breaking news
Alluri Sitarama Raju
-
విద్యార్థుల జీవితాలతో చెలగాటం : విశ్వేశ్వరరాజు
పాడేరు: రాష్ట్రంలో గిరిజన సమాజంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు విమర్శించారు. గిరిజన విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీడీఏ కార్యాలయం ఎదుట శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న గిరిజన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను కలిసి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాల చరిత్ర కలిగిన మారికవలస గిరిజన గురుకుల విద్యాలయాన్ని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ పేరుతో కార్పొరేట్ విద్యా సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం ఏకపక్షంగా ఎత్తివేసిందని ఆరోపించారు. ఐటీడీఏ పీవోతో పాటు ఇతర అధికారులు రాత్రికి రాత్రే పోలీసులతో కలిసి విద్యార్థులను బెదిరించి, ట్రంక్ పెట్టెలు, సామానుతో బయటకు పంపించడం దుర్మార్గ చర్య అని విమర్శించారు. ఇలాంటి చర్యలకు గిరిజన సమాజం తగిన మూల్యం చెల్లించక తప్పదని ఆయన హెచ్చరించారు. పాఠశాలను యథావిధిగా కొనసాగించ లేనిపక్షంలో భారీ స్థాయిలో ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. -
రేవ్ పార్టీ.. దర్యాప్తు డర్టీ..!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖపట్నం శివార్లలోని ‘హ్యాపీ నేచర్ రిసార్ట్స్’లో జరిగిన రేవ్ పార్టీలో కత్తిపోట్ల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. అధికార పార్టీ నేతల మధ్య జరిగిన ఈ వివాదాన్ని కప్పిపుచ్చేందుకు సాక్షాత్తూ పోలీసులే తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శలు తీవ్రమవుతున్నాయి. ఘటనా స్థలంలో కళ్లెదుటే ఆధారాలు కనిపిస్తున్నా.. వాటిని స్వాధీనం చేసుకోవడంలో ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం ప్రదర్శించడం పోలీసుల తీరుపై అనేక అనుమానాలకు తావిస్తోంది. ఉన్నతాధికారులను సైతం తప్పుదోవ పట్టిస్తూ.. కేసును నీరుగార్చి, అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలను రక్షించేందుకు కింది స్థాయి సిబ్బంది చేస్తున్న ప్రయత్నాలు విస్మయానికి గురిచేస్తున్నాయి. పోలీసుల వైఫల్యం? తెల్లవారుజామున సుమారు 4:18 గంటల ప్రాంతంలోనే పార్టీలో ఘర్షణ జరిగి, గాయపడిన వ్యక్తి ఆసుపత్రికి వెళ్లినప్పటికీ.. పోలీసుల దర్యాప్తు మధ్యాహ్నం 3 గంటల వరకు ముందుకు సాగలేదు. కనీసం క్రైమ్ సీన్ను స్వాధీనం చేసుకోవడంలోనూ పోలీసులు విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలంలో సుమారు 40కి పైగా ఖాళీ, సగం తాగిన మద్యం సీసాలు పడి ఉన్నా వాటిని వెంటనే స్వాధీనం చేసుకోలేదు. ఈ జాప్యాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు నేతలు ఆధారాలన్నింటినీ అక్కడి నుంచి మాయం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేసు నమోదు కాకముందే ఘటనా స్థలంలో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు పరోక్షంగా అవకాశం కల్పించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో కేవలం 6 బాటిళ్లు మాత్రమే దొరికినట్టు ఎకై ్సజ్ అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు రిసార్ట్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. బయటకు రాని సీసీటీవీ ఫుటేజీ! ఈ రేవ్ పార్టీలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారన్న సమాచారం ఉన్న నేపథ్యంలో, ఆ కోణాన్ని దాచిపెట్టేందుకు సీసీటీవీ ఫుటేజీల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా హత్యాయత్నం జరిగిన సమయానికి సంబంధించిన ఫుటేజీని మాత్రమే పోలీసులు తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం పార్టీకి సంబంధించిన పూర్తి ఫుటేజీని సేకరించి ఉంటే అందులో పాల్గొన్న వారి వివరాలు, అసలు విషయాలన్నీ వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని స్థానికంగా చర్చ నడుస్తోంది. కానీ అలా పూర్తిస్థాయి ఫుటేజీ తీసుకోకపోవడం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లభ్యమైన ప్రాథమిక దృశ్యాల్లో.. దాడికి పాల్పడిన వ్యక్తి ఒంటిపై దుస్తులు లేకుండా ఉన్నాడని, అలాగే పెద్ద సంఖ్యలో యువతులు కూడా అక్కడ కనిపించారని సమాచారం. అసలు అక్కడికి కత్తి ఎలా వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? అన్న అంశాలపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పార్టీకి ఎవరెవరు వచ్చారు? లోపల ఏం జరిగింది? అన్న కీలక విషయాలు నమోదైన సీసీ కెమెరాల ఫుటేజీని తక్షణమే సీజ్ చేయకుండా కాలయాపన చేశారనే విమర్శలు ఉన్నాయి. సాధారణంగా చిన్న చోరీల వ్యవహారాల్లోనూ హడావుడి చేసే పోలీసులు.. ఇంత పెద్ద ఘటన జరిగినా కనీసం మీడియాకు పూర్తి సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం.ఆ విదేశీ మద్యం తెచ్చిందెవరు? ఈ రేవ్ పార్టీలో స్థానిక మద్యంతో పాటు విదేశీ మద్యం కూడా భారీగా పారినట్లు తెలుస్తోంది. పదుల సంఖ్యలో మద్యం బాటిళ్లు ఉన్నట్లు ఆధారాలు కనిపిస్తున్నా, పోలీసులు మాత్రం తక్కువ బాటిళ్లు ఉన్నట్లు చెబుతున్నారు. అసలు ఈ విదేశీ మద్యం అక్కడికి ఎలా వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? అన్న కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు చేయడం లేదని సమాచారం. ఒక విద్యార్థి విభాగం (టీఎన్ఎస్ఎఫ్) నాయకుడే ఈ విదేశీ మద్యాన్ని సరఫరా చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నా.. ఆ దిశగా పూర్తిస్థాయి విచారణ చేపట్టకపోవడం పోలీసుల పక్షపాత వైఖరికి అద్దం పడుతోంది. -
సావిత్రీ బాయి పూలే విగ్రహావిష్కరణ
కె.కోటపాడు: మహిళల హక్కుల కోసం పోరాటం చేయడం తమ సామాజిక బాధ్యతగా సావిత్రీ బాయిపూలే, జ్యోతిరావ్ పూలేలు విశ్వసించినట్టు జిల్లా విద్యాశాఖాధికారి జి.జి.ఎస్.నాగేశ్వరరావు అన్నారు. పాతవలస జెడ్పీ హైస్కూల్లో హిందీ ఉపాధ్యాయురాలు సుజాతతో పాటు ఆమె భర్త నాగేశ్వరరావులు సావిత్రీబాయి పూలే విగ్రహాన్ని వారి సొంత నగదుతో ఏర్పాటు చేశారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖాధికారి నాగేశ్వరరావు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి పూలే అని విద్యార్థులకు తెలిపారు. భారతీయ సంఘ సంస్కర్తగాను, ఉపాధ్యాయినిగా, రచయిత్రిగా ఆమె సేవలు అందించారని కొనియాడారు. కార్యక్రమంలో ఎంఈవోలు కె.సత్యనారాయణ, డి.వి.డి.ప్రసాద్, హెచ్ఎం.నాగేశ్వరరావు, ఉపాధ్యాయుడు ఈశ్వరరావు పాల్గొన్నారు. -
సిద్ధమవుతున్న గణనాథులు
బుచ్చెయ్యపేట: హిందూ సంప్రదాయం ప్రకారం తొలి పూజ చేసేది వినాయకుడికే.. హిందువులు ఏ కార్యం తలపెట్టినా విఘ్నాలు తొలగించే గణనాథుడినే వేడుకుంటారు. ఇందుకోసం గణపతి విగ్రహాలు సిద్ధమవుతున్నాయి. రంగురంగుల అలంకరణలతో వివిధ రూపాల్లో ఆకర్షణీయంగా వీటిని శిల్పికళాకారులు తీర్చిదిద్దుతున్నారు. అడుగు నుంచి 15 అడుగుల ఎత్తు వరకు తయారు చేస్తున్నారు. వచ్చే నెల 14వ తేదీన వినాయక చవితి సందర్భంగా ఉత్సవ కమిటీలు సైతం గ్రామాల్లో అంగరంగ వైభవంగా వేడుకలు జరుపుకునేందుకు సిద్ధమవుతున్నాయి. పలు రూపాల్లో విగ్రహాలు మేజర్ పంచాయతీ వడ్డాది, బుచ్చెయ్యపేట, సీతయ్యపేట, విజయరామరాజుపేట, రాజాం తదితర గ్రామాల్లో వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారు. వీటి తయారీతో స్థానికంగా పలువురి కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. విజయ వినాయక, లంబోదర వినాయక, బుద్ధి వినాయక, పంచముఖ వినాయక, పార్వతీపరమేశ్వర్ల సన్నిధి వినాయక, ఊయలలో ఊగుతున్న వినాయక, శ్వేత నాగు బంధ వినాయక, గోవుపై ఊరేగుతున్న వినాయక వంటి పలు ఆకారాల్లో తయారు చేస్తున్నారు. మట్టితోపాటు కొబ్బరి పీచు, అట్టలు, ఇతర ముడి సరుకులతో వినాయక విగ్రహాలు తయారవుతున్నాయి. ఒక్కో విగ్రహాన్ని పరిమాణం బట్టి రూ. 100 నుంచి రూ.25 వేల వరకు అమ్మకాలకు సిద్ధం చేస్తున్నారు. వినాయ విగ్రహాలు తయారీతో శిల్పి కళాకారుల కుటుంబాలతోపాటు మరో 15 మంది కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. వినాయక చవితి నుంచి దసరా ఉత్సవాల వరకు వీరికి చేతినిండా పని దొరుకుతుంది. తయారవుతున్న కాల సర్ప వినాయక విగ్రహంఆకట్టుకుంటున్న విజయ వినాయక విగ్రహంరంగులతో ఆకట్టుకుంటున్నపంచముఖ వినాయక విగ్రహంవినాయక విగ్రహాల తయారీ 15 అడుగుల ఎత్తు వరకు సిద్ధం వివిధ ఆకృతుల్లో ముస్తాబు చేతినిండా పని విగ్రహాల తయారీపై ఆధార పడి జీవిస్తున్నాం. మా కుటుంబాలతోపాటు మరో 15 మంది కుటుంబీకులకు ఉపా ధి కల్పిస్తున్నాం. ఈ ఏడాది విగ్రహాల తయారీకి ముడిసరుకు ధరలు పెరిగాయి. 15 అడుగుల విగ్రహాలు వరకు తయారు చేశాం. పలు గ్రామాల నుంచి వస్తున్న ఆర్డర్లు మేరకు పలు ఆకారాల్లో వినాయక విగ్రహాలను తయారు చేసి అమ్మకాలకు అందుబాటులో ఉంచాం. –కె లోవరాజు, విగ్రహాల తయారుదారుడు, వడ్డాది -
జిల్లా కోర్టును సందర్శించిన విదేశీ ప్రతినిధులు
విశాఖ లీగల్: కెన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక మార్పిడి కార్యక్రమంలో భాగంగా జపాన్, బెల్జియం, అమెరికా దేశాలకు చెందిన అంతర్జాతీయ ఇంటర్న్స్ భారతీయ సంప్రదాయాలు, సంస్కృతి, జీవన విధానంపై అవగాహన పొందేందుకు భారత్ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వారు జిల్లా కోర్టుతో పాటు న్యాయవాదుల చాంబర్లను సందర్శించారు. ఈ సందర్భంగా భారత న్యాయ వ్యవస్థ, కోర్టుల పనితీరు, న్యాయ ప్రక్రియలు, న్యాయవాదుల విధుల గురించి వివరాలు తెలుసుకున్నారు. భారతీయ న్యాయ వ్యవస్థ ఆచరణాత్మక విధానాన్ని, కోర్టు కార్యకలాపాలను ప్రత్యక్షంగా పరిశీలించే అవకాశం లభించడం ఎంతో ఉపయోగకరంగా ఉందని వారు తెలిపారు.సాంస్కృతిక మార్పిడి ద్వారా విదేశీ యువతకు భారతీయ సంప్రదాయాలు, న్యాయ వ్యవస్థపై అవగాహన కల్పించడంతో పాటు, అంతర్జాతీయ స్థాయిలో పరస్పర అవగాహన, స్నేహ సంబంధాలను బలోపేతం చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని విశాఖపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సన్నీ యాదవ్ తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ గాలి రామిరెడ్డి, సీనియర్ మెంబర్ యు. శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఈ. సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
భగ్గుమన్నగిరిపుత్రులు
● మారికవలస పాఠశాల ఎత్తివేతపై ఆగ్రహం ● రెండో రోజూ ఐటీడీఏ ఎదుట నిరసన ● పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ ● చంద్రబాబు ప్రభుత్వ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రుల మండిపాటు గిరిజన విద్యార్థులసంక్షేమానికే ప్రాధాన్యం కలెక్టర్ నిశాంతి పాడేరు: మారికవలస స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్లో విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు ఆధునిక సౌకర్యాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమని కలెక్టర్ నిశాంతి స్పష్టం చేశారు. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి నిర్ణయం తీసుకుంటున్నామని తెలిపారు. మారికవలస పాఠశాల వ్యవహారంపై గురువారం ఐటీడీఏ కార్యాలయంలో విలేకరులతో కలెక్టర్ మాట్లాడుతూ మారికవలస పాఠశాలను సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్గా అభివృద్ధి చేసి ప్రస్తుతం 360 మంది విద్యార్థులకు విద్యా, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. 5 నుంచి 8వ తరగతి వరకు ఉన్న 225 మంది విద్యార్థులను పేరెంట్స్–టీచర్స్ సమావేశాలు నిర్వహించి తల్లిదండ్రులకు పూర్తి వివరాలు తెలియజేశామన్నారు. 9, 10వ తరగతులకు చెందిన 135 మంది విద్యార్థులను కృష్ణాపురం, జి.మాడుగుల, సబ్బవరం, గుమ్మకోట, పెదబయలు, దేవరాపల్లి, కొయ్యూరు తదితర స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్లలో కొనసాగించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ మాట్లాడుతూ భవిష్యత్లో ఈ పాఠశాలలో 600 మంది విద్యార్థులు చేరే అవకాశముందన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థుల ఆందోళనను అర్థం చేసుకుంటున్నామని, మారికవలస బా య్స్ పాఠశాలలోనే విద్య కొనసాగించాలని తల్లిదండ్రులు కోరుకుంటే, ఈ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పా రు. జిల్లా అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) శృతి పాల్గొన్నారు. ఎన్నో ఏళ్లుగా మెరుగైన విద్యను అందిస్తున్న చదువుల గుడిని దూరం చేయడంపై ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రాత్రికి రాత్రి పాఠశాలను ఖాళీ చేయించి నేరస్తుల మాదిరి విద్యార్థులను బస్సుల్లో కర్కశంగా తరలించిన చంద్రబాబు ప్రభుత్వ తీరుపై గిరిజనం మండిపడింది. మారికవలస గిరిజన గురుకుల విద్యాలయం ఎత్తివేతపై ఆగ్రహం వ్యక్తమైంది. పాఠశాలను యథావిధిగా కొనసాగించాల్సిందేనని బుధవారం పాడేరు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు, తల్లిదండ్రులు ఐటీడీఏ ప్రధాన గేటు వద్ద బైటాయించి నిరసనకు దిగారు. రాత్రి వేళ జరిగిన చర్చలు ఫలించకపోవడంతో అక్కడే రాత్రంతా ఆందోళన కొనసాగించారు. గురువారం కూడా వివిధ గిరిజన, ఆదివాసీ హక్కుల సంఘాల నాయకులు చేరడంతో నిరసన మరింత ఉధృతంగా సాగింది. -
కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గోవాడ సుగర్స్ నిర్వీర్యం
దేవరాపల్లి: కూటమి ప్రభుత్వ హయాంలోనే గోవాడ సుగర్ ఫ్యాక్టరీని పూర్తిగా నిర్వీర్యం చేసి మూతపడే స్థాయికి తీసుకువచ్చారని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. వెంకన్న విమర్శించారు. గోవాడ సుగర్ ఫ్యాక్టరీ పరిధిలోని చెరకు రైతులు, కార్మికుల బకాయి రూ. 38 కోట్లు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. దేవరాపల్లిలో గురువారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. చెరకు రైతు, కార్మికుల బకాయిలను తక్షణమే చెల్లించి సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని ఆదుకోన్ని ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కోరారు. చోడవరం, మాడుగుల, నర్సీపట్నం మూడు నియోజకవర్గాల రైతులు, ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండున్నర లక్షల మంది గోవాడ సుగర్ ఫ్యాక్టరీపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. వ్యవసాయ ఆధారిత ప్రాంతం కావడంతో అత్యధికంగా ఉన్న రైతులు, కూలీలు ఉన్నారని వీరికి తీవ్ర ద్రోహం చేసిందన్నారు. రైతులు పూర్తిగా చెరకు పంట పండించే కోల్పోయే విధంగా చేసిందన్నారు. ఒక వైపు ఫ్యాక్టరీ మూసివేయగా మరో వైపు ఈ ఏడాది వర్షాలు కురవక పోవడంతో రైతులు సంక్షోభంలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి సుగర్ ఫ్యాక్టరీకి చెరుకు సరఫరా చేసిన రైతులకు నేటికీ బిల్లులు చెల్లించక పోవడంతో అప్పులు ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించిందని ఆందోళన వ్యక్తం చేశారు. మూడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఈ ప్రాంత రైతాంగం చెరకు రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతాంగాన్ని ఆదుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారని మండిపడ్డారు. బకాయిల కోసం రైతులు, కార్మికులు సంక్రాంతి పూట 23 రోజులు ఆఖిల పక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేస్తే చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు స్పందించి బకాయి చెల్లింపునకు స్పష్టమైన హామీ ఇచ్చి దీక్ష విరమింప చేశారన్నారు. అనంతరం ఇద్దరు ఎమ్మెల్యేలు ముఖం చాటేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది వ్యవసాయం పూర్తిగా దెబ్బతిందని, సంక్షోభంలో ఉన్న రైతులు, కూలీలను ఆదుకొని, కరువు సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి...
అనకాపల్లి: విజయనగరం జిల్లా పూసపాటిరేగకు చెందిన విశాలాంద్ర విలేకరి పి.గోవిందుపై ఈనెల 19న జరిగిన హత్యాయత్యాన్ని ఖండిస్తూ, నిందితుడు గుడివాడ కృష్ణను తక్షణమే అరెస్టు చేయాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు భీమరశెట్టి వెంకటేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి రాజాన దొరబాబులు అన్నారు. స్థానిక నెహ్రూచౌక్ వద్ద ఏపీడబ్ల్యూజేఎఫ్, సీపీఐ ఆధ్వర్యంలో ఽగురువారం ధర్నా చేసి, మండలంలో కొత్తూరు పంచాయతీ పరిదిలో ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో షేక్ ఆయిషాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూ అక్రమాలపై వార్తలను ప్రచురించినందుకే జర్నలిస్టు గోవిందుపై దాడి చేయడం అన్నాయమన్నారు. దాడికి సంబంధించిన వీడియో, ఫొటో ఆధారాలు ఉన్నప్పటికీ నిందితుడు గుడివాడ కృష్ణపై అక్కడ పోలీసులు నేటి వరకూ చర్యలు తీసుకోకపోవడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు అజయ్, బి.కొండలరావు, సీహెచ్.శశికుమార్, కాండ్రేగుల మోహన్బాబు తదితరులు పాల్గొన్నారు. -
కూటమి పాలనలో గిరిజన విద్యా వ్యవస్థ నిర్వీర్యం
పాడేరు: కూటమి ప్రభుత్వ హయాంలో గిరిజన విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయిందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు పసుపులేటి బాలరాజు విమర్శించారు. మారికవలస గిరిజన గురుకుల విద్యాలయం ఎత్తివేతకు నిరసనగా ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులను గురువారం సాయంత్రం ఆయన పరామర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో గిరిజన విద్యార్థుల ప్రాథమిక విద్యకు ప్రధాన ఆధారంగా ఉన్న మారికవలస గురుకులాన్ని విద్యా సంవత్సర మధ్యలో అర్ధంతరంగా ఎత్తివేయడం దారుణమన్నారు. అక్కడే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలనుకుంటే, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయలతో నిర్మించిన అదనపు భవనాలను వినియోగించుకోవాలన్నారు. గిరిజనుల అభ్యున్నతిపై ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చూపుతోందన్నారు. మారికవలస గిరిజన గురుకులాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. -
సీఎం చంద్రబాబుగన్నెల పర్యటన రేపు
సాక్షి, పాడేరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం అరకులోయ మండలం గన్నెల ప్రాంతంలో పర్యటించనున్నట్లు కలెక్టర్ టి. నిశాంతి తెలిపారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై గురువారం కలెక్టరేట్లో ఆమె అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం గన్నెల ప్రాంతంలో ప్రత్యక్షంగా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శనివారం ఉదయం హెలికాప్టర్లో సీఎం గన్నెలకు చేరుకుంటారని చెప్పారు. ఆ తరువాత ఆర్.కె.నగర్ గ్రామాన్ని సందర్శించి ‘సంజీవని’కార్యక్రమం లబ్ధిదారులతో ముఖాముఖీ నిర్వహించనున్నారని తెలిపారు. అనంతరం గన్నెల గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో సీఎం పాల్గొని వివిధ విభాగాల స్టాళ్లను సందర్శిస్తారని వివరించారు. -
ఏయూ భూతర్పణం!
విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన రూ.వేల కోట్ల విలువైన ఆస్తులు క్రమంగా కరిగిపోతున్నాయి. నగర నడిబొడ్డున ఉన్న భూములు ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. వర్సిటీ భవిష్యత్ అవసరాలు, విద్యార్థుల ప్రయోజనాల కోసం పూర్వీకులు ఇచ్చిన విలువైన భూములను ప్రజా ప్రయోజనాల సాకుతో పలు సంస్థలకు బదలాయింపులు జరిగిపోతున్నాయి. తాజాగా చంద్రబాబు ప్రభుత్వం మరోసారి ‘భూ’తర్పణం చేసేందుకు సిద్ధమైపోయింది. ఇప్పటి వరకు ఇచ్చిన భూములకే సరైన పరిహారం రాకపోగా.. మళ్లీ భూములను కట్టబెట్టడంపై ఉద్యోగ వర్గాలు తప్పుబడుతున్నాయి. ఏయూ భూములు చేజారిపోతుండటంపై విశ్వవిద్యాలయ అధ్యాపకులు, ఉద్యోగ సంఘాలు, పూర్వ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ హయాంలో వరుస కేటాయింపులు ● 1991లో త్రీటౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని 2 ఎకరాల ఏయూ భూమిని రైతుబజార్ కోసం, మరో ఎకరాన్ని జీవీఎంసీ వినియోగానికి కేటాయించారు. ఆ భూమిలో టెన్నిస్ గ్రౌండ్ ఏర్పాటు చేసినప్పటికీ విశ్వవిద్యాలయానికి ఎటువంటి పరిహారం అందలేదు. ● 1999లో మధురవాడలో అందుబాటులో ఉన్న సుమారు 85 ఎకరాల్లో 81 ఎకరాలను పేదల గృహ నిర్మాణ కార్యకలాపాల కోసం జీవీఎంసీకి అప్పగించారు. ఈ భూమికి కూడా విశ్వవిద్యాలయానికి ఎలాంటి పరిహారం చెల్లించలేదు. ● 2001లో హనుమంతవాక జంక్షన్ వద్ద జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న సుమారు 9 ఎకరాల్లో 4 ఎకరాలను జాతీయ రహదారి సంస్థకు ఇచ్చారు. ఈ భూమికి కూడా ఏయూకు పరిహారం శూన్యం. ● 2018లో సుమారు 1.5 ఎకరాల విలువైన బీచ్ ప్రాంత భూమిని వాణిజ్య కార్యకలాపాల కోసం వుడాకు కేటాయించారు. ఇప్పటివరకు దీనివల్ల విశ్వవిద్యాలయానికి ఎలాంటి ఆర్థిక ప్రయోజనం అందలేదని వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. మరో కేటాయింపునకు రంగం సిద్ధం ఇప్పటికే విలువైన భూములు కోల్పోయిన ఏయూకు మరోసారి భూ నష్టం జరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. యోగా సెంటర్ భూమిని ఆయుష్ ఆసుపత్రికి, సిరిపురం సమీపంలోని భూమిని, హనుమంతవాక జంక్షన్ వద్ద మరో ఎకరం భూమిని జీవీఎంసీకి అప్పగించేందుకు ఏయూ వైస్చాన్సలర్ ఆచార్య జి.పి.రాజశేఖర్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలు అమలైతే విశ్వవిద్యాలయానికి మరింత విలువైన భూమి దూరమయ్యే అవకాశం ఉందని ఏయూ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ సంస్థలకు కేటాయిస్తున్నప్పటికీ.. అందుకు తగిన విధంగా ఏయూకు పరిహారం అందకపోవడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రూ.7 కోట్ల మున్సిపల్ పన్ను వివాదం ఒకవైపు విలువైన భూములను జీవీఎంసీ ఉచితంగా తీసుకుంటుంటే, మరోవైపు అదే జీవీఎంసీకి ఏయూ నిధుల నుంచి ఏకంగా రూ.7 కోట్ల ఆస్తి పన్ను చెల్లించడం వివాదాస్పదంగా మారింది. గతంలో పన్ను మినహాయింపు కోసం గవర్నర్కు లేఖలు రాసి ప్రభుత్వ స్థాయిలో ప్రయత్నాలు జరిగాయి. ఆ ప్రక్రియ కొలిక్కి రాకముందే హడావుడిగా రూ.7 కోట్లు చెల్లించడాన్ని అప్పటి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ధనుంజయరావు తీవ్రంగా వ్యతిరేకించారని, వర్సిటీ ప్రయోజనాలకు గండికొట్టే నిర్ణయాలను వ్యతిరేకించినందుకే ఆయన రాజీనామా చేయాల్సి వచ్చిందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. పరిరక్షించకపోతే భవిష్యత్తు శూన్యం వర్సిటీ భూములు ఎవరి సొంత ఆస్తి కాదని, భవిష్యత్ తరాల విద్యార్థుల కోసమేనని అధ్యాపకులు స్పష్టం చేస్తున్నారు. ఒకవైపు ప్రైవేటు వర్సిటీలకు ప్రభుత్వం రెడ్ కార్పెట్ వేస్తూ భూములు కేటాయిస్తుంటే, ప్రఖ్యాత ప్రభుత్వ విశ్వవిద్యాలయమైన ఏయూ ఆస్తులను ఇష్టారాజ్యంగా పప్పుబెల్లాల్లా పంచడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ప్రస్తుత బదలాయింపు ప్రతిపాదనలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
గిరిజన ఓటర్ల హక్కులకు భంగం కలిగిస్తే సహించం
అరకులోయ టౌన్: అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గంలో గిరిజన ఓటర్ల హక్కులకు భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం స్పష్టం చేశారు. గురువారం తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అరకులోయ మండలంలోని బూత్ నంబర్లు 213 నుంచి 271 వరకు, అలాగే 107 నుంచి 163 వరకు ఉన్న పోలింగ్ కేంద్రాల పరిధిలో అనుమానాస్పదంగా వందల సంఖ్యలో ఓటర్ల నమోదు జరిగినట్లు తన దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఒకే ఫొటోతో రెండు ఓట్లు నమోదు కావడం, మరణించిన వారి పేర్లు ఇంకా జాబితాలో కొనసాగడం, ఒకే వ్యక్తి పేరుతో రెండు వేర్వేరు బూత్లలో ఓట్లు ఉండటం వంటి తీవ్ర లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాలపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి, నకిలీ ఓటర్లను తొలగించాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి అరకులోయ నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల తహసీల్దార్లు, డీటీలకు లిఖితపూర్వకంగా లేఖలు పంపినట్లు తెలిపారు. బీఎల్వోలు ప్రతి ఇంటికి వెళ్లి సమగ్రంగా విచారణ జరపాలని, అర్హులైన నిజమైన ఓటర్లను తొలగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనుమానాస్పదంగా ఉన్న వారికి నోటీసులు జారీ చేసి, ఆధారాలు సమర్పించుకునే అవకాశం కల్పించాలని అన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం నకిలీ ఓటర్లుగా నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే ఓటు హక్కును తొలగించాలని ఆయన స్పష్టం చేశారు. దొంగ ఓట్లకు అడ్డుకట్ట వేస్తూ, 100 శాతం పారదర్శకతతో ఓటర్ల జాబితా రూపొందించాలని ఎన్నికల అధికారులను ఎమ్మెల్యే మత్స్యలింగం కోరారు. -
వడ్డాది వెంకన్న ఆలయ ట్రస్ట్బోర్డు ప్రమాణ స్వీకారం
బుచ్చెయ్యపేట: వడ్డాది వేంకటేశ్వరస్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల రాష్ట్ర దేవదాయశాఖ వేంకటేశ్వరస్వామి ఆలయానికి 20 ఏళ్ల తరవాత కమిటీ సభ్యులను నియమించింది. కొత్తగా నియమితులైన సభ్యులతో గురువారం దేవదాయశాఖ ఇన్స్పెక్టర్ వసంతకుమార్ ట్రస్ట్ బోర్డు సభ్యులతో ప్రమాణం చేయించారు. వేంకటేశ్వరస్వామి సన్నిధిలోనే ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త దొండా కన్నబాబుతో పాటు ట్రస్ట్ బోర్డు సభ్యులుగా ఎన్నికై న సయ్యపురెడ్డి సత్యనారాయణ మూర్తి,(నవీన్), ఎస్.లక్ష్మీనారాయణ, పి.రాధ, ఎస్. మహాలక్ష్మి, అప్పలనరస, కె.లక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు. ఈవో శర్మ, నాయకులు దొండా గిరిబాబు, శ్రీరామూర్తి, రమేష్, పేరమ్మ, వాసు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
జోరుగా రాఖీల విక్రయాలు
సాక్షి, పాడేరు: శ్రావణమాసం మూడో శుక్రవారం, పవిత్ర రక్షాబంధన్ సందర్భంగా గురువారం పాడేరు మార్కెట్ కళకళలాడింది. పట్టణంలోని మెయిన్ రోడ్, పాత బస్టాండ్, సినిమా హాల్ సెంటర్ ప్రాంతాల్లో ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేసి రాఖీలు విక్రయాలు చేపట్టారు. దీంతో ఈ ప్రాంతాలు కొనుగోలుదారులతో కిక్కిరిశాయి. ముఖ్యంగా యువతులు రాఖీలు కొనుగోలు చేయడానికి భారీగా తరలివచ్చారు. బంగారు దుకాణాల్లో వెండి రాఖీలకు ప్రత్యేక ఆదరణ కనిపించింది. మరో వైపు శ్రావణ మాసం మూడో శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతానికి అవసరమైన పూజా సామగ్రి కొనుగోలుకు మహిళలు మార్కెట్కు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పూలు, పండ్ల విక్రయాలు కూడా గణనీయంగా పెరిగి వ్యాపారులకు మంచి ఆదాయం అందింది. -
సమ్మెదలో ప్రభుత్వ భూముల దురాక్రమణ
దేవరాపల్లి: మండలంలోని చింతలపూడి పంచాయతీ సమ్మెద రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ప్రభుత్వ భూముల్లో పాగా వేసి దర్జాగా అక్రమిస్తున్నారు. సుమారు 30 ఎకరాలకు పైగా ప్రభుత్వ, బంజరు భూములను ఎటువంటి అనుమతుల పత్రాలు లేకుండానే సాగు చేస్తున్నారు. కొందరు బయట వ్యక్తులు సిండికేట్గా ఏర్పడి దౌర్జన్యంగా దురాక్రమణకు తెగబడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన రెవెన్యూ అధికారులు చోద్యం చూడడంపై పలు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. రెవెన్యూ అధికారులకు భారీ మొత్తంలో మామూళ్లు ముట్టడంతోనే అటుగా కన్నెత్తి చూడడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమణలపై బాధిత రైతులు కొందరు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోవడం ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.ఇదిలా ఉండగా సమ్మెద రెవెన్యూ పరిధిలో బంజరు భూములకు 2005లో అప్పటి ప్రభుత్వం దళితులకు, గిరిజనులకు పట్టాలు మంజూరు చేసింది. వీరిలో కొందరు సాగు ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారుల అండదండలతో ఈ ప్రాంతానికి సంబంధం లేని బయట వ్యక్తులు ఆక్రమించి దర్జాగా సాగు చేస్తున్నారు. భూ హక్కుదారులకు రక్షణ కల్పించాల్సిన రెవెన్యూ అధికారులు అక్రమణదారులకు కొమ్ము కాస్తూ మాట్లాడుతున్నారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆక్రమణలపై రెవెన్యూ, పోలీస్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన పరిష్కరించకుండా ఉద్దేశ్యపూర్వకంగా జాప్యం చేస్తున్నారని, ప్రస్తుతం చేపడుతున్న రీసర్వేలో ఆక్రమణదారులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి అక్రమణదారుల నుంచి తమ భూములకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. -
స్థానిక ఎన్నికల్లో ‘కూటమి’కి వణుకు పుట్టించాలి
గూడెంకొత్తవీధి: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి వణుకు పుట్టించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే ఎం.విశ్వేశ్వరరాజు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇందు కోసం మనందరి అజెండా వైఎస్సార్సీపీ జెండాగా ఉండాలని సూచించారు. గూడెంలో పార్టీ మండల అధ్యక్షుడు కంకిపాటి గిరి ప్రసాద్ అధ్యక్షతన గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని అన్ని పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం సోషల్ మీడియాలో మాత్రమే కనిపిస్తోందని, క్షేత్రస్థాయిలో ఎలాంటి పనులు చేయడం లేదని విమర్శించారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు అబద్ధపు ప్రచారాలు చేస్తోందని ఆరోపించారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను బహిర్గతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు కాకపోవడం, 18 సంవత్సరాలు నిండిన మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామన్న హామీ నెరవేర్చకపోవడం, నిరుద్యోగ భృతి అమలు కాలేదని ఆయన గుర్తుచేశారు. స్థానిక ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో కమిటీ సూచనలకు ప్రాధాన్యం ఇస్తామని, గెలుపు అవకాశాలున్న అభ్యర్థులను ఎంపిక చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోయిన కుమారి, రాష్ట్ర పంచాయతీరాజ్ సంయుక్త కార్యదర్శి బొబ్బిలి లక్ష్మణ్, మైనారిటీ జిల్లా అధ్యక్షుడు వసుపరి తిమోతి, వైస్ ఎంపీపీ లోతా దేవుడు, కోశాధికారి కుందేరి రామకృష్ణ, ఎంపీటీసీ కొర్రా రాజులమ్మ, మండల ఉపాధ్యక్షులు అరుణ్ కుమార్, రీమెలి బాలకృష్ణ, మాజీ జడ్పీటీసీ సభ్యులు మత్స్య రాజు, వాణిజ్య విభాగం అధ్యక్షుడు పనసల రాజేష్, యువజన విభాగం అధ్యక్షుడు లంబసింగి రమేష్, రైతు విభాగం అధ్యక్షుడు కంకిపాటి రామారావు, మండల ప్రధాన కార్యదర్శి బుజ్జిబాబు, పలువురు ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు పాల్గొన్నారు. మనందరి అజెండా వైఎస్సార్సీపీ జెండాగా మారాలి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలనుఎండగట్టాలి గూడెం కార్యకర్తల సమావేశంలో పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు -
ఖాళీ బిందెల గోడు వినండి...
రోలుగుంట: ఫ్లోరైడు గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో రోలుగుంట ఎస్సీ కాలనీలో ఖాళీ బిందెలతో మహిళలు బుధవారం ధర్నా చేశారు. ఈ ధర్నాకు సారధ్యం వహించిన సీపీఎం నాయకుడు కె.గోవింద మాట్లాడుతూ మండలంలోని కె.నాయుడుపాలెం, నిండుగొండ, ఎన్.కొత్తూరు తదితర ఫ్లోరైడు గ్రామాల్లో తాగునీరందక జనం ఎన్నో ఇక్కట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన తెలిపిన వివరాలివి. ఆయా గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడానికి 2004లో రూ.3.50 కోట్లతో భారీ ప్రాజెక్టు నిర్మించారు. రోలుగుంటలో లక్ష లీటర్ల సామర్ధ్యం గల ట్యాంకు నిర్మించి జానకీరాంపురంలో ఏటిలో నీటిని శుద్ధి చేసి బాధిత గ్రామాలకు సరఫరా చేసేవారు. ఏటిలో ఇసుక మాఫియా కారణంగా నీటిమట్టం అడుగంటి పోయి తాగునీరందని పరిస్థితి ఏర్పడింది. జల్జీవన్ మిషన్ పథకం ద్వారా 2020–21లో రూ.6 కోట్లు మంజూరు చేశారు. పనులు జరగాల్సి ఉండగా కూటమి ప్రభుత్వం వచ్చి వాటిని రద్దు చేసింది. అయితే అధికారులు ఆ నిధులతో పనులు జరపాలని ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామంటున్నారు. జల్జీవన్ మిషన్ పథకం కింద 50 లీటర్ల స్వచ్ఛమైన తాగునీరందిస్తామని కోతలు కోసిన కూటమి నాయకులు చుక్కనీరు అందించకపోవడం బాధాకరమని తెలిపారు. తాము భూములు అడగడం లేదు, రుణాలు అడగడం లేదు.. తాగునీరవ్వండి మహాప్రభో అంటూ ఈ ధర్నాలో మహిళలు తమ గోడు వినిపించారు. వారం రోజుల్లో సమస్య పరిష్కరించకుంటే తహసీల్దార్, మండల పరిషత్ కార్యాలయాలు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో పెద్ద ఎత్తున మహిళలతో పాటు సీపీఎం నాయకులు కె.గోవింద, వి.నూకరత్నం, వి.శ్రీదేవి పాల్గొన్నారు. -
‘పిల్లలు చేసిన తప్పేంటి?’: ఎమ్మెల్సీ రవిబాబు
విద్యార్థుల తరలింపు విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు పాఠశాలకు చేరుకుని పిల్లలతో మాట్లాడారు. అనంతరం అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వేళ పిల్లలను భయభ్రాంతులకు గురిచేసి తరలించడం అమానుషమన్నారు. ‘ఆ పసిబిడ్డలు చేసిన తప్పేంటి? వారి చదువులు, భవిష్యత్తుతో ఇలా ఆడుకోవడం సరికాదు’ అని మండిపడ్డారు. సీవోఈ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, శాశ్వత భవన నిర్మాణం పూర్తయ్యే వరకు అద్దె భవనంలో దాన్ని నిర్వహించాలని సూచించారు. రాష్ట్రంలో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న మారికవలస గురుకులాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. -
జిల్లా దస్తావేజు లేఖర్ల నూతన కార్యవర్గం
అనకాపల్లి/చోడవరం: జిల్లా దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం అధ్యక్షునిగా వడ్డాది రమేష్(చోడవరం) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలో కొత్తూరు పంచాయతీ శారదానగర్ శ్రీనివాస ఫంక్షన్ హాల్లో బుధవారం జరిగిన ఎన్నికల్లో జిల్లా గౌరవాధ్యక్షునిగా సున్నం చిదంబరస్వామి(నర్సీపట్నం), ప్రధాన కార్యదర్శి బొగ్గారపు వెంకట గున్నాజీరావు(అనకాపల్లి), ఉపాధ్యక్షులుగా డి.ఎస్.వి.జె.ఎన్.మురళీకృష్ణ (నక్కపల్లి), సహాయ కార్యదర్శిగా రనరం సన్యాసినాయుడు(నర్సీపట్నం), కోశాధికారిగా ఆర్లే ఉమామహేశ్వరరావు(యలమంచిలి), ఆర్గనైజింగ్ కార్యదర్శిగా శేఖర్మంత్రి శ్రీనివాసరావు (సబ్బవరం) కార్యవర్గ సభ్యులుగా కోట్ని గణేష్, సూదికొండ మాణిక్యాలరావు, ఒమ్మిడిపాటి వరప్రసాద్, జూరెడ్డి శ్రీరామూర్తి, బొబ్బిలి సన్యాసినాయుడుతో పాటు మరో తొమ్మిది మంది ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెనుమాక వెంకట సుబ్బారావు, రాష్ట్ర కార్యదర్శి గాదె రవికుమార్, రాష్ట్ర కోశాధికారి అవ్వారు సత్యనారాయణ వ్యవహరించారు. ఈ సందర్బంగా వడ్డాది రమేష్ మాట్లాడుతూ పై కమిటీ రెండు సంవత్సరాలు ఉంటుందన్నారు. జిల్లాలో దస్తావేజుల లేఖరులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు చేస్తామన్నారు. -
పెళ్లికి వెళ్తూ అనంత లోకాలకు..
