ-కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే ఇప్పటివరకు ధ్రువీకరణ పూర్తి చేయని ఇతర ఎల్పీజీ సబ్సిడీ లబ్ధిదారులు కూడా జూన్ 30లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. లేనిపక్షంలో వారి బ్యాంకు ఖాతాల్లోకి సబ్సిడీ జమ కావడం తాత్కాలికంగా నిలిచిపోవచ్చు. అయితే గ్యాస్ సిలిండర్ బుకింగ్పై ఎలాంటి ప్రభావం ఉండదు. పూర్తి ధర చెల్లించి సిలిండర్ పొందవచ్చు. ఇప్పటికే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఈ-కేవైసీ పూర్తి చేసిన లేదా సబ్సిడీకి అర్హులు కాని వినియోగదారులు మళ్లీ ఈ ప్రక్రియ చేయాల్సిన అవసరం లేదు.ఐటీఆర్ స్క్రూటినీ నోటీసులకు కీలకం2025-26 ఆర్థిక సంవత్సరానికి దాఖలైన ఆదాయపు పన్ను రిటర్నులపై సెక్షన్ 143(2) కింద స్క్రూటినీ నోటీసులు జారీ చేయడానికి ఆదాయపు పన్ను శాఖకు జూన్ 30 చివరి గడువు. ఇది పన్ను చెల్లింపుదారులు రిటర్న్ దాఖలు చేయాల్సిన గడువు కాదు. కేవలం ఇప్పటికే దాఖలైన రిటర్నులను పరిశీలనకు ఎంపిక చేస్తే నోటీసులు పంపేందుకు శాఖకు ఉన్న చట్టబద్ధమైన చివరి తేదీ మాత్రమే. రిటర్నులో చూపిన వివరాలు, ఫారం 26AS, AIS, TIS, బ్యాంకు లావాదేవీలు లేదా అధిక విలువ గల ఆర్థిక లావాదేవీల మధ్య వ్యత్యాసాలు కనిపిస్తే స్క్రూటినీకి ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. ఇటీవల కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (CBDT) కూడా జూన్ 30నే ఈ గడువుగా స్పష్టం చేసింది.వ్యాపారాలకు త్రైమాసిక ముగింపుజూన్ 30తో 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్) ముగియనుంది. దీంతో కంపెనీలు, వ్యాపార సంస్థలు తమ ఖాతాల పుస్తకాలు, టీడీఎస్, టీసీఎస్ నమోదులు, జీఎస్టీ రికార్డులు, ఇతర చట్టబద్ధమైన లెక్కలను నవీకరించుకోవాల్సి ఉంటుంది. తద్వారా జూలైలో దాఖలు చేయాల్సిన జీఎస్టీ రిటర్నులు, టీడీఎస్/టీసీఎస్ స్టేట్మెంట్లను సకాలంలో సమర్పించేందుకు వీలు కలుగుతుంది.ఈ గడువులను చివరి నిమిషానికి వాయిదా వేయకుండా ముందుగానే పూర్తి చేస్తే అనవసరమైన జరిమానాలు, సబ్సిడీ జాప్యాలు, పన్ను సంబంధిత ఇబ్బందులను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. -
బంగారం, వెండి ధరలు ఇప్పుడిలా..
దేశంలో రెండు రోజులుగా భారీగా పెరిగిన పసిడి ధరలు ధరలు నేడు (Today Gold Rate) నిలకడగా ఉన్నాయి. దీంతో ఈరోజు బంగారం కొనేవాళ్లకు కాస్త ఉపశమనం లభించింది. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. -
150 మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు షాక్.. అందరూ లేఆఫ్
అమెరికాకు చెందిన రిటైల్ టెక్నాలజీ సంస్థ హై-వీ (Hy-Vee) భారత్లోని తన ఇంజినీరింగ్ సెంటర్ను ఆకస్మికంగా మూసివేయడంతో సుమారు 150 మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఒక్కరాత్రిలోనే ఉద్యోగాలు కోల్పోయారు. ఉద్యోగులను రాత్రి 9 గంటలకు మైక్రోసాఫ్ట్ టీమ్స్ వీడియో కాల్కు ఆహ్వానించిన సంస్థ, రీస్ట్రక్చరింగ్లో భాగంగా భారత ఇంజినీరింగ్ కార్యకలాపాలను వెంటనే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఉద్యోగులకు ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండానే వారి కార్పొరేట్ యాక్సెస్ కూడా నిలిపివేయబడింది.ఈ ఘటనపై మాజీ ఉద్యోగి ఒకరు రెడ్డిట్లో చేసిన పోస్ట్ వైరల్గా మారింది. ఇంటర్న్గా చేరి దాదాపు రెండేళ్లలో పూర్తి స్థాయి సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఎదిగిన తాను, "ఒక్క సమావేశంతో అంతా ముగిసిపోయింది" అని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా సంస్థ నుంచి సెవరెన్స్ ప్యాకేజీ లేదా ఎటువంటి ఆర్థిక పరిహారం కూడా అందలేదని పేర్కొన్నాడు. రియాక్ట్, నోడ్ జేఎస్, జావా స్క్రిప్ట్, టైప్ స్క్రిప్ట్ వంటి టెక్నాలజీల్లో పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ, ఒక్కసారిగా ఉద్యోగం కోల్పోవడం తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసిందని తెలిపాడు.ఈ అకస్మాత్తు తొలగింపులపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరిగింది. ఉద్యోగులకు కనీస నోటీసు లేకుండా మొత్తం టీమ్ను తొలగించడం చట్టబద్ధమేనా? అనే ప్రశ్నలు నెటిజన్లు లేవనెత్తుతున్నారు. కొందరు ఉద్యోగుల ఆరోపణల ప్రకారం, తొలగింపుల అనంతరం సంస్థ భారత విభాగానికి సంబంధించిన లింక్డ్ఇన్ పేజీతో పాటు పలు పోస్టులను కూడా తొలగించినట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణలపై సంస్థ అధికారికంగా స్పందించలేదు.ఇదిలా ఉండగా, హై-వీ ఇండియా ఇంజినీరింగ్ డైరెక్టర్ అమిత్ గోయల్ లింక్డ్ఇన్లో స్పందిస్తూ, భారత ఇంజినీరింగ్ కేంద్రాన్ని మూసేసినట్లు ధ్రువీకరించారు. ప్రభావితమైన ఇంజినీర్లు అత్యుత్తమ ప్రతిభ కలిగినవారని, వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సహకరించాలని తన పరిచయ వర్గాలను కోరారు. అయితే ఉద్యోగుల ఆరోపణల్లో పేర్కొన్న సెవరెన్స్ ప్యాకేజీ, నోటీసు వంటి అంశాలపై సంస్థ ఇప్పటివరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.ఇదీ చదివారా? ఐటీ కంపెనీలు కనుమరుగవుతాయా? -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంత్ అంబానీ
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ అనంత్ అంబానీ దుర్శించుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున తిరుమలలోని శ్రీవారి ఆలయంలో నిర్వహించిన సుప్రభాత సేవలో ఆయన పాల్గొన్నారు. అనంతరం శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ అధికారులు సంప్రదాయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికి, దర్శనానంతరం వేద పండితుల ఆశీర్వచనం అందజేశారు. అలాగే శ్రీవారి తీర్థప్రసాదాలు అందించి సత్కరించారు.అనంత్ అంబానీ అంతకుముందు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానాలకు భారీ విరాళాన్ని ప్రకటించారు. రూ.27.5 కోట్లతో 25 ఎలక్ట్రిక్ బస్సులను అందించనున్నట్లు వెల్లడించారు. ఆ బస్సుల నిర్వహణ, డ్రైవర్ల జీతభత్యాలు కూడా తామే భరిస్తామన్నారు.ఈ 25 ఎలక్ట్రిక్ బస్సులను నడిపే 50 మంది బస్సు డ్రైవర్ల జీతభత్యాలు చెల్లించడంతో పాటు, తిరుమలలో ఛార్జింగ్ స్టేషన్ను రిలయన్స్ ఏర్పాటు చేయనుంది. గుజరాత్లోని వంతారా తహరాలో టీటీడీ గోశాలను ఆధునికీకరించేందుకు అంగీకారం తెలినట్లుగా తెలుస్తోంది. -
కొత్త కారు: సిట్రోయెన్ నుంచి ‘ఎయిర్క్రాస్ కంఫర్ట్’ ఎడిషన్
హైదరాబాద్: ఆటోమొబైల్ సంస్థ సిట్రోయెన్ ఇండియా, బ్రాండ్ యొక్క 108వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా తన ఎస్యూవీ ‘ఎయిర్క్రాస్ కంఫర్ట్ ఎడిషన్’ను పరిమిత సంఖ్యలో విడుదల చేసింది. ఎక్స్ షోరూం ప్రారంభ ధర రూ. 9.09 లక్షలుగా ఉంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ లోని అన్ని వేరియంట్లలో ప్రీమియం ‘మెట్రోపాలిటాన్ బీజ్ లెదరేట్ ఇంటీరియర్లను’ ప్రామాణికంగా చేర్చి కేబిన్ కంఫర్ట్ను మరింత పెంచారు.వినియోగదారుల బడ్జెట్కు తగినట్లుగా ఇందులో యూ, ప్లస్, మ్యాక్స్ పేర్లతో మూడు ప్రత్యేక యాక్ససరీ ప్యాక్లను పరిచయం చేశారు. వీటి ద్వారా 10 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, వైర్లెస్ ఛార్జర్, ప్రీమియం జేబీఎల్ స్పీకర్లు జోడించారు. భద్రత కోసం ఫ్రంట్ కొలిషన్ హెచ్చరికలు చేసే అడ్వాన్స్డ్ డాష్ క్యా మ్ను అదనంగా పొందవచ్చు. ఈ ఆకర్షణీయమైన మోడల్ బు కింగ్లు దేశవ్యాప్తంగా ఉన్న డీలర్షిప్లలో, అధికారిక డిజిటల్ వేదికలలో ఇప్పటికే ప్రారంభమయ్యాయి. డెలివరీలు కూడా త్వరలోనే ప్రారంభం కానున్నట్లు కంపెనీ పేర్కొంది. -
ఏఐ.. రూ.450 లక్షల కోట్లు
ఏఐ. ఓ అనూహ్యమైన ఎకానమీని సృష్టిస్తోంది. ఈ రెండక్షరాల చుట్టూ అల్లుకున్న ఆర్థిక వ్యవస్థ... వచ్చే పదేళ్లలో ఏకంగా 5 ట్రిలియన్ డాలర్ల (రూ.450 లక్షల కోట్లు) వ్యాపార అవకాశాల్ని అందించబోతోంది. ఇక ఈ ఎకోసిస్టమ్లో ఎదిగే కంపెనీల విలువైతే దీనికి వందరెట్ల పైనే ఉంటుందన్నది ఇన్వెస్ట్మెంట్ నిపుణుల అంచనా. బహుశా! పారిశ్రామిక విప్లవం తరవాత ప్రపంచం చవిచూస్తున్న అతిపెద్ద మార్పు ఇదే కావచ్చు. ఏఐ ఎంతవేగంగా మారుతోందంటే... ఇపుడిది చాట్బోట్లకో, సాఫ్ట్వేర్ ఆటోమేషన్కో పరిమితం కాదు. తయారీ, విద్య, వైద్యం, ఫైనాన్స్, వ్యవసాయం, లాజిస్టిక్స్, డిఫెన్స్, శాస్త్రీయ పరిశోధన.. ఇలా అన్నిటికీ వెన్నెముకే. ఇపుడు పోటీ మెరుగైన ఏఐ మోడల్ను సృష్టించడానికి కాదు. మొత్తం ఏఐ వ్యవస్థను చేతుల్లో ఉంచుకోవటానికి. సెమీ కండక్టర్ల నుంచి డేటా సెంటర్లు, క్లౌడ్ ఇన్ఫ్రా, డిజిటల్ ట్విన్స్, అటానమస్ సిస్టమ్స్, పారిశ్రామిక ఏఐ, రోబోటిక్స్... ప్లస్ నైపుణ్యం ఎవరి చేతుల్లో ఎక్కువ ఉంటాయన్నదే నియంత్రణాధికారానికి నిదర్శనం. ఈ అధికారం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, కార్పొరేట్లు బిలియన్ల డాలర్లను కుమ్మరిస్తున్నాయి. ప్రస్తుత పరిశ్రమల్ని మార్చటంతో పాటు కొత్త పరిశ్రమల్ని సృష్టించే ఏఐ వల్ల 2030 నాటికి ప్రపంచ జీడీపీ 15 ట్రిలియన్ డాలర్లు జతపడుతుందన్నది ఆర్థిక నిపుణుల అంచనా. ఈ నేపథ్యంలో అసలు ఏఐ ఎన్ని రకాలు? వీటి అవసరాలేంటి? ఆ అవసరాలను అల్లుకుని ఎదుగుతున్న కంపెనీలేంటి? వాటి వ్యాపారమెంత? విలువెంత? అంతర్జాతీయ దిగ్గజాలెవరు? లాభపడే కంపెనీలేంటి?ఇదీ.. ఏఐ సామ్రాజ్య స్వరూపంచిప్ అండ్ సిలికాన్ (సెమీ కండక్టర్లు, జీపీయూలు, నెట్వర్కింగ్ సిలికాన్)ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (సర్వర్లు, స్టోరేజీ, కూలింగ్, విద్యుత్తు) క్లౌడ్ అండ్ ప్లాట్ఫామ్స్ (కంప్యూటింగ్, క్లౌడ్, మెషీన్ లెర్నింగ్ ఆపరేషన్స్, హోస్టింగ్ఫౌండేషన్ మోడల్స్ (లార్జ్ మోడల్స్, ట్రెయినింగ్, మరింత మెరుగుపరచటంఏఐ అప్లికేషన్లు (ఎంటర్ప్రైజ్ ఏఐ, వినియోగదారుల ఏఐ, పారిశ్రామిక ఏఐ తదితరాలు)ఏఐ ఏజెంట్లు అండ్ అటానమీ (స్వతంత్ర వ్యవస్థలు, ఏజెంట్లు, రోబోటిక్స్)సాక్షి, బిజినెస్ -
వైదొలగనున్న కోటక్ బ్యాంక్ సీఈవో వాస్వానీ
ముంబై: కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ, సీఈవో అశోక్ వాస్వానీ తన పదవి నుంచి తప్పుకోనున్నారు. ప్రస్తుత మూడేళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత పునర్నియామకాన్ని కోరే యోచన లేదని ఆయన బోర్డుకు తెలియజేసినట్లు సంస్థ వెల్లడించింది. ఇందుకు బోర్డు ఆమోదముద్ర వేసినట్లు వివరించింది. 2024 జనవరి 1న కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ, సీఈవోగా బాధ్యత లు చేపట్టిన వాస్వానీ పదవీకాలం ఈ ఏడాది (2026) డిసెంబర్ 31తో ముగియనుంది. వాస్వానీ గతంలో బార్క్లేస్, సిటీ గ్రూప్ తదితర అంతర్జాతీయ సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అటు తర్వాత అప్పటి కోటక్ మహీంద్రా బ్యాంకు సీఈవో దీపక్ గుప్తా స్థానంలో చేరారు. రేసులో కాశ్యప్, అనూప్ సాహా: అశోక్ వాస్వానీ వారసుణ్ని ఎంపిక చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనట్లు సమాచారం. వాస్వానీ స్థానంలో బాధ్యతలు తీసుకునేందుకు కీలకమైన ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. కోటక్ బ్యాంక్లో చిరకాలంగా వివిధ హోదాల్లో పని చేసిన పరితోష్ కాశ్యప్ గతేడాదే హోల్ టైమ్ డైరెక్టరుగా నియమితులయ్యారు. ఆయన హోల్సేల్ బ్యాంకింగ్ బిజినెస్ని పర్యవేక్షిస్తున్నారు. ఆయనతో పోలిస్తే బ్యాంకులో అనూప్ సాహా కొంత కొత్త వారు. గతంలో బజాజ్ ఫైనాన్స్ సీఈవోగా పని చేశారు. ప్రస్తుతం హోల్ టైమ్ డైరెక్టరుగా కన్జూమర్ బ్యాంకింగ్, మార్కెటింగ్ తదితర విభాగాలను పర్యవేక్షిస్తున్నారు. -
ఐటీ ఆదాయాలకు ఏఐ బూస్ట్
న్యూఢిల్లీ: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవల రంగంలో దాదాపు పావు శాతం పైగా కంపెనీలు కృత్రిమ మేథ (ఏఐ)పై ప్రయోగాలు చేసే దశ నుంచి వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం వైపు మళ్లాయి. తద్వారా ఆ సంస్థలు ఇప్పటికే ఏఐ సర్వీసుల ద్వారా 10–12 బిలియన్ డాలర్ల ఆదాయాలను ఆర్జిస్తున్నాయి. దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ న్యూయార్క్ సిటీలో నిర్వహించిన సీఈవోల సదస్సులో పరిశ్రమ దిగ్గజాలు ఈ మేరకు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఏఐ వినియోగం పెరగడం వల్ల సంప్రదాయ ఐటీ సేవలకు ప్రాధాన్యం తగ్గిపోతుందన్న ఆందోళనలను వారు తోసిపుచ్చారు. ఐటీ వల్ల ఉత్పాదకత పెరుగుతుందని, పదే పదే పునరావృతమయ్యే పనులను చేయడం తగ్గుతుందని వివరించారు.. ఏఐ గవర్నెన్స్, అప్లికేషన్ల ఆధునీరణ, సైబర్సెక్యూరిటీ మొదలైన వాటికి డిమాండ్ పెరుగుతుందని నాస్కామ్ తెలిపింది. ఏఐలో శిక్షణ పొందిన ప్రొఫెషనల్స్ 20 లక్షల మంది పైగా ఉండగా, అధునాతన ఏఐలో ట్రైనింగ్ తీసుకున్న వారు లక్ష నుంచి రెండు లక్షల మంది ఉంటారని పేర్కొంది. ప్రస్తుతం 85 శాతం టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్స్ వద్ద ఏజెంటిక్ ఏఐ ప్లాట్ఫాంలు ఉన్నట్లు వివరించింది. ఏజెంటిక్ ఏఐతో టెక్ సేవలకు డిమాండ్ ఏజెంటిక్ ఏఐతో సైబర్సెక్యూరిటీ, గవర్నెన్స్, కార్యకలాపాల ఆధునీకరణ తదితర విభాగాల్లో డిమాండ్ నెలకొంటుందని నాస్కామ్ తెలిపింది. దీనితో 2030 నాటికి టెక్నాలజీ సర్వీసులపై 300 – 400 బిలియన్ డాలర్ల మేర అదనంగా వెచ్చించే అవకాశం ఉందని వివరించింది. ఏఐని వినియోగంలోకి తెచ్చే క్రమంలో టెక్నాలజీని బాధ్యతాయుతంగా విస్తరించేందుకు కంపెనీలకు స్పెషలిస్ట్ పార్ట్నర్లు అవసరమవుతారని నాస్కామ్ ప్రెసిడెంట్ రాజేశ్ నంబియార్ తెలిపారు. మోడల్స్, అప్లికేషన్స్, డేటా ప్లాట్ఫామ్లు, సైబర్సెక్యూరిటీ నియంత్రణలు, పరిశ్రమ వ్యవస్థలు మొదలైన వాటన్నింటినీ అనుసంధానించే విశ్వసనీయమైన మోడల్ని రూపొందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇదంతా కూడా సురక్షితంగా, సమర్ధవంతంగా జరిగేలా చూడటంలోనే ఐటీ సర్వీసుల అసలు సామర్థ్యాలు బైటపడతాయని చెప్పారు. రాబోయే రోజుల్లో సిబ్బంది సంఖ్యను పెంచుకోవడం కాకుండా డొమైన్ సంబంధ సొల్యూషన్స్ కనుగొనడం, ఫలితాలను కచ్చితంగా డెలివర్ చేయడంపైనే ఐటీ పరిశ్రమ వృద్ధి ఆధారపడి ఉంటుందని నంబియార్ తెలిపారు. బిజినెస్ ప్రాసెస్ సర్వీసులనేవి పనులను రొటీన్గా చేయడం కాకుండా తెలివిగా పూర్తి చేసే విధానాలకు మళ్లుతాయని కాగి్నజెంట్ సీఈవో ఎస్ రవి కుమార్ తెలిపారు. -
భారత కంపెనీలకు ఉపశమనం
న్యూఢిల్లీ: పశ్చిమాసియా ఘర్షణల కారణంగా భారత కంపెనీల లాభాదాయకత ముందు అంచనా వేసిన స్థాయిలో ప్రభావితం కాకపోవచ్చని క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది. యూఎస్–ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగడంతోపాటు, ఇంధన సరఫరాలు సాధారణ స్థితికి రావడంపైనే ఈ ప్రభావం ఆధారపడి ఉంటుందని తెలిపింది. పశ్చిమాసియా సంక్షోభంతో 2026–27 ఆర్థిక సంవత్సరంలో భారత కంపెనీల నిర్వహణ మార్జిన్లు 100 బేసిస్ పాయింట్లు (ఒక శాతం) తగ్గిపోవచ్చని తాజాగా ప్రకటించింది. వాస్తవానికి ఘర్షణలు ఎక్కువ కాలం పాటు కొనసాగొచ్చని, హర్మూజ్ జలసంధి ఇప్పట్లో తెరుచుకోకపోవచ్చన్న అంచనా ఆధారంగా.. కంపెనీల లాభదాయకత 200 బేసిస్ పాయింట్లు తగ్గిపోవచ్చని క్రిసిల్ రేటింగ్స్ లోగడ పేర్కొనడం గమనార్హం. అమెరికా–ఇరాన్ మధ్య ఈ నెలలో కుదిరిన అవగాహన ఒప్పందంతో హర్మూజ్ జలసంధి తెరుచుకోవడం తెలిసిందే. దీంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు గణనీయంగా దిగొచ్చాయి. బ్రెంట్ బ్యారెల్ 73 డాలర్ల స్థాయికి పడిపోయింది. యుద్ధ సమయంలో ఒక దశలో 121 డాలర్ల వరకు వెళ్లడం చూశాం. అయితే, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయంటూ, గ్యాస్ సరఫరా సాధారణ స్థాయికి చేరుకునేందుకు చాలా కాలమే పట్టొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. కార్పొరేట్ ఇండియా సరఫరా వైవిధ్యంపై దృష్టి సారించాల్సి ఉంటుందని పేర్కొంది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు సగటున 80–85 డాలర్ల స్థాయిలో ఉండొచ్చని పేర్కొంది. కొన్ని రంగాలపై ఎక్కువ ప్రభావం.. పశ్చిమాసియా ఘర్షణలతో 22 రంగాల కంపెనీల లాభదాయకతపై ఎక్కువ ఒత్తిడి పడొచ్చని క్రిసిల్ లోగడ అంచనా వేయగా.. ఇప్పుడు పది రంగాలపైనే ఈ ప్రభావం చెప్పకోతగ్గ స్థాయిలో ఉంటుందని తెలిపింది. అంతేకానీ, భారీగా ఆదాయం, లాభాలు తగ్గడం ఉండదని స్పష్టం చేసింది. ఎయిర్లైన్స్ (విమానయాన సంస్థలు), సిరామిక్స్, పాలిస్టర్ టెక్స్టైల్స్, స్పెషాలిటీ కెమికల్స్, ప్యాకేజింగ్, వజ్రాల పాలిíÙంగ్ కంపెనీలపై ఎక్కువగా ఒత్తిళ్లు ఉండొచ్చంటూ.. వీటికి ధరల నిర్ణయంలో వెసులుబాటు లేకపోవడం, సరఫరా సమస్యలు, అధిక ముడి సరకుల వ్యయాలు, బలహీన లాభదాయకత, అధిక మూలధన అసవసరాలు, బలహీన బ్యాలన్స్ షీట్లను కారణాలుగా పేర్కొంది. దీంతో ఈ కంపెనీల క్రెడిట్ రేటింగ్ ప్రతికూలంగా మారే రిస్క్ లేకపోలేదని తెలిపింది. ముడి చమురు ధరలు దిగిరావడం, గ్యాస్ సరఫరాలు మెరుగుపడడం చాలా రంగాలకు ఉపశమనాన్నిస్తుందని అంచనా వేసింది. దీనికితోడు ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై నిధులు ఖర్చు చేస్తుండడం, దేశీ వినియోగ డిమాండ్ ఆదాయ వృద్ధికి అనుకూలిస్తాయని తెలిపింది. అత్యవసర రుణ హామీ పథకం (ఈసీఎల్జీఎస్) 5.0 కింద రూ.2.55 లక్షల కోట్ల అదనపు రుణ సాయం, ఎయిర్లైన్స్కు ప్రత్యేకంగా రూ.5,000 కోట్లు అన్నవి నిధుల అవసరాలను తీరుస్తాయని అభిప్రాయపడింది. లాభాల్లోకి చమురు కంపెనీలు ఇంధన ధరలు తగ్గడంతో ఆయిల్ మార్కెటింగ్, ఎరువుల కంపెనీలు ఎక్కువగా ప్రయోజనం పొందుతాయని క్రిసిల్ నివేదిక అంచనా వేసింది. ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు మార్చి నుంచి మే మధ్య రూ.40,000–45,000 కోట్ల నష్టాలను ఎదుర్కొన్నాయని, ధరలు దిగిరావడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అవి నిర్వహణ లాభంలోకి తిరిగి అడుగు పెడతాయని తన నివేదికలో వెల్లడించింది. ప్రధానంగా రెండు రిస్్కలు పొంచి ఉన్నట్టు తెలిపింది. యూఎస్–ఇరాన్ ఒప్పందం ముందుకు వెళ్లకుండా, ఘర్షణలు తిరిగి మొదలు కావడం ఒకటి కాగా.. ఎల్నినో కారణంగా వర్షాలు బలహీనపడితే గ్రామీణ వినియోగం సన్నగిల్లుతుందని అంచనా వేసింది. -
పర్సిస్టెంట్ సిస్టమ్స్ చేతికి నగారో
న్యూఢిల్లీ: భారత ఐటీ దిగ్గజం పర్సిస్టెంట్ సిస్టమ్స్ అంతర్జాతీయంగా భారీ కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. జర్మనీకి చెందిన ప్రముఖ డిజిటల్ ఇంజినీరింగ్ సంస్థ నగారో ఎస్ఈను పూర్తిగా స్వా«దీనం చేసుకోనున్నట్లు ప్రకటించింది. తమ అనుబంధ సంస్థ గెలాక్సీ జర్మనీ హోల్డింగ్ ఎస్ఈ .. నగారో షేర్ల పూర్తిగా కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ఇందుకోసం ఒక్కో షేరుకు 81 యూరోల చొప్పున నగదు రూపంలో ఆఫర్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ డీల్ విలువ సుమారు 1.3 బిలియన్ డాలర్లుగా ఉంటుందని, 2027 మార్చి ఆఖరు నాటికి పూర్తి కావొచ్చని అంచనా. ఈ వ్యూహాత్మక విలీనంతో సుమారు 2.9 బిలియన్ డాలర్ల (రూ.24 వేల కోట్లకు పైగా) వార్షిక ఆదాయ సామర్థ్యంతో ప్రపంచ ఏఐ ఆధారిత డిజిటల్ ఇంజినీరింగ్ రంగంలో అగ్రశ్రేణి సంస్థల్లో ఒకటిగా పర్సిస్టెంట్ అవతరించనుంది. పర్సిస్టెంట్–నగారోకి ఉమ్మడిగా ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లో 46 వేల మంది పైగా ఐటీ ఉద్యోగులు ఉంటారు. వీరిలో అత్యధికంగా 37 వేల మంది భారత్లో, ఉత్తర అమెరికాలో 3,500 మంది, యూరప్లో సుమారు 3,000 మంది ఉంటారని సంస్థ తెలిపింది. ఈ లావాదేవీకి సంబంధించి ఇరు సంస్థలు ఇప్పటికే బిజినెస్ కాంబినేషన్ అగ్రిమెంట్పై సంతకాలు చేశాయి. -
ఐటీసీ వార్షిక వినియోగదారుల వ్యయం రూ.37,000 కోట్లు
న్యూఢిల్లీ: దేశీయ దిగ్గజ సంస్థ ఐటీసీ ఎఫ్ఎమ్సీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్) విభాగంలో తన తన దూకుడును కొనసాగిస్తోంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఐటీసీకి చెందిన ఎఫ్ఎమ్సీజీ ఉత్పత్తులపై వినియోగదారులు చేసిన మొత్తం వార్షిక వ్యయం 8.8 శాతం పెరిగి రూ.37,000 కోట్లకు చేరిందని కంపెనీ తన తాజా వార్షిక నివేదికలో వెల్లడించింది. భారత్లోనే నెంబర్వన్ ఎఫ్ఎమ్సీజీ కంపెనీగా అవతరించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్న ఐటీసీ ఉత్పత్తులు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 28 కోట్ల కుటుంబాలకు చేరుతున్నాయని తెలిపింది. మూడేళ్లుగా తిరుగులేని వృద్ధి గడిచిన మూడేళ్లుగా ఐటీసీ ఎఫ్ఎమ్సీజీ ఉత్పత్తులపై వినియోగదారుల వ్యయం స్థిరమైన వృద్ధి రేటును నమోదు చేస్తోంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.29,000 కోట్లుగా ఉండగా, 2023–24లో 12% వృద్ధితో రూ.32,500 కోట్లకు చేరింది. 2024–25లో మరో 4.6 % పెరిగి రూ.34,000 కోట్లకు చేరగా, 2025–26లో రూ.37,000 కోట్ల మార్కును దాటింది. 2022–23 నుంచి 2024–25 మధ్య రెండేళ్లలోనే వినియోగదారుల వ్యయం సుమారు రూ.5,000 కోట్ల మేర పెరిగినట్లు కంపెనీ పేర్కొంది. ∙2025–26 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్ఎమ్సీజీ వ్యాపారం ద్వారా ఐటీసీ రూ.24,209.75 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 10.1 శాతం అధికం. కంపెనీ లెక్కల ప్రకారం, వార్షిక వినియోగదారుల వ్యయంలో బ్రాండ్ల నికర అమ్మకాలు, పంపిణీ మార్జిన్లు, పన్నులు కూడా భాగంగా పరిగణిస్తారు. మార్కెట్లో 30కి పైగా ప్రసిద్ధ బ్రాండ్లు ప్రస్తుతం ఐటీసీ ఎఫ్ఎమ్సీజీ పోర్ట్ఫోలియోలో ఆశీర్వాద్, బింగో, సన్ఫీస్ట్, క్లాస్మేట్, యిప్పీ, మంగళ్దీప్ వంటి దాదాపు 30కి పైగా ప్రసిద్ధ బ్రాండ్లు ఉన్నాయి. వీటిలో ఆశీర్వాద్ (గోధుమ పిండి), బింగో (స్నాక్స్), సన్ఫీస్ట్ (క్రీమ్ బిస్కెట్లు), క్లాస్మేట్ (నోట్బుక్స్) తమ తమ విభాగాల్లో దేశంలోనే ప్రథమ స్థానంలో కొనసాగుతున్నాయి. వినియోగదారుల మారుతున్న అలవాట్లకు అనుగుణంగా ఐటీసీ గడిచిన ఆర్థిక సంవత్సరంలోనే మార్కెట్లోకి దాదాపు 100 కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయడం విశేషం. పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా కీలకమైన ముడిసరుకులు, ఇంధన ధరలు భారీగా పెరిగాయని, దీనివల్ల స్వల్పకాలికంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తలెత్తాయని ఐటీసీ పేర్కొంది. అయితే, ఈ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ, మార్కెట్లో తమ పోటీతత్వాన్ని, వృద్ధి వేగాన్ని కాపాడుకోవడానికి అన్ని విభాగాలలో ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. భవిష్యత్ వృద్ధికి ప్రత్యేక వ్యూహం ఎఫ్ఎమ్సీజీ వ్యాపారంలో తదుపరి వృద్ధి దశపై కంపెనీ ప్రత్యేక దృష్టి సారించింది. దేశంలో కుటుంబాల వినియోగం తక్కువగా ఉన్న, తలసరి వినియోగం పరిమితంగా ఉన్న విభాగాల్లో విస్తరణకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఐటీసీ భావిస్తోంది. ఇప్పటికే ఉన్న 30కు పైగా ప్రధాన బ్రాండ్ల బలాన్ని ఉపయోగించుకుని విలువ ఆధారిత (వాల్యూ యాడెడ్) కొత్త ఉత్పత్తులు, అభివృద్ధి చెందుతున్న విభాగాల్లో ప్రవేశించడం కంపెనీ వ్యూహంలో కీలక భాగమని తెలిపింది. భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన ఉత్పత్తుల పోర్ట్ఫోలియోను రూపొందించడంపై కూడా దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించింది. అంతర్జాతీయ విస్తరణ భారత మార్కెట్తో పాటు అంతర్జాతీయ మార్కెట్లలోనూ ఐటీసీ తన ఉనికిని వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం కంపెనీ ఎఫ్ఎమ్సీజీ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. రానున్న రోజుల్లో భారత్కు సమీపంలోని వ్యూహాత్మక మార్కెట్లలో మరింత విస్తరించడం ద్వారా తదుపరి వృద్ధిని సాధించాలని ఐటీసీ లక్ష్యంగా పెట్టుకుంది. సంజీవ్ పురి వేతనం 7 శాతం డౌన్ గత ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీసీ సీఎండీ సంజీవ్ పురి మొత్తం వేతనం రూ. 23.91 కోట్లకు పరిమితమైంది. పర్ఫార్మెన్స్ బోనస్, దీర్ఘకాలిక ప్రోత్సాహకాలు / కమీషన్లు తగ్గడంతో అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 6.8 శాతం క్షీణించింది. తాజాగా కన్సాలిడేటెడ్ శాలరీ రూ. 3.85 కోట్లతో పాటు పనితీరు ఆధారిత బోనస్, కమీషన్లు మొదలైన వాటి రూపంలో రూ. 19.17 కోట్లు లభించాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రెమ్యూనరేషన్ రూ. 25.66 కోట్లు.ఆదాయంలో సిగరెట్లదే సింహభాగం ఐటీసీ మొత్తం స్థూల ఆదాయంలో సిగరెట్ల విభాగమే ఇప్పటికీ అతిపెద్ద వాటాగా కొనసాగుతోంది. కంపెనీ ప్రొడెక్ట్స్, సర్వీసుల అమ్మకాల ద్వారా సాధించిన మొత్తం స్థూల ఆదాయం రూ.80,867.49 కోట్లు కాగా.. అందులో కేవలం సిగరెట్ల అమ్మకాల ద్వారానే రూ.37,099.65 కోట్ల ఆదాయం సమకూరింది. అంటే కంపెనీ మొత్తం ఆదాయంలో దీని వాటా దాదాపు 45.9 శాతంగా ఉంది. -
ఏఐలోకి ‘మెగా’ఎంట్రీ!
