breaking news
-
ఇంత దుర్మార్గమా?.. కూటమి సర్కార్ కళ్లు తెరవాలి: కారుమూరి
సాక్షి, ఒంగోలు: కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని వైఎస్సార్సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులోని ఆ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. పెట్టుబడి సాయం లేకుండా రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ.. కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని అస్తవ్యస్తం చేసిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల ఏడాది కాలంలో 250 మంది రైతులు బలవన్మరణానికి గురయితే.. ప్రభుత్వం మాత్రం కేవలం 104 మంది అని మాత్రమే చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..ఎన్నికల ముందు రైతులకు అన్నదాతకు వందనం పేరుతో రూ.20 వేలు అని చెప్పారు. ఏడాది గడిచి రెండో సంవత్సరంలోకి అడుగుపెట్టినా వారికి ఏ సాయం చేయలేదు. ఈ ప్రభుత్వ పాలనలో రైతులు అమ్మబోతే అడవి.. ప్రజలు కొనబోతే కొరివిలా తయారైంది. దళారీ వ్యవస్థ పెరిగిపోవడం వల్ల... రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు రావడం లేదు. ప్రజలు కొనుక్కువాలనుకుంటే ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రైతులు గురించి కనీస ఆలోచన చేయని ఈ ప్రభుత్వం.. రైతులు కోసం జగన్మోహన్ రెడ్డి రోడ్డెక్కితే మాత్రం కేంద్రానికి లేఖలు రాస్తారు. సాయం చేస్తున్నామంటూ హడావుడి చేస్తుంటారు. పొదిలిలో పొగాకు రైతుల పరిస్ధితి అత్యంత అధ్వాన్నంగా తయారైంది. పొగాకు బేళ్ల వేలంలో వ్యాపారులు గ్రూపుగా తయారవడంతో రైతులకు మంచి ధర లేకుండా పోయింది. అయినా ప్రభుత్వం రైతుల గోడు పట్టించుకోవడం లేదు.రైతులను గాలికొదిలిన ప్రభుత్వం:వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు మద్ధతు ధర అందేలా ప్రభుత్వమే రూ.100 కోట్లు నిధులు విడుదల చేసి... మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి రైతులకు మెరుగైన ధర అందించారు. ఇవాళ మిర్చి, పత్తి, అపరాలు ఏ పంట చూసుకున్నా మద్ధతు ధర లేకుండా పోయింది. మా ప్రభుత్వ హయాంలో రైతులకు ఇ-క్రాప్ ద్వారా ఉచిత పంటల బీమా కల్పించడంతో పాటు గిట్టుబాటు ధర వచ్చేట్టు చేశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం జరిగితే వారికి నష్టపరిహారం అందించడంతో పాటు ఇన్ పుట్ సబ్సిడీ వెంటనే ఇచ్చాం. ఇవాళ ఉచిత ఇన్సూరెన్స్ చేయలేదు. రైతులను పూర్తిగా గాలికొదిలేశారు. ఒంగోలులో గతంలో అపరాలు పంట నష్టపోతే ఇ-క్రాప్ ద్వారా నష్టపోయిన రైతులకు లక్షల్లో పరిహారం అందింది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చన్నాయుడు ప్రగల్భాలు పలకడం తప్ప పనుల్లేవు. మాజీ ముఖ్యమంత్రి అన్న గౌరవం లేకుండా ఏకవచనంతో మాట్లాడుతున్నారు. ఆయన రైతులకు శాపంగా మారాడు.కనీసం రూ.7 లక్షలు చనిపోయిన రైతులకు వెంటనే అందించే కార్యక్రమం గతంలో చేస్తే... ఈ ప్రభుత్వం నుంచి కనీస స్పందన ఉండడం లేదు. వీరి పనితీరు చూస్తుంటే ప్రభుత్వం ఉందా లేదా అన్నట్టు తయారైంది. అన్ని రంగాలను తుంగలో తొక్కి.. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. కేసుల పేరుతో వేధించడంతో పాటు భయబ్రాంతులకు గురిచేస్తూ.. హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారు.నాలుగు దశాబ్దాలు అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు పాలనకి, తొలిసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి పాలనకు ఉన్న తేడా చూడండి. కులాలు, పార్టీ, ప్రాంతం చూడకుండా పథకాలు ఇవ్వాలన్న జగన్మోహన్ రెడ్డికి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తే వాళ్లకు పాలుపోసినట్లు అనడం దారుణం. చంద్రబాబు ఇంట్లో డబ్బు ఇవ్వడం లేదు. ఇది రాచరికం కాదు, ప్రజాస్వామ్య దేశం, ప్రజలకు అనుగుణంగా పాలన ఉండాలి.రైతులను ఆదుకోవాల్సిందే:రైతుసాగుని నిర్లక్యం చేస్తే మనుగడ ఉండదు. అలాంటి రైతులను ఆదుకోల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. రైతులు నాగలి వదిలేసే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతు భరోసాతో అందిస్తే.. రెండేళ్లు అయినా మీరు రైతులకు రూపాయి కూడా సాయం లేదు. చిన్నవయసులో తొలిసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి సాయం చేస్తే... చంద్రబాబు మామిడి, పొగాకు, మిర్చి, ధాన్యం సహా ఏ రైతులనూ ఆదుకోలేదు. రైతులకు పెట్టుబడి సాయం ఎలాగూ లేదు కనీసం మద్ధతు ధర కూడా ఇవ్వడం లేదు.విత్తనం నుంచి విక్రయం వరకు వైఎస్ జగన్ హయాంలో రైతులకు అండగా నిలబడి.. విత్తనం నుంచి నాణ్యమైన ఎరువులు వరకు రైతు ముంగిటకే అందించారు. రైతులు యూరియా కోసం ఎదురు చూస్తుంటే కనీసం స్పందడం లేదు. రైతుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వం కళ్లు తెరవాలి. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు అదే ధోరణిలో రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలకు కందిపప్పు కూడా ఇవ్వలేని పరిస్ధితికి ఈ ప్రభుత్వ పాలన దిగజారిపోయింది. సార్టెక్స్ బియ్యం అని ప్రకటించి అవి కూడా సక్రమంగా అమలుచేయడం లేదని ఆయన మండిపడ్డారు. -
‘రాయలసీమలో ఏ ప్రాజెక్ట్ చేపట్టారో చంద్రబాబు చెప్పాలి’’
కర్నూలు జిల్లా: 16 ఏళ్ల పాటు సీఎంగా ఉండి రాయలసీమలో ఏ ప్రాజెక్ట్ చేపట్టారో చంద్రబాబు చెప్పాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత గడికోట శ్రీకాంత్రెడ్డి డిమాండ్ చేశారు. ఎంతో అనుభవం ఉన్న నాయకుడిగా చెప్పుకునే చంద్రబాబు.. రాయలసీమ ప్రాజెక్టులు గురించి ఎప్పుడూ పట్టించుకోలేదని విమర్శించారు. ఎన్టీఆర్ హయాంలో హంద్రీనీవా ప్రాజెక్టును ప్రారంభించగా, ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘ కాలం సీఎంగా పని చేసిన చంద్రబాబు.. ప్రాజెక్టును పూర్తి చేయకుండా ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. 1998లో జీవో హంద్రీనీవా ప్రాజెక్టు నిర్మించలేమని చెప్పి.. కేవలం త్రాగునీటి కోసం ఈ ప్రాజెక్టును వాడుకోవాలని జీవో విడుదల చేశారన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాక ఎన్టీఆర్ చేపట్టిన తెలుగు గంగ ప్రాజెక్టును పూర్తి చేసి హంద్రీనీవా ప్రాజెక్ట్ నుంచి 40 టీఎంసీలు తీసుకోవాలని రెండు ఫేస్లుగా విభజించారన్నారు. అనంతపురం కరువు నుంచి బయట పడింది అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి చలవేనని శ్రీకాంత్రెడ్డి స్పష్టం చేశారు. ఆయన చేపట్టిన ప్రాజెక్ట్ ద్వారా కియా పరిశ్రమకు నీరు అందుతున్నదని, ఇప్పుడు వైఎస్సార్ పేరు చెప్పకుండా తానే మొత్తం చేస్తున్న అని చంద్రబాబు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. రాయలసీమకు నీళ్లు ఇవ్వాలనే సంకల్పంతో వైఎస్సార్ పని చేశారని, 98లో మీరు ఇచ్చిన జీవో, 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన జీవో గురించి చర్చించడానికి మీరు, మీ నాయకులు సిద్ధమా? అని శ్రీకాంత్ రెడ్డి సవాల్ విసిరారు. చంద్రబాబుకు చిత్త శుద్ధి ఉంటే గుండ్రేవుల, వేదవతి, రాయలసీమ లిఫ్ట్ పూర్తి చేస్తామని చెప్పాలని డిమాండ్ చేశారు. రాయలసీమను రత్నాల సీమ చేస్తానని మాట్లాడుతున్న చంద్రబాబు.. కర్నూలులో హైకోర్టు ఎందుకు వద్దన్నారని, ఇక్కడ ఉన్న లా యూనివర్సిటీ ఎందుకు తరలించారని ప్రశ్నించారు. -
‘కూటమి నాయకుల అరాచకాలను ప్రశ్నించాలి’
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: కూటమి ప్రభుత్వంలోని నాయకుల అరాచకాల్ని ప్రశ్నించాలని వైఎస్సార్సీపీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అమలుచేస్తున్న సమయంలో ప్రతిపక్షమే ప్రజల గొంతుగా మారుతుందదన్నారు. ‘కూటమి నాయకుల అరాచకాలను ప్రశ్నించాలి. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనియంగా ఉంది. చంద్రబాబు వంద అబద్ధాలు చెపితే... లోకేష్ 200 అబద్ధాలు చెబుతున్నాడు. గతంలో స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టాలని చెప్పిన లోకేష్ ఇప్పుడు అదే మీటర్లు పెట్టడం ఎంతవరకు సమంజసం. మా నాయకుడు ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం’ అని బొత్స తెలిపారు. వైఎస్సార్సీపీ మండపేట కో ఆర్డినేటర్ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ.. ‘చంద్రబాబుది ఏరు దాటక తెప్ప తగలేసే పద్దతి. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నిలబెట్టుకోలేకపోయారు. 1,80, వేల ఇళ్ళు పెడతామని చెప్పి ఒక్క ఇల్లు కూడా కట్టలేకపోయారు. చంద్రబాబు ఒక్క హామీ కూడా నిలబెట్టు కోకుండా ప్రజలను అన్ని రకాలుగా మోసం చేశారు.’ అని మండిపడ్డారు. -
శ్రీకాళహస్తిలో కూటమి నేతలు కుట్రలు
తిరుపతి జిల్లా: జిల్లాలోని శ్రీకాళహస్తిలో కూటమి నేతలు కుట్ర రాజకీయాలకు తెరలేపుతున్నారు. వైఎస్సార్సీపీ నిర్వహించ తలపెట్టిన బాబు షూరిటీ-మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఫెక్సీలను మున్సిపల్ అధికారులు బలవంతంగాఇ తొలగించారు. అధికారుల తీరుపై మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అనుమతులు లేని కూటమి నేతల ఫ్లెక్సీలకు ఒక న్యాయం.. వైఎస్సార్సీపీ నాయకుల ఫ్లెక్సీలకు ఒక న్యాయమా? అని ఆయన ప్రశ్నించారు. శ్రీకాళహస్తిలో మున్సిపల అధికారులు ఎమ్మెల్యే తొత్తులుగా పని చేయవద్దని, తర్వాతే ఇబ్బందులు పడాల్సి వస్తుందని మధుసూదన్రెడ్డి హెచ్చరించారు. రానున్న రోజుల్లో ఈరోజు చేసిన పనికి రెట్టింపు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. -
కాలకేయుల్లా టీడీపీ నేతలు: వరుదు కల్యాణి
సాక్షి, విశాఖపట్నం: కాలకేయుల్లా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. శుక్రవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్.. ఆర్కే రోజాపై దిగజారుడు వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా మాట్లాడారన్న వరుదు కల్యాణి.. భాను ప్రకాష్ను టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.రోజా మీద దారుణమైన వ్యాఖ్యలు చేస్తే మహిళా కమిషన్ ఏం చేస్తుందంటూ ఆమె ప్రశ్నించారు. మహిళా కమిషన్ సుమోటోగా కేసు స్వీకరించారా?. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపితే ఇష్టానుసారంగా మాట్లాడతారా?. రోజా మీద చేసిన వ్యాఖ్యలు మీ ఇంట్లో ఆడవారి మీద చేస్తే మీరు ఊరుకుంటారా?. టీడీపీ అంటే తెలుగు దండుపాళ్యం పార్టీగా మారింది’’ అంటూ వరుదు కల్యాణి దుయ్యబట్టారు.గతంలో బండారు సత్యనారాయణమూర్తి, అయ్యన్న వంటి వారు రోజాపై అసభ్యకరంగా మాట్లాడారు. విజయమ్మ, భారతమ్మ గురించి ఐటీడీపీ వాళ్లు దారుణంగా ట్రోల్ చేశారు. మహిళలంటే టీడీపీకి గౌరవం లేదు. ఉప్పాల హారికపై దాడి మరువక ముందే ఆర్కే రోజా మీద అసహ్యంగా మాట్లాడుతున్నారు. మహిళా మీద దాడి జరిగితే తాట తీస్తామని చెప్పిన పవన్ కల్యాణ్ ఎక్కడ ఉన్నారు?. భాను ప్రకాష్ తాట ఎందుకు పవన్ తీయలేదు’’ అంటూ వరుదు కల్యాణి నిలదీశారు. -
ఇంకెన్నాళ్లు ఇట్టాగా..
