breaking news
Alluri Sitarama Raju
-
కదల్లేని దేహాలు కరగని గుండెలు
ఆ చిన్నారుల నవ్వుల్లో వెలుగు ఉండాలి.. కానీ విధి ఆడిన వింత నాటకంలో వారి జీవితాలు చీకటిమయమయ్యాయి. పుట్టుకతోనే లోకోమోటర్ వైకల్యంతో మంచానికే పరిమితమైన ఆ ఇద్దరు గిరిజన చిన్నారుల కథ ఇది. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి.. 90 శాతం వైకల్యం ఉన్నట్లు వైద్యులే ధ్రువీకరించినా.. రెండేళ్లుగా ప్రభుత్వ పింఛన్ ఆ పసిబిడ్డల దరికి చేరడం లేదు. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం శూన్యం. పర్రెడ పంచాయతీలో వెలుగుచూసిన ఇద్దరి దీనగాథ. వ్యవస్థలోని ఉదాసీనతకు నిలువుటద్దం పడుతోంది. వీరికి కావాల్సింది కేవలం పింఛన్ మాత్రమే కాదు, మానవత్వంతో కూడిన సాయం. పెదబయలు: ఆ చిన్నారులు పుట్టినప్పుడు వారి తల్లిదండ్రులు ఎన్నో కలలు కన్నారు. తమ బిడ్డలు పెరిగి పెద్దయ్యాక తమకు చేదోడు వాదోడుగా ఉంటారని ఆశపడ్డారు. కానీ విధి ఆడిన వింత నాటకంలో ఆ పసి ప్రాణాలు పుట్టుకతోనే వైకల్యంతో పోరాడుతున్నాయి. పెరిగే కొద్దీ ఆరోగ్యం కుదుటపడుతుందని ఆశగా ఎదురుచూస్తున్న ఆ గిరిజన కుటుంబాలకు ఇప్పుడు మిగిలింది కేవలం కన్నీళ్లే. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా.. వారి బాధ పాలక యంత్రాంగానికి వినిపించడం లేదు. సాయం శూన్యం పెదబయలు మండలం పర్రెడ పంచాయతీ నందిమెట్ట గ్రామానికి చెందిన నేరోడి రామారావు, వరలక్ష్మి దంపతుల కుమారుడు నేరోడి ఆకాష్ (8). ఆకాష్ లోకోమోటర్ ఆర్థోపెడిక్ వైకల్యంతో బాధపడుతున్నాడు. ఎముకలు, కండరాలు సహకరించక, నాడీ వ్యవస్థ బలహీనపడటంతో కనీసం అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. 2023లో సదరం సరి్టఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా, వైద్యులు 90 శాతం వైకల్యం ఉందని నిర్ధారించారు. కానీ, ఆ 90 శాతం వైకల్యం సాక్షిగా రెండేళ్లుగా గ్రామ సచివాలయం చుట్టూ తిరుగుతున్నా, ఆకాష్కు వికలాంగ పింఛన్ మాత్రం మంజూరు కాలేదు. వస్తే చెబుతాం.. అనే సిబ్బంది సమాధానం ఆ తల్లిదండ్రుల గుండెలను పిండేస్తోంది. కన్నీరు మున్నీరవుతున్న మరో కుటుంబం అదే గ్రామానికి చెందిన నేరోడి రంజిత్ కుమార్, భవాని దంపతుల కుమారుడు అభిమన్యు (7) పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. అభిమన్యు కూడా పుట్టుకతోనే అదే వ్యాధితో మంచానికే పరిమితమయ్యాడు. ఆశతో విశాఖలోని కేజీహెచ్ ఆసుపత్రికి తీసుకెళ్లిన తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది. బాబుకు రక్తం తక్కువగా ఉందని, ఆపరేషన్ చేయడం వీలుపడదని వైద్యులు డిశ్చార్జ్ చేసేశారు. ప్రభుత్వం నుంచి పింఛన్ రాక, సొంతంగా వైద్యం చేయించే స్థోమత లేక ఆ కుటుంబం బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తోంది. వినబడని ఆర్తనాదం ఈ రెండు గిరిజన కుటుంబాల పరిస్థితి అత్యంత దీనంగా ఉంది. ఒకవైపు అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్న బిడ్డలు, మరోవైపు ఆర్థిక ఇబ్బందులు వారిని కుంగదీస్తున్నాయి. 90 శాతం వైకల్యం ఉన్నా పింఛన్ రాకపోవడం వ్యవస్థలోని లోపాలకు అద్దం పడుతోందని పలువురు విమర్శిస్తున్నారు. మెరుగైన వైద్యం అందిస్తే తమ బిడ్డలు కోలుకుంటారని ఆ తల్లిదండ్రులు నమ్ముతున్నారు, కానీ చేతిలో చిల్లిగవ్వ లేదు. ప్రభుత్వం ఎలాగూ పట్టించుకోవడం లేదని, కనీసం మానవత్వం ఉన్న దాతలైనా ముందుకు వచ్చి తమ బిడ్డల ప్రాణాలు నిలబెట్టాలని వారు వేడుకుంటున్నారు. పర్రెడ పంచాయతీలోని ఈ రెండు కుటుంబాల కన్నీళ్లు తుడవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, ఆ ఇద్దరు చిన్నారులకు తక్షణమే పింఛన్ మంజూరు చేయడమే కాకుండా, వారికి మెరుగైన కార్పొరేట్ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆ గిరిజన గ్రామం కోరుతోంది. కాళ్లరిగేలా తిరుగుతున్నా.. కుమారుడి పింఛను కోసం తల్లి పాట్లు సీలేరు: గూడెం కొత్తవీధి మండలం, సీలేరు పంచాయతీ పార్వతీనగర్కు చెందిన కుర్ర కుమారి అనే గిరిజన మహిళ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఇటీవలే ఆమె భర్త అసురు అనారోగ్యంతో మృతి చెందడంతో, ముగ్గురు పిల్లల పోషణ ఆ తల్లికి భారమైంది. కుమారి పెద్ద కుమారుడు అజయ్ (12) పోలియో కారణంగా రెండు కాళ్లు పడిపోయి నడవలేని స్థితిలో ఉన్నాడు. తన కుమారుడికి వికలాంగుల పెన్షన్ మంజూరు చేయాలని గత రెండేళ్లుగా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ స్పందించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కూలి పనులు చేస్తూ, అడవి నుంచి కట్టెలు తెచ్చి అమ్ముకుంటూ పిల్లలను పోషిస్తున్నారు. ‘పెన్షన్ అందితేనే నా పిల్లలకు కడుపునిండా అన్నం పెట్టగలను‘ అని ఆదివారం విలేకరుల వద్ద ఆమె కన్నీరుమున్నీరయ్యా రు. ఈ నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి, చిన్నారి అజయ్కు పెన్షన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అడుగు పడని సాయం మా పిల్లలు నడవలేరు, కదలలేరు. సచివాలయానికి వెళ్తే రేపు మాపు అంటున్నారు. ప్రభుత్వం కరుణిస్తుందని, ఎవరైనా దాతలు మా బిడ్డలకు వైద్యం చేయిస్తారన్న ఆశ మాత్రమే మిగిలి ఉంది. – బాధిత తల్లిదండ్రుల ఆవేదన -
పశువుల అక్రమ రవాణా పై ప్రభుత్వం స్పందించాలి
నక్కపల్లి: కూటమి పెద్దల ప్రమేయంతోనే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి పశువుల అక్రమ రవాణా జరుగుతోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ ఆరోపించారు. ఆదివారం ఆయన నక్కపల్లిలో విలేకరులతో మాట్లాడారు. పాడి రైతులను, కూలీలను అడ్డం పెట్టుకుని కొంతమంది ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతాల నుంచి పశువులు కొనుగోలు చేసి హైదరాబాద్, కేరళ తదితర ప్రాంతాల్లో ఉన్న గోవధ శాలలకు తరలిస్తున్నారన్నారు. విజయనగరం జిల్లా కొత్తవలస ప్రాంతానికి చెందిన శేఖర్, రాజమండ్రి కత్తిపూడి ప్రాంతానికి చెందిన శ్రీను తదితరులు నక్కపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పాడి రైతులు, కూలీల ఆధార్ కార్డులు సేకరించి పశువులు కొని వారి పేరుతో అక్రమంగా అనుమతులు పొంది కబేళాలకు తరలిస్తూ కోట్లు గడించారన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో పెద్ద నాయకులు, ప్రజా ప్రతినిధులు అండతోనే వీరు పశువులను తరలిస్తున్నారన్నారు. శేఖర్ అనే వ్యక్తి ప్రజా ప్రతినిధులు అధికారులను తన చెప్పు చేతల్లో ఉంచుకుని ఈ దందాలు చేస్తున్నాడని తెలిపారు. పోలీసులు ఇతనికి కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ముఠా పై చర్యలు తీసుకోవాలనికోరారు. పశు అక్రమ రవాణా పై బీజేపీ, జనసేన పార్టీలు నోరు మెదపకపోవడం సిగ్గు చేటన్నారు. ఈ సమావేశంలో పాడి రైతులు దండు బాలరామ రాజు, వేగేసిన చంటి రాజు, సకిరెడ్డి రమణ, సఖిరెడ్డి వెంకటరావు, రైతుకూలీలు రామ్ ప్రసాద్,దేవర నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మండలంలో పలు గ్రామాలకు చెందిన పాడి రైతులు, కూలీలు వీసం రామకృష్ణ ని కలిసి పశు మాఫియా వల్ల తాము ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించి, తమకు అండగా నిలవాలని కోరారు. -
టీచర్ల చలో విజయవాడ రేపు
యూటీఎఫ్ కార్యాలయంలో మాట్లాడుతున్న ప్రధాన కార్యదర్శి అంబేడ్కర్ ఆరిలోవ: పీఆర్సీ సాధన కోసం ఈ నెల 17న జరగనున్న చలో విజయవాడ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్(యూటీఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి టి.ఆర్.అంబేడ్కర్ పిలుపునిచ్చారు. యూనియన్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దాసరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేం ఆదివారం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న అంబేడ్కర్ మాట్లాడుతూ 12వ పీఆర్సీ 2023 నుంచి అమలు కావాల్సి ఉన్నప్పటికీ ఇంతవరకు కమిషన్ను నియమించలేదన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. 29 శాతం ఫిట్మెంట్ ప్రకటన, సీపీఎస్ రద్దు, పెండింగ్ డీఏల చెల్లింపు తదితర డిమాండ్ల సాధనకు యూటీఎఫ్ ఆధ్వర్యంలో చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు టి.అప్పారావు, జిల్లా గౌరవాధ్యక్షుడు అనకాపల్లి పైడిరాజు, సహాధ్యక్షుడు ముత్యాలనాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
‘రెడ్ రోప్’ విద్యార్థులకు కేథరిన్ ఆశ్రయం
తగరపువలస: డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలు, హెచ్ఐవీ, మానసిక వికాసంపై విద్యార్థులకు అవగాహన కలిగించేందుకు సైకిల్ యాత్ర చేస్తున్న రెడ్ రోప్ ఆర్గనైజేషన్ విద్యార్థులు 15 మందికి భీమిలి కేథరిన్ విద్యాసంస్థల యాజమాన్యం ఆదివారం ఆశ్రయం కల్పించింది. ఈ నెల 9న విజయవాడ నుంచి బయలు దేరిన బృందం 5 జిల్లాల్లో 600 కి.మీ. దూరం ప్రయాణించనుంది. ఇందులో భాగంగా వీరికి కేథరిన్ విద్యార్థులు స్వాగతం పలికారు. బృంద సభ్యులు మాట్లాడు తూ ప్రేమాభిమానాలు పెంచుకుని, కోపం తగ్గించుకోవాలన్నారు. వ్యసనాలకు బానిసలైతే అమూ ల్యమైన జీవితం కోల్పోతామన్నారు. ఈ సందర్భంగా కేథరిన్ విద్యాసంస్థల అధినేత ఆలీవర్ ఆర్ రాయి, డైరెక్టర్ ఇవాంజలిన్ రాయి, డీన్ హెప్సీబాలు సైకిల్ యాత్ర బృందాన్ని అభినందించారు. -
అప్పన్నకు వైభవంగా ఆర్జిత సేవలు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం ఆర్జిత సేవలు వైభవంగా జరిగాయి. ఉదయం 7 నుంచి స్వర్ణపుష్పార్చనని ఘనంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆలయ కల్యాణ మండపంలోని వేదికపై అధిష్టింపజేసి 108 స్వర్ణ సంపెంగ పుష్పాలతో అష్టోత్తర శతనామావళి పూజ నిర్వహించారు. ఉభయదాతలకు శేషవస్త్రాలు, ప్రసాదం అందజేశారు. ఆలయ కల్యాణ మండపంలో స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను అధిష్టింపజేసి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉభయ దాతలకు కల్యాణం అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రాలు అందజేశారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం గరుడసేవ ఘనంగా జరిగింది. ఆలయ కల్యాణ మండపంలో వెండి గరుడ వాహనంపై స్వామివారి ఉత్సవమూర్తి గోవింద రాజస్వామిని అధిష్టింపజేసి అష్టోత్తర శతనామావళి పూజని శాస్త్రోక్తంగా నిర్వహించారు. విశేషంగా హారతులు అందజేశారు. -
జిల్లా స్థాయి ఎడ్ల బళ్ల పోటీల విజేత కేజే పురం
దేవరాపల్లి: మండలంలోని తారువలో శ్రీభక్తాంజనేయ స్వామి తీర్థమహోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి ఎడ్ల బళ్ల పోటీలు హోరాహోరీగా జరిగాయి. ఈ పోటీలను మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు జెండా ఊపి ప్రారంభించారు. రసవత్తరంగా సాగిన ఈ పోటీల్లో కేజే పురం కొయిలాడ మోహన్ ఎడ్లు ప్రథమ స్థానంలోను, వల్లంపూడి సిద్ధివినాయక ఎడ్లు ద్వితీయ స్థానంలోను, కూండ్రం మరిడిమాంబ ఎడ్లు తృతీయ స్థానంలోను నిలిచాయి. దేవరాపల్లి వేతమ్స్ నాయుడు ఎడ్లు నాల్గవ, కేజే పురం కొయిలాడ మోహన్ ఎడ్లు ఐదవ, దేవరాపల్లి వీరాంజనేయ ఎడ్లు ఆరవ స్థానంలోను నిలిచాయి. విజేతలకు మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు చేతుల మీదుగా వరుసగా రూ. 25వేలు, రూ.15వేలు, రూ.10వేలు, రూ.8వేలు, రూ. 6వేలు, రూ.4వేల చొప్పున నగదు బహుమతులను అందజేశారు. తీర్థ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఉదయం నుంచి స్వామి వారికి గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామి వారిని మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, స్థానిక జెడ్పీటీసీ కర్రి సత్యం, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు బూరె బాబురావు తదితరులు దర్శించుకున్నారు. సాయంత్రం మహిళల కోలాట ప్రదర్శన, రాత్రి పలు సాసంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. -
అక్రమ మైనింగ్కు అడ్డుకట్ట వేయాలి
సీపీఎం జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు సమావేశంలో మాట్లాడుతున్న సీపీఎం జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు అనకాపల్లి: జిల్లాలో అక్రమమైనింగ్్కు అధికారులు అడ్డుకట్టవేయడంతో పాటు అక్రమంగా ఏర్పాటు చేసిన మైనింగ్ చెక్పోస్టులను ఎత్తివేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ రహదారి పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఒక్క అనకాపల్లి మండలంలోనే రోజుకు 500 పైగా లారీలతో రాంబిల్లి మండలంలో పోర్టుకు (ఎన్వోబి), ఇతర ప్రాంతాలకు పిక్కతోపాటు ఇతర మెటీరియల్ సప్లై జరుగుతోందని చెప్పారు. దీనిపై మైనింగ్, విజిలెన్స్, రవాణాశాఖ, రెవెన్యూ, పోలీస్ అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం పక్కతోవ పడుతోందని చెప్పారు. మండలంలో మార్టూరు జంక్షన్ వద్ద ఎ.ఎం.ఆర్ సంస్థ అక్రమంగా చేక్ పోస్టు పెట్టడంతో ప్రమాదాలు జరుగుతూ ప్రజలు ప్రాణాలు పోతున్నప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఏఎంఆర్ సంస్థ ద్వారా స్థానిక ఎంపీ సీఎం రమేష్ అనుచరులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, మైనింగ్శాఖకు సంబంధించిన బోర్డులు పెట్టి దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా ఏర్పాటు చేసిన చెక్పోస్టులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సీపీఎం ఆధ్వర్యంలో దశలువారీగా జిల్లా వ్యాప్తంగా స్థానిక ప్రజలు సహాకారంతో ఉద్యమాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రుత్తల శంకరరావు, గంటా శ్రీరామ్, అల్లు రాజు, కాళ్ళ తేలయ్యబాబు తదితరులు పాల్గొన్నారు. -
కల్యాణపులోవ జాతరకు పోటెత్తిన భక్తులు
రావికమతం: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కళ్యాణపులోవలో వెలసియున్న పోతురాజుబాబును ఆదివారం సభాపతి సిహెచ్.అయ్యన్నపాత్రుడు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎన్ రాజు, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ తాతయ్యబాబు, డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ , అనకాపల్లి డీఎస్పీ శ్రావణి తదితరులు దర్శించుకున్నారు. వారికి దేవదాయ ధర్మదాయశాఖ ఈవో సత్యనారాయణ మూర్తి ఆహ్వానం పలికారు. మహాశివరాత్రి సందర్బంగా కళ్యాణపులోవ పోతురాజుబాబు, పెద్దింటమ్మ ఉత్సవాలు మూడు రోజుల పాటు జరుగుతాయి. ఈ సందర్భంగా మెదటి రోజు భక్తులు భారీగా తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించి పోతురాజుబాబును దర్శించుకున్నారు. జిల్లా ఎస్పీ తుహిన్సిన్హా , డీఎస్పీ శ్రావణి పర్వవేక్షణలో కొత్తకోట సీఐ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో కొత్తకోట ఎస్ఐ శ్రీనివాస్ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టి నిరంతర సీసీ కెమెరాలలో నిఘా ఏర్పాటు చేశారు. చోడవరం ఎమ్మెల్యే రాజు ఆధ్వర్యంలో ఆలయ వద్ద భక్తులకు అన్న సమారాధన జరిపారు. -
రాష్ట్రపతి పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందిర ప్రసాద్ మహారాణిపేట(విశాఖ): భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఐఎన్ఎస్ డేగాలో నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, ఇంటెలిజెన్స్ డీఐజీ అరిఫ్ హఫీజ్లతో కలసి అధికారులతో అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం సాయంత్రం వాయు మార్గం ద్వారా ఐఎన్ఎస్ డేగాకు చేరుకునే రాష్ట్రపతికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్లు స్వాగతం పలుకుతారని తెలిపారు. అనంతరం రాష్ట్రపతి ఐఎన్ఎస్ చోళాకు చేరుకుని, విందులో పాల్గొంటారని పేర్కొన్నారు. 18న ఉదయం ఐఎఫ్ఆర్లో పాల్గొంటారని, అదే రోజు సాయంత్రం వాయు మార్గం ద్వారా ఢిల్లీకి బయల్దేరతారని వెల్లడించారు. సీఎం చంద్రబాబు 18న ఐఎఫ్ఆర్కు హాజరవుతారని తెలిపారు. అనంతరం కలెక్టర్ ఐఎన్ఎస్ చోళా, జట్టీ వద్ద ఏర్పాట్లు పరిశీలించారు. నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి కాన్వాయ్ సెక్యూరిటీ ఏర్పాట్లపై పోలీస్ అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి, డీసీపీ మేరీ ప్రశాంతి, నేవల్, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
హామీలకు, ఆచరణకు పొంతన లేదు
ఎన్నికల ముందు రైతుల కోసం చెప్పిన దానికి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు చేస్తున్న దానికి పొంతన లేదు. రైతులకు బడ్జెట్లో కేటాయింపు చూస్తే చాలా దారుణంగా ఉంది. గతంలో వైఎస్సార్సీపీ హయాంలో మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ రైతు భరోసా పథకంలో పెట్టుబడి సాయం అందించి రైతులకు భరోసా కల్పించారు. కూటమి ప్రభుత్వం కొత్త నిబంధనల పేరుతో కొందరు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం అందించలేదు. వ్యవసాయ రైతులకు చేసిన దానికి కంటే ఈ ప్రభుత్వంలో ప్రచార ఆర్భాటం అధికంగా కనిపిస్తోంది. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేలా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి. – బొబ్బర ప్రకాశరావు, వీబీ అగ్రహారం (నాతవరం) -
ధారమఠం.. భక్తజన సందోహం
గొలుగొండ: ప్రముఖ శైవక్షేత్రం ధారమఠం శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా సోమవారం శివనామస్మరణతో మారుమ్రోగింది. వేలాదిగా భక్తులతో కిటకిటలాడింది. సత్యసాయి ట్రస్టు సభ్యులు భక్తులకు అల్పాహారం, మజ్జిగ అందజేశారు. చోద్యం యూత్ సభ్యులు ప్రత్యేకంగా 500 లీటర్ల పెరుగుతో మజ్జిగ పంపిణీ చేశారు. కృష్ణదేవిపేట గ్రామంలో నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. చీడిగుమ్మల కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయాన్ని కూడా భక్తులు పెద్ద ఎత్తున సందర్శించారు. భారమఠంలో సోమవారం రాత్రి మహా రుద్రాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ, గొలుగొండ ఎస్ఐ రామారావు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. -
సరుగుడు జలపాతం వద్ద భక్తుల సందడి
నాతవరం: మహాశివరాత్రి సందర్భంగా సరుగుడు జలపాతంలో స్నానాలు చేసేందుకు భక్తులతో పాటు సందర్శకులు పోటీపడ్డారు. ఉమ్మడి విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల నలుమూలల నుంచి అధిక సంఖ్యలో సందర్శకులు రావడంతో ఈప్రాంతమంతా ఆదివారం సందడి నెలకొంది. సరుగుడు, సుందరకోట పంచాయతీల శివారు 16 గ్రామాల గిరిజనులు శివరాత్రి పండగను ఘనంగా జరుపుకొంటారు. వారంతా సరుగుడు జలపాతంలో స్నానమాచరించి సమీపంలో ఉన్న శివలింగాన్ని దర్శించుకున్నారు. అధిక సంఖ్యలో సందర్శకులు రావడంతో నాతవరం, సరుగుడు మధ్య ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సందర్శకులు సరుగుడు జలపాతాన్ని సందర్శించిన అనంతరం తాండవ రిజర్వాయర్ను చూసేందుకు రావడంతో ఈ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. ట్రాఫిక్ అంతరాయం లేకుండా నాతవరం ఎస్ఐ వై.తారకేశ్వరరావు తగిన చర్యలు తీసుకున్నారు. -
నిరాశపరిచిన బడ్జెట్
చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడో బడ్జెట్ కూడా అన్ని వర్గాలనూ నిరాశపరిచింది. బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు యాభై ఏళ్లకే పింఛన్ అన్నారు.ఎన్నికల ప్రచార సభల్లోనూ పదే పదే చెప్పారు.దీంతో చాలా మంది ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలు ఓట్లు వేశారు.కానీ ఇప్పుడు ఆ ఊసే లేదు.నాడు,నేడు పనులతో పాటు వేతన సవరణ,నిరుద్యోగ భృతి,ఆడబిడ్డ నిధి వంటి హామీలకు ఒక్క రూపాయి కేటాయించలేదు. అమరావతి రాజధాని నిర్మాణం కోసమే అన్నట్టుగా బడ్జెట్ కేటాయింపులున్నాయి.రాష్ట్రంలో మిగతా ప్రాంతాల అభివృద్ధి విస్మరించారు. – అర్రెపు గుప్తా, మున్సిపల్ వైస్ చైర్మన్,యలమంచిలి -
ఉత్తరవాహినిలో శివనామస్మరణ
నర్సీపట్నం: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బలిఘట్టం ఉత్తరవాహిని నది ఒడ్డున త్రిశూల పర్వతంపై వేంచేసియున్న బ్రహ్మలింగేశ్వరస్వామి పుణ్యక్షేత్రానికి భక్తులు పెద్ద ఎత్తున సందర్శించారు. ఉత్తర వాహిని నదిలో పుణ్యస్నానాలు ఆచరించి బ్రహ్మలింగేశ్వరుడిని దర్శించుకున్నారు. స్వామికి లింగోద్భవ కాలమహోన్యాసపూర్వక రుద్రాభిషేకం, కల్యాణోత్సవం నిర్వహించారు. భక్తులు దేవరజంగాలతో పితృదేవతలను పోగిడించుకున్నారు. పాకలపాడు గురుదేవుల ఆశ్రమంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక్కడ మనస్సులో కోరికను గురుదేవుల చెవిలో చెబితే నెరవేరుతాయని భక్తులు విశ్వాసం. గురుదేవుల రథోత్సవాన్ని పట్టణంలో భక్తులు ఊరేగించారు. శ్రీసత్యనారాయణస్వామి వారిని భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. భక్తులకు ఉత్సవ కమిటీ సభ్యులు సదుపాయాలు ఏర్పాటు చేశారు. నాయుడు జ్యూయలర్స్ వారు మజ్జిగ, రోటరీ, శ్రీసత్యసాయి సేవా సంఘం వారు ప్రసాదం పంపిణీ చేశారు. టౌన్ సీఐ గపూర్ ట్రాఫిక్ను నియంత్రించారు. స్నానాలు ఆచరించే ప్రాంతంలో చెత్తాచెదారం ఎప్పటికప్పుడు తొలగించేలా మున్సిపల్ కమిషనర్ సురేంద్ర చర్యలు చేపట్టారు. -
మత్స్యలింగేశ్వరునికి నీరాజనం
సాక్షి, పాడేరు/హుకుంపేట: గిరిజన ప్రాంతంలో అత్యంత మహిమాన్విత పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న హుకుంపేట మండలంలోని మత్స్యగుండం, మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తజన సంద్రమైంది. ఆదివారం జాతర రెండో రోజు కావడంతో దండకారణ్య పరివాహక రాష్ట్రాల గిరిజనులతో పాటు, మైదాన ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. అటు ఆధ్యాత్మిక కేంద్రంగా, ఇటు పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందిన ఈ క్షేత్రం ’హరహర మహాదేవ’ శంభో శంకర’ నామస్మరణతో మారుమోగింది. భక్తుల పరవశం : వేకువజాము నుంచే భక్తులు ప విత్ర స్నానాలు ఆచరించి, గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండి మత్స్యలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక అభిషేకాలు, పూజల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. సజీవ దైవాలుగా మత్స్యదేవతలు ఈ క్షేత్రంలోని ప్రధాన ఆకర్షణ, ఆధ్యాత్మిక విశిష్టత ఇక్కడి మత్స్యదేవతలు (చేపలు). స్వామివారి దర్శనం అనంతరం భక్తులంతా దిగువన ఉన్న మత్స్యగెడ్డ సెలయేరు ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ మత్స్యగుండంలో సంచరించే చేపలను దేవతా స్వరూపాలుగా భావించి, క్యూలైన్లలో వెళ్లి వాటిని దర్శించుకుని పులకించిపోయారు.భక్తుల సౌకర్యార్థం పాడేరు ఆర్టీసీ డిపో ప్రత్యేకంగా 20 బస్సులను నడపడం పట్ల యాత్రికులు హర్షం వ్యక్తం చేశారు. జాతరలో వెలిసిన దుకాణాలు, వినోద కార్యక్రమాల వద్ద రద్దీ కొనసాగింది. ఇన్చార్జి జేసీ, పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, పాడేరు డీఎస్పీ అభిషేక్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సీఐ అప్పలనాయుడు ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. మత్స్యదేవతల చెంతకు భక్తజన ప్రవాహం మత్స్యగుండంలో మారుమోగిన శివనామస్మరణ ఘనంగా శివరాత్రి ఉత్సవాలు -
భక్తి.. ముక్తి.. శివరాత్రి
హామీలు నమ్మి మోసపోయాం గత ఎన్నికల సమయంలో చంద్రబాబు కూటమి ఇచ్చిన రంగుల హామీలను నమ్మి ఓటు వేసినందుకు, ఇప్పుడు కటిక నిరుద్యోగంతో కాలం వెళ్లదీస్తున్నాం. ఉద్యోగం ఇచ్చే వరకు నెలకు రూ.వేల భృతి ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా అందలేదు. లెక్కగడితే ప్రభుత్వం ఒక్కో నిరుద్యోగికి రూ.60 వేలు బకాయిపడింది. ఈ బడ్జెట్లోనైనా నిధులు కేటాయిస్తారని ఆశించినప్పటికీ నిరాశే మిగిలింది. ఎటువంటి ఉపాధి అవకాశాలు లేకపోవడంతో గ్రామంలో వ్యవసాయ, కూలిపనులు చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. – కవడం నాగమురళి, నిరుద్యోగి, అంతర్ల, చింతపల్లి మండలం -
అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం
ఏపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకన్న విమర్శ దేవరాపల్లి: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ అన్ని తరగతుల ప్రజలను మోసం చేసేదిగా ఉందని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.వెంకన్న విమర్శించారు. 2024 ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసేందుకు ఎటువంటి భరోసా, కేటాయింపులు చేయకపోవడం దారుణమన్నారు. నిరుద్యోగులకు ప్రతీ నెలా రూ. 3వేల నిరుద్యోగ భృతి, ప్రతీ ఆడ పడుచుకు ఏడాదికి నెలకు రూ. 1500, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ పథకాలకు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం ప్రజలను మోసగించడమేనన్నారు. విశాఖ ఉక్కు అభివృద్ధి, కడప ఉక్కు నిర్మాణం మాటే లేదన్నారు. ఆంధ్రప్రదేశ్కు జీవనాడిగా చెప్పుకుంటున్న పోలవరం ప్రాజెక్టు 2027 నాటికి పూర్తి చేస్తామని గొప్పగా చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణానికి, నిర్వాసితులకు కేవలం రూ. 6105 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. ఈ నిధులు గేట్లు పెట్టేందుకు సైతం సరిపోవని ఎద్దేవా చేశారు. ఇలాంటి బడ్జెట్ కేటాయింపులు చేస్తే మరో 20 ఏళ్లు అయిన పోలవరం పూర్తయ్యే పరిస్థితి ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరకొర కేటాయింపులతో ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసి, నగదు బదిలీ ప్రవేశ పెట్టేందుకు పూనుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతోందని చెప్పారు. హక్కుగా రావాల్సిన ఎస్సీ, ఎస్టీ, బీసీ తరగతుల సబ్ ప్లాన్ నిధుల ఊసెత్తకుండా అంకెల గారడి చేసి ప్రజలను మభ్య పెట్టారని వెంకన్న మండిపడ్డారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా విస్మరించారని, కార్పోరేట్ రంగాన్ని, టూరిజాన్ని మాత్రమే పెంచే దిశగా బడ్జెట్ ఉందని, ఈ బడ్జెట్తో 2047 కాదు, మరో 100 ఏళ్లు అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర, హరితాంధ్రగా తీర్చిదిద్దడం సాధ్యం కాదన్నారు. -
సీలేరులో ఒడిశాఎంపీ, ఎమ్మెల్యే
● ఉమామహేశ్వర ఆలయం సందర్శన సీలేరు : మహాశివరాత్రి సందర్భంగా ఒడిశాకు చెందిన నవరంగ్పూర్ ఎంపీ బలభద్ర మాజ్జి, మల్కనగిరి ఎమ్మెల్యే నరసింహ మడకామి సీలేరును సందర్శించారు. సరిహద్దులోని పప్పులూరు గ్రామంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్తూ, మార్గమధ్యలో సీలేరులోని ఉమామహేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ వారికి ఘనస్వాగతం పలికి పూజా కార్యక్రమాలను పర్యవేక్షించింది. సీలేరు ప్రకృతి సౌందర్యం, గుంటవాడ జలాశయం చాలా బాగున్నాయని ఎంపీ ప్రశంసించారు.ఎప్పుడూ వార్తల్లో వినే సీలేరును స్వయంగా చూడటం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో గంజాయి సాగును అరికట్టేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని వారిని ఎస్ఐ యాసిన్ కోరారు. ఒడిశా నుంచి వస్తున్న గంజాయి వల్ల ఈ ప్రాంతంలో కేసులు పెరుగుతున్నాయని వివరించారు. దీనిపై వారు సానుకూలంగా స్పందిస్తూ, తమ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పిస్తామని హామీ ఇచ్చారు. -
సింహగిరిపై మల్టీలెవల్ కారు పార్కింగ్కు స్థల పరిశీలన
సింహాచలం: సింహాచల పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల పార్కింగ్ ఇబ్బందులను తొలగించేందుకు దేవస్థానం కీలక అడుగు వేసింది. కొండపైకి వచ్చే కార్ల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో, అత్యాధునిక ‘మల్టీ లెవల్ కార్ పార్కింగ్’ ఏర్పాటుకు సంకల్పించింది. ఈ మేరకు ఆదివారం దేవస్థానం ఈవో జె.వెంకటరావు, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి సింహగిరిపై పాదాలమ్మ, బంగారమ్మ ఆలయాల ప్రాంగణంలో స్థల పరిశీలన చేశారు. ఈ ప్రాంగణంలో గరిష్టంగా ఎన్ని కార్లను పార్క్ చేయవచ్చనే అంశంపై సాంకేతిక నిపుణులతో చర్చించారు. కార్యక్రమంలో దేవస్థానం డీఈ హరి, ఏఈ రవిరాజు, సాంకేతిక సిబ్బంది పాల్గొన్నారు. -
ఆటో బోల్తా.. నలుగురికి గాయాలు
క్షతగాత్రులు గోవింద్, వంతాల విజయశాంతికి వైద్యం అందిస్తున్న సిబ్బందిపెదబయలు: మండలంలోని సీకరి పంచాయతీ పన్నెడ గ్రామ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఆటో బోల్తా పడిన ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం...మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని, లక్ష్మీపేట పంచాయతీ కుడాసింగి, ముంచంగిపుట్టు గ్రామాలకు చెందిన భక్తులు మత్స్యగుండం ఆలయాన్ని సందర్శించుకున్నారు. దర్శనం ముగించుకుని తిరిగి వస్తుండగా, పన్నెడ సమీపంలో నిర్మాణంలో ఉన్న రహదారి వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడింది.ఈ ప్రమాదంలో కుడాసింగి గ్రామానికి చెందిన పలువురు గాయపడ్డారు. వంతాల విజయశాంతికి ఎడమ చేయి, కాలుకు గాయాలయ్యాయి.లకే సూరిబాబు తలకు తీవ్ర గాయమైంది. తమడ్ల రంజిత్కు నడుము భాగంలో దెబ్బ తగిలింది. పేటమాలిపుట్టుకు చెందిన వంతాల గోవింద్ ఎడమ కాలికి గాయమైంది. వీరితో పాటు ఆటోలో మరికొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ఆటోలో చిన్న పిల్లలు, చంటిబిడ్డలతో కలిపి సుమారు 15 మంది ప్రయాణికులు ఉన్నారు. అదృష్టవశాత్తూ పిల్లలెవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే 108 అంబులెన్స్లో క్షతగాత్రులను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చి ప్రథమ చికిత్స అందించారు.ఇలావుండగా ఇటీవల ఆర్అండ్బీ రోడ్డు పనుల వల్ల రహదారిపై మెటల్ తేలి ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆటో నెమ్మదిగానే వెళ్తున్నప్పటికీ, రోడ్డు సరిగా లేకపోవడంతోనే అదుపు తప్పినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉత్తరాంధ్రపై ఉత్తుత్తి ప్రేమే..
కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్లో కూడా ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులపై ఉత్తుత్తి ప్రేమనే చూపింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు రూ.605 కోట్లు చూపుతున్నారు. అసలైన ప్రాజెక్టు పనులకు రూ.200 కోట్లను కూడా కేటాయించలేదని స్పష్టమవుతోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిపేశారు. తాండవ ప్రాజెక్టు వద్ద రూ.470 కోట్లకుపైగా వ్యయంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టు పనులను ఈ ప్రభుత్వం నిలిపివేసింది. కేవలం తాండవ, ఏలేరు ప్రాజెక్టుల నిర్వహణ కోసం తూతూ మంత్రంగా రూ.8.13 కోట్లను కేటాయించి చేతులు దులిపేసుకుంది. విశాఖ అభివృద్ధిపైనా అదే నిర్లక్ష్యం. – గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి -
దివ్యాంగ పింఛనుకు నోచుకోని అభాగ్యులు
పెదబయలు: ఆ చిన్నారులు పుట్టినప్పుడు వారి తల్లిదండ్రులు ఎన్నో కలలు కన్నారు. తమ బిడ్డలు పెరిగి పెద్దయ్యాక తమకు చేదోడు వాదోడుగా ఉంటారని ఆశపడ్డారు. కానీ విధి ఆడిన వింత నాటకంలో ఆ పసి ప్రాణాలు పుట్టుకతోనే వైకల్యంతో పోరాడుతున్నాయి. పెరిగే కొద్దీ ఆరోగ్యం కుదుటపడుతుందని ఆశగా ఎదురుచూస్తున్న ఆ గిరిజన కుటుంబాలకు ఇప్పుడు మిగిలింది కేవలం కన్నీళ్లే. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా.. వారి బాధ పాలక యంత్రాంగానికి వినిపించడం లేదు. సాయం శూన్యం పెదబయలు మండలం పర్రెడ పంచాయతీ నందిమెట్ట గ్రామానికి చెందిన నేరోడి రామారావు, వరలక్ష్మి దంపతుల కుమారుడు నేరోడి ఆకాష్ (8). ఆకాష్ లోకోమోటర్ ఆర్థోపెడిక్ వైకల్యంతో బాధపడుతున్నాడు. ఎముకలు, కండరాలు సహకరించక, నాడీ వ్యవస్థ బలహీనపడటంతో కనీసం అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. 2023లో సదరం సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా, వైద్యులు 90 శాతం వైకల్యం ఉందని నిర్ధారించారు. కానీ, ఆ 90 శాతం వైకల్యం సాక్షిగా రెండేళ్లుగా గ్రామ సచివాలయం చుట్టూ తిరుగుతున్నా, ఆకాష్కు వికలాంగ పింఛన్ మాత్రం మంజూరు కాలేదు. వస్తే చెబుతాం.. అనే సిబ్బంది సమాధానం ఆ తల్లిదండ్రుల గుండెలను పిండేస్తోంది. కన్నీరు మున్నీరవుతున్న మరో కుటుంబం అదే గ్రామానికి చెందిన నేరోడి రంజిత్ కుమార్, భవాని దంపతుల కుమారుడు అభిమన్యు (7) పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. అభిమన్యు కూడా పుట్టుకతోనే అదే వ్యాధితో మంచానికే పరిమితమయ్యాడు. ఆశతో విశాఖలోని కేజీహెచ్ ఆసుపత్రికి తీసుకెళ్లిన తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది. బాబుకు రక్తం తక్కువగా ఉందని, ఆపరేషన్ చేయడం వీలుపడదని వైద్యులు డిశ్చార్జ్ చేసేశారు. ప్రభుత్వం నుంచి పింఛన్ రాక, సొంతంగా వైద్యం చేయించే స్థోమత లేక ఆ కుటుంబం బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తోంది. వినబడని ఆర్తనాదం ఈ రెండు గిరిజన కుటుంబాల పరిస్థితి అత్యంత దీనంగా ఉంది. ఒకవైపు అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్న బిడ్డలు, మరోవైపు ఆర్థిక ఇబ్బందులు వారిని కుంగదీస్తున్నాయి. 90 శాతం వైకల్యం ఉన్నా పింఛన్ రాకపోవడం వ్యవస్థలోని లోపాలకు అద్దం పడుతోందని పలువురు విమర్శిస్తున్నారు. మెరుగైన వైద్యం అందిస్తే తమ బిడ్డలు కోలుకుంటారని ఆ తల్లిదండ్రులు నమ్ముతున్నారు, కానీ చేతిలో చిల్లిగవ్వ లేదు. ప్రభుత్వం ఎలాగూ పట్టించుకోవడం లేదని, కనీసం మానవత్వం ఉన్న దాతలైనా ముందుకు వచ్చి తమ బిడ్డల ప్రాణాలు నిలబెట్టాలని వారు వేడుకుంటున్నారు. పర్రెడ పంచాయతీలోని ఈ రెండు కుటుంబాల కన్నీళ్లు తుడవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, ఆ ఇద్దరు చిన్నారులకు తక్షణమే పింఛన్ మంజూరు చేయడమే కాకుండా, వారికి మెరుగైన కార్పొరేట్ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆ గిరిజన గ్రామం కోరుతోంది. అడుగు పడని సాయం మా పిల్లలు నడవలేరు, కదలలేరు. సచివాలయానికి వెళ్తే రేపు మాపు అంటున్నారు. ప్రభుత్వం కరుణిస్తుందని, ఎవరైనా దాతలు మా బిడ్డలకు వైద్యం చేయిస్తారన్న ఆశ మాత్రమే మిగిలి ఉంది. – బాధిత తల్లిదండ్రుల ఆవేదన కాళ్లరిగేలా తిరుగుతున్నా.. కుమారుడి పింఛను కోసం తల్లి పాట్లు సీలేరు: గూడెం కొత్తవీధి మండలం, సీలేరు పంచాయతీ పార్వతీనగర్కు చెందిన కుర్ర కుమారి అనే గిరిజన మహిళ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఇటీవలే ఆమె భర్త అసురు అనారోగ్యంతో మృతి చెందడంతో, ముగ్గురు పిల్లల పోషణ ఆ తల్లికి భారమైంది. కుమారి పెద్ద కుమారుడు అజయ్ (12) పోలియో కారణంగా రెండు కాళ్లు పడిపోయి నడవలేని స్థితిలో ఉన్నాడు. తన కుమారుడికి వికలాంగుల పెన్షన్ మంజూరు చేయాలని గత రెండేళ్లుగా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ స్పందించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కూలి పనులు చేస్తూ, అడవి నుంచి కట్టెలు తెచ్చి అమ్ముకుంటూ పిల్లలను పోషిస్తున్నారు. ‘పెన్షన్ అందితేనే నా పిల్లలకు కడుపునిండా అన్నం పెట్టగలను‘ అని ఆదివారం విలేకరుల వద్ద ఆమె కన్నీరుమున్నీరయ్యా రు. ఈ నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి, చిన్నారి అజయ్కు పెన్షన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
పొల్లూరు జల్లింత కావాలిలే..!