సాక్షి, బిజినెస్: మూడు దశాబ్దాలకుపైగా ఇన్ఫ్రా రంగంలో ఉంటూ వివిధ రంగాల్లోకి విస్తరిస్తున్న స్థానిక సంస్థ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా (ఎంఈఐఎల్) కూడా ఏఐ రంగంలోకి అడుగుపెట్టనుంది. మైక్రోసాఫ్ట్లో రెండు దశాబ్దాలు పనిచేసిన అలెక్స్ కిప్మాన్ సంస్థ అనలాగ్ ఏఐతో చేతులు కలపబోతోంది. ఈ భాగస్వామ్యం ఏ రూపంలో ఉంటుంది? ఎంత పెట్టుబడి పెడతారు? అనే వివరాలు బహుశా జూలై ఒకటిన వెల్లడి కావచ్చు. ఆ రోజున కిప్మాన్తో కలిసి నిర్వహించే సమావేశంలో ఎంఈఐఎల్ దీనిపై ప్రకటన చేసే అవకాశముంది. ఫౌండేషన్ ఏఐ కాదిది.. పారిశ్రామిక ఏఐ! చాట్ జీపీటీ, క్లాడ్, పెర్ప్లెక్సిటీ మాదిరి అనలాగ్ ఏఐ సంస్థ ఫౌండేషనల్ ఏఐ లేదా జనరేటివ్ ఏఐ కాదు... ఇది పారిశ్రామిక ఏఐ. భౌతికంగా ఇంటెలిజెన్స్ను తయారు చేస్తుంది. అంటే సెన్సర్లు, రోబోలు, న్యూరల్ నెట్వర్క్లను కలుపుతూ భౌతిక యంత్రాలకు డిజిటల్ నకళ్లను తయారు చేస్తుంది. వాహనాలు, యంత్రాలు, పరిశ్రమలు... ఇలా పనిచేసే వేటికైనా డిజిటల్ ట్విన్స్ను తయారు చేయడం ద్వారా వాటిని రిమోట్గా వేరే చోటు నుంచి మానిటర్ చేయొచ్చు. ఈ డిజిటల్ నకళ్లు నిరంతరం అప్డేట్ అవుతూ వాటి ట్విన్స్ను ట్రాక్ చేస్తూ ఉంటాయి. ఇలా ట్రాక్ చేయడం ద్వారా నిర్వహణను ముందే ఊహించొచ్చు. సమస్యలు రాకుండా నివారించే అవకాశమూ ఉంటుంది. సీమెన్స్, స్నీడర్, జీఈ వెర్నోవా, రాక్వెల్ వంటి దిగ్గజాలున్న ఈ రంగంలోకి పూర్తి ఏఐ కంపెనీగా అడుగుపెట్టింది అనలాగ్ ఏఐ. అబుదాబికి చెందిన టెక్నాలజీ దిగ్గజం జీ24... ఈ సంస్థకు అవసరమైన పూర్తి ఫండింగ్ను ఎప్పటికప్పుడు అందిస్తోంది. అందుకే దీని విలువను ఇప్పటిదాకా ఎక్కడా వెల్లడించలేదు. వచ్చే పదేళ్లలో భారత్ సహా అన్నిచోట్లా 80 శాతానికిపైగా భారీ పరిశ్రమలు తమ కీలక ఆపరేషన్లలో డిజిటల్ ట్విన్స్ను ఉపయోగిస్తాయన్నది నిపుణుల అంచనా. తయారీ రంగంతోపాటు విద్యుత్, చమురు, గ్యాస్, రైల్వే, మెట్రో వ్యవస్థ, పోర్టులు–షిప్పింగ్, నిర్మాణ రంగం, మైనింగ్... ఇలా అన్ని రంగాలూ పారిశ్రామిక ఏఐ, డిజిటల్ ట్విన్స్ వల్ల లబ్ధి పొందుతాయనేది వారి మాట. -
భారత్లో ఓపెన్ఏఐకి కొత్త బాస్.. ఎవరీ ప్రభ్జీత్ సింగ్?
కృత్రిమ మేధస్సు (AI) రంగంలో ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ఓపెన్ఏఐ.. భారత్లో తన కార్యకలాపాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా 'ప్రభ్జీత్ సింగ్'ను నియమించింది.ప్రభ్జీత్ సింగ్ ఈ ఏడాది సెప్టెంబర్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. భారత్లో AI వినియోగాన్ని మరింత విస్తరించడంతో పాటు, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ విభాగాలు కృత్రిమ మేధస్సు ప్రయోజనాలను పొందేలా భాగస్వామ్యాలను అభివృద్ధి చేయడంపై ఆయన దృష్టి సారించనున్నారు.ప్రభ్జీత్ సింగ్కు టెక్నాలజీ రంగంలో విశేష అనుభవం ఉంది. గత 11 సంవత్సరాలుగా ఉబెర్లో పనిచేసిన ఆయన, చివరి ఆరేళ్లు ఆ రైడ్-హెయిలింగ్ ప్లాట్ఫామ్కు భారతదేశం - దక్షిణాసియా అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రైడ్-హెయిలింగ్ మార్కెట్లలో ఒకటైన భారతదేశం, బంగ్లాదేశ్, శ్రీలంకలలో కంపెనీ మొబిలిటీ వ్యాపారానికి ఆయన నాయకత్వం వహించి, దాని విస్తరణకు మార్గనిర్దేశం చేశారు.ఐఐటి ఖరగ్పూర్, ఐఐఎం అహ్మదాబాద్ పూర్వ విద్యార్థి అయిన సింగ్, మెకిన్సీ & కంపెనీలో అసోసియేట్ పార్టనర్గా పనిచేసి, అంతకుముందు ఉబర్లో చేరారు. కార్పొరేట్ నాయకత్వానికి ఆయన చేసిన విశేష సేవలకు గాను, 2022లో ఐఐఎం అహ్మదాబాద్ వారి యంగ్ అలూమ్ని అచీవర్స్ అవార్డుతో ఆయనను సత్కరించారు. -
భారత్ ట్యాక్సీ.. అమిత్ షా కీలక ప్రకటన!
కేంద్ర మంత్రి అమిత్ షా గుజరాత్లోని గాంధీనగర్లో భారత్ ట్యాక్సీ సేవలను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్ ట్యాక్సీని అడ్డుకునేందుకు కొన్ని ప్రైవేట్ క్యాబ్ సేవల సంస్థలు పోటీకి దిగుతున్నాయని ఆరోపించారు.భారత్ ట్యాక్సీ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయంటూ వస్తున్న వార్తలు పూర్తిగా తప్పుదోవ పట్టించేవేనని అమిత్ షా స్పష్టం చేశారు. తమ లక్ష్యం ఇతర కంపెనీలకు నష్టం కలిగించడం కాదని.. డ్రైవర్లు, ప్రయాణికులకు న్యాయమైన సేవలు అందించడమేనని చెప్పారు. భారత్ ట్యాక్సీ విజయవంతం కాకుండా అడ్డుకునేందుకే కొన్ని సంస్థలు తాత్కాలికంగా తక్కువ ఛార్జీలు, డ్రైవర్లకు అధిక కమిషన్లు ఇస్తున్నాయని ఆరోపించారు.కొన్ని ప్రైవేట్ క్యాబ్ సంస్థలు మొదట నష్టాలను భరిస్తూ మార్కెట్లో పోటీదారులను తొలగించి, ఆ తర్వాత తమ ఇష్టానుసారం ఛార్జీలు నిర్ణయించే విధానాన్ని అనుసరిస్తున్నాయని అమిత్ షా అన్నారు. అయితే భారత్లో సహకార భావన ఎంతో బలంగా ఉందని, ఇలాంటి వ్యూహాలు ఎక్కువ కాలం పనిచేయవని ఆయన అన్నారు.భారత్ ట్యాక్సీ సేవలను ప్రస్తుతం గుజరాత్లోని అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్కోట్, ద్వారక, సోమనాథ్ మొదలైన మొత్తం 14 ప్రధాన నగరాల్లో ప్రారంభించారు. ఈ సేవలు టూ వీలర్స్, త్రీ వీలర్స్, ఫోర్ వీల్ ట్యాక్సీలు అనే మూడు విభాగాల్లో అందుబాటులో ఉంటాయి.భారత్ ట్యాక్సీ ప్రత్యేకత ఏమిటంటే.. ఇది దేశంలోనే తొలి సహకార సంఘాల ఆధ్వర్యంలో నడిచే, డ్రైవర్ల యాజమాన్యంలోని రైడ్-హైలింగ్ ప్లాట్ఫామ్. ఇందులో డ్రైవర్ల నుంచి ఎలాంటి కమిషన్ వసూలు చేయరు. ప్రయాణికుడు చెల్లించిన మొత్తం ఛార్జీ నేరుగా డ్రైవర్కే అందుతుంది. దీంతో డ్రైవర్ల ఆదాయం పెరగడంతో పాటు, వారికి ఆర్థిక భద్రత కూడా లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది.భారత్ ట్యాక్సీ విస్తరణపై కూడా అమిత్ షా కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది జూలై 31లోపు నాగ్పూర్, పుణే, ముంబై, లక్నో, చండీగఢ్, జైపూర్, కోల్కతా వంటి ప్రధాన నగరాల్లో సేవలు ప్రారంభిస్తామని, అలాగే రెండేళ్లలో దేశవ్యాప్తంగా 500కు పైగా నగరాలు, పట్టణాలకు భారత్ ట్యాక్సీ సేవలను విస్తరిస్తామని ప్రకటించారు.అంతే కాకుండా.. 'సహకార్ సే సమృద్ధి' అనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన నినాదాన్ని రవాణా రంగంలో కూడా విజయవంతం చేయాలన్నదే తమ లక్ష్యమని అమిత్ షా పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇదే సహకార నమూనాను మరిన్ని రంగాల్లో కూడా విస్తరిస్తామని వెల్లడించారు. -
TG REAT సభ్యులుగా వేముల శ్రీకర్
తెలంగాణ రియల్ ఎస్టేట్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (TG-REAT) సాంకేతిక, పరిపాలనా సభ్యుడిగా IRS మాజీ అధికారి వేముల శ్రీకర్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్) చట్టం-2016 నిబంధనల మేరకు చేపట్టిన ఈ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ శనివారం జారీ చేసింది.1995 ఐఆర్ఎస్ బ్యాచ్కు చెందిన శ్రీకర్ సుమారు 26 ఏళ్లపాటు ఆదాయపు పన్ను శాఖలో వివిధ కీలక హోదాల్లో సేవలందించారు. ఇంజినీరింగ్ డిగ్రీ తర్వాత ఎంబీఏ, ఎంఏతో పాటు న్యాయశాస్త్రంలో (ఎల్ఎల్బీ) ప్రథమ శ్రేణిలో పట్టా పొందారు. ట్రిబ్యునల్ కార్యకలాపాల్లో చట్టపరమైన అంశాలకు అధిక ప్రాధాన్యం ఉండటంతో ఆయన న్యాయ విద్య, అప్పిలేట్ వ్యవహారాల్లోని అనుభవం ఉపయోగపడనుంది.పన్ను ఎగవేత కేసుల దర్యాప్తులో విశేష ప్రతిభ కనబరిచిన శ్రీకర్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆదాయ సమీకరణ, దర్యాప్తు రంగాల్లో విశిష్ట సేవలకు గాను కేంద్ర ఆర్థిక మంత్రి నుంచి రెండు ప్రత్యేక పురస్కారాలు అందుకున్నారు. ఆయన పర్యవేక్షించిన కీలక దర్యాప్తు కేసులు ఆదాయపు పన్ను శాఖ ప్రచురించిన ‘లెట్ అస్ షేర్’ ఉత్తమ విధానాల సంకలనంలో చోటు దక్కించుకున్నాయి.హైదరాబాద్లోని ఇన్కమ్ట్యాక్స్ టవర్స్ నిర్మాణం, బంజారాహిల్స్లో ఆదాయపు పన్ను శాఖ నివాస సముదాయాల అభివృద్ధి, తిరుపతిలో అతిథి గృహం ఏర్పాటు, నాగ్పూర్లో సిబ్బంది నివాస గృహాల నిర్మాణం వంటి పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. శాఖ ఆధునీకరణ, డిజిటల్ వ్యవస్థల అమలు, కంప్యూటరీకరణ కార్యక్రమాలకు నాయకత్వం వహించారు.ముంబయిలో ఆదాయపు పన్ను కమిషనర్గా పనిచేసిన ఆయన 2021లో పదవీ విరమణ పొందారు. అనంతరం సామాజిక సేవ, సాహిత్య రంగాల్లో చురుగ్గా కొనసాగుతున్నారు. తెలంగాణ భాష, సంస్కృతి పరిరక్షణకు దశాబ్దాలుగా కృషి చేసిన ప్రముఖ సాహితీవేత్త వేముల పెరుమాళ్ల వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ, ఆయన రచించిన ప్రసిద్ధ గ్రంథం ‘తెలంగాణ జాతీయాలు’ ప్రచురణలో శ్రీకర్ విశేష సహకారం అందించారు. -
పాత కార్లకు E20 పెట్రోల్ ప్రమాదమేనా?
ప్రభుత్వం ఈ20 పెట్రోల్ (20 శాతం ఇథనాల్+ 80 శాతం పెట్రోల్) వినియోగాన్ని వేగంగా పెంచుతోంది. దేశం తన ఈ20 లక్ష్యాన్ని ముందుగానే చేరుకోవడంతో, ఈ ఇంధనం ఇప్పుడు ఎక్కువగా అందుబాటులోకి వచ్చింది. అయితే వాహన యజమానుల్లో 'E20 పెట్రోల్ వాడితే ఇంజిన్కు నష్టం జరుగుతుందా?' అనే అనుమానం మాత్రం అలాగే ఉంది.నిపుణుల ప్రకారం.. అన్ని వాహనాలకు ఈ20 పెట్రోల్ హానికరం కాదు. ముఖ్యంగా ఏప్రిల్ 2023 తర్వాత తయారైన వాహనాలు ఇప్పటికే ఈ20 ఇంధనానికి అనుగుణంగా తయారయ్యాయి. ఈ కార్లు ఈ ఫ్యూయల్తో సజావుగా పనిచేస్తాయి. కానీ 2023కి ముందు తయారైన పాత వాహనాలు సాధారణంగా ఈ10 లేదా ప్యూర్ పెట్రోల్కు మాత్రమే అనుకూలంగా ఉంటాయి. అందువల్ల వాటిలో ఈ20 వాడితే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.పాత వాహనాల్లో సమస్యలు రావడానికి ప్రధాన కారణం.. ఇథనాల్ స్వభావం. ఇథనాల్ నీటిని ఆకర్షించే లక్షణం కలిగి ఉంటుంది. దీని వల్ల ఫ్యూయల్ ట్యాంక్లో తేమ చేరి తుప్పు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి రబ్బర్ సీల్స్, ప్లాస్టిక్ ఫ్యూయల్ లైన్స్ వంటి భాగాలు కాలక్రమేణా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్లో మురికి పేరుకుపోయి పనితీరు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా.. పెట్రోల్తో పోలిస్తే ఇథనాల్ ఎనర్జీ తక్కువగా ఉండటంతో మైలేజ్ కొంత తగ్గుతుంది.ఇదీ చదవండి: రూ.20 లక్షల కారు కొనడంపై ChatGPT క్లారిటీఅయితే.. పాత వాహన యజమానులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ20 వల్ల కలిగే సమస్యలను తగ్గించుకోవచ్చు. ఫ్యూయల్ అడిటివ్స్ వాడడం ఒక సులభమైన మార్గం. ఇవి ఇంధనంలోని ఇథనాల్ ప్రభావాన్ని కొంతవరకు నియంత్రించగలవు. అలాగే.. పాత ఫ్యూయల్ లైన్స్ను PTFE లేదా బ్రైడెడ్ స్టీల్ లైన్స్తో మార్చడం ద్వారా దీర్ఘకాలిక రక్షణ పొందవచ్చు. ఇంజిన్ సీల్స్ను విటాన్ వంటి మెటీరియల్స్తో అప్గ్రేడ్ చేయడం కూడా ఉపయోగకరం.మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ ఉన్న వాహనాల్లో తుప్పు రాకుండా స్పెషల్ కోటింగ్ చేయించుకోవచ్చు. వాహనాల్లో ఈసీయూ ట్యూనింగ్ లేదా అప్డేటెడ్ మ్యాపింగ్ ద్వారా కూడా ఈ20 అనుకూలతను మెరుగుపరచవచ్చు. కాబట్టి పాత వాహనాలను ఉపయోగించేవాళ్లు ఈ విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి. -
రూ.20 లక్షల కారు కొనడంపై ChatGPT క్లారిటీ
ఒక వ్యక్తి వార్షిక ఆదాయం రూ.30 లక్షలు ఉంటే, రూ.20 లక్షల విలువైన కారును కొనుగోలు చేయడం ఆర్థికంగా సౌకర్యవంతమేనా? ఒకవేళ కొనాలంటే మొత్తం డబ్బు ఒకేసారి చెల్లించడం మంచిదా?, లేక లోన్ తీసుకుని కొనడం మంచిదా? అనే ప్రశ్నలకు చాట్జీపీటీ వివరంగా సమాధానం ఇచ్చింది.బెంగళూరుకు చెందిన 35 ఏళ్ల ఉద్యోగి తన పూర్తి ఆర్థిక వివరాలను చాట్జీపీటీకు అందించాడు. అతనికి సంవత్సరానికి రూ.30 లక్షల జీతం, అయితే నెలకు రూ.1.9 లక్షలు చేతికి వచ్చే ఆదాయం. కాగా అతనికి రూ.15 లక్షల పెట్టుబడులు, రూ.5 లక్షల ఎమర్జెన్సీ ఫండ్, రూ.10 లక్షల ఈపీఎఫ్ ఉన్నాయి. ప్రస్తుతం రూ.40 లక్షల హోమ్ లోన్ ఉండగా, ప్రతి నెల రూ.40 వేల ఈఎంఐ, మరో రూ.40 వేల సిప్ పెట్టుబడులు కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అతని వద్ద ఎనిమిదేళ్ల పాత హ్యాచ్బ్యాక్ కారు ఉంది.ఈ నేపథ్యంలో రూ.20 లక్షల ఆన్రోడ్ ధర ఉన్న కొత్త SUV కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు పేర్కొంటూ, రెండు ఎంపికలను చాట్జీపీటీ ముందుంచాడు. మొదటిది, మొత్తం రూ.20 లక్షలను పొదుపు నుంచి తీసుకుని ఒకేసారి చెల్లించి కారు కొనడం. రెండోది, రూ.5 లక్షలు డౌన్ పేమెంట్ చేసి మిగిలిన మొత్తాన్ని ఐదేళ్ల కార్ లోన్ ద్వారా చెల్లించడం.ఈ రెండు ఎంపికలను విశ్లేషించిన చాట్జీపీటీ, కారు కొనుగోలు మాత్రమే కాకుండా, ఐదు సంవత్సరాలు, పది సంవత్సరాల పాటు కారును మెయింటెన్స్ కోసం అయ్యే మొత్తం ఖర్చును కూడా అంచనా వేసింది. ఇందులో కొనుగోలు ధర, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, సర్వీసింగ్, రిపేర్లు, ఇంధనం, టైర్లు, పార్కింగ్, లోన్ వడ్డీ వంటి అన్ని ఖర్చులను పరిగణనలోకి తీసుకుంది.చాట్జీపీటీ అంచనా ప్రకారం, మొత్తం డబ్బు చెల్లించి కారు కొనుగోలు చేస్తే ఐదేళ్లలో మొత్తం యాజమాన్య వ్యయం సుమారు రూ.28 నుంచి రూ.31 లక్షల మధ్య ఉండొచ్చు. అదే రూ.5 లక్షల డౌన్ పేమెంట్తో లోన్ తీసుకుంటే వడ్డీ కారణంగా ఈ ఖర్చు రూ.31 నుంచి రూ.33 లక్షల వరకు పెరగొచ్చు.పది సంవత్సరాల వ్యవధిలో నగదు చెల్లించి కొనుగోలు చేసిన కారుకు మొత్తం ఖర్చు సుమారు రూ.42 నుంచి రూ.46 లక్షలు, లోన్ తీసుకుని కొనుగోలు చేసిన కారుకు రూ.45 నుంచి రూ.49 లక్షలు అవుతుందని చాట్జీపీటీ అంచనా వేసింది. ఈ ఖర్చులో అత్యధిక భాగం కారు విలువ తగ్గడం, ఇంధనం, ఇన్సూరెన్స్, నిర్వహణ ఖర్చులు ఉంటాయని వెల్లడించింది.అయితే.. తుది నిర్ణయంలో చాట్జీపీటీ ఆసక్తికరమైన సూచన చేసింది. మొత్తం రూ.20 లక్షలను ఒకేసారి చెల్లించడం వల్ల వడ్డీ భారం ఉండదు. కానీ అలా చేస్తే ఇప్పటికే ఉన్న పెట్టుబడులు దాదాపు ఖాళీ అవుతాయి. దీంతో అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన డబ్బు అందుబాటులో ఉండదు. అలాగే పెట్టుబడులు భవిష్యత్తులో ఇచ్చే వృద్ధి ప్రయోజనాన్ని కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది.కాబట్టి.. రూ.5 లక్షల డౌన్ పేమెంట్ చేసి, మిగిలిన మొత్తాన్ని ఐదేళ్లకు లోన్ తీసుకోవడం మంచి నిర్ణయం అని చాట్జీపీటీ పేర్కొంది. ఇలా చేయడం వల్ల కొంత వడ్డీ చెల్లించాల్సి వచ్చినప్పటికీ, చేతిలో నగదు నిల్వ ఉంటుంది. పెట్టుబడులు కొనసాగుతాయి. దీర్ఘకాలంలో ఆర్థిక భద్రత కూడా మెరుగ్గా ఉంటుందని పేర్కొంది.ఇదీ చదవండి: జూన్ 30 తర్వాత పాత నోట్ల రద్దు?: స్పందించిన బ్యాంక్ -
జూన్ 30 తర్వాత పాత నోట్ల రద్దు?: స్పందించిన బ్యాంక్
2026 జూన్ 30 తర్వాత పాత రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లను బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర స్వీకరించదని ఒక వార్త వైరల్ సోషల్ మీడియాలో అయింది. దీంతో దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన నెలకొంది. చాలామంది ఇది మరోసారి పెద్ద నోట్ల రద్దు (డీమానిటైజేషన్) జరుగుతుందేమోనని భావించారు. అయితే.. ఈ వార్త పూర్తిగా అసత్యమని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అధికారికంగా స్పష్టం చేసింది.బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తన అధికారిక ఫేస్బుక్ పేజీలో #FakeMessageAlert హ్యాష్ట్యాగ్తో ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో, ''2005కు ముందు ముద్రించిన రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లను 2026 జూన్ 30 తర్వాత మా శాఖలు స్వీకరించవని ప్రచారం జరుగుతోంది. ఈ సమాచారం పూర్తిగా తప్పు. వినియోగదారులు ఇలాంటి తప్పుడు సందేశాలను నమ్మవద్దు, ఇతరులకు పంపవద్దు. అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించండి'' అని తెలిపింది.A false message is being circulated claiming that pre-2005 ₹10, ₹20, ₹50 & ₹100 notes will not be accepted after 30th Jun'26. Bank of Maharashtra clarifies that this information is incorrect. Customers are requested to rely only on official sources for authentic information. pic.twitter.com/afF5czNO7e— Bank of Maharashtra (@mahabank) June 26, 2026వైరల్ వార్తలో జరిగిన ప్రచారంవైరల్ అయిన కథనాల ప్రకారం.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పాత నోట్లను ఉపసంహరించుకోవాలని ఆదేశాలు జారీ చేసిందని, త్వరలో ఇతర బ్యాంకులు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తాయని ప్రచారం జరిగింది. దీంతో ప్రజలు తమ వద్ద ఉన్న పాత నోట్లను వెంటనే మార్చుకోవాలని భావించారు. అయితే.. ఈ ప్రచారాన్ని బ్యాంక్ పూర్తిగా ఖండించింది. అంతే కాకుండా.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా దీనికి సంబంధించిన ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని స్పష్టం చేసింది.ఆర్బీఐ ప్రకటన2015లో ఆర్బీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో 2005కు ముందు ముద్రించిన మహాత్మా గాంధీ సిరీస్ నోట్ల చలామణి తగ్గిపోయిందని, అవసరమైతే ప్రజలు వాటిని బ్యాంకుల్లో మార్చుకోవచ్చని పేర్కొంది. అయితే.. ఆ నోట్లు చట్టబద్ధమైన కరెన్సీ (Legal Tender)గానే కొనసాగుతాయని కూడా స్పష్టంగా తెలిపింది. కొత్త నోట్లలో భద్రతా ఫీచర్లు మెరుగ్గా ఉండటంతో నకిలీ నోట్ల తయారీని అరికట్టడం సులభమవుతుందని ఆర్బీఐ వివరించింది. కానీ.. పాత నోట్లను రద్దు చేస్తున్నట్లు లేదా చెల్లుబాటు కాకుండా చేస్తున్నట్లు ఎప్పుడూ ప్రకటించలేదు.ఇదీ చదవండి: 35 వేల డాలర్లకు గోల్డ్?: కియోసాకి ట్వీట్ -
లీటరుకు 71 కిమీ మైలేజ్.. ఈ బైక్ ధర ఎంతంటే?
