breaking news
Business
-
ఫ్లాట్గా స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:31 సమయానికి నిఫ్టీ(Nifty) 4 పాయింట్లు తగ్గి 25,721 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 47 దిగజారి 83,405 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 18-02-2026(time: 9:32 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఉద్యోగాలకు చలిగాలి
నిరుద్యోగం జనవరిలో 5 శాతానికి పెరిగింది. 2025 డిసెంబర్లో ఇది 4.8 శాతంగానే ఉంది. జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 15 ఏళ్లకు మించిన వారికి సంబంధించి నిరుద్యోగం జనవరిలో పెరిగినట్టు తెలుస్తోంది. కార్మికుల భాగస్వామ్య రేటు (ఎల్ఎఫ్పీఆర్), జనాభాలో పనిచేసే వారి నిష్పత్తి (డబ్ల్యూపీఆర్) సైతం తగ్గడం గమనార్హం. గ్రామీణ ప్రాంతాల్లో సాగు కాలం ముగియడం వంటి సీజనల్ ప్రభావాలే ఎల్ఎఫ్పీఆర్, డబ్ల్యూపీఆర్ తగ్గడానికి కారణమని ఎన్ఎస్వో తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ రంగం, వ్యవసాయ అనుబంధ రంగాల్లో పనులు, రవాణా, వ్యాపార కార్యకలాపాలు శీతాకాలంలో నిదానించగా, పట్టణాల్లో మాత్రం వాణిజ్య కార్యకలాపాలు స్థిరంగా ఉన్నాయి. గ్రామీణ నిరుద్యోగం గత డిసెంబర్లో 3.9 శాతంగా ఉంటే, జనవరిలో 4.2 శాతానికి పెరిగింది. పట్టణాల్లో నిరుద్యోగ రేటు 6.7 శాతం నుంచి 7 శాతానికి చేరింది. జనవరిలో కార్మికుల భాగస్వామ్య రేటు దేశవ్యాప్తంగా 55.9 శాతంగా నమోదైంది. డిసెంబర్లో ఇది 56.1 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కార్మికుల భాగస్వామ్య రేటు 59 శాతం నుంచి 58.7 శాతానికి తగ్గింది. పట్టణ ప్రాంతాల్లో ఇది 50.2 శాతం నుంచి 50.3 శాతానికి స్వల్పంగా మెరుగుపడింది.మహిళా కార్మికుల భాగస్వామ్య రేటు జనవరిలో 35.1 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 39.7 శాతం కాగా, పట్టణాల్లో 25.5 శాతంగా ఉండడం గమనార్హం. జనాభాలో పనిచేసే వారి నిష్పత్తి (డబ్ల్యూపీఆర్) 2025 జూన్లో 53.3 శాతంగా ఉంటే, డిసెంబర్ నాటికి 56.7 శాతానికి మెరుగుపడగా.. 2026 జనవరిలో తిరిగి 56.2 శాతానికి బలహీనపడింది. గ్రామీణ ప్రాంతాల్లో పురుషులకు సంబంధించి డబ్ల్యూపీఆర్ 75.7 శాతంగా, మహిళలకు సంబంధించి 38 శాతంగా ఉంది. పట్టణాల్లో పురుషులకు సంబంధించి 70.5 శాతం, మహిళలకు సంబంధించి 23 శాతం చొప్పున నమోదయ్యాయి. -
రూపే కార్డు వినియోగం పెంచాలి
చెల్లింపులకు యూపీఐ ప్రధాన సాధనంగా మారిందని.. నగదు లావాదేవీలను మించిపోయాయని కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం ప్రకటించింది. రూపే డెబిట్ కార్డు వాడకం లక్ష్యిత చర్యలు అవసరమని పేర్కొంది. ఇందుకు సంబంధించి ఒక సర్వే చేసింది. 15 రాష్ట్రాల్లో 10,378 మంది అభిప్రాయాలను స్వీకరించింది. భిన్న సామాజిక ఆర్థిక విభాగాల్లో డిజిటల్ చెల్లింపుల ఆమోదం పెరిగినట్టు తెలిసింది. సర్వేలో పాల్గొన్న వారిలో 57 శాతం మంది చెల్లింపులకు యూపీఐ సాధనాన్ని వినియోగిస్తున్నారు. నగదు వినియోగం 38 శాతాన్ని ఇది అధిగమించినట్టు ఈ నివేదిక తెలిపింది. సులభంగా, చెల్లింపులు అప్పటికప్పుడు పూర్తయిపోతుండడాన్ని ఇందుకు అనుకూలంగా పేర్కొంది. 65 శాతం మంది రోజులో ఒకటికి మించిన లావాదేవీలను యూపీఐ ద్వారానే నిర్వహిస్తున్నట్టు చెప్పారు. రూపే డెబిట్ కార్డు వినియోగాన్ని, ముఖ్యంగా గ్రామీణ, చిన్న పట్టణాల్లో పెంచాలంటూ.. వర్తకులు ఈ కార్డులను ఆమోదించే విధంగా ప్రోత్సాహక కార్యక్రమాలను అమలు చేయాలని సూచించింది.ఇదీ చదవండి: డిజిటల్ రాజ్యంలోనూ.. క్యాషే కింగ్ -
డిజిటల్ రాజ్యంలోనూ.. క్యాషే కింగ్
దేశంలో ఒకవైపు యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపులు గణనీయంగా పెరుగుతుండగా.. మరోవైపు వ్యవస్థలో నగదు చలామణి సైతం ఆసక్తికరంగా విస్తరిస్తోంది. జనవరి చివరికి చలామణిలో ఉన్న నగదు రూ.40లక్షల కోట్లకు చేరినట్టు ఎస్బీఐ పరిశోధన విభాగం నివేదిక వెల్లడించింది. 2025 జనవరి నుంచి చూస్తే ఏడాదిలో 11.1 శాతం పెరిగింది. ఏడాది కాలంలో నికరంగా రూ.2.76 లక్షల కోట్ల నగదు వినియోగం అధికమైంది. ప్రజల వద్దనున్న నగదు కూడా ఆల్టైమ్ గరిష్ట స్థాయిలో 97.6 శాతంగా ఉంది. విలువ పరంగా రూ.39 లక్షల కోట్లు. 2020–21 (కరోనా అనంతరం) నాటి నుంచి ప్రజల వద్ద నగదు నికరంగా రూ.4.6 లక్షల కోట్లు పెరిగినట్టు ఎస్బీఐ పరిశోధన నివేదిక ఆధారంగా తెలుస్తోంది. అంతేకాదు, ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలు, ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో (కర్ణాటక, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, ఛత్తీస్గఢ్, పంజాబ్, జార్ఖండ్) పెరుగుతుండడం గమనార్హం. నగదు వినియోగం పెరుగుతున్నప్పటికీ.. జీడీపీలో నగదు నిష్పత్తి మాత్రం 2021 మార్చి నాటికి ఉన్న 14.4 శాతం నుంచి 11 శాతానికి తగ్గింది. నగదు ఉపసంహరణలు.. ఏటీఎంల నుంచి నెలవారీ నగదు ఉపసంహరణలు దీర్ఘకాల సగటు రూ.2.5 లక్షల కోట్లను అధిగమించినట్టు తాజా డేటా స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు, పశి్చమబెంగాల్ రాష్ట్రాల్లో ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలు పెరిగాయి. కర్ణాటకలో జీఎస్టీ విభాగం గతేడాది జూలైలో ఏకంగా 18,000 మంది చిన్న వర్తకులకు పన్ను నోటీసులు జారీ చేసింది. వీరి యూపీఐ లావాదేవీలు ఏడాదిలో రూ.40 లక్షలు దాటడమే ఇందుకు కారణం. ఈ పరిమితి దాటితే వారు జీఎస్టీ కింద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ చర్య యూపీఐ చెల్లింపులను నిరుత్సాహపరిచి ఉండొచ్చని ఈ నివేదిక అభిప్రాయపడింది. జీఎస్టీ విభాగం నోటీసులు జారీ తర్వాత కర్ణాటక రాష్టంలోని ఆయా జిల్లాల్లో ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ రూ.37 కోట్ల మేర అదనంగా పెరిగినట్టు తెలిసింది. పశి్చమబెంగాల్, కేరళలలోనూ ఇదే ధోరణి కనిపించింది. నగదు పెరగడం వెనుక.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల వద్ద నగదు కలిగి ఉండడం కూడా పెరిగింది. జీడీపీ వృద్ధికి అనుగుణంగా కరెన్సీకి సైతం డిమాండ్ పెరగడం సహజమేనని... వడ్డీ రేట్లు తక్కువలో ఉండడం కూడా ప్రజల వద్ద నగదు పెరగడానికి ఒక కారణమని ఈ నివేదిక పేర్కొంది. బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగిపోవడం కూడా మార్కెట్లో నగదు లభ్యత అధికం కావడానికి దారితీసినట్టు విశ్లేషించింది. ధరలు పెరగడంతో ఇళ్లల్లోని పాత బంగారం, వెండిని విక్రయించడం ద్వారా ప్రజల వద్ద సొమ్ము పెరిగినట్టు తెలిపింది. 2025 మార్చి నాటికి వినియోగంలోని రూ.500 నోట్ల విలువ 8.9 శాతం పెరిగి మొత్తం నగదులో 89 శాతానికి చేరింది. పరిమాణం పరంగా 3 శాతం పెరిగి మొత్తం వినియోగ నోట్లలో 40.9 శాతానికి చేరింది. విలువ పరంగా రూ.100 నోట్ల వినియోగం ఒక శాతం పెరిగి 4.7 శాతానికి చేరగా, రూ.200 నోట్ల వినియోగం మొత్తం కరెన్సీలో 0.8 శాతానికి చేరింది. ముఖ్యంగా రూ.500 నోట్ల వినియోగం అధికంగా ఉండడం వెనుక.. రూ.500 లోపు చెల్లింపులకు యూపీఐని ఎక్కువగా వినియోగిస్తుండడం కారణం. వినియోగంలో నగదు చలామణి రూ.40 లక్షల కోట్లకు చేరినప్పటికీ.. ఒక్క నెలలో యూపీఐ లావాదేవీల విలువ రూ.28 లక్షల కోట్ల స్థాయిలో ఉండడం గమనార్హం. 2025 అక్టోబర్లో నెలవారీ రూ.2.1 లక్షల కోట్ల విలువ మేర యూపీఐ లావాదేవీలు నికరంగా పెరిగి రూ.27.3 లక్షల కోట్లకు చేరడం గమనార్హం. నవంబర్లో రూ.26.3 లక్షల కోట్లకు తగ్గినప్పటికీ.. తిరిగి డిసెంబర్లో రూ.28 లక్షల కోట్లు, 2026 జనవరిలో రూ.28.3 లక్షల కోట్ల చొప్పున నమోదయ్యాయి. -
వెండి రూ. 5,000 డౌన్
న్యూఢిల్లీ: పసిడి, వెండిలో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. ఫలితంగా మంగళవారం ఢిల్లీ మార్కెట్లో వెండి మరో రూ.5,000 నష్టపోయి (2 శాతం) రూ.2,45,000 స్థాయికి దిగొచ్చింది. అటు బంగారం సైతం 10 గ్రాములకు రూ.2,200 నష్టంతో (1.4 శాతం) రూ.1,57,000కు పరిమితమైంది. అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో వెండి ఔన్స్కు 1.65 డాలర్లు (2.15 శాతం) తగ్గి 74.96 డాలర్ల వద్ద, పసిడి ఔన్స్కు ఒక శాతం నష్టపోయి 4,938.70 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి.‘‘స్పాట్ బంగారం ధరలు వరుసగా రెండో రోజు నష్టపోయాయి. అమెరికా–ఇరాన్ చర్చలకు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించారు’’అని మిరే అసెట్ షేర్ఖాన్ కమోడిటీస్ హెడ్ ప్రవీణ్ సింగ్ తెలిపారు. చైనా కొత్త సంవత్సరం సెలవులు కావడంతో కొనుగోళ్ల ఆసక్తి తగ్గినట్టు.. పసిడికి 5,000 డాలర్ల పైన అమ్మకాల ఒత్తిడి ఎదురైనట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీ విభాగం సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. మెటల్స్లో లిక్విడిటీ తగ్గిందని.. స్పెక్యులేషన్ పెరగనంత వరకు ధరలు ఒక పరిమిత శ్రేణిలోనే కొనసాగొచ్చన్నారు. -
ఆదుకున్న బ్యాంకులు
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఐటీ, క్యాపిటల్ గూడ్స్ షేర్లు రాణించడంతో దేశీయ స్టాక్ మార్కెట్ రెండో రోజూ లాభంతో ముగిసింది. సెన్సెక్స్ 174 పాయింట్లు పెరిగి 83,451 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 43 పాయింట్లు బలపడి 25,725 వద్ద నిలిచింది. ఆసియా మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం నష్టాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ఆద్యంతం లాభ నష్టాల మధ్య ఊగిసలాడాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 611 పాయింట్ల పరిధిలో 82,987 – 83,598 శ్రేణిలో ట్రేడైంది. నిఫ్టీ 25,570 వద్ద కనిష్టాన్ని, 25,764 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. ఇన్వెస్టర్ల సంపద భావించే బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.1.52 లక్షల కోట్లు పెరిగి రూ.470.11 లక్షల కోట్లకు చేరింది. లూనార్ కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా చైనా, దక్షిణ కొరియా, హాంగ్కాంగ్, తైవాన్, సింగపూర్ మార్కెట్లు పనిచేయలేదు. జపాన్ ఇండెక్సు 0.50% నష్టపోయింది. ఆరంభ నష్టాలు భర్తీ చేసుకున్న యూరప్ మార్కెట్లు స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. అమెరికా స్టాక్ సూచీలు స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి. ⇒ బీఎస్ఈ రంగాల వారీ ఇండెక్సుల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల సూచీ 2.36% పెరిగింది. ఐటీ 1.15%, ఇండ్రస్టియల్స్ 1.13%, సర్వీసెస్ 0.98% ఐటీ 0.94%, ఎఫ్ఎంసీజీ 0.87%, కన్జూమర్ డ్యూరబుల్స్ 0.85%, క్యాపిటల్ గూడ్స్ 0.76% పెరిగాయి. స్మాల్, మిడ్ క్యాప్ ఇండెక్సులు 0.49%, 0.26% లాభపడ్డాయి. మరోవైపు మెటల్, కమోడిటీస్, ఇంధన, రియల్టీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ⇒ హెచ్సీఎల్ టెక్ 1.50 శాతం, విప్రో 1.21శాతం, ఎల్అండ్టీఎం 1 శాతం లాభపడ్డాయి. టీసీఎస్, టెక్ మహీంద్రా, పెర్సిస్టెంట్ షేర్లు 0.50 శాతం పెరిగాయి. ⇒ భారత పర్యటనలో ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్... ప్రధాని మోదీతో భేటీ నేపథ్యంలో మరిన్ని రఫేల్ ఫైటర్ జెట్ల కొనుగోళ్ల ఒప్పందం కుదరొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. ఫలితంగా డిఫెన్స్ షేర్లకు డిమాండ్ లభించింది. కొచి్చన్ షిప్యార్డ్ 4%, భారత్ ఎల్రక్టానిక్స్ 2%, యూనిమెక్ ఏరోస్పేస్ 4%, భారత్ ఫోర్జ్ 1.38%, పరాస్ డిఫెన్స్, జెన్ టెక్నాలజీస్ 1%, హెచ్ఏఎల్ 0.50% లాభపడ్డాయి. -
ఒక్క చార్జ్ 543 కి.మీ. రేంజ్
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్లోకి లాంఛనంగా ప్రవేశించింది. తమ తొలి బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనం ఈ–విటారాను ఆవిష్కరించింది. బ్యాటరీ యాజ్ ఎ సరీ్వస్ (బీఏఏఎస్) ఓనర్షిప్ ప్లాన్ కింద దీని ధర రూ. 10.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. బ్యాటరీ యూసేజీ చార్జీ కిలోమీటరుకు రూ. 3.99 చొప్పున ఉంటుంది. 61కేడబ్ల్యూహెచ్, 49కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో లభించే ఈ–విటారా 543 కి.మీ. వరకు రేంజినిస్తుంది. తొలినాళ్లలో తీసుకున్నవారికి మారుతీ సుజుకీ డీలర్ లొకేషన్లలో ఏడాది పాటు చార్జింగ్ కాంప్లిమెంటరీగా లభిస్తుంది.అలాగే 3 ఏళ్ల ఓనర్షిప్ ప్లాన్తో 60 శాతం విలువ వరకు అష్యూర్డ్ బైబ్యాక్ ఆప్షన్ ఉంటుంది. ఈ–విటారా యజమానులు కాంప్లిమెంటరీగా 7.4 కేడబ్ల్యూ ఏసీ వాల్ బాక్స్ చార్జర్తో పాటు ఇన్స్టాలేషన్ ఉచితంగా పొందవచ్చు. మార్చి 31 వరకు ఈ ప్రారంభ ఆఫర్ అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. రూ. 21,000తో కస్టమర్లు దీన్ని బుక్ చేసుకోవచ్చని వివరించింది. పటిష్టమైన వ్యవస్థ..: దీన్ని మార్కెట్లో ప్రవేశపెట్టడానికి ముందుగా ఈవీల వినియోగంలో ఎదురవుతున్న అవరోధాలను తొలగించే వ్యవస్థలను పటిష్టంగా తీర్చిదిద్దడంపై దృష్టి పెట్టినట్లు మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు. పబ్లిక్ చార్జింగ్ మౌలిక సదుపాయాలు, ఆఫ్టర్ సేల్స్..సరీ్వస్ నెట్వర్క్ మొదలైన విషయాలన్నీ పరిగణనలోకి తీసుకున్నట్లు బెనర్జీ పేర్కొన్నారు. -
నభా పవర్ కొత్త ఓనర్.. టొరెంట్పవర్
ముంబై: ప్రైవేట్ రంగ కంపెనీ టొరెంట్ పవర్ తాజాగా డైవర్సిఫైడ్ దిగ్గజం ఎల్అండ్టీ నుంచి నభా పవర్ను కొనుగోలు చేయనుంది. ఇందుకు ఎల్ అండ్ టీ సొంత అనుబంధ సంస్థ ఎల్ అండ్ టీ పవర్ డెవలప్మెంట్తో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనిలో భాగంగా నభా పవర్లో 100 శాతం వాటాసహా మార్పిడికి వీలయ్యే సెక్యూరిటీలను రూ. 6,889 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువలో సొంతం చేసుకోనుంది. పూర్తిగా కాంట్రాక్టు కలిగిన థర్మల్ పవర్ ప్లాంటును నభా కలిగి ఉంది. గతేడాది(2024–25) రూ. 4,866 కోట్ల ఆదాయం, రూ. 1,153 కోట్ల నిర్వహణ లాభం సాధించింది.జపనీస్ సాంకేతికతతో ఏర్పాటు చేసిన సూపర్ క్రిటికల్ బొగ్గు ఆధారిత(థర్మల్) విద్యుత్ ప్లాంటును నిర్వహిస్తోంది. పంజాబ్లోని రాజ్పురాలో 700 మెగావాట్ల సామర్థ్యంగల రెండు యూనిట్లతో కలిపి ఈ ప్లాంటు 1,400 మెగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. 2014లో కార్యకలాపాలు ప్రారంభమైన ప్లాంటు 25 ఏళ్ల కాలానికి ప్రభుత్వంతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని(పీపీఏ) కుదుర్చుకుంది. బొగ్గు సరఫరాలకు ఎస్ఈసీఎల్, ఎన్సీఎల్తో ఇంధన సరఫరా ఒప్పందాలను(ఎఫ్ఎస్ఏలు) కలిగి ఉంది. ఈ కొనుగోలు తదుపరి టొరెంట్ పవర్ విద్యుదుత్పత్తి సామర్థ్యం ప్రస్తుత 5 గిగావాట్ల నుంచి 6.4 గిగావాట్లకు బలపడనుంది. అంతేకాకుండా అత్యధిక వృద్ధికి వీలున్న ఉత్తరాది మార్కెట్లలో ప్రవేశించేందుకు వీలు చిక్కనుంది. -
కోడ్ నుంచి క్లౌడ్ వరకు.. ఆంత్రోపిక్తో ఇన్ఫోసిస్ జట్టు
న్యూఢిల్లీ: దేశీయంగా టెలికం, ఆర్థిక సేవలు, తయారీ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ తదితర రంగ సంస్థల కోసం ఎంటర్ప్రైజ్ ఏఐ సొల్యూషన్స్ని రూపొందించేందుకు, వినియోగంలోకి తెచ్చేందుకు అమెరికన్ ఏఐ సంచలనం ఆంత్రోపిక్తో దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని కింద క్లాడ్ కోడ్ సహా ఆంత్రోపిక్ క్లాడ్ మోడల్స్ని ఇన్ఫోసిస్కి చెందిన టొపాజ్ ఏఐ సొల్యూషన్స్తో అనుసంధానం చేస్తారు. అలాగే టెలికం రంగ అవసరాల కోసం ఏఐ ఏజెంట్లను తయారు చేసేందుకు ప్రత్యేక ఆంత్రోపిక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయనున్నట్లు, తదుపరి ఇతర నియంత్రిత రంగాల్లోకి కూడా విస్తరించనున్నట్లు ఇన్ఫోసిస్ తెలిపింది.క్లెయిమ్స్ ప్రాసెసింగ్, కాంప్లయెన్స్ సమీక్షలు, కోడ్ జనరేషన్, టెస్టింగ్లాంటి బహుళ దశలు ఉండే పనులను స్వతంత్రంగా హ్యాండిల్ చేయగలిగే ఏజెంటిక్ ఏఐ సిస్టమ్లను రూపొందించడంపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు సీఈవో సలిల్ పరేఖ్ చెప్పారు. వివిధ రంగాల్లో అపార అనుభవం ఉన్న ఇన్ఫీ డెవలపర్లు ఇప్పటికే తమ క్లాడ్ కోడ్ని ఉపయోగిస్తున్నట్లు ఆంత్రోపిక్ సీఈవో డేరియో తెలిపారు. భారత్లో ఆంత్రోపిక్ కార్యాలయం ఆంత్రోపిక్ దేశీయంగా బెంగళూరులో తమ కార్యాలయాన్ని మంగళవారం ప్రారంభించింది. ఆసియాలో టోక్యో తర్వాత కంపెనీకి ఇది రెండో ఆఫీసు. తమ క్లాడ్.ఏఐ సొల్యూషన్కి భారత్ రెండో అతి పెద్ద మార్కెట్ అని కంపెనీ ఇండియా ఎండీ ఇరినా ఘోష్ తెలిపారు. 2025 అక్టోబర్లో విస్తరణను ప్రకటించినప్పటి నుంచి భారత్లో తమ ఆదాయ వృద్ధి వేగం రెట్టింపయ్యిందని వివరించారు. వివిధ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు స్థానికంగా రిక్రూట్ చేసుకోనున్నట్లు వివరించారు. విద్య, వ్యవసాయం తదితర రంగాల్లో సంస్థలతో భాగస్వామ్యాలను కుదుర్చుకుంటున్నట్లు చెప్పారు. ఆంత్రోపిక్తో భాగస్వామ్యం వార్తల నేపథ్యంలో ఇన్ఫోసిస్ షేరు మంగళవారం దాదాపు రెండు శాతం లాభపడింది. బీఎస్ఈలో 1.83 శాతం లాభపడి రూ. 1,391.20 వద్ద క్లోజయ్యింది. ఓపెన్ఏఐతో ఎటర్నల్ చెట్టాపట్టాల్వివిధ విభాగాలవ్యాప్తంగా కృత్రిమ మేధ(ఏఐ) వినియోగాన్ని పెంచుకునే దిశగా ఓపెన్ఏఐతో భాగ స్వామ్య పరిధిని మరింతగా విస్తరించినట్లు ఎటర్నల్ వెల్లడించింది. దీని ప్రకారం జొమాటో, బ్లింకిట్, డిస్ట్రిక్ట్, హైపర్ప్యూర్తో పాటు తమ భాగస్వామ్య ప్లాట్ఫాంలు, అంతర్గత వ్యవస్థల్లో ఏఐ వాడకాన్ని పెంచనుంది. కస్టమర్లు, భాగస్వాములు తమ ప్లాట్ఫాంలను మరింత మెరుగ్గా ఉపయోగించుకునేందుకు వీలు కలి్పంచే కొత్త మార్గాలను ఆవిష్కరించేందుకు ఓపెన్ఏఐకి చెందిన ఎంటర్ప్రైజ్ ఏపీఐ ప్లాట్ఫాంతో కలిసి ఎటర్నల్ పని చేయనుంది. అంతర్గతంగా తమ ఆటోమేషన్ ప్లాట్ఫాం స్టిచ్తో జీపీటీ–5.3–కోడెక్స్లాంటి లేటెస్ట్ కోడింగ్ మోడల్స్ని అనుసంధానం చేయడంపై దృష్టి పెట్టనుంది. -
నా దగ్గర క్యాష్ లేదు!: ఎలాన్ మస్క్ ట్వీట్
ప్రపంచ కుబేరుడు, టెస్లా బాస్.. ఎలాన్ మస్క్ నికర సంపద 849.03 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈయన తరువాత జాబితాలో లారీ పేజ్ (251 బిలియన్ డాలర్లు), సెర్గీ బ్రిన్ (231.7 బిలియన్ డాలర్లు), మార్క్ జుకర్బర్గ్ (219.4 బిలియన్ డాలర్లు) ఉన్నారు. వీరి ముగ్గురి నికర సంపద మొత్తం (702.1 బిలియన్ డాలర్లు).. మస్క్ సంపదకు సమానం కాదు. దీన్ని బట్టి చూస్తే.. మస్క్ కుబేరుల జాబితాలో ఎవరికీ అందనంత ఎత్తుకు చేరిపోయినట్లు స్పష్టంగా అర్థమైపోతుంది.ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలాన్ మస్క్ సంపద అక్షరాలా రూ. 70 లక్షల కోట్ల కంటే ఎక్కువే. ఈ సంపదకు కారణం టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీలలో వాటాలే కారణమని మస్క్ వెల్లడించారు. నన్ను అందరూ కుబేరుడు అనుకుంటారు. కానీ నా దగ్గర నగదు రూపంలో ఉన్న క్యాష్ 0.1 శాతం కంటే తక్కువ అని పేర్కొన్నారు. గతంలో కూడా ఈ మాటలు చెప్పాను, మళ్లీ ఇప్పుడు కూడా చెబుతున్నాను అని వెల్లడించారు. నిజానికి ఆయన సంపద పేపర్ వెల్త్ మాత్రమే. అంటే షేర్ల విలువ ఆధారంగా ఉన్న సంపదన్నమాట.Already have thousands of times over. My “net worth” is almost entirely due to my ownership stakes in Tesla and SpaceX. I have <0.1% that is cash. Tesla and SpaceX employees all receive stock/options and Tesla is >80% owned by retail investors and index/pension funds, so value…— Elon Musk (@elonmusk) February 15, 2026 -
ఫేక్, ఏఐ కంటెంట్ నియంత్రణకు కేంద్రం కొత్త నిబంధనలు
కేంద్ర ప్రభుత్వం కీలకం నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ ఫేక్ కంటెంట్ను అరికట్టడానికి కొత్త నిబంధనలను ప్రకటించింది. ఇవి కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కంటెంట్కే పరిమితం కాకుండా, అన్ని రకాల కంటెంట్పై వర్తించనున్నట్లు తెలిపింది. ఈ కొత్త నిబంధనలు ఫిబ్రవరి 20 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇంటర్నెట్ యుగంలో వ్యక్తుల గోప్యత ఉల్లంఘన, నకిలీ సమాచారం, డీప్ఫేక్ వీడియోలు వంటి సమస్యలు పెరుగుతున్నాయి. అదే సమయంలో భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త నిబంధనల్ని అందుబాబులోకి తెచ్చింది. తద్వారా వినియోగదారులు ఎవరైనా సంబంధిత సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్లో చూసిన ఫేక్ కంటెంట్ గురించి సంబంధిత ఫ్లాట్ఫామ్ యాజమాన్యానికి నేరుగా ఆన్లైన్లో ఫిర్యాదు చేసే వెసులు బాటు కల్పించింది. ఉదాహరణకు, ఫేస్బుక్లో గోప్యత ఉల్లంఘించే వీడియో కనిపిస్తే, ఫేస్బుక్ గ్రివెన్సెస్ ఆఫీసర్కి ఆన్లైన్లో ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు చేసిన 24 గంటల్లోగా దాన్ని ఫ్లాట్ఫామ్ నుంచి తొలగిస్తుంది. అంతేకాదు, అశ్లీల కంటెంట్, పిల్లల లైంగిక నేరాలు, కులం లేదా మతం ఆధారిత ద్వేషం, నకిలీ సమాచారం వంటి వాటిని 36 గంటల్లో, వ్యక్తిగత నగ్నత్వం, లైంగిక సంపర్కం, డీప్ఫేక్ వీడియోలు వంటి వాటిపై ఫిర్యాదు వస్తే 2 గంటల్లో చర్య తీసుకోవాలి. కాపీరైట్, పేటెంట్, ట్రేడ్మార్క్ ఉల్లంఘనలపై ఫిర్యాదులు అయితే 7 రోజుల్లో పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం లేదా కోర్టు ఆదేశాలపై కంటెంట్ తొలగించడానికి గడువు 36 గంటల నుండి 3 గంటలకు తగ్గించారు. జాతీయ భద్రత, శాంతిభద్రతలు, పరువు నష్టం వంటి అంశాలకు ఇది వర్తిస్తుంది.మీరు ఫిర్యాదు చేసినా సదరు సోషల్ మీడియా యాజమాన్యం పట్టించుకోకపోతే 30 రోజుల్లో ప్రభుత్వ Grievance Appellate Committee (GAC)ని సంప్రదించవచ్చు. ఇది పూర్తిగా ఆన్లైన్లో ఉంటుంది. వెబ్సైట్ gac.gov.inలో మొబైల్ నంబర్, OTP, ఆధార్ ద్వారా నమోదు చేసి, ‘File New Appeal’ ద్వారా వివరాలు సమర్పించాలి. కమిటీ నిర్ణయం తప్పు అని భావిస్తే, కంటెంట్ తొలగించాలని ఆదేశించవచ్చు. ఏఐ కంటెంట్పై ప్రత్యేక నియంత్రణలు కూడా ఉన్నాయి. ఏఐ ద్వారా రూపొందించిన కంటెంట్కి తప్పనిసరిగా లేబుల్ (నోటీసు) ఇవ్వాలి. ఆడియో లేదా వీడియోలో ప్రారంభంలోనే ఇది AI కంటెంట్ అని స్పష్టంగా చూపించాలి. అశ్లీల కంటెంట్, చైల్డ్ పోర్నోగ్రఫీ, నకిలీ పత్రాలు, డీప్ఫేక్లు ఉత్పత్తి కాకుండా ఆటోమేటెడ్ టూల్స్ ఏర్పాటు చేయాలి. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు కంటెంట్ అప్లోడ్ చేసే సమయంలో వినియోగదారుల నుండి అఫిడవిట్ తీసుకోవాలి.ఇప్పటివరకు సోషల్ మీడియా సంస్థలకు సేఫ్ హార్బోర్ ప్రొటెక్షన్ ఉండేది. కొత్త నిబంధనలతో, ప్లాట్ఫారమ్లు కంటెంట్ తొలగించడంలో విఫలమైతే ఈ రక్షణ కోల్పోతాయి. అంటే, వినియోగదారులు రాసిన పోస్ట్పై కూడా కంపెనీలు న్యాయపరమైన బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలు ఒకవైపు గోప్యత రక్షణను బలపరుస్తాయి, మరోవైపు భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడేలా రూపొందించబడ్డాయి. AI కంటెంట్కి ప్రత్యేక నియంత్రణలు ఉండటం వల్ల భవిష్యత్తులో డీప్ఫేక్లు, నకిలీ వీడియోలు వంటి సమస్యలు తగ్గే అవకాశం ఉంది. -
'టెకీల ప్రైమరీ జాబ్ కోడింగ్ కాదు': నందన్ నీలేకని
ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వల్ల టెక్ ప్రపంచంలో కీలక మార్పులు సంభవిస్తాయని, ఉద్యోగులు జాబ్స్ కోల్పోతారని ఇప్పటికే చాలామంది నిపుణులు హెచ్చరించారు. ఇలాంటి సమయంలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నీలేకని చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.ఇటీవల జరిగిన ఇన్వెస్టర్ డే కార్యక్రమంలో నందన్ నీలేకని మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తులో సాఫ్ట్వేర్ రంగాన్ని పూర్తిగా మార్చివేస్తుందని పేర్కొన్నారు. ఇది సాధారణ సాంకేతిక మార్పు కాదు.. సంస్థల పని విధానం, వ్యాపార నమూనాలు, ఉద్యోగుల నైపుణ్యాలను మూలం నుంచి మార్చే 'రూట్ అండ్ బ్రాంచ్' మార్పు అని అన్నారు.ఇప్పటి వరకు సాఫ్ట్వేర్ రంగంలో మొదటి పని కోడ్ రాయడం. కానీ భవిష్యత్తులో మొదటి పని కోడ్ రాయడం కాదు, AI వ్యవస్థలను సమర్థంగా ఉపయోగించి వ్యాపార సమస్యలను పరిష్కరించడం అని నీలేకని అన్నారు. ఏఐ మోడళ్ల సామర్థ్యం వేగంగా పెరుగుతున్నప్పటికీ, వాటిని సంస్థల్లో సమర్థవంతంగా అమలు చేయడం సవాలుగా మారింది. కాబట్టి దీనిని పరిష్కరించుకోవడానికి.. ఇందులో ప్రత్యేకించి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: 'భారీ క్రాష్ మొదలైంది'.. కియోసాకి హెచ్చరిక!ఏఐ యుగంలో కొత్త నైపుణ్యాలు అవసరం అవుతాయి. ఏఐ ఇంజినీరింగ్, ఏజెంట్ ఆర్కెస్ట్రేషన్ మొదలైన రంగాల్లో నిపుణుల అవసరం ఏర్పడుతుంది. ఒకే ప్రాంప్ట్కు ప్రతి సారి వేర్వేరు ఫలితాలు రావడం వంటి వ్యవస్థలను సమర్థంగా నిర్వహించగల సామర్థ్యం.. ఉద్యోగుల్లో ఉండాలి. దీనిని అలవాటు చేసుకోవాలి. ఇది సంప్రదాయ సాఫ్ట్వేర్ అభివృద్ధి విధానంతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉంటుందని నందన్ నీలేకని అన్నారు. అయితే ఈ మార్పు అనుకున్నంత సులభం కాదు. నెమ్మదిగా అలవాటు చేసుకోవాలి. -
మారుతి తొలి ఎలక్ట్రిక్ కారు లాంచ్: ధర ఎంతంటే?
చాలా రోజుల నిరీక్షణ తరువాత మారుతి సుజుకి తన మొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఈవిటారాను లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 10.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). దీనిని రూ. 21000 చెల్లించి నెక్సా షోరూమ్లలో లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.2025 జనవరిలో జరిగిన ఆటో ఎక్స్పోలో తొలిసారి కనిపించిన ఈ కారు ఏడాది తరువాత మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ విభాగంలోకి ప్రవేశించింది. ఈ కారు కొనుగోలుదారులు వెహికల్ & బ్యాటరీ ప్యాక్ రెండింటిపై ఎనిమిది సంవత్సరాల వారంటీ, ఒక సంవత్సరం ఉచిత ఛార్జింగ్ వంటి వాటితో పాటు.. రూ. 50,000 విలువైన ఇన్స్టాలేషన్తో ఫ్రీ హోమ్ ఛార్జర్ కూడా పొందవచ్చు. trends.embed.renderExploreWidget("TIMESERIES", {"comparisonItem":[{"keyword":"e Vitara","geo":"IN","time":"now 1-d"}],"category":0,"property":""}, {"exploreQuery":"date=now%201-d&amp;amp;geo=IN&amp;amp;q=e%20Vitara&amp;amp;hl=en-US&amp;amp;legacy","guestPath":"https://trends.google.com:443/trends/embed/"}); మారుతి సుజుకి ఈవిటారా 49 కిలోవాట్ (440 కిమీ), 61 కిలోవాట్ (543 కిమీ) బ్యాటరీ ఎంపికలతో లభిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు, ఇన్వర్టర్ అండ్ ట్రాన్స్మిషన్లను అనుసంధానించే కాంపాక్ట్ 3-ఇన్-1 వ్యవస్థను ఉపయోగిస్తుంది. కాబట్టి మంచి పనితీరును అందిస్తుంది. ఇది ఎకో, నార్మల్, స్పోర్ట్, స్నో వంటి నాలుగు డ్రైవింగ్ మోడ్స్ పొందుతుంది. రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టం కూడా ఇందులో ఉంటుంది. ఇది కొంత ఎక్కువ రేంజ్ పొందటానికి అనుమతిస్తుంది.మంచి డిజైన్ కలిగిన ఈ కారు 10.1 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే & 10.25-అంగుళాల మల్టీ-ఇన్ఫర్మేషన్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పొందుతుంది. వైర్లెస్ కనెక్టివిటీ, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, సెగ్మెంట్-లీడింగ్ 10-వే పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు ఇందులో ఉన్నాయి. కాబట్టి ఇది అన్ని విధాలా వాహన వినియోగదారులకు అనుకూలంగా ఉంటుంది.ఇదీ చదవండి: 'భారీ క్రాష్ మొదలైంది'.. కియోసాకి హెచ్చరిక! -
జియో ఏఐ డాక్టర్.. అద్దం ముందే ఆరోగ్య పరీక్ష!
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో.. జియో పెవిలియన్ ఎంతో మందికి ఆకట్టుకుంది. ఇక్కడ జియో ఏఐ స్టాక్, జియో సంస్కృతి ఏఐ, జియో ఆరోగ్యం ఏఐ, జియో శిక్షా, జియో ఏఐ హోమ్ వంటి వివిధ ఏఐ మోడల్స్ ప్రదర్శించారు. ఇందులో ప్రత్యేకంగా 'జియో ఆరోగ్య ఏఐ' మరింత ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.'జియో ఆరోగ్య ఏఐ' అనేది ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కోసం రూపొందించిన ఏఐ క్లినిక్ మోడల్. దీనిని దేశంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏఐ సాంకేతికతతో శక్తివంతం చేసి, గ్రామీణ ప్రాంతాల్లో కూడా వేగవంతమైన.. తక్కువ ఖర్చుతో కూడిన వైద్య సేవలను అందించడానికి తీసుకొచ్చారు.వీడియోలో మీరు గమనించినట్లయితే.. ఒక వ్యక్తి అద్దం మాదిరిగా ఉన్న ఒక పరికరం ముందు నిలబడితే.. తక్కువ వ్యవధిలోనే వారి కళ్లు, చర్మ రంగు, ముఖ కవళికలు & ఇతర దృశ్య సూచనలను ఆధారంగా తీసుకుని అవసరమైన ప్రాథమిక ఆరోగ్య సమాచారం ప్రదర్శిస్తుంది. ఆ తర్వాత AI సిస్టమ్.. ఈ డేటాను పరిశీలించి ఒక ప్రాథమిక ఆరోగ్య నివేదికను సిద్ధం చేస్తుంది.ఏఐ డాక్టర్.. అద్దం ముందే ఆరోగ్య పరీక్ష!'జియో ఆరోగ్య ఏఐ' అనేది ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కోసం రూపొందించిన ఏఐ క్లినిక్ మోడల్.దీనిని దేశంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏఐ సాంకేతికతతో శక్తివంతం చేసి, గ్రామీణ ప్రాంతాల్లో కూడా వేగవంతమైన.. తక్కువ ఖర్చుతో కూడిన వైద్య సేవలను… pic.twitter.com/QcblqE5UUF— Sakshi (@SakshiNews) February 17, 2026రోగులు తమ సమస్యలను వాయిస్ AI డాక్టర్కు మాటల ద్వారా కూడా వివరించవచ్చు. ఈ వాయిస్ సిస్టమ్ అవసరమైతే మరిన్ని ప్రశ్నలు అడిగి రోగి పరిస్థితిని స్పష్టంగా అర్థం చేసుకుంటుంది. ముఖ్యంగా, ఇది అనేక భారతీయ భాషల్లో సంభాషించడం వల్ల భాషకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయి. దీని ద్వారా గ్రామీణ ప్రజలు సులభంగా తమ ఆరోగ్య సమస్యలను చెప్పుకోవచ్చు.ఏఐ డాక్టర్ రోగుల పరిస్థితిని ముందుగానే గుర్తించి.. అవసరమైతే నిపుణుల వద్దకు రిఫర్ చేస్తుంది. అయితే.. ఈ ఏఐ సిస్టం కేవలం ప్రాథమిక అంచనా మాత్రమే. డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి మందులు లేదా చికిత్స అందించదు. దీనిని డిజిటల్ కనెక్టివిటీ ఉన్న ఎక్కడైనా ఏర్పాటు చేయవచ్చు. పోర్టబుల్ ఎక్స్-రేలు, పోర్టబుల్ ఈసీజీలు వంటి పరికరాలను కూడా ఈ వ్యవస్థతో అనుసంధానం చేయవచ్చు. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. -
బ్యాంకుల్లో మిస్ సెల్లింగ్కు ముగింపు!
బ్యాంకుల్లో బీమా సహా ఇతర ఆర్థిక ఉత్పత్తులను తప్పుదోవ పట్టించి విక్రయించడాన్ని (మిస్ సెల్లింగ్) నిరుత్సాహపరిచే నిబంధనలను ఆర్బీఐ ప్రతిపాదించింది. ‘‘ఉత్పత్తులు/సేవల విక్రయాలను పెంచుకునేందుకు గాను, మిస్ సెల్లింగ్ లేదా ఉద్యోగులను ప్రోత్సహించే విధంగా బ్యాంక్ విధానాలు, పద్దతులు లేకుండా చర్యలు తీసుకోవాలి’’అని ఆర్బీఐ తన ముసాయిదా నిబంధనల్లో పేర్కొంది.ఉత్పత్తులు/సేవల విక్రయాలకు సంబంధించి వివిధ యూనిట్ల మధ్య పోటీలను నిర్వహించడాన్ని ఉదాహరణగా ఆర్బీఐ పేర్కొంది. థర్డ్ పార్టీ (బ్యాంకు సొంతం కానివి) ఉత్పత్తులు/సేవల మార్కెటింగ్/విక్రయాలపై ఉద్యోగులకు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి ప్రోత్సాహకాలు ఉండరాదని స్పష్టం చేసింది. అలాగే, బ్యాంక్లు తన ఉత్పత్తికి జోడింపుగా (బండిల్డ్) థర్డ్ పార్టీ ఉత్పత్తి విక్రయాన్ని చేపట్టరాదని కోరింది.ఈ విషయంలో కస్టమర్లకు ఒకటికి మించి ఆప్షన్లు అందించాలని నిర్దేశించింది. ఒకవేళ కస్టమర్ను తప్పుదోవ పట్టించి ఉత్పత్తిని విక్రయించినట్టు తేలితే.. అంత మొత్తాన్ని తిరిగి వెనక్కి ఇచ్చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దీనికి అదనంగా కస్టమర్కు ఏదైనా నష్టం కలిగితే అంత మేర పరిహారం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. -
స్టాక్ మార్కెట్ క్లోజింగ్ అప్డేట్స్
మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 173.81 పాయింట్ల లాభంతో 83,450.96 వద్ద, నిఫ్టీ 42.65 పాయింట్ల లాభంతో 25,725.40 వద్ద నిలిచాయి.యూనికామర్స్ ఈసొల్యూషన్స్ లిమిటెడ్, కొఠారి ప్రొడక్ట్స్ లిమిటెడ్, ఈజీ ట్రిప్ ప్లానర్స్ లిమిటెడ్, ఆర్చాస్ప్ లిమిటెడ్, కెల్టన్ టెక్ సొల్యూషన్స్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఇండోవిండ్ ఎనర్జీ లిమిటెడ్, కామధేను వెంచర్స్ లిమిటెడ్, సీఎల్ ఎడ్యుకేట్ లిమిటెడ్, సూపర్ స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్, యుకెన్ ఇండియా లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయు.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
'భారీ క్రాష్ మొదలైంది'.. కియోసాకి హెచ్చరిక!
స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉన్న సమయంలో.. ప్రముఖ ఇన్వెస్టర్, ప్రసిద్ధ 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ఒక ట్వీట్ చేశారు. ఇందులో నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అంటూనే.. భారీ క్రాష్ మొదలైందని అన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.2013లో ప్రచురించిన రిచ్ డాడ్స్ ప్రాఫసీలో.. భవిష్యత్తులో అతిపెద్ద స్టాక్ మార్కెట్ క్రాష్ జరుగుతుందని హెచ్చరించాను. నేను చెప్పినట్లే.. ఆ పెద్ద ఆర్థిక సంక్షోభం సమీపంలో ఉంది. మార్కెట్ క్రాష్ అనేది కొందరికి ప్రమాదం అయినా.. స్టాక్స్ కొనుగోలు చేయాలని వేచి చూసేవారికి గొప్ప అవకాశం.ఈ సందర్భంగా కియోసాకి.. గోల్డ్, సిల్వర్ గురించి చెబుతూనే బిట్కాయిన్, ఎథెరియం గురించి కూడా పేర్కొన్నారు. బిట్కాయిన్ విలువ తగ్గిపోతున్నప్పుడు, నేను మరింత కొనుగోలు చేస్తానని అన్నారు. నా దృష్టిలో ఇవే (బంగారం, వెండి, బిట్కాయిన్, ఎథెరియం) నిజమైన ఆస్తులని పేర్కొన్నారు.I Am Warning You: In Rich Dad’s Prophecy published 2013 I warned of the biggest stock market crash in history still coming.That giant crash is now imminent.The good news is those of you who followed my rich dad’s warning and prepared….the coming crash will make you richer…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 17, 2026ఆర్థిక సంక్షోభాలు ఎప్పుడూ నష్టాలనే కాకుండా.. అవకాశాలను అందిస్తుంది. భయపడే వారు నష్టపోవచ్చు, కానీ ఆర్థిక జ్ఞానం కలిగి, దీర్ఘకాల దృష్టితో పెట్టుబడులు పెట్టే వారు మాత్రం.. తప్పకుండా ధనవంతులు అవుతారు. ఎప్పుడైతే మార్కెట్ నష్టాలను చవి చూస్తుందో.. చాలామంది తమ స్టాక్ అమ్మేయడానికి సిద్ధపడతారు. అలాంటి సమయంలో వాటిని కొనుగోలు చేసేవారు సంపన్నులవుతారు.ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. పెట్టుబడి అనేది ఒక వ్యక్తి ఆర్థిక దృష్టికోణం మాత్రమే. ఇందులో లాభనష్టాలు సహజమే. కాబట్టి ఇన్వెస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి. అవసరమైతే ఆర్ధిక పరిస్థితిని విశ్లేషించడం లేదా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.ఇదీ చదవండి: డేంజర్లో ఉద్యోగాలు!.. 2026లో ఇదే జరుగుతుందా? -
ఇంటెల్కు రూ.27 కోట్ల జరిమానా!
పోటీని దెబ్బతీసే విధానాలను పాటించినందుకు ఇంటెల్ కార్పొరేషన్పై కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) రూ. 27.38 కోట్ల జరిమానా విధించింది. డెస్క్టాప్లో ఉపయోగించే బాక్స్డ్ మైక్రోప్రాసెసర్లకు (బీఎంపీ) సంబంధించి భారత్కి మాత్రమే పరిమితమయ్యే వారంటీ పాలసీని వర్తింప చేయడం ద్వారా మార్కెట్లో తన ఆధిపత్యాన్ని కంపెనీ దుర్వినియోగం చేసిందని సీసీఐ పేర్కొంది.చైనా, ఆస్ట్రేలియా, ఇతరత్రా ప్రపంచదేశాల్లో కంపెనీల పాటించే వారంటీ పాలసీలతో పోల్చినప్పుడు భారత్లో అమలు చేస్తున్న విధానం వివక్షపూరితమైనదని తెలిపింది. భారత్లోని అధీకృత పంపిణీదారు నుంచి కొనుగోలు చేస్తేనే బీఎంపీలకు వారంటీ చెల్లుబాటయ్యేలా, మిగతా ఎక్కడా లేని విధంగా ఇండియాకు మాత్రమే పరిమితమయ్యే విధంగా పాలసీని ఇంటెల్ అమలు చేయడం సరికాదంటూ మ్యాట్రిక్స్ ఇన్ఫో సిస్టమ్స్ చేసిన ఫిర్యాదుపై సీసీఐ ఈ ఆదేశాలిచ్చింది. -
ఐదు కంపెనీల లిస్టింగ్ బాట
రాజకీయ, భౌగోళిక అనిశ్చితుల కారణంగా సెకండరీ మార్కెట్లు ఆటుపోట్లు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రైమరీ మార్కెట్లు కళకళలాడుతూనే ఉన్నాయి. తాజాగా ఐదు కంపెనీల లిస్టింగ్ ప్రణాళికలకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఐపీవోల జోరు కొనసాగనుంది. వివరాలు చూద్దాం..కొత్త కేలండర్ ఏడాదిలోనూ 2025 బాటలో పబ్లిక్ ఇష్యూల జోరు కొనసాగుతోంది. తాజాగా సెబీ ఐదు కంపెనీలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యేందుకు అనుమతించింది. జాబితాలో విరూపాక్ష ఆర్గానిక్స్, డ్యురోఫ్లెక్స్, ప్రీమియర్ ఇండ్రస్టియల్ కార్పొరేషన్, హెక్సాగాన్ న్యూట్రిషన్, ఓమ్ పవర్ ట్రాన్స్మిషన్ చేరాయి. ఈ కంపెనీలన్నీ సెబీకి 2025 సెపె్టంబర్– అక్టోబర్ కాలంలో ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. కాగా.. 2025లో తొలిసారి దేశీ ప్రైమరీ మార్కెట్ల చరిత్రలోనే అత్యధికంగా 103 కంపెనీలు రూ. 1.76 లక్షల కోట్లను సమీకరించిన విషయం విదితమే. ఆర్అండ్డీ ఫార్మాహైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు విస్తరించిన ఫార్మాస్యూటికల్ రంగ కంపెనీ విరూపాక్ష ఆర్గానిక్స్ ఐపీవోకు వస్తోంది. ఇందుకు అనుగుణంగా రూ. 740 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. అయితే ఐపీవోకు ముందుగా రూ. 148 కోట్ల విలువైన ప్లేస్మెంట్కు వీలున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 360 కోట్లు సామర్థ్య విస్తరణ కోసం పెట్టుబడి వ్యయాలకు కేటాయించనుంది. మరో రూ. 195 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. కంపెనీ పరిశోధన– అభివృద్ధి(ఆర్అండ్డీ) ఆధారిత ఫార్మాస్యూటికల్ కంపెనీగా నిలుస్తోంది. సంబంధిత ఏపీఐలు, ఇంటర్మీడియేట్స్ తయారీ చేపడుతోంది.పరుపుల తయారీపరుపుల తయారీలో సుప్రసిద్ధమైన డ్యురోఫ్లెక్స్ పబ్లిక్ ఇష్యూ చేపట్టనుంది. దీనిలో భాగంగా రూ. 184 కోట్ల విలువైన ఈక్విటీ జారీతోపాటు.. కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు 2.25 కోట్ల షేర్లను ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను ముంబై కంపెనీ 120 సొంత, నిర్వహణా స్టోర్ల ఏర్పాటుకు వెచి్చంచనుంది. అంతేకాకుండా ప్రస్తుత కోకో స్టోర్ల లీజ్, రెంట్, లైసెన్స్ ఫీజులతోపాటు తయారీ యూనిట్ ఏర్పాటుకు సైతం వినియోగించనుంది. 1963లో ఏర్పాటైన డ్యురోఫ్లెక్స్ మార్కెట్ వాటా రీత్యా దేశీయంగా పరుపుల తయారీలోని టాప్–3 కంపెనీలలో ఒకటిగా నిలుస్తోంది. ఫర్నీచర్సహా బెడ్డింగ్ సంబంధిత ప్రొడక్టులను సైతం తయారు చేస్తోంది.విస్తరణపై దృష్టివెల్డింగ్ కన్జూమబుల్స్ పరిశ్రమలో వినియోగించే పౌడర్లు, వైర్ల తయారీ చేపట్టే ప్రీమియర్ ఇండ్రస్టియల్ కార్పొరేషన్ ఐపీవోకు రానుంది. దీనిలో భాగంగా రూ. 2.25 కోట్ల విలువైన ఈక్విటీ జారీతోపాటు.. ప్రస్తుత వాటాదారులు 54 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను హోనడ్, ఖాలాపూర్(మహారాష్ట్రలోని రాయ్గఢ్) వద్ద కొత్తగా వైర్ తయారీ ప్లాంటును ఏర్పాటు చేయడంతోపాటు.. వాడా, పాల్ఘర్(మహారాష్ట్ర)లోగల యూనిట్ విస్తరణకు వినియోగించనుంది. అంతేకాకుండా మరికొన్ని నిధులను వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు సైతం వెచ్చించనుంది. వెల్నెస్ ప్రొడక్టులతోవిభిన్న మైక్రోన్యూట్రియంట్ ఉత్పత్తులను అభివృద్ధి చేస్తున్న హెక్సాగాన్ న్యూట్రిషన్ ఐపీవోకు వస్తోంది. దీనిలో భాగంగా కంపెనీ ప్రమోటర్లు 3.08 కోట్లకుపైగా ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. 1993లో ఏర్పాటైన కంపెనీ ప్రధానంగా వివిధ మైక్రోన్యూట్రియంట్ ప్రీమిక్స్లతోపాటు.. బ్రాండెడ్ వెల్నెస్, క్లినికల్ న్యూట్రిషన్, థరెప్యూటిక్ ఫార్ములేషన్స్, వినియోగానికి సిద్ధంగా ఉండే(రెడీ టు యూజ్) ఆహారోత్పత్తులను తయారు చేస్తోంది.పెట్టుబడి వ్యయాలకుహైవోల్టేజీ, ఎక్స్ట్రా హైవోల్టేజీ విద్యుత్ ప్రసార లైన్లు, సబ్స్టేషన్లను ఏర్పాటు చేసే ఓమ్ పవర్ ట్రాన్స్మిషన్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు అనుగుణంగా 90 లక్షల షేర్లను కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 10 లక్షల షేర్లు ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను మెషీనరీ, పరికరాల కొనుగోలు, రుణ చెల్లింపులు, దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. కంపెనీ విద్యుత్ లైన్లు, సబ్స్టేషన్లతోపాటు.. భూగర్భ కేబుళ్ల ప్రాజెక్టులు, సమీకృత నిర్వహణా సర్వీసులు తదితర కార్యకలాపాలు సైతం చేపడుతోంది.ఇదీ చదవండి: ఏఐతో నిజంగా ఉద్యోగాలు పోతాయా? -
సెలబ్రిటీల కళ్లు, ఇళ్లు అక్కడే.. ఎందుకంటే...
