breaking news
Business
-
అమెజాన్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు
రాయల్ ఎన్ఫీల్డ్ ఆన్లైన్ ఉనికి విస్తరణలో భాగంగా అమెజాన్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో రాయల్ ఎన్ఫీల్డ్కు చెందిన క్లాసిక్ 350, బుల్లెట్ 350, హంటర్ 350, గోవాన్ క్లాసిక్ 350, కొత్త మీటియోర్ 350 బైక్లను అమెజాన్ ఇండియా ద్వారా ఆన్లైన్లో కొనుగోళ్లు చేయోచ్చు.అహ్మదాబాద్, చెన్నై, హైదరాబాద్, న్యూఢిల్లీ, పూణే నగరాల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంది. ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసినప్పట్టకీ.., డెలివరీ, విక్రయానంతర సేవలను కస్టమర్ ఎంపిక చేసుకున్న రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్ ద్వారా అందిస్తామని కంపెనీ తెలిపింది. -
స్మార్ట్ఫోన్ కంపెనీలో జెరోధా కామత్ ఇన్వెస్ట్మెంట్
స్మార్ట్ఫోన్ల తయారీ కంపెనీ నథింగ్ (Nothing)లో వెల్త్టెక్ యూనికార్న్ సంస్థ జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ (Nikhil Kamath) 2.1 కోట్ల డాలర్లు(రూ. 186 కోట్లు) ఇన్వెస్ట్ చేశారు. కంపెనీ ఇటీవల చేపట్టిన 20 కోట్ల డాలర్ల(రూ. 1,775 కోట్లు) నిధుల సమీకరణలో భాగంగా పెట్టుబడులను సమకూర్చినట్లు కామత్ వెల్లడించారు.1.3 బిలియన్ డాలర్ల(రూ. 11,530 కోట్లు) విలువలో నథింగ్ సిరీస్ సీ రౌండ్కు పెట్టుబడులు అందించినట్లు పేర్కొన్నారు. తదుపరి దశ ఏఐ టెక్నాలజీ కంపెనీగా అభివృద్ధి చెందేందుకు ప్రధానంగా నిధుల సమీకరణ చేపట్టనున్నట్లు సెప్టెంబర్లో నథింగ్ ప్రకటించింది. నథింగ్కు తెరతీయకముందు కార్ల్ పే.. స్మార్ట్ఫోన్ల దిగ్గజం వన్ప్లస్ సహవ్యవస్థాపకుడిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. -
అరట్టై ప్రైవసీపై సందేహం: శ్రీధర్ వెంబు రిప్లై ఇలా..
జోహో మెసేజింగ్ యాప్.. అరట్టై (Arattai) గత కొన్ని రోజులుగా అధిక ప్రజాదరణ పొందుతోంది. మెటా యాజమాన్యంలోని వాట్సాప్ యాప్ కంటే కూడా ఎక్కువ ఫీచర్స్ ఉండటం వల్ల, దేశీయ యాప్ కావడం వల్ల ఎక్కువమంది డౌన్లోడ్ చేసుకుంటున్నారు. దీనిని ఉపయోగించాలని కేంద్రమంత్రులు కూడా పిలుపునిచ్చారు. అయితే ఇప్పుడు సమాచార గోప్యతకు సంబంధించిన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక నెటిజన్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.మెసేజస్ పంపుకోవడానికి, ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్ వంటివి షేర్ చేసుకోవడానికి.. వాయిస్ కాల్స్ & వీడియో కాల్స్ చేసుకోవడానికి అరట్టై ఉపయోగపడుతుంది. ''అరట్టై చాట్ యాప్ని ఉపయోగిస్తున్నప్పుడు భార్యాభర్తలు షేర్ చేసుకునే ఫోటోలు ఎంతవరకు గోప్యంగా ఉంటాయని'' ఒక యూజర్ అడిగారు. దీనిని 'నన్ను నమ్మండి బ్రో' అంటూ జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు (Sridhar Vembu) పేర్కొన్నారు.యూజర్ల గోప్యతను దృష్టిలో ఉంచుకునే యాప్ రూపొందించామని, వినియోగదారుల భద్రతకు ఎలాంటి భంగం కలగదని శ్రీధర్ వెంబు పేర్కొన్నారు. దీనికోసం ప్రత్యేకంగా 'ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్' కూడా రాబోతోందని ఆయన అన్నారు. నమ్మకం చాలా విలువైనది.. మేము ప్రపంచ మార్కెట్లో ప్రతిరోజూ ఆ నమ్మకాన్ని సంపాదిస్తున్నాము. మా వినియోగదారుల నమ్మకాన్ని మేము నెరవేరుస్తూనే ఉంటామని వెంబు స్పష్టం చేశారు.ఇదీ చదవండి: గ్రోక్ ఏఐ వీడియో: స్పందించిన మస్క్ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. వాట్సాప్ ప్రారంభమైన తరువాత ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ 2016 వరకు అందుబాటులో లేదు. అరట్టై కొత్తది కాబట్టి.. ఇందులో కూడా అలాంటి ఫీచర్ తప్పకుండా వస్తుందని ఒక యూజర్ పేర్కొన్నారు. ఎవరైనా ఒక మంచి చేస్తుంటే బెదిరించడానికి ప్రయత్నించవద్దని.. ఇంకొకరు అన్నారు. ఏదైనా లోపాలను గుర్తించి మెరుగుపరచడంలో సహాయపడటం మంచిది. ఉద్దేశాలు మంచిగా ఉండాలి, సామాజిక వ్యాఖ్యాతల ఆధారంగా పక్షపాతంతో ఉండకూడదని మరొకరు పేర్కొన్నారు.I asked the Zoho founder how private the pictures shared between a husband and wife are when using the Arattai chat app. His response: "Trust me, bro!" pic.twitter.com/7MeRQrmVik— Ravi (@tamilravi) October 8, 2025 -
ఆల్టైమ్ గరిష్టాలను తాకిన వెండి: 10 రోజుల్లో..
ఇన్నాళ్లు బంగారం ధరలు పెరిగిపోతున్నాయని ఆందోళన చెందిన ప్రజలకు వెండి కూడా నిరాశ కలిగిస్తోంది. 2025 అక్టోబర్ ప్రారంభంలో రూ. 161000 వద్ద ఉన్న సిల్వర్ రేటు.. ఈ రోజు (అక్టోబర్ 10) రూ. 1,80,000 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే 10 రోజుల్లో వెండి ధరలు ఎంతగా పెరిగాయో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.అక్టోబర్ 7 (గురువారం) వెండి రేటు ఏకంగా రూ. 7,000 పెరిగి.. ఒక్కసారిగా షాకిచ్చింది. ఈ రోజు (శుక్రవారం) కూడా సిల్వర్ రేటు రూ. 3000 పెరిగింది. దీంతో ఒక గ్రామ్ సిల్వర్ రేటు 180 రూపాయలకు చేరింది. వెండి ధరలు ఒక్క భారతీయ మార్కెట్లో మాత్రమే కాకుండా.. అంతర్జాతీయ కూడా గణనీయంగా పెరుగుతోంది.వెండి రేటు గ్లోబల్ మార్కెట్లో.. మొదటిసారి ఔన్స్కు 50 డాలర్ల స్థాయికి చేరి, 2012 నాటి గరిష్టాన్ని చెరిపేసింది. 2012లో ఔన్స్ వెండి ధర 49.50 డాలర్లకు చేరుకుని, తర్వాత గణనీయంగా దిద్దుబాటుకు గురైంది. ఇన్నాళ్ల తర్వాత తిరిగి వెండి లోహానికి బలమైన డిమాండ్ కనిపిస్తోంది.ఇదీ చదవండి: ఒక్కసారిగా తగ్గిన గోల్డ్ రేటుపరిశ్రమల నుంచి పెరుగుతున్న డిమాండ్ మాత్రమే కాకుండా.. అమెరికా టారిఫ్స్ కూడా వెండి ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని నిపుణుల అభిప్రాయం. ప్రముఖ అనలిస్ట్ రాబర్ట్ కియోసాకి కూడా వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ధరలు పెరగడానికి ముందే.. సిల్వర్ కాయిన్స్ కొనుగోలు చేయండి అని సలహా ఇస్తున్నారు. -
గ్రోక్ ఏఐ వీడియో: స్పందించిన మస్క్
టెక్నాలజీ రంగంలో.. ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ 'ఎలాన్ మస్క్' మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇందులో భాగంగానే ఈయన తన ఏఐ వీడియో జనరేషన్ ప్లాట్ఫామ్ గ్రోక్ ఇమాజిన్కు సంబంధించిన కొత్త వెర్షన్ 0.9ని ప్రవేశపెట్టారు. ఈ కొత్త వెర్షన్.. ఇప్పటికే రియాలిటీగా కనిపించే వీడియోలను సృష్టించగల సామర్థ్యంతో యూజర్లను తెగ ఆకట్టుకుంది.ఇండియన్ కంటెంట్ క్రియేటర్ ప్రశాంత్.. ప్రముఖ హాలీవుడ్ చిత్రం ఐరన్ మ్యాన్ నుంచి ఒక సన్నివేశాన్ని.. రీక్రియెట్ చేసి తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసారు. ఇక్కడ కనిపించే వ్యక్తి మస్క్ను పోలి ఉన్నారు. వీడియో మొత్తం ఎడారి ప్రాంతం కనిపిస్తుంది. వీడియో షేర్ చేస్తూ.. ''గ్రోక్ ఇమాజిన్ 0.9 సినిమా నిర్మాణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దింది. ఐకానిక్ ఐరన్ మ్యాన్ దృశ్యాన్ని తిరిగి ఊహించుకున్నాను. ఇందులో విజువల్ క్వాలిటీ, ఆడియో జనరేషన్ వంటివి నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇది అద్భుతమైన మోడల్'' అని అన్నారు. దీనిపై మస్క్ స్పందిస్తూ.. 'గ్రోక్ ఇమాజిన్ వెర్షన్ 0.9 నాట్ బ్యాడ్' అని అన్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. గ్రోక్ 0.9 వెర్షన్ ఇంత అద్భుతంగా ఉంటే.. 1.0 ఎలా ఉంటుందో అని ఒకరు అన్నారు. గ్రోక్ రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతాలను సృష్టిస్తుందని ఇంకొకరు అన్నారు.Not bad for Grok Imagine version 0.9 … https://t.co/ihIzdVOylj— Elon Musk (@elonmusk) October 9, 2025 -
ఆకాశ ఎయిర్ కో-ఫౌండర్ రాజీనామా
దేశీ విమానయాన కంపెనీ ఆకాశ ఎయిర్ (Akasa Air) అంతర్జాతీయ కార్యకలాపాల సీనియర్ వైస్ప్రెసిడెంట్, సహవ్యవస్థాపకురాలు నీలూ ఖత్రి రాజీనామా చేశారు. తద్వారా మూడేళ్ల క్రితమే ఏర్పాటైన కంపెనీ నుంచి నిష్క్రమించారు. ప్రొఫెషనల్గా కొత్త దారిలో ప్రయాణించేందుకు వీలుగా నీలూ ఖత్రి (Neelu Khatri) పదవిని వొదులుకున్నట్లు ఆకాశ ఎయిర్ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే అంతకుమించి వివరాలు వెల్లడించలేదు.2022 ఆగస్ట్ 7న కార్యకలాపాలు ప్రారంభించిన సంస్థ వ్యవస్థాపకులలో ఒకరైన ఖత్రి ఆకాశ ఎయిర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులలోనూ ఒకరిగా సేవలు అందిస్తున్నారు. కంపెనీ వ్యవస్థాపకుడు వినయ్ దూబే సీఈవోగా వ్యవహరిస్తున్నారు. కాగా.. కంపెనీ సహవ్యవస్థాపకుల జాబితాలో ఆదిత్య ఘోష్, ఆనంద్ శ్రీనివాసన్, బెల్సన్ కౌటినో, భవిన్ జోషీ, ప్రవీణ్ అయ్యర్ సైతం ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో ఎగ్జిక్యూటివ్ స్థాయిలో కొంతమంది కంపెనీ నుంచి వైదొలగడం గమనార్హం! మరోపక్క ఆగస్ట్లో ప్రేమ్జీ ఇన్వెస్ట్, క్లేపాండ్ క్యాపిటల్ తదితర సంస్థల నుంచి నిధుల సమీకరణ పూర్తి చేసుకున్నట్లు ఎయిర్లైన్ ప్రకటించిన విషయం విదితమే. ఇదీ చదవండి: ఫోర్బ్స్ ఇండియా బిలియనీర్స్ జాబితా: టాప్ 10లో ఒక్క మహిళ -
ఒక్కసారిగా తగ్గిన గోల్డ్ రేటు: రూ.2 లక్షలకు చేరువలో వెండి!
అక్టోబర్ ప్రారంభం నుంచి భారీగా పెరుగుతున్న బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. నేడు (శుక్రవారం) గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 1860 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో గోల్డ్ రేటు.. ఏ నగరం ఎంత ఉంది అనే విషయం తెలుసుకుందాం. -
లాభాల్లో దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లో శుక్రవారం ఉదయం లాభల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 282.04 పాయింట్లు లేదా 0.34 శాతం లాభంతో 82,454.14 వద్ద, నిఫ్టీ 86.45 పాయింట్లు లేదా 0.34 శాతం లాభంతో 25,268.25 వద్ద సాగుతున్నాయి.రిలయన్స్ పవర్ లిమిటెడ్, నాగరీకా క్యాపిటల్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్, సంగం (ఇండియా), 5పైసా క్యాపిటల్, జిందాల్ ఫోటో లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. లక్ష్మీ గోల్డోర్నా హౌస్, క్యాపిటల్ ట్రస్ట్, తమిళనాడు టెలికమ్యూనికేషన్స్ లిమిటెడ్, మెక్లియోడ్ రస్సెల్ (ఇండియా), సోలెక్స్ ఎనర్జీ వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఇళ్ల ధరలు ఎంత పెరిగాయంటే..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశవ్యాప్తంగా 18 ప్రముఖ నగరాలకు సంబంధించి ఇళ్ల ధరల సూచీ (హెచ్పీఐ) 3.6 శాతం పెరిగింది. 18 నగరాల్లో ఇళ్ల కొనుగోలు/విక్రయ లావాదేవీల వివరాలను రిస్ట్రేషన్ విభాగాల నుంచి సమీకరించి, ఆర్బీఐ ప్రతీ త్రైమాసికానికి సంబంధించి హెచ్పీఐని విడుదల చేస్తుంటుంది. 2022–23 మూల సంవత్సరం (బేస్ ఇయర్)గా ఆర్బీఐ 2025–26 క్యూ1 హెచ్పీఐని ప్రకటించింది. ఇంతకుముందు వరకు 2010–11 బేస్ సంవత్సరంగా ఉంది. ఆర్బీఐ తాజా డేటా ప్రకారం.. ఇళ్ల ధరల పెరుగుదల 3.6 శాతంగా ఉన్నట్టు తెలుస్తోంది.క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ పెరుగుదల 7.6 శాతంగా ఉంది. నాగ్పూర్, చండీగఢ్, చెన్నై, కోచిలో ధరల వృద్ధి ఎక్కువగా ఉంది. ఇక త్రైమాసికం వారీగా పోల్చి చూస్తే (మార్చి క్వార్టర్ నుంచి) సూచీ 2 శాతం పెరిగింది. హైదరాబాద్, తిరువనంతపురం, పుణె, ఘజియాబాద్, థానే, గౌతమ్ బుద్ధ నగర్, చండీగఢ్, నాగ్పూర్ను ప్రస్తుత 10 నగరాలకు అదనంగా సూచీలో ఆర్బీఐ చేర్చింది. ఇవి కాకుండా ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్కతా, బెంగళూరు, లక్నో, అహ్మదాబాద్, జైపూర్, కాన్పూర్, కోచి పట్టణాలు ఈ సూచీలో భాగంగా ఉన్నాయి. ఈ నగరాల్లో ధరల తీరు తెన్నులను సూచీ ప్రతిఫలిస్తుంటుంది. -
మెట్రోల్లో ఇళ్ల అమ్మకాలు అంతంతే
న్యూఢిల్లీ: హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా టాప్–8 నగరాల్లో ఇళ్ల విక్రయాలు జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో 87,603 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే ఒక శాతం పెరిగినట్టు నైట్ఫ్రాంక్ తెలిపింది. ఎలాంటి మందగమనం ఛాయలు లేవంటూ, రానున్న కాలంలో అమ్మకాలు పుంజుకుంటాయన్న అంచనాను వ్యక్తం చేసింది. ప్రస్తుత పండుగల సీజన్ అమ్మకాలతో దీనిపై స్పష్టత ఏర్పడుతుందని పేర్కొంది. వడ్డీ రేట్లు తగ్గడం, జీడీపీ అధిక వృద్ధి, బడ్జెట్లో కల్పించిన పన్ను ప్రయోజనాలతో అమ్మకాలు బలంగా కొనసాగినట్టు తెలిపింది. రెపో రేటు 100 బేసిస్ పాయింట్ల మేర రేట్ల తగ్గింపు, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్ను తగ్గింపు (జీఎస్టీ రేట్ల క్రమబద్దీకరణ) నేపథ్యంలో పెరిగిన వినియోగ విశ్వాసం ఇళ్ల అమ్మకాలపై ఏ మేరకు ఉంటుందో చూడాల్సి ఉందని పేర్కొంది. ఇక ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో టాప్–8 నగరాల్లో ఇళ్ల అమ్మకాలు 2,57,804 యూనిట్లుగా ఉన్నట్టు తెలిపింది. గతేడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే ఒక శాతం తగ్గినట్టు వెల్లడించింది. హైదరాబాద్తోపాటు బెంగళూరు, చెన్నై, పుణె, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), కోల్కతా, అహ్మదాబాద్, ఢిల్లీ ఎన్సీఆర్ గణాంకాలు ఇందులో కలసి ఉన్నాయి. సంస్థాగత పెట్టుబడులు 11 శాతం అప్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో సంస్థాగత పెట్టుబడులు సెప్టెంబర్ త్రైమాసికంలో 11 శాతం పెరిగి 1.27 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా తెలిపింది. ఆఫీస్ వసతుల్లోకి మెరుగైన పెట్టుబడుల రాక ఇందుకు దోహదం చేసింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో 1.15 బిలియన్ డాలర్లుగానే ఉన్నట్టు పేర్కొంది. 780 మిలియన్ డాలర్లు ఆఫీస్ వసతుల్లోకి రాగా, 320 మిలియన్ డాలర్లు నివాస గృహ ప్రాజెక్టుల్లోకి వచ్చాయి. భారత ఆరి్థక వ్యవస్థ మూలాలు, రియల్ ఎస్టేట్ రంగంలో అవకాశాలపై ఇన్వెస్టర్లలో పెరిగిన విశ్వాసానికి ఇది నిదర్శనమని కొలియర్స్ ఇండియా సీఈవో బాదల్యాజ్ఞిక్ తెలిపారు. 1.27 బిలియన్ డాలర్ల పెట్టుబడుల్లో 60 శాతం దేశీ ఇన్వెస్టర్ల రూపంలో రాగా, మిగిలిన మొత్తం విదేశీ ఇన్వెస్టర్లు సమకూర్చారు. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు 51 శాతం పెరగ్గా, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు 21 శాతం తగ్గాయి. విదేశీ ఇన్వెస్టర్లలో అప్రమత్త ధోరణి నెలకొన్నప్పటికీ, రానున్న రోజుల్లోనూ ఈ రంగంలోకి సంస్థాగత పెట్టుబడుల రాక బలంగా కొనసాగుతుందని యాజి్ఞక్ అంచనా వేశారు. -
జీసీసీలకు కీలక హబ్గా తెలంగాణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొత్త గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) ఏర్పాటుకు తెలంగాణ కీలక గమ్యస్థానంగా మారినట్లు స్పెషలిస్ట్ స్టాఫింగ్ సంస్థ ఎక్స్ఫినో ఒక నివేదికలో తెలిపింది. గత మూడేళ్లుగా భారత్లో ఏర్పాటైన 40 శాతం సెంటర్లను హైదరాబాద్ ఆకర్షించినట్లు వివరించింది. ఇదే వ్యవధిలో బెంగళూరు వాటా 33 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. కేపబిలిటీ సెంటర్లకు సంబంధించి దేశ, విదేశాల్లో తెలంగాణకి పెరుగుతున్న ప్రాముఖ్యతను ఇది తెలియజేస్తోందని రిపోర్ట్ తెలిపింది.టాలెంట్ లభ్యత, మౌలిక వసతులు, పాలసీలు మొదలైనవి రాష్ట్రానికి సానుకూలంగా ఉంటున్నాయని పేర్కొంది. ప్రస్తుతం తెలంగాణలో 360 జీసీలు ఉన్నట్లు వివరించింది. వీటిలో సుమారు 3.1 లక్షల మంది ప్రొఫెషనల్స్ ఉన్నారని, రాష్ట్ర వైట్–కాలర్ సిబ్బందిలో ఇది 14 శాతమని రిపోర్ట్ తెలిపింది. ‘‘భారత్లో కొత్తతరం జీసీసీ పవర్హౌస్గా తెలంగాణ వేగంగా ఎదుగుతోంది. నిపుణులైన సిబ్బంది లభ్యత, మెరుగైన మౌలిక సదుపాయాలతో గ్లోబల్ దిగ్గజాలను ఆకర్షిస్తోంది’’ అని ఎక్స్ఫినో సహ వ్యవస్థాపకుడు కమల్ కారంత్ తెలిపారు. వ్యయాల విషయంలో ఇతర నగరాలకు దీటుగా పోటీనిస్తూ, టెక్నాలజీ, టెక్యేతర కార్యకలాపాలకు కీలకమైన హబ్గా తెలంగాణ నిలుస్తోందని సంస్థ సీఈవోగా కొత్తగా ఎంపికైన పి. ఫ్రాన్సిస్ తెలిపారు. కార్యకలాపాలను విస్తరించడంపై దృష్టి పెడుతున్న కొత్త తరం జీసీసీలకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా ఉంటోందని పేర్కొన్నారు. నివేదిక ప్రకారం.. → తెలంగాణలో 47.8 లక్షల మంది వైట్–కాలర్ ప్రొఫెషనల్స్ అందుబాటులో ఉన్నారు. వీరిలో 23.3 లక్షల మందికి ఏడాది పైగా అనుభవం ఉంది. → జీసీసీ సిబ్బందిలో 33 శాతం మంది మహిళలు ఉన్నారు. నాయకత్వ స్థానాల్లో 19 శాతం మంది ఉన్నారు. → రాష్ట్రంలోని మొత్తం జీసీసీ ఉద్యోగాల్లో ఇంజినీరింగ్, ఐటీ వాటా 57 శాతంగా ఉంది. -
25 గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ రహదారులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రూ.6లక్షల కోట్లతో 10,000 కిలోమీటర్ల పొడవైన 25 గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వేలను నిర్మిస్తున్నట్టు కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఎక్స్ప్రెస్ రహదారులు, ఆర్థిక నడవాల నిర్మాణంతో దేశంలో లాజిస్టిక్స్ (రవాణా) వ్యయాలు గతంలో ఉన్న 16 శాతం నుంచి 10 శాతానికి తగ్గినట్టు చెప్పారు. డిసెంబర్ నాటికి ఇది 9 శాతానికి తగ్గుతుందని, అప్పుడు భారత్ పోటీతత్వం మరింత పెరుగుతుందన్నారు. పీహెచ్డీసీసీఐ వార్షిక సమావేశంలో భాగంగా మంత్రి ప్రసంగించారు. లాజిస్టిక్స్ వ్యయాలు యూఎస్, ఐరోపా దేశాల్లో 12 శాతం మేర ఉండగా, చైనాలో 8–10 శాతం మధ్య ఉండడం గమనార్హం. ఈ వ్యయం ఎంత కనిష్టానికి తగ్గితే, అంతర్జాతీయ వాణిజ్యంలో అంతగా పోటీపడొచ్చు. దీంతో దీన్ని సాధ్యమైనంత తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. నంబర్ 1 స్థానానికి ఆటోమొబైల్ రంగం భారత ఆటోమొబైల్ రంగం వచ్చే ఐదేళ్లలో ప్రపంచంలోనే నంబర్ 1 స్థానానికి చేరుకుంటుందని మంత్రి గడ్కరీ మరోసారి పునరుద్ఘాటించారు. ‘‘రవాణా మంత్రిగా బాధ్యతలు తీసుకునే నాటికి భారత ఆటోమొబైల్ పరిశ్రమ పరిమాణం రూ.14 లక్షల కోట్లుగా ఉంటే, ఇప్పుడు రూ.22 లక్షల కోట్ల కు చేరుకుంది. 4 లక్షల మందికి పరిశ్రమ ఉపాధి కల్పించడమే కాకుండా, కేంద్ర, రాష్ట్రాలకు జీఎస్టీ రూపంలో పెద్ద ఎత్తున ఆదాయాన్ని అందిస్తోంది. ప్రస్తుతం యూఎస్ ఆటోమొబైల్ పరిశ్రమ పరిమాణం రూ.78 లక్షల కోట్లుగా, చైనా రూ.47 లక్షల కోట్లుగా ఉంది’’అని మంత్రి వివరించారు. వ్యూహా త్మకమైన జోజిలా టన్నెల్ (సొరంగ మార్గం) నిర్మాణం పనులు 80 శాతం వరకు పూర్తయ్యాయని చెబుతూ.. ఇది అందుబాటులోకి వస్తే అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో లద్దాక్ ప్రాంతానికి అనుసంధానత ఏర్పడుతుందన్నారు. దేశ ప్రగతికి గ్రీన్ ఇంధనాలు కీలకం శిలాజ ఇంధనాల (పెట్రోలియం ఉత్పత్తులు) దిగుమతుల కోసం ఏటా రూ.22 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తున్నట్టు మంత్రి గడ్కరీ తెలిపారు. పైగా వీటి వల్ల పర్యావరణానికి ఎంతో హాని కలుగుతుందన్నారు. భారత ప్రగతికి శుద్ధ ఇంధనాల వినియోగం కీలకమని చెప్పారు. దేశ జీడీపీ వృద్ధికి వ్యవసాయ రంగంపైనా దృష్టి సారించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. మొక్కజొన్న నుంచి ఇథనాల్ తయారీతో రైతులకు రూ.45వేల కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరినట్టు చెప్పారు. ‘‘మొక్కజొన్న నుంచి ఇథనాల్ తయారు చేయాలని నిర్ణయించినప్పుడు.. క్వింటా మొక్కజొన్న మార్కెట్ ధర రూ.1,200 ఉంటే, మద్దతు ధర రూ.1,800గా ఉంది. పెట్రోల్లో ఇథనాల్ కలపాలని నిర్ణయించిన తర్వాత మొక్కజొన్న ధర రూ.2,800కు పెరిగింది. దీనివల్ల రైతులకు రూ.45,000 కోట్లు అదనంగా సమకూరింది’’అని మంత్రి వివరించారు. జాతీయ రహదారుల నిర్మాణంలో 80 లక్షల టన్నుల వ్యర్థాలను వినియోగించినట్టు వెల్లడించారు. ఢిల్లీలో పర్యావరణ కాలుష్యం ఎంతో పెరిగిపోయిందని చెబుతూ, దీన్ని తగ్గించడం ప్రభుత్వ ప్రాధాన్యంగా పేర్కొన్నారు. -
టీసీఎస్ క్యూ2.. ఓకే
న్యూఢిల్లీ: ఐటీ సేవల దేశీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఈ ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెపె్టంబర్ (క్యూ2)లో నికర లాభం వార్షికంగా నామమాత్ర (1.4 శాతం) వృద్ధితో రూ. 12,075 కోట్లను తాకింది. గతేడాది (2024–25) ఇదే కాలంలో రూ. 11,909 కోట్లు ఆర్జించింది. ప్రధానంగా బీఎఫ్ఎస్ఐతోపాటు వివిధ విభాగాలలో వృద్ధి ఇందుకు సహకరించింది. మొత్తం ఆదాయం సైతం స్వల్పంగా 2.4 శాతం పుంజుకుని రూ. 65,799 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 64,259 కోట్ల టర్నోవర్ అందుకుంది. అయితే త్రైమాసికవారీగా (క్యూ2తో పోలిస్తే) నికర లాభం 5.3 శాతం క్షీణించగా, ఆదాయం 3.7 శాతం ఎగసింది. వాటాదారులకు ఒక్కో షేరుకీ రూ. 11 చొప్పున రెండో మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఇందుకు ఈ నెల 15 రికార్డ్ డేట్కాగా.. నవంబర్ 4కల్లా చెల్లించనుంది. క్యూ2లో అన్ని విభాగాలలోనూ వృద్ధి పథంలో సాగినట్లు కంపెనీ సీఎఫ్వో సమీర్ సేక్సరియా పేర్కొన్నారు. క్రమబద్ధ ఎగ్జిక్యూషన్, వ్యూహాత్మక పెట్టుబడులతో మార్జిన్లనకు బలాన్నిచ్చినట్లు తెలియజేశారు. వేతన పెంపు, భవిష్యత్ అవసరాలకు సంసిద్ధత, కొత్త భాగస్వామ్యాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు వెల్లడించారు. కాగా, టీసీఎస్ క్యూ2లో 10 బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్టులు కుదుర్చుకుంది. లిస్ట్ఎంగేజ్ కొనుగోలు మసాచుసెట్స్(యూఎస్) సంస్థ లిస్ట్ఎంగేజ్లో 100 శాతం వాటాను టీసీఎస్ కొనుగోలు చేసింది. ఇందుకు యాజమాన్య ప్రోత్సాహకాలు, వ్యయాలుకాకుండా 7.28 కోట్ల డాలర్లు (సుమారు రూ. 645 కోట్లు) వెచ్చించింది.డేటా సెంటర్లకు సై.. 57,700 కోట్ల పెట్టుబడి భారీ పెట్టుబడి ప్రణాళికలతో డేటా సెంటర్ల బిజినెస్లోకి ప్రవేశించనున్నట్లు టీసీఎస్ తాజాగా ప్రకటించింది. ఇందుకు రానున్న 5–7ఏళ్లలో 6.5 బిలియన్ డాలర్ల(రూ. 57,700 కోట్లు)పెట్టుబడులు వెచ్చించనున్నట్లు కృతివాసన్ వెల్లడించారు. తద్వారా దశలవారీగా 1 గిగావాట్ సామర్థ్యంగల డేటా సెంటర్ ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలియజేశారు. వీటికి పెట్టుబడులను ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థలు, రుణాల ద్వారా సమకూర్చుకోనున్నట్లు టీసీఎస్ వివరించింది. 150 మెగావాట్లకు బిలియన్ డాలర్లు అవసరంకాగా.. గిగావాట్ సామర్థ్యానికి 6.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వెచ్చించవలసి ఉంటుందని కంపెనీ మదింపు చేసింది. టీసీఎస్ షేరు బీఎస్ఈలో 1.2% బలపడి రూ. 3,062 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిశాక ఫలితాలు వచ్చాయి.6,000 ఉద్యోగాల కోత కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 6,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు టీసీఎస్ సీహెచ్ఆర్వో సుదీప్ కున్నుమల్ వెల్లడించారు. ఇది మొత్తం సిబ్బంది సంఖ్యలో 1 శాతమేనని తెలియజేశారు. అయితే మరింత భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తారన్న వదంతులను తోసిపుచ్చారు. కాగా.. ఐటీ నిపుణుల యూనియన్ నైట్స్ వివరాల ప్రకారం టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య క్యూ2లో 5,93,314కు చేరింది. ఈ ఏడాది క్యూ1లో నమోదైన 6,13,069 సంఖ్యతో పోలిస్తే 19,755 మంది ఉద్యోగులు తగ్గారు. అయితే ఈ క్యూ2లో 18,500 మందికి ఉపాధి కల్పించినట్లు కున్నుముల్ పేర్కొన్నారు. భవిష్యత్లో డిమాండుకు అనుగుణంగా నియామకాలు చేపట్టనున్నట్లు తెలియజేశారు. ఈ ఏడాది జూలైలో ప్రపంచవ్యాప్తంగా కంపెనీ సిబ్బందిలో 2%(12,261) మందిని తొలగిస్తున్నట్లు టీసీఎస్ ప్రకటించడం తెలిసిందే.పటిష్ట పనితీరు క్యూ2లో ప్రదర్శించిన పటిష్ట పనితీరు సంతోషాన్నిచ్చింది. అంకితభావం, సామర్థ్యాలు చూపిన మా ఉద్యోగులకు కృతజ్ఞతలు. ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ ఆధారిత టెక్నాలజీ సర్వీసుల కంపెనీగా అవతరించే ప్రయాణంలో ఉన్నాం. ఇందుకు అనుగుణంగా నైపుణ్యం, మౌలికసదుపాయాలు, వ్యవస్థాగత భాగస్వామ్యాలలో ట్రాన్స్ఫార్మేషన్కు ప్రాధాన్యతనిస్తున్నాం. తగిన పెట్టుబడులు వెచ్చిస్తున్నాం. – కె. కృతివాసన్, సీఈవో, ఎండీ, టీసీఎస్ -
యూకే ఒప్పందంతో ఎంఎస్ఎంఈలకు బూస్ట్
న్యూఢిల్లీ: భారత్–యునైటెడ్ కింగ్డమ్ (యూకే) మధ్య సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందంతో (సెటా) చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) ఊతం లభిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కల్పనకు ఇది దోహదపడుతుందని ఆయన చెప్పారు. సెటా దన్నుతో 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసుకోవాలన్న లక్ష్యాన్ని సాధించగలమని ధీమా వ్యక్తం చేశారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో కలిసి సీఈవోల సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. రెండు పెద్ద దేశాల ఉమ్మడి పురోగతికి, ప్రజల శ్రేయస్సుకు సెటా తోడ్పడుతుందన్నారు. అలాగే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను నెలకొల్పగలిగే రంగాలను గుర్తించాలని పరిశ్రమ వర్గాలకు సూచించారు. పాలసీపరంగా స్థిరత్వం, అంచనాలకు అనుగుణమైన నియంత్రణ విధానాలు, భారీ స్థాయి డిమాండ్ లాంటివి భారత్కు సానుకూలాంశాలని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ఫార్మా, ఇన్ఫ్రా, ఎనర్జీ, ఫైనాన్స్ తదితర రంగాల్లో ఇన్వెస్ట్ చేయాలని బ్రిటన్ కంపెనీలను ఆహ్వానించారు.ఇరు దేశాల బంధం బలోపేతం.. ప్రస్తుతం అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ సెటాతో భారత్–యూకే మధ్య బంధం మరింత పటిష్టమైందని ప్రధాని పేర్కొన్నారు. ‘ప్రస్తుతం భారత్–యూకే ద్వైపాక్షిక వాణిజ్యం 56 బిలియన్ డాలర్లుగా ఉంది. నిర్దేశించుకున్న డెడ్లైన్ 2030 నాటికి దీన్ని రెట్టింపు చేసుకోగలమనే నమ్మకం ఉంది‘ అని చెప్పారు. ‘టెలికం, ఏఐ, బయోటెక్, క్వాంటమ్, సెమీకండక్టర్, సైబర్, స్పేస్ తదితర రంగాల్లో పరస్పరం సహకరించుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే కీలక లోహాలు, రేర్ ఎర్త్ మొదలైన విభాగాల్లోనూ నిర్మాణాత్మకంగా ముందుకెళ్లాలి. భారత్–యూకే ఉమ్మడిగా ప్రపంచంలో అగ్రగాములుగా నిల్చేందుకు అవకాశమున్న రంగాలను రెండు దేశాల వ్యాపార దిగ్గజాలు గుర్తించాలి. ఫిన్టెక్, సెమీకండక్టర్లు, గ్రీన్ హైడ్రోజన్ లేదా స్టార్టప్లు.. ఇలా ఏ రంగంలోనైనా సరే ఇరు దేశాలు కలిసి అంతర్జాతీయ ప్రమాణాలను నెలకొల్పాలి‘ అని మోదీ పేర్కొన్నారు. యూకేకి చెందిన తొమ్మిది యూనివర్సిటీలు భారత్లో క్యాంపస్లు ప్రారంభిస్తాయని ఆయన తెలిపారు.పరిశ్రమకు పూర్తి సహకారం: స్టార్మర్ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఎదురవుతున్న అవరోధాలను తొలగించేందుకు ఇరు దేశాల ప్రభుత్వాలు తీసుకోతగిన చర్యలను సూచించాలని పరిశ్రమ దిగ్గజాలను స్టార్మర్ కోరారు. వాణిజ్య ఒప్పందం ప్రయోజనాలను పొందేందుకు పరిశ్రమకు కావాల్సిన పూర్తి సహకారాన్ని అందిస్తామని ఆయన చెప్పారు. జూలైలో సెటాపై సంతకాలు జరిగినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య 6 బిలియన్ పౌండ్ల మేర వాణిజ్యం, పెట్టుబడులు నమోదయ్యాయని పేర్కొన్నారు.భారత్లో ఇన్వెస్ట్ చేయండి..ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారత్లో పెట్టుబడులు పెట్టాలని గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2025లో పాల్గొన్న సందర్భంగా అంతర్జాతీయ ఇన్వెస్టర్లను మోదీ ఆహ్వానించారు. తద్వారా భారత్ వృద్ధి గాథలో పాలుపంచుకోవాలని సూచించారు. బ్యాంకింగ్ వ్యవస్థ గతంలో కొందరికే పరిమితమై ఉండేదని, దాన్ని అందరికీ సాధికారత కల్పించే సాధనంగా డిజిటల్ టెక్నాలజీ మార్చిందన్నారు. జేఏఎం (జన్ధన్, ఆధార్, మొబైల్) వ్యూహం ఇందుకు ఉపయోగపడిందని చెప్పారు. ‘సాంకేతికత, ప్రజలు, భూమి.. ఇలా అన్నింటికీ ప్రయోజనం చేకూర్చగలిగే ఫిన్టెక్ ప్రపంచాన్ని సృష్టించాలి. ఇన్నోవేషన్ లక్ష్యమనేది వృద్ధి మాత్రమే కాకూడదు, మేలు చేసేదిగా ఉండాలి. ఫైనాన్స్ అంటే కేవలం అంకెలు కాదు.. మానవాళి పురోగతికి దోహదకారిగా ఉండాలి‘ అని ప్రధాని చెప్పారు. భారత్ విషయంలో ఏఐ అంటే సమ్మిళితత్వానికి సంక్షిప్త రూపమని చెప్పారు. -
రూ.3.4 కోట్ల జాబ్ మానేసింది.. ‘ఉద్యోగం ఓకే కానీ..’
టెక్ దిగ్గజం గూగుల్లో ఉన్నత స్థాయి ఉద్యోగం.. భారీ వేతనం అయినా అన్నీ వదిలేసిందో ఓ ఉద్యోగిని. గూగుల్ జ్యూరిచ్ కార్యాలయంలో సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్గా పని చేసిన ఫ్లోరెన్స్ పోయిరెల్, ఏడానికి రూ. 3.40 కోట్లు (390,000 డాలర్లు) సంపాదించేవారు. అయినప్పటికీ, ఎక్కువ సమయం తన ప్రియమైన వారితో గడపాలని ఆకాంక్షతో ఆమె ఉద్యోగాన్ని వీడి, జీవితాన్ని మెల్లగా ఆస్వాదించేందుకు నిర్ణయం తీసుకున్నారు."పని మంచిగా అనిపించేది కానీ జీవితం ఇంకా గొప్పది" అని ఫ్లోరెన్స్ చెబుతారు. ఆమె 37 ఏళ్ల వయసులో ఉద్యోగానికి గుడ్బై చెప్పింది. బర్న్ అవుట్ కాకపోయినా, జీవితం అసలైన అర్థాన్ని తెలుసుకోవాలని ఆమెకు ఆసక్తి పెరిగింది. తన జీవిత భాగస్వామి జాన్ (తన కంటే 17 ఏళ్లు పెద్దవాడు, అతను కూడా గూగుల్ ఉద్యోగే)తో గడిపే సమయం చాలా విలువైనదని ఆమె గుర్తించారు.2024 నాటికి 1.5 మిలియన్ డాలర్లు (రూ. 12.6 కోట్లు) ఆదా చేసిన ఫ్లోరెన్స్, FIRE (Financial Independence, Retire Early) భావనతో ప్రేరితమై, ఉద్యోగం మానేసి 18 నెలల "మినీ రిటైర్మెంట్" తీసుకుంది. ఈ సమయంలో ఆమె జాన్తో కలిసి ప్రయాణాలు చేస్తూ, జీవితాన్ని తానే నిర్ణయించే వేగంతో అనుభవిస్తున్నారు.ఇప్పుడు ఆమె జ్యూరిచ్ సరస్సులో ఈత కొడుతూ, కెరీర్ కోచింగ్ అందిస్తూ, జీవితం యొక్క అందాన్ని ఆస్వాదిస్తోంది. "జీవితం చిన్నది, అందమైనది. దానిని మీరు ప్రేమించే వ్యక్తులతో గడపడంమే నిజమైన ఆనందం" అని ఫ్లోరెన్స్ తేల్చి చెప్పింది. -
‘ఆ ఇన్వెస్ట్మెంట్ ఫార్ములా చచ్చింది.. కొత్తది వచ్చింది’
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి సాంప్రదాయ 60/40 పెట్టుబడి వ్యూహాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యూహం ప్రకారం 60 శాతం డబ్బును ఈక్విటీల్లో (స్టాక్స్), 40 శాతం డబ్బును బాండ్లలో (స్థిర ఆదాయ పెట్టుబడులు) పెట్టాలి. దీర్ఘకాలిక, స్థిరమైన ఆదాయాన్ని కల్పించగలదని భావించి, ఈ వ్యూహాన్ని ఎన్నో దశాబ్దాలుగా ఆర్థిక ప్రణాళికదారులు ఒక "మ్యాజిక్ ఫార్ములా"గా వర్ణిస్తూ వచ్చారు.అయితే, కియోసాకి అభిప్రాయం (Rich Dad Poor Dad author Robert Kiyosaki) ప్రకారం, ఈ 60/40 విధానం 1971లోనే పనికిరానిది అయిపోయింది. అంటే, అప్పటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్ బంగార ప్రమాణం నుంచి డాలర్ను వదిలించాక ఇది అసంబద్ధం అయింది.రాబర్ట్ కియోసాకి తన ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. "మొత్తానికి, ఫైనాన్షియల్ ప్లానర్ల మ్యాజిక్ మంత్రదండం – 60/40 చనిపోయింది" అంటూ పోస్ట్ను మొదలు పెట్టిన కియోసాకి "ఆ బీఎస్ నిష్పత్తి నిక్సన్ బంగారు ప్రమాణం నుంచి డాలర్ను తీసేసిన 1971లోనే చనిపోయింది. దాన్నుంచి ఇప్పటివరకు, ఆర్థిక ప్రణాళికదారులు దీన్ని పదవీ విరమణ భద్రత కోసం మేజిక్ కార్పెట్ రైడ్ లా ప్రచారం చేస్తూ వచ్చారు" అని రాసుకొచ్చారు.అమెరికా ప్రభుత్వం ప్రపంచంలో అతిపెద్ద రుణగ్రహీత అని, అమెరికన్ డాలర్ ఒక “నకిలీ” కరెన్సీగా మారిందని కియోసాకి పేర్కొన్నారు. "యూఎస్ డాలర్ నకిలీ. ఇది మార్క్సిస్ట్ ఫెడ్ నియంత్రణలో ఉన్న, దివాలా తీసిన అమెరికన్ ప్రభుత్వ ఐఓయూ మాత్రమే. అలాంటి దేశం నుంచి బాండ్లు కొంటారా? ఆర్థిక భద్రత ఎక్కడుంది?" అంటూ ప్రశ్నించారు.కొత్త ఫార్ములా..మొత్తానికి వాస్తవం తెలిసొచ్చిందని, మోర్గాన్ స్టాన్లీ లాంటి సంస్థలు ఇప్పుడు మరో ప్రత్యామ్నాయ వ్యూహం 60/20/20 పోర్ట్ఫోలియోను ప్రోత్సహిస్తున్నాయని వివరించారు. ఈ వ్యూహం ప్రకారం.. 60 శాతం స్టాక్స్ లేదా ఇతర పెట్టుబడులు, 20 శాతం బాండ్లు, 20 శాతం బంగారం (లేదా ఇతర భద్రతా ఆస్తులు)పై పెట్టుబడి పెడతారు. ఇది పెట్టుబడిదారులకు పదవీ విరమణలో మరింత భద్రత కలిగిస్తుందని ఆయా సంస్థలు చెబుతున్నాయన్నారు.నేను వీటికే ప్రాధాన్యమిస్తా..ఎవరెన్ని చెప్పినప్పటికీ తాను ఎప్పటికీ నిజమైన ఆస్తులు అంటే, బంగారం, వెండి నాణేలు, బిట్కాయిన్, ఎథెరియం వంటి క్రిప్టో కరెన్సీలు, రుణంతో కొనుగోలు చేసిన రియల్ ఎస్టేట్ నుంచి అద్దె ఆదాయం, చమురు బావులు, పశువులపై వచ్చే రాబడికే ప్రధాన్యత ఇస్తానన్నారు. ఇవన్నీ ఆదాయం అందించే "రియల్ అసెట్స్" అని చెబుతూ, వాటిలో పెట్టుబడి పెట్టాలని సూచించారు.ఇదీ చదవండి: నా బంగారం.. ఇంకా పెరుగుతుందోచ్: ‘రిచ్ డాడ్’ రాబర్ట్"నేను ఇప్పటికీ వీటినే ఇష్టపడతాను. నాకు ఇవే 30 సంవత్సరాల క్రితం ఆర్థిక స్వాతంత్ర్యం ఇచ్చాయి" అన్నారు. ఇంకో ముఖ్యమైన జీవన పాఠం కూడా ఆయన పంచుకున్నారు. "ఫైనాన్షియల్ ప్లానర్ల మ్యాజిక్ వాండ్ అయిన 60/40 ఫార్ములాని నేను ఎప్పుడూ ఉపయోగించలేదు. మీకు ఉత్తమంగా పనికొచ్చే పెట్టుబడి వ్యూహం ఏదో దాన్ని కనుక్కోండి" అంటూ సూచించారు.FINALLY the BS “magic wand” of Financial Planner’s….the BS of 60/40 is dead.FYI: 60/40 meant investors invest 60% in stocks and 40 % in bonds.That BS ratio died in 1971 the year Nixon took the dollar off the gold standard.For years, financial planners have touted the…— Robert Kiyosaki (@theRealKiyosaki) October 9, 2025 -
TCS: ఒక్క శాతమే పెరిగిన లాభం.. ఒక్కో షేరుకు డివిడెండ్ ఎంతంటే..
దేశంలో అతిపెద్ద సాఫ్ట్వేర్ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2025-26 ఆర్థిక సంవత్సరానికి రెండో త్రైమాసిక ఫలితాలను (Q2 Results) ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం జులై- సెప్టెంబర్ త్రైమాసికానికి టీసీఎస్ ఏకీకృత లాభం కేవలం 1.4 శాతం పెరిగి రూ.12,075 కోట్లకు చేరుకుంది.గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.11,909 కోట్లు. సమీక్షలో ఉన్న త్రైమాసికంలో కార్యకలాపాల నుండి ఏకీకృత ఆదాయం గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.64,259 కోట్లతో పోలిస్తే 2.4% పెరిగి రూ.65,799 కోట్లకు చేరుకుంది.టీసీఎస్ డివిడెండ్టీసీఎస్ డైరెక్టర్ల బోర్డు ఈక్విటీ షేర్ హోల్డర్లకు రూ.11 చొప్పున రెండో మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది. డివిడెండ్ అందుకోవడానికి వాటాదారుల అర్హతను నిర్ణయించడానికి టీసీఎస్ డివిడెండ్ రికార్డు తేదీని అక్టోబర్ 15గా నిర్ణయించారు.ఇదీ చదవండి: అరట్టై అదుర్స్.. ఆ రెండింటిలో లేని ఫీచర్ ఇదే.. -
అరట్టై అదుర్స్.. ఆ రెండింటిలో లేని ఫీచర్ ఇదే..
డిజిటల్ కమ్యూనికేషన్ యుగంలో గోప్యత, ఫైల్ షేరింగ్, ఆటోమేషన్ సామర్థ్యాలు వినియోగదారులు తమ ఇష్టపడే మెసేజింగ్ యాప్లను ఎంచుకోవడానికి కీలక నిర్ణయం తీసుకునే కారకాలుగా మారాయి. ఇంక్42 (Inc42) రీసెర్చ్ కొత్త తులనాత్మక విశ్లేషణ మూడు ప్రసిద్ధ ప్లాట్ ఫామ్లు - స్వదేశీ అరట్టై, వాట్సాప్,టెలిగ్రామ్లలో ఏవీ దేనికి ప్రత్యేకమో.. వీటిలో మన అరట్టై ఏ ఫీచర్లో గొప్పదో తెలియజేస్తోంది.అరట్టైజోహో సంస్థ అరట్టై యాప్ను అభివృద్ధి చేసింది. భారతీయ వినియోగదారుల కోసం రూపొందించిన ఈ యాప్ ప్రైవసీ-ఫస్ట్ ప్రత్యామ్నాయంగా ఉంది. ఇందులో యూజర్ల డేటాను ఇతరులకు విక్రయించడం ఉండదు. యాప్లోని అంతర్నిర్మిత విజిల్ బ్లోయర్ ఫీచర్ నిఘా, డేటా మానిటైజేషన్ గురించి ఆందోళన చెందే వినియోగదారులకు నిశ్చింత కలిగిస్తుంది. ఎన్క్రిప్షన్ వాయిస్ కాల్స్కే పరిమితం అయినప్పటికీ, దీని పారదర్శకత, స్థానిక మూలాలు గోప్యత-స్పృహ ఉన్న భారతీయ వినియోగదారులకు కచ్చితమైన ఎంపికగా చేస్తాయి.వాట్సాప్వాట్సాప్ భారతదేశంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్గా ఉంది. మెరుగైన ఇంటర్ ఫేస్, వ్యాపార సాధనాలతో కూడిన డీప్ ఇంటిగ్రేషన్తో ఆదరణ పొందింది. అయితే మాతృ సంస్థ మెటాతో దాని డేటా-షేరింగ్ పద్ధతులపై ఆందోళనలు కొనసాగుతున్నాయి.టెలిగ్రామ్టెలిగ్రామ్ దాని భారీ గ్రూప్లు / ఛానెల్ సామర్థ్యాలకు, బాట్లు, ఆటోమేషన్ కు సపోర్ట్ చేసే ఓపెన్ API కోసం ప్రత్యేకంగా నిలుస్తుంది. దాని ఎన్ క్రిప్షన్ ప్రోటోకాల్ లు, విజిల్ బ్లోయర్ ఫ్రెండ్లీ వైఖరి ప్రాచుర్యం పొందాయి.ఫీచర్అరట్టైవాట్సాప్టెలిగ్రామ్టెక్స్ట్, మీడియా, డాక్స్✅ సపోర్ట్✅ సపోర్ట్✅ సపోర్ట్ఎండ్-టు-ఎండ్ ఎన్ క్రిప్షన్వాయిస్ కాల్స్ మాత్రమేవాయిస్, వీడియో, టెక్స్ట్వాయిస్, వీడియో, టెక్స్ట్గ్రూప్ సైజ్ లిమిట్1,000 మంది1,024 మందిఅపరిమితం (ఛానెళ్ల ద్వారా)డేటా వినియోగండేటా విక్రయం ఉండదుకొంత డేటాను పంచుకుంటుందిదాదాపు ప్రైవేటుఫైల్ సైజ్ లిమిట్2 GB వరకు2 GB వరకు2–4 GBబాట్లు/ ఆటోమేషన్❌ లేదు✅ బిజినెస్ బాట్స్✅ ఓపెన్ API బాట్సెక్యూరిటీ విజిల్ బ్లోయర్✅ ఉంది❌ లేదు✅ ఉంది -
దుబాయ్లో సెటిల్ అవుతున్న స్పోర్ట్స్ స్టార్స్!.. కారణం ఇదే
ఇటీవలి కాలంలో దుబాయ్ (Dubai)లో నివాసం ఏర్పరచుకుంటున్న క్రీడాకారుల సంఖ్య పెరిగిపోతోంది. వేల కోట్లకు అధిపతి అయిన పోర్చుగీస్ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) నుంచి బాక్సర్ ఆమిర్ ఖాన్ దాకా చాలా మంది దుబాయ్లోనే సెటిల్ అయ్యేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.బిలియనీర్స్ ఐలాండ్లో..పోర్చుగల్కు చెందిన రొనాల్డో అల్ నసర్ (Al Nassr) జట్టుతో భారీ మొత్తానికి డీల్ కుదుర్చుకున్నాడు. దీంతో ఎక్కువ సమయం దుబాయ్లోనే గడుపుతున్న ఈ ఫుట్బాల్ కింగ్ గతేడాది జూన్లో ఓ భారీ ప్రాపర్టీ కొనుగోలు చేశాడు. బిలియనీర్స్ ఐలాండ్లోని జుమేరా బేలో భూమి కొనుక్కున్నాడు.వందల కోట్ల విలువైన పెంట్హౌజ్ఇక బ్రెజిల్ ఫుట్బాల్ లెజెండ్ నెయ్మార్ కూడా దుబాయ్లో భారీ పెట్టుబడి పెట్టాడు. బుగాటి రెసిడెన్స్లో అత్యాధునిక పెంట్హౌజ్ను రూ. 450 కోట్లకు పైగా వెచ్చించి సొంతం చేసుకున్నాడు. మరోవైపు.. బ్రిటిష్-పాకిస్తానీ బాక్సర్ ఆమిర్ ఖాన్ లండన్లో తనపై దాడి తర్వాత దుబాయ్కు మకాం మార్చాడు.ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ మొయిన్ అలీ కూడా కుటుంబంతో కలిసి దుబాయ్లో నివసిస్తున్నాడు. ‘‘ఈ భూమ్మీద ఉన్న అత్యంత సురక్షితమైన ప్రదేశం’’ అంటూ మొయిన్ అలీ పలు సందర్భాల్లో దుబాయ్పై ప్రశంసలు కురిపించాడు. వీరే కాదు.. టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ కూడా దుబాయ్ మరీనాలో ఇల్లు కొన్నాడు. భారత టెన్నిస్ లెజెండ్ సానియా మీర్జా కూడా దుబాయ్లోనే సెటిల్ అవడమే కాకుండా.. అక్కడే అకాడమీ కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.దుబాయ్కే ఎందుకు?దుబాయ్ విలాసాలకు పెట్టింది పేరు. అత్యాధునిక సౌకర్యాలు గల ఇళ్లు, అగ్ర శ్రేణి విద్యా సంస్థలు, అత్యాధునిక వైద్యం, వేగవంతమైన, సాఫీ ప్రయాణాలకు వీలైన మార్గాలు, గోల్డెన్ వీసా రూల్స్, రక్షణ విషయంలో ప్రభుత్వం తీసుకునే జాగ్రత్తలు వంటివి స్పోర్ట్స్ స్టార్స్ అనే కాదు.. ఇతర సెలబ్రిటీలు కూడా ఇక్కడ సెటిల్ అయ్యేందుకు ప్రధాన కారణాలు.అన్నింటికంటే.. ఇక్కడ పన్నులు తక్కువగా ఉండటం సెలబ్రిటీలను ఆకర్షించే మరో అంశం. ముఖ్యంగా ఫుట్బాలర్ లేదంటే అథ్లెట్ తమ సొంత దేశాల్లో 40- 50 శాతం టాక్స్ చెల్లిస్తుండగా.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో మాత్రం ఇది నామ మాత్రం లేదంటే కొన్నిసార్లు సున్నాగా ఉంటుందని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు పేర్కొంది. చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్ -
విండ్సర్ ఇన్స్పైర్ ఎడిషన్: ధర ఎంతో తెలుసా?
జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా.. 'విండ్సర్ ఈవీ ఇన్స్పైర్ ఎడిషన్'ను లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 16.65 లక్షలు (ఎక్స్-షోరూమ్). BaaS (బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ ఆప్షన్)తో ఈ కారును ఎంచుకునేవారు.. రూ. 9.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇది లిమిటెడ్ ఎడిషన్ వెర్షన్ కావడంతో, కంపెనీ దీనిని 300 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది.ఎంజీ విండ్సర్ ఈవీ ఇన్స్పైర్ ఎడిషన్.. పెర్ల్ వైట్ అండ్ స్టార్రి బ్లాక్లను కలిగి ఉన్న డ్యూయల్-టోన్ ఎక్స్టీరియర్తో వస్తుంది. ఫ్రంట్ గ్రిల్, బంపర్ కార్నర్ ప్రొటెక్టర్లపై రోజ్ గోల్డ్ డిజైన్ ఎలిమెంట్లను కలిగి ఉన్న యాక్సెసరీ ప్యాక్తో కూడా లభిస్తుంది.ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఇన్స్పైర్ ఎడిషన్ దాని థీమ్ను సాంగ్రియా రెడ్ అండ్ బ్లాక్ లెదర్ అప్హోల్స్టరీ, హెడ్రెస్ట్లపై ఎంబ్రాయిడరీ ఇన్స్పైర్ లోగో వంటివి పొందుతుంది. ఆప్షనల్ యాక్ససరీస్ జాబితాలో.. స్కైలైట్ ఇన్ఫినిటీ వ్యూ గ్లాస్ రూఫ్ & వైర్లెస్ ఇల్యూమినేటెడ్ సిల్ ప్లేట్లు ఉన్నాయ., వీటిని ఎంజీ డీలర్షిప్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.ఇదీ చదవండి: జపాన్ మొబిలిటీ షో 2025: సిద్దమైన ఫ్రాంక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారుఎంజీ విండ్సర్ ఈవీ ఇన్స్పైర్ ఎడిషన్లో 38 కిలోవాట్ బ్యాటరీ, పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ను పొందుతుంది. ఈ మోటార్ 134 bhp పవర్, 200 Nm టార్క్ను అందిస్తుంది. ఈ స్పెషల్ ఎడిషన్ ఒక ఫుల్ ఛార్జ్పై 331 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. దీనిని డీసీ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 40 నిమిషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. -
బిహార్ బిలియనీర్లు.. బిజినెస్లో తోపులు!
