కే14ఎక్స్ 5జీ ఫోన్ల అమ్మకాలు ప్రారంభించినట్లు స్మార్ట్ఫోన్ల దిగ్గజం ఒప్పో ఇండియా తెలిపంది. దీని ధర వేరియంట్ని బట్టి రూ.14,999 నుంచి ప్రారంభమవుతుంది. కాగా తమ ఈ–స్టోర్, ఫ్లిప్కార్ట్పై సేల్ రోజున రూ. 1,500 వరకు తక్షణ డిస్కౌంటుతో రూ.13,499 నుంచి పొందవచ్చని సంస్థ తెలిపింది.
ఫిబ్రవరి 20 తర్వాత నుంచి రెండు వేరియంట్లపై రూ. 1,000 డిస్కౌంటు ఉంటుందని పేర్కొంది. ఇందులో 6.75 అంగుళాల హెచ్డీ డిస్ప్లే, 6500 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 50 ఎంపీ ఏఐ కెమెరా, కలర్ఓఎస్ 15 మొదలైన ఫీచర్లు ఉన్నాయి.
ఇదీ చదవండి: నకిలీ రెజ్యూమెతో కంపెనీకి కుచ్చుటోపీ


