breaking news
Alluri Sitarama Raju
-
ప్రవేశ పరీక్షల్లోవర్షిణి విశేష ప్రతిభ
● నవోదయ, సైనిక్ స్కూల్రెండింటికీ ఎంపిక ● సత్తా చాటిన గిరిజన బాలిక కొయ్యూరు: మండలాని కి చెందిన ఒక గిరిజన విద్యార్థిని అద్భుత ప్రతిభ కన బరిచింది. గదబపా లెం పంచా యతీ మల్లవరం గ్రామానికి చెందిన తుబిరి వర్షిణి, జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో సత్తా చాటింది. ఒకే విద్యా సంవత్సరంలో అటు నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష (ర్యాంక్ 169)లోనూ, ఇటు కోరుకొండ సైనిక్ పాఠశాల (178/300) ప్రవేశ పరీక్షలోనూ ఉత్తీర్ణత సాధించి రెండింటికీ ఎంపికై ంది. వర్షిణి తండ్రి మల్లేష్ గిరిజన సంక్షేమ శాఖలో వార్డెన్గా విధులు నిర్వహిస్తున్నారు. తండ్రి ప్రోత్సాహంతో కష్టపడి చదివిన వర్షిణి, అత్యంత కఠినమైన ఈ రెండు ప్రవేశ పరీక్షల్లోనూ సీటు సాధించడం విశేషం. తన కుమార్తె అటు నవోదయకు, ఇటు ప్రతిష్టాత్మకమైన సైనిక్ పాఠశాలకు ఎంపిక కావడంపై ఆమె తండ్రి మల్లేష్తో పాటు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
గ్రూప్–2కు పంచాయతీ కార్యదర్శి ఎంపిక
● ఎకై ్సజ్ ఎస్ఐ కొలువు సాధించిన శివకుమార్ ● ఘనంగా సత్కారం అరకులోయ టౌన్: అరకులోయ మండలంలోని బస్కీ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న డి. శివకుమార్ గ్రూప్–2 ఫలితాల్లో ప్రతిభ కనబరిచి, ఎకై ్సజ్ ఎస్ఐ పోస్టుకు ఎంపిక కావడం అభినందనీయమని ఎంపీడీవో అడపా లవరాజు అన్నారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శివకుమార్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. బస్కీ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూనే, కష్టపడి చదివి విజయనగరం జిల్లాలో ఎకై ్సజ్ ఎస్ఐగా ఎంపికవ్వడం గర్వకారణమన్నారు. ఆయన విజయం తోటి ఉద్యోగులకు, నిరుద్యోగులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలువురు పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొని శివకుమార్కు అభినందనలు తెలిపారు. -
భానుడి భగభగలు
గొడుగులను ఆశ్రయించిన వ్యాపారులువడ దెబ్బతో ముంంచంగిపుట్టు సీహెచ్సీలో వైద్య సేవలు పొందుతున్న రోగులు ముంచంగిపుట్టు: ఎప్పుడూ చల్లగా ఉండే ఏజెన్సీ ప్రాంతంలో ఈ ఏడాది ఎండలు ముందస్తుగానే ప్రతాపం చూపుతున్నాయి. గత కొన్ని రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నాయి. ఉదయం 9 గంటలకే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో రానున్న రోజులను తలచుకుని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అత్యధికంగా కొయ్యూరులో 37 డిగ్రీలు నమోదు.. ● 12వ తేదీన కొయ్యూరులో 37 డిగ్రీలు, అరకులో 35.2, చింతపల్లిలో 34.5 డిగ్రీలు నమోదు అయ్యాయి. 13వ తేదీన కొయ్యూరులో 38 డిగ్రీలు, అరకులో 35.8, ముంచంగిపుట్టులో 34.7 డిగ్రీలు నమోదు అయ్యాయి. 14వ తేదీన కొయ్యూరులో 36.4 నమోదు కాగా అరకులో 34.9,ముంచంగిపుట్టులో 34 డిగ్రీలు, 15వ తేదీన కొయ్యూరులో 35.4 డిగ్రీలు, ముంచంగిపుట్టులో 34.2 డిగ్రీలు నమోదు అయ్యాయి. 16వ తేదీన కొయ్యూరులో 34.6 డిగ్రీలు, అరకులో 34.1 డిగ్రీలు, ముంచంగిపుట్టులో 32.6గా నమోదు అయ్యాయి. 17వ తేదీన కొయ్యూరులో 33.8 డిగ్రీలు, అరకులో 31 డిగ్రీలు, ముంచంగిపుట్టులో 30.7 డిగ్రీలు నమోదు అయ్యాయి. 18న కొయ్యూరులో 33.3, జి.మాడుగులలో 31.6, ముంచంగిపుట్టులో 31.3 డిగ్రీలు నమోదు అయినట్టు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం వాతావరణ విభాగం తెలిపింది. ● వడదెబ్బ బారి నుంచి తమను తాము రక్షించుకోవడానికి వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల మెదడులో వేడిని నియంత్రించే హైపోథలామస్ కేంద్రం దెబ్బతిని, మనిషి వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ● శరీరంలో అధిక వేడి ఉత్పత్తి కావడం లేదా శరీరం ఉష్ణాన్ని కోల్పోకపోవడం వల్ల వడదెబ్బ తగులుతుంది. దీనివల్ల శరీరంలోని లవణాలు, నీటి శాతం తగ్గిపోతాయి. అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశాల్లో కష్టపడి పనిచేసే వారు గంటకు సుమారు 3 నుంచి 4 లీటర్ల నీటిని చెమట రూపంలో కోల్పోతారు. ముఖ్యంగా 65 ఏళ్లు పైబడిన వారు, గర్భిణులు, బాలింతలు, పసిపిల్లలు, గుండె జబ్బులు, రక్తపోటు ఉన్నవారు వడదెబ్బకు త్వరగా గురయ్యే అవకాశం ఉంది. వడదెబ్బ లక్షణాలు: విపరీతమైన తలనొప్పి, తల తిరగడం. తీవ్రమైన జ్వరం రావడం. మగతగా ఉండటం లేదా కలవరించడం. ఫిట్స్ రావడం లేదా అపస్మారక స్థితిలోకి వెళ్లడం. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఎండలోకి వెళ్లేటప్పుడు గొడుగు వాడాలి. తెలుపు రంగు, పల్చటి చేనేత వస్త్రాలు ధరించడం ఉత్తమం. తలకు టోపీ లేదా రుమాలు కట్టుకోవాలి.ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య ఆరుబయట కష్టమైన పనులు చేయకుండా ఉండటం మంచిది. బయటకు వెళ్లే ముందు తప్పనిసరిగా నీరు తాగాలి. ఎండలో తిరిగేటప్పుడు చల్లని నిమ్మరసం, కొబ్బరి నీరు లేదా మంచినీరు తీసుకోవాలి. అయితే శీతల పానీయాలు, ఐస్ ముక్కలు తీసుకోవడం వల్ల గొంతు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి వాటికి దూరంగా ఉండాలి.నిర్లక్ష్యం వద్దు వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడగల ప్రదేశానికి చేర్చాలి.చల్లటి నీటిలో ముంచిన తడిగుడ్డతో శరీరం తుడవాలి. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చే వరకు అలాగే చేస్తుండాలి. ఫ్యాన్ గాలి, చల్లని గాలి తగిలేలా చూడాలి. ఉప్పు కలిపిన మజ్జిగ లేదా గ్లూకోజ్ ద్రావణం లేదా ఓరల్ రీ హైడ్రేషన్ ద్రావణం తాగించాలి. వడదెబ్బ తగిలి అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తి నీరు తాగించకూడదు. వీలైనంత త్వరగా దగ్గరలోని ఆరోగ్య కేంద్రానికి తరలించాలి. – నిఖిల్, వైద్యాధికారి, కిలగాడ పీహెచ్సీ, ముంచంగిపుట్టు మండలం మన్యంలో పెరుగుతున్న ఎండ తీవ్రత కొద్దిరోజులుగా పగటి ఉష్ణోగ్రతల్లో మార్పులు ఈ ఏడాది ముందస్తుగానే భానుడి ప్రతాపం నమోదు అవుతున్న అధిక ఉష్ణోగ్రతలు -
జిల్లా ప్రజలకు బూడి ఉగాది శుభాకాంక్షలు
దేవరాపల్లి: పరాభవ నామ సంవత్సరంలో జిల్లా ప్రజలకు సకల శుభాలు, విజయాలు సిద్ధించాలని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్, మాజీ డిప్యూటీ బూడి ముత్యాలనాయుడు ఆకాంక్షించారు. తారువలో బుధవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ఆయన పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ తెలుగు నూతన సంవత్సరాదిలో ప్రతి ఒక్కరూ అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో తలతూగాలని మనసారా భగవంతుడిని కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమృద్దిగా వర్షాలు కురిసి పాడి పంటలు బాగా వృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు. -
బొత్సను కలిసిన ‘చిక్కాల’
బొత్సను కలిసిన చిక్కాల రామారావు పాయకరావుపేట: రాష్ట్ర మాజీ మంత్రి, ప్రస్తుత శాసన మండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణను పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిక్కాల రామారావు మర్యాదపూర్వకంగా కలిశారు. బొత్స సత్యనారాయణ ఇటీవల ఆనారోగ్యానికి గురై విశాఖపట్నంలో గల ఆయన స్వగృహాంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. చిక్కాల రామారావు ఆయన స్వగృహానికి వెళ్ళి ఆరోగ్య పరిస్ధితిని ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. బొత్స సత్యనారాయణ ఆరోగ్యంగా ఉండాలని, దేవున్ని ప్రార్ధిస్తున్నట్లు చిక్కాల రామారావు తెలిపారు. -
ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఆర్డీవో రమణ
నర్సీపట్నం: పురపాలిక ప్రత్యేక అధికారిగా ఆర్డీవో వి.వి.రమణ బుధవారం బాధ్యతలు చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర, వివిధ విభాగాల అధికారులు ప్రత్యేక అధికారికి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యాలయ సిబ్బందితో సమావేశమై ఆయా విభాగాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వేసవి నేపథ్యంలో పురపాలక సంఘంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందుస్తుగా అన్ని చర్యలు చేపడతామని చెప్పారు. నీటి ఎద్దడి గల ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తామని తెలిపారు. చేతిపంపులు వినియోగంలోకి తీసుకువస్తామని, శానిటేషన్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టే పనులు ఈ నెలాఖరులోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పట్టణంలో కొత్తగా కరెంట్ స్తంభాలు వేయించటనున్నట్టు ఆయన చెప్పారు. -
పరిహారం చెల్లించకుండా భూమిపూజ తగదు
అనకాపల్లి : నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకుండా ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్కు ఈ నెల 23న భూమి పూజ చేయడానికి ఏర్పాట్లు చేయడం సరికాదని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాథం అన్నారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో బుధవారం రౌండ్టేబుల్సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వైజాగ్ –చైన్నె ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్టోలో భాగంగా నక్కపల్లి మండలంలో రాజయ్యపేట, బుచ్చిరాజుపేట, చందనాడ, అమలాపురం, డిఎల్.పురం ఐదు పంచాయతీల పరిధిలో 11 గ్రామాల నుండి 5,500 ఎకరాల భూమి రైతుల నుంచి బలవంతంగా ప్రభుత్వం సేకరించిందన్నారు. 2,100 ఎకరాల భూమిని ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం కేటాయించిందని, నిర్వాసితులైన రైతులు, కూలీలు, వృత్తిదారులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ఇవ్వాల్సిన పరిహారం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు ఇప్పటివరకు పూర్తిగా అమలు చేయలేదన్నారు. నిర్వాసిత కాలనీలో ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా ఆగమేఘాలమీద ప్రస్తుతం నివసిస్తున్న ఇళ్లు నేలమట్టం చేసి నిర్వాసితులను నడిరోడ్డుపై నెట్టివేయడం అన్యాయమన్నారు. రైతులు, నిర్వాసితులకు పూర్తిస్థాయి ప్యాకేజీ, పునరావాసం కల్పించాలని, ఆర్.కార్డులు ఇవ్వాలని, పర్మినెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని, కంపెనీ నిర్మాణ దశలో నిర్వాసితులకు ఉపాధి కల్పించాలని కోరారు. జిరాయితీ భూములతో సమానంగా డి–ఫారం సాగు భూములకు కూడా పూర్తిస్థాయి పరిహారం చెల్లించాలన్నారు. వివాహమైన ఆడపిల్లలకు, 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతీ, యువకులకు భూసేకరణ సందర్భంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, ఇంటి స్థలం ఇవ్వాలన్నారు. ఇళ్లు కోల్పోయి నిర్వాసితులైన కుటుంబాలకు ప్రస్తుతం ఇచ్చిన ప్యాకేజీ రూ.8,98,000 అంగీకారం కాదని, పెరిగిన ఇంటి నిర్మాణ సామాగ్రి ధరలకు అనుగుణంగా రూ.25 లక్షల ప్యాకేజీ పెంచి ఇవ్వాలన్నారు. నిర్వాసితుల కాలనీలో విద్యా, వైద్యం, విద్యుత్, నీటి సౌకర్యంతో పాటు 25 రకాల మౌలిక సదుపాయాలు పూర్తిగా కల్పించే వరకు బలవంతంగా ఖాళీ చేయించకూడదని ఆయన కోరారు. కార్యక్రమంలో సీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.అప్పలరాజు, డి.వెంకన్న, ఆర్.శంకరరావు, గంటా శ్రీరామ్, గనిశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు. -
ఆటో, బైక్ ఢీ.. వృద్ధురాలు మృతి
రావికమతం : మండలంలో కొత్తకోట దాటిన తరువాత వమ్మవరం వెళ్లే రూటు దగ్గరలో బుధవారం ఆటోను బైక్ బలంగా ఢీ కొట్టిన సంఘటనలో వృద్ధురాలు మృతి చెందగా యువకునికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలో కొత్తకోట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన దుర్ఘటన వివరాలివి. రోలుగుంట మండలం బలిజిపాలెం గ్రామానికి చెందిన కంట్రెడ్డి దేముళ్లుమ్మ (65) కొత్తకోట నుంచి సొంత గ్రామం బలిజిపాలెం వెళ్లేందుకు ఏపీ05 టీఎన్1905 నంబర్ గల ఆటో ఎక్కింది. ఆటో కొత్తకోట దాటి వెళ్తుండగా అదే సమయంలో వమ్మవరం గ్రామం నుంచి ఏపీ 40 హెచ్బి 1633 నంబర్ గల బైక్పై వస్తున్న పండూరు ప్రశాంత్ ఆటోను బలంగా ఢీ కొట్టాడు. దీంతో ఆటో డ్రైవరు ఈశ్వరరావుకు స్వల్పంగా గాయాలుకాగా, ఆటోలో ప్రయాణం చేస్తున్న దేముళ్లమ్మకు, బైకుపై వస్తున్న ప్రశాంత్కు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరిని కొత్తకోట పీహెచ్సీకి తరిలించి ప్రథమ చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఇద్దరిని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే దేముళ్లమ్మ పరిస్థితి విషమించి మృతి చెందగా, ప్రశాంత్ను మెరుగైన చికిత్స నిమిత్తం కేజిహెచ్కు తరిలించారు. దీనిపై కొత్తకోట ఎస్ఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. గాయపడిన యువకుడు పండూరు ప్రశాంత్మృతి చెఽందిన దేముళ్లుమ్మ (ఫైల్) -
మర్యాదపూర్వక కలయిక
అనకాపల్లి/రోలుగుంట: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని బుధవారం ఆ పార్టీ యువజన విభాగం ఉత్తరాంధ్ర జోనల్ అధ్యక్షుడు అంబటి శైలేష్, అనకాపల్లి యువజన విభాగం అధ్యక్షుడు వెంకటేష్ , వైఎస్సార్సీపీ జిల్లా యూత్ సెక్రటరీగా ఇటీవల నియమితులైన కన్నడ చలనచిత్ర నటుడు, మండలం బి.బి.పట్నం గ్రామానికి చెందిన గొందు సిద్ధు మర్యాదపూర్వకంగా వేర్వేరుగా కలిశారు. తాడేపల్లిలో గల క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి సింహాచలం శ్రీ నృసింహస్వామి వారి విగ్రహాన్ని అందజేశారు. -
గ్యాస్ డెలివర్రీ
నర్సీపట్నం: సరిపడా నిల్వలు ఉన్నాయి. గ్యాస్ సిలిండర్ల కొరత లేదంటూ అధికారులు చెబుతున్నా... క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. సమయానికి గ్యాస్ సిలిండర్లు సరఫరా కాకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. హెచ్పీ గ్యాస్ ఏజెన్సీల డిస్ట్రిబ్యూటర్లు, డెలివరీ బాయ్స్ అక్రమాలకు పాల్పడుతున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. బాక్ల్ మార్కెట్ దందా జోరుగా నడుస్తున్నా సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారని వాపోతున్నారు. వాణిజ్య సిలిండర్ల సరఫరా తగ్గిపోవడంతో గృహ అవసరాల సిలిండర్లకు మార్కెట్లో డిమాండ్ పెరిగింది. దీంతో డబుల్ సిలిండర్లు ఉన్నవారి నంబర్లను గుర్తించి వినియోగదారులకు తెలియకుండానే బుకింగ్ చేసేస్తున్నారు. ఒక్కోదాని ఖరీదు రూ.968 ఉండగా బహిరంగ మార్కెట్లో రూ.2 వేలకు పైగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. గ్యాస్ సరఫరాకు సంబంధించి వినియోగదారులు హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి ఫోన్ చేస్తున్నా ఆ ఫోన్ ఉలకదు..పలకదు అన్నట్టుగా ఉంది. మరోవైపు గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు ల్యాండ్లైన్ ఫోన్ నంబర్లను తీయడం లేదు. డెలివరీ బాయ్స్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలోని గ్యాస్ ఏజెన్సీల పరిధిలో సుమారు 75 వేల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం నాలుగు రెట్ల మంది అధికంగా నమోదు చేసుకుంటున్నారు. బుకింగ్ చేసుకుని నెలలు గడుస్తున్నా సిలిండర్ల అందక వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. -
శిశు సంరక్షణ గృహానికి ముగ్గురు పిల్లలు తరలింపు
గొలుగొండ : తల్లి అనారోగ్యంతో రెండు రోజులు క్రితం చనిపోయింది. తండ్రి ఉన్నా లేనట్టే. పిల్లలు బాధ్యత తండ్రి పట్టించుకోలేదు. చేరదీసే తల్లి చనిపోవడం, కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో కొత్త ఎల్లవరం గ్రామంలో బుధవారం ముగ్గురు పిల్లలను ఐసీడీఎస్ అధికారులకు సర్పంచ్ రాంబాబు, గ్రామస్తులు అప్పగించారు. వివరాలివి. కొత్త ఎల్లవరం గ్రామానికి చెందిన పైల పెద్దినాయుడు, లక్ష్మి దంపతులకు ముగ్గరు పిల్లలు. పెద్ద కుమార్తె 7 సంవత్సరాలు, రెండు బాబుకు ఐదు సంవత్సరాలు, మూడో బాబుకు రెండు నెలలు. లక్ష్మికి కడుపులో దీర్ఘకాలిక వ్యాధి రావడంతో ఆసుపత్రిలో చూపించినా ప్రయోజనం లేకుండా పోవడంతో ఆమె రెండు రోజులు క్రితం చనిపోయింది. తండ్రి పెద్దినాయుడు కనీసం పిల్లలు వంక చూడకపోవడంతో గ్రామస్తులు అంతా ఐక్యంగా ఆలోచించి వారి సంరక్షణ బాధ్యత ఐసీడీఎస్కు అప్పగించాలని నిర్ణయించారు. దీంతో గ్రామస్తులు గొలుగొండ ఐసీడీఎస్ పీవో శ్రీగౌరికి సమాచారం ఇవ్వడంతో ఐసీడీఎస్ సిబ్బంది ముగ్గురు పిల్లలను అనకాపల్లి శిశు సంరక్షన కేంద్రానికి అప్పగించడం జరిగిందని పీవో శ్రీగౌరి తెలిపారు. -
సజావుగా పది పరీక్షలు
నాతవరం : జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని డీఈవో గిడ్డి అప్పారావునాయుడు అన్నారు. మండలంలో బుధవారం నాతవరం డి.యర్రవరం హైస్కూల్లో గల పరీక్ష కేంద్రాలను ఆయన స్వయంగా పరిశీలించారు. పరీక్షలు రాసే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. తర్వాత మర్రిపాలెం పంచాయతీ శివారు వె న్నలపాలెంలో గల పాఠశాలను ఆకస్మాకంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతం కంటే ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులు ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించామన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం దగ్గర్నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహించడం వంటి జాగ్రత్తలు చేపట్టామన్నారు, విద్యార్థులకు విద్యతో పాటు అరోగ్య విషయంలో కూడా శ్రద్ధ అవసరమని అన్నారు. కార్యక్రమంలో ఎంఈవోలు కామిరెడ్డి వరహాలబాబు, బ్రహ్మజీ, సిబ్బంది పాల్గొన్నారు. పది హిందీ పరీక్షకు 66 మంది గైర్హాజరు అనకాపల్లి టౌన్: పదవ తరగతి హిందీ సబ్జెక్ట్ పరీక్షల్లో జిల్లా వ్యాప్తంగా జరిగిన 102 కేంద్రాలలో 20,581 మంది విద్యార్థులకు గానూ 20,519 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 62 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు తెలిపారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో ఓపెన్ స్కూల్ హిందీ పరీక్షకు 439 మంది విద్యార్థులకు గానూ 373 మంది విద్యార్ధులు పరీక్షలు రాయగా 66 మంది పరీక్షలకు హాజరు కాలేదన్నారు. ఈ పరీక్ష కేంద్రాలను ఏడు స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించారన్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని డీఈవో తెలిపారు. -
ప్రభుత్వ పాఠశాలలో పేలుడు పదార్థాల నిల్వ
యలమంచిలి రూరల్ : రాష్ట్రంలో పలుచోట్ల బాణసంచా పేలుడుతో ప్రమాదాలు జరుగుతున్నా అధికార పార్టీ నాయకుల్లో మాత్రం మార్పు రావడం లేదు. మండలంలో పేరంటాళ్లపాలెం(మెట్టపాలెం) మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో మంగళవారం రాత్రి స్థానిక జనసేన నాయకులు కొందరు పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలతో కూడిన బాణాసంచాను అక్రమంగా నిల్వ చేశారు. ఒకే టీచర్తో నడుస్తున్న ఈ పాఠశాలలో విద్యార్థులందరికీ ఒకటే తరగతి గది ఉంది. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో గ్రామానికి చెందిన కొందరు నాయకులు పాఠశాల తలుపులు తీసి బయట నుంచి తెచ్చిన పేలుడు పదార్థాలను నిల్వ చేశారు. ఈ విషయం తెలిసిన కొందరు గ్రామస్థులు పాఠశాలలో బాణాసంచాను అక్రమంగా నిల్వ చేయడమేమిటని అభ్యంతరం తెలపడంతో బుధవారం ఉదయం జనసేన నేతలు బాణాసంచాను అక్కడి నుంచి మరోచోటుకి తరలించారు. ఒకవేళ పాఠశాలకు విద్యార్థులు వచ్చి అనుకోని ప్రమాదం సంభవిస్తే ఎవరి బాధ్యత వహిస్తారని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. అసలు రాత్రి సమయంలో పాఠశాల తాళాలు ఎలా తీస్తారని, విలువైన సామగ్రి, రికార్డులు అదృశ్యమైతే బాధ్యత ఎఅవరు వహిస్తారని వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలు నిల్వ చేసినవారిపై, వారికి సహకరించిన వారిపై చర్యలు తీసుకుని ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని గ్రామస్థులు కోరుతున్నారు. దీనిపై ఎంఈవో సూర్యప్రకాష్ను సంప్రదించగా పేరంటాళ్లపాలెం పాఠశాలలో నిల్వ చేసిన బాణాసంచాను వెంటనే అక్కడి నుంచి తొలగించాలని ఉపాధ్యాయురాలిని ఆదేశించామన్నారు. -
దివ్యాంగ శక్తి పథకం ప్రారంభించిన స్పీకర్
జెండా ఊపి పథకాన్ని ప్రారంభిస్తున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం : ఆర్టీసీ కాంప్లెక్స్లో బుధవారం దివ్యాంగ శక్తి పథకాన్ని స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల కోసం ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించే సౌకర్యం కల్పించామన్నారు. 40 శాతంకు పైగా వైకల్యం ఉండే దివ్యాంగులు ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ ధీరజ్, పలువురు ప్రజాప్రతినిథులు తదితరులు పాల్గొన్నారు. -
రెండు కిలోల గంజాయితో ఒకరి అరెస్టు
దేవరాపల్లి : అక్రమంగా రెండు కిలోల గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని దేవరాపల్లి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఎస్ఐ వి.సత్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఏజెన్సీ నుంచి గంజాయి తరలిస్తున్నట్టు వచ్చిన సమాచారం మేరకు శ్రీరాంపురం జంక్షన్ వద్ద మంగళవారం వాహనాలు తనిఖీ చేపట్టారు. జీనబాడు వైపు నుంచి ఓ బ్యాగ్తో వస్తున్న వ్యక్తి పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు అప్రమత్తమై అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి బ్యాగ్ తనిఖీ చేయగా రెండు కిలోల గంజాయి పట్టుబడింది. పట్టుబడిన వ్యక్తి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహింపట్నం మండలం సుఘాలి గ్రామానికి చెందిన భూక్య హేమంత్కుమార్గా పోలీసులు గుర్తించారు. అతని వద్ద నుంచి గంజాయితో పాటు మొబైల్ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.లక్ష వరకు ఉంటుందని అంచనా వేశారు. ఈ గంజాయిని ఒడిశాలో కొనుగోలు చేశాడని, చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి విక్రయిస్తున్నట్టు నిందితుడు హేమంత్ కుమార్ అంగీకరించాడని ఎస్ఐ తెలిపారు. నిందితుడిపై గతంలో రెండు గంజాయి కేసులు నమోదు కాగా బెయిల్పై ఉన్నాడని పోలీసులు తెలిపారు. -
దేవరాపల్లిలో శాంతి ర్యాలీ
దేవరాపల్లిలో ప్లకార్డుతో నినాదాలు చేస్తున్న విద్యార్థులు, సీపీఎం నాయుకులు వెంకన్న, దొర దేవరాపల్లి: మండల కేంద్రం దేవరాపల్లిలో మంగళవారం రాత్రి సీపీఎం ఆధ్వర్యంలో విద్యార్థులు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులను నిరసిస్తూ నాలుగు రోడ్ల కూడలిలో యుద్ధం వద్దు...శాంతి ముద్దు అంటూ ప్లకార్డులు చేత పట్టి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న మాట్లాడుతూ ఇరాన్పై ఇజ్రాయిల్, అమెరికా దేశాలు దాడులు చేయడాన్ని తక్షణమే నిలిపివేయాలన్నారు. గ్యాస్ కొరతను నివారించాలని, ఇప్పటికే పెరిగిన నిత్యవసర ధరలతో సతమతమవుతున్న ప్రజలపై భారం మోపద్దని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి బి.టి. దొర తదితర్లు పాల్గొన్నారు. -
రాజకీయ రంగు
పెదపూడిలో నూకాంబిక పండగకు బుచ్చెయ్యపేట : మండలంలో గల పెదపూడి నూకాలతల్లి పండగకు కూటమి ప్రభుత్వం రాజకీయ రంగు పులిమారు. నూకాంబిక అమ్మవారికి వందేళ్లుగా వంశపారం పర్యంగా వస్తున్న పూజలు, ఆచారాలను తప్పించి ఈ ఏడాది కూటమి నేతల కమిటీతో అమ్మవారికి పండగ జరిగేలా చేయడంపై గ్రామస్తులు ఆగ్రహం చెందుతున్నారు. గ్రామానికి చెందిన గోకివాడ అప్పలస్వామి నాయుడు వంశీయులు ఆధ్వర్యంలో వందేళ్లుగా నూకాంబిక అమ్మవారికి గ్రామంలో పూజలు చేస్తున్నారు. ఇతని వారసులు వీరుబాబు, రామునాయుడు, రాములోడు వీరంతా అప్పటి నుంచి వంశపారంపర్యంగా ప్రతి ఏటా అమ్మవారికి పూజలు చేస్తున్నారు. గతంలో వీరంతా అప్పటి గ్రామ అధికారి మున్సిబు పోతురాజు ఆధ్వర్యంలో అమ్మవారికి ఘనంగా పూజలు చేసేవారు. గోకివాడ కుటుంబానికి చెందిన దాసుడు ఇతని కుమారులు గోకివాడ దేముడు 30 ఏళ్లు, రామనాయుడు గత పదేళ్లుగా నూకాలతల్లి అమ్మవారికి కొత్త అమావాస్య రోజున, ఇతర రోజుల్లో పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. 2002లో పెదపూడి నూకాంబిక ఆలయాన్ని ప్రభుత్వం ఎండోమెంట్(దేవదాయశాఖ)లో కలిపారు. అమ్మవారి ఆలయానికి ఆదాయం రావడం లేదని వంశపారం పర్యంగా నూకాంబిక ఉత్సవాలు చేసుకోవాలని దేవస్థానం అధికారులు ఆలయం నిర్మించిన గోకివాడ కుటుంబ సభ్యులకు తెలిపారు. 25 ఏళ్లుగా ఆలయం కట్టించిన గోకివాడ కుటుంబ సభ్యులే అమ్మవారికి ప్రతి ఏటా కొత్త అమావాస్య పండగ నిర్వహిస్తున్నారు. గతంలో ఎపుడూ లేని విధంగా ఈ ఏడాది ఎమ్మెల్యే పెదపూడి నూకాంబిక ఆలయ ఉత్సవాలకు కమిటీ వేయడంపై గ్రామస్తులు, ఆలయ వంశపారంపర్య కుటుంబ సభ్యులు మండి పడుతున్నారు. ఎప్పటిలాగే ఈ ఏడాది లక్షలాది రూపాయలతో నూకాంబిక అమ్మవారి పండగ చేద్దామని అమ్మవారి ధర్మకర్త మండలి సభ్యులు తగిన చర్యలు చేపట్టారు. ఆలయానికి రంగులు వేసి భారీ విద్యుత్ లైటింగ్, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఇతర పండగ ఏర్పాట్లు చేసుకున్నారు. నూకాంబిక ఆలయం కట్టించిన గోకివాడ వంశీయులు మంగళవారం రాత్రి గుడిలో పూజలు చేయడానికి వెళ్లగా కూటమి నేతలు పోలీసులతో వీరిని అడ్డగించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 11 మంది కమిటీ సభ్యులతోనే అమ్మవారికి పూజలు, ఉత్సవం చేస్తామని మీరు గుడిలోకి రావొద్దని తెలపడంపై సర్పంచ్ గోకివాడ వరక్రిష్ణ, రమణ, దాసుడు, బండి నాయుడు, వీరునాయుడు, నాగేష్, దేముడు నాయుడు, బొట్టా శివ, వియ్యపు పైడిరాజు, వియ్యపు సోమునాయుడు, రాజబాబు, సాగిరాజు వర్మ , ఎండ్లబోయిన రమణ, పాతరబిల్లి తాతబాబు తదితరులు ఆగ్రహం చెందుతున్నారు. దీనిపై ఇరు వర్గాల వారికి వాగ్వాదం జరిగింది. పోలీసులు ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలను కాకుండా కమిటీ సభ్యులతోనే ఉత్సవాలు చేయాలని తెలిపారు. దీంతో ఆలయం వద్ద నుంచి ధర్మకర్తల మండలి సభ్యులు వచ్చేశారు. అమ్మవారి ఉత్సవాలకు రూపాయి కూడా ఖర్చు పెట్టలేని వారిని ఉత్సవ కమిటీ సభ్యులుగా నియమించడంపై వీరు ఆగ్రహం చెందుతున్నారు. నెల రోజుల కిందట వడ్డాదిలో వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాలకు ఉత్సవ కమిటీ వేయలేని ఎమ్మెల్యే చిన్న గ్రామంలో నూకాంబిక ఆలయానికి కమిటీ వేయడమేంటని, దేవుడి దగ్గర కూటమి నేతలు రాజకీయం చేయడం సిగ్గుచేటని వాపోయారు. ముందుగా స్టేజీ, మైక్ అనుమతి కోరిన ఆలయ ధర్మకర్తలకు అమ్మవారికి ఉత్సవం నిర్వహించే అధికారం లేదని పోలీసులు అడ్డుకోవడమే కాకుండా గుడి వద్ద బందోబస్తు ఏర్పాటు చేయడపై గ్రామస్తులు మండిపడుతున్నారు. -
ఉపాధి పథకంలో అవకతవకలపై చర్యలేవీ...