మోతుగూడెం: ప్రకృతి అందాలకు నిలయమైన పోలవరం జిల్లాలోని పొల్లూరు జలపాతం అభివృద్ధిపై అటవీ శాఖ దృష్టి సారించింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హాయంలోనే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు తయారై పనులు కూడా మొదలయ్యాయి. ఇందులో భాగంగా అక్కడి మౌలిక వసతుల కల్పనపై ఆ అటవీశాఖ దృష్టి సారించింది. ఏపీ జెన్కో సంస్థ కేటాయించిన రూ.50 లక్షల సీఎస్సార్ నిధులతో ఈ పనులు చేపట్టారు. అభివృద్ధితో పాటు సౌకర్యాలు.. ఏపీ జెన్కో సంస్థ ఇచ్చిన నిధులతో పొల్లూరు జలపాతం వద్ద అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. వర్షాకాలంలో ముఖ్యంగా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈ జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తూ పర్యాటకులకు కనువిందు చేస్తుంది. కొండల మధ్య సుమారు 50 అడుగులు ఎత్తు నుంచి నీరు జాలువారుతూ ఎందరో పర్యాటకులను ఆకర్షిస్తుంటుంది. ఈ జలపాతం పొల్లూరు నుంచి డొంకరాయికి వెళ్లే మార్గంలో రహదారికి అర కిలోమీటరు దూరంలో ఉంది. ఫోర్బే, డొంకరాయి అటవీ ప్రాంతాల నుంచి ప్రవహిస్తూ కొల్లూరు వద్ద సీలేరు నదిలో కలుస్తుంది. ఇక్కడి జలపాతం ప్రవేశ ద్వారాన్ని ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. సుమారు 50 వరకు కార్లు పార్కింగ్ చేయడానికి అనుకూలంగా ఈ స్థలాన్ని చదును చేశారు. అలాగే పర్యాటకులు సేదతీరేందుకు రెల్లుగడ్డితో నిర్మిచిన పగోడాలను, కూర్చొనేందుకు వీలుగా గ్రానైట్ బెంచ్లు ఏర్పాట్లు చేశారు. జలపాతాన్ని చూడడానికి వచ్చే మహిళల సౌకర్యం కోసం మూడు మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునేందుకు మూడు గదులు నిర్మిస్తున్నారు. అంతే కాకుండా కెప్ట్రే (టీ,కాఫీతో పాటు టిఫిన్, శీతల పానీయాలు) అందించేందుకు షాప్ను ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు సేవానియర్స్ ఏర్పాటు చేసి స్థానికంగా ఉండే అటవీ ఉత్పత్తులను ఈ స్టాల్లో ఉంచి పర్యాటకులకు అందిస్తున్నారు. ఇవే కాకుండా పది మీటర్ల సీసీ రహదారిని రూ.3.5 లక్షలతో నిర్మించారు. సోలార్ సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. పార్కింగ్ ప్రాంతాల్లో చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేన్నారు. అలాగే చెత్త లేకుండా శుభ్రంగా ఉంచడానికి డస్ట్బిన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు 70 శాతం సుందరీకరణ పనులు, మౌలిక సదుపాయాల కల్పన పూర్తయినట్లు స్థానిక రేంజర్ జి.నానాజీ తెలిపారు. అటవీ మార్గంలో ట్రెక్కింగ్ మారేడుమిల్లి మండలం గుడిస ప్రాంతానికి మోతుగూడెం సమీపాన సుకుమామిడి గ్రామం నుంచి (ఏనుగుల బాట) 12 కిలోమీటర్ల మేర ట్రెక్కింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఐదు నెలల క్రితం ఈ గ్రామం నుంచి గుడిసె వరకు కొండలు గుట్టలపై ట్రెక్కింగ్ మార్గానికి అటవీశాఖ అధికారులు సర్వే చేశారు. సుమారు ఐదు మీటర్ల వెడల్పున 12 కిలోమీటర్ల మేర కాలిబాటకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అటవీ శాఖ ప్రధాన కార్యాలయం నుంచి అనుమతులు రాగానే దీనికి రూపకల్పన చేయనున్నట్టు వారు తెలిపారు. ట్రెక్కింగ్ చేయాలనుకునే వారి నుంచి కొంత రుసుము తీసుకొని గైడ్లను ఏర్పాటు చేస్తామని అధికారులు, అలాగే తరువాత వర్షాకాలం లోపు ఫైర్ క్యాంపింగ్తో పాటు, నైట్ స్టే చేసేందుకు క్యాంపింగ్ టెంట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వారు తెలిపారు. వీటి వల్ల రాత్రి వేళల్లో కూడా గుడిస అందాలను తిలకిస్తూ గడిపేందుకు అవకాశం ఉంటుంది. అలాగే పర్యాటకులు బస చేసేందుకు మోతుగూడెంలో ఏపీ జెన్కో అతిథి గృహం ఉంది. ఇందులో ఆరు గదులు ఉన్నాయి. ఇవి ఖాళీగా ఉంటే అద్దెకు ఇచ్చే అవకాశం ఉంది. ఇవి కాకుండా ప్రైవేట్ రిసార్టులు పొల్లూరులో ఒకటి, మోతుగూడెంలో ఏడు ఉన్నాయి. గదికి 24 గంటలకు రూ.2500 వరకు అద్దె ఉంటుంది. నలుగురు నుంచి ఆరుగురు ఉండేందుకు అనువుగా ఇవి ఉంటాయి. రిసార్టులలో భోజన సదుపాయం కూడా ఉంది. జలపాతం సందర్శనకు భద్రాచలం, రాజమహేంద్రవరం నుంచి రావచ్చు. ఈ రహదారి మార్గాల్లో బస్సు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ప్రధాన రహదారి నుంచి కాలినడకన జలపాతం వద్దకు వెళ్లవచ్చు. రాజమహేంద్రవరం నుంచి వచ్చే రహదారి మెరుగ్గా ఉంది. -
ఆధునిక హంగులతో జెడ్పీ అతిథి గృహం
● ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర ● రూ.25 లక్షలతో నిర్మాణానికి శంకుస్థాపన ముంచంగిపుట్టు: ఆధునిక హంగులతో జెడ్పీ అతిథి గృహం నిర్మిస్తామని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. మండల కేంద్రంలో రూ.25 లక్షలతో నిర్మించనున్న జెడ్పీ అతిథి గృహానికి శనివారం ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పన కోసం జిల్లా పరిషత్ నుంచి నిధులు కేటాయిస్తున్నామన్నారు. ముంచంగిపుట్టులో జెడ్పీ అతిథి గృహం నిర్మించి ఎన్నో ఏళ్ల గడిచిపోవడంతో ప్రస్తుతం శిథిలావస్థకు చేరిందన్నారు. దీనివల్ల వసతి లేక మండల కేంద్రానికి వచ్చే అతిథులు, అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనివల్ల భవన నిర్మాణంపై దృష్టి సారించామన్నారు. త్వరితగతిన పూర్తిచేసి అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. వైస్ ఎంపీపీ భాగ్యవతి, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు పద్మారావు, సర్పంచులు రమేష్, సుభాష్చంద్ర, నరసింగరావు, భాగ్యవతి, ఎంపీటీసీలు సుబ్బలక్ష్మి, కమల, జిల్లా కోఆర్డినేటర్ జగబంధు, పార్టీ నేతలు సన్యాసిరావు, జయదేవ్, రాజారావు, అర్జున్, అప్పారావు, దేవ, రాంప్రసాద్, జేవీవీఎన్మూర్తి పాల్గొన్నారు. బొండాపల్లిలో సీసీ రోడ్డుకు శంకుస్థాపన పెదబయలు: బొండాపల్లి పంచాయతీ పరిఽధిలోని బొండాపల్లికి రూ.10 లక్షల జెడ్పీ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అభివృద్ధే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని తెలిపారు. జేవీఎస్మూర్తి, సర్పంచ్ బి.మత్స్యరాజు, బొండా బాస్కర్రావు, కార్యకర్తలు, ఫీల్డ్ అసిస్టెంట్ చింతా కొండలరావు పాల్గొన్నారు. -
లిక్విడ్ గంజాయి తరలిస్తున్న ముగ్గురు అరెస్టు
దేవరాపల్లి: లిక్విడ్ గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు కె.కోటపాడు సీఐ కె.కృష్ణ శనివారం తెలిపారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి దేవరాపల్లి వైపు గంజాయి తరలిస్తున్నట్లు స్థానిక పోలీసులకు సమాచారం అందడంతో శ్రీరాంపురం చెక్ పోస్టు వద్ద స్థానిక ఎస్ఐ వి. సత్యనారాయణ తన సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టినట్టు చెప్పారు. జీనబాడు వైపు నుంచి బైక్పై వస్తున్న ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూసి పరారయ్యేందుకు ప్రయత్నించగా వారిని అదుపులోకి తీసుకుని, బ్యాగ్ను తనిఖీ చేయగా అందులో రెండు ప్యాకెట్లలో ఉన్న రెండు కిలోల లిక్వడ్ గంజాయి బయటపడింది. నిందితుల నుంచి లిక్విడ్ గంజాయితో పాటు బైక్, రూ. 3వేలు నగదు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు. పట్టుబడిన లిక్విడ్ గంజాయి విలువ సుమారు రూ. 25 లక్షలు ఉంటుందని, లిక్విడ్ గంజాయిని ఒడిశాలో కొనుగోలు చేసి విశాఖపట్నం మీదుగా మహారాష్ట్ర తరలించేందుకు యత్నించినట్లు తమ విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. పట్టుబడిన నిందితుల్లో మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతానికి చెందిన రంజాన్ జాకీర్ మన్సూరి, డుంబ్రిగుడ మండలానికి చెందిన గోల్లోరి దానేష్, పాంగి దేవదాస్ ఉన్నారు. వీరిని చోడవరం కోర్టుకు తరలించనున్నట్లు సీఐ కె.కృష్ణ, ఎస్ఐ వి. సత్యనారాయణ వెల్లడించారు. -
17న చలో విజయవాడ
అనకాపల్లి: వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ), బకాయిపడ్డ కరువు భత్యం (డీఏ) అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17న చలో విజయవాడ కార్యక్రమం తలపెట్టినట్టు యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సంపతి కిషోర్కుమార్ తెలిపారు. శనివారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో యూటీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. పాత పీఆర్సీ గడువు రెండేళ్ల 8 నెలలు పూర్తయిందని, ఈ జాప్యం ఉద్యోగుల, ఉపాధ్యాయుల జీతభత్యాలపై ఎంతో నష్టాన్ని చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు విడతల కరువు భత్యాన్ని, ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ.30 వేల కోట్ల ఆర్థిక బకాయిలు చెల్లించవలసి ఉందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరి రెండు సంవత్సరాలు కావస్తున్న ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేయడం సరికాదన్నారు. ఇప్పటికై నా ఎన్నికల హామీ మేరకు మెరుగైన వేతన సవరణ చేయాలని కోరారు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చినబ్బాయ్, సహాధ్యక్షులు రొంగలి అక్కునాయుడు, రొంగలి ఉమాదేవి, జిల్లా కార్యదర్శులు రమేష్ రావు, గుత్తుల సూర్యప్రకాష్, రాష్ట్ర కౌన్సిలర్లు ఎస్.ఎస్. నాగమణి, ఎల్లయ్యబాబు, ఎం.వి అప్పారావు పాల్గొన్నారు. -
పథకాల పేరుతో మహిళలకు మోసం
ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పేరిట సీఎం చంద్రబాబు మహిళలకు ఎన్నో హామీలిచ్చారు. ఉచిత బస్ ప్రయాణం పథకం కింద రాష్ట్రంలో ఏ పుణ్యక్షేత్రానికై నా ఉచితంగా వెళ్లవచ్చని చెప్పారు. కానీ, వాస్తవానికి జిల్లా పరిధిలోని 16 సర్వీసులకు గాను.. కేవలం ఐదారు సర్వీసుల్లోనే ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. అలాగే ప్రతి మహిళకూ నెలకు రూ.1,500 ఇస్తామని నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. కానీ తొలి ఏడాది ఆ సొమ్ము ఇవ్వకుండా మోసం చేశారు. తాజాగా రెండో ఏడాది బడ్జెట్లోనూ ఆ పథకానికి నిధులు కేటాయించకుండా మరోసారి దగా చేశారు. – సూరిశెట్టి నూకరత్నం, పెందుర్తి -
రక్తపు మడుగుల్లో వృద్ధురాలి ఆర్తనాదం
డాబాగార్డెన్స్: జనంతో కిక్కిరిసిన పూర్ణామార్కెట్ ప్రాంతం కొనుగోళ్ల సందడి మధ్య ఒక్కసారిగా విషాద దృశ్యం ఆవిష్కృతమైంది. రోడ్డు దాటేందుకు ప్రయత్నించిన 70 ఏళ్ల వృద్ధురాలు క్షణాల్లోనే రక్తపు మడుగులో పడిపోయింది. ఆరిలోవకు చెందిన ఆమె శనివారం సాయంత్రం మార్కెట్కు వచ్చింది. జగదాంబ జంక్షన్ నుంచి పాత పోస్టాఫీస్ వైపు వెళ్తున్న 52డి నంబరు గల ఆర్టీసీ బస్సు ఆమెను ఢీకొట్టింది. కాలు నుజ్జునుజ్జయింది. రక్తస్రావంతో ఆమె రోడ్డుపై పడిపోయి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడింది. చివరకు కేజీహెచ్కు తరలించారు. -
60 కిలోల గంజాయి స్వాధీనం
మాకవరపాలెం: ఏజెన్సీ ప్రాంతం నుంచి వ్యాన్లో తరలిస్తున్న 60 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు స్థానిక పోలీస్ స్టేషన్లో అందించిన వివరాలిలా ఉన్నాయి. బెంగళూరుకు చెందిన రహీమ్ షరీఫ్(29) తన మినీ వ్యాన్తో అరకు మీదుగా ఒడిశాలోని పాడువ గ్రామానికి వెళ్లాడు. అక్కడ శ్రీను అనే వ్యక్తి నుంచి కిలో రూ.6,000 చొప్పున 60 కిలోల గంజాయిని కొనుగోలు చేశాడు. దీనిని వ్యాన్పై తరలిస్తుండగా మండలంలోని రాచపల్లి జంక్షన్లో శనివారం పట్టుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. ఈ గంజాయిని బయట విక్రయిస్తే రూ. 30 లక్షలు వస్తుందని చెప్పారు. గంజాయితోపాటు వ్యాన్ను స్వాధీనం చేసుకున్నట్టు ఆయన తెలిపారు. రహీమ్ షరీఫ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించామని, ఈ కేసుకు సంబంధించి బెంగళూరుకు చెందిన మరో వ్యక్తి సయ్యద్ తన్వీర్, పాడువకు చెందిన శ్రీను పరారీలో ఉన్నారన్నారు. నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ, స్థానిక ఎస్ఐ దామోదర్నాయుడు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఏపీ పీఆర్ నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా కార్యవర్గ ఎన్నిక
మహారాణిపేట(విశాఖ): ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్ నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం ఉమ్మడి విశాఖ జిల్లా కార్యవర్గ ఎన్నికలు శనివారం ఏకగ్రీవంగా జరిగాయని ఎన్నికల అధికారి జి.రత్నకుమార్ తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ ఎన్నికల్లో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఓమ్మి చిట్టిబాబు, ప్రధాన కార్యదర్శిగా పి.నరేష్బాబు, అసోసియేట్ ప్రెసిడెంట్గా బి.రవి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా టి.చంద్రశేఖర్, జి.చాందిని, ఎ.శ్రీనివాసరావు ఎంపికయ్యారు. ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా పి.రాధాలక్ష్మి, వై.విజయకుమారి, ఎం.నాగభూషణం నాయుడు, డి.కవిత ఎన్నికయ్యారు. జాయింట్ సెక్రటరీలుగా డి.సింహాచలం, బి.ఈశ్వర్, వి.కిరణ్, ఎం.వి.ఎస్.కౌశిక్, కోశాధికారిగా కె.జె.ఎస్.చక్రి, కోఆప్టెడ్ సభ్యురాలిగా పి.నిర్మల ఎన్నికయ్యారు. ఎన్నికల పరిశీలకుడిగా ఎస్.రాజేష్ ప్రభుకుమార్ వ్యవహరించారు. విజయం సాధించిన నాయకులను ఏపీ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడు ఎస్.సత్తిబాబు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎస్.త్రినాథ్, కె.గంగాధర్లు అభినందించారు. -
అప్పులబాధలు తాళలేక వ్యక్తి ఆత్మహత్య
అచ్యుతాపురం రూరల్ : అప్పులబాధ తాళలేక స్క్రాప్ షాపు యజమాని రాగల ఆదినారాయణ (45) శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. భీమవరానికి చెందిన ఆదినారాయణ అచ్యుతాపురం మండలం వెదురువాడ అయ్యప్పస్వామి ఆలయం వద్ద ఉంటూ అక్కడే స్క్రాప్ షాపు నడుపుతున్నాడు. అప్పు తీసుకుని ఇనుప సామగ్రి కొనుగోలుకు వ్యాపారపరంగా గాజువాకకు చెందిన ఓ వ్యక్తికి రూ.4లక్షలు ఇచ్చాడు. అయితే ఆ వ్యక్తి ఆ సొమ్మును తిరిగి ఇవ్వకపోవడం వల్ల, అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి రావడంతో మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. గతంలో కూడా ఆదినారాయణ ఆత్మహత్యకు యత్నించగా కుటుంబ సభ్యులు అడ్డుకున్నారని పోలీసులు చెప్పారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రశేఖర్ రావు తెలిపారు. -
చోడవరం సబ్ రిజిస్ట్రార్కు పతకాల పంట
● జాతీయ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్లో సత్తా పతకాలు అందుకుంటున్న గీతాలక్ష్మి చోడవరం: జాతీయ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో చోడవరం సబ్ రిజిస్ట్రార్ బి.గీతాలక్ష్మి పతకాలు సాధించారు. ఇటీవల మధ్యప్రదేశ్లో 45వ జాతీయ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో రాష్ట్రం నుంచి పాల్గొన్న ఆమె డిస్క్ త్రో విభాగంలో బంగారు, ట్రిపుల్ జంప్లో వెండి, లాంగ్ జంప్, 400 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకాలు సాధించారు. గతంలోనూ గీతాలక్ష్మి అనేక పోటీల్లో పతకాలు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ పోటీల్లో సత్తా చాటడంతో అందరూ ఆమెకు అభినందనలు తెలిపారు. -
అసెంబ్లీలో మా గళం వినిపించండి
రెండో రోజుకు చేరిన ఏయూ అతిథి అధ్యాపకుల ఆందోళన మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులు చేపట్టిన నిరసన దీక్షలు శనివారం నాటికి రెండో రోజుకు చేరుకున్నాయి. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏయూ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట వారు ఆందోళన చేపట్టారు. ఈ దీక్ష శిబిరాన్ని సందర్శించిన ప్రొఫెసర్ సూరప్పడు వారికి సంఘీభావం తెలిపారు. నెలవారీ వేతనాల కోసం అతిథి అధ్యాపకులు చేస్తున్న పోరాటం న్యాయబద్ధమైనదని, వారి పట్టుదల అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అతిథి అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఎం.సురేష్ మీనన్ మాట్లాడుతూ.. ఏయూ పూర్వ విద్యార్థులైన ఎమ్మెల్యేలు తమ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని కోరారు. ప్రస్తుతం ఏయూలో కేవలం 165 మంది మాత్రమే పర్మనెంట్ ఆచార్యులు, 91 మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారని, కానీ సుమారు 300 మంది అతిథి అధ్యాపకులే భారాన్ని మోస్తున్నారని సురేష్ మీనన్ వివరించారు. ఏయూకు నాక్ ఏ–ప్లస్ ప్లస్ గ్రేడ్ రావడంలో తమ కృషి ఎంతో ఉందన్నారు. ఇంత చేస్తున్నా తమకు అతి తక్కువ వేతనాలు ఇస్తున్నారని, దీని వల్ల నాణ్యమైన విద్యను అందించడంలో జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఏయూ అధికారులు స్పందించి తమ కష్టాన్ని గుర్తించి, వెంటనే నెలవారీ వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అతిథి అధ్యాపకులు శేషు, ఫణి, మురళి, పీతాని ప్రసాద్, దుర్గ ప్రసాద్, వీరేంద్ర, విక్రమ్, దేవానంద్, సునీల్, అంబేడ్కర్ సుమంత్, దివ్య, అమృత తదితరులు పాల్గొన్నారు. -
రూ.2కోట్లే!
రూ.3.32 లక్షల కోట్ల బడ్జెట్లో కేటాయింపులు నామమాత్రం ● విశాఖ మెట్రోకు విజయవాడ లింక్.. పనులపై నీలినీడలు ● ఏయూ, సాగునీటి ప్రాజెక్టులపైనా చిన్నచూపు ● తాండవ ఎత్తిపోతలకు చెక్.. నిర్వహణకే పరిమితం ● విశాఖ–చైన్నె కారిడార్ భారం జీవీఎంసీపైనే ● అరకు కాఫీపై అదే పాత పాట సామాజిక న్యాయం ఎక్కడ? రాష్ట్ర బడ్జెట్లో ఆదివాసీల సంక్షేమానికి ఒరిగిందేమీ లేదు. మహిళలకు నెలకు రూ. 1,500 (ఏడాదికి రూ. 18 వేలు), నిరుద్యోగ భృతి రూ. 3వేలు, రైతులకు రూ. 20 వేలు, పాఠశాలకు వెళ్లే పిల్లలకు రూ. 15వేలు ఇస్తామన్న హామీలను ప్రభుత్వం విస్మరించింది. సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా సాగుతున్న కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనను భవిష్యత్తులో అన్ని వర్గాల ప్రజలు ఎదిరించాలి. – అప్పలనర్స, జిల్లా కార్యదర్శి, సీపీఎం, పాడేరువిశాఖకు విదిల్చింది.. బడ్జెట్లో మరోసారి మోసం నిరుద్యోగులందరికీ ఉద్యోగాలిస్తామని, అప్పటివరకూ ప్రతి ఒక్కరికీ నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ నేటికి హామీ అమలు చేయలేదు. రాష్ట్ర బడ్జెట్లో నిరుద్యోగ భృతి కోసం ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం కేటాయించకపోవడం దారుణం. ఏటా జవనరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పినా ఆ ఊసే లేదు.ఉదోగావకాశాలు కల్పించకుంటే కనీసం ప్రతినెలా రూ.3వేల నిరుద్యోగ భృతి అయినా చెల్లించాలి. – తాంగుల ధనలక్ష్మి, నిరుద్యోగ యువతి, డింగూడ, ముంచంగిపుట్టు మండలం సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: భారీ బడ్జెట్ లెక్కలతో చంద్రబాబు ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరం(2026–27) కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విశాఖ నగర అభివృద్ధికి విదిల్చిన నిధులు ఎంతో తెలుసా? కేవలం రూ. 2 కోట్లు. అంటే మొత్తం బడ్జెట్ కేటాయింపుల్లో విశాఖ నగరానికి దక్కింది 0.000006 శాతం మాత్రమే. నగర అభివృద్ధికి నిధులు కేటాయించకపోగా.. మరోవైపు విశాఖ–చైన్నె పారిశ్రామిక కారిడార్ పనుల భారాన్ని జీవీఎంసీపై మోపింది. ఇందుకోసం జీవీఎంసీ ఖజానా నుంచి రూ.22.28 కోట్లు ఖర్చు చేయాలని ఆదేశించింది. ఇక ఇప్పటికే డీపీఆర్ ఆమోదం పొందిన విశాఖ మెట్రోకు.. ఇంకా ఆమోదం లభించని విజయవాడ మెట్రోతో కలిపి అరకొర నిధులను కేటాయించింది. దీనిని బట్టి విజయవాడ మెట్రో పనులు మొదలయ్యేదాకా విశాఖలో పనులు మొదలుపెట్టే ఆలోచన లేదని ప్రభుత్వం పరోక్షంగా తేల్చిచెప్పినట్లయింది. సాగునీటి ప్రాజెక్టుల విషయంలోనూ ఉత్తరాంధ్రపై వివక్ష కొనసాగుతోంది. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన తాండవ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేసిన కూటమి ప్రభుత్వం.. కేవలం ప్రాజెక్టు నిర్వహణ కోసం మాత్రమే తూతూమంత్రంగా నిధులను కేటాయించింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు రూ. 605 కోట్ల కేటాయింపులు కనిపిస్తున్నా.. ఆచరణలో ఈ నిధుల్లో అత్యధిక భాగం కేవలం పునరావాసం, జీత భత్యాలకే సరిపోనున్నాయి. మరోవైపు ఏజెన్సీపై అదే వివక్షను కొనసాగించింది. గత ఏడాది చెప్పినట్టుగానే ఈ సారి కూడా 25 వేల ఎకరాల్లో కాఫీ ప్లాంటేషన్ కోసం రూ.16 కోట్ల మేర నిధులను కేటాయించినట్టు బడ్జెట్ పత్రాల్లో చూపారు. ఉత్తరాంధ్రపై ఉత్తుత్తి ప్రేమ ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం ఉత్తుత్తి ప్రేమను ప్రదర్శిస్తోంది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు బడ్జెట్లో రూ.605కోట్లు కేటాయించినట్లు చూపారు. అయితే, వాస్తవానికి ఇందులో సింహభాగం నిధులు పునరావాసం, జీతభత్యాలకే సరిపోనున్నాయి. ఈ రెండు పద్దులకే రూ. 400 కోట్లకు పైగా ఖర్చయ్యే పరిస్థితి ఉంది. అంటే, అసలైన ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం కనీసం రూ.200 కోట్లు కూడా మిగలవని స్పష్టమవుతోంది. మరోవైపు, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో రూ.470 కోట్లతో ప్రారంభించిన తాండవ ప్రాజెక్టు పనులను ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేసింది. తాండవ, ఏలేరు ప్రాజెక్టుల నిర్వహణ కోసం తూతూమంత్రంగా కేవలం రూ.8.13 కోట్లను మాత్రమే కేటాయించింది. ఇదిలా ఉండగా.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో కాంట్రాక్టర్లు పనులను ఎక్కడికక్కడ నిలిపివేశారు. ‘సూపర్ సిక్స్’జాడేది? ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అంటూ హోరెత్తించిన ప్రభుత్వం, బడ్జెట్ కేటాయింపుల విషయానికి వచ్చేసరికి మాత్రం దాగుడుమూతలు ఆడుతోంది. యువతకు నెలకు రూ. 3వేల చొప్పున ఇస్తామన్న నిరుద్యోగ భృతి కోసం బడ్జెట్లో ఎక్కడా నిధులు కేటాయించలేదు. ఇక ఆడబిడ్డ నిధి కింద మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున అందించే పథకానికి సంబంధించిన ప్రస్తావనే లేదు. మరోవైపు గ్యాస్ రాయితీ కింద ఇవ్వాల్సిన మొత్తానికి కూడా పూర్తిస్థాయిలో నిధులు కేటాయించలేదు. ఇక అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఏటా రూ. 20 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం... కేంద్రం ఇచ్చే నిధులను కూడా కలిపి బడ్జెట్లో చూపించడం గమనార్హం. మొత్తంగా సూపర్ సిక్స్ హామీలకు నిధుల కేటాయింపులో మొండిచేయి చూపడం ద్వారా, పథకాల అమలుపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరికొన్ని అరకొర కేటాయింపులివే... ● విశాఖ, తిరుపతి జూ పార్కులకు కలిపి బడ్జెట్లో కేవలం రూ. 3.30కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ లెక్కన విశాఖ జూ పార్కు వాటా రూ.1.65 కోట్లకు పరిమితమైనట్లేనని స్పష్టమవుతోంది. ● విశాఖపట్నం, కడప జిల్లాలోని ఉన్న మానసిక ఆసుపత్రులకు రూ.13 కోట్లను కేటాయింపులు జరిగాయి. ఇందులో విశాఖ మానసిక ఆసుపత్రికి సగటున రూ. 6.5 కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాంలో భాగంగా వచ్చే నిధులు కావడం గమనార్హం. ● తొట్లకొండ వద్ద నిర్మాణంలో ఉన్న గ్రేహౌండ్స్ భవనాలకు రూ. 3 కోట్లు, విశాఖలోని గ్రేహౌండ్స్ రీజనల్ శిక్షణ కేంద్రానికి మరో రూ. 3 కోట్లు కేటాయించారు. పీఎంపాలెంలో ఆక్టోపస్ బేస్ క్యాంపు నిర్మాణానికి రూ. 3.5 కోట్లు కేటాయించారు. ● విచిత్రమేమిటంటే... విశాఖ పోలీస్ కమిషనరేట్ కార్యాలయ భవనంతో పాటు... ఆరిలోవ ఏసీపీ కార్యాలయం, మహారాణిపేట పోలీస్ స్టేషన్, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ల నూతన భవనాల నిర్మాణానికి మాత్రం కేవలం రూ.1.5 కోట్లు విదిల్చారు. మొత్తంగా నగరాభివృద్ధితో పాటు ప్రజల భద్రత విషయంలో ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఈ అరకొర కేటాయింపులే నిదర్శనమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆదివాసీలకు తీవ్ర అన్యాయంరాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆదివాసీలకు ఎన్నడూలేనివిధంగా తీవ్ర అన్యాయం జరిగింది. చంద్రబాబు ప్రభుత్వం ఆదివాసీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. ఈ బడ్జెట్ సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఉంది. గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలలు, వసతి గృహాల (హాస్టళ్ల) అభివృద్ధికి నిధుల కేటాయింపుపై బడ్జెట్లో స్పష్టత లేదు. పీవీటీజీ గిరిజనులకు పీఎం జన్మన్ పథకం కింద కేంద్రం ఇచ్చే నిధులు కాకుండా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను ఎప్పుడు విడుదల చేస్తుందో చెప్పడం లేదు. ఆదివాసీల హక్కులు, సంక్షేమం కోసం తమ సంఘం నిరంతరం పోరాడుతుంది. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి, ఆదివాసీల అవసరాలకు అనుగుణంగా పూర్తిస్థాయి నిధులు కేటాయించాల్సి అవసరం ఉంది. ఇందుకుకోసం పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. – పొద్దు బాలదేవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆదివాసీ గిరిజన సంఘంనిరుద్యోగ భృతి మాటేది? రాష్ట్ర బడ్జెట్లో ఎలాంటి రాయితీలు, మేలు చేసే అంశాలు ఉంటాయోనని నాలాంటి యువత ఎదురు చూశారు. కానీ మా ఆశల మీద ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఎన్నికల హామీల్లో నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. కానీ బడ్జెట్లో దాని ఊసే లేదు. దీని కోసం నిధులు కేటాయిస్తారని అంతా అనుకున్నాం. ఇక ఈ ఏడాది భృతి లేనట్టే. పాలకులకు మళ్లీ ఎన్నికల సమయంలోనే ఇది గుర్తుకువస్తుందేమో. బడ్జెట్ అంతా కల్లబొల్లి కబుర్లే అన్నట్టుగా ఉంది. –వాండ్రాసి శివశంకర్, గ్రాడ్యుయేట్, నగరంపాలెం -
ఏయూపై అదే వివక్ష
ఆంధ్రా యూనివర్సిటీపై ప్రభుత్వం తన వివక్షను కొనసాగిస్తోంది. ఇప్పటికే వర్సిటీ నిర్వహణలో రోజుకో కొత్త నిబంధనలతో ఆంక్షలు విధిస్తుండగా.. తాజాగా బడ్జెట్ కేటాయింపుల్లోనూ తన వైఖరిని మరోసారి తేటతెల్లం చేసింది. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో(2024–25) ఏయూకి రూ.417 కోట్లు కేటాయించారు. అయితే 2025–26 నాటికి ఆ మొత్తాన్ని రూ.389 కోట్లకు తగ్గించారు. సవరించిన అంచనాల సమయానికి ఈ నిధులను మరింత కుదిస్తూ రూ.379 కోట్లకు పరిమితం చేశారు. చివరకు వాస్తవ లెక్కల నాటికి ఇది రూ.300 కోట్లకు పడిపోయే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా.. 2026–27 ఆర్థిక సంవత్సరానికి కూడా కేవలం రూ.389 కోట్లే కేటాయించారు. దీన్ని బట్టి ఏయూకి బడ్జెట్ కేటాయింపులు తగ్గించడమే కాకుండా, నిధుల విడుదల సమయంలోనూ భారీ కోతలు విధిస్తున్నారని స్పష్టమవుతోంది. -
విశాఖ అభివృద్ధిపై అదే నిర్లక్ష్యం
చంద్రబాబు ప్రభు త్వం ఈ బడ్జెట్లోనూ విశాఖ అభివృద్ధిపై అదే నిర్లక్ష్యం చూపించింది. అరకొర నిధులు, కంటి తుడుపు చర్యలు తప్ప విశాఖకు ప్రత్యేకంగా కేటాయించిందేమీ లేదు. విశాఖ మెట్రో విషయంలోనూ.. ఇంకా ఆమోదం పొందని విజయవాడ మెట్రోతో ముడిపెట్టారు. విశాఖ నగరాన్ని వాడుకుని, అమరావతిని అభివృద్ధి చేసుకోవాలన్న చంద్రబాబు వైఖరి ఈ బడ్జెట్తో పూర్తిగా అర్థమైంది. మొత్తంగా ఈ బడ్జెట్తో ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం జరిగింది. సాగునీటి ప్రాజెక్టులకు ఎటువంటి కేటాయింపులూ లేవు. నమ్మి ఓట్లు వేసినందుకు.. ఈ ప్రాంతంలోని అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసింది. నిరుద్యోగ భృతి, మహిళలకు ఆడబిడ్డ నిధి ప్రస్తావనే లేదు. – కేకే రాజు, వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు -
నగర అభివృద్ధిపై శ్రద్ధ ఏదీ?