ఆనందపురం/డెంకాడ: సింహాచలంలో జరిగే స్నేహితుడి పెళ్లి వేడుకలో పాల్గొనాలని ఉదయాన్నే సంతోషంగా బయలుదేరారు. పెళ్లి సందడి చూసి, ఆనందంగా తిరిగి రావాలని అనుకున్నారు. కానీ కొన్ని క్షణాల్లోనే ఆ ప్రయాణం విషాదంగా మారింది. కారు లారీని ఢీకొనడంతో సంతోషంగా సాగాల్సిన ప్రయాణం ఓ కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. విజయనగరం జిల్లా డెంకాడ మండలం బొడ్డవలస గ్రామానికి చెందిన కోన రవికిశోర్ (37) సీఆర్పీఎఫ్ జవాన్. బంధువులతో కలిసి సింహాచలంలో జరిగే స్నేహితుడు శంకర్ వివాహ వేడుకకు కారులో బయలుదేరారు. గురువారం ఉదయం ఆనందపురం నుంచి పెందుర్తి వైపు వెళ్తుండగా గంభీరం పంచాయతీ పరిధిలోని దుక్కవానిపాలెం టోల్గేట్ సమీపంలో కారు అదుపుతప్పింది. డివైడర్పైకి ఎక్కిన కారు, అవతలి వైపు నుంచి వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. డ్రైవింగ్ చేస్తున్న రవికిశోర్కు తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. క్షణం ముందు వరకు కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లి వేడుకకు బయలుదేరిన ఆయన.. అదే ప్రయాణంలో విగతజీవిగా మారడం అందరినీ కలచివేసింది. కారులో ఉన్న రౌతు వరాలమ్మ, కోన వరాలమ్మ, రౌతు దుర్గ, కురుముంజి వరలక్ష్మి, బంటుపల్లి లక్ష్మి గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. రవికిశోర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వాస్పత్రికి చేర్చారు. పెళ్లి ఇంటికి చేరాల్సిన వేళ విషాద వార్త చేరడంతో ఇరు కుటుంబాల్లో కన్నీటి పర్యంతమైంది. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లి కళ్లెదుటే... జమ్ముకశ్మీర్లో విధులు నిర్వర్తిస్తున్న కోన కిశోర్ బుధవారం సింహాచలంలో జరిగే స్నేహితుడి పెళ్లికోసం స్వగ్రామమైన బొడ్డవలసకు మంగళవారం వచ్చాడు. బొడ్డవలసకు చెందిన శంకర్ పెళ్లికోసం పేరంటాళ్లను తీసుకుని బుధవారం కారులో బయలుదేరి వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. కారులో తల్లి కోన వరహాలు కూడా ఉంది. తల్లి కళ్లెదుటే కొడుకు ప్రాణాలు విడవడంతో కన్నీటిపర్యంతమైంది. వరహాలకు కూడా స్పల్పగాయాలయ్యాయి. భార్య, ఇద్దరు ఆడ పిల్లలు మృతుడికి భార్య భాగ్యశ్రీ, కుమార్తెలు రిషితశ్రీ (3వ తరగతి), గాత్వికశ్రీ (ఎల్కేజీ)లు ఉన్నారు. తల్లిదండ్రులు కోన చిదంబరం, వరహాలకు ఇద్దరు కుమార్తెలు, రవికిశోర్ ఒక్కడే కుమారుడు. కుటుంబానికి మృతుడి జీతమే ఆధారం. ప్రమాదంలో ఒక్కగానొక్క కొడుకు మృతిచెందడంతో కుటుంబంలో అంతులేని విషాదం అలుముకుంది. రవికిశోర్ మృతదేహానికి పోలీస్ లాంచనాలతో బొడ్డవలసలో అంత్యక్రియలు నిర్వహించారు. సీఆర్పీఎఫ్ జవాన్ కోన రవికిశోర్(ఫైల్) మృతుడుకోన రవికిశోర్ -
చదువుల గూడు చెదిరింది
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరిట మారికవలస గురుకులంలో కర్కశత్వం అర్ధరాత్రి 480 మంది విద్యార్థుల బలవంతపు తరలింపు ‘సారూ.. మమ్మల్ని ఇక్కడే చదువుకోనివ్వండి’ అంటూ కన్నీళ్లతో వేడుకోలు ‘మా పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు?’ అంటూ తల్లిదండ్రుల ఆవేదన ప్రభుత్వ తీరుపై భగ్గుమన్న గిరిజన సంఘాలు, వైఎస్సార్సీపీ నేతలుఇది రాతిగుండెల ప్రభుత్వం మా దగ్గర ఓట్లు వేయించుకుని గద్దెనెక్కిన ఈ ప్రభుత్వానికి మా పేద పిల్లల కష్టాలు కనిపించడం లేదా? ఇది పూర్తిగా గుడ్డి ప్రభుత్వం. రాత్రి ఒంటి గంటకు ఫోన్ చేసి అర్జెంటుగా స్కూల్కి రమ్మంటే 125 కిలోమీటర్ల దూరం నుంచి అంత అర్ధరాత్రి ఎలా రాగలం? నేను అరకు గన్నెల పంచాయతీ తడక నుంచి వచ్చాను. మా పిల్లల జీవితాలతో ఆడుకోవద్దు. ఇక్కడే చదవనివ్వాలి. – నరాజి పద్మ, విద్యార్థి తల్లి మా ఉసురు కూటమికి తగులుతుంది అర్ధరాత్రి వేళ ఫోన్ చేసి రమ్మన్నారు. ఈ బడి బాగుంటుందని కడుపు కట్టుకుని మా పిల్లలను చేర్పించాం. తీరా చూస్తే విద్యా సంవత్సరం మధ్యలో ఎక్కడికో తరిమేస్తున్నారు. మా పిల్లల భవిష్యత్తు, చదువు ఏమైపోవాలి? రాత్రంతా మమ్మల్ని మానసిక క్షోభకు గురిచేశారు. మా ఏడుపు, మా ఉసురు వాళ్లకు తగులుతుంది. మంత్రి స్వయంగా ఇక్కడే ఉంచుతామని మాటిచ్చి ఇప్పుడు ఎటుపోయారు? – ఎన్ని వెంకటలక్ష్మి, విద్యార్థి తల్లి, పాడేరు గిరిజనులంటే అంత చులకనా? భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి మా గిరిజన వేషధారణలు, మా సంస్కృతి సంప్రదాయాలను ప్రచారానికి వాడుకున్నారు. అప్పుడు గుర్తొచ్చిన మేము.. ఇప్పుడు అవసరం లేదా? గిరిజన బిడ్డలంటే పాలకులకు ఇంత చులకనా? మారికవలసలో నాణ్యమైన విద్య దొరుకుతుందని ఆశపడితే ఉన్న ఫళంగా గెంటేస్తున్నారు. ఇంత కర్కశంగా వ్యవహరించడం దుర్మార్గం. – కిల్లో సహదేవ్, విద్యార్థి తండ్రి మధురవాడ: రాత్రి 10 గంటలు.. చుట్టూ చిమ్మచీకటి. గురుకుల వసతి గృహంలో రేపటి పాఠాల గురించి కలలు కంటూ నిద్రిస్తున్న గిరిజన బిడ్డలకు ఒక్కసారిగా బూట్ల చప్పుళ్లు, అధికారుల గద్దింపులు వినిపించాయి. ‘తెల్లారేసరికి స్కూల్ ఖాళీ చేయాలి.. బ్యాగులు సర్దుకోండి’ అంటూ హుకుం జారీ చేశారు. నిద్రమత్తులోనే పుస్తకాలు, బట్టలు బ్యాగుల్లో సర్దుకున్న విద్యార్థులు.. ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమన్నారు. ‘సారూ.. మమ్మల్ని ఇక్కడే చదువుకోనివ్వండి’ అంటూ కొందరు చేతులు జోడించి వేడుకున్నా ఫలితం లేకపోయింది. అర్ధరాత్రి దాటిన తర్వాత కొండకోనల్లో ఉన్న తల్లిదండ్రులకు ఫోన్లు చేసి ‘మీ పిల్లలను తరలిస్తున్నాం.. వెంటనే రండి’ అని సమాచారం ఇచ్చారు. వారు విశాఖ చేరుకునేలోపే 480 మంది విద్యార్థులను పోలీసుల పహారా మధ్య బస్సుల్లో ఎక్కించి సబ్బవరం, శ్రీకృష్ణాపురం, దేవరాపల్లి, పార్వతీపురం ప్రాంతాలకు తరలించారు. దీంతో మారికవలస–తిమ్మాపురం రోడ్డులోని గురుకుల ప్రాంగణం విద్యార్థుల ఆర్తనాదాలు, తల్లిదండ్రుల రోదనతో దద్దరిల్లింది. చదువు కోసం దూరం నుంచి వచ్చిన బిడ్డలు అరకు, పాడేరు, కొయ్యూరు, చింతపల్లి తదితర ఏజెన్సీ ప్రాంతాల కొండకోనల నుంచి వచ్చిన 480 మంది గిరిజన విద్యార్థులు మారికవలస గురుకులంలో చదువుకుంటున్నారు. మెరుగైన విద్య అందుతుందన్న ఆశతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఇక్కడ చేర్పించారు. అయితే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) ఏర్పాటు కోసం ఈ పాఠశాలను ఖాళీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఆ పిల్లల చదువులపై అనిశ్చితి నెలకొంది. విద్యార్థులను ఇతర పాఠశాలలకు తరలించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గత కొద్దిరోజులుగా తల్లిదండ్రులు, గిరిజన సంఘాలు, వైఎస్సార్సీపీ నాయకులు ఆందోళనలు చేస్తున్నారు. పాఠశాలను ఇక్కడే కొనసాగించాలని, సీవోఈకి ప్రత్యామ్నాయ భవనం చూడాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన పేరెంట్స్ సమావేశంలోనూ ఇదే విషయాన్ని తల్లిదండ్రులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే వారి అభ్యంతరాలను పక్కనపెట్టి మంగళవారం అర్ధరాత్రి అధికారులు, పోలీసులు పాఠశాలకు చేరుకోవడం తీవ్ర కలకలం రేపింది. అర్ధరాత్రి ‘ఆపరేషన్’ రాత్రివేళ పాఠశాలకు చేరుకున్న అధికారులు, పోలీసులు గేట్లు మూసివేసి విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేశారు. బ్యాగులు సర్దుకోవాలని హుకుం జారీ చేశారు. నిద్రపోతున్న బిడ్డలను లేపి.. పుస్తకాలు, బట్టలు సర్దించి.. తెల్లారేలోగా పాఠశాలను ఖాళీ చేయించారు. ఒంటిగంట దాటిన తర్వాత ఏజెన్సీ ప్రాంతాల్లోని తల్లిదండ్రులకు ఫోన్లు చేసి పిల్లలను తరలిస్తున్నట్టు చెప్పారు. అప్పటికే రాత్రి కావడంతో దూర ప్రాంతాల నుంచి బయలుదేరడం తల్లిదండ్రులకు సాధ్యం కాలేదు. కొందరు అర్ధరాత్రే వాహనాల కోసం పరుగులు తీశారు. మరికొందరు ‘మా పిల్లల్ని మాకు చూపించండి.. మేమే వచ్చి తీసుకెళ్తాం’ అంటూ అధికారులను వేడుకున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ అంతలోనే ప్రత్యేక బస్సులు సిద్ధమయ్యాయి. పోలీసుల పహారా మధ్య విద్యార్థులను బస్సుల్లోకి ఎక్కించి సబ్బవరం, శ్రీకృష్ణాపురం, దేవరాపల్లి, పార్వతీపురం తదితర ప్రాంతాలకు తరలించారు. బిడ్డల కన్నీళ్లు.. తల్లిదండ్రుల ఆర్తనాదాలు.. పోలీసుల పహారా.. అధికారుల హడావుడి.. వెరసి ఆ రాత్రి మారికవలస గురుకుల ప్రాంగణం ఓ విషాద దృశ్యాన్ని తలపించింది. తల్లిదండ్రుల్లో ఆందోళన పెంచి పెద్దచేసి మంచి చదువు అందించాలన్న ఆశతో కొండకోనల నుంచి వందల కిలోమీటర్ల దూరం పంపిన పిల్లలను అర్ధరాత్రి హడావుడిగా తరలించడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీవోఈ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, అయితే విద్యార్థుల చదువుకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గిరిజన, ప్రజాసంఘాలు, వైఎస్సార్సీపీ శ్రేణులు కూడా అధికారుల తీరుపై మండిపడ్డాయి. ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ, సాంఘిక సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ సునీల్కుమార్ రాజా, సోషల్ వెల్ఫేర్ డీడీ రామకృష్ణ, డీఎస్టీడబ్ల్యూవో సురేష్ల పర్యవేక్షణలో తరలింపు జరిగినట్లు సమాచారం. అమరావతిని ముట్టడిస్తాం.. విద్యా సంవత్సరం మధ్యలో విద్యార్థులను ఇలా రోడ్డున పడేయడం దారుణం. మొన్నటి పేరెంట్స్ మీటింగ్లో ప్రిన్సిపల్ సెక్రటరీ సమక్షంలో పిల్లలను ఇక్కడే ఉంచుతామని స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే సహించేది లేదు. అవసరమైతే అమరావతి వరకు వెళ్లి సర్కారు మెడలు వంచుతాం. – పూజారి గోవిందరావు, పీసా ఉపాధ్యక్షుడు -
సరుగుడు...నష్టాలకు విరుగుడు
చోడవరం: ఈ ఏడాది సరుగుడు సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. గతంలో మెట్ట ప్రాంతాలకే పరిమితమైన సరుగుడు సాగు ఇప్పుడు నదీ పరివాహక ప్రాంతాల్లోను, పల్లపు ప్రాంతాల్లోనూ అధికంగా సాగు చేస్తున్నారు. వ్యవసాయ పెట్టుబడులు పెరిగిపోవడంతో ఈ ఏడాది వరి, చెరకు సాగు తగ్గింది. వీటి స్థానంలో తక్కువ ఖర్చుతో సాగయ్యే సరుగుడు వేసేందుకు రైతులు ఎక్కువగా మొగ్గు చేపుతున్నారు. దీనితో సరుగుడు నారుకు విపరీతమైన గిరాకీ పెరిగింది. చోడవరం నియోజకవర్గంలో ప్రధాన పంటలు వరి, చెరకు. ఈ రెండు పంటలు సాధారణ విస్తీర్ణం ఏటా 21వేల 500 ఎకరాల్లో వరి, 30వేల ఎకరాల్లో చెరకు సాగు జరుగుతుంది. సరుగుడు సాగు 6వేల ఎకరాల్లో జరిగేది. అయితే ఈ ఏడాది సరుగుడు సాగు ఏకంగా 10వేల ఎకరాలకు పైబడి జరుగుతుందని అంచనా వేస్తున్నారు. సకాలంలో వర్షాలు పడకపోవడం, మరో పక్క వరి నారు ముడుగులు ఆశించిన స్థాయిలో నీరు, నారు లేకపోవడంతో ఆదిలోనే వరి సాగుకి నారు సమస్య ఉత్పన్నమైంది. అంతేకాకుండా సబ్సిడీపై అందాల్సిన డీఏపీ ఎరువును ప్రభుత్వం అనుకున్నంతగా అందించలేకపోయింది. వీటికితోడు దమ్ములు, ఉడుపులకు యంత్రాలు, ట్రాక్టర్లు, కూలీలకు అయ్యే ఖర్చు నాట్లు సమయంలోనే ఎకరాకి రూ.15 నుంచి 20 వేలకు ఖర్చవుతుండడంతో పెట్టుబడి పెట్టలేని పరిస్థితిలో రైతులు ఉన్నారు. ఈ రెండు పంటలకు ఈ ఏడాది పెట్టుబడులు భారీగా పెరిగాయి. మరో పక్క గోవాడ సుగర్ ఫ్యాక్టరీ రెండేళ్లుగా క్రషింగ్ చేయకుండా మూసివేయడంతో ప్రత్యామ్నాయ పంటలపై రైతులు ఆసక్తి చూపారు. ఈ పరిస్థితుల్లో పెద్దగా ఖర్చులేకుండా ఒకసారి ఉడిస్తే 4,5 యేళ్లు ఎటువంటి పెట్టుబడి లేకుండా ఒకేసారి మొత్తంలో డబ్బులు వచ్చే వాణిజ్య పంట అయిన సరుగుడుపై ఈ ఏడాది రైతులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. జోరుగా సరుగుడు నారు వేసే పనిలో నిమగ్నమయ్యారు. సరుగుడు సాగు చేసేవారు సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో నారు కొరత ఏర్పడింది. ఒక్కో మొక్క 80 పైసలు నుంచి రూపాయి ఉండగా ఇప్పుడు డిమాండ్ను బట్టి రూపాయి 20 పైసలకు అమ్ముతున్నారు. అయినా నారుకోసం దూర ప్రాంతాలకు వెళ్లి మరీ తెచ్చి రైతులు సాగు చేస్తున్నారు. అయితే ఆహార పంటలైన వరి, చెరకు సాగు తగ్గడంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. -
విద్యార్థుల భవిషత్తుతో చెలగాటం బాధాకరం
అరకు ఎంపీ తనుజారాణిపాడేరు రూరల్: గిరిజన విద్యార్థుల భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడడం బాధాకరమని అరకు ఎంపీ తనుజారాణి అన్నారు. బుధవారం ఆమె స్థానిక విలేకరులతో ఫోన్లో మాట్లాడారు. విశాఖపట్నం మారికవలస గురుకుల పాఠశాల నుంచి విద్యార్థులను బలవంతంగా వివిధ పాఠశాలలకు తరలించడం గిరిజనుల పట్ల కక్షసాధింపు చర్యేనని చెప్పారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించవలసిన ప్రభుత్వం కార్పొరేట్ శక్తులను పెంచిపోషిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన పేద విద్యార్థులు అనే చిన్నచూపుతోనే వారికి ఇష్టంలేకపోయినా తరలించారని, ఇదే మీ పిల్లలైతే ఈవిధంగానే చేస్తారా అని ప్రశ్నించారు. తెలవారుజాము నుంచే విద్యార్థులను తరలించే తీరు చూస్తే ఆవేదన కలిగిందన్నారు. నేరస్తుల పట్ల కూడా ఎవరూ ఈ విధంగా వ్యవహరించరని చెప్పారు. కనీసం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా ఏవిధంగా తరలిస్తారని మండిపడ్డారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, గుడులుగోపురాలపై కూడా కూటమి ప్రభుత్వ పాలకుల కన్ను పడిందన్నారు. ఇప్పటికై నా తప్పు తెలుసుకుని ఆదివాసీ విద్యార్థులను మారికవలస పాఠశాలలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ఎంపీ చెప్పారు. -
వరాహనృసింహునికి నిత్యకల్యాణం
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి బుధవారం ఆర్జిత సేవలు వైభవంగా జరిగాయి. ఉదయం 9.30 నుంచి నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ బేడామండపంలో స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణం జరిపారు. ఉభయ దాతలకు కల్యాణ అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రంలను అందించారు. ఘనంగా గరుడ సేవ శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి గరుడ సేవ ఘనంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని వెండి గరుడ వాహనంపై వేంజేపచేశారు. అష్టోత్తర శతనామావళి పూజ జరిపారు. భక్తులను గరుడ వాహనం చుట్టూ ప్రదక్షిణ చేయించారు. విశేష హారతులు అందించారు. -
విశాఖలో ‘నవ్య’ శకం!
సాక్షి, విశాఖపట్నం: బుక్ చేసిన గ్యాస్ సిలిండర్ ఎప్పుడొస్తుందో అని ఎదురుచూస్తున్నారా.? సిలిండర్ మోసుకురావాలంటే అలిసిపోతున్నారా.? ఇకపై మీకు సమస్య లేదు. ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నట్లు సిలిండర్ ఆర్డర్ పెట్టేసుకుంటే.. నిమిషాల వ్యవధిలో మీ ఇంట్లో వాలిపోతుంది. ఒక చోటు నుంచి మరో చోటికి సులువుగా, శ్రమ లేకుండా తీసుకెళ్లేలా మీ చేతిలో ఒదిగిపోతుంది. అదే.. హిందూస్థాన్ పెట్రోలియం(హెచ్పీ) తీసుకొచ్చిన ‘నవ్య’మైన సిలిండర్. ఇప్పటికే బెంగళూరు, విజయవాడల్లో అందుబాటులోకి వచ్చిన ఈ సిలిండర్ను తాజాగా విశాఖ మార్కెట్లోకి కూడా ప్రవేశపెట్టారు. శివాజీపాలెంలోని రఘురాం గ్యాస్ ఏజెన్సీ వద్ద బుధవారం హెచ్పీ కంపెనీ ప్రతినిధులు 10 కిలోల కాంపోజిట్ సిలిండర్ ‘హెచ్పీ నవ్య’ను లాంఛనంగా మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. ఏమిటీ ‘నవ్య’ ప్రత్యేకతలు.? నవ్య సిలిండర్ పాలిమర్తో తయారు చేశారు. బరువు తక్కువ, భద్రత ఎక్కువ అన్న సూత్రంతో రూపొందిన ఈ సిలిండర్ ఈ జనరేషన్కి పర్ఫెక్ట్ మ్యాచ్ అని హెచ్పీసీఎల్ వర్గాలు చెబుతున్నాయి. సాంప్రదాయ ఇనుప సిలిండర్లతో పోలిస్తే ఈ కొత్త కాంపోజిట్ సిలిండర్ అత్యంత తేలికగా ఉండటమే కాకుండా అనేక ఆధునిక వసతులను కలిగి ఉందంటున్నారు. గ్యాస్ ఎంత ఉందో చూసుకోవచ్చు! గ్యాస్ ఉందా లేదా అనే టెన్షన్ని కూడా ఈ కొత్త సిలిండర్ లేకుండా చేస్తుంది. పాలిమర్ సిలిండర్లో మధ్యలో ఫైబర్గ్లాస్ సాంకేతికతను ఏర్పాటు చేశారు. అందుకే ఇది పాక్షికంగా పారదర్శకంగా ఉంటుంది. లోపల గ్యాస్ ఎంత ఉందనేది ఎప్పటికప్పుడు మనం చూసుకునే వెసులుబాటు ఉన్న ఒక స్మార్ట్ కాంపోజిట్ సిలిండర్ ఇది. దీంతో రీఫిల్ బుకింగ్ సమయాన్ని ముందుగానే అంచనా వేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఫైబర్గ్లాస్ మెటీరియల్తో రూపుదిద్దుకోవడం వల్ల తుప్పు పట్టే సమస్య ఉండదు. ప్రమాదాల బారిన పడకుండా అత్యున్నత భద్రతా ప్రమాణాలతో, పేలుడు సంభవించని రీతిలో దీనిని రూపొందించారు. 10 కేజీల సిలిండర్ ఇది 10 కిలోల సిలిండర్. అపార్టుమెంట్లు, చిన్న కుటుంబాలు, ఉద్యోగులు, విద్యార్థులతో పాటుగా అదనపు గ్యాస్ కనెక్షన్ కావాలనుకునేవారికి అనుకూలంగా ఉంటుంది. ఈ సిలిండర్ ధర ప్రాంతాన్ని అనుసరించి, మొదటిసారి కనెక్షన్ తీసుకున్నప్పుడు రూ.4,900 నుంచి రూ.5,002 వరకూ ఉంటుందని హెచ్పీ అధికారులు చెబుతున్నారు. తొలిసారి కొనుగోలు చేసినప్పుడు మాత్రం గుర్తింపు కార్డు, డాక్యుమెంటేషన్ ప్రక్రియ ఉంటుంది. తర్వాత ఇక సులువే. దీని రీఫిల్ ధర రూ.1,600 నుంచి రూ.1,700 వరకూ ఉంటుంది. విశాఖ మార్కెట్లోకి ‘హెచ్పీ నవ్య’ మద్దిలపాలెం: హెచ్పీసీఎల్ రిఫైనరీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అభిషేక్ త్రివేది, ఎల్పీజీ చీఫ్ జనరల్ మేనేజర్ దేబేష్ పురోహిత్, డిప్యూటీ జనరల్ మేనేజర్ మహేందర్ సింగ్ చేతుల మీదుగా ‘హెచ్పీ నవ్య’ను శివాజీపాలెంలో గల రఘురాం గ్యాస్ ఏజెన్నీ వద్ద బుధవారం మార్కెట్లోకి లాంఛనంగా ప్రవేశపెట్టారు. అనంతరం సేల్స్ ఆఫీసర్ ప్రతాప్ కుమార్, డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఎన్డీ సేల్స్) ఆశీష్ సింఘాల్ మాట్లాడుతూ వినియోగదారులకు మరింత భద్రతతో పాటు సులభమైన వినియోగాన్ని అందించడమే లక్ష్యంగా ఈ ఆధునిక సిలిండర్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీజీఎం(ఎల్పీజీ సేల్స్) ఆర్.ఉమాపతి, చీఫ్ మేనేజర్ (కమర్షియల్) బి.వి.వి.రాజు తదితరులు పాల్గొన్నారు. -
బతుకులు
విద్యుత్ కాంతులు పంచుతున్న ఆ కార్మికుల బతుకుల్లో వెలుగుకానరావడం లేదు. ఏళ్ల తరబడి గొడ్డుచాకిరీ చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు చాలీచాలని వేతనాలతో జీవితాలు వెల్లదీయవలసి వస్తోంది. చుట్టూ ప్రమాదాలు మోహరించి ఉన్నా కుటుంబ పోషణకోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వెట్టిచాకిరీ చేస్తున్న వారిని కూటమి ప్రభుత్వం, ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వెలుగులు లేని● గేటు వద్ద సామూహికంగా భోజనాలు ● సోషల్మీడియాలో వీడియోలనుచూసి కన్నీరుపెట్టుకున్న తల్లిదండ్రులు ఐటీడీఏ ముట్టడి మారికవలస నుంచి విద్యార్థుల తరలింపునకు వ్యతిరేకంగా ఆందోళనపాడేరు రూరల్: ‘మా పిల్లల భవిష్యత్తును నాశనం చేయకండి.. చదువులో రాణించి మా బతుకులు మారుస్తారని దూరాభారమైనా పంపిస్తే ఇప్పుడు కనికరం లేకుండా వేరే ప్రాంతానికి తరలించడంతో వారికి నాణ్యమైన చదువు అందదు’ అంటూ గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. మా బిడ్డలను మారికవలస గురుకులంలోనే చదువుకోనివ్వండి అంటూ ప్రాధేయపడుతూ పాడేరు ఐటీడీఏ కార్యాలయాన్ని బుధవారం ముట్టడించారు. విశాఖపట్నంలోని మారికవలస గురుకులం నుంచి గిరిజన విద్యార్థులను తరలించడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ మాట్లాడుతూ.. గిరిజన విద్యార్థులపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. నిరంకుశ పాలనలో భాగంగా పాడేరు ఐటీడీఏ పీవో, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్, జిల్లా యంత్రాంగంతో పాటు వివిధ శాఖల అధికారులు మారికవలస పాఠశాలలో రాత్రి బసచేసి తెల్లవారుజామున విద్యార్థులను కర్కశంగా వివిధ పాఠశాలలకు తరలించడం బాధాకరమన్నారు. కనీసం తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా నేరస్తులను తరలించినట్లుగా బస్సుల్లో తరలించడం తగదన్నారు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు మారికవలస పాఠశాలలో ఉన్న పిల్లలను తక్షణం ప్రభుత్వం బలవంతంగా తరలించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పాఠశాల నుంచి ఖైదీలను తరలించినట్లు విద్యార్థులను బస్సుల్లో తీసుకెళ్లిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ వీడియోలను చూసి వారు తల్లడిల్లిపోయారు. గుండెలు బాదుకుని విలపించారు. అభంశుభం తెలియని విద్యార్థుల పట్ల కూటమి ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు తల్లిదండ్రులు విశాఖ వెళ్లి తమ పిల్లలను పాడేరు తీసుకొచ్చారు. పాడేరు ప్రధాన రోడ్డుపై సాయంత్రం ర్యాలీ నిర్వహించి ఐటీడీఏ గేటు వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. కలెక్టర్, పీవో, డీడీ తక్షణం సమాధానం చెప్పాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అక్కడే సామూహికంగా భోజననాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, నాయకులు పార్వతి, రమేష్నాయుడు, వెంకటరాజు, శ్రీను, పుష్పవతి, పుణ్యవతి, మహిళా సంఘం నాయకురాలు చిన్ని పాల్గొన్నారు. సీలేరు: రాష్ట్రానికి వెలుగులు పంచే విద్యుత్ కేంద్రాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మి కుల బతుకులు దయనీయంగా మారుతున్నాయి. చాలీచాలని జీతాలతో కు టుంబాలు సైతం గడవని పరిస్థితి నెలకొంది. ఏళ్ల తరబడి జెన్కోనే నమ్ముకుని పనిచేస్తున్న వారిని ఉన్నతాధికారులు, కూటమి ప్రభు త్వం పట్టించుకోవడం లేదు. వారి శ్రమను దోపిడీ చేస్తూ, కష్టానికి తగిన వేతనం ఇవ్వడం లేదు. ఏపీ జెన్కో సీలేరు విద్యుత్ కాంప్లెక్స్ పరిధిలో 323 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో మోతుగూడెంలో 210 మంది, డొంకరాయిలో 60 మంది, సీలేరులో 53 మంది దశాబ్దాలుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి కేవలం 22 వేల చొప్పున చెల్లిస్తున్నారు. ప్రమోషన్ అవకాశం, సరైన ఇంక్రిమెంట్, ఈఎస్ఐ సౌకర్యం, ఉద్యోగ భద్రత, పెన్షన్ తదితర సౌకర్యాలు లేకుండా ఏళ్ల తరబడి వెట్టిచాకిరీ చేస్తున్నారు. 35 ఏళ్లుగా రాత్రీపగలు తేడా లేకుండా ప్రమాదకర పనులు చేస్తున్న కాంట్రాక్టు కార్మికుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. పర్మినెంట్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కాంట్రాక్టర్ వ్యవస్థను రద్దుచేయాలని, తమను సంస్థలో విలీనం చేయాలని, జెన్కో నేరుగా జీతాలు ఇవ్వాలని, తెలంగాణ తరహాలో వేతనాలు చెల్లించాలని ఏళ్ల తరబడి కోరుతున్నా ఆలకించే నాథుడే కరవయ్యాడు. హామీలు గుప్పించి... ఆనక మరిచి ఎన్నికల సమయంలో కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పిన కూటమి నాయకులు హామీలు గుప్పించి, వారిలో ఆశలు రేకెత్తించారు. తీరా గెలిచిన తరువాత ఆ మాటే మరిచిపోయారు. అధికారం చేపట్టి రెండేళ్లవుతున్నా ఆ ఊసే ఎత్తడం లేదు. ప్రస్తుతం విద్యుత్ సంస్థల్లో కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య పెరుగుతూ వారే కీలకంగా మారినప్పటికీ వారికి వేతనాలు ఎక్కడవేసిన గొంగలి అన్న చందంగా ఉన్నాయి. దీంతో కుటుంబాన్ని పోషించలేక, పిల్లలకు మంచి చదువులు చెప్పించలేక సతమతమవుతున్నారు. ప్రమాదకర పనులు ఏపీ జెన్కో సీలేరు విద్యుత్ కాంప్లెక్స్లో కాంట్రాక్ట్ కార్మికులతో ప్రమాదకర పనులు చేయిస్తున్నారు. అన్స్కిల్డ్ కేటగిరీలో చేరిన వీరికి సరైన శిక్షణ ఇవ్వకుండా పనులు అప్పగిస్తున్నారు. దీంతో వారి ప్రాణాలకు భద్రత కరవైంది. విధి నిర్వహణలో కాంట్రాక్ట్ కార్మికులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. పొరుగు రాష్ట్రంలో.. పొరుగు రాష్ట్రం తెలంగాణ కార్మికులకు రూ. 48 వేలు జీతం చెల్లిస్తుండగా మన రాష్ట్రంలో అదే కార్మికులకు 22,000 జీతం ఇస్తున్నారు. కష్టపడి పనిచేసే కార్మికులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చకుండా నిబంధనల పేరుతో మరింత ఇబ్బందులకు గురి చేస్తోందని పలు యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆందోళనలు చేసినా... దశాబ్దాలుగా జెన్కోలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికులను సంస్థలో విలీనం చేయాలని లేదా, సంస్థే నేరుగా తెలంగాణ తరహాలో జీతాలు చెల్లించాలని పలుమార్లు ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు చేసి, వినతి పత్రాలు అందజేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కాంట్రాక్ట్ కార్మికులే అధికం గతంలో జెన్కోలో పర్మినెంట్ ఉద్యోగులు సంఖ్య అధికంగా ఉండేది. ఉద్యోగుల పదవీ విరమణ, మరణించడం, కొత్త నియామకాలు లేకపోవడంతో వారి సంఖ్య తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం సీలేరు కాంప్లెక్స్పరిధిలోని మూడు ప్రాజెక్టుల్లో సుమారు 250 మంది పర్మినెంట్ ఉద్యోగులు పనిచేస్తుండగా కాంట్రాక్ట్ కార్మికులు 323 మంది పనిచేస్తున్నారు. అధికంగా కాంట్రాక్ట్ కార్మికులే ఉన్నా వారి సంక్షేమం గురించి పట్టించుకునే వారే లేరు. ఇప్పటికై నా తమను పర్మినెంట్ చేయాలని, సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని కాంట్రాక్ట్ కార్మికులు కోరుతున్నారుప్రధాన డిమాండ్లు.. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను భేషరతుగా పర్మినెంట్ చేయాలి. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి. గ్రాట్యుటీ రూ.20 లక్షలు, ప్రమాద బీమా రూ.కోటి ప్రతి కార్మికుడికి అమలు చేయాలి. తెలంగాణ రాష్ట్రం తరహాలో కనీస వేతనం రూ.48 వేలు చెల్లించాలి. జీవో.167 ప్రకారం పనిచేస్తున్న కార్మికులకు జీవో నంబర్ 129 ప్రకారం వేతనాలు చెల్లించాలి. కాంట్రాక్టర్లు ప్రతి నెల ఒప్పందం ప్రకారం 7 వ తేదీ లోపు వేతనాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. దుర్భరంగా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల జీవితాలు చాలీచాలని జీతాలతో అవస్థలు ప్రమాదకర పనులు చేయిస్తున్నా పట్టని ఉన్నతాధికారులు ఎన్నికల హామీని విస్మరించిన కూటమి ప్రభుత్వం భారంగా కుటుంబ పోషణ జీతం సరిపోక ఇబ్బందులు పడుతున్నాం సీలేరులో గత 20 ఏళ్లుగా కాంట్రాక్టు కార్మికుడిగా పారిశుధ్యం విభాగంలో పనిచేస్తున్నాను. జీతం సరిపోక కుటుంబ పోషణ ఇబ్బందిగా మారుతోంది. కనీస సదుపాయాలు కల్పించడంతో పాటు వేతనాలు పెంచాలి. – అప్పలరాజు, జెన్ కో కార్మికుడు సీలేరు జీతం చాలక ఇబ్బందులు నేను సీలేరు ఏపీ జెన్కోలో 15 సంవత్సరాలుగా కాంటాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం రూ.22 వేలు చేతికి వస్తోంది. దీంతో కుటుంబ పోషణ ఇబ్బందిగా ఉంది. ప్రస్తుతం నిత్యావసర సరుకులు ధరలు, ఇతర ఖర్చులు, పిల్లల చదువుల ఖర్చులు పెరిగిపోవడంతో అప్పులు చేయాల్సి వస్తోంది. చాలా సంవత్సరాలుగా ఇదే జీతంతో పని చేస్తున్నాను. ప్రభుత్వం స్పందించి జీతం పెంచాలి. – బాపిరాజు, కాంట్రక్ట్ కార్మికుడు, సీలేరు తెలంగాణ తరహాలోసదుపాయాలు కల్పించాలి మన రాష్ట్రంలో జెన్ కో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను కూటమి ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. తెలంగాణ తరహాలో అన్ని సదుపాయాలు కల్పిస్తూ రూ.48 వేల జీతాన్ని అమలు చేయాలి. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తాం. – బి.లక్ష్మణరావు, సీఐటీయూ బ్రాంచ్ అధ్యక్షుడు -
రెండు చోరీ కేసుల్లో నలుగురి అరెస్ట్
పెందుర్తి: సబ్బవరం–షీలానగర్ రోడ్డు పనులకు వినియోగించే ఐరన్, కేబుల్ వైర్లను దొంగిలించిన నలుగురు వ్యక్తులను పెందుర్తి పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.4.5 లక్షల విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పెందుర్తి క్రైం పోలీస్ స్టేషన్లో బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయా వివరాలను క్రైం ఏసీపీ ఎ.వెంకటరావు వెల్లడించారు. సబ్బవరం–షీలానగర్ రోడ్డు పనుల నిమిత్తం పెందుర్తి మండలం నందవరపువానిపాలెం సమీపంలో ఐవోసీఎల్ సంస్థ ఐరన్, కేబుల్ వైర్లను నిల్వచేసింది. ఈ నెల 8న సైట్ ఇన్చార్జి తోట సునీల్రాజ్ సామగ్రి సరిచూడగా అందులో దాదాపు రూ.3 లక్షల విలువైన ఐరన్, కేబుల్ వైర్లు చోరీకి గురైనట్లు గుర్తించారు. ● గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి అనుసంధానంగా నిర్మిస్తున్న సబ్బవరం–షీలానగర్ రోడ్డు నిర్మాణ పనుల నిమిత్తం జేపీ కన్స్ట్రక్షన్స్ సంస్థ నరవ వద్ద సెంటరింగ్ ప్లేట్లు, యూ జాకీలు, బేస్ జాకీలు భద్రపరిచింది. గత నెల 10న సైట్ సెక్యూరిటీ సూపర్వైజర్ వంకా శివశంకర్ సామగ్రి పరిశీలించగా రూ.1.50 విలువైన సామాగ్రి చోరీకి గురైనట్లు గుర్తించారు. ఆయా చోరీల విషయంలో ఫిర్యాదులు అందుకున్న పెందుర్తి క్రైం విభాగం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నగరంలోని కొబ్బరితోట(స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కుప్పిలి)కి చెందిన అలపాన రెడ్డి(29), పూర్ణామార్కెట్ కల్లు పాకల(స్వస్థలం శ్రీకాకుళం జిల్లా లోపెంట)కు చెందిన నాయన అసిరిబాబు(30), పూర్ణామార్కెట్ ప్రసాద్ గార్డెన్స్(స్వస్థలం శ్రీకాకుళం జిల్లా వెంకయ్యపేట)కు చెందిన దల్లి గోవింద్(29), 104 ఏరియాకు చెందిన పరపటి సంతోష్కుమార్(31) ఆయా చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. నిందితులను బుధవారం నగరంలో మాటు వేసి పట్టుకున్నట్లు ఏసీపీ వెల్లడించారు. వారిని నుంచి చోరీ సొత్తును రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. ఆయా కేసుల్లో ప్రతిభ కనబరిచిన వెస్ట్ జోన్ క్రైం సీఐ బి.తిరుమలరావు, పెందుర్తి క్రైం ఎస్ఐ డి.సూరిబాబు, ఏఎస్ఐ కె.శ్రీనివాసరావు, హెచ్సీ వి.పేరయ్యనాయుడు, పీసీలు బి.దేముడునాయుడు, ఎల్.తాతారావులను ఉన్నతాధికారులు అభినందించారు. -
సీఎం రమేష్ అక్రమ మైనింగ్
ఆ క్వారీకి లీజుల్లేవు.. పర్యావరణ అనుమతులు అంతకంటే లేవు. ప్రభుత్వ రికార్డుల్లో మూతపడినట్లు కనిపిస్తుంది.. కానీ వాస్తవానికి అక్కడ నిత్యం వందలాది లారీలు ఖనిజాన్ని తరలించేస్తున్నాయి. కళ్లెదుటే దోపిడీ జరుగుతున్నా అధికారులు కిమ్మనడంలేదు...ఎందుకంటే దాని వెనకున్నది ఎంపీ సీఎం రమేష్ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్, ‘వెంగమాంబ’ క్రషర్స్ అధినేత శ్రీనివాస్ చౌదరిలతో కూడిన మైనింగ్ మాఫియా. అనకాపల్లి జిల్లాలో ఎంపీ సీఎం రమేష్ సాగిస్తున్న దోపిడీకి అంతు లేకుండా పోతోంది. నిబంధనలను తుంగలో తొక్కుతూ రూ.వందల కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. ఈ అక్రమ మైనింగ్ వివరాలివీ.సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : అనకాపల్లి మండలం సీతానగరం గ్రామ పరిధిలోని సర్వే నంబరు 251, 190, 303లో ‘వెంగమాంబ క్రషర్స్’ పేరుతోనూ అక్రమ మైనింగ్ సాగిస్తున్నారు. వాస్తవానికి సర్వే నం. 251లో జీఎస్ఎన్ శ్రీనివాస్ పేరిట ఉన్న 4 హెక్టార్లు, 1 హెక్టారు లీజుల గడువు వరుసగా మే 2023, ఫిబ్రవరి 2022 నాటికే ముగిసిపోయాయి. అలాగే సర్వే నం.193, 303లలో సుమారు 3 హెక్టార్లలో వీవీఆర్ స్టోన్ క్రషర్స్ (వెంగమాంబ శ్రీనివాస్ చౌదరి) పేరిట ఉన్న లీజులకు సైతం ఎలాంటి అనుమతులు లేవు. గతంలో వచ్చిన అక్రమ మైనింగ్ ఫిర్యాదులతో ఈ క్వారీలు మూతపడ్డాయి. మైనింగ్ శాఖ అధికారిక రికార్డుల ప్రకారం ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలు జరగడం లేదు. కానీ, నిబంధనలకు పాతరేసి ప్రతిరోజూ ఇక్కడ తవ్వకాలు జరిపి ఇష్టారాజ్యంగా ఖనిజాన్ని తరలించేస్తున్నారు. పథకం ప్రకారం చేతులు కలిపి... తన అక్రమ వ్యాపారాలకు రక్షణ కవచం ఏర్పాటు చేసుకునేందుకు వెంగమాంబ శ్రీనివాస్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీలో చేరి, అనకాపల్లి ఎంపీగా పోటీ చేసిన సీఎం రమేతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ ఎంపీకి అత్యంత సన్నిహితుడిగా మారారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉందన్న ధీమాతో ఆయన మరింతగా రెచ్చిపోతున్నారు. వెంగమాంబకు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత పీలా గోవింద్ కూడా సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కొద్ది రోజుల క్రితం స్వయంగా పీలా మాట్లాడిన ఆడియో మెసేజ్ కలకలం రేపింది. అనుమతిలేని చోట అడ్డగోలు తవ్వకాలు పాత జరిమానాలకు సంబంధించి ఒక్క పైసా కూడా చెల్లించకపోగా, మైనింగ్ శాఖ డిమాండ్æ నోటీసులు ఇచ్చినా, కోర్టుల్లో కేసులు నడుస్తున్నా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎంపీ సీఎం రమేష్ అండతో.. పర్యావరణ, మైనింగ్ అనుమతులు లేకుండానే రూ.వందల కోట్ల విలువైన ఖనిజాన్ని యథేచ్ఛగా దోచేస్తున్నారు. అనుమతి లేని చోట అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. పట్టపగలే అక్రమ మైనింగ్ నడుస్తూ రోడ్డు మెటల్, బోల్డర్లు రవాణా అవుతున్నా..ఎంపీ జోక్యం ఉండడంతో అటు మైనింగ్ శాఖ అధికారులతో పాటు రవాణా, రెవెన్యూ యంత్రాంగం కూడా అడ్డుకునే సాహసం చేయలేకపోతోంది. కళ్లెదుటే కోట్లాది రూపాయల ప్రభుత్వ సంపద దోపిడీకి గురవుతున్నా అధికారులు చేష్టలుడిగి చూస్తుండడంపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.విజిలెన్స్ అధికారికి లంచం ఆఫర్!వెంగమాంబ స్టోన్ క్రషర్స్ అక్రమాల చరిత్ర ఈనాటిది కాదు. 2020లో మైన్స్ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈ క్వారీల్లో ఆకస్మిక తనిఖీలు జరిపారు. అనుమతులకు మించి ఏకంగా 5,68,923 క్యూబిక్ మీటర్ల ఖనిజాన్ని అక్రమంగా దోచేశారని నిర్ధారించారు. ఈ అడ్డగోలు తవ్వకాల వల్ల ప్రభుత్వ ఖజానాకు ఏకంగా రూ.100 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అంచనా వేసి, రూ. 33 కోట్ల మేర భారీ జరిమానా విధించారు. అయితే ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం విజిలెన్స్ మైనింగ్ అధికారికి వెంగమాంబ యజమాని ఏకంగా రూ. 3 కోట్ల మేర లంచం ఇవ్వజూపారంటూ ఆరోపణలు రావడం.. కలకలం రేపింది. వందలాది లారీల్లో ఖనిజం తరలిపోతోందని స్థానికులు మొత్తుకున్నా లెక్కచేయకుండా మైనింగ్ డాన్కి సహకరించారన్న ఆరోపణలతో అప్పట్లో ముగ్గురు అధికారులపై బదిలీ వేటు కూడా పడింది.రూ.15 వేల జీతగాడు.. మైనింగ్ ఓనర్.! పంచదార్లలో మైనింగ్ లీజు తీసుకున్న విజయకుమార్ నాయుడు సీఎం రమేష్కు సమీప బంధువు, వరుసకు అల్లుడు. యర్రగొండ్లకు చెందిన విజయ్కుమార్ గతంలో సీఎం రమేష్ అన్న సురేష్ నాయుడు దగ్గర రూ.15 వేల జీతంతో పీఏగా పనిచేశారు. తర్వాత సీఎం రమేష్ పీఏగా మారారు. అనకాపల్లి రాజకీయ వ్యవహారాల్లో పీఏ విజయ్కుమార్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. కేవలం రూ.15 వేల జీతగాడైన విజయ్కుమార్.. తక్కువ కాలంలోనే మైనింగ్ ఓనర్గా ఎలా అయ్యారనేదే ప్రశ్నార్థకంగా మారింది. తన కంపెనీ మైనింగ్ పేరుతో రిత్విక్ ప్రాజెక్టులకు గ్రావెల్ సరఫరా చేస్తున్నట్లు చూపిస్తూ రూ.కోట్లు కొల్లగొట్టేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. Godavari Pushkaralu: పది కోట్ల మంది భక్తులు వస్తారు -
కన్నీటి జలపాతాలే
