breaking news
Alluri Sitarama Raju
-
రైలు ఇంజన్పై పడ్డ బండరాయి.. తప్పిన పెను ప్రమాదం
సాక్షి, అల్లూరి జిల్లా: అల్లూరి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఐరన్ లోడ్తో వెళ్తున్న రైలు ఇంజన్పై బండరాయి పడింది. దీంతో గూడ్స్ రైలు ఇంజన్ ముందు భాగం దెబ్బతింది. ఇవాళ (అక్టోబర్ 19, ఆదివారం) తెల్లవారుజామున తైడా- చిమిడిపల్లి రైల్వే స్టేషన్ల మధ్య ఘటన జరిగింది. కొత్తవలస-కిరండోల్ లైన్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.విశాఖ- కిరండోల్, కిరండోల్-విశాఖ రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఆ మార్గంలో రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది తక్షణమే ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.ఇదీ చదవండి: ధనత్రయోదశి ప్రభావం.. బంగారం ఎంత కొన్నారంటే? -
సేంద్రియ సాగుతో అధిక దిగుబడులు
అవగాహన కల్పిస్తున్న ఉద్యానవన పరిశోధన స్థానం శాస్త్రవేత్త బిందు చింతపల్లి: గిరిజన రైతులు జీవనియంత్రణ పద్ధతులపై అవగాహనతో పసుపు, మిరియా లు పంటల్లో అధిక దిగుబడులు సాధించవచ్చని ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త శెట్టి బిందు అన్నారు. ఉద్యాన పరిశోధన స్థానంలో గిరిజన రైతులకు అంబాజిపేట ఏఐిసీఆర్ిపీ బయో కంట్రోల్ ఆధ్వర్యంలో జీవనియంత్రణ పద్ధతులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పసుపు,అల్లం మిరియాలు వంటి పంటల్లో అధిక దిగుబడులు సాధించడానికి సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అవలంభించాలన్నారు. టాటా ట్రస్టు సాంకేతిక నిపుణుడు అప్పలరాజు, రైతులు, స్థానికులు పాల్గొన్నారు. -
బాలికల విద్యాభివృద్ధికి కృషి
రంపచోడవరం/గంగవరం : బాలికల విద్యాభివృద్ధికి, మహిళా సాధికారతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని జిల్లా బాలికా శిశు సంరక్షణ అధికారి ఎం.కవిత అన్నారు. శుక్ర,శనివారాలు రెండు రోజుల పాటు ఆమె రంపచోడవరం డివిజన్లో విస్తృతంగా పర్యటించారు. గంగవరం మండలంలో గంగవరం గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికోన్నత పాఠశాల, కొత్తాడ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని రంపచోడవరంలో ఇర్లపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా బాలికలకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. వృత్తి విద్యా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ఆమె సూచించారు. ఆయా పాఠశాలల, విద్యాలయాల్లో వృత్తి విద్యాకోర్సులపై ఆమె ఆరా తీశారు. హెచ్ఎం వరలక్ష్మి, వృత్తి విద్యా ట్రైనర్స్ సుష్మా, భాగ్యలక్ష్మి, కొత్తాడ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ ప్రిన్సిపాల్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. -
పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కృషి
అడ్డతీగల/గంగవరం/రాజవొమ్మంగి: రంపచోడవరం డివిజన్లో పర్యాటక ప్రాంతాలను గుర్తించి, అభివృద్ధి చేసేందుకుచర్యలు చేపట్టనున్నట్టు రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి స్మరణ్ రాజ్ తెలిపారు.పర్యాటక ప్రాంతాలను గుర్తించేందుకు శనివారం రంపచోడవరం మండలంలోని ఐ.పోలవరం, బీరంపల్లి,రాజవొమ్మంగి మండలంలోని జడ్డంగి, సింగంపల్లి, గంగవరం మండలంలోని పెద్ద అడ్డపల్లి గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమైన ప్రాంతాలను ఎంపిక చేసి, అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు.ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందితే గిరిజన యువతీయువకులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. రాజవొమ్మంగి మండలంలోజాతీయ రహదారి 516ఇకి ఇరువైపులా గల ప్రభుత్వ భూములను ఆయన పరిశీలించారు. ఎన్హెచ్కు ఇరువైపుల విశ్రాంతి భవనాలు, సులభ కాంప్లెక్సులు, తాగునీటి సౌకర్యం కల్పన తదితర ఏర్పాట్ల పై ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పీవో తెలిపారు. వేటమామిడిలో సమస్యల పరిష్కారానికి కృషి అడ్డతీగల మండలం వేటమామిడిలో సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఐటీడీఏ పీవో తెలిపారు. ఈ గ్రామంలో జరిగిన గ్రామ సభలో ఆయన మాట్లాడారు. ముందుగా గ్రామ సమస్యలు తెలుసుకున్నారు. కమ్యూనిటీ హాల్, డ్రైనేజీ ఏర్పాటు చేయాలని, పూర్తిస్థాయిలో తాగునీరు సరఫరా చేయాలని గ్రామస్తులు ప్రాజెక్ట్ అధికారిని కోరారు. వెంటనే స్పందించిన ఆయన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. తహసీల్దార్లు బాలాజీ, దొరకయ్య, సత్యనారాయణ, అడ్డతీగల మండల పరిషత్ అధ్యక్షుడు రాఘవ,గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఐ. శ్రీనివాసరావు, మండల సర్వేయర్ లక్ష్మణ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సీహెచ్ నిర్మల తదితరులు పాల్గొన్నారు. -
సరిహద్దు వంతెనకు నిర్లక్ష్య గ్రహణం
ముంచంగిపుట్టు: ఆంధ్ర– ఒడిశా రాష్ట్రాలను కలుపుతూ సరిహద్దులోనిర్మించే జోలాపుట్టు వంతెనకు నిర్లక్ష్య గ్రహణం పట్టింది.దీంతో ఇరు రాష్ట్రాల ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారు. 10 సంవత్సరాలుగా వంతెన పనులు అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి. పనులు పూర్తి చేయాలని పలుమార్లు సరిహద్దు గ్రామాల గిరిజనులు అప్పటి కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల దృష్టికి తీసుకు వెళ్లినా హామీలతో సరి పెట్టారు.చివరికి వంతెన నిర్మాణ వ్యయం పెరగడంతోకాంట్రాక్టర్ పనులు నిలుపుదల చేశారు. 2014 సంవత్సరంలోఅప్పటి కాంగ్రెస్ ఎంపీ కిషోర్ చంద్రదేవ్ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసి,శిలాఫలకం ఆవిష్కరించారు. రూ. 5 కోట్ల ఎంపీ నిధులతో వంతెన నిర్మాణం ప్రారంభించారు.దీంతో ఇరు రాష్ట్రాల ప్రజలకు రవాణా కష్టాలు తీరుతాయని అందరూ భావించారు. కానీ అప్పటి పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా వంతెన పనులు పునాది స్థాయిలోనే నిలిచిపోయాయి. వంతెన నిర్మాణానికి ఒడిశా ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని ప్రచారం జరుగుతోందని,కానీ ఈ విషయమై ఒడిశా ప్రభుత్వం ఎక్కడా ప్రకటనలు చేయలేదు. తాత్కాలిక వంతెనపై రాకపోకలు 2006 సంవత్సరంలో వరద నీటి ఉధృతికి సరిహద్దును కలుపుతూ ఉన్న ఐరెన్ వంతెన కొట్టుకుపోవడంతో అప్పటి నుంచి ఇరు రాష్ట్రాలకు రవాణా కష్టాలు మొదలయ్యాయి. జోలాపుట్టులో గల జలాశయాలపై ఉన్న వంతెనలపై రాకపోకలు చేసేవారు. అయితే ఈ మార్గంలో రాకపోకల వల్ల జలాశయానికి గండి పడే ప్రమాదం ఉంది. దీంతో భారీ వాహనాల రాకపోకలనుజలాశయ అధికారులు నిలుపుదల చేశారు. ద్విచక్రవాహనాలు, పాదచారుల కోసం ఆ పక్కనే జలాశయ అధికారులు తాత్కాలిక ఐరెన్ వంతెనను ఏర్పాటు చేశారు. దీనిపై నుంచి విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే జలాశయం నుంచి నీరు విడుదల చేసినప్పుడు, వర్షాలు కురిసే సమయంలో ఈ వంతెన పై నుంచి నీరు ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వాహనాలు మూడు కిలో మీటర్లు ప్రయాణం చేసి,జలాశయంపై నుంచి రావాల్సిన పరిస్థితి నెలకొంది.సరిహద్దు ప్రజల రవాణా కష్టాలను తీర్చేవిధంగా చొరవ తీసుకోవాలని,వెంటనే ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు సరిహద్దు వంతెనపై దృష్టి పెట్టి నిధులు మంజూరు చేసి తమ కష్టాలు తీర్చాలని ఆంధ్ర, ఒడిశా సరిహద్దు గిరిజనులు కోరుతున్నారు.పునాది స్థాయిలో నిలిచిపోయిన వంతెననిధులు మంజూరు చేయాలి వంతెన పూర్తయితే ఇరు రాష్ట్రాల ప్రజల రాకపోకలు ఇబ్బందులు తొలగుతాయని అనుకొన్నాం. కానీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా నిధులు వెనక్కి వెళ్లిపోయాయి. దీంతో తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నాం. ఇరురాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించి,నిధులు మంజూరు చేసి రవాణా కష్టాలు తీర్చాలి. – శేఖర్, జోలాపుట్టు గ్రామస్తుడు. ముంచంగిపుట్టు మండలం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం జోలాపుట్టు వంతెన నిధులు ఎప్పుడో వెనక్కి వెళ్లిపోయాయి. టెండర్ కూడా రద్దయింది. స్థానికులు పలుమార్లు వంతెన సమస్యను మా దృష్టికి తీసుకొచ్చారు. మేం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. నిధుల మంజూరు కోసం వేచి చూస్తున్నాం. – రాయుడు, ట్రైబల్ వెల్ఫేర్ ఏఈ, ముంచంగిపుట్టు మండలం 10 ఏళ్లగా రాకపోకలకు ఆంధ్ర,ఒడిశా రాష్ట్రాల ప్రజల అవస్థలు నిధులు వెనక్కి వెళ్లిపోవడంతో నిలిచిన పనులు ఇరురాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించాలని కోరుతున్న సరిహద్దు ప్రజలు -
అనధికార మద్యం, డ్రగ్స్పై పటిష్ట నిఘా
మహారాణిపేట: జిల్లాలో అనధికార మద్యం అమ్మకాలు జరగకుండా గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో పటిష్టమైన నిఘా ఉంచాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో ఎకై ్సజ్, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, జోనల్ కమిషనర్లతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ కీలక సూచనలు చేశారు. అక్రమ మద్యం అమ్మకాలపై సమాచారం అందించడానికి గ్రామ/వార్డు కార్యదర్శులు, వీఆర్వోలు, వీఆర్ఏలు, శానిటేషన్ సిబ్బంది ఎకై ్సజ్ శాఖకు సహకరించాలన్నారు. గంజాయి, గంజాయి చాక్లెట్లు వంటి మాదక ద్రవ్యాల అమ్మకాలను కూడా పసిగట్టి నిరోధించాలని ఆదేశించారు. స్థానికంగా మద్యం తయారీ లేదా కల్తీ మద్యం అమ్మకాలు జరగకుండా నిరంతర పర్యవేక్షణ ఉంచాలని, లేబుల్ లేని బాటిల్స్ అమ్మకూడదని స్పష్టం చేశారు. తక్కువ రేటుకు వస్తోందని నాసిరకం మద్యం తాగవద్దని ప్రజలకు సూచించారు. ప్రభుత్వం బ్రాండెడ్ మద్యాన్ని మాత్రమే సరఫరా చేస్తుందని వివరించారు. అనుమతి లేని దుకాణాలు, లైసెన్సు రద్దయిన బార్లు, దాబాలు, అలాగే పాత భవనాలు, చీకటి ప్రదేశాలు, శ్మశాన వాటికల వద్ద మద్యపానం జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్వయంశక్తి సంఘాల మహిళలకు అక్రమ మద్యం నిరోధంపై అవగాహన కల్పించాలని సూచించారు. ఎకై ్సజ్ సూపరిండెంటెంట్ ఆర్.ప్రసాద్ మాట్లాడుతూ.. అక్రమ మద్యం గుర్తించడానికి ప్రభుత్వం ‘ఏపీ ఎకై ్సజ్ సురక్ష యాప్’ను తీసుకొచ్చిందని, దీని ద్వారా ప్రతి బాటిల్ను స్కాన్ చేసి అమ్మకాలు చేయాలని సూచించారు. బెల్ట్ షాపుల సమాచారంపై ఎకై ్సజ్ సిబ్బంది చర్య తీసుకోకపోతే నేరుగా తన దృష్టికి తీసుకురావాలన్నారు. సమావేశంలో జేసీ మయూర్ అశోక్, జెడ్పీ సీఈవో నారాయణమూర్తి తదితర అధికారులు పాల్గొన్నారు. -
బంతి...ధరల కాంతి
● దీపావళి సందర్భంగా పెరిగిన ధర ● బుట్టడు పూలు రూ.150 ● కొనుగోలుకు పోటీపడిన వర్తకులు ● గిరి రైతుల ఆనందంసాక్షి, పాడేరు: జిల్లాలో బంతి పూలకు భలే డిమాండ్ ఏర్పడింది. దీపావళి పండగ నేపథ్యంలో మన్యంలోని బంతిపూలకు గిరాకీ ఏర్పడింది.తెలుగు రాష్ట్రాలతో పాటు ఈఏడాది తొలిసారిగా ఒడిశాలోపలు ప్రాంతాలకు చెందిన వ్యాపారులు కూడా పూలను కొనుగోలు చేసేందుకు పోటీ పడ్డారు. పాడేరు పాతబస్టాండ్లో శనివారంమార్కెట్కు గిరిజనులు భారీగాబంతిపూలను తీసుకువచ్చారు. బుట్టడు బంతి పూలను రూ.150లకు వర్తకులు కొనుగోలు చేశారు. హుకుంపేట, పాడేరు, పెదబయలు, జి.మాడుగుల మండలాల పరిధిలోని పలు గ్రామాల గిరిజనులు ఉదయం నుంచే పూల అమ్మకాలను చేపట్టారు. మధ్యాహ్నం వరకు సీతమ్మకాటుక (చిన్నబంతి) రకం పూల వ్యాపారం పోటాపోటీగా జరిగింది. ముద్దబంతి పూలను బుట్ట రూ.100లకువ్యాపారులు కొనుగోలు చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఈ పూలను కొనుగోలు చేసి విశాఖ, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, హైదరాబాద్ ప్రాంతాలకు తరలించారు. ఒడిశా వ్యాపారులు తమ రాష్ట్రానికి వ్యాన్ల ద్వారా పూలను రవాణా చేశారు. పండగవేళ ఆదాయం దీపావళి పండగ సందర్భంగా బంతిపూల అమ్మకాలు పెరగడంతో గిరిజన రైతులకు మంచి ఆదాయం లభించింది. శుక్రవారం నుంచి బంతిపూల ధరలు పెరగడంతో బుట్ట పూలకు రూ.150 వరకూ ధర లభించింది.ప్రతి గిరిజన రైతు పాడేరు మార్కెట్లో రోజుకు ఐదు నుంచి పది బుట్టల వరకు బంతిపూలను విక్రయిస్తున్నారు.కార్తీకమాసం ప్రారంభం కానుండడంతో బంతిపూల ధర మరింత పెరగనుంది.ఒడిశా పూల వ్యాపారులు నేరుగా వాహనాలతో పాడేరు మార్కెట్కు వచ్చి బుట్ట పూలను రూ.150 ధరతో కొనుగోలు చేస్తుండడంతో పోటీ ఏర్పడింది. స్థానిక వ్యాపారులు కూడా అదే ధరతో కొనుగోలు చేస్తుండడంతో గిరిజన రైతులకు కలిసి వచ్చింది. గిరిజన రైతులు పూలసేకరణ,అమ్మకాలతో బిజీగా ఉన్నారు. ధర పెరిగింది బంతి పూలకు గిరాకీ ఏర్పడింది. గత వారం బుట్ట ధర రూ.30 నుంచి రూ. 50 వరకు ఉంటే ఈవారం రూ.150 నుంచి రూ.200 పైబడి ఉంది. వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేశారు. –బి.చిట్టిబాబు, డి.చింతలవీధి, హుకుంపేట మండలం గిట్టుబాటు ధర లభించింది ఈవారం బంతి పూలకు మంచి ధర లభించింది. ఈవారం నుంచి అయ్యప్ప స్వాముల సంఖ్య పెరగడంతో పూలకు గిరాకీ ఏర్పడింది. దీంతో మాకు గిట్టుబాటు ధర లభిస్తోంది. –కిముడు శాంతికుమారి, రైతు,కుమరిపుట్టు, పాడేరు మండలం. -
70 కిలోల గంజాయి పట్టివేత
డుంబ్రిగుడ: మండలకేంద్రం డుంబ్రిగుడలో శనివారం 25 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ కె.పాపినాయుడు తెలిపారు. స్థానిక కస్తూర్బా గాంధీ పాఠశాల వద్ద వాహన తనిఖీలు చేస్తున్న సమయంలో ఒడిశా నుంచి ఆటోలో మైదాన ప్రాంతానికి తరలిస్తున్న గంజాయి పట్టుబడినట్టు చెప్పారు. గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి, వారి నుంచి ఆటోతో పాటు మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన పాంగి లొబ్బొతో పాటు ముంచంగిపుట్టు మండలానికి చెందిన దురియ విజయ్, కొర్రా నీలకంఠంపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్టు ఎస్ఐ తెలిపారు. అంతకుముందు మండల కేంద్రంలో సర్పంచ్ వెంకటరావు ఆధ్వర్యంలో పరివర్తన కార్యక్రమం నిర్వహించారు. ముంచంగిపుట్టు: జోలాపుట్టు పంచాయతీ లబ్బూరు జంక్షన్ వద్ద శనివారం 45 కిలోల గంజాయిని పట్టుకున్నట్టు ఎస్ఐ జె.రామకృష్ణ తెలిపారు. ముందస్తు సమాచారంతో లబ్బూరు జంక్షన్ వద్ద తనిఖీలు చేసినట్టు చెప్పారు. ఒడిశా వైపు వచ్చిన రెండు బైకులతో వచ్చిన వ్యక్తులు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించారని తెలిపారు. దీంతో చాకచాక్యంగా వ్యవహరించి, నలుగురిని పట్టుకున్నట్టు చెప్పారు. వారి వద్ద ఉన్న రెండు బస్తాలను తనిఖీ చేయగా గంజాయి బయటపడినట్టు తెలిపారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో తూకం వేయగా 45కిలోల470 గ్రాముల ఉందని,దీని విలువ రూ. 1.35 లక్షలు ఉంటుందని చెప్పారు. నిందితులు ఒడిశా రాష్ట్రం మల్కన్గిరి జిల్లా చిత్రకొండ బ్లాక్ పంపార్లమెట్ల పంచాయతీ నువడోలింబా గ్రామానికి చెందిన కంటెరి జలంధర్, డామా హంతల్, చింతలారి గ్రామానికి చెందిన పటి ఖారా, కొర్రాపుట్టు జిల్లా గంజైపాదర్ గ్రామానికి చెందిన గెన్ను హంతల్లుగా గుర్తించినట్టు తెలిపారు. వారిని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించి, రెండు బైకులు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ రామకృష్ణ చెప్పారు.ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.ఏడుగురు అరెస్టు -
జీఎస్టీ తగ్గింపుతో మధ్యతరగతికి ఊరట
పాడేరు: కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించడం వల్ల మధ్య తరగతి ప్రజలకు ఊరట లభిస్తోందని జిల్లా ఇన్చార్జ్ జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తిరుమణి శ్రీపూజ అన్నారు.ఽ వాణిజ్యపన్నుల శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ సమావేశ మందిరంలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ సంస్కరణలను చేపడుతోందని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, వాణిజ్య పన్నుల డిప్యూటీ కమిషనర్ ఆర్.పద్మజ, ఇన్చార్జ్ ఆర్డీవో లోకేశ్వరరావు, గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ పరిమళ తదితరులు పాల్గొన్నారు. -
మెనూ అమలులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ఐటీడీఏ డీడీ పరిమళ కిల్లోగుడ ఆశ్రమ పాఠశాలలో రికార్డులు పరిశీలిస్తున్న డీడీ పరిమళడుంబ్రిగుడ: పాఠశాలల్లో మెనూ అమలులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని గిరిజన సంక్షేమ శాఖ డీడీ పరిమళ హెచ్చరించారు. మండలంలోని కిల్లోగుడ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను శనివారం ఆమె సందర్శించారు. ఈసందర్భంగా వసతి గదులతో పాటు పరిసరాలు, పాఠశాల రికార్డులు, భోజనం మెనూ చార్ట్ను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మెనూ ప్రకారం ప్రతిరోజు విద్యార్థులకు భోజ నం పెట్టాలని ఆదేశించారు. విద్యార్థులకు నా ణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యా యు లు కృషి చేయాలన్నారు. ఈకార్యక్రమంలో ఏటీ డబ్ల్యూవో రమణ, ప్రధానోపాధ్యాయుడు ఎల్.వెంకటరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
జి.మాడుగుల: మండలంలోని కె.కోడాపల్లి పంచాయతీ బంధవీధిలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎంపీడీవో ఎస్.పూర్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం విస్తృతంగా మొక్కలు నాటాలని సూచించారు.అనంతరం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈ విజయ్కుమార్, సీడీపీవో బాలదేవి, ఏపీవో కొండబాబు, వైఎస్సార్సీపీ నాయకుడు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. చింతపల్లి: స్వఛ్చాంధ్ర సాదనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చింతపల్లి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.విజయబారతి అన్నారు. శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు కళాశాల పరిసరాలను శుభ్రపరిచి మొక్కలు నాటారు. వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస పాత్రుడు, అధ్యాపకులు కెజియా రాణి, జగదీష్, రమణ,రవీంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు. గంగవరం: స్థానిక గ్రామ సచివాలయ ఆవరణలో శనివారం నిర్వహించిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మణరావు, వైస్ ఎంపీపీ గంగాదేవి, మాజీ ఎంపీపీ తీగల ప్రభ, కలుముల అక్కమ్మ మొక్కలు నాటారు. ఎంపీడీవో లక్ష్మణరావు మాట్లాడుతూ వాయు కాలుష్యాన్ని నియంత్రిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై స్థానికులకు అవగాహనా కల్పించారు. సత్యనారాయణమ్మ , బుల్లియమ్మ సత్యవేణి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు.చింతపల్లి డిగ్రీ కళాశాలలో పరిసరాలను శుభ్రం చేస్తున్న విద్యార్థులుబంధవీధిలో స్థానికులకు అవగాహన కల్పిస్తున్న ఎంపీడీవో పూర్ణయ్య -
పీహెచ్సీల ద్వారా మెరుగైన వైద్య సేవలు
ఏడీఎంహెచ్వో సరిత ఇర్లపల్లి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులతో మాట్లాడుతున్న ఏడీహెచ్ఎంవో సరితరంపచోడవరం: పీహెచ్సీల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్టు అడిషనల్ వైద్యఆరోగ్యశాధికారి డాక్టర్ సరిత తెలిపారు. రంపచోడవరం సమీపంలోని ఇర్లపల్లి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను ఆమె శనివారం సందర్శించారు. వసతి గృహంలో విద్యార్థినులతో మాట్లాడి వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని, పిల్లలు అనారోగ్యం బారిన పడితే తక్షణమే ఆస్పత్రికి తరలించాలని, నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అనంతరం స్థానిక హెల్త్వెల్నెస్ సెంటర్, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐటీడీఏ పీవో ఆదేశాల మేరకు ఆశ్రమ పాఠశాలను సందర్శించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ శిరీష తదితరులు పాల్గొన్నారు. -
చిత్తశుద్ధితో సేవలందిస్తున్న అధికారుల బదిలీ తగదు
చింతపల్లి: చింతపల్లి తహసీల్దారును మూడు నెలలకే అకారణంగా బదిలీ చేయడం దారుణమని స్థానిక ఎంపీపీ కోరాబు అనూషదేవి, జెడ్పీటీసి పోతురాజు బాలయ్య పడాల్లు అన్నారు.మండల కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు.ఇటీవల కూటమి ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా చింతపల్లికి పూర్తిస్థాయి తహసీల్దారును నియమించారన్నారు. దీంతో ఇప్పటి వరకూ పెండింగ్లో ఉన్న అనేక రెవెన్యూ సమస్యలు వేగవంతంగా పరిష్కారమవుతాయని అనుకున్నామన్నారు. చిత్తశుద్ధితో ప్రజా సేవలందిస్తున్న తహసీల్దార్ను విధుల్లో చేరిన మూడు నెలల్లోనే డిప్యూటేషన్ పేరుతో అనకాపల్లి జిల్లాకు బదిలీ చేయడం దారుణమన్నారు. గిరిజన ప్రాంతానికి వచ్చి సేవలందిస్తున్న అధికారులను బదిలీ చేయడం,ఈ ప్రాంతానికి అవసరమైన కాఫీ ప్రాసెసింగ్ యూనిట్లను మైదాన ప్రాంతానికి తరలించడం, నిరుద్యోగ యువతకు ఉపాధి లేకుండా చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి తహసీల్దారు బదిలీని నిలుపుదల చేయకపోతే మండలంలో గల అన్ని ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. సోలార్ పవర్కు సూపర్ బూస్ట్.. జీఎస్టీ 2.0 సాక్షి, విశాఖపట్నం: జీఎస్టీ 2.0 అమలు ద్వారా సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల వంటి పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పాదనకు సూపర్ బూస్ట్ ఇచ్చినట్లని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అన్నారు. ‘సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్’ ప్రచారంలో భాగంగా ఈపీడీసీఎల్ విశాఖ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్కిల్ కార్యాలయం ఆవరణలో కలెక్టర్తో పాటు ఈపీడీసీఎల్ డైరెక్టర్ టీవీ సూర్యప్రకాష్, ఎస్ఈ జి.శ్యాంబాబు మొక్కలు నాటా రు. అనంతరం పీఎం సూర్యఘర్ రూఫ్టాప్ సోలార్ ప్లేట్స్ ప్రదర్శనను కలెక్టర్ తిలకించారు. అనంతరంఆయన మాట్లాడుతూ జీఎస్టీ స్లాబ్ రేట్ల తగ్గింపు ద్వారా పునరుత్పాదక శక్తి పరికరాలపై 12 నుంచి 5 శాతనికి తగ్గించడం పెద్ద ప్రోత్సాహకమన్నారు. జీఎస్టీ 2.0 కారణంగా వినియోదారులకు రూ.10 వేలు ఆదా అవుతుందని తెలిపారు. బయో గ్యాస్ యూనిట్ ధరలో రూ.10,000, 5 హెచ్పీ సోలార్పంప్ సెట్ ధరలో కూడా రూ.29 వేల వరకూ ఆదా అవుతుందని వివరించారు. డైరెక్టర్ సూర్యప్రకాష్, ఎస్ఈ శ్యాంబాబు మాట్లాడుతూ ప్రతీ ఒక్క గృహ వినియోగదారులు జీఎస్టీ 2.0, పీఎం సూర్యఘర్ పథకాల ద్వారా లబ్ధి పొందాలని, రూఫ్ టాప్పై సోలార్ పలకలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా కాలుష్యం నివారించవచ్చని సూచించారు. కార్యనిర్వాహక ఇంజినీర్ శ్రీనివాసరావు, ఇతర విద్యుత్ శాఖ అధికారులు, సోలార్ వెండర్లు పాల్గొన్నారు. అంతకు ముందు సర్కిల్ కార్యాలయ ఉద్యోగులు, అధికారులతో కలిసి ఎస్ఈ శ్యాంబాబు జీఎస్టీ 2.0 అవగాహన ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ విప్లవంలో స్టార్టప్ల కోసం హ్యాకథాన్ సాక్షి, విశాఖపట్నం: విద్యుత్ సరఫరా, వినియోగంలో సరికొత్త ఆధునిక విప్లవాన్ని సృష్టిస్తూ.. డిస్కమ్లకు, వినియోగదారులకు ఉపయుక్తమయ్యే స్టార్టప్ల కోసం హ్యాకథాన్ నిర్వహిస్తున్నామని ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి అన్నారు. సృజనాత్మక ఆవిష్కరణలను రూపొందించే స్టార్టప్ సంస్థలను ప్రోత్సహించే ఉద్దేశంతో వచ్చే నెలలో హ్యాకథాన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్ను ఆయన శనివారం సంస్థ ప్రధాన కార్యాలయంలో ఆవిష్కరించారు. సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్(సీవోఈఈటీ), కై ్లమేట్ కలెక్టివ్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో హ్యాకథాన్ ద్వారా స్టార్టప్లను ప్రోత్సహిస్తున్నామన్నారు. హ్యాకథాన్లో ఎంపికై న స్టార్టప్లు తమ పరిష్కారాలను రాష్ట్ర విద్యుత్ రంగ ప్రముఖుల సమక్షంలో ప్రదర్శించే అవకాశంతో పాటు విజేతలకు పైలెట్ ప్రాజెక్టులు, 3 డిస్కమ్ల్లో పూర్తి స్థాయి ప్రాజెక్టులను అమలు చేసుకునే అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ హ్యాకథాన్ను ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్లు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయన్నారు. ఈ నెల 22వ తేదీ రాత్రి 12 గంటల వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు సూర్యప్రకాష్, వనజ, డి.చంద్రం, సీజీఎం సుమన్ కళ్యాణి పాల్గొన్నారు. -
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
● జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కృష్ణమూర్తి నాయక్ ● ఇద్దరు పర్యవేక్షక సిబ్బంది, స్టాఫ్ నర్స్కు షోకాజ్ నోటీసులు పాడేరు రూరల్: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ కృష్ణమూర్తి నాయక్ హెచ్చరించారు. మండలంలో మినుములూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులతో కొద్దిసేపు మాట్లాడి అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. రికార్డులు పరిశీలించి, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు పర్యవేక్షక సిబ్బందితో పాటు స్టాఫ్ నర్స్కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సిబ్బంది తీరు మార్చుకోవాలని, లేకపోతే ఉపేక్షించేది లేదన్నారు. మలేరియా నిర్ధారణ రక్తపూతల నమోదు సక్రమంగా నిర్వహించాలని ల్యాబ్ టెక్నీషియన్కు సూచించారు. డయేరియా, మలేరియా మందులు, పాము, కుక్కకాటు వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 64 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తామని చెప్పారు. ప్రజారోగ్యంపై సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఉద్యమం ఉధృతం
పాడేరు: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజాఉద్యమాన్ని ఉధృతం చేయాలని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు తెలిపారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మండలంలోని ఇరడాపల్లి పంచాయతీ బొడ్డపుట్టులో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వై.ఎస్. జగన్మోహన్రెడ్డి 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేశారన్నారు.దానిలో భాగంగా గిరిజన ప్రాంతమైన అల్లూరి జిల్లా కేంద్రంలో ఒక మెడికల్ కళాశాలను మంజూరు చేశారని చెప్పారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి గిరిజనుల కోసం కళాశాలను మంజూరు చేస్తే ఇప్పటి సీఎం చంద్రబాబునాయుడు దానిని ప్రైవేట్ పరం చేయాలని యత్నిస్తున్నారని చెప్పారు. ఆ కళాశాలను ప్రైవేటు పరంకాకుండా కాపాడుకునేందుకు కోటి సంతకాల సేకరణతో ప్రజా ఉద్యమం తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు సీందెరి రాంబాబు, సర్పంచ్ గుల్లెలి ఆశ్విజ, ప్రచార కమిటీ కార్యదర్శి కూతంగి సూరిబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి సీదరి మంగ్లన్నదొర, కాడెలి, కించూరు, గబ్బంగి సర్పంచులు వనుగు, బసవన్నదొర, వంతల రాంబాబు, గొల్లూరి నీలకంఠం, మండల యువజన అధ్యక్షుడు లింగమూర్తి, మాజీ సర్పంచ్ నాగరాజు, నాయకులు సుబ్రహ్మణ్యం,బాబుల్ నాయుడు, అర్జున్, నడిపన్న, శ్రీను నాగేశ్వరరావు పాల్గొన్నారు.పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరాజు -
అనంతునికి పవిత్రాల సమర్పణ
పద్మనాభం: పద్మనాభంలోని కుంతీ మాధవస్వామి ఆలయంలో అనంతుని పవిత్రోత్సవాల్లో భాగంగా మూడో రోజైన శనివారం పవిత్రాలు సమర్పించారు. ఆలయంలోని కుంతీ మాధవస్వామి, శ్రీదేవి భూదేవి సమేత అనంత పద్మనాభస్వామి పెద్ద ఉత్సవ విగ్రహాలు, శ్రీదేవి భూదేవి సమేత అనంత పద్మనాభ స్వామి చిన్న ఉత్సవ విగ్రహాలు, రుక్ష్మిణి, సత్యభామ సమేతుడైన వేణుగోపాల స్వామి, లక్ష్మీదేవిలకు గిరిపై ఉన్న అనంత పద్మనాభ స్వామికి పవిత్రాలు సమర్పించారు. ముందుగా కుంతీ మాధవస్వామి, ఆనంత పద్మనాభ స్వాములకు అష్టకలశ స్నపనం, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పవిత్రాలను సమర్పించారు. -
పర్యాటకులకు రక్షణ కల్పించాలి
పాడేరు డీఎస్పీ షహబాజ్ అహ్మద్ కొత్తపల్లి జలపాతాన్ని సందర్శిస్తున్న పాడేరు డీఎస్పీ షహబాజ్ అహ్మద్ జి.మాడుగుల: కొత్తపల్లి జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చే పర్యాటకులకు తగిన రక్షణ కల్పించాలని పాడేరు డీఎస్పీ ఎస్.షహబాజ్ అహ్మద్ ఆదేశించారు. జలపాతాన్ని శనివారం ఆయన సందర్శించారు. పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, భద్రతా చర్యలు, వసతిపై నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వ్యూపాయింట్,జలపాత ప్రాంతాలను ఆయన పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ షణ్ముఖరావు, జలపాతం సూపర్వైజర్ వంతాల అభి, నిర్వాహకులు పాల్గొన్నారు. -
అమలుకు నోచుకోని ఆదివాసీ చట్టాలు
ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను మాట్లాడుతున్న ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను గంగవరం: ఆదివాసీల కోసం చేసిన చట్టాలు సక్రమంగా అమలుకు నోచుకోవడం లేదని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏజెన్సీలో 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆరోపించారు. ఏజెన్సీ చట్టాలు పూర్తిగా నిర్వీర్యమైపోతున్నాయన్నారు. ఆదివాసీ చట్టాల అమలు, రిజర్వేషన్ల పరిరక్షణ కోసం కృషి చేయని ఎమ్మెల్యేలకు రాబోయే ఎన్నికల్లో ఆదివాసీలు తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఏజెన్సీలోకి గిరిజనేతరుల వలసలు పెరిగిపోతున్నాయని చెప్పారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ బృందం రంపచోడవరం నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ డివిజన్ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ దొర, డివిజన్ నాయకులు పీటా ప్రసాద్, కంగాల అబ్బాయి దొర, కలుముల ప్రసాద్, చోడి ఏడుకొండల దొర, వేట్ల హనుమంత రెడ్డి, పరద సత్యనారాయణ, కలుముల జోగి రాజు, కారం శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
భగ్గుమన్న పాత్రికేయులు
‘సాక్షి’పై కూటమి ప్రభుత్వ వేధింపులకు నిరసన ● లోపాలు ఎత్తి చూపితే అంత కక్ష ఎందుకు?పాడేరు: రాష్ట్రంలో ప్రజల ప్రాణాలను హరిస్తున్న నకిలీ మద్యంపై వాస్తవాలను వెలుగులోకి తెస్తూ కూటమి ప్రభుత్వ అక్రమాలపై సాక్షిలో వార్తలు రాస్తే యాజమాన్యంతోపాటు ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. శుక్రవారం ఉదయం పట్టణంలోని పాత బస్టాండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద జర్నలిస్టులు నిరసన చేపట్టారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాక్షి ఎడిటర్తో పాటు వార్తలు రాస్తున్న విలేకరులపై పోలీసులతో కేసులు పెట్టించి భయభ్రాంతులకు గురిచేయడం సరియైన పద్ధతి కాదంటూ నినాదాలు చేశారు. సాక్షి పత్రిక కార్యాలయాలతో పాటు విలేకరుల ఇళ్లలో అకారణంగా సోదాలు నిర్వహించడం విరమించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై వార్తలు రాస్తున్న సాక్షి దినపత్రికను టార్గెట్ చేసుకొని దాడులకు తెగబడటం సిగ్గు చేటన్నారు. అక్కడనుంచి పాడేరు పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. డీఎస్పీ షహబాజ్ అహ్మద్కు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు పీడీ చక్రవర్తి, తాంగుల మహేష్, టమికే సునీల్, భాస్కర్, ప్రేమ్కుమార్, జవ్వాది శ్రీను, కంభం మహేష్, పారిజాతం, భీమ్రాజు, రాంబాబు, శోభన్రాజు, శ్రీను, బేరా నానీ, విలేకరులు ఎన్ఎం కొండబాబు, కొంటా దుర్గారావు, శెట్టి కోటేశ్వరరావు, రాజు తదితరులు పాల్గొన్నారు. విశాఖలో.. డాబాగార్డెన్స్ (విశాఖ): ‘సాక్షి’ మీడియా సంస్థపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ జర్నలిస్టులు భగ్గుమన్నారు. ప్రజా సమస్యలను, ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతున్న ‘సాక్షి’ గొంతు నొక్కేందుకు పోలీసులను ప్రయోగించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు శుక్రవారం విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వివిధ జర్నలిస్ట్, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. నకిలీ మద్యం దందాను వెలుగులోకి తెచ్చినందుకు ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డికి, నెల్లూరు బ్యూరో ఇన్చార్జ్కి బీఎన్ఎస్ఎస్ సెక్షన్ల కింద పోలీసులు నోటీసులు జారీ చేయడాన్ని జర్నలిస్టులు తీవ్రంగా తప్పుబట్టారు. ఇది పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిగా అభివర్ణించారు. నిరసనలో భాగంగా పాత్రికేయులు చేతులకు సంకెళ్లు వేసుకుని, నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ‘కూటమి నిరంకుశ పాలన నశించాలి’, ‘అక్షరంపై దాడి సిగ్గు సిగ్గు’, ‘పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లా?’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకుడు ఎంఆర్ఎన్ వర్మ, ఏపీడబ్ల్యూజే నాయకుడు, పి.నారాయణ్, జాతీయ జర్నలిస్ట్ల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబుతోపాటు పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
రైతులకు న్యాయం చేసిన తర్వాతే హైవే పనులు చేపట్టాలి
● పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు ● బాధిత గిరిజన రైతులతో కలిసి ఐటీడీఏ వరకు ర్యాలీపాడేరు: పాడేరు నియోజకవర్గం మీదుగా నిర్మిస్తున్న ఎన్హెచ్516–ఇ రహదారి కారణంగా గిరిజన రైతులు భారీ స్థాయిలో నష్టపోతున్నారని వారికి న్యాయం చేసిన తర్వాతే నిర్మాణ పనులు చేపట్టాలని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు డిమాండ్ చేశారు. శుక్రవారం బాధిత గిరిజన రైతులతో కలిసి స్థానిక క్యాంప్ కార్యాలయం నుంచి ఐటీడీఏ వరకు ర్యాలీ నిర్వహించి, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీకే వీధి మండలం పెదవలస, రంపుల, చాపరాతిపాలెం, జి.మాడుగుల మండలం వంజరి, ములక్కాయపుట్టు, గెమ్మెలి పంచాయతీ వరిగెలపాలెం గ్రామాల్లో సుమారు 150 కుటుంబాల గిరిజన రైతులు ఎన్నో ఏళ్లుగా కాఫీ, మిరియాలు సాగు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారని చెప్పారు. ఈ గ్రామాల మీదుగా జాతీయ రహదారి నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు. తాము జాతీయ రహదారి నిర్మాణానికి వ్యతిరేకం కాదన్నారు. కానీ బాధిత గిరిజన రైతులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించకుండా ఎంతోకొంత ముట్టజెప్పి చేతులు దులుపుకోవాలని చూడడం సరికాదని చెప్పారు. బాధిత గిరిజన రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేంత వరకు హైవే పనులు నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రైతుల పక్షాన వైఎస్సార్సీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుందని ఆయన హెచ్చరించారు. -
కష్టాల కాలనీలు
రెంటికి చెడ్డ రేవడిలా తయారయ్యాయి పోలవరం నిర్వాసితుల బతుకులు. సకల సౌకర్యాలు కల్పిస్తామని పదేళ్ల క్రితం ప్రభుత్వం చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. సర్వం త్యాగం చేసి ఊరొదిలి వచ్చిన వారు నాలుగేళ్లుగా నరకయాతన అనుభవిస్తూ కాలనీల్లో కాలం వెళ్లదీస్తున్నారు.అసౌకర్యాల నీడలో పోలవరం నిర్వాసితులుఎటపాక: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా వీఆర్పురం మండలంలో పలు గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. జీడిగుప్ప, శ్రీరామగిరి గ్రామపంచాయతీల పరిధిలోని ములకపల్లి , కల్తునూరు, ఇప్పూరు, భీమవరం గ్రామాలకు చెందిన కుటుంబాలను నిర్వాసితులుగా గుర్తించారు. అయితే వీరికోసం ఎటపాక మండలం కన్నాయిగూడెం పంచాయతీలో ఆర్అండ్ఆర్ కాలనీలో 329 ఇళ్లను 39.17 ఎకరాల్లో ప్రభుత్వం నిర్మించింది. ఒక్కో ఇంటికి ఐదు సెంట్ల స్థలాన్ని కేటాయించింది. ఈకాలనీలో బడి, గుడి, పార్కు. బస్టాండ్, అంగన్వాడీ, కమ్యూనిటీ హాల్, ఆస్పత్రి తదితర భవనాలతో పాటు సీసీ రహదారులు, డ్రైనేజీ సౌకర్యాలతో కాలనీ నిర్మిస్తామని నిర్వాసితులకు ఆశ చూపారు. కానీ గడిచిన పదేళ్లుగా నిర్మాణాలు అసంపూర్తిగానే ఉన్నాయి. వారి సొంత గ్రామాల్లో భూములు కోల్పోయిన 80 మంది కొండరెడ్ల రెతులకు 120 ఎకరాల వ్యవసాయ భూమిని కన్నాయిగూడెం పంచాయతీలో ఇచ్చారు. ఈ కాలనీలో ప్రస్తుతం ములకపల్లి, కల్తునూరు, ఇప్పూరు గ్రామాలకు చెందిన 166 నిర్వాసిత కుటుంబాలు ఉంటున్నాయి. వీరిలో కొన్ని కుటుంబాలు గత నాలుగేళ్ల నుంచి దయనీయస్థితిలో కాలం గడుపుతున్నాయి. సౌకర్యాల్లేక.. ● సీసీ రోడ్లు లేక రహదారులన్ని పొదలు, పిచ్చి మొక్కలతో భయానకంగా ఉన్నాయి. ● డ్రైనేజీలు లేకపోవడంతో మురికి నీరంతా ఇళ్లముందు నిలిచిపోతోంది. రహదారులకు అడ్డంగా కాలువలు తీయడంతో మురుగు నీటితో నిండి ఉన్నాయి. ● ఈ కాలనీలో నివాసం ఉంటున్న వారికి ఆధార్ కార్డు అడ్రస్లు మార్పు చేయకపోవడంతో ఉపాధి హామీ పథకం దూరమైంది. రైతులకు యూరియా, దాణా ఇవ్వడం లేదు. ఇక్కడ వారికి ఇచ్చిన భూముల పట్టాలు ఆన్లైన్లో ఎక్కించకపోవడంతో ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీభవ పథకానికి దూరమవుతున్నారు. ● ఈ కాలనీలో కన్నాయిగూడెం పంచాయతీగా గుర్తించకపోవడంతో వీధి దీపాలు కూడా వేయడం లేదు. ఆధార్ కార్డు మార్పునకు పంచాయతీ కార్యదర్శి రూ.100 డిమాండ్ చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ● ఇక్కడ ఉండేవారికి రోగమొస్తే చూసేందుకు వైద్య సిబ్బంది ఎవరూ రారు. చిన్నారులకు అంగన్వాడీ కేంద్రం కూడా లేకపోవడంతో పౌష్టికాహారానికి దూరం అవుతున్నారు. అటు ఇటు కాని బతుకులు కాలనీల్లో కనీస సౌకర్యాలు కరువు రహదారులు, వీధి దీపాలు లేక ఇబ్బందులు కలగానే ఆధార్ అడ్రస్ మార్పు రేషన్ బియ్యం కోసం వ్యయ ప్రయాస ముంపులోనే భూములు -
కూలి పనులు దొరకడం లేదు
ఇక్కడ వ్యవసాయ కూలి పనులు దొరకడం లేదు. ఆధార్ కార్డు ఇక్కడ అడ్రస్కు మార్చక పోవడంతో మాకు ఉపాధి హామీ పథకంలో పనులు కల్పించడం లేదు.సొంతూరు వదిలి వచ్చిన మమ్మల్ని ఐటీడీఏ, ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. సర్వం కోల్పోయిన తమ పట్ల ఇలా వ్యవహరించడం ఏమాత్రం సరికాదు. – నూతి రమేష్, ములకపల్లిముంపు భూములిచ్చారు భూమికి భూమిగా కన్నాయిగూడెం పంచాయతీలో ఐదు ఎకరాలు ఇచ్చారు. అయితే ఈఏడాది వచ్చిన గోదావరి వరదలకు మూడుసార్లు ముంపునకు గురైంది. పత్తిపంట నాశనమైంది. ఎరువులు, పశువుల దాణా కూడా ఇవ్వడం లేదు. అధార్ అడ్రస్ మార్చకపోవడంతో ఇక్కడ పంచాయతీకి చెందిన వారు కాదంటున్నారు. – కెచ్చల సుబ్బారెడ్డి, కల్తునూరు రేషన్కు రూ.300 ఖర్చు కాలనీకి వచ్చి రెండేళ్లుగా నివాసం ఉంటున్నా. ఇప్పటి వరకు మా రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఇక్కడికి మార్చలేదు. ప్రతి నెలా కల్తునూరు వెళ్లి రేషన్ బియ్యం తెచ్చుకునేందుకు రూ.300 రవాణా ఖర్చులు బరాయించాల్సి వస్తోంది. రేషన్ తెచ్చుకోకపోతే కార్డు అక్కడ ఇక్కడ లేకుండా పోతుందని భయపడుతున్నాం. – రమణమ్మ, కల్తునూరు పనికిరాని భూమిచ్చారు పది సంవత్సరాల క్రితం ఇక్కడ నాలుగు ఎకరాల భూమి ఇచ్చారు. అయితే ఆభూమిలో ఉన్న జామాయిల్ చెట్లు కూడా నేటికి తొలగించకపోవడంతో ఆ భూమిలో ఏ పంట వేయాలన్నా ఇబ్బందిగా మారింది. అధికారులు ముందు చెప్పిన మాటలు నేటికి నెరవేర్చకుండా మోసం చేయడం ఏమాత్రం సరికాదు. – కెచ్చల వెంకటేశ్వరరెడ్డి, కల్తునూరు -
గిరిజనులకు మెరుగైన వైద్యసేవలే లక్ష్యం
● మాతాశిశు ఆరోగ్యసేవలపై ప్రత్యేక దృష్టి ● డీఎంహెచ్వో డాక్టర్ కృష్ణమూర్తినాయక్ సాక్షి, పాడేరు: గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందంచడమే లక్ష్యంగా పనిచేయడంతో పాటు, మాతాశిశు ఆరోగ్య సేవలపై ప్రత్యేకంగా దృష్టి పెడతానని డీఎంహెచ్వో డాక్టర్ డి.కృష్ణమూర్తినాయక్ తెలిపారు. డీఎంహెచ్వోగా ని యమితులైన ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందేలా కృషి చేస్తానన్నారు. డోలీమోతలను అరికట్టేందుకు ప్రత్యేక ప్రణాళికలను రూ పొందిస్తామన్నారు. పీహెచ్సీల వైద్యులు,ఇతర సిబ్బంది, 108, బైక్ అంబులెన్స్ల సిబ్బంది స మన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకుంటా నని తెలిపారు.అన్ని గ్రామాల్లో మాతాశిశు మరణాల నిరోధానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రసూతి తేదీకి వారం రోజుల ముందుగానే గర్భిణులను దగ్గరలో ఉన్న ప్రసూతి కేంద్రాలకు తరలించాలని వైద్యబృందాలను ఆదేశించారు.అన్ని పీహెచ్సీల్లో అత్యవసర మందులు,వ్యాక్సిన్లు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. -
రాజయ్యపేట
మూడో రోజూ నిఘా నీడలో నక్కపల్లి: రాజయ్యపేటలో వరుసగా మూడో రోజు కూడా భారీ పోలీసు బందోబస్తు కొనసాగింది. బల్క్ డ్రగ్ పార్క్ను వ్యతిరేకిస్తూ మత్స్యకారులు చేపట్టిన ఉద్యమం ఎప్పుడు ఏ విధంగా మారుతుందోనన్న ముందుజాగ్రత్తతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమయింది. మత్స్యకారుల వ్యూహాన్ని పోలీసు సిబ్బంది ముందుగా పసిగట్టలేకపోవడం వల్లే గ్రామంలోకి వచ్చిన హోంమంత్రిని అడ్డుకోవడం, ఆమె కాన్వాయ్కు అడ్డంగా తాటి, కొబ్బరి చెట్లు పడేసి ఘెరావ్ చేయడం, ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న జాతీయరహదారిని ముట్టడించి నాలుగు గంటలపాటు ధర్నా చేసి ట్రాఫిక్ను స్తంభింపజేయడం వంటి ఘటనలకు పాల్పడ్డారు. దీంతో జిల్లా యంత్రాంగం ఒక్కసారిగా షాక్కు గురయింది. గ్రామంలోకి వచ్చి చర్చలు జరుపుతానని కలెక్టర్ హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా మత్స్యకారులు శాంతించారు. అనివార్య కారణాల వల్ల కలెక్టర్ పర్యటన వాయిదా పడింది. మత్స్యకారులు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా దీటుగా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో పక్క జిల్లాల నుంచి సుమారు వెయ్యిమందికి పైగా పోలీసులను రంగంలోకి దింపారు. ఇద్దరు డీఎస్పీల పర్యవేక్షణలో బందోబస్తు నర్సీపట్నం, అనకాపల్లి డీఎస్పీలు శ్రీనివాసరావు, శ్రావణిల ఆధ్వర్యంలో పోలీసులు రాజయ్యపేట పరిసర ప్రాంతాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బందిని బందోబస్తు కోసం వినియోగించారు. వీరు కాకుండా స్పెషల్ బ్రాంచ్, ఇంటిలిజెన్స్ సిబ్బంది కూడా రాజయ్యపేట పరిసరాల్లో ఉన్నారు. మఫ్టీలో కొంతమంది సిబ్బంది గ్రామంలో ఉంటూ మత్స్యకారుల కదలికలపై నిఘా పెట్టారు. గ్రామస్తుల సంభాషణలపై కూడా ఆరా తీస్తున్నారు. ఎస్పీ తుహిన్ సిన్హా ఎప్పటికప్పుడు ఇక్కడ పరిస్దితిని సమీక్షిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసులంతా నక్కపల్లి, ఉపమాక, బోయపాడు, దొండవాక, హెటెరో కంపెనీ, తదితర ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటు చేసుకుని బందోబస్తు నిర్వహిస్తున్నారు. రాజయ్యపేట వెళ్లే అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. వాహనాల నంబర్లను సయితం నమోదు చేసుకుంటున్నారు. ఎక్కడికక్కడ ఐరన్ బారికేడ్లు ఏర్పాటు చేశారు. పక్క గ్రామాల నుంచి ఎవరినీ రానీయకపోవడంతో రాజయ్యపేట మత్స్యకారులు మాత్రమే దీక్ష కొనసాగిస్తున్నారు. గ్రామంలోను, బల్క్ డ్రగ్ ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు సెక్షన్ 30 అమలు చేస్తున్నారు. దీంతో దీక్షా శిబిరం వద్ద మినహా మరెక్కడా గుంపులుగా ఉండడాన్ని అనుమతించడం లేదు. కలెక్టర్ వచ్చి వెళ్లిన తర్వాతే దీక్ష కొనసాగించడమా వద్దా అనేది ఇరు వర్గాలు నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 22న ‘చలో రాజయ్యపేట’ నక్కపల్లి: బల్క్ డ్రగ్ పార్క్కు వ్యతిరేకంగా మత్స్యకారులు చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతుగా ఈ నెల 22న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చలో రాజయ్యపేట కార్యక్రమం నిర్వహించనున్నట్టు వీసం రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమానికి శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర రీజినల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ ఆమర్నాథ్, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, కన్నబాబు, మాజీ ఎంపీ సత్యవతి, పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ తదితరులు హాజరవుతారన్నారు. నిలిచిపోయిన బల్క్ డ్రగ్ పనులు బల్క్ డ్రగ్ పార్క్ ఉద్యమం నేపథ్యంలో 15 రోజుల నుంచి పనులు నిలిచిపోయాయి. దీంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన లేబర్ వారి స్వగ్రామాలకు వెళ్లిపోయారు. ఈ వ్యవహారం తేలే వరకు ఎక్కడా పనులు చేయడానికి వీల్లేదని మత్స్యకారులు డిమాండ్ చేసిన నేపథ్యంలో వారిలో ఆగ్రహావేశాలు చల్లార్చేందుకు తాత్కాలికంగా పనులు నిలిపివేశారు. -
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
చింతూరు: మండలంలోని తులసిపాక సమీపంలో సోకలేరువాగు ఒడ్డున శుక్రవారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో గుర్తుపట్టేందుకు వీలులేకుండా ఉండడంతో మృతి చెంది సుమారు 15 రోజులకు పైబడి ఉండవచ్చని తెలుస్తోంది. మృతదేహాన్ని కుక్కలు లేదా అడవి జంతువులు పీక్కుతినడంతో ఎడమకాలు లేని స్థితిలో ఉంది. ఈ సమాచారం తెలుసుకున్న చింతూరు సీఐ గోపాలకృష్ణ, ఎస్ఐ రమేష్, మోతుగూడెం ఎస్.చరణ్నాయక్ తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. కాగా మృతదేహం లభ్యమైన స్థలం ప్రముఖ పర్యాటక ప్రాంతమైన సోకిలేరు వ్యూ పాయింట్కు సమీపంలో ఉండడంతో పర్యటనకు వచ్చిన వ్యక్తి ప్రమాదవశాత్తు వాగులో పడి మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. -
ఇంటి పన్నుల వసూళ్లలో జాప్యం చేస్తే చర్యలు
డుంబ్రిగుడ: గిరిజన గ్రామాల్లో మౌలిక సౌకర్యాల కల్పనపై దృష్టి సారించి ఇంటి పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని పంచాయతీ అధికారులతో ఆయన శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఇంటిపన్ను వసూళ్లలో జాప్యం చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అనంతరం ఎంపీపీ బాకా ఈశ్వరి, జెడ్పీటీసీ జానకమ్మతో కలిసి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్మించిన ప్రజా మరుగుదొడ్లను ప్రారంభించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్థానికులకు సూచించారు. రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ సుబ్బారావు, ఎంపీడీవో ప్రేమ్సాగర్, ప్రజా ప్రతినిధులు, పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల శ్రమదానం
ముంచంగిపుట్టు: మండలంలోని కిలగాడ పంచాయతీ కేంద్రంలోని ప్రైమరీ స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులు శుక్రవారం శ్రమదానం చేశారు. పాఠశాల ఆవరణలో పరిసరాలు శుభ్రం చేసి, పిచ్చి మొక్కలను తొలగించారు. రాళ్లు, సిమెంట్ను సొంత నిధులతో సమకూర్చి పిల్లలు ఆడుకునే విధంగా ప్లాట్ ఫారం నిర్మించారు. తమ పిల్లలు చదువుకునే పాఠశాలలో తమ వంతంలో సహయంగా ప్లాట్ ఫారం నిర్మించామని, శ్రమదానం చేసి పరిసరాలు శుభ్రం చేయడం చాలా ఆనందంగా ఉందని వారు చెప్పారు. ప్రసుత్తం పాఠశాల చుట్టూ నిర్మించిన ప్రహారీకి ప్లాస్టింగ్ లేదని, ప్రభుత్వం అధికారులు స్పందించి ప్లాస్టింగ్కు నిధులు కేటాయించి, పూర్తి చేయాలని కోరారు. ఎస్ఎంసీ చైర్మన్ కె.నాగరాజు, విద్యార్థుల తల్లిదండ్రులు రాంప్రసాద్, కృష్ణమూర్తి, రమేష్పడాల్, నరసింహమూర్తి, రాంబాబు, రమేష్లు తదితరులు పాల్గొన్నారు. వారికి పాఠశాల హెచ్ఎం కె.బంగారయ్య, ఉపాధ్యాయులు సూర్యనారాయణ, బాబూరావు, సింహాచలం తదితరులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. -
హైడ్రో పవర్ ప్రాజెక్టు ఒప్పందం రద్దుకు వినతి
పాడేరు రూరల్: హైడ్రో పవర్ ప్రాజెక్టు ఒప్పందాల జీవోలను రద్దు చేయాలని కోరుతు పాడేరు ఐటిడిఏ పీవో తిరుమణిశ్రీపూజకు ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు పి.అప్పలనర్స, హైడ్రో పవర్ ప్రాజెక్టు ప్రభావిత గ్రామల గిరిజనులు కలిసి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అరాచకపాలన చేస్తుందన్నారు. ప్రజలకు ఇచ్చిన హమీలు అమలు చేయకుండా కొత్త సమస్యలతో ప్రజలకు భయబ్రాంతులు గురి చేస్తుందన్నారు.హైడ్రో పవర్ ప్రాజెక్టు కోసం సమగ్ర కమిటి పేరుతో సర్వే నిర్వహిస్తే గిరిజనులతో అడ్డుకుంటమన్నారు. జిల్లాలో అనంతగిరి, అరకులోయ, హుకుంపేట, చింతపల్లి, గూడెం కొత్తవీధి, కొయ్యూరు మండలాల్లో హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటికే కూటమి ప్రభుత్వం బడా కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందాలు జారీ చేసిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల హక్కులు, చట్టాలను ప్రభుత్వం ఉల్లంఘించి హైడ్రో పవర్ ప్రాజెక్టు ఏ విధంగా నిర్వహిస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర గిరిజన మంత్రి గుమ్మడి సంధ్యారాణి తాత్కలిక పనులు నిలిపివేస్తున్నట్టు తప్పుడు ప్రకటనలు చేశారని ఆరోపించారు. రాష్ట్ర క్యాబినెట్, రాష్ట్ర గిరిజన సలహా మండలి, ఐటిడిఏ పాలక వర్గం, వివిద ప్రభుత్వ చట్టబద్ద వేదికల్లో చర్చించకుండానే హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణ పనులు తాత్కలిక పనులు నిలుపుదల చేసామని ప్రకటించడం ఆదివాసీలకు మోసం చేయాడమేనన్నారు. దీనిపై కూటమి ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని లేనిపక్షంలో ఈనెల 24న చలో కలెక్టరేట్ పాడేరు కార్యక్రమం పిలుపునిస్తామన్నారు. కార్యక్రమానికి ప్రజలంతా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఆదివాసీ గిరిజన సంఘం నేతలు కిల్లో సురేంద్ర, గంగరాజు, బాలదేవ్ ప్రాజెక్టు ప్రభావిత గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
డొంకరాయి గ్రామాన్ని మండల కేంద్రం చేయాలని డిమాండ్
మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయం ఎదుట ప్రదర్శనమంగళగిరి టౌన్: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న డొంకరాయి గ్రామాన్ని మండల కేంద్రంగా చేయాలని కోరుతూ ఆ గ్రామ ప్రజలు మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం ఎదుట శుక్రవారం బ్యానర్తో ప్రదర్శన చేశారు. 2017 సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మండల కేంద్రంగా చేస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చిందని, ఆ హామీని నేటికీ అమలు చేయలేదని ఆ గ్రామ ప్రజలు పేర్కొన్నారు. గత 40 సంవత్సరాలుగా అన్ని విధాల నష్టపోతున్నామని, న్యాయం చేయాలని కోరారు. -
విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల ఆందోళన
పాడేరు రూరల్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన కార్యక్రమం చేపట్టారు. జిల్లాలోని పాడేరు, సీలేరు, మోతుగూడెం ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో విద్యుత్ శాఖ కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు. అనంతరం ఉన్నతాధికారులకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పాడేరులో జరిగిన కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చిన్నయ్యపడాల్ మాట్లాడుతూ విద్యుత్ శాఖలో కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ కార్మికుల నెలకొన్న ప్రధాన సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, సర్వీసులను బట్టి పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అందజేయాలని డిమాండ్ చేశారు. అనంతరంలో విద్యుత్ శాఖ డీఈ వేణుగోపాల్కు వినతిపత్రం ఇచ్చారు. నాయకులు, కార్మికులు ఈశ్వరరావు, రాజు,చైతన్య, ప్రసాద్, విజయ్, బుల్లిబాబు తదితరులున్నారు. సీలేరు: ఏపీ జెన్కో కార్యాలయం వద్ద శుక్రవారం జెన్కో కాంట్రాక్ట్ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. నేతలు లక్ష్మణరావు, విష్ణుకుమార్రాజు పాల్గొన్నారు. మోతుగూడెం: మోతుగూడెం ఏపీ జెన్కో చీఫ్ ఇంజనీర్ కార్యాలయం వద్ద కాంట్రాక్ట్ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జెన్కో సీఈకి అందజేశారు. ప్రేమ్సన్, శ్రీను, దేవుడు, సన్యాసిరావు, రాజేష్, గంగయ్య మహేష్ పాల్గొన్నారు. -
గంజాయి సాగు, రవాణా చట్టరీత్యా నేరం
గంగవరం: ప్రజలు గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాల నుంచి దూరంగా ఉండాలని రంపచోడవరం డీఎస్పీ జి.సాయి ప్రశాంత్ చెప్పారు. జిల్లా ఎస్పీ అమిత్బర్దర్ ఆదేశాల మేరకు మండలంలోని జగ్గంపాలెం గ్రామంలో శుక్రవారం జనమైత్రి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న డీఎస్పీ జి.సాయి ప్రశాంత్ మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్, నకిలీ లోన్ యాప్స్, ఓటీపీ వల, మోసపూరిత లింకులు, ఏఐ ఆధారిత సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. గంజాయి సాగు, రవాణా చట్టరీత్యా నేరమని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. గంజాయి సాగు, రవాణాపై సమాచారం తెలిస్తే 1972 టోలిఫ్రీ నంబర్ సమాచారం ఇవ్వాలన్నారు. వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. అపరిచితులతో ఆన్న్లైన్ చాటింగ్, వీడియో కాల్స్ ద్వారా మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.అనుమానాస్పద కాల్స్ లేదా లింకులు వచ్చినప్పుడు తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పోలీస్ శాఖలో త్వరలో భర్తీ చేయనున్న పలు పోస్టులకు సంబంధించి గిరిజన యువతకు శారీరక ,ట్రైనింగ్ కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్టు డీఎస్పీ వివరించారు. అడ్డతీగల సీఐ నరసింహమూర్తి, గంగవరం ఎస్ఐ బి.వెంకటేష్ , జగ్గంపాలెం సర్పంచ్ లీలావతి, , పద్మావతి, వైఎస్సార్సీపీ నాయకులు సిద్ధార్ధదొర, శ్రీనివాసు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
సిమెంట్ కాంక్రీట్తో రంగురాళ్ల క్వారీల పూడ్చివేత
డీఎఫ్వో నర్సింహారావు చింతపల్లి: రంగురాళ్ల క్వారీలను సిమెంట్ కాంక్రీట్తో మూసివేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు డివిజన్ అటవీశాఖ అధికారి వై.నర్సింహారావు తెలిపారు. మండలంలోని సత్యవరం క్వారీని శుక్రవారం సిమెంట్ కాంక్రీట్తో ు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూడెం కొత్తవీధి మండలంలో సిగనాపల్లి, గుర్రాలగొంది, చింతపల్లి మండలంలో మేడూరు, సత్యవరం, గురుగూడెం, పోతురాజుగున్నలు తదితర గ్రామాల్లో గుర్తించిన అన్ని క్వారీల్లో సొరంగాలను పూర్తిగా సిమెంట్ కాంక్రీట్తో పూడ్చివేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే సిగనాపల్లి క్వారీని మూసివేసినట్టు చెప్పారు. డివిజన్లో ఎక్కడా రంగురాళ్ల తవ్వకాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. రంగురాళ్ల తవ్వకాలను పోత్సహించి, వ్యాపారాలు చేస్తున్న వ్యక్తుల జాబితాను సిద్ధం చేసినట్టు చెప్పారు.ఇప్పటికే కొంతమంది వ్యాపారులపై బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు. -
జీఎస్టీ తగ్గింపుపై అవగాహన
రంపచోడవరం: దేశంలో పేద బడుగు బలహీన వర్గాల వారికి సూపర్ జీఎస్టీ– సూపర్ సేవింగ్స్ ద్వారా భారీగా వివిధ వస్తువులపై పన్నులు తగ్గించినట్టు రంపచోడవరం ఐటీడీఏ పీవో స్మరణ్రాజ్ అన్నారు. ఐటీడీఏ సమావేశపు హాలులో ఏడు మండలాల సంబంధించిన మహిళా సంఘాల సభ్యులతో వర్తక సంఘాలతో, అంగన్వాడీ తదితర శాఖల అధికారులతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో స్మరణ్రాజ్ మాట్లాడుతూ రోజు నిత్యావసరాల వస్తువులపై ఐదు శాతం వరకు పన్నులు చాలా వరకు తగ్గినట్టు చెప్పారు. మండలాల పరిధిలో గల సచివాలయాల్లో గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రాజమహేంద్రవరానికి చెందిన కళాకారులతో కళాజాత నిర్వహించారు. ఏపీవో రమణ, ఏడీఏ రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు. -
బాణసంచా విక్రయాలకు అనుమతులు తప్పనిసరి
సబ్ కలెక్టర్ శుభం నొఖ్వాల్ రంపచోడవరం/చింతూరు: రాబోయే దీపావళి పండగ సందర్భంగా వ్యాపారులు నిర్వహించే బాణసంచా విక్రయాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని రంపచోడవరం సబ్ కలెక్టర్, చింతూరు ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ తెలిపారు. రంపచోడవరం, చింతూరు డివిజన్లకు చెందిన తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎస్ఐలు, ఫైర్ ఆఫీసర్లతో శుక్రవారం చింతూరులో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల భద్రత, అగ్ని ప్రమాదాల నివారణే ధ్యేయంగా ప్రశాంతంగా బాణసంచా విక్రయాలు జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనుమతులు లేకుండా విక్రయాలు జరిపేవారిపై కఠినచర్యలు తీసుకుంటామని, వ్యాపారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలన్నారు. దుకాణాలను పాఠశాలలు, ఆస్పత్రులు, పెట్రోల్ బంకులకు దూరంగా అధికారులు నిర్దేశించిన బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకోవాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు. దుకాణాల వద్ద ఇసుక బకెట్లు, నీరు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని, పండగ పూర్తయ్యే వరకు అధికారులు నిరంతరం దుకాణాలను పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు. -
పాడేరు ఇన్చార్జి ఆర్డీవోగా లోకేశ్వరరావు
సాక్షి, పాడేరు: పాడేరు ఇన్చార్జి ఆర్డీవోగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం.వి.ఎస్.లోకేశ్వరరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. పాడేరు సబ్కలెక్టర్గా పనిచేసిన సౌర్యమన్ పటేల్ మైదాన ప్రాంతానికి బదిలీ అయిన నాటి నుంచి పాడేరు సబ్కలెక్టర్గా ఎవరినీ నియమించలేదు. పాడేరు ఇన్చార్జి ఆర్డీవోగా ఎస్డీసీ లోకేశ్వరరావుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.క్రీడా పోటీలను ప్రారంభిస్తున్న సూరిబాబు, తదితరులుపాడేరు రూరల్: ఉత్సాహపూరిత వాతావరణంలో డివిజన్ స్థాయి వాలీబాల్ క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో వీటిని శుక్రవారం ఎస్జీఎఫ్ క్రీడా జిల్లా కార్యదర్శి పాంగి సూరిబాబు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ చిట్టబ్బాయిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్నత విద్యా శాఖ అధికారుల ఆదేశాల మేరకు ఈనెల 22 వరకు పోటీలు జరుగుతాయన్నారు. ఇక్కడ ప్రతిభ కనబరిచిన వారిని జిల్లాస్థాయికి ఎంపిక చేస్తామన్నారు. పీఈటీలు కొండబాబు, భవాని, సత్యవతి, రాజులమ్మ, అప్పలరాజు, ప్రసాధ్ పాల్గొన్నారు.బెల్ట్ షాపు నిర్వాహకుడిపై కేసు నమోదు రాజవొమ్మంగి: మండలంలోని అమ్మిరేఖల గ్రామంలో మద్యం బెల్ట్ షాపు నిర్వహిస్తున్న చిన్నబ్బాయి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ శివకుమార్ శుక్రవారం తెలిపారు. షాపు నిర్వాహకుడి నుంచి పది– 180 ఎంఎల్ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకొన్నామన్నారు. ఆయన వెంట సిబ్బంది ఉన్నారు. -
క్రీడాకారులకు అభినందనలు
సీలేరు: ఏపీ జెన్కో లో ఇటీవల జరిగిన కబడ్డీ పోటీల్లో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో ప్రతిభను కనబర్చిన సీలేరు కాంప్లెక్సు క్రీడాకారులను పలువురు అభినందించారు. ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన విజయోత్సవ కార్యక్రమంలో జెన్కో కాంప్లెక్స్ సూపరింటెండెంట్ ఇంజినీర్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ 47 సంవత్సరాల తరువాత రాష్ట్రానికి కబడ్డీ పోటీల్లో ఏపీ విద్యుత్ జట్టుకు స్థానం దక్కిందని, ఆ జట్టులో సీలేరుకు చెందిన డీఈఈ శ్రీనివాసులు కెప్టెన్గా వ్యవహరించడం ఆనందంగా ఉందన్నారు. ఏపీ జట్టు జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో తృతీయస్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. ఏపీ జట్టుకు సీలేరు నుంచి నలుగురు క్రీడాకారులు ఎంపిక కావడంతో పాటు, సీలేరుకు చెందిన కొండల శ్రీను ఉత్తమ ప్రతిభ కనబర్చి బెస్ట్ డిఫెండర్గా ఎంపికై నట్టు చెప్పారు. జట్టుకు మేనేజర్గా వ్యవహరించిన సీహెచ్.సురేష్తో పాటు జట్టు కెప్టెన్ శ్రీనివాసులు, శ్యాంసన్, ప్రసాద్ ఎస్ఈ, డీఈఈ రాజేంద్రప్రసాద్, అకౌంట్స్ అధికారి ఈవీవీ సత్యనారాయణ చేతులమీదుగా ఘనంగా సన్మానించారు. క్రీడాకారులకు ప్రత్యేక ట్రోఫీలు, మెడల్స్ను అందజేశారు.అదే విధంగా పోటీలో సహకరించిన యువతకు బహుమతులిచ్చారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే.. గిరిజన విద్యార్థుల మరణాలు
సాక్షి, పార్వతీపురం మన్యం: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే కురుపాంలో గిరిజన విద్యార్థులు మరణించారని, 200 మంది వరకు పిల్లలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని వైఎస్సార్సీపీ నాయకుడు, శాసన మండలిలో విపక్ష నేత, బొత్స సత్యనారాయణ అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం ఆశ్రమ పాఠశాలలో పచ్చకామెర్ల కారణంగా మరణించిన తోయక కల్పన, అంజలి కుటుంబ సభ్యులను ఆయనతోపాటు వైఎస్సార్సీపీ నాయకులు శుక్రవారం పరామర్శించి, ధైర్యం చెప్పారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించిన మేరకు పార్టీ తరఫున రెండు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆరి్థక సాయం అందించారు. అనంతరం పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత బొత్స మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ అశ్రద్ధ, నిర్లక్ష్యం వల్లే రెండు నిండు ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, వైద్య శాఖ సకాలంలో స్పందించి ఉంటే ఈ దారుణం జరిగేది కాదన్నారు. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధిత పిల్లలను మానవత్వంతో వైఎస్ జగన్ పరామర్శించడాన్ని కూడా ఈ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు గానీ, మంత్రులు గానీ ఈ ఘటనపై సమీక్షించిన దాఖలాలు లేవన్నారు. పది రోజుల తర్వాత ఆ శాఖ మంత్రి ఆస్పత్రికి వచ్చారని ధ్వజమెత్తారు. ఇటువంటి ప్రభుత్వం ఉండటం మన దురదృష్టమన్నారు.ప్రజారోగ్యం కుదేలు విద్యార్థులకు పూర్తిగా నయం కాకుండానే విశాఖ కేజీహెచ్ నుంచి జిల్లా ఆస్పత్రికి, ఇళ్లకు పంపిస్తున్నారని బొత్స మండిపడ్డారు. మృతి చెందిన పిల్లల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘పిల్లలను ఎందుకు ఆదుకోరు.. అప్పట్లో అబ్బ సొత్తు ఇస్తున్నారా.. అన్నారు కదా.. ఇప్పుడు నేను అడుగుతున్నా.. వారి అబ్బ సొత్తు ఏమైనా ఇవ్వాలా?’ అని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో వైద్య కళాశాలలను తాకట్టు పెట్టి, దోపిడీకి తెర తీయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి, ప్రజారోగ్యాన్ని కుదేలు చేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రులు పాముల పుష్ప శ్రీవాణి, పీడిక రాజన్నదొర, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పాల్గొన్నారు. -
ఆదివాసీల భూములను ప్రాజెక్ట్లకు ఎలా కేటాయిస్తారు?
● గిరిజన ఆదివాసీ సంఘ జిల్లా గౌరవ అధ్యక్షుడు బోనంగి చిన్నయ్యపడాల్ ధ్వజం ● ఎర్రవరంలో ఆందోళన చింతపల్లి: గిరిజన ప్రాంతంలోని 5వ షెడ్యూల్లో ఆదివాసీల భూములను హైడ్రోపవర్, పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టుల పేరిట జీవోల విడుదలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఎవరిచ్చారని గిరిజన ఆదివాసీ సంఘ గౌరవ జిల్లా అధ్యక్షుడు బోనంగి చిన్నయ్యపడాల్ ధ్వజమెత్తారు. గురువారం మండలంలోని ఎర్రవరంలో హైడ్రోపవర్ ప్రాజెక్టు బాధిత గిరిజనులతో కలిసి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్బంగా గిరిజనులు ప్లకార్డులు చేతపట్టి, కళ్లకు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. జీవోలను కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చిన్నయ్యపడాల్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలు భూములు, చట్టాలపై పెత్తనం చేసే హక్కు ప్రభుత్వాలకు లేదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చినిప్పటికీ రాష్ర ప్రభుత్వం ఆ తీర్పులను అమలు చేయడం లేదన్నారు ఏజెన్సీలో ఆదీవాసీ భూములను దోచుకోవడమే లక్ష్యంగా ప్రయత్నాలు కొనసాగిస్తుందని ఆరోపించారు. ఈ జీవోల వల్ల మన్యం ప్రాంతంలో 250 గ్రామాలు నిర్వాసితులు కావడంతో పాటు 50 వేలమంది గిరిజనులు ఆదివాసీ ప్రాంతానికి దూరం అయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుల జీవోలు రద్దుకు అన్ని ప్రాంతాలు గిరిజనులతో కలసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ కో కన్వీనర్లు గూడెపు రాజు,వెంకటేశ్వర్లు, కృష్ణంరాజు, గోపి తదితరులు పాల్గొన్నారు. -
గిరిజనుల ఆరోగ్యమే ధ్యేయం
జి.మాడుగుల: అల్లూరి జిల్లా వ్యాప్తంగా పోలీస్శాఖ నిర్వహిస్తున్న ఉచిత మెగా వైద్యశిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పాడేరు డీఎస్పీ ఎస్.షహబాజ్ అహ్మద్ తెలిపారు. జి.మాడుగుల మండలం బొయితిలి పంచాయతీ మద్దిగరువు గ్రామంలో గురువారం జరిగిన వారపు సంతలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విశాఖ కేర్, మహాత్మాగాంధీ క్యాన్సర్ ఆస్పత్రి సహకారంతో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ అమిత్బర్దర్ ఆదేశాలమేరకు గిరిజనుల ఆరోగ్యమే ధ్యేయంగా పోలీసుశాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటుచేస్తున్నామన్నారు. ఎటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తినా పట్టణాలకు వెళ్లి వైద్యం చేయించుకోవడంలో ఆర్థికంగా ఇబ్బందులు దృష్ట్యా పోలీస్శాఖ ఆధ్వర్యంలో గిరిజనులకు వైద్య సదుపాయాలు కల్పించినట్టు ఆయన చెప్పారు. వైద్య శిబిరంలో 700 మందికి డాక్టర్ మురళీధర్, డాక్టర్ సతీష్, మహాత్మాగాంధీ క్యాన్సర్ ఆస్పత్రి డాక్టర్ సౌజన్య, ఎంజీసీహెచ్ డాక్టర్ హారిక రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సీఐ శ్రీనివాసరావు, ఎంపీపీ లంబోరి అప్పలరాజు, ఎస్ఐ షణ్ముఖరావు, పోలీస్ సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు.డీఎస్పీ షహబాజ్ అహ్మద్ -
స్నేహితుడిని పరామర్శించి వస్తూ మృత్యువాత
● లారీ ఢీకొని యువకుడి దుర్మరణం గోపాలపట్నం: చేతికి అందివచ్చి.. ఇంటికి అండగా ఉంటున్న కొడుకు మరణం ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. ఆరు నెలల కిందట చెల్లెలి పెళ్లి చేసి మురిసిన అన్నయ్య.. ఈ రోజు కన్నీటి జ్ఞాపకంగా మిగిలిపోయాడు. స్నేహితుడిని పరామర్శించి వస్తున్న ఆ యువకుడిని మృత్యువు రోడ్డు రూపంలో కబళించింది. పోలీసులు తెలిపిన వివరాలివి. వేపగుంటలో ఉంటున్న స్నేహితుడికి తేలు కుట్టిందని తెలిసి పరామర్శించేందుకు బుధవారం రాత్రి వెళ్లిన బొడ్డేడ వంశీ (24) తిరిగి ఇంటికి వస్తుండగా.. అర్ధరాత్రి సమయంలో జాతీయ రహదారిపై ఈ దారుణం చోటుచేసుకుంది. అక్కయ్యపాలెంలో నివాసముంటున్న వంశీ స్వస్థలం అనకాపల్లి జిల్లా చోడవరం మండలం చేమలాపల్లి. ట్రావెల్ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. తన ద్విచక్రవాహనంపై వేపగుంట నుంచి వస్తుండగా.. ఆర్అండ్బీ జంక్షన్ సమీపంలో వెనుకనే అతివేగంగా వస్తున్న లారీ అతన్ని ఢీకొట్టింది. ఈ ధాటికి అదుపుతప్పిన వంశీ లారీ చక్రాల కింద పడి నలిగిపోయాడు. లారీ అతన్ని సుమారు 100 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లడంతో వంశీ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. కుటుంబానికి అండగా ఉంటున్న కుమారుడు అకాల మరణంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. తండ్రి రామకృష్ణ లారస్ సంస్థలో హౌస్ కీపర్గా పనిచేస్తున్నారు. బుద్ధిమంతుడైన కొడుకు లేడనే నిజాన్ని జీర్ణించుకోలేక వారు పడుతున్న వేదన అక్కడివారిని సైతం కంటతడి పెట్టించింది. ఆరు నెలల కిందటే వంశీ తన చెల్లెలు కావ్యకు అన్నీ తానై వివాహం జరిపించాడు. ఆ తీపి జ్ఞాపకాలు ఇంకా మరువకముందే.. అన్న మరణవార్త విన్న కావ్య కన్నీటి పర్యంతమైంది. తండ్రి రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎయిర్పోర్టు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. -
ఏయూ పరువు పాయే..!