రాష్ట్రానికి విశాఖ ఆర్థిక రాజధాని అని చంద్రబాబు ప్రభుత్వం పదే పదే వల్లె వేస్తోంది. కానీ, నిధుల కేటాయింపు విషయానికి వచ్చే సరికి మాత్రం ఎక్కడా ప్రాధాన్యత లేకుండా జాగ్రత్తపడుతోంది. తాజాగా విజయవాడ, విశాఖ మెట్రోలకు కలిపి బడ్జెట్లో కేవలం రూ.15.50 కోట్లు మాత్రమే కేటాయించారు. వాస్తవానికి విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు ఇంకా ఆమోదం కూడా లభించలేదు. కానీ, ఇప్పటికే డీపీఆర్ ఆమోదం పొందిన విశాఖ మెట్రోకు ప్రత్యేక కేటాయింపులు జరపకుండా.. అనుమతులు లేని విజయవాడ మెట్రోతో కలిపి అరకొర నిధులు విదిల్చడం విశాఖపై చంద్రబాబు ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో ఇట్టే అర్థమవుతోంది. విజయవాడ మెట్రో ప్రాజెక్టు పట్టాలెక్కేదాకా విశాఖ మెట్రో పనుల్లో కదలిక ఉండదనే సంకేతాలు ప్రభుత్వం ఇస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక విశాఖ నగర అభివృద్ధికి ప్రత్యేక నిధుల కేటాయింపులోనూ ప్రభుత్వం అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. సిటీస్ ప్రాజెక్టు కింద ఒక కోటి రూపాయలు, స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద మరో కోటి రూపాయలు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుంది. నగర అభివృద్ధి కోసం ఇలా కేవలం రూ.2 కోట్లు విదిల్చిన ప్రభుత్వం.. మరో చేత్తో ఏకంగా రూ. 22 కోట్లకు పైగా నిధులను కాజేస్తోంది. విశాఖ–చైన్నె పారిశ్రామిక కారిడార్లో పలు అభివృద్ధి పనుల కోసం జీవీఎంసీ నిధులపై ప్రభుత్వం కన్నేసింది. ఈ పనుల కోసం ఏకంగా రూ. 22.28 కోట్లు జీవీఎంసీ ఖజానా నుంచే ఖర్చు చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో ప్రభుత్వ వాటా కంటే జీవీఎంసీపై పడుతున్న అదనపు భారమే ఎక్కువగా ఉండటం గమనార్హం. -
మైనింగ్ చెక్పోస్టు వల్లే ఆర్మీ ఉద్యోగి మృతి
అనకాపల్లి: మండలంలో మార్టూరు జంక్షన్లో అక్రమ మైనింగ్ చెక్పోస్టు వద్ద లారీలు నిలుపుదల చేయడంతో బవులవాడకు చెందిన ఆర్మీ ఉద్యోగి రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాథం తెలిపారు. అక్రమ మైనింగ్ చెక్పోస్టులను తక్షణమే తొలగించాలని కోరుతూ మండలంలో మార్టూరు జంక్షన్ వద్ద పార్టీ ఆధ్వర్యంలో నాయకులు శనివారం ధర్నా చేపట్టారు. ఆయన మాట్లాడుతూ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గెలిచిన తర్వాత జిల్లాలో మైనింగ్ మాఫియా పెరిగిపోయిందన్నారు. యజమానులు రెండు నుంచి ఐదెకరాలకు పర్మిషన్ తీసుకుని పది, పదిహేను హెక్టార్ల వరకు అక్రమంగా మైనింగ్్ చేస్తున్నారన్నారు. మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు నిర్లక్ష్యం వల్ల ఈ దందా సాగుతుందన్నారు. కొండలను బ్లాస్టింగ్ చేయడం వల్ల చుట్టుపక్కల ఇళ్లు, పొలాల్లో పంటలు దెబ్బతింటున్నాయని వాపోయారు. సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ మండలంలో రోజుకు రెండు వేల భారీ వాహనాల ద్వారా అక్రమంగా మైనింగ్ తరలిస్తున్నారన్నారు. వీటికి ప్రభుత్వ పే బిల్లులు ఉండటం లేదని, కోట్లాది రూపాయల గ్రామీణ సంపదను రాజకీయ నాయకులు దోచుకోవడం అన్యాయమన్నారు. మండలంలో 115 క్వారీల్లో చాలా వాటికి అనుమతులు లేవన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ గంటా శ్రీరామ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రుత్తల శంకరరావు, గనిశెట్టి సత్యనారాయణ, కాళ్ల తలయ్యబాబు, అల్లు రాజు, కె. ఈశ్వరరావు, చలపతి, నాగిరెడ్డి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
సాగరం సాక్షిగా సాహస విన్యాసం
ఏయూ క్యాంపస్: సాగరం సాక్షిగా సాహస విన్యాసాలు అబ్బురపరిచాయి. కదన రంగాన్ని కళ్ళ ముందు ఆవిష్కరించారు. భారత నావికాదళ సమన్వయం, సమర్ధతకు ఈ ప్రదర్శన వేదికగా నిలిచింది. బీచ్ రోడ్డులోని రామకృష్ణ బీచ్ ప్రాంగణం వద్ద శనివారం సాయంత్రం భారత నావికా దళానికి చెందిన యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు చేసిన విన్యాసాలు నగరవాసులను, పర్యాటకులను సంభ్రమాశ్చర్యానికి గురి చేశాయి, ఆకాశంలో రివ్వున ఎగురుతూ యుద్ధానికి సిద్ధం అన్న విధంగా దూసుకు వెళుతున్న లోహ విహంగాలు, నేలపైన సమరానికి సయ్యంటూ పరుగులు తీసిన యుద్ధ ట్యాంకులు ప్రతి క్షణం ఏం జరుగుతుందో అనే ఉత్కంఠను రేపే విధంగా నమూనా విన్యాసాలు సాగాయి. భారత నావికాదళ అమ్ముల పొదలో ఉన్న అనేక యుద్ధ విమానాలు హెలికాప్టర్లు చేసిన సింక్రనైజ్డ్ విన్యాసాలు దేనికదే సమయపాలన, సమన్వయాలకు ప్రతీకలుగా నిలిచాయి. విశాఖ వేదికగా జరుగనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్ లో భాగంగా శనివారం సాయంత్రం జరిగిన నావికాదళ విన్యాసాలు పర్యాటకులను నగరవాసులను అమితంగా ఆకట్టుకున్నాయి భారతదేశ నావికాదళ బలాన్ని, దేశభద్రతలో చేస్తున్న సేవను ప్రతిబింబించే విధంగా ఈ సన్నాహక కార్యక్రమాలు జరిగాయి. ఐఎఫ్ఆర్కు సమయం దగ్గరవుతున్న నేపధ్యంలో ప్రధాన వేదికతో సహా ఇతర ఏర్పాట్లు వేగం పుంచుకున్నాయి. సిటీ పెరేడ్ జరిగే సాగర తీరం అంతా పోలీసులు కట్టుదిట్టమైన బధ్రతా ఏర్పాట్లను చేస్తున్నారు. దీనిలో భాగంగా తీరాన్ని జల్లెడపడుతున్నారు. పోలీసు జాగిలాలలో అణువణువు తనిఖీ చేస్తున్నారు. -
ఘనంగా శివరాత్రి ఉత్సవాలు
సాక్షి,పాడేరు: జిల్లా వ్యాప్తంగా అన్ని శివాలయాల్లోను శివరాత్రి ఉత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తుల శివనామస్మరణతో హోరెత్తాయి.పవిత్ర పుణ్యక్షేత్రమైన మత్స్యగుండం మత్స్యలింగేశ్వరస్వామి ఆలయంతో పాటు జిల్లాలోని అన్ని శివాలయాల్లోను వేకువజామునుంచి భక్తుల తాకిడి నెలకొంది. మత్స్యలింగేశ్వరస్వామితోపాటు మత్స్యదేవతలను దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చారు. ఇన్చార్జి ఆర్డీవో లోకేశ్వరరావుతో పాటు అన్నిశాఖల అధికారులు ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. పార్వతీపరమేశ్వరుల విగ్రహాల ఉరేగింపు పాడేరు పట్టణంలోని గిరికై లాస క్షేత్రంలోని ఉమానీలకంఠేశ్వరస్వామి ఆలయంలోను శివరాత్రి ఉత్సవాలు రెండోరోజు ఘనంగా జరిగాయి. శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను పట్టణ పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు. దేవతామూర్తులు, శక్తి వేషాలు, డప్పు వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి సింహాచలంనాయుడు ఆధ్వర్యంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, అన్ని వర్గాల భక్తులు, వర్తక సంఘాల నేతలు ఉరేగింపులో పాల్గొన్నారు. ఆదివారం ఉమానీలకంఠేశ్వరస్వామి ఆలయంలో అన్నసమారాధన ఏర్పాటుకు ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేసింది. పాత పాడేరు, ఐటీడీఏ పీవో బంగ్లా, లగిశపల్లి, వంజంగి, గెడ్డంపుట్టు, తామారపల్లి, కరకపుట్టు, తురాయిమెట్ట శివాలయాలతో పాటు పోలుపుట్టు, తుమ్మరమెట్ట నాగదేవత మందిరాల్లోను శివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.జిల్లావ్యాప్తంగా ప్రారంభం -
3,480 పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్
అనకాపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 3,480 పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని, పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో 77ను తక్షణమే రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి.బాబ్జి, జి.ఫణీంద్రకుమార్ డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక రింగ్రోడ్డు జంక్షన్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీజీ విద్యార్థుల విద్యా హక్కులను దెబ్బతీస్తూ, ఉన్నత విద్యా వ్యవస్థను బలహీనపరుస్తున్న జీవోలను తక్షణమే రద్దు చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 3,480 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలన్నారు. బోధనా సిబ్బంది లేకపోవడం వల్ల పీజీ విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందలేకపోతున్నారు. పరిశోధన కార్యక్రమాలు నిలిచిపోతున్నాయని వాపోయారు. ప్రైవేట్ యూనివర్సిటీల్లో అవినీతి, అధిక ఫీజుల వసూళ్లు, అక్రమ ప్రవేశాలు వంటి అంశాలను ప్రభుత్వం కఠినంగా అరికట్టాలన్నారు. విద్యను వ్యాపారంగా మార్చే ధోరణిని నిరోధించకపోతే సామాన్య, మధ్య తరగతి విద్యార్థులకు ఉన్నత విద్య అందని ద్రాక్షగా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మణికంఠ, అజయ్, దేవీ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
ఆయుష్మాన్ కేంద్రాన్ని సందర్శించిన టాస్క్ఫోర్స్
మాట్లాడుతున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ టాస్క్ ఫోర్స్ అధికారులు అచ్యుతాపురం రూరల్: మండలంలోని చోడపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ టాస్క్ఫోర్స్ అధికారులు శుక్రవారం సందర్శించారు. రికార్డుల్లో నమోదు చేసిన వివరాల ఆధారంగా గర్భిణులు, బాలింతలు, కౌమారదశ బాలికలకు వైద్య పరీక్షలు, తదితర వివరాలు పరిశీలించారు. జిల్లా ఎన్హెచ్ఎం అధికారి డాక్టర్ ప్రశాంతి, జిల్లా స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎ.రామచంద్రరావు, డీపీవో కె.జగదీష్, అధికారులు పాల్గొన్నారు. -
యువకుడు ఆత్మహత్య
యలమంచిలి రూరల్: చిన్నతనం నుంచి తనను పెంచిన పెద్దమ్మ,మేనమామ మృతి చెందడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.తన తనను పెంచి పెద్ద చేసిన పెద్దమ్మ, మేనమామ ఇద్దరూ లేకపోవడమే ఆత్మహత్యకు కారణంగా తన డైరీలో రాసుకున్నాడు.ఈ ఘటన యలమంచిలి పట్టణం ద్వారకానగర్ పాత ఎస్బీఐ కాలనీలో చోటుచేసుకుంది.పట్టణ ఎస్ఐ కె.సావిత్రి తెలిపిన వివరాలు... పాత ఎస్బీఐ కాలనీలో నివాసముంటున్న అలుగోలు వీరవెంకట శివనాగేశ్వరరావు శుక్రవారం ఉదయం తను నివాసముంటున్న ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకున్నాడు.మృతుని తల్లిదండ్రులు తగరపువలసలో ఉంటున్నారు. అలుగోలు వీరవెంకట శివనాగేశ్వరరావు తండ్రి తగరపువలసలో కార్పెంటర్గా పనిచేస్తున్నాడు.శుక్రవారం ఉదయం తమ కుమారుడికి పలుమార్లు ఫోన్ చేసినపుడు కాల్స్కు సమాధానం ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చి స్థానికంగా తమకు తెలిసిన ఒక యువకుడ్ని శివనాగేశ్వరరావు వద్దకు వెళ్లాలని కోరారు.ఈ మేరకు ఆ యువకుడు అక్కడకు వెళ్లగా తలుపు వేసి ఉండడం చూశాడు.కిటికీలోంచి చూడగా శివనాగేశ్వరరావు ఉరి వేసుకుని మృతి చెందినట్టు గుర్తించి, తల్లిదండ్రులకు తెలిపాడు.ఒంటరి అయ్యాననే భావన,తనను పెంచి పెద్ద చేసిన పెద్దమ్మ,మేనమామ కొన్నేళ్ల క్రితం చనిపోవడంతోనే బలన్మరణానికి పాల్పడినట్టు తన డైరీలో రాసుకున్నాడు.ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు ప్రైవేటుగా పనులు చేసుకుంటూ బతుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న వెంటనే పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.శవపంచనామా,పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
కల్యాణపులోవ జాతరకు పటిష్ట ఏర్పాట్లు
రావికమతం: మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని మండలంలోని చీమలపాడు పంచాయతీ కల్యాణపులోవలో జరిగే పోతురాజుబాబు, పెద్దింటమ్మ జాతర ఏర్పాట్లను కలెక్టర్ విజయ్కృష్ణన్, చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు శుక్రవారం పరిశీలించారు. ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు ఇక్కడ జరిగే ఉత్సవాల సందర్భంగా అధికారులతో ఆమె సమీక్షించారు. ఉత్తరాంధ్రలో అన్ని జిల్లాల నుంచి మూడు లక్షల మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఆలయం వద్ద తొక్కిసలాట జరగకుండా ప్రత్యేక క్యూలెన్లు, ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మహిళలకు స్నాన ఘాట్ల వద్ద ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాలని సూచించారు. జాతరకు వచ్చే భక్తుల కోసం 70 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశామన్నారు. దొండపూడి చెక్పోస్టు నుంచి ఆలయం వరకు ఎనిమిది కిలోమీటర్ల మేర ట్రాఫిక్కు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కల్యాణపులోవ రిజర్వాయర్లో స్నానాల ఘాట్లను సిద్ధం చేశామని, బారికేడ్లు, గజ ఈతగాళ్లు, బోట్లు, లైఫ్ జాకెట్లు, ఫైర్ సిబ్బందిని ఏర్పాటు చేశామని అధికారులు వివరించారు. కొత్తకోట సీఐ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో రిజర్వాయర్, ఆలయం వద్ద సీసీకెమెరాలుతో నిరంతర నిఘాతోపాటు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. చోడవరం ఎమ్యెల్యే రాజు సహాయ సహకారాలతో ఆలయం వద్ద మూడు రోజులపాటు 28 కౌంటర్ల ద్వారా ఉచిత అన్నసమారాధన ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ అంబేడ్కర్, ఎంపీడీవో మహేష్, కొత్తకోట సీఐ కోటేశ్వరరావు, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రాజాన కొండనాయుడు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
శివపూజకు వేళాయె..
గొలుగొండ/నర్సీపట్నం: మహా శివరాత్రి అత్యంత పవిత్రమైనది. హరిహరులిద్దరికీ ప్రీతికరమైనది. మహా శివరాత్రి పర్వదినాల్లో పుణ్య స్నానాలు ఆచరిస్తే పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఈ నెల 15వ తేదీ నుంచి మూడు రోజులపాటు జరగనున్న మహా శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని భక్తులు ఎంతో నిష్టతో పుణ్యస్నానాలు ఆచరించి మహా శివుడ్ని దర్శించుకోనున్నారు. ఆధ్యాత్మిక కేంద్రమైన ధారమఠం, ఉత్తరవాహిని శివరాత్రి స్నానాలు ఆచరించే భక్తులతో సందడిగా మారనుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలోనే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ధారమఠం శివాలయానికి తరలి రానున్నారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో లక్షలాది మంది భక్తులు వస్తారని అంచనా. ఆలయం ప్రాంగణమంతా ఇప్పటికే భారీగా ముస్తాబు చేశారు. 15న రాత్రి మహా రుద్రాభిషేకం, జాగారం సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ దట్టమైన అటవీ ప్రాంతంలో జలజలపారే జలపాతాల వద్ద పుణ్యస్నానాలు ఆచరించి శివుడిని దర్శించుకోవడం కోసం ఆలయ కమిటీ, దేవాదాయ శాఖ అధికారులు ఇప్పటికే పనులు పూర్తి చేశారు. నర్సీపట్నం నుంచి 30 ప్రత్యేక బస్సులు గొలుగొండ నుంచి ధారమఠం శివాలయానికి వెళ్లడానికి నర్సీపట్నం నుంచి 30 ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నారు. గొలుగొండ వద్ద భారీ చెక్పోస్టు ద్వారా ఇతర వాహనాలకు అనుమతి ఇచ్చారు. నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు, నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ పర్యవేక్షణలో గొలుగొండ, నర్సీపట్నం రూరల్, టౌన్, కృష్ణదేవిపేట, నాతవరం ఎస్ఐల ఆధ్వర్యంలో వంద మంది పోలీస్ సిబ్బందితో ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక కేంద్రంగా గురుదేవుల ఆశ్రమం.... బలిఘట్టం ఉత్తర వాహినిని ఆనుకున్న పాకలపాడు గురుదేవుల ఆశ్రమం ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. నిత్యం భక్తుల రాకపోకలతో గురుదేవుల ఆశ్రమం సందడిగా ఉంటోంది. ప్రతి పౌర్ణమికి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఆశ్రమంలో నిత్యాన్నదానం కొనసాగుతోంది. మహాశివరాత్రి పర్వదినాల్లో బ్రహ్మలింగేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు గురుదేవుల ఆశ్రమాన్ని సందర్శించి గురుదేవుల ఆశీస్సులు పొందుతారు. ఉత్తరవాహిని ఒడ్డున శ్రీరామ సమేత సత్యనారాయణస్వామి ఆలయం ఉంది. స్వామి వారికి నిత్య పూజలు జరిపిస్తున్నారు. ఉత్తర వాహినికి శివరాత్రి శోభ సువిశాలమైన వాతావరణం... నిత్యం ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సందడిగా ఉండే ఉత్తర వాహిని మహా శివరాత్రి మహోత్సవాలకు సిద్ధమైంది. బలిఘట్టం త్రిశూల పర్వతంపై ప్రసిద్ధి చెందిన బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయం ఉంది. ఇక్కడ ఈశ్వరుడు పశ్చిమ ముఖంగా ఉండి, సమీపంలో నది ఉత్తర ముఖంగా ప్రవహించడంతో దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందింది. జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఇక్కడ బ్రహ్మలింగేశ్వరస్వామిని దర్శించుకుని పునీతులవుతారు. బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయంతోపాటు స్తంభాలు, గోపురం సైతం రాతితోనే నిర్మించడం విశేషం. శివరాత్రి రోజు నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. -
ఉపాధ్యాయుల ధర్నా
తుమ్మపాల: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్టీయూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఐ.వి.రామిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా సీపీఎస్ రద్దు చేసి, ఆర్థిక బకాయిలు చెల్లించాలని, పీఆర్సీ కమిషన్ నియామకం చేపట్టాలని, మధ్యంతర భృతి తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలతో పాటు పాఠశాల సమస్యలు పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కె.పరదేశి, రాష్ట్ర కౌన్సిలర్ పి.గంగాధర్, ఉపాధ్యక్షుడు ఉదయ భాస్కర్,మహిళా అధ్యక్షురాలు సునీత, అసోసియేట్ అఽధ్యక్షుడు భాస్కర్, ఎలమంచిలి బాధ్యులు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
క్షతగాత్రుడికి ప్రతి నెలా రూ.2 వేల సాయం
● విశ్రాంత ఎంఈవో అమృత్కుమార్ భరోసా మంచానికే పరిమితమైన రాముకు సాయం చేస్తున్న విశ్రాంత ఎంఈవో అమృత్కుమార్ నాతవరం: కష్టాల్లో ఉన్న పేదలను మావవతా దృక్పథంతో ఆదుకోవడమే తన ధ్యేయమని ఏకే వెల్ఫేర్ సేవా సంఘం అధ్యక్షుడు, విశ్రాంత ఎంఈవో తాడి అమృత్కుమార్ తెలిపారు. మండలంలోని మర్రిపాలెం గ్రామానికి చెందిన బొత్స రాము కొన్ని నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితమయ్యాడు. అతడి భార్య(బాలింత), ఇద్దరు చిన్నారులతో జీవనం సాగించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో రాము కుటుంబానికి విశ్రాంత ఎంఈవో శుక్రవారం రూ.2 వేలు అందజేశారు. రాము పూర్తిగా కోలుకుని ఏదైనా ఉపాధి చేసుకునే వరకు ప్రతి నెలా రూ.2 వేల చొప్పున అందజేస్తానని భరోసా కల్పించారు. తన పెన్షన్లో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు అందజేస్తున్నట్టు తెలిపారు. -
అందుబాటులో ఆధార్ సేవలు
● కలెక్టర్ దినేష్కుమార్ సాక్షి,పాడేరు: జిల్లాలోని ప్రతి గ్రామ సచివాలయాలు, పోస్టాపీసుల్లో ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాలలో అర్హులైన ప్రజలందరికి ఆధార్ సేవలు కల్పించాలని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ అధికారులను ఆదేశించారు.తన కార్యాలయంలో శుక్రవారం కలెక్టర్ జిల్లాస్థాయి ఆధార్ మానటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఆధార్ కేంద్రం వద్ద సర్వీస్ చార్జీల వివరాల బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.అంగన్వాడీ కేంద్రాలు, విద్యాలయాల్లో బయోమెట్రిక్ నవీకరణ శిబిరాలు ఏర్పాటు చేసి ఉచితంగా సేవలు అందించాలన్నారు. వందేళ్లు పైబడిన వృద్ధులకు కూడా ఆధార్ నవీకరణ చేయాలన్నారు. ఈ సమావేశంలో డీఎల్పీవో కుమార్,పలుశాఖల అధికారులు పాల్గొన్నారు. -
పంచాయతీ కార్యదర్శి గైర్హాజరుపై నిరసన
పెదబయలు: మండలంలోని అడుగులపుట్టు పంచాయతీ కార్యదర్శి వి. తులసి రెండు వారాలుగా విధులకు హాజరుకాలేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం గ్రామ సచివాలయం ఎదుట నిరసన చేపట్టారు. కొత్తాపుట్టు గ్రామానికి చెందిన వంతాల త్రినాథరావు మూడు నెలల క్రితం మృతి చెందగా, ఆయన భార్య గున్నమ్మ మరణ ధ్రువీకరణ పత్రం కోసం కార్యదర్శి చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే గ్రామానికి చెందిన మరికొందరు లబ్ధిదారులు కూడా మరణ ధ్రువపత్రాలు అందక ఇబ్బంది పడుతున్నారు. పంచాయతీ తీర్మానాలు లేకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు ఆగిపోయాయని గ్రామస్తులు ఆరోపించారు.కార్యదర్శికి ఫోన్ చేస్తే ఆమె భర్త ఫోన్ ఎత్తి దురుసుగా మాట్లాడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.మండల కేంద్రానికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నా అధికారులు స్పందించకపోవడం దారుణమని మాజీ ఎంపీటీసీ పి. కృష్ణారావు, స్థానిక నేతలు విమర్శించారు. సెలవు పెట్టకుండా విధులకు గైర్హాజరైన కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై కార్యదర్శి తులసిని వివరణ కోరగా.. అనారోగ్య కారణాలతో మెడికల్ లీవ్ కోరానని, ఎంపీడీవో సస్పెన్షన్లో ఉండటంతో సెలవు మంజూరులో జాప్యం జరిగిందని తెలిపారు. కాగా, ఇన్చార్జ్ ఎంపీడీవో సత్యప్రసాద్ స్పందిస్తూ.. తులసి ఈ నెల 9 నుంచి 22 వరకు ఆన్లైన్లో సెలవు కోరారని, ఫిబ్రవరి 13న బొంగరం కార్యదర్శి ప్రసాద్కు అదనపు బాధ్యతలు అప్పగించామని తెలిపారు. ఇకపై ప్రజలకు సేవల్లో జాప్యం ఉండదని ఆయన హామీ ఇచ్చారు. -
పీజేఆర్ఎస్కు వినతుల వెల్లువ
● 109 అర్జీలు స్వీకరణ సాక్షి,పాడేరు: స్థానిక ఐటీడీఏలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థకు వినతులు వెల్లువెత్తాయి. జిల్లాలోని అనేక ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ వ్యక్తిగత,గ్రామాల సమస్యలపై 109 అర్జీలను కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్కు అందజేశారు.ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నిశాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.అలాగే జిల్లా ప్రజలు తమ సమస్యలు పరిష్కారం కాని పక్షంలో 1100 కాల్సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఇన్చార్జి జేసీ తిరుమణి శ్రీపూజ, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, ఇన్చార్జి డీఆర్వో అంబేద్కర్, ఇన్చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు పాల్గొన్నారు. -
పుణ్యధామం
గిరిజన సంస్కృతికి నిలయం, ప్రకృతి మాత ఒడిలో పరవళ్లు తొక్కే జలపాతాల హృదయం.. జిల్లాలోని పావన పుణ్యక్షేత్రం మత్స్యగుండం. ఉత్తర వాహినిగా ప్రవహించే మత్స్యగెడ్డ తీరాన, శివనామ స్మరణతో కొండకోనలు ప్రతిధ్వనించే వేళ వచ్చేసింది. సాక్షాత్తు మత్స్యరూపంలో ఉన్న దేవతలు భక్తులకు దర్శనమిచ్చే ఈ అద్భుత క్షేత్రం, మహాశివరాత్రి ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అటు ఆధ్యాత్మికత, ఇటు ప్రకృతి రమణీయత కలగలిసిన ఈ పుణ్యధామంలో శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రకృతి ఒడిలోసాక్షి, పాడేరు: ప్రకృతి ఒడిలో పులకించే జలపాతాలు, గలగల పారే సెలయేళ్లు.. వీటన్నింటి మధ్య కొలువుదీరిన ఆధ్యాత్మిక క్షేత్రం మత్స్యగుండం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని భక్తుల పాలిట ఆరాధ్య దైవమైన మత్స్యలింగేశ్వర స్వామి క్షేత్రం, మహాశివరాత్రి ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. పురాణ వైభవం.. హుకుంపేట మండలంలోని ఈ పుణ్యక్షేత్రానికి వందేళ్ల పైబడిన ఘన చరిత్ర ఉంది. జి.మాడుగుల మండలం గెమ్మెలి ప్రాంతంలో చిన్న ధారగా మొదలయ్యే మత్స్యగెడ్డ, మత్స్యగుండం మీదుగా జోలాపుట్టు రిజర్వాయర్ వరకు ప్రవహిస్తుంది. ఇక్కడ ప్రవహించే నీరు ఉత్తర వాహినిగా ప్రసిద్ధి చెందింది. కిముడుపల్లి నుంచి వచ్చే గేదెగెడ్డ ఇక్కడ కలవడం వల్ల ఈ సంగమ స్నానం అత్యంత పవిత్రమైనదని, ఇక్కడ స్నానం ఆచరిస్తే పాపాలు తొలగి శుభం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చేపలే ఇక్కడ దేవతలు.. మత్స్య దేవతలు ఇక్కడ ప్రత్యేకత. బండరాళ్ల మధ్య కొలువుదీరిన ఈ చేపలను గిరిజనులు సాక్షాత్తు దైవ స్వరూపాలుగా ఆరాధిస్తారు. భక్తులు భక్తితో మురిలు, అటుకులు, కొబ్బరి ముక్కలను సమర్పిస్తే, వేల సంఖ్యలో చేపలు కనువిందు చేస్తూ పైకి వస్తాయి. ● మత్స్యగుండం ఎగువన కొలువుదీరిన మత్స్యలింగేశ్వర స్వామి, సమీపంలోని నాగదేవత పుట్ట భక్తులకు మానసిక ప్రశాంతతను, ఆధ్యాత్మిక అనుభూతిని ప్రసాదిస్తాయి. మూడు రోజుల సంబరం ఈ నెల 14వ తేదీ (శనివారం) నుంచి 16వ తేదీ (సోమవారం) వరకు మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. వీటిని ఘనంగా నిర్వహించేందుకు స్థానిక గిరిజనులతో హుకుంపేట మండలం మఠం పంచాయతీ సర్పంచ్ మఠం శాంతకుమారి అధ్యక్షతన ఇటీవల ఉత్సవ కమిటీ ఏర్పాటైంది. భక్తుల విరాళాలతో మత్స్యలింగేశ్వర స్వామి ఆలయానికి సౌకర్యాలు అందుబాటులోకి తెస్తున్నారు. ఇందుకు అవసరమైన చర్యలు చేపపట్టాలని కలెక్టర్ దినేష్కుమార్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. జాతర షెడ్యూల్శనివారం ఉదయం 5 గంటల నుంచి మత్స్యలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమవుతాయి. జాతరలో ఇది అత్యంత ముఖ్యమైన రెండవ రోజు ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి మఠం పంచాయతీలో శివపార్వతుల విగ్రహాల ఊరేగింపు ఉంటుంది. రాత్రికి మత్స్యలింగేశ్వర స్వామి వారి కల్యాణం జరుగుతుంది. కలెక్టర్ దినేష్ కుమార్ పర్యవేక్షణలో అన్ని శాఖలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఉత్సవాలు చివరి రోజు సోమవారం స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తారు. రాత్రితో జాతర ముగుస్తుంది. -
అరకు వారపు సంతపైడ్రోన్ నిఘా
డుంబ్రిగుడ: అరకులో శుక్రవారం జరిగిన జిల్లాలోనే అతిపెద్ద వారపు సంతపై పోలీసులు డ్రోన్ సహాయంతో నిఘా పెట్టారు. ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు ఎస్ఐ సురేష్ తన సిబ్బందితో కలిసి సంత ప్రాంతాన్ని పర్యవేక్షించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేశారు.ఒడిశా, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల నుంచి వ్యాపారులు భారీగా వస్తుండటంతో, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నిఘా పెంచారు.గంజాయి, నాటుసారా వంటి మత్తు పదార్థాల రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. -
శతశాతం ఉత్తీర్ణత తప్పనిసరి
పెదబయలు: టెన్త్, ఇంటర్లో గురుకుల విద్యార్థులు శత శాతం ఉత్తీర్ణత సాధించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల సంస్థ సహాయ కార్యదర్శి (అకాడమిక్) డాక్టర్ ఎన్జీ కిశోర్ బాబు సూచించారు. శుక్రవారం ఆయన స్థానిక గురుకుల కళాశాల, ఏకలవ్య మోడల్ పాఠశాలను సందర్శించారు. ఇంటర్ విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేస్తున్న తీరును పరిశీలించి, విద్యా ప్రణాళికను పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. గత ఏడాది అల్లూరి జిల్లాలో టెన్త్ ఫలితాలు తగ్గడంతో, ఈసారి రాష్ట్రస్థాయి అధికారుల నేరుగా పర్యవేక్షణలో విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.రెండేళ్ల క్రితం ఒక విద్యార్థి మృతి చెందిన ఘటనలో నాటి ప్రిన్సిపాల్ విఠల్ మూర్తి సస్పెన్షన్ గురించి సిబ్బంది నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు కేశవరావు, శంకర్ రావు పాల్గొన్నారు.గురుకుల సంస్థ సహాయ కార్యదర్శి కిశోర్ బాబు -
జాతరకు ప్రత్యేక బస్సులు
భక్తుల సౌకర్యార్థం పాడేరు డిపో మేనేజర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 20 ప్రత్యేక బస్సులు కేటాయించారు. ఈ నెల 14 నుంచి పాడేరు పాత బస్టాండ్ నుంచి రెండు బస్సులు అందుబాటులో ఉంటాయి. ఈనె 15 వ తేదీ నుంచి పాడేరుతో పాటు అరకులోయ, చింతపల్లి, ముంచంగిపుట్టు రూట్లలో అన్ని బస్సులు మత్స్యగుండం క్షేత్రానికి సర్వీసులు అందిస్తాయి. ● పాడేరు పట్టణంలోని సుండ్రుపుట్టు సాయిబాబా గుడి, మెయిన్ రోడ్డు, పాత బస్టాండ్, సినిమా హాల్ సెంటర్ మరియు ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంతాల నుంచి బస్సులు నడుస్తాయి. ● మూడు రోజుల పాటు భక్తులు మత్స్యదేవతలను (చేపలను) సందర్శించుకునేందుకు ఆలయ కమిటీ ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. -
గోల్లిపుట్టులో తాగునీటి కష్టాలపై ఆందోళన
ముంచంగిపుట్టు: మండలంలోని బరడ పంచాయతీ, గోల్లిపుట్టు గ్రామంలో తాగునీటి కష్టాలను తీర్చాలని కోరుతూ స్థానిక గిరిజనులు ఆందోళనకు దిగారు. గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న నీటి ఇబ్బందులను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, శుక్రవారం గ్రామస్తులు పాడైన తాగునీటి పథకం వద్ద ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాగునీటి కోసం గ్రామ మహిళలు సుమారు రెండు కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లాల్సి వస్తోందన్నారు. గతంలో నవ నిర్మాణ సమితి ద్వారా ఏర్పాటు చేసిన నీటి పథకం ప్రస్తుతం నిరుపయోగంగా మారిందన్నారు. ప్రత్యామ్నాయం లేక గ్రామస్తులు ఊట గెడ్డలు, పారు గెడ్డల నీటినే తాగునీటిగా వాడుతున్నామన్నారు. దీనివల్ల అనారోగ్య బారిన పడే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వంతాల జగన్నాథం, వంతాల రాజు, వంతాల రామన్న, కిల్లో సోమనాథ్ మాట్లాడుతూ.. గ్రామంలోని 20 కుటుంబాలకు చెందిన 140 మంది జనాభా నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తక్షణమే స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని, లేనిపక్షంలో మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు -
బాల్య వివాహాలను నిర్మూలిద్దాం
సాక్షి,పాడేరు: జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యంగా అధికార యంత్రాంగం పనిచేయాలని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ ఆదేశించారు. ఐసీడీఎస్, సీడ్ సంస్థలు సమకూర్చిన బాల్య వివాహాల విముక్తి ప్రచార రథంను ఆయన ఐటీడీఏ ప్రాంగణంలో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలు జరిపినా, ప్రోత్సహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడ బాల్య వివాహాలు జరిగినా 100, 112, 1098, 18001027222 నంబర్లకు ప్రజలు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, ఇన్చార్జి డీఆర్వో అంబేద్కర్, ఇన్చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు పాల్గొన్నారు. -
కాంట్రాక్ట్ కార్మికుడు గణేష్ మృతిపై ఆందోళన
సీలేరు: ఏపీ జెన్కో సీలేరు జలవిద్యుత్ కేంద్రం స్విచ్ యార్డ్లో మరమ్మతులు చేస్తూ, ప్రమాదవశాత్తు కింద పడి గంగిరి గణేష్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందాడు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ మృతుని బంధువులు, గిరిజన సంఘాలు, ప్రజాప్రతినిధులు జెన్కో డివిజనల్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా చేపట్టారు. ముమ్మాటికి జెన్కో అధికారుల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడని మృతి తల్లి, సోదరి ఆరోపించారు. ఎటువంటి అవగాహన లేని అన్–స్కిల్డ్ కార్మికుడితో 220 కేవీ విద్యుత్ లైన్ల వద్ద ప్రమాదకర పనులు చేయించడం వల్లే గణేష్ ప్రాణాలు కోల్పోయాడన్నారు. ప్రమాదం జరిగి రెండు రోజులు గడుస్తున్నా అధికారులు స్పందించకపోవడం, పోస్టుమార్టం నిర్వహించడంలో జాప్యం చేయడంపై కుటుంబ సభ్యులు మండిపడ్డారు. కార్మికులకు కనీస ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పించలేదని నాయకులు నిలదీశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళన ఉధృతం కావడంతో జెన్కో అధికారులు స్పందించి బాధిత కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం, అంత్యక్రియలకు తక్షణమే రూ.50 వేలు ఇస్తామన్నారు. మృతుని తల్లికి నెలకు రూ. పది వేల చొప్పున ఈఎస్ఐ పింఛను అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్రక్రియను నెలరోజుల్లో పూర్తిచేస్తామని వెల్లడించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు ఎస్ఐ యాసిన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో బంధువులకు అప్పగించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, అన్–స్కిల్డ్ కార్మికులతో ప్రమాదకర పనులు చేయించవద్దని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బోనంకి చిన్నయ్య పడాల్, గడుతూరి సత్యనారాయణ, సీఐటీయూ నేతలు సుభాన్, విష్ణు, లక్ష్మణ్, ఎంపీటీసీ సాంబమూర్తి,ఉప సర్పంచ్ మళ్లీ ప్రసాద్. మాజీ సర్పంచ్ కారే శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏపీ జెన్కో అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆవేదన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మృతుడి తల్లి, సోదరి డిమాండ్ పోస్టుమార్టం నిర్వహించడంలో జాప్యంపై మండిపాటు -
మౌంట్ కాఫీ... సరికొత్త స్ఫూర్తి
సాధారణంగా గిరిజన రైతులు తాము పండించిన పంటను దళారులకు అమ్ముకుని తక్కువ ధరతో సరిపెట్టుకుంటారు. కానీ మండలంలోని బడిమెల గ్రామానికి చెందిన ఆ ఎనిమిది మంది రైతులు అలా ఆలోచించలేదు. తమ చెమట చుక్కల విలువను తామే నిర్ణయించుకోవాలనుకున్నారు. మౌంట్ అరకు గిరిజన్ సొసైటీని స్థాపించి రూ.కోటి టర్నోవర్తో అరకు కాఫీ సువాసనలను వ్యాపార సామ్రాజ్యంగా మార్చారు. చదువులేకపోయినా ప్రభుత్వ సాయం, ఆధునిక సాంకేతికతను ఉపయోగించి పక్కా మార్కెటింగ్ వ్యూహంతో ఆదాయం పొందుతూ సాటి రైతులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. డుంబ్రిగుడ: ఉన్నత లక్ష్యానికి ఆలోచన తోడైతే విజయం వరిస్తుందని అల్లూరి జిల్లా డుంబ్రిగుడ మండలంలోని బడిమెల గ్రామానికి చెందిన ఎనిమిది మంది రైతులు నిరూపించారు. అరకు కాఫీని పండించే రైతుకు, దాన్ని తాగే వినియోగదారుడికి మధ్య ఉండే ’మిడిల్ మెన్’ వ్యవస్థను తొలగించి, తామే మౌంట్ అరకు గిరిజన్ సొసైటీ పేరుతో ఒక బ్రాండ్గా ఎదుగుతున్నారు. వనరులు మనవే, శ్రమ మనదే అయినప్పుడు.. లాభం కూడా మనకే దక్కాలన్న ఆశయం.. అరకు కాఫీ సువాసనలు ఇప్పుడు వారి జీవితాల్లో ఆర్థిక పరిమళాలను వెదజల్లుతున్నాయి. ఆలోచన నుంచి ఆవిర్భావం వరకు.. 2023లో ప్రారంభమైన ఈ ప్రస్థానం కేవలం రెండేళ్లలోనే రూ.కోటి టర్నోవర్కు చేరుకోవడం సామాన్య విషయం కాదు. ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకుంటూనే, వ్యాపార మెళకువలపై పట్టు సాధిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. మౌలిక వసతులు.. పెట్టుబడి.. కేంద్ర కాఫీ బోర్డు (ఐసీడీపీ పథకం) సహకారంతో సుమారు రూ.30 లక్షలతో అత్యాధునిక యూనిట్లను వీరు ఏర్పాటు చేసుకున్నారు. కాఫీ నిల్వ కేంద్రం రూ.4.57 లక్షలు, కాఫీ శుద్ధి కేంద్రం రూ.8.23 లక్షలు, సోలార్ డ్రైయింగ్ యూనిట్లు రూ.8.25లక్షలతో నిర్మించుకున్నారు. ఈ మొత్తంలో కొంత రాయితీ రూపంలో లభించగా, మిగిలిన మొత్తాన్ని వ్యాపారం చేస్తూ తిరిగి చెల్లిస్తూ స్వయంసమృద్ధికి నిదర్శనంగా నిలుస్తున్నారు. వ్యవస్థాగత మార్పుతో.. ఈ రైతుల విజయానికి ప్రధాన కారణం మార్కెట్ గమనాన్ని అర్థం చేసుకోవడం. సంప్రదాయకంగా గిరిజన సహకార సంస్థపై ఆధారపడకుండా, ’కొకోరో’ వంటి ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడం ద్వారా వీరు రెండు ప్రయోజనాలు సాధించారు. జీసీసీలో ఉండే చెల్లింపుల జాప్యాన్ని నివారించారు. మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా మెరుగైన ధర పొందుతున్నారు. సంస్థ 2025–26 లక్ష్యాల గణాంకాలు ఆశాజనకంగా ఉన్నాయి. అడ్వాన్స్ రూపంలో పొందిన మొత్తం రూ. 30 లక్షలు కాగా, 26 టన్నుల కాఫీ పండ్లను సేకరించారు. వార్షిక వ్యాపార టర్నోవర్ సుమారు రూ. కోటి సాధించారు. ఈ రైతులు కేవలం లాభాలకే పరిమితం కాకుండా, తమ గ్రామంలోని గిరిజన మహిళలకు ఉపాధి కలి్పస్తూ స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు.లాభాలు వస్తున్నాయి గ్రామంలో యూనిట్ ఏర్పాటుతో స్థానికంగా అనేక మంది గిరిజనులకు ఉపాధి అందిస్తున్నాం. దీని ద్వారా మాకు కూడా కొంత లాభం వస్తోంది. గతంలో జీసీసీ కొనుగోలు చేసేది కాఫీ అయితే మాకు ఆశించినంత డబ్బు వచ్చేది కాదు. ప్రస్తుతం కొక్కొరో కంపెనీకి అమ్మడం వల్ల లాభాలు బాగానే వస్తున్నాయి. – గొల్లోరి సీతారాం, చైర్మన్, అరకు మౌంట్ సొసైటీ, బడిమెలస్థానికంగా ఉపాధి స్థానికంగా యూనిట్ ఏర్పాటు చేయడం వల్ల మాలాంటి వారికి మూడు నెలలు ఉపాధి దొరుకుతోంది. కాఫీ పండ్లు ఆడించి వాటిని ఎండబెట్టి పప్పు చేసి బస్తాల్లో నింపుతున్నాం. నాతో పాటు మరో 30 మంది గిరిజనులకు పని దొరుకుతోంది.వీటితోపాటు వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబంతో సుఖంగా ఉంటున్నాం. – బురిడి మిట్టు, బడిమెల, అరమ పంచాయతీ -
16 మంది విద్యార్థినులకు అస్వస్థత
అడ్డతీగల: గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో వసతులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నా చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం వీడడం లేదు. ఏదైనా ఘటన జరిగినప్పుడు హడావుడి చేస్తున్న ప్రభుత్వ పెద్దలు.. ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా పోలవరం జిల్లా అడ్డతీగలలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో ఒకేసారి 16 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురవడం కలకలం రేగింది. పాఠశాల సిబ్బంది విద్యార్థినులను శుక్రవారం స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్సీ)కు తరలించారు.ఇద్దరికి ఆస్పత్రిలో చికిత్సఅనారోగ్యం బారిన పడిన విద్యార్థులను పరీక్షించిన వైద్యులు 14 మందికి మందులు ఇచ్చి పాఠశాలకు పంపించారు. ఏడో తరగతి విద్యార్థినులు కాసులేటి శివపార్వతి, లకే నిత్యవేణికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం చికెన్, శుక్రవారం ఉదయం కిచిడీ, పచ్చిపులుసు తిన్నట్టు విద్యార్థినులు అధికారులకు తెలిపారు. వాంతులు కావడంతో ఇబ్బంది పడ్డారు. అయితే కొంత మంది సాధారణ జ్వరం, జలుబుతో బాధపడుతున్నారని.. ఇద్దరికి వాంతులు కావడంతో నీరసపడ్డారని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. పరామర్శసీహెచ్సీలో చికిత్స పొందుతున్న ఇద్దరు విద్యార్థినులను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్వో) సరిత పరామర్శించారు. విద్యార్థులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. గురువారం మధ్యాహ్నం చికెన్ , శుక్రవారం ఉదయం కిచిడీ, పచ్చిపులుసు తిన్నామని ఆ విద్యార్థినులు చెప్పారు. అనంతరం డీఎంహెచ్వో వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. పాఠశాలలో మూçడు రోజుల పాటు వైద్య శిబిరం నిర్వహించాలని ఆదేశించారు. ఆశ్రమ పాఠశాలను గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రుక్మాంగదయ్య కూడా శుక్రవారం సందర్శించారు. బాధిత విద్యార్థినులతో మాట్లాడారు. పాఠశాలలో సౌకర్యాలను పరిశీలించారు. ఎలాంటి అనారోగ్య సమస్య తలెత్తినా వెంటనే విద్యార్థినులను ఆస్పత్రికి తరలించాలని సిబ్బందిని ఆదేశించారు. -
కుక్కల్ని లెక్కెట్టండి!