అత్యధికశాతం మంది భారతీయులకు నచ్చే టూరిస్ట్ డెస్టినేషన్ కావచ్చేమో కానీ గత కొన్నేళ్లుగా దుబాయ్ భారతీయ సినీ సెలబ్రిటీలకు పెట్టుబడులకు కేంద్రంగా కూడా మారింది. ముఖ్యంగా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖ నటులు దుబాయ్లో ఇళ్లు, స్థలాలు, లగ్జరీ అపార్ట్మెంట్లు, ఎంటర్టైన్మెంట్ ప్రాపర్టీల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. కొందరైతే మరింత ముందుకెళ్లి అక్కడ స్థిరనివాసాలు సైతం ఏర్పాటు చేసుకుంటున్నారు.కారణాలివే...అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, భద్రత, విలాసవంతమైన జీవనశైలి, అలాగే గ్లోబల్ బిజినెస్ అవకాశాలు సెలబ్రిటీలను దుబాయ్ వైపు ఆకర్షిస్తున్న ప్రధాన కారణాలు. అంతేకాకుండా, సినిమా షూటింగ్లకు బాగా అనుకూలమైన లొకేషన్లు, వరల్డ్ క్లాస్ ఎంటర్టైన్మెంట్ వేదికలు కూడా దుబాయ్ను ఫేవరెట్ డెస్టినేషన్ గా మార్చాయి. ఇటీవలే దుబాయ్లో స్టూడియో సిటీ పేరుతో ఒక అత్యాధునిక షూటింగ్ వేదికను కూడా ఏర్పాటు చేశారు. గత కొంత కాలంగా సినిమా అవార్డుల వేడుకలు దుబాయ్లో విజయవంతంగా నిర్వహిస్తున్న సంగతి కూడా తెలిసిందే. అక్కడ భారతీయులు పెద్ద సంఖ్యలో నివసిస్తుండడం వల్ల ఎంటర్టైన్ మెంట్ షోలు, మూవీ ప్రమోషన్లు నిర్వహించడానికి దుబాయ్ అనువైన వేదికగా మారింది. అది సెలబ్రిటీలకు మరో ప్లస్ పాయింట్గా మారింది. అంతేకాక ప్రపంచంలోని అనేక దేశాలకు కేవలం 8 గంటల్లోనే దుబాయ్ నుంచి రాకపోకలు సాగించవచ్చు కూడా. నాణ్యమైన విద్యను అందించే ఇంటర్నేషనల్ స్కూల్స్, అత్యాధునిక వైద్య వసతులు, విలాసవంతమైన లైఫ్ స్టైల్...వంటివన్నీ ఆకర్షణలే.పన్ను తక్కువ భధ్రత ఎక్కువ...దుబాయ్లోని పన్నుల వ్యవస్థే అత్యంత ప్రధాన ఆకర్షణ అనేది విశ్లేషకుల మాట. అక్కడి వారు వ్యక్తిగత పన్నును చెల్లించనక్కర్లేదు. అలాగే అధిక సంపదపై విధించే పన్ను లేదా వారసులకు ఆస్తుల బదిలీపై పన్ను బెడద కూడా ఉండదు. కార్పొరేట్ కంపెనీల లాభాలపై.. అదీ ఓ మోస్తరుగా పన్ను కడితే సరిపోతుంది. ఫలితంగా అక్కడ చిన్న, మధ్య స్థాయి వాణిజ్య వ్యాపారాల ఎదుగుదలకు అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయని అంటున్నారు. రాజకీయ సుస్థిరత, నేరాల శాతం తక్కువగా ఉండటం, వంటి వాటి వల్ల సెలబ్రిటీలు తమ కుటుంబాలతో సహా దుబాయ్కు మకాం మారుస్తున్నారు. దుబాయ్లో అనుమతి లేకుండా అవతలి వారి ఫొటోలు తీయడం నిషిద్ధం. విలేకరుల హడావుడి కూడా ఉండదు. ఇలా ప్రైవెసీని కాపాడేలా కట్టుదిట్టమైన చట్టాలు, భద్రత కూడా సెలబ్రిటీలను దుబాయ్కి రా రమ్మంటున్నాయ్. బాలీవుడ్ పాగా...ఈ నేపధ్యంలో దుబాయ్లో పలువురు బాలీవుడ్ నటులు పాగా వేస్తున్నారు. బాలీవుడ్ సూపర్స్టార్ షారుక్ ఖాన్కు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రదేశంగా పేరొందిన దుబాయ్లోని పామ్ జుమైరా ప్రాంతంలో విలాసవంతమైన విల్లా ఉంది. ఇది అక్కడి ఆయన అభిమానులకు ఓ ప్రత్యేక ఆకర్షణగా కూడా. ఇదే ప్రదేశంలో మన దేశానికి చెందిన వ్యాపార ప్రముఖులు అంబానీ కుటుంబీకులకు కూడా నివాసాలు ఉన్నాయి. అలాగే సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ లాంటి నటులు కూడా దుబాయ్లో ఖరీదైన రెసిడెన్షియల్ ప్రాపర్టీలను కొనుగోలు చేసినట్లు సమాచారం. అంతర్జాతీయ ప్రముఖులతో పాటు భారత్కు చెందిన అనేక మంది సెలబ్రిటీలు యూఏఈకి ఇప్పటికే మకాం మార్చారు. స్విమ్మింగ్లో రాణిస్తున్న తన తనయుడి కెరీర్ కోసం అని చెబుతూ ప్రముఖ నటుడు మాధవన్ తన కుటుంబంతో సహా దుబాయ్కు అడ్రెస్ మార్చేశారు. అలాగే హైదరాబాద్కు చెందిన మాజీ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా కూడా విడాకుల అనంతరం దుబాయ్లోనే నివసిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ భార్య తమ పిల్లల చదువుల కోసం దుబాయ్లోనే ఎక్కువగా ఉంటున్నారు. పాప్ స్టార్ యో యో హనీ సింగ్, నటి రాఖీ సావంత్ కూడా దుబాయ్లోనే సెటిలైపోయారు. కార్ రేస్ల గురించి తమిళ సూపర్స్టార్ అజిత్ తరచుగా దుబాయ్కు రాకపోకలు సాగిస్తున్నారు.టాలీవుడ్ నుంచి కూడా పలువురు నటులు దుబాయ్లో అపార్ట్మెంట్లు, హాలిడే హోమ్లపై ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ల సమయంలో ఉండేందుకు, కుటుంబంతో విహారానికి వీలుగా వీటిని ఉపయోగిస్తున్నారు. నివాసాలకే కాకుండా, కొంతమంది సెలబ్రిటీలు దుబాయ్లోని అభివద్ధి చెందుతున్న ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ ప్లాట్లు, కమర్షియల్ స్పేస్లలో పెట్టుబడులు పెడుతున్నారు. పర్యాటక పరంగా దూసుకుపోతున్న ప్రాంతం కావడంతో భవిష్యత్తులో విలువ పెరిగే అవకాశాలు ఉండటంతో, సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు.వినోదానికి లోటు లేదు...ఇస్లామిక్ దేశమైనప్పటికీ మతపరమైన అంశాల్లో ఇతర మధ్య ప్రాచ్య దేశాలతో పోలిస్తే దుబాయ్ చాలా సరళమైన విధానాలను అనుసరిస్తుంది. అక్కడి ముస్లిమేతరుల కోసం దేశవ్యాప్తంగా సివిల్ పర్సనల్ స్టేటస్ చట్టం అమలులో ఉంది. అలాగే ప్రస్తుతం సెలబ్రిటీల్లో ఎక్కువ మంది అనుసరిస్తున్న లివ్–ఇన్ రిలేషన్ షిప్స్ను నేరంగా పరిగణించొద్దని కొంత కాలం క్రితం యూఏఈ నిర్ణయించింది. అంతేకాదు దుబాయ్కి సమీపంలో ఉన్న యూఏఈ లోని రస్ ఉల్ ఖైమా ప్రాంతంలో త్వరలోనే క్యాసినో కూడా రానుంది. దీంతో మరింతగా ఈ ఎడారి దేశం సెలబ్రిటీలు ఎంచుకునే రహదారిగా మారడం తధ్యంగా కనిపిస్తోంది. -
ఏఐతో నిజంగా ఉద్యోగాలు పోతాయా?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచాన్ని శాసిస్తున్న తరుణంలో అది మానవ ఉపాధిని ఏ మేరకు ప్రభావితం చేస్తుందనే అంశంపై ప్రముఖ టెక్ దిగ్గజం, జోహో వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏఐ వల్ల వైట్ కాలర్ ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయన్న ఆందోళనల నడుమ, ఈ సాంకేతికతను అర్థం చేసుకునే ప్రక్రియలో తాను ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ లూయిస్ గరికానో సామాజిక మాధ్యమాల్లో చేసిన ఒక విశ్లేషణాత్మక పోస్ట్పై స్పందిస్తూ వెంబు తన అభిప్రాయాలను పంచుకున్నారు.ఆటోమేషన్ అంటే ఉద్యోగం పోవడం కాదుఒక ఉద్యోగంలోని కొన్ని పనులను ఆటోమేట్ చేయడం అంటే, ఆ మొత్తం ఉద్యోగాన్ని ఏఐ భర్తీ చేస్తుందని అర్థం కాదని ప్రొఫెసర్ గరికానో తన పోస్ట్లో పేర్కొన్నారు. చాలా ఉద్యోగాల్లో సంక్లిష్టమైన మానవ తీర్పు (హ్యుమన్ జడ్జ్మెంట్), సామాజిక అవగాహన అవసరమని, వీటిని ఏఐ భర్తీ చేయలేదన్నారు. సాఫ్ట్వేర్ ఎప్పటికీ ఆ బాధ్యతను తీసుకోలేదని, సంస్థలు మనుషుల అధికారంపైనే ఆధారపడతాయని స్పష్టం చేశారు.శ్రీధర్ వెంబు ‘లెర్నింగ్ ఫ్రేమ్వర్క్’మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త టెక్నాలజీని ఎలా అర్థం చేసుకోవాలో వివరిస్తూ శ్రీధర్ వెంబు ఒక ఫ్రేమ్వర్క్ను ప్రతిపాదించారు. ‘ముందస్తు అంచనాలకు వెళ్లకుండా అన్ని రకాల వాదనలను (సానుకూల, ప్రతికూల) వినాలి. ప్రారంభంలో కొన్ని అభిప్రాయాలను ఏర్పరచుకోవాలి. అయితే కొత్త ఆధారాలు లభించినప్పుడు ఆ అభిప్రాయాలను వెంటనే సవరించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. కాలక్రమేణా అభిప్రాయాలు బలమైన నమ్మకాలుగా మారాలి. కానీ, ఆ నమ్మకంలోకి అహం (ఈగో) చేరకూడదు. అహం కొత్త విషయాలను నేర్చుకోనివ్వదు. కొత్త సాంకేతికతకు సంబంధించి కేవలం నమ్మకం ఉంటే సరిపోదు, దానిపై స్పష్టమైన వైఖరి ఉండాలి’ అన్నారు.‘ఏఐ మా కంపెనీని, ఉద్యోగాలను ఎలా ప్రభావితం చేస్తుందనే విషయంలో నేను ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాను. దీనిపై కచ్చితమైన నిర్ణయానికి రావడానికి ఇంకా సమయం పడుతుంది’ అని శ్రీధర్ వెంబు అన్నారు.The quoted post makes a strong argument that white collar jobs won't go away anytime soon due to AI.In rapidly changing times like this, here is a framework I use:1. Keep an open mind and absorb every kind of information (like the quoted post and the ones that argue the… https://t.co/P0UOemLiXe— Sridhar Vembu (@svembu) February 16, 2026సాంకేతికత పరిష్కరించలేని సమస్యలులండన్లో గృహ నిర్మాణ రంగంలోని సమస్యలను ఉదహరిస్తూ కేవలం ఏఐ డాక్యుమెంటేషన్ను సిద్ధం చేయగలదు కానీ, రాజకీయ వ్యవస్థను ఒప్పించడం లేదా సామాజిక వివాదాలను పరిష్కరించడం వంటి పనులు చేయలేదని గరికానో పేర్కొన్నారు. ఈ వాదనతో వెంబు ఏకీభవిస్తూ.. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి కామాండ్స్ రూపొందించే ముందు ఎంతో జాగ్రత్త అవసరమని సూచించారు. మొత్తానికి ఏఐ అనేది ఒక శక్తివంతమైన సాధనం అయినప్పటికీ మానవ మేధస్సు, సామాజిక నైపుణ్యాలు, జవాబుదారీతనం అవసరమైన వైట్ కాలర్ ఉద్యోగాలకు తక్షణమే వచ్చే ముప్పేమీ లేదని ఈ టెక్ నిపుణుల విశ్లేషణ సారాంశం.ఇదీ చదవండి: రష్యా డాలర్లలో వ్యాపారం? భారత్పై ప్రభావం.. -
కరుగుతోన్న బంగారు కొండ..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:36 సమయానికి నిఫ్టీ(Nifty) 78 పాయింట్లు తగ్గి 25,603 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 171 దిగజారి 83,096 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 97.13బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 68.3 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.03 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.05 శాతం పెరిగింది.నాస్డాక్ 0.22 శాతం దిగజారింది.Today Nifty position 17-02-2026(time: 9:36 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
రష్యా డాలర్లలో వ్యాపారం? భారత్పై ప్రభావం..
గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచ వాణిజ్యాన్ని శాసిస్తున్న అమెరికన్ డాలర్ స్థానాన్ని మార్చేందుకు రష్యా చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు అనూహ్య మలుపు తిరిగాయి. అంతర్జాతీయంగా రష్యా-అమెరికా మధ్య జరుగుతున్న ఈ కరెన్సీ గేమ్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను భారీగా ప్రభావితం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. తాజా పరిణామాలు, కొన్ని మీడియా సంస్థల కథనాల ప్రకారం రష్యా అమెరికా డాలర్లలో వ్యాపారం సాగిస్తుందనే వార్తలొస్తున్నాయి. ఇది అమల్లోకి వస్తే అంతర్జాతీయంగా, భారత్పై ఎలాంటి ప్రభావం పడనుందో తెలుసుకుందాం.డాలర్ వైపు రష్యా మొగ్గు ఎందుకు?2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పశ్చిమ దేశాలు రష్యాను స్విఫ్ట్ బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి బహిష్కరించాయి. దీంతో రష్యా తన చమురు, గ్యాస్ వ్యాపారాలను డాలర్లకు బదులు రూబుల్స్, యువాన్, రూపాయిల్లోకి మార్చింది. అయితే, 2026 ప్రారంభంలో వచ్చిన కొన్ని రిపోర్టుల ప్రకారం రష్యా తిరిగి అమెరికన్ డాలర్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థలోకి రావడానికి ఆసక్తి చూపుతోంది.ఇందుకు కారణాలుఅమెరికాలో ట్రంప్ మరోసారి అధ్యక్షడయ్యాక ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ రష్యాతో ఆర్థిక సంబంధాలను పునరుద్ధరించే దిశగా చర్చలు జరుపుతోంది. ఇంధన రంగాలు, ఖనిజాల వ్యాపారంలో తిరిగి డాలర్లను అనుమతించడం ద్వారా ఆంక్షల నుంచి ఉపశమనం పొందాలని రష్యా భావిస్తోంది. చైనా యువాన్ లేదా ఇతర కరెన్సీల కంటే డాలర్ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆమోదం కలిగి ఉండటం రష్యాకు అంతర్జాతీయ మార్కెట్లో లావాదేవీలను సులభతరం చేస్తుంది. ఇది కూడా రష్యా డాలర్లలో వ్యాపారం కొనసాగించాలనుకోవడానికి ఒక కారణంగా ఉంది.ప్రపంచ వాణిజ్యంపై ప్రభావంరష్యా వంటి అతిపెద్ద ఇంధన ఎగుమతిదారు తిరిగి డాలర్ జోన్లోకి వస్తే అది ‘డీ-డాలరైజేషన్’ ప్రక్రియకు బ్రేక్ వేస్తుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా డాలర్ డిమాండ్ మళ్లీ పెరుగుతుంది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఊతాన్నిస్తుంది. డాలర్కు ప్రత్యామ్నాయంగా సొంత కరెన్సీని తీసుకురావాలనుకుంటున్న బ్రిక్స్ దేశాల ప్రయత్నాలకు ఇది విఘాతం కలిగించవచ్చు. అయితే, చమురు వ్యాపారం తిరిగి డాలర్లలో జరిగితే ధరల్లో అనిశ్చితి తగ్గి గ్లోబల్ మార్కెట్ స్థిరపడే అవకాశం ఉంది.భారత్పై ప్రభావమెంత?రష్యా-అమెరికా మధ్య మారుతున్న ఈ ఆర్థిక సమీకరణాలు భారతదేశంపై మిశ్రమ ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా చమురు దిగుమతుల విషయానికి వస్తే ఇప్పటివరకు రష్యా నుంచి రూపాయిల్లో చమురు కొనుగోలు చేస్తూ భారత్ కొంత లబ్ధి పొందింది. అయితే, రష్యా తిరిగి డాలర్ల వైపు మళ్లితే భారత్పై అమెరికా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. తాజా ట్రేడ్ డీల్స్ ప్రకారం భవిష్యత్తులో భారత్ రష్యా నుంచి చేసే దిగుమతులను తగ్గించి అమెరికా నుంచి చమురు కొనుగోళ్లను పెంచే సూచనలు కనిపిస్తున్నాయి.మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ తిరిగి పట్టు సాధిస్తే అది భారత కరెన్సీ విలువపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రపంచవ్యాప్తంగా డాలర్ బలపడటం వల్ల రూపాయి విలువ మరింత క్షీణించే ప్రమాదం ఉంది. ఇది దిగుమతుల వ్యయాన్ని పెంచి దేశీయంగా ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చు.రష్యా తీసుకునే ఈ నిర్ణయం కేవలం ఆర్థికపరమైనది మాత్రమే కాదు, భౌగోళిక రాజకీయ వ్యూహంతో కూడుకున్నది. ఉక్రెయిన్ యుద్ధం వల్ల దెబ్బతిన్న తన ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించుకోవడానికి పుతిన్ డాలర్ వైపు మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇది అధికారికంగా అమలైతే రాబోయే రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్లు, పసిడి ధరల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని గమనించాలి. బంగారం, ఎగుమతుల రంగంలో ఈ నిర్ణయం ప్రభావం ఎలా ఉంటుందో కింద తెలియజేశాం.ఇదీ చదవండి: నకిలీ రెజ్యూమెతో కంపెనీకి కుచ్చుటోపీ -
బీమా కంపెనీల్లో 100 శాతం ఎఫ్డీఐలు
బీమా రంగంలో 100 శాతం విదేశీ పెట్టుబడులకు (ఎఫ్డీఐ) సంబంధించి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖలో భాగమైన పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం ప్రోత్సా హక విభాగం (డీపీఐఐటీ) నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఆటోమేటిక్ పద్ధతిలో 100 శాతం ఎఫ్డీఐలను అనుమతిస్తారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మాత్రం 20 శాతానికే అనుమతి ఉంటుంది.విదేశీ పెట్టుబడులున్న భారతీయ బీమా కంపెనీల విషయంలో బోర్డ్ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్లలో కనీసం ఒక్కరైనా రెసిడెంట్ భారతీయ పౌరులై ఉండాలి. ఇన్సూరెన్స్ చట్టాల సవరణకు సంబంధించిన సబ్కా బీమా సబ్కీ రక్షా బిల్లు 2025ని డిసెంబర్లో పార్లమెంటు ఆమోదముద్ర వేసింది.ఇదీ చదవండి: నకిలీ రెజ్యూమెతో కంపెనీకి కుచ్చుటోపీ -
టీసీఎస్తో ఏఎండీ బంధం బలోపేతం
అమెరికన్ దిగ్గజం ఎన్విడియాకి భారత మార్కెట్లో దీటుగా పోటీనిచ్చేందుకు ఐటీ దిగ్గజం టీసీఎస్, అడ్వాన్స్డ్ మైక్రో డివైజెస్ (ఏఎండీ) తమ భాగస్వామ్యాన్ని మరింతగా విస్తరించాయి. టీసీఎస్ అనుబంధ సంస్థ హైపర్వాల్ట్ ఏఐ డేటా సెంటర్ లిమిటెడ్తో కలిసి అమెరికన్ సంస్థ ఏఎండీ తమ హీలియోస్ ప్లాట్ఫాం ఆధారంగా పెద్ద కంపెనీలకు అవసరమయ్యే ‘ర్యాక్–స్కేల్ ఏఐ’ మౌలిక సదుపాయాలను డిజైన్ చేయనుంది. పనితీరును మరింత మెరుగుపర్చుకునేందుకు, ఎంటర్ప్రైజ్ ఏఐని అమలు చేసేందుకు పట్టే సమయాన్ని తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుంది.సోమవారం న్యూఢిల్లీలో ప్రారంభమైన ఏఐ ఇంపాక్ట్ సమిట్ సందర్భంగా కంపెనీలు దీన్ని ప్రకటించాయి. భాగస్వామ్యం ప్రకారం ఏఎండీ తమ ఫుల్–స్టాక్ ఏఐ కంప్యూట్ ప్లాట్ఫాంను, టీసీఎస్ తమ డేటా సెంటర్ ఇంజినీరింగ్, ఇంటిగ్రేషన్ సామర్థ్యాలను ఉపయోగించనున్నాయి. లార్జ్ ల్యాంగ్వేజ్ మోడల్స్, ఏఐ శిక్షణ మొదలైన వాటి కోసం కంపెనీలు, ప్రభుత్వాలు కంప్యూట్ సామర్థ్యాన్ని పెంచుకుంటున్న నేపథ్యంలో ఏఐ మౌలిక సదుపాయాల సెగ్మెంట్లో ఏఎండీ నేరుగా జీపీయూల తయారీ దిగ్గజం ఎన్విడియాతో పోటీపడనుంది.ఇదీ చదవండి: నకిలీ రెజ్యూమెతో కంపెనీకి కుచ్చుటోపీ -
ఒప్పో కొత్త ఫోన్.. ధర ఎంతంటే..
కే14ఎక్స్ 5జీ ఫోన్ల అమ్మకాలు ప్రారంభించినట్లు స్మార్ట్ఫోన్ల దిగ్గజం ఒప్పో ఇండియా తెలిపంది. దీని ధర వేరియంట్ని బట్టి రూ.14,999 నుంచి ప్రారంభమవుతుంది. కాగా తమ ఈ–స్టోర్, ఫ్లిప్కార్ట్పై సేల్ రోజున రూ. 1,500 వరకు తక్షణ డిస్కౌంటుతో రూ.13,499 నుంచి పొందవచ్చని సంస్థ తెలిపింది. ఫిబ్రవరి 20 తర్వాత నుంచి రెండు వేరియంట్లపై రూ. 1,000 డిస్కౌంటు ఉంటుందని పేర్కొంది. ఇందులో 6.75 అంగుళాల హెచ్డీ డిస్ప్లే, 6500 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 50 ఎంపీ ఏఐ కెమెరా, కలర్ఓఎస్ 15 మొదలైన ఫీచర్లు ఉన్నాయి.ఇదీ చదవండి: నకిలీ రెజ్యూమెతో కంపెనీకి కుచ్చుటోపీ -
వాణిజ్య లోటు సెగ
పసిడి, వెండి దిగుమతులు దేశ వాణిజ్య ముఖచిత్రాన్ని మార్చేస్తున్నాయి. జనవరిలో వస్తు ఎగుమతులు 0.61 శాతం పుంజుకుని 36.56 బిలియన్ డాలర్లకు చేరాయి. కానీ, దిగుమతులు 19.2 శాతం ఎగసి 71.24 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. బంగారం, వెండి దిగుమతులు గణనీయంగా పెరగడమే ఈ పరిస్థితికి కారణం. ఫలితంగా వాణిజ్య లోటు మూడు నెలల గరిష్ట స్థాయిలో 34.68 బిలియన్ డాలర్లకు చేరింది. టారిఫ్ల కారణంగా జనవరిలో అమెరికాకు మన దేశ వస్తు ఎగుమతులు తగ్గాయి. క్రితం ఏడాది జనవరితో పోలి్చతే 21.77 శాతం తగ్గి 6.6 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. బంగారం దిగుమతులు జనవరిలో 349 శాతం పెరిగి 12 బిలియన్ డాలర్లుకాగా, వెండి దిగుమతులు సైతం 127 శాతం జంప్చేసి 2 బిలియన్ డాలర్లకు చేరాయి.చమురు దిగుమతులు మాత్రం 0.24 శాతం తగ్గి 13.4 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ప్రస్తుత ఏడాది (2025–26) ఏప్రిల్ నుంచి జనవరి వరకు వస్తు ఎగుమతులు 2.22 శాతం పెరిగి 366.63 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ కాలంలో దిగుమతులు 7 శాతానికి పైగా పెరిగి 649.86 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీంతో వాణిజ్య లోటు మొదటి పది నెలల్లో 247.38 బిలియన్ డాలర్లకు చేరింది. జనవరిలో సేవల ఎగుమతులు 43.90 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 2025 జనవరిలో ఇవి 34.75 బిలియన్ డాలర్లుగానే ఉన్నాయి. సేవల దిగుమతులు 19.60 బిలియన్ డాలర్ల మేర ఉన్నాయి. ఏప్రిల్–జనవరి మధ్య వస్తు, సేవల ఎగుమతులు కలసి 720.76 బిలియన్ డాలర్లకు పెరిగాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి 679 బిలియన్ డాలర్లు. -
రూ.215 లక్షల కోట్లకు రిటైల్ మార్కెట్
న్యూఢిల్లీ: దేశ రిటైల్ మార్కెట్ వేగవంతమైన వృద్ధి దిశగా పరుగులు తీస్తోంది. 2025 నాటికి భారత రిటైల్ మార్కెట్ రూ.90–95 లక్షల కోట్ల పరిమాణంతో ఉండగా, 2035 నాటికి అంటే వచ్చే పదేళ్లలో రూ.210–215 లక్షల కోట్ల స్థాయికి విస్తరిస్తుందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) అంచనా వేసింది. ప్రపంచంలోని ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలకు మించి భారత్ మంచి పనితీరు చూపిస్తుండడంతోపాటు, మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థానానికి చేరుకోనున్నట్టు గుర్తు చేసింది. భారత రిటైల్ రంగం తదుపరి వృద్ధి దశలోకి ప్రవేశించిందంటూ.. స్పష్టత, క్రమశిక్షణతో కూడిన నిర్వహణ, ఏఐ ఆధారిత పరివర్తనపై దృష్టి సారించిన సంస్థలను విజయం వరిస్తుందని పేర్కొంది. ఈ మేరకు ఒక నివేదికను బీసీజీ, రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా విడుదల చేశాయి. వినియోగదారులతో అనుబంధం, నిర్వహణ నమూనాలు, నైపుణ్యాల విషయంలో నిర్మాణాత్మక మార్పులను స్వీకరించే సంస్థలు రూ.200 లక్షల కోట్ల రిటైల్ మార్కెట్లో గణనీయమైన విలువను సొంతం చేసుకుంటాయని ఈ నివేదిక తెలిపింది. కస్టమర్లకు ప్రత్యేకమైన విలువను అందించడం, స్థిరమైన లాభదాయకతను కొనసాగించేందుకు క్రమశిక్షణతో కూడిన నిర్వహణ ఎంతో కీలకమని పేర్కొంది. వినియోగదారుల నిర్ణయాలను, ముఖ్యంగా ఏఐ ప్రభావితం చేస్తుండడాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. టెక్నాలజీ పాత్ర కీలకం.. ‘‘భారత రిటైల్ ఒక స్ఫూర్తిదాయక ప్రయాణం. వచ్చే దశాబ్ద కాలంలో రూ.200 లక్షల కోట్లకు విస్తరించనుంది. ఆఫ్లైన్, ఆన్లైన్ రిటైల్ సంస్థల నగదు ప్రవాహాలు స్పష్టమైన పురోగతిని చూపిస్తున్నాయి. విస్తరణలో ఏఐ వంటి టెక్నాలజీల విస్తృత వినియోగం, అత్యుత్తమ నిర్వహణ, ప్రత్యేకమైన విలువను అందించే సంస్థలే విజేతలుగా నిలుస్తాయి’’అని బీసీజీ ఎండీ అభీక్సింఘి తెలిపారు. ఏజెంటింక్ కామర్స్ అన్నది ప్రయోగాత్మక దశ నుంచి ఆచరణ దశకు వచ్చేసిందని.. పరిశోధన, కొనుగోలు నిర్ణయాలను జెన్ఏఐ ప్రభావితం చేస్తోందని ఈ నివేదిక తెలిపింది. అమెరికాలో ఇప్పటికే 42 శాతం మంది వినియోగదారులు జెన్ఏఐని వినియోగిస్తున్నట్టు పేర్కొంది. ‘‘వినియోగదారులు ఉత్పత్తిని గుర్తించడం, పరిశీలించడం, కొనుగోలు చేయడాన్ని అంతర్జాతీయంగా ఏజెంటిక్ కామర్స్ ప్రభావితం చేస్తోంది. భారత్లో డిజిటల్ వినియోగం బలంగా ఉంది. కనుక పట్టణ ప్రాంతాల్లో ఏఐ ఆధారిత షాపింగ్, ముఖ్యంగా జెన్ జెడ్లో వేగవంతం అవుతుంది’’అని బీసీజీ ఎండీ, పార్ట్నర్ భారత్ మిమానీ తెలిపారు. ఉత్పత్తులు, సరఫరా చైన్, మార్కెటింగ్, సేవలు ఇలా అన్నింటా ఏఐ వినియోగంతో 40–60 శాతం అధిక ప్రయోజనాలను రిటైలర్లు పొందగలరని ఈ నివేదిక తెలిపింది. ‘‘డిమాండ్ బలంగా ఉంది. వినియోగదారులు వివేకంతో వ్యవహరిస్తున్నారు. రిటైలర్లు ఆవిష్కరణలకు ఆసక్తి చూపిస్తున్నారు. డిజిటల్ పరివర్తనను ఒక ప్రాజెక్టుగా కాకుండా క్రమశిక్షణగా పరిగణించే సంస్థలు, అన్ని ఫార్మాట్లలో స్థిరమైన సేవలు అందించేవి వచ్చే దశాబ్దంలో విజేతలుగా నిలుస్తాయి’’ అని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సీఈవో కుమార్ రాజగోపాలన్ అభిప్రాయపడ్డారు. -
వంటింటిపై ధరల దాడి.. రెట్టింపైన ఖర్చుల వేడి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ధరల పెరుగుదల మళ్లీ ఆందోళన రేకెత్తిస్తోంది. గడచిన కొన్ని నెలలుగా కాస్త శాంతించినట్లు కనిపించిన టోకు ధరల ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) కొత్త ఏడాది ఆరంభంలోనే సామాన్యుడికి షాక్ ఇచ్చింది. 2026 జనవరి నెలకు టోకు ద్రవ్యోల్బణం రేటు ఏకంగా 1.81 శాతానికి ఎగబాకింది. డిసెంబర్ 2025లో ఇది కేవలం 0.83 శాతంగా ఉండగా.. ఒక్క నెల వ్యవధిలోనే 1%‡ పెరగడం గమనార్హం. నవంబర్లో మైనస్లో ఉన్న ద్రవ్యోల్బణం, ఇప్పుడు వేగంగా పెరుగుతుండటం ఆర్థిక వర్గాలను సైతం కలవరపెడుతోంది. సోమవారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ మేరకు అధికారిక గణాంకాలను విడుదల చేసింది. తయారీ రంగం, ఆహార పదార్థాల ధరలు పెరగడమే ఈ ద్రవ్యోల్బణం పెరుగుదలకు ప్రధాన కారణమని కేంద్రం పేర్కొంది. ఎందుకింతలా పెరిగింది? ప్రధానంగా తయారీ రంగంలో ధరల పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. గతేడాది జనవరితో పోలి్చతే ఈసారి ’బేసిక్ మెటల్స్’ (లోహాలు), టెక్స్టైల్స్ (వ్రస్తాలు), రసాయనాలు, మోటారు వాహనాలు, యంత్ర పరికరాల ధరలు ప్రియమయ్యాయి. ఫ్యాక్టరీ గేటు వద్దే ధరలు పెరగడంతో, అది అంతిమంగా వినియోగదారుడిపై భారం మోపే అవకాశముంది. అలాగే ఆహారేతర వస్తువులు, ఆహార పదార్థాల ధరలు కూడా పెరగడంతో ద్రవ్యోల్బణం సూచీ పైకి ఎగసింది. రంగాలవారీగా పరిస్థితి ఇలా.. టోకు ధరల సూచీలో అత్యధిక వాటా కలిగిన తయారీ రంగం విభాగంలో ద్రవ్యోల్బణం 2.86 శాతానికి చేరింది. ప్రధానంగా లోహాలు, వ్రస్తాలు, రబ్బరు, ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీ ఖర్చులు పెరగడం ఇందుకు కారణం. ఆహార పదార్థాలు, ఖనిజాలు ఉండే ప్రాథమిక వస్తువులు విభాగంలో ద్రవ్యోల్బణం 2.21 శాతంగా నమోదైంది. డిసెంబర్తో పోలి్చతే (3.12%) ఇది కాస్త తగ్గినప్పటికీ, ఇప్పటికీ ధరలు ఎగువ స్థాయిలోనే ఉన్నాయి. సామాన్యుడికి నేరుగా సంబంధమున్న ఆహార ద్రవ్యోల్బణం డిసెంబర్లో సున్నా (0.00%) వద్ద ఉండగా, జనవరి నాటికి 1.41 శాతానికి పెరిగింది. పప్పుధాన్యాలు, గోధుమలు, పండ్లు, కూరగాయల ధరల్లో కదలికలు ఇందుకు కారణమయ్యాయి. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, విద్యుత్ వంటి అంశాలున్న ఇంధనం, విద్యుత్ విభాగం మాత్రం ప్రజలకు కాస్త ఊరటనిచి్చంది. ఇందులో ద్రవ్యోల్బణం –4.01 శాతం (మైనస్)గా నమోదైంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల్లో మార్పులు దీనికి కారణమని భావిస్తున్నారు. గత మూడు నెలల ట్రెండ్.. టోకు ధరల సూచీ గమనాన్ని గమనిస్తే.. స్పష్టమైన పెరుగుదల కనిపిస్తోంది. నవంబర్ 2025: –0.13% (ధరల తగ్గుదల) డిసెంబర్ 2025: 0.83% (స్వల్ప పెరుగుదల) జనవరి 2026: 1.81% (భారీ పెరుగుదల) నవంబర్, డిసెంబర్ 2025 నెలలకు సంబంధించిన తుది గణాంకాలను కేంద్రం సవరించింది. నవంబర్ రేటును –0.13 శాతంగా ఖరారు చేసింది. మొత్తం మీద టోకు ధరల పెరుగుదల ప్రభావం రానున్న రోజుల్లో చిల్లర ధరలపై పడే అవకాశం లేకపోలేదు. -
మెరుగైన రాబడులకు మార్గం
ఈక్విటీల్లో దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేసుకునే వారు.. వివిధ రకాల పథకాలను ఎంపిక చేసుకుంటూ ఉంటారు. ఎక్కువ మంది పోర్ట్ఫోలియోలో లార్జ్క్యాప్, మిడ్క్యాప్, స్మాల్క్యాప్ ఫండ్స్ కనిపిస్తుంటాయి. ఇలా భిన్న పథకాలకు కేటాయింపులు చేసుకునే బదులు.. ఒకే పథకం ద్వారా అన్ని విభాగాల్లోనూ పెట్టుబడులు పెట్టుకోవాలని భావించే వారికి ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. అంటే మార్కెట్ విలువ పరంగా ఇవి ఏదో ఒక విభాగానికే పరిమితం కాకుండా.. అన్ని రకాల అవకాశాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఈ విభాగంలో టాప్ ఫండ్స్లో హెచ్డీఎఫ్సీ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ ఒకటి.రాబడులుఈ పథకంలో ఇన్వెస్ట్ చేసిన వారికి గడిచిన ఏడాది కాలంలో రాబడి 16.19 శాతం వచ్చింది. ఇక గడిచిన మూడేళ్లలో వార్షిక రాబడి 23.07 శాతం చొప్పున నమోదైంది. ఐదేళ్లలోనూ ఏటా 21.33 శాతం చొప్పున రాబడిని ఈ పథకం ఇన్వెస్టర్లకు అందించింది. ఇక ఈ ఫండ్ ఆరంభం నుంచి (1995) చూసుకున్నా.. వార్షిక రాబడి 16.78 శాతం చొప్పున ఉండడం గమనించొచ్చు. ఈ పథకంలో కనీసం రూ.100 నుంచి సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.పెట్టుబడుల విధానంఈ పథకం ఈక్విటీల్లో కనీసం 65 శాతం తగ్గకుండా, గరిష్టంగా 100 శాతం వరకు పెట్టుబడులు పెడుతుంది. లార్జ్క్యాప్స్, మిడ్క్యాప్, స్మాల్క్యాప్ మధ్య ఎలాంటి పరిమితులు లేకుండా.. మెరుగైన వృద్ధి అవకాశాలు ఏ విభాగంలో ఉంటే అక్కడ కేటాయింపులు పెంచే స్వేచ్ఛతో పనిచేస్తుంది.ఈక్విటీ పెట్టుబడుల విలువను ఊహించని షాక్ల నుంచి రక్షించుకునేందుకు పరిస్థితులకు అనుగుణంగా డెరివేటివ్స్ (ఫ్యూచర్, ఆప్షన్ కాంట్రాక్టులు) పొజిషన్లలోనూ కొంత ఇన్వెస్ట్ చేస్తుంటుంది. పరిస్థితులను బట్టి డెట్ సాధనాల్లో అరుదుగా (ఈక్విటీలు మరీ ఖరీదుగా మారినప్పుడు) 35 శాతం వరకూ ఇన్వెస్ట్ చేస్తుంది. రియల్ ఎస్టెట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్వెస్ట్)ల్లోనూ పెట్టుబడులు పెడుతుంటుంది. సగటు కంటే అధిక రాబడులు అందించాలన్నది ఈ పథకం ఉద్దేశం.పోర్ట్ఫోలియోప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.97,451 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో ఈక్విట్లీలో 82.12 శాతం ఇన్వెస్ట్ చేయగా, రియల్ ఎస్టేట్ సాధనాల్లోనూ 2.32 శాతం మేర పెట్టుబడి పెట్టింది. డెట్ సెక్యూరిటీల్లో కేవలం 0.53 శాతం పెట్టుబడులు ఉండగా, 15 శాతం మేర నగదు నిల్వలు ఉన్నాయి. మార్కెట్ వ్యాల్యూషన్లు ఆకర్షణీయంగా లేనప్పుడు ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ ఇలా చెప్పుకోతగ్గ స్థాయిలో నగదు నిల్వలు నిర్వహిస్తుంటాయి.ఈక్విటీ పెట్టుబడులను పరిశీలించగా.. ఇందులో 70 శాతం మేర లార్జ్క్యాప్ కంపెనీల్లోనే ఉన్నాయి. మిడ్క్యాప్ కంపెనీల్లో 4.25 శాతం, స్మాల్క్యాప్ కంపెనీల్లో 9.35 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది. రంగాల వారీ కేటాయింపులను పరిశీలించగా, అత్యధికంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీల్లో 47 శాతం, కన్జ్యూమర్ డిస్క్రీషినరీ కంపెనీల్లో 16.87 శాతం, టెక్నాలజీ కంపెనీల్లో 11.20 శాతం, హెల్త్కేర్ కంపెనీల్లో 8.18 శాతం, మెటీరియల్స్ కంపెనీల్లో 6.61 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి. -
జియో ఏఐ పెవిలియన్ సందర్శించిన మోదీ
ఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 (India AI Impact Summit 2026) అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ జియో ఇంటెలిజెన్స్ పెవిలియన్ను సందర్శించారు. ఇక్కడ జియో ఏఐ స్టాక్, జియో సంస్కృతి ఏఐ, జియో ఆరోగ్యం ఏఐ, జియో శిక్షా, జియో ఏఐ హోమ్ వంటి వివిధ ఏఐ మోడల్స్ వీక్షించారు.జియో ఏఐ మోడల్స్ అన్నీ కూడా ఎంటర్ప్రైజ్ ఇంటెలిజెన్స్ను నడిపించడానికి, భారతీయ భాషలు & సాంస్కృతిక కంటెంట్ను ప్రోత్సహించడానికి, ఆరోగ్య సంరక్షణ డెలివరీని మెరుగుపరచడానికి, విద్యా వ్యవస్థలను బలోపేతం చేయడానికి & ఏఐ బేస్డ్ స్మార్ట్ లివింగ్ను ప్రారంభించడానికి ప్రత్యేకంగా రూపొందించారు.ఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 (India AI Impact Summit 2026) అట్టహాసంగా ప్రారంభమైంది.ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ జియో ఇంటెలిజెన్స్ పెవిలియన్ను సందర్శించారు.ఇక్కడ జియో ఏఐ స్టాక్, జియో సంస్కృతి ఏఐ, జియో ఆరోగ్యం ఏఐ, జియో శిక్షా, జియో ఏఐ హోమ్ వంటి వివిధ ఏఐ… pic.twitter.com/oDzwTW4SUg— Sakshi (@SakshiNews) February 16, 2026ఏఐ ఎకోసిస్టమ్ & వివిధ రంగాల్లో డిజిటల్ మార్పును వేగవంతం చేయడంలో ఏఐ పాత్ర గురించి జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాష్ అంబానీ.. ప్రధాని నరేంద్ర మోదీకి వివరించారు. సంస్థ 'ఏఐ ఫర్ ఆల్' (అందరికి ఏఐ) అనే దృక్పథాన్ని ప్రతిపాదిస్తూ, ఆధునిక సాంకేతికతలను అందరికీ చేరువయ్యేలా చూస్తోందని అన్నారు. -
డేంజర్లో ఉద్యోగాలు!.. 2026లో ఇదే జరుగుతుందా?
పోటీ ప్రపంచంలో చదివి ఉద్యోగం తెచ్చుకోవడం ఒక సాహసం అయితే.. ఉన్న జాబ్ ఎప్పుడు ఊడిపోతుందో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఓరాకిల్, గూగుల్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థలు సైతం.. ఖర్చులను తగ్గించుకోవడానికి, పునర్వ్యవస్థీకరణ పేరుతో లెక్కకు మించిన ఉద్యోగులను తొలగించేస్తున్నాయి. ఇప్పుడు దీనికి ఏఐ కూడా తోడైంది. దీంతో టెక్ రంగంలో తీవ్రమైన అలజడి మొదలైపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉద్యోగులను భర్తీ చేస్తుందని కొందరు చెబుతుంటే.. ఏఐ వల్ల కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని ఇంకొందరు చెబుతున్నారు. ఈ సమయంలో బాబా వంగా అంచనాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వైరల్ అవుతున్నాయి.బాల్కన్ ప్రాంతపు నోస్ట్రడామస్ అని పిలువబడే బాబా వంగా.. అంధురాలైనప్పటికీ, భవిష్యత్తును ముందుగానే చూడగల శక్తి తనకు ఉందని అనేక మంది విశ్వసించారు. రెండో ప్రపంచ యుద్ధం, సెప్టెంబర్ దాడులు, హిందూ మహాసముద్రం సునామీ వంటి కొన్ని ప్రధాన సంఘటనలు.. ఆమె అంచనాలకు సరిపోలినట్టు కొందరు భావించారు. ఈ కారణంగానే ఈమె పేరుకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.బాబా వంగా 1996లో మరణించినప్పటికీ.. ఆమె అంచనాలు ఇప్పటికీ చర్చకు దారి తీస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఆమె చేసిన ఒక టెక్ ప్రపంచానికి సంబంధించిన విషయం వైరల్ అయింది.2026 సంవత్సరం AI రంగంలో ఒక కీలక మలుపు అవుతుందని, అది మన రోజువారీ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతూ మానవ నియంత్రణకు మించి వెళ్లే అవకాశం ఉందని బాబా వంగ చెప్పినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.ఇదీ చదవండి: మరో ఐదేళ్లలో ఆ ఉద్యోగాలన్నీ మాయం!ప్రస్తుతం ఏఐ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. మెషీన్ లెర్నింగ్, ఆటోమేషన్, చాట్బాట్స్, ఆటోమాటిక్ వాహనాలు వంటి సాంకేతికతలు ప్రజల జీవితాలను సులభతరం చేస్తున్నాయి. అయితే.. ఇవన్నీ ఉద్యోగాలపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. AI మనుషులను భర్తీ చేస్తుందా? లేక మానవులకు తోడ్పడే సాధనంగా మారుతుందా? అనే ప్రశ్నలు ప్రజలలో ఆందోళన కలిగిస్తున్నాయి.బాబా వంగా అంచనాలు పక్కన పెడితే.. ప్రస్తుత పరిస్థితులు కూడా ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనే చెబుతున్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త & వెంచర్ క్యాపిటలిస్ట్ 'వినోద్ ఖోస్లా' కూడా ఏఐ కారణంగా.. మరో ఐదేళ్లలో వైట్ కాలర్ ఉద్యోగాలలో భారీ మార్పులు చోటు చేసుకుంటాయని, ముఖ్యంగా ఐటీ సర్వీస్, బీపీఓ రంగాలు దాదాపు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడవచ్చని హెచ్చరించారు. -
కొత్త బీఎండబ్ల్యూ కారు లాంచ్: ధర ఎంతంటే?
ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ.. ఇండియన్ మార్కెట్లో ఎక్స్3 30 xDrive ఎం స్పోర్ట్ ప్రో వేరియంట్ లాంచ్ చేసింది. రూ. 74.50 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో అందుబాటులోకి వచ్చిన ఈ కారు.. మెర్సిడెస్-బెంజ్ GLC, ఆడి Q5 & వోల్వో XC60 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.BMW X3 30 xDrive M స్పోర్ట్ ప్రో కారు.. బ్రూక్లిన్ గ్రే మెటాలిక్, డ్యూన్ గ్రే మెటాలిక్, ఆల్పైన్ వైట్, ఇండివిజువల్ టాంజానైట్ బ్లూ & బ్లాక్ సఫైర్ మెటాలిక్ అనే రంగులలో లభిస్తుంది. ఇందులోని 2.0-లీటర్, ఫోర్ సిలిండర్ల టర్బో-పెట్రోల్ ఇంజిన్ 48V మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్తో లభిస్తుంది. ఇది 258 హార్స్ పవర్, 400 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 8-స్పీడ్ స్టెప్ట్రానిక్ ఆటోమేటిక్ గేర్బాక్స్ అప్షన్ ఇందులో ఉంటుంది.ఈ కొత్త బీఎండబ్ల్యూ కారు.. ముందు భాగంలో బ్లాక్ కిడ్నీ గ్రిల్, కార్నరింగ్ లైట్లు, షాడోలైన్ డిటెయిలింగ్తో అడాప్టివ్ ఎల్ఈడీ హెడ్లైట్, రెడ్ కలర్ స్పోర్ట్స్ బ్రేక్స్ పొందుతుంది. వెనుక భాగంలో స్ప్లిట్ ఎల్ షేప్ ఎల్ఈడీ ల్యాంప్లు, గ్లోస్-బ్లాక్ డిఫ్యూజర్ & రూఫ్ స్పాయిలర్ ఉండటం చూడవచ్చు.ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 12.3-అంగుళాల ఇన్ఫర్మేషన్ స్క్రీన్, 14.9-అంగుళాల కంట్రోల్ డిస్ప్లే ఉన్నాయి. ఇవి కాకుండా.. పనోరమిక్ సన్రూఫ్, రియర్ సన్బ్లైండ్లు, హర్మాన్ కార్డాన్ ఆడియో & ట్రావెల్ & కంఫర్ట్ సిస్టమ్ ద్వారా సీమ్లెస్ కనెక్టివిటీ, ADAS ఫంక్షన్స్, 360 డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆటో హోల్డ్తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, మల్టిపుల్ ఎయిర్బ్యాగ్లు ఉన్నాయి. -
మ్యూచువల్ ఫండ్స్.. ‘కొత్త’ ఆఫర్స్!
ఓవైపు జీవిత బీమా భద్రత పొందుతూనే మరోవైపు సంపదను పెంచుకునేందుకు అవకాశం కలి్పస్తూ టాటా ఏఐఏ లైఫ్ కొత్తగా ఎన్హాన్స్డ్ వేల్యూ ఇండెక్స్ ఫండ్స్ని ఆవిష్కరించింది. ఎన్హాన్స్డ్ వేల్యూ ఇండెక్స్ ఫండ్, ఎన్హాన్స్డ్ వేల్యూ ఇండెక్స్ పెన్షన్ ఫండ్ వీటిలో ఉన్నాయి. ఇవి ప్రధానంగా వేల్యూ ఇన్వెస్టింగ్ పద్ధతిలో లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ కంపెనీల స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి. టాటా ఏఐఏ యూనిట్ లింక్డ్ ప్లాన్ల ద్వారా వీటిని తీసుకోవచ్చు. పిల్లల చదువులు, అసెట్స్ సమకూర్చుకోవడం, దీర్ఘకాలిక ఆర్థిక భద్రత మొదలైన ప్రణాళికలకు మొదటి ఫండ్ ఉపయోగకరంగా ఉంటుంది. రిటైర్మెంట్ నిధిని ఏర్పర్చుకోవడానికి రెండోది పని చేస్తుంది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ ఫిబ్రవరి 16 వరకు అందుబాటులో ఉంటుంది. ఓల్డ్ బ్రిడ్జ్ ఫ్లెక్సి క్యాప్ ఫండ్ లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే ఈ ఫండ్ని ఓల్డ్ బ్రిడ్జ్ మ్యూచువల్ ఫండ్ ప్రవేశపెట్టింది. ఫిబ్రవరి 23 వరకు ఇది అందుబాటులో ఉంటుంది. బాటమ్–అప్ వ్యూహంతో దీర్ఘకాలిక పెట్టుబడి వృద్ధికి దోహదపడే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. అయిదేళ్లకు పైగా పెట్టుబడులు కొనసాగించే వారికి అనువైన ఫండ్. కనీసం రూ. 5,000 నుంచి, సిప్ అయితే రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. కేవలం మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా పెట్టుబడులను కేటాయించకుండా కంపెనీ వ్యాపార నాణ్యత, వృద్ధి అవకాశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. బీఎస్ఈ 500 టీఆర్ఐ దీనికి ప్రామాణికంగా ఉంటుంది. -
మరో ఐదేళ్లలో ఆ ఉద్యోగాలన్నీ మాయం!
ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్ రంగంలోని ఉద్యోగుల్లో తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది. కొన్ని స్టార్టప్స్.. టెక్ కంపెనీలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుని కొత్త ఏఐ టూల్స్ లాంచ్ చేస్తున్నాయి. ఇవి మానవ ప్రమేయం లేకుండా పనులను వేగంగా చేసేస్తున్నాయి. కాబట్టి చాలా సంస్థలు ఏఐలో పెట్టుబడులు పెడుతూ.. తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. ఈ సమయంలో ప్రముఖ పారిశ్రామికవేత్త & వెంచర్ క్యాపిటలిస్ట్ 'వినోద్ ఖోస్లా' ఏఐ భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.ఖోస్లా అభిప్రాయం ప్రకారం.. AI అభివృద్ధి వేగంగా జరుగుతున్నందున వైట్ కాలర్ ఉద్యోగాలలో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐటీ సర్వీస్, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ (BPO) రంగాలు వచ్చే ఐదు సంవత్సరాలలో దాదాపు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడవచ్చని అన్నారు.ప్రస్తుతం ఏఐ సాధనాలు సాధారణ డిజిటల్ సహాయకుల స్థాయి నుంచి స్వయం నియంత్రిత కలిగిన AI వర్కర్స్ స్థాయికి ఎదుగుతున్నాయి. ఇవి అనేక పనుల్లో మానవులను సైతం మించిపోయే అవకాశం ఉందని ఖోస్లా వెల్లడించారు. అకౌంట్స్, లా, మెడిసిన్స్, చిప్ డిజైన్ వంటి రంగాల్లో.. ఏఐ పురోగతి చాలా వేగంగా ఉంటుందని హెచ్చరించారు.ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్స్ మార్కెట్లో అడుగుపెట్టి వ్యాపార విధానాలను మార్చివేశాయి. మానవ మేధస్సుపై ప్రత్యక్ష ప్రభావం చూపించలేకపోయాయి. కానీ ఏఐ మనిషి ఆలోచనా శక్తిని అనుకరిస్తూ.. చాలా పనులను వేగంగా చేస్తోంది. కాబట్టి ఇది సాధారణ సాంకేతిక పరివర్తన కాదు, ఒక తరం మొత్తాన్ని ప్రభావితం చేసే విప్లవాత్మక మార్పు అని ఆయన అభివర్ణించారు.ఏఐ కంపెనీ వీడిన సేఫ్టీ హెడ్ఆంథ్రోపిక్ కంపెనీలో సేఫ్గార్డ్ రీసెర్చ్ టీమ్కు నాయకత్వం వహించిన మృణాంక్ శర్మ రాజీనామా చేశారు. ఆయన ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడిస్తూ.. ప్రపంచం ప్రమాదంలో ఉందని చెబుతూ.. దీనికి కారణం కేవలం ఏఐ లేదా బయో వెపన్స్ మాత్రమే కాదు. ఒకదానితో ఒకటి ముడిపడిన అనేక సంక్షోభాల వల్ల ప్రమాదంలో ఉందని పేర్కొన్నారు. అయితే ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయికి మన జ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అప్పుడే మనం ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోగలం అని పేర్కొన్నారు. లేకుంటే.. తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. -
జియోలో పని చేయాలనుకుంటే.. వచ్చేయండి!
ప్రతిభావంతుల అన్వేషణకు రిలయన్స్ జియో (Reliance Jio) సరికొత్త పంథాను ఎంచుకుంది. జియో చీఫ్ ఏఐ సైంటిస్ట్ గౌరవ్ అగర్వాల్ (Gaurav Aggarwal) తన బృందాన్ని విస్తరించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 (India AI Impact Summit 2026)ను వేదికగా చేసుకుంటున్నారు. జియోలో పని చేయాలనుకునే ప్రతిభావంతులైన ఇంజనీర్లు ఈ సమ్మిట్లోనే తనను నేరుగా సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.బెంగళూరుకు చెందిన గౌరవ్ అగర్వాల్.. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్లో ఈ వారం మొత్తం తన బృందంతో కలిసి ఉంటానని ‘ఎక్స్’ (ట్విటర్) ద్వారా ప్రకటించారు. “మా బృందాన్ని కలవండి. మేము ఏం నిర్మిస్తున్నామో మీతో పంచుకోవడానికి సంతోషిస్తాం” అని ఆయన పేర్కొన్నారు.తాజా అప్డేట్లో, ఏఐAI మోడల్స్, ఆప్టిమైజేషన్, లేదా ప్లాట్ఫారమ్ల అభివృద్ధిలో పనిచేస్తున్న ఇంజనీర్లను ప్రత్యేకంగా ఆహ్వానించారు. “మీరు ఏఐ సరిహద్దుల్లో నిర్మిస్తున్న ‘క్రాక్డ్ ఇంజనీర్లు’ అయితే, మాకు మీరు అవసరం. నన్ను సంప్రదించండి. మా రిక్రూట్మెంట్ బృందంతో మీ పరిచయాన్ని వేగంగా ట్రాక్ చేస్తాను. భారత్ కోసం, భారీ స్థాయిలో నిర్మిద్దాం!” అంటూ గౌరవ్ అగర్వాల్ తన పోస్ట్లో రాసుకొచ్చారు.ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఏఐ, టెక్ పరిశ్రమ నాయకులు ఇందులో పాల్గొంటున్నారు. వీరిలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్గేట్స్, ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మన్, మెటా ఛీఫ్ ఏఐ ఆఫీసర్ అలెగ్జాండర్ వాంగ్, టీసీఎస్ సీఈవో కృతివాసన్ తదితరులు ఉన్నారు.Unsurprisingly, I am at the AI Summit this entire week with folks from my team and colleagues. Come visit us - we are all excited to share a glimpse of what all is cooking in our kitchen!Divided by companies, United by Mission - Let's build AI for Bharat 🙏 pic.twitter.com/eg7QDCDEVZ— Gaurav Aggarwal (@fooobar) February 15, 2026 -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్
సోమవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 650.39 పాయింట్ల లాభంతో 83,277.15 వద్ద, నిఫ్టీ 211.65 పాయింట్ల లాభంతో 25,682.75 వద్ద నిలిచాయి.భారత్ సీట్స్ లిమిటెడ్, ఆర్.ఎ.సి.ఎల్. గేర్టెక్ లిమిటెడ్, ఈజీ ట్రిప్ ప్లానర్స్ లిమిటెడ్, ప్రెసిషన్ వైర్స్ ఇండియా లిమిటెడ్, ఆసియన్ హోటల్స్ (నార్త్) లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో ఉన్నాయి. బీటా డ్రగ్స్ లిమిటెడ్, సార్థక్ మెటల్స్ లిమిటెడ్, డెల్ఫీ వరల్డ్ మనీ లిమిటెడ్, టీఐఎల్ లిమిటెడ్, ధ్రువ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
బంగారం ధర రూ.లక్ష కంటే తక్కువకు..?
బంగారం కొనాలంటేనే భయపడుతున్న సమయంలో.. నిపుణులు పసిడి ప్రియులకు శుభవార్త చెప్పారు. తులం గోల్డ్ రేటు లక్ష రూపాయల కంటే తక్కువకు చేరుకుంటుందని పేర్కొన్నారు. గ్లోబల్ మార్కెట్లో కూడా ఔన్సు ధర 3000 డాలర్లకు చేరుకుంటుందని వెల్లడించారు. రష్యా అమెరికాతో వ్యాపారం చేయడం ప్రారంభిస్తే ఇది సాధ్యమవుతుందని అన్నారు.2025లో భారీగా పెరిగిన గోల్డ్ రేటు.. 2026 జనవరిలో కూడా అదే రీతిగా ముందుకు సాగింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో 10 గ్రాముల ధర రూ.1.80 లక్షల స్థాయికి చేరింది. కాగా గత వారంలో ఎంసీఎక్స్ బంగారం ధర రూ. 1.56 లక్షల (10 గ్రామ్స్) వద్ద నిలిచింది. దీన్నిబట్టి చూస్తే.. ఇప్పుడు పరిస్థితులు కొంత చక్కబడ్డాయని, బంగారం ధరలు స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయని తెలుస్తోంది.మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రష్యా అమెరికాతో డాలర్లలో (USD) వ్యాపారం చేయడానికి తిరిగి వస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా.. రష్యన్ అంతర్జాతీయ డాక్యుమెంట్ క్రెమ్లిన్.. అమెరికాతో ఆర్థిక భాగస్వామ్యాన్ని అన్వేషిస్తోందని సూచిస్తోంది. ఈ పరిణామంలో అత్యంత ఆసక్తికరమైన భాగం మాస్కో యుఎస్ డాలర్ ఆధారిత వాణిజ్య ఒప్పందానికి తిరిగి రావడం. ఇది రష్యాతో సహా బ్రిక్స్ దేశాల డీ-డాలరైజేషన్ ప్రయత్నాలకు పెద్ద దెబ్బ అవుతుంది.ఇదీ చదవండి: వెండి ధర ఇంకా ఎంత పెరుగుతుందంటే..?రష్యా అంతర్జాతీయ వాణిజ్యాన్ని డాలర్లతో నిర్వహిస్తే.. డాలర్ విలువ భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోలు చేయడం కొంత తగ్గిస్తాయి. ఇవన్నీ బంగారం రేటును గణనీయంగా తగ్గించడంలో దోహదపడతాయి.భారతదేశంలో నేటి బంగారం ధరలుఇండియన్ మార్కెట్లో ఈ రోజు (ఫిబ్రవరి 16) బంగారం ధరలు రూ. 1000 కంటే ఎక్కువ తగ్గాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరల్లో మార్పులు జరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1.56 లక్షల వద్ద, 22 క్యారెట్స్ తులం బంగారం ధర రూ. 1.43 లక్షల వద్ద ఉన్నాయి. -
ఏఐ భయాలు నిజమే.. కానీ..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వస్తున్న మార్పుల వల్ల ప్రస్తుతం భారతీయ సాఫ్ట్వేర్ రంగం సందిగ్ధంలో ఉంది. ఏఐ కారణంగా సాఫ్ట్వేర్ అభివృద్ధిలో ఆటోమేషన్ పెరుగుతుందనే భయాలు ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ, ‘వయానాయి’(Vianai) వ్యవస్థాపకులు విశాల్ సిక్కా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మానవ ఆధారిత సాఫ్ట్వేర్ అభివృద్ధి పనుల్లో ఏఐ అంతరాయం నిజమైనదేనని అయితే దాన్ని ఎదుర్కొనే సత్తా భారతీయ మేధోశక్తికి ఉందని ఆయన స్పష్టం చేశారు.మార్కెట్ పతనానికి కారణం ఏఐ భయంగత వారం రోజులుగా భారత ఐటీ స్టాక్స్ తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఫిబ్రవరి నెలలోనే ఐటీ ఇండెక్స్ దాదాపు 15% పతనం కావడం గమనార్హం. గత వారంలోనే టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు దాదాపు 9 శాతం మేర నష్టపోయాయి. సాఫ్ట్వేర్ బడ్జెట్ల్లో ఏఐ ఏజెంట్లు అధిక వాటాను కలిగి ఉన్నాయని, తద్వారా సాంప్రదాయ ఐటీ సేవల బిజినెస్ మోడల్ దెబ్బతింటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.వేగమే అసలు సవాలుఓ ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడిన విశాల్ సిక్కా.. ప్రస్తుత పరిస్థితులపై విశ్లేషించారు. ‘సాఫ్ట్వేర్ అభివృద్ధిలో మానవ ఆధారిత పనులకు అంతరాయం కలగడం ఖాయం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అయితే, ఈ మార్పు పరిశ్రమలన్నింటికీ వ్యాపించడానికి సమయం పడుతుంది’ అన్నారు. సిక్కా అభిప్రాయం ప్రకారం, గతంలో భారత ఐటీ రంగం మొబైల్ కంప్యూటింగ్, క్లౌడ్ సర్వీసెస్ వంటి అనేక మార్పులను తట్టుకుని నిలబడింది. కానీ, ఈసారి ఇది వేగంగా మార్పు చెందుతుందన్నారు. మన మెదడు ఇంత వేగవంతమైన మార్పులను అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేకపోవడమే అసలు సమస్య అని ఆయన పేర్కొన్నారు.అపరిమిత అవకాశాలుభారత ఐటీ రంగంలో పనిచేస్తున్న సుమారు 17 లక్షల మంది ఉద్యోగుల సమష్టి సామర్థ్యం అనంతమని సిక్కా కొనియాడారు. కంపెనీలు ట్రెండ్కు తగినట్టుగా కొత్త సాంకేతికతను అలవరుచుకుని నూతన ఆవిష్కరణలు చేయాలన్నారు. ఏఐ వల్ల కలిగే అంతరాయాన్ని ఒక ‘టెయిల్ విండ్’ (సానుకూల శక్తి)గా మార్చుకున్న కంపెనీలే ఈ పోటీలో విజేతలుగా నిలుస్తాయని చెప్పారు.ఇదీ చదవండి: ఈ-రూపీ ఆధారిత రేషన్ పంపిణీ ప్రారంభం -
ఇంటర్వ్యూలో ఊహించని ప్రశ్న.. ఉద్యోగం వచ్చేసింది!