అధికారులను నిలదీస్తున్న ప్రజా ప్రతినిధులు రావికమతం : ఉపాధి హామీ పథకం పనులకు కూలీలు రాకపోయినా మష్టర్లు వేసుకోవడం, కొలతల్లో తేడాలు, వీఅర్పీల అవినీతి, గ్రామాల్లో సర్పంచ్లకు సమాచారం ఇవ్వకుండా సామాజిక తనిఖీ గ్రామ సభలు పెట్టడం తదితర అంశాలపై స్థానిక మండల పరిషత్ ఆవరణలో మంగళవారం సామాజిక తనిఖీ ప్రజా వేదికలో ప్రజా ప్రతినిధులు నిలదీశారు. డ్వామా ఇన్చార్జి పీడీ రవీంద్ర, అంబుడ్స్మెన్ వేణుగోపాలరావు, జిల్లా విజి లెన్స్ అధికారి లలితశ్రీ, సామాజిక తనిఖీ ఎస్ఆర్పీ దాసు హాజరయ్యారు. మండల పరిధిలో 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.212.24 కోట్లతో 1187 పనులు జరిగినట్టు అధికారులు తెలిపారు. 2014–15లో 39 మినీ గోకులం షెడ్ల కోసం రైతులు ఒక్కో షెడ్డుకు రూ.18,500 చొప్పున డీడీలు తీయడం జరిగింది. కట్టిన డీడీలు తాలుకా డబ్బులు ఇప్పటి వరకు రైతులకు తిరిగి అందజేయలేదు. దుర్గా కనస్ట్రక్షన్ వారు కట్టిన డీడీలు మార్చుకుని తీసుకున్నట్టు సమాచారం ఉంది. దీనిపై గతంలో చేపట్టిన సామాజిక తనిఖీల సమయంలో ఫిర్యాదు చేసినా ఇంత వరకు చర్యలు తీసుకోలేదని, గోకులం షెడ్డులకు డీడీలుగా కట్టిన డబ్బులు ఏమయ్యాయో చెప్పేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని గొంప ఎంపీటీసీ సూర్యనారాయణ తెలిపారు. అధికారులు కలగజేసుకొని ఈ విషయంమై జిల్లా అధికారులు దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఉపాధి పనులపై ఆడిట్ సక్రమంగా జరగలేదని, రీ ఆడిట్ జరిపించి సర్పంచ్ సమక్షంలో గ్రామ సభ నిర్వహించాలని పండూరి సత్తిబాబు పట్టుబట్టారు. దీనిపై ఉన్నధికారుల దృష్టికి తీసుకెళ్లామని దానిపై తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. సామాజిక తనిఖీ ప్రజా వేదికలో చాలా గ్రామాల్లో జరిగిన పనుల్లో కొలతల్లో తేడాలు, కూలీలు పనులకు వెళ్లకుండా మష్టర్లు వేసినట్టు గుర్తించారు. దీనిపై జిల్లా అధికారుల దృష్టికి తీసుకొచ్చి సమగ్ర విచారణ చేస్తామని అధికారులు తెలిపారు. -
పచ్చనేత మట్టిమేత
కోటవురట్ల : అధికారం అండతో టీడీపీ నేతల కాసుల దాహానికి కొండలు పిండవుతున్నాయి. ప్రభుత్వ ఖజానాకు గండిపడుతోంది. చినబొడ్డేపల్లి శివారు రెడ్డి కొత్తూరుకు చెందిన ఓ టీడీపీ నేత రెండేళ్లుగా కొండలను పిండి చేసి గ్రావెల్ మాఫియా నడుపుతున్నాడు. ఇదంతా స్వయానా హోం మినిస్టరు అనిత సొంత నియోజకవర్గంలోనే జరుగుతున్న మహా దోపిడీ కావడం గమనార్హం. అధికారం అండతోనే సదరు టీడీపీ నేత కొండలను ఇష్టానుసారంగా తవ్వేసి గ్రావెల్, రాయిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నాడు. చినబొడ్డేపల్లి రెవెన్యూ పరిధిలోని రెండు కొండలపై ఇతని కన్ను పడి బక్కచిక్కిపోయాయి. కొండలు సగానికి తరిగిపోయినా మైనింగ్ శాఖాధికారులు, రెవెన్యూ శాఖాధికారులు నోరుమెదపడం లేదు. చినబొడ్డేపల్లి రెవెన్యూ పరిధిలో ఉన్న నూకాలమ్మకొండ, ఒట్టివోడు కొండలను ఇష్టానుసారం తవ్వేస్తున్నాడు. ఫిర్యాదు వచ్చినపుడు పోలీసులు, రెవెన్యూ అధికారులు వెళ్లేసరికి సదరు మాఫియా డాన్ అక్కడి నుంచి పొక్లెయిన్, ట్రాక్టర్లను తరలించేస్తున్నాడు. కొండలపై తవ్వకపు జాడలు స్పష్టంగా కనిపించినా ఎవరూ లేరన్న వంకతో అధికారులు మిన్నకుండిపోతున్నారు. ఇంత భారీ స్థాయిలో తవ్వకాలు జరుగుతున్నా మైనింగ్ శాఖాధికారుల జాడే లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సదరు వ్యక్తి ఇపుడు మట్టి తరలింపును కూడా వ్యాపారంగా చేసుకున్నాడు. కనిపించిన గ్రావెల్, రాయి, మట్టి అప్పనంగా అమ్మేసుకుని రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ప్రస్తుతం గ్రావెల్ తవ్వకాలతో పాటు మట్టి వ్యాపారం మూడు గ్రావెల్ ట్రాక్టర్లు, ఆరు మట్టి ట్రాక్టర్లుగా వ్యాపారం సాగిస్తున్నాడు. పిప్పళ్ల కొత్తపల్లి రెవెన్యూ పరిధిలోని చెరువును తవ్వేసి స్థానికంగా కొబ్బరితోటలను మెరక చేసే బేరాలు సాగిస్తున్నాడు. అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపినా అధికారులు చోద్యం చూస్తున్నారు. చర్యలు తీసుకుంటాం మండలంలో గ్రావెల్ తవ్వకాలకు ఎక్కడా అనుమతి లేదు. తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. అలాగే చెరువులో మట్టి తవ్వినా చర్యలు తీసుకుంటాం. ఇటువంటి అక్రమాలు జరిగితే స్థానికులు సమాచారం ఇవ్వాలి. కొడవటిపూడి సమీపంలో కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ రహదారి నిర్మాణానికి కొన్ని ట్రాక్టర్ల గ్రావెల్ కోసం మైనింగ్ శాఖాధికారులు అనుమతి ఇచ్చారు. కానీ దానికి భారీ స్థాయిలో తవ్వకాలు అవసరం లేదు. – తిరుమలబాబు, తహసీల్దారు, కోటవురట్ల -
ఫిర్యాదుదారునికి తహసీల్దార్ తప్పుడు సమాచారం
దేవరాపల్లి: దేవరాపల్లి రెవెన్యూలో నాలుగు సర్వే నంబర్లలో ఆక్రమణలపై పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేస్తే ఒక సర్వే నంబర్కే ఎండార్స్మెంట్ ఇచ్చి ఫిర్యాదుదారుడిని, ఉన్నతాధికారులను స్థానిక తహసీల్దార్ తప్పుదోవ పట్టించారని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న ఆరోపించారు. మంగళవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన తహసీల్దార్ భూ కబ్జాదారులను రక్షించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దేవరాపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 280, 280/1, 281/1, 281/2 లో గల ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించాలని గత ఏడాది డిసెంబర్ 8న కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో అర్జీ అందజేశామన్నారు. ఈ పత్రాలను మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్లకు, సీసీఎల్ఏకు పంపించామని చెప్పారు. స్థానిక తహసీల్దార్ దీనిపై విచారణ జరిపి 281/2 లో గల భూమి కోర్టు వివాదంలో ఉందని, ఫల సాయం తీసుకునేందుకు కోర్టు ఆర్డర్ ఉందని, దీనిలో గెస్ట్ హౌస్ నిర్మాణం జరగలేదని ఎండార్స్మెంట్లో పేర్కొన్నారని వెంకన్న తెలిపారు. రెవెన్యూ రికార్డుల్లో లేని సర్వే నంబర్ 281/2ఏ మాత్రమే కోర్టు వివాదంలో ఉందని, మిగిలిన సర్వే నంబర్లకు కోర్టు వివాదాలు లేవన్నారు. తహసీల్దార్ సర్వే నంబర్ 281/2 కు మాత్రమే ఎండార్స్మెంట్ ఇచ్చి ఫిర్యాదుదారుడిని, ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించడం దారుణమన్నారు. వెంటనే కలెక్టర్ జోక్యం చేసుకుని తప్పుడు ఎండార్స్మెంట్ ఇచ్చిన తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని వెంకన్న డిమాండ్ చేశారు. -
చలో ఢిల్లీని విజయవంతం చేయండి
● దారకొండ ఆర్ఎస్ఎస్ సభ్యుల పిలుపుకర్ర పత్రాలు పంపిణీ చేస్తున్న ఆర్ఎస్ఎస్ సభ్యులు సీలేరు: గిరిజన సాంస్కృతిక సంగమం కార్యక్రమంలో భాగంగా చేపట్టనున్న ‘చలో ఢిల్లీ’ యాత్రను గిరిజనులందరూ విజయవంతం చేయాలని దారకొండ ఆర్ఎస్ఎస్ సభ్యులు కోరారు. మంగళవారం గూడెంకొత్తవీధి మండలం దుప్పులవాడ గ్రామంలో వారు కరపత్రాలను పంపిణీ చేశారు. మే 23, 24, 25 తేదీల్లో ఢిల్లీలో జరిగే ఈ కార్యక్రమానికి ఈ ప్రాంతంలోని హిందువులందరూ తరలివచ్చి, గిరిజన సంస్కృతిని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు ఒక ముఖ్యమైన డిమాండ్ను వినిపించారు. మతం మారిన గిరిజనులను షెడ్యూల్డ్ తెగల జాబితా నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు.గూడెం కొత్తవీధి మండలంలోని 16 పంచాయతీల్లో దశలవారీగా పర్యటిస్తూ కరపత్రాలు పంపిణీ చేస్తున్నామని, హిందూ ధర్మ ప్రచారం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా సభ్యులు పేర్కొన్నారు. -
మున్సిపాలిటీ అభివృద్ధికి కలసి నడుద్దాం
నర్సీపట్నం : పార్టీలకు అతీతంగా మున్సిపాలిటీ అభివృద్ధికి అందరం కలిసి నడుద్దామని స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. ఆఖరి మున్సిపల్ సాధారణ సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి స్పీకర్ ఎక్స్ అఫీషియో సభ్యుని హోదాలో పాలకవర్గ సమావేశానికి హాజరయ్యారు. ముందుగా మున్సిపల్ సిబ్బంది అజెండాలోని అంశాలను చదివి వినిపించారు. పాలకవర్గాన్ని ఉద్దేశించి స్పీకర్ మాట్లాడుతూ మరో మూడేళ్లు అధికారంలో ఉంటా..నర్సీపట్నంను అభివృద్ధి చేయడమే తన ఏకై క లక్ష్యమన్నారు. మున్సిపాలిటీని రూ.21 కోట్లతో అభివృద్ధి చేశాను.. వచ్చే నెలలో మరో రూ.10 కోట్లు తెస్తున్నానన్నారు. రానున్న కాలంలో మరో రూ.20 కోట్లు తీసుకువస్తానన్నారు. తాను స్పీకర్ హోదాలో ఉండడం వల్ల కాదనకుండా మంత్రులు నిధులు ఇస్తున్నారన్నారు. ప్రజలకు మంచి చేశామన్న సంతృప్తి రాజకీయ నాయకుల్లో ఉండాలన్నారు. రాజకీయ విమర్శలు వేరు, వ్యక్తిగతంగా తనకు ఎవరితోనూ విభేదాలు లేవన్నారు. పార్టీలు వేరైనా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్. వై.ఎస్.రాజశేఖర్రెడ్డి తనను ఎంతో గౌరవంగా చూసేవారన్నారు. కేరళ త్రివేండ్రంలో మాదిరిగా శివపార్వతుల 108 అడుగుల విగ్రహాన్ని నర్సీపట్నం పెద్దచెరువు మధ్యలో ఏర్పాటు చేస్తున్నానన్నారు. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.7 కోట్లు అవుతుందన్నారు. ఈ కార్యక్రమాల్లో సభ్యులంతా భాగస్వాములు కావాలన్నారు. చైర్పర్సన్, వైస్చైర్మన్ కోనేటి రామకృష్ణ, కౌన్సిలర్లు సిరసపల్లి నాని, జగదీశ్వరి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ సహకారంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మున్సిపాలిటీకి కోట్ల రూపాయాలు తీసుకువచ్చి పట్టణాన్ని అభివృద్ధి చేసే అవకాశం తమకు వచ్చిందన్నారు. మాజీ ఎమ్మెల్యే చొరవతో గడపగడప కార్యక్రమంలో ప్రత్యేక గ్రాంటు తీసుకువచ్చి ఎంతో అభివృద్ధి చేశారన్నారు. రెండు ప్రభుత్వాల్లో ఈ పాలకవర్గం పని చేయడం గొప్ప అదృష్టమన్నారు. మునుముందు పట్టణ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. అనంతరం టీడీపీ కౌన్సిలర్లు సిహెచ్.పద్మావతి, ధనిమిరెడ్డి మధు, మాజీ చైర్పర్సన్ గుడబండి ఆదిలక్ష్మి మాట్లాడారు. ప్రథమ శ్రేణి మున్సిపాలిటీ కావడం వల్ల ప్రత్యేక నిధులు వస్తాయని కౌన్సిలర్ పద్మావతి పేర్కొన్నారు. మెయిన్ రోడ్డు విస్తరణకు చర్యలు తీసుకోవాలని మాజీ చైర్పర్సన్ కోరారు. జనసేన కౌన్సిలర్ అద్దెపల్లి సౌజన్య మాట్లాడుతూ మా వార్డుపై ప్రత్యేక దృష్టిసారించాలని, అసంపూర్తిగా నిలిచిన పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరారు. అనంతరం వైఎస్సార్సీపీ, టీడీపీ కౌన్సిలర్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడుతో గ్రూపు ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సురేంద్ర, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
హోంమంత్రి నియోజకవర్గంలో దళితులపై వివక్ష
నక్కపల్లి : హోంమంత్రి నియోజకవర్గంలో దళితులు, దళిత ఉద్యోగులపై వివక్ష చూపిస్తున్నారని, హెచ్ఎంపై సహోపాధ్యాయుడు కులంపేరుతో దూషిస్తే పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎటువంటి కేసు నమోదు చేయలేదని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జె.వి.ప్రభాకర్, అంబేడ్కర్ భీమసేన జిల్లా నాయకుడు కల్యాణరావు ఆరోపించారు. మంగళవారం నక్కపల్లిలో వారు విలేకర్లతో మాట్లాడారు. వేంపాడు హెచ్ఎం చిరంజీవిపై అదే పాఠశాలలో సహోపాధ్యాయుడిగా పని చేస్తున్న ప్రగడ శివాజీ అనే వ్యక్తి కులం పేరుతో దూషించి వివక్ష చూపిస్తున్నారన్నారు. దాదాపు 9 నెలల నుంచి హెచ్ఎంను సహోపాధ్యాయుడు వేధిస్తున్నాడన్నారు. దీనిపై హెచ్ఎం చిరంజీవి పోలీసులకు, డీఈవో, ఎంఈవోలకు ఫిర్యాదు చేసి, వారం రోజులు గడుస్తున్నా ఇంతవరకు శివాజీపై కేసు నమోదు చేయలేదన్నారు. ఒక యూనియన్ అండతో ఉపాధ్యాయుడు కులంపేరుతో దూషించడం చేస్తున్నారన్నారు. ఇదే ఉపాధ్యాయుడిపై గతంలో ఎస్సీ యువకులపై దాడి చేసిన ఘటనలో అట్రాసిటీ కేసు నమోదైనా అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈ విషయం హోంమంత్రి వంగలపూడి అనిత దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. మంత్రి న్యాయం చేస్తారన్న ఆశలు సన్నగిల్లుతున్నాయన్నారు. తక్షణమే శివాజీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలన్నారు. వివక్ష చూపినట్టు రుజువైతే చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు స్పందించకపోతే దళిత సంఘాల తరపున ఆందోళనకు దిగుతామన్నారు. ఈ సమావేశంలో డీహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షుడు శివప్రకాష్, సహాయకార్యదర్సి సుబ్బలక్ష్మి అంబేద్కర్ దళిత సేన జిల్లా కార్యదర్శి గౌతం రాజు, బాధిత హెచ్ఎం చిరంజీవి పాల్గొన్నారు. -
జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలకు అరకు క్రీడా పాఠశాల విద్యార్థులు
అరకులోయ: అరకులోయలోని గిరిజన సంక్షేమ గురుకుల క్రీడా పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయి ఆర్చరీ (విలువిద్య) పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ పి.ఎస్.ఎన్. మూర్తి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను వివరించారు. ఈ నెల 7వ తేదీన విశాఖపట్నం జిల్లా పరవాడలోని సంస్కృతి గ్లోబల్ పాఠశాలలో జరిగిన జిల్లా స్థాయి ఆర్చరీ పోటీల్లో అండర్–15 విభాగంలో వంతాల లలిత్ సాయి తేజ, పాంగి రమేష్, కె. సంపత్ కుమార్.. అలాగే అండర్–13 విభాగంలో కేత్విన్ హర్ష, కె. రవికాంత్ రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. అనంతరం ఈ నెల 11న నూజివీడులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో లలిత్ సాయి తేజ అద్భుత ప్రదర్శనతో బంగారు పతకాన్ని సాధించి జాతీయ స్థాయికి అర్హత సాధించాడు. అండర్–13 విభాగంలో కేత్విన్ హర్ష, ఎ. రవికాంత్ కూడా ప్రతిభ కనబరచి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. వీరంతా ఈ నెల 26న గుంటూరులోని వీవీఐటీ కళాశాల క్రీడా మైదానంలో జరగనున్న జాతీయ స్థాయి ఆర్చరీ పోటీల్లో పాల్గొంటారని ప్రిన్సిపాల్ తెలిపారు. జాతీయ స్థాయికి ఎంపికై న విద్యార్థులను ప్రిన్సిపాల్ మూర్తితో పాటు ఆర్చరీ కోచ్ ఎల్. సూరిబాబు, ఇతర శిక్షకులు, ఉపాధ్యాయులు అభినందించారు. -
వీడీవీకే సందర్శన
డుంబ్రిగుడ: స్థానిక వీడీవీకే మిల్లేట్ హబ్ను అసిస్టెంట్ ట్రైనింగ్ కలెక్టర్ మనీషా, పాడేరు ఐటీడీఏ అసిస్టెంట్ ఏపీవో వెంకటేశ్వరరావు మంగళవారం సందర్శించారు. ఈ కేంద్రంలో రూ. 20 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన చిరుధాన్యాల ప్రాసెసింగ్ యంత్రాలను వారు నిశితంగా పరిశీలించారు. అనంతరం వీడీవీకే కేంద్రాన్ని నిర్వహిస్తున్న మహిళా సంఘాల సభ్యులతో వారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. నాణ్యమైన చిరుధాన్యాలను సేకరించి, వాటిని ప్రాసెస్ చేసి ప్రజలకు సరసమైన ధరలకే అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో చిరుధాన్యాల సాగును, వినియోగాన్ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ సిబ్బంది, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
నేడు దారాలమ్మ తల్లి ప్రధాన జాతర
● ఏర్పాట్లు పూర్తి సీలేరు: గిరిజనుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ ధారకొండ దా రాలమ్మ అమ్మ వారి ప్రధాన జాతర మహోత్సవం బుధవారం కొత్త అమావాస్య పర్వదినం సందర్భంగా అత్యంత అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ నెల 7వ తేదీన అంకురార్పణతో ప్రారంభమైన ఈ జాతర మహోత్సవాలు 15 రోజుల పాటు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. జాతరలో భాగంగా వివిధ గ్రామాల్లో పర్యటించిన అమ్మవారి పవిత్ర గరగలు మంగళవారం సాయంత్రం 6 గంటలకు తిరిగి ఆలయానికి చేరుకున్నాయి. రాత్రంతా భక్తుల జాగరణ అనంతరం, బుధవారం తెల్లవారుజామున అమ్మవారు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. విశేష పూజలు: తెల్లవారుజాము నుంచి సాయంత్రం 3.54 గంటల వరకు భక్తులకు నిత్య పూజలు, దర్శన సౌకర్యం కల్పించనున్నారు. నైవేద్య సమర్పణ: వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులు అమ్మవారికి ధూప, దీప, నైవేద్యాలను సమర్పించుకోనున్నారు. అనంతరం అమ్మవారికి మహా నైవేద్యం నివేదించి, సాయంత్రం ఆలయ ద్వారాలను మూసివేస్తారు. ద్వార దర్శనం: గురువారం ఉదయం 7.24 గంటలకు ఆలయ తలుపులు తెరిచి, యథావిధిగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ కార్యనిర్వహణాధికారి సాంబశివరావు తెలిపారు. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయ ఆవరణలో భారీగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేక ఉత్సవాలు: ప్రధాన పండుగ సందర్భంగా దారకొండ గ్రామస్తులు మేళతాళాలతో, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకోనున్నారు. -
స్తవ్యస్త వైద్యం
సంపూర్తి భవనంచింతపల్లి ఏరియా ఆస్పత్రిలో వసతుల లేమిఒకే గదిలో నలుగురు వైద్యులు.. 30 పడకల స్థానంలో 50 మంది రోగుల అవస్థలు.. నెలకు సుమారు వంద వరకు ప్రసవాలు. మన్యంలో వేలాది మంది గిరిజనులకు ప్రాణాధారమైన చింతపల్లి ఏరియా ఆసుపత్రి ప్రస్తుతం వసతుల లేమితో కొట్టుమిట్టాడుతోంది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా, నిధులు మంజూరై నిర్మాణం చివరి దశకు చేరుకున్నా, నేటికీ కొత్త భవనం గిరిజనులకు అందుబాటులోకి రాలేదు. చింతపల్లి: ఈ ప్రాంతంలోని గిరిజనులకు వైద్య సేవలందించడంలో కీలకపాత్ర పోషిస్తున్న స్థానిక ఏరియా ఆసుపత్రి ప్రస్తుతం తీవ్రమైన వసతి సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఎనిమిదేళ్ల క్రితమే ఈ ఆసుపత్రిని వంద పడకల స్థాయికి అప్గ్రేడ్ చేసినప్పటికీ, నూతన భవన నిర్మాణం పూర్తికాకపోవడంతో రోగులు, వైద్యులు నానా అవస్థలు పడుతున్నారు. నిధులున్నా .. నిరీక్షణ గత ప్రభుత్వ హయాంలో ఈ వంద పడకల ఆసుపత్రి కోసం మండల కేంద్రం సమీపంలోని పట్టు పరిశ్రమకు చెందిన 5 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. నూతన భవన నిర్మాణానికి రూ. 25 కోట్ల నిధులను కూడా మంజూరు చేయగా, 2021 చివరలో ఏపీఎంఎస్ఐడీసీ పర్యవేక్షణలో పనులు ప్రారంభమయ్యాయి. వాస్తవానికి ఈ పనులు 2023 నాటికే పూర్తి కావాల్సి ఉంది. కానీ, నిధుల విడుదలలో జాప్యం కారణంగా పనులు నెమ్మదించాయి. గత రెండు నెలల వరకు వేగంగా జరిగిన పనులు, ప్రస్తుతం కాంట్రాక్టర్ నిలిపివేయడంతో స్థానిక గిరిజనులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో 200 పడకల ప్రణాళిక భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఈ నూతన భవనాన్ని భవిష్యత్తులో 200 పడకల సామర్థ్యంతో ఉపయోగించుకునేలా, నాలుగు అంతస్తులలో నిర్మిస్తున్నారు: మొదటి అంతస్తు: ఎమర్జెన్సీ వార్డు, ఓపీ, సమావేశ మందిరం, పరిపాలనా విభాగం, సూపరింటెండెంట్ కార్యాలయం. రెండో బ్లాక్: ఇన్పేషెంట్ వార్డులు. మూడో బ్లాక్: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు. నాలుగో బ్లాక్: ఐసీయూ, ఎంఆర్ఐ, సీటీ స్కాన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఎక్స్రే, ల్యాబ్లు.అంతేకాకుండా బ్లాక్ నుంచి బ్లాక్కు వెళ్లేందుకు ఎలివేటెడ్ కారిడార్లు, అదనంగా మార్చురీ, బయో–మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్, ఫైర్ సేఫ్టీ వంటి వసతులతో ఈ నిర్మాణం చేపట్టారు. పాత భవనంలో అరకొర వసతులు కొత్త భవనం అందుబాటులోకి రాకపోవడంతో, రెండున్నర దశాబ్దాల క్రితం నిర్మించిన పాత భవనంలోనే వైద్య సేవలు కొనసాగుతున్నాయి. ఆసుపత్రిలో కేవలం 30 పడకలు మాత్రమే ఉన్నప్పటికీ, రోగుల రద్దీ దృష్ట్యా వైద్యులు మరో 20 బెడ్లను సర్దుబాటు చేసి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ 23 మంది వైద్యులు, 63 మంది సిబ్బంది ఉండాలి. కానీ గదుల కొరత వల్ల ఒక్కో గదిలోనే నలుగురు వైద్యులు కూ ర్చుని రోగులను పరీక్షించాల్సి వస్తోంది. ఇది అటు వై ద్యులకు, ఇటు రోగులకు ఇబ్బందికరంగా మారింది. రెండు మండలాలకు ఏకై క దిక్కు చింతపల్లి మండలంలోని కోరుకొండ, లోతుగెడ్డ, లంబసింగి, తాజంగి, గూడెం కొత్తవీధి మండలంలోని జెర్రెలు, పెదవలస, ఆర్వీ నగర్, జీకే వీధి, సీలేరు పీహెచ్సీల పరిధిలో గ్రామాలతోపాటు కొయ్యూరు,, జి.మాడుగుల మండలాల సరిహద్దు గ్రామాల ప్రజలకు ఈ ఆసుపత్రే పెద్ద దిక్కు. ప్రతిరోజూ 250 నుంచి 300 మందికి పైగా రోగులు ఇక్కడకు వస్తుంటారు. నెలకు సగటున 80 నుంచి 100 ప్రసవాలు జరుగుతాయి. నవజాత శిశు సంరక్షణ కేంద్రం, రక్త నిల్వ కేంద్రం, టీబీ విభాగం వంటి కీలక విభాగాలు కూడా ఈ పాత భవనంలోనే ఇరుకుగా కొనసాగుతున్నాయి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి, నిలిచిపోయిన భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, తద్వారా గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.అ వేధిస్తున్న వసతి సమస్య అసంపూర్తిగా నూతన భవనం స్థాయి పెంచినా మెరుగుపడని వసతులు ఒకే గదిలో నలుగురు వైద్యులు 30 పడకల స్థానంలో 50 మంది రోగులు పట్టించుకోని సర్కారు అధికారులు దృష్టికి సమస్య ఆసుపత్రి భవన నిర్మాణాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అదికారులు దృిష్టికి తీసుకు వెళ్లాం.ఉన్న పాత భవనంలోనే రోగులకు ఇబ్బందులు కలగకుండా ఉండేలా వైద్య సేవలందిస్తున్నాం. ఒక్క గదిలోనే నలుగురు వైద్యలు సేవలండించాల్సి వస్తోంది. – నీలవేణి, ఆసుపత్రి సూపరింటెండెంట్, చింతపల్లి త్వరగా పూర్తిచేయాలి చింతపల్లిలో నిలిచిపోయిన ఆస్పత్రి భవన నిర్మాణాన్ని త్వరిత గతిన పూర్తి చేయాలి.వంద పడకల ఆసుపత్రికి తగినట్లుగా వసతి సౌకర్యం లేకపోవడంతో వైద్యుల,రోగుల ఇబ్బందుల పడుతున్నారు.త్వరగా అందుబాటులోకి వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. – కోరాబు అనూషదేవి, ఎంపీపీ, చింతపల్లి -
సచివాలయ సిబ్బంది గైర్హాజరుపై ఎమ్మెల్యే ఆగ్రహం
● నలుగురు మాత్రమే ఉండటంపై విశ్వేశ్వరరాజు మండిపాటు ● అంజలి శనివారంలో పర్యటన చింతపల్లి: మారుమూల గిరిజన ప్రాంత ప్రజలకు సత్వర సేవలు అందించాల్సిన గ్రామ సచివాలయాల్లో సిబ్బంది నిర్లక్ష్యం వహించడంపై పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం అంజలిశనివారం గ్రామంలో పర్యటించిన ఆయన, స్థానిక సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో విధుల్లో కేవలం నలుగురు సిబ్బంది మాత్రమే ఉండటంపై ఆయన మండిపడ్డారు. ప్రజల ముంగిటకే సేవలు అందాలి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా, ప్రభుత్వ సేవలను నేరుగా ప్రజల వద్దకే చేర్చాలనే ఉద్దేశంతో సచివాలయాలను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. కానీ నేడు ఆ లక్ష్యం నెరవేరకపోవడం, సేవలు ప్రజలకు చేరువలో లేకపోవడం బాధాకరమన్నారు. సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మారుమూల ప్రాంత గిరిజనులకు సేవలందించాలని, విధుల్లో అలసత్వాన్ని సహించేది లేదని హెచ్చరించారు. బోడకొండమ్మ తల్లికి ప్రత్యేక పూజలు అంజలి శనివారంలో జరుగుతున్న శ్రీ బోడకొండమ్మ, గంగాదేవి జాతర మహోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం గ్రామంలోని ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించి, వారి యోగక్షేమాలు, స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సాగిన వెంగళరావు, వైసిపి సీనియర్ నాయకులు కిముడు బెన్నలింగం, లకే కళ్యాణం, సాగిన సింహాచలం, లకే ఎర్నన్నదొర, ప్రసాద్, రెహ్మాన్, హేమంత్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. -
లంబసింగి ఘాట్లో ప్రమాదం
● లోయలో పడిన యువకుడికి తీవ్ర గాయాలు ● కాపాడిన ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, మాజీ మంత్రి బాలరాజు చింతపల్లి: లంబసింగి ఘాట్ రోడ్డులో మంగళవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. చింతపల్లి మండలం కొత్తపాలెం పంచాయతీ భీమసింగి గ్రామానికి చెందిన సెగ్గే గురుబాబు, తన అన్న కుమారుడిని కొత్త అమావాస్య పండుగకు తీసుకురావడానికి బైక్పై నర్సీపట్నం బయలుదేరాడు. మార్గమధ్యంలో లంబసింగి ఘాట్లోని బోడకొండమ్మ ఆలయం దాటిన తర్వాత, ఒక ప్రమాదకరమైన మలుపు వద్ద బైక్ అదుపుతప్పి రక్షణ గోడను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గురుబాబు సుమారు 20 అడుగుల లోతు ఉన్న లోయలో పడిపోయాడు. అదే సమయంలో చింతపల్లి పర్యటన ముగించుకుని నర్సీపట్నం వెళ్తున్న పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, అలాగే చింతపల్లి వస్తున్న మాజీ మంత్రి పసుపులేటి బాలరాజులు వెంటనే తమ వాహనాలను నిలిపారు. స్థానికుల సహాయంతో లోయలో ఉన్న గురుబాబును బయటకు తీయించి, వెంటనే అంబులెన్స్ను రప్పించారు. క్షతగాత్రుడిని హుటాహుటిన నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ ప్రమాదంలో గురుబాబు తీవ్రంగా గాయపడ్డాడు. -