సాక్షి, పార్వతీపురం మన్యం/వంగర: చంద్రబాబు ప్రభుత్వంలో గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. వివిధ సర్వేలతో పని ఒత్తిడికి గురిచేయడం, సదుపాయాలు సమకూర్చకపోవడం, వారు చేయాల్సిన పనులు కాకుండా ఇతర పనులు అప్పగించడంతో వారంతా రోడ్లెక్కి ఆందోళనలు చేశారు. వేధింపులు భరించలేక కొందరు తనువు చాలించారు. అయినా పట్టించుకోని ప్రభుత్వం వారికి కొత్తకొత్త పనులు అప్పగిస్తూనే ఉంది. తాజాగా.. పార్వతీపురం మున్సిపాలిటీలో వీధి కుక్కలు ఎన్ని ఉన్నాయో లెక్కపెట్టాలంటూ సచివాలయాల్లోని శానిటరీ ఇన్స్పెక్టర్లకు మున్సిపల్ ఉన్నతాధికారులు కొత్త టాస్క్ ఇచ్చారు. ఈ ఆదేశాలపై వార్డు ఉద్యోగులు భగ్గుమంటున్నారు. తాము చదువుకున్న చదువేమిటి.. చేస్తున్న పని ఏమిటో తెలియక ఉద్యోగులు అసంతృప్తికి లోనవుతున్నారు. ఇదెక్కడి ఉద్యోగం బాబోయ్ అంటూ తలలు పట్టుకుంటున్నారు. ఇక్కడితో అయిపోలేదు: విజయనగరం జిల్లా వంగర మండలంలోని సంగమేశ్వరస్వామి ఆలయం వద్ద ఏటా శివరాత్రి రోజున జరిగే ఉత్సవాలకు ఈ ఏడాది సచివాలయ ఉద్యోగులకు డ్యూటీలు వేయడం విమర్శలకు తావిస్తోంది. చీపురుపల్లి ఆర్డీవో ఆదేశాల మేరకు మండల పరిషత్ నుంచి 32 మంది, రెవెన్యూ శాఖ నుంచి ఏడుగురు వీఆర్ఓలకు సంగాంలో డ్యూటీలు వేశారు. గతంలో ఎన్నడూ వీరిని విధుల్లో వినియోగించకపోగా, తాజాగా ఎంపీడీఓ, తహసీల్దార్ 12న ఆర్సీ నెం.20–2026–బి పేరుతో ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 14నుంచి 21వరకు ఎవరెవెరు ఏఏ షిఫ్టులలో విధులకు హాజరు కావాలో అందులో పేర్కొన్నారు. సచివాలయ మహిళా ఉద్యోగులకు రాత్రి షిప్టులు వేయడంపై భగ్గుమంటున్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ నెల 15నుంచి 21 వరకు మహిళా పోలీసులకు విధులు కేటాయించారు. విధులకు డుమ్మా కొడితే బాధ్యతారాహిత్యం కింద చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.సచివాలయ ఉద్యోగులకు శివరాత్రి ఉత్సవాల విధులు కేటాయిస్తూ వంగర ఎంపీడీఓ ఇచ్చిన ఉత్తర్వులు -
సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో విషాదం
సీలేరు: ఏపీ జెన్కో సీలేరు జలవిద్యుత్ కేంద్రం స్విచ్ యార్డ్లో గురువారం జరిగిన ప్రమాదంలో గంగిరి గణేష్ (24) అనే కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందాడు. 220 కేవీ విద్యుత్ వైర్లను సరిచేస్తున్న క్రమంలో గణేష్ పైనుంచి కిందపడిపోయాడు. గమనించిన తోటి సిబ్బంది వెంటనే అతడిని జెన్కో ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం చింతపల్లి తరలిస్తుండగా మార్గమధ్యలో గణేష్ ప్రాణాలు కోల్పోయాడు. సీలేరు ఎస్ఐ యాసిన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలేం జరిగింది? ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. జలవిద్యుత్ కేంద్రంలోని స్విచ్ యార్డు వద్ద 220 కేవీ ఫీడర్ రెండో యూనిట్కు సంబంధించి సాంకేతిక మరమ్మతులు జరుగుతున్నాయి. సుమారు 15 అడుగుల ఎత్తులో పని చేస్తున్న గణేష్ ఒక్కసారిగా కిందపడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. పనిచేస్తున్న సమయంలో విద్యుత్ షాక్ తగలడం వల్లే గణేష్ కిందపడిపోయాడని తోటి కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ ఘటనపై డీఈఈ శ్రీనివాసులు వివరణ ఇస్తూ.. స్విచ్ యార్డులో హాట్లైన్ పెండింగ్ పనుల కోసం ఎల్సీ తీసుకున్నాం. గణేష్ సేఫ్టీ బెల్ట్ ధరించినప్పటికీ, స్టాక్ విరిగిపోవడంతో ప్రమాదం జరిగింది. రెండు వైపులా ఐసోలేటర్లు తెరిచి ఉంచి, ఎర్తింగ్ కూడా చేశాం కాబట్టి విద్యుత్ షాక్ తగిలే అవకాశం లేదు అని తెలిపారు. గ్రామంలో విషాద ఛాయలు గణేష్ మృతి వార్త తెలియడంతో సీలేరు గ్రామంలో విషాదం నెలకొంది. అందరితో సరదాగా ఉండే యువకుడు కళ్లముందే విగతజీవిగా మారడంతో స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. జలవిద్యుత్ కేంద్రం ఈఈ రాజేంద్రప్రసాద్, ఎస్ఈ హనుమ తదితర అధికారులు ఆసుపత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. నష్టపరిహారం చెల్లించకుంటే ఆందోళన.. మృతుడి కుటుంబానికి రూ. కోటి నష్టపరిహారం చెల్లించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సీపీఎం మండల కార్యదర్శి ఎ. బుజ్జిబాబు డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆయన ఆరోపించారు. నష్టపరిహారంతో పాటు కుటుంబంలో ఇద్దరికి ఉపాధి కల్పించాలని కోరారు. అనుభవజ్ఞులైన శాశ్వత ఉద్యోగులు ఉండగా, ప్రమాదకరమైన పనులను కాంట్రాక్ట్ కార్మికులతో చేయించడం దారుణమని విమర్శించారు. -
వ్యాధుల పట్ల అప్రమత్తత అవసరం
● పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారిజయరాజ్ చింతపల్లి: గిరిజన రైతులు పెంచుతున్న కోళ్లు, గొర్రెలు, మేకలకు సోకే వ్యాధుల పట్ల జాగ్రత్త వహించాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ జయరాజ్ సూచించారు. గురువారం ఆయన లోతుగెడ్డ, లంబసింగి పశు ఆసుపత్రులను తనిఖీ చేయడంతో పాటు, భీమసింగిలోని ఫామ్లను పరిశీలించారు. పొరుగు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపిస్తున్న నేపథ్యంలో, గిరిజన రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోళ్లలో అసాధారణ లక్షణాలు కనిపిస్తే వెంటనే పశువైద్యులను సంప్రదించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే 55 వేల గొర్రెలు, మేకలకు ’షీప్ పాక్స్’ టీకాలు వేయడమే కాకుండా మూడు లక్షల పశువులకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశామని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదవశాత్తు పశునష్టం వాటిల్లితే ఆర్థిక భరోసా కోసం రైతులు ’బీమా’ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లావ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారులు సౌజన్యదేవి, శాలిని, ఉపేంద్ర పాల్గొన్నారు. -
మౌంట్ కాఫీ...
సాధారణంగా గిరిజన రైతులు తాము పండించిన పంటను దళారులకు అమ్ముకుని తక్కువ ధరతో సరిపెట్టుకుంటారు. కానీ మండలంలోని బడిమెల గ్రామానికి చెందిన ఆ ఎనిమిది మంది రైతులు అలా ఆలోచించలేదు. తమ చెమట చుక్కల విలువను తామే నిర్ణయించుకోవాలనుకున్నారు. మౌంట్ అరకు గిరిజన్ సొసైటీని స్థాపించి రూ.కోటి టర్నోవర్తో అరకు కాఫీ సువాసనలను వ్యాపార సామ్రాజ్యంగా మార్చారు. చదువులేకపోయినా ప్రభుత్వ సాయం, ఆధునిక సాంకేతికతను ఉపయోగించి పక్కా మార్కెటింగ్ వ్యూహంతో ఆదాయం పొందుతూ సాటి రైతులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. సరికొత్త స్ఫూర్తి డుంబ్రిగుడ: ఉన్నత లక్ష్యానికి ఆలోచన తోడైతే విజయం వరిస్తుందని మండలంలోని బడిమెల గ్రామానికి చెందిన ఎనిమిది మంది రైతులు నిరూపించారు. అరకు కాఫీని పండించే రైతుకు, దాన్ని తాగే వినియోగదారుడికి మధ్య ఉండే ’మిడిల్ మెన్’ వ్యవస్థను తొలగించి, తామే మౌంట్ అరకు గిరిజన్ సొసైటీ పేరుతో ఒక బ్రాండ్గా ఎదుగుతున్నారు. వనరులు మనవే, శ్రమ మనదే అయినప్పుడు.. లాభం కూడా మనకే దక్కాలన్న ఆశయం.. అరకు కాఫీ సువాసనలు ఇప్పుడు వారి జీవితాల్లో ఆర్థిక పరిమళాలను వెదజల్లుతున్నాయి. ఆలోచన నుంచి ఆవిర్భావం వరకు.. ● 2023లో ప్రారంభమైన ఈ ప్రస్థానం కేవలం రెండేళ్లలోనే రూ.కోటి టర్నోవర్కు చేరుకోవడం సామాన్య విషయం కాదు. ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకుంటూనే, వ్యాపార మెళకువలపై పట్టు సాధిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. మౌలిక వసతులు.. పెట్టుబడి.. కేంద్ర కాఫీ బోర్డు (ఐసీడీపీ పథకం) సహకారంతో సుమారు రూ.30 లక్షలతో అత్యాధునిక యూనిట్లను వీరు ఏర్పాటు చేసుకున్నారు. కాఫీ నిల్వ కేంద్రం రూ.4.57 లక్షలు, కాఫీ శుద్ధి కేంద్రం రూ.8.23 లక్షలు, సోలార్ డ్రైయింగ్ యూనిట్లు రూ.8.25లక్షలతో నిర్మించుకున్నారు. ఈ మొత్తంలో కొంత రాయితీ రూపంలో లభించగా, మిగిలిన మొత్తాన్ని వ్యాపారం చేస్తూ తిరిగి చెల్లిస్తూ స్వయంసమృద్ధికి నిదర్శనంగా నిలుస్తున్నారు. వ్యవస్థాగత మార్పుతో.. ఈ రైతుల విజయానికి ప్రధాన కారణం మార్కెట్ గమనాన్ని అర్థం చేసుకోవడం. సంప్రదాయకంగా గిరిజన సహకార సంస్థపై ఆధారపడకుండా, ’కొకోరో’ వంటి ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడం ద్వారా వీరు రెండు ప్రయోజనాలు సాధించారు. జీసీసీలో ఉండే చెల్లింపుల జాప్యాన్ని నివారించారు. మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా మెరుగైన ధర పొందుతున్నారు. ● సంస్థ 2025–26 లక్ష్యాల గణాంకాలు ఆశాజనకంగా ఉన్నాయి. అడ్వాన్స్ రూపంలో పొందిన మొత్తం రూ. 30 లక్షలు కాగా, 26 టన్నుల కాఫీ పండ్లను సేకరించారు. వార్షిక వ్యాపార టర్నోవర్ సుమారు రూ. కోటి సాధించారు. ఈ రైతులు కేవలం లాభాలకే పరిమితం కాకుండా, తమ గ్రామంలోని గిరిజన మహిళలకు ఉపాధి కల్పిస్తూ స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. చదువులేకపోయినా పక్కా వ్యూహం ప్రభుత్వ సాయం, సాంకేతికత సద్వినియోగం అరకు కాఫీ సామ్రాజ్యంలో బడిమెల రైతుల కొత్త శకం రెండేళ్లలో రూ.కోటి టర్నోవర్ శిఖరస్థాయికి మౌంట్ అరకు గిరిజన్ సొసైటీ బాటలు స్థానికంగా యూనిట్ ఏర్పాటు చేయడం వల్ల మాలాంటి వారికి మూడు నెలలు ఉపాధి దొరుకుతోంది. కాఫీ పండ్లు ఆడించి వాటిని ఎండబెట్టి పప్పు చేసి బస్తాల్లో నింపుతున్నాం. నాతో పాటు మరో 30 మంది గిరిజనులకు పని దొరుకుతోంది.వీటితోపాటు వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబంతో సుఖంగా ఉంటున్నాం. – బురిడి మిట్టు, బడిమెల, అరమ పంచాయతీగ్రామంలో యూనిట్ ఏర్పాటుతో స్థానికంగా అనేక మంది గిరిజనులకు ఉపాధి అందిస్తున్నాం. దీని ద్వారా మాకు కూడా కొంత లాభం వస్తోంది. గతంలో జీసీసీ కొనుగోలు చేసేది కాఫీ అయితే మాకు ఆశించినంత డబ్బు వచ్చేది కాదు. ప్రస్తుతం కొక్కొరో కంపెనీకి అమ్మడం వల్ల లాభాలు బాగానే వస్తున్నాయి. – గొల్లోరి సీతారాం, చైర్మన్, అరకు మౌంట్ సొసైటీ, బడిమెల -
ఆశ్రమ పాఠశాల హెచ్ఎం సస్పెన్షన్
● ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ ఉత్తర్వులు ● బంగారుమెట్ట పాఠశాల నిర్వహణలో నిర్లక్ష్యంపై చర్యలు ముంచంగిపుట్టు: మండలంలోని బంగారుమెట్ట గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలను గురువారం పాడేరు ఐటీడీఏ పీవో, ఇన్చార్జి జేసీ తిరుమణి శ్రీపూజ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పనితీరుపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో తరగతి గదులను సందర్శించిన పీవో, విద్యార్థినులతో వ్యక్తిగతంగా మాట్లాడారు. పాఠశాలలో అందుతున్న వసతులు, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యాబోధన తీరుపై ఆరా తీశారు.విద్యార్థినులకు పాఠాలు సరిగ్గా అర్థం కావడం లేదని, బోధన సక్రమంగా సాగడం లేదని ఆమె పరిశీలనలో తేలింది. విద్యా ప్రమాణాల నిర్వహణలో పాఠశాల యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ఆమె గుర్తించారు. పాఠశాల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహించిన ప్రధానోపాధ్యాయుడిని తక్షణమే సస్పెండ్ చేస్తూ పీవో ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులందరిపై ఉంది. బోధనలో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. మిగిలిన ఉపాధ్యాయులందరినీ ఆమె తీవ్రంగా మందలించారు. పనితీరులో తక్షణమే మార్పు రాకపోతే బాధ్యులైన అందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
శివరాత్రి శోభ
గిరిజన గ్రామాల్లో మహాశివరాత్రి ఆధ్యాత్మిక శోభ ముందే సంతరించుకుంది. హుకుంపేట మండలం దొంతురాయి గ్రామంలో గిరిజనులు గురువారం నాడే శివరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా ప్రారంభించారు. గ్రామంలోని నాగదేవత పుట్ట వద్దకు ఉదయం నుంచే గిరిజనులు పోటెత్తారు. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు. రోజంతా ఆలయ పరిసరాలు శివనామస్మరణతో మారుమోగాయి. పూజా కార్యక్రమాల అనంతరం, దొంతురాయి నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అడ్డుమండ పంచాయతీ శివాలయం వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. గిరిజన సంప్రదాయ పద్ధతిలో ఘటాలను నెత్తిన ధరించి, శివనామ స్మరణ చేస్తూ భక్తులు సాగారు. – సాక్షి, పాడేరు -
వంద కిలోల గంజాయి పట్టివేత
సీలేరు: ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్న వంద కిలోల గంజాయిని స్థానిక పోలీసులు పట్టుకున్నారు. గురువారం సరిహద్దు ప్రాంతంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా, ఒడిశా నుంచి వస్తున్న ఒక కారు అనుమానాస్పదంగా కనిపించడంతో దానిని ఆపి తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో కారులో దాచిన గంజాయిని గుర్తించినట్లు ఎస్ఐ యాసిన్ తెలిపారు. ఈ దాడిలో వంద కిలోల గంజాయితో పాటు, దానికి సంబంధమున్న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. పట్టుబడిన నిందితులు పల్నాడు జిల్లాకు చెందిన సప్పరాపు గోపి, మారిబోయిన వెంకటేశ్వర్లు, కొమ్మడిగుంట అనిల్ అని పోలీసులు గుర్తించారు. 24 కిలోలతో మరొకరు.. గూడెంకొత్తవీధి: ఒడిశా నుంచి పట్టణ ప్రాంతానికి అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు ఎస్ఐ సురేష్ గురువారం తెలిపారు. రామచంద్రపురం ప్రాంతానికి చెందిన కొగురు రామ్తేజ, ఒడిశాలోని చిత్రకొండ వద్ద 24 కిలోల గంజాయిని కొనుగోలు చేశాడు. తన స్నేహితునితో కలిసి ద్విచక్ర వాహనంపై వస్తుండగా, పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో పట్టుబడ్డాడు. రామ్తేజ పట్టుబడగా, అతని స్నేహితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడి వద్ద నుంచి గంజాయి, ద్విచక్ర వాహనం, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని రిమాండ్కు తరలించామని, పరారైన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నామని ఎస్ఐ పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో రెవెన్యూ అధికారులు లింగాలు, నాగేశ్వరరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.సీలేరులో ముగ్గురి అరెస్టు -
ఆర్థిక బకాయిల చెల్లింపులో విఫలం
● ప్రభుత్వం తీరుపై యూటీఎఫ్ జిల్లాకార్యదర్శి కన్నయ్య మండిపాటు డుంబ్రిగుడ: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల మొండి వైఖరి అవలంబిస్తూ, ఆర్థిక బకాయిలను చెల్లించడంలో విఫలమైందని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్. కన్నయ్య మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు గురువారం ఉద్యోగులు, ఉపాధ్యాయులు కలిసి ’పోస్ట్ కార్డ్’ ఉద్యమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లతో కూడిన పోస్ట్ కార్డులను పోస్ట్ బాక్సులో వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, 29 శాతం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే ఉద్యోగులకు, పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిల కోసం స్పష్టమైన ’రూట్ మ్యాప్’ ప్రకటించాలని కోరారు. ఆర్థిక బకాయిలు తీర్చే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల యూటీఎఫ్ అధ్యక్షుడు శెట్టి బాలకృష్ణ, కార్యదర్శి రాజారావు, నాయకులు మేఘనాథరాజు, రమేష్, లవకుశ, రాజుకుమార్ పాల్గొన్నారు. -
మృతుడి కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం
చింతపల్లి: సీలేరు విద్యుత్ కేంద్రంలో అవుట్సోర్సింగ్ కార్మికుడిగా విధులు నిర్వహిస్తూ, విద్యుత్ షాక్తో మృతి చెందిన గంగిరి గణేష్ కుటుంబానికి రూ. 50 లక్షల నష్టపరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బోనంగి చిన్నయ్య పడాల్ డిమాండ్ చేశారు. గురువారం చింతపల్లి ఏరియా ఆసుపత్రి వద్ద మృతుడి కుటుంబ సభ్యులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. గంగిరి గణేష్ గత ఆరేళ్లుగా సీలేరు విద్యుత్ ప్రాజెక్టులో అవుట్సోర్సింగ్ కార్మికుడిగా పనిచేస్తున్నాడన్నారు. అతని సంపాదనపైనే తల్లి, సోదరుడు ఆధారపడి జీవిస్తున్నారని, అతని మరణంతో ఆ కుటుంబం దిక్కులేనిదైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణమైన విద్యుత్ శాఖ సిబ్బందిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని, ఇందులో భాగంగా శుక్రవారం గణేష్ మృతదేహంతో విద్యుత్ ప్రాజెక్టు వద్ద కుటుంబ సభ్యులు, అవుట్సోర్సింగ్ సిబ్బందితో కలిసి ఆందోళన చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మృతుని కుటుంబ సభ్యులు శివకుమార్, శ్రీను, కూడా సురేష్ పాల్గొన్నారు.బోనంగి చిన్నయ్య పడాల్ డిమాండ్ -
6 కిలోల గంజాయితో ఇద్దరు అరెస్టు
గంజాయితో పట్టుబడిన వ్యక్తులతో పోలీసులు కోటవురట్ల : గంజాయి అక్రమ రవాణా చేస్తూ ఇద్దరు వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గంజాయిని తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో మండలంలోని యండపల్లి వద్ద పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించారు. బ్యాగుతో ఇద్దరు అపరిచిత వ్యక్తులు కనిపించడంతో వారిని తనిఖీ చేయగా 6 కిలోల గంజాయి పట్టుబడింది. ఇక్కడి నుంచి ఎస్.రాయవరం మండలం అడ్డురోడ్డుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన వ్యక్తులు నంధ్యాల జిల్లా సుంకేసుల గ్రామానికి చెందిన కుమ్మరి దస్తగిరి, తలారి సుబ్బ రామయ్య గుర్తించి వారి నుంచి మొబైల్ ఫోన్, 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. వైఎస్సార్సీపీ అనుబంధ విభాగ కమిటీల్లో ఇద్దరికి చోటు -
అందరికీ ఉపాధి లభిస్తుంది
ఈ నెల 19వ తేదీ నుంచి బలమైన శుభముహూర్తాలు ప్రారంభం అవుతున్నాయి. 90 రోజులుగా మూఢాల వల్ల శుభకార్యాలకు బ్రేక్ పడటంతో, ఈ రంగంపై ఆధారపడిన పురోహితులు, కళాకారులు, ఇతర వృత్తుల వారికి ఉపాధి లేకుండా పోయింది. ఇప్పుడు వరుస ముహూర్తాలు వస్తుండటంతో వారందరికీ మళ్లీ చేతి నిండా పని దొరుకుతుంది. – వెలవలపల్లి కోటీశ్వర శర్మ, ప్రముఖ వేద పండితుడు, మునగపాక చైత్ర, వైశాఖ మాసాల్లోనే అధికం చైత్ర మాసంలో సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి కల్యాణం, శ్రీరామ నవమి తర్వాత వివాహాది శుభ కార్యక్రమాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా చైత్ర, వైశాఖ మాసాల్లో ముహూర్తాలు బలంగా ఉన్నాయి. ఇన్నాళ్లూ మూఢాల వల్ల ఖాళీగా ఉన్న అర్చకులు, పండితులు, ఇతర అనుబంధ రంగాల వారికి ఈ సీజన్ మంచి ఉపాధినిస్తుంది. – అయిలూరి శ్రీనివాస దీక్షితులు, శైవాగమ పండితుడు, విశాఖపట్నం -
దద్దుగులలో రెండు పూరిళ్లు దగ్ధం
నాతవరం: మండలంలో సరుగుడు పంచాయతీ శివారు దద్దుగుల గ్రామంలో గురువారం జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు పూరిళ్లు కాలిబూడిదయ్యాయి. ఎప్పుడు మాదిరిగానే మధ్యాహ్నం భోజనం చేసి పోడు వ్యవసాయం పనులు నిమిత్తం గిరిజనులు వెళ్లిపోయారు. గ్యాస్ స్టౌ నుంచి మంటలు వ్యాపించి తాటాకులకు అంటుకుని ఎగసి పడ్డాయి. రెండు తాటాకు ఇళ్లతో పాటు పక్కనే ఉన్న గొర్రెల షెడ్లు కూడా పూర్తిగా కాలిపోయాయి. ఇళ్లలో ఎవరు లేని సమయంలో అగ్ని ప్రమాదం జరగడంతో నిత్యావసర సరకులు, దుస్తులు, పాసు పుస్తకాలు, ఇతర సామగ్రి పూర్తిగా కాలిపోవడంతో బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. స్థానిక ప్రజాప్రతినిధుల సమాచారం మేరకు నాతవరం ఎస్ఐ వై.తారకేశ్వరరావు రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. గ్యాస్ స్టౌను ఎస్ఐ పరిశీలించారు. అగ్ని ప్రమాదంలో గొల్లపల్లి ఆనందరావు, గొల్లపల్లి దేముడు తాటాకు ఇళ్లు, గొల్లపల్లి సోమరాజు గొల్లపల్లి ఉబయ్య, లోచల పెదరాజుబాబుకు చెందిన గొర్రెల పాకలు పూర్తిగా కాలిపోయాయని అధికారులు తెలిపారు. సుమారు రూ.4 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగి ఉంటుందని నాతవరం ఎస్ఐ, రెవెన్యూ సిబ్బంది తెలిపారు. బాధితులను ప్రభుత్వ పరంగా ఆదుకునేందుకు ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామన్నారు. -
ఐఎఫ్ఆర్ ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలి
మహారాణిపేట: ఐఎఫ్ఆర్–2026 నిర్వహణకు సంబంధించి మిగిలిన ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చితో కలిసి కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన ఏర్పాట్ల పురోగతిని పరిశీలించారు. ఈ నెల 17 నుంచి 20 వరకు జరగనున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ, మిలాన్, ఐఎన్ఎస్ కాన్క్లేవ్, సిటీ పరేడ్ కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రపతి, కేంద్ర రక్షణ మంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రి తదితర ప్రముఖుల పర్యటనల దృష్ట్యా ప్రోటోకాల్ ఏర్పాట్లు కచ్చితంగా పాటించాలని సూచించారు. భద్రతా చర్యల్లో భాగంగా ఫిషింగ్ బోట్ జెట్టీలోని పడవలను తాత్కాలికంగా తరలించాలని మత్స్యశాఖ అధికారులకు ఆదేశించారు. కోస్ట్ గార్డ్, మైరెన్ పోలీసులు తీర భద్రత పర్యవేక్షించాలని తెలిపారు. మిలాన్ విలేజ్ స్టాళ్లు, సిటీ పరేడ్ సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లను టూరిజం శాఖ చేపట్టాలని చెప్పారు. 18న జరిగే ఫుల్ డ్రస్ రిహార్సల్కు ముందే అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, పటిష్టమైన బారికేడింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖలకు సూచించారు. హోల్డింగ్ పాయింట్ల వద్ద ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. అవసరమైన మెడికల్ క్యాంపులు, అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలని వైద్య శాఖను ఆదేశించారు. అలాగే వంతెన, రోడ్డు పనులు వేగవంతం చేయాలని, అగ్నిమాపక యంత్రాలు సిద్ధంగా ఉంచాలని, తాగునీరు, టాయిలెట్ సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎయిర్పోర్టు వద్ద రిసెప్షన్ డెస్క్, విశ్వప్రియ ఫంక్షన్ హాల్లో జాయింట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, నేవీ అధికారులు, ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
ఆరు నెలలుగా సెలవుల్లోనే..