పార్టీ పెట్టి 15 ఏళ్లయింది. ఇన్నేళ్లుగా సొంతంగా పోటీ చేయడం అనేది లేకపోయింది. చంద్రబాబు పొత్తుతోనో బిజెపి అండతోను ఎన్నాళ్ళని నడుస్తాం.. వాళ్లని గెలిపించడానికి పడుతున్న కష్టం ఏదో మనంతట మనం గెలవడానికి నిలవడానికి పడితే ప్రయోజనం ఉంటుంది కదా. మన పార్టీని నమ్ముకుని ఉన్నవాళ్లకు కూడా ఆసరా ఇచ్చినట్లు ఉంటుంది కదా.. ఊత కర్ర వదిలేద్దాం సొంతంగా నడుద్దాం అనే ఆలోచనలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఉన్నారా.. తాను మరో 15 ఏళ్ల పాటు చంద్రబాబుకు మద్దతు ఇవ్వడానికి ఎలాంటి ఇబ్బంది లేదని గతంలో చెప్పినప్పటికీ పార్టీలో అంతర్గతంగా జరిగిన చర్చ నేపథ్యంలో ఇలా ఉంటే కుదరదని.. చంద్రబాబు తనను నిమ్మరసం పిండినట్లు పిండేసి తొక్కలు బయటకు విసిరేసినట్లుగా తనను బయట వదిలేస్తాడని జ్ఞానబోధ అయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తానే బలపడేందుకు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ తరఫున 21 మంది ఎమ్మెల్యేలు శాసనసభలో ఉన్నారు వచ్చే ఎన్నికల నాటికి. ఇలా గుప్పెడు సీట్లు తీసుకుంటే కుదరదని.. మూడెంతల సీట్లు డిమాండ్ చేసే పరిస్థితికి ఎదగాలని పవన్ కళ్యాణ్ కు పార్టీ సీనియర్లు కాపు నేతలు సైతం హిత బోధ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తీరు పట్ల కాపు నేతల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది. క్యాడర్లో కూడా తాము ఎంతసేపు తెలుగుదేశం మోచేతి నీళ్లు తాగడమేనా ప్రభుత్వాన్ని నిలబెట్టింది మేము తీసుకొచ్చింది మేము అయినప్పటికీ మాకు ఎంగిలి మెతుకులే తప్ప ప్రధాన పదవులు కానీ ఇతరత్రా అధికారాల్లో కానీ వాటా లేదన్న మనోవేదన కనిపిస్తోంది. దీంతోపాటు తెలుగుదేశం నాయకుల చేతిలో జనసైనికులు పలు సందర్భాల్లో అవమానాలకు గురైన సంఘటనలు సైతం ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా తనకు ఉన్న బలాన్నీ బేరిజు వేసుకోడానికి అంతర్గతంగా ఒక సర్వే నిర్వహించినట్లుగా తెలుస్తోంది. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 60 నియోజక వర్గాల్లో ఇప్పటికే సర్వే పూర్తికాగా వాటిలో దాదాపుగా 50 నియోజకవర్గాల్లో తమకు బలం పుంజుకునే అవకాశం ఉన్నట్లుగా ఒక అంచనాకు వచ్చారు.వాస్తవానికి పార్టీకి ఎంతవరకు రాష్ట్ర జిల్లా కార్యవర్గాలు ఏర్పాటు చేయలేదు. నియోజకవర్గ ఇన్చార్జిలతో కథ నడిపిస్తూ వస్తున్నారు. రాష్ట్ర జిల్లా స్థాయి నుంచి మండల స్థాయికి పార్టీని తీసుకువెళ్లాలంటే జిల్లా కమిటీలు ఏర్పాటు చేయక తప్పదు. ఆ తరువాత గ్రామ బూత్ కమిటీ వేయాల్సి ఉంటుంది. ఇవేమీ లేకుండా రాత్రి కి రాత్రి ఎన్నికల్లో గెలిచేయడం అన్ని సందర్భాల్లోనూ సాధ్యం కాదని పవన్ కళ్యాణ్ కు రాజకీయ సలహాదారులు చెప్పినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇకపై పార్టీని గాలికి వదిలేయకుండా 65 నియోజకవర్గాల్లో బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో కనీసం 50 ఎమ్మెల్యే టికెట్లు డిమాండ్ చేసే పరిస్థితికి ఎదగాలని సేనాని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే త్వరలో జిల్లా అధ్యక్షులు నియమకాలు కూడా చేపడతారని పార్టీ సమాచారం. ఎంతసేపు చంద్రబాబు చేయి పట్టుకొని ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లడం పార్టీకి మంచిది కాదని.. ఇలా చేయడం ద్వారా మున్ముందు పార్టీ ఒక పరాన్న జీవి మాదిరిగా మిగిలిపోతుంది అన్న భయాన్ని పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్లోకలిగించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మున్ముందు సొంతంగా ఎదిగి మరింత బలోపేతం అయ్యేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా చేతిలో ఉన్న సినిమాలను త్వరగా పూర్తిచేసి పార్టీ నిర్మాణాన్ని చేపట్టాలని పవన్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఎత్తులకు చంద్రబాబు ఏ విధమైన పైఎత్తులు వేస్తారో.. జనసేన ఎదుగుదలను చంద్రబాబు తన కుయుక్తులతో ఏ విధంగా నియంత్రిస్తారో చూడాలిసిమ్మాదిరప్పన్న -
బనకచర్ల గురించి చంద్రబాబు అతిగా మాట్లాడారు: సీపీఐ నారాయణ
సాక్షి, ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా బనకచర్ల ఎలా కడతారు? అని ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి ప్రశ్నించారాయన. శుక్రవారం సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. బనకచర్ల అనేది ప్రస్తుత ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టు కాదు. మొదట పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయాలి. బనకచర్ల గురించి చంద్రబాబు అతిగా మాట్లాడారు. కాంట్రాక్టర్లు,రాష్ట్రం ,కేంద్రం కలిసి ప్రాజెక్టు కడతామని చెప్పారు. బనక చర్ల రూ.80 వేల కోట్ల ప్రాజెక్టు కాదు రూ.2 లక్షల కోట్ల ఖర్చు అవుతుంది. అసలు.. చంద్రబాబు బనకచర్ల గురించి మొదట తెలంగాణ ముఖ్యమంత్రితో మాట్లాడాల్సింది. అలా చేయకపోవడం వల్ల విమర్శలు వచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి వ్యతిరేకించారు. ప్రాజెక్టులు ఎప్పుడైనా వివాద రహితంగా కట్టుకోవాలి. నదుల్లో రెండు రాష్ట్రాల నీటి వాటాలు తేలాకనే నీటి ప్రాజెక్టులపై ముందుకు వెళ్ళాలి. అంతేగానీ నీళ్ళను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం.. తల్లిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడంతో సమానమే. కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి నీళ్లను అడ్డుకోవద్దు అని నారాయణ హితవు పలికారు. రేవంత్ గట్టొడుటీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తరువాత సెంటిమెంట్ ఎగిరిపోయింది. ఇప్పుడు సెంటిమెంట్లు లేవు. ప్రతి అంశంపై సెంటిమెంట్లతో రెచ్చగొట్టాలని చూస్తున్నారు. రేవంత్ తెలంగాణ సీఎం. ఆయన ఎన్నుకోబడిన నేత.. నామినేట్ చేయబడిన వ్యక్తి కాదు. తెలంగాణకి రేవంత్ అన్యాయం చేయలేదు. పొట్టివాడు గట్టి వాడు. అయితే.. రేవంత్ విమర్శిస్తూ రాజకీయాలు చేయడం మానుకోవాలి అని నారాయణ సూచించారు. -
మహిళా కమిషన్లో రోజా ఫిర్యాదు.. గాలిపై చర్యలు తీసుకోవాల్సిందే..
సాక్షి, నగరి: చిత్తూరు జిల్లా నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి ఆర్కే రోజా జాతీయ, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్కి ఫిర్యాదు చేశారు. ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మాజీ మంత్రి రోజా.. కమిషన్ను ఆశ్రయించారు. ఈ సందర్భంగా మహిళల వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డ టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని రోజా.. కమిషన్ను కోరారు. ఇక, అంతకుముందు.. భాను ప్రకాశ్ను అరెస్ట్ చేయాలని రోజా నిన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఇదిలా ఉండగా.. మహిళలను అవమాన పరచడం, కించ పరచడం అధికార టీడీపీ నేతలకు పరిపాటిగా మారింది. పత్రికలో రాయడానికి వీలు లేనంతగా బూతులు తిడుతూ ఆర్కే రోజా వ్యక్తిత్వ హననానికి టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పాల్పడ్డారు. మహిళా లోకం అసహ్యించుకునేలా సోషల్ మీడియాలో ఆమెపై అసభ్యకర వ్యాఖ్యలను ట్రోల్ చేశారు. ఈ వ్యవహారంపై ఆర్కే రోజా గురువారం చిత్తూరు జిల్లా నగరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సభ్య సమాజం సిగ్గుపడేలా తనపై ట్రోల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, ఆయన సహచరులు సోషల్ మీడియాలో తన గురించి ‘‘రూ.2,000 ఇస్తే ఏ పనైనా చేసేది. మార్కెట్లో ఆ మాట ఉంది. ఆమె నేడు రూ.రెండు వేల కోట్లు సంపాదించింది. ఆమె వ్యాంప్కు ఎక్కువ.. హీరోయిన్కు తక్కువ. ఈ పిచ్చి దాంతో వాళ్ల పార్టీ నేతకు పిచ్చెక్కిందా.. ఆయన పిచ్చి ఈమెకెక్కిందా తెలియడం లేదు’’ అని దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎవరైనా ఇంత నీచంగా మాట్లాడుతారా? అని ఆమె ప్రశ్నించారు. వ్యక్తిత్వ హననం చేసేలా మాట్లాడిన నగరి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఈ ఫిర్యాదుపై పోలీసులు స్పందించక పోవడంపై అనంతరం ఆమె ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.‘నేను రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై గొంతెత్తినందుకు టీడీపీ ఎమ్మెల్యే గాలిభాను.. నన్ను అసభ్యకరంగా, దుర్భాషలాడుతూ బాధ పెట్టారు. ఇది నాకు మాత్రమే జరిగిన అవమానం కాదు. అధికారంలో ఉన్న వారిని ప్రశ్నించడానికి ధైర్యం చేసే ప్రతి మహిళపై జరిగిన దాడి. ఇలాంటి రాష్ట్రంలోనా మనం నివసిస్తున్నాం? ఇది ప్రమాదకరమైన సంస్కృతి. అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. భాను ప్రకాష్పై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’ అని ఆమె డిమాండ్ చేశారు. మీ ఇంట్లో మహిళల గురించి మాట్లాడితే ఊరుకుంటారా?మరోవైపు.. టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి స్పందించారు. ఈ సందర్బంగా వరుదు కళ్యాణి మాట్లాడుతూ..‘రోజాపై గాలి భాను ప్రకాష్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. సభ్య సమాజం తలదించుకునేలా భాను ప్రకాష్ వ్యాఖ్యలు ఉన్నాయి. ఆయన ఇంట్లో మహిళల గురించి ఎవరైనా మాట్లాడితే ఊరుకుంటారా?. రోజాకు వెంటనే భాను ప్రకాష్ క్షమాపణ చెప్పాలి. భాను ప్రకాష్ను అరెస్టు చేయాలి. ఆయన్ను పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. మహిళలకు అన్యాయం జరిగితే తాట తీస్తానన్న పవన్ ఏమైపోయారు. మహిళలను అవమాన పరచడం అనేది టీడీపీ డీఎన్ఏనే ఉంది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
తాడిపత్రిలో మళ్లీ ఉద్రిక్తత.. జేసీ వర్గీయుల ఓవరాక్షన్
సాక్షి,అనంతపురం: తాడిపత్రిలో మరోసారి రాజకీయ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశాన్ని అడ్డుకునేందుకు జేసీ వర్గీయులు ప్రయత్నించబోయారు. ఈ క్రమంలో పోలీసుల జోక్యంతో పరిస్థితి ఒక్కసారి ఉద్రిక్తంగా మారింది. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశం జరగాల్సి ఉంది. అయితే.. కేతిరెడ్డిని నియోజకవర్గంలో అడుగుపెట్టనివ్వనంటూ టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్రెడ్డి సవాల్ చేసిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్లే పోలీసులు సైతం.. పెద్దారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు.అయినా జేసీ వర్గీయులు శాంతించలేదు. వైఎస్సార్సీపీ సమావేశ వేదిక వద్దకు జేసీ నివాసం నుంచి ర్యాలీగా బయల్దేరారు. ఈ క్రమంలో పరిస్థితి చేజారిపోయే అవకాశం ఉందని భావించిన పోలీసులు.. వాళ్లను అడ్డుకోగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అంతకు ముందు.. సమావేశానికి హాజరయ్యేందుకు పెద్దారెడ్డి స్వగ్రామం తిమ్మంపల్లి గ్రామం నుంచి తాడిపత్రి బయలుదేరారు. పెద్దారెడ్డి రాకపై అప్రమత్తమైన పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశానికి అనుమతి ఉందంటూనే.. పెద్దారెడ్డి మాత్రం వచ్చేందుకు వీలులేదని ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. పెద్దారెడ్డి మినహా మిగిలిన వైఎస్సార్సీపీ నేతలు కావచ్చంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.మరోవైపు, పెద్దారెడ్డి తాడిపత్రిలో ఉండేందుకు హైకోర్టు ఆదేశాలిచ్చింది. అయినప్పటికీ తనపై పోలీసులు ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి నేనంటే భయం: కేతిరెడ్డి పెద్దారెడ్డిటీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి నన్ను చూసి భయపడుతున్నారు. అందుకే పోలీసుల ద్వారా నన్ను అడ్డుకుంటున్నారు. హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా పోలీసులు జేసీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.తాడిపత్రిలో ప్రజాస్వామ్యం ఖూనీ తాడిపత్రిలో వైఎస్సార్సీపీ సమావేశానికి వెళ్తున్న తనను అడ్డుకోవడం దుర్మార్గం.18వ తేదీన అనుమతిచ్చి.. ఇప్పుడు వెళ్లొద్దంటే ఎలా?. తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చి మూడు మాసాలవుతోంది. తాడిపత్రి వెళ్లేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతి కావాలా?తాడిపత్రిలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. -
జగనే రైటని నిరూపిస్తున్న బాబు సర్కారు!
వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక సూపర్ వ్యాఖ్య చేశారు. ‘‘ఏ ప్రభుత్వంలో అయినా పోలీసులు గట్టిగా పనిచేస్తే నేరాలు చేసేవారు రాష్ట్రం వదలివెళ్లిపోతారు..కానీ ఏపీలో పోలీస్ అధికారులు రాష్ట్రం విడిచిపోతున్నారు..’’ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని అరాచక పరిస్థితికి ఇది దర్పణం పడుతుంది. జగన్ బుధవారం వివిధ అంశాలపై మీడియాతో మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థ తీరుతెన్నులు, సూపర్ సిక్స్సహా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల మేనిఫెస్టో అమలు కాని వైనం, ప్రజాస్వామ్యానికి చంద్రబాబు ప్రభుత్వం తిలోదకాలు ఇస్తున్న తీరులపై సాకల్యంగా మాట్లాడారు. వాటిలో ఈ కామెంట్ చాలా అర్ధవంతంగా ఉందని చెప్పాలి. ఏపీలో పలువురు సీనియర్ పోలీసు అధికారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. కొందరైతే రాష్ట్రం నుంచి ఎలాగొలా బయటపడి కేంద్రానికి వెళదామనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఓసీ ఇవ్వడం లేదు. దాంతో ఈ చికాకులు తట్టుకోవడం ఇష్టం లేక కొందరు వేరే మార్గాలు వెతుక్కుంటున్నారు. సిద్దార్ధ్ కౌశల్ అనే యువ అధికారి రాష్ట్రంలో పనిచేయడం ఇష్టం లేక ఉద్యోగానికి రాజీనామా చేశారని వార్తలు వచ్చాయి. ఇది ఏపీ పరువు తీసేదిగా ఉంది. మరికొందరు అధికారులను పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తున్న వైనం ఉండనే ఉంది. గత ప్రభుత్వ హయాంలో వచ్చిన అభియోగాల మీద దర్యాప్తు చేసి అనేక విషయాలు వెల్లడించి కేసులు పెట్టిన అధికారులు కొంతమందిని ఏదో సాకుతో సస్పెండ్ చేశారు. పీఎస్ఆర్ ఆంజనేయులు అనే డీజీ స్థాయి అధికారిని ఒక కేసులో అరెస్టు చేశారు. ఇవన్ని చర్చనీయాంశాలుగా ఉన్న తరుణంలో జగన్ మీడియా ముఖంగా మరింత ఘాటైన వ్యాఖ్యలు చేశారు. డీఐజీ స్థాయి అధికారులు కొందరు మాఫియా మాదిరి మారారని, ప్రభుత్వంలోని పెద్దల కోసం కొంతమంది సీఐల ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తన హయాంలో ప్రజలకు ఉపయోగపడే స్పందన వంటి కార్యక్రమాలు తీసుకువచ్చి పోలీసు శాఖకు మంచిపేరు తెస్తే, ఇప్పుడు వారితో అరాచకాలు చేయిస్తున్నారని విమర్శించారు. వైసీపీకి చెందిన వారితోపాటు జర్నలిస్టులను కూడా వదలకుండా ఇష్టారాజ్యంగా అక్రమ కేసులు పెట్టి వేదిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా పలువురి పేర్లను ప్రస్తావించారు. గుడివాడలో జెడ్పీ ఛైర్పర్సన్ హారికపై టీడీపీ గూడాలు దాడి చేస్తే కేసులు పెట్టకపోగా, వాహనంలో వెనుక సీటులో ఉన్న హరిక భర్త రాముపై కేసు పెడతారా? అని ప్రశ్నించారు. మాజీమంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడిచేసి విధ్వంసం సృష్టిస్తే కనీసం చర్య తీసుకోరా? అని ప్రశ్నించారు. వీటిపై అటు ప్రభుత్వ పెద్దలుకాని, ఇటు పోలీసు అధికారులూ వివరణ ఇవ్వలేకపోతున్నారు. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యేని తన ఇంటికి వెళ్లనివ్వడం లేదని, ఇదేమి పోలీసు వ్యవస్థ అని ఆయన ప్రశ్నించారు. నిజంగానే ఏ పోలీస్ వ్యవస్థకైనా, ప్రభుత్వానికైనా ఇంతకన్నా సిగ్గుచేటైన విషయం ఉంటుందా? అన్నదానిపై అంతా ఆలోచిస్తున్నారు. ఎవరో ఒకరి వాంగ్మూలం తీసుకోవడం, కేసు పెట్టడం, అక్రమ అరెస్టులు చేయడం నిత్యకృత్యమైందని, అవకాశం వస్తే చంద్రబాబు సర్కార్ ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా లపై కూడా కేసులు పెట్టగలదని జగన్ విమర్శించారు.ఈ సందర్భంగా 2002లో నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా అక్కడ జరిగిన మత కలహాలపై ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు గుర్తుకొస్తాయి. మోడీ హైదరాబాద్కు రానివ్వనని అప్పట్లో ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. 2019లో ప్రధాని మోడీని కూడా చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. వ్యక్తిగతంగా నిందించారు. కానీ 2024 నాటికి ఎలాగొలా బతిమలాడుకుని మళ్లీ వారితోనే పొత్తుపెట్టుకున్నారు. మీడియా సమావేశంలో జగన్ ఇంకో ఘాటు వ్యాఖ్య చేశారు. మూడేళ్లు కళ్లు మూసుకుంటే వచ్చేది తమ ప్రభుత్వమేనని అప్పుడు తమ పార్టీ వారు ఇదే సంస్కృతిని అనుసరిస్తే టీడీపీ వారి పరిస్థితి ఏమిటో ఆలోచించుకోవాలని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం జగన్ ఇలా మాట్లాడుతున్నప్పుడు కాస్త తగ్గినట్లు కనిపిస్తున్నా, కొద్ది కాలానికే మళ్లీ యథాప్రకారం రెడ్ బుక్ పాలనను కొనసాగిస్తోంది. దానివల్ల దేశ వ్యాప్తంగా ఏపీ ఇమేజీ దెబ్బతింటోంది. వైసీపీని అణచివేస్తే తామే ఎల్లకాలం పాలించవచ్చన్న భ్రమతో చంద్రబాబు ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుందనిపిస్తుంది. కాని చరిత్రలో ప్రత్యేకించి ప్రజాస్వామ్య వ్యవస్థలో అది సాధ్యం కాదన్న సంగతి పలుమార్లు రుజువైనా అధికారంలో ఉన్నవారు భ్రమలలో బతుకుంటారనుకోవాలి. ఏపీలో ప్రతిపక్షంగా ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రమే ఉందని, ప్రజల పక్షాన తాము పని చేస్తున్నామని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఇచ్చిన హామీలను తమ పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నందునే ప్రభుత్వం భయపడుతోందని జగన్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు తమ సమస్యలు తీర్చుతారన్న నమ్మకం లేకే జనం ఆయన వద్దకు వెళ్లడం లేదని కూడా జగన్ వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో చంద్రబాబు, లోకేశ్ పర్యటనలలో ఆశించిన స్థాయిలో ప్రజలు కనిపించడం లేదని అంటారు. అదే జగన్ ఎక్కడకు వెళ్లినా ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఇక కూటమి హామీల గురించి ప్రశ్నిస్తూ, ఆడబిడ్డ నిధి కింద ఇస్తామని ప్రకటించిన రూ.18 వేల సంగతి ఏమిటి? ఏమైంది? నిరుద్యోగ భృతి నెలకు రూ.మూడు వేలు ఎందుకు ఇవ్వడం లేదు? రైతులకు ఇస్తామన్న రూ.20 వేల మాట ఏమిటి? మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఏమి చేశారు? ఎన్నికలకు ముందేమో రాష్ట్రంలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్లవచ్చని అన్నారని, ప్రస్తుతం మాట మార్చి జిల్లా పరిధి అంటున్నారని జగన్ ఎద్దేవ చేశారు. ఏభై ఏళ్లకే ఫించన్ హామీతో సహా 143 హామీల మాటేమిటని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు ఎంతమేర ఎగవేసింది, లెక్కలతో సహా ప్రజలకు వివరిస్తుంటే తట్టుకోలేకపోతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. సహజమే కదా! ప్రజలకు ప్రభుత్వ వైఫల్యాలను పదే, పదే గుర్తు చేస్తే వారు భరించగలుగుతారా? ప్రజాస్వామ్య బద్దంగా ఆలోచిస్తే ఏ పార్టీ వారి కార్యక్రమాలకు అడ్డు తగలరు. కాని చంద్రబాబు ప్రభుత్వం పూర్తి నియంతృత్వంగా వ్యవహరిస్తూ వైసీపీ సభలు, సమావేశాలు సరిగా జరగకుండా చూడడానికి యత్నిస్తోంది. ఇవన్ని భవిష్యత్తులో చెడ్డ సంప్రదాయాలుగా మారతాయి. జగన్ దానినే ఒకటికి రెండుసార్లు వివరిస్తున్నారు. ఒక వైపు హామీలు సజావుగా అమలు చేయకుండా, మరో వైపు కరెంటు ఛార్జీల రూపేణా సుమారు రూ.18 వేల కోట్ల భారం మోపారని జగన్ ధ్వజమెత్తారు. దీనికి ప్రభుత్వం వద్ద సమాధానం లేదనే చెప్పాలి. ఎన్నికలకు ముందు చంద్రబాబు పదే,పదే తాము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచబోమని, తగ్గిస్తామని కూడా ఊరించారు. తీరా పవర్ వచ్చాక ప్రజలు వాడుకునే పవర్ ఛార్జీలు మాత్రం ఇబ్బడిముబ్బడి అయ్యాయి. ఏది ఏమైనా జగన్ వేసిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వలేకే చంద్రబాబు సర్కార్ తీవ్ర అసహనానికి గురి అవుతోంది. తమది మంచి ప్రభుత్వమని ప్రచారం చేసుకోవాలన్నది చంద్రబాబు లక్ష్యమైతే, ఇది మంచి ప్రభుత్వం కాదని, మాట మీద నిలబడే ప్రభుత్వం కాదని జగన్ పదే,పదే రుజువు చేస్తున్నారు.అదే అసలు సమస్య.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
నగరి ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలపై ఆర్కే రోజా ఫిర్యాదు
మహిళలను అవమాన పరచడం, కించ పరచడం అధికార టీడీపీ నేతలకు పరిపాటిగా మారింది. ఇంట్లో మహిళలు ఏమనుకుంటారోనన్న కనీస స్పృహ లేకుండా ప్రతిపక్ష వైఎస్సార్సీపీ మహిళా నేతలపై నిస్సిగ్గుగా నోరు పారేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికను అసభ్యంగా దూషిస్తూ.. ఆమె వాహనంపై టీడీపీ సైకో మూకలు దాడి చేసిన ఘటనపై రాష్ట్రం అట్టుడుకుతుండగా.. మరో వైపు మాజీ మంత్రి ఆర్కే రోజాపై సభ్య సమాజం సిగ్గు పడేలా దుర్భాషలాడుతూ ఐ టీడీపీ, చిత్తూరు జిల్లా నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ రెచ్చిపోయారు. సాక్షి, అమరావతి/నగరి: పత్రికలో రాయడానికి వీలు లేనంతగా బూతులు తిడుతూ ఆర్కే రోజా వ్యక్తిత్వ హననానికి టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పాల్పడ్డారు. మహిళా లోకం అసహ్యించుకునేలా సోషల్ మీడియాలో ఆమెపై అసభ్యకర వ్యాఖ్యలను ట్రోల్ చేశారు. ఈ వ్యవహారంపై ఆర్కే రోజా గురువారం చిత్తూరు జిల్లా నగరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సభ్య సమాజం సిగ్గుపడేలా తనపై ట్రోల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, ఆయన సహచరులు సోషల్ మీడియాలో తన గురించి ‘‘రూ.2,000 ఇస్తే ఏ పనైనా చేసేది. మార్కెట్లో ఆ మాట ఉంది. ఆమె నేడు రూ.