ఉపాధి పనుల్లో అక్రమాలు ఉపేక్షించం
● పీడీ విద్యాసాగర్ గూడెంకొత్తవీధి: ఉపాధి హామీ పథకం పనుల నిర్వహణలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పథకం ప్రాజెక్ట్ డైరెక్టర్ డీవీ విద్యాసాగర్ హెచ్చరించారు. మంగళవారం మండల కేంద్రంలో ఉపాధి హామీ పనులకు సంబంధించి సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఎంపీపీ బోయిన కుమారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీడీవో రమణబాబు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీడీ విద్యాసాగర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వేల కోట్లు వెచ్చించి ఉపాధి పనులను కల్పిస్తోందని, పనులను పారదర్శకంగా చేపట్టేందుకు అనేక వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మండలంలో 2024 నుంచి 2025 వరకు రూ. 32 కోట్ల వ్యయంతో సుమారు 3 వేలకు పైగా పనులు చేపట్టామన్నారు. అయితే, కొన్ని పంచాయతీల్లో చేసిన పనులకు సంబంధించి సరైన రికార్డులు, ఫొటోలు లేవని ఆయన అసహనం వ్యక్తం చేశారు. పనులకు సరైన ఆధారాలు లేకపోతే నిధులు దుర్వినియోగం అయినట్లుగానే భావించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. చాలా చోట్ల మస్టర్లలో పనిచేసిన వారి సంతకాలు లేకున్నా నిధుల చెల్లింపులు జరగడం, కొన్ని చోట్ల చనిపోయిన వ్యక్తుల పేరిట పెన్షన్ల పంపిణీ జరగడం వంటి అక్రమాలను గుర్తించామన్నారు. అక్రమాలు జరిగిన చోట బాధ్యుల నుంచి నిధులను రికవరీ చేయాలని అధికారులను ఆదేశించారు. డీఈ రఘు, ఎస్ఆర్పీ అచ్యుత్, ఏపీవో రాంప్రసాద్, వైస్ఎంపీపీ ఆనంద్, సర్పంచ్లు పాల్గొన్నారు. -
విద్యార్థుల భవిష్యత్తు పట్టని కూటమి ప్రభుత్వం
డుంబ్రిగుడ: మండలంలోని కితలంగి పంచాయతీ, దేవలయం గ్రామంలో విద్యార్థుల భవిష్యత్తును కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెడబారికి సురేష్కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆగ్రామంలో పర్యటించారు. ప్రాథమిక పాఠశాలకు సరైన భవనం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణం నూతన భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆయన విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు. పాఠశాల భవన నిర్మాణంపై మండల విద్యాశాఖ అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయాన్ని కలెక్టర్, డీఈవోల దృష్టికి కూడా తీసుకువెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం పాడి గ్రామంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కొర్ర పంచాయతీ నాయకులు ఎస్.బి. బాలరాజు తదితరులు పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెడబారికి సురేష్కుమార్ -
గురుకుల విద్యార్థులకు క్రీడా సామగ్రి
సీలేరు: హైదరాబాద్కు చెందిన శ్రీ సాయి సేవా సమితి ఆధ్వర్యంలో అప్పర్ సీలేరులోని గురుకుల బాలుర పాఠశాలకు మంగళవారం క్రీడా సామగ్రిని పంపిణీ చేశారు. సుమారు రూ. 50 వేల విలువైన వివిధ రకాల క్రీడా వస్తువులతో పాటు, పాఠశాల అవసరాల నిమిత్తం ఒక అహుజా పోర్టబుల్ పీఏ యాంప్లిఫైయర్ను సమితి ప్రతినిధులు అందజేశారు. సమితి వైస్ ప్రెసిడెంట్ వల్లీ ప్రసాద్, సభ్యులు వెంకట్, సత్యనారాయణ చేతుల మీదుగా ఈ సామగ్రిని పాఠశాల క్రీడా విభాగానికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..మారుమూల ప్రాంతాల్లోని ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు క్రీడల్లో కూడా రాణించాలనే ఉద్దేశంతోనే ఈ స్వచ్ఛంద సాయం అందించామని వారు తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్ బుచ్చి బాబు, పీఈటీ గంగరాజు, డిప్యూటీ వార్డెన్ సునీల్ కుమార్, ఎన్. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సామగ్రిని పంపిణీ చేశారు. -
ఎగిరిన గ్రిల్స్
కూలిన గోడలు..పేలుడు జరిగిన భవనం ఇదే.. పేలుడు ధాటికి రెండంతస్తుల భవనం వెనుక వైపు గోడ పేకమేడలా కూలి పక్కనే ఉన్న రేకుల షెడ్డుపై పడింది. కిటికీ ఇనుప గ్రిల్స్ గాలిలో ఎగురుకుంటూ వెళ్లి రెండు వీధుల అవతల పడ్డాయంటే ఆ ధాటి ఎంత తీవ్రంగా ఉందో ఊహించుకోవచ్చు. ‘ఆ సమయంలో వీధిలో ఎవరైనా ఉంటే వారి ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. ఇంట్లో మనుషులుంటే ఆ గుర్తు పట్టలేని విధంగా ఛిద్రమైపోయేవారు’ అని ఘటనా స్థలాన్ని చూసిన వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాణనష్టం జరగకపోవడం కేవలం అదృష్టంగా భావిస్తున్నారు. ఐదు కేసులున్నా ఆగని ‘వారసత్వ’ అరాచకం బాణసంచా సూత్రధారి స్థానికుడు దామోదర శివకృష్ణ కుమార్ (బాంబుల శివ). తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన బాంబుల వ్యాపారాన్ని ఏకంగా 40 ఏళ్లుగా యథేచ్ఛగా సాగిస్తున్నాడు. ఎక్కడో తక్కువ ధరకు బాంబులు కొనుగోలు చేయడం.. జనావాసాల మధ్య ఉన్న ఇంట్లో నిల్వ ఉంచి అమ్మడం ఇతనికి నిత్యకృత్యం. గతంలో ఇతనిపై 5 సార్లు కేసులు నమోదయ్యాయి. పోలీసులు సామగ్రిని స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేసినా, శివకృష్ణలో మార్పు రాలేదు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు గుట్టుచప్పుడు కాకుండా సాగే ఈ అక్రమ వ్యాపారం, ఈ పేలుడుతో ఇప్పుడు బహిర్గతమైంది. చట్టాలన్నా, పోలీసులన్నా ఇతనికి లెక్క లేదన్నది బహిరంగ రహస్యం. ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే గణబాబు సోమవారం సందర్శించారు. నివాస ప్రాంతాల్లో పేలుడు పదార్థాలు నిల్వ ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రంగంలోకి యంత్రాంగం.. ఆధారాల సేకరణ క్లూస్ టీం సభ్యులు ఘటనా స్థలంలో సోదాలు నిర్వహించి పేలుడుకు సంబంధించిన కీలక ఆనవాళ్లను సేకరించారు. సీఐ సన్యాసినాయుడు, ఎస్ఐ రామారావు భవనాన్ని తమ ఆధీనంలోకి తీసుకోగా, తహసీల్దార్ రమేష్, వెస్ట్ జోనల్ కమిషనర్ హేమావతి, టౌన్ ప్లానింగ్ ఏసీపీ రామలింగేశ్వరరావు భవన పటిష్టతను పరిశీలించారు. ప్రస్తుతానికి ఆ భవనాన్ని పూర్తిగా ఖాళీ చేయించి సీజ్ చేశారు. ఐదు కేసులు ఉన్నా ఒక వ్యక్తి 40 ఏళ్లుగా ఇంత సాహసం ఎలా చేయగలుగుతున్నాడు? పర్యవేక్షించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వల్లే కదా సామాన్యుల ప్రాణా లు ఫణంగా మారుతున్నాయి? ఇప్పటికై నా యంత్రాంగం కళ్లు తెరవాలని స్థానికులు కోరుతున్నారు. అది కేవలం బాణసంచా పేలుడు కాదు.. జనావాసాల మధ్య పొంచి ఉన్న మృత్యువు విసిరిన పంజా.. జీవీఎంసీ 89వ వార్డు ఆదర్శనగర్ శ్మశానవాటిక సమీపంలో ఆదివారం రాత్రి సంభవించిన బాణసంచా పేలుడు ఘటన సృష్టించిన బీభత్సం చూస్తుంటే స్థానికులు ఇప్పటికీ వణికిపోతున్నారు. చీకట్లో కేవలం మంటలు, పొగ మాత్రమే కనిపించినా.. సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చిన దృశ్యాలు ఆ ప్రాంతాన్ని రణరంగంగా తలపించాయి. – గోపాలపట్నంఆదర్శనగర్లో బాణసంచా పేలుడు అధికారుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యం బాంబుల శివ అరాచకం.. పోలీసు కౌన్సెలింగ్ పట్టించుకోని వైనం 40 ఏళ్లుగా వారసత్వ వ్యాపారం.. అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం -
బైక్ల దొంగ అరెస్టు
పల్సర్బైక్ చోరీ కేసులో నిందితుడిని అదుపులోనికి తీసుకున్న ఎస్ఐ సంతోష్కుమార్ అనకాపల్లి : బైక్ల చోరీకి పాల్పడుతున్న పసుపులేటి రామును మండలంలో కొత్తూరు జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుకుని అదుపులోనికి తీసుకోవడం జరిగిందని ఎస్ఐ కె.సంతోష్ కుమార్ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం గ్రామానికి చెందిన పసుపులేటి సంతోష్ గతంలో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో బైక్ల చోరీలకు పాల్పడ్డాడని ఎస్ఐ చెప్పారు. అతని వద్ద నుంచి రెండు పల్సర్ బైక్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించినట్టు ఎస్ఐ చెప్పారు. -
అమరజీవి... మన్నించు
పాడేరు: ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన మహనీయుడు అరమజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం తుప్పల పాలైంది. సోమవారం ఆయన 125వ జయంతి. ఆయన చేసిన సేవలను స్మరించుకునేందుకు ప్రతి ఏటా మార్చి 16న ఆయన జయంతిని ఘనంగా నిర్వహిస్తారు. కానీ పాడేరు ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో తుప్పల మధ్య ఆ మహనీయుడి విగ్రహం నిరాధారణకు గురై పడి ఉంది. గతంలో ఈ విగ్రహం ప్రధాన రహదారి పక్కన ఉన్న సాయిబాబా ఆలయ ముందున ఉండేది. కానీ రహదారి పక్కన ఆక్రమణల తొలగింపులో భాగంగా కొన్నేళ్ల కిందట ఈ విగ్రహాన్ని అక్కడ నుంచి తొలగించి ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఓ పక్కన పడేశారు. అప్పటి నుంచి ఈ విగ్రహాన్ని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. దీంతో ఆ మార్గాన వెళ్తున్న వారి విగ్రహాన్ని చూసి అధికారులు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం
అనకాపల్లి: ప్రకృతి వ్యవసాయానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు, ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మండలం వెంకుపాలెం గ్రామం రైతు సేవా కేంద్రం వద్ద సోమవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం కలెక్టర్ విజయక్రిష్ణన్తో కలసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు చేసిన మేలును వివరించడం లక్ష్యంగా గన్నవరంలో ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం ప్రారంభించామన్నారు. రాష్ట్రంలో సుమారు 46.83 లక్షల మందికి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయగా, తొలి విడతలో రూ.7000 చొప్పున రూ.3174 కోట్లు, రెండో విడతలో రూ.3,135 కోట్లు, మూడో విడతలో రూ.6000 చొప్పున రూ.2600 కోట్లు చొప్పున సుమారు రూ.9వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ ప్రభుత్వం జమ చేసిందన్నారు. జిల్లాలో రూ.132 కోట్లు జమ చేయడం జరిగింద న్నారు. నేటి పరిస్థితుల్లో ప్రతి రోజు క్యాన్సర్ బాధితులతో ఒక రైలు ఢిల్లీ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అందుకే ప్రకృతి వ్యవసాయానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేసే విధంగా చర్యలు చేపడుతున్నామని, లెఫ్ట్ కెనాల్ ద్వారా జిల్లాకు పుష్కలంగా సాగునీరు అందించే అవకాశం ఉందని అన్నారు. కలెక్టర్ విజయక్రిష్ణన్ మాట్లాడుతూ వ్యవసాయం, అనుబంధ రంగాల శాఖల సిబ్బంది రైతుల ఇళ్లకు వెళ్లి ఆధునిక వ్యవసాయ పద్ధతులతో తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధనకు ‘రైతులకు అవగాహన కలిగించడం రైతన్న మీకోసం’ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. జిల్లాలో మరింత విస్తీర్ణంలో ప్రకృతి విధానంలో సాగు చేపట్టేలా రైతులలో అవగాహన పెంచాలని వ్యవసాయాధికారులను ఆమె కోరారు. జిల్లాలో 60 డ్రోన్లను రైతులకు అందించడం జరిగిందన్నారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్కు ప్రభుత్వ మద్దతు గురించి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆశా దేవి, వివిధ రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు బత్తుల తాతయ్య బాబు, పీలా గోవింద సత్యనారాయణ, మళ్ల సురేంద్ర, డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీష్, రైతులు పాల్గొన్నారు. -
లీఫ్ కాఫీ యూనిట్ల ఏర్పాటుకు త్వరలో ఒప్పందం
చింతపల్లి: జిల్లాలో కాఫీ ఆకులతో కాఫీ తయారు చేసే యూనిట్ల ఏర్పాటుకు ఐటీడీఏతో త్వరలో ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు గ్రీన్ ఆయుష్ సీఈవో పులి రాజేష్ తెలిపారు. సోమవారం కలెక్టర్ను గ్రీన్ ఆయుష్ ప్రతినిధులు కలిసి లీఫ్ కాఫీ యూనిట్ల ఏర్పాటుపై చర్చించినట్టు చెప్పారు. కాఫీ ఆకులతో లీఫ్ కాఫీ తయారు చేసే యూనిట్లు ఏర్పాటు చేసి, రైతులకు ఉపాధి కల్పించేందుకు ఐటీడీఏతో ఒప్పందం కుదుర్చుకోవడానికి కలెక్టర్ను కలిశామన్నారు. మొదటిగా ఏదో ఒక మండలంలో కాఫీ ఆకులు సేకరించుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఏపీవో వెంకటేశ్వరావుకు కలెక్టర్ ఆదేశించారన్నారు. ఐటీడీఏ కేటాయించిన ప్రాంతంలో కాఫీ ఆకులను సేకరించి లీఫ్ కాఫీ తయారీకి పంపుతామని చెప్పారు.చింతపల్లి మండలంలో ఐదు లీఫ్ కాఫీ యూనిట్లు సిద్ధం చేశామన్నారు. ప్రస్తుతం రైతుల నుంచి సేకరించిన కాఫీ ఆకులను కిలో రూ.17.28 చొప్పున కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు. అధిక మొత్తంలో లీఫ్కాఫీ ఉత్పత్తి చేసేందుకు ఐటీడీఏతో ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు ఆయన తెలిపారు.తొలి సారిగా కాఫీ ఆకులతో రైతులకు ఆదాయం సమకూరేలా గ్రీన్ ఆయుష్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు.ఈకార్యక్రమంలో గ్రీన్ ఆయుష్ ప్రతినిధులు కనకరాజు,షేక్ రజాక్,బుజ్జిబాబులు పాల్గొన్నారు. -
వైద్యాధికారులకు ఇంటిగ్రేటెడ్ శిక్షణ
డీఎంహెచ్వో కృష్ణమూర్తి నాయక్పాడేరు: గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా వైద్యాధికారులకు హైబ్రీడ్ మోడ్లో మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్వో డాక్టర్ కృష్ణమూర్తి నాయక్ తెలిపారు. జిల్లాలో 17 పీహెచ్సీల వైద్యాధికారులకు మూడు రోజుల ప్రత్యేక ఇంటిగ్రేటెడ్ శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమాన్ని ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్నామన్నారు. సీజనల్ వ్యాధులు, మాతాశిశు మరణాల నివారణ,అత్యవసర వైద్య సేవలపై వైద్యులకు అత్యాధునిక విధానాల్లో అవగాహన కల్పిస్తామన్నారు. వైద్యులంతా ఈ అవగాహన కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు వైద్యరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రతాప్, జిల్లా కార్యక్రమాల పర్యవేక్షణ అధికారి డాక్టర్ కిరణ్కుమార్, కార్యకర్తల శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ శాంతి తదితరులు పాల్గొన్నారు. -
పదిలంగా తొలిరోజు
చింతపల్లి బాలుర ఆశ్రమ పాఠశాల పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థులు టెన్త్ పరీక్షకు 99.27 శాతం హాజరు సాక్షి,పాడేరు: జిల్లాలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8గంటలకు విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. జిల్లా కేంద్రం పాడేరులో తలారిసింగి, ఏపీఆర్ నంబర్–1 ప్రభుత్వ ఉన్నత పాఠశాల, శ్రీకృష్ణాపురం, సెయింట్ ఆన్స్ కాన్వెంట్లో ఆరు కేంద్రాలతో పాటు జిల్లా వ్యాప్తంగా 44 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 7,268 మందికి గాను మొదటి రోజు 53మంది గైర్హాజరయ్యారు. 99.27 శాతం హాజరు నమోదైనట్టు అధికారులు తెలిపారు. విద్యార్థులను గేటు వద్ద పూర్తిస్థాయిలో తనిఖీ చేసి కేంద్రాల్లోకి అనుమతించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటచేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.మాస్కాపీయింగ్కు ఆస్కారం లేకుండా నిఘా పెట్టారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం నుంచే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సందడి నెలకొంది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపింది. విద్యార్థులకు ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు పరీక్ష కేంద్రాల ఆవరణలో దీవెనలు అందించారు. తొలిరోజు పరీక్ష ప్రశాంతంగా జరిగింది. -
సొసైటీ దోపిడీపై ఫిర్యాదు చేస్తే బెదిరింపులు
నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.లక్షలను దోచేస్తున్న గౌరీ శంకర్ ఫిషర్మాన్ కో ఆపరేటివ్ సొసైటీపై చర్యలు తీసుకోవాలంటూ పీజీఆర్ఎస్లో 25 సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని, తనపై వ్యక్తిగతంగా కక్షసాధింపు చర్యలు చేపడుతున్నారని మునగపాకకు చెందిన బేరా శ్రీను వాపోయాడు. సొసైటీ లెక్కలు అడిగినందుకు తన సభ్యత్వం తొలగించి ఉపాధి లేకుండా చేశారని, అధికారులు వారికే కొమ్ముకాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై కలెక్టరమ్మ విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని పీజీఆర్ఎస్లో కోరాడు. -
మారేపల్లి యువకుడు చైన్నెలో దుర్మరణం
దేవరాపల్లి : మారేపల్లికి చెందిన కిల్లి కృష్ణ (23) అనే యువకుడు చైన్నెలో అకాల మరణం చెందడంతో అతడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు శోక సంద్రంలో మునిగిపోయారు. బతుకు తెరువు కోసం ఏడాది క్రితం చైన్నెలో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో చేరిన కృష్ణ తన నివాసానికి సమీపంలో ప్రమాదవశాత్తూ చెరువులో పడి ఈ నెల 14న మృతి చెందాడని అతని కుటుంబ సభ్యులు విలేకర్లకు తెలిపారు. అక్కడ పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని సోమవారం సాయంత్రం దేవరాపల్లి మీదుగా స్వగ్రామం మారేపల్లికి తీసుకువచ్చారు. ఉద్యోగం చేసి తమను ఆదుకుంటాడనుకున్న కొడుకు మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు అప్పలనాయుడు, ఎర్రయ్యమ్మ తల్లడిల్లిపోయారు. వారు గుండెలవిసేలా రోందించిన తీరు అక్కడ ఉన్నవారందర్నీ కలిచివేసింది. తమ స్నేహితుడు శాశ్వతంగా దూరమయ్యాడని తెలుసుకున్న యువకులు, గ్రామస్తులు చైన్నె నుంచి మృతదేహాన్ని తీసుకువచ్చిన వాహనానికి ఎదురుగా వెళ్లి ఊరేగింపుగా శ్మశాన వాటికకు తీసుకువచ్చారు. అంతిమయాత్ర అనంతరం కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. -
ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల సర్దుబాటుకు చర్యలు
గిరిజన సంక్షేమ శాఖ డీడీ పరిమళకొయ్యూరు: రానున్న విద్యా సంవత్సరంలో ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల సర్దుబాటుకు చర్యలు తీసుకుంటామని గిరిజన సంక్షేమ డీడీ పి.బి.కె. పరిమళ తెలిపారు. మంప, రాజేంద్రపాలెం,రావణాపల్లి బాలికల ఆశ్రమ పాఠశాలలను ఆమె సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొన్ని పాఠశాలల్లో అధిక సంఖ్యలో, మరికొన్ని పాఠశాలల్లో తక్కువ సంఖ్యలో విద్యార్థులున్నారని చెప్పారు. ఎక్కువ మంది ఉన్న పాఠశాలల్లో వసతుల సమస్యలు వస్తున్నాయని తెలిపారు. అందువల్ల విద్యార్థుల సర్దుబాటుకు సంబంధించి ప్రతిపాదనలు పంపిస్తున్నట్టు చెప్పారు. ఒక్కో పాఠశాలలో 320 కి మించి విద్యార్థులులేకుండా చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. రూ.30 కోట్ల వ్యయంతో ఆశ్రమ పాఠశాలల్లో మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలు కల్పించనున్నట్టు ఆమె చెప్పారు. పీఎం జన్మన్లో కొత్త భవనాలు మంజూరయ్యాయని తెలిపారు. రాజేంద్రపాలెం బాలికల ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి విద్యార్థినులతో ఆమె మాట్లాడారు.తెలుగు పరీక్ష ఎలా రాశారో అడిగి తెలుసుకున్నారు. తెలుగు ఉపాధ్యాయుడి ని వివరాలు అడిగారు. ఏటీడబ్ల్యువో క్రాంతి కుమార్ పాల్గొన్నారు. -
కిక్కిరిసిన కలెక్టరేట్
తుమ్మపాల: పలు సమస్యలు పరిష్కారం కోరుతూ జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన ప్రజలతో కలెక్టరేట్ కిక్కిరిసింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టర్ కార్యాలయం కిటకిటలాడింది. మరోవైపు గేటు బయట ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు, నిరసనలు కొనసాగాయి. ఇదే సమయంలో పలువురు తమ కష్టాలను కలెక్టరమ్మకు మొరపెట్టుకున్నారు. పదే పదే అధికారుల చుట్టూ తిరుగుతున్నా పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్కు, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల్లో కలెక్టర్ విజయ కృష్ణన్, జేసీ శౌర్యమాన్ పటేల్, డీఆర్వో వై. సత్యనారాయణరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో నమోదైన 24 గంటల్లో విచారణ చేపట్టి అర్జీని పరిష్కారం చేయాలన్నారు. అర్జీలు పునరావృతం అయితే అధికారులదే బాధ్యత అన్నారు. జిల్లా స్థాయి అధికారులు తప్పకుండా అర్జీదారులతో మాట్లాడి, సమస్య పూర్వాపరాలు తెలుసుకొని సరైన పరిష్కారం చూపాలన్నారు. పీజీఆర్ఎస్లో 14, రెవెన్యూ క్లినిక్లో 169 వినతులు నమోదయ్యాయి. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. భూ ఆక్రమణపై పదేపదే ఫిర్యాదు చేస్తున్నా... ప్రభుత్వ భూముల ఆక్రమణపై పదేపదే ఫిర్యాదులు చేస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోకుండా ఆక్రమణదారులకు అండగా నిలుస్తున్నారని కలెక్టరే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని అనకాపల్లి మండలం ఊడేరు గ్రామానికి చెందిన డి.గంగరాజు కలెక్టరేట్లో ఫిర్యాదు చేశాడు. గ్రామంలో సర్వే నంబర్లు 211, 28లో ప్రభుత్వ భూములను ఆక్రమిస్తూ ప్రైవేటు వ్యక్తులు లేఅవుట్ నిర్మించి ప్లాట్ల విక్రయాలు చేపడుతున్నారు. కొండను చదును చేసి లేఅవుట్లో కలిపేయడం, కొండ గెడ్డ రూపురేఖలు మార్చేయడంపై అనేక ఫిర్యాదులు చేసినా ప్రయోజనం లేదు. వెంటనే భూ ఆక్రమణలు తొలగించి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరాడు. కోళ్ల ఫారాన్ని నిలిపివేయాలని ఫిర్యాదు గ్రామస్తుల అంగీకారం లేకుండా పంచాయతీ పాలకవర్గం తీర్మానంతో గ్రామానికి సమీపంలో నిర్మించనున్న కోళ్ల ఫారాన్ని తక్షణమే నిలిపివేసి ప్రజారోగ్యాన్ని కాపాడాలంటూ చీడికాడ మండలం చెట్టుపల్లి గ్రామస్తులు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. గ్రామంలో తామంతా పశువుల పోషణ, వ్యవసాయం ద్వారానే జీవిస్తున్నామని, పాలకులు జేబులు నింపుకుని పచ్చని గ్రామంలో కోళ్ల ఫారాలు ఏర్పాటు చేసి గ్రామాన్ని కలుషితం చేస్తున్నారని వాపోయారు. మా గ్రామంలో ఎటువంటి కోళ్ల ఫారాలు లేకుండా పనులు నిలిపివేయాలని కోరారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో బస్టాప్ తొలగింపు రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం అనకాపల్లి ప్రధాన రహదారికి ఆనుకున్న బాలకృష్ణ బస్టాప్ను రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో జీవీఎంసీ అధికారులు తొలగించడం దారుణమని, తక్షణమే పునర్నిర్మించాలని ఆమ్ ఆద్మీ పార్టీ నేత కె.హరినాథ్బాబు కలెక్టర్కు వినతి అందించారు. కొందరు నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం బస్టాప్ను తొలగించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. వసతి గృహానికి సొంత భవనం కేటాయించాలి చీడికాడ ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహానికి సొంత భవనం కేటాయించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.బాలాజీ, పి.విజయ్ కలెక్టర్కు వినతిపత్రం అందించారు. 120 మంది విద్యార్థినులు ఉన్నప్పటికి సరైన సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అద్దె భవనంలోనూ మరుగుదొడ్లు లేవన్నారు. క్లాస్ రూములు, బ్లాక్ బోర్డ్ లేవన్నారు. కలెక్టర్ను కలిసిన వారిలో ఎస్ఎఫ్ఐ మండల నాయకుడు జి. అప్పలరాజు, సభ్యులు ఉన్నారు. దివ్యాంగుల నిరసన అనకాపల్లిలో దివ్యాంగుల జిల్లా కార్యాలయాన్ని నిర్మించి పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించాలని దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద దివ్యాంగులు నిరసన చేపట్టారు. దివ్యాంగుల సమస్యల కోసం విజయనగరం జిల్లా కార్యాలయానికి వెళ్లాల్సి వస్తుందన్నారు. అక్కడ అరకొర సిబ్బందితో సమస్యలు పరిష్కారం కావడం లేదని వాపోయారు. అలింకో సంస్థ ద్వారా ప్రత్యేక ఉపకరణాలు అందించాలని, సబ్సిడీ రుణాలు, అంత్యోదయ రేషన్ కార్డులు మంజూరు చేయాలని, నిలిపివేసిన దివ్యాంగుల పింఛన్లు పునరుద్ధరణ చేయాలంటూ కలెక్టర్కు వినతిపత్రం అందించారు. -
పొట్టి శ్రీరాములు సేవలు ఎనలేనివి