బిహార్ అంటే పేద రాష్ట్రం, నిరక్షరాస్యులు ఎక్కువ అనే అభిప్రాయం దేశంలో చాలామందికి ఉంటుంది. కానీ బిహార్ (Bihar) సాంప్రదాయకంగా పండితులు, నాయకులు, సాంస్కృతిక గొప్పతనానికి ప్రసిద్ధి చెందింది. దేశంలోని అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలకు నిలయంగా కూడా ఉంది.మైనింగ్ నుండి ఫార్మాస్యూటికల్స్, సెక్యూరిటీ సర్వీసులు, పునరుత్పాదక ఇంధనం, రాజకీయాల వరకు వివిధ రంగాల్లో సంకల్పం, విజన్తో వేల కోట్ల సంపదను ఎలా సృష్టించగలరో బిహార్ సంపన్నులు (Richest People In Bihar) చూపిస్తున్నారు. మీడియా నివేదికల ప్రకారం.. 2025లో బిహార్ లోని టాప్ 10 ధనవంతులు, వారి వ్యాపార సామ్రాజ్యాలు, నెట్వర్త్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.అనిల్ అగర్వాల్నెట్వర్త్: రూ.16,000–17,000 కోట్లుబిజినెస్: వేదాంత రిసోర్సెస్ వ్యవస్థాపకుడు (మైనింగ్ & మెటల్స్)నేపథ్యం: పాట్నాలో స్క్రాప్ డీలర్ గా ప్రారంభించిన అగర్వాల్ ప్రపంచంలోని అతిపెద్ద సహజ వనరుల కంపెనీలలో ఒకదాన్ని నిర్మించారు. ఇప్పుడు లండన్ లో ప్రధాన కార్యాలయం ఉంది.రవీంద్ర కిషోర్ సిన్హానెట్వర్త్: రూ.5,000–10,000 కోట్లుబిజినెస్: SIS (సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్)నేపథ్యం: భారతదేశపు అతిపెద్ద సెక్యూరిటీ అండ్ ఫెసిలిటీ మేనేజ్ మెంట్ కంపెనీని నిర్మించిన మాజీ జర్నలిస్ట్.మహేంద్ర ప్రసాద్నెట్వర్త్: రూ .4,000 కోట్లు పైనేబిజినెస్: అరిస్టో ఫార్మాస్యూటికల్స్నేపథ్యం: "కింగ్ మహేంద్ర"గా పిలువబడే ఈయనది బిహార్ ఫార్మా ఉనికిలో కీలక పాత్ర.సంప్రదా సింగ్నెట్వర్త్: (2019లో మరణించడానికి ముందు): రూ .25,000 కోట్లు పైనేబిజినెస్: ఆల్కెమ్ లేబొరేటరీస్నేపథ్యం: తన సోదరుడితో కలిసి ముంబైలో ఆల్కెమ్ ను స్థాపించి, దానిని ప్రముఖ ఫార్మా బ్రాండ్ గా తీర్చిదిద్దారు.సుబ్రతా రాయ్నెట్వర్త్: రూ .3,000 కోట్లు పైనేబిజినెస్: సహారా ఇండియా (ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, మీడియా)నేపథ్యం: 1978లో సహారాను కనీస మూలధనంతో స్థాపించి, దానిని జాతీయ సమ్మేళనంగా నిర్మించారు.శుభమ్ సింగ్నెట్వర్త్: రూ.500+ కోట్లుబిజెనెస్: భారత్ ఊర్జా డిస్టిలరీస్ (ఇథనాల్ ప్లాంట్)నేపథ్యం: కేవలం 26 సంవత్సరాల వయస్సులో భారతదేశంలోని అతి పిన్న వయస్కుడైన ఇంధన పారిశ్రామికవేత్తలలో ఒకరుగా బిహార్ పునరుత్పాదక ఇంధన రంగాన్ని నడిపించారు.సుభాష్ చంద్రనెట్వర్త్: రూ .5,000+ కోట్లుబిజినెస్: ఎస్సెల్ గ్రూప్, జీ మీడియానేపథ్యం: భారతదేశపు అతిపెద్ద మీడియా సామ్రాజ్యాలలో ఒకదాన్ని నిర్మించారు. బీహార్ వెలుపల ఉన్నప్పటికీ, ఆయన కుటుంబ మూలాలు బిహార్తో ముడిపడి ఉన్నాయి.సుమంత్ సిన్హానెట్వర్త్: రూ .3,000+ కోట్లుబిజినెస్: రెన్యూ పవర్నేపథ్యం: మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా తనయుడైన సుమంత్ భారత క్లీన్ ఎనర్జీ రంగంలో ప్రముఖ పేరు తెచ్చుకున్నారు.ఇదీ చదవండి: నా బంగారం.. ఇంకా పెరుగుతుందోచ్: ‘రిచ్ డాడ్’ రాబర్ట్ -
జపాన్ మొబిలిటీ షో 2025: సిద్దమైన ఫ్రాంక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు
మారుతి సుజుకి త్వరలో జరగనున్న జపాన్ మొబిలిటీ షో 2025లో ప్రదర్శించబోయే.. మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఫ్లెక్స్-ఫ్యూయల్ కాన్సెప్ట్ గురించి వెల్లడించింది. ఇది 85 శాతం వరకు ఇథనాల్ బ్లెండింగ్కు మద్దతు ఇచ్చే ప్రస్తుత 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ట్వీక్డ్ వెర్షన్ ద్వారా శక్తిని పొందుతుందని సమాచారం. అయితే కంపెనీ ఫ్లెక్స్-ఫ్యూయల్ పవర్ట్రెయిన్ వివరాలను పూర్తిగా వెల్లడించలేదు.జపాన్ మొబిలిటీ షోలో కనిపించనున్న ఫ్రాంక్స్ ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు డిజైన్ ముందు భాగంలో సుజుకి ఎటువంటి మార్పులకు లోను కాలేదు. అయితే సైడ్ ప్రొఫైల్ కొన్ని 'ఫ్లెక్స్-ఫ్యూయల్' డెకల్లను పొందుతుంది. టెయిల్గేట్పై ఫ్లెక్స్-ఫ్యూయల్ బ్యాడ్జ్ ఉన్నట్లు తెలుస్తుంది.జపాన్ మొబిలిటీ షో 2025లో సుజుకిజపాన్ మొబిలిటీ షో అనేది రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఆటో షో. ఈ కార్యక్రమం 2025 అక్టోబర్ 30 నుంచి నవంబర్ 9 వరకు ఒడైబాలోని టోక్యో బిగ్ సైట్లో జరుగుతుంది. ఇందులో సుజుకి రాబోయే ఈ-విటారా , ఫేస్లిఫ్టెడ్ ఎక్స్-బీ, జిమ్నీ నోమేడ్ (5-సీట్ల మేడ్-ఇన్-ఇండియా జిమ్నీ), స్పేసియా, విజన్ ఈ-స్కై బీఈవీ కాన్సెప్ట్ & ఈ-ఎవ్రీ కమర్షియల్ వ్యాన్ కాన్సెప్ట్లను కూడా ప్రదర్శించనుంది. ఈవేదికపైనే ఫ్రాంక్స్ ఫ్లెక్స్-ఫ్యూయల్ కాన్సెప్ట్ను కూడా ప్రదర్శించనుంది. -
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 398.45 పాయింట్లు లేదా 0.49 శాతం లాభంతో 82,172.10 వద్ద, నిఫ్టీ 135.65 పాయింట్లు లేదా 0.54 శాతం లాభంతో 25,181.80 వద్ద నిలిచాయి.జిందాల్ ఫోటో లిమిటెడ్, నాగరీకా క్యాపిటల్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్, జీఎం బ్రూవరీస్, ఆల్కలీ మెటల్స్, వీ విన్ లిమిటెడ్ వంటివి లాభాల జాబితాలో చేరాయి. నీరాజ్ సిమెంట్ స్ట్రక్చరల్స్, ఐమ్కో ఎలెకాన్ (ఇండియా), మోడీ రబ్బర్ లిమిటెడ్, సుమీత్ ఇండస్ట్రీస్, హెడ్స్ అప్ వెంచర్స్ వంటి కంపెనీలు వంటివి నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
కొత్త ఫోన్ తీసుకొచ్చిన జియో.. ఇది ఉంటే ఫుల్ సేఫ్టీ!
రిలయన్స్ జియో సరికొత్త ఫోన్ను తీసుకొచ్చింది. ఢిల్లీలో జరుగుతున్న ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2025 సదస్సులో వివిధ సేఫ్టీ ఫీచర్లతో కూడిన జియోభారత్ ఫోన్లను ప్రవేశపెట్టింది. ఫోన్ పర్యవేక్షణ, వినియోగ నిర్వహణ, కుటుంబ సభ్యులు, పిల్లలు, వృద్ధులకు సంబంధించిన హెల్త్ వంటి సేఫ్టీ-ఫస్ట్ ఫీచర్లను ఈ ఫోన్లో తీసుకొచ్చింది.వినియోగదారులకు భద్రతతోపాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చేలా రూపొందించిన జియోభారత్ ఫోన్లను ఐఎంసీ సదస్సులో రిలయన్స్ ఆవిష్కరించింది. అంతేకాకుండా వైట్-లిస్టింగ్ ద్వారా అవాంఛిత కాల్స్ , కాలర్లను నివారించడంలో సేఫ్టీ షీల్డ్ సహాయపడుతుంది. ఇక అత్యంత ముఖ్యమైన ఫీచర్ ఏంటంటే కుటుంబ సభ్యుల వద్ద ఉన్న జియోఫోన్లో బ్యాటరీ , నెట్ వర్క్ లభ్యత స్థితిని రిమోట్ గా పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. ఇక ఫోన్ బ్యాటరీ బ్యాకప్ ఏడు రోజుల వరకు ఉంటుందని జియో పేర్కొంది.జియోభారత్ ఫోన్ సేఫ్టీ షీల్డ్ మరిన్ని ప్రయోజనాలను రిలయన్స్ జియో అధ్యక్షుడు సునీల్ దత్ వివరించారు. ఈ ఫోన్లు ముఖ్యంగా కుటుంబంలోని పిల్లలు, పెద్దవారి కోసం రూపొందించినట్లు చెప్పారు. ఈ ఫోన్లు వినియోగిస్తున్న తమ వారు ఎక్కడ ఉన్నారు.. వారి ఫోన్లు ఎక్కడ ఉన్నాయో మీరు పర్యవేక్షించగలుగుతారు. ఒకవేళ కనిపించక పోయినట్లయితే ఫోన్లోని అలారాన్ని మోగించవచ్చు.జియోభారత్ ఫోన్లను జియో స్టోర్స్, జియోమార్ట్, అమెజాన్, స్విగ్గీ ఇన్స్టామార్ట్ వంటి ప్లాట్ఫామ్ల ద్వారా కొనుగోలుచ చేయవచ్చు. జియోభారత్ ఫోన్ల ధర రూ.799 నుంచి ప్రారంభమవుతుంది. -
ఫోర్బ్స్ ఇండియా బిలియనీర్స్ జాబితా: టాప్ 10లో ఒక్క మహిళ
భారతదేశంలోని అత్యంత ధనవంతులైన 100 మంది వ్యక్తుల జాబితాను.. ఫోర్బ్స్ ఇండియా (Forbes India) రిలీజ్ చేసింది. ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ 'ముకేశ్ అంబానీ' (Mukesh Ambani) అగ్రస్థానంలో నిలిచారు.105 బిలియన్ డాలర్ల నికర విలువతో ముకేశ్ అంబానీ.. ప్రధమ స్థానంలో నిలిచారు. గత ఏడాదితో పోలిస్తే ఈయన సంపద 12 శాతం క్షీణించింది. 2వ స్థానంలో మౌలిక సదుపాయాల దిగ్గజం గౌతమ్ అదానీ & కుటుంబం 92 బిలియన్ డాలర్ల సంపదతో ఉన్నారు. మొత్తం మీద వందమంది ధనవంతుల సంపద 2025లో 9 శాతం తగ్గింది.ఓపీ జిందాల్ గ్రూప్కు చెందిన సావిత్రి జిందాల్ మూడో స్థానంలో నిలిచారు. వీరి నికర విలువ 3.5 బిలియన్లు తగ్గి.. 40.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. టాప్ 10 జాబితాలో ఉన్న మహిళగా ఈమె రికార్డ్ క్రియేట్ చేశారు. టెలికాం దిగ్గజం సునీల్ మిట్టల్, టెక్ బిలియనీర్ శివ నాడార్ వరుసగా నాలుగు, ఐదోస్థానంలో నిలిచారు.ఇదీ చదవండి: 'రేటు మరింత పెరగకముందే.. కొనేయండి': రాబర్ట్ కియోసాకిభారతదేశంలోని టాప్ 10 బిలినీయర్స్➤ముకేశ్ అంబానీ: 105 బిలియన్ డాలర్లు➤గౌతమ్ అదానీ & కుటుంబం: 92 బిలియన్ డాలర్లు➤సావిత్రి జిందాల్: 40.2 బిలియన్ డాలర్లు➤సునీల్ మిట్టల్ & కుటుంబం: 34.2 బిలియన్ డాలర్లు➤శివ్ నాడర్: 33.2 బిలియన్ డాలర్లు➤రాధాకిషన్ దమానీ & కుటుంబం: 28.2 బిలియన్ డాలర్లు➤దిలీప్ షాంఘ్వీ: 26.3 బిలియన్ డాలర్లు➤బజాజ్ కుటుంబం: 21.8 బిలియన్ డాలర్లు➤సైరస్ పూనవల్లా: 21.4 బిలియన్ డాలర్లు➤కుమార్ మంగళం బిర్లా: 20.7 బిలియన్ డాలర్లుForbes India Rich List 2025: India's richest, Mukesh Ambani, remains a 'centibillionaire', Savitri Jindal is the only woman in the top 10, while Sunil Mittal and family are the biggest gainers. Here's a look at India's 100 richest.https://t.co/V7HUD44U4Z— Forbes India (@ForbesIndia) October 9, 2025 -
మార్పు మంచిదే! ఎవరిపై ఎంత ప్రభావం?
ప్రతి ఇంట్లో తరచుగా ఉపయోగించే కొన్ని వస్తువులను వాటి పరిశుభ్రత, పనితీరు లేదా భద్రత కోసం ఒక నిర్దిష్ట సమయం తర్వాత మార్చాల్సి ఉంటుంది. అందులో టూత్ బ్రష్, కిచెన్ స్పాంజ్, సాక్స్లు/ లోదుస్తులు, దిండు.. వంటి వస్తువులున్నాయి. ఈ నిరంతర మార్పు ప్రక్రియ వినియోగదారులకు, కార్పొరేట్ కంపెనీల్లో కంపెనీలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది.గృహోపకరణాల్లో సాధారణంగా ఏయే వస్తువులు ఎంత కాలానికి మారుస్తారో కింది విధంగా ఉంది.టూత్ బ్రష్ - ప్రతి 3 నెలలకుదిండు - ప్రతి 1–2 సంవత్సరాలకుకిచెన్ స్పాంజ్ - ప్రతి 1–2 వారాలకుసాక్స్, లోదుస్తులు - ప్రతి 6–12 నెలలకురన్నింగ్ షూస్ - ప్రతి 300–500 మైళ్లకుతువ్వాళ్లు - ప్రతి 1–2 సంవత్సరాలకుబెడ్షీట్ - ప్రతి 1–2 వారాలకుకటింగ్ బోర్డు - ప్రతి 1–2 సంవత్సరాలకునిత్యావసర వస్తువులను క్రమం తప్పకుండా మార్చడం వల్ల అనేక వాణిజ్యపరమైన అంశాలు కీలకం అవుతాయి. ఈ వస్తువులకు డిమాండ్ ఎల్లప్పుడూ ఉంటుంది. వినియోగదారులు నిర్ణీత వ్యవధిలో కొత్త వస్తువును కొనుగోలు చేయాల్సి ఉంటుంది కాబట్టి, కంపెనీలకు స్థిరమైన ఆదాయ ప్రవాహం (Steady Revenue Stream) లభిస్తుంది.పునరావృత కొనుగోలు (Repeat Purchases)టూత్ బ్రష్లు, కిచెన్ స్పాంజ్లు వంటివి తక్కువ కాలంలోనే మార్చాల్సి రావడం వల్ల, వినియోగదారులు తరచుగా ఒకే బ్రాండ్ను లేదా స్టోర్ను ఎంచుకునే అవకాశం ఉంది. ఇది వినియోగదారుల విశ్వసనీయత (Customer Loyalty) పెరగడానికి దోహదపడుతుంది.మార్కెటింగ్, బ్రాండింగ్ (Marketing and Branding)కంపెనీలు తమ వస్తువుల మార్పు వ్యవధిని బట్టి మార్కెటింగ్ వ్యూహాలను రూపొందిస్తాయి. ‘ప్రతి మూడు నెలలకు మార్చండి’ వంటి సందేశాలు కొనుగోళ్లను పెంచడంలో సహాయపడతాయి.సరఫరా గొలుసు సామర్థ్యంస్థిరమైన డిమాండ్తో ఉత్పత్తిదారులు తమ సరఫరా గొలుసును (Supply Chain) మరింత సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. దీనివల్ల ఉత్పత్తి వ్యయం (Cost of Production) తగ్గుతుంది.కొత్తదనం, ఆవిష్కరణమార్కెట్లో స్థిరంగా సర్వీసు అందించడానికి కంపెనీలు టూత్ బ్రష్లలో కొత్త సాంకేతికతలు, లేదా బెడ్షీట్లలో కొత్త డిజైన్లు వంటి నూతన ఉత్పత్తులను (New Products) ప్రవేశపెట్టడానికి ఆసక్తి చూపుతాయి.వినియోగదారులకు లాభాలుటూత్ బ్రష్, కిచెన్ స్పాంజ్, బెడ్షీట్లను క్రమం తప్పకుండా మార్చడం వల్ల బ్యాక్టీరియా, క్రిములు పెరగకుండా నియంత్రించి, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. రన్నింగ్ షూస్, కటింగ్ బోర్డుల వంటి వాటిని సమయానికి మార్చడం వల్ల వాటి అసలు పనితీరును (ఉదాహరణకు, షూస్ కుషనింగ్) తిరిగి పొందవచ్చు. కొత్త దిండ్లు, మెత్తటి తువ్వాళ్లు, శుభ్రమైన బెడ్షీట్లు మెరుగైన నిద్ర, సౌకర్యాన్ని అందిస్తాయి.నష్టాలునిరంతరంగా వస్తువులను కొనుగోలు చేయడం వినియోగదారులపై ఆర్థిక భారాన్ని పెంచుతుంది. ముఖ్యంగా పెద్ద కుటుంబాలకు ఇది మరింత ప్రభావం చూపుతుంది. తరచుగా వస్తువులను పారవేయడం వల్ల వ్యర్థాలు పెరుగుతాయి. ఇది పర్యావరణానికి హాని కలిగిస్తుంది. ప్లాస్టిక్ టూత్ బ్రష్లు వంటివి భూమిలో కలిసిపోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. వస్తువుల మార్పు తేదీలను గుర్తుంచుకోవడం, వాటిని మళ్లీ మళ్లీ కొనుగోలు చేయాల్సి రావడం ఒక అదనపు భారం అవుతుంది.కార్పొరేట్ కంపెనీలకు లాభాలుఈ వస్తువుల మార్పు చక్రం స్థిరంగా ఉండటం వల్ల కంపెనీలు తమ ఆదాయాన్ని, ఉత్పత్తిని సులభంగా అంచనా వేయగలుగుతాయి. కొత్త వస్తువుల ఆవిష్కరణ లేదా మార్కెటింగ్ ద్వారా వినియోగదారులను పెంచుకునేందుకు, మార్కెట్ వాటాను విస్తరించేందుకు నిరంతర అవకాశం లభిస్తుంది. భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడం వల్ల తయారీ ప్రక్రియలో ప్రామాణీకరణ పెరుగుతుంది. ఫలితంగా ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది.కంపెనీలకు నష్టాలుముడిసరుకు ధరలు పెరిగినప్పుడు స్థిరమైన ఉత్పత్తిని కొనసాగించడానికి కంపెనీలు అధిక వ్యయాన్ని భరించాల్సి ఉంటుంది. ఈ మార్కెట్లో అనేక కంపెనీలు ఉండటం వలన తీవ్రమైన పోటీ ఉంటుంది. ధరలు, నాణ్యత, మార్కెటింగ్ పరంగా నిలదొక్కుకోవడం ఒక సవాలు. ఒక ఉత్పత్తిని మార్కెట్లో ప్రవేశపెట్టిన కొద్ది కాలానికే మెరుగైన సాంకేతికతతో కూడిన మరో కొత్త ఉత్పత్తి వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు, సాధారణ టూత్ బ్రష్ స్థానంలో ఎలక్ట్రిక్ బ్రష్లు రావడం.ఇదీ చదవండి: ఫొటోలకు ప్రాణం పోసేలా వీడియో.. గ్రోక్ ఏఐ కొత్త ఫీచర్ -
ఐదేళ్లలో అత్యధికం.. లాభాల్లో హోండా మోటార్సైకిల్
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన రంగ దిగ్గజం హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా నికర లాభం గతేడాది (2024–25) 38 శాతం జంప్చేసి రూ. 3,727 కోట్లకు చేరింది. ఇది గత ఐదేళ్లలోనే అత్యధికం కాగా.. బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ టోఫ్లర్ వివరాల ప్రకారం అంతక్రితం ఏడాది (2023–24)లో రూ. 2,705 కోట్లు మాత్రమే ఆర్జించింది. నిర్వహణ ఆదాయం సైతం 23 శాతం ఎగసి రూ. 39,238 కోట్లను తాకింది. అంతక్రితం రూ. 31,945 కోట్ల టర్నోవర్ సాధించింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. జపనీస్ ఆటో రంగ దిగ్గజం హోండా మోటార్కు చెందిన దేశీ అనుబంధ అన్లిస్టెడ్ సంస్థ ఇది.ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ఫెడరేషన్ (ఎఫ్ఏడీఏ) వివరాల ప్రకారం.. గతేడాది రిటైల్గా 1,88,77,812 ద్విచక్ర వాహనాలు విక్రయమయ్యాయి. వీటిలో హోండా మోటార్సైకిల్ రిటైల్ అమ్మకాలు 47,89,283 యూనిట్లుగా నమోదయ్యాయి. వెరసి హీరో మోటోకార్ప్(54,45,251 యూనిట్లు) తదుపరి ద్వితీయ ర్యాంకులో నిలిచింది. కాగా.. 2030కల్లా దేశీ ద్విచక్ర వాహన మార్కెట్లో 30 శాతం వాటాపై హోండా మోటార్సైకిల్ కన్నేసినట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. -
ఫొటోలకు ప్రాణం పోసేలా వీడియో.. గ్రోక్ ఏఐ కొత్త ఫీచర్
ఎక్స్ఏఐ (xAI) రూపొందించిన గ్రోక్ఏఐ (GrokAI) యాప్లో కొత్త ఫీచర్ ప్రవేశపెట్టినట్లు ఎలాన్మస్క్ తెలిపారు. పాత, కొత్త ఫొటోలను అప్లోడ్ చేసి కేవలం 20 సెకన్లలో వాటిని వీడియోలుగా మార్చేయవచ్చని చెప్పారు. ఈ నూతన సాంకేతికత కృత్రిమ మేధ (Artificial Intelligence) ద్వారా కేవలం ఒక చిత్రాన్ని తీసుకొని దానికి కదలిక (Motion), అనుగుణమైన శబ్దం (Audio) జోడించి 20 సెకన్లలో 6 నుంచి 15 సెకన్ల నిడివి గల వాస్తవిక దృశ్యం (Photorealistic video)లాగా మార్చగలుగుతోంది. గ్రోక్ఏఐ ‘గ్రోక్ ఇమాజిన్’ (Grok Imagine) ఫీచర్ ద్వారా చారిత్రక చిత్రాలు, ఫ్యామిలీ ఫొటోలు లేదా కార్టూన్ పాత్రలను సజీవంగా మార్చవచ్చని కంపెనీ చెబుతుంది.Upload any photos from your phone or take a picture of an old photo and turn it into a video in 20 seconds with the Grok app! https://t.co/ouHoufWeqG— Elon Musk (@elonmusk) October 7, 2025బనానా ఏఐఫొటోలు అప్లోడ్ చేసి వీడియోలు మార్చే క్రమంలో గ్రోక్ఏఐ ముందున్నా, ఇదే తరహా కృత్రిమ మేధ సామర్థ్యాలను బనానా ఏఐ (Banana AI) కలిగి ఉంది. ఇది గూగుల్ జెమిని 2.5 ఫ్లాష్ ఇమేజ్ (Gemini 2.5 Flash Image) మోడల్కు చెందింది. బనానా ఏఐ ప్రధానంగా ఫోటోలను మెరుగుపరచడం, వాటిని మార్చడం, కొత్త చిత్రాలను సృష్టించడం (Text-to-Image) వంటి వాటికి ప్రసిద్ధి చెందింది.ప్రస్తుతం బనానా ఏఐ ఫోటో-టు-వీడియో ఫీచర్ కాకుండా ఫొటో ఎడిటింగ్ వంటి వాటిలో వినియోగదారులకు సహాయపడుతుంది. ఉదాహరణకు వినియోగదారులు తమ సాధారణ ఫొటోలను ‘రెట్రో చీరలు ధరించిన వింటేజ్ ఫొటోలు’గా మార్చడానికి దీన్ని వాడుతున్నారు. ఈ రెండు కంపెనీలు (గ్రోక్, గూగుల్) వేర్వేరు మార్గాల్లో కంటెంట్ సృష్టికి కొత్త దిశానిర్దేశం చేస్తున్నాయి.మానసిక స్వాంతనతమ పాత ఫొటోకు ప్రాణం పోసినప్పుడు నెజిజన్లకు అపూర్వమైన భావోద్వేగ అనుభూతి కలుగుతుంది. దశాబ్దాల నాటి కుటుంబ ఫొటోలు, గతించిపోయిన ప్రియమైన వారి చిత్రాలు వీడియోలుగా మారినప్పుడు గతాన్ని మళ్లీ అనుభూతి చెందే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ వల్ల సంతోషం, సంతృప్తి, లోతైన భావోద్వేగ బంధం ఏర్పడతాయి. తమ ఊహలకు రూపం ఇచ్చేందుకు, పాత కథలకు దృశ్యరూపం కల్పించేందుకు ఈ ఫీచర్ వీలు కల్పిస్తుంది. ఈ సృజనాత్మకత ఒక విధమైన మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది.వ్యాపార అవకాశాలుఏఐ ఆధారిత ఫోటో-టు-వీడియో టెక్నాలజీ కేవలం వ్యక్తిగత భావోద్వేగాలకే పరిమితం కాకుండా కంపెనీలకు వ్యాపార అవకాశాలను సృష్టిస్తోంది. గ్రోక్ఏఐ ఈ అధునాతన ఫీచర్ను సాధారణంగా ‘సూపర్ గ్రోక్’ (Super Grok) వంటి పెయిడ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ల్లో అందిస్తుంది. దీని ద్వారా వినియోగదారుల నుంచి స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు. అధిక నాణ్యత (High-quality), ఎక్కువ నిడివి గల వీడియోల కోసం ప్రీమియం సబ్స్క్రిప్షన్ను తీసుకోవాల్సి ఉంటుంది.కంటెంట్ క్రియేటర్ల మార్కెట్నేటి సోషల్ మీడియా యుగంలో కంటెంట్ క్రియేటర్లకు వీడియో అత్యంత ముఖ్యమైన సాధనం. ఈ ఏఐ టూల్స్ ద్వారా నిమిషాల్లో ప్రొఫెషనల్ స్థాయి వీడియోలను సృష్టించవచ్చు. దీనివల్ల సోషల్ మీడియా మార్కెటింగ్, యాడ్స్, షార్ట్ ఫిల్మ్ల తయారీకి అయ్యే ఖర్చు, సమయం గణనీయంగా తగ్గుతుంది. ఈ విధంగా కంటెంట్ తయారీ ప్లాట్ఫామ్లు (FlexClip వంటివి) కూడా ఏఐ ఆధారిత ఫీచర్లను తమ వ్యాపారంలో భాగం చేసుకుంటున్నాయి.ఇదీ చదవండి: ఉద్యోగం చేస్తూనే కోట్లు సంపాదించే మార్గాలు.. -
'రేటు మరింత పెరగకముందే.. కొనేయండి': రాబర్ట్ కియోసాకి
బంగారంపై పెట్టుబడి పెట్టండి.. అది మిమ్మల్ని ధనవంతులను చేస్తుందని చెప్పిన 'రాబర్ట్ కియోసాకి' మాటలు నిజవవుతున్నాయి. ఇప్పుడు ఎవరిదగ్గర బంగారం ఎక్కువ ఉందో వాళ్లే ధనవంతులని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ రోజు (అక్టోబర్ 9) 24 క్యారెట్ల 10 గ్రామ్స్ గోల్డ్ రేటు రూ. 1,24,000 దాటేసింది. ఇలాంటి సమయంలో.. కియోసాకి వెండి గురించి తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.పసిడి ధరల మాదిరిగానే.. ''వెండి ధర దాదాపుగా గరిష్ట స్థాయికి చేరుకుంది. సిల్వర్ రేటు మరింత పెరుగుతుంది. వెండి ధరలు భారీగా పెరగడానికి ముందే.. దయచేసి సిల్వర్ కాయిన్స్ కొనుగోలు చేయండి'' అని రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు.SILVER near time high.Silver is a dollar away from turning into a rocket ship.Please get a few silver coins before the silver rocket leaves the earth.— Robert Kiyosaki (@theRealKiyosaki) October 9, 2025ప్రస్తుతం భారతదేశంలో కేజీ వెండి రేటు రూ. 1,71,000 వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తుంటే.. కేజీ వెండి ధర రూ. 2 లక్షలకు చేరుకోవడానికి మరెంతో సమయం పట్టదని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. కాబట్టి బంగారంపైన మాత్రమే కాకుండా.. వెండిపై చేసే ఇన్వెస్ట్మెంట్ కూడా మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది.గతంలో చాలా సందర్భాల్లో ఫైనాన్షియల్ ప్లానర్లు స్టాక్ కొనుగోలు చేయమని, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయమని సలహాలు ఇచ్చారు. అయితే యూఎస్ డాలర్ విలువ క్రమంగా తగ్గుతోంది. ఈ సమయంలో స్టాక్స్, ఫండ్స్ అంత సురక్షితం కాదని కియోసాకి వాదన. అమెరికా ప్రభుత్వం చరిత్రలో అతిపెద్ద రుణగ్రహీత దేశం అయినప్పుడు.. ఆర్థిక భద్రత ఎలా ఉంటుంది. దివాలా తీసిన దేశం నుంచి బాండ్లను కొనుగోలు చేసేంత తెలివితక్కువవారు ఎవరు? అని ఆయన ప్రశ్నించారు.ఇదీ చదవండి: కోటీశ్వరున్ని చేసిన 30 ఏళ్ల క్రితం పేపర్లునిజం ఏమిటంటే.. కొన్ని సంవత్సరాలుగా బంగారం విలువ, స్టాక్లు.. బాండ్ల కంటే మెరుగైన పనితీరును కనబరిచింది. నేను ఇప్పటికీ బంగారం, వెండి నాణేలను కొనుగోలు చేయడానికే ఇష్టపడతాను. నిజమైన ఆస్తులు ఇవే. మీరు కూడా ఉత్తమైన వాటిలో పెట్టుబడి పెట్టండని కియోసాకి పేర్కొన్నారు.FINALLY the BS “magic wand” of Financial Planner’s….the BS of 60/40 is dead.FYI: 60/40 meant investors invest 60% in stocks and 40 % in bonds.That BS ratio died in 1971 the year Nixon took the dollar off the gold standard.For years, financial planners have touted the…— Robert Kiyosaki (@theRealKiyosaki) October 9, 2025 -
తులం బంగారం రూ.లక్షా 28 వేల 200
నిజామాబాద్ రూరల్: బంగారం, వెండి ధరల పరుగు ఆగడం లేదు. మంగళవారం తులం బంగారం రూ. 1,25,400 ఉండగా బుధవారం రూ. 1,28,200కు చేరుకొని రికార్డు సృష్టించింది. తులం వెండి ధర రూ.1610కి చేరింది. దీపావళి పండుగ దాటేసరికి బంగారం ధర రూ. లక్షా 50 వేలకు చేరుకోవచ్చని బంగారు దుకాణాదారులు అభిప్రాయపడుతున్నారు. శుభకార్యాలు, పెళ్లిళ్ల కోసం పెద్ద మొత్తంలో కొనుగోలు చేయాల్సిన ప్రజలు ధరల పెరుగుదలతో తక్కువ బంగారంతోనే సరిపుచ్చుకుంటున్నారు. దీంతో కొనుగోళ్లు మందగించాయని దుకాణాదారులు చెప్తున్నారు.రూ.లక్షా 50వేలు దాటుతుంది..ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ధర హెచ్చు తగ్గులు ఉండడంతోనే బంగారం రేటు పెరుగుతోంది. రానున్న రోజు ల్లో తులం బంగారం ధర రూ. లక్షా50వేలకు దాటేలా కనిపిస్తోంది. ఇలా ఉంటే సామాన్యుడికి చాలా ఇబ్బందే.– లక్ష్మణచారి, వర్తకుడు, నగరవాసి -
84 ఏళ్ల వయసులోనూ స్టైలిష్ హెయిర్స్టైల్
జపాన్కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హోండా మోటార్లో అధునాతన సాంకేతిక అభివృద్ధి విభాగానికి బాధ్యత వహిస్తున్న చీఫ్ ఇంజినీర్ షోటారో ఓడేట్ ‘అనిమే’ అనే హెయిర్ స్టైల్తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్రస్తుతం తన హెయిర్ స్టైల్ కారణంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. 84 ఏళ్ల వయసున్న ఈ సీనియర్ ఆటోమోటివ్ నిపుణుడు సురక్షిత డ్రైవింగ్ టెక్నాలజీలో అపారమైన కృషి సంస్థలో ప్రత్యేక గుర్తింపు సాధించారు.ఇటీవల ఒక జపనీస్ షోలో ఓడేట్ మాట్లాడుతూ అనిమే స్పైకీ హెయిర్స్టైల్ను ఐదేళ్లుగా కొనసాగిస్తున్నానని వెల్లడించారు. తన జుట్టు అసాధారణంగా గట్టిగా, సులభంగా ముడుచుకుపోతుందని పేర్కొన్నారు. తన పేలవమైన నిద్ర అలవాట్ల కారణంగా ప్రతి ఉదయం జుట్టు అస్తవ్యస్తంగా ఉండేదని చెప్పారు. ఈక్రమంలో కొత్త హెయిర్ స్టైల్ను అనుసరించినట్లు తెలిపారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం ఈయన తన చిన్నతనంలో తన జుట్టును స్టైల్గా ఉంచుకోవడానికి చాలా సమయాన్ని గడిపేవారట.ఇదీ చదవండి: ఉద్యోగం చేస్తూనే కోట్లు సంపాదించే మార్గాలు..షోటారో ఓడేట్ కేవలం హెయిర్స్టైల్ను ఫాలో అవ్వడంలో మాత్రమేకాదు సాంకేతిక రంగంలో చాలా కృషి చేసి ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన సురక్షిత డ్రైవింగ్ టెక్నాలజీలకు సంబంధించి మొత్తం 253 పేటెంట్లు కలిగి ఉండటం విశేషం. ఆయన 2003లో హోండాలో చేరినప్పుడు సీట్ బెల్టుల్లో ప్రత్యేకత కలిగిన డిజైనర్గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన హోండా సెన్సింగ్ 360+ ADAS సిస్టమ్ లీడ్ ఇంజినీర్గా వ్యవహరిస్తున్నారు. దాంతోపాటు డ్రైవర్-అసిస్టెన్స్ టెక్నాలజీలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.About to go to bed so im going to put this up... Shotaro Odate. 84 years old. Chief Engineer at Honda. Looks strong and rocks the Sasuke Hairstyle daily.Something to strive for. pic.twitter.com/hnUotU6vKV— Jonathan Magno 🇺🇲 🇵🇭 (@HyperM0nkey1) September 29, 2025Honda Chief Engineer Shotaro OdateBeing cool is ageless and timeless. 😊 pic.twitter.com/9KByqO0gtH— meemingwong (@freetheatoms) September 22, 2025 -
అతను లేరు.. తనకో చరిత్ర ఉంది
రతన్ టాటా మరణించి ఏడాది కావొస్తున్నా.. తాను చేసిన మంచి పనులు ఇప్పటికీ ఆయనను గుర్తుచేసుకునేలా చేస్తున్నాయి. సామాజిక సేవ, విద్య, ఆరోగ్యం, విపత్తు సహాయ కార్యక్రమాలు వంటి విభాగాల్లో సేవలు అందించి.. ఎంతోమందికి ఉపయోగపడిన రతన్ టాటా.. భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కూడా కృషి చేశారు.రతన్ టాటా దిగ్గజ పారిశ్రామిక వేత్తగా ఎదుగుతూనే.. భారతదేశ ఆర్థిక స్థిరత, ఉపాధి, విదేశీ పెట్టుబడులు, టెక్నాలజీ అభివృద్ధి మొదలైన రంగాల్లో తనదైన ముద్ర వేశారు. టాటా సంస్థకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంలో ఈయన పాత్ర అనన్య సామాన్యమనే చెప్పాలి. ఎన్నో జాతీయ.. అంతర్జాతీయ రంగాల్లో పెట్టుబడులు పెట్టి.. కొత్త స్టార్టప్లను ప్రోత్సహించారు. ఇందులో భాగంగానే గ్లోబల్ కంపెనీలు, స్టార్టప్లు, టెక్నాలజీ, ఫిన్టెక్, హెల్త్కేర్, కన్స్యూమర్ ప్రాడక్ట్స్ మొదలైన విభాగాల్లో ఇన్వెస్ట్ చేశారు.ముఖ్యంగా వ్యాపారవేత్తలను ప్రోత్సహించడంలో భాగంగా రతన్ టాటా.. ఓలా క్యాబ్స్, పేటీఎం, స్నాప్డీల్, అర్బన్ ల్యాడర్, అప్స్టాక్స్, ఫస్ట్క్రై మొదలైన స్టార్టప్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టారు. దీని ద్వారా దేశంలో పరిశ్రమలు పెరగడమే కాకుండా.. ఉద్యోగావకాశాలు కూడా మెండుగా లభిస్తాయని భావించారు.రతన్ టాటా గురించిరతన్ టాటా 1937 డిసెంబర్ 28న దేశంలోనే అత్యంత ధనిక కుటుంబంలో జన్మించారు. ఈయనకి పదేళ్ల వయసు ఉన్నప్పుడు తల్లి తండ్రులిద్దరు విడిపోవడంతో.. నానమ్మ దగ్గర పెరిగారు. తరువాత అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. వెంటనే ఐబీఎం కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కానీ జేఆర్డీ టాటా రతన్ టాటాను ఇండియాకు వచ్చి టాటా స్టీల్లో చేరమని సలహా ఇచ్చారు. దాంతో అమెరికా నుంచి ఇండియాకు వచ్చి జంషెడ్పూర్ టాటా స్టీల్ ప్లాంట్లో అప్రెంటిస్గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు.1991లో జేఆర్డీ టాటా.. రతన్ టాటాను టాటా గ్రూప్ ఛైర్మన్గా నియమించారు. అప్పట్లో చాలా మంది బోర్డ్ అఫ్ మెంబెర్స్ ఈ నిర్ణయాన్ని తప్పు పట్టారు. ఎటువంటి అనుభవంలేని రతన్ టాటా చేతిలో ఇన్ని కోట్ల రూపాయల వ్యాపారాన్ని పెట్టడాన్ని వ్యతిరేకించారు. కానీ వాళ్లందరి అభిప్రాయాలు తప్పని నిరూపించాడు రతన్ టాటా. ఈయన హయాంలో టాటా గ్రూప్ పరుగులు తీసింది. రూ.10 వేలకోట్లుగా ఉండే వ్యాపారాన్ని దాదాపు రూ.30 లక్షల కోట్లకు చేర్చారు.ఇంత పెద్ద కంపెనీకి సారథ్యం వహిస్తున్నప్పటికీ రతన్ టాటా ప్రపంచంలో, భారతదేశంలోని ధనవంతుల జాబితాలో ఏనాడూ స్థానం సంపాదించలేదు. ఎందుకంటే టాటా కంపెనీకి వచ్చే లాభాల్లో దాదాపు 66% శాతం టాటా ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న స్వచ్ఛంద సేవ సంస్థలకే విరాళం ఇస్తున్నారు. ఒకవేళ ఈ ఆస్తి అంతా సేవ సంస్థలకు కాకుండా రతన్ టాటాకు చెందితే ప్రపంచ ధనవంతుల జాబితాలో మొదటి మూడు స్థానాల్లో ఉండేవారు.రతన్ టాటా ఎదుర్కొన్న అవరోధాలురతన్టాటా తన ప్రయాణంలో ఎన్నో అవరోధాలను అవమానాలను ఎదుర్కొన్నారు. ఉదాహరణకు..1998లో రతన్ టాటా, టాటా ఇండికా కార్లను ప్రవేశపెట్టారు. ఆ కార్లు మొదట సంవత్సరం ఆశించినమేర విక్రయాలు జరగలేదు. దాంతో అందరూ టాటా ఇండికా విభాగాన్ని అమ్మేయాలని సలహా ఇచ్చారు. దాంతో ఫోర్డ్ కంపెనీని ఆశ్రయించారు. కార్ల తయారు చేయడం తెలియనప్పుడు ఎందుకు సాహసం చేయడమని అవమానించారు. ఆ తరువాత క్రమంగా ఇండికాను లాభాలబాట పట్టించారు.ఇదీ చదవండి: 2026లో జీతాలు పెరిగేది వీరికే!.. రిపోర్ట్ వచ్చేసిందియూరప్కు చెందిన కోరస్ స్టీల్ కంపెనీను కొనుగోలు చేశారు. అలాగే ఇంగ్లాండ్కు చెందిన టెట్లీ టీ కంపెనీను కొని ‘టాటా టీ’లో విలీనం చేశారు. దాంతో ప్రపంచంలోనే రెండో అతి పెద్ద టీ కంపెనీగా టాటా ఎదిగింది. ఇవే కాదు ఇతర దేశాలకు చెందిన 22కు పైగా అంతర్జాతీయ కంపెనీలను టాటా గ్రూప్లో కలుపుకుని టాటాను ఒక అంతర్జాతీయ బ్రాండ్గా మార్చారు రతన్ టాటా. ఒకప్పుడు ఏ బ్రిటిష్ వాళ్లైతే భారతీయులను పరిపాలించారో.. అదే బ్రిటిష్ వారికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగారు. -
భారత్-యూకే ఎఫ్టీఏ.. ఆర్థిక వృద్ధికి కొత్త ఆశలు
భారత్-యునైటెడ్ కింగ్డమ్ (యూకే) మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) రెండు దేశాల ఆర్థిక సంబంధాల్లో మైలురాయిగా నిలుస్తుంది. 2025 జులై 24న ఈ ఒప్పందం కుదిరింది. యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ తాజాగా భారత్ పర్యటన సందర్భంగా దీని అమలును త్వరగా చేపట్టాలని పిలుపునిచ్చారు. ఇది రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంచడానికి ఎంతో తోడ్పడుతుందని చెప్పారు.ఈ ఒప్పందం వల్ల భారత్లో అద్భుతమైన అవకాశాలు వస్తాయని నిపుణులు నమ్ముతున్నారు. 2028 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగాలన్న సంకల్పానికి ఇది శక్తివంతమైన చోదకశక్తిగా పనిచేస్తుంది. రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని సుమారు 34 బిలియన్ డాలర్లకు పెంచే లక్ష్యంతో ముందుకుసాగుతున్నారు.ఎగుమతులు, దిగుమతులుఎఫ్టీఏ ప్రధాన ఆకర్షణల్లో ఎగుమతులు ముందంజలో ఉన్నాయి. ఈ ఒప్పందం 90% టారిఫ్ లైన్లపై తగ్గింపులు అందిస్తుంది. యూకే నుంచి భారత్కు విమాన భాగాలు, శాస్త్రీయ సాధనాలు, చాక్లెట్, జింజర్బ్రెడ్, మెడికల్ డివైసెస్ వంటివి టారిఫ్రహితంగా ఉంటాయి. విస్కీ, జిన్పై 150% నుంచి 75%కి సుంకాలు తగ్గింపు ఉంటుంది. 10 సంవత్సరాల తర్వాత ఇది 40%కు చేరుతుంది.ప్రొఫెషనల్ మొబిలిటీప్రొఫెషనల్ మొబిలిటీలో ఈ ఒప్పందం యూకే పాయింట్స్-బేస్డ్ ఇమ్మిగ్రేషన్ విధానాన్ని ఉల్లంఘించకుండా తాత్కాలిక ప్రయాణాలను సులభతరం చేస్తుంది. ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, అకౌంటెన్సీ, మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ వంటి రంగాల్లో ప్రొఫెషనల్స్ కాన్ఫరెన్సులు, ఇంట్రా-కంపెనీ ట్రాన్స్ఫర్లు, కాంట్రాక్ట్ సర్వీసెస్ కోసం వీసా ప్రక్రియలు సమానంగా ఉంటాయి. అకౌంటెంట్స్, ఆడిటర్స్, ఆర్కిటెక్ట్స్, లాయర్స్, ఇంజినీర్లకు మ్యూచువల్ రికగ్నిషన్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ ప్రోత్సహిస్తుంది. ఇది అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులను తగ్గిస్తుంది. దాంతో భారత IT, ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొఫెషనల్స్కు యూకే మార్కెట్లో అవకాశాలు పెరుగుతాయి.వ్యవసాయం, సముద్ర ఉత్పత్తులువ్యవసాయ రంగంలో యూకే నుంచి భారత్కు ఫ్రెష్/ఫ్రోజెన్ సాల్మన్, లాంబ్ మీట్ వంటి ఉత్పత్తులపై టారిఫ్లుండవు. 10 సంవత్సరాల తర్వాత చాక్లెట్, బిస్కట్స్, సాఫ్ట్ డ్రింక్స్ వంటివి ఇందులో చేరుతాయి. షుగర్, రైస్, పోర్క్, చికెన్, ఎగ్స్ వంటి సున్నిత రంగాలను ఇందులో నుంచి మినహాయించారు.ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహంఎంఎస్ఎంఈలకు ఇన్ఫర్మేషన్ షేరింగ్, పారదర్శకత పెంచుతూ అడ్డంకులను తగ్గించడం ద్వారా చేయూతని అందిస్తారు. కాంటాక్ట్ పాయింట్లు, మార్కెట్ ఎంట్రీ బెస్ట్ ప్రాక్టీసెస్, ఆన్లైన్ ట్రేడ్ ఇన్ఫో, ఫైనాన్స్ యాక్సెస్పై సహకారం అందుతుంది. డిజిటల్ ట్రేడ్ ద్వారా ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్స్ ఎంఎస్ఎంఈలకు సహాయపడుతుంది.విద్య, పరిశోధనవిద్యా రంగంలో నేరుగా కమిట్మెంట్స్ లేకపోయినా సర్వీసెస్ సెక్టార్ ద్వారా యూకే యూనివర్సిటీలు (అక్స్ఫర్డ్, కేమ్బ్రిడ్జ్) భారత్లో క్యాంపస్లు ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయి. ఇది భారత విద్యార్థులకు (ప్రతి సంవత్సరం 1.5 లక్షల మంది యూకే వెళ్తారు) మరింత సౌలభ్యం అందిస్తుంది. ఇన్నోవేషన్ విభాగంలో యూకే-భారత్ పరిశోధన, అభివృద్ధి సహకారాన్ని పెంచుతుంది. ఇన్నోవేషన్ వర్కింగ్ గ్రూప్ రెగ్యులేటరీ అప్రోచెస్, టెక్నాలజీ కమర్షలైజేషన్పై పనిచేస్తుంది.పారిశ్రామికీకరణపారిశ్రామికీకరణలో ఆటోమోటివ్స్ (కారు టారిఫ్లు 10%), ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, మెడికల్ డివైసెస్, ఎయిర్క్రాఫ్ట్ పార్ట్స్పై టారిఫ్లు ఉండవు. భారత మాన్యుఫాక్చరింగ్ జీడీపీలో 21% (2031 నాటికి) పెరగడానికి యూకే ఇన్వెస్ట్మెంట్స్ (లైఫ్ సైన్సెస్, క్లీన్ ఎనర్జీ) సహాయపడతాయి. ఎన్విరాన్మెంట్ పరంగా గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొక్యూర్మెంట్ను ప్రోత్సహిస్తుంది.ఇదీ చదవండి: ఉద్యోగం చేస్తూనే కోట్లు సంపాదించే మార్గాలు.. -
ఇలా అయితే ఎలా 'బంగారం': మరింత పెరిగిన ధరలు
బంగారం ధరలు రోజురోజుకి భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు (అక్టోబర్ 09) కూడా గరిష్టంగా రూ. 220 పెరిగింది. పెరుగుతున్న గోల్డ్ రేట్లు.. పసిడి ప్రియులలో కొంత ఆందోళన కలిగిస్తోంది. ఇదిలాగే కొనసాగితే పసిడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
25,000 మార్కుపైనే నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:42 సమయానికి నిఫ్టీ(Nifty) 52 పాయింట్లు పెరిగి 25,097కు చేరింది. సెన్సెక్స్(Sensex) 107 పాయింట్లు పుంజుకొని 81,871 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
వైజాగ్ అభివృద్ధికి జగన్ ఏం చేశారంటే..