రోలుగుంట: మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సుమారు ఆరు నెలలుగా ఇద్దరు ఉద్యోగులు సెలవుల్లో ఉండడంతో సేవలకు అంతరాయం కలుగుతోంది. పలు పనులపై వచ్చే ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వివరాలిలా ఉన్నాయి. 2024లో సీనియర్ అసిస్టెంట్ పి.శ్రీనివాసరావు వేరే మండలం నుంచి బదిలీపై వచ్చి విధుల్లో చేరారు. కొన్ని నెలల పాటు విధులు నిర్వహించిన ఆయన అనారోగ్యం కారణంతో సెలవు పెట్టేశారు. మరో జూనియర్ అిసిస్టెంట్ కె.వి.ఎస్.ఎన్.ఈశ్వరరావు గతేడాది జూలైలో బదిలీ కావడంతో ఆయన స్థానంలో గతేడాది సెప్టెంబర్లో ఎస్.వి.ఎస్.చలపతి వచ్చారు. వారం రోజులు విధులు నిర్వహించి అనంతరం సెలవు పెట్టేశారు. ఇప్పటి వరకూ వారు విధుల్లో చేరక, వేరొకరు రాక వారి కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో మిగతా సిబ్బందిపై పని భారం పడుతోంది. దీనిపై ఎంపీడీవో వి.ఎస్.నాగేశ్వరరావును ‘సాక్షి’వివరణ కోరగా ఇద్దరు ఉద్యోగులూ సెలవుల్లో ఉన్నారని, విధుల ఆటంకం గురించి సీఈవో కార్యాలయంలో నివేదించామన్నారు. దీనికి స్పందించిన అధికారులు సీనియర్ అసిస్టెంట్ సెలవు పెట్టి ఆరు నెలలు దాటడంతో అతని స్థానంలో నక్కపల్లి మండలం గొడిచెర్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో జూనియర్ అసిస్టెంటుగా పని చేస్తున్న వై.గోపాలకృష్ణకు సీనియర్ అసిస్టెంటుగా పదోన్నతి కల్పిస్తూ ఇక్కడికి బదిలీ చేశారని, ఆయన జాయిన్ కావాల్సి ఉందన్నారు. జూనియర్ అసిస్టెంట్ సెలవులోనే ఉన్నారని, విధుల్లో చేరాల్సి ఉందని వివరించారు. -
పాయకరావుపేటలో ‘వై నాట్’ షోరూం ప్రారంభం
పాయకరావుపేట : ప్రముఖ ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్సెస్ స్టోర్ ‘వై నాట్’ 40వ బ్రాంచిని పాయకరావుపేటలో లాయిడ్ ఇండియా 2 హెడ్ ఎ.కె.ఆర్.ప్రసాద్, హైర్ ఆర్ఎం బి.ప్రవీణ్కుమార్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ అధినేత జుజ్జవరపు వెంకటరాయుడు మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాల్లో 39 షోరూంలు ప్రారంభించామని, పాయకరావుపేటలో 40వ షూరూం ఏర్పాటు చేశామన్నారు. 4 ఏళ్లుగా టైమ్స్ ఆఫ్ ఇండియా వారిచే బెస్ట్ ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్సెస్ సోర్గా ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు. షోరూంలో పులవర్తి వెంకటజగన్నాథ్ గుప్తా మొదటి సారి కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏవీ బీఎం నాగవాసు, సాంసంగ్ బీఎం సుమన్, లాయడ్ ఆర్ఎం హేమసుందర్, లాయడ్ బీఎం జీవన్, హైర్ బీఎం మహేష్, ఐఎఫ్బీ బీఎం సుధీర్, క్యారియర్ బీఎం రామకృష్ణ, ప్రీతి బీఎం కృష్ణ, డబ్ల్యూవీపీ బీఎం గోపి, బ్లూస్టార్ బీఎం ప్రకాష్, అన్ని బ్రాంచ్ల ఏఎస్ఎంలు పాల్గొన్నారు. అద్భుత ఆఫర్లతో కస్టమర్లు భారీగా తరలివచ్చారు. -
జీవీఎంసీని సందర్శించిన ఇండోర్ మున్సిపల్ కౌన్సిలర్లు
డాబాగార్డెన్స్: ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన కౌన్సిలర్లు గురువారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. అదనపు కమిషనర్లు పీఎం సత్యవేణి, పి.నల్లనయ్య, డీవీ రమణమూర్తి, ప్రధాన వైద్యాధికారి నరేష్కుమార్ వారితో సమావేశమై నగర అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణపై వివరించారు. పారిశుధ్య కార్మికుల పనితీరు, వ్యర్థాల సేకరణ–తరలింపు, క్లోజ్డ్ కాంపాక్టర్ సిస్టం, గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లు, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ నిర్వహణ, నీటి సరఫరా వ్యవస్థ, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు, త్రిబుల్ ఆర్ సెంటర్లు, సోలార్ ప్లాంట్లు, నీటి శుద్ధి కేంద్రాలు, ఎల్ఆర్ఎస్, బీపీఎస్ అమలు వంటి అంశాలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఇండోర్ సీనియర్ కౌన్సిలర్లు సురేష్ తక్కల్కర్, కాంచన గిద్వానీ విశాఖ నగర పరిశుభ్రత, సుందరీకరణను ప్రశంసించారు. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్, సోలార్ ప్రాజెక్టులు, మురుగునీటి శుద్ధి విధానం ఆదర్శనీయమని పేర్కొన్నారు. అనంతరం పరస్పరం జ్ఞాపికలు అందజేసుకున్నారు. -
పెళ్లి కళ
వచ్చేసిందిసుదీర్ఘ విరామం తర్వాత తెలుగు లోగిళ్లలో మళ్లీ పెళ్లికళ సంతరించుకోనుంది. దాదాపు 90 రోజుల పాటు గురు, శుక్ర మూఢాల కారణంగా నిలిచిపోయిన శుభకార్యాలకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇన్నాళ్లూ అడ్డంకిగా మారిన శూన్యమాసాలు తొలగిపోవడంతో... వేద మంత్రాల సాక్షిగా ఒక్కటయ్యేందుకు వధూవరులు సిద్ధమవుతున్నారు. ఈ నెల 19వ తేదీ నుంచి మే 13 వరకు బలమైన ముహూర్తాలు ఉండటంతో వివాహాలు, గృహ ప్రవేశాలు, ఉపనయనాలు, నిశ్చితార్థాలకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. – మహారాణిపేట ఈ నెల 19 నుంచి మే 13 వరకు పెళ్లిళ్ల జోరు మూడు నెలల విరామం తర్వాత మళ్లీ శుభకార్యాల కళ వ్యాపారాల్లోనూ శుభ కళ ముహూర్తాలు లేక గత మూడు నెలలుగా స్తబ్దుగా ఉన్న వివాహ సంబంధిత వ్యాపారాలు ఇప్పుడు మళ్లీ కళకళలాడుతున్నాయి. కల్యాణ మండపాలు, క్యాటరింగ్, డెకరేషన్, బ్యాండ్ మేళాలు, ఫొటోగ్రాఫర్లు, ఈవెంట్ మేనేజర్లు, వస్త్ర, బంగారు వ్యాపారులు తిరిగి బిజీ అయిపోయారు. ముహూర్తాలు ఖరారు చేసుకునేందుకు జనం పండితుల వద్దకు క్యూ కడుతుండగా, ఫంక్షన్ హాళ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. మూఢాల్లో కేవలం అన్నప్రాసన, నామకరణం వంటి చిన్న కార్యక్రమాలకే పరిమితమైన వారు, ఇప్పుడు భారీ వేడుకలకు సిద్ధమవుతున్నారు. మే 13 వరకు కంటిన్యూ సందడి గత ఏడాది నవంబర్ 26 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 13వ తేదీ వరకు మూఢాల కారణంగా శుభకార్యాలకు బ్రేక్ పడింది. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అధిక మాసం మినహా, మిగిలిన మాసాల్లో శుభమూహూర్తాలు ఉన్నాయి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఫాల్గుణ మాసంలో కూడా అధిక సంఖ్యలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. అయితే, మే 14 నుంచి జూన్ 13వ తేదీ వరకు అధిక జ్యేష్ట మాసం రానుండటంతో ఆ నెల రోజులు మళ్లీ ముహూర్తాలకు విరామం ఉంటుంది. తిరిగి నిజ జ్యేష్ట మాసం, ఆ తర్వాత వచ్చే మాసాల్లో శుభకార్యాలు ఊపందుకుంటాయి. -
అసత్య ప్రచారాల్లో దిట్ట చంద్రబాబు
అనకాపల్లి : సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయకుండా, తిరుమల లడ్డూ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఘోరమైన విషపూరిత ప్రచారాలు సీఎం చంద్రబాబు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ అన్నారు. అసత్యాలను సత్యాలుగా ప్రచారం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కూటమి పాలన సాగుతుందని, త్వరలో వేంకటేశ్వరస్వామి ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడం ఖాయమని పేర్కొన్నారు. స్థానిక రింగ్రోడ్డు వైఎస్సార్సీపీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక, సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేక సీఎం చంద్రబాబు ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ఇప్పటికై నా లడ్డూ విషయంలో తప్పుడు ప్రచారాలు మానుకుని రాష్ట్రంలో వితంతువులు, దివ్యాంగులు, 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు ప్రభుత్వ పింఛను ఇచ్చే విధంగా దృష్టి సాధించాలని హితవు పలికారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, 18 సంవత్సరాలు పైబడి మహిళలకు నెలకు రూ.1500, నిరుద్యోగ భృతి నెలకు రూ.3వేలు ఎప్పడిస్తారో రాష్ట్ర ప్రజలకు స్పష్టమైన ప్రకటన చేస్తే బాగుంటుందన్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంతో వినియోగించే నెయ్యిలో జంతువు కొవ్వు కలవలేదని సిట్ నివేదిక స్పష్టం చేసినప్పటికీ పదే పదే విషపూరిత ప్రచారం చేయడం దారుణమన్నారు. మొన్నటి వరకూ లడ్డులో జంతువు కొవ్వు కలిసిందని, ఇప్పుడు బాత్రూమ్లు కడిగే హర్పిక్స్ తయారీకి వినియోగించే కెమికల్స్ కలిపారని మరో దుష్ప్రచారానికి తెర తీయడం సిగ్గు చేటన్నారు. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లడ్డు విషయంలో తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలన్నారు. రెండేళ్ల పాలనలో రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేయకుండా సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అంటూ డబ్బా కొట్టుకోవడంతో ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. కరోన వంటి విపత్తుల్లో రాష్ట్రానికి ఆదాయం లేకపోయినప్పటికీ వైఎస్సార్సీపీ పానలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాలు పూర్తిగా అమలు చేశారని, ప్రస్తుతం రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అదాయం ఉన్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేక దుష్ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తోందన్నారు. -
కొనసాగుతున్న దళిత రైతుల దీక్షలు
రాంబిల్లి (అచ్యుతాపురం): రాంబిల్లి మండలంలోని పంచదార్లలో దళిత రైతులు నిర్వహిస్తున్న నిరసన దీక్షలు గురువారంతో ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. తమకు అప్పగించిన డీ పట్టా భూముల్ని తప్పుడు నివేదికలు చూపించి స్వాధీనం చేసుకోవాలని అధికారులు ప్రయత్నించడాన్ని నిరసిస్తూ దళిత రైతు కుటుంబాలు దీక్షలకు దిగాయి. గురువారం దీక్షా శిబిరం వద్ద వంటా వార్పు నిర్వహించారు. కాగా సర్వే నంబర్ 2లో పనులు చేపడుతున్న పొక్లెయిన్ని దళితులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వీరిని నియంత్రించేందుకు వచ్చిన ఎంఆర్వోను డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తమ భూమిలో పనులు ఎందుకు చేపడుతున్నారని ప్రశ్నించారు. కూటమి నేతలకు దళిత దీక్షలు కంటగింపుగా మారిందని, తమకు న్యాయం జరిగే వరకూ నిరసన దీక్షలు ఉపసంహరించబోమని దళితులు స్పష్టం చేశారు. -
మందుబాబులను పట్టేసిన డ్రోన్ కెమెరా
మద్యం సేవిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్న సీఐ రేవతమ్మ, ఎస్సై రాజారావు నర్సీపట్నం : నర్సీపట్నం మండలం, నెల్లిమెట్ట జంక్షన్ నుండి బుచ్చంపేట వెళ్లే మార్గంలో సీఐ ఎల్.రేవతమ్మ పర్యవేక్షణలో గురువారం డ్రోన్ కెమెరా ఎగురవేశారు. బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న ఐదుగురు వ్యక్తులను డ్రోన్ కెమెరా పట్టేసింది. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్టు సీఐ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం డ్రోన్ నిఘా ఉంటుందన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. ఈ దాడుల్లో ఎస్ఐ రాజారావు, సిబ్బంది పాల్గొన్నారు. -
కూటమి వైఫల్యాలపై పోరుబాట
● శ్రీశైలంలో భక్తులపై లాఠీచార్జ్ దారుణం ● మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజల గొంతుకగా యువజన విభాగం నిలవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీలో లేని విధంగా వైఎస్సార్ సీపీ యువజన విభాగం అత్యంత బలంగా మారనుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.70 లక్షల మంది యువజన విభాగం సైనికులు తయారవుతున్నారని తెలిపారు. బుధవారం ఎండాడలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఉత్తరాంధ్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నంరెడ్డి అదీప్రాజ్ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర యువజన విభాగం విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జక్కంపూడి రాజా, పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు హాజరయ్యారు. ముందుగా రాజాకు ఉత్తరాంధ్ర యువజన విభాగం జోనల్ అధ్యక్షుడు అంబటి శైలేష్ ఆధ్వర్యంలో భారీ గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్, ఇతర యువజన విభాగం నాయకులతో కలిసి రాజా.. వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. యువజన విభాగమే గొంతుక కావాలి ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. పార్టీ అనుబంధ విభాగాల్లో యువజన విభాగం అత్యంత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. విద్యార్థి దశ నుంచే వైఎస్సార్ సీపీలో పని చేసిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని, గతంలో యువజన విభాగంలో పని చేసిన వారికి ఎమ్మెల్యేలుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా అనేక అవకాశాలు కల్పించామని గుర్తు చేశారు. పార్టీ బలోపేతానికి ఎవరైతే శ్రమిస్తారో వారికి భవిష్యత్తులో కచ్చితంగా అవకాశాలు వస్తాయని భరోసా ఇచ్చారు. ‘చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్మెంట్, ఏటా జాబ్ క్యాలెండర్ వంటి హామీలను తుంగలో తొక్కింది. కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు.. ఉన్న ఉద్యోగాలకే ఎసరు పెట్టింది. ఎండీయూ వాహన ఆపరేటర్లు, వలంటీర్లు సహా అనేక సంస్థల్లో పనిచేస్తున్న చిరుద్యోగులను రోడ్డున పడేసింది. విభజన చట్టం హామీలను, ప్రత్యేక హోదా అంశాన్ని గాలికి వదిలేసింది. వీటిపై యువత పోరాటం చేయాలి’అని రాజా పిలుపునిచ్చారు. దాడి చేసిన వారికి బెయిల్.. ప్రశ్నించిన అంబటికి జైలా? ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారన్న అక్కసుతోనే మాజీ మంత్రి అంబటి రాంబాబుపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారని జక్కంపూడి రాజా ఆరోపించారు. ఇళ్లు ధ్వంసం చేసి పెట్రోల్ బాంబులు విసిరిన వారికి స్టేషన్ బెయిల్ ఇస్తూ, ప్రభుత్వాన్ని నిలదీసిన వారిని అరెస్ట్ చేయడం చంద్రబాబు ప్రభుత్వ కక్ష సాధింపు చర్య అని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసమే తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. జగన్ 2.0లో కార్యకర్తలకే పెద్దపీట జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు. యువజన విభాగమే పార్టీ భవిష్యత్తుకు బాటగా మారుతుందన్నారు. జగన్ 2.0లో కార్యకర్తల ద్వారానే పాలన సాగుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే అదీప్రాజ్ మాట్లాడుతూ.. గతంలో వైఎస్సార్ హయాంలో యూత్ కాంగ్రెస్లో కష్టపడి పనిచేశానని, అందుకే తనను పిలిచి వైఎస్సార్ సీపీ లో ఎమ్మెల్యేగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అవకాశం కల్పించారని గుర్తుచేసుకున్నారు. రాజకీయంగా ఎదగాలనుకునే వారికి, ప్రజా సేవ చేయాలనుకునే వారికి యువజన విభాగం మంచి అవకాశం కల్పిస్తుందన్నారు. గాజువాక సమన్వయకర్త దేవన్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర అంటే ‘ఉత్తి ఆంధ్ర’కాదు ‘ఉద్యమాంధ్ర’అని చరిత్ర చూస్తే తెలుస్తుందన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తూనే.. కుటుంబ బాధ్యతలను కూడా సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో యువజన విభాగం ఉపాధ్యక్షుడు మెంటాడ స్వరూప్, యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి మహ్మద్ ఇమ్రాన్, విశాఖ, అనకాపల్లి, అల్లూరి, విజయనగరం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల యువజన విభాగం అధ్యక్షులు ఉరుకూటి చందు, పుల్లేటి వెంకటేష్, గబ్బిడి శేఖర్, అల్లు అవినాష్, ఎం.పృథ్వీ, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దొడ్డి కిరణ్, పాలిశెట్టి సురేష్, యువజన విభాగం కార్యదర్శులు చింతకాయల వరుణ్, మలసాల కుమార్ రాజా, కనకల ఈశ్వరరావు, చందక అప్పలస్వామి, సంయుక్త కార్యదర్శులు జె.నరేష్, ధీరజ్ కుమార్, నియోజకవర్గం, మండల, వార్డు యువజన విభాగం అధ్యక్షులు పాల్గొన్నారు. -
ఉపాధి హామీ పనుల తనిఖీ
దేవరాపల్లి: ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులను కేంద్రం నుంచి వచ్చిన అధికారితో కూడిన బృందం పరిశీలించింది. మండలంలోని వాలాబు, చింతలపూడి, తామరబ్బ, చిననందిపల్లి, తారువ, బోయిలకింతాడ, కొత్తపెంట తదితర గ్రామాల్లో బుధవారం అధికార్లు పర్యటించారు. గత ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనులకు సంబంధించిన ఫొటోలను మండలాల వారీగా ఆన్లైన్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు పంపించారు. వీటిలో కొన్నింటిని ఎంపిక చేసుకుని అక్కడ నిబంధనల ప్రకారం పని జరిగిందా లేదా అని క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలన చేశారు. జలసంచయ్–భాగీదారీ పథక కేంద్ర నోడల్ అధికారి, కేంద్ర జల కమిషన్ సబ్ డివిజన్ ఇంజినీర్ సుగుణాకరరావు, డ్వామా నుంచి ఇంజినీరింగ్ కన్సల్టెంట్ బాలు తదితర అధికారులు చెరువులు, నీటి గుంతల పనులను పరిశీలించారు. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. వీరి వెంట ఉపాధి హామీ పథకం ఏపీవో వై. రుక్మిణీదేవి, ఈసీ వెంకటేష్, లక్ష్మణరావు, ఎర్రునాయుడు, సత్యనారాయణ ఉన్నారు. -
నిరుపయోగం
నాడుచింతపల్లిలో ఖాళీగా యూత్ ట్రైనింగ్ సెంటర్ భవనం గిరిజన యువత భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన జిల్లాలోని ఏకైక శిక్షణ కేంద్రం.. నేడు నిశ్శబ్దానికి కేరాఫ్ అడ్రస్గా మారింది. రూ.కోట్ల ప్రజాధనంతో చింతపల్లిలో నిర్మించిన యూత్ ట్రైనింగ్ సెంటర్ పాలకుల నిర్లక్ష్యం వల్ల నిరుపయోగంగా పడి ఉంది. ఒకప్పుడు విద్యార్థులు, నిరుద్యోగులతో కళకళలాడిన ఈ భవనం, నేడు కేవలం ఒక ఖాళీ కట్టడంగా మిగిలిపోవడంపై మన్యం యువత ఆవేదన వ్యక్తం చేస్తోంది. కలల సౌధం..నేడుచింతపల్లి: మండలకేంద్రం చింతపల్లికి పొలిమేరలోని కొండపై, ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో గిరిజన యువతకు ఉపాధి శిక్షణ ఇచ్చేందుకు రూ.కోట్లతో నిర్మించిన యూత్ ట్రైనింగ్ సెంటర్ నేడు నిరుపయోగంగా మారింది. చింతపల్లి, గూడెంకొత్తవీధి, కొయ్యూరు మండలాలతో పాటు పాడేరు డివిజన్ పరిధిలోని నిరుద్యోగ యువతకు అండగా నిలవాల్సిన ఈ కేంద్రం, ప్రస్తుతం ఎందుకూ పనికిరాకుండా పడి ఉంది. అనేక శిక్షణలకు వేదికగా.. పదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం చింతపల్లిలోని సాయిబాబా ఆలయ సమీపంలో అన్ని వసతులతో ఈ భవనాన్ని నిర్మించింది. ప్రారంభంలో ఇక్కడ గిరిజన యువతీ యువకులకు కంప్యూటర్ కోర్సులు, హోటల్ మేనేజ్మెంట్, ఇంగ్లీష్ స్కిల్స్, స్వయం ఉపాధి కోర్సులతో పాటు పోలీసు కానిస్టేబుల్, ఏపీపీఎస్సీ గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చేవారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో గిరిజన మహిళలకు ప్రత్యేకంగా టైలరింగ్ శిక్షణ కూడా ఇక్కడ నిర్వహించేవారు. ఏకలవ్య నుంచి కోవిడ్ సెంటర్ వరకు.. చింతపల్లిలో తొలిసారిగా ప్రారంభించిన ఏకలవ్య ఆదర్శ పాఠశాల గత విద్యా సంవత్సరం వరకు ఇక్కడే కొనసాగింది. అంతేకాకుండా ఐటీడీఏ, మాక్స్ ఆధ్వర్యంలో కాఫీ గింజల నిల్వ, రైతులతో సమావేశాలు, వేలం వంటి కార్యక్రమాలు కూడా ఇక్కడే జరిగేవి. కరోనా సమయంలో ఈ కేంద్రాన్ని క్వారంటైన్ సెంటర్గా ఉపయోగించి ఎంతో మందికి సేవలందించారు. గత రెండు, మూడు నెలల క్రితం వరకు కొయ్యూరు ఏకలవ్య ఆదర్శ పాఠశాల కూడా ఇక్కడే నిర్వహించారు. అయితే, కొయ్యూరులో నూతన భవనం అందుబాటులోకి రావడంతో పాఠశాలను అక్కడికి తరలించారు. అప్పటి నుంచి ఈ యూత ట్రైనింగ్ సెంటర్ భవనం ఖాళీగా ఉండి, క్రమంగా పాడవుతోంది. రూ.కోట్ల ప్రజా ధనంతో నిర్మించిన ఈ భవనం నిరుపయోగంగా ఉండటంపై స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, ఈ శిక్షణ కేంద్రాన్ని తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని, తద్వారా నిరుద్యోగ గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. -
36 టన్నుల మేర కాఫీ కొనుగోలు
● జీసీసీ బ్రాంచి మేనేజర్ అప్పన్నమాట్లాడుతున్న జీసీసీ మేనేజర్ అప్పన్న పెదబయలు: స్థానిక జీసీసీ బ్రాంచ్ పరిధిలో 70 టన్నుల కాఫీ కొనుగోలు లక్ష్యం కాగా ఇప్పటివరకు 36 టన్నులు కొనుగోలు చేశామని బ్రాంచ్ మేనేజర్ జి.అప్పన్న తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు కాఫీ కొనుగోలుకు సంబంధించి రూ.1.70 కోట్లతో కాఫీ కొనుగోలు చేయడం జరిగిందన్నారు. కాఫీ గింజలను నేరుగా గ్రామాల్లో రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ వ్యాపారుల దగ్గర రైతులు ముందుగానే అడ్వాన్సులు తీసుకుని ఉన్నందున వారికి ఎక్కువ మొత్తంలో కాఫీ ఇస్తున్నారన్నారు. రైతులకు జీసీసీ ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తున్నట్టు తెలిపారు. దీనిలో భాగంగా ఈ ఏడాది 62 మంది కాఫీ రైతులకు రూ. 5 45 లక్షలు రుణాలు ఇచ్చామన్నారు. గిరిజనులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వ సంస్థలకు విక్రయించాలని ఆయన కోరారు. కాఫీ అమ్మకాలు చేసిన రైతులకు 24 గంటల లోపే వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. -
కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
జి.మాడుగుల: కలెక్టర్ దినేష్ కుమార్ బుధవారం మండలంలోని కుంబిడిసింగి, బొయితిలి, కిల్లంకోట పంచాయతీల్లోని పలు గ్రామాల్లో ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులను పరిశీలించి, స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. కుంబిడిసింగి వెళ్లే మార్గంలో గెడ్డపై జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు. అలాగే, కిల్లంకోట గ్రామ సమీపంలోని గెడ్డపై బ్రిడ్జి నిర్మాణానికి మరో మూడు నెలల్లో టెండర్లు ఖరారు చేసి, పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. కిల్లంకోట పంచాయతీ చిలకపనస గ్రామంలో జరుగుతున్న తారు రోడ్డు పనులను తనిఖీ చేశారు.కె.బందవీధి నుంచి బొయితిలి ఆశ్రమ పాఠశాల వరకు జరుగుతున్న పనులు ఒకటి రెండు రోజుల్లో పూర్తవుతాయని, త్వరలోనే రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. పెదబయలు మండలం బూరికిపనస సమీపంలోని కల్వర్టు పనులు పూర్తికాగానే, మార్చి నాటికి గ్రామం వరకు తారు రోడ్డు నిర్మించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కుంబిడిసింగిలో పంచాయతీ భవనం లేక పడుతున్న ఇబ్బందులను గిరిజనులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరుతూ వినతిపత్రాలు అందజేశారు. స్థానిక ఎంపీపీ లంబోరి అప్పలరాజు కలెక్టర్ను కలిసి పలు ప్రాంతాల్లో కొత్త రోడ్ల మంజూరు కోసం కోరారు. దిగరాపల్లి ఆర్అండ్బీ రోడ్డు నుంచి జాములవీధి వరకు రెండు కిలోమీటర్లు, పులుసుమామిడి ఘాట్ నుంచి సిరిసపల్లి వరకు రెండు కిలోమీటర్లు, వాకపల్లి రోడ్డు నుంచి తోకగరువు వరకు 1.5 కిలోమీటర్ల బీటీ రోడ్లు, మండిభ నుంచి రాసవీధి వరకు 2.5 కిలోమీటర్ల కొత్తరోడ్డు, మడతకొండ నుంచి రెయ్యిలగెడ్డ, వణుకూరు, సారాపల్లి వరకు 3.5 కిలోమీటరు మేర రోడ్లకు నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సుభద్ర, సర్పంచ్లు కృష్ణమూర్తి, లసంగి మాలన్న, మాజీ సర్పంచ్ రామన్న, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
రాజకీయ కక్షతోనే కంటైనర్ తొలగింపు
గొలుగొండ: ఏటిగైరంపేటలో పాల ఉత్పత్తులు విక్రయిస్తున్న కంటైనర్ను కూటమి నేతలు రాజకీయ కక్షతోనే తొలగించారని మండల వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. స్థానిక వైఎస్సార్సీపీ నేత పాము అప్పలనాయుడుపై కక్షతో ఇలా చేయడం సరికాదని వారన్నారు. వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు కొరుప్రోలు పాణీశాంతారామ్, వైఎస్సార్సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు లోచల సుజాత, జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు, ఎంపీపీ గజ్జలపు మణికుమారి ఆధ్వర్యంలో మండల వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు పాము అప్పలనాయుడును పరామర్శించి, కంటైనర్ తొలగించిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంటైనర్ను తొలగించడం దారుణమన్నారు. కోర్టు అనుమతితో ఈ కంటైనర్ ద్వారా పాల ఉత్పత్తుల అమ్మకాలు చేస్తున్నారని, తొలగింపుపై మళ్లీ కోర్టుకు ఆశ్రయిస్తామని వారు చెప్పారు. అప్పలనాయుడు కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ సుర్ల బాబ్జి, గాదంపాలెం, కొమిర సర్పంచ్లు నల్లబెల్లి శ్రీనివాసరావు, అల్లురాజుబాబు, ఏఎల్పురం ఎంపీటీసీ సభ్యులు బుల్లిప్రసాద్, సీనియర్ నాయకులు కిలపర్తి పెద్దిరాజు, కొల్లు సత్యనారాయణ, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
వేసవిలో పొదుపుగా నీటి వాడకం
సీలేరు: ఆంధ్ర – ఒడిశా సరిహద్దులోని జలవిద్యుత్ కేంద్రాలకు నీటిని సరఫరా చేసే బలిమెల జలాశయం నీటి నిల్వలపై బుధవారం ఇరు రాష్ట్రాల అధికారులు స్థానిక ఏపీ జెన్కో గెస్ట్ హౌస్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. రానున్న వేసవిలో గ్రిడ్కు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలని ఇరు రాష్ట్రాల అధికారులు నిర్ణయించారు. బలిమెల జలాశయంలో ప్రస్తుతం మొత్తం 86.8499 టీఎంసీల నీరు ఉంది. దీనిలో ఒడిశా వాటా: 28.4829 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ వాటా: 58.3670 టీఎంసీలు ఉన్నట్టు అధికారులు లెక్క తేల్చారు. విద్యుత్ ఉత్పత్తి, సాగు నీటి అవసరాల కోసం ఒడిశా రోజుకు 3వేలు క్యూసెక్కులు, ఆంధ్రప్రదేశ్ 6,500 క్యూసెక్కుల నీటిని వాడుకునేందుకు పరస్పర అంగీకారం కుదిరింది. 2024–25 నీటి సంవత్సరంలో (జూలై నుంచి జనవరి వరకు) ఒడిశా 58.2836 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ 28.3996 టీఎంసీలు వినియోగించింది. ఈ సమావేశంలో ఒడిశా నీటిపారుదల శాఖ, ఓహెచ్పీసీఎల్ అధికారులతో పాటు ఏపీ జెన్కో సూపరింటెండెంట్ ఇంజనీర్ జాకీర్ హుస్సేన్, హనుమ, ఏడీ జయపాల్ తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్యంతోనే ఉన్నతస్థాయి సాధ్యం
కొయ్యూరు: ఉన్నత స్థితికి చేరేందుకు విద్యార్థులు ఇప్పటినుంచి లక్ష్యంతో ముందుకు సాగాలని అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్ సూచించారు. బుధవారం ఆయన మండలంలో బాలుర ఆశ్రమ పాఠశాల–1, శరభన్నపాలెం బాలుర ఆశ్రమ పాఠశాల, పెదమాకవరం బాలికల పాఠశాలను సందర్శించారు. బోధనను పరిశీలించారు. పెదమాకవరం, శరభన్నపాలెంలో టెన్త్ విద్యార్థులతో మాట్లాడారు. పదిలో మంచి మార్కులు ఎలా సాధించాలో సూచించారు. ఇప్పటినుంచి ఇష్టపడి చదివితే ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చని తెలిపారు. గణితం, ఆంగ్లం,సైన్స్తో పాటు అన్ని సబ్జెక్టుల్లో పట్టు సాధించాలని కోరారు. నిరంతరం లక్ష్యంతో తపిస్తే అనుకున్నది సాధించడం సులభంగా మారుతుందన్నారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడారు. విద్యార్థుల ఆరోగ్యం,బోధనపై దృష్టి సారించాలని సూచించారు. ఎవరికి ఆరోగ్యం సరిగా లేకున్నా తక్షణమే స్పందించాలని కోరారు. విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు. ఆయన వెంట ఏటీడబ్ల్యూవో క్రాంతి కుమార్ ఉన్నారు. -
నిబంధనల ప్రకారమే ఆదిత్యకు ధ్రువపత్రం జారీ
అరకులోయ టౌన్: మండలంలోని పద్మాపురం పంచాయతీ, ఎండపల్లివలస గ్రామానికి చెందిన ఎండపల్లి ఆదిత్యకు గతంలో రెవెన్యూ శాఖ జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రాల ఆధారంగానే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ జారీ చేసినట్లు తహసీల్దార్ కె. కుమారస్వామి స్పష్టం చేశారు. బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆదిత్యకు నకిలీ కుల ధ్రువీకరణ పత్రం జారీ చేసినట్లు కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలపై వివరణ ఇచ్చారు. ఆదిత్య తండ్రి (లేటు) ఎండపల్లి కన్నంనాయుడుకు సంబంధించి 1982 నాటి టీసీతో పాటు 2005, 2017, 2022, 2024 సంవత్సరాల్లో అరకులోయ తహసీల్దార్ కార్యాలయం నుంచి జారీ అయిన కొండదొర (ఎస్టీ) కుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించినట్లు తెలిపారు. అదేవిధంగా ఆదిత్య చదువుకున్న టీసీ, 2013 నుంచి 2025 వరకు వివిధ సంవత్సరాల్లో అతను పొందిన ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాల ఆధారంగానే ఈ సర్టిఫికేట్ ఇచ్చామన్నారు. రైల్వే శాఖలో పనిచేస్తూ మృతి చెందిన కన్నంనాయుడు వారసుడిగా ఆదిత్య ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో అతని కులాన్ని నిర్ధారించాలని కోరుతూ రైల్వే అధికారులు 2025 సెప్టెంబర్ 18, డిసెంబర్ 24 తేదీల్లో తహసీల్దార్కు లేఖలు రాశారన్నారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్, వీఆర్వోలు ఎండపల్లివలసలో క్షేత్రస్థాయి విచారణ (పంచనామా) నిర్వహించి, వారు కొండదొర కులానికి చెందిన వారని నిర్ధారించిన తర్వాతే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ జారీ చేశామని వివరించారు. ఈ విషయంలో ఎవరికై నా ఏవైనా సందేహాలు ఉంటే నేరుగా తమ కార్యాలయానికి వచ్చి నివృత్తి చేసుకోవచ్చని తహసీల్దార్ తెలిపారు. అరకు తహసీల్దార్ కుమారస్వామి -
బంగారుమెట్టలో కొబ్బరి, సరుగుడు తోటలు దగ్ధం
బుచ్చెయ్యపేట : బంగారుమెట్ట,లోపూడి గ్రామాల మధ్య మిరాశలో జరిగిన అగ్ని ప్రమాదంలో మూడు ఎకరాల్లో కొబ్బరి, సరుగుడు తోటలు కాలిపోయాయి. విశాఖకు చెందిన ఉద్యోగి కొబ్బరితోటలో గుర్తు తెలియని వ్యక్తి కాల్చి పారేసిన సిగరెట్టు కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు స్థానికులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో బంగారుమెట్టకు చెందిన జక్కా చిన్నారావు, వేచలపు చినతల్లికి చెందిన సరుగుడు తోటతో పాటు విశాఖకు చెందిన ఉద్యోగి కొబ్బరితోట కాలిపోయాయి. సుమారు రూ.రెండు లక్షలు వరకు ఆస్తి నష్టం జరిగినట్టు బాధిత రైతులు వాపోతున్నారు. స్ధానికుల ఫిర్యాదు మేరకు రావికమతం అగ్నిమాపక సిబ్బంది గంగరాజు, శివయ్యనాయుడు, రాజు, అర్జున మంటలను అదుపు చేశారు. -
మత విద్వేషాలు రగిల్చే రాజకీయాలు మానుకోవాలి
దేవరాపల్లి: ప్రజా సమస్యలను పక్క దారి పట్టించేందుకే చంద్రబాబు ప్రభుత్వం లడ్డూ వివాదాన్ని ముందుకు తెచ్చిందని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. వెంకన్న విమర్శించారు. దేవరాపల్లిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీం కోర్టు తీర్పుకు కట్టుబడి ఉండాలని, ప్రజల మధ్య మత విద్వేషాలు పెంచే రాజకీయాలు మానుకోవాలని సూచించారు. రాజకీయ ప్రయోజనాల కోసం భక్తుల మనోభావాలతో చెలగాటమాడొద్దన్నారు. రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలపై సతమతమవుతుంటే అవేవీ పట్టించుకోకుండా, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు లడ్డూ వివాదాన్ని వాడుకోవడం దారుణమన్నారు. లడ్డూలో జరిగిన కల్తీపై సిట్ నివేదికను అధికారికంగా వెల్లడించకుండానే టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు తమకు తోచిన విధంగా దుష్ప్రచారం చేస్తూ వాస్తవాలను సమాధి చేస్తున్నారని మండిపడ్డారు. లడ్డూ వివాదంపై కూటమి నాయకులు తలో విధంగా మాట్లాడుతూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని చెప్పారు. సుప్రీం కోర్టు ఆదేశంతో కేంద్రం నియమించిన సిట్ టీటీడీకి చెందిన ముగ్గురు అధికారులపై క్రమ శిక్షణా చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తే కూటమి ప్రభుత్వం బదిలీ చేసి చేతులు దులుపుకోవడం వెనుక అంతర్యమేమిటని ప్రశ్నించారు. అవినీతికి పాల్పడ్డారని సిట్ నివేదిక చెప్పినా అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సిట్ నివేదికను బహిర్గతం చేయకుండానే రాష్ట్ర ప్రభుత్వం మరో విచారణ కమిటీ వేయడం చూస్తే రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు అర్థమవుతోందన్నారు. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకన్న -
ఉన్నాధికారులకు నివేదించాం
చింతపల్లిలో నిరుపయోగంగా ఉన్నటు యూత్ ట్రైనింగ్ సెంటర్ని వినియోగంలోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటాం. దీనిపై ఐటీడీఏ ఉన్నతాధికారులకు నివేదిస్తాం. సాధ్యమైన తొందరలో ఈ కేందాన్ని అందుబాటులోనికి తీసుకువచ్చేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. – సీతామహాలక్ష్మి, ఎంిపీడీవో, చింతపల్లివినియోగంలోకి తేవాలి చింతపల్లిలో నిరుపయోగంగా ఉన్న యూత్ ట్రైనింగ్ సెంటర్ను వినియోగంలోకి తీసుకురావాలి. ఈ కేంద్రం నిరుపయోగంతో రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన అత్యాధునిక సౌకర్యాలతో కూడిన భవనం ఎందుకూ పనికి రాకుండా పోతోంది. దీనిపై అధికారులు దృష్టి సారించాలి – దురియా పుష్పలత, అధ్యక్షురాలు, సర్పంచ్ల ఫోరం, చింతపల్లి -
దురుద్దేశంతోనే లడ్డూపై దుష్ప్రచారం
దేవరాపల్లి: సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులు చేపట్టడంలో ఘోరంగా విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే తిరుమల లడ్డూ వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చిందని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు బూడి ముత్యాలనాయుడు విమర్శించారు. దేవరాపల్లి మండలం తారువలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్వార్థ రాజకీయాల కోసం శ్రీవారి లడ్డూ ప్రసాదం పవిత్రతను తగ్గించేలా వ్యవహరించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో జంతు కొవ్వు కలవ లేదని సిట్ నివేదిక స్పష్టం చేసినప్పటికీ పదే పదే విష ప్రచారం చేయడంపై ఆయన మండిపడ్డారు. మొన్నటి వరకు జంతు కొవ్వు కలిసిందని, ఇప్పుడేమో ఏకంగా బాత్రూమ్లు కడిగే హార్పిక్స్ తయారీకి వినియోగించే కెమికల్స్ కలిపారని దు ష్ప్రచారం చేయడం అత్యంత దుర్మార్గమన్నా రు. మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై బురదజల్లాలన్న దుర్బుద్ధితోనే నీచ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ అసత్య ప్రచారాలు చేస్తూ కోట్లాది మంది భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడటం సరికాదని హితవు పలికారు. వీరిద్దరితో పాటు కూటమి నేతలంతా శ్రీవారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా దేవుడితో రాజకీయాలు చేయడం మానుకుని పరిపాలనపై దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే ప్రతిపక్ష నేతల ఇళ్లపై దాడి చేసే విష సంస్కృతిని విడనాడాలని హితవు పలికారు. -
మత్స్యగుండంలో పకడ్బందీగా శివరాత్రి ఉత్సవాలు