పాడేరు: ఆంధ్రరాష్ట్ర అవతరణకు ప్రాణత్యాగం చేసిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని కలెక్టర్ దినేష్కుమార్ తెలిపారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి కలెక్టర్ దినేష్కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, కాకినాడ అసిస్టెంట్ కలెక్టర్ మనీషా తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర సాధనలో అమరజీవి కృషి మరువలేనిదన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అనంతరం అమరావతిలో నిర్వహించిన పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమాన్ని వర్చువల్గా వీక్షించారు. కార్యక్రమంలో రాష్ట్ర జానపద కళలు, సాంస్కృతిక,సృజనాత్మక అకాడమీ చైర్మన్ వంపూరి గంగులయ్య, ఇన్చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు, కలెక్టరేట్ పరిపాలన అధికారి ప్రసాద్రావు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. -
మాస్కాపీయింగ్కు ఆస్కారం లేకుండా చర్యలు
సాక్షి, పాడేరు: మాస్ కాపీయింగ్కు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో టెన్త్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ ఆదేశించారు. స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల సెంటర్లోని పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.అన్ని గదులను సందర్శించారు.విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలపై ఆరా తీశారు. జిల్లా వ్యాప్తంగా 44 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ తీరును తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొబైల్ ఫోన్లు,ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై ఉన్న నిషేధాన్ని పక్కాగా అమలుజేయాలన్నారు.ఈ కార్యక్రమంలో డీఈవో రామకృష్ణారావు,పరీక్షల ముఖ్య పర్యవేక్షకు డు కె.జె.రమణ, డిపార్ట్మెంట్ అధికారి ఎం.రాజు.హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
‘డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీకి’ 37 ఫిర్యాదులు
సాక్షి, విశాఖపట్నం: విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి ఏపీఈపీడీసీఎల్ నిర్వహించిన ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమానికి సోమవారం 37 ఫిర్యాదులు వచ్చినట్లు సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీతేజ్ ఇమ్మడి తెలిపారు. కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం ఉదయం నిర్వహించిన డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కార్యక్రమంలో 37 మంది వినియోగదారులు తమ విద్యుత్ సమస్యలను నేరుగా సీఎండి దృష్టికి తీసుకువచ్చారు. ఇందులో ప్రధానంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరు, విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు, ట్రాన్స్ఫార్మర్ల మార్పిడిలో జాప్యం, విద్యుత్ బిల్లులు, విద్యుత్ లైన్లు, స్తంభాల మార్పిడి, తదితర సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ సందర్భంగా సీఎండీ పృథ్వీతేజ్ మాట్లాడుతూ ‘డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమం ద్వారా వచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు టి.వి. సూర్యప్రకాష్, ఎస్.హరిబాబు, సీజీఎం లు వి.విజయలలిత, ఎల్.దైవప్రసాద్, జీఎంలు వి.వి.ఎస్..ఎన్.వి. ప్రసాద్, ఎం.ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. -
23న స్టీల్ప్లాంట్కు శంకుస్థాపన
నక్కపల్లి: ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ ఇండియా లిమిటెడ్ వారు ఏర్పాటు చేస్తున్న స్టీల్ ప్లాంట్కు ఈ నెల 23వ తేదీన శంకుస్థాపన జరగనుందని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. భూమి పూజ, బహిరంగ సభ ఏర్పాట్లను సోమవారం ఆమె కలెక్టర్ విజయ కృష్ణన్, ఎస్పీ తుహిన్సిన్హా, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణలతో కలసి పరిశీలించారు. చందనాడ సమీపంలో భూమి పూజకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీష్, ఆర్డీవో వి.వి. రమణ, నియోజకవర్గ ఇన్చార్జ్ కొప్పిశెట్టి వెంకటేష్ పాల్గొన్నారు. పొట్టిశ్రీరాములకు ఘన నివాళులు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమాన్ని నక్కపల్లి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి హోం మంత్రి అనిత నివాళులర్పించారు. -
చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతి
మాకవరపాలెం : తాటిచెట్టుపై నుంచిపడి కల్లుగీత కార్మికుడు మృతి చెందాడు. మండలంలోని జి.వెంకటాపురం గ్రామానికి చెందిన పోలవరపు రాంబాబు(45) గీత వృత్తిని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే సోమవారం ఉదయం తాటిచెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తూ కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రాంబాబు మరణించినట్టు వైద్యులు తెలిపారు. రాంబాబుకు ఒక కొడుకు, కుమార్తె ఉండగా కుమార్తెకు వివాహం చేశాడు. రాంబాబు మృతితో కుటుంబీకులు పెద్ద దిక్కును కోల్పోయామని బోరున విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పొట్టి శ్రీరాములుకు ఎస్పీ నివాళి
అనకాపల్లి : భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం తన ప్రాణాలనే అర్పించిన మహనీయుడు, అమరజీవి పొట్టి శ్రీరాములకే దక్కిందని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. తమ కార్యాలయంలో సోమవారం శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి సోమవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం, భాషా ప్రాతిపదికన ప్రత్యేక రాష్ట్రం సిద్ధించాలని ఆయన చేసిన ఆమరణ నిరాహార దీక్ష భారత చరిత్రలో లిఖితంగా గుర్తింపు తీసుకురావడం జరిగిందన్నారు. మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడుస్తూ సత్యం, అహింస, హరిజనోద్ధరణే ధ్యేయంగా జీవించిన గొప్ప వ్యక్తిత్వం ఆయనదన్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగు వారి హక్కుల కోసం పోరాడి, ప్రాణత్యాగంతో ఆంధ్ర రాష్ట్ర సాధనకు మార్గదర్శకులుగా నిలిచిన ఆయన ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహన్రావు, ఎస్బీ డీఎస్పీ జీ.ఆర్.ఆర్.మోహన్, అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ ఎం.శ్రావణి, సీఐలు లక్ష్మణమూర్తి, బాల సూర్యారావు, వెంకట నారాయణ, ప్రేమ్ కుమార్, రమేష్, కృష్ణ్ణ, ఎస్ఐలు రమణయ్య, సురేష్ బాబు పాల్గొన్నారు. -
ఫోర్జరీ సంతకాలపై చర్యలు తీసుకోవాలని ధర్నా
సీపీఐఎంఎల్ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్న గిరిజనులు నర్సీపట్నం: కలెక్టర్ సమగ్ర విచారణ జరిపించి గిరిజనులకు న్యాయం చేయాలని సీపీఐఎంఎల్ నాయకులు బంగార్రాజు, జనార్దన్ డిమాండ్ చేశారు. సీపీఐఎంఎల్ ఆధ్వర్యంలో గిరిజనులు సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఫోర్జరీ సంతకాలతో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. రోలుగుంట మండలం కొండఅడ్డసారం గ్రామంలో గిరిజనులు సాగు చేసుకుంటున్న భూమిని ప్రకాష్ అనే భూస్వామి కాజేసేందుకు ఫోర్జరీ సంతకాలతో తప్పుడు పత్రాలు సృష్టించారన్నారు. తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించిన వ్యక్తిపై క్రిమినల్ కేసు పెట్టాలని, సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏవోకు వినతిపత్రం అందజేశారు. -
మత్స్యగెడ్డలో గల్లంతైన గిరిజనుడు మృతి
ముంచంగిపుట్టు :మండలంలోని సుజనకోట పంచాయతీ కుమ్మరిపుట్టు సమీపంలో మత్స్యగెడ్డలో స్నానం చేస్తూ గల్లంతైన వంతాల గోపీనాథ్(72) అనే గిరిజనుడు మృతిచెందాడు. వారం రోజుల తరువాత మృతదేహం లభించింది. ఈ నెల 10న గల్లంతైన గోపీనాథ్ కోసం కుటుంబ సభ్యులు,స్థానిక గిరిజనులు నాటు పడవలపై రెండు రోజుల పాటు గాలించారు. అనంతరం విశాఖకు చెందిన ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చి రెండు రోజుల పాటు రెండు కిలో మీటర్ల మేర గాలింపు చేసినా ఫలితం లేకపోయింది. వారం రోజుల తరువాత సోమవారం మత్స్యగెడ్డ ఒడ్డున గోపీనాథ్ మృతదేహాన్ని గుర్తించిన స్థానిక గిరిజనులు రెవెన్యూ, పోలీసు అధికారులకు సమాచారం అందించారు. ఎస్ఐ నానీ, ఆర్ఐ భాస్కర్,సర్పంచ్ రమేష్,మండల వైఎస్సార్సీపీ నేత దేవాలు మత్స్యగెడ్డ నుంచి గోపినాథ్ మృతదేహానికి బయటకు తీయించారు.మృతదేహం గుర్తుపట్టలేని విధంగా ఉంది.పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. వారం రోజుల తరువాత లభించిన మృతదేహం -
వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలన దిగ్విజయం
నర్సీపట్నం: వైఎస్సార్సీపీ ఐదేళ్ల పుర పాలన దిగ్విజయంగా ముగిసింది. నర్సీపట్నం మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి అధ్యక్షతన మంగళవారం మున్సిపల్ ఆఖరి పాలకవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంతో మున్సిపల్ పాలకవర్గం పదవీ కాలం ముగిస్తుంది. మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ నాయకత్వంలో 2021లో మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. నాలుగు దశాబ్దాలుగా టీడీపీకి కంచుకోటగా ఉన్న పుర పీఠాన్ని కై వసం చేసుకుంది. పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో మాజీ ఎమ్మెల్యే గణేష్ తొలిసారి అధికార వికేంద్రీకరణతో ముగ్గురు దళిత మహిళలకు చైర్పర్సన్ అయ్యే అవకాశాన్ని కల్పించారు. మొదటి చైర్పర్సన్గా గుడబండి ఆదిలక్ష్మి రెండేళ్లు కొనసాగారు. మరో రెండేళ్లు ప్రస్తుత చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మికి కల్పించారు. ఆఖరి ఏడాది చెక్కా బాలమ్మకు అవకాశం కల్పించినా సాధ్యం కాలేదు. వైఎస్సార్సీపీ పాలకవర్గం 2021 మార్చి 18న కొలువుదీరింది. మాజీ ఎమ్మెల్యే సహకారంతో మున్సిపాలిటీని పాలకవర్గం ఎంతో అభివృద్ధి చేసింది. చివరి ఏడాది బాలమ్మను చైర్పర్సన్ చేయాల్సి ఉండగా, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడం, రాజకీయ పరిణామాల దృష్ట్యా సాధ్యం కాలేదు. ఏదేమైనా ఐదేళ్ల పాటు వైఎస్సార్సీపీ పాలకవర్గం ఎన్నో అభివృద్ధి పనులు చేయడంతోపాటు అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందజేసింది. నర్సీపట్నం మున్సిపాలిటీ రూపురేఖలు మార్చి తమ పదవీ కాలాన్ని దిగ్విజయంగా పూర్తి చేసింది. -
ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్ఎస్కు 49 అర్జీలు
అర్జీదారుల సమస్యను వింటున్న ఎస్పీ తుహిన్ సిన్హా అనకాపల్లి : ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్కు 49 అర్జీలు వచ్చాయి. ఎస్పీ తుహిన్ సిన్హా అర్జీదారుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ చట్ట పరిధిలో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. భూ తగాదాలు – 26, కుటుంబ కలహాలు – 2, మోసపూరిత వ్యవహారాలు – 2, ఇతర విభాగాలకు చెందినవి – 19 అర్జీలు వచ్చాయన్నారు. అర్జీదారుల సమస్యలు వారం రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహనరావు పాల్గొన్నారు. -
సిండికేట్లు
తక్కువ ధరతో కొనుగోలు ● తీవ్రంగా నష్టపోతున్న కూరగాయల రైతులుసాక్షి, పాడేరు: సంతల్లో వ్యాపారుల సిండికేట్ దెబ్బకు కూరగాయల రైతులు విలవిలలాడుతున్నారు. ధరలను బాగా తగ్గించి కొనుగోలు చేస్తుండడంతో నష్టాల్లో కూరుకుపోతున్నారు. సేంద్రియ పద్ధతిలో సాగు చేసే కూరగాయలు నాణ్యత, రుచిలో నంబర్–1గా గుర్తింపు ఉన్నా పండించిన రైతుకు మాత్రం నష్టాలే మిగులుతున్నాయి.రిటైల్ మార్కెట్లో అధిక ధరలకు కూరగాయలు విక్రయిస్తున్నా, గిరిజన రైతుల వద్ద మాత్రం వ్యాపారులు కారుచౌకగానే కొనుగోలు చేస్తున్నారు. విశాఖ,గాజువాక, విజయనగరం, ఎస్.కోట, అనకాపల్లి, తుని ప్రాంతాల నుంచి జిల్లాలో జరిగే సంతలకు సుమారు 60 మంది వ్యాపారులు వస్తారు. వ్యాపారులు సిండికేట్గా మారి కూరగాయల ధరలను పతనం చేస్తున్నారు.ఇంటిల్లపాది కష్టపడి సాగు చేసిన కూరగాయలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులు ఉసూరుమంటున్నారు. అన్నింటికీ తక్కువ ధరలే రబీలో సాగు చేసిన కూరగాయల దిగుబడులు వస్తుండడంతో గిరిజన రైతులు సంతల్లో అమ్మకాలు ప్రారంభించారు. అన్ని పంటలకు తక్కువ ధరలే లభిస్తుండడంతో వారికి నష్టాలు తప్పడం లేదు. 50 కిలోల క్యారెట్ రూ.1000, బంగాళాదుంపలు రూ.800 నుంచి రూ.1000, 40 కిలోల క్యాబేజీ రూ.700 నుంచి రూ.800 ధరలతో వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు..టమాటా కిలో రూ.10 దాటి కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కాలీఫ్లవర్, పచ్చిమిర్చి ధరలు కూడా తక్కువుగానే ఉన్నాయి. దుకాణాల్లో ఏ కూరగాయలు కొనాలన్నా కిలో రూ.50కిపైగా పలుకుతున్నాయి. గిరిజన రైతులు మాత్రం కిలో రూ.20లోపే విక్రయిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. -
మృత్యుపాశంలో.. మూగజీవం
అటవీ చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా, నిఘా నీడన వేటగాళ్ల తుపాకులు గర్జిస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు వన్యప్రాణులతో కళకళలాడిన అడవులు ఇప్పుడు మూగబోతున్నాయి. వేసవి వేడికి తోడు, సరిహద్దు దాటి వస్తున్న వేటగాళ్ల ముఠాల కారణంగా అరుదైన జంతుజాలం అంతరించిపోతోంది. ముఖ్యంగా అల్లూరి జిల్లా కొయ్యూరు, మర్రిపాకలు అటవీ ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కొయ్యూరు: అటవీ చట్టాలు అత్యంత కఠినంగా ఉన్నప్పటికీ, జంతువుల వేట మాత్రం ఆగడం లేదు. వన్యప్రాణులను వేటాడినట్లు నిర్థారణ అయితే నిందితులకు బెయిల్ రావడం కూడా కష్టమే.. అయినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో వేటగాళ్లు యథేచ్ఛగా రెచ్చిపోతున్నారు. వేసవి ముప్పు.. వేసవి కాలం వచ్చిందంటే అడవిలోని చెట్లు ఆకులు రాల్చడం వల్ల జంతువులు దూరం నుంచే వేటగాళ్ల కంట పడుతున్నాయి.వేటనే వృత్తిగా చేసుకున్న ఒడిశా వేటగాళ్లు పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడం వల్ల వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. గత ఏడాది కొంతమంది వేటగాళ్లను పట్టుకుని కేసులు నమోదు చేసినా, పరిస్థితిలో మార్పు రాలేదు. నాటు తుపాకుల వినియోగం వేటగాళ్లు నాటు తుపాకులను ఉపయోగిస్తూ అడవి గేదెలు (బైసన్లు), కణుజులు, దుప్పులు వంటి అరుదైన జంతువులను వేటాడుతున్నారు. దీనివల్ల ఈ జాతులు క్రమంగా అంతరించిపోతున్నాయి. అటవీ శాఖలో పూర్తిస్థాయిలో సిబ్బంది లేకపోవడం వల్ల నిఘా, పర్యవేక్షణ లోపిస్తోంది. పులుల ఆచూకీ మృగ్యం 2010లో నిర్వహించిన పులుల గణనలో మర్రిపాకల రేంజ్లో రెండు పులులు, రెండు పులిపిల్లలు ఉన్నట్లు అటవీ శాఖ గుర్తించింది. కానీ, ఆ తర్వాత జరిగిన గణనలో వాటి జాడ లభించలేదు. పులులకు ఆహారంగా ఉండే అడవి గేదెలు, ఇతర జంతువుల సంఖ్య తగ్గిపోవడమే ఇందుకు ప్రధాన కారణం. సాధారణంగా ఆహారం లభించని పక్షంలో పులులు వేరే ప్రాంతాలకు వలస వెళ్లిపోతాయి. వేటగాళ్ల వ్యూహం ఒడిశాలోని మల్కన్గిరి జిల్లా నుంచి సుమారు 20 మంది చొప్పున నాలుగు, ఐదు బృందాలు నాటు తుపాకులతో బైక్లపై వస్తుంటారు. వీరు ముఖ్యంగా యూ.చీడిపాలెం, ఎం.భీమవరం పంచాయతీల పరిధిలోని నీటి కాలువల వద్ద మాటు వేస్తారు. దాహంతో నీరు తాగడానికి వచ్చే జంతువులను కాల్చి చంపుతారు. అనంతరం ఆ మాంసాన్ని ఎండబెట్టి, సంచుల్లో నింపుకుని తరలిస్తుంటారు. 2015లో ఎన్కౌంటర్తో.. పుట్టకోట సమీపంలో కాలువ వద్ద మాటు వేసిన ఒడిశా వేటగాళ్లను చూసి, కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు మావోయిస్టులుగా భావించి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు వేటగాళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఆ తరువాత కొంతకాలం వేట తగ్గినా, మళ్లీ పాత పరిస్థితే పునరావృతమైంది. దీంతో సీలేరు, మర్రిపాకల, పెదవలస రేంజ్లలో జంతువుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. స్థానికుల వద్ద ఉన్న రహస్య నాటు తుపాకుల వల్ల కూడా వేట కొనసాగుతోంది. ప్రస్తుతం మన అటవీ శాఖ అధికారులు మల్కన్గిరి అధికారులతో సమన్వయం చేసుకుంటూ వేటగాళ్ల కదలికలపై నిఘా ఉంచారు. కొంతమందిని ఇప్పటికే గుర్తించడంతో వేటగాళ్లలో భయం మొదలైంది. కఠిన చర్యలు తప్పవు జంతువులను వేటాడితే కఠిన చర్యలు తప్పవు. ఒడిశా వేటగాళ్ల రాకను చాలా వరకు కట్టడి చేశాం. వారిలో కొందరిని గుర్తించి కదలికలపై నిఘా ఉంచాం. మల్కన్గిరి అటవీ అధికారులతో సమన్వయం చేస్తున్నాం. చింతపల్లి డివిజన్ పరిధిలోకి ప్రస్తుతం వేటగాళ్లు రాలేదు. వేటకు వస్తే అరెస్ట్ చేసి కేసులు పెడతామని హెచ్చరించాం. – వైవీ నర్సింగరావు, డీఎఫ్వో, చింతపల్లి -
పది పరీక్షలకు పటిష్ట బందోబస్తు
పాడేరు: జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల నిర్వహణకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ అమిత్బర్దర్ తెలిపారు. పరీక్షలు అత్యంత పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామని ఆదివారం ఆయన పేర్కొన్నారు. నిఘా నీడలో పరీక్షా కేంద్రాలు జిల్లావ్యాప్తంగా మొత్తం 72 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, ప్రతి కేంద్రం వద్ద ప్రత్యేక పోలీసు సిబ్బందితో గట్టి బందోబస్తు ఉంటుందని ఎస్పీ వివరించారు. పరీక్షలు ముగిసేంత వరకు అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. ప్రశ్నపత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ల వద్ద కట్టుదిట్టమైన భద్రత కల్పించామని, అక్కడి నుంచి పరీక్షా కేంద్రాలకు చేరవేయడం మరియు తిరిగి జవాబు పత్రాలను సేకరించి భద్రపరిచే వరకు పోలీసు ఎస్కార్ట్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈనెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను పరీక్షా సమయంలో మూసివేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు ఆయన పేర్కొన్నారు. నిరంతర పర్యవేక్షణ కోసం మొబైల్ పెట్రోలింగ్ బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్లు రంగంలో ఉంటాయి. కేవలం పరీక్షా విధుల్లో ఉన్న అధికారులు, ఇన్విజిలేటర్లు, సిబ్బంది హాల్ టికెట్ ఉన్న విద్యార్థులను మాత్రమే కేంద్రాల్లోకి అనుమతిస్తారన్నారు. బయటి వ్యక్తులు గుమిగూడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఓపెన్ స్కూల్ పరీక్షలు రెగ్యులర్ పరీక్షలతో పాటు, ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలు కూడా ఈనెల 16 నుంచి 28 వరకు ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు జరుగుతాయని ఎస్పీ తెలిపారు. పరీక్షల సమయంలో ఎక్కడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. ఏదైనా అనుమానాస్పద సంఘటనలు జరిగితే వెంటనే 100, 112 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని ఆయన సూచించారు. పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పీ అమిత్ బర్దర్ -
పాస్ అవ్వాలంటే ..చదవాల్సిందే!
కఠిన చర్యలు ప్రస్తుతం జరిగే పరీక్షల్లో మాస్ కాపీయింగ్కు ఏమా త్రం అవకాశం లేదు. ప్రతీ కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. ఇన్విజిలేటర్లు ఏమి చేసినా వారి మాటలు సైతం దానిలో నమోదవుతాయి. స్లిప్లు అందించాలని చూస్తే కేసులు పెట్టడమే కాకుండా కఠిన చర్యలు ఉంటాయి. – క్రాంతి కుమార్, ఏటీడబ్ల్యూవో●కొయ్యూరు: ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీ విద్యార్థులకు తెలుగు భాషపై పట్టు లేకపోవడం వారి విద్యా భవిష్యత్తుపై, ముఖ్యంగా పదో తరగతి ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధమైంది. గత రెండున్నర దశాబ్దాలుగా కొనసాగుతున్న మాస్ కాపీయింగ్ సంస్కృతికి ఈసారి బ్రేక్ పడనుంది. మాస్ కాపీయింగ్ నేపథ్యం.. సుమారు 25 ఏళ్ల క్రితం మావోయిస్టు ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో, పదో తరగతిలో విఫలమైతే విద్యార్థులు నిరాశతో మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితులవుతారనే భావన ఉండేది. ఆ ఉద్దేశంతోనే అప్పట్లో విద్యార్థులను మాస్ కాపీయింగ్ వైపు ప్రోత్సహించే వారనే అభిప్రాయం ఉంది. అయితే ప్రస్తుతం మావోయిస్టు ప్రభావం తగ్గడం, పోటీ ప్రపంచంలో నాణ్యమైన విద్య అవసరం కావడంతో అధికారులు ఈ విధానానికి స్వస్తి పలుకుతున్నారు. మాస్ కాపీయింగ్ వల్ల విద్యార్థుల భవిష్యత్తుకు ప్రమాదం పొంచి ఉందని గుర్తించి, పరీక్షలను కఠినంగా నిర్వహించాలని నిర్ణయించారు. కువ్వి భాష ప్రభావం.. ప్రాథమిక పాఠశాలల్లో భాషా వలంటీర్లను నియమించినప్పటికీ, ఆదివాసీ విద్యార్థులు తెలుగుపై పట్టు సాధించలేకపోతున్నారు. 7, 8 తరగతులకు వచ్చినా చాలామంది విద్యార్థులు తెలుగులో అనర్గళంగా మాట్లాడలేకపోతున్నారు. వీరంతా తమ మాతృభాష అయిన ‘కువ్వి’ని అధికంగా మాట్లాడటమే దీనికి ప్రధాన కారణం. వాస్తవానికి ఐదో తరగతి పూర్తయ్యే సరికి తెలుగు భాషపై కనీస అవగాహన ఉండాలి. కానీ, ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను అర్థం చేసుకోవడంలోనూ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిని గమనించిన గత ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లోనే నాలుగు రకాల భాషల్లో (బహుభాషా విద్యా విధానం) పుస్తకాలను పంపిణీ చేసింది. అయితే తెలుగు మాత్రమే తెలిసిన వర్కర్లు ఉన్న చోట ఆ పుస్తకాల్లోని అంశాలను వివరించడం కష్టతరంగా మారింది. ఈ విధానాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేస్తేనే ప్రాథమిక స్థాయిలోనే తెలుగుపై పట్టు వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిఘా నీడలో పరీక్ష కేంద్రాలు గత ఏడాది మార్చిలో జరిగిన పదో తరగతి ఫలితాల్లో కొయ్యూరు మండలం 70 శాతం ఉత్తీర్ణత సాధించింది. మాస్ కాపీయింగ్ లేకుండా ఇంత శాతం ఎలా సాధ్యమైందని నాటి కలెక్టర్ అధికారులను ప్రశ్నించినట్లు వార్తలు వచ్చాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత కలెక్టర్ పరీక్షల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. సీసీ కెమెరాల ఏర్పాటు కొయ్యూరులోని మూడు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను అమర్చారు. కఠిన నిఘా ఒక్కో కేంద్రానికి ఒక ప్రత్యేక అధికారితో పాటు సిట్టింగ్ స్క్వాడ్లను నియమించారు.ఎట్టి పరిస్థితుల్లోనూ మాస్ కాపీయింగ్కు తావు లేకుండా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ కఠిన ఆదేశాలు జారీ చేశారు. మాస్ కాపీయింగ్కు బ్రేక్ -
నూరు శాతం ఫలితాలే లక్ష్యం
● నేటి నుంచి టెన్త్ పరీక్షలు ● పకడ్బందీగా ఏర్పాట్లు అక్షర సేద్యంలో అగ్రగామిగా నిలిచేందు కు ఏజెన్సీ విద్యార్థులు సిద్ధమయ్యారు. జిల్లాలో పదో తరగతి పరీక్షల్లో నూరు శాతం ఫలితాల సాధనే లక్ష్యంగా అటు అధికారులు, ఇటు ఉపాధ్యాయులు చేసిన 100 రోజుల కృషి నేటితో పరీక్షకు నిలవనుంది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పది పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 7,804 మంది హాజరుకానున్నారు. విద్యార్థులకు రవాణా సమస్య తలెత్తకుండా ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. పది పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య -
గోదావరి డెల్టాకు సీలేరు నీరు
● 17 రోజుల పాటు సరఫరా ● రోజుకు 8 వేల క్యూసెక్కుల విడుదల సీలేరు : ఏపీ జెన్కో సీలేరు విద్యుత్ కాంప్లెక్స్ నుంచి గోదావరి డెల్టా పంట భూములకు అధికారులు ఆదివారం మరోసారి నీటిని విడుదల చేశారు. 17 రోజుల పాటు నీటిని పంపిణీ చేయనున్నట్టు జెన్కో సూపరింటెండెంట్ ఇంజినీర్ జాకీర్ హుస్సేన్ తెలిపారు. డొంకరాయి మెయిన్ డ్యామ్ 6, 7 నంబర్ల గేట్ల ద్వారా 3,700 క్యూసెక్కుల నీటిని నేరుగా శబరి నదిలోకి విడుదల చేస్తున్నట్లు చెప్పారు. దీనికి అదనంగా డొంకరాయి జలవిద్యుత్ కేంద్రంలో 25 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 4,300 క్యూసెక్కుల నీరు బయటకు వస్తోంది. వెరసి, మొత్తం 8,000 క్యూసెక్కుల నీరు గోదావరి డెల్టాకు చేరుతోందని ఆయన వివరించారు. నేటి నుంచి 17 రోజుల పాటు ప్రతిరోజూ 8,000 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. డొంకరాయి ఏఈ శివశంకర్ డ్యామ్ నీటిమట్టాలను పర్యవేక్షిస్తున్నారు. -
పవన్ పర్యటన పబ్లిసిటీ కోసమే..