విశాఖ సిటీ: ఆంధ్రా యూనివర్సిటీ మరో వివాదం రాజుకుంటోంది. ఏయూలో బాణసంచా దుకాణాల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ జోక్యం చేసుకోవడం అగ్గి రాజేస్తోంది. ఏయూ వీసీ అనుమతులు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ.. ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా తాత్కాలిక స్టాళ్ల అనుమతులకు ఉన్నత విద్యా శాఖ లేఖ రాయడం హాట్ టాపిక్గా మారింది. ఇది వైస్ చాన్సలర్ పరువు తీయడమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామం విశ్వవిద్యాలయ అధికార, ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. తాత్కాలిక దుకాణాల ఏర్పాటుకు రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ కల్పించుకోవడం వెనుక ఆంతర్యమేంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదిలా ఉంటే ఏయూ నుంచి అనుమతులు రాకముందే స్టాళ్ల ఏర్పాటు పనులు చేపట్టడంపై ‘సాక్షి’ ప్రచురించిన కథనంతో అధికార వర్గాల్లో ప్రకంపనలు రేగాయి. దీనిపై కలెక్టర్ హరేందిర ప్రసాద్ సీరియస్ అయినట్లు సమాచారం. ఉన్నత విద్యా శాఖ జోక్యంపై చర్చ సాధారణంగా ఏయూలో కార్యక్రమాల నిర్వహణకు ఏయూ సమావేశ మందిరాలు, మైదానాలు లీజుకు ఇవ్వడం సర్వసాధారణమైన విషయం. ఎవరైనా కార్యక్రమం నిర్వహణకు దరఖాస్తు చేసుకొని నిర్ణీత రుసుము చెల్లిస్తే.. ఏయూ వీసీ అనుమతులు ఇస్తుంటారు. గతంలో ప్రైవేటు కార్యక్రమాలకు కూడా అనుమతులు ఇచ్చేవారు. అయితే ఏయూ రాజకీయ వేదికగా మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో కేవలం ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రమే అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ప్రైవేటు కార్యక్రమానికి ఏయూ, దానికి సంబంధించిన మైదానాల్లో అనుమతులు మంజూరు చేసే అవకాశం లేదు. దీపావళి సందర్భంగా బాణసంచా విక్రయాలకు ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్లో స్టాళ్ల ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం ఆలోచన చేస్తోంది. దీనిపై ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ హెలీప్యాడ్ గ్రౌండ్ను లీజుకు ఇవ్వాలని జీవీఎంసీ కమిషనర్ స్వయంగా ఏయూ వీసికి లేఖ రాశారు. దీనిపై ఏయూ వీసీ నిర్ణయం తీసుకోకముందే పనులు జరిగిపోయాయి. ఇదిలా ఉంటే ఈ అనుమతుల విషయంలో నేరుగా ఉన్నత విద్యా శాఖ జోక్యం చేసుకోవడం ఇపుడు వర్సటీలో చర్చకు దారితీసింది. ఏయూ వీసీ నిర్ణయం తీసుకోవాల్సిన్న సర్వసాధారణ విషయంలో రాష్ట్ర హయ్యర్ ఎడ్యుకేషన్ కల్పించుకోవాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్నలు అధికార వర్గాల్లో ఉత్పన్నమవుతున్నాయి. ఇది ఏయూ వీసీని అవమానించడమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 21వ తేదీ వరకు అనుమతులు కలెక్టర్ హరేందిర ప్రసాద్ విజ్ఞప్తి మేరకు ఈ నెల 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఏయూ ఇంజినీరింగ్ హెలీప్యాడ్ గ్రౌండ్ లేదా దాని ఎదురుగా ఉన్న పార్కింగ్ మైదానాన్ని తాత్కాలిక స్టాళ్ల ఏర్పాటుకు లీజుకు ఇవ్వాలని ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి కార్యాలయం నుంచి ఏయూ వీసీ ప్రొఫెసర్ రాజశేఖర్కు లేఖ వచ్చింది. ఈ నెల 15న ఈ లేఖ రాగా వెంటనే ఏయూ వీసీ కూడా అనుమతులు మంజూరు చేసినట్లు తెలుస్తోంది. కానీ 14వ తేదీ నుంచి అనుమతులు కోరినట్లు ఉండడం గమనార్హం. ఇదిలా ఉంటే ఆయన అనుమతులకు ముందే ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ పార్కింగ్ మైదానంలో మళ్లీ పనులు ప్రారంభించేయడం విషయం. ప్రస్తుతం అనుమతులు ఉండడంతో పనులు జరుగుతున్నాయి. ‘కూటమి’ జోక్యంతో వివాదం ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ హెలీప్యాడ్ మైదానంలో స్టాళ్ల ఏర్పాటు కోసం అనుమతులు ఇవ్వాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఏయూ ఉపకులపతి ప్రొఫెసర్ రాజశేఖర్కు లేఖ రాశారు. దీనిపై ఏయూ వీసీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అనుమతులు ఇవ్వకముందే గ్రౌండ్లో స్టాళ్ల ఏర్పాటుకు పనులు ప్రారంభించారు. దీనిపై సాక్షి ‘ఏయూ–జీవీఎంసీ మధ్య దివాళీ ట్రేడ్ ఫైర్’ అంటూ కథనం ప్రచురించింది. దీంతో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. ఏ శాఖ నుంచి అనుమతులు రాకముందే, ఏయూ వీసీ గ్రౌండ్ను లీజుకు ఇవ్వకముందే పనులు చేపట్టడంపై కలెక్టర్ హరేందిర ప్రసాద్ సీరియస్ అయ్యారు. వెంటనే ఆ పనులను ఆపాలని ఆదేశాలు జారీ చేశారు. వెంటనే కూటమి ప్రజాప్రతినిధి రంగంలోకి దిగారు. జిల్లా అధికారులతో పాటు ఏయూ వీసీతో కూడా మాట్లాడి అనుమతులు ఇవ్వాలని ఒత్తిడి తీసుకువచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. సదరు ప్రజాప్రతినిధి అనుచరులే ఈ మందుగుండు స్టాళ్ల పేరుతో దందాకు తెరతీసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో స్టాల్ను రూ.1.5 లక్షలకు బేరం పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఫలితంగానే అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి ఏయూ గ్రౌండ్లో దుకాణాలను ఏర్పాటు చేయించాలని ప్రజాప్రతినిధి గట్టిగా పట్టుబట్టినట్లు తెలుస్తోంది. -
జేసీ అభిషేక్ గౌడకు వీడ్కోలు
ఘనంగా సత్కరించినజిల్లా అధికార యంత్రాంగం సాక్షి,పాడేరు: ఏలూరు జాయింట్ కలెక్టర్గా బదిలీపై వెళుతున్న జేసీ డాక్టర్ ఎంజే అభిషేక్గౌడను జిల్లా అధికార యంత్రాంగం గురువారం ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికింది. కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్, ఇన్చార్జి జేసీ, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, డీఎఫ్వో సందీప్రెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ మెహిత్, డీఆర్వో పద్మలత అభిషేక్గౌడను సత్కరించి జ్ఞాపిక అందజేశారు. ఏడాదిపాటు జేసీ, ఏడు నెలలు ఇన్చార్జి పీవోగా ఆయన గిరిజనుల సంక్షేమానికి ఉత్తమ సేవలు అందించారని కలెక్టర్ దినేష్కుమార్ కొనియాడారు. సన్మాన గ్రహీత అభిషేక్గౌడ మాట్లాడుతూ అందరి సహకారంతో గిరిజన ప్రాంతంలో సేవలు అందించడం సంతోషంగా ఉందన్నారు. -
ఆందోళనకు టీడీపీ దూరం.. ఊరి సమస్యలోనూ రాజకీయమే!
రాజయ్యపేటలో మత్స్యకారులు చేస్తున్న ఉద్యమం రాజకీయ రంగు పులుముకుంది. ప్రారంభంలో గ్రామస్తుల ఒత్తిడి తట్టుకోలేక కొంతమంది టీడీపీ నాయకులు ఆందోళనలో పాల్గొన్నప్పటీకి హోంమంత్రిని అడ్డుకున్న తర్వాత టీడీపీ నాయకులు ఈ ఆందోళనకు దూరంగా ఉన్నారు. మిగిలిన మత్స్యకారులు మాత్రమే ఆందోళన కొనసాగిస్తున్నారు. మత్స్యకారులంతా గ్రామం కోసం, ప్రాణాల కోసం పోరాటం చేస్తుంటే రాజకీయ కారణాలతో టీడీపీ నాయకులు ముఖం చాటేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది టీడీపీ నాయకుల పేర్లు, వారి ఫొటోలు, బల్క్ డ్రగ్ పార్క్కు వ్యతిరేకంగా వ్యక్తం చేసిన అభిప్రాయాలు టీవీల్లో, పత్రికల్లో రావడంతో.. మన ప్రభుత్వమే బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తుంటే మీరెలా నిరాహారదీక్ష శిబిరంలో కూర్చుంటారని పార్టీ పెద్దలు చీవాట్లు పెట్టినట్టు తెలుస్తోంది. -
సెక్యూరిటీ గార్డుతోరక్త పరీక్షలా?
● లక్ష్మీపురం సర్పంచ్ కోర్రా త్రినాథ్ ఆవేదన ● మండల సర్వసభ్య సమావేశంలో ధ్వజం ముంచంగిపుట్టు: స్థానిక సీహెచ్సీలో సెక్యూరిటీ గార్డుతో రక్త నమూనాల సేకరించి, పరీక్షలు చేస్తే ఎలా అని లక్ష్మీపురం సర్పంచ్ కోర్రా త్రినాథ్ ధ్వజమెత్తారు. సాక్షిలో ప్రచురితమైన కథనాన్ని చూపిస్తూ గురువారం జరిగిన మండల సర్వసభ్య సమావేశం ఆయన వైద్యసిబ్బంది, ఎంపీడీవో ధర్మారావును ప్రశ్నించారు. దీనిపై ఉన్నతస్థాయి అధికారులు, కలెక్టర్, ఐటీడీఏ పీవో కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు. సీహెచ్సీలో పూర్తిస్థాయిలో వైద్యులు, సిబ్బందిని నియమించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఆస్పత్రిలో అంబులెన్సు పాడైందని, కనీసం 108 సేవలు కూడా అందుబాటులో లేవన్నారు. దీనిపై సీహెచ్సీని తనిఖీ చేసి వైద్యసేవలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో ధర్మారావు పేర్కొన్నారు. -
పోలవరం నిర్వాసితులకు కొత్త చిక్కు?
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్ (ఏపీజీవీబీ)ను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ (ఏపీజీబీ)లో సాంకేతికంగా విలీనం చేయడం వల్ల పోలవరం నిర్వాసితులకు కొత్త చిక్కు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీరిలో అధికశాతం మందికి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్లో ఖాతాలు ఉన్నాయి. వీరంతా ప్రభుత్వం చెల్లించే నష్టపరిహారానికి సంబంధించి ఇవే ఖాతా నంబర్లు ఇచ్చారు. వీటిని ఉన్నతాధికారులు ప్రభుత్వానికి పంపించారు. ఈ నేపథ్యంలో జరిగిన విలీనం వల్ల ఏపీజీవీబీ ఖాతాదారుల నంబర్లు మారుతాయని సంబంధిత అధికారవర్గాలు చెబుతుందటం నిర్వాసితుల్లో ఆందోళనకు దారితీస్తోంది. ఏపీజీబీలో ఏపీజీవీబీ విలీనంతో సమస్య చింతూరు: పోలవరం ముంపులో భాగంగా చింతూరు డివిజన్లో ప్రాధాన్యత క్రమంలో చేర్చిన 32 గ్రామాల నిర్వాసితుల గృహాల విలువ, ఆర్అండ్ఆర్ పరిహారం త్వరలోనే అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వీరంతా గృహాల విలువ, ఆర్అండ్ఆర్ పరిహార నిమిత్తం గతంలోని ఏపీజీవీబీ ఖాతా నంబర్లను అధికారులకు ఇచ్చారు. దీంతో పరిహారం వారి ఖాతాల్లో జమకావాల్సి ఉంది. ఇంతలోనే ఖాతా నంబర్ల మార్పుతో వారిలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ ఏడాది డిసెంబర్ వరకు తమ ఖాతాల్లో పరిహారం జమ అయితే ఫర్వాలేదని, లేకుంటే మారిన ఖాతా నంబర్లను తిరిగి పోలవరం అధికారులకు ఇవ్వాల్సి ఉంటుందని వారు ఆవేదన చెందుతున్నారు. ఐఎఫ్సీ కోడ్ మారితే పెద్ద ఇబ్బంది లేకున్నా నిర్వాసితుల ఖాతా నంబర్లు మారితే మాత్రం వాటిని తిరిగి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలంటే చాలా సమయం పడుతుందని ఆర్అండ్ఆర్ సిబ్బంది అంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నాగార్జున గ్రామీణ బ్యాంకు ఉండగా రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్బ్యాంకు (ఏపీజీవీబీ)గా మారింది. ప్రస్తు తం విలీనంలో భాగంగా అదికాస్తా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు(ఏపీజీబీ)గా రూపాంతరం చెందింది. చింతూరు డివిజన్లో కూనవరం, వీఆర్పురం, సీతాపురం, నెల్లిపాక, చింతూరులో ఏపీజీబీ బ్యాంకులున్నాయి. ఐదు బ్యాంకుల పరిధిలో సుమారు 40 వేల నుంచి 50 వేల వరకు ఖాతాదారులుండగా వీరిలో సుమారు 2 వేల మంది పోలవరం నిర్వాసితులు ఉన్నారు. గతంలో నాలుగు మండలాల్లో ప్రధాన బ్యాంకులు లేకపోవడంతో నాగార్జున గ్రామీణ బ్యాంకు మాత్రమే అందుబాటులో ఉండేది. దీంతో అందరూ ఈ బ్యాంకు ద్వారానే తమ లావాదేవీలు కొనసాగించేవారు. కాలక్రమేణా ప్రధాన బ్యాంకులు అందుబాటులోకి వచ్చినా చాలామంది ఖాతాదారులు ఈ బ్యాంకులోనే తమ ఖాతాలను కొనసాగిస్తున్నారు. ప్రధానంగా మారుమూల గ్రామాలకు చెందిన గిరిజనులు ఈ బ్యాంకులో ఖాతాలు కలిగి ఉన్నారు. వీరిలో వ్యాపారులు, రైతులతో పాటు స్వయం సహాయక గ్రూపుల మహిళలు అధికసంఖ్యలో ఖాతాదారులుగా ఉన్నారు. ప్రతి మండలంలో ఈ బ్యాంకు ద్వారా డ్వాక్రా మహిళలకు చెందిన లావాదేవీలు అధికంగా జరుగుతుంటాయి. ఇప్పటివరకు ఏపీజీవీబీగా ఉన్న ఈ బ్యాంకు ఈనెల 13 నుంచి ఏపీజీబీగా రూపాంతరం చెందింది. దీనికోసం కొన్ని రోజులపాటు ఆన్లైన్ సేవలను నిలిపివేసి మార్పులు చేపట్టారు. ఈ నేపధ్యంలో బ్యాంకుకు సంబంధించిన ఐఎఫ్ఎస్సీ కోడ్ మారడంతో పాటు ఖాతాదారుల నంబర్లు, యాప్ కూడా మారాయి. అయితే ఖాతా నంబర్ల మార్పుతో ఇప్పటికప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేవని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు., ఈ ఏడాది డిసెంబర్ వరకు పాత ఖాతా నంబర్లతోనే లావాదేవీలు కొనసాగించవచ్చని, తరువాత ఖాతా నంబర్లు మార్చుకోక తప్పదని వారు స్పష్టం చేస్తున్నారు. -
వైజాగ్ హాఫ్ మారథాన్కు భారీ స్పందన
ఏయూ క్యాంపస్ (విశాఖ): వైజాగ్ ట్రైల్ రన్నింగ్ అసోసియేషన్.. వైజాగ్ హాఫ్ మారథాన్ 2025 బీచ్లో జరిగింది. ఈ కార్యక్రమంలో 2 వేల మందికి పైగా పాల్గొన్నారు. మారథాన్లో హాఫ్ మారథాన్ (21.1 కి.మీ), 10 కి.మీ పరుగు, 5 కి.మీ ఫన్ రన్ ఉన్నాయి. ఆర్కే బీచ్ నుంచి రుషికొండ మీదుగా ఈ మారథాన్ను నిర్వహించారు. నగర పోలీసు కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి జెండా ఊపి రన్ను ప్రారంభించారు. అనంతరం కమిషనర్ రన్లో పాల్గొన్న వారిని అభినందించారు. డిసెంబర్ 6, 7 తేదీల్లో పాడేరులో 100 కిలోమీటర్లు రన్ కూడా పెడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇతర వివరాలకు www.vtra.run వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. -
జాతీయ స్థాయి యోగా పోటీలకు ఇద్దరు ఎంపిక
రంపచోడవరం: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిను లు పి. శ్రావణి సంధ్య, పి. మౌనిక యోగాలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ డా.పి వసుధ తెలిపారు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ పరిధి రాజమహేంద్రవరంలో ఈనెల 15న జరిగిన ఎంపికల్లో వీరిద్దరు ప్రతిభ కనబరిచారన్నారు. ఎస్వీవైఏఎస్ఏ యూనివర్సిటీ బెంగళూరులో వచ్చే 24 నుంచి 28 వరకు జరగనున్న ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో పాల్గొంటారని వీరి పాల్గొంటారని తెలిపారు. ఇద్దరు విద్యార్థినులను గురువారం వైస్ ప్రిన్సిపాల్ డి.రవికుమార్, పీడీ ప్రభాకరరావు, అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు. -
అధ్వానంగా డీఆర్ డిపో భవనం
పాడేరు రూరల్: మండలంలో చింతలవీధి పంచాయతీ కేంద్రంలో ఉన్న డీఆర్ డిపో భవనం అధ్వానంగా మారింది. భవనం ప్రాంగణం పిచ్చిమొక్కలు, తుప్పలతో నిండి ఉంది. విషసర్పాలు, కీటకాలతో ప్రమాదభరితంగా మారిందని స్థానికులు చెందుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ పొందేందుకు కార్డుదారులు నానా అవస్థలు పడుతున్నారని చెబుతున్నారు. అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని పలువురు చెబుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని వారు కోరుతున్నారు. -
కూటమి ప్రభుత్వం అరాచక పాలన
● కోటి సంతకాల సేకరణ కరపత్రాల ఆవిష్కరణ ● అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డుంబ్రిగుడ: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం గురువారం రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కరపత్రాలు ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మత్స్యలింగం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తోందని, ప్రజలు గమనిస్తున్నారన్నారు. త్వరలో కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులు ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ కార్యక్రమం విజయవంతమైందన్నారు. ఇప్పుడు రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమంతో పాటు కమిటీల నియామకాలు కూడా పూర్తి చేస్తామన్నారు. కోటి సంతకాల సేకరణలో అనుబంధ విభాగాలు క్రియాశీలకంగా ఉండాలని కమిటీల నిర్వహణలో అలసత్వ వద్దన్నారు. ఉత్సాహం, తపన, బాధ్యతతో పనిచేయాలని ముందుకొచ్చేవారిని గుర్తించి కమిటీల్లో ప్రాధాన్యతనివ్వాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. రాష్ట్రంలో నకిలీ మధ్యం ఏరులై పారుతోందని ఆయన ధ్వజమెత్తారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పాలనలో ప్రజలకు సంక్షేమ పథకాలు ఇంటివద్దనే అందజేస్తే కూటమి ప్రభుత్వం చంద్రబాబు రివర్స్ పాలన సాగిస్తుందని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పాంగి పరశురామ్, వైస్ ఎంపీపీ శెట్టి ఆనంద్రావు, కితలంగి, పోతంగి, గుంటసీమల సర్పంచ్లు సుబ్బారావు, గుమ్మ నాగేశ్వరరావు, వంతాల వెంకటరావు, నాయకులు సింహాచలం, నరేష్, అప్పలరాజు, రామ్దాసు, బబిత, నిర్మల, మండల కార్యదర్శి రామ్నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
వైద్య కళాశాలలోఎనస్తీషియా దినోత్సవం
● ఘనంగా ప్రపంచ ఎనస్తీషియా దినోత్సవం సాక్షి,పాడేరు: ప్రపంచ ఎనస్తీషియా దినోత్సవాన్ని స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలలో గురువారం ఘనంగా నిర్వహించారు, ప్రిన్సిపల్ డాక్టర్ డి.హేమలతాదేవి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య కార్యక్రమాలు.అత్యవసర వైద్యంలో మత్తు వైద్య నిపుణుల పాత్రను ఆమె వైద్య విద్యార్ధులకు వివరించారు. కోవిడ్ సమయంలో మత్తు వైద్యవిభాగం బాధితులకు విశేష సేవలు అందించిందన్నారు. ఈ కార్యక్రమంలో పలు విభాగాల వైద్యనిపుణులు, వైద్య విద్యార్ధులు పాల్గొన్నారు. -
ఆపదలో పల్లె వైద్యం
సాక్షి,పాడేరు: జిల్లాలో పీహెచ్సీ వైద్యుల సమ్మె ప్రభావం రోగుల ఆరోగ్య సేవలపై చూపుతోంది. సమస్యలు పరిష్కారం కోరుతూ గత నెల 29 నుంచి విధులకు దూరమయ్యారు. వీరంతా విజయవాడలో ఆందోళనలు చేస్తున్నారు. అయినప్పటికీ వీరి సమస్యలు పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ● జిల్లాలో 64 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 106 మంది వైద్యులు ఉన్నారు. వీరంతా సమ్మెలో ఉండగా 14 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సర్వీసు పీజీ కోటా పునరుద్ధరణ, పదోన్నతుల కల్పన, గిరిజన ప్రాంతాల్లో విధులు, 104 సంచార చికిత్స అలవెన్స్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. దీంతో గ్రామీణ వైద్యంపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రతి పీహెచ్సీకి ఇద్దరు వైద్యులు ఉన్నందున చాలాచోట్ల రౌండ్ క్లాక్ సేవలు అందుబాటులో ఉండేవి. పీహెచ్సీ వైద్యుల సమ్మె ప్రభావం గ్రామీణ వైద్యసేవలపై లేకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ● వైద్యసిబ్బంది అందించే సేవలపై పూర్తిస్థాయిలో సంతృప్తి చెందని రోగులు ముంచంగిపుట్టు, చింతూరు, చింతపల్లి, కూనవరం, అడ్డతీగల సామాజిక ఆరోగ్య కేంద్రాలు, అరకులోయ, రంపచోడవరం ప్రాంతీయ ఆస్పత్రులు, పాడేరు జిల్లా ఆస్పత్రిని ఆశ్రయిస్తున్నారు. దీంతో ఓపీ, రక్తపరీక్షల విభాగాల వద్ద బారులు తీరుతున్నారు. ● జిల్లా ఆస్పత్రి, కమ్యూనిటీ ఆస్పత్రులు, ఆయుష్ విభాగం నుంచి 30 మంది వైద్యులను కొన్ని ఆస్పత్రులకు తాత్కాలికంగా కేటాయించామని అధికారవర్గాలు చెబుతున్నా అందుకుతగ్గట్టుగా సేవలు అందించలేకపోతున్నారని రోగులు వాపోతున్నారు. ● పీహెచ్సీ వైద్యులు లేకపోవడంతో ఆ భారమంతా వైద్యసిబ్బందిపై పడుతోంది. పీహెచ్సీలకు వస్తున్న నెలలు నిండిన గర్భిణులకు నర్సింగ్ సిబ్బంది ప్రసవం చేస్తున్నారు. కాన్పు కష్టం అనుకుంటే వారిని రిఫరల్ ఆస్పత్రుతలకు తరలిస్తున్నారు. వైద్యులు లేకపోవడంతో గర్భిణులకు నరకంగా మారింది. తల్లీబిడ్డలకు ఆరోగ్యసేవలు అందించేందుకు వైద్య సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. పీహెచ్సీ వైద్యుల సమ్మెతో 18 రోజులుగా రోగుల ఇక్కట్లు వారి సమస్యలు పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలం వైద్యసేవలు పొందేందుకు నానా అవస్థలు పడుతున్న ప్రజలు -
ఇబ్బందులు తప్పేట్టు లేవు
ఇళ్లకు సంబంధించిన పరిహారం, ఆర్అండ్ఆర్ పరిహారం వచ్చేందుకు ఏపీజీవీబీ ఖాతాను ప్రభుత్వా నికి ఇచ్చాం. ప్రస్తుతం బ్యాంకు ఖాతా నంబర్లు మారుతాయని అధికారులు చెప్పడంతో ఇబ్బందులు తప్పేట్టు లేవు. – పయ్యాల నాగేశ్వరరావు, పోలవరం నిర్వాసితుడు, చింతూరు సమస్యను పరిష్కరించాలి ఏపీజీవీబీ బ్యాంకు ఖాతా నంబర్లు ఉన్నట్టుండి మార్చడం సరికాదు. దీని ప్రభావం నిర్వాసితుల పరిహారానికి సంబంధించి ఆన్లైన్ ప్రక్రియపై ప్రభావం పడే అవకాశముంది. దీనిపై ఉన్నతాధికారులు దృష్టిపెట్టాలి. – మొహమ్మద్ ఎజాజ్ అహ్మద్, చింతూరు ఉన్నతాధికారుల దృష్టికి సమస్య ఖాతా నంబర్ల మార్పు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషిచేస్తాం. ఇప్పటికే ఆ బ్యాంకు రీజనల్ మేనేజర్తో మాట్లాడా. సమస్యను పోలవరం అడ్మినిస్ట్రేటివ్ అధికారికి వివరించాం. – శుభం నొఖ్వాల్, ఐటీడీఏ పీవో, చింతూరు ప్రస్తుతానికి ఇబ్బంది లేదు ఏపీజీబీలో విలీనం వల్ల ఖాతా నంబర్లు మారనున్నాయి. ఇప్పటికే ఐఎఫ్ఎస్సీ కోడ్ మారగా ఈ ఏడాది డిసెంబరు అనంతరం ఖాతా నంబర్లు కూడా మారతాయి. అప్పటివరకు పాత నంబర్లలో లావాదేవీలు కొనసాగించవచ్చు. – శ్రీనివాసరావు, ఏపీజీబీ మేనేజర్, చింతూరు బ్రాంచ్ -
చిరుధాన్యాల సాగుతో లాభాలు
జి.మాడుగుల: చిరుధాన్యాల సాగుతో లాభాలు పొందవచ్చని భారతీయ చిరుధాన్యాల సంస్థ (హైదరాబాద్), ఐఐఎంఆర్ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ సంగప్ప, డాక్టర్ రఫి చెప్పారు. మండలంలోని సొలభం పంచాయతీలో భీమలోయి గ్రామంలో చిరుధాన్యాల పంటలను వారు బుధవారం పరిశీలించారు. మత్స్యదేవత ఎఫ్పీవో ఆధ్వర్యంలో భారతీయ చిరుధాన్యాల సంస్థ (హైదరాబాద్) అందించిన విత్తనాలతో సాగుచేస్తున్నట్టు రైతులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయా శాస్త్రవేత్తలు చిరుధాన్యాల పంటల సాగుపై రైతులకు పలు సూచనలు, సలహాలిచ్చారు. శ్రీ మత్స్యదేవత ఎఫ్పీవో సీఈవో ఐసరం హనుమంతరావు, అకౌంటెంట్, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. -
కలెక్టర్ దృష్టికి గ్రామాల సమస్యలు
కొయ్యూరు: బురుదగెడ్డపై వంతెన నిర్మించాలని కోరుతూ యూ.చీడిపాలెం సర్పంచ్ దడాల రమేష్, గొట్లుపాడు,కంపుమామిడితో పాటు పలు గ్రామస్తులు కలెక్టర్ ఎ.ఎస్. దినేష్ కుమార్కు బుధవారం వీరవరంలో వినతిపత్రం ఇచ్చారు. అడ్డతీగల మండలం వీరవరం పంచాయతీ చాకిరేవులలో కలెక్టర్ దినేష్కుమార్ పల్లెనిద్ర చేశారు. ఈ మేరకు పలువురు గ్రామస్తులు ఆయనను కలిసి సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. బురుదగెడ్డ, ఈదులబంద కాలువలపై వంతెనల కోసం వివరించారు.దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్టు గ్రామస్తులు తెలిపారు. వి.ఆర్.పురం: మండలంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు బుధవారం చింతూరులో చేపట్టిన గ్రీవెన్స్కు విచ్చేసిన కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు మాదిరెడ్డి సత్తిబాబు, ఎంపీటీసీ సభ్యురాలు బందం విజయలక్ష్మి, సర్పంచ్ పిట్లా రామారావు, జిల్లా అధికార ప్రతినిధి చిక్కాల బాలకృష్ణ, ఆర్టీఐ విభాగం అధ్యక్షుడు బోడ్డు సత్యనారాయణ మాట్లాడుతూ అన్నవరం బ్రిడ్జి కూలడంతో సుమారు 40 గ్రామలకు రాకపోకలు నిలిచిపోయాయన్నారు. పలు గ్రామాలకు అత్యవసర సేవలైన 108 104 సౌకర్యలు లేవన్నారు. త్వరగా బిడ్జి నిర్మించాలని కోరారు. పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలన్నారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ స్ట్రక్చర్ వాల్యుషన్ పరిహారం సంబంఽధించి పెండింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన రోడ్లు పూర్తి చేయాలన్నారు. నాయకులు పోడియం గోపాలరావు, కోటం జయరాజు, బంధం రాజు, చీమల కాంతారావు, మాచర్ల వెంగళరావు, ముత్యాల రాజు తదితరులు పాల్గొన్నారు. కూనవరం: చినార్కూరు పంచాయతీలో వర్షాభావ పరిస్థితుల మూలంగా 550 ఎకరాలలో గిరిజన రైతులు పంటలు వేసుకునే పరిస్థితి లేదని, 15 స్తంభాలు వేస్తే అయా పొలాల్లోకి విద్యుత్ లైన్ వస్తుందని, విద్యుత్ మోటార్ల సౌకర్యం కల్పిస్తే వ్యవసాయానికి సంబంధించిన ఇబ్బందులు తొలిగుతాయని ఎంపీపీ పాయం రంగమ్మ, సర్పంచ్ సున్నం అబిరామ్లు చింతూరు ఐటీడీఏలో జరిగిన గ్రీవెన్స్కు విచ్చేసిన కలెక్టర్ ఎ.ఎస్. దినేష్ కుమార్కు బుధవారం వినతి పత్రం ఇచ్చారు. వరదల కారణంగా కొండ్రాజుపేట, టేకులబోరు రోడ్డు కోతకు గురవుతుందని, మరమ్మతు చేయాలని కోరారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని, ఆయా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు ఎంపీపీ పాయం రంగమ్మ తెలిపారు. గ్రామస్తులు కుంజా లక్ష్మణ్రావు, సోడె వెంకటేష్ పాల్గొన్నారు. -
సమావేశాల్లో వెల్లువెత్తిన సమస్యలు
రాజవొమ్మంగి సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్నగిరిజన సంక్షేమశాఖ డీఈ గౌతమి రంపచోడవరంలోని సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ బంధం శ్రీదేవి, వేదికపై జెడ్పీటీసీ పండా వెంకటలక్ష్మి తదితరులురంపచోడవరం: రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి వచ్చిన రోగులకు సకాలంలో స్పందించి వైద్య సేవలు అందించాలన్నారు. ఎప్పటికప్పుడు వైద్యాధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు.అత్యవసర పరిస్థితుల్లో రోగులను తరలించేందుకు అంబులెన్స్లు అందుబాటులో ఉంచాలన్నారు. ఏరియా ఆస్పత్రికి ఒక అంబులెన్స్ ఏర్పాటు చేయాలని అరకు ఎంపీ గుమ్మ తనూజరాణిని కోరినట్టు చెప్పారు. ప్రతి గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలు పక్కాగా నిర్వహించాలన్నారు. ఆదికర్మయోగి సర్వే మారుమూల గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు ఎంతగానో ఉపయోగడపడుతుందన్నారు. రంపచోడవరం మండలంలో అన్ని గ్రామ సచివాలయాలకు సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలన్నారు. జెడ్పీటీసీ సభ్యురాలు పండా వెంకటలక్ష్మి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలతో పాటు తాగునీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులందరికి అందాలన్నారు. గృహా నిర్మాణాలు సకాలంలో పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఎంపీడీవో వై.రాజబాబు, పి.జయంతి, వైస్ ఎంపీపీలు కొమ్మిశెట్టి బాలకృష్ణ, పండా కుమారి, ఎంపీటీసీ సభ్యులు వంశీ, షేక్వలీ, సర్పంచ్లు తదతరులు పాల్గొన్నారు. రాజవొమ్మంగి: రాజవొమ్మంగి మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారం ఎంపీపీ సమావేశపు హాలులో ఎంపీపీ గోము వెంకటలక్ష్మి అధ్యక్షతన వాడీవేడిగా జరిగింది. వివిధ శాఖల అధికారులతో జరిగిన సమీక్షలో ప్రభుత్వం, అధికారుల పనితీరుపై సభ్యులు ధ్వజమెత్తారు. సమావేశాల్లో ప్రస్తావించిన సమస్యలు పరిష్కారం కావడం లేదని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో బెల్టుషాపుల్లో మద్యం విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఎంపీపీ వెంకటలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యురాలు జ్యోతి, గడుఓకుర్తి సర్పంచ్ చంద్రుడు చెప్పారు. గిరిజన సంక్షేమ డీఈ గౌతమి మండలంలో నూతనంగా చేపట్టనున్న పలు అభివద్ధి కార్యక్రమాలను వివరిస్తుండగా సభ్యులు అడ్డుతగిలారు. గత ప్రభుత్వ హయాంలో మండలంలో మంజూరైన అప్పలరాజుపేట తదితర గ్రామాలకు చెందిన రహదారి పనులు నేటికి అసంపూర్తిగా ఉన్నాయని, వాటిని ముందు పూర్తి చేయాలని సభ్యులు డిమాండ్ చేశారు. పలు గ్రామాల్లో రహదారుల సమస్యలను సర్పంచ్లు మురళీకృష్ణ, చంద్రుడు ప్రస్తావించారు. ఆయా రహదారుల పనులకు ప్రతిపాదనలు పంపినట్టు డీఈ గౌతమి వివరణ ఇచ్చారు. వట్టిగెడ్డ రిజర్వాయర్ పంటకాలువ పూడికతీత పనులకు , జడ్డంగి వద్ద మడేరు అనకట్ట కుడి ఎడమ కాలువ పనులకు నిధులు మంజూరైనా నేటి పనులు ఎందుకు పూర్తికాలేదని పలువురు సభ్యులు నిలదీశారు. ప్రజాప్రతినిధులకు సమాచారం లేకుండా అధికారులు పలు పనులు ప్రారంభిస్తున్నారని పలువురు ధ్వజమెత్తారు. అధికారులు చేపడుతున్న పనులకు ప్రతిపాదనలు, నిధుల మంజూరు వంటి వివరాలను ప్రజాప్రతినిధులకు తెలియజేయాలని ఎంపీటీసీ సభ్యుడు పెద్దిరాజు కోరారు. ఎంపీడీవో యాదగిరీశ్వరరావు, ఎంపీపీ వెంకటలక్ష్మి, వైస్ ఎంపీపీ చంద్రరాణి, జెడ్పీటీసీ సభ్యురాలు జ్యోతి, ట్రైబల్ వెల్ఫేర్ డీఈ గౌతమి, పీఏసీఎస్ చైర్మన్ కేశవరావు తదితరులు పాల్గొన్నారు. -
పెద్దాస్పత్రి కిటకిట
సాక్షి,పాడేరు: స్థానిక జిల్లా సర్వజన ఆస్పత్రి రోగులతో రద్దీగా మారింది.బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లా ఆస్పత్రికి అనేక ప్రాంతాల నుంచి రోగులు వైద్యసేవలకు భారీగా తరలివచ్చారు.ఓపీతో పాటు వైద్యుల గదులు, రక్తపరీక్షలు, మందుల విభాగాలు రోగులతో కిటకిటలాడాయి. పీహెచ్సీల్లో వైద్యులంతా సమ్మెలో ఉండడంతో వైద్యుల పరీక్షలు నిలిచిపోయాయి. దీంతో పీహెచ్సీల నుంచి కూడా రిఫరల్ కేసులు సంఖ్య భారీగా పెరిగింది. ఆస్పత్రికి వచ్చిన వారిలో జ్వరాలతో బాధపడే వారే అధికంగా ఉన్నారు. వీరంతా రక్తపరీక్షలకు గంటల తరబడి క్యూలెన్లో నిల్చోవాల్సి వచ్చింది.సాయంత్రం వరకు 700 మంది రోగులకు వైద్యసేవలు కల్పించగా, 330 మంది ఇన్పేషెంట్లుగా వైద్యం పొందుతున్నారు. -
సైబర్ నేరాలపై అవగాహన అవసరం
రంపచోడవరం: సైబర్ నేరాలపై విద్యార్థులు పూర్తి స్ధాయిలో అవగాహన కలిగి ఉండాలని గ్రామాల్లో వీటి మోసాలపై చైతన్యం కలిగించాలని రంపచోడవరం డీఎస్పీ సాయిప్రశాంత్ అన్నారు. రంపచోడవరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం సైబర్ నేరాలు, సైబర్ సెక్యూరిటి , ఉమెన్ సెఫ్టీపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీఎస్పీ సాయి ప్రశాంత్ మాట్లాడుతూ సైబర్ నేరాల్లో భాగంగా లోన్ యాప్లు, ఆన్లైన్ ట్రేడింగ్. ఓటీపీ ఫ్రాడ్, ఆన్నౌన్ లింక్లు, ఏఐ ఆధారిత సైబర్ మోసాలు గురించి వివరించారు. మహిళలు అపరిచిత వ్యక్తులతో ఆన్లైన్ చాటింగ్ , వీడియో కాల్స్ వంటివి చేయవద్దని సూచించారు. సీఐ సన్యాసినాయుడు, ఎస్ఐ వెంకటరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వసుధ, పీఎస్ఐ రాజ్కోటి పాల్గొన్నారు. -
ఈఎన్సీ చీఫ్ ఆఫ్ స్టాఫ్గా రియర్ అడ్మిరల్ మనోజ్ ఝా
సాక్షి, విశాఖపట్నం: తూర్పు నౌకాదళం(ఈఎన్సీ) చీఫ్ ఆఫ్ స్టాఫ్(ఆపరేషన్స్)గా రియర్ అడ్మిరల్ మనోజ్ ఝా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మనోజ్ ఝా డీఎస్ఎస్సీ (వెల్లింగ్టన్), యూకేలోని రాయల్ కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్లో విద్యనభ్యసించారు. 1995 జనవరి 1న నౌకాదళంలో ఫ్లాగ్ ఆఫీసర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. గోవాలోని నావల్ అకాడమీ, ఇండియన్ నావల్ వార్ కాలేజ్ (గోవా)లో విధులు నిర్వర్తించారు. గన్నరీ నిపుణుడైన మనోజ్ ఝా.. ఐఎన్ఎస్ చైన్నె యుద్ధ నౌకకు కమాండ్ ఆఫ్ డిస్ట్రాయర్గా విధులు నిర్వహించారు. ఏఎస్డబ్ల్యూ కర్వెట్ ఐఎన్ఎస్ కమోర్తా యుద్ధ నౌకకు మొట్టమొదటి కమాండింగ్ ఆఫీసర్గా, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విరాట్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా విజయవంతంగా బాధ్యతలు పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన నేవల్ హెడ్క్వార్టర్స్లో అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అక్కడి నుంచి ఈస్ట్రన్ నేవల్ కమాండ్కు రావడం గర్వంగా ఉందని మనోజ్ ఝా ఈ సందర్భంగా తెలిపారు. -
ఆత్మీయ సన్మానం
సాక్షి, పాడేరు: జిల్లా కేంద్రం పాడేరులో బుధవారం పర్యటించిన వాసవి క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షుడు ఇరుకు రామకృష్ణను ఉమానీలకంఠేశ్వరస్వామి ఆలయ కమిటీ ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ఆలయంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. అంతకుముందు మోదకొండమ్మతల్లిని రామకృష్ణ దర్శించుకున్నారు. ఆలయ కమిటీతో పాటు స్థానిక వాసవీ క్లబ్ ప్రతినిధులు ఆయనను ఘనంగా సన్మానించారు. పేదలకు చీరలు పంపిణీ చేశారు.అన్నదాన కమిటీకి బియ్యం, ఇతర నిత్యావసర సామాగ్రిని అందజేశారు.స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వాసవీక్లబ్ ప్రతినిధులు ఏర్పాటు చేసిన సరస్వతీదేవి, సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ విగ్రహాలను రామకృష్ణతో పాటు వాసవీ క్లబ్ జిల్లా అధ్యక్షురాలు కొల్లూరి పార్వతి, పట్టణంలోని ఆర్యవైశ్య కుటుంబాలు ఘనంగా ఆవిష్కరించారు. వాసవీ క్లబ్ ప్రతినిధులు శ్రీనాథ శ్రీను, ఉడా త్రినాథరావు, సత్యవరపు సోమరాజు, పుట్టా నానాజీ, శ్రీనాథ శీరిషా, ఉమానీలకంఠేశ్వరస్వామి ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి రమాదేవి, ప్రధాన కార్యదర్శి ఉప్పల వెంకటరత్నం, వైదేహి తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాద స్థాయికి తాండవ నీటిమట్టం
నాతవరం: తాండవ రిజర్వాయరులో నీటిమట్టం బుధవారం నాటికి 377.4 అడుగులకు చేరింది. మరో అడుగు నీటిమట్టం పెరిగితే ప్రమాద నివారణ చర్యలో భాగంగా గేట్లు ద్వారా నదిలోకి నీరు విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలోనే ఏకై క మేజరు ప్రాజెక్టు తాండవ నుంచి ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ఆయకట్టకు నీటిని ఆగస్టు 10న విడుదల చేశారు. ఆ సమయంలో ప్రాజెక్టులో 363.0 అడుగులు మాత్రమే ఉండేది. ఈ ఏడాది అధికంగా వర్షాలు కురవడంతో ప్రస్తుతం నీటిమట్టం 377.4 అడుగులు ఉంది. రిజర్వాయరు ప్రమాద స్థాయి నీటిమట్టం 380 కాగా, డెడ్ స్టోరేజీ 345 అడుగులుగా పరిగణిస్తారు. ఇంకా ఎగువ ప్రాంతం నుంచి ఇన్ ఫ్లో 900 క్యూసెక్కులు వచ్చి చేరుతుందని ప్రాజెక్టు జేఈ శ్యామ్కుమార్ తెలిపారు. ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువల ద్వారా రోజుకు 550 క్యూసెక్కులు విడుదల చేస్తున్నామన్నారు. నీటి మట్టం 378.0 అడుగులకు వచ్చేసరికి ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తామన్నారు. -
హైడ్రో పవర్ ప్రాజెక్టు విషయంలో ఆందోళన వద్దు
అరకులోయటౌన్: హైడ్రో పవర్ ప్రాజెక్టు విషయంలో ఆందోళన వద్దని పాడేరు డీఎస్పీ షెహబాజ్ ఆహ్మద్ అన్నారు. మండలంలోని బస్కీ పంచాయతీ కేంద్రంలో డీఎస్పీ, సీఐ, ఎస్ఐలతో కలిసి పంచాయతీ ప్రజలతో మాట్లాడారు. హైడ్రో పవర్ ప్రాజెక్టు పనులను ప్రభుత్వం నిలిపివేసిందని, ఆయా గ్రామ గిరిజనులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి, కలెక్టర్ ఏఎస్. దినేష్ కుమార్ ఇప్పటికే ప్రకటించారన్నారు. తప్పిపోయిన విద్యార్థుల అప్పగింత పెదబయలు, పాడేరు, హుకుంపేట మండల్లాలోని ఏకలవ్య పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న పి.అరవిందు, బి.సాయితేజ, ఎం.అశోక్లు మంగళవారం పాఠశాల నుంచి బయటకు వెళ్లిపోయిన విద్యార్థులను డీఎస్పీ షెహబాజ్ ఆహ్మద్ సమక్షంలో వారి తల్లిదండ్రులకు అప్పగించారు. తప్పిపోయిన విద్యార్ధుల కోసం పాఠశాల ఉపాధ్యాయులు, వారి తల్లిదండ్రులు వాకాబు చేశారని, వారి ఆచూకీ లభించకపోవడంతో 15వ తేది పెదబయలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. దీంతో పాడేరు ఎస్పీ అమిత్బర్దర్కు వచ్చిన సమాచారం మేరకు పాడేరు డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక టీం ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టామన్నారు. ఈ మేరకు వివిధ సోషల్ మీడియా గ్రూపుల్లో విషయం పొందుపరిచామన్నారు. దీంతో అరకు సంత బయలుకు చెందిన కె.సుబ్రహ్మాణ్యం అనే వ్యక్తి సోషల్ మీడియాలో పిల్లల ఫోటోలను చేసి వారిని గుర్తించి అరకులోయ సీఐ హిమగిరికి సమాచారం ఇచ్చారన్నారు. దీంతో సీఐ హుటాహటిన అక్కడకు చేరుకొని విద్యార్థులను అదుపులోకి తీసుకొని వారు పాఠశాల నుంచి పరారీ కావడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. సరిగ్గా చదువుకోలేక ఒత్తిడికి గురవుతున్నామని, అందుకు పాఠశాల నుంచి బయటకు వచ్చినట్లు వారు వివరించినట్టు తెలిపారు. అనంతరం ఆయా విద్యార్థులను పాఠశాల యాజమన్యం, వారి తల్లిదండ్రులకు అప్పగించిచామన్నారు. సమాచారం ఇచ్చిన సుబ్రహ్మాణ్యంకు నగదు రివార్డు అందించామన్నారు. సీఐ ఎల్.హిమగిరి, ఎస్ఐ గోపాలరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
బధిరులకు సంకేత భాషతో నైపుణ్యం
పాడేరు : విభిన్న సామర్థ్యాలు కలిగిన వ్యక్తులు, వినికిడి లోపం ఉన్న వారిని నైపుణ్యం కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దటం అత్యంత అవసరమని ఐటీడీఏ పీవో, ఇన్చార్జి జేసీ తిరుమణి శ్రీపూజ అన్నారు. బుధవారం పట్టణంలోని కాఫీ హౌస్లో జాతీయ సంకేత దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో బధిరుల కోసం ప్రత్యేకమైన సంకేత భాష (సైన్ లాంగ్వేజ్) ఉంటుందని, దీనిద్వారా పూర్తి స్థాయిలో నైపుణ్యం కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దవచ్చన్నారు. సంకేత భాష నాట్యం లాంటిందన్నారు. పూర్వకాలంలో భరతనాట్యంలో మాటలు లేకుండా కేవలం ముఖ కవళికలు, చేతుల సంజ్ఞల ద్వారానే మహాభారతం, రామాయణం వంటి కథాంశాలు చెప్పేవారన్నారు. సైన్ లాంగ్వేజ్కు యూనిఫాం లాంగ్వేజ్ ఉందని ఇదోక ఆర్టిస్టిక్ టాలెంట్ అని అన్నారు. ఆసక్తి ఉన్నవారు దీనిని నేర్చుకోవచ్చన్నారు. ఆర్టిస్టిక్ ఫీల్డ్లో ఆసక్తి గలవారికి కాంటాక్ట్లు ఏర్పాటు చేయడానికి తాము బాధ్యత తీసుకుంటామని చెప్పారు. ఇంట్లో ఉన్న బధిరులకు సైన్ లాంగ్వేజ్ నేర్పిస్తే వారి భావాలను వ్యక్తపరచడానికి వీలవుతుందన్నారు. సంకేత భాష వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు కవిత, పలు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ -
పథకాలు నూరుశాతం అమలుకు గ్రామాల్లో పర్యవేక్షణ
● కలెక్టర్ దినేష్కుమార్ ● చాకిరేవులలో పల్లె నిద్ర అడ్డతీగల: ప్రభుత్వ పథకాలు నూరుశాతం అమలుకు గ్రామాల్లో పర్యవేక్షణ చేస్తున్నట్లు కలెక్టర్ దినేష్కుమార్ అన్నారు. మండలంలోని మారుమూల గ్రామమైన చాకిరేవులలో మంగళవారం రాత్రి కలెక్టర్ , రంపచోడవరం ఐటీడీఏ పీవో స్మరణ్రాజ్, సబ్ కలెక్టర్ శుభం నొక్వాల్ తదితర అధికారులు పల్లె నిద్ర నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామసభలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నారు. ఏళ్ల తరబడి తాము కనీస వసతులకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీరు పూర్తిస్థాయిలో అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామం నుంచి వీరవరం మీదుగా వెదురునగరం వరకూ రహదారి నిర్మించాలని కోరారు. గ్రామ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. వీరవరం నుంచి కొయ్యూరు మధ్యలో కాలువపై వంతెన నిర్మించాలన్నారు. ఎత్తిపోతల పథకాన్ని వినియోగంలోనికి తీసుకురావాలని విన్నవించారు. కన్నేరు,ఏలేరు వాగులపై జలాశయం నిర్మిస్తే వందలాది ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. సంబందిత అధికారులతో చర్చించి గ్రామ సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దొరకయ్య, ఎంపీడీవో ఏవీవీ కుమార్, గిరిజన సంక్షేమ శాఖ ఈఈ ఐ.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ఆశ్రమ పాఠశాలల్లో మృత్యు ఘంటికలు!