ఆదమరిస్తేముంచంగిపుట్టు: జిల్లాలో కనువిందు చేసే జలపాతాలు ఎన్నో ఉన్నాయి. వర్షాకాలంలో కొండలపై నుంచి జలనిధి జాలువారుతూ మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ప్రకృతి సోయగాలు తిలకించేందుకు, జలపాతాల సవ్వడులను ఆస్వాదించేందుకు దేశ,విదేశాల నుంచి సందర్శకులు వస్తుంటారు. ఈ విహార యాత్రలు కొత్త సంవత్సరం ప్రారంభం వరకు కొనసాగుతాయి. కొత్త ప్రదేశాలను చూసి తన్మయత్వానికి లోనవ్వ డమే కాకుండా అక్కడి పరిస్థితులపై అవగాహన లేక ఈతకు దిగి ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరు ఫొటోలు, సెల్ఫీల కోసం సాహసాలు చేస్తూ ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. వీరిలో యువతే ఎక్కువగా ఉంటున్నారు. ● ముంచంగిపుట్టు మండలంలో ఆంధ్ర,ఒడిశా రాష్ట్రాల సరిహద్దులో ఉన్న డుడుమ జలపాతం 556 అడుగుల పైనుంచి జాలువారుతుంది. దగ్గరకు వెళ్లడమంటే కాస్త ప్రమాదంతో కూడుకున్నదే. జలపాతం వద్దకు వెళ్లాలంటే 800 మెట్లు దిగాలి. నీటి ప్రవాహం వల్ల జలపాతం కింద భాగంలో రాళ్లు కోతకు గురై సొరంగాలు ఏర్పడ్డాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లే. ఈ జలపాతం వద్ద ఇప్పటికే అనేకమంది మృత్యువాత పడ్డారు. మండలంలో తారబు, జడిగూడ,బురదగుంట,హంసబంద జలపాతాల వద్ద సైతం ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ● అనంతగిరి మండలంలో సరియా, కటికి, తాటిగూడ, డుంబ్రిగుడ మండలంలో చాపరాయి, అరకులోయలో రణజిల్లెడ, జి.మాడుగులలో కొత్తపల్లి, పెదబయలులో పిట్టలబొర్ర, తారబు, చింతపల్లిలో లంబసింగి సమీపంలో రావిమానుపాకలు, గాదిగుమ్మి వంటి పలు జలపాతాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. అయితే వీటిని చూసేందుకు వెళ్లిన వారు అజాగ్రత్త కారణంగా ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రభుత్వం,పర్యాటక శాఖ అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు లెక్కచేయకుండా ప్రమాదకర ప్రదేశాలకు వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో విహారయాత్ర విషాదాన్ని మిగులుస్తోంది. కొన్ని జలపాతాల వద్ద స్థానిక గిరిజనులే ప్రహారా కాస్తూ పర్యాటకులను హెచ్చరిస్తున్నా లెక్కచేయకుండా వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు నీళ్లు అధికంగా ప్రవహిస్తున్న జలపాతాల వద్ద స్నానం చేయకూడదు. సెల్ఫీ కోసం ఎత్తైన బండ రాళ్లపై ఎక్కకూడదు. బండరాళ్లపై నిరంతరం నీళ్లు ప్రవహిస్తూ ఉండటం వల్ల అవి నాచు పట్టి జారుగా ఉంటాయి. వర్షాలు అధికంగా పడుతున్న సమయంలో జలపాతాల వద్దకు వెళ్లకపోవడమే మేలు. పర్యాటక శాఖ అధికారుల సూచనలు పాటించాలి. ఈత వస్తే తప్ప జలపాతంలో దిగడానికి సాహసించరాదు. మద్యానికి దూరంగా ఉండడం ఎంతో ఉత్తమం. జలపాతాల వద్దకు ఒంటరిగా కాకుండా గుంపులుగానే వెళ్లాలి. డుడుమ వద్ద గల్లంతైన వారి కోసం గాలిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం (ఫైల్)జాగ్రత్తలు పాటించాలి జలపాతాలలో ప్రమాదాలు జరిగే ప్రదేశాల వద్ద హెచ్చరిక బోర్డులు సైతం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వాటిని పట్టించుకోకపోవడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. జలపాతాలను సందర్శించేందుకు వెళ్లే పర్యాటకులు అన్ని జాగ్రత్తలు పాటించాలి. – ఎస్.లక్ష్మణరావు, సీఐ, జి.మాడుగుల -
కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగుల సమ్మె నోటీసు
● సమస్యలు పరిష్కరించే వరకూ పోరాటం ● జేఏసీ జిల్లా అధ్యక్షుడు రాంబాబు పాడేరు: జిల్లా వ్యాప్తంగా వైద్యారోగ్య శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డీఎంహెచ్వో డాక్టర్ రియాజ్కు వైద్యారోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు మంగళవారం సమ్మె నోటీసు అందజేశారు. అనంతరం కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగుల సంఘం జేఏసీ జిల్లా అధ్యక్షుడు గంపరాయి రాంబాబు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ తాము సమ్మె చేయనున్నట్టు చెప్పారు. ఏజెన్సీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వైద్యారోగ్య ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, నగదు రహిత హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, సర్వీస్లో ఉన్న కాంట్రాక్ట్ హెల్త్ ఉద్యోగి మరణిస్తే పూర్తి స్థాయి ఎక్స్గ్రేషియా చెల్లించాలని, ఉద్యోగుల రెగ్యులర్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు సమాన పనికి సమాన వేతనం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం ఇప్పటికే పలుమార్లు శాంతియుతంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. ప్రభుత్వం ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మె చేయవలసి వస్తోందన్నారు. సమస్యలు పరిష్కరించే వరకూ దశలవారీగా పోరాటం చేస్తామని చెప్పారు. ఈనెల 26, 27, 28 తేదీల్లో నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతామని, 29, 30 తేదీల్లో ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తామని చెప్పారు. సెప్టెంబర్ 1, 2 తేదీల్లో ఆన్లైన్ పనులు నిలుపుదల చేస్తామని, 3, 4 తేదీల్లో ఓపీ సేవలు నిలిపివేస్తామని, 5, 6వ తేదీల్లో ఎమర్జెన్సీ సేవలు బహిష్కరిస్తామని, 7, 8 తేదీల్లో పెన్డౌన్ చేసి ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద నిరసన వ్యక్తం చేస్తామని తెలిపారు. 9వ తేదీన కలెక్టరేట్ వద్ద రిలే దీక్షలు చేపడతామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను తీర్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సమ్మె నోటీసు అందించిన వారిలో వైద్యారోగ్య కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం జిల్లా జేఏసీ నేతలు విజయ, వరలక్ష్మి తదితరులు ఉన్నారు. -
ఒకే పేరుతో బ్యాంకులో ఇద్దరికి ఖాతాలు
మునగపాక : ఖాతాదారుని పేరు ఒక్కటే..గాని వ్యక్తులు వేర్వేరు. ఇరువురు ఖాతాదారులు ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలో భాగంగా జరిగిన తప్పును తెలుసుకొని సర్దుకుపోయారు. అయితే సంబంధం లేని వ్యక్తి బ్యాంక్ వద్ద హల్చల్ చేయడం చర్చనీయాంశమైంది. మునగపాక గ్రామంలో శెట్టిబలిజ కాలనీకి చెందిన పోలారపు జ్యోతి 28–03–2015న నాగులాపల్లి యూనియన్ బ్యాంక్లో ఖాతా తెరిచారు. అదే ప్రాంతానికి చెందిన పోలారపు జ్యోతి పేరిట 2016లో అదేబ్యాంక్లో మరో ఖాతా తెరిచారు. అయితే వెనుక అకౌంట్ తెరిచిన జ్యోతికి 28–03–2015న ఖాతా ప్రారంభించినట్టు పుస్తకం అందజేశారు. ఇరువురిలో ఒక జ్యోతి స్థానికంగా పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నారు. సంబంధిత బ్యాంకుకు ఆమె జీతం క్రమం తప్పకుండా క్రెడిట్ అవుతూ వస్తుంది. రెండవసారి అకౌంట్ ప్రారంభించిన జ్యోతి బ్యాంక్ ఖాతాలో రెండేళ్లుగా తల్లికి వందనం పేరిట ఇద్దరు పిల్లలకు రూ.52వేలతో పాటు మరో 5వేల నగదు వెరసి రూ.57వేల నగదు ఖాతాలో ఉంది. అయితే రెండు రోజుల క్రితం జ్యోతి తన ఖాతా నుంచి డబ్బులు డ్రా చేసినట్టు మెసేజ్ రావడంతో కంగుతిన్న ఆమె స్థానిక బ్రాంచి అధికారులను ఆశ్రయించింది. దీంతో బ్యాంక్ మేనేజర్ కలుగజేసుకొని విషయాన్ని పరిశీలించి గతంలో బ్యాంక్ అధికారుల చిన్నపాటి తప్పిదం కారణంగా పొరపాటు జరిగిందని వారికి నచ్చచెప్పారు. ఈ సమయంలో మునగపాకకు చెందిన ఒక వ్యక్తి తనకు సంబంధం లేకున్నా బ్యాంక్ వద్ద హల్చల్ చేసి బ్యాంక్ అఽధికారులను ఇబ్బందులకు గురిచేసేలా ప్రవర్తించడంతో అసహనం వ్యక్తమైంది. ఇరువురు ఖాతాదారులు జరిగిన తప్పును గుర్తించి సర్దుకుపోతుంటే సంబంధం లేని వ్యక్తి హల్చల్ చేయడం ఎంతవరకు సమంజసమని బ్యాంక్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న బ్యాంక్ అధికారులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారం. -
కళాకారులను ప్రోత్సహించాలి
తుమ్మపాల : సాంస్కృతిక రంగానికి, కళాకారులకు సరైన ప్రోత్సాహం లేనందువల్ల కళా రంగం దుర్భరమైన పరిస్థితిలో కొట్టుమిట్టాడుతుందని, కళాకారుల సమస్యలపై ప్రభుత్వం స్పందించి సంక్షేమ పథకాలు అందించాలని ప్రజానాట్యమండలి కళా సంస్థ జిల్లా సమితి ఆధ్వర్యంలో కళాకారులు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. రాష్ట్రంలో జానపద గ్రామీణ పౌరాణిక పద్మ నాటక రంగాలు కళారూపాలు ఉన్నాయని, వాటికి ప్రభుత్వం నుంచి సరైన ఆదరణ, ప్రోత్సాహం కరువైందని జిల్లా నాయకులు ఎన్.అప్పారావు, వై.ఎన్. భద్రం అన్నారు. ఆయా కళా రంగాలలో నెపుణ్యం కలిగిన కళాకారులకు గుర్తింపు లేకుండా పోయిందని, గతంలో కళాకారులకు ప్రత్యేకమైన పెన్షన్ విధానం ఉండేదని, కళాకారులకు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు కావడం లేదన్నారు. సమాజాన్ని చైతన్యవంతుల్ని చేస్తూ వినోదాన్ని విజ్ఞానాన్ని పంచే కళాకారుల పరిస్థితి దుర్భరంగా తయారైందన్నారు. కళారంగాన్ని కళారూపాలను, కళాకారులను కాపాడుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం సాంస్కృతిక శాఖకు ప్రతి ఏటా ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయింపుతో పాటు అర్హత కలిగి, 50 సంవత్సరాలు నిండిన ప్రతి పేద కళాకారునికి పదివేల రూపాయలు పెన్షన్, ప్రతి కళాకారుడికి గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని, నెలలో కనీసం 15 రోజుల పాటు కళాకారులకు వేతనంతో కూడిన కళా ప్రదర్శనలకు అవకాశాలు కల్పించాలన్నారు. నంది నాటకోత్సవాల్లో గ్రామీణ జానపద కళారూపాల విభాగాలను పోటీల్లో చేర్చాలని, ప్రతి ఏటా తప్పనిసరిగా నంది నాటకోత్సవాలు నిర్వహించి ప్రోత్సహించాలన్నారు. ప్రతి పేద కళాకారుడికి మూడు సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించాలన్నారు. ప్రభుత్వం ఏటా అందించే కళారత్న, ఉగాది పురస్కారాల ఎంపికలో పారదర్శకత నిజాయితీ ప్రదర్శించాలని అన్నారు. కళాకారులకు బస్సు, రైలులో ఉచితంగా ప్రయాణించడానికి సౌకర్యం కల్పించాలని కోరారు. -
రేపు చింతపల్లిలోమెగా జాబ్మేళా
పాడేరు : ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఏపీఎస్ఎస్డీసీ) ఆధ్వర్యంలో ఈనెల 27న చింతపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్మేళా నిర్వహించనున్నట్టు కలెక్టర్ టి.నిశాంతి మంగళవారం తెలిపారు. జాబ్మేళాలో పది ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారన్నారు. టెన్త్ నుంచి పీజీ ఆపై చదువులు పూర్తి చేసుకుని ఉపాధి, ఉద్యోగం లేని నిరుద్యోగ అభ్యర్థులు అర్హులని తెలిపారు. విద్యార్హత, నైపుణ్యం అధారంగా జాబ్మేళాలో పాల్గొని ఉద్యోగావకాశాలు పొందాలని సూచించారు. అనంతరం ఆమె జాబ్మేళా పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జి. ప్రశాంత్కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి
తాటిచెట్లపాలెం(విశాఖ): రైల్వే ప్రయాణికుల భద్రత, సురక్షిత ప్రయాణాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ అధికారులకు సూచించారు. జనరల్ మేనేజర్ కార్యాలయంలో జోన్ పరిధిలోని నాలుగు డివిజన్ల డివిజనల్ రైల్వే మేనేజర్లు, ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల భద్రత, భద్రతా చర్యలు, నిఘా వ్యవస్థపై విస్తృతంగా సమీక్షించారు. అనంతరం ఇంజినీరింగ్ పనులు, గూడ్స్ షెడ్ల అభివృద్ధి, పార్సిల్ కార్యాలయాల సదుపాయాల విస్తరణతో పాటు ప్రస్తుతం జరుగుతున్న పలు రైల్వే అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. విధి నిర్వహణలో అప్రమత్తత, అంకితభావం ప్రదర్శించి పలు ప్రమాదాలను అరికట్టడంతో పాటు ప్రయాణికుల ప్రాణాలు, రైల్వే ఆస్తులను కాపాడడంలో విశేష సేవలందించిన నలుగురు ఉద్యోగులకు సేఫ్టీ అవార్డులు అందజేశారు. అవార్డులు అందుకున్న వారిలో విజయవాడ డివిజన్కు చెందిన తుని ట్రాక్ మెయింటెనర్ బి. వెంకటరావు, గుంటూరు డివిజన్ గుండ్లకమ్మకు చెందిన స్టేషన్ మాస్టర్ వి. వీరబ్రహ్మం, గుంతకల్ డివిజన్ వెంకటగిరికి చెందిన గేట్మన్ లలిత్ కుమార్, విశాఖ డివిజన్ సింహాచలం నార్త్కు చెందిన గూడ్స్ ట్రైన్ మేనేజర్ జై సింగ్ మీనా ఉన్నారు. వారికి జనరల్ మేనేజర్ అభినందనలు తెలిపారు. సమావేశంలో ఆయా డివిజన్ల డివిజనల్ రైల్వే మేనేజర్లు, వివిధ విభాగాల ప్రిన్సిపల్ హెడ్లు పాల్గొన్నారు.సౌత్ కోస్ట్ రైల్వే జీఎం సందీప్ మాథుర్ -
స్లాస్ సర్వేలో పారదర్శకత పాటించాలి
కశింకోట : స్లాస్ (ఎస్ఎల్ఎఎస్) సర్వేను కేవలం ఒక పరీక్షగానే కాకుండా విద్యార్థుల వాస్తవ అభ్యసన స్థాయిని తెలుసుకునే ముఖ్య విద్యా సాధనంగా చూడాలని జిల్లా విద్యా శాఖ అధికారి జి.జి.ఈ నాగేశ్వరరావు సూచించారు. కశింకోటలోని డీపీఎన్ జెడ్పీ హైస్కూల్లో జోన్ స్థాయిలో 7 మండలాలకు చెందిన ఎంపిక చేసిన 139 మంది ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్కు మంగళవారం స్లాస్ సర్వే (రాష్ట్ర స్థాయి అభ్యాసన సాధన సర్వే)పై ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా హాజరై మాట్లాడుతూ విద్యార్థులు తమ తరగతి స్థాయికి అనుగుణంగా సాధించాల్సిన అభ్యాసన ఫలితాలను ఎంతవరకు సాధించారో తెలుసుకోవడం, వారి సామర్థ్యం, అభ్యాసన లోపాలను గుర్తించడం సర్వే ప్రధాన ఉద్దేశ్యమన్నారు. సర్వే ద్వారా లభించే సమాచారాన్ని విశ్లేషించి విద్యార్థులకు అవసరమైన అబ్యాసన మెరుగుదల కార్యక్రమాలను రూపొందించేందుకు, బోధనా పద్దతులను మరింత సమర్థవంతంగా మార్చేందుకు ఉపయోగించుకోవచ్చునన్నారు. ఫీల్డ్ ఇన్విజిలేటర్లు సర్వే సమయంలో పూర్తి పారదర్శకత పాటించాలని, విద్యార్థులకు ఎలాంటి సమాధానాలను సూచించరాదని, మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఒ వి. సురేష్, డిసీసీబీ కార్యదర్శి నూకరాజు, డైట్ లెక్చరర్ సిహెచ్. శ్రీధర్, ఎ.వి. రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. వేతన బకాయిల కోసం డీఈవోకు వినతి జిల్లాలోని సమగ్ర శిక్ష ఉద్యోగులు తమకు రెండు నెలలుగా వేతనాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బంది చెందుతున్నామని, వేతనాలు చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ డీఈఒ జిజిఈ నాగేశ్వరరావును కోరారు. కశింకోటలోని డీపీఎన్ జెడ్పీ హైస్కూలుకు వచ్చిన సందర్భంగా మంగళవారం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన సమగ్ర శిక్ష ఉద్యోగులు, సీఆర్పీలు కలిసి ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు. జూన్, జులై నెలలకు సంబంధించి వేతనాలు చెల్లించలేదన్నారు. వేతనాలు సకాలంలో జమ అయ్యేలా చూడాలన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘ నాయకులు అచ్యుతకృష్ణ, శంకర్, రమణ, నూకేష్, లక్ష్మణ్, సత్యబాబు, లక్ష్మినారాయణ, రామలక్ష్మి పాల్గొన్నారు. -
రానున్న ఐదు రోజుల్లోతేలికపాటి వర్షాలు
● ఏడీఆర్ డాక్టర్ ఆదిలక్ష్మి చింతపల్లి: జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చింతపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ డి.ఆదిలక్ష్మి తెలిపారు. ఈ నెల 26 నుంచి 30 వరకూ చింతపల్లి, పాడేరు, అరకు డివిజన్ల పరిధిలో 1.8 నుంచి 4.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 21.8 డిగ్రీల నుంచి 22.6 డిగ్రీల మధ్య, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 22.1 డిగ్రీల నుంచి 22.3 డిగ్రీల మధ్య ఉండవచ్చన్నారు. గాలిలో తేమ ఉదయం వేళల్లో 80 నుంచి 85 శాతం, మధ్యాహ్న సమయాల్లో 87 నుంచి 88 శాతం మధ్యలో ఉంటుందన్నారు. గాలి గంటకు 6 కిలో మీటర్ల వేగంతో వీచే సూచనలు ఉన్నాయని చెప్పారు. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందన్నారు. రైతులు తగు జాగ్రత్తలు పాటించాలని ఏడీఆర్ సూచించారు. -
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు
పాడేరు: జిల్లా వ్యాప్తంగా అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలు సకాలంలో పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ టి.నిశాంతి అధికారులను ఆదేశించారు. జిల్లాలో వ్యవసాయం, ఉద్యానవన, పశుసంవర్ధక, కాఫీ శాఖ, మత్స్యశాఖ, సెరికల్చర్, ఏపీఏంఐపీ తదితర శాఖలతో ప్రాథమిక రంగాల అభివృద్ధి, అమలులో ఉన్న ప్రభుత్వ సంక్షేమ పథకాల పురోగతిపై తన చాంబర్లో మంగళవారం సమీక్ష నిర్వహించారు. లబ్ధిదారులకు, రైతులకు అందుతున్న పఽథకాలు, ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు వాటి పరిష్కార మార్గాలపై అధికారులతో చర్చించారు. ప్రాథమిక రంగాలను మరింత బలోపేతం చేసేందుకు శాఖల వారీగా కార్యాచరణ రూపొందించి క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయాలని ఆదేశించారు. లబ్ధిదారులకు పథకాల ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తూ జాప్యం లేకుండా పర్యవేక్షించాలన్నారు. ఐవీఆర్ఎస్ కాల్స్కు సంబంధించిన అంశాలపై రైతులందరికీ అవగాహన కల్పించాలని, రైతులు స్పందించేలా క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్.బి. నంద్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కర్ణ, జిల్లా సెరికల్చర్ అధికారి రాజేంద్రప్రసాద్, కాఫీ బోర్డు ఏడీ జయంత్, పశు సంవర్ధక శాఖ అధికారి కరుణాకర్, మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు. రీసర్వే వేగవంతం రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని, పెండింగ్లో ఉన్న రెవెన్యూ సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కారించాలని కలెక్టర్ టి.నిశాంతి అధికారులను ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో ప్రజలకు రెవెన్యూ సేవలను మరింత పారదర్శకంగా నిర్ణీత సమయంలో అందించేందుకు అధికార యంత్రాంగం సమన్వయంతో పని చేస్తుందన్నారు. జిల్లాలో 1400 గ్రామాల్లో మూడు విడతలుగా రీసర్వే చేపడుతున్నామని, రీసర్వే సమర్థంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. రెవెన్యూ రికార్డులను సక్రమంగా నిర్వహించడంతో పాటు వాటి భద్రతకు డిజిటలైజేషన్కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. పీజీఆర్ఎస్ ద్వారా అందుతున్న భూ సంబంధిత అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కారించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ, అసైన్డ్ భూముల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మ్యుటేషన్లు, ఆర్వోఆర్ ప్రక్రియలో ఎటువంటి జాప్యం లేకుండా పారదర్శకంగా పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్వో లోకేశ్వరరావు, మండల రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.కలెక్టర్ నిశాంతి -
చిన్నారులకు ఆటపాటలతో బోధన
నర్సీపట్నం: ఆటపాటల ద్వారా చిన్నారులకు విద్య నేర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి జి.జి.ఎస్.నాగేశ్వరరావు అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు. పట్టణంలోని జెడ్పీ హైస్కూల్(తురకబడి)లో జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న అంశాలను అంగన్వాడీ కేంద్రాల్లో సక్రమంగా అమలు చేయాలన్నారు. ఇంగ్లిష్పై ప్రత్యేక దృష్టి సారించి, చిన్నారులను ఆ దిశగా తీర్చిదిద్దాలన్నారు. పిల్లలకు సులభంగా అర్థం కావాలంటే ఆటపాటల ద్వారానే సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో సీడీపీవో జి.వి.రమణి, ఏఎంవో కెజియా, ఎంఈవో సిహెచ్.తలుపులు, రిసోర్స్పర్సన్లు కె.ఆర్.పి.ఎం.నాగేశ్వరరావు, బి.ఎస్.ఆర్.గోవింద్, కె.గణేష్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు కె.రామలక్ష్మి, పి.అప్పలనర్స పాల్గొన్నారు. -
జీవీఎంసీకి మళ్లీ విలీన గండం!
● ఎన్నికలు ఎగ్గొట్టేందుకే కూటమి సర్కారు కొత్త నాటకం? ● 79 గ్రామ పంచాయతీల విలీనం పేరిట గ్రామసభల హడావుడి ● గతంలో ఎన్నికలు ఆపేసినట్లే.. మళ్లీ పాత ఫార్ములా అమలు? అప్పుడూ బాబే.. ఇప్పుడూ బాబే..డాబాగార్డెన్స్: మహా విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికలను దీర్ఘకాలం పాటు వాయిదా వేసేందుకు కూటమి ప్రభుత్వం ’విలీన ప్రక్రియ’ పేరుతో రాజకీయ కుట్రకు తెరలేపిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. 2014–19లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఇలాగే విలీన ప్రక్రియను తెరపైకి తెచ్చి, ఆపై న్యాయపరమైన వివాదాలు సృష్టించి ఏకంగా 2021 వరకు జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహించకుండా అడ్డుకున్నారని విపక్షాలు గుర్తుచేస్తున్నాయి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నడుస్తుండగానే, అదే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగా ఉంటూ అశాసీ్త్రయ పద్ధతిలో 79 గ్రామ పంచాయతీలను జీవీఎంసీలో విలీనం చేసేందుకు ప్రయత్నించడం చూస్తుంటే, ఎన్నికలు జరపకూడదనే కుట్ర స్పష్టంగా కనిపిస్తోంది. రాత్రికి రాత్రే గ్రామసభల డ్రామా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, ప్రజాస్వామ్య నియమ నిబంధనలను పూర్తిస్థాయిలో తుంగలో తొక్కి కూటమి ప్రభుత్వం రాత్రికి రాత్రే నిర్ణయాలు తీసుకుంటోంది. నాలుగు గ్రామీణ మండలాల్లోని 79 గ్రామ పంచాయతీల విలీనం కోసం హడావుడిగా గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది. కార్పొరేట్ శక్తుల ఆర్థిక ప్రయోజనాలు కాపాడేందుకు, కూటమి పార్టీల స్వార్థ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకే ఈ రకమైన దారుణమైన చర్యకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నిధులు, విధులు, అధికారాల వికేంద్రీకరణ ద్వారా స్థానిక సంస్థలను బలోపేతం చేయాలన్న 73, 74 రాజ్యాంగ సవరణల ఆశయాలకు ఈ చర్య కోలుకోలేని దెబ్బ. ఆలోచించే సమయం ఎక్కడ? జీవీఎంసీలో విలీనం కావాలో వద్దో తేల్చుకునే కనీస స్వేచ్ఛను కూడా ప్రజలకు ఇవ్వడం లేదు. లాభనష్టాలపై చర్చించేందుకు తగిన సమయం ఇవ్వకుండా, ఆఘమేఘాలపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం వెనుక ఆంతర్యమేమిటో అందరికీ అర్థమవుతూనే ఉంది. ముందస్తుగా గడువు ఇచ్చి, ప్రజాభిప్రాయ సేకరణ తేదీలను వెల్లడించాలి. విలీనం వల్ల కలిగే పరిణామాలు, లాభాలు, నష్టాలను ప్రజలకు స్పష్టంగా వివరించాలి. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, స్థానిక నాయకుల అభిప్రాయాలను ప్రామాణికంగా తీసుకోవాలి. కానీ, కూటమి ప్రజాప్రతినిధులు తమ అనుయాయులతో ముందస్తుగా విలీన లేఖలు రాయించి, గ్రామసభలలో తూతూమంత్రంగా ఆమోదం పొందేందుకు డ్రామా ఆడుతున్నారని స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత విలీన ప్రాంతాల పరిస్థితి ఏంటి? గతంలో జీవీఎంసీలో విలీనం చేసిన గాజువాక, భీమిలి, అనకాపల్లి మున్సిపాలిటీలతో పాటు 32 గ్రామ పంచాయతీల పరిస్థితి ఇప్పటికీ అగమ్యగోచరంగానే ఉంది. విలీనమైన ప్రాంతాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోకపోగా, ప్రజలపై విపరీతమైన పన్నుల భారం పడింది. తాగేందుకు కనీస తాగునీరు అందించలేని దుస్థితి నెలకొంది. పారిశుధ్య కార్మికులను కూడా పూర్తి స్థాయిలో నియమించలేకపోయారు. ’పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యం’ పేరుతో ప్రజల ఉమ్మడి ఆస్తులను, మౌలిక సదుపాయాలను ప్రైవేట్ శక్తులకు కట్టబెడుతున్నారు. గ్రామీణ స్వరూపానికి ముప్పు కూటమి ప్రభుత్వం జీవీఎంసీలో విలీనం చేయాలని చూస్తున్న పద్మనాభం, భీమిలి, ఆనందపురం, పెందుర్తి మండలాల్లోని 79 గ్రామ పంచాయతీలు నగరానికి అత్యంత సుదూరంలో ఉన్న గ్రామీణ ప్రాంతాలు. ఈ విలీనం వల్ల గ్రామీణ ప్రజలు తీవ్రంగా నష్టపోనున్నారు. విలీనం పూర్తయితే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పూర్తిగా రద్దవుతుంది. గ్రామీణ ప్రాంత ప్రజలపై పట్టణ స్థాయి ఆస్తి, చెత్త, నీటి పన్నుల భారం మోపబడుతుంది. స్థానిక పాలన ప్రజలకు దూరమై, వికాసానికి బదులు వినాశనం దాపురిస్తుంది. పన్నులు నగర స్థాయిలో.. సేవలు? గ్రామ పంచాయతీ నుంచి జీవీఎంసీలోకి వస్తే ఆస్తి పన్ను, నీటి చార్జీలు, ఇతర పౌరసేవల రుసుములు పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన ఉంది. పన్నులు పెరిగితే అందుకు తగ్గట్టుగా రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు వంటి సేవలు అందుతాయా? అన్నది ప్రశ్న. ఇప్పటికే విలీనమైన ప్రాంతాల్లో మౌలిక వసతుల పరిస్థితిపై సమీక్ష చేయకుండా కొత్తగా మరో 79 గ్రామ పంచయాతీలను కలపడం వల్ల జీవీఎంసీపై మరింత భారం పడుతుందన్న విమర్శలూ ఉన్నాయి. -
రీజనల్ గేమ్స్లో మెరిసిన విద్యార్థిని
కోటవురట్ల : గ్రామీణ క్రీడాకారులు అద్భుత ప్రతిభతో అబ్బురపరుస్తూ ఔరా అనిపిస్తున్నారు. మండలంలోని కె.బి.అగ్రహారం గ్రామానికి చెందిన లాలం లెహ్యాశ్రీ అండర్ 14 విభాగంలో బహుముఖ ప్రజ్ఞతో పతకాల పంట పండించింది. విభిన్న క్రీడలను ఎంచుకుని తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటోంది. కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్(సీఐఎస్సీఈ) ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన రీజనల్ గేమ్స్, స్పోర్ట్స్లో 9 పతకాలను సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ంది. రాజమండ్రిలోని ఓ ప్రైవేటు స్కూల్లో చదువుతున్న లాలం లెహ్యాశ్రీ స్కేటింగ్, అథ్లెటిక్స్లో రాణిస్తోంది. రీజనల్ గేమ్స్లో రోలర్ స్కేటింగ్లో 2 స్వర్ణ పతకాలు, 2 రజత పతకాలు, అథ్లెటిక్స్లో 3 రజత పతకాలు, 2 కాంస్య పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ంది. దీంతో అక్టోబర్ 7 నుంచి 9 వరకు ముంబై, ఠాణే, మహారాష్ట్ర జరిగే జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్, అక్టోబర్ 13 నుంచి 15 వరకు హైదరాబాద్లో జరిగే జాతీయ స్థాయి అథ్లెటిక్స్లో పాల్గొననుంది. ఈ సందర్భంగా లెహ్యాశ్రీ మాట్లాడుతూ భవిష్యత్లో భారత ఒలింపిక్ జట్టుకు ప్రాతినిథ్యం వహించి మన దేశానికి స్వర్ణ పతకం అందించమే జీవిత లక్ష్యంగా పేర్కొంది. తన తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్ మార్గదర్శకత్వం తన విజయాలకు కారణంగా తెలిపింది. జాతీయ స్థాయి పోటీలలో కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు కీర్తిని తీసుకొచ్చేలా స్వర్ణ పతకాలను సాధించాలని కె.బి.అగ్రహారం గ్రామస్తులు, మండల ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. -
వలకు చిక్కిన 20 కిలోల బంగారుపాప
అల్లూరి సీతారామరాజు జిల్లా: మండలంలో మత్స్యకారుల పంట పండుతోంది. భారీ చేపలు వలకు చిక్కుతుండడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు డుడుమ జలాశయం, మత్స్యగెడ్డలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఆంధ్ర, ఒడిశా సరిహద్దులోని డుడుమ జలాశయంలో సోమవారం 20 కిలోల చొప్పున నాలుగు చేపలు సింధిగూడ గ్రామ గిరిజనుల వలకు చిక్కాయి. సుజనకోట, దారెల, పెదగూడ, పనసపుట్టు, జోలాపుట్టు పంచాయతీల్లో మత్స్యగెడ్డ పరీవాహక గ్రామాల గిరిజన మత్స్యకారులు నాటు పడవలపై ముమ్మరంగా చేపల వేట చేస్తున్నారు. వారి వలలకు 15 కిలోల నుంచి 20 కిలోల వరకు బంగారుపాప చేపలు చిక్కుతున్నా యి. వీటిని మండల కేంద్రానికి తీసుకువచ్చిన వెంటనే కొనుగోలుదారులు దక్కించుకోవడానికి పోటీపడ్డారు. కిలో రూ. 300 నుంచి రూ. 350 వరకు విక్రయిస్తున్నారు. -
ఆత్మహత్యకు పాల్పడ్డ ఏఈ కుటుంబానికి న్యాయం చేయాలి...
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమం ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు అన్నారు. ఇటీవల వార్తల్లో ప్రచారమవుతున్న ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య తీవ్ర ఆందోళనకు గురిచేస్తుందని, ఆత్మహత్యపై ఆరోపణలు ఎదుర్కొంటున్న సాదిక్ ఖాన్పై సమగ్ర దర్యాప్తు జరిపించి, బాధిత కుటుంబానికి న్యాయం చేయడం, నిందితుడితో పాటు సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సాదిక్ ఖాన్పై వచ్చిన మోసం, బెదిరింపులు, ఆర్థిక దోపిడీ, వ్యక్తిగత ఫొటోలు, వీడియోల దుర్వినియోగం, బలవంతపు మతమార్పిడి ఆరోపణలు, కుటుంబ సభ్యులకు హాని చేస్తామని బెదిరించిన ఆరోపణలు అంశాలను చట్టపరంగా పరిశీలించి, నేరం రుజువైతే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. -
ఎస్పీ కార్యాలయంలో 56 అర్జీలు
అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్కు 56 అర్జీలు వచ్చాయి. ఎస్పీ తుహిన్ సిన్హా కార్యాలయంలో అదనపు ఎస్పీ ఎల్.మోహన్రావు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టపరిధిలో ఉన్న సమస్యలు పరిష్కారానికి వారం రోజుల్లో చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. భూ తగాదాలు, ఆస్తి సంబంధిత సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, వేధింపులు, మోసపూరిత వ్యవహారాలు, ఆర్థిక నేరాలు, ఇతర ప్రభుత్వ విభాగాలకు చెందిన అర్జీలు వచ్చాయన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
విశ్రాంత డీఎఫ్వో మృతికి సంతాపం
నర్సీపట్నం: జిల్లా సోషల్ ఫారెస్ట్ అధికారిగా పని చేస్తూ ఇటీవల పదవీ విరమణ పొందిన లక్ష్మణ్ సోమవారం గుండెపోటుతో విశాఖలో మృతి చెందారు. నర్సీపట్నం ఏరియాలో వివిధ హోదాల్లో ఆయన పని చేసి అందరికీ సుపరిచితులయ్యారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. స్వస్థలం విజయనగరం జిల్లా అయినప్పటికీ, కుమార్తె చదువు నిమిత్తం విశాఖలో ఉంటున్నారు. నర్సీపట్నం డీఎఫ్వోగా, రేంజర్గా సేవలు అందించారు. చింతపల్లి డీఎఫ్వో, సబ్ డీఎఫ్వోగా పని చేశారు. నూతన జిల్లాలు ఏర్పాటు అయిన తరువాత జిల్లా సోషల్ ఫారెస్ట్ అధికారిగా సేవలు అందించి గత ఏడాది జూన్లో పదవీ విరమణ పొందారు. నర్సీపట్నం, చింతపల్లి డివిజన్ల్లో పని చేసిన సిబ్బంది ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. -
ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ సక్రమంగా అమలు చేయాలి
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పథకం ప్రకారం దళితులు, గిరిజన జనాభా ప్రతిపాధికన నిధులు కేటాయించి అభివృద్ధి పథకాలు అమలు చేయాలంటూ దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద దళిత నాయకులు నిరసన చేశారు. ఎస్సీలకు 16.4, ఎస్టీలకు 5.3 శాతం నిధులు కేటాయించి ఖర్చు చేయాలని, ప్రతి నెలా నోడల్ ఏజెన్సీ సమావేశం ద్వారా పథకాన్ని సక్రమంగా ఆమలు చేయాలని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పథకం నిధులను ఇతర పథకాలకు కేటాయించకుండా శ్వేత పత్రం విడుదల చేయాలంటూ పలు డిమాండ్లపై వినతిపత్రాన్ని పీజీఆర్ఎస్ ద్వారా కలెక్టర్కు అందించారు. -
చింతపల్లిలో మూతబడిన పెట్రోల్ బంక్
చింతపల్లి: గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో మండల కేంద్రం చింతపల్లిలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్ సోమవారం మూత పడింది. దీంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మండలంలో ఉన్న ఈ ఏకై క బంక్ ద్వారా రోజుకు రూ.3 నుంచి రూ.4 లక్షల వరకు పెట్రోల్, డీజిల్ విక్రయిస్తారు. సోమవారం పెట్రోలు ట్యాంక్ రాకపోవడంతో బంక్ మూతపడింది. దీంతో ఈ ప్రాంతానికి వచ్చిపోయే పలువురు వాహనచోదకులు ఇబ్బందులకు గురయ్యారు. ఇటీవల తరచూ పెట్రోలు కొరత ఏర్పడుతుండడంతో ఇబ్బందులు పడుతున్నామని, ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా గిరిజన సహకార సంస్థ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు వాహనదారులు కోరారు. -
గిరిజన విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడితే పోరాటమే
● పాఠశాల తరలింపు నిర్ణయాన్నివెనక్కు తీసుకోవాలి ● తల్లిదండ్రుల కమిటీతో కలిసి ఎమ్మెల్సీ కుంభా రవిబాబు స్పష్టీకరణ ● విద్యార్థులకు ధైర్యం చెప్పిన ఎమ్మెల్సీ మధురవాడ: గిరిజన విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడితే గిరిజన సమాజం తరఫున మరింత తీవ్రంగా పోరాడతామని ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు స్పష్టం చేశారు. మధురవాడ మారికవలస–తిమ్మాపురం రోడ్డులోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల బాలుర ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో 5 నుంచి 10వ తరగతి చదువుతున్న 480 మంది విద్యార్థులను ఇతర ప్రాంతాలకు తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై సోమవారం తల్లిదండ్రులతో అధికారులు సమావేశం నిర్వహించారు. గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ సెక్రటరీ కిషోర్బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి రవిబాబు హాజరై మాట్లాడారు. తాము సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు వ్యతిరేకం కాదని, అయితే వేపగుంట సమీపంలో మూడేళ్లుగా ఖాళీగా ఉన్న యూత్ ట్రైనింగ్ సెంటర్ను వినియోగించుకోవాలని సూచించారు. లేదంటే ప్రత్యామ్నాయ భవనాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. సీవోఈ ఏర్పాటు పేరుతో మైదాన ప్రాంతంలో గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఏర్పాటు చేసిన పాఠశాలను మూసివేసి, 480 మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చడం సరికాదన్నారు. నిర్ణయాన్ని మార్చుకోకపోతే ఉద్యమం తీవ్రతరం 2004లో ఆదివాసీ విద్యార్థులకు నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం విద్య అందించేందుకు ఈ పాఠశాలను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. అర్ధంతరంగా పాఠశాలను మూసివేసి ఇతర ప్రాంతాలకు వెళ్లాలని చెప్పడం, విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేయడం, బలవంతంగా టీసీలు ఇవ్వడం వంటి చర్యలను సహించేది లేదన్నారు. రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని, వాటిని మెరుగుపరచాల్సిన అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. గిరిజన విద్యార్థుల హక్కుల కోసం గిరిజనుడిగా, ప్రజాప్రతినిధిగా ముందుండి పోరాడతానని తెలిపారు. పాఠశాలను మూసివేయాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం మార్చుకోకపోతే తల్లిదండ్రులు, ఆదివాసీ–గిరిజన సంఘాలతో కలిసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులను సబ్బవరం, దేవరాపల్లి, శ్రీకృష్ణాపురం తదితర పాఠశాలలకు మార్చుకోవచ్చని అధికారులు సూచించినప్పటికీ, తమ పిల్లలను ప్రస్తుత పాఠశాలలోనే కొనసాగించాలని తల్లిదండ్రులు స్పష్టం చేశారు. ఈ మేరకు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించారు. -
గ్యాస్ గోదాం వద్ద ఆందోళన
చింతపల్లి: సకాలంలో గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ చౌడుపల్లి హెచ్పీ గ్యాస్ గోదాం వద్ద సోమవారం వినియోగదారులు ఆందోళన చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బుక్ చేసుకున్నప్పటికీ సకాలంలో గ్యాస్ బండలను పంపిణీ చేయడంలేదని వారు ఆరోపించారు. చింతపల్లి డివిజన్ పరిధిలో గ్యాస్ బుక్ చేసుకున్న వారికి కాకుండా ఇతరులకు అధిక సొమ్ముకు విక్రయించుకుంటూ వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బుక్ చేసి వారం రోజులు కావస్తున్నా గ్యాస్ లేదంటూ, రాలేదంటూ కాలయాపన చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికై నా సంబంధిత అధికారు లు స్పందించి సకాలంలో గ్యాస్ సరఫరా అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని పలువు రు వినియోగదారులు కోరారు. -
తండ్రి మృతిపై కుమారుడి ఫిర్యాదు
కె.కోటపాడు: తామర వ్యాధి చికిత్సకు ఎ.కోడూరు గ్రామానికి వచ్చిన వ్యక్తి వైద్యం పొందుతూ మృతిచెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎ.కోడూరు ఎస్ఐ సంతోష్కుమార్ తెలిపిన వివరాలివి. మండలంలో ఆనందపురం గ్రామానికి చెందిన దుంగల ఈశ్వరరావు(55) తామర వ్యాధికి చికిత్స పొందేందుకు ఎ.కోడూరులో గల ఆర్ఎంపీ వైద్యుడు త్రినాథ్ వద్దకు సోమవారం వచ్చాడు. ఆర్ఎంపీ వైద్యుడు త్రినాథ్ ఈశ్వరరావును పరిశీలించి ఇంజక్షన్ చేశాడని, అయితే కొద్ది సేపటికి ఈశ్వరరావు మృతిచెందాడని తెలిపారు. వైద్యుడు ఇచ్చిన ఇంజక్షన్ వల్లే తన తండ్రి ఈశ్వరరావు మృతిచెందినట్టు కుమారుడు అక్కునాయుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి పోస్టుమార్టంకు తరలించామన్నారు. -
వినతులు...