హీరో మోటోకార్ప్ తన ఎంట్రీ లెవల్ కమ్యూటర్ మోటార్సైకిల్ అయిన ప్యాషన్ ప్లస్ కొత్త వేరియంట్ లాంచ్ చేసింది. ఇది ఫీచర్ అప్గ్రేడ్లతో పాటు మెరుగైన భద్రతను అందించే లక్ష్యంతో రూపుదిద్దుకుంది. దీని ధర రూ.84,128 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ).కొత్త వేరియంట్లో స్టాండర్డ్ డ్రమ్ బ్రేక్కు బదులుగా.. ముందు వైపు డిస్క్ బ్రేక్ను అమర్చారు. ఈ అప్గ్రేడ్ ముఖ్యంగా అకస్మాత్తుగా బ్రేక్ వేయాల్సి వచ్చే పట్టణ ప్రాంతాల్లో, మెరుగైన బ్రేకింగ్ పనితీరును, నియంత్రణను అందిస్తుందని భావిస్తున్నారు. కొత్త ప్యాషన్ ప్లస్ డిస్క్ హెవీ గ్రే, నెక్సస్ బ్లూ, డార్క్ ఇండస్ట్రియల్ గ్రే, పెర్ల్ రెడ్ అనే నాలుగు డ్యూయల్ టోన్ రంగులలో అందుబాటులో ఉంది.బ్రేకింగ్ అప్గ్రేడ్తో పాటు, ప్యాషన్ ప్లస్ డిస్క్ పూర్తిగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ను కూడా పొందుతుంది. ఈ కన్సోల్లో రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్, లో ఫ్యూయెల్ వార్నింగ్, సర్వీస్ రిమైండర్స్, కాల్ అండ్ SMS అలర్ట్ల కోసం బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతే కాకుండా.. ఈ మోటార్సైకిల్లో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్, అదనపు భద్రత కోసం సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ ఫీచర్, USB ఛార్జింగ్ పోర్ట్, యుటిలిటీ స్టోరేజ్ కంపార్ట్మెంట్ వంటివి కూడా ఉన్నాయి.మెకానికల్గా ఎలాంటి మార్పులు లేవు. కాబట్టి అదే 100 సీసీ ఇంజన్తో పనిచేస్తుంది, ఇది 8,000 ఆర్పీఎమ్ వద్ద 5.9 కిలోవాట్ల పవర్, 6,000 ఆర్పీఎమ్ వద్ద 8.05 ఎన్ఎమ్ పీక్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ హీరో ఐ3ఎస్ (ఐడిల్ స్టాప్-స్టార్ట్ సిస్టమ్)తో కలిసి పనిచేస్తుంది. ఇది ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ బైక్ 71 కిమీ/లీ మైలేజ్ ఉస్తుందని కంపెనీ చెబుతోంది.ఇదీ చదవండి: ఈ సమయంలో డ్రైవింగ్ ప్రమాదం! -
పసిడి పరుగు ఆగేలా లేదు: కియోసాకి
'రిచ్ డాడ్ పూర్ డాడ్' రచయిత, ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి మరోసారి బంగారంపై తన బలమైన ఆశావహ దృక్పథాన్ని వ్యక్తం చేశారు. తాను బంగారం కొనుగోలు చేసిన మరుసటి రోజే ఔన్స్కు 62 డాలర్లు పెరిగిందని పేర్కొంటూ, ఇది కొత్త బుల్రన్కు సంకేతం కావచ్చని సోషల్ మీడియా వేదిక ఎక్స్లో తెలిపారు. మార్కెట్ విశ్లేషకుడు జిమ్ రికార్డ్స్ అంచనాను ప్రస్తావిస్తూ, బంగారం ధర ఔన్స్కు 35,000 డాలర్ల వరకు వెళ్లే అవకాశం ఉందని తాను కూడా నమ్ముతున్నట్లు వెల్లడించారు.కియోసాకి ప్రకారం.. ఇన్వెస్టర్లు కేవలం వార్తలు లేదా భావోద్వేగాల ఆధారంగా కాకుండా టెక్నికల్ అనాలిసిస్ (TA) నేర్చుకోవడం అత్యంత అవసరం. మార్కెట్లు ఎప్పుడు ఎగుస్తాయి, ఎప్పుడు పడిపోతాయి అన్న సంకేతాలను చార్టుల ద్వారా అర్థం చేసుకునే సామర్థ్యం ఉంటే, మార్కెట్ పెరిగినా, కుప్పకూలినా అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చని ఆయన సూచించారు. అయితే టెక్నికల్ అనాలిసిస్ను నేర్చుకోవడానికి తనకు ఎన్నో సంవత్సరాలు పట్టిందని కూడా చెప్పారు.ఇటీవలే బంగారం ధరలు తగ్గుతున్న సమయంలో తాను వెంటనే కొనుగోళ్లు చేయబోనని, ముందు మార్కెట్లో బాటమ్ ఏర్పడిందని చార్టులు నిర్ధారించేవరకు వేచి చూస్తానని కియోసాకి పేర్కొన్నారు. ఇప్పుడు ఆ మలుపు వచ్చినట్లు కనిపిస్తోందని చెబుతూ మళ్లీ కొనుగోళ్లు ప్రారంభించినట్లు వెల్లడించారు.Yay: I may have picked the turnin price of gold.Gold up $62 since I purchased yesterday. Possibly on a bull run to $35k if Jim Rickards is correct…. and I think he is. LESSON: An important study for you to increase your financial education is Technical Analysis,how…— Robert Kiyosaki (@theRealKiyosaki) June 27, 2026 -
బెంగళూరులో 130 ఏళ్ల ఇల్లు.. భలే మార్చిన ఐటీ దంపతులు
టెక్నాలజీ హబ్గా పేరొందిన బెంగళూరులో ఓ ఐటీ దంపతులు నిర్మించుకున్న ఇల్లు ఇప్పుడు సోషల్ మీడియాలో విశేష ఆకర్షణగా మారింది. అత్యాధునిక జీవనశైలికి అలవాటు పడిన ఈ సాఫ్ట్వేర్ ఇంజినీర్ దంపతులు, తమ పూర్వీకుల జ్ఞాపకాలను ఆధునిక అవసరాలతో మేళవిస్తూ నిర్మించిన ఈ నివాసం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇంటికి సంబంధించిన వీడియోను డిజైన్ సంస్థ ఆర్చ్ప్రో (ArchPro) ఇటీవల ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది.అందులోని వివరాల ప్రకారం.. వేగవంతమైన కార్పొరేట్ జీవితానికి పూర్తి భిన్నంగా ప్రశాంతమైన, సంప్రదాయ విలువలతో కూడిన వాతావరణంలో జీవించాలని ఈ దంపతులు కోరుకున్నారు. ముఖ్యంగా ఇంటి నుంచే ఎక్కువసేపు పనిచేస్తున్న (వర్క్ ఫ్రమ్ హోమ్) ప్రస్తుత పరిస్థితుల్లో మానసిక ప్రశాంతతను కలిగించేలా, పాతకాలపు దక్షిణ భారత గృహ నిర్మాణ శైలిని ఆధునిక సౌకర్యాలతో మిళితం చేయాలని నిర్ణయించుకున్నారు. అదే ఈ ఇంటి రూపకల్పనకు ప్రధాన ఆలోచనగా నిలిచిందని డిజైనర్లు తెలిపారు.సుమారు 4,382 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఇల్లు 2025లో పూర్తైంది. ఇంటి ప్రధాన ఆకర్షణ మధ్యలో ఏర్పాటు చేసిన సాంప్రదాయ ప్రాంగణం (కోర్ట్యార్డ్). అయితే అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం మాత్రం 130 ఏళ్ల నాటి చెక్క స్తంభాలు. ఈ స్తంభాలను దంపతుల పూర్వీకుల ఇంటి నుంచి జాగ్రత్తగా భద్రపరచి కొత్త ఇంటిలో వినియోగించారు. కొత్త మంగళూరు టైల్స్ పైకప్పునకు సరిపోయేలా ఈ పురాతన స్తంభాలను అమర్చడం డిజైన్ బృందానికి సవాలుగా మారినప్పటికీ, వాటి అసలు రూపానికి ఎలాంటి నష్టం కలగకుండా పనులు పూర్తి చేశారు.ఇంటి నిర్మాణంలో సహజమైన వస్తువుల వాడకానికి పెద్దపీట వేశారు. ఇటుకలు బయటకు కనిపించేలా గోడలు, మట్టి రంగు ఫ్లోరింగ్, చెక్కతో చేసిన తలుపులు, పెద్ద కిటికీలు, ఎత్తైన పైకప్పులు, సంప్రదాయ ఉయ్యాల వంటి అంశాలు ఇంటికి ప్రత్యేక ఆకర్షణను తెచ్చాయి. మధ్యలోని ప్రాంగణం ద్వారా సహజ కాంతి, గాలి సమృద్ధిగా ప్రవేశించేలా రూపకల్పన చేయడంతో ఇల్లంతా ప్రశాంత వాతావరణం పరచుకుంటుంది. బయట ప్రకృతి, లోపలి జీవనశైలి మధ్య సహజ అనుసంధానం కల్పించేలా వరండా, ప్రవేశ ద్వారాన్ని రూపొందించారు.బెంగళూరు వంటి నగరాల్లో ఇటీవలి కాలంలో సంప్రదాయ శైలిని ఆధునిక నిర్మాణంతో కలిపే "హెరిటేజ్-ఇన్స్పైర్డ్ హోమ్స్"పై ఆసక్తి పెరుగుతోంది. పాతకాలపు నిర్మాణ సామగ్రిని తిరిగి వినియోగించడం, సహజ కాంతి, గాలి, పర్యావరణహిత పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి ధోరణులు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ ఇంటి రూపకల్పన కూడా అలాంటి మారుతున్న నిర్మాణ ధోరణులకు ప్రతీకగా నిలుస్తోంది. View this post on Instagram A post shared by ArchPro (@archpro.live) -
ఏఐ సంచలనం ‘ఆంథ్రోపిక్’లో రూ.కోట్ల జీతాలు..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో ప్రతిభావంతులైన ఉద్యోగుల కోసం పోటీ రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ (Anthropic) తన ఉద్యోగులకు కోట్ల రూపాయల వేతన ప్యాకేజీలు అందిస్తూ మరోసారి వార్తల్లో నిలిచింది. క్లాడ్ (Claude), మైథోస్ (Mythos) వంటి ఏఐ మోడళ్లను అభివృద్ధి చేస్తున్న ఈ సంస్థలో కొందరు సాంకేతిక ఉద్యోగుల వార్షిక ప్రాథమిక వేతనం (Base Salary) ఏకంగా 13 కోట్ల రూపాయల వరకు ఉండటం చర్చనీయాంశమైంది. ఇవి కేవలం బేస్ పే మాత్రమే. బోనస్లు, స్టాక్ ఆప్షన్లు (Equity) ఇందులో లేవు.ఇటీవల ముగిసిన భారీ నిధుల సమీకరణ తర్వాత ఆంథ్రోపిక్ విలువ 965 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో ఓపెన్ఏఐను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత విలువైన ప్రైవేట్ ఏఐ కంపెనీల్లో ఒకటిగా అవతరించింది. కొత్తగా సమీకరించిన నిధులను కంప్యూటింగ్ సామర్థ్యాల పెంపు, అధునాతన ఏఐ మోడళ్ల అభివృద్ధి, భద్రతా పరిశోధనల కోసం వినియోగించనున్నట్లు సంస్థ తెలిపింది.హెచ్-1బీ దరఖాస్తులతో వెలుగు చూసిన జీతాలుఅమెరికా ప్రభుత్వానికి సమర్పించిన హెచ్-1బీ వీసా దరఖాస్తుల ఆధారంగా ఈ వేతన వివరాలు బయటకు వచ్చాయి. బిజినెస్ ఇన్సైడర్ విశ్లేషణ ప్రకారం, "మెంబర్ ఆఫ్ టెక్నికల్ స్టాఫ్" హోదాలో ఉన్న ఇద్దరు ఉద్యోగులకు వరుసగా 1.12 మిలియన్ డాలర్లు, 1.38 మిలియన్ డాలర్ల వార్షిక బేస్ పే నమోదు అయింది. అయితే ఈ హోదాను సంస్థ వివిధ సాంకేతిక విభాగాల్లో ఉపయోగిస్తుండటంతో వారి ఖచ్చితమైన బాధ్యతలు వెల్లడికాలేదు. అలాగే ఈ గణాంకాల్లో స్టాక్ అవార్డులు, పనితీరు బోనస్లు చేర్చలేదు.హెచ్-1బీ దరఖాస్తుల ప్రకారం ప్రధాన విభాగాల్లో వార్షిక బేస్ పే ఇలా ఉంది..మెంబర్ ఆఫ్ టెక్నికల్ స్టాఫ్: రూ.1.26 కోట్లు – రూ.13.02 కోట్లుమెంబర్ ఆఫ్ టెక్నికల్ స్టాఫ్ (మేనేజర్): రూ.1.26 కోట్లు – రూ.8.02 కోట్లురీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ రీసెర్చర్: రూ.1.06 కోట్లు – రూ.4.71 కోట్లుప్రొడక్ట్ డిజైన్ మేనేజర్: రూ.1.32 కోట్లు – రూ.3.60 కోట్లుప్రొడక్ట్ ఆపరేషన్స్: రూ.1.17 కోట్లు – రూ.4.71 కోట్లుఅకౌంటింగ్: రూ.1.33 కోట్లు – రూ.2.17 కోట్లుకమర్షియల్ కౌన్సెల్: రూ.1.87 కోట్లు – రూ.3.01 కోట్లుఫైనాన్స్ అండ్ స్ట్రాటజీ: రూ.1.72 కోట్లు – రూ.2.92 కోట్లుమార్కెటింగ్: రూ.1.50 కోట్లు – రూ.1.88 కోట్లురిసెర్చ్ ఆపరేషన్స్: రూ.1.17 కోట్లు – రూ.4.71 కోట్లుటెక్నికల్ సేల్స్: రూ.1.46 కోట్లు – రూ.4.71 కోట్లుటాలెంట్ కోసం పోటీఅమెరికాలో హెచ్-1బీ వీసాలపై అనిశ్చితి కారణంగా అనేక కంపెనీలు నియామకాలను తగ్గిస్తున్నప్పటికీ, ఆంథ్రోపిక్, ఓపెన్ఏఐ, ఎన్విడియా వంటి ఏఐ సంస్థలు మాత్రం అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించేందుకు నియామకాలను వేగవంతం చేస్తున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లోనే ఆంథ్రోపిక్ సుమారు 80 హెచ్-1బీ ఉద్యోగాలకు సర్టిఫికేషన్ పొందినట్లు సమాచారం. అత్యున్నత స్థాయి వేతనాలతో పాటు భారీ స్టాక్ ఆప్షన్లు ఇవ్వడం ద్వారా ఉద్యోగులను సంస్థలోనే కొనసాగించే వ్యూహాన్ని ఆంథ్రోపిక్ అమలు చేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. -
ఆగని పసిడి పరుగులు.. నేడు కొత్త ధరలు
దేశంలో బంగారం ధరల పరుగులు కొనసాగుతున్నాయి. వరుసగా రెండో రోజూ పసిడి ధరలు పెరుగుదలను నమోదు చేశాయి. మరోవైపు వెండి ధరలు మాత్రం కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. క్రితం రోజున భారీగా ఎగిసిన వెండి ధరలు నేడు ఎటువంటి పెరుగుదల లేకుండా నిలకడగా ఉన్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
జాబ్ ఇంటర్వ్యూకు 11 గంటల స్లాట్ వద్దా? కెరీర్ కోచ్ సూచనపై చర్చ
ఉద్యోగ ఇంటర్వ్యూలో విజయాన్ని నిర్ణయించేది కేవలం ప్రతిభ, సన్నద్ధత మాత్రమే కాదు.. ఇంటర్వ్యూ సమయం కూడా కొంత ప్రభావం చూపుతుందని ఓ కెరీర్ కోచ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. సైమన్ ఇంగారి అనే కెరీర్ కోచ్ తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్టులో, అభ్యర్థులకు ఇంటర్వ్యూ సమయాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఉంటే ఉదయం 11 గంటల స్లాట్ను వీలైనంత వరకు నివారించాలని సూచించారు. అయితే, ఈ అభిప్రాయంపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.ఇంగారి అభిప్రాయం ప్రకారం.. ఉదయం 11 గంటల స్లాట్ సాధారణంగా ఆ రోజులో మొదటి రెండు ఇంటర్వ్యూ స్లాట్ల తర్వాత వస్తుంది. దీంతో అప్పటికే ఇంటర్వ్యూయర్లు పలువురు అభ్యర్థులను చూసి ఉండటంతో కొత్త అభ్యర్థిని ముందున్న వారితో పోల్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అలాగే భోజన విరామం సమయం దగ్గరపడుతుండటంతో కొన్నిసార్లు ఇంటర్వ్యూలు త్వరగా ముగించాలనే ఆలోచన కూడా ఇంటర్వ్యూయర్లలో ఉండవచ్చని వివరించారు.అంతేకాకుండా, ముందుగా షెడ్యూల్ చేసిన ఇంటర్వ్యూలు ఎక్కువసేపు కొనసాగితే 11 గంటల స్లాట్లో ఉన్న అభ్యర్థులకు ఆలస్యం ఎదురయ్యే అవకాశం ఉందని చెప్పారు. చివరి నిమిషంలో సమావేశాలు, షెడ్యూల్ మార్పులు వంటి కారణాలతో కూడా ఈ సమయానికి అంతరాయాలు ఎక్కువగా ఏర్పడే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంటర్వ్యూ బాగా సాగుతున్నప్పటికీ సమయాభావం వల్ల చర్చను కొనసాగించే అవకాశాలు తగ్గిపోవచ్చని, అవసరమైన ఫాలోఅప్ చర్చలు కూడా భోజనం తర్వాతకు వాయిదా పడే అవకాశం ఉంటుందని తెలిపారు.దీని బదులుగా ఉదయం 8 గంటల నుంచి 9.30 గంటల మధ్య ఇంటర్వ్యూ స్లాట్ లభిస్తే దానిని ఎంచుకోవాలని ఇంగారి సూచించారు. ఆ సమయంలో ఇంటర్వ్యూయర్లు తాజాగా ఉండటంతో పాటు సమావేశాల ఒత్తిడి తక్కువగా ఉంటుందని, ప్రశాంత వాతావరణంలో ఇంటర్వ్యూ జరిగే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని పేర్కొన్నారు.అయితే ఈ సూచనపై నెటిజన్లు ఏకీభవించలేదు. ఇంటర్వ్యూలో విజయాన్ని నిర్ణయించేది సమయం కాదని, అభ్యర్థి సన్నద్ధత, నైపుణ్యాలు, కమ్యూనికేషన్, ఆత్మవిశ్వాసమే కీలకమని చాలామంది యూజర్లు వ్యాఖ్యానించారు. కొందరు తాము 11 గంటల స్లాట్లోనే ఇంటర్వ్యూకు హాజరై ఉద్యోగాలు సాధించామని తెలిపారు. మరోవైపు, ఇంటర్వ్యూలు నిర్వహించే అనుభవం ఉన్న కొందరు రిక్రూటర్లు తమ షెడ్యూల్ బిజీగా ఉండటంతో సమయానికి అంత ప్రాధాన్యం ఇవ్వబోమని వెల్లడించారు.హెచ్ఆర్ నిపుణుల అభిప్రాయం కూడా ఇదే దిశగా ఉంది. ఇంటర్వ్యూ సమయం కొంతమేర ప్రభావం చూపినా, సబ్జెక్ట్ పరిజ్ఞానం, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్, సంస్థ గురించి అవగాహన, ఆత్మవిశ్వాసం వంటి అంశాలే తుది ఎంపికలో ప్రధాన పాత్ర పోషిస్తాయని వారు చెబుతున్నారు. అందువల్ల ఇంటర్వ్యూ సమయం కంటే, అభ్యర్థి పూర్తి స్థాయిలో సిద్ధమై హాజరవడం విజయానికి మరింత కీలకమని నిపుణులు సూచిస్తున్నారు.If HR asks you to choose when to be interviewed, don't choose 11:00 AM.Here's why :— Simons (@Simon_Ingari) June 26, 2026 -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు లీగల్ క్లీన్ చిట్..
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు స్వతంత్ర న్యాయ సమీక్షలో ఊరట లభించింది. మాజీ పార్ట్టైమ్ ఛైర్మన్ అతాను చక్రవర్తి రాజీనామా సందర్భంగా చేసిన పాలన, నైతికతకు సంబంధించిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లభించలేదని రెండు బాహ్య న్యాయ సంస్థలు తేల్చాయి.అమెరికాకు చెందిన ‘విల్సన్ సోన్సిని గుడ్రిచ్ & రొసాటి’ (సంక్షిప్తంగా విల్సన్ సోన్సిని)తో పాటు భారతీయ న్యాయ సంస్థ ‘వాడియా ఘండి & కో’ నిర్వహించిన మూడు నెలల సమీక్షలో బోర్డు సమావేశాల మినిట్స్, కమిటీ రికార్డులు, అధికారిక కమ్యూనికేషన్లు, సంబంధిత పత్రాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించినప్పటికీ చక్రవర్తి చేసిన ఆరోపణలకు మద్దతుగా ఎలాంటి సమకాలీన ఆధారాలు కనిపించలేదని బ్యాంకు స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది.బ్యాంకు తెలిపిన వివరాల ప్రకారం.. సమీక్షలో భాగంగా స్వతంత్ర డైరెక్టర్లు, కమిటీ చైర్మన్లు, ఎండీ-సీఈవో శశిధర్ జగదీశన్తో పాటు సీనియర్ మేనేజ్మెంట్ సభ్యులను ఇంటర్వ్యూ చేశారు. వేలాది పత్రాలు, బోర్డు ఎజెండాలు, సమావేశ మినిట్స్ను పరిశీలించారు. అతాను చక్రవర్తిని కూడా పలుమార్లు విచారణలో పాల్గొనాలని కోరినా, చివరకు ఆయన ఇంటర్వ్యూకు హాజరుకాలేదని బ్యాంకు వెల్లడించింది.మార్చిలో తన రాజీనామా లేఖలో బ్యాంకులో గత రెండేళ్లుగా చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు తన వ్యక్తిగత విలువలు, నైతిక ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నాయని చక్రవర్తి పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దుబాయ్ శాఖకు సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావించారు. అయితే ఈ అంశాలపై కూడా అధికారిక రికార్డుల్లో ఆయన అభ్యంతరాలు నమోదు చేసినట్లు లేదా బోర్డు నిర్ణయాలపై అసమ్మతి వ్యక్తం చేసినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని న్యాయ సమీక్ష స్పష్టం చేసింది.బోర్డు స్థాయిలో చర్చించిన అన్ని అంశాలు నిర్దేశిత పాలనా విధానాలకు అనుగుణంగానే నిర్వహించబడ్డాయని, ఎలాంటి కీలక లోపాలు గుర్తించలేదని బ్యాంకు పేర్కొంది. ఈ నివేదికను ఆడిట్ కమిటీ, అనంతరం బోర్డు పరిశీలించనుంది.జగదీశన్ పదవీకాలం పొడిగింపునకు మార్గం సుగమంఈ న్యాయ సమీక్షతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎండీ, సీఈవో శశిధర్ జగదీశన్ పదవీకాల పొడిగింపు ప్రక్రియకు మార్గం సుగమమైంది. ఆయన ప్రస్తుత పదవీకాలం అక్టోబర్లో ముగియనుండగా, మరోసారి నియామకానికి తనను అందుబాటులో ఉంచినట్లు గతంలో వెల్లడించారు. బోర్డు ఆమోదం అనంతరం సంబంధిత ప్రతిపాదనను ఆర్బీఐకి పంపనున్నారు.చక్రవర్తి ఆకస్మిక రాజీనామా తర్వాత పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొని, బ్యాంకు మార్కెట్ విలువలో సుమారు రూ.1 లక్ష కోట్లకుపైగా క్షీణత నమోదైంది. అనంతరం ఆర్బీఐ బ్యాంకు పాలనపై నమ్మకం వ్యక్తం చేయగా, ఇప్పుడు స్వతంత్ర న్యాయ సమీక్ష కూడా ఎలాంటి పాలనా లోపాలు లేవని తేల్చడంతో ఈ వివాదానికి తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఏఐ మెమరీచిప్స్ విస్తరణకు రూ. 1,000 కోట్లు
న్యూఢిల్లీ: ఏఐ మెమరీ చిప్స్ తయారీ సామర్థ్యాలను మరింతగా పెంచుకోవడంపై మైఫై దృష్టి పెడుతోంది. ఇందుకోసం రూ.1,000 కోట్లు ఇన్వెస్ట్ చేయాలని, ఉత్తర్ ప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ప్రస్తుతమున్న ప్లాంటును విస్తరించాలని యోచిస్తోంది. ఏఐ మౌలిక సదుపాయాలు, డేటా సెంటర్లు, ఆటోమొబైల్ తదితర రంగాల నుంచి మెమరీ సొల్యూషన్స్కి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మైఫై సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మూడు రెట్లు వ్యాపార వృద్ధి, రూ.1,000 కోట్ల ఆదాయాన్ని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. మైక్రోమ్యాక్స్, తైవాన్కి చెందిన ఫైసన్ సంస్థ కలిసి జాయింట్ వెంచర్గా ఏర్పాటు చేసిన మైఫై గతేడాది జనవరిలో వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాయి. దేశ విదేశీ కస్టమర్ల నుంచి భారీ ఆర్డర్ల దన్నుతో వచ్చే రెండు మూడేళ్లలో యూనికార్న్గా (1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్) ఎదిగే అవకాశం కూడా ఉందని శర్మ తెలిపారు. కేవలం హార్డ్వేర్కే పరిమితం కాకుండా కృత్రిమ మేధ (ఏఐ) సాఫ్ట్వేర్ విభాగంలోకి కూడా విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు. కృత్రిమ మేధ పనులకు సంబంధించి సిస్టమ్ మెమరీని మరింత సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు తమ ఏఐ అడాప్టివ్ మెమరీ సాఫ్ట్వేర్ సహాయకరంగా ఉంటుందని వివరించారు. -
జీఎంఆర్ ఏరో చేతికి నాగ్పూర్ ఎయిర్పోర్ట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నాగ్పూర్లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును ఆధునీకరించే దిశగా హ్యాండోవర్ చేసుకున్నట్లు జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ (జీఎంఆర్ ఏరో) వెల్లడించింది. దీనితో సంస్థ చేతిలోని విమానాశ్రయాల సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. వీటిలో కొన్ని కంపెనీ నిర్వహణలో ఉండగా, కొన్నింటిని అభివృద్ధి చేస్తోంది. 30 ఏళ్ల కన్సెషన్ వ్యవధిలో విమానాశ్రయాన్ని జీఎంఆర్ నాగ్పూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (జీఎన్ఐఏఎల్) దశలవారీగా అభివృద్ధి చేస్తుందని కంపెనీ చైర్మన్ జీబీఎస్ రాజు తెలిపారు. తొలి దశలో ఏటా ముప్పై లక్షల మంది ప్యాసింజర్ల స్థాయికి టెర్మినల్ని విస్తరించనున్నట్లు, దశలవారీగా 3 కోట్ల ప్రయాణికుల స్థాయికి పెంచనున్నట్లు వివరించారు. దీనికి సంబంధించి 2024లో మిహాన్ ఇండియాతో జీఎన్ఐఏఎల్ ఒప్పందం కుదుర్చుకుంది. -
నయా ట్రెండ్.. పెట్రోల్+ఎలక్ట్రిక్!