మక్కువ (పార్వతీపురం మన్యం): ఆశ్రమ పాఠశాలల్లో చేరి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్న అడవి బిడ్డల కలలు ఆవిరైపోతున్నాయి. చదువుల మాట దేవుడెరుగు.. ఆశ్రమ పాఠశాలల నుంచి సురక్షితంగా ఇంటికి వస్తే చాలు అన్నట్లుగా ప్రస్తుతం పరిస్థితి నెలకొంది. కలుషిత తాగునీరు, అనారోగ్యం, సరైన వైద్యం అందకపోవడం వల్ల ఏడాది వ్యవధిలో 15 మంది గిరిజన విద్యార్థులు మృత్యువాత పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి సొంత నియోజకవర్గం సాలూరులోనే నలుగురు విద్యార్థులు చనిపోవడం గమనార్హం. తాజాగా పార్వతీపురం మన్యం జిల్లాలో 11 ఏళ్ల వయసున్న చిన్నారి అనే విద్యార్థి కిడ్నీ సమస్య బారిన పడి ప్రాణాలు కోల్పోయాడు. ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి విద్యార్థి మృతిపార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం పనసబద్ర పంచాయతీ మూలవలస గ్రామానికి చెందిన తాడంగి చిన్నారి (11) బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఎర్రసామంతవలస ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న చిన్నారి అనారోగ్యానికి గురైనట్లు ఈనెల 13వ తేదీన తల్లిదండ్రులు ముగిరి, కాంతమ్మకు పాఠశాల యాజమాన్యం సమాచారం అందించింది. చిన్నారి తల్లిదండ్రులు అదే రోజు పాఠశాలకు చేరుకొని విద్యార్థిని సాలూరు ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం విజయనగరం తరలించగా విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖ కేజీహెచ్కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందాడు. కలుషిత నీరు కారణంగా అనారోగ్యానికి గురై, కిడ్నీలు పాడవడంతోనే తమ బిడ్డ మృతి చెందినట్లు వైద్యాధికారులు ధ్రువీకరించారని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. గిరిజన, ప్రజా సంఘాల ఆందోళన..రైతు కూలీసంఘం రాష్ట్ర కార్యదర్శి దంతులూరి వర్మ, జిల్లా నాయకులు అసిరి, పీడీఎస్ఓ జిల్లా అధ్యక్షుడు కె.సోమేష్, గిరిజన సంఘం నేత మండల గిరిధర్రావు తదితరులు మూలవలస చేరుకుని విద్యార్థి మృతదేహంతో ఆందోళనకు దిగారు. ఐటీడీఏ అధికారులు గ్రామానికి వచ్చి విద్యార్థి మృతికి సమాధానం చెప్పాలని, లేదంటే మృతదేహాన్ని ఆశ్రమ పాఠశాలకు తరలించి నిరసన చేపడతామని హెచ్చరించారు. గిరిజన బిడ్డల ఆరోగ్యం గురించి మంత్రి సంధ్యారాణి కనీసం పట్టించుకోవడంలేదని, అనారోగ్యంతో పిట్టల్లా రాలిపోతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంల నియామకాల కోసం చేసిన మొదటి సంతకం ఏమైందని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల మరణాలు సంభవిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 11 ఏళ్ల బాలుడు కిడ్నీలు పాడై చనిపోవడం ఏమిటని మండిపడ్డారు. తాగునీటి సమస్యతో విద్యార్థులు రోగాల బారిన పడుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఆశ్రమ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేవని, ఆర్వో ప్లాంట్లు మూలకు చేరినా బాగు చేయడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీటీడబ్ల్యూ విజయశాంతి, ఏటీడబ్ల్యూ కృష్ణవేణిని చుట్టుముట్టిన ప్రజాసంఘాలు, గిరిజన నేతలు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థి చిన్నారి చనిపోయాడని మండిపడ్డారు. ఏఎన్ఎం పోస్టుల భర్తీ, ఆర్వో ప్లాంట్ మరమ్మతుల గురించి ప్రభుత్వం దృష్టికి తెస్తామని డీటీడబ్ల్యూఓ పేర్కొన్నారు.ఈ ఏడాది జూన్లో జియ్యమ్మవలస మండలం టీకే జమ్ముకు చెందిన గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ఆరో తరగతి విద్యార్థిని కె.తనూజ, గత నెల 26న గుమ్మలక్ష్మీపురం మండలం కంబగూడకు చెందిన పువ్వల అంజలి, ఈ నెల ఒకటో తేదీన కురుపాం మండలం దండసూర గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని తోయక కల్పన పచ్చకామెర్లతో ప్రాణాలు కోల్పోయారు. కురుపాం బాలికల గురుకుల పాఠశాలకు చెందిన 180 మందికిపైగా బాలికలు పచ్చకామెర్ల బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మక్కువ మండలం నంద గ్రామానికి చెందిన కేజీబీవీ విద్యార్థిని బిడ్డిక కీర్తన (17), పాచిపెంట మండలంలో మూడో తరగతి విద్యార్థిని శాంత కొద్దినెలల కిందట మృతిచెందగా.. సాలూరు మండలంలోని మామిడిపల్లి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని తాడంగి పల్లవి(12) రెండు రోజుల కిందట చనిపోయింది. తాజాగా మక్కువ మండలం ఎర్రసామంతవలస ఆశ్రమ పాఠశాల విద్యార్థి చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు.మన్యంలో మరణ మృదంగం గతేడాది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జియ్యమ్మవలస మండలం రావాడ రామభద్రపురం గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి బి.ఈశ్వరరావు, పార్వతీపురం మండలం రావికోన గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల ఆరో తరగతి విద్యార్థి పి.రాఘవ, గుమ్మలక్ష్మీపురం మండలం వామాసి గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల మండంగి గౌతమ్ మలేరియాతో చనిపోయాడు. కొమరాడ కేజీబీవీ పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థిని కె.శారద, గుమ్మలక్ష్మీపురం బాలికల ఆశ్రమ పాఠశాల ఎనిమిదో తరగతి విద్యార్థిని ఎన్.అవంతిక, కురుపాం గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల నాలుగో తరగతి విద్యార్థి నితిన్, జియ్యమ్మవలస మండలం రావాడ రామభద్రపురం పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థి జీవన్కుమార్, గుమ్మలక్ష్మీపురం మండలం దొరజమ్ముకు చెందిన మూడో తరగతి చదువుతున్న జి.దినేష్ మృతిచెందారు.కన్నెత్తి చూడని విద్యాశాఖ మంత్రిఒక్క పార్వతీపురం మన్యం జిల్లాలోనే కాదు.. ఏజెన్సీ ప్రాంతాలైన అరకు, పాడేరు, రంపచోడవరంల్లోనూ గిరిజన విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నారు. వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నా.. కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. కురుపాంలో ఇద్దరు గిరిజన బాలికలు మృతి చెందిన ఘటనను కప్పిపుచ్చేందుకు మంత్రులు ప్రయత్నించారు. విద్యార్థులు ఇళ్ల వద్దే మరణించారని.. ప్రభుత్వానికి ఏం సంబంధమంటూ మంత్రి సంధ్యారాణి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. పరిహారం సంగతి తర్వాత చూస్తామని.. మట్టి ఖర్చులే ఇవ్వగలమని చెప్పడం ప్రభుత్వ దారుణ వైఖరికి అద్దం పడుతోంది. గిరిజన విద్యార్థుల మరణాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు గానీ, ఉప ముఖ్యమంత్రిగానీ, విద్యాశాఖ మంత్రి గానీ సమీక్షించిన దాఖలాలు లేవు. ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి నుంచి ఒక ప్రకటన కూడా లేదు. విశాఖలో పర్యటించిన విద్యాశాఖ మంత్రి కేజీహెచ్కు వెళ్లి గిరిజన బిడ్డల ఆరోగ్యంపై కనీసం ఆరా తీయలేదు. విద్యార్థుల చావులకు కారణాలను కప్పిపుచ్చుతూ ప్రభుత్వం అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తోంది.పిల్లలు చనిపోతున్నా పట్టదా..?మా కుమారుడు అనారోగ్యానికి గురైనట్లు సమాచారం అందిన వెంటనే పాఠశాలకు వెళ్లాం. సాలూరు, విజయనగరం, కేజీహెచ్ ఆస్పత్రులకు తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. చక్కగా చదువుకుని ప్రయోజకుడు అవుతాడనుకుంటే చిన్న వయసులోనే కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. పిల్లలు అనారోగ్యంతో మృతి చెందుతున్నా పట్టించుకునేవారే లేరు. – తాడంగి ముగిరి (చిన్నారి తండ్రి, మూలవలస గ్రామం)తాగునీటి సమస్యే కారణం..విద్యార్థి చిన్నారి అనారోగ్యానికి గురి కావడంతో ఈనెల 8వ తేదీన శంబర పీహెచ్సీలో పరీక్షలు నిర్వహించగా మలేరియా పాజిటివ్ వచ్చింది. 10వ తేదీన పార్వతీపురం ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆరోగ్యంగా ఉన్నాడంటూ పంపించేశారు. చిన్నారి 13వ తేదీన మళ్లీ అనారోగ్యానికి గురికాగా సాలూరు, విజయనగరం, విశాఖ ఆస్పత్రులకు తరలించినా ప్రయోజనం లేకపోయింది. చిన్న వయసులో కిడ్నీలు పాడవడం దారుణం. దీనికి తాగునీటి సమస్యే ప్రధాన కారణం. ప్రభుత్వం చిన్నారి కుటుంబాన్ని ఆదుకోవాలి. – కె.సోమేష్, పీడీఎస్ఓ జిల్లా అధ్యక్షుడు, పార్వతీపురం మన్యం జిల్లా -
వారం రోజుల్లో నీటి సమస్య పరిష్కరించాలి
● లేకుంటే పిల్లలను ఇంటికి తీసుకుపోతాం ● లబ్బూరు ఏకలవ్య పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల హెచ్చరిక ముంచంగిపుట్టు: వారం రోజుల్లో నీటి సమస్య పరిష్కరించాలని లేకుంటే తమ పిల్లలను ఇళ్లకు తీసుకువెళ్లిపోతామని లబ్బూరు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్చరించారు. బుధవారం వారు విద్యార్థులు ఎదుర్కొంటున్న నీటి సమస్యపై ఏకలవ్య పాఠశాల ప్రిన్సిపాల్ సుమన్తో సమావేశం అయ్యారు. పాఠశాల ప్రారంభించినప్పటి నుంచి స్నానం చేసేందుకు సైతం నీళ్లులేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పడుతున్న బాధలు చెప్పు కుంటే విద్యార్థులపై చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ హెచ్చరించడం సరైన పద్ధతి కాదన్నారు. సమస్యల మధ్య తమ పిల్లల చదవులు ఎలా సాగుతాయని ప్రిన్సిపాల్ను వారు ప్రశ్నించారు. వారం రోజుల వరకు అవకాశం ఇస్తామన్నారు. అప్పటికీ పరిష్కరించకుంటే నీటి సమస్య తీరిన రోజే పాఠశాలకు పంపిస్తామని వారు స్పష్టం చేశారు.దీనిపై కలెక్టర్, ఐటీడీఏ పీవో స్పందించాలని వారు కోరారు. -
గంజాయి నిర్మూలనకు ప్రత్యేక వ్యూహం
ఎస్పీ అమిత్ బర్దర్పాడేరు : జిల్లాలో గంజాయి సాగు, రవాణా, సరఫరాను సమూలంగా నిర్మూలించేందుకు ప్రత్యేక వ్యూహం అమలు చేస్తామని ఎస్పీ అమిత్బర్దర్ అన్నారు.బుధవారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంగళవారం నిర్వహించిన నెలవారీ సమీక్షలో పోలీసు అధికారులకు కొత్త మార్గదర్శకాలను జారీ చేశామన్నారు. గంజాయితో సంబంధం ఉన్నా, అక్రమ కార్యకలాపాలపైన జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు వచ్చిన వ్యక్తులను నిశితంగా పరిశీలిస్తామన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఇళ్లను అద్దెకు ఇచ్చే యజమానులు వారియొక్క పూర్వ చరిత్ర పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే ఇవ్వాలన్నారు. ఎవరైనా వ్యక్తులు ఎక్కడైనా ఆశ్రయం పొంది గంజాయి కేసుల్లో పట్టుబడితే ఆశ్రయం ఇచ్చిన వారిపైనా కఠిన శిక్షలు అమలు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో ఎవరైనా అనుమానస్పదంగా సంచరించినా, అనుమానస్పద కార్యకలపాలకు పాల్పడినా వెంటనే పోలీసు శాఖకు సమాచారం ఇవ్వాలన్నారు. ఎప్పటికప్పుడు గంజాయి సాగు, రవాణ, సరఫరాను అడ్డుకునేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లాను మాదకద్రవ్యాల ముప్పు నుంచి విముక్తి చేయడం తమ ఏకై క లక్ష్యమని ఎస్పీ పేర్కొన్నారు. -
గిరిజనుడి మృతదేహంతో బంధువుల ఆందోళన
ముంచంగిపుట్టు: స్థానిక సీహెచ్సీలో గిరిజనుడు మృతి చెందడంతో వైద్యాధికారి నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. మండలకేంద్రంలో ఇందిరా కాలనీకి చెందిన టొంగి ఆదినారాయణ (52) అనే గిరిజనుడికి రెండు కాళ్లు పని చేయకపోవడంతో మంగళవారం మధ్యాహ్నం స్థానిక సీహెచ్సీకి ప్రైవేట్ వాహనంలో తీసుకువచ్చారు.స్థానిక వైద్యాధికారి గీతా గాయత్రి వైద్య సేవలు అందించారు. ఆదినారాయణ పరిస్థితి విషమంగా ఉండడంతో పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. ఆస్పత్రి అంబులెన్సు మరమ్మతులకు గురైన కారణంగా అందుబాటులో లేదు. దీంతో 108కు ఫోన్ చేశారు. గంటల కొద్దీ సమయం పడుతుందని సంబంధిత అధికారులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి వారు అంబులెన్సుకోసం వేచి చూశారు. అదేరోజు రాత్రి 12 గంటల తరువాత ఆదినారాయణ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారింది. ఆ సమయంలో వైద్యులు ఆసుపత్రిలో అందుబాటులో లేరు. ఆదినారాయణ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో తెల్లవారుజాము 4 గంటలకు మృతి చెందినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి వైద్యాధికారి గీతాంజలికి ఫోన్ చేస్తే వస్తానని చెప్పినప్పటికీ రాలేదని, బుధవారం ఉదయం ఐదు గంటలకు వచ్చారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వైద్యాధికారి తీరుపై ఆగ్రహం పరిస్థితి విషమంగా ఉందని చెప్పినా వైద్యాధికారి తీరికగా వచ్చారంటూ ఆమైపె మృతుడి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యసేవలు అందించడంలో ఆమె నిర్లక్ష్యం వల్లే ప్రాణం కోల్పోవాల్సి వచ్చిందని ధ్వజమెత్తారు. పాడైన అంబులెన్సుకు మరమ్మతులు చేపట్టకపోవడం, 108 సకాలంలో రాకపోవడంపై వారు అసహనం వ్యక్తం చేశారు. వైద్యులు, సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అత్యవసర పరిస్థితుల్లో ఇలా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని వారు హెచ్చరించారు. మృతదేహంతో సీహెచ్సీ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం మృతదేహాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అర్ధరాత్రి విషమించిన ఆరోగ్యం పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్సు అందుబాటులో లేక అవస్థలు సకాలంలో రాని 108 వాహనం ఫోన్ చేసినా వైద్యాధికారి స్పందించ లేదంటూ కుటుంబ సభ్యులు ధ్వజం ఆమె నిర్లక్ష్యమే మృతికి కారణమంటూ ఆవేదన ముంచంగిపుట్టు సీహెచ్సీ ఎదుట నిరసన -
గృహ నిర్మాణాలు వేగవంతం
● హౌసింగ్ పీడీ బాబునాయక్ కొయ్యూరు: పీఎం జన్మన్ గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని హౌసింగ్ పీడీ బాబు నాయక్ సూచించారు. ఆయన బుధవారం డౌనూరు పంచాయతీ బచింతలో నిర్మాణంలో ఉన్న గృహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పూర్తయిన గృహాలకు వేగంగా బిల్లుల చెల్లింపునకు కృషి చేస్తున్నామన్నారు. నిర్మాణ పనుల్లో ఎటువంటి జాప్యం చేయవద్దన్నారు.బూదరాళ్ల పంచాయతీలో నిర్మాణాలు కొన్నిచోట్ల వేగంగా జరిగితే మరి కొన్ని చోట్ల జరగడం లేదన్నారు. ఆయన వెంట ఏఈ పొత్తూరు ఉమామహేశ్వరరావు, వర్క్ ఇనస్పెక్టర్ గిరీష్ పాల్గొన్నారు. -
32 గ్రామాలకు త్వరలోనే పరిహారం: కలెక్టర్ దినేష్కుమార్
గ్రామసభలు పూర్తయిన 32 గ్రామాలకు త్వరలోనే డ్రాఫ్ట్ ఆర్అండ్ఆర్ ప్రక్రియ పూర్తిచేసి పరిహారం అందిస్తామని తెలిపారు. పోలవరం పరిహారం జాబితాలో లేని గ్రామాలను రీసర్వే చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామన్నారు. గృహాల పరిహారంలో అవకతవకలకు పాల్పడే అధికారులపై కఠినచర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించడంలో భాగంగా కాలనీల నిర్మాణాలు తొందరగా పూర్తయ్యేలా చర్యలు చేపడతామని, త్వరలోనే పరిహారం అందేలా తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీతో నిర్వాసితులు ఆందోళన విరమించారు. మాట్లాడుతున్న కలెక్టర్ దినేష్కుమార్ -
460 టు 690
ఆరు నెలల్లో..పెరగనున్న పొల్లూరు జలవిద్యుత్ కేంద్ర ఉత్పత్తి సామర్థ్యంరాష్ట్రంలో జలవిద్యుత్ ఉత్పాదనలో ప్రత్యేకత సంతరించుకున్న పొల్లూరు జలవిద్యుత్ కేంద్రం మరో మైలురాయిని అధిగమించనుంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.530 కోట్లతో చేపట్టిన 5,6 యూనిట్లు ఏర్పాటు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీటిని ఏప్రిల్ నాటికి పూర్తి చేసి వినియోగంలోకి తేవాలన్న లక్ష్యంతో ఏపీ జెన్కో అధికారులు పనిచేస్తున్నారు. జల విద్యుత్ కేంద్రంలో జరుగుతున్న ఐదు, ఆరు యూనిట్ల నిర్మాణ పనులుటెర్మినల్ యాంకర్ నుంచి వాల్వ్ హౌస్ వరకు పూర్తయిన పెన్స్టాక్ పైపులైన్మెగా వాట్లుమోతుగూడెం: పొల్లూరు జలవిద్యుత్ కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ఐదు, ఆరు యూనిట్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీటికి సంబంధించి పెన్ స్టాక్ పనులు 60 శాతం, సివిల్ పనుల్లో ఫ్లోర్ శ్లాబ్కు సంబంధించి 80శాతం మేర పూర్తయినట్టు జెన్కో అధికారవర్గాలు తెలిపాయి. ● ఐదవ యూనిట్కు సంబంధించి కీలకమైన స్పారల్ కేసింగ్ పనులు పూర్తయ్యాయి. దీంతోపాటు వికెట్ గేటు ద్వారా నీటిని విడుదల చేసే రన్నర్ మీద స్పారల్ కేసింగ్ పనులు దాదాపు పూర్తికావొచ్చాయి. వాల్వుహౌస్ నుంచి టెర్మినల్ యాంకర్ వరకు పూర్తిస్థాయిలో పెన్స్టాక్ పైపులైను నిర్మాణం పూర్తయింది. ● ఆరో యూనిట్కు సంబంధించి జనరేటర్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. యూనిట్లకు సంబంధించి కీలకమైన విడిభాగాలు సకాలంలో బీహెచ్ఎల్ , ఇతర కంపెనీ నుంచి పవర్ హౌస్కు వచ్చేలా జెన్కో అధికారులు చర్యలు చేపట్టారు. ఎస్ఎస్సీ పీఈసీ కంపెనీ ప్రతినిధుల అధికారుల ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను బీహెచ్ఎల్, ప్రాజెక్ట్ అధికారుల బృందం అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ● ప్రస్తుతం ఈ జలవిద్యుత్ కేంద్రంలో నాలుగు యూనిట్ల ద్వారా 460 మెగావాట్లు ఉత్పాదన జరుగుతోంది. 5,6 యూనిట్లు అందుబాటులోకి వస్తే ఉత్పత్తి సామర్థ్యం 690 మెగావాట్లకు పెరుగుతుందని ప్రాజెక్ట్ అధికారవర్గాలు పేర్కొన్నాయి. అండర్ గ్రౌండ్లో పెన్స్టాక్ పైపునకు వెల్డింగ్ చేస్తున్న కార్మికులు వేగవంతం చేశాం వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నాటికి ఐదు, అరు యూనిట్ల నిర్మాణ పనులు పూర్తయ్యేలా వేగవంతం చేశాం. ఇవి పూర్తయితే 460 నుంచి 690 మెగావాట్లకు ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. సిబ్బంది, అధికారులు శ్రమిస్తున్నారు. – బాలకృష్ణ, డీఈ, ఏపీ జెన్కో లక్ష్యం మేరకు పూర్తిచేస్తాం నిర్దేశించిన లక్ష్యం మేరకు ఆదనపు యూనిట్ల నిర్మాణ పనులు పూర్తిచేస్తాం. ఇందుకు జెన్కో యాజమాన్యం, డైరక్టర్ల ఆదేశాలకు అనుగుణంగా చర్యలు చేపట్టాం. నిర్మాణ పనులను ఎప్పటి కప్పుడు పర్యవేక్షించి, సూచనలు ఇస్తున్నాం. – సీహెచ్వీ రాజారావు, చీఫ్ ఇంజినీరు, పొల్లూరు చురుగ్గా ఐదు, ఆరు యూనిట్ల నిర్మాణ పనులు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మంజూరు రూ.530 కోట్లతో చేపట్టిన గత ప్రభుత్వం సివిల్ పనులు 80 శాతం, పెన్స్టాక్ పనులు 60 శాతం పూర్తి ఏప్రిల్ నాటికి ఉత్పత్తి ప్రారంభిస్తామంటున్న జెన్కో అధికారులు -
జీఎస్టీ తగ్గింపుతోసామాన్యులకు మేలు
● కలెక్టర్ దినేష్కుమార్ చింతూరు: జీఎస్టీ తగ్గింపుతో సామాన్యులకు ఎంతో మేలు చేకూరుతుందని, దీనివల్ల ఎన్నోరకాల వస్తువుల ధరలు తగ్గనున్నాయని కలెక్టర్ దినేష్కుమార్ అన్నారు. జీఎస్టీ తగ్గింపుపై బుధవారం స్థానిక ఏకలవ్య విద్యార్థుల ప్రదర్శనను ఆయనతోపాటు పీవో శుభం నొఖ్వాల్ తిలకించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూనిత్యావసర సరకుల ధరలు తగ్గాయన్నారు. జీఎస్టీ తగ్గినా ఇంకా అదనపు ధరలకు సరకులు విక్రయించే వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
కూటమి ప్రభుత్వ తీరుపై పోలవరం నిర్వాసితుల ఫైర్
చింతూరు: పరిహారం ఇవ్వకుండా పునరావాసం కల్పించకుండా తాత్సారం చేస్తున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ పది గ్రామాలకు చెందిన పోలవరం నిర్వాసితులు బుధవారం చింతూరు ఐటీడీఏను ముట్టడించారు. మండుటెండలో ఆందోళన చేస్తున్న అధికారులు పట్టించుకోక పోవడంతో ఆగ్రహించిన వారు ప్రధానగేటుతో పాటు పోలీసులను తోసుకుని ఐటీడీఏలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గంటన్నరసేపు మండుటెండలో.. స్థానిక ఐటీడీఏలో కలెక్టర్ దినేష్కుమార్ బుధవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ క్రమంలో వీఆర్పురం మండలం రామవరం, చొప్పల్లి, రామవరంపాడు, సోములగూడెం, శబరిరాయిగూడెం, కొప్పల్లి, అడవివెంకన్నగూడెం, నూతిగూడెం, గుర్రంపేట, చింతూరు మండలం మల్లెతోటకు చెందిన పోలవరం నిర్వాసితులు భారీసంఖ్యలో ఐటీడీఏ వద్దకు వచ్చారు. ప్రధానగేటు ఎదుట బైఠాయించారు. వరుస వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా తమకు పరిహారం అందించడంతో పాటు పునరావాసం కల్పించాలంటూ వారు నినాదాలు చేశారు. వారు సుమారు గంటన్నర పాటు మండుటెండలో ఆందోళన చేశారు, మిన్నంటిన నినాదాలు అధికారులు పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన నిర్వాసితులు ప్రధాన గేటుతో పాటు అక్కడ కాపలాగా వున్న పోలీసులను తోసుకుంటూ ఐటీడీఏ కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు కార్యాలయంలోకి వెళ్లే గేటును మూసేశారు. నిర్వాసితులు అక్కడే బైఠాయించి ఆందోళన నిర్వహించారు. కలెక్టర్ రావాలని, తమ సమస్యలకు పరిష్కారం చూపాలంటూ వారు నినాదాలు చేశారు. దీంతో కలెక్టర్ దినేష్కుమార్, ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ అక్కడికి చేరుకుని నిర్వాసితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైద్యం కోసం అవస్థలు వరదల సమయంలో నెలల తరబడి రహదారులు ముంపులో ఉంటున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి తరలించలేకపోవడంతో ప్రాణాల గాలిలో కలిసిపోతున్నాయి. – మాడి ముత్యాలరావు, రామవరం, వీఆర్పురం మండలంనిత్యావసరాలకు కష్టాలు వరదల సమయంలో నీరు గ్రామాలచుట్టూ చేరడంతో మేము బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంటోంది. ఇళ్లలో నిత్యావసరాలు నిండుకుంటున్నాయి. వరద తగ్గిన తరువాత అధికారులు ఇస్తున్నారు. – ఆసు లక్ష్మణరావు, సోములగూడెం, వీఆర్పురం మండలంరూ.పది లక్షలివ్వాలి 2013 భూసేకరణ చట్ట ప్రకారం నిర్వాసితులకు పోలవరం పరిహారం రూ.10 లక్షలు ఇవ్వాలి. కటాఫ్ తేదీతో సంబంధం లేకుండా అందరికీ ప్యాకేజీ వర్తింపజేయాలి. – పూసం సత్తిబాబు, చొప్పల్లి, వీఆర్పురం మండలంపథకాలివ్వడం లేదు పోలవరం ముంపు గ్రామాల్లోని వ్యవసాయ భూములకు ప్రభుత్వ పథకాలు ఇవ్వడం లేదు. ఎరువులు ఇవ్వకపోవడంతో పాటు అన్నదాత సుఖీభవ పథకం కూడా వర్తింప చేయలేదు. – కారం సుందరయ్య,అడవి వెంకన్నగూడెం, వీఆర్పురం మండలం -
క్రీడారంగ బలోపేతానికి సమష్టి కృషి
● డీఈవో బ్రహ్మాజీరావు పాడేరు రూరల్: క్రీడా రంగం బలోపేతానికి అంతరూ సమిష్టిగా కృషి చేయాలని డీఈవో బ్రహ్మాజీరావు సూచించారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం వివిధ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 17, 18, 21, 22 తేదీల్లో నిర్వహించే డివిజన్ స్థాయి ఆర్చరీ అండర్ 14,17,19 పోటీలు విజయవంత చేయాలన్నారు. వచ్చే నెల 7, 8, 9 తేదీల్లో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ఉంటాయన్నారు. విద్యార్ధులకు అవసరమైన శిక్షణ అందించి ప్రోత్సహించాలని సూచించారు. ఎస్జీఎఫ్ క్రీడా కార్యదర్శులు పాంగి సూరిబాబు, భవాని తదితరులు పాల్గొన్నారు. -
వేడుకగా పొల్లూరుధారాలమ్మ జాతర
మోతుగూడెం: పొల్లూరు గ్రామ దేవత ధారాలమ్మ జాతర మహోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ఉదయం నుంచి అమ్మవారిని గరగ నృత్యాలతో ఊరేగించారు. అనంతరం ఆలయ వద్ద పూజారి కుమార స్వామి శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పొల్లూరు, మోతుగూడెం, ఒడిశాకు చెందిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నసమారాధన ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ జెన్కో సీఈ రాజారావు, ఈఈ బాలకృష్ణ, వరప్రసాద్, శ్రీనివాస్, ఎస్ఏవో వరప్రసాద్, ఏడీఈ కొండబాబు, చింతూరు ఎస్ఐ రమేష్, ఎంపీటీసీ వేగి నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
అర్హులైన గిరిజనులకు భూమికి భూమి
గంగవరం : దేవీపట్నం మండలం కొండమొదలు పోలవరం నిర్వాసితుల్లో అర్హులైన గిరిజనులకు భూమికి భూమి ఇస్తామని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని నేలదోనెలపాడు ఆర్అండ్ఆర్ కాలనీలో ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, రంపచోడవరం ఐటీడీఏ పీవో స్మరణ్ రాజ్, రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభం నొక్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాసితుల సమస్యలు తెలుసుకున్నారు. వీధిలైట్లు, పూర్తిస్థాయిలో తాగునీరు ఏర్పాటు చేయలని వారు కోరారు. సబ్ సెంటర్ను ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా అప్గ్రేడ్ చేయాలని, ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా స్థాయి పెంచాలని కోరారు. రాజవరం నుంచి నేలదోనెలపాడు వరకు చేపట్టిన రోడ్డు పనులు మధ్యలో నిలిచిపోయాయని, వెంటనే బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు. రేషన్ కార్డులు మంజూరు చేయాలని కలెక్టర్ను కోరారు. కొండమొదలు సర్పంచ్ వేట్ల విజయ, స్థానికులు వంజం జోగారావు, ఇల్లా రామిరెడ్డి తదితరులు మాట్లాడుతూ 12 గ్రామాలను కలిపి కొండమొదలు పేరు మీద ప్రత్యేక పంచాయతీ ఏర్పాటుచేయాలని, ప్రతి 50 కుటుంబాలకు బోరు బావి నిర్మించాలని విన్నవించారు. కతనపల్లి గ్రామ గిరిజనులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అమలు చేయాలని, ఆర్అండ్ఆర్ కాలనీలో వెటర్నరీ అసిస్టెంట్ నియమించాలని కోరారు. వీటిపై స్పందించిన కలెక్టర్ జలజీవన్ మిషన్ పథకంలో ఆరు లేదా ఏడు బోర్లు ఏర్పాటుచేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వీధిలైట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేసి సమర్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. పీహెచ్సీ ఏర్పాటుపై సంబంధిత అధికారులతో చర్చిస్తామన్నారు. గిరిజనులు ఆర్థికాభివృద్ధి సాధించేలా సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. రంపచోడవరం ఐటీడీఏ పీవో స్మరణ్ రాజ్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులకు మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నారు. రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభం నొఖ్వాల్ మాట్లాడుతూ కొండ మొదలు పంచాయతీ ముంపు బాధితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ద్వారా భూమికి భూమి ఇస్తామన్నారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు పి .అంబేద్కర్, సతీష్, తహసీల్దార్లు సీహెచ్ శ్రీనివాసరావు, కరక సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఐ. శ్రీనివాసరావు, ఎస్బీవీ రెడ్డి, పీసా కమిటీ ఉపాధ్యక్షుడు పాపారావు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే లక్ష్మణ్ పాల్గొన్నారు.కలెక్టర్ దినేష్ కుమార్ -
ఈక్రాప్ నమోదు వేగవంతం
● వ్యవసాయాభివృద్ధికి చర్యలు ● అవకాడో, లిచీని ప్రోత్సహించాలి ● ఇన్చార్జి జేసీ తిరుమణి శ్రీపూజ ఆదేశం సాక్షి,పాడేరు: జిల్లాలో వ్యవసాయాభివృద్ధితో పాటు పంటల ఈక్రాప్ నమోదును వేగవంతం చేయాలని ఇన్చార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ ఆదేశించారు. వ్యవసాయం, ఉద్యానవన, అనుబంధశాఖలు, పంచాయతీరాజ్, డ్వామా అధికారులతో మంగళవారం ఆమె వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఈ–క్రాప్, ఈ– పట్టాతో రైతులకు అన్నివిధాలుగా ప్రయోజనాలు ఉంటాయన్నారు. పెండింగ్లో ఉన్న పీఎం కిసాన్ దరఖాస్తులను పరిశీలించి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. గ్రామ సచివాలయాల ద్వారా అర్హులైన రైతులను గుర్తించి బ్యాంకుల ద్వారా రుణాలు పంపిణీ చేయాలని, ఆర్వోఎఫ్ఆర్ రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రైతులు పండించిన పంటలకు దళారుల ప్రమేయం లేకుండా గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో అవకాడో, లిచీ సాగును ప్రోత్సహించాలని, రైతులకు ఆధునిక వ్యవసాయ పరికరాలను అందుబాటులోకి తేవాలన్నారు. జిల్లాలో మల్బరి సాగు విస్తరించాలని, ఈదిశగా రైతులకు తగిన ప్రోత్సాహకాలు అందించాలన్నారు. మత్స్యసంపద, పశువైద్య కార్యక్రమాలపైన దృష్టి పెట్టాలని, పశుబీమా అమలు చేయాలన్నారు. ఖరీఫ్, రబీ పంటల కోసం జిల్లాలో యూరియా, డీఏపీ నిల్వలు పెంచుకోవాలని మార్క్ఫెడ్ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజనలో అర్హులైన సభ్యులను తప్పక నమోదు చేసి, ఆపత్కాలంలో ప్రయోజనం అందేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ, ఉద్యానవన జిల్లా అఽధికారులు నందు, కర్ణ, డీఆర్డీఏ పీడీ మురళీ, డ్వామా పీడీ విద్యాసాగర్, జిల్లా పట్టుపరిశ్రమ అధికారి అప్పారావు, లీడ్ బ్యాంకు మేనేజర్ మాతునాయుడు పాల్గొన్నారు. -
నల్లబ్యాడ్జీలతో వైద్య సిబ్బంది నిరసన
కూనవరం: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యులు గత నెల 26 నుంచి సమ్మెబాట పట్టడంతో వారికి మద్దతుగా స్థానిక పీహెచ్సీ సిబ్బంది మంగళవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతూ విధులు నిర్వహించారు. ఆదివాసీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు తుష్టి జోగారావు, ఐఎన్టీయూసీ డివిజన్ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పీహెచ్సీల్లో రెండు రోజుల పాటు సిబ్బంది నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో వైద్యులు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, సిబ్బంది అభద్రతాభావంతో సేవలు అందించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. అత్యవసర కేసుల సమయంలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. వైద్యుడు ఉంటే ఎలాంటి ప్రమాదానైనా ఎదుర్కొని ప్రాణాపాయం నుంచి కాపాడే అవకాశం ఉంటుందన్నారు. అందువల్ల ప్రభుత్వం సమ్మెబాటలో ఉన్న వైద్యుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి విధుల్లో చేరేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ అసోసియేషన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గుజ్జా సీతమ్మ, రవ్వా రాంఆంజనేయులు, ఎంఎల్హెచ్పీలు, 104 సిబ్బంది పాల్గొన్నారు. విధులు నిర్వహిస్తూ పీహెచ్సీ వైద్యుల సమ్మెకు మద్దతు -
గుండెకు అత్యవసరవైద్యంపై అవగాహన
సాక్షి,పాడేరు: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు గుండెకు సంబంధించిన అత్యవసర వైద్యంపై వైద్య నిపుణులు మంగళవారం అవగాహన కల్పించారు. స్థానిక వైద్య కళాశాల మత్తు వైద్య విభాగాధిపతి డాక్టర్ సతీష్కుమార్,అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఉషారాణి, కమ్యూనిటీ మెడిషన్ విభాగాధిపతి డాక్టర్ సంధ్యారాణి, సైకియాట్రి ఇన్చార్జి హెచ్వోడీ డాక్టర్ టీ.ఎస్.ఎస్.రాజులు గుండె, ఉపిరితిత్తుల పునరుద్ధరణ చర్య కార్యకలాపాలను డెమో ద్వారా విద్యార్థులకు వివరించారు.అత్యవసర పరిస్థితులలో వ్యక్తుల ప్రాణాలు కాపాడేందుకు సీపీఆర్ వ్యవస్థ కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వనుము చిట్టబ్బాయి, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
నక్సలిజం, గంజాయి సాగు నిర్మూలనే లక్ష్యం
● ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశం సాక్షి,పాడేరు: జిల్లాలో నక్సలిజం, గంజాయి సాగు నిర్మూలన లక్ష్యంగా పనిచేయాలని ఎస్పీ అమిత్బర్దర్ ఆదేశించారు. మంగళవారం ఆయన జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నేర సమీక్ష నిర్వహించారు. నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చే వారిపై నిఘాతో పాటు, వలసదారుల పూర్వ చరిత్రపై కఠినంగా దృష్టి పెట్టాలన్నారు. గంజాయి కేసులతో సంబంధం ఉన్న వ్యక్తులతో పాటు వారికి ఆశ్రయం ఇచ్చిన, తాత్కాలిక సహాయం అందించే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామసందర్శనను విజయవంతంగా నిర్వహించాలని, పలు కేసుల్లో సమగ్ర విచారణ, చార్జిషీట్లు పూర్తి చేయాలని, కోర్టుల్లో నేరస్తులకు శిక్ష పడేలా ప్రయత్నించాలన్నారు.పోలీసుస్టేషన్లకు వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించి, అర్జీదారులకు త్వరితగతిన న్యాయం చేయాలని సూచించారు. మహిళలకు సంబంధించిన కేసుల్లో ఎలాంటి లోపాలు లేకుండా విచారణ జరపాలన్నారు. మత్తుపదార్థాలు సేవించే వారికి, చిన్నచిన్న నేరాలు చేసేవారికి కౌన్సెలింగ్ నిర్వహించి వారు మంచి మార్గంలో నడిచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గంజాయి,సారా అక్రమ రవాణాపై దృష్టి సారించి నిందితులపై కేసులు నమోదు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఏఎీస్పీ పంకజ్ కుమార్ మీనా, డీఎస్పీలు జి.సాయిప్రశాంత్,షేక్ సహబాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