జాబ్ ఇంటర్వ్యూలలో అభ్యర్థులను అంచనా వేయడానికి ఇంటర్వ్యూయర్లు ఎన్నో సృజనాత్మక పద్ధతులను ఉపయోగిస్తుంటారు. కొన్నిసార్లు వారు అడిగే ప్రశ్నలు అక్కడికక్కడే సమాధానం ఇవ్వడానికి కష్టంగా అనిపిస్తాయి. అలాంటి అనుభవాన్ని ఇటీవల ఒక మహిళ ఎదుర్కొని, దానిని ఉద్యోగ అవకాశంగా మార్చుకుంది.అనుకోని ప్రశ్నకాత్యాయని శుక్లా (Katyayani Shukla) అనే ఉద్యోగ అభ్యర్థిని తన అనుభవాన్ని ‘ఎక్స్’(గతంలో ట్విట్టర్) లో పంచుకున్నారు. ఆమె ఇటీవల హాజరైన ఉద్యోగ ఇంటర్వ్యూలో ఆ సంస్థ సీఈవో ఒక అసాధారణమైన ప్రశ్న అడిగారు.. “మిమ్మల్ని నియమించుకోకుండా ఉండటానికి ఒక మంచి కారణం చెప్పండి” అని. ఆ ప్రశ్నకు తక్షణం సమాధానం చెప్పడానికి సిద్ధంగా లేకపోయిన శుక్లా, ఆలోచించడానికి కొంత సమయం కావాలని చెప్పి, తరువాత ఈమెయిల్ ద్వారా సమాధానం పంపుతానని తెలియజేశారు.“ఆ ప్రశ్నకు నేను సిద్ధంగా లేను. కాబట్టి ఆలోచించడానికి కొంత సమయం కావాలని చెప్పాను” అని ఆమె వివరించారు. కొన్ని గంటల తరువాత సీఈవో ఫాలో-అప్ మెసేజ్ పంపి ఆమె సమాధానాన్ని కోరారు. జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత, శుక్లా తన సమాధానాన్ని ఈమెయిల్ ద్వారా పంపించారు. అదే ఆమెకు ఉద్యోగ ఆఫర్గా మారింది.కాత్యాయని ఇచ్చిన సమాధానం ఇదే.. సీఈవో అడిగిన గమ్మత్తైన ప్రశ్నకు తాను ఏం సమాధానం చెప్పిందో తన ఈమెయిల్ స్క్రీన్షాట్ను కూడా కాత్యాయని శుక్లా పంచుకున్నారు. తన సమాధానాన్ని క్షమాపణతో ప్రారంభించిన ఆమె.. “నన్ను నియమించుకోకుండా ఉండటానికి ఒక మంచి కారణం ఏమిటంటే.. నా జీవితం సవ్యంగా అంటే నా వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలను సమతుల్యంగా, వ్యవస్థీకృతంగా ఉంచుకుంటాను” అని రాసుకొచ్చారు.తాను రోజూ (వీక్ డేస్లో) 9 గంటల నుండి 5 వరకు మాత్రమే పని చేస్తానని, పని-వ్యక్తిగత జీవితం మధ్య స్పష్టమైన సరిహద్దులు ఉంచుతానని చెప్పారు. ‘ప్రతిదీ అర్జెంట్ అని చెబుతుంటారు కానీ నిజానికి ఏదీ అర్జెంట్ కాదు’ అని తాను నమ్ముతుంటానన్నారు.తన సమయం, ఇతరుల సమయం పట్ల గౌరవం చూపడం తనకు అత్యంత ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. కొంతమంది దీనిని ఒక సానుకూల లక్షణంగా చూస్తారని, మరికొందరు వ్యతిరేకంగా భావించే అవకాశం ఉందని ఆమె అంగీకరించారు.During my last job interview, the CEO asked me to give her one good reason not to hire me.I told her I wasn’t ready for that question and needed some time to think.She said, “That’s fine... just promise you’ll email me your answer.”Honestly, I thought she’d forget. But a… pic.twitter.com/z5CWWF8uxZ— Katyayani Shukla (@aibytekat) February 15, 2026 -
ఈ-రూపీ ఆధారిత రేషన్ పంపిణీ ప్రారంభం
భారత ప్రభుత్వ ఆహార సబ్సిడీ పథకంలో పారదర్శకతను పెంచేందుకు, అవినీతిని నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ఆధారిత ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) పైలట్ ప్రాజెక్టును కేంద్ర హోం మంత్రి అమిత్ షా గుజరాత్లోని గాంధీనగర్లో ప్రారంభించారు. దీనితో పాటు 24x7 సేవలందించే ‘అన్నపూర్తి’ గ్రెయిన్ ఏటీఎంను కూడా ఆయన ఆవిష్కరించారు.ఈ-రూపీ ఆధారిత రేషన్ పంపిణీ ఎలా పనిచేస్తుంది?ప్రస్తుతానికి గుజరాత్లోని అహ్మదాబాద్, సూరత్, ఆనంద్, వల్సాద్ జిల్లాల్లో ఈ పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. దీని ప్రత్యేకతలు..లబ్ధిదారుల డిజిటల్ వాలెట్లలో ఆర్బీఐ (ఆర్బీఐ) ద్వారా ‘ఈ-రూపీ’ క్రెడిట్ అవుతుంది. ఇందులో సరకు రకం, పరిమాణం, రాయితీ ధర ముందే పరిగణలోకి తీసుకుంటారు. ఈ డిజిటల్ టోకెన్లను కేవలం అధీకృత రేషన్ షాపుల్లో తమకు కేటాయించిన సరుకుల కోసం మాత్రమే వాడాలి. ఇతర అవసరాలకు వీటిని ఖర్చు చేయడం సాధ్యపడదు. స్మార్ట్ఫోన్ ఉన్నవారు క్యూఆర్ కోడ్ ద్వారా, సాధారణ ఫీచర్ ఫోన్లు ఉన్నవారు ఆధార్ ఆధారిత ఓటీపీ ద్వారా ఈ లావాదేవీలను పూర్తి చేయవచ్చు.సాధారణంగా పాత పద్ధతిలో డీలర్లకు ప్రభుత్వం నుంచి డబ్బులు రావడానికి సమయం పట్టేది. కానీ ఈ-రూపీ విధానంలో లబ్ధిదారుడు వౌచర్ను రిడీమ్ చేయగానే ఆ టోకెన్ విలువకు సమానమైన నగదు డీలర్ బ్యాంక్ ఖాతాలో తక్షణమే జమ అవుతుంది. ప్రతి కిలో ధాన్యం ఎవరికి అందింది, ఏ సమయంలో అందింది అనే సమాచారం రియల్ టైమ్లో ప్రభుత్వానికి అందుతుంది. దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. తూకంలో మోసాలకు తావుండదు.‘అన్నపూర్తి’ గ్రెయిన్ ఏటీఎంసామాన్యులకు రేషన్ సేకరణను మరింత సులభతరం చేస్తూ ‘అన్నపూర్తి’ పేరుతో ఆటోమేటెడ్ గ్రెయిన్ డిస్పెన్సింగ్ మెషీన్ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏటీఎంలు రోజులో 24 గంటలు పనిచేస్తాయి. కేవలం 35 సెకన్లలో 25 కిలోల ధాన్యాన్ని పంపిణీ చేయగలవు. మార్చి 2026 నాటికి ఈ యంత్రాల ద్వారా గోధుమలు, బియ్యంతో పాటు (25 కిలోల వరకు), ఒక కిలో ప్యాకెట్లలో కందిపప్పు, శనగలు, చక్కెర, ఉప్పును లబ్ధిదారులు పొందవచ్చు. ఈ ఏటీఎం యంత్రాలను పూర్తిగా గుజరాత్లోనే తయారు చేయడం విశేషం.ఈ ఏటీఎంలను ఉపయోగించడానికి ‘స్మార్ట్ రేషన్ కార్డ్’ లేదా ప్రభుత్వం జారీ చేసిన ప్రత్యేక డిజిటల్ కార్డ్ అవసరం ఉంటుంది. లబ్ధిదారుడు తన రేషన్ కార్డును ఏటీఎం మిషీన్ వద్ద ఉన్న రీడర్ ద్వారా స్కాన్ చేయాలి. కార్డుతో పాటు భద్రత కోసం వేలిముద్ర లేదా కంటిపాప(ఐరిస్) స్కాన్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల కార్డు వేరే వారు దొంగిలించినా ధాన్యం తీసుకోలేరు. కొన్ని సందర్భాల్లో కార్డు లేకపోయినా ఆధార్తో లింక్ అయిన మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీ ద్వారా కూడా లావాదేవీ పూర్తి చేయవచ్చు.ఏటీఎం పనిచేసే విధానంపైన చెప్పినట్లుగా కార్డ్ లేదా బయోమెట్రిక్ ద్వారా లబ్ధిదారుడిని మిషీన్ గుర్తిస్తుంది. ఆ నెలలో వారికి ఎంత కోటా మిగిలి ఉందో స్క్రీన్ మీద కనిపిస్తుంది. స్క్రీన్ మీద మీకు కావాల్సిన వస్తువును (ఉదాహరణకు: బియ్యం లేదా గోధుమలు) పరిమాణాన్ని ఎంచుకోవాలి. ఈ మిషీన్లలో సెన్సార్లు ఉంటాయి. ఇవి ధాన్యాన్ని గ్రాములతో సహా అత్యంత కచ్చితంగా తూకం వేస్తాయి. మాన్యువల్ తూకంలో జరిగే మోసాలకు ఇక్కడ తావుండదు. మీరు ఎంచుకున్న వస్తువు కింద ఉన్న అవుట్లెట్ ద్వారా బయటకు వస్తుంది. పప్పులు, ఉప్పు వంటివి అయితే సీల్డ్ ప్యాకెట్ల రూపంలో వస్తాయి.దేశవ్యాప్త విస్తరణ ప్రణాళికఈ పైలట్ ప్రాజెక్ట్ గుజరాత్లో విజయవంతమైన తర్వాత ఈ పైలట్ ప్రాజెక్టును చండీగఢ్, పుదుచ్చేరి, దాద్రా నగర్ హవేలీ వంటి కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించనున్నారు. రాబోయే మూడు, నాలుగేళ్లలో ఈ సీబీడీసీ ఆధారిత రేషన్ వ్యవస్థను దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల సామాజిక సంక్షేమ పథకాల్లో ‘ప్రోగ్రామబుల్ డిజిటల్ కరెన్సీ’ని ఉపయోగిస్తున్న ప్రపంచంలోని అగ్రగామి దేశంగా భారత్ నిలవనుంది.ఇదీ చదవండి: నకిలీ రెజ్యూమెతో కంపెనీకి కుచ్చుటోపీ -
బెంగళూరులో అద్దె ‘మంట’
సహజ వనరులైన గాలి, వెలుతురును కూడా వ్యాపార వస్తువులుగా మార్చేస్తున్న నగర అద్దె పోకడలు సామాన్య, మధ్యతరగతి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. బెంగళూరులో ఇల్లు దొరకడం కంటే, దొరికిన ఇంటికి అద్దె కట్టడమే పెద్ద సవాలుగా మారింది. బెంగళూరులో నివాస గృహాల అద్దెలు ఇటీవల ఆకాశాన్ని తాకుతున్నాయి. ఐటీ ఉద్యోగుల రాకతో ఇప్పటికే డిమాండ్ పెరిగిపోగా తాజాగా ఒక ఇంటి యజమాని పెట్టిన వింత నిబంధన సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. గదుల్లో మెరుగ్గా సూర్యరశ్మి (సన్లైట్) వస్తుందనే కారణంతో ఒక ఫ్లాట్కు రూ.80,000 అద్దె అడగడం ఇప్పుడు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.అసలేం జరిగింది?నగరంలో నివాసం కోసం ఇల్లు వెతుకుతున్న అను అనే మహిళకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆమె ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. బెంగళూరు అద్దెలు ఎప్పుడూ తనను ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయని, కానీ ఈసారి ఎదురైన అనుభవం షాకింగ్గా ఉందని ఆమె పేర్కొన్నారు.‘ఒక గదిలోకి సహజమైన సూర్యరశ్మి వస్తుందనే కారణంతో దానికి రూ.80,000 అద్దె అడిగారు. కనీస సౌకర్యంగా ఉండాల్సిన సూర్యకాంతి ఇప్పుడు ప్రీమియం ఫీచర్గా మారిపోయింది’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.Bangalore Rent would never stop surprising me. What do you mean “ma’am is room me sunlight bhi aati hai to iska rent ₹80,000 hai” 😭— Anu (@Escapeplace__) February 13, 2026సోషల్ మీడియా స్పందనఅను చేసిన ఈ పోస్ట్ నిమిషాల్లోనే వైరల్ కావడంతో నెటిజన్లు బెంగళూరు అద్దె మార్కెట్పై భిన్నంగా స్పందిస్తున్నారు. ‘నెలకు రూ.80 వేల అద్దె కట్టడం కంటే ఆ డబ్బుతో హోమ్ లోన్ తీసుకుని సొంత ఇల్లు కొనుక్కోవడం ఉత్తమం’ అని ఒక వినియోగదారుడు సలహా ఇచ్చారు. ‘బెంగళూరు అద్దెలు చూస్తుంటే ముంబై రియల్ ఎస్టేట్ ధరలను తలపిస్తున్నాయి’ అని మరొకరు వ్యాఖ్యానించారు. ‘భవిష్యత్తులో స్వచ్ఛమైన గాలి వస్తుందని మరో రూ.20 వేలు అదనంగా అడిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు’ అంటూ నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.ఎందుకింత ధర?గత రెండేళ్లుగా బెంగళూరులోని వైట్ఫీల్డ్, సర్జాపూర్, కోరమంగళ వంటి ప్రాంతాల్లో అద్దెలు 30% నుంచి 50% వరకు పెరిగాయి. దీనికిగల కొన్ని కారణాలు.. ఆఫీసులు పూర్తిస్థాయిలో ప్రారంభం కావడంతో టెక్కీల తాకిడి పెరిగింది. విదేశీ కంపెనీల ప్రతినిధులు, హై-నెట్ వర్త్ వ్యక్తులు అధిక ధరలకు వెనకాడకపోవడంతో యజమానులు అద్దెలను భారీగా పెంచేస్తున్నారు.ఇదీ చదవండి: నకిలీ రెజ్యూమెతో కంపెనీకి కుచ్చుటోపీ -
పన్నుల ముసాయిదాలోని ‘‘ప్రమోదం’’
కొత్త ఇన్కం టాక్స్ చట్టం వచ్చింది. ముసాయిదా నిబంధనలు–2026 విడుదల అయ్యాయి. ఈ ఫిబ్రవరి 22 తేదీ వరకు సలహాలు స్వీకరిస్తారు. ఆ తరువాత వాటిని అమలులోకి తెస్తారు. ఈ ముసాయిదా ప్రతిపాదనలు చిన్న చిన్న అస్సెస్సీలకు, ఉద్యోగస్తులకు ఎంతో ఊరట, ఉపశమనం కల్పిస్తాయి అనడంలో సందేహం లేదు. ముసాయిదాలోని ప్రతిపాదనలు ప్రమోదాన్ని తెస్తున్నాయి. వివరాల్లోకి వెళ్దాం... కేవలం వ్యక్తులకు సంబంధించిన వాటిని ప్రస్తావిస్తున్నాం....ఉద్యోగస్తులకు ఉపశమనంఉద్యోగికి జీతంతో పాటు అదనంగా లభించే వేతనేతర ప్రయోజనాలు/సౌకర్యాల పరిమితిని పెంచారు. కొత్తగా వచ్చే ఈ అదనపు ప్రయోజనాలతో లబ్ధి పొందేది అంతిమంగా ఉద్యోగస్తుడు. రెండు, మూడు దశాబ్దాలుగా వీటి జోలికెళ్లని డిపార్ట్మెంట్ ఇప్పుడు ఆచరణాత్మకంగా అడుగులేస్తోంది. యజమాని సమకూర్చే వాహనాల సామర్థ్యం ఆధారంగా మినహాయింపు ఇస్తారు. ఈ సదుపాయంతో డ్రైవర్ ఇవ్వడం లేదా ఇవ్వకపోవడం జరగొచ్చు. ఇంజిన్ సామర్థ్యం 1.6 లీటర్ దాటని సందర్భంలో ఇచ్చే మినహాయింపుని రూ.2,700 నుంచి రూ.8,000 లకు పెంచారు. కెపాసిటీ 1.6 లీటర్ దాటితే రూ.3,200 నుంచి రూ.10,000లకు పెంచారు.యజమాని ఇచ్చే భోజనం విలువ పరిమితిని ఒక్కొక్క భోజనానికి రూ.50 నుంచి రూ.200లకు పెంచారు. దాని విలువ ఏడాదికి లెక్కిస్తే మినహాయింపు విలువ రూ.1,05,000 దాకా వస్తుందని అంచనా.గిఫ్ట్ వోచర్ల విలువని రూ.15,000 లకు పెంచారు. ప్రస్తుతం వాటి విలువ రూ.5,000గా ఉంది. వడ్డీ లేని రుణాలు... వడ్డీ విలువ రూ.20,000 దాకా ఉంది. దాన్ని పదింతలు అంటే రూ.2,00,000 లకు పెంచారు.ఎడ్యుకేషన్ అలవెన్స్.. ఒక సంతనానికి నెలకి రూ.100 ఉంది. దానిని రూ.3,000లకు పెంచారు. విద్యార్థులకు హాస్టల్ అలవెన్సు పరిమితిని రూ.300 నుంచి రూ.3,000లకు పెంచారు.ప్రస్తుతం అమల్లో ఉన్న పరిమితులు దశాబ్దాల చరిత్ర కలిగినవి. కొంతమంది మరిచిపోయారు. కొంతమంది క్లెయిమ్ చేయడం మానేశారు. డిపార్ట్మెంట్ వారి ఆలోచనా విధానం సమకాలీన పరిస్థితులకు అద్దం పడుతోంది. ఈ పెంపుదల గణనీయం.. ఈ మేరకు ఉద్యోగస్తులకు ఎంతో పన్ను ఊరట కలుగుతుంది. పాన్తో తిప్పలు తప్పుతాయ్..! చేతిలో సెల్ఫోన్, బ్యాగులో ఆధార్కార్డు, పాన్ కార్డు లేకుండా బయటకు రాలేని పరిస్థితి. కొంతమంది జిరాక్సులు చేయించి సిద్ధంగా ఉంటారు. ప్రస్తుతం బ్యాంకులో నగదు డ్రా చేయాలంటే ఒక రోజులో రూ.50,000 దాటితే పాన్ తెలియచేయాలి. ఇక నుంచి డైయిలీ లిమిట్స్ ఉండవు. ఒక ఆర్థిక సంవత్సరం మొత్తంలో రూ.10,00,000 నగదు విత్డ్రా చేసినా, డిపాజిట్ చేసినా, ఈ పరిమితి రూ.10 లక్షలు దాటితేనే పాన్ వివరాలు ఇవ్వాలి. దీని వలన ఇల్లు కట్టిస్తున్నప్పుడు, ఏవైనా పెళ్లిళ్లు, కార్యాలున్నప్పుడు వ్యాపారంలో కొనుగోళ్లు, మెడికల్ ఎమర్జెనీ సందర్భాల్లో ఎంతో వెసులుబాటు ఉంటుంది. స్థిరాస్తి క్రయవిక్రయ సందర్భాల్లో రూ.10,00,000 ఉన్న పరిమితిని రూ.20,00,000లకు పెంచారు. అలాగే జాయింట్ డెవలప్మెంట్ సందర్భాల్లో రూ.20,00,000 లోపల ఎటువంటి ఇబ్బంది లేకుండా సాఫీగా వ్యవహారాలు జరుపుకోవచ్చు. అలాగే చిన్న, చిన్న మోటారు బైకులు కొనుగోలు సందర్భంలో విలువతో నిమిత్తం లేకుండా పాన్ అడిగేవారు. ఇక నుంచి రూ.5,00,000 దాటిన బండి కొంటేనే పాన్ అడుగుతారు. హోటల్, ఈవెంట్ల నిర్వహణ కోసం చెల్లించే మొత్తం రూ.1,00,000 దాటితేనే పాన్ సమర్పించాలి. ప్రస్తుతం ఈ పరిమితి రూ.50,000గా ఉంది. అయితే ఇవన్నీ ఒక దిశగా వెళ్లితే.., ఊరంతా ఒక దారి, ఉలిపికట్టెదొక దారి అన్నట్లు బీమా రంగంలో మాత్రం ఎటువంటి సడలింపు లేదు. పాన్ వాడకం సడలింపు విషయంలో డిపార్ట్మెంట్ని అభినందించాలి. సడలింపుల వలన ఎంతో సౌలభ్యం ఏర్పడుతుంది. కాలం వృథా కాదు. టాక్సుపేయర్ ఎప్పుడూ చట్టాన్ని, రూల్స్తో కలిసి చదివి నిర్ణయానికి రావాలి. ఈ రూల్స్ ప్రకారం మన తెలుగు ప్రజలలో హైదరాబాద్ ఉద్యోగస్తులకు ఒక తీపి కబురు. హైదారాబాద్ ఉద్యోగస్తులుఇంటి అద్దె అలవెన్సు మినహాయింపు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా మినహా అన్ని ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగస్తులకు జీతం మీద 40% మాత్రమే ఉండేది. నిజానికి హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందింది. దానితో పాటు సదుపాయాలు, ఇళ్లు, అపార్ట్మెంట్లు ఇప్పు డు విల్లాలు.. కొంతమంది ఇండిపెండెంట్ ఇంటిలో ఉంటారు. అమలులో ఉన్న రూల్స్ ప్రకారం వారికి మినహాయింపు 40% మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు ఈ లిమిట్ అన్నీ 40% నుంచి 50 శాతానికి పెంచారు. దాని వలన హైదరాబాదులో ఎక్కువ అద్దె ఇచ్చే వారికి మంచి ఉపమశనం. అంతేకాకుండా ఈ వెసులుబాటు పూణే, అహ్మదాబాద్, బెంగళూర్కి వర్తిస్తుంది. వెనకోముందో ఉద్యోగస్తులకు ప్రమోదం కలిగించేలా ప్రతిపాదనలు ఉన్నాయి. అభినందనీయం..! -
నకిలీ రెజ్యూమెతో కంపెనీకి కుచ్చుటోపీ
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం సంపాదించడానికి కొందరు అభ్యర్థులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఆకర్షణీయంగా ఉండే అబద్ధాలతో రెజ్యూమెలను సృష్టించి కంపెనీలను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా ఒక స్టార్టప్ వ్యవస్థాపకుడు ఇటువంటి ఫేక్ అభ్యర్థిని నమ్మి ఉద్యోగం ఇవ్వడం వల్ల తమ కంపెనీ రూ.2 లక్షలకు పైగా నష్టపోయిందని సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాపర్ మీడియా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అశుతోష్ గుప్తా లింక్డ్ఇన్లో షేర్ చేసిన వివరాలు కార్పొరేట్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.అసలేం జరిగింది?కంపెనీ ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ (నేపథ్య తనిఖీ) అనవసరమని భావించినట్లు గుప్తా పేర్కొన్నారు. కేవలం అభ్యర్థి ఇంటర్వ్యూ ప్రదర్శన, గట్ ఫీలింగ్ ఆధారంగా నియామకాలు చేపట్టేవారు. ఈ క్రమంలోనే చిరాగ్ అనే అభ్యర్థి కంపెనీలోకి ప్రవేశించాడు. పాత కంపెనీలో 3 ఏళ్ల అనుభవం, నెలకు రూ.40,000 వేతనం ఉండడంతో ఇంటర్వ్యూలో తన ఆత్మవిశ్వాసాన్ని చూసి ఈ స్టార్టప్ కంపెనీ రూ.45,000 జీతం ఆఫర్ చేసింది.నియామకం జరిగిన రెండు నెలల తర్వాత చిరాగ్ పనితీరుపై అనుమానాలు మొదలయ్యాయి. ఒక సాధారణ రియాక్షన్ వీడియో ఎడిటింగ్ టాస్క్ (సాధారణంగా జూనియర్ ఎడిటర్లు రోజుకు మూడు చేస్తారు) పూర్తి చేయడానికి చిరాగ్కు రెండు రోజులు పట్టింది. పైగా అతను ఇచ్చిన అవుట్పుట్ ఏమాత్రం పనికివచ్చేది కాదు. దీంతో అనుమానం వచ్చిన యాజమాన్యం తన పాత కంపెనీని సంప్రదించింది.వెలుగు చూసిన నిజాలువెరిఫికేషన్ ప్రక్రియలో చిరాగ్ ఆడిన అబద్ధాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. గతంలో అతను నెలకు పొందింది రూ.25 వేలు మాత్రమే, కానీ రూ.40 వేలు అని అబద్ధం చెప్పి 80 శాతం పెంపు పొందాడు. తాను పాత కంపెనీలో రాజీనామా చేయలేదు. పేలవమైన పనితీరు కారణంగా కంపెనీ అతన్ని తొలగించింది. కొత్త కంపెనీలో రిఫరెన్స్ కోసం అతను ఇచ్చిన మేనేజర్ నంబర్ తన స్నేహితుడిది. ఆ స్నేహితుడు మేనేజర్లా నటించి చిరాగ్ గురించి మంచి రివ్యూ ఇచ్చాడు.ఈ ఒక్క తప్పుడు నియామకం వల్ల కంపెనీకి కలిగిన నష్టాన్ని గుప్తా వివరించారు. వేతన రూపంలో మూడు నెలలకు గానూ రూ.1.35 లక్షలు, శిక్షణ ఖర్చుల కింద రూ.40,000, రీప్లేస్మెంట్ నియామకం కింద రూ.25,000 నష్టపోయామని చెప్పారు. దీనికంటే ముఖ్యంగా క్లయింట్ ప్రాజెక్టుల జాప్యం, టీమ్ మనోధైర్యం దెబ్బతినడం, నాలుగు నెలల విలువైన సమయం వృథా అయినట్లు తెలిపారు.స్టార్టప్లకు సూచనలుఈ చేదు అనుభవం తర్వాత ప్రాపర్ మీడియా ప్రతి నియామకానికి కఠినమైన నిబంధనలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. అభ్యర్థుల మునుపటి కంపెనీ హెచ్ఆర్కు అధికారిక మెయిల్ చేయడం, లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ క్రాస్ చెక్ చేయడం, అధికారిక నంబర్ల ద్వారా మాత్రమే ధ్రువీకరించుకోవడం వంటివి తప్పనిసరి చేశారు. తప్పు జరిగిన తర్వాత బాధపడేకంటే, అభ్యర్థిని కంపెనీలోకి తీసుకునే ముందే క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఇతర స్టార్టప్ వ్యవస్థాపకులకు ఆయన సూచించారు.ఇదీ చదవండి: ఉఫ్.. బిగ్ రిలీఫ్! -
బంగారం రివర్స్! కొనేవారికి గుడ్న్యూస్
దేశంలో బంగారం ధరలు భారీగా దిగివచ్చాయి. ఈరోజు కొనుగోలు చేసేవారికి ఊరట కల్పించాయి. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో మార్పులు వస్తున్నాయి. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. అటు వెండి ధరలు కూడా నిలకడగా కొనసాగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఫ్లాట్గా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు క్రితం సెషన్తో పోలిస్తే సోమవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:26 సమయానికి నిఫ్టీ(Nifty) 13 పాయింట్లు పెరిగి 25,489 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 45 పుంజుకొని 82,646 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 16-02-2026(time: 9:28 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ప్యాసివ్ ఫండ్లకు ‘స్మార్ట్ బీటా వ్యూహాలు’
దేశీయంగా పెట్టుబడుల పరిస్థితుల్లో ఇటీవల గణనీయమైన మార్పులు వస్తున్నాయి. తక్కువ ఖర్చు, వైవిధ్యం, పారదర్శకత, దీర్ఘకాల క్రమశిక్షణ తదితర అంశాలకు ఇన్వెస్టర్లు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో ‘ప్యాసివ్ ఇన్వెస్టింగ్’ విధానం వేగంగా విస్తరిస్తోంది. ఇండెక్స్ ఫండ్లు, ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లాంటి ప్యాసివ్ ఫండ్లు, స్వయంగా షేర్లను ఎంపిక చేసుకోవాల్సిన బాదరబందీ లేకుండా మార్కెట్లో పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్యాసివ్ ఇన్వెస్టింగ్కి సంబంధించి ‘స్మార్ట్ బీటా వ్యూహాలు’ ఒక వినూత్న మార్గంగా అవతరిస్తున్నాయి. స్మార్ట్ బీటా వ్యూహాల నిర్వచనం.. ‘స్మార్ట్ బీటా వ్యూహాలు’ అనేవి ఇండెక్స్కు అనుసంధానమైన పెట్టుబడి వ్యూహాలు. ఇవి సంప్రదాయ ప్యాసివ్ ఫండ్ల మాదిరిగా కేవలం మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా పనిచేయవు. ఈ వ్యూహంలో భాగంగా, ముందుగానే నిర్ణయించిన నిర్దిష్ట నియమాల ప్రకారం, పలు ఆర్థిక ప్రమాణాలను పరిగణనలోకి తీసుకొని షేర్లను ఎంపిక చేసి, వాటికి తగిన వెయిటేజీ కేటాయిస్తాయి. ఈ విధానం ‘ప్యాసివ్ ఇన్వెస్టింగ్’లోని సరళత్వాన్ని కొనసాగిస్తూనే, అదనంగా వ్యూహాత్మక దృష్టికోణాన్ని కూడా జోడిస్తుంది. దీనితో పోర్ట్ఫోలియో నుంచి మరింత మెరుగైన ఫలితాలను పొందేందుకు వీలవుతుంది.ఫాక్టర్ ఆధారిత విధానంస్మార్ట్ బీటా వ్యూహాల్లో విస్తృతంగా ఉపయోగించే కొన్ని ముఖ్యమైన ఫాక్టర్లు ఉన్నాయి. విలువ (వేల్యూ), మొమెంటం, నాణ్యత(క్వాలిటీ), తక్కువ వోలటిలిటీ (ఒడిదుడుకులు), సమానమైన వెయిటేజీ తదితర ఫ్యాక్టర్లను పరిగణలోకి తీసుకుంటారు. వీటిలో విలువ (వేల్యూ) అనే ఫాక్టర్, కంపెనీల షేర్ల వేల్యుయేషన్ ఆకర్షణీయంగా ఉందా లేదా అనే అంశాన్ని సూచిస్తుంది. మొమెంటం ఫాక్టర్ గతంలో స్థిరమైన పనితీరు కనబరిచిన కంపెనీ షేర్లపై దృష్టి సారిస్తుంది. నాణ్యత (క్వాలిటీ) ఫాక్టర్ ఆర్థికంగా బలమైన, స్థిరమైన లాభాలు కలిగిన కంపెనీల షేర్లను ఎంపిక చేస్తుంది. తక్కువ వోలటిలిటీ ఫాక్టర్ అనేది మార్కెట్తో పోలిస్తే తక్కువ ఒడిదుడుకులకు లోనయ్యే షేర్లను గుర్తిస్తుంది. సమానమైన వెయిటేజీ అనే ఫ్యాక్టర్ అన్ని షేర్లకు సమాన వెయిటేజీ ఇస్తూ, మధ్యతరహా, చిన్న కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తాయి.రిస్క్లు, పరిమితులుస్మార్ట్ బీటా వ్యూహాలకు కూడా కొన్ని రిస్క్లు, పరిమితులున్నాయి. ముఖ్యంగా ఫ్యాక్టర్ ఆధారిత రిస్క్. ఏదో ఒక ఫాక్టర్ కొన్ని మార్కెట్ పరిస్థితుల్లో బాగా పనిచేయవచ్చు. మరికొన్ని సమయాల్లో వెనుకబడే అవకాశం ఉంటుంది. సహజంగానే ప్యాసివ్ ఫండ్లు అనేవి మార్కెట్ సూచీలను అనుసరిస్తాయి. కాబట్టి, మార్కెట్ పడిపోతే వెంటనే ఫండ్ విలువా తగ్గుతుంది. కొన్నిసార్లు మంచి మార్కెట్ సమయంలోనూ సగటు లాభాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఒకే రంగానికి పరిమితయమ్యే ప్యాసివ్ ఫండ్లూ ఉంటాయి. ఆ రంగానికి ఏదైనా ఇబ్బంది వచి్చనప్పుడు మొత్తం పోర్ట్ఫోలియో ప్రభావితం కావచ్చు. కావున దీర్ఘకాలంలోనే ఈ వ్యూహాల అసలు ప్రయోజనం బయటపడుతుంది. అందుకే తాత్కాలిక పనితీరును చూసి నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదు.మొత్తంగా, స్మార్ట్ బీటా వ్యూహాలు అనేవి ప్యాసివ్ ఇన్వెస్టింగ్ సరళతను, నిర్దిష్ట నియమాల ఆధారిత వ్యూహాలను సమన్వయం చేసే ఆధునిక పెట్టుబడి విధానాలుగా అభివర్ణించవచ్చు. ఇవి విభిన్న ఫాక్టర్లను కలిపి పెట్టుబడిదారులకు స్థిరమైన ఆదాయాలు అందించగలవు. భవిష్యత్తులో భారత ప్యాసివ్ ఇన్వెస్టింగ్ ప్రయాణంలో స్మార్ట్ బీటా వ్యూహాలు కీలక పాత్ర పోషించనున్నాయి. మార్కెట్లు వృద్ధి చెందుతున్న దశలో ప్యాసివ్ ఫండ్లు దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇచ్చేందుకు ఆస్కారం ఉంది.ఇదీ చదవండి: ఉఫ్.. బిగ్ రిలీఫ్! -
నేడు దలాల్ స్ట్రీట్ దారి ఎటువైపు?
భారతీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు (ఫిబ్రవరి 16, 2026) ఒత్తిడికి లోనయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గత శుక్రవారం సెన్సెక్స్ 1,000 పాయింట్లకు పైగా, నిఫ్టీ 330 పాయింట్లకు పైగా భారీగా పతనమైన నేపథ్యంలో నేడు కూడా మార్కెట్ బేరిష్(తగ్గుదల) ట్రెండ్ను కొనసాగించే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. గ్లోబల్ మార్కెట్ల నుంచి వస్తున్న ప్రతికూల సంకేతాలు, అంతర్జాతీయ రాజకీయ అనిశ్చితులు దీనికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.అంతర్జాతీయ అనిశ్చితులు - టెక్ రంగంలో ప్రకంపనలుఅమెరికా మార్కెట్లలో ముఖ్యంగా టెక్నాలజీ (ఐటీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) షేర్లలో చోటుచేసుకున్న భారీ అమ్మకాలు భారతీయ ఐటీ రంగంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. నాస్డాక్ పతనం కారణంగా దేశీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ షేర్లు ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. అలాగే, పెరుగుతున్న అమెరికా బాండ్ ఈల్డ్స్, డాలర్ ఇండెక్స్ బలపడటం కూడా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల నిష్క్రమణకు దారితీస్తోంది.క్రూడాయిల్ ధరలు.. భారత్పై ప్రభావంప్రస్తుతానికి అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్కు సుమారు 67 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇరాన్ అణు చర్చల నేపథ్యంలో సరఫరా అంతరాయాలు తగ్గుతాయన్న ఆశలు ఉన్నప్పటికీ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పూర్తిగా సద్దుమణగలేదు. క్రూడాయిల్ ధరలు పెరిగితే అది భారతదేశ ద్రవ్యోల్బణంపై, కరెంటు ఖాతా లోటు (క్యాడ్)పై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ఇది రూపాయి విలువ క్షీణతకు కారణమై మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసే ప్రమాదం ఉంది.ఆర్బీఐ, ఫెడ్ రిజర్వ్ భవిష్యత్తు నిర్ణయాలుఇటీవలి ఫిబ్రవరి మానిటరీ పాలసీ సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 5.25% వద్ద స్థిరంగా ఉంచింది. అయితే, ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నప్పటికీ ఆహార ధరల పెరుగుదల, అంతర్జాతీయ అనిశ్చితుల దృష్ట్యా ఆర్బీఐ తన తటస్థ వైఖరిని కొనసాగిస్తోంది. భవిష్యత్తులో వడ్డీ రేట్ల తగ్గింపుపై స్పష్టత లేకపోవడం మార్కెట్లలో కొంత నిరుత్సాహాన్ని నింపింది. అమెరికాలో ద్రవ్యోల్బణ గణాంకాలు అంచనాల కంటే ఎక్కువగా ఉండటంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపును మరింత ఆలస్యం చేసే అవకాశం ఉంది. ఈ అనిశ్చితి గ్లోబల్ లిక్విడిటీపై ప్రభావం చూపుతోంది.టెక్నికల్ లెవల్స్పై నిపుణుల అంచనాటెక్నికల్ చార్టుల ప్రకారం, నిఫ్టీకి 25,400 స్థాయి అత్యంత కీలకమైన సపోర్ట్గా ఉంది. ఒకవేళ నిఫ్టీ ఈ స్థాయి కంటే దిగువకు పడిపోతే అది 25,200 నుంచి 25,000 వరకు వెళ్లే ప్రమాదం ఉంది. సెన్సెక్స్కు 82,500 - 82,400 జోన్ బలమైన సపోర్ట్గా పనిచేస్తుంది. ఇన్వెస్టర్లు ప్రస్తుతం దూకుడుగా పెట్టుబడులు పెట్టడం కంటే వేచి చూడటం ఉత్తమమని, ముఖ్యంగా ఐటీ, మెటల్ రంగాల షేర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: ఉఫ్.. బిగ్ రిలీఫ్! -
ఉఫ్.. బిగ్ రిలీఫ్!
రాజ్యలక్ష్మి(68) రిటైర్డ్ గవర్నమెంట్ టీచరు. ఉండేది హైదరాబాద్లో. ఎఫ్డీని రెన్యువల్ చెయ్యడానికి బ్యాంకుకు వెళ్లారు. బ్యాంకు సిబ్బంది రెన్యువల్ చెయ్యకుండా... ఎఫ్డీని మించిన రాబడి కచ్చితంగా వస్తుందంటూ మార్కెట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్లో రూ.10 లక్షలు ఇన్వెస్ట్ చేయించారు. రెండేళ్లు గడిచాయి. మార్కెట్ పడిపోవడంతో ఆమె పెట్టుబడిలో 18 శాతం వరకూ పోయింది. ఎఫ్డీని మించిన రాబడి కచ్చితంగా వస్తుందన్నారు కదా? అంటూ బ్యాంకును నిలదీశారు. ‘‘మార్కెట్ లింక్డ్ సాధనాల్లో ఇవి సహజం. మీరూ ఒప్పుకుని సంతకం చేశారు కదా?’’ అని బ్యాంకు వాళ్లు చూపించటంతో లక్ష్మి హతాశురాలయ్యారు.ఇక వెంకటాచలం అయ్యర్ అనే 90 ఏళ్ల వ్యక్తికి ఏటా రూ.2 లక్షల ప్రీమియంతో 2124లో అంటే, వందేళ్ల తర్వాత మెచ్యూరయ్యే జీవిత బీమా పాలసీని అంటగట్టింది మరో బ్యాంకు. దీనిపై సోషల్ మీడియాలో నానా రచ్చ జరిగేసరికి సైలెంటుగా రిఫండ్ చేసేసింది. ఈ నేపథ్యంలో కస్టమర్లకుండే హక్కులను వివరించేదే ఈ వెల్త్ స్టోరీ..బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మనకు పనికిరాని, అనవసరమైన ఉత్పత్తుల్ని బలవంతంగా కొనిపించేదంతా మిస్–సెల్లింగే. దీన్నుంచి వినియోగదారులను కాపాడేందుకు రిజర్వ్ బ్యాంక్ తొలిసారి స్పష్టమైన చర్యలకు దిగింది. ‘రెస్పాన్సిబుల్ బిజినెస్ కండక్ట్ అమెండ్మెంట్ డైరెక్షన్స్ – 2026’ ముసాయిదా ప్రకారం మిస్ సెల్లింగ్ రుజువైతే, కస్టమర్ల దగ్గరనుంచి వసూలు చేసిన డబ్బు మొత్తాన్ని బ్యాంకులు వాపసు చేయాలి. సదరు ప్రోడక్టు విక్రయాన్ని రద్దు చేయాలి. ఈ ఏడాది జులై 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశమున్న ఈ నిబంధనలతో మిస్–సెల్ చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత బ్యాంకులపై పడుతుంది.మిస్–సెల్లింగ్ ఇదీ...రిజర్వ్ బ్యాంక్ తొలిసారిగా మిస్–సెల్లింగ్కంటూ స్పష్టమైన నిర్వచనాలిచ్చింది. అవేంటంటే...కస్టమర్ ప్రొఫైల్కి అనువుగా లేని ఉత్పత్తులను విక్రయించటంపూర్తిగా, లేక సరైన వివరాలు ఇవ్వకుండా అమ్మడంబండిల్గా ప్రోడక్టులను అంటగట్టడంకస్టమరు నుంచి స్పష్టమైన సమ్మతి తీసుకోకుండానే విక్రయించడంఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కస్టమరు ఒకవేళ అన్ని డాక్యుమెంట్స్పై సంతకాలు చేసినా, ప్రోడక్టు గానీ అనువైనది కాకపోతే అది మిస్–సెల్లింగ్ కిందికే వస్తుంది. ఇప్పటివరకు కస్టమర్ల సంతకాలు, డిజిటల్ క్లిక్లు అనే లూప్హోల్ని అడ్డం పెట్టుకుని, బయటపడిపోయిన బ్యాంకులు ఇకపై అలాంటివి చేయటానికి కుదరదు. ఆర్బీఐ కొత్త ఫ్రేమ్ వర్క్ ప్రకారం రాజ్యలక్ష్మి ఎదుర్కొన్నది మిస్ సెల్లింగే. ఎందుకంటే ఆమె వయస్సు, రిస్కు సామర్థ్యాల రీత్యా మార్కెట్లో భారీ పెట్టుబడులు పెట్టడం రిస్కీ వ్యవహారమే. పెట్టుబడికి కూడా హాని ఉంటుందనే విషయం సరిగ్గా చెప్పకుండా ఆమెకు అరకొర సమాచారమే ఇచ్చి ఉండొచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ఆమెకు పూర్తి రిఫండ్ చేయాల్సి ఉంటుంది.బలవంతంగా బండిల్ చేయొద్దు..రుణం ఇవ్వాలంటే ఆ రుణానికి బీమా తీసుకోవాలంటూ బ్యాంకులు లింకు పెట్టడం సహజం. ఇదే బండ్లింగ్. ఒకటి కావాలంటే మరొకటి కూడా జత కలపటం. ఆర్బీఐ ముసాయిదా నిబంధనల ప్రకారం...రుణం కోసం తప్పనిసరిగా తాము చెప్పే బీమా పాలసీని తీసుకోవాల్సిందే అంటూ బ్యాంకులు ఒత్తిడి చేయడానికి ఉండదు.నచ్చిన ఏ కంపెనీ నుంచైనా థర్డ్ పార్టీ ప్రోడక్టులను కొనుక్కునేందుకు కస్టమర్లకు స్వేచ్ఛ ఉంటుంది.కస్టమర్లు స్పష్టంగా సమ్మతించకుండా, రుణ మొత్తం నుంచి బీమా లేదా ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్టులకు సంబంధించిన డబ్బును కట్ చేసుకోవడానికి ఉండదు. కస్టమర్ల సమ్మతి అనేది నిర్దిష్టంగా ఉండాలి. పూర్తి వివరాలు తెలుసుకుని ఇచ్చినట్లుగా ఉండాలి. అస్పష్టత ఉండకూడదు.వివిధ ప్రోడక్టులన్నింటికీ కలిపి ఒకే ఫారంలో లేదా డిజిటల్ చెక్బాక్స్ ద్వారా సమ్మతి తీసుకోవడానికి కుదరదు. ప్రతి ప్రోడక్టుకు విడిగా అప్రూవల్ తీసుకోవాల్సిందే. డిజిటల్ ‘డార్క్ ప్యాటర్న్స్’ కట్టడిబ్యాంకులు ఇకపై కస్టమర్లను మభ్యపెట్టే ‘డార్క్ ప్యాటర్న్స్’లాంటి డిజిటల్ మాయవేషాలు వేయడానికి ఉండదు. ఈ డార్క్ ప్యాటర్న్స్ ఏమిటంటే..ఇదిగో మరికాసేపట్లోనే ఆఫర్ ముగిసిపోతుంది, త్వరపడకపోతే నష్టపోతారనే విధంగా కంగారు పెట్టేయడం ముందే యాడ్–ఆన్స్ని సెలెక్ట్ చేసేసి ఉంచడంప్రీ–అప్రూవ్డ్ క్రెడిట్ కార్డులంటూ ఇచ్చేసి, కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్లలాంటివి అంటగట్టడంపేమెంట్ దశవరకు ఇతర చార్జీల గురించి చెప్పకుండా దాచి పెట్టి ఉంచడంఅన్సబ్స్క్రయిబ్ చేసేందుకు సంబంధించిన ఆప్షన్లు గందరగోళంగా ఉండటంఇలాంటివి చేయకుండా కేంద్రీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ మార్గనిర్దేశకాలను బ్యాంకులు తప్పనిసరిగా పాటించాలి. తమ యూజర్ ఇంటర్ఫేస్లను తరచుగా ఆడిట్ చేసుకుంటూ ఉండాలి. దీనితో యాప్–ఆధారిత బ్యాంకింగ్లో పారదర్శకత గణనీయంగా మెరుగుపడుతుంది. టార్గెట్లే మిస్–సెల్లింగ్కి మూలం..అసలు మిస్–సెల్లింగ్కి మూలకారణం ఉద్యోగులకు ఉండే భారీ సేల్స్ టార్గెట్లు, ప్రోత్సాహకాలే. కాబట్టి ఇకపై బ్యాంకులు ఏవి చేయకూడదో ఆర్బీఐ స్పష్టంగా పేర్కొంది. అవి...సేల్స్ కోసం అంతర్గతంగా పోటీ పెట్టడంస్పెషల్ ‘టార్గెట్ డేస్’ని నిర్దేశించడంఎలాగైనా ప్రోడక్టును అంటగట్టేలా ప్రోత్సహించే ప్రోత్సాహకాల విధానాలుథర్డ్ పార్టీ ప్రోడక్టులను విక్రయించే ఉద్యోగులు నేరుగా గానీ పరోక్షంగా గానీ సదరు సంస్థల నుంచి ప్రోత్సాహకాలేవీ పొందకూడదు. రిలేషన్షిప్ మేనేజర్లు టార్గెట్లను పూర్తిచేసేందుకు, తమకు భారీగా కమీషన్ వచ్చే ప్రోడక్టులను అంటగట్టకుండా ఇలాంటివి కట్టడి చేస్తాయి. టెలీమార్కెటింగ్ కష్టాలకు చెక్కొత్త రూల్స్ ప్రకారం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకే కాల్స్కి అనుమతి ఉంటుందిడీఎన్డీ కింద రిజిస్టర్ చేసుకుంటే అసలు కాల్ చేయడానికే ఉండదుఏజెంట్లు తాము కూడా బ్యాంకు ఉద్యోగులమే అన్నట్లుగా వ్యవహరించకూడదుప్రమోషనల్ మెసేజీలను కస్టమర్లు స్పష్టంగా సమ్మతిస్తేనే పంపాలి. అన్సబ్స్క్రైబింగ్ ప్రక్రియ కూడా సరళంగా ఉండాలి.ఇదీ చదవండి: విదేశాలకు వెళుతున్నారా.. ఈ జాగ్రత్తలు మీకోసమే -
గణాంకాలతో మార్కెట్ల తీరెటు?
దేశీ స్టాక్ మార్కెట్లకు ఈ వారం ప్రధానంగా దేశ, విదేశీ గణాంకాలు కీలకంగా నిలవనున్నాయి. అయితే ఇటీవల ఆంత్రోపిక్, శాప్ ఏఐ టూల్స్ అమెరికా నుంచి ఆసియా వరకూ టెక్నాలజీ రంగాన్ని కుదిపేస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఇకపై మార్కెట్లు, ఇన్వెస్ట్మెంట్ల తీరెలా ఉండవచ్చంటూ నిపుణుల మధ్య చర్చలు అధికమయ్యాయి. వీటిమధ్య ఈ వారం ట్రెండ్పై పలు అంశాల ప్రభావం ఉంటుందని నిపుణులు ప్రస్తావిస్తున్నారు. వివరాలు చూద్దాం.. దేశీయంగా నేడు(16న) జనవరి నెల టోకు ధరల వివరాలు(డబ్ల్యూపీఐ) వెల్లడికానున్నాయి. 2025 నవంబర్లో 0.32 శాతం నీరసించినప్పటికీ డిసెంబర్లో డబ్ల్యూపీఐ వార్షికంగా 0.83 శాతం బలపడింది. వెరసి గత మూడు నెలల్లో తొలిసారి పెరిగింది. ఏప్రిల్ తదుపరి వేగమందుకుంది. రిటైల్ ధరలు(సీపీఐ) 2.75 శాతం ఎగసిన సంగతి తెలిసిందే. ఇక మరోపక్క వాణిజ్య గణాంకాలు సైతం వెలువడనున్నాయి. డిసెంబర్లో ఎగుమతులకంటే దిగుమతులు అధికమై వాణిజ్య లోటు 25 బిలియన్ డాలర్లకు చేరింది. నవంబర్లో ఇది 24.53 బిలియన్ డాలర్లుకాగా.. 2024 డిసెంబర్లో 20.6 బిలియన్ డాలర్లు మాత్రమే. ఈ బాటలో వారాంతాన ఫిబ్రవరి నెలకు తయారీ, సరీ్వసులు, కాంపోజిట్ పీఎంఐ గణాంకాలు విడుదలకానున్నాయి. విదేశీ అంశాలు ఫిబ్రవరి 17న యూఎస్ ఏడీపీ ఉపాధి గణాంకాలు, హౌసింగ్ మార్కెట్ ఇండెక్స్, పారిశ్రామికోత్పత్తి వివరాలు విడుదలకానున్నాయి. అంతేకాకుండా ఫెడరల్ రిజర్వ్ గత పాలసీ సమీక్షా వివరాలు(మినిట్స్) సైతం వెల్లడికానున్నాయి. గత పాలసీ సమీక్షలో ఫెడ్ ఫండ్స్ రేట్లను యథాతథంగా 3.5–3.75 శాతం వద్ద కొనసాగించేందుకు నిర్ణయించింది. ఇవి 2022 తదుపరి కనిష్టంకాగా.. తద్వారా మూడు వరుస రేట్ల కోతకు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. వీటితోపాటు వ్యక్తిగత వ్యయాల ఇండెక్స్, 2025 అక్టోబర్–డిసెంబర్ జీడీపీ ముందస్తు అంచనాలు సైతం విడుదలకానున్నాయి. పెట్టుబడుల ప్రవాహమెటు? → ఆంత్రోపిక్, శాప్ విడుదల చేసిన ఏఐ టూల్స్ సాఫ్ట్వేర్ ఆధారిత సరీ్వసుల రంగంలో ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. ఐటీ దిగ్గజ కంపెనీలు నిర్వహించే కొన్ని రకాల ప్రాజెక్టులకు చెక్ పడటంతోపాటు.. సిబ్బందిపై సైతం భారీ సంఖ్యలో వేటు వేయవలసి వస్తుందన్న అంచనాలు పెరుగుతున్నాయి. ఇవి ఆందోళనలుగా మారి ప్రపంచవ్యాప్తంగా ఐటీ స్టాక్స్లో భారీ అమ్మకాలకు కారణమవుతున్నాయి. దీంతో ప్రపంచ ఇన్వెస్టర్ల దృష్టి ఇతర రంగాలవైపు మళ్లవచ్చని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. దేశీ కస్టమర్ ఆధారిత రంగాలైన బ్యాంకింగ్, ఆటోసహా కొన్ని వినియోగ ఆధారిత రంగాలవైపు ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. → టారిఫ్ ఆందోళనలు ఉపశమిస్తున్న నేపథ్యంలో దేశీ కరెన్సీ కదలికలు, విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐలు) పెట్టుబడులు లేదా అమ్మకాల తీరు, దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ప్రపంచ మార్కెట్ల పరిస్థితులు, ఆర్బీఐ, ఫెడరల్ రిజర్వ్ భవిష్యత్ పాలసీ నిర్ణయాలపై అంచనాలు తదితర అంశాలు సెంటిమెంటుకు కీలకంకానున్నట్లు విశ్లేషకులు వివరించారు. యూఎస్, భారత్లలో ద్రవ్యోల్బణం, జీడీపీ పురోగతి వంటి అంశాలు ఫెడ్, ఆర్బీఐ పరపతి విధానాలను ప్రభావితం చేసే సంగతి తెలిసిందే. వెరసి వీటికి ప్రాధాన్యత ఉన్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. → క్యూ3(అక్టోబర్–డిసెంబర్) ఫలితాల ప్రభావంతో పలు రంగాల కౌంటర్లు యాక్టివ్గా కదులుతున్నట్లు నాయిర్ తెలియజేశారు. పటిష్ట ఫలితాలు, ఆర్డర్లు సాధించిన కౌంటర్లు బలపడుతుంటే.. నిరాశపరచిన స్టాక్స్ నుంచి ఇన్వెస్టర్లు తప్పుకుంటున్నట్లు పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. వెరసి మార్కెట్ భారీ ఆటుపోట్లలోనూ విభిన్న రంగాల కౌంటర్లు యాక్టివ్గా ట్రేడవుతున్నట్లు వివరించారు. → గత వారాంతాన వెలువడిన ఆశావహ యూఎస్ ఉపాధి గణాంకాలు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు యోచనకు చెక్ పెట్టనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో గత వారం విదేశీ మార్కెట్లలోనూ అమ్మకాలు తలెత్తినట్లు మిశ్రా తెలియజేశారు.ఇండెక్సులు అటా.. ఇటా?గత వారం యూఎస్ ట్రేడ్ డీల్ ఆశలు కలి్పంచినప్పటికీ ఏఐ ఆందోళనలు అమ్మకాలకు దారి చూపాయి. వెరసి ఈ వారం సైతం ఇండెక్సులు బలహీనంగా కదిలే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. → నిఫ్టీకి 25,200–25,100 పాయింట్ల వద్ద మద్దతుకు వీలుంది. ఒకవేళ బలపడితే 26,000–26,100 పాయింట్లవరకూ బౌన్స్కావచ్చు. అయితే నిఫ్టీ 25,100 దిగువకు చేరితే 24,700వరకూ పతనంకావచ్చు. → సెన్సెక్స్ తొలుత 82,450–82,000 పాయింట్ల వద్ద సపోర్ట్ తీసుకునే వీలుంది. ఒకవేళ తదుపరి జోరందుకుంటే 84,500–85,000 వరకూ పుంజుకునే చాన్స్ ఉంది. అయితే నీరసిస్తే 82,000 పాయింట్ల దిగువన 80,500–80,000 స్థాయిలో మద్దతు కనిపించవచ్చు.గత వారమిలా..గత వారం(9–13) దేశీ స్టాక్ మార్కెట్లు ఐటీ రంగ కౌంటర్లలో భారీ అమ్మకాల కారణంగా డీలా పడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ నికరంగా 954 పాయింట్లు(1.15 శాతం) క్షీణించి 82,627 వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 223 పాయింట్లు(0.9 శాతం) నీరసించి 25,471 వద్ద ముగిసింది. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్స్ సైతం 1.5 శాతం చొప్పున వెనకడుగు వేశాయి.ఎఫ్పీఐల కొనుగోళ్లుఈ నెల తొలి రెండు వారాల్లో ఎఫ్పీఐలు దేశీ స్టాక్స్లో కొనుగోళ్లకు ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో ఈ నెల 2–13 మధ్య నికరంగా రూ. 19,675 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. యూరప్సహా.. యూఎస్తోనూ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడంతో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే అంతకుముందు 2026 జనవరి(రూ. 35,962 కోట్లు), 2025 డిసెంబర్(రూ. 22,611 కోట్లు), నవంబర్(3,765 కోట్లు)లలో నికరంగా అమ్మకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
మీ లాకర్ ఎంత భద్రం?