రెండు వేల కోట్లు సంపాదించింది. ఆమె వ్యాంప్కు ఎక్కువ.. హీరోయిన్కు తక్కువ. ఈ పిచ్చి దాంతో వాళ్ల పార్టీ నేతకు పిచ్చెక్కిందా.. ఆయన పిచ్చి ఈమెకెక్కిందా తెలియడం లేదు’’ అని దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎవరైనా ఇంత నీచంగా మాట్లాడుతారా? అని ఆమె ప్రశ్నించారు. వ్యక్తిత్వ హననం చేసేలా మాట్లాడిన నగరి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఈ ఫిర్యాదుపై పోలీసులు స్పందించక పోవడంపై అనంతరం ఆమె ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై గొంతెత్తినందుకు టీడీపీ ఎమ్మెల్యే గాలిభాను.. నన్ను అసభ్యకరంగా, దుర్భాషలాడుతూ బాధ పెట్టారు. ఇది నాకు మాత్రమే జరిగిన అవమానం కాదు. అధికారంలో ఉన్న వారిని ప్రశ్నించడానికి ధైర్యం చేసే ప్రతి మహిళపై జరిగిన దాడి. ఇలాంటి రాష్ట్రంలోనా మనం నివసిస్తున్నాం? ఇది ప్రమాదకరమైన సంస్కృతి. అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. భాను ప్రకాష్పై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’ అని ఆమె డిమాండ్ చేశారు. పవన్ కల్యాణ్ స్పందించాలిమహిళా లోకం అసహ్యించుకొనేలా.. సభ్య సమాజం తల దించుకునేలా మాజీ మంత్రి ఆర్కే రోజా గురించి నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ మాట్లాడటం దారుణం అని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల పేర్కొన్నారు. ‘సినిమా వాళ్లు అంటే ఎందుకు మీకు ఇంత చులకన? మీరు నెత్తిన ఎక్కించుకున్న పవన్ కళ్యాణ్ సినిమా వ్యక్తి కాదా?’ అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కూడా దీనిపై స్పందించాలి అని ఆమె డిమాండ్ చేశారు. నగరి ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు సభ్య సమాజం తల దించుకునేలా ఉన్నాయన్నారు. కౌన్సిలర్ల అక్రమ అరెస్ట్పై నిలదీసిన రోజాపుత్తూరు: తమిళనాడుకు ఏడు టిప్పర్లతో ఇసుక అక్రమ రవాణా చేస్తూ నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ బ్యాచ్ పట్టుబడగా.. తప్పుడు వాంగ్మూలంతో పోలీసులు ఇద్దరు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను అరెస్టు చేశారు. వివరాలు.. ఇసుకను అక్రమంగా తమిళనాడుకు తరలిస్తున్న ఏడు టిప్పర్లను ఇటీవల నగరి పోలీసులు పట్టుకున్నారు. ప్రధాన సూత్రధారి అయిన భరత్ను అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ అనుచరుడైన భరత్ ఇచ్చిన తప్పుడు వాంగ్మూలంతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు బీడీ భాస్కర్, బిలాల్పై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేసి.. బుధవారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. వారిని గురువారం ఉదయం 11 గంటలకు పుత్తూరు సబ్ కోర్టులో హాజరుపరిచారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి రోజా పుత్తూరు కోర్టు వద్దకు చేరుకుని ఎస్సై విజయ్ను పలు ప్రశ్నలతో నిలదీశారు. ఇసుకను ఎక్కడ అక్రమంగా తరలిస్తుంటే వీరిని పట్టుకున్నారో సాక్ష్యాలు చూపించాలని డిమాండ్ చేశారు. ఇంట్లో నిద్రిస్తున్న ప్రజాప్రతినిధులను అర్ధరాత్రి సమయంలో ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశి్నంచారు. అసలు రాజంపేట నుంచి నగరి మీదుగా తమిళనాడుకు అక్రమంగా ఇసుక తరలించడం వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు సాధ్యపడే విషయమేనా అని నిలదీశారు. అన్ని ప్రశ్నలకూ సీఐని అడగాలంటూ ఎస్సై నీళ్లునమిలారు. ఇసుక మాఫియాకు ప్రధాన సూత్రధారి అయిన గాలి భానుప్రకాశ్ ప్రధాన అనుచరుడు భరత్ నుంచి తప్పుడు వాంగ్మూలం తీసుకొని.. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై అక్రమ కేసులు బనాయించారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగాన్ని పోలీసులు అమలు చేస్తున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలన్నారు. తప్పుడు కేసులకు భయపడే పరిస్థితిలో లేమని.. పార్టీ కేడర్కు వైఎస్సార్సీపీ నాయకులతో పాటు వైఎస్ జగన్ అండగా ఉన్నారని చెప్పారు. -
సర్వేలతో కూటమి ఎమ్మెల్యేల హడల్
సాక్షి ప్రతినిధి, అనంతపురం: పాలన మొదలుపెట్టి ఏడాది తిరక్కుండానే టీడీపీ ఎమ్మెల్యేల్లో సర్వేల గుబులు మొదలైంది. సంవత్సరంలోనే నాలుగేళ్ల వ్యతిరేకతను మూటగట్టుకున్నట్టుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఓ వైపు ముఖ్యమంత్రే స్వయానా ఐవీఆర్ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం) ద్వారా సర్వే చేయిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం తరఫున వ్యూహకర్త రాబిన్ శర్మ సర్వే చేస్తున్నారని తెలుస్తోంది. ఈ రెండింట్లోనూ.. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఇద్దరు మంత్రులతో సహా 8 మంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్టు వెల్లడైనట్లు తెలిసింది. మరికొన్ని నెలల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో దీని ప్రభావం తీవ్రంగా పడనుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్టు ఉమ్మడి జిల్లాలో ప్రచారం జరుగుతోంది.మెజారిటీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత..ఉమ్మడి జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ అభ్యర్థులే గెలిచారు. కూటమి పాలన మొదలెట్టి ఈ ఏడాది జూన్ 12 నాటికి ఏడాది దాటింది. తాజా సర్వేల ప్రకారం 8 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులపై వ్యతిరేకత పెల్లుబికుతోందని చర్చ జరుగుతోంది. ఐవీఆర్ఎస్ ద్వారా జరిగిన సర్వేలో 60 శాతం మందికి పైగా ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇద్దరు మంత్రులపైనా నిప్పులు చెరిగినట్టు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చి స్వల్పకాలమే అయినా ఎమ్మెల్యేలు, మంత్రుల వ్యవహారంపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నట్టు సర్వేలు చెబుతున్నట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది.వ్యతిరేకతకు ప్రధాన కారణాలివే..అన్ని నియోజకవర్గాల్లో ఉచిత ఇసుక అని చెప్పి.. ఎమ్మెల్యేలే అక్రమంగా తరలిస్తూ సామాన్యులకు అందకుండా చేస్తున్నారు. పలు నియోజవర్గాల్లో మట్టిని అక్రమంగా తోలుతూ సామాన్యులతో మాత్రం వేలకు వేలు వసూలు చేస్తున్నారు.సామాన్యులకు సంబంధించిన ఖాళీ స్థలాలు కనిపిస్తే ఎమ్మెల్యేల అనుచరులం అని చెప్పి పాగా వేసి కంచె వేస్తున్నారు. అధికారులకు చెప్పుకుంటున్నా పరిష్కారం లేదు.మద్యం సిండికేటు అయి పర్మిట్రూములు, బెల్టుషాపుల ద్వారా పల్లెల్లో విచ్చలవిడిగా మద్యం అమ్ముతుండటం వల్ల మహిళలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు.చాలామంది ఉద్యోగులు బదిలీలు, పోస్టింగ్ల విషయంలో సిఫార్సు లేఖలకు భారీగా వసూలు చేయడంతో ఉద్యోగ వర్గాల్లో వ్యతిరేకత వచ్చింది. అర్బన్ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం చేపడితే మున్సిపాలిటీ అధికారులను పంపించి లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నారు. -
‘వాగ్దానాలకు అతీలేదు గతి లేదు.. మందు కావాలని మాత్రం ఆలోచించారు’
పశ్చిమ గోదావరి జిల్లా: కూటమ ఏడాది పాలనలో ఇచ్చిన హామీలకు చేసిన పాలనకు పొంతన లేదని వైఎస్సార్సీపీ ఉయగోదావరి జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్. బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. జిల్లాలోని ఉండి నియోజకవర్గం ఇంచార్జ్ పీవీఎల్ నరసింహరాజు ఆధ్వర్యంలో బాబు షూరిటీ -మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొత్స సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు, నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళి కృష్ణంరాజు, కన్వీనర్ ఉమాబాల, మాజీమంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు , ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, భీమవరం నియోజకవర్గ ఇంచార్జ్ చిన్నమిల్లి వెంకటరాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు బొత్స మాట్లాడుతూ.. ‘ కూటమి నేతల మెడలు వంచి పాలన చేయించాలనే ఉద్దేశంతోనే బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం చేపట్టాము. ఐదు కోట్ల మందిపై ప్రమాణం చేసి భవిష్యత్తు గ్యారెంటీ అంటూ బాండ్లు ఇచ్చారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఇచ్చిన వాగ్దానాలను కూటమీ ప్రభుత్వం నెరవేర్చలేదు. మూడు సిలిండర్లని ఒక సిలిండర్ ఇచ్చారు. సూపర్ సిక్స్ హామీల గురించి అడిగితే నాలికమందం అంటున్నాడు చంద్రబాబు. చంద్రబాబు మాయగాడు.. మాయగాడికి తోడు ఒక మోసగాడు తోడయ్యాడు. ఎప్పుడు ఎన్నికల్లో గెలిచిన ప్రజలను మోసం చేయడమే వారి ఉద్దేశం. ప్రజలకు ఐదువేళ్లు నోట్లోకి వెళ్లడం కావాలి.. మందు కాదు. చంద్రబాబు ప్రజలకు మందే కావాలని ఆలోచించాడు. రైతులకు పెట్టుబడి సాయం ఇప్పటి వరకు ఇవ్వలేదుచంద్రబాబు 100 అబద్ధాలు ఆడితే లోకేష్ 200 అబద్దాలు ఆడుతున్నాడు. చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలకు అతీలేదు గతి లేదు. అడిగితే ఒకరేమో నాలికమందమని ఇంకో ఆయన ఏమో తాటతీస్తాను మక్కెలు ఇరగ కొడుతాను అంటున్నాడు. ఐదు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలు మానేశారు ఈ రాష్ట్రంలో.. ఇది వాస్తవం. ఆడబిడ్డ నిధి 1500.. ఎప్పటినుండి ఇస్తారు. P-4 పేరుతో అభివృద్ధి పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు.’ అని బొత్స మండిపడ్డారు. -
ఇది చంద్రబాబుకు సిగ్గుచేటు కాదా?: అంబటి రాంబాబు