ఇటుఅటుతుమ్మపాల: పీజీఆర్ఎస్ అర్జీలపై అధికారులు క్షేత్ర స్థాయి పర్యటనలు చేయాలని, ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం–1, 2 లలో నిర్వహించిన పీజీఅర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో ఆమెతో పాటు జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, డీఆర్వో వై.సత్యనారాయణరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డివిజన్, మండల, గ్రామ, వార్డు స్థాయిలలో నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి సంబంధిత అధికారులు హాజరై ఆయా స్థాయిలోనే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి శాఖ అధికారి వారి శాఖకు సంబంధించిన అర్జీల పరిష్కార పరిస్థితిని ప్రతిరోజు పర్యవేక్షణ చేసి, గడువులోపల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో దళిత కాలనీల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించి, కుల వివక్షకు అడ్డుకట్ట వేయాలని, కుల వివక్ష వ్యతిరేక పోరాటం సంఘం, ఏపి వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఆందోళన చేసిన దళితులు, సంఘాల నాయకులు కలెక్టరేట్ గేటు వరకు పాడె మోసి నిరసన తెలిపారు. కుల వివక్ష లేని సమాజం కోసం సామాజిక శంఖారావం కార్యక్రమంలో భాగంగా 71 గ్రామాలో్ల్ ప్రత్యక్షంగా సర్వేలు చేశామని, కనీస మౌలిక వసతులు కూడా సక్రమంగా అందడం లేదన్నారు. మంచినీటి సౌకర్యం లేకపోవడం, కుళాయి కనెక్షన్లు ఉన్నప్పటికీ నీరు రాకపోవడం, రోడ్లు అధ్వానంగా ఉండడం, డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వంటి సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దళిత కాలనీల పట్ల ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా ఉందన్నారు. జిల్లాలో అనేక గ్రామాల్లో దళితులకు శ్మశాన వాటికలకు స్థలాలు లేకపోవడం, ఉన్న స్మశాన స్థలాలు కబ్జాలకు గురికావడం, సామాజిక భవనాలు లేకపోవడం వంటి సమస్యలు కొనసాగున్నాయన్నారు. దళితులు ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వకపోవడంతో వారి భూ హక్కులు ప్రశ్నార్థకంగా మారాయని, ముఖ్యంగా ఎస్.రాయవరం మండలం సైతారుపేటలో దళితులకు క్షవరం చేయడానికి నిరాకరించడం వంటి కుల వివక్ష ఘటనలు ఇప్పటికీ చోటు చేసుకోవడం ఆందోళనకరమని, దీనిపై విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పాయకరావుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రభుత్వ స్థలంలో సుమారు 40 ఏళ్లుగా ఇళ్లు, గుడిసెలు, పాకలు వేసుకుని నివసిస్తున్న పేద కుటుంబాలను ఎటువంటి ప్రత్యామ్నాయ వసతి కల్పించకుండా పొక్లెయిన్లతో తొలగించేందుకు అధి కారులు ప్రయత్నించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. దళితుల సమస్యలపై పాడె మోసి నిరసన చేస్తున్న దళితులుకలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం అర్జీలు స్వీకరించిన కలెక్టర్, జేసీ, డీఆర్వో పలు సమస్యలపై కలెక్టరేట్ ఎదుట నిరసనలు దళిత కాలనీలపై ఇంత నిర్లక్ష్యమా... -
సాధిక్ఖాన్పై పోలీసులకు బీజేపీ నేతల ఫిర్యాదు
రావికమతం: రాజమండ్రి దగ్గర గోదావరిలో దూకి ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి కారకుడైన సాధిక్ ఖాన్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని సోమవారం రావికమతం పోలీసులకు మండల భారతీయ జనతా పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఏఈ నూకరాజు కుటుంబంతో సంబంధాలు ఏర్పరచుకొని స్నేహంగా ఉంటూ సభ్యుల వ్యక్తిగత ఫొటోలు,వీడియోలు తీసి , వారిని మత మార్పిడిపై ఒత్తిడి తెచ్చి, బెదిరింపు చర్యలకు పాల్పడి వారిని మానసిక క్షోభకు గురి చేసి కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి కారకుడైన సాధిక్ఖాన్ను అరెస్టు చేయాలని ఫిర్యాదులో కోరారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి అదేశాల మేరకు సాధిక్ఖాన్పై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు, టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ మెంబర్ గల్లా రాజేశ్వరరావు, మండల బీజేపీ అధ్యక్షుడు గుటాల చిన్న, ప్రధాన కార్యదర్శి దంట్ల సత్యనారాయణ తెలిపారు. -
కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి
ముంచంగిపుట్టు: వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీహెచ్సీ వైద్యసిబ్బంది నల్ల రిబ్బన్లు ధరించి విధులకు హాజరయ్యారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించే వరకు దశలవారీగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు తెలిపారు. రెగ్యులర్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు 100 శాతం గ్రాస్ శాలరీ ఇవ్వాలని, విధి నిర్వహణలో మరణించిన వైద్య ఉద్యోగి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని, కాంట్రాక్ట్ వైద్య సిబ్బందికి ఈపీఎఫ్ వర్తింపజేయాలని, అనారోగ్యానికి గురైన ఉద్యోగికి పూర్తి జీతంతో కూడిన సెలవు మంజూరు చేయాలని వైద్య సిబ్బంది రమేష్, సింహాచలం, సురేష్, వసంత కోరారు. -
జాతీయస్థాయి రెజ్లింగ్లో కేజీబీవీ విద్యార్థినికి పతకం
మాకవరపాలెం: జాతీయస్థాయి రెజ్లింగ్ పోటీల్లో కేజీబీవీ విద్యార్థిని కాంస్య పతకం సాధించింది. స్థానిక కేజీబీవీ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కోసూరు జ్యోత్స్న ఈ నెల 21 నుంచి 23 వరకు హరిద్వార్లో గ్రాప్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీల్లో పాల్గొంది. ఈ పోటీల్లో ప్రతిభ చూపి కాంస్య పతకం సాధించింది. రాష్ట్రస్థాయిలో సైతం ద్వితీయ స్థానంలో నిలిచి రజత పతకం సాధించిందని పాఠశాల ఎస్వో త్రివేణి సోమవారం తెలిపారు. ఈ విద్యార్థినిని ఎస్వోతో పాటు ఉపాధ్యాయులు అభినందించారు. -
‘పబ్లిక్’ సర్వీస్
తుమ్మపాల: పీజీఆర్ఎస్కు వచ్చే అర్జీదారులకు సోమవారం ఉచిత భోజన ఏర్పాట్లను కలెక్టర్ విజయకృష్ణన్, జేసీ శౌర్యమాన్ పటేల్ పరిశీలించి అర్జీదారులకు స్వయంగా భోజనం వడ్డించారు. రెండు నెలలుగా ప్రతి సోమవారం ఉచిత భోజన కార్యక్రమం జరుగుతున్నప్పటికీ కలెక్టరేట్ అధికారుల ఆదేశాలతో నిర్వాహకులు గత వారం అర్జీదారులు నుంచి ఒక్కో ప్లేట్ భోజనానికి రూ.5 చొప్పున వసూలు చేసిన విషయం విమర్శలకు దారి తీసింది. దీనిపై స్పందించిన కలెక్టర్ అర్జీదారులకు స్వయంగా భోజనం వడ్డించి అధికారుల తీరుపై పరోక్షంగా చురకలు అంటించారు. అన్నా క్యాంటీన్ ద్వారా అందించే ఈ పథకంలో కూడా నగదు వసూలు చేయడంపై సంబంధిత సిబ్బందిని ఆమె హెచ్చరించినట్టు తెలిసింది. కార్యక్రమంలో డీఆర్వో వై.సత్యనారాయణరావు, సూపరింటెండెంట్ విజయకుమార్ పాల్గొన్నారు. -
విచారణే అస్త్రం.. వసూళ్లే లక్ష్యం!
ఏయూలో విచారణ పేరుతో అధికారుల బరితెగింపు ‘సంతోష’ంగా తెగబడి మరీ పిండుకుంటున్న వైనం కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు, చిరుద్యోగులనూ వదలని వసూళ్ల పర్వం గవర్నర్కు ఫిర్యాదు చేసేందుకు పలువురు యోచనసాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఓ వైపు లాభదాయకమైన డిఫెన్స్ కోర్సులను ఎత్తివేస్తూ ప్రైవేటు సంస్థలకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతుండగా.. మరోవైపు విచారణ పేరుతో అధికారుల వసూళ్ల పర్వం హద్దులు దాటుతోందనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. విభాగాల్లో తప్పులు జరిగాయని ఒప్పుకోవాలంటూ ఉద్యోగులపై ఒత్తిడి తేవడంతోపాటు.. అడిగిన మొత్తం ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టర్ల నుంచి ఇంజనీర్లు, చిరుద్యోగుల వరకు ఎవరినీ వదలకుండా విచారణను వసూళ్ల అస్త్రంగా మార్చుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓ కాంట్రాక్టరు డబుల్ బిల్లులు తీసుకున్నారంటూ రికార్డుల్లో నమోదు చేసి, కేసులు పెడతామని బెదిరిస్తూ రూ.15 లక్షలు డిమాండ్ చేసినట్టు సమాచారం. ఇదే తరహాలో ఇంజనీర్లు, చిరుద్యోగుల నుంచి కూడా డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో ‘సంతోష’ంగా చక్రం తిప్పిన ఓ అధికారితోపాటు మరో ఉన్నతాధికారి అండదండలు ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై కొందరు ఆధారాలతో సహా గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. టార్గెట్లు పెట్టి మరీ..! విచారణ పేరుతో ప్రొఫెసర్లు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, ఉద్యోగులను భయపెట్టడంతోపాటు.. తమకు అనుకూలంగా వ్యవహరించకపోతే చివరి వరకు వేధిస్తామంటూ బెదిరింపులకు దిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఒక్కో వర్గానికి లక్ష్యాలు నిర్దేశించి మరీ డబ్బులు వసూలు చేసినట్టు సమాచారం. ఏయూలో పనిచేస్తున్న సుమారు 11 మంది ఇంజనీర్ల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.22 లక్షలు విచారణ పేరుతో వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. యూనివర్సిటీలో వివిధ పనులు చేపట్టే ఓ కాంట్రాక్టు సంస్థ నుంచి రూ.15 లక్షలు, ఏయూలో పలు కార్యక్రమాలు నిర్వహించే మరో సంస్థ నుంచి రూ.10 లక్షలు తీసుకున్నట్టు సమాచారం. చిన్న ఉద్యోగుల నుంచి రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు, ఉద్యోగ సంఘాల నేతల నుంచి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు డిమాండ్ చేసినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఎవరు ఎంత ఇవ్వాలో ముందే లక్ష్యాన్ని నిర్దేశించి వసూళ్లు చేసినట్టు ఆరోపణలు రావడం గమనార్హం. త్వరలో గవర్నర్ వద్దకు! ఏయూ ప్రతిష్టను దెబ్బతీసే నిర్ణయాలతోపాటు.. ఉద్యోగులు, కాంట్రాక్టు సంస్థలపై విచారణ పేరుతో ఒత్తిళ్లు, వసూళ్ల ఆరోపణలు వర్సిటీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతున్నాయి. తమకు జీవనోపాధి కల్పిస్తున్న సంస్థను ఇష్టారాజ్యంగా బలహీనపరచడమే కాకుండా, విచారణల పేరుతో వేధింపులకు గురిచేయడం ఏమిటని పలు వురు ప్రశ్నిస్తున్నారు. విచారణ పేరుతో వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ అధికారిపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేసేందుకు కొందరు సిద్ధమవుతున్నట్టు సమాచారం. పాలకమండలి అనుమతి లేకుండా వీసీ ఏకపక్షంగా తీసుకుంటున్నారని ఆరోపిస్తున్న పలు నిర్ణయాలనూ ఫిర్యాదులో ప్రస్తావించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ అంశాలన్నింటినీ నేరుగా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడంతోపాటు.. ఫిర్యాదు ప్రతిని పంపాలని కొందరు యోచిస్తున్నట్టు సమాచారం. గవర్నర్ దీనిపై విచారణకు ఆదేశిస్తే.. విచారణ పేరుతో జరిగిన వసూళ్ల వ్యవహారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని వర్సిటీ వర్గాలు భావిస్తున్నాయి. దిగజారుతున్న ఏయూ ప్రతిష్ట! వాస్తవానికి ఏయూ ప్రతిష్టను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి వీసీ ప్రసాద్రెడ్డి కృషితో మరింత పెంచారనే అభిప్రాయం ఉంది. 2018లో అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఏయూలో డిఫెన్స్ స్టడీస్ సెంటర్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ కేంద్రంలో సైనికులు, సైనికాధికారులు ఉన్నత విద్య అభ్యసించారు. వైమానిక, నౌకా, భూసేనలతోపాటు ఐఎన్ఎస్ వంటి సంస్థలతో ఏయూ ఒప్పందాలు చేసుకుంది. వేలాది మంది రక్షణశాఖ సిబ్బంది డిగ్రీ లు, పీహెచ్డీలు పూర్తి చేశారు. అగ్నివీరులకు శిక్షణ ఇచ్చేందుకు ఎంపికై న తొలి విశ్వవిద్యాలయంగానూ ఏయూ గుర్తింపు పొందింది. 7వేల మందికిపైగా సైనికులు ఇక్కడ గ్రాడ్యు యేషన్ పూర్తి చేసినట్టు వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. అలాంటి డిఫెన్స్ సెంటర్ను మూసివేయడంపై ప్రశ్న లు తలెత్తుతున్నాయి. పరిణామాల నేపథ్యంలో సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ నిరంజన్ రాజీనామా చేయగా.. సమన్వయకర్త ఉజ్వల్ వంటి నిపుణులు వర్సిటీని వీడారు. డిఫెన్స్ కోర్సులు నిలిచిపోవడంతో అడ్మిషన్లు గీతం వంటి ప్రైవేటు సంస్థలకు మళ్లేలా నిర్ణయాలు జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో గత ప్రభు త్వ హయాంలో అవినీతి జరిగిందంటూ విచారణలు చేపట్టి.. ఆ పేరు తో వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు చర్చనీయాంశమవుతున్నాయి. ‘ఇంటిని చక్కదిద్దాల్సింది పోయి గోడలు కూల్చిన చందంగా’ ఏయూ ప్రతిష్టను కాపాడాల్సినవారే సంస్థను మరింత అప్రతిష్టపాలు చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. -
ఉధృతంగా గెడ్డలు
పలు గ్రామాలకు రాకపోకలు బంద్ ● వంతెనలు లేక అవస్థలు వంతెన నిర్మించాలి మండలంలోని జామిగుడ, ఇంజరి పంచాయతీల పరిధిలోని గ్రామాల ప్రజల సౌకర్యార్థం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గుంజివాడ, జామిగుడ గ్రామా ల మధ్య గెడ్డపై వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసి, పునాది నిర్మించారు. స్థల వివాదం కారణంగా పనులు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వంలో పనులు ప్రారంభించి, నిలిపివేశారు. అధికారులు స్పందించి పనులు పూర్తి చేయాలి. – మజ్జి చంద్రుబాబు, వైఎస్సార్సీపీ పెదబయలుమండల అధ్యక్షుడు పెదబయలు/ముంచంగిపుట్టు: జిల్లాలో పలు ప్రాంతాల్లో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. పెదబయలు, ముంచంగిపుట్టు, జి.మాడుగుల మండలాల్లో కొండవాగులు, గెడ్డలు పొంగి ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ● పెదబయలు మండలం జామిగుడ పంచాయతీ పరిధిలో జామిగుడ గెడ్డ పొంగి ప్రవహిస్తుండడంతో 10 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఇంజరి పంచాయతీలో 10 గ్రామాలు, గిన్నెలకోట పంచాయతీలో 5 గ్రామాలు, గుల్లేలు పంచాయతీలో కించూరు గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. గెడ్డ ఉధృతంగా ప్రవహించడం వల్ల జామిగుడలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి గెడ్డ అవతలి వైపు ఉన్న గుంజివాడ, తారాబు, చింతలవీధి, సరిగిగుడ, గబ్బరుమామిడి, కెందుగుడ ప్రజలతో పాటు మరో నాలుగు గ్రామాల ప్రజలు రాలేకపోయారు. ● ముంచంగిపుట్టు మండలంలో లక్ష్మీపురం, బుంగాపుట్టు, రంగబయలు, భూసిపుట్టు, దొడిపుట్టు పంచాయతీల్లో మారుమూల గ్రామాల్లో వాగులు పొంగాయి. వరదనీటితో గెడ్డలు ప్రమాదభరితంగా ఉన్నాయి. లక్ష్మీపురం పంచాయతీ ఉబ్బెంగుల, దొరగూడ గ్రామాల చుట్టూ ఉన్న వాగులు పొంగడంతో మూడు రోజులుగా రెండు గ్రామాల గిరిజనులు గ్రామాలకే పరిమితమయ్యారు. దొడిపుట్టు పంచాయతీ బీడిచెంప గ్రామ సమీపంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మాకవరం, కర్రిముఖిపుట్టు, కిలగాడ, వనుగుమ్మ, బరడ పంచాయతీల్లో వర్షపు నీరు పంట పొలాల్లోకి చేరడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముంచంగిపుట్టు నుంచి కుమడ వెళ్లే మార్గంలో భారీగా గోతులు ఉండడంతో వాహనాలు గోతుల్లో దిగిపోయి ప్రమాదాల బారిన పడుతున్నారు. స్థానికుల సహాయంతో గోతుల నుంచి వాహనాలు అతికష్టం మీద బయటకు తీయవలసి వస్తోంది. ● జి.మాడుగుల మండలంలో కిల్లంకోట వద్ద చాపగెడ్డ పొంగి ప్రవహిస్తోంది. సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అసంపూర్తిగా జామిగుడ వంతెన పెదబయలు మండలం జామిగుడ పంచాయతీ పరిధిలోని గ్రామాలతో పాటుగా ఒడిశాకు అనుసంధానం చేస్తూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసి, పునాది వరకు నిర్మించారు. అనంతరం స్థల వివా దం కారణంగా పనులు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వంలో పనులు ప్రారంభించారు. పిల్లర్ల వరకు నిర్మించి, నిలిపివేశారు. దీంతో ఈ ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు గెడ్డ పొంగి ప్రవహిస్తుండడంతో అత్యవసర సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. గ్రామాల నుంచి పంచాయతీ కేంద్రానికి రావడానికి కూడా వీలులేకుండా పోయింది. ప్రభుత్వం స్పందించి గుంజివాడ, కించూరు, తారాబు గెడ్డలపై వంతెనలు నిర్మాణం చేపట్టాలని ఈ ప్రాంత గిరిజనులు కోరుతున్నారు. -
బైక్ ప్రమాదంలో బీహార్ యువకుడి మృతి
కోటవురట్ల: అతివేగం ఓ యువకుడి ప్రాణాలను బలి తీసుకుంది. మండలంలోని యండపల్లిలో అన్నవరం జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. బీహార్కు చెందిన మహ్మద్ సెహవాజ్, మహ్మద్ అనాష్, మహ్మద్ సాజిద్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం చింతపల్లి వచ్చారు. సోమవారం ఉదయం రేవు పోలవరం బీచ్కు ముగ్గురూ బైక్పై వెళుతుండగా అన్నవరం జంక్షన్ వద్ద మలుపులో రోడ్డు పక్కన ఉన్న సిమెంట్ బెంచీని వేగంగా ఢీకొట్టారు. ఈ దుర్ఘటనలో బైక్ నడుపుతున్న మహ్మద్ సెహవాజ్(22) తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ వెనుక కూర్చున్న మహ్మద్ అనాష్, మహ్మద్ సాజిద్లకు గాయాలు కావడంతో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పాలిటెక్నిక్ స్పాట్ కౌన్సెలింగ్ వాయిదా
చింతపల్లి: స్థానిక ఆచార్య ఎన్జీ రంగా సేంద్రియ పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల 26వ తేదీన నిర్వహించాల్సిన కౌన్సెలింగ్ను ఒక రోజు వాయిదా వేసి, 27న నిర్వహించనున్నట్టు వ్యవసాయ పరిశోధన స్థానం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ డి.ఆదిలక్ష్మి తెలిపారు. గుంటూరు లాం కళాశాలలో జరిపిన కౌన్సెలింగ్లో చింతపల్లి సేంద్రియ వ్యవసాయ పాలిటెక్నిక్లో ఉన్న 25 సీట్లకు గాను 12 సీట్లు భర్తీకాగా, 13 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటి భర్తీకి మొదట ఈ నెల 26న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు ప్రకటించినప్పటికీ, ఆ రోజు సెలవు కావడంతో 27వ తేదీకి వాయిదా వేశామని చెప్పారు. ఈ విషయాన్ని అర్హత గల అభ్యర్థులు గమనించాలన్నారు.ఈ కౌన్సెలింగ్కు ఇంటర్ పాస్, ఫెయిల్ అయిన వారితో పాటు పదవ తరగతి ఉత్తీర్ణులైన ఆసక్తిగల అభ్యర్థులు హాజరుకావచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్ 9014637080 లో సంప్రదించాలని కోరారు. -
‘ఓపెన్’లో 10వ తరగతి అడ్మిషన్లు
అనంతగిరి(డుంబ్రిగుడ): మండల కేంద్రం అనంతగిరిలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల–2లో సార్వత్రిక విద్యాపీఠం దూర విద్యా కేంద్రం ద్వారా ఓఎస్ఎస్సీ 10వ తరగతి అడ్మిషన్లు జరుగుతున్నాయని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మంగమ్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అనివార్య కారణాల వల్ల పదవ తరగతి వరకు చదువుకోలేకపోయిన, 15 సంవత్సరాల వయసు పైబడిన వారు దూర విద్యా విధానంలో 10వ తరగతి, ఇంటర్మీడియెట్ను పూర్తి చేసుకునే సదవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం కల్పిస్తోందని చెప్పారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఓఎస్ఎస్సీ 10వ తరగతి అడ్మిషన్ల కోసం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలి కార్యాలయంలో గానీ, ఫోన్ నంబర్ 6305971317 లో గానీ సంప్రదించాలని సూచించారు. -
ఎన్టీఆర్ ఆస్పత్రిలో నల్లబ్యాడ్జీలతో నిరసన
అనకాపల్లి: ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో ఏళ్ల తరబడి అంకితభావంతో రోగులకు సేవలు అందిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులందరినీ తక్షణమే రెగ్యులర్ చేయాలని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్ట్ సిబ్బంది పట్టణశాఖ అధ్యక్షురాలు రాజేశ్వరి అన్నారు. స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రి ఆవరణలో సోమవారం కాంట్రాక్టు ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకూ నిరసన చేయడం జరుగుతుందని, వేతనాలు పెంపుపై తక్షణం చర్యలు చేపట్టాలని, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి కాంట్రాక్టు ఉద్యోగి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని తదితర డిమాండ్లతో నిరసన తెలియజేశారు. -
కందుల దందా
డాబాగార్డెన్స్: కనకమహాలక్ష్మి దేవస్థానం వివాదాలకు నిలయంగా మారుతోంది. పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో సనాతన ధర్మ సూత్రాలను, దేవదాయ శాఖ నిబంధనలను తుంగలో తొక్కుతూ ఆలయ ట్రస్ట్బోర్డు చైర్మన్ కందుల నాగరాజు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరు తీవ్ర కలకలం రేపుతోంది. ‘ఆలయం నాదే... నే చెప్పిందే వేదం’ అనే ధోరణితో ఆయన తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు అటు పాలకమండలి సభ్యులకు, ఇటు ఆలయ అధికారులకు, చివరకు అర్చక సిబ్బందికి సైతం తీవ్ర మనస్తాపం కలిగిస్తున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కుతూ ఆయన సాగిస్తున్న వ్యవహార శైలిపై భక్తజనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే పేరుమీద.. తాజాగా మార్గశిర మాస ఉత్సవాల వేళ చైర్మన్ నాగరాజు తీసుకున్న నిర్ణయం ఆలయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. డిసెంబర్ 27న నిర్వహించ తలపెట్టిన మార్గశిర సహస్ర కలశాభిషేకం (మార్గశిర రథయాత్ర) పేరిట దేవదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ గానీ, ప్రభుత్వం గానీ ఎటువంటి ఆమోదం తెలపకుండానే ఆయన సొంతంగా రూ.200 విలువైన టికెట్లను, కరపత్రాలను ముద్రించి విక్రయాలకు శ్రీకారం చుట్టడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. మహిళలకు ప్రత్యేక డ్రెస్ కోడ్ నిర్ణయించడమే కాకుండా, ఈ అనధికారిక కరపత్రాలపై దక్షిణ జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, ఆలయ కార్యనిర్వహణాధికారి సుజాత పేర్లను ముద్రించడం గమనార్హం. ఎమ్మెల్యే చేతుల మీదుగానే యాత్ర ప్రారంభమవుతుందంటూ భక్తులను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆది నుంచి వివాదస్పదమే.. చైర్మన్ కందుల నాగరాజు ఏకపక్ష నిర్ణయాల పరంపర ఈనాటిది కాదు. గత జూన్ నెలలోనే ఆలయ పవిత్రతను భంగపరుస్తూ, కాళ్లకు పాదరక్షలతో దేవుని ప్రాంగణంలోకి ప్రవేశించి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన ఘటన మరవకముందే ఈ కొత్త వివాదం ముసిరింది. ఆలయ కార్యనిర్వహణాధికారి సుజాతతో పాటు ఇతర సిబ్బందితో కనీస సమన్వయం లేకుండా, ఎవరినీ సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంటుండటంతో ఆలయ పరిపాలన దారి తప్పింది. ప్రజాప్రతినిధి, ప్రభుత్వ అధికారులు సైతం మౌనం వహించడంతో ఛైర్మన్ వైఖరి మరింత శ్రుతిమించుతోందని పాలకమండలి సభ్యులే బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భక్తుల నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటూ సాగిస్తున్న ఈ అనధికారిక టికెట్ల విక్రయాలను, ఆర్థిక లావాదేవీలను వెంటనే నిలిపివేసి, దేవదాయ శాఖ ఉన్నతాధికారులు సత్వరమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వ అనుమతులు లేకుండానే.. చట్ట ప్రకారం ట్రస్ట్బోర్డు సమావేశంలో ఏదేని నిర్ణయం తీసుకున్నప్పటికీ, దానికి సంబంధించిన ప్రతిపాదనలను కార్యాలయం ద్వారా దేవదాయ శాఖ కమిషనర్కు పంపి, ప్రభుత్వ పూర్వానుమతి పొందాకే ఎలాంటి రుసుములు లేదా టికెట్లను అమలు చేయాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటివరకు ఈ నిర్ణయానికి సంబంధించిన ఎలాంటి దస్త్రాలు తమ కార్యాలయానికి రాలేదని ఆలయ సిబ్బందే స్పష్టం చేస్తుండటం చైర్మన్ అక్రమ విధానాలకు అద్దం పడుతోంది. ప్రభుత్వ అనుమతి లేకుండా ఆర్థిక లావాదేవీలకు తెరదీయడం చట్టవిరుద్ధమని తెలిసినా, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న చైర్మన్ ఇలా వ్యవహరించడం శోచనీయం. గర్వంతో విర్ర వీగకూడదు ఆలయ వ్యవహారాల్లో ఏకపక్ష ధోరణి, అనధికారిక నిర్ణయాలు సరికావు. ట్రస్ట్ బోర్డు బాధ్యతల్లో ఉన్నవారు దేవదాయ శాఖ నిబంధనలకు లోబడి భక్తులకు సేవకులుగా మాత్రమే పనిచేయాలి తప్ప, ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అనే గర్వంతో విర్రవీగకూడదు. దేవదాయ శాఖ డీసీ హోదా కలిగిన అధికారి అధికారికంగా అనుమతించి విడుదల చేయాల్సిన సేవా టికెట్లను, ప్రభుత్వ ఆమోదం లేకుండా చైర్మన్ సొంతంగా ముద్రించి విక్రయించడం స్పష్టమైన చట్ట ఉల్లంఘన. అమ్మవారి ఆలయ ప్రతిష్టను దిగజారుస్తూ, అనధికారిక రుసుములతో భక్తులను దేవునికి దూరం చేసే ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలి. ప్రభుత్వం మరియు దేవదాయ శాఖ ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి. –విజయశంకర్ ఫణీంద్ర, కో–కన్వీనర్, బీజేపీ రాష్ట్ర ధార్మిక సెల్ -
పర్యాటక ప్రాంతాల్లో ‘బ్రిక్స్’ ప్రతినిధులుసందడి
కొమ్మాది: బ్రిక్స్ దేశాల క్రీడామంత్రుల సమావేశం నేపథ్యంలో పలువురు బ్రిక్స్ ప్రతినిధులు తొట్లకొండను ఆదివారం సందర్శించారు. దీని చారిత్రక పాధాన్యతతో పాటు బౌద్ధమతంలో ఈ ప్రాంతానికి ఉన్న విశిష్టతను గైడ్ ద్వారా తెలుసుకున్నారు. నీటి తొట్టెలు, చైత్యాలు, ఆరామాలు, స్థూపాలు, మహాస్థూపం, పాకశాల, ధ్యాన కేంద్రాలను సందర్శించి, వాటి గురించి తెలుసుకున్నారు. అక్కడి నుంచి తొట్లకొండపై ఉన్న సీ వ్యూ పాయింట్ సందర్శించారు. రుషికొండ వద్ద... బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పొందిన రుషికొండ బీచ్ను బ్రిక్స్ దేశాల ప్రతినిధులు సందర్శించి అక్కడ అధికారులు ఏర్పాటు చేసిన తేనీటి విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక కళాకారులు సాంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. వారితో కలసి థింసా, ఇతర నృత్యాల్లో పాల్గొని, ప్రతినిధులు సందడి చేశారు. -
కేజీహెచ్లో మెడ్కో మాయాజాలం
మహారాణిపేట: డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ పథకం నిర్వహణలో నిబంధనలు కాగితాలకే పరిమితమవుతున్నాయా? కేజీహెచ్లో చోటుచేసుకున్న తాజా పరిణామం ఈ ప్రశ్నను మరోసారి తెరపైకి తెచ్చింది. క్లినికల్ స్పెషాలిటీ విభాగాలకు చెందిన వైద్యులను ఎన్టీఆర్ వైద్యసేవ ఇన్చార్జి మెడికల్ కోఆర్డినేటర్ (మెడ్కో)గా నియమించవద్దని వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ) గతంలోనే స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ, వాటిని బేఖాతరు చేస్తూ న్యూరోసర్జరీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె. శివరామకృష్ణకు మెడ్కో బాధ్యతలు అప్పగించడం వివాదాస్పదంగా మారింది. ఉత్తర్వుల నేపథ్యం కేజీహెచ్కు చెందిన సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ ఏ. రాజేష్ను ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్కు డిప్యుటేషన్పై పంపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ట్రస్ట్ మెడ్కు పూర్తి బాధ్యతలను డాక్టర్ కె. శివరామకృష్ణకు అప్పగించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అత్యంత రద్దీగా ఉండే న్యూరోసర్జరీ విభాగంలో పనిచేసే వైద్యుడికి ఈ అదనపు పరిపాలనా బాధ్యత అప్పగించడంపై ఆస్పత్రి వర్గాల్లో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. డీఎంఈ ఆదేశాలు బేఖాతరు ఎన్టీఆర్ వైద్యసేవ/ఆరోగ్యశ్రీ పథకం నిర్వహణ బాధ్యతలను సీఎస్ఆర్ఎంవో, డీసీఎస్ఆర్ఎంవో, ఆర్ఎంవో వంటి పరిపాలనా వైద్యాధికారులకే అప్పగించాలని, క్లినికల్ స్పెషాలిటీ వైద్యులను వీలైనంత వరకూ ఈ బాధ్యతల నుంచి మినహాయించి వారి సేవలను పూర్తిగా రోగుల చికిత్సకే వినియోగించాలని డీఎంఈ గతంలోనే స్పష్టం చేసినట్టు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. క్లినికల్ వైద్యులు ఇన్చార్జిలుగా ఉంటే పథకం అమలులో ఎదురయ్యే సమస్యల పరిష్కారంలో ఇబ్బందులు తలెత్తుతాయని, పరిపాలనా వ్యవహారాలతో ప్రత్యక్ష సంబంధమున్న సీఎస్ఆర్ఎంవో, డీసీఎస్ఆర్ఎంవో, ఆర్ఎంవోలే ఈ బాధ్యతలకు సరైనవారని ఆ మార్గదర్శకాల్లో పేర్కొన్నట్టు సమాచారం. అయితే వీటిని పక్కనపెట్టి న్యూరోసర్జరీ అసోసియేట్ ప్రొఫెసర్కు బాధ్యతలు కట్టబెట్టడం చర్చనీయాంశమైంది. వద్దన్నా వినకుండా అప్పగింత మెడ్కో బాధ్యతలు స్వీకరించలేనని సంబంధిత వైద్యుడు చెప్పినప్పటికీ బలవంతంగా అప్పగించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిత్యం శస్త్రచికిత్సలు, రోగుల పరీక్షలతో బిజీగా ఉండే న్యూరోసర్జరీ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వైద్యుడిపై ఇంత విస్తృత పరిపాలనా భారం మోపడం రోగుల సేవలపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. డీఎంఈ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్నతాధికారుల ఉద్దేశమేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. డైట్ క్యాంటీన్లోనూ అదే తీరు కేజీహెచ్లో డైట్ క్యాంటీన్ నిర్వహణ బాధ్యతలను కూడా ఆర్ఎంవో స్థాయి అధికారులకు కాకుండా పీడియాట్రిక్స్ విభాగ అధిపతి డాక్టర్ చక్రవర్తికి అప్పగించినట్టు ఆస్పత్రి వర్గాలు ఆరోపిస్తున్నాయి. క్లినికల్ బాధ్యతలు నిర్వర్తించే స్పెషలిటీ వైద్యులపై పరిపాలనా భారం మోపడం వైద్య సేవలకు విఘాతం కలిగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.ఆర్ఎంవో వ్యవస్థ ఉన్నా వినియోగించని వైనం కేజీహెచ్లో సీఎస్ఆర్ఎంవో డాక్టర్ యు. శ్రీహరి, డీసీఎస్ఆర్ఎంవో డాక్టర్ కుమార్, ఆర్ఎంవో డాక్టర్ బంగారయ్య వంటి పరిపాలనా వ్యవస్థ అందుబాటులో ఉన్నప్పటికీ, కీలక బాధ్యతల నుంచి వారిని పక్కనపెట్టడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. బాధ్యతలు నిర్వహించే అధికారులను పక్కనపెట్టి, ఉన్నతాధికారులు చెప్పినట్లు సంతకాలు పెట్టే రబ్బర్ స్టాంపుల కోసమేనా నిబంధనలను సైతం విస్మరిస్తున్నారు? అన్న ప్రశ్నలు ఆస్పత్రి వర్గాల్లో తీవ్రంగా వినిపిస్తున్నాయి. కలెక్టర్ జోక్యం చేసుకోవాలి డీఎంఈ మార్గదర్శకాలకు విరుద్ధంగా జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరిపించాలని ఆస్పత్రి వర్గాలు కోరుతున్నాయి. ఎన్టీఆర్ వైద్యసేవ నిర్వహణలో నిబంధనలు పాటిస్తున్నారా? క్లినికల్ స్పెషాలిటీ వైద్యుడికి మెడ్కో బాధ్యతలు అప్పగించడం సమంజసమేనా? అందుబాటులో ఉన్న ఆర్ఎంవో వ్యవస్థను ఎందుకు వినియోగించలేదు? అన్న ప్రశ్నలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.నిబంధనలు కేవలం సాధారణ ఉద్యోగులకే వర్తిస్తాయా, ఉన్నతాధికారులకు వర్తించవా అన్న ప్రశ్నకు కేజీహెచ్ యాజమాన్యం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. -
ముగ్గులతో నిరసన
నేటి నుంచి జూడాల ఆందోళన తీవ్రతరంమహారాణిపేట: స్టైఫండ్ పెంపు కోసం గత 14 రోజులుగా ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యుల (జూడాలు) పట్ల ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో సోమవారం నుంచి తమ నిరసనలను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే అత్యవసర సేవలను సైతం బహిష్కరించిన వైద్యులు, ఆదివారం కేజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట రంగురంగుల ముగ్గులు వేసి వినూత్నంగా నిరసన తెలిపారు. జనవరి నుంచి స్టైఫండ్ పెంచుతామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు కేవలం 3 శాతమే ఇస్తామనడం సరికాదని, ఇతర రాష్ట్రాలతో ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించి తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు తీరేవరకు పోరాటం కొనసాగుతుందని ఏపీ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ నాయకులు డాక్టర్ శిరాజ్, దినకర్ సాయి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఆదివారం నాటి రిలే నిరాహార దీక్షల్లో డాక్టర్ కళ్యాణ్, డాక్టర్ జాహ్నవి, డాక్టర్ సుభాష్, డాక్టర్ విజేత తదితరులు పాల్గొన్నారు. -
కావడి కదంబం.. భక్తి రస ప్రవాహం
నగరంలోని మార్వాడీల సంప్రదాయ సిద్ధంగా ఆదివారం కావడి యాత్ర నిర్వహించారు. తమ కుటుంబాలు సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని, విశ్వశాంతి నెలకొనాలని కోరుతూ వీరు ప్రతి ఏడాది శ్రావణమాసంలో ఈ కావడి యాత్రను చేపడతారు. ఈసారి యాత్ర రోజు ఏకాదశి కావడంతో ఆదివారం కావడి యాత్రను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో భాగంగా వీరు మొదట మాధవదార శివాలయంలో శివుడిని దర్శించుకున్న అనంతరం కావిళ్లతో బయలుదేరారు. మురళీనగర్, ఊర్వశి కూడలి మీదుగా జాతీయ రహదారిపై సుమారు రెండువేల కుటుంబాలు భారీ సంఖ్యలో ఊరేగింపుగా బీచ్రోడ్డులోని జగన్నాథస్వామి ఆలయం వరకు కావడి యాత్రను కొనసాగించినట్టు మార్వాడీ యువమంచ్ అధ్యక్షుడు విష్ణు రాటేరియా తెలిపారు. అక్కడ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కావడి యాత్రతో నగరం భక్తి రస ప్రవాహంగా మారింది. – మురళీనగర్ -
అడుగంటిన రావణాపల్లి జలాశయం
గొలుగొండ: రావణాపల్లి రిజర్వాయర్ అడుగంటడంతో నర్సీపట్నం, గొలుగొండ మండలాల్లో దారు ణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆగస్టు రెండో వారంలో వరి నాట్లు పడి పచ్చగా కళకళలాడాల్సిన పొలా లు జీవం కోల్పోయి బీడువారి ఉన్నాయి. రావణాపల్లి నీటి నిల్వ సామర్థ్యం 139 ఎంసీఎఫ్టీలకు గాను, ప్రస్తుతం 49 ఎంసీఎఫ్టీలు మాత్రమే ఉంది. గొలు గొండ, నర్సీపట్నం మండలాల్లోని 2,600 ఎకరాల భూములకు ఈ జలాశయం ప్రధాన ఆధారం. ప్రతి ఏటా జులై నెలలో సాగు నీరు విడుదల చేసేవారు. ఈ ఏడాది ఆగస్టు పూర్తి కావస్తున్నా నీటి నిల్వలు లేకపోవడంతో వరి సాగు ప్రశ్నార్థకంగా మారింది. 15 సంవత్సరాల తరువాత... రావణాపల్లి జలాశయం ఎప్పుడూ నిండు కుండలా ఉండేది. జలాశయం గొలుగొండ మండలంలో ఉన్నప్పటికీ అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం తురవాడ గెడ్డ నుంచి జలాశయంలోకి నీరు వచ్చేది. తురవాడ గెడ్డ నిత్యం నీటితో కళకళలాడేది. ఏజెన్సీ ప్రాంతంలో ఏ మాత్రం వర్షం కురిసినా తురవాడ గెడ్డ పొంగి ప్రవహించి, జలాశయంలోకి నీరు చేరుతుంది. ఏజెన్సీ ప్రాంతంలో కూడా వర్షాలు కురవకపోవడంతో జలాశయం అడుగంటింది. 15 సంవత్సరాల తరువాత ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. మత్స్యకారులకు నష్టం రావణాపల్లి జలాశయంలో చేపల పెంపకం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రతి ఏటా జనవరి నుంచి జులై వరకు ఈ జలాశయంలో మత్స్యకారులు భారీగా చేపలు వేటాడి జీవనోపాధి పొందుతారు. ఈ ఏడాది జలాశయంలో నీరు లేకపోవడంతో ఇటు రైతులకు, ఇటు వందలాది మంది మత్స్యకారులకు ఇబ్బందులు గురవుతున్నారు. -
పొల్యూషన్కు సొల్యూషన్ ‘సైక్లింగ్’
ఏయూ క్యాంపస్: కాలుష్యానికి సైక్లింగ్ పరిష్కారంగా నిలుస్తుందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. బ్రిక్స్ ఫ్రెండ్షిప్ వేడుకల్లో భాగంగా సండేస్ ఆన్ సైకిల్ పేరిట బ్రిక్స్ దేశాల ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొని ఆదివారం ఉదయం బీచ్రోడ్డులో సైక్లింగ్ చేశారు. సైక్లింగ్ అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. సైక్లింగ్ ‘ఫిట్ ఇండియా’ఉద్యమంలో భాగమన్నారు. భారత ప్రధాని ‘సండేస్ ఆన్ సైకిల్’కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. ఆదివారం దేశవ్యాప్తంగా దాదాపు 1,800 నగరాల్లో ఈ కార్యక్రమం నిర్వహించగా, 50 లక్షల మంది యువత పాల్గొన్నారని పేర్కొన్నారు. సైక్లింగ్ అద్భుతమైన వ్యాయామమని, దీనివల్ల శారీరక దృఢత్వం పెరుగుతుందన్నారు. ప్రతి ఆదివారం ప్రజలు సైక్లింగ్లో పాల్గొనాలని సూచించారు. తద్వారా కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. బీచ్రోడ్డులోని నోవాటెల్ హోటల్ నుంచి సీ హారియర్ వరకు బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైక్లింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సే, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, బ్రిక్స్ ప్రతినిధులు, శాప్ ఎండీ భరణి, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, ఆర్డీవో దిలీప్ చక్రవర్తి, క్రీడా అధికారి జూన్ గ్యాలియట్, యూడీసీ పీడీ సత్యవేణి, కేంద్ర ప్రభుత్వ అధికారులు, పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు. -
రుచికరం.. విభిన్నం
ఆరోగ్యానికి ఎంతో మేలు సంతలో వెదురు కొమ్ములు అమ్మకాలుముంచంగిపుట్టు: కూరగాయల్లో ఎన్నో రకాలు ఉంటాయి. కానీ, జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో లభించే కొన్ని ప్రత్యేకమైన వంటకాలు ఎంతో విభిన్నంగా ఉంటాయి. ఎప్పుడైనా వెదురు నుంచి తీసిన కూరను రుచి చూశారా? వినడానికి కొత్తగా ఉన్నప్పటికీ, గిరిజనులు మాత్రం లేత వెదురు చిగురుతో ఎంతో రుచికరమైన కూర వండుకుంటారు. దీనిని స్థానికంగా వెదురు కొమ్ములు లేదా వెదురు కంజి అని పిలుస్తారు. ప్రస్తుతం వర్షాకాలం సీజన్ ప్రారంభం కావడంతో, మన్యం ప్రాంతాల్లోని మండల కేంద్రాలు వారపు సంతల్లో ఈ వెదురు కంజి అమ్మకాలు హాట్ కేకుల్లా సాగుతున్నాయి. సేకరణ: అటవీ, కొండ ప్రాంతాల్లోని వెదురు బొంగుల నుంచి లేత వెదురు చిగురును సేకరించి, శుభ్రం చేసి చిన్న ముక్కలుగా కట్ చేస్తారు. గిరిజనులు వీటిని మండల కేంద్రాలకు తెచ్చి, వాటాను బట్టి రూ.20 నుంచి రూ.50 వరకు విక్రయిస్తారు. రెండు రకాలు ● పచ్చి వెదురు కంజి.. సేకరించిన వెంటనే తాజాగా ఉన్నప్పుడు కూర వండుకోవడానికి ఉపయోగిస్తారు. ● ఎండబెట్టిన కంజి.. వీటిని ఎండబెట్టి నిల్వ చేసుకుని, ఏడాది పొడవునా ఎప్పుడైనా వండుకోవడానికి ఉపయోగిస్తారు. రుచికరమైన వంటకాలు ఈ వెదురు కంజిని మన్యం వాసులు ఎంతో ఇష్టంగా తింటారు. దీనితో వేపుడు, పచ్చడి, పులుసు వంటి రకరకాల వంటకాలను తయారు చేసుకోవచ్చు. చిట్కా: వెదురు కంజి కూర వండే ముందు, దానిలోని సహజమైన చేదుదనం పోయేలా రెండు, మూడు సార్లు శుభ్రంగా కడగుతారు. అప్పుడే కూర అద్భుతమైన రుచిని ఇస్తుంది! ఉపయోగాలిలా.. వెదురుకంజిని బాగా ఉడకబెట్టి దాని కషయాన్ని తాగితే శరిరానికి తక్షణమే వేడి చేస్తుందని గిరిజనులు చెబుతుంటారు. మదుమేహం, కపం, మూల వ్యాధి నివారణకు ఆయుర్వేద పరంగా ఎంతో ఉప శమనం ఇస్తుంది. రక్తాన్ని శుద్ధి పరుస్తుంది. మహిళల్లో గర్భశోఖ వ్యాధులు రాకుండా అరికడుతుంది. జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. కడుపులో నులి పురుగును తొలగిస్తుంది. అలాగే గాయాలైనప్పుడు గాయం మానేందుకు వెదురు కంజిని పేస్ట్గా చేసి గాయంపై రాస్తారు. దీనికి తోడు మారుమూల గిరిజనులు పాము, తేలు కాటులకు ఔషధంగా వినియోగిస్తామని గిరిజనులు తెలిపారు. వెదురు కొమ్ములకు గిరాకీ అటవీ ప్రాంతాల్లో వెదురు నుంచి లేత చిగురు సేకరణ వారపు సంతల్లో అమ్మకాలు వేపుడు, పచ్చడి, పులుసు రుచులకు ఎంతో డిమాండ్ గిరిజనులకు ఎంతో ఇష్టమైన వంటకం వెదురు కంజివెదురు కొమ్ములను గర్భిణులకు అధికంగా వండి పెడతాం.దీనిలో ఉన్న గుణాలు వారి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరానికి వేడిచేసినా గిరిజన ప్రాంతంలోని వాతావరణం చల్లగా ఉన్నందున పెద్దగా ఇబ్బంది ఉండదు. వెదురు కొమ్ముల కూర ఎంతో రుచికరంగా ఉంటుంది. ఈ నాలుగు నెలలు మాత్రమే వెదురు కొమ్ములు లభ్యమవుతాయి. – ఎస్.పుణ్యవతి, గృహిణి, డేగలపుట్టు, ముంచంగిపుట్టు మండలం వారపు సంతల్లో వెదురు కొమ్ముల అమ్మకాలు జోరు గా సాగుతున్నాయి. కొమ్ముల వాటా రూ.20, రూ.50కు విక్రయిస్తున్నారు. ఇప్పుడు మైదాన ప్రాంతం నుంచి వచ్చి కూడా వెదురు కొమ్ములను కొనుగోలు చేస్తున్నారు. కొమ్ములను పచ్చిగా, ఉడకబెట్టి మరీ అమ్ముతున్నాం. వారపు సంతలో కొమ్ములు తెచ్చిన కొద్దిసేపటికే అమ్ముడు పోయాయి. – ఎస్.రామారావు, కూరగాయల వ్యాపారి, నర్సిపుట్టు, ముంచంగిపుట్టు మండలం -
‘అంతర్జాతీయ డ్రాగన్ బోట్’ పోటీలకు కానిస్టేబుల్ ఎంపిక
తుమ్మపాల: ప్రతిష్టాత్మక అంతర్జాతీ య డ్రాగన్ బోట్ పోటీలకు అనకాపల్లి మండలం రొంగలివానిపాలెంకు చెందిన కానిస్టేబుల్ సూరినాయుడు ఎంపికయ్యారు. చైనా లోని హాంగ్జౌలో సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3 వరకు నిర్వహించనున్న 2026 ఐసీఎఫ్ డ్రాగన్ బోట్ ప్రపంచ చాంపియన్షిప్ పోటీల్లో భారత జట్టు తరఫున ఆయన ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ మేరకు భారత కయాకింగ్ అండ్ కానోయింగ్ అసోసియేషన్ నుంచి ఏపీ డీజీపీ కార్యాలయానికి లేఖ అందినట్టు సూరినాయుడు తెలిపారు. సెప్టెంబర్ 28న భారత బృందం చైనాకు బయలుదేరి, అక్టోబర్ 4న తిరిగి వస్తుంది. సూరినాయుడు ప్రస్తుతం డీఐజీ వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. సూరినాయుడు అంతర్జాతీయ పోటీలకు ఎంపిక కావడంపై పోలీసు అధికారులు, సహచరులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు. -
ప్రమాదస్థాయికిడుడుమ నీటిమట్టం
● 1500 క్యూసెక్కుల విడుదల ముంచంగిపుట్టు: ఆంధ్ర–ఒడిశా రాష్ట్రాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి నీరందించే డుడుమ జలాశయంలో నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరుకుంది. గత కొన్ని రోజులుగా సరిహద్దులో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. డుడుమ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 2590 అడుగులు కాగా, ఆదివారం నాటికి అది 2587.07 అడుగులకు చేరుకుంది. జలాశయ నీటి మట్టం క్రమేణా పెరుగుతుండటంతో అప్రమత్తమైన సిబ్బంది, 6వ నెంబర్ గేటును ఒక అడుగు పైకెత్తి 1,500 క్యూసెక్కుల నీటిని బలిమెల జలాశయానికి విడుదల చేస్తున్నారు. వర్షాలు ఇదే విధంగా కొనసాగితే జలాశయానికి ప్రమాదం తప్పదని భావించిన ప్రాజెక్టు అధికారులు మరియు సిబ్బంది, నీటి నిల్వలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రమాద స్థాయి నుంచి సాధారణ స్థాయికి తీసుకువచ్చేందుకు శ్రమిస్తున్నారు. -
జీతం అందక ఇబ్బందులు
● అరునెలలుగా పారిశుధ్య కార్మికుడి వెతలు సీలేరు: సీలేరు మేజర్ పంచాయతీలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న కుర్ర చింటూకు గత ఆరు నెలలుగా జీతం అందకపోవడంతో ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఐదేళ్ల కిందట ఒడిశా నుంచి వలస వచ్చిన అతను, భార్య, నలుగురు పిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. తోటి కార్మికులకు జీతాలు వస్తున్నా, తనకు మాత్రం ఆరు నెలలుగా రాకపోవడంతో కుటుంబ పోషణ భారమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీనిపై గ్రామ కార్యదర్శిని వివరణ కోరగా, బ్యాంకు ఖాతాకు సంబంధించిన సాంకేతిక ఇబ్బందుల వల్ల ఆలస్యమైందని, తక్షణమే జీతం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి పెండింగ్ జీతం ఇప్పించాలని ఆయన కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు. -
రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించడంలో విఫలం
పాడేరు రూరల్: గిరిజన సహకార సంస్థ రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం, సంబంధిత శాఖ ఉన్నత అధికారులు పూర్తిగా విఫలమయ్యారని సీపీఎం జిల్లా కార్యదర్శి అప్పలనర్స విమర్శించారు. పాడేరు మొదకొండమ్మతల్లి కల్యాణ మండపంలో ఆదివారం గిరిజన రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, దశాబ్దాలుగా రేషన్ డీలర్లుగా విధులు నిర్వహిస్తున్న వారిపై ప్రభుత్వం, ఉన్నత అధికారులు సవతితల్లి ప్రేమ చూపుతున్నారని మండిపడ్డారు. చాలిచాలని వేతనాలతో డీలర్లు దుర్భర జీవితం గడపాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఏళ్లుగా పనిచేస్తున్నా కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత లేకపోవడం దారుణమన్నారు. డీలర్లపై ఈ స్థాయి వివక్ష చూపడం ప్రభుత్వానికి తగదని హితవు పలికారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని సౌకర్యాలు కల్పించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేస్తున్న డీలర్ల ప్రధాన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో ఉద్యమాలు మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల నుంచి వచ్చిన డీలర్లు కల్యాణ్ పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి అప్పలనర్స విమర్శ -
ఏయూలో తాత్కాలికనియామకాలకు పచ్చజెండా
● గంటల లెక్కన బోధనకు రేపటి నుంచి ఇంటర్వ్యూలు విశాఖ విద్య: బోధనా సిబ్బంది కొరతతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్ర విశ్వవిద్యాలయ యంత్రాంగం ఎట్టకేలకు గంటల లెక్కన బోధించే తాత్కాలిక సిబ్బంది నియామకానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 25 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పేరిట ఆదివారం ఓ ప్రకటన విడుదలైంది. ఈ నెల 25న కంప్యూటర్ ఇంజినీరింగ్ అండ్ సిస్టమ్ ఇంజినీరింగ్, ఐటీ అండ్ సీఏ, మెటలర్జికల్ ఇంజినీరింగ్ విభాగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. 28న ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగాలకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి. 29న ఇంజినీరింగ్ మ్యాథమెటిక్స్, ఇన్స్ట్రుమెంట్ టెక్నాలజీ, మైరెన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, సివిల్ ఇంజినీరింగ్, జియో ఇంజినీరింగ్ విభాగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయని ఏయూ ప్రకటించింది. ఇప్పటికే సకాలంలో బోధన అందక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు ఈ తాత్కాలిక నియామకాలు ఎంతవరకు ప్రయోజనం చేకూరుస్తాయో చూడాలి. అలాగే ఇంటర్వ్యూల నిర్వహణలో పారదర్శకత పాటిస్తారా? లేదా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ముమ్మరంగా వాహన తనిఖీలు డుంబ్రిగుడ: మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన చాపరాయి సమీపంలో ఆదివారం పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఎస్ఐ ఎల్. సురేష్ ఆదేశాల మేరకు ప్రత్యేక పార్టీ పోలీసులు పర్యాటక కార్లు, ద్విచక్ర వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ, డబ్బులకు ఆశపడి యువత గంజాయి, హ్యాష్ ఆయిల్ అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. గంజాయి రవాణాను పూర్తిగా అరికట్టేందుకే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. -
కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు తగదు
పాడేరు రూరల్: ప్రభుత్వ విద్యపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు మానుకోవాలని ఆదివాసీ సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కూడ రాధాకృష్ణ డిమాండ్ చేశారు. విశాఖపట్నం మధురవాడ (మారికవలస)లోని గురుకుల పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని కోరుతూ పాడేరు ఐటీడీఏ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు నిర్వహిస్తున్న నిరాహార దీక్ష ఆదివారంతో 13వ రోజుకు చేరింది. ఈ దీక్షా శిబిరాన్ని సందర్శించి మాట్లాడిన ఆయన.. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరుతో ఉన్న గురుకుల పాఠశాలను ఎత్తివేసే కుట్రను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. ఉన్నట్లుండి మారికవలస పాఠశాలను ఎత్తివేయడం ప్రభుత్వ నిరంకుశ పాలనకు అద్దం పడుతోందని మండిపడ్డారు. 2004లో ఆదివాసీ విద్యార్థుల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన ఈ ఇంగ్లీష్ మీడియం పాఠశాలను అర్ధంతరంగా రద్దు చేయడం విద్యార్థుల పట్ల కక్షసాధింపు చర్యేనని విమర్శించారు. ప్రభుత్వ విద్యను గాలికి వదిలేసి ప్రైవేట్, కార్పొరేట్ విద్యకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆరోపించారు. మొదట 5 నుంచి 8 తరగతులను తొలగిస్తున్నట్లు ప్రకటించి, ఇప్పుడు 9, 10 తరగతులను కూడా లేకుండా చేయడం ప్రభుత్వ కుట్రలో భాగమేనని ధ్వజమెత్తారు. ఆదివాసీ విద్యార్థులను చదువుకు దూరం చేయడమే లక్ష్యంగా పాలకులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల ప్రిన్సిపాల్ తప్పిదాల వల్లే ఈ సమస్య తలెత్తిందని, విద్యార్థులపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భవిష్యత్తులో ఉద్యమాలు మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ రాజేష్, పోరాట కమిటీ కన్వీనర్ రమే ష్నాయుడు, శ్రావణి, మత్స్యరాజు, రాజారావు, రాంబాబు, గణపతి, త్రినాథ్, శేషు పాల్గొన్నారు. ఆదివాసీ సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కూడ రాధాకృష్ణ -
ఎడతెరిపిలేని వర్షం
ముంచంగిపుట్టు: మండలంలో ఆదివారం ఈదురుగాలులతో కూడిన ఎడతెరిపిలేని భారీ వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లపై భారీగా వరదనీరు ప్రవహించింది. జర్రెల పంచాయతీ డేగలపుట్టు గ్రామానికి చెందిన గుంట గోపాల్ అనే గిరిజనుడి ఇంటిపై భారీ చింతచెట్టు, వెదురు చెట్లు ఒకేసారి పడటంతో పైకప్పు రేకులు ధ్వంసమయ్యాయి. అయితే, ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ మండల నేత నాయకం సురేష్ డేగలపుట్టు గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. జరిగిన నష్టంపై రెవెన్యూ అధికారులకు సమాచారం అందించిన ఆయన, ప్రభుత్వాన్ని తక్షణమే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. తగ్గని వర్షం.. వారపు సంతలకు ఆటంకం సీలేరు: ఏజెన్సీ, ఆంధ్రా–ఒడిశా–పోలవరం సరిహద్దు ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో గిరిజనులు ఇళ్లకే పరిమితమయ్యారు. కూలీ పనులు లేక జీవనం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం సీలేరు, ధారకొండ, చిత్రకొండ ప్రాంతాల్లో జరిగిన వారపు సంతలు వర్షం వల్ల పూర్తిగా దెబ్బతిన్నాయి. గిరిజనులు తాము పండించిన కూరగాయలను విక్రయించడానికి తెచ్చినా, కొనుగోలుదారులు లేక, వర్షానికి కూరగాయలు తడిసిపోవడంతో వెనుదిరిగాల్సి వచ్చింది. పిల్లిగెడ్డ, కొంగపాకల, మాదిగమల్లు, చిన్న గంగవరం తదితర వాగులు కొండనీటితో ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. అసంపూర్తిగా నిలిచిన వంతెనల కారణంగా గిరిజన గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయి ప్రమాదకరంగా మారాయి. మైదాన ప్రాంతాల్లో ఎండలు కాయగా, ఏజెన్సీలో మాత్రం నిత్యం కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.స్తంభించిన జనజీవనం -
ప్రభుత్వాస్పత్రుల్లో.. మందుపాతర!