బ్యాంకు లాకర్లో పెట్టేదే భద్రంగా ఉంటాయని. మరి అక్కడే చోరీ జరిగితే? తమకు సంబంధం లేదని బ్యాంకులు తప్పించుకోజూస్తే? పశ్చిమ బెంగాల్లోని బాగ్డోగ్రా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇదే జరిగింది. 2016లో ఈ బ్యాంకు లాకర్లో ఓ కస్టమర్ ఉంచిన విలువైన వస్తువులు చోరీ అయ్యాయి. రాష్ట్ర వినియోగ వివాదాల పరిష్కార కమిషన్ రూ.59 లక్షల పరిహారానికి ఆదేశించింది. బ్యాంకు జాతీయ కమిషన్కు అప్పీల్ చేసింది. తాజాగా జాతీయ కమిషన్ తీర్పునిస్తూ... లాకర్ భద్రతలో వైఫల్యం ఉన్నప్పుడు బ్యాంక్ తప్పించుకోలేదని స్పష్టంచేసింది. నష్ట పరిహారాన్ని రూ.5 లక్షలకు తగ్గించింది. మరి ఈ సంఘటన నుంచి నేర్చుకోవాల్సిందేంటి? అదే ఈ ‘వెల్త్’ స్టోరీ...రెండేళ్లలో బంగారం ధర 150 శాతానికి పైనే పెరిగింది. వెండి ధర ఐదు రెట్లు ఎగిసింది. మరి ఇంతటి విలువైన వస్తువుల్ని ఇంట్లో ఉంచటం సేఫేనా? పోనీ బ్యాంకు లాకర్లో పెడితే భద్రతకు గ్యారంటీ ఉంటుందా? వాస్తవానికి ఇల్లయినా, బ్యాంకయినా పటిష్ట రక్షణ చర్యలతోనే అక్కడ పెట్టిన వస్తువులకు భద్రత. ఒకవేళ లాకర్లో విలువైన వస్తువులను కోల్పోతే పరిస్థితేంటి? అందుకు బ్యాంక్లు పూర్తి బాధ్యత తీసుకోవా? సేఫ్ట్ లాకర్ విషయంలో కస్టమర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైనా ఉన్నాయా? అసలు లాకర్ ఎవరికి అవసరం? ఒకసారి చూద్దాం...లాకర్ చార్జీలు ఎంతంటే..→ ప్రాంతం, బ్యాంక్, లాకర్ పరిమాణం ఆధారంగా చార్జీలుంటాయి → సాధారణంగా చిన్న లాకర్కు వార్షిక చార్జీ రూ.1,000–3,000 → మధ్యస్థ లాకర్కు రూ.3– 6వేలు... పెద్ద లాకర్కు రూ.6 –12 వేలు → ఈ చార్జీపై జీఎస్టీని ... ఒప్పందానికి సంబంధించి స్టాంప్ డ్యూటీని చెల్లించాలి. → లాకర్ కోసం బ్యాంక్లు డిపాజిట్లు అడుగుతాయి. లాకర్ను క్లోజ్ చేసినప్పుడు వీటిని తిరిగి పొందొచ్చు. → వార్షిక చార్జీలు బకాయి పడి, కస్టమర్ స్పందించని సందర్భాల్లో లాకర్ బ్రేకింగ్కు అయ్యే చార్జీలను బ్యాంక్లు వసూలు చేస్తాయి.బ్యాంకులపై బాధ్యత లేదా..?→ లాకర్ల నిర్వహణకు సంబంధించి బ్యాంకులపై బాధ్యత ఎంత వరకు అన్నది కస్టమర్తో కుదుర్చుకునే ఒప్పంద పత్రాల్లో వివరంగా ఉంటుంది. → నిర్లక్ష్యం లేదా భద్రత వైఫల్యం కారణంగా లాకర్లలో ఉంచిన వాటికి నష్టం వాటిల్లితే అందుకు బ్యాంకులదే బాధ్యత. → చోరీ, దోపిడీ, అగ్ని ప్రమాదం, భవనం కూలిపోవడం లేదా బ్యాంక్ ఉద్యోగుల మోసం కారణంగా నష్టం ఏర్పడితే పరిహారం చెల్లించాల్సిందే. → ప్రకృతి విపత్తులు, భూకంపాలు, వరదల కారణంగా లాకర్లలో వాటికి నష్టం కలిగితే బ్యాంకులపై బాధ్యత ఉండదు. కానీ, బ్యాంక్ తగిన రక్షణ చర్యలు తీసుకోకపోవటం వల్ల ఈ సమయాల్లో నష్టం ఏర్పడితే అప్పుడు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. → లాకర్లోని వాటికి నష్టం జరిగినప్పటికీ.. బ్యాంకుల బాధ్యత పరిమితంగానే ఉంటుంది. లాకర్ వార్షిక అద్దె చార్జీలకు గరిష్టంగా 100 రెట్ల వరకే అవి చెల్లిస్తాయి. ఉదాహరణకు లాకర్లోని రూ.20 లక్షల విలువైన ఆభరణాలు కనిపించకుండాపోయాయనుకోండి. లాకర్ చార్జీ రూ.6,000 ఉంటే, అప్పుడు గరిష్టంగా రూ.6 లక్షల మొత్తాన్ని బ్యాంక్ చెల్లిస్తుంది. → వరుసగా మూడేళ్ల పాటు వార్షిక చార్జీలు చెల్లించకపోతే లేదా ఏడేళ్లపాటు లాకర్ను తెరవకపోతే నోటీసు జారీ చేసి.. మూడు నెలల తర్వాత లాకర్లను బ్యాంక్లు బ్రేక్ చేయాల్సి ఉంటుంది. నోటీసులకు స్పందన రానప్పుడు.. పేపర్ ప్రకటన ఇచ్చి, ఇద్దరు సాక్షుల సమక్షంలోనే ఈ పని చేయాలి. ఇన్సూరెన్స్తో రక్షణ → లాకర్లను సురక్షితంగా ఉంచేందుకు దాదాపు అన్ని బ్యాంక్లు గట్టి చర్యలు చేపడతాయి. అయినా, కొన్ని ఘటనల్లో కస్టమర్లకు నష్టం జరుగుతుంటుంది → కాబట్టి లాకర్లలో విలువైన ఆభరణాలు, డాక్యుమెంట్లు ఉంచే వారు వ్యక్తిగతంగా వాటికి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి. → బ్యాంకుల మాదిరి లాకర్ చార్జీకి గరిష్టంగా 100 రెట్ల వరకే పరిహారం అన్న పరిమితి బీమాలో ఉండదు. → బంగారం, వెండి ఆభరణాలు, విలువైన రాళ్లు, ఇతర విలువైన వస్తువులు, పత్రాలకు సైతం బీమా రక్షణ పొందొచ్చు. → దోపిడీ, దొంగతనాలు, బ్యాంకు ఉద్యోగుల నిర్లక్ష్యం లేదా మోసం, అగ్ని ప్రమాదాలు, పేలుడు, భూకంపాలు లేదా వరదలు కారణంగా లాకర్లోని వాటికి ఏర్పడే నష్టానికి బీమా పరిహారం పొందొచ్చు. → లాకర్లలో ఉంచిన కరెన్సీ నోట్లకు నష్టం వాటిల్లితే బీమా పరిహారం రాదు. → తుప్పు పట్టడం, చెద పురుగులు, వాతావరణంలో తేమ కారణంగా ఏర్పడే నష్టానికి కూడా బీమా పాలసీలో రక్షణ ఉండదు. ఇలాంటి లాకర్లుంటేనే భరోసా... → బ్యాంక్లు లాకర్లకు సంబంధించి సీసీటీవీ కెమెరా, అలారమ్ (హెచ్చరించే) సిస్టమ్లను ఏర్పాటు చేసుకోవాలి. → లాకర్లు సురక్షితంగా ఉండేలా భవన నిర్మాణం ఉండాలి. రాత్రిళ్లు తగినంత భద్రత ఉండేలా చర్యలు తీసుకోవాలి. → లాకర్ తెరిచిన ప్రతి సందర్భంలో ఖాతాదారుడి రిజిస్టర్ మొబైల్ నంబర్కు ఎస్ఎంఎస్ అలర్ట్ను పంపించాల్సి ఉంటుంది. → లాకర్కు సంబంధించి బ్యాంక్లకు ఉండే బాధ్యత ఎంత మేర? అనేది ఒప్పందంలో వివరంగా ఉండాలి. → నామినేషన్ సదుపాయం కలి్పంచాలి. ఒప్పందంపై సంతకాలు చేయించుకుని, కాపీని కస్టమర్కు సైతం అందించాలి.వీరికి పెద్దగా ఉపయోగం ఉండదు.. → కేవలం కొన్ని ఆభరణాలే ఉన్నా... వాటి విలువ తక్కువగా ఉన్నా.. → బ్యాంక్కు వెళ్లి లాకర్ నుంచి తీసుకొచ్చి, మళ్లీ లాకర్లో పెట్టడం వీలు పడని వారు.అసలు లాకర్లు ఎవరికి..? → అధిక విలువ కలిగిన ఆభరణాలున్నప్పుడు. ముఖ్యంగా వారసత్వంగా వచి్చన ఆభరణాలున్నవారికి అనుకూలం. → వ్యాపార లావాదేవీలకు సంబంధించి సున్నితమైన డాక్యుమెంట్లు ఉన్నప్పుడు. → ప్రాపర్టీ ఒరిజినల్ డాక్యుమెంట్లు, పార్టనర్íÙప్ డీడ్లు ఉన్నవారు. → పటిష్టమైన రక్షణ చర్యలు లేని అద్దె ఇళ్లలో నివసించే వారు. → ఇళ్లల్లో కేవలం వృద్ధులే ఉండే వారికి బ్యాంకు లాకర్లు ఎంతో ఉపయోగకరం. లాకర్లో వేటికి చోటు..? → బంగారం, వజ్రాభరణాలు → ప్రాపర్టీ క్రయ, విక్రయ దస్తావేజులు → వీలునామాలు, చట్టబద్ధమైన పత్రాలు → బాండ్ సరి్టఫికెట్లు, అరుదైన కలెక్షన్లునమోదు చేస్తే నయం...→ లాకర్లో ఏవేవి ఉంచుతున్నారనే విషయాన్ని ఒక రికార్డులో రాసి ఉంచుకోవటం మంచిది. → ఆభరణాలు, వాటి బరువు, వస్తువుల వివరాలు రాయండి. వీటి కొనుగోలు బిల్లులు, ఫొటోలు కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి. → లాకర్లో తీసి, పెడుతున్న ప్రతి సారీ వాటి వివరాలు తప్పకుండా నమోదు చేయాలి. → ఆభరణాలకు సంబంధించి విలువ నిర్ధారణ సరి్టఫికెట్లు దగ్గర ఉంచుకోవాలి. → లాకర్కు తప్పకుండా నామినేషన్ తీసుకోవాలి. అవసరమైనప్పుడు నామినీని అప్డేట్ చేసుకోవాలి. → ఏడాదిలో ఒకసారి అయినా లాకర్ను తెరిచి, మూయడం చేయాలి. → డాక్యుమెంట్లు తేమ కారణంగా దెబ్బతినే రిస్క్ ఉంటుంది. కనుక దెబ్బతినని విధంగా ప్యాక్ చేసి పెట్టాలి.వీటిని ఉంచకండి.. → దేశ, విదేశీ కరెన్సీ నోట్లు → హానికారక మెటీరియల్స్ → పాడైపోయే వస్తువులు → ప్రమాదకరమైన వస్తువులు → ఆయుధాలు, డ్రగ్స్, మందుగుండు సామగ్రి → చట్టవిరుద్ధమైనవి కూడా..నష్టం జరిగితే... → లాకర్లో ఉంచినవి దెబ్బతిన్నట్టు గుర్తించినా లేదా కనిపించక పోయినా బ్యాంక్ మేనేజర్కు లిఖిత పూర్వక ఫిర్యాదు ఇవ్వాలి. → బ్యాంక్ ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో అక్కడి వెళ్లి ఫిర్యాదు చేయాలి. → కస్టమర్ నిర్లక్ష్యం లేని సందర్భాల్లో జరిగిన నష్టానికి బ్యాంక్లు పరిహారం చెల్లించాల్సిందే. → బ్యాంక్లు పరిహారానికి నిరాకరిస్తే బ్యాంకింగ్ అంబుడ్స్మన్ను సంప్రదించొచ్చు. → అక్కడ న్యాయం జరగకపోతే జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ను సంప్రదించాలి. -
భారీగా పెరిగిన ఎగుమతులు.. జాబితాలో మారుతి టాప్!
ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి దేశీయ అమ్మకాల్లో తన హవా కొనసాగిస్తూనే.. ఎగుమతుల్లోనూ అగ్రస్థానంలో నిలిచింది. కంపెనీ ఎక్స్పోర్ట్స్ వార్షిక ప్రాతిపదికన 89 శాతం పెరిగాయి. గతేడాది జనవరిలో 26,781 యూనిట్లుగా ఉండగా తాజాగా 50,716 యూనిట్లకు చేరాయి.హ్యుందాయ్ ఎగుమతులు 21 శాతం పెరిగినప్పటికీ మొత్తం ఎగుమతుల మార్కెట్లో వాటా 20 శాతం నుంచి 18 శాతానికి పడిపోవడం గమనార్హం. అటు నిస్సాన్, ఫోక్స్వ్యాగన్ ఎగుమతులు కూడా 36 శాతం, 78 శాతం క్షీణించినట్లు సియామ్ గణాంకాల్లో వెల్లడైంది. భారత్ నుంచి మొత్తం ప్యాసింజర్ వెహికల్స్ ఎగుమతుల్లో తమ సంస్థ వాటా 66 శాతంగా ఉన్నట్లు మారుతి సుజుకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ భారతి తెలిపారు.ఈ ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో కంపెనీ దాదాపు 3.6 లక్షల ప్యాసింజర్ వాహనాలను ఎగుమతి చేసినట్లు వివరించారు. ఇవి మొత్తం పీవీల ఎగుమతుల్లో 48 శాతమని రాహుల్ చెప్పారు. పరిశ్రమ ఎక్స్పోర్ట్స్ 7 శాతం పెరగ్గా, తమ ఎగుమతులు 32 శాతం వృద్ధి చెందినట్లు పేర్కొన్నారు. తమ తొలి బీఈవీ అయిన ఈ–విటారా ఎగుమతులు గతేడాది ఆగస్టు నుంచి ప్రారంభం కావడం ఎక్స్పోర్ట్స్కి ఊతమిస్తోందని రాహుల్ తెలిపారు.ఇప్పటివరకు ప్రధానంగా యూరప్లోని 36 దేశాలకు దాదాపు 16,000 యూనిట్లను ఎగుమతి చేసినట్లు వివరించారు. 2030 నాటికి ఎగుమతుల్లో 30 శాతం వాటాను దక్కించుకోవాలని నిర్దేశించుకున్నట్లు హ్యుందాయ్ మోటర్స్ ఇండియా ఎండీ తరుణ్ గర్గ్ చెప్పారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో కొత్త అవకాశాలు లభించగలవని తెలిపారు. -
గూగుల్ పే, ఫోన్పే ట్రాన్సాక్షన్.. రూ.1000 దాటితే ఫీజులా?
దేశంలో యూపీఐ వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. ప్రతి రోజూ లెక్కకు మించిన నగదు లావాదేవీలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో రూ. 1000 కంటే ఎక్కువ మొత్తం యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తే సర్వీస్ ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతోంది. దీంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది.రూ.1000 కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తే.. సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తున్నారనే వార్తలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఖండించింది. ప్రస్తుతం వ్యక్తుల మధ్య లేదా వ్యక్తులు - వ్యాపారాలు మధ్య జరిగే యూపీఐ లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదని వెల్లడించింది. డిజిటల్ ఇండియా లక్ష్యాన్ని దెబ్బతీసే ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదు. ఇలాంటి వార్తలను ఎవరూ నమ్మొద్దని స్పష్టం చేసింది.ఇదిలా ఉండగా.. 2026–27 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం UPI & RuPay డెబిట్ కార్డ్ లావాదేవీలకు మద్దతు ఇవ్వడానికి రూ. 2,000 కోట్లు కేటాయించింది. చిరు వ్యాపారులపై ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్) భారం పడకుండా ఉండటానికి ఈ నిధులను కేటాయించనున్నారు. దీని ద్వారానే బ్యాంకులకు, పేమెంట్ అగ్రిగేటర్లకు ప్రోత్సాహకాలు ఇస్తోంది.ఇదీ చదవండి: ఆర్థిక భవిష్యత్తు: బంగారం కొనాలా.. వద్దా?ప్రస్తుతం భారతదేశంలో చాలావరకు యూపీఐ లావాదేవీలే జరుగుతున్నాయి. నేడు చిన్న బట్టి కొట్టు నుంచి పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ వరకు దాదాపు అందరూ ఆన్లైన్ పేమెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు రోజుకు ఒక లక్ష రూపాయల వరకు పేమెంట్ చేసుకునే వెసులుబాటు ఉంది. బిజినెస్ అకౌంట్ అయితే రోజుకి రూ. 5 లక్షల వరకు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. -
బ్యాంకులకు వరుస సెలవులు!
దేశంలోని వివిధ ప్రాంతాలలోని.. బ్యాంకు శాఖలు వచ్చే వారం మూడు రోజులు క్లోజ్లో ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫిబ్రవరి 18, 19, 20 తేదీలను సెలవు దినాలుగా ప్రకటించింది.ఫిబ్రవరి 18 (బుధవారం): టిబెటన్ నూతన సంవత్సరమైన లోసర్ను జరుపుకుంటారు. కాబట్టి ఈ సందర్భంగా సిక్కింలోని బ్యాంకులకు సెలవు. ఫిబ్రవరి 19 (గురువారం): ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మహారాష్ట్రలో బ్యాంకులకు సెలవు.ఫిబ్రవరి 20 (శుక్రవారం): రాష్ట్ర దినోత్సవం/రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అరుణాచల్ ప్రదేశ్ & మిజోరాంలలో బ్యాంకులకు సెలవు.అందుబాటులో ఆన్లైన్ సేవలుబ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పనిని.. సెలవులను గమనించి ముందుగానే పూర్తి చేసుకోవాలి. బ్యాంకుల ఫిజికల్ బ్రాంచీలు మూసివేసినప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్డ్రా వంటి ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వినియోగదారులు చెల్లింపులు చేయడం, బ్యాలెన్స్ చెకింగ్, డిజిటల్ ట్రాన్స్ఫర్లు చేసుకోవచ్చు. -
ఆర్థిక భవిష్యత్తు: బంగారం కొనాలా.. వద్దా?
కొన్ని రోజులకు ముందు భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు మెల్లగా తగ్గుముఖం పడుతున్నాయి. రేట్లు పెరుగుతున్నప్పుడు.. ఏ ధరకైనా కొనేయాలని ఎగబడిన కొంతమంది జనం.. ఇప్పుడు తగ్గుతున్నాయి కదా అని వేచి చూస్తున్నారు. ఇంకా తగ్గే అవకాశం ఉందేమో అని ఆలోచిస్తున్నారని ప్రముఖ ఇన్వెస్టర్, మార్కెట్ మాస్ట్రోలో డైరెక్టర్ 'అంకిత్ యాదవ్' తన ట్వీట్ ద్వారా వెల్లడించారు.ధరలు పెరిగినప్పుడు ఉత్సాహం చూపించారని, రేటు తగ్గుతున్నప్పుడు ప్రజలు మౌనం పాటిస్తున్నారని అన్నారు. ఇది మార్కెట్లో సహజమైన అంశం. అయితే ఇది పూర్తి స్థాయి క్రాష్ అని నిర్దారించలేము. ఇదొక స్లోడౌన్ దశ మాత్రమే.వెండి ధర భవిష్యత్తులో 100 డాలర్లు లేదా 120 డాలర్ల వరకు వెళ్లే అవకాశం ఉంది. దీనికి ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, డాలర్ బలహీనత, ద్రవ్యోల్బణం వంటి అంశాలు ప్రధాన కారణమవుతాయి.ప్రపంచం మొత్తం.. ప్రస్తుతం భారీ రుణభారంతో ఉంది. ముఖ్యంగా అమెరికా అప్పులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఫెడరల్ రిజర్వ్కు (Fed) అందుబాటులో ఉన్న ఎంపికలు చాలా తక్కువ. ఇలాంటి సమయంలో వారు ఎక్కువ లిక్విడిటీ అందించడం, అంటే మరింత డబ్బు ముద్రించడానికి సిద్దపడే అవకాశం ఉంది. ఇదే జరిగితే డాలర్ విలువ బలహీనపడే అవకాశం ఉంటుంది.డాలర్ విలువ ఎప్పుడైతే పడిపోతుందో.. బంగారం, వెండి ధరలు అమాంతం పెరుగుతాయి. కాబట్టి ఇప్పటికే బంగారం లేదా వెండి కలిగి ఉన్నవాళ్లు దాన్ని నిల్వ చేసుకోండి. ఇది మీ ఆర్థిక భవిష్యత్తుకు చాలా ఉపయోగపడుతుంది.ఇదీ చదవండి: వెండి ధర ఇంకా ఎంత పెరుగుతుందంటే..?ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే కొత్తగా గోల్డ్, సిల్వర్ కొనాలనుకుంటే.. తప్పకుండా ఓసారి ఆలోచించాల్సిందే. ఎందుకంటే.. ప్రస్తుతం ధరలు చౌకగా లేవు. ఎప్పుడైనా ఎక్కువ ధర వద్ద పెట్టుబడి పెట్టడం వల్ల మూలధన నష్టం వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి త్వరగా ధనవంతులు కావాలని తొందరపడకూడదు. కొంత ఓపిగ్గా ఎదురు చూడండి అని.. అంకిత్ యాదవ్ వివరించారు.🚨 Big update: Gold & Silver 🩶💛✅Globally, gold and silver are slowly coming out of the high‑volatility phase. The craze to buy silver at any price is clearly cooling off – one small slowdown or mini‑crash and people’s attention has already shifted.While prices were rising…— Ankit Yadav (@ankit_investing) February 14, 2026 -
రూ.125 కోట్ల డీల్.. ఇక్సిగోకి మెజారిటీ వాటాలు
స్పెయిన్కి చెందిన ట్రెయిన్ బుకింగ్ ప్లాట్ఫాం అయిన ఆన్లైన్ ట్రావెల్ సొల్యూషన్స్ (ట్రెనెస్)లో మెజారిటీ వాటాలను ట్రావెల్ అగ్రిగేటర్ ఇక్సిగో కొనుగోలు చేయనుంది. 60 శాతం వాటాల కొనుగోలు ప్రతిపాదనకు సంస్థ బోర్డు ఆమోదముద్ర వేసింది. ఈ డీల్ విలువ సుమారు రూ. 125 కోట్లుగా (11.70 మిలియన్ యూరోలు) ఉంటుంది.యూరోపియన్ ఓటీఏ మార్కెట్లో స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. మరోవైపు స్క్వాడ్ యాజ్ సరీ్వస్ అనే ఇంకో స్పానిష్ సంస్థలో కూడా 45.02 శాతం వాటాలను కొనుగోలు చేసే ప్రతిపాదనకు కూడా ఇక్సిగో బోర్డు ఆమోదం తెలిపింది. దీని విలువ రూ. 4.83 కోట్లుగా ఉంటుంది. ఎస్క్యూఏఏఎస్ సంస్థ ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ సంబంధ సేవలను అందిస్తోంది. -
పంచ్ ఈవీ ఫేస్లిఫ్ట్.. 593 కిమీ రేంజ్!
టాటా మోటార్స్ ఫిబ్రవరి 20న.. భారతదేశంలో పంచ్ ఫేస్లిఫ్టెడ్ ఎలక్ట్రిక్ కారును పరిచయం చేయనుంది. అయితే ఈ కారు లాంచ్ కావడానికి ముందే.. టెస్టింగ్ సమయంలో కనిపించింది. ఇది ఎంత రేంజ్ ఇస్తుందనే విషయం కూడా లీక్ అయింది. ఈ కథనంలో ఆ వివరాలు చూసేద్దాం.టాటా పంచ్ ఈవీ ఫేస్లిఫ్టెడ్ మోడల్ ఒక ఫుల్ ఛార్జ్పై 593.6కిమీ దూరం ప్రయాణిస్తుందని సమాచారం. దీన్నిబట్టి చూస్తే.. కారు చిన్నదే అయినా.. మంచి పర్ఫామెన్స్ ఇస్తుందని తెలుస్తోంది. దీని ధరలను కంపెనీ లాంచ్ సమయంలో వెల్లడించనుంది.టాటా పంచ్ ఈవీ ఫేస్లిఫ్టెడ్ మోడల్ 25 కిలోవాట్, 35 కిలోవాట్ అనే రెండు బ్యాటరీ ప్యాక్లను పొందుతుంది. చిన్న బ్యాటరీ 82 హార్స్ పవర్, 114 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తే.. పెద్ద బ్యాటరీ 122 హార్స్ పవర్, 190 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 45 కిలోవాట్ బ్యాటరీ ఎంపికలో కూడా లభించే అవకాశం ఉందని సమాచారం. దీనిపై అధికారిక సమాచారం అందుబాటులో లేదు.ఇదీ చదవండి: స్లిప్పర్స్ వేసుకుని డ్రైవింగ్ చేస్తే చలాన్ పడుతుందా?: గడ్కరీ క్లారిటీటాటా పంచ్ ఈవీ ఫేస్లిఫ్ట్.. బంపర్ క్లీనర్ లేఅవుట్తో రీడిజైన్ చేయబడి ఉండటం చూడవచ్చు. వై షేప్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు ఉన్నాయి. ఛార్జింగ్ స్లాట్ అదే విధంగా ఉంటుంది. ఎయిర్ డ్యామ్ & స్కిడ్ ప్లేట్ కూడా కొంత అప్డేట్ అయ్యాయి. వెనుక వైపు.. ఫుల్ ఎల్ఈడీ లైట్ బార్ కనిపిస్తుంది. -
దేశంలో తొలి రోడ్డు - రైలు సొరంగం
అస్సాంలో గోహ్పూర్ నుంచి నుమాలీగఢ్ వరకు నాలుగు లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ఫీల్డ్ కారిడార్ నిర్మాణానికి భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ విలువ ఏకంగా రూ. 18,662 కోట్లు. ఇందులో భాగంగా బ్రహ్మపుత్ర నది కింద దేశంలో తొలి రోడ్డు - రైలు సొరంగం నిర్మించనున్నారు. ఇది కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా.. ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్గా నిలవనుంది.ప్రస్తుతం.. NH715లోని నుమాలిఘర్ & NH-15లోని గోహ్పూర్ మధ్య దూరం 240 కి.మీ. ఇది NH-52లోని సిల్ఘాట్ సమీపంలోని కాలియాభంభోరా మీదుగా వెళుతుంది. ఈ ప్రయాణం నుమాలీగఢ్, కాజిరంగ నేషనల్ పార్క్, బిస్వనాథ్ టౌన్ వంటి ప్రాంతాల గుండా సాగుతుంది. కొత్త గ్రీన్ఫీల్డ్ కారిడార్ నిర్మాణంతో దూరం & ప్రయాణ సమయం చాలా తగ్గుతుంది.ఈ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. దీనిని ఇంజినీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ (EPC) మోడల్ ద్వారా అభివృద్ధి చేయనున్నారు. బ్రహ్మపుత్ర నదికి కింద నిర్మించే ఈ రోడ్డు - రైలు టన్నెల్ ద్వారా.. అస్సాం మాత్రమే కాకుండా అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ & ఇతర ఈశాన్య రాష్ట్రాలకు కూడా పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతుంది.ఇదీ చదవండి: స్లిప్పర్స్ వేసుకుని డ్రైవింగ్ చేస్తే చలాన్ పడుతుందా?: గడ్కరీ క్లారిటీఈ కారిడార్ 11 ఆర్థిక కేంద్రాలు, మూడు సామాజిక కేంద్రాలు, రెండు పర్యాటక కేంద్రాలు & ఎనిమిది లాజిస్టిక్ కేంద్రాలకు అనుసంధానంగా ఉంటుంది. అంతే కాకుండా నాలుగు ప్రధాన రైల్వే స్టేషన్లు, రెండు విమానాశ్రయాలు, రెండు అంతర్గత జలమార్గాలతో కూడిన మల్టీ మోడల్ కనెక్టివిటీని ఇది బలోపేతం చేస్తుంది. ఇది సరుకు రవాణా సామర్థ్యం పెంచడానికి మాత్రమే కాకుండా.. ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది. -
దేశంలోనే టాప్ 5 టోల్ ప్లాజాలు.. అత్యధిక వసూళ్లు
భారతదేశంలో జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేలపై గత ఐదేళ్లలో (2020-21 నుంచి 2024-25 వరకు) సుమారు రూ. 2.27 లక్షల కోట్ల టోల్ వసూళ్లు నమోదయ్యాయి. ఈ వివరాలను కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల రాజ్యసభలో వెల్లడించింది. అయితే టాప్ టోల్ ప్లాజాల వివరాలు 2019-20 నుంచి 2023-24 వరకే అందుబాటులో ఉన్నాయి. ఇందులో టాప్ 5 టోల్ ప్లాజాల గురించి తెలుసుకుందాం. -
అమెరికా-ఇరాన్ యుద్ధం?.. స్టాక్ మార్కెట్లలో టెన్షన్!
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం సంభవించే అవకాశంపై అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళన నెలకొంది. గత సంవత్సరం ‘మిడ్ నైట్ హామర్ ఆపరేషన్’తో పోలిస్తే, ఈసారి అమెరికా మరింత వ్యూహాత్మక సైనిక చర్యలకు సిద్ధమవుతోంది. ఈ ప్రాంతంలో యూ.ఎస్. విమాన వాహక నౌక బృందాన్ని మోహరించినప్పటి నుంచి, స్థానిక యూఎస్ శిబిరాల్లో కూడా సన్నాహాలు కట్టుదిట్టంగా జరుగుతున్నాయి.అమెరికా దళాలు వారాలపాటు సైనిక కార్యకలాపాలకు సన్నద్ధమవుతున్నాయని సైనిక వర్గాలు అంతర్జాతీయ మీడియాకు అనామకంగా తెలియజేశాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊ అనడమే ఆలస్యం.. రంగంలోకి దిగి ఇరాన్పై దాడులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.శాంతి చర్చలు ఫలించేనా?ఇక ఇరాన్-అమెరికా మధ్య రెండో విడత శాంతి చర్చలు జెనీవాలో జరగనుండగా, ఈ నెల 17న ఈ చర్చలు ఒమన్ మధ్యవర్తిత్వంతో జరుగుతాయని భావిస్తున్నారు. ఇరాన్ తన అణు పరీక్షలను ఆపకపోతే “సైనిక చర్యలు తప్పవు” అని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. అయితే, ఇరాన్ తన అణు, క్షిపణి కార్యక్రమాలను ఆపే ఎటువంటి ప్రణాళికలు లేవని ప్రకటించింది. అంతే కాకుండా, మధ్యప్రాచ్యంలోని అమెరికా స్థావరాలపై దాడి జరిగితే, ప్రతీకారం తప్పనిసరిగా జరిగుతుందని హెచ్చరిస్తోంది. ఇలా పరిస్థితులు తీవ్రమైతే, ఈ ప్రాంతంలో యుద్ధం విస్తరించే అవకాశం ఉంది. దీంతో ప్రపంచం అంతటా ముడి చమురు, బంగారం, స్టాక్ మార్కెట్లు ప్రభావితమవుతాయి.చమురు ధరలు పెరిగే అవకాశంఇదిలా ఉండగా, ఇరాన్పై ఆర్థిక ఆంక్షలను కఠినతరం చేయాలని ఇజ్రాయెల్, అమెరికా నిర్ణయించాయి. ఇరాన్-చైనా చమురు అమ్మకాలపై అమెరికా దృష్టి సారించింది. ప్రస్తుతం ఇరాన్ చమురు అమ్మకాలలో 80 శాతం చైనాకు జరుగుతున్నాయి. దీన్ని నివారించగలిగితే ఇరాన్ ఆర్థికంగా మరింత నాశనం అవుతుందని ఇరు దేశాలు అభిప్రాయపడుతున్నాయి. చైనాపై మరిన్ని సుంకాలు విధించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అదే జరిగితే, అరుదైన లోహాల ఎగుమతిపై చైనా మళ్లీ ఆంక్షలు విధిస్తుంది. ఇది యూఎస్-చైనా సంబంధాలను మరింత దిగజార్చుతుంది. ప్రధాన చమురు ఉత్పత్తిదారు అయిన ఇరాన్ నుంచి ముడి చమురు ఆగిపోతే మార్కెట్లో చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది.బంగారం, వెండి ధరలపై ప్రభావంగత వారం హెచ్చుతగ్గులకు గురైన బంగారం, వెండి ధరలకు రాబోయే రోజుల్లో ఇరాన్-అమెరికా శాంతి చర్చలు కీలకం. అమెరికాలో ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కావడంతో బంగారానికి కొత్త డిమాండ్ ఏర్పడింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్ కు 5,041 డాలర్ల వద్ద ముగిసింది. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల భయాల మధ్య ధరలు మరింత పెరుగుతాయని మార్కెట్లు అంచనా వేస్తున్నాయి. -
కాపర్ మరో సిల్వర్ కానుందా?.. సంక్షోభం ఆసన్నమైందా?
దేశీయంగా, అంతర్జాతీయంగా రాగి మార్కెట్పై ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి. 2025లో వెండి ధరలు 150 శాతం వరకు ఎగసిన నేపథ్యంలో, రాగి కూడా అదే బాట పట్టే అవకాశముందా అన్న ప్రశ్న ఇన్వెస్టర్లలో చర్చనీయాంశంగా మారింది.ఉత్పత్తిలో హెచ్చుతగ్గులు2026 ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం, రాగి ఉత్పత్తిలో స్థిరత్వం కనిపించడం లేదు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో తాత్కాలిక దేశీయ రాగి ఉత్పత్తి 3.33 మిలియన్ టన్నులు. 2023–24లో ఇది 3.78 మిలియన్ టన్నులకు పెరిగింది. అయితే 2024–25లో మళ్లీ 3.56 మిలియన్ టన్నులకు పడిపోయింది.రాగి సాంద్రత (కాన్సన్ట్రేట్) ఉత్పత్తిలో కూడా ఇదే ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. 2022–23లో 1,12,745 టన్నులు ఉండగా 2023–24లో 1,25,230 టన్నులకు పెరిగింది. కానీ, 2024–25లో 1,05,012 టన్నులకు క్షీణించింది.తగ్గుతున్న ధాతు గ్రేడ్లురాగి గనుల్లో సగటు ధాతు గ్రేడ్లు క్రమంగా పడిపోతున్నాయి. ప్రస్తుతం అనేక గనులు 0.4–0.6 శాతం మాత్రమే దిగుబడితో పనిచేస్తున్నాయి. అంటే ఒక టన్ను రాగి కోసం వందల టన్నుల రాతిని తవ్వి ప్రాసెస్ చేయాల్సి వస్తోంది. దీంతో ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్నాయి.ఆర్థిక సర్వే ఉదాహరణగా 1 గిగావాట్ విండ్ టర్బైన్ ప్రాజెక్ట్ను పేర్కొంది. దీనికి సుమారు 2,866 టన్నుల రాగి అవసరం. 0.6 శాతం దిగుబడి వద్ద దాదాపు 4.7 లక్షల టన్నుల రాగి ధాతువును ప్రాసెస్ చేయాల్సి ఉంటుందని అంచనా. వ్యర్థ రాయి కలుపుకుంటే మొత్తం తరలింపు 10 లక్షల నుంచి 20 లక్షల టన్నుల వరకు ఉండొచ్చని నివేదిక చెబుతోంది.పెరుగుతున్న డిమాండ్రాగి వినియోగం విస్తృతంగా పెరుగుతోంది. వైర్లు, మోటార్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బైన్లు, డేటా సెంటర్ల శీతలీకరణ వ్యవస్థలు ఇలా.. ప్రతి రంగంలో రాగి కీలక పాత్ర పోషిస్తోంది.ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మౌలిక సదుపాయాల విస్తరణతో రాగిపై అదనపు ఒత్తిడి ఏర్పడుతోంది. పవర్ కేబుల్స్, ట్రాన్స్ఫార్మర్లు, స్విచ్గేర్, జీపీయూలు, సర్వర్లను నడిపే పవర్ డెలివరీ వ్యవస్థలకు విస్తృతంగా రాగి అవసరమవుతోంది.ధరల దిశ2025లో కీలక లోహాల్లో రాగి ధరలు గణనీయంగా పుంజుకున్నాయి. మెటల్ ధరల సూచీలో ఇది సంవత్సరానికి 32 శాతం పెరుగుదల నమోదు చేసింది. సరఫరా పరిమితులు, పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో రాబోయే కాలంలో ధరలపై మరింత ఒత్తిడి ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.భవిష్యత్తు ఎలా?వెండి లాగా 150 శాతం పెరుగుతుందా అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేకపోయినా, రాగి మార్కెట్లో బుల్లిష్ సంకేతాలు కనిపిస్తున్నాయి. శక్తి పరివర్తన, విద్యుతీకరణ, డిజిటల్ మౌలిక సదుపాయాల విస్తరణ.. ఈ మూడు ధోరణులు కొనసాగితే రాగి ధరలు మధ్యకాలంలో మరింత ఎగిసే అవకాశాన్ని నిపుణులు కొట్టిపారేయడం లేదు.మొత్తంగా, రాగి ఇక సాధారణ పారిశ్రామిక లోహం మాత్రమే కాదు.. భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థకు కీలక మౌలిక వనరుగా మారుతోంది. సరఫరా-డిమాండ్ అసమతౌల్యం కొనసాగితే మార్కెట్లో కొత్త రికార్డులు నమోదయ్యే అవకాశం ఉంది!. -
ఇంటి విలువను పెంచే కొత్త రకం కిచెన్..
ఇంట్లో వంట గది స్థానం ప్రత్యేకం.. ఇంటిల్లిపాది ఆరోగ్యానికి, శ్రేయస్సుకు, సానుకూల శక్తికి బీజం పడేది ఇక్కడే. అందుకే వాస్తుశాస్త్రంలోనూ వంట గదికి ప్రత్యేక స్థానాన్ని కేటాయించారు. అలాంటి కిచెన్ రూమ్ అందంగా, ఆకర్షణీయంగా, శుభ్రంగా ఉండాలి కదా.. అందుకే మార్కెట్లో రకరకాల మాడ్యులర్ కిచెన్స్ అందుబాటులోకి వచ్చాయి. కానీ, కలప, వెదురుతో కిచెన్ వార్డ్ రోబ్స్ తయారు చేస్తుండటంతో కొంతకాలం తర్వాత మన్నిక తగ్గి సమస్యలు ఎదురవుతున్నాయి. దీనికి పరిష్కారమే ‘స్టెయిన్ లెస్ స్టీల్ మాడ్యులర్ కిచెన్స్’! సంప్రదాయ వంట గదులకు కాలం చెల్లింది. ఇప్పటివరకు లగ్జరీ హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, బార్లు, కాఫీ షాప్స్లో వినియోగించిన స్టెయిన్లెస్ స్టీల్ కిచెన్స్ను ఇప్పుడు ఇళ్లలోనూ ఏర్పాటు చేస్తున్నారు. ఇంటీరియర్ డిజైనింగ్లో స్టెయిన్లెస్ స్టీల్ భాగమైపోయింది. ఇవి సాటిలేని మన్నిక, పరిశుభ్రత, సొగసైన, ఆధునిక సౌందర్యాన్ని అందిస్తాయి. నివాస, వాణిజ్య సముదాయాలు రెండింటిలోనూ అనువైనవి.నిర్వహణ సులువు.. స్టెయిన్లెస్ స్టీల్ వంట గదుల వేడిని గ్రహించవు. తుప్పు నిరోధక గుణాన్ని కలిగి ఉంటాయి. పైగా వీటి ఉపరితలాలపై రంధ్రాలు ఉండకపోవడంతో ద్రవాలు, రసాయనాలు, సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా వంటివి లోపలికి వెళ్లవు. దీంతో ఎప్పుడూ మరకలు లేకండా పరిశుభ్రంగా ఉంటుంది. వీటి నిర్వహణ చాలా సులువు. ప్రత్యేకమైన క్లీనర్లు అవసరం లేకుండా తేలికపాటి సబ్బు, నీటితో శుభ్రం చేయవచ్చు. ఇవి అగ్ని నిరోధక శక్తిని కలిగి ఉంటుంది. అన్ని రకాల వాతావరణాలకు అనుకూలమైనవి. నీరు పడితే ఉబ్బడం, అధిక వేడికి కాలిపోవడం, కరగడం జరగదు. ఈ స్టీల్కు రంధ్రాలు ఉండవు కాబట్టి తెగుళ్లు, చెదపురుగులు పట్టవు.పర్యావరణ అనుకూలమైనవి.. సాధారణ ఇళ్లతో పోలిస్తే స్టెయిన్లెస్ స్టీల్ కిచెన్ ఉండే ఇంటి విలువ కొంత మెరుగ్గా ఉంటుంది. ఉన్నతశైలి అనుభూతిని కలిగిస్తుంది. ఇది పర్యావరణ అనుకూలమైనది. స్టయిన్లెస్ స్టీల్తో తరుచూ కిచెన్ కౌంటర్ టాప్లు, క్యాబినెట్ల తయారీ కోసం వినియోగిస్తారు. అయితే వీటి ఎంపికలో జాగ్రత్తలు అత్యవసరం. కేవలం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) సర్టిఫికేషన్, ఇండియన్ స్టాండర్డ్ ఇనిస్టిట్యూషన్(ఐఎస్ఐ) మార్క్ ఉన్న ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలి. -
రిలయన్స్కి వెనెజులా చమురు
న్యూఢిల్లీ: వెనెజులా నుంచి ముడి చమురు నేరుగా దిగుమతి చేసుకునేందుకు దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్కి అమెరికా నుంచి లైసెన్సు లభించింది. కంపెనీకి చెందిన జామ్నగర్ రిఫైనరీకి అనువైన ఈ క్రూడాయిల్ని డిస్కౌంటు రేటుకు పొందడం వల్ల రిలయన్స్ రిఫైనింగ్ మార్జిన్లు మరింత మెరుగుపడతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.ఇప్పటివరకు ట్రేడర్ల ద్వారా మాత్రమే విక్రయించడానికి అమెరికా అనుమతిస్తూ వస్తోంది. తాజాగా జనరల్ లైసెన్సు ఇవ్వడం వల్ల ఇప్పటికే ఆయిల్ని వెలికితీసిన సంస్థ నుంచి నేరుగా కొనుగోలు చేసేందుకు వీలవుతుంది. వాస్తవానికి 2019–20 వరకు వెనెజులా నుంచి రిలయన్స్ క్రూడాయిల్ని కొనుగోలు చేసింది. ఆ దేశంపై అమెరికా ఆంక్షలతో కొన్నాళ్లు నిలిపివేసి, వాటిని సడలించాక 2024లో కొనుగోలు చేసింది.మళ్లీ ఈ ఏడాది ట్రేడర్ల ద్వారా వెనెజులా ఆయిల్ అమ్మకాలు ప్రారంభమయ్యాక 2 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురును కొనుగోలు చేసింది. వెనెజులా అధ్యక్షుడు నికొలస్ మదురోను బంధించిన తర్వాత ఆ దేశ ఇంధన రంగంపై ఆంక్షలను అమెరికా సడలించింది. -
లెన్స్కార్ట్కు భారీ లాభాలు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో కళ్లద్దాల కంపెనీ లెన్స్కార్ట్ సొల్యూషన్స్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం భారీగా దూసుకెళ్లి రూ. 133 కోట్లకు చేరింది.కొత్త కస్టమర్లు జత కలవడం, మార్జిన్లు మెరుగుపడటం, అంతర్జాతీయ బిజినెస్ పుంజుకోవడం ఇందుకు సహకరించాయి. గతేడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 2 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 38 శాతం జంప్చేసి రూ. 2,308 కోట్లను తాకింది. గత క్యూ3లో రూ. 1,669 కోట్ల టర్నోవర్ అందుకుంది. దేశీ ఆదాయం 40 శాతం, విదేశీ ఆదాయం 33 శాతం చొప్పున ఎగసినట్లు కంపెనీ పేర్కొంది.ఈ కాలంలో పన్నుకు ముందు లాభం(పీబీటీ) రూ. 48 కోట్ల నుంచి మూడు రెట్లు బలపడి రూ. 161 కోట్లకు చేరింది. విదేశీ మార్కెట్ల నుంచి రూ. 33 కోట్ల పీబీటీ ఆర్జించగా.. గత క్యూ3లో ఇది రూ. 42 కోట్ల నష్టంగా నమోదైంది. -
రుణాలపై టాటా క్యాపిటల్ అవగాహన కార్యక్రమాలు
ముంబై: ‘సవాల్ కరో, ఫిర్ లోన్ లో’ పే రిట రుణాలపై అవగాహనను పెంచేందుకు ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆర్థిక సేవల సంస్థ టాటా క్యాపిట ల్ వెల్లడించింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం రుణాల ప్రక్రియ సరళతరంగా మారి లోన్స్ మరింత అందుబాటులోకి వచ్చాయని టాటా క్యాపిటల్ ఎండీ రాజీవ్ సబర్వాల్ తెలిపారు.ఈ నేపథ్యంలో పూర్తి సమాచారంతో రుణం విషయంలో హడావిడి పడకుండా, సరై న ప్రశ్నలు వేసుకుని, తమ ఆర్థిక బాధ్య తలను పూర్తిగా అర్థం చేసుకుని ముందడుగు వేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. దీనితో దేశీయంగా రుణ వ్యవస్థ పటిష్టమవుతుందన్నారు. -
టాప్ గేర్లో వాహన విక్రయాలు
న్యూఢిల్లీ: దేశీయంగా జనవరిలో ప్యాసింజర్ వాహనాలు (పీవీ), టూ–వీలర్లు, త్రీ–వీలర్ల టోకు అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. గతేడాది జనవరితో పోలిస్తే రెండంకెల స్థాయిలో వృద్ధి చెందాయి. భారతీయ ఆటోమోబైల్స్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ గణాంకాల ప్రకారం పీవీల టోకు అమ్మకాలు 12.6 శాతం వృద్ధితో 4,49,616 యూనిట్లకు చేరాయి. గతేడాది జనవరిలో ఇవి 3,99,386 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇక మొత్తం డీలర్లకు ద్విచక్ర వాహనాల డిస్పాచ్లు 26.2 శాతం వృద్ధితో 15,26,218 యూనిట్ల నుంచి 19,25,603 యూనిట్లకు పెరిగాయి. మొత్తం త్రీ–వీలర్ల అమ్మకాలు కూడా 30.2 శాతం పెరిగి 58,167 యూనిట్ల నుంచి 75,725 యూనిట్లకు చేరాయి. వివిధ కేటగిరీలన్నీ కలిపి మొత్తం టోకు విక్రయాలు వార్షికంగా 23.5 శాతం వృద్ధితో 24,50,944 యూనిట్లకు చేరాయి. గతేడా ఈ వ్యవధిలో వీటి పరిమాణం 19,83,771 యూనిట్లు. కొత్త సంవత్సరం సానుకూలంగా ప్రారంభమైందని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ తెలిపారు. జీఎస్టీ రేట్ల తగ్గింపుతో గత త్రైమాసికంలో నమోదైన అమ్మకాల జోరు తాజాగా జనవరిలో కూడా కొనసాగిందని ఆయన వివరించారు. కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన చర్యలు దేశీయంగా తయారీ రంగాన్ని బలోపేతం చేయనుందని, ప్రస్తుత పాలసీలోని సానుకూలాంశాలు కూడా తోడైతే మధ్యకాలికంగా ఆటోపరిశ్రమ వృద్ధికి తోడ్పడతాయని, అలాగే దీర్ఘకాలికంగా ప్రయోజనాలు కూడా లభించగలవని మీనన్ చెప్పారు. ఎగుమతులు జోరు మూడు కేటగిరీల్లోనూ ఎగుమతులు రెండంకెల స్థాయిలో వృద్ధి చెందాయి. మొత్తం పీవీల ఎగుమతులు 33.4 శాతం వృద్ధితో 57,585 యూనిట్ల నుంచి 76,822 యూనిట్లకు చేరాయి. ద్విచక్ర వాహనాల ఎక్స్పోర్ట్స్ 3,80,528 యూనిట్ల నుంచి 20 శాతం పెరిగి 4,56,435 యూనిట్లకు పెరిగాయి. అదే విధంగా మొత్తం త్రీ–వీలర్ల ఎగుమతులు 54.6 శాతం పెరిగాయి. 23,859 యూనిట్ల నుంచి 36,879 యూనిట్లకు చేరాయి. వివిధ విభాగాలవ్యాప్తంగా మొత్తం వాహనాల ఎగుమతులు 4,62,500 యూనిట్ల నుంచి 23.5 శాతం వృద్ధి చెంది 5,71,066 యూనిట్లకు పెరిగాయి. -
బ్రయాన్స్టన్తో బొండాడ ఇంజినీరింగ్ ఎంవోయూ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హరిత విద్యుత్ ఆధారిత డేటా సెంటర్ ప్యాకేజీలను సంయుక్తంగా అభివృద్ధి చేసే దిశగా బొండాడ ఇంజినీరింగ్ (బీఈఎల్), దుబాయ్కి చెందిన బ్రయాన్స్టన్ రెన్యువబుల్స్ ఎఫ్జెడ్సీవో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. భారత్తో పాటు నిర్దిష్ట అంతర్జాతీయ మార్కెట్లలో ఈ సెంటర్లను ఏర్పాటు చేయనున్నాయి. మరోవైపు మహారాష్ట్ర, తమిళనాడులో 69.51 ఎండబ్ల్యూపీ సామర్థ్యంతో సోలార్ పవర్ ప్రాజెక్టులను జనవరిలో విజయవంతంగా వినియోగంలోకి తెచి్చనట్లు కంపెనీ తెలిపింది. పారడైమ్ ఐటీ, మహాజెన్కో, ఎన్ఎల్సీ ఇండియా తదితర క్లయింట్ల కోసం ఈ ప్రాజెక్టులను నిర్మించినట్లు వివరించింది. -
‘బంగారం బాట’లో యువ భారతం
న్యూఢిల్లీ: బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నా... యువ భారతం బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. దేశవ్యాప్తంగా 18–39 ఏళ్ల మధ్య వయసు కలిగిన 5,000 మంది నుంచి సేకరించిన అభిప్రాయాలతో ‘స్మిట్టెన్ పల్స్ఏఐ’ ఒక నివేదిక విడుదల చేసింది. సర్వేలో పాల్గొన్నవారిలో 62 శాతం మంది పెట్టుబడుల్లో తొలి ప్రాధాన్యతం బంగారానికి ఇచ్చారు. గతంలో బంగారం కొనాలంటే ఇంటి పెద్దల సలహా తీసుకునేవారు. కానీ ఇప్పుడు 66.7% మంది యువత స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయిదు గ్రాముల లోపే పసిడి కొన్నామని 62% మంది వెల్లడించారు. 2 గ్రాముల లోపు కొనుగోలు చేసిన వాళ్లు 27.5% మంది కాగా.. 2–5 గ్రాముల మధ్య కొనుగోలు చేసిన వాళ్లు 34.4% మంది ఉన్నారు. → తమ మొదటి జీతం/సంపాదనతో తొలిసారి 24% మంది పసిడిని కొనుగోలు చేశారు. కేవలం పెట్టుబడిగా పసిడిని కొనుగోలు చేసినట్లు 23.9% మంది వెల్లడించారు. ఆర్థిక అనిశ్చితి సందర్భాల్లో, బ్యాంకు సేవింగ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీలతో పోలిస్తే 65.7% మంది బంగారమే అత్యంత సురక్షితమైన సాధనంగా భావిస్తున్నామని తెలిపారు. సుమారు 65.7% మంది స్టాక్స్, మ్యూచువల్ ఫండ్ల (ఎంఎఫ్) కంటే పసిడినే అత్యంత సురక్షిత పెట్టుబడి మార్గంగా భావిస్తున్నారని సర్వేలో తేలింది. → ఒకవేళ రూ.25,000 నగదు రూపంలో ఉంటే.., పసిడి కొంటామని 61.9% మంది పేర్కొన్నారు. మ్యూచువల్ ఫండ్లకు 16.6%, డిపాజిట్లు 13%, షేర్లు 6.6%, క్రిప్టో 1.9% మంది ఆసక్తి చూపారు. రత్నాలు, ఆభరణ ఎగుమతులు డీలా గత నెల(జనవరి)లో రత్నాలు, బంగారు ఆభరణ ఎగుమతులు డీలా పడ్డాయి. 2025 జనవరితో పోలిస్తే 6% క్షీణించి 2,239 మిలి యన్ డాలర్లకు పరిమితమయ్యాయి. 2025 జనవరిలో ఇవి 2,376 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. రత్నాలు, ఆభరణ ఎగుమతుల ప్రో త్సాహక సమితి(జీజేఈపీసీ) వివరాలివి. ప్రపంచ వాణిజ్య సవాళ్లు, కీలక మార్కెట్లలో టారిఫ్ ఒత్తిళ్లు ప్రభావం చూపాయి. ఈ బాటలో ప్రస్తు త ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి 10 నెల ల(ఏప్రిల్ 2025–జనవరి 2026)నూ ఇవి నామమాత్ర వెనకడుగు వేశాయి. 0.6% తగ్గి 23,186 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గతే డాది(2024–25) ఇదే కాలంలో ఇవి 23,335 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ప్రధా నంగా దేశీ ఆభరణ ఎగుమతులకు ప్రధాన మార్కెట్గా నిలిచే యూఎస్కు షిప్మెంట్స్ 45% నీరసించడం ప్రభావం చూపింది. -
డిజిటల్ పారదర్శకతకు అంతర్జాతీయ కూటమి
న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో విశ్వసనీయ సాంకేతిక వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఆఫ్రికా, ఆసియా, యూరప్, ఉత్తర అమెరికా ప్రాంతాలకు చెందిన 15 ప్రపంచ దిగ్గజ టెక్నాలజీ కంపెనీలు ‘ట్రస్టెడ్ టెక్ అలయన్స్ (టీటీఏ)’ పేరుతో కూటమిని ఏర్పాటు చేశాయి. జర్మనీలో జరిగిన మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ అలయన్స్ను ప్రకటించాయి. డిజిటల్ వ్యవస్థకు ఆధారమైన కనెక్టివిటీ, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెమీకండక్టర్లు, సాఫ్ట్వేర్, కృత్రిమ మేధ (ఏఐ) తదితర అన్ని విభాగాలను ఏకతాటిపైకి తీసుకురావడంతో ఈ విభాగాల్లో పారదర్శకత, భద్రత, గవర్నెన్స్కు సంబంధించిన ఉమ్మడి ప్రమాణాలు రూపొందించడమే ప్రధాన ఉద్దేశమని అలయన్స్ సంయుక్త ప్రకటనలో పేర్కొంది. అమెజాన్ వెబ్ సరీ్వసెస్, ఆంథ్రోపిక్, కసావా టెక్నాలజీస్, కోహిర్, ఎరిక్సన్, గూగుల్ క్లౌడ్, హాన్వా గ్రూప్, జియో ప్లాట్ఫామ్స్, మైక్రోసాఫ్ట్, నోకియా, ఎన్స్కేల్, ఎన్టీటీ, రాపిడస్, సాబ్, సాప్ తదితర సంస్థలు ఈ అలయన్స్కు స్థాపక సభ్యులుగాఉన్నాయి. డిజిటల్ విశ్వసనీయతకు అంతర్జాతీయ కృషిప్రపంచ దేశాల మధ్య భౌగోళిక–రాజకీయ విభజన పెరుగుతున్న నేపథ్యంలో ‘ట్రస్టెడ్ టెక్ అలయన్స్’ను ఏర్పాటు చేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే సాంకేతిక మార్పులు వేగంగా జరుగుతున్న పరిస్థితుల్లో డిజిటల్ విశ్వసనీయతను బలోపేతం చేయడమే ఈ కూటమి ప్రధాన ఉద్దేశమని తెలిపారు. కృత్రిమ మేధ (ఏఐ) వ్యవస్థలు శరవేగంగా అభివృద్ధి చెందుతుండగా, డిజిటల్ మౌలిక సదుపాయాలు జాతీయ భద్రత, ఆర్థిక పోటీ సామర్థ్యాలతో మరింత అనుసంధానం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో టెక్నాలజీ సప్లయిదారుల విషయంలో అధిక స్థాయి విశ్వసనీయత అవసరమని ప్రభుత్వాలు కంపెనీలు కోరుకుంటున్నాయని అలయన్స్ వెల్లడించింది. టెక్నాలజీ ఏ దేశానికి చెందినదన్న అంశం కంటే, ఉమ్మడి ఆపరేటింగ్ ప్రమాణాల ఆధారంగానే నమ్మకాన్ని నిర్మించవచ్చని చూపించేందుకే టీటీఏ ఫ్రేమ్వర్క్ను రూపొందించినట్లు పేర్కొంది. అయిదు నిర్దిష్ట సూత్రాలకు అంగీకారం అలయన్స్ సభ్య సంస్థలు ఐదు కీలక సూత్రాలకు అంగీకారం తెలిపాయి. (1). పారదర్శక కార్పొరేట్ పాలన, నైతిక ప్రవర్తన(2). కార్యకలాపాల్లో స్పష్టత, సురక్షిత డెవలప్మెంట్, స్వతంత్ర అసెస్మెంట్ (3). బలమైన సప్లై చైన్, భద్రతా పర్యవేక్షణ (4). ఓపెన్, సహకారాత్మక, సమగ్ర, స్థిరమైన డిజిటల్ ఎకోసిస్టమ్ (5). చట్టపాలనకు, డేటా పరిరక్షణకు గౌరవం. ఈ అయిదు సూత్రాల ప్రకారం టెక్నాలజీ అభివృద్ధి నుంచి వినియోగం వరకు ప్రతి దశలోనూ భద్రత అమలు చేయాల్సి ఉంటుంది.అలయన్స్లో జియో ప్లాట్ఫామ్స్ భాగస్వామ్యంఅలయన్స్లో భారతీయ సంస్థ జియో ప్లాట్ఫామ్స్ భాగస్వామ్యం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘డిజిటల్ ఇండియా’, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాలకు అనుగుణంగా కనెక్టివిటీ, క్లౌడ్, సెమీకండక్టర్లు, ఏఐ వంటి కీలక రంగాల్లో గ్లోబల్ స్థాయి ఉమ్మడి ప్రమాణాల రూపకల్పనలో భారత్ పాత్రను ఇది మరింత బలోపేతం చేయనుంది. టెక్నాలజీ ఏ దేశానికి చెందినదన్న అంశం కంటే, పారదర్శకత–భద్రత ఆధారిత ప్రమాణాలే విశ్వాసానికి పునాది కావాలన్న దృక్పథం భారత్కు వ్యూహాత్మకంగా అనుకూలంగా మారనుందని జియో ప్లాట్ఫామ్స్ సీఈవో కిరణ్ థామస్ తెలిపారు. -
ఇక మలేసియాలోనూ యూపీఐ పేమెంట్స్
న్యూఢిల్లీ: ఇకపై భారత్, మలేసియా మధ్య క్యూఆర్ మర్చంట్ చెల్లింపులకు తెరలేవనుంది. ఇందుకు అనుగుణంగా ఎన్పీసీఐ అంతర్జాతీయ విభాగం ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్(ఎన్ఐపీఎల్) తాజాగా పేమెంట్స్ నెట్వర్క్ మలేసియా ఎస్డీఎన్ బీహెచ్డీ(పేనెట్)తో చేతులు కలిపింది. పేనెట్.. మలేసియావ్యాప్త పేమెంట్స్ నెట్వర్క్ సంస్థకావడంతో రెండు దేశాల మధ్య క్యూఆర్ ఆధారిత చెల్లింపులకు వీలు చిక్కనుంది. అయితే దశలవారీగా ఇందుకు తెరతీయనున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) ఒక ప్రకటనలో వెల్లడించింది. తొలి దశలో భాగంగా మలేసియా సందర్శించే దేశీ ప్రయాణికులు తమ యూపీఐ యాప్ల ద్వారా చెల్లింపులు చేపట్టేందుకు వీలు కలి్పంచనున్నట్లు తెలియజేసింది. డూయిట్నౌ క్యూఆర్ అనుమతించే టచ్పాయింట్ల ద్వారా ఇందుకు వీలుంటుందని పేర్కొంది. పేనెట్ నిర్వహించే డూయిట్నౌ మలేసియాలో ప్రామాణిక క్యూఆర్గా తెలియజేసింది. తదుపరి దశలో మలేసియన్లు సైతం భారత్ సందర్శనలో డూయిట్నౌ యాప్స్ ద్వారా యూపీఐ క్యూఆర్ కోడ్ సేవలను వినియోగించుకోవచ్చని వివరించింది. -
స్లిప్పర్స్ వేసుకుని డ్రైవింగ్ చేస్తే చలాన్ పడుతుందా?: గడ్కరీ క్లారిటీ
భారతదేశంలో ట్రాఫిక్ రూల్స్ కఠినంగా ఉంటాయని తెలుసు. అయితే కొందరికి ఈ రూల్స్ గురించి సరైన అవగాహన ఉండదు. కాబట్టి మాటల ద్వారా విన్న విషయాలను నిజమని నమ్మేస్తుంటారు. అలాంటి ఒక సాధారణ అపోహ ఏమిటంటే.. చెప్పులు వేసుకుని వాహనం నడిపితే చలాన్ పడుతుందనే భావన. కొన్నేళ్లుగా ఈ విషయం గురించి చర్చ జరుగుతున్నా, ఇంకా చాలా మందికి ఆ సందేహం అలాగే ఉంది.భారతదేశంలో అమలులో ఉన్న మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం.. స్లిప్పర్లు వేసుకుని కారు లేదా బైక్ నడపడం నేరం కాదు. ఈ విషయాన్ని 2019లోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దీంతో ప్రజల్లో ఉన్న అపోహ కొంత వరకు తొలగింది.अफवाहों से सावधान...!#TrafficFines #MotorVehicleAct pic.twitter.com/vd2gLu72i3— Office Of Nitin Gadkari (@OfficeOfNG) September 25, 2019స్లిప్పర్లు వేసుకుని వాహనం నడపడం చట్ట విరుద్ధం కానప్పటికీ.. అది పూర్తిగా సురక్షితమని చెప్పలేం. ఎందుకంటే స్లిప్పర్లు సాధారణంగా పాదానికి బిగుతుగా ఉండవు. బ్రేక్ లేదా క్లచ్ వేయాల్సిన సమయంలో జారిపోయే అవకాశం ఉంది.బైక్ రైడ్ చేసేటపుడూ గేర్ మార్చేటప్పుడు కూడా సరైన నియంత్రణ ఉండకపోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో క్షణాల్లో స్పందించాల్సి వస్తుంది. అప్పుడు పాదరక్షలు సరిగా లేకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి భద్రత దృష్ట్యా షూస్ ధరించడం మంచిది. సరైన పాదరక్షలు వాహనంపై మంచి నియంత్రణను ఇస్తాయి & ప్రమాదాలను తగ్గిస్తాయి.ఇదీ చదవండి: ఈ హోండా బైకుపై రూ.లక్ష డిస్కౌంట్! -
ఈ హోండా బైకుపై రూ.లక్ష డిస్కౌంట్!