● పాడేరు ఇన్చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు మాట్లాడుతున్న ఇన్చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు, ఇతర అధికారులు సాక్షి,పాడేరు: పవిత్ర పుణ్యక్షేత్రం హుకుంపేట మండలంలోని మత్స్యగుండంలో మహా శివరాత్రి ఉత్సవాలను ఈఏడాది కూడా అత్యంత ఘనంగా నిర్వహించాలని పాడేరు ఇన్చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఈనెల 14నుంచి 16వతేదీ వరకు మత్స్యగుండంలో జరిగే శివరాత్రి ఉత్సవాలకు సంబంధించి స్థానిక సబ్కలెక్టర్ కార్యాలయంలో అఽధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నిశాఖల అధికారుల సమన్వయంతో మూడు రోజుల జాతరను విజయవంతం చేయాలన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుశాఖ పటిష్టమైన బందోబస్తు చేపట్టాలని ఆదేశించారు. భక్తులకు సురక్షిత తాగునీరు,విద్యుత్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని, పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో మఠం సర్పంచ్ మఠం శాంతకుమారి, పాడేరు డీఎస్పీ అభిషేక్, డీఎల్పీవో కుమార్, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు. -
మత్స్యగెడ్డలో పడి వ్యక్తి మృతి
అరడకోటలో విషాదం పెదబయలు: మండలంలోని అరడకోట గ్రామ సమీపంలోని మత్స్యగెడ్డలో ప్రమాదవశాత్తు కాలుజారి పడి తమర్భ వెంకటరమణ (35) అనే వ్యక్తి మృతి చెందారు. కుటుంబ సభ్యులు, ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం ఆరు గంటల సమయంలో వెంకటరమణ బహిర్భూమి కోసం మత్స్యగెడ్డ ఒడ్డుకు వెళ్లారు. అక్కడ ప్రమాదవశాత్తు కాలుజారి గెడ్డలో పడిపోవడంతో, నీటి అడుగున ఉన్న ఊబిలో చిక్కుకొని మృతి చెందాడు. ఆ సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఆయన్ని కాపాడే అవకాశం లేకుండా పోయింది. ఒడిశాకు వెళ్లే బోటు రేవు (వెలంబొడ్డ) సమీపంలో కొన్ని గంటల తర్వాత మృతదేహాన్ని గమనించిన స్థానికులు అరడకోట గ్రామస్తులకు సమాచారం అందించారు. వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ వెంకటేష్, మృతదేహాన్ని బయటకు తీయించి పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ముంచంగిపుట్టు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కుటుంబంలో తీరని లోటు.. మృతుడు వెంకటరమణ ప్రైవేటు జీపు డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు, తల్లి ఉన్నారు. ఉదయాన్నే నిద్రలేచి బయటకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన మనిషి, తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు అంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ఈ ఘటనతో అరడకోట గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. -
శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యం
● ఎస్పీ అమిత్ బర్దర్ సాక్షి,పాడేరు: జిల్లాలో మావోయిస్టుల కార్యకలపాల నిర్మూలన ,శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా పోలీసుశాఖ పనిచేయాలని ఎస్పీ అమిత్బర్దర్ ఆదేశించారు. జిల్లాలోని పోలీసు అధికారులతో నెలవారీ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో నమోదైన కేసులపై నేరసమీక్ష జరిపారు. ఆయన మాట్లాడుతూ పోలీసు అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది అంతా గ్రామాల సందర్శన చేపట్టాలన్నారు. బాలికలు, మహిళలకు రక్షణతో పాటు సైబర్ నేరాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. నక్సలిజం, గంజాయి సాగు నిర్మూలన ముందున్న లక్ష్యమన్నారు. ఈ సమావేశంలో ఏఎస్పీలు పంకజ్ కుమార్ మీనా, నవజ్యోతిమిశ్రా, డీఎస్పీలు సాయిప్రశాంత్, ఆర్వీవీఎస్ అభిషేక్, బొడ్డు హేమంత్, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
భగవంతుడిని అడ్డుపెట్టుకుని నీచ రాజకీయం
నర్సీపట్నం: చంద్రబాబు ప్రభుత్వం భగవంతుని ప్రసాదాన్ని రాజకీయాలకు వాడుకోవడం దుర్మార్గమని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మండిపడ్డారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అసత్యాన్ని పదేపదే చెప్పి ప్రజలను నమ్మించడంలో సీఎం చంద్రబాబు దిట్ట అని అన్నారు. తిరుమల లడ్డూ విషయమై కూటమి నేతలు చేసిన ఆరోపణలన్నీ అసత్యమని సిట్, సీబీఐతో కూడిన దర్యాప్తులో తేటతెల్లమైందన్నారు. వేంకటేశ్వరస్వామి ప్రసాదంలో కల్తీ జరిగిందని చంద్రబాబు విషప్రచారం చేసి కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశారన్నారు. లడ్డూలో కల్తీ జరగలేదని నిగ్గుతేల్చిన తర్వాత కూడా కెమికల్స్ కలిశాయని మరో తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టారన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న కూటమి నేతలు తిరుమల వేంకటేశ్వరస్వామి ఆగ్రహానికి గురి కాక తప్పదని హెచ్చరించారు. శ్రీశైలంలో దర్శనం కోసం వచ్చిన శివభక్తులపై లాఠీ చార్జీ చేయించడం దారుణమన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయని ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. రాజకీయాల కోసం దేవుళ్లను వాడుకుంటే దేవుడు కచ్చితంగా శిక్షిస్తారన్నారు. నీచ ప్రచారాలు, అబద్ధాలను కట్టిపెట్టి భక్తుల మనోభావాలను టీడీపీ నాయకులు గౌరవించాలన్నారు. -
ఇచ్చిన హామీలు నిలబెట్టుకో చంద్రబాబు
ఆదివాసీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు రామారావుదొర డిమాండ్ సాక్షి,పాడేరు: ఎన్నికలకు ముందు అరకు సభలో ఆదివాసీలకు ఇచ్చిన నూరుశాతం ఉద్యోగాల హమీని సీఎం చంద్రబాబు వెంటనే నిలబెట్టుకోవాలని ఆదివాసీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు రామారావుదొర డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జీవో నంబరు 3 పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ జీవోను జారీ చేసి గిరిజన ప్రాంతాలలో నూరుశాతం ఉద్యోగాలు గిరిజనులకే కల్పిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు రెండేళ్లు కావవస్తున్నా పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. గత ఏడాది మెగా డీఎస్సీలో గిరిజన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, ఐదు వేల ఉపాధ్యాయ ఉద్యోగాలను కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించిన రాబోయే డీఎస్సీలో మళ్లీ గిరిజనులకు అన్యాయం జరిగే పరిస్థితి ఉందన్నారు. గిరిజన అభ్యర్థులకు న్యాయం జరగాలంటే ఈనెల 11వతేదీ బుధవారం జరిగే 114వ గిరిజన సలహా మండలి(టీఏసీ) సమావేశంలో సీఎం చంద్రాబు, గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి గిరిజనులకు నూరుశాతం ఉద్యోగాల జీవోకు చట్టం చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన సలహా మండలి మినీ రాజ్యాంగంగిరిజనుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన గిరిజన సలహా మండలి మినీ రాజ్యాంగమని, అందులో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యేలు,ఇతర సభ్యులంతా గిరిజనులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. 1/70 భూ బదలాయింపు నిషేద చట్టం రద్దుకు సుప్రీంకోర్టులో దాఖలైన కేసుల్లో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తక్షణమే ఇంప్లీడ్ పిటిషన్ వేయాలని ఆయన కోరారు..రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు చేసిన పోలవరం జిల్లాలో ఏలూరు జిల్లా పరిధిలోని షెడ్యూల్ ప్రాంతాన్ని కలిపి, కారం తమ్మన్నదొర పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. -
ఆటో బోల్తా.. ఐదుగురికి తీవ్ర గాయాలు
క్షతగాత్రులు వైఎస్సార్ కడప జిల్లా వాసులు కొయ్యూరు: మండలంలోని బలభద్రం గ్రామం సమీపంలోని డౌన్ వద్ద మంగళవారం సాయంత్రం ఒక ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులకు ప్రాథమి క చికిత్స అనంతరం 108 వాహనాల్లో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదమిలా.. వైఎస్సార్ కడప జిల్లాలోని కొత్తరెడ్డిపల్లి పంచాయతీ సరిబాల, రామాపురం మండలం గంగునాయుడు గ్రామాలకు చెందిన కొందరు కార్మికులు వాటర్ షెడ్డు పథకం కింద రాతి కట్టు పనుల కోసం కొద్దిరోజుల క్రితం ఇక్కడికి వచ్చారు. వీరంతా మంప పంచాయతీ చిక్కుడుపాడులో నివాసం ఉంటున్నారు.మంగళవారం సాయంత్రం పనులు ముగించుకుని ఆటోలో చిక్కుడుపాడు బయలుదేరారు. డ్రైవర్ అంతిరెడ్డి శ్రీనివాస్ ఆటో నడుపుతుండగా, అతని పక్కనే కూర్చున్న సరిబాలకు చెందిన ఆంజనేయులు తాను నడుపుతానని బలవంతంగా స్టీరింగ్ తీసుకున్నాడు. తోటి కార్మికులు వద్దని వారించినా వినకుండా ఆటో నడపడంతో, డౌన్ ప్రాంతంలో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో ఆటోలో స్థానికులతో కలిపి మొత్తం తొమ్మిది మంది ఉన్నారు. క్షతగాత్రుల వివరాలు: వెంకటేష్(గంగునాయుడు గ్రామం): తల, ముక్కు పై తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉంది. ఆర్. రమణ, ఆర్. శంకర్, జయరామ్: వీరికి కాళ్లు విరగడంతో పాటు ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. ఆంజనేయులు (డ్రైవింగ్ చేసిన వ్యక్తి) తీవ్రంగా గాయపడ్డారు. సహాయక చర్యలు ప్రమాద సమాచారం అందిన వెంటనే 108 వాహనం, రాజేంద్రపాలెం పీహెచ్సీ అంబులెన్స్లో క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ వైద్యులు స్నేహలతా రెడ్డి, స్టాఫ్ నర్సులు ఇందిర, లావణ్య, శైలు, దేవి సత్వర చికిత్స అందించారు. మంప ఎస్ఐ సీదరి శ్రీనివాస్ ఆసుపత్రిని సందర్శించి బాధితుల వివరాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
త్రోబాల్ పోటీల్లో టీచర్ల ప్రతిభ
● రాష్ట్రస్థాయిలో తృతీయ స్థానం ● జట్టు సభ్యులను అభినందించిన కలెక్టర్ దినేష్కుమార్ సాక్షి,పాడేరు: రాష్ట్రస్థాయి టీచర్స్ లీప్ యాప్ ఆధ్వర్యంలో ఇటీవల గుంటూరులో నిర్వహించిన మహిళాటీచర్లు త్రోబాల్ పోటీల్లో సత్తా చాటారు.రాష్ట్రస్థాయిలో మూడవ స్థానం సాధించారు. ఈ సందర్భంగా వీరిని మంగళవారం కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ మంగళవారం కలెక్టరేట్లో అభినందించారు.ఎస్జీఎఫ్ జిల్లా మేనేజర్ సూరిబాబు,కోచ్ రాజులమ్మ,త్రోబాల్ క్రీడాకారులు రమణమ్మ, రాజేశ్వరి, దుర్గలత, కొండమ్మ, ఆశ పాల్గొన్నారు. -
జిహ్వచేపల్యం
నోరూరిస్తున్న ‘పొడైల మాచ్’.. సంతలో విరివిగా అమ్మకాలుపెదబయలు: మన్యంలోని గిరిజనుల జీవనశైలి ఎంత విభిన్నమో, వారి ఆహారపు అలవాట్లు కూడా అంతే ప్రత్యేకం. మైదాన ప్రాంత ప్రజలతో పోలిస్తే వీరి వంటకాలు పూర్తి భిన్నంగా ఉంటాయి. సాధారణంగా అందరూ చేపలతో పులుసు లేదా ఫ్రై చేసుకుంటారు. కానీ, ఇక్కడ వేటాడిన చేపలను నిప్పులపై కాల్చి, ఆపై ఎండలో ఆరబెట్టి భద్రపరుచుకోవడం ఒక విశిష్టమైన పద్ధతి. ఏమిటీ ‘పొడైల మాచ్’? అరకు ప్రాంతంలో ’బొంగు చికెన్’ ఎంత ఫేమస్సో, పెదబయలు వారపు సంతల్లో ’పొడైల మాచ్’ (ఒరియా భాషలో కాల్చిన చేపలు) అంత పాపులర్. ● పెదబయలు, ముంచంగిపుట్టు సరిహద్దుల్లోని మత్స్యగెడ్డ, జోలాపుట్టు రిజర్వాయర్, డుడుమ డ్యాం ప్రాంతాల్లో గిరిజనులు చేపలను వేటాడుతుంటారు. వేటాడి తెచ్చిన చేపల్లో పెద్ద వాటిని పక్కన పెట్టి, చిన్న పరిగె చేపలను ఎంచుకుంటారు. వీటిని మంటల్లో పొడిపొడిగా కాల్చి, ఆ తర్వాత ఎండలో పూర్తిగా ఎండిపోయేలా చేస్తారు. పురుషులు చేపల వేటకు వెళ్తే, వాటిని కాల్చి, ఎండబెట్టి విక్రయానికి సిద్ధం చేసే బాధ్యతను మహిళలు, పిల్లలు తీసుకుంటారు. ఇలా వందలాది గిరిజన కుటుంబాలు ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. సంతల్లో ఫుల్ డిమాండ్! : ప్రస్తుతం మార్కెట్లో దొరికే చెరువు చేపలు, సముద్రపు చేపల కంటే ఈ గెడ్డ చేపలకే గిరాకీ ఎక్కువ. ఎలాంటి వ్యర్థాలు, రసాయనాలు లేకుండా సహజంగా పెరిగే ఈ చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ కాల్చిన చేపలతో పులుసు వండి తినిపిస్తే, బాలింతలకు కాల్షియం లభిస్తుందని, పాలు పెరుగుతాయని గిరిజనుల నమ్మకం. అందుకే ఈ చేపలను కొనుగోలు చేయడానికి గిరిజనులు సంతల్లో ఎగబడుతుంటారు. ప్రకృతి ప్రసాదించిన ఈ సహజ రుచులు గిరిజనుల ఆరోగ్యానికి, ఆర్థిక స్థితికి వెన్నుముకగా నిలుస్తున్నాయి. పెదబయలు సంతలో అడుగుపెడితే చాలు.. నిప్పుల మీద కాల్చిన చేపల ఘుమఘుమలు ఆహ్వానిస్తాయి. ఇవి కేవలం చేపలు మాత్రమే కాదు, గిరిజన సంస్కృతిలో భాగమైన ఒక అద్భుతమైన రుచి. జలాల్లో పట్టిన పరిగెలను అగ్గి మీద కాల్చి, ఎండలో ఆరబెట్టి ఈ వంటకాన్ని సిద్ధం చేస్తారు. సహజసిద్ధమైన ఈ చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు అని, ముఖ్యంగా బాలింతలకు ఇది గొప్ప పౌష్టికాహారమని గిరిజనులు చెబుతుంటారు. రసాయనాలు లేని స్వచ్ఛమైన ఆహారం కావాలనుకునే వారు ఈ ’పొడైల మాచ్’ ను అమితంగా ఇష్టపడతారు. -
గ్యాస్ లీక్.. ఇల్లు దగ్ధం
● టికిలిబెడ్డలో ఘటన డుంబ్రిగుడ: మండలంలోని సాగర పంచాయతీ పరిధి మారుమూల టికిలిబెడ్డ గ్రామంలో మంగళవారం రాత్రి 7:30 గంటలకు జరిగిన అగ్నిప్రమాదంలో అదే గ్రామానికి చెందిన పాలకి అనందరావు ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. గ్యాస్ లీక్ కావడంతో మంటలు వ్యాప్తించి, ఇంట్లోని ధాన్యం, దుస్తులు, విలువైన సామగ్రి పూర్తిగా కాలిబూడిదయ్యాయి. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎటువంటి ప్రాణాపాయం కలగలేదు. సర్వం కోల్పోయి వీధిన పడ్డామని బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే అదుకోవాలని వారు కోరుతున్నారు. -
కార్పొరేట్ కంపెనీల కోసమే లేబర్ కోడ్లు
సాక్షి,పాడేరు: ఈనెల 12వతేదీన తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను కార్మికులంతా విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర నేత, ఉత్తరాంఽధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్ ఎ.అజాశర్మ పిలుపునిచ్చారు. మంగళవారం పీఎంఆర్సీ భవనంలో కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులంతా లేబర్ కోడ్లను తిప్పికొట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లు, కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా ఈలేబర్ కోడ్లు తెచ్చిందని ఆయన ఆరోపించారు. కార్పొరేట్ శక్తులకు రూ.కోట్లు లాభాలు మిగిల్చేందుకు మోడీ ప్రభుత్వం సిద్ధమైందన్నారు. లేబర్ కోడ్లను జిల్లాలోని అన్ని వర్గాల కార్మికులు వ్యతిరేకించాలన్నారు. ఈ సమావేశం అనంతరం బైక్ ప్రచార ర్యాలీని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బోనంగి చిన్నయ్యపడాల్ జెండా ఊపి ప్రారంభించారు.సీఐటీయూ జిల్లా నేతలు ఎల్.సుందర్రావు, పోతురాజు, పలు ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలు చిన్నారి, రేణుక, కాంతమ్మ, రత్నాలమ్మ తదితరులు పాల్గొన్నారు.సీఐటీయూ రాష్ట్ర నేత, ఉత్తరాంఽధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్ అజాశర్మ -
వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ
చింతపల్లి: మండలంలో టెన్త్లో వెనుకబడిన విద్యార్థులకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు పాడేరు, అరకువేలీ ప్రాంతాలకు తరలిస్తున్నట్టు ఎంఈవో ప్రసాద్ తెలిపారు. మండలానికి చెందిన సి,డి గ్రేడ్ల్లో ఉన్నటు 29 మంది విద్యార్థులను గుర్తించామన్నారు. వీరిని ఉన్నతాధికారుల ఆదేశాలు, తల్లిదండ్రుల అంగీకారం మేరకు 13 మంది విద్యార్థినులను అరకువేలీ ఉన్నత పాఠశాలకు,16 మంది బాలురలను పాడేరు ఉన్నత పాఠశాలకు తరలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులతో పాటు పాఠశాలకు సంబంధించిన ముగ్గురు ఉపాధ్యాయులను పంపిస్తున్నామన్నారు. ఈ శిక్షణ నెల రోజులపాటు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక హెచ్ఎం గిడ్డి విజయలక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
అరకువేలీలో తగ్గిన ఉష్ణోగ్రతలు
● 6.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. చలి, మంచు తీవ్రత ఎక్కువగా ఉంది. మంగళవారం అరకువేలిలో 6.5 డిగ్రీ లు, ముంచంగిపుట్టులో 7.0 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. జిల్లాలో పెదబయలులో 8.8 డిగ్రీలు, హుకుంపేటలో 9.1 డిగ్రీలు, జి.మాడుగులలో 10.3 డిగ్రీలు, చింతపల్లిలో 10.5 డిగ్రీలు, కొయ్యూరులో 12.9 డిగ్రీ లు, అనంతగిరిలో 15.1 డిగ్రీలు నమోదు అయ్యాయయని ఆయన పేర్కొన్నారు. -
నకిలీ కుల ధ్రువీకరణ పత్రంపై విచారణ జరిపించాలి
అరకులోయ టౌన్: మండలంలోని పద్మాపురం పంచాయతీ, ఎండపల్లివలస గ్రామానికి చెందిన ఎండపల్లి ఆదిత్య (తండ్రి (లేటు) కన్నం నాయుడు) పొందిన నకిలీ కొండదొర కుల ధ్రువీకరణ పత్రంపై సమగ్ర విచారణ జరపాలని అరకుఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డిమాండ్ చేశారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎండపల్లి ఆదిత్యకు 2025 జూలై 17న ‘కొండదొర’ కుల ధ్రువీకరణ పత్రం జారీ అయ్యిందని, ప్రస్తుతం ఆయన రైల్వేలో ఉద్యోగం చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.దీనిపై గతంలో గిరిజనులు ఫిర్యాదు చేయగా.. ప్రస్తుత తహసీల్దార్ కమక కుమారస్వామి, అప్పటి ఆర్ఐ, వీఆర్వోలు ధ్రువీకరించిన పత్రాలను పరిశీలించి, అది అసలైనదేనని పేర్కొంటూ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ను రైల్వే అధికారులకు పంపడంపై ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎండపల్లివలసలో నివసిస్తున్న ఆదిత్య వాస్తవానికి కొండకాపు కులానికి చెందిన వ్యక్తి అని, అటువంటప్పుడు కొండదొర సర్టిఫికెట్ ఎలా జారీ చేస్తారని ఆయన ప్రశ్నించారు. తప్పుడు ధ్రువీకరణ పత్రం జారీ చేసిన అప్పటి తహసీల్దార్, ఆర్ఐ, వీఆర్వోలపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారిని తక్షణమే విధుల నుంచి తొలగించాలని ఎమ్మెల్యే మత్స్యలింగం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం డిమాండ్ -
● పోతురాజు బాబు ఆలయానికి షెడ్డు నిర్మాణం ● రిటైర్డ్ ఉద్యోగి సేవాభావం
పుట్టిన ఊరిపై మమకారం కొయ్యూరు: ఉద్యోగ రీత్యా ఎక్కడో స్థిరపడినా, కన్నతల్లిని.. ఉన్న ఊరిని మర్చిపోకూడదని నిరూపించారు రిటైర్డ్ ఉద్యోగి జంపా అప్పారావు. తన సొంత గ్రామమైన రావణాపల్లి పంచాయతీ తోట లూరుపై ఉన్న ప్రేమతో, అక్కడి స్థానిక ఆలయ అభివృద్ధికి ఆయన చేయూత అందించారు. భక్తుల సౌకర్యార్థం రూ. 50 వేలతో అభివృద్ధి తోటలూరులోని శ్రీశ్రీశ్రీ పోతురాజు బాబు ఆలయం సరైన వసతులు లేక ఇబ్బందిగా ఉండటాన్ని గమనించిన అప్పారావు, భక్తుల సౌకర్యార్థం ఆలయం ముందు షెడ్డును నిర్మించాలని నిర్ణయించారు. సుమారు రూ. 50 వేలు సొంత నిధులతో రేకుల షెడ్డును ఏర్పాటు చేశారు. ఆయన ఎంఎంటీసీలో పనిచేసి పదవీ విరమణ పొంది ప్రస్తుతం వేరే ప్రాంతంలో స్థిరపడ్డారు. అయినప్పటికీ గ్రామస్తులకు ఇచ్చిన మాట ప్రకారం షెడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయించారు. మంగళవారం షెడ్డు పనులను పర్యవేక్షించిన అనంతరం ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. సొంత ఊరిలోని ఆలయానికి చిన్న సేవ చేసే అవకాశం రావడం నా అదృష్టం. తోటలూరుకు చెందిన ఎంతోమంది వివిధ ప్రభుత్వ, ప్రైవేటు శాఖల్లో ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు. వారందరూ కూడా తమ వంతుగా గ్రామాభివృద్ధికి సహకరించాలి అని ఆయన పిలుపునిచ్చారు. ఆయన దాతృత్వాన్ని చూసి తోటలూరు గ్రామస్తులు అభినందనలతో ముంచెత్తారు. తోటి ఉద్యోగులకు ఆయన ఒక ఆదర్శంగా నిలిచారని స్థానికులు కొనియాడారు. -
రీసర్వే 2.0లో అవకతవకలు జరిగితే చర్యలు
● కలెక్టర్ దినేష్కుమార్ ● పోలవరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్పాడేరు: భూవివాదాల పరిష్కారం, శాశ్వత భూమి హక్కుల పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రీసర్వే 2.0లో ఎలాంటి అవకతవకలు జరిగినా ఉపేక్షించేది లేదని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ హెచ్చరించారు. మంగళ వారం ఆయన కలెక్టరేట్ నుంచి పోలవరం, అల్లూరి జిల్లాల రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడా రు. సర్వే 2.0 నిర్వహణకు అన్ని మండలాల రెవెన్యూ అధికారులు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. సర్వే బృందాలకు మండల స్థాయిలో సమగ్ర శిక్షణ ఇవ్వాలి. ఇందులో తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, వీఆర్వోలు, గ్రామ సర్వేయర్లు, డిజిటల్ అసిస్టెంట్లు కీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు. రెండు జిల్లాల్లో గ్రామాల సంఖ్య ఎక్కువగా ఉన్నందున, సర్వేను అత్యంత జాగ్రత్తగా, విజయవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. మ్యూటేషన్ల సమయంలో సర్వే బృందాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఇన్చార్జి జేసీ తిరుమణి శ్రీపూజ, ఇన్చార్జి డీఆర్వో అంబేద్కర్, తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఉద్యానవన పంటల సాగు పెంచాలి పోలవరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఉద్యానవన పంటల సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, అనుబంధ రంగాల పురోగతిపై నిర్వహించిన సమీక్షలో ఆయన కీలక సూచనలు చేశారు. ఈ రెండు జిల్లాలు ఉద్యానవన పంటలకు ఎంతో అనుకూలమైనవన్నారు. శాస్త్రవేత్తలు, నిపుణుల సలహాలతో భూసార పరీక్షలు నిర్వహించి, కొత్త రకం పంటలను ప్రోత్సహించాలన్నారు. కాఫీ సాగుకు అధిక ప్రాధాన్యతనిస్తూనే, అంతర పంటల సాగును పెంచాలన్నారు. అల్లం, మిరియాలు, డ్రాగన్ ఫ్రూట్, అవకాడో, లిచీ, స్ట్రాబెర్రీ, జీడిమామిడి, పైనాపిల్, సీతాఫలం, పనస, పామాయిల్ వంటి పంటల ద్వారా రైతులకు ఏడాది పొడవునా ఆదాయం లభించేలా చర్యలు తీసుకోవాలి. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి నందు, జిల్లా ఉద్యానవన అధికారి బాలకర్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
చంద్రబాబు,పవన్ కల్యాణ్ శ్రీవారికి క్షమాపణ చెప్పాలి
యలమంచిలి రూరల్: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ ఫైనల్ చార్జ్ షీట్లో నిగ్గుతేల్చిందని వైఎస్సార్సీపీ యలమంచిలి నియోజకవర్గసమన్వయకర్త కర ణం ధర్మశ్రీ తెలిపారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం వ్యవహారంపై చంద్రబాబు ప్రభుత్వం కుట్రకు పాల్పడిందని తెలుపుతూ ఆయన మంగళవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాజకీయ లబ్ధికోసం తిరుమల లడ్డూ పవిత్రతను దెబ్బతీసేలా పదేపదే ప్రకటనలు చేయడం దురదృష్టకరమన్నారు.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శ్రీవారికి క్షమాపణలు చెప్పాలని ఆయనడిమాండ్ చేశా రు.లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని,చేప నూనె కలి పారని ఆరోపణలు చేసి పాపానికి ఒడిగట్టారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో కిలోనెయ్యి రూ.320కి కొంటే,చంద్రబాబు హయాంలో రూ.290కే కొనుగోలు చేశారని పేర్కొన్నారు.బోలే బాబా సంస్థకు సర్టిఫికెట్ ఇచ్చింది, 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వమేనన్నారు. 2019 మార్చి 6న ఆసంస్థకు 82వేల కిలోల నెయ్యి ని ఆర్డర్ ఇచ్చింది కూడా చంద్రబాబు ప్రభుత్వమే ని తెలిపారు.సీబీఐ సిట్ ఎన్డీడీబీ,ఎన్డీఆర్ఐలు ఇచ్చిన నివేదికలు నిజం కాదట,చంద్రబాబు చెప్పి ందే నిజమట అని మండిపడ్డారు.చేసిన తప్పులకు చెంపలు వేసుకుని చంద్రబాబు,పవన్ కల్యాణ్ శ్రీవారికి క్షమాపణలు చెప్పాలని హితవు పలికారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ -
మెడికల్, ఫార్మా మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలి
అనకాపల్లి: రాష్ట్రంలో మెడికల్ అండ్ ఫార్మా మాఫియా ఆగడాలను అరికట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని, దీనికి నిరసనగా సీపీఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 14న జిల్లా కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నామని ఆపార్టీ జిల్లా కార్యదర్శి రాజాన దొరబాబు తెలిపారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో మెడికల్, ఫార్మా మాఫియా వ్యతిరేక పోస్టర్ను మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోగులకు నాసిరకం మందులు పంపిణీ చేయడంతో పాటు వాటిని అధిక ధరలకు అమ్మకాలు చేసి, కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారని తెలిపారు. మాఫియాకు చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని ఆయన కోరారు. అద్దె సర్టిఫికెట్లతో ఫార్మేషన్ లేకుండా నిర్వహిస్తున్న మెడికల్ షాపుల పై తనిఖీలు నిర్వహించి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలో డ్రగ్స్ ఇన్స్పెక్టర్, ఉన్నత అఽధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న మెడికల్, ఫార్మా మాఫియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి వియ్యపురాజు, పరవాడ మండల కన్వీనర్ కె.త్రినాఽథ్, నాయకులు విత్తనాల పోతురాజు, మూతుర్తి సూరిబాబు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
మంచి స్థానం కోసం..
రాష్ట్రంలో మంచి స్థానం కోసం కృషి చేస్తున్నాం. వంద రోజుల ప్రణాళికలో భాగంగా విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వంద రోజుల ప్రణాళికను పటిష్టంగా అమలు చేస్తున్నాం. ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల నుంచి ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు చెందిన మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ప్రస్తుతం ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి. పరీక్షలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నాం. –ఎం.వినోద్బాబు, జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పర్యవేక్షిస్తున్నాం.. గత ఏడాది కంటే మంచి ఫలితాలు తెచ్చేందుకు కృషి చేస్తున్నాం. ప్రత్యేక ప్రణాళికతో విద్యార్ధులకు తర్ఫీదునిస్తున్నాం. అధ్యాపకులు వెనుకబడిన విద్యార్ధులను పర్యవేక్షించి ప్రతీ రోజు పురోగతిని పరిశీలిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా విద్యార్ధులకు సహకారం అందించాలి. ఇంటి వద్ద విద్యార్ధులను పర్యవేక్షించి జాగ్రత్తగా చదివేలా చూడాలి. –డాక్టరు ఎ.ఆర్.టి.సుజాత, ప్రిన్సిపాల్,ప్రభుత్వ జూనియర్ కళాశాల, కోటవురట్ల -
పక్కా ప్రణాళికతో పరీక్షలకు సన్నద్ధం
కోటవురట్ల: జీవితం మలుపుకు మొదటి అడుగు ఇంటర్లోనే..పదిని పదిలంగా దాటేసినా ఇంటర్లో తప్పటడుగులు పడితే కుప్పకూలిపోవడం ఖాయం..ఇక్కడే కాసింత పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి బీజం పడుతుంది. డాక్టరు కావాలన్నా, ఇంజినీరు అవ్వాలన్నా, సైంటిస్టుగా ఎదగాలన్నా ఇంటర్లో శ్రమించాల్సిందే. లక్ష్యంతో గురువుల తర్ఫీదుతో ముందుకెళితే గురి తప్పకుండా మంచి మార్కులు పొందే అవకాశం ఉంటుంది. విద్యార్థుల పట్టుదలకు తల్లిదండ్రుల సహకారం, లెక్చరర్ల ప్రోత్సాహం తోడైతే లక్ష్యాలను ఇట్టే చేరుకోవచ్చు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కూడా ఇందుకు ప్రత్యేక దృష్టి సారించింది. మెరుగైన ఫలితాల కోసం సంకల్పం వంద రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహించి విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వెనుకబడిన విద్యార్ధులపై దృష్టి సారించి వారి అనుమానాలను నివృత్తి చేస్తూ పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. వంద రోజుల ప్రణాళిక ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగనుండగా కళాశాలల్లోనే సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు విద్యార్థులను ప్రశాంత వాతావరణంలో చదివిస్తున్నారు. ఉత్తీర్ణతా శాతాన్ని పెంచేందుకు లెక్చరర్లు కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల కాగా ఈ నెల 23 నుంచి మార్చి 24వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుండగా ప్రస్తుతం ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతున్నాయి. ప్రణాళిక ఇలా.. ఇంటర్లో మంచి మార్కులు సాధించాలంటే పాఠ్యాంశాలపై పూర్తి పట్టు సాధించడంతో పాటు నిరంతర సాధన అవసరమని నిపుణులైన అధ్యాపకులు చెబుతున్నారు. సిలబస్ను ఎప్పటికపుడు అర్థం చేసుకోవడం, చదవాల్సిన అన్ని భావనల జాబితాను తయారు చేసుకోవాలని సూచిస్తున్నారు. పురోగతిని తెలసుకునేందుకు ప్రతీ రోజు పరిశీలన, వారానికి లక్ష్యాన్ని నిర్ధేశించుకోవాలంటున్నారు. ప్రశ్నల నమూనాలు, క్లిష్ట సమస్యలను చేధించేందుకు గత పరీక్ష పత్రాలను అధ్యయనం చేయాలి. ఇక చేతిరాతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. దస్తూరీ ఎంత బాగుంటే అంత మంచి మార్కులు పడే అవకాశం ఉంటుంది. ఎంతమంది హాజరవుతున్నారంటే.. అనకాపల్లి జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 20, ప్రైవేటు కళాళాలలు 77 ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 3,540 మంది, రెండో సంవత్సరం పరీక్షలకు 2,931 మంది, ప్రైవేటు కళాశాల నుంచి మొదటి సంవత్సరం 8,131 మంది, రెండో సంవత్సరం 7,873 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 34 పరీక్ష కేంద్రాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో గత ఏడాది ఇంటర్ మొదటి సంవత్సరంలో అనకాపల్లి జిల్లాకు 63 శాతం, ద్వితీయ సంవత్సరం జిల్లాకు 73 శాతం ఉత్తీర్ణత వచ్చాయి. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాలలో రాష్ట్రంలో అనకాపల్లి జిల్లా 20వ స్థానంలో ఉండగా ద్వితీయ సంవత్సరం 25వ స్థానాన్ని పొందింది. ఈ ఏడాది ఈ స్థానాలను దాటుకుని మంచి స్థానాలకోసం అధికారులు, అధ్యాపకులు సంకల్పంతో కృషి చేస్తున్నారు. -
ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు..
లెక్చరర్లు మాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా ప్రతీరోజూ అదనంగా గంటపాటు చదివిస్తున్నారు. సబ్జెక్టులలో అనుమానాలను తీరుస్తున్నారు. మంచి మార్కులు తెచ్చుకునేందుకు కృషి చేస్తున్నాం. –చరణ్, బైపీసీ ద్వితీయ సంవత్సరం, కోటవురట్ల ప్రోత్సాహం బాగుంది.. అధ్యాపకుల ప్రోత్సాహం బాగుంది. మా కళాశాలలో మంచి వాతావరణం ఉంది. స్టడీ అవర్స్ చెట్ల నీడలో నిర్వహిస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో అధ్యాపకుల పర్యవేక్షణలో పట్టుదలగా చదువుతున్నాం. – మేఘన, సీఈసీ ద్వితీయ సంవత్సరం, కోటవురట్ల -
‘డెయిరీ కంటైనర్ తొలగింపు అన్యాయం’
గొలుగొండ: ఏటిగైరంపేటలో విశాఖ డెయిరీ ఆధ్వర్యంలో పాల ఉత్పత్తుల అమ్మకాలు చేస్తున్న కంటైనర్ను అన్యాయంగా తొలగించడంపై రైతులు ఆవేదన చెందారు. గత ఏడాది అక్టోబర్లో నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్డీడీసీ) గ్రామంలో పాల సంఘం ఆధ్వర్యంలో కంటైనర్ ద్వారా పాల ఉత్పత్తుల అమ్మకం కోసం చర్యలు తీసుకుంది. గ్రామానికి చెందిన పాము లోకేష్కు వీటి బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ కంటైనర్ ద్వారా పాల ఉత్పత్తులు అమ్మకాలు ఇష్టం లేని కొంతమంది అధికార పార్టీని అడ్డం పెట్టుకుని దానిని ఏర్పాటు చేయకుండా అడ్డుకునేందుకు యత్నించారు. విశాఖ డెయిరీ సంఘంలో పాలు పోస్తున్న రైతులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశం మేరకు కంటైనర్ ఏర్పాటు చేసి పాలు, పాల ఉత్పత్తులు అమ్మకాలు ప్రారంభించారు. ఈ పాల ఉత్పత్తులు అమ్మకాలు చేసే కంటైనర్ ఆర్అండ్బీ స్థలంలో ఉందనే కారణంగా మంగళవారం రైతులకు తెలియకుండా దానిని తొలగించారు. ఏటిగైరంపేట పరిధిలో చాలా వరకు ఆర్అండ్బీ స్థలంలోనే షాపులు ఉండగా రైతుల ద్వారా నడిచే ఈ కంటైనర్ తొలగించడం చాలా దారుణంగా ఆవేదన చెందుతున్నారు. వీటిపై మళ్లీ కోర్టుకు ఆశ్రయిస్తామని విశాఖ డెయిరీ సంఘ కార్యదర్శి పాము అప్పలనాయుడు, రైతులు తెలిపారు. -
డీసీసీబీలో చోరీకి యత్నించిన వ్యక్తి అరెస్టు
అనంతగిరి మండలం వెలగలపాడు వాసిగా గుర్తింపు దేవరాపల్లి: మండల కేంద్రం దేవరాపల్లిలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (డీసీసీబీ)లో ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి చోరీకి యత్నించిన కేసులో నిందితుడిని మంగళవారం అరెస్టు చేసినట్లు కె.కోటపాడు ఇన్చార్జి సీఐ పి.అప్పలరాజు తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లో సీసీఎస్ సీఐ కె.అప్పలనాయుడు, స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణతో కలిసి విలేకరులకు వివరాలు వెల్లడించారు. రైవాడ జలాశయం అతిథి గృహం సమీపంలోని బ్యాంకు వెనుక భాగంలో ప్రహరీ దాటి లోపలికి ప్రవేశించాడన్నారు. మేనేజర్ గది కిటికీ ఐరన్ గ్రిల్ను తన వద్ద ఉన్న ఇనుప రాడ్తో తొలగించి బ్యాంకులోకి చొరబడినట్టు చెప్పారు. సీసీ కెమెరాలో తన ముఖం రికార్డు అవుతుందని గమనించి తలపై స్వెటర్ కప్పుకుని లైట్లు ఆఫ్ చేసి చోరీకి యత్నించినట్లు తమ విచారణలో తేలిందన్నారు. క్యాష్ కౌంటర్లలో నగదు దొరకకపోవడంతో లాకర్ను తెరవడానికి యత్నించి విఫలమై అదే మార్గంలో పరారైనట్లు తెలిపారు. బ్యాంక్ మేనేజర్ పూర్ణచంద్రరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అనకాపల్లి డీఎస్పీ ఆదేశాలతో నాలుగు ప్రత్యేక బృందాలతో గాలించినట్టు చెప్పారు. సీసీ ఫుటేజీలో ఫొటో ఆధారంగా నిందితుడు అనంతగిరి మండలం పినకోట పంచాయతీ శివారు వెలగలపాడుకు చెందిన వ్యక్తిగా నిర్ధారించుకున్నట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం దేవరాపల్లి శారదానది వంతెన వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా వచ్చిన యువకుడు పంది ప్రభాస్ను అరెస్టు చేసినట్టు సీఐ తెలిపారు. ఈ కేసును కొద్ది రోజుల్లోనే ఛేదించిన సంబంధిత సీఐలు, ఎస్ఐలు, సిబ్బందిని అనకాపల్లి డీఎస్పీ ఎం. శ్రావణి అభినందించారు. మండలంలోని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కాగా నిందితుడి ప్రభాస్ను చోడవరం కోర్టుకు తరలించినున్నట్లు పోలీసులు తెలిపారు. -
మెడకు చుట్టుకున్న మాంజా దారం