సాక్షి, తాడేపల్లి: ఎల్లో మీడియా, చంద్రబాబు.. రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పోలవరం, బనకచర్ల మీదనే రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశమంటూ ఎల్లో మీడియా చాలా రోజులుగా హడావుడి చేశాయి.. తీరా చూస్తే అసలు దీనిమీద చర్చే జరగలేదని అంబటి రాంబాబు అన్నారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎవరిని మోసం చేయాలని ఇలాంటి పనులు చేస్తున్నారు చంద్రబాబూ? అంటూ ప్రశ్నించారు.‘‘చంద్రబాబు శాలువాలు కప్పి బయటకు వచ్చారు. రెండు రాష్ట్రాలూ నాకు సమానమంటూ బడాయి మాటలు చెప్పి వచ్చేశారు. మంత్రి రామానాయుడు మాత్రం కమిటీ వేస్తున్నట్టు చెప్పి మళ్లీ మోసం చేయాలని చూశారు. విభజన సమస్యల పరిష్కారం కోసం అంటూ గతంలో ఇద్దరు సీఎంలు కలిశారు. ఆ రోజు కూడా తెగ బడాయి మాటలు చెప్పారు. తీరా చూస్తే ఏమీ జరగలేదు. కానీ వారి ఎల్లో మీడియా మాత్రం ఆహాఓహో అంటూ జాకీలు లేపింది..రాయలసీమకు నీరు అందించే ఆలోచనే చంద్రబాబు కు లేదు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి ఇంతకాలంలో రాయలసీమ కోసం ఒక్క పనైనా ఎందుకు చేయలేదు?. పోలవరంలో 42 మీటర్ల ఎత్తు ఉంటేనే బనకచర్లకు నీరు తీసుకెళ్లటానికి వీలవుతుంది. కానీ పోలవరాన్ని 41 మీటర్ల ఎత్తుకే ఆపేస్తే ఇక బనకచర్ల ఎలా సాధ్యం?. 2027కు పోలవరాన్ని పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు. కానీ ఆ స్థాయిలో పనులు జరగటం లేదని ఎల్లో మీడియానే రాసింది..డయాఫ్రం వాల్ నిర్మాణం1.6 మీటర్ల వెడల్పుతో వేయాల్సి ఉండగా కేవలం 0.9 మీటర్లకే వేస్తున్నారు. ఇది పోలవరం ప్రాజెక్టుకే అత్యంత ప్రమాదకరం. ప్రాజెక్టు నిర్మాణ సంస్థతో కుమ్మక్కై చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పోలవరాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశారు. సీడబ్ల్యుసీ, పోలవరం అథారిటీ వారు బనకచర్లకు అనుమతులు లేవని తేల్చిచెప్పింది. ఇది చంద్రబాబుకు సిగ్గుచేటు కాదా?..హంద్రీనీవా ప్రాజెక్టుకు నీరు వదలటానికి చంద్రబాబు వెళ్లటం ఏంటి?. మంత్రులో, అధికారులే చేసే చేసే పనిని చంద్రబాబు చేయటం సిగ్గుచేటు. హంద్రీనీవా కొత్త ప్రాజెక్టు కాదు. పోలవరం, అమరావతి విషయాలలో చంద్రబాబు దుర్మార్గపు పనులు చేస్తున్నారు. రాయలసీమకు చంద్రబాబు ఏనాడూ ఏమీ చేయలేదు. తప్పు ఒప్పో చూడకుండా పోలీసులు ఎలా కేసు పెడతారు?.జర్నలిస్టు కొమ్మినేని మీద ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు ఎలా పెడతారు?. జగన్ మీద కేసు ఎలా పెట్టారు?. పిన్నెళ్లి సోదరుల మీద హత్య కేసులు ఎలా పెడతారు?. పోలీసు అధికారుల సంఘం ముందు సమాధానం చెప్పాలి. ఇష్టానుసారం కేసులు పెడతామంటే చూస్తూ ఊరుకోం. జగన్ సమావేశానికి రైతులు వెళ్తే రౌడీషీట్లు ఓపెన్ చేస్తారా?. సోషల్ మీడియా కార్యకర్తలపై థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్టు కోర్టులు కూడా గుర్తించాయి. టీడీపీ నేతలు చెప్పినట్టు చేస్తూ కొందరు పోలీసు అధికారులు మాఫియా డాన్ లాగా వ్యవహరిస్తున్నారు’’ అని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘నాణ్యమైన మద్యం అందిస్తానని చెప్పిన ఏకైక సీఎం చంద్రబాబు మాత్రమే’
తాడేపల్లి : కళ్యాణదుర్గం ఎమ్మెల్యే దారుణాలకు దిగారని, మద్యం దుకాణాలపై కమీషనల్ల గుంజుతున్నారని మాజీ ఎంపీ తలారి రంగయ్య మండిపడ్డారు. ఇతరులకు వచ్చిన మద్యం షాపుల్ని సైతం లాగేసుకున్నారని ధ్వజమెత్తారు. భారీ స్థాయిలో మద్యం షాపుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని, కళ్యాణదుర్గంలో ఎక్కడ చూసినా కళ్యాణి వైన్స్ అనే పేరుతోనే మద్యం షాపులు ఎలా ఉన్నాయి? అని ప్రశ్నించారు. ఈ రోజు(గురువారం, జూలై 17) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన తలారి రంగయ్య.. ‘ దినేష్ అనే సాధారణ వ్యక్తికి వచ్చిన మద్యం షాపుని కూడా లాగేసుకున్నారు. ఒక ప్రజాసంఘాల నాయకుడిని సైతం బెదిరించి తమవైపు తిప్పుకున్న చరిత్ర స్థానిక ఎమ్మెల్యేది. కళ్యాణదుర్గంలో మూడు వేల బెల్టు షాపులు ఏర్పాటయితే ప్రభుత్వం ఏం చేస్తోంది?, నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం అందిస్తానని చెప్పిన సీఎంలను గతంలో చూశాం. కానీ నాణ్యమైన మద్యం అందిస్తానని చెప్పిన ఏకైక సీఎం చంద్రబాబు మాత్రమే. గ్రామాల్లో మంచినీరు దొరకటం లేదుగానీ మద్యం మాత్రం పుష్కలంగా దొరుకుతుంది. బెల్టుషాపుల కోసం వేలం వేసి రూ.12 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ప్రతి మద్యం సీసా మీద అధికంగా వసూలు చేస్తుంటే ఎక్సైజ్ శాఖ చోద్యం చూస్తోంది. మద్యం తాగి వాహనాలు నడుపుతూ జనం చనిపోతున్నారు. అయినా ప్రభుత్వానికి ఏం పట్టడం లేదుబెల్టు షాపులు పెడితే బెండు తీస్తానన్న చంద్రబాబు ఇప్పుడు ఏం చేస్తున్నారు?, రీకాల్ చంద్రబాబూస్ మేనిఫెస్టో కార్యక్రమంలో క్యూఆర్కోడ్ స్కాన్ చేస్తుంటే దానిపై దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలన్నీ కట్ అయిపోతాయంటూ జనాన్ని భయపెడుతున్నారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే దారుణంగా వ్యవహరిస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. -
మంత్రి కొల్లు ఇంటి ముందు వైఎస్సార్సీపీ మహిళా నేతల నిరసన
సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర ఇంటి ముందు వైఎస్సార్సీపీ మహిళా నేతలు నిరసనకు దిగారు. జడ్పీ ఛైర్ పర్సన్ ఉప్పాల హారికపై మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలపై మండిపడ్డారు. చీపుర్లతో కొల్లు రవీంద్ర ఫోటోలను కొడుతూ నిరసన వ్యక్తం చేశారు. ఉప్పాల హారికకు కొల్లురవీంద్ర క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ ద్రోహి కొల్లు రవీంద్ర అంటూ నినాదాలు చేశారు.మహానటి కంటే ఎక్కువ అంటే మీ ఇంట్లోవాళ్లేనా?. మీ ఇంట్లో ఆడవాళ్ల గురించైతే ఇలానే మాట్లాడతారా? అంటూ నిలదీశారు. ఉప్పాల హారిక భర్త రాముపై కేసు పెట్టడం దుర్మార్గం. తక్షణమే మంత్రి కొల్లు రవీంద్ర క్షమాపణ చెప్పాలి. ఉప్పాల హారికకు క్షమాపణ చెప్పేవరకూ మా పోరాటం ఆగదు’’ వైఎస్సార్సీపీ మహిళా నేతలు హెచ్చరించారు. -
దమ్ముంటే జగన్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి: తాటిపర్తి
సాక్షి, తాడేపల్లి: ఏడాదికి పైగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ అసమర్థ పాలనపై ప్రతిపక్షనేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మీడియా ద్వారా సంధించిన ప్రశ్నలకు జవాబు చెప్పే దమ్మూ, ధైర్యం కూటమి నేతలకు ఉందా? అంటూ యర్రగొండపాలెం ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ సవాల్ చేశారు.తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ప్రశ్నలకు బదులివ్వలేక వైఎస్సార్సీపీ పైనా, వైఎస్ జగన్ పైనా వ్యక్తిగత దూషణలకు దిగడం సిగ్గుచేటని అన్నారు. అక్రమ కేసులతో, ఎల్లో మీడియా ద్వారా విష ప్రచారంతో వైఎస్సార్సీపీని నిలువరించాలనుకోవడం చంద్రబాబు, లోకేష్ల అవివేకమని మండిపడ్డారు. ఇంకా ఆయనేమన్నారంటే..కూటమి ప్రభుత్వం విషపు కత్తులకు తేనె పూసి, వాస్తవాలను వక్రీకరిస్తూ, అవాస్తవాలను విస్తృతంగా ప్రచారం చేస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద విషం చిమ్ముతూ ప్రజల్లో విష గుళికలు చల్లడం టీడీపీకి నిత్యకృతమైపోయింది. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ మా పార్టీ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రెస్మీట్లో ప్రభుత్వానికి అనేక ప్రశ్నలను సంధించారు. వాటికి కూటమి దగ్గర సమాధానాలు లేక ఆయన మీద నిందలు మోపడానికి పచ్చ బ్యాచ్ సిద్ధమైపోయింది.ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే సమాధానం ఇచ్చుకోలేని దుస్థితిలోకి వెళ్లిన చంద్రబాబు. కొంతమంది దళిత సామాజికవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులను మీడియా ముందుకు పంపించి వ్యక్తిగత దాడికి దిగుతున్నారు. ఒక్క సంక్షేమ పథకం కూడా ఇవ్వకుండా అప్పులు తెచ్చిన ఈ డబ్బంతా ఏమైందని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. ప్రభుత్వం తరఫున నాదెండ్ల మనోహర్, వర్ల రామయ్య, హోంమంత్రి అనిత వంటి వారు మాట్లాడినా ఏ ఒక్కరూ సూటిగా సమాధానం చెప్పలేకపోయారు.దళిత ద్రోహి చంద్రబాబుఒక పక్క దళితులకు అందాల్సిన సంక్షేమ పథకాలను చంద్రబాబు ఎగ్గొట్టేస్తుంటే లబ్ధిదారుల తరపున ఆయన్ను ప్రశ్నించకుండా దళిత ఎమ్మెల్యేలు చంద్రబాబుని సంతృప్తి పరచడానికి సిగ్గులేకుండా జగన్ని తిట్టడానికి ప్రెస్మీట్లు పెడుతున్నారు. వైఎస్ జగన్ దళితులను ఇంట్లోకి కూడా రానిచ్చేవారు కాదని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అసందర్భంగా మాట్లాడుతున్నాడు. మా నాయకులు వైఎస్ జగన్తో కలిసి వారింట్లోనే వారి డైనింగ్ టేబుల్ మీద ఆయనతో కలిసి నేను రెండుసార్లు భోజనం చేశాను.నీకు చంద్రబాబుతో కలిసి ఆయన ఇంట్లోకి వెళ్లే అవకాశం దక్కిందా అని ప్రశ్నిస్తున్నా.? వైఎస్ జగన్ని తిట్టడానికే నక్కా ఆనందబాబును చంద్రబాబు వాడుకుంటున్నాడు. సినిమాల నేపథ్యంలో ఏర్పాటైన పార్టీ తెలుగుదేశం పార్టీ అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డ్రామా పార్టీ అని ఆనందబాబు చెప్పడం చూస్తుంటే ఆయన ఎంతటి అజ్ఞానో అర్థమవుతుంది. ఉన్నత చదువులు చదువుకున్న దళిత బిడ్డల్ని బహిరంగంగా రోడ్డు మీద అమానుషంగా లాఠీలతో కొడుతుంటే గలీజు బ్యాచ్, గంజాయి బ్యాచ్ అంటూ తాను పుట్టిన కులాన్నే అవహేళన చేసేలా ఆనందబాబు మాట్లాడాడు ఆయన సంస్కారానికి నిదర్శనం.దోపిడీని విజన్ గా ప్రచారం చేసుకుంటున్నారు..ఈ రాష్ట్రం తెలుగుదేశం పార్టీ సొత్తు అయినట్టు మేం తలచుకుంటే వైఎస్ జగన్ రాష్ట్రంలో తిరగలేడని మాట్లాడుతున్నారు. దమ్ముంటే తలచుకోమని సవాల్ చేస్తున్నా.. తెలుగుదేశం పార్టీకి పాలించమని ఐదేళ్లు ప్రజలు అధికారం ఇస్తే వారికి చేతకాక ఏడాదిలోనే ఓటేసిన ప్రజలతోనే ఛీకొట్టించుకుంటున్నారు. ప్రజా సమస్యలపై వారి పక్షాన నిలబడి వైఎస్సార్సీపీ పోరాడుతోంది. ప్రెస్మీట్లో అడిగిన ప్రశ్నలకే సమాధానం చెప్పలేక జగన్ని తిట్టిపోస్తున్న టీడీపీ నాయకులు పబ్లిక్ డిబేట్కి వస్తామని చెప్పడం మరింత విడ్డూరంగా ఉంది. కూటమి ప్రభుత్వంలో నిజాయతీ కలిగిన పోలీస్ అధికారులను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు.ప్రభుత్వం చెప్పినట్టు చట్టవిరుద్ధంగా పనిచేయలేక సిద్ధార్థ కౌశల్ వంటి యంగ్ డైనమిక్ ఐపీయస్ అధికారి రాజీనామా చేసి వెళ్లిపోయాడు. దీని గురించి వైఎస్ జగన్ ప్రెస్మీట్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు అసత్యాలను అస్త్రాలుగా చేసుకుని వ్యవస్థలను ధ్వంసం చేస్తూ తాను మాత్రం ఆర్థికంగా బలపడుతున్నాడు. ఆయన ఎత్తుగడలను వైఎస్సార్సీపీ సాగనివ్వదు.బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ పేరుతో ఇప్పటికే కూటమి పాలన మోసాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాం. పక్క రాష్ట్రాలు 12 శాతం జీఎస్టీ గ్రోత్ రేటును నమోదు చేస్తుంటే చంద్రబాబు మాత్రం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశాడు. సంపద సృష్టిస్తానని చెప్పి వికృత ఆలోచనలతో రాష్ట్రాన్ని తిరోగమనంలోకి తీసుకెళ్తున్నాడు. చంద్రబాబు చేతకానితనానికి ఇదే నిదర్శనం. చంద్రబాబు మోసాలను, వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కేసులకు భయపడి వైఎస్సార్సీపీ ఆపేది జరగదని గుర్తుంచుకోవాలి. -