● గిరిజనులకు ఒరిగింది శూన్యం ● మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి విమర్శ పాడేరు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాడేరు పర్యటన వల్ల గిరిజనులకు ఒరిగిందేమీ లేదని, ఇది కేవలం ఆయన పబ్లిసిటీ స్టంట్ అని వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి విమర్శించారు. ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె పవన్ పర్యటనపై ఎద్దేవా చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే ‘మిషన్ కనెక్ట్ పాడేరు’ ద్వారా ఓనూరు, నందిగరువు గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించామని ఆమె గుర్తుచేశారు. ఈ విషయాలు తెలియకుండా పవన్ మాట్లాడటం సరికాదన్నారు. పసిపిల్లలను మండుటెండలో గంటల తరబడి నిలబెట్టి ఫొటోలు, వీడియోలు తీసుకోవడం పవన్ కల్యాణ్ ప్రచార యావకు నిదర్శనమని ఆరో పించారు. ప్రభుత్వ అధికారిక కార్యక్ర మాలకు వచ్చి, అధికారుల సమక్షంలోనే పార్టీ ఆవిర్భా వ దినోత్సవం నిర్వహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ సంస్కృతి పెరిగిపోయిందని.. సాక్షాత్తు టీడీపీ ఎంపీయే డ్రగ్స్ పార్టీలో దొరికిపోవడం సిగ్గుచేటన్నారు. దీనికి సీఎం చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. పవన్ పర్యటనతో తమ సమస్యలు తీరుతాయని ఆశించిన గిరిజనులకు చివరకు నిరాశే మిగిలిందని భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. -
గగన విజేత
మన్యంలో పుట్టి.. నీలి గగనంలోకి ఎగిరాడు. సాఫ్ట్వేర్ కొలువుల కంటే తన కన్న కలకే ప్రాణమిచ్చి, ఏపీ జెన్కో ప్రాజెక్టు గ్రామం సీలేరు నుంచి తొలి పైలట్గా రికార్డు సృష్టించాడు ఓద్దూరు సాయినాథ్. పట్టుదలే పెట్టుబడిగా, తల్లిదండ్రుల ప్రోత్సాహమే ఇంధనంగా మన్యం గర్వపడేలా సాయినాథ్ సాధించిన ఈ అద్భుత ప్రస్థానంనేటి యువతకు ఒక స్ఫూర్తిపాఠం. ● ఏజెన్సీ నుంచి తొలి పైలట్గా సాయినాథ్ ఘనత ● శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లోకి.. ● నేటి యువతకు స్ఫూర్తి సీలేరు: గూడెంకొత్తవీధి మండలంలో మారుమూల గ్రామం సీలేరు నుంచి ఒక అద్భుత విజయం నమోదైంది. పట్టుదలే పెట్టుబడిగా, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఓద్దూరు సాయినాథ్ అనే యువకుడు పైలట్గా ఎంపికై , సీలేరు గ్రామం నుంచి ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. ఒకటో తరగతి నుంచి పైలట్ వరకు.. ఓద్దూరు శ్రీనివాస్ (శ్రీను మాస్టారు), కనకదుర్గ దంపతుల కుమారుడైన సాయినాథ్ ప్రాథమిక విద్య అంతా సీలేరులోని ఏపీ జెన్కో డీఏవీ పబ్లిక్ స్కూల్లోనే సాగింది. పదో తరగతి తర్వాత ఇంటర్మీడియట్ పూర్తి చేసి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో బీటెక్ పట్టా పొందాడు. విద్యాభ్యాసం పూర్తయ్యాక రెండు సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చినా, చిన్నప్పటి నుంచి ఉన్న పైలట్ కల తనను నిలవనీయలేదు. ఆ ఉద్యోగాలను వదులుకుని లక్ష్యం వైపు అడుగులు వేశాడు. శిక్షణ .. అంతర్జాతీయ వేదికపై గుర్తింపు పూణేలోని బారామతిలో ఉన్న ‘కార్వర్ ఏవియేషన్’లో ఫ్లయింగ్ ట్రైనింగ్ పూర్తి చేసిన సాయినాథ్, అనంతరం ఇండిగో ఎయిర్లైన్స్ నోటిఫికేషన్లో ఎంపికయ్యాడు. ఆ తర్వాత అబూదాబీలోని ‘ఎతిహాద్ ఏవియేషన్ ట్రైనింగ్’ సెంటర్లో ‘ఎయిర్ బస్ ఏ–320’ విమానాల కోసం ప్రత్యేక టైప్ రేటింగ్ శిక్షణ పొందాడు.శిక్షణ విజయవంతంగా ముగించుకుని, ఈ ఏడాది మార్చి 9న ఇండిగో ఎయిర్లైన్స్లో జూనియర్ ఫస్ట్ ఆఫీసర్’గా పట్టా అందుకున్నాడు. ఇండిగో వైస్ ప్రెసిడెంట్లు కెప్టెన్ అషీమ్ మిత్రా, కెప్టెన్ సింగ్ చేతుల మీదుగా ఆయన ఈ గౌరవాన్ని పొందారు. ప్రస్తుతం హైదరాబాద్ బేస్ కేంద్రంగా దేశవ్యాప్తంగా విమాన సర్వీసుల్లో విధులను నిర్వహిస్తున్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు ఉన్నత శిఖరాలకు తండ్రి శ్రీనివాస్ మొదట అటవీ శాఖలో పని చేస్తూ, తర్వాత విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్లో ఫోర్మెన్గా స్థిరపడ్డారు. తన ముగ్గురు పిల్లలను క్రమశిక్షణతో ఉన్నత చదువులు చదివించారు. సాయినాథ్ సోదరీమణులు కూడా ఉన్నత స్థానాల్లో రాణిస్తున్నారు. పెద్ద కుమార్తె సౌజన్య జర్మనీలో ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో క్వాలిటీ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నారు. చిన్న కుమార్తె తేజస్విని టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.తల్లిదండ్రుల ప్రోత్సాహంమరువలేనిది నా తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే ఈ స్థాయికి ఎదిగాను. చిన్నప్పటి నుంచి చదువులో ముందుండి వారికి మంచి పేరు తేవాలన్నదే నా లక్ష్యం. పైలట్ కావాలన్న నా పట్టుదలను వారు గౌరవించి వెన్నుతట్టారు. – ఓద్దూరు సాయినాథ్, పైలట్ -
ఇక కాఫీ ఆకులతోనూ ‘కాఫీ’ తయారీ
● గ్రీన్ ఆయుష్ ఎండీ పులి రాజేష్ చింతపల్లి: మన్యం ముఖచిత్రాన్ని మార్చిన కాఫీ తోటల్లో ఇప్పుడు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం పడుతోంది. సాధారణంగా కాఫీ గింజలతో కాఫీని తయారు చేస్తారు, కానీ ఇకపై కాఫీ ఆకులతోనూ కాఫీ పొడిని తయారు చేసే ప్రయోగాత్మక ప్రాజెక్టును చేపట్టినట్లు విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త, గ్రీన్ ఆయుష్ ప్రైవేట్ కంపెనీ ఎండీ పులి రాజేష్ తెలిపారు. ఆదివారం ఆయన చింతపల్లి మండలంలోని పలు కాఫీ తోటలను సందర్శించి, రైతులతో ముఖాముఖి మాట్లాడారు. అంతర్జాతీయ వేదికపై గుర్తింపు ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ.. గత ఏడాది దుబాయ్లో నిర్వహించిన ఆర్గానిక్ నేచురల్ ఎక్స్పో సదస్సులో కాఫీ ఆకులతో తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శించగా మంచి స్పందన వచ్చిందని తెలిపారు. ఈ వినూత్న ప్రాజెక్టుపై పేటెంట్ పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు. గిరి రైతులకు అదనపు ఆదాయం కాఫీ గింజలతో పాటు ఆకులను కూడా ఎగుమతి చేయగలిగితే గిరిజన రైతులకు మరింత గుర్తింపుతో పాటు అదనపు ఆదాయం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు వివరాలను త్వరలోనే కలెక్టర్కు వివరించనున్నట్లు తెలిపారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ పర్యటనలో కంపెనీ ప్రతినిధులు రజాక్, కనకారావు తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా అప్పన్న సహస్రనామార్చన
● సింహాద్రిమఠం ఆధ్వర్యంలో నిర్వహణ ● అధిక సంఖ్యలో పాల్గొన్న గిరిజనులు చింతపల్లి : మండలంలోని లోతుగెడ్డ జంక్షన్లో ఉన్న శ్రీ దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో ఆదివారం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి సహస్రనామార్చన పూజ కన్నుల పండువగా జరిగింది. విశాఖపట్నం సింహాచలంలోని ‘సింహాద్రి మఠం’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో గిరిజన భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తరించారు. లోతుగెడ్డ పరిసర ప్రాంతాలు అప్పన్న నామస్మరణతో మారుమోగాయి. వైభవంగా పూజా కార్యక్రమాలు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై స్వామివారి నమూనా విగ్రహాన్ని ఉంచి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. భక్తులను వరుస క్రమంలో ఆసీనులను చేసి విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, మండపారాధన కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో జరిపించారు. అనంతరం 1001 నామాలతో స్వామివారికి సహస్రనామార్చన నిర్వహించి, విశేష హారతులు సమర్పించారు. పూజలో పాల్గొన్న భక్తులకు స్వామివారి చిత్రపటాలను, పూజా సామగ్రిని ఉచితంగా అందజేశారు. కార్యక్రమం అనంతరం భక్తులందరికీ భారీ స్థాయిలో అన్నసమారాధన నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో పర్యవేక్షణ సింహాచలం దేవస్థానం విశ్రాంత ప్రధానార్చకులు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు, సింహాద్రి మఠం గురుస్వామి కశిరెడ్డి సురేంద్రస్వామి ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల ఏర్పాట్లను తాజంగికి చెందిన కె.పురుషోత్తం, కె.కృష్ణతో పాటు లోతుగెడ్డ జంక్షన్కు చెందిన రమణ, సత్తిబాబు తదితరులు పర్యవేక్షించారు. -
జనం మధ్యే ‘మృత్యు’ నిలయాలు
గోపాలపట్నం : తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట బాణసంచా ప్రమాదం సృష్టించిన శోకం ఇంకా పచ్చిగానే ఉంది. అక్కడ పదుల సంఖ్యలో కార్మికులు ప్రాణాలు కోల్పోయిన విషాదం నుంచి ప్రజలు తేరుకోకముందే, విశాఖ నడిబొడ్డున ఆదివారం సాయంత్రం చోటుచేసుకున్న భారీ పేలుళ్లు నగరాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. నిబంధనలను తుంగలో తొక్కి నివాస ప్రాంతాల మధ్యే సాగుతున్న ప్రమాదకర కార్యకలాపాలు సామాన్యుడి ప్రాణాలకు గాలం వేస్తున్నాయి. ఆ అరగంట.. అల్లకల్లోలం ఆదివారం సాయంత్రం సరిగ్గా 5.30 గంటల నుంచి ఆరు గంటల మధ్య గోపాలపట్నం పరిధిలోని చంద్రనగర్, ఆదర్శనగర్ ప్రాంతంలో ఒక్కసారిగా ఆకాశం చిట్లిపోయిందా అన్నట్లుగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. వరుసగా వినిపించిన పేలుళ్ల ధాటికి భూమి కంపించినట్టు అనిపించడంతో స్థానికులు బయటకు పరుగులు తీశారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్ల కిటికీ అద్దాలు పగిలిపోవడం, గోడలకు పగుళ్లు రావడంతో ఆ తీవ్రత ఎంతటిదో అర్థమవుతోంది. ప్రాణనష్టం తప్పినా, అధికారుల కళ్లు గప్పి నివాస ప్రాంతాల్లో సాగుతున్న ప్రమాదకర కార్యకలాపాలు సామాన్యుడి ప్రాణాలకు గాలం వేస్తున్నాయి. -
ప్రాణాలు పోతున్నాయ్
గాజువాక (విశాఖ): నగరంలోని జాతీయ రహదారులు నిత్యం రక్తమోడుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనల పట్ల అధికారుల ఉదాసీనత కారణంగా నగరం మృత్యుపాశంగా మారుతోంది. ముఖ్యంగా భారీ వాహనాల అతివేగం, నిబంధనలకు విరుద్ధంగా రద్దీ సమయాల్లోనూ నగరంలోకి ప్రవేశించడం ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతోంది. నిషేధాజ్ఞలు బేఖాతరు నిజానికి ఉదయం 8 గంటల లోపు, రాత్రి 10 గంటల తర్వాతే భారీ వాహనాలకు నగరంలోకి అనుమతి ఉంటుంది. కానీ ఈ నిబంధనలు కాగితాలకే పరిమితమయ్యాయి. గాజువాక వంటి రద్దీ ప్రాంతాల్లో పరిశ్రమల సాకుతో లారీలు, టిప్పర్లు ఇష్టానుసారంగా దూసుకువస్తున్నాయి. ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించినా.. చర్యలు తీసుకున్నా ఎక్కడా పరిస్థితి మారడం లేదు. ఆదివారం...విషాదం : ఆదివారం బీహెచ్పీవీ జంక్షన్ వద్ద జరిగిన ఘోర ప్రమాదం నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. సోమవారం పదో తరగతి పరీక్షలకు ప్రారంభం కానున్న నేపథ్యంలో కుమార్తె సింహాచలం దర్శనం నిమిత్తం తీసుకువెళ్లిన తండ్రిని, వచ్చే నెలలో వివాహం జరుపుకోవాల్సిన ఓ యువకుడిని టిప్పర్ చిదిమేసింది. ఈ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే విశాఖ డెయిరీ వద్ద జరిగిన మరో ప్రమాదంలో యువతి మృత్యువాత పడింది. ఇలా రోజుకో ప్రాణం గాలిలో కలుస్తున్నా, సంబంధిత అధికారులు మాత్రం మొక్కుబడి తనిఖీలతో సరిపెడుతున్నారు. ఇప్పటికైనా భారీ వాహనాలపై కఠిన ఆంక్షలు అమలు చేయాలని విశాఖ వాసులు డిమాండ్ చేస్తున్నారు. వాహనం అదుపు తప్పి యువతి మృతి : మరొకరికి గాయాలు గాజువాక : ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఒక యువతి మృతి చెందగా, మరో యువతి తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వివరాలివి. పార్వతీపురానికి చెందిన మహాలక్ష్మి, తునికి చెందిన అనుష్క స్థానిక బీహెచ్ఈఎల్లో ఇంటర్న్షిప్ చేస్తున్నారు. వారిద్దరూ ఆదివారం ఒకే ద్విచక్ర వాహనంపై కంపెనీవద్ద బయల్దేరి షీలానగర్ వైపు వెళ్తున్నారు. విశాఖ డెయిరీ జంక్షన్ వద్దకు వచ్చేసరికి ఆ వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ అపస్మారక స్థితికి చేరుకొన్నారు. దీన్ని గమనించిన సమీపంలోని ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ శ్రీకాంత్ వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. కాగా, మహాలక్ష్మి మార్గంమధ్యలోనే మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. అనుష్క తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నట్టు సీఐ షేక్ హుస్సేన్ తెలిపారు. -
మెడికల్ షాపులు
‘మత్తు’లోమహారాణిపేట: నగరంలో మత్తు మందుల వ్యాపారం నిబంధనలకు విరుద్ధంగా జోరుగా సాగుతోంది. అదనపు లాభాల కోసం కొన్ని మెడికల్ షాపుల నిర్వాహకులు, వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకపోయినా మత్తు ఇచ్చే ఇంజెక్షన్లు, పెయిన్ కిల్లర్లు మరియు దగ్గు మందులను విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో ఈ అమ్మకాలు మరింత అధికమవుతున్నాయి. ఈ అక్రమ వ్యాపారం రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. మెడికల్ పరిజ్ఞానం లేని వ్యక్తులతో.. ఈ విక్రయాల్లో ప్రధాన లోపం..అర్హత కలిగిన ఫార్మసిస్టులు లేకపోవడమే... మెడికల్ పరిజ్ఞానం లేని వ్యక్తులు షాపులను నడుపుతూ, నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. మందుల విక్రయాలకు సంబంధించిన బిల్లులు ఇవ్వకపోవడం, ప్రిస్క్రిప్షన్ రిజిస్టర్లను నిర్వహించకపోవడం, కంప్యూటరైజ్డ్ రికార్డులను పక్కన పెట్టడం వంటి అక్రమాలు సర్వసాధారణమయ్యాయి. గడువు ముగిసిన మందులను కూడా విక్రయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఔషధ నియంత్రణశాఖ పర్యవేక్షణ లేక ఔషధ నియంత్రణ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం ఈ పరిస్థితిని మరింత దారుణంగా మార్చింది. విశాఖ ఉమ్మడి జిల్లా పరిధిలో సుమారు 4,500 మెడికల్ షాపులు, ఏజెన్సీలు ఉన్నాయి. ఇందులో చిన్న చిన్న షాపుల్లో ఎటువంటి రిజిస్టర్లు, కంప్యూటర్లు లేకుండానే కార్యకలాపాలు సాగుతున్నాయి. గతంలో జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన విజయకుమార్ బదిలీ అయినప్పటి నుంచి, ఆ స్థానంలో రెగ్యులర్ అధికారిని నియమించలేదు. ప్రస్తుతం డిప్యూటీ డైరెక్టర్ రజిత ఇన్చార్జీ ఏడీగా అదనపు బాధ్యతలను చూస్తున్నారు. అయితే ఆమె ఇప్పటికే విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల ఏడీగా, ఉత్తరాంధ్ర డీడీగా కూడా పనిచేస్తుండటంతో, విశాఖపై పూర్తిస్థాయి దృష్టి సారించడం అసాధ్యంగా మారింది. ఈ నాయకత్వ లోపం కారణంగా, అక్కడ పనిచేస్తున్న డ్రగ్ ఇన్స్పెక్టర్లు, ఇతర సిబ్బంది తనిఖీలను మొక్కుబడిగా చేస్తూ, నామమాత్రపు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి. కేవలం వార్షిక లేదా నెలవారీ లక్ష్యాల కోసం, ఏదో ఒకటి రెండు కేసులు నమోదు చేసి నిబంధనలను పాటించామన్నట్టుగా వ్యవహరిస్తున్నారు తప్ప, క్షేత్రస్థాయిలో అక్రమాలను అరికట్టేలా సోదాలు జరగడం లేదు. నగరంలో జోరుగా నిషేధిత మందులు అమ్మకాలు వివిధ శాఖల అధికారులు పర్యవేక్షణ లోపం వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా దగ్గు మందులు, ఇంజక్షన్ల అమ్మకాలువెలుగు చూసిన వ్యవహారం ఇటీవల మర్రిపాలెంలో జరిగిన ఒక సంఘటన ఈ వ్యవస్థలోని లోతైన వైఫల్యాలను బయటపెట్టింది. ప్రభుత్వం నాలుగు సంవత్సరాల లోపు పిల్లలకు నిషేధించిన ఒక మందుల మిశ్రమాన్ని విక్రయిస్తున్న మెడికల్ ఏజెన్సీని గుర్తించారు. ఈ వ్యవహారం వెలుగుచూడటంతో, వైద్యుని ప్రిస్క్రిప్షన్ లేకుండా కోల్డ్/కఫ్ సిరప్స్ విక్రయించవద్దని డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు హెచ్చరించారు. ఈ దాడుల ద్వారా నిషేధిత మందుల అమ్మకాలు జరుగుతున్న విషయం వాస్తవమేనని నిరూపితమైనా, ఇప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితిలో మార్పు రావడం లేదు. ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న ఈ అంశంలో ఔషధ నియంత్రణ శాఖ మొద్దు నిద్ర వీడి, కఠినమైన ఆకస్మిక తనిఖీలను నిర్వహించాల్సిన తరుణం ఆసన్నమైంది. -
ప్లాస్టిక్ రహిత సింహగిరి కోరుతూ ట్రెకింగ్
సింహాచలం: ప్లాస్టిక్ను అరికట్టి పర్యావరణాన్ని కాపాడాలనే సంకల్పంతో అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ), ఆంధ్ర యూనివర్సిటీ ఆర్ఎస్ఎస్ విభాగం, ఖేలో భారత్ సంస్థ సంయుక్తంగా ఆదివారం మాధవధార నుంచి సింహాచలం కొండపైకి ట్రెకింగ్ నిర్వహించాయి. సుమారు వంద మంది యువకులు, విద్యార్థులు ఈ ట్రెకింగ్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రకృతిని ప్రేమించాలనే ఉద్దేశంతో ప్లాస్టిక్ను నిషేధించాలి అనే నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ప్రతినిధులు తెలిపారు. ట్రెకింగ్ మార్గ మధ్యలో పడి ఉన్న ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు, ఇతర వ్యర్థ పదార్థాలను సేకరించి పర్యావరణ స్పృహను చాటారు. అనంతరం సింహగిరికి చేరుకున్న విద్యార్థి బృందాన్ని దేవస్థానం ఈవో జె.వెంకటరావు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణాన్ని కాపాడేందుకు విద్యార్థులు చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయమన్నారు. పుణ్యక్షేత్రాలను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడంలో యువత పాత్ర కీలకమని సూచించారు. ఖేలో భారత్ కన్వీనర్ విజయ్, సభ్యులు చందు తదితరులు పాల్గొన్నారు. -
నూకాలమ్మ జాతరకు ఏర్పాట్లు
నాతవరం : మండలంలో జిల్లేడుపూడి పంచాయతీలోని బుచ్చింపేటలో నూకాలమ్మతల్లి ఆలయం ఉంది. ఈ అమ్మవారి పండగను ప్రతి ఏటా కొత్త అమావాస్యకు ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీ. ఈ ప్రాంతీయులతో పాటు ఉమ్మడి విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల ప్రజలు జాతరకు తరలివస్తారు. పండగను ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ప్రాంతీయులు ఏ పని తలపెట్టినా ముందుగా అమ్మవారిని దర్శించుకొని ప్రారంభిస్తే అవలీలగా పూర్తవుతుందన్న అపారమైన నమ్మకం ఉంది. సోమవారం నుంచి అమ్మవారి ప్రాంగణంలో హోమాలు ప్రత్యేక పూజలు చేసేందుకు ఉత్సవ కమిటీ ఏర్పాటు చేశారు. అమ్మవారి పండగ కొత్త అమావాస్య బుధవారం రావడంతో మంగళవారం సాయంత్రం నుంచే వేలాది మంది భక్తులు రానున్నారు. భక్తులకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయంగా స్థలాన్ని కేటాయించారు. అలయ ప్రాంగణంలో మొక్కులు చెల్లించుకునే వారికి ఐరన్ క్యూలైను ఏర్పాటు చేశారు. ఆలయం ప్రాంగణంలో తాగునీటి కోసం ప్రత్యేకంగా కుళాయిలు ఏర్పాటు చేశారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఆలయ కమిటీ ఉచితంగా తీర్థప్రసాదాలు అందించడానికి టెంట్లతో పాటు కౌంటర్లు సమకూర్చారు. ఆలయ చరిత్ర ఇదీ! బుచ్చింపేట నూకాలమ్మ తల్లి అమ్మవారు మొదట్లో అడవి ప్రాంతాన్ని తలపించే తోటల మధ్యలో మర్రిచెట్లు నీడలో తాటాకు పాకలో ఉండేవారు. రాతి విగ్రహాలను అమ్మవారిగా ఈ ప్రాంతీయులు పూజించేవారు. విశాఖపట్నంలో స్టీల్ప్లాంటుకు నీటిని తరలించేందుకు తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం ప్రాజెక్టు నుంచి ఏలేరు కాలువ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. జిల్లేడుపూడి ప్రాంతంలో ఎత్తయిన ప్రాంతం కావడంతో ఏలేరు కాలువ తవ్వడానికి కుదరలేదు. నీటిని తరలించేందుకు ఇక్కడ సొరంగం తీయాలని నిర్ణయించారు. ఇరువైపులా ఏలేరు కాలువ పూర్తి చేశారు. సొరంగం పనులు జరగలేదు. అప్పట్లో ఎం.ప్రభాకర్ చౌదరి అనే వ్యక్తి ఏలేరు కాలువ సొరంగం తీస్తానని ముందుకు వచ్చాడు. మొదట్లో అయన కూడా పనులు చేయలేకపోయాడు. ఈ ప్రాంతీయులు ఏపని చేపట్టాలన్నా మర్రిచెట్టు పొదలో శిథిలమైన తాటాకు పాకలో ఉన్న అమ్మవారిని దర్శించుకునే చేపడతారని ఓ వృద్ధుడు సలహా ఇవ్వడంతో అతని మాట ప్రకారం అమ్మవారిని దర్శించుకుని పనులు సక్రమంగా పూర్తయితే ఆలయ నిర్మాణం చేస్తానని మొక్కి పనులు ప్రారంభించారు. దీంతో అంతవరకు తవ్వుతుంటే కూలిపోయే సొరంగం చక చకా పనులు సాగిపోతున్నాయి. గడువుకు ముందే సొరంగం పూర్తి కావడంతో అమ్మవారికి ఇచ్చిన మాట ప్రకారం 1988లో సొంత నిధులతో అతను మర్రిచెట్టు ఊళ్లమధ్యలో సర్వాంగ సుందరంగా అమ్మవారి ఆలయం నిర్మాణం చేశారు. అమ్మవారికి కుడి వైపు 30 అడుగులు ఎత్తులో నాగసర్పంతో కూడిన శివలింగం, ఎడమ వైపు ఏనుగు తొండంలో కన్పించే విధంగా వినాయకుడి ఆలయం నిర్మించారు. అంజనేయస్వామి, మహాలక్ష్మి అమ్మవారుతో పాటు పలు దేవుళ్ల విగ్రహాలు, నవగ్రహాలు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఏటా ఉగాదికి ఇక్కడ అమ్మవారి పండగ ఘనంగా చేస్తున్నారు. ప్రభాకర్చౌదరి 2022లో మృతి చెందగా, జిల్లేడుపూడి గ్రామస్తులు ఆలయ ఉత్సవ కమిటీగా ఏర్పడి అమ్మవారి పండగ నిర్వహిస్తున్నారు. కొత్త అమావాస్య రోజున పండగ సోమవారం నుంచి ఆలయ ప్రాంగణంలో హోమాలు ప్రత్యేక పూజలు పండగ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు -
‘హెచ్ఆర్ఏ పెంపు హర్షణీయం’
ఎమ్మెల్సీ చిరంజీవిరావును సన్మానిస్తున్న డి.గోపీనాథ్, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు నర్సీపట్నం: మున్సిపాలిటీ పరిధిలో పని చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు హౌస్ రెంట్ అలవెన్స్ 12 శాతం పెంచడం ఊరట నిచ్చిందని జేఏసీ కోచైర్మన్ డి.గోపీనాథ్ అన్నారు. హౌస్రెంట్ అలెవన్స్ పెంపునకు కృషి చేసిన ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావును ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డి.గోపీనాథ్ మాట్లాడుతూ కొన్నేళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగుల కల నేరవేర్చిన ఎమ్మెల్సీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎన్ఎంయు అధ్యక్షుడు నారాయణ, ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు మూర్తి, హెల్త్ డిపార్మెంట్ రమణబాబు, ఇరిగేషన్ భరత్, ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హనుమంతురావు, పీఆర్టీయూ అధ్యక్ష, కార్యదర్శులు ఎ.వరహాలనాయుడు, జి.వి.రమేష్ పాల్గొన్నారు. -
గ్రామీణ ఆర్థిక వ్యవస్థలోపాడి పరిశ్రమ కీలకం
● అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అరకులోయ టౌన్: గ్రామీణ ఆర్ధిక వ్యవస్థలో పాడి పశువుల పాత్ర కీలకమని స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. శనివారం స్ధానిక పశువైద్యశాలలో జాతీయ పశువ్యాధి నియంత్రణకు సంబంధించిన వాల్పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. పశువులు వ్యాధుల బారిన పడకుండా రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. పశువైద్యాధికారి సాగరి గణేశ్వరరావు మాట్లాడుతూ జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం ఈనెల 16 నుంచి వచ్చే నెల 29 వరకు జరుగుతుందన్నారు. -
1400 లీటర్ల బెల్లం పులుపు ధ్వంసం
పులుపును ధ్వంసం చేస్తున్న నాతవరం పోలీసులు నాతవరం: సారా తయారు చేసేందుకు నిల్వ చేసిన పులుపును ధ్వంసం చేసినట్టు స్థానిక ఎస్ఐ వై.తారకేశ్వరరావు శనివారం తెలిపారు. మండలంలో తాండవ జంక్షన్–గాంధీనగరం మధ్య పెడిమికొండ అటవీ ప్రాంతంలో సారా తయారు చేస్తున్నట్టుగా సమాచారం వచ్చిందన్నారు. సిబ్బందితో కలిసి దాడి చేసి, సారా తయారు చేసేందుకు నిల్వ చేసిన 1,400 లీటర్ల పులుపును ధ్వంసం చేసినట్టు చెప్పారు. సారా తయారీ, విక్రయం చట్టరీత్యా నేరమన్నారు. ఎక్కడైనా సారా తయారీ చేస్తే సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. -
ఘనంగా రాజగోపుర ప్రతిష్ట
అనంతగిరి (అరకులోయ టౌన్): మండలంలోని ఎన్ఆర్పురంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీనటడు సుమన్, అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం శనివారం దర్శించుకున్నారు. ఆలయ ద్వితీయ వార్షికోత్సవం పురస్కరించుకుని ప్రధాన రాజగోపుర ప్రతిష్ట కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని సత్కరించారు. అనంతరం స్వామివారి ప్రతిమలను ఆలయ అర్చకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తడబారికి మిథుల, మాజీ ఎంపీపీ శెట్టి నీలవేణి, మండల పార్టీ అధ్యక్షుడు కొర్రా సూర్యనారాయణ, పార్టీ మండల పరిశీలకుడు సెంబి సన్యాసిరావు, వాలసి సర్పంచ్ బాక గురుమూర్తి పాల్గొన్నారు. -
జి.మాడుగుల రామాలయంలో 100వ కల్యాణ వేడుకలు
ఉత్సవాల పోస్టర్లు ఆవిష్కరణజి.మాడుగుల: శ్రీరామ నవమి పురస్కరించుకుని స్థానిక రామాలయ ప్రాంగణంలో 100వ శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాలను ఈ నెల 25 నుంచి 27 వరకు అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి, ఆలయ ధర్మకర్త మత్స్యరాస బాలరాజు తెలిపారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మత్స్యరాస మత్స్యరాజు, ప్రధాన కార్యదర్శి మత్స్యరాస వెంకటగంరాజు (బుజ్జి)లతో కలిసి శనివారం ఆయన ఆలయ మండపంలో ఉత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విశాఖపట్నంకు చెందిన శ్రీ గోపాలకృష్ణ శాస్త్రి గారి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు స్వామివారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, శాంతి హోమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈనెల 27 ఉదయం సీతారాముల కళ్యాణ మహోత్సవం, పూర్ణాహుతి, శ్రీ పాలకపాటి గురుదేవుల ఆశీస్సులతో మధ్యాహ్నం భక్తులకు భారీ అన్నసమారాధన ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సాయంత్రం థింసా నృత్యాలు, కోలాటాల నడుమ స్వామివారి తిరువీధి వైభవంగా సాగుతుందని పేర్కొన్నారు.ఉత్సవాల సందర్భంగా మండల స్థాయి వాలీబాల్ పోటీలు ఏర్పాటుచేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు మత్స్యరాస రామరాజు, కిముడు వెంకటరమణ, వడ్డాది శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
అప్పన్న ధ్వజస్తంభం పీఠానికి స్వర్ణతాపడం పనులకు శ్రీకారం
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలోని ధ్వజస్తంభం పీఠానికి స్వర్ణతాపడం పనులకు శనివారం శ్రీకారం చుట్టారు. దేవస్థానం ఈవో జె. వెంకటరావు కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. దాదాపు నాలుగేళ్ల క్రితం ధ్వజస్తంభానికి సుమారు రూ.1.8 కోట్ల వ్యయంతో సీఎంఆర్ సంస్థ స్వర్ణతాపడం చేయించింది. ప్రస్తుతం అదే సంస్థ ధ్వజస్తంభం అడుగుభాగంలో ఉన్న పీఠానికి కూడా స్వర్ణతాపడం చేయడానికి ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా పీఠానికి ఎంత మేర బంగారు తాపడం అవసరమవుతుందో తెలుసుకునేందుకు అధికారులు కొలతలు తీసుకునే పనులను ప్రారంభించారు. పనులు పూర్తయిన తర్వాత ధ్వజస్తంభం పీఠం మరింత ఆకర్షణీయంగా మారనుంది. ఈ కార్యక్రమంలో దేవస్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్ పాల్గొన్నారు. -
నరకయాతన
పవన్ కల్యాణ్ పర్యటనతో సామాన్యుల ● పాడేరు– విశాఖ రహదారిలో బారికేడ్లు ● వాహన రాకపోకలు నిలిపివేత ● అవస్థలు పడిన ప్రయాణికులు సాక్షి, పాడేరు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాడేరు పర్యటన సామాన్య ప్రయాణికులకు, వాహన చోదకులకు తీవ్ర ఇబ్బందులు మిగిల్చింది. శనివారం ఉదయం 10 గంటల నుంచే పాడేరు – విశాఖపట్నం ప్రధాన రహదారిపై పోలీసులు ఎక్కడికక్కడే బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను నిలిపివేయడంతో జనం నరకయాతన పడ్డారు. స్తంభించిన ప్రధాన రహదారి.. తప్పని నిరీక్షణ పాడేరు నుంచి మైదాన ప్రాంతాలకు వెళ్లే అత్యంత కీలకమైన ఈ రహదారిపై ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలను పోలీసులు గంటల తరబడి నిలిపివేశారు. పవన్ కల్యాణ్ కాన్వాయ్ ఓనూరు జంక్షన్ దాటే వరకు ఇరువైపులా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఎండలో అల్లాడి.. భానుడి భగభగలకు తోడు ట్రాఫిక్ నిలిచిపోవడంతో చిన్నపిల్లలు, వృద్ధులు, రోగులు వాహనాల్లోనే చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు.డిప్యూటీ సీఎం నందిగరువు పర్యటన ముగిసిన తర్వాత కూడా ప్రయాణికుల అవస్థలు కొనసాగాయి. ప్రజా ప్రతినిధుల పర్యటనల కోసం సామాన్యుల ప్రాణాలు, సమయంతో చెలగాటం ఆడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తారురోడ్డు పనుల పరిశీలన ఓనూరు నుంచి నందిగరువు వరకు అడవితల్లిబాట పేరుతో కేంద్ర ప్రభుత్వ పీఎం జన్మన్ నిధులతో చేపట్టిన తారురోడ్డు పనులను డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ పరిశీలించారు. రూ.1.70 కోట్లతో ఈరోడ్డు నిర్మాణం పూర్తిచేశామని, రానున్న రోజులలో డోలిమోత లేని గ్రామాలు లక్ష్యమని ఆయన తెలిపారు. నందిగరువులో తాగునీటి పథకాన్ని ప్రారంభించారు. ఇదే గ్రామంలో పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. పాఠశాల చిన్నారులకు స్కూల్ బ్యాగ్లు, అంగన్వాడీ చిన్నారులకు పౌష్టికాహార కిట్లు అందజేశారు. అంతకముందు నందిగరువు రోడ్డులో గిరిజనుల సమక్షంలో జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఘాట్లో మోదకొండమ్మతల్లికి పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మక ఆకాడమి చైర్మన్ వంపూరి గంగులయ్య, పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శివ శ్రీనివాసరావు, కలెక్టర్ దినేష్కుమార్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రత్యేక కార్యదర్శి శశిభూషణ్కుమార్, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ, ఎస్పీ అమిత్బర్దర్ పాల్గొన్నారు. -
జనసేన పార్టీ నేత ఏకరువు
నందిగరువు గ్రా మంలో నిర్వహించిన ‘మాటామంతి’ కార్యక్రమంలో జనసేన పార్టీ నేతలే సమస్యలపై ఏకరువు పెట్టారు. గిరిజన రైతులు పండించే కాఫీ, పసుపు, మిరియం పంటలపై వ్యాపారులు 50 కిలోల బస్తాకు 5 కిలోల వరకు తరుగు తీస్తూ దోచుకుంటున్నారని జనసేన కార్యకర్త, పాడేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాంగి శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. మిరియాల ధర కిలో రూ.650 ఉండగా, బస్తాకు రూ.4 వేల వరకు రైతులు నష్టపోతున్నారని, ఐటీడీఏ ద్వారా కొనుగోలు చేపట్టాలని కోరారు.చింతపల్లి మండలం కొత్తమాడెం, పాతమాడెం వంటి గ్రామాలకు కనీసం రోడ్డు సౌకర్యం లేదని, ఆరు కిలోమీటర్ల మేర రహదారి నిర్మించాలని గిరిజనులు విజ్ఞప్తి చేశారు. -
మూగజీవం
అటవీ చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా, నిఘా నీడన వేటగాళ్ల తుపాకులు గర్జిస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు వన్యప్రాణులతో కళకళలాడిన అడవులు ఇప్పుడు మూగబోతున్నాయి. వేసవి వేడికి తోడు, సరిహద్దు దాటి వస్తున్న వేటగాళ్ల ముఠాల కారణంగా అరుదైన జంతుజాలం అంతరించిపోతోంది. ముఖ్యంగా కొయ్యూరు, మర్రిపాకలు అటవీ ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మృత్యుపాశంలోకొయ్యూరు: అటవీ చట్టాలు అత్యంత కఠినంగా ఉన్నప్పటికీ, జంతువుల వేట మాత్రం ఆగడం లేదు. వన్యప్రాణులను వేటాడినట్లు నిర్థారణ అయితే నిందితులకు బెయిల్ రావడం కూడా కష్టమే.. అయినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో వేటగాళ్లు యథేచ్ఛగా రెచ్చిపోతున్నారు. వేసవి ముప్పు.. వేసవి కాలం వచ్చిందంటే అడవిలోని చెట్లు ఆకులు రాల్చడం వల్ల జంతువులు దూరం నుంచే వేటగాళ్ల కంట పడుతున్నాయి.వేటనే వృత్తిగా చేసుకున్న ఒడిశా వేటగాళ్లు పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడం వల్ల వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. గత ఏడాది కొంతమంది వేటగాళ్లను పట్టుకుని కేసులు నమోదు చేసినా, పరిస్థితిలో మార్పు రాలేదు. నాటు తుపాకుల వినియోగం వేటగాళ్లు నాటు తుపాకులను ఉపయోగిస్తూ అడవి గేదెలు (బైసన్లు), కణుజులు, దుప్పులు వంటి అరుదైన జంతువులను వేటాడుతున్నారు. దీనివల్ల ఈ జాతులు క్రమంగా అంతరించిపోతున్నాయి. అటవీ శాఖలో పూర్తిస్థాయిలో సిబ్బంది లేకపోవడం వల్ల నిఘా, పర్యవేక్షణ లోపిస్తోంది. పులుల ఆచూకీ మృగ్యం 2010లో నిర్వహించిన పులుల గణనలో మర్రిపాకల రేంజ్లో రెండు పులులు, రెండు పులిపిల్లలు ఉన్నట్లు అటవీ శాఖ గుర్తించింది. కానీ, ఆ తర్వాత జరిగిన గణనలో వాటి జాడ లభించలేదు. పులులకు ఆహారంగా ఉండే అడవి గేదెలు, ఇతర జంతువుల సంఖ్య తగ్గిపోవడమే ఇందుకు ప్రధాన కారణం. సాధారణంగా ఆహారం లభించని పక్షంలో పులులు వేరే ప్రాంతాలకు వలస వెళ్లిపోతాయి. వేటగాళ్ల వ్యూహం ఒడిశాలోని మల్కన్గిరి జిల్లా నుంచి సుమారు 20 మంది చొప్పున నాలుగు, ఐదు బృందాలు నాటు తుపాకులతో బైక్లపై వస్తుంటారు. వీరు ముఖ్యంగా యూ.చీడిపాలెం, ఎం.భీమవరం పంచాయతీల పరిధిలోని నీటి కాలువల వద్ద మాటు వేస్తారు. దాహంతో నీరు తాగడానికి వచ్చే జంతువులను కాల్చి చంపుతారు. అనంతరం ఆ మాంసాన్ని ఎండబెట్టి, సంచుల్లో నింపుకుని తరలిస్తుంటారు. 2015లో ఎన్కౌంటర్తో.. పుట్టకోట సమీపంలో కాలువ వద్ద మాటు వేసిన ఒడిశా వేటగాళ్లను చూసి, కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు మావోయిస్టులుగా భావించి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు వేటగాళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఆ తరువాత కొంతకాలం వేట తగ్గినా, మళ్లీ పాత పరిస్థితే పునరావృతమైంది. దీంతో సీలేరు, మర్రిపాకల, పెదవలస రేంజ్లలో జంతువుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. స్థానికుల వద్ద ఉన్న రహస్య నాటు తుపాకుల వల్ల కూడా వేట కొనసాగుతోంది. ప్రస్తుతం మన అటవీ శాఖ అధికారులు మల్కన్గిరి అధికారులతో సమన్వయం చేసుకుంటూ వేటగాళ్ల కదలికలపై నిఘా ఉంచారు. కొంతమందిని ఇప్పటికే గుర్తించడంతో వేటగాళ్లలో భయం మొదలైంది. ఒడిశా వేటగాళ్ల తూటాలకు బలవుతున్న వన్యప్రాణులు నాటు తుపాకులతో వేట అంతరించిపోతున్న అడవి గేదెలు కానరాని పులుల జాడ ప్రశ్నార్థకంగా వన్యప్రాణుల మనుగడ అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు మల్కన్గిరి అధికారుల సమన్వయంతో నిఘాకఠిన చర్యలు తప్పవు జంతువులను వేటాడితే కఠిన చర్యలు తప్పవు. ఒడిశా వేటగాళ్ల రాకను చాలా వరకు కట్టడి చేశాం. వారిలో కొందరిని గుర్తించి కదలికలపై నిఘా ఉంచాం. మల్కన్గిరి అటవీ అధికారులతో సమన్వయం చేస్తున్నాం. చింతపల్లి డివిజన్ పరిధిలోకి ప్రస్తుతం వేటగాళ్లు రాలేదు. వేటకు వస్తే అరెస్ట్ చేసి కేసులు పెడతామని హెచ్చరించాం. – వైవీ నర్సింగరావు, డీఎఫ్వో, చింతపల్లి -
ఆ‘లివ్’ రిడ్లే..