యలమంచిలి రూరల్: ఆటలాడుకుంటున్న రెండో తరగతి విద్యార్థి మెడకు మాంజా దారం చుట్టుకున్న ఘటనలో అదృష్టవశాత్తూ పెను ముప్పు తప్పింది. రెండు రౌండ్లు చుట్టుకున్న తర్వాత ఉక్కిరిబిక్కిరైన విద్యార్థి దారంతో పెనుగులాడడంతో తెగిపోయింది. రక్తస్రావంతో బాధపడుతున్న బాధిత విద్యార్థికి ప్రథమ చికిత్స అందించడం, తల్లిదండ్రులకు సమాచారం తెలియజేయడంలో పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం చూపడంతో విద్యార్థి తల్లిదండ్రులు,గ్రామస్తులు పాఠశాల ఎదుట ఆందోళన చేశారు. పాఠశాల ప్రిన్సిపాల్, ఇతర బాధ్యులను నిలదీశారు. యలమంచిలి భాష్యం స్కూల్లో సోమవారం సాయంత్రం జరిగిన ఘటనను యాజమాన్యం గోప్యంగా ఉంచింది. బాధిత విద్యార్థి తల్లిదండ్రులు యలమంచిలి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.వివరాలివి.. కోర్టుపేట వీధిలో భాష్యం స్కూల్లో రెండో తరగతి చదువుతున్న 30 మంది విద్యార్థులను ఓ టీచర్ ఆటలాడించడానికి తీసుకెళ్లారు. వ్యాయామ ఉపాధ్యాయుడు లేకుండా,హెచ్ఎంకు సమాచారం ఇవ్వకుండా విద్యార్థులను ఆటలాడించడానికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.ఆటలాడుతుండగా జారుడుబల్లపైకి ఎక్కిన నలుగురు విద్యార్థుల్లో పెదపల్లికి చెందిన బొద్దపు సాయి దీక్షిత్ మెడకు సమీపంలో చెట్టుకు వేలాడుతున్న పదునైన దారం చుట్టుకుంది. దీంతో మెడ భాగంలో రెండు లేయర్లు తెగిపోయాయి.మూడో రౌండు తిరిగే సమయంలో విద్యార్థి దారాన్ని తెంపుకొన్నాడు.శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న విద్యార్థికి వెంటనే చికిత్స చేయించకుండా అలాగే వదిలేశారు.విద్యార్థి తండ్రి అశోక్ ఫోన్ నంబరుకు కాల్ చేసిన టీచర్ అసలు విషయాన్ని చెప్పకుండా మీ అబ్బాయికి చిన్న గాయమైంది స్కూలుకు రావాలంటూ తెలపడంతో అనుమానం వచ్చిన తండ్రి హుటాహుటిన స్కూలు వద్దకు చేరుకున్నారు.మెడకు గాయమైనా తన కొడుక్కి చికిత్స చేయించకుండా తాత్సారం చేయడంతో యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.అనంతరం గాయపడిన విద్యార్థిని పట్టణంలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి,అక్కడ్నుంచి యలమంచిలి సీహెచ్సీకి తీసుకెళ్లి చికిత్స చేయించారు.ఎంఎల్సీ కావడంతో పట్టణ ఎస్ఐ సావిత్రి ప్రభుత్వాస్పత్రికి వెళ్లి తండ్రి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు.మంగళవారం ఉదయం విద్యార్థిని అనకాపల్లి తీసుకెళ్లి మెరుగైన చికిత్స చేయించారు.ప్రాణాపాయం తప్పిందని వైద్యులు నిర్థారించడంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.మంగళవారం రాత్రి స్కూల్ నిర్వాహకులు,గాయపడిన విద్యార్థి తల్లిదండ్రులు,పెదపల్లి గ్రామపెద్దలతో యలమంచిలి సీఐ ధనుంజయరావు సమక్షంలో చర్చలు జరిగాయి. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని స్కూలు నిర్వాహకులు తల్లిదండ్రులను ప్రాధేయపడ్డారు.దీనిపై ఇరువర్గాలు రాజీకి వచ్చినట్టు తెలిసింది.కాగా భాష్యం స్కూలు బిల్డింగుతో పాటు సమీపంలో ఉన్న బహుళ అంతస్థుల భవానాలకు పెద్దపెద్ద తేనెపట్లు ఉన్నాయి.వాటివల్ల మా పిల్లలకు ప్రమాదం ఉంటుందని,వాటిని తొలగించాలని కోరినా స్కూలు నిర్వాహకులు పట్టించుకోవడం లేదని,బస్సులో సీటింగ్ కెపాసిటీకి మించి పెద్ద సంఖ్యలో విద్యార్థులను కుక్కుతున్నారని..ఇలా పలువురు తల్లిదండ్రులు స్కూలు నిర్వాహకులపై ఆరోపణలు చేస్తున్నారు. -
కోడి పందాలపై పోలీసుల దాడి
బుచ్చెయ్యపేట: రాజాం గ్రామంలో కోడి పందాలపై పోలీసులు దాడి చేశారు. మంగళవారం గ్రామంలో పండగ సందర్భంగా నూకాలతల్లి గుడి వెనుక జరుగుతున్న కోడి పందాలపై ఎస్ఐ శ్రీనివాసరావు తమ సిబ్బందితో దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులను, రెండు కోడి పుంజులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద ఉన్న రూ, 1,300 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. గ్రామదేవతల పండగల సందర్భంగా గ్రామాల్లో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవద్దని ఆయా గ్రామాల నాయకులు పోలీసులకు సహకరించాల ని అన్నారు. -
గంజాయి సేవిస్తున్న ముగ్గురి అరెస్టు
అనకాపల్లి: మండలంలోని శంకరం వద్ద గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకులను అరెస్టు చేసినట్టు రూరల్ ఎస్ఐ జి. రవికుమార్ మంగళవారం తెలిపారు. వారి నుంచి మూడు సెల్ ఫోన్లు, గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. అరెస్టు అయిన వారిలో ఉగ్గిన శేష మణికంట(29), జగ్గుపల్లి జగదీష్ (28), రాజపూడి ఆదిత్యసాయి వెంకటేష్ (29) ఉన్నారన్నారు. వీరు శంకరం గ్రామ పరిధిలోని ఎఫ్సీ గోదాముల వెనుక కొండ ప్రాంతంలో సోమవారం గంజాయి సేవిస్తుండగా ముందుగా అందిన సమాచారం మేరకు దాడి చేసి పట్టుకున్నట్టు చెప్పారు. వారిని విచారించగా విజయరామరాజుపేటకు చెందిన యర్రంశెట్టి దుర్గాప్రసాద్ వద్ద గంజాయి కొనుగోలు చేసినట్లు చెప్పారన్నారు. దుర్గాప్రసాద్ పరారీలో ఉన్నట్టు చెప్పారు. అరెస్టు అయిన నిందితుల్లో శేష మణికంఠపై గతంలో క్రిమినల్ కేసులున్నాయన్నారు. అతని నుంచి 20 గ్రాములు,మిగిలిన ఇద్దరి నుంచి 15 గ్రాముల చొప్పున గంజాయి, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
లిక్విడ్ గంజాయితో ముగ్గురు పట్టివేత
సీలేరు: ఒడిశా నుంచి సీలేరు మీదుగా ద్విచక్ర వాహనాల పై తరలిస్తున్న లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీలేరు ఎస్ఐ యాసిన్ తెలిపారు. ఒడిశాలోని ఓ గ్రామంలో ఏడు కిలోల గంజాయితో తయారుచేసిన లిక్విడ్ గంజాయిని కొనుగోలు చేసి మైదాన ప్రాంతానికి రెండు ద్విచక్ర వాహనాల మీద తరలిస్తుండగా సీలేరులో సోమవారం పట్టుకున్నట్టు ఆయన చెప్పారు. దారకొండ గ్రామానికి చెందిన బంగారు రాజు, రింతాడ గ్రామానికి చెందిన వీరయ్య, డబల్ప హాడ్ ప్రాంతానికి చెందిన బిక్కులను అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
కేంద్ర బడ్జెట్పై అవగాహనకు క్విజ్ పోటీలు
● విశాఖ జిల్లా మై భారత డిప్యూటీ డైరెక్టర్ మహేశ్వరరావు అరకులోయటౌన్: కేంద్ర బడ్జెట్పై యువత ద్వారా ప్రజలకు అవగాహన కల్పించేందుకు క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు విశాఖ జిల్లా మై భారత్ డిప్యూటీ డైరెక్టర్ మహేశ్వరరావు తెలిపారు. సోమవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్, మై భారత్ ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్పై యువతకు అవగాహన కల్పించేందుకు మేరా యువభారత్ జాతీయ స్థాయి క్విజ్ పోటీలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రస్థాయి లో ప్రతిభ కనబరిచిన వారు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. జాతీయ స్థాయి విజేతలు దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.భరత్ కుమార్ నాయక్ మాట్లాడుతూ అవగాహన కార్యక్రమాల్లో యువత పాత్రను కీలకం చేస్తూ మైభారత్ ఈ కార్యక్రమాన్ని రూపొందించిందన్నారు. ఎన్ఎస్ఎస్ పీవోలు పి.నాగబాబు, వై.విజయలక్ష్మి, ఎం.అనిత కుమారి మాట్లాడుతూ మై భారత్ బడ్జెట్ క్విజ్ 2026 మొదట ఆన్లైన్ ద్వారా మొదలవుతుందన్నారు. -
అంతర పంటలతో అధిక ఆదాయం
ఇన్చార్జ్జి జేసీ, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ పాడేరు: కాఫీ సాగును పెంపొందించడంతో పాటు అంతర పంటల సాగుపై అవగాహన కల్పిస్తే మంచి ఫలితాలతో పాటు అధిక ఆదాయం లభిస్తుందని ఇన్చార్జి జేసీ, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ అన్నారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో సోమ వారం సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. కాఫీ సాగులో అంత రపంటల ఉత్పత్తులను పెంపొందించేందుకు తీసుకోవాల్సిన ప్రణాళికలను రూపొందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మిక్స్డ్ క్రాప్ ఏర్పాటు అనుకూలమైన ప్రాంతాల్లో కాఫీతో పాటు ఇతర మిశ్రమ పంటలను ప్రోత్సహించడం వల్ల రైతులకు అదన పు ఆదాయం లభిస్తుందన్నారు. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడం ద్వారా నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చని చెప్పారు. సేంద్రియ ఎరువుల వినియోగం యాజమాన్యంపై ప్రత్యక్ష శిక్షణ ఇవ్వాలన్నారు. కాఫీ బోర్డు అధికారులు రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు అందించాలని సూచించారు. గ్రామస్థాయిలో రైతులతో సమావేశాలు నిర్వహించి విత్తన సేకరణ, నర్సరీల నిర్వహణపై అభిప్రాయాలు తీసుకుని మొక్కల పెంపకంపై ప్రోత్సహకాలు, రాయితీలు అందజేయాలన్నారు. ఈ సమావేశంలో ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, కాఫీ డీడీ మురళీధర, కాఫీ ఏడీ బొంజుబాబు, తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏలో ఆధార్ సెంటర్ ఏర్పాటు పాడేరు : గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 150 ఆధార్ ఎన్రోల్ కిట్లు మంజూరయ్యాయని, వీటిని జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అందుబాటులోకి తెస్తామని ఇన్చార్జి జేసీ, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ తెలిపారు. ఐటీడీఏ కార్యాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాన్ని సోమవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆధార్ కేంద్రంలో పుట్టిన తేదీ సవరణలు, బయోమెట్రిక్ అప్డేట్స్, కొత్త ఆధార్ కార్డుల జారీ వంటి సేవలు లభిస్తాయని తెలిపారు. ఇప్పటికే గ్రామ సచివాలయాల్లో ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేసి మారుమూల ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఏ దరఖాస్తు కూడా తిరస్కరణకు గురికాకుండా ఉండేలా చేశామన్నారు. మారుమూల ప్రాంతాల్లో పరిష్కారం కాని ఆధార్ సమస్యలకు పాడేరు ఐటీడీఏ అధార్ సెంటర్లో పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, పీఎంయూ ప్రాజెక్టు ఇంప్లిమెంట్ అధికారి రాంగోపాల్, అడిషనల్ ప్రాజెక్టు ఇంప్లిమెంట్ అధికారి రాజేష్, ఆధార్ జిల్లా కో ఆర్డినేటర్ వీర వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
కుస్తీ పట్టి..పతకాలు కొట్టి
● రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ ● గోల్డ్మెడల్స్ సాధించిన కొయ్యూరు, చింతపల్లి క్రీడాకారులు కొయ్యూరు: రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. కుస్తీ పోటీల్లో కొయ్యూరు కుస్తీ అకాడమీ, చింతపల్లి డిగ్రీకళాశాల విద్యార్థులు పతకాల పంట పండించారు. పాడేరు ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొయ్యూరు కుస్తీ అకాడమీ విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా చాటారు. ఈనెల 5 నుంచి 8వ తేదీ వరకు చిత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అండర్ 15, అండర్ 17,అండర్ 20 విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో ఓవరాల్ చాంపియన్ షిప్ను సాధించి, వచ్చే నెలలో జరిగే జాతీయస్థాయి పోటీలకు 17 మంది ఎంపికయ్యారు. అండర్ 20 విభాగంలో వి.మహేష్, పి.ధారవీర ప్రసాద్, ఎం.రమణబాబు, సీహెచ్ మహేష్, కె.రూతు, కె.సుజాత, కె.కెసియ, కె.కమల, బి.భార్గవ్ బంగారు పతాకాలు సాధించారు.అండర్ 17 విభాగంలో కె.తబిత, పి.సురేష్, వి.శ్రీనుబాబు, ఎస్.రాజు, దుర్గాప్రసాద్లు బంగారు పతాకాలు సాధించారు.అండర్ 15 విభాగంలో జి.బుజ్జిబాబు, పి.శ్రీను, డి.ఆదినారాయణ బంగారు సాధించి ఢిల్లీలో వచ్చేనెల జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరితో పాటు జి.చరణ్,కె.చందు, వి.రాజేష్లు వెండిపతాకాలు సాధించారు.చిత్తూరు నుంచి సోమవారం కొయ్యూరు వచ్చిన వీరిని, పీడీ అంబటి నూకరాజును హెచ్ఎం శ్రీనివాస్, ఉపాధ్యాయులు అభినందించారు. చింతపల్లి: రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీల్లో చింతపల్లి డిగ్రీ కళాశాలు విద్యార్థులు బంగారు పతకాలు సాధించినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.విజయభారతి తెలిపారు. బి.భార్గవి, కె.రూతూ,కె.తబిత,కె.కేసియా, వి, మహేష్లు బంగారు పతకాలు సాధించారని చెప్పారు అనంతరం విద్యార్థులను, వారికి శిక్షణ ఇచ్చిన పీడీ శివరాంను ప్రిన్సిపాల్ అభినందించారు. -
13 వరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు
పాడేరు : భారతీయ రిజర్వ్ బ్యాంకు(ఆర్బీఐ) ఆధ్వర్యంలో ఈనెల 9నుంచి 13వ తేదీ వరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ దినేష్కుమార్ తెలిపారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఇందుకు సంబంధించిన పోస్టర్లను ఇన్చార్జి జేసీ, ఐటీడీఏ పీవో శ్రీపూజ, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్లతో కలిసి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో ఆర్థిక అక్షరాస్యత కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. సురక్షిత బ్యాంకింగ్ విధానాలు పాటించడం, డిజిటల్ లావా దేవీలు జాగ్రత్తగా నిర్వహించడం, పొదుపు అలవాటు చేసుకోవడం, ఆర్థిక మోసాల నుంచి రక్షణ పొందటం వంటి అంఽశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ మాతునాయుడు, డీఆర్డీఏ పీడీ మురళి, జిల్లా ఫౌరసరఫరాల శాఖ అధికారి మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్యశ్రీ
ఐసీయూలో మొదటి నుంచి ఆరోగ్యశ్రీపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. అడపా దడపా బకాయిలు విడుదల చేస్తున్నా, అవి కనీసం ఆస్పత్రుల రోజువారీ ఖర్చులకు కూడా సరిపోవడం లేదు. దీంతో నెట్వర్క్ ఆస్పత్రులు ఒక్కొక్కటిగా ఆరోగ్యశ్రీ సేవలకు స్వస్తి పలుకుతున్నాయి. ఈ పరిస్థితి పేదవాడి పాలిట మరణశాసనంగా మారుతోంది. క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు, గుండె సంబంధిత సమస్యలతో అత్యవసర శస్త్రచికిత్సలు అవసరమైన రోగులు ఇప్పుడు ఆస్పత్రుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేని నిరుపేదలకు ‘ప్రభుత్వం నుంచి డబ్బులు రావడం లేదు.. మేము వైద్యం చేయలేం’ అంటూ ఆస్పత్రులు ముఖం చాటేస్తుండటం దారుణం. ప్రభుత్వ అసమర్థతకు, నిధుల మళ్లింపునకు సామాన్యుడి ప్రాణాలు బలికావాల్సిందేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజకీయ విమర్శలు, పథకాల పేర్ల మార్పుల మీద చూపిస్తున్న శ్రద్ధ, రోగి ప్రాణాలను కాపాడటంలో చూపకపోవడం ప్రభుత్వ ప్రాధాన్యతలను శంకిస్తోంది. మొత్తానికి ఒక గొప్ప సామాజిక భద్రత కవచంగా నిలిచిన ఆరోగ్యశ్రీ పథకం, నేడు పాలకుల నిర్లక్ష్యంతో పడకేసింది. వైఎస్సార్ ఆశయం.. జగన్ విస్తరణ ఆరోగ్యశ్రీ అంటే తెలుగు రాష్ట్రాల్లో ముందుగా గుర్తుకు వచ్చే పేరు స్వర్గీయ వై.ఎస్. రాజశేఖర రెడ్డి. 2008లో ఆయన ప్రారంభించిన ఈ పథకం రెండు దశాబ్దాలుగా పేదలకు ప్రాణదాతగా నిలిచింది. ఆయన మరణానంతరం వచ్చిన ప్రభుత్వాలు కొన్ని నిబంధనలతో దీనిని పరిమితం చేసినప్పటికీ, వై.ఎస్. జగన్ మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఈ పథకాన్ని విప్లవాత్మకంగా మార్చారు. చికిత్సల సంఖ్యను 1800 నుంచి ఏకంగా 3,257కు పెంచి, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు కూడా ఉచిత చికిత్సను చేర్చారు. కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందజేస్తూ, హైదరాబాద్, చైన్నె, బెంగళూరు వంటి నగరాల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో కూడా సేవలు పొందేలా విస్తరించారు. కేవలం వైద్యమే కాకుండా, శస్త్రచికిత్స అనంతరం రోగి కోలుకునే వరకు జీవనోపాధి కోసం ‘ఆరోగ్య ఆసరా’ కింద రోజుకు రూ. 225 చొప్పున నెలకు గరిష్టంగా రూ.5 వేలు నేరుగా వారి ఖాతాల్లో జమ చేసి అండగా నిలిచారు. ఆరోగ్యశ్రీ నిర్వీర్యానికి కుట్ర పేదలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం, రాజకీయ కారణాలతో వ్యవస్థలను నిర్వీర్యం చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కేవలం సామాన్యులే కాకుండా, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల హెల్త్ స్కీమ్ , జర్నలిస్టుల వైద్య సేవలు కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి. నిరుపేదల సంజీవనిగా పేరుగాంచిన ఈ పథకానికి ఉరి బిగించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని బాధితులు వాపోతున్నారు. పథకం పేరు మార్చి, కార్పొరేట్ శక్తులకు మేలు చేసేలా ఇన్సూరెన్స్ పద్ధతిని తీసుకువస్తే, సామాన్యుడికి ఉచిత వైద్యం అందడం కష్టమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. నూతన హెల్త్ పాలసీ.. ఆరోగ్యమిత్రల ఆందోళనఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రజల మనసుల నుంచి తుడిచిపెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం రహస్యంగా పావులు కదుపుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జీవీఓ నంబర్ 162 ద్వారా ‘యూనివర్సల్ హెల్త్ పాలసీ’ని తీసుకురావడానికి కసరత్తు చేస్తోంది. దీనికోసం ఇప్పటికే టెండర్లు పిలవడం, పలువురు బిడ్డర్లు పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఏప్రిల్ నుంచి ఈ కొత్త పాలసీని అమల్లోకి తెచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆయుష్మాన్ భారత్ , ఇతర ఇన్సూరెన్స్ మోడల్స్ను కలిపి కొత్త విధానం తెస్తే, ప్రస్తుతం అమల్లో ఉన్న ఆరోగ్యశ్రీ రద్దవుతుందన్న భయం ప్రజల్లో నెలకొంది. ఈ మార్పుల వల్ల ఆస్పత్రుల్లో రోగులకు మార్గదర్శకులుగా ఉంటూ సేవలందిస్తున్న ‘ఆరోగ్యమిత్ర’ల భవిష్యత్తు కూడా అగమ్యగోచరంగా మారింది. వారి ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడంతో వందలాది కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ఒకప్పుడు నిరుపేదల గుమ్మం వద్దకు కార్పొరేట్ వైద్యాన్ని చేర్చి, చావు అంచుల్లో ఉన్న వేలాది మందికి పునర్జన్మ ప్రసాదించిన ‘ఆరోగ్యశ్రీ’ పథకం నేడు ఐసీయూలో కొట్టుమిట్టాడుతోంది. ధనవంతులకే పరిమితమైన కార్పొరేట్ ఆస్పత్రుల గడపను సామాన్యుడు కూడా ధైర్యంగా తొక్కవచ్చన్న నమ్మకాన్ని కలిగించిన ఈ వ్యవస్థ, ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వ ఉదాసీనత వల్ల కుప్పకూలుతోంది. నిన్నటి వరకు పేదవాడి గుండెల్లో ధైర్యం నింపిన ఈ పథకం, నేడు అదే గుండెల్లో ఆందోళన నింపుతూ ‘అనారోగ్యశ్రీ’గా మారుతోంది. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులకు చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయల బకాయిలను పెండింగ్లో పెట్టడంతో, చికిత్సల ప్రక్రియ స్తంభించిపోయింది. అప్పులు తెచ్చి వైద్యం అందించలేమని ఆస్పత్రుల యాజమాన్యాలు మొండికేస్తుంటే, చికిత్స కోసం కార్డు పట్టుకుని వెళ్తున్న సామాన్యుడికి ఆస్పత్రి గేట్ల దగ్గరే చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. – మహారాణిపేట బకాయిల సెగ.. అందని ‘ఆసరా’ చంద్రబాబు ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితి తలకిందులైంది. జిల్లా విషయానికొస్తే, సుమారు 92 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నాయి. ఇందులో 50 నెట్వర్క్ ఆస్పత్రులు, 19 ప్రభుత్వ ఆస్పత్రులు, 23 డెంటల్ ఆస్పత్రులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఆస్పత్రులకు సుమారు రూ.90 కోట్ల మేర బకాయిలు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. బకాయిల కోసం కార్పొరేట్ ఆస్పత్రులు సమ్మెకు దిగడం, ప్రభుత్వం నామమాత్రంగా 5 శాతం నిధులు విడుదల చేయడంతో తాత్కాలికంగా సేవలు కొనసాగుతున్నా, పూర్తిస్థాయి భరోసా కరువైంది. మరోవైపు గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ‘ఆరోగ్య ఆసరా’ పథకం ఇప్పుడు పూర్తిగా మూలనపడింది. డిశ్చార్జ్ అయిన రోజూనే ఖాతాల్లో పడాల్సిన నగదు ఇప్పుడు అందని ద్రాక్షలా మారింది. -
పర్యాటక ప్రాంతంగా గుర్రాయి జలపాతం
సందర్శించిన ఇంజినీరింగ్ అధికారులు జి.మాడుగుల: ప్రకృతి అందాల నడుమ ఆకట్టుకుంటున్న గుర్రాయి జలపాతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు మండలంలో కుంబిడిసింగి పంచాయతీలో గల ఈ జలపాతాన్ని సోమవారం టూరిజం పాడేరు టీడబ్ల్యూ ఇంజినీరింగ్ అధికారులు, సర్పంచ్ కృష్ణమూర్తి సందర్శించారు. జలపాత ప్రాంతం, పరిసర ప్రాంతాల అభివృద్ధిపై సర్పంచ్తో ఇంజినీరింగ్ అధికారులు చర్చించారు. జలపాతానికి రోడ్డు, పర్యాటకులకు సౌకర్యాలు,వాహనాల పార్కిగ్, ఇతర వసతుల గురించి పరిశీలించారు. జలపాతాన్ని అభివృద్ధి చేస్తే నిరుద్యోగ యువతకు ప్రత్యేక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని సర్పంచ్ కృష్ణమూర్తి అధికారులకు తెలిపారు. -
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి
అరకులోయటౌన్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పిలుపునిచ్చారు. సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో అరకులోయ, డుంబ్రిగుడ మండలాలకు చెందిన రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ పార్టీ గుర్తిస్తుందన్నారు. పార్టీ కోసం గ్రామ స్థాయిలో అహర్నిశలు కష్టపడి పనిచేసే నాయకులకు, కార్యకర్తలకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టిక్కెట్ కేటాయించి, వారి గెలుపునకు కృషి చేస్తుందని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్సీపీ నాయకులు సిద్ధంగా ఉండాలన్నారు. ఇప్పటి నుంచే స్థానిక సంస్థల ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయాలని సూచించారు. అప్పటి పరిస్థితి, సమీకరణలు పరిగణనలోకి అభ్యర్థులకు మద్దతు తెలపనున్నట్టు చెప్పారు. ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేసి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థుల గెలుపునకు కష్టపడి పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్, పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జన్ని నరసింహమూర్తి, అరకులోయ, డుంబ్రిగుడ మండలాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు స్వాభి రామూర్తి, పాంగి పరశురామ్, పల్టాసింగ్ విజయ్కుమార్, గుడివాడ ప్రకాష్, ఎంపీటీసీలు స్వాభి రామచందర్, శత్రుఘ్న, వార్డు సభ్యుడు శివ, ముఖ్య నాయకులు బి.బి. కామేశ్వరరావు, మండియకేడి బాలరాజు, పాంగి నాగేశ్వరరావు, పెట్టెలి సుక్రయ్య తదితరులు పాల్గొన్నారు. దురుద్దేశంతోనే తిరుమల లడ్డూపై దుష్ప్రచారం అరకులోయటౌన్: తిరుమల వేంకటేశ్వర స్వామి వారి పవిత్ర లడ్డూ ప్రసాందలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ సిట్ నివేదిక స్పష్టం చేసినప్పటికీ... దురుద్దేశంతో సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. దేశంలోని అత్యున్నత సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎస్డీడీబీ, ఎన్డీఆర్ఐ వంటి ల్యాబ్లలో చేసిన పరీక్షల్లో తిరుమల లడ్డూలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టమైందన్నారు. కానీ అసత్య ఆరోపణలు చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే మండి పడ్డారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వేంకటేశ్వర స్వామికి, దేశ, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డిమాండ్ చేశారు. అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం -
గిరిజన విద్యార్థుల సంరక్షణపై తీవ్ర నిర్లక్ష్యం
పాడేరు : గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంరక్షణపై చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పాడేరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అద్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఆరోపించారు. రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో ఇటీవల తరచుగా ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరిగి వందల సంఖ్యలో గిరిజన విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం, గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు కనీసం నష్ట నివారణ చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. సోమవారం ఆమె మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు కనీస వసతులు, నాణ్యమైన ఆహారం, మెరుగైన విద్యా బోధన కరవయ్యాయని చెప్పారు. చాలీచాలని వసతులతో నాసిరకమైన ఆహారంతో విద్యార్థులు తీవ్ర అనారోగ్యాల పాలవుతున్నారని చెప్పారు. విద్యార్థులు తాగేందుకు గుక్కేడు రక్షిత నీరు కరువైందన్నారు. ఆశ్రమ వసతి గృహాల్లో హెల్త్వలంటీర్లను నియమిస్తామని ఊదరగొట్టిన కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తలేడం లేదని ఆరోపించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో గిరిజన విద్యార్థులకు అన్ని రకాల వసతులతో నాణ్యమైన విద్య, రుచికరమైన ఆహారం అందేదని చెప్పారు. ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వం గిరిజన సంక్షేమ పాఠశాలల్లో ఫుడ్పాయిజన్ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గిరిజన విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైఎస్సార్సీపీ పోరాటాలను కొనసాగిస్తుందన్నారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి -
కక్ష సాధింపుతో కాపులపై అక్రమ కేసులు
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి చిక్కాల రామారావు పాయకరావుపేట: కాపులపై కక్ష సాధింపుతో సీఎం చంద్రబాబు అన్యాయంగా కేసులు బనాయించడం తగదని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి చిక్కాల రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక టీడీపీ నాయకులు కాపు నేతలను విమర్శించడంపై మండలంలోని మాసాహేబుపేటలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని ఈ నెల 7న ఉత్తరాంధ్ర కాపులందరూ పరామర్శించామన్నారు. సీఎం చంద్రబాబు కాపులపై కక్ష సాధిస్తున్నారని ఆ సమయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారన్నారు. దీనిపై స్థానిక టీడీపీ నాయకులు దుర్భాషలాడటం తగదన్నారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను విమర్శించే స్థాయి టీడీపీ మండలాధ్యక్షుడు చించలపు పద్దు, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పెదిరెడ్డి చిట్టిబాబులకు లేదన్నారు. నాడు వంగవీటి రంగాను, నేడు ముద్రగడ పద్మనాభం, అంబటి రాంబాబులను కక్ష సాధింపుతోనే ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. కాపులను అణగదొక్కడం కోసమే కేసులు బనాయిస్తున్నారన్నారు. స్థానిక టీడీపీ నాయకులు మాట తీరు మార్చుకోకపోతే రానున్న రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని అనడం అవగాహన రాహిత్యం అన్నారు. లడ్డూలో కల్తీ లేదని సీబీఐ, సిట్ నిర్ధారించాయన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు గెడ్డమూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ టీడీపీకి చెందిన కాపు నాయకులు వైఎస్సార్సీపీ నేతలను విమర్శించడం తగదన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలోనే కాపులకు మంత్రి పదవులు, ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారన్నారు. టీడీపీ నాయకులు విమర్శించే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. సమావేశంలో పార్టీ మండల మాజీ అధ్యక్షుడు ధనిశెట్టి బాబూరావు, పట్టణ అధ్యక్షుడు ధనిశెట్టి మహేష్, గోపాలపట్నం, కేశవరం సర్పంచ్లు పన్నీరు బాబ్జి, మేడిశెట్టి రామగోవిందు, ఎంపీటీసీలు కొంతం నరేష్, పల్లేల లక్ష్మణ్, నాయకులు కోనే పుత్రరావు, పాలపర్తి సతీష్, అక్కిరెడ్డి నాగేశ్వరరావు, పెనుమత్య నాగేశ్వరరావు, దేవవరపు నాగభూషణం, పర్వత సత్యనారాయణ పాల్గొన్నారు. -
ఆలయంలో విగ్రహం ఆపహరణకు యత్నం!
మునగపాక: పాటిపల్లిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఆకతాయిలెవరో అపహరించేందుకు యత్నించడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల పనిగా స్థానికులు భావిస్తున్నారు. ఎప్పటిలాగానే సోమవారం ఉదయం ఆలయం పైకి వెళ్లిన స్థానికులకు అభయాంజనేయ స్వామి విగ్రహం స్థానచలనం అయినట్టు గుర్తించారు. ఎవరో ఆకతాయిలు విగ్రహాన్ని ఎత్తుకుపోయేందుకు యత్నించినట్టు గుర్తించారు. దీంతో స్థానికులు కమిటీ సభ్యులకు సమాచారం అందించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. -
మట్టి అక్రమ తవ్వకాలకు అడ్డగోలు అనుమతులు
దేవరాపల్లి: దేవరాపల్లిలో అక్రమ మట్టి తవ్వకాలపై ఫిర్యాదు చేస్తే రెవెన్యూ అధికారులు 75 రోజుల తర్వాత ఎండార్స్మెంట్ ఇవ్వడం అత్యంత దారుణమని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి.వెంకన్న తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దేవరాపల్లిలో సోమవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. దేవరాపల్లి రెవెన్యూ పరిధిలోని బిల్లలమెట్ట సమీపంలో అక్రమ మట్టి తవ్వకాలపై గత ఏడాది డిసెంబర్ 1న ఫిర్యాదు చేస్తే సుమారు 75 రోజుల తర్వాత దర్యాప్తు జరిపి సోమవారం తనకు ఎండార్స్మెంట్ ఇచ్చారని, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనమన్నారు. దేవరాపల్లిలో మూడు సర్వే నెంబర్లలో కేవలం ఏడు రోజులు మాత్రమే మట్టి తవ్వి వ్యవసాయ భూమి చదును చేసేందుకు మాత్రమే వినియోగించాలని సూచిస్తూ గత ఏడాది నవంబర్ 25న తహసీల్దార్ అనుమతులు ఇచ్చామని ఎండర్స్మెంట్లో పేర్కొన్నారని వెంకన్న తెలిపారు. సదరు మట్టి తవ్వకాలు చేపట్టిన వ్యక్తి సుమారు నెల రోజులకు పైబడి నిబంధనలను బేఖాతరు చేస్తూ భారీ వాహనాలతో రాత్రి పగలు తేడా లేకుండా రెండు కిలోమీటర్ల మేర మట్టి తవ్వకాలు చేపట్టారని, కానీ రెవెన్యూ అధికారులు కాసులకు కక్కుర్తి పడి చూసి చూడనట్టుగా వ్యవహరించి, అక్రమ తవ్వకాలకు పరోక్షంగా సహకరించారని విమర్శించారు. స్థానిక రెవెన్యూ అధికారుల తీరుతో ప్రభుత్వంపై నమ్మకం పోయి, తీవ్ర వ్యతిరేకత పెరుగుతుందన్నారు. మట్టి అక్రమ తవ్వకం, స్థానిక రెవెన్యూ అధికారుల అవినీతిపై జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారులతో సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
భూ సమస్యలే అధికం
కాళ్లరిగేలా తిరిగినా గోడు వినలేదు... తుమ్మపాల: భూ సంబంధిత సమస్యలను రెవెన్యూ క్లినిక్ల ద్వారా సత్వరమే పరిష్కరించడం జరుగుతుందని, పీజీఆర్ఎస్కు వచ్చే అర్జీదారుల సమస్యలను అధికారులు వ్యక్తిగతంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని వివిధ శాఖల జిల్లా అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం–1 , 2 లో నిర్వహించిన పీజీఅర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలలో ఆయనతో పాటు ఎన్ఎఓబీ, బిజయూఆర్ఎస్ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు సుబ్బలక్ష్మి, రామమణి, మనోరమలు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో 131, రెవిన్యూ క్లినిక్లో 197 అర్జీలు మొత్తం – 328 అర్జీలు స్వీకరించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మెప్మా, ఐసిడీి ఎస్ అధికారులు కె.సరోజిని, సూర్యలక్ష్మి, జిల్లా ఎకై ్సజ్ అధికారి వి.సుధీర్, జిల్లా రవాణా శాఖ అధికారి జి.మనోహర్, జిల్లా సర్వే భూ రికార్డుల సహాయ సంచాలకులు గోపాల్ రాజా పాల్గొన్నారు. పాఠశాల ఆటస్థలంలో నిర్మాణాలపై నిరసన పాఠశాల ఆటస్థలంలో నిర్మించే డ్రైనేజీ వాటర్ ఫిల్టర్ ప్రాజెక్టును తక్షణమే నిలిపివేయాలంటూ యలమంచిలి మండలం తెరువుపల్లి గ్రామస్తులు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలకు ఆటస్థలంతో పాటు గ్రామ అవసరాలకు కూడా వినియోగించుకుంటున్న గ్రౌండ్ను కనుమరుగు చేసేవిధంగా గ్రామస్తుల అంగీకారం లేకుండా యలమంచిలి మున్సిపాలిటీ అవసరాలకు వినియోగించడం దారుణమని, పాఠశాలకు చెందిన ఆటస్థలంలో ఎటువంటి నిర్మాణాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తక్షణమే నిర్మాణ పనులు నిలిపివేయాలంటూ నినాదాలు చేసి పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. అనధికార భూసర్వే పనులపై ఆగ్రహం రైతులకు కనీస సమాచారం లేకుండా వ్యవసాయ భూముల్లో అధికారులు చేపట్టే అనధికారిక సర్వేను నిలిపివేసి గ్రామాన్ని కాపాడాలంటూ సబ్బవరం మండలం రాయపుర అగ్రహారం గ్రామస్తులు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. వ్యవసాయమే జీవనాధారంగా జీవించే తమ భూముల్లో మూడు రోజులుగా అధికారులు భూ సర్వే పనులు చేస్తున్నారని, అడిగితే ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో ఏపీఐఐసీకి భూములు కేటాయిస్తున్నట్టు చెబుతున్నారని, దీంతో తామంతా ఆందోళనకు గురయ్యామన్నారు. పరిశ్రమలకు గ్రామంలో రైతుల భూములను సేకరించే విధంగా సర్వే చేయడం అన్యాయమని, గ్రామసభ, గ్రామస్తుల అభిప్రాయ సేకరణ చేయకుండా చేపడుతున్న సర్వేను నిలిపివేయాలని కోరారు. వ్యవసాయం అధారంగా ఉన్న గ్రామస్తుల పొట్ట కొట్టవద్దని, ఏపీఐఐసీకి భూ కేటాయింపులు మరో చోట చేపట్టి మా గ్రామాన్ని విడిచిపెట్టాలంటూ పీజీఆర్ఎస్లో వినతిపత్రం అందించారు. ఆ వీఆర్వోలపై చర్యలు తీసుకోండి... నిబంధనలకు విరుద్ధంగా సొంత మండలంలోనే విధుల్లో కొనసాగుతున్న ఇద్దరు వీఆర్వోలపై విజిలెన్స్ విచారణ చేపట్టి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఓబీసీ విభాగం చైర్మన్ బొంతు రమణ పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. మాకవరపాలెం మండల స్థిరనివాసులైన జి.సాంబశివరావు, ఎస్.సూర్యనారాయణ అనే ఇద్దరు వీఆర్వోలు మాకవరపాలెం, రాచపల్లి గ్రామాల్లోనే వీఆర్వోలుగా విధుల్లో కొనసాగుతున్నారని, ప్రభుత్వం చేపట్టే బదిలీలకు విరుద్ధంగా ఇతర చోట్లకు వెళ్లకుండా కొనసాగడం ప్రాథమిక ఉల్లంఘనగా భావించి చర్యలు తీసుకోవాలని కోరారు. చిల్లంగి పేరిట వేధింపులపై ఫిర్యాదు చెడుపులు చిల్లంగులు చేస్తున్నామంటూ అదేపనిగా దూషించడంతో మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, గ్రామంలో తలెత్తుకు తిరగలేకపోతున్నామని, తమకు న్యాయం చేయాలని కోరుతూ మునగపాక మండలం టి.సిరసపల్లి గ్రామానికి చెందిన బి.నరేష్, మరికొంతమంది కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. గ్రామంలో అద్దెకు వచ్చి నివాసముంటూ వికలాంగులుగా ఉన్న చిట్టిబోయిన విజయ, కరుణ, వగైరాలు తమను తీవ్రంగా వేధిస్తున్నారని, అందరిపై పోలీసు కేసులు పెడుతూ భయాందోళనలకు గురిచేస్తున్నారని, వారికి కౌన్సెలింగ్ చేసి తమకు కాపాడాలని కోరారు. ఆటస్థలాన్ని కాపాడాలంటూ నిరసన తెలుపుతున్న తెరువుపల్లి గ్రామస్తులురాయపుర అగ్రహారం గ్రామస్తుల నిరసన ఇన్కంట్యాక్స్ చెల్లిస్తున్నట్టు తప్పుడుగా నమోదైన కారణంగా ఎటువంటి ప్రభుత్వ పథకాలు రావడం లేదని, తెల్లరేషన్ కార్డు ఉన్నప్పటికీ ఫీజు రీయంబర్స్మెంట్, స్కాలర్షిప్ కూడా రాకపోవడంపై కొన్నేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకుండా పోయిందని కలెక్టరేట్లో పీజీఆర్ఎస్లో అర్జీ చేసేందుకు వచ్చిన అక్కాచెల్లెళ్ల అర్జీని నమోదు చేయకుండా కలెక్టరేట్ సిబ్బంది తిరిగి వెనక్కు పంపించేశారు. అనకాపల్లి మండలం మూలపేటకు చెందిన అక్కాచెల్లెళ్లు ఇల్లా హిమవర్శిని డిగ్రీ, యామిని ఇంటర్మీడియట్ చదువుతున్నారు. కూలీపనులు చేసుకుంటు కుటుంబాన్ని నేట్టుకొచ్చే తల్లిదండ్రులు ఐదేళ్ల క్రితం ప్రైవేటు బ్యాంకుల్లో అప్పు తీసుకున్న క్రమంలో ఇన్కంట్యాక్స్ చెల్లిస్తున్నట్టు తప్పుగా నమోదైంది. దీంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిచిపోవడంతో అప్పును ఆగమేఘాల మీద తీర్చేసినప్పటికీ తప్పుగా నమోదైన ఇన్కంట్యాక్స్ వివరాలు మాత్రం ప్రభుత్వ రికార్డుల నుంచి తొలగిపోలేదు. దీంతో అమ్మ ఒడి దగ్గర నుంచి ఫీజు రీయంబర్స్మెంట్ ఇతరత్రా ఏ ఒక్కపథకంలో వీరికి లబ్ధి చేకూరలేదు. దీనిపై అనేక వినతులు చేస్తున్నా పట్టించుకుని పరిష్కరించే అధికార యాంత్రంగమే లేకపోవడంతో చివరకు కళాశాలకు సెలవు పెట్టి అక్కాచెల్లెళ్లు ఇద్దరూ కలెక్టరేట్కు వచ్చారు. కూలీపనులు చేసుకుంటూ తమను పోషిస్తున్న తల్లిదండ్రులు డిగ్రీ, ఇంటర్మీడియట్ చదువుతున్న తమకు ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని, కలెక్టర్కు తమ బాధ చెప్పుకుందామని వస్తే మీ అర్జీ తహసీల్దార్ వద్ద పెండింగ్లో ఉందంటూ సిబ్బంది తిరిగి వెనక్కు పంపించేయడంతో నిరాశతో వెనుతిరిగి వెళ్లిపోయారు. – ఇల్లా హిమవర్శిని, యామిని పీజీఆర్ఎస్కు 131 అర్జీలు ఎస్పీ కార్యాలయానికి 55 అర్జీలు అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్కు 55 అర్జీలు వచ్చాయి. ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ ఎల్.మోహన్రావు అర్జీదారుల సమస్యలను తెలుసుకున్నారు. చట్టపరిధిలో ఉన్న సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని ఏఎస్పీ తెలిపారు. భూ తగాదాలకు సంబంధించి 25, కుటుంబ కలహాలపై 2, మోసపూరిత వ్యవ హారాలపై 4, ఇతరత్రా 24 అర్జీలు వచ్చాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ జి.విశ్వనాథం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా త్రినాఽథ్