‘గాలిలో గెలిచిన గాలిగాడు.. కౌన్సిలర్కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ’
సాక్షి, తిరుపతి: వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులతో వేధించడంపై పుత్తూరు కోర్టు వద్ద పోలీసులను మాజీ మంత్రి ఆర్కే రోజా నిలదీశారు. టీడీపీ, జనసేన కూటమి దిగజారుడు రాజకీయాల చేస్తున్నాయని.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నవారిపై తప్పుడు కేసులు పెడతున్నారని మండిపడ్డారు.గాలిలో గెలిచిన గాలిగాడు నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. రాజంపేట నుంచి తిరుపతి మీదుగా నగరికు వచ్చి తమిళనాడుకు టిప్పర్లతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ఏడాదిగా పోలీసులు, మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు?’’ అంటూ ఆర్కే రోజా ప్రశ్నించారుసుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినా కానీ సోషల్ మీడియా యాక్టివిస్టులను అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ఎమ్మెల్యే భాను ప్రకాష్ కౌన్సిలర్కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ. నగరి నియోజకవర్గం అక్రమ మైనింగ్, గంజాయికి అడ్డగా మారింది. నువ్వు చేసిన అక్రమాలు బయటకు తీస్తా.. నీ అవినీతి బయటకు కక్కిస్తా. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన మోసాలు ప్రజలు తెలుసుకున్నారు. తప్పుడు కేసులు కు భయపడం. మాకు వైఎస్ జగన్ అండగా ఉన్నారు. లక్ష 86 వేల కోట్లు అప్పులు చేసి చెత్త రికార్డు నమోదు చేశారు సీఎం చంద్రబాబు. వీళ్లను నమ్మి తప్పుడు కేసులు పెడుతున్న అధికారులు కచ్చితంగా శిక్ష అనుభవిస్తారు’’ అని ఆర్కే రోజా హెచ్చరించారు. -
ఇమేజీ బాగా డ్యామేజీ అవుతోంది బాబూ!
ఆంధ్రప్రదేశ్లో ఆటవిక రాజ్యం నడుస్తోందన్న భావన రోజు రోజుకూ బలపడుతోంది. తెలుగుదేశం పార్టీ నేతల ఆగడాలు రోజురోజుకు శ్రుతి మించుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులున్నా.. పోలీసులు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణం కూడా దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. ఇదే విషయానికి ‘‘బాబు ష్యూరిటీ- గుండాయిజం గ్యారంటీ..’’ శీర్షికతో సాక్షి ప్రచురించిన ఒక కథనం అద్దం పడుతోంది.కొద్ది రోజుల క్రితం ఒక స్వతంత్ర సంస్థ జరిపిన సర్వే కూడా ఏపీలో శాంతిభద్రతల పరిస్థితి బాగా దిగజారిందన్న అభిప్రాయం వ్యక్తమైంది. అత్యధిక శాతం ప్రజలు ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఏడాది పాలనలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సీఎం చంద్రబాబు నాయుడు తన పార్టీ నేతలను కోరుకున్నా అది ఆశించినంతమేర సాగడం లేదని సమాచారం. ప్రజల నుంచి ఎక్కడికక్కడ నిరసన వ్యక్తమవుతూండటంతో టీడీపీ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారట.ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుకు ప్రజలు పట్టుపడుతూండటంతో ఎమ్మెల్యేలు దిక్కుతోచని స్థితిలో పడ్డారని తెలుస్తోంది. ఇదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ ‘‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’’ అంటూ జనంలోకి వెళుతోంది. అన్ని నియోజక వర్గాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రజలకు చేసిన మోసాలను అంకెలతో వివరిస్తున్నారు. ఇది కాస్తా ప్రభుత్వానికి చికాకుగా మారింది. దీన్ని అడ్డుకునేందుకా అన్నట్టు టీడీపీ, జనసేనలు రెండూ వైసీపీ సభలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి.గుడివాడలో జరిగిన ఘటనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశాన్ని టీడీపీ వారు అడ్డుపడే ప్రయత్నం చేయడం ఏమిటి? పోలీసులు నిలువరించలేకపోవడం ఏమిటి? ప్రజాస్వామ్యంలో ఎవరైనా సమావేశాలు పెట్టుకోవచ్చు. జెడ్పీ ఛైర్పర్సన్ ఉప్పాల హారిక ప్రయాణిస్తున్న వాహనంపై దాడి చేయడం ఏమిటి? వాహనం అద్దాలు పగులగొట్టి మహిళ అని కూడా చూడకుండా అసభ్య పదజాలం వాడడం ఏమిటి?వైఎస్సార్సీపీ వారిపై నిత్యం ఏదో ఒక ఆరోపణ చేసి తామే మహిళోద్దారకులం అని చెప్పుకునే కూటమి పెద్దలు ఈ అంశంపై నోరు తెరవకపోవడం ఏమిటి? పైగా వాహనంలో ప్రయాణిస్తున్న హారిక భర్త రాముపై ఎదురు కేసు పెట్టారట. దాడి ఘటనపై కేసు పెట్టకపోవడంపై గట్టి హెచ్చరిక చేయడంతో టీడీపీ వారిపై కేసులు నమోదు చేసినా కీలకమైన వ్యక్తిపై మాత్రం పెట్టలేదట. అసలు అల్లరికి కారణమైన వ్యక్తిని వదలి వేస్తే ఏమిటి అర్థం? ఇదేనా పోలీసు వ్యవస్థ పనితీరు!నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడిచేసి విధ్వంసం సృష్టించిన వారిపై ఎందుకు చర్య తీసుకోలేదు? ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంతి చేసిన ఫిర్యాదుపై మాత్రం పోలీసులు వేగంగా స్పందించారు. ఎవరి తప్పు ఉన్నా కేసు పెట్టవచ్చు. కాని పోలీస్ యంత్రాంగం ఒక వైపే చూడడం ఏపీ స్పెషాలిటీగా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ ఎక్కడకు వెళ్లినా, పోలీసులు ఏదో రకంగా అడ్డం తగలడం, ఆ పార్టీ వారిపై కేసులు పెట్టడం నిత్యకృత్యంగా మారింది. జగన్ సత్తెనపల్లి టూర్కు సంబంధించి సుమారు 150 మందికి పోలీసులు నోటీసు ఇచ్చి విచారణ పేరుతో వేధిస్తున్నారని చెబుతున్నారు.అనంతపురం వద్ద లింగమయ్య అనే వైఎస్సార్సీపీ నేత హత్యకు గురైతే అక్కడకు జగన్ వెళ్లినప్పుడు కూడా ఇలాగే చేశారు. జగన్ హెలికాఫ్టర్ వద్ద సరైన సెక్యూరిటీ పెట్టకుండా, దాని విండ్ షీల్డ్ దెబ్బతింటే, వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి, ఇతర కార్యకర్తలపై కేసులు పెట్టారు. జగన్ మామిడి రైతుల పరామర్శకు బంగారుపాళ్యం వెళితే అక్కడా అదే తంతు. అసలు జగన్ పర్యటనలో 500 మించి పాల్గొనరాదని ఆంక్ష పెట్టి ఏమి సాధించదలిచారు.అయినా జనం వేలాదిగా తరలివచ్చారు అంటే అది జగన్ మీద అభిమానంతోనే కదా? దానిని తట్టుకోలేక ఇక్కడ కూడా ఏదో కారణం చూపి కొందరిని అరెస్టు చేశారు. పైగా చిన్న కేసులు పెట్టవలసిన చోట ఏకంగా నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టడం, వీలైతే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం వంటివి చేస్తున్నారు. పొగాకు రైతుల సమస్యపై పొదిలి వెళితే అక్కడకు టీడీపీ గూండాలను పోలీసులు ఎలా అనుమతించారు?వైఎస్సార్సీపీ రీకాలింగ్ చంద్రబాబు మానిఫెస్టో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తుండడం అధికార పార్టీ కూటమికి కంటగింపుగా మారింది. దానిని ఎలా ఎదుర్కోవాలో తెలియక వారే అల్లర్లు సృష్టిస్తున్నారు. దీంతో ఏపీలో ఒక రకమైన భయానక వాతావరణం నెలకొంటోంది. రాజకీయపరమైన వేధింపులే కాదు.. ఇతరత్రా కూడా అనేక సంఘటనలు ఏపీలో శాంతి భద్రతలను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఉదాహరణకు ముఖ్యమంత్రి నియోజకవర్గమైన కుప్పంలో అప్పు తీర్చలేదని ఒక మహిళను చెట్టుకు కట్టి హింసించిన ఘటన కలకలం రేపింది.మహిళలపై అత్యాచారాల ఘటనలు రిపోర్టు అవుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా శ్రీకాళహస్తిలో జనసేన ఇంఛార్జి కోట వినూత దంపతులు తమ వద్ద పనిచేసిన డ్రైవర్ శ్రీనివాసులును హత్య చేసిన ఉదంతం తీవ్ర సంచలనమైంది. వినూతకు, టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి మధ్య ఉన్న విబేధాల గురించి వస్తున్న వార్తలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఒక మహిళా నేతను బెదిరించడానికి బొజ్జల అనుసరించారని వస్తున్న ఆరోపణలు జుగుప్స కలిగిస్తాయి.అవి నిజమైతే అయితే ఈయనపై కూడా కేసు పెట్టాల్సి ఉంటుంది. ఈ వ్యవహారం పవన్ కళ్యాణ్కు తెలిసినా ఆయన పట్టించుకోలేదని వినూత దంపతులు చెబుతున్నారు. చెన్నై పోలీసులు ఈ కేసును పట్టుకున్నారు కాబట్టి ఈ మాత్రం అయినా వెలుగులోకి వచ్చింది. లేకుంటే హత్య ఘటనే ఎవరికి తెలియకుండా పోయేదేమోనన్న సందేహాలు వస్తున్నాయి. వినూతను ఎవరు, ఎందుకు బ్లాక్ మెయిల్ చేశారు, మొదలైన అంశాలు పూర్తిగా వెలుగులోకి రావల్సి ఉంది. ఈ హత్యపై వస్తున్న వార్తల గురించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ వంటివారు నోరువిప్పడం లేదు. ఇంకో వైపు కరేడు వద్ద భూ సేకరణ వివాదం, ఇండోసోల్కు గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన భూములు వెనక్కి లాక్కుని కరేడు వద్ద వివాదం సృష్టించడం అంటే ఆ పరిశ్రమను ఇబ్బంది పెట్టడమే కదా! రాజధాని అదనపు భూముల పూలింగ్ గొడవ, గతంలో ఒఒక మోసకారి నటిని పట్టుకు వచ్చి ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించడం, ఆ సందర్భంగా ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని జైలులో పెట్టడం, గత ప్రభుత్వంలో పనిచేసిన కొందరు ఐఏఎస్లు, ఐపీఎస్లను ఏదో ఒక కేసులో ఇరికిస్తుండడం, పలువురికి పోస్టింగ్లు ఇవ్వకపోవడం, కొంతమంది డీజీ స్థాయి అధికారులు పరిపాలన తీరుతెన్నులపై అసంతృప్తితో ఉండడం, చివరికి తమకు ఉద్యోగం వద్దని చెప్పి రాజీనామా చేసే వరకు వెళ్లడం వంటివి చంద్రబాబు ప్రభుత్వ ప్రతిష్టను బాగా దెబ్బతీస్తున్నాయి. ఐఏఎస్, ఐపీఎస్లను కూడా వేధిస్తున్నారన్న సమాచారం సహజంగానే దేశమంతటా తెలుస్తుంది. దాని వల్ల ఏపీ ఇమేజీ తీవ్రంగా డామేజి అవుతోంది. అయినా ఫర్వాలేదు.. తమకు రెడ్ బుక్కే ప్రధానమని టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి నేతలు భావిస్తే అది ఏపీ ప్రజలు చేసుకున్న ఖర్మ అనుకోవల్సిందే.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
విషం ఇచ్చి చంపేయచ్చుగా బాబు గారూ!.. టీడీపీకి బిగ్ షాక్?