సిటీలో రోజూ 50–60 కిలోమీటర్ల జర్నీ.. వారాంతాల్లో విహారానికి అలా 300–400 కిలోమీటర్ల లాంగ్ రైడ్కు వెళ్లి రావాలి! ఎలక్ట్రిక్ కారు కొంటేనేమో దూర ప్రయాణాలకు రేంజ్ సమస్యతో పాటు చార్జింగ్ సదుపాయాలు ఇంకా సరిగ్గా అందుబాటులో లేవు. పోనీ పెట్రోలు కారైతే సిటీలో మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువ. మరి అటు నగర ప్రయాణాలకు పూర్తి ఎలక్ట్రిక్ కారు ఫీచర్స్.. ఇటు పెట్రోలు కారులా ఎంత దూరమైనా ప్రయాణించే చాన్సుంటే? ఒకే కారులో ఈ రెండు ఆప్షన్లు దొరికితే? అలాంటి వారి కోసమే ఇప్పుడు ప్లగ్–ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కార్లు (పీహెచ్ఈవీ) దూసుకొస్తున్నాయి. విదేశీ వాహన దిగ్గజాలతో పాటు దేశీ కంపెనీలు కూడా ఈ హైబ్రిడ్ మోడళ్లను తీసుకొచ్చేందుకు సై అంటున్నాయి. భారత్లో పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ కార్ల (ఈవీ)పై ఆసక్తి పెరుగుతున్నప్పటికీ.. చార్జింగ్ స్టేషన్లు తక్కువగా ఉండటం.. దూర ప్రయాణాల్లో బ్యాటరీ అయిపోతుందేమోనన్న భయం కొనుగోలుదారులను పునరాలోచనలో పడేస్తున్నాయి. ఈవీ ఎకోసిస్టమ్ పూర్తిగా ఏర్పాటయ్యేందుకు చాలా ఏళ్లే పట్టేలా ఉంది. దీనికి మధ్యేమార్గంగా ఆటోమొబైల్ కంపెనీలు ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్లపై ఫోకస్ చేస్తున్నాయి. తాజాగా మెర్సిడెస్ బెంజ్ పాపులర్ ఎస్–క్లాస్లో తొలి పీహెచ్ఈవీ మోడల్ ‘ఎస్450ఈ’ని ప్రవేశపెట్టింది. దీనిలోని బ్యాటరీ పవర్ 110 కిలోమీటర్ల రేంజ్ (ఒక్కసారి పూర్తి చార్జింగ్తో ప్రయాణించే దూరం) అందిస్తుంది. పెట్రోల్ ఇంజిన్తో ఎంచక్కా నచ్చినంత దూరం జర్నీ చేయొచ్చు. మెర్సిడెస్తో పాటు బీఎండబ్ల్యూ, వోల్వో వంటి లగ్జరీ కార్ల దిగ్గజాలు ప్రస్తుతం మన దగ్గర పీహెచ్ఈవీలను విక్రయిస్తున్నాయి.రేట్లు ఎక్కువే.. జీఎస్టీ తగ్గాలిఈవీలతో పోలిస్తే ప్రస్తుతం పీహెచ్ఈవీలు ఉపయోగకరమే అయినా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా అధిక రేట్లే ప్రధాన అడ్డంకి. పెట్రోల్ కార్లతో పోలిస్తే వీటి ధర సుమారు రూ. 15 లక్షలు ఎక్కువగా ఉంటోంది. చాలావరకు ప్రీమియం, లగ్జరీ విభాగంలోనే కంపెనీలు వీటిని తీసుకొస్తున్నాయి. వీటి ధరలు రూ.90 లక్షల నుంచి రూ. 2.5 కోట్ల రేంజ్లో ఉన్నాయి. మాస్ మార్కెట్కు అందుబాటులో లేవు. దీనికి తోడు ఈవీలకు 5 శాతం జీఎస్టీ ఉండగా.. పీహెచ్ఈవీలపై 40 శాతం ఫ్లాట్ జీఎస్టీ విధింపు వల్ల కూడా కొనుగోలుదారులపై అధిక భారం పడుతోంది. అందుకే వీటినీ ఈవీ కేటగిరీలోకి చేర్చాలనేది కంపెనీల డిమాండ్. కాగా, ధరలు తగ్గాలంటే స్థానిక అసెంబ్లింగ్ కూడా కీలకం. పూర్తిగా విదేశాల్లో తయారైన కార్లను దిగుమతి చేసుకోవడం వల్ల సుంకాల మోత మోగుతోంది. అందుకే సీకేడీ (వాహన విడిభాగాలను) దిగుమతి చేసుకుని దేశీయంగా అసెంబుల్ చేయడం వల్ల కూడా ధరలు భారీగా దిగొచ్చే అవకాశం ఉంటుంది.ప్లగ్–ఇన్ హైబ్రిడ్ అంటే...ప్లగ్–ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కార్లలో విద్యుత్ మోటార్తో పాటు పెట్రోల్ ఇంజిన్ ఉంటాయి. ఇందులోని బ్యాటరీని ఇంట్లో లేదా పబ్లిక్ చార్జింగ్ పాయింట్ ద్వారా చార్జ్ చేయవచ్చు. బ్రేకులు వేస్తున్నప్పుడు కూడా కొంత పవర్ తిరిగి బ్యాటరీలో స్టోర్ అవుతుంది. ఇక బ్యాటరీ చార్జింగ్ తగ్గినప్పుడు లేదా ఎక్కువ దూరం వెళ్లాల్సి వచి్చనప్పుడు పెట్రోల్ ఇంజిన్ పనిచేస్తుంది. ఇప్పుడు అందుబాటులో ఉన్న ప్లగ్ఇన్ హైబ్రిడ్ల రేంజ్ సుమారు 50–120 కిలోమీటర్లు. మన దేశంలో రోజువారీ సిటీ జర్నీ సుమారు 40–50 కిలోమీటర్ల మధ్యే ఉంటుంది. కాబట్టి పీహెచ్ఈవీలతో ఇంధన ఖర్చు దిగొస్తుంది. ఒకవేళ ఎక్కువ దూరం వెళ్లాల్సి వస్తే బ్యాటరీ అయిపోయాక పెట్రోల్ మోడ్లోకి మారడమే. ఇక మారుతీ గ్రాండ్ విటారా, హోండా సిటీ వంటి స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లలో పెట్రోలు ఇంజిన్లు సెల్ఫ్ చార్జింగ్ ద్వారా స్వయంగా కొంత విద్యుత్ను ఉత్పత్తి చేసుకుని స్టోర్ చేసుకుంటాయి. వీటిని బయటి నుంచి చార్జింగ్ చేయాల్సిన అవసరం లేదు. అయితే, ఎలక్ట్రిక్ మోడ్లో ఇవి 1–3 కిలోమీటర్లే వెళ్లగలవు. కారు స్టార్ట్ చేసేటప్పుడు, సిగ్నల్స్ వద్ద ఇవి బ్యాటరీ పవర్ను వాడుకుంటాయి. దీనివల్ల కొద్దిగా ఇంధనం ఆదా అవుతుంది.చైనా చలువతో మాస్మార్కెట్లోనూ...ఇప్పటిదాకా లగ్జరీ సెగ్మెంట్కే పరిమితమైన ఈ హైబ్రిడ్ కార్లు.. చైనా కంపెనీల చలువతో ఇకపై మాస్ మార్కెట్కు కూడా అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా బీవైడీ ‘సీల్ యూ’తో పాటు జేఎస్డబ్ల్యూ మోటార్స్ – చైనాకు చెందిన చెరీ ఆటోమొబైల్ భాగస్వామ్యంతో తీసుకొస్తున్న ‘జెటూర్ టీ2’ ఎస్యూవీ రిలీజ్ కోసం కారు ప్రియులు ఎదురుచూస్తున్నారు. ఈ రెండు ఎస్యూవీల్లోనూ పెట్రోల్ ఇంజిన్ పవర్తో పాటు 120 కిలోమీటర్ల పైగా బ్యాటరీ రేంజ్ ఉండటం విశేషం. సీల్ యూలో పెట్రోలు ఫుల్ ట్యాంక్, బ్యాటరీ ఫుల్ చార్జ్ చేస్తే.. 1,200 కిలోమీటర్లు నాన్స్టాప్గా దూసుకుపోవచ్చు. జెటూర్ టీ2 అయితే పెట్రోల్+ఎలక్ట్రిక్ రేంజ్ 1,000 కి.మీ. అంతేకాదు, వీటి ధరలు సైతం రూ.45–50 లక్షల మధ్యలోనే ఉండొచ్చని అంచనా. మరోపక్క జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ సైతం ఎస్యూవీ 520 పీహెచ్ఈవీని ప్రవేశపెడుతోంది. ఇది కూడా చైనా జాయింట్ వెంచర్ సెయిక్–జీఎం–వులింగ్ (ఎస్జీఎండబ్ల్యూ) స్టార్లైట్ 560 క్రాసోవర్ ఎస్యూవీ రీబ్యాడ్జ్డ్ వెర్షన్. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేటు!
భారతదేశంలో వరుసగా తగ్గుముఖం పడుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. ఎందుకంటే ఈ రోజు (జూన్ 26) గోల్డ్ రేటు ఊహకందని రీతిలో ఒక్కసారిగా పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరల్లో మార్పు జరిగింది. ఈ కథనంలో తాజా ధరల వివరాలు చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడలలో శుక్రవారం ఉదయం రూ.250 పెరిగి రూ.1,29,800 వద్ద ఉన్న 22 క్యారెట్ల తులం బంగారం రేటు.. సాయంత్రానికి రూ.1,30,850 వద్దకు చేరింది. అంటే గంటల వ్యవధిలో రూ.1050 పెరిగింది. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,41,600 నుంచి రూ.142750 వద్దకు చేరింది.ఢిల్లీలో కూడా గోల్డ్ ధరలో మార్పులు కనిపించాయి. దేశ రాజధానిలో 22 క్యారెట్ల తులం బంగారం ధర ఉదయం నుంచి సాయంత్రానికి రూ.1,29,950 నుంచి రూ.1,31,050 వద్దకు (రూ.1100 పెరిగింది) చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు 1,41,750 రూపాయల నుంచి 1,42,950 రూపాయల వద్దకు చేరింది.చెన్నైలో మాత్రం 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,33,000 (రూ.1600 పెరిగింది) వద్ద, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,45,090 (రూ.1740 పెరిగింది) వద్ద నిలిచింది. -
హైదరాబాద్లో టాటా ఈవీ మెగాచార్జర్ హబ్
భారతదేశపు అగ్రగామి ఇంటిగ్రేటెడ్ పవర్ కంపెనీ అయిన 'టాటా పవర్', దేశంలోనే అతిపెద్ద ఫోర్ వీలర్ ఈవీ తయారీ సంస్థ 'టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్'తో జతకట్టింది. ఈ రెండు సంస్థలు కలిసి తెలంగాణలోనే మొట్టమొదటి హై-స్పీడ్ 'టాటా.ఈవీ మెగాచార్జర్ హబ్'ను హైదరాబాద్లోని ఐలాబ్స్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్లో ప్రారంభించాయి.హైటెక్ సిటీ నడిబొడ్డున వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ ఐలాబ్స్ చార్జింగ్ హబ్.. హైదరాబాద్లో వేగంగా పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహన వినియోగదారుల అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా రూపొందించింది. సొంత ఈవీ కార్లు ఉన్నవారు, కమర్షియల్ ఫ్లీట్ నిర్వాహకులు, రైడ్ హెయిలింగ్ సర్వీసులు, నగరాల మధ్య ప్రయాణించే వారు, కార్పొరేట్ ఉద్యోగులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.హైదరాబాద్ నగరం దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ అండ్ బిజినెస్ హబ్గా ఎదుగుతున్న తరుణంలో.. నమ్మకమైన, వేగవంతమైన ఈవీ చార్జింగ్ మౌలిక సదుపాయాల డిమాండ్ను తీర్చడంతో పాటు, రాష్ట్ర పర్యావరణ లక్ష్యాలకు మద్దతు ఇవ్వడం ఈ కేంద్రం ముఖ్య ఉద్దేశ్యం.మొత్తం 360 కిలోవాట్స్ చార్జింగ్ సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ మెగాచార్జర్ హబ్లో మూడు 120 కిలోవాట్ల డిస్పెన్సర్లు ఉన్నాయి. వీటి సహాయంతో ఒకే సమయంలో ఆరు ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ చేయవచ్చు. 24 గంటలూ పనిచేసే ఈ సదుపాయం వల్ల చార్జింగ్ సమయం గణనీయంగా తగ్గుతుంది. అలాగే కస్టమర్లకు ఎటువంటి ఇబ్బంది లేని, నమ్మకమైన చార్జింగ్ అనుభూతి లభిస్తుంది. ఈ ప్రాంతంలో అత్యాధునిక ఈవీ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇది ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పింది. -
దిగ్గజ కంపెనీ కొత్త ప్లాన్.. లక్ష ఉద్యోగులు బయటకు!
జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఫోక్స్వ్యాగన్ గ్రూప్.. అతిపెద్ద పునర్వ్యవస్థీకరణ దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే.. కంపెనీ సీఈఓ ఒలివర్ బ్లూమ్ ఆధ్వర్యంలో రూపొందుతున్న ఈ ప్రణాళికలో భారీ స్థాయిలో ఉద్యోగ కోతలు, ఫ్యాక్టరీల మూసివేత, పెట్టుబడుల తగ్గింపు వంటి కీలక నిర్ణయాలు ఉండే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.కంపెనీ కొత్త ప్రణాళిక ప్రకారం.. సుమారు లక్ష ఉద్యోగాల వరకు కోతలు ఉండే అవకాశం ఉంది. ఇది సంస్థలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 15 శాతం అని తెలుస్తోంది. అయితే కంపెనీ 50వేల మంది ఉద్యోగులను తొలగించడానికి ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.ఫోక్స్వ్యాగన్ తన పెట్టుబడి వ్యయాన్ని కూడా తగ్గించాలని చూస్తోంది. రాబోయే ఐదేళ్లలో పెట్టుబడులను సుమారు 15 శాతం తగ్గించి, మొత్తం 130 బిలియన్ యూరోలకు పరిమితం చేయాలని యోచిస్తోంది. ఆర్ధిక ఒత్తిడిని తగ్గించుకోవడంలో భాగంగానే సంస్థ ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. -
35 వేల డాలర్లకు గోల్డ్?: కియోసాకి ట్వీట్
బంగారం, వెండి ధరలు తారుమారవుతున్న వేళ 'రాబర్ట్ కియోసాకి' ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బంగారం ఇప్పుడే మలుపు తిరిగింది. నా అంచనా తప్పయినప్పటికీ.. గోల్డ్, సిల్వర్ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.పెట్టుబడిదారుడు జిమ్ రికార్డ్స్ వంటి వారు భవిష్యత్తులో బంగారం ధర 35,000 డాలర్ల వరకు చేరవచ్చని అంచనా వేస్తున్నారని కియోసాకి తన ట్వీట్ ద్వారా వెల్లడించారు. అంతే కాకుండా.. గత అనుభవాలను పరిశీలిస్తే, 2000 సంవత్సరంలో ప్రారంభమైన పెద్ద బుల్ రన్ సమయంలో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. అప్పట్లో కొందరు పెట్టుబడిదారులు మంచి లాభాలను పొందారు. ఇప్పుడు కూడా అదే తరహా పరిస్థితులు మళ్లీ ఏర్పడవచ్చని ఆయన పేర్కొన్నారు.ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అప్పుల భారంతో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సంప్రదాయ కరెన్సీలపై నమ్మకం తగ్గి, బంగారం వంటి సురక్షితమైన ఆస్తులపై డిమాండ్ పెరుగుతుందని కియోసాకి చెప్పారు.'బంగారం అనేది నిజమైన డబ్బు, మిగతావన్నీ క్రెడిట్ మాత్రమే' అనే జేపీ మోర్గాన్ అభిప్రాయాన్ని కూడా కియోసాకి ఉదహరించారు. దీన్నిబట్టి చూస్తే.. అమెరికన్ డాలర్ కూడా ఒక రకమైన అప్పు ఆధారిత వ్యవస్థగా కనిపిస్తుందని వారు అంటున్నారు. అందువల్ల ఆర్థిక అనిశ్చితి పెరిగినప్పుడు బంగారం, వెండి వంటి ఆస్తులు మరింత బలపడతాయని చెబుతున్నారు.అంతే కాకుండా.. ఆధునిక ప్రపంచంలో కృత్రిమ మేధస్సు (AI) వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఇది భవిష్యత్తులో ఆర్థిక, ఉద్యోగ, పెట్టుబడి రంగాల్లో పెద్ద మార్పులను తీసుకురావచ్చని భావిస్తున్నారు. ఈ మార్పుల మధ్య పెట్టుబడిదారులు తమ ఆర్థిక నిర్ణయాలను మరింత జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది.GOLD just made the turn.I think and I have been wrong, the price of gold and silver are about to rise for a long time. Jim Rickards predicts $35,000 gold in near future.As I stated in my previous X the last big bull run began in 2000 and I bought gold at $300.In 2026 the…— Robert Kiyosaki (@theRealKiyosaki) June 25, 2026 -
భారత్లో కొత్త మోటార్సైకిళ్ల తయారీ!
అమెరికాకు చెందిన ప్రీమియం బైక్ తయారీ సంస్థ హార్లే డేవిడ్సన్, భారతీయ ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్ తమ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయనున్నాయి. ఇరు సంస్థలు కలిసి ఎంట్రీ లెవల్ పెర్ఫార్మెన్స్ మోటార్సైకిళ్లు, క్రూయిజర్ మోడళ్లను సంయుక్తంగా అభివృద్ధి చేయనున్నాయి. వీటిని భారతదేశంలోనే తయారు చేస్తారు. ఇక్కడి నుండి అంతర్జాతీయంగా, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు ఎగుమతి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.హార్లే ‘బ్యాక్ టు బ్రిక్స్’ వ్యూహం2019 నుంచి 2025 మధ్య కాలంలో హార్లే డేవిడ్సన్ అంతర్జాతీయ రిటైల్ విక్రయాలు 40 శాతం తగ్గాయి. దీంతో కంపెనీ మార్జిన్లు 18% దెబ్బతిన్నాయి. డీలర్ల లాభాలు ఏకంగా 80% మేర క్షీణించాయి. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు ‘బ్యాక్ టు బ్రిక్స్’ పేరుతో కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుత ప్లాట్ఫారమ్ల ఆధారంగా రాబోయే మూడేళ్లలో 20 కొత్త మోడళ్లు, వేరియంట్లను మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా ప్రీమియం విభాగంలో మరింత విస్తృతంగా వినియోగదారులను చేరుకోవాలని కంపెనీ భావిస్తోంది.వ్యూహాత్మకంగా భారత్లోకి రీఎంట్రీహార్లే డేవిడ్సన్ 2011లో హర్యానాలోని బావల్లో ప్లాంట్ ఏర్పాటు చేసింది. నష్టాల కారణంగా 2019లో భారత్లో తయారీ కార్యకలాపాలను నిలిపివేసింది. తర్వాత 2020లో హీరో మోటోకార్ప్తో లైసెన్సింగ్, పంపిణీ ఒప్పందం కుదుర్చుకుంది. డీల్లో భాగంగా మోటార్సైకిళ్ల విక్రయం, సరీ్వసింగ్తో పాటు సంయుక్తంగా కొత్త మోడళ్ల రూపకల్పన, తయారీ చేపట్టాలని నిర్ణయించారు. ఈ భాగస్వామ్యంలో తొలి ఉత్పత్తిగా వచి్చన హెచ్డీ ఎక్స్440 ఎక్స్షోరూమ్ ధర రూ.2.35 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. ఇదే ప్లాట్ఫారమ్పై హీరో మావ్రిక్ పేరుతో మరో మోడల్ను విక్రయిస్తోంది. ఇప్పుడు ఈ భాగస్వామ్యం అంతర్జాతీయ ఎగుమతుల దిశగా కీలక అడుగులు వేస్తోంది.వ్యాపారణ విస్తరణ వ్యూహంపై హార్లే డేవిడ్సన్ స్పందిస్తూ.. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో తమ బ్రాండ్ విస్తరణకు హీరో మోటోకార్ప్ కీలక భాగస్వామి అని పేర్కొంది. అయితే కొత్త ఉత్పత్తులపై పూర్తి వివరాలను వెల్లడించలేదు. మరోవైపు హీరో మోటోకార్ప్ సీఈఓ హర్షవర్ధన్ చితాలే మాట్లాడుతూ, ఈ ఏడాది మరిన్ని హార్లే బ్రాండెడ్ మోటార్సైకిళ్లు విడుదలవుతాయని ధృవీకరించారు.గ్లోబల్ మార్కెట్లలో అనుకూలత ఉంటే భారత్లో తయారైన మోడళ్లను ఇతర దేశాల్లో విక్రయించే నిర్ణయం పూర్తిగా హార్లే–డేవిడ్సన్దేనని స్పష్టం చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎక్స్440, హీరో మావ్రిక్ మోడళ్లు కలిపి దేశంలో 14,375 యూనిట్లు అమ్ముడయ్యాయి. 350సీసీ - 500సీసీ విభాగంలో సుమారు 11 శాతం మార్కెట్ వాటాతో, హీరో మోటోకార్ప్ ప్రస్తుతం బజాజ్ ఆటో, రాయల్ ఎన్ఫీల్డ్ తర్వాత మూడో అతిపెద్ద సంస్థగా నిలిచింది. పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం, ఈ ప్రీమియం మోటార్సైకిల్ విభాగంలో ఆపరేటింగ్ మార్జిన్లు సాఫ్ట్వేర్ ఎగుమతుల కంటే అధికంగా ఉండటం గమనార్హం.ఏడాది చివర్లో ‘హార్లే–డేవిడ్సన్ స్ప్రింట్’ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హార్లే–డేవిడ్సన్ ఎక్స్440, హీరో మావ్రిక్ మోడళ్లకు మంచి ఆదరణ లభించడంతో ప్రస్తు ఆర్థిక సంవత్సరంలో మరిన్ని కొత్త మోడళ్లను విడుదల చేయాలని ఇరు సంస్థలు నిర్ణయించాయి. వీటిలో తొలి మోడల్గా ‘హార్లే–డేవిడ్సన్ స్ప్రింట్’ ఈ ఏడాది చివర్లో మార్కెట్లోకి వచ్చే అవకాశముంది. అనంతరం దశలవారీగా మరిన్ని మోడళ్లను ప్రవేశపెట్టనున్నారు. వీటిలో కొన్ని మోడళ్లను భారత్ నుంచి తొలిసారిగా అభివృద్ధి చెందుతున్న అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయనున్నట్లు పరిశ్రమ వర్గాల సమాచారం. -
రూ.7 వేల కోట్ల వేతనం.. ఎవరీ శంఖ్ మిత్ర?
ప్రపంచ కార్పొరేట్ రంగంలో ఇండియన్స్ ప్రతిభ మరోసారి వెలుగులోకి వచ్చింది. భారతీయ మూలాలున్న శంఖ్ మిత్ర ప్రపంచంలోనే రెండో అత్యధిక వేతనం పొందిన సీఈఓగా గుర్తింపు పొందారు. ఈ జాబితాలో మొదటి స్థానంలో టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఉండగా, ఆయన తర్వాతి స్థానాన్ని శంఖ్ మిత్ర దక్కించుకోవడం విశేషం.అమెరికాకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అయిన 'వెల్టవర్'కు మిత్రా ప్రధాన కార్యనిర్వాహక అధికారిగా (CEO) బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2025 సంవత్సరానికి ఈయన మొత్తం 821 మిలియన్ డాలర్లు (సుమారు రూ.7,000 కోట్లకు పైగా) వేతనంగా అందుకున్నారు. ఇది గత దశాబ్దంలో ప్రపంచంలోని పబ్లిక్ కంపెనీల సీఈఓలకు ఇచ్చిన అత్యంత భారీ వేతన ప్యాకేజీల్లో ఒకటిగా నిలిచింది.శంఖ్ మిత్రకు లభించిన మొత్తం వేతనంలో దాదాపు 99 శాతం స్టాక్ అవార్డుల రూపంలోనే ఉంది. ముఖ్యంగా 2025 అక్టోబర్లో కంపెనీ ఆయనకు 789 మిలియన్ డాలర్ల విలువైన షేర్లను ప్రోత్సాహకంగా కేటాయించింది. ఆ షేర్ల విలువ ఏడాది చివరినాటికి 1 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. దీంతో ప్రపంచంలో అత్యధిక పారితోషికం పొందిన సీఈఓల జాబితాలో ఆయన రెండో స్థానంలో నిలిచారు.శంఖ్ మిత్ర వేతనం ప్రపంచంలోని పలువురు ప్రముఖ కంపెనీల సీఈఓల కంటే చాలా ఎక్కువగా ఉంది. గోల్డ్మాన్ సాక్స్ సీఈఓ డేవిడ్ సోలోమన్ 119 మిలియన్ డాలర్లు, పాలో ఆల్టో నెట్వర్క్స్ సీఈఓ నికేశ్ అరోరా 100 మిలియన్ డాలర్లు మాత్రమే వేతనంగా పొందారు. వీరందరినీ అధిగమించి శంఖ్ మిత్ర ప్రత్యేక గుర్తింపు సాధించారు.శంఖ్ మిత్ర భారతదేశంలోని కోల్కతాకు చెందినవారు. ఆయన తన ఇంజినీరింగ్ విద్యను జాదవ్పూర్ విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. అనంతరం అమెరికాలోని కొలంబియా బిజినెస్ స్కూల్లో అప్లైడ్ వ్యాల్యూ ఇన్వెస్టింగ్లో ఎంబీఏ పూర్తి చేసి అంతర్జాతీయ ఆర్థిక రంగంలో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు.తన వృత్తి జీవితాన్ని ప్రైస్వాటర్హౌస్కూపర్స్ (PwC)లో ప్రారంభించిన శంఖ్ మిత్ర, తరువాత ఫిడెలిటీ ఇన్వెస్ట్మెంట్స్, సిటాడెల్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ వంటి ప్రముఖ సంస్థల్లో సీనియర్ విశ్లేషకుడిగా పనిచేశారు. అనంతరం మిలీనియం మేనేజ్మెంట్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పోర్ట్ఫోలియో మేనేజర్గా సేవలందించారు.2016లో వెల్టవర్ సంస్థలో చేరిన ఆయన, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్, వైస్ చైర్మన్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వంటి కీలక పదవులను విజయవంతంగా నిర్వహించారు. చివరకు 2020 అక్టోబర్లో కంపెనీ సీఈఓగా, డైరెక్టర్ల బోర్డు సభ్యుడిగా నియమితులయ్యారు. ఇప్పుడు అత్యధిక వేతనం పొందుతున్న సీఈఓల జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. -
ఈ సమయంలో డ్రైవింగ్ ప్రమాదం!
భారతదేశంలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని జూనో జనరల్ ఇన్సూరెన్స్ వారి 'ఇండియా రోడ్ సేఫ్టీ రిపోర్ట్ (IRSR) 2026' దేశంలోని డ్రైవింగ్ అలవాట్లపై కీలకమైన విషయాలను వెల్లడించింది.జూనో స్మార్ట్డ్రైవ్ యాప్ ద్వారా సేకరించిన మొత్తం సమాచారం.. 17 రాష్ట్రాల్లో 45 లక్షల ప్రయాణాలు, 5.5 కోట్ల కిలోమీటర్ల డ్రైవింగ్ డేటా ఆధారంగా రూపొందించారు.ఈ నివేదిక ప్రకారం.. రాత్రి 9 గంటల నుంచి 10 గంటల మధ్య వాహనం నడపడం రోజులో అత్యంత ప్రమాదకరమైన సమయం. ఎందుకంటే రాత్రి 8 గంటల తర్వాత డ్రైవింగ్ నాణ్యత గణనీయంగా తగ్గుతుంది. అయితే.. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య డ్రైవింగ్ చేయడం అత్యంత సురక్షితమైన సమయంగా గుర్తించారు.ఈ అధ్యయనం ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేసింది. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం వయస్సు లేదా లింగం కాదు, డ్రైవింగ్ ప్రవర్తనే. భారతదేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో 80 శాతానికి పైగా ప్రమాదాలు డ్రైవింగ్ అలవాట్ల వల్లే సంభవిస్తున్నాయని నివేదిక పేర్కొంది.మహిళలు పురుషుల కంటే తక్కువ నైపుణ్యంతో డ్రైవ్ చేస్తారనే అభిప్రాయాన్ని ఈ నివేదిక పూర్తిగా ఖండించింది. మహిళల సగటు డ్రైవింగ్ స్కోర్ 92.86 కాగా, పురుషుల స్కోర్ 92.43గా నమోదైంది. అంటే.. ఇద్దరి మధ్య భద్రత పరంగా పెద్దగా తేడా లేదని ఈ అధ్యయనం వెల్లడించింది.భారతీయ డ్రైవర్లలో ప్రధాన బలహీనతలు ఆకస్మికంగా బ్రేక్ వేయడం, హఠాత్తుగా వేగం పెంచడం అని నివేదిక తెలిపింది. ఈ అంశాల్లో డ్రైవర్లు తక్కువ స్కోర్లు సాధించారు. అయితే వర్షాకాలం లేదా చలికాలం వంటి వాతావరణ మార్పులు డ్రైవింగ్ స్కోర్లపై పెద్దగా ప్రభావం చూపలేదని కూడా అధ్యయనం పేర్కొంది.భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు 1.73 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగే రోడ్డు మరణాల్లో దాదాపు 11 శాతం. ఈ ప్రమాదాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా భారీ నష్టం జరుగుతోంది. రోడ్డు ప్రమాదాల కారణంగా భారత జీడీపీలో 3 నుంచి 5 శాతం వరకు నష్టం వాటిల్లుతోంది.రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా నష్టపోతున్నవారు ద్విచక్ర వాహనదారులు, పాదచారులు. మొత్తం మరణాల్లో 44 శాతం ద్విచక్ర వాహనదారులు, 19 శాతం పాదచారులు ఉన్నారు.భారతదేశంలో 2030 నాటికి రోడ్డు ప్రమాదాల మరణాలను 50 శాతం తగ్గించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి రహదారుల నిర్మాణం మాత్రమే సరిపోదని, డ్రైవర్ల ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి సాంకేతికత ఆధారిత పరిష్కారాలు అవసరమని జునో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ షనాయ్ ఘోష్ అభిప్రాయపడ్డారు. -
వంతారాకు చేరిన 'మణికీ'.. ఆ ఏనుగుకు ఇక దీర్ఘకాలిక చికిత్సలు
జామ్నగర్: దాదాపు 48 ఏళ్ల వయసున్న ఏనుగు 'మణికీ' జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఎన్నో సంవత్సరాలుగా కాలికి తీవ్ర వైకల్యం, వయోభారంతో వచ్చిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మణికీని అత్యాధునిక వైద్య చికిత్స కోసం గుజరాత్లోని జామ్నగర్లో ఉన్న ‘వంతారా’కు తరలించారు. ఇకపై ఆ ఏనుగుకు దీర్ఘకాలిక వైద్య సంరక్షణతో పాటు శాశ్వత ఆవాసం కూడా కల్పించనున్నారు.మణికీ ముందు ఎడమ కాలులో చాలా కాలంగా ఉన్న వైకల్యం కారణంగా నడక తీవ్రంగా దెబ్బతింది. దీనికి తోడు ఇన్ఫెక్షన్తో కూడిన గాయాలు, ఒక కంటిలో చూపు మందగించడం, డీహైడ్రేషన్, శరీర బలహీనత వంటి సమస్యలు ఏనుగు ఆరోగ్యాన్ని మరింత క్లిష్టంగా మార్చాయి.అస్సాంలో చికిత్స కోసం తరలిస్తుండగా మణికీ తీవ్ర నొప్పితో కుంటుకుంటూ రహదారిపై నడుస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. జంతు సంక్షేమ కార్యకర్తలు, పౌరులు, పలు సంస్థలు ఆ ఏనుగుకు తక్షణ వైద్య సహాయం అందించాలని ప్రభుత్వాలను కోరాయి. పిటిషన్లు దాఖలు చేయడంతో మణికీ పరిస్థితి జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.మణికీకి ప్రత్యేక వైద్య చికిత్స అవసరమని గుర్తించిన దాని యజమాని రుచి చేతియా, బాధిత వన్యప్రాణుల రక్షణ, సంరక్షణ కోసం సుప్రీంకోర్టు నియమించిన కమిటీకి లేఖ రాసి వంతారాకు తరలించేందుకు అనుమతి కోరారు. అనంతరం కమిటీతో పాటు అస్సాం, గుజరాత్ ప్రభుత్వాల నుంచి అవసరమైన అనుమతులు లభించడంతో ఆ ఏనుగును సురక్షితంగా జామ్నగర్కు తరలించారు.అత్యాధునిక చికిత్స.. దీర్ఘకాలిక సంరక్షణవంతారాలోని అత్యాధునిక వెటర్నరీ ఆసుపత్రిలో మణికీకి సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించి, దీర్ఘకాలిక చికిత్స అందించనున్నారు. ప్రారంభ దశలో నొప్పి నివారణ చికిత్స, హైడ్రోథెరపీ, ఆక్యుపంక్చర్, ఇన్ఫెక్షన్తో ఉన్న గాయాలకు ప్రత్యేక వైద్యం, పోషకాహార పునరుద్ధరణ వంటి చర్యలు చేపట్టనున్నట్లు వంతారా ప్రతినిధులు తెలిపారు.అలాగే కాలుపై ఒత్తిడి తగ్గేలా మెత్తని నేల, సహజమైన మట్టి వాతావరణం, నీటిలో విశ్రాంతి తీసుకునేందుకు కుంటలు, సహజంగా ఆహారం వెతుక్కునే అవకాశం, ఇతర ఏనుగుల సాన్నిధ్యం వంటి అనుకూల వాతావరణాన్ని కూడా కల్పించనున్నారు. దీంతో మణికీ ఆరోగ్య పునరుద్ధరణకు అవసరమైన శారీరక, మానసిక ప్రశాంతత లభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.వంతారా ప్రతినిధులు మాట్లాడుతూ, మణికీ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ప్రత్యేక వైద్య పర్యవేక్షణ అత్యవసరమని నిర్ధారణ అయిందన్నారు. చికిత్స ప్రక్రియలో సహకరించిన సంబంధిత ప్రభుత్వ శాఖలకు, సుప్రీంకోర్టు కమిటీకి, అలాగే యజమాని రుచి చేతియాకు కృతజ్ఞతలు తెలిపారు.మణికీ రక్షణ కథనం ప్రజల చొరవ, జంతు సంక్షేమ సంస్థల కృషి, ప్రభుత్వాల సమన్వయం కలిసి ఒక జంతువు జీవితాన్ని ఎలా మార్చగలవో చూపించింది. ఎన్నో రోజులుగా బాధతో సాగిన ఆ ఏనుగు ప్రయాణానికి ఇప్పుడు ముగింపు పలుకుతూ, చికిత్స, సంరక్షణ, ప్రశాంతతతో కూడిన కొత్త జీవితానికి వంతారా వేదికగా మారింది.వంతారా గురించి..వంతారా అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ స్థాపించిన ప్రపంచ స్థాయి జంతు సంక్షేమ, సంరక్షణ కేంద్రం. గాయపడిన, అనారోగ్యంతో ఉన్న అడవి జంతువులను రక్షించడం, వైద్య చికిత్స అందించడం, పునరావాసం కల్పించడం, దీర్ఘకాలిక సంరక్షణ అందించడం దీని ప్రధాన లక్ష్యం. ప్రపంచంలోనే అతిపెద్ద ఏనుగుల ఆసుపత్రుల్లో ఒకటిగా ఉండటమే కాకుండా అత్యాధునిక మల్టీ స్పెషాలిటీ వన్యప్రాణి ఆసుపత్రులను నిర్వహిస్తూ, శాస్త్రీయ విధానాలతో జంతు సంరక్షణ కార్యక్రమాలను చేపడుతోంది. ప్రభుత్వాలు, వివిధ భాగస్వామ్య సంస్థలతో కలిసి వన్యప్రాణుల సంరక్షణకు వంతారా సేవలందిస్తోంది. -
హైదరాబాద్ హౌసింగ్ మార్కెట్ జోరు..
దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్లో హైదరాబాద్ మరోసారి తన బలాన్ని చాటుకుంది. 2026 రెండో త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో నగరంలో గృహ విక్రయాలు, కొత్త ప్రాజెక్టుల ప్రారంభాలు రెండూ గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా కొత్త ఇళ్ల సరఫరాలో హైదరాబాద్ దేశంలోనే రెండో అతిపెద్ద మార్కెట్గా నిలవడం విశేషం. రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ ప్రాప్ఈక్విటీ (PropEquity) విడుదల చేసిన తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో మొత్తం గృహ విక్రయాలు ఏడాది క్రితంతో పోలిస్తే 19 శాతం పెరిగి 1,12,458 యూనిట్లకు చేరగా, కొత్త గృహాల ప్రారంభాలు 43 శాతం పెరిగి 1,17,609 యూనిట్లకు చేరాయి. మధ్యప్రాచ్యంలోని భౌగోళిక ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ భారత గృహ మార్కెట్పై వాటి ప్రభావం పెద్దగా కనిపించలేదని నివేదిక పేర్కొంది. త్రైమాసిక ప్రాతిపదికన కూడా విక్రయాలు 14 శాతం, కొత్త సరఫరా 27 శాతం పెరిగాయి.హైదరాబాద్లో ఈ త్రైమాసికంలో 14,410 ఇళ్లు విక్రయం కాగా, ఇది గత ఏడాదితో పోలిస్తే 22 శాతం అధికం. మరోవైపు 18,407 కొత్త గృహ యూనిట్లు మార్కెట్లోకి రావడం ద్వారా సరఫరా 75 శాతం పెరిగింది. ఈ పెరుగుదలతో పుణె, థానే, ఢిల్లీ-ఎన్సీఆర్లను వెనక్కి నెట్టి, బెంగళూరు తర్వాత దేశంలో రెండో అతిపెద్ద హౌసింగ్ సప్లై మార్కెట్గా హైదరాబాద్ అవతరించింది.దక్షిణ భారత నగరాలే ఈసారి మార్కెట్కు ప్రధాన చోదకశక్తిగా నిలిచాయి. బెంగళూరులో విక్రయాలు 47 శాతం పెరిగి 21,516 యూనిట్లకు చేరి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాయి. చెన్నైలో కూడా 18 శాతం వృద్ధి నమోదైంది. పశ్చిమ భారత నగరాల్లో నవీ ముంబై, ముంబై బలమైన వృద్ధిని నమోదు చేయగా, ఢిల్లీ-ఎన్సీఆర్, కోల్కతాల్లో మాత్రం విక్రయాలు తగ్గాయి.రియల్ ఎస్టేట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, హైదరాబాద్లో ఐటీ, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ల (GCCs) విస్తరణ, మెట్రో కనెక్టివిటీ, కోకాపేట్–ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్–నర్సింగి వంటి ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టుల ప్రారంభం గృహ డిమాండ్ను బలోపేతం చేస్తున్నాయి. ఇదే సమయంలో నాణ్యమైన ప్రాజెక్టులను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు డెవలపర్లు కూడా వేగం పెంచుతున్నారు. -
ఐపీవో బాటలో మరిన్ని కంపెనీలు
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూల (ఐపీవో) ద్వారా నిధులు సమీకరించేందుకు కంపెనీలు క్యూ కడుతున్నాయి. తాజాగా కన్జూమర్ ఎల్రక్టానిక్స్ రిటైల్ సంస్థ సత్య ఏజెన్సీస్, ట్రాన్స్ఫార్మర్ల తయారీ సంస్థ కనోహర్ ఎలక్ట్రికల్స్, టోరెంట్ గ్యాస్ ప్రతిపాదనలకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదముద్ర వేసింది. సత్యా ఏజెన్సీస్, టోరెంట్ గ్యాస్ మార్చి నెలలో, కనోహర్ ఎలక్ట్రికల్స్ జనవరిలో తమ ఐపీవో ముసాయిదా పత్రాలను సమరి్పంచాయి. వాటిని పరిశీలించిన మీదట జూన్ 2–25 మధ్య సెబీ తన ’అబ్జర్వేషన్స్’ని ఇచ్చింది. దీన్ని పబ్లిక్ ఇష్యూకి గ్రీన్ సిగ్నల్గా పరిగణిస్తారు. కీలకమైన వ్యాపార వివరాలు ప్రస్తుత దశలో బహిర్గతం కాకుండా, టోరెంట్ గ్యాస్ సంస్థ కాన్ఫిడెన్షియల్ విధానంలో తమ పత్రాలను సమర్పించింది. సత్య ఏజెన్సీస్ రూ. 600 కోట్లు.. ముసాయిదా పత్రాల ప్రకారం తమిళనాడుకు చెందిన సత్య ఏజెన్సీస్ రూ. 600 కోట్లు సమీకరించనుంది. ఇందులో భాగంగా రూ. 300 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ప్రమోటర్లు రూ. 300 కోట్ల విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద విక్రయించనున్నారు. ప్రమోటర్లయిన జాన్సన్ అసారియా, జె జాన్ సత్య, చార్లెస్ పకియారాజ్ తలో రూ. 100 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించనున్నారు. తాజా షేర్ల జారీ ద్వారా సమీకరించిన నిధులను కంపెనీ నిర్దిష్ట రుణాలను చెల్లించివేసేందుకు, ఇతరత్రా కార్పొరేట్ అవసరాలకు వినియోగించుకోనుంది. రూ. 300 కోట్ల కనోహర్ ఇష్యూ.. కనోహర్ ఎలక్ట్రికల్స్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 300 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేసే యోచనలో ఉంది. అలాగే ప్రమోటర్లు సుమారు 1.45 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ విధానంలో విక్రయించనున్నారు. తాజా షేర్ల జారీ ద్వారా సేకరించిన నిధులను వ్యాపార వృద్ధి, వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. తమ గంగోల్ ప్లాంటు కోసం యంత్రపరికరాల కొనుగోలు, ఆటోమేషన్, సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు, ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు మొదలైన వాటిపై వెచ్చించనుంది. -
బంగారం, వెండి ధరలు.. ఒక్క రోజులో రివర్స్!
దేశంలో బంగారం, వెండి ధరల పతనానికి బ్రేక్ పడింది. మూడు రోజులుగా భారీగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు నేడు పెరుగుదల బాటపట్టాయి. ఇక వెండి ధరల్లో కూడా నేడు పెరుగుదల నమోదైంది. దీంతో కొనుగోలుదారులకు నిరాశ ఎదురైంది. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
చల్లారుతున్న చమురు ధరల మంటలు
న్యూఢిల్లీ: హార్మూజ్ జలసంధి నుంచి నౌకల రాకపోకలకు మార్గం సుగమమై, సరఫరా మెరుగుపడుతుండటంతో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఫిబ్రవరి ఆఖరులో అమెరికా, ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం మొదలు కావడానికి ముందు స్థాయికి చేరుకుంటున్నాయి. అంతర్జాతీయంగా ప్రామాణికంగా తీసుకునే బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్కి 72–73 డాలర్లకు, అమెరికా క్రూడాయిల్ రేటు 70 డాలర్లకు దిగి వచ్చాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఇవి ఒక దశలో 120 డాలర్లకు ఎగిసిన సంగతి తెలిసిందే.ఇక ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేయడానికి ముందు రోజున .. అంటే ఫిబ్రవరి 27న భారత్ కొనుగోలు చేసే ముడిచమురు బాస్కెట్ ధర 71.17 డాలర్లు పలికింది. తాజాగా కేంద్ర చమురు శాఖలో భాగమైన పెట్రోలియం ప్లానింగ్, అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) డేటా ప్రకారం జూన్ 24న ఇది 70.71 డాలర్లకు నెమ్మదించింది. జూన్ పూర్తి నెలకు గాను సగటు ధర 86.31 డాలర్లుగా ఉంది. ఫిబ్రవరిలో ఇది 72.47గా నమోదైంది. భారత్కి ఊరట... ముడిచమురు కోసం భారత్ ప్రధానంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. సుమారు 88 శాతం క్రూడాయిల్ని దిగుమతి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో బ్యారెల్ ధర కనీసం 10 డాలర్లు తగ్గినా ఏటా బిలియన్ల కొద్దీ డాలర్ల స్థాయిలో దిగుమతుల బిల్లు ఆదా అవుతుంది. కరెంటు అకౌంటు లోటు తగ్గుతుంది. అలాగే, ఇంధన, రవాణా, తయారీ వ్యయాలు తగ్గడం ద్వారా రిటైల్ ద్రవ్యోల్బణం నెమ్మదిస్తుంది. ప్రభుత్వంపై ఇంధన సబ్సిడీల భారం కూడా తగ్గి .. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.ఇంధనాల రేట్లు తగ్గడం వల్ల పెట్రోకెమికల్ డెరివేటివ్స్ కీలకంగా ఉండే ఏవియేషన్, పెయింట్స్, కెమికల్స్, లాజిస్టిక్స్, కన్జూమర్ గూడ్స్ తదితర రంగాలకు కూడా ఊరట లభిస్తుంది. దీన్ని ప్రతిబింబిస్తూ, ఇంధనాలను విరివిగా ఉపయోగించే కంపెనీల మార్జిన్లు బాగుంటాయనే ఇన్వెస్టర్ల అంచనాలతో వాటి షేర్లు ఇప్పటికే పుంజుకోవడం కనిపిస్తోంది. ఇక, ఇంధనాల దిగుమతులకు డాలర్లను చెల్లించడం తగ్గుతుంది కాబట్టి, వాటికి డిమాండ్ నెమ్మదించి రూపాయి మారకం విలువ పెరుగుతుంది. తగ్గుదల స్థిరంగా ఉంటేనే.. గ్లోబల్గా క్రూడాయిల్ ధరలు ఎగియడంతో ప్రభుత్వ రంగ ఇంధన మార్కెటింగ్ సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు సుమారు రూ. 7.50 మేర పెంచిన సంగతి తెలిసిందే. అయితే, ముడి చమురు ధరలు రికార్డు స్థాయుల నుంచి తగ్గినప్పటికీ దేశీయంగా పెట్రోల్, డీజిల్ రేట్లను మాత్రం అవి తగ్గించలేదు. దీనితో ధర ధరలను రోజువారీగా కాకుండా అంతర్జాతీయంగా గడిచిన పక్షం, నెల రోజుల సగటు రేట్లను బట్టి ఆయిల్ కంపెనీలు సవరిస్తాయని పరిశ్రమవర్గాలు తెలిపాయి. ఒకవేళ క్రూడాయిల్ రేట్లు నిలకడగా తక్కువ స్థాయిలోనే కొనసాగిన పక్షంలో పెట్రోల్ బంకుల్లో ఆ ప్రయోజనాలు కనిపించాలంటే కొంత సమయం పట్టొచ్చని వివరించాయి. గ్లోబల్గా క్రూడాయిల్ రేట్లు భారీగా పెరిగినప్పటికీ దాదాపు రెండున్నర నెలల తర్వాతే ఆయిల్ కంపెనీలు ఇంధనాల రేట్లను పాక్షికంగా పెంచినట్లు పేర్కొన్నాయి.ప్రస్తుతం ముడిచమురు ధరలు తగ్గిన తరుణంలో డీజిల్ విక్రయాలపై స్వల్ప నష్టాలు వస్తున్నప్పటికీ పెట్రోల్పై మెరుగ్గా మార్జిన్లు లభిస్తున్నాయని అధికారులు వివరించారు. ఆయిల్పై ఆందోళన తగ్గడమనేది ప్రభుత్వ స్పందనలోనూ కనిపిస్తోంది. ఉద్రిక్తతలు మొదలైన తర్వాత నుంచి అంతర్ మంత్రిత్వ శాఖలకు ప్రతి రోజూ తాజా పరిస్థితుల గురించి బ్రీఫింగ్ జరిగేది. సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సన్నద్ధతపై కీలక మంత్రిత్వ శాఖల అధికారులు ఇందులో చర్చించేవారు. పరిస్థితి మెరుగుపడే కొద్దీ ఈ సమావేశాల నిర్వహణ నెమ్మదిగా వారానికి రెండు సార్లకు తగ్గింది. సాధారణంగా సోమవారం, గురువారం బ్రీఫింగ్ నిర్వహిస్తున్నప్పటికీ, ఈ వారం అసలు సమావేశాలే జరగలేదు. -
రూపాయి పెట్టుబడి లేకుండా బిజినెస్ ప్రారంభించడం ఎలా?
డెహ్రాడూన్: వ్యాపారం ప్రారంభించాలంటే భారీగా పెట్టుబడి ఉండాలని చాలా మంది భావిస్తారు. కానీ, వ్యాపార నైపుణ్యాలు, క్రౌడ్ మేనేజ్మెంట్, స్థానిక డిమాండ్ను అర్థం చేసుకుంటే రూపాయి పెట్టుబడి లేకుండా కూడా డబ్బు సంపాదించవచ్చని నిరూపించారు సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ తనీ ఠాకూర్ ఉత్తరాఖండ్లోని పవిత్ర పుణ్యక్షేత్రం రిషికేశ్లో ఆయన చేసిన సోషల్ ఎక్స్పెరిమెంట్ ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. తనీ ఠాకూర్ సమాజంలో మనుషుల ప్రవర్తన, వారి మనస్తత్వం, భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా, కేవలం తన తెలివితేటలతో డబ్బు సంపాదించడం ఎలా అనే సవాలును ఆయన ఎంచుకున్నారు.దీనికోసం ఆయన ఆధ్యాత్మిక నగరమైన రిషికేశ్లోని గంగా నది తీరాన్ని ఎంపిక చేసుకున్నారు రిషికేశ్ ఆధ్యాత్మిక వాతావరణానికి, అక్కడి సంస్కృతికి సరిపోయేలా తనీ ఠాకూర్ సాంప్రదాయ దుస్తులను ధరించారు. ఒక చిన్న పళ్లెంలో తిలకం (బొట్టు) తీసుకుని వీధుల్లోకి వెళ్లారు. గంగా నది తీరంలో తిరిగే పర్యాటకులను, భక్తులను సమీపించి వారి నుదుటిపై తిలకం దిద్దడం ప్రారంభించారు. ఈ ప్రయోగంలో అత్యంత కీలకమైన మలుపు ఏమిటంటే, ఆయన ఎవరినీ డబ్బులు అడగలేదు. అంతేకాకుండా, సాధారణంగా డబ్బులు అడిగే వారు చేసేలా తన ప్లేటులో ఎలాంటి నోట్లను గానీ, నాణేలను గానీ ప్రదర్శించలేదు. ప్రయోగం ప్రారంభించిన మొదటి గంటలో పెద్దగా స్పందన రాలేదు. చాలా మంది ఠాకూర్ను చూసి తిరస్కరించారు. మొదటి గంటలో కేవలం 20 మంది మాత్రమే ఆయనతో తిలకం పెట్టించుకున్నారు.అయితే, సమయం గడుస్తున్న కొద్దీ అక్కడి భక్తులు ఆయన నిస్వార్థ సేవను, భక్తిని గమనించారు. తిలకం పెట్టించుకున్న వారు కేవలం కృతజ్ఞతతో సరిపెట్టకుండా, భక్తిభావంతో స్వచ్ఛందంగా డబ్బులు ఇవ్వడం ప్రారంభించారు. ఎవరినీ ఒక్క రూపాయి కూడా డిమాండ్ చేయకుండానే, కేవలం 3 గంటల వ్యవధిలో ఆయన ప్లేటులోకి ఏకంగా రూ.2,350 జమ అయ్యాయి. ఈ సోషల్ ఎక్స్పెరిమెంట్ ద్వారా తనీ ఠాకూర్ నేటి తరం యువతకు, కాబోయే వ్యాపారవేత్తలకు కొన్ని ముఖ్యమైన విషయాలను నిరూపించారు. View this post on Instagram A post shared by Tan_E (@mrtan.e_) ఏ ప్రాంతంలో ఏ వస్తువుకు లేదా సేవకు ప్రాధాన్యత ఉంటుందో గుర్తించడం (ఆధ్యాత్మిక క్షేత్రంలో తిలకం ప్రాధాన్యతను వాడుకోవడం). బలవంతంగా డబ్బులు అడగకుండా, వారి భావోద్వేగాలను, భక్తిని గౌరవిస్తూ సేవ చేయడం ద్వారా ప్రజలు మరింతగా ఆకర్షితులవుతారు.వ్యాపారానికి డబ్బు కంటే కూడా క్రౌడ్ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, సమయస్ఫూర్తి చాలా అవసరమని ఈ ప్రయోగం స్పష్టం చేసింది. ప్రస్తుతం డిజిటల్ ప్రపంచంలో ఈ వీడియో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. పెట్టుబడి లేదని ఆగిపోయే వారికి ఈ స్టోరీ ఒక గొప్ప బూస్ట్లా పనిచేస్తోంది. -
స్టాక్ మార్కెట్: ట్రేడింగ్ బంద్
మొహర్రం సందర్భంగా శుక్రవారం (జూన్ 26) దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ పూర్తిగా నిలిచిపోయింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE)ల్లో ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్స్, కరెన్సీ డెరివేటివ్స్, సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ బారోయింగ్ (SLB) తదితర అన్ని ప్రధాన విభాగాల్లో లావాదేవీలు జరగవు. దీంతో దలాల్ స్ట్రీట్కు వరుసగా మూడు రోజుల విరామం లభించింది. శనివారం, ఆదివారం వారాంతపు సెలవులు కావడంతో రెగ్యులర్ ట్రేడింగ్ మళ్లీ జూన్ 29 (సోమవారం) ప్రారంభం కానుంది.కరెన్సీ, డెట్ మార్కెట్లలో కూడా శుక్రవారం ఎలాంటి ట్రేడింగ్ ఉండదు. జూన్ నెలలో ఇదే ఏకైక అధికారిక ట్రేడింగ్ సెలవు కాగా, అంతకుముందు మే 28న బక్రీద్ సందర్భంగా మార్కెట్లు మూతపడ్డాయి. జూలై, ఆగస్టు నెలల్లో ప్రత్యేక ట్రేడింగ్ సెలవులు లేకపోగా, తదుపరి మార్కెట్ సెలవు సెప్టెంబర్ 14న గణేశ్ చతుర్థి సందర్భంగా ఉంటుంది.అయితే కమోడిటీ మార్కెట్లో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ఉదయం సెషన్ (ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు) ట్రేడింగ్ ఉండదు. అయితే సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11:30/11:55 గంటల వరకు ఈవెనింగ్ సెషన్లో ట్రేడింగ్ కొనసాగుతుంది. మరోవైపు NCDEXలో మాత్రం రోజంతా ట్రేడింగ్ అందుబాటులో ఉండదు. -
12 కోట్లు దాటిన క్రెడిట్ కార్డులు..
దేశంలో డిజిటల్ చెల్లింపుల వినియోగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో క్రెడిట్ కార్డుల సంఖ్య మరో కీలక మైలురాయిని చేరుకుంది. 2026 మే నాటికి దేశంలో క్రియాశీల (యాక్టివ్) క్రెడిట్ కార్డుల సంఖ్య 12.04 కోట్లకు చేరుకుంది. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 8.3 శాతం అధికం. మే నెలలోనే నికరంగా 10.17 లక్షల కొత్త క్రెడిట్ కార్డులు జారీ కావడం విశేషం. ఇది ఏడాది ప్రాతిపదికన 33.7 శాతం, ఏప్రిల్తో పోలిస్తే 26.9 శాతం పెరుగుదలను సూచిస్తోందని ఆర్బీఐ గణాంకాలు వెల్లడించాయి.క్రెడిట్ కార్డుల వినియోగం కూడా స్థిరంగా కొనసాగుతోంది. మే నెలలో మొత్తం కార్డు లావాదేవీల విలువ రూ.2.02 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది గత ఏడాదితో పోలిస్తే 6.3 శాతం అధికం. అయితే ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా మార్చిలో నమోదైన రికార్డు స్థాయి రూ.2.19 లక్షల కోట్ల ఖర్చుతో పోలిస్తే ఇంకా తక్కువగానే ఉంది. ఏప్రిల్లో నమోదైన రూ.1.97 లక్షల కోట్లతో పోలిస్తే మాత్రం స్వల్పంగా మెరుగుదల కనిపించింది. ఒక్కో క్రెడిట్ కార్డుపై సగటు నెలవారీ వ్యయం రూ.16,778గా నమోదైంది.కొత్త కార్డుల జారీలో ఎస్బీఐ కార్డ్స్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వరుసగా రెండో, మూడో స్థానాల్లో ఉన్నాయి. ఇదే సమయంలో ఫెడరల్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ వంటి మధ్యస్థాయి బ్యాంకులు కూడా కార్డు జారీలో వేగంగా విస్తరిస్తున్నాయి. మరోవైపు కొన్ని బ్యాంకులు అసురక్షిత రుణాల రిస్క్ను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా ముందుకు సాగుతున్నాయి.విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, దేశంలో డిజిటల్ చెల్లింపులు, ఈ-కామర్స్ విస్తరణతో క్రెడిట్ కార్డుల వినియోగదారుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, ఖర్చుల వృద్ధి గతంతో పోలిస్తే కొంత మితంగా సాగుతోంది. దీంతో బ్యాంకులు మార్కెట్ వాటాను పెంచుకోవడమే కాకుండా, లాభదాయకతను కాపాడుకోవడం, బకాయిలు పెరగకుండా రిస్క్ మేనేజ్మెంట్పై మరింత దృష్టి సారిస్తున్నాయి. -
యాపిల్ మ్యాక్బుక్, ఐప్యాడ్ ధరలు భారీగా పెరిగాయ్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్తో పాటు భారత్లోనూ టెక్ దిగ్గజం యాపిల్ తన మ్యాక్బుక్, ఐప్యాడ్ మోడళ్ల ప్రారంభ ధరలను భారీగా పెంచింది. లాంచ్ ధరలతో పోలిస్తే వీటిపై ఏకంగా 20 శాతం నుండి 42 శాతం వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విస్తరణతో మెమరీ చిప్ల కొనుగోలు ఖర్చులు విపరీతంగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణం.యాపిల్ ఇండియా అధికారిక వెబ్సైట్ ప్రకారం.. ‘ఎం5’ సిరీస్ చిప్తో పనిచేసే మ్యాక్బుక్ ప్రో ధరలను కంపెనీ దాదాపు 20 శాతం మేర పెంచింది. ఎం5 ప్రో చిప్తో కూడిన 14–ఇంచుల మ్యాక్బుక్ ప్రో ప్రారంభ ధర రూ. 2,49,900 ఉండగా, ఇప్పుడది రూ. 2,99,900కి చేరింది. ఐప్యాడ్ ఎయిర్ ధరలో అత్యధిక పెరుగుదల నమోదైంది. బేసిక్ మోడల్ 13–ఇంచుల ఐప్యాడ్ ఎయిర్ ధర 41.22 శాతం పెరిగింది. రూ. 84,900 గా ఉన్న ఈ వేరియంట్ ధర ఇప్పుడు రూ. 1,19,900 కి చేరింది.మార్కెట్ ఒత్తిడి తట్టుకోలేకపోయాం: యాపిల్ ప్రస్తుతం కన్జూమర్ ఎల్రక్టానిక్స్ రంగం తీవ్రమైన స వాళ్లను ఎదుర్కొంటోందని యాపిల్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఏఐ డేటా సెంటర్ల వేగవంతమైన విస్తరణతో మెమరీ, స్టోరేజ్ చిప్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. విడిభాగాల ధరలు ఇంత స్వల్ప కాలంలో ఈ స్థాయిలో పెరగడం ఎప్పుడూ చూడలేదు. ఇప్పటివరకు ఈ భారాన్ని వినియోగదారులపై పడకుండా కాపాడుకుంటూ వచ్చాం. కానీ, ఇకపై భరించలేని పరిస్థితితో ఐప్యాడ్, మ్యాక్ వంటి ఉత్పత్తుల ధరలను పెంచక తప్పలేదు’ అని యాపిల్ పేర్కొంది. -
‘ఎయిర్పోర్ట్ సిటీ’లపై రూ. 20 వేల కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: భారీ స్థాయిలో చేపడుతున్న ఎయిర్పోర్ట్ సిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టులపై అదానీ ఎయిర్పోర్ట్ (ఏఏసీఎల్) తొలి దశలో రూ. 20,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేయనుంది. ఇందులో అత్యధికంగా 70 శాతాన్ని ముంబై, నవీ ముంబైలో పెట్టుబడులు పెట్టనుంది. ఈ ప్రాంతంలో కంపెనీ చేతిలో దాదాపు 440 ఎకరాల స్థలం ఉంది.ఏఏసీఎల్ అయిదు రాష్ట్రాల్లో ఆరు విమానాశ్రయాలవ్యాప్తంగా 655 ఎకరాల్లో సిటీ ప్రాజెక్టులను చేపడుతోంది. మెట్రో, పట్టణ ప్రాంత రవాణా నెట్వర్క్లతో విమానాశ్రయాలను అనుసంధానం చేసేలా వీటిలో హోటళ్లు, ఆఫీసులు, రిటైల్, ఎంటర్టైన్మెంట్, కన్వెన్షన్ సెంటర్లు మొదలైనవి ఏర్పాటవుతాయి. ముంబై, నవీ ముంబై, అహ్మదాబాద్, లక్నో, జైపూర్, గౌహతి ఎయిర్పోర్టులు ఈ జాబితాలో ఉన్నాయి. -
కొండ దిగుతున్న కనకం
న్యూఢిల్లీ: పసిడి, వెండి గురువారం కూడా దేశీ మార్కెట్లో నష్టాలను చవిచూశాయి. క్రితం రోజు ప్రపంచ మార్కెట్లలో ఈ రెండు లోహాలు భారీగా పడిపోయిన నేపథ్యంలో.. దేశీ బులియన్ మార్కెట్పైనా ఇది ప్రతి ఫలించింది. 10 గ్రాముల బంగారం రూ.2,800 నష్టంతో రూ.1,45,300 వద్దకు దిగొచ్చింది.వెండి కిలోకి రూ.5,000 తగ్గి రూ.2,26,000 స్థాయికి పరిమితమైంది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం పసిడి, వెండి లాభ, నష్టాల మధ్య ట్రేడవుతున్నాయి. ఒక దశలో పసిడి అర శాతం తగ్గగా.. తర్వాత 1% వరకు పుంజుకుని ఔన్స్కు 4,033 డాలర్ల స్థాయిని అందుకుంది. వెండి ధర ఔన్స్కు 2 శాతానికి పైగా లాభపడి 58.57 డాలర్ల స్థాయిని చేరుకుంది. -
స్టాండర్డ్ ఇంజనీరింగ్ చేతికి జీస్కేల్ ఎనర్జీ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏఐ డేటా సెంటర్ ఇంజనీరింగ్ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ జీస్కేల్ ఎనర్జీలో స్టాండర్డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ (ఎస్ఈటీఎల్) 51 శాతం వాటాలను కొనుగోలు చేయనుంది. ప్రాథమికంగా పెట్టుబడులు, షేర్ల మారి్పడి రూపంలో ఈ డీల్ ఉంటుంది. ఇందుకు సంబంధించి తొలి దశలో రూ. 190 కోట్లు ఇన్వెస్ట్ చేస్తోంది. ఈక్విటీ కొనుగోలు, ఉమ్మడి వ్యాపార విస్తరణ, వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం మొత్తం మీద సుమారు రూ. 500 కోట్లు పెట్టుబడులకు కంపెనీ బోర్డు ఆమోదముద్ర వేసింది. గురువారమిక్కడ విలేకరుల సమావేశంలో కంపెనీ ఎండీ నాగేశ్వరరావు కందుల ఈ విషయాలు తెలిపారు. ఫార్మా, కెమికల్ తదితర రంగాలకు ఇంజనీరింగ్ సొల్యూషన్స్ని అందించడం నుంచి ఏఐ డేటాసెంటర్ రంగంలోకి ప్రవేశించడం వరకు తమ కంపెనీ ప్రస్థానంలో ఇదొక కీలక మైలురాయిగా ఆయన అభివర్ణించారు. 2026 నవంబర్ నుంచి కొత్త వ్యాపార విభాగం తయారీ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆఖరు నాలుగు నెలల్లో ఆ ఆర్థిక ఫలితాలు కంపెనీకి జతవుతాయని పేర్కొన్నారు. ఈ వ్యవధిలో కొత్త విభాగం నుంచి రూ. 250 కోట్ల ఆదాయాన్ని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఎస్ఈటీఎల్ తయారీ, ఆర్థిక, ఇంజనీరింగ్ సామర్థ్యాలతో ప్రపంచ స్థాయి ఏఐ డేటాసెంటర్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ అందిస్తామని జీస్కేల్ ఎనర్జీ వ్యవస్థాపకుడు కాసు బ్రహా్మరెడ్డి చెప్పారు. గురువారం ఎస్ఈటీఎల్ షేరు 5% క్షీణించి రూ. 213 వద్ద క్లోజైంది. -
అమెజాన్ పెట్టుబడుల బూస్ట్
న్యూఢిల్లీ: భారత్లో దీర్ఘకాలిక విస్తరణ వ్యూహంలో భాగంగా టెక్ దిగ్గజం అమెజాన్ కృత్రిమ మేధ (ఏఐ), క్లౌడ్ సదుపాయాలను మరింత పటిష్టం చేసుకోవడంపై దృష్టి పెడుతోంది. ఇందుకోసం తాజాగా 13 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 1.23 లక్షల కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు ప్రకటించింది. దీనితో 2026–30 మధ్య కాలంలో భారత్లో అమెజాన్ పెట్టుబడులు 48 బిలియన్ డాలర్లకు చేరనున్నాయి. గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అనంతరం కంపెనీ సీఈవో ఆండీ జస్సీ ఈ విషయాలు వెల్లడించారు. వ్యాపార వృద్ధికి సంబంధించి భారత్ తమకు కీలక మార్కెట్లలో ఒకటిగా ఉంటోందని ఆయన చెప్పారు. దేశీయంగా ఈ–కామర్స్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) విభాగాలవ్యాప్తంగా కస్టమర్ల నుంచి డిమాండ్ పటిష్టంగా ఉంటోందని జస్సీ వివరించారు. డిజిటల్ వినియోగం, క్లౌడ్–ఏఐ సర్వీసులకు డిమాండ్ పెరుగుతుండటంతో భారత్లో పలు గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజాలు ఇన్వెస్ట్ చేస్తున్న నేపథ్యంలో అమెజాన్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘భారత్లో అమెజాన్ రికార్డు స్థాయిలో 48 బిలియన్ డాలర్ల పెట్టుబడులను స్వాగతిస్తున్నాను. యువతకు దీనితో కొత్త అవకాశాలు లభిస్తాయి‘ అని ఎక్స్లో ప్రధాని మోదీ పోస్ట్ చేశారు. ‘వికసిత్, ఆత్మనిర్భర్ భారత్ సాకారంపై ప్రధాని మోదీ విజన్ మాకు స్ఫూర్తిదాయకం. భారత వృద్ధి గాథలో మేము దీర్ఘకాలిక భాగస్వామిగా ఉండాలని కోరుకుంటున్నాం’ అని జస్సీ పేర్కొన్నారు. 20 ఏళ్లలో 88 బిలియన్ డాలర్లు.. తాజా ఇన్వెస్ట్మెంట్స్ కూడా కలిపి 2010–2030 మధ్య కాలంలో భారత్లో 88 బిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులు పెట్టినట్లవుతుందని అమెజాన్ తెలిపింది. ఈ ఏడాది కొత్తగా 20 ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు, 100 లాస్ట్–మైల్ డెలివరీ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు వివరించింది. ప్రధానంగా టియర్ 3, టియర్ 4 నగరాల్లో ఇవి రానున్నట్లు తెలిపింది. అలాగే, తమ ఈ–కామర్స్, క్విక్ కామర్స్ నెట్వర్క్కి దన్నుగా ఉంటున్న వేల మంది డెలివరీ ఏజెంట్ల సంక్షేమం కోసం ’సమ్మాన్’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు అమెజాన్ తెలిపింది. భారత్లో కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి 1.2 కోట్ల చిన్న వ్యాపారాలను డిజిటైజ్ చేసినట్లు, 20 బిలియన్ డాలర్లకు పైగా ఈ–కామర్స్ ఎగుమతులు, 28 లక్షల ఉద్యోగాలకు తోడ్పాటు అందించినట్లు అమెజాన్ వివరించింది. అలాగే కోటి మంది భారతీయులకు క్లౌడ్ నైపుణ్యాల్లో శిక్షణ కల్పించినట్లు పేర్కొంది. నిమిషాల్లో డెలివరీ సేవల నెట్వర్క్ను భారీగా విస్తరించే దిశగా 300 పైగా నగరాల్లో అమెజాన్ నౌ సర్వీసులను అందుబాటులోకి తేనున్నట్లు వివరించింది.హైదరాబాద్, ముంబై డేటా సెంటర్ల విస్తరణ.. తాజా పెట్టుబడులతో హైదరాబాద్, ముంబైలోని ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ల సామర్థ్యాన్ని పెంచుకోనున్నట్లు అమెజాన్ ఒక ప్రకటనలో తెలిపింది. అంకుర సంస్థలు, ఎంటర్ప్రైజ్లు .. ఆవిష్కరణలను వేగవంతం చేసేందుకు, భారీగా కార్యకలాపాలను విస్తరించేందుకు, అంతర్జాతీయంగా కస్టమర్లకు సేవలందించేందుకు ఉపయోగపడే ఏఐ చిప్లు, మేనేజ్డ్ ఏఐ సర్వీసులు, సురక్షితమైన క్లౌడ్ టెక్నాలజీలు, డెవలపర్ టూల్స్ను మరింత అందుబాటులోకి తేనున్నట్లు వివరించింది. 2030 నాటికి 38 లక్షల కొలువుల కల్పనకు, 80 బిలియన్ డాలర్ల ఈ–కామర్స్ ఎగుమతులకు ఈ పెట్టుబడులు తోడ్పడనున్నట్లు తెలిపింది. 1.5 కోట్ల చిన్న వ్యాపారాలకు, నలభై లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఏఐ ప్రయోజనాలు అందుబాటులోకి రాగలవని వివరించింది. నేషనల్ హెల్త్ అథారిటీ, గవర్నమెంట్ ఈ–మార్కెట్ప్లేస్, అపోలో టైర్స్, డెల్హివెరీ, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఫిజిక్స్వాలా మొదలైనవి తమ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసులను ఉపయోగించుకుంటున్నట్లు అమెజాన్ పేర్కొంది. -
అంతలోనే ఇంతలా.. బంగారం కొత్త ధరలు ఇలా!