మహారాణిపేట: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పేద రోగుల ప్రాణాలకు భరోసా కరువైంది. ఒకవైపు జూనియర్ వైద్యుల సమ్మెతో సర్కారు వైద్యం పడకేసింది. మరోవైపు ప్రాణాధార మందుల కొరత పేద రోగులను నిలువునా దహిస్తోంది. ఉత్తరాంధ్ర ప్రజల పెద్ద దిక్కు అయిన కింగ్ జార్జ్ ఆస్పత్రి (కేజీహెచ్) మొదలుకొని నగరంలోని అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో మందుల కొరత తీవ్ర స్థాయికి చేరింది. రోగుల ఆర్తనాదాలు వినపడుతున్నా పాలకుల్లో మాత్రం చలనం లేకుండా పోయింది. మందుల కోటాలో కోత గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పేద రోగులకు అన్ని రకాల మందులు పుష్కలంగా అందుబాటులో ఉండేవి. దాదాపు 613 రకాల ఔషధాలను నిరంతరం అందుబాటులో ఉంచి, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెల రోజులకు సరిపడా మందులను ఒకేసారి ఉచితంగా అందజేసేవారు. కానీ నేడు ఆ పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. ప్రస్తుతం కేవలం 318 రకాల మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అందులోనూ అత్యవసర ఔషధాలు దాదాపు నిండుకున్నాయి. నెల రోజుల కోటాను కాస్తా వారం రోజులకు కుదించేశారు. ఆ కొద్దిపాటి మందుల కోసమే గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సి వస్తోంది. ప్రాణాధార మందుల కొరత బీపీ, షుగర్, గుండెజబ్బులు, క్యాన్సర్, ఫిట్స్, మూర్ఛ వ్యాధి నివారణ మాత్రలతో పాటు ఇన్సులిన్, యాంటీబయాటిక్స్, బ్లీడింగ్ నివారణ, రక్తహీనత నివారణ మందుల నిల్వలు పూర్తిగా అడుగంటాయి. ఆక్సిజన్ పైపులు, వెంటిలేటర్ కిట్లు, ఆపరేషన్లకు వాడే సర్జికల్ దారాలు, గర్భాశయ ఇన్ఫెక్షన్ నివారణ మందులు సైతం దొరకడం లేదు. క్యాన్సర్ బాధితులకు అవసరమైన ఖరీదైన మందులు వస్తే 2–3 రోజుల్లోనే అయిపోతున్నాయి. మళ్లీ ఎప్పుడు వస్తాయో తెలియక ప్రాణాంతక వ్యాధులతో బాధపడే రోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. 100 గ్లౌజులకు ఉన్నవి 10 మాత్రమే! ఆస్పత్రుల్లో ప్రాథమిక వైద్య పరికరాల కొరత మరింత దారుణంగా మారింది. కేజీహెచ్లో రోజుకు కనీసం 100 సెట్ల గ్లౌజులు అవసరం కాగా, పది సెట్లకు మించి లభించడం లేదు. ఒక్కోసారి గ్లౌజులు లేకుండానే ఆపరేషన్లు చేయాల్సిన ప్రమాదకర పరిస్థితులు దాపురిస్తున్నాయని వైద్యులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాయాలకు డ్రెస్సింగ్ చేయడానికి అవసరమైన సూదులు, కిట్లు, ఆయింట్మెంట్లు లేకపోవడంతో రోగుల కుటుంబ సభ్యులే బయట మెడికల్ స్టోర్స్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది. కౌంటర్లు కిటకిట.. రోగుల విలవిల! కేజీహెచ్తో పాటు ప్రభుత్వ విక్టోరియా ఆస్పత్రి, ప్రాంతీయ కంటి ఆస్పత్రి, ప్రభుత్వ మానసిక వైద్యశాల, ఈఎన్టీ, రాణి చంద్రమతి దేవి, టీబీ, ఐడీ ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రోజూ 3 వేల మందికి పైగా ఓపీ, ఐపీ రోగులు మందుల కౌంటర్ల వద్ద బారులు తీరుతున్నారు. మందుల కోసం నిలబడితే ‘స్టాక్ లేదు.. విజయవాడకు ఇండెంట్ పెట్టాం.. బయట కొనుక్కోండి’ అంటూ సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ వైద్యం పూర్తిగా పడకేసింది. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం అందక.. మందులు లేక రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. నిండుకున్న మందుల స్టాక్ 613 రకాలకు అందుబాటులో ఉన్నవి 318 మాత్రమే.. బీపీ, షుగర్, గుండె జబ్బులు, క్యాన్సర్ మందుల కొరత నెల రోజుల కోటా వారం రోజులకు కుదింపు -
గంజాయి స్మగ్లర్లపై ఉక్కు పాదం
ఇద్దరు అన్నదమ్ములు జైలుకు తరలింపుకొయ్యూరు: గంజాయి తరలింపునకు పాల్పడుతూ యువతను మత్తుకు అలవాటు చేస్తున్న ఇద్దరు అన్నదమ్ములను పీడీ చట్టం కింద అరెస్ట్ చేసి విశాఖా సెంట్రల్ జైలుకు తరలించామని సీఐ బి శ్రీనివాసరావు శవారం తెలిపారు.మర్రివాడ పంచాయతీ దొడ్డవరంకు చెందిన మాగాపు చక్రవర్తి,గంగాధర్లు అన్నదమ్ములు ఇద్దరు గంజాయిని ఇది వరకు తరలించారన్నారు.వారిపై ఇక్కడ పోలీసులు పంపిన నివేదిక ఆధారంగా కలెక్టర్ పీడీ చట్టం కింద అరెస్ట్కు ఆదేశాలు ఇచ్చారన్నారు.దీనిలో బాగంగా వారిని జైలుకు తరలించామన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నిరోధిక నిర్బంధ ఉత్తర్వులను అనుసరించిపై ఇద్దరిని జైలుకు తరలించామన్నారు. సమాజానికి, యువతకు ముప్పుగా మారిన ఇలాంటి గంజాయి స్మగ్లర్లపై మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిపై సైతం పీడీ చట్టాన్ని ప్రయోగిస్తామని హెచ్చరించారు.మండలంలో ఎవరైనా గంజయిని తరలించినా లేదా అక్రమంగా నిల్వ ఉంచినా నేరస్తులవుతారన్నారు.వారి జీవితాలు అంధకారమవుతాయని తెలిపారు. దీనిలో మంప ఎస్ఐ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
సీఎం గారూ.. మాకు ఒరిగిందేమిటి?
సాక్షి, అనకాపల్లి/కె.కోటపాడు: అధికారం చేపట్టి రెండున్నరేళ్ల తరువాత కె.కోటపాడు మండలం ఎ.కోడూరులో శనివారం జరిగిన సీఎం చంద్రబాబు పర్యటనతో స్థానిక ప్రజలకు, జిల్లా వాసులకు ఒరిగేందేమి లేదు. స్థానిక సమస్యల పరిష్కారంపై ఎటువంటి ప్రకటన లేదు. అభివృద్ధి పనులకు నిధులపై హామీ లేదు. అయితే ప్రభుత్వ వైఫల్యాలను మాత్రం అధికారులపై నెట్టే ప్రయత్నం కనిపించిందని ప్రజలు చెబుతున్నారు. ‘సీఎం గారూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు? మా రోడ్లు ఎప్పుడు బాగుపడతాయి? మా సమస్యలకు పరిష్కారం ఎప్పుడొస్తుంది?’అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అధికారులే బాధ్యులు : ప్రజల సమస్యలకు పరిష్కారం, అభివృద్ధి పనులపై స్పష్టమైన హామీ ఇవ్వడం కంటే ప్రభుత్వ శాఖల పనితీరుపై విమర్శలు చేయడానికే చంద్రబాబు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వివిధ డిపార్ట్మెంట్ల పనితీరు సరిగా లేదంటూ అధికారులపై రుబాబు ప్రదర్శించారు. ప్రభుత్వమే తగిన నిధులు విడుదల చేయకపోతే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అధికారులు ఎలా అమలు చేస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిధుల కొరత, ప్రభుత్వ వైఫల్యాలను పక్కనపెట్టి అధికారుల పనితీరుపై నెపం మోపే ప్రయత్నం చేశారని స్థానికులు విమర్శిస్తున్నారు. సూపర్ సిక్స్లో అరకొరగా అమలు చేసిన అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, సీ్త్ర శక్తి పథకంలో లోపాలను అధికారులపై నెట్టే యత్నం చేశారు. అంతేకాకుండా వివిధ విభాగాల వారీగా జిల్లా అధికారుల పనితీరును బహిరంగ సభలో సీఎం ప్రశ్నించారు. ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, మైనింగ్ శాఖ, పురపాలక శాఖ అధికారుల పురోగతి బాలేదంటూ రుబాబు చేశారు. ప్రభుత్వమే తగిన నిధులివ్వకపోతే అధికారులు సైతం ఏమి చేస్తారంటూ ప్రజలు మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను అధికారులపై రుద్దేందుకే ఈ సభ నిర్వహించినట్టుగా ఉందని జనం గుసగుసలాడుకోవడం కనిపించింది. రోడ్లు బాలేదంటూ నిరసన : సీఎం సభలో ప్రజల నుంచే అసంతృప్తి వ్యక్తమైంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత నుంచి రోడ్లు అద్దంలా మెరిసిపోతున్నాయంటూ చంద్రబాబు చెబుతూ.. అర్అండ్బీ, పంచాయతీ రాజ్ ఎస్ఈను పిలవగా.. రోడ్లు బాగోలేదంటూ పలువురు ప్రజలు చేతులూపుతూ నిరసన తెలిపారు. దీంతో రోడ్ల అభివృద్ధికి నిధులు విడుదల చేస్తే మీరు సరిగ్గా ఎందుకు వేయలేదంటూ ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్ ఇంజినీర్లపై సీఎం రుసరుసలాడారు. ఒక వైపు ప్రజలు సమస్యలను గుర్తు చేస్తుంటే.. మరోవైపు చంద్రబాబు ప్రసంగం కొనసాగుతున్న సమయంలోనే సభలో నుంచి పలువురు వెళ్లిపోవడంతో కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. గంట ఆలస్యంగా పర్యటన : సీఎం చంద్రబాబు పర్యటన గంట ఆలస్యంగా ప్రారంభమైంది. ముందుగా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఉదయం 10 గంటలకు హెలికాప్టర్ ద్వారా ఎ.కోడూరు చేరుకోవాల్సి ఉంది. పలు గ్రామాల నుంచి డ్వాక్రా మహిళలను ఎ.కోడూరుకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఒక వైపు చిరుజల్లులు పడుతున్నా.. బయటకు వెళ్లకుండా వారిని సభలోనే బలవంతంగా నిలిపివేశారు. చంద్రబాబు ప్రసంగం ప్రారంభమైన కొద్ది సేపటికే మహిళలు, ప్రజలు వెనుదిరగడం ప్రారంభించారు. సీఎం ప్రసంగం పూర్తయినంత వరకూ ఉండాలని టీడీపీ నాయకులు కోరుతున్నా ఎవరూ వినిపించుకోకపోవడం విశేషం.సీఎం చంద్రబాబు పర్యటన జిల్లా వాసులకు మళ్లీ నిరాశే మిగిల్చింది. కె.కోటపాడు మండలం ఎ.కోడూరులో శనివారం నిర్వహించిన ‘స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర’కార్యక్రమంలో ఎప్పటిలాగే చంద్రబాబు డాబూ..డూబూ అంటూ సాగింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండున్నరేళ్లు కావస్తుండడంతో ఎన్నికలకు ముందు కె.కోటపాడు వేదికగా ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా సీఎం ఏమైనా ప్రకటన చేస్తారని, స్థానిక సమస్యల పరిష్కారంపై స్పష్టత ఇస్తారని ఆశించిన ప్రజలకు భంగపాటే ఎదురైంది. ఎన్నికల హామీల ప్రస్తావనకే చోటు లేకపోవడంతో ‘సీఎం గారూ.. మా సమస్యల పరిష్కారం ఎప్పుడో?’అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలను అధికారులపై నెట్టే యత్నం చేయడంతో అంతా విస్తుపోయారు. -
ప్రభుత్వ వైద్య కళాశాలలో మౌలిక వసతులు కల్పిస్తాం
పాడేరు : స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రణాళికబద్ధంగా మౌలిక వసతులు కల్పిస్తామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వీరపాండ్యన్ తెలిపారు. శనివారం ఆయన స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించారు. కళాశాల తరగతి గదులను, ఇతర బ్లాకులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించాలని, మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు తయారుచేయాలని అధికారులను ఆదేశించారు. జీజీహెచ్, ఎంసీహెచ్ ఆస్పత్రులను వైద్య కళాశాల పరిధిలోని తరలించే ప్రక్రియను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. అనంతరం ఆయన స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిని తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, రోగులకు అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. సకాలంలో రక్త పరీక్షలు చేసి ఇవ్వాలన్నారు. ఆస్పత్రిలో సెక్యూరిటీ, శానిటేషన్ సేవలను పరిశీలించారు. అవసరమైతే వారి సంఖ్యను పెంచాలని అధికారులను ఆదేశించారు. వైద్య సేవల్లో ఎటువంటి ఇబ్బందులకు తావు లేకుండా రోగులకు సమర్ధవంతంగా అందించాలని సూచించారు. ఆయన వెంట కలెక్టర్ నిశాంతి, జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, జిల్లా ఆస్పత్రి సూపరిండెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర్లు, వైద్యులు ఉన్నారు.రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వీరపాండ్యన్ -
వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు
పాడేరు: పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ రోజురోజుకూ బలపడుతోంది. నియోజకవర్గంలోని ఆ పార్టీ నాయకత్వంపై నమ్మకంతో ఇతర పార్టీల నుంచి చేరికలు అధికమవుతున్నాయి. ఇప్పటికే చాలామంది రిటైర్డ్ అధికారులు, ఉద్యోగులు, ఇతర పార్టీలకు చెందిన కీలక నాయకులు వైఎస్సార్సీపీలో చేరారు. ఈ క్రమంలో శనివారం మండలంలోని గుత్తులపుట్టు, వంట్లమామిడి పంచాయతీలకు చెందిన సుమారు 100 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు సమక్షంలో పార్టీలో చేరారు. వంట్లమామిడికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు, పీసా కమిటీ అధ్యక్షులు వంతాల చిట్టిబాబు, మాజీ వార్డు సభ్యులు ఉల్లి రామారావు, అల్లంగి చిన్న పోతురాజు, పీసా కమిటీ అధ్యక్షులు బోయిని రాంబాబు, నాయకులు మాదెల నూకరాజు, వంతాల కోటేశ్వరరావు, సీదరి సత్తిబాబు, వంతాల కళ్యాణ్ తదితరులు ఉన్నారు. అలాగే గుత్తులపుట్టు పంచాయతీకి చెందిన సింహాచలం, అర్జున్, త్రినాథ్, వెంకట్, నాగరాజు, కొండమ్మ, చిన్నయ్య, శ్రీను, కుమారి, పండన్న, కొండలరావు తదితరులు వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు పార్టీలోకి వచ్చిన వారందరికీ సాదరంగా ఆహ్వానం పలికారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరాజు సమక్షంలో చేరిన టీడీపీ నేతలు -
జూడాల సమస్యలను విస్మరించిన ప్రభుత్వం
● ఈఎన్టీ సీనియర్ రెసిడెంట్డాక్టర్ వైదేహి విమర్శ ● పాడేరులో నాలుగో రోజుకు చేరిన నిరసన పాడేరు రూరల్: జూనియర్ వైద్యుల సమస్యలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఈఎన్టీ సీనియర్ రెసిడెంట్ డాక్టర్ వైదేహి విమర్శించారు.స్థానిక ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో జూనియర్ వైద్యులు నిర్వహిస్తున్న నిరసనలు శనివారం నాటికి నాలుగో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ వైద్యులు చేపడుతున్న నిరసనలు రోజురోజుకూ తీవ్రతరం అవుతున్నాయని, సంబంధిత శాఖా మంత్రి ఈ అంశంపై సానుకూలంగా స్పందించాలని కోరారు. ప్రభుత్వం, ఉన్నత అధికారుల నుంచి తీవ్ర ఒత్తిళ్లు వస్తుండటంతో కొంతమంది జూనియర్ వైద్యులు తమ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తాత్కాలికంగా విధుల్లో చేరారని, అయినప్పటికీ తాము జిల్లా ఆసుపత్రిలో నిరసనను కొనసాగిస్తున్నామని తెలిపారు. ఇప్పటికై నా పెరిగిన ధరలకు అనుగుణంగా వైద్యుల స్టయిఫండ్ను పెంచాలని డిమాండ్ చేశారు. జూనియర్ వైద్యుల ఐక్యతను దెబ్బతీయడానికే ప్రభుత్వం దొంగదారిలో ప్రైవేట్ వైద్యులను రంగంలోకి దించే కుట్ర చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ వైద్యానికి తూట్లు పొడిచేందుకు కొత్త డ్రామాలకు తెరలేపుతున్నారని, ఇప్పటికే ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు భారీగా రాయితీలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి జూనియర్ వైద్యుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. -
వంట కష్టాలు!
గ్యాస్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో కొయ్యూరు మండలంలోని ఆశ్రమ పాఠశాలల్లో వంట కష్టాలు మొదలయ్యాయి. విద్యార్థులకు భోజనం వండాల్సిన సిబ్బంది గ్యాస్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి.. సరఫరా కాకపోతే కట్టెల పొయ్యినే ఆశ్రయించాల్సిన దుస్థితి. అవసరానికి తగ్గ సిలిండర్లు అందకపోవడం, కొన్ని పాఠశాలలకు నెలల తరబడి గ్యాస్ రాకపోవడంతో సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది.ఆశ్రమ పాఠశాలల్లోకొయ్యూరు: ఆశ్రమ పాఠశాలల్లో గ్యాస్ కొరత వంట సిబ్బందికి తలబొప్పి కట్టిస్తోంది. వారానికి అవసరమైన గ్యాస్ సిలిండర్లలో సగం కూడా అందకపోవడంతో పలు పాఠశాలల్లో కట్టెల పొయ్యిపైనే వంట చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మరికొన్ని ఆశ్రమ పాఠశాలలకు నెలల తరబడి గ్యాస్ సరఫరా కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కొయ్యూరు మండలంలోని ఆశ్రమ పాఠశాలలకు చింతపల్లి జీసీసీ నుంచి హెచ్పీ గ్యాస్ సరఫరా అవుతోంది. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి వారానికి 6 నుంచి 8 సిలిండర్లు అవసరం కాగా, ప్రస్తుతం రెండింటికి మించి ఇవ్వడం లేదని వార్డెన్లు చెబుతున్నారు. నడింపాలెం, శరభన్నపాలెం ఆశ్రమ పాఠశాలలకు నెలల తరబడి గ్యాస్ సరఫరా కావడం లేదని పేర్కొంటున్నారు. వర్షం వస్తే.. కట్టెలతో మరింత కష్టం! గ్యాస్ అందకపోవడంతో వంట చెరకు వినియోగించాల్సి వస్తోంది. ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో ఎండిన కట్టెలు కొంతమేర దొరుకుతున్నా.. వర్షాలు కురిస్తే తడిసిన కట్టెలతో వంట చేయడం మరింత ఇబ్బందికరంగా మారుతుందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా ఆశ్రమ పాఠశాలల్లో వంట సిబ్బంది వృద్ధులు కావడంతో కట్టెల పొయ్యిపై గంటల తరబడి వంట చేయడం వారికి మరింత భారంగా మారుతోంది. జీసీసీ సరఫరాపై అసంతృప్తి.. మరో ఏజెన్సీకి మార్పు? ఇతర గ్యాస్ ఏజెన్సీలు సరఫరా చేస్తున్నప్పటికీ జీసీసీ నుంచి హెచ్పీ గ్యాస్ సక్రమంగా అందడం లేదని అధికారులు, వార్డెన్లు చెబుతున్నారు. గతంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా జరిగేదని, గత కొన్ని నెలలుగా పరిస్థితి మారిందని పేర్కొంటున్నారు. దీంతో గిరిజన సంక్షేమ శాఖాధికారులు మరో గ్యాస్ ఏజెన్సీకి సరఫరాను మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏటీడబ్ల్యూవో క్రాంతి కుమార్ మాట్లాడుతూ.. సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. వార్డెన్లు నిబంధనల ప్రకారం అవసరమైన గ్యాస్ కోసం ముందుగానే ఫారం పూర్తి చేసి గ్యాస్ పర్యవేక్షకునికి అందించాలని సూచించారు.గ్యాస్ కొరతతో అవస్థలు వినియోగంలో సగం కూడా అందనిసిలిండర్లు వారానికి రెండుకు మించిఇవ్వడం లేదంటున్న వార్డెన్లు జీసీసీ ఏజెన్సీ సరఫరాపై అసంతృప్తి మరో ఏజెన్సీకి మార్చే యోచనలో గిరిజన సంక్షేమశాఖ అధికారులు -
లాంఛనమేనా..?
ప్రైవేటీకరణ సీఐఎస్ఎఫ్ ఉపసంహరణతో విశాఖ ఉక్కులో కలవరం●జింక్ పరిశ్రమలోనూ తొలుత భద్రతా బలగాల తొలగింపు.. ఆ తర్వాతే మూత ●కూటమి వచ్చాక ప్లాంట్పై వరుసగా ప్రతికూల నిర్ణయాలు ●ప్రైవేటీకరణను అడ్డుకుంటామన్న హామీలు ఏమయ్యాయంటున్న ఉద్యోగ సంఘాలు ●సెయిల్లో విలీనం చేయడమే పరిష్కారమని డిమాండ్ సాక్షి, విశాఖపట్నం/ఉక్కునగరం: ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ స్టీల్ప్లాంట్కు భద్రతా కవచంగా ఉన్న సీఐఎస్ఎఫ్ కూడా ఇక ఉండదా..? వేల ఎకరాల్లో విస్తరించి.. వేల కోట్ల విలువైన ఆస్తులు, అత్యంత కీలకమైన ఉత్పత్తి విభాగాలున్న ప్లాంట్ నుంచి కేంద్ర బలగాలను పూర్తిగా వెనక్కి తీసుకోవడం దేనికి సంకేతం..? ‘ప్రైవేటీకరణ చేయం’ అని చెబుతున్న కేంద్రం.. ఒక్కో అడుగు వేస్తూ చివరకు ప్లాంట్ భద్రతనూ తొలగిస్తోందా..? సీఐఎస్ఎఫ్ ఉపసంహరణే ప్రైవేటీకరణకు ముందడుగుగా మారుతోందా..? తాజా పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. స్టీల్ప్లాంట్లోని సీఐఎస్ఎఫ్ యూనిట్ను పూర్తిగా ఖాళీ చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. నవంబర్ 17 నాటికి మొత్తం బలగాలను వెనక్కి తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్లాంట్లో సుమారు 350 మంది సెక్యూరిటీ, 120 మంది ఫైర్ సేఫ్టీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వీరందరినీ ఉపసంహరించనున్నారు. 2024 వరకు దాదాపు 1,500 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఉండగా.. రెండేళ్లుగా దశలవారీగా సంఖ్యను కుదిస్తూ వచ్చిన కేంద్రం.. ఇప్పుడు మిగిలిన బలగాలనూ పూర్తిగా తొలగించేందుకు నిర్ణయించడం ఉద్యోగ, కార్మిక వర్గాల్లో ఆందోళనకు దారితీసింది. కూటమి వచ్చాక.. ఒక్కో అడుగు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్లాంట్ పరిస్థితులు మరింత దిగజారాయని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో విశాఖ ఉక్కును కాపాడతామని, ప్రైవేటీకరణను అడ్డుకుంటామని హామీ ఇచ్చిన కూటమి నేతలు.. అధికారంలోకి వచ్చాక కేంద్రం నిర్ణయాలపై గట్టిగా నిలదీయడం లేదని విమర్శిస్తున్నాయి. ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని కేంద్రాన్ని ఒత్తిడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని.. మరోవైపు అనకాపల్లి జిల్లాలోని ప్రైవేటు స్టీల్ పరిశ్రమకు గనుల కేటాయింపు కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేసిందని ఆరోపిస్తున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ తీర్మానం చేయడం ద్వారా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అడ్డుకున్నామని.. అప్పట్లో కేంద్ర ఉక్కు మంత్రి సైతం ఈ విషయాన్ని ప్రకటించారని ఉద్యోగ సంఘాలు గుర్తుచేస్తున్నాయి. ముడిసరుకు కొరత.. ఉద్యోగుల కుదింపు 2024 సెప్టెంబర్లో వర్కింగ్ క్యాపిటల్, ముడిసరుకు కొరత తీవ్రరూపం దాల్చింది. కోకింగ్ కోల్ అందక బ్లాస్ట్ ఫర్నేస్–3 మూతపడటంతో ఉత్పత్తి సామర్థ్యం దాదాపు 25 శాతానికి పడిపోయి నష్టాలు మరింత పెరిగాయి. 2024 అక్టోబర్ నుంచి 2025 జనవరి వరకు ఉత్పత్తి తగ్గిందన్న కారణంతో కార్మికులకు వేతనాలు నిలిచిపోయాయి. ఆ తర్వాత ఉద్యోగుల సంఖ్యను తగ్గించే చర్యల్లో భాగంగా వీఆర్ఎస్ అమలు చేశారు. సుమారు 12,300 మంది ఉన్న శాశ్వత ఉద్యోగులను 2026 డిసెంబర్ నాటికి 8 వేలకు తగ్గించాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. మరోవైపు వేలాది మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించడంతో మిగిలిన సిబ్బందిపై పనిభారం పెరిగిందని సంఘాలు చెబుతున్నాయి. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు 2025 జనవరిలో కేంద్రం రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించినా.. అందులో ఎక్కువ మొత్తం పాత బకాయిలు, రుణాల చెల్లింపులకే వెళ్లిందని.. ప్లాంట్ అభివృద్ధికి పెద్దగా ఉపయోగపడలేదని కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి. కీలక విభాగాలు ప్రైవేటు బాటలో.. 2025 ఆగస్టులో ప్లాంట్లోని 44 కీలక విభాగాలను ప్రైవేటుపరం చేసేందుకు ఆర్ఐఎన్ఎల్ యాజమాన్యం టెండర్లు పిలిచింది. రా మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంట్, కోక్ ఒవెన్, సింటర్ ప్లాంట్, థర్మల్ పవర్ ప్లాంట్, బ్లాస్ట్ ఫర్నేస్ వంటి కీలక విభాగాలు ఇందులో ఉండటంపై ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అదే ఏడాది ఉద్యోగులపై సీఎం చంద్రబాబు చేసిన ‘వైట్ ఎలిఫెంట్స్’ వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. పని చేయని ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఇవ్వాలన్న ఆయన వ్యాఖ్యలను ఉద్యోగ సంఘాలు తీవ్రంగా తప్పుబట్టాయి. భద్రతా కవచానికీ కోత నిర్వహణ వ్యయాన్ని తగ్గించే చర్యలతో ప్లాంట్లో భద్రతా ప్రమాణాలు దెబ్బతిన్నాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. 2025 డిసెంబర్లో ఫ్యాక్టరీల శాఖ తనిఖీల్లో 645 భద్రతా లోపాలను గుర్తించి నోటీసులు ఇచ్చిందని చెబుతున్నాయి. 2026 జనవరిలో సీఐఎస్ఎఫ్ సిబ్బంది తగ్గింపు ప్రక్రియ మొదలైంది. సెక్యూరిటీ, ఫైర్ విభాగాల నుంచి సుమారు 400 మందిని తగ్గించి.. వారి స్థానంలో ఏపీ స్పెషల్ ఫోర్స్ సిబ్బందిని నియమించారు. తాజాగా మిగిలిన సీఐఎస్ఎఫ్ సిబ్బందినీ పూర్తిగా వెనక్కి తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఇదే సమయంలో అనుభవజ్ఞులైన కాంట్రాక్టు సిబ్బందిని తొలగించి కొత్త సిబ్బందితో కీలక విభాగాల్లో పనులు చేయించారని సంఘాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో 2026 జూన్ 8న ఎస్ఎంఎస్–2 విభాగంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు మృతి చెందడం భద్రతా వ్యవస్థపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తింది. రూ.8,097 కోట్ల సాయం ఎక్కడ? ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్లాంట్కు అదనంగా రూ.8,097 కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ 2026 మేలో సిఫార్సు చేసినా.. ఇప్పటివరకు నిధులు విడుదల కాలేదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై తగిన ఒత్తిడి తీసుకురావడంలో విఫలమైందని విమర్శిస్తున్నాయి. ఇక 2026 జూలైలో రాజధాని నిర్మాణ పనులకు అవసరమైన స్టీల్ కొనుగోళ్లలో విశాఖ ఉక్కుకు ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రైవేటు సంస్థ నుంచి కొనుగోలుకు సీఆర్డీఏ అనుమతులు ఇచ్చిందని ఆరోపిస్తున్నాయి. ఆ ఆర్డర్ను స్టీల్ప్లాంట్కు ఇచ్చి ఉంటే కొంత ఆర్థిక ఊరట లభించేదని పేర్కొంటున్నాయి.జింక్ పరిశ్రమలోనూ ఇదే దారి విశాఖలోని హిందూస్థాన్ జింక్ పరిశ్రమ పరిణామాలను ఉద్యోగ సంఘాలు ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నాయి. తొలుత ముడిసరుకు రవాణా భారం పెరగడం.. నష్టాలు రావడం.. ఆ తర్వాత సీఐఎస్ఎఫ్ భద్రతను ఉపసంహరించడం.. అనంతరం ప్రైవేటీకరణ.. చివరకు ముడిసరుకు వ్యయం భారంగా మారడంతో 2012లో పరిశ్రమ శాశ్వతంగా మూతపడిందని చెబుతున్నాయి. ఇప్పుడు విశాఖ ఉక్కులోనూ ముడిసరుకు కొరత, ఆర్థిక సంక్షోభం, ఉద్యోగుల సంఖ్య కుదింపు, కీలక విభాగాల ప్రైవేటీకరణ, భద్రతా బలగాల ఉపసంహరణ వంటి పరిణామాలు వరుసగా చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జింక్ పరిశ్రమ బాటలోనే స్టీల్ప్లాంట్నూ నడిపిస్తున్నారా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. -
సీఎంకు సమస్యలు చెప్పుకోనివ్వరా?
సీపీఐ, ఏపీ చెరకు రైతు సంఘాల ఆగ్రహంచోడవరం: రైతు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన తమను అడ్డుకోవడం హేయమైన చర్య అని సీపీఐ జిల్లా సంయుక్త కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు, చెరకు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేచలపు వెంకటరమణ(కాసుబాబు) ఆగ్రహం వ్యక్తం చేశా రు. కె. కోటపాడు మండలం ఏ కోడూరులో శనివారం సీఎం చంద్రబాబునాయుడు బహిరంగ సభలో గోవాడ చర్కెర కర్మాగారం చెరకు రైతుల బకాయిలు, చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో వ్యవసాయ దయనీయ పరిస్థితులపై వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన తమను పోలీసులు అడ్డుకోవడంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం గోవాడ సుగర్ ఫ్యాక్టరీని పూర్తిగా మూసివేసి చెరకు రైతులను, కార్మికులను రోడ్డున పడేసిందని వాపోయారు. వీరి సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లడానికి సభ వద్దకు వెళ్లనీయకుండా పోలీసులతో అడ్డుకుని ప్రజాస్వామ్య హక్కులను కాలరాశారని ధ్వజమెత్తారు. అభ్యసన సామర్థ్యాలు పెంపొందేలా బోధన సబ్బవరం: విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలను పెంపొందించేలా ఉపాధ్యాయులు బోధన సాగించాలని డీఈవొ జి.జి.ఎస్.నాగేశ్వరరావు సూచించారు. సబ్బవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాన్ని ఆయన సందర్శించి మ్యాథ్స్, సోషల్ స్టడీస్ ఉపాధ్యాయులతో మాట్లాడారు. విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పెంచేందుకు అవసరమైన అంశాలపై సమావేశాల్లో చర్చించి, పరస్పరం బోధనా పద్ధతులను మెరుగుపరుచుకోవాలన్నారు. -
పరదేశమ్మ విగ్రహానికి ప్రత్యామ్నాయం చూపాలి
అచ్యుతాపురం రూరల్: చోడపల్లి పంచాయితీ పరిధి లో గ్రామదేవత పరదేశమ్మ తల్లి విగ్రహాన్ని తొలగించే ప్రయత్నాన్ని శనివారం గ్రామస్తులు అడ్డుకున్నారు. అచ్యుతాపురం–అనకాపల్లి రహదారి విస్తరణలో భాగంగా విగ్రహాన్ని ప్రత్యామ్నాయ ప్రదేశానికి తరలించకుండా తొలగించేందుకు చర్యలు చేపట్టడం అన్యాయమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహానికి ముందుగా తగిన స్థలం కేటా యించి, కొత్తగా ప్రతిష్టాపన పూర్తి చేసిన అనంత రం ప్రస్తుత విగ్రహాన్ని తరలించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ అధికారులు చర్యలు చేపట్టాలని కోరా రు. ఈ ఆందోళనకు సీఐటీయూ మండల కన్వీనర్ కూండ్రపు సోమునాయుడు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కాకి శంకర్, కాకి అవతారం, పోలవరపు పారునాయుడు, దమ్ము చండి, గెంజి రామకృష్ణ, పెంకి నరసింగరావు, గోవిందు, లోవరాజు, తదితరులు పాల్గొన్నారు.విగ్రహం తొలగింపును అడ్డుకున్న గ్రామస్తులు -
ఘాటెక్కిన ఉల్లి
● రోజురోజుకు పెరుగుతున్న ఉల్లిపాయ ధరలు ● అయోమయంలో వినియోగదారులు అనకాపల్లి టౌన్: ఉల్లిపాయ కోయకుండానే కంటతడి తెప్పిస్తుంది. ఇది లేనిదే ఏ కూరలు వండడం దాదాపు సాధ్యం కాదు. సాంబార్, పప్పు, వేపుళ్లు, గ్రేవీ కూరీలు, చట్నీలు ఇలా ప్రతీ వంటకంలో ఉల్లి ఉండాల్సిందే. వంటకాలలో ఉల్లిదే అగ్రస్థానం. అటువంటి ఉల్లిపాయ ధరలు రోజురోజుకు పెరుగుతుండడంతో సామాన్యులు బెంబేలెత్తున్నారు. గత వారం క్రితం కిలో రూ.34 ఉన్న ఉల్లిపాయ ధర నేడు రూ.50లకు పలుకుతుంది. నిన్నటి వరకు కిలోల లెక్కన కొనుగోలు చేసిన వినియోగదారులు ప్రస్తుతం ధరలు చూసి అరకిలో, పావుకిలోతో సరిపెట్టుకుంటున్నారు. ఈ ధరలు అల్పాదాయ వర్గాల కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పటికే కాయగూరల ధరలతో బెంబేలెత్తుతున్న సామాన్యులు ఒక్కసారిగా పెరిగిపోతున్న ఉల్లిపాయ ధరతో మరింత సతమతమవుతున్నా పలువురు చెబుతున్నారు. సాగుపై ఎల్నినో ప్రభావం మహారాష్ట్రలోని నాసిక్, సోలాపూర్ వంటి ప్రధాన ప్రాంతాల నుంచి మార్కెట్కు ఉల్లి రాక తగ్గిపోయింది. అలాగే ఎనినో ప్రభావంతో ఉల్లి సాగు ఆలస్యమవడం, కోల్డ్ స్టోరేజ్లలో ఉన్న నిల్వలు మాత్రమే మార్కెట్కు తెస్తుండడంతో ఉల్లి ధర భారిగా పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయాలు ఉల్లిపాయ ధరల నియంత్రణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమండ్ చేస్తున్నారు. మార్కెట్ను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని అందుకే రోజు రోజుకు ధరలు పెరుగుతున్నాయని పలువురు చెబుతున్నారు. తక్షణమే రైతు బజార్లు, ప్రత్యేక కౌంటర్ల ద్వారా అందుబాటు ధరల్లో ఉల్లిపాయలు, కాయగూరల విక్రయాలు చేపట్టాలని కోరుతున్నారు. -
వరుణ దేవా.. కరుణించవా.!