బుచ్చెయ్యపేట: ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కందిపూడి ఉపాధ్యాయుడు తమరాన త్రినాఽథ్ ఎన్నికయ్యారు. ఆదివారం విజయవాడలో జరిగిన రాష్ట్ర ఏపీటీఎఫ్ కౌన్సిల్ సమావేశంలో త్రినాఽథ్ను ఏకగ్రీవంగా ఉపాధ్యాయులు ఎన్నుకున్నారు. పి. కందిపూడి పాఠశాలలో ఆయన విధులు నిర్వహిస్తున్నారు. గతంలో మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పలు పదవులు నిర్వహించారు. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఏపీటీఎఫ్ సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని త్రినాథ్ తెలిపారు. ఆయన ఎన్నిక పట్ల పలువురు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. -
లడ్డూలో కల్తీ లేదని సీబీఐ నివేదికలో సుస్పష్టం
నక్కపల్లి: తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరగలేదని సీబీఐ, సిట్ నివేదికలు స్పష్టం చేయడంతో చంద్రబాబు, లోకేష్ పవన్కల్యాణ్ ప్రజలకు సమాధానం చెప్పలేక సోషల్ మీడియా, ఎల్లో మీడియా ద్వారా ఇంకా తప్పుడు ప్రచారం కొనసాగిస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ ధ్వజమెత్తారు. సోమవారం ఆయన సీతంపాలెంలో మాట్లాడుతూ గుజరాత్లోని ఎన్డీడీబీ, హర్యానాలో ఎన్డీఆర్ఐ ల్యాబ్లో పరీక్షించి నెయ్యిలో జంతుకొవ్వు, పందికొవ్వు, చేపనూనె కలవలేదని నిర్ధారణకు వచ్చిన తర్వాతే సీబీఐ చార్జ్షీట్ దాఖలు చేసిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం తప్పుడు ప్రచారం మానుకోవడం లేదని ఆరోపించారు. నాలుగు ట్యాంకర్లలో వెజిటబుల్ ఫ్యాట్ ఉందని 2024 జూలై 17న నివేదిక వచ్చిందని అప్పటి ఈవో శ్యామలరావు మీడియా సమావేశంలో వెల్లడిస్తే, అదే ట్యాంకర్లలో నెయ్యి తిరిగి ఏఆర్ డెయిరీకి వెళ్లకుండా వైష్ణవి డైయిరీకి వెళ్లి పేరు మార్చి మళ్లీ తిరుమలకు ఎందుకు చేర్చారో సమాధానం చెప్పాలన్నారు. ఇదే నెయ్యిని తిరుమల లడ్డూ తయారీలో వినియోగించారని సుప్రీం కోర్టులో సీబీఐ చార్జ్షీట్ దాఖలు చేసిందన్నారు. అల్ఫా మిల్క్లో ప్రమాణాలు సరిగ్గా లేవని కేసులు నమోదు చేసిందన్నారు. అదే ఆల్ఫా మిల్క్ కంపెనీకి 10 లక్షల కేజీల నెయ్యి సరఫరా చేయాలని ప్రస్తుత చైర్మన్ బీఆర్నాయడు రూ.245 కోట్లకు కాంట్రాక్ట్ ఇచ్చారన్నారు. తప్పులన్నీ చంద్రబాబు ప్రభుత్వం చేసి వాటిని అప్పటి ఈవో అనిల్కుమార్ సింఘాల్పై తోసేసి రాత్రికి రాత్రే అతనిని బదిలీ చేసిందన్నారు. అతనితోపాటు శ్యామలరావులను ఎందుకు బదిలీ చేశారో సమాధానం చెప్పాలన్నారు. సీబీఐ చార్జ్షీట్ ప్రజలు పూర్తిగా తెలుసుకునేలోపు వారిలో విష ప్రచారం ఎక్కించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. పోస్టర్లు వేయించడం, ఫ్లెక్సీలు కట్టడం, యూట్యూబ్ చానళ్ల ద్వారా గత ప్రభుత్వంపైన అప్పటి చైర్మన్ సుబ్బారెడ్డిపైన తప్పుడు ప్రచారం చేసి తిరుమల ఆలయాన్ని రాజకీయాలకు వాడుకుంటుందన్నారు. దీని కోసం వందల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెడుతోందని ఆరోపించారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ప్రజల్లోకి రాలేక డైవర్షన్ పాలిటిక్స్కు తెరతీసి అంబటి రాంబాబు, జోగి రమేష్ల ఇళ్లపై భౌతిక దాడులకు పాల్పడి అరెస్టు చేస్తున్నారన్నారు. సమావేశంలో ఎంపీటీసీ గొర్ల గోవిందు, సర్పంచ్లు వెదుళ్ల వెంకటరమణ, నాగఅప్పలరాజు, నాయకులు పోతంశెట్టి బాబ్జి, మేకల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
పీఏసీఎస్ల ద్వారా యూరియా సరఫరాకు చర్యలు
కశింకోట: పీఏసీఎస్ల ద్వారా యూరియాను సరఫరా చేయడానికి మార్క్ఫెడ్ దృష్టికి తీసుకువెళ్లి చర్చించి చర్యలు తీసుకుంటామని డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు అన్నారు. కశింకోట, నరసింగబిల్లి పీఏసీఎస్లను సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి సంఘ సభ్యుల సమస్యలు తెలుసుకున్నారు. రుణాలను ఎకరాకు రూ.5 లక్షల నుంచి అవసరాన్ని బట్టి పెంచుతామని తెలిపారు. డీసీసీబీ బ్యాంకుల్లో డ్వాక్రా రుణాలు రూ.3 లక్షల వరకు 7 శాతం, రూ.3 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు 9.50 శాతం వడ్డీతో ఎటువంటి ప్రాసెసింగ్ చార్జీలు లేకుండా రుణాలు అందిస్తున్నామని తెలిపారు. ఇతర బ్యాంకుల్లో రూ.50 వేల వరకు ప్రాసెసింగ్ చార్జీలు, ఎక్కువ వడ్డీ వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. అందువల్ల రైతులు డీసీసీబీ రుణ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. గతంలో మరణించిన రైతుకు ఇచ్చే బీమా రూ.15,000 ఉండగా, ప్రస్తుతం దాన్ని రూ.50,000 కు పెంచామని తెలిపారు. ప్రమాదవశాత్తూ మరణించిన రైతుకు రూ.2 లక్షల బీమా అందిస్తున్నామని, అలాగే పీఎంఎస్బీవై పథకం కింద ఎల్ఐసీ ద్వారా మరో రూ.2 లక్షల బీమా పరిహారం అందిస్తామని తెలిపారు. -
నిండు ప్రాణాన్ని బలిగొన్న నిర్లక్ష్యం
అచ్యుతాపురం రూరల్: బొలేరో వాహనం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఒక కుటుంబం చిన్నాభిన్నం అయిపోయింది. విధులు ముగించుకుని ఇంటికి వస్తాడు అనుకునేలోపే కుమారుడు అంతుచిక్కని లోకాలకు వెళ్లిపోయాడన్న చేదు నిజం ఒక తల్లి గుండెలను చిదిమేసింది. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో యర్రవరం గ్రామానికి చెందిన అప్పికొండ సాయి (22) బ్రాండిక్స్లో గల టీజే పరిశ్రమలో విధులు ముగించుకుని బైకుపై ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో సుప్రజా డెయిరీ ఎదురుగా అకస్మాత్తుగా రాంగ్ రూట్లో వచ్చిన బొలేరో వాహనంను ఢీకొనడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈ దుర్ఘటనలో వెనక కూర్చున్న రావాడ శ్రీను కూడా తీవ్రంగా గాయపడి ఆరిలోవలో గల ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. యర్రవరంలో ఒక ఇంట్లో జరుగుతున్న జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు వస్తున్న ఇద్దరు యువకులు ప్రమాదం బారినపడి ఒకరు మృతి చెందగా, మరొకరు ఆసుపత్రి పాలవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతి చెందిన సాయి తండ్రి సంవత్సరం క్రితం అనారోగ్య కారణంగా మృతి చెందాడు. చేతికి అందొచ్చిన కుమారుడు తనకు అండగా ఉంటాడనుకున్న ఆ తల్లి ఆశలు అడియాశలు అయ్యాయి. కొడుకు మృతితో తల్లి గుండెలవిసేలా చేసిన రోదన గ్రామస్తులకు కంటతడి పెట్టించింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అదే గ్రామానికి చెందిన రావాడ శ్రీనుకు వివాహమై ఒక కుమార్తె ఉంది. విధుల నుంచి వస్తూ శ్రీను ఆసుపత్రి పాలవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోలన చెందుతున్నారు. ఆసుపత్రి నుంచి క్షేమంగా ఇంటికి చేరుకోవాలని భగవంతున్ని వేడుకుంటున్నారు. కాగా ప్రమాద బాధితుల కుటుంబ సభ్యులు సోమవారం సుప్రజ డెయిరీ ఎదురుగా ధర్నా నిర్వహించారు. ప్రమాదానికి గల కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళన చేపట్టారు. మృతుని కుటుంబానికి అలాగే ఆసుపత్రిలో ఉన్న యువకుని కుటుంబానికి న్యాయం చేయాలని సీపీఎం, సీఐటీయు, అఖిల పక్ష నాయకుల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన కారణంగా రహదారి పూర్తిగా స్తంభించడంతో కొన్ని గంటల వ్యవధి ట్రాఫిక్ నిలిచిపోయింది. అనుకోకుండా బొలేరో వాహనం సుప్రజా డెయిరీలోకి వెళ్లేందుకు ఒక్కసారిగా రహదారికి అడ్డంగా రావడంతో బైక్ పై ఉన్నవారు అదుపుతప్పి ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి పూర్తి విచారణ చేపడతున్నట్టు ఇన్స్పెక్టర్ చంధ్రశేఖర్రావు తెలిపారు. గాయపడిన రావాడ శ్రీనుసంఘటనా స్థలంలో సాయి మృతదేహం -
భక్తుల సౌకర్యమే తొలి లక్ష్యం
సింహాచలం దేవస్థానం ఈవోగా వెంకటరావు బాధ్యతల స్వీకరణసింహాచలం : వరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యం లేకుండా తృప్తిగా దర్శనం చేసుకునేలా చూడడమే ప్రథమ ప్రాధాన్యత అని సింహాచలం దేవస్థానం నూతన ఈవో జె.వెంకటరావు తెలిపారు. ఆదివారం బాధ్యతలు స్వీకరించిన ఆయన తొలుత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కప్పస్తంభాన్ని ఆలింగనం చేసి బేడామండపంలో ప్రదక్షిణ చేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారి చిత్రపటం, శేషవస్త్రం, ప్రసాదాన్ని ఏఈవో తిరుమలేశ్వరరావు అందజేశారు. ఇన్చార్టి ఈవోగా పనిచేసిన ఎన్.సుజాత నుంచి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆలయ పవిత్రత, ఆస్తుల పరిరక్షణను రెండవ ప్రాధాన్యతగా తీసుకుంటానన్నారు. కలెక్టర్, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని ఆలయ ఆస్తులను కాపాడుతామని తెలిపారు. ఏప్రిల్ 20న జరిగే చందనోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించడం అత్యవసర ప్రాధాన్యతగా తీసుకుంటామని, రానున్న 50 రోజులు ఆ ఏర్పాట్లపైనే దృష్టి పెడతానన్నారు. దేవస్థానంలో లోపాలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. -
ముగిసిన ‘శిఖర్ సే సాగర్ తక్’ స్వచ్ఛత వేడుకలు
ఏయూక్యాంపస్ : జీవీఎంసీ, సులభ్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా నిర్వహించిన ‘శిఖర్ సే సాగర్ తక్’ స్వచ్ఛత అవగాహన కార్యక్రమాలు ఆదివారం ఆర్కే బీచ్లో బీచ్ క్లీనింగ్, సైక్లోథాన్తో ముగిశాయి. జీవీఎంసీ అదనపు కమిషనర్ పి. నల్లనయ్య ముఖ్య అతిథిగా పాల్గొని అందరితో స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యర్థాలను కాలువల్లో వేసి సముద్రాలను కలుషితం చేయవద్దని, పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. సులభ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కుమార్ దిలీప్, ప్రాజెక్టు డైరెక్టర్ ఆర్.పి. సింగ్ తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో.. ఔత్సాహికులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేసి సైక్లోథాన్ నిర్వహించారు. అనంతరం 20 కిలోమీటర్ల సైక్లింగ్ పూర్తి చేసిన విజేతలకు, ఫిషర్మెన్ కమ్యూనిటీ ప్రతినిధులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. -
చింతపల్లిలో తగ్గిన ఉష్ణోగ్రతలు
● 7.5 డిగ్రీల నమోదు చింతపల్లి: జిల్లాలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో మంచు, చలి తీవ్రత కొనసాగుతోంది. ఆదివారం చింతపల్లిలో 7.5 డిగ్రీలు, అరకువేలీలో 7.8 డిగ్రీలు నమోదు అయినట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. జిల్లాలో హకుంపేటలో 8.2 డిగ్రీలు, ముంచంగిపుట్లులో 8.9 డిగ్రీలు, పెదబయలులో 9.4 డిగ్రీలు, జి.మాడుగులలో 11.5 డిగ్రీలు,,కొయ్యూరులో 12.7 డిగ్రీలు, అనంతగిరిలో 16.6 డిగ్రీలు నమోదు అయ్యాయని ఆయన పేర్కొన్నారు. -
హుకుంపేటలో అప్పన్న సహస్రనామార్చన
సింహాచలం: అడవివరంలోని సింహాద్రిమఠం ఆధ్వర్యంలో అల్లూరిజిల్లా హుకుంపేటలో ఆదివారం శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి సహస్రనామార్చన పూజ పెద్ద ఎత్తున నిర్వహించారు. 896 మంది గిరిజనులు ఈ పూజలో పాల్గొన్నారు. సింహాచలం దేవస్థానం రిటైర్డ్ ప్రధానార్చకుడు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు ఈ పూజని నిర్వహించారు. 1001 నామాలతో స్వామికి అర్చన చేశారు. పూజలో పాల్గొన్న గిరిజనులకు సింహాద్రిమఠం గురుస్వామి కశిరెడ్డి సురేంద్రస్వామి లక్ష్మీదేవి సహిత శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చిత్రపటాలు ఉచితంగా అందజేశారు. -
డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి
కొయ్యూరు సీఐ శ్రీనివాసరావుకొయ్యూరు: వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, లేనిపక్షంలో ప్రమాదాలు జరిగినప్పుడు బీమాతో పాటు ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు రావని కొయ్యూరు సీఐ బి. శ్రీనివాసరావు సూచించారు. ఆదివారం కొయ్యూరు సంతలో మంప ఎస్ఐ శ్రీనివాస్తో కలిసి ఆయన గిరిజనులతో మాట్లాడారు. ప్రతీ ఒక్కరూ విధిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, దీనివల్ల జరిమానాల నుంచి తప్పించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అది ప్రమాద సమయాల్లో ప్రాణాలను కాపాడుతుందని వివరించారు. గంజాయి పండించినా లేదా రవాణా చేసినా జీవితాలు నాశనమవుతాయని ఆయన హెచ్చరించారు. అటువంటి కేసుల్లో చిక్కుకుంటే బెయిల్ రాక నెలల తరబడి జైలులోనే ఉండాల్సి వస్తుందని తెలిపారు. అనంతరం సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ.. గుర్తుతెలియని లింకులను క్లిక్ చేస్తే ఖాతాల్లోని సొమ్ము మాయమవుతుందని, ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మహిళలపై ఎవరూ నేరాలకు పాల్పడకూడదని, ప్రస్తుతం చట్టాలు చాలా పటిష్టంగా ఉన్నాయని గుర్తుచేశారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన గిరిజనులు తమ సమస్యలను సీఐ దృష్టికి తీసుకెళ్లగా, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. క్రీడల్లో రాణించాలి యువత క్రీడల్లో రాణించాలని కొయ్యూరు సీఐ శ్రీనివాసరావు,మంప ఎస్ఐ శ్రీనివాస్ కోరారు.బూదరాళ్ల పంచాయతీ చల్దిగెడ్డ,కొత్తపల్లి గ్రామాలకు చెందిన యువకులకు ఆదివారం వాలీబాల్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడతూ క్రీడల్లో రాణించి మంచి పేరు తీసుకురావాలని కోరారు. -
ప్రగతి దారులు
కొండకోనల్లోకొండకోనల మధ్య ఉండే గిరిజన పల్లెలకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రవాణా కష్టాల నుంచి విముక్తి లభించింది. రూ. కోట్ల వ్యయంతో నిర్మించిన జోడిగుడ– చటువా, లోగిలి, సంపంగి గెడ్డ వంతెనలతో పాటు అంతర్రాష్ట్ర రహదారులు అందుబాటులోకి రావడంతో రవాణా వ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతోంది. హుద్హుద్ వంటి విపత్తులు మిగిల్చిన గాయాలను మాన్పుతూ, ప్రజల సౌకర్యార్థం పక్కా ప్రణాళికతో ఈ పనులు పూర్తి చేశారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నిర్మించిన కండ్రుమ్– సర్రయి వంతెనలోగిలిలో పూర్తయిన వంతెనడుంబ్రిగుడ: మండల గిరిజనుల దశాబ్దాల కల నెరవేరింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ ప్రత్యేక చొరవతో చేపట్టిన వంతెనలు, రహదారుల నిర్మాణం ఈ ప్రాంత రూపురేఖలను మార్చివేసింది. ముఖ్యంగా ఆంధ్ర–ఒడిశా సరిహద్దులను కలుపుతూ సాగిన ఈ అభివృద్ధి పనులపై స్థానిక గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన అభివృద్ధి పనులివే.. జోడిగుడ – చటువా వంతెన: కండ్రుమ్ పంచాయతీ పరిధిలోని గుంటసీమ వీజే రోడ్డు నుంచి కండ్రుమ్, సర్రాయి మీదుగా జోడిగుడ, చటువా వద్ద పీఎంజీఎస్వై నిధులు రూ.5.80 కోట్ల వ్యయంతో నిర్మించిన వంతెన అందుబాటులోకి వచ్చింది. ఇది ఆంధ్ర – ఒడిశా సరిహద్దు గ్రామాల మధ్య కీలక అనుసంధానకర్తగా మారింది. లోగిలి వంతెన: 2014 హుద్హుద్ తుపాను ధాటికి కొట్టుకుపోయిన ఈ వంతెన లేక గిరిజనులు పదేళ్లపాటు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.1.80 కోట్లు కేటాయించి పనులు పూర్తి చేయడంతో, మార్చి 13, 2024న ఇది ప్రారంభమైంది. దీనివల్ల గసభ, సొవ్వా పంచాయతీలతో పాటు ఒడిశా ప్రజలకు సైతం రవాణా సౌకర్యం మెరుగుపడింది. సంపంగి గెడ్డ వంతెన: కితలంగి, కించుమండ పంచాయతీల పరిధిలోని 18 గ్రామాల ప్రజల కష్టాలను గుర్తించి, రూ.4.40 కోట్లతో సంపంగి గెడ్డ వద్ద వంతెనను నిర్మించారు. అప్పటి ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ శంకుస్థాపన చేసిన ఈ వంతెన పూర్తికావడంతో అరకులోయ, అనంతగిరి మండల వాసులకు ప్రయాణం సులువైంది. అంతర్రాష్ట్ర రహదారి నిర్మాణం: అరకు రోడ్డు నుంచి కొర్రయి, కొల్లాపుట్టు మీదుగా బొడ్డలమామిడి వరకు 10.50 కిలోమీటర్ల మేర తారు రోడ్డును, 14 కల్వర్టులను నిర్మించారు. ఈ రహదారి ద్వారా ఒడిశాలోని పుక్కలి, పొట్టంగి, జైపూర్తోపాటు ఛత్తీస్గఢ్, ఢిల్లీ వరకు రవాణా అనుసంధానం ఏర్పడటం విశేషం. కిలోగుడ జంక్షన్ – చమడపాడు రోడ్డు: సాగర పంచాయతీ కిలోగుడ జంక్షన్ నుంచి టిక్కిటిబెడ్డ, కమలబంద, సొవ్వా మీదుగా చమడపాడు వరకు 22 కిలోమీటర్ల పొడవైన తారు రోడ్డును పీఎంజీఎస్వై నిధులు రూ.11.50 కోట్లతో నిర్మించి గిరిజన ప్రాంతాల్లో రవాణా వ్యవస్థను బలోపేతం చేశారు. ప్రాణభయం తప్పింది సంపంగి గెడ్డపై వంతెన లేక గతంలో చాలా మంది గిరిజనులు గెడ్డలో కొట్టుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ వంతెన ఏర్పాటు నిధులు మంజూరు చే యించారు. వంతెన నిర్మించడంతో సమస్య తీరింది. – వరబోయిన సుబ్బారావు, సర్పంచ్, కితలంగివంతెన కష్టాలు తీరాయి లోగిలి వంతెన కూలిపోవడంతో పదేళ్లుగా ఇబ్బందులు పడ్డాం. వైఎస్సార్సీపీ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తరువాత వంతెన నిర్మించారు. రోగాలకు గురైనప్పుడు ఆస్పత్రికి వెళ్లే మార్గం లేకుండా ఉండేది. ఇప్పుడు కష్టాలు తీరాయి. – వంతాల జెమ్మ, ఎంపీటీసీ, గసభ గత ప్రభుత్వానికిరుణపడి ఉంటాం సుమారు రూ.కోట్ల నిధులు వెచ్చించి వంతెన నిర్మించడంతో రవాణా కష్టాలు తీరాయి. సమస్య పరిష్కరించిన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి తామంతా రుణపడి ఉంటాం. ఇదే పెద్ద వంతెన కావడం అదృష్టంగా భావిస్తున్నాం. – శెట్టి ఆనందరావు, ఎంపీటీసీ, కండ్రుమ్ జగనన్న పాలనలో డుంబ్రిగుడకు దక్కిన రవాణా విప్లవం దశాబ్దాల కష్టానికి చెక్ రూ. కోట్ల నిధులతో నిర్మించిన వంతెనలు, అంతర్రాష్ట్ర రహదారులు గిరిజన పల్లెల్లో వెలుగులు నింపిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం -
ఏపీఎన్జీజీవో ఉపాధ్యక్షుడిగా రవిశంకర్
మహారాణిపేట: ఆంధ్రప్రదేశ్ నాన్ గజిటెడ్, గజిటెడ్ ఆఫీసర్ల సంఘం రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు ఆదివారం విజయవాడలో జరిగాయి. ఈ ఎన్నికల్లో విశాఖకు చెందిన ఆర్.రవిశంకర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. గతంలో ఆయన విశాఖ జిల్లా ఎన్జీజీవో కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. కాగా, ఈ ఎన్నికల్లో రాష్ట్ర అధ్యక్షుడిగా విద్యాసాగర్, కార్యదర్శిగా డి.వి.రమణ ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికై న రవిశంకర్ను పలువురు ఉద్యోగ సంఘ నేతలు అభినందించారు. -
ఉపాధి పథకం పరిరక్షణకు పోరాటం
● సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శిఉమామహేశ్వరరావు పాడేరు రూరల్: ఉపాధి హమీ పథకం పరిరక్షణకు అందరూ కలిసి పోరాడుదామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు పిలుపు నిచ్చారు. ఈనెల 12న జరగనున్న కార్మిక సంఘాల సమ్మెకు సంబంధించి పోస్టర్లను ఆదివారం సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక హక్కులు, చట్టాల పరిరక్షణకై నిర్వహిస్తున్న దేశవ్యాప్త సమ్మె విజయవంతానికి అనివర్గాల కార్మిక సంఘాలు తరలి రావాలన్నారు. ఇప్పటికే కార్మికుల హక్కుల నిర్వీర్యానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబ్ కోడ్లు తక్షణం రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చిన్నయ్యపడాల్, కోశాధికారి పోతురాజు, సహాయ కార్యదర్శి సుందర్రావు పాల్గొన్నారు. -
నల్ల చొక్కాలతో ఉక్కు నిర్వాసిత రైతుల ఉద్యమం
గాజువాక: విశాఖ స్టీల్ప్లాంట్ కోసం భూములిచ్చిన నిర్వాసితులు తమ హక్కుల సాధన కోసం తమిళనాడు ‘పెరియార్ ’ తరహాలో నల్లచొక్కాలు ధరించి నిరసన తెలపాలని రిటైర్డ్ డీజీపీ, ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయకర్త జె.పూర్ణచంద్రరావు పిలుపునిచ్చారు. ఆదివారం లంకా మైదానంలో ఉక్కు నిర్వాసితుల ఐక్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన ప్రజాగర్జన సభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. వేల ఎకరాల భూములిచ్చిన రైతులు 35 ఏళ్లుగా న్యాయం కోసం ఎదురుచూస్తున్నా ప్రభుత్వాల్లో చలనం లేదని ఆయన విమర్శించారు. ధర్నాలు, రాస్తారోకోల కంటే వినూత్నంగా నల్లచొక్కాల ఉద్యమం ద్వారా పాలకులను నిలదీయాలని కోరారు. తమిళనాడులో సేలం స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకున్న స్ఫూర్తితో ఇక్కడి నిర్వాసితులు, కార్మికులు ఉద్యమించాలన్నారు. అమరావతి రైతులకు ఇచ్చిన తరహాలోనే స్టీల్ప్లాంట్ నిర్వాసితులకు ఎకరానికి 1250 గజాల పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు, నాయకులు వై.మహాదేవ్, పరంధామయ్య పాల్గొన్నారు. రిటైర్డ్ డీఎస్పీ పూర్ణచంద్రరావు పిలుపు -
ఇంటర్ ప్రయోగ పరీక్షల పరిశీలన
జి.మాడుగుల: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ ప్రయోగ పరీక్ష పరీక్షలను ఆదివారం ఇంటర్బోర్డు అబ్జర్వర్ చాణుక్యుడు పరిశీలించారు. పరీక్షల నిర్వహణ తీరు, ల్యాబ్ సదుపాయాలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా డీఈసీ సభ్యుడు ఎం.స్వామినాయుడు కళాశాలను సందర్శించి పరీక్షల ప్రక్రియను పర్యవేక్షించారు. పరీక్షల నిర్వహణపై అధ్యాపకులు తీసుకుంటున్న చర్యలను అభినందించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గౌరీ ప్రసాద్, అధ్యాపకులు పాల్గొన్నారు. చింతపల్లి: ఎటువంటి మాస్ కాపీయింగ్కు తావులేకుండా ప్రయోగ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు అబ్జర్వర్ చాణక్యుడు అన్నారు. స్థానిక ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జరుగుతున్న ప్రయోగ పరీక్షలను ఆయన పరిశీలించారు. విద్యార్థులు శత శాతం ఉత్తీర్ణత సాధించేలా బోధన అందించాలని అధ్యాపకులకు సూచించారు. డీఈసీ సభ్యుడు ఎం.స్వామినాయుడు, కళాశాల ప్రిన్సిపాల్ గోవిందరావు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
అలరించిన ‘శ్రీకృష్ణ లీలలు’
తగరపువలస: మండలంలోని గంభీరం ఐఐఎంవీ రోడ్డులో ఉన్న హరేకృష్ణ వైకుంఠంలో ఆదివారం ‘శ్రీకృష్ణ అర్పణం’ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో శ్రీరాధా మదన్ మోహనుల మందిరంలో జరిగిన ఈ వేడుకలో చైతన్య డాన్స్ అకాడమీ చిన్నారులు ప్రదర్శించిన ‘శ్రీకృష్ణ లీలలు’ నృత్య రూపకం భక్తులను అలరించింది. ఈ ప్రదర్శనలో పాల్గొన్న బుక్కపట్నం ఇందిర, లీలభాను, పూజిత, శాంతిప్రియ తదితర చిన్నారులను హరేకృష్ణ మూవ్మెంట్ అధ్యక్షుడు నిష్కించన భక్తదాస ప్రత్యేకంగా అభినందించారు. -
మాకవరంలో నేడు గంగమ్మతల్లి జాతర
ముంచంగిపుట్టు: మండలంలోని మాకవరం గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ గంగమ్మ తల్లి జాతర నేడు (సోమవారం) ప్రారంభం కానుంది. ప్రతి ఏటా గిరిజన సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం ఈ ఉత్సవాలను అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ పండుగలో ప్రధాన ఆకర్షణ బుడియాలు. దీక్షా పరులైన వీరు కేవలం గోచీ (ప్యాటు) మాత్రమే ధరించి, శరీరంపై తెల్లటి సున్నంతో చారలు వేసుకుని వారం రోజుల పాటు మాల ధరిస్తారు. వీరు గ్రామగ్రామాన తిరుగుతూ పండుగ విశిష్టతను చాటిచెబుతారు. ఆదివారం నాడు జోలాపుట్టు, మాకవరం పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లో వీరు ప్రచారం నిర్వహించారు. జాతర సందర్భంగా మాకవరం గ్రామం, గంగమ్మ తల్లి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. సోమవారం రాత్రి జాతర ప్రారంభం అవుతుంది. మంగళవారం ఉదయం నుంచి అమ్మవారికి భక్తులు మొక్కుబడులు సమర్పిస్తారు. సరిహద్దు గ్రామాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఉత్సవ కమిటీ సభ్యులు పులంధర్, జగత్రాయ్, గంగాధర్, పరశురాం, రఘుపతి పడాల్, ధనుంజయ్, రాజు, రాధాకృష్ణ, రామ్మూర్తి, గణపతి, నరసింగరావు పడాల్, బాబూరావు తెలిపారు. ఏర్పాట్లు పూర్తి చేసిన ఉత్సవ కమిటీ -
మిరియం రైతుకు ప్రకృతి సెగ
ఏజెన్సీలో గిరిజన రైతులకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మిరియం సాగు ఈ ఏడాది గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. ప్రకృతి కన్నెర్ర చేయడంతో పూత దశలోనే పంట దెబ్బతిని, దిగుబడి భారీగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. గత ఏడాది రూ.లక్షల్లో ఆదాయం చూసిన రైతులు, ఈసారి కనీస పెట్టుబడులు కూడా వస్తాయో లేదోనని ఆందో ళన చెందుతున్నారు. సాక్షి, పాడేరు: ఏటా గిరిజన రైతులకు సిరులు కురిపించే మిరియం దిగుబడి ఈ ఏడాది ఆశాజనకంగా లేదు. తోటల్లోని పాదులకు అక్కడక్కడ మాత్రమే గుత్తులు కనిపిస్తుండటంతో, దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో లక్ష ఎకరాల్లో కాఫీ తోటల మధ్య అంతరపంటగా మిరి యం సాగవుతోంది. గతంలో ఎకరానికి రూ. లక్ష వరకు ఆదాయం వచ్చేదని, ఈసారి మాత్రం రూ. 20 వేలకు మించి వచ్చేలా లేదని గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు. జాతీయ స్థాయిలో డిమాండ్ ఉన్నా.. గిరిజన రైతులు సాగు చేసే మిరియాలకు జాతీయ స్థాయిలో మంచి డిమాండ్ ఉంది. సాధారణంగా ఎకరాకు 150 నుంచి 200 కిలోల వరకు ఎండు మిరియాల దిగుబడి వస్తుంది. గత ఏడాది దిగుబడి బాగుండటంతో, కిలో మిరియాలు రూ.600 –రూ.700 వరకు పలికాయి. దీని తో ఎకరాకు సుమారు రూ. 1.5 లక్షల వరకు ఆదాయం లభించిందని రైతులు చెబుతున్నారు. కానీ ఈ ఏడాది కాపు భారీగా తగ్గడంతో ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. పూత సమయంలో వర్షాల్లేక.. మిరియం పాదులు పూత దశలో ఉన్నప్పుడు వర్షాలు లేకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని గిరిజన రైతులు వాపోతున్నారు. ముఖ్యంగా ఆగస్టు, సెపె్టంబర్ నెలల్లో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు. దీని ప్రభావం పూతపై పడటంతో దిగుబడి క్షీణించింది. గత ఏడాది మిరియం గుత్తులతో కళకళలాడిన తోటలన్నీ ప్రస్తుతం వెలవెలబోతున్నాయి.తక్కువగా పూత ఐదు ఎకరాల కాఫీ తోటలో మిరియం పాదులు ఉన్నాయి. ఏటా దిగుబడి ఎక్కువగా ఉండేది. ఈ ఏడాది పూత తక్కువగా ఉంది. అందువల్ల కాపు కూడా బాగా తగ్గింది. అరకు, పాడేరు మండలాల్లో ఇదే పరిస్థితి ఉంది. దీని ప్రభావం ఆదాయంపై చూపుతుంది. – పాలికి లక్కు, గిరిజన ౖరైతు, మోదాపల్లి పంచాయతీ, పాడేరు మండలం -
ఎం'తాటి' ఘనతో..
ఇదో గ్రామీణ సౌరభం.. అమృతం దాచిన అద్భుత ఫలం.. ప్రకృతి సిగ నుంచి వచ్చిన ఆరోగ్యకర ఆహారం.. అలాంటి తాటి పండు రుచి అమోఘం.. ఈ పండ్లతో పాటు కాయలు, తేగలు, నీరా వంటి వాటితో ఆహార ఉత్పత్తుల తయారీలో అగ్రస్థానంలో నిలిచింది పందిరిమామిడి డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధన స్థానం.. మూడు దశాబ్దాలకు పైగా పరిశోధనలతో తనదైన ముద్ర వేసింది. ఆ వివరాలు తెలుసుకుందామా.. రంపచోడవరం: కాలం మారినా.. తాటి రుచి మరువలేనిది. అలాంటి ఫలం ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ తాటితో ఆహార ఉత్పత్తుల తయారీపై పోలవరం జిల్లా పందిరిమామిడి డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధన స్థానం (హెచ్ఆర్ఎస్) చేపట్టిన పరిశోధనలు సత్ఫలితాలను ఇచ్చాయి. ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఆర్థిక సహకారంతో అఖిల భారత తాటి సమన్వయ పరిశోధన పథకంలో భాగంగా 1993 నుంచి ఈ పరిశోధనలు ప్రారంభించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి తాటి మొక్కలను సేకరించి హెచ్ఆర్ఎస్ పెంచడం ద్వారా పరిశోధనలకు శ్రీకారం చుట్టారు. చెట్లు.. 272 రకాలు దేశంలో మేలైన తాటి మొక్కల సేకరణలో భాగంగా ఆంధ్రా, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్తో పాటు అన్ని రాష్ట్రాల నుంచి తాటి మొక్కలను సేకరించారు. ఇలా సేకరించిన 272 రకాల తాటి మొక్కలను హెచ్ఆర్ఎస్ వ్యవసాయ క్షేత్రంలో పెంచారు. ఇందులో తక్కువ ఎత్తుగలవి, తక్కువ వయసులో కాపునకు వచ్చేవి, పెద్ద సైజు కాయలు వచ్చే 50 రకాలను గుర్తించారు. పరిశోధనలకు వాటి నుంచి సేకరించిన తాటి కాయలు, తేగలు, నీరాతో ప్రయోగాలు చేశారు. తాటి చెట్ల నుంచి కల్లు కంటే నీరా సేకరణ ద్వారా అధికంగా లాభాలు ఉంటాయని గుర్తించిన శాస్త్రవేత్తలు మొదటి దశలో కల్లు కుండలకు సున్నం రాసి నీరా సేకరించేవారు. ఈ పద్ధతి శాస్త్రీయం కావడంతో కూల్ బాక్స్లో నీరా సేకరణ ద్వారా విజయం సాధించారు. తాటి బెల్లాన్ని నీరాతోనే తయారు చేస్తారు. మార్కెటింగ్, ఉత్పత్తిపై దృష్టి సుదీర్ఘ కాలం పరిశోధనల తర్వాత తాటితో అనేక రకాల ఆహార ఉత్పత్తులు తయారు చేశారు. ప్రస్తుతం తాటి పండ్లతో ఎక్కువ స్థాయిలో ఆహార పదార్థాలు ఉత్పత్తి చేయడంపై దృష్టి సారించాం. ఇప్పటి ఐటీడీఏ అటవీ శాఖ సహకారంతో నీరా కేఫ్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాం. గ్రామ స్థాయిలో తాటి చెట్ల ద్వారా వచ్చే లాభాలపై రైతులను చైతన్యపరుస్తున్నాం. గిరిజన రైతుల నుంచి నీరా సేకరిస్తున్నాం. మార్కెట్లో తాటి బెల్లం, నీరాకు మంచి డిమాండ్ ఉంది. అలాగే తేగలతో తయారు చేసిన పిండిలో మంచి ఫైబర్, పోషకాలు ఉంటాయి. –డాక్టర్ పీసీ వెంగయ్య, హెచ్ఆర్ఎస్ కోఆర్డినేటర్, పందిరిమామిడి పరిశోధన.. శిక్షణ2010 సంవత్సరం నుంచి పందిరిమామిడి హెచ్ఆర్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ పీసీ వెంగయ్య తాటితో సహజమైన ఆహార ఉత్పత్తుల తయారీపై పరిశోధనలు ప్రారంభించారు. తాటి తాండ్ర, నీరా, తేగల పిండి, జెల్లీ, బుర్ర గుజ్జు ప్లోర్, తాటి ముంజుల క్యాండీ, చాక్లెట్లు, బిస్కెట్లు, తాటి పండు జ్యూస్ వంటివి 30 రకాల ఆహార పదార్థాలు తయారు చేశారు. 2020లో ఆశ స్వచ్ఛంద సంస్థ– హెచ్ఆర్ఎస్ సహకారంతో తేగల పిండిని లండన్కు సరఫరా చేశారు. రెండు రకాల ఆహార ఉత్పత్తులకు పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేశారు. 2025లో అఖిల భారత స్థాయిలో ఉత్తమ పరిశోధన స్థానంగా గుర్తించారు. తాటికి సంబంధించిన ఆహార ఉత్పత్తుల తయారీలో ఇప్పటి వరకూ 5 వేల మందికి శిక్షణ ఇచ్చారు. 1993 నుంచి తాటి పరిశోధనల్లో శాస్త్రవేత్తలు డాక్టర్ పురుషోత్తం, డాక్టర్ రాఘవరావు, డాక్టర్ విజయపద్మ, డాక్టర్ కేటీవీ రమణ, డాక్టర్ సత్తిరాజు, డాక్టర్ నరసింహమూర్తి, డాక్టర్ రాజేంద్ర›ప్రసాద్ పాలుపంచుకున్నారు. ప్రస్తుతం డాక్టర్ పీసీ వెంగయ్య హెచ్ఆర్ఎస్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నారు. కూల్ బాక్స్ టెక్నాలజీ ద్వారా.. నీరా సేకరణలో కూల్ బాక్స్ టెక్నాలజీని ఇక్కడి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. తాటిచెట్టు నుంచి కల్లు గీత మాదిరిగానే, అయితే గాలి తగలకుండా కూల్ బాక్స్లో సేకరించే దానినే నీరా అంటారు. వంద శాతం సహజంగా తయారయ్యే ద్రవం ఇది. కొబ్బరి నీళ్ల కంటే తియ్యగా ఉంటుంది. ఇందులో పోషక విలువలు ఎక్కువ. ఐరన్ ఎక్కువగా ఉండడంతో రక్తహీనత నివారణకు బాగా ఉపయోగపడుతోంది. ఇందులో ఖనిజ లవణాలు పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. తాటి పిండి చేద్దామా.. తాటి తేగలను ఉడికించి ముక్కలు చేసి ఆరబెట్టాలి. తరువాత హీటర్ బాయిలర్ స్టీమ్లో ఉంచి తేమ పూర్తిగా తొలగిస్తారు. అనంతరం పౌడర్ చేస్తారు. మైదాకు బదులుగా అన్ని రకాల ఆహార పదార్థాల తయారీలో దీనిని ఉపయోగించవచ్చు. ఫైబర్ ఎక్కువగా ఉండడంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు. బెల్లం.. ప్రియం నీరాను రెండు నుంచి మూడు గంటల వరకూ మరగబెట్టడం ద్వారా నీరాలోని నీరు తొలగిపో యి తాటి బెల్లం తయారవుతోంది. దీనిని ఇంటి వద్ద, పరిశ్రమల ద్వారా తయారు చేసేందుకు ప్రత్యేక యంత్రాలను కూడా రూపొందించారు. ఇలా తయారైన బెల్లం పొడిని కిలో రూ.వెయ్యికి అమ్ముతుండడం విశేషం. చాక్లెట్ల తయారీ ఇలా.. సాధారణ చాక్లెట్లు ఎలా తయారు చేస్తారో అదే విధంగా తాటి బెల్లంతో చాక్లెట్లు చేస్తారు. ఈ చాక్లెట్లలో పంచదారకు బదులుగా తాటి బెల్లం వాడతారు. అలాగే కోకో పౌడర్, బటర్ను వినియోగిస్తారు. ఇందులో తక్కువ గ్లైసిమిన్ ఉండడంతో డయాబెటిక్ ఫ్లెండ్లీగా ఉంటుంది. -
డిగ్రీ అధ్యాపకుడికి ప్రశంస
మాడుగుల: స్థానిక డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకుడు పులపర్తి పైడిరాజు మహాభారతంలోని భీష్మపర్వంపై ఉపన్యాసించి ప్రశంసలందుకున్నారు. నెల్లూరుకు చెందిన ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం, మైసూరుకు చెందిన జాతీయ తెలుగు భాషా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ మారిస్ స్టెల్లా కళాశాలలో ఈ నెల 5, 6వ తేదీల్లో జాతీయ తెలుగు భాషా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో భారతీయ జ్ఞాన పరంపర, తెలుగు సాహిత్యం అనే అంశంపై ఆయన ఉపన్యాసించారు. ఈ మేరకు ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం, డైరెక్టర్ ప్రశంసాపత్రం అందజేసి ఘనంగా సత్కరించారు. శనివారం స్థానిక డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ శాస్త్రి, అధ్యాపకులు, విద్యార్థులు పైడిరాజును అభినందించారు. -
దివ్యాంగ బాలలను ప్రోత్సహించాలి
అనకాపల్లి: దివ్యాంగ బాలలను ప్రోత్సహించి, వారిలో నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈవో గిడ్డి అప్పారావు నాయుడు అన్నారు. స్థానిక గుండాల జంక్షన్ ఎస్ఆర్ శంకరన్ హాల్లో జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగ బాలబాలికలకు జిల్లాస్థాయి ఆర్ట్, కల్చరల్ పోటీలను శనివారం నిర్వహించి, బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల్లో ప్రత్యేకమైన నైపుణ్యాలు ఉంటాయని, వాటిని గుర్తించి, సరైన దిశలో ప్రొత్సహించినట్టయితే వారిలో ప్రతిభను వెలికితీయవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహిత విద్య సమన్వయకర్త బి.రామకృష్ణం నాయుడు, మండల విద్యాశాఖాధికారి కోటేశ్వరరావు, వివిధ మండలాల దివ్యాంగ బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, ప్రత్యేక ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