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు తన పాలనా కాలంలో రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాను ఆర్థిక శక్తిస్థావరంగా మలచడానికి అనేక కార్పొరేట్ కార్యక్రమాలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు సృష్టించారు. విశాఖపట్నం దక్షిణాసియాలోని ముఖ్యమైన ఓడరేవు నగరంగా ఉండటం వల్ల దీన్ని ఐటీ, ఫార్మా, టూరిజం, ఇండస్ట్రీలకు హబ్గా మార్చడానికి జగన్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. జగన్ నేడు విశాఖ పర్యటన సందర్భంగా తన పాలనా కాలంలో జిల్లాలో నిర్వహించిన కార్పొరేట్ కార్యక్రమాలను తెలుసుకుందాం. భవిష్యత్ వ్యాపార అభివృద్ధి కోసం సిద్ధం చేసిన ప్రణాళికలను చూద్దాం.కార్పొరేట్ కార్యక్రమాలుజగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత 2019-2024 మధ్యకాలంలో విశాఖపట్నం జిల్లాను పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యంగా మార్చడానికి అనేక కార్పొరేట్ కార్యక్రమాలు, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (GIS) వంటి పెద్ద ఈవెంట్లు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు ఫార్మా, ఐటీ, ఇండస్ట్రియల్ పార్కులు, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలపై దృష్టి సారించాయి. 2023 మార్చిలో విశాఖపట్నంలోనే నిర్వహించిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (GIS) ఒక మైలురాయి. ఈ సమ్మిట్లో 352 ఒప్పందాలు జరిగాయి. దాంతో రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్ల చేరాలనే లక్ష్యం నిర్ణయించుకున్నారు. వీటిలో సుమారు 39% ఇప్పటికే పెట్టుబడులుగా మారాయి. GIS వేదిక నుంచి జగన్ 14 పరిశ్రమలను భౌతికంగా ప్రారంభించారు. ఈ పరిశ్రమలకు మొత్తం రూ.3,841 కోట్ల పెట్టుబడితో 9,108 ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంది.విశాఖపట్నం జిల్లాలో నేరుగా ప్రారంభించిన కార్పొరేట్ కార్యక్రమాలలో 2023 అక్టోబర్లో ఐదు కంపెనీల ప్రారంభం ముఖ్యమైనది. మొత్తం రూ.1,371 కోట్ల పెట్టుబడితో ఈ కంపెనీలు 2,950 ఉద్యోగాలు సృష్టించాయి. వీటిలో..ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్: రూ.500 కోట్ల పెట్టుబడితో 1,000 ఉద్యోగాలు. జావా, J2EE, SAP, డేటా సైన్స్ వంటి టెక్నాలజీలపై దృష్టి, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎనర్జీ, రిటైల్ రంగాలకు సేవలు అందిస్తుంది.ఈజియా స్టెరైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఫార్మా సిటీలో): రూ.500 కోట్ల పెట్టుబడి, 700 ఉద్యోగాలు. సంవత్సరానికి 300 మిలియన్ ఇంజెక్టబుల్ యూనిట్లు ఉత్పత్తి.లారస్ ల్యాబ్స్ (అచ్చుతపురం సెజ్లో): రూ.440 కోట్ల పెట్టుబడి, 500 ఉద్యోగాలు.లారస్ సింథటిక్స్: రూ.191 కోట్ల పెట్టుబడి, 300 ఉద్యోగాలు.మరో లారస్ ల్యాబ్స్ యూనిట్: రూ.240 కోట్ల పెట్టుబడి, 400 ఉద్యోగాలు (ఫౌండేషన్ స్టోన్).అనకాపల్లిలో ఫార్మా సిటీ అభివృద్ధి జగన్ పాలనలో వేగవంతమైంది. 2023 అక్టోబర్లో మూడు ఫార్మా కంపెనీలను ప్రారంభించి రెండు బల్క్ డ్రగ్ యూనిట్లకు శంకుస్థాపన వేశారు. ఈ ప్రాజెక్టులకు మొత్తం రూ.1,611 కోట్ల పెట్టుబడితో వేలాది ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 2019 నుంచి 107 పెద్ద పరిశ్రమలు రూ.46,002 కోట్ల పెట్టుబడితో ప్రారంభమయ్యాయి. వీటి ద్వారా 1,06,249 ఉద్యోగాలు వచ్చాయి. వీటిలో విశాఖపట్నం జిల్లా భాగస్వామం అధికంగానే ఉంది. అలాగే 88 ఒప్పందాలతో రూ.44,963 కోట్ల లక్ష్యం పెట్టుకున్నారు. వీటిలో రూ.38,573 కోట్లు ఇప్పటికే పెట్టుబడులుగా మారాయి. ఈ కార్యక్రమాలు విశాఖపట్నంను ఫార్మా, ఐటీ హబ్గా మార్చాయి.భవిష్యత్ ప్రణాళికలుజగన్ పాలనలో విశాఖపట్నంను భవిష్యత్తులో గ్లోబల్ మెట్రోపాలిస్గా మార్చడానికి ‘విజన్ విశాఖ’ (Vision Visakha) ప్రణాళికను 2024 మార్చి 5న ప్రకటించారు. 10 సంవత్సరాల ప్లాన్కు మొత్తం రూ.1.05 లక్ష కోట్ల పెట్టుబడిని నిర్ణయించారు. ఈ పెట్టుబడులు ఐటీ, టూరిజం, ఎడ్యుకేషన్, ఇండస్ట్రీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో ఉపయోగపడతాయి. 5 లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టిస్తాయి. విశాఖను హైదరాబాద్, చెన్నైలతో పోటీపడేలా మార్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ల మధ్య సహకారం నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ప్రణాళికలు ఇలా..ఇండస్ట్రియల్ డెవలప్మెంట్: 30 ప్రాజెక్టులకు రూ.33,080 కోట్లు (విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో). ఇందులో NTPC హైడ్రోజన్ పార్క్ (రూ.20,225 కోట్లు), TVS లాజిస్టిక్స్ పార్కులు (రూ.1,500 కోట్లు), JSW ఇండస్ట్రియల్ పార్క్ (రూ.532 కోట్లు), ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్, ఇన్క్యుబేషన్ ఫెసిలిటీలు (APIS, STPI, NASSCOM, ఆంధ్ర యూనివర్సిటీ).ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్పోర్టేషన్: భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ (రూ.4,727 కోట్లు), విశాఖ మెట్రో రైల్ (రూ.14,000-14,309 కోట్లు), హై-స్పీడ్ రైల్ కారిడార్లు (హైదరాబాద్-విశాఖ, విజయవాడ-బెంగళూరు). స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్కు రూ.1,906.15 కోట్లు. బీచ్ కారిడార్ (భోగాపురం నుంచి నగరం వరకు 6-లేన్ రోడ్)కు రూ.960 కోట్లు.ఎనర్జీ, గ్రీన్ టెక్: అదానీ డేటా సెంటర్ (రూ.27,000 కోట్లు), NTPC గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ (రూ.27,000 కోట్లు).ఇదీ చదవండి: ఉద్యోగం చేస్తూనే కోట్లు సంపాదించే మార్గాలు.. -
ప్రతీ కార్మికుడికి ఏఐ ఫలాలు
‘మిషన్ డిజిటల్ శ్రమసేతు’ కార్యక్రమం కింద కృత్రిమ మేధ (ఏఐ) ప్రతీ కార్మికుడికి అందుబాటులో ఉండేలా తగిన కార్యాచరణను రూపొందించాలని నీతి ఆయోగ్ పిలుపునిచ్చింది. ‘సమ్మిళిత సామాజికాభివృద్ధికి ఏఐ’ పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. ఏఐ, బ్లాక్చైన్, ఇమ్మర్సివ్ లెర్నింగ్(వీఆర్, ఏఆర్ సాధనాల సాయంతో), ఇతర టెక్నాలజీల ద్వారా.. ఆర్థిక అభద్రత, పరిమిత మార్కెట్ అవకాకాశాలు, నైపుణ్యాలలేమి వంటి వాటిని అధిగమించొచ్చని పేర్కొంది.అసంఘటిత రంగ కార్మికులు పరికరాలు, ప్లాట్ఫామ్ల సాయంతో తమ నైపుణ్యాలు పెంచుకునేందుకు, అధిక ఉత్పాదకతకు మిషన్ డిజిటల్ శ్రమసేతు వీలు కల్పిస్తుందని తెలిపింది. ఈ కార్యక్రమం ప్రభుత్వం, విద్యా సంస్థలు, పౌర సమాజం మధ్య సహకారాన్ని పెంచుతుందని వివరించింది. తద్వారా లక్షలాది మందిని దేశ అభివృద్ధి పథకంలో భాగస్వాములను చేయడం ద్వారా 2047 నాటికి వికసిత్ భారత్ ఆకాంక్షను సాధించడం సాధ్యపడుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేసింది.ప్రస్తుత మాదిరే కొనసాగితే అసంఘటిత రంగంలో ప్రతీ కార్మికుడి వార్షిక ఆదాయం 2047 నాటికి 6,000 డాలర్లకు మించకపోవచ్చని, 14,500 డాలర్ల లక్ష్యానికి ఇది ఎంతో తక్కువని పేర్కొంది. కనుక దేశ అభివృద్ధికి లక్షలాది మంది దూరంగా ఉండకుండా వెంటనే సమిష్టి చర్యలు అవసరమని నివేదికలో సూచించింది. ‘దేశంలోని 49 కోట్ల అసంఘటిత రంగ కార్మికుల జీవితాల్లో మార్పులు తీసుకురావడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకునేట్టు అయితే సహకారం అన్నది తప్పనిసరి’ అని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణియన్ తెలిపారు.ఇదీ చదవండి: ఉద్యోగం చేస్తూనే కోట్లు సంపాదించే మార్గాలు.. -
ఎస్ఈఐఎల్ ఎనర్జీకి గోల్డెన్ పీకాక్ అవార్డు
ఎస్ఈఐఎల్ ఎనర్జీ ఇండియాకి 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక ‘గోల్డెన్ పీకాక్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్’ పురస్కారం లభించినట్లు లభించింది. కార్పొరేట్ గవర్నెన్స్లో అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తున్నందుకు గాను ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐవోడీ) ఈ అవార్డును ప్రకటించినట్లు తెలి పింది.పారదర్శకంగా, బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో కూడుకున్న వ్యాపార విధానాలను పాటించడంపై తమకున్న నిబద్ధతకు ఇది గుర్తింపని సంస్థ సీఈవో జనమేజయ మహాపాత్ర తెలిపారు. నవంబర్ 4న జరిగే గోల్డెన్ పీకాక్ అవార్డ్స్ కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్ (ఐపీపీ) దిగ్గజంగా కంపెనీ కార్యకలాపాలు సాగిస్తోంది.ఇదీ చదవండి: ఉద్యోగం చేస్తూనే కోట్లు సంపాదించే మార్గాలు.. -
సౌర ఇంధనంలో మూడో స్థానానికి భారత్
సోలార్ విద్యుదుత్పత్తి పరంగా భారత్ ప్రపంచంలో మూడో స్థానానికి చేరుకుంది. ఉత్పాదక సామర్థ్యం 125 గిగావాట్ల సామర్థ్యాన్ని అధిగమించినట్టు కేంద్ర పనరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. అంతర్జాతీయ సోలార్ కూటమి (ఐఎస్ఏ) కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి మాట్లాడారు.‘కాప్28 అంగీకారం మేరకు ప్రపంచ పునరుత్పాదక ఇంధన వనరుల సామర్థ్యం మూడు రెట్లు పెరిగి 2030 నాటికి 11,000 గిగావాట్లకు చేరుకోవాలి. ఈ లక్ష్య సాధనలో సోలార్ విద్యుత్ అన్నది కీలక పాత్ర పోషిస్తుంది. నేడు 125 గిగావాట్ల సామర్థ్యంతో ప్రపంచంలో భారత్ మూడో అతిపెద్ద సోలార్ విద్యుదుత్పత్తిదారుగా ఉంది’ అని మంత్రి తెలిపారు.దేశ ఆకాంక్ష క్షేత్రస్థాయిలో ఎంత ప్రభావం చూపించగలదన్నది దానికి ఈ పురోగతి నిదర్శనమని పేర్కొన్నారు. పీఎం సూర్యఘర్ ముఫ్తి బిజ్లీ యోజన పథకం కింద ఇప్పటికే 20 లక్షలకు పైగా గృహాలకు రూఫ్టాప్ సోలార్ విద్యుత్ వసతులు సమకూర్చినట్టు చెప్పారు. ఈ నెల 27 నుంచి 30 వరకు అంతర్జాతీయ సోలార్ కూటమి సదస్సు ఢిల్లీలో జరగనుంది. సోలార్ ఇంధన పరిష్కారాల ద్వారా వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు భారత్, ఫ్రాన్స్ సంయుక్తంగా ఐఎస్ఏని ఏర్పాటు చేయడం గమనార్హం.ఇదీ చదవండి: ఉద్యోగం చేస్తూనే కోట్లు సంపాదించే మార్గాలు.. -
వాహన అమ్మకాలకు పండుగ జోష్
న్యూఢిల్లీ: పండుగ సీజన్ ప్రారంభం భారత ఆటోమొబైల్ రంగానికి తిరుగులేని ఉత్సాహాన్ని అందించింది. ముఖ్యంగా నవరాత్రి తొమ్మిది రోజుల పండుగ సందర్భంగా ప్యాసింజర్ వాహన రిటైల్ అమ్మకాలు గతేడాదితో పోలిస్తే ఏకంగా 34% పెరిగాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) వెల్లడించింది. సెప్టెంబర్ 22 వరకు మందకొడిగా సాగిన అమ్మకాలు, జీఎస్టీ 2.0 అమల్లోకి వచ్చాక విక్రయాలు అనూహ్య రీతిలో పెరిగాయి. వెరసి సెప్టెంబర్లో అన్ని విభాగాలు కలిపి మొత్తం 18,27,337 వాహన విక్రయాలు జరిగాయి. గతేడాది ఇదే నెల 17,36,760 యూనిట్లతో పోలిస్తే ఇవి 5.22% అధికంగా ఉన్నాయి. నవరాత్రుల పండుగ తొమ్మిది రోజుల్లో వాహన విక్రయాలు 34% పెరిగి 11,56,935 యూనిట్లకు చేరాయి. గత ఏడాది ఇదే సమయంలో 8,63,327 వాహనాలు అమ్ముడయ్యాయి. ‘‘భారతీయ ఆటోమొబైల్ రిటైల్ పరిశ్రమకు 2025 సెపె్టంబర్ అత్యంత ప్రత్యేకమైన నెల నిలిచింది. కొత్త జీఎస్టీ అమల్లోకి వస్తే ధరలు దిగి వస్తాయని అంచనాలతో కస్టమర్లు మూడో వారం వరుకూ కొనుగోళ్ల జోలికెళ్లలేదు. అయితే సెపె్టంబర్ 22 తర్వాత జీఎస్టీ 2.0 రేట్లు అమల్లోకి రావడం, నవరాత్రి ఉత్సవాలు ఒకేసారి రావడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అన్ని విభాగాల్లో విక్రయాలు, డెలివరీలు వేగంగా పుంజుకున్నాయి’’ అని ఫాడా ఉపాధ్యక్షుడు సాయి గిరిధర్ తెలిపారు. విభాగాల వారీగా వృద్ధి ఇలా... → ప్యాసింజర్ విక్రయాలు గతేడాది సెపె్టంబర్తో పోలిస్తే 2,82,945 యూనిట్ల నుంచి ఏకంగా 5.80% పెరిగి 2,99,396 కు చేరాయి. భారీ కొనుగోళ్లు, అందుబాటు ధరల కారణంగా నవరాత్రుల్లో 2,17,744 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. గతేడాది ఇదే నవరాత్రి విక్రయాలు 1,61,443తో పోలిస్తే ఇవి 35% అధికం. → ద్వి చక్ర వాహనాల రిజి్రస్టేషన్లు 7% పెరిగాయి. ఈ సెపె్టంబర్లో మొత్తం 12,87,735 అమ్మకాలు జరిగాయి. గతడాది ఇదే నెలలో విక్రయాలు 12,08,996 యూనిట్లుగా ఉన్నాయి. ఈ విభాగపు ఎంక్వైరీలు ఇప్పట్టకీ బలంగా ఉన్నాయి. జీఎస్టీ రేట్ల తగ్గింపు, పండుగ ఆఫర్లు, డిమాండ్ పెరగడంతో నవరాత్రిలో అమ్మకాలు 36% పెరిగి 8,35,364 యూనిట్లకు చేరాయి. → త్రి చక్రవాహన రిటైల్ అమ్మకాలు 7% క్షీణించి 98,866కు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే సెపె్టంబర్ అమ్మకాలు 1,06,534 యూనిట్లుగా ఉన్నాయి. అయితే నవరాత్రి అమ్మకాల్లో 25% వృద్ధి నమోదైంది. మొత్తం 46,204 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది దసరా సీజన్ విక్రయాలు 37,097గా ఉన్నాయి. → వాణిజ్య వాహన రిటైల్ విక్రయాలు సెపె్టంబర్లో 70,254 యూనిట్ల నుంచి 3% పెరిగి 72,124 యూనిట్లకు చేరుకున్నాయి. రుణవితరణ పెరగడంతో నవరాత్రి అమ్మకాల్లో 15% వృద్ధి సాధించి మొత్తం 33,856 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇదే సెపె్టంబర్లో ట్రాక్టర్ అమ్మకాలు 64,785 యూనిట్లుగా ఉన్నాయి. ఒక్క నవరాత్రుల్లోనే 21,604 ట్రాక్టర్ల విక్రయాలు జరిగాయి. అక్టోబర్ అమ్మకాలపై మరింత ఆశాభావం ‘‘జీఎస్టీ 2.0 రేట్ల తగ్గింపు అన్ని ఆదాయ వర్గాలలో కొనుగోలు శక్తిని గణనీయంగా పెంచింది. సానుకూల వర్షాలు, బలమైన ఖరీఫ్ పంటలు గ్రామీణ ఆదాయాలను మెరుగుపరిచాయి. ధంతేరాస్, దీపావళి పండుగల సీజన్లో ఇదే సానుకూల వాతావరణం కొనసాగొచ్చు. తగ్గిన ధరలు, ఆకట్టుకునే ఆఫర్లు కొత్త కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. భారతీయ చరిత్రలోనే ఈ పండుగ సీజన్ అత్యుత్తమ రిటైల్ సీజన్గా నిలిచే అవకాశం ఉంది’’ అని ఫాడా విశ్వాసం వ్యక్తం చేసింది. ఈవీ కార్ల అమ్మకాలు రెండింతలు ఎలక్ట్రిక్ కార్ల రిటైల్ విక్రయాలు ఈ ఏడాది సెపె్టంబర్లో 15,329 గా నమోదయ్యాయి. గతేడాది (2024) ఇదే నెలలో నమోదైన 6,191 ఈవీ కార్ల విక్రయాలతో పోలిస్తే ఈ సంఖ్య రెండింతలు అధికమని వాహన డీలర్ల సమాఖ్య (ఫాడా) తెలిపింది. ఈవీ రేసులో టాటా మోటార్స్ అగ్రస్థానంలో ఉంది. ఈ సంస్థ ఈవీ కార్ల అమ్మకాలు 62% వృద్ధి చెంది 3,833 నుంచి 6,216 కు చేరాయి. జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ 3,912 ఈవీ కార్లను అమ్మింది. గతేడాది సెప్టెంబర్లో విక్రయించిన 1,021 యూనిట్లతో పోలిస్తే ఇవి మూడింతలు అధికం. మహీంద్రా అమ్మకాలు 475 యూనిట్ల నుంచి ఏకంగా 3,243కు చేరాయి. అలాగే బీవైడీ ఇండియా 547 యూనిట్లు, కియా ఇండియా 506 యూనిట్లు, హ్యుందాయ్ మోటార్ ఇండియా 349 యూనిట్లు, బీఎండబ్ల్యూ ఇండియా 310 యూనిట్లు, మెర్సిడస్ బెంజ్ 97 యూనిట్లను విక్రయించాయి. ఇటీవల భారత్ మార్కెట్లోకి అడుగుపెట్టిన టెస్లా సైతం 64 కార్లను విక్రయించింది. -
సులభమైన ప్రోడక్టులను తీసుకురండి
ముంబై: అందరూ సులభంగా ఉపయోగించగలిగే, అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రోడక్టులు, సర్వీసులను డిజైన్ చేయాలని ఫిన్టెక్ సంస్థలకు రిజర్వ్ బ్యాంక్ డిప్యుటీ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సూచించారు. సంపన్నులకు సరీ్వసులు అందించడం లాభసాటి వ్యాపారమే అయినప్పటికీ, అంతగా సేవలందని వారిపైనా చిన్న కంపెనీలు దృష్టి పెట్టాలని చెప్పారు. తద్వారా ఆరి్థక సమ్మిళితత్వం సాధించేందుకు, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఎదిగేందుకు తమ వంతు తోడ్పాటు అందించాలని పేర్కొన్నారు. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2025లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. ‘కస్టమర్ల అవసరాలకు ప్రాధాన్యమిస్తూ, వారు సులభంగా ఉపయోగించగలిగేలా ఉత్పత్తులు, సర్వీసులను డిజైన్ చేయాలి. అవి అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలి. సీనియర్ సిటిజన్లు, డిజిటల్ అక్షరాస్యత అంతగా లేని వారు, దివ్యాంగులు కూడా ఉపయోగించగలిగేలా అసిస్టివ్ టెక్నాలజీలను పొందుపర్చాలి‘ అని మల్హోత్రా చెప్పారు. విశ్వసనీయత, నిబంధనలను పాటించడానికి భారతీయ ఫిన్టెక్లు అత్యంత ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. ప్రతి ప్రోడక్టు, సరీ్వసులోను వినియోగదారుల డేటా గోప్యతను పరిరక్షిస్తూ, పారదర్శకతకు పెద్ద పీట వేయాలని పేర్కొన్నారు. గ్లోబల్ రేంజ్లో... లోకల్గా ఉంటూనే గ్లోబల్ స్థాయిలో ఆలోచించాలని, అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి పనిచేయాలని, ఉత్తమ విధానాలను అమలు చేయాలని మల్హోత్రా సూచించారు. ఫిన్టెక్ సంస్థలు డిజిటల్ తారతమ్యాలను చెరిపివేయగలవని, నవకల్పనలకు ఊతమివ్వగలవని ఆయన పేర్కొన్నారు. ఆరి్థక సేవలను తక్కువ ఖర్చులతో భారీ స్థాయిలో అందించడాన్ని ఫిన్టెక్ సాధ్యం చేసిందని తెలిపారు. ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్న డిజిటల్ మోసాలను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని మల్హోత్రా తెలిపారు. ఈ దిశగా ఆర్బీఐ విభాగం రూపొందించిన మ్యూల్హంటర్ సొల్యూషన్ని ప్రస్తుతం 21 బ్యాంకులు ఉపయోగిస్తున్నాయని చెప్పారు. మోసగాళ్లు ఉపయోగించే ఖాతాలను ట్రాక్ చేయడంలో 90 శాతం సక్సెస్ రేటు ఉంటోందని తెలిపారు. కస్టమర్లను చేర్చుకునే ప్రక్రియలను, యూజర్ ఇంటర్ఫేస్లను మెరుగుపర్చేందుకు, డేటా భద్రతను పటిష్టం చేసేందుకు నిర్దిష్ట ప్రమాణాలను ప్రవేశపెట్టడంపై ఆర్బీఐ కసరత్తు చేస్తోందని మల్హోత్రా వివరించారు. పదేళ్లలో 40 బిలియన్ డాలర్ల పెట్టుబడులు.. గత దశాబ్దకాలంగా సుమారు 10,000 ఫిన్టెక్ సంస్థలు 40 బిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులను దక్కించుకున్నాయని మల్హోత్రా వివరించారు. రాబోయే రోజుల్లోనూ ఈ రంగం గణనీయంగా వృద్ధి చెందనుందని చెప్పారు. సుశిక్షితులైన టెక్నాలజీ నిపుణుల లభ్యత, చెల్లింపులు.. బీమా .. మొదలైన విభాగాలవ్యాప్తంగా ఆ ర్థిక వ్యవస్థ క్రియాశీలకంగా ఉండటం ఫిన్టెక్లో కొత్త ఆవిష్కరణలకు దోహదపడుతున్నాయని ఆయన చెప్పారు. ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంకు కూడా పరిశ్రమకు చేయూతనిచ్చేలా చర్యలు తీసుకుంటున్నాయని మల్హోత్రా తెలిపారు. మరోవైపు, తాను కొన్నాళ్లుగా ప్రస్తావిస్తున్న ’ఫిన్టర్నెట్’ వ్యవస్థ వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తుందని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ నాన్–ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నందన్ నీలేకని చెప్పారు. స్థలాలు, ప్రాపరీ్టలు, బాండ్లు, ఆర్థిక పెట్టుబడులు మొదలైన అసెట్స్ అన్నీ ఒకే ప్లాట్ఫాంపైకి తెచ్చేందుకు, లావాదేవీలను సులభతరం చేసేందుకు ఉపయోగపడేలా ఇది ఉంటుంది. -
భారత్ అభివృద్ధిని ఏ శక్తీ నిలువరించలేదు
ముంబై: భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని, భూమిపై ఏ శక్తి దీన్ని అడ్డుకోలేదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. దేశీ ఆరి్థక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఎన్నో చర్యలను ప్రభు త్వం తీసుకుందన్నారు. మౌలిక వసతుల కల్పనతోపాటు అంతర్జాతీయ వాణిజ్య విస్తరణకు చేపడుతున్న చర్యలను ప్రస్తావించారు. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ (జీఎఫ్ఎఫ్) 6వ ఎడిషన్ను ఉద్దేశించి మంత్రి గోయల్ మాట్లాడారు. ‘‘నేడు ప్రపంచం భారత్ను విశ్వసిస్తోంది. అత్యున్నత నాణ్యమైన నిపుణులు, వస్తు, సేవలకు భారత్ హామీ ఇస్తోంది. 100 ఏళ్ల స్వాతంత్య్ర సంబరాల నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుంది. టెక్నాలజీతో కలసి సాగకుంటే ఇది సాధ్యం కాదు. 2047 నాటికి 30–35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని భారత్ ఆకాంక్షిస్తున్నప్పుడు ఆరి్థక ప్రపంచంలో మన మిత్రులు తమదైన అంచనాలు వేసుకుంటారు. కానీ, ఇది సాధ్యమేనని మీరు చూ స్తారు. మనందరం సమిష్టిగా ఈ లక్ష్యాన్ని సాధించేందుకు కట్టుబడి ఉన్నాం’’అని మంత్రి పేర్కొన్నారు. వినియోగంపై ఆధారపడిన ఆరి్థక వ్యవస్థను ఉరకలెత్తించేందుకు ప్రభుత్వం తన వంతుగా కీలక చర్యలు చేపట్టినట్టు చెప్పారు. అంతర్జాతీయంగా ఎన్నో అనిశ్చితులు నెలకొన్నప్పటికీ విదేశీ వాణిజ్యం విస్తరణకు కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు. ప్రస్తుత ఆరి్థక సంవత్సరంలో ఎగుమతులు 4–5% మేర పెరుగుతాయన్న అంచనాను వ్యక్తం చేశారు. -
కప్పు టీ కన్నా చౌకగా డేటా!
న్యూఢిల్లీ: డిజిటల్ రంగంలో భారత్ వేగంగా వృద్ధి చెందుతోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఓ కప్పు టీ రేటు కన్నా 1 జీబీ డేటా చౌకగా లభిస్తుండటం దీనికి నిదర్శనమని తెలిపారు. ఒకప్పుడు 2జీ టెలికం సర్వీసుల లభ్యత కూడా కష్టంగా ఉండేదని, ప్రస్తుతం దానికి అనేక రెట్లు మెరుగైన 5జీ సర్వీసులు దేశవ్యాప్తంగా దాదాపు ప్రతి జిల్లాలోనూ లభిస్తున్నాయని పేర్కొన్నారు. డేటా వినియోగంలో ప్రస్తుతం ప్రపంచంలోనే టాప్ దేశాల్లో ఒకటిగా భారత్ నిలుస్తోందని తెలిపారు. డిజిటల్ మౌలికసదుపాయాల కల్పనపై ప్రభుత్వానికి గల చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ)ని ప్రారంభించిన సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విధానాలు, వ్యాపారాలకు అనువైన పరిస్థితులు మొదలైన అంశాల దన్నుతో భారత్.. పెట్టుబడులకు గమ్యస్థానంగా నిలుస్తోందని ప్రధాని చెప్పారు. సంస్కరణలను మరింత వేగవంతం చేస్తున్నామన్నారు. సెమీకండక్టర్లు, మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ మొదలైన వాటి తయారీకి భారత్లో అపార అవకాశాలు ఉన్నాయని మోదీ వివరించారు. మరింతగా పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని ఆయన చెప్పారు. దీన్ని అందిపుచ్చుకునేందుకు పరిశ్రమలు, ఆవిష్కర్తలు, స్టార్టప్లు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘తయారీ కార్యకలాపాలు మొదలుకుని సెమీకండక్టర్లు, మొబైల్స్, ఎల్రక్టానిక్స్ వరకు అన్నింటా దేశం పురోగమిస్తోంది. వివిధ రంగాల్లో స్టార్టప్ల సందడితో దేశీయంగా పరిస్థితులు చాలా ఆశావహంగా ఉన్నాయి. భారత్లో తయారీ కార్యకలాపాలకు, పెట్టుబడులు పెట్టేందుకు, నవకల్పనలను ఆవిష్కరించేందుకు ఇదే సరైన సమయం’’ అని ఆయన చెప్పారు. రూ. 900 కోట్లతో శాట్కామ్ పర్యవేక్షణ వ్యవస్థ: సింధియా దేశ స్పెక్ట్రం అసెట్స్ను, డేటా వనరులను పరిరక్షించే దిశగా నేషనల్ శాట్కామ్ మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రూ. 900 కోట్లు కేటాయించిందని టెలికం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. టెలికం, బ్రాడ్కాస్టింగ్ కలిపి భారతీయ శాట్కామ్ మార్కెట్ గతేడాది 4.3 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2033 నాటికి 14.8 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నట్లు చెప్పారు. 6జీ పేటెంట్లకు సంబంధించి 10 శాతం వాటా దక్కించుకోవాలని నిర్దేశించుకున్నట్లు సింధియా వివరించారు. పేమెంట్ యాప్లతో రూ. 200 కోట్ల మోసాల నివారణ టెలికం శాఖ రూపొందించిన ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ (ఎఫ్ఆర్ఐ) ప్లాట్ఫాంని ఉపయోగించి అనుమానాస్పద లావాదేవీలని బ్లాక్ చేయడం ద్వారా ఫోన్పే, పేటీఎంలాంటి పేమెంట్ యాప్లు సుమారు రూ. 200 కోట్ల ఆర్థిక మోసాలను నివారించాయి. ఎఫ్ఆర్ఐ డేటా ప్రకారం ఈ రెండు సంస్థలు 10 లక్షలకు పైగా ఖాతాలు, వాలెట్లను ఫ్రీజ్ చేశాయి. ఫోన్పే సహ వ్యవస్థాపకుడు రాహుల్ చారి ఈ విషయాలు తెలిపారు. త్వరలో శాట్కామ్ సర్వీసులు..: మిట్టల్ శాటిలైట్ కమ్యూనికేషన్ సర్వీసులను ప్రారంభించడంపై యూటెల్శాట్ వన్వెబ్ కసరత్తు చేస్తోందని భారతి ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ తెలిపారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే సర్వీసులు మొదలవుతాయని పేర్కొన్నారు. మరోవైపు, సురక్షితమైన విధంగా అత్యంత నాణ్యమైన బ్రాడ్బ్యాండ్ సేవలను అందించడంపై ఆసక్తిగా ఉన్నట్లు స్టార్లింక్ ఇండియా మార్కెట్ యాక్సెస్ డైరెక్టర్ పరి్నల్ ఊర్ధ్వరేషే తెలిపారు. ఈ విషయంలో టెలికం శాఖతో పాటు విభాగాలన్నీ చక్కటి సమన్వయంతో పని చేస్తున్నాయని చెప్పారు. అటు, కొత్త ఆవిష్కరణలపై మరింతగా దృష్టి పెడుతూ, డిజిటల్ విప్లవంలో భారత్ను అగ్రగామిగా నిలబెట్టేందుకు తాము కట్టుబడి ఉన్నామని రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ చెప్పారు.స్టార్టప్ వ్యవస్థకు దన్ను .. టెలికం టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్, డిజిటల్ కమ్యూనికేషన్స్ ఇన్నోవేషన్స్ స్క్వేర్ మొదలైన వాటితో స్టార్టప్ వ్యవస్థకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందని ప్రధాని చెప్పారు. అలాగే 5జీ, 6జీ, అధునాతన ఆప్టికల్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీలను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు ఉపయోగపడే టెస్ట్ బెడ్స్కి నిధులు కూడా సమకూరుస్తోందన్నారు. సైబర్ సెక్యూరిటీకి గణనీయంగా ప్రాధాన్యం ఇస్తున్నామని, సైబర్ మోసాలను కట్టడి చేసేందుకు కఠినతరమైన చట్టాలు చేశామని ప్రధాని చెప్పారు. మొబైల్, టెలికం, ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ వ్యవస్థలవ్యాప్తంగా నెలకొన్న సరఫరా సమస్యలకి తగిన పరిష్కారాలను అందించేందుకు మన ముందు చక్కని అవకాశం ఉందని తెలిపారు. సెమీకండక్టర్ల తయారీలాంటి విభాగాల్లో భారత్ ఈ అవకాశాలను అందిపుచ్చుకుంటోందని ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10 సెమీకండక్టర్ తయారీ యూనిట్ల పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయన్నారు. ఎల్రక్టానిక్స్ తయారీ విషయంలో గ్లోబల్ కంపెనీలు భారీ స్థాయిలో విశ్వసనీయంగా, భారీ స్థాయిలో సరఫరా చేయగలిగే భాగస్వాముల కోసం అన్వేíÙస్తున్నాయని .. ఆ అవకాశాలను భారతీయ కంపెనీలు అందిపుచ్చుకోవాలని సూచించారు. చిప్సెట్లు, బ్యాటరీలు, డిస్ప్లేలు, సెన్సార్లను దేశీయంగానే మరింతగా తయారు చేయడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. 2014 నుంచి ఎలక్ట్రానిక్స్ తయారీ ఆరు రెట్లు, మొబైల్ ఫోన్ల తయారీ ఇరవై ఎనిమిది రెట్లు, ఎగుమతులు 127 రెట్లు పెరిగాయని ప్రధాని చెప్పారు. గత దశాబ్దకాలంలో మొబైల్ ఫోన్ల తయారీ రంగంలో భారీ స్థాయిలో ప్రత్యక్ష ఉద్యోగాలను కల్పించిందన్నారు. డేటా ప్రకారం ఓ దిగ్గజ స్మార్ట్ఫోన్ కంపెనీకి అవసరమైన ఉత్పత్తులను 45 భారతీయ సంస్థలు సరఫరా చేస్తున్నాయని చెప్పారు. ఇలాంటి ఒక్క కంపెనీతో దాదాపు 3.5 లక్షల ఉద్యోగాలు వచ్చాయన్నారు. -
EPFO: ఏటీఎం నుంచి పీఎఫ్ విత్డ్రా కొత్త సంవత్సరం నుంచే!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సభ్యులకు ఓ కొత్త అప్డేట్ వచ్చింది. ఏటీఎం నుంచి పీఎఫ్ సొమ్ము ఉపసంహరణ సేవలను ఈపీఎఫ్ఓ 2026 జనవరి నుంచి ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం.. ఈపీఎఫ్ఓ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ సీబీటీ, అక్టోబర్ రెండవ వారంలో జరగబోయే బోర్డు సమావేశంలో ఏటీఎం ఉపసంహరణలను ఆమోదించే అవకాశం ఉంది.ఏటీఎం ఉపసంహరణ సౌకర్యం ఉద్యోగులకు గణనీయమైన ఉపశమనం కలిగిస్తుంది. పీఎఫ్ సొమ్ము ఉపసంహరించుకోవడానికి వారు ఆన్ లైన్ క్లెయిమ్ ను సమర్పించాల్సిన అవసరం ఉండదు. పీఎఫ్ డబ్బు కోసం ఎక్కువ రోజులు వేచి ఉండాల్సిన అవసరం కూడా ఉండదు. ఉద్యోగులు నేరుగా ఏటీఎంకు వెళ్లి పీఎఫ్ నిధులను ఉపసంహరించుకోవచ్చు.ఈపీఎఫ్ఓ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏటీఎం లాంటి లావాదేవీలను అనుమతించడానికి సిద్ధంగా ఉందని సీబీటీ సభ్యుడిని ఉటంకిస్తూ మనీకంట్రోల్ వార్తా సంస్థ పేర్కొంది. ఏటీఎం ఉపసంహరణకు పరిమితి ఉంటుందని, అయితే దీనిపై ఇంకా చర్చ జరుగుతోందని ఆయన చెప్పనట్లుగా పేర్కొంది.ఈపీఎఫ్ఓ ఏటీఎం సదుపాయాన్ని ప్రారంభించడంపై బ్యాంకులతో పాటు ఆర్బీఐతో చర్చించినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈపీఎఫ్ఓ తన సభ్యులకు ప్రత్యేక కార్డును జారీ చేసే అవకాశం ఉందని, ఏటీఎంల నుండి తమ నిధులలో కొంత భాగాన్ని ఉపసంహరించుకునేందుకు వీలు కల్పిస్తుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.కాగా ప్రస్తుతం ఈపీఎఫ్ఓ కింద 7.8 కోట్ల మంది రిజిస్టర్డ్ సభ్యులు ఉన్నారు. వీరంతా కలిసి ఈపీఎఫ్వో దగ్గర రూ .28 లక్షల కోట్లకు పైగా డిపాజిట్ చేశారు. దాదాపు పదేళ్ల క్రితం 2014లో ఈపీఎఫ్ఓలో సభ్యులు 3.3 కోట్ల మంది ఉండగా వారి డిపాజిట్ల మొత్తం రూ.7.4 లక్షల కోట్లుగా ఉండేది. -
రేట్లు తగ్గించిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు
ప్రయివేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) తన రుణ రేట్లను తగ్గించినట్లు ప్రకటించింది. బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసిఎల్ఆర్) తో ముడిపడి ఉన్న రుణగ్రహీతలకు ఉపశమనం కలిగించింది. ఈ తగ్గింపుతో వివిధ రుణ కాలపరిమితులలో చాలా మంది కస్టమర్లకు ఈఎంఐలను తగ్గిస్తుందని భావిస్తున్నారు.ఎంపిక చేసిన కాలపరిమితులపై బ్యాంక్ తన ఎంసీఎల్ఆర్ను 15 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. సవరణ తరువాత, రుణ వ్యవధిని బట్టి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎంసిఎల్ఆర్ ఇప్పుడు 8.40 శాతం నుండి 8.65 శాతం వరకు ఉంటుంది. గతంలో ఈ రేట్లు 8.55 శాతం నుంచి 8.75 శాతం వరకు ఉండేవి.తగ్గింపు ఇలా..ఓవర్నైట్ ఎంసీఎల్ఆర్ 8.55 శాతం నుంచి 8.45 శాతానికి తగ్గుముఖం పట్టగా, నెల రోజుల వ్యవధి రేటు 8.40 శాతానికి పడిపోయింది. మూడు నెలల రేటును 15 బేసిస్ పాయింట్లు తగ్గించి 8.45 శాతానికి తగ్గించారు. ఆరు నెలలు, ఏడాది ఎంసీఎల్ఆర్ రేట్లు ఇప్పుడు 8.55 శాతంగా ఉన్నాయి. దీర్ఘకాలానికి రెండేళ్ల రేటు 8.60 శాతం, మూడేళ్ల రేటు 8.65 శాతంగా ఉంది.ఎంసీఎల్ఆర్ అంటే..మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్ లేదా ఎంసిఎల్ఆర్ అనేది రుణం కోసం బ్యాంకు వసూలు చేయగల కనీస వడ్డీ రేటు. ఇది చాలా గృహ, వ్యక్తిగత, వ్యాపార రుణాలకు ఆధారంగా పనిచేస్తుంది. 2016 లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన ఎంసిఎల్ఆర్ రుణగ్రహీతలకు బ్యాంకు నిధుల వ్యయం కంటే తక్కువ ఛార్జీలు వసూలు చేయవద్దని నిర్ధారిస్తుంది.ఈఎంఐలు తగ్గే అవకాశంఈ సవరణ తరువాత ఎంసిఎల్ఆర్తో అనుసంధానించిన గృహ, వ్యక్తిగత రుణగ్రహీతలు వారి ఈఎంఐలలో (EMI) తగ్గింపును చూసే అవకాశం ఉంది. రెపో రేటుతో ముడిపడి ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గృహ రుణ రేట్లు ప్రస్తుతం రుణగ్రహీత ప్రొఫైల్, రుణ రకాన్ని బట్టి 7.90 శాతం నుండి 13.20 శాతం వరకు ఉన్నాయి. -
బంగారం చెలగాటం.. డాలర్కు సంకటం!
ఈ భూమిపై బంగారాన్ని అన్నింటి కంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే.. ఆయనే రాబర్ట్ కియోసాకి. ప్రసిద్ధ పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత అయిన ఆయన ఎప్పుడూ బంగారం, వెండి లోహాలపై పెట్టుబడులు పెడుతుంటారు. తనను అనుసరించేవాళ్లనూ పెట్టమని ప్రోత్సహిస్తుంటారు.బంగారం ధర అంతకంతకూ పెరిగిపోతూ రోజుకో కొత్త గరిష్టాన్ని తాకుతోంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్) లో 10 గ్రాములకు రూ .1,22,780 జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయంగా ఔన్స్కు 4,000 డాలర్లను అధిగమించింది. దీంతో ఎప్పటిలాగే రాబర్ట్ కియోసాకి వెంటనే సోషల్ మీడియాలోకి వచ్చేశారు. విలువైన లోహాలుక, డిజిటల్ ఆస్తులపై తన బుల్లిష్ వైఖరిని పునరుద్ఘాటించారు."యూఎస్ డాలర్ అంతం?"నా బంగారం, వెండి, బిట్ కాయిన్, ఎథేరియం స్టాక్కు విలువ ఇంకా పెరుగుతోంది.యూఎస్ డాలర్ను నమ్ముకున్నోళ్లంతా నష్టబాధితులు.విజేతగా ఉండండి.జాగ్రత్త" అంటూ తన ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) లో పోస్ట్ చేశారు.బంగారం, వెండి, బిన్ కాయిన్ల విలువలు పెరిగిపోతున్న తరుణంలో రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) సాంప్రదాయ పొదుపులపై ఆయన సందేహం వ్యక్తం చేశారు. అమెరికా డాలర్లను పొదుపు చేసేవారు నష్టపోతారు అంటూ హెచ్చరించారు.ఇదీ చదవండి: ఈ దీపావళికి బంగారం కొనడం మరింత కష్టం!END of US Dollar? Adding to my gold, silver, Bitcoin, and Ethereum stack.Savers of US dollars are losers. Be a winner. Take care.— Robert Kiyosaki (@theRealKiyosaki) October 8, 2025 -
ఇన్స్టాగ్రామ్లో ‘మ్యాప్’ ఫీచర్
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వాడే ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ ఈరోజు నుంచి భారత మార్కెట్లో “మ్యాప్” ఫీచర్ను ప్రారంభించింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ చుట్టుపక్కల ఉన్న రెస్టారెంట్లు, కేఫేలు, టూరిస్టు ప్రదేశాలు, షాపింగ్ సెంటర్లు, ఈవెంట్లు మొదలైనవాటిని ప్రత్యక్షంగా మ్యాప్లో వీక్షించవచ్చు.ఈ ఫీచర్తో స్థానిక వ్యాపారాలకు పెద్ద ఎత్తున ప్రాచుర్యం లభించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యూజర్లు తమ పోస్టులు లేదా స్టోరీల్లో లొకేషన్ ట్యాగ్ చేస్తే — ఆ కంటెంట్ ఆ ప్రాంతానికి సంబంధించిన మ్యాప్ వ్యూలో కూడా ప్రత్యక్షమవుతుంది. దీని ద్వారా సమీప ప్రాంతాల్లో ఉన్న ఇతర యూజర్లు ఆ ప్రదేశాన్ని సులభంగా గుర్తించే అవకాశాలుంటాయి.ఈ ఫీచర్లో యూజర్లు లొకేషన్ ట్యాగ్లను పూర్తి నియంత్రణలో ఉంచవచ్చు. లొకేషన్ను పబ్లిక్గా, ఫ్రెండ్స్కి మాత్రమే లేదా ప్రైవేట్గా ఉంచే ఆప్షన్లు ఉంటాయి. 18 ఏళ్ల లోపు వయసున్న యూజర్ల ఖాతాల్లో లొకేషన్ డిఫాల్ట్గా ఆఫ్లో ఉంటుంది.భారతీయ యూజర్లలో లొకేషన్ ఆధారిత కంటెంట్ వినియోగం వేగంగా పెరుగుతోందని, అందుకే ఈ ఫీచర్ను ప్రత్యేకంగా ప్రారంభించినట్లు ఇన్స్టా వర్గాలు చెబుతున్నాయి. -
తెలంగాణ టి-ఫైబర్కు జాతీయ గుర్తింపు..
తెలంగాణ టి-ఫైబర్కు (Telangana T-Fiber ) జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2025లో టి-ఫైబర్ పైలట్ విలేజెస్ డిజిటల్ ఇన్క్లూజన్ విజయానికి ప్రశంసలు పొందాయి. కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ చొరవను "ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్" గా అభివర్ణించారు. గ్రామీణ బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీకి వినూత్న విధానాన్ని అవలంభిస్తున్నందుకు తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబును అభినందించారు.ఈ సందర్బంగా కేంద్ర సమాచార శాఖ మంత్రి అధ్యక్షతన జరిగిన ఐటీ మంత్రుల రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. భారత్ నెట్ అమలును వేగవంతం చేయడానికి, రైట్ ఆఫ్ వే (ఆర్ఓడబ్ల్యూ) సవాళ్లను పరిష్కరించడానికి, జాతీయ, రాష్ట్ర డిజిటల్ ఆస్తులను రక్షించడానికి సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్ వర్క్ లను బలోపేతం చేయడానికి కేంద్రంతో భాగస్వామ్యం కుదుర్చుకోవడానికి తెలంగాణ నిబద్ధతను పునరుద్ఘాటించారు.ప్రతి ఇల్లు, సంస్థ, వ్యాపారాలకు హై-స్పీడ్ కనెక్టివిటీని అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రధాన బ్రాడ్ బ్యాండ్ చొరవ అయిన టి-ఫైబర్ కింద సాధించిన పురోగతిని ఆయన వివరింంచారు. మంత్రితో పాటు టి-ఫైబర్ మేనేజింగ్ డైరెక్టర్ వేణు ప్రసాద్ పన్నీరు కూడా ఉన్నారు. పైలట్ గ్రామాల నుంచి రాష్ట్ర విజయగాథలు, డేటా-ఆధారిత ఫలితాలను ఆయన వివరించారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025 (India Mobile Congress- IMC) అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 11 వరకు నాలుగు రోజులపాటు జరగనుంది. డిజిటల్ టెక్నాలజీ, టెలికాం ఆవిష్కరణలకు భారతదేశ ప్రధాన వేదికగా విధాన రూపకర్తలు, పరిశ్రమ నాయకులు, ప్రపంచ నిపుణులను ఒకచోట చేర్చింది. -
వెయ్యి కొత్త ఉద్యోగాలు.. డిజిటల్ ఇంజినీరింగ్ కంపెనీ ప్రకటన
గ్లోబల్ డిజిటల్ ఇంజినీరింగ్ కంపెనీ నగారో వచ్చే 12–18 నెలల్లో 1,000 మంది పైగా నిపుణులను నియమించుకునే యోచనలో ఉంది. హైదరాబాద్, బెంగళూరు, పుణె సహా కీలక హబ్లలో ఈ నియామకాలు చేపట్టనున్నట్లు సంస్థ తెలిపింది. కంపెనీకి ప్రస్తుతం భారత్లో 13,000 మంది ఉద్యోగులు ఉన్నట్లు నగారో సీఈవో మానస్ హుమాన్ వివరించారు.స్టార్టప్లు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) హైరింగ్ పెరగడంతో మార్కెట్లో నిపుణుల కొరత నెలకొందని, అయితే అంతర్జాతీయ అనిశ్చితులపై ఆందోళన వల్ల ఉద్యోగాలు మారే విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నట్లు మానస్ తెలిపారు. అంతర్జాతీయంగా వాణిజ్య, టారిఫ్లపరమైన అనిశ్చితులు ప్రభావం చూపుతున్నాయని వివరించారు. -
నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. మెరిసిన ఐటీ షేర్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Market ) బుధవారం నష్టాల్లో ముగిశాయి. అస్థిర సెషన్ తరువాత బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు ప్రారంభ లాభాలు కరెక్షన్కు గురై నష్టాల్లో స్థిరపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 153.09 పాయింట్లు లేదా 0.19 శాతం క్షీణించి 81,773.66 వద్ద స్థిరపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 62.15 పాయింట్లు లేదా 0.25 శాతం నష్టపోయి 25,046.15 వద్ద ముగిసింది.విస్తృత మార్కెట్లో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.73 శాతం, 0.52 శాతం నష్టపోయాయి. సెక్టోరల్ ఫ్రంట్ లో, నిఫ్టీ ఐటీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ మినహా మిగతా అన్ని రంగాలు నష్టాల్లో ముగిశాయి.ఇన్ఫోసిస్, టీసీఎస్, కోఫోర్జ్, ఎల్టీఐ మైంట్రీ, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1.51 శాతం లాభపడ్డాయి. మరోవైపు నిఫ్టీ రియాల్టీ, మీడియా, ఆటో, ఎనర్జీ 1 శాతానికి పైగా నష్టపోయాయి. నిఫ్టీ బ్యాంక్, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫార్మా, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ కూడా 1 శాతం వరకు పడిపోయాయి.సెన్సెక్స్ లో 30 షేర్లకు గాను 21 షేర్లు పడిపోయాయి. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారత్ ఎలక్ట్రానిక్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ట్రెంట్, సన్ ఫార్మా టాప్ లూజర్స్ గా నిలిచాయి. టైటాన్, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా టాప్ గెయినర్లుగా నిలిచాయి. -
TCS: వాళ్లందరికీ కనీసం ఆర్నెళ్ల జీతం..
దేశీయ ఐటీ సంస్థ టీసీఎస్ (TCS) ఇటీవల భారీ లేఆఫ్ ప్రణాళికను (TCS Layoff)ప్రకటించింది. సుమారు 12,000 మందిని తొలగిస్తున్నట్లు తెలిపింది. ఈ తొలగింపులతో ప్రభావితమవుతున్న ఉద్యోగులకు వివిధ స్థాయిల సెవెరెన్స్ ప్యాకేజీని అమలు చేస్తోంది. ఏఐ, డేటా, సైబర్ సెక్యూరిటీలో కంపెనీ పెట్టుబడులను పెంచుతున్న నేపథ్యంలో సిబ్బంది పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. ఈ నిర్ణయం సోషల్ మీడియాలో కలకలం రేపింది.సంస్థలో ఎవరి నైపుణ్యాలైతే పనికిరావో లేదా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం పొందడానికి అవకాశం లేదో అలాంటి వారిని టీసీఎస్ తొలగిస్తోంది. వీరందరికీ మూడు నెలల నోటీసు వ్యవధి చెల్లింపుతో పాటు ఆరు నెలల నుండి ఒక సంవత్సరం జీతాన్ని సెవెరెన్స్ ప్యాకేజీ కింద అందిస్తోంది. ఇది సంస్థలో వారి సర్వీస్ కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అయితే అందరికీ కనీసం ఆరు నెలల వేతనాన్ని ఇవ్వాలని నిర్ణయించారు.ప్రభావిత ఉద్యోగులు మరో ఉద్యోగం వెతుక్కోవడంలో సహాయపడటానికి, టీసీఎస్ మూడు నెలల వరకు అవుట్ ప్లేస్ మెంట్ ఏజెన్సీ ఫీజులను అందిస్తోంది. అదే జూనియర్ అసోసియేట్లకు అయితే ఇంకొన్ని నెలలు ఈ సహాయాన్ని అందించనుందని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది. ఇక అలాగే ఉద్యోగులకు అందించే మానసిక ఆరోగ్య సాయం టీసీఎస్ కేర్స్ను కూడా కొన్నాళ్ల పాటు వారికి కొనసాగించనుంది.బెంచ్లో ఉన్నవారికి మూణ్నెళ్ల జీతమే..బెంచ్లో ఉండి లేదా ఎనిమిది నెలలకు పైగా వర్క్ కేటాయించని ఉద్యోగులు తొలగింపునకు గురైతే వారు ప్రామాణిక మూడు నెలల నోటీసు వ్యవధి వేతనాన్ని మాత్రమే పొందుతారు. రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్నవారికి, పదవీ విరమణ ప్రయోజనాలు, బీమాకు పూర్తి ప్రాప్యతతో ముందస్తు రిటైర్మెంట్ ఎంపికను టీసీఎస్ అందించింది. అలాంటి వారు మిగిలిఉన్న సర్వీస్ కాలాన్ని బట్టి ఆరు నెలల నుండి రెండేళ్ల వరకు జీతాన్ని సెవెరెన్స్ ప్యాకేజీగా అందుకుంటారు.ఇదీ చదవండి: దీపావళి ధమాకా.. ఐఫోన్పై రూ.55 వేల డిస్కౌంట్! -
జాబ్లో చేరిన 4 నెలల్లోనే రూ.1లక్ష వేతనం పెంపు
వేతనాల పెంపు కోసం చాలా మంది ఉద్యోగులు సంవత్సరాల తరబడి ఎదురుచూస్తుంటారు. కానీ ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ కేవలం నాలుగు నెలల్లోనే భారీ వేతన పెంపును అందుకున్నాడు. కంపెనీలో చేరినప్పుడు తన సీటీసీ(CTC)లో 100% పెరిగిన కొద్ది నెలలకే మరోసారి వేతన పెంపు అందుకున్నాడు. ఈమేరకు రెడ్డిట్లో చేసిన పోస్ట్ కాస్తా వైరల్గా మారింది.పోస్ట్లోని వివరాల ప్రకారం..‘నేను ప్రముఖ కంపెనీలో ఇటీవలే చేరాను. నాకు 7.2 ఏళ్ల పని అనుభవం ఉంది. అంతకుముందు పని చేసిన కంపెనీతో పోలిస్తే కొత్త సంస్థ 100 శాతం సీటీసీను పెంచింది. నేను ఇంటర్వ్యూలో అడిగిన దానికంటే ఎక్కువగానే వేతనం ఇచ్చారు. దాంతో నాకు ఏటా రూ.31 లక్షలు ఆఫర్ చేశారు. కొత్త సంస్థలో చేరి నాలుగు నెలలైంది. ఇటీవల అప్రైజల్స్ వచ్చాయి. అందులో ఆశ్చర్యంగా నాకు మరో లక్ష పెంచారు. దాంతో నా వార్షిక వేతనం రూ.32 లక్షలైంది’ అని రాసుకొచ్చారు.ఈ వ్యవహారంపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘ఇది అసాధారణమైనది కాదు. మంచి స్టార్టప్ కంపెనీలు నైపుణ్యాలున్న వారి కోసం ఇలా చేస్తాయి’ అని ఒకరు తెలిపారు. మరోవ్యక్తి స్పందిస్తూ..‘కేవలం 5 నెలల్లోనే నేను 16% పెంపు పొందాను’ అని చెప్పారు.ఇదీ చదవండి: అమెరికా పొమ్మంటూంటే.. ఇవి రమ్మంటున్నాయి! -
వయసు తక్కువే కానీ.. సంపదలో రారాజులు
భారతదేశ స్టార్టప్, వ్యాపార రంగంలో యువతరం శక్తి అద్భుతమైన ప్రభావాన్ని చూపుతోంది. హురున్ రిచ్ లిస్ట్ 2025 విడుదల చేసిన జాబితా ప్రకారం భారత్లో అత్యంత ధనిక యువ వ్యాపారవేత్తలు దేశవ్యాప్తంగా ఆదరణ పొందుతున్న ఎన్నో ఆవిష్కరణలు చేస్తున్నారు. ఆర్థికంగా ఎదుగుతున్నారు. సాంకేతికత, ఫిన్టెక్, సైబర్ సెక్యూరిటీ, నిర్మాణ రంగాలు.. వంటి వాటిలో తమదైన ముద్ర వేస్తున్నారు.అతి పిన్న వయస్కుడిగా కైవల్య వోహ్రా రికార్డుకైవల్య వోహ్రా కేవలం 22 ఏళ్ల వయస్సులోనే రూ.4,480 కోట్ల నికర విలువతో భారతదేశంలోని అతి పిన్న వయస్కుడైన బిలియనీర్గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న తన ‘జెప్టో’ స్టార్టప్ నిమిషాల్లో కిరాణా సామాగ్రిని డెలివరీ చేయడంలో నగర జీవన విధానాన్ని మార్చేసింది. జెప్టో సహ-వ్యవస్థాపకుల్లో మరొకరు ఆదిత్ పలిచా (23). రూ.5,380 కోట్ల సంపదతో ముందుకు సాగుతున్నారు.రితేష్ అగర్వాల్ (31): ప్రిజం (OYO) వ్యవస్థాపకుడు. రూ.14,400 కోట్ల నికర విలువతో గ్లోబల్ ఆతిథ్య రంగంలో తనదైన ముద్ర వేశారు. భారతీయ స్టార్టప్లను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన దార్శనికత ముఖ్యమైనది.అరవింద్ శ్రీనివాస్ (31): శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా ఉన్న పెర్ప్లెక్సిటీ ద్వారా రూ.21,190 కోట్లు సేకరించి గ్లోబల్ టెక్ మార్కెట్లో భారతదేశ ప్రతిభను తెలియజేశారు.త్రిష్నీత్ అరోరా (30): చండీగఢ్కు చెందిన ఈయన తన సైబర్ సెక్యూరిటీ సంస్థ టాక్ సెక్యూరిటీ ద్వారా రూ.1,820 కోట్ల సంపదను ఆర్జించారు.శాశ్వత్ నక్రానీ (27): ఫిన్టెక్ ప్లాట్ఫామ్ భారత్పే సహ వ్యవస్థాపకుడిగా రూ.1,340 కోట్ల నికర విలువతో చిన్న వ్యాపారాల చెల్లింపులను డిజిటలైజ్ చేయడంలో ముందంజలో ఉన్నారు.రోహన్ గుప్తా & ఫ్యామిలీ (26): ఎస్జీ ఫిన్సర్వ్ ద్వారా రూ.1,140 కోట్ల సంపదతో డిజిటల్ ఫైనాన్షియల్ సేవలను ఆధునీకరిస్తున్నారు.హార్దిక్ కొఠియా అండ్ ఫ్యామిలీ (31): సూరత్ కేంద్రంగా ఉన్న రేజోన్ సోలార్ ద్వారా రూ.3,970 కోట్ల సంపదతో పునరుత్పాదక ఇంధన పరిష్కారాలపై దృష్టి సారించి పర్యావరణ అనుకూల ఆవిష్కరణ లాభదాయకతను నిరూపించారు.హర్షారెడ్డి పొంగులేటి (31): హైదరాబాద్కు చెందిన ఈయన రాఘవ కన్స్ట్రక్షన్స్ ద్వారా రూ.1,300 కోట్ల నికర విలువతో రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల రంగంలో భారతదేశ వృద్ధికి దోహదపడుతున్నారు.ఇదీ చదవండి: అమెరికా పొమ్మంటూంటే.. ఇవి రమ్మంటున్నాయి! -
దేశంలో 10 ప్రీమియం సర్వీస్ సెంటర్లు ప్రారంభం
భారతదేశంలో కస్టమర్ సపోర్ట్, మేనేజ్మెంట్ను మెరుగుపరచడానికి షావోమి ప్రధాన నగరాల్లో 10 ప్రీమియం సర్వీస్ సెంటర్లను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఇది భారత మార్కెట్ పట్ల కంపెనీ దీర్ఘకాలిక నిబద్ధతను బలోపేతం చేస్తుందని చెప్పింది. కంపెనీ తీసుకున్న నిర్ణయంలో భాగంగా బెంగళూరు, హైదరాబాద్, కొచ్చిన్, చెన్నై, కోల్కతా, ఢిల్లీ, జైపూర్, ముంబై, పుణె, అహ్మదాబాద్ల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే బెంగళూరు, హైదరాబాద్, కొచ్చిన్లో కేంద్రాలు ప్రాథమికంగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.భవిష్యత్తులో దేశవ్యాప్తంగా 100 ప్రీమియం సర్వీస్ సెంటర్లకు విస్తరించాలని సంస్థ యోచిస్తోంది. ఈ సందర్భంగా షావోమి ఇండియా సీఈవో సుధీన్ మాథుర్ మాట్లాడుతూ..‘కంపెనీ ఉత్పత్తులను తయారు చేసి విక్రయించడం కంటే మమ్మల్ని విశ్వసించే వ్యక్తులతో శాశ్వత సంబంధాలను సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. అందులో భాగంగానే ఈ ప్రీమియం సర్వీస్ సెంటర్లను ప్రారంభించాని నిర్ణయించాం’ అని చెప్పారు.ఇదీ చదవండి: అమెరికా పొమ్మంటూంటే.. ఇవి రమ్మంటున్నాయి! -
వద్దు పొమ్మంటే ఎవరికి నష్టం..
అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాలను కఠినతరం చేయడం లేదా ఉన్న ఉద్యోగులను తిరిగి పంపించే నిర్ణయాలు స్వల్పకాలికంగా అమెరికన్ ఉద్యోగులకు మేలు చేస్తాయనే వాదనలున్నాయి. కానీ, దీర్ఘకాలంలో ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు, ప్రపంచంలో ఆ దేశ పోటీతత్వానికి తీవ్ర నష్టం కలిగిస్తాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. వలస వచ్చిన నిపుణులు (Immigrant professionals) అమెరికా ఆవిష్కరణకు మూల స్తంభాలుగా ఉన్నారు. పేటెంట్లు (Patents), సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం (STEM) రంగాల్లో గ్రాడ్యుయేట్లు, వెంచర్ క్యాపిటల్-ఫండ్ పొందిన సంస్థల్లో కీలక స్థానాల్లో విదేశీ నిపుణుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.వారంతా విరమించుకుంటే అమెరికన్ కంపెనీల్లో నైపుణ్యాల కొరత (Talent Crunch) ఏర్పడుతుంది. ముఖ్యంగా సాంకేతిక రంగంలో ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. దీని వలన ఆవిష్కరణ రేటు తగ్గి, ఉత్పాదకత దెబ్బతింటుంది. కొన్ని అంచనాల ప్రకారం, కఠినమైన వలస విధానాలు దీర్ఘకాలంలో అమెరికా స్థూల జాతీయోత్పత్తి (GDP)ని గణీనయంగా తగ్గించవచ్చు.శ్రామిక శక్తి పెరుగుదలపై ప్రతికూలతఅమెరికన్ స్థానిక జనాభా వయసు పెరుగుతున్న నేపథ్యంలో గత 20 ఏళ్లుగా శ్రామిక శక్తి వృద్ధికి (Labor Force Growth) వలసదారులు ప్రధాన చోదక శక్తిగా ఉన్నారు. 2000 నుంచి 2022 మధ్య 25-54 ఏళ్ల వయసున్న శ్రామికుల్లో దాదాపు మూడు వంతుల పెరుగుదలకు విదేశీయులే కారణం. కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాలు శ్రామిక శక్తి వృద్ధిని తగ్గిస్తాయి. ఇది ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించే సామర్థ్యాన్ని తీవ్రంగా పరిమితం చేస్తుంది.పోటీ దేశాలకు లాభంఅమెరికాలో ఉద్యోగం కోల్పోయిన లేదా ప్రవేశం దొరకని అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులు (Highly Skilled Professionals) వేరే మార్గాలను అన్వేషిస్తారు. ఈ సమయంలో కెనడా, జర్మనీ వంటి దేశాలు వీరికి స్వాగతం పలుకుతున్నాయి. అమెరికా కోల్పోయిన ఈ మేధాసంపత్తి (Talent) ఇతర దేశాలకు బదిలీ అవుతుంది. తద్వారా ఆ దేశాల ఆవిష్కరణ, ఆర్థిక వ్యవస్థలు బలోపేతం అవుతాయి. అమెరికాను కాదని ఇతర దేశాలకు వెళ్లే వలసదారులు అక్కడ వ్యాపారాలను స్థాపిస్తారు. వినియోగాన్ని పెంచుతారు.ఇదీ చదవండి: అమెరికా పొమ్మంటూంటే.. ఇవి రమ్మంటున్నాయి! -
అమెరికా పొమ్మంటూంటే.. ఇవి రమ్మంటున్నాయి!