● వెన్నలపాలెం మహిళల ఆలయప్రదక్షిణలు, పూజలు ● సాయంత్రం చిరుజల్లులు పడడంతో సర్వత్రా హర్షం నాతవరం: వరుణ దేవుడు కరుణ కోసం మర్రిపాలెం పంచాయతీ శివారు వెన్నలపాలెం గ్రామంలోని మహిళలు శనివారం ఆలయ ప్రదక్షిణలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మహిళలు నిర్వహించిన ఈ పూజలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముందుగా తాండవ జంక్షన్లోని వినాయకుడి ఆలయాన్ని బిందెలతో నీళ్లు తీసుకువెళ్లి శుద్ధి చేశారు. అనంతరం గ్రామంలోని సీతారాముల ఆలయం, ఆంజనేయస్వామి ఆలయం, జీడితోటల్లో ఉన్న తలుపులమ్మ తల్లి ఆలయాన్ని కూడా నీటితో శుభ్రపరిచి, ఆలయాల చుట్టూ నీటి బిందెలతో ప్రదక్షిణలు చేశారు. ఆలయ ప్రాంగణమంతా ఇంటి వద్ద నుంచి తీసుకువచ్చిన నీటితో శుభ్రం చేసి, భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ‘ఎండ తీవ్రత తగ్గించి సకాలంలో వర్షాలు కురిపించాలి’అంటూ మహిళలు దేవుడిని ప్రార్థించారు. అనంతరం గ్రామ వీధుల్లో బిందెల్లో నీళ్లు తీసుకుని ఊరేగింపుగా తిరుగుతూ ఒకరిపై ఒకరు నీళ్లు పోసుకుంటూ సందడి చేశారు. ఆశ్చర్యకరంగా మధ్యాహ్నం తరువాత వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతూ సాయంత్రానికి చిరుజల్లులతో కూడిన వర్షం కురిసింది. దీంతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తూ, తమ పూజల ఫలితంగా వర్షం కురిసిందని విశ్వాసం వ్యక్తం చేశారు. పూర్వకాలంలో వర్షాలు ఆలస్యమైనప్పుడు ఇదే విధంగా ఆలయాలను శుభ్రపరిచి, పూజలు నిర్వహించే సంప్రదాయం ఉందని గ్రామ పెద్దలు తెలిపారు. -
లారీని ఢీకొని కారు దహనం.. ఇద్దరు మృతి
చింతూరు: ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొనడంతో కారు దహనమై ఇద్దరు మృతి చెందిన ఘటన పోలవరం జిల్లా చింతూరు మండలం బొడ్డుగూడెం సమీపంలో జాతీయ రహదారి–30పై శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనలో కారులోనే ఒకరు సజీవ దహనమవ్వగా, మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తీసుకెళ్లగా మృతి చెందాడు. ఛత్తీస్గఢ్ నుంచి భద్రాచలం వైపు వెళుతున్న లారీని భద్రాచలం వైపు నుంచి చింతూరు వైపు వస్తున్న టీఎస్08జీఈ 9755 నంబరు గల కారు వేగంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో కారు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి తలకు తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వస్తున్న వాహనదారులు వారిని గమనించి, డ్రైవింగ్ సీటులో ఉన్న వ్యక్తిని కిందకు దింపారు. ఆ పక్క సీట్లో కూర్చున్న మరో వ్యక్తిని కిందకు దింపే క్రమంలో డోరు లాక్ కావడం.. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడం జరిగింది. దీంతో కళ్లెదుటే డ్రైవింగ్ సీటు పక్కన కూర్చున్న వ్యక్తి సజీవ దహనమయ్యాడు. తీవ్ర గాయాలైన వ్యక్తిని అంబులెన్సులో సమీపంలోని ఏడుగురాళ్లపల్లి ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. కారులో ఇద్దరే ఉన్నారని, ఇద్దరూ మృతి చెందడంతో వారి వివరాలు తెలియ రాలేదని పోలీసులు తెలిపారు. -
మోదకొండమ్మకు కుంకుమ పూజలు
మాడుగుల మోదకొండమ్మ పాదాలకు కుంకుమ పూజలు చేస్తున్న భక్తులు మాడుగుల: ఉత్తరాంధ్ర ఇలవేల్పు మాడుగుల మోదకొండమ్మ ఆలయానికి రెండో శ్రావణ శుక్రవారం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వెలసిన అమ్మవారి పాదాలకు ప్రత్యేక కుంకుమ పూజలు చేశారు. ఇంటికి గుర్తుతెలియని వ్యక్తి నిప్పు నక్కపల్లి: మండలంలోని ఎస్. నర్సాపురంలో ఎస్. వరహాలు అనే మహిళ పెంకుటిల్లుకు గుర్తుతెలియని వ్యక్తి నిప్పు పెట్టాడు. శుక్రవారం తెల్లవారుజామున నిప్పు పెట్టడంతో ఇల్లు అగ్నికి ఆహుతైంది. ఇదే ఇంటి పక్కన ఉన్న పోతంశెట్టి త్రిమూర్తులు ఇంటిపై సోలార్ ప్యానళ్లు కూడా కాలిపోయాయి. సమాచారం అందిన వెంటనే సీఐ మురళి తన సిబ్బందితో వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పరిసర ప్రాంతాల్లో సీసీ ఫుటేజీలను పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
పరిశ్రమల భద్రతకు నెలవారీ శిక్షణ
పరవాడ: జేఎన్ ఫార్మాసిటీలోని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను మరింత మెరుగుపరచడంతో పాటు ఉద్యోగుల్లో భద్రతపై అవగాహన పెంచేందుకు ప్రతి నెలా మూడో శుక్రవారం జేఎన్పీసీ భవనంలో భద్రతా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎంఏఎస్ఆర్ఎం కార్యదర్శి జెట్టి సుబ్బారావు తెలిపారు. ఎంఏఎస్ఆర్ఎం ఆధ్వర్యంలో పరిశ్రమల భద్రతపై యాజమాన్యాలు, ఉద్యోగులకు శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ.. ఏడాది కాలంగా పరిశ్రమల భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉద్యోగుల్లో భద్రతపై చైతన్యం కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని వచ్చే ఏడాది డిసెంబరు వరకు నిరంతరం కొనసాగించేలా ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. పరిశ్రమల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఈహెచ్ఎస్ విభాగాల సిబ్బందికి ఈ అవగాహన సదస్సులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. ‘జీరో హార్మ్–జీరో హజార్డ్’లక్ష్యంతో అన్ని పరిశ్రమల్లో ప్రమాదాలను నివారించి, సురక్షితమైన పని వాతావరణాన్ని నెలకొల్పేందుకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఫార్మాసిటీ పరిశ్రమల యాజమాన్య ప్రతినిధులు తమ పరిశ్రమల్లో అమలు చేస్తున్న భద్రతా విధానాలు, ప్రమాదాల నివారణ చర్యలు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇతర పరిశ్రమల ప్రతినిధులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పలు పరిశ్రమల యాజమాన్య ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
బ్రిక్స్ సదస్సు ఏర్పాట్ల పరిశీలన
సాక్షి, విశాఖపట్నం: బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యే ప్రతినిధుల పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ శుక్రవారం అధికారులతో కలిసి భీమిలి బీచ్ రోడ్డు, మంగమారిపేట, తొట్లకొండ, రుషికొండ బీచ్ ప్రాంతాలను పరిశీలించారు. ప్రతినిధులు సందర్శించే ప్రాంతాల్లో భద్రత, పారిశుద్ధ్యం, రహదారులు, వాహనాల పార్కింగ్ తదితర ఏర్పాట్లను పర్యవేక్షించారు. అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పర్యాటక ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి, సుందరీకరణ పనులను కూడా పరిశీలించారు. ప్రతినిధుల పర్యటన సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలను పటిష్టంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. తొట్లకొండలో ఆంక్షలు బ్రిక్స్ ప్రతినిధుల పర్యటన నేపథ్యంలో తొట్లకొండకు సందర్శకుల ప్రవేశంపై రెండు రోజులపాటు ఆంక్షలు విధించారు. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, ఆదివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పర్యాటకులు, సందర్శకులను తొట్లకొండపైకి అనుమతించబోమని వీఎంఆర్డీఏ కార్యదర్శి మురళీకృష్ణ తెలిపారు. ఈ సమయంలో ప్రతినిధుల పర్యటనకు ఎలాంటి ఆటంకాలు లేకుండా భద్రతా ఏర్పాట్లు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. -
షిప్.. షిప్.. హుర్రే!
షిప్యార్డులో డ్రైడాక్ చేసిన ఐఎన్ఎస్ జలాశ్వ సాక్షి, విశాఖపట్నం: హిందూస్థాన్ షిప్యార్డు లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్) తన సుదీర్ఘ చరిత్రలో మరో అరుదైన మైలురాయిని అధిగమించింది. భారత నౌకాదళానికి చెందిన అత్యంత భారీ యుద్ధ నౌకల్లో ఒకటైన.. ఏకై క ల్యాండింగ్ ప్లాట్ఫామ్ డాక్ ‘ఐఎన్ఎస్ జలాశ్వ’ని షిప్యార్డు విజయవంతంగా డ్రై డాక్ (ఓడల నిర్వహణ, మరమ్మతు ప్రక్రియ)లోకి తీసుకుంది. హెచ్ఎస్ఎల్ చరిత్రలో ఇంతటి భారీ సైనిక ప్లాట్ఫామ్ను డాకింగ్ చేయడం ఇదే తొలిసారి. అత్యంత క్లిష్టమైన ఈ ప్రక్రియను ఎలాంటి భద్రతా లోపాలు లేకుండా పూర్తిచేసి, రక్షణరంగ నౌకల మరమ్మతుల్లో తన సత్తాను మరోసారి చాటుకుంది. కొత్త చరిత్ర లిఖిస్తూ.. దేశీయ నౌకల తయారీపై దృష్టి సారిస్తూ అత్యుత్తమ సేవలందించేందుకు మినీరత్న హోదా పొందిన తర్వాత హిందూస్థాన్ షిప్యార్డు వరుస లాభాలతో కొత్త చరిత్ర సృష్టిస్తోంది. దేశీయ ఆర్డర్లతోపాటు అంతర్జాతీయ నౌకల మరమ్మతు పనులను దక్కించుకుంటూ చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహిస్తోంది. ఫ్లీట్ సపోర్ట్ షిప్స్ (ఎఫ్ఎస్ఎస్) నిర్మాణంతోపాటు 45 మిలియన్ టన్నుల డిస్ప్లేస్మెంట్ సామర్థ్యమున్న నౌకల్ని తయారుచేస్తోంది. భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌకలు, కార్గో షిప్స్, పోర్టు గ్రీన్ టగ్లు, కోస్ట్గార్డ్ వెసల్స్, జలాంతర్గాముల రీఫిట్, మరమ్మతు పనులను కూడా చేపడుతోంది. విదేశీ నౌకల మరమ్మతుల ద్వారా అంతర్జాతీయ వ్యాపారాన్ని ఆకర్షిస్తున్న షిప్యార్డు.. విశాఖ కేంద్రంగా అంతర్జాతీయ వాణిజ్యం దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో భారీ నౌకలను సైతం డ్రైడాక్లోకి తీసుకొస్తూ తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటోంది. అత్యద్భుత సమన్వయంతో.. ఐఎన్ఎస్ జలాశ్వ సాధారణ యుద్ధనౌక కాదు. సుమారు 175 మీటర్ల పొడవు, 28 మీటర్ల వెడల్పు ఉన్న ఈ భారీ నౌకను డ్రైడాక్లోకి తీసుకురావడం ఇంజినీరింగ్ పరంగా షిప్యార్డుకు పెద్ద సవాల్గా మారింది. దీనికోసం హెచ్ఎస్ఎల్ బృందాలు ముందుగానే సమగ్ర డాకింగ్ అనాలసిస్ నిర్వహించి.. నౌక బరువు, ఆకృతికి అనుగుణంగా కచ్చితమైన డాక్బెడ్ను సిద్ధం చేశాయి. అన్ని విభాగాల సిబ్బంది సమన్వయంతో, భద్రతా ప్రమాణాల్లో ఏమాత్రం రాజీ పడకుండా నౌకను సురక్షితంగా డ్రైడాక్లోకి చేర్చారు. భారత నౌకాదళంలో బలగాలను, ట్యాంకర్లను ఒకేసారి తరలించే సామర్థ్యం ఉన్న అతిపెద్ద నౌకల్లో జలాశ్వ ఒకటి. ఇది సుమారు 1,000 మంది సైనికులతోపాటు కంబాట్ వెహికల్స్, హెలికాప్టర్లను మోసుకెళ్లగలదు. గతంలో ‘ఆపరేషన్ సముద్ర సేతు’ తదితర విపత్తు సహాయక చర్యల్లోనూ ఈ నౌక కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు హెచ్ఎస్ఎల్ ఆధ్వర్యంలో దీనికి సమగ్ర మరమ్మతులు, ఆధునికీకరణ పనులు చేపట్టనున్నారు. నౌకాదళానికి వ్యూహాత్మక లబ్ధి జలాశ్వను విజయవంతంగా డ్రైడాక్ చేయడం తూర్పు నౌకాదళానికి వ్యూహాత్మకంగా కీలక పరిణామం. ఈస్ట్రన్ నేవల్ కమాండ్కు భారీ ప్లాట్ఫామ్ల మరమ్మతుల కోసం ఇతర సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. తూర్పు తీరంలోనే భారీ నౌకల మరమ్మతులకు అనువైన సదుపాయం అందుబాటులో ఉండటంతో టర్న్ అరౌండ్ సమయం తగ్గి, ఫ్లీట్ ఎప్పటికప్పుడు కార్యకలాపాలకు సిద్ధంగా ఉండే అవకాశం ఉంటుంది. తూర్పు తీరంలోని సముద్ర జలాల్లో చైనా సహా పలు దేశాల నౌకాదళ కదలికలు పెరుగుతున్న నేపథ్యంలో భారత నౌకాదళం నిరంతరం సన్నద్ధంగా ఉండేందుకు హెచ్ఎస్ఎల్ అందిస్తున్న సాంకేతిక సేవలు కీలకంగా మారుతున్నాయి. 80 వేల టన్నుల సామర్థ్యంతో.. విశాఖలోని హెచ్ఎస్ఎల్ డ్రైడాక్ దేశంలోనే ప్రతిష్టాత్మకమైన సదుపాయాల్లో ఒకటి. ఇది 240 మీటర్ల పొడవు, 53 మీటర్ల వెడల్పు, 8.5 మీటర్ల లోతుతో నిర్మితమైంది. ఒకేసారి 70,000 నుంచి 80,000 డెడ్వెయిట్ టన్నేజ్ సామర్థ్యమున్న భారీ నౌకలకు మరమ్మతులు నిర్వహించగల సామర్థ్యం దీనికి ఉంది. గతంలో 200 మీటర్లకు పైగా పొడవున్న కమర్షియల్ పానామాక్స్ బల్క్ క్యారియర్లు, క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లకు విజయవంతంగా మరమ్మతులు నిర్వహించింది. తాజాగా జలాశ్వ రాకతో భవిష్యత్లో నేవీకి చెందిన ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య వంటి విమాన వాహక నౌకలు లేదా అంతకంటే సంక్లిష్టమైన ప్రాజెక్టులను చేపట్టేందుకు షిప్యార్డ్ సిద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. -
జూడాల సమ్మె.. రోగులపై తీవ్ర ప్రభావం
మహారాణిపేట: జూనియర్ వైద్యుల సమ్మె ప్రభావం కేజీహెచ్ రోగులపై పడుతోంది. క్యాజువాలిటీ, ఎమర్జెన్సీ వార్డుల్లో వైద్యుల కొరతతో రోడ్డు ప్రమాద బాధితులకు చికిత్సలో జాప్యం జరుగుతోంది. జూనియర్ వైద్యుల విధులను నర్సింగ్ సిబ్బంది, ఎంఎన్వోలు నిర్వహించాల్సి వస్తోంది. 11 రోజులుగా ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లు శుక్రవారం కేజీహెచ్ నుంచి ఏఎంసీ మీదుగా ర్యాలీ నిర్వహించి మానవహారంగా నిరసన తెలిపారు. రిలే దీక్షలో డాక్టర్లు విజేత, రక్షక్, కల్యాణ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.తమ నిరసన కార్యక్రమం రోగులకు వ్యతిరేకం కాదని, రోగుల సంరక్షణ తమ బాధ్యత అని జూనియర్ వైద్యుల సంఘం నాయకుడు దినకర్ సాయి శ్రీనివాస్ తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (ఏపీజూడీఏ) నాయకుడు డాక్టర్ శిరాజ్ తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ సత్యజీత్, మనోహర్, దినకర్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. -
సింహవల్లీ తాయారుకు లక్ష కుంకుమార్చన
సింహాచలం: వరలక్ష్మీ వ్రతం, శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో కొలువుదీరిన సింహవల్లీ తాయారు అమ్మవారి సన్నిధిలో లక్ష కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు. సింహాసనంపై సింహవల్లీ తాయారు, చతుర్భుజ తాయారు అమ్మవార్ల ఉత్సవమూర్తులను వేంజేపచేశారు. పది ఆవృతులతో లక్ష నామాలతో అమ్మవార్లకు కుంకుమపూజ జరిపారు. భక్తులకు కుంకుమ, శేషవవస్త్రాలు, ప్రసాదం అందజేశారు. సాయంత్రం అమ్మవార్ల సన్నిధిలో సహస్రనామార్చన విశేషంగా నిర్వహించారు. అమ్మవార్లను పల్లకిలో వేంజేపచేసి ఆలయ బేడామండపంలో తిరువీధి నిర్వహించారు. విశేష హారతులు అందించారు. -
పారిశుధ్య కార్మికుల ఆకలి కేకలు పట్టవా?
అనకాపల్లి: పారిశుధ్య కార్మికుల ఆకలి కేకలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వి.వి.శ్రీనివాసరావు ఆరోపించారు. గ్రామాల్లో పారిశుధ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్న గ్రీన్ అంబాసిడర్లు, పారిశుధ్య కార్మికులు ఆరు నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఆదివారం కె.కోటపాడుకు రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో జిల్లాలోని పంచాయతీల నుంచి వందలాది గ్రామపంచాయతీ కార్మికులను తీసుకువెళ్లి శుభ్రత కార్యక్రమాలు చేపట్టేందుకు సన్నాహాలు పూర్తి చేశారన్నారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి నెలా ఇవ్వాల్సిన రూ.6 వేల వేతనం కూడా సకాలంలో చెల్లించకపోవడంతో కార్మికుల కుటుంబాలు అర్ధాకలితో జీవించే పరిస్థితి ఏర్పడిందన్నారు. ‘స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర’పేరుతో ప్రతి నాలుగో శనివారం ప్రచార ఆర్భాట కార్యక్రమాలు నిర్వహించేందుకు ఖర్చు చేస్తున్న నిధులను కార్మికుల జీతాలకు వినియోగిస్తే గ్రామాల పరిస్థితి మెరుగుపడుతుందని సూచించారు. గతేడాది నుంచి హెల్త్ అలవెన్స్గా నెలకు రూ.4 వేల చెల్లిస్తామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు అమలు చేయలేదని విమర్శించారు. కె.కోటపాడు పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి వెంటనే బకాయి జీతాలు విడుదల చేసి, మున్సిపల్ కార్మికులతో సమానంగా వేతనాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. శంకరరావు తదితరులు పాల్గొన్నారు. -
వెల్డింగ్ చేస్తుండగా విద్యుత్ షాక్తో కార్మికుడి మృతి
అక్కిరెడ్డిపాలెం : ఆటోనగర్ డీ బ్లాక్ మ్యాంగ్ పార్క్ ఎదురుగా ఉన్న ప్రైజం ఆర్ఎంసీ కంపెనీలో వెల్డింగ్ పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు కంపెనీ వద్దకు చేరుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. గాజువాక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి ప్రాంతానికి చెందిన మాటూరి చిన్నరావు (38) ఇటీవల విదేశాల నుంచి తిరిగి వచ్చారు. ఆయన తల్లి ఇటీవల మృతి చెందడంతో కుటుంబ బాధ్యతల నిమిత్తం ఆటోనగర్లోని ప్రైజం ఆర్ఎంసీ సిమెంట్ పరిశ్రమలో వెల్డింగ్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. శుక్రవారం మధ్యాహ్నం విధుల్లో భాగంగా వెల్డింగ్ పనులు చేస్తుండగా పరిశ్రమలోని విద్యుత్ పరికరాల నుంచి ఒక్కసారిగా ఎర్త్ రావడంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. రెండు రోజులుగా పరిశ్రమలో విద్యుత్ షాక్ వస్తున్న విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని తోటి కార్మికులు ఆరోపించారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే చిన్నరావు మృతి చెందారని వారు తెలిపారు. మృతుడి కుటుంబానికి రూ.కోటి పరిహారం అందించాలని బంధువుల, కార్మికులు డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తరలించేందుకు అంగీకరించబోమని స్పష్టం చేశారు. పరిశ్రమ గేటు వద్ద ఆందోళన కొనసాగించారు. సమాచారం అందుకున్న గాజువాక పోలీసులు పరిశ్రమ యాజమాన్యాన్ని విచారించారు. యాజమాన్య ప్రతినిధులు బెంగళూరు నుంచి రావాల్సి ఉందని, వారు వచ్చిన అనంతరం పరిహారంపై నిర్ణయం తీసుకుంటామని పోలీసులకు తెలిపారు. దీంతో ఆందోళన విరమించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎస్.నర్సాపురంలో జేసీబీ స్వాధీనం
పాయకరావుపేట: మండలంలో ఎస్.నర్సాపురం గ్రామ శివారులో చెరువు వద్ద మట్టి తవ్వుతున్న జేసీబీని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ జై.పురుషోత్తం తెలిపారు. శుక్రవారం తెల్లవారుజూమున గ్రామ శివారులో చెరువు వద్దకు వెళ్లి తనిఖీ చేయగా, జేసీబీ (ఏపీ39 హెచ్ఆర్ 4923)తో మట్టి తవ్వుతున్నట్లు గుర్తించి అడ్డుకున్నామన్నారు. సదరు జేసీబీ డ్రైవరును చెరువు మట్టి తవ్వడానికి సంబంధించి ఏమైనా అనుమతులు, ఇతర అధికారక పత్రాలు ఉన్నాయా అని ప్రశ్నించగా, ఏమీ లేవని సమాధానమిచ్చారని తెలిపారు. దీంతో జేసీబీని స్థానిక పోలీసు స్టేషన్కు తరలించామన్నారు. తదుపరి చర్యల నిమిత్తం తహసీల్దార్కి అప్పగిస్తామని తెలిపారు. -
సీలేరులో ‘ఇరుముడి’ సందడి
సీలేరు: మాస్ మహారాజ రవితేజ హీరోగా సీలేరు పరిసర ప్రాంతాల్లో నెల రోజుల పాటు చిత్రీకరించిన ‘ఇరుముడి’ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ ప్రాంత అందాలను సినిమాలో చూడాలని స్థానికులు ఎంతో కాలంగా ఎదురుచూశారు. సినిమా విడుదల కావడంతో సీలేరు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలోని ‘కట్టు కట్టు ఇరుముడి కట్టు‘ అనే పాటను సీలేరు మారెమ్మ తల్లి ఆలయంలో చిత్రీకరించారు. ఇది ప్రేక్షకాదరణ పొందడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే గుంటవాడ రిజర్వాయర్, ఇంటెక్స్ డ్యామ్ వంటి ప్రాంతాలను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. తమ ప్రాంత అందాలు, పర్యాటక ప్రదేశాలు వెండితెరపై కనిపించడం పట్ల స్థానికులు గర్వపడుతున్నారు. షూటింగ్ సమయంలో సీలేరు ప్రాంత అందాలకు, ఇక్కడి ప్రజల సహకారానికి దర్శకుడు, హీరో రవితేజ ముగ్ధులయ్యారని, సినిమా హిట్ అయితే ఈ ప్రాంతంలో మరిన్ని షూటింగ్లు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
రాంగ్ రూట్లో కారు బీభత్సం
మాకవరపాలెం: రాంగ్ రూట్లో వచ్చిన ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ సంఘటనలో ఓ వృద్ధుడు మృతి చెందగా.. జ్యూస్ షాపు ధ్వంసమైంది. ఈ ఘటన మాకవరపాలెం – విశాఖపట్నం ప్రధాన రహదారిలో శుక్రవారం చోటు చేసుకుంది. మండలంలోని శెట్టిపాలెం శివారు వెంకన్నపాలెం గ్రామానికి చెందిన చీపురుపల్లి దేముడు(80) శుక్రవారం ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఓ జ్యూస్ దుకాణం వద్ద కూర్చున్నాడు. విశాఖ వైపు నుంచి నర్సీపట్నం వెళ్తున్న కారు ఒక్కసారిగా నిబంధనలకు విరుద్ధంగా కుడివైపున ఉన్న దుకాణంపైకి దూసుకువచ్చింది. దీంతో అక్కడే కూర్చున్న దేముడును సైతం ఈడ్చుకుపోయింది. ఈ ప్రమాదంలో వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటనలో జ్యూస్ దుకాణం ముందు ఉన్న రేకుల షెడ్డు పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద సమయంలో కారులో డ్రైవర్తో సహా నలుగురు ఉన్నారని, వారంతా సురక్షితంగా బయటపడ్డారని స్థానికులు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ దామోదర్నాయుడు తెలిపారు. -
వరలక్ష్మీ నమోస్తుతే.!
ప్రయాణం గోతులమయంవాహనదారులకు అడుగడుగునా అవస్థలురూ.10 లక్షల నగదుతో నూకాంబిక అలంకరణమహాలక్ష్మీగా గవరపాలెం సంతోషిమాతఅనకాపల్లి: శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా జిల్లాలోని అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మహిళా భక్తులు వరలక్ష్మీదేవికి ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించి వ్రతాలు ఆచరించారు. పట్టణం, మండలాల పరిధిలో ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమార్చనలు ఘనంగా జరిగాయి. అమ్మవారి నామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. ●అనకాపల్లి మెయిన్ రోడ్డులోని కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారిని విశేషంగా అలంకరించారు. తెల్లవారుజామున నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు ఉప్పల రవిరామ్ జవహర్, కార్యదర్శి శ్రీధరాల సోమరాజు, కోశాధికారి కడిమిశెట్టి అచ్యుతరామయ్య, ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంధి వీవీఎస్ మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. ●గవరపాలెం సంతోషిమాత ఆలయంలో అమ్మవారిని మహాలక్ష్మీ అవతారంలో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మారిశెట్టి భాస్కరరావు, ఈవో చైతన్య తదితరులు పాల్గొన్నారు. ●గవరపాలెం నూకాంబిక అమ్మవారు ధనలక్ష్మీ అలంకరణలో దర్శనమిచ్చారు. సుమారు రూ.10 లక్షల విలువైన నగదుతో శోభాయమానంగా అలంకరించారు. మహిళలు ఉచిత కుంకుమ పూజలో పాల్గొని తరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో యాళ్ల శ్రీధర్, చైర్మన్ పీలా నాగశ్రీను తదితరులు పాల్గొన్నారు. ●గవరపాలెం శతకంపట్టు కనకదుర్గ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ శాశ్వత చైర్మన్ కాండ్రేగుల నాయుడు, ప్రధాన అర్చకులు కె.హరి నారాయణ, కె.శివకేశవ, ఉదయగిరి చంద్రశేఖర్, వ్యవస్థాపకులు పీవీ రమణ, ఉత్సవ కమిటీ చైర్మన్ భీమరశెట్టి వరాహ నూకరాజు తదితరులు పాల్గొన్నారు. ●అరుంధతినగర్లో నూకాంబిక అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయ ప్రతినిధి పెట్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. -
రానున్న ఐదు రోజుల్లోతేలికపాటి వర్షాలు
● 26 వ తేదీ వరకూ తేలిక పాటి వర్షాలు చింతపల్లి: జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురి సే అవకాశం ఉందని చింతపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం అసో సియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ మరియు వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ డి. ఆదిలక్ష్మి తెలిపారు. ఈ నెల 22 నుండి 26 వరకు అల్లూరి జిల్లా పరిధిలోని వాతావరణ వివరాలను ఆమె వెల్లడించారు. చింతపల్లి, పాడేరు, అరకు డివిజన్ల పరిధిలో 2.7 నుండి 5.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 27.9 డిగ్రీల నుండి 28.8 డిగ్రీల మధ్య, కనిష్ట ఉష్ణోగ్రతలు 22.1 డిగ్రీల నుండి 22.3 డిగ్రీల మధ్య ఉండవచ్చని తెలిపారు. గాలిలో తేమ శాతం ఉదయం వేళల్లో 82 నుండి 84 శాతం, మధ్యాహ్న సమయాల్లో 80 నుండి 87 శాతం మధ్య ఉంటుందన్నారు. గాలి గంటకు 6 నుంచి 7 కిలోమీటర్ల వేగంతో వీచే సూచనలున్నాయని, ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రైతులు పంటల విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని ఏడీఆర్ సూచించారు.షిప్.. షిప్.. హుర్రే! హిందూస్థాన్ షిప్యార్డు లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్) తన సుదీర్ఘ చరిత్రలో మరో అరుదైన మైలురాయిని అధిగమించింది.శనివారం శ్రీ 22 శ్రీ ఆగస్టు శ్రీ 2026ముంచంగిపుట్టు: ప్రభుత్వం కొత్త ఇళ్లు మంజూరు చేసిందన్న ఆనందంతో ఉన్న ఇళ్లను తొలగించి.. కొత్త ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన పీవీటీజీ గిరిజనులకు ఇప్పుడు కష్టాలు మొదలయ్యాయి. గృహ నిర్మాణం వివిధ దశల్లో ఉన్నప్పటికీ సకాలంలో బిల్లులు మంజూరు కాకపోవడంతో నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. నెలల తరబడి బిల్లుల కోసం ఎదురుచూస్తున్న గిరిజన లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ● జిల్లాలో 11 మండలాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం పీవీటీజీ గిరిజనుల కోసం ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం–జన్మన్) పథకం కింద 28,691 పక్కా ఇళ్లను మంజూరు చేసింది. వీటిలో ఇప్పటివరకు 6,693 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ● ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.2.39 లక్షలు కేటాయించింది. తొలి విడతగా పునాది స్థాయి నిర్మాణానికి రూ.70 వేల చొప్పున లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఆ తర్వాత లింటల్ స్థాయి వరకు నిర్మాణం పూర్తయితే రూ.90 వేలు, పైకప్పు నిర్మాణం పూర్తయితే రూ.40 వేలు చెల్లించాల్సి ఉంది. మరో రూ.27 వేలు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద, వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకుంటే అదనంగా రూ.12 వేలు మంజూరు చేయాల్సి ఉంది. మూడు నెలలుగా రూ.కోట్లలో పైగా బకాయిలు జిల్లాలో నిర్మాణంలో ఉన్న గృహాలకు గత మూడు నెలలుగా నిధులు విడుదల కాలేదని లబ్ధిదారులు వాపోతున్నారు. సుమారు రూ.6 కోట్లకు పైగా బిల్లులు బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో వివిధ దశల్లో ఉన్న 21,998 గృహాలకు బిల్లులు మంజూరు కావాల్సి ఉంది. ముఖ్యంగా ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల, హుకుంపేట మండలాల్లో బిల్లుల బకాయిలు అధికంగా ఉన్నట్లు లబ్ధిదారులు చెబుతున్నారు. రూఫ్ లెవల్ దశ వరకు నిర్మాణం పూర్తయిన 12,027 గృహాలకు కూడా బిల్లులు అందాల్సి ఉంది. ఆందోళన చేసినా స్పందన కరువు : గృహ నిర్మాణ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ గిరిజన సంఘం ఆధ్వర్యంలో లబ్ధిదారులు మండల కేంద్రాల్లో తహసీల్దార్ కార్యాలయాలను ముట్టడించి ఆందోళనలు చేపట్టారు. అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కొత్త ఇల్లు మంజూరైందన్న ఆనందంతో పాత ఇళ్లను కూల్చుకున్న పీవీటీజీ గిరిజనులకు ఇప్పుడు తీవ్ర కష్టాలు ఎదురవుతున్నాయి. జిల్లాలో గత మూడు నెలలుగా సుమారు రూ.6 కోట్లకు పైగా గృహ నిర్మాణ బకాయిలు నిలిచిపోవడంతో వేలాది ఇళ్ల నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తాత్కాలిక పాకల్లో చిన్నారులతో జీవిస్తూ లబ్ధిదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. -
సింహవల్లీ తాయారుకులక్ష కుంకుమార్చన
ప్రభుత్వం కొత్త ఇళ్లు మంజూరు చేయడంతో పాత ఇళ్లను తొలగించి నిర్మాణాలు ప్రారంభించిన పలువురు పీవీటీజీ గిరిజనులకు బిల్లులు అందక నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో వర్షాకాలంలో తాత్కాలికంగా పాకలు వేసుకుని జీవించాల్సిన పరిస్థితి నెలకొంది. – ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాకల్లోకి నీరు చేరుతుండటంతో చిన్నారులతో కలిసి గిరిజన కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొత్త ఇల్లు ఎప్పుడు పూర్తవుతుందో.. బకాయి బిల్లులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. పాత ఇళ్లు తొలగించి.. పాకల్లో జీవనం -
ఏరో ఎక్స్ప్రెస్ బస్సుల్లో 30 శాతం ఆక్యుపెన్సీ
డాబాగార్డెన్స్: ఏరో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణికుల ఆక్యుపెన్సీ ప్రస్తుతం 30 శాతంగా ఉందని రవాణా, క్రీడల శాఖ మంత్రి రాంప్రసాదరెడ్డి తెలిపారు. విశాఖపట్నం నుంచి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి నడుస్తున్న ఏరో ఎక్స్ప్రెస్ బస్సుల నిర్వహణను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఏరో ఎక్స్ప్రెస్ బస్సులు నిర్ణీత సమయపట్టిక ప్రకారం సమయపాలనతో నడుస్తున్నాయని అధికారులు మంత్రికి వివరించారు. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు ఏరో ఎక్స్ప్రెస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. ఇతర రవాణా మార్గాలతో పోలిస్తే తక్కువ చార్జీలతో రూ.50 నుంచి రూ.400 వరకు ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని, ప్రయాణికులు వీటిని వినియోగించుకోవాలని కోరారు. ఈ పరిశీలనలో ఏపీఎస్ఆర్టీసీ రీజినల్ మేనేజర్ బి.అప్పలనాయుడు, డిప్యూటీ సీటీఎం కె.పద్మావతి, డీఈఎంఈ ఎ.గంగాధర్, డిపో మేనేజర్లు ప్రసాద్, దుర్గ, సూపర్వైజర్లు పాల్గొన్నారు. -
వరాహ నృసింహునికిఘనంగా ఆర్జిత సేవలు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి గురువారం ఆర్జిత సేవలు వైభవంగా జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి స్వర్ణపుష్పార్చన చేశారు. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆలయ బేడామండపంలో వేదికపై వేంజేపచేశారు. 108 స్వర్ణ సంపెంగ పుష్పాలతో స్వామికి అష్టోత్తర పూజ నిర్వహించారు. ఉభయదాతలకు శేషవస్త్రాలు, ప్రసాదం అందించారు. శాస్త్రోక్తంగా నిత్యకల్యాణం : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఉదయం 9.30 నుంచి నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ బేడామండపంలో స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాల తో కల్యాణం జరిపారు. ఉభయ దాతలకు కల్యా ణ అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రం అందజేశారు. -
రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేయాలని ధర్నా
ఎస్.రాయవరం: నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో అనారోగ్యంతో ఉన్న రైతుపై రెవెన్యూ అధికారులు దౌర్జాన్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు అడ్డురోడ్డులోని ఆర్డీవో కార్యాలయం ఎదుట గురువారం ధర్నాకు దిగారు. సంబంధిత అధికారులను, ముఖ్యంగా తహసీల్దార్ను వెంటనే సస్పెండ్ చేసి, బాధిత రైతుకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. బాధిత రైతు గోసల దేముడు భార్య రామయ్యమ్మ, ఆయన అల్లుడు, ఎస్.రాయవరం మండలం వైస్ ఎంపీపీ చోడిపల్లి అప్పన్న, రైతు సంఘ నాయకుడు ఎం.అప్పలరాజు మాట్లాడుతూ రాజయ్యపేట గ్రామంలోని సర్వే నంబర్లు 231/3బీలో ఎకరా 11 సెంట్లు, 231/5లో ఎకరా 45 సెంట్లు, 235/5లో 80 సెంట్లు కలిపి మొత్తం 3 ఎకరాలు 37 సెంట్ల భూమిని 2023లో ఏపీఐఐసీ భూసేకరణ సమయంలో మినహాయింపుగా గుర్తించినట్లు తెలిపారు. అయితే అదే భూమిలోకి బుధవారం నక్కపల్లి తహసీల్దార్ అక్రమంగా ప్రవేశించి, మొక్కలకు నీరు పోస్తున్న రైతు గోసల దేముడితో వాగ్వాదానికి దిగారని ఆరోపించారు. పెద్దగా అరుస్తూ భయాందోళనలకు గురి చేయడంతో అప్పటికే అనారోగ్యంతో ఉన్న దేముడు స్పృహ తప్పి కుప్పకూలిపోయారని తెలిపారు. అనంతరం అక్కడ ఉన్న రెవెన్యూ సిబ్బంది పొలంలో ఉన్న వస్తువులను తొలగించారని పేర్కొన్నారు. 2013 భూసేకరణ చట్టంలోని సెక్షన్లు 12, 20లను, న్యాయస్థానాల తీర్పులను పట్టించుకోకుండా రెవెన్యూ అధికారులు వ్యవహరించారని విమర్శించారు. బాధిత రైతుకు తక్షణమే మెరుగైన వైద్యం అందించడంతో పాటు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీవో రామలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. ఘటనపై స్పందించిన ఆర్డీవో.. విషయం జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎం.మహేష్బాబు, జె.అప్పలరాజు, సిహెచ్.రాజు, గోపాలకృష్ణ, ఎం.రమణ, జి.కామేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
అప్పుల బాధతో లారీ డ్రైవర్ ఆత్మహత్య
సబ్బవరం: అప్పుల బాధ తాళలేక ఓ లారీ డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని పైడివాడ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అసకపల్లి శివారు ఎరుకునాయుడుపాలెం గ్రామానికి చెందిన గౌర నీలకంఠేశ్వరరావు(35) లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఐదేళ్ల క్రితం పైడివాడకు చెందిన జ్యోతిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె ఉంది. భార్యాభర్తలు పైడివాడ బీసీ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. జ్యోతి నాన్నమ్మ అనారోగ్యంతో ఉండటంతో రెండు రోజుల క్రితం ఆమెను చూసేందుకు జ్యోతి మరో వీధిలోని నాన్నమ్మ ఇంటికి వెళ్లింది. గురువారం ఉదయం ఇంటికి వచ్చిన ఆమె, భర్త ఆచూకీ కోసం ఇంటి పక్కనే నివసిస్తున్న మహిళను అడగగా.. తెల్లవారుజామున నీలకంఠేశ్వరరావు తన తాతకు చెందిన మామిడి తోట వైపు వెళ్లినట్లు ఆమె తెలిపింది. దీంతో జ్యోతి తోటకు వెళ్లి చూడగా.. నీలకంఠేశ్వరరావు మామిడి చెట్టుకు నైలాన్ తాడుతో ఉరివేసుకుని కనిపించాడు. వెంటనే ఆమె పోలీసులకు సమాచారం అందించింది. అప్పుల బాధతోనే తన భర్త ఆత్మహత్యకు పాల్పడినట్లు జ్యోతి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సబ్బవరం సీఐ జి.రామచంద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్కు కూటమి తూట్లు
నర్సీపట్నం: షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు అభివృద్ధికి తోడ్పాటును అందించేందుకు తీసుకువచ్చిన సబ్ ప్లాన్కు చంద్రబాబు ప్రభుత్వం తూట్లు పొడించిందని డీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు శివప్రకాష్ విమర్శించారు. మున్సిపాలిటీలో గురువారం ఆయన మాట్లాడుతూ చట్ట ప్రకారం జనాభా ప్రాతిపదికన బడ్జెట్లో నిధులు కేటాయించి ఎస్సీ, ఎస్టీ పథకాలకు మాత్రమే ఖర్చు చేయాలన్నారు. ఇతర పథకాలకు నిధులను మళ్లించడం సరికాదన్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 24న కలెక్టరేట్ వద్ద ధర్నా తలపెట్టామన్నారు. కొన్ని సందర్భాల్లో నిధులు ఖర్చు కాక మురిగిపోతున్నాయన్నారు. ఏ ప్రభుత్వ శాఖలోనూ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వంద శాతం ఖర్చు చేయడంలేదన్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ సబ్ ప్లాన్ పథకానికి బడ్జెట్లో రూ.18,497.68 కోట్లు కేటాయించిస్తే, రూ.13,571.50 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. 2025–26లో సబ్ ప్లాన్కు రూ.20,281.20 కోట్లు కేటాయించి రూ.15,616.45 కోట్లు ఖర్చు చేశారన్నారు. దీని వల్ల ఎస్సీ వర్గాలు నష్టపోతున్నాయని వాపోయారు. ఎస్సీ వర్గాలకు తీవ్ర ద్రోహం జరుగుతుందన్నారు. సమావేశంలో డీహెచ్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు యర్రంశెట్టి పాపారావు పాల్గొన్నారు. -
తవ్వుతాం దోచుకుంటాం!