హోండా మోటార్సైకిల్ తన సీబీ750 హార్నెట్ కొనుగోలుపై రూ. లక్ష డిస్కౌంట్ అందిస్తోంది. ఈ బైక్ ఇప్పుడు భారతదేశం అంతటా ఎంపిక చేసిన బిగ్ వింగ్ డీలర్షిప్లలో అమ్మకానికి అందుబాటులో ఉంది.హోండా సీబీ750 హార్నెట్ బైక్ రూ.8.59 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో దేశంలో లాంచ్ అయింది. జీఎస్టీ 2.0 ప్రవేశపెట్టిన తర్వాత, దాని ధర రూ.9.22 లక్షలకు పెరిగింది. ఇప్పుడు కంపెనీ దీని కొనుగోలుపై లక్ష రూపాయల తగ్గింపు అందిస్తోంది. సంస్థ 2025 మోడల్ మీద మాత్రమే ఈ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.సీబీ750 హార్నెట్ బైక్ 755 సీసీ ప్యారలల్ ట్విన్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 9500 ఆర్పీఎం వద్ద 90.5 బీహెచ్పీ పవర్, 7250 ఆర్పీఎం వద్ద 75 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ స్లిప్పర్ క్లచ్ను కలిగి ఉన్న 6-స్పీడ్ గేర్బాక్స్తో లభిస్తుంది. స్టీల్ డైమండ్ ఫ్రేమ్పై నిర్మితమైన ఈ బైక్.. యూఎస్డీ ఫ్రంట్ ఫోర్కులు & వెనుక మోనోషాక్ సెటప్తో లభిస్తుంది.సీబీ750 హార్నెట్ బైక్ ఎల్ఈడీ లైటింగ్, స్మార్ట్ఫోన్ కనెక్టివిటీతో 5 ఇంచెస్ టీఎఫ్టీ డిస్ప్లే, మల్టిపుల్ రైడింగ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి. ఇది యమహా ఏంటీ-07, ట్రయంఫ్ ట్రైడెంట్ 660, సుజుకి జీఎస్ఎక్స్-8ఎస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. -
బంగారం ధరల తారుమారు.. వారం రోజుల్లో ఇలా..
బంగారం ధరలు వారం రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ నేడు (శనివారం) స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. ఈ కథనంలో ఏడు రోజుల్లో.. గోల్డ్ రేటు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది?, సిల్వర్ రేటు ఎలా ఉంది అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో.. ఫిబ్రవరి 8న రూ. 1,56,600 వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నేటికి 1,57,750 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో రూ. 1150 పెరిగిందన్నమాట. 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు 1,43,550 రూపాయల దగ్గర నుంచి రూ. 1,44,600 వద్దకు (1050 రూపాయలు పెరిగింది) చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా ఉన్నాయి.ఢిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం రేటు వారం రోజుల్లో 1,56,750 రూపాయల దగ్గర నుంచి రూ. 1,57,900 వద్దకు (1150 రూపాయలు పెరిగింది) చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,43,700 నుంచి 1,44,750 రూపాయలకు (1050 రూపాయలు పెరిగింది) చేరింది.చెన్నైలో ధరల విషయానికి వస్తే.. ఇక్కడ ఫిబ్రవరి 8న 1,57,310 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. ఈ రోజుకి (శనివారం) 1,58,840 రూపాయల (రూ. 1530 పెరిగింది) వద్దకు చేరింది. 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే.. 10 గ్రాముల రేటు 1,44,200 రూపాయల దగ్గర నుంచి రూ. 1,45,600 (1400 రూపాయలు పెరిగింది) వద్దకు చేరింది.సిల్వర్ ధరలుగత ఆదివారం (ఫిబ్రవరి 8) కేజీ సిల్వర్ రేటు రూ. 2.85 లక్షల దగ్గర ఉండేది. ఆ ధర ఇప్పుడు రూ. 2.80 లక్షలకు చేరింది. అంటే వారం రోజుల్లో కేజీ మీద రూ. 5000 తగ్గిందన్నమాట. సిల్వర్ ధరలు ఒక్కో నగరం ఒక్కో విధంగా ఉంటుంది. అయితే ఢిల్లీలో.. రేటు కొంత తక్కువగా ఉంటుంది.ఇదీ చదవండి: వెండి ధర ఇంకా ఎంత పెరుగుతుందంటే..? -
ఏఐ ప్రమాదం.. సెబీ చైర్మన్ హెచ్చరిక!
ఏఐ వల్ల ఉద్యోగాలు ఊడిపోతున్నాయని పలువురు టెక్ నిపుణులు చెబుతున్నవేళ.. సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ ఆర్ధిక వ్యవస్థకు ప్రమాదమని హెచ్చరించారు.ఏఐ వంటి లేటెస్ట్ టెక్నాలజీ.. ఆర్థిక రంగాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి.. దీనికి అనుగుణంగా నియంత్రణ వ్యవస్థలు సైతం అభివృద్ధి చెందాలని పాండే పేర్కొన్నారు. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈఓ ముస్తఫా సులేమాన్ను ఉటంకిస్తూ.. రాబోయే ఏఐ, సింథటిక్ బయాలజీ వంటివన్నీ మానవాళికి సవాలుగా మారుతాయని వెల్లడించారు. ఈ సాంకేతికతలు మన జీవితాలను మెరుగుపరచగలిగినప్పటికీ.. సరైన నియంత్రణ లేకపోతే సమస్యలను కూడా సృష్టించగలవని అన్నారు.ఇదీ చదవండి: ఏఐ రేసులో భారత్.. మూడేళ్లలో రూ.6 లక్షల కోట్లు!ఏఐ టెక్నాలజీనీ దృష్టిలో ఉంచుకునే.. సెబీ సూపర్టెక్ (సూపర్వైజరీ టెక్నాలజీస్) & రెగ్టెక్ (రెగ్యులేటరీ టెక్నాలజీస్) వంటి సాంకేతిక పద్ధతులను అమలు చేస్తోంది. అంతే కాకుండా.. సైబర్ భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం, డేటా పరిపాలనను మెరుగుపరచడం వంటి చర్యలు తీసుకుంటోంది. సెక్యూరిటీస్ మార్కెట్ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని తక్షణ & దీర్ఘకాలిక సాంకేతిక వ్యూహ పథకాన్ని రూపొందించడానికి ఒక ఉన్నత స్థాయి నిపుణుల బృందాన్ని కూడా ఏర్పాటు చేసిందని పాండే పేర్కొన్నారు. -
సిటీ శివారులో రియల్ ఎస్టేట్ డిమాండ్!
వీకెండ్ వస్తే సినిమాలు, షికార్లు, పార్కులు, పబ్ల్లో గడిపే నగరవాసులు క్రమంగా ఇంటి పట్టునే ఉంటున్నారు. కాకపోతే ఈ ఇళ్లు కాస్త ప్రత్యేకమైనవి. కాలుష్యం, రణగొణ ధ్వనులకు దూరంగా, ప్రశాంతమైన పచ్చని వాతావరణంలో ఉండటమే ఈ వీకెండ్ హోమ్స్ స్పెషాలిటీ. రోజూ ఆఫీసు పనులు, ట్రాఫిక్ రద్దీ, ఒత్తిడితో అలసిన ప్రజలు హ్యాపీగా వీకెండ్ హోమ్స్లో సేద తీరుతున్నారు. కరోనాతో వారాంత గృహాలకు పెరిగిన ఆదరణ.. కుటుంబంతో కలిసి ఆనందంగా గడిపే వేదికగా మారింది. – సాక్షి, సిటీబ్యూరో ఒకప్పుడు సిటీలో ఒక ఇల్లు ఉంటే చాలనుకునేవారు నేడు నగరంలో ఒక ఇల్లు. నగరం బయట మరో ఇల్లు కోరుకుంటున్నారు. కొందరు సాధ్యమైనంతలో 200 నుంచి 1,000 గజాల్లోపు భూమిని కొని సాదాసీదాగా ఇంటిని నిర్మించుకుంటుంటే.. మరి కొందరు వెయ్యి నుంచి 4 వేల గజాలు, రెండెకరాలు, మూడెకరాలంటూ భూమి కొనేసి వ్యవసాయ క్షేత్రాలను అభివృద్ధి చేసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఈ రెండింటికీ మధ్య మరో కొత్త పోకడ చిగురించింది. అదే వారాంతపు ఇల్లు. ఇంటి నుంచి వంద కిలోమీటర్ల దూరంలో స్థలాలను కొనుగోలు చేస్తున్నారు. ఫామ్ ల్యాండ్స్ పేరుతో కొన్న జాగాల్లో, డీటీసీపీ లేఅవుట్లలో, గ్రామ పంచాయతీ లేఅవుట్లలో స్థలాలను కొనుగోలు చేసి బంగ్లాలు కడుతున్నారు. శని, ఆదివారాల్లో కుటుంబం అంతా కలిసి కారులో వారాంతపు ఇంటికి వెళ్లి షికారు చేస్తున్నారు.ఎవరు కొంటున్నారంటే.. విదేశాల నుంచి నగరానికి వచ్చి స్థిరపడుతున్న కుటుంబాలు, వ్యాపారులు, ఐటీ ఉద్యోగులు, ఇతర వర్గాలు కొత్త తరహా ఆలోచనతో అభిరుచులకు తగ్గట్లుగా వీకెండ్ హోమ్స్కు ప్రాముఖ్యత ఇస్తున్నాయి. అలాగే రెండో ఇల్లు కొనుగోలు చేయాలని భావించే కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు పరిశుభ్రత, భద్రత, విలాసవంతమైన వసతులు, మెరుగైన నిర్వహణ సేవలు ఉండే వీకెండ్ హోమ్స్ వైపు దృష్టిసారించారు. దీర్ఘకాలం పాటు గడిపేందుకు ఇష్టపడుతున్నారు. నివాసితుల అభిరుచికి తగ్గట్లుగా వీకెండ్ హోమ్స్ను మరింత అందంగా, ఆనందంగా తీర్చిదిద్దేందుకు నిర్మాణ సంస్థలు పోటీపడుతున్నాయి. ఐటీ ఉద్యోగులు, యువతను వీకెండ్ గృహాల వైపు ఆకర్షించేందుకు డెవలపర్లు మెరుగైన ఇంటర్నెట్, క్లబ్ హౌస్, ఓపెన్ జిమ్ వంటి వసతులను సైతం కల్పిస్తున్నారు.అద్దెకు కూడా.. వీకెండ్ హోమ్స్ విలాసవంతమైనవి కావడం, వీటిని నిర్వహణలో సమస్యల కారణంగా చాలా మంది కొనుగోలుదారులు కొనుగోళ్లకు దూరంగా ఉంటారు. దీంతో చాలా మంది డెవలపర్లు వీకెండ్ హోమ్స్ సేవలను సమీకృతం చేస్తున్నారు. అంటే హౌస్ కీపింగ్, వసతుల నిర్వహణ సేవలను అందిస్తారన్నమాట. దీంతో వీకెండ్ హోమ్స్ కొనుగోళ్లు స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తున్నాయి. ఒకవేళ వీకెండ్ హోమ్స్ను కస్టమర్లు వినియోగించలేని పక్షంలో కంపెనీయే అద్దెకు తీసుకుంటుంది. వాటిని స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడిపేందుకు అద్దెకు ఇస్తారు. అలాగే డెస్టినేషన్ వెండింగ్స్ కోసం వినియోగించి వచ్చే లాభాలలో కస్టమర్లకు వాటా ఇస్తుంది. వాటి నిర్వహణ బాధ్యత కంపెనీదే. కొనుగోలుదారులు ఇంటిని నిర్మించుకోవాలని భావిస్తే తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ వ్యవస్థ, రోడ్లు, వీధి దీపాలు వంటి మౌలిక వసతులను కల్పిస్తారు.ఈ ప్రాంతాలలో డిమాండ్.. నగరం ఓఆర్ఆర్ వరకు విస్తరించింది. శంషాబాద్, అబ్దుల్లాపూర్మెట్, మేడ్చల్, సంగారెడ్డి ప్రాంతాల వైపు, యాదాద్రి, శ్రీశైలం వెళ్లే రోడ్డు పొడవునా, చౌటుప్పల్, వికారాబాద్, శంకర్పల్లి, జహీరాబాద్ వైపు, కడ్తాల్, తలకొండపల్లి, షాద్నగర్, శంకర్పల్లి వంటి ప్రాంతాలలో వీకెండ్ హోమ్స్కు డిమాండ్ ఉంది. చార్టెడ్ అకౌంటెంట్లు, వైద్యులు, ఐటీ ఉద్యోగులు, వ్యాపారస్తులు ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తున్నారు. వీకెండ్ హోమ్స్ అంటే ఎకరాల కొద్ది స్థలం అవసరం లేదు.కొద్ది స్థలంలోనే ప్రణాళికబద్ధంగా వినియోగిస్తే అందమైన వీకెండ్ హోమ్స్ను డిజైన్ చేయవచ్చు. ఈ నిర్మాణంలో వినియోగించే ప్రతి వస్తువూ పర్యావరణహితమైనవే ఉంటాయి. ఉష్ణోగ్రతను నిరోధించేలా మట్టి ఇటుకలు, కలపతో నిర్మాణం ఉంటుంది. వర్షపు నీటి సేకరణతో పాటు జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ సహజ వనరులకు ఏమాత్రం విఘాతం కలిగించకుండా ఉంటుంది. ఇంటితో పాటు చుట్టూ పచ్చదనం, ఆకు కూరలు, పండ్ల తోట పెంచుతూ వ్యవసాయం చేశామనే తృప్తి పొందేందుకు చాలామంది ఇష్టపడుతున్నారు. -
అప్పుడు డోర్ హ్యాండిల్స్, ఇప్పుడు స్టీరింగ్ వీల్.. నిషేధం!
చైనా ప్రభుత్వం వాహన భద్రతా ప్రమాణాలను మరింత కఠినతరం చేయడానికి మరో కీలక నిర్ణయం తీసుకుంది. చైనా పరిశ్రమ, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన కొత్త భద్రతా ప్రమాణాలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రావాలని ఆదేశించింది.ఇప్పటికే ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ నిషేధించిన చైనా, ఇప్పుడు యోక్ స్టైల్ హాఫ్ స్టీరింగ్ వీల్స్ సైతం నిషేధించింది. భద్రతా నియమాలను అంతర్జాతీయ ప్రమాణాలకు సరిపోలేలా కఠినతరం చేయడం, ప్రయాణికులకు రక్షణ కల్పించడమే ఈ నిషేధాల వెనుక ఉన్న ప్రధాన ఉదేశ్యం.హాఫ్ స్టైల్ స్టీరింగ్ వీల్ను టెస్లా ప్రారంభించింది. ఆ తరువాత చాలా చైనీస్ కంపెనీలు ఇలాంటి స్టైల్ ఫాలో అయ్యాయి. ఇలాంటి స్టీరింగ్ వీల్ వల్ల చాలా నష్టాలు ఉన్నాయని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో డ్రైవర్లకు కలిగే గాయాలలో సుమారు 46 శాతం స్టీరింగ్ వ్యవస్థ కారణంగా సంభవిస్తున్నాయి. సాధారణ రౌండ్ స్టీరింగ్ వీల్ ప్రమాద సమయంలో.. డ్రైవర్ ముందుకు ఒరిగినప్పుడు శరీరానికి కొంత పట్టు లభిస్తుంది. హాఫ్ స్టీరింగ్ వీల్ శరీరానికి కొంత ప్రమాదం కలిగిస్తుంది.కొత్త ప్రమాణాల ప్రకారం.. 2027 నుంచి చైనాలో అమ్మకానికి వచ్చే కొత్త కార్లు హాఫ్ స్టైల్ స్టీరింగ్ వీల్ పొందకూడదు. అంతే కాకుండా.. ఇలాంటి స్టైల్ స్టీరింగ్ వీల్ కలిగిన వాహనాల్లో కూడా చేంజ్ చేసుకోవడానికి 13 నెలల గడువు ఇచ్చింది. దీన్నిబట్టి చూస్తే.. కార్లను తప్పకుండా నియమాలను పాటించాల్సిందే అని అవగతం అవుతోంది. -
భారీ బోనస్.. ఐటీ కంపెనీ ఉద్యోగులకు గుడ్ న్యూస్
సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలోని డిసెంబర్ త్రైమాసికం (Q3) కోసం సంస్థ సగటున 85 శాతం పనితీరు బోనస్ ప్రకటించింది. ఈ బోనస్ ఫిబ్రవరి జీతంతో పాటు ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు కంపెనీ ఈమెయిల్ ద్వారా తెలిపింది.ఈసారి మెరుగైన చెల్లింపులుఈసారి బోనస్ చెల్లింపులు మంచి వ్యాపార ఫలితాలు, కొత్త ఒప్పందాల విజయాల నేపథ్యంలో పెరిగినట్లు సమాచారం. టెక్నాలజీ స్టాక్స్ మార్కెట్లో ఒత్తిడి ఉన్న సమయంలో ఈ ప్రకటన ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది.కొంతమంది ఉద్యోగులు చెప్పినదాని ప్రకారం.. గత త్రైమాసికంతో పోలిస్తే సుమారు 15% ఎక్కువ బోనస్ ఈసారి అందనుంది. కొందరికైతే 100% వరకు కూడా వేరియబుల్ పే లభిస్తోంది. వ్యక్తిగత పనితీరు ఆధారంగా 75% నుంచి 100% మధ్య బోనస్ జమ చేయనున్నట్లు తెలిసింది.ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కాకుండా, గత ఆర్థిక సంవత్సరంలోని ఏ త్రైమాసికంతో పోల్చినా మెరుగైన చెల్లింపుగా ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. కంపెనీ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ షాజీ మాథ్యూ గత నెల టౌన్హాల్ సమావేశంలో ఈసారి వేరియబుల్ పే మెరుగ్గా ఉండొచ్చని సంకేతాలు ఇచ్చారు.ఇన్ఫోసిస్లో ప్రస్తుతం సుమారు 3,23,000 మంది ఉద్యోగులు ఉన్నారు. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో అర్హులైన ఉద్యోగులకు సగటున 75% వేరియబుల్ పే చెల్లించిన సంస్థ, ఈసారి మరింత ఎక్కువగా అందించడం గమనార్హం. -
రూ.100, రూ.500 నోట్ల రద్దు!.. నిజమేనా?
కేంద్ర ప్రభుత్వం 2016లో.. అప్పుడు వాడుకలో ఉన్న రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తూ కీలక ప్రకటన చేసింది. ఆ తరువాత 2023లో రూ. 2000 నోట్ల ఉపసంహరణ ప్రారంభించింది. ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆర్బీఐకు చేరాల్సిన పెద్ద నోట్లు ఇంకా ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ తరుణంలో ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.100, రూ.500 నోట్లలో కీలక మార్పులు జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.డిజిటల్ చెల్లింపులు ఎంత పెరిగినప్పటికీ నోట్ల అవసరం కూడా ఉంది. ఇప్పటికీ రిటైల్ మార్కెట్లలో, గ్రామీణ ప్రాంతాల్లో, చిన్న చిన్న వ్యాపారాల్లో కరెన్సీ నోట్లు కీలకంగా మారాయి. దీనిని దృష్టిలో ఉంచుకునే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రస్తుతం దేశంలో చలామణిలో ఉన్న 100, 500 రూపాయల నోట్లలో మార్పులు చేయనుంది. ఈ మార్పులలో వాటర్మార్క్లు, మైక్రోప్రింటింగ్, మెరుగైన ఇంక్ వంటివి ఉన్నాయి.నకిలీ నోట్లకు అడ్డుకట్ట వేయడానికి, నోట్లలో మరింత మెరుగైన భద్రతను పెంచడానికి రిజర్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఆర్బీఐ అధికారికంగా స్పందించలేదు. ఒకవేళా ప్రస్తుతం చలామణిలో ఉన్న నోట్లలో ఏమైనా మార్పులు చేస్తే.. పాత నోట్లు రద్దు అవుతాయా? అనేది ఇప్పుడొక ప్రశ్నగా మిగిలింది.కొత్త నోట్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ.. పాత నోట్లు కూడా చలామణిలో ఉంటాయని కొందరు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు సైతం తమ కరెన్సీలను మెరుగు పరుస్తున్నాయని పేర్కొన్నారు.ఇదీ చదవండి: వాట్సాప్ బ్యాన్ చేయడానికే ప్రయత్నం? -
విదేశాలకు వెళుతున్నారా.. ఈ జాగ్రత్తలు మీకోసమే
అంతర్జాతీయ ప్రయాణాలు చేసేటప్పుడు చాలామంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్లోని కస్టమ్స్ జోన్కు రాగానే ఒక రకమైన ఆందోళనకు గురవుతుంటారు. కస్టమ్స్ అధికారులు కావాలనే కఠినంగా వ్యవహరిస్తారని లేదా కేవలం ఏదైనా వస్తువులు వ్యక్తిగత అవసరాల కోసం అని చెబితే సరిపోతుందని చాలామంది భావిస్తుంటారు. కానీ, వాస్తవం దీనికి భిన్నంగా ఉంటుంది. కస్టమ్స్ చట్టాలు ప్రయాణికులను ఇబ్బంది పెట్టడానికి కాదనే విషయం గుర్తుంచుకోవాలి. అక్రమ రవాణాను అరికట్టడానికి, దేశ ఆర్థిక ఆదాయాన్ని కాపాడటానికి నిర్దేశించబడ్డాయి. లేటెస్ట్ అధికారిక సమాచారం ప్రకారం అంతర్జాతీయ ప్రయాణికులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు కింద ఉన్నాయి.కస్టమ్స్ నిబంధనలు ఎవరికి వర్తిస్తాయి?ముందుగా ఒక ప్రాథమిక విషయాన్ని గమనించాలి. కస్టమ్స్ నిబంధనలు కేవలం అంతర్జాతీయ ప్రయాణికులకు మాత్రమే వర్తిస్తాయి. మీరు భారతదేశం లోపల (డొమెస్టిక్) ప్రయాణిస్తుంటే కేవలం విమానయాన సంస్థల బ్యాగేజీ పరిమితులు మాత్రమే ఉంటాయి తప్ప కస్టమ్స్ డిక్లరేషన్ అవసరం ఉండదు.విదేశీ నివాస కాలం కీలకంమీరు విదేశాల్లో ఎంతకాలం గడిపారు అనే అంశంపైనే మీ బ్యాగేజీ మినహాయింపులు ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా బంగారం వంటి వస్తువుల విషయంలో ఒక ఏడాది కంటే ఎక్కువ కాలం విదేశాల్లో ఉన్నవారికి మాత్రమే ప్రత్యేక రాయితీలు వర్తిస్తాయి. స్వల్పకాలిక పర్యాటకులు, దీర్ఘకాలిక ఉద్యోగులు లేదా ఎన్ఆర్ఐ కేటగిరీని బట్టి అధికారులు నిబంధనలను పరిశీలిస్తారు.బంగారం నిబంధనలుభారతీయ విమానశ్రయాల్లో బంగారం అత్యంత సున్నితమైన అంశం. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. పురుషులు ఒక ఏడాది కంటే ఎక్కువ కాలం విదేశాల్లో ఉంటే 20 గ్రాముల(గరిష్ట విలువ రూ.50,000) బంగారు ఆభరణాలను, మహిళలు ఏడాది కంటే ఎక్కువ కాలం విదేశాల్లో ఉంటే 40 గ్రాముల(గరిష్ట విలువ రూ.1,00,000) బంగారు ఆభరణాలను తీసుకురావచ్చు. ఇక్కడ బరువు, విలువ రెండూ పరిగణనలోకి తీసుకుంటారు. ప్రస్తుతం బంగారం ధరలు పెరిగిన నేపథ్యంలో 20 గ్రాముల బంగారం విలువ రూ.50,000 దాటింది కాబట్టి ఆ పైన ఉన్న విలువకు ప్రయాణికులు కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది.గోల్డ్ బార్లు.. కాయిన్స్ఆభరణాలకు ఇచ్చే మినహాయింపులు గోల్డ్ బార్లు లేదా నాణేలకు వర్తించవు. వీటిని వాణిజ్య పరమైనవిగా పరిగణిస్తారు కాబట్టి, వీటిపై పూర్తి స్థాయిలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వీటిని డిక్లేర్ చేయకుండా తీసుకురావడం చట్టరీత్యా నేరం.మద్యం, నగదు పరిమితులువిదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు గరిష్టంగా రెండు లీటర్ల మద్యం లేదా వైన్ మాత్రమే తీసుకురావడానికి అనుమతి ఉంది. ఈ పరిమితి దాటితే వాటిని జప్తు చేసే అవకాశం ఉంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం, ప్రయాణికులు తమ వద్ద గరిష్టంగా రూ.25,000 వరకు నగదును ఉంచుకోవచ్చు. విదేశీ కరెన్సీని తీసుకురావడానికి గరిష్ట పరిమితి లేదు. కానీనగదు రూపంలో 5,000 అమెరికన్ డాలర్లు దాటినా, మొత్తం విదేశీ ఎక్స్ఛేంజ్ (నగదు + ట్రావెలర్స్ చెక్కులు) 10,000 డాలర్లు దాటినా కచ్చితంగా డిక్లేర్ చేయాలి.‘పర్సనల్ యూజ్’ అంటే ఏమిటి?కస్టమ్స్ క్లియరెన్స్లో ప్రయాణికులు తీసుకొస్తున్న వస్తువుల గురించి అధికారులు అడిగినప్పుడు సింపుల్గా పర్సనల్ యూజ్ అంటారు. కేవలం ప్రయాణికులు చెప్పిన మాటపై అధికారులు నమ్మకం ఉంచరు. వస్తువుల సంఖ్య, అవి కొత్తవా లేదా వాడినవా, ప్యాకింగ్ ఎలా ఉంది, మీరు తరచుగా ప్రయాణాలు చేస్తున్నారా అనే అంశాలను బట్టి అది వ్యక్తిగత అవసరమా లేక వాణిజ్య అవసరమా అని నిర్ణయిస్తారు. ఉదాహరణకు, ఒకటి రెండు వాడిన మొబైల్ ఫోన్లు వ్యక్తిగతమైనవిగా పరిగణిస్తారు. కానీ డజన్ల కొద్దీ సీల్ చేసిన కొత్త ఫోన్లు ఉంటే అది వాణిజ్య ఉద్దేశంగానే చూస్తారు.సురక్షిత ప్రయాణం కోసం సూచనలుకస్టమ్స్ నిబంధనలు ఉల్లంఘిస్తే 10% నుంచి 100% వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. కొన్నిసార్లు జైలు శిక్ష కూడా తప్పకపోవచ్చు. మీ వద్ద ఉన్న వస్తువులపై ఏమాత్రం సందేహం ఉన్నా ఎయిర్పోర్ట్లోని రెడ్ ఛానల్(కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సిన వస్తువులు ఉన్న ప్రయాణికుల కోసం ఉద్దేశించింది) వద్దకు వెళ్లి అధికారులను సంప్రదించాలి. నిజాయితీగా డిక్లేర్ చేయడం వల్ల మీరు అనవసరపు ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. గ్రీన్ ఛానల్(కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సిన వస్తువులు ఏవీ లేవని భావించే ప్రయాణికుల కోసం ఉద్దేశించింది) ద్వారా దొంగచాటుగా వెళ్లడం వల్ల కలిగే రిస్క్ చాలా ఎక్కువ.-దవనం శ్రీకాంత్ -
ఎస్ఎంఎస్ల పేరుతో రూ.3,388 కోట్ల వసూలు
టెలికాం కంపెనీలు తమ ప్రమోషన్ల కోసం రోజూ వందల కొద్దీ మెసేజ్లను ఉచితంగా పంపిస్తుంటే, మన సొమ్ముకు భద్రతనిచ్చే బ్యాంకులు మాత్రం ప్రతి ఎస్ఎంఎస్కు ఛార్జీలు వసూలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు కస్టమర్లను ఆకర్షించడానికి ఉచితంగా అందించిన సేవలే ఇప్పుడు బ్యాంకుల ఆదాయ వనరులుగా మారాయి. గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో (2023–25) కేవలం 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎస్ఎంఎస్ సేవల ద్వారా ఏకంగా రూ.3,388 కోట్లు వసూలు చేశాయని పార్లమెంట్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.భారీగా వసూళ్లు: టాప్ 6 బ్యాంకుల జాబితాఎస్ఎంఎస్ అలర్ట్ల పేరుతో అత్యధికంగా వసూలు చేసిన బ్యాంకుల్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అగ్రస్థానంలో ఉంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి:బ్యాంక్వసూలు చేసిన సొమ్ము (రూ. కోట్లలో)యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా1,188.14కెనరా బ్యాంక్506.28పంజాబ్ నేషనల్ బ్యాంక్360.45సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా308.72ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్204.89బ్యాంక్ ఆఫ్ బరోడా202.42 గమనిక: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్బీఐ 2020 నుంచి ఎస్ఎంఎస్ సేవలపై ఛార్జీలను రద్దు చేయడం గమనార్హం.ఉచితం నుంచి ఛార్జీల వైపు.. ఎందుకు?ప్రారంభంలో డిజిటల్ బ్యాంకింగ్ను ప్రోత్సహించడానికి బ్యాంకులు ఎస్ఎంఎస్ అలర్ట్లను ఉచితంగా అందించాయి. అయితే, ప్రతి ఎస్ఎంఎస్కు టెలికాం కంపెనీలకు బ్యాంకులు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఈ వ్యయాన్ని కస్టమర్ల నుంచే వసూలు చేయడం బ్యాంకులు ప్రారంభించాయి. ట్రాయ్ నిబంధనల ప్రకారం, కమర్షియల్ ఎస్ఎంఎస్ల నియంత్రణకు ‘డిజిటల్ లెడ్జర్ టెక్నాలజీ’(డీఎల్టీ) అమలులోకి వచ్చింది. దీనివల్ల బ్యాంకులపై నిర్వహణ భారం పెరిగింది. వడ్డీ రేట్ల తగ్గింపు వల్ల ఏర్పడే ఆదాయ లోటును భర్తీ చేసుకునేందుకు బ్యాంకులు సర్వీస్ ఛార్జీలపై దృష్టి పెట్టాయి.కేవలం ఎస్ఎంఎస్లే కాదు.. ఏటీఎంలు కూడా!గతంలో ఉచితంగా లభించి ప్రస్తుతం భారంగా మారిన సేవల్లో ఏటీఎం లావాదేవీలు ప్రధానమైనవి. ఒకప్పుడు ఎన్నిసార్లైనా ఉచితంగా డబ్బులు డ్రా చేసుకునే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు పరిమితి దాటితే ప్రతి లావాదేవీకి అదనంగా ఛార్జీలు (జీఎస్టీ అదనం) చెల్లించాల్సి వస్తోంది. ఖాతాలో మినిమం బ్యాలెన్స్ లేకపోతే జరిమానాల రూపంలో బ్యాంకులు భారీగా వసూలు చేస్తున్నాయి. ఏటా డెబిట్ కార్డ్ మెయింటెనెన్స్ పేరుతో రూ.150 నుంచి రూ.500 వరకు బ్యాంకులు కట్ చేస్తున్నాయి. బ్రాంచ్కు వెళ్లి నగదు జమ చేసినా లేదా విత్డ్రా చేసినా నెలకు నిర్ణీత పరిమితి దాటితే ఛార్జీలు వర్తిస్తున్నాయి.సామాన్యుడి పొదుపుపై బ్యాంకులు ఈ స్థాయిలో ఛార్జీలు వసూలు చేయడంపై సర్వత్రా అసహనం వ్యక్తమవుతోంది. ఒకవైపు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తూనే, మరోవైపు భద్రత కోసం ఇచ్చే ఎస్ఎంఎస్లపై కూడా భారం మోపడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎస్బీఐ బాటలోనే మిగిలిన బ్యాంకులు కూడా కనీసం ప్రాథమిక ఎస్ఎంఎస్ అలర్ట్లను ఉచితంగా అందిస్తే సామాన్యులకు ఊరట లభిస్తుంది.ఇదీ చదవండి: ప్రేమలో మునిగి తేలుతూ.. వ్యాపారం పెంచుతూ.. -
కోకాపేటలో కొత్త రియల్ఎస్టేట్ ట్రెండ్..
విలాసవంతమైన గృహ విభాగం సరికొత్త పుంతలు తొక్కుతోంది. గృహ కొనుగోలుదారులు అభిరుచులకు అనుగుణంగా సంస్థలు ఇళ్లను నిర్మిస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రైవసీ, భద్రత, గ్రీనరీకి అధిక ప్రాధాన్యం ఇచి్చన బిల్డర్లు.. ఇప్పుడు కస్టమర్లకు అంతర్జాతీయ స్థాయి సేవలను అందించేందుకు సిద్ధమయ్యారు. లగ్జరీ ఆతిథ్య సంస్థల భాగస్వామ్యంతో గృహ నిర్మాణాలను చేపడుతున్నారు. హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్(హెచ్ఎన్ఐ), ప్రవాసుల నుంచి ఈ తరహా ఇళ్లకు విపరీతంగా డిమాండ్ ఉంది. ప్రధానంగా కోకాపేట, పుప్పాలగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, రాయదుర్గం వంటి పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాల్లో ఇటువంటి ఫైవ్ స్టార్ హోమ్స్ వస్తున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోరియల్ ఎస్టేట్ రంగంలో మార్కెటింగ్ కోసం ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ మీద చూసినా లగ్జరీ అనేది కనపడుతోంది. విలాసవంతంగా ఉన్నా లేకున్నా ఈ పదం వాడేస్తున్నారు. అందరూ లగ్జరీ అనే ట్యాగ్ వాడటంతో అర్థమే మారిపోయింది. కొందరు మాత్రమే ఈ స్థాయి ప్రమాణాలతో కడుతున్నారు. కొనుగోలుదారులు సైతం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో తిరుగుతుండటంతో విలాసం అంటే ఎలా ఉంటుందో వారికి అవగాహన పెరిగింది. దీంతో నిర్మాణ సంస్థలు లగ్జరీకి పునఃనిర్వచనం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇదు నక్షత్రాల రేటింగ్ కలిగిన నివాసాలను నిర్మించేందుకు నిర్మాణ సంస్థలు ప్రసిద్ధ ఆతిథ్య సంస్థలతో జతకడుతున్నాయి. డిజైనింగ్ ప్రమాణాలను పెంచడంతో పాటు నివాసం ఉండేవారికి స్టార్ హోటల్ మాదిరి సేవలు కల్పించేందుకు భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నాయి.హోటల్స్, ఫ్యాషన్ డిజైనర్లతో ఒప్పందం ఇంటర్ కాంటినెంటల్, మారియట్, తాజ్, రిడ్జ్, కార్ల్టన్, లీలా వంటి స్టార్ హోటల్ బ్రాండ్స్, అబూజానీ, సందీప్ ఖోస్లా వంటి ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లతో నగరానికి చెందిన పలు ప్రముఖ నిర్మాణ సంస్థలు భాగస్వామ్యం చేసుకొని గృహ నిర్మాణాలను చేపడుతున్నాయి. డిజైనింగ్, ఆర్కిటెక్చర్, ఎలివేషన్స్, విస్తీర్ణం, వసతులు, సేవలు.. అన్నీ టాప్ క్లాస్గా ఉంటాయి. నివాసితులకు అంతర్జాతీయ జీవనశైలి అనుభూతిని అందించడమే ఈ గృహాల ప్రత్యేకత.హెచ్ఎన్ఐ, ప్రవాసులు కస్టమర్లు.. కరోనా నుంచి నగరంలో హైఎండ్ గృహాలకు ఆదరణ పెరిగింది. ఆధునికత, విలాసవంతమైన జీవనశైలికి నేటి యువ గృహ కొనుగోలుదారులు మొగ్గు చూపుతున్నారు. హెచ్ఎన్ఐలు, ప్రవాసులు, బిజినెస్ టైకూన్లు, సినీ, క్రీడా సెలబ్రిటీలు డిజైనర్ హోమ్స్కు ఆసక్తి చూపిస్తున్నారు. సాధారణంగా ఈ తరహా ఇళ్ల కొనుగోలుదారులు సెకండ్ లేదా థర్డ్ హోమ్ బయ్యర్లు ఉంటారు. ఇందులో నివాసం ఉండటం స్టేటస్ సింబల్గా భావిస్తుంటారు. హైటెక్ సిటీ, గచి్చ»ౌలి, రాయదుర్గం, నియోపొలిస్, నానక్రాంగూడ, కోకాపేట, ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్, పుప్పాలగూడ, తెల్లాపూర్, మదీనాగూడ, నల్లగండ్ల వంటి ప్రాంతాల్లో ఈ తరహా ప్రాజెక్ట్లను నిర్మిస్తున్నారు. వీటి విస్తీర్ణం 6 వేల చదరపు అడుగుల నుంచి ప్రారంభవుతుంది. ధర రూ.6 కోట్ల నుంచి ఉంటుంది.వీటి ప్రత్యేకతలివే.. స్టార్ హోమ్స్ అంటే హోటల్ ఆధారిత ప్రాజెక్ట్లు. ఇందులో లేఔట్ స్థలంలో నివాసాల కోసం ప్రత్యేకంగా ఒక టవర్ ఉంటుంది. పక్కనే మరో టవర్లో హోటల్ ఉంటుంది. నివాసితులకు సేవలన్నీ ఆతిథ్య సంస్థలే నిర్వహిస్తాయి. కొన్ని ప్రాజెక్ట్లలో దిగువ అంతస్తుల్లో హోటల్, ఎగువ అంతస్తులో నివాస యూనిట్లు ఉంటాయి. నివాసితులకు ప్రత్యేకంగా యాప్ ఉంటుంది. ఇందులో నుంచి ఫుడ్, స్పా, సెలూన్ వంటివి ఆర్డర్ చేయవచ్చు. వాళ్లే అపార్ట్మెంట్కు వచ్చి సర్వీస్ చేస్తారు. అలాగే వీటిల్లో సెవెన్ స్టార్ హోటల్లో మాదిరి గ్రాండ్ లాంజ్, డబుల్ హైట్ బాల్కనీ, హోమ్ ఆటోమేషన్, బ్యూటీఫుల్ వ్యూ, స్కై లాంజ్, స్పా, మినీ థియేటర్, ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ వంటి అన్ని రకాల ఆధునిక వసతులుంటాయి.ప్రైవసీ, భద్రత..ప్రైవసీ, భద్రత ఈ ప్రాజెక్ట్ల ప్రత్యేకత. వెంటిలేషన్, ఓపెన్ స్పేస్, వేర్వేరుగా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ద్వారాలు, ప్రతి అపార్ట్మెంట్కు ప్రత్యేక మార్గం ఉంటుంది. అపార్ట్మెంట్ ఫేసింగ్ ఎదురెదురుగా ఉండదు. దీంతో పూర్తిగా ప్రైవసీ ఉంటుంది. విశాలమైన బాల్కనీ, గ్రీనరీ, ఓపెన్ స్పేస్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సాధారణ గృహాలతో పోలిస్తే ఈ డిజైనర్ హోమ్స్లో 5–7 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా వస్తాయి. -
పైలట్లకు భలే డిమాండ్.. రూ.లక్షల్లో జీతాలు
భారతీయ విమానయాన రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దేశంలో అతిపెద్ద ఎయిర్లైన్ అయిన ఇండిగో (IndiGo) తన చరిత్రలోనే అతిపెద్ద కాక్పిట్ నియామక డ్రైవ్లలో ఒకదాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతోంది. పల విభాగాల్లో 1,000 మందికి పైగా పైలట్లను నియమించుకునేందుకు సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది. ట్రెయినీ ఫస్ట్ ఆఫీసర్లు, సీనియర్ ఫస్ట్ ఆఫీసర్లు, కెప్టెన్లు వంటి అన్ని స్థాయిలలో నియామకాలు జరగనున్నాయి.ఈ నిర్ణయం 2025 డిసెంబర్లో ఎదురైన తీవ్రమైన సిబ్బంది కొరత, ఆ కారణంగా ఏడు రోజుల్లో వేల సంఖ్యలో విమానాలు రద్దైన ఘటనల తర్వాత తీసుకున్నదిగా తెలుస్తోంది. కొత్తగా అమల్లోకి వచ్చిన విశ్రాంతి నిబంధనలతో (FDTL) సిబ్బంది లభ్యతపై ఒత్తిడి పెరగడంతో, భవిష్యత్తులో ఇలాంటి అంతరాయాలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యగా ఈ భారీ నియామక ప్రక్రియ ప్రారంభమైంది.డీజీసీఏ కొత్త నిబంధనలువిమాన సురక్షత దృష్ట్యా డీజీసీఏ (DGCA) పైలట్లకు సంబంధించిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (FDTL) నిబంధనలను సవరించింది. కొత్త నియమాల ప్రకారం పైలట్లకు తగిన విశ్రాంతి సమయం తప్పనిసరి.దీంతో రోస్టర్ నిర్వహణలో మార్పులు అవసరమయ్యాయి. కొంతకాలం తాత్కాలిక సడలింపులతో సేవలు నిర్వహించిన ఎయిర్లైన్లు, ఇప్పుడు పూర్తి స్థాయి అమలుకు సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అదనపు పైలట్ల అవసరం ఏర్పడింది.నియామకాల్లో ప్రత్యేకతఇండిగో విమానాల్లో ప్రధానంగా ఎయిర్బస్ A320 కుటుంబానికి చెందిన విమానాలు ఉపయోగిస్తుండగా, ముందస్తు A320 అనుభవం లేకపోయినా అర్హత కలిగిన పైలట్లను తీసుకోవడానికి సంస్థ సిద్ధంగా ఉందని సమాచారం.విమానాల సంఖ్య పెరుగుతుండడం, అంతర్జాతీయ మార్గాల్లో విస్తరణ జరగడం, ప్రయాణికుల రద్దీ పెరగడం వంటి అంశాలు కూడా నియామకాల వేగాన్ని పెంచుతున్నాయి.పైలట్ల జీతాలు ఎలా ఉన్నాయంటే..భారతీయ విమానయాన రంగంలో పైలట్ వృత్తి అత్యంత అధిక వేతనాలు కలిగిన కెరీర్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. సాధారణంగా జీతాలు (అంచనా) ఇలా ఉంటాయి..ట్రెయినీ ఫస్ట్ ఆఫీసర్: నెలకు రూ.80,000 నుంచి రూ.1.5 లక్షలుఫస్ట్ ఆఫీసర్ (FO): రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షలుసీనియర్ ఫస్ట్ ఆఫీసర్ (SFO): రూ.3.5 లక్షల నుంచి రూ.5 లక్షలుకెప్టెన్: రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువనడిపే విమాన రకం, అనుభవం, ఫ్లైట్ గంటలు, అంతర్జాతీయ మార్గాలు వంటి అంశాలపై ఆధారపడి ఈ మొత్తాలు మారవచ్చు.ఇతర భత్యాలు, సౌకర్యాలుజీతంతో పాటు పైలట్లకు పలు అదనపు ప్రయోజనాలు ఉంటాయి. అవి..లేఓవర్ అలవెన్సులు (దేశీయ, అంతర్జాతీయ)ఫ్లైట్ గంటల ఆధారిత ప్రోత్సాహకాలుమెడికల్ ఇన్సూరెన్స్ & లైఫ్ కవర్కుటుంబ సభ్యులకు ఉచిత/తగ్గింపు ధరల ప్రయాణ సౌకర్యంశిక్షణా అవకాశాలు, టైప్ రేటింగ్ మద్దతుపనితీరు ఆధారిత బోనసులుకొన్ని ఎయిర్లైన్లు పైలట్ల మనోబలాన్ని పెంచేందుకు ప్రత్యేక ప్రోత్సాహక ప్యాకేజీలను కూడా ప్రవేశపెడుతున్నాయి.ఇతర ఎయిర్లైన్లలోనూ నియామకాలుభారతదేశంలో పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఆకాశ ఎయిర్ (Akasa Air) వంటి కొత్త ఎయిర్లైన్లు కూడా పైలట్ల నియామకాలను వేగవంతం చేస్తున్నాయి. వేతనాలు, సౌకర్యాల పరంగా పోటీ వాతావరణం నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా అనేక ఎయిర్లైన్లు భారత పైలట్లకు అవకాశాలు అందిస్తున్నాయి. దీనితో దేశీయంగా జీతాల నిర్మాణంలో కూడా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. -
గిఫ్ట్ సిటీ ఛైర్మన్గా ఉదయ్ కోటక్ నియామకం
ప్రముఖ బ్యాంకర్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకులు ఉదయ్ కోటక్ దేశలోని ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘గిఫ్ట్ సిటీ’ సారథ్య బాధ్యతలను చేపట్టారు. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీ(గిఫ్ట్ సిటీ) కంపెనీ లిమిటెడ్ ఛైర్మన్గా ఆయనను నియమిస్తూ గుజరాత్ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.హస్ముఖ్ అధియా స్థానంలో కోటక్గత ఏడాది జూన్ నుంచి గిఫ్ట్ సిటీ బోర్డు ఛైర్మన్గా (నాన్-ఎగ్జిక్యూటివ్) సేవలు అందించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ హస్ముఖ్ అధియా స్థానంలో ఉదయ్ కోటక్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర పట్టణాభివృద్ధి, పట్టణ గృహనిర్మాణ శాఖ ఈ మేరకు గురువారం ఒక తీర్మానాన్ని విడుదల చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని, ఆయన పాత్రకు సంబంధించిన ఇతర నిబంధనలను ప్రభుత్వం త్వరలోనే ఖరారు చేయనుందని డిప్యూటీ సెక్రటరీ అంకితా షా సంతకం చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.గిఫ్ట్ సిటీ: ప్రపంచ స్థాయి ఆర్థిక కేంద్రంగుజరాత్లోని 886 ఎకరాల్లో విస్తరించి ఉన్న గిఫ్ట్ సిటీ భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీ. ఇది అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆర్థిక, సాంకేతిక హబ్. వ్యాపారాలకు సులభతర వాతావరణాన్ని కల్పిస్తూ సింగిల్ విండో పద్ధతిలో అనుమతులిస్తారు. ఇక్కడి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు సుస్థిరత, అత్యాధునిక సాంకేతికతకు కీలకంగా మారుతున్నాయి.ఉదయ్ కోటక్..1985లో కేవలం రూ.30 లక్షల పెట్టుబడితో ఒక చిన్న బిల్లు డిస్కౌంట్ సంస్థను స్థాపించిన ఉదయ్ కోటక్, నేడు కోటక్ మహీంద్రా బ్యాంక్ను దేశంలోనే నాలుగో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకుగా తీర్చిదిద్దారు. ప్రాథమికంగా ఎటువంటి పెద్ద కార్పొరేట్ నేపథ్యం లేకపోయినా పారదర్శకత, క్రమశిక్షణతో కూడిన బ్యాంకింగ్ విధానాలతో కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకున్నారు. 2003లో బ్యాంకింగ్ లైసెన్స్ పొందిన మొదటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా కోటక్ మహీంద్రా రికార్డు సృష్టించింది. భారత ఆర్థిక రంగానికి ఆయన చేసిన సేవలకు గాను 2026 సంవత్సరంలో ప్రభుత్వం ‘పద్మభూషణ్’ పురస్కారంతో గౌరవించింది.ఇదీ చదవండి: ప్రేమలో మునిగి తేలుతూ.. వ్యాపారం పెంచుతూ.. -
ఐటీ రంగంలో ఖర్చుల సెగ..
గ్లోబల్ టెక్నాలజీ మార్కెట్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ సంస్థలు సాఫ్ట్వేర్ సేవల కంటే హార్డ్వేర్ మౌలిక సదుపాయాలకే పెద్దపీట వేస్తున్నాయి. దీనివల్ల భారతీయ ఐటీ సేవల కంపెనీలు తాత్కాలిక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ స్టాక్ ధరల తగ్గింపు దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఒక అద్భుతమైన కొనుగోలు అవకాశాన్ని అందిస్తోందని క్వాంటం ఏఎంసీ ఫండ్ మేనేజర్ (ఈక్విటీస్) క్రిస్టీ మథాయ్ చెబుతున్నారు.మారిన వ్యయాల ప్రాధాన్యతప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హవా నడుస్తోంది. దీంతో కంపెనీలు తమ బడ్జెట్ను డేటా సెంటర్లు, సెమీకండక్టర్లు, హై-ఎండ్ ప్రాసెసర్ల వైపు మళ్లిస్తున్నాయి. ఎన్విడియా వంటి హార్డ్వేర్ కంపెనీలు లాభపడుతుంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ (SaaS), సంప్రదాయ ఐటీ సర్వీస్ కంపెనీలపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ మార్పుల వల్ల లార్జ్ క్యాప్ ఐటీ స్టాక్స్ ఇటీవల భారీగా క్షీణించాయి.సెంటిమెంట్ కంటే ఫండమెంటల్స్ బలంగా..మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి ఉన్నప్పటికీ ఐటీ కంపెనీల ఫండమెంటల్స్ పటిష్టంగా ఉన్నాయని విశ్లేషణలు చెబుతున్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ విభాగాల నుంచి ఐటీ ఆర్డర్లు మళ్లీ పుంజుకుంటున్నాయి. కంపెనీలు ఇప్పుడు నేరుగా ఏఐ ప్రాజెక్టుల ద్వారా ఆదాయాన్ని పొందడం ప్రారంభించాయి. కీలక రంగాల్లో ఆర్డర్ బుక్స్ ఆశాజనకంగా ఉన్నాయని, ఇది భవిష్యత్తు వృద్ధికి సంకేతమని మథాయ్ అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: ప్రేమలో మునిగి తేలుతూ.. వ్యాపారం పెంచుతూ.. -
ఇల్లు.. పిల్లలకు నచ్చేలా..
కొత్త ఆలోచనలు, ఆసక్తి, కుతూహలం వంటి లక్షణాలన్నీ చిన్నారుల్లో అధికంగా ఉంటాయి. వారికంటూ ఒక ప్రత్యేక ప్రపంచం ఉంటే ఇవి మరింత ఇనుమడిస్తాయి. వారిలో సృజనాత్మక శక్తి ఊపిరి పోసుకుంటుంది. ఈ విషయాన్ని గ్రహించిన తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంట్లోనూ వారి కోసం ఓ ప్రత్యేక ప్రపంచం ఉండాలని భావిస్తున్నారు. చిల్డ్రన్ స్పెషల్ రూమ్లు ఈ భావనతోనే ఆవిర్భవించాయి. కాన్సెప్ట్ బాగుండటంతో ఇంటీరియర్ డెకరేటర్స్ సలహాలు తీసుకుంటున్నారు. సరైన ప్రణాళికను అనుసరిస్తే భేషుగ్గా మీరే మీ పిల్లల గదిని తీర్చిదిద్దుకోవచ్చు. ఆసక్తి, అభిరుచి, వయస్సు.. పిల్లల రూమ్ ఇలాగే ఉండాలని రూల్ ఏమీ లేదు. వారి ఆసక్తి, అభిరుచి, వయస్సు, జెండర్ దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు. దీనికితోడు పిల్లల ఆరోగ్యం, చదువు, ప్రవర్తనలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. చిన్న వయసులో అందరు పిల్లలకు ఉండే ఉత్సాహానికి ఊతమిచ్చేలా కొంచెం సృజనాత్మకత, ఆడంబరాన్ని జోడిస్తే ఆ గదికి తిరుగే ఉండదు. అయితే క్షణానికో కొత్త ఇంటీరియర్ పుట్టుకొస్తున్న తరుణంలో అన్ని హంగులు అమర్చుకోవాలంటే కొంచెం ఖర్చుతో కూడిన వ్యవహారమే..రంగులే కీలకం.. పిల్లలను ఆకట్టుకొనేలా గదిని రూపొందించడంలో రంగులకు కావాల్సినంత ప్రాధాన్యం ఉంది. మానసిక శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం చిన్న పిల్లలు ఎరుపు, నీలం, పసుపు రంగులను ఇష్టపడతారు. ఇవి కాకుండా ఆకుపచ్చ, పర్పుల్ కూడా ఓకే. ఇక వయోలెట్, పింక్ కూడా పర్వాలేదు. అన్నింటికన్నా ముఖ్యం మీ చిన్నారి ఏ రంగు ఇష్టపడుతున్నాడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మొత్తం ఒకే రంగు కాకుండా గదిలో వేర్వేరు చోట్ల రంగులను నింపడం ద్వారా అందాన్ని తేవచ్చు. ఒక్కో రంగు ఒక్కో విధమైన ప్రేరణ కల్పిస్తుందని కలర్ సైకాలజీ చెబుతోంది. కాబటి తేలిక రంగులు వేస్తే మంచిది. పిల్లలకు ఇష్టమైన కార్టూన్ క్యారెక్టర్లను గోడలపై చిత్రించడం ద్వారా వారికి ఆనందాన్ని కలుగచేయవచ్చు. సీలింగ్కు చీకట్లో కూడా మెరిసే విధంగా ఉండే మెటాలిక్ రంగులు వేస్తే చీకట్లోనూ హాయిగా నిద్రపోతారు.కంటికి శ్రమ కలిగించని లైటింగ్.. లైట్ల విషయానికి వస్తే బాగా వెలుతురు అందించే ఫ్లోరోసెంట్ బల్బులను వాడాలి. కంటిపై ఎలాంటి ప్రభావం చూపకుండా, చదువుకొనేటప్పుడు ఇబ్బంది కలగకుండా ఉండాలి. పిల్లల గది కదా అని హంగామా చేసి అన్ని వస్తువులను పేర్చేయకుండా అవసరమైన మేరకు ఉంచాలి. వారి అభిరుచులకు ప్రాధాన్యం ఇస్తూనే ఆకట్టుకొనే విధంగా రూపొందించాలి. -
బంగారం కొనబోతే షాక్! ధరలు ఎలా ఉన్నాయంటే..
దేశంలో బంగారం, వెండి ధరలు షాక్ ఇచ్చాయి. రెండు రోజులుగా వరుస తగ్గుదలతో ఆనందంలో ఉన్న కొనుగోలుదారులకు నిరాశ తప్పలేదు. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో మార్పులు వస్తున్నాయి. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
భారత్లో రోల్స్-రాయ్స్ విస్తరణ చర్యలు
ప్రపంచ ప్రఖ్యాత ఆటోమొబైల్, ఇంజినీరింగ్ దిగ్గజం రోల్స్-రాయ్స్ భారత్లో తన కార్యకలాపాలను భారీ స్థాయిలో విస్తరించనున్నట్లు ప్రకటించింది. బ్రిటన్కు చెందిన ఈ సంస్థ భారత రక్షణ రంగ అవసరాల కోసం అత్యాధునిక సాంకేతికతను అందించడమే కాకుండా స్థానికంగా ఇంజిన్ల తయారీకి సిద్ధమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రోల్స్-రాయ్స్ సీఈఓ తుఫాన్ ఎర్గిన్ బిల్గిక్ ఇటీవల సమావేశమైన నేపథ్యంలో ఈ కీలక ప్రకటన వెలువడటం విశేషం.ప్రకటనలోని అంశాలు..భారత తదుపరి తరం యుద్ధ విమానాల కోసం 120 కేఎన్ క్లాస్ కాంబాట్ జెట్ ఇంజన్ను అభివృద్ధి చేసేందుకు రోల్స్-రాయ్స్ ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు ద్వారా భారతదేశానికి పూర్తి మేధో సంపత్తి హక్కులతో పాటు వంద శాతం సాంకేతిక బదిలీ జరుగుతుంది. ఇది స్వదేశీ రక్షణ పరిజ్ఞానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. భారత ఆర్మీ, నేవీ, కోస్ట్ గార్డ్ కోసం అవసరమైన ఇంజన్లను భాగస్వామ్య సంస్థలతో కలిసి ఇక్కడే తయారు చేయడంపై కంపెనీ దృష్టి సారించింది.వికసిత్ భారత్ దిశగా అడుగులుప్రధాని మోదీతో భేటీ సందర్భంగా భారత ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాల్లో పాలుపంచుకోవాలని చూస్తున్నట్లు కంపెనీ సీఈఓ ఎర్గిన్ బిల్గిక్ వెల్లడించారు. ‘మా అత్యాధునిక సాంకేతికతతో భారత అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాం’ అని సీఈఓ అన్నారు.ఉపాధి, ఆర్థిక వృద్ధిఈ విస్తరణ ప్రణాళికల వల్ల భారత్లో భారీగా పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. ప్రస్తుతం రోల్స్-రాయ్స్, దాని భాగస్వామ్య సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యను సుమారు 10,000 కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది ప్రస్తుత సంఖ్య కంటే రెట్టింపు. భారత్ నుంచి కంపెనీ చేసే ఔట్ సోర్సింగ్ సర్వీసులు రాబోయే కాలంలో 10 రెట్లు పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు భారీ లబ్ధి చేకూరుతుంది. రక్షణ రంగమే కాకుండా మౌలిక సదుపాయాలు, పరిశ్రమలకు అవసరమైన పవర్ సొల్యూషన్లను అందించడానికి కూడా సంస్థ సిద్ధమవుతోంది.ఇదీ చదవండి: ప్రేమలో మునిగి తేలుతూ.. వ్యాపారం పెంచుతూ.. -
ప్రేమలో మునిగి తేలుతూ.. వ్యాపారం పెంచుతూ..