అమెరికా హెచ్1బీ వీసాపై పెంచిన ఫీజులు, ‘యూఎస్ ఫస్ట్’ వైఖరితో అక్కడ ఉన్న ఇతర దేశాలకు చెందిన చాలామంది ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. దాంతోపాటు అమెరికా వెళ్లాలని భావిస్తున్న ఇతర దేశాల్లోని వారు ఆలోచనలో పడ్డారు. ఈనేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అనేక ఇతర అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు తమ శ్రామిక శక్తి లోటును భర్తీ చేయడానికి, ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేయడానికి నియామకాలను ముమ్మరం చేస్తున్నాయి.నైపుణ్యం కలిగిన వారికి అవకాశాలు..కెనడాఅత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానం కెనడా తన టెంపరరీ ఫారిన్ వర్కర్ ప్రోగ్రామ్ (TFWP) ద్వారా గ్లోబల్ టాలెంట్ స్ట్రీమ్ (Global Talent Stream - GTS) విధానంలో నిపుణులను వేగంగా రిక్రూట్ చేసుకుంటోంది. ఎక్స్ప్రెస్ ఎంట్రీ (Express Entry), గ్లోబల్ టాలెంట్ స్ట్రీమ్ (GTS), ప్రావిన్షియల్ నామినీ ప్రోగ్రామ్స్ (PNP) వంటి విధానాలు అనుసరిస్తోంది. ముఖ్యంగా IT/టెక్నాలజీ (సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, నెట్వర్క్ టెక్నీషియన్లు), ఇంజినీరింగ్ (ఎలక్ట్రికల్, సివిల్), ఆరోగ్యం (నర్సులు, డాక్టర్లు), నిర్మాణం (Construction) వంటి విభాగాల్లో నియామకాలు చేపడుతున్నారు.కెనడా GTS ద్వారా అర్హతగల అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగుల వర్క్ పర్మిట్ దరఖాస్తులను కేవలం రెండు వారాల్లో ప్రాసెస్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది అత్యంత వేగవంతమైన ప్రక్రియ.జర్మనీయూరప్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీ తన కార్మిక లోటును పూడ్చుకోవడానికి చురుగ్గా వలసదారులను ఆకర్షిస్తోంది. అందుకోసం ఈయూ బ్లూ కార్డ్ (EU Blue Card), ఎంప్లాయ్మెంట్ వీసా, జాబ్ సీకర్ వీసా, ఆపర్చునిటీ కార్డ్ (Opportunity Card) పాలసీలను అనుసరిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా ఇంజినీరింగ్ (మెకానికల్, ఆటోమోటివ్, ఎలక్ట్రికల్), IT (సాఫ్ట్వేర్ డెవలపర్లు, డేటా సైంటిస్టులు), ఆరోగ్యం (డాక్టర్లు, నర్సింగ్), ఫైనాన్స్ రంగాల్లో అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక్కడ ఉద్యోగం చేయాలంటే జర్మన్ భాషా నైపుణ్యం కలిగిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.ఆస్ట్రేలియా (Australia)ఆస్ట్రేలియా పాయింట్స్-ఆధారిత (Points-based) వ్యవస్థను ఉపయోగిస్తుంది. నైపుణ్యాల కొరత ఉన్న ఉద్యోగాల జాబితాను క్రమం తప్పకుండా ప్రకటిస్తుంది. హెల్త్కేర్ (నర్సింగ్, ఇతర వైద్య నిపుణులు), IT, ఇంజినీరింగ్, నిర్మాణ రంగం(Construction Management)లో అవకాశాలున్నాయి. ఆస్ట్రేలియాలో కనీస వేతనంగా భారీ మొత్తాన్ని చెల్లిస్తారు.యూకే (United Kingdom)యూకే కూడా పాయింట్స్-ఆధారిత ఇమ్మిగ్రేషన్ వ్యవస్థకు మారింది. నైపుణ్యం కలిగిన కార్మికులకు (Skilled Workers), ఆరోగ్య కార్యకర్తలకు వీసా ప్రక్రియను సులభతరం చేసింది. IT, హెల్త్కేర్ (నర్సులు, వైద్య నిపుణులు), విద్యలో అవకాశాలున్నాయి.స్వీడన్ (Sweden)స్వీడన్ అధిక నాణ్యత గల జీవన ప్రమాణాలు, బలమైన సామాజిక భద్రత, వర్క్-లైఫ్ సమతుల్యత (Work-Life Balance)కు ప్రసిద్ధి చెందింది. టెక్నాలజీ, హెల్త్కేర్, ఇంజినీరింగ్, పునరుత్పాదక శక్తి (Renewable Energy) రంగాల్లో భారీగా అవకాశాలున్నాయి. నైపుణ్యం కలిగిన నిపుణులకు వర్క్ పర్మిట్ ప్రక్రియ చాలా సరళంగా ఉంటుంది.నెదర్లాండ్స్ (Netherlands)నెదర్లాండ్స్ ఒక అంతర్జాతీయ వాణిజ్య కేంద్రం. హై-టెక్నాలజీ, ఆవిష్కరణలకు ప్రసిద్ధి చెందింది. హైలీ స్కిల్డ్ మైగ్రెంట్ (HSM) వీసా, ఈయూ బ్లూ కార్డ్ పాలసీలు పాటిస్తుంది. IT, ఫైనాన్స్, ఇంజినీరింగ్, హెల్త్కేర్, లాజిస్టిక్స్ (Logistics) వంటి రంగాల్లో ఉద్యోగ అవకాశాలున్నాయి.సింగపూర్, యూఏఈఆసియాలో ఈ దేశాలు ఉన్నత స్థాయి జీతాలు, తక్కువ పన్నులు, శక్తివంతమైన వ్యాపార వాతావరణాన్ని అందిస్తున్నాయి. సింగపూర్లో ఫైనాన్స్, ఫిన్టెక్ (FinTech), ఐటీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇంజినీరింగ్ విభాగాల్లో కొలువులున్నాయి. ఇక్కడ జారీ చేసే ఉద్యోగ పాస్లు (Employment Passes) అత్యంత నైపుణ్యం కలిగిన వారికి మార్గాన్ని సుగమం చేస్తాయి. యూఏఈ (దుబాయ్, అబుదాబి)లో నిర్మాణ నిర్వహణ, పర్యాటకం, రియల్ ఎస్టేట్, ఐటీ, ఎనర్జీ వంటి విభాగాల్లో అవకాశాలున్నాయి. ఇక్కడ అందించే గోల్డెన్ వీసాల (Golden Visas) ద్వారా దీర్ఘకాల నివాస అవకాశాలను పొందవచ్చు.ఇదీ చదవండి: పసిడి ప్రియుల నడ్డి విరిగినట్టే! పెరిగిన తులం ధర -
పసిడి ప్రియుల నడ్డి విరిగినట్టే! పెరిగిన తులం ధర
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. అయితే మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఉద్యోగం చేస్తూనే కోట్లు సంపాదించే మార్గాలు..
ఉద్యోగులకు కోటీశ్వరులు కావాలనే ఆశ ఉంటుంది. కానీ సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల చాలామంది తమ కలను నెరవేర్చుకోలేకపోతున్నారు. జీతం తక్కువగా ఉన్నా సరైన ప్రణాళిక, క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి విధానాన్ని అనుసరిస్తే ప్రైవేట్ ఉద్యోగులు కూడా దీర్ఘకాలంలో కోటీశ్వరులు (Crorepati) కావడం సాధ్యమే.బడ్జెటింగ్, పొదుపునెలవారీ ఖర్చులను లెక్కించి, బడ్జెట్ వేసుకోవడం తప్పనిసరి. వచ్చిన జీతంలో కనీసం 20% నుంచి 30% వరకు పొదుపు చేయడానికి ప్రయత్నించాలి. మీరు ఎంత త్వరగా పొదుపు చేయడం ప్రారంభిస్తే అంత త్వరగా మీ లక్ష్యాన్ని చేరుకోవచ్చు. అధిక వడ్డీ ఉండే వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డు అప్పులను వీలైనంత త్వరగా చెల్లించాలి. ఎందుకంటే అధిక వడ్డీ మీ సంపాదనలో చాలా భాగాన్ని తగ్గిస్తుంది.పెట్టుబడి ఎంపికలుకోటీశ్వరులు కావాలంటే కేవలం పొదుపు చేస్తే సరిపోదు. ఆ పొదుపును పెంచే మార్గాల్లో పెట్టుబడి పెట్టాలి. ఈ క్రమంలో రిస్క్ (Risk), రాబడి(Returns)ని దృష్టిలో ఉంచుకోవాలి. దీర్ఘకాలంలో అత్యధిక రాబడి ఇచ్చే అవకాశం ఉన్న పెట్టుబడి మార్గాల్లో స్టాక్ మార్కెట్, ఈక్విటీ మార్కెట్లు కీలకంగా ఉన్నాయి. ప్రైవేట్ ఉద్యోగులకు SIP ఒక ఉత్తమమైన మార్గం. ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని మంచి పనితీరు కనబరుస్తున్న ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం ద్వారా మార్కెట్ ఒడిదుడుకులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.ఉదాహరణ: మీరు నెలకు రూ.10,000 చొప్పున 25 సంవత్సరాలు SIP చేస్తే సగటున 12% రాబడితో దాదాపు రూ.1.89 కోట్లు సంపాదించవచ్చు. చిన్న మొత్తంలో క్రమంగా పెట్టుబడి పెట్టి పెద్ద సంపదను సృష్టించడానికి ఇది సహాయపడుతుంది.నేరుగా స్టాక్స్లో పెట్టుబడి: మీకు మార్కెట్ గురించి లోతైన అవగాహన ఉంటే మంచి ప్రాథమిక అంశాలున్న (fundamentally strong) పెద్ద కంపెనీల బ్లూ-చిప్ షేర్లలో పెట్టుబడి పెట్టవచ్చు. అయితే ఇందులో నష్టభయం ఉంటుందని గమనించాలి.గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లు (Gold Investments)ఆర్థిక అనిశ్చితి సమయంలో బంగారం ఒక సురక్షితమైన పెట్టుబడిగా పరిగణించబడుతుంది. మొత్తం పెట్టుబడిలో కొంత భాగాన్ని (సుమారు 5% - 10%) బంగారంలో పెట్టవచ్చు. నేరుగా బంగారం కొనుగోలు చేయడం కంటే గోల్డ్ ఈటీఎఫ్ల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు.ముఖ్యమైన పెట్టుబడి సూత్రాలు‘వడ్డీపై వడ్డీ’ అనే సూత్రాన్ని సమర్థంగా ఉపయోగించుకోవడానికి వీలైనంత త్వరగా పెట్టుబడి ప్రారంభించాలి. మీరు ఎంత ఎక్కువ కాలం పెట్టుబడిని కొనసాగిస్తే మీ డబ్బు అంత వేగంగా పెరుగుతుంది.పెట్టుబడి మొత్తాన్ని ఒకే ఆస్తిలో కాకుండా స్టాక్స్, గోల్డ్, రియల్ ఎస్టేట్ వంటి వేర్వేరు మార్గాల్లో విభజించాలి. ఒక రంగంలో నష్టం వచ్చినా మరొక రంగం ఆ నష్టాన్ని భర్తీ చేయగలుగుతుంది.మీరు ఎంచుకున్న SIP లేదా ఇతర పెట్టుబడిని నిరంతరాయంగా కొనసాగించాలి. మార్కెట్ తగ్గినా లేదా పెరిగినా నెలవారీ పెట్టుబడిని ఆపకూడదు.ఏటా జీతం పెరిగినప్పుడల్లా మీ పెట్టుబడి మొత్తాన్ని కూడా కొంత పెంచాలి. ఇది మీ లక్ష్యాన్ని త్వరగా చేరుకోవడానికి సహాయపడుతుంది.కోటీశ్వరులు అవ్వడం ఒక రాత్రిలో జరిగేది కాదు. ఇది సమయం, క్రమశిక్షణ, సరైన పెట్టుబడి నిర్ణయాల కలయిక. మీ ప్రస్తుత జీతం ఎంత ఉన్నా దీర్ఘకాలిక పెట్టుబడి ప్రణాళికను అనుసరిస్తే మీరు తప్పకుండా ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోగలరు.ఇదీ చదవండి: కేంద్రం చెంతకు పంచాయితీ! -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:42 సమయానికి నిఫ్టీ(Nifty) 71 పాయింట్లు పెరిగి 25,179కు చేరింది. సెన్సెక్స్(Sensex) 267 పాయింట్లు పుంజుకొని 82,209 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
అంబుడ్స్మన్ స్కీమ్ విస్తరణ
రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) పరిధిలోకి రాష్ట్ర సహకార బ్యాంకులు, కేంద్ర సహకార బ్యాంకులు చేరనున్నాయి. ఇందుకు 2021 ఏకీకృత అంబుడ్స్మన్ పథకం(ఐవోఎస్)లోకి వీటిని చేరుస్తూ ఆర్బీఐ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో నవంబర్ 1నుంచి రూ.50 కోట్ల డిపాజిట్ పరిమాణంగల అన్ని వాణిజ్య బ్యాంకులతోపాటు.. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకులు, కేంద్ర సహకార బ్యాంకులు, షెడ్యూల్డ్ ప్రైమరీ(అర్బన్) సహకార బ్యాంకులు, నాన్షెడ్యూల్డ్ ప్రైమరీ(అర్బన్) సహకార బ్యాంకులకు ఏకీకృత అంబుడ్స్మన్ స్కీమ్ వర్తించనుంది.కనీసం రూ. 100 కోట్లు అంతకుమించిన ఆస్తులు కలిగిన అన్ని నాన్బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ)లనూ పథకం కవర్ చేయనుంది. అయితే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలను ఈ పథకం నుంచి మినహాయింపునివ్వగా.. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలను చేర్చింది. ఈ ఆర్బీఐ ఐవోఎస్ను 2021 నవంబర్లో ప్రవేశపెట్టింది. అంబుడ్స్మన్ అనేది బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, ఇతర నియంత్రిత సంస్థల వినియోగదారుల కోసం కేంద్రీకృత ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ. క్రెడిట్ రిస్క్లో సవరణబ్యాంకుల క్రెడిట్ రిస్క్ నిబంధనలను సవరించేందుకు ఆర్బీఐ తాజాగా ప్రతిపాదించింది. సంభవించిన నష్టాల ఆధారంగా ప్రొవిజనింగ్ చేపట్టేందుకు ప్రస్తుతం బ్యాంకులను ఆర్బీఐ నిబంధనలు అనుమతిస్తున్నాయి. వీటిస్థానే అంచనా రుణ నష్టాల ఆధారిత ప్రొవిజనింగ్కు వీలు కల్పించే విధంగా ఆర్బీఐ నిబంధనల సవరణకు ప్రతిపాదించింది. తద్వారా క్రెడిట్ రిస్క్ నిర్వహణా విధానాలను మరింత పటిష్టం చేయనుంది. అంతేకాకుండా వివిధ ఫైనాన్షియల్ సంస్థలను పోల్చి చూడటంలో మరిన్ని అవకాశాలకు తెరతీయనుంది. 2025 ఆర్బీఐ మార్గదర్శకాలు పేరుతో అంతర్జాతీయంగా అనుమతించిన నిబంధనలు, అకౌంటింగ్ ప్రమాణాలకు అనుగుణంగా తాజా ముసాయిదాను రూపొందించింది. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, దేశవ్యాప్త ఫైనాన్షియల్ సంస్థలు– అసెట్ క్లాసిఫికేషన్, ప్రొవిజనింగ్ అండ్ ఇన్కమ్ రికగ్నిషన్ పేరుతో ముసాయిదాను విడుదల చేసింది.ఇదీ చదవండి: కేంద్రం చెంతకు పంచాయితీ! -
భారత్తో భాగస్వామ్యంపై ఖతార్ కంపెనీల్లో ఆసక్తి
భారత కంపెనీలతో భాగస్వామ్యానికి ఖతార్ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నట్టు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. కేవలం పెట్టుబడులకే పరిమితం కాకుండా, ఇతర దేశాల్లో ప్రాజెక్టులను భారత కంపెనీల భాగస్వామ్యంతో చేపట్టేందుకు ఉత్సాహంగా ఉన్నట్టు చెప్పారు. ఒక్క రోజు పర్యటన కోసం వ్యాపార ప్రతినిధి బృందంతో మంత్రి గోయల్ ఖతార్కు వచ్చిన సందర్భంగా మాట్లాడారు.ఖతార్కు చెందిన ఆల్ బలఘ్ ఎల్అండ్టీ భాగస్వామిగా ఉందన్న ఉదాహరణను ప్రస్తావించారు. ఈ ఇరు సంస్థలు కలసి ఖతార్లో ప్రాజెక్టులను పూర్తి చేశాయని, ఇతర దేశాల్లోనూ సంయుక్తంగా ప్రాజెక్టులు చేపట్టనున్నట్టు చెప్పారు. ఖతార్ ప్రభుత్వం మూడో పక్ష దేశాల్లో ప్రాజెక్టులపై దృష్టి పెట్టిందని, ఇదే విషయాన్ని తనకు చెప్పినట్టు పేర్కొన్నారు. ఖతారీ డెవలప్మెంట్బ్యాంక్ నిధులు సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. కనుక భారత కంపెనీలు ఈ అవశాలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఖతార్తో భారత ద్వైపాక్షిక వాణిజ్యం 2024–25లో 14.15 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం.అమెరికాతో ఒప్పందంపై చర్చలుప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై (బీటీఏ) అమెరికా–భారత్ మధ్య చర్చలు కొనసాగుతున్నాయని మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. నవంబర్ చివరికి చర్చలు ముగించాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు అన్ని అవకాశాలున్నట్టు చెప్పారు. తదుపరి విడత చర్చలు భౌతికంగా జరిగేందుకు ఉన్న అవకాశాలను తోసిపుచ్చలేదు. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వ షట్డౌన్ (మూసివేత)ను ఎదుర్కొంటున్నందున, తదుపరి దశ చర్చలు ఎలా, ఎక్కడ నిర్వహించేదీ చూడాల్సి ఉందన్నారు. నిధుల మంజూరునకు కాంగ్రెస్ ఆమోదం పొందలేకపోవడంతో అక్టోబర్ 1 నుంచి అమెరికా ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోవడం తెలిసిందే.ఇదీ చదవండి: కేంద్రం చెంతకు పంచాయితీ! -
బజాజ్ అలయెంజ్ పేరు మార్పు
డైవర్సిఫైడ్ ఫైనాన్షియల్ సర్వీసుల దిగ్గజం బజాజ్ ఫిన్సర్వ్ తాజాగా బీమా రంగ భాగస్వామ్య సంస్థలను రీబ్రాండింగ్ చేసింది. దీంతో ఇకపై బజాజ్ అలయెంజ్ జనరల్ ఇన్సూరెన్స్, బజాజ్ అలయెంజ్ లైఫ్ ఇన్సూరెన్స్.. బజాజ్ జనరల్, బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్గా సేవలు అందించనున్నాయి. ఈ ఏడాది మొదట్లో రెండు సంస్థలలోనూ భాగస్వామ్య కంపెనీ అలయెంజ్ ఎస్ఈకి గల 26 శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు బజాజ్ గ్రూప్ ఒప్పందం(ఎస్పీఏ) కుదుర్చుకుంది.ఈ ఒప్పందాన్ని అమలు చేయడంతో వీటిలో బజాజ్ గ్రూప్ వాటా ప్రస్తుతం 74 శాతం నుంచి 100 శాతానికి చేరనుంది. ఎస్పీఏకు అన్ని రకాల అనుమతులు లభించడంతో రెండు సంస్థలూ బజాజ్ గ్రూప్నకు పూర్తి అనుబంధ సంస్థలుగా అవతరించనున్నాయి. భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా బజాజ్ గ్రూప్ తొలుత వీటిలో కనీసం 6.1 శాతం వాటా కొనుగోలుని పూర్తి చేయవలసి ఉంటుంది. దీంతో అలయెంజ్ ప్రమోటర్ గుర్తింపును కోల్పోవడం ద్వారా ఇన్వెస్టర్గా మారనుంది.ఇదీ చదవండి: కేంద్రం చెంతకు పంచాయితీ! -
ఆవిష్కరణలను అణగదొక్కేలా నిబంధనలు ఉండకూడదు..
నిబంధనలు, నియంత్రణలనేవి కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేలా ఉండాలే తప్ప అణగదొక్కేలా ఉండకూడదని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. వాటిని అణగదొక్కే పరిస్థితి ఉంటే ఇంకో దగ్గరెక్కడో ఆవిష్కరణలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. నియంత్రణలనేవి సంస్థ ప్రాతిపదికగా కాకుండా కార్యకలాపాల ప్రాతిపదికన ఉండాలని సుబ్రహ్మణ్యం గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్లో పాల్గొన్న సందర్భంగా చెప్పారు.‘ఒకవేళ నేను బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తుంటే, నన్ను బ్యాంకరుగా పరిగణించి, దానికి తగ్గ నిబంధనలు వర్తింపచేయాలి. అదే ఏదైనా ఫండ్ను డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే, బ్యాంకరుగా కాకుండా ఫండ్ డిస్ట్రిబ్యూటరు నిబంధనలను వర్తింపచేయాలి’ అని ఆయన పేర్కొన్నారు. ఈ తరహా విధానంపై ఆర్థిక శాఖ, నియంత్రణ సంస్థలు లోతుగా చర్చిస్తున్నట్లు వివరించారు. మరోవైపు, జీఎస్టీ 2.0 తర్వాత, దీపావళికన్నా ముందే మరో విడత సంస్కరణలను ప్రకటించే అవకాశం ఉందని సుబ్రహ్మణ్యం చెప్పారు. నీతి ఆయోగ్ సభ్యుడు రాజీవ్ గౌబా సారథ్యంలోని కమిటీ ఇప్పటికే వీటికి సంబంధించిన నివేదికల తొలి సెట్ను సమర్పించినట్లు పేర్కొన్నారు. పొరుగుదేశాలతో పటిష్ట సంబంధాలు ఉండాలి..చైనాతో పాటు ఇతర పొరుగు దేశాలతో భారత్కి పటిష్టమైన వాణిజ్య సంబంధాలు ఉండాలని సుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డారు. మొత్తం యూరోపియన్ యూనియన్ వాణిజ్యంలో 50 శాతం భాగం.. అంతర్గతంగా ఆయా దేశాల మధ్యే జరుగుతుందని ఆయన చెప్పారు. భారత్ విషయానికొస్తే బంగ్లాదేశ్ 6వ అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగాను, టాప్ 10లో నేపాల్ ఉండేదని తెలిపారు. చైనా పెట్టుబడులపై ఆంక్షలు ఎత్తివేస్తారా అనే ప్రశ్నకు నేరుగా సమాధానం ఇవ్వకపోయినప్పటికీ, భారత్కి ఆ దేశం కీలక సరఫరాదారని సుబ్రహ్మణ్యం చెప్పారు. 18 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని విస్మరించజాలమని పేర్కొన్నారు. అలాంటి దేశానికి మరింతగా విక్రయించలేకపోతే అర్థరహితమైన విషయం అవుతుందని అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: కేంద్రం చెంతకు పంచాయితీ! -
నేడే నవీ ముంబై విమానాశ్రయం ప్రారంభం
దాదాపు రూ.19,650 కోట్లతో నిర్మించిన నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం తొలి దశను ప్రధాని నరేంద్ర మోదీ నేడు (బుధవారం) ప్రారంభించనున్నారు. ముంబైకి కనెక్టివిటీని పెంచేందుకు, ప్రస్తుత విమానాశ్రయంపై భారాన్ని తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుందని గ్లోబల్ ఎయిర్లైన్స్ గ్రూప్ ఐఏటీఏ తెలిపింది. దీనితో భారత ఎకానమీకి కూడా గణనీయంగా లబ్ధి చేకూరుతుందని వివరించింది.భారత ఏవియేషన్ ప్రస్తానంలో నవీ ముంబై ఎయిర్పోర్ట్ ప్రారంభం కీలక మైలురాయిగా నిలుస్తుందని ఐఏటీఏ రీజనల్ వైస్ ప్రెసిడెంట్ (ఏషియా–పసిఫిక్) షెల్డన్ హీ తెలిపారు. తొలి దశలో ఏటా 2 కోట్ల మంది ప్యాసింజర్ల హ్యాండ్లింగ్ సామర్థ్యంతో, ఎయిర్పోర్టులో ఒక టర్మినల్, ఒక రన్వే ఉంటాయి. దేశీయంగా మొట్టమొదటిసారిగా వాటర్ ట్యాక్సీతో కనెక్ట్ అయిన విమానాశ్రయం ఇదే అవుతుందని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.ఇదీ చదవండి: కేంద్రం చెంతకు పంచాయితీ! -
కేంద్రం చెంతకు పంచాయితీ!
బోర్డు నియామకాలు, గవర్నెన్స్ అంశాలపై ట్రస్టీల మధ్య విభేదాలతో టాటా ట్రస్ట్స్లో అంతర్గతంగా ఆధిపత్య పోరు నెలకొన్న తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ మంగళవారం సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. హోంమంత్రి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో టాటా ట్రస్ట్స్ వైస్ చైర్మన్ వేణు శ్రీనివాసన్, ట్రస్టీ డేరియస్ ఖంబట్టా కూడా ఉన్నారు.ట్రస్టీల మధ్య ఆధిపత్య పోరు కారణంగా ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో టాటా గ్రూప్నకు చాలా ప్రాధాన్యమున్న నేపథ్యంలో దాని పూర్తి నియంత్రణను ఏ ఒక్కరి చేతికో ఇవ్వడం శ్రేయస్కరమేనా కాదా అనేది ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న సవాలుగా మారిందని వివరించాయి. టాటా ట్రస్ట్స్ ట్రస్టీల మధ్య విభేదాలు టాటా సన్స్పైనా ప్రభావం చూపుతాయని పేర్కొన్నాయి.రెండు వర్గాలుగా ట్రస్టీలు..156 ఏళ్ల దిగ్గజ గ్రూప్ టాటా సన్స్ గొడుగు కింద 30 లిస్టెడ్ కంపెనీలతో పాటు 400 కంపెనీలు ఉన్నాయి. దీనిపై గణనీయంగా ప్రభావం చూపే.. టాటా ట్రస్ట్స్కి టాటా సన్స్లో 66 శాతం వాటాలు ఉన్నాయి. ప్రస్తుతం టాటా సన్స్ బోర్డులో నియామకాలు, గవర్నెన్స్ అంశాల మీద వివాదం నెలకొంది. టాటా సన్స్ బోర్డులో నామినీ డైరెక్టరుగా మాజీ డిఫెన్స్ కార్యదర్శి విజయ్ సింగ్ పునర్నియామకం కోసం సెప్టెంబర్ 11న జరిగిన ఆరుగురు ట్రస్టీల సమావేశంలో దీనికి బీజం పడింది. విజయ్ పేరును ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా, వేణు శ్రీనివాసన్ ప్రతిపాదించగా, నలుగురు ట్రస్టీలు (మెహ్లి మిస్త్రీ, ప్రమిత్ ఝవేరీ, జహంగీర్ హెచ్సీ జహంగీర్, డేరియస్ ఖంబట్టా) వ్యతిరేకించారు. తదుపరి మెహ్లీ మిస్త్రీని నామినేట్ చేయాలంటూ ఆయన తరఫున ఉన్న నలుగురు ట్రస్టీలు ప్రతిపాదించగా, టాటా గ్రూప్ విలువలను ప్రస్తావిస్తూ దాన్ని నోయెల్ టాటా, వేణు శ్రీనివాసన్ వ్యతిరేకించారు. దీనితో విభేదాలు తారస్థాయికి చేరినట్లు సమాచారం.ఇదీ చదవండి: ఏఐ దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలికీలకమైన నిర్ణయాల్లో తనను పక్కన పెడుతున్నారంటూ మెహ్లీ మిస్త్రీ భావిస్తుండగా, ఆయన సారథ్యంలోని ట్రస్టీలంతా కలిసి.. ట్రస్ట్స్లో నోయెల్ టాటా ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని గ్రూప్లో కొందరు భావిస్తున్నారు. టాటా సన్స్లో 18.37 శాతం వాటాలున్న షాపూర్జీ పల్లోంజీ కుటుంబానికి మెహ్లీ మిస్త్రీకి బంధుత్వం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆధిపత్యం కోసం పోరు నడుమ ట్రస్టీలు రెండు వర్గాలుగా చీలిపోయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అక్టోబర్ 10న టాటా ట్రస్ట్స్ బోర్డు మరోసారి సమావేశం కానుండగా, అజెండా వెల్లడి కాలేదు. ఈ వ్యవహారంపై టాటా ట్రస్ట్ టాటా సన్స్, వేణు శ్రీనివాసన్ వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. టాటా గ్రూప్లో అత్యున్నత స్థాయిలో కొన్నాళ్ల క్రితం కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తింది. అప్పటి గౌరవ చైర్మన్ రతన్ టాటా, టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ మధ్య విభేదాలు తలెత్తాయి. ఇవి చివరికి మిస్త్రీ ఉద్వాసనకు దారి తీశాయి. ప్రస్తుతం రతన్ టాటా, మిస్త్రీ.. ఇద్దరూ మరణించారు. -
కెనరా హెచ్ఎస్బీసీ @ రూ. 100–106
న్యూఢిల్లీ: బీమా రంగ కంపెనీ కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ ఇన్సూరెన్స్ పబ్లిక్ ఇష్యూకి రూ. 100–106 ధరల శ్రేణి ప్రకటించింది. ఈ నెల 10న ప్రారంభంకానున్న ఇష్యూలో భాగంగా ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారు 23.75 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా కంపెనీ రూ. 2,516 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. 14న ముగియనున్న ఇష్యూలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్లకు 9న షేర్లను ఆఫర్ చేయనుంది. లిస్టింగ్లో కంపెనీ విలువ రూ. 10,000 కోట్లుగా నమోదయ్యే వీలుంది.ఈ భాగస్వామ్య సంస్థలో పీఎస్యూ కెనరా బ్యాంక్కు 51%, హెచ్ఎస్బీసీ గ్రూప్ కంపెనీ హెచ్ఎస్బీసీ ఇన్సూరెన్స్ (ఏషియా పసిఫిక్) హోల్డింగ్స్కు 26% చొప్పున వాటా ఉంది. ఐపీవోలో కెనరా బ్యాంక్ 13.77 కోట్ల షేర్లు(14.5 శాతం వాటా), హెచ్ఎస్బీసీ ఇన్సూరెన్స్ 47.5 లక్షల షేర్లు(0.5 శాతం వాటా)తోపాటు.. ఇన్వెస్టర్ సంస్థ పంజాబ్ నేషనల్బ్యాంక్ (పీఎన్బీ) 9.5 కోట్ల షేర్లు(10 శాతం వాటా) విక్రయించనున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 140 షేర్లకు (ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఈ బాటలో ఈ నెల 9న కెనరా రొబెకో అసెట్ మేనేజ్మెంట్ సంస్థ ఐపీవో సైతం ప్రారంభం కానుంది. ఇది 13న ముగియనుంది. -
ఏఐ దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలి
ముంబై: ప్రజలను మోసగించేందుకు నేరగాళ్లు కృత్రిమ మేధను (ఏఐ) ఉపయోగించి క్లోనింగ్, ఫేక్ వీడియోల్లాంటివి సృష్టిస్తున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ దుర్వినియోగం కాకుండా అడ్డుకట్ట వేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని, రిస్క్ మేనేజ్మెంట్ వ్యవస్థలను పటిష్టం చేసుకోవాలని ఫిన్టెక్ సంస్థలకు సూచించారు. 6వ గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2025లో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు చెప్పారు. వివిధ రకాల ఏఐ ఉత్పత్తులు, సరీ్వసులను రూపొందించే విషయంలో గ్లోబల్ హబ్గా ఎదిగే సత్తా భారత్కి ఉందని మంత్రి చెప్పారు.ప్రపంచవ్యాప్తంగా పలు రకాల అవసరాలకు ఉపయోగపడే ఏఐ ఉత్పత్తులను సృష్టించగలదని, ఏఐ ఐడియాలను అభివృద్ధి చేసేందుకు, ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు ప్రయోగశాలగా కూడా ఉండగలదని ఆమె పేర్కొన్నారు. ఏఐ చీకటి కోణం..: ఏఐతో ఆర్థిక రంగం, గవర్నెన్స్లో సానుకూల మార్పులు వచి్చనప్పటికీ, ఈ టెక్నాలజీలో చీకటి కోణం కూడా ఉందని ఆమె చెప్పారు. ‘ఏఐతో అసాధారణ అవకాశాలు లభిస్తాయి. అదే సమయంలో అది దుర్వినియోగం కాకుండా కూడా మనం కట్టడి చేయాలి.కొత్త ఆవిష్కరణలకు దన్నుగా నిల్చే సాధనాలే మోసాలు చేసేందుకు ఆయుధాలుగా కూడా మారే అవకాశాలు ఉన్నాయి. ప్రజలను తప్పుదారి పట్టించేలా, వాస్తవాలను కప్పిపుచ్చేలా తయారు చేసిన నా డీప్ఫేక్ వీడియోలు ఎన్నో ఆన్లైన్లో సర్క్యులేట్ అవుతుండటాన్ని నేను స్వయంగా చూశాను. ఇలాంటి వాటిని తక్షణం ఎదుర్కొనేందుకు మన వ్యవస్థలను తక్షణం బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది‘ అని చెప్పారు. ఆర్థిక సాధికారతకు ఫిన్టెక్ దన్ను.. ఫిన్టెక్ అనేది ఏదో పట్టణ ప్రాంతాలకు పరిమితమైన సౌకర్యం కాదని, దేశవ్యాప్తంగా ఆర్థిక సాధికారతకు ఉపయోగపడే సాంకేతికతని మంత్రి చెప్పారు. యూపీఐ, డిజిటల్ పబ్లిక్ మౌలిక సదుపాయాలతో రోజువారీ జరిపే చెల్లింపుల తీరుతెన్నులను ఇది మార్చేసిందని పేర్కొన్నారు. ప్రపంచంలో దాదాపు సగభాగం రియల్ టైమ్ డిజిటల్ లావాదేవీలు భారత్లో జరుగుతున్నాయని తెలిపారు. ‘మనం ఆర్థికంగా ఎలాంటి భవిష్యత్తును కోరుకుంటున్నాం, దాన్ని ఎలా సాధించదల్చుకుంటున్నాం అనేది ఆలోచించుకునేందుకు ఇది సరైన తరుణం. ఆదాయ వృద్ధి, కొత్త ఆవిష్కరణలు, లాభదాయకత, రిస్క్ సామర్థ్యాలు మొదలైన ప్రాథమికాంశాలపై ఫిన్టెక్లు తప్పకుండా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది‘ అని వివరించారు.బయోమెట్రిక్తో యూపీఐ చెల్లింపులు..ఏకీకృత చెల్లింపు విధానం (యూపీఐ)కి సంబంధించిన పలు సొల్యూషన్స్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఆవిష్కరించింది. ప్రస్తుతం డివైజ్లో యూపీఐ లావాదేవీ ధ్రువీకరణ కోసం ఉపయోగిస్తున్న పిన్ నంబరు స్థానంలో, బయోమెట్రిక్ విధానాన్ని (వేలి ముద్ర, ఫేస్ అన్లాక్) వాడేందుకు ఉపయోగపడే టెక్నాలజీని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం నాగరాజు ప్రవేశపెట్టారు.ఏటీఎంలలో నగదు విత్డ్రాయల్తో పాటు యూపీఐ పిన్ను సెట్ చేసేందుకు లేదా రీసెట్ చేసేందుకు కూడా దీన్ని ఉపయోగించవచ్చు. కొత్త యూజర్లు, సీనియర్ సిటిజన్లను కూడా యూపీఐ చెల్లింపుల పరిధిలోకి చేర్చేందుకు ఇది తోడ్పడుతుందని ఎన్పీసీఐ వివరించింది. అలాగే యూపీఐ క్యాష్ పాయింట్లలో యూపీఐని ఉపయోగించి నగదును విత్డ్రా చేసుకునే సదుపాయాన్ని కూడా ప్రవేశపెట్టినట్లు పేర్కొంది. యూపీఐ లైట్ ద్వారా వేరబుల్ స్మార్ట్గ్లాసెస్తో కూడా చెల్లింపులు జరిపే సొల్యూషన్ని రిజర్వ్ బ్యాంక్ డిప్యుటీ గవర్నర్ టి. రవి శంకర్ ఆవిష్కరించారు. ఫోన్తో పని లేకుండా, పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా క్యూఆర్ని స్మార్ట్ కళ్లద్దాలతో స్కాన్ చేసి, వాయిస్ కమాండ్తో పేమెంట్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. చిన్న మొత్తాల్లో చెల్లింపులు అవసరమయ్యే రోజువారీ కొనుగోళ్లకు ఇది ఉపయోగకరం. ఇక జాయింట్ అకౌంట్ హోల్డర్లు కూడా చెల్లింపుల కోసం యూపీఐని ఉపయోగించే సదుపాయాన్ని ఆవిష్కరించింది. అటు ఎన్పీసీఐ ఇంటర్నేషనల్తో జట్టు కట్టినట్లు పేపాల్ ప్రకటించింది. -
నాలుగో రోజూ లాభాలే
ముంబై: అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకుల షేర్లు 1% రాణించడంతో స్టాక్ మార్కెట్ నాలుగో రోజూ లాభపడింది. సంస్థాగత ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కలిసొచ్చాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 137 పాయింట్లు పెరిగి 81,927 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 31 పాయింట్లు బలపడి 25,108 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు, కార్పొరేట్ క్యూ2 ఆర్థిక ఫలితాలపై ఆశలతో ప్రథమార్ధమంతా స్థిరంగా ముందుకు కదలాయి. ఒక దశలో సెన్సెక్స్ 519 పాయింట్లు బలపడి 82,310 వద్ద, నిఫ్టీ 143 పాయింట్లు ఎగసి 25,221 వద్ద గరిష్టాలు నమోదు చేశాయి.అయితే ద్వితీయార్ధంలో ఎఫ్ఎంసీజీ, కమోడిటీస్, ఐటీ, మెటల్ షేర్లలో లాభాల స్వీకరణతో సూచీల లాభాలు తగ్గాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ మూడు పైసలు బలహీనపడి 88.77 వద్ద స్థిరపడింది. ఆసియాలో జపాన్, సింగపూర్, తైవాన్, ఇండోనేíÙయా, కొరియా మార్కెట్లు లాభపడ్డాయి. సెలవు కారణంగా చైనా, హాంగ్కాంగ్ మార్కెట్లు పనిచేయలేదు. యూరప్ మార్కెట్లు అరశాతం పెరిగాయి. అమెరికా సూచీలు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ⇒ బీఎస్ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో టెలికం 2.13%, రియల్టీ 1.09%, ఇంధన 0.50%, కన్జూమర్ డ్యూరబుల్స్ 0.28%, ఫైనాన్సియల్ సర్విసెస్ 0.24%, ఐటీ 0.23 శాతం లాభపడ్డాయి. ⇒ లాజిస్టిక్స్ సర్విసు ప్రొవైడర్ గ్లోటిస్ లిస్టింగ్ నిరాశపరిచింది. ఇష్యూ ధర(రూ.129)తో పోలిస్తే బీఎస్ఈలో 32% డిస్కౌంటుతో రూ.88 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 37% క్షీణించి రూ.81 కనిష్టాన్ని తాకింది. చివరికి 35% పతనంతో రూ.84 వద్ద నిలిచింది.⇒ ఇష్యూ ధర (రూ.191) వద్దే ఫ్లాటుగా లిస్టయిన ఫ్యాబ్టెక్ టెక్నాలజీస్ షేరూ మెప్పించలేకపోయింది. ఇంట్రాడేలో 5% పతనమై రూ.181 వద్ద కనిష్టాన్ని తాకింది. మార్కెట్ ముగిసే సరికి 4.5% నష్టంతో రూ.182 వద్ద స్థిరపడింది. -
బంగారం @ 4,000
న్యూఢిల్లీ: కనకం రోజుకో కొత్త రికార్డులతో ఆకాశమే హద్దుగా పరుగులు తీస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో తొలిసారి 4,000 డాలర్ల (ఔన్స్కు) కీలక మైలురాయిని దాటింది. కామెక్స్ ఫ్యూచర్స్లో 4,014 డాలర్ల స్థాయిని నమోదు నమోదు చేసింది. దీంతో అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్మన్ శాక్స్ 2026 చివరికి 4,900 డాలర్లకు చేరుకోవచ్చని ప్రకటించింది. 4,300 డాలర్ల గత అంచనాలను భారీగా పెంచింది. పసిడి ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్లు)లోకి అదే పనిగా వస్తున్న పెట్టుబడులు, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్ల నేపథ్యంలో ఈ అంచనాకు వచ్చింది. ప్రైవేటు రంగం వైవిధ్యం కోసం గోల్డ్ ఈటీఎఫ్లను ఆశ్రయిస్తుండడాన్ని సైతం పరిగణనలోకి తీసుకుంది. సెంట్రల్ బ్యాంక్లు 2025లో నెలకు 80 టన్నులు, 2026లో నెలకు 70 టన్నుల మేర బంగారం కొనుగోలు చేయొచ్చని అంచనా వేసింది. ముఖ్యంగా వర్ధమాన దేశాల సెంట్రల్ బ్యాంకులు ఈ దిశగా కీలక పాత్ర పోషిస్తున్నట్టు పేర్కొంది. ఇక యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల కోతపై అంచనాలు సైతం బంగారంలో బుల్లిష్ సెంటిమెంట్కు కారణంగా తెలిపింది. 2026 మధ్య నాటికి ఫెడ్ 100 బేసిస్ పాయింట్ల మేర రేట్లను తగ్గించొచ్చని.. ఇది బంగారం తదితర ఆస్తులకు డిమాండ్ను పెంచుతుందని పేర్కొంది. ఈ ఏడాది గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి పెట్టుబడులు 17 శాతం పెరగడాన్ని మెహతా ఈక్విటీస్ కమోడిటీ విభాగం వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కళంత్రి సైతం గుర్తు చేశారు. అమెరికాలో ఆర్థిక అనిశ్చితులు, ఫ్రాన్స్ తదితర దేశాల్లో రాజకీయ అలజడులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సైతం సురక్షిత సాధనంగా బంగారానికి డిమాండ్ను పెంచుతున్నట్టు చెప్పారు. దేశీయంగా రూ.1.24 లక్షలు ఢిల్లీ మార్కెట్లో పుత్తడి ధర (99.9 శాతం స్వచ్ఛత) మంగళవారం సరికొత్త ఆల్టైమ్ గరిష్టం రూ.1,24,000ను నమోదు చేసింది. 10 గ్రాములకు రూ.700 లాభపడింది. వెండి కిలోకి రూ.3,400 లాభపడి రూ.1,54,000కు చేరుకుంది. -
2026లో జీతాలు పెరిగేది వీరికే!
భారతదేశంలో 2026లో జీతాలు 9 శాతం పెరుగుతాయని, Aon యాన్యువల్ శాలరీ ఇంక్రీజ్ అండ్ టర్నోవర్ సర్వే ద్వారా వెల్లడించింది. ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించినప్పటికీ, 2025లో నమోదైన 8.9 శాతం జీతాల వృద్ధి కంటే.. ఈ అంచనా స్వల్ప పెరుగుదలను సూచిస్తుంది.రియల్ ఎస్టేట్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFC) వరుసగా 10.9 శాతం, 10 శాతం చొప్పున అత్యధిక జీతాల పెరుగుదలను ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఎగుమతులు తగ్గడం, ఏఐ (కృత్రిమ మేధస్సు) ప్రభావం కారణంగా టెక్నాలజీ కన్సల్టింగ్ రంగాలు మాత్రం 6.5 శాతానికి పరిమితం చేయనున్నాయి. 2025 ఐటీ కంపెనీలు 7 శాతం జీతాల పెరుగుదలను ప్రకటించాయి.టాప్/సీనియర్ & మిడిల్ మేనేజ్మెంట్ జీతాల వృద్ధి వరుసగా 8.5 శాతం, 8.9 శాతం వద్ద ఉంటాయి. అయితే.. జూనియర్ మేనేజ్మెంట్ జీతాలు మాత్రం 9.5 శాతానికి (2025లో 9.3 శాతం పెరుగుదల) చేరే అవకాశం ఉంది. పోటీ మార్కెట్లో యువ ప్రతిభను ఆకర్షించడంలో భాగంగానే ఈ కొంత జీతాల పెంపు చేయనున్నట్లు సమాచారం. కాగా ఈ ఏడాది ఉద్యోగ విరమణ 17.1 శాతంగా ఉన్నట్లు నివేదికలో వెల్లడైంది.1060 కంపెనీల నుంచి సేకరించిన డేటాఈ నివేదికను.. 45 పరిశ్రమలలోని 1,060 కంటే ఎక్కువ కంపెనీల నుంచి డేటా ఆధారంగా రూపొందించారు. ఇందులో సుమారు 43 శాతం కంపెనీలు FY26కి వార్షిక ఆదాయ వృద్ధిని 10 శాతం కంటే ఎక్కువ అంచనా వేయగా.. 27 శాతం మంది 5–10 శాతం వృద్ధిని ఆశిస్తున్నారు. మరో 12 శాతం మంది ఎటువంటి ప్రభావం లేదని అంచనా వేస్తున్నారు. 14 శాతం మంది 0–5 శాతం వృద్ధిని చూస్తున్నారు. 4 శాతం మంది మాత్రం ప్రతికూల వృద్ధిని అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: కోటీశ్వరున్ని చేసిన 30 ఏళ్ల క్రితం పేపర్లు -
కోటీశ్వరున్ని చేసిన 30 ఏళ్ల క్రితం పేపర్లు
ఎప్పుడు, ఎవరు, ఎలా కోటీశ్వరులవుతారో ఎవ్వరూ ఊహించలేరు. అయితే ఇది అందరి జీవితంలో జరుగుతుందని కచ్చితంగా చెప్పలేము. ఒకవేళా జరిగితే మాత్రం.. వారిని మించిన అదృష్టవంతులు ఇంకొకరు లేరనే చెప్పాలి. ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.స్టాక్ మార్కెట్స్ గురించి ప్రస్తుతం అందరికీ తెలుసు.. ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే భారీ లాభాలు వస్తాయని కొందరు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే కొన్ని సార్లు ఊహకందని నష్టాలను కూడా చూడాల్సి ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలి. ఇప్పుడంతా డిజిటల్ లావాదేవీలు వచసాయి. ఒక 20-30 ఏళ్లు వెనక్కి వెళ్తే.. అప్పుడంతా పేపర్ రూపంలోనే లావాదేవీలు జరిగేవి. ఆ నాటి పేపర్స్ కొందరికి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పోస్టులో.. సుమారు 30ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన షేర్లకు సంబంధించిన పేపర్లు దొరకడంతో ఒక వ్యక్తి.. ఇప్పటి వాటి విలువను చూసి ఆశ్చర్యపోయాడు. నిజానికి ఆ వ్యక్తి 1995లో జేవీఎస్ఎల్ (JVSL) కంపెనీకి సంబంధించిన షేర్లను ఒక్కక్కరి రూ. 10 చొప్పున.. 100 కొనుగోలు చేసాడు. 1000 రూపాయలు పెట్టి కొన్న షేర్స్.. ఎక్కడో పెట్టి మర్చిపోయాడు. అవి ఇప్పుడు దొరికాయి. వాటి విలువ ఇప్పుడు ఏకంగా రూ. 1.83 కోట్లు అయింది.ఇదీ చదవండి: మిలియనీర్గా ఎదిగిన బార్బర్: ట్యాక్సీగా రూ.3.2 కోట్ల కారు!2005లో జేవీఎస్ఎల్ కంపెనీ.. జేఎస్డబ్ల్యూ సంస్థలో విలీనమైంది. ఆ సమయంలో ఒక జేవీఎస్ఎల్ షేర్ ఉన్న వారికి.. జేఎస్డబ్ల్యూ కంపెనీ 16 షేర్స్ ఇచ్చింది. దీంతో 1995లో కొన్న వ్యక్తి 1000 షేర్స్ 16000 షేర్స్ అయ్యాయి. ఈ విషయాన్ని మార్కెటింగ్ గ్రోమాటిక్స్ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం JSW ధర ఒక్కో షేరుకు రూ. 1,146 ఉంది. దీంతో ఆ షేర్స్ విలువ రూ. 1.83కోట్లుగా మారింది. ఆ వ్యక్తి ఒకేసారి కోటీశ్వరుడయ్యాడు. View this post on Instagram A post shared by Startup | Marketing (@marketing.growmatics) -
ఐఐహెచ్ఎల్ మారిషస్ చేతికి స్టెర్లింగ్ బ్యాంక్
న్యూఢిల్లీ: బహమాస్కి చెందిన స్టెర్లింగ్ బ్యాంకులో మిగతా 49 శాతం వాటాలను దక్కించుకున్నట్లు ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ (ఐఐహెచ్ఎల్) మారిషస్ వెల్లడించింది. దీనితో బ్యాంకు కొనుగోలు పూర్తయినట్లు వివరించింది.2022 సెప్టెంబర్లో బ్యాంకులో 51 శాతం వాటాను ఐఐహెచ్ఎల్ మారిషస్ కొనుగోలు చేసింది. బ్యాంకు పేరును ’ఐఐహెచ్ఎల్ బ్యాంక్ అండ్ ట్రస్టు’ గా మార్చనున్నట్లు సంస్థ తెలిపింది. బ్యాంకింగ్, బీమా తదితర ఆర్ధిక సేవలందించే ఐఐహెచ్ఎల్ నికర విలువ 1.26 బిలియన్ డాలర్లుగా ఉంది. భారత్లో అయిదో పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన ఇండస్ఇండ్ బ్యాంక్నకు ఐఐహెచ్ఎల్ ప్రమోటరుగా ఉంది. -
మిలియనీర్గా ఎదిగిన బార్బర్: ట్యాక్సీగా రూ.3.2 కోట్ల కారు!