నిర్వాసితులకు సాగు భూమిని గుర్తించండి
రంపచోడవరం: పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులకు వ్యవసాయానికి అనువుగా ఉన్న భూమిని గుర్తించి నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ ఆదేశించారు. మంగళవారం ఆయన స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో పీవో స్మరణ్రాజ్, సబ్ కలెక్టర్ శుభమ్ నొఖ్వాల్, ఎస్డీసీలు, ఇంజనీర్లు, ఆర్అండ్ఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలవరం ముంపునకు గురైన చింతూరు, రంపచోడవరం డివిజన్లోని నిర్వాసితులకు భూమికి భూమి ఇచ్చేందుకు ప్రైవేట్ భూమికి సంబంధించిన నివేదికలు సమర్పించాలని సూచించారు. గంగవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి మండలాల్లో ఒక్కొక్క మండలంలో ఏమేర గుర్తించింది రెవెన్యూ అధికారులతో చర్చించారు. గిరిజనులకు భూమికి భూమి ఎన్ని ఎకరాలు అవసరమో తెలుసుకున్నారు. భూములు కొనుగోలుకు సంబంధించి ఇప్పటివరకు నిర్వహించిన గ్రామ సభలు, యాక్షన్ ప్లాన్పై ఆయన ఆరా తీశారు. గిరిజనేతరులకు సంబంధించి పునరావాస పనులపై చర్చించారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో గృహాలు నిర్మించేలా టెండర్లు నిర్వహణపై అధికారుల నుంచి తెలుసుకున్నారు. ఆర్అండ్ఆర్ పెండింగ్ పనులు త్వరితంగా పూర్తి చేయాలని ఆదేశించారు.శ్మశానవాటిక లేని ఆర్అండ్ ఆర్ కాలనీలకు భూమిని కొనుగోలు చేసి వాటిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్డీసీలు పి.అంబేడ్కర్, నాసరయ్య, అంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఏజెన్సీలో మంజూరైన పనులు ప్రారంభించాలి ఏజెన్సీలో మంజూరైన రోడ్లు, వంతెన పనులు పూర్తి చేయించాలని రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ను కోరారు. పీవో చాంబర్లో మంగళవారం ఎమ్మెల్యే కలెక్టర్ను కలిసి ఏజెన్సీలో మారుమూల గ్రామాలకు రోడ్ల నిర్మాణానికి అటవీ అభ్యంతరాలు తొలగించాలన్నారు.అధికారులకు కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశం -
అర్థమయ్యే రీతిలో బోధించండి
● ఉపాధ్యాయులకు కలెక్టర్ సూచన అడ్డతీగల: విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ ఆదేశించారు. మంగళవారం రాత్రి స్థానిక ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలతో పాటు వీరవరం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను ఐటీడీఏ పీవో స్మరణ్రాజ్, సబ్కలెక్టర్ శుభం నొఖ్వాల్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు పాఠ్యాంశాలను ఒకటికి రెండు సార్లు అర్ధమయ్యే రీతిలో బోధించాలని సూచించారు.విద్యతో పాటు వారి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి రోజు మెనూ పక్కాగా అమలు చేయాలన్నారు. ఉపాధ్యాయులు బోధించిన పాఠాలు అర్థమవుతున్నదీ లేనిది విద్యార్థుల నుంచి తెలుసుకున్నారు. సౌకర్యాలపై ఆరా తీశారు. -
159 ఎకరాల్లో బెర్రీ బోరర్తో నష్టం
అరకులోయ టౌన్: పాడేరు డివిజన్లో గిరి రైతులకు ప్రధాన ఆదాయ వనరు కాఫీ. సుమారు 2.30 లక్షల ఎకరాల్లో కాఫీ తోటలు ఉండగా వీటిలో 1.50 లక్షల ఎకరాలు ఫలసాయం ఇస్తున్నాయి. డుంబ్రిగుడ, అరకువ్యాలీ ప్రాంతాల్లో బెర్రీ బోరర్ (కాయతొలుచు పురుగు) నష్టం కలుగచేసినప్పటికీ మిగతా చోట్ల దిగుబడి ఆశాజనకంగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రెండు మండలాల్లో 159 ఎకరాల్లో నష్టం జరిగిందని ఐటీడీఏ కాఫీ బోర్డు ఏడీ లకే బొంజుబాబు తెలిపారు. చినలబుడు పంచాయతీ మాలివలస, తురాయిగుడ, మాలిసింగారం, పెదలబుడు పంచాయతీ గరడగుడ, డుంబ్రిగుడ మండలంలో శాంతినగర్, కురాయి ప్రాంతాల్లో రైతులు నష్టపోయారు. ● బెర్రీ బోరర్ సోకిన తోటల్లో పండ్లను సేకరించి గోతులు తవ్వి పూడ్చిపెట్టడానికి రూ.5 వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వీటిని సంబంధిత తోటల్లో పండ్లు సేకరించి పూడ్చిపెట్టిన కూలీలకు నేరుగా కాఫీ బోర్డు అందజేయాల్సి ఉంది. ఈ నిధులు విడుదల కాలేనట్టుగా తెలుస్తోంది. -
ఇంటి పన్నుల సొమ్ము స్వాహా
దేవరాపల్లి: తన అవినీతి ఆరోపణలపై విచారణ జరుగుతుండగానే మునగపాక నుంచి దేవరాపల్లికి బదిలీపై వచ్చిన బిల్ కలెక్టర్ మరోమారు వక్రబుద్ధి ప్రదర్శించారు. ఇక్కడ ప్రజల నుంచి వసూలు చేసిన ఇంటి పన్నుల సొమ్ము ప్రభుత్వానికి చెల్లించకుండా స్వాహా చేశారు. ఇందులో ఇతర సిబ్బంది హస్తం ఉందని తెలుస్తోంది. ఈ విషయమై స్థానిక పంచాయతీ కార్యదర్శి అనంత ఉమాదేవి, ఎంపీడీవో ఎం.వి. సువర్ణరాజు వేర్వేరుగా జిల్లా పంచాయతీ అధికారికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో ఈ బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మునగపాక పంచాయతీలో బిల్ కలెక్టర్గా పనిచేసిన జె.జోగిరాజుపై వివిధ అవినీతి ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఈ విచారణ జరుగుతుండగానే ఆయన్ను గతేడాది అక్టోబర్లో దేవరాపల్లి పంచాయతీకి బదిలీ చేశారు. మునగపాకలో ప్రజలు చెల్లించిన ఇంటి పన్ను సొమ్ములో రూ. 4.45 లక్షలు మేర జోగిరాజు స్వాహా చేసినట్లు విచారణలో తేలింది. ఈ నేపథ్యంలోనే దేవరాపల్లిలో విధులు నిర్వర్తిస్తున్న అతడిపై మే 26న డీపీవో సస్పెన్షన్ వేటు వేశారు. అప్పటి నుంచి అతని స్వాధీనంలో ఉన్న రికార్డులను, బీరువా తాళాలను సైతం నేటి వరకు అప్పగించలేదు. వాటిని స్వాధీనం చేసుకునేందుకు స్థానిక పంచాయతీ ఈవో అనంత ఉమాదేవి చేసిన పలు ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో అతనిపై దేవరాపల్లి పోలీస్ స్టేషన్లో జూన్ 6న ఆమె ఫిర్యాదు చేయగా తిరస్కరించారు. డీపీవో, ఎంపీడీవో నుంచి ఫిర్యాదు వస్తే తప్పా తాము స్వీకరించలేమని పోలీసులు చెప్పినట్టు ఆమె తెలిపారు. గతేడాది ఇంటి పన్ను సొమ్ము రూ. 6 లక్షలే జమ : దేవరాపల్లి పంచాయతీలో గత ఆర్థిక సంవత్సరం రూ. 13 లక్షల మేర ఇంటి పన్ను వసూలు కావాల్సి ఉంది. గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది మే 25వ తేదీ వరకు రూ. 6 లక్షలు మేర మాత్రమే బ్యాంక్లో జమ అయ్యింది. మిగిలిన సొమ్ములో ఎంత మేర వసూలు అయ్యిందో అనే దానిపై పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది. తమ వద్ద ఉన్న ప్రాథమిక సమాచారంతో ఇంటి పన్ను చెల్లించాలంటూ కొంతమందికి పంచాయతీ కార్యాలయ సిబ్బంది ఫోన్ చేయగా, వారి ఇంటి పన్ను చెల్లించిన రసీదు తెచ్చి చూపిస్తుండటంతో ఈవో నివ్వెరపోతున్నారు. దీంతో మునగపాక పంచాయతీ మాదిరిగానే దేవరాపల్లిలోనూ బిల్ కలెక్టర్ స్వాహా చేసి ఉంటాడన్న అనుమానాన్ని ఆమె వ్యక్తం చేస్తున్నారు. అతడిపై ఎంపీడీవోకి గత నెల 20న లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశానన్నారు. దీనిపై ఎంపీడీవో ఎం.వి. సువర్ణరాజును వివరణ కోరగా, పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు బిల్ కలెక్టర్పై డీపీవోకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ అవినీతి బాగోతంపై డీపీవో ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. విచారణ చేపడితే అవినీతి వెలుగులోకి... : స్థానిక పంచాయతీపై ఇప్పటికే పలు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తగా, ఇంటి నిర్మాణ అనుమతుల పేరిట పెద్ద ఎత్తున కొందరు అనధికారికంగా వసూళ్లకు పాల్పడ్డారని కొన్నేళ్లుగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వెలుగు చూసిన అవినీతి ఆరోపణలతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇక్కడి పంచాయతీలో జరిగిన అవినీతి లక్షల్లో ఉంటుందని విశ్వసనీయ సమాచారం. పంచాయతీలో అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు చేపడితే నిధులు దుర్వినియోగం సహా అవినీతి బట్టబయలవుతుంది. ఈ అవినీతి వెనుక ఎవరెవరి హస్తాలు ఉన్నాయో ఉన్నతాధికారులు విచారించి నిగ్గు తేల్చాలని స్థానికుల డిమాండ్ చేస్తున్నారు. -
కోరుకున్న చోట పునరావాసం కల్పించాలి
వీఆర్పురం: పోలవరం నిర్వాసితులకు కోరుకున్న చోట పునరావాసం కల్పించాలని స్థానిక సర్పంచ్ పిట్టా రామారావు, పీసా కమిటీ ఉపాధ్యక్షుడు కోటం జయరాజు డిమాండ్ చేశారు. బుధవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. నిర్వాసితులు కోరుకున్న చోట పునరావాసం క ల్పిస్తామని ప్రభుత్వం ప్రకటనలు చేస్తోంది తప్ప ఆచరణలో చూపడం లేదని వారు చెప్పారు. పునరావాసం అడిగింది ఒకచోటయితే వేరే చోట స్థలం చూపిస్తుండడంతో నిర్వాసితులు ఆందోళన చేందుతున్నారని తెలిపారు. గోదావరి వరదలకు సర్వం కోల్పోయిన వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదు చెప్పారు. నిర్వాసితుల సమస్యలపై బుధవారం చింతూరు ఐటీడీఏ కార్యాలయం వద్ద నిర్వహించనున్న ధర్నాకు రామవరం, చింతరేవుపల్లి పంచాయతీ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
చేతబడి నెపంతో వ్యక్తిపై కత్తితో దాడి
చింతూరు : చేతబడి చేస్తున్నాడన్న నెపంతో ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసిన ఘటన మంగళవారం చిడుమూరు గ్రామంలో జరిగింది. చింతూరు ఎస్ఐ పేరూరి రమేష్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బొక్కలి మల్లయ్య మనుమరాలు అనారోగ్యానికి గురైంది. ఇందుకు అదే గ్రామానికి చెందిన దురవా పిచ్చయ్య చేతబడి చేయడమే కారణం అన్న అనుమానంతో అతనిపై మల్లయ్య కత్తితో దాడి చేసినట్టు ఎస్ఐ తెలిపారు. తీవ్రంగా గాయపడిన పిచ్చయ్య చింతూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
అనంతుని పవిత్రోత్సవాలకు ఏర్పాట్లు
కుంతీ మాధవ స్వామి ఆలయం (ఇన్సెట్) శాంతి కల్యాణం జరపనున్న అనంతుని ఉత్సవ విగ్రహాలుపద్మనాభం: స్థానిక కుంతీ మాధవస్వామి ఆలయంలో ఈ నెల 16 నుంచి 19 వరకు అనంత పద్మనాభస్వామి పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు ఆలయ అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. పవిత్రోత్సవాలకు అవసరమయ్యే పవిత్రాలను తమిళనాడులోని శ్రీరంగం నుంచి తీసుకొచ్చి, ఆలయంలో భద్రపరిచారు. నూతన వస్త్రాలు సమకూర్చారు. 16వ తేదీ సాయంత్రం 6 గంటలకు పవిత్రోత్సవాలు ప్రాంభమవుతాయి. ఉత్సవాల్లో భాగంగా విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మృత్సంగ్రహణం, అంకురార్పణ వంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. 17న అగ్ని మథనం, అగ్ని ప్రతిష్టాపన, నిత్యహోమాలు, మూల మంత్రహోమం, పవిత్రాలకు అభిమంత్రణ, మహాఽశాంతి హోమం జరుపుతారు. 18న అష్ట కలశ స్నపన, పంచామృత అభిషేకాలు, నిత్య హోమం అనంతరం శ్రీరంగం నుంచి తెచ్చిన పవిత్రాలను స్వామికి సమర్పిస్తారు. కుంతీ మాధవస్వామి ఆలయంలోని కుంతీ మాధవస్వామి, శ్రీదేవి భూదేవి సమేత అనంత పద్మనాభ స్వామి పెద్ద ఉత్సవ విగ్రహాలకు, చిన్న ఉత్సవ విగ్రహాలకు, రుక్ష్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి, గోదాదేవి, లక్ష్మీదేవి, గిరిపై ఉన్న అనంత పద్మనాభ స్వామికి పవిత్రాలు సమర్పిస్తారు. పవిత్రాల అలకరణలో ఈ మూర్తులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. 19న ఉదయం విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, నిత్య హోమం అనంతరం పవిత్రాలను విసర్జింప చేస్తారు. పూర్ణాహుతి నిర్వహించి, కుంతీ మాధవస్వామి ఆలయంలోని శ్రీదేవి భూదేవి సమేత అనంత పద్మనాభస్వామి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా రూపొందించిన వేదిక వద్దకు తోడ్కొని వస్తారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఉదయం 11 గంటలకు శాంతి కల్యాణంతో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. -
నీ చెంతనే బతుకుతున్నాం.. కాపాడు తల్లీ..
తీరంలో గంగమ్మకు, నూకతాతకు ప్రత్యేక పూజలురాజయ్యపేటతీరంలో ఇసుక ప్రతిమలు చేసి పూజలు నిర్వహిస్తున్న మహిళలు (ఇన్సెట్) పసుపు కుంకుమలు కలిపిన నీళ్లను సముద్రంలో కలుపుతున్నమహిళలు నక్కపల్లి(అనకాపల్లి) : ‘గంగమ్మతల్లీ నిన్నే నమ్ముకున్నాం.. నీ చెంతనే బతుకుతున్నాం.. నీవిచ్చిన మత్స్య సంపదే ఆధారం.. మమ్మల్ని బల్క్ డ్రగ్ పార్కు నుంచి కాపాడు తల్లీ’ అంటూ రాజయ్యపేట మత్స్యకార మహిళలు మంగళవారం తీరంలో ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ఆరాధ్య దైవం నూక తాతపై కూడా భారం వేస్తూ వేడుకున్నారు. మంగళవారం ఉదయం వందలాది మంది మహిళలు సముద్రపు ఒడ్డుకు చేరుకున్నారు. ఇసుకతో గంగమ్మతల్లి, నూకతాత విగ్రహాలను తయారు చేశారు. వాటికి పసుపు, కుంకుమలతో పూజలు నిర్వహించారు. బిందెలతో నీళ్లు తెచ్చి పసుపు, కుంకుమ వేసి ఆ నీటిని, ఇసుకతో తయారు చేసిన విగ్రహాలను సముద్రంలో నిమజ్జనం చేశారు. గంగమ్మతల్లి.. బల్క్ డ్రగ్ పార్క్ నీ నుంచి మమ్మల్ని దూరం చేయబోతోంది.. ఇంత కాలం నీ నీడలో బతుకుతున్నాం.. నువ్విచ్చిన సంపదతో కడుపు నింపుకొంటున్నాం.. నీ నుంచి మమ్మల్ని దూరం చేసే ప్రయత్నాలకు కూటమి ప్రభుత్వం ఒడిగడుతోంది.. నిన్ను కలుషితం చేయాలని చూస్తున్నారు.. నువ్వే కాపాడాలమ్మా అంటూ ప్రార్థించారు. ‘నూకతాతా.. ఇప్పటి వరకు ప్రతి ఏటా శివరాత్రికి నీ పండగ ఘనంగా చేసే వాళ్లం.. వచ్చే ఏడాది నుంచి ఆ పరిస్థితి ఉండదు. మా ప్రాణాలు తీసే ప్రమాదకరమైన రసాయన పరిశ్రమలను బల్క్ డ్రగ్ పేరుతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది.. మేమంతా పొట్ట చేత పట్టుకుని ఇతర ప్రాంతాలకు పోయే పరిస్థితి కల్పిస్తోంది. నువ్వే దిక్కు మమ్మల్ని కాపాడాలి. నీపైనే భారం వేస్తున్నాం’ అంటూ వేడుకున్నారు. అలాగే గ్రామంలో ఉన్న బాకీర్తమ్మ అలయం వద్ద కూడా మహిళలు పూజలు చేశారు. అమ్మవారికి జలాశభిషేకం నిర్వహించారు. ఆలయం ముందు ఉన్న మెట్టపై నీళ్లు పోసి అమ్మవారిని బల్క్ డ్రగ్ భూతం నుంచి కాపాడాలంటూ వేడుకున్నారు. ఈ పూజల్లో జెడ్పీటీసీ సభ్యురాలు గోసల కాసులమ్మ, పైడితల్లి, మసేన మ్మ, పోలమ్మ, మహాలక్ష్మమ్మ, పాల్గొన్నారు. బల్క్ డ్రగ్ పార్కు రద్దు చేయాలంటూ మత్స్యకారుల వేడుకోలు -
ఉపాధి పనుల కొలతల్లో తేడాలు
వై.రామవరం: ఉపాధి హామీ పథకంలో చేపట్టిన రూ.68 లక్షల విలువైన పనుల్లో కొలతల్లో తేడా రావడంతో మళ్లీ నిర్వహించాలని ఆదేశించినట్టు ఉపాధి హామీ పథకం పీడీ డాక్టర్ విద్యాసాగర్ తెలిపారు. మండలంలో ఉపాధి హామీ పథకం పనులపై నిర్వహించిన సామాజిక తనిఖీలపై మంగళవారం స్థానిక ఉపాధిహామీ కార్యాలయంలో ప్రజావేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీడీ మాట్లాడుతూ రూ.17.54 కోట్లతో పంచాయతీరాజ్ శాఖలో జరిగిన 2,278 పనులకు సోషల్ ఆడిట్ నిర్వహించినట్టు చెప్పారు. ఈ పనుల్లో పొరపాట్లు జరగడంతో రూ.6,789 రికవరీ చేశామన్నారు. కొంతమంది సిబ్బందికి రూ.7వేలు జరిమానా విధించినట్టు చెప్పారు. ఎంపీడీవో కె.బాపన్నదొర అధ్యక్షతన నిర్వహించిన ఈసభలో ఎంపీపీ కడబాల ఆనందరావు, జెడ్పీటీసీ కర్ర వెంకటలక్ష్మి, వైస్ ఎంపీపీలు ముర్ల జోగిరెడ్డి, వలాల విశ్వమ్మ, ఎంపీటీసీ వీరమళ్ళ సుబ్బలక్ష్మి, సర్పంచ్ పల్లాల బాలురెడి, ఏపీడీ టి.ఎస్. విశ్వనాఽథ్, విజిలెన్స్ అధికారి సురేష్, ఏపీవోలు సాయిబాబ, స్వామి పాల్గొన్నారు.మళ్లీ నిర్వహించాలని పీడీ ఆదేశం -
ఏయూ–జీవీఎంసీ మధ్య దివాళీ ట్రేడ్ ‘ఫైర్’
విశాఖ సిటీ: ఆంధ్ర విశ్వవిద్యాలయం మరో వివాదానికి కేంద్రమవుతోంది. ప్రైవేటు వ్యాపారాలకు యూనివర్సిటీ మైదానాన్ని లీజుకు ఇస్తుండడం ఏయూలో అగ్గి రాజేస్తోంది. తాజాగా ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో ‘దివాళీ ట్రేడ్ ఫేర్’కు అనుమతి ఇచ్చే విషయంపై గందరగోళం నెలకొంది. ఒకవైపు ఎనిమిది రోజుల పాటు మైదానాన్ని లీజుకు ఇవ్వాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఏయూ వీసీకి లేఖ రాయడం ఇపుడు హాట్ టాపిక్గా మారింది. ఏయూ ఆడిటోరియాలు, మైదానాల్లో ప్రైవేటు కార్యక్రమాలను నిషేధిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ట్రేడ్ ఫెయిర్కు అనుమతులు ఎలా ఇస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రజాప్రతినిధులు, అధికారులు మాత్రం ఈ దివాళీ ట్రేడ్ ఫెయిర్కు అనుమతులు ఇవ్వాలని ఏయూ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. మందుగుండు సామగ్రి స్టాళ్ల ఏర్పాటు పేరుతో కూటమి నేతలు భారీగా వసూళ్లకు తెరలేపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 8 రోజుల అనుమతికి లేఖ ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ క్రీడా మైదానంలో హెలీప్యాడ్ ప్రాంతంలో స్టాళ్ల ఏర్పాటుకు ఈ నెల 14 నుంచి 21వ తేదీ వరకు 8 రోజుల పాటు లీజుకు ఇవ్వాలని జీవీఎంసీ కమిషనర్ ఏయూ వీసీకి లేఖ రాశారు. ముందు నాలుగు రోజులు స్టాళ్ల ఏర్పాటుకు, మూడు రోజుల పాటు అమ్మకాలకు, మరో రోజు వాటి తొలగింపునకు మైదానాన్ని కేటాయించాలని ఆ లేఖలో కోరారు. ఈ అనుమతులపై ఏయూ అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేనట్లు సమాచారం. ఇటీవలే క్రెడాయ్ ఒక కార్యక్రమం నిర్వహణకు ఈ మైదానాన్ని లీజుకు కోరగా.. ఏయూ అధికారులు అందుకు అంగీకరించలేదు. ప్రైవేటు కార్యక్రమాలను ఏయూలో అనుమతి లేదన్న ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయని చెప్పి క్రెడాయ్ కార్యక్రమాన్ని తిరస్కరించారు. ఇపుడు ఈ మందుగుండు సామాగ్రి అమ్మకాలకు ఎలా అనుమతులిచ్చారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. స్టాల్కు రూ.1.5 లక్ష నుంచి రూ.2 లక్షలు ఏయూలో స్టాళ్ల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే కూటమి నేతలు వసూళ్లకు తెరలేపారు. ఒక్కో స్టాల్కు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షలు రేటును నిర్ణయించినట్లు టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి ఒక సొసైటీ పేరుతో అనుమతులకు దరఖాస్తు చేసినప్పటికీ.. తెరవెనుక కూటమి నేతలే చక్రం తిప్పాలని చూస్తున్నట్లు సమాచారం. ఫలితంగా ఏయూలో స్టాళ్ల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చేలా ప్రజాప్రతినిధులు సైతం రంగంలోకి దిగి అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏయూ గ్రౌండ్లో స్టాళ్ల ఏర్పాటుపై గందరగోళం 8 రోజులకు అనుమతులు ఇవ్వాలని జీవీఎంసీ కమిషనర్ లేఖ ఏయూ ఆడిటోరియాలు, మైదానాల్లో ప్రైవేటు కార్యక్రమాలు నిషేధం అనుమతులు ఇచ్చే విషయంలో ఏయూ అధికారులపై ఒత్తిళ్లు వసూళ్లకు తెరలేపిన కూటమి నేతలు -
దేశ సమగ్ర అభివృద్ధికినూతన ఆవిష్కరణలు దోహదం
చింతపల్లి: దేశ సమగ్ర అభివృద్ధికి నూతన ఆవిష్కరణలు ఎంతో దోహదపడతాయని ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్లు కనక కుమార్ చాంద్, వీకే చాంద్లు తెలిపారు. స్థానిక డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ విజయ భారతి ఆధ్వర్యంలో జాతీయ సెమినార్ ముగింపు కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా దేశాన్ని పరివర్తన చేయడం,ఆవిష్కరించడం,సవాళ్లు మరియు అవకాశాలపై సెమినార్ నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి కావలసిన పరిజ్ఞానం, పరిశోధకుల కృషిని వివరించారు. విద్యార్థులతో పోస్టర్ ప్రజెంటేషన్ చేయించారు. ఈకార్యక్రమంలో పీఎం ఉష కోఆర్డినేటర్ వి. రమణ,వైస్ ప్రిన్సిపాల్ లకే పాత్రుడు పాల్గొన్నారు. -
ఆర్టీసీ ‘కార్తీక’ స్పెషల్స్
డాబాగార్డెన్స్(విశాఖ): పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భక్తులు, పర్యాటకుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జిల్లాశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. పంచారామాలు, శబరిమలై దర్శనంతో పాటు లంబసింగి వంటి పర్యాటక ప్రాంతాలకు టూర్ ప్యాకేజీలను ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. ఈ వివరాలను జిల్లా ప్రజా రవాణా అధికారి బి. అప్పలనాయుడు మంగళవారం వెల్లడించారు. ఒకే రోజులో పంచారామాల దర్శనం కార్తీక మాసంలో వచ్చే ప్రతి శని, ఆదివారాల్లో (ఈ నెల 25, 26, నవంబర్ 1, 2, 8, 9, 15, 16) సాయంత్రం 5 గంటలకు విశాఖ ద్వారకా బస్టేషన్ కాంప్లెక్స్ నుంచి ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయి. అమరావతి (అమరేశ్వరస్వామి), భీమవరం (సోమేశ్వరస్వామి), పాలకొల్లు (క్షీర రామలింగేశ్వరస్వామి), ద్రాక్షారామం (భీమేశ్వరస్వామి), సామర్లకోట (కుమార రామలింగేశ్వరస్వామి) – ఈ ఐదు పంచారామాలను ఒకే రోజులో దర్శించుకునేలా ఈ సర్వీసులను నడపనున్నట్టు ఆయన తెలిపారు. పంచారామాల ప్రయాణ చార్జీలు (ఒక్కరికి): సూపర్ లగ్జరీ రూ. 2,200 అల్ట్రా డీలక్స్ రూ. 2,150 ఇంద్ర (ఏసీ) రూ. 2,800 లంబసింగి పిక్నిక్ టూర్ కార్తీక మాసంలో పిక్నిక్లకు వెళ్లే పర్యాటకుల కోసం లంబసింగి టూర్ను కూడా ఆర్టీసీ ప్రారంభించింది. ఈ టూర్ శని, ఆదివారాల్లో ఉదయం 3 గంటలకు ద్వారకా బస్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ఈ ప్యాకేజీలో లంబసింగి, తాజంగి డ్యామ్, కొత్తపల్లి వాటర్ఫాల్స్, మోదమాంబ గుడి, కాఫీ ప్లాంటేషన్ ప్రాంతాలను చూపించనున్నారు. టూర్ చార్జీలు : అల్ట్రా డీలక్స్ రూ. 800, ఎక్స్ప్రెస్ – రూ. 650. ధారమట్టం టూర్: శని, ఆదివారాల్లో ఉదయం 7 గంటలకు ద్వారకా బస్టేషన్ నుంచి ధారమట్టం టూర్ బస్సులు బయలుదేరుతాయి. ఈ టూర్లో శివాలయం, ధారమట్టం వాటర్ఫాల్స్, అల్లూరి సీతారామరాజు మ్యూజియం, బొజ్జనకొండ (అనకాపల్లి) దర్శనీయ ప్రాంతాలు ఉంటాయి. టూర్ ఛార్జీలు: సూపర్ లగ్జరీ – రూ. 650, అల్ట్రా డీలక్స్ – రూ. 550 శబరిమలై, ఇతర టూర్స్ శబరిమలై వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం కూడా ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపనుంది. భక్తులు ముందుగానే సీట్లు రిజర్వ్ చేసుకోవాలని డీపీటీఓ కోరారు. కార్తీక మాసంలో విజ్ఞాన విహార యాత్రలకు కూడా అద్దె ప్రాతిపదికన బస్సులు ఇవ్వనున్నామని, గ్రూపులుగా వచ్చినచో వారు కోరిన రోజున టూర్ స్పెషల్స్ నడపనున్నట్టు అప్పలనాయుడు తెలిపారు. రిజర్వేషన్లు: పంచారామ దర్శినీ, పిక్నిక్లు, మార్గశిర మాసంలో పంచవైష్ణవి క్షేత్ర దర్శనాల కోసం వెళ్లే భక్తులు www. apsrtconline. in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ రిజర్వేషన్ చేసుకోవచ్చు. ద్వారకా బస్టేషన్ వద్ద గల రిజర్వేషన్ కౌంటర్ వద్ద కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు: 9959225602, 9052227083, 9959225594, 9100109731 నంబర్లలో సంప్రదించవచ్చు.పంచారామాలు, లంబసింగి టూర్ ప్యాకేజీలు -
‘బెర్రీ బోరర్’ నియంత్రణకు చర్యలు
సాక్షి, పాడేరు: కాఫీతోటలకు పెనుముప్పుగా మారిన బెర్రీబోరర్ పురుగు నియంత్రణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం ఐటీడీఏ కేంద్ర కాఫీబోర్డు, ఎఫ్పీవోలు, ఎన్జీవోతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్, కంటైన్మెంట్, బఫర్ జోన్లలో ఈ పురుగును నియంత్రించని పక్షంలో మొత్తం కాఫీ పంట నాశనమవుతుందని హెచ్చరించారు. బెర్రీబోరర్ సోకిన ప్రాంతాన్ని మూడేళ్ల పాటు జాగ్రత్తగా పరిశీలించాలని, ప్రామాణిక కార్యాచరణ విధానం(ఎస్వోపీ) తప్పనిసరిగా పాటించాలన్నారు. కింద పడిన కాఫీ కాయలకు గ్లీనింగ్ ప్రక్రియ చేపట్టాలని చెప్పారు. పురుగు సోకిన ప్రాంతాల నుంచి కాఫీ పిక్కలు,టార్పాలిన్,గోనె సంచులను ఇతర ప్రాంతాలకు తరలించవద్దని సూచించారు. పురుగు సోకని ప్రాంతాల్లోనూ అప్రమత్తంగా ఉండాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కంటైన్మెంట్ జోన్లో రైతుల జాబితాను తక్షణమే తయారు చేయాలని,పురుగు సోకిన ప్రాంతంలోనే కాఫీ పల్పింగ్ జరిగేటట్టు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బెర్రీబోరర్ వ్యాప్తిని నివారించేందుకు అన్ని పంచాయతీల్లోను గ్రామసభలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించాలన్నారు.ఈఏడాది కాఫీ నాణ్యతను పెంచేందుకు ఐటీడీఏ ద్వారా గ్రేడింగ్ చేస్తామని, వేరియబుల్ ధరను నిర్ధారించి చెల్లిస్తామని కలెక్టర్ తెలిపారు.ఈ సమావేశంలో కేంద్ర కాఫీబోర్డు డీడీ మురళీధర, ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, మినుములూరు ఎస్ఎల్వో రమేష్ తదితరులు పాల్గొన్నారు. జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలపై ప్రచారం జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను అన్ని వర్గాల ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన సంబంధిత అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటక సీజన్ను దృష్టిలో పెట్టుకుని కొత్త ధరల వల్ల కలిగే ఆర్థిక లాభాలను వివరించాలని ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. రూ.7,500 నుంచి రూ.7,000 లోపు ఉన్న హోటళ్ల గదుల అద్దెలు దాదాపు 10శాతం తగ్గుతాయని చెప్పారు అరకు, మారేడుమిల్లి, లంబసింగి పర్యాటక ప్రాంతాల్లో రిసార్ట్లు, హోటళ్లు,చిన్న రెస్టారెంట్ల వద్ద పాత, కొత్త ధరలను పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.కలెక్టర్ దినేష్కుమార్ హెచ్చరిక -
గిరిజన సంక్షేమ శాఖ డీడీ ఆకస్మిక తనిఖీ
పెదబయలు: మండల కేంద్రం పెదబయలులోని స్థానిక ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలను సోమవారం రాత్రి గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పరిమళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలకు చెందిన రికార్డులు, ఉపాధ్యాయుల లెసన్ ప్లాన్ను పరిశీలించారు. అనంతరం మరుగుదొడ్లు పరిశీలించగా.. అపరిశుభ్రంగా, ఆధ్వానంగా ఉండి కంపు కొడుతుండడంతో పాఠశాల హెచ్ఎం, వార్డెన్లపై డీడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుగుదొడ్లు ఇలా ఉంటే విద్యార్థులకు వ్యాధులు ప్రబలే ఆస్కారం ఉందని వార్డెన్ను హెచ్చరిస్తూ హెచ్ఎం, వార్డెలకు చార్జీ మెమోను జారీ చేశారు. అనంతరం ఏపీ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల వసతి గృహంను తనిఖీ చేసి, సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. వారీ సామర్థ్యంపై డీడీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏటీడబ్లూవో స్వర్ణలత, తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల ప్రాణాలతో కూటమి నాయకుల చెలగాటం
అరకులోయటౌన్: రాష్ట్రంలో కల్తీ మద్యం తయారీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గ కేంద్రమైన అరకులోయలో మహిళా ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులు సోమవారం కదం తొక్కారు. అరకులోయ జెడ్పీటీసీ శెట్టి రోషిణి, యువజన నాయకుడు రేగం చాణిక్య, పార్టీ నాయకులు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి ఎకై ్సజ్ స్టేషన్ వరకు సుమారు రెండు కిలోమీటర్లు ర్యాలీ నిర్వహించారు. మార్గమధ్యంలో భారీ వర్షం కురిసినప్పటికీ లెక్కచేయకుండా ర్యాలీ కొనసాగించారు. ఎక్సైజ్ స్టేషన్కు చేరుకుని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. సీఐ ఆర్.శ్రావణ్ కుమార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ శెట్టి రోషిణి మాట్లాడుతూ కూటమి నాయకులు కల్తీ మద్యం తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని చెప్పారు. యువజన నాయకుడు రేగం చాకిణ్య మాట్లాడుతూ కల్తీ మద్యం తయారు చేస్తూ అడ్డంగా దొరికి పోయిన కూటమి నాయకులను కాపాడేందుకు ప్రభుత్వ పెద్దలు యత్నిస్తుండడం సిగ్గుచేటన్నారు. అనంతగిరి ఎంపీపీ శెట్టి నీలవేణి మాట్లాడుతూ కల్తీ మద్యం కేసుల్లో పట్టుబడిన వారంతా టీడీపీకి చెందిన వారేనని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత వాడవాడలా బెల్ట్ షాపులు వెలిశాయని చెప్పారు. హుకుంపేట వైస్ ఎంపీపీ సుశీల మాట్లాడుతూ రాష్ట్రంలో కల్తీ మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయన్నారు. డుంబ్రిగుడ జెడ్పీటీసీ జానకమ్మ మాట్లాడుతూ బెల్ట్షాపులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ డుంబ్రిగుడ మండల అధ్యక్షుడు పాంగి పరశురామ్ మాట్లాడుతూ కల్తీ మద్యం కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు బాక ఈశ్వరి, సీతమ్మ, వైస్ ఎంపీపీలు కిల్లో రామన్న, లలిత కుమారి, శెట్టి ఆనంద్, పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్, పార్టీ మండల అధ్యక్షులు రామూర్తి, చంద్రుబాబు, సూర్యనారాయణ, అనిల్, సర్పంచ్లు సుస్మిత, పూర్ణిమ, నాగేశ్వరరావు, పాగి అప్పారావు, బుటికి, పార్టీ మండల ఉపాధ్యాక్షులు విజయ్కుమార్, ప్రకాష్, పార్టీ నాయకులు సందడి కొండబాబు పాల్గొన్నారు.మద్యాంధ్రప్రదేశ్గా మార్చారురంపచోడవరం: రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులైపారుతోందని వైఎస్సార్ సీపీ రంపచోడవరం నియోజకవర్గ కోఆర్డినేటర్,మాజీ ఎమ్మెల్యే నాగుపల్లి ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్(అనంతబాబు) ధ్వజమెత్తారు. కల్తీ మద్యం తయారీకి వ్యతిరేకంగా రంపచోడవరం నియోజకవర్గంలోని 11 మండలాల నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో కలిసి స్థానిక అంబేడ్కర్ సెంటర్ నుంచి ఎకై ్సజ్ స్టేషన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఎకై ్సజ్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే నాగుపల్లి ధనలక్ష్మి మాట్లాడుతూ నారా వారి కల్తీ లిక్కర్తో రాష్ట్రం మద్యాంధ్రప్రదేశ్గా మారిందని విమర్శించారు. మద్యం, బెల్ట్షాపుల్లో టీడీపీ నాయకులు విచ్చలవిడిగా నకిలీ మద్యాన్ని విక్రయిస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో టీడీపీ నేతలు కల్తీ మద్యం తయారీని కుటీర పరిశ్రమ స్థాయికి తీసుకువెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త మద్యం పాలసీ ముసుగులో విచ్చలవిడిగా మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు ఏర్పాటు చేశారన్నారు. చంద్రబాబు, లోకేష్ సన్నిహితుడే కల్తీ మద్యం తయారీలో కీలక పాత్రధారి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం ఎంపీపీ బంధం శ్రీదేవి, జెడ్పీటీసీ పండా వెంకటలక్ష్మి, దేవీపట్నం ఎంపీపీ కుంజం మురళి, జెడ్పీటీసీ శిరసం సత్యవేణి, మారేడుమిల్లి జెడ్పీటీసీ గొర్ల బాలాజీ బాబు, అడ్డతీగల జెడ్పీటీసీ మద్దాల వీర్రాజు, రంపచోడవరం వైస్ ఎంపీపీ కొమ్మిశెట్టి బాలకృష్ణ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఐటీడీఏ గ్రీవెన్స్లో సమస్యల ఏకరువు
రంపచోడవరం: ఐటీడీఏ సమావేశపు హాలులో పీవో స్మరణ్రాజ్, సబ్ కలెక్టర్ శుభమ్ నొఖ్వాల్లు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. గిరిజనులు తమ సమస్యలపై ఏకరువు పెట్టి, అర్జీలు అందజేశారు. ఉపప్రణాళిక ప్రాంతంలోని గిరిజనుల సమస్యలు పరిష్కరించాలని, రౌతులపూడి మండలంలోని లచ్చిరెడ్డిపాలెంలో భూములను వ్యవసాయ యోగ్యంగా చేయాలని కోరుతూ అవిటి సాంబమూర్తి, నాగేశ్వరరావు, గంగరాజు ఐటీడీఏ గ్రీవెన్స్లో అర్జీ అందజేశారు. గంగవరం మండలంలోని లక్కొండ, గొరగొమ్మి పెదగార్లపాడు మీదుగా 15 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం చేపట్టాలని, లక్కొండ గ్రామంలో 60 ఎకరాలకు సాగు నీరందించే కొమ్మిరెడ్డి చెరువుకు మరమ్మతులు చేయించాలని వేట్ల సత్యనారాయణ వినతిపత్రం అందజేశారు. ఏజెన్సీ రామకృష్ణ మిషన్ ద్వారా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు అనుమతి మంజూరు చేయాలని రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞానందజీ, మెడికల్ క్యాంపు కోఆర్డినేటర్ కానుమోను శ్రీనివాసు కోరారు. అనంతరం పీవోకు స్వామివివేకానంద చిత్రపటాన్ని స్వామీజీ అందజేశారు. -
సత్తాచాటిన జూనియర్ అథ్లెట్లు