ప్రేమకు భాషతో పనిలేదు అంటారు. అది వాస్తవమే అయినా భాషలకు అతీతంగా యువతీ యువకుల ప్రేమైనా, తల్లిదండ్రుల ప్రేమైనా, అన్నా చెల్లల ప్రేమనా.. మార్కెట్తో కనెక్ట్ అవ్వాల్సిందే. నేటి కాలంలో ప్రేమకు ‘మార్కెట్’తో విడదీయలేని ముడిపడి ఉంది. ఫిబ్రవరి 14న జరుపుకునే వాలెంటైన్స్ డే ఇప్పుడు కేవలం ఒక భావోద్వేగపూరితమైన రోజుగా మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే ఒక భారీ కమర్షియల్ ఈవెంట్గా అవతరించింది. భారత్లో ఈ ఒక్క రోజున జరిగే వ్యాపారం విలువ సుమారు రూ.25,000 కోట్ల నుంచి రూ.30,000 కోట్ల వరకు ఉంటుందని వాణిజ్య వర్గాల అంచనా.విందులు.. వినోదాలువాలెంటైన్స్ డే ప్రభావం అత్యధికంగా కనిపించేది హోటళ్లు, రెస్టారెంట్లపైనే. క్యాండిల్ లైట్ డిన్నర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘కపుల్ మెనూ’లకు భారీ డిమాండ్ ఉంటుంది. సాధారణ రోజుల కంటే ఈ రోజు రెస్టారెంట్ల ఆదాయం 40-50% పెరుగుతుంది. నగరాల్లోని ఫైవ్స్టార్ హోటళ్లు లవ్ ప్యాకేజీల పేరుతో బస, స్పా, డిన్నర్ కలిపి ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.బహుమతుల్లో కొత్త పోకడలువస్తువుల క్రయవిక్రయాల్లో ఈ సీజన్లో మెరుగైన వృద్ధి కనిపిస్తుంది. గులాబీ పూల ఎగుమతి, దిగుమతులు ఈ వారంలో పీక్ స్టేజ్లో ఉంటాయి. కేవలం ఒక్క రోజులోనే కోట్లాది రూపాయల విలువైన గులాబీలు అమ్ముడవుతాయి. ప్రత్యేకంగా ఫొటోలు ఉన్న బహుమతులు, కస్టమైజ్డ్ జువెలరీ, గాడ్జెట్స్కు యువత ప్రాధాన్యత ఇస్తోంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ-కామర్స్ సంస్థలు ప్రత్యేకంగా సేల్స్ నిర్వహించడం వల్ల ఆన్లైన్ షాపింగ్ వృద్ధి నమోదు చేస్తుంది.టూరిజంప్రేమికులు ఏకాంతంగా గడపడానికి పర్యాటక ప్రాంతాలను ఎంచుకోవడంతో ట్రావెల్ ఇండస్ట్రీకి లాభాలొస్తాయి. దేశీయంగా గోవా, ఉదయ్పూర్, కేరళ, కొడైకెనాల్ వంటి ప్రాంతాలకు విమాన టిక్కెట్లు, హోటల్ రూమ్స్ నెల రోజుల ముందే బుక్ అవుతున్నాయి. విదేశీ ప్రయాణాల్లో భాగంగా మాల్దీవులు, థాయిలాండ్, బాలి వంటి దేశాలకు వెళ్లే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకే పరిమితమైన ఈ సంస్కృతి నేడు భారత్లో ఒక బలమైన వాణిజ్య శక్తిగా మారింది. వినియోగదారుల ఖర్చు చేసే సామర్థ్యం పెరగడం, సోషల్ మీడియా ప్రభావం వెరసి వాలెంటైన్స్ డేని ఒక బిలియన్ డాలర్ ఇండస్ట్రీగా మార్చేశాయి.ఇదీ చదవండి: రాజ్పాల్ యాదవ్ గ్యారేజీలోని కార్ల లిస్ట్ ఇదే.. -
స్టాండర్డ్ ఇంజనీరింగ్ కొత్త ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హై–ప్రెసిషన్ ఇంజనీరింగ్ సేవల సంస్థ స్టాండర్డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ (గతంలో స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ) రూ. 240 కోట్లతో కొత్త ప్లాంటు ఏర్పాటు చేస్తోంది. మొదటి దశలో రూ. 120 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు సంస్థ ప్రమోటర్ కందుల నాగేశ్వరరావు తెలిపారు. ఇది వచ్చే ఏడాది వ్యవధిలో అందుబాటులోకి రాగలదని చెప్పారు. అలాగే ఇప్పుడున్న ప్లాంట్లపై దాదాపు రూ. 60 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు, ఇప్పటికే రూ. 20 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు కంపెనీ కొత్త లోగోను ఆవిష్కరించిన సందర్భంగా వివరించారు. ఈ ఏడాదిలో సుమారు రూ. 760–800 కోట్ల ఆదాయాన్ని అంచనా వేస్తున్నట్లు, ప్రస్తుతం 95 రకాల ఉత్పత్తులను అందిస్తున్నట్లు నాగేశ్వరరావు చెప్పారు. ఆదాయంలో ఎగుమతుల వాటా 13 శాతంగా ఉన్నట్లు వివరించారు. శుక్రవారం షేరు సుమారు 2 శాతం క్షీణించి రూ. 129.70 వద్ద క్లోజయ్యింది. -
డబ్బుఉందా? డెబిట్! లేదా? క్రెడిట్!
భారత్లో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ మరో కీలక మలుపు తీసుకుంటోంది. అంతర్జాతీయ చెల్లింపుల దిగ్గజం వీసా త్వరలో భారత్లో ఒకే కార్డుతో అటు డెబిట్కి, ఇటు క్రెడిట్కి రెండు విధాలుగా ఉపయోగపడేలా ‘డెబిట్–కమ్–క్రెడిట్ కార్డు’ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ కొత్త విధానం వినియోగదారులకు సౌకర్యాన్ని పెంచడమే కాకుండా, దేశంలో క్రెడిట్ వినియోగాన్ని విస్తరించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డులతో పోలిస్తే ప్రస్తుతం భారత్లో యూపీఐ వేగంగా విస్తరిస్తున్నప్పటికీ, అది ప్రధానంగా బ్యాంక్ సేవింగ్స్ ఖాతా నుంచి నేరుగా డబ్బు కట్ అయ్యే విధానమే. డెబిట్ కార్డులు కూడా ఖాతాలో డబ్బు ఉంటేనే పనిచేస్తాయి. మరోవైపు, క్రెడిట్ కార్డులు సౌకర్యవంతమే అయినా వాటి వినియోగం డిజిటల్ రూపంలో,యూపీఐ చెల్లింపుల విషయంలో ఇంకా పరిమితంగానే ఉంది. ఈ నేపథ్యంలో వీసా తీసుకొస్తున్న కొత్త కార్డు యూపీఐతో అందే సౌలభ్యం, డెబిట్ కార్డుతో చేయగల నియంత్రణ, క్రెడిట్ కార్డు ఫ్లెక్సిబిలిటీ ఈ మూడింటినీ కలిపిన ఉపయోగకరమైన సాధనంగా మారనుందని విశ్లేషకులు అంటున్నారు. బ్యాంకులు, వినియోగదారులకు లాభాలు ఈ కొత్త విధానం ద్వారా బ్యాంకులు తమ రిస్క్ పాలసీలకు అనుగుణంగా క్రెడిట్ వినియోగాన్ని నియంత్రించగలుగుతాయి. వినియోగదారులకు మాత్రం ఒకటి కంటే ఎక్కువ కార్డులని ప్రతిచోటుకూ మోసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా స్థిర ఆదాయం ఉన్నా క్రెడిట్ కార్డు లేని మధ్యతరగతి వర్గానికి ఇది ఉపయోగకరంగా మారే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం నిపుణుల అంచనాల ప్రకారం, ఈ విధానం నగదు వినియోగాన్ని తగ్గించడంలో, టైర్–2, టైర్–3 నగరాల్లో కార్డు వినియోగాన్ని పెంచడంలో, ఫార్మల్ ఎకానమీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అయితే, అతిగా క్రెడిట్ వినియోగం వల్ల వినియోగదారుడు అప్పుల ఊబిలో కూరుకునే ప్రమాదం కూడా ఉందని, అందుకే ప్రజల్లో ఆర్థిక అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. వీసా ప్రతిపాదిస్తున్న ఈ డెబిట్–కమ్–క్రెడిట్ కార్డు భారత్ చెల్లింపుల వ్యవస్థను మరింత స్మార్ట్గా, ఫ్లెక్సిబుల్గా మార్చే విధానంగా పరిగణించవచ్చు. ఇది వినియోగదారుల సౌకర్యం, బ్యాంకులకు భద్రత ఈ రెండింటికీ మధ్య సమతుల్యత తీసుకురావచ్చని విశ్లేషకుల అభిప్రాయం. కార్డు కాదు కాంబోప్యాక్ వీసా అభివృద్ధి చేసిన ‘ఫ్లెక్సిబుల్ క్రెడెన్షియల్ (వీసా ఫ్లెక్స్) ’ టెక్నాలజీ ఆధారంగా ఈ కార్డు పనిచేస్తుంది. 16 అంకెల ఒకే కార్డు నంబర్ ద్వారా కస్టమర్ లావాదేవీ చేసే సమయంలో అది అవసరాన్ని బట్టి డెబిట్గా లేదా క్రెడిట్గా వాడుకోవచ్చు. చెల్లింపు ఎలా జరగాలన్నది కస్టమర్ కొనుగోలు చేసే విలువ మొత్తం, లేదా వినియోగదారు ముందుగా ఎంచుకున్న సెట్టింగ్స్ ఆధారంగా ఆటోమేటిక్గా నిర్ణయమవుతుంది.ఉదాహరణకు, రోజువారీ చిన్న ఖర్చులు డెబిట్గా, పెద్ద కొనుగోళ్లు క్రెడిట్లో జరిగేలా ఈ కార్డును సెట్ చేసుకోవచ్చు.భారత్ ఎందుకు కీలక మార్కెట్? భారత్లో క్రెడిట్ కార్డు వినియోగం అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే తక్కువ. అదే సమయంలో నగదు లావాదేవీల వాటా చాలా పెద్దది. ఈ పరిస్థితిలో ఒకే కార్డు ద్వారా డెబిట్–క్రెడిట్ సౌకర్యం ఇవ్వడం వల్ల డిజిటల్ చెల్లింపులు మరింత విస్తరించవచ్చని వీసా భావిస్తోంది. సాక్షి, బిజినెస్డెస్క్ -
ఒక్కరోజే రూ. 20వేలు డౌన్.. తగ్గుతున్న వెండి రేటు!
బంగారం, వెండి ధరలు ఊహకందని విధంగా మారిపోతున్నాయి. గత వారంలో రూ. 3.20 లక్షలకు చేరింది సిల్వర్ రేటు.. ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. ఈ రోజు (శుక్రవారం) ధర రూ. 20,000 తగ్గింది. దీంతో కేజీ రేటు రూ. 2.80 లక్షలకు చేరింది.ఫిబ్రవరి 9న రూ.3 లక్షల వద్ద ఉన్న కేజీ సిల్వర్ రేటు.. ఆ తరువాత మూడు రోజులు స్థిరంగా ఉండి.. నేడు (ఫిబ్రవరి 13) రూ. 20వేలు తగ్గింది. రానున్న రోజుల్లో ఇంకా తగ్గుతుందా?, పెరుగుతుందా? అనే ఆందోళన చాలామంది పెట్టుబడిదారుల్లో మొదలైంది. గ్లోబల్ మార్కెట్లో కూడా వెండి రేటు 9 శాతం తగ్గి 76.53 డాలర్ల వద్దకు చేరింది.ధరలు తగ్గడానికి ప్రధాన కారణం.. గ్లోబల్ మార్కెట్లో వస్తున్నా పరిణామాలే అని తెలుస్తోంది. ఇన్వెస్టర్ల ప్రాఫిట్ బుకింగ్ కూడా దీనిపై ప్రభావం చూపింది. అయితే.. భవిష్యత్తులో సిల్వర్ రేటు పెరుగుతుందని కియోసాకి వంటి నిపుణులు చెబుతున్నారు.2025 నాటి వెండి రేటుకు.. 2026 వెండి రేటుకు చాలా తేడా ఉంది. ఏడాది కాలంలో ధర రూ. 153 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత సంవత్సరం జనవరి రూ. 90వేలు వద్ద ఉన్న కేజీ సిల్వర్ రేటు.. ఈ ఏడాది జనవరి రూ.3 లక్షలు దాటేసింది. దీన్నిబట్టి చూస్తే.. వెండి రేటు ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.వెండి ధరలు పెరగడానికి కారణాలువెండిని.. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం, వైద్య సాంకేతికత, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా.. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ కీలకంగా మారింది. ఇవన్నీ వెండి డిమాండును అమాంతం పెంచడంలో దోహదపడ్డాయి. ఇది ధరలను భారీగా పెంచే అవకాశం ఉందని చేబడుతున్నారు. -
బీఎస్ఎన్ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్.. రోజుకు 3జీబీ డేటా!
రూ.2626 యాన్యువల్ ప్లాన్ పరిచయం చేసిన బీఎస్ఎన్ఎల్ మరో వార్షిక రీఛార్జ్ ప్లాన్ ప్రకటించింది. 365 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్ కొంత ఎక్కువ డేటా కావాలనుకునేవారికి ఉపయోగకరంగా ఉంటుంది.బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన కొత్త రూ. 2766 ప్లాన్ ద్వారా రోజుకు 3 జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత కాల్స్ మాత్రమే కాకుండా రోజుకు 100 ఎస్ఎంఎస్లు పొందవచ్చు. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 365 రోజులు.A Year of Connectivity, SortedChoose BSNL ₹2799 Annual Plan, get- 3GB data/day, Unlimited calls, 100 SMS/day for 365 days validity. Recharge smart via #BReX 👉 https://t.co/41wNbHpQ5c #BSNL #BSNLAnnualPlan #BSNL2799 #StayConnected pic.twitter.com/80JMv67IaH— BSNL India (@BSNLCorporate) February 12, 2026రూ. 2,626 రీఛార్జ్ ప్లాన్దేశ్ కా నెట్వర్క్, దేశ్ కా భరోసా అంటూ.. బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన ప్లాన్ కోసం వినియోగదారులు 2,626 రూపాయలతో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. 365 రోజుల వరకు చెల్లుబాటు అయ్యే ఈ ప్లాన్ ద్వారా.. రోజుకు 2.6 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు పొందవచ్చు. అపరిమిత కాల్స్ యధావిధిగా లభిస్తాయి. అయితే ఈ ఆఫర్ కేవలం ఫిబ్రవరి 24 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని సంస్థ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. -
ఎన్పీసీఐ భారత్ కనెక్ట్తో ఎన్టీటీ డేటా జట్టు
ఎన్పీసీఐ భారత్ కనెక్ట్తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఎన్టీటీ డేటా బిజినెస్ సొల్యూషన్స్ వెల్లడించింది. హైదరాబాద్లో నిర్వహించిన ట్రాన్స్ఫర్మేషన్ నౌ వార్షిక కార్యక్రమం సందర్భంగా ఇందుకు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది.సంక్లిష్టమైన వ్యవస్థల కారణంగా మధ్య, భారీ స్థాయి కంపెనీలు బీ2బీ చెల్లింపుల విషయంలో పలు సవాళ్లు ఎదుర్కొంటాయని ఎన్టీటీ డేటా బిజినెస్ సొల్యూషన్స్ ఎండీ కృణాల్ పటేల్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఎస్ఏపీ సాఫ్ట్వేర్ని ఉపయోగించే సంస్థల మధ్య బీ2బీ చెల్లింపులను సరళతరం చేసేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.ట్రాన్స్ఫర్మేషన్ నౌ కార్యక్రమంలో 1,500 మంది పైగా సీఎక్స్వోలు, పరిశ్రమ దిగ్గజాలు పాల్గొన్నారు. డేటా సార్వ¿ౌమత్వం, బాధ్యతాయుతంగా కృత్రిమ మేథను వినియోగించడం తదితర అంశాలపై చర్చించారు. ఆటోమోటివ్, కెమికల్స్, తయారీ తదితర రంగాల్లో ఎస్ఏపీ ఆధారిత వ్యూహాల అమలు తీరుతెన్నులను ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఎన్టీటీ డేటా బిజినెస్ సొల్యూషన్స్ గ్లోబల్ సీఈవో నార్బర్ట్ రోటర్తో పాటు ఎన్పీసీఐ భారత్ కనెక్ట్ అధికారులు ఇందులో పాల్గొన్నారు. -
NHAI: ఉచితంగా రూ.1000 ఫాస్ట్ట్యాగ్ రీఛార్జ్!
జాతీయ రహదారులపై ప్రయాణించే.. ప్రయాణికులకు మరింత సౌకర్యం & పరిశుభ్రత కల్పించాలనే లక్ష్యంతో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఓ కొత్త కార్యక్రమం ప్రారంభించింది. దీని ద్వారా రూ. 1000 విలువైన ఫాస్ట్ట్యాగ్ రీచార్జ్ ఉచితంగా పొందవచ్చని ప్రకటించింది. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఎన్హెచ్ఏఐ 'క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్' పేరుతో ప్రారంభించిన ఈ కార్యక్రమం 2026 జూన్ 30 వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమం ఉద్దేశ్యం ఏమిటంటే.. జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాలలోని మరుగుదొడ్ల పరిశుభ్రతను మెరుగుపరచడం.జాతీయ రహదారులపై ప్రయాణించే వారిలో చాలామంది.. టోల్ ప్లాజాలలో ఉన్న మరుగుదొడ్లను ఉపయోగిస్తున్నారు. అయితే కొన్ని చోట్ల పరిశుభ్రత లోపించడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఎన్హెచ్ఏఐ ప్రజల సహకారం కోరుతోంది. కాబట్టి ఎవరైనా.. టోల్ ప్లాజాలలో మరుగుదొడ్డి అపరిశుభ్రంగా ఉందని గమనిస్తే.. ఫోటో తీసి రాజ్మార్గయాత్ర యాప్ లేటెస్ట్ వెర్షన్ ద్వారా జియో-ట్యాగ్ చేసిన ఫోటోలను పేరు, ప్రదేశం, వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ (VRN) & మొబైల్ నంబర్తో సహా వివరాలతో అప్లోడ్ చేయాలి.సంబంధిత అధికారులు ఫోటోలను పరిశీలించి.. సమాచారం నిజమని ద్రువీకరిస్తే, ఫోటోలను షేర్ చేసిన వారి వెహికల్ నెంబర్కు రూ. 1000 విలువైన ఫాస్ట్ట్యాగ్ రీఛార్జ్ బహుమతిగా లభిస్తుంది. ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని.. రహదారులపై పరిశుభ్రతను మెరుగుపరచడానికి సహకరిస్తారని ఎన్హెచ్ఏఐ భావిస్తోంది.Report & Get Rewarded!To enhance commuter convenience and hygiene standards across National Highways, NHAI is conducting the ‘Clean Toilet Picture Challenge’ till 30th June 2026. The initiative encourages National Highway users to report any unclean toilet facilities at Toll… pic.twitter.com/fu3cmstoSZ— NHAI (@NHAI_Official) February 12, 2026 -
ఇక ‘అక్కా కేఫ్’లు.. ఎక్కడంటే..
కర్ణాటక రాష్ట్రంలో ఇక మరిన్ని ‘అక్కా కేఫ్’లు ప్రారంభం కానున్నాయి. 2025లో ప్రారంభించి స్వయం సహాయక బృందాల (SHGs) మహిళల ద్వారా నిర్వహిస్తున్న కాఫీ వ్యవస్థాపకత కార్యక్రమం ‘అక్కా కేఫ్’ చొరవను విస్తరించేందుకు కర్ణాటక ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది. 16వ రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ ప్రాజెక్టును ప్రకటించారు.బెంగళూరులో తాజాగా జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ కాఫీ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో కర్ణాటక పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ ఈ విషయాన్ని వెల్లడించారు. మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా, రాష్ట్ర కాఫీ వ్యాల్యూ చెయిన్నుబలోపేతం చేయడం ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.ఏమిటీ ‘అక్కా కేఫ్’?‘అక్కా కేఫ్’ ప్రోగ్రామ్ అనేది జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (NRLM) కింద రాష్ట్ర ప్రభుత్వ మద్దతుతో అమలవుతున్న జీవనోపాధి, వ్యవస్థాపకత పథకం. ఇది నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత, జీవనోపాధి విభాగం ద్వారా అమలవుతోంది.ఈ చొరవ ద్వారా కర్ణాటక అంతటా మహిళలు నడిపే కాఫీ కియోస్కులు, కేఫ్ల నెట్వర్క్ను ఏర్పాటుచేయడం లక్ష్యం. స్వయం సహాయక సంఘాల మహిళలు మైక్రోఫైనాన్స్ కార్యకలాపాలకు మాత్రమే పరిమితం కాకుండా సూక్ష్మ పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ఇది తోడ్పడుతుంది.కర్ణాటక ప్రభుత్వ తాజాగా ప్రకటించిన రూ.25 కోట్ల కేటాయింపుతో కియోస్క్ మౌలిక సదుపాయాలు, శిక్షణ కార్యక్రమాలు, ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్కు సహకారం అందించనున్నారు. ప్రభుత్వం ఈ పథకం కింద 2,500 ‘అక్కా కేఫ్’ కాఫీ కియోస్కులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కియోస్క్ల రూపకల్పన, సరఫరా, నిర్మాణం, ప్రారంభానికి టెండర్లు ఇప్పటికే పిలిచినట్లు సమాచారం.దశలవారీ అమలుప్రాజెక్టును దశలవారీగా అమలు చేస్తారు. మొదటి దశలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 50 ఆధునిక కేఫ్లు ఏర్పాటు చేస్తారు. అర్హులైన మహిళలకు మౌలిక సదుపాయాలు, సెటప్ కోసం రూ.15 లక్షల వరకు గ్రాంట్లు అందించనున్నారు.ఎక్కడెక్కడ?ప్రస్తుతం రాష్ట్రంలో కొన్ని ‘అక్కా కేఫ్’లు పనిచేస్తున్నాయి. వీటిలో బెంగళూరులో రెండు, బీదర్లో రెండు, కార్వార్లో ఒకటి ఉన్నాయి. త్వరలో మైసూరులో మరో రెండు కేఫ్లు ప్రారంభం కానున్నాయి. బెంగళూరులోని గాంధీనగర్, దేవనహళ్లి ప్రాంతాలలో అక్కా కేఫ్లను పైలట్ ప్రాతిపదికన ప్రారంభించారు.మెనూలో ఏమేముంటాయంటే..‘అక్కా కేఫ్’ల్లో ప్రధానంగా కాఫీ లభిస్తుంది. అదనంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేకమైన వంటకాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ మెనూలో సాధారణంగా కాఫీతోపాటు ఇడ్లీ, వడ, ఉప్మా, పులావ్, టీ ఉంటాయి. చౌకైన ధరల్లో అల్పాహారం, తేలికపాటి భోజనం కూడా లభిస్తాయి.లక్ష మంది మహిళలకు శిక్షణకాఫీ బోర్డు ఆఫ్ ఇండియా, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ సహకారంతో లక్ష మంది స్వయం సహాయక బృందాల మహిళలకు శిక్షణ ఇవ్వనుంది. ఈ శిక్షణలో ప్రధానంగా ప్రామాణిక ఫిల్టర్ కాఫీ తయారీ, కేఫ్, కియోస్క్ నిర్వహణ, వ్యవస్థాపకత, సూక్ష్మ ఎంటర్ప్రైజ్ అభివృద్ధి వంటి అంశాలు ఉంటాయి.తొలుత సుమారు 400 మంది మహిళలకు బెంగళూరులోని కాఫీ బోర్డు ప్రధాన కార్యాలయంలో మాస్టర్ ట్రైనర్లుగా శిక్షణ ఇస్తారు. ఈ శిక్షకులు తాలూకా, గ్రామ స్థాయిలలో మిగిలిన మహిళలకు శిక్షణ అందిస్తారు. శిక్షణ , అమలుకు కాఫీ బోర్డు అటల్ ఇంక్యుబేషన్ & ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ సెంటర్ సహకారం అందిస్తుంది. -
బ్యాంక్లకు ఆర్బీఐ గవర్నర్ సూచన
'ఆర్థిక అక్షరాస్యత వారం'ను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ముంబైలో ప్రారంభించారు. ఈ నెల 13 వరకు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరగనుంది. ఇందులో భాగంగా ఆర్థిక్ష అక్షరాస్యతపై అవగాహన కల్పించనున్నారు. ఒకటికి మించిన మాధ్యమాల్లో అవగాహన, ప్రచార కార్యక్రమాలను ఆర్బీఐ నిర్వహించనుంది.2016 నుంచి ఆర్బీఐ ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సురక్షిత కేవైసీ (కస్టమర్ గురించి వివరాలు తెలుసుకోవడం), సమ్మిళిత బ్యాంక్ ప్రాధాన్యాన్ని గవర్నర్ మల్హోత్రా ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేవైసీ, ఈ–కేవైసీ, సెంట్రల్ కేవైసీ ప్రాధాన్యాన్ని కస్టమర్లకు ఈ కార్యక్రమంలో భాగంగా తెలియజేయడంపై బ్యాంక్లు దృష్టి సారించాలని కోరారు. అదే సమయంలో కేవైసీ సంబంధిత మోసాలు, దుర్వినియోగాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
తొలి ఎంపిక బంగారమే.. సర్వేలో కీలక విషయాలు!
మారుతున్న కాలానికి అనుగుణంగా పెట్టుబడి మార్గాలు ఎన్ని వచ్చినా.. యువత మాత్రం ఇప్పటికీ బంగారం పైనే గట్టి నమ్మకం పెట్టుకుంటున్నారు. దేశంలోని జనరేషన్ జెడ్ (జెన్ జీ), మిలీనియల్స్ పెట్టుబడుల ధోరణిపై స్మిట్టన్ పల్స్ ఏఐ నిర్వహించిన తాజా సర్వేలో కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. సుమారు 5,000 మంది యువత (18-39 ఏళ్లు) అభిప్రాయాలను సేకరించిన ఈ నివేదిక ప్రకారం.. సురక్షితమైన పెట్టుబడిగా 62 శాతం మంది బంగారం వైపే మొగ్గు చూపుతున్నారు.ఆర్థిక అనిశ్చితి నెలకొన్న సమయంలో సేవింగ్స్ అకౌంట్లు, ఈక్విటీల కంటే బంగారమే తమకు ధీమా ఇస్తుందని 65.7 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఒకవేళా రూ.25,000 పెట్టుబడి పెట్టాల్సి వస్తే.. పెట్టుబడి మొత్తాన్ని కింది విధంగా విభజించనున్నట్లు సర్వేలో వెల్లడైంది.➤బంగారం: 61.9 శాతం➤మ్యూచువల్ ఫండ్లు: 16.6 శాతం➤ఫిక్స్డ్ డిపాజిట్లు: 13 శాతం➤స్టాక్ మార్కెట్: 6.6 శాతం➤క్రిప్టో కరెన్సీ: 1.9 శాతంగతంలో బంగారం కొనుగోలు అంటే.. కుటుంబం అంతా కలిసి తీసుకునే పెద్ద నిర్ణయంగా ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. 66.7 శాతం కొనుగోళ్లు పూర్తిగా వ్యక్తిగత నిర్ణయాల ఆధారంగానే జరుగుతున్నాయి. కుటుంబ సభ్యుల ప్రమేయం తగ్గుతోంది. 61.9 శాతం మంది తాము చేసిన ఇటీవలి కొనుగోలు 5 గ్రాముల లోపే ఉందని తెలిపారు. అందులో 27.5 శాతం మంది 2 గ్రాముల కంటే తక్కువ పరిమాణంలోనే కొనుగోలు చేశారు. జెడ్ జీ యువత తమ మొదటి జీతం (24.3 శాతం) అందగానే గోల్డ్ కొనుగోలు చేయాలని భావిస్తారు.డిజిటల్ ప్లాట్ఫారమ్లు అందుబాటులోకి వచ్చిన తరువాత.. ఫిజికల్ గోల్డ్ కొనుగోలుకు కూడా యువత ప్రాధాన్యత ఇస్తోంది. పెద్ద గోల్డ్ బ్రాండెడ్ షోరూమ్లలో 38.3%, స్థానిక జ్యువెలరీ దుకాణాలలో 34.7 శాతం, ఆన్లైన్/యాప్స్ ద్వారా బంగారం కొనుగోలు చేసేందుకు 5.2 శాతం యువత ఆసక్తిగా చూపుతున్నారు.ఇదీ చదవండి: వెండి ధర ఇంకా ఎంత పెరుగుతుందంటే..?బంగారం కొంటున్నారు. కానీ కొనేటప్పుడు ప్రధానంగా ప్యూరిటీ విషయంలో 49.4 శాతం మంది ఆందోళన వ్యక్తం చేస్తుండగా, మేకింగ్ ఛార్జీలు (21 శాతం), రీసేల్ వాల్యూ (17 శాతం)పై మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా బంగారం కొన్న తర్వాత 67.1 శాతం మంది ఏదో ఒక సమయంలో బాధపడినట్లు సర్వేలో వెల్లడయ్యాయి.కొనుగోలులో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ బంగారంపై ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. రాబోయే 12 నుంచి 24 నెలల్లో కచ్చితంగా బంగారం కొంటామని 52.7 శాతం మంది యువత ధీమా వ్యక్తం చేశారు. ఎక్కువ పెట్టుబడిగా కాకుండా.. క్రమ పద్ధతిలో, చిన్న మొత్తాల్లో బంగారం కొనుగోలు చేయడమే ట్రెండ్ అని ఈ సర్వే స్పష్టం చేస్తోంది. -
స్టాక్మార్కెట్ క్రాష్.. నెత్తురు కక్కిన షేర్లు!
మార్కెట్పై బేర్స్ పట్టు సాధించడంతో దలాల్ స్ట్రీట్లో శుక్రవారం తీవ్ర రక్తపాతం! చోటుచేసుకుంది. గ్లోబల్ టెక్ మార్కెట్లలో కొనసాగుతున్న మందగమనం ప్రభావంతో హెవీవెయిట్ ఐటీ షేర్లు భారీగా క్షీణించాయి. ఫలితంగా భారతీయ ఈక్విటీ సూచీలు దిగువన పయనించాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 1,048.16 పాయింట్లు లేదా 1.25 శాతం క్షీణించి 82,626.76 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 336.1 పాయింట్లు లేదా 1.30 శాతం క్షీణించి 25,471.1 వద్ద ముగిసింది. బీఎస్ఈలో బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ మినహా అన్ని షేర్లు కుప్పకూలాయి. వీటిలో హెచ్యూఎల్, ఐషర్ మోటార్స్, టాటా స్టీల్, టైటాన్ టాప్ లూజర్స్గా ఉన్నాయి. రంగాలవారీగా నష్టాలకు దారితీసింది. ఇది 3 శాతానికి పైగా పడిపోయింది. ఇదిలా ఉండగా, నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 5 శాతానికి పైగా పడిపోయి 1.44 శాతం నష్టపోయింది.రంగాల వారీగా చూస్తే, నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 3 శాతం కంటే ఎక్కువ నష్టపోయి అగ్రస్థానంలో నిలిచింది. అలాగే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 5 శాతం పైగా క్షీణించి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.71 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.79 శాతం పడిపోయాయి. మార్కెట్ అస్థిరతకు సూచిక అయిన ఇండియా వీఐఎక్స్ 15.18 శాతం ఎగసి, పెట్టుబడిదారుల ఆందోళనలను ప్రతిబింబించింది. -
మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. వాహనదారులకు గుడ్న్యూస్!
టోల్ వసూళ్లకు సంబంధించి.. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్స్ప్రెస్వేలపై వసూలు చేస్తున్న టోల్ ఫీజును తగ్గించాలని నిర్ణయించింది. ఇది 2026 ఫిబ్రవరి 15 నుంచి అమలులోకి వస్తుందని వెల్లడించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.నిర్మాణం పూర్తికాని లేదా కొంత భాగం మాత్రమే ప్రారంభించిన ఎక్స్ప్రెస్వేలపై వసూలు చేస్తున్న టోల్ ఫీజును 25 శాతం తగ్గించాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. 2008లో అమలులోకి వచ్చిన జాతీయ రహదారుల ఫీజు నియమాలలో సవరణలు చేసి ఈ తగ్గింపును అమలులోకి తీసుకురానున్నారు.ఇప్పటివరకు.. ఎక్స్ప్రెస్వే పూర్తిగా అందుబాటులో లేకపోయినప్పటికీ.. ప్రయాణికులు ఎక్కువ టోల్ చెల్లించాల్సి వచ్చేది. రోడ్డు నిర్మాణం పూర్తికాకపోయినా.. ఎక్కువ ఫీజులు వసూలు చేయడం అనేది ప్రజలకు భారంగా మారింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు టోల్ చెల్లింపులు తగ్గిస్తూ కొత్త నిర్ణయం తీసుకున్నారు.ఇక్కడ వాహనదారులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. 25 శాతం టోల్ ఫీజు తగ్గింపు అనేది శాశ్వతం కాదు. రోడ్డు నిర్మాణం పూర్తయిన తరువాత సాధారణ టోల్ ఫీజును వసూలు చేస్తారు. అంటే సాధారణ ఎక్స్ప్రెస్వే రేట్లు అమలులోకి వస్తాయన్నమాట.ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం.. ప్రజలను కొత్తగా నిర్మిస్తున్న ఎక్స్ప్రెస్వేలను ఉపయోగించేందుకు ప్రోత్సహించడమే. టోల్ ఫీజు తక్కువగా ఉంటే ఎక్కువ మంది ఆ మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఉంది. దీంతో జాతీయ రహదారులపై ట్రాఫిక్ తగ్గుతుంది.ఇదీ చదవండి: ఎంజీ మెజెస్టర్ వచ్చేసింది: రూ.41 వేలతో బుకింగ్! -
పవర్ఫుల్ పాస్పోర్ట్ల్లో భారత్ స్థానం ఎంతంటే..
అంతర్జాతీయ ప్రయాణ విభాగంలో భారత పాస్పోర్ట్ తన ప్రభావాన్ని చాటుతోంది. తాజాగా విడుదలైన 2026 హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో ఇండియా గతేడాదితో పోలిస్తే ఏకంగా 10 స్థానాలు ఎగబాకి 75వ స్థానానికి చేరుకుంది. భారతీయ పౌరుల అంతర్జాతీయ ప్రయాణ స్వేచ్ఛ గణనీయంగా పెరిగిందని ఈ ర్యాంకింగ్ స్పష్టం చేస్తోంది.హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) అందించే అధికారిక డేటా ఆధారంగా రూపొందుతుంది. ఒక దేశ పాస్పోర్ట్ హోల్డర్లు ముందస్తు వీసా అవసరం లేకుండా ఎన్ని దేశాలకు వెళ్లగలరు అనే అంశంపై ఈ ర్యాంకింగ్స్ ఆధారపడి ఉంటాయి. ప్రస్తుత నివేదిక ప్రకారం, భారతీయ పాస్పోర్ట్ కలిగి ఉన్నవారు ప్రపంచవ్యాప్తంగా 56 దేశాలకు వీసా-ఫ్రీ, వీసా-ఆన్-అరైవల్ లేదా ఇ-వీసా సౌకర్యంతో సులభంగా ప్రయాణించవచ్చు.ప్రయాణికులకు ప్రయోజనాలుఈ మెరుగైన ర్యాంకింగ్ వల్ల సెలవులు, వ్యాపార పర్యటనలు లేదా సాంస్కృతిక సందర్శనల కోసం విదేశాలకు వెళ్లే భారతీయులకు వీసా అవాంతరాలు తగ్గుతాయి. ముఖ్యంగా ఆసియా, ఓషియానియా, కరేబియన్ దీవులు, ఆఫ్రికా ఖండంలోని దేశాల్లో భారతీయులకు మెరుగైన ప్రవేశ సౌకర్యాలు లభిస్తాయి.భారత్ ఈ ర్యాంకింగ్స్లో గత దశాబ్ద కాలంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. 2006లో 71వ ర్యాంకులో ఉన్న భారత్ గత ఏడాది 85వ స్థానానికి పడిపోయింది. అయితే, 2026 ప్రారంభంలో 80వ స్థానానికి, ఇప్పుడు ఏకంగా 75వ స్థానానికి చేరుకోవడం గమనార్హం.ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్లు..ర్యాంకుదేశంవీసా రహిత పర్యటన(దేశాల సంఖ్య)1సింగపూర్1922జపాన్, దక్షిణ కొరియా1873స్వీడన్, యూఏఈ1864జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ (మరో 8 ఐరోపా దేశాలు)1855ఆస్ట్రియా, గ్రీస్, పోర్చుగల్, మాల్టా184 టాప్ 10లో ఇతర దేశాలు..ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాలు టాప్ 10 జాబితాలో కొనసాగుతున్నాయి. అమెరికా పాస్పోర్ట్ హోల్డర్లు ప్రస్తుతం 179 దేశాలకు ముందస్తు వీసా లేకుండా ప్రయాణించగలరు.75వ ర్యాంకు అనేది భారత పాస్పోర్ట్ చరిత్రలో అత్యుత్తమ స్థానం కాకపోయినప్పటికీ, గత కొన్నేళ్లుగా కనిపిస్తున్న వృద్ధి రేటు సానుకూల ధోరణిని సూచిస్తోంది. ప్రపంచ దేశాలతో భారత్ కుదుర్చుకుంటున్న ద్వైపాక్షిక ఒప్పందాలు, దౌత్య సంబంధాల మెరుగుదల కారణంగా భవిష్యత్తులో భారత పాస్పోర్ట్ మరింత శక్తివంతంగా మారే అవకాశం ఉంది.ఇదీ చదవండి: రాజ్పాల్ యాదవ్ గ్యారేజీలోని కార్ల లిస్ట్ ఇదే.. -
డబ్బుతోనే చెడగొడుతున్నారు.. ‘రిచ్ డాడ్’ వార్నింగ్!
ప్రఖ్యాత ఇన్వెస్టర్, బెస్ట్ సెల్లర్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) తరచూ తన ఆర్థిక అభిప్రాయాలతో వార్తల్లో నిలుస్తుంటారు. ఈసారి ఆయన.. తల్లిదండ్రులు డబ్బుతో తమ పిల్లల జీవితాలను ఎలా చెడగొడుతున్నారో వివరించారు.5 ‘సీ’లతో పిల్లల జీవితాలు నాశనంతల్లిదండ్రులు తమ పిల్లల జీవితాలను ఎలా నాశనం చేస్తున్నారో కియోసాకి తన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ (ట్విటర్)లో చేసిన పోస్టులో వివరించారు. పిల్లలు ఆర్థికంగా చెడిపోవడానికి కారణమైన ఐదు ‘సీ’(C)ల గురించి ప్రస్తావించారు.1. క్యాష్ (మనీ): తల్లిదండ్రులు పిల్లలకు డబ్బు ఇస్తారు. కానీ వారు స్వయంగా సంపాదించాలని ఆశించరు. దీంతో పిల్లల్లో ఆర్థిక బాధ్యత తగ్గుతుంది.2. కాలేజ్ : పిల్లల ఉన్నత విద్యకు తల్లిదండ్రులే పూర్తిగా ఖర్చు భరిస్తారు. దీంతో ఉన్నత విద్య కోసం కష్టపడే అలవాటు పిల్లలకు తగ్గిపోతుంది.3. కారు: కళాశాల ఫీజులతో పాటు, కారు కొనివ్వడం, బీమా, నిర్వహణ ఖర్చులు కూడా తల్లిదండ్రులే భరిస్తున్నారు.4. కాండో (ఇల్లు): కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు తొలి ఇంటిని కూడా తామే స్వయంగా కొనిస్తున్నారు.5. క్యాష్(ట్రస్ట్ ఫండ్): పిల్లల భవిష్యత్తు కోసం ట్రస్ట్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నారు. ఫలితంగా పిల్లలు బడ్జెట్ చేయడం, పెట్టుబడి పెట్టడం వంటి ఆర్థిక నైపుణ్యాలు నేర్చుకోరు.ఆస్తి కరిగిపోతుంది..కియోసాకి అభిప్రాయం ప్రకారం.. మొదటి తరం కష్టపడి సంపాదిస్తుంది. రెండో తరం సౌకర్యవంతమైన జీవితం గడుపుతుంది. కానీ అదే అలవాట్లు మూడో తరానికి వెళ్తే కుటుంబ ఆస్తి క్రమంగా క్షీణిస్తుంది. కష్టపడి పనిచేయడం, సంపాదించడం, పెట్టుబడి పెట్టడం, బడ్జెట్ నిర్వహించడం వంటి అలవాట్లు చిన్నప్పటి నుంచే నేర్పాలని ఆయన సూచిస్తున్నారు.ఇదీ చదవండి: ఫేక్లొద్దు.. రాబర్ట్ కియోసాకి హెచ్చరిక!భారతీయ కుటుంబాల్లో ఇదే పరిస్థితిరాబర్ట్ కియోసాకి చెప్పిన పరిస్థితి భారతీయ కుటుంబాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. భారతదేశంలో పిల్లలు ఉద్యోగం పొందిన తర్వాత కూడా ఇల్లు లేదా కారు కొనుగోలు సమయంలో తల్లిదండ్రులు తమ పొదుపులను, కొన్నిసార్లు ప్రావిడెంట్ ఫండ్ లేదా పదవీ విరమణ నిధుల నుంచే ఉపసంహరించుకుని సహాయం చేస్తుంటారు. ఇది తల్లిదండ్రుల ప్రేమగా కనిపించినా, దీర్ఘకాలంలో పిల్లల్లో ఆర్థిక స్వావలంబనను దెబ్బతీసే ప్రమాదం ఉందని కియోసాకి హెచ్చరిస్తున్నారు.THE 5-Cs: How to destroy a child’s life with money.I have met many parents who destroy their children’s lives with money….The parents give their child or children the 5-Cs1: CASH: they give their children money never expecting them to earn their money.2: COLLEGE:…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 12, 2026 -
రాజ్పాల్ యాదవ్ గ్యారేజీలోని కార్ల లిస్ట్ ఇదే..
బాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు రాజ్పాల్ యాదవ్ ప్రస్తుతం వ్యక్తిగత, వృత్తిపరమైన కారణాలతో వార్తల్లో నిలిచారు. ఒకవైపు ఆయన లగ్జరీ కార్ల సేకరణ సోషల్ మీడియాలో చర్చనీయాంశం కాగా, మరోవైపు ఆయన ఎదుర్కొంటున్న చట్టపరమైన చిక్కులు పరిశ్రమలో సంచలనం రేపుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం రాజ్పాల్ యాదవ్ ఎందుకు వార్తల్లో ఉన్నారు? ఆయన జీవనశైలికి సంబంధించిన ఆసక్తికర వివరాలతో కూడిన వివరాలు చూద్దాం.రాజ్పాల్ యాదవ్ ఎందుకు వార్తల్లో నిలిచారు?ప్రస్తుతం రాజ్పాల్ యాదవ్ చెక్ బౌన్స్ కేసులో చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు రూ.9 కోట్ల బకాయిలకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన ఇటీవల తిహార్ జైలులో లొంగిపోయారు. 2010లో ఆయన దర్శకత్వం వహించిన ‘అతా పతా లాపతా’ సినిమా కోసం తీసుకున్న అప్పు తిరిగి చెల్లించకపోవడంతో ఈ వివాదం తలెత్తింది. దీనిపై ఇటీవల జరిగిన బెయిల్ విచారణను కోర్టు ఫిబ్రవరి 16కి వాయిదా వేసింది. ఈ క్లిష్ట సమయంలో కొందరు ప్రముఖ బాలీవుడ్ నటులు ఆయనకు అండగా నిలవడం, ఆర్థిక సహాయం ప్రకటించడం బాలీవుడ్లో చర్చనీయాంశమైంది.రాజ్పాల్ యాదవ్ వ్యక్తిగత జీవితం సాధారణంగానే ఉన్నప్పటికీ, ఆయన వద్ద ఉన్న కార్ల సేకరణ మాత్రం చాలా ప్రత్యేకం. వీటికి సంబంధించి అధికారిక ధ్రువీకరణ లేనప్పటికీ కొన్ని వార్తా నివేదికల సమాచారం ప్రకారం ఆయన వద్ద ఉన్న వాహనాలు వివరాలు కింది విధంగా ఉన్నాయి. -
రాజీనామా చేసిన వారికి ఆహ్వానం
జొమాటో సంస్థను వదిలి వెళ్లిన మాజీ ఉద్యోగులను తిరిగి ఆహ్వానిస్తూ జొమాటో గ్రూప్ (ఎటర్నల్) వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ చేసిన ప్రయత్నం మెరుగైన ఫలితాలను ఇస్తోంది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఆయనకు సుమారు 8,000 ఈమెయిల్స్ వచ్చినట్లు ఆయన ఎక్స్(ట్విట్టర్) వేదికగా వెల్లడించారు.గోయల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఈమెయిల్స్ను రెండు వర్గాలుగా విభజించవచ్చు. అందులో గతంలో ఎటర్నల్ ప్రయాణంలో భాగమై వివిధ కారణాలతో సంస్థను వీడిన 4,000 మంది మాజీ ఉద్యోగులు కొందరున్నారు. ఇప్పటివరకు సంస్థలో పనిచేయకపోయినా జొమాటో సంస్కృతికి ఆకర్షితులై చేరాలనుకుంటున్న వారు మరో 4,000 మంది ఉన్నారు. ‘నేను దీన్ని అస్సలు ఊహించలేదు. చాలా ధన్యవాదాలు. ఈ ఈమెయిల్స్లో ఎన్నో కథలు, భావోద్వేగాలు, నిజాయితీ దాగి ఉన్నాయి’ అని గోయల్ ఆనందం వ్యక్తం చేశారు.పాత సహోద్యోగులకు బంపర్ ఆఫర్సంస్థ గత కొన్నేళ్లుగా ఎదుగుతున్న క్రమంలో పాత ఉద్యోగులతో తనకు ఉన్న అనుబంధం ప్రస్తుత టీమ్కు ఉండకపోవచ్చని గోయల్ అభిప్రాయపడ్డారు. 8,000 మెయిల్స్ స్వయంగా చదవడం సమయంతో కూడుకున్న పని కావడంతో తనతో నేరుగా పనిచేసిన వారికి ఆయన ఒక వెసులుబాటు కల్పించారు. ఎవరైనా గతంలో దీపిందర్తో పనిచేసి ఉంటే మెయిల్ కోసం వేచి చూడకుండా నేరుగా తన మొబైల్ నంబర్ కనుగొని వాట్సాప్ చేయమని ఆయన కోరారు.‘గతాన్ని పట్టించుకోను’మాజీ ఉద్యోగుల పట్ల గోయల్ చూపిన సానుకూల దృక్పథం చర్చనీయాంశమైంది. గతంలో వారు ఎందుకు వెళ్లిపోయారు లేదా ఎలాంటి పరిస్థితుల్లో రాజీనామా చేశారనే విషయాలను పక్కన పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. గతంలో సంస్థలో సరైన వాతావరణం లేదా నాయకత్వం లేకపోవడం వల్ల కొందరు వెళ్లిపోయి ఉండవచ్చని ఆయన నిజాయితీగా అంగీకరించారు. ‘నేను గతాన్ని పట్టుకుని కూర్చుంటానని మీరు భావించవద్దు. తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. మాకు మీ అవసరం ఉంది’ అంటూ ఆయన భరోసా ఇచ్చారు.ఎందుకు మాజీ ఉద్యోగులకే ప్రాధాన్యత?సంస్థ పనితీరు, దాని విలువలు తెలిసిన వారు తిరిగి రావడం వల్ల పని వేగవంతం అవుతుందని గోయల్ నమ్ముతున్నారు. ‘ఎటర్నల్లో ఇంకా వృద్ధి చెందాల్సింది చాలా ఉంది. ఇక్కడ ఎదిగి, బయటకు వెళ్లి తిరిగి రావాలనుకునే వారికంటే మెరుగైన అభ్యర్థి మరొకరు ఉండరు’ అని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: డబుల్ డ్రాప్.. ఇంకా భారీగా పడిపోయిన పసిడి, వెండి ధరలు -
రూ .300 లకు కొన్న 2 అక్షరాలు.. ఇప్పుడు రూ .634 కోట్లు
అక్షరాలకు అదృష్టం వరించడమంటే ఇదోనేమో. మూడు దశాబ్దాల క్రితం కేవలం రూ.300కి కొనుగోలు చేసిన ఏఐ.కామ్ (AI.com) అనే రెండు అక్షరాల డొమైన్ నేమ్ నేడు సుమారు రూ.634 కోట్ల విలువైన డిజిటల్ ఆస్తిగా మారింది. కృత్రిమ మేధస్సు (AI) విప్లవం సాధారణ వందల రూపాయల పెట్టుబడిని వందల కోట్ల మహా సంపదగా ఎలా మార్చగలదో ఈ స్టోరీ తెలియజేస్తోంది.1993లో అర్సయాన్ ఇస్మాయిల్ అనే ఎంటర్ప్రెన్యూర్ ఈ డొమైన్ను సుమారు రూ.300కి రిజిస్టర్ చేశారు. ఆ సమయంలో ఇంటర్నెట్ ప్రారంభ దశలో ఉండగా, కృత్రిమ మేధస్సు ప్రధానంగా విద్యా పరిశోధనలకే పరిమితమైంది. రెండు అక్షరాల డొమైన్ పేర్లకు అప్పట్లో పెద్దగా వాణిజ్య విలువ లేకపోవడంతో, AI.com సంవత్సరాల పాటు నిశ్శబ్దంగానే ఉంది.ఏఐ బూమ్తో పెరిగిన విలువగత కొన్నేళ్లలో జనరేటివ్ AI, మెషిన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్లు, వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిన AI సాధనాల పెరుగుదలతో “AI” అనే పదానికి అపారమైన ప్రాధాన్యం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా శోధించే టెక్నాలజీ పదాల్లో ఇది ఒకటిగా మారింది. దీంతో చిన్నగా, సులభంగా గుర్తుపట్టే డొమైన్ పేర్లు పరిమిత డిజిటల్ ఆస్తులుగా మారాయి. AI.com కూడా ఈ ట్రెండ్తో క్రమంగా భారీ విలువను సంపాదించింది.రూ.634 కోట్ల డీల్2025 నాటికి AI.com అమ్మకం సుమారు రూ.634 కోట్లకు పూర్తయింది. దీన్ని కొనుగోలు చేసిన వ్యక్తి క్రిస్ మర్స్జలెక్ (Kris Marszalek). ఆయన ఈ డొమైన్ను కేవలం పెట్టుబడిగా కాకుండా వినియోగదారుల కోసం కృత్రిమ మేధస్సు ఆధారిత ప్లాట్ఫారమ్గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. డొమైన్ పేర్లు ఇప్పుడు కేవలం వెబ్ చిరునామాలు కాదు.. అవి వ్యూహాత్మక డిజిటల్ ఆస్తులు. రెండు అక్షరాల డొమైన్లను అత్యంత అరుదైనవిగా పరిగణిస్తారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాలతో అనుసంధానమైతే, అవి తక్షణ బ్రాండ్ గుర్తింపు, విశ్వసనీయతను అందిస్తాయి. ఏఐ రంగంలో స్టార్టప్లు, పెద్ద సంస్థలు పోటీ పడుతున్న నేపథ్యంలో, సరళమైన, ప్రభావవంతమైన వెబ్ చిరునామాల యాజమాన్యం ఇప్పుడు దీర్ఘకాలిక బ్రాండింగ్ వ్యూహంగా మారింది. -
డబుల్ డ్రాప్.. ఇంకా భారీగా పడిపోయిన పసిడి, వెండి ధరలు
దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. పసిడి ధరలు వరుసగా రెండో రోజూ రూ.వేలల్లో తగ్గి కొనుగోలుదారులకు డబుల్ ఆనందాన్ని ఇస్తోంది. మరో వైపు వెండి ధరలు కూడా చాలా రోజుల తర్వాత భారీగా దిగివచ్చాయి. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో మార్పులు వస్తున్నాయి. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:35 సమయానికి నిఫ్టీ(Nifty) 257 పాయింట్లు తగ్గి 25,548 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 809 దిగజారి 82,868 వద్ద ట్రేడవుతోంది.భారతీయ స్టాక్ మార్కెట్లు నేడు (ఫిబ్రవరి 13, 2026) భారీ పతనాన్ని చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన బలహీన సంకేతాలు, ముఖ్యంగా ఐటీ రంగంలో చోటుచేసుకున్న భారీ అమ్మకాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి.అమెరికాకు చెందిన ఏఐ స్టార్టప్ ఆంత్రోపిక్ కార్పొరేట్ లీగల్ విధులను ఆటోమేట్ చేసే కొత్త టూల్ను విడుదల చేయడం భారత ఐటీ రంగానికి శాపంగా మారింది. ఈ సాంకేతికత వల్ల ఐటీ కంపెనీల భవిష్యత్తు ఆదాయాలపై నీలి నీడలు కమ్ముకోవడంతో ఇన్వెస్టర్లు బెంబేలెత్తిపోయారు.అమెరికాలో జనవరి నెలకు సంబంధించి వెలువడిన ఉద్యోగ గణాంకాలు అంచనాల కంటే మెరుగ్గా ఉన్నాయి. ఇది ఆర్థిక వ్యవస్థకు శుభసూచకమే అయినప్పటికీ, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపును మరింత ఆలస్యం చేసే అవకాశం ఉందన్న సంకేతాలు మార్కెట్లను కలవరపెట్టాయి.‘ప్రస్తుత పతనం ప్రధానంగా ఐటీ, గ్లోబల్ సెంటిమెంట్ వల్ల జరిగింది. అయితే, నిఫ్టీకి 25,500 వద్ద బలమైన మద్దతు ఉంది. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు నాణ్యమైన షేర్లలో ఈ పతనాన్ని కొనుగోలు అవకాశంగా చూడవచ్చు’ అని నిపుణులు సూచిస్తున్నారు.Today Nifty position 13-02-2026(time: 9:36 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగులకు శుభవార్త
భారతీయ ఐటీ దిగ్గజం విప్రో తన ఉద్యోగులకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తీపి కబురు అందించింది. గత సెప్టెంబర్లో వాయిదా పడిన జీతాల పెంపును ఈ ఏడాది మార్చి 1 నుంచి అమలు చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.డిసెంబర్ 31, 2025తో ముగిసిన మూడో త్రైమాసికానికి గాను 100 శాతం వేరియబుల్ పేను కంపెనీ ప్రకటించింది. ఇది ఉద్యోగులకు ఫిబ్రవరి జీతంతో కలిసి అందుతుంది. అయతే, జీతాల పెంపు ఎంత శాతం ఉంటుందనే దానిపై కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.ఐటీ రంగంలో వేచి చూసే ధోరణిభౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, టారిఫ్ భయాల కారణంగా ఐటీ రంగంలో వ్యాపార పరిస్థితులు కొంత క్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో భారతీయ ఐటీ కంపెనీలు వ్యయ నియంత్రణపై దృష్టి సారించాయి. టీఈఎస్ ఏప్రిల్లో ఇవ్వాల్సిన పెంపును సెప్టెంబర్కు వాయిదా వేసి మెజారిటీ ఉద్యోగులకు 4.5% నుంచి 7% వరకు పెంపును ఇచ్చింది. కాగ్నిజెంట్.. ఆగస్టులో జరగాల్సిన పెంపును నవంబర్కు వాయిదా వేసింది. ప్రధాన ఐటీ సంస్థల్లో పెంపును ప్రకటించిన చివరి కంపెనీగా విప్రో నిలిచింది.ఇదీ చదవండి: రెరా బిల్డర్లకే కొమ్ముకాస్తోంది: సుప్రీంకోర్టు -
విశాఖలో ఇళ్ల అమ్మకాలు ఢీలా
విశాఖపట్టణం సహా దేశవ్యాప్తంగా టాప్–15 ద్వితీయ శ్రేణి పట్టణాల్లో గతేడాది ఇళ్ల అమ్మకాలు ఢీలాపడ్డాయి. 2024తో పోలిస్తే 10 శాతం తగ్గి 1.56 లక్షల యూనిట్లుగా ఉన్నట్టు ప్రాప్ఈక్విటీ సంస్థ వెల్లడించింది. అమ్మకాల విలువ మాత్రం ఎలాంటి మార్పు లేకుండా రూ.1.48 లక్షల కోట్లుగా ఉంది. ప్రీమియం ఇళ్లకు మాత్రం ఆదరణ కొనసాగుతోంది. రూ.కోటికి మించి ధరల శ్రేణిలోని ఇళ్ల అమ్మకాలు గతేడాది 9 శాతం పెరిగాయి. మొత్తం ఇళ్ల విక్రయాల్లో వీటి వాటా 23 శాతం నుంచి 28 శాతానికి పెరిగింది. విశాఖపట్టణంలో 2025లో అమ్ముడైన ఇళ్ల యూనిట్లు 2,406గా ఉన్నాయి. 2024లో విక్రయాలు 3,858 యూనిట్లతో పోలి్చతే 38 శాతం తగ్గాయి. కోయింబత్తూర్లో 4 శాతం తక్కువగా 3,702 యూనిట్లు విక్రమయ్యాయి.కోచిలో 17 శాతం తగ్గి 2,214 యూనిట్లకు విక్రయాలు పరిమితమయ్యాయి. నాగ్పూర్లోనూ అమ్మకాలు 18 శాతం తగ్గాయి. 6,260 యూనిట్లు అమ్ముడయ్యాయి. భువనేశ్వర్లో 4,885 యూనిట్ల విక్రయాలు జరిగాయి. అంతకుముందు ఏడాదితో పోలి్చతే 25 శాతం తగ్గాయి.వదోదరలో 19 శాతం తగ్గి 13,798 యూనిట్లు, సూరత్లో 15 శాతం తక్కువగా 19,835 యూనిట్లు చొప్పున విక్రయాలు నమోదయ్యాయి. గాం«దీనగర్లో విక్రయాలు 13,884 యూనిట్ల నుంచి 13,710 యూనిట్లకు పరిమితమయ్యాయి. అహ్మదాబాద్లో 51,148 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. 2024లో విక్రయాలు 55,315 యూనిట్ల కంటే 8 శాతం తగ్గాయి.భోపాల్లో 5 శాతం తక్కువగా 3,599 యూనిట్లు, జైపూర్లోనూ ఇంతే మేర తగ్గి 9,758 యూనిట్లు చొప్పున విక్రయాలు నమోదయ్యాయి.మెహాలీలో మాత్రం 34 శాతం అధికంగా 6,118 యూనిట్లు, లక్నోలో 6 శాతం అధికంగా 4,053 యూనిట్లు చొప్పున అమ్ముడయ్యాయి.ఎన్నో కారణాలు..గతేడాది ద్వితీయ శ్రేణి పట్టణాల్లో (టైర్–2) అమ్మకాలు ప్రథమ శ్రేణి పట్టణాల్లో మాదిరే ఉన్నట్టు ప్రాప్ఈక్విటీ సీఈవో సమీర్ జసూజ తెలిపారు. రూ.కోటిలోపున్న ఇళ్ల సరఫరా తగ్గడమే విక్రయాలు బలహీనపడేందుకు కారణమని పేర్కొన్నారు. టైర్–2 పట్టణాల్లో రూ.కోటిలోపు ఇళ్లకే డిమాండ్ ఎక్కువగా ఉంటుందన్నారు. భూముల ధరలు, నిర్మాణ వ్యయాలు, కొనుగోలుదారుల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్తగా వచ్చే ప్రాజెక్టుల్లో ఇళ్ల ధరలు అధికంగా ఉంటుండడం డిమాండ్, సరఫరాపై ప్రభావం చూపించినట్టు వివరించారు.ఇదీ చదవండి: రెరా బిల్డర్లకే కొమ్ముకాస్తోంది: సుప్రీంకోర్టు -
మహీంద్రా ఈ–ఆటో ‘ఉడో’.. ధర ఎంతంటే..