సాక్షి, చీరాల: ‘తెలుగుదేశం పార్టీని నమ్మి చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరితే చివరకు నన్ను నిలువునా మోసం చేసి చంపేశారు. మూడు సార్లు నాకు అన్యాయమే జరిగింది. చివరి వరకు ఆశ పెట్టుకున్న చైర్మన్ పదవి కల్పించకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. ఏదైనా విషం ఇచ్చి చంపేయచ్చుగా బాబు గారూ..!’ బాపట్ల జిల్లా, చీరాల మున్సిపాలిటీ 18వ వార్డు కౌన్సిలర్ పొత్తూరి సుబ్బయ్య ఆవేదనా పూరిత వ్యాఖ్యలివి.వివరాల్లోకి వెళితే, మే 14న చైర్మన్ జంజనం శ్రీనివాసరావుపై అవిశ్వాస తీర్మానం పెట్టి నెగ్గిన అనంతరం, బుధవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. చైర్మన్ స్థానానికి పొత్తూరి సుబ్బయ్య, మించాల సాంబశివరావు, మామిడాల రాములు పేర్లు బలంగా వినిపించాయి. ఎన్నికకు జిల్లా మంత్రి కొలుసు పార్థసారథి విచ్చేయగా, ఎక్స్అఫిషియో సభ్యులుగా ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య హాజరయ్యారు. అధిష్టాన నిర్ణయం మేరకు సాంబశివరావు పేరును చైర్మన్గా ఎంపీ ప్రతిపాదించగా, ఆయన ఎన్నికయ్యారు.అప్పటి వరకు తనకే ఆ అవకాశం దక్కుతుందని గంపెడు ఆశతో ఉన్న సుబ్బయ్యకు తీవ్ర పరాభవం ఎదురైంది. వెంటనే ఆయన కౌన్సిల్ హాలు నుంచి కన్నీరు పెట్టుకుంటూ బయటకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చీరాల మున్సిపాలిటీలో ఆర్యవైశ్య సామాజికవర్గానికి 16 వేల ఓట్లు ఉన్నాయని, 83 శాతం ఓట్లు వేయించి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని గెలిపించామన్నారు. గతంలోనూ రెండు సార్లు తనకు చైర్మన్ పదవి విషయంలో అన్యాయం జరిగిందన్నారు. 14 రకాల ఆస్తులుంటే పార్టీ కోసం 12 అమ్ముకుని ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నానన్నారు. అమ్ముకోవడానికి ఇక మిగిలింది కిడ్నీలు, లివర్ మాత్రమేనని వాపోయారు. వైఎస్సార్సీపీని కాదనుకొని వస్తే.. ఇంత అన్యాయమా? వైఎస్సార్సీపీని కాదనుకొని టీడీపీలో చేరితే ఇంత అన్యాయం చేస్తారనుకోలేదని పొత్తూరి వాపోయారు. తాను ఇక పార్టీలో ఉండలేనని పేర్కొంటూ కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తానన్నారు. -
బాబైనా.. ట్రెండ్ సెట్టర్లను అనుసరించాల్సిందే!
ఫాలో ద లీడర్ అంటూ ఉంటారు చూడండి అదిప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది. పదవిలో ఎంత కాలం ఉన్నామన్నది కాదు.. ఉన్నది కొద్దికాలమైనా ఆ పదవిలోకి వచ్చే ఇతరులకు ఎంత ఆదర్శంగా నిలిచామన్నది ముఖ్యమంటారు. ఈ విషయాన్ని ఆంధప్రదేశ్ రాజకీయాలిప్పుడు రుజువు చేస్తున్నాయి. ప్రత్యేకించి దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విషయంలో ఆయన హయాంలో తీసుకొచ్చిన పాలన సంస్కరణలు, మార్పులు, స్కీములు, ప్రాజెక్టులను ఆ తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు కొనసాగించారు.విభజిత ఏపీలో 2019-2024 టర్మ్లో సీఎంగా ఉన్న వైఎస్ జగన్ సృష్టించిన వ్యవస్థలు, తెచ్చిన పథకాలను ప్రస్తుత టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అమలు చేయక తప్పడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో, విభజన తరువాత కూడా సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు తాను కూడా జగన్ తెచ్చిన వ్యవస్థలను కొనసాగిస్తానని, స్కీములను అమలు చేస్తామని, అంతకన్నా ఎక్కువ ఇస్తామని చెప్పేవారు. ఇది ఒక రకంగా నాయకుడిని అనుసరించడమే!కూటమి సర్కారు కూడా కొన్నింటిని మినహాయించి మిగిలిన వాటి విషయంలో జగన్ విధానాలనే అనుసరిస్తోంది. ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే కడప నగరంలో వెలిసిన ఒక ఫ్లెక్సీ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందడం వల్ల! అది అత్యంత ఆసక్తికరంగా ఉంది. జగన్కు ప్రజలలో వస్తున్న ఆదరణను గమనించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అతడిని ఎలా అనుసరిస్తున్నాడో వివరించారీ ఫ్లెక్సీలో! ఫ్లెక్సీలోని కొన్నింటి గురించి చూద్దాం..‘‘సంక్షేమం అంటే అంత ఇష్టం ఉండని ఆయనకు సంక్షేమం అంటే నేర్పించావు" అని ఒక కామెంట్ ఉంది దాంట్లో. నిజంగానే సంక్షేమ రంగంపై చంద్రబాబుది భిన్నాభిప్రాయం. ఇదే విషయాన్ని ఆయన చాలాసార్లు బహిరంగంగానే చెప్పుకున్నారు కూడా. ఎన్నికల సమయంలో మాత్రం జగన్ ఇచ్చేదానికంటే రెండు మూడు రెట్లు ఎక్కువే ఇస్తానని హామీ ఇచ్చినా, జగన్ ప్రవేశపెట్టిన పథకాల పేర్లు మార్చి మేనిఫెస్టోల్లో ఊదరగొట్టినా... గెలిచిన తరువాత మాత్రం సంపద సృష్టించే సంక్షేమం అమలు చేయాలని, సంక్షేమంతోనే అన్నీ జరిగిపోవని మాట్లాడిన విషయం ప్రజల దృష్టిలోనే ఉంది.పెన్షన్ ఒక వెయ్యి రూపాయలు పెంచడం మినహా ఏడాది పాటు మిగిలిన అన్ని పథకాలనూ కూటమి సర్కారు ఎగవేసింది. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న ఎన్నికల హామీ గెలుపు తరువాత ఒక్క సిలిండర్కే పరిమితమైంది. ప్రజల్లో వస్తున్న తీవ్రమైన వ్యతిరేకతను గుర్తించి ఏడాది తరువాత తల్లికి వందనం స్కీమును కొంత అమలు చేయక తప్పలేదు. అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం వంటి వాటిని అమలు చేస్తామని ప్రకటించారు. మొత్తమ్మీద జగన్ కారణంగా చంద్రబాబు సంక్షేమ రంగం వైపు చూడక తప్పలేదని చెప్పాలి.'ఎప్పుడూ లేనిది గెలిచిన వెంటనే కోడితో పోటీగా నిద్రలేచి పొద్దు, పొద్దునే బ్యాగు తగిలించుకుని అవ్వ,తాతలకు ఫించన్ డబ్బులు ఇచ్చేటట్లు చేశావు" అన్నది కడపలో వెలిసిన ఫ్లెక్సీలోని మరో వ్యాఖ్య. ఇది కూడా వాస్తవమే. 14 ఏళ్లు సీఎంగా ఉండగా ఏ రోజూ చంద్రబాబు ప్రతి నెల ఉదయాన్నే వెళ్లి ఫించన్లు పంపిణీ చేసిన దాఖలాలు లేవు. వృద్ధులే నానా తిప్పలూ పడాల్సి వచ్చేది. రెవెన్యూ ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వచ్చేది. జగన్ వలంటీర్ల వ్యవస్థ ద్వారా పింఛన్లను ఇళ్ల వద్దకే చేర్చేశారు. అధికారంలోకి వస్తే తానూ వలంటీర్లను కొనసాగిస్తానని ఉగాది నాడు దైవపూజ చేసి మరీ చెప్పిన చంద్రబాబు ఆ తరువాత దానికి మంగళం పాడారు. కాని జగన్ పెట్టిన పద్దతి మాత్రం పాటించక తప్పలేదు. ఆయన స్వయంగా కొందరు వృద్ధుల వద్దకు వెళ్లి ఫించన్ అందచేస్తున్నారు. ఇందుకు అనవసరంగా రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారనుకోండి. అది వేరే విషయం.నాడు-నేడు కార్యక్రమం ద్వారా బాగు చేసిన బడులకు వెళ్లి, ప్రభుత్వ స్కూళ్ల గురించి చంద్రబాబు మాట్లాడేలా చేశారన్నది మరో కామెంట్. నిజమే. విద్య అన్నది ప్రభుత్వ బాధ్యత కాదని ఎంతో ఘనంగా చెప్పిన ఘనత చంద్రబాబుది మరి. అలాంటి వ్యక్తి ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లి జగన్ తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులను స్వయంగా గమనించారు. ఆ క్రమంలో అక్కడ ఒక చోట రాసి ఉన్న నాడు-నేడు పదాలను చెరపడానికి స్కూల్ సిబ్బంది నానా పాట్లు పడాల్సి రావడం విశేషం. ఇష్టం ఉన్నా, లేకపోయినా, తండ్రి, కొడుకులు కుటుంబంలోని పిల్లలందరికి తల్లికి వందనం డబ్బులు ఇవ్వక తప్పలేదని అది కూడా జగన్ ఎఫెక్టే అన్నది ఆ ఫ్లెక్సీలోని మరో అంశం.కూటమి సర్కార్ జగన్ హయాంలో చేపట్టి ఓడరేవులు, వైద్య కళాశాలలు మొదలైన వాటిని ప్రామాణికంగా చూపి పెట్టుబడులను ఆకర్షిస్తోందన్నది కడపలో వెలసిన ఫ్లెక్సీలోని మరో కామెంట్. పెట్టుబడిదారుల సదస్సులలో ఏపీలో కొత్తగా వస్తున్న పోర్టుల గురించి చంద్రబాబు ప్రచారం చేశారు. అవన్ని జగన్ శ్రీకారం చుట్టినవే. గతంలో జగన్ ‘‘గడప గడపకు...’’ పేరుతో పార్టీ నేతలందరిని ప్రజల ఇంటింటికి పంపిస్తే ప్రస్తుతం చంద్రబాబు కూడా అదే తరహాలో కూటమి ఎమ్మెల్యేలు, కేడర్ను ‘‘తొలి అడుగు’’ పేరుతో ప్రజల వద్దకు పంపుతున్నారు.'నీ పర్యటనలు ఆపడానికి అష్టకష్టాలు పడి ఏమి చేయాలో అర్థం కాక ఆ బాధ అంతా మంత్రులపై తిట్ల దండకం అయ్యేలా చేశావ్’’ అన్నది ఇంకో కామెంట్. జగన్ టూర్లు, ఆయనకు ప్రజలలో వస్తున్న మద్దతు మొదలైనవాటిని గమనించిన చంద్రబాబు గత మంత్రివర్గ సమావేశంలో మంత్రులు పలువురిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్కు గట్టిగా జవాబు ఇవ్వలేకపోతున్నారని ఆయన వాపోయారని వార్తలు వచ్చాయి. జగన్ పర్యటనల ఫలితంగా కూటమి సర్కార్ ఆయా సమస్యలపై స్పందించక తప్పడం లేదు. మిర్చి ,పొగాకు, మామిడి రైతుల వద్దకు జగన్ వెళ్లి పరామర్శ చేయడంతో ప్రభుత్వం హడావుడి పడి కొంత నిధులు ఇవ్వడం, కేంద్రానికి లేఖలు రాయడం వంటివి చేసింది. 'నీకు 11 సీట్లే వచ్చినా పాలన అంతా నీ కనుసన్నలలోనే జరుగుతా ఉన్నట్లు ఉంది జగనూ" అన్న వ్యాఖ్య ఈ ఫ్లెక్సీలో కొసమెరుపు. ఈ ఫ్లెక్సీపై ఎవరి పేరైనా ఉంటే ఈపాటికి రెడ్ బుక్ ప్రయోగం జరిగేదేమో! గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని అంటే, అలా చేస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరవేసుకోవల్సిందేనని చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కాని వైఎస్సార్ ముఖ్యమంత్రై రైతులకు ఉచిత విద్యుత్ అందించారు. ఆ తర్వాత కాలంలో చంద్రబాబు తాను ఇంకా ఎక్కువ సమయం ఉచిత విద్యుత్ ఇస్తానని ప్రకటించారు.