శుక్రవారం శ్రీ 21 శ్రీ ఆగస్టు శ్రీ 2026డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం పాడేరు: జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలోని మిడ్ డే మిల్స్ విభాగంలో ఖాళీగా ఉన్న ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టును ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి భానుమూర్తి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏదేని ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. వీటితో పాటు ఎంఎస్ ఆఫీస్ పరిజ్ఞానంతో పాటు తెలుగు, ఇంగ్లీష్ టైపింగ్లో మంచి ప్రవేశం/నైపుణ్యం ఉండాలని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 24 నుంచి 29వ తేదీ వరకు పాడేరులోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో నేరుగా తమ దరఖాస్తులను అందజేయాలని సూచించారు.మరింతసాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రకృతి సంపదను కొల్లగొట్టేందుకు కూటమి నేతలు మరో అడుగు ముందుకేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డేటా సెంటర్లు, టూరిజం ప్రాజెక్టులు, మైనింగ్ పేరుతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో కొండలను తొలిచేస్తున్న పరిస్థితుల్లో.. ఇప్పుడు లేటరైట్ పేరుతో సరుగుడు ప్రాంతంలో తవ్వకాలను మరింత భారీగా విస్తరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఉత్పత్తి లక్ష్యాన్ని రెట్టింపు చేసి ఏడాదికి 22 లక్షల టన్నుల లేటరైట్ తవ్వేందుకు అనుమతులు పొందేందుకు కసరత్తు సాగుతోంది. ఇందులో భాగంగా సెప్టెంబరు 9న సుందరకోట గ్రామంలోని కొత్త సిరిపురం రామాలయం వద్ద ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) ప్రకటించింది. జర్తా లక్ష్మణరావు పేరుతో కొనసాగుతున్న మైనింగ్ ప్రాజెక్టులో 121 హెక్టార్ల విస్తీర్ణంలో ప్రస్తుతం ఉన్న 10 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని 22 లక్షల టన్నులకు పెంచాలని ప్రతిపాదించారు. మరో 36 హెక్టార్లలో కొత్తగా మైనింగ్కు అనుమతులు పొందేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. రెట్టింపు తవ్వకాలు ! నాతవరం మండలం సరుగుడు పంచాయతీ పరిధిలో ఇప్పటికే 130.5 హెక్టార్లలోని రెండు ప్రాంతాల్లో మైనింగ్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతాల నుంచి ఏడాదికి సుమారు 20 లక్షల టన్నుల లేటరైట్ను తరలిస్తున్నారు. దీనికి అదనంగా మరో 20 లక్షల టన్నులను వెలికితీసేలా అనుమతులు పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే మొత్తం ఏడాదికి 40 లక్షల టన్నుల లేటరైట్ తవ్వి తరలించే స్థాయికి మైనింగ్ను విస్తరించేందుకు పావులు కదుపుతున్నారన్నమాట. ఇప్పటికే సరుగుడు పంచాయతీలోని నాగులకొండపై జరుగుతున్న తవ్వకాలపైనా ఆరోపణలు ఉన్నాయి. సుమారు 60 అడుగుల మేర తవ్వకాలకు అనుమతి ఉండగా.. 100 అడుగుల లోతు వరకు తవ్వకాలు సాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో భూగర్భ జలాల మట్టం పడిపోవడం, తాగునీటి ఇబ్బందులు తలెత్తడంతోపాటు వంట చెరకుకూ కొరత ఏర్పడుతోందని చుట్టుపక్కల ఉన్న పది గిరిజన గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొండలు తరిగిపోతున్నా.. అధికారుల పర్యవేక్షణ మాత్రం కనిపించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హైగ్రేడ్ లేటరైట్కు డిమాండ్ సరుగుడు ప్రాంతంలో లభిస్తున్న హైగ్రేడ్ లేటరైట్కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని సమాచారం. టన్నుకు సుమారు రూ.5 వేల వరకు ధర పలుకుతున్న ఈ ఖనిజాన్ని ఒడిశాలోని ఓ ప్రైవేటు స్టీల్ ప్లాంట్కు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. రోజుకు వందలాది ట్రిప్పుల్లో ఖనిజాన్ని తరలించేందుకు అటవీ ప్రాంతం మీదుగా ప్రత్యేక రహదారిని నిర్మించినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ రహదారి నిర్మాణానికి అటవీశాఖ అనుమతులు ఉన్నాయా? అన్నదే ఇప్పుడు ప్రశ్నగా మారింది. అటవీ భూమిలో రహదారి నిర్మాణం జరిగినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఏటా 22 లక్షల టన్నుల లేటరైట్ తవ్వకానికి ప్లాన్ అనకాపల్లి జిల్లా సరుగుడులో మరింత ప్రకృతి విధ్వంసం సుందరకోటలో సెప్టెంబరు 9న ప్రజాభిప్రాయ సేకరణ చినబాబుకు, ఇద్దరు ఎంపీలకు భారీగా ముడుపులుచినబాబుకు రూ. 200 కోట్లు! ఈ మైనింగ్ వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన కీలక నేతలకు భారీగా వాటాలు అందుతున్నాయనే ఆరోపణలు స్థానికంగా ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడి నుంచి తరలించే ప్రతి టన్ను లేటరైట్కు ‘చినబాబు’ పేరుతో రూ.500, మరో ఇద్దరు ఎంపీలకు చెరో రూ.250 చొప్పున వాటా వెళ్తోందని ప్రచారం జరుగుతోంది. ఏడాదికి 40 లక్షల టన్నుల లేటరైట్ తరలింపు లక్ష్యాన్ని చేరుకుంటే.. టన్నుకు రూ.500 చొప్పున లెక్కించినా ‘చినబాబు’కు ఏడాదికి రూ.200 కోట్ల వాటా అందుతుందనే ప్రచారం సాగుతోంది. మరో ఇద్దరు ఎంపీలకు చెరో రూ.100 కోట్ల చొప్పున.. ఇద్దరికీ కలిపి మరో రూ.200 కోట్లు దక్కుతాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవి కేవలం ప్రతిపాదిత ఉత్పత్తి లక్ష్యాల ఆధారంగా వేసిన లెక్కలేనని స్థానిక వర్గాలు చెబుతున్నాయి. అధికారిక లెక్కలకు మించి ఖనిజాన్ని తరలిస్తే ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందనే ఆరోపణలూ ఉన్నాయి. గిరిజనుల పేరుతో మైనింగ్ సరుగుడు పంచాయతీ పరిధి గిరిజన ప్రాంతం కావడంతో ఇక్కడ 1/70 చట్టం అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో గిరిజనుల పేర్లను ముందుపెట్టి మైనింగ్ కార్యకలాపాలు సాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గిరిజనుల పేర్లపై అనుమతులు తీసుకుంటున్నప్పటికీ.. వాస్తవంగా తవ్వకాలు, ఖనిజ రవాణా వ్యవహారాలను ఎవరు నియంత్రిస్తున్నారు? అసలు లబ్ధిదారులు ఎవరు? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ వ్యవహారంలో స్థానికంగా కీలక నేత కుమారుడు ‘చినబాబు’ తరఫున కీలక పాత్ర పోషిస్తున్నారనే ప్రచారం ఉంది. తాజాగా చినబాబుకు సన్నిహితంగా ఉండే మరో ఎంపీకి కూడా ఈ మైనింగ్ వ్యవహారంలో వాటా అందుతోందనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఇప్పటికే తవ్వకాలతో సరుగుడు కొండలు రూపురేఖలు కోల్పోతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతుండగా.. ఉత్పత్తిని రెట్టింపు చేసి ఏటా 22 లక్షల టన్నుల లేటరైట్ వెలికితీసేందుకు అనుమతిస్తే పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది. -
కై సర్లవాని చెరువులో మట్టి అక్రమ తవ్వకాలు
రోలుగుంట: కుసుర్లపూడి గ్రామానికి చెందిన కై సర్లవాని చెరువులో మట్టి అక్రమ తవ్వకాలతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. గురువారం చెరువులోకి ట్రాక్టర్లు, పొక్లెయిన్లు తరలించి కొందరు అక్రమార్కులు మట్టి తవ్వకాలు ప్రారంభించారు. గ్రామ చెరువును అందంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చిన యువతకు ఈ అక్రమ తవ్వకాల విషయం తెలియడంతో వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని అడ్డుకున్నారు. మట్టి తవ్వకాలు ఆపాలంటూ అక్రమార్కులను నిలదీశారు. ఈ విషయం ‘డిపార్ట్మెంట్ అధికారులు చెప్పాలి, మీరు ఎవరు?’అంటూ అక్రమార్కులు వాదనకు దిగడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న రోలుగుంట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ విషయంపై తహసీల్దార్ నాగమ్మను ఫోన్లో సంప్రదించగా, తవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, తనకు సమాచారం లేదని తెలిపారు. ఇరిగేషన్ శాఖ నుంచి అనుమతి ఉండవచ్చని ఆమె పేర్కొన్నారు. ఇరిగేషన్ ఏఈ డి.సూర్యనారాయణను సంప్రదించగా, సిబ్బందిని పంపించి తవ్వకాలను నిలిపివేశామని తెలిపారు. తాత్కాలికంగా పనులు ఆగిపోవడంతో గ్రామ యువత వెనుదిరిగినప్పటికీ, ఈ వ్యవహారం మరింత వివాదాలకు దారి తీస్తుందేమోనన్న ఆందోళన గ్రామస్తుల్లో వ్యక్తమవుతోంది. -
సోలాపూర్–అనకాపల్లి ఎక్స్ప్రెస్ ఇక రెగ్యులర్
తాటిచెట్లపాలెం: సోలాపూర్–అనకాపల్లి–సోలాపూర్ మధ్య నడుస్తున్న వీక్లీ ఎక్స్ప్రెస్ ఈ నెల 21 నుంచి రెగ్యులర్ రైలుగా నడవనుంది. సోలాపూర్–అనకాపల్లి (11313) రైలు శుక్రవారం ఉదయం 9.20 గంటలకు సోలాపూర్లో బయల్దేరి శనివారం మధ్యాహ్నం 2.40 గంటలకు అనకాపల్లి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో అనకాపల్లి–సోలాపూర్ (11314) రైలు ఈ నెల 22 నుంచి రెగ్యులర్గా నడుస్తుంది. శనివారం సాయంత్రం 5.35 గంటలకు అనకాపల్లిలో బయల్దేరి ఆదివారం రాత్రి 11.50 గంటలకు సోలాపూర్ చేరుకుంటుంది. ఈ రైళ్లు గుంతకల్, అనంతపురం, ధర్మవరం, తిరుపతి, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, ఎలమంచిలి తదితర స్టేషన్లలో ఆగుతాయి. చర్లపల్లి–శ్రీకాకుళం రోడ్ ప్రత్యేక రైలు చర్లపల్లి–శ్రీకాకుళం రోడ్ (07037) వీక్లీ స్పెషల్ ఈ నెల 25న రాత్రి 8.30 గంటలకు చర్లపల్లిలో బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.45 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో (07038) రైలు ఈ నెల 26న మధ్యాహ్నం 1.30 గంటలకు శ్రీకాకుళం రోడ్లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు చర్లపల్లి చేరుతుంది. -
అనంతగిరి ఎంఈవో–1పై ఫిర్యాదు
● అవినీతి, అక్రమాలపై చర్యలు తీసుకోవాలి ● ఉద్యోగ సంఘాల ప్రతినిధుల డిమాండ్ పాడేరు రూరల్: అనంతగిరి మండల విద్యాశాఖ అధికారి–1 బాలాజీ తీవ్ర అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు గురువారం పాడేరులో డీఈవోకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మాసాడ ఈశ్వర్రావు, డీటీఎఫ్, ఏపీటీఎఫ్, పీఆర్టీయూ, బీటీఏ సంఘాల నేతలు సన్యాసిరావు, గురుదొర, రామకృష్ణ, దేముడు తదితరులు మాట్లాడారు. 2023 నుంచి ఇప్పటివరకు ఎంఈఓ పాఠశాలలకు సంబంధించిన సామగ్రి, మధ్యాహ్న భోజన నిధులను స్వాహా చేశారని ఆరోపించారు.జీనబాడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అభివృద్ధి, భవన నిర్మాణ పనులు ఏమాత్రం జరగకుండానే రూ. 11,98,000 నిధులను డ్రా చేసుకున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా డిప్యూటేషన్ వేస్తూ ఒక్కో ఉపాధ్యాయుడి వద్ద నుంచి రూ. 30 వేల వరకు అక్రమంగా వసూలు చేస్తున్నారన్నారు. మండలంలోని 175 పాఠశాలల ఫేషియల్ హాజరులో జోక్యం చేసుకోవడమే కాకుండా, మధ్యాహ్న భోజన బిల్లుల మంజూరుకు రూ. 500 చొప్పున వసూలు చేస్తున్నారని ఆరోపించారు.బదిలీపై వెళ్లే ఉపాధ్యాయుల సర్వీస్ రిజిస్టర్ ప్రక్రియ కోసం రూ. 2 వేల నుంచి రూ. 3 వేల వరకు లంచం తీసుకుంటున్నారు. ఎంఈవో బాలాజీ అవినీతి అక్రమాలపై ఉన్నతాధికారులతో సమగ్ర విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. -
గురుకులంలో సర్కారు గందరగోళం!
మధురవాడ: పేద గిరిజన విద్యార్థుల బతుకులతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతోంది. ‘ఎక్సలెన్స్’ ముసుగులో వందలాది మంది అమాయక విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. మారికవలస ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో 5, 6, 7 తరగతుల తరలింపు నిర్ణయంతో విద్యార్థులు, తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతూ రోడ్డెక్కి నిరసనలు తెలుపుతుంటే.. ప్రభుత్వం మాత్రం వారి ఆక్రందనలను నిర్దాక్షిణ్యంగా తొక్కిపెట్టింది. సమస్యను పరిష్కరించాల్సింది పోయి, ఏకంగా 10వ తరగతిలోపు ఉన్న బాలురందరినీ గెంటేసి పాఠశాలకే ఎసరు పెట్టే ఆలోచన చేస్తోంది. విద్యార్థుల ఆందోళనలను కనీసం పట్టించుకోకుండా, వారిని బలవంతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లగొట్టాలని ఉన్నతాధికారుల నుంచి అప్పటికప్పుడు హుకుం జారీ కావడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఒకరి చదువు కోసం ఇంకొకరి బతుకును బలిపీఠం ఎక్కించే ఈ కుట్రపూరిత వైఖరిపై గిరిజన వర్గాల్లో తీవ్ర ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. జీవో 69 ముసుగులో నిర్వాకం గతంలో తెచ్చిన జీవో నంబర్ 69 ద్వారా మారికవలస బాలికల స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్(ఎస్వోఈ), తిమ్మాపురం రోడ్డులోని గురుకుల పాఠశాలలో 5, 6, 7 తరగతుల విద్యార్థులను తరలించి శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా భావించారు. అయితే ఆ పరిధిని ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా విస్తరించారు. బాలుర గురుకుల పాఠశాలలో 10వ తరగతి లోపు చదువుతున్న వందలాది మంది విద్యార్థులందరినీ ఏకపక్షంగా ఖాళీ చేయించాలని నిర్ణయించారు. దీంతో పాఠశాల ఉనికితో పాటు అక్కడ చదువుతున్న పేద విద్యార్థుల విద్యా భవిష్యత్తు పూర్తిగా ప్రశ్నార్థకంగా మారింది. ఒకరి కోసం మరొకరు బలి? మారికవలస బాలికల ఎస్వోఈలో ఇంటర్ ఎంపీసీ, బైపీసీ చదువుతున్న 300 మందిని, మారికవలస ఆర్ఎస్లోని మరో 300 మంది విద్యార్థులను కలిపి మొత్తం 600 మందికి ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ పేరుతో ఒకే ప్రాంగణంలో నీట్, ఐఐటీ కో–ఎడ్యుకేషన్ శిక్షణ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం మంచిదే అయినా, అందుకోసం ఏళ్ల తరబడి ఇక్కడే చదువుకుంటున్న పాఠశాల స్థాయి చిన్నారులను బలవంతంగా వెళ్లగొట్టడం ఎంతవరకు న్యాయమని ప్రజా, విద్యార్థి, గిరిజన సంఘాలతో పాటు తల్లిదండ్రులు నిలదీస్తున్నారు. 600 మంది ఇంటర్ విద్యార్థుల కోసం కొత్త వసతులు కల్పించకుండా, అమాయక బాలుర బతుకులను రోడ్డున పడేసేలా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గురుకుల విద్యార్థులకు స్థిరమైన విద్యా వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని, దాన్ని ఒక్కసారిగా మార్చే నిర్ణయాలు వారి చదువుపై ప్రభావం చూపే అవకాశం ఉందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
సీఎం చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు
కె.కోటపాడు: మండలంలోని ఎ.కోడూరులో ఈ నెల 22న సీఎం చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ప్రాథమిక పాఠశాల సమీపంలో సీఎం హెలిప్యాడ్ నిర్మాణ పనులను ఆర్అండ్బీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. హెలిప్యాడ్ నుంచి ప్రజావేదిక ప్రాంతానికి చేరుకునే మార్గాన్ని శుభ్రం చేయిస్తున్నారు. ఇక్కడ స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి వచ్చే ప్రజాప్రతినిధులు, అధికారుల వాహనాల పార్కింగ్ కోసం గ్రామ సమీపంలో ఖాళీ ప్రదేశాలను ప్రజా వేదిక కోసం హైస్కూల్ ప్రాంగణాన్ని జేసీబీలతో సిద్ధం చేస్తున్నారు. ఈ పనులను కలెక్టర్ విజయకృష్ణన్, జేసీ శౌర్యమాన్పటేల్, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గురువారం పరిశీలించారు. -
విశాఖను అదాని‘పట్నం’గా మార్చొద్దు
ఎంవీపీకాలనీ: విచక్షణారహితంగా భూ కేటాయింపులు చేస్తూ విశాఖను ధ్వంసం చేసి, దానిని ‘అదానిపట్నం’గా మార్చవద్దని చంద్రబాబు ప్రభుత్వాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు హెచ్చరించారు. విశాఖ పర్యటనలో భాగంగా గురువారం ఆయన పార్టీ నాయకులతో కలిసి ముడసర్లోవ జలాశయం, అక్కడి డేటా సెంటర్ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మూడేళ్ల క్రితమే మధురవాడలో అదానికి కేటాయించిన 300 ఎకరాల భూమి ఇంకా వినియోగంలోకి రాకుండానే, తాజాగా ముడసర్లోవలో సింహాచలం దేవస్థానానికి చెందిన 160 ఎకరాలను ప్రభుత్వం కేటాయించడాన్ని తప్పుపట్టారు. ఈ కేటాయింపుల వల్ల విశాఖ ప్రజలకు ఒరిగిందేమిటని ప్రశ్నించారు. 40 ఏళ్లుగా పరిష్కారం కాని సింహాచలం పంచగ్రామాల సమస్యను పక్కనపెట్టి, అదానికి భూములు ధారాదత్తం చేస్తున్న తీరును ఆయన తీవ్రంగా విమర్శించారు. అసెంబ్లీలో అదాని అబద్ధాలను నమ్మి మంత్రి లోకేష్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ప్రాజెక్టుపై ఎలాంటి నిపుణుల నివేదిక, లాభనష్టాల విశ్లేషణ లేకుండానే మాట్లాడటం సరికాదని అన్నారు. హిందుత్వ పరిరక్షణ పేరుతో ప్రచారం చేసుకునే బీజేపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్పీలు అప్పన్న దేవస్థాన భూములు అదానికి వెళ్తున్నా ఎందుకు మౌనంగా ఉన్నాయని ఆయన నిలదీశారు. గత ప్రభుత్వ హయాంలో రుషికొండ అంశంపై గగ్గోలు పెట్టిన చంద్రబాబు, ఇప్పుడు విశాఖలో మూడు కొండలను బోడిగుండ్లుగా మారుస్తున్నారని, ఆ ప్రాంతాలకు ఎవరినీ వెళ్లనివ్వకపోవడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ముడసర్లోవలో డేటా సెంటర్ ఏర్పాటు వల్ల విశాఖ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ఈ ప్రాజెక్టును వెంటనే రద్దు చేయాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాథం, జిల్లా కార్యదర్శి యం.జగ్గునాయుడు, కార్యదర్శివర్గ సభ్యుడు డాక్టర్ బి.గంగారావు, ఆర్కేఎస్వీ కుమార్, పి.మణి, వి.కృష్ణారావు, జగన్ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించే వరకు శాంతియుత పోరాటం
● జూనియర్ డాక్టర్ల స్పష్టీకరణ ● పాడేరు జిల్లా ఆసుపత్రి ఎదుట నిరసన.. విధుల బహిష్కరణ పాడేరు: తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించేంత వరకు శాంతియుత పోరాటం కొనసాగిస్తామని జిల్లా జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ మహేష్ స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు గురువారం పాడేరు జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి, ఆసుపత్రి ప్రధాన ద్వారం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మహేష్ మాట్లాడుతూ.. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా తమ వేతనాలు పెంచాలని, ఆసుపత్రుల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వైద్యుల రిటైర్మెంట్ వయస్సును 62 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 11 నుంచి నిరసనలు తెలుపుతూ, 17వ తేదీ నుంచి విధులను పూర్తిగా బహిష్కరించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కనీసం చర్చలకు పిలవకపోవడం విచారకరమన్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, లేనిపక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ జిల్లా ప్రతినిధులు డాక్టర్ అమన్, పృథ్వీ, భానుతో పాటు పలువురు జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు. -
న్యాయవాదుల సమస్యలపై సానుకూల స్పందన
విశాఖ లీగల్: విశాఖ న్యాయవాదుల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి సానుకూలంగా స్పందిస్తామని ఉమ్మడి విశాఖ జిల్లా పోర్ట్ఫోలియో న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ తెలిపారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు బి.వి.ఆర్.మూర్తి, డి.మంజులత, ఉపాధ్యక్షుడు ఎస్.కృష్ణమోహన్, కె.రామజోగేశ్వరరావులు నేలపాడులోని హైకోర్టు ఆవరణలో జస్టిస్ దేవానంద్ను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విశాఖ న్యాయవాదుల పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. వినతిపత్రంలోని అంశాలను పరిశీలించి తగిన విధంగా స్పందిస్తామని జస్టిస్ దేవానంద్ హామీ ఇచ్చారు. విశాఖతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ.. ఎందరో మహనీయులతో ప్రత్యేక గుర్తింపు పొందిన విశాఖ బార్ అసోసియేషన్ సమస్యలపై అధ్యక్షుడు, ఇతర కార్యవర్గ సభ్యులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
మాడుగుల ఎమ్మెల్యే హామీలపై సీఎంకు విన్నవిస్తాం
దేవరాపల్లి: మాడుగుల నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి హామీలు ఇచ్చి అమలు చేయడం మరిచిపోయారని, ఈ విషయంపై ఈ నెల 22న కె.కోటపాడులో పర్యటించనున్న సీఎం చంద్రబాబుకు వినతి పత్రాన్ని అందజేస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జీనబాడు – దేవరాపల్లి రోడ్డు నుంచి వయా వాలాబు మీదుగా కోనాంకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ. 6 కోట్లు మంజూరు చేసినట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినా నేటికి అతీగతీ లేదన్నారు. చింతలపూడి పంచాయతీ శివారు వీరభద్రపేటకు కోటి రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణానికి పల్లె పండుగ పేరిట అట్టహాసం చేసి అసంపూర్తిగా నిలిపివేశారన్నారు. బోడిగరువు, నేరెళ్లపూడి, ఎం.అలమండ– మామిడిపల్లి రోడ్లు రెండేళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయాయన్నారు. రైవాడ జలాశయం రూపురేఖలు మారుస్తామని ప్రకటించిన ఎమ్మెల్యే హామీని గాలికి వదిలేశారన్నారు. దేవరాపల్లిలో హోల్సేల్ కాయగూరల మార్కెట్లో కోల్డ్ స్టోరేజీ, దేవరాపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ తదితర హామీలను నెరవేర్చలేదన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే నెరవేర్చని ఇతరత్రా హామీలన్నింటిని వెంటనే అమలు చేయాలని కోరుతూ సీఎం చంద్రబాబుకు వినతి పత్రం అందజేస్తామన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వెంకన్న -
ఎయిరో ఎక్స్ప్రెస్ ఆలస్యం.. ప్రయాణికులకు చుక్కలు
అల్లిపురం: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునేందుకు ఏర్పాటు చేసిన ఏపీఎస్ఆర్టీసీ ఎయిరో ఎక్స్ప్రెస్ బస్సుల సమయపాలనపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బస్సులు నిర్ణీత సమయానికి రాకపోవడంతో విమానాశ్రయానికి సమయానికి చేరుకోలేమనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం ఉదయం గురుద్వారా జంక్షన్లో సైమన్ అబీబ్ అనే ప్రయాణికుడు ఉదయం 8 గంటల నుంచే ఎయిరో ఎక్స్ప్రెస్ కోసం వేచి ఉన్నారు. ఉదయం 8.30 గంటలకు రావాల్సిన బస్సు 8.45 గంటలైనా రాకపోవడంతో అక్కడి ఎంకై ్వరీ సిబ్బందిని ప్రశ్నించగా..‘బస్సు రావాల్సి ఉంది.. ఇంకా రాలేదు’ అనే సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం ఫోన్ ద్వారా ఎంకై ్వరీని సంప్రదించినా స్పష్టమైన సమాచారం అందలేదని, దీంతో సమయానికి విమానాశ్రయానికి చేరుకోలేక విమానం మిస్సయ్యే పరిస్థితి వస్తుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ కారణంగా స్వల్ప ఆలస్యం: ఆర్ఎం ఈ అంశంపై ఆర్టీసీ రీజినల్ మేనేజర్ బి. అప్పలనాయుడు స్పందిస్తూ, ట్రాఫిక్ రద్దీ తదితర కారణాలతో ఎయిరో ఎక్స్ప్రెస్ బస్సులు అప్పుడప్పుడు 5 నుంచి 10 నిమిషాలు ఆలస్యమవు తున్నాయని తెలిపారు. అయినప్పటికీ మొత్తం మీద బస్సులు నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే నడుస్తున్నాయని స్పష్టం చేశారు. ప్రతి బస్టాప్ వద్ద బస్సుల రాకపోకల సమయాలను సూచించే బోర్డులు ఏర్పాటు చేశామని, సమయపాలనపై సూపర్వైజర్లు నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. -
‘ఎన్జీరంగా’ పాలిటెక్నిక్లో స్పాట్ ప్రవేశాలు
చింతపల్లి: స్థానిక ఆచార్య ఎన్జీరంగా సేంద్రియ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల 26న జోనల్ స్థాయిలో స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ డి. ఆదిలక్ష్మి తెలిపారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో గుంటూరు ’లాం’ వద్ద నిర్వహించిన కౌన్సెలింగ్లో చింతపల్లి సేంద్రీయ పాలిటెక్నిక్లోని మొత్తం 25 సీట్లకు గానూ 12 సీట్లు భర్తీ అయ్యాయని, మిగిలిన 13 సీట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఈ ఖాళీలను భర్తీ చేసేందుకే చింతపల్లిలోనే నేరుగా స్పాట్ కౌన్సిలింగ్ చేపడుతున్నట్లు వెల్లడించారు. పదవ తరగతి ఉత్తీర్ణులైన వారితో పాటు ఇంటర్మీడియట్ పాస్ లేదా ఫెయిల్ అయిన అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ కౌన్సెలింగ్కు హాజరుకావచ్చని సూచించారు. ఇతర వివరాలు, సందేహాల కోసం 9014637080 నంబరులో సంప్రదించాలని కోరారు. -
మాతా, శిశు మరణాల నివారణే లక్ష్యం
పాడేరు: గిరిజన ప్రాంతాల్లో గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించి మాతా, శిశు మరణాలను సంపూర్ణంగా నివారించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ నిశాంతి స్పష్టం చేశారు. అలాగే టీనేజ్ గర్భధారణలు, బాల్య వివాహాలను అడ్డుకట్ట వేసేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో అడుగులు వేస్తోందన్నారు. పాడేరు శంకరన్ ఆడిటోరియంలో మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్యారోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ’ఏఎస్ఆర్ – షాతి’ కార్యక్రమాన్ని గురువారం జిల్లా కలెక్టర్ నిశాంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే తొలిసారిగా ఏఎస్ఆర్ జిల్లాలోనే ఈ ‘షాతి’ కార్యక్రమాన్ని రూపొందించి ప్రారంభించామని తెలిపారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో ప్రతి గర్భిణికి సురక్షితమైన ప్రసూతి పూర్వ వైద్య సేవలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గర్భధారణ ప్రారంభ సమయం నుండి ప్రసవం వరకు నిరంతర పర్యవేక్షణ ఉండాలని, ఏ తల్లి కూడా బిడ్డను కోల్పోయే పరిస్థితి రాకూడదని ఆకాంక్షించారు. గ్రామ స్థాయిలో ఫ్రంట్లైన్ వారియర్స్గా పనిచేస్తున్న ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు గర్భిణులను నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రమాదకర గర్భధారణలను (హై–రిస్క్ ప్రెగ్నెన్సీ) ముందుగానే గుర్తించి తగిన వైద్య చికిత్సలు అందించేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. బాల్య వివాహాలు చట్టరీత్యా తీవ్ర నేరమని, ఎవరైనా బాల్య వివాహాలు జరిపించినా లేదా ప్రోత్సహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గిరిజన ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ ఝాన్సీరామ్, డీఎంహెచ్వో డాక్టర్ రియాజ్, ప్రభుత్వ మెడికల్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ హేమలత, డాక్టర్ ప్రతాప్, డాక్టర్ చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు, ఐసీడీఎస్, వైద్యారోగ్య శాఖల సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ నిశాంతి -
డుంబ్రిగుడలో టీడీపీకి బిగ్ షాక్
అరకులోయ టౌన్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలన నచ్చకే ఇతర పార్టీల శ్రేణులు వైఎస్సార్సీపీలోకి చేరుతున్నారని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తెలిపారు. డుంబ్రిగుడ మండల పార్టీ అధ్యక్షుడు పాంగి పరశురామ్ ఆధ్వర్యంలో గురువారం కొర్రాయి పంచాయతీ పరిధిలోని జాముగుడ, జాంకరవలస, అంజోడ, బోందుగుడ గ్రామాలకు చెందిన సుమారు 100 కుటుంబాలు ఎమ్మెల్యే సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరాయి. పార్టీలోకి వచ్చిన వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మత్స్యలింగం మాట్లాడుతూ.. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అందించిన సంక్షేమ పథకాలను, ప్రస్తుత ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిఒక్కరికీ వివరించాలని పిలుపునిచ్చారు. కార్యకర్తల కష్టంతో రాబోయే స్థానిక సంస్థల, సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించి వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కొర్రాయి పంచాయతీ టీడీపీ అధ్యక్షుడు లైచోన్ ఆధ్వర్యంలో నాలుగు గ్రామాల నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరడం అభినందనీయమని మండల పార్టీ అధ్యక్షుడు పాంగి పరశురామ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య, మాజీ ఎంపీపీ శెట్టి నీలవేణి, మండల పార్టీ ఉపాధ్యక్షుడు పల్లాసింగ్ విజయ్ కుమార్, జిల్లా సంయుక్త కార్యదర్శి నర్సింగరావు, నియోజకవర్గం బూత్ కమిటీ ఇన్చార్జ్ పాంగి విజయ్, మాజీ వైస్ ఎంపీపీ ధర్మనాయుడు, మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు పాంగి నాగేశ్వరరావు, పార్టీ నాయకులు బీబీ కామేశ్వరరావు, సందడి కొండబాబు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలో చేరినవంద కుటుంబాలు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించిన అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పాలన నచ్చకే చేరినట్టు వెల్లడి -
స్థానిక ఎన్నికలకు కసరత్తు
● వీడియో కాన్ఫరెన్సులో సూచనలిచ్చిన కలెక్టర్ నిశాంతి ● ఇప్పటినుంచి ఏర్పాట్లు చేయాలని ఆదేశం పాడేరు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉండటంతో, అందుకు అనుగుణంగా ఎన్నికల సంఘం అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే చేపట్టాల్సిన పనులపై ఇప్పటి నుంచి కసరత్తు మొదలైంది. జిల్లా కలెక్టర్ స్థాయిలో అధికారులతో ఇప్పటికే సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహిస్తున్నారు. తాజాగా బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు.. కలెక్టర్ టి. నిశాంతి, జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, ఎన్నికల నిర్వహణకు సంబంధించి పలు కీలక సూచనలు చేశారు. అర్బన్ లోకల్ బాడీస్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండు దశల్లో జరుగుతాయని అధికారులు తెలిపారు. అర్బన్ లోకల్ బాడీస్ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత 15 రోజుల్లో పోలింగ్ నిర్వహించి, 18వ రోజున ఫలితాలు ప్రకటిస్తారని కలెక్టర్ వెల్లడించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ తర్వాత 16వ రోజున పోలింగ్ జరిపి, 19వ రోజున ఫలితాలను వెల్లడిస్తారని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసిన 14వ రోజున పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఓట్ల లెక్కింపు పూర్తి చేసేలా షెడ్యూల్ ఉంటుందని వివరించారు. ఏర్పాట్లు – ఓటర్ల వర్గీకరణ పోలింగ్ కేంద్రాల గుర్తింపు, సిబ్బంది నియామకం, ఎన్నికల సామాగ్రి సిద్ధం చేయడం, కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన, సిబ్బందికి శిక్షణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఓటర్ల వర్గీకరణ కోసం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లాలోని 11 మండలాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర వర్గాల ఓటర్లను విభజించి, కచ్చితమైన జాబితాలను సిద్ధం చేస్తున్నారు. వెబ్సైట్ మాడ్యూల్ వినియోగం ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం, ప్రతి దశకు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించిన అధికారిక వెబ్సైట్ మాడ్యూల్లో నిర్ణీత సమయంలోగా అప్లోడ్ చేయాలని అధికారులు ఆదేశించారు. పకడ్బందీగా ఏర్పాట్లు: కలెక్టర్ నిశాంతి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ టి. నిశాంతి తెలిపారు. ప్రీ–పోలింగ్ ప్రక్రియ, ఓటర్ల విభజన, కౌంటింగ్ వంటి అంశాలపై ఎన్నికల సంఘం అందించిన సూచనలను అమలు చేస్తామన్నారు. ఎన్నికల నిర్వహణలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, ఎటువంటి లోపాలు లేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు. -
గిరిజనుల సమస్యలు పట్టవా?