విశాఖ స్పోర్ట్స్: 40వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఆంధ్ర అథ్లెట్లు వెంకట్రామ్, శేషు పతకాలు సాధించారు. భువనేశ్వర్లో జరుగుతున్న ఈ మీట్లో ఎం. వెంకట్రామ్ అండర్–20 బాలుర 800, 1500 మీటర్ల పరుగుల్లో విజేతగా నిలిచి స్వర్ణాలు అందుకున్నాడు. విశాఖ అథ్లెట్ డి. శేషు అండర్–18 బాలుర విభాగపు 200 మీటర్ల పరుగును 22.09 సెకన్లలో పూర్తి చేసి తృతీయ స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని అందుకున్నాడు. ఆంధ్ర జట్టుకు కోచ్గా వైకుంఠరావు వ్యవహరించగా, పతకాలు సాధించిన వీరిద్దరినీ జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రతినిధులు అభినందించారు. కేజీహెచ్లో ఫుట్ స్కానింగ్ ప్రారంభం మహారాణిపేట(విశాఖ): ఫుట్ స్కానింగ్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ. వాణి అన్నారు. సోమవారం కేజీహెచ్ ఆర్థోపెడిక్ ఓపీలో ఏపీ మెడిటెక్ జోన్ సహకారంతో వైద్యులకు, పోస్ట్–గ్రాడ్యుయేట్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ వాణి మాట్లాడుతూ, పాదంలో బరువు ఎలా సమతుల్యంగా ఉందో దీని ద్వారా తెలుస్తుందన్నారు. ఈ సౌకర్యం ఇంతవరకు హైదరాబాద్లో మాత్రమే ఉందని, కానీ నేటి నుంచి విశాఖలో కూడా ఈ సౌకర్యం లభిస్తుందన్నారు. ఏపీ మెడిటెక్ జోన్ ద్వారా ఆర్టిఫిషియల్ లింబ్ సెంటర్ ద్వారా ఈ అవకాశం కల్పిస్తున్నారని అన్నారు. పాదంలో జరుగుతున్న మార్పులను ముందుగా తెలుసుకోవడం ద్వారా తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పాదాలకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలను నిరోధించవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో కేజీహెచ్ ఆర్థోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ ఎం. చంద్రశేఖరం నాయుడు, ఆంధ్రా మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వి. మన్మధరావు, పిల్లల విభాగాధిపతి డాక్టర్ బీ.ఎన్. చక్రవర్తి, ఎండోక్రైనాలజీ విభాగాధిపతి డాక్టర్ కె.వి. సుబ్రహ్మణ్యం, ఇతర విభాగాల వైద్యులు, పీజీ వైద్యులు తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి
రంపచోడవరం: ఏజెన్సీలో గిరిజన చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం గిరిజన సంఘాలు, యువత, నాయకులు రంపచోడవరం ఐటీడీఏ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఎదుట ఏజెన్సీ నుంచి పెద్ద ఎత్తున గిరిజనులు పాల్గొని ధర్నా చేశారు. ఏజెన్సీ ప్రత్యేక డీఎస్సీ విడుదల చేయాలని, 2025 డీఎస్సీ నోటిఫికేషన్ ఐదో షెడ్యూల్ చట్టాలకు విరుద్ధంగా ఉందని, జీవో 3 స్థానంలో కొత్త జీవో అమలు చేసి గిరిజనుల ప్రయోజనాలు కాపాడాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీలో నూరు శాతం ఉద్యోగాలు స్థానిక గిరిజనులతో భర్తీ చేయాలన్నారు. ఐటీడీఏ ఎదుట గిరిజనులు బైఠాయించడంతో సుమారు ఐదు గంటలు పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. అనంతరం ధర్నా వద్దకు వచ్చిన ఐటీడీఏ పీవో స్మరణ్రాజ్, సబ్ కలెక్టర్, శుభమ్ నొఖ్వాల్, డీఎస్పీ సాయిప్రశాంత్లు గిరిజన యువత, నాయకులతో మాట్లాడారు. జేఏసీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్న అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. -
కస్తూర్బాలో అపరిశుభ్రతపై మేజిస్ట్రేట్ ఆగ్రహం
రంపచోడవరం: స్థానిక కసూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పారిశుధ్యం లోపించడంపై మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎం.ఎం. మురళీగంధర్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో అపరిశుభ్రవాతావరణం ఉండడంతో అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన బాలలకు అందించే ఆహారంలో విషయంలో తగిన శ్రద్ధ చూపించాలని,గదులు శుభ్రంగా ఉంచాలని పాఠశాల హెచ్ఎంకు సూచించారు. విద్యార్థినుల భవిష్యత్తు, ఆరోగ్యం, చదువుపైన శ్రద్ధ వహించాలన్నారు. అనంతరం విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. పచ్చ కామెర్ల బాధితుల తరలింపు మహారాణిపేట: కురుపాం గురుకుల బాలికల పాఠశాలకు చెందిన 21 మంది పచ్చ కామెర్ల బాధితులను సోమవారం కేజీహెచ్ నుంచి పార్వతీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. విద్యార్థులకు వ్యాధి పూర్తిగా తగ్గిపోయిందని, వైద్యులు ఇచ్చిన నివేదికల ఆధారంగానే తరలించినట్టు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి తెలిపారు. డాక్టర్ గిరినాథ్ (గ్యాస్ట్రో ఎంటాలజీ), డాక్టర్ శివకళ్యాణి (మైక్రోబయాలజీ), డాక్టర్ కృష్ణవేణి (కమ్యూనిటీ మెడిసిన్), డాక్టర్ వాసవి లత (జనరల్ మెడిసిన్), డాక్టర్ చక్రవర్తి (పిల్లల వైద్యుడు) సహా ఐదుగురు వైద్యుల బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా విద్యార్థుల తరలింపు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇప్పటివరకు పలు విడతల్లో మొత్తం 44 మంది విద్యార్థులను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు సూపరింటెండెంట్ వివరించారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినులు ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మొత్తం 50 మంది విద్యార్థినులు పచ్చ కామెర్ల బారిన పడ్డారు. వీరిలో తొమ్మిదో తరగతి చదువుతున్న తోయిక కల్పన, పదో తరగతి చదువుతున్న పువ్వల అంజలి మృత్యువాత పడటం కలకలం సృష్టించింది. ఈ ఘటనపై కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి ఆధ్వర్యంలో గ్యాస్ట్రో ఎంటాలజీ, జనరల్ ఫిజిషియన్, ఇతర వైద్యులు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించారు. ఎన్టీఆర్ వైద్య సేవలను కొనసాగించాలి బీచ్రోడ్డు: నిలిచిపోయిన ఎన్టీఆర్ వైద్య సేవలను వెంటనే కొనసాగించాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి పాత్రపల్లి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. పేద ప్రజల వైద్యంపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి పాత్రపల్లి చంద్రశేఖర్ మాట్లాడుతూ గత ఏడు నెలలుగా కూటమి ప్రభుత్వం కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులకు బకాయిలు చెల్లించలేదనే నెపంతో ఈ నెల 10వ తేదీన ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు చేతులెత్తేయడంతో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయాయని మండిపడ్డారు. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నెయ్యల నాగభూషణరావు, మన్మథరావు, క్షేత్రపాల్ రెడ్డి, పార్టీ జిల్లా సమితి సభ్యులు సీహెచ్. కాసుబాబు, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా నాయకురాలు పుష్పలత, మత్స్య కార్మిక సంఘం నాయకులు కోడా వజ్రం, మీసాల శ్రీనివాస్, మత్స్య కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వాసుపల్లి నల్లయ్య, అరిలోవ సీపీఐ పార్టీ శాఖ కార్యదర్శి లక్ష్మణరావు, అత్తిలి రవి పాల్గొన్నారు. -
నేడు మత్స్య మాడుగులమ్మ దసరా ఉత్సవం
జి.మాడుగుల: స్థానిక గంతకొండపై కొలువై ఉన్న, మత్స్యరాస వంశీయుల ఇలువేల్పు అయిన మత్స్య మాడుగులమ్మ తల్లి గిరిజన దసరా పండగను మంగళవారం ఘనంగా నిర్వహించేందుకు గ్రామపెద్దలు ఏర్పాట్లు చేశారు. మండల కేంద్రం జి.మాడుగులలో ఏటా రెండు సార్లు దసరా ఉత్సవాలను నిర్వహిస్తారు. సాధారణంగా అందరూ జరుపుకొనే ఆశ్వయుజ దశమి నాడు ఒకసారి, విజయ దశమి అనంతరం వచ్చే మొదటి లేదా రెండో మంగళవారం నాడు మరోసారి దసరా ఉత్సవం నిర్వహించడం పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయం. గిరిజన దసరా పండగను మత్స్యరాస వంశీయులతో పాటు, ఈ ప్రాంత ప్రజలు ఘనంగా జరుపుకొంటారు. పూర్వీకులు వినియోగించిన నాటు తుపాకీ, ఖడ్గం తదితర ఆయుధాలు, ఘటాలను దివంగత మాజీ ఎంపీ మత్స్యరాస మత్స్యరాజు స్వగృహం నుంచి మత్స్యరాస కుటుంబ సభ్యులు డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా మత్స్య మాడుగులమ్మ ఆలయానికి తీసుకొచ్చి, గిరిజన సంప్రదాయం ప్రకారం ఆయుధ పూజ చేస్తారు. మత్స్యరాస వంశీయులతో పాటు ఈప్రాంతం ప్రజలు కూడా పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకుంటారు. -
సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న ముగ్గురు అరెస్ట్
విశాఖ సిటీ: సైబర్ మోసాల ద్వారా బాధితుల నుంచి దోచుకున్న డబ్బును ’మ్యూల్ అకౌంట్ల’ ద్వారా ఉపసంహరించి వాటిని సైబర్ నేరగాళ్లకు క్రిప్టోకరెన్సీగా మార్చి అందించిన ముగ్గురు వ్యక్తులను విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి సోమవారం రిమాండ్కు పంపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూర్మన్నపాలెం ప్రాంతంలో నివాసముంటున్న స్టీల్ప్లాంట్ ఉద్యోగికి టెలిగ్రామ్ యాప్లో ‘గోద్రేజ్ ప్రాపర్టీస్’ పేరు మీద ఉన్న గ్రూప్లో యాడ్ చేసి, ఇంటి వద్దే పార్ట్టైమ్ జాబ్ చేసుకోవచ్చని సందేశం వచ్చింది. అది నిజమని నమ్మి, వారు పంపించిన లింకులో అతను తన వివరాలు నమోదు చేసుకున్నాడు. అతనికి ‘5 స్టార్ రేటింగ్స్’ ఇచ్చే పనిని అప్పగించారు. మొదట్లో కొన్ని టాస్కులు పూర్తి చేసిన తరువాత లాభాలు కూడా అందడంతో అతనికి నమ్మకం ఏర్పడింది. తర్వాత ఫైజా అనే వ్యక్తి తాను సీబీఏవో అనే కంపెనీకి సలహాదారునిగా పనిచేస్తున్నానని చెబుతూ.. ఇందులో ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మబలికాడు. ఇలా ఎన్ఈఎఫ్టీ, ఐఎంపీఎస్, యూపీఐ మార్గాల ద్వారా డబ్బులు పంపించమని కోరారు. ఆ సూచనల ప్రకారం బాధితుడు మొత్తం రూ.15.51 లక్షలు వివిధ బ్యాంకు లావాదేవీల ద్వారా జమ చేశా రు. లాభాలు రాకపోగా.. డబ్బు విడుదల చేయాలంటే మరింత మొత్తం చెల్లించాలంటూ మోసగాళ్లు పదేపదే డిమాండ్ చేయడం ప్రారంభించారు. దీంతో మోసపోయినట్లు గ్రహించి వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.2.5 కోట్ల లావాదేవీలు సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొదటిగా బ్యాంక్ లావాదేవీలు, యూపీఐ పేమెంట్ లింకులు, టెలిగ్రామ్ గ్రూప్ ఐపీ లాగ్లు, ఫేక్ వెబ్సైట్లను విశ్లేషించారు. ఈ ప్రక్రియలో అనేక లేయర్ల ద్వారా డబ్బు తిరిగి, తిరిగి చివరకు నంద్యాల జిల్లాకు చెందిన షేక్ సఫియుర్ రెహ్మాన్, షేక్ అబ్దుల్ రెహ్మాన్, షేక్ హుస్సేన్ వలీ ఖాతాల్లోకి చేరినట్లు తేలింది. వీరు సుమారు 15 బ్యాంక్ అకౌంట్ల ద్వారా క్యాష్ డిపాజిట్లు, సీఎండీ లావాదేవీలు, యూఎస్డీటీ కొనుగోళ్లు, అమ్మకాలు జరిపారు. టెలిగ్రాంలో పరిచయమైన జేఎండీ అకౌంట్లో సుమారు రూ.2.5 కోట్లు క్రిప్టోకరెన్సీ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఇందులో సఫియూర్ రెహ్మాన్కు సహకరించిన అబ్దుల్ రెహ్మాన్, షేక్ హుస్సేన్ వలీలను విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సైబర్ నేరాలకు వినియోగిస్తున్న బ్యాంక్ అకౌంట్స్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కోర్టులో ప్రవేశ పెట్టగా, వారికి 15 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించారు. ప్రధాన నిందితుడి కోసం పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. -
విస్తారంగా వర్షాలు
పాడేరులో కురుస్తున్న వర్షం సాక్షి, పాడేరు: జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గెడ్డలు,వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. సోమవారం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రం పాడేరులో భారీ వర్షం కురవడంతో జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా 267.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా వై.రామవరంలో 68.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఎటపాకలో 62.4, జీకే వీధిలో 39.2, రంపచోడవరంలో 26.8, కొయ్యూరులో 22, ముంచంగిపుట్టులో 9.4, మారేడుమిల్లిలో 7.4, అనంతగిరిలో 6.8, హుకుంపేటలో 6.6, రాజవొమ్మంగిలో 3.2, వి.ఆర్.పురంలో 2.4, చింతూరులో 2.2, డుంబ్రిగుడలో 2, కూనవరంలో 1.6, దేవిపట్నంలో 1.6, జి.మాడుగుల 1.4, పాడేరులో 1.2,అడ్డతీగలలో 0.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
బడికెళ్లొచ్చే వరకూ బెంగే!
● గెడ్డదాటితేనే చదువులు ● నిత్యం విద్యార్థులకు తప్పని అవస్థలు ● వర్షం పడితే గండమే ● భయాందోళనలకు గురవుతున్న తల్లిదండ్రులుజి.మాడుగుల: మండలంలో బూసిపల్లికి చెందిన విద్యార్థులు పాఠశాలకు వెళ్లిరావాలంటే గెడ్డ దాటాల్సిందే. ఆ సమయంలో ఏ మాత్రం పట్టు తప్పినా గల్లంతవడం ఖాయం. దీంతో తీవ్ర భయాందోళనల మధ్య విద్యార్థులు తమ గ్రామం నుంచి వంజరి పంచాయతీ కృష్ణాపురానికి వెళ్లి చదువుకోవలసి వస్తోంది. రోజూ మాదిరిగానే బూసుపల్లి గ్రామం నుంచి సోమవారం ఉదయం కృష్ణాపురంలో గల పాఠశాలకు విద్యార్థులు వెళ్లారు. సాయంత్రం భారీ వర్షం కురవడంతో మార్గమధ్యంలో గల గెడ్డ ఉధృతంగా ప్రవహించింది. దీంతో ఇళ్లకు చేరుకునేందుకు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురికావలసి వచ్చింది. పొలాల గట్లపై జారుతూ,పడుతూ ప్రమాదకరంగా ప్రవహిస్తున్న గెడ్డ దాటుతూ వస్తున్న విద్యార్థులను చూసిన బూసిపల్లి గ్రామస్తులు వారికి రక్షణగా నిలిచి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. కృష్ణాపురం పాఠశాలలో బూసిపల్లి,నీలమెట్ట, తోకచిలుక గ్రామాలకు చెందిన 50 మంది విద్యార్థులు చదువుతున్నారు. కృష్ణాపురం–బూసిపల్లి మార్గ మధ్యంలో గల గెడ్డ వర్షాలు పడితే ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ రెండు గ్రామాల మధ్య 2కిలోమీటర్లు రోడ్డు, గెడ్డపై బ్రిడ్జి నిర్మించాలని పలుమార్లు అధికారులకు గ్రామస్తులు మొరపెట్టుకున్నారు. అయినా పట్టించుకోలేదు. దీంతో బడికి వెళ్లిన పిల్లలు ఇళ్లకు చేరే వరకూ తల్లిదండ్రులు భయాందోళనలతో ఎదురుచూడాల్సి వస్తోంది.ఉధృతంగా ప్రవహిస్తున్న గెడ్డలోంచి చిన్నారులను సురక్షితంగా తీసుకొస్తున్న గ్రామస్తులు -
సమస్యలు పరిష్కరించకుంటే ఎన్నికలు బహిష్కరిస్తాం
ఐటీడీఏ ముట్టడిలో ఆదివాసీ జేఏసీ నాయకుల హెచ్చరికచింతూరు: సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వ తీరుకు నిరసనగా అవసరమైతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తామని ఆదివాసీ జేఏసీ నాయకులు హెచ్చరించారు. ఏజెన్సీలో వందశాతం ఉద్యోగాలు స్థానిక ఆదివాసీలతోనే భర్తీచేయాలనే డిమాండ్తో ‘హలో చింతూరు–చలో ఐటీడీఏ’ కార్యక్రమంలో భాగంగా సోమవారం నాలుగు మండలాలకు చెందిన ఆదివాసీలు చింతూరు ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. జోరువానను సైతం లెక్కచేయకుండా భారీగా తరలివచ్చిన ఆదివాసీ యువత ముందుగా చింతూరు మెయిన్రోడ్ సెంటర్ నుంచి ఎర్రంపేటలోని ఐటీడీఏ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐటీడీఏ ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. జేఏసీ జాతీయ నాయకులు మడివి నెహ్రూ, అప్పలనర్స మాట్లాడుతూ ఆదివాసీ నిరుద్యోగుల కోసం ఏజెన్సీ స్పెషల్ డీఎస్సీ నిర్వహించి న్యాయం చేయాలని కోరారు. ఇటీవల నిర్వహించిన డీఎస్సీ కారణంగా స్థానిక ఆదివాసీలు ఐదువేల టీచర్ పోస్టుల వరకూ నష్టపోయారన్నారు. గిరిజనేతర ఉపాధ్యాయులకు మైదాన ప్రాంతాల్లోనే పోస్టింగులు ఇవ్వాలని వారు కోరారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను మాట్లాడుతూ గిరిజనేతరుల అక్రమ కట్టడాలను తొలగించాలని, ఆదివాసీ చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వారు ఏపీవో రామతులసికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కూనవరం జెడ్పీటీసీ గుజ్జా విజయ, వీఆర్పురం ఎంపీపీ కారం లక్ష్మి, సర్పంచ్లు, జేఏసీ నాయకులు పులి సంతోష్, సీసం సురేష్, జల్లి నరేష్, తిమ్మ సాయి, పొడియం రామకృష్ణ, సాయిబాబు, సీతారామయ్య, ప్రదీప్, బుర్రయ్య పాల్గొన్నారు. పాడేరులో... పాడేరు: ఆదివాసీ నిరుద్యోగుల కోసం ఐటీడీఏ పరిధిలో స్పెషల్ డీఎస్సీ నిర్వహించాలని, జీవో నంబర్.3 పునరుద్ధరించాలని ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ సాధన సమితి జిల్లా కన్వీనర్ సాగిన ధర్మన్నపడాల్, ఆదివాసీ నిరుద్యోగుల సంఘం జిల్లా కన్వీనర్ సాగిన సత్యనారాయణ డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఆదివాసీ నిరుద్యోగులు ఆందోళన చేశారు. జోరుగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పాడేరులో ర్యాలీ నిర్వహించి, ఐటీడీఏ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ధర్మన్నపడాల్, సత్యనారాయణ మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన డీఎస్సీ కారణంగా ఆదివాసీ నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారన్నారు. గత ఎన్నికల సమయంలో జీవో నంబర్ 3ను పునరుద్దిస్తామని, ఐటీడీఏల పరిధిలో స్పెషల్ డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చిన కూటమి నాయకులు ఆ తరువాత ఆదివాసీ నిరుద్యోగ యువతను మోసం చేశారన్నారు. ఐటీడీఏల పరిధిలో స్పెషల్ డీఎస్సీ నిర్వహించాలని, ఐదో షెడ్యూల్డ్ ఏరియాలో చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని, జీవో నంబర్ 3 పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నిరుద్యోగ సంఘం జిల్లా నాయకులు అరుణకుమారి, వంపూరి స్వాతీ లత, గంపరాయి భాను, అధిక సంఖ్యలో నిరుద్యోగులు పాల్గొన్నారు. -
ఊడిన ఆర్టీసీ బస్సు చక్రం
రాజవొమ్మంగి: ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు చక్రం ఊడిపడిన ఘటన బోర్నగూడెం వద్ద సోమవారం చోటుచేసుకుంది. ఏలేశ్వరం డిపోకు చెందని ఆర్టీసీ బస్సు రాజవొమ్మంగి నుంచి ఏలేశ్వరం వెళుతుండగా మార్గ మధ్యంలో బోర్నగూడెం వద్ద గోతిలో పడి చక్రం ఊడిందని బస్సులోని ప్రయాణికులు తెలిపారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఎటువంటి ప్రమా దం జరగలేదు. గోతులతో నిండిన ఈ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని, కండిషన్లో ఉన్న బస్సులనే ఏజెన్సీప్రాంతానికి నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
క్రమబద్ధీకరించకుంటే సమ్మె తప్పదు
జెన్ కో, ట్రాన్స్కో, డిస్కమ్ ఒప్పంద కార్మికులు సీలేరు: ఏపీ జెన్కో సీలేరు విద్యుత్ కాంప్లెక్స్లోని పలు ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఒప్పంద కార్మికులు డిమాండ్ చేశారు. లేకపోతే సమ్మె తప్పదన్నారు. ఈ మేరకు సోమవారం సీలేరు జెన్కో ఎస్ఈ చంద్రశేఖర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. తెలంగాణ విద్యుత్ సంస్థల తరహాలో ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో, డిస్కమ్లలో పనిచేస్తున్న సుమారు 27,151 మంది విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఈనెల 15వ తేదీ ఉదయం 6 గంటల నుంచి సమ్మె చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అప్పర్ సీలేరు బ్రాంచ్ అధ్యక్షుడు బి.లక్ష్మణ్,కార్యదర్శి టి.విష్ణుకుమార్ జెన్కో, ట్రాన్స్కో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. -
పర్యాటక హరివిల్లు..'పొల్లూరు'
ప్రకృతిసిద్ధ అందాలకు నెలవు అల్లూరి జిల్లాలోని పొల్లూరు. ఈ ప్రాంతం జలవిద్యుత్ ఉత్పత్తిలోనే కాకుండా పర్యాటకంగాను గుర్తింపు ఉంది. ఇక్కడి ప్రకృతి అందాలు మంత్రముగ్ధులను చేస్తుండగా.. పొల్లూరు జలపాతం.. సీలేరు నది ఉరకలేస్తూ పర్యాటకుల్లో ఉత్సాహం నింపుతోంది. పొల్లూరు జలవిద్యుత్ కేంద్రం, ఏవీపీ డ్యామ్, ఫోర్బే డ్యామ్ ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న కట్టడాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.మోతుగూడెం: సీజన్తో సంబంధం లేకుండా ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతుంటారు. ప్రముఖ పర్యాటక కేంద్రం మారేడుమిల్లి వచ్చిన వారంతా ఈ ప్రాంత సందర్శనకు వస్తుంటారు. » ఇక్కడి జలవిద్యుత్ కేంద్రం రాష్ట్రంలోనే గుర్తింపు పొందింది. ఇక్కడ 460 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండగా అదనంగా మరో 230 మెగావాట్ల ఉత్పత్తికి 5,6 యూనిట్లు నిర్మిస్తున్నారు. » పొల్లూరు జలపాతం..అలసిపోయిన మనసుకు ఈ ప్రాంతం ఎంతో హాయినిస్తుంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఉరకలేస్తోంది. చూడచక్కని ప్రకృతిలో కొండలమధ్య ప్రవహిస్తూ సందర్శకుల మదిని దోచేస్తోంది. డొంకరాయి ఏవీపీ డ్యామ్ అదనపు నీరు, కొండవాగుల ప్రవాహం ఈ జలపాతంలో చేరుతుంది. » ఫోర్బే డ్యామ్ ప్రత్యేక కట్టడంగా గుర్తింపు పొందింది. పవర్ కెనాల్ నుంచి వచ్చే నీటిలో సుమారు 0.5 టీఎంసీలు ఐదు కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ డ్యామ్లో నిల్వ ఉంటుంది. ఇక్కడి నుంచి అండర్గ్రౌండ్ టన్నల్ ద్వారా పొల్లూరు జలవిద్యుత్ కేంద్రానికి వెళ్తుంది. దీనిని పూర్తిగా మట్టితో నిర్మించారు. కొండలు, పచ్చదనంతో పరిసరాలు ఆకర్షణీయంగా ఉంటాయి. వీటిని తిలకించేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు » సీలేరు నది.. పొల్లూరు జలవిద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి అనంతరం విడుదలైన నీరు పొల్లూరు నుంచి ప్రారంభమై చింతూరు వద్ద శబరినదిలో కలుస్తుంది. నది పొడవునా దట్టమైన వనాలతో ఆహ్లాదక వాతావరణం ఉంటుంది. నది వడివడిగా ప్రవహించడం వల్ల దిగేందుకు పర్యాటకులు సాహసించరు.సరిహద్దు పండగ.. మన్యంకొండ జాతర ఇక్కడికి సమీపంలోని ఒడిశాకు చెందిన మన్యం కొండ గ్రామం ఆధ్యాత్మికంగా గుర్తింపు పొందింది. ఈ ప్రాంతంలో మూడేళ్లకోసారి జరిగే మన్యంకొండ జాతర ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ప్రసిద్ధి చెందింది. కొండ గుహలో పోతురాజు, బాలరాజు, కన్నమరాజు దేవతామూర్తులు కొలువుదీరారు. మూడేళ్లకోసారి వీరి ఉత్సవ విగ్రహాలను బయటకు తీసుకువచ్చి జాతర నిర్వహిస్తారు. మన్యంకొండనుంచి భారీ ఊరేగింపుతో సీలేరు నదిని దోనెపై దాటించి పొల్లూరు జలపాతం వద్దకు తీసుకువెళ్లి మంగళస్నానం చేయిస్తారు. ఈ సమయంలో దర్శనమిచ్చే బంగారు చేపకు నమస్కరించుకుంటారు. గిరిజన సంప్రదాయ ప్రకారం నవంబర్, డిసెంబర్ నెలల్లో తేదీ నిర్ణయించి పండగ జరిపిస్తారు. మల్కన్గిరి కలెక్టర్ ఆధ్వర్యంలో జాతర జరుగుతుంది. ఇరు రాష్ట్రాల్లో సరిహద్దు ప్రాంతాలకు చెందిన భక్తులు భారీగా తరలివచ్చి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. మౌలిక వసతులపై అటవీశాఖ దృష్టి » జాతీయ రహదారి నుంచి జలపాతం వద్దకు వెళ్లే మార్గాన్ని గ్రావెల్తో నిర్మించింది. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు సౌకర్యం కల్పించింది. » పర్యాటకులు కూర్చునేందుకు వీలుగా బెంచీలు, తాత్కాలిక షెడ్లు నిర్మించింది. జలపాతంలోకి పూర్తిగా వెళ్లకుండా సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేసింది. వీటికి రూ.13 లక్షలు వెచ్చించినట్టు అటవీశాఖ రేంజర్ నానాజి తెలిపారు.ఫోర్బే డ్యామ్, పుష్ప బ్రిడ్జి, సీలేరు నది ప్రాంతాల్లో సందర్శకుల సౌకర్యార్థం వసతులు కల్పిస్తున్నామన్నారు. పర్యాటకులకు ప్రదేశాన్ని చూపించేందుకు నియమించిన ఐదుగురు యువకులు ఉపాధి పొందుతున్నారన్నారు. రూ.45 లక్షల మంజూరు పొల్లూరు జలపాతంతోపాటు ఇతర ప్రదేశాల్లో పర్యాటకులకు సదుపాయాలు కల్పించేందుకు రూ.45 లక్షలు ఏపీ జెన్కో నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అటవీశాఖ ప్రణాళికపరంగా చర్యలు తీసుకుంటోంది. అద్భుతం జలపాతం విజయవాడ నుంచి సుమారు 15 మంది మిత్రులతో కలిసి పొల్లూరు, మోతుగూడెం పరిసర ప్రాంతాలు తిలకించేందుకు వచ్చాం. పొల్లూరు జలపాతం అద్భుతంగా ఉంది. ఈ ప్రాంతంలో ప్రకృతి అందాలు మైమరిపించాయి. – సతీష్, జియాలజిస్ట్, విజయవాడచాలా సరదాగా గడిపాం పొల్లూరు జలపాతం, సీలేరు నది అందాలు చాలా ఆకట్టుకున్నాయి. కుటుంబ సభ్యులతో ఈ ప్రాంతంలో ఎంతో ఆహ్లాదాన్ని పొందాం. సాయంత్రం వరకు ఎంతో ఆనందంగా గడిపాం. మరిచిపోలేనంతగా అనుభూతి పొందాం. – కె.రూప, భద్రాచలం -
కూలిన పాఠశాల రేకుల షెడ్డు
● పక్కా భవనం నిర్మించాలని బలపం సర్పంచ్ రమేష్నాయుడు డిమాండ్ చింతపల్లి: మండలంలో లవడంపల్లిలో కొద్దిరోజులక్రితం పాఠశాల రేకుల షెడ్డు కూలిపోయింది. ఈ సమయంలో విద్యార్థులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సుమారు 15 ఏళ్ల క్రితం గ్రామంలో ఏర్పాటుచేసిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు పక్కా భవనం లేదు. ఇక్కడ 20 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వసతి సమస్య నెలకొనడంతో గ్రామస్తులు రేకులతో షెడ్డు నిర్మించారు. అప్పటినుంచి అందులోనే తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గాలివానకు రేకులషెడ్డు కూలిపోయింది. ఈ సమయంలో విద్యార్థులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వసతి లేని కారణంగా ఓ చిన్న ఇంటి ప్రాంగణంలో బోధన నిర్వహిస్తున్నారు. అధికారులు స్పందించి పక్కా భవనం మంజూరు చేయాలని బలపం సర్పంచ్ రమేష్నాయుడు, గ్రామస్తులు కోరుతున్నారు. -
ఘాట్లో వాహనం బోల్తా
● పర్యాటకుల్లో ఇద్దరికి తీవ్ర గాయాలు చింతూరు: మారేడుమిల్లి, చింతూరు ఘాట్రోడ్లో ఆదివారం ట్రావెల్స్ వాహనం బోల్తాపడిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కాకినాడలోని ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన 15 మంది విహారయాత్రకు చింతూరు వైపు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఘాట్రోడ్లోని కనకదుర్గ గుడి సమీపంలో వారు ప్రయాణిస్తున్న ట్రావెల్స్ వాహనం అదుపుతప్పి పక్కనేఉన్న కల్వర్టులో పడిపోయింది. ఈ ఘటనలో దువ్వా మనోజ్, అయినూరి శ్రీనివాసరావుకు తీవ్రగాయాలు కాగా అటుగా వెళ్తున్న ప్రయాణికులు వీరిని గమనించి చింతూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మిగతా వారికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. కాగా మనోజ్ పరిస్థితి విషమంగా ఉండటంతో రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
సరిహద్దు పండగ.. మన్యంకొండ జాతర
ఇక్కడికి సమీపంలోని ఒడిశాకు చెందిన మన్యం కొండ గ్రామం ఆధ్యాత్మికంగా గుర్తింపు పొందింది. ఈ ప్రాంతంలో మూడేళ్లకోసారి జరిగే మన్యంకొండ జాతర ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ప్రసిద్ధి చెందింది. కొండ గుహలో పోతురాజు, బాలరాజు, కన్నమరాజు దేవతామూర్తులు కొలువుదీరారు. మూడేళ్లకోసారి వీరి ఉత్సవ విగ్రహాలను బయటకు తీసుకువచ్చి జాతర నిర్వహిస్తారు. మన్యంకొండనుంచి భారీ ఊరేగింపుతో సీలేరు నదిని దోనైపె దాటించి పొల్లూరు జలపాతం వద్దకు తీసుకువెళ్లి మంగళస్నానం చేయిస్తారు. ఈ సమయంలో దర్శనమిచ్చే బంగారు చేపకు నమస్కరించుకుంటారు. గిరిజన సంప్రదాయ ప్రకారం నవంబర్, డిసెంబర్ నెలల్లో తేదీ నిర్ణయించి పండగ జరిపిస్తారు. మల్కన్గిరి కలెక్టర్ ఆధ్వర్యంలో జాతర జరుగుతుంది. ఇరు రాష్ట్రాల్లో సరిహద్దు ప్రాంతాలకు చెందిన భక్తులు భారీగా తరలివచ్చి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. దేవతామూర్తులను పడవపై సీలేరు నదిని దాటిస్తున్న మన్యం కొండ గిరిజనులు (ఫైల్) -
నేతల నిర్బంధం దుర్మార్గం
దేవరాపల్లి: నక్కపల్లి మండలం రాజయ్యపేట బల్క్ డ్రగ్ పార్కును పెట్టొద్దని మత్స్యకారులు చేపడుతున్న ఆందోళనలో పాల్గొన్న సీపీఎం నేతల పట్ల ప్రభుత్వం, పోలీసుల తీరు అప్రజాస్వాకమని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి.వెంకన్న అన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం.అప్పలరాజును కొన్ని రోజులుగా పోలీసులు గృహ నిర్బంధం చేయడాన్ని ఖండిస్తూ దేవరాపల్లిలో ఆదివారం నిరసన చేపట్టారు. రాజయ్యపేట బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా వేలాది మంది మత్స్యకారులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారని, దీనికి పరిశీలించేందుకు వెళ్లిన హోంమంత్రి అనిత గత నెల 29న వెళ్లగా మత్స్యకారులు కారును అడ్డగించి ఆందోళన చేపట్టారన్నారు. దీనికి సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు అప్పలరాజు కారణమని గృహ నిర్భందంలో ఉంచారని, ఇది అత్యంత దుర్మార్గమన్నారు. దీనికి కూటమి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. తక్షణమే అప్పలరాజుపై గృహ నిర్భందాన్ని తొలగించాలని, లేదంటే ఈనెల 15న జిల్లా వ్యాప్తంగా అన్ని మండల ఆందోళన చేస్తామని హెచ్చరించారు. -
మెరుగైన వైద్యానికి బాలింతల నిరాకరణ
● కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్తో అంగీకారం ● చింతూరు ప్రభుత్వాస్పత్రికి తరలింపుసీలేరు: మెరుగైన వైద్యం కోసం ఇద్దరు బాలింతలు నిరాకరించడంతో కుటుంబ సభ్యులకు పోలీసులు కౌన్సెలింగ్ చేసి ఎట్టకేలకు చింతూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గూడెంకొత్తవీధి మండలంలోని దుప్పులవాడ పంచాయతీ బూసుకొండ గ్రామానికి చెందిన గొళ్లోరి రొయిల శనివారం స్థానిక ఆస్పత్రిలో మగబిడ్డను ప్రసవించింది. అయితే తల్లి రొయిలకు బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు పరీక్షల్లో నిర్థారణ అయింది. ఇదే పంచాయతీ వలస గెడ్డ గ్రామానికి చెందిన పాంగి సావిత్రి (29) కూడా ఆదివారం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. శిశువు 1.80 కిలోలు మాత్రమే ఉండటంతో వీరిద్దరిని మెరుగైన వైద్యం కోసం చింతూరు ఆస్పత్రికి తరలించాలని సిబ్బంది నిర్ణయించారు. ఇందుకు బాలింతలు ఇద్దరూ ఒప్పుకోలేదు. ఈ విషయాన్ని వెంటనే ఎస్ఐ రవీంద్రకు తెలిపారు. వెంటనే ఆయన ఆస్పత్రికి వచ్చి వారి బంధువులతో మాట్లాడారు. కౌన్సెలింగ్ చేయడంతో చింతూరు ఆస్పత్రికి వెళ్లేందుకు అంగీకరించారు. వెంటనే వారిని అంబులెన్సులో ఆశా వర్కర్ సాయంతో చింతూరు పంపించారు. -
అడ్డతీగల చేరుకున్నధర్మ ప్రచార రథం
అడ్డతీగల: ప్రముఖ దేవస్థానం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ధర్మ ప్రచార రథం ఆదివారం అడ్డతీగల చేరుకుంది. పవనగిరి క్షేత్ర వ్యవస్థాపకుడు తణుకు వెంకటరామయ్య ఆధ్వర్యంలో భక్తులు స్వాగతం పలికారు. పరిసర గ్రామాల్లో పర్యటించిన రథం వద్దకు ప్రజలు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సత్యదక్షలు చేపట్టే భక్తులకు దేవస్థానం ఈవో సుబ్బారావు దీక్షా వస్త్రాలను ఉచితంగా అందజేస్తారని వెంకటరామయ్య తెలిపారు. దీక్షా వస్త్రాలు, మాలధారణ భక్తులు భక్తులు ఆధార్ కార్డు తీసుకురావాలన్నారు. -
వైద్యకళాశాలల ప్రైవేటీకరణపై ఉద్యమం
అడ్డతీగల: వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయంపై వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న పోరాటానికి ప్రజలంతా కలసి రావాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్సీ అనంత బాబు, రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పిలుపునిచ్చారు. కోటి సంతకాల సేకరణ పోస్టరును మండలంలోని ఎల్లవరంలో ఆదివారం వారు ఆవిష్కరించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పోస్టర్ ఆవిష్కరణ ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. పేద వాడికి వైద్య విద్యను దూరం చేసే కూటమి ప్రభుత్వ కుట్రలను అన్ని వర్గాల ప్రజలు తిప్పికొట్టాలన్నారు. కూటమి ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను వ్యతిరేకించకుంటే భవిష్యత్లో వైద్య విద్యతో పాటు వైద్య సేవలు మరింత భారంగా మారుతాయన్నారు. అంతేకాకుండా పేదలకు వైద్య విద్య దూరం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన వైఎస్సార్సీపీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పోరాటానికి ప్రజలు కలసి రావాలి ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పిలుపు ఎల్లవరంలో కోటి సంతకాల పోస్టర్ ఆవిష్కరణ -
అంబుజా సిమెంట్స్పై పోరాటానికి కార్యాచరణ