జీవులకు విశాఖ అభయం కొమ్మాది: సముద్రం ఎన్నో అద్భుత జీవరాశులకు ఆవాసం. అందులో ఒక అరుదైన, అలసట ఎరుగని వలస జీవి ‘ఆలివ్ రిడ్లే’తాబేలు. ఏ సరిహద్దులూ లేని సాగరంలో.. అలుపెరగని అలల తోడుగా వేల కిలోమీటర్లు ఈదుకుంటూ.. కేవలం సంతానోత్పత్తి కోసమే ప్రతి ఏడాదీ తూర్పు తీరానికి చేరుకుంటాయి. ఒకవైపు పొంచి ఉన్న ముప్పు, మరోవైపు అటవీ శాఖ, స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న అభయం మధ్య ఈ చిట్టి తాబేళ్లు బుడిబుడి అడుగులు వేస్తూ తిరిగి సంద్రం ఒడికి చేరుకుంటున్నాయి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ జాబితాలో హానికి లోనయ్యే జాతులుగా వర్గీకరించబడిన ఈ తాబేళ్ల రక్షణకు విశాఖ తూర్పు తీరం కేరాఫ్ అడ్రస్గా మారింది. అలుపెరుగని ప్రయాణం ఆలివ్ రిడ్లే తాబేళ్లకు స్థిర నివాసం అంటూ ఉండదు. సుమారు రెండు అడుగుల పొడవు, 35 నుంచి 50 కిలోల బరువు ఉండే ఈ తాబేళ్లు ఆహార అన్వేషణ, సంతానోత్పత్తి కోసం మహా సముద్రాల్లో దాదాపు 20 వేల కిలోమీటర్ల మేర ప్రయాణిస్తాయి. వీటిల్లో ఏడు జాతులు ఉండగా 5 జాతులు జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల నుంచి ఏపీ, ఒడిశా తీరాలకు వలస వస్తుంటాయి. వీటి ప్రయాణాన్ని ట్రాక్ చేసేందుకు అటవీశాఖ శాటిలైట్ ట్యాగింగ్ విధానాన్ని కూడా వాడుతోంది. ఇటీవల ట్యాగ్ చేసిన ఒక తాబేలు కేవలం 51 రోజుల్లో 1000 కిలోమీటర్లు ప్రయాణించినట్లు గుర్తించింది. అర్ధరాత్రి తీరంలో సందడి నవంబర్ నుంచి మే వరకు వీటి సంతానోత్పత్తి కాలం. డిసెంబర్–ఫిబ్రవరి మధ్యలో ఇవి ఎక్కువగా వస్తుంటాయి. విశాఖ సాగరతీరం వీటికి ఇష్టమైన ప్రదేశం. అర్ధరాత్రి 2 గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల మధ్య తీరానికి చేరుకుని, ఇసుకలో గోతులు తవ్వి 50 నుంచి 150 గుడ్ల వరకు పెడతాయి. గుడ్లపై ఇసుక కప్పి తల్లి తాబేళ్లు తిరిగి సముద్రంలోకి వెళ్లిపోతాయి. గుడ్లు పొదిగే ఇసుక ఉష్ణోగ్రత పిల్లల లింగాన్ని నిర్ణయిస్తుంది. 28 నుండి 30 డిగ్రీల ఉష్ణోగ్రతలో పొదిగితే మగ తాబేళ్లుగానూ, 30–32 డిగ్రీల ఉష్ణోగ్రతలో పొదిగితే ఆడ తాబేళ్లుగానూ ప్రాణం పోసుకుంటాయి. అయితే పిల్లలుగా మారిన వెంటనే వాటంతట అవే సముద్రంలోకి వెళ్లిపోవడం విశేషంపొంచి ఉన్న ముప్పు తీరంలో తాబేళ్లు గుడ్లు పెట్టి వెళ్లిన తర్వాత వాటికి అనేక సవాళ్లు ఎదురవుతాయి. ఉదయం పూట పర్యాటకుల తాకిడి, కుక్కలు, నక్కలు వంటి జంతువుల దాడులు, అలాగే సముద్రంలో వేటగాళ్ల వలలకు చిక్కుకుని ఎన్నో గుడ్లు, తాబేళ్లు నశించిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆలివ్ రిడ్లే జాతి అంతరించిపోకుండా అటవీశాఖ ఆద్వర్యంలో సాగర్నగర్, జోడుగుళ్లపాలెం, చేపలుప్పాడ, పెదనాగమయ్యపాలెం ప్రాంతాల్లో ప్రత్యేక సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పార్ట్టైం ఉద్యోగులు, స్థానిక మత్స్యకారుల సహాయంతో తీరంలో అసురక్షిత ప్రాంతాల్లో ఉన్న గుడ్లను సేకరించి, ఈ కేంద్రాల్లో సురక్షితంగా పొదిగిస్తున్నారు. సంద్రం ఒడికి.. సంరక్షణ కేంద్రాల్లో సేకరించిన గుడ్లను సుమారు 40 నుంచి 45 రోజుల పాటు రక్షణ వలయంలో ఉంచుతారు. గుడ్లు పొదిగి పిల్లలుగా మారిన తర్వాత, అటవీశాఖ అధికారులు ఆ చిట్టి తాబేళ్లను విడతల వారీగా సముద్రంలోకి విడిచిపెడతారు. అవి బుడిబుడి అడుగులు వేస్తూ అలల మీద సముద్రంలోకి కలిసిపోతున్న దృశ్యం చూపరులను కట్టిపడేస్తుంది. ఇప్పటికే ఈ తాబేలు పిల్లలను సముద్రంలోకి వదిలే కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. -
అప్పుల బాధతో ప్లంబర్ ఆత్మహత్య
తగరపువలస: జీవీఎంసీ భీమిలి జోన్ రెండో వార్డు వలందపేటకు చెందిన సరగడ లక్ష్మణరెడ్డి (42) అనే ప్లంబర్ అప్పుల బాధ తాళలేక శనివారం ఉదయం ఇంటి రెండో అంతస్థులో ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య పార్వతి ఫిర్యాదు ప్రకారం ఆర్థిక ఇబ్బందులు, అప్పుల కారణంగా మూడేళ్లుగా తామిద్దరం మానసిక ఒత్తిడికి గురయినట్టు తెలిపింది. రుణదాతలు తరచూ ఇంటికి వచ్చి డబ్బుల విషయమై గొడవ పడుతున్నట్టు తెలిపింది. ఈ అప్పుల కారణంగా తాము జైలుకు కూడా వెళ్లామని చెప్పింది. రుణదాతలకు డబ్బులు ఇస్తామని గడువు కోరినా వినని కారణంగా తీవ్ర ఆందోళనకు గురయిన లక్ష్మణరెడ్డి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిపింది. ఇరుగుపొరుగు వారి సాయంతో ఇంటి తలుపులు బద్దలుకొట్టి సీలింగ్కు వేలాడుతున్న మృతుని కిందకు దించారు. భీమిలి ఏఎస్ఐ నక్కా శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సరుగుడు,టేకు తోటల దగ్ధం
లోపూడిలో దగ్ధమైన సరుగుడు తోట బుచ్చెయ్యపేట: మండలంలోని లోపూడి లో శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో సరుగుడు,టేకు తోటలు దగ్ధమయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిపారేసిన సిగరెట్టు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. గ్రామానికి చెందిన ఉడికొట్టు పోతురాజు,బండి బోడమ్మలకు చెందిన 60 సెంట్ల భూమిలో సరుగుడు,టేకు తోటలు కాలిపోయాయి. గ్రామస్తులు,రైతులు సకాలంలో మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాదం వల్ల సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. పరిహారం అందించి ఆదుకోవాలని వారు కోరారు. -
ఆదివాసీలపై గిరిజనేతరుల దాడి దారుణం
● చర్యలు తీసుకోకుంటే ఉద్యమం తీవ్రతరం ● ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు వంతాల కృష్ణ హెచ్చరిక పాడేరు రూరల్: చింతపల్లి మండలం లంబసింగి పంచాయతీ జలాగలగెడ్డ గ్రామానికి చెందిన పీటీజీ (ఆదిమ జాతి) గిరిజనులపై, మైదాన ప్రాంతాల నుంచి వలస వచ్చిన గిరిజనేతరులు దాడికి పాల్పడటంపై ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు వంతాల కృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. న్యాయం కోరుతూ పాడేరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట జలాగలగెడ్డ గిరిజనులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శనివారం నాటికి 6వ రోజుకు చేరుకుంది. ఈ దీక్షకు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వంతాల కృష్ణ మాట్లాడుతూ గిరిజనేతరుల ఆగడాలను ఎండగట్టారు. ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తే, ఆ పనులు జరగకుండా గిరిజనేతరులు అడ్డుకోవడం హాస్యాస్పదమని మండిపడ్డారు. రోడ్డు గురించి ప్రశ్నించినందుకు కొరుబయలులో నివాసం ఉంటున్న వలసదారులు ఆదివాసీలపై బరితెగించి దాడులు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. గత వారం రోజులుగా జలాగలగెడ్డకు వెళ్లే దారిని పూర్తిగా మూసివేయడంతో కనీసం చిన్నపిల్లలు పాఠశాలలకు కూడా వెళ్లలేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా నేటికీ స్పందించకపోవడం దారుణమని కృష్ణ విమర్శించారు. 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసీలకు సర్వహక్కులు ఉన్నప్పటికీ, గిరిజనేతరుల అక్రమాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని విమర్శించారు.ఆదివాసీ గిరిజనులపై దాడి చేసిన వారిపై తక్షణమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని.. లేకుంటే . ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, బాధితులు, గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
టెన్త్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
● జిల్లావ్యాప్తంగా 44 పరీక్షా కేంద్రాలు ● 7,804 మందికి హాల్ టికెట్లు ● పకడ్బందీగా ఏర్పాట్లు సాక్షి,పాడేరు: జిల్లాలో ఈఏడాది టెన్త్ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. జిల్లాలోని 159 ఉన్నత పాఠశాలల పరిధిలో 7,804మంది విద్యార్థులు ఈనెల 16వతేదీ సోమవారం నుంచి జరగనున్న టెన్త్ పరీక్షలకు హాజరు కానున్నారు. విద్యార్ధులందరికి హాల్టికెట్లు పంపిణీ పూర్తి చేసినట్టు విద్యాశాఖ అధికార వర్గాలు తెలిపారు. జిల్లాలోని 11 మండలాల పరిధిలో 44 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి, విద్యార్ధులకు మౌలిక వసతులు కల్పించారు. బెంచీలతో పాటు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం, వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చారు. కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశాల మేరకు టెన్త్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని డీఈవో రామకృష్ణారావు తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలతో పాటు పోలీసు భద్రతను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇన్విజిలేటర్లు, తనిఖీ బృందాల నియామకాలు పూర్తి చేశామన్నారు. కొయ్యూరు: మండలంలో బాలారం జిల్లా పరిషత్ పాఠశాలతో కలిపి 15 పాఠఽశాలలకు చెందిన 589 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారని ఏటీడబ్ల్యూవో క్రాంతి కుమార్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొయ్యూరు బాలుర ఆశ్రమ పాఠశాల, ప్రభుత్వోన్నత పాఠశాల, గురుకుల పాఠశాలలో పరీక్ష రాస్తారన్నారు. సీలేరు: టెన్త్ పరీక్షా కేంద్రాల్లో మాస్కాపీయింగ్కు అవకాశం లేకుండా చర్యలు తీసుకున్నామని డీవో ప్రసాద్ తెలిపారు. శనివారం సీలేరులో పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ సీలేరు గురుకుల పాఠశాల కేంద్రంలో ఐదు పాఠశాలలకు చెందిన 197 మందితోపాటు కంపార్ట్మెంట్ విద్యార్థులు కలిపి 240 మంది పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు. పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేశామని ఆయన పేర్కొన్నారు. -
నూతన ఆవిష్కరణలకు వేదిక ‘ఫార్మా అన్వేషణ్’
మద్దిలపాలెం(విశాఖ): ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏయూ ఫార్మసీ కళాశాల ఆధ్వర్యంలో శనివారం బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ఫార్మా అన్వేషణ్–2026 సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ జషుబాయ్ హెచ్.చౌదరి మాట్లాడుతూ ఫార్మసీ రంగం నుంచి నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించేందుకు, వాటి ఆవశ్యకతను తెలియజేసేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. ఫార్మా రంగంలో ఉత్సుకతతో సేవలందించాలనుకునే విద్యార్థులకు ఫార్మసీ కౌన్సిల్ ఒక ఉన్నత స్థాయి మార్గంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఏయూతో ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఫార్మా అన్వేషణ్లో భాగంగా విద్యార్థులకు పోటీలు నిర్వహించి రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచిన వారిని జాతీయ స్థాయి పోటీలకు తీసుకెళ్తామన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తు కల్పించే దిశగా ఏయూ అడుగులేస్తోందని, దీనికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. త్వరలో సమ్మర్ ఇంటర్న్షిప్ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. మంచి ఫలితాలు పొందే దిశగా ప్రతి విద్యార్థి ఉన్నతంగా ఆలోచించి లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. ఏయూ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ జి.గిరిజాశంకర్, ఫార్మా అన్వేషణ్ కార్యక్రమ జోనల్ కో ఆర్డినేటర్లు డాక్టర్ శరత్చంద్ర, డాక్టర్ ఎం.నిరంజన్ బాబు, ఐపీసీఏ జనరల్ సెక్రటరీ డాక్టర్ టి.వి.నారాయణ, డాక్టర్ పి.వీరరాజు, స్టేట్ కో ఆర్డినేటర్ డాక్టర్ ఎస్.ఎల్.ఎన్.ప్రసాద్రెడ్డి, స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రార్ డాక్టర్ ఎం.విలియం కేరి తదితరులు కార్యక్రమంలో ప్రసంగించారు. ఏయూ తరఫున అతిథులను వీసీ సత్కరించారు. సదస్సు ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. అనేక మంది ఆచార్యులు, విద్యార్థులు, ఫార్మా ప్రముఖులు పాల్గొన్నారు. -
బ్రాండిక్స్ పనులు అడ్డగింత
అచ్యుతాపురం: తమ గ్రామాన్ని తరలించిన తర్వాతే బ్రాండిక్స్ పనులు చేపట్టాలని అచ్యుతాపురం మండలంలోని దుప్పుతూరు ప్రజలు శనివారం ఆందోళన చేశారు. బ్రాండిక్స్ సిబ్బంది చేపడుతున్న పనులను సర్పంచ్ దేశంశెట్టి శంకర్రావు ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీలకు చెందిన నాయకులు,స్థానికులు కలిసి అడ్డుకున్నారు.ఈ సందర్భంగా దుప్పుతూరు సర్పంచ్ శంకర్రావు మాట్లాడుతూ ఏపీఐఐసీ అధికారులు,బ్రాండిక్స్ యాజమాన్యం దుప్పుతూరు ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. భూముల సేకరణ వల్ల నష్టపోయిన ప్రజలకు ప్యాకేజీ అందజేయాలని,గ్రామాన్ని తరలించిన తర్వాతే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.ప్రగడ రాజు,ప్రగడ నాగేశ్వరరావు, దేశంశెట్టి పైడియ్యనాయుడు, దేశంశెట్టి వెంకటరమణ, దేశంశెట్టి ఈశ్వరరావు, దేశంశెట్టి యల్లయ్యనాయుడు, దేశంశెట్టి అప్పలనాయుడు, ప్రగడ తాతబాబు, దేశంశెట్టి త్రినాఽథ్,బద్ది తాతాజీ,నందారపు త్రినాఽథ్,శెట్టి కాసుబాబు,దేశంశెట్టి తాతీలు,నందారపు శివ,రావి కాసుబాబు,దేశంశెట్టి నానాజీ,పట్టుగర్ల యల్లయ్యనాయుడు స్థానిక రైతులు పాల్గొన్నారు. -
భావోద్వేగాల నడుమ ‘విజయీభవ’
సీలేరు: విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైన పదవ తరగతి పరీక్షల ముంగిట, విద్యార్థినుల్లోని భయాందోళనలను తొలగించి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు సీలేరు బాలికల ఆశ్రమ పాఠశాల ఒక అద్భుతమైన వేదికగా నిలిచింది. శనివారం పాఠశాల ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమం అటు తల్లిదండ్రులను, ఇటు విద్యార్థినులను భావోద్వేగానికి గురిచేసింది. తల్లిదండ్రుల సమక్షంలో ఆత్మవిశ్వాసం పరీక్షలంటే ఉండే ఒత్తిడిని దూరం చేసేందుకు ఇన్చార్జి హెచ్ఎం నాగ శకుంతల నేతృత్వంలో ఉపాధ్యాయ బృందం ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. పదవ తరగతి చదువుతున్న విద్యార్థినుల తల్లిదండ్రులందరినీ పాఠశాలకు ఆహ్వానించి, వారిని తమ పిల్లలతో ముఖాముఖిగా కూర్చోబెట్టారు. మూడు గంటల సుదీర్ఘ సంభాషణ సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ ఆత్మీయ భేటీలో పిల్లలు తమ మనసులోని మాటలను తల్లిదండ్రులతో పంచుకున్నారు. నాన్న.. నేను బాగా రాస్తా!.. నేను పరీక్షలు బాగా రాస్తాను నాన్న.. మీ నమ్మకాన్ని నిలబెడతాను.. అంటూ విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు మాట ఇస్తూ, వారి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం అక్కడ ఉన్న వారందరినీ కదిలించింది. ఒత్తిడి లేని వాతావరణమే లక్ష్యం సాధారణంగా పరీక్షల సమయంలో హాస్టల్ విద్యార్థులు ఇంటికి దూరంగా ఉంటూ కొంత ఆందోళనకు గురవుతుంటారు. ఈ విషయాన్ని గమనించిన పాఠశాల యంత్రాంగం, తల్లిదండ్రులను నేరుగా పాఠశాలకే పిలిపించి వారితో సమయం గడిపేలా చేయడం వల్ల విద్యార్థినుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. విద్యార్థుల భవిష్యత్తు పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి, వారిని మానసికంగా సిద్ధం చేసిన ఇన్చార్జి హెచ్ఎం నాగ శకుంతల, తోటి ఉపాధ్యాయులను తల్లిదండ్రులు అభినందించారు.సీలేరు ఆశ్రమ పాఠశాలలోవినూత్న ప్రయోగం -
నూతన వసతి గృహం ఏర్పాట్లకు చర్యలు
విద్యార్థినులతో మాట్లాడుతున్న జాయింట్ కలెక్టర్ బాలికల వసతి గృహం నిర్వహిస్తున్న అద్దె భవనాన్ని పరిశీలస్తున్న జేసీ జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ చీడికాడ: వేసవి సెలవుల అనంతరం పాఠశాల పునఃప్రారంభం నాటికి బాలికల వసతి గృహానికి కొత్త భవనాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్ తెలిపారు. మండల కేంద్రం చీడికాడలో అద్దె భవనంలో నిర్వహిస్తున్న బాలికల వసతి గృహాన్ని శనివారం ఆయన సందర్శించారు. విద్యార్థినుల సమస్యలపై ఆరా తీశారు. హాస్టల్ సిబ్బంది తమను ఇబ్బంది పెట్టారని విద్యార్థినులు ఆరోపణలు చేయడంతో ఇటీవల బదిలీచేసిన వార్డెన్ లలితాదేవి,కుక్కు,కమాటీ,నైట్ వాచ్మన్లను విచారించారు. అనంతరం 14 ఏళ్ల కిందట ప్రారంభించి, అసంపూర్తిగా నిలిపివేసిన హాస్టల్ భవనాన్ని పరిశీలించారు. ఈ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో కొత్త భవనం నిర్మించాలని ఇంజినీరింగ్ అధికారులు సూచించిన విషయాన్ని జేసీ దృష్టికి బీసీ వేల్పేర్ డీడీ శ్రీదేవి తీసుకెళ్లారు.అనంతరం చీడికాడ ఉన్నత పాఠశాలలో ఖాళీగా ఉన్న పాఠశాల భవనాల గదులు పరిశీలించారు. కలెక్టర్కు నివేదిక అందజేయనున్నట్టు జేసీ తెలిపారు. ఆయన వెంట అనకాపల్లి ఇన్చార్జి ఆర్డీవో వై.శ్రీనివాసరావు,తసీల్దార్ కిషోర్ లింకన్ తదితరులున్నారు. -
వావ్ అథ్లెట్స్కు సీపీ సత్కారం
విశాఖ సిటీ: జాతీయ, అంతర్జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పతకాలు సాధించిన వెటరన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆఫ్ విశాఖపట్నం(వావ్) అథ్లెట్లకు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఘనంగా సన్మానించారు. ఇటీవల జగల్పూర్, మధ్యప్రదేశ్లో జరిగిన నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లోను, థాయ్లాండ్లో జరిగిన ఇంటర్నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్–2026లో వావ్ అథ్లెట్లు అత్యధిక పతకాలు సాధించారు. శనివారం నగరంలో ఒక హోటల్లో జరిగిన వీరి సన్మాన కార్యక్రమానికి సీపీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా అథ్లెట్లకు సీపీ శాలువాలు వేసి జ్ఞాపికలు అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెటరన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ను ప్రోత్సహించాలని సూచించారు. తద్వారా వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మరింత ఉత్సాహంతో జీవితాన్ని గడపగలరని తెలిపారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న వాట్ చైర్మన్, వావ్ చీఫ్ పేటర్న్ డా.కమల్ బయద్ మాట్లాడుతూ తాను ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారా ఎందరో ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ట్రస్టీలు నండూరి రామకృష్ణ, సి.హెచ్.శ్రీనివాసరాజు, ఇండియా టీం మేనేజర్, ఇండియా మాస్టర్స్ సెక్రటరీ జనరల్ డా.మంగవరప్రసాద్, వావ్ కార్యదర్శి ఎల్.వి.సుధాకర్, కోశాధికారి కె.రామారావు పాల్గొన్నారు. -
రూ.32.80 కోట్లతో నక్కపల్లి ఆస్పత్రి అభివృద్ధి
నక్కపల్లి: స్థానిక ఏరియా ఆస్పత్రిని రూ.32.80 కోట్లతో అభివృద్ధి చేసి, 100 పడకల స్థాయికి పెంచి మల్టీస్పెషాలటీ ఆస్పత్రిగా మార్పుచేస్తున్నట్లు హోం మంత్రి వంగల పూడి అనిత తెలిపారు. శనివారం ఆమె క్యాంపు కార్యాలయంలో సమన్వయకమిటీ సభ్యులు,క్లస్టర్,యూనిట్ ఇన్చార్జ్లతో సమావేశం నిర్వహించారు.అనంతరం విలేకరులతోమాట్లాడుతూ పెద ఉప్పలం–లింగరాజుపాలెం మధ్య వంతెన నిర్మాణానికి రూ.13 కోట్లు, కోటవురట్ల మండలం ఇందేశమ్మ వాక వద్దకొండలను తొలచి రోడ్డు విస్తరణకు రూ.16 కోట్లు మంజూరైనట్టు చెప్పారు. నక్కపల్లి, ఎస్.రాయవరం, పాయకరావుపేట మండలాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న నక్కపల్లి ఏరియా ఆస్పత్రిలో ట్రామాకేర్ సెంటరు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. పెనుగొల్లు ఆస్పత్రి అభివృద్ధికి రూ.50లక్షలు మంజూరైనట్టు ఆమె చెప్పారు. ఉపాధి అవకాశాల కోసం నక్కపల్లి మండలంలో స్వయం పేరుతో డ్రైఫిష్ యూనిట్ , రాజయ్యపేటలో మత్స్యకారుల కోసం బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈనెల 23న ఆర్సిలర్ మిట్టల్స్టీల్ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ఇన్చార్జ్ కొప్పిశెట్టి వెంకటేష్,మార్కెట్కమిటీ చైర్మన్ దేవర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.హోం మంత్రి అనిత -
ఏప్రిల్ 6 మెగా కల్చరల్ ఫెస్టివల్
మద్దిలపాలెం(విశాఖ): ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏప్రిల్ 6 నుంచి 8వ తేదీ వరకు మెగా కల్చరల్ ఫెస్ట్–2026 నిర్వహించనున్నట్లు ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ తెలిపారు. శనివారం ఏయూ అకడమిక్ సెనేట్ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్, టీజర్లను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరిగే ఈ మెగా కల్చరల్ ఫెస్ట్లో మ్యూజికల్ నైట్, సైక్లింగ్, వాక్థాన్, డ్రోన్ షో, లేజర్ షో, డీజే నైట్, సాంస్కృతిక కార్యక్రమాలు, టాలెంట్ షో, ఫ్లవర్ షో వంటి అనేక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఏయూతో పాటు అనుబంధ కళాశాలల విద్యార్థులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. వచ్చే నెలలో జరగనున్న శతాబ్ది మహోత్సవాలకు ముందు నిర్వహించనున్న వివిధ కార్యక్రమాల వివరాలతో రూపొందించిన శతాబ్ది మహోత్సవ్ వెబ్సైట్ను ఆయన ప్రారంభించారు. ఈ వెబ్సైట్ను పూర్తిగా ఏయూ విద్యార్థులే రూపొందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ ఆచార్య ఎం.శశి, ఎం.వి.ఆర్. రాజు, కె.సీతామాణిక్యం, ఆచార్య ఎన్.విజయమోహన్, ఆచార్య ఎన్.ఎం.యుగంధర్, ఆచార్య సిహెచ్.ఆశా ఇమ్మానియల్ రాజు పాల్గొన్నారు. కార్యక్రమ వివరాలు : ఏప్రిల్ 6న భీమిలి వరకు సైక్లింగ్, ట్రీ ప్లాంటేషన్, లైవ్ మ్యూజిక్ బ్యాండ్, సాంస్కృతిక కార్యక్రమాలు, లైవ్ కన్సర్ట్ నిర్వహిస్తారు. ఏప్రిల్ 7న రంగోలి పోటీలు, ఉత్తరాంధ్ర గాయకులతో ప్రత్యేక పాత పాటల కార్యక్రమం, థింసా నృత్యం, విద్యార్థుల ప్రదర్శనలు, శాసీ్త్రయ నృత్యాలు జరుగుతాయి. ఏప్రిల్ 8న వాక్థాన్, రక్తదాన శిబిరం, సాంస్కృతిక కార్యక్రమాలు, లేజర్ షో, డీజే నైట్ నిర్వహిస్తారు. -
పవన్ సభలో బయటపడ్డ చంద్రబాబు మోసం
అల్లూరి జిల్లా: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అల్లూరి జిల్లాలో నిర్వహించిన మాటామంతి సభలో సీఎం చంద్రబాబు నాయుడి మోసం బయటపడింది. వితంతువులకు భర్త చనిపోయిన నెల రోజుల్లో కొత్త పెన్షన్ ఇస్తున్నట్లు వివిధ సభల్లో సీఎం చంద్రబాబు ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. అయితే, చంద్రబాబు మాటలు ప్రకటనలకే పరిమితమని మరోసారి స్పష్టమైంది. తనకు పెన్షన్ రాలేదని పవన్ కల్యాణ్ సభలో వితంతు మహిళ స్పష్టం చేసింది. తన భర్త చనిపోయి రెండేళ్లయినా పెన్షన్ అందలేదని ఓ గిరిజన మహిళ తెలిపింది. పెన్షన్ కోసం చాలా దూరం నడిచి వచ్చానని ఆవేదన వ్యక్తం చేసింది. నలుగురు పిల్లలతో ఇబ్బంది పడుతున్నానని చెప్పింది. తనకు ఏ ఆధారమూ లేదని వివరించింది. -
ఒకే అంబులెన్స్.. డజను మంది రోగులు!