ఎక్కడైనా ట్యాక్సీ కోసం.. మారుతి కారునో, మహీంద్రా కారునో లేదా టాటా కారునో ఉపయోగిస్తారు. కానీ బెంగళూరుకు చెందిన ఒక బార్బర్ ఏకంగా రూ.3.2 కోట్ల విలువైన కారును ట్యాక్సీగా అద్దెకు ఇవ్వడానికి కొనుగోలు చేశారు.బెంగళూరుకు చెందిన రమేష్ బాబు.. టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే లెక్కలేనన్ని కార్లను ఈ ఫ్లీట్లో చేర్చిన ఈయన.. తాజాగా 'రేంజ్ రోవర్ ఎల్డబ్ల్యుబీ' కారును చేర్చారు. ఈ కారును డెలివరీ తీసుకుంటున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.రమేష్ బాబు టూర్స్ అండ్ ట్రావెల్స్లో.. ఇప్పటికే రోల్స్ రాయిస్ ఘోస్ట్, మెర్సిడెస్ మేబాచ్, జీ వ్యాగెన్, ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130, బీఎండబ్ల్యు ఐ7 వంటి కార్లు చేరాయి. ఇప్పుడు తాజాగా రేంజ్ రోవర్ ఎల్డబ్ల్యుబీ చేరింది. ఈ కారు ఫుజి వైట్ క్లాసీ షేడ్లో ఉన్న హెచ్ఎస్ఈ లాంగ్ వీల్బేస్ వేరియంట్. ఇది 3.0 లీటర్ డీజిల్ ఇంజన్ ద్వారా 346 బీహెచ్పీ పవర్, 700 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో.. నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది.రమేష్ బాబు లగ్జరీ కార్లురమేష్ బాబు గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఎన్నో కష్టాలను అధిగమించి.. నేడు మిలియనీర్ స్థాయికి ఎదిగారు. బెంగళూరులో జన్మించిన రమేష్ బాబు తండ్రి బార్బర్, అయితే తన చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో.. తల్లి తమను పోషించడానికి పనిమనిషిగా పనిచేసింది. ఈ క్రమంలో రమేష్ బాబు చిన్న చిన్న పనులు చేస్తూ.. పాఠశాల విద్యను పూర్తి చేసి, తండ్రికి చెందిన బార్బర్ షాప్ బాధ్యతలు తీసుకున్నారు. ఇందులోనే మెల్లగా ఎదిగి, మారుతి సుజుకి ఓమ్ని వ్యాన్ కొనుగోలు చేశారు.ఇదీ చదవండి: రోజుకు 12 గంటల నిద్ర!.. ఇదే నా సక్సెస్ సీక్రెట్: టెలిగ్రామ్ సీఈఓమారుతి సుజుకి ఓమ్ని వ్యాన్ కొనుగోలు చేసిన తరువాత.. దానిని అద్దెకు ఇవ్వడం ద్వారా కొంత డబ్బు సంపాదించడం మొదలుపెట్టారు. ఆలా అద్దెకు కార్లను ఇవ్వడం ద్వారా సంపాదించడం ప్రారభించి.. రమేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రీమియం కార్ల అద్దె కంపెనీ ఏర్పాటు చేశారు. 2011లో అద్దెకు ఇవ్వడానికి రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ I కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ఈయన అనేక ఖరీదైన కార్లను అద్దెకు ఇస్తున్నారు. -
ప్యాసివ్ ఫండ్స్కు పెరుగుతున్న ఆదరణ
న్యూఢిల్లీ: ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్లలో అవగాహన విస్తృతం అవుతోంది. ఇందుకు నిదర్శనంగా ప్యాసివ్ ఫండ్స్ నిర్వహణలోని ఇన్వెస్టర్ల పెట్టుబడుల (ఏయూఎం) విలువ 2025 మార్చి నాటికి రూ.12.2 లక్షల కోట్లకు చేరింది. 2019 నాటికి ఉన్న రూ.1.91 లక్షల కోట్ల నుంచి ఆరు రెట్లు పెరిగింది.మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ మూడో ఎడిషన్ ‘ప్యాసివ్ సర్వే 2025’ ఈ వివరాలు విడుదల చేసింది. 2023 మార్చి నుంచి చూసినా ప్యాసివ్ ఫండ్స్ ఏయూఎం 1.7 రెట్లు పెరిగింది. మూడు వేల మందికి పైగా ఇన్వెస్టర్లు, ఫండ్స్ పంపిణీదారుల నుంచి అభిప్రాయాలను సర్వేలో భాగంగా మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ తెలుసుకుంది.ప్యాసివ్ ఫండ్స్ (ఇండెక్స్ ఫండ్స్/ఈటీఎఫ్లు) అన్నవి నిర్దేశిత సూచీల్లోని స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తాయి. రాబడి కూడా సూచీల స్థాయిలోనే ఉంటుంది. యాక్టివ్ ఫండ్స్ మెరుగైన రాబడుల అవకాశాలను ఎల్లప్పుడూ అన్వేషిస్తూ, అందుకు అనుగుణంగా పెట్టుబడులు పెడుతుంటాయి. యాక్టివ్ ఫండ్స్తో పోల్చి చూస్తే ప్యాసివ్ ఫండ్స్లో ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉంటుంది. సర్వే అంశాలు..76 శాతం మంది ఇన్వెస్టర్లు తమకు ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్ల పట్ల అవగాహన ఉన్నట్టు చెప్పడం గమనార్హం.68 శాతం ఇన్వెస్టర్లు కనీసం ఒక ప్యాసివ్ ఫండ్లో పెట్టుబడులు పెట్టారు. 2023లో ఇలాంటి వారు 61 శాతంగా ఉన్నారు.ప్యాసివ్ ఫండ్స్కు ఆదరణ పెరిగినప్పటికీ.. యాక్టివ్ ఫండ్స్పైనా కొందరు ఇన్వెస్టర్లలో అమిత విశ్వాసం కొనసాగుతోంది. ఇప్పటికీ ప్రతి ముగ్గురిలో ఒకరు యాక్టివ్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. వీరికి ప్యాసివ్ ఫండ్స్ గురించి పెద్దగా తెలియకపోవడం కూడా ఒక కారణం.ప్యాసివ్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టడానికి తక్కువ వ్యయాలు కారణమని 54 శాతం మంది చెప్పారు. సులభత్వం, పారదర్శక గురించి 46 శాతం మంది ప్రస్తావించారు. 29 శాతం మంది పనితీరును కారణంగా పేర్కొన్నారు.మ్యూచువల్ ఫండ్స్ పంపిణీదారుల్లోనూ 93% మందికి ప్యాసివ్ ఫండ్స్పై అవగాహన ఉంది.సర్వేలో పాల్గొన్న ఇన్వెస్టర్లలో 85 శాతం మంది మూడేళ్లకు పైగా పెట్టుబడులు కొనసాగిస్తున్నారు. దీర్ఘకాలం కోసం పెట్టుబడుల ధోరణి వారిలో కనిపించింది. ఏడాది నుంచి మూడేళ్ల మధ్య పెట్టుబడులు కొనసాగిస్తున్న వారు 13 శాతంగా ఉన్నారు.57 శాతం మంది ఇన్వెస్టర్లు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్), ఒకే విడతలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. 26 శాతం మంది కేవలం సిప్లో, 17 శాతం ఒకే విడత పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు.ఆర్థిక స్వేచ్ఛ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నట్టు 61 శాతం మంది చెప్పగా, రిటైర్మెంట్ నిధి కోసం 49 శాతం ఇన్వెస్ట్ చేస్తున్నారు. -
రోజుకు 12 గంటల నిద్ర!.. ఇదే నా సక్సెస్ సీక్రెట్
స్మార్ట్ఫోన్ ప్రపంచాన్ని అరచేతిలో చూపిస్తుందని.. అందరూ నమ్ముతుంటే, ఫోన్ వాడకపోవడం వల్లే నేను సక్సెస్ సాధించా అని టెలిగ్రామ్ కో-ఫౌండర్, సీఈఓ పావెల్ దురోవ్ (Pavel Durov) చెబుతున్నారు. ఇంతకీ అదెలా సాధ్యమైంది?, వివరాలు ఏమిటనేది ఇక్కడ తెలుసుకుందాం.లెక్స్ ఫ్రిడ్మాన్ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. ''రోజులో వీలైనంత సమయం.. సుమారు 11 నుంచి 12 గంటలు నిద్ర కోసం కేటాయించడానికి ప్రయత్నిస్తాను. అయితే అన్ని గంటలు నిద్రకోసం కేటాయించినా.. నిద్రపోను. మంచం మీద పడుకుని ఆలోచిస్తూనే ఉంటాను'' అని దురోవ్ పేర్కొన్నారు.పడుకున్నప్పుడే.. నాకు అద్భుతమైన ఆలోచనలు వస్తాయి. తాను సోషల్ నెట్వర్కింగ్లో ఉన్నప్పటికీ.. స్మార్ట్ఫోన్ వాడకం చాలా తక్కువని పేర్కొన్నారు. నిద్ర లేచిన వెంటనే తన ఫోన్ చూడకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను. నోటిఫికేషన్లు, సోషల్ మీడియా వంటివన్నీ ఒక వ్యక్తి రోజును డిసైడ్ చేస్తాయని నమ్ముతాను.జీవితంలో ఏది ముఖ్యమైనదో నిర్ణయించుకోవాలి. ఇతర వ్యక్తులు, కంపెనీ వంటివన్నీ మన జీవితంలో చాలా ముఖ్యమైనవి కాదు. ప్రతి రోజూ ఉదయం ఫోన్ లేకుండానే మీ దినచర్యను ప్రారభించడం అలవాటు చేసుకోవాలి.ఇదీ చదవండి: ఉద్యోగం కోసం డిగ్రీ సరిపోదు!: లింక్డ్ఇన్ సీఈఓ కీలక వ్యాఖ్యలువ్యాయామం చేసేటప్పుడు.. ఇతరత్రా పనులు చేసేటప్పుడు కూడా వీలైనంత ఫోనుకు దూరంగా ఉండాలి. ఫోన్ దూరంగా ఉన్నప్పుడే మీకు అద్భుతమైన ఆలోచనలు రావొచ్చని దురోవ్ చెబుతున్నారు. టెక్నాలజీ, కనెక్టివిటీ వంటి వాటికి మద్దతు ఇస్తున్నప్పటికీ.. జీవితంలో ఏది ముఖ్యమో దానికోసం సమయం వెచ్చించాలని ఆయన సూచించారు. -
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 136.63 పాయింట్లు లేదా 0.17 శాతం లాభంతో 81,926.75 వద్ద, నిఫ్టీ 30.65 పాయింట్లు లేదా 0.12 శాతం లాభంతో 25,108.30 వద్ద నిలిచాయి.ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్, ఆర్బిట్ ఎక్స్పోర్ట్స్, సెంచరీ ఎక్స్ట్రూషన్స్, ఇండ్బ్యాంక్ మర్చంట్ బ్యాంకింగ్ సర్వీసెస్, మైండ్టెక్ (ఇండియా) వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. గ్లోటిస్ లిమిటెడ్, సిగ్మా సాల్వ్ లిమిటెడ్, ఏఏఏ టెక్నాలజీస్, సైబర్టెక్ సిస్టమ్స్ అండ్ సాఫ్ట్వేర్, కేఐఓసీఎల్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లెక్స్ ఆఫీస్ ట్రెండ్.. హైదరాబాద్ టాప్
దేశంలో ఫ్లెక్స్ ఆఫీస్ ట్రెండ్ వేగంగా సాగుతోంది. అభివృద్ధి చెందిన నగరాల్లో.. హైబ్రిడ్ వర్క్ మోడల్కు ఇదొక ఉత్తమ పరిష్కారం. మైహెచ్క్యూ (MyHQ) 'ఫ్లెక్స్ ఆఫీస్ స్టాక్ ఫుట్ప్రింట్' పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉన్నట్లు వెల్లడించింది.మైహెచ్క్యూ డేటా ప్రకారం.. భారతదేశంలోని మొత్తం ఫ్లెక్స్ ఆఫీసులలో హైదరాబాద్ ముందు వరుసలో ఉంది. ఈ నగరం ఫ్లెక్స్ ఆఫీస్ హబ్గా మారింది. ఇక్కడ కూడా ప్రధానంగా.. హైటెక్ సిటీలో 23.4 శాతం ఫ్లెక్స్ ఆఫీసుల, మాదాపూర్లో 11.2 శాతం ఉన్నట్లు నివేదిక చెబుతోంది. ఆ తరువాత జాబితాలో బంజారా హిల్స్ (9.9%), బేగంపేట (9.9%), కొండాపూర్ (9.5%), ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ (5.3%) మొదలైనవి ఉన్నాయి.మెట్రో సౌకర్యం, రవాణా కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో ఫ్లెక్స్ ఆఫీసుల సంఖ్య పెరుగుతోంది. ఈ సంఖ్య గడిచిన మూడేళ్ళలో పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఫ్లెక్సిబుల్ వర్క్ కల్చర్ ట్రెండ్సెట్టర్గా మారిపోయింది. దీంతో ఫ్లెక్స్ ఆఫీసులకు డిమాండ్ పెరుగుతోంది.కోవిడ్ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం ప్రారంభమైంది. అయితే కరోనా దాదాపు కనుమరుగైపోయినప్పటికీ.. ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ విధానాలకు అలవాటుపడిపోయారు. దీనిని నివారించడానికి.. సంస్థలు హైబ్రిడ్ వర్క్ కల్చర్ స్టార్ట్ చేశాయి. దీనికోసం ఫ్లెక్స్ ఆఫీసులను ఎంచుకోవడం మొదలైంది. దీంతో ఫ్లెక్సిబుల్ ఆఫీసులు పుట్టుకొచ్చాయి. ఫ్లెక్సిబుల్ సొల్యూషన్స్ ప్రస్తుతం అన్ని కార్యాలయ లావాదేవీలలో 20% వాటా కలిగి ఉన్నాయి. 2030 నాటికి ఈ మార్కెట్ వ్యాప్తి దాదాపు 30%కి చేరుకుంటుందని సమాచారం.ఫ్లెక్స్ ఆఫీస్ ఉపయోగాలుఫ్లెక్స్ ఆఫీస్ (Flexible Office) అనేది.. ఒకవిధమైన ఆఫీస్ వర్క్ స్పేస్. ఇక్కడ ఉద్యోగులు సౌకర్యవంతంగా పనిచేసుకోవచ్చు. స్టార్టప్ కంపెనీలు తక్కువ ఖర్చుతో.. కార్యాలయ నిర్వహణ చేసుకోవడానికి ఫ్లెక్స్ ఆఫీస్ ఉపయోగపడుతుంది. ఫ్రీలాన్సర్లు, రిమోట్ వర్కర్లు తమకు అవసరమైన స్థలాన్ని ఎంచుకుని పని చేయవచ్చు. ఉద్యోగ వాతావరణం ఉంటుంది కాబట్టి.. ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. -
జీఎస్టీ క్రమబద్ధీకరణ తర్వాత ఎస్బీఐ జనరల్ నుంచి కొత్త హెల్త్ ప్లాన్
భారతదేశంలో ప్రముఖ బీమా సంస్థల్లో ఒకటైన ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ తమ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా హెల్త్ ఆల్ఫా (Health Alpha) పేరుతో సమగ్ర ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. ఆధునిక వైద్య ఖర్చులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, అన్ని వయసుల వారికి మెరుగైన రక్షణ కల్పించడానికి రూపొందిస్తున్నట్లు చెబుతున్న ఈ ప్లాన్ వివిధ రకాల ప్రత్యేకతలు, సౌకర్యాలు, ప్రయోజనాలు కలిగి ఉందని కంపెనీ తెలిపింది.అనూహ్యంగా పెరిగే వైద్య ఖర్చుల నుంచి పాలసీదారులకు ఆర్థిక భద్రత కల్పించడానికి ఎస్బీఐ జనరల్ (SBI General) ఈ ప్లాన్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది. జీఎస్టీ సంస్కరణల తర్వాత ఎస్బీఐ ప్రారంభించిన మొదటి ఆరోగ్య బీమా ఇది.అదనంగా ప్రీమియం చెల్లించకుండా 10 రెట్లు క్లెయిం-ఫ్రీ క్యుమిలేటివ్ బోనస్ను అందిస్తున్నట్లు చెప్పింది. ఈ ప్లాన్లో బేస్ కవరేజీపై గరిష్ట పరిమితి లేదని తెలిపింది. ‘జిమ్, స్పోర్ట్స్ ఇంజ్యూరీ కవరేజి కూడా లభిస్తుంది. అందుకు ఓపీడీ ప్రయోజనాలు, పరీక్షలు, చికిత్స, మందుల ఖర్చులు కూడా కవర్ అవుతాయి. ప్లాన్ కొనుగోలు చేసేందుకు కోట్ చేసిన 5 రోజుల్లోగా కొనుగోలు చేసినట్లయితే ప్రీమియంపై 5% తగ్గింపు పొందవచ్చు’ అని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: చనిపోయేంత కాలం బ్యాంకు నుంచి డబ్బు వచ్చేలా.. -
ఏపీలో 172 బావుల ఏర్పాటుకు రూ.8,110 కోట్లు
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) ఆంధ్రప్రదేశ్లోని ఎనిమిది పెట్రోలియం మైనింగ్ లీజు (PML) బ్లాకుల్లో 172 ఆన్షోర్ బావులను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. వీటి ద్వారా చమురు, గ్యాస్ ఉత్పత్తి కోసం రూ.8,110 కోట్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అడవులు, వాతావరణ మార్పులకు సంబంధించిన ఒక కమిటీ గత నెలలో జరిగిన సమావేశంలో ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి (EC) ఇవ్వడానికి సిఫార్సు చేసింది.ఈ ఆన్షోర్ బావుల ఏర్పాటు కోసం పర్యావరణ నిర్వహణ ప్రణాళిక (EMP)కు సంబంధించి మూలధన వ్యయం రూ.172 కోట్లుగా కంపెనీ నిర్ణయించింది. ఏటా ఈఎంపీ రెన్యువల్ కోసం చేసే ఖర్చు రూ.91.16 కోట్లు ఉంటుందని చెప్పింది. కమిటీ బహిరంగ విచారణలో చేసిన హామీల కోసం రూ.11 కోట్లు కేటాయించనున్నట్లు పేర్కొంది. పర్యావరణ అనుమతిని సిఫార్సు చేస్తూ కమిటీ ఓఎన్జీసీని అన్ని పర్యావరణ పరిరక్షణ చర్యలు, భద్రతా ఏర్పాట్లను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది.మే నెలలో జారీ చేసిన ఎన్ఓసీ (NOC) ప్రకారం కోరింగా వన్యప్రాణుల అభయారణ్యం పర్యావరణ సున్నిత ప్రాంతం (eco-sensitive area) నుంచి 10 కి.మీ. లోపు ఏ బావిని కూడా ఏర్పాటు చేయరు. ముందస్తు అనుమతి లేకుండా అటవీ భూమి/ రక్షిత ప్రాంతంలో పైప్లైన్లు ఏర్పాటు చేయరు.ఇదీ చదవండి: బంగారం ధరల తుపాను.. తులం ఎంతంటే.. -
చనిపోయేంత కాలం బ్యాంకు నుంచి డబ్బు వచ్చేలా..
బ్యాంకు లోన్ ఇస్తే మనం ఈఎంఐ చెల్లించడం ఆనవాయితి. అయితే అందుకు పూర్తి భిన్నంగా బ్యాంకే మనకు డబ్బు చెల్లిస్తే.. అవును.. ఈ ఊహ ఎంత బావుందో కదా.. అయితే అందుకు మన ప్రాపర్టీని బ్యాంకు వద్ద తనఖా పెట్టాల్సి ఉంటుంది. దాంతో ప్రతినెల లేదా ఒకేసారి పెద్ద మొత్తంలో బ్యాంకు ద్వారా డబ్బు పొందవచ్చు. ఆ వివరాలు కింద చూద్దాం.సీనియర్ సిటిజన్ల (వృద్ధుల) కోసం బ్యాంకుల్లో కొన్ని ప్రత్యేక లోన్లు ఉంటాయి. సాధారణంగా హోమ్ లోన్లో రుణగ్రహీత బ్యాంకుకు ఈఎంఐలు చెల్లిస్తే రివర్స్ మార్టగేజ్ లోన్లో బ్యాంకులే సీనియర్ సిటిజన్కు క్రమానుగతంగా లేదా ఒకేసారి కొంత మొత్తాన్ని చెల్లిస్తాయి. దీనికి బదులుగా సీనియర్ సిటిజన్ తమ స్థిరాస్తులను బ్యాంకులో తాకట్టు (Mortgage) పెట్టాల్సి ఉంటుంది.రివర్స్ మార్టగేజ్ లోన్లు అంటే ఏమిటి?తమ సొంత ఇంట్లో ఉంటూనే ఆర్థిక అవసరాల కోసం తమ ఆస్తిపై ఉన్న విలువను నగదు రూపంలో పొందేందుకు ఈ లోన్లు వృద్ధులకు సహాయపడతాయి. ముఖ్యంగా స్థిరమైన ఆదాయం లేని వారికి ఈ లోన్ ఒక మంచి ఆదాయ మార్గంగా ఉపయోగపడుతుంది. లోన్ తీసుకున్న వ్యక్తి (రుణగ్రహీత) జీవించి ఉన్నంత కాలం లేదా ఇంట్లో నివసిస్తున్నంత వరకు లోన్ తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు.వాటిని బ్యాంకులు ఎలా జారీ చేస్తాయి?షెడ్యూల్డ్ బ్యాంకులు, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (NHB) వద్ద నమోదైన హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (HFCలు) ఈ రుణాలను అందిస్తాయి.వృద్ధులు తమ నివాస ఆస్తిని బ్యాంకులో తాకట్టు పెడతారు.బ్యాంక్ ఆ ఆస్తి విలువను అంచనా వేస్తుంది. రుణగ్రహీత వయసు, ఆస్తి విలువ, వడ్డీ రేటు ఆధారంగా ఎంత లోన్ ఇవ్వవచ్చో నిర్ణయిస్తుంది.మంజూరైన లోన్ మొత్తాన్ని రుణగ్రహీతకు నిర్ణీత పద్ధతిలో చెల్లిస్తారు.నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక లేదా వార్షిక వాయిదాలుగా చెల్లిస్తారు. (సాధారణంగా గరిష్ఠ నెలవారీ చెల్లింపు పరిమితి రూ.50,000 వరకు ఉంటుంది).లోన్ మొత్తంలో కొంత భాగాన్ని ఒకేసారి కూడా తీసుకోవచ్చు (సాధారణంగా 50% వరకు).ఈ లోన్ను రుణగ్రహీత జీవించి ఉన్నంత కాలం చెల్లించాల్సిన అవసరం లేదు. చివరి రుణగ్రహీత మరణించిన తర్వాత లోన్ అసలు, దానిపై పేరుకుపోయిన వడ్డీ మొత్తం చెల్లించవలసి వస్తుంది. వారసులు ఈ మొత్తాన్ని చెల్లించి ఆస్తిని తిరిగి తీసుకోవచ్చు లేదా ఆస్తిని అమ్మి లోన్ను సెటిల్ చేయవచ్చు.ఈ లోన్ పొందేందుకు అర్హతలేమిటి?సాధారణంగా రివర్స్ మార్టగేజ్ లోన్ పొందడానికి కింది అర్హతలు అవసరం అవుతాయి.వయసు: దరఖాస్తుదారు భారతీయ పౌరుడై ఉండాలి. 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు కలిగి ఉండాలి.ఉమ్మడి రుణం: వివాహిత జంటల విషయంలో ఒకరు 60 ఏళ్లు పైబడినవారు, మరొకరు 55 ఏళ్ల కంటే తక్కువ కాకుండా ఉంటే ఉమ్మడి రుణగ్రహీతలుగా అర్హులు.ఆస్తి యాజమాన్యం: ఆస్తికి సంబంధించిన స్పష్టమైన టైటిల్ (Clear Title) ఉండాలి. అది ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండాలి.ఆస్తి రకం: అది స్వయం-ఆర్జితం (Self-acquired) లేదా వారసత్వంగా వచ్చిన నివాస ఆస్తి (ఇల్లు లేదా ఫ్లాట్) అయ్యి ఉండాలి.నివాసం: ఆ ఆస్తిని రుణగ్రహీత ప్రాథమిక నివాసంగా ఉపయోగించాలి.బ్యాంకులకు కలిగే ప్రయోజనాలు ఏమిటి?ఆస్తిని తాకట్టు పెట్టుకోవడం ద్వారా బ్యాంకుకు అధిక భద్రత (Security) లభిస్తుంది. రుణగ్రహీత తిరిగి చెల్లించలేకపోయినా ఆస్తిని అమ్మి లోన్ను వసూలు చేసుకునే అవకాశం ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు సేవ చేయడం ద్వారా కొత్త మార్కెట్ను చేరుకోగలుగుతారు. ఈ లోన్పై వడ్డీ కాలక్రమేణా పెరుగుతూ పోతుంది. రుణ వ్యవధి ముగిసిన తర్వాత లేదా వారసులు ఆస్తిని అమ్మినప్పుడు ఈ వడ్డీతో సహా అసలు మొత్తాన్ని బ్యాంకు పొందుతుంది.కస్టమర్లకు ఎలాంటి లాభాలున్నాయి?రుణగ్రహీత తమ ఇంట్లోనే జీవించే హక్కును కలిగి ఉంటారు. లోన్ తీసుకున్నంత మాత్రాన ఆస్తి యాజమాన్యం పోదు. స్థిరమైన ఆదాయ వనరులు లేని వృద్ధులకు క్రమం తప్పకుండా ఆదాయం లభిస్తుంది. ఇది వారి రోజువారీ ఖర్చులకు, వైద్య అవసరాలకు, ఇంటి మరమ్మతులకు ఉపయోగపడుతుంది. రుణగ్రహీత జీవించి ఉన్నంత కాలం నెలవారీగా లోన్ను తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు.పన్ను ప్రయోజనాలురివర్స్ మార్టగేజ్ ద్వారా పొందిన డబ్బును ఆదాయంగా పరిగణించరు. కాబట్టి దానిపై సాధారణంగా ఆదాయపు పన్ను ఉండదు (అయితే తాకట్టు పెట్టిన ఆస్తిని బ్యాంక్ అమ్మి లోన్ రికవరీ చేసుకునే సమయంలో మూలధన లాభాల పన్ను (Capital Gains Tax) వర్తించవచ్చు). రుణగ్రహీత లేదా వారి వారసులు ఎప్పుడైనా లోన్ను ముందుగానే చెల్లించవచ్చు. చాలా బ్యాంకులు ముందస్తు చెల్లింపుకు పెనాల్టీ విధించవు.బ్యాంకులు పాటిస్తున్న నియమాలు..భారతదేశంలో నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (NHB) జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు ఈ లోన్లను అందిస్తాయి. ఇందులో గరిష్ఠ లోన్ చెల్లింపు వ్యవధి 20 సంవత్సరాలు మించకూడదు. రుణగ్రహీత ఆస్తి విలువ తగ్గకుండా దాన్ని మంచి స్థితిలో ఉంచాలి. ఆస్తి పన్నులు (Property Taxes), ఇంటి బీమా (Home Insurance) ప్రీమియంలను రుణగ్రహీత క్రమం తప్పకుండా చెల్లించాలి. బ్యాంక్ కనీసం ప్రతి ఐదేళ్లకోసారి ఆస్తి విలువను తిరిగి అంచనా వేయవచ్చు లేదా లోన్ మొత్తాన్ని సవరించవచ్చు. రుణగ్రహీత మరణించిన తర్వాత లేదా శాశ్వతంగా ఆస్తిని విడిచిపెట్టిన తర్వాత ఆరు నెలల్లోపు లోన్ మొత్తం చెల్లించాలి. రుణగ్రహీత ఆస్తి పన్నులు లేదా బీమాను చెల్లించడంలో విఫలమైతే లేదా నిరంతరంగా ఒక సంవత్సరం కంటే ఎక్కువకాలం ఇంట్లో నివసించకపోతే బ్యాంకు లోన్ను రద్దు (Foreclosure) చేయవచ్చు.ఇదీ చదవండి: బంగారం ధరల తుపాను.. తులం ఎంతంటే.. -
వరుసలో చివరి అక్షరం అని తీసిపారేయకండి!
కార్పొరేట్ కంపెనీలు, కొత్తగా ప్రారంభమవుతున్న స్టార్టప్లు తమ పేర్లను ‘Z’ అనే అక్షరంతో ప్రారంభించడానికి మొగ్గు చూపుతున్నాయి. అయితే ఇలా కంపెనీలు Zతో పేర్లను ప్రారంభించడానికిగల కారణాలను మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అలాగే ఈ పంథాను ఇప్పటికే అనుసరించిన కొన్ని ప్రముఖ కంపెనీల వివరాలను కింద చూద్దాం.Gen Zతో అనుబంధంజెన్జీ- 1990 నుంచి 2010ల మధ్య జన్మించిన Gen Z (జనరేషన్ Z) ప్రస్తుతం ప్రపంచ వినియోగదారుల్లో, శ్రామిక శక్తిలో బలమైన ప్రభావాన్ని చూపుతున్నారు. ఈ తరం డిజిటల్ నేటివ్గా మారుతున్నారు. వీరు వేగవంతమైన మార్పులను అంగీకరించే వారిగా ఉన్నారు. కంపెనీ పేరులో 'Z' ఉండటం ద్వారా తాము ఈ ఆధునిక, సాంకేతికత ఆధారిత, డైనమిక్ తరానికి చెందినవారమని, వారి అవసరాలను తీర్చగలమని పరోక్షంగా కంపెనీలు సందేశం పంపవచ్చు.'Z' అక్షరం యువతలో ట్రెండీగా, విభిన్నంగా కనిపిస్తుంది. ఇది కొత్తదనాన్ని, భవిష్యత్తు, సాంప్రదాయేతర విధానాన్ని సూచిస్తుంది.మార్కెట్లో విభిన్నతఆంగ్ల అక్షరమాల (Alphabet)లో చివరి అక్షరం 'Z'. ఇది ఒక కంపెనీని సులభంగా గుర్తుంచుకునే అవకాశాన్ని ఇస్తుంది. 'A' లేదా 'G'.. వంటి సాధారణ అక్షరాలతో పోలిస్తే 'Z' తో ప్రారంభమయ్యే పేర్లు తక్కువగా ఉంటాయి. కాబట్టి కంపెనీ పేరు వేగంగా దృష్టిని ఆకర్షిస్తుంది.కొన్నిసార్లు వెబ్సైట్ డైరెక్టరీల్లో లేదా యాప్ స్టోర్ల్లో (A-Z జాబితా) పేర్లు ఆల్ఫాబెటికల్ క్రమంలో ఉన్నప్పుడు 'Z' తో ప్రారంభమయ్యే పేర్లు జాబితాలో చివరిలో కనిపించి వినియోగదారులకు ప్రత్యేకంగా గుర్తుండిపోయే అవకాశం ఉంటుంది.డొమైన్ నేమ్స్ఇంటర్నెట్లో కొత్త స్టార్టప్లకు తమకు నచ్చిన పేరుతో డొమైన్ పేరు (ఉదా: example.com) దొరకడం చాలా కష్టం. 'Z' అక్షరం అరుదుగా ఉపయోగించబడటం వల్ల ఈ అక్షరంతో ప్రారంభమయ్యే అర్థవంతమైన పేర్లు, వాటికి అనుగుణమైన డొమైన్ నేమ్స్, సోషల్ మీడియా హ్యాండిల్స్ సులభంగా లభిస్తాయి.'Z' తో ప్రారంభమయ్యే పేర్లను తరచుగా పలకడం, వినడం సులువుగా ఉంటుంది. (ఉదాహరణకు: జెప్టో, జొమాటో). ఇది వేగవంతమైన డిజిటల్ యుగానికి సరిపోయేలా ఉంటుంది.ఇదీ చదవండి: బంగారం ధరల తుపాను.. తులం ఎంతంటే..'Z' అక్షరంతో ప్రారంభమైన ప్రముఖ కంపెనీలుకంపెనీస్థాపించబడిన దేశంప్రధాన వ్యాపారంZeptoభారతదేశంక్విక్ కామర్స్ (10 నిమిషాల కిరాణా డెలివరీ)Zetwerkభారతదేశంమ్యానుఫ్యాక్చరింగ్, సప్లై చైన్ (B2B)Zomatoభారతదేశంఆన్లైన్ ఫుడ్ డెలివరీ, రెస్టారెంట్ అగ్రిగేటర్Zerodhaభారతదేశంఆన్లైన్ స్టాక్ బ్రోకరేజ్ (ట్రేడింగ్)Zillowఅమెరికారియల్ ఎస్టేట్ మార్కెట్ ప్లేస్Zoomఅమెరికావీడియో కమ్యూనికేషన్స్ టెక్నాలజీ -
ఎస్యూవీ మార్కెట్లోకి నిస్సాన్ కొత్త మోడల్
నిస్సాన్ మోటార్ ఇండియా సీ-సెగ్మెంట్ ఎస్యూవీ (SUV) మార్కెట్లో కొత్త మోడల్ను తీసుకురాబోతున్నట్లు తెలిపింది. నిస్సాన్ టెక్టాన్(Nissan Tecton) పేరుతో త్వరలో కొత్త ఎస్యూవీని లాంచ్ చేస్తామని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. కొత్త మోడల్ పేరు వెల్లడించడంతోపాటు దీని ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతూ డిజైన్ టీజర్ను విడుదల చేసింది. డీలర్లకు ఇప్పటికే దీని వివరాలు వెల్లడించినట్లు కంపెనీ తెలిపింది. 2026 రెండో త్రైమాసికంలో భారత మార్కెట్లో ఈ మోడల్ను లాంచ్ చేయనున్నట్లు తెలిపింది.నిస్సాన్ టెక్టాన్ డిజైనింగ్ పరంగా వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఎస్యూవీ ఇంజిన్ పైభాగం బానెట్ వెడల్పుగా ఉండడంతోపాటు ముందు భాగంలో ఎల్ఈడీ డీఆర్ఎల్ (LED DRL) సిగ్నేచర్ మధ్యలో నిస్సాన్ లోగోతో ఆకర్షణీయంగా ఉంటుందని చెప్పారు. స్ప్లిట్ హెడ్ల్యాంప్ సెటప్, ఎల్ఈడీ క్లస్టర్లు, ఫ్రంట్ బంపర్ డిజైన్తో కలిసి దీని ఎస్యూవీ ఆకర్షణను పెంచుతుందని తెలిపారు.వెనుక భాగంలో టెక్టాన్ ఇటీవలి నిస్సాన్ గ్లోబల్ మోడళ్ల మాదిరిగానే కనెక్ట్ ఎల్ఈడీ టెయిల్ లైట్ బార్, స్క్వేర్డ్ టెయిల్ ల్యాంప్స్ను కలిగి ఉంటుందని చెప్పింది. టెక్టాన్ అల్లాయ్ వీల్స్ దీనికి డైనమిక్, ప్రీమియం లుక్ను అందిస్తాయని కంపెనీ తెలిపింది. ఇంటీరియర్లో ప్రీమియం ఫీచర్లు ఉంటాయని తెలిపింది. లేయర్డ్ డాష్బోర్డ్ డిజైన్, లార్జ్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ యూనిట్, పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, వైర్లెస్ స్మార్ట్ఫోన్ కనెక్టివిటీ, వెంటిలేటెడ్ సీట్లు, అధునాతన డ్రైవర్-సహాయక వ్యవస్థల (ADAS)సూట్ను అందించాలని కంపెనీ భావిస్తున్నట్లు తెలిపింది. అయితే దీన్ని ఏ ప్రైస్ రేంజ్లో మార్కెట్లో తీసుకొస్తారని అంశాలను వెల్లడించాల్సి ఉంది.ఇదీ చదవండి: బంగారం ధరల తుపాను.. తులం ఎంతంటే.. -
బంగారం ధరల తుపాను.. ఒక్కరోజే భారీగా..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. అయితే సోమవారంతో పోలిస్తే మంగళవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. ఇదీ చదవండి: మహీంద్రా బొలెరోకు కొత్త హంగులు..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
మహీంద్రా బొలెరోకు కొత్త హంగులు..
దేశీ ఆటోమొబైల్ దిగ్గజం మహింద్రా తన సూపర్ హిట్ బొలెరో ఎస్యూవీలో కొత్త వేరియంట్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. బొలెరో B8, బొలెరో నియో N11 అని పిలుస్తున్న ఈ కొత్త వేరియంట్ల ధరలు రూ.7.99 లక్షల నుంచి రూ.9.99 లక్షల (ఎక్స్ షో రూమ్) వరకూ ఉండనున్నాయి.డిజైన్ పరంగా చూస్తే కొత్త బొలెరోలో ఆకట్టుకునే హారిజోంటల్ యాక్సెంట్స్తో ఆకర్షణీయమైన డిజైన్ను సరికొత్తగా సిద్ధం ఏశారు. ఫాగ్ల్యాంప్స్తోపాటు డైమండ్ కట్ ఆర్-15 అలాయ్ వీల్స్ను అందిస్తున్నారు. మూడు రంగుల్లో, డ్యుయల్టోన్, స్టెల్త్ బ్లాక్ రంగు ఆప్షన్స్తో అందుబాటులో ఉన్న ఈ వాహనాలల్లో ప్రయాణీకుల సౌకర్యాలకు పెద్దపీట వేశారు.సరికొత్త 17.8 సెం.మీ. టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, స్టీరింగ్పైనే ఆడియో నియంత్రణకు అవసరమైన బటన్లు ఉన్నాయి. అలాగే వాహనాన్ని నడపడంలో సౌలభ్యం కోసం రైడ్ &హ్యాండ్లింగ్ టెక్నాలజీ టెక్ను వాడారు. ఎలాంటి నేలపైనైనా వెళ్లేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది.ఈ ఎస్యూవీల్లో 55.9 kW శక్తి మరియు 210 Nm టార్క్ను అందించే mHAWK75 ఇంజిన్ను ఉపయోగించారు. బాడీ-ఆన్-ఫ్రేమ్ నిర్మాణ స్వరూపంతో పటిష్టంగా ఉంటుంది. పగుళ్లిచ్చిన రహదారులపై కూడా మెరుగైన ట్రాక్షన్ లభించేలా బొలెరో నియోలో క్రూయిజ్ కంట్రోల్ మరియు మల్టీ-టెరైన్ టెక్నాలజీ (ఎంటీటీ) ఉన్నాయి.ఇంటీరియర్స్ విషయానికి వస్తే లూనార్ గ్రే, మోకా బ్రౌన్ థీమ్ ఆప్షన్లు ఉన్నాయి. లెదరెట్ అప్హోల్స్ట్రీతోపాటు రియర్ వ్యూ కెమెరా, 22.8 సెంటీమీటర్ల టచ్ స్క్రీన్ ఇన్ఫోటెయిన్ మెంట్ ఏర్పాట్లు ఉన్నాయి.కొత్త బొలెరో ధర రూ. 7.99 లక్షల (ఎక్స్-షోరూం) నుంచి ప్రారంభం అవుతుండగా, కొత్తగా ప్రవేశపెట్టిన టాప్ ఎండ్ B8 వేరియంట్ ధర రూ. 9.69 లక్షలుగా (ఎక్స్-షోరూం) ఉంటుంది. కొత్త బొలెరో నియో ధర రూ. 8.49 లక్షల నుంచి (ఎక్స్-షోరూం) ప్రారంభమవుతుంది. కొత్త టాప్-ఎండ్ వేరియంట్ N11 రేటు రూ. 9.99 లక్షలు. మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఆటోమోటివ్ డివిజన్) నళినికాంత్ గొల్లగుంట మాట్లాడుతూ “పాతికేళ్లుగా భారతదేశపు అత్యంత విశిష్టమైన, పటిష్టమైన ఎస్యూవీగా సుస్థిర స్థానం సంపాదించుకున్న బొలెరో నవ భారత యువత ఆకాంక్షలకు అనుగుణంగా సరికొత్త శ్రేణి తీర్చిదిద్దింది. దృఢత్వం, సమకాలీన స్టైలింగ్, మరింత సౌకర్యం, ఆధునిక ఫీచర్ల మేళవింపుతో సరికొత్త బొలెరో, బొలెరో నియో, పట్టణ ప్రాంతాల్లోనూ అటు సంక్లిష్టమైన ఎత్తుపల్లాల్లోనూ సమంగా, అత్యంత శక్తివంతమైన ఎస్యూవీ అనుభూతిని అందిస్తాయి” అని తెలిపారు.ఇదీ చదవండి: 6జీ అభివృద్ధిలో భారత్ పాత్ర కీలకం -
గ్రీన్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:33 సమయానికి నిఫ్టీ(Nifty) 41 పాయింట్లు పెరిగి 25,122కు చేరింది. సెన్సెక్స్(Sensex) 127 పాయింట్లు పుంజుకొని 81,919 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
6జీ అభివృద్ధిలో భారత్ పాత్ర కీలకం
భారతదేశం 6జీ టెక్నాలజీ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో, ప్రపంచవ్యాప్త భాగస్వామ్యాలను ఏర్పాటు చేయడంలో చురుకుగా ముందుకు సాగుతోంది. విశ్వసనీయ భాగస్వామిగా భారత్కు ఉన్న అంతర్జాతీయ గుర్తింపు 6జీ వ్యవస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు గట్టిగా నమ్ముతున్నారు. ఈ నెల 8 నుంచి 11 వరకు న్యూఢిల్లీలో నిర్వహించే ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2025లో ఈమేరకు చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో 6జీ టెక్నాలజీ, దాని స్పెక్ట్రమ్ పరిమితులు, భారత్పై ప్రభావం, ప్రపంచవ్యాప్త అభివృద్ధి గురించి వివరంగా తెలుసుకుందాం.6జీ టెక్నాలజీ అంటే ఏమిటి?6జీ అనేది వైర్లెస్ కమ్యూనికేషన్ ఆరో తరం సాంకేతికత. ఇది ప్రస్తుతం ఉన్న 5జీ నెట్వర్క్ల సామర్థ్యాన్ని, వేగాన్ని, విశ్వసనీయతను గణనీయంగా పెంచుతుంది. 6జీ సాంకేతికత ప్రధాన లక్ష్యం అల్ట్రా-హైస్పీడ్, అల్ట్రా-లో లేటెన్సీ (చాలా తక్కువ జాప్యం), భారీ కనెక్టివిటీతో కూడిన కమ్యునికేషన్ను సృష్టించడం.6జీ ముఖ్య లక్షణాలుఅత్యధిక వేగం (Ultra-High Speed)6జీ నెట్వర్క్లు సెకనుకు 1 టెరాబిట్ (Tbps) లేదా అంతకంటే ఎక్కువ గరిష్ట డేటా ట్రాన్స్ఫర్ రేటును అందించగలవని అంచనా. ఇది 5జీ కంటే 100 రెట్లు ఎక్కువగా ఉంటుందని కొందరు చెబుతున్నారు.చాలా తక్కువ జాప్యం (Ultra-Low Latency)డేటా బదిలీకి పట్టే సమయం 100 మైక్రోసెకన్ల కంటే తక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ అతి తక్కువ జాప్యం వల్ల రియల్-టైమ్ ఆపరేషన్స్, క్లిష్టమైన అప్లికేషన్లు మరింత సులభతరం అవుతాయి.విస్తృత కనెక్టివిటీ (Massive Connectivity)ఒక చదరపు కిలోమీటరుకు కోట్లాది డివైజ్లను కనెక్ట్ చేసే సామర్థ్యం 6జీకి ఉంటుంది. ఇది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), స్మార్ట్ సిటీస్ విస్తరణకు ఎంతో తోడ్పడుతుంది.ఏఐ ఏకీకరణ (AI Integration)ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML) నెట్వర్క్తో పూర్తిగా కలిసిపోయి ఆటోమేటెడ్, సమర్థవంతమైన నెట్వర్క్ నిర్వహణను అందిస్తుంది.హోలోగ్రాఫిక్ కమ్యూనికేషన్6జీ ద్వారా త్రీ-డైమెన్షనల్ (3D) హోలోగ్రాఫిక్ కమ్యూనికేషన్, వర్చువల్ రియాలిటీ (VR), ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) వంటి ఇమ్మర్సివ్ అనుభవాలు సాధ్యమవుతాయి.6జీకి కావాల్సిన స్పెక్ట్రమ్ పరిమితులు6జీ నెట్వర్క్లకు కావాల్సిన అత్యంత వేగం, సామర్థ్యం కోసం ప్రస్తుతం వాడుకలో ఉన్న ఫ్రీక్వెన్సీ బ్యాండ్లతో పాటు కొత్త, విశాలమైన స్పెక్ట్రమ్ బ్యాండ్లు అవసరం. 6జీ కోసం దృష్టి సారిస్తున్న ప్రధాన స్పెక్ట్రమ్ పరిమితులు కింది విధంగా ఉంటాయి.సబ్-టెరాహెర్ట్జ్ (Sub-Terahertz - Sub-THz) బ్యాండ్ఇది 90 GHz (గిగాహెర్ట్జ్) నుంచి 3 THz (టెరాహెర్ట్జ్) మధ్య ఉండే ఫ్రీక్వెన్సీ పరిధి. ఈ బ్యాండ్ చాలా విశాలమైన బ్యాండ్విడ్త్ను అందిస్తుంది. దీని ద్వారానే 1 Tbps వేగం సాధ్యమవుతుందని అంచనా. అయితే ఈ ఫ్రీక్వెన్సీల్లో సిగ్నల్స్ పరిధి తక్కువగా ఉండి భవనాలు వంటి అడ్డంకులను దాటడం కష్టం. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.సెంటీమీటర్ వేవ్ (cmWave) బ్యాండ్ప్రస్తుతం 5జీకి వాడుతున్న మిడ్-బ్యాండ్ ఫ్రీక్వెన్సీలకు దగ్గరగా ఉండే 7 GHz నుంచి 15 GHz మధ్య ఉన్న ఈ బ్యాండ్ను ‘6జీ గోల్డెన్ బ్యాండ్’గా పరిగణిస్తున్నారు. ఇది మంచి కవరేజ్, సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 6జీ కోసం 1.5-2 GHz మిడ్-బ్యాండ్ స్పెక్ట్రమ్ అవసరమని పరిశోధకులు భావిస్తున్నారు.ఇండియాలో 6జీ వస్తే చోటు చేసుకోనున్న పరిణామాలుఇండియాలో ‘భారత్ 6జీ విజన్’ కింద 6జీ సాంకేతికతను 2030 నాటికి అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత్ వంటి అతిపెద్ద జనాభా గల దేశంలో 6జీ రాక వల్ల భారీ పరివర్తనలు సంభవిస్తాయి.డిజిటల్ విప్లవం: 6జీ గ్రామీణ, సరైన కనెక్టివిటీలేని ప్రాంతాలకు సైతం మెరుగైన కమ్యునికేషన్ అందిస్తుంది.ఆరోగ్య సంరక్షణ (Healthcare): రియల్-టైమ్ టెలిసర్జరీలు, రిమోట్ పేషెంట్ మానిటరింగ్, ఏఐ-ఆధారిత డయాగ్నోస్టిక్స్ వంటివి విస్తృతం అవుతాయి. అంబులెన్స్లు, ఆసుపత్రులు సహా అన్ని వైద్య మౌలిక సదుపాయాలు ఏఐ ఆధారితంగా అనుసంధానమవుతాయి.విద్య (Education): విద్యార్థులు వర్చువల్ టీచర్లతో, క్లాస్మేట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, ఎక్కడైనా, ఎప్పుడైనా నాణ్యమైన విద్యా వనరులను పొందేందుకు 6జీ ఉపయోగపడుతుంది.పరిశ్రమల ఆటోమేషన్ (Industrial Automation): స్మార్ట్ ఫ్యాక్టరీల్లో యంత్రాల రియల్-టైమ్ రిమోట్ కంట్రోల్, ఏఐ-ఆధారిత ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్, రోబోటిక్స్ వంటివి ఉత్పత్తి సామర్థ్యాన్ని, నాణ్యతను అసాధారణంగా పెంచుతాయి.రవాణా (Transportation): అర్బన్ ఎయిర్ మొబిలిటీ (UAM), అటానమస్ వాహనాల (Self-Driving Cars) కోసం 6జీ కమ్యూనికేషన్ అత్యంత అవసరం. ట్రాఫిక్ నిర్వహణ, లాజిస్టిక్స్లో డ్రోన్ ఫ్లీట్ల వాడకం పెరుగుతుంది.రక్షణ రంగం (Defence): కమాండర్లకు వేగవంతమైన, రియల్-టైమ్ క్షేత్ర సమాచారం అందించేందుకు వీలవుతుంది. సురక్షితమైన కమ్యూనికేషన్, డ్రోన్లు, హైపర్సోనిక్ ఆయుధాలకు కమ్యూనికేషన్ లింక్లు అందించడం ద్వారా రక్షణ సామర్థ్యం పెరుగుతుంది.ఈ టెక్నాలజీ వివిధ దేశాల పరిశోధనలుప్రస్తుతానికి ప్రపంచంలో ఏ దేశంలోనూ పూర్తిగా వాణిజ్యపరమైన (Commercial) 6జీ నెట్వర్క్ వాడుకలో లేదు. 6జీ సాంకేతికతను 2030 నాటికి వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుని అభివృద్ధి, పరిశోధన (R&D)లో వివిధ దేశాలు, టెక్ కంపెనీలు చురుగ్గా పోటీ పడుతున్నాయి.6జీ అభివృద్ధిలో ముందున్న దేశాలుచైనా: 6జీ పరిశోధన, అభివృద్ధిలో ముందంజలో ఉంది. చైనా భారీగా పెట్టుబడులు పెడుతోంది. టెరాహెర్ట్జ్ సిగ్నల్ ప్రసారాన్ని పరీక్షించేందుకు ఇప్పటికే ప్రయోగాత్మక ఉపగ్రహాన్ని (Experimental Satellite) ప్రయోగించింది. 6జీ పేటెంట్ ఫైలింగ్స్లో చైనా అగ్రస్థానంలో ఉంది.దక్షిణ కొరియా: 5జీని వేగంగా అమలు చేసిన దక్షిణ కొరియా 6జీలో కూడా బలమైన పోటీదారుగా ఉంది. శాంసంగ్, ఎల్జీ వంటి దిగ్గజ సంస్థలు 6జీ R&D కేంద్రాలను ఏర్పాటు చేశాయి. 2028 నాటికి 6జీని వాణిజ్యపరంగా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.జపాన్: టెక్నాలజీ అభివృద్ధిలో తన నైపుణ్యాన్ని కొనసాగిస్తూ 2030 నాటికి 6జీని ఆవిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.యునైటెడ్ స్టేట్స్, యూరప్: యూఎస్ ‘నెక్స్ట్ G అలయన్స్’ ద్వారా ఈయూ ఆధ్వర్యంలో ‘హెక్సా-ఎక్స్’ (Hexa-X) వంటి చొరవలతో 6జీ పరిశోధనలో చురుకుగా పాల్గొంటున్నాయి.ప్రస్తుత డిజిటల్ అభివృద్ధిపైన తెలిపిన దేశాలు ఇంకా 6జీని వాడకపోయినా 5జీని వేగంగా, విస్తృతంగా అమలు చేస్తున్నాయి. ఉదాహరణకు దక్షిణ కొరియా వంటి దేశాలు ప్రపంచంలోనే అత్యధిక 5జీ కవరేజ్, వేగాన్ని కలిగి ఉన్నాయి. ఇది ఇప్పటికే రిమోట్ సర్జరీ, ఏఐ-ఆధారిత స్మార్ట్ ఫ్యాక్టరీలు వంటి డిజిటల్ ఆవిష్కరణలకు మార్గం సుగమం చేస్తోంది. 6జీ రాకతో ఈ డిజిటల్ అభివృద్ధి మరింత వేగవంతమై ఊహించని పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.చివరగా..6జీ టెక్నాలజీ అనేది కేవలం మొబైల్ స్పీడ్ను పెంచేది మాత్రమే కాదు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాలిటీ, హోలోగ్రాఫిక్స్, అటానమస్ సిస్టమ్స్ వంటి వాటిని అనుసంధానించే ఒక కొత్త డిజిటల్ ఫ్రేమ్వర్క్. భారత్ తన ‘భారత్ 6జీ విజన్’తో ఈ రేసులో దూసుకుపోతోంది. విశ్వసనీయ భాగస్వామిగా ఉన్న భారత్ అంతర్జాతీయ సహకారంతో 6జీ సాంకేతికతను అభివృద్ధి చేయడంలో విజయం సాధిస్తే అది దేశ సామాజిక-ఆర్థిక పురోగతిని, ప్రపంచ టెక్నాలజీ రంగంలో దాని నాయకత్వాన్ని బలోపేతం చేస్తుంది. ఈ ఆవిష్కరణతో ప్రజల జీవన నాణ్యత మెరుగుపడటంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు వస్తుందని చెప్పవచ్చు.ఇదీ చదవండి: సోషల్ మీడియాలో మోసపూరిత కంటెంట్ తొలగింపు -
కొత్త మొబైల్ యూజర్లలో టాప్ కంపెనీ
కొత్త మొబైల్ యూజర్లకు సంబంధించి ఆగస్టులో రిలయన్స్ జియో జోరు కొనసాగగా, ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ దాదాపు ఏడాది తర్వాత భారతి ఎయిర్టెల్ను అధిగమించింది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ గణాంకాల ప్రకారం మొబైల్ సెగ్మెంట్లో ఆగస్టులో నికరంగా 35.19 లక్షల కొత్త కనెక్షన్లు నమోదయ్యాయి. జియో కస్టమర్లు అత్యధికంగా 19 లక్షల మేర పెరగ్గా బీఎస్ఎన్ఎల్ (13.85 లక్షలు), ఎయిర్టెల్ (4.96 లక్షలు) తర్వాత స్థానాల్లో నిల్చాయి.చివరిసారిగా 2024 సెప్టెంబర్లో అన్ని ప్రైవేట్ సంస్థలను మించి బీఎస్ఎన్ఎల్ అత్యధికంగా యూజర్లను దక్కించుకుంది. అప్పట్లో కంపెనీ 3జీ సేవలను మాత్రమే అందించేది. అయితే, ప్రైవేట్ టెల్కోలు టారిఫ్లను పెంచేయడం బీఎస్ఎన్ఎల్కి కలిసొచ్చింది. కంపెనీ ఇటీవలే దేశవ్యాప్తంగా 4జీ సర్వీసులు ప్రారంభించింది. ఇక, తాజాగా జూలైలో 122 కోట్లుగా ఉన్న మొత్తం టెలిఫోన్ సబ్ర్స్కయిబర్స్ సంఖ్య ఆగస్టులో 122.45 కోట్లకు చేరింది. వొడాఫోన్ ఐడియా అత్యధికంగా 3.08 లక్షల యూజర్లను కోల్పోయింది. బ్రాడ్బ్యాండ్ సెగ్మెంట్లో (మొబైల్, ఫిక్సిడ్ లైన్ కలిపి) 50 కోట్ల కస్టమర్లతో జియో అగ్రస్థానంలో ఉండగా, తర్వాత స్థానాల్లో 30.9 కోట్ల కనెక్షన్లతో భారతి ఎయిర్టెల్, 12.7 కోట్లతో వొడాఫోన్ ఐడియా, 3.43 కోట్ల కనెక్షన్లతో బీఎస్ఎన్ఎల్, 23.5 లక్షల బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లతో ఏట్రియా కన్వర్జెన్స్ ఉన్నాయి.ఇదీ చదవండి: సోషల్ మీడియాలో మోసపూరిత కంటెంట్ తొలగింపు -
సేవల రంగంలో నిదానించిన వృద్ధి
సేవల రంగంలో కార్యకలాపాల వృద్ధి సెప్టెంబర్ నెలలో కాస్తంత నిదానించింది. హెచ్ఎస్బీసీ ఇండియా సేవల రంగం పీఎంఐ ఆగస్ట్లో 15 ఏళ్ల గరిష్ట స్థాయి 62.9 పాయింట్లకు చేరగా, సెప్టెంబర్లో 60.9కు తగ్గింది. అయినప్పటికీ 50 పాయింట్లకు పైన నమోదు కావడాన్ని వృద్ధి కిందే పరిగణిస్తుంటారు. వేగం తగ్గినప్పటికీ, వృద్ధి ధోరణికి ఢోకా లేదని హెచ్ఎస్బీసీ భారత ముఖ్య ఆర్థికవేత్త ప్రంజుల్ భండారీ పేర్కొన్నారు.అంతర్జాతీయంగా భారత సేవలకు డిమాండ్ కొంత నిదానించడంతో వృద్ధి వేగానికి కాస్త బ్రేక్లు పడినట్టయింది. సెప్టెంబర్లో ఎగుమతుల్లో వృద్ధి నెలకొన్నప్పటికీ, ఈ ఏడాది మార్చి తర్వాత నుంచి చూస్తే తక్కువకు పరిమితమైనట్టు హెచ్ఎస్బీసీ ఇండియా సర్వే గుర్తించింది. సెప్టెంబర్లో ఉపాధి కల్పన సైతం మోస్తరు స్థాయికి నిదానించిందని, కేవలం 5 శాతానికంటే కొంచెం ఎక్కువ కంపెనీలు నియామకాల్లో వృద్ధిని నమోదు చేసినట్టు తెలిపింది.ఇక భవిష్యత్తు కార్యకలాపాలకు సంబంధించిన సూచీ మాత్రం ఈ ఏడాది మార్చి తర్వాత గరిష్ట స్థాయికి చేరుకుంది. భవిష్యత్తులో వ్యాపార కార్యకలాపాల పరంగా సేవల రంగ కంపెనీల్లో ఆశాభావం బలపడినట్టు ఈ సర్వే పేర్కొంది. సెప్టెంబర్ నెలకు సంబంధించి హెచ్ఎస్బీసీ ఇండియా కాంపోజిట్ పీఎంఐ (తయారీ, సేవల రంగం కలిపి) 61గా నమోదైంది. ఆగస్ట్లో ఇది 63.2 పాయింట్లుగా ఉంది. ఈ ఏడాది జూన్ తర్వాత తక్కువ వృద్ధి రేటు ఇదే కావడం గమనార్హం.ఇదీ చదవండి: దేశం విడిచిన కుబేరులు.. కారణాలు.. -
ఆరు ఐపీవోలకు గ్రీన్సిగ్నల్
మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మరో ఆరు కంపెనీల పబ్లిక్ ఇష్యూలకు (ఐపీవో) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐవేర్ రిటైల్ సంస్థ లెన్స్కార్ట్ సొల్యూషన్స్, వేక్ఫిట్ ఇన్నోవేషన్స్, టెనెకో క్లీన్ ఎయిర్ ఇండియా, కార్డీలియా క్రూయిజెస్ నిర్వహణ సంస్థ వాటర్వేస్ లీజర్ టూరిజం, కాటన్ యార్న్ల తయారీ కంపెనీ శ్రీరామ్ ట్విస్టెక్స్, ఇండ్రస్టియల్ ల్యామినేట్స్ ఉత్పత్తి చేసే లామ్టఫ్ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ కలిసి సుమారు రూ. 6,500 కోట్లు పైగా సమీకరించవచ్చని అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాది జూన్–జూలై మధ్య ఈ ఆరు కంపెనీలు దరఖాస్తు చేసుకోగా, సెపె్టంబర్ 26 – అక్టోబర్ 3 మధ్య అనుమతులు వచ్చినట్లు తెలుస్తోంది. 2025లో 80 కంపెనీలు ఇప్పటికే ఐపీవోల ద్వారా నిధులు సమీకరించుకోగా, ఈ నెలలో మరిన్ని సంస్థలు లైనులో ఉన్నాయి.లెన్స్కార్ట్తాజాగా షేర్ల జారీ ద్వారా లెన్స్కార్ట్ సొల్యూషన్స్ రూ. 2,150 కోట్లు సమీకరించనుంది. ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు 13.22 కోట్ల షేర్లు విక్రయించనున్నారు. ఐపీవో నిధులను కొత్త స్టోర్స్ ఏర్పాటు చేసేందుకు, స్టోర్ల లీజులు–అద్దెలు మొదలైన వాటి చెల్లింపులకు, టెక్నాలజీ–క్లౌడ్ ఇన్ఫ్రాపై ఇన్వెస్ట్ చేసేందుకు, బ్రాండ్ మార్కెటింగ్కు, ఇతర సంస్థ కొనుగోలుకు, ఇతరత్రా సాధారణ కార్పొరేట్ అవసరాలకు కంపెనీ వినియోగించుకోనుంది. వేక్ఫిట్ ఇన్నోవేషన్స్రూ. 468.2 కోట్ల వరకు విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద ప్రస్తుత వాటాదారులు 5.84 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. ఫ్రెష్ ఇష్యూ ద్వారా వచ్చే నిధుల్లో రూ. 82 కోట్లను 117 కంపెనీ ఆపరేటెడ్ కంపెనీ ఓన్డ్ (కోకో)–రెగ్యులర్ స్టోర్స్, ఒక కోకో–జంబో స్టోర్ ఏర్పాటుకు; కొత్త పరికరాల కొనుగోలుకు రూ. 15.4 కోట్లు; ప్రస్తుత స్టోర్ల లీజులు, అద్దెల కోసం రూ. 145 కోట్లు; మార్కెటింగ్ కోసం రూ. 108 కోట్లను కంపెనీ వినియోగించుకోనుంది.టెనెకో క్లీన్ ఎయిర్ ఇండియాఇష్యూ ద్వారా రూ. 3,000 కోట్లు సమీకరించనుంది. ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో ఉంటుంది. ప్రమోటర్ టెనెకో మారిషస్ హోల్డింగ్స్ ఈ షేర్లను విక్రయించనుంది. వాటర్వేస్ లీజర్ టూరిజంకొత్తగా షేర్లను జారీ చేయడం ద్వారా రూ.727 కోట్లు సమీకరించనుంది. ఇందులో రూ. 552.53 కోట్లను తమ అనుబంధ సంస్థ బేక్రూయిజ్ షిప్పింగ్ అండ్ లీజింగ్కి సంబంధించిన అడ్వాన్స్లు, లీజులు మొదలైన వాటిని చెల్లించేందుకు, మిగతా మొత్తాన్ని కార్పొరేట్ అవసరాలకు కంపెనీ ఉపయోగించుకోనుంది. శ్రీరామ్ ట్విస్టెక్స్1.06 కోట్ల షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ఈ నిధులను సొంత అవసరాల కోసం 6.1 మెగావాట్ల సౌరవిద్యుత్ ప్లాంటు, 4.2 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంటు ఏర్పాటు కోసం; అలాగే రుణాల చెల్లింపు, ఇతరత్రా నిర్వహణ మూలధన అవసరాల కోసం వినియోగించుకోనుంది.లామ్టఫ్కొత్తగా 1 కోటి షేర్లను జారీ చేయనుండగా, ప్రమోటర్లు 20 లక్షల షేర్లను ఓఎఫ్ఎస్ కింద విక్రయించనున్నారు. తెలంగాణలో తమకున్న తయారీ ప్లాంటు విస్తరణకు, నిర్వహణ మూలధనం, ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం నిధులను కంపెనీ ఉపయోగించుకుంటుంది.ఇదీ చదవండి: దేశం విడిచిన కుబేరులు.. కారణాలు.. -
సోషల్ మీడియాలో మోసపూరిత కంటెంట్ తొలగింపు
సోషల్ మీడియా వేదికలపై ఇన్వెస్టర్లను మోసగించే చట్టవిరుద్ధమైన కంటెంట్ను గత 18 నెలల్లో లక్షకు పైగా తొలగించినట్టు సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు. మోసగాళ్ల బారి నుంచి ఇన్వెస్టర్లకు రక్షణ కల్పించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. చట్టవిరుద్ధమైన కంటెంట్ విషయాన్ని గూగుల్, మెటా తదితర ప్లాట్ఫామ్ల దృష్టికి తీసుకెళ్లి వాటిని తొలగించే దిశగా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.ఎన్ఎస్ఈలో ఏర్పాటు చేసిన ఇన్వెస్టర్ల అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మోసపూరిత కంటెంట్ను గుర్తించడంతో టెక్నాలజీ సాయపడుతున్నట్టు తెలిపారు. క్యాపిటల్ మార్కెట్లపై కేవలం 36 శాతం మందికే అధికంగా లేక మోస్తరు అవగాహన ఉందన్న ఇటీవలి సర్వే ఫలితాలను ప్రస్తావిస్తూ.. ఈ పరిస్థితుల్లో మోసపూరిత కంటెంట్ మెజారిటీ ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించే అవకాశం లేకపోలేదన్నారు.‘విశ్వాసం దెబ్బతింటే అప్పుడు ఆర్థిక వ్యవస్థకు చోదకం కుంటుపడుతుంది. పెట్టుబడులకు ఇన్వెస్టర్లు వెనకాడతారు’అని పాండే పేర్కొన్నారు. అందుకే ఇన్వెస్టర్లలో అవగాహన కల్పించడం సెబీకి కీలక ప్రాధాన్యంగా తెలిపారు. ఈ దిశగా ఎన్నో చర్యలు చేపట్టినట్టు చెప్పారు.ఇదీ చదవండి: దేశం విడిచిన కుబేరులు.. కారణాలు.. -
లలితా జ్యువెల్లరి ఐపీవోకి సెబీ ఓకే
హైదరాబాద్: లలితా జ్యువెల్లరి మార్ట్ ప్రతిపాదిత ఇనీషీయల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 1,700 కోట్లు సమీకరించనుంది. ఇష్యూలో భాగంగా రూ. 1,200 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ప్రమోటర్ కిరణ్ కుమార్ జైన్ రూ. 500 కోట్ల విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో విక్రయించనున్నారు. తాజాగా షేర్ల జారీ ద్వారా సమీకరించే నిధుల్లో రూ. 1,014.50 కోట్లను కొత్త స్టోర్స్ ఏర్పాటుకు, మిగతా మొత్తాన్ని ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. 1985లో చెన్నై టీ నగర్లో తొలి స్టోర్ ప్రారంభించిన లలితా జ్యువెల్లరి దక్షిణాదిలో 56 స్టోర్లతో విస్తరించింది. వీటిలో ఆంధ్రప్రదేశ్లో 22, తెలంగాణలో 6 స్టోర్స్ ఉన్నాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 13,316.80 కోట్లుగా ఉన్న ఆదాయం 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 16,788 కోట్లకు చేరగా లాభం రూ. 238.3 కోట్ల నుంచి రూ. 359.8 కోట్లకు చేరింది.లలితా జ్యువెలరీ మార్ట్ (Lalithaa Jewellery Mart) దక్షిణ భారతదేశంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రాంతీయ బ్రాండ్ల్లో ఒకటి. కొన్నేళ్లుగా కంపెనీ తన కార్యకలాపాలు విస్తరిస్తోంది. నాణ్యత, పారదర్శకత, భారీ స్టోర్ల ఏర్పాటు వ్యూహంతో ఈ సంస్థ దేశీయ నగల మార్కెట్లో తనదైన ముద్ర వేస్తోంది. నాణ్యతకు నిదర్శనంగా అన్ని ఆభరణాలపై BIS హాల్మార్క్ ప్రమాణాలను పాటిస్తూ బంగారం (Gold), వెండి (Silver), వజ్రాల (Diamond) ఆభరణాలను అందిస్తోంది. ఈ సంస్థకు మొత్తం 6.09 లక్షల చదరపు అడుగుల వ్యాపార స్థలం ఉంది. ఇది సంస్థ విస్తృతికి అద్దం పడుతోంది.ఆర్థిక ప్రగతిలో దూకుడులలితా జ్యువెలరీ గత కొంతకాలంగా ఆర్థిక వృద్ధిని నమోదు చేస్తోంది. సంస్థ ఆదాయ వృద్ధి రేటు 43.62%గా ఉందని కంపెనీ తెలిపింది. ఇది ఈ రంగంలో సంస్థ బలమైన పనితీరును సూచిస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.16,788 కోట్లు ఆదాయం వస్తే రూ.359.8 కోట్లు లాభం వచ్చింది. 2025 ఆర్థిక సంవత్సరంలో (9 నెలలు) రూ.12,594 కోట్లు ఆదాయం వస్తే అందులో రూ.262.3 కోట్లు లాభంగా ఉందని కంపెనీ తెలిపింది.భారీ స్టోర్ల వ్యూహం, తయారీ సామర్థ్యంలలితా జ్యువెలరీ దేశంలోనే అతిపెద్ద నగల స్టోర్లను నెలకొల్పింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన స్టోర్ల పరిమాణం ప్రత్యేకంగా నిలిచింది. విజయవాడలో 1,00,000 చదరపు అడుగులు, సోమాజిగూడ (హైదరాబాద్)లో 98,210 చదరపు అడుగులు, విశాఖపట్నంలో 65,000 చదరపు అడుగులతో స్టోర్లు నెలకొల్పింది.ఈ సంస్థకు తమిళనాడులో రెండు అత్యాధునిక తయారీ కేంద్రాలు (మానుఫ్యాక్చరింగ్ యూనిట్లు) ఉన్నాయి. ఇక్కడ 563 మంది నిపుణులైన కారిగర్లు(బంగారు ఆభరణాల తయారీదారులు) పనిచేస్తున్నారు. వీరు కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా అనేక రకాల డిజైన్లను రూపొందిస్తున్నారు. -
‘దీపావళి’ పర్యాటక కళ!