మహీంద్రా గ్రూప్లో భాగమైన మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ తాజాగా ‘ఉడో’ పేరిట ఎలక్ట్రిక్ ఆటోను గురువారమిక్కడ ఆవిష్కరించింది. దీని ఎక్స్షోరూం ధర రూ. 3,84,299 కాగా పరిమిత కాలం పాటు రూ. 3,58,999కి అందించనున్నట్లు సంస్థ ఎండీ సుమన్ మిశ్రా తెలిపారు. రిటైల్ విక్రయాలు ప్రారంభించామని, ఈ వారంలో డెలివరీలు మొదలవుతాయని చెప్పారు.తెలంగాణలోని జహీరాబాద్ ప్లాంటులో దీన్ని ఉత్పత్తి చేస్తున్నట్లు వివరించారు. ఇందుకోసం రూ. 500 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు మిశ్రా చెప్పారు. ఉడో ఒక్కసారి చార్జి చేస్తే 200 కి.మీ. రేంజి ఇస్తుందని, గరిష్టంగా గంటకు 55 కి.మీ. వేగం ఉంటుందని పేర్కొ న్నారు. 1.5 లక్షల కి.మీ. లేదా 6 ఏళ్ల వారంటీ ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీయంగానే విక్రయా లపై దృష్టి పెడుతున్నామని, అవకాశాలను బట్టి ఎగుమతి కూడా చేస్తామని మిశ్రా తెలిపారు.ఇదీ చదవండి: రెరా బిల్డర్లకే కొమ్ముకాస్తోంది: సుప్రీంకోర్టు -
పతనమైన పసిడి విలువ.. కారణాలు..
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో బంగారం ధరలు తాజాగా భారీగా పతనమయ్యాయి. భారతీయ మార్కెట్లో బంగారం ధరలు ఇటీవల గరిష్ట స్థాయుల్లో ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ముఖ్యంగా నిన్నటి మార్కెట్ సెషన్లో ఎంసీఎక్స్లో గోల్డ్ ఫ్యూచర్స్ సుమారు 6% నుంచి 9% వరకు పడిపోయి లోయర్ సర్క్యూట్ను తాకడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది. దీనికి గల ప్రధాన కారణాలు కింద చూద్దాం.ట్రంప్ విధానాలు.. డాలర్ బలోపేతంఅమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అనుసరిస్తున్న వాణిజ్య విధానాలు, సుంకాల విధింపు హెచ్చరికలు అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ విలువను పెంచాయి. డాలర్ ఇండెక్స్ పెరగడం వల్ల విదేశీ ఇన్వెస్టర్లకు బంగారం కొనుగోలు భారంగా మారుతుంది. ఇది సహజంగానే ధరలపై ఒత్తిడిని పెంచుతుంది.అంతర్జాతీయ అనిశ్చితి.. భౌగోళిక ఉద్రిక్తతలుఅమెరికాకు.. ఇరాన్, వెనిజువెలా వంటి దేశాలకు ఉన్న ఉద్రిక్తతలు కొంతమేర సద్దుమణగడం, దౌత్యపరమైన చర్చలు మొదలవ్వడం వల్ల సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారంపై డిమాండ్ తాత్కాలికంగా తగ్గింది. ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడి ఈక్విటీ మార్కెట్ల వైపు మళ్లడం కూడా ఈ పతనానికి ఒక కారణం.మార్జిన్ పరిమితుల పెంపుఎంసీఎక్స్, అంతర్జాతీయంగా కామెక్స్ వంటి ఎక్స్ఛేంజీలు బంగారం ట్రేడింగ్పై మార్జిన్ రిక్వైర్మెంట్లను పెంచాయి. దీనివల్ల ట్రేడర్లు ఎక్కువ నగదును డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే.. వారు తమ పొజిషన్లను ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో మార్కెట్లో లిక్విడేషన్ పెరిగి ధరలు దిగివచ్చాయి.రూపాయి ప్రభావంభారత రూపాయి విలువలో మార్పులు దేశీయంగా బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనపడటం వల్ల దిగుమతి చేసుకునే బంగారం ఖరీదవుతుంది. అయితే, ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకున్న భారీ కరెక్షన్ వల్ల దేశీయంగా ధరలు తగ్గుముఖం పట్టాయి.ఇన్వెస్టర్లు ఏం చేయాలి?ప్రస్తుత పతనం అనేది కేవలం టెక్నికల్ కరెక్షన్ మాత్రమేనని గుర్తుంచుకోవాలని ఎంసీఎక్స్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలంలో బంగారం పట్ల సానుకూల ధోరణి కొనసాగుతుందని భావిస్తున్నారు. ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయడం తెలివైన వ్యూహం కావొచ్చని సూచిస్తున్నారు.ఇదీ చదవండి: రెరా బిల్డర్లకే కొమ్ముకాస్తోంది: సుప్రీంకోర్టు -
వసూల్ రాజాలకు వార్నింగ్
ముంబై: రికవరీ ఏజెంట్ల ఆగడాలకు కళ్లెం దిశగా రిజర్వ్ బ్యాంక్ గురువారం కొన్ని ముసాయిదా నిబంధనలను ప్రతిపాదించింది. వీటి ప్రకారం లోన్ రికవరీ బాధ్యతలు నిర్వర్తించే ఏజెంట్లు తప్పనిసరిగా దానికి సంబంధించిన శిక్షణ పొందాలి. బ్యాంకు ఉద్యోగి లేదా రికవరీ ఏజెంట్లు రుణగ్రహీతతో గౌరవప్రదంగా మాట్లాడాలి. వసూలు కోసం వెళ్లినప్పుడు కూడా మర్యాదకరంగా వ్యవహరించాలి. రుణగ్రహీతలకు ఏజెంట్లు చేసే ఫోన్ కాల్స్ అన్నీ కూడా తప్పకుండా రికార్డ్ అయ్యేలా బ్యాంక్ చర్యలు తీసుకోవాలి. ఏజెంట్లు లేదా ఉద్యోగుల దగ్గరున్న కస్టమర్ల వివరాలు దురి్వనియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రికవరీ ప్రయత్నాల్లో భాగంగా ఏజెంట్లు దుర్భాషలాడటం, అనుచిత మెసేజీలు పంపించడంలాంటివి చేయకూడదు. రుణ గ్రహీత కుటుంబం దుఃఖంలో ఉన్న పరిస్థితుల్లో, వివాహ వేడుకలు, పండుగల్లాంటి సందర్భాల్లో లోన్ రికవరీ ప్రయత్నాలు చేయకూడదు. రికవరీ ఏజెంట్లుగా వ్యవహరించే వారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (ఐఐబీఎఫ్) నిర్వహించే ’డెట్ రికవరీ ట్రైనింగ్’ తీసుకోవడాన్ని తప్పనిసరి చేసే అంశాన్ని ఆర్బీఐ పరిశీలిస్తోంది. రికవరీ ఏజెన్సీలు తాము నియమించుకునే ఏజెంట్ల పూర్వచరిత్ర గురించి కూడా తెలుసుకునేలా బ్యాంకులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ రుణ బాకీల అంశం న్యాయస్థానం పరిధిలో ఉంటే ఆ వ్యవహారాన్ని ఉద్యోగులకు లేదా రికవరీ ఏజెంట్లకు రిఫర్ చేసే విషయంలో బ్యాంకులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మానిటరీ పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా రికవరీలపై నిర్దిష్ట ప్రకటన చేసిన మీదట రిజర్వ్ బ్యాంక్ తాజా ముసాయిదా నిబంధనలను ప్రతిపాదించడం గమనార్హం. -
ఇక ధరల లెక్క కొత్తగా
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణ సూచీ.. క్షేత్రస్థాయిలో వాస్తవ ధరలను ప్రతిఫలించడం లేదన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. వీటికి సమాధానంగానా అన్నట్టు.. కేంద్ర ప్రభుత్వం వినియోగ ధరల ఆధారిత సూచీ (సీపీఐ)లో కీలక మార్పులు, చేర్పులు చేసింది. సీపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం (రిటైల్)కు ఇప్పటివరకు 2012 బేస్ ఇయర్గా ఉండగా దీన్ని 2024కు మార్చింది. గృహ వినియోగ, వ్యయ సర్వే (హెచ్సీఈఎస్) 2023–24ను ఇందుకు పరిగణనలోకి తీసుకుంది. సీపీఐలో కొన్ని వినియోగ వస్తువులను, సేవలను చేరుస్తూ.. అదే సమయంలో కొన్నింటిని తొలగించింది. కొన్నింటి వెయిటేజీ తగ్గిస్తూ.. కొన్నింటికి పెంచింది. కొత్త బేస్ సంవత్సరం ఆధారంగా చూస్తే ఈ ఏడాది జనవరిలో నిత్యావసర ధరలు పెరిగినట్టు తెలుస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణం 2.75 శాతానికి ఎగిసింది. 2012 బేస్ సంవత్సరం ప్రకారం డిసెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 1.33 శాతమే. సీక్వెన్షియల్గా (నెలవారీ) పెరగ్గా.. 2025 జనవరిలో ఉన్న 4.26 శాతంతో పోలి్చనప్పుడు తగ్గింది. పట్టణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం జనవరిలో 2.77 శాతంగా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో 2.73 శాతంగా నమోదైంది. ముఖ్యంగా ఆహారం, మెటల్స్ ధరలు పెరగడం ద్రవ్యోల్బణం ఎగిసేందుకు దారితీసింది. దీంతో ద్రవ్యోల్బణం వరుసగా మూడో నెలలోనూ పెరిగినట్టయింది. అయినప్పటికీ ఆర్బీఐ నియంత్రిత లక్ష్యం 4 శాతానికి దిగువనే ఉండడం గమనార్హం. ఈ వివరాలను జాతీయ గణాంక కార్యాలయం విడుదల చేసింది. → కొత్త సిరీస్ ప్రకారం దేశంలో అత్యధికంగా 4.92 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం తెలంగాణలో నమోదైంది. ఆ తర్వాత కేరళ, తమిళనాడులో అధిక ద్రవ్యోల్బణం కనిపించింది. → జనవరిలో ఆహార విభాగంలో ద్రవ్యోల్బణం 2.13 శాతంగా, హౌసింగ్లో 2.05 శాతం చొప్పున నమోదైంది. వ్రస్తాలు, పాదరక్షల విభాగంలో 2.98 శాతంగా ఉంది. → వెల్లుల్లి, ఉల్లి, ఆలుగడ్డలు, కందిపప్పు, శనగపప్పు ధరలు తగ్గాయి. → వెండి, బంగారం, వజ్రం, ప్లాటినం ఆభరణాలు, టమాటాలు, కొబ్బరి, కొబ్బరి నూనె ధరలు పెరిగాయి. → కొత్త సిరీస్లో వస్తువులు 259 నుంచి 308కి పెరిగాయి. సేవలు సైతం 40 నుంచి 50కు చే రాయి. ధరల ప్రభావం మరింత వాస్తవికంగా ఉండేందుకు ఈ చేరికలు సాయపడనున్నాయి. → సూచీలో ఆహారం, పానీయాలకు ఇప్పటి వరకు 45.86 శాతం వాటా ఉంటే, కొత్త సిరీస్లో 36.75 శాతానికి తగ్గింది. సీపీఐలో చేరినవి → గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు (అద్దెలు, నిర్వహణ వ్యయాలు) → ఆన్లైన్ మీడియా సర్వీస్ ప్రొవైడర్లు/స్ట్రీమింగ్ సేవలు → విలువ ఆధారిత పాడి ఉత్పత్తులు → బార్లీ, సంబంధిత ఉత్పత్తులు → పెన్ డ్రైవ్లు, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ → వ్యాయామ పరికరాలు → అటెండెంట్, బేబీ సిట్టర్ (ఇళ్లలో సహాయకులు)సీపీఐ నుంచి తొలగించినవి → వీసీఆర్/వీసీడీ/డీవీడీ ప్లేయర్లు → రేడియో, టేప్రికార్డర్ → వినియోగించిన వ్రస్తాలు → సీడీ/డీవీడీలు, ఆడియా/వీడియో క్యాసెట్లు → కాయిర్/రోప్ → హైరింగ్ చార్జీలు (బాడుగకు తీసుకున్న వాటికి చెల్లించేవి) -
ఫుడ్ డెలివరీ విభాగంలోకి ఫ్లిప్కార్ట్!
ఈ కామర్స్ విభాగంలో ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తున్న ఫ్లిప్కార్ట్.. ఇప్పుడు ఫుడ్ డెలివరీ రంగంలో అడుగుపెట్టనుంది. కంపెనీ ఎప్పటి నుంచి ఫుడ్ డెలివరీ స్టార్ట్ చేయనుంది?,.. ఈ రంగంలో జొమాటో & స్విగ్గీ వంటి వాటికి గట్టి పోటీ ఇస్తుందా? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.ఫ్లిప్కార్ట్ 2026 మే-జూన్ నాటికి బెంగళూరులో ప్రయోగాత్మకంగా డెలివరీలను ప్రారంభించే అవకాశం ఉంది. ఆ తరువాత ఈ ఏడాది చివరి నాటికి లేదా 2027 ప్రారంభంలో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా ఫుడ్ డెలివరీ ప్రారంభించనున్నట్లు సమాచారం.వాల్మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్కార్ట్.. ఫుడ్ డెలివరీ ప్రారభించినట్లయితే.. ఇప్పుడు ఈ విభాగంలో అగ్రగామిగా ఉన్న జొమాటో & స్విగ్గీ వంటి వాటికి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఫ్లిప్కార్ట్ మార్కెట్ విలువ 2025 ఆర్థిక సంవత్సరంలో 9 బిలియన్ డాలర్లు, కాగా ఇది 2030 నాటికి 25 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా.ఫుడ్ డెలివరీ చేయడానికి ఫ్లిప్కార్ట్ ఇప్పటికే టీమ్ సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా రెండేళ్ల క్రితమే ఈ కంపెనీ ఓలా, పేటీఎం సంస్థలతో కలిసి ఓఎన్డీసీ ద్వారా ఫుడ్ డెలివరీ రంగంలోకి అడుగుపెట్టాలని యోచించింది. అయితే ఈ చర్చలు ముందుకు సాగలేదు. ఇప్పుడు మళ్లీ ఫుడ్ డెలివరీ విషయం తెరమీదికి వచ్చింది. కానీ దీనిపై ఫ్లిప్కార్ట్ అధికారిక ప్రకటన వెల్లడించలేదు.ఫుడ్ డెలివరీ చేయడానికి చాలా కంపెనీలే పుట్టుకొచ్చాయి. కానీ జొమాటో,స్విగ్గీ మాదిరిగా పాపులర్ కాలేదు. ఇప్పుడు ఈ రంగంలో అడుగుపెట్టనున్న ఫ్లిప్కార్ట్ సక్సెస్ సాధిస్తుందా?, లేదా? అనేది త్వరలోనే తెలుస్తుంది. కాగా.. ఫ్లిప్కార్ట్ ఫుడ్ డెలివరీ విభాగంలో అడుగుపెట్టనున్నట్లు వార్తలు వినిపించగానే జొమాటో, స్విగ్గీ షేర్స్ తగ్గుముఖం పట్టాయి. -
బీఎండబ్ల్యూ రీకాల్.. లక్షల కార్లపై ఎఫెక్ట్!
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షల కార్లకు రీకాల్ ప్రకటించింది. కంపెనీ రీకాల్ ప్రకటించడానికి కారణం ఏమిటి?, సమస్యను పరిష్కరించుకోవడానికి కస్టమర్లు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుందా? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.వాహనాల్లోని స్టార్టర్ మోటార్ లోపభూయిష్టంగా ఉండటం వల్ల.. ఒకానొక సందర్భంలో వాహనంలో మంటలు చెలరేగే ప్రమాదం ఉంది. దీనిని పరిష్కరించడానికే బీఎండబ్ల్యూ రీకాల్ ప్రకటించింది. ఈ సమస్య సుమారు 5,75,000 కార్లలో ఉన్నట్లు సంస్థ వెల్లడించింది.ఇదీ చదవండి: ఎంజీ మెజెస్టర్ వచ్చేసింది: రూ.41 వేలతో బుకింగ్!జూలై 2020 నుంచి జూలై 2022 మధ్య ఉత్పత్తి అయిన సుమారు 16 మోడల్స్ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమస్య గురించి కంపెనీ.. తన కస్టమర్లకు ఈమెయిల్స్ లేదా మెసేజస్ రూపంలో వెల్లడించనుంది. దీనికోసం కస్టమర్లు ప్రత్యేకించి డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. -
పోలియో నిర్మూలనకు బీఈ వ్యాక్సిన్
బయోలాజికల్ ఈ లిమిటెడ్ (BE) పోలియోకు వ్యతిరేకంగా.. ఒక ప్రధాన మైలురాయిని ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇటీవల నోవెల్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ టైప్ 2 (nOPV2) కోసం ఫేజ్ II ప్రీ-క్వాలిఫికేషన్ (PQ) మంజూరు చేసింది. ఈ ప్రీ-క్వాలిఫికేషన్ ద్వారా.. BE తన సింగిల్ ఇంటిగ్రేటెడ్ సైట్లో మొత్తం ఉత్పత్తి శ్రేణి (డ్రగ్ సబ్స్టాన్స్ & డ్రగ్ ప్రొడక్ట్) కోసం WHO ప్రమాణాలను పూర్తి చేసింది.ఫేజ్ I ప్రీ-క్వాలిఫికేషన్ (జూన్ 2024) కేవలం డ్రగ్ ప్రొడక్ట్ ఉత్పత్తికి మాత్రమే వర్తించింది. ఇది బయట నుంచి అందిన డ్రగ్ సబ్స్టాన్స్ ఆధారంగా తయారయ్యేది. కానీ ఫేజ్ II ద్వారా BE మొత్తం ఉత్పత్తి విధానాన్ని WHO ప్రమాణాలతో నిర్వహించగలుగుతుంది, ఇది ప్రపంచంలో పోలియోవైరస్ టైప్ 2 (cVDPV2) వ్యాప్తిని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.బయోలాజికల్ ఈ లిమిటెడ్ ఇప్పటికే 700 మిలియన్ల డోసుల nOPV2 ఉత్పత్తి చేసి, వివిధ దేశాలకి పంపించింది. అక్కడ cVDPV2 వ్యాప్తిని నియంత్రించే వ్యాక్సినేషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. nOPV2 ప్రత్యేకంగా ఔట్పుట్ నియంత్రణ కోసం రూపొందించారు. ఇది పోలియో వైరస్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.ఈ ప్రీ-క్వాలిఫికేషన్ సాధనలో PT Bio Farma (ఇండోనేషియా), PATH, Gates Foundation వంటి అంతర్జాతీయ భాగస్వాములు కీలక సహకారం అందించారు. టెక్నాలజీ ట్రాన్స్ఫర్, ఉత్పత్తి సరాసరి పరిశీలనలు, ప్రత్యేక పరీక్షలు మరియు తయారీ సిద్ధత కార్యక్రమాలు ఈ విజయానికి తోడ్పడ్డాయి. -
సెబీ చైర్మన్ కీలక ప్రకటన.. ఎస్ఎంఈల్లో..
న్యూఢిల్లీ: చిన్న, మధ్య తరహా సంస్థల (ఎస్ఎంఈ) అభివృద్ధి కోసం గతంలో పలు చర్యలు తీసుకున్నప్పటికీ క్యాపిటల్ మార్కెట్స్ కోణంలో అవి ఇంకా భారీగా విస్తరించడం లేదని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు. మార్కెట్స్లో లిస్ట్ కావడం వల్ల చిన్న కంపెనీల్లో గవర్నెన్స్ మెరుగుపడేందుకు అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. కానీ క్యాపిటల్ మార్కెట్స్ గురించి అంతగా తెలియకపోవడం వల్ల, మర్చంట్ బ్యాంకర్లు అంత తేలిగ్గా దొరక్కపోవడం వల్ల చిన్న సంస్థలు లిస్టింగ్పై సందేహిస్తుంటాయని పేర్కొన్నారు.ఐపీవోల ద్వారా నిధులను సమీకరించేందుకు వ్యయాల భారం కూడా ఇందుకు ఒక కారణం కావచ్చని ఇండియా ఎస్ఎంఈ ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు. మార్కెట్ల నుంచి నిధులను సమీకరించడం వల్ల గవర్నెన్స్ మెరుగుపడుతుందని, విశ్వసనీయత పెరగడం వల్ల పెట్టుబడి వ్యయాలు కూడా తగ్గుతాయని పాండే చెప్పారు. చిన్న సంస్థలకి వర్తించే మినహాయింపులను కొన్ని సంస్థలు దుర్వినియోగం చేయడం వల్ల ఎస్ఎంఈ ఐపీవోలపై ఇన్వెస్టర్లలో ప్రతికూల సెంటిమెంటుకి దారి తీసిందని ఆయన తెలిపారు. అలాంటి ఉదంతాలు చోటు చేసుకోకుండా నిబంధనలను సెబీ, స్టాక్ ఎక్స్ఛేంజీలు మెరుగుపర్చాయన్నారు.ఎస్ఎంఈ ఎక్స్ఛేంజీల్లో 1,400 కంపెనీలు లిస్టయ్యాయని, వాటి మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 4.1 లక్షల కోట్లని పాండే చెప్పారు. ఇందులో 350 సంస్థలు మెయిన్ బోర్డుకి మైగ్రేట్ అయ్యాయని గర్గ్ వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఐపీవోల ద్వారా 98 సంస్థలు రూ. 9,800 కోట్లు సమీకరించగా, ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి వరకు 232 లిస్టింగ్స్ ద్వారా రూ. 10,500 కోట్లకు సమీకరించినట్లు చెప్పారు. -
పాన్ కార్డు రూల్స్ మారుతున్నాయ్..
పాన్ కార్డుకు సంబంధించి పలు నిబంధనలు మారబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘డ్రాఫ్ట్ ఆదాయపు పన్ను నిబంధనలు–2026’లో పాన్ కార్డు (PAN) బహిర్గతం తప్పనిసరి అయ్యే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పరిమితుల్లో మార్పులను ప్రతిపాదించింది. లక్ష్యం ఏమిటంటే.. సాధారణ, తక్కువ విలువైన లావాదేవీలకు పాన్ కార్డు అవసరాన్ని తగ్గిస్తూ, పెద్ద మొత్తాల లావాదేవీలలో పారదర్శకత పెంచడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశమని అధికారులు పేర్కొంటున్నారు. ఈ ముసాయిదాపై ఫిబ్రవరి 22 వరకు ప్రజల నుంచి అభిప్రాయాలను కోరుతోంది. తుది ఆమోదం అనంతరం కొత్త నిబంధనలు 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.నగదు డిపాజిట్లు, ఉపసంహరణలు, మోటారు వాహనాల కొనుగోలు, హోటల్, రెస్టారెంట్ బిల్లులు, స్థిరాస్తి లావాదేవీలు, ఇన్సూరెన్స్ పాలసీలు ప్రీమియం చెల్లింపులకు సంబంధించి పాన్ కార్డు అవసరం ఎలా మారబోతోందో ఈ కింద తెలుసుకుందాం.నగదు డిపాజిట్లు, ఉపసంహరణలు ప్రస్తుతం ఒకే రోజులో రూ.50,000 కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తే పాన్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త ప్రతిపాదన ప్రకారం, ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖాతాల్లో కలిపి రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్ లేదా ఉపసంహరణ చేసినప్పుడు మాత్రమే పాన్ తప్పనిసరి అవుతుంది.మోటారు వాహనాల కొనుగోలుప్రస్తుత నిబంధనల ప్రకారం మోటార్ సైకిళ్లు మినహా అన్ని వాహనాల కొనుగోలుకు పాన్ అవసరం. ప్రతిపాదిత మార్పుల ప్రకారం రూ.5 లక్షల కంటే ఎక్కువ విలువైన వాహనాలు (బైక్లు సహా) కొనుగోలు చేసినప్పుడు మాత్రమే పాన్ అవసరం ఉంటుంది.హోటల్, రెస్టారెంట్ బిల్లులుఇప్పటి వరకు ఒక చెల్లింపులో రూ.50,000 దాటితే పాన్ ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త ముసాయిదాలో ఈ పరిమితిని రూ.1 లక్షకు పెంచాలని సూచించారు.స్థిరాస్తి లావాదేవీలుప్రస్తుతం రూ.10 లక్షలకు పైబడిన ఆస్తి లావాదేవీలకు పాన్ తప్పనిసరి. ప్రతిపాదన ప్రకారం ఈ పరిమితిని రూ.20 లక్షలకు పెంచనున్నారు.ఇన్సూరెన్స్ పాలసీలుఇప్పటివరకు రూ.50,000 పైగా ప్రీమియం చెల్లింపులకు మాత్రమే పాన్ అవసరం ఉండేది. ఇకపై బీమా సంస్థలతో ఏదైనా ఖాతా ఆధారిత సంబంధం ఏర్పరిస్తేనే పాన్ తప్పనిసరి చేయాలని సూచించారు. -
విజయ్ మాల్యాకు బాంబే హైకోర్టు ఝలక్!
ఇండియా నుంచి వెళ్ళిపోయి.. యూకేలో ఉంటున్న విజయ్ మాల్యా విషయంలో బాంబే హైకోర్టు స్పందించింది. మీరు భారత్కు తిరిగి రావాలి, లేకుంటే.. మేము మీ పిటిషన్ (ఆర్థిక నేరస్థుల చట్టం, 2018)ను విచారించలేము వెల్లడించింది.పిటిషన్ను కోర్టు పరిగణనలోకి తీసుకోవాలని కోరుకుంటే, ముందుగా మీరు (విజయ్ మాల్యా) భారతదేశానికి తిరిగి రావాలి. మేము ఇప్పటికీ కేసును కొట్టివేయడం లేదు.. మీకు మరొక అవకాశం ఇస్తున్నామని కోర్టు వెల్లడించింది. విదేశాల్లో ఉండి ఈ కేసును ముందుకు తీసుకెళ్లలేరని స్పష్టం చేసింది.ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి చంద్రశేఖర్ నేతృత్వంలోని బెంచ్ స్పష్టంగా వ్యాఖ్యానించింది. మీరు కోర్టు అధికార పరిధిని తప్పించుకుంటున్నారు. అలాంటి పరిస్థితిలో మీరు సమాన న్యాయం కోరలేరు. ముందుగా మీరు భారతదేశానికి తిరిగి రావాలని కోర్టు స్పష్టం చేసింది. అయితే మాల్యా భారత్కు వస్తారా లేదా అన్న విషయంపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసు ఫిబ్రవరి 18న మళ్లీ విచారణకు రానుంది.ఆర్ధిక నేరాలకు పాల్పడి పరారీలో ఉన్న నిందితులు విచారణను ఎదుర్కొనేందుకు తిరిగి వచ్చేలా.. భారతదేశం పూర్తిగా కట్టుబడి ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తెలిపింది. ఇందులో విజయ్ మాల్యా మాత్రమే కాకుండా.. లలిత్ మోదీ కూడా ఉన్నారు. వీరిని తీసుకురావడానికి ప్రభుత్వం చురుకుగా ప్రయత్నిస్తోందని MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.ఇదీ చదవండి: వాట్సాప్ బ్యాన్ చేయడానికే రష్యా ప్రయత్నం?2018లో అమలులోకి వచ్చిన ఎఫ్ఈఓ చట్టం ప్రకారం.. మొత్తం 15 మందిని పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థులుగా ప్రకటించారు. వీరిలో 9 మంది ప్రభుత్వ బ్యాంకులకు సుమారు రూ. 26,645 కోట్ల నష్టం కలిగించారు. 2025 అక్టోబర్ 31 వరకు వడ్డీ కలిపి ఈ మొత్తం రూ. 31,437 కోట్లకు చేరింది. ఇందులో రూ. 19,187 కోట్లు ఇప్పటివరకు తిరిగి వసూలు చేశారు. -
వాట్సాప్ బ్యాన్ చేయడానికే ప్రయత్నం?
ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్ యాప్లు ప్రజల జీవితంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వాట్సాప్, టెలిగ్రామ్ వంటివి కోట్లాది మంది వినియోగదారులను కలుపుతున్నాయి. ఇలాంటి సమయంలో.. రష్యా ప్రభుత్వం తమ సేవలను దేశంలో పూర్తిగా బ్లాక్ చేయడానికి ప్రయత్నించిందని వాట్సాప్ వెల్లడించింది. దీనికి కారణం.. ప్రభుత్వం నిర్వహించే 'మ్యాక్స్' సూపర్ యాప్ను ముందుకు తీసుకురావడానికే అని పేర్కొంది.రష్యా మ్యాక్స్ యాప్మ్యాక్స్ అనే యాప్ను రష్యా ప్రభుత్వం వీచాట్ (చైనా దేశంలో ప్రసిద్ధి చెందన యాప్) నమూనాను అనుసరించి రూపొందించింది. ఇది కేవలం మెసేజెస్, కాల్స్ చేసుకోవడానికి మాత్రమే కాకుండా.. ప్రభుత్వ సేవలు, డాక్యుమెంట్ స్టోరేజ్ వంటి వాటికి కూడా ఉపయోగపడుతుంది. మనీ ట్రాన్సక్షన్స్ చేయడానికి కూడా ఇది అనుమతిస్తుంది. ప్రస్తుతం దేశంలో అమ్ముడవుతున్న అన్ని స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లలో ఈ మ్యాక్స్ యాప్ను ముందుగానే ఇన్స్టాల్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.Today the Russian government attempted to fully block WhatsApp in an effort to drive people to a state-owned surveillance app. Trying to isolate over 100 million users from private and secure communication is a backwards step and can only lead to less safety for people in Russia.…— WhatsApp (@WhatsApp) February 12, 2026''రష్యా ప్రభుత్వం వాట్సాప్ను పూర్తిగా బ్లాక్ చేయడానికి ప్రయత్నించింది. ప్రజలను ప్రభుత్వ యాజమాన్యంలోని యాప్కి నడిపించే ప్రయత్నం చేసింది. అయితే వినియోగదారులను కనెక్ట్ చేయడానికి మేము చేయగలిగినదంతా చేస్తూనే ఉన్నాము'' అని వాట్సాప్ ట్వీట్ చేసింది.టెలిగ్రామ్ సేవలు పరిమితం!రష్యా ప్రభుత్వం విదేశీ యాప్లపై కఠినమైన చర్యలు తీసుకోవడంలో భాగంగానే.. వాట్సాప్, టెలిగ్రామ్ సేవలను పరిమితం చేసింది. టెలిగ్రామ్ కంపెనీ ప్రభుత్వ ఆదేశాలను పాటించడం లేదని, క్రిమినల్ & ఉగ్రవాద కంటెంట్ తొలగించలేదని ఆరోపణలు రావడంతో.. రష్యా కమ్యూనికేషన్ నియంత్రణ సంస్థ రోస్కోమ్నాడ్జర్ టెలిగ్రామ్పై పరిమితులు విధించేందుకు చర్యలు చేపట్టింది. అంతేకాకుండా, టెలిగ్రామ్పై 64 మిలియన్ రూబిళ్ల జరిమానా విధించే అవకాశం ఉందని సమాచారం.మ్యాక్స్ యాప్పై విమర్శలుఇక రష్యా ప్రభుత్వం నిర్వహించే.. మ్యాక్స్ యాప్పై విమర్శకులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ యాప్ ద్వారా వినియోగదారుల సమాచారం ప్రభుత్వం చేతిలోకి వెళ్లే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఈ ఆరోపణలను కొట్టిపారేసింది.క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ (Dmitry Peskov) ప్రకారం.. వాట్సాప్ రష్యాలో తిరిగి తన సేవలు యధావిధిగా అందించాలంటే, దేశంలోని చట్టాలను పూర్తిగా పాటించాలి. మెటా సంస్థ రష్యా అధికారులతో చర్చలకు సిద్ధంగా ఉంటే.. ఒప్పందం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై మెటా మొండిగా ప్రవర్తిస్తే మాత్రం.. వాట్సాప్ పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉందని అన్నారు.ఇదీ చదవండి: రైలులో అత్యవసర బెర్త్లు ఉంటాయని తెలుసా.. వీటిని ఎవరికి ఇస్తారంటే? -
బ్యాంకుల ‘తోకలు’ కత్తిరిస్తున్న ఆర్బీఐ.. ఇక కొత్త రూల్స్!
బ్యాంకు బ్యాలెన్స్ కొన్నిసార్లు అనవసరంగా కట్ అవుతూ ఉంటుంది. ఎందుకు కట్ అయిందో తెలుసుకుందామని బ్యాంకుకు వెళ్తే అప్పుడు తెలుస్తుంది.. ఏ ఇన్సూరెన్సో, మరేదో సర్వీస్ యాక్టివేట్ అయింది... దానికి సంబంధించిన ప్రీమియమే కట్ అయింది అని. ఇది చాలా మంది ఖాతాదారులకు ఎదురయ్యే అనుభవమే. ఇకపై అలా కుదరదు..బ్యాంకుల్లో తప్పుడు అమ్మకాల (మిస్-సేలింగ్) నిర్వచనాన్ని మరింత కఠినతరం చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త మార్గదర్శకాలను ప్రతిపాదించింది. బ్యాంకులు, బీమా సంస్థలు ఇప్పటివరకు వినియోగిస్తున్న కొన్ని రక్షణలను తొలగిస్తూ, కస్టమర్కు అనుచితంగా ఉత్పత్తులు విక్రయించినట్లు నిరూపితమైతే పూర్తి రీఫండ్ చెల్లించాల్సిన బాధ్యతను విధించింది.2026లో అమల్లోకి రానున్న డ్రాఫ్ట్ ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (కమర్షియల్ బ్యాంక్స్ – రెస్పాన్సిబుల్ బిజినెస్ కండక్ట్) సవరణ ఆదేశాలు’ ప్రకారం.. కస్టమర్ వయస్సు, ఆదాయ స్థాయి, రిస్క్ స్వభావం వంటి ప్రొఫైల్కు సరిపోని ఉత్పత్తి లేదా సర్వీస్ను విక్రయించడం ‘తప్పుడు అమ్మకం’గా పరిగణిస్తారు.అంతేకాదు.. “డార్క్ ప్యాటర్న్స్” (చీకటి నమూనాలు) అనే భావనను కూడా మొదటిసారిగా ఆర్బీఐ నిర్వచించింది. ఇవి డిజిటల్ ప్లాట్ఫామ్లలో వినియోగదారులను తప్పుదారి పట్టించే విధంగా రూపకల్పన చేసిన మోసపూరిత యూజర్ ఎక్స్పీరియన్స్ నమూనాలు. ఇవి వినియోగదారుల స్వతంత్ర నిర్ణయాన్ని ప్రభావితం చేసి, వారు ఉద్దేశించని చర్యలకు ప్రేరేపిస్తాయి. ఇటువంటి చర్యలు తప్పుదారి పట్టించే ప్రకటనలు, అన్యాయ వాణిజ్య పద్ధతులు, వినియోగదారుల హక్కుల ఉల్లంఘనలకు సమానమని ఆర్బీఐ పేర్కొంది.ఇప్పటివరకు బ్యాంకులు, బీమా సంస్థలు ‘కొనుగోలుదారు జాగ్రత్త’ (Buyer Beware) విధానాన్ని అనుసరిస్తూ, సంతకం చేసిన పత్రాలు, నిర్ధారణ కాల్స్ ఆధారంగా తమను తాము రక్షించుకునేవి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు విక్రయించిన సంక్లిష్ట బీమా, పెట్టుబడి ఉత్పత్తుల విషయంలో వివాదాలు ఎక్కువగా వచ్చేవి.కస్టమర్ సమ్మతి ఉన్నా కూడా, అది అనుచిత అమ్మకాన్ని చట్టబద్ధం చేయదని ఆర్బీఐ తాజాగా స్పష్టం చేసింది. దీని ద్వారా బ్యాంకులను ‘అత్యున్నత సద్భావన’ (Utmost Good Faith) సూత్రానికి లోబరచి, కేవలం కమీషన్ ఆధారిత మధ్యవర్తులుగా కాకుండా వారు విక్రయించే ఉత్పత్తులు సరైనవిగా ఉండేలా బాధ్యత వహించే సంస్థలుగా నిలిపింది. వినియోగదారుల పరిహారం కోసం ప్రతి నియంత్రిత సంస్థ తప్పనిసరిగా ప్రత్యేక విధానం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.ముసాయిదా నిబంధనలు రుణ ఆమోదాన్ని బీమా లేదా ఇతర ఆర్థిక ఉత్పత్తుల కొనుగోలుతో అనుసంధానించే తప్పనిసరి బండిలింగ్ను నిషేధించాయి. అలాగే, థర్డ్ పార్టీ ఏజెంట్ల పర్యవేక్షణను కఠినతరం చేస్తూ, అన్ని డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్ల తాజా జాబితాను బ్యాంకుల వెబ్సైట్లలో ప్రదర్శించాలని ఆదేశించింది. బ్రాంచీల్లో పనిచేసే ఏజెంట్లు, బ్యాంకు ఉద్యోగులు వేరువేరని స్పష్టమైన నిర్ధారణ ఉండాలి.ఈ నిబంధనలు 2026 జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. బ్యాంకు శాఖల ద్వారా బీమా, పెట్టుబడి ఉత్పత్తుల విక్రయ విధానంలో ఇవి గణనీయమైన మార్పులకు దారి తీసే అవకాశముందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 558.72 పాయింట్ల నష్టంతో.. 83,674.92 వద్ద, నిఫ్టీ 146.65 పాయింట్ల నష్టంతో 25,807.20 వద్ద నిలిచాయి.టాప్ గెయినర్స్ జాబితాలో జీఈ పవర్ ఇండియా లిమిటెడ్, క్రౌన్ లిఫ్టర్స్ లిమిటెడ్, రత్నమణి మెటల్స్ & ట్యూబ్స్ లిమిటెడ్, అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ లిమిటెడ్, అవంతి ఫీడ్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు చేరాయి. ధ్రువ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్, నెట్వర్క్ పీపుల్ సర్వీసెస్ టెక్నాలజీస్ లిమిటెడ్, యూనిటెక్ లిమిటెడ్, కిలిచ్ డ్రగ్స్(ఐ) లిమిటెడ్, నోవా అగ్రిటెక్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
రెరా బిల్డర్లకే కొమ్ముకాస్తోంది: సుప్రీంకోర్టు
రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత కోసం ఉద్దేశించిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) పనితీరుపై సుప్రీంకోర్టు గురువారం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రెరా సంస్థలు కేవలం బిల్డర్లకు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తున్నాయని, కొనుగోలుదారుల ప్రయోజనాలను గాలికి వదిలేస్తున్నాయని ధర్మాసనం ఘాటుగా విమర్శించింది.ఏమిటీ వివాదం?హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తమ రాష్ట్ర రెరా కార్యాలయాన్ని సిమ్లా నుంచి ధర్మశాలకు తరలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులకు, ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంటూ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ నోటిఫికేషన్పై స్టే విధించింది. దీన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయిమాల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం విచారించింది.ధర్మాసనం ప్రధాన వ్యాఖ్యలువిచారణ సందర్భంగా సీజేఐ సూర్యకాంత్ రెరా పనితీరును తప్పుబడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘రెరాను ఏర్పాటు చేసిన అసలు ఉద్దేశాన్ని రాష్ట్రాలు విస్మరిస్తున్నాయి. డిఫాల్ట్ అయిన బిల్డర్లకు సహకరించడం తప్ప, ఈ సంస్థల వల్ల సామాన్యులకు ఒరిగేదేమీ లేదు. ఇలాంటి సంస్థలను కొనసాగించడం కంటే రద్దు చేయడమే మేలు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. బిల్డర్ల పట్ల ఈ సంస్థలు చూపిస్తున్న సానుకూల ధోరణిపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల మార్పు అనేది పరిపాలనాపరమైన నిర్ణయమని పేర్కొంటూ హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు కొట్టివేసింది.కోర్టు ఆదేశాలురెరా కార్యాలయాన్ని, అప్పీలేట్ ట్రిబ్యునల్ను సిమ్లా నుంచి ధర్మశాలకు మార్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. ప్రజలకు, బాధితులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రిన్సిపల్ అప్పీలేట్ బాడీని కూడా ధర్మశాలకే తరలించాలని సూచించింది. హిమాచల్ ప్రదేశ్ వెనుకబడిన తరగతుల కమిషన్ కార్యాలయం తరలింపుపై ఉన్న స్టేను కూడా కోర్టు తొలగించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది మాధవి దివాన్ వాదనలు వినిపించారు. కాగా, గతేడాది జూన్ 13న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు పక్కన పెట్టడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించినట్లయింది. అయితే, దేశవ్యాప్తంగా ఉన్న రెరా సంస్థల పనితీరుపై సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో చర్చనీయాంశంగా మారాయి.ఇదీ చదవండి: ‘బంగారు ప్రయాణం’లో రహస్యాలు! -
ఎంజీ మెజెస్టర్ వచ్చేసింది: రూ.41 వేలతో బుకింగ్!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త ఎంజీ మెజెస్టర్ (MG Majestor) వచ్చేసింది. దేశీయ విఫణిలో లాంచ్ కానున్న ఈ ఎస్యూవీ.. జీప్ మెరిడియన్, స్కోడా కొడియాక్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.కొత్త మెజెస్టర్ కోసం ఎంజీ మోటార్ బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. దీనిని రూ.41 వేలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. 2026 మే నెలలో డెలివరీలు జరిగే అవకాశం ఉంది. అంతకంటే ముందు ఏప్రిల్లో టెస్ట్ డ్రైవ్లు మొదలవుతాయి. కాగా కంపెనీ త్వరలోనే ఈ కారు ధరలను వెల్లడించనుంది.ఎంజీ మోటార్.. తన కొత్త మెజెస్టర్ ఎస్యూవీని మూడు వేరియంట్లలో లాంచ్ చేయనుంది. అవి ఎంట్రీ లెవల్ షార్ప్ 4x2, మిడ్ స్పెక్ సావీ 4x2 & టాప్ స్పెక్ సావీ 4x4. ఇవి 6 సీటర్, 7 సీటర్ రూపంలో మార్కెట్లోకి అమ్మకానికి వస్తుంది. మెజెస్టర్ను ముందస్తుగా రిజర్వ్ చేసుకున్న మొదటి 3,000 మంది కస్టమర్లకు 5 సంవత్సరాల అపరిమిత కిలోమీటర్ల వారంటీ, 5 సంవత్సరాల రోడ్సైడ్ అసిస్ట్, 5 సంవత్సరాల లేబర్-ఫ్రీ సర్వీస్ కాంట్రాక్ట్ను అందించనున్నట్లు సంస్థ వెల్లడించింది.ఎంజీ మెజెస్టర్ కేవలం 2.0 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్ ఎంపికలో మాత్రమే లభిస్తుంది. ఇది 215 హార్స్ పవర్ & 478 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో 8 స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ రెగ్యులర్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. పనితీరు దాదాపు గ్లోస్టర్ మాదిరిగా ఉంటుందని సమాచారం.ఇదీ చదవండి: కారు మైలేజ్ కోసం.. ముఖ్యం ఈ వేగం!మంచి డిజైన్ కలిగిన మెజెస్టర్.. ట్విన్ పేన్ పనోరమిక్ సన్రూఫ్, ప్యాడిల్ షిఫ్టర్లు, వైర్లెస్ ఆపిల్ కార్ప్లే & ఆండ్రాయిడ్ ఆటో, 12 స్పీకర్ జేబీఎల్ ఆడియో సిస్టమ్ & 64 కలర్ యాంబియంట్ లైట్స్ వంటి వాటితో పాటు.. లెవల్ 2 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్స్ కూడా పొందుతుంది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్ & హిల్-డిసెంట్ కంట్రోల్, ఐసోఫిక్స్ యాంకరేజ్లు, సరౌండ్ వ్యూ కెమెరాలు & ఆరు ఎయిర్బ్యాగ్లు కూడా ఉన్నాయి. -
ఏడాదిలో 4000 కోట్ల స్పామ్ కాల్స్!
భారత్ డిజిటల్ విప్లవం దిశగా దూసుకుపోతున్న వేళ స్పామ్ కాల్స్, సైబర్ మోసాలు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయి. 2025 సంవత్సరంలో భారతీయులకు ఏకంగా 4,000 కోట్లకు పైగా స్పామ్ కాల్స్ వచ్చినట్లు ‘ట్రూకాలర్ ఇండియా ఇన్సైట్స్ రిపోర్ట్ 2025’ కొన్ని విషయాలను వెల్లడించింది.ఈ సందర్భంగా ట్రూకాలర్ సీఈఓ రిషిత్ ఝున్ఝున్వాలా మాట్లాడుతూ.. వికసిత్ భారత్ విజన్లో భాగంగా దేశం డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా మారుతున్న తరుణంలో కమ్యూనికేషన్ వ్యవస్థపై నమ్మకం చాలా కీలకమన్నారు. ‘ఈ రోజుల్లో మోసం అనేది కేవలం సాంకేతిక సమస్య కాదు, అది మానవ బలహీనతలతో ఆడుకునే ప్రక్రియ. భయం, అత్యవసరం, అనిశ్చితిని పెట్టుబడిగా చేసుకుని స్కామర్లు రెచ్చిపోతున్నారు. ప్రతి భారతీయుడికి డిజిటల్ భద్రత కల్పించాలన్నదే మా లక్ష్యం’ అన్నారు.నివేదిక ప్రకారం, గడిచిన ఏడాదిలో నమోదైన స్పామ్ కాల్స్ వివరాలు ఇలా ఉన్నాయి:మొత్తం స్పామ్ కాల్స్: 4,168 కోట్లు.బ్లాక్ చేసిన కాల్స్: 1,189 కోట్లు (యూజర్లకు చేరకముందే సాంకేతికతతో నిరోధించినవి).మోసపూరిత కాల్స్: సుమారు 770 కోట్లు. ఇవి ప్రధానంగా బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, పేమెంట్ ప్లాట్ఫారమ్ల పేరుతో వచ్చాయి.స్పామ్ ఎస్ఎంఎస్లు: ఏడాది పొడవునా 12,903 కోట్ల స్పామ్ సందేశాలు నమోదయ్యాయి.స్పామ్ కాల్స్ నిరోధించడం వల్ల కేవలం మోసాలు తగ్గడమే కాకుండా ప్రజల విలువైన సమయం కూడా ఆదా అవుతోంది. కమ్యూనిటీ రిపోర్టింగ్ ద్వారా భారతీయులకు రోజుకు సుమారు 21.7 లక్షల గంటల సమయం ఆదా అవుతోందని నివేదిక పేర్కొంది. దీనివల్ల అనవసరపు ఒత్తిడి తగ్గడమే కాకుండా హడావుడిలో తీసుకునే తప్పుడు నిర్ణయాల వల్ల కలిగే ఆర్థిక నష్టాలను నివారించవచ్చు.2026లో పొంచి ఉన్న ముప్పురాబోయే రోజుల్లో మోసగాళ్లు మరింత అధునాతన పద్ధతులను అవలంబిస్తారని నివేదిక హెచ్చరించింది. అందులో ఏఐ సృష్టించిన వాయిస్ స్కామ్స్, కాల్స్, మెసేజ్లతో చేసే మోసాలు ఉండనున్నాయి. ఇతరుల పేర్లతో డిజిటల్ ఐడెంటిటీని దొంగిలించడం వంటి మోసాలు ఎక్కువగా జరగవచ్చని అంచనా.జాగ్రత్తలుఅత్యవసరమని వచ్చే కాల్స్ను వెంటనే నమ్మకుండా ధ్రువీకరించుకోవాలి. వ్యక్తిగత వివరాలను, ఓటీపీలను ఎవరితోనూ పంచుకోకూడదు. నమ్మకమైన కాలర్ ఐడీ సాధనాలను ఉపయోగించాలి. డిజిటల్ సాధికారత సాధించే క్రమంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండటమే అసలైన రక్షణ అని గుర్తించాలి.ఇదీ చదవండి: ‘బంగారు ప్రయాణం’లో రహస్యాలు! -
ఫేక్లొద్దు.. రాబర్ట్ కియోసాకి హెచ్చరిక!
ప్రఖ్యాత ఆర్థిక రచయిత, వ్యాపారవేత్త రాబర్ట్ కియోసాకి తన పేరుతో సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న ఏఐ ఆధారిత నకిలీ (డీప్ఫేక్) వీడియోల గురించి హెచ్చరించారు. ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత అయిన కియోసాకి, తాను గతంలో “రియల్ ఎస్టేట్ గైస్ సెమినార్ అట్ సీ” టీ-షర్ట్ ధరించిన విషయం నిజమేనని తెలిపారు. అయితే యూట్యూబ్లో ప్రస్తుతం కనిపిస్తున్న, అదే టీ-షర్ట్ ధరించి ఉన్నట్లు చూపిస్తున్న కొన్ని వీడియోలు ఏఐ ద్వారా సృష్టించిన నకిలీవని స్పష్టం చేశారు. ఆ వీడియోల్లో ఉన్న సందేశాలు కూడా అసత్యమని ఆయన పేర్కొన్నారు.“టీ-షర్ట్ నిజమే, సెమినార్ కూడా నిజమే. కానీ వీడియోలు, సందేశాలు ఏఐతో సృష్టించిన నకిలీలు” అని కియోసాకి (Robert Kiyosaki) సోషల్ మీడియాలో వెల్లడించారు. డీప్ఫేక్ సాంకేతికత కృత్రిమ మేధస్సు (AI)ను ఉపయోగించి నిజమైన వ్యక్తి మాట్లాడుతున్నట్లుగా కనిపించే నకిలీ వీడియోలను రూపొందిస్తుంది. ఇటీవలి కాలంలో ఈ సాంకేతికతను ఉపయోగించి ప్రముఖుల పేరుతో మోసపూరిత పెట్టుబడి ప్రకటనలు రూపొందించే ఘటనలు పెరుగుతున్నాయి. ఈ తరహా నకిలీ వీడియోలు రూపొందిస్తున్న వారిపై కియోసాకి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి పనులకంటే సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని సూచించారు.అదేవిధంగా, ఈ సందర్భాన్ని ఉపయోగించి ఆయన తన ఆర్థిక దృక్పథాన్ని మరోసారి ప్రస్తావించారు. ప్రభుత్వ ఫియాట్ కరెన్సీని “నకిలీ డబ్బు”గా పేర్కొంటూ, బంగారం, వెండి, రియల్ ఎస్టేట్, బిట్కాయిన్, ఈథిరియం వంటి “నిజమైన ఆస్తుల్లో” పెట్టుబడి పెట్టాలని ఆయన సూచించారు.ఏఐ సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, నిజమైన సమాచారాన్ని నకిలీ కంటెంట్ నుండి వేరు చేయడం సాధారణ ప్రజలకు కష్టతరమవుతోంది. అందువల్ల పెట్టుబడులకు సంబంధించిన వీడియోలు లేదా ప్రకటనలను అధికారిక వనరుల ద్వారా ధ్రువీకరించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.FYI: if you see YouTube videos with me wearing a Real Estate Guys Seminar at Sea T-shirt on….the T - shirt is real and so is the seminar.The problem is the videos are AI Fakes. So are the messages.Why someone waste their time doing fake AI videos is beyond me.To those…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 11, 2026 -
ఐటీ కంపెనీలను వణికిస్తున్న ఆ ‘పేరు’ మాదే..
అమెరికా ఆధారిత ఏఐ సంస్థ ‘ఆంథ్రోపిక్’ భారత విస్తరణ ప్రణాళికలు చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. అదే పేరుతో పనిచేస్తున్న భారతీయ సంస్థ ‘ఆంథ్రోపిక్ సాఫ్ట్వేర్’.. తమ బ్రాండ్కు గందరగోళం కలుగుతోందని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ కేసు భారత కోర్టులో పెండింగ్లో ఉండటం వల్ల, దేశంలో ఆంథ్రోపిక్ వ్యూహాత్మక ప్రణాళికలు క్లిష్టతరం అయ్యే అవకాశముంది.అమెరికా ఆంథ్రోపిక్ Vs ఇండియా ఆంథ్రోపిక్టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం.. ఆంథ్రోపిక్ సాఫ్ట్వేర్ గత నెలలో కర్ణాటక వాణిజ్య కోర్టులో ఫిర్యాదు దాఖలు చేసింది. 2017 నుంచే తమ సంస్థ "ఆంథ్రోపిక్" పేరును ఉపయోగిస్తోందని, అమెరికా సంస్థ భారత మార్కెట్లో ప్రవేశించడం వల్ల వినియోగదారుల్లో గందరగోళం ఏర్పడుతోందని కంపెనీ పేర్కొంది.స్థానిక సంస్థ తన ముందస్తు వినియోగాన్ని అధికారికంగా గుర్తించాలని, అలాగే మరింత గందరగోళం నివారించేందుకు తగిన ఉపశమనం ఇవ్వాలని కోరుతోంది. అదనంగా, రూ.1 కోటి నష్టపరిహారం కూడా డిమాండ్ చేసినట్లు సమాచారం.భారతీయ సంస్థ వాదన ఏమిటంటే..ఆంథ్రోపిక్ సాఫ్ట్వేర్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ మొహమ్మద్ అయ్యాజ్ ముల్లా టెక్ క్రంచ్తో మాట్లాడుతూ, ఈ ఫిర్యాదు వెనుక ఉద్దేశం ఘర్షణ కాదని, తమ ముందస్తు వినియోగానికి అధికారిక గుర్తింపు పొందడమేనని తెలిపారు. గుర్తింపు లభించకపోతే, చట్టపరమైన పోరాటాన్ని కొనసాగించవచ్చని ఆయన స్పష్టం చేశారు.భారతీయ సంస్థ తమ వెబ్సైట్లో “ఆంథ్రోపిక్ సాఫ్ట్వేర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (అప్లికేషన్ పెండింగ్) ట్రేడ్మార్క్” అని పేర్కొంది. ట్రేడ్మార్క్ నమోదు ఇంకా పెండింగ్లో ఉన్నందున, ఇది నేరుగా ట్రేడ్మార్క్ ఉల్లంఘన కేసుగా పరిగణించబడకపోవచ్చు. అయితే కోర్టు భారతీయ సంస్థకు అనుకూలంగా తీర్పు ఇస్తే, అమెరికా సంస్థ భారతదేశంలో తన పేరును మార్చాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశముంది.ఇదీ చదవండి: పేరు మార్చుకున్న ప్రముఖ ఐటీ కంపెనీకేసు ప్రస్తుత స్థితిజనవరి 20న కోర్టు ఆంథ్రోపిక్ ఇండియాకు సమన్లు జారీ చేసింది. అయితే ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు. అంటే, సంస్థ తన కార్యకలాపాలను తక్షణం నిలిపివేయాల్సిన అవసరం లేదు. తదుపరి విచారణ ఫిబ్రవరి 16న జరగనుంది.ఇదిలా ఉండగా, ఆంథ్రోపిక్ ఏఐ భద్రతా విభాగాధిపతి మృణక్ శర్మ రాజీనామా చేశారు. ఇలీవల ‘ఎక్స్’ (ట్విట్టర్)లో తన రాజీనామాను ప్రకటించారు. తాను వెంటనే కొత్త వెంచర్ ప్రారంభించడం లేదని, తదుపరి నిర్ణయం తీసుకునే ముందు స్వల్ప విరామం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. -
‘బంగారు ప్రయాణం’లో రహస్యాలు!