డుంబ్రిగుడ (అల్లూరి సీతారామరాజు జిల్లా): అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిపుత్రులకు వైద్యం దైవాదీనంగా మారింది. జిల్లా కేంద్రమైన పాడేరు ఆస్పత్రిలో సైతం సరిపడా అంబులెన్స్లు లేవు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం శుక్రవారం పాడేరు జిల్లా ఆస్పత్రి నుంచి ఒకే అంబులెన్స్లో 12 మంది రోగులను విశాఖ కేజీహెచ్కు తరలించడమే. గర్భిణులు ఉన్న అంబులెన్స్లో కనీసం నర్సు లేరని.. మార్గమధ్యంలో ప్రసవం జరిగితే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. డుంబ్రిగుడ మండలం గసబ పంచాయతీ గసబ గ్రామానికి చెందిన పాంగి చిన్ని ప్రసవం నిమిత్తం అరకువేలీ సీహెచ్సీలో మూడు రోజుల కిందట చేరింది. అక్కడి నుంచి పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించగా.. సరిపడా రక్తం లేదని కేజీహెచ్కు రిఫర్ చేశారు. ఆమెతో పాటు ఒకే అంబులెన్సులో 12 మందిని తరలించడం.. ఏజెన్సీలో ప్రజల కష్టాలకు అద్దంపడుతోంది. -
కవయిత్రి ‘మొల్ల’కు ఘన నివాళి
అనకాపల్లి: సామాన్య కుటుంబంలో జన్మించిన మొల్ల తన అద్భుత ప్రతిభతో ‘మొల్ల రామాయణాన్ని’ సామాన్యులకు సైతం అర్థమయ్యేలా సరళమైన తెలుగులో రచించి చరిత్రలో నిలిచిపోయారని అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహనరావు అన్నారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో మొల్ల జయంతి సందర్భంగా శుక్రవారం ఆమె చిత్రపటానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ మొల్ల చేసిన అక్షర కృషి నేటి తరానికి, మహిళా సాధికారతకు గొప్ప స్ఫూర్తినిస్తుందన్నారు. పట్టుదల, సాహిత్య సేవను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ జి.ఆర్.ఆర్.మోహన్, సీఐలు లక్ష్మణమూర్తి, బాల సూర్యారావు, రమేష్, దేవుళ్ళు, పిల్లా రమేష్, ఎస్ఐలు ప్రసాద్, రమణయ్య, తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో... తుమ్మపాల: కలెక్టరేట్లో కవయిత్రి మొల్లమాంబ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి తెలుగు మహిళా కవయిత్రిగా మొల్లమాంబ తెలుగు సాహిత్యానికి విశేష సేవలందించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై సత్యనారాయణ రావు, బీసీ వెల్ఫేర్ అధికారి శ్రీదేవి, గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. తొలి తెలుగు కవయిత్రి మొల్లఅనకాపల్లి: పార్టీ బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు విల్లూరి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో స్థానిక రింగ్రోడ్డులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో కవయిత్రి మొల్ల జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొల్ల చిత్రపటానికి పూలమాల వేసి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ కుమ్మర కులంలో పుట్టిన మొల్ల తొలి తెలుగు కవయిత్రిగా ప్రసిద్ధి కెక్కి, రామాయణం రచించి ప్రజలకు అంకితం చేశారన్నారు. కార్యక్రమంలో అనకాపల్లి, యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్తలు మలసాల భరత్కుమార్, కరణం ధర్మశ్రీ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, మాజీ ఎంపీ బీవీ సత్యవతి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్కుమార్, పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
చోడవరం: సబ్బవరం–వెంకన్నపాలెం బీఎన్ రోడ్డుపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న మోటారు సైకిల్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మల్లంపాలెం గ్రామానికి చెందిన బి.వెంకటరమణ తన స్నేహితుడు అప్పారావుతో కలిసి మోటారు సైకిల్పై అడ్డూరు నుంచి వెంకన్నపాలెం వైపు వస్తుండగా ఎదురుగా చోడవరం నుంచి విశాఖపట్నం వెళుతున్న ఆర్టీసీ బస్సు నర్సాపురం సెంటర్ వద్ద ఢీకొంది. ఈ ప్రమాదంలో మోటారు సైకిల్పై వెళుతున్న వెంకరమణ, అప్పారావు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108వాహనంలో అనకాపల్లి ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చోడవరం పోలీసులు తెలిపారు. ఇదే ప్రదేశంలో ఆర్టీసీ బస్సు ప్రమాదం జరగడం నెలరోజులు వ్యవధిలో ఇది రెండో సారి కావడంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్సులను ఇష్టారాజ్యంగా నడపడం వల్లే తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, డ్రైవర్లకు పోలీసులు కౌన్సెలింగ్ ఇవ్వాలని జనం కోరుతున్నారు. -
పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
దేవరాపల్లిలో శిలాఫలకాన్ని ఆవిష్కరించి పార్కును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే బండారు, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజభరత్, చైర్మన్ ప్రణవ్గోపాల్ కె.కోటపాడు : వీఎంఆర్డీఏ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. కె.కోటపాడులో సుమారు కోటి రుపాయల నిధులతో కల్యాణ మండపం నిర్మాణానికి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తితో కలిసి వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్గోపాల్ భూమి పూజ చేశారు. అనంతరం కె.కోటపాడులో పీఎం కిసాన్ నగదు రైతుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో కొప్పల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ రొంగలి మహేష్, ఎంపీపీ జగన్మోహన్, ఏవో సోమశేఖర్, పాల్గోన్నారు. ఇంటింటి కుళాయిలు, పార్క్ ప్రారంభం దేవరాపల్లి: జల్ జీవన్ మిషన్ స్కీమ్ కింద దేవరాపల్లిలో నిర్మించిన మంచినీటి ట్యాంక్, ఇంటింటి కుళాయిలను ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి శుక్రవారం ప్రారంభించారు. అలాగే స్థానిక పోలీస్స్టేషన్కు ఎదురుగా వీఎంఆర్డీఏ నిధులతో నిర్మించిన పార్క్, యోగా సెంటర్ భవనాన్ని కమిషనర్ తేజ్ భరత్, చైర్మన్ ప్రణవ్గోపాల్తో కలిసి ఎమ్మెల్యే శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. -
19న అప్పన్న పెళ్లి రాట
సింహాచలం: ఉగాదిని పురస్కరించుకుని ఈనెల 19న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి పెళ్లిరాట ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నట్టు దేవస్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్ తెలిపారు. ఆరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆలయ ఆస్థానమండపంలో వేంజేపచేసి పూజలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి పంచాంగశ్రవణం, విశిష్ట అతిథిలకు పురస్కారాలు అందిస్తామన్నారు. సాయంత్రం 4గంటల నుంచి ఆలయ ప్రాంగణంలోను, రాజగోపురం పక్కన, వార్షిక కల్యాణం నిర్వహించే ఉత్తర రాజగోపురం ఎదురుగా ఉన్న మైదానంలోను పెళ్లి రాటలు వేయడం జరుగుతుందన్నారు. ఆరోజు సాయంత్రం సూర్యకిరణాలు స్వామివారి మూలవిరాట్ని తాకే వీలు ఉంటుందని పేర్కొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
బుచ్చెయ్యపేట: మండలంలోని బీఎన్ రోడ్డులో వడ్డాది కోవెల అప్పనదొర జిల్లా పరిషత్ స్కూల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎల్బీ పురానికి చెందిన మొల్లి అప్పలనాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. తోపుడు రిక్షాపై ఊరూరా తిరిగి కల్లు ఉప్పు అమ్ముకుని జీవించే అప్పలనాయుడు శుక్రవారం ఎల్బీ పురం నుంచి వడ్డాదికి ఉప్పు తీసుకెళుతుండగా వెనుక నుంచి వచ్చిన ఓ కారు ఢీ కొంది. దీంతో అప్పలనాయుడు తుప్పల్లో తూలిపడగా, తోపుడు రిక్షా దెబ్బతిని, ఉప్పు రోడ్డు పాలైంది. తీవ్రంగా గాయపడిన అప్పలనాయుడును స్థానికులు 108 వాహనంలో అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ ఆగకుండా పరారయ్యాడు. బుచ్చెయ్యపేట పోలీసులు విచారణ చేస్తున్నారు.ప్రమాదంలో దెబ్బతిన్న తోపుడు రిక్షా గాయపడిన అప్పలనాయుడు -
10.8 కిలోల గంజాయి పట్టివేత
ఎస్.రాయవరం: అడ్డురోడ్డు జంక్షన్లో 10.8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు సీఐ ఎల్. రామకృష్ణ శుక్రవారం చెప్పారు. గంజాయిని ఒడిశా రాష్ట్రం నుంచి నర్సీపట్నం మీదుగా ఆర్టీసీ బస్సులో అడ్డురోడ్డు జంక్షన్కు తీసుకువచ్చారు. అక్కడి నుంచి చైన్నె వెళ్లేందుకు ఫ్లైఓవర్ కింద నిలుచుని ఉండగా అనుమానంతో ఎస్.రాయవరం పోలీసులు తనిఖీ చేసినట్టు సీఐ చెప్పారు. బ్యాగ్లో గంజాయి బయటపడడంతో తమిళనాడు రాష్ట్రం మధురైకి చెందిన హరికృష్ణ,విఘ్నేష్ అనే ఇద్దరితో పాటు ఓ బాలుడిని అదుపులోకి తీసుకున్నట్టు సీఐ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్ఐ విభీషణరావు పాల్గొన్నారు.మాట్లాడుతున్న సీఐ రామకృష్ణ -
సమయ పాలన కరువు.!
శుక్రవారం ఉదయం 10.30 గంటలైనా తెరుచుకోని పాపయ్యపాలెం సచివాలయం అనకాపల్లి: పాపయ్యపాలెం సచివాలయం ఉద్యోగులు సమయ పాలన పాటించడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలైనా సచివాలయానికి ఒక్క ఉద్యోగి కూడా రాలేదు. అప్పటికే సచివాలయానికి వచ్చిన ప్రజలు భవనానికి తాళం వేసి ఉండడంతో నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు. మండల, జిల్లా స్థాయి అధికారులు స్పందించి సచివాలయ సిబ్బంది సమయ పాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని పాపయ్యపాలెం ప్రజలు కోరుతున్నారు. -
విజయీభవ.!
విద్యార్థులను దీవిస్తున్న తల్లిదండ్రులు నర్సీపట్నం: మండలంలో చెట్టుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విజయీభవ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ నెల 16వ తేదీ నుంచి పబ్లిక్ పరీక్షలు రాయనున్న పదో తరగతి విద్యార్థులను వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విజయీభవ అంటూ దీవించారు. విద్యార్థులు తమ తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఎంఈవో నాగేంద్ర హాల్ టికెట్లు అందజేశారు. ఉపాధ్యాయుల సహకారంతో పరీక్షలు రాసేందుకు అవసరమైన సామగ్రిని విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం సరోజిని, స్కూల్ చైర్మన్ ఈశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
నూకాంబిక అమ్మవారికి సారె సమర్పణ
అనకాపల్లి: ఉత్తరాంధ్ర ఇలవేల్పు స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారికి జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చీర, పట్టువస్త్రాలు, సారెను శుక్రవారం సమర్పించారు. అమ్మవారు సారెను ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీను, సహాయ కమిషనర్ యాళ్ల శ్రీధర్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జీవీ నాగేశ్వరరావు, సంఘం జిల్లా అధ్యక్షుడు తిప్పాన అప్పారావు, గౌరవాధ్యక్షుడు పంపాన సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ దొడ్డి ఈశ్వరరావు, సంఘం రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
చెట్టుపై నుంచి జారి పడి వ్యక్తి మృతి
రావికమతం: తాటి చెట్టుపై నుంచి ప్రమాదవశాతు జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. కొత్తకోట పోలీసులు తెలిపిన వివరాలు.. మత్సవానిపాలెం గ్రామానికి చెందిన సబ్బి నాగేశ్వరరావు(30) కూలిపని నిమిత్తం తాటి కమ్మ నరికేందుకు గ్రామానికి చెఽందిన మరో నలుగురితో కలిసి మర్రి వలస శివారు గొల్లలపాలెంకు శుక్రవారం వెళ్లాడు. తాటి కమ్మలు నరకు తుండగా ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి జారి పడ్డాడు. తీవ్రంగా గాయపడిన నాగేశ్వరరావును సహచర కూలీలు కొత్తకోట పీహెచ్సీకి తరిలించగా అప్పటికై మృతి చెందినట్టు వైద్య సిబ్బంది తెలిపారు. మృతుడికి భార్య నాగలక్ష్మి,రెండేళ్ల కుమార్తె ఉన్నారు.భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న హెచ్సీ సి.భాస్కర్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించినుట్ట హెచ్సీ చెప్పారు. -
ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు
జేసీ శౌర్యమాన్ పటేల్ తుమ్మపాల: యుద్ధ పరిస్థితుల దృష్ట్యా గ్యాస్ సిలిండర్ల పంపిణీ, నిల్వలు, ధరలపై ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ హెచ్చరించారు. ఆయన శుక్రవారం ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు, ఆయా మండలాల తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్యాస్ కొరత ఉందనే ఆందోళనతో వినియోగదారులు ముందుగానే బుకింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. బుక్ చేసిన 72 గంటల్లోనే గ్యాస్ సిలిండర్ డెలివరీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిస్ట్రిబ్యూటర్లను ఆదేశించారు. ప్రతి గ్యాస్ ఏజెన్సీ వద్ద ఫోన్ నంబర్లు, సేల్స్ ఆఫీసర్, సంబంధిత తహసీల్దార్ ఫోన్ నంబర్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలని, బిల్లులో ఉన్న ధర కంటే ఒక్క రూపాయి అదనంగా వసూలు చేసినా, టిప్స్ పేరుతో ఒత్తిడి చేసినా డెలివరీ బాయ్స్, సదరు ఏజెన్సీలపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఓటీపీ లేకుండా ఎక్కడా సిలిండర్ డెలివరీ చేయకూడదని, పారదర్శకత పాటించాలని సూచించారు. నిల్వలను అక్రమంగా దాచడం, ఇతర అవసరాలకు మళ్లించడం వంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, దీనికోసం సివిల్ సప్లయి, తహసీల్దార్ బృందాలు నిరంతరం తనిఖీలు చేస్తాయన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్సుల రద్దుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్వో కె.వి.ఎల్.ఎన్.మూర్తి, కలెక్టరేట్ పరిపాలన అధికారి విజయ్ కుమార్ పాల్గొన్నారు. -
అభివృద్ధిలో ఆదర్శంగా 82వ వార్డు
● మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ● కార్పొరేటర్ మందపాటి దంపతులకు ఆత్మీయ సత్కారంఅనకాపల్లి: అభివృద్ధిలో ఆదర్శంగా 82వ వార్డు నిలిచిందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. స్థానిక రింగ్రోడ్డులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో జీవీఎంసీ 82వ వార్డు కార్పొరేటర్ మందపాటి సునీత జానకీరామరాజు దంపతుల ఆత్మీయ సమావేశం నూకాంబిక అమ్మవారి దేవస్థానం మాజీ చైర్మన్ కొణతాల మురళీ కృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే 82వ వార్డు పరిధిలో సుమారుగా రూ.15 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. పదవీ కాలం ముగిసినా ప్రజలకు సేవ చేస్తే రాజకీయ జీవితచరిత్రలో ఎప్పుడు గుర్తింపు ఉంటుందన్నారు. వార్డు పరిధిలో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నట్టు ఐదేళ్ల పాలనలో ఒక్క ఫిర్యాదు కూడా రాలేదన్నారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్కుమార్, పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ మేయర్పై కూటమి నేతలు పెట్టిన అవిశ్వాస తీర్మాన సమయంలో వైఎస్సార్సీపీ అధిష్టానం ఆదేశాలను పాటించిన కార్పొరేటర్గా మందపాటి సునీత చరిత్రలో నిలిచిపోతారన్నారు. మాజీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి మాట్లాడుతూ జీవీఎంసీ సమావేశాల్లో వార్డు అభివృద్ధి పనులపై ఎక్కువగా దృష్టి సారించి, పనులు త్వరితగతిన పూర్తిచేసేందుకు కృషి చేశామన్నారు. కార్పొరేటర్ మందపాటి సునీత మాట్లాడుతూ అందరి సహకారంతో వార్డు పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. అనంతరం కార్పొరేటర్ మందపాటి దంపతులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బీవీ సత్యవతి, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, దంతులూరి దిలీప్కుమార్, నియోజకవర్గలో వివిధ అనుబంధ విభాగాల నాయకులు, ఎంపీపీ గొర్లి సూరిబాబు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మళ్ల బుల్లిబాబు, 80, 81, 84 వార్డు ఇన్చార్జ్లు కె.ఎం.నాయుడు, బొడ్డేడ శివ, కె.రాఘవ, పార్టీ సీనియర్ నాయకులు జి.రామమూర్తి, కాండ్రేగుల విష్ణుమూర్తి, హైమావతి, కె.పద్మకుమారి, పలకా సత్యనారాయణ, ఆడారి శ్రీను, మర్రిపల్లి శోభ, తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
దిలీప్కుమార్ మృతదేహం మాకవరపాలెం: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్.రాయవరం మండలం దార్లపూడికి చెందిన జవ్వాది దిలీప్కుమార్(19) శుక్రవారం మండలంలోని జి.కోడూరులో ఉన్న తన అక్క ఇంటికి వచ్చాడు. తిరిగి మధ్యాహ్నం నర్సీపట్నం మీదుగా బైక్పై స్వగ్రాం బయలుదేరాడు. మండలంలోని దాలింపేట వద్దకు వెళ్లేసరికి ఎదురుగా వస్తున్న లారీ, బైక్ ఢీకొన్నాయి. ఈ సంఘటనలో దిలీప్కుమార్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనలో బైక్ ముందు చక్రం సైతం వేరైంది. ప్రమాద స్థలాన్ని ఎస్ఐ దామోదర్నాయుడు పరిశీలించి, కేసు నమోదు చేశారు. -
పథకం
25,4921,43, 7721,69,264 మందికి లబ్ధి నాడు భరోసా..హామీలేమో కొండంత.. అమలు మాత్రం గోరంత.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గిరిజన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గతేడాది వరకు సాయం పొందిన 25 వేల మందికి పైగా రైతులకు ఈసారి మొండిచేయే ఎదురైంది. పెట్టుబడి సాయం పెంచుతామని చెప్పి, లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడమేనా ‘సూపర్ సిక్స్’ అంటే అని వారు ధ్వజమెత్తుతున్నారు. సాక్షి, పాడేరు: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ రంగంలో అభివృద్ధి దిశగా సాగిన గిరిజన రైతులకు ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో నిరాశే ఎదురవుతోంది. ఎన్నికల హామీల్లో భాగంగా ‘అన్నదాత సుఖీభవ’ పథకం ద్వారా ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు పెట్టుబడి సాయం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించినప్పటికీ, ఆచరణలో మాత్రం వేల సంఖ్యలో రైతులపై కోత విధించడం గమనార్హం. లబ్ధిదారుల సంఖ్యలో భారీ తగ్గింపు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అరకులోయ, పాడేరుతో పాటు రంపచోడవరం ( ప్రస్తుతం పోలవరం జిల్లా) నియోజకవర్గాల పరిధిలో మొత్తం 1,69,264 మంది గిరిజన రైతులకు ‘వైఎస్సార్ రైతు భరోసా’ లబ్ధి చేకూరింది. ఇందులో అటవీ భూములు (ఆర్వోఎఫ్ఆర్) సాగు చేసుకుంటున్న వారితో పాటు కౌలు రైతులు కూడా ఉండేవారు. అయితే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ సంఖ్యను 1,43,772కు కుదించింది. ఫలితంగా 25,492 మంది గిరిజన రైతులకు ఈ ఏడాది పెట్టుబడి సాయం అందకుండా పోయింది. ఏడాది పాటు నిరీక్షించినా.. 2024 ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, ఆ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులకు ఎలాంటి పెట్టుబడి సాయం అందించకుండా మొండిచెయ్యి చూపింది.గతంలో కౌలు రైతులకు లభించిన ప్రాధాన్యత ప్రస్తుత పథకంలో లోపించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 25వేల మందికి ప్రశ్నార్థకం గతేడాది ఆగస్టు, నవంబర్ నెలల్లో లబ్ధి పొందిన వారికి మాత్రమే ప్రస్తుతం సాయం అందుతోంది. పెండింగ్లో ఉన్న సుమారు 25 వేల మందికి పైగా రైతుల పరిస్థితి ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. వ్యవసాయంపై ఆర్థిక భారం ప్రస్తుతం గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. పంటల దిగుబడి తగ్గడమే కాకుండా, మార్కెట్లో గిట్టుబాటు ధరలు లేకపోవడం రైతులకు శాపంగా మారింది.వాణిజ్య పరంగా కాఫీ, మిరియం, రాజ్మా వంటి పంటలకు ఆశించిన ధరలు లభించడం లేదు. సంప్రదాయ పంటలైన పసుపు, పిప్పళ్లమోడి, జీడిమామిడి సాగు చేస్తున్న రైతులు ఆర్థిక నష్టాల్లో ఉన్నారు. ప్రభుత్వ వైఫల్యం గిట్టుబాటు ధరలు, మార్కెటింగ్ సౌకర్యాల కల్పనలోనూ కూటమి ప్రభుత్వం విఫలమైందనే ఆవేదన గిరిజనుల్లో కనిపిస్తోంది. పెట్టుబడి సాయం పెంచామనే సాకుతో వేలాది మంది అర్హులైన గిరిజన రైతులకు లబ్ధిని నిరాకరించడం గిరిజన ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది. సూపర్ సిక్స్ హామీల అమలుపై ప్రతిపక్షాల ఒత్తిడి పెరగడంతో పథకాన్ని ప్రారంభించినా, క్షేత్రస్థాయిలో కోతలు మాత్రం రైతులకు అన్యాయం చేస్తున్నాయి.నేడు నిరాశ !గిరి రైతు గుండె కోత వినేదెవరు? సాయం అందలేదు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి ఏటా రైతు భరోసా ఆర్థిక సాయం అందేది.కూటమి ప్రభుత్వం వచ్చాక మాత్రం అన్నదాత సుఖీభవ సాయం నిలిపివేసింది. పెట్టుబడి సాయం కోసం అనేక సార్లు అధికారులను అడిగినా ఫలితం లేకపోయింది. – కొర్రా సింద్రి, గిరి రైతు, గుర్రగరువు, పాడేరు మండలం కౌలు రైతుకు కోత ముంచంగిపుట్టు మండలం దోడిపుట్టు నుంచి వనుగుపల్లి ప్రాంతానికి వలస వచ్చి భూములను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నా. ఈ ఏడాది పెట్టుబడి సాయం అందుతుందని ఆశపడ్డాం. చాలా మంది కౌలు రైతులకు అన్యాయం జరిగింది. – సొమ్రో హరి, కౌలు రైతు, వనుగుపల్లి, పాడేరు మండలం తగ్గిన అన్నదాత సుఖీభవ లబ్ధిదారులు కోత విధించిన కూటమి ప్రభుత్వం సుమారు 25 వేల మందికి మొండిచెయ్యి సూపర్ సిక్స్ అంటే లబ్ధిదారులనుతగ్గించడమేనా? రైతులు ధ్వజం గిట్టుబాటు ధరలు కరువు గిరిజన ప్రాంతాల్లో గిరిజనుల పంటలకు గిట్టుబాటు ధరలు కల్పనలో ప్రభుత్వం విఫలమైంది.కూటమి ప్రభుత్వం కనీస మద్దతు ధరలు ప్రకటించకపోవడంతో దళారుల రాజ్యమవుతోంది. జీసీసీ కూడా పూర్తిస్థాయిలో కాఫీ కొనుగోలు జరపలేదు. – పాలికి లక్కు, కాఫీ రైతుల సంక్షేమ సంఘం, పాడేరు -
లభ్యం కాని గిరిజనుడి ఆచూకీ
మత్స్యగెడ్డలో గాలింపు నిలిపివేసిన ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముంచంగిపుట్టు: మండలంలోని సుజనకోట పంచాయతీ కుమ్మరిపుట్టు వద్ద గల మత్స్యగెడ్డలో గోపినాథ్ అనే గిరిజనుడు గల్లంతైన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. గత రెండు రోజులుగా ఏపీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కుమ్మరిపుట్టు గ్రామానికి చేరుకుని ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ, ఎటువంటి ఫలితం లభించలేదు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి బృందాలు గాలింపును నిలిపివేశాయి. పర్యవేక్షణలో అధికారులు, నేతలు.. ఈ గాలింపు చర్యలను తహసీల్దార్ భాస్కర అప్పారావు, ఎంపీడీవో ధర్మారావు, ఎస్ఐ నాని పర్యవేక్షించారు. వీరితో పాటు సర్పంచులు రమేష్, బాబూరావు, ఎంపీటీసీ సుబ్బలక్ష్మి, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పద్మారావు, స్థానిక నేతలు జయదేవ్, సింహాచలం, రాంప్రసాద్ తదితరులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు గల్లంతైన గోపినాథ్ ఆచూకీ కోసం ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు మత్స్యగెడ్డ వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విస్తృతంగా గాలింపు చేపట్టినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుమ్మరిపుట్టు గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. అధికారుల గాలింపు ఆగిపోయినప్పటికీ, గ్రామస్థులే స్వచ్ఛందంగా గెడ్డలో వెతుకులాట కొనసాగిస్తున్నారు. ఎస్డీఆర్ఎఫ్ బృందంపై ఆగ్రహం.. ఆచూకీ లభించకముందే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపును మధ్యలోనే నిలిపివేసి వెనుదిరగడంపై కుమ్మరిపుట్టు గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాలింపు చర్యలను కొనసాగించి తమ వ్యక్తిని అప్పగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
సచివాలయ వ్యవస్థతోనే గ్రామస్వరాజ్యం
● అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం హుకుంపేట: గాంధీజీ కలలుకన్న గ్రామస్వరాజ్యం గ్రామసచివాలయ వ్యవస్థతోనే సాధ్యపడిందని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. శుక్రవారం మండలంలోని సూకూరులో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. దీనిలో భాగంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామసచివాలయ వ్యవస్థ వల్లే సంక్షేమ పథకాలకు ప్రజలకు చేరువ అయ్యాయన్నారు. అదే ఆశయంతో ప్రజలకు సేవలు అందించాలని ఆయన సిబ్బందికి సూచించారు. సర్పంచ్ ధనసాని సత్యవతి, ఎంపీటీసీ కిలగడ సింహాచలం, పీఆర్ జేఈ సంజీవ్, పార్టీ మండల అధ్యక్షుడు పాంగి అనిల్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బత్తిరి రవిప్రసాద్, సర్పంచ్లు సమిడ వెంకటపూర్ణిమ, పార్టీ మండల ఉపాధ్యక్షుడు కాకరి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. -
హైడ్రో పవర్ ప్రాజెక్టు జీవోలను రద్దు చేయాలి