పెదగంట్యాడ: అదానీ అంబుజా సిమెంట్స్ గ్రైండింగ్ యూనిట్కు వ్యతిరేకంగా పోరాడేందుకు స్థానికులతో కలసి పోరాట కమిటీని నియమించనున్నట్లు వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్రెడ్డి తెలిపారు. గొందేశి శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో పెదగంట్యాడలో ఆదివారం సాయంత్రం స్థానికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబుజా సిమెంట్స్ను ఏర్పాటు చేస్తే జరిగే నష్టాలను వివరించారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతోపాటు ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకున్నామని గుర్తు చేశారు. ప్రజలు వ్యతిరేకించినా మళ్లీ ప్రజాభిప్రాయ సేకరణను చేపడతామని అధికారులు ప్రకటించడం సరికాదన్నారు. ఈ ఫ్యాక్టరీ కోసం ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో పోరాట కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో మార్టుపూడి పరదేశి, పల్లా కార్తీక్, గొందేశి మహేశ్వరరెడ్డి, గొందేశి వెంకటరమణారెడ్డి, మంత్రి శంకరనారాయణ, కొయ్య భారతి, గంట్యాడ గురుమూర్తి, సంపంగి ఈశ్వరరావు, తాటికొండ జగదీష్, మధుసూదన్రెడ్డి, సుమన్రెడ్డి, నాగు, పిట్టా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలి అంబుజా సిమెంట్స్ గ్రైండింగ్ యూనిట్ ఏర్పాటు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని రద్దు చేయాలని అదానీ అంబుజా సిమెంట్ కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ చైర్మన్ డాక్టర్ ఎం.రమేష్కుమార్ డిమాండ్ చేశారు. నడుపూరులోని సీడబ్ల్యూసీలో ఆదివారం వ్యతిరేక పోరాట కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జేవీవీ అధ్యక్షుడు కృష్ణారావు, సీఐటీయూ నాయకుడు లక్ష్మణమూర్తి, రామారావు, కె.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
వర్షాలకు కూలిన కళామందిరం, కల్వర్టు
జి.మాడుగుల: మండలంలో కురుస్తున్న వర్షాలకు కళామందిర భవనం, కల్వర్టు కూలిపోగా, అప్రోచ్ ర్యాంప్ దెబ్బతింది. మండల కేంద్రం జి.మాడుగులలో రామాలయం వీధిలో కళామందిరం స్టేజ్ ఇటీ వల కుప్పకూలిపోగా, నుర్మతి–మద్దిగరువు గ్రామా నికి వెళ్లే మార్గంలో సూరిమెట్ట వద్ద సీపీ అప్రోచ్ ర్యాంప్ దెబ్బతింది. జి.ఎం. కొత్తూరు– జోగులపుట్టు రోడ్డులో కల్వర్టు అడుగుభాగం కొట్టుకుపోవడంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదార్లు ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని భయాందోళనలు చెందుతున్నారు. దెబ్బతిన్న కల్వర్టు, సీసీ అప్రోచ్ ర్యాంప్కు మరమ్మతులు చేపట్టాలని, కూలిన కళా మందిరం స్టేజ్ స్థానంలో కొత్త దానిని నిర్మించాలని మాజీ ఎంపీపీ, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు మత్స్యరాస వెంకటగంగరాజు,బొయితిలిసర్పంచ్ లసంగి మాలన్న కోరారు. దెబ్బతిన్న రోడ్లు పాడేరు రూరల్: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని పలు రోడ్లు దెబ్బతిన్నాయి. అమ్మవారి (పాదాలు) ఆలయం నుంచి డల్లాపల్లి, బూరుగుచెట్టు, అల్లివరం మీదుగా ఉన్న రహదారి కోతకు గురైంది. దీంతో వాహనచోదకులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బూరుగుచెట్టు గ్రామం నుంచి సలుగు పంచాయతీ కేంద్రం మీదుగా ఈదులపాలెం తదితర ప్రాంతాలకు వెళ్లే రోడ్డు గోతులమయంగా మారింది. దీంతో తరచూ వాహన చోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. అత్యవసర సమయంలో అంబులెన్స్ రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
కొనసాగుతున్న హైవే బాధితుల ఆందోళన
● నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ ● లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక జి.మాడుగుల: జాతీయ రహదారి 516ఈ నిర్మాణంలో నష్టపోయిన కాఫీ, మిరియం తోటల బాధిత రైతులు పరిహారం కోసం చేపట్టిన ఆందోళన ఆదివారం కొనసాగింది. హైవే నిర్మాణంలో వంజరి, గెమ్మెలి పంచాయతీలకు చెందిన ములకాపుట్టు, వరిగెలపాలెం, కడగెడ్డ ప్రాంతాలకు చెందిన 78 మంది రైతులకు చెందిన కాఫీ, మిరియం, మామిడి, నిమ్మ, కమలాపండ్ల తోటలకు నష్టం వాటిల్లింది. మూడేళ్లు గడస్తున్నా కలెక్టర్, అధికారులు జరిగిన నష్టాన్ని పరిశీలించిన దాఖలాలు లేవని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిరాయితీ భూములకు కూడా ఇప్పటి వరకు పంట నష్టం చెల్లించకుండా కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా పనులు చేపడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపరిహారం చెల్లించకుంటే గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాధిత సంఘ నేతలు వంజరి సీతారాంనాయుడు, శ్రీనివాసనాయుడు, పోతురాజునాయుడు, చిరంజీవినాయుడు, హరిబాబు, భాస్కరరావు, రాధాకృష్ణ, సన్యాసిదొర, పుష్పరత్నం, భారతమ్మ, చంద్రకళ, మోహన్రావు పాల్గొన్నారు. -
పొల్లూరు
ప్రకృతిసిద్ధ అందాలకు నెలవు పొల్లూరు. ఈ ప్రాంతం జలవిద్యుత్ ఉత్పత్తిలోనే కాకుండా పర్యాటకంగాను గుర్తింపు ఉంది. ఇక్కడి ప్రకృతి అందాలు మంత్రముగ్ధులను చేస్తుండగా.. పొల్లూరు జలపాతం.. సీలేరు నది ఉరకలేస్తూ పర్యాటకుల్లో ఉత్సాహం నింపుతోంది. పొల్లూరు జలవిద్యుత్ కేంద్రం, ఏవీపీ డ్యామ్, ఫోర్బే డ్యామ్ ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న కట్టడాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పర్యాటక హరివిల్లు..అలసిసొలసిన మనసుకు ఆటవిడుపుమోతుగూడెం: సీజన్తో సంబంధం లేకుండా ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతుంటారు. ప్రముఖ పర్యాటక కేంద్రం మారేడుమిల్లి వచ్చిన వారంతా ఈ ప్రాంత సందర్శనకు వస్తుంటారు. ● ఇక్కడి జలవిద్యుత్ కేంద్రం రాష్ట్రంలోనే గుర్తింపు పొందింది. ఇక్కడ 460 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండగా అదనంగా మరో 230 మెగావాట్ల ఉత్పత్తికి 5,6 యూనిట్లు నిర్మిస్తున్నారు. ● పొల్లూరు జలపాతం..అలసిపోయిన మనసుకు ఈ ప్రాంతం ఎంతో హాయినిస్తుంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఉరకలేస్తోంది. చూడచక్కని ప్రకృతిలో కొండలమధ్య ప్రవహిస్తూ సందర్శకుల మదిని దోచేస్తోంది. డొంకరాయి ఏవీపీ డ్యామ్ అదనపు నీరు, కొండవాగుల ప్రవాహం ఈ జలపాతంలో చేరుతుంది. ● ఫోర్బే డ్యామ్ ప్రత్యేక కట్టడంగా గుర్తింపు పొందింది. పవర్ కెనాల్ నుంచి వచ్చే నీటిలో సుమారు 0.5 టీఎంసీలు ఐదు కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ డ్యామ్లో నిల్వ ఉంటుంది. ఇక్కడి నుంచి అండర్గ్రౌండ్ టన్నల్ ద్వారా పొల్లూరు జలవిద్యుత్ కేంద్రానికి వెళ్తుంది. దీనిని పూర్తిగా మట్టితో నిర్మించారు. కొండలు, పచ్చదనంతో పరిసరాలు ఆకర్షణీయంగా ఉంటాయి. వీటిని తిలకించేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు ● సీలేరు నది.. పొల్లూరు జలవిద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి అనంతరం విడుదలైన నీరు పొల్లూరు నుంచి ప్రారంభమై చింతూరు వద్ద శబరినదిలో కలుస్తుంది. నది పొడవునా దట్టమైన వనాలతో ఆహ్లాదక వాతావరణం ఉంటుంది. నది వడివడిగా ప్రవహించడం వల్ల దిగేందుకు పర్యాటకులు సాహసించరు. అద్భుతం జలపాతం విజయవాడ నుంచి సుమారు 15 మంది మిత్రులతో కలిసి పొల్లూరు, మోతుగూడెం పరిసర ప్రాంతాలు తిలకించేందుకు వచ్చాం. పొల్లూరు జలపాతం అద్భుతంగా ఉంది. ఈ ప్రాంతంలో ప్రకృతి అందాలు మైమరిపించాయి. – సతీష్, జియాలజిస్ట్, విజయవాడ -
మన్యం గుమ్మడికి భలే డిమాండ్
ముంచంగిపుట్టు: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు గ్రామాల్లోని వారపు సంతల్లో గుమ్మడికాయల వ్యాపారం జోరుగా సాగుతోంది. ఈ ఏడాది గుమ్మడికాయల దిగుబడి ఎక్కువగా ఉండడంతో గిరిజనులు అధిక ఆదాయం పొందుతున్నారు. ఒడిశా వ్యాపారులు కొనుగోలు చేసి తీసుకువెళ్తున్నారు. ఒడిశాలోని ప్రతి హోటల్లో గుమ్మడి కూర వండుతుంటారు. అందువల్ల మంచి డిమాండ్ ఉంది. ● జిల్లాలో ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల, హుకంపేట, డుంబ్రిగుడ, అరకు, అనంతగిరి మండలాలల్లో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు గుమ్మడి అమ్మకాలు జరుగుతుంటాయి. పోడు భూముల్లో సుమారు 130 ఎకరాల్లో గుమ్మడిని పండిస్తున్నారు. దాదాపు వంద టన్నుల మేర దిగుబడి వస్తుందని రైతులు తెలిపారు. ● గుమ్మడికాయ సైజు బట్టి రూ.20 నుంచి రూ.40 వరకు ధర పలుకుతోంది. లారీలు, వ్యాన్లు,ఆటోల్లో ఒడిశాలోని జయపురం, కోరాపుట్టు, కటక్, రాయఘడ్.మల్కన్గిరి తదితర ప్రాంతాల్లో వారపు సంతలకు తరలిస్తున్నారు. వీటిని కొనుగోలు చేసిన వ్యాపారులు ఒడిశాలోని హోటళ్లు, రెస్టారెంట్లకు కిలోల చొప్పున విక్రయిస్తున్నారు. ఆదాయం బాగుండటంతో ఒడిశా రైతులు కూడా గుమ్మడి సాగుపై ఆసక్తి చూపుతున్నారు. సాగుపై ఆసక్తి గుమ్మడికాయకు డిమాండ్ పెరిగింది. అందువల్ల సాగుపై ఆసక్తి పెరుగుతోంది. గతంలో ఇంటి అవసరాల కోసం మాత్రమే పంట వేసేవాళ్లం. ఒడిశా వ్యాపారులు సంతలకు వచ్చి అధికంగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో మంచి ఆదాయం వస్తోంది. – జి.రాజారావు, గిరిజన రైతు పనస, ముంచంగిపుట్టు మండలం ఒడిశాలో కిలో రూ.60 వారపు సంతల్లో కొనుగోలు చేసి ఒడిశాలోని రెస్టారెంట్లు, హోటళ్లకు కిలో రూ.60 ధరకు విక్రయిస్తున్నాం. గుమ్మడి అధికంగా ఏజెన్సీ ప్రాంతంలో మాత్రమే పండిస్తున్నారు. వీటిని వారపు సంతలకు తీసుకువచ్చిన గిరిజన రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నాం. – వి.మహేష్పాడి, గుమ్మడి వ్యాపారి, లంతాపుట్టు, ఒడిశా వారపు సంతల్లో కొనుగోలు చేస్తున్న వ్యాపారులు గిరిజన రైతులకు కాయ సైజును బట్టి రూ.40 వరకు చెల్లింపు ఒడిశాలో కిలోల చొప్పున విక్రయం -
మౌలిక వసతులపై అటవీశాఖ దృష్టి
● జాతీయ రహదారి నుంచి జలపాతం వద్దకు వెళ్లే మార్గాన్ని గ్రావెల్తో నిర్మించింది. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు సౌకర్యం కల్పించింది. ● పర్యాటకులు కూర్చునేందుకు వీలుగా బెంచీలు, తాత్కాలిక షెడ్లు నిర్మించింది. జలపాతంలోకి పూర్తిగా వెళ్లకుండా సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేసింది. వీటికి రూ.13 లక్షలు వెచ్చించినట్టు అటవీశాఖ రేంజర్ నానాజి తెలిపారు.ఫోర్బే డ్యామ్, పుష్ప బ్రిడ్జి, సీలేరు నది ప్రాంతాల్లో సందర్శకుల సౌకర్యార్థం వసతులు కల్పిస్తున్నామన్నారు. పర్యాటకులకు ప్రదేశాన్ని చూపించేందుకు నియమించిన ఐదుగురు యువకులు ఉపాధి పొందుతున్నారన్నారు. రూ.45 లక్షల మంజూరు పొల్లూరు జలపాతంతోపాటు ఇతర ప్రదేశాల్లో పర్యాటకులకు సదుపాయాలు కల్పించేందుకు రూ.45 లక్షలు ఏపీ జెన్కో నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అటవీశాఖ ప్రణాళికపరంగా చర్యలు తీసుకుంటోంది. -
పూడిమడక మత్స్యకారుల సంఘీభావం
అచ్యుతాపురం: నక్కపల్లి మండలం రాజయ్యపేట పరిధిలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు ఉద్యమిస్తున్న మత్స్యకారులకు మద్దతుగా పూడిమడక మత్స్యకారులు ఆదివారం తీరప్రాంతంలో నిరసన తెలిపారు. మత్స్యకార్మిక సంఘం నాయకులు చేపల తాతయ్య మాట్లాడుతూ అప్పలరాజు, ఉమాదేవిని తొమ్మిది రోజుల పాటు గృహనిర్భంధం చేయడం దారుణమన్నారు. బల్క్ డ్రగ్ పార్కు వల్ల ఆ ప్రాంతంలో మత్స్య సంపదకు తీవ్ర ఆపద ఉందన్నారు.తీర ప్రాంతాల్లో నివసిస్తున్న మత్స్యకారుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోందని, మరోవైపు తక్కువ ధరకు ఎక్కువ ఇమ్యూనిటీ పవర్ ఇచ్చే మత్స్యసంపద ఇక్కడి తీర ప్రాంతంలో దొరికే అవకాశం నానాటికీ తగ్గుతుందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పటి హోం మంత్రి అనిత ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. లాఠీలతో ఉద్యమాలను ఆపలేరని స్పష్టం చేశారు. కరక సోమునాయుడు, ఎల్లయ్య, రాజు, గుర్రయ్య,పోతురాజు తదితరులు పాల్గొన్నారు. -
ముంచంగిపుట్టు సీహెచ్సీకి సెక్యూరిటీ గార్డే దిక్కు
ముంచంగిపుట్టు (అల్లూరి సీతారామరాజు జిల్లా): స్థానిక సీహెచ్సీలో వైద్య సిబ్బంది కొరతతో ఇక్కడి సెక్యూరిటీ గార్డే రోగులకు రక్త పరీక్షలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. రెండ్రోజులుగా ఇక్కడ ఇదే పరిస్థితి నెలకొనడంతో బాధితులు నానా అవస్థలు పడుతున్నారు. ముంచంగిపుట్టు సీహెచ్సీలో వైద్యులు, సిబ్బంది కొరతతో సక్రమంగా వైద్యసేవలు అందడంలేదని.. టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంవల్ల గిరిజనుల పరిస్థితి అత్యంత ఘోరంగా తయారైందని.. ఆసుపత్రికి రావాలంటే భయపడే పరిస్థితులు దాపురించాయని రోగులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లోని సీహెచ్సీ, పీహెచ్సీల్లో పూర్తిస్థాయిలో వైద్యులు, సిబ్బందిని నియమించాలని.. లేకపోతే సెక్యూరిటీ గార్డులు, కిందస్థాయి సిబ్బంది అందించే సేవలలో ఏమైనా పొరపాట్లు జరిగితే ప్రభుత్వమే అందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇతరులు రక్త పరీక్షలు చేస్తుండగా కొందరు వీడియోలు తీసి వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. -
విద్యార్థుల అభ్యసన స్థాయి పెంచాలి
ముంచంగిపుట్టు: తరాల్ శిక్షణతో విద్యార్థుల అభ్యసన స్థాయిని ఉపాధ్యాయులు పెంచాలని రాష్ట్ర సమగ్ర శిక్ష కోఆర్డినేటర్ కల్పన శైల అన్నారు.మండల కేంద్రం ముంచంగిపుట్టులో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న తరాల్ శిక్షణ కార్యక్రమం చివరి రోజు రాష్ట్ర సమగ్ర శిక్ష కోఆర్డినేటర్ కల్పన శైల మాట్లాడుతూ ఉపాధ్యాయులు నిరంతరం శ్రమించి,విద్యార్థులకు అత్యున్నత బోధనను అందించాలన్నారు. జిల్లాలో విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని,ప్రతి ఉపాధ్యాయుడు సమస్య వైపు చూడకుండా లక్ష్యం వైపు ముందుకు నడవాలన్నారు.అనంతరం కల్పన శైలకు ఉపాధ్యాయులు దుశ్శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర రిసోర్స్ పర్సన్ మహాలక్ష్యయ్య,ఆర్పీ తులసి,ఎంఈవో కృష్ణమూర్తి,త్రినాథ్,పుష్పావతి,సీఆర్సీలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర సమగ్ర శిక్ష కోఆర్డినేటర్ కల్పన శైల -
బ్యూటీ సెలూన్ ముసుగులో వ్యభిచారం
కూర్మన్నపాలెం: దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కూర్మన్నపాలెం వద్ద ‘లవిషి బ్యూటీ సెలూన్’ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు శుక్రవారం రాత్రి ఈ సెలూన్పై దాడి చేయగా వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురు నిర్వాహకులు, ఒక సహాయకుడు, ముగ్గురు విటులు పట్టుబడ్డారు.ఈ సెలూన్ను రాజీవ్నగర్కు చెందిన కిల్లాడ ప్రవీణ్, పార్కు హోటల్ వద్ద నివాసముంటున్న య. పురపు దమయంతి, గాజువాక కుంచమాంబ కాలనీకి చెందిన కొసనం హైమవతి నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. వీరికి రాజీవ్నగర్కు చెందిన అమిత్ గౌతమ్ సహకరిస్తున్నాడన్నారు. ఈ దాడిలో నిర్వాహకులు, ముగ్గురు విటులతో సహా మొత్తం ఏడుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వివరించారు. ఈ కేసులో పట్టుబడిన బాధితురాలైన మహిళను సేఫ్ కస్టడీకి పంపించినట్లు పోలీసులు తెలిపారు. -
రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి హెల్త్కేర్ పరికరాలు
● అందజేసిన ఆర్క్ సర్వ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెట్ ఇండియా ● విలువ రూ.2 లక్షలు రంపచోడవరం: స్థానిక ఏరియా ఆస్పత్రికి సమారిటన్స్ ఫర్ ది నేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆర్క్ సర్వ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెట్ ఇండియా హెల్త్కేర్ పరికరాలను శనివారం అందజేసింది. దీనిలో భాగంగా నాలుగు ఆక్సిజన్ సిలెండర్లు, 12 చానల్ ఈసీజీ మెషీన్లు, హ్యాండ్ ఆక్సీమీటర్లు, పది మంచం మెట్రస్లు, బెడ్లు అందజేసినట్టు సూపరింటెండెంట్ డాక్టర్ సూర్యప్రకాష్ తెలిపారు. వీటి విలువ రూ.2 లక్షలు ఉంటుందన్నారు. సమారిటన్స్ ఫర్ దినేషన్ వ్యవస్థాపకుడు పి.రామ్కుమార్ మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు బలోపేతం చేయడంలో సాఫ్ట్వేర్ సంస్థ అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంవో డా. రాహుల్, డా. సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆట, పాటలతో బోధించాలి
డుంబ్రిగుడ: ఆట, పాటలు, కథల రూపంలో విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే విధంగా చదువు నేర్పించాలని జిల్లా విద్యాశాఖధికారి బ్రహ్మాజీరావు ఉపాధ్యాయులకు సూచించారు. మండల కేంద్రం డుంబ్రిగుడలో ఉపాధ్యాయులకు నిర్వహించిన శిక్షణకార్యక్రమాన్ని ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువులో వెనకబడి ఉన్న విద్యార్థులను గుర్తించి, వారికి అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధించాలని చెప్పారు. సమయపాలన పాటించని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఎంఈవో శెట్టి సుందర్రావు తదితరులు పాల్గొన్నారు. సీసీఎల్ మంజూరు రెండవ శనివారం సెలవు దినం కావడంతో శిక్షణలో పాల్గొన్న ఉపాధ్యాయులకు సీసీఎల్ మంజూరు చేయాలని యూటీఎఫ్ నాయకులు కోరారు. ఈ మేరకు డీఈవోను కలిసి వినతిపత్రం అందజేశారు. ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు సీసీఎల్ మంజూరు చేయడంతో ఉపాధ్యాయులు ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు ఎస్. బాలకృష్ణ, జిల్లా కార్యదర్శి ఎస్.కన్నయ్య, ఆడిట్ కమిటీ సభ్యులు రఘనాథ్, కార్యదర్శి రాజారావు తదితరులు పాల్గొన్నారు. హుకుంపేట: విద్యార్థుల విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావు సూచించారు. స్థానిక ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో జరిగిన ఉపాధ్యాయుల శిక్షణ శిబిరంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు అర్థమైన రీతిలో బోధన చేయాలని తెలిపారు. ఎంఈవోలు సోమేలి చెల్లయ్య,ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
మహోన్నత వ్యక్తిత్వం జస్టిస్ రామస్వామి సొంతం
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ కె. రామస్వామి చిత్రపటాన్ని శనివారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఆవిష్కరించారు. గతంలో జస్టిస్ కె. రామస్వామి ఏయూలో ‘పబ్లిక్ పవర్ అండ్ జ్యుడిషియల్ ఫంక్షన్’ అనే అంశంపై అందించిన ప్రసంగాన్ని పునర్ ముద్రించిన పుస్తకాన్ని కూడా జస్టిస్ బట్టు దేవానంద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జస్టిస్ బట్టు దేవానంద్ మాట్లాడుతూ.. జస్టిస్ కె. రామస్వామి మహోన్నత వ్యక్తిత్వం సొంతమని కొనియాడారు. విద్యార్థి నాయకుడిగా తాను తొలిసారిగా ఆయనను కలిసిన సందర్భం, ఏయూకు ముఖ్యఅతిథిగా ఆహ్వానించి తీసుకువచ్చిన సందర్భాలను ఆయన గుర్తు చేసుకున్నారు. జస్టిస్ రామస్వామి చారిత్రాత్మకమైన తీర్పులు అందించారని పేర్కొన్నారు. తాను ఉన్నత స్థానంలో నిలవడానికి తన గురువులు అందించిన అత్యుత్తమ బోధన, మార్గదర్శకమే కారణమని, ఈ అవకాశాన్ని దైవం ఇచ్చిన వరంగా భావిస్తున్నానని జస్టిస్ దేవానంద్ అన్నారు. ఏయూ న్యాయ కళాశాల విద్యార్థిగా తన కళాశాల రోజులను, ప్రత్యేక న్యాయ కళాశాల ఏర్పాటుకు చేసిన కృషిని, న్యాయ కళాశాలకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరును ప్రతిపాదించిన సందర్భాలను ఆయన గుర్తు చేసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన ఆచార్యులకు తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని వేదికపై స్మరించుకున్నారు. అంతకుముందు ఏయూ వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్ మాట్లాడుతూ ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల ఎందరో న్యాయ కోవిదులను సమాజానికి అందించిందని చెప్పారు. -
అరకు అందాల్లో తేలిపోదామా..
అరకులోయ టౌన్: పర్యాటక సీజన్ ప్రారంభం కావడంతో అందాల అరకులోయకు సందర్శకుల రాక మొదలైంది. వాతావరణ మార్పుల కారణంగా మంచు దట్టంగా కురుస్తుండటంతో ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి. ● అరకులోయ పద్మాపురం ఉద్యానవనంలో పాడేరు ఐటీడీఏ ఆధ్వర్యంలో మెగా ప్లే నిర్వాహకులు హాట్ ఎయిర్ బెలూన్ అందుబాటులోకి తెచ్చారు. ఈ ప్రాంత సందర్శనకు వచ్చిన వారంతా హాట్ ఎయిర్ బెలూన్లో గాలిలో తేలిపోతూ ప్రకృతి అందాలను వీక్షిస్తున్నారు. మరపురాని అనుభూతి పొందుతున్నారు. ● ఈ ఏడాది నిర్వాహకులు టికెట్ ధర కూడా తగ్గించారు. గతేడాది ఒకొక్కరికి రూ.1500 ఉన్న టికెట్ ధరను ఈఏడాది రూ.1200కు తగ్గించారు. వాతావరణంలో విండ్ బాగుంటే ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 3.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు హాట్ ఎయిర్ బెలూన్లో విహరించవచ్చు. ● పాడేరు ప్రాంతానికి చెందిన కొంత మంది గిరిజన నిరుద్యోగ యువత ఢిల్లీలోని గురుగామ్లో హాట్ ఎయిర్ బెలూన్ నిర్వహణపై శిక్షణ పొందారు. మెగా ప్లే పేరిట హాట్ ఎయిర్ బెలూన్ను రెండేళ్లుగా నిర్వహిస్తున్నారు. పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ హాట్ ఎయిర్ బెలూన్ను ప్రారంభించినట్టు నిర్వాహకుడు సంతోష్ తెలిపారు. -
‘ధన్ ధాన్య కృషి యోజన’తో వ్యవసాయ రంగానికి మేలు
మాట్లాడుతున్న ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి ప్రధానమంత్రి ప్రసంగాన్ని వీక్షిస్తున్న కలెక్టర్ దినేష్కుమార్,ఇతర అధికారులు సాక్షి,పాడేరు: జిల్లాలో పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకం అమలుతో వ్యవసాయ ఉత్పాదకత పెంపునకు దోహదపడుతుందని కలెక్టర్ దినేష్కుమార్ అన్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రారంభించిన కార్యక్రమాన్ని కలెక్టరేట్లో అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు వీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వంద జిల్లాల్లో అమలుకానున్న ఈ పథకానికి జిల్లా ఎంపిక కావడం శుభపరిణామమన్నారు. ఆరేళ్లపాటు అమలు కావడంతో వ్యవసాయ రంగం మరింత అభివృద్ధికి ఈ పథకం ఎంతో మేలు చేస్తుందన్నారు.నీటి పారుదల సౌకర్యాలతో పాటు లాభసాటి పంటల సాగు, పంటల మళ్లింపు, ప్రకృతి వ్యవసాయంలో అంతరపంటల సాగుకు ప్రోత్సాహం ఉంటుందన్నారు. ఏడాది పొడవునా పంటల సాగు, ఆదాయ వనరుల పెంపు, వ్యవసాయ అనుబంధ విభాగాల బలోపేతం జరుగుతాయన్నారు. జిల్లా వ్యవసాయ అభివృద్ధికి రైతులంతా సంఘాలుగా ఏర్పడి పంటల సాగు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి ఎస్బీఎస్.నందు, రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మక చైర్మన్ వంపూరు గంగులయ్య తదితరులు పాల్గొన్నారు. అనుబంధ రంగాల్లో రైతులు వృద్ధి సాధించాలి : ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జిరెడ్డి రంపచోడవరం: గిరి రైతులు వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాణించాలని ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జిరెడ్డి కోరారు. శనివారం పందిరిమామిడి కృషి విజ్ఞాన కేంద్రంలో పీఎం ధన్ –ధాన్య కృషి యోజన కార్యక్ర మం నిర్వహించారు. కేవీకే కోఆర్డినేటర్, సీనియర్ శాస్త్రవేత్త రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ పప్పు ధాన్యాల వృద్ధి, వ్యవసాయ అనుబంధ రంగాలపై రైతులు దృష్టి సారించాలన్నారు. ఎంపీపీ బందం శ్రీదేవి, జెడ్పీటీసీ పండా వెంకటలక్ష్మి, పీహెచ్వో దేవదానం, సర్పంచ్ లక్ష్మీదేవి, కేవీకే శాస్త్రవేత్తలు వీరాంజనేయులు, ఏడీఏ రామ్మోహన్రావు పాల్గొన్నారు.కలెక్టర్ దినేష్కుమార్ -
బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించాలి
జి.మాడుగుల: మండలంలో జాతీయ రహదారి బాధిత కాఫీ రైతులకు నష్టపరిహారం అందించాలని బాధిత సంఘ ప్రతినిధులు వంజరి సీతారాంనాయుడు, శ్రీనివాసనాయుడు డిమాండ్ చేశారు. మండలంలో వంజరి గ్రామంలో శనివారం హైవే రోడ్డు బాధితులకు నష్టపరిహారం అందించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా హైవే నిర్మాణానికి సంబంధించిన వాహనాలను అడ్డుకోవడంతో పనులు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైవే రోడ్డు నిర్మాణంలో వంజరి, గెమ్మెలి పంచాయతీ ప్రజలకు సంబంధించిన కాఫీ, మిరియం తోటలకు నష్టం వాటిల్లిందన్నారు. వీరికి నష్టపరిహారం అందిస్తామని అధికారులు హామీ ఇచ్చినప్పటికీ నేటి వరకు కార్యరూపం దాల్చలేదని అవేదన వ్యక్తం చేశారు. వంజరి, కడగెడ్డ, వరిగెలపాలెం, ములకాయపుట్టు గ్రామాలకు చెందిన గిరిజనులు కాఫీ, మిరియం తోటల ఆదాయంతోనే జీవనం సాగిస్తున్నారన్నారు. తోటలు నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకుంటే వారితో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. బాధిత సంఘ ప్రతినిధులు వంజరి సీతారాంనాయుడు, శ్రీనివాసనాయుడు డిమాండ్ లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తాం హైవే నిర్మాణ పనుల వాహనాలనుఅడ్డగించి ఆందోళన -
నేడు ఉద్యమ నేత ఏలియా సంస్మరణ సభ
పాడేరు : ప్రజా ఉద్యమ నేత, డీఎల్వో, జీఎస్యూ, ఓపీజీఆర్ సంఘాల వ్యవస్థాపకుడు, రిటైర్డ్ హెచ్ఎం డాక్టర్ చెండా ఏలియ సంస్మరణ సభ ఆదివారం ఉదయం పాడేరు మోదకొండమ్మ తల్లి ఓపెన్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు డీఎల్వో రాష్ట్ర నాయకులు సీహెచ్ కేశవరావు, సమరెడ్డి మాణిక్యం తెలిపారు. శనివారం పట్టణంలోని డీఎల్వో కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ కాశీం, గద్దర్ కుమార్తె డాక్టర్ వెన్నెలక్క, ఒరిస్సా రాష్ట్ర మాజీ మంత్రి జయరాం పాంగి, స్థానిక ఎమ్మెల్యేలు మత్య్సరాస విశ్వేశ్వరరాజు, రేగం మత్య్సలింగం, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరవుతారన్నారు. ఈ సంస్మరణ సభకు అన్ని గిరిజన, ప్రజా, ఉద్యమ, విద్యార్థి సంఘాలు, అఖిలపక్ష నేతలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
విద్యార్థులకు చతుర్విధ ప్రక్రియ నేర్పించాలి
పెదబయలు: గిరిజన విద్యార్థులకు చతుర్విధ ప్రక్రియలు తప్పనిసరిగా నేర్పించాలని ఏపీ విద్యాశాఖ అసిస్టెంట్ మానిటరింగ్ అధికారి కల్పన సూచించారు. శనివారం మండలంలో జరుగుతున్న రెండవ విడత ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని ఆమె మాట్లాడుతూ ప్రతీ విద్యార్థికి చదవడం, రాయడం, గణితంలో చతుర్విద ప్రక్రియలు నేర్పించాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్నారు. ఇందుకు గాను ఉపాధ్యాయులు అంకితభావంతో పని చేయాలన్నారు. ఎంఈవోలు కృష్ణమూర్తి, పుష్పజోసెఫ్, డీఆర్పీలు పాల్గొన్నారు.ఏపీ విద్యాశాఖ అసిస్టెంట్ మానిటరింగ్ అధికారి కల్పన -
చలువ పిండి
సాగును ప్రోత్సహిస్తే గిరి రైతులకు సిరులువర్షాకాలంలో నాటుతాం పాలగుండ నీటిని తాగడం వల్ల చాలా చలువ చేస్తుంది. ఇంట్లో నిల్వ ఉంచుకుంటాం. గ్రామాల్లోకి మైదాన ప్రాంతాల నుంచి వచ్చి అధికంగా కొనుగోలు చేస్తున్నారు. వర్షకాలంలో దుంపలు నాటుతాం. వేసవి కాలం నాటికి పంట దిగుబడి వస్తుంది. – వంతల రామో, వనుగుపుట్టు,ముంచంగిపుట్టు మండలం ఎన్నో ఉపయోగాలు పాలపిండి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఎటువంటి రసాయనాలు వినియోగించకుండా ప్రకృతి వనరులతో పండించిన దుంపల నుంచి తయారు చేస్తున్నారు. ప్రభుత్వం, పాడేరు ఐటీడీఏ పాలపిండి సాగును ప్రోత్సహించాలి. – ఎంఎం శ్రీను, గిరిజన సంఘం, ముంచంగిపుట్టు ఐటీడీఏ ప్రోత్సహించాలి పాలపిండి సాగును ఐటీడీఏ ప్రోత్సహించాలి. పూర్తిశాతం రాయితీపై దుంపను రైతులకు సరఫరా చేయాలి. అందుకు తగ్గట్టుగా సాగుకు అవసరమైన పెట్టుబడిని రుణ రూపంలో అందించాలి. సహకారంల లేకనే సాగును విస్తరించలేకపోతున్నాం. – వి.సిద్ధేశ్వరరావు, దిగువ కుమడ, ముంచంగిపుట్టు మండలం పాల పిండి తయారీకి గిరి రైతులు దుంపలను సేకరించే పైరుభలే ఆదాయమండి!దుంపల నుంచి తీసిన పాలుముంచంగిపుట్టు: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లోని గిరిజనులు పాలపిండి సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు శరీరంలో వేడి తగ్గించేందుకు ఉపయోగించే ఈ పిండిని ఇంట్లో వినియోగించేవారు. ఇప్పుడు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నందున వాణిజ్యపరంగా సాగు చేస్తున్నారు. పాడేరు ఐటీడీఏ ప్రోత్సహిస్తే మంచి ఆదాయవనరుగా మారుతుందని గిరిజన రైతులు పేర్కొంటున్నారు. ఈ సాగును ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల్లోని 152 గ్రామాల్లో చిన్నచిన్న కమతాల్లో చేస్తున్నారు. మొత్తంమీద సుమారు 1253 ఎకరాల్లో సాగు చేస్తున్నట్టు అంచనా. ఒడిశాలోని లంతాపుట్టు, మాచ్ఖండ్, ఒనకడిల్లీ, పాడువ ప్రాంతాల్లో కూడా విస్తారంగా పండిస్తున్నారు. ఇళ్ల వద్ద చిన్న చిన్న కమతాల్లో పెరటి పంటగా సాగు చేస్తున్నారు. పసుపు పంట మాదిరిగానే దుంపను నాటుకోవాలి. సీజన్తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా పండించవచ్చని గిరిజన రైతులు తెలిపారు. దుంప నుంచి.. మొక్క పక్వానికి వచ్చిన తరువాత దుంపను పైకి తీసి నీటితో శుభ్రం చేస్తారు. గరుకుగా ఉండే జల్లెడ వెనుక భాగంపై రుద్దితో వచ్చే పిప్పిని, రసాన్ని పాత్రలోకి సేకరిస్తారు. ఒక రాత్రంతా రసాన్ని ఊరబెడతారు. మరుసటి రోజు ఉదయం రసాన్ని పాత్రలో పోసి ఎండబెడతారు. వారం రోజులకు పూర్తిగా ఎండిపోయి, కేకు ఆకారంలో గట్టిగా తయారవుతుంది. అనంతరం వీటిని ముక్కలుగా కోస్తారు. ఇలా ఎంతో కష్టపడి పాల పిండిని గిరిజనులు తయారు చేస్తున్నారు. దీనిని మార్కెట్లో కిలో రూ.270 నుంచి రూ.300 వరకు అమ్ముతున్నారు. మైదాన ప్రాంత వాసులు నేరుగా గిరిజనుల వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. వీరి నుంచి సేకరించిన పాలపిండి ముక్కలను మైదాన ప్రాంతంలో వ్యాపారులు రూ.400 ధరకు పైగా అమ్ముతున్నారు. ప్రయోజనాలివీ.. పాల పిండిని నీటిలో కలుపుకొని తాగుతుంటారు. చిన్నపాటి చేదు అనిపించే వారు పంచదార కలిపి సేవిస్తారు. శరీరంలో వేడిని క్షణాల్లో తగ్గించి చలువ చేస్తుందని గిరిజనులు చెబుతున్నారు. పచ్చ కామెర్ల వ్యాధిగ్రస్తులు వినియోగిస్తారని తెలిపారు. ● సరిహద్దు గ్రామాల్లో ప్రతి గిరిజనుడి ఇంటివద్ద పాలపిండి నిల్వ ఉంటుంది. వేసవి కాలంలో ఇంటికి వచ్చే అతిథులకు పాలపిండి నీటిని ఇవ్వడం ఆనవాయితీ. రోగనిరోధక శక్తి పెంపులో ఉపయోగపడుతుందని గిరిజనులు చెబుతున్నారు. సాగును ప్రోత్సహిస్తే మంచి ఆదాయం: పాలపిండి సాగును వాణిజ్యపరంగా ఐటీడీఏ తగిన సహకారం అందించి పోత్సహిస్తే గిరిజన రైతులకు మంచి ఆదాయ వనరుగా మారుతుందని పలువురు సూచిస్తున్నారు. గతంలో సరిహద్దు గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్లు, ఐటీడీఏ పీవోలు సాగు గురించి తెలుసుకున్న సందర్భాలు ఉన్నాయి. అవసరమైన రుణ సౌకర్యం అందిస్తామని, సాగు విస్తీర్ణం పెంచాలని హామీఇచ్చినా కార్యరూపం దాల్చిన పరిస్థితులు లేవు. శరీరంలో వేడి చేస్తే కొబ్బరి నీళ్లు, నిమ్మ రసం తాగుతాం. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో గిరిజనులు మాత్రం పాలపిండి (బిత్తిరి పాలు) నీళ్లను తాగుతారు. శరీరంలో వేడిని తగ్గించడంలో దివ్య ఔషధంగా పనిచేస్తుంని వారు చెబుతుంటారు. గిరిజనులు కేవలం ఇంట్లో మాత్రమే వినియోగించే ఈ పిండికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో సాగుపై ఆసక్తి చూపుతున్నారు. వాణిజ్యపరంగా సాగుకు ఐటీడీఏ సహకారం అందిస్తే మంచి ఆదాయ వనరుగా మారుతుందని వారు చెబుతున్నారు. సేకరించిన దుంపలు దుంప పాలతో తయారుచేసిన పాలపిండి పలుకులు -
జన విజ్ఞాన వేదిక కృషి అభినందనీయం
గంగవరం: విద్యార్థులల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని అలవర్చడం కోసం జన విజ్ఞాన వేదిక చేస్తున్న కృషి అభినందనీయమని ఏజెన్సీ డీఈవో వై.మల్లేశ్వరరావు అన్నారు. శనివారం జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే చెకుముకి సైన్స్ సంబరాలు –2025 పోస్టర్స్ను స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికోన్నత పాఠశాల ఆవరణలో ఏజెన్సీ డీఈవో మల్లేశ్వరరావు, మండల విద్యాశాఖాధికారి –2 టి.మల్లేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏజెన్సీ డీఈవో మాట్లాడుతూ విద్యార్థుల్లో సైన్స్ పట్ల అభిరుచి పెంచడం, శాసీ్త్రయదృక్పథాన్ని అలవర్చడం, మూఢ నమ్మకాలను పారదోలడం కోసం 35ఏళ్లుగా జన విజ్ఞాన వేదిక కృషి చేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు టి. బొజ్జయ్య, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.కృష్ణ, ఎం.వెంకన్న దొర, యూటీఎఫ్ మండల మహిళా అధ్యక్షురాలు రుక్మిణీదేవి, యాట్ల సత్యనారాయణ, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. ఏజెన్సీ డీఈవో మల్లేశ్వరరావు -
నూరుశాతం వంచనే!