భారతదేశంలో బంగారం తగ్గుదలకు బ్రేక్ పడింది. వరుసగా తగ్గుతున్న గోల్డ్ రేటు.. పెరుగుదల దిశగా అడుగులు వేసింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో మార్పులు జరిగాయి. ఈ కథనంలో కొత్త రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలో ఈ రోజు (జూన్ 25) ఉదయం రూ.1,28,450 వద్ద ఉన్న తులం 22 క్యారెట్స్ బంగారం ధర సాయంత్రానికి రూ.1,29,550 వద్దకు చేరింది. 24 క్యారెట్ల బంగారం రేటు రూ.1,40,130 నుంచి రూ.1,41,330 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే గంటల వ్యవధిలో పసిడి ధరలు ఎంతగా మారాయో స్పష్టంగా తెలుస్తోంది.ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో మార్పులు జరిగాయి. ఇక్కడ ఉదయం రూ.1,28,600 వద్ద ఉన్న 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.1,29,700 వద్దకు చేరింది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,40,280 నుంచి రూ.1,41,480 వద్దకు చేరింది.అయితే చెన్నైలో మాత్రం ధరల్లో ఎలాంటి మార్పు జరగలేదు. కాబట్టి ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం రేటు రూ.131400 వద్ద, 24 క్యారెట్ల రేటు రూ.1,43,350 వద్ద ఉంది. -
నకిలీ మందులకు చెక్.. కేంద్రం కీలక నిర్ణయం!
భారతదేశంలో ఔషధాల భద్రత, నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని ఔషధ సరఫరా వ్యవస్థను మరింత పారదర్శకంగా, సురక్షితంగా మార్చే లక్ష్యంతో వ్యాక్సిన్లు, యాంటీమైక్రోబియల్ మందులు, క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే ఔషధాలు, అలాగే మత్తు పదార్థాలకు సంబంధించిన మందులపై QR కోడ్ లేదా బార్కోడ్ను తప్పనిసరి చేసింది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (MoHFW) ఈ మేరకు డ్రగ్ రూల్స్ 1945 నిబంధనల్లో సవరణలు చేసింది.కొత్త నిబంధనల ప్రకారం.. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (NDPS) చట్టం, 1985 పరిధిలోకి వచ్చే అన్ని వ్యాక్సిన్లు, యాంటీమైక్రోబియల్స్, క్యాన్సర్ నిరోధక మందులు, నార్కోటిక్ అండ్ సైకోట్రోపిక్ డ్రగ్స్ వాటి ప్యాకేజింగ్పై బార్కోడ్ లేదా క్విక్ రెస్పాన్స్ (QR) కోడ్ను తప్పనిసరిగా కలిగి ఉండాలి.ఈ క్యూఆర్ కోడ్లో ఔషధానికి సంబంధించిన కీలక సమాచారం ఉంటుంది. అందులో మందు పేరు, బ్రాండ్ పేరు, తయారీ సంస్థ వివరాలు, బ్యాచ్ నంబర్, తయారీ తేదీ, గడువు తేదీ, తయారీ లైసెన్స్ నంబర్ వంటి వివరాలు నమోదవుతాయి. వినియోగదారులు లేదా అధికారులు ఈ కోడ్ను స్కాన్ చేసి మందు అసలుదా కాదా అనే విషయాన్ని సులభంగా ధృవీకరించవచ్చు.ఇప్పటివరకు ఈ క్యూఆర్ కోడ్ విధానం దేశంలోని టాప్ 300 ఔషధ బ్రాండ్లకు మాత్రమే వర్తించేది. అయితే తాజా సవరణలతో ఈ వ్యవస్థను మరింత విస్తరించి, అత్యంత కీలకమైన ఔషధ విభాగాలన్నింటికీ వర్తింపజేస్తున్నారు. దీనివల్ల మందుల తయారీ నుంచి వినియోగదారుల చేతికి చేరే వరకు ప్రతి దశను సులభంగా ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: భారీగా పెరిగిన పాస్పోర్ట్ ఛార్జీలు!ఈ నిర్ణయం ద్వారా నకిలీ మందుల విక్రయాలను అరికట్టడంలో ప్రభుత్వం మరింత సమర్థవంతంగా పనిచేయగలదని భావిస్తోంది. ముఖ్యంగా యాంటీమైక్రోబియల్ మందుల విషయంలో నకిలీ లేదా నాసిరకం ఉత్పత్తులను గుర్తించడం సులభమవుతుంది. తద్వారా యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ (AMR) వంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడంలో కూడా ఇది సహాయపడుతుంది.ఈ నిబంధనలను అమలు చేయడానికి ఔషధ కంపెనీలకు తగిన సమయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాక్సిన్లు, క్యాన్సర్ మందులు, నార్కోటిక్ అండ్ సైకోట్రోపిక్ ఔషధాలపై క్యూఆర్ కోడ్ నిబంధన 2027 జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. యాంటీమైక్రోబియల్ మందులపై ఈ నిబంధన 2028 జూలై 1 నుంచి అమలు చేయనున్నారు. -
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం భారీ ఊరట
దేశంలోని బల్క్, కమర్షియల్ ఎల్పీజీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా వాణిజ్య గ్యాస్ సరఫరాపై విధించిన అన్ని రకాల తాత్కాలిక ఆంక్షలను కేంద్రం తక్షణమే ఎత్తివేసింది.ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమ ఆసియా సంక్షోభానికి ముందు దేశంలో ఏ స్థాయిలో సరఫరా ఉండేదో, ఆ పాత నిబంధనలనే పునరుద్ధరిస్తున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ ద్వారా స్పష్టం చేశారు. బల్క్ గ్యాస్ సరఫరా 50 శాతానికి పెంపు ప్యాక్డ్ సిలిండర్లతో పాటు, సంక్షోభం ప్రారంభమైన సమయంలో పూర్తిగా నిలిపివేసిన ‘బల్క్ ఎల్పీజీ’ సరఫరాపై కూడా కేంద్రం సడలింపులు ఇచ్చింది.పాత వినియోగంతో పోలిస్తే పరిశ్రమలకు 50 శాతం మేర బల్క్ గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని చమురు మార్కెటింగ్ కంపెనీలను ఆదేశించింది. దీనివల్ల హోటళ్లు, రెస్టారెంట్లు, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, స్టీల్ వంటి భారీ ఇంధన ఆధారిత పరిశ్రమలకు గ్యాస్ కొరత తీరనుంది. -
భారీగా పెరిగిన పాస్పోర్ట్ ఛార్జీలు!
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) 1980 పాస్పోర్ట్ నిబంధనల ప్రకారం ఫీజులను సవరించారు. 2026 జులై 1 నుంచి కొత్త ఫీజులు అమల్లోకి రానున్నాయి. అంటే కొత్తగా పాస్పోర్ట్ కోసం అప్లై చేసేవారు ఎక్కువ ఫీజును చెల్లించాల్సి ఉంటుందన్న మాట.36 పేజీల పాస్పోర్ట్ కోసం ఇప్పుడు రూ.2,500, తత్కాల్ కేటగిరీ కింద రూ.500060 పేజీల పాస్పోర్ట్ కోసం రూ.3,500, తత్కాల్ ప్రాసెసింగ్ కింద రూ. 6,000పాస్పోర్ట్ పోయినప్పుడు లేదా డ్యామేజ్ అయినప్పుడు రీప్లేస్మెంట్ ఖర్చులు కూడా పెరిగాయి. 36 పేజీల పాస్పోర్ట్ రీప్లేస్మెంట్కు సాధారణంగా రూ.5,000, తత్కాల్లో రూ.7,500 చెల్లించాలి. 60 పేజీల రీప్లేస్మెంట్ కోసం రూ.6,000 నుంచి రూ.8,500 వరకు ఫీజు నిర్ణయించారు.ఇతర పాస్పోర్ట్ సంబంధిత సేవలకూ కొత్త ఛార్జీలు నిర్ణయించారు. ఉదాహరణకు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్, సరెండర్ సర్టిఫికేట్లు, గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్ వెరిఫికేషన్, ఇతర సర్టిఫికేట్లతో సహా, పాస్పోర్ట్కు సంబంధించిన వివిధ సేవల కోసం భారతదేశంలో రూ.750 ఫీజు ఉండగా, ఐడెంటిటీ సర్టిఫికెట్కు రూ.1,000 చెల్లించాలి. విదేశాల్లో అవసరమయ్యే ఎమర్జెన్సీ సర్టిఫికెట్ కోసం 15 డాలర్లు, ఐడెంటిటీ సర్టిఫికెట్ కోసం 50 డాలర్ల ఫీజు నిర్ణయించారు. అయితే ఈ సేవలకు తత్కాల్ సౌకర్యం ఉండదు.కొత్త నిబంధనల ప్రకారం పెద్దల పాస్పోర్ట్ 10 సంవత్సరాల వరకు చెల్లుబాటు అవుతుంది. మైనర్ల పాస్పోర్ట్ అయితే 5 సంవత్సరాలు లేదా పాస్పోర్ట్ హోల్డర్కు 18 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు, ఈ రెండింటిలో ఏది ముందుగా వస్తే అంతవరకు చెల్లుబాటులో ఉంటాయి.ఇదీ చదవండి: EPFO సేవలకు బ్రేక్.. చందాదారులకు అలర్ట్! -
EPFO సేవలకు బ్రేక్.. చందాదారులకు అలర్ట్!
ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (EPFO) చందాదారులకు ఒక ముఖ్యమైన సమాచారం అందించింది. సిస్టమ్ను మరింత వేగంగా, సమర్థవంతంగా మార్చేందుకు జూన్ 26 నుంచి జూన్ 28 (మూడు రోజులు) వరకు పోర్టల్లో చాలా సేవలు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో వెల్లడించింది.ఈ సమయంలో కొత్త ఈపీఎఫ్ క్లెయిమ్ చేయడం, క్లెయిమ్ల ప్రాసెసింగ్ వంటి సేవలు అందుబాటులో ఉండవు. అంటే.. ఈ మూడు రోజుల్లో పీఎఫ్ డబ్బులు విత్డ్రా చేయాలని లేదా ట్రాన్స్ఫర్ చేయాలని ప్లాన్ చేస్తున్నవారు కాస్త వేచి ఉండాల్సిందే.సేవలు నిలిచే సమయంజూన్ 26, 2026: రాత్రి 12 గంటల నుంచిజూన్ 28, 2026: రాత్రి 11:59 వరకుజూన్ 29 నుంచి సేవలు మళ్లీ ప్రారంభంఈ సమయంలో కొత్త క్లెయిమ్లు చేయలేరు. అంతేకాదు, ఇప్పటికే పెండింగ్లో ఉన్న క్లెయిమ్ల ప్రాసెసింగ్ కూడా తాత్కాలికంగా ఆగిపోతుంది. అయితే క్లెయిమ్లు రద్దు కావని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. అవి కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం మాత్రమే ఉంది. అవసరమైతే సహాయం కోసం EPFO హెల్ప్లైన్ నంబర్ 14470 అందుబాటులో ఉంటుంది. ఈ తాత్కాలిక అంతరాయం వల్ల ఇబ్బంది కలిగినా, భవిష్యత్తులో సేవలు మరింత వేగంగా అందించడానికే ఈ అప్గ్రేడ్ చేస్తున్నామని సంస్థ తెలిపింది.⚠️ Important NoticeServices on Member Portal, Employer Portal & UMANG App will remain temporarily unavailable from 26–30 June 2026 due to scheduled system migration.The upgraded system will deliver faster, more reliable and secure services.#EPFOWithYou #HumHainNa pic.twitter.com/U2VoJVLVEC— EPFO (@officialepfo) June 25, 2026 -
భారీ డిమాండ్.. 10 లక్షలకు చేరుకున్న ఐక్యూబ్!
భారతదేశంలో ఈవీ రంగం వేగంగా విస్తరిస్తోంది. ఈ తరుణంలో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టీవీఎస్ మోటార్ ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఐక్యూబ్ తయారీ సంఖ్య 10 లక్షల యూనిట్లను దాటింది.2020లో మొదటిసారిగా విడుదలైన ఐక్యూబ్, తక్కువ కాలంలోనే భారత ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో ఒకటిగా మారింది. కొన్ని సందర్భాల్లో.. బజాజ్ చేతక్ వంటి పోటీదారులు గట్టి పోటీ ఇస్తూనే మార్కెట్లో మొదటి స్థానానికి కూడా చేరుకుంది.టీవీఎస్ విడుదల చేసిన సమాచారం ప్రకారం, ఇప్పటివరకు ఐక్యూబ్ వినియోగదారులు అందరూ 14.94 బిలియన్ కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేశారు. ఇది కేవలం అమ్మకాల గణాంకం మాత్రమే కాదు, పర్యావరణ పరిరక్షణలో కూడా పెద్ద పాత్ర పోషిస్తోంది. ఈ ప్రయాణాల ద్వారా సుమారు 5,22,969 టన్నుల కార్బన్ డయాక్సైడ్ (CO₂) ఉద్గారాలు తగ్గినట్లు కంపెనీ తెలిపింది. అంటే పెట్రోల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించబడటం వల్ల పర్యావరణానికి గణనీయమైన మేలు జరుగుతోంది.గత ఆరు సంవత్సరాల్లో ఈ స్కూటర్లో పెద్ద డిజైన్ మార్పులు జరగకపోయినా, ఇది నిరంతరంగా అప్డేట్ అవుతూ వచ్చింది. కొత్త రంగులు, ఫీచర్లు, బ్యాటరీ ఆప్షన్లు వంటి మెరుగుదలలు వినియోగదారులను ఆకర్షించాయి. ముఖ్యంగా ఈ స్కూటర్ను భారతదేశంలోని 3,000కి పైగా నగరాల్లో అందుబాటులో ఉంది.టీవీఎస్ ఐక్యూబ్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి బేస్ వేరియంట్, ఎస్ వేరియంట్, ఎస్టీ వేరియంట్.. వీటి ధరలు రూ. 1.07 లక్షల నుంచి రూ.1.72 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. ఇవి 2.2 కిలోవాట్ బ్యాటరీ, 5.3 కిలోవాట్ బ్యాటరీ సామర్థ్యాలతో లభిస్తాయి. -
బిట్కాయిన్ పతనం.. పెట్టుబడిదారుల్లో ఆందోళన!
ప్రపంచంలో అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన 'బిట్కాయిన్' ఇటీవల 60,000 డాలర్ల స్థాయి కంటే దిగువకు పడిపోవడం పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగించింది. కొద్ది రోజుల క్రితం వరకు బలంగా కనిపించిన బిట్కాయిన్ ధర ఒక్కసారిగా సుమారు 59,000 డాలర్ల వరకు పడిపోవడంతో, క్రిప్టో మార్కెట్ భవిష్యత్తుపై మళ్లీ చర్చ మొదలైంది. దాదాపు 20 నెలల కనిష్ఠ స్థాయికి చేరిన ఈ పతనం వెనుక అనేక అంతర్జాతీయ ఆర్థిక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.ఈ ధర పతనానికి ప్రధాన కారణం.. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ల పతనం, అమెరికా వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణంపై కొనసాగుతున్న ఆందోళనలు, పెట్టుబడిదారులు రిస్క్ ఉన్న ఆస్తుల నుంచి దూరంగా వెళ్లడం వంటి అంశాలు క్రిప్టో మార్కెట్పై ప్రభావం చూపాయి.Pi42 సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అవినాష్ శేఖర్ ప్రకారం.. బిట్కాయిన్ ధర తగ్గడానికి పెద్ద పెట్టుబడిదారులు లాభాలను స్వీకరించడం, మార్కెట్ సెంటిమెంట్ బలహీనపడటం, అలాగే డిజిటల్ ఆస్తుల్లో పెట్టుబడుల పునర్వ్యవస్థీకరణ కారణమయ్యాయి. ఇలాంటి పరిస్థితులు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో సహజమేనని, దీర్ఘకాలిక విలువ, స్వల్పకాలిక ధరల మధ్య పెట్టుబడిదారులు తేడాను గుర్తిస్తున్నారని ఆయన తెలిపారు.ప్రస్తుతం మార్కెట్లో సానుకూల వార్తలు లేకపోవడం కూడా ధరలపై ఒత్తిడిని పెంచుతోంది. ముఖ్యంగా అమెరికాలో ప్రతిపాదిత క్లారిటీ యాక్ట్ అమలుపై స్పష్టత లేకపోవడం పెట్టుబడిదారులను మరింత జాగ్రత్తగా వ్యవహరించేలా చేస్తోందని బిట్డెల్టా ఇండియా సీఈఓ వికాస్ ఎం సచ్దేవా అన్నారు.అమెరికా డాలర్ బలపడటం కూడా బిట్కాయిన్ పతనానికి కారణమని ముడ్రెక్స్ బిజినెస్ హెడ్ ప్రతీక్ గుప్తా అన్నారు. అమెరికా డాలర్ సూచీ గత 13 నెలల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. సాధారణంగా డాలర్ బలపడినప్పుడు బిట్కాయిన్ వంటి క్రిప్టో ఆస్తులపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ప్రస్తుతం క్రిప్టో మార్కెట్పై ఒత్తిడి కనిపిస్తోంది.అయితే.. ఈ పతనం మధ్యలో కూడా కొన్ని సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. బిట్కాయిన్ నెట్వర్క్లో జరిగే కార్యకలాపాలు మాత్రం బలంగానే కొనసాగుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి నెట్వర్క్ యాక్టివిటీ క్రమంగా పెరుగుతుండగా, రోజువారీ లావాదేవీలు 8 లక్షలకు పైగా నమోదవుతున్నాయి. ఇది గత బుల్రన్ సమయంలో కనిపించిన స్థాయిలకు దగ్గరగా ఉండటం విశేషం. అంటే ధర తగ్గుతున్నప్పటికీ, బిట్కాయిన్ వినియోగం,నెట్వర్క్ కార్యకలాపాలపై విశ్వాసం ఇంకా కొనసాగుతోందని స్పష్టమవుతోంది.ప్రస్తుత పరిస్థితులను బట్టి, బిట్కాయిన్ పతనమైందని అనుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లో అస్థిరత మరికొంతకాలం కొనసాగవచ్చు. అయితే దీర్ఘకాలిక పెట్టుబడిదారులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, పెట్టుబడులను విభజించడం, దశలవారీగా పెట్టుబడి పెట్టడం వంటి వ్యూహాలను అనుసరించాలని సూచిస్తున్నారు. -
భీమ్ యాప్ కొత్త రికార్డు..ఏడాదిలో మూడు రెట్లు!
ఎన్పీసీఐ భీమ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎన్బీఎస్ఎల్) రూపొందించిన 'భీమ్ (BHIM) పేమెంట్స్ యాప్', గత 12 నెలల్లో పటిష్టమైన వృద్ధిని నమోదు చేసింది. 2025 జూన్, 2026 మే నెల మధ్య కాలంలో ఈ యాప్ ద్వారా లావాదేవీల పరిమాణం మూడు రెట్లకు పైగా పెరిగింది. ఈ యాప్లో నెలవారీ లావాదేవీల సంఖ్య 2025 జూన్లో 7.964 కోట్లుగా ఉండగా, 2026 మే నెల నాటికి అది ఏకంగా 24.4 కోట్లకు చేరుకుంది.ఒక్క 2026 మే నెలలోనే ఈ ప్లాట్ఫామ్ ద్వారా రూ. 26,952 కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. దేశవ్యాప్తంగా రోజువారీ అవసరాల కోసం డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ప్రజలు గణనీయంగా వినియోగిస్తున్నారనడానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది.జాతీయ ధోరణికి అనుగుణంగానే తెలంగాణలో కూడా భీమ్ యాప్ వృద్ధి నమోదైంది. ఇక్కడ సైతం 2025 జూన్ నుంచి 2026 మే మధ్య లావాదేవీల పరిమాణం మూడు రెట్లు పెరిగింది. 2026 మే నెలలో ఈ యాప్ ద్వారా రాష్ట్రంలో జరిగిన మొత్తం మర్చంట్ లావాదేవీలలో నిత్యావసరాలు 23.9% శాతం వాటాతో మొదటి స్థానంలో ఉండగా, ఫుడ్ అవుట్లెట్స్ (18.1%), క్విక్ కామర్స్ (11.6%) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.ఇవే కాకుండా డెయిరీ అండ్ బేకరీలు (3.2%), పెట్రోల్ బంకులు (2.8%), ఈ-కామర్స్ (2.2%), ప్రభుత్వ సేవలు (2.0%) ఇతర ముఖ్యమైన కేటగిరీలుగా ఉన్నాయి. ఇది రోజువారీ ఖర్చులలో డిజిటల్ చెల్లింపుల ప్రాధాన్యతను స్పష్టం చేస్తోంది. వీటితో పాటు యూపీఐ లైట్, యూపీఐ ఆధారిత రూపే క్రెడిట్ కార్డ్ వంటి సరికొత్త పేమెంట్ విధానాలను కూడా రాష్ట్ర ప్రజలు విస్తృతంగా వాడుతున్నారు.యాప్లోని ముఖ్యమైన ఫీచర్లుయూపీఐ సర్కిల్: ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమకు నమ్మకమైన వ్యక్తులకు నెలకు గరిష్టంగా రూ. 15,000 పరిమితితో, 5 సంవత్సరాల కాలవ్యవధి వరకు తమ ఖాతా నుంచి పేమెంట్స్ చేసుకునే అధికారాన్ని ఇవ్వవచ్చు. దీనికోసం అవతలి వారికి ప్రత్యేకంగా బ్యాంక్ ఖాతా లేదా యూపీఐ ఐడీ ఉండాల్సిన అవసరం లేదు. దీనివల్ల కుటుంబ సభ్యులు, సిబ్బంది రోజువారీ ఖర్చులను, అన్ని లావాదేవీలను పర్యవేక్షించడం సులువవుతుంది.స్ప్లిట్ ఎక్స్పెన్సెస్: స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి హోటల్కు వెళ్లినప్పుడు, రూమ్ అద్దెలు కట్టినప్పుడు లేదా గ్రూప్ కొనుగోళ్లు చేసినప్పుడు ఆ బిల్లును అందరూ సమానంగా పంచుకుని, నేరుగా యాప్ ద్వారానే ఎవరి వాటా వారు సులభంగా చెల్లించవచ్చు.ఫ్యామిలీ మోడ్: కుటుంబ సభ్యులందరినీ ఒకే చోట చేర్చి, ఉమ్మడి ఖర్చులను ట్రాక్ చేయడానికి మరియు నిర్దిష్ట బిల్లుల చెల్లింపులను కేటాయించడానికి ఇది ఉపయోగపడుతుంది. దీనితో తమ ఖర్చులు ఒకే చోట కనిపించడం వల్ల కుటుంబ ఆర్థిక ప్రణాళిక సులువవుతుంది.స్పెండ్స్ అనలిటిక్స్: ఈ డ్యాష్బోర్డ్ యూజర్ యొక్క నెలవారీ ఖర్చుల విధానాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ఖర్చులను ఆటోమేటిక్గా కేటగిరీల వారీగా విభజించి చూపడం ద్వారా, ఎలాంటి క్లిష్టమైన లెక్కలు లేకుండానే బడ్జెట్ను మేనేజ్ చేసుకోవచ్చు.యూపీఐ లైట్ ఆటో-టాప్ అప్: యూపీఐ లైట్ వాలెట్లోని బ్యాలెన్స్ రూ. 200 కంటే తగ్గినప్పుడు, ఈ ఫీచర్ ఆటోమేటిక్గా వాలెట్ను రీఛార్జ్ చేస్తుంది.యూపీఐ బేస్డ్ రూపే క్రెడిట్ కార్డ్: యూజర్లు తమ రూపే క్రెడిట్ కార్డ్ను యూపీఐకి లింక్ చేయడం ద్వారా క్రెడిట్ ఆధారిత లావాదేవీలను సులభంగా జరుపుకోవచ్చు.ఫారెక్స్ పేమెంట్స్: విదేశీ కరెన్సీ (ఫారెక్స్) అవసరమైన వారు భీమ్ యాప్ ద్వారానే నేరుగా బుక్ చేసుకోవచ్చు. వివిధ బ్యాంకుల ధరలను పోల్చి చూసి నచ్చిన ఆప్షన్ను ఎంచుకోవచ్చు. ఈ కరెన్సీని నగదు రూపంలో లేదా డిజిటల్ కరెన్సీ రూపంలో పొందే వీలుంది. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 109.25 పాయింట్లు లేదా 0.14 శాతం లాభంతో 77,100.47 వద్ద, నిఫ్టీ 34.35 పాయింట్లు లేదా 0.14 శాతం లాభంతో 24,056.00 వద్ద నిలిచాయి.గుజరాత్ నేచురల్ రిసోర్సెస్ లిమిటెడ్, సోమి కన్వేయర్ బెల్టింగ్స్ లిమిటెడ్, సాక్సాఫ్ట్ లిమిటెడ్, రిలాక్సో ఫుట్వేర్స్ లిమిటెడ్, ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ వద్ద.. టీసీఐ ఎక్స్ప్రెస్ లిమిటెడ్, జెనెసిస్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ లిమిటెడ్, సవితా ఆయిల్ టెక్నాలజీస్ లిమిటెడ్, కాంకర్డ్ ఎన్విరో సిస్టమ్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మోదీని కలిసిన అమెజాన్ సీఈఓ: కీలక ప్రకటన!
ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థల్లో ఇండియా ఒకటి. అందుకే.. దిగ్గజ సంస్థలు భారత మార్కెట్పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. తాజాగా అమెజాన్ కూడా అదే బాటలో మరో అడుగేసింది.అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ తన భారత పర్యటన సందర్భంగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా.. 2030 నాటికి భారతదేశంలో ఏఐ, క్లౌడ్ మౌలిక సదుపాయాల విస్తరణ కోసం అదనంగా 13 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే అమెజాన్ 2025 డిసెంబర్లో 35 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించింది.కొత్త పెట్టుబడులను ప్రకటించిన నేపథ్యంలో ఆండీ జాస్సీ మాట్లాడుతూ.. "మేము దశాబ్దానికి పైగా కాలంగా భారతదేశంలో పనిచేస్తున్నాం. ఈ కామర్స్, క్లౌడ్, ఏఐ రంగాల్లో అద్భుతమైన వృద్ధిని చూశాం. అందుకే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరింత పెట్టుబడి పెడుతున్నాం" అని చెప్పారు.అమెజాన్ లక్ష్యం.. కేవలం వ్యాపారం పెంచుకోవడం మాత్రమే కాదు. భారతదేశంలో చిన్న వ్యాపారాలను డిజిటల్ ప్రపంచంలోకి తీసుకురావడం, ఉద్యోగాలను సృష్టించడం, ఎగుమతులను పెంచడం, ఏఐ సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం కూడా.అమెజాన్ పెట్టుబడులతో 2030 నాటికి భారతదేశంలో.. 38 లక్షలకు పైగా ఉద్యోగాలకు మద్దతు లభించనున్నాయి. 80 బిలియన్ డాలర్ల ఈ-కామర్స్ ఎగుమతులకు సహకారం, 1.5 కోట్ల చిన్న వ్యాపారాలు ఏఐ ప్రయోజనాలు పొందనున్నారు. పైగా 40 లక్షల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏఐ ప్రయోజనాలను అందించనుంది.ఇదీ చదవండి: భారీగా తగ్గిన మస్క్ సంపద: కారణం ఇదే!అమెజాన్ కంపెనీ తన పెట్టుబడిలో భారీ మొత్తాన్ని ఏఐ, క్లౌడ్ రంగానికే కేటాయించనుంది. ఇందులో భాగంగా.. హైదరాబాద్, ముంబైలలో ఉన్న ఏడబ్ల్యుఎస్ డేటా సెంటర్లను మరింత విస్తరించనుంది. దీని వల్ల భారతీయ కంపెనీలు తమ డేటాను దేశంలోనే భద్రంగా నిల్వ చేసుకోవడంతో పాటు అత్యాధునిక ఏఐ టెక్నాలజీలను ఉపయోగించుకోగలుగుతాయి.ఇప్పటికే అనేక భారతీయ సంస్థలు ఏడబ్ల్యుఎస్ సేవలను ఉపయోగిస్తున్నాయి. ఇందులో బ్యాంకులు, స్టార్టప్లు, ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. మొత్తం మీద అమెజాన్ తాజా ప్రకటన.. భారత ఆర్థిక వ్యవస్థకు, ఉద్యోగ అవకాశాలకు, సాంకేతిక అభివృద్ధికి కొత్త ఊపునిచ్చే అవకాశం ఉంది. ఇది ''డిజిటల్ ఇండియా'' లక్ష్యాలను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లే మరో కీలక అడుగుగా చెప్పవచ్చు.Really enjoyed my meeting with Prime Minister @narendramodi about what’s ahead for Amazon in India.We’ve been serving customers, sellers, developers, startups, and enterprises in India for more than a decade and just getting started. Shared that we’re investing $48 billion… pic.twitter.com/CSiwPTiEBh— Andy Jassy (@ajassy) June 25, 2026 -
బంగారం మరింత కొనే సమయం వచ్చిందా?
ప్రముఖ ఇన్వెస్టర్, ప్రపంచ ప్రఖ్యాత ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) బంగారం ధరలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పడుతుండటం మంచి వార్తేనని ఆయన తన ఎక్స్ (X) ఖాతాలో పేర్కొన్నారు. అయితే తాను ప్రస్తుతం మరింత బంగారం కొనుగోలు చేసే సమయం వచ్చిందా లేదా అన్నది తెలుసుకోవడానికి సాంకేతిక చార్టులను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.ధరలు తగ్గుతున్నాయనే కారణంతోనే పెట్టుబడి పెట్టడం సరైన నిర్ణయం కాదని కియోసాకి అభిప్రాయపడ్డారు. ఒక ఇంటి ధర తగ్గితే కేవలం తక్కువ ధర చూసి కొనుగోలు చేయరని, ఆ ఇంటి చుట్టుపక్కల ప్రాంతం ఎలా అభివృద్ధి చెందుతోందో కూడా పరిశీలిస్తామని ఉదాహరణగా వివరించారు. అదే విధంగా బంగారం ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? ఆర్థిక వ్యవస్థలో ఏమి జరుగుతోంది? అనే అంశాలను తెలుసుకోవడం ముఖ్యమని పేర్కొన్నారు.ఆర్థిక పరిస్థితులు బలహీనపడుతున్నాయని భావిస్తే తాను బంగారం కొనుగోలుకు దూరంగా ఉండవచ్చని, కానీ ఆర్థిక వ్యవస్థ మెరుగుదల దిశగా సాగుతోందని సంకేతాలు కనిపిస్తే తక్కువ ధరల వద్ద బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశాన్ని పరిశీలిస్తానని చెప్పారు. ప్రస్తుతం తన వద్ద ఉన్న బంగారంలో చాలా భాగాన్ని 2000 ప్రాంతంలో ఔన్స్కు సుమారు 300 డాలర్ల ధర వద్ద కొనుగోలు చేశానని కియోసాకి గుర్తుచేశారు.మార్కెట్ ధోరణి (ట్రెండ్)ను గమనించడం పెట్టుబడిదారులకు అత్యంత కీలకమని, ధరల కంటే వాటి వెనుక ఉన్న ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోవడమే విజయవంతమైన పెట్టుబడులకు మూలమని ఆయన తన పోస్ట్లో సూచించారు.GREAT NEWS: Gold continues to drop in price. Watching technical charts to know when to buy more.TREND is your FRIEND!!!!! Repeating past lesson.Price is like knowing the price of a house is going down.What I want to know what is happening in the neighborhood?If…— Robert Kiyosaki (@theRealKiyosaki) June 24, 2026 -
పొల్యూషన్ సర్టిఫికెట్పై వాహనదారులకు ఊరట!
బీఎస్-6 (BS-VI) ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న కొత్త వాహనాల యజమానులకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే శుభవార్త అందించే అవకాశం ఉంది. పొల్యూషన్ అండర్ కంట్రోల్ (PUC)సర్టిఫికెట్ చెల్లుబాటు కాలాన్ని గణనీయంగా పెంచే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం బీఎస్-6 వాహనాలకు నిర్దిష్ట వ్యవధిలో కాలుష్య పరీక్షలు నిర్వహించి పీయూసీ సర్టిఫికెట్ను పునరుద్ధరించాల్సి ఉండగా, కొత్త ప్రతిపాదన అమల్లోకి వస్తే ఆరు సంవత్సరాల లోపు ప్రైవేట్ బీఎస్-6 వాహనాలకు ఒకేసారి మూడేళ్ల వరకు చెల్లుబాటు కల్పించే అవకాశం ఉంది.ప్రతిపాదిత మార్గదర్శకాల ప్రకారం ఆరు నుంచి పది సంవత్సరాల మధ్య ఉన్న బీఎస్-6 వాహనాలు ప్రతి ఏడాది పీయూసీ సర్టిఫికెట్ని రెన్యువల్ చేయించుకోవాలి. పదేళ్లు దాటిన వాహనాలకు మాత్రం ప్రతి ఆరు నెలలకు ఒకసారి కాలుష్య ధ్రువీకరణ తప్పనిసరి కావచ్చు. వాణిజ్య బీఎస్-6 వాహనాలకు ఆరు సంవత్సరాల వరకు రెండు సంవత్సరాల చెల్లుబాటు ఇవ్వాలని, ఆ తర్వాత వార్షిక పునరుద్ధరణ విధానాన్ని కొనసాగించాలని అధికారులు పరిశీలిస్తున్నట్లు నివేదికలు వెల్లడించాయి.ఈ మార్పులు ‘PUCC 3.0’ పేరుతో రూపుదిద్దుకుంటున్న సంస్కరణలలో భాగమని తెలుస్తోంది. బీఎస్-6 వాహనాలు పాత తరహా బీఎస్-4, బీఎస్-3 వాహనాలతో పోలిస్తే నైట్రోజన్ ఆక్సైడ్లు, సూక్ష్మ ధూళికణాల ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తాయి. దీంతో తక్కువ కాలుష్యం విడుదల చేసే వాహన యజమానులపై అనవసర పరిపాలనా భారాన్ని తగ్గించడమే ప్రభుత్వ ఉద్దేశంగా భావిస్తున్నారు.అయితే పాత వాహనాలపై మరింత కఠిన నిబంధనలు అమలు చేసే అవకాశమూ ఉంది. ముఖ్యంగా అధిక కాలుష్యం వెదజల్లే వాహనాలకు తరచూ పరీక్షలు నిర్వహించడం, పీయూసీ కేంద్రాల్లో తప్పుడు రీడింగులు లేదా డేటా తారుమారును అరికట్టేందుకు పరీక్షా విధానాన్ని సాంకేతికంగా బలోపేతం చేయడం వంటి చర్యలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.ఇదే సమయంలో దేశంలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం, పాత వాహనాలను దశలవారీగా తొలగించేందుకు స్క్రాపేజ్ విధానాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడం వంటి అంశాలపై కూడా కేంద్రం దృష్టి సారించింది. అయితే పీయూసీ చెల్లుబాటు కాలం పెంపుపై ఇప్పటివరకు అధికారిక నోటిఫికేషన్ వెలువడలేదు. సంబంధిత ప్రతిపాదనకు తుది ఆమోదం లభించిన తర్వాతే కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. -
వెయ్యి మైక్రో ఫుల్ఫిల్మెంట్ కేంద్రాలకు ‘ఫ్లిప్కార్ట్ మినిట్స్’
బెంగళూరు: దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్కు చెందిన క్విక్ కామర్స్ సర్వీస్ ‘ఫ్లిప్కార్ట్ మినిట్స్’ ప్రారంభమై రెండేళ్లు కూడా పూర్తికాకముందే దేశవ్యాప్తంగా 1,000 మైక్రో ఫుల్ఫిల్మెంట్ కేంద్రాల మైలురాయిని చేరుకుంది. 2024 ఆగస్టులో ప్రారంభమైన ఈ సర్వీస్ ప్రస్తుతం 130కుపైగా నగరాలు, 8,000కుపైగా పిన్కోడ్లకు విస్తరించింది. నెట్వర్క్ విస్తరణతో గత ఏడాదితో పోలిస్తే ఆర్డర్ల సంఖ్య ఐదు రెట్లు పెరిగింది.ప్రత్యేకంగా టైర్-2, టైర్-3 నగరాల్లో ఫ్లిప్కార్ట్ మినిట్స్కు విశేష ఆదరణ లభిస్తోంది. అంబాలా, ఆరా, బొకారో, దర్భంగా, జోర్హాట్, ఒంగోలు, పూర్ణియా, సహర్సా, తెనాలి వంటి నగరాల్లో డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఈ విభాగాల్లో వ్యాపారం గత ఏడాదితో పోలిస్తే 42 రెట్లు విస్తరించినట్లు సంస్థ వెల్లడించింది. గత ఏడాదిలోనే 90కుపైగా కొత్త నగరాలను తన నెట్వర్క్లో చేర్చుకుంది.సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. జెన్-జీ వినియోగదారులు అత్యంత వేగంగా పెరుగుతున్న కస్టమర్ వర్గంగా నిలిచారు. ప్రస్తుతం మొత్తం వినియోగదారుల్లో 40 శాతానికి పైగా ఈ వర్గానికే చెందినవారు. కేవలం నిత్యావసర వస్తువులకే పరిమితం కాకుండా ఎలక్ట్రానిక్స్, బ్యూటీ, వెల్నెస్, లైఫ్స్టైల్ ఉత్పత్తులను కూడా వేగంగా ఆర్డర్ చేస్తున్నారు. పండ్లు, కూరగాయల విభాగంలో సగటు ఆర్డర్ విలువ 30 శాతం పెరగగా, పునరావృత కొనుగోళ్లు 20 శాతానికి పైగా వృద్ధి చెందాయి. ప్రస్తుతం 250కుపైగా ఉత్పత్తి విభాగాల్లో సేవలు అందిస్తోంది.ఫ్లిప్కార్ట్ మినిట్స్ 500కుపైగా డీ2సీ బ్రాండ్లతో భాగస్వామ్యం కలిగి ఉండగా, ‘సమర్థ్ కృషి’ కార్యక్రమం ద్వారా 3,000కుపైగా రైతులను మార్కెట్తో అనుసంధానిస్తోంది. అలాగే విద్యుత్ వాహనాల వినియోగాన్ని రెట్టింపు చేసి, 10 శాతానికి పైగా డెలివరీలను గ్రీన్ డెలివరీలుగా నిర్వహిస్తున్నట్లు సంస్థ తెలిపింది. -
‘ట్రెంట్’లో ముగింపునకు నోయల్ టాటా శకం
న్యూఢిల్లీ: రిటైల్ సంస్థ ‘ట్రెంట్’ ప్రస్థానంలో నోయల్ టాటా శకం ముగింపునకు చేరింది. ఈ ఏడాది నవంబర్లో ఆయనకు 70 ఏళ్లు నిండుతాయి. దీంతో ట్రెంట్ చైర్మన్గా తప్పుకోనున్నారు. కంపెనీ చైర్మన్గా 74వ ఏజీఎం (వాటాదారుల సమావేశం) తనకు చివరిదంటూ ప్రకటించారు. బెంగళూరులో ఒక స్టోర్తో మొదలు పెట్టగా, నేడు దేశవ్యాప్తంగా 1200పైగా స్టోర్లతో దిగ్గజ రిటైల్ సంస్థల్లో ఒక్కటిగా ట్రెంట్ ఎదగడంలో ప్రధాన పాత్ర అంతా నోయల్ టాటాదేనని చెప్పుకోవాలి.ట్రెంట్ కింద జూడియో, వెస్ట్సైడ్, స్టార్ బజార్ తదితర గొలుసు దుకాణ సంస్థలు నడుస్తున్నాయి. కంపెనీ ఏజీఎంలో భాగంగా వాటాదారులను ఉద్దేశించి నోయల్ టాటా ప్రసంగించారు. వాటాదారులు, ఉద్యోగులు, భాగస్వాములకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. దీర్ఘకాలంలో విలువ సృష్టించడంలోనూ.. స్పష్టమైన దృష్టితో, బలమైన, చెక్కుచెదని రిటైల్ ప్లాట్ఫామ్గా ట్రెంట్ అవతరించినట్టు చెప్పారు. 2014లో బాధ్యతలు.. తన తల్లి సిమోన్ టాటా ఏర్పాటు చేసిన ట్రెంట్లో 2010 ఆగస్ట్ 19న బోర్డు సభ్యుడిగా నోయల్ టాటా చేరారు. లాక్మే వ్యాపారాన్ని హిందుస్థాన్ యూనిలీవర్కు విక్రయించిన అనంతరం సిమోన్ టాటా ట్రెంట్ను ఏర్పాటు చేశారు. 1998 బెంగళూరులోని కమర్షియల్ స్ట్రీట్లో వెస్ట్సైడ్ స్టోర్తో ఇది అవతరించింది. ఎఫ్కే కవరణ రిటైర్మెంట్తో 2014 మార్చి 31న సంస్థ చైర్మన్ బాధ్యతలు నోయల్ టాటా చేతికి వెళ్లాయి.నేడు 321 పట్టణాల్లో 1,286 స్టోర్లను నిర్వహిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ.20,074 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయాన్ని, రూ.1,721 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. సంస్థ ఇంకా ఆరంభ దశలోనే ఉందంటూ, దీర్ఘకాలంలో వృద్ధి అవకాశాల పట్ల నమ్మకాన్ని నోయల్ టాటా వ్యక్తం చేశారు. భారత్లోనే కాకుండా, విదేశాల్లోనూ తమ బ్రాండ్ల విక్రయాలకు చక్కని అవకాశాలున్నట్టు చెప్పారు. తద్వారా అంతర్జాతీయంగానూ విస్తరించనున్నట్టు ఆయన సందేశమిచ్చారు. -
అందుకు పాస్పోర్ట్ ప్రూఫ్ కాదు
భారతీయ పాస్పోర్ట్ అనేది ప్రధానంగా అంతర్జాతీయ ప్రయాణం కోసం జారీ చేసే పత్రం మాత్రమేనని, దానిని భారత పౌరసత్వానికి తుది రుజువుగా పరిగణించరాదని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) స్పష్టం చేసింది. 14వ పాస్పోర్ట్ సేవా దివస్ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో అధికారులు ఈ వివరణ ఇచ్చారు. ఇటీవల పాస్పోర్ట్, ఆధార్, ఓటరు గుర్తింపు కార్డు వంటి పత్రాలు పౌరసత్వానికి ఆధారమా కాదా అనే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.అధికారుల ప్రకారం, పాస్పోర్ట్ జారీకి ముందు వివిధ ప్రభుత్వ సంస్థల ద్వారా విస్తృత స్థాయిలో ధ్రువీకరణ ప్రక్రియ నిర్వహించినప్పటికీ, దాని ప్రధాన ఉద్దేశం విదేశీ ప్రయాణాలను సులభతరం చేయడం, విదేశాల్లో వ్యక్తి జాతీయతను నిర్ధారించడం మాత్రమే. అందువల్ల పాస్పోర్ట్ను పౌరసత్వ ధ్రువీకరణ పత్రంగా చూడరాదని వారు స్పష్టం చేశారు.మరి పౌరసత్వానికి ఆధారం ఏమిటి?భారత పౌరసత్వం 1955 పౌరసత్వ చట్టం ప్రకారం జననం, వంశపారంపర్యం, నమోదు, సహజీకరణ (నేచురలైజేషన్) లేదా భూభాగ విలీనాల ద్వారా లభిస్తుంది. పౌరసత్వ ధ్రువీకరణ పత్రం (Citizenship Certificate) ఉంటే దాన్ని ప్రత్యక్ష ఆధారంగా పరిగణిస్తారు. అయితే ప్రతి భారతీయుడి వద్ద అలాంటి పత్రం ఉండదు. జనన ధ్రువీకరణ పత్రం, తల్లిదండ్రుల పౌరసత్వానికి సంబంధించిన రికార్డులు, నమోదు లేదా నేచురలైజేషన్ పత్రాలు వంటి ఆధారాలు పరిస్థితులను బట్టి పౌరసత్వ నిర్ధారణలో ఉపయోగపడతాయి.సుప్రీంకోర్టు కూడా గతంలో ఆధార్ కార్డు కేవలం గుర్తింపు పత్రమేనని, అది పౌరసత్వానికి రుజువు కాదని స్పష్టం చేసింది. ఇదే విధంగా ఓటరు గుర్తింపు కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి పత్రాలు కూడా స్వతంత్రంగా పౌరసత్వాన్ని నిర్ధారించవని న్యాయపరమైన అభిప్రాయాలు ఉన్నాయి.వేగవంతమైన పాస్పోర్ట్ సేవలుపాస్పోర్ట్ సేవల్లో దేశవ్యాప్తంగా గణనీయమైన పురోగతి సాధించినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం అనేక సాధారణ దరఖాస్తులు ఐదు పని దినాల్లోనే పూర్తి అవుతున్నాయి. పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో దరఖాస్తుదారులు గడిపే సగటు సమయం 45 నిమిషాల కంటే తక్కువకు తగ్గినట్లు అధికారులు తెలిపారు.దేశవ్యాప్తంగా ప్రస్తుతం 545 పాస్పోర్ట్ సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయి. మరో 20 కేంద్రాలను ఈ ఏడాది ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2027 నాటికి ప్రతి లోక్సభ నియోజకవర్గంలో కనీసం ఒక పాస్పోర్ట్ సేవా కేంద్రం అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతోంది. మారుమూల ప్రాంతాల్లో ప్రత్యేక మొబైల్ బృందాల ద్వారా సేవలను విస్తరిస్తోంది.ఈ-పాస్పోర్ట్లుగత ఏడాది నుంచి చిప్ ఆధారిత ఈ-పాస్పోర్ట్ల జారీని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. బయోమెట్రిక్ సమాచారంతో కూడిన ఎలక్ట్రానిక్ చిప్లు, అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) ప్రమాణాలకు అనుగుణంగా ఉండటంతో భద్రత మరింత బలపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటివరకు కోట్ల సంఖ్యలో ఈ-పాస్పోర్ట్లు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. -
హ్యాట్రిక్.. మరింత పడిపోయిన బంగారం, వెండి!
దేశంలో బంగారం, వెండి ధరల పతనం కొనసాగుతోంది. రెండు రోజులుగా భారీగా తగ్గిన పసిడి ధరలు వరుసగా నేడు వరుసగా మూడో రోజూ పతనమై హ్యాట్రిక్ తగ్గుదలను నమోదు చేశాయి. ఇక వెండి ధరలు కూడా వరుసగా మూడో రోజు భారీగా క్షీణించాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం(Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
‘ఇథనాల్ కలిపిన పెట్రోల్ సురక్షితమే’
న్యూఢిల్లీ: ఇథనాల్ కలిపిన పెట్రోల్ సురక్షితమేనని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై వినియోగదారుల్లో ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో సందేహాలను తొలగించే ప్రయత్నం చేసింది. 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ (ఈ20) ప్రస్తుతం దేశవ్యాప్తంగా విక్రయాలకు అందుబాటులో ఉండడం గమనార్హం. దీన్ని వినియోగించడం వల్ల వాహన బీమా క్లెయిమ్పై ప్రభావం పడుతుందన్న ఆందోళనలు కూడా వచ్చాయి.దీంతో కేంద్ర పెట్రోలియం శాఖ స్పందిస్తూ.. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వినియోగదారులకు అనుకూలమని, ఆర్థికంగా ప్రయోజనకరమని స్పష్టం చేసింది. ఈ20 పెట్రోల్ వినియోగించడం వల్ల వాహన బీమా క్లెయిమ్ లభించందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని పేర్కొంది. ‘‘ఇథనాల్ మిశ్రమం అన్నది అంతర్జాతీయంగా ఆమోదంలో ఉన్న విధానమే. యూఎస్, బ్రెజిల్, జపాన్ తదితర దేశాల్లో విజయవంతంగా అమలవుతోంది’’అని పెట్రోలియం శాఖ ప్రకటన విడుదల చేసింది.బ్రెజిల్ అయితే పెట్రోల్లో ఇథనాల్ను మరింత ఎక్కువగా కలుపుతోందని, ఈ27 అక్కడ అమల్లో ఉందని పేర్కొంది. ఇథనాల్ను కలపడం వల్ల పెట్రోల్ దిగుమతులను తగ్గించుకోవచ్చంటూ, ఈ రూపంలో ఇప్పటి వరకు రూ.1.4 లక్షల కోట్ల మేర విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసినట్టు తెలిపింది. మరోవైపు ఇథనాల్ తయారీలోకి వినియోగించే వ్యవసాయ ముడి సరుకులకు స్థిరమైన డిమాండ్ ఏర్పడినట్టు, అది రైతులకు ఆదాయాన్ని పెంచి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సాయపడుతున్నట్టు వెల్లడించింది.‘‘దేశ ఇందన భద్రతలో ఇథనాల్ కీలక పాత్ర పోషిస్తోంది. కర్బన ఉద్గారాల విడుదలను తగ్గించి, పర్యావరణ అనుకూలమైన రవాణాకు తోడ్పడుతోంది’’అని పెట్రోలియం శాఖ ప్రకటించింది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. ఈ షేర్లే టాప్ గెయినర్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:51 సమయానికి నిఫ్టీ(Nifty) 0.63 శాతం లేదా 151.70 పాయింట్లు పెరిగి 24,173.35 వద్ద, సెన్సెక్స్(Sensex) 521.17 పాయింట్లు లేదా 0.68 శాతం పెరిగి 77,512.39 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 50 సూచీలో ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, శ్రీరామ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా టాప్ గెయినర్లుగా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ వరుసగా 0.56 శాతం, 0.36 శాతం పెరిగాయి. సెక్టార్ వారీగా, నిఫ్టీ ఆటో, నిఫ్టీ రియాల్టీ మంచి పనితీరు చూపిస్తుండగా నిఫ్టీ మెటల్, మీడియా తక్కువ పనితీరు కనబరిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
చమురు ధరలు తగ్గినా.. పెట్రోల్, డీజిల్ ఇలా..
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గణనీయంగా తగ్గినా దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ఉపశమనం కనిపించలేదు. అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుముఖం పట్టడం, చమురు సరఫరాపై ఉన్న ఆందోళనలు సడలడం వల్ల బ్రెంట్ క్రూడ్ ధర యుద్ధానికి ముందు స్థాయికి చేరుకుంది. గురువారం ట్రేడింగ్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు సుమారు 72.5 డాలర్ల వద్ద, అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ 69 డాలర్లకు సమీపంలో ట్రేడయ్యాయి.అయితే ఈ పరిణామాల ప్రభావం దేశీయ ఇంధన ధరలపై ఇంకా పడలేదు. ప్రభుత్వ చమురు మార్కెటింగ్ సంస్థలు (ఓఎంసీలు) జూన్ 25న కూడా పెట్రోల్, డీజిల్ ధరలను యథాతథంగా కొనసాగించాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.102.12, డీజిల్ ధర రూ.95.20గా కొనసాగుతున్నాయి.గత నెలలో పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఎగసిపడటంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు నాలుగు విడతల్లో పెరిగాయి. మే 15 నుంచి మే 25 మధ్య పెట్రోల్పై మొత్తం రూ.7.35, డీజిల్పై రూ.7.53 వరకు పెంపు జరిగింది. దీంతో నాలుగేళ్ల తర్వాత ఢిల్లీలో పెట్రోల్ ధర మళ్లీ రూ.100 మార్కును దాటింది.అయితే తాజాగా చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో వినియోగదారులు ధరల కోత కోసం ఎదురుచూస్తున్నారు. కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇటీవల స్పందిస్తూ, తక్కువ ధరలకు కొనుగోలు చేసిన ముడి చమురు రిఫైనరీలకు చేరిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలపై సానుకూల ప్రభావం కనిపించే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే తుది నిర్ణయం అంతర్జాతీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.ప్రధాన నగరాల్లో ఇంధన ధరలుహైదరాబాద్లో పెట్రోల్ రూ.115.73, డీజిల్ రూ. 103.82ఢిల్లీలో పెట్రోల్ రూ.102.12, డీజిల్ రూ. 95.20ముంబైలో పెట్రోల్ రూ.111.21, డీజిల్ రూ. 97.83కోల్కతాలో పెట్రోల్ రూ.113.51, డీజిల్ రూ. 99.82చెన్నైలో పెట్రోల్ రూ.108.01, డీజిల్ రూ. 99.66బెంగళూరులో పెట్రోల్ రూ.110.89, డీజిల్ రూ. 98.80చమురు ధరలు మరింత కాలం తక్కువ స్థాయిలో కొనసాగితే, చమురు సంస్థలపై ఉన్న ఒత్తిడి తగ్గి దేశీయ ఇంధన ధరల్లోనూ తగ్గుదల వచ్చే అవకాశముందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ప్రస్తుతం మాత్రం వినియోగదారులకు వెంటనే ఉపశమనం లభించే సూచనలు కనిపించడం లేదు. -
రేటు పెంపు చెప్పే చేస్తాం!
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో పరిణామాలను సునిశితంగా గమనిస్తున్నామని, రేట్ల పెంపు విషయమై ఈ దశలో మాట్లాడడం తొందరపాటు అవుతుందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. ‘‘ఇందుకు (రేటు పెంపు) మార్కెట్ను సన్నద్ధం చేయాలని అనుకుంటే, మా వైఖరి మార్చుకునే వాళ్లం కదా!.. రానున్న నెలల్లో రేట్లు పెంచుతామన్న స్పష్టతతో ఉంటే మా వైఖరిని తటస్థం నుంచి నియంత్రిత విధానానికి మార్చుకుని ఉండే వాళ్లం. కానీ, అలా చేయలేదు. కనుక ఇప్పుడే రేటు పెంపు గురించి మాట్లాడడం భావ్యం కాదు. మేం అప్రమత్తంగా ఉన్నామని చెప్పాం. ద్రవ్యోల్బణం, వృద్ధికి సంబంధించి రిస్్కలు ఉన్నాయని తెలుసు. కనుక డేటా ఆధారితంగా వ్యవహరిస్తాం’’అని మల్హోత్రా వివరించారు.ఈ నెల ఆరంభంలో జరిగిన ఆర్బీఐ ఎంపీసీ సమావేశంలో రెపో రేటును 5.25 శాతం వద్దే కొనసాగించడం తెలిసిందే. పశ్చిమాసియా ఘర్షణల కారణంగా ఇంధన ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం, వృద్ధికి సవాళ్లు పొంచి ఉండడంతో, వేచి చూసే వైఖరిని అనుసరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2026–27) వృద్ధి అంచనాను సైతం గతంలో వేసిన 6.9 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గించడం గమనార్హం. ద్రవ్యోల్బణం 5.1 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. పైగా తటస్థ విధానాన్నే కొనసాగించింది. ప్రపంచానికి సానుకూలం పశి్చమాసియా ఘర్షణలు ఉపశమించడం ప్రపంచానికి, భారత్ ఆర్థిక వ్యవస్థకు సానుకూలమని సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. వృద్ధి, ద్రవ్యోల్బణం పరంగానూ అనుకూలమని పేర్కొన్నారు. చమురు, ఎరువుల ధరలు తగ్గడం దేశ ఆర్థిక వ్యవస్థకు సౌకర్యాన్నిస్తుందన్నారు. ప్రభుత్వం, ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు ఇంధన ధరల పెరుగుదల భారాన్ని వినియోగదారులపై ఎక్కువగా పడకుండా వ్యవహరించాయని, ఈ అనిశి్చతులను భారత్ గొప్పగా ఎదుర్కోందని చెప్పారు. చమురు ధరలకుతోడు నైరుతి రుతుపవనాల పురోగతిని సైతం ఆర్బీఐ పరిశీలిస్తున్నట్టు మల్హోత్రా చెప్పారు. రానున్న రోజుల్లో ద్రవ్యల్బణం తీరును ఇవే ప్రభావితం చేస్తాయన్నారు. -
పసిడి ఢమాల్!