● ఆ తరువాతనే పవన్ కల్యాణ్ జిల్లా పర్యటనకు రావాలి ● ఆదివాసీ సంఘాల డిమాండ్ అరకులోయ టౌన్: హైడ్రో పవర్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్లు 2, 13, 51లను వెంటనే రద్దు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్, అరకులోయ వైస్ ఎంపీపీ కిల్లో రామన్న డిమాండ్ చేశారు. ఈ జీవోలను రద్దు చేసిన తర్వాతే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జిల్లా పర్యటనకు రావాలని వారు స్పష్టం చేశారు. శుక్రవారం వారు వేర్వేరుగా విలేకరులతో మాట్లాడుతూ పలు కీలక డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. హైడ్రో పవర్ ప్రాజెక్టుతో పాటు బాకై ్సట్ తవ్వకాలకు సంబంధించిన జీవోలను వెంటనే రద్దు చేయాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ నియామకాల్లో నూరుశాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేయాలని, ఆదివాసీ నిరుద్యోగుల కోసం ప్రత్యేక డీఎస్సీ ప్రకటించి భర్తీ చేపట్టాలని వారు స్పష్టంచేశారు. ఐదవ షెడ్యూల్ ప్రాంతాలైన గుజ్జెలి, చిట్టంవలస, పెదకోట, ఎర్రవరం, సీలేరు ప్రాంతాల్లో 6,100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రభుత్వం అదానీ, నవయుగ, షిరిడి సాయి వంటి కార్పొరేట్ కంపెనీలకు అనుమతులు ఇచ్చిందని వారు విమర్శించారు.ఈ ప్రాజెక్టుల వల్ల 25 గ్రామ పంచాయతీల్లోని దాదాపు 250 గ్రామాలు, సుమారు 60 వేల మంది ఆదివాసీలు నిరాశ్రయులవుతారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది ఎకరాల అటవీ భూములు, కాఫీ తోటలు, వన్యప్రాణులు జలసమాధి అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.ఆదివాసీల హక్కులను, చట్టాలను ఉల్లంఘిస్తూ చేపడుతున్న ఈ ప్రాజెక్టులను నిలిపివేసిన తరువాతనే పవన్ కల్యాణ్ ఏజెన్సీలో అడుగుపెట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం మండల కార్యదర్శి జి. బుజ్జిబాబు, మండల ఉపాధ్యక్షుడు బురిడి దశరథ్ తదితరులు పాల్గొన్నారు. బాకై ్సట్ తవ్వకాలపై స్పష్టత ఇవ్వాల్సిందే చింతపల్లి: ఏజెన్సీ ప్రాంతంలో బాకై ్సట్ తవ్వకాలుపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చిన తరువాతనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మన్యంలో పర్యటించాలని గిరిజన సంఘం మండల కార్యదర్శి సాగిన చిరంజీవి డిమాండ్ చేశారు.శుక్రవారం చౌడుపల్లి పంచాయతీ గెర్లెగెడ్డ గ్రామంలో గిరిజనులతో కలసి నిరసన చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అపారమైన ఖనిజ సంపదను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయమైన మార్గంలో దోచుకుపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఖనిజ సంపద ఒడిశా తరువాత అల్లూరి జిల్లాలోనే ఉందన్నారు.దీనిని అక్రమంగా తరలించకుండా గిరిజనులంతా ఏకమై పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో సంఘ నేతలు రఘరాం, రమణ, రాజేష్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. -
హుండీ ఆదాయం రూ.3.11 లక్షలు
హుండీ ఆదాయం లెక్కింపు చేస్తున్న ఉద్యోగులు అనకాపల్లి: స్థానిక సుంకరమెట్ట జంక్షన్ సత్యనారాయణ, సూర్యనారాయణ స్వామివార్ల హుండీ ఆదాయం 3 లక్షల 11 వేల 573 రూపాయలు వచ్చింది. దేవదాయ శాఖ ఈవో బి.మురళీకృష్ణ, ఆలయ చైర్మన్ బొడ్డేడ మురళీల ఆధ్వర్యంలో ఆలయ ఉద్యోగులు హుండీ కానుకలు లెక్కించారు. వారు మాట్లాడుతూ మాఘ మాసంలో దర్శనానికి వచ్చిన భక్తులు సమర్పించిన ఆదాయం లెక్కించామన్నారు. ఇంత పెద్దమొత్తంలో ఎప్పుడు ఆదాయం రాలేదన్నారు. యూఎస్ఏ డాలర్, కెనడియన్ డాలర్ ఒకటి చొప్పున వచ్చిందన్నారు. భక్తుల టికెట్స్ ద్వారా రూ.1,72,650, వ్రతాలు టికెట్స్ ద్వారా రూ. 53,600, స్వామివారి ప్రసాదం అమ్మకం ద్వారా రూ.56,745, బంగారం 1.350 మిల్లీ గ్రాములు, వెండి 400 గ్రాములు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ మొత్తం నగదును దేవదాయ ధర్మాదాయ శాఖ బ్యాంక్ ఖాతాలో జమ చేశామన్నారు. కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
గత పాలనలో 70 శాతం నూకాంబిక ఆలయ పునర్నిర్మాణం
అనకాపల్లి: ఉత్తరాంధ్ర ఇలవేల్పు స్థానిక గవరపాలెం నూకాంబిక ఆలయ పునర్నిర్మాణ పనులకు 2023 జూన్ 8న అప్పటి వైఎస్సార్సీపీ పాలనలో రూ.11 కోట్లతో శంకుస్థాపన చేశామని, ప్రస్తుత పాలనలో పూర్తయ్యాయని మాజీ మంత్రి, పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్ తెలిపారు. స్థానిక గవరపాలెం నూకాంబిక నూతన ఆలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, నియోజకవర్గ సమసన్వయకర్త మలసాల భరత్కుమార్, మాజీ ఎంపీ బీవీ సత్యవతి, పార్టీమెంట్ పరిశీలకురాలు శోభా హైమావతిలతో కలిసి ఆయన గురువారం దర్శించుకున్నారు. ఆలయ సహాయ కమిషనర్ యాళ్ల శ్రీధర్, ఆలయ చైర్మన్ పీలా గొల్లబాబు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, అమ్మవారి దర్శనభాగ్యం కల్పించి, బేడా మండపంలో శాలువాలతో సత్కరించి, అమ్మవారి చిత్రపటాలను అందజేశారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ పాలనలో తాను మంత్రిగా ఉన్న సమయంలో అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. అప్పటి ఆలయ చైర్మన్ కొణతాల మురళీకృష్ణతోపాటు కమిటీ సభ్యులు ప్రత్యేక చొరవతో 60 నుంచి 70 శాతం ఆలయ నిర్మాణ పనులు చేపట్టారన్నారు. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు రావడంతో చంద్రబాబు ప్రభుత్వం మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేసి ఆలయాన్ని ప్రారంభించిందన్నారు. నూతన ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో కొత్త అమావాస్య జాతర నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్కుమార్, పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, పార్టీ మండలాధ్యక్షుడు పెదిశెట్టి గోవింద్, ఎంపీపీ గొర్లి సూరిబాబు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, 80, 81, 84 వార్డు ఇన్చార్జులు కె.ఎం.నాయుడు, బొడ్డేడ శివ, కోరుకొండ రాఘవ, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు లోచల సుజాత, కశింకోట మండల అధ్యక్షుడు మలసాల కిషోర్, అనకాపల్లి మండల మహిళా విభాగం అధ్యక్షురాలు కె.పద్మకుమారి, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాల్లో తాగునీటి కష్టాలు పట్టని సర్కారు
● ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో సమస్య తీవ్రతరం ● వైఎస్సార్సీపీ ఐటీ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుబ్రహ్మణ్యం విమర్శ పాడేరు రూరల్: మండలంలోని గ్రామాల్లో తాగునీటి కష్టాలు మొదలయ్యాయని వైఎస్సార్సీపీ ఐటీ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కూడా సుబ్రహ్మణ్యం తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వేసవి దృష్ట్యా కూటమి ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రతరమైందని విమర్శించారు. ఆదివాసీ గిరిజన గ్రామాల్లోని బావులు, బోర్లు అడుగంటిపోవడంతో ప్రజలు కొండ వాగులు, పంట పొలాల్లోని ఊట గెడ్డలను ఆశ్రయిస్తూ కలుషితమైన నీటిని తాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేసవి మొదలైనప్పటికీ సంబంధిత అధికారులు, పాలకులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయలేదని, దీనివల్ల ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లు కావస్తున్నా పంచాయతీలకు అవసరమైన నిధులు కేటాయించలేదని, ఎన్నికల హామీలను గాలికి వదిలేశారని ఆరోపించారు. రూ.కోట్ల వ్యయంతో నిర్మించిన జల్ జీవన్ మిషన్ పథకాలు నిరుపయోగంగా మారాయని.. ముఖ్యంగా వంట్లమామిడి, సలుగు, ఐనాడ, దేవపురం, కుజ్జెలి వంటి పంచాయతీల్లో పథకాలున్నా చుక్క నీరు అందడం లేదని మండిపడ్డారు. ప్రజా పాలనను విస్మరించి, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలి. లేనిపక్షంలో ఐటీడీఏ ముట్టడికి పిలుపునిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పాడేరు నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షుడు సరభ సూర్యనారాయణ, మాజీ సర్పంచ్ పాంగి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
చింతపల్లి: మండల కేంద్రమైన చింతపల్లిలలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం వివరాలు.. గూడెంకొత్తవీధి మండలం, దామనాపల్లి శివారు దొండుగొండ గ్రామానికి చెందిన గెమ్మిలి సత్తిబాబు (26), చింతపల్లి మండలం చౌడుపల్లి శివారు గెంజిగెడ్డకు చెందిన మామిడి హరిచంద్రప్రసాద్ ద్విచక్రవాహనంపై చింతపల్లి వైపు బయలుదేరారు. అంతర్ల వాటర్ సర్వీసింగ్ వద్ద మలుపు తిరుగుతున్న వాటర్ ట్యాంకర్ను వీరు బలంగా ఢీ కొట్టారు. దీంతో సత్తిబాబు అక్కడక్కడే మృతి చెందాడు. హరిచంద్రప్రసాద్ తీవ్రంగా గాయపడ్డాడు. అతనికి చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వ్యవసాయదారుడైన మృతుడు సత్తిబాబుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. జరిగిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
120 కేజీల గంజాయి స్వాధీనం
మాకవరపాలెం : ఏజెన్సీ ప్రాంతం నుంచి వ్యానులో తరలిస్తున్న 120 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు స్థానిక పోలీస్ స్టేషన్లో అందించిన వివరాలిలా ఉన్నాయి. వ్యానుతో నర్సీపట్నం వైపు నుంచి మాకవరపాలెం మండలం మీదుగా గంజాయి తరలిస్తున్నట్టు అందిన సమాచారంతో ఎస్ఐ దామోదర్నాయుడు ఆధ్వర్యంలో సిబ్బంది పైడిపాల జంక్షన్ వద్ద గురువారం ఉదయం వాహనాల తనికీలు చేపట్టారన్నారు. ఈ సందర్భంగా మహీంద్ర మినీ వ్యాన్లో తరలిస్తున్న 120 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్ట్ చేశామన్నారు. మరో ముగ్గురు పరారయ్యాయన్నారు. వీరితోపాటు ఒడిశా రాష్ట్రంలో గంజాయి విక్రయించిన వ్యక్తిని పట్టుకోవాల్సి ఉందన్నారు. పట్టుబడిన వారిలో గొలుగొండ మండలం పోలవరం గ్రామానికి చెందిన కొప్పి సత్తిబాబు(34), పాకలపాడుకు చెందిన కర్రి కృష్ణ(38), మాకవరపాలెం మండలం పెద్దిపాలెం గ్రామానికి చెందిన పైల సురేష్(27), నర్సీపట్నంకు చెందిన పరవాడ శ్రీనివాస్(52) ఉన్నారన్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.60 లక్షలు ఉంటుందన్నారు. ఈ కేసులో మినీ వ్యాన్, ఒక బైక్, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ, స్థానిక ఎస్ఐ దామోదర్నాయుడు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రాథమిక విద్య బలోపేతంతో సత్ఫలితాలు
కశింకోట: పరాక్ రాష్ట్రీయ సర్వేక్షన్ ఫలితాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాటిని గుర్తించి పాఠశాల స్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలను రూపొందించుకొని అమలుకు కృషి చేయాలని విశాఖపట్నం రీజనల్ జాయింట్ డైరెక్టర్ విజయ భాస్కర్ ఉపాధ్యాయులకు సూచించారు. కశింకోటలోని డీపీఎన్ జెడ్పీ హైస్కూలులో జిల్లాలోని 24 మండలాల నుంచి ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు పరాక్ రాష్ట్రీయ సర్వేక్షన్ కార్యక్రమంపై రెండు రోజులపాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం గురువారం ముగిసింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక స్థాయి నుంచి విద్యను బలోపేతం చేసినప్పుడు మాత్రమే ఉన్నత స్థాయిలో సత్ఫలితాలు సాధించడానికి దోహదంగా నిలుస్తాయన్నారు. దీనికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు బాధ్యత వహించాలని, అప్పుడే విజయాలు సాధించవచ్చునన్నారు. పరాక్ రాష్ట్రీయ సర్వేక్షన్ 2024 కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా చేపట్టారన్నారు. దీనిలో భాగంగా జిల్లాలోని వివిధ యాజమాన్యాలకు సంబంధించిన 84 పాఠశాలల్లో 3,6,9 తరగతులకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. దీని ఫలితాలను జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో వివిధ రకాల అంశాలపై వ్యత్యాసాలు, వాటి కారణాలు, అభివృద్ధి పరచుకోవడానికి తీసుకోవలసిన చర్యలను మండలాల్లో అమలు చేయాలన్నారు. దీనిలో విద్యా శాఖ అధికారులు, క్లస్టర్ హెచ్ఎంలు, ఎస్జీటీల, పాఠశాల సహాయకులు కలిపి సమూహంగా ఏర్పడి కార్యక్రమాన్ని అమలు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో కార్యక్రమం అమలుపై అవగాహనకు శిక్షణ నిర్వహించామన్నారు. డీఈవో గిడ్డి అప్పారావునాయుడు మాట్లాడుతూ సంగ్రహణాత్మక అభివృద్ధి నివేదిక నింపడం ద్వారా పిల్లల్లో ఒక ప్రేరణ కలిగించవచ్చునన్నారు. ఉన్నత లక్ష్యాలకు చేరుకోవడానికి ఈ నివేదికలు దోహదపడతాయన్నారు. యలమంచిలి ఉప విద్యా శాఖ అధికారి అప్పారావు, హెచ్ఎం ప్రసాద్ మాట్లాడారు. భీమిలి డైట్ ఉపన్యాసకులు అల్లావుద్దీన్, డీసీసీబీ కార్యదర్శి సత్యనారాయణ, రిసోర్స్ పర్సన్లు ఏవీ రాజగోపాల్, రాము శిక్షణ ఇచ్చారు. అనంతరం స్థానిక హైస్కూలులో టెన్త్ విద్యార్థులు పరీక్షలకు ఎలా సన్నద్ధమవ్వాలనే విషయమై సూచనలిచ్చారు. -
బీసీ బాలికల హాస్టల్లో సమస్యలపై డీడీ విచారణ
చీడికాడ : చీడికాడ బీసీ బాలికల వసతి గృహంలో సిబ్బంది పెడుతున్న ఇబ్బందులపై విద్యార్థినులు చేసిన ఆరోపణలపై విచారణలో భాగంగా ప్రస్తుత ఇన్చార్జి వార్డెన్ లలితకుమారితో పాటు కుక్, కమాటి, నైట్ వాచ్ఉమన్ను తాత్కాలికంగా వేరే చోటుకు పంపిస్తున్నట్టు బీసీ వెల్ఫేర్ డీడీ శ్రీదేవి తెలిపారు. ఈ మేరకు ఆమె బుధవారం రాత్రి చీడికాడ వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థినులతో మాట్లాడారు. పక్కా భవనం లేకపోవడంతో ప్రైవేట్ భవనంలోనే వసతి గృహం నిర్వహిస్తున్నారు. 100 మంది విద్యార్థి నులకు ఒకే హాల్ ఉండడంతో విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. పక్కా భవనం 10 ఏళ్ల క్రితమే నిర్మాణం సగంలో నిలిచిపోయింది. ఇదిలా ఉంటే గురువారం ఉదయం వసతి గృహంలో సమస్యలను చీడికాడ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి విద్యార్థినులను ఆరా తీశారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. -
14 ఏళ్ల బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్
● 14 ఏళ్ల బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ తప్పనిసరి బూరుగుపాలెంలో తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్న ప్రశాంతి మాకవరపాలెం: ఉచితంగా వేస్తున్న గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణ టీకాలను 14 ఏళ్లు నిండిన బాలికలంతా తప్పనిసరిగా వేయించుకోవాలని జిల్లా ప్రోగ్రాం అధికారి ప్రశాంతి కోరారు. మండలంలోని బూరుగుపాలెం పీహెచ్సీలో హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆమె గురువారం పరిశీలించారు. అనంతరం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి హెచ్పీవీ వ్యాక్సిన్ ఉపయోగాలను తల్లిదండ్రులకు వివరించారు. రక్తహీనత నివారణతోపాటు బాల్య వివాహాలు చేయడం వల్ల కలిగే అనర్థాలను తెలియజేశారు. 14 ఏళ్లు నిండిన, 15 ఏళ్లలోపు బాలికలకు తప్పనిసరిగా ఈ టీకాలను వేయించాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు చరిష్మ, సాయిచరణ్, ఎంపీహెచ్ఈవో రామచంద్రరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆన్లైన్ మోసాలకు పాల్పడ్డ ముగ్గురు అరెస్ట్
నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు చోడవరం : ఆన్లైన్లో ఉన్నతాధికారులుగా బెదిరించి జిల్లా స్థాయి అధికారి నుంచి దశల వారీగా రూ.59 లక్షలు ఆన్లైన్ మోసానికి పాల్పడిన ముగ్గురు నిందితులను చోడవరం పోలీసులు గురువారం పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే పార్వతీపురం మన్యం జిల్లా డీపీవోగా పని చేస్తున్న తమరపు కొండలరావు చోడవరం మండలం గాంధీగ్రామంలో నివాసం ఉంటున్నారు. ఇతను విధి నిర్వహణలో ఉండగా ముగ్గురు వ్యక్తులు ఈ ఏడాది జనవరి నెలలో ఫోన్కాల్స్ ద్వారా తాము వివిధ శాఖలకు చెందిన ఉన్నతాదికారులమని చెప్పి డబ్బులు కావాలని బెదిరింపులకు దిగారు. దశల వారీగా రూ.59 లక్షలు ఆన్లైన్ ద్వారాగా డీపీవో నుంచి పొంది మోసం చేసినట్టు చోడవరం సీఐ అప్పలరాజు చెప్పారు. తమ దర్యాప్తులో ఈ ఆన్లైన్ మోసాలకు పాల్పడిన సదాశివని వెంకట శివ రమాకాంత్, లెంపిముఖి మణికంఠేశ్వరరావు, ఇల్లపు హేమ సంతోష్లను గుర్తించి అరెస్ట్ చేయడం జరిగిందని ఆయన చెప్పారు. ఈ ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి చోడవరం కోర్టుకు తరలించగా నిందితులకు కోర్టు రిమాండ్ విధించిందని సీఐ చెప్పారు. ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
దోపిడీలో అయ్యన్న నంబర్ వన్
నర్సీపట్నం: దోపిడీ చేయటంలో స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు రాష్ట్రంలోనే నంబర్ వన్ అని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెతారు. గురువారం విలేకరుల సమావేశంలో ఆయన స్పీకర్ విమర్శలపై ఘాటుగా స్పందించారు. దోపిడీలు గురించి మాట్లాడే అర్హత అయ్యన్నపాత్రుడుకి లేదని, లేటరైట్ తవ్వకాల ద్వారా వందల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని విమర్శించారు. పక్క నియోజకవర్గం రోలుగుంట మండలంలోని రాయి క్వారీల ద్వారా ఏపీ టాక్స్ (అయ్యన్నపాత్రుడు)పేరుతో కోట్ల రూపాయలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఈ విధంగా దోచుకుంటూ దోపిడీ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ విషయాన్ని నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారని, దోపిడీని కప్పిపుచ్చుకునేందుకు ఎదుటి వ్యక్తులపై బురదజల్లడం పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రూ.10 లక్షల ఖర్చు నిగ్గు తేల్చండి... నూకాలమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి సీఎంఆర్ అధినేత ఇచ్చిన రూ.10 లక్షలపై సమగ్ర విచారణ జరిపించి తప్పు చేసిన వారిని జైల్లో వేయించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు మాజీ ఎమ్మెల్యే గణేష్ సవాల్ విసిరారు. నిధులు కాజేశారని పదే పదే తనపై విమర్శలు చేయడం తగదన్నారు. 2019లో సార్వత్రిక ఎన్నికలు మూడు నెలలు ఉండగా, అయ్యన్నపాత్రుడు ఇక్కడ ఆలయ పునర్నిర్మాణానికి రూ.10 లక్షలు డిపాజిట్ చేయడం వాస్తవమేనని, అప్పట్లో శంకుస్థాపన చేసి వదిలేశారన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో అప్పటి సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ఆలయ నిర్మాణానికి రూ.44.38 లక్షలు మంజూరు చేయించానని తెలిపారు. ఆ నిధులతో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆలయాన్ని నిర్మించానన్నారు. ఆరేళ్ల క్రితమే ఆలయం నిర్మాణం చేశానని స్పీకర్ పచ్చి అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. ఆరేళ్ల క్రితం ఆలయ ప్రాంగణంలో గొయ్యి ఉందన్న వాస్తవాలను ప్రజలు కూడా గ్రహించాలన్నారు. గత ప్రభుత్వంలో నిర్మించిన ఆలయాన్ని వినియోగంలోకి తీసుకురావడాన్ని అభినందిస్తున్నామన్నారు. అమ్మవారి విగ్రహం తయారీకి రూ.1.50 లక్షలు అవుతుంటే, అప్పుడే శిల్పికి రూ.లక్ష ఇచ్చానని, ఆ విగ్రహాన్ని స్పీకర్ పెట్టనివ్వలేదన్నారు. ఆలయ నిర్మాణానికి నిధులు సరిపోకపోవడంతో సీఎంఆర్ అధినేతను ఆర్థిక సాయం కోరామన్నారు. అప్పటి ఆలయ చైర్మన్ ధనిమిరెడ్డి నాగు ఈ నిధులను ఆలయ నిర్మాణానికి ఖర్చు చేశారన్నారు. ఈ నిధులు మాజీ ఎమ్మెల్యే తినేశారని అబద్ధాలు చెప్పడం తగదన్నారు. అమ్మవారి పేరుతో డబ్బులు దండుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితిలో తాను లేనని స్పష్టం చేశారు. స్పీకర్ హోదాలో రూ.10 లక్షలపై సమగ్ర విచారణ జరిపించి తప్పు చేసిన వారిని జైల్లో వేయించాలని సవాల్ విసిరారు. ఇకనైనా నిరాధార ఆరోపణలతో తనపై బురదజల్లడం మానుకోవాలని హితవు పలికారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ, టౌన్ పార్టీ అధ్యక్షుడు ఏకా శివ తదితరులు పాల్గొన్నారు. -
అప్పన్నకు విశేషంగా ఆర్జిత సేవలు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి గురువారం ఆర్జిత సేవలు విశేషంగా జరిగాయి. ఉదయం 7 నుంచి స్వర్ణపుష్పార్చన ఘనంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేదికపై వేంజేపచేశారు. 108 స్వర్ణసంపెంగ పుష్పాలతో స్వామికి అష్టోత్తర శతనామావళి పూజ జరిపారు. ఉభయదాతలకు స్వామివారి శేషవస్త్రాలు అందించారు. వైభవంగా నిత్యకల్యాణం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఉదయం 9.30 నుంచి నిత్యకల్యాణం వైభవంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేదికపై వేంజేపచేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. ఉభయదాతలకు స్వామివారి ప్రసాదం, శేషవస్త్రం, కల్యాణ అక్షింతలను అందజేశారు. -
ప్రజాసంక్షేమమే అజెండా
అరకులోయలో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేస్తున్న ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, పార్టీ నేతలుపాడేరు పాతబస్టాండ్లో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, నేతలువాడవాడలా ఘనంగా వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవంసాక్షి, పాడేరు: మహానేత డాక్టర్ వైఎస్ మరణాంతరం, ప్రజల సంక్షేమమే అజెండాగా ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్సీపీ ఆవిర్భవించిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రమైన పాడేరులో వైఎస్సార్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా పాడేరులోని తన క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మితో పాటు పార్టీలోని అన్ని విభాగాల నేతలు పాల్గొన్నారు. అనంతరం పాడేరు పాత బస్టాండ్లోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, ఇతర నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ కేక్ను కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. పాత బస్టాండ్ ఆవరణలో వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వానికి మద్దతుగా కార్యకర్తలు చేసిన నినాదాలు హోరెత్తాయి. వేడుకల అనంతరం జిల్లా ఆస్పత్రిలోని మాతాశిశు ఆరోగ్య సేవల వార్డులో గర్భిణులు, బాలింతలు, రోగులకు ఎమ్మెల్యే పాలు, రొట్టెలను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వంపై ధ్వజం ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల కోసం పుట్టిన వైఎస్సార్సీపీకి అన్ని వర్గాల సంపూర్ణ మద్దతు ఉందన్నారు. గత ఐదేళ్ల పాలనలో గిరిజన ప్రాంతాల అభివృద్ధికి జగన్మోహన్రెడ్డి ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. 2024 ఎన్నికల్లో మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రస్తుతం అన్ని వర్గాల ప్రజలను వంచిస్తోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారని మండిపడ్డారు. గిరిజనులంతా వైఎస్సార్సీపీ వెంటే ఉన్నారని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు 2029 సార్వత్రిక ఎన్నికల్లోనూ జగన్మోహన్రెడ్డి నాయకత్వానికి మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కుంతూరు కనకాలమ్మ, మండల పార్టీ అధ్యక్షుడు సీదరి రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి సీదరి మంగ్లన్నదొర, అధికార ప్రతినిధి కూడ సురేష్కుమార్, మహిళా విభాగం అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ, నియోజకవర్గ అధ్యక్షురాలు కిల్లో ఉర్వశిరాణి, ఎస్టీసెల్ అధ్యక్షుడు శరభ సూర్యనారాయణ, గ్రీవెన్స్ సెల్ జిల్లా అధ్యక్షుడు దిసారి గంగరాజు, వలంటీర్ల సంఘ ప్రతినిధులు కొమ్ము సురేష్, కొమ్మ రాంబాబు, ఎంపీటీసీలు గిడ్డి విజయలక్ష్మి, చిప్పాడ మీనా, తవుడు ఎర్రయ్యమ్మ, సర్పంచ్లు వనుగు బసవన్నదొర, గొల్లూరి నీలకంఠం, పార్టీ నేతలు లకే రామసత్యవతి,గుల్లెలి లింగమూర్తి, పాంగి నాగరాజు, మోదబాబూరావు, రంగరాజు, వంతాల నరేష్, బెదర బంగార్రాజు, పలాసి రామారావు, మినుముల వెంకటరావు, లక్ష్మోజి, నర్సింగరావు, రాజారావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ ఆశయసాధన కోసమే ఆవిర్భావం : అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అరకులోయ టౌన్: దివంగత సీఎం వైఎస్ ఆశయసాధనకోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం నియోజకవర్గ కేంద్రమైన అరకులోయ వైఎస్ కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడే పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు పంచిపెట్టారు. అరకులోయ ఏరియా ఆస్పత్రిలో పార్టీ శ్రేణులతో కలిసి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడారు. పేద ప్రజల సంక్షేమం కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వేసిన బాటలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నడుస్తున్నారని, సంక్షేమ పథకాలను గడప గడపకూ అందించిన ఘనత ఆయనకే దక్కుతుందని కొనియాడారు.ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి తక్కువ, ప్రచార ఆర్భాటం ఎక్కువని విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులన్నింటినీ వైఎస్సార్ సీపీపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.గత ఐదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి, మాట తప్పని.. మడమ తిప్పని నేతగా నిలిచారని స్పష్టం చేశారు. జగన్ నాయకత్వంలో పనిచేయడం గర్వంగా ఉందని, భవిష్యత్తులో మనమంతా కష్టపడి పనిచేసి 2029లో మళ్లీ వైఎస్సార్సీపీ జెండా ఎగురవేసి, ఆయనను ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు రేగం చాణక్య, జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తడబారికి సురేష్ కుమార్, ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ అధ్యక్షుడు కమిడి లశోక్ కుమార్, రాష్ట్ర ఎస్టీ సెల్ సంయుక్త కార్యదర్శి జన్ని నర్సింహమూర్తి, పార్టీ మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులు స్వాభి రామూర్తి, పల్టాసింగి విజయ్ కుమార్, గుడివాడ ప్రకాష్, వైస్ ఎంపీపీ కిల్లో రామన్న, ఎంపీటీసీ దురియా ఆనంద్ కుమార్, డుంబ్రిగుడ వైస్ ఎంపీపీ కూడ పాపారావు, వార్డు సభ్యుడు మాధురి శివ తదితరులు పాల్గొన్నారు. అరకులో వైఎస్ విగ్రహం వద్ద కేక్ కట్ చేస్తున్న ఎమ్మెల్యే మత్స్యలింగం, పార్టీ నాయకులు పాడేరు జిల్లా ఆస్పత్రిలోని రోగులకు పాలు, రొట్టెలను పంపిణీ చేస్తున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు,ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, పార్టీ నేతలుఅరకు ఏరియా ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే మత్స్యలింగం, పార్టీ నేతలు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ పాలనలోనే గిరిజనాభివృద్ధి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు జిల్లావ్యాప్తంగా వేడుకలు, సేవా కార్యక్రమాలు గిరిజన గడ్డపై మిన్నంటిన నినాదాలు -
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా..
ముంచంగిపుట్టు: ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా వైఎస్సార్సీపీ పార్టీ ఉందని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు.మండల కేంద్రంలో గురువారం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.నాలుగు రోడ్ల కూడలిలో వైఎస్