బంగారం షాపులో నగదు చెల్లించి నచ్చిన నగను కొనుక్కుంటాం. అద్దాల షోరూమ్లో విద్యుత్ కాంతుల మధ్య తళతళలాడే ఆ బంగారు ఆభరణాలను చూసి మురిసిపోతాం. కానీ, ఆ మెరుపు వెనుక.. వందల మంది కార్మికుల చెమట చుక్కలు ఉన్నాయని ఎంతమందికి తెలుసు? ఆ హొయల వెనుక.. వేల అడుగుల లోతులో పేలే బాంబుల మోత, ఊపిరాడని గనుల్లో ఉక్కపోత ఉందని చాలా మందికి తెలియదు కదా.. ఒక చిన్న ఉంగరం మన వేలికి చేరడానికి ముందు అది ఒక కఠినమైన శిల. ఆ శిల నుంచి స్వచ్ఛమైన పసిడిని ఒడిసి పట్టుకోవడానికి ప్రకృతితో చేసే యుద్ధమే ఈ ‘బంగారు ప్రయాణం’. బంగారాన్ని గనుల్లో నుంచి ఎలా వెలికితీస్తారో.. ఆభరణాల రూపంలోకి ఎలా మారుస్తారో తెలుసుకుందాం.అన్వేషణ, మైనింగ్బంగారం ఎక్కడ ఉందో గుర్తించడం మొదటి దశ. దీన్ని ప్రోస్పెక్టింగ్ అంటారు. భూగర్భంలో బంగారం నిల్వలు ఉన్నాయని శాస్త్రవేత్తలు నిర్ధారించిన తర్వాత మైనింగ్ ప్రారంభమవుతుంది. బంగారం భూమిపై పొరల్లోనే ఉన్నప్పుడు పెద్ద గుంతలు తవ్వి వెలికితీస్తారు. దీన్ని ఓపెన్ పిట్ మైనింగ్ అంటారు. బంగారం చాలా లోతులో ఉన్నప్పుడు సొరంగాలు తవ్వి, పేలుళ్ల సాయంతో ముడి ఖనిజాన్ని బయటకు తీస్తారు. దీన్ని అండర్గ్రౌండ్ మైనింగ్ అంటారు.ముడి ఖనిజాన్ని పొడి చేయడంగనుల నుంచి సేకరించిన పెద్ద రాళ్లను క్రషర్స్ యంత్రాల్లో వేసి చిన్న ముక్కలుగా మారుస్తారు. ఆ తర్వాత వాటిని చిన్న స్పటికాల పరిమాణంలోకి, ఆపై మెత్తటి పౌడర్లాగా పిండి చేస్తారు. ఈ పొడిలోనే అతి సూక్ష్మమైన బంగారు రేణువులు దాగి ఉంటాయి.బంగారం వేరు చేయడంపొడి చేసిన మట్టి నుంచి బంగారాన్ని వేరు చేయడానికి ప్రధానంగా కొన్ని పద్ధతులను ఉపయోగిస్తారు.సైనైడ్ లీచింగ్: ఈ పౌడర్కు సోడియం సైనైడ్ ద్రావణాన్ని కలుపుతారు. ఇది బంగారాన్ని ద్రవ రూపంలోకి మారుస్తుంది. ఆ తర్వాత జింక్ పౌడర్ లేదా యాక్టివేటెడ్ కార్బన్ ఉపయోగించి బంగారాన్ని తిరిగి ఘన రూపంలోకి మారుస్తారు.గ్రావిటీ సెపరేషన్: బంగారం బరువు ఎక్కువగా ఉండటం వల్ల నీటి ప్రవాహం ద్వారా తేలికపాటి మట్టిని కొట్టుకుపోయేలా చేసి బంగారు రేణువులను కిందకు చేరేలా చేస్తారు.స్మెల్టింగ్పైన తెలిపిన ప్రక్రియలో వచ్చిన బంగారాన్ని (దీన్ని డోర్ అని పిలుస్తారు) దాదాపు 1064 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద కరిగిస్తారు. ఈ దశలో బంగారం నుంచి ఇతర లోహాలు వేరవుతాయి. ఇక్కడ వచ్చే పసిడి 100% స్వచ్ఛంగా ఉండదు. ఇందులో వెండి లేదా రాగి కలిసి ఉంటాయి. వీటిని బార్స్ రూపంలోకి మారుస్తారు.శుద్ధీకరణ(రిఫైనింగ్)చివరి దశలో బంగారాన్ని పూర్తిస్థాయిలో శుద్ధి చేయడానికి మిల్లర్ ప్రక్రియ లేదా వోల్విల్ ప్రక్రియ వాడతారు. ఈ ప్రక్రియల్లో క్లోరిన్ గ్యాస్ను ఉపయోగించి ఇతర మలినాలను తొలగిస్తారు. దీని ద్వారా 99.9% (24 క్యారెట్) స్వచ్ఛమైన బంగారం లభిస్తుంది.ఆభరణాల తయారీచివరిగా ఈ స్వచ్ఛమైన బంగారానికి కొంత మోతాదులో రాగి లేదా వెండిని కలిపి (సాధారణంగా 22 క్యారెట్లు) నచ్చిన ఆభరణాలుగా మలుస్తారు.ఒక గ్రాము బంగారాన్ని పొందడానికి దాదాపు ఒక టన్ను ముడి ఖనిజాన్ని ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. అందుకే బంగారం అంత విలువైనది!ఇదీ చదవండి: భవిష్యత్తులో పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇదే.. -
రూ .10 లక్షలలోపు కార్లు.. మైలేజీలో తోపులు
కారు కొనడం చాలా మందికి ఒక పెద్ద నిర్ణయం. బడ్జెట్కు సరిపోవాలి.. మైలేజీ బాగుండాలి.. అలాగే నమ్మకమైన బ్రాండ్ కావాలి.. ఇవన్నీ కలిసొస్తేనే సరైన ఎంపిక అవుతుంది. ముఖ్యంగా రోజువారీ ప్రయాణాలకు ఇంధన వ్యయం తక్కువగా ఉండే కార్లకు చాలా మంది ప్రాధాన్యం ఇస్తారు.భారత మార్కెట్లో రూ.10 లక్షల లోపు మంచి మైలేజీ ఇచ్చే అనేక కార్లు అందుబాటులో ఉన్నాయి. ప్రకటనల్లో కనిపించే మైలేజీ గణాంకాలు సాధారణంగా ARAI సర్టిఫైడ్ ఫిగర్స్ కాగా, వాస్తవ పరిస్థితుల్లో అవి కొంత తేడా ఉండవచ్చు. ఇప్పుడు రూ.10 లక్షలలోపు అత్యుత్తమ మైలేజీ ఇచ్చే 10 కార్ల జాబితాను చూద్దాం.. -
భవిష్యత్తులో పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇదే..
సాంకేతిక ప్రపంచంలో ప్రస్తుతం కృత్రిమ మేధ (ఏఐ) సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో ఎన్విడియా అధినేత జెన్సెన్ హువాంగ్ భవిష్యత్తు ప్రోగ్రామింగ్ గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. భవిష్యత్తులో అత్యంత శక్తివంతమైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సీ++ లేదా పైథాన్ వంటివి కాదని, అది మన ‘సహజ భాష’(ఇంగ్లీష్) అని ఆయన పేర్కొన్నారు.సాంప్రదాయకంగా కంప్యూటర్లతో సంభాషించాలంటే క్లిష్టమైన సింటాక్స్ కలిగిన కోడింగ్ భాషలు అవసరం. అయితే జనరేటివ్ ఏఐ రాకతో ఈ పరిస్థితి వేగంగా మారుతోంది. హువాంగ్ అభిప్రాయం ప్రకారం.. వినియోగదారులు క్లిష్టమైన కోడ్ రాయడానికి బదులు తమకు కావాల్సిన అంశాన్ని సాధారణ ఇంగ్లీషులో వివరిస్తే చాలు. ఏఐ వ్యవస్థలు ఆ ఆదేశాలను అర్థం చేసుకుని డిజిటల్ ఉత్పత్తులను సృష్టిస్తాయి. గతంలో కోడ్లోని లోపాలను మాన్యువల్గా టెస్టింగ్లో వెతకాల్సి ఉండేది. ఇప్పుడు వినియోగదారులు ఏఐ సిస్టమ్లతో సంభాషిస్తూ అవుట్పుట్ను సరిచేయమని ఆదేశిస్తే సరిపోతుంది. ఈ లూప్ సాఫ్ట్వేర్ అభివృద్ధిని మరింత సులభతరం చేస్తోంది.అధికారిక కోడింగ్ పరిజ్ఞానం లేని వారు కూడా తమ వ్యాపార ప్రక్రియలను ఆటోమేట్ చేసుకోవడానికి, డేటాను విశ్లేషించడానికి, కొత్త ప్రోటోటైప్లను రూపొందించడానికి ఈ మార్పు దోహదపడుతుందని చెబుతున్నారు.డెవలపర్లు, పరిశ్రమపై ప్రభావంజెన్సెన్ హువాంగ్ వ్యాఖ్యల తర్వాత, ఇకపై ప్రోగ్రామింగ్ భాషలు అదృశ్యమవుతాయా? అనే సందేహం కలగడం సహజం. కానీ వాస్తవానికి సీ++, పైథాన్ వంటి కంప్యూటర్ భాషలు ఆపరేటింగ్ సిస్టమ్స్, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కీలక పాత్ర పోషిస్తూనే ఉంటాయని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే డెవలపర్లు ఇకపై కేవలం సింటాక్స్ రాయడంపై కాకుండా సమస్యను స్పష్టంగా నిర్వచించడం, ఏఐని సమర్థవంతంగా మార్గనిర్దేశం చేయడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. తార్కిక, కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరింత కీలకం కానున్నాయి.ఇదీ చదవండి: బీహెచ్ఈఎల్లో వాటాల విక్రయానికి భారీ స్పందన -
బంగారం లాంటి న్యూస్.. భారీగా తగ్గిందోచ్..
పసిడి ప్రియులకు బంగారం లాంటి న్యూస్. దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో మార్పులు వస్తున్నాయి. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
నష్టాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:43 సమయానికి నిఫ్టీ(Nifty) 114 పాయింట్లు తగ్గి 25,853 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 381 దిగజారి 83,836 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 12-02-2026(time: 9:43 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
దేశీ తయారీ మరింత పెరగాలి
దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ తదుపరి దశ వృద్ధి ప్రస్థానంలో ముందుకెళ్లాలంటే స్థానికంగా తయారీ, కొత్త నైపుణ్యాల్లో శిక్షణ, అంతర్జాతీయ విస్తరణపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటర్ ఇండియా ఎండీ తరుణ్ గర్గ్ చెప్పారు. ‘భారత్లో గెలవాలంటే, తప్పనిసరిగా భారత్లో ఉండాలి’ అని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తమ పుణె తయారీ ప్లాంటుకు అవసరమైన విడిభాగాల సరఫరా వ్యవస్థపై రూ. 4,500 కోట్లు పైగా ఇన్వెస్ట్ చేశామన్నారు.ఆటోమోటివ్ విడిభాగాల తయారీ సంస్థల సమాఖ్య (ఏసీఎంఏ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ విషయాలు చెప్పారు. కీలక లోహాలు, విడిభాగాలు, ఎలక్ట్రానిక్స్ కోసం ఏ ఒక్క దేశంపైనో ఆధారపడితే సరఫరా వ్యవస్థ పటిష్టంగా ఉండబోదని గర్గ్ పేర్కొన్నారు. ఎల్రక్టానిక్స్, సెన్సార్లు మొదలైన వాటిని సమగ్రపర్చుకోకపోతే పెను సవాళ్లు తప్పవని, మనల్ని దాటి పరిశ్రమ ముందుకెళ్లిపోతుందని ఆయన హెచ్చరించారు. భారతీయ ఇంజినీర్లు, డిజైనర్ల పరిజ్ఞానం ప్రశంసనీయమన్నారు. అయితే, పరిజ్ఞానానికి, సంసిద్ధతకి మధ్య గణనీయంగా అంతరం ఉంటోందని, దీన్ని సత్వరం భర్తీ చేయాల్సిన అవసరం ఉందని గర్గ్ వివరించారు.ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప ఊరట -
బీహెచ్ఈఎల్లో వాటాల విక్రయానికి భారీ స్పందన
ప్రభుత్వ రంగ బీహెచ్ఈఎల్లో కేంద్ర ప్రభుత్వ వాటాల విక్రయానికి భారీ స్పందన లభించింది. తొలిరోజైన బుధవారం నాడు ఓఎఫ్ఎస్ (ఆఫర్ ఫర్ సేల్)కి 2.3 రెట్లు సబ్ర్స్కయిబ్ అయ్యింది. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 5,650 కోట్ల విలువ చేసే బిడ్లను దాఖలు చేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లకు 9.40 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా రూ. 256.07 రేటుపై 22.07 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. రిటైల్ ఇన్వెస్టర్లు గురువారం బిడ్ చేయొచ్చు. ఓఎఫ్ఎస్కి మంచి స్పందన లభిస్తున్నట్లు పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి అరుణిష్ చావ్లా తెలిపారు.బీహెచ్ఈఎల్లో వాటాల విక్రయానికి సంబంధించి బేస్ ఇష్యూ పరిమాణం 10.44 కోట్లు (3 శాతం) కాగా, గ్రీన్షూ ఆప్షన్ కింద మరో 6.96 కోట్ల షేర్లను (2 శాతం) కేంద్రం విక్రయిస్తోంది. ఒక్కో షేరుకి రూ. 254 ధర చొప్పున బీహెచ్ఈ ఎల్లో 17.41 కోట్ల షేర్లను (5 శాతం వాటా) విక్రయించడం ద్వారా రూ. 4,422 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. కంపెనీలో ప్రభుత్వానికి 63.17 శాతం వాటా ఉంది.ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప ఊరట -
జనవరిలోనూ ఎగుమతులు సానుకూలమే
భారత వస్తు, సేవల ఎగుమతులు ఈ ఏడాది ఇప్పటి వరకు సానుకూల వృద్ధిని నమోదు చేసిట్టు కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ప్రకటించారు. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు నెలకొన్నప్పటికీ జనవరిలోనూ సానుకూలంగానే ఉన్నట్టు తెలిపారు. జనవరి నెలకు సంబంధించి అధికారిక డేటా ఈ నెలలో విడుదల అవుతుందన్నారు. బయోఫాచ్ 2026 కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన జర్మనీలోని న్యూరెమ్బర్గ్కు వచ్చిన సందర్భంగా మాట్లాడారు.భారత్లోని 20 రాష్ట్రాలకు చెందిన 100 మంది ఎగ్జిబిటర్లు ఆర్గానిక్ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శనగా ఉంచారు. ఐరోపా సమాఖ్య వీటికి పెద్ద మార్కెట్గా ఉంది. దేశ వస్తు ఎగుమతులు గత డిసెంబర్లో 2 శాతం పెరిగి 38.5 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. అదే నెలలో దిగుమతులు 8.7 శాతం పెరిగి 63.55 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు (9 నెలల్లో) వస్తు ఎగుమతులు క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలి్చతే 2.44 శాతం పెరిగి 330.29 బిలియన్ డాలర్లకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద వస్తు, సేవల ఎగుమతులు 850 బిలియన్ డాలర్లకు మించి నమోదవుతాయని వాణిజ్య శాఖ అంచనాగా ఉంది.ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప ఊరట -
ఆటో విడిభాగాల రంగానికి ప్రభుత్వం అండ
న్యూఢిల్లీ: దేశీ ఆటో విడిభాగాల పరిశ్రమ అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో కీలక పాత్ర పోషించేందుకు వీలుగా స్థిరమైన విధానాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి తెలిపారు. ఆటో విడిభాగాల తయారీదారుల సంఘం (ఏసీఎంఏ) నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించే క్రమంలో తదుపరి తరం సరఫరా వ్యవస్థలో ఆటో విడిభాగాల పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ‘‘ఎల్రక్టానిక్స్, పవర్ ఎల్రక్టానిక్స్, తేలిక రకం మెటీరియల్స్ అన్నవి అంతర్జాతీయ పోటీతత్వానికి కీలకం. స్థిరమైన విధానపర వాతావరణం ఉండేలా చూసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. టెక్నాలజీ స్వీకరణను ప్రోత్సహించడం, ఎగుమతుల విస్తరణ, నాణ్యత పెంపు దిశగా పరిశ్రమ భాగస్వాములతో కలసి పనిచేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’అని మంత్రి తెలిపారు. భారత ఆటో విడిభాగాల పరిశ్రమ ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్నట్టు చెప్పారు. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ల తయారీ నుంచి కారిడార్ల ఏర్పాటు వరకు ప్రభుత్వం ఆటో పరిశ్రమకు ఎన్నో రకాలుగా చేయూతనిస్తున్నట్టు పేర్కొన్నారు. -
స్వచ్ఛ విద్యుత్కి పెట్టుబడుల పవర్
న్యూఢిల్లీ: భారత్ సమ్మిళిత, సుస్థిర వృద్ధి సాధించడంలో విద్యుత్ రంగం కీలక పాత్ర పోషించనుంది. జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు, ఉత్పాదకత పెరిగేందుకు దోహదపడనుంది. ఈ నేపథ్యంలో శిలాజ ఇంధనాలను వినియోగించని, పర్యావరణహితమైన స్వచ్ఛ విద్యుత్, తటస్థ స్థాయి ఉద్గార (నెట్ జీరో) లక్ష్యాల సాధనకు భారీ పెట్టుబడులు అవసరం కానున్నాయి. 2070 నాటికి రెన్యువబుల్స్, స్టోరేజ్, పంపిణీ మొదలైన విభాగాలకు సంబంధించి విద్యుత్ రంగానికి 14.23 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు కావాల్సి ఉంటుంది. నీతి ఆయోగ్ ఒక నివేదికలో ఈ విషయాలు వివరించింది. దేశాభివృద్ధి, వాతావరణ లక్ష్యాలన్నీ కూడా విద్యుత్పైనే ఆధారపడి ఉన్నాయని పేర్కొంది. 2047 నాటికి నిర్దేశించుకున్న వికసిత భారత్ లక్ష్యాలకు సంబంధించి ప్రస్తుత విధానాలను కొనసాగిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది, 2070 నాటికి నిర్దేశించుకున్న నెట్ జీరో లక్ష్యాల సాధనకు తోడ్పడే విధానాలను అమలు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే కోణాల్లో నివేదిక రూపొందింది. దీని ప్రకారం .. → 2025 డిసెంబర్ నాటికి 258 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యంతో ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద రెన్యువబుల్ ఎనర్జీ మార్కెట్గా భారత్ నిలి్చంది. → తదుపరి దశ మాత్రం చాలా సంక్లిష్టంగా ఉంటుంది. పట్టణీకరణ, కూలింగ్, డిజిటలీకరణ, ఎలక్ట్రిక్ మొబిలిటీ, హరిత హైడ్రోజన్ మొదలైన వాటితో విద్యుత్కి డిమాండ్ భారీగా పెరగనుంది. వివిధ రకాల పునరుత్పాదక విద్యుత్ విభాగాల నుంచి పెరిగే డిమాండ్ని తట్టుకునే విధంగా వ్యవస్థ పటిష్టం కావాలి. → ఇందుకోసం నిల్వ సామర్థ్యాలను, పంపిణీ సామర్థ్యాలను పెంచుకోవాలి. గ్రిడ్ కార్యకలాపాలను ఆధునీకరించాలి. విశ్వసనీయమైన విధంగా, చౌకగా స్వచ్ఛ విద్యుత్ లభించేలా చూసేందుకు పంపిణీ అనేది ఆర్థికంగా లాభదాయకంగా ఉండేలా చూడాలి. → దేశవ్యాప్తంగా విద్యుదీకరణ వేగవంతం కావడాన్ని బట్టి భారతదేశ విద్యుత్ పరివర్తన ప్రస్థానం ఆధారపడి ఉంటుంది. → తలసరి విద్యుత్ వినియోగం 2025లో 1,400 కిలోవాట్అవర్ స్థాయి నుంచి 2070 నాటికి 7,000–10,000 కిలోవాట్అవర్కి పెరగనుంది. ఫ్రాన్స్, కొరియాలాంటి సంపన్న దేశాల స్థాయికి చేరనుంది. → ప్రస్తుత పాలసీలు ఇలాగే కొనసాగితే 2070 నాటికి మొత్తం స్థాపిత సామర్థ్యం తొమ్మిది రెట్లు పెరుగుతుంది. అదే తటస్థ ఉద్గారాల లక్ష్యాలకు అనుగుణమైన నెట్–జీరో విధానాలను అమలు చేస్తే 14 రెట్లు పెరుగుతుంది. → సోలార్ పీవీ సామర్థ్యం 5,500 గిగావాట్లకు చేరుతుంది. ప్రస్తుత పాలసీలను కొనసాగిస్తే ఇప్పుడు నామమాత్రంగా ఉన్న బ్యాటరీ స్టోరేజీ 1,400 గిగావాట్లకు చేరుతుంది. నెట్ జీరో విధానాలతో 3,000 గిగావాట్లకు చేరుతుంది. → దీర్ఘకాలికంగా విద్యుత్ పరివర్తనలో అణు విద్యుత్ వ్యూహాత్మక పాత్ర పోషించనుంది. 2025లో 8.8 గిగావాట్లుగా ఉన్న సామర్థ్యం 2070 నాటికి 300 గిగావాట్లకు పెరుగుతుంది. → ప్రస్తుత పాలసీల ప్రకారం 2070 నాటికి మొత్తం పెట్టుబడులు దాదాపు 8.79 లక్షల కోట్ల డాలర్లకు చేరనుండగా, నెట్ జీరో విధానాలతో 14.23 లక్షల కోట్ల డాలర్లకు చేరతాయి. -
ఖజానా హౌస్ఫుల్
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్నుల నికర వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జోరుగా కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి 10 వరకు (2025 ఏప్రిల్ 1 నుంచి) ప్రత్యక్ష పన్నుల నికర ఆదాయం.. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 9.4 శాతం పెరిగి రూ.19.44 లక్షల కోట్లకు చేరింది. ఆదాయపన్ను శాఖ డేటా ప్రకారం రిఫండ్లు తగ్గడం, కార్పొరేట్ పన్ను (కంపెనీలు చెల్లించే) వసూళ్లు బలంగా ఉండడం ఇందుకు అనుకూలించింది. ఈ కాలంలో కార్పొరేట్ పన్నుల వసూలు 14.51% పెరిగి రూ.8.90 లక్షల కోట్లుగా ఉంటే.. వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాల (హెచ్యూఎఫ్లు) నుంచి ఆదాయం 5.91 శాతం పెరిగి రూ.10.03 లక్షల కోట్లుగా ఉన్నట్టు ఆదాయపన్ను శాఖ డేటా తెలియజేస్తోంది. సెక్యూరిటీ లావాదేవీల పన్ను (ఎస్టీటీ) రూపంలో ఖజానాకు రూ.50,279 కోట్లకు సమకూరింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూస్తే ఎలాంటి వృద్ధి లేదు. పన్ను రిఫండ్లు (తిరిగి చెల్లింపులు) 18.82 శాతం తగ్గి రూ.3.34 లక్షల కోట్లకు పరిమితమయ్యాయి. ఇక ఫిబ్రవరి 10 నాటికి స్థూల పన్ను వసూళ్లు 4.09 శాతం పెరిగి రూ.22.78 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇందులో కార్పొరేట్ పన్నుల స్థూల ఆదాయం రూ.10.88 లక్షల కోట్లుగా, నాన్ కార్పొరేట్ పన్నుల ఆదాయం రూ.11.39 లక్షల కోట్లుగా ఉంది. -
క్రేజీ క్రేజీ.. మేడిన్ ఇండియా లగేజీ
ఇప్పుడు ట్రావెల్ అనేది అప్పుడప్పుడు మాత్రమే వేసే ట్రిప్పులకే పరిమితం కాకుండా, రెగ్యులర్ జీవన విధానంగా మారిపోయింది. దీంతో అత్యంత నాణ్యమైన, దీర్ఘకాలం మన్నే లగేజీకి డిమాండ్ పెరుగుతోంది. డిజైన్, పనితీరు, నాణ్యతలో అంతర్జాతీయ బ్రాండ్లకు దీటుగా ఉండే దేశీ బ్రాండ్స్ ఉత్పత్తులను కొనేందుకు వినియోగదారులు మొగ్గుచూపుతున్నారు. వ్యక్తిత్వాన్ని ప్రతిబింబింబించడం, స్టయిల్కి పెద్దపీట వేయడం, ఉపయోగించడానికి సులభతరంగా ఉండటం తదితర అంశాలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో దశాబ్దాలుగా గ్లోబల్ లగేజీ, బ్యాగ్ తయారీ పరిశ్రమలో చైనా ఆధిపత్యం కొనసాగినప్పటికీ ప్రస్తుతం క్రమంగా భారత్లో తయారీవైపు మొగ్గు చూపే ధోరణి పెరుగుతోంది. మేడిన్ ఇండియా నినాదం, ఇన్వెస్టర్లలో ఆసక్తి, విస్తరణ ప్రణాళికలు మొదలైనవి ఇందుకు సానుకూలాంశాలుగా ఉంటున్నాయి. మోతీలాల్ ఓస్వాల్ నివేదిక ప్రకారం 2028 నాటికి భారత లగేజ్ పరిశ్రమ రూ. 26,700 కోట్లకు చేరనుంది. 2023 నుంచి 2028 మధ్య ఏటా 12 శాతం వృద్ధి చెందనుంది. 60 శాతం మంది వినియోగదారులు దేశీ లేదా చిన్న బ్రాండ్స్ని కొనడానికి ఇష్టపడుతుండగా, 14 % మంది మరికాస్త ఎక్కువ చెల్లించి ప్రీమియం ఉత్పత్తులను కొనేందుకు సిద్ధంగా ఉంటున్నారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటున్న సంస్థలు .. సూట్కేసులు, ట్రాలీలు, బ్యాక్ప్యాక్లు, బిజినెస్ బ్యాగ్లు మొదలైనవి విక్రయించే అప్పర్కేస్ ఇందులో సింహభాగం ఉత్పత్తులను ప్రధానంగా నాసిక్ (మహారాష్ట్ర), రుద్రపూర్ (ఉత్తరాఖండ్)లోని తమ ప్లాంట్లలోనే ఉత్పత్తి చేస్తోంది. ప్రముఖ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా దన్ను గల అప్పర్కేస్ ఉత్పత్తి సామర్థ్యం వచ్చే మూడేళ్ల వృద్ధికి సరిపడేంతగా నెలకు 1,00,000 యూనిట్ల స్థాయిలో ఉంది. భారత్లోనే తయారీ వైపు మళ్లుతున్న ప్రీమియం బ్రాండ్లలో యూమ్ అంకుర సంస్థ కూడా ఒకటి. మేడిన్ ఇండియాను తమ ప్రధాన బ్రాండ్ ఐడియాలజీగా పరిగణిస్తామని సంస్థ కో–¸ఫౌండర్ నైనా పరేఖ్ తెలిపారు. అందుకే తమ ఉత్పత్తుల తయారీని, ముఖ్యంగా అల్యూమినియం, హార్డ్ లగేజీ సోర్సింగ్, అసెంబ్లీని చైనా నుంచి భారత్కి మార్చుకుంటున్నామని వివరించారు. కఠినతరమైన నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ, ఆవిష్కరణ ప్రక్రియలను వేగవంతం చేస్తూ, విదేశీ సరఫరా వ్యవస్థలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలనే లక్ష్యంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని పరేఖ్ వివరించారు. వివిధ భాగస్వామ్యాల ద్వారా యూమీకి ఏటా 4,00,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. వచ్చే రెండేళ్లలో దీన్ని 7,00,000 యూనిట్లకు పెంచుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇక మరో కంపెనీ మిరాజియో ప్రస్తుతం తమ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నప్పటికీ, భారత్లో తయారు చేసేందుకు భాగస్వామ్యాలను కుదుర్చుకునే ప్రయత్నాల్లో ఉంది. ఇందుకోసం పెద్ద సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు వివరించింది. మార్కెట్ వాటాపై కన్ను.. యూమీ ఇప్పటివరకు రూ. 35 కోట్ల వరకు పెట్టుబడులు సమీకరించింది. 2029 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 250 కోట్లకు పైగా వార్షికాదాయాన్ని, 2029–30 నాటికి ప్రీమియం లగేజ్ సెగ్మెంట్లో 8–10% వాటా ను లక్ష్యంగా పెట్టుకుంది. అటు అప్పర్కేస్ దాదాపు 2,000 రిటైలర్లు, మూడు ఎక్స్క్లూజివ్ స్టోర్స్, ఆన్లైన్ మాధ్యమాల ద్వారా విక్రయాలు సాగిస్తోంది. ప్రస్తుతం మార్కెట్ వాటా 2–3 శాతంగా ఉండగా, వచ్చే ఏడేళ్ల వ్యవధిలో 10 శాతానికి పెంచుకోవాలని భావిస్తోంది. అసెంబ్లీ అనే సంస్థ వచ్చే రెండేళ్లలో బ్యాక్ప్యాక్ల తయారీ సామర్థ్యాన్ని సుమారు 20% పెంచుకోవడంపై దృష్టి పెడుతోంది.సాక్షి, బిజినెస్డెస్క్ -
60 దాటిన బంగారం-వెండి నిష్పత్తి.. ఇక ధరలు తారుమారు!
బంగారం-వెండి నిష్పత్తి (Gold-Silver Ratio) ఇటీవల గణనీయ మార్పులను చూపిస్తోంది. ఇది విలువైన లోహాల మార్కెట్లో ఉన్న అధిక అస్థిరతను సూచిస్తుంది. 2026 జనవరి చివరలో వెండి ధరలు ఘోరంగా పెరగడంతో ఈ నిష్పత్తి చారిత్రాత్మక కనిష్ట స్థాయి అయిన 44–46కు పడిపోయింది. వెండి ధరలు ఔన్స్కు 100 డాలర్లను మించిపోయాయి.అయితే, ఫిబ్రవరి ప్రారంభంలో వెండి ధరల్లో తీవ్ర దిద్దుబాటు చోటుచేసుకోవడంతో, బంగారం-వెండి నిష్పత్తి వేగంగా 60కు పుంజుకుంది. 2026 ఫిబ్రవరి 11 నాటికి ఈ నిష్పత్తి 61 పైన ట్రేడ్ అవుతోంది.నెల ప్రారంభంలో బంగారం-వెండి నిష్పత్తిలో కనిపించిన తీవ్ర అమ్మకాలు, బులియన్ ధరలలో కొత్త ర్యాలీకి దారితీశాయి. బుధవారం (ఫిబ్రవరి 11) స్పాట్ గోల్డ్ ధరలు 0.7% పెరిగి ఔన్స్కు 5,057.23 డాలర్లకు చేరాయి. ఏప్రిల్ డెలివరీ కోసం యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 1% పెరిగి ఔన్స్కు 5,081.40 డాలర్లను తాకాయి. స్పాట్ సిల్వర్ 2.3% పెరిగి ఔన్స్కు 82.56 డాలర్లు చేరింది.ఇక ఫిబ్రవరి 2 నుండి, బంగారం ధరలు 15% పైగా పెరిగాయి, వెండి ధరలు 16% పెరిగాయి. జనవరి 30 న వెండి ఒక్క సెషన్లోనే 26% క్షీణతను ఎదుర్కొంది. ఇది లోహ మార్కెట్లో తీవ్ర అస్థిరతను స్పష్టంగా చూపిస్తుంది.బంగారం-వెండి నిష్పత్తి అంటే..బంగారం-వెండి నిష్పత్తి అనేది బంగారం, వెండి సాపేక్ష విలువను కొలుస్తుంది. ఇది ఒక ఔన్సు బంగారాన్ని కొనుగోలు చేయడానికి అవసరమైన వెండి ఔన్సుల సంఖ్యను సూచిస్తుంది. బంగారం ధరను వెండి ధరతో భాగించడం ద్వారా ఈ నిష్పత్తిని లెక్కిస్తారు. ఈ నిష్పత్తి రెండు విలువైన లోహాల సాపేక్ష పనితీరు, మార్కెట్ విలువను అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది.నిష్పత్తి 60 దాటడం దేనికి సూచన?బంగారం-వెండి నిష్పత్తి 43.80 వద్ద కనిష్టంగా గుర్తించడం సాంకేతికంగా, చారిత్రాత్మకంగా ముఖ్యమైన సంఘటన అని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఈ నిష్పత్తి 60ని దాటడం మార్కెట్ సాధారణీకరణ దశకి సూచన. అంటే సమీప కాలంలో బంగారం ధరలు వెండి ధరలను అధిగమించే అవకాశం ఉంది. -
జోరుగా వాహన విక్రయాలు
న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి మొత్తం 27,22,558 వాహనాలు రిటైల్గా విక్రయమయ్యాయని వాహన డీలర్ల సమాఖ్య ఫాడా వెల్లడించింది. గతేడాది ఇదే నెలలో అమ్ముడైన 23,14,940 యూనిట్లతో పోలిస్తే ఇవి 18% అధికంగా ఉన్నాయి. జీఎస్టీ సంస్కరణల ఉత్సాహం కొనసాగడం, పంట దిగుమతి, పెళ్లిళ్ల ప్రభావంతో గ్రామీణ ప్రాంతాల్లో నగదు సరఫరా పెరగడం, సరుకు రవాణా రంగంలో డిమాండ్ స్థిరంగా కొనసాగడంతో వాహనాలకు గిరాకీ పెరిగిందని ఫాడా వివరణ ఇచ్చింది.‘‘ప్యాసింజర్ వాహనాలకు డిమాండ్ పెద్ద నగరాలకే పరిమితం కాకుండా, నిర్మాణాత్మకంగా విస్తరిస్తోంది. వార్షిక ప్రాతిపదికన ప్రయాణికుల వాహన విక్రయాల వృద్ధి గ్రామీణ ప్రాంతాల్లో 14.43%, పట్టణ ప్రాంతాల్లో 2.75%గా ఉంది. కస్టమర్లకు ఎస్యూవీ/కాంపాక్ట్ ఎస్యూవీలపై అమితాసక్తి, ఎంట్రీ లెవల్ కార్ల తిరిగి మార్కెట్లోకి విడుదల కావడం, డిమాండ్కు తగ్గట్లు ఉత్పత్తి, కంపెనీల ఆఫర్లు, స్కీములు కొనసాగడం వాహన విక్రయాల వృద్ధికి తోడ్పడ్డాయి’’ అని ఫాడా ప్రెసిడెంట్ సీ ఎస్ విఘ్నేశ్వర్ తెలిపారు.వచ్చే మూడు నెలలపై ఫాడా అవుట్లుక్ రాబోయే మూడు నెలలపై ఫాడా ఆశావహ దృక్పథం వ్యక్తం చేసింది. డీలర్ విశ్వాసం బలంగా కొనసాగుతోందని, సర్వేలో పాల్గొన్నవారిలో 79.70% వృద్ధిని ఆశిస్తున్నారని, కేవలం 1.88% మాత్రమే క్షీణత ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది. వృద్ధి ఆధారిత బడ్జెట్ 2026లో కేంద్రం మౌలిక సదుపాయాలు, వ్యవసాయ రంగాలపై దృష్టి సారించింది.జీఎస్టీ 2.0 సంస్కరణల కొనసాగింపు, వడ్డీ రేట్లలో స్థిరత్వం, ఫైనాన్సింగ్ సౌలభ్యం తదితర అంశాలు కొనుగోళ్ల సామర్థ్యాన్ని పెంచవచ్చని ఫాడా అభిప్రాయపడింది. ముఖ్యంగా టూ వీలర్స్, వాణిజ్య వాహనాలు, ప్యాసింజర్ వాహనాల విభాగాల్లో డిమాండ్ సానుకూలంగా కొనసాగుతుందని అంచనా వేసింది. అయితే ఎన్నికల ప్రభావం, సీజనాలిటీ, కొన్ని ప్రాంతాల్లో మోడల్ లభ్యత అంశాలు వాహన విక్రయాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపొచ్చని ఫాడా పేర్కొంది. -
పేరు మార్చుకున్న ప్రముఖ ఐటీ కంపెనీ
ప్రముఖ దేశీయ ఐటీ సేవల సంస్థ ఎల్టీఐ మైండ్ట్రీ (LTIMindtree) తన పేరును మార్చుకుంది. కంపెనీ కొత్త పేరును ఎల్టీఎం లిమిటెడ్ (LTM Limited)గా ప్రకటించింది. తన కొత్త బ్రాండ్ గుర్తింపు, లోగోను ఆవిష్కరించింది. వేణు లాంబును చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO), మేనేజింగ్ డైరెక్టర్గా నియమించిన సంవత్సరం తర్వాత తన పేరును అధికారికంగా మార్చుకుంది."వ్యాపార సృజనాత్మకత భాగస్వామి" (Business Creativity Partner)గా కొత్త గుర్తింపు, స్థానాన్ని ప్రకటిస్తూ, ఎల్టీఎం తన సాంకేతిక సామర్థ్యాలు, లోతైన డొమైన్ నైపుణ్యం కలిసి వాటాదారులకు అర్థవంతమైన విలువను ఎలా సృష్టిస్తాయో వివరించింది. ఈ విషయాన్ని కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్లో తెలిపింది."మార్కెట్లు మారుతున్నాయి, క్లయింట్ల అంచనాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో, మన ప్రస్తుత సామర్థ్యాలు, భవిష్యత్తు దృష్టిని ప్రతిబింబించే బ్రాండ్తో ముందుకు సాగుతున్నాము. బిజినెస్ క్రియేటివిటీ భాగస్వామిగా, మనం పని చేసే కొత్త మార్గాలు, కొత్త ఉత్పాదకత నమూనాలు, విలువ సృష్టించే కొత్త విధానాలను రూపొందిస్తున్నాము" అని సీఈఓవేణు లాంబు తెలిపారు.ఎల్టీఐ మైండ్ట్రీ లిమిటెడ్.. లార్సెన్ & టుబ్రో గ్రూప్కు చెందిన ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కన్సల్టింగ్ అండ్ డిజిటల్ సొల్యూషన్స్ సంస్థ. ఎల్అండ్టీఐ ఇన్ఫోటెక్, మైండ్ట్రీ విలీనంతో ఏర్పడిన ఈ సంస్థ, ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల సంస్థలకు డిజిటల్ మార్పు, క్లౌడ్, డేటా అనలిటిక్స్, కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత సేవలను అందిస్తోంది. ఇటీవల విడుదల చేసిన డిసెంబర్ త్రైమాసిక (Q3) ఆర్థిక ఫలితాల ప్రకారం.. కంపెనీ ఆదాయం సుమారు 11 శాతం పెరిగి రూ. 10,781 కోట్లకు చేరుకోగా, పునరావృతం కాని (one-off) వ్యయ ప్రభావాల కారణంగా నికర లాభం సుమారు 12 శాతం తగ్గి రూ. 960 కోట్లుగా నమోదైంది.ఇదీ చదవండి: ఉద్యోగం వద్దనుకుంటే.. గూగుల్ ఆఫర్ ఇదే.. -
పీఎల్ఐ పథకానికి 55 కంపెనీలు సై..
న్యూఢిల్లీ: స్పెషాలిటీ స్టీల్ విభాగంలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల(పీఎల్ఐ) పథకం మూడో రౌండ్ను కేంద్ర స్టీల్ మంత్రి హెచ్డీ కుమారస్వామి తాజాగా ప్రవేశపెట్టారు. అప్గ్రేడెడ్ అలాయ్ స్టీల్ తయారీలో 8.7 మిలియన్ టన్నులను అదనంగా జత చేసుకునే లక్ష్యంతో తాజా రౌండ్కు తెరతీశారు. ఇందుకు అనుగుణంగా 55 కంపెనీల మధ్య 85 అవగాహనా ఒప్పందాలు(ఎంవోయూలు) కుదిరాయి.వీటిలో పీఎస్యూ దిగ్గజం సెయిల్ సేలం స్టీల్ ప్లాంట్తో స్టీల్ శాఖ ఒప్పందం సైతం కలసి ఉంది. వెరసి పీఎల్ఐ 1.2లో భాగంగా రూ. 13,203 కోట్ల విలువైన పెట్టుబడులకు తెరలేవనుంది. ప్రధాని నరేంద్ర మోడీ విజన్కు అనుగుణంగా ప్రపంచస్థాయి పోటీతత్వ స్పెషాలిటీ స్టీల్ ఎకోసిస్టమ్ ఏర్పాటులో పీఎల్ఐ 1.2 కీలక ముందడుగుగా మంత్రి కుమారస్వామి పేర్కొన్నారు.మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్.. లక్ష్యాలు రెండింటికీ తాజా పథకం ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వివరించారు. తద్వారా దేశీయంగా ఆధునిక, వ్యూహాత్మక స్టీల్ ప్రొడక్టుల తయారీ సామర్థ్యాలకు ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు తెలియజేశారు. తాజా ప్రాజెక్టులతో 2030–31కల్లా 8.7 మిలియన్ టన్నుల స్పెషాలిటీ స్టీల్ సామర్థ్యాలు జత కలిసే వీలున్నట్లు అంచనా వేశారు. -
రిలయన్స్ చేతికి సదరన్ హెల్త్ ఫుడ్స్
న్యూఢిల్లీ: అనుబంధ ఎఫ్ఎంసీజీ విభాగం రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్(ఆర్సీపీఎల్) తాజాగా తమిళనాడు కంపెనీ సదరన్ హెల్త్ ఫుడ్స్ను సొంతం చేసుకుంటున్నట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. అయితే డీల్ విలువను తెలియజేయలేదు.తాజా కొనుగోలు ద్వారా తృణ ధాన్యాల(మిల్లెట్స్) ఆధారిత ఫుడ్ విభాగంలో రిలయన్స్ కన్జూమర్ విస్తరించనుంది. రెండు దశాబ్దాలుగా ఆరోగ్యకర ఆహార విభాగంలో మన్నా బ్రాండ్తో సదరన్ హెల్త్ ఫుడ్స్ విభిన్న ప్రొడక్టులను విక్రయిస్తోంది. ఆర్సీపీఎల్ ఇటీవలే ఆ్రస్టేలియా సంస్థ గుడ్నెస్ గ్రూప్ గ్లోబల్ పీటీవైను సొంతం చేసుకున్న నేపథ్యంలో తాజా కొనుగోలుకి ప్రాధాన్యత ఏర్పడింది. తద్వారా బెటర్ ఫర్ యు బ్రాండ్ పానీయాల బిజినెస్ను సొంతం చేసుకున్న విషయం విదితమే. -
స్టాక్ మార్కెట్ ర్యాలీకి బ్రేక్.. పడిపోయిన ఐటీ షేర్లు
భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ బుధవారం మ్యూట్ నోట్తో సెషన్ను ముగించాయి. యూఎస్-ఇండియా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో నడిచిన ర్యాలీకి బ్రేక్ పడింది. ముగింపులో బీఎస్ఈ సెన్సెక్స్ 40.28 పాయింట్లు లేదా 0.05 శాతం నష్టపోయి 84,233.64 వద్ద ఉండగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 18.7 పాయింట్లు లేదా 0.07 శాతం పెరిగి 25,953.85 వద్ద ఉంది. విస్తృత మార్కెట్లో ఎన్ఎస్ఈ మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.03 శాతం, 0.02 శాతం లాభపడ్డాయి.సెన్సెక్స్ 30 స్టాక్స్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 3 శాతానికి పైగా ర్యాలీ చేసి, మార్కెట్ క్యాపిటలైజేషన్లో టీసీఎస్ను అధిగమించి నాలుగో అతిపెద్ద కంపెనీగా అవతరించింది. మారుతి సుజుకి, ట్రెంట్ ఇతర టాప్ గెయినర్స్గా నిలిచాయి. మరోవైపు ఐటీ షేర్లు పడిపోయాయి. టీసీఎస్ 2 శాతానికి పైగా క్షీణించింది. హెల్సీఎల్ టెక్నాలజీస్, ఎటర్నల్, ఐటీసీ ఇతర టాప్ లూజర్స్లో జాబితాలో చేరాయి. రంగాలవారీగా నిఫ్టీ హెల్త్ కేర్ 1.62 శాతం లాభపడగా, నిఫ్టీ ఆటో 1.3 శాతం లాభపడ్డాయి. దీనికి విరుద్ధంగా, నిఫ్టీ ఐటీ సెషన్ లో అతిపెద్ద లూజర్గా ఉద్భవించింది. -
ఉద్యోగం వద్దనుకుంటే.. గూగుల్ ఆఫర్ ఇదే..
గూగుల్ తన గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్ (GBO) ఉద్యోగుల కోసం మరోసారి స్వచ్ఛంద నిష్క్రమణ ప్యాకేజీలను (Voluntary Exit Packages - VEP) ప్రకటించింది. ఏఐ (AI) ఆధారిత భవిష్యత్తుకు పూర్తిగా కట్టుబడి ఉన్న సంస్థగా మారేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.“కొత్త సంవత్సరాన్ని మనం బలమైన స్థితిలో ప్రారంభిస్తున్నాం. 2025లో మీరు అందించిన సహకారానికి కృతజ్ఞతలు. అయితే టెక్నాలజీ రంగం వేగంగా మారుతోంది. పోటీ తీవ్రంగా ఉంది. కాబట్టి మన ఏఐ మిషన్కు పూర్తిగా అనుగుణంగా పనిచేసే శ్రామిక శక్తి అవసరం” అని గూగుల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ షిండ్లర్ అంతర్గత మెమోలో ఉద్యోగులకు తెలిపారు.ఏఐ-ఫస్ట్ దిశగా అడుగులుగూగుల్ ఇప్పుడు పూర్తిగా “ఏఐ-ఫస్ట్” సంస్థగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే వ్యాపార విభాగంలోని ప్రతి ఉద్యోగీ ఏఐని స్వీకరించి, ఎక్కువ ప్రభావాన్ని చూపాలని సంస్థ స్పష్టం చేసింది. “ఈ వేగానికి సరిపోలలేనివారు లేదా ముందుకు సాగడానికి సిద్ధంగా లేనివారు స్వచ్ఛందంగా నిష్క్రమించేందుకు కంపెనీ అవకాశం ఇస్తుంది” అని షిండ్లర్ పేర్కొన్నారు.ఎవరిపై ప్రభావం?ఈ స్వచ్ఛంద నిష్క్రమణ ప్యాకేజీలు ముఖ్యంగా సొల్యూషన్స్ టీమ్స్, సేల్స్ విభాగం, కార్పొరేట్ డెవలప్మెంట్, ఇతర సంబంధిత వ్యాపార విభాగాల వారికి వర్తిస్తాయి. అయితే, అమెరికాలోని పెద్ద కస్టమర్ సేల్స్ టీమ్స్, కొన్ని కస్టమర్-ఫేసింగ్ పాత్రలకు ఈ ఆఫర్ వర్తించదని స్పష్టం చేశారు. “మా వినియోగదారులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండటానికి ఈ నిర్ణయం తీసుకున్నాము” అని షిండ్లర్ తెలిపారు.ఏడాదిలో మూడోసారి.. ఇది గూగుల్ అమలు చేస్తున్న మూడో స్వచ్ఛంద నిష్క్రమణ ప్రణాళిక. గతంలో కూడా ఇలాంటి చర్యలు తీసుకుంది. 2025 జూన్లో ‘రిటర్న్-టు-ఆఫీస్’ విధానం కఠినతరం చేసిన సమయంలో యూఎస్ ఉద్యోగులకు ఇలాంటి ఆఫర్లు ఇచ్చింది. మళ్లీ 2025 అక్టోబర్లోనూ యూట్యూబ్ విభాగంలో పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ఎగ్జిట్ ప్యాకేజీలు ప్రకటించింది.వీఈపీ ప్యాకేజీలో ఏం ఉంటాయంటే..గూగుల్ వీఈపీ (Voluntary Exit Program) ప్యాకేజీని ఎంచుకుని స్వచ్ఛందంగా నిష్క్రమించే ఉద్యోగులకు సాధారణంగా వారి సర్వీస్ పీరియడ్, దా ఆధారంగా లంప్సమ్ సెవరెన్స్ పే (కొన్ని వారాలు/నెలల జీతం), ప్రోరేటెడ్ బోనస్ చెల్లింపు, ఉపయోగించని సెలవులకు నగదు, కొంతకాలం వరకు ఆరోగ్య బీమా కొనసాగింపు, ఇప్పటికే వెస్ట్ అయిన RSUs/స్టాక్లపై హక్కులు, అలాగే కొత్త ఉద్యోగం కోసం కెరీర్ ట్రాన్సిషన్ లేదా అవుట్ప్లేస్మెంట్ సపోర్ట్ వంటి ప్రయోజనాలు అందిస్తారు. -
ఎయిర్టెల్ సరికొత్త ఏఐ ఫ్రాడ్ అలర్ట్ ప్రారంభం
దేశంలో వేగంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, ముఖ్యంగా వన్-టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) లీకేజీల ద్వారా జరుగుతున్న బ్యాంకింగ్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. కృత్రిమ మేధ(ఏఐ) ఆధారంగా పనిచేసే అత్యాధునిక ‘ఫ్రాడ్ అలర్ట్’ ఫీచర్ను కంపెనీ ఆవిష్కరించింది.ఏమిటీ ఏఐ ఫ్రాడ్ అలర్ట్?సాధారణంగా డెలివరీ బాయ్స్ లేదా సర్వీస్ ఏజెంట్ల పేరుతో ఫోన్ చేసే మోసగాళ్లు వినియోగదారులను మాటల్లో పెట్టి వారి బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన ఓటీపీలను కాజేస్తుంటారు. ఇలాంటి దాడుల నుంచి కస్టమర్లను రక్షించడమే ఈ ఏఐ వ్యవస్థ ప్రధాన ఉద్దేశం.ఒక కస్టమర్ కాల్లో ఉన్నప్పుడు అవతలి వ్యక్తి బ్యాంకింగ్ ఓటీపీ కోసం ప్రయత్నిస్తున్నాడని ఏఐ గుర్తించినట్లయితే నెట్వర్క్ స్థాయిలో ఎయిర్టెల్ వెంటనే జోక్యం చేసుకుంటుంది. కాల్ సమయంలో కస్టమర్కు వెంటనే ‘ఫ్రాడ్ అలర్ట్’ ద్వారా హెచ్చరిక పంపుతుంది. తద్వారా కస్టమర్ అప్రమత్తమై తన సమాచారాన్ని పంచుకోకుండా జాగ్రత్త పడవచ్చు.ఈ సందర్భంగా ఎయిర్టెల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ శాశ్వత్ శర్మ మాట్లాడుతూ.. ‘ఎయిర్టెల్ను దేశంలోనే అత్యంత సురక్షితమైన నెట్వర్క్గా మార్చాలన్నదే లక్ష్యం. డిజిటల్ లావాదేవీల్లో ఓటీపీలు కీలకమే అయినప్పటికీ నేరగాళ్ల చేతికి చిక్కితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అందుకే నెట్వర్క్ స్థాయిలోనే ఈ మోసాలను అడ్డుకునే ఏఐ పరిష్కారాన్ని తీసుకొచ్చాం. ప్రయోగాత్మక పరీక్షల్లో ఇది మంచి ఫలితాలను ఇచ్చింది’ అని పేర్కొన్నారు.అందుబాటులోకి ఎప్పుడు?గత రెండేళ్లుగా స్పామ్ కాల్ హెచ్చరికలు, హానికరమైన లింక్లను కట్టడి చేయడం వంటి చర్యలు తీసుకుంటున్న ఎయిర్టెల్ ఇప్పుడు ఈ ఓటీపీ ప్రొటెక్షన్ను మరింత బలోపేతం చేసింది. ఎయిర్టెల్ ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ ప్రస్తుతం ప్రారంభ దశలో భాగంగా హరియాణా రాష్ట్రంలోని వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ సదుపాయాన్ని కేవలం ఒక ప్రాంతానికే పరిమితం చేయకుండా రాబోయే రెండు వారాల్లో దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్టెల్ కస్టమర్లందరికీ ఈ సర్వీసును విస్తరించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.ఈ రక్షణ వ్యవస్థ పూర్తిగా నెట్వర్క్ స్థాయి ఏఐ సాంకేతికతపై ఆధారపడి పనిచేస్తుంది. వినియోగదారుల మొబైల్ ఫోన్లలో ప్రత్యేకంగా ఎలాంటి యాప్లు ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండానే నెట్వర్క్ స్థాయిలోనే మోసపూరిత కాల్స్, ఓటీపీ లీకేజీలను గుర్తించి అడ్డుకుంటుంది.ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప ఊరట -
లీటర్ పెట్రోల్తో ఎక్కువ దూరం ప్రయాణం!
భారతీయులకు కారు లగ్జరీ కంటే కూడా అది ఇచ్చే మైలేజీనే ముఖ్యమని చెప్పడానికి ఓ ఆటోమొబైల్ సంస్థ గతంలో ఇచ్చిన యాడ్ నిదర్శనంగా నిలుస్తోంది. పెరుగుతున్న ఇంధన ధరల దృష్ట్యా కొత్త కారు కొనాలనుకునే వారు నేటికీ మైలేజీకే పెద్ద పీట వేస్తున్నారు. వివిధ కంపెనీలు అందించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం మార్కెట్లో అత్యధిక మైలేజీనిచ్చే టాప్-5 కార్లు కింద చూద్దాం.టాప్ 5: మారుతీ సుజుకీ స్విఫ్ట్ (కొత్త మోడల్)కంపెనీ ఇటీవల విడుదల చేసిన ఫోర్త్ జనరేషన్ స్విఫ్ట్ తన మైలేజీతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. దీని పెట్రోల్ మాన్యువల్ మోడల్ లీటర్కు 24.8 కి.మీ., ఆటో గేర్ వెర్షన్ 25.75 కి.మీ మైలేజీ అందిస్తుంది. పాత మోడల్తో పోలిస్తే ఇది 3 కిలోమీటర్ల మైలేజీని అదనంగా ఇస్తుంది. అయితే మైలేజీ కోసం ఇంజన్ పవర్లో స్వల్పంగా 8 బీహెచ్పీ శక్తిని తగ్గించడం గమనార్హం.టాప్ 4: మారుతీ సుజుకీ సెలెరియోఅధిక ఇంధన సామర్థ్యం కలిగిన నాన్-హైబ్రిడ్ పెట్రోల్ కారుగా సెలెరియో గుర్తింపు పొందింది. ఏఆర్ఏఐ సర్టిఫికేషన్ ప్రకారం మాన్యువల్ వెర్షన్ 25.24 కి.మీ, ఆటో గేర్ వెర్షన్ ఏకంగా 26.68 కి.మీ/లీటర్ మైలేజీని ఇస్తుంది.టాప్ 3: హోండా సిటీ (హైబ్రిడ్)సెడాన్ కార్ల విభాగంలో మైలేజీకి రారాజుగా హోండా సిటీ హైబ్రిడ్ నిలుస్తోంది. 1.5 లీటర్ అట్కిన్సన్ సైకిల్ పెట్రోల్ ఇంజన్తో పాటు ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ వ్యవస్థ ఇందులో ఉంటుంది. ఈ కారు లీటరుకు 27.26 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని ఏఆర్ఏఐ ధ్రువీకరించింది. ఇది 100 బీహెచ్పీ శక్తిని, 131 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.టాప్ 2: టయోటా హైరైడర్ / మారుతి గ్రాండ్ విటారామిడ్-సైజ్ ఎస్యూవీ విభాగంలో ఈ రెండు కార్లు మైలేజీ విషయంలో రాణిస్తున్నాయి. కంపెనీల లెక్కల ప్రకారం ఇవి లీటరుకు 27.97 కిలోమీటర్ల మైలేజీని అందిస్తాయి. వాస్తవానికి హైవేలపై అద్భుతమైన మైలేజీ ఇచ్చినప్పటికీ, సిటీ డ్రైవింగ్లో మాత్రం సుమారు 20 కి.మీ మైలేజీ వస్తోందని వినియోగదారులు చెబుతుంటారు.టాప్ 1: మారుతీ సుజుకీ విక్టోరిస్ (హైబ్రిడ్)అత్యధిక మైలేజీనిచ్చే ప్రీమియం ఎంపీవీ/ఎస్యూవీగా మారుతీ సుజుకీ విక్టోరిస్ నిలుస్తోంది. ఇది లీటరుకు 28 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇది భారీ సైజు ఉన్నప్పటికీ హైబ్రిడ్ టెక్నాలజీ కారణంగా ఇది మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఈ మోడల్కు మంచి డిమాండ్ ఉంది.ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప ఊరట -
భారత్లో సాక్ష్యాల సేకరణకు సాయం కోరిన వెంబు భార్య
జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు, ఆయన భార్య ప్రమీలా శ్రీనివాసన్ మధ్య సాగుతున్న విడాకుల వివాదం ఇప్పుడు మద్రాస్ హైకోర్టుకు చేరింది. అమెరికా కోర్టులో పెండింగ్లో ఉన్న ఈ విచారణకు సంబంధించి భారతదేశంలో ఉన్న సాక్ష్యాలను సేకరించేందుకు న్యాయపరమైన సహాయం కావాలని కోరుతూ ప్రమీల దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు నిర్ణయం తీసుకోనుంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.మద్రాస్ హైకోర్టులో పిటిషన్కాలిఫోర్నియా సుపీరియర్ కోర్టు జారీ చేసిన ‘లెటర్స్ రోగేటరీ’(లెటర్స్ రోగేటరీ అనేది అంతర్జాతీయ న్యాయ ప్రక్రియలో ఒక దేశపు కోర్టు, మరొక దేశపు కోర్టుకు పంపే అధికారిక అభ్యర్థన పత్రం)ను గౌరవించి దాన్ని అమలు చేసేలా భారత అధికారులను ఆదేశించాలని ప్రమీలా శ్రీనివాసన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. సరిహద్దు వ్యాజ్యాల్లో మరో దేశంలోని సాక్ష్యాలను లేదా సాక్షుల స్టేట్మెంట్లను సేకరించడానికి ఉపయోగించే అధికారిక అభ్యర్థనే ఈ లెటర్స్ రోగేటరీ.ఈ కేసులో శ్రీధర్ వెంబుతో సహా పలువురు కీలక సాక్షులు ప్రస్తుతం భారతదేశంలోనే ఉన్నందున వారి నుంచి సాక్ష్యాలను సేకరించి అమెరికా కోర్టుకు సమర్పించడానికి స్థానిక కోర్టు కమిషనర్ను నియమించాలని ఆమె కోరారు.వివాదం నేపథ్యం..1993లో వివాహం చేసుకున్న ఈ జంట మధ్య 2020 నుంచి విభేదాలున్నాయి. కాలిఫోర్నియా కోర్టులో సాగుతున్న ఈ విడాకుల విచారణలో ప్రమీల కొన్ని ఆరోపణలు చేశారు. కంపెనీలో తన వాటాను తగ్గించే ఉద్దేశంతో శ్రీధర్ వెంబు జోహో సంస్థకు చెందిన ఆస్తులను తన కుటుంబ సభ్యులకు అక్రమంగా బదిలీ చేశారని ఆమె ఆరోపించారు. 2020లో భారతదేశానికి మకాం మార్చిన తర్వాత తనకు దూరంగా ఉంటున్నారని పేర్కొన్నారు. అయితే, ఈ ఆరోపణలను శ్రీధర్ వెంబు గతంలోనే బహిరంగంగా ఖండించారు. ఆస్తుల వివరాలను దాయడం లేదా నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి ఆస్తుల బదిలీ జరగలేదని వాదిస్తున్నారు.సాక్ష్యాల సేకరణ ఎందుకు కీలకం?వీరి విడాకుల ప్రక్రియలో భాగంగా వైవాహిక ఆస్తుల పంపకం, ఆర్థిక స్థిరత్వానికి సంబంధించిన అంశాలు సంక్లిష్టంగా మారాయి. భారతదేశంలో నివసిస్తున్న సాక్షుల స్టేట్మెంట్లు లేకుండా కాలిఫోర్నియా కోర్టు ఒక నిర్ణయానికి రావడం కష్టమని ప్రమీల తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారు. గతంలో కూడా భారత న్యాయస్థానాలు అంతర్జాతీయ సహకారంలో భాగంగా ఇటువంటి విదేశీ అభ్యర్థనలను అంగీకరించిన సందర్భాలను వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.హైకోర్టు స్పందనప్రమీలా శ్రీనివాసన్ పిటిషన్ను పరిగణనలోకి తీసుకున్న మద్రాస్ హైకోర్టు దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ శ్రీధర్ వెంబుకు నోటీసులు జారీ చేసింది. భారతీయ చట్టాలకు లోబడి సాక్ష్యాల నమోదుకు స్థానిక కమిషనర్ను నియమించవచ్చా అనే అంశాన్ని కోర్టు పరిశీలించనుంది.ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప ఊరట