గిరిజనులకు నూరుశాతం ఉద్యోగాల కల్పనకు జీవో నంబరు 3 పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ జీవో అమలు హామీ నీటిమూటలుగానే మిగిలింది. వీటిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమల్లోకి తెస్తామని చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా అరకు సభలో గిరిజనులకు హామీ ఇవ్వడం తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 16 నెలలు కావస్తున్నా దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు మంత్రి లోకేష్ నోరు మెదపడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సూపర్ జీఎస్టీపై అవగాహన అవసరం గిరిజన నిరుద్యోగ యువత డిమాండ్లపై స్పందించని కూటమి సర్కార్శనివారం శ్రీ 11 శ్రీ అక్టోబర్ శ్రీ 2025● కలెక్టర్ దినేష్కుమార్ సాక్షి,పాడేరు: సూపర్ జీఎస్టీపై అన్ని వర్గాల ప్రజలకు అవగాహన అవసరమని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ కోరారు.స్థానిక కాఫీ అతిథి గృహంలో వాణిజ్య పన్నులశాఖ, ఛాంబర్ ఆప్ కామర్స్ ఏర్పాటు చేసిన రెండు రోజుల అవగాహన సదస్సు, ప్రదర్శన, పలు సామగ్రి విక్రయాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్ పేరుతో నెల రోజుల పాటు ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.జిల్లాలోని అన్ని గ్రామాల్లో జీఎస్టీపై ప్రజలను చైతన్యపరుస్తామన్నారు. జీఎస్టీ తగ్గింపుతో సామాన్యులపై భారం తగ్గిందని, ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు రావడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ డాక్టర్ అభిషేక్గౌడ, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, వాణిజ్య పన్నులశాఖ సహాయ కమిషనర్ అచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. సాక్షి,పాడేరు: గిరిజనులకు నూరుశాతం ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకోనందున ఇటీవల నిర్వహించిన డీఎస్సీలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని గిరిజన నిరుద్యోగ యువత పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూరుశాతం ఉద్యోగాల జీవోను తేకుండానే జనరల్ డీఎస్సీతో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడంతో మోసపోయామని వారు వాపోతున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే సమయంలో కూడా సీఎం చంద్రబాబు, ఇతర ప్రభుత్వ పెద్దలు జీవో నంబరు 3 పునరుద్ధరణ,ప్రత్యామ్నాయ జీవో జారీపై దృష్టి పెట్టలేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నూరుశాతం ఉపాధ్యాయ ఉద్యోగాలు తమకే దక్కుతాయని ఆఽశపడినప్పటికీ 6శాతం రిజర్వేషన్తోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చిందని వారు ధ్వజమెత్తుతున్నారు. పాడేరు ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమశాఖలో 335, మండల పరిషత్లో 139 ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో 6శాతం ఉద్యోగాలు మాత్రమే గిరిజన యువత పొందారు. ప్రతిభ ఆధారంగా అర్హులైన గిరిజన అభ్యర్థులు వందలసంఖ్యలో ఉన్నా నూరుశాతం ఉద్యోగాల జీవో లేకపోవడంతో గిరిజన ప్రాంతాల్లో కూడా ఓసీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులకు కేటాయించాల్సి పోస్టులు వచ్చింది. నూరుశాతం ఉపాధ్యాయ పోస్టులన్నీ గిరిజనులతోనే భర్తీ చేయాలని,ఆదివాసీ ప్రజాసంఘాలు,రాజకీయ పార్టీలు ఆందోళనలు ఉధృతం చేసినా సీఎం చంద్రబాబు పట్టించుకోలేదు. వైఎస్సార్సీపీ కూడా గిరిజన అభ్యర్థుల న్యాయ సమ్మతమైన ఉద్యమానికి సంపూర్ణ మద్దతునిచ్చింది. గిరిజనుల డిమాండ్తో నాలుగు నెలల క్రితం గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేసినప్పటికీ ఇంతవరకు నూరుశాతం ఉద్యోగాల జీవో, గిరిజన ప్రత్యేక డీఎస్సీపై ఎలాంటి చర్చ జరగలేదు. ఐటీడీఏల స్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగినప్పటికి వాటి నివేదికను కూడా ప్రభుత్వం ఇంత వరకు బహిరంగ పరచలేదు. 2026లో డీఎస్సీ, ప్రత్యేక డీఎస్సీ ఉంటుందని, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి లోకేష్ గురువారం ప్రకటించారు. తండ్రి సీఎం చంద్రబాబు గిరిజనులకు ఇచ్చిన నూరుశాతం ఉద్యోగాల జీవోపై ఆయన మాట్లాడకపోవడంతో గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నూరుశాతం ఉద్యోగాల జీవో పునరుద్ధరణ, గిరిజనులకు ప్రత్యేక డీఎస్సీ డిమాండ్లతో ఉద్యమం ఉధృతం చేసేందుకు ఆదివాసీ ప్రజాసంఘాలు సిద్ధమవుతున్నాయి. పూర్తిశాతం ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీ ఇప్పుడు జీవో నంబరు 3 పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ జీవో ఊసెత్తని ఆయన, తనయుడు మంత్రి లోకేష్ ఇటీవల డీఎస్సీలో అమలు కాని హామీ ఇక నుంచి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించిన ప్రభుత్వం హామీ అమలుపై నోరు మెదపని సర్కార్ ప్రత్యేక డీఎస్సీ, పూర్తిశాతం ఉద్యోగాల జీవో అమలుకోసం ఆందోళన ఉధృతానికి సిద్ధం -
లక్ష్యం, క్రమశిక్షణతో కూడిన విద్య అవసరం
● పాడేరు డీఎస్పీ సహబాజ్ అహ్మద్ పాడేరు : విద్యార్థులు ప్రాథమిక విద్య దశ నుంచి నిర్ధిష్టమైన లక్ష్యంతో క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని పాడేరు డీఎస్పీ సహబాజ్ అహ్మద్ సూచించారు. పట్టణంలోని కుమ్మరిపుట్టు గిరిజన గురుకుల కళాశాలలో శుక్రవారం విద్యార్థులకు ఆవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్ధులు, మహిళలపై జరుగుతున్న దాడులు, ఎదుర్కొంటున్న సమస్యలను వారికి వివరించారు. విద్యార్థులు తమ ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోవాలన్నారు. మొబైల్ వాడుతున్న మహిళలు శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకొని అత్యవసర సమయాల్లో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏదైనా విపత్కర పరిస్థితులు ఎదురైతే యాప్లో సేఫ్ ట్రావెల్ ఆప్షన్స్పై క్లిక్ చేస్తే ఆ ప్రదేశంలోకి పోలీసులు వెంటనే చేరుకొని వారికి రక్షిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో పాడేరు సీఐ దీనబంధు, కరాటే చీఫ్ ఇన్స్ట్రక్చర్ పాండురాజు పాల్గొన్నారు. -
సిగనాపల్లి క్వారీలోశాశ్వత బేస్ క్యాంప్
● రంగురాళ్ల తవ్వకాలను ప్రోత్సహిస్తున్న మైదాన ప్రాంత వ్యాపారులకు నోటీసులు ● అనకాపల్లి జిల్లా ఎస్పీ సహకారంతో వారిపై కేసులు పెట్టేందుకు చర్యలు ● చింతపల్లి డీఎఫ్వో నర్సింహరావుచింతపల్లి: సిగనాపల్లి రంగురాళ్ల క్వారీ వద్ద అటవీ సిబ్బందితో శాశ్వత బేస్ క్యాంపు ఏర్పాటు చేసినట్లు డీఎఫ్వో వై.నరసింహారావు తెలిపారు. బుదవారం ’సిగనాపల్లి క్వారీలో రంగురాఽశ్లు తవ్వకాలు’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. గూడెంకొత్తవీధి మండలం పెదవలస రేంజి పరిధిలో ఉన్నటువంటి సిగనాపల్లి క్వారీలో ఎటువంటి తవ్వకాలు జరపకుండా పటిష్టమైన చర్యలు చేపట్టినట్టు చెప్పారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తవ్వకాలు ప్రోత్సహిస్తున్నారనే ఉద్దేశంతో చింతపల్లికి చెందిన వ్యాపారులపై బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు. వీరు ప్రతిరోజు ఉదయం సాయంత్రం కార్యాలయంలో సంతకాలు చేసేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. రంగురాళ్ల తవ్వకాలకు ఆర్థికంగా ప్రోత్సాహం అందిస్తున్న మైదాన ప్రాంతం నర్సీపట్నం, తునికి చెందిన 20 మందిని గుర్తించి, వారికి నోటీసులు జారీ చేశామన్నారు. వీరిపై కేసులు నమోదు చేసేందుకు అనకాపల్లి జిల్లా ఎస్పీ సహకారం తీసుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. క్వారీ ప్రాంతంలో శాశ్వతంగా పది మందితో బేస్ క్యాంపు ఏర్పాటు చేయడంతో పాటు తమ సిబ్బందితో 24 గంటలు గస్తీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. క్వారీ ప్రాంతంలో 144 సెక్షన్ అమలుకు గూడెంకొత్తవీధి తహసీల్దార్ ఆదేశాలు ఇచ్చారని డీఎఫ్వో పేర్కొన్నారు. -
సివిల్స్ శిక్షణకు
2021లో రూ.3 కోట్లతో అత్యాధునిక హంగులతో స్టడీ సర్కిల్ భవన నిర్మాణం ఏపీ స్టడీ సర్కిల్ నిర్వీర్యంఉద్యమించేందుకు సన్నద్ధం ఏపీ స్టడీ సర్కిల్ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు మొత్తుకుంటున్నా ఆలకించని కూటమి సర్కారు అంబేడ్కర్ స్టడీ సర్కిళ్ల ద్వారా సాధారణ పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తామని చెబుతోంది. సివిల్స్, గ్రూప్స్ శిక్షణకు అవకాశం కల్పించకుండా కేవలం ఐబీపీఎస్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ, బ్యాంకు ఉద్యోగాల పరీక్షలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అభ్యర్థుల నుంచి ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించింది. అది కూడా ప్రిలిమ్స్ కాకుండా కేవలం మెయిన్స్ మాత్రమే శిక్షణ ఇవ్వాలని నిర్ణయించడం పట్ల నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కూటమి ప్రభుత్వం ఏపీ స్టడీ సర్కిల్ను నిర్వీర్యం చేస్తోందని మండిపడుతున్నారు. దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఇంటికో ఉద్యోగం లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తామని నమ్మబలికిన చంద్రబాబు సర్కారు ఉద్యోగాలు కాదు కదా.. కనీసం నిరుద్యోగ యువతకు శిక్షణ కూడా ఇవ్వకుండా అడ్డుపడుతోంది. వైఎస్సార్ సీపీ హయాంలో ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు అందించిన ఏపీ స్టడీ సర్కిల్ మనుగడనే కూటమి సర్కారు ప్రశ్నార్థకంగా మార్చేసింది. యూపీఎస్సీ సివిల్స్, ఏపీపీఎస్సీ గ్రూప్–1, 2 శిక్షణ తరగతులను పూర్తిగా ఎత్తి వేయడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు ఉచిత శిక్షణ అందకుండా పోయింది. 2019లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక ఏపీ స్టడీ సర్కిల్కు పునరుజ్జీవం కల్పించింది. మన రాష్ట్రానికి చెందిన యువత కోసం విశాఖలో ఏపీ స్టడీ సర్కిల్ భవన నిర్మాణాన్ని చేపట్టింది. రుషికొండ ప్రాంతంలో రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించి సుమారు రూ.3 కోట్లతో అత్యాధునిక హంగులతో స్టడీ సర్కిల్ భవనాన్ని 2021లో నిర్మించింది. పరిపాలన భవనంతో పాటు వసతి గృహానికి సంబంధించి రెండు భవనాలను జీ+2 విధానంలో అందుబాటులోకి తెచ్చింది. గత ప్రభుత్వం వరుసగా మూడేళ్ల పాటు ఈ కేంద్రంలో సివిల్స్ పరీక్షలకు సిద్ధమయ్యే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించగా పలువురు ఉద్యోగాలు కూడా సాధించారు. నిరుద్యోగుల పడిగాపులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏపీ స్టడీ సర్కిల్ తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ గ్రాడ్యుయేట్లకు ఉచిత శిక్షణ తరగతులను నిలిపివేసింది. 2024–25లో సివిల్స్ ఉచిత వసతి శిక్షణ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. స్టడీ సర్కిల్ నోటిఫికేషన్ కోసం వందల మంది నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు పడిగాపులు కాస్తున్నారు. వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని ఏపీ స్టడీ సర్కిల్స్ స్టూడెంట్స్ ఫోరం ప్రతినిధులు ఆందోళనకు దిగుతున్నారు. వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి తక్షణమే ఏపీ స్టడీ సర్కిల్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. నోటిఫికేషన్ రాకపోవడంతో నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు సివిల్స్, గ్రూప్స్ పరీక్షల శిక్షణకు దూరమవుతున్నారు. ప్రైవేట్ సంస్థల్లో శిక్షణ పొందే స్థోమత లేక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులు నష్టపోతున్నారు. కూటమి ప్రభుత్వం సివిల్స్ ఉచిత వసతి శిక్షణ నోటిఫికేషన్ వెంటనే ఇవ్వాలి. – కొల్లు ఆనంద్కుమార్, అధ్యక్షుడు, ఏపీ స్టడీ సర్కిల్ స్టూడెంట్స్ ఫోరం -
ప్రాజెక్టుల పేరుతో ఆదివాసీలను దూరం చేసే ప్రయత్నం
చింతపల్లి : ఏజెన్సీలో హైడ్రో పవర్ ప్రాజెక్టుల పేరుతో ఆదివాసీలను అడవులకు దూరం చేసే ప్రయత్నాన్ని విరమించుకోకుంటే మరో అల్లూరి విప్లవానికి గిరిజనుల సిద్ధం కావలసి వస్తుందని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బోనంగి చిన్నయ్యపడాల్ హెచ్చరించారు. శుక్రవారం గూడెం కొత్తవీధి మండల కార్యదర్శితో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రికి హైడ్రోపవర్ ప్రాజెక్టు ఒప్పందాలను ,రద్దు చేసుకోవాలని సీపీఎం రాసిన లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్టులు నిర్మాణాలు చేపట్టడం వల్ల ఈ ప్రాంత గిరిజనానికి ఒక్క శాతం ఉపయోగం లేకపోగా ఆదీవాసి ప్రజలు తాము నమ్ముకున్న అడవులకు దూరమయ్యే ప్రమాదం పొంచి ఉందని అన్నారు. ఈ ప్రాజెక్టులు నిర్మా ణాలు చేపడితే ఎనిమిది మండలాల పరిధిలో గల 250 గ్రామాలకు సంబంధించి 50వేల మంది గిరిజనుల జీవన పరిస్థితులు తారుమారు కావడంతో పాటు 20 వేల ఎకరాలు అటవీ వ్యవసాయ భూమి జల సమాధి అయ్యే ప్రమాదం ఉందన్నారు. ఏజెన్సీలో గిరిజన చట్టాలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఉల్లంఘించి కార్పొరేట్ సంస్థలకు హైడ్రో పవర్ ప్రాజెక్టులకు ఇచ్చిన జీవోలను వెంటనే ఉపసంహరించుకోకుంటే ఆందోళన తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాఫీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కనకవల్లి పాల్గొన్నారు. -
జిల్లాకు 474 మంది ఉపాధ్యాయుల కేటాయింపు
● త్వరలో వారంతా విధుల్లో చేరిక ● జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావు కొయ్యూరు: జిల్లాకకు 474 మంది ఉపాధ్యాయులను ప్రభుత్వం కేటాయించిందని, త్వరలో వారంతా విధుల్లో చేరతారని డీఈవో బ్రహ్మాజీరావు తెలిపారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న ట్రాల్ శిక్షణను పరిశీలించారు.శిక్షణ లక్ష్యాన్ని ఆయన ఉపాధ్యాయులకు వివరించారు. రికార్డులను పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాకు కేటాయించిన 474 మంది ఉపాధ్యాయుల్లో 335 మంది గిరిజన సంక్షేమ విభాగం, 139 మంది మండల పరిషత్ పాఠశాలకు కేటాయించిందని చెప్పారు. కొత్త వారికి పాడేరు డివిజన్కు సంబంధించి అరకు, రంపచోడవరం డివిజన్కు సంబంధించి అడ్డతీగలలో శిక్షణ ఇచ్చామన్నారు. జిల్లాలో విద్యార్థుల సామర్థ్యాన్ని 46 శాతం ఉందన్నారు. చడవడం రాయడంలో ఇతర జిల్లాలతో పోల్చితే తక్కువగా ఉందని బేస్ లైన్ పరీక్షల్లో వెల్లడైందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కలెక్టర్ దినేష్కుమార్ ఉపాధ్యాయులకు శిక్షణ అవసరమని సర్వ శిక్ష అభియాన్కు తెలపడంతో శిక్షణకు అనుమతి ఇచ్చారన్నారు.శిక్షణ పూర్తయిన తరువాత 10 నుంచి 30 విద్యార్థులకు ఒక కిట్ను ఏర్పాటు చేస్తామన్నారు. 30 దాటి ఉంటే మరో కిట్ ఇస్తామని తెలిపారు. కొత్త డీఎస్సీలో ఎంపికై న వారికి అడ్డతీగల సమీపంలో వేటమామిడి వద్ద పాఠశాలలో శిక్షణ ఇచ్చామన్నారు.అయితే 90 మంది ఉపాధ్యాయులు వెబ్ ఆప్షన్కు ఓటీపీలు రాకపోవడంతో వాటి కోసం వారిని గోకవరం, గంగవరం పంపించామన్నారు. అక్కడ ఓటీపీలు రావడంతో సమస్య తీరిందన్నారు. ఎంఈవోలు రాంబాబు, ప్రసాద్, హెచ్ఎంలు పాల్గొన్నారు. -
సాగుకు అనుకూలంగా భూముల అభివృద్ధి
గంగవరం : పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురైన కొండ మొదలు గ్రామపంచాయతీ నిర్వాసిత గిరిజనులకు కేటాయించిన భూములను సాగుకు అనువుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభం నొఖ్వల్ అన్నారు. శుక్రవారం మండలంలోని నేలదోనెలపాడు, కొండమొదలు ఆర్అండ్ఆర్ కాలనీలో నిర్వాసిత గిరిజనులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురైన కొండమొదలు గిరిజనులకు ల్యాండ్ టు ల్యాండ్ ఏర్పాటుకు సుమారు 160 ఎకరాలను ముందుగా గుర్తించామన్నారు. ఇవి సాగుకు అనువుగా ఉండేలా జంగిల్ క్లియర్ చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన వారికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ద్వారా ల్యాండ్ టు ల్యాండ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఉపాధి హామీ, గిరిజన సంక్షేమశాఖ ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలో భూములను చదును చేసి సాగుకు అనువుగా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో తహసీల్దార్ శ్రీనివాసరావు, గిరిజన సంక్షేమశాఖ ఈఈ శ్రీనివాసరావు, ఏపీడీ ఎల్.రాంబాబు, ఉపాధి హా మీ ఏపీవో ప్రకాష్, కొండమొదలు సర్పంచ్ వేట్ల విజయ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.నిర్వాసితులకు రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభం నొఖ్వాల్ హామీ -
సమస్యల పరిష్కారం వేగవంతం
● కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశం ● ఐటీడీఏ పీజీఆర్ఎస్లో 137 అర్జీల స్వీకరణ పాడేరు : ప్రజా సమస్యలపై అందే ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి ప్రత్యేక చర్యలు వేగవంతం చేయాలని కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో శుక్రవారం మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్, జేసీ అభిషేక్ గౌడ, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్ 137 వినతులు స్వీకరించారు. ఆర్జీదారులు మీకోసం కాల్ సెంటర్ 1100ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. కాల్ సెంటర్ నంబర్కు ఫోన్ చేసి అర్జీ పరిష్కారం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో పద్మలత, టీడబ్ల్యూ డీడీ పరిమళ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నందు, డీఆర్డీఏ పీడీ మురళి, డీపీవో చంద్రశేఖర్, జిల్లా ఖజానా అధికారి ప్రసాద్బాబు పాల్గొన్నారు. వినతుల్లో కొన్ని.. పాడేరు మండలం డి.గొందూరు పంచాయతీ బొడ్డుమామిడిలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలని సర్పంచ్ సీదరి రాంబాబు వినతిపత్రం అందజేశారు. ● అనంతగిరి మండలం కాశీపట్నం పంచాయతీ వై.కొతవలస గ్రామానికి చెందిన జ్యోతి, లక్ష్మి, కమల తమకు ఆశా కార్యకర్తలుగా ఉద్యోగ అవకాశం కల్పించాలని అర్జీ ఇచ్చారు. ● అరకువ్యాలీ మండలం సుంకరమెట్ట పంచాయతీ పిరిబందలో ప్రభుత్వ గిరిజన సంక్షేమ పాఠశాలలో భవనం మంజూరు చేయాలని సర్పంచ్ చినబాబు అధికారులను కోరారు. ● గూడెంకొత్తవీధి మండలం దుప్పులవాడకు చెందిన సురేష్ రేషన్ కార్డు మంజూరు చేయాలని , పెదబయలు మండలం మారుమూల ఇంజరి పంచాయతీ సాలెబుల గ్రామానికి చెందిన రంగారావు తమ గ్రామంలో కల్వర్టు, సీసీ రోడ్డు నిర్మించాలని అర్జీ అందజేశారు. ● దేవీపట్నం మండలం తన్మూరు పంచాయతీ కె.గొందూరుకు చెందిన శ్రీకృష్ణ, రాములు, సోములమ్మ తమ డి.ఫారం పట్టాకు నష్టపరిహారం కోసం వినతిపత్రం ఇచ్చారు. -
ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలి
పెదబయలు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలకు చేస్తున్న మోసాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు మజ్జి చంద్రుబాబు అన్నారు. వైఎస్సార్సీపీ అధిష్టానం ఆదేశాల మేరకు అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సూచనల మేరకు మండలంలోని అడుగులపుట్టు పంచాయతీలో రచ్చబండ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలకు మోసం చేస్తున్నారన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పేద విద్యార్థులకు ఉన్నత చదువులు అందించాలనే లక్ష్యంతో ప్రతి జిల్లాలో ఓ మెడికల్ కళాశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారన్నారు. అయితే ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్కు దారాదత్తం చేయాలని చూస్తున్నారన్నారు. సూపర్ సిక్స్ పేరుతో ప్రజలకు కుచ్చుటోపి పెట్టారని, రాష్ట్రంలో నిరుద్యోగులకు. మహిహిళలకు మోసం చేశారన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాడు–నేడు ద్వారా పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పించి చదువుల విప్లవం చేస్తే నేడు పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ పాఠశాలల్లో సరైన సదుపాయాలు లేవన్నారు. కలుషిత ఆహారంతో విద్యార్థులు మృత్యువాత పడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు వైఎస్సార్సీపీ శ్రేణులు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. నాయకులు పోయిభ కృష్ణారావు, చిట్టపులి అన్నపూర్ణ. కొర్ర హరి, పంచాయతీ కమిటీ నాయకులు పాంగి గోవర్థన్, ఆనందరావు, జగత్రాయ్, తిరుపతిరావు, కొర్ర నాగేశ్వరరావు, కామేశ్వరరావు, నాగరాజు,సొనదోర్, మన్మథరావు, కుర్తాడి సోమేశ్వరరావు, ధనలక్ష్మీ, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి
గిరిజన ప్రాంతాల్లో నూరుశాతం ఉద్యోగాలు ఆదివాసీలకు కల్పించే బాధ్యత సీఎం చంద్రబాబుపైనే ఉంది. ఎన్నికలకు ముందు ఆదివాసీలకు ఇచ్చిన హమీని ఆయన నిలబెట్టుకోవాలి.ఇటీవల జనరల్ డీఎస్సీలో ఆరు శాతం రిజర్వేషన్ అమలవ్వడంతో గిరిజన అభ్యర్థులకు అన్యాయం జరిగింది. – రామారావుదొర, జిల్లా అధ్యక్షుడు, ఆదివాసీ జేఏసీ గిరిజనులకు చంద్రబాబు అన్యాయం ఎన్నికలకు ముందు నూ రుశాతం ఉద్యోగాలన్ని ఆదివాసీలతోనే భర్తీ చేస్తానని హమీ ఇచ్చిన చంద్రబాబు సీఎం అవ్వగానే గిరిజనులకు అన్యాయం చేయడం దారుణం. 2026 డీఎస్సీ కి ముందే గిరిజన ప్రాంతాల్లో నూరుశాతం ఉద్యోగాల జీవోను కూటమి ప్రభుత్వం జారీ చేయకుంటే ఉద్యమం తప్పదు. – మత్స్యరాస విశ్వేశ్వరరాజు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే న్యాయం చేసే వరకు ఉద్యమం కూటమి ప్రభుత్వం గిరిజన అభ్యర్థులకు అన్ని ఉద్యోగాల్లోను నూరుశాతం రిజర్వేషన్ కల్పించే వరకు ఉద్యమాలు చేస్తాం. ఇటీవల డీఎస్సీలో నూరుశాతం ఉద్యోగ రిజర్వేషన్ను ప్రభుత్వం పట్టించుకోలేదు. నూరుశాతం ఉపాధ్యాయ ఉద్యోగాలు గిరిజనులకే వర్తించేలా చర్యలు తీసుకోవాలి. – కూడా రాధాకృష్ణ, ప్రత్యేక డీఎస్సీ సాధన పోరాట సమితి ప్రతినిధి, పాడేరు -
గర్భిణులకు వైద్య పరీక్షలు
చింతపల్లి: ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పలు ఆస్పత్రుల్లో శుక్రవారం గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగా చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో 84 మంది గర్భిణులకు స్కానింగ్ తదితర పరీక్షలు చేశారు. ఈ సంర్భంగా గైనకాలజిస్టు ఎస్.వాసవి మాట్లాడుతూ గర్భిణులు ఆస్పత్రుల్లోనే ప్రసవాలు చేసుకోవాలని, దీంతో తల్లి, బిడ్డ ఆరోగ్యానికి ఎంతో సురక్షతిమన్నారు. గర్భిణులు తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అడ్డతీగల: మండల కేంద్రంలోని సీహెచ్సీలో వైద్యాధికారి ప్రసన్నదేవి ఆధ్వర్యంలో 87 మంది గర్భిణులకు వైద్య పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణులు రక్తహీనత సమస్య లేకుండా చూసుకోవాలని, పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పండా సతీష్ మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలపై గర్భిణులు అప్రమత్తంగా ఉ ండాలన్నారు. వై.రామవరం: మండల కేంద్రంలోని సీహెచ్సీలో సూపరింటెండెంట్ డాక్టర్ చైతన్యకుమార్ ఆధ్వర్యంలో 64 మంది గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగా 21 మంది హైరిస్క్ గర్భిణులను ఆస్పత్రిలో చేర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ గర్భిణులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. చవిటిదిబ్బలు పీహెచ్సీలో వైద్యాధికారి డాక్టర్ శ్రావణి ఆద్వర్యంలో గర్భిణులకు స్కానింగులు, ప్రత్యేక వైద్యపరీక్షలు నిర్వహించారు. -
పిడుగుపాటుకు ఆరు ఎద్దులు మృతి
ముంచంగిపుట్టు: మండలంలోని మాకవరం పంచాయతీ అరబీరు గ్రామ సమీపంలో శుక్రవరం సాయంత్రం పిడుగుపాటుకు ఆరు దూక్కటేద్దులు మృతి చెందాయి. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.అరబీరు గ్రామానికి చెందిన ఎద్దులు, ఆవులు, మేకలను మేత కోసం కొండ ప్రాంతానికి తీసుకొని వెళ్లి సాయంత్రం గ్రామానికి తీసుకు వస్తున్న సమయంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆ సమయంలో ఎద్దులపై పిడుగు పడంతో అక్కడికి అక్కడే ఆరు దుక్కటేద్దులు మృతి చెందాయి. కాపరులు పిడుగుపాటుకు పరుగులు పెట్టారు. అరబీరు గ్రామానికి చెందిన కిరసాని జయరాంకు చెందిన నాలుగు, బలరాంకు చెందిన ఒకటి, సీతారాంకు చెందిన ఒకటి చొప్పున ఎద్దులు మృతి చెందాయి. ఒక్కో ఎద్దు రూ.30వేలు విలువ చేస్తుందని, ఎద్దులు మృతితో తీవ్ర నష్టపోయామని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరారు. -
మోడల్ పాఠశాల కోసం పట్టు
కొయ్యూరు: చింతలపూడి పంచాయతీ గింజర్తికి చెందిన 30 మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. గింజర్తికి దగ్గరగా ఉన్న చింతలపూడి ప్రాథమిక పాఠశాలను ఈ ఏడాది మోడల్ పాఠశాలగా స్థాయి పెంచారు. గింజర్తిలో 47 మంది విద్యార్థులు ఉండగా వీరిలో 3,4,5 తరగతులు చదివే 30 మందిని చింతలపూడి పాఠశాలకు పంపించాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలిచ్చారు. ఈమేరకు వీరి పేర్లను గింజర్తి పాఠశాల యు డైస్ నుంచి తొలగించారు.అయితే గ్రామస్తులు చింతలపూడి పాఠశాలలో చేర్పించలేదు. ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న గింజర్తిని మోడల్ పాఠశాల చేయకుండా తక్కువ మంది ఉన్నచోట ఎలా చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. దీంతో 30 మంది విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గింజర్తి పాఠశాలలో ప్రస్తుతం ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నారు. విద్యార్థులను చింతలపూడి పాఠశాలలో చేర్పించి గింజర్తి పాఠశాలలో చదువుకునేలా మరో ఉపాధ్యాయుడిని అక్కడికి పంపిస్తామని ఎంఈవో చెప్పినా తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు. పేరెంట్స్ ఒప్పుకోవడం లేదు గింజర్తి పాఠశాలను కాకుండా పిల్లలు తక్కువగా ఉన్న చింతలపూడిని మోడల్ పాఠశాలగా స్థాయి పెంచడం వల్ల అక్కడికి తమ పిల్లలను పంపించేందుకు తల్లిదండ్రులు అంగీకరించడం లేదు. ఒక విద్యాసంవత్సరం నష్టపోయినా ఫర్వాలేదని చెబుతున్నారు.గింజర్తిని మోడల్ పాఠశాలగా చేయాలని కోరుతున్నారు – దేవర అప్పారావు, విద్యాకమిటీ చైర్మన్ ఉన్నతాధికారుల దృష్టికి సమస్య గింజర్తి విద్యార్థుల తల్లిదండ్రుల సమస్యను ఉన్నతాధికారుల దృిష్టికి తీసుకువెళ్లి పరిష్కరానికి చర్యలు తీసుకుంటాం. విద్యార్థులకు ఏమి చేస్తే మేలు జరుగుతుందో పరిశీలన చేస్తాం. వారిని గింజర్తిలోనే ఉంచాలని ఆదేశాలు ఇస్తే అలాగా చేస్తాం. తమ పిల్లల భవిషత్తు గురించి తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. – బ్రహ్మాజీరావు, జిల్లావిద్యాశాఖాధికారి, పాడేరు గింజర్తి విద్యార్థులను చింతలపూడి పాఠశాలలో చేర్పించని తల్లిదండ్రులు యు డైస్లో నమోదుకాని 30 మంది పేర్లు అగమ్యగోచరంగా వారి భవిష్యత్తు సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టాం: డీఈవో బ్రహ్మాజీరావు -
వేగవంతంగా గృహ నిర్మాణ పనులు
రాజవొమ్మంగి: రంపచోడవరం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి.అంబేడ్కర్ శుక్రవారం రాజవొమ్మంగి ఎంపీడీవో కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. సీజనల్ వ్యాధుల పట్ల ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు, సిబ్బందిని కోరారు. ఇప్పటికే మంజూరైన పీఎం జన్మన్, పీఎం గ్రామీణ్ శాశ్వత గృహ నిర్మాణాలను లక్ష్యం మేరకు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఆదికర్మ యోగి కార్యకలాపాల్లో భాగంగా విలేజి డెవలప్మెంట్ ప్లాన్ ఎంత వరకు వచ్చింది ఆరా తీశారు. పీ4లో భాగంగా బంగారు కుటుంబాల ఎంపిక, అంగన్వాడీ, హాస్టల్స్ పరిసరాల్లో పారిశూద్యం కోసం తీసుకొంటున్న చర్యలను అడిగి తెలుసుకొన్నారు. పిల్లలకు సురక్షితమైన త్రాగునీరు అందించాలని సూచించారు. ఎంపీడీవో యాదగిరీశ్వరరావు, పంచాయతీ కార్యదర్శులు, హౌసింగ్ ఏఈ, విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు. -
సమస్యలు వింటూ.. భరోసానిస్తూ..
డాబాగార్డెన్స్: పచ్చకామెర్లతో బాధపడుతూ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న పార్వతీపురం జిల్లా కురుపాం మండలం శివన్నపేట గురుకులం ఆశ్రమ పాఠశాల హాస్టల్ విద్యార్థులను మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం రాత్రి పరామర్శించారు. కేజీహెచ్ పిల్లల వార్డులో చికిత్స పొందుతున్న సుచిత్ర, లాస్య, స్మైల్, భవిష్య, మాధవి, కీర్తన, సాయి, ప్రణవి, గ్రీష్మ, విద్యా, రమ్య, సంజన, అశ్విని, ధరణి, అఖిల, దీపిక, నీహరిక తదితర పిల్లల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. కాసేపు పిల్లలతో ముచ్చటించారు. తాగునీరు, భోజనం బాగోలేదని విద్యార్థినులు చెప్పారు. ఆర్వో ప్లాంట్ పనిచేయడం లేదని, మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయని వాపోయారు. వార్డులో చికిత్స పొందుతున్న పిల్లలందర్నీ ఆప్యాయంగా పలకరించగా.. వారంతా సంతోషంగా వైఎస్ జగన్తో మాట్లాడారు. -
ఎండకు భయపడలేదు.. వర్షానికి వెరవలేదు..
మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పర్యటనకు జనం పోటెత్తారు. ఎయిర్పోర్టు నుంచి ప్రారంభమైన జనజాతర.. నర్సీపట్నం చేరేసరికి సముద్రంలా ఉప్పొంగింది. జై జగన్ అంటూ చేసిన నినాదాలతో జంక్షన్లు మార్మోగిపోయాయి. గోపాలపట్నం, వేపగుంట, చినముషిడివాడ, పెందుర్తి ప్రాంతాల్లో విశాలమైన బీఆర్టీఎస్ రహదారి కూడా జనసంద్రంగా మారిపోయింది. మధ్యాహ్నం 2 గంటలకు మండే ఎండలోనూ జగన్కు హారతులు పడుతూ.. పూలు జల్లుతూ, గజమాలలు వేస్తూ కరచాలనాలు చేశారు. అక్కడి నుంచి అనకాపల్లికి చేరుకున్న తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం చిల్లుపడినట్లు ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. అయినప్పటికీ.. ఏ ఒక్కరూ వెనక్కు వెళ్లలేదు. ఆ జోరు వర్షంలోనే జగన్కు జేజేలు కొట్టారు. అనకాపల్లి నుంచి నర్సీపట్నం మెడికల్ కాలేజ్ వరకు జగన్ను జనసునామీలా చుట్టేశారు. కాన్వాయ్ కదిలేందుకు కూడా వీలులేకుండా బారులు తీరారు. అభిమానంతో ఉరకలెత్తుతున్న ప్రజల్ని చూసి వైఎస్ జగన్.. అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. నర్సీపట్నం చేరుకున్నాక జై జగన్ నినాదాలు మరింత మిన్నంటాయి. వైద్య కళాశాల వద్ద పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జగన్కు స్వాగతం పలికారు. -
అడుగడుగునా అదే ఆప్యాయత
మండుటెండలోనూ అడుగు వెనక్కిపడలేదు. అడ్డంకులు సృష్టించినా జన సునామీ చేతులెత్తి మొక్కుతూ.. మనసారా అభివాదం చేస్తూ.. ముందుకు సాగిన మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ఆకాశం చిల్లుపడేలా వర్షం పడినా వెరవలేదు. అదే అభిమానం.. చెక్కు చెదరని ఆదరణ. విశాఖ పర్యటనకు వచ్చిన జననేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి ప్రజలు అడుగడుగునా హారతులు పట్టారు. ప్రతి జంక్షన్లోను పూల వర్షం కురిపించారు. గజమాలలతో స్వాగతాలు పలికారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి మాకవరపాలెం మెడికల్ కాలేజీ వరకు సాగిన ఈ పర్యటనలో బ్రహ్మరథం పట్టారు. ఈ పర్యటనకు జనాలు రాకుండా చేసేందుకు కూటమి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినావాటన్నింటినీ పటాపంచలు చేశారు. బారికేడ్లు, రోప్ పార్టీలు, చెక్పోస్టులు జనహోరు ముందు నిలవలేకపోయాయి. జంక్షన్లు జనజాతరను తలపించాయి. మార్గంమధ్యలో బాధలు, సమస్యలతో వచ్చిన వారి నుంచి వినతులు స్వీకరిస్తూ.. వారికి భరోసా ఇస్తూ.. సుమారు 60 కిలోమీటర్ల మేర అభిమానంతో వచ్చిన ప్రతి ఒక్కరికీ అభివాదాలు చేస్తూ.. జనసునామీలో ముందుకు సాగారు. అభిమాన నేతకు కరచాలనం చేసేందుకు మహిళలు, వృద్ధులు, యువత పోటీ పడ్డారు. సాధారణంగా 60 కిలోమీటర్ల ప్రయాణానికి గంటన్నర సమయం పడుతుంది. కానీ విశాఖను చుట్టేసిన జన సంద్రాన్ని తన చిరునవ్వుతో పలకరిస్తూ సాగిన ఆయన పర్యటనకు 6 గంటలు పట్టిందంటే ప్రజానీకం ఎలా వెల్లువలా వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. – విశాఖ సిటీనర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలను పీపీపీ విధానంలో ప్రైవేటుపరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోంది. ఇందులో భాగంగానే అసలు మెడికల్ కాలేజీల నిర్మాణాలే జరగలేదని, మాకవరపాలెంలో నిర్మాణంలో ఉన్న కాలేజీకి జీవో ఉంటే చూపించాలని మంత్రులు సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నర్సీపట్నం మెడికల్ కాలేజీ నిర్మాణాలను పరిశీలించడానికి గురువారం విశాఖకు వచ్చారు. జగన్ పర్యటనకు భారీగా జనసందోహం తరలివస్తుండడంతో కూటమి ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. దీంతో ముందు ఆయన రోడ్షోకు అనుమతి లేదని పోలీసులతో చెప్పించింది. ఎన్ని అడ్డంకులు సృష్టించిన రోడ్షో ఆగేది లేదని వైఎస్సార్సీపీ నేతలు తెగేసి చెప్పడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. జగన్ రోడ్షో చేస్తే జనసునామీ తప్పదని భావించిన చంద్రబాబు ప్రభుత్వం రాత్రికి రాత్రి షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసింది. పోలీసుల సాయంతో ఆటోలు, ప్రైవేటు వాహన యజమానులతో సమావేశాలు పెట్టించి.. జగన్ కార్యక్రమానికి జనాలను తీసుకువెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేయించింది. అలాగే వైఎస్సార్సీపీ నేతలకు ఫోన్లు చేయించి జన సమీకరణ చేయకూడదని బెదిరించే ప్రయత్నం చేసింది. గురువారం తెల్లవారుజాము నుంచే రోడ్లపై బారికేడ్లు, రోప్ పార్టీలు దర్శనమిచ్చాయి. గ్రామాల్లో చెక్పోస్టులు వెలిశాయి.● ప్రధానంగా విశాఖ ఎయిర్పోర్టు వద్ద మాజీ సీఎం జగన్మోహన్రెడ్డికి స్వాగతం పలికేందుకు వేల మంది జనాలు వస్తారని భావించిన పోలీసులు ఎన్ఎస్టీఎల్ గేటు ఎదురుగా బలగాలను మోహరించారు. ఆటోలు, ప్రైవేటు వాహనాల్లో గ్రూపులుగా విమానాశ్రయం రహదారిలోకి వెళ్లకుండా నిరోధించే ప్రయత్నం చేశారు. ఎయిర్పోర్టు రహదారి ప్రారంభంలో కూడా పోలీసులు వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులను అడ్డుకున్నారు.● ఎయిర్పోర్టు నుంచి మాజీ సీఎం జగన్ కాన్వాయ్ బయలుదేరిన తర్వాత ఎన్ఏడీ కొత్త రోడ్డు వద్ద వెనుక ఉన్న వైఎస్సార్సీపీ ముఖ్య నాయకుల వాహనాలను అడ్డగించారు. కేవలం పోలీస్ ఎస్కార్ట్తోనే జగన్ కాన్వాయ్ను అనుమతించారు.● గోపాలపట్నం, సింహాచలం ముఖద్వారం, వేపకుండా కూడలి, పెందుర్తి– అనకాపల్లి ప్లైఓవర్ బ్రిడ్జి ప్రాంతాల్లోను పోలీసులు ఇదే తరహా ధోరణిని అవలంబించారు.● పోలీసులు కాన్వాయ్లోని వాహనాలను అడ్డుకున్న ప్రతిసారి.. నిమిషాల వ్యధిలో రెట్టించిన ఉత్సాహంతో పార్టీ శ్రేణుల వాహనాలు ఎక్కడకక్కడ కాన్వాయ్లో వచ్చి చేరాయి.● పెందుర్తి హైవేపైనా అడ్డుకోగా పినగాడి, సబ్బవరం, అనకాపల్లి ఇలా.. పార్టీ శ్రేణుల వాహనాలు కాన్వాయ్లో కలుస్తూ పర్యటనకు మరింత ఊపు తెచ్చారు.● అనకాపల్లి మండలం మార్టూరు జంక్షన్ వద్ద వాహనదారులను సైతం ఎక్కడకు వెళుతున్నారో తెలుసుకున్న తర్వాతే పంపించారు. కొత్తూరు జంక్షన్ వద్ద జగన్ను చూసేందుకు వెళుతున్న జనాలను పోలీసులు అడ్డగించారు.● కశింకోట మండలం నర్సింగపల్లి వద్ద ఆటోల్లో ప్రయాణికులను వెళ్లనీయలేదు. అత్యవసర పనులపై వెళుతున్నట్లు ఆధారాలు చూపిస్తే గానీ ఆటోల్లో ప్రయాణికులను ముందుకు కదలనీయలేదు.● యలమంచిలి ఫ్లై ఓవర్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. షేకిళ్లపాలెం హైవేలో సైతం ద్విచక్ర వాహనదారులను వెళ్లకుండా అడ్డుకున్నారు.● నర్సీపట్నం నియోజకవర్గంలో ఇతర గ్రామాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సుల్లో పోలీసులు ఎక్కి మరీ ప్రయాణికులు ఎక్కడకు వెళుతున్నారని ఆరా తీసి పంపించారు.కష్టాలు వింటూ.. వినతులు స్వీకరిస్తూ..● మాజీ సీఎం జగన్ పర్యటనలో ప్రజలు, గ్రామస్తులు తమ కష్టాలు, సమస్యలను విన్నవించుకునేందుకు పోటీ పడ్డారు. ప్రతి ఒక్కరి బాధలను వింటూ భరోసా ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.● ఎయిర్పోర్టు దాటిన తరువాత కాకానినగర్ వద్ద వైఎస్సార్ సీపీ గాజువాక సమన్వయకర్త దేవన్రెడ్డి ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు మంత్రి రాజశేఖర్, అయోధ్యరామయ్యతో పాటు పలువురు జగన్ను కలిశారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ, కార్మికుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. స్టీల్ప్లాంట్ను కాపాడుకోవడమే వైఎస్సార్సీపీ లక్ష్యమని, కార్మికులకు అండగా ఉంటామని జగన్ హామీ ఇచ్చి ముందుకు కదిలారు.● బి.భీమవరంలో బల్క్ డ్రగ్ పార్క్ బాధిత నిర్వాసితులు కలిశారు. ఆ పార్క్ వల్ల జరిగే నష్టాలను వివరిస్తూ వినతిపత్రం అందజేశారు. వారి కష్టాలను తెలుసుకున్న జగన్.. బాధితులు తీసుకొచ్చిన ప్లకార్డును పట్టుకుని వారికి మద్దతు తెలిపారు.● గోవాడ షుగర్ ఫ్యాక్టరీని కాపాడాలని రైతులు, కార్మికులు జగన్ను కోరారు.● తాళ్లపాలెం జంక్షన్ వద్ద ఎన్ఏవోబీ నిర్వాసితులు వినతిపత్రం అందజేశారు.● ఇలా అనేక ప్రాంతాల్లో స్థానిక సమస్యలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై జగన్కు వినతిపత్రాలు అందజేశారు.పాల్గొన్నది వీరే..శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, ఎంపీలు పిల్లి సుభాష్చంద్రబోస్, తనూజరాణి, పార్టీ విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లా అధ్యక్షులు కేకే రాజు, అమర్నాథ్, మజ్జి శ్రీనివాసరావు, మాజీ డిప్యూటీ సీఎంలు బూడి ముత్యాలనాయుడు, పీడిక రాజన్నదొర, పుష్పశ్రీవాణి, ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రులు విడదల రజినీ, పేర్ని నాని, దాడిశెట్టి రాజా, సిదిరి అప్పలరాజు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్యేలు మత్స్యరాస విశ్వేశ్వరరాజు, రేగం మత్స్యలింగం, జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, పార్టీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, పార్లమెంట్ పరిశీలకులు సూర్యనారాయణరాజు, కదిరి బాబురావు, శోభాహైమావతి, మాజీ ఎమ్మెల్యేలు పెట్ల ఉమాశంకర్ గణేష్, వాసుపల్లి గణేష్కుమార్, కరణం ధర్మశ్రీ, కంబాల జోగులు, మళ్ల విజయప్రసాద్, అన్నంరెడ్డి అదీప్రాజ్, కె.భాగ్యలక్ష్మీ, మాజీ ఎంపీలు భీశెట్టి వెంకట సత్యవతి, గొడ్డేటి మాధవి, సమన్వయకర్తలు మలసాల భరత్కుమార్, మొల్లి అప్పారావు, దేవన్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శిలు చింతకాయల సన్యాసిపాత్రుడు, చిక్కాల రామారావు, వీసం రామకృష్ణ, పైలా శ్రీనివాసరావు, దంతులూరి దిలీప్కుమార్, ఉత్తరాంధ్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ, సినీనటుడు జోగినాయుడు, ముఖ్యనేతలు డాక్టర్ లక్ష్మీకాంత్, ఎర్రాపాత్రుడు, మున్సిపల్ చైర్మన్ బోడపాటి సుబ్బలక్ష్మీ, వైఎస్ చైర్మన్ కొనేటి రామకృష్ణ, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి చింతకాయల వరుణ్, మాకవరపాలెం ఎంపీపీ రుత్తల సర్వేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు చిటికెల రమణ, జెడ్పీటీసీ పెట్ల సత్యవేణి తదితరులు పాల్గొన్నారు.