ముంబై: దీపావళి పండుగ సందర్భంగా ప్రయాణ బుకింగ్లకు డిమాండ్ నెలకొంది. దేశీయంగా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న బంధుమిత్రులతో పండుగ సంబరాలు చేసుకునేందుకు.. దేశ, విదేశాల్లోని సుందర ప్రదేశాలు చూసి వచ్చేందుకు.. ఇలా అన్ని రకాల ట్రావెల్ బుకింగ్లకు డిమాండ్ ఏర్పడినట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. బంధు మిత్రులను కలుసుకోవడం పడుగల సీజన్లో ప్రయాణాలకు కీలక డిమాండ్గా ఉన్నట్టు మేక్మై ట్రిప్ కో ఫౌండర్, గ్రూప్ సీఈవో రాజేష్ మాగోవ్ తెలిపారు. ఈ సమయంలో వేడుకల కోసం స్వస్థలాలకు వెళుతుంటారని చెప్పారు. అత్యధికంగా బుకింగ్లు జరిగిన టాప్–10 ప్రదేశాల్లో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ఉన్నాయంటూ.. పుణ్యక్షేత్రాలకు సైతం డిమాండ్ పెరిగినట్టు పేర్కొన్నారు. అంతర్జాతీయంగా చూస్తే యూఏఈ, సింగపూర్, థాయ్లాండ్, వియత్నాంకు బుకింగ్లు అధికంగా ఉన్నట్టు చెప్పారు. దీపావళి సందర్భంగా కొత్త ప్రదేశాలకు చూసి వచ్చేందుకు ఆసక్తి పెరుగుతోందని థామస్ కుక్ (ఇండియా) ప్రెసిడెంట్ రాజీవ్ కాలే సైతం తెలిపారు. ‘‘ఒక్కొక్కరు పర్యటన కోసం చేసే సగటు వ్యయం పెరుగుతుండడం ఆసక్తికరం. ప్రయాణికులు ఎక్కువ రోజులు బస చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సాధారణంగా కనిపించే మూడు రోజులకు బదులు 6–12 రోజులకు బుక్ చేసుకుంటున్నారు’’అని తెలిపారు. యూరప్లో స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ, ఆ్రస్టియా, స్పెయిన్, పోర్చుగల్ ప్రధాన బుకింగ్ కేంద్రాలుగా ఉన్నాయి. స్వల్పకాలం కోసం వియత్నాం, ఒమన్, మాల్దీవులు, బాలి, కంబోడియాకు డిమాండ్ నెలకొన్నట్టు రాజీవ్ కాలే తెలిపారు. వీసా పరంగా సులభ ప్రవేశానికి అవకాశం ఉన్న థాయ్లాండ్, మలేషియా, శ్రీలంక, నేపాల్, భూటాన్, దుబాయి–అబుదాబి, ఇండోనేíÙయా, ఫిలిప్పీన్స్కు ఎప్పటి మాదిరే డిమాండ్ కనిపిస్తున్నట్టు చెప్పారు. వారణాసికి డిమాండ్.. దేశీయంగా కేరళ, రాజస్తాన్, ఉత్తరాఖండ్, అండమాన్తోపాటు ఆధ్యాత్మిక కేంద్రాలైన చార్ధామ్, కైలాస్ మానససరోవర్, అయోధ్య, వారణాసి వెళ్లొచ్చేందుకు ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తున్నట్టు రాజీవ్ కాలే తెలిపారు. ఈ దీపావళి సందర్భంగా ఫ్లయిట్ బుకింగ్లు పెరిగినట్టు ఇక్సిగో గ్రూప్ సీఈవో అలోకే బాజ్పాయ్ తెలిపారు. గతేడాదితో పోల్చి చూస్తే 60–65 శాతం డిమాండ్ పెరిగినట్టు చెప్పారు. ముఖ్యంగా అయోధ్య, వారణాసికి బుకింగ్లు 100 శాతం అధికంగా ఉన్నట్టు తెలిపారు. జెనరేషన్ జెడ్, దంపతులు అయితే క్రూయిజ్ బుకింగ్లు ఆసక్తి చూపిస్తున్నట్టు చెప్పారు. ఈ దీపావళి సీజన్కు ముందు 4, 5 స్టార్ హోటళ్లలో బుకింగ్లు గణనీయంగా పెరిగినట్టు, ముఖ్యంగా 5 స్టార్ కోసం రెండు రెట్లు అధికంగా బుకింగ్లు వస్తున్నట్టు క్లియర్ట్రిప్ అధికార ప్రతినిధి సైతం తెలిపారు. పండుగలకు ముందు నాటితో పోల్చి చూస్తే ఫ్లయిట్ బుకింగ్ రెండు రెట్లు, హోటల్ బుకింగ్లు 3.5 రెట్లు అధికంగా ఉన్నట్టు చెప్పారు. -
త్వరలో పెట్రోల్ వాహనాల రేట్లకి ఈవీలు
న్యూఢిల్లీ: వచ్చే నాలుగు నుంచి ఆరు నెలల్లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) రేట్లు కూడా పెట్రోల్ వాహనాల ధరల స్థాయిలో లభించగలవని అంచనా వేస్తున్నట్లు కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. శిలాజ ఇంధనాల దిగుమతులపై ఆధారపడటమనేది ఆర్థికంగా భారం కావడంతో పాటు పర్యావరణంపరంగాను ప్రతికూల పరిణామాలకు దారి తీస్తోందన్నారు. ఏటా ఇంధన దిగుమతులపై రూ. 22 లక్షల కోట్లు వెచి్చంచాల్సి వస్తోందని 20వ ఫిక్కీ ఉన్నత విద్యా సదస్సు 2025లో పాల్గొన్న సందర్భంగా చెప్పారు. అయిదేళ్లలోగా భారత్ను ప్రపంచంలోనే నంబర్ వన్ ఆటోమొబైల్ పరిశ్రమగా నిలపాలని నిర్దేశించుకున్నట్లు ఆయన చెప్పారు. ‘నేను రవాణా మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ పరిమాణం రూ. 14 లక్షల కోట్లుగా ఉండేది. ప్రస్తుతం రూ. 22 లక్షల కోట్లకు చేరింది‘ అని గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం రూ. 78 లక్షల కోట్లతో అమెరికా ఆటోమొబైల్ పరిశ్రమ అగ్రస్థానంలోను, రూ. 47 లక్షల కోట్ల పరిమాణంతో చైనా తొలి రెండు స్థానాల్లో ఉండగా, భారత్ మూడో స్థానంలో ఉంది. మరోవైపు, దేశ పురోగతికి స్వచ్ఛ ఇంధనాల వినియోగం చాలా కీలకమని మంత్రి వివరించారు. మొక్కజొన్న నుంచి ఇథనాల్ ఉత్పత్తి చేయడం వల్ల రైతులకు అదనంగా రూ. 45,000 కోట్ల మేర ఆదాయం వచి్చందని పేర్కొన్నారు. ఇక 2027 నాటికల్లా ఘనవ్యర్ధాలను రహదారుల నిర్మాణంలో వినియోగించే ప్రాజెక్టును చేపట్టినట్లు మంత్రి చెప్పారు. ఉన్నత విద్యాభ్యాసం, నైపుణ్యాలను పెంచుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత కీలకంగా మారిందని ఆయన పేర్కొన్నారు. -
పసిడి హైజంప్!
న్యూఢిల్లీ: బంగారం ధర మరో రికార్డు గరిష్టానికి చేరింది. ఒక్క రోజే 10 గ్రాములకు (99.9 శాతం స్వచ్ఛత) రూ.2,700 ఎగిసి, ఢిల్లీ మార్కెట్లో సోమవారం రూ.1,23,300 సరికొత్త ఆల్టైమ్ గరిష్ట స్థాయిని నమోదు చేసింది. వెండి సైతం కిలోకి రూ.7,400 పెరిగి మరో నూతన జీవిత కాల గరిష్ట స్థాయి రూ.1,57,400కు చేరింది. ముఖ్యంగా డాలర్తో రూపాయి బలహీనపడడం బంగారం ధరలకు ఆజ్యం పోసినట్టు ట్రేడర్లు తెలిపారు. ‘బంగారం ధరలు సోమవారం నూతన ఆల్టైమ్ గరిష్టానికి చేరాయి. రికార్డు స్థాయి ధరల్లోనూ ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. బలమైన సానుకూల ధోరణితో బులియన్ ధరలు మరింత పెరుగుతాయన్నది వారి అంచనా. అమెరికా ప్రభుత్వం ఎక్కువ రోజుల పాటు షట్డౌన్ కావడం ఆర్థిక కార్యకలాపాలను ప్రభావితం చేస్తుందన్న ఆందోళనలు సైతం తాజా డిమాండ్కు తోడయ్యాయి’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్స్కు 85 డాలర్లు ఎగసి 3,994 డాలర్లకు కొత్త రికార్డును తాకింది. వెండి ఔన్స్కు 1% పెరిగి 48.75 డాలర్ల స్థాయిని తాకింది. ‘యూఎస్ ప్రభుత్వం షట్డౌన్ ఆరో రోజుకు చేరుకుంది. దీంతో బంగారం సరికొత్త గరిష్టాలను చేరింది’ అని కోటక్ సెక్యూరిటీస్ ఏవీపీ కేనత్ చైన్వాలా తెలిపారు. నాన్ స్టాప్ ర్యాలీ...ఈ ఏడాది బంగారం, వెండి ధరలు ఇప్పటి వరకు ఆగకుండా ర్యాలీ చేస్తూనే ఉన్నాయి. 2024 డిసెంబర్ 31న 10 గ్రాముల బంగారం ధర ఢిల్లీ మార్కెట్లో రూ.78,950 వద్ద ఉంది. అక్కడి నుంచి చూస్తే నికరంగా రూ.44,350 పెరిగింది. వెండి ధర సైతం ఈ ఏడాది ఇప్పటి వరకు 75 శాతం ర్యాలీ (కిలోకి నికరంగా రూ.67,700) చేసింది. గత డిసెంబర్ చివరికి కిలో ధర రూ.89,700 వద్ద ఉండడం గమనార్హం. ‘‘2025సంవత్సరం ఎన్నో అనిశ్చితులకు కేంద్రంగా ఉంది. మొదట రాజకీయ ఉద్రిక్తతలు, ఆ తర్వాత సుంకాల పరమైన అనిశ్చితులు, భౌగోళిక ఉద్రిక్తతలు, రేట్ల కోతపై అస్పష్టత, ఇప్పుడు యూఎస్ ప్రభుత్వం షట్డౌన్. వీటన్నింటితో సురక్షిత సాధనమైన బులియన్ ధరలు ఈ ఏడాది దూసుకెళ్లాయి. డాలర్ బలహీనత, సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేస్తుండడం, గోల్డ్ ఈటీఎఫ్లకు పెరుగుతున్న డిమాండ్, హెడ్జింగ్ సాధనంగా రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి సైతం డిమాండ్ పెరగడం ధరల ర్యాలీకి కారణం. -
ఉద్యోగం కోసం డిగ్రీ సరిపోదు!: లింక్డ్ఇన్ సీఈఓ కీలక వ్యాఖ్యలు
చదువుకుని ఒక డిగ్రీ తెచ్చుకుంటే.. వెంటనే ఉద్యోగంలో చేరిపోవచ్చని చాలామంది అనుకుంటారు. కానీ డిగ్రీ ఉంటేనే ఉద్యోగాలు త్వరగా లభిస్తాయని చెప్పలేమని లింక్డ్ఇన్ సీఈఓ 'ర్యాన్ రోస్లాన్స్కీ' (Ryan Roslansky) పేర్కొన్నారు.పరుగులు పెడుతున్న పోటీ ప్రపంచంలో కేవలం ఒక కాలేజీ డిగ్రీ సరిపోదు. నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి. ముఖ్యంగా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) గురించి చాలా నేర్చుకోవాల్సి ఉందని.. గత వారం కంపెనీ శాన్ ఫ్రాన్సిస్కో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ర్యాన్ రోస్లాన్స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు.మార్పు అనేది చాలా ఉత్తేజకరమైన విషయం అని భావిస్తున్నాను. ఎందుకంటే ఉద్యోగ భవిష్యత్తు ఇకపై ఫ్యాన్సీ డిగ్రీలు ఉన్నవారికి లేదా మంచి కాలేజీలో చదువుకున్న వారికి మాత్రమే చెందదు. మారుతున్న కాలానికి అనుగుణంగా అలోచించి కొత్త టెక్నాలజీలను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నవారికి ఉద్యోగాలు లభిస్తాయని నా అంచనా అని అన్నారు.ఏఐ మనుషుల స్థానాన్ని భర్తీ చేస్తుందనే విషయాన్ని నేను నమ్మనని ర్యాన్ రోస్లాన్స్కీ అన్నారు. అయితే కమ్యునికేషన్, ఎవరితో అయినా మాట్లాడగలగడం వంటివి నేర్చుకోవాలి. స్కిల్స్ ఎప్పుడూ పెంచుకుంటూ ఉండాలి. మీరు ముందుకు సాగడానికి ప్రయత్నిస్తున్న ఏ పనిలోనైనా విజయం సాధించడానికి అవి చాలా కీలకం అని ఆయన అన్నారు.ఇదీ చదవండి: ముకేశ్ అంబానీ పర్సులో ఎంత డబ్బు ఉంటుందో తెలుసా?ఏఐ గురించి తెలుసుకోవడం లేదా నేర్చుకోవడం చాలా అవసరం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఏఐ నైపుణ్యాలు ఉన్న వ్యక్తికే పరిశ్రమల్లో ఉద్యోగాలు లభిస్తాయి. అంటే ఉద్యోగం కోసం ఏఐ ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. ఉద్యోగ మార్కెట్ వేగంగా మారుతోంది. నిపుణులు నిరంతరం తమను తాము అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉందని చెబుతూనే ఉన్నారని ర్యాన్ రోస్లాన్స్కీ చెప్పారు. -
ఇండియన్ ఆయిల్ డైరెక్టర్గా సౌమిత్ర పి శ్రీవాస్తవ
ఇండియన్ ఆయిల్ మార్కెటింగ్ డైరెక్టర్గా.. సౌమిత్ర పి శ్రీవాస్తవ (Saumitra P Srivastava) బాధ్యతలు స్వీకరించారు. కంపెనీలో సుమారు 30ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఈయన.. ఐఐటీ రూర్కెలా నుంచి సివిల్ ఇంజినీరింగ్, ముంబైలోని ఎస్పీ జైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు.ఎల్పీజీ వ్యాపార విభాగంలో నాలుగేళ్ల పనిచేశారు. ఆ తరువాత ఇండియన్ ఆయిల్ సంస్థలో చేరిన.. సౌమిత్ర పి శ్రీవాస్తవ సేల్స్ విభాగంలో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో వ్యాపార విస్తరణకు కీలకంగా మారారు. ఈయనకు ముంబై, ఢిల్లీ డివిజన్ కార్యాలయాలను నడిపిన అనుభవం కూడా ఉంది. అంతే కాకుండా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో కూడా సేల్స్ విభాగంలో పనిచేశారు. మహారాష్ట్ర, గోవా హెడ్ ఆఫ్ స్టేట్గా పనిచేసిన సమయంలో.. ప్రధాన ఉత్పత్తులు, వ్యాపారాలను ఈయన విజయవంతంగా నిర్వహించారు. -
టిమ్ కుక్ తరువాత యాపిల్ సీఈఓ ఎవరు?
టిమ్ కుక్ (Tim Cook)కు వచ్చే ఏడాదికి 65 ఏళ్లు నిండుతాయి. 2011లో యాపిల్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన ఈయన కంపెనీ నుంచి నిష్క్రమించిన తరువాత.. అతని స్థానంలో ఎవరు రావచ్చనే దానిపై ఇప్పటికే చర్చ మొదలైపోయింది. టెక్ ప్రపంచంలో ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్న పెద్ద ప్రశ్న ఇదే!.గత కొన్ని సంవత్సరాలుగా.. యాపిల్ కంపెనీ నుంచి ఎంతోమంది ఉన్నత స్థాయి ఉద్యోగులు వైదొలిగారు. ఈ జాబితాలో డిజైన్ చీఫ్ జోనీ ఐవ్, రిటైల్ హెడ్ ఏంజెలా అహ్రెండ్ట్స్, సీఎఫ్ఓ లూకా మాస్ట్రీ, సీఓఓ జెఫ్ విలియమ్స్ ఉన్నారు. వీరు కంపెనీ నుంచి వైదొలిగినప్పుడు ఇంత పెద్ద చర్చ జరగలేదు. కానీ టిమ్ కుక్ నిష్క్రమణ తప్పకుండా చర్చనీయాంశమే. ఎందుకంటే.. ఆయన స్థానాన్ని పొందే వ్యక్తి యాపిక్ సంస్థలో కీలక నిర్ణయాలు తీసుకోవాలి. అంతటి వ్యక్తి 'జాన్ టర్నస్' అని వినిపిస్తోంది.జాన్ టర్నస్.. యాపిల్ కంపెనీలో హార్డ్వేర్ ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్. ఆయన దాదాపు 24 సంవత్సరాలుగా యాపిల్లో ఉంటూ.. కీలక పదవులను చేపట్టారు. ఈయన వ్యూహాలు కూడా హార్డ్వేర్ పాత్రకు మించి ఉంటాయి. ప్రస్తుతం ఈయన వయసు 50 ఏళ్లు. యాపిల్ సీఈఓగా బాధ్యతలు తీసుకున్నప్పుడు టిక్ కుక్ వయసు 50 సంవత్సరాలే.ఇదీ చదవండి: ముకేశ్ అంబానీ పర్సులో ఎంత డబ్బు ఉంటుందో తెలుసా?జాన్ టర్నస్కు టిమ్ కుక్ దగ్గర మంచి పేరు ఉంది. ఈయన యాపిల్ మొట్టమొదటి కొత్త ఐఫోన్ ఫారమ్ ఫ్యాక్టర్ అయిన ఐఫోన్ ఎయిర్ను పరిచయం చేశారు. ఈయన ఐఫోన్ 17 లాంచ్ సందర్భంగా లండన్లోని యాపిల్ రీజెంట్ స్ట్రీట్ స్టోర్లో కస్టమర్లను కూడా పలకరించారు. ఇలాంటి కారణాల వల్ల కుక్ స్వయంగా అతన్ని ఎక్కువగా విశ్వసిస్తారని సన్నిహిత వర్గాలు చెబుతాయి. అయితే సీఈఓ బాధ్యతల నుంచి వైదొలిగే అంశం గురించి టిమ్ కుక్ ఇప్పటివరకు ఎలాంటి ప్రస్తావన చేయలేదు. -
హైదరాబాద్లో ప్రారంభమైన రీఫర్ రైలు సర్వీస్
ఇండియా ఫార్మాస్యూటికల్ లాజిస్టిక్స్ను ప్రోత్సహించడంలో భాగంగా.. డీపీ వరల్డ్, హైదరాబాద్లో మొట్టమొదటి స్పెషల్ రీఫర్ రైలు (Reefer Rail)ను ప్రారంభించింది. తిమ్మాపూర్ (Thimmapur) నుంచి నవా షెవా (Nhava Sheva) మధ్య దీని సేవలను అందిస్తుంది. తక్కువ ఉష్ణోగ్రతల వద్ద తరలించాల్సిన వస్తువులను.. ఈ రీఫర్ రైలు ద్వారా సరఫరా చేస్తారు. ఫార్మా ఎగుమతులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.వారానికి ఒకసారి మాత్రమే ప్రయాణించే ఈ రైలులో 43 రిఫ్రిజిరేటెడ్ కంటైనర్లు ఉంటాయి. ఇది నెలకు నాలుగుసార్లు ప్రయాణిస్తుంది. స్పెషల్ ట్రైన్ ప్రారంభించడం వల్ల.. 43 ట్రక్కుల అవసరం తగ్గడం మాత్రమే కాకుండా.. రోడ్డుపై రద్దీ కూడా కొంత తగ్గుతుంది. కార్బన్ ఉద్గారాలు కూడా 70 శాతం వరకు తగ్గుతాయి.ప్రతి కంటైనర్ ఖచ్చితమైన ఉష్ణోగ్రతను కలిగి ఉండటం కోసం.. కావలసిన ఏర్పాట్లను చేశారు. సాంకేతిక నిపుణులు దీనిని పర్యక్షిస్తూ ఉంటారు. కాబట్టి దీని ద్వారా వస్తువులను సురక్షితంగా గమ్యం చేర్చవచ్చు. -
బస్సులకు డిజిటల్ పాస్లు.. యాప్లో బుకింగ్
హైదరాబాద్: తెలంగాణ ప్రజా రవాణా వ్యవస్థ మరింత స్మార్ట్గా మారుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ఈఎస్డీ) విభాగం నిర్వహిస్తున్న ‘మీటికెట్’ యాప్ ద్వారా త్వరలో టీజీఆర్టీసీ ఇంటర్సిటీ బస్సు సేవలు & క్యూ ఆర్ ఆధారిత డిజిటల్ బస్ పాస్లు అందుబాటులోకి రానున్నాయి.స్టేట్ స్మార్ట్ మొబిలిటీ ప్రణాళికలో భాగంగా చేపట్టిన ఈ విస్తరణతో ప్రయాణికులకు మరింత సౌకర్యం లభించనుంది. ఇక నుంచి బస్సు టికెట్లు, నెలవారీ పాస్లు మొబైల్లోనే పొందవచ్చు. 2025 జనవరి 9న ప్రారంభమైన మీటికెట్ యాప్ ఇప్పటికే మంచి ఆదరణ పొందుతోంది. ఇప్పటి వరకు 1.35 లక్షల డౌన్లోడ్లు, 2.6 లక్షల టికెట్ బుకింగ్స్, రూ.2 కోట్లకు పైగా లావాదేవీలు నమోదయ్యాయి. యాప్ రేటింగ్ 3.5కు పైగా ఉండగా, ప్రస్తుతం 221 ప్రదేశాల్లో సేవలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ మెట్రో, 123 పార్కులు, 16 దేవాలయాలు, ఆరు మ్యూజియాలు, ఖుత్బ్ షాహీ సమాధులు వంటి ప్రదేశాలు ఈ సేవల్లో ఉన్నాయి.టీజీఆర్టీసీ సేవలు చేర్చడంతో ఇకపై సాధారణ, మెట్రో డీలక్స్, మెట్రో ఎక్స్ప్రెస్, గ్రీన్ మెట్రో లగ్జరీ (ఎసీ), పుష్పక్ ఎసీ బస్సులకు కూడా డిజిటల్గా టికెట్లు, పాస్లు పొందవచ్చు. ఇది విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు వంటి ప్రయాణికులకు మరింత సౌకర్యంగా ఉంటుంది. మొబైల్ యాప్ ద్వారా చెల్లింపు చేసుకోవచ్చు. దీంతో క్యూలలో నిలబడాల్సిన అవసరం ఉండదు.ప్రస్తుతం మీటికెట్ పరిధిలో 98 అటవీ ప్రదేశాలు, 52 పర్యాటక బోటింగ్ సెంటర్లు, 16 దేవాదాయ శాఖ దేవాలయాలు, 9 వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్ర పురావస్తు మ్యూజియం, గాంధీ సెంటెనరీ మ్యూజియం వంటి ప్రదేశాలను కూడా ఈ యాప్లో చేర్చారు. పర్యాటకులు, స్థానికులకు ఇది సులభతరం అవుతుందని అధికారులు తెలిపారు. టీజీఆర్టీసీ సేవల అధికారిక ప్రారంభ తేదీ త్వరలో ప్రకటించనున్నట్లు ఈఎస్డీ విభాగం వెల్లడించింది. ఇది రాష్ట్రంలో పౌర సౌకర్యాలను పెంచుతూ, డిజిటల్ గవర్నెన్స్ వైపు తెలంగాణ మరో ముందడుగు అని అధికారులు పేర్కొన్నారు. -
5 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఏథర్ మైలురాయి
బెంగళూరు: దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ లిమిటెడ్ వాహన ఉత్పత్తిలో సరికొత్త మైలురాయిని అధిగమించింది. తమిళనాడులోని హోసూర్లో ఉన్న తమ తయారీ ప్లాంట్ నుండి 5 లక్షలవ వాహనాన్ని రోల్-అవుట్ చేయడం ద్వారా ఒక ముఖ్యమైన ఉత్పత్తి మైలురాయిని సాధించినట్లు ఏథర్ ప్రకటించింది. ఈ మైలురాయి వాహనం ఏథర్ ఫ్లాగ్షిప్ ఫ్యామిలీ స్కూటర్ రిజ్టా.“5,00,000 స్కూటర్లను అధిగమించడం ఏథర్కు ఒక ప్రధాన మైలురాయి. మా మొట్టమొదటి ప్రోటోటైప్ నుండి నేటి వరకు, మా ప్రయాణం కేవలం వాహనాలను నిర్మించడం మాత్రమే కాదు, స్కేలబుల్, నమ్మకమైన, స్థిరమైన తయారీ వ్యవస్థను నిర్మించడంపై దృష్టి సారించింది” అని ఏథర్ ఎనర్జీ సహ-వ్యవస్థాపకుడు, సీటీవో స్వప్నిల్ జైన్ పేర్కొన్నారు.ఏథర్ ప్రస్తుతం తమిళనాడులోని హోసూర్లో రెండు తయారీ కేంద్రాలను నిర్వహిస్తోంది. ఒకటి వాహన అసెంబ్లీ కోసం, మరొకటి బ్యాటరీ ఉత్పత్తి కోసం. హోసూర్ ప్లాంట్ సంవత్సరానికి 4,20,000 స్కూటర్ల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి, ఏథర్ తన మూడవ తయారీ కేంద్రాన్ని మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్లో ఏర్పాటు చేస్తోంది. -
ముకేశ్ అంబానీ పర్సులో ఎంత డబ్బు ఉంటుందో తెలుసా?
రిలయన్స్ చైర్మన్ 'ముకేశ్ అంబానీ' (Mukesh Ambani) ఆసియాలోనే అత్యంత ధనవంతుడు, ప్రపంచ కుబేరులలో ఒకరు. ఈయన సంపద కొన్ని చిన్న దేశాల జీడీపీ(GDP)ల కంటే ఎక్కువ. ఇంత ధనవంతుడైన ముకేశ్ అంబానీ ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు తన పర్సులో ఎంత డబ్బు పెట్టుకుంటారో బహుశా ఎవరికీ తెలిసి ఉండదు. అయితే దీనికి అంబానీ సమాధానం ఇచ్చారు.ముకేశ్ అంబానీ ఫ్యామిలీ విలాసవంతమైన జీవితం గడుపుతారు. ఇందులో భాగంగానే.. వీరు ఖరీదైన ఇంట్లో నివసించడం, అత్యంత లగ్జరీ కార్లను తమ రోజువారీ వినియోగిస్తుండటం వంటివి జరుగుతున్నాయి. నీతా అంబానీ, ఆమె కుమార్తె ఇషా కూడా విలువైన ఆభరణాలు ధరించడం.. అనంత్ అంబానీ బ్రాండెడ్ గడియారాలు ధరించిన సన్నివేశాలు చాలానే వెలుగులోకి వచ్చాయి. అయితే ముఖేష్ అంబానీ మాత్రం.. ఎక్కువగా సాధారణ దుస్తులు ధరించి, ఫార్మల్ ప్యాంటుతో కనిపిస్తారు.డబ్బు ఒక వనరు మాత్రమేముకేశ్ అంబానీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు డబ్బు ఎప్పుడూ ముఖ్యం కాదు, డబ్బు కేవలం ఒక వనరు మాత్రమే అని వెల్లడించారు. నేను ఎప్పుడూ పర్సులో నగదు లేదా క్రెడిట్ కార్డులను తీసుకెళ్లనని స్వయంగా వెల్లడించారు. అయితే బిల్లులు చెల్లించడానికి ఎల్లప్పుడూ నాతో ఎవరైనా ఉంటారని పేర్కొన్నారు. తాను స్కూల్, కాలేజీ రోజుల్లో కూడా ఎప్పుడూ తనతో డబ్బు తీసుకెళ్లలేదని పేర్కొన్నారు.ఇదీ చదవండి: మస్క్ ట్వీట్: నెట్ఫ్లిక్స్కు రూ.2 లక్షల కోట్ల నష్టం!బిరుదులు ఇష్టం ఉండదుమీడియా లేదా ఏదైనా ప్రత్యేక వార్తాపత్రిక తనను ఏదైనా బిరుదుతో సత్కరించడం తనకు ఇష్టం ఉండదని ముఖేష్ అంబానీ వెల్లడించారు. ప్రపంచ ధనవంతులలో ఒకరైన ఈయన.. తన వ్యక్తిగత జీవితంలో చాలా నిశ్చింతగా ఉండటానికి ఇష్టపడతారని వీటిని బట్టి చూస్తే అర్థమవుతుంది. అతను సరళమైన జీవనశైలిని ఆస్వాదిస్తాఋ, ఉదయాన్నే నిద్రలేవడం.. ఎక్కడికీ వెళ్ళే ముందు తన తల్లి ఆశీర్వాదం తీసుకుంటారు. -
కొత్త రకాల వీసాలను ప్రకటించిన యూఏఈ
ప్రపంచ ప్రతిభను ఆకర్షించడానికి, పర్యాటకాన్ని పెంచడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నాలుగు కొత్త విజిట్ వీసా కేటగిరీలను ప్రకటించింది. రెసిడెన్సీ వ్యవస్థలోనూ మార్పులు చేసింది. వీటిలో ఏఐ, ఎంటర్టైన్మెంట్, ఈవెంట్, క్రూయిజ్ టూరిజం కోసం నాలుగు కొత్త వీసా (New Visa) కేటగిరీలు ఉన్నాయి.అంతే కాకుండా, వ్యాపార, ట్రక్ డ్రైవర్ వీసాలకు సంబంధించి కూడా మార్పులు చేశారు. మానవతా సహాయం, వితంతువులు, విడాకులు తీసుకున్న వారు, నివాసితుల బంధువులు, స్నేహితులకు కూడా రెసిడెన్సీ అవకాశం కల్పిస్తున్నారు.నాలుగు కొత్త విజిట్ వీసా కేటగిరీలు ఇవే..ఏఐ స్పెషలిస్ట్ వీసా: ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోని నిపుణుల కోసం ఉద్దేశించినది. ఇందు కోసం టెక్ ఫోకస్డ్ కంపెనీ నుంచి స్పాన్సర్ షిప్ అవసరం అవుతుంది. ఒకటి లేదా ఎక్కువ ఎంట్రీలకు అనుమతి ఉంటుంది.ఎంటర్టైన్మెంట్ వీసా: కమర్షియల్ ఎంటర్ టైన్ మెంట్ సెక్టార్ లోని వ్యక్తుల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన వీసా ఇది. విశ్రాంతి లేదా ప్రదర్శన నిమిత్తం వచ్చే ప్రముఖులకు దీన్ని కేటాయిస్తారు.ఈవెంట్ వీసా: పండుగలు, ఎగ్జిబిషన్లు, కాన్ఫరెన్సులకు హాజరయ్యేవారికి ఈ ఈవెంట్ వీసాలు జారీ చేస్తారు. అయితే వీటిని ఈవెంట్ నిర్వాహకులచే స్పాన్సర్ చేయాలి.క్రూయిజ్ టూరిజం వీసా: క్రూయిజ్ ట్రావెలర్లకు మల్టిపుల్ ఎంట్రీ వీసా ఇది. లైసెన్స్ పొందిన మారిటైమ్ సంస్థల ద్వారా స్పాన్సర్ చేస్తారు.రెసిడెన్సీ, ఇతర వీసా అప్డేట్లుహ్యుమానిటేరియన్ రెసిడెన్స్ పర్మిట్: సంక్షోభ పరిస్థితుల నుంచి వచ్చే వ్యక్తులకు ఒక సంవత్సరం పునరుద్ధరించతగిన వీసా.స్నేహితులు, బంధువుల కోసం విజిట్ వీసా: నివాసితులు తమ బంధువులకు దీన్ని స్పాన్సర్ చేయవచ్చు.ట్రక్ డ్రైవర్ వీసా: లాజిస్టిక్స్ లో కార్మిక కొరతను పరిష్కరించే వీసా. లైసెన్స్ పొందిన కంపెనీల ద్వారా స్పాన్సర్ షిప్ అవసరం అవుతుంది.వితంతువులు, విడాకులకు రెసిడెన్సీ: నిర్వచించిన పరిస్థితులలో ఒక సంవత్సరం పునరుద్ధరణ అనుమతి.బిజినెస్ ఎక్స్ ప్లోరేషన్ వీసా: బిజినెస్ ప్రారంభించేందుకు వచ్చే ఆర్థిక సాల్వెన్సీ రుజువు ఉన్న వ్యాపారవేత్తలకు జారీ చేస్తారు. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైం దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 582.95 పాయింట్లు లేదా 0.72 శాతం లాభంతో 81,790.12 వద్ద.. నిఫ్టీ 183.40 పాయింట్లు లేదా 0.74 శాతం లాభంతో 25,077.65 వద్ద నిలిచాయి.అట్లాంటా, ఇండ్బ్యాంక్ మర్చంట్ బ్యాంకింగ్ సర్వీసెస్, ఏఏఏ టెక్నాలజీస్, ఓరియంట్ టెక్నాలజీస్, తారా చంద్ ఇన్ఫ్రాలాజిస్టిక్ సొల్యూషన్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. సిగ్మా సాల్వ్, హెమిస్పియర్ ప్రాపర్టీస్ ఇండియా, సైబర్టెక్ సిస్టమ్స్ అండ్ సాఫ్ట్వేర్, మాస్టర్ ట్రస్ట్, ప్రోజోన్ రియాల్టీ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
జాయింట్ డెవలప్ అగ్రిమెంట్లు.. జాగ్రత్తలు
జాయింట్ డెవలప్ అంటే మీకు బాగా తెలుసు.. ఒక ఓనర్, ఒక డెవలపర్, వారి మధ్య అగ్రిమెంటు. అపార్ట్మెంట్లు ఎన్ని కడతారు, వాటిని ఎలా పంచుకోవాలిలాంటి మిగతా విషయాలతో కూడుకున్న ఒక అగ్రిమెంటు.ఒకప్పుడు ఇలా ఒప్పందంపై సంతకం పెట్టగానే ఓనర్ నెత్తి మీద బాంబు పడేది. ఏ రోజు సంతకం పెట్టారో ఆ రోజునే ఆ ల్యాండ్ బదిలీ అయినట్లు లెక్క. డెవలపర్ పని మొదలుపెట్టకపోయినా, మొదలుపెట్టి పూర్తి చేయకపోయినా, పూర్తి చేసి ఓనర్కి వారి వంతు అపార్ట్మెంట్లు ఇవ్వకపోయినా, డబ్బులు చేతికి రాకపోయినా కూడా.. పన్ను భారం మాత్రం విధించే వారు. ఇది అశనిపాతంలాంటిది. ఏదో శాపవిమోచనంలాగా 2017 సంవత్సర శుభవేళ, చట్టంలో (అధికారులు చూడటంలో) మార్పు వచ్చింది.ఇక నుంచి అగ్రిమెంటు రోజు కాదు, డెవలపర్ అపార్టుమెంట్ను పూర్తి చేసి, కంప్లీషన్ సర్టిఫికెట్ జారీ చేసిన నాడు పన్ను భారం ఏర్పడుతుంది. ప్రతిఫలం ఎంత అంటే, ల్యాండ్ ఓనర్కి ఇచ్చిన షేరు, స్టాంప్ డ్యూటీ విలువ, అదనంగా ఇచ్చిన నగదు. ఈ కథ సజావుగా సాగుతోంది. అందరూ బాగున్నారు. కానీ అధికారులకు ఇందులో కొన్ని లొసుగులు కనిపించాయి. కొన్ని మోసాలు బైటపడ్డాయి. వేల్యుయేషన్లలో అవకతవకలు కనిపించాయి. వివిధ రకాల వేల్యుయేషన్, అస్థిరమైన అంకెలు, చాలా సందర్భాల్లో అండర్ వేల్యుయేషన్, కొన్ని చోట్ల అండర్ రిపోర్టింగ్.. వెరసి మతలబుల గారడీ అయ్యింది.2014 సంవత్సరంలో జారీ చేసిన ఉత్తరం (ఉత్తర్వులాంటిది) ప్రకారం 2021–22, 2022–23, 2023–24 ఆర్థిక సంవత్సరాల్లో జారీ చేసిన ఆక్యుపెన్సీ–కమ్–కంప్లీషన్ సరి్టఫికెట్లను రివ్యూ చేయాలన్నారు. ఆ డేటాని డిపార్టుమెంటు వాళ్లకు దాఖలు చేసిన డాక్యుమెంట్లు/సమాచారంతో సమన్వయం చేయాలన్నారు. ఈ విషయంలో కలకత్తా అధికారులు ఒక సరైన, సమర్ధవంతమైన, సమగ్రమైన పద్ధతి ఫాలో అయ్యారు.అదేమిటంటే..రెరా (ఆర్ఈఆర్ఏ), హిరా (హెచ్ఐఆర్ఏ)లాంటి ప్రభుత్వ సంస్థల అధికారిక వెబ్సైట్లలో సమాచారాన్ని తీసుకుని, సమన్వయం ద్వారా డేటాని సేకరించడంజాయింటు డెవలప్మెంటు అగ్రిమెంట్లో ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించడం. ప్రాజెక్టు వివరాలు, కాగితాలు, అసలు ఎన్నింటికి అనుమతి లభించింది? ల్యాండ్ ఓనర్లు ఎవరు, డెవలపర్లు ఎవరు, ఏ సంవత్సరంలో, ఏ స్థాయిలో వర్క్ జరిగింది మొదలైన వివరాల పరీక్ష, సమీక్ష.సీపీసీ 2.0 పోర్టల్ ద్వారా రిటర్నుల్లో ఏయే సమాచారం ఉంది, రిటర్న్ ప్రకారం ఏయే ప్రాజెక్టులు పూర్తయ్యాయి మొదలైన వివరాలను క్రాస్ వెరిఫై చేయడం రిటర్నులో ఒక షెడ్యూలు క్యాపిటల్ గెయిన్స్కి సంబంధించినది. అందులో పొందుపర్చిన వివరాల సేకరణ.అన్ని వివరాలు చేతిలో పడ్డాక, పిలక దొరికినట్లే. సమన్లు జారీ చేయడం, అస్సెసీలను పిలవడం, అన్ని వివరాలు రాబట్టుకోవడం, గుట్టు రట్టు చేయడం.దీనివల్ల రెవెన్యూపరంగా ఎన్నో సత్ఫలితాలు వచ్చాయి. వివరాలను వెల్లడించని ఎందరో బడాబాబులు చట్టాన్ని గౌరవించడం (విధి లేక) మొదలెట్టారు. దేశమంతటా కలకత్తా మోడల్ని ఒక ప్రామాణిక ఆపరేటింగ్ విధానంగా మలిచారు. ఉత్తమ పద్ధతిగా తీర్చిదిద్దారు. స్పష్టమైన వైఖరి, డేటా ఆధారిత ఫ్రేమ్వర్క్, పారదర్శకత, దేశమంతటా ఒకే విధానం, గోప్యత పాటిస్తూ వివరాల సేకరణ.. ఇదీ లక్ష్యం.ఈమధ్యే, అంటే 2025 సెప్టెంబర్ 15న ఒక ఆఫీస్ మెమొరాండంను జారీ చేశారు. దీని లక్ష్యాలు రెండు..1. కాంప్లయెన్స్ (నిబంధనలను పాటించడం) జరగాలి2. పన్ను వసూళ్లు అస్సెస్సీలు ఇచ్చే సమాచారం మీద తక్కువగా ఆధారపడటమనేది ఇక్కడ ప్రధానమైన ఉద్దేశం.సూచన ఏమిటంటే: సరైన, సమగ్రమైన సమాచార సేకరణ కోసం రెరా అధికారులు, డెవలప్మెంట్ అధికారులను సంప్రదించాలి.వారు ఏం చేస్తారు: సమాచారాన్ని సేకరించి ఇన్వెస్టిగేషన్ అధికారులకు పంపుతారు. తేడా ఉంటే వారు తోలు తీస్తారు.చివరగా 2025 అక్టోబర్ 31లోగా ఈ సమాచారాన్ని సేకరించాలి. అధికారులు త్వరితగతిన పురోగతి చూపిస్తారు.ఏం చేయాలి: మీరు ఓనర్ అయినా డెవలపర్ అయినా జాగ్రత్త వహించాలి. ఇన్వెస్ట్మెంటుపరంగా డెవలపర్, క్యాపిటల్ గెయిన్స్పరంగా ఓనర్.. తగిన శ్రద్ధ పెట్టాలి. ఈ విషయంలో మీ నిజాయితీ, నీతే మీ స్థిరాస్థి! -
వాట్సప్కు పోటీగా అరట్టై.. 75 లక్షల డౌన్లోడ్స్!
భారతదేశపు ఐటీ కంపెనీ జోహో అభివృద్ధి చెందిన మెసేజింగ్ ప్లాట్ఫామ్ 'అరట్టై'కు ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది. ఈ యాప్ శుక్రవారం నాటికి మొత్తం 75 లక్షల డౌన్లోడ్లను అధిగమించింది. అంటే అంతమంది దీనిని డౌన్లోడ్ చేసుకున్నారన్నమాట. దీన్ని బట్టి చూస్తే ఇది ఇటీవలి కాలంలో.. అతి తక్కువ కాలంలో ఎక్కువ డౌన్లోడ్స్ పొందిన యాప్లలో ఒకటిగా నిలిచింది.ఇప్పటి వరకు చాలామంది భారతీయులు.. మెటా యాజమాన్యంలోని వాట్సప్ను వినియోగిస్తున్నారు. అయితే ఇక దేశీయ యాప్ అరట్టైను ఉపయోగించాలని పలువురు మంత్రులు, వ్యవస్థాపకులు, సీఈఓలు పిలుపునిచ్చారు. దీంతో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకునేవారు సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ & ఆపిల్ యాప్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది.అరట్టై అంటే.. తమిళంలో సరదాగా ముచ్చటించుకోవడం అని అర్థం. దీనిని జోహో సంస్థ.. వాట్సప్కు పోటీగా అభివృద్ధి చేసింది. ఇది వాట్సప్ కంటే ఎక్కువ ఫీచర్స్ కలిగి ఉంది. దీనికి అశ్వినీ వైష్ణవ్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్ వంటి కేంద్రమంత్రులు కూడా మద్దతు ప్రకటించారు. దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా కూడా నేను అరట్టై డౌన్లోడ్ చేసుకున్నా అంటూ ట్వీట్ చేశారు.అరట్టై.. వాట్సప్ మధ్య తేడాలు➤అరట్టై.. వాట్సాప్ రెండూ మెసేజింగ్ యాప్స్ అయినప్పటికీ, అరట్టైలో కొన్ని అదనపు ఫీచర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ యాప్ గురించి జోహో సీఈఓ శ్రీధర్ వెంబు గత కొన్ని రోజులుగా తన ఎక్స్ ఖాతాలో చెబుతూనే ఉన్నారు.➤అరట్టై ఆండ్రాయిడ్ టీవీలతో సహా విస్తృత శ్రేణి పరికరాలకు యాక్సెస్ను అందిస్తుంది. అయితే వాట్సాప్ ప్రస్తుతం వీటికి మద్దతు ఇవ్వదు. వినియోగదారులు తమ అరట్టై ఖాతాను ఒకేసారి ఐదు పరికరాల్లో ఉపయోగించవచ్చు.➤అరట్టైలో పాకెట్ ఫీచర్ ఉంది. ఇది వినియోగదారులు ఫోటోలు, వీడియోలు, నోట్స్, రిమైండర్లు, ఇతర ఫైల్లను స్టోర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం వాట్సాప్లో ఈ ఫీచర్ లేదు. అయితే, వాట్సాప్ 'యు' చాట్ విండోను అందిస్తుంది, ఇక్కడ వినియోగదారులు తమతో తాము చాట్ చేసుకోవచ్చు, కావలసినవి సేవ్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: మస్క్ ట్వీట్: నెట్ఫ్లిక్స్కు రూ.2 లక్షల కోట్ల నష్టం!➤అరట్టై యాప్.. తక్కువ మెమరీ ఉన్న స్మార్ట్ఫోన్లు & పాత 2G/3G నెట్వర్క్లలో కూడా సజావుగా పనిచేసేలా రూపొందించబడింది. ఇది గ్రామీణ వినియోగదారులకు, బడ్జెట్ పరికరాలను కలిగిన వారికి అందుబాటులో ఉంటుంది. అంతే కాకుండా అరట్టైలో యూపీఐ చేయడానికి కూడా జోహో సిద్ధమవుతోంది. దీనికోసం ఐస్పిరిట్ గ్రూప్తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. -
ఆనంద్ మహీంద్రా ఫోన్లో కొత్త యాప్ డౌన్లోడ్
వాట్సాప్ మాదిరి దేశీయ కంపెనీ జోహో తయారు చేసిన ఆన్లైన్ కమ్యునికేషన్ యాప్ ‘అరట్టై’(Arattai)ని గర్వంగా డౌన్లోడ్ చేసినట్లు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ ఖాతాలో తెలిపారు. ఈ యాప్ మొదటిసారిగా 2021లో యాప్ స్టోర్లోకి ప్రవేశించింది. అయితే భారత ప్రభుత్వం ఆమోదం పొందిన తరువాత సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ మేడ్ ఇన్ ఇండియా యాప్ ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోంది.మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా దేశీయ టెక్నాలజీ ఉత్పత్తులకు మద్దతు ఇవ్వడంలో తన ఉదారతను మరోసారి చాటుకున్నారు. జోహో సంస్థ కొత్తగా రూపొందించిన చాట్, కాలింగ్ యాప్ అరట్టైకి ఆయన ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా మద్దతు ప్రకటించారు. ‘గర్వంగా అరట్టైను డౌన్లోడ్ చేశా’ అని ఆనంద్ మహీంద్రా ప్రకటించారు. దీనికి యాప్ అధికారిక హ్యాండిల్ తక్షణమే స్పందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ అరట్టై ప్లాట్ఫామ్లోకి ఆయనను ఆహ్వానించింది.దీనిపై కంపెనీ చీఫ్ శ్రీధర్ వెంబు స్పందిస్తూ.. ‘నేను మా తెన్కాసి కార్యాలయంలో అరట్టై ఇంజినీర్లతో సమావేశంలో ఉన్నాను. యాప్కు మెరుగుదలలు చేస్తున్నాం. మా టీమ్లో ఒక సభ్యుడు ఈ ట్వీట్ను చూపించాడు. ధన్యవాదాలు @anandmahindra. మీ మద్దతు మాకు మరింత స్ఫూర్తినిచ్చింది’ అని ఎక్స్లో పేర్కొన్నారు. దీనికి ప్రతిస్పందనగా ఆనంద్ మహీంద్రా ‘మీ జట్టు విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’ అంటూ ప్రోత్సహించారు.ఇదీ చదవండి: దేశం విడిచిన కుబేరులు.. కారణాలు.. -
హైదరాబాద్లో ఎలి లిల్లీ తయారీ కేంద్రం ఏర్పాటు
గ్లోబల్ ఫార్మా దిగ్గజం ఎలి లిల్లీ అండ్ కంపెనీ (Eli Lilly and Company) భారతదేశంలో తయారీ కార్యకలాపాలను విస్తరించడానికి 1 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడిని ప్రకటించింది. ఇందులో భాగంగా తెలంగాణలోని హైదరాబాద్లో మాన్యుఫ్యాక్చరింగ్, క్వాలిటీ హబ్ను ఏర్పాటు చేయనుంది. ఈ కేంద్రం భారతదేశం అంతటా కంపెనీ కాంట్రాక్ట్ తయారీ నెట్వర్క్ను పర్యవేక్షిస్తుంది.ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కంపెనీ ప్రతినిధులను ప్రశంసించారు. ఇది ప్రపంచ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్ ఆవిర్భవించడానికి సంకేతమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..రాష్ట్ర సాంకేతిక పరిజ్ఞానంతో మమేకమైన మౌలిక సదుపాయాలు, సులభతర వ్యాపారం (Ease of Doing Business) వంటి అంశాలు ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడానికి కీలకం అవుతున్నట్లు చెప్పారు.కంపెనీ ఏర్పాటు చేయబోయే అత్యాధునిక సదుపాయంలో ఇంజినీర్లు, రసాయన శాస్త్రవేత్తలు, ఇతర శాస్త్రవేత్తలు, నిపుణుల కోసం తక్షణమే నియామక ప్రక్రియను ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. హైదరాబాద్లో ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవకు బలాన్ని ఇస్తూ వినూత్న ఔషధాలను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా లిల్లీ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పాట్రిక్ జాన్సన్ మాట్లాడుతూ..‘మా గ్లోబల్ నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంపొందించడానికి కేంద్రంగా భారతదేశంలో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని పేర్కొన్నారు. లిల్లీ డయాబెటిస్, ఊబకాయం, అల్జీమర్స్, క్యాన్సర్.. వంటి వాటికి ఔషధాలు తయారు చేస్తోంది. గురుగ్రామ్, బెంగళూరు, హైదరాబాద్ కేంద్రంగా కంపెనీ ఇప్పటికే దేశవ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తోంది.ఇదీ చదవండి: దేశం విడిచిన కుబేరులు.. కారణాలు.. -
రూ.2.5 లక్షలతో బుకింగ్: కేవలం 100మందికే ఈ కారు!
స్కోడా (Skoda) కంపెనీ భారతదేశంలో.. లాంచ్ చేయనున్న తన కొత్త 'ఆక్టావియా ఆర్ఎస్' (Octavia RS) కోసం బుకింగ్లను స్వీకరించడం ప్రారంభించింది. ఈ కారు కోసం రూ. 2.5 లక్షలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ కారు అక్టోబర్ 17న లాంచ్ అయిన తరువాత.. నవంబర్ 6 నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి.స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ కారును కంపెనీ.. కంప్లీట్ బిల్డ్ యూనిట్ (CBU) మార్గం ద్వారా దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి దీని ధర కొంత ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. అయితే దీని ధరను సంస్థ అధికారికంగా వెల్లడించలేదు. అయితే దీని ధర రూ. 45 లక్షల కంటే ఎక్కువ ఉంటుందని అంచనా.ఇదీ చదవండి: జాతీయ రహదారులపై క్యూఆర్ కోడ్ బోర్డులు: ఎందుకంటే?కంపెనీ తన కొత్త స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ కారును కేవలం 100 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది. అంటే.. దీనిని వందమంది మాత్రమే కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ కారు మంచి డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. ఇందులోని 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 216 హార్స్ పవర్, 370 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 6.4 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అయ్యే కారు.. టాప్ స్పీడ్ 250 కిమీ/గం అని సమాచారం. -
దీపావళి ధమాకా.. ఐఫోన్పై రూ.55 వేల డిస్కౌంట్!