న్యూఢిల్లీ: పసిడి, వెండి ధరలు బుధవారం అంతర్జాతీయ మార్కెట్లో భారీగా పతనమయ్యాయి. స్పాట్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 3 శాతం నష్టంతో 3,980 డాలర్ల స్థాయికి పడిపోయింది. వెండి ధర అయితే ఔన్స్కు 8 శాతం నష్టపోయి 57 డాలర్లకు దిగొచ్చింది. దీంతో వీటి ధరలు ఈ ఏడాది కనిష్టాలకు చేరినట్టయింది.జనవరి 29న పసిడి ఆల్టైమ్ గరిష్టం 5,626 డాలర్లు, వెండి 121.78 డాలర్లను నమోదు చేయడం తెలిసిందే. అక్కడి నుంచి చూస్తే బంగారం 29 శాతం, వెండి 50 శాతానికి పైనే నష్టపోయినట్టు లెక్క. అమెరికా–ఇరాన్ మధ్య తాత్కాలిక ఒప్పందంతో పశ్చిమాసియాలో పరిస్థితులు కుదుటపడడానికి తోడు యూఎస్ ఫెడ్ సమీప కాలంలోనే వడ్డీ రేట్ల పెంపును చేపడుతుందన్న అంచనాలతో పసిడి, వెండి ధరలు దిగొస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఢిల్లీలో రూ.1,200 డౌన్ ఢిల్లీ మార్కెట్లో 10 గ్రా. బంగారం ధర రూ.1,200 నష్టాన్ని చవిచూసింది. రూ.1,48,100 వద్ద ముగిసింది. వెండి కిలోకి రూ.4,000 తగ్గి రూ.2,31,000కు పరిమితమైంది. అంతక్రితం రోజు వెండి రూ.10,500 నష్టపోవడం తెలిసిందే. యూఎస్ డాలర్ పవర్ఫుల్ ర్యాలీకి తోడుగా కఠిన ద్రవ్య విధానంపై ఏర్పడిన అంచనాలతో బంగారం, వెండి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ పేర్కొన్నారు. -
క్రెడిట్ కార్డుపై మోసపోతే 5 రోజుల్లో వెనక్కి!
ముంబై: ఎల్రక్టానిక్ బ్యాంకింగ్ లావాదేవీలను (ఈబీటీ) మరింత సురక్షితంగా మార్చేందుకు ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. ముఖ్యంగా క్రెడిట్ కార్డు ద్వారా లావాదేవీల్లో మోసపోతే కస్టమర్కు ఐదు రోజుల్లోనే ఆ మొత్తాన్ని షాడో రివర్స్ (తాత్కాలికంగా జమ) చేయాలన్న నిబంధనను తీసుకొచ్చింది. రూ.500 మించిన ప్రతి లావాదేవీ వివరాలను వెంటనే కస్టమర్కు ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేయడం తప్పనిసరి. రూ.500లోపు లావాదేవీలకు సైతం ఎస్ఎంఎస్ ఇవ్వాలా? వద్దా అన్నది బ్యాంకుల అభీష్టానికి విడిచిపెట్టింది. ఒకవేళ రూ.500లోపు లావాదేవీలను కూడా ఎస్ఎంఎస్ రూపంలో తెలియజేసేట్టు అయితే అందుకు చార్జీ వసూలు చేయరాదని స్పష్టం చేసింది. కొత్త నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. → మోసపూరిత ఈబీటీపై కస్టమర్ నుంచి ఫిర్యాదు రాగానే, ఆ ఖాతా నుంచి తదుపరి మోసపూరిత లావా దేవీలు జరగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి. → బ్యాంక్ వ్యవస్థలో లోపాలు, నిర్లక్ష్యం కారణంగా మోసపూరిత ఈబీటీ చోటు చేసుకుంటే అందుకు కస్టమర్పై ఎలాంటి బాధ్యత ఉండదు. ఆ మొత్తాన్ని కస్టమర్కు వెనక్కిచ్చేయాల్సిందే. → మూడో పక్షం ఉల్లంఘన వల్ల మోసపూరిత లావాదేవీ చోటు చేసుకుంటే, దీనిపై 5 రోజుల్లో బ్యాంక్కు తెలియజేస్తే, కస్టమర్ బాధ్యత ఏమీ ఉండదు. ఆ తర్వాత నివేదిస్తే బ్యాంక్ విధానం మేరకు కస్టమర్ బాధ్యతను నిర్ణయించొచ్చు. → క్రెడిట్ కార్డు, యూపీఐ లావాదేవీలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్ లావాదేవీలు, ఐఎంపీఎస్, నెఫ్ట్, ఆర్టీ జీఎస్ లావాదేవీలన్నీ ఈబీటీ కిందకే వస్తాయి. → షాడో రివర్సల్ అంటే.. మోసపూరిత లావాదేవీ మొత్తానికి తాత్కాలిక జమ. సంబంధిత మోసంపై దర్యాప్తు పూర్తయ్యేందుకు కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు ఆ లావాదేవీ మొత్తాన్ని కస్టమర్పై బాధ్యతగా చూపించకుండా ఈ నిబంధన వెసులుబాటునిస్తుంది. -
భీమ్ యాప్లో మరిన్ని ఆర్థిక సేవలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చెల్లింపుల సేవలకు సంబంధించిన భీమ్ పేమెంట్స్ యాప్లో మరిన్ని ఆర్థిక సర్వీసులను అందుబాటులోకి తేనున్నట్లు ఎన్బీఎస్ఎల్ (ఎన్పీసీఐ భీమ్ సర్వీసెస్) ఎండీ లలిత నటరాజ్ తెలిపారు. ఆర్థిక సంస్థలతో కలి సి రుణాలు, పింఛను పథకాలు, బీమా, పెట్టుబడి సాధనాలు మొదలైనవి ప్రవేశపెట్టే ప్రణాళికలు ఉన్నట్లు ఆమె వివరించారు. గడిచిన 12 నెలల్లో యాప్ ద్వారా లావాదేవీల పరిమాణం మూడు రెట్లు పెరిగినట్లు బుధవారమిక్కడ విలేకరుల సమావేశంలో లలిత చెప్పా రు. గతేడాది జూన్లో 7.96 కోట్లుగా ఉన్న నెలవారీ వాల్యూ మ్స్ ఈ ఏడాది మే నాటికి 2.44 కోట్లకు చేరినట్లు చెప్పారు. మే నెలలో రూ. 26,952 కోట్ల విలువైన లావాదేవీలను ప్లాట్ఫాం ప్రాసెస్ చేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణలో, భీమ్ యాప్ ద్వారా జరిగిన మర్చంట్ లావాదేవీల్లో 23.9% వాటాతో నిత్యావసరాలు అగ్రస్థానంలో ఉండగా ఫుడ్ ఔట్లెట్స్ (18.1%), క్విక్ కామర్స్ (11.6%) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. -
విలువైన కంపెనీల్లో ‘తెలుగు’ హవా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా అత్యంత విలువైన 500 కంపెనీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 39 సంస్థలు చోటు దక్కించుకున్నాయి. దివీస్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా తదితర దిగ్గజాలు వీటిలో ఉన్నాయి. 2025కి సంబంధించి హురూన్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్లో భాగమైన బర్గండీ ప్రైవేట్ దేశీయంగా అత్యంత విలువైన టాప్ 500 కంపెనీలపై రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన కంపెనీల మొత్తం విలువ రూ. 12.1 లక్షల కోట్లుగా ఉంది. 2021 నుంచి చూస్తే 75 శాతం పెరిగింది. ఇవి గత ఐదేళ్లుగా ప్రతి రోజు సుమారు రూ. 283 కోట్ల విలువను జోడించాయి. జాబితాలోని 39 తెలుగు కంపెనీలు.. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వీటిలో 3.4 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. 2021తో పోలిస్తే ఈ సంఖ్య 70 శాతం పెరిగింది. ఇక మహిళా ఉద్యోగులు ఎక్కువగా ఉన్న కంపెనీల్లో 8,480 మంది ఉద్యోగినులతో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ అగ్రస్థానంలో ఉండగా, 8,143 మందితో మెడ్ప్లస్ హెల్త్ సర్వీసెస్ రెండో స్థానంలో, రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ 3,427 మందితో మూడో స్థానంలో ఉంది. ఎంటార్ టెక్నాలజీస్, స్కైరూట్ ఏరోస్పేస్ మొదలైన వాటికి ఈసారి స్థానం లభించింది. హెల్త్కేర్ రంగంలో తెలంగాణ నుంచి 16 సంస్థలు, ఏరోస్పేస్–డిఫెన్స్లో 5, పారిశ్రామికోత్పత్తుల్లో 3, ఆటోమొబైల్–ఆటో విడిభాగాల్లో 3, నిర్మాణం–ఇంజనీరింగ్, ఎనర్జీ, రియల్ ఎస్టేట్, కన్జూమర్ గూడ్స్ రంగాల్లో తలో రెండు కంపెనీల చొప్పున ఉన్నాయి. రిలయన్స్ టాప్.. జాతీయ స్థాయిలో టాప్ 500 కంపెనీలన్నింటి వేల్యుయేషన్ 3.4 లక్షల కోట్లడాలర్లుగా ఉంది. ఇది కెనడా జీడీపీ, ఇండొనేసియా–స్పెయిన్ల సంయుక్త జీడీపీ కన్నా అధికమని హురూన్ ఇండియా ఫౌండర్ అనాస్ రెహ్మాన్ జునైద్ తెలిపారు. వీటిలో దాదాపు 89 లక్షల మంది సిబ్బంది ఉండగా, పన్నుల కింద అవి రూ. 3.23 లక్షల కోట్లు చెల్లిస్తున్నాయి. 2026 ఏప్రిల్ 30 నాటికి కనీసం రూ. 10,230 కోట్ల విలువ చేసే కంపెనీలకు ఈసారి లిస్టులో చోటు దక్కింది. గత ఎడిషన్లో ఇది రూ. 9,580 కోట్లుగా ఉంది. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 19,36,230 కోట్ల వేల్యుయేషన్తో అగ్రస్థానంలో నిల్చింది. కాగా, అత్యంత విలువైన అన్లిస్టెండ్ కంపెనీగా ఎన్ఎస్ఈ అగ్రస్థానంలో కొనసాగింది. సంస్థ వేల్యుయేషన్ రూ. 4,86,340 కోట్లుగా ఉంది. అన్లిస్టెడ్ దిగ్గజాల్లో మేఘా ఇంజనీరింగ్ ఆరో స్థానంలో, జిరోధా అయిదో స్థానంలో, గ్రీన్కో 8వ స్థానంలో ఉన్నాయి. ఎన్ఎస్ఈ రూ. 30,000 కోట్ల ఐపీఓకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.ఐదు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు చోటు హురూన్ ఇండియా 2025 లిస్టులో 5 ఐపీఎల్ టీమ్లకు చోటు దక్కింది. కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ వీటిలో ఉన్నాయి. వీటి మొత్తం వేల్యుయేషన్ రూ. 71,000 కోట్లు. కోల్కతా నైట్ రైడర్స్ రూ. 20,850 కోట్లతో అత్యంత విలువైన ఫ్రాంచైజీగా, ఓవరాల్ లిస్టులో 270వ స్థానంలో నిల్చింది. -
300 నగరాలకు ‘అమెజాన్ నౌ’ విస్తరణ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 300 నగరాలకు తన క్విక్ కామర్స్ సర్వీస్ ‘అమెజాన్ నౌ’ను విస్తరించనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. ఈ విస్తరణతో భారతదేశంలోనే అతిపెద్ద ‘నిమిషాల్లో డెలివరీ’ నెట్వర్క్ను నిర్మించాలన్న లక్ష్యంతో సంస్థ ముందుకు సాగుతోంది. ప్రారంభించినప్పటి నుంచి ప్రతి త్రైమాసికంలో అమెజాన్ నౌ ఆర్డర్లు రెట్టింపు అవుతున్నాయని, దీంతో ఇది అమెజాన్ ఇండియా చరిత్రలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ-కామర్స్ వ్యాపార విభాగంగా నిలిచిందని కంపెనీ తెలిపింది.ప్రస్తుతం బెంగళూరు, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, పుణె, హైదరాబాద్, అమృత్సర్, కొచ్చి తదితర 15కు పైగా మెట్రో, నాన్-మెట్రో నగరాల్లో అమెజాన్ నౌ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే 5 కోట్లకు పైగా వినియోగదారులకు ఈ సేవ చేరువైంది. కిరాణా వస్తువులు, పండ్లు, కూరగాయలు, ఫ్రోజెన్ ఫుడ్, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, ఫ్యాషన్, బ్యూటీ ఉత్పత్తులు, చిన్న గృహోపకరణాలు, కిచెన్ వస్తువులు తదితర వేలాది ఉత్పత్తులను నిమిషాల్లోనే వినియోగదారులకు అందిస్తోంది. భారత్ పర్యటనకు వచ్చిన కంపెనీ సీఈఓ ఆండీ జెస్సీ ముంబైలోని అమెజాన్ మైక్రో ఫుల్ఫిల్మెంట్ సెంటర్ను సందర్శించారు.దేశవ్యాప్తంగా వినియోగదారుల అవసరాలను మరింత వేగంగా తీర్చేందుకు మైక్రో ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు, అర్బన్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్ల నెట్వర్క్ను విస్తరించాలని అమెజాన్ యోచిస్తోంది. ప్రస్తుతం లక్షల సంఖ్యలో ఉత్పత్తులను అదే రోజు లేదా మరుసటి రోజు డెలివరీ చేయగల సామర్థ్యాన్ని సంస్థ కలిగి ఉందని వెల్లడించింది.ఇదే సందర్భంగా డెలివరీ అసోసియేట్ల సంక్షేమం కోసం ‘సమ్మాన్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా అమెజాన్ ప్రారంభించింది. ఇటీవల ప్రకటించిన 30 కోట్ల డాలర్ల పెట్టుబడిలో భాగాన్ని ఈ కార్యక్రమం విస్తరణకు వినియోగించనుంది. ఇందులో డెలివరీ సిబ్బంది పిల్లలకు విద్యా స్కాలర్షిప్లు, ఆరోగ్య, జీవిత బీమా, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రాప్యత, ఆర్థిక చేరిక కార్యక్రమాలు, రోడ్డు భద్రతా చర్యలు వంటి పలు ప్రయోజనాలు అందించనున్నారు. అలాగే ఈ ఏడాదిలో ‘ఆశ్రయ్’ విశ్రాంతి కేంద్రాల సంఖ్యను 250కు పెంచి, పరిశ్రమలోని అన్ని డెలివరీ అసోసియేట్లకు అందుబాటులో ఉంచనున్నట్లు అమెజాన్ వెల్లడించింది. -
ఇంట్లోని బంగారం కొండంత అండ!
ముంబై: ఇళ్లల్లో ఉన్న బంగారం క్రమంగా బ్యాంక్లు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల ఖజానాల్లోకి చేరుతోంది. పసిడిని నిరుపయోగంగా ఉంచకుండా, దానిపై రుణాలు తీసుకునే ధోరణి ఇటీవలి కాలంలో విస్తృతమవుతోంది. కుటుంబాల ఆర్థిక అవసరాల్లో బంగారం కొండంత అండనిస్తోంది. ఫలితంగా బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలు, ప్రత్యేక పసిడి రుణ సంస్థల మధ్య పోటీ మరింత పెరిగింది. డేటా విశ్లేషణ, క్రెడిట్ సమాచార సంస్థ ‘ఎక్స్పీరియన్’ విడుదల చేసిన నివేదిను పరిశీలించినప్పుడు పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. పసిడి రుణాలకు ఆమోదం పెరుగుతోంది. విశ్వసనీయమైన రుణ సాధనంగా వినియోగదారులు చూస్తున్నారు. ఫలితంగా గడిచిన రెండేళ్లలో రుణాల కోసం తనఖా పెట్టిన పసిడి విలువ గణనీయంగా పెరిగింది. 2024–25లో 69 శాతం పెరిగితే, 2025–26లో 84 శాతం వృద్ధి చెందింది. 2023 మార్చి నాటికి రూ.6.3 లక్షల కోట్ల రుణాలు పసిడి తనఖాపై మంజూరు కాగా (గోల్డ్ లోన్ పోర్ట్ఫోలియో), 2026 మార్చి నాటికి ఈ మొత్తం రూ.19.4 లక్షల కోట్లకు చేరింది. ముఖ్యంగా బంగారం ధర భారీగా పెరిగిపోవడం తెలిసిందే. దీంతో తమ వద్దనున్న పసిడిపై మరింత మొత్తం రుణంగా పొందే వెసులుబాటు లభించింది. దీంతో సగటు పసిడి రుణం గత మూడేళ్లలో రూ.98వేల నుంచి రూ.1.96 లక్షలకు ఎగిసింది. 2025–26 చివరి త్రైమాసికంలో కొత్త రుణాల్లో 75 శాతం పాత రుణ గ్రహీతలు పొందినవే ఉన్నాయి. రుణాల వృద్ధికి, అందరికీ ఆర్థిక సేవల చేరువలో పసిడి ముఖ్యపాత్ర పోషిస్తోందని ఎక్స్పీరియన్ నివేదిక పేర్కొంది. ఇక ఇప్పటి వరకు బంగారం రుణాల వృద్ధిలో దక్షిణాది రాష్ట్రాలు కీలక పాత్ర పోషించగా, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ మార్కెట్ విస్తృతమవుతోంది. అయితే, ఇప్పటికీ దక్షిణాది రాష్ట్రాల వాటాయే అధికంగా ఉంది. 2025–26లో ఉత్తరప్రదేశ్లో పసిడి రుణాలు 138 శాతం పెరగ్గా, పశ్చిమ బెంగాల్లో 112 శాతం, రాజస్థాన్లో 105 శాతం, మహారాష్ట్రలో 102 శాతం చొప్పున పసిడి రుణాలు గత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి చెందాయి. ప్రాధాన్య రంగానికి సంబంధించి పసిడి రుణాలు (పీఎస్జీఎల్) సమ్మిళిత వృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. మొత్తం పసిడి రుణాల్లో వీటికి సంబంధించినవే 23 శాతానికి చేరాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లోని వ్యాపార సంస్థలు, వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలు, రుణ సదుపాయం అంతగా అందుబాటులో లేని వర్గాలకు పసిడి రుణాలు అండగా నిలుస్తున్నాయి. ఈ వర్గాలు ఇళ్లల్లోని బంగారంతో తమ నిధుల అవసరాలను (వ్యాపారం, కుటుంబ అవసరాలు, సాగు కోసం) తీర్చుకుంటున్నాయి. బంగారం రుణ గ్రహీతల్లో ఇతర రుణ సాధనాల వినియోగం కూడా పెరుగుతోంది. 2021 డిసెంబర్ నాటికి ఈ తరహా కస్టమర్లు 10 శాతంగా ఉంటే, 2025 డిసెంబర్ నాటికి 17 శాతానికి పెరిగారు. పసిడి రుణాల్లో ఎగవేతలు కూడా చాలా తక్కువగా ఉంటుండడం విశేషం. 90 రోజులకు పైగా చెల్లింపుల్లేని రుణాలు 2023 మార్చి నాటికి ఉన్న 0.4 శాతం నుంచి 2026 మార్చి నాటికి 0.2 శాతానికి తగ్గాయి. గొప్ప ఆర్థిక సాధనం.. ‘‘కుటుంబాల వద్ద పసిడి నిల్వలు గణనీయంగా ఉన్నాయి. దీంతో పసిడి రుణాలు వేగంగా పెరుగుతున్నాయి. దీంతో సంప్రదాయంగా నిల్వ ఉంచుకునే ఆస్తి కాస్తా రుణ సాధనంగా మారిపోయింది. ఎన్నో వ్యక్తిగత, జీవన అవసరాలను తీర్చడం ద్వారా ఆర్థిక సేవల చేరువలో పసిడి గొప్ప పాత్ర పోషిస్తోంది’’అని ఎక్స్పీరియన్ ఇండియా ఎండీ మనీష్జైన్ పేర్కొన్నారు. పోటాపోటీ పసిడి రుణాలకు డిమాండ్ అనూహ్యంగా పెరుగుతుండడంతో ఈ మార్కెట్లో వాటా కోసం ప్రభుత్వరంగ బ్యాంక్లు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు), ప్రత్యేక పసిడి రుణ సంస్థలు మధ్య పోటీ తీవ్రతరమైంది. ఇంతకాలం ఈ విభాగంలో ప్రభుత్వ బ్యాంక్లదే ఆధిపత్యం ఉండేది. ఇప్పుడు ఎన్బీఎఫ్సీలు, గోల్డ్ ఎన్బీఎఫ్సీల నుంచి వాటికి గట్టి పోటీ ఎదురవుతోందని ఎక్స్పీరియన్ నివేదిక వెల్లడించింది. పంపిణీ విభాగం బలంగా ఉండడం, కస్టమర్లు సైతం నాన్ బ్యాంక్ గోల్డ్ లోన్ సంస్థలవైపే మొగ్గు చూపిస్తుండడం వాటికి జోష్నిస్తోంది.ప్రభుత్వరంగ బ్యాంకుల వాటా 2025–26 క్యూ4లో (2026 జనవరి–మార్చి) 37 శాతానికి తగ్గింది. సరిగ్గా అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2024–25) క్యూ4లో ఇది 45 శాతంగా ఉంటే, అంతక్రితం త్రైమాసికంలోనూ (2025 డిసెంబర్ క్వార్టర్) 53% ఉండడం గమనార్హం. ఇక ఇదే కాలంలో పసిడి రుణాల్లో ఎన్బీఎఫ్సీల వాటా 33% నుంచి 44 శాతానికి పెరిగింది. ప్రాధాన్యరంగ పసిడి రుణాల్లో మాత్రం 88% వాటా ప్రభుత్వరంగ బ్యాంకుల చేతుల్లోనే ఉంది. -
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్: అవే షేర్లు నిలబెట్టాయ్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఐటీ, రియల్టీ, బ్యాంక్, ఫైనాన్షియల్ స్టాక్స్ పురోగమించడంతో నిఫ్టీ 50, సెన్సెక్స్ ఎగిశాయి. నిఫ్టీ 0.83 శాతం లేదా 197.55 పాయింట్ల లాభంతో 24,021.65 వద్ద, సెన్సెక్స్ 1.04 శాతం లేదా 790.54 పాయింట్లు పెరిగి 76,991.22 వద్ద స్థిరపడ్డాయి.నిఫ్టీ 50 ఇండెక్స్ లో ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ట్రెంట్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.10 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.39 శాతం పెరిగాయి.రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఐటీ, నిఫ్టీ రియల్టీ 2 శాతానికి పైగా లాభంతో మెరుగైన పనితీరు కనబరిచాయి. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ కూడా మెరుగైన పనితీరు కనబరిచాయి. మరొవైపు నిఫ్టీ ఆటో, నిఫ్టీ మెటల్ ఎక్కువగా క్షీణించాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
‘టాటా’ భారీ ప్లాన్: అయిదేళ్లలో రూ.40,000 కోట్ల పెట్టుబడి
న్యూఢిల్లీ: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ (టీఎంపీవీ) వచ్చే అయిదేళ్లలో రూ.37,500 కోట్ల నుంచి రూ.40,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. 2031 ఆర్థిక సంవత్సరం (ఎఫ్వై31) నాటికి దేశీయ ప్యాసింజర్ వాహనాల మార్కెట్లో 20 శాతం వాటాను సాధించడంతో పాటు వార్షిక విక్రయాలను ప్రస్తుత 6.4 లక్షల యూనిట్ల స్థాయి నుంచి 12 లక్షల యూనిట్లకు పైగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇన్వెస్టర్ల సమావేశంలో టాటా మోటార్స్ ప్యాసింజర్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో శైలేష్ చంద్ర ఈ వివరాలను వెల్లడించారు.ఆరు కొత్త మోడళ్లు.. ఉత్పత్తి సామర్థ్యం పెంపు కంపెనీ ప్రస్తుతం ఏడాదికి 9 లక్షల వాహనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. రానున్న 2–3 ఏళ్లలో అదనంగా మరో 4 లక్షల యూనిట్ల సామర్థ్యాన్ని జోడించి మొత్తం ఉత్పత్తి సామర్థ్యాన్ని 13 లక్షల యూనిట్లకు పెంచనున్నట్లు శైలేష్ చంద్ర తెలిపారు. అలాగే ఎఫ్వై31 నాటికి ఆరు కొత్త మోడల్ శ్రేణులను మార్కెట్లోకి తీసుకురానుంది. దీంతో కంపెనీ మొత్తం మోడల్ శ్రేణుల సంఖ్య ప్రస్తుతం ఉన్న తొమ్మిది నుంచి 15కు చేరనుంది. అధిక వృద్ధి అవకాశాలు ఉన్న విభాగాలతో పాటు ఇప్పటివరకు ప్రవేశించని కొత్త ఈవీ విభాగాల్లోనూ ఈ మోడళ్లు అందుబాటులోకి రానున్నాయి. పోర్ట్ఫోలియోలో 30% ఈవీ వాటా లక్ష్యం భవిష్యత్తు అంతా మలీ్ట–పవర్ట్రెయిన్ (ఈవీ, సీఎన్జీ, పెట్రోల్/డీజిల్) దేనని శైలేష్ చంద్ర స్పష్టం చేశారు. ఎఫ్వై31 నాటికి టాటా మోటార్స్ తన సొంత పోర్ట్ఫోలియోలో 30 శాతం ఈవీ భాగస్వామ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 10 ఈవీ మోడళ్లను అందుబాటులోకి తీసుకురానుంది. రాబోయే రోజుల్లో కంపెనీ సాధించే అదనపు విక్రయాల్లో ఈవీ, సీఎన్జీ వాహనాలదే కీలక పాత్ర కానుంది. ‘‘ఎఫ్వై20 నుంచి ఎఫ్వై26 మధ్య కంపెనీ మార్కెట్ వాటా 9 శాతం పాయింట్లు పెరిగిందని, ఎఫ్వై26 నుంచి ఎఫ్వై31 మధ్య మరో 5–6 శాతం పాయింట్ల వృద్ధితో 20 శాతం మార్కెట్ వాటాను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాము’’ అని శైలేష్ చంద్ర తెలిపారు.ఆటో పరిశ్రమ అంచనాలు దేశీయ ప్యాసింజర్ వాహనాల మార్కెట్ ఎఫ్వై26 లోని 47 లక్షల యూనిట్ల నుండి ఎఫ్వై31 నాటికి 64 లక్షల యూనిట్లకు పెరుగుతుందని శైలేష్ చంద్ర అంచనా వేశారు. కొనుగోలుదారుల ఆదాయాలు పెరగడం, ఆధునిక సాంకేతికత తోడవ్వడంతో ప్రస్తుతం ఉన్న కార్ల సగటు ధర రూ.11–12 లక్షల నుండి ఎఫ్వై 31 నాటికి రూ.15 లక్షలకు చేరనుందన్నారు. దేశీయంగా ఈవీ విక్రయాలు ఎఫ్వై31 నాటికి 10.11 లక్షల యూనిట్లకు (మొత్తం మార్కెట్లో 15–20% వాటా) చేరుకుంటాయని అభిప్రాయపడ్డారు. కాగా, గత ఆర్థిక సంవత్సరంలో 2.2 లక్షలుగా ఉన్న ఈవీ విక్రయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి 3.5 లక్షల యూనిట్లకు చేరుకోవచ్చని శైలేష్ చంద్ర తెలిపారు. -
ఎక్కువ జీతానికి ఆశపడి వెళ్తే.. టెకీ సలహాపై చర్చ
తమ వేతనం పెరగాలని ప్రతి ఉద్యోగి కోరుకుంటారు. ఇందు కోసం కంపెనీలు సైతం మారుతుంటారు. ఇది ఐటీ పరిశ్రమలో మరీ ఎక్కువ. అయితే ఇలాంటి ఉద్యోగ మార్పుల విషయంలో బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ నిపుణుడు ఉద్యోగులకు కీలక సూచన చేశారు. ప్రస్తుతం ఐటీ రంగంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో, చిన్న కంపెనీల నుంచి భారీ వేతన పెంపు ఆఫర్లు వచ్చినా వెంటనే ఆకర్షితులు కాకుండా, స్థిరత్వం ఉన్న పెద్ద సంస్థల్లో కొనసాగడాన్ని పరిశీలించాలని సూచించారు.ఇన్స్టాగ్రామ్లో వైరల్గా మారిన వీడియోలో సన్నీ కుమార్ అనే టెకీ తన స్నేహితుడి అనుభవాన్ని ఉదాహరణగా వివరించాడు. పుణెలోని అంతర్జాతీయ చెల్లింపుల సంస్థ మాస్టర్కార్డ్లో మంచి వేతనం, స్థిరమైన ఉద్యోగంతో పనిచేస్తున్న అతనికి ఒక చిన్న కన్సల్టెన్సీ సంస్థ నుంచి 60 శాతం అధిక వేతనంతో ఆఫర్ వచ్చిందని తెలిపాడు. భారీ వేతన పెంపు కారణంగా అతను కొత్త కంపెనీలో చేరినప్పటికీ, కేవలం ఆరు నెలలకే ఆ సంస్థకు సంబంధించిన ప్రాజెక్టు నిలిచిపోవడంతో ఉద్యోగం కోల్పోయాడని వివరించాడు.ఈ సంఘటనను ప్రస్తావిస్తూ, ఉద్యోగులు కేవలం వేతన పెంపును మాత్రమే ప్రమాణంగా తీసుకుని నిర్ణయాలు తీసుకోవద్దని కుమార్ సూచించాడు. మంచి సంస్థలో స్థిరమైన ఉద్యోగం ఉంటే 60 శాతం, 70 శాతం లేదా అంతకంటే ఎక్కువ వేతన పెంపు వచ్చినా, మార్కెట్ పరిస్థితులను జాగ్రత్తగా అంచనా వేసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఐటీ రంగం వేగంగా మారుతున్నందున ఉద్యోగ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు.అయితే ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పెద్ద కంపెనీలు కూడా ఇటీవల కాలంలో ఉద్యోగుల తొలగింపులకు పాల్పడుతున్నాయని పలువురు గుర్తు చేశారు. ఉద్యోగ భద్రత సంస్థ పరిమాణంపై మాత్రమే ఆధారపడదని, కంపెనీ ఆర్థిక పరిస్థితి, ఆదాయ వృద్ధి, ప్రాజెక్టుల స్థిరత్వం, భవిష్యత్ వ్యూహం, ఏఐ(AI) ప్రభావం వంటి అంశాలను కూడా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో పునర్వ్యవస్థీకరణలు, ఆటోమేషన్, ఏఐ వినియోగం పెరగడంతో ఉద్యోగ మార్కెట్లో పోటీ మరింత తీవ్రమైంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ మార్పు నిర్ణయాల సమయంలో వేతన పెంపుతో పాటు సంస్థ ఆర్థిక బలం, వ్యాపార నమూనా, మార్కెట్ అవకాశాలు, ఉద్యోగ భద్రత వంటి అంశాలను సమగ్రంగా అంచనా వేయడం అవసరమని కెరీర్ నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: ఐటీ కంపెనీలు కనుమరుగవుతాయా?