● 16 నెలలుగా ఏర్పాటుచేయనిఐటీడీఏ పాలకవర్గ సమావేశం ● తక్షణ నిర్వహించాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డిమాండ్ అరకులోయ టౌన్: కూటమి ప్రభుత్వానికి పాడేరు ఏజెన్సీ ప్రాంత సమస్యలపై శ్రద్ధ లేదని స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆరోపించారు. బుధవారం తన క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా ఇంతవరకు పాడేరు ఐటీడీఏ పాలకవర్గ సమావేశం నిర్వహించలేదని, తక్షణమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధికారులు బదిలీలపై వెళ్తున్నారు తప్ప, గిరిజనుల సమస్యలను పరిష్కరించేవారు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని 11 మండలాల గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, డ్రైనేజీల్లో పూడిక తీయకపోవడం వల్ల చెత్తాచెదారం నిండి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. మారుమూల గ్రామాల్లో సరైన రహదారి సౌకర్యాలు లేక నేటికీ డోలి మోతలు తప్పడం లేదన్నారు. అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవనాలు, సీసీ రోడ్డు నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని కోరారు. గిరిజన ప్రాంత సమస్యలపై చర్చించేందుకు ఐటీడీఏ పాలకవర్గ సమావేశం ఎందుకు ఏర్పాటు చేయడం లేదో రాష్ట్ర ప్రభుత్వం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమాధానం చెప్పాలని నిలదీశారు. సర్పంచ్ల పదవీకాలం ముగిసిన తర్వాత గ్రామ పంచాయతీల్లో నియమించిన ప్రత్యేక అధికారులు కనీసం గ్రామాల్లో పర్యటించకపోవడం దారుణమన్నారు. ఇప్పటికై నా జిల్లా కలెక్టర్ నిశాంతి, ఐటీడీఏ పీవో అభిషేక్ స్పందించి ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రతి 3 నెలలకు ఒకసారి ఐటీడీఏ పాలకవర్గ సమావేశం నిర్వహించాలని ఎమ్మెల్యే మత్స్యలింగం డిమాండ్ చేశారు. -
22 కిలోల గంజాయి పట్టివేత
ముంచంగిపుట్టు: మండలంలోని జోలాపుట్టు పంచాయతీ లబ్బూరు జంక్షన్ వద్ద బుధవారం ఉదయం అక్రమంగా తరలిస్తున్న 22 కిలోల 100 గ్రాముల గంజాయిని పట్టుకున్నట్లు సీఐ లక్ష్మణరావు తెలిపారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు లబ్బూరు జంక్షన్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా ఒడిశా వైపు నుంచి బైక్లపై వస్తున్న వ్యక్తులు పోలీసులను చూసి వాహనాలను వదిలి పారిపోవడానికి ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు చాకచాక్యంగా వ్యవహరించి ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు. వారి బైక్లపై ఉన్న బస్తాలను తనిఖీ చేయగా గంజాయి ఉన్నట్లు గుర్తించారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో తూకం వేయగా 22 కిలోల 100 గ్రాముల గంజాయి ఉన్నట్లు తేలిందని, దీని విలువ సుమారు రూ. 11 లక్షల 5 వేలు ఉంటుందని సీఐ వెల్లడించారు. పట్టుబడిన స్మగ్లర్లు ఒడిశా రాష్ట్రం కొరాపుట్ జిల్లా లమతాపుట్ బ్లాక్కు చెందిన బలరామ్, నీలు, గణపతిగా గుర్తించి అరెస్టు చేశామన్నారు. వారి నుంచి గంజాయితో పాటు రెండు బైక్లు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. పదేపదే నేరాలకు పాల్పడే స్మగ్లర్లపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని సీఐ లక్ష్మణరావు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నాని, స్థానిక పోలీసు సిబ్బంది, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
చింతాలమ్మ ఘాట్లో భారీ ప్రమాదం
● లారీ బ్రేక్ ఫెయిల్ ● అప్రమత్తమైన డ్రైవర్ ● కొండను ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు ● కాసేపటికే ప్రాణాలు వదిలిన వైనం కొయ్యూరు : పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలం జడ్డంగి నుంచి నర్సీపట్నం ఎరువుల లోడుతో వస్తున్న లారీ చింతాలమ్మ ఘాట్ రోడ్డులో బ్రేకులు ఫెయిలై అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో లారీ పక్కనే ఉన్న కొండను బలంగా ఢీకొట్టింది. బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటనలో విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన డ్రైవర్ నలపు కృష్ణ (51) తీవ్రంగా గాయపడి, కొద్దిసేపటికి మృతి చెందారు. చింతాలమ్మ ఘాట్ ఎక్కిన తర్వాత డౌన్లో లారీకి బ్రేకులు పనిచేయలేదు. అయినప్పటికీ డ్రైవర్ కొంత దూరం వరకు లారీని ఎంతో ధైర్యంగా అణచి ఉంచారు. చివరకు నాలుగో మలుపు వద్ద లారీని కొండ వైపుగా మళ్లించి బలంగా ఢీకొట్టారు. ఒకవేళ డ్రైవర్ ఆ సమయంలో కొండను ఢీకొట్టకపోతే, ఎదురుగా వస్తున్న కొయ్యూరు సీఐ శ్రీనివాసరావు, ఎంపీపీ బడుగు రమేష్ వాహనాలను ఢీకొని ఉండేదని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. రక్షించండి అంటూ ఆర్తనాదాలు.. కొండను లారీ ఢీకొట్టిన వెంటనే డ్రైవర్ కృష్ణ క్యాబిన్లో ఇరుక్కుపోయారు. లారీ కొండలో కూరుకుపోవడంతో నన్ను రక్షించండి, ప్రాణాలు కాపాడండి.. అంటూ ఆయన ఆర్తనాదాలు చేశారు. పక్కనే ఉన్న సీఐ వెంటనే స్పందించి డ్రైవర్కు ధైర్యం చెప్పారు. ఏం కాదంటూ చాలాసేపు ఆయనతో మాట్లాడారు. వెంటనే జేసీబీని రప్పించి క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్ను బయటకు తీశారు. రాజేంద్రపాలెం నుంచి వైద్యుడు జగదీష్నాయక్ వచ్చేసరికి డ్రైవర్ కృష్ణ మృతి చెందారు. కాగా, విజయనగరం జిల్లా రాజాం ప్రాంతంలోని వస్త్రపుర కాలనీ కొట్టువలసకు చెందిన క్లీనర్ షేక్ అసీర్ను వైద్యులు పరీక్షించి మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం డ్రైవర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
మునగపాకలో డీఎస్పీ విచారణ
మునగపాక: మేజర్ పంచాయతీ మునగపాకలో బుధవారం పరవాడ డీఎస్పీ మోహనరావు పర్యటించారు. రెండు రోజుల క్రితం స్థానిక పల్లపు వీఽధికి చెందిన పొలిమేర దేవకీ నాగప్పారావు హత్యకు గురైన విషయం తెలిసిందే. కేసు దర్యాప్తులో భాగంగా హతుడి కుటుంబ సభ్యుల నుంచి ఆయన వివరాలు సేకరించారు. నిందితులకు సంబంధించిన సమాచారం సేకరించారు. సాక్షుల విచారణ జరుగుతుందని ఇందుకు సహకరించాలన్నారు. హత్యకు పాల్పడిన వ్యక్తులు అరెస్టు అయ్యారన్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఆయన వెంట ఎస్ఐ పి.ప్రసాదరావు పాల్గొన్నారు. కొట్లాట కేసులో విచారణ.. ఇటీవల మునగపాక బైపాస్ రోడ్డులో కుంచవానిపాలెం గ్రామానికి చెందిన వ్యక్తిపై జరిగిన దాడికి సంబంధించి సాక్షిని డీఎస్పీ మోహనరావు విచారణ చేశారు. కొట్లాటలో ఎవరెవరు పాల్గొన్నారు. ఈ నెల 7వ తేదీన సాయంత్రం ఏం జరిగిందన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. -
స్పేసెస్ డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరం
పాయకరావుపేట: శ్రీ ప్రకాష్ విద్యా సంస్థలు 49 వసంతాలు పూర్తి చేసుకుని 50 వ సంవత్సరంలోకి అడుగిడిన సందర్భంలో 50వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ ప్రకాష్ విద్యాసంస్థల అనుబంధ సంస్థ స్పేసెస్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో పాయకరావుపేట, తుని, అన్నవరం బ్రాంచిల్లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. శ్రీ ప్రకాష్ విద్యాసంస్థల సంయుక్త కార్యదర్శి సిహెచ్.విజయ్ ప్రకాష్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేశారు. విద్యార్థులు సమాజానికి ఉపయోగపడేలా సేవా దృక్ఫథం కలిగి ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. 2004 నుంచి ఇప్పటివరకు సుమారు 3000 యూనిట్ల రక్తాన్ని ఇచ్చి తమ విద్యార్థులు, సిబ్బంది తమ సేవా నిరతిని చాటుకున్నారన్నారు. ఈ శిబిరంలో సుమారు 400 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా 40 సార్లు కంటే ఎక్కువసార్లు రక్తదానం చేసిన పలువురిని జ్ఞాపికలతో సత్కరించారు. కార్యక్రమంలో రోటరీ బ్లడ్ బ్యాంక్, డా. పి.కామరాజు, రెడ్క్రాస్ బ్లడ్ బ్యాంకు డా.పరాసర్, మదర్ బ్లడ్ బ్యాంకు డా.సత్యనారాయణ, వీనస్ బ్లడ్ బ్యాంకు డా.సాల్మన్రాజు, స్పేసెస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.రామకృష్ణారెడ్డి, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థికి ఆర్థిక సాయం
కశింకోట: డ్యూషెన్ మస్క్యూలర్ డిస్ట్రోఫీ సమస్య (కాల క్రమేణా కండరాలు బలహీనపడి క్షిణించిపోయే జన్యుపరమైన వ్యాధుల సమూహం)తో బాధపడుతున్న విద్యార్థికి కశింకోటలోని సెయింట్ జాన్స్ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సిబ్బంది సంయుక్తంగా రూ.3.49 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇదే స్కూల్లో 2వ తరగతి చదువుతున్న పొన్నగంటి ప్రణయ్ సూర్య వైద్య చికిత్సకు మానవతా దృక్ఫథంతో ఆర్థిక సహాయం సమకూర్చి బుధవారం ఆ విద్యార్థి తల్లిదండ్రులకు అందించారు. తన స్కూల్లో చదివినంత కాలం ప్రణయ సూర్యకు ఉచిత విద్య అందిస్తామని పాఠశాల యాజ మాన్యం ప్రకటించింది. -
22న సీఎం చంద్రబాబు పర్యటన
● ఏర్పాట్లపై సమీక్షించిన జేసీ తిరుమణి శ్రీపూజ పాడేరు: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 22న జిల్లాలో పర్యటించనున్నారని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ తెలిపారు. ఈనెల 22న అరకువేలీ మండలం గన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్సీ) ఆయన సందర్శించి, సంజీవని పైలట్ ప్రాజెక్టును ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లో అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత బలోపేతం చేయడానికి, ప్రజలకు మెరుగైన నాణ్యమైన వైద్యం అందించే ఉద్దేశంతోనే ఈ సంజీవని ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు జేసీ తెలిపారు. సీఎం పర్యటనకు సంబంధించి నిర్దేశిత ప్రొటోకాల్ ప్రకారం ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా గన్నెల పీహెచ్సీని పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని, సంబంధిత శాఖల అధికారులు అక్కడికి వెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచించారు. -
స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యం
చింతపల్లి: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి పంచాయతీలో వైఎస్సార్సీపీ జెండా ఎగరాలని ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. చింతపల్లి మండల పార్టీ అధ్యక్షుడు పాంగి గణబాబు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పేర్లు మార్చి, ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని మండిపడ్డారు. కావున గ్రామ కమిటీ సభ్యులు ప్రతి గడపకూ వెళ్లి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, మోసాలను ప్రజలకు వివరించి వారి మద్దతును కూడగట్టాలని సూచించారు. గత ఎన్నికల్లో ఏ విధంగానైతే విజయాలు సాధించుకున్నామో, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కార్యకర్తలు మరింత కష్టపడి ప్రతి పంచాయతీని కై వసం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని, కేవలం గెలుపే లక్ష్యంగా అందరూ ఐక్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఎంపీపీ కోరభు అనూషదేవి, జడ్పీటీసీ పోతురాజు బాలయ్య, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి జల్లి సుధాకర్, పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి భూసారి కృష్ణరావు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గుబ్బడి శేఖర్, వైస్ ఎంపీపీలు గోపీనాయక శారద, సాగిన వెంగళరావు, సీనియర్ నాయకులు సాగిన గంగన్న పడాల్, మోరీ రవి, జిల్లా యువజన కార్యదర్శి వేములపూడి పరమేష్తో పాటు వివిధ పంచాయతీల ఎంపీటీసీలు, సర్పంచ్లు, అనుబంధ విభాగాల నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీజిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరాజు -
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గిరిజన గ్రామాల అభివృద్ధిని విస్మరిస్తోందని పలు గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా మౌలిక సదుపాయాల కల్పనలో మొదటి స్థానంలో ఉందని, నీతి ఆయోగ్ ర్యాంకింగుల్లో దేశంలోనే ప్రథమ స్థానం దక్కిందని
సాహస ప్రయాణంసీలేరు: గూడెంకొత్తవీధి మండలం గాలికొండ పంచాయతీ పరిధిలోని బత్తునూరు గ్రామం వద్ద వాగు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ వాగును దాటి గూడెంకొత్తవీధి మండల సరిహద్దు అటవీ ప్రాంతం మీదుగా కొయ్యూరు మండలానికి వెళ్లే పదుల సంఖ్యలో గ్రామాలు ఉన్నాయి. వర్షాకాలంలో అత్యవసర సమయాల్లో ఈ మార్గంలో ప్రయాణించడానికి గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నడివిడి వద్ద అసంపూర్తిగా.. మండలంలోని దారకొండ పంచాయతీ నడివిడి గ్రామం మధ్యలో పెద్ద వాగు ఉంది. వర్షాకాలంలో గర్భిణులు, అనారోగ్యంతో ఉన్న రోగులు ఈ వాగు దాటాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు రావలసి వస్తోంది. ఈ వంతెన నిర్మాణం ఏడాదిగా టెండర్ దశలోనే నిలిచిపోయిందని ఆ ప్రాంత గిరిజనులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. పిల్లి గెడ్డ వంతెన సమస్య తెలంగాణ రాష్ట్రం నుంచి సీలేరు మీదుగా ఒడిశా వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న పిల్లి గెడ్డ వంతెన నిర్మాణం రెండేళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఈ వంతెనపై రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గత ప్రభుత్వ హయాంలో వంతెన నిర్మించినప్పటికీ, అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి 50 లక్షల రూపాయలు అవసరమని సంబంధిత అధికారులు ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి నివేదికలు పంపినా స్పందన కరవైంది. కొట్టుకుపోయిన చిన్న గంగవరం వంతెన దారకొండ నుంచి ఒడిశా వెళ్లే మార్గంలో ఉన్న చిన్న గంగవరం వంతెన ఏడాదిన్నర కిందట వర్షాలకు పూర్తిగా కొట్టుకుపోయింది. ఆ వంతెనను నిర్మించాలని ఆ ప్రాంత గిరిజనులు అనేకసార్లు ధర్నాలు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. ఫలితంగా వర్షాకాలంలో ఈ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి.ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి తక్షణమే నిధులు మంజూరు చేసి, గిరిజనులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నారు.మాదిగ మల్లువంతెన దుస్థితి మాదిగ మల్లువంతెన దుస్థితి పొంగుతున్న వాగులు.. వంతెనలు లేక అవస్థలు ఏడాదిగా నిలిచిన నడివిడి బ్రిడ్జి నిర్మాణం బురదమయంగా అప్రోచ్ రోడ్లు కలెక్టర్ ప్రకటనకు భిన్నంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు నీతి ఆయోగ్ ర్యాక్సింగ్లో ప్రథమస్థానం అని చెబుతున్నా కరువైన మౌలిక వసతులు దారకొండ పంచాయతీ నుంచి అడవి మార్గం ద్వారా పోలవరం జిల్లాకు వెళ్లే దారిలో ఉన్న మాదిగ మల్లు వంతెన పరిస్థితి కూడా ఇలాగే ఉంది. వర్షాల కారణంగా వంతెనకు రెండువైపులా రోడ్డు వేసినా, దానిపై తారు రోడ్డు వేయకపోవడంతో పూర్తిగా గోతులు పడి బురదగా మారి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. -
దారాలమ్మ సన్నిధిలో ‘దీరధాత్రి’
సినిమాకు ముహూర్తపు షాట్సీలేరు: ప్రాచీన ప్రాముఖ్యత కలిగిన దారకొండలో కొలువైన శ్రీ దారాలమ్మ తల్లి సన్నిధిలో నూతన తెలుగు చిత్రం ‘ధీరధాత్రి’ ముహూర్తపు తొలి షాట్ను బుధవారం ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, వేద మంత్రోచ్ఛారణల నడుమ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా చిత్రబృందం అమ్మవారి దివ్య ఆశీస్సులు అందుకుంది. ఈ సందర్భంగా నిర్మాత విజయ్ కంభంపాటి మాట్లాడుతూ... దారాలమ్మ తల్లి సన్నిధిలో ‘ధీరధాత్రి’ చిత్రాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి గూడెంకొత్తవీధి, చింతపల్లి పరిసర ప్రాంతాల్లోని ప్రకృతి రమణీయ ప్రదేశాల్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, శరవేగంగా కొనసాగిస్తామని తెలిపారు. కథాబలంతో పాటు నటీనటుల ప్రతిభకు ప్రాధాన్యం ఇస్తూ ఈ చిత్రాన్ని వినూత్న శైలిలో తెరకెక్కిస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. పవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వంశీ కథానాయకుడిగా, మామిత కథానాయికగా నటిస్తున్నారు. మన్యం అందాలను, కథలోని కీలక సన్నివేశాలను అద్భుతమైన దృశ్యాలతో ఆవిష్కరించేందుకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కిరణ్ పనిచేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని ప్రకృతి సౌందర్యం, మన్యం నేపథ్యం, నటీనటుల ప్రతిభ, అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణుల సహకారంతో ‘ధీరధాత్రి’ చిత్రాన్ని ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిస్తున్నామని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది. -
ఎట్టకేలకు కోడాపల్లికి ప్రత్యేక రేషన్ స్టాక్ పాయింట్
దేవరాపల్లి: మండలంలోని వాలాబు పంచాయతీ శివారు కోడాపల్లికి ఎట్టకేలకు అధికారులు ప్రత్యేక రేషన్ స్టాక్ పాయింట్ను మంజూరు చేశారు. నెల నెలా రేషన్ కష్టాలకు విముక్తి కల్పించాలని కోరుతూ ఇటీవల కోడాపల్లి, రామన్నపాలెం, పూలగరువు, ఇప్పగరువు, బుచ్చెంపాలెం గ్రామాల గిరిజనులు ప్లకార్డులు చేతపట్టి నిరసనకు దిగారు. గత ప్రభుత్వ హయాంలో తమ గ్రామాలలో ఇంటింటికి రేషన్ సరఫరా చేసే వారని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ప్రక్రియను నిలిపివేశారని ఆందోళనకు దిగారు. ఐదు గ్రామాల గిరిజనులు నాలుగు నుంచి ఆరు కిమీ మేర కాలిన నడకన వెళ్లి రోజంతా పనులు మానుకొని రేషన్ తెచ్చుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి ఆందోళనతో అధికారులు దిగి వచ్చారు. శివారు ఐదు గ్రామాలకు కలిపి కోడాపల్లిలో రేషన్ స్టాక్ పాయింట్ ఏర్పాటు చేస్తూ బుధవారం ఆర్డీవో ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్థానిక గిరిజనులు మంజూరు పత్రాన్ని పట్టుకొని హర్షం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి స్టాక్ పాయింట్ ద్వారా రేషన్ పంపిణీ చేయనున్నట్టు మంజూరు పత్రంలో పేర్కొన్నారు. అధికారులు స్పందించి రేషన్ స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయడం పట్ల స్థానిక గిరిజనులు, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బి.టి.దొర కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తామర్ల శంకరరావు, సిహెచ్బి.లక్ష్మి, సిహెచ్. లక్ష్మణ, సిహెచ్.చినదేముడు, కె.రామస్వామి, సిహెచ్.ఎరకయ్య మహిళలు పాల్గొన్నారు. -
చోరీ కేసును ఛేదించిన పోలీసులు
డుంబ్రిగుడ: అరకు గ్రామంలో ఈనెల 12న జరిగిన చోరీ కేసును స్థానిక పోలీసులు విజయవంతంగా ఛేదించారు. స్థానిక అరకులోయ సీఐ కోటేశ్వరరావు విలేకరుల సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. షావుకారి బాలకృష్ణ అనారోగ్యంతో మృతి చెందడంతో, కుటుంబ యాజమాని లేకపోవడంతో బాధిత కుటుంబీకులు అత్తింటి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో రాత్రి గుర్తుతెలియని దుండగులు కిటికీలు పగులగొట్టి గదిలోకి చొరబడి, బీరువాలోని వస్తువులను చిందరవందర చేసి పక్కనే ఉన్న లాకర్ను ఎత్తుకెళ్లారు. బాధితుడి తండ్రి షావుకారి దాసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్ఐ సురేష్ నేతృత్వంలో క్లూస్ టీమ్తో పాటు డాగ్ స్క్వాడ్ను రప్పించి ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ముద్దాయిల ఆనవాళ్లను సేకరించారు. చుట్టుపక్కల ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీలతో పాటు కాల్ డేటాను విశ్లేషించి ఇద్దరు వ్యక్తులు ఈ చోరీకి పాల్పడినట్లు నిర్ధారించి గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుల గాలింపు చర్యల్లో భాగంగా ఈనెల 18న బొందుగుడ జంక్షన్లో సాయంత్రం ఆరు గంటల సమయంలో అందిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి వెళ్లగా.. పోలీసులను చూసి పారిపోతున్న అరకు గ్రామానికి చెందిన అడకట్ల శరత్కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించగా దొంగతనం చేసినట్లు రుజువైందని సీఐ తెలిపారు. అతని నుంచి 8.25 తులాల బంగారం, 919 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ చోరీ సొత్తు విలువ సుమారు రూ. 10 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు ఉమాశంకర్ పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతడిని పట్టుకుని లాకర్తో పాటు మిగతా నగదును కూడా స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. గిరిజనులు, పర్యాటకులు ఎవరైనా సరే చోరీల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఐ సూచించారు. ఈ సమావేశంలో డుంబ్రిగుడ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. నిందితుడి అరెస్టు 8.25 తులాల బంగారం,919 గ్రాముల వెండి స్వాధీనం వివరాలు వెల్లడించినఅరకు సీఐ కోటేశ్వరరావు -
లక్ష్యసాధనకు నిరంతర కృషి
● చింతపల్లి డీఎస్పీ తిరుపతిరావు గూడెంకొత్తవీధి: విద్యార్థులు జీవితంలో ఒక లక్ష్యాన్ని పెట్టుకుని, దానిని సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని చింతపల్లి డీఎస్పీ సీహెచ్ తిరుపతిరావు సూచించారు. జీవితంలో పైకి రావాలంటే విధిగా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని ఆయన స్పష్టం చేశారు. బుధవారం గూడెం ఏకలవ్య పాఠశాలలో విద్యార్థులకు కెరీర్ గైడెన్స్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చదువుతోనే సమాజంలో మార్పు వస్తుందని, ప్రస్తుతం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరేందుకు సరైన ప్రణాళికను తయారు చేసుకుని దాని కోసం శ్రమించాలన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. మత్తుకు అలవాటు పడితే జీవితాలు నాశనమై, భవిష్యత్ అంధకారంలోకి వెళ్తుందని హెచ్చరించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై కూడా దృష్టి సారిస్తే ఉజ్వల భవిషత్ ఉంటుందన్నారు. ఇటీవల కాలంలో పెరిగిపోతున్న సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరికీ కూడా ఓటీపీలు చెప్పకూడదని తెలిపారు. అలాగే పోక్సో చట్టంపై అవగాహన కల్పించిన ఆయన, మహిళలను ఎప్పుడూ గౌరవించాలని కోరారు. మహిళలను వేధిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐ సుధాకర్, ఎస్ఐ సురేష్, ఏకలవ్య పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
చింతామణి గణపతి దత్త క్షేత్రంలో సస్య గణపతి
అనకాపల్లి: పర్యావరణ పరిక్షణను కాపాడుతూ ఈ ఏడాది గణపతి నవరాత్ర ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చింతామణి గణపతి దత్త క్షేత్రం స్థలదాత సి.వి.రమారావు అన్నారు. జీవీఎంసీ విలీన గ్రామమైన సిరసపల్లి చింతామణి గణపతి దత్తక్షేత్రంలో గణపతి నవరాత్రులను పురస్కరించుకుని దేవి శ్రీదేవి ఎంటర్ప్రైజెస్ సహకారంతో సజీవ మొక్కలతో రూపొందించిన 20 అడుగుల ‘సస్య గణపతి’ బ్రోచర్ను, సస్య గణపతి నమూనాను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమారావు, దత్త క్షేత్రం నిర్వాహకులు ఆంజనేయరాజు విలేకరులతో మాట్లాడుతూ సెప్టెంబర్ 14 నుంచి గణపతి నవరాత్రులను పురస్కరించుకుని సస్య గణపతిని ఏర్పాటు చేయడం జరుగుతుందని, గణపతి తయారీకి 2 టన్నుల ఇనుమును ఉపయోగించడం జరిగిందని తెలిపారు. సుమారుగా 16 నుంచి 80 వేల మొక్కలతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రూపొందిస్తున్నామని, దీనికి రూ.50 లక్షల వరకూ ఖర్చు అవుతుందన్నారు. సస్య గణపతిని దత్త క్షేత్ర ఆవరణలో 21 రోజులు భక్తుల దర్శనార్ధం ఉంచడం జరుగుతుందన్నారు. గణపతికి ఉపయోగించే మొక్కలను పూణే నుంచి దత్త క్షేత్రానికి తీసుకురావడం జరుగుతుందన్నారు. ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సెప్టెంబర్ 13న భక్తులకు (వినాయక చవితి పురస్కరించుకుని) ఉచితంగా 21 రకాల పత్రులు, గణపతి విగ్రహం, వ్రతకల్పం పుస్తకం అందజేస్తామని, దీనికి ముందుగా ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. దేవి శ్రీదేవి ఎంటర్ప్రైజెస్ ప్రతినిధులు సుధాకర్, విజయకుమార్ మాట్లాడుతూ సెప్టెంబర్ 14న ఒడిశా గవర్నర్ హరిబాబు విచ్చేస్తారని తెలిపారు. జలధారలు, ప్రకృతి సోయగాలు, దివ్యకాంతుల నడుమ వెలసిన సస్య హరిత గణపతిని దర్శించుకోవడం పర్యావరణ ప్రేమికులకు మంచి అనుభూతి ఇస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సన్యాసిరావు, టీడీపీ నాయకుడు నీలబాబు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
భార్యతో వివాదం..భర్త ఆత్మహత్య
కోటవురట్ల: భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్థాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ విజయ్కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రామచంద్రపురం గ్రామానికి చెందిన పొలుమూరి ఈశ్వరరావు(36) కార్పెంటర్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతని భార్య నూకరత్నం బ్రాండిక్స్ కంపెనీలో పనిచేస్తుండగా ఆమైపె అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకోవడంతో నాలుగు రోజుల క్రితం భార్య అలిగి తన పుట్టింటికి ఎస్.రాయవరం మండలం ధర్మవరం వెళ్లిపోయింది. భార్యను తిరిగి ఇంటికి రమ్మని ఈశ్వరరావు పదే పదే ఫోన్ చేసినప్పటికీ రాకపోవడంతో తీవ్ర మనస్థాపం చెంది మంగళవారం రాత్రి ఇంట్లో ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన గ్రామస్తులు అతని భార్యకు ఫోన్ చేసి చెప్పగా రాత్రి 9 గంటల సమయంలో ఇంటికి వచ్చి చూసేసరికి ఈశ్వరరావు విగతజీవిగా కనిపించాడు. ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతుడు ఈశ్వరరావు -
రాజేశ్వరి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి
రోలుగుంట: లోసింగిలో గర్భిణి పాంగి రాజేశ్వరి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని గిరిజనులు సీపీఎం జిల్లా కార్యవర్గం సభ్యుడు గోవింద ఆధ్వర్యంలో బుధవారం లోసింగిలో ధర్నా చేశారు. కలెక్టర్ విజయకృష్ణన్. ఎమ్మెల్యే గతంలో ఇచ్చిన హమీలు నిలబెట్టుకోవాలని నినాదాలు చేశారు. ఆశా కార్యకర్తను ఏర్పాటు చేయాలని, 320 మంది జనాభా ఉన్న ఈ గ్రామాలకు అంగన్వాడీ పోస్టు మంజూరు చేయాలని, అద్వానంగా ఉన్న రహదారి సమస్య మెరుగుపరచాలని కోరుతూ పలు దఫాలు ధర్నా చేయడం జరిగందన్నారు. దీనిపై స్పందించిన కలెక్టర్, చోడవరం ఎమ్మెల్యే రాజు కొండ ఎగువన ఉన్న ఈ గ్రామాలను సందర్శించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే సమస్యలు అలాగే ఉన్నాయని, మాతృ, శిశు మరణాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. -
గర్భిణి మృతిపై విచారణ
రోలుగుంట: బుచ్చింపేట పీహెచ్సీ పరిధిలో గల లోసింగి గ్రామానికి చెందిన గర్భిణి పాంగి రాజేశ్వరి (24) తన ఇంటి వద్దనే మృతి చెందింది. ఈ సమాచారంతో బుధవారం డీఎంహెచ్వో ఆర్. అచ్యుతాకుమారి, డిప్యుటీ డీఎంహెచ్వో చంద్రశేఖర్ వచ్చి విచారణ చేపట్టారు. ఆరు నెలల గర్భవతి రాజేశ్వరి మంగళవారం సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో బహిర్భూమికి వెళ్లినపుడు తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో కుటుంబీకులు బుచ్చింపేట పీహెచ్సీకి తరలించగా వైద్యాధికారి శివప్రసాద్ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం ఏరియా అసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అయితే వారు ఆమెను గ్రామానికి తీసుకెళ్లారు. అవసరమైనవి సమకూర్చుకొని తిరిగి ఏరియా ఆసుపత్రికి తరలించే సమయానికి ఆమె గ్రామంలోనే మృతి చెందింది. దీనిపై సమాచారంతో డీఎంఅండ్హెచ్వో వచ్చి మృతురాలి కుటుంబీకులను ఓదార్చారు. జరిగిన విషయాలపై ఆరా తీశారు. గ్రామానికి ఆశా కార్యకర్త లేదని, రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, ఈ రోడ్డు మార్గంలో కొండపై నుంచి దిగువకు పీహెచ్సీకి తీసుకురావడానికి ఎన్నో ఇక్కట్లు పడ్డామని తెలిపారు. కాగా ఈ సందర్భంగా బుచ్చింపేట పీహెచ్సీని డీఎంహెచ్వో అచ్యుతాకుమారి, డిప్యూటీ డీఎంహెచ్వో చంద్రశేఖర్ బుధవారం విడివిడిగా అకస్మికంగా తనిఖీ చేశారు. డెలివరీలు ఎలా జరగుతున్నాయి..నెలకెన్ని జరుగుతున్నాయో సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మాతృ మరణాలు జరగకుండా పాటించాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి సూచనలు జారీ చేశారు. -
శివారు ఆయకట్టుకు నీరందదేం?
నాతవరం: వరుణు దేవుడు కరుణించక తాండవ రిజర్వాయరు నుంచి నీటిని విడుదల చేసి వారం రోజులు గడిచినా శివారు ఆయకట్టుకు నీరు ప్రవహించలేదు. తాండవ రిజర్వాయరు పరిధిలో అధిక శాతం రైతులు వరినారును కాపాడుకునే పరిస్ధితిలో ఉన్నారు. గతంలో తాండవ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసిన వారం రోజుల వ్యవధిలో శివారు ఆయకట్టుకు నీరు ప్రవహించేది. ఈ ఏడాది వరుణుదేవుడు కన్నెర్ర చేయడంతో ఖరీఫ్ సాగుపై నీలినీడలు కమ్ముకున్నాయి. తాండవ రిజర్వాయరు నీరు అధారంగా ప్రతి ఏటా ఖరీఫ్లో కాకినాడ, అనకాపల్లి జిల్లాల పరిధిలో 52 వేల ఎకరాలు వరి పంట సాగు చేస్తుంటారు. ఈనెల 11న తాండవ నుంచి కాలువలోకి నీరు విడుదల చేశారు. అయితే వారం దాటుతున్నా శివారు ఆయకట్టు భూములకు చుక్కనీరు కూడా అందలేదు. కాలువ ద్వారా రోజుకు 750 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నా కోటవురట్ల, నర్సీపటం, కోటనందూరు, రవతలపూడి మండలాల పరిధిలో నేటికీ శివారు ఆయకట్టుకు నీరు ప్రవహించలేదు. ఈ ప్రాంతంలో రైతులు వ్యవసాయ బోర్లు లేదా గెడ్డలో మోటార్ల సాయంలో వరినారు ఎండిపోకుండా బతికించుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకూ 300 హెక్టార్లలోనే... నాతవరం మండలంలో ఖరీఫ్ సాగు లక్ష్యం 6,297 హెక్టార్లు కాగా మంగళవారం సాయంత్రానికి కేవలం 300 హెక్టార్లు మాత్రమే రైతులు వరినారులు వేనినట్లుగా వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలోనే ఖరీఫ్ సీజన్లో వరి పంట నాతవరం మండలంలోనే అధికంగా సాగు చేస్తుంటారు. ఈ ఏడాది ఖరీఫ్ సమయం సమీపిస్తున్న వరినాట్లు మందకొడిగా వేస్తున్నారు. గతంలో ఈ సమయానికి తాండవ ఆయకట్టు పరిధిలో వరినాట్లతో పచ్చగా కన్పించే పంట పొలాలు బీడు భూములుగా దర్శనమిస్తున్నాయి. తాండవ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేసినా ఎండ తీవ్రత కారణంగా నీరు ప్రవహించక రైతుల మధ్య తగాదాలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా ఈ ఏడాది ఖరీ్్ఫ్లో వరి పంట సాగుపై సందిగ్ధత నెలకొంది. నేటికి కేవలం 300 హెక్టార్లలో మాత్రమే వరినాట్లు పడడం పట్ల వ్యవసాయశాఖాధికారి సుగుణ ఆందోళన వ్యక్తం చేశారు. కాలువలు నిండుగా నీరు విడుదల చేస్తున్నందున తాండవ ప్రాజెక్టులో నీటి మట్టం గణనీయంగా తగ్టిపోతుందని ప్రాజెక్టు డీఈఈ అనురాద తెలిపారు. అయితే కాలువ కింద ఇంకా శివారు ఆయకట్టుకు నీరు అందలేదు. -
నిత్య సాధనతోనే గాయకులుగా రాణింపు
సినీ నేపథ్య గాయని ఎస్పీ శైలజ ముగిసిన శ్రీప్రకాష్ వ్యవస్థాపక వేడుకలు పాయకరావుపేట: నిత్య సాధనతోనే భవిష్యత్లో మంచి గాయకులుగా ఎవరైనా రాణించగలరని ప్రముఖ సినీ నేపథ్య గాయని ఎస్పీ శైలజ అన్నారు. శ్రీప్రకాష్ విద్యా సంస్థలు 49 వసంతాలను విజయవంతంగా పూర్తి చేసుకుని, స్వర్ణోత్సవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా నిర్వహించిన 50వ వ్యవస్థాపక వేడుకలు బుధవారం ఘనంగా ముగిశాయి. ఈ వేడుకల్లో భాగంగా రెండు రోజుల పాటు తుని, పాయకరావుపేట, అన్నవరం, పెద్దాపురం, కాకినాడ, రాజమహేంద్రపురం తదితర ప్రాంతాల శ్రీ ప్రకాష్ విద్యాసంస్థల విద్యార్థుల మధ్య ‘గాతా రహే మేరా దిల్’పేరుతో పాటల పోటీలు నిర్వహించారు. ఆరో తరగతి నుంచి డిగ్రీ స్థాయి వరకు జూనియర్, సీనియర్ విభాగాలుగా ఈ పోటీలు నిర్వహించగా, విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్పీ శైలజ న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యతో పాటు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమన్నారు. నిరంతర సాధనతో విద్యార్థులు భవిష్యత్తులో మంచి గాయకులుగా ఎదగగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ఆమె తన పాటలతో ఆహూతులను అలరించారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల అధినేత సిహెచ్.వి.కె.నరసింహారావు మాట్లాడుతూ స్వయం ఉపాధి ద్వారా స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో విద్యను అభ్యసించాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం శైలజను జ్ఞాపికతో సత్కరించారు. పోటీల్లో విజేతలకు శైలజతో పాటు విద్యాసంస్థల సంయుక్త కార్యదర్శి సిహెచ్.విజయ్ ప్రకాష్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు డా.నరేంద్రబాబు, కోశాధికారిణి సిహెచ్.రామసీత, సభ్యులు సబ్బవరపు సూర్యనారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
హిందూ ధర్మ రక్షణకు కృషి
● విశ్వహిందూ మహాసంఘ జిల్లా సాంస్కృతిక విభాగం ఉపాధ్యక్షుడు చెల్లయ్యనాయుడు మునగపాక : మండలంలోని మూలపేటకు చెందిన బొడ్డేడ చెల్లయ్యనాయుడు విశ్వహిందూ మహాసంఘ భారత్ జిల్లా సాంస్కృతిక విభాగం ఉపాధ్యక్షునిగా నియమితులయ్యారు. ఈ మేరకు విశ్వహిందూ మహా సంఘ భారత్ అధ్యక్షుడు శ్రీ లంకా గణేష్ నుంచి ఉత్తర్వులు అందాయి. చెల్లయ్యనాయుడు మాట్లాడుతూ తనకు అవకాశం కల్పించిన రాష్ట్ర గోసంరక్షణ అధ్యక్షుడు యాసపు శ్రీనుతో పాటు ఇతర పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు పాటుపడతానని పేర్కొన్నారు. -
పంచాయతీ ఎన్నికలకు పక్కాగా ఏర్పాట్లు
పాడేరు: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రాథమిక ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని లెక్టర్ టి. నిశాంతి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మంగళవారం కలెక్టరేట్లో డీపీఓ, డీఎల్పీవో, ఆర్డీవో, ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలతో ఆమె సమీక్షా నిర్వహించారు. జిల్లాలోని 244 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ కేంద్రాల గుర్తింపు, మౌలిక సదుపాయాల కల్పన, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు తదితర అంశాలపై ఆమె మాట్లాడారు. ప్రతి మండలంలోనూ ఎంపీడీవోలు పోలింగ్ కేంద్రాలను క్షుణ్ణంగా పరిశీలించి తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, ఫర్నిచర్ వంటి కనీస సౌకర్యాలు ఉండేలా చూడాలన్నారు. దివ్యాంగుల సౌకర్యార్థం ర్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం అన్ని గ్రామ పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ఈనెల 18 నుంచి ప్రారంభించాలని సూచించారు. ఈనెల 25న ఓటర్ల ముసాయిదా జాబితా ప్రచురణ. అనంతరం అభ్యర్థనలు, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం అనంతరం గ్రామసభల్లో ఆమోదించాలని సూచించారు. వచ్చేనెల 7న అన్ని గ్రామ పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల తుది జాబితా ప్రచురించాలని ఆదేశించారు.ఈ సమావేశంలో డీపీవో చంద్రశేఖర్, డీఎల్పీవో కుమార్, ఇన్చార్జి డీఆర్వో లోకేశ్వరరావు, ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు పాల్గొన్నారు. -
భూ నిర్వాసితులకు పరిశ్రమల్లో ఉపాధి కల్పించాలి
పరవాడ: జేఎన్ ఫార్మాసిటీలో పరిశ్రమల ఏర్పాటుకు భూములు ఇచ్చిన నిర్వాసితులకు పరిశ్రమల్లో తగురీతిలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు యాజమాన్యాలు చర్యలు చేపట్టాలని వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు, గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల శ్రీనివాస దేవన్రెడ్డిలు డిమాండ్ చేశారు. వారు ఫార్మాసిటీలోని అరాజెన్ పరిశ్రమను మంగళవారం సందర్శించి యాజమాన్యంతో చర్చలు జరిపారు. నిర్వాసితుల ఉపాధిపై వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటులో సర్వస్వం కోల్పోయిన లంకెలపాలెం దరి లేమర్తి భూ నిర్వాసితులకు పరిశ్రమల్లో ఉపాది అవకాశాలు దక్కలేదని ఆరోపించారు. 2005లో ఫార్మాసిటీ పరిశ్రమల ఏర్పాటు సమయంలో నిర్వాసితులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై ఇచ్చిన హామీ అమలు కాకపోవడం విచారకరమన్నారు. అనేక పరిశ్రమల యాజమాన్యాలు కాంట్రాక్టు పద్ధతిలో తీసుకున్న కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించకపోవడం, ఉద్యోగ భద్రత కల్పించకపోవడం అన్యాయమన్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా పర్మినెంట్ చేయకపోవడంతో కార్మిక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మాసిటీ నిర్వాసితులకు సరైన రీతిలో న్యాయం చేసేలా యాజమాన్యాలు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పాతపాటి ఆర్ఎస్వీ ప్రసాద్రాజు, అనకాపల్లి జిల్లా వైఎస్సార్సీపీ ఉపాధ్యక్షుడు, పరవాడ జెడ్పీటీసీ పైల సన్యాసిరాజు, పరవాడ మండల పార్టీ అధ్యక్షుడు కోన రామారావు, మండల వైస్ ఎంపీపీ బందం నాగేశ్వరరావు, పార్టీ నాయకులు నక్కా రమణబాబు, పూర్ణానందశర్మ, బోరా సోమునాయుడు, ఇళ్లపు వాసు, జీలకర్ర నాగేంద్ర, గొందేసి శ్రీనివాస్ రెడ్డి, గొడబా మనోజ్, పైడిరాజు, ఎర్ని రమణ, బిమ్మిటి శ్రీనివాస్, చొప్ప వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
ఒకే పోలింగ్ బూత్లో కుటుంబ సభ్యుల ఓట్లు
సీపీఎం నాయకుల వినతితుమ్మపాల: ఒకే కుటుంబానికి చెందిన ఓట్లు వేర్వేరు పోలింగ్ బూత్ల్లో ఉండడం వల్ల ఓటర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సర్ ప్రక్రియలో భాగంగా ఒకే పోలింగ్ బూత్లో నమోదు చేయాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు వి.వి.శ్రీనివాసరావు, అల్లు రాజు కోరారు. మంగళవారం కలెక్టరేట్లో డీఆర్వో వై. సత్యనారాయణరావును కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిదండ్రులు, పిల్లలు ఒకే చిరునామాలో నివసిస్తున్నప్పటికీ వేర్వేరు బూత్లకు ఓట్లు కేటాయించడం సరికాదన్నారు. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కుటుంబ సభ్యులందరూ కలిసి వెళ్లి ఒకే పోలింగ్ బూత్లో ఓటు వేసుకునేలా అవకాశం కల్పించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగానే తుది జాబితా ప్రచురించేలోపే ఓటర్ల జాబితాలను పరిశీలించి, ఒకే ఇంటి చిరునామాలో నివసిస్తున్న కుటుంబ సభ్యుల ఓట్లను ఎన్నికల నిబంధనలు, పోలింగ్ కేంద్రాల పరిధికి లోబడి ఒకే పోలింగ్ బూత్లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. బూత్ స్థాయి అధికారులు, ఎన్నికల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన సవరణలు చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. -
చాపరాయి అందానికి బ్లాస్టింగ్ బీటలు
డుంబ్రిగుడ: సినిమా తెరపై అందాలను పంచిన ఆ చాపరాయి రాయి.. ఇప్పుడు బ్లాస్టింగ్ శబ్దాలతో దద్దరిల్లుతోంది! ఎన్నో దశాబ్దాలుగా సినీ చిత్రీకరణలకు వేదికగా నిలిచిన చాపరాయి జలపాతం వద్ద వంతెన నిర్మాణం కోసం రాళ్లను బ్లాస్టింగ్ చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. గిరిజనుల రాకపోకల సౌకర్యం కోసం వంతెన అవసరమే అయినా.. అదే సమయంలో చాపరాయి సహజసౌందర్యానికి ఎలాంటి నష్టం కలగకూడదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. హీరోల అడుగులతో.. చరిత్ర మండలంలోని చాపరాయి జలపాతం ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. నాటి ఎన్టీఆర్ నుంచి నేటి తరం సినీ హీరోల వరకు పలువురు అగ్ర నటుల చిత్రాలకు ఈ ప్రాంతం వేదికై ంది. చిరంజీవి నటించిన యముడికి మొగుడు చిత్రంలోని ఫైట్ సన్నివేశాలతో పాటు చాలెంజ్’, హీరో కృష్ణ నటించిన తెలుగు వీర లేవరా.. తదితర చిత్రాల చిత్రీకరణ ఇక్కడ జరిగింది. బాలకృష్ణ పట్టాభిషేకం, లారీ డ్రైవర్, వెంకటేష్ నటించిన చిత్రాలు, మోహన్బాబు మేజర్ చంద్రకాంత్, డిటెక్టివ్ నారద.. రాజేంద్రప్రసాద్ అలీబాబా అరడజను దొంగలు, ఆ ఒక్కటీ అడక్కు, గంగోత్రి తదితర సినిమాలు కూడా చాపరాయి అందాలను తెరపై ఆవిష్కరించాయి. కృష్ణంరాజు, శోభన్బాబు, చంద్రమోహన్, సుమన్, హరీష్ తదితర నటుల సినిమాలకూ ఈ ప్రాంతం వేదికగా నిలిచింది. రాళ్ల మధ్య జాలువారే జలపాతం చాపరాయి ప్రత్యేకత కేవలం సినిమా షూటింగులకే పరిమితం కాదు. సహజసిద్ధమైన రాళ్ల మధ్య నుంచి జాలువారే నీరు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. జలపాతంలో జలకాలాడేందుకు వచ్చే సందర్శకులతో ఈ ప్రాంతం సందడిగా ఉంటుంది. వంతెన కోసం.. బ్లాస్టింగ్ ఇలాంటి ప్రాంతంలో ప్రస్తుతం వంతెన నిర్మాణం కోసం రాళ్లను బ్లాస్టింగ్ చేస్తున్నారు. దీంతో సహజసిద్ధమైన చాపరాయి రూపురేఖలకు నష్టం వాటిల్లుతుందేమోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ● 2025 ఏప్రిల్ 7న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ఈ ప్రాంతంలో పర్యటించిన సమయంలో పెద్దపాడు, కోసంగి తదితర గ్రామాల గిరిజనులు వంతెన నిర్మించాలని వినతిపత్రం అందజేశారు. గిరిజనుల ఇబ్బందులను గుర్తించిన ఆయన వంతెన నిర్మాణానికి హామీ ఇచ్చారు. అక్కడ కాదు.. ప్రమాదకర ప్రాంతంలో’.. చాపరాయి అందాలకు ఇబ్బంది కలగకుండా.. జలపాతం వద్ద కాకుండా పైభాగంలోని ప్రమాదకర ప్రాంతంలో వంతెన నిర్మించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. అంతేకాకుండా పర్యాటకులు చాపరాయి అందాలను వీక్షించేలా వేలాడే వంతెన ఏర్పాటు చేస్తే మరింత ఆకర్షణగా ఉంటుందని సూచించినట్లు పేర్కొంటున్నారు. మారిన ప్రదేశం.. మొదలైన బ్లాస్టింగ్ అయితే ఏడాదిన్నర తర్వాత వంతెన నిర్మాణానికి నిధులు మంజూరవడంతో పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం బ్లాస్టింగ్ జరుగుతున్న ప్రాంతం సమతలంగా ఉండటంతో నిర్మాణ సంస్థకు పనిభారం తగ్గుతుందన్న కారణంతో అక్కడి రాళ్లను తొలగిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వంతెన వస్తే.. పర్యాటకానికి వరమా? శాపమా? వంతెన నిర్మాణం పూర్తయితే గిరిజన గ్రామాల రాకపోకలకు ఎంతో ఉపయోగకరమే. అయితే వంతెనపై నుంచి పర్యాటకులు చాపరాయి ప్రాంతాన్ని వీక్షించే అవకాశం ఉండటంతో సందర్శకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో నియంత్రణ లేకపోతే మద్యం సేవించడం, ప్లాస్టిక్ సీసాలు, ఇతర వ్యర్థాలు పడేయడం వంటి సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని స్థానికులు, పర్యాటక విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి అవసరమే.. కానీ చాపరాయి సహజసౌందర్యం మూల్యం చెల్లించేలా మాత్రం ఉండకూడదు. గిరిజనులకు రాకపోకల సౌకర్యం కల్పిస్తూనే.. జలపాతం సహజత్వాన్ని కాపాడేలా వంతెన నిర్మాణం చేపట్టాలన్న డిమాండ్ వినిపిస్తోంది. వంతెన కాస్త ముందు నిర్మిస్తే మేలు మా గ్రామాలకు వంతెన రావడం ఎంతో సంతోషం. అయితే వంతెన నిర్మాణాన్ని చాపరాయిలో కాకుండా, కొద్దిగా ముందున్న ప్రమాదకరమైన ప్రదేశంలో చేపట్టాలి. ఆ ప్రాంతంలో వంతెన నిర్మిస్తే ప్రమాదాలు తగ్గడంతో పాటు చాపరాయికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ విషయాన్ని అధికారులు దృష్టిలో పెట్టుకుని వంతెన నిర్మాణం చేపట్టాలి. – మఠం శంకర్రావు, వైఎస్సార్సీపీ మండల కార్యదర్శి, కోసంగి, డుంబ్రిగుడ మండలం -
నూరు శాతం రిజర్వేషన్పై బిల్లు పెట్టాలి
డుంబ్రిగుడ: ఆదివాసీలకు నూరు శాతం రిజర్వేషన్ కల్పించేలా అసెంబ్లీలో బిల్లు పెట్టాలని గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలో గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టి. సూర్యనారాయణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలదేవ్ మాట్లాడుతూ.. 1/70 చట్టం పరిరక్షణతో పాటు, జీవో నంబర్ 3కి ప్రత్యామ్నాయ జీవో జారీ చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. హామీని అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే దీనిపై స్పష్టమైన ప్రకటన చేసి బిల్లు ప్రవేశపెట్టాలని కోరారు. జీవో నంబర్ 3 రద్దు కావడం వల్ల గత మెగా డీఎస్సీలో గిరిజన యువత ఉద్యోగాలు కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి రెండు వేల మంది గిరిజనులకు ఉద్యోగాలు వచ్చినట్లు అసెంబ్లీ మీడియా పాయింట్లో ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. దమ్ముంటే ఆ రెండు వేల మంది ఎస్టీ టీచర్ల వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని సవాలు విసిరారు. ఈ సమావేశంలో గిరిజన సంఘం మండల నాయకులు సత్యనారాయణ, సురేశ్కుమార్, లైకాన్, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. -
హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు
మునగపాక : మునగపాకలో జరిగిన హత్యకు సంబంధించి ఇద్దరు నిందితులను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు యలమంచిలి సీఐ ఎస్.ధనుంజయరావు తెలిపారు. కేసు వివరాలను ఆయన స్థానిక ఎస్ఐ ప్రసాదరావుతో కలిసి విలేకరులకు తెలిపారు. రెండు కుటుంబాల మధ్య గతంలో జరిగిన మాటల వివాదం నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తిపై దాడి చేయడంతో మృత్యువాతకు గురయ్యాడన్నారు. మునగపాకలోని పల్లపు వీధికి చెందిన పొలిమేర దేవకీ నాగప్పారావు సెంట్రింగ్ కాంట్రాక్ట్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇదే గ్రామానికి చెందిన దాడి భాస్కరరావు అతని సోదరుడు జగదీష్లతో దేవకికి రెండు రోజుల క్రితం వివాదం చోటు చేసుకుంది. వారి మధ్య మాటల వివాదం చినికి చినికి గాలివానగా మారింది. సోమవారం రాత్రి దేవకి నాగప్పారావు తన మేడపై నిద్రిస్తున్న సమయంలో భాస్కరరావు, జగదీష్లు కలిసి దాడి చేశారు. ఈ సంఘటనలో దేవకీ నాగప్పారావు తీవ్రంగా గాయపడడంతో అతనిని అనకాపల్లి వంద పడకల ఆసుపత్రికి తరలించగా వైద్యులు మృతి చెందినట్టు నిర్ధారించారన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు తెలిపారు. మునగపాకలో విషాద ఛాయలుఎంతో ప్రశాంతంగా ఉండే మునగపాక నాగప్పారావు హత్యతో ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైంది. అందరితో సరదాగా మెలిగే దేవకీ నాగప్పారావు మృత్యువాతకు గురయ్యారన్న సమాచారంతో మునగపాకలో విషాదం నెలకొంది. మృతదేహానికి అనకాపల్లి వందపడకల ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సాయంత్రం జరిగిన అంత్యక్రియలకు మునగపాక గ్రామస్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. కాగా హత్య జరిగిన ప్రాంతాన్ని మంగళవారం ఉదయం యలమంచిలి సీఐ ధనుంజయరావు,ఎస్ఐ ప్రసాదరావుతో పాటు క్లూస్ టీమ్ పరిశీలించి పలు వివరాలు సేకరించారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. రిమాండ్కు తరలింపు -
ప్రమాదవశాత్తూనదిలో పడి యువతి మృతి
పాయకరావుపేట : మండలంలో కుమార పురం గ్రామానికి చెందిన చాపల నందిని (19) గ్రామ సమీపాన గల పంపానదిలో ప్రమాదవశాత్తూ పడి మృతి చెందినట్టు ఎస్ఐ జె.పురుషోత్తం తెలిపారు. మృతురాలు చాపల నందిని ఈ నెల 14 వ తేదీన మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ఇంటి నుండి బయటకు వెళ్లి మరలా ఇంటికి తిరిగి రాలేదు. 15 వ తేదీన తన కుమార్తె కనిపించలేదని తల్లి చేపల బంగారు లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే తన కుమార్తె గ్రామ శివారు పంపానదిలో చనిపోయి ఉందని, మూడు నెలల నుండి టైఫా యిడ్ జ్వరంతో బాధపడుతుందని, పాయకరావుపేటలో చికిత్స పొందేదని, మానసిక అనారోగ్యంతో ఉండేదని, 14న నందిని బహిర్భూమికి వెళ్లి కాలుజారి నదిలో పడిపోయి మృతి చెందిందని ఆమె తల్లి మరలా ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ జె.పురుషోత్తం తెలిపారు. మృతదేహాన్ని నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించడం జరిగిందని తెలిపారు. -
రూ.1.47 లక్షల బిల్లు
అనకాపల్లి జిల్లా మునగపాక మండలం సిరసపల్లి (టి) గ్రామానికి చెందిన రైతు మద్దల వెంకటరావు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ (సర్వీసు నంబర్ 1172682212000366) ఇందుకు ఉదాహరణ. 2023 సెప్టెంబరులో ఆయన 300 యూనిట్ల విద్యుత్ వినియోగించారు. అప్పట్లో వచ్చిన బిల్లు సున్నా. అంటే వ్యవసాయ విద్యుత్ పూర్తిగా ఉచితంగా అందిందన్నమాట. అదే సర్వీసుకు 2026 ఆగస్టులో ఈపీడీసీఎల్ జారీ చేసిన బిల్లులో మాత్రం రూ.1,47,361 బకాయి ఉన్నట్లు పేర్కొంది. సెప్టెంబరు 2లోగా బకాయి చెల్లించాలని, లేకపోతే సెప్టెంబరు 3న విద్యుత్ కనెక్షన్ తొలగిస్తామని నోటీసులో స్పష్టం చేసింది. ఒకప్పుడు సున్నా బిల్లు వచ్చిన అదే వ్యవసాయ కనెక్షన్కు ఇప్పుడు లక్షన్నర రూపాయలకు చేరువలో బకాయి చూపించడంపై రైతు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