దీపావళి పండుగ సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్కార్ట్ రెండూ స్మార్ట్ఫోన్లు, స్మార్ట్వాచ్లు, ల్యాప్టాప్లు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లపై అద్భుతమైన డిస్కౌంట్ డీల్స్ అందిస్తున్నాయి. పాత స్మార్ట్ ఫోన్ నుంచి ఐఫోన్కు అప్గ్రేడ్ కావాలనుకుంటున్నవారికి, ఆండ్రాయిడ్ నుంచి ఐఓఎస్కు మారాలనుకుంటున్నవారికి ఇంతకంటే మంచి సమయం లేదు.ఐఫోన్ 16 ప్రో మాక్స్పై భారీ తగ్గింపుప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో ఉన్న స్టాండ్ అవుట్ ఆఫర్లలో ఐఫోన్ 16 ప్రో మాక్స్ డీల్ ఒకటి. ఇది ఇప్పటివరకు సంవత్సరంలో అతిపెద్ద తగ్గింపు. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ (256 జీబీ వేరియంట్) వాస్తవ ధర రూ .1,34,999 కాగా ఫ్లిప్కార్ట్ రూ .1,09,999 కు లిస్ట్ చేసింది. కస్టమర్లు హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తే రూ .5,000 వరకు తగ్గింపు పొందవచ్చు.అదే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డు ద్వారా ఈఎంఐ కొనుగోళ్లపై రూ .4,000 వరకు తగ్గింపును అందుకోవచ్చు. అంతేకాదు.. కొనుగోలుదారులు తమ పాత స్మార్ట్ఫోన్లను ఎక్స్చేంజ్కి ఇచ్చి ఫోన్ కండీషన్ను బట్టి రూ.55,790 వరకు పొందవచ్చు. ఇలా అన్ని డిస్కౌంట్లను కలిపితే ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ కొనుగోలుపై రూ.35,000 నుంచి రూ.55,000 ఆదా చేయవచ్చు. ఈ ఆఫర్లు పరిమితమైనవి, లభ్యతకు లోబడి ఉంటాయని గమనించాలి.ఐఫోన్ 16 ప్రో మాక్స్ ఫీచర్లుడిజైన్: ప్రీమియం టైటానియం నలుపు, తెలుపు, నేచురల్, డిసెర్ట్ ఫినిషింగ్.డిస్ప్లే: 6.9-అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్ డీఆర్ ఓఎల్ఈడీ, 120 హెర్ట్జ్ ప్రోమోషన్, హెచ్డీఆర్, ఆల్వేస్-ఆన్.పనితీరు: అధునాతన యాపిల్ ఇంటెలిజెన్స్, న్యూరల్ ఇంజిన్ తో A18 ప్రో చిప్.కెమెరా: 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్, అల్ట్రా వైడ్, 5ఎక్స్ టెలిఫోటో, నైట్ మోడ్, మాక్రో, 4కే డాల్బీ విజన్.ఇతర స్పెసిఫికేషన్లు: ఫేస్ ఐడీ, యాపిల్ పే, ఐపీ 68 రేటింగ్, 5జీ, వైఫై 7, స్పేషియల్ ఆడియో, శాటిలైట్ ద్వారా ఎమర్జెన్సీ ఎస్ఓఎస్. -
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఆటో మోడ్లో!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం 15 ఏళ్లుగా స్థిరమైన అభివృద్ధిని సాధిస్తోందని, ప్రస్తుతం ఇతర అంశాల సహాకారం లేకుండా కూడా నిర్దిష్టమైన వృద్ధిని నమోదు చేసే ఆటో మోడ్లో ఉందని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (NAREDCO, నరెడ్కో) అధ్యక్షుడు మేకా విజయ సాయి తెలిపారు. కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే నరెడ్కోను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీఆర్ఈడీఏ అని పిలిచేవారు. నరెడ్కో ఈ నెల 10వ తేదీ నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్న ప్రాపర్టీ షో వివరాలు తెలిపేందుకు సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేకా విజయ సాయి మాట్లాడుతూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ విస్తీర్ణం ఇప్పుడు ఏకంగా 1,28,000 చదరపు కిలోమీటర్ల వరకూ ఉందని తెలిపారు. అమెరికా అధ్యక్షుడి టారిఫ్లు, ఐటీ ఉద్యోగాల్లో అనిశ్చితి వంటివి ఒడిదుడుకులు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ ఈ రంగం స్థిరమైన అభివృద్ధిని నమోదు చేస్తుందని, తెలంగాణ ప్రభుత్వ విధానాలు, రీజనల్ రింగ్ రోడ్డు వంటివి ఇందుకు దోహదపడతాయని అన్నారు. వృద్ధి విషయంలో హైదరాబాద్, ముంబైను దాటిపోయిందన్నారు. హైదరాబాద్లో భూమి అందుబాటులో ఉండటం, మెరుగైన మౌలిక సదుపాయాలు ఉండటం ఇందుకు కారణమని తెలిపారు. గత ఏడాది జూలై సెప్టెంబరు త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో అమ్మకం ధరలు ఎనిమిది శాతం వరకూ పెరిగాయని, దేశవ్యాప్తంగా ఈ పెరుగుదల నాలుగు నుంచి 24 శాతం వరకూ ఉందన్నారు.ఐటీ అనిశ్చితి, ట్రంప్ విధానాలు ఒక రకంగా హైదరాబాద్ రియల్ ఎస్టే్ట్ రంగానికి ఉపయోగపడేవని అభిప్రాయపడ్డారు. అమెరికాలో స్థిరపడ్డ ఎన్నారైలు స్వదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి పెంచుకుంటున్నారని తెలిపారు.అమ్మకాలపై నెగటివ్ ప్రచారం..హైదరాబాద్లో లక్ష వరకూ రియల్ ఎస్టేట్ యూనిట్లు అమ్ముడు పోకుండా ఉన్నాయని ఇటీవల వచ్చిన వార్తలను మేకా విజయ సాయి ఖండించారు. నగరంలో ఎన్ని యూనిట్లు నిర్మాణంలో ఉన్నాయి? ఎన్ని అమ్ముడుపోయాయి? ఎన్ని కాదు? అన్నది తెలుసుకునేందుకు తగిన శాస్త్రీయ సమాచారం ఏదీ అందుబాటులో లేదని తెలిపారు. ప్రభుత్వ సంస్థల నుంచి భవన నిర్మాణానికి తీసుకున్న అనుమతుల ఆధారంగా కొందరు రియల్ ఎస్టేట్ యూనిట్లు అమ్ముడుపోవడం లేదన్న వార్తలు సృష్టించారని చెప్పారు. తమకున్న సమచారం మేరకు డెవలపర్లు స్థిరంగా అమ్మకాలు కొనసాగిస్తున్నారని తెలిపారు. నగరంలో అపార్ట్మెంట్ల ధరలు మధ్యతరగతి వారికి అందుబాటులో లేకుండా పోయాయన్న విమర్శకు ఆయన బదులిస్తూ.... 600 - 800 చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టిన అపార్ట్మెంట్లు చాలా వరకూ అమ్ముడుపోవడం లేదని, దీన్నిబట్టి ప్రజలు మరింత విశాలమైన ఆపార్ట్మెంట్లు కోరుకుంటున్నట్లు తెలుస్తోందని అన్నారు.ఎస్బీఐ ప్రత్యేక ఆఫర్: కె.శ్రీధర్ రెడ్డినరెడ్కో 15వ ప్రాపర్టీ షో సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండనుందని సంస్థ ప్రధాన కార్యదర్శి కె.శ్రీధర్ రెడ్డి తెలిపారు. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో మూడు రోజులపాటు జరిగే ఈ ప్రదర్శనలో 74 మంది బిల్డర్లు, డెవలపర్లు పాల్గొంటున్నారని తెలిపారు. వీరితోపాటు బ్యాంకులు ఆర్థిక సంస్థలు ఆరు, సరఫరాదారులు ఐదుగురు, పర్యాటక రంగానికి చెందిన రెండు, భవన నిర్మాణ సామాగ్రీ, టెక్నాలజీలకు సంబంధించిన ఎనిమిది స్టాళ్లు ఏర్పాటు కానున్నాయని వివరించారు. ఈ ప్రదర్శనలో రియల్ ఎస్టేట్ యూనిట్ కొనుగోలుదారులు స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రుణం తీసుకుంటే ప్రాసెసింగ్ ఫీజ్లో ప్రత్యేక రాయితీ అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో నరెడ్కో ఎగ్జిక్యుటివ్ వైస్ ప్రెసిడెంట్ కాళీ ప్రసాద్, కోశాధికారి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.ఇదీ చదవండి: దేశం విడిచిన కుబేరులు.. కారణాలు.. -
దేశం విడిచిన కుబేరులు.. కారణాలు..
భారతదేశం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ముందుంది. ఇది 2023-24 ఆర్థిక సంవత్సరంలో 8.2% జీడీపీ వృద్ధిని సాధించింది. తయారీ, సేవల రంగాల్లో బలంగా ఉంది. అయితే దేశ సంపదకు మూలమైనవారు.. కంపెనీల వ్యవస్థాపకులు, ప్రముఖ వ్యాపారవేత్తలు మాత్రం దేశాన్ని విడిచి వెళ్తున్నారు. తమ సంస్థలు భారత్లో కార్యకలాపాలు సాగిస్తున్నా తాము విదేశాల్లో స్థిరపడేందుకే ఆసక్తి చూపుతున్నారు. అందుకు కొన్ని కారణాలను కోటక్-ఈవై సర్వే వెల్లడించింది.భారతదేశం అద్భుతమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తుంటే దాని సంపద సృష్టికర్తలు ఎందుకు నిష్క్రమిస్తున్నారనే దానిపై కోటక్ ఈవై నివేదిక రూపొందించింది. భారతీయ ధనవంతులు విదేశాలకు వలస వెళ్లడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నట్లు తెలిపింది.మెరుగైన జీవన నాణ్యత, మౌలిక సదుపాయాలుప్రపంచంలోని 50 అత్యంత కలుషితమైన నగరాల్లో 39 భారతదేశంలోనే ఉన్నాయి. ఇది సంపన్న కుటుంబాలను సింగపూర్, ఆస్ట్రేలియా, యూరప్ వంటి సురక్షితమైన, సుసంపన్నమైన జీవన వాతావరణానికి ప్రేరేపించేలా చేస్తుంది.ఆరోగ్య సంరక్షణ, విద్యా వ్యవస్థలుభారతదేశం జీడీపీలో ప్రజారోగ్యం కోసం కేవలం 2.1%, విద్య కోసం 2.9% మాత్రమే ఖర్చు చేస్తోంది. ఇది ప్రపంచ ప్రమాణాలైన 6% కంటే చాలా తక్కువ. దీని కారణంగా ధనవంతులు మెరుగైన ప్రైవేట్ సేవలు, ప్రపంచ స్థాయి విద్య కోసం యూఎస్ఏ, యూకే లేదా కెనడా వైపు మొగ్గు చూపుతున్నారు.స్నేహపూర్వక పన్ను విధానాలు..భారత్లో 42.74% అధిక వ్యక్తిగత ఆదాయపు పన్ను ఉంది. దుబాయ్లో సున్నా పన్ను. పోర్చుగల్లో పదేళ్ల పన్ను మినహాయింపులు ఆకర్షణీయంగా తోస్తున్నాయి. అంతేకాకుండా భారతదేశంలో 52 మిలియన్లకు పైగా కోర్టు కేసులు పెండింగ్లో ఉండటం వలన పౌర వివాదాలు దశాబ్దాల పాటు సాగుతున్నాయి. ఇది వ్యాపారవేత్తలకు ఆమోదయోగ్యం కాని జాప్యాన్ని సూచిస్తుంది.విదేశాల్లోని భారతీయులుపేరుస్థూల విలువ (రూ.కోట్లలో)ప్రస్తుత ప్రదేశంగోపీచంద్ హిందూజా & ఫ్యామిలీ1,85,310లండన్లక్ష్మీ మిట్టల్1,75,390లండన్జే చౌదరి1,46,470శాన్ జోస్, అమెరికాఅనిల్ అగర్వాల్1,11,400లండన్షాపూర్ పల్లోంజీ మిస్త్రీ, కుటుంబం88,650మొనాకోప్రకాష్ లోహియా87,700లండన్వివేక్ చాంద్ సెహగల్57,060మెల్బోర్న్జయశ్రీ ఉల్లాల్50,170శాన్ ఫ్రాన్సిస్కోయూసఫ్ అలీ, ఎం.ఎ.46,300అబుదాబిరాకేష్ గంగ్వాల్42,790మయామి, అమెరికా నీరవ్ మోదీ (యూకే), మెహుల్ చోక్సీ (ఆంటిగ్వా) వంటివారు పరారీలో ఉన్నారు. ఈ వజ్రాల వ్యాపారులు అక్రమంగా సంపాదించిన సంపదను కాపాడుకునేందుకు విదేశాల్లో ఆశ్రయం పొందుతున్నారు.దేశీయ పెట్టుబడుల బలహీనతలిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (LRS-దేశం నుంచి విదేశాలకు వెళ్లే డబ్బు) కింద విదేశీ చెల్లింపులు 2022-23 ఆర్థిక సంవత్సరంలో 27.14 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది అంతకుముందు సంవత్సరం కంటే 38% పెరిగింది. ఈ మూలధనం విదేశీ రియల్ ఎస్టేట్, రెసిడెన్సీ కార్యక్రమాలకు మళ్లించబడుతుంది. ఇది దేశీయ వృద్ధికి ఉపయోగపడదు. దీనికి విరుద్ధంగా భారతదేశంలోకి ఎఫ్డీఐ 2022-23లో 84.8 బిలియన్ డాలర్ల నుంచి 71 బిలియన్ డాలర్లకు తగ్గింది.2023లో 6,500 మంది మిలియనీర్లు భారతదేశాన్ని విడిచిపెట్టారని హెన్లీ & పార్టనర్స్ నివేదించింది. 2025 నాటికి ఈ సంఖ్య సంవత్సరానికి 8,000కి పెరగవచ్చని గతంలో అంచనా వేసింది. ఇది ప్రతిభతోపాటు సంపదను కోల్పోవడాన్ని సూచిస్తుంది.ఇదీ చదవండి: ఛార్జీల నియంత్రణకు డీజీసీఏ చర్యలు -
అదానీ కంపెనీకి ఐటీ శాఖ నోటీసులు
టాప్ బిలియనీర్ గౌతమ్ అదానీకి (Gautam Adani) ఆదాయపు పన్ను శాఖ షాక్ ఇచ్చింది. అదానీ గ్రూప్ కంపెనీ ఏసీసీ లిమిటెడ్పై రెండు వేర్వేరు డిమాండ్ నోటీసుల్లో మొత్తం రూ .23.07 కోట్లు జరిమానాలు విధించింది. వీటిని అదానీ గ్రూప్ కంపెనీ అప్పీలేట్ అధికారుల ముందు సవాలు చేయాలని యోచిస్తోంది.ఆదాయపు పన్ను శాఖ (Income Tax department) జారీ చేసిన డిమాండ్ నోటీసుల్లో 2015-16 అసెస్మెంట్ సంవత్సరానికి "ఆదాయానికి సంబంధించిన తప్పుడు వివరాలను అందించడం"పై రూ .14.22 కోట్ల జరిమానా విధించగా, 2018-19 అసెస్మెంట్ సంవత్సరానికి "ఆదాయాన్ని తక్కువగా నివేదించడం"పై మరో రూ .8.85 కోట్ల జరిమానా విధిస్తున్నట్లు ఐటీ శాఖ పేర్కొంది.సవాలు చేస్తాం.."నిర్ణీత కాలపరిమితిలో ఆదాయపు పన్ను కమిషనర్ (అప్పీల్స్) ముందు అప్పీళ్లు దాఖలు చేయడం ద్వారా కంపెనీ రెండు ఉత్తర్వులను సవాలు చేస్తుంది. దీంతోపాటు సమాంతరంగా, సంబంధిత ఉత్తర్వుల ప్రకారం లేవనెత్తిన జరిమానా డిమాండ్లపై స్టే కోరుతుంది" అని ఏసీసీ రెగ్యులేటర్ ఫైలింగ్స్లో తెలిపింది. ఈ రెండు డిమాండ్ నోటీసులను అక్టోబర్ 1న స్వీకరించినట్లు చెప్పిన కంపెనీ.. ఈ జరిమానాలు సంస్థ ఆర్థిక కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం చూపవని తెలిపింది.అదానీ సిమెంట్ గురించి..అదానీ సిమెంట్.. అంబుజా సిమెంట్ అనుబంధ సంస్థ. ఇది కంపెనీలో 50 శాతానికి పైగా వాటాను కలిగి ఉంది. 2022 సెప్టెంబర్లో అదానీ గ్రూప్ స్విట్జర్లాండ్కు చెందిన హోల్సిమ్ గ్రూప్ నుండి అంబుజా సిమెంట్స్ దాని అనుబంధ సంస్థ ఏసీసీ లిమిటెడ్ను 6.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. -
ఛార్జీల నియంత్రణకు డీజీసీఏ చర్యలు
దీపావళి పండుగ సమీపిస్తున్న తరుణంలో విమానయాన రంగంలో ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టికెట్ ధరలు విపరీతంగా పెరగకుండా నిరోధించడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక చర్యలు తీసుకుంటుంది. ప్రయాణికులకు సరసమైన ధరలు లభించేలా చూడటానికి దేశీయ విమానయాన సంస్థలు తమ విమాన సామర్థ్యాన్ని పెంచాలని రెగ్యులేటర్ ఆదేశించింది.పండుగ కాలంలో టికెట్ ధరలు పెరగడం వల్ల ప్రయాణికులపై ఆర్థిక భారం పడకుండా చూసేందుకు విమానయాన సంస్థలతో ఈ సమస్యను ముందుగానే చర్చించినట్లు డీజీసీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధాన మార్గాల్లో విమాన ఛార్జీల పోకడలను సమీక్షించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు. అధిక డిమాండ్ ఉన్న దీపావళి, క్రిస్మస్ వంటి పండుగ సమయాల్లో ఛార్జీల హెచ్చుతగ్గులపై ప్రయాణికుల నుంచి ఇటీవల ఫిర్యాదుల పెరుగుతున్న దృష్ట్యా డీజీసీఏ ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది.భారతదేశంలో ‘ఓపెన్ స్కైస్ పాలసీ’ ప్రకారం విమానయాన సంస్థలకు తమ ధరలను నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉన్నప్పటికీ ఛార్జీలు అసమానంగా పెరిగితే జోక్యం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందని అధికారులు స్పష్టం చేశారు. పండుగ సీజన్లో ప్రయాణీకుల ప్రయోజనాలను కాపాడటానికి విమాన ఛార్జీలు, విమాన సామర్థ్యాలపై కఠినమైన పర్యవేక్షణ కొనసాగుతుందని డీజీసీఏ ప్రతినిధి ఒకరు తెలిపారు.డీజీసీఏ సలహాకు అనుగుణంగా ప్రధాన విమానయాన సంస్థలు అదనపు విమానాలను మోహరిస్తున్నాయి. ఈ అదనపు విమానాలు అక్టోబర్, నవంబర్ నెలల్లో సేవలందించనున్నాయి. దేశంలో 64.2 శాతం మార్కెట్ వాటాతో అగ్రగామిగా ఉన్న ఇండిగో 42 సెక్టార్లలో 730 అదనపు విమానాలను నడపనుంది. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కలిసి 20 మార్గాల్లో సుమారు 486 విమానాలను జోడించనున్నాయి. స్పైస్ జెట్ 38 సెక్టార్లలో 546 అదనపు సేవలను మోహరించనుంది.ఇదీ చదవండి: మేనేజర్ కావాలనే నాపై కక్ష కట్టాడు! -
మేనేజర్ కావాలనే నాపై కక్ష కట్టాడు!
వర్క్ ఫ్రం హోం విధానంలో పని చేస్తున్న బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఇటీవల సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసిన కథనం వైరల్గా మారింది. రిక్రూట్మెంట్ సమయంలో పూర్తిస్థాయి వర్క్ ఫ్రం హోం అని చెప్పిన కంపెనీ సడెన్గా ఫిజికల్గా ఆఫీస్కు రావాలని ఆదేశించినట్లు అందులో రాసుకొచ్చారు. అయితే మేనేజర్ కావాలనే ఇలా తనను వేదిస్తున్నట్లు చెప్పారు. తాను ఉంటున్న ప్రాంతం ఆఫీస్కు 300 కి.మీ ఉండడంతో సదరు ఉద్యోగి తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు.‘రిక్రూట్మెంట్ సమయంలో పర్మనెంట్ వర్క్ ఫ్రం హోం అన్నారు. నేను కంపెనీలో చేరి ఇప్పటికి ఏడాది గడిచిపోయింది. నేను ప్రస్తుతం ఉంటున్న ప్రాంతం మా ఆఫీస్కు 300 కి.మీ. ఇప్పటివరకు ప్రతి రెండు నెలలకు ఒకసారి ఆఫీస్కు రమ్మనారు. కానీ ఇప్పడు నన్ను మేనేజర్ కావాలనే ప్రతివారం రమ్మంటున్నాడు. టీమ్ బిల్డింగ్, ఆఫీస్ సంస్కృతిని సంరక్షించడం అనేవి కారణంగా చెబుతున్నాడు. ఈ వ్యవహారంపై మేనేజర్తో మాట్లాడినా లాభం లేకుండా పోయింది. ఇది స్నేహపూర్వకమైన వృత్తిపరమైన సంబంధాన్ని ఘర్షణకు, ఒత్తిడికి తావిస్తుంది. మేనేజర్ ప్రవర్తనకు వ్యతిరేకంగా ఉన్నత స్థాయి యాజమాన్యాన్ని ఆశ్రయించాలని భావిస్తున్నాను. అదేసమయంలో కెరియర్ అవకాశాలు, టీమ్ రిలేషన్స్ దెబ్బతింటాయేమోనని ఆలోచలున్నాయి’ అని పోస్ట్లో తెలిపారు.రెడిట్ ప్లాట్ఫామ్లో వెలసిన ఈ పోస్ట్పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. చాలా మంది ఉద్యోగి పట్ల సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. ఇది ఒక అనివార్య సమస్య అని పేర్కొన్నారు. ‘టీమ్ బిల్డింగ్’ లేదా ‘ఆఫీస్ సంస్కృతి’ని సంరక్షించడం అనే సాకుతో చాలామంది ఇలా ఉద్యోగులను ఇబ్బందిపెడుతున్నట్లు కొందరు చెప్పారు. కొంతమంది మేనేజర్లు తాము రిమోట్గా పని చేస్తూనే కింది సిబ్బందిని కార్యాలయానికి రావాలని బలవంతం చేస్తున్నట్లు చెప్పారు.ఇదీ చదవండి: పెళ్లి నిధిని ఎలా సమకూర్చుకోవాలి? -
పసిడి కొత్త ధరలు: వింటే దడ పుట్టడం ఖాయం!!
దేశంలో బంగారం ధరలు అంతే లేకుండా పెరిగిపోతున్నాయి. విజయదశమి సందర్భంగా కాస్త శాంతించినట్టే కనిపించినా మళ్లీ స్పీడ్ను అమాంతం పెంచేశాయి. ధర వింటేనే పసిడి ప్రియులకు దడ పుడుతోంది. ఆదివారంతో పోలిస్తే సోమవారం బంగారం ధరలు (Gold price today) ఒక్కసారిగా ఎగిశాయి. అలాగే వెండి ధరలు (Silver price today) కూడా భారీగా పెరిగాయి. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద తెలుసుకుందాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:38 సమయానికి నిఫ్టీ(Nifty) 23 పాయింట్లు పెరిగి 24,916కు చేరింది. సెన్సెక్స్(Sensex) 69 పాయింట్లు పుంజుకొని 81,279 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పెళ్లి నిధిని ఎలా సమకూర్చుకోవాలి?
కుమార్తె వివాహ అవసరాల కోసం ప్రతి నెలా రూ.45,000 చొప్పున ఆరేళ్ల పాటు పెట్టుబడి చేయాలన్నది ప్రణాళిక. ఈ మొత్తాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి? – జి. దేవిగుప్తామన దేశంలో వివాహ వేడుకలన్నవి భారీ ఖర్చుతో కూడుకున్నవి. ప్రతి నెలా రూ.45,000 చొప్పున వచ్చే ఆరేళ్ల పాటు ఇన్వెస్ట్ చేసినట్టయితే గణనీయమైన మొత్తమే సమకూరుతుంది. వివాహం లక్ష్యం విషయంలో రాజీపడలేం. అనుకున్న సమయానికి కావాల్సినంత చేతికి అందాల్సిందే. కనుక రిస్క్ తక్కువగా ఉండాలని కోరుకునే వారు తటస్థ మార్గాన్ని అనుసరించొచ్చు. ఇందులో భాగంగా 50 శాతాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల పెట్టుబడికి రిస్క్ ఉండదు. మిగిలిన 50 శాతాన్ని వృద్ధి కోసం ఈక్విటీలకు కేటాయించుకోవాలి.డెట్ విషయంలో షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్ లేదా టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్స్ను ఎంపిక చేసుకోవచ్చు. ఈక్విటీ పెట్టుబడులకు లార్జ్క్యాప్ ఫండ్స్ లేదా ఇండెక్స్ ఫండ్స్ నుంచి ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ అధిక రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉంటే.. ఈక్విటీలకు 65 శాతం నుంచి 80 శాతాన్ని కేటాయించుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. బంగారం కోసం గోల్డ్ ఈటీఎఫ్ల్లోనూ కొంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బంగారం విలువ పెరుగుదల రూపంలో రాబడి సమకూర్చుకోవచ్చు. వివాహ సమయంలో గోల్డ్ ఈటీఎఫ్లను విక్రయించి ఆభరణాలు కొనుగోలు చేసుకోవచ్చు. నేను దీర్ఘకాలం కోసం స్మాల్క్యాప్ ఫండ్స్లోనే నూరు శాతం ఇన్వెస్ట్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇది సరైనదేనా? – నిరంజన్ దాస్స్మాల్క్యాప్లో పెట్టుబడులు పెట్టుకునే ముందు దీర్ఘకాలం ఒక్కటే చూడకూడదు. మార్కెట్ దిద్దుబాట్లలో స్మాల్క్యాప్ పెట్టుబడుల గణనీయమైన కుదుపులకు లోనవుతుంటుంది. అయినప్పటికీ దీర్ఘకాలంలో ఇవి మెరుగైన రాబడులను ఇవ్వగలవు. కనుక పెట్టుబడుల కోసం స్మాల్క్యాప్ పథకాలను పరిశీలించొచ్చు. కాకపోతే ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి కనుక, మీ మొత్తం పెట్టుబడుల్లో 10–15 శాతం మించి స్మాల్క్యాప్ పథకాలకు కేటాయించుకోకపోవడమే మంచిది. చిన్న కంపెనీ దిగ్గజ కంపెనీగా మారిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. అదే సమయంలో చిన్న కంపెనీల్లో సంపదను తుడిచిపెట్టేవీ ఉంటాయి. ఆటుపోట్లను తట్టుకునే బలం చిన్న కంపెనీలకు తక్కువగా ఉంటుంది.స్మాల్క్యాప్ కంపెనీల విషయానికొస్తే కావాల్సినంత లిక్విడిటీ ఉండదు. చిన్న కంపెనీలు కావడంతో ఫ్రీ ఫ్లోటింగ్ ఈక్విటీ తక్కువే ఉంటుంది. దీంతో మార్కెట్ల కరెక్షన్లలో కొద్ది విక్రయాలకే ఎక్కువ నష్టపోతుంటాయి. అందుకే మిడ్క్యాప్, లార్జ్క్యాప్ కంపెనీలతో పోలిస్తే స్మాల్క్యాప్ కంపెనీల్లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. స్మాల్క్యాప్ కంపెనీల్లో అయితే నేరుగా కాకుండా మ్యూచువల్ ఫండ్స్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవడమే మంచి నిర్ణయం అవుతుంది. ఎందుకంటే చిన్న కంపెనీల్లో ఏ ధరలో కొనుగోలు చేశారన్నది రాబడులను నిర్ణయిస్తుంది. పైగా ఈ విభాగంలో వైఫల్యాలు, మోసాల రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. నిపుణులైన ఫండ్ మేనేజర్లు వీటన్నింటినీ పరిశీలిస్తూ వేగంగా పెట్టుబడుల విషయంలో నిర్ణయాలు అమలు చేస్తుంటారు. కనుక మొత్తం పెట్టుబడుల్లో స్మాల్క్యాప్ విభాగానికి పరిమితంగానే కేటాయింపులు చేసుకోవాలి. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా స్మాల్క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ తగ్గించుకోవచ్చు.ఇదీ చదవండి: వయసు 31.. సంపద రూ.21 వేలకోట్లు! ఎలా సాధ్యమైంది? -
భవిష్యత్తులో పాలసీ రేట్ల కోతకు మరింత చాన్స్: క్రిసిల్
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణ అంచనాలను తగ్గించిన రిజర్వ్ బ్యాంక్, భవిష్యత్తులో పాలసీ రేట్లను మరింత తగ్గించేందుకు అవకాశాలను తెరిచి ఉంచిందని క్రిసిల్ ఇంటెలిజెన్స్ ఒక నివేదికలో తెలిపింది. అమెరికా టారిఫ్లపరమైన అనిశి్చతుల వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) ద్వితీయార్థంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి తిరోగమించే రిస్కులు ఉన్నట్లు మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) కూడా పేర్కొందని గుర్తు చేసింది. అయితే, ఇటీవల జీఎస్టీ రేట్లను క్రమబదీ్ధకరించడం వల్ల టారిఫ్లపరమైన ప్రతికూల ప్రభావం కొంత తగ్గొచ్చని క్రిసిల్ ఇంటెలిజెన్స్ తెలిపింది. కారి్మక శక్తి అధికంగా ఉండే నిర్దిష్ట రంగాలపై టారిఫ్ల ఎఫెక్ట్ గణనీయంగా ఉంటుందని, వాటికి పాలసీపరమైన మద్దతును అందించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణంపరమైన ఆందోళన కొంత తగ్గే అవకాశం ఉందని, అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల తగ్గింపు ప్రభావంతో ఆర్బీఐ కూడా పాలసీ రేట్లను తగ్గించడానికి కాస్త ఆస్కారం ఉంటుందని వివరించింది. 2025 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను 100 బేసిస్ పాయింట్లు (1%) తగ్గించింది. రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్నందున, ఎంపీసీ సిఫార్సుల మేరకు, పాలసీ రేట్లను ఆర్బీఐ ఫిబ్రవరిలో 25 బేసిస్ పాయింట్లు, ఏప్రిల్లో మరో 25 బేసిస్ పాయింట్లు, జూన్లో 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో ఇది ప్రస్తుతం 5.5 శాతానికి చేరింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం, రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించుకున్న 4 శాతం లోపే కొనసాగుతోంది. -
ఏడాదిలో బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్వర్క్
న్యూఢిల్లీ: భారత్ సొంతంగా అభివృద్ధి చేసిన బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్వర్క్ని ఏడాదిలోగా 5జీకి అప్గ్రేడ్ చేయనున్నట్లు టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింథియా తెలిపారు. భారత దేశం కూడా సొంతంగా 4జీ టెక్నాలజీ రంగంలోకి అడుగుపెట్టిందని ప్రపంచవ్యాప్తంగా స్వీడన్, ఫిన్లాండ్, దక్షిణ కొరియా, చైనాకు చెందిన హువావే, జడ్టీఈ, శాంసంగ్, నోకియా, ఎరిక్సన్ తదితర ఐదు కంపెనీలు 4జీ టెక్నాలజీలో ఆధిపత్యం వహిస్తున్నాయని, భారత్ కూడా ఇప్పుడు 4జీ ప్రపంచ క్లబ్లో ప్రవేశించిందన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భరూచ్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు 92564 టవర్లను ప్రారంభించినట్లు సింధియా తెలిపారు. ఈ వేగం ఇక్కడితో ఆగదని వచ్చే ఏడాదిలోగా ఈ 4జీ టవర్లను 5జీ నెట్వర్క్కు అప్గ్రేడ్ చేసి దేశమంతా 5జీ సేవలు అందిస్తామని సింథియా వెల్లడించారు. -
ఎలక్ట్రానిక్స్ తయారీకి రాష్ట్రాలూ చేయూతనివ్వాలి
న్యూఢిల్లీ: నాన్ సెమీకండక్టర్ ఎల్రక్టానిక్ విడిభాగాల తయారీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉత్పాదక అనుసంధాన ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కింద పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడం స్థానిక తయారీకి జోన్నివ్వనుంది. తుది ఉత్పత్తుల విలువలో స్థానిక తయారీ విలువ 40 శాతానికి పెరుగుతుందని ఎల్రక్టానిక్స్ పరిశ్రమల సంఘం (ఎల్సినా) ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ‘ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ పథకం’ (ఈసీఎంఎస్)కు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వ్యాపార నిర్వహణను సులభతరం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని కోరింది. ఈసీఎంఎస్ కింద రూ.1.5 లక్షల కోట్ల విలువైన పెట్టుబడుల ప్రతిపాదనలు రావడం గమనార్హం. రూ.59,000 కోట్ల పెట్టుబడులు రాబట్టుకోవాలని కేంద్రం ఆశించగా, అంతకు రెట్టింపు మేర స్పందన వచి్చంది. మొత్తం 249 కంపెనీలు పెట్టుబడుల ప్రతిపాదనలు సమరి్పంచాయి. కేంద్ర ప్రభుత్వ కమిటీ వీటిని పరిశీలించిన అనంతరం, అర్హత కలిగిన వాటికి ఆమోదం లభించనుంది. ‘‘దేశ ఎల్రక్టానిక్స్ తయారీ వ్యవస్థలో స్థానిక విలువ జోడింపును ప్రస్తుతమున్న 15–20 శాతం నుంచి 35–40 శాతానికి వచ్చే ఐదేళ్లలో పెరిగేందుకు ఈ పథకం దోహదం చేస్తుంది’’ అని ఎల్సినా సెక్రటరీ జనరల్ రాజు గోయల్ తెలిపారు. రూ.10.34 లక్షల కోట్ల తయారీ తాము రూ.4,56,500 కోట్ల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంటే, రూ.10.34 లక్షల కోట్ల ఉత్పత్తికి సంబంధించిన ప్రతిపాదనలు వచి్చనట్టు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ నెల 2న ప్రకటించడం గమనార్హం. ఇందులో ప్రధానంగా ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులకు సంబంధించి రూ.16,542 కోట్లు, ఎలక్ట్రో మెకానికల్ విడిభాగాలకు సంబంధించి రూ.14,362 కోట్లు, మల్టీ లేయర్ పీసీబీలకు సంబంధించి రూ.14,150 కోట్లు, డిస్ప్లే మాడ్యూల్ సబ్ అసెంబ్లీకి సంబంధించి రూ.8,642 కోట్లు, కెమెరా మాడ్యూల్ సబ్ అసెంబ్లీకి సంబంధించి రూ.6,205 కోట్లు, లిథియం అయాన్ సెల్స్కు సంబంధించి రూ.4,516 కోట్ల చొప్పున ప్రతిపాదనలు వచ్చాయి. ఇందులో ఎలక్ట్రో మెకానికల్స్, ఐటీ ఉత్పత్తులకు సంబంధించి ఎన్క్లోజర్లు, మల్టీ లేయర్ పీసీబీలు, ఫ్లెక్సిబుల్ పీసీబీలకు ంసబంధించి పెద్ద మొత్తంలో, అధిక విలువ మేర ప్రతిపాదనలు వచి్చనట్టు ఎల్సినా తెలిపింది. తయారీ కేంద్రంగా భారత్పై పెరుగుతున్న విశ్వాసానికి ఈ స్పందన నిదర్శనమని ఎల్సినా ప్రెసిడెంట్ శశి గంధనం పేర్కొన్నారు. వ్యాపార నిర్వహణకు అనుకూలమైన పరిస్థితులను కల్పించడం ద్వారా ఈ ధోరణికి రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతుగా నిలవాలని కోరారు. రాష్ట్రాలు సైతం తమవంతు ప్రోత్సాహకాలు కల్పిస్తే మరిన్ని పెట్టుబడులు రావడంతోపాటు, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాల కల్పన సాధ్యపడుతుందన్నారు. -
గణాంకాలు, ప్రపంచ పరిణామాలే దిక్సూచి!
న్యూఢిల్లీ: స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలతో పాటు ఐటీ దిగ్గజం టీఎస్ఎస్తో బోణీ కానున్న రెండో త్రైమాసిక (క్యూ2) ఫలితాలు మన మార్కెట్ల గమనాన్ని నిర్దేశించనున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. వరుసగా మూడు నెలల నుంచి అమ్మకాల బాటలో సాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల కార్యకలాపాలను కూడా మార్కెట్లు నిశితంగా పరిశీలిస్తాయని చెప్పారు. మరోపక్క, జారుడు బల్లపై ఉన్న రూపాయి మారకం విలువ, అంతర్జాతీయంగా ముడి చమురు ధరల కదలికలు కూడా మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నాయి. టీసీఎస్ బోణీ... కార్పొరేట్ల క్యూ3 (జూలై–సెపె్టంబర్) ఆర్థిక ఫలితాలు ఈ వారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 9న ఐటీ దిగ్గజం టీసీఎస్ ఫలితాలతో బోణీ కొట్టనుంది. ట్రంప్ సర్కారు హెచ్1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచడం, 25 శాతం అదనపు టారిఫ్ల మోత తదితర భారత్ వ్యతిరేక చర్యల నేపథ్యంలో క్యూ2 ఫలితాలపై, కంపెనీల భవిష్యత్తు అంచనాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించనున్నారు. ‘క్యూ2 ఫలితాల సందర్భంగా టారిఫ్ల ప్రభావం, వీసా ఫీజుల పెంపు, డీల్స్, కంపెనీల వ్యయాలు, ఉద్యోగాల కోత, హైరింగ్ అవుట్లుక్ వంటి అంశాలపై టీసీఎస్ యాజమాన్యం చేసే వ్యాఖ్యలు ఐటీ రంగంలో పాటు మార్కెట్ల సెంటిమెంట్ను ప్రభావితం చేసే అవకాశం ఉంది’ అని ఆన్లైన్ ట్రేడింగ్, వెల్త్ టెక్ సంస్థ ఎన్రిచ్ మనీ సీఈఓ పోన్ముడి ఆర్ అభిప్రాయపడ్డారు. గణాంకాలపై ఫోకస్.. ‘టీసీఎస్ ఫలితాలకు తోడు హెచ్ఎస్బీసీ సర్వీస్ రంగం పీఎంఐ డేటా, బ్యాంకింగ్ రంగ రుణ, డిపాజిట్ వృద్ధి గణాంకాలు రానున్నాయి. టాటా క్యాపిటల్, ఎల్జీ బడా ఐపీఓలతో ప్రైమరీ మార్కెట్ కార్యకలాపాలు జోరందుకోనున్నాయి’ అని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా చెప్పారు. కాగా, అమెరికాలో ఫెడర్ రిజర్వ్ ఇటీవలి పాలసీ భేటీ వివరాలు (మినిట్స్), నిరుద్యోగ గణాంకాలు, కన్జూమర్ సెంటిమెంట్ డేటా వంటి వాటిపై ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు ఫోకస్ చేసే అవకాశం ఉంది. కొనసాగుతున్న అమెరికా ప్రభుత్వ షట్డౌన్ కారణంగా కొన్ని కీలక ఆర్థిక గణంకాలు ఇప్పటికే ఆలస్యమయ్యయాని మిశ్రా పేర్కొన్నారు. గత వారమిలా... వరుసగా 8 రోజుల పాటు నష్టాల బాటలో సాగిన దేశీ మార్కెట్లకు ఆర్బీఐ పాలసీ కాస్త ఊరటనిచి్చంది. గురు, శక్రవారాల్లో ప్లస్లో నిలిచిన సూచీలు లాభాలతో వారాన్ని ముగించాయి. సెన్సెక్స్ 781 పాయింట్లు (0.97%), నిఫ్టీ 240 పాయింట్లు (0.97%) చొప్పున ఎగబాకాయి. కీలక రెపో రేటును ఆర్బీఐ యథాతథంగా కొనసాగించినప్పటికీ, రానున్న నెలల్లో రేట్ల కోతకు ఆస్కారం ఉందంటూ ఇచ్చిన సిగ్నల్స్ మార్కెట్ను మెప్పించింది. మరోపక్క, ఐపీఓ ఫైనాన్సింగ్, షేర్ల తనఖా రుణ పరిమితిని భారీగా పెంచడం కూడా ఇన్వెస్టర్లలో జోష్ నింపింది. ‘జీడీపీ వృద్ధి అంచనాలను పెంచడంతో పాటు పాలసీ సందర్భంగా ఆర్బీఐ తీసుకున్న చర్యలు ఇన్వెస్టర్లలో విశ్వాసం పెంచింది. ఇటీవలి కరెక్షన్ నుంచి మార్కెట్లు మళ్లీ సానుకూల పథంలోకి మారాయి’ అని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ వ్యాఖ్యానించారు.మెగా ఐపీఓ వారం..పబ్లిక్ ఆఫర్ల వరదతో కళకళలాడుతున్న ప్రైమరీ మార్కెట్లను ఈ వారం మెగా ఐపీఓలు (దాదాపు రూ.27,000 కోట్లు) ముంచెత్తనున్నాయి. టాటా క్యాపిటల్ రూ.15,512 కోట్ల ఇష్యూతో పాటు (6న ప్రారంభమై 8న ముగుస్తుంది). దీని ప్రైస్ బ్యాండ్ను కంపెనీ రూ.310–326గా నిర్ణయించింది. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ కూడా ఈ వారమే ప్రారంభమవుతోంది. దాదాపు రూ.11,607 కోట్ల ఈ ఆఫర్ అక్టోబర్ 7న మొదలై 9న క్లోజవుతుంది. దీని ధరల శ్రేణి రూ.1,080–1,140. ఇవి కాకుండా రూబికాన్ రీసెర్చ్ రూ.1,377 కోట్ల ఇష్యూ అక్టోబర్ 9న షురూ కానుంది. ఇప్పటికే మొదలైన రూ.3,000 కోట్ల వియ్వర్క్ ఆఫర్ 7న ముగియనుంది. 2025లో ఇప్పటికే 78 ఐపీఓలు పూర్తవగా.. రానున్న నెలల్లో మరిన్ని కంపెనీలు వరుస కట్టనున్నాయి.ఎఫ్పీఐల రివర్స్ గేర్...సెపె్టంబర్ నెలలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) అమ్మకాల జోరు పెంచారు. ఈ ఒక్క నెలలోనే రూ.23,885 కోట్ల విలువైన షేర్లను నికరంగా అమ్మేశారు. దీంతో ఈ ఏడాది ఇప్పటిదాకా ఈక్విటీ మార్కెట్లో ఎప్పీఐల నికర అమ్మకాలు రూ.1.58 లక్షల కోట్లకు చేరాయి. వరుసగా మూడో నెలలోనూ విదేశీ ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు పాల్పడటం తాజా కరెక్షన్కు ఆజ్యం పోసింది. ఆగస్ట్లో ఏకంగా రూ.34,990 కోట్లు ఉపసంహరించున్న ఎఫ్పీఐలు, జూలైలో రూ.17,700 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు. ‘ఇటీవలి అమ్మకాలకు ప్రధానంగా అమెరికా టారిఫ్ల మోతతో పాటు ఇతరత్రా పాలసీ షాక్లు ప్రధాన కారణం. భారతీయ వస్తువులపై 50 శాతం టారిఫ్ల విధింపు, హెచ్1బీ వీసా ఫీజు లక్ష డాలర్లకు పెంపు వంటివి ఎగుమతి ఆధారిత రంగాలపై, ముఖ్యంగా ఐటీ పరిశ్రమ సెంటిమెంట్ను దెబ్బతీసింది. రూపాయి రికార్డు కనిష్టాలకు పడిపోతుండటం వల్ల తలెత్తుతున్న కరెన్సీ రిస్క్, భారతీయ స్టాక్స్లో అధిక వేల్యుయేషన్లు వంటివి కూడా ఎఫ్ఐపీలను తాత్కాలికంగా ఇతర ఆసియా మార్కెట్ల వైపు (రొటేషన్) దృష్టి సారించేలా చేస్తోంది’ అని మార్నింగ్ స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా ప్రిన్సిపల్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు. -
‘హెల్త్ ఎమర్జెన్సీ’కి సిద్ధమా!
అత్యవసర వైద్య పరిస్థితుల్లో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకోవాల్సి వస్తే ఆదుకునే సాధనం హెల్త్ ఇన్సూరెన్స్. ఆస్పత్రిలో నగదు రహిత వైద్యానికి బీమా పాలసీ భరోసానిస్తుంది. కానీ, ఆస్పత్రిలో చేరిన తర్వాత నగదు రహిత చెల్లింపులకు తిరస్కారం ఎదురైతే..? రూ.లక్షల బిల్లు సొంతంగా చెల్లించడం మినహా మరో మార్గం ఉండదు. ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అన్ని బిల్లులతో బీమా కంపెనీ వద్ద రీయింబర్స్మెంట్ క్లెయిమ్ దాఖలు చేసుకోవాల్సి వస్తుంది. ఇటీవలి కాలంలో ఆస్పత్రులు, బీమా కంపెనీల మధ్య ఏర్పడిన విశ్వాస వైరుధ్యం.. పాలసీదారులను ఆందోళనకు గురిచేసే అంశమే. దీనిపై అవగాహన కలిగి ఉంటే.. అత్యవసర పరిస్థితులను ధైర్యంగా, సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు నగదు రహిత చికిత్సలను సెప్టెంబర్ 22 నుంచి నిలిపివేస్తున్నట్టు అసోసియేషన్ ఆఫ్ హెల్త్కేర్ ప్రొవైడర్స్ (ఏహెచ్పీఐ) సెప్టెంబర్ 12న ప్రకటించింది. ఏహెచ్పీఐ కింద దేశవ్యాప్తంగా 15 వేల ఆస్పత్రులు సభ్యులుగా ఉన్నాయి. అక్టోబర్ 10 నుంచి నగదు రహిత చికిత్సలను తిరిగి ప్రారంభించేందుకు పరస్పర అంగీకారం కుదిరినట్టు ఏహెచ్పీఐ, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కొన్ని రోజుల తర్వాత ప్రకటించాయి. అంతకుముందు ఆగస్ట్లో బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్, కేర్ హెల్త్ ఇన్సూరెన్స్,, నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారులకూ ఇదే అనుభవం ఎదురైంది. తన ఎంపానెల్డ్ హాస్పిటల్స్ జాబితా నుంచి మ్యాక్స్ హాస్పిటల్స్ను తొలగిస్తున్నట్టు ఆగస్ట్ 16న నివాబూపా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రకటించింది. సరిగ్గా మ్యాక్స్ హాస్పిటల్స్ విషయంలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సైతం ఈ ఏడాది ఫిబ్రవరి 17న ఇదే విధంగా వ్యవహరించింది. కొన్ని సందర్భాల్లో బీమా సంస్థలు, కొన్ని సందర్భాల్లో ఏహెచ్పీఐ ఈ తరహా చర్యలకు ఉపక్రమిస్తుండడం పాలసీదారులను అయోమయానికి గురిచేస్తోంది. విధానం – వివాదం → సాధారణంగా అన్ని బీమా సంస్థలకు ‘నెట్వర్క్ హాస్పిటల్స్’ అంటూ ఒక జాబితా ఉంటుంది. ఇందులో ఉన్న వాటిని ‘ఎంపానెల్డ్ హాస్పిటల్స్’ అని పేర్కొంటారు. బీమా సంస్థలు అన్ని ముఖ్యమైన ఆస్పత్రులతో ఒప్పందం చేసుకుంటూ ఉంటాయి. ప్రతి చికిత్సకు సంబంధించి తక్కువ రేట్లతో ఒక టారిఫ్పై అంగీకారం కుదుర్చుకుంటాయి. → ప్రధానంగా ఈ ధరల విషయంలో ఆస్పత్రులు, బీమా సంస్థల మధ్య ప్రస్తుతం వివాదం నెలకొంది. ఆస్పత్రులు అధిక చార్జీలు వసూలు చేస్తున్నాయని, బోగస్ క్లెయిమ్లకు (క్లెయిమ్ మోసాలు) చోటు కల్పిస్తున్నాయని, ప్రొటోకాల్కు విరుద్ధమైన, అవసరం లేని వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఔషధాలను సూచిస్తున్నాయని, ముందు పేర్కొన్న క్లెయిమ్ కంటే తుది క్లెయిమ్ భారీగా పెరిగిపోతోందని.. ఇలా ఎన్నో ఆరోపణలు బీమా సంస్థలు నుంచి వినిపిస్తున్నాయి. 2020 తర్వాత చికిత్సల టారిఫ్లను సవరించలేదని, అత్యాధునిక చికిత్సా విధానాలు, పెరిగిన సిబ్బంది వేతనాల దృష్ట్యా రేట్లను సవరించాల్సి ఉందని.. కానీ, తక్కువ చార్జీలకు అంగీకారం తెలపాలంటూ బీమా కంపెనీలు ఒత్తిడి చేస్తున్నాయని, నగదు రహిత క్లెయిమ్లకు తొలుత అంగీకారం తెలిపి, తుది క్లెయిమ్ సమయంలో తిరస్కరిస్తున్నాయని ఆస్పత్రుల నుంచి ఆరోపణలు ఉన్నాయి. అలాగే, క్లెయిమ్ మొత్తాన్ని తగ్గించేస్తున్నాయని అంటున్నాయి. → ఆస్పత్రిలో పాలసీదారుడు చేరిన సమయంలో అతడి నుంచి ప్రీ ఆథరైజేషన్ ఫారమ్ను ఆస్పత్రి సిబ్బంది తీసుకుని, బీమా కంపెనీలు లేదా థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్కు (టీపీఏ) పంపిస్తాయి. ఈ పత్రంలో ఆరోగ్య సమస్య ఏమిటి, చికిత్స వివరాలు, అంచనా వ్యయాలు ఉంటాయి. దీనికి బీమా కంపెనీలు నాలుగు గంటల్లోపు స్పందిస్తాయి. ఆమోదిస్తే నగదు రహిత చికిత్స తీసుకోవచ్చు. లేదంటే సొంతంగా చెల్లించి, తర్వాత రీయింబర్స్మెంట్కు (తిరిగి పొందడం) వెళ్లాల్సి ఉంటుంది. బీమా కంపెనీ నుంచి ఆమోదం లభించిన కేసుల్లో.. డిశ్చార్జ్కు ముందు మొత్తం చికిత్స వ్యయం, పూర్తి వివరాలతో తుది క్లెయిమ్ బీమా కంపెనీకి వెళుతుంది. అప్పుడు చికిత్సలకు విధించిన చార్జీలు తమ ఒప్పందం ప్రకారమే ఉన్నాయా? లేక అదనంగా బాదేశారా? అని బీమా కంపెనీ లేదా టీపీఏ బృందాలు పరిశీలిస్తాయి. ఆరోగ్య సమస్య, చికిత్స, ఔషధ వినియోగం, వ్యాధి నిర్ధారణ పరీక్షలనూ లోతుగా పరిశీలిస్తాయి. ఏవైనా సందేహాలుంటే మరిన్ని వివరాలు కోరతాయి. పాలసీదారుడి ఆరోగ్య చరిత్ర విషయంలో సందేహాలు నెలకొంటే తుది క్లెయిమ్కు తిరస్కరిస్తాయి. రీయింబర్స్మెంట్ విధానంలో రావాలని సూచిస్తాయి. ఒకవేళ ఆస్పత్రులు అధికంగా చార్జీలు వేసినట్టు భావిస్తే, ఆ మేరకు బిల్లులో తగ్గించి క్లెయిమ్కు ఆమోదం తెలపొచ్చు. అప్పుడు మిగిలిన మొత్తాన్ని పాలసీదారు చెల్లించాల్సి ఉంటుంది. నగదు రహిత క్లెయిమ్ తిరస్కరణకు గురై, రీయింబర్స్మెంట్ క్లెయిమ్కు వెళ్లిన సందర్భంలోనూ పూర్తి మొత్తం వస్తుందన్న భరోసా లేదు.కళ్లు తెరిపించే గణాంకాలు..→ ఇన్సూరెన్స్ అంబుడ్స్మన్ 2023–24 నివేదిక ప్రకారం.. హెల్త్ ఇన్సూరెన్స్కు సంబంధించి బీమా కంపెనీలపై ఫిర్యాదులు అంతకుముందు సంవత్సరంతో పోల్చి చూసినప్పుడు 21.7 శాతం పెరిగాయి. మొత్తం 31,490 ఫిర్యాదులు వచ్చాయి. → 13,308 ఫిర్యాదులు ఒక్క స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్కు వ్యతిరేకంగా వచ్చాయి. ఇందులో 10,196 ఫిర్యాదులు క్లెయిమ్ల తిరస్కారాలకు సంబంధించినవే. → కేర్ హెల్త్ ఇన్సూరెన్స్కు వ్యతిరేకంగా 3,718 ఫిర్యాదులు పాలసీదారుల నుంచి దాఖలు కాగా, అందులో క్లెయిమ్ తిరస్కరణకు సంబంధించి 2,393 ఉన్నాయి. → నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్కు వ్యతిరేకంగా 2,511 ఫిర్యాదులు రాగా, 1,770 క్లెయిమ్ తిరస్కరణకు సంబంధించినవే. నేషనల్ ఇన్సూరెన్స్కు వ్యతిరేకంగా 2,196, న్యూ ఇండియా అష్యూరెన్స్కు వ్యతిరేకంగా 1,602 ఫిర్యాదులు వచ్చాయి. → ముఖ్యంగా క్లెయిమ్ తిరస్కరణలు, బీమా కంపెనీ సేవలపై ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో ప్రతీ బీమా సంస్థ పరిధిలో అంతర్గత అంబుడ్స్మన్ వ్యవస్థను ఏర్పాటునకు బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్డీఏఐ) ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. అత్యవసర నిధి.. ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. చివరి నిమిషంలో క్లెయిమ్ రాకపోతే స్వయంగా చెల్లించక తప్పదు. ఒక్కోసారి బీమా కవరేజీ పరిధిలో లేని అనారోగ్య సమస్యలు కూడా ఎదురుకావొచ్చు. లేదా కవరేజీకి మించి చికిత్సల వ్యయాలు ఎదురుకావొచ్చు. కనుక ఒక కుటుంబం కనీసం రూ.4–5 లక్షలతో అత్యవసర వైద్యనిధిని ప్రత్యేకంగా సమకూర్చుకోవాలన్నది నిపుణుల సూచన. క్లెయిమ్ తిరస్కరిస్తే..బీమా కంపెనీలు–ఆస్పత్రుల మధ్య వివాదం పాలసీదారుల ప్రయోజనాలకు భంగం కలిగించరాదు. అవసరంలో ‘బీమా’ అదుకోనప్పుడు పాలసీదారులు మిన్నకుండిపోనక్కర్లేదు. నిబంధనల మేరకు క్లెయిమ్ మొత్తాన్ని పొందే హక్కు పాలసీదారులకు ఉంటుంది. నగదు రహిత క్లెయిమ్ తిరస్కరణకు గురైతే, స్వయంగా చెల్లించి రీయింబర్స్మెంట్ క్లెయిమ్ను 30 రోజుల్లోపు (డిశ్చార్జ్ అనంతరం) దాఖలు చేయాల్సి ఉంటుంది. కొన్ని సంస్థలు 90 రోజుల వరకు అవకాశం కలి్పస్తున్నాయి. → ముందుగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వకముందే బీమా కంపెనీ కస్టమర్కేర్కు కాల్ చేసి, నగదు రహిత చెల్లింపులకు ఒప్పించే ప్రయత్నం చేయొచ్చు. ఫలితం లేకపోతే డిశ్చార్జ్ అనంతరం రీయింబర్స్మెంట్ క్లెయిమ్కు వెళ్లడమే. → చెల్లింపులు పూర్తి స్థాయిలో రాకపోతే పాలసీ నియమ, నిబంధనల ప్రకారమే బీమా కంపెనీ వ్యవహరించిందా? అన్నది సరిచూసుకోవాలి. క్లెయిమ్ తిరస్కరించినా లేక పాక్షిక చెల్లింపులతో సరిపెట్టినా.. అప్పుడు రాతపూర్వక వివరణ తీసుకోవాలి. → బీమా కంపెనీ వివరణ సమంజసంగా, సహేతుకంగా, పాలసీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టయితే.. తొలుత బీమా కంపెనీ అంబుడ్స్మన్ వద్ద ఫిర్యాదు దాఖలు చేసి, పరిష్కారానికి ప్రయతి్నంచాలి. ఫలితం లేకపోతే బీమా రంగ అంబుడ్స్మన్ను ఆశ్రయించొచ్చు. అప్పటికీ పరిష్కారం కాకపోతే చట్టప్రకారం బీమా కంపెనీపై చర్యలకు వెళ్లాల్సి ఉంటుంది.ఇవి తెలియాలి..→ పాలసీ కొనుగోలుకు ముందు నియమ నిబంధనలు, షరతులు, మినహాయింపులు, అర్హతల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి. ఏవైనా సందేహాలుంటే బీమా కంపెనీ కస్టమర్ కేర్ను సంప్రదించాలి. → క్లెయిమ్ చెల్లింపుల నిష్పత్తి (సీఎస్ఆర్) సాధారణంగా 90కు పైన ఉంటే మంచిది. 95పైన ఉంటే మరింత భరోసా ఉన్నట్టుగా భావించొచ్చు. క్లెయిమ్ రేషియోను ఏటా ఐఆర్డీఏఐ ప్రకటిస్తుంటుంది. బీమా సంస్థలకు వ్యతిరేకంగా అంబుడ్స్మన్ వద్ద ఎన్ని ఫిర్యాదులు నమోదైనదీ పరిశీలించాలి. → బీమా కంపెనీ నెట్వర్క్ ఆస్పత్రుల జాబితా విస్తృతంగా, తమ నివాస ప్రాంతంలోని అన్ని ముఖ్య ఆస్పత్రులతో ఉండేలా చూసుకోవాలి. → సమగ్రమైన కవరేజీతో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. కస్టమర్ సేవలు మెరుగ్గా ఉన్నాయో లేదో చూడాలి. → పాలసీ దరఖాస్తులో కచ్చితమైన వివరాలను నమోదు చేయాలి. మరీ మఖ్యంగా పాలసీ తీసుకునే ముందు కొన్నేళ్లలో ఏవైనా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటే వాటి వివరాలు.. తీసుకునే నాటికి ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే వాటి గురించి సమగ్రంగా వెల్లడించాలి. → పాలసీ తీసుకున్న మొదటి 30 రోజుల్లో ప్రమాదాలు మినహా మిగతా క్లెయిమ్లు దాఖలు చేసుకోవడానికి ఉండదు. పాలసీ తీసుకునే నాటికి ఉన్న వ్యాధులకు 3–4 ఏళ్ల వరకు.. కొన్నింటికి రెండేళ్ల వెయిటింగ్ పీరియడ్ నిబంధన వర్తిస్తుంది. పాలసీ తీసుకునే ముందే ఏ వ్యాధులకు ఎంత కాలం పాటు వేచి ఉండాలో సమగ్రంగా తెలుసుకోవాలి. అదనపు ప్రీమియంతో వెయిటింగ్ పీరియడ్ లేకుండా కొన్ని బీమా సంస్థలు పాలసీలను ఆఫర్ చేస్తున్నాయి. → ఆస్పత్రిలో చేరిక గురించి బీమా సంస్థలకు సకాలంలో సమాచారం ఇవ్వాలి. సకాలంలో క్లెయిమ్లు దాఖలు చేయాలి. → బీమా సంస్థ ఎంపానెల్డ్ ఆస్పత్రుల్లోనే చికిత్స తీసుకోవడం సూచనీయం. ఎప్పటికప్పుడు తాజా జాబితా బీమా సంస్థ పోర్టల్పై అందుబాటులో ఉంటుంది. → క్లెయిమ్ను స్వయంగా దాఖలు చేస్తే, అన్ని డా క్యుమెంట్లు సమగ్రంగా ఉండేలా చూసుకోవాలి. కొన్ని బీమా సంస్థలు తమ ఎంపానెల్డ్ జాబితా నుంచి కొన్ని ఆస్పత్రులను తొలగిస్తున్నాయి. బీమా సంస్థలు ఒక్కటైతే.. మేము కూడా (ఆస్పత్రులన్నీ) ఉమ్మడిగా చేతులు కలిపి, ఆయా కంపెనీలతో వ్యాపారం నిర్వహించబోం. కరోనా తర్వాత నుంచి రేట్లపై చర్చలు జరగాల్సి ఉంది. కొన్ని బీమా సంస్థలు అయితే 2017 నుంచి రేట్లను సవరించలేదు. అసాధారణ స్థాయిలో టెక్నాలజీ పరంగా పురోగతి, సిబ్బంది జీతభత్యాల పరంగా పెరిగిన భారాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ముఖ్యంగా రేడియాలజీ, కేన్సర్, రోబోటిక్ చికిత్సల పరంగా ఎంతో పురోగతి ఉంది. సూపర్ స్పెషలిస్ట్ వైద్యుల కొరత వేధిస్తోంది. అధిక డిమాండ్ కారణంగా వారు మతిపోయే వేతనాలు డిమాండ్ చేస్తున్నారు– గిరిధర్ జ్ఞాని, డైరెక్టర్ జనరల్, ఏహెచ్పీఐఆస్పత్రులు కరోనా సమయంలో చార్జీలను అసాధారణంగా పెంచేయడమే కాదు, ఏటా ఇదే తీరులో వ్యవహరిస్తున్నాయి. హాస్పిటల్స్ ధరలను పెంచిన ప్రతి సందర్భంలోనూ బీమా కంపెనీలకు నష్టాలు పెరుగుతున్నాయి. దీంతో ప్రీమియంలను సవరించాల్సి వస్తోంది. దీన్ని పరిష్కరించాలన్నది బీమా పరిశ్రమ డిమాండ్. ద్రవ్యోల్బణం కారణంగా ఏటా రేట్లు పెరగడం సహజమే. కానీ, ఇది 15–20 శాతం స్థాయిలో ఉండరాదు. అపెండెక్టమీ చికిత్స ధర సాధారణంగా రూ.30,000–40,000 ఉంటుంది. పేరున్న ఆస్పత్రులు ఇందుకు రూ.1–1.5 లక్షలు చార్జీ వసూలు చేస్తున్నాయి. బీమా పరిశ్రమ అధిక నియంత్రణల మధ్య పనిచేస్తోంది. అలాగే, ఆస్పత్రులు, హెల్త్కేర్ ప్రొవైడర్లపైనా ఇదే మాదిరి నియంత్రణ వ్యవస్థను తీసుకురావాలి. – హెల్త్ ఇన్సూరెన్స్ పరిశ్రమ– సాక్షి, బిజినెస్ డెస్క్ -
మస్క్ ట్వీట్: నెట్ఫ్లిక్స్కు రూ.2 లక్షల కోట్ల నష్టం!
ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' (Elon Musk) చేసిన ఒక ట్వీట్.. నెట్ఫ్లిక్స్ (Netflix) మార్కెట్ విలువను భారీగా దెబ్బతీసింది. 2025 సెప్టెంబర్ 27న 514 బిలియన్ డాలర్లుగా ఉన్న దాని మార్కెట్ విలువ.. 2025 అక్టోబర్ 3 నాటికి సుమారు 25 బిలియన్ డాలర్లు తగ్గిపోయి.. 489 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అంటే సుమారు రెండు లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ నష్టం వాటిల్లిందన్నమాట.పిల్లల షోలలో ట్రాన్స్జెండర్ సందేశాలను ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో మస్క్ స్ట్రీమర్ను విమర్శించారు. ''మీ పిల్లల ఆరోగ్యం కోసం నెట్ఫ్లిక్స్ రద్దు చేయండి'' అని ఆయన తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: వికీపీడియాకు పోటీగా గ్రోకీపీడియా!: మస్క్హమీష్ స్టీల్ దర్శకత్వం వహించిన.. నెట్ఫ్లిక్స్ యానిమేటెడ్ సిరీస్ 'డెడ్ ఎండ్: పారానార్మల్ పార్క్' లింగ మార్పిడి సమస్యలను ప్రోత్సహిస్తోందని, వోక్ ఎజెండాను ప్రచారం చేస్తోందని ఆరోపించారు. కాబట్టి పిల్లల మానసిక ఆరోగ్యం దృష్ట్యా నెట్ఫ్లిక్స్ చూడటం ఆపాలని మస్క్ అన్నారు. దీంతో నెట్ఫ్లిక్స్ మార్కెట్ విలువ భారీ పతనాన్ని చవిచూసింది.Cancel Netflix for the health of your kids https://t.co/uPcGiURaCp— Elon Musk (@elonmusk) October 1, 2025 -
హోండా ఏడీవీ 350: ఇప్పుడు కొత్త హంగులతో..
2022లో యూరోపియన్ మార్కెట్లో లాంచ్ అయిన 'హోండా ఏడీవీ 350' (Honda ADV 350) స్కూటర్.. ఇప్పుడు కొత్త వెర్షన్లో కనిపించింది. ఇది కొత్త కాస్మొటిక్ అప్డేట్లను పొందుతుంది. కానీ మెకానికల్, టెక్నికల్ అంశాలు మాత్రం అలాగే ఉన్నాయి. కాగా ఇది మూడు కొత్త రంగులలో అందుబాటులోకి రానుంది.సరికొత్త హోండా ఏడీవీ 350 స్కూటర్.. 330 సీసీ ఎస్ఓహెచ్సీ ఫోర్ వాల్వ్ ఇంజిన్ ద్వారా 30 హార్స్ పవర్, 31.5 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది యూఎస్డీ ఫ్రంట్ ఫోర్కులు, డ్యూయల్ రియర్ షాక్ అబ్జార్బర్లను పొందుతుంది. 11.7 లీటర్ల ఫ్యూయెల్ ట్యాక్స్ కెపాసిటీ కలిగిన ఈ స్కూటర్.. ముందు భాగంలో 256 మిమీ డిస్క్, వెనుక భాగంలో 240 మిమీ డిస్క్ పొందుతుంది.ఇదీ చదవండి: సరికొత్త బ్రిక్స్టన్ బైక్: దీని గురించి తెలుసా?ఫీచర్స్ విషయానికి వస్తే హోండా ఏడీవీ 350 స్కూటర్.. ప్రీలోడ్ అడ్జస్టబుల్ రియర్ స్ప్రింగ్లు, హోండా రోడ్సింక్ స్మార్ట్ఫోన్ కనెక్టివిటీతో 5 ఇంచెస్ టీఎఫ్టీ స్క్రీన్, ఫోర్ వే టోగుల్ స్విచ్, స్టోరేజ్ కంపార్ట్మెంట్ లైట్, ఆటో క్యాన్సిలింగ్ ఇండికేటర్లు మొదలైనవి పొందుతుంది. అయితే ఈ స్కూటర్ను కంపెనీ ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేస్తుందా? లేదా? అనే విషయాన్ని వెల్లడించలేదు. -
వికీపీడియాకు పోటీగా గ్రోకీపీడియా!: మస్క్
టెస్లా అధినేత.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) వికీపీడియాకు పోటీగా.. గ్రోకీపీడియా (Grokipedia) లాంచ్ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం దీని బీటా వెర్షన్ రెండు వారాల్లో ప్రారంభమవుతుందని ఆయన తన ఎక్స్ ఖాతాలో తెలిపారు.గ్రోకీపీడియాను.. మస్క్ ఏఐ కంపెనీ ఎక్స్ఏఐ (xAI) రూపొందిస్తోంది. ''గ్రోకిపీడియా ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ఖచ్చితమైన జ్ఞాన వనరుగా మారబోతోంది'' అని ఒక ఎక్స్ యూజర్ చేసిన పోస్టుకు.. మస్క్ రిప్లై ఇచ్చారు. అయితే ఈ గ్రోకీపీడియాకు సంబంధించిన ఫీచర్లను గురించి అధికారికంగా వెల్లడించలేదు. నిజాలను వెల్లడించానికే ఈ ఫ్లాట్ఫామ్ను రూపొందిస్తున్నట్లు సమాచారం.Version 0.1 early beta of Grokipedia will be published in 2 weeks https://t.co/M6VrGv8zp5— Elon Musk (@elonmusk) October 5, 2025Exactly https://t.co/Ia38jMbJoj— Elon Musk (@elonmusk) October 5, 2025 -
మన దేశంలో మొదటి క్రెడిట్ కార్డు అందించిన బ్యాంక్ ఏదంటే?
క్రెడిట్ కార్డుల వినియోగం ఈ రోజుల్లో సర్వ సాధారణం అయిపోయింది. ఉద్యోగస్తులు మాత్రమే కాకుండా, వ్యాపారవేత్తలు సైతం వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే మనదేశంలో.. క్రెడిట్ కార్డు ఎప్పుడు ప్రారంభమైందనే విషయం బహుశా కొంతమందికి తెలియకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలను తెలుసుకుందాం.1980లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. మొదటి క్రెడిట్ కార్డును జారీ చేసింది. దీనిని సెంట్రల్ కార్డు అని పిలిచేవారు. ఇది వీసా నెట్వర్క్ కింద ఉండేది. దీన్ని బట్టి చూస్తే.. ఇండియాలో క్రెడిట్ కార్డు ప్రారంభమైన దాదాపు 45 సంవత్సరాలైందన్నమాట.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం.. ప్రస్తుతం, భారతదేశంలో 11 కోట్లకు పైగా క్రెడిట్ కార్డులు ఉన్నాయి. ఇందులో రెగ్యులర్ కార్డులు, ట్రావెల్ కార్డులు, లైఫ్ స్టైల్ కార్డులు, ఫ్యూయెల్ కార్డులు, సెక్యూర్ కార్డులు యూపీఐ కార్డులు వంటివి అనేకం ఉన్నాయి. వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా.. కావలసిన క్రెడిట్ కార్డులను ఎంచుకుంటారు.ఇదీ చదవండి: బిట్కాయిన్ సరికొత్త రికార్డ్.. ఆల్టైమ్ గరిష్టాలకు చేరిన ధరఒకప్పుడు.. పెద్ద బ్యాంకులు మాత్రమే, క్రెడిట్ స్కోర్ల ఆధారంగా క్రెడిట్ కార్డులను జారీ చేసేవి. కానీ ఇప్పుడు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వంటి చిన్న ఫైనాన్స్ బ్యాంకులు కూడా ఈ కార్డులను జారీ చేస్తున్నాయి. దీంతో క్రెడిట్ కార్డులను వినియోగించేవారి సంఖ్య బాగా పెరిగింది. -
సరికొత్త బ్రిక్స్టన్ బైక్: దీని గురించి తెలుసా?
బ్రిక్స్టన్ మోటార్ సైకిల్స్.. తన మొట్టమొదటి మిడ్-కెపాసిటీ అడ్వెంచర్ మోటార్ సైకిల్ అయిన 'స్టోర్ 500'(Storr 500)ను ఆస్ట్రియాలోని తన ప్రధాన కార్యాలయంలో అధికారికంగా ఆవిష్కరించింది. ఈ బైక్ కోసం ప్రీ-బుకింగ్లు డిసెంబర్ 2025లో ప్రారంభమవుతాయి. ఆ తరువాత డెలివరీ ఎప్పుడనే విషయాన్ని సంస్థ వెల్లడించనుంది. ముందుగా బుక్ చేసుకున్నవారికి.. ముందుగా డెలివరీలు జరుగుతాయని సంస్థ వెల్లడించింది.బ్రిక్స్టన్ స్టోర్ 500 బైక్.. 486 సీసీ లిక్విడ్-కూల్డ్, ప్యారలల్-ట్విన్ ఇంజిన్ ద్వారా 8500 ఆర్పీఎం వద్ద 47.6 బీహెచ్పీ పవర్, 6750 ఆర్పీఎం వద్ద, 43 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్బాక్స్తో లభిస్తుంది. ఈ బైక్ యూఎస్డీ ఫ్రంట్ ఫోర్క్, సెంట్రల్ రియర్ మోనోషాక్ వంటి సస్పెన్షన్ సెటప్ పొందుతుంది. డ్యూయల్ ఛానల్ ఏబీఎస్తో డిస్క్ బ్రేక్లు ఈ బైకులో ఉంటాయి.ఇదీ చదవండి: జాతీయ రహదారులపై క్యూఆర్ కోడ్ బోర్డులు: ఎందుకంటే?ఫీచర్స్ విషయానికి వస్తే.. కనెక్టివిటీ ఎంపికలతో కూడిన 5 ఇంచెస్ టీఎఫ్టీ డిస్ప్లే, ఎల్ఈడీ డీఆర్ఎల్ & ఇండికేటర్స్, ఇంటర్నల్ ఫాగ్ ల్యాంప్స్, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ మొదలైనవి ఈ బైకులో ఉన్నాయి. అయితే కంపెనీ ఈ బైకుని ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేస్తుందా?, లేదా అనేది వెల్లడించలేదు. -
బిట్కాయిన్ సరికొత్త రికార్డ్.. ఆల్టైమ్ గరిష్టాలకు చేరిన ధర
అమెరికా ప్రభుత్వ షట్డౌన్ కారణంగా.. పెట్టుబడిదారులలో ఆందోళన మొదలైంది. డాలర్ విలువ రోజురోజుకి తగ్గుముఖం పట్టింది. ఈ తరుణంలో బిట్కాయిన్ వాల్యూ ఆదివారం ఆల్టైమ్ గరిష్ట స్థాయికి చేరుకొని.. 1,25,000 డాలర్ల మార్కును దాటింది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం ఒక బిట్కాయిన్ విలువ సుమారు రూ. 1.08 కోట్లు.ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన బిట్కాయిన్ విలువ తాజాగా 1,25,689 డాలర్లకు చేరుకుంది. ఆగస్టు 14న నెలకొల్పిన 1,24,514 రికార్డును సైతం.. ఇప్పుడు అధిగమించింది. ప్రస్తుత పరిస్థితులు బిట్కాయిన్ విలువను అమాంతం పెంచే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా అమెరికా స్టాక్లలో లాభాలు, బిట్కాయిన్ లింక్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లోకి ఇన్ఫ్లోలు పెరిగాయి.ఇటీవల ప్రారంభమైన ప్రభుత్వ షట్డౌన్.. డబ్బును సురక్షితమైన ఆస్తులలో పెట్టుబడి పెట్టేలా చేసింది. మార్కెట్ వర్గాలు దీనిని 'డీబేస్మెంట్ ట్రేడ్' అని పిలుస్తున్నారు. "ఈక్విటీలు, బంగారం, పోకీమాన్ కార్డుల వంటి సేకరణలతో సహా అనేక ఆస్తులు ఆల్ టైమ్ గరిష్టాలను తాకాయి. డాలర్ విలువ తగ్గడం.. బిట్కాయిన్ విలువ పెరగడంలో ఆశ్చర్యం ఏమీ లేదు" అని క్రిప్టో ప్రైమ్ బ్రోకరేజ్ సంస్థ ఫాల్కన్ఎక్స్ మార్కెట్ల కో హెడ్ జాషువా లిమ్ అన్నారు.సాధారణంగా అక్టోబర్ నెల బిట్కాయిన్కు అనుకూలమైనది.. దీనిని "అప్టోబర్" అని మార్కెట్ నిపుణులు పిలుచుకుంటారు. గత కొన్నేళ్లుగా బిట్కాయిన్ పెరుగుతూనే ఉంది. రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదని చెబుతున్నారు.బిట్కాయిన్ పెరుగుదలపై విక్రమ్ సుబ్బురాజ్ ఏమన్నారంటే?బిట్కాయిన్ విలువ 125000 డాలర్లు దాటడం అనేది మరో మైలురాయి కాదు. గత కొంతకాలంగా దీని విలువ పెరుగుతూనే ఉంది. పరిస్థితులు కూడా బిట్కాయిన్కు అనుకూలంగా మారుతున్నాయి. దీనికి కారణం రికార్డు స్థాయిలో పెట్టుబడులు రావడం, పెరుగుతున్న సంస్థాగత భాగస్వామ్యం.. స్థిరమైన డిమాండ్ అని జియోటస్ సీఈవో విక్రమ్ సుబ్బురాజ్ అన్నారు. అంతే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులకు బిట్కాయిన్ ఒక ప్రత్యేక ఆస్తి అని కూడా ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: రష్మికతో ఎంగేజ్మెంట్.. విజయ్ దేవరకొండ నెట్వర్త్ ఎంతో తెలుసా? -
రెనోలో 3000 మంది బయటకు!: కారణం ఇదే..
ప్రముఖ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్.. ప్రపంచవ్యాప్తంగా 3,000 మంది ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమవుతోంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ తొలగింపులకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.రెనాల్ట్ కంపెనీ.. హెచ్ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్ విభాగాల్లో ఉద్యోగులను తొలగించనుంది. మొత్తం మీద సంస్థ తన మొత్తం ఉద్యోగులలో 15 శాతం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ తొలగింపులు సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు.. ప్రపంచవ్యాప్తంగా ఇతర ప్రదేశాలలో కూడా ఉన్నాయి. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగానే కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.రెనాల్ట్ కంపెనీ 2024 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 98,636 మంది సిబ్బందిని నియమించింది. ''ఆటోమోటివ్ మార్కెట్లోని అనిశ్చితులు.. పోటీ వాతావరణం దృష్ట్యా, మా కార్యకలాపాలను సరళీకృతం చేయడానికి తగిన మార్గాలను పరిశీలిస్తున్నాము. ఇందులో భాగమని లేఆఫ్స్ కూడా చేయడానికి చూస్తున్నట్లు'' రెనాల్ట్ ప్రతినిధి పేర్కొన్నారు.ఇదీ చదవండి: జాతీయ రహదారులపై క్యూఆర్ కోడ్ బోర్డులు: ఎందుకంటే?రెనాల్ట్ జూలై ఆర్థిక నివేదిక ప్రకారం.. కంపెనీ ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో 11.2 బిలియన్ యూరోల (13 బిలియన్ డాలర్లు) నష్టాన్ని చవిచూసింది. ఇందులో భాగస్వామి నిస్సాన్పై కూడా 9.3 బిలియన్ యూరోల నష్టం ఉంది. కంపెనీ నికర ఆదాయం కూడా 461 మిలియన్ యూరోలకు తగ్గిపోయింది. ఖర్చులు పెరగడం.. పెరుగుతున్న పోటీ వాతావరణం నుంచి ఉత్పన్నమయ్యే వాణిజ్య ఒత్తిళ్లు ఈ తగ్గుదలకు కారణమని సమాచారం. -
హైదరాబాద్ అపార్ట్మెంట్లలో ‘పార్కింగ్’ దందా..
‘గ్రోహె–హురన్ ఇండియా రియల్ ఎస్టేట్ రిచ్ లిస్ట్లో చోటు సంపాదించుకున్న నగరానికి చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఇది. హైదరాబాద్లోని ఓ ప్రాజెక్ట్లో ద్విచక్ర వాహనం కోసం కేటాయించిన పార్కింగ్ స్థలాన్ని.. కార్గా ఏమార్చి కొనుగోలుదారునికి విక్రయించి సొమ్ము చేసుకుంది. భవన నిర్మాణ అనుమతి పత్రంలో బైక్ పార్కింగ్ స్థలాన్ని డ్రాయింగ్లో కారు బొమ్మగా మార్చారని ఆరోపిస్తూ ఓ ఫిర్యాదుదారుడు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ–రెరా)ను ఆశ్రయించాడు. ఫిర్యాదు స్వీకరించిన టీజీ–రెరా అప్రూవల్ ప్లాన్ను తప్పనిసరిగా అనుసరించాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు’.. గృహ కొనుగోలుదారులకు పార్కింగ్ స్థలం విక్రయంలో పేరు మోసిన నిర్మాణ సంస్థ తీరే ఇలా ఉంటే చిన్నాచితక డెవలపర్ల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమధ్య కాలంలో బిల్డర్ల అక్రమ పార్కింగ్ విక్రయాలపై టీజీ–రెరాకు కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులు వస్తున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోజీవో నంబరు 168 ప్రకారం 2 వేల గజాలపైన నిర్మించే నివాస భవన నిర్మాణాలలో 33 శాతం బిల్టప్ ఏరియాను పార్కింగ్కు కేటాయించాలి. ఇందులో 30 శాతం ఆ భవనంలోని నివాసితులకు, 3 శాతం సందర్శకుల కోసం కేటాయించాల్సి ఉంటుంది. అలాగే వాణిజ్య భవన నిర్మాణాలలో అయితే 44 శాతం బిల్టప్ ఏరియాను పార్కింగ్కు కేటాయించాల్సి ఉంటుంది. ఇందులో 40 శాతం రిటైల్ స్టోర్లకు, 4 శాతం సందర్శకులకు కేటాయించాలి. 2.5/4.5 మీటర్ల పొడవు, వెడల్పుతో కారు పార్కింగ్ను కేటాయించాలి. దీనికంటే తక్కువ ఉండకూడదు. కానీ, ప్రస్తుతం ఈ నిబంధనలను తూ.చ. తప్పకుండా అనుసరించే డెవలపర్లు చాలా తక్కువే.లాటరీ పద్ధతిలో పార్కింగ్ ప్లేస్.. ఏ గృహ కొనుగోలుదారుడికి ఎక్కడ పార్కింగ్ ప్లేస్ కేటాయించాలనే అంశంపై కూడా నిబంధనలు ఉన్నాయి. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్(ఓసీ) వచ్చిన మూడు నెలలలోపు అసోసియేషన్ ఏర్పాటు కావాలి. నివాసితులకు పార్కింగ్ ప్లేస్ల కేటాయింపు కోసం ఆఫీస్ బేరర్స్ సమక్షంలో లాటరీ పద్ధతిలో కేటాయించాలి. 600 గజాలలోపు నిర్మించే స్టిల్ట్+5 అంతస్తుల భవనాలకైతే డీమ్డ్ టు సాటిస్ఫై ఉంటుంది. బహుళ అంతస్తుల భవనాలలో అక్రమ పార్కింగ్ విక్రయాలపై సమస్యలు ఎక్కువగా జరుగుతుంటాయి.టీడీఆర్తోనూ పార్కింగ్ సమస్యలే.. సాధారణంగా డెవలపర్లు అనుమతి ఉన్న దాని కంటే అదనంగా పార్కింగ్ ప్లేస్లను విక్రయిస్తుంటారు. ఉదాహరణకు అప్రూవల్ డ్రాయింగ్లో 450 కార్ల పార్కింగ్ ప్లేస్లకు అనుమతి లభిస్తే.. 600ల పార్కింగ్ ప్లేస్లుగా మార్చి విక్రయిస్తుంటారు. డిమాండ్ను బట్టి ఒక్కో కారు పార్కింగ్ను రూ.1–5 లక్షల చొప్పున అమ్ముకుంటుంటారు. కొందరు డెవలపర్లు స్టిల్+4 అంతస్తులకు నిర్మాణ అనుమతులు తీసుకొని, ఆ తర్వాత ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్స్(టీడీఆర్) తీసుకొని ఇంకో అంతస్తు నిర్మిస్తున్నారు. 400 గజాల్లో 8 అపార్ట్మెంట్లు వస్తే.. టీడీఆర్ తీసుకొని ఇంకో అదనపు అంతస్తులో రెండు ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. దీంతో యూనిట్ల సంఖ్య పెరిగి, పార్కింగ్ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి.డ్రైవ్ వేలు కూడా పార్కింగ్గానే.. ఆరు నెలల్లో 10–12 అక్రమ పార్కింగ్ విక్రయ ఫిర్యాదులే వచ్చాయి. కొందరు డెవలపర్లు డ్రైవ్ వేలను కూడా పార్కింగ్ ప్లేస్గా మార్చి విక్రయిస్తున్నారు. ఈ తరహా ఫిర్యాదులలో అప్రూవ్డ్ డ్రాయింగ్ ప్లాన్ను తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నాం. – కే.శ్రీనివాసరావు, సభ్యులు, టీజీ–రెరా -
ఈ దీపావళికి బంగారం కొనడం మరింత కష్టం!
దీపావళి సమీపిస్తున్న కొద్దీ, బంగారం, వెండి ధరలు చారిత్రాత్మక గరిష్టాలకు చేరుకుంటున్నాయి. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, పండుగ డిమాండ్, సెంట్రల్ బ్యాంక్ విధానాల వల్ల పసిడి ధరలు మరింత పెరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో బంగారం ధరలు (gold price) ఇప్పటికే 10 గ్రాములకు రూ .1,18,000 దాటగా, వెండి కిలోకు రూ .1,44,000 దాటింది. దీపావళి రోజు అంటే అక్టోబర్ 21 నాటికి బంగారం రూ .1.22 లక్షలు, వెండి (silver price)రూ .1.50 లక్షలకు చేరుకుంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఆజ్యం పోస్తున్న ప్రపంచ పోకడలుఅంతర్జాతీయంగా, బంగారం ఔన్స్ కు 3950– 4000 డాలర్లకు చేరుకుంటుందని, అలాగే వెండి ఔన్స్ కు 49– 50 డాలర్లకు పెరుగుతుందని అంచనా. ఈ ధరల వేగానికి విశ్లేషకులు చెబుతున్న కారణాలు.. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ డోవిష్ (తక్కువ వడ్డీ రేట్లు, వృద్ధికి ప్రాధాన్యం) వైఖరి, బలహీనపడుతున్న అమెరికన్ డాలర్, బలమైన ఈటీఎఫ్ ఇన్ఫ్లోలు, భారతదేశ పండుగ, వివాహ సీజన్ల నుండి బలమైన డిమాండ్.వెండికి పారిశ్రామిక డిమాండ్ సౌరశక్తి, ఎలక్ట్రిక్ వాహనాలు, గ్రీన్ టెక్నాలజీస్ వంటి రంగాల నుండి పెరుగుతున్న పారిశ్రామిక డిమాండ్ కూడా వెండి ర్యాలీకి మద్దతు ఇస్తోంది. సరఫరా పరిమితులు, రూపాయి విలువ తరుగుదల మరింత ఊపందుకుంటోంది.ఇదీ చదవండి: ఆశ పెట్టి అంతలోనే.. ఒక్కసారిగా కొత్త రేట్లకు పసిడి, వెండి -
చిన్న బిజినెస్.. పెద్ద మ్యాజిక్!
నేటి రోజుల్లో చిన్న చిన్న వ్యాపార యజమానులందరూ సులభంగా, వేగంగా, సురక్షితంగా పని చేయాలనుకుంటే, ఒక్కసారి ఈ స్మార్ట్ టూల్స్ ప్రయత్నించాల్సిందే!పేపర్ ప్లస్ డిజిటల్ మ్యాజిక్ఒకప్పుడు నోట్స్ రాస్తే కేవలం కాగితాలకే పరిమితం అయ్యేది. ఒక్క కాగితం మిస్ అయినా, రాసిన మాట, గీసిన డ్రాయింగ్ అంతా మాయం అవుతుంది. ఇప్పుడు ‘హుయిన్ డిజిటల్ నోట్బుక్’తో ఆ భయం పూర్తిగా తొలగింది. ఇది కేవలం ఒక నోట్బుక్ కాదు, పేపర్ ప్లస్ డిజిటల్ టాబ్లెట్. ఇందులో రాసిన ప్రతి అక్షరం, గీసిన ప్రతి లైన్ వెంటనే మీ డివైస్లో స్టోర్ అవుతుంది. ఆడియో రికార్డ్ ఫీచర్తో, మీ వాయిస్ కూడా నోట్స్తో కలిసి రికార్డ్ అవుతుంది. ఒక్క క్లిక్తో షేర్ చేసుకోవచ్చు కూడా. పేజీలను మిళితం చేయడం, విడగొట్టడం చాలా సులభం. ముఖ్యమైన విషయాలను హైలైట్ చేయడానికి సులభమైన టూల్స్ కూడా ఉన్నాయి. ధర రూ. 7,105 ల ప్యాక్లో ఒక హుయిన్ నోట్, ఏ ఐ నోట్ ప్యాడ్, యూఎస్బీ కేబుల్, మాగ్నెటిక్ పెన్ స్లీవ్, రీఫిల్స్, ప్లాస్టిక్ పెన్ నిబ్స్, మార్గదర్శక పుస్తకంతో వస్తుంది.ఒక్క కార్డు చాలు! ఒకప్పుడు పాత పేపర్ విజిటింగ్ కార్డ్ అంటే స్టేటస్ సింబల్. ‘ఇదిగో నా కార్డ్’ అంటూ ఇచ్చేసి స్టయిల్ కొట్టేవాళ్లు. కాని, నిజం చెప్పాలంటే ఆ కార్డుల ఫ్యూచర్ బాగుండేది కాదు. రోజుల తరబడి జేబులో మురిగి, కాఫీ కప్పుల కింద నలిగి, చివరికి ఏ డస్ట్బిన్లోనో ఎండ్ అయ్యేది. అలాంటప్పుడు వాటికోసం అనవసరంగా ఖర్చు ఎందుకు చేయటం. కేవలం, ఒక్క టాప్తోనే మీ పేరు, నంబర్, వెబ్సైట్, సోషల్ మీడియా అన్నీ ఎదుటివారి మొబైల్లో బజ్ అయ్యే మాయ చేస్తుంది ఈ ‘టాప్మో స్మార్ట్ బిజినెస్ కార్డ్’. ఇందులో చిన్న లోగో, క్యూ ఆర్ కోడ్, లైఫ్టైమ్ వాలిడిటీ అన్నీ రెడీ! యాప్ డౌన్లోడ్ అనే తలనొప్పి లేదు, ‘కార్డులు అయిపోయాయి’ అనే టెన్షన్ లేదు. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవచ్చు కూడా. ధర కేవలం రూ. 599 మాత్రమే!పోర్టబుల్ సర్వర్స్మాల్ బిజినెస్ ఓనర్స్కు కస్టమర్ డేటా, ఫైనాన్స్ రికార్డులు, ప్రాజెక్ట్ ఫైల్స్ అన్నీ రక్షించుకోవాలంటే పెద్ద సర్వర్ అవసరమా? లేనే లేదు! బిజినెస్ డీటైల్స్ అన్నీ ఒకే చోట, సురక్షితంగా ఉంచాలంటే ‘అప్రికార్న్ ఏజిస్ ప్యాడ్లాక్’ బెస్ట్ ఆప్షన్. 480 జీబీ స్టోరేజ్, 256–బిట్ ఎన్క్రిప్షన్, రగ్డ్ బాడీ, టూ స్టెప్ వెరిఫికేషన్తో ఏ ఫైల్ అయినా సేఫ్గా స్టోర్ చేస్తుంది. ఇది కేవలం స్టోరేజ్ సర్వర్ మాత్రమే కాదు, చిన్న బిజినెస్కి నమ్మకమైన డేటా గార్డు. ఆఫీస్లోనైనా, ఇంట్లోనైనా, ట్రావెల్లోనైనా సులభంగా ఉపయోగించవచ్చు. చిన్న, పోర్టబుల్ బాడీతో జేబులోనైనా పెట్టుకుని క్యారీ చేయవచ్చు. ఏకకాలంలో డేటా యాక్సెస్, బ్యాకప్, షేర్ అన్నీ సులభం. ధర రూ. 49,325. -
ఫాస్టాగ్ లేకపోతే డబుల్ ఛార్జ్..
జాతీయ రహదారులపై వెళ్లే వాహనదారులు తమ వాహనాలకు ఫాస్టాగ్ (FASTag) లేకపోతే డబుల్ ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. ఫంక్షనల్ ఫాస్టాగ్లు లేని వాహనాలు లావాదేవీలో నగదును ఉపయోగిస్తే రెట్టింపు రుసుము చెల్లించాలి. అదే యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) ద్వారా చెల్లిస్తే వినియోగదారు రుసుముకు 1.25 రెట్లు మాత్రమే వసూలు చేస్తారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడంతోపాటు జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద నగదు లావాదేవీలను తగ్గించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.సవరించిన జాతీయ రహదారుల రుసుము (రేట్లు, వసూళ్ల నిర్ణయం) నిబంధనలు, 2008 ప్రకారం.. చెల్లుబాటు అయ్యే, ఫంక్షనల్ ఫాస్టాగ్ లేకుండా ఫీజు ప్లాజాలోకి ప్రవేశించే వాహనాలు యూపీఐ (UPI) ద్వారా చెల్లింపును ఎంచుకుంటే ఆ వాహన కేటగిరికి వర్తించే వినియోగదారు రుసుము కంటే 1.25 రెట్లు మాత్రమే వసూలు చేస్తారని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది.కొత్త ఫీజుల విధానం నవంబర్ 15 నుండి అమల్లోకి వస్తుంది. "ఈ సవరణ ఫీజు వసూలు ప్రక్రియను బలోపేతం చేయడం, టోల్ వసూలులో పారదర్శకతను పెంచడంతోపాటు జాతీయ రహదారి వినియోగదారులకు ప్రయాణ సౌలభ్యాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది" అని రోడ్డు రవాణా శాఖ పేర్కొంది. -
తెగ అప్పులిచ్చేసిన బ్యాంకులు.. హెచ్డీఎఫ్సీ బ్యాంకుదే జోరు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో బ్యాంకుల రుణ వితరణ (Bank loans) గణనీయంగా పెరిగింది. రెండో త్రైమాసికంలో ప్రైవేట్ రంగ హెచ్డీఎఫ్సీ బ్యాంకు (HDFC Bank ) రుణాలు 9 శాతం పెరిగి రూ. 27.9 లక్షల కోట్లకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు క్రెడిట్ బుక్ రూ. 25.6 లక్షల కోట్లుగా నమోదైంది.మరోవైపు, కోటక్ మహీంద్రా బ్యాంక్లో రుణ వృద్ధి 15.8 శాతంగా నమోదైంది. రుణాల పరిమాణం రూ. 3.99 లక్షల నుంచి రూ. 4.62 లక్షల కోట్లకు ఎగిసింది. ఇక ఐడీబీఐ బ్యాంకు రుణాలు 15 శాతం పెరిగి రూ. 2 లక్షల కోట్ల నుంచి రూ. 2.3 లక్షల కోట్లకు చేరాయి. మొత్తం వ్యాపారం 12 శాతం పెరిగింది.రూ. 4.78 లక్షల కోట్ల నుంచి రూ. 5.33 లక్షల కోట్లకు ఎగిసింది. అటు క్యూ2లో యూకో బ్యాంక్ మొత్తం వ్యాపారం 13 శాతం పెరిగి రూ. 5.37 లక్షల కోట్లకు చేరింది. మొత్తం రుణాలు 16.67 శాతం వృద్ధి చెంది రూ. 1.98 లక్షల కోట్ల నుంచి రూ.2.31 లక్షల కోట్లకు చేరాయి. -
ఇక ఫోకస్ అంతా 6జీపైనే.. 8 నుంచి ఇండియా మొబైల్ కాంగ్రెస్
ఈ నెల 8 నుంచి 11 వరకు న్యూఢిల్లీలో నిర్వహించే ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2025 సదస్సులో ప్రధానంగా 6జీ వ్యవస్థను అభివృద్ధి చేయడం, భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకోవడంపై దృష్టి పెట్టనున్నారు. విశ్వసనీయ భాగస్వామిగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన భారత్, 6జీ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించగలదని డిజిటల్ టెక్నాలజీ ప్లాట్ఫాం ఐఎంసీ సీఈవో పి. రామకృష్ణ తెలిపారు.’6జీ వ్యవస్థకు ప్రధానమైన అంశాలను అనుసంధానం చేయగలిగే కీలక ప్లాట్ఫాంగా ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఎదుగుతోంది. ఇందులో భారత్తో పాటు యూరప్, బ్రిటన్, అమెరికా, జపాన్, దక్షిణ కొరియా తదితర దేశాల నుంచి పరిశ్రమకు చెందిన సీనియర్ నేతలు, నిపుణులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు’ అని ఆయన పేర్కొన్నారు. 6జీ సిపోజియంలో టెక్నాలజీ దిగ్గజాలతో పాటు ఐఐటీ, అంతర్జాతీయ యూనివర్సిటీల్లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల నుంచి విద్యావేత్తలు పాల్గోనున్నారు.6జీకి సంబంధించిన టెక్నాలజీలు, కృత్రిమ మేథ నెట్వర్క్లు, స్పెక్ట్రం క్రమబద్ధీకరణ తదితర అంశాలపై అత్యున్నత స్థాయిలో చర్చలు జరపనున్నట్లు రామకృష్ణ చెప్పారు. 7,000 మంది పైగా గ్లోబల్ ప్రతినిధులు, 800 మంది వక్తలు, 150 దేశాల నుంచి 400 మంది ఎగ్జిబిటర్లు ఇందులో పాల్గొంటారని అంచనా. 6జీ గ్లోబల్ రేసుకు భారత్ సారథ్యం వహించనుందని సెల్యులార్ ఆపరేటర్స్ సమాఖ్య సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచ్చర్ తెలిపారు.ఏఐ, జెన్ఏఐ టెక్నాలజీల్లో భారతీయ డిజిటల్ ఆవిష్కరణలు, దేశీయంగా టెలికం రంగాన్ని సరికొత్తగా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. 5జీ విస్తరణ, 6జీ సన్నద్ధతకు 6 గిగాహెట్జ్ బ్యాండ్ను సమర్ధవంతంగా కేటాయించడం కీలకంగా ఉంటుందని వివరించారు. -
పునాది నుంచే పొదుపు.. తక్కువ ఖర్చుతో సొంతిల్లు
గత దశాబ్దంలో గృహ నిర్మాణ వ్యయం (house construction) రెండింతలు పెరిగింది. ముఖ్యంగా పునాది నిర్మాణంలో అవసరమైన మెటీరియల్స్ (construction material) ధరలు గణనీయంగా పెరిగాయి. సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు సొంతిల్లు కలను నెరవేర్చుకోవాలంటే ఖర్చులు తగ్గించుకోవడం తప్పనిసరైంది.ఈ నేపథ్యంలో, సంప్రదాయ మెటీరియల్స్కు ప్రత్యామ్నాయంగా చౌకగా, మన్నికగా, పర్యావరణ హితంగా ఉండే కొత్త మేటీరియల్స్ ఇప్పుడు మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయి. తక్కువ ఖర్చుతోనే నిర్మాణ నాణ్యతను కోరుకునే వారికి ఇవి వరంగా మారుతున్నాయి.మెటీరియల్సంప్రదాయ ఎంపికలుకొత్త/చౌకైన ప్రత్యామ్నాయాలువిశేషాలుసిమెంట్ఓపీసీ, పీపీసీజియోపాలిమర్ సిమెంట్, స్లాగ్ బేస్డ్ సిమెంట్తక్కువ ఉద్గారాలు, శాశ్వతత ఎక్కువఇసుకనది ఇసుకఎం-సాండ్, రోబో సాండ్తక్కువ ధర, నది పరిరక్షణరాళ్లు20ఎంఎం, 40ఎంఎం మిక్స్రీసైకిల్ అగ్రిగేట్వ్యర్థాలను ఉపయోగించి తయారీస్టీల్ (TMT)Fe500, Fe550బసాల్ట్ రీబార్తక్కువ బరువు, తక్కువ ఖర్చు, ఎక్కువ సంవత్సరాలు మన్నికబీమ్ & ఫౌండేషన్సైట్లలో తయారు చేసే బీమ్లుప్రికాస్ట్ ఫౌండేషన్ బ్లాక్స్వేగంగా నిర్మాణం, శ్రమ ఆదాకొత్తగా అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీలు, మెటీరియల్స్రోబో సాండ్ – ఇసుకకు ఉత్తమ ప్రత్యామ్నాయం* మేనుఫ్యాక్చర్డ్ శాండ్ (M-Sand) కన్నా మెరుగైన గుణాత్మకత కలిగిన రోబో సాండ్, హైదరాబాద్, సంగారెడ్డి, విజయవాడ ప్రాంతాల్లో సులభంగా అందుబాటులో ఉంది.* ధర నది ఇసుక కంటే 25-30% తక్కువ.* గృహ నిర్మాణానికి సరైన పైనెస్ మోడ్యూలస్ (Fineness modulus) కలిగి ఉంటుంది.జియోపాలిమర్ సిమెంట్ – పర్యావరణ హితమైన కొత్త పరిష్కారం* జియోపాలిమర్ సిమెంట్ తయారీలో లైమ్ వినియోగం తక్కువగా ఉంటుంది.* OPC కంటే 60% తక్కువ కార్బన్ ఉద్గారాలు విడుదల చేస్తుంది.* పునాది స్థాయిలోనే గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ను అమలుపరచవచ్చు.ప్రికాస్ట్ బ్లాక్స్ – వేగంగా నిర్మాణం* ఫౌండేషన్, పిలర్స్, వాల్ సెక్షన్లను ముందే తయారు చేసి సైటులో ఫిక్స్ చేయడం వల్ల నిర్మాణ వ్యయం తగ్గుతుంది.* ఒక సాధారణ 1000 చ.అ. ఇంటికి 15 రోజుల పని, 5–6 రోజుల్లో పూర్తవుతుంది.బసాల్ట్ రీబార్ – స్టీల్కు ఆధునిక ప్రత్యామ్నాయం* బసాల్ట్ ఫైబర్తో తయారవుతుంది.* తక్కువ బరువు, తక్కువ ఖర్చు.* తేమ, ఉప్పు వల్ల తుడుపుకు గురికాకపోవడం దీని ప్రత్యేకత.నిర్మాణ ఖర్చు తగ్గాలంటే.. ఇంజినీర్లు, నిపుణుల సలహాలు* స్థలానికి దగ్గరగా లభించే మెటీరియల్స్ను ప్రాధాన్యత ఇవ్వాలి.* పునాది నిర్మాణానికి ముందు సైట్ సొయిల్స్ టెస్టింగ్ తప్పనిసరిగా చేయించాలి. తద్వారా అవసరమైన మెటీరియల్స్ను సరిగ్గా అంచనా వేయవచ్చు.* సామూహిక కొనుగోలు లేదా గ్రామీణ కాంట్రాక్టర్లతో పనిచేయడం ద్వారా మెటీరియల్ ధరకులను తగ్గించవచ్చు.* ప్రికాస్ట్ టెక్నాలజీని అనుసరించడం వల్ల పని వేగంగా పూర్తవుతుంది, లేబర్ ఖర్చు తగ్గుతుంది.చివరగా..పునాది నుంచే చౌకగా, మన్నికగా, పర్యావరణహితంగా నిర్మించగలిగితే ఇంటి మొత్తం నిర్మాణ వ్యయం మీద సగటున 15 నుంచి 20 శాతం వరకు ఆదా చేయవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: ఇల్లు కొనేవాళ్లకు డబుల్ ధమాకా.. -
డీమార్ట్ ఆదాయం జంప్.. 3 నెలల్లో ఎన్ని వేల కోట్లు వచ్చాయంటే..
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో డీమార్ట్ మాతృ సంస్థ అవెన్యూ సూపర్మార్ట్స్ ఆదాయం రూ. 16,219 కోట్లుగా (స్టాండెలోన్) నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నమోదైన రూ. 14,050 కోట్లతో పోలిస్తే 15 శాతం పెరిగింది. త్రైమాసికాలవారీగా క్యూ1లో నమోదైన రూ. 15,932 కోట్లతో పోలిస్తే 1.8 శాతం వృద్ధి చెందినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో కంపెనీ పేర్కొంది.2025 సెప్టెంబర్ ఆఖరు నాటికి మొత్తం స్టోర్స్ సంఖ్య 432గా ఉంది. స్టాండెలోన్, కన్సాలిడేటెడ్ ఫలితాలను ఆమోదించేందుకు అక్టోబర్ 11న కంపెనీ బోర్డు మసావేశం కానుంది. ఆంధ్రపద్రేశ్, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో డీమార్ట్కి కార్యకలాపాలు ఉన్నాయి. -
హైదరాబాద్లో హార్ట్ఫోర్డ్ టెక్నాలజీ సెంటర్
హైదరాబాద్: అమెరికాకు చెందిన బీమా సేవల సంస్థ ది హార్ట్ఫోర్డ్ తాజాగా హైదరాబాద్లో తమ ఇండియా టెక్నాలజీ సెంటర్ను ప్రారంభించింది. కొత్త ఆవిష్కరణలకు ఊతమిచ్చేలా అధునాతన వర్క్స్టేషన్లు, శిక్షణా సదుపాయాలు మొదలైన ప్రత్యేకతలతో దీన్ని రూపొందించినట్లు సంస్థ తెలిపింది. డిజిటల్, కృత్రిమ మేథ సామర్థ్యాలను పటిష్టం చేసుకునేందుకు ఇది తోడ్పడుతుందని చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ శేఖర్ పన్నాల తెలిపారు.సుశిక్షితులైన టెక్నాలజీ నిపుణుల లభ్యత, గ్లోబల్ ఇన్నోవేషన్ కేంద్రంగా హైదరాబాద్ పేరొందిన నేపథ్యంలో నగరాన్ని ఎంచుకున్నట్లు చీఫ్ డేటా, ఏఐ, ఆపరేషన్స్ ఆఫీసర్ జెఫ్ హాకిన్స్ తెలిపారు. దాదాపు 200 ఏళ్ల పైగా చరిత్ర గల ది హార్ట్ఫోర్డ్కి ప్రపంచవ్యాప్తంగా 19 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. అమెరికాలోని హార్ట్ఫోర్డ్, షికాగో తదితర ప్రాంతాల్లో టెక్నాలజీ కేంద్రాలు ఉన్నాయి. -
జొమాటో డెలివరీ సిబ్బందికి హెచ్డీఎఫ్సీ పెన్షన్
న్యూఢిల్లీ: జొమాటో, హెచ్డీఎఫ్సీ పెన్షన్ మధ్య భాగస్వా మ్యం కుదిరింది. జొమాటో డెలివరీ భాగస్వాములకు ‘ఎన్పీఎస్ ప్లాట్ఫామ్ వర్కర్స్మోడల్’ను హెచ్డీఎఫ్సీ పెన్షన్ ఆఫర్ చేయనుంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దీన్ని కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రారంభించారు.‘‘ప్లాట్ఫామ్ ప్రారంభించిన 72 గంటల్లోనే 30,000 మందికి పైగా డెలివరీ భాగస్వాములు శాశ్వత రిటైర్మెంట్ ఖాతా నంబర్లను (ప్రాన్) తీసుకున్నారు. లక్ష మందికి పైగా డెలివరీ భాగస్వాములకు ఎన్పీఎస్ సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నాం’’అని జొమాటో ప్రకటించింది. -
బ్యాంకులకు డిపాజిట్ సవాళ్లు
ముంబై: ఫిక్స్డ్ డిపాజిట్లలో క్షీణత, కరెంట్–సేవింగ్స్ ఖాతా డిపాజిట్లు (కాసా) తగ్గుదలతో బ్యాంక్లు మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి సవాళ్లను ఎదుర్కోనున్నట్టు రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. గృహ పొదుపులు అధిక రాబడులను ఆకాంక్షిస్తూ క్యాపిటల్ మార్కెట్లకు మళ్లుతుండడంతో బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గిపోతున్నాయంటూ కొంత కాలంగా ఆందోళనలు నెలకొనడం తెలిసిందే. వ్యవస్థ పరిణతిలో భాగంగా ఇలాంటి పరిణామం చూస్తున్నట్టు నిపుణుల అభిప్రాయంగా ఉంది. ‘‘టర్మ్ డిపాజిట్లు, కాసా నిష్పత్తిలో గృహాల వాటా తగ్గుతోంది. డిపాజిట్ కూర్పులో నిర్మాణాత్మక మార్పును ఇది సూచిస్తోంది. డిపాజిట్ స్థిరత్వానికి ఇది సవాలుగా మారొచ్చు. మధ్య కాలం నుంచి దీర్ఘకాలంలో బ్యాంకుల నిధుల వ్యయాలపైనా ప్రభావం చూపిస్తుంది. 2025 మార్చి నాటికి బ్యాంకుల డిపాజిట్లలో గృహాల వాటా 60 శాతానికి తగ్గింది. 2020 మార్చి నాటికి ఇది 64 శాతంగా ఉంది’’అని క్రిసిల్ నివేదిక వివరించింది. డిపాజిట్లలో వృద్ధి బ్యాంకులకు ఎంతో కీలకమని, స్థిరత్వం, వ్యయాలను ఇది ప్రభావితం చేయగలదని పేర్కొంది. రానున్న కాలంలో బ్యాంక్ డిపాజిట్లలో గృహాల వాటా మరింత తగ్గుతుందని అంచనా వేసింది. పెరుగుతున్న ఆర్థికేతర సంస్థల వాటా ఆర్థికేతర సంస్థలు తమ వాటా పెంచుకుంటున్నట్టు క్రిసిల్ డైరెక్టర్ శుభ శ్రీనారాయణన్ ఎత్తిచూపుతూ.. కార్పొరేట్ డిపాజిటర్లు రేటుకు సున్నితంగా ఉంటారని, వారు స్వల్పకాలానికి ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పారు. ‘‘నగదు లభ్యత పరిస్థితులు (లిక్విడిటీ) కఠినంగా ఉన్నప్పుడు ఈ తరహా పరిస్థితుల్లో మరిన్ని డిపాజిట్లు బయటకు వెళ్లిపోతాయి. దీంతో బ్యాంకులకు నిధుల వ్యయాలు పెరుగుతాయి. భవిష్యత్తులో ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనాలు మరింత ఆదరణకు నోచుకుంటాయి. దీంతో బ్యాంకు డిపాజిట్లలో గృహాల వాటా మరింత తగ్గుతుంది’’అని నారాయణన్ వివరించారు. బ్యాంకులకు సేవింగ్స్, కరెంటు ఖాతాల్లోని డిపాజిట్లపై వ్యయాలు చాలా తక్కువగా ఉంటాయన్న విషయం తెలిసిందే. సేవింగ్స్ ఖాతాల్లోని డిపాజిట్లపై 3 శాతం వరకు బ్యాంకులు వడ్డీ కింద చెల్లిస్తుంటాయి. ఇక కరెంటు ఖాతా డిపాజిట్లపై ఎలాంటి వడ్డీని ఇవ్వవు. దీంతో వాటికి తక్కువ వ్యయాలకు పెద్ద మొత్తంలో నిధులు సమకూరుతుంటాయి. అందుకే బ్యాంకుల వృద్ధికి కాసా డిపాజిట్లను కీలకంగా పరిగణిస్తుంటారు. 2025 జూన్ చివరికి బ్యాంకుల కాసా డిపాజిట్ల నిషపత్తి 36 శాతానికి తగ్గిపోయినట్టు క్రిసిల్ నివేదిక తెలిపింది. 2022 మార్చిలో నమోదైన 42 శాతం చారిత్రక గరిష్ట స్థాయి నుంచి తగ్గుముఖం పట్టడాన్ని ప్రస్తావించింది. ముఖ్యంగా సేవింగ్స్ డిపాజిట్లు తగ్గుముఖం పడుతున్నట్టు పేర్కొంది. ఇటీవలి కాలంలో బ్యాంకులు సేవింగ్స్ డిపాజిట్లపై రేట్లను తగ్గించడం దీన్ని మరింత వేగవంతం చేస్తుందని అంచనా వేసింది. సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీని ఎస్బీఐ సహా పలు ప్రముఖ బ్యాంకులు ఇటీవల 2.5 శాతానికి తగ్గించడం గమనార్హం. లిక్విడిటీ పెంపు దిశగా ఆర్బీఐ పలు చర్యలు తీసుకున్నందున సమీప కాలానికి ఈ డిపాజిట్లు స్థిరంగా వృద్ధి చెందాల్సి ఉందని క్రిసిల్ నివేదిక పేర్కొంది. -
బ్యూటీ బ్రాండ్స్లోకి పెట్టుబడుల జోరు..
న్యూఢిల్లీ: గ్లోబల్ బ్రాండ్స్ భారత మార్కెట్లోకి విస్తరిస్తున్నప్పటికీ, దేశీ ఆన్లైన్ డైరెక్ట్–టు–కన్జూమర్ (డీ2సీ) సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ బ్రాండ్స్లోకి కూడా భారీగా పెట్టుబడులు వెల్లువెత్తున్నాయి. 20 అగ్రగామి డీ2సీ బ్రాండ్స్లోకి గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది (జనవరి–సెప్టెంబర్ మధ్య కాలంలో) ఇన్వెస్ట్మెంట్స్ 7 శాతం పెరిగాయి. సుమారు 63.1 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 560 కోట్లు) పైగా వచ్చినట్లు బిజినెస్ ఇంటెలిజెన్స్ సంస్థ ట్రాక్షన్ డేటాలో వెల్లడైంది. 2020లో నమోదైన 21.6 మిలియన్ డాలర్లతో పోలిస్తే పెట్టుబడులు సుమారు మూడు రెట్లు ఎగియడం గమనార్హం. ఫండింగ్ సమకూర్చుకున్న సంస్థల్లో షుగర్ కాస్మెటిక్స్, ఇన్నోవిస్ట్, ఫే బ్యూటీ, రెనీ కాస్మెటిక్స్లాంటివి ఉన్నాయి. బ్యూటీ కేటగిరీలో పెట్టే పెట్టుబడులపై సగటున 10 నుంచి 25 రెట్లు రాబడులు వస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఈ విభాగంలో మార్జిన్లు అధికంగా ఉండటం, మూలధనాన్ని సమర్ధంగా వినియోగించుకునేందుకు అవకాశం ఉండటమే ఇందుకు కారణమని పేర్కొన్నాయి. ప్రీమియం ఉత్పత్తులకి, వినియోగానికి గణనీయంగా డిమాండ్ నెలకొనడం ఈ కేటగిరీకి సానుకూలాంశమని, ఇతరత్రా మిగతా ఏ కేటగిరీల్లోనూ ఇలాంటి పరిస్థితి లేదని వివరించాయి. ఫాక్స్టేల్కి 30 మిలియన్ డాలర్లు.. ఆర్ఏఎస్ లగ్జరీ స్కిన్కేర్ సంస్థ ఈ ఏడాది యూనిలీవర్ వెంచర్స్ నుంచి 5 మిలియన్ డాలర్లు, ఆయుర్వేదిక్ బ్యూటీ బ్రాండ్ ఇండి వైల్డ్ కూడా దాదాపు అంతే మొత్తాన్ని సమకూర్చుకున్నాయి. ఇందులోనూ యూనిలీవర్ వెంచర్స్ సారథ్యంలోని ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టారు. అమెరికాలో కార్యకలాపాల విస్తరణ కోసం కంపెనీ ఈ నిధులను సమకూర్చుకుంది. ఇక ఆగస్టులో రెనీ కాస్మెటిక్స్ సంస్థ సిరీస్ సీ విడత కింద ప్లేబుక్, మిడాస్ పార్ట్నర్స్, ఇతర ఇన్వెస్టర్ల నుంచి 5.8 మిలియన్ డాలర్లు సేకరించింది. ఇక ఫాక్స్టేల్ సైతం సిరీస్ సీ విడత కింద పాంథెరా, కోసీ కార్పొరేషన్ తదితర సంస్థల నుంచి ఏకంగా 30 మిలియన్ డాలర్లు దక్కించుకుంది. అటు బేర్ అనాటమీ, కెమిస్ట్ ఎట్ ప్లే, సన్సూ్కప్లాంటి బ్రాండ్స్ మాతృ సంస్థ ఇన్నోవిస్ట్ సైతం ఐసీఐసీఐ వెంచర్, మిరాబిలిస్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ నుంచి 16 మిలియన్ డాలర్లు సమకూర్చుకుంది. 45 బిలియన్ డాలర్లకు చేరనున్న పరిశ్రమ .. 2025 ఆర్థిక సంవత్సరంలో భారతీయ బ్యూటీ, పర్సనల్ కేర్ ఉత్పత్తుల మార్కెట్ పరిమాణం సుమారు 24 బిలియన్ డాలర్లుగా ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. 2030 నాటికి ఇది 40–45 బిలియన్ డాలర్లకు చేరే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. ఈ మార్కెట్లో ఆన్లైన్ కేటగిరీ వాటా 2023లో 13 శాతంగా ఉండగా 2024లో దాదాపు 17 శాతానికి పెరిగినట్లు వివరించాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి మార్కెట్లలో ఈ–కామర్స్ బూమ్ నెలకొనడంతో కొత్త కస్టమర్లకు చేరువయ్యేందుకు అవకాశాలు లభిస్తున్నాయని తెలిపాయి. దీంతో వేగంగా వృద్ధి సాధించేందుకు, విస్తృత శ్రేణిలో ఉత్పత్తులను అందించేందుకు, మార్కెట్లో మరింత విస్తరించేందుకు దేశీ బ్యూటీ బ్రాండ్స్ నిధులను సమకూర్చుకుంటున్నట్లు ట్రాక్షన్ వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో బడా కంపెనీలు, ఇలాంటి బ్యూటీ బ్రాండ్స్ను కొనుగోలు చేయడంపై ఆసక్తిగా ఉంటున్నాయి. దేశీ స్కిన్ కేర్ బ్రాండ్ మినిమలిస్ట్లో హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్యూఎల్) 90.5 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ. 2,706 కోట్లు వెచి్చంచింది. అటు మారికో సంస్థ దాదాపు రూ. 400 కోట్లతో బియర్డోను కొనుగోలు చేసింది. ది మ్యాన్ కంపెనీని ఇమామీ దక్కించుకుంది. గ్లోబల్ బ్రాండ్స్ వెల్లువ.. దేశీయంగా వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో భారత మార్కెట్లోకి పలు అంతర్జాతీయ బ్రాండ్స్ కూడా పెద్ద ఎత్తున ఎంట్రీ ఇస్తున్నాయి. స్వీడిష్ బ్రాండ్ హెచ్అండ్ఎం ఇటీవలే భారత్లో బ్యూటీ సెగ్మెంట్లోకి ప్రవేశించగా, రిలయన్స్కి చెందిన టీరాతో కలిసి పాప్ ఐకాన్ రిహానా తన ఫెంటీ బ్రాండ్ను ప్రవేశపెట్టింది. అటు ఎంఏసీ, హుడా, అనస్టాషియా బెవర్లీ హిల్స్, స్మాష్బాక్స్, చార్లొట్ టిల్బరీ కూడా రంగంలోకి దిగాయి. ఇక ఓటీటీ ప్లాట్ఫాంలలో కొరియన్ కంటంట్కి ఆదరణ పెరుగుతుండటంతో, ప్రీమియం ఉత్పత్తులతో ఇన్నిస్ఫ్రీ, కాస్ఆర్ఎక్స్, బ్యూటీ ఆఫ్ జోసియోన్లాంటి కొరియన్ బ్రాండ్లు కూడా భారత వినియోగదారులకు గాలమేస్తున్నాయి.