గత టరమ్లో కాని, ఇప్పుడు కాని అది కొనసాగుతూనే ఉంది. వైఎస్ తీసుకు వచ్చిన ఆరోగ్యశ్రీని తొలుత టీడీపీ వ్యతిరేకించింది. కాని తదుపరి అది కూడా అమలు చేయక తప్పలేదు. ఫీజ్ రీయింబర్స్ మెంట్ స్కీముల విషయం కూడా అంతే. వైఎస్ చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులను కాని, హైదరాబాద్ చుట్టూరా జరిగిన అభివృద్ది కాని తన ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు చేసే ప్రసంగాలు కూడా వైఎస్ పాలనను గుర్తు చేస్తాయి. అలాగే గత టరమ్లో వైఎస్ జగన్ తీసుకువచ్చిన గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్స్, భూముల రీసర్వే తదితర కార్యక్రమాలను చంద్రబాబు ప్రభుత్వం కూడా అమలు చేస్తోంది.ఎన్టీఆర్ కాలంలో పరిపాలనను మండల స్థాయికి తీసుకు వెళితే, జగన్ ప్రజల వద్దకు పాలనను గ్రామ స్థాయికి తీసుకువెళ్లి ఎంతో సదుపాయం కలిగించారు. కాకపోతే జగన్ తెచ్చిన స్కీములను కాదనలేక కొన్నిటిని నీరు కార్చడానికి చంద్రబాబు యత్నిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అయినా సుదీర్ఘకాలం సీఎంగా ఉన్న చంద్రబాబు ఇలా ఎన్ని వ్యవస్థలను ప్రజలకు ఉపయోగపడేలా తేగలిగారన్నది చర్చనీయాంశం. ఆయన గతంలో ఇంకుడు గుంతలు, జన్మభూమి వంటివాటిని ప్రవేశపెట్టారు. కాని వాటిని ఆయనే కొనసాగించలేకపోయారు.ప్రస్తుతం అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో లక్షల కోట్ల వ్యయం చేయాలని చంద్రబాబు తలపెట్టారు. దాని ప్రభావం ఇతర ప్రాంతాలలో ఎలా ఉంటుందో అప్పుడే చెప్పలేం. వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్లతో పోల్చితే చంద్రబాబుకు విశేషమైన అవకాశాలు వచ్చినా వాటిని సామాన్య ప్రజల కోసం కాకుండా ధనవంతుల ప్రయోజనాల కోసం చేశారన్నది సర్వత్రా ఉన్న అభిప్రాయం. ఇప్పుడు తనకంటే చిన్నవాడైన జగన్ ప్రభుత్వంలో అమలు అయినవాటిని చంద్రబాబు అనుసరించవలసి రావడం చారిత్రక సత్యం అని ఒప్పుకోవాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కూటమి ప్రభుత్వ శ్రేణుల బరితెగింపు.. టీడీపీ అధిష్టానం ఆదేశిస్తే..
సాక్షి,ఎన్టీఆర్ జిల్లా: కూటమి ప్రభుత్వంలో ఆ పార్టీ శ్రేణులు బరితెగిస్తున్నారు. అధిష్టానం అనుమతిస్తే వైఎస్సార్సీపీ నేతల అంతు చూస్తామని బహిరంగంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాజాగా,నందిగామలో టీడీపీ కార్యకర్త బెదిరింపులకు దిగాడు.ఎమ్మెల్సీ అరుణ్ కుమార్తో పాటు వైఎస్సార్సీపీ నాయకుల్ని చంపేస్తానంటూ బహిరంగంగా బెదిరింపులకు దిగాడు. టీడీపీ అధిష్టానం అనుమతిస్తే 24 గంటల్లోనే వైఎస్సార్సీపీ నేతలను రప్పా రప్పా రంపంతో కోసేస్తాని కంచికచర్ల టీడీపీ కార్యకర్త అజయ్ వీడియోలు పోస్టు చేశాడు. ఆ వీడియోలపై వైఎస్సార్సీపీ నేతలు కంచికచర్ల పోలీసుల్ని ఆశ్రయించారు. టీడీపీ కార్యకర్త అజయ్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. -
దెబ్బ తిన్న వాళ్లు రేపు నా మాట కూడా వినరు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వ పాలనలో ఏం జరుగుతోంది అన్నది అందరూ చూస్తున్నారు.. చంద్రబాబు తనను తాను ప్రశ్నించుకోవాలి అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. బీహార్లో ఉన్నామా? ఆటవిక రాజ్యంలో ఉన్నామా అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యేలపై దాడులు చేయడమేంటి?. ప్రజా ప్రతినిధులకు పోలీసులు గన్ చూపించి బెదిరిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘తాడిపత్రిలో ఓ మాజీ ఎమ్మెల్యే (కేతిరెడ్డి పెద్దారెడ్డి) తన సొంత ఇంటికి వెళ్లలేని పరిస్థితి ఉంది. హైకోర్టు ఆదేశాలున్నా.. పోలీసులు అడ్డుతగులుతున్న పరిస్థితి కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యేకు పోలీసులు.. గన్ చూపించమేంటి?. మనం ఎక్కడ ఉన్నాం. ఆరు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిపై పచ్చ సైకోలు.. అదీ పోలీసుల సమక్షంలోనే దాడికి ప్రయత్నించారు. పోలీసులు అక్కడే ఉన్నా.. పచ్చ బ్యాచ్ను అడ్డుకోలేదు. ఆటవిక రాజ్యంలో ఉన్నామా?. చంద్రబాబు తనను తాను ప్రశ్నించుకోవాలి.బాధితుడు నల్లపురెడ్డి మీదనే కేసు పెట్టారు. ఇది శాడిజం కాదా?. కాకాణి, వంశీ, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి, నందిగం సురేష్, పిన్నెల్లి, పోసాని సహా ఎంతో మందిపై తప్పుడు కేసులు పెట్టారు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్పై కూడా కేసు పెట్టారు. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి మచ్చ లేని అధికారులు. వారి మీద కూడా అక్రమ కేసులు పెట్టారు. ఎంతో మంది అమాయకులపైనా తప్పుడు కేసులు బనాయించారు. తప్పుడు వాంగ్మూలతో ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు రాజకీయాల్లో దుష్ట సంప్రదాయం తెచ్చారు. మా ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు పరిస్థితి ఏంటి?. చంద్రబాబు నీ తప్పుడు సంప్రదాయం విష వృక్షం అవుతుంది. మా ప్రభుత్వం వచ్చాక ప్రతి చర్యగా వీళ్లు కూడా ఇదే చేస్తే పరిస్థితి ఏంటి?. చంద్రబాబు ఇప్పటికైనా మారకపోతే వ్యవస్థ ఎవరి చేతుల్లో ఉండదు. దెబ్బ తగిలిన వాడికే బాధ తెలుస్తుంది. మేం అధికారంలోకి వచ్చాక మా వాళ్లు నా మాట కూడా వినరు. ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదు. మా ప్రభుత్వం వచ్చాక వడ్డీ సహా చెల్లిస్తాం.’ అంటూ హెచ్చరించారు. -
బాలకృష్ణ, పవన్ సినిమాల్లో దారుణమైన డైలాగులే ఉంటున్నాయ్: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: గుమ్మడి కాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు.. సినిమా డైలాగులు, పాటలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఏపీలో నెలకొన్నాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం ప్రెస్మీట్లో ఆయన ఈ అంశంపై మాట్లాడారు. గుమ్మడి కాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకుంటున్నారు. సినిమా డైలాగులు కొట్టినా.. పోస్టర్లు పెట్టినా కేసులు పెడుతున్నారు. సెన్సార్ బోర్డు ఎందుకు ఉంది? అలాంటప్పడు సినిమాలు తీయడం ఎందుకు?. అసలు సినిమా డైలాగులతో చంద్రబాబుకి వచ్చే నష్టం ఏంటి?. బాలకృష్ణ, పవన్ కల్యాణ్ సినిమాల్లో అంతకంటే దారుణమైన డైలాగులు ఉంటున్నాయి. మరి వాటి సంగతి ఏంటి?. ఇదేనా ప్రజాస్వామ్యం?.. ఏపీలో సినిమా డైలాగులను ప్రదర్శించారని.. ఇద్దరిని రిమాండ్కు పంపించారు. మరో 131 మందికి నోటీసులు ఇచ్చారు. రోజంతా పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టి వేధిస్తున్నారు. ఛార్జ్షీట్లో అదర్స్ అని పెట్టి.. వాళ్లకు కావాల్సిన వాళ్లను అందులో ఇరికించి ఇబ్బంది పెడుతున్నారు.ప్రజాస్వామ్యంలో మంచి చేసి మనసులు గెలుచుకుని తగ్గేదే లే(మేనరిజం ప్రదర్శించారు) అను. అది సత్తా. అంతేతప్ప అన్యాయమైన పాలన చేస్తూ .. ప్రశ్నిస్తే కేసులు పెట్టడం దారుణమని వైఎస్ జగన్ అన్నారు. -
హారికను అనకూడని మాటలు అన్నారు: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: రాజకీయ పార్టీకి ఉండాల్సిన మౌలిక హక్కులపై నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకి అవగాహన లేదా? అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రశ్నించారు. బుధవారం వైఎస్సార్సీపీ కేంద్రకార్యాలయంలో నిర్వహించిన ప్రెస్మీట్లో.. గుడివాడ జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక దాడి ఉదంతాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు రాజకీయ పార్టీలకు ఉండదా?. ప్రజలను చైతన్యవంతుల్ని చేయడం, మీటింగ్లు పెట్టుకోవడం.. ఇవన్నీ హక్కులే కదా. మరి రాజకీయ పార్టీకి ఉండాల్సిన మౌలిక హక్కులు నలభై ఏళ్ల రాజకీయానుభవం ఉన్న చంద్రబాబుకి తెలీదా? అని జగన్ ప్రశ్నించారు.గుడివాడలో దాడిని రాష్ట్రం మొత్తం చూసింది. మహిళా జెడ్పీ చైర్పర్సన్పై దాడి చేశారు. బీసీ మహిళ ఉప్పాల హారికపై దాడి దుర్మార్గం. నా సోదరి హారిక మీద టీడీపీ సైకోలు దాడి చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటే.. పోలీసుల సమక్షంలో ఇది జరిగింది. రాష్ట్రంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఒక బీసీ మహిళకు ఆత్మగౌరవం లేదా?.. ఇంతమంది సైకోలుగా, శాడిస్టులుగా ప్రవర్తిస్తారా?.. పథకం పన్ని నా చెల్లి హారికపై చేసిన దాడి దుర్మార్గం.హరికను అనకూడని మాటలు అన్నారు. మళ్లీ మహానటి అంటూ ఆమెనే ఎద్దేవా చేస్తున్నారు. దానవీరశూరకర్ణ కంటే గొప్పగా నటించేంది చంద్రబాబే. స్పష్టంగా ఆధారాలు ఉంటే ఎంత మంది మీద కేసు పెట్టారు?. తిరిగి హారిక భర్త రాము మీదే తప్పుడు కేసు పెట్టారు. చంద్రబాబు ఈ విషయమై అడుగుతున్నా.. పెడనలో సభ పెట్టిన వైఎస్సార్సీపీ నేతలందరిపై కేసు పెట్టారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఇంకా ఎక్కడైనా ఉన్నామా?. చంద్రబాబు చేసే ప్రతిపనిలో డైవర్షన్ పాలిటిక్సే అని జగన్ అన్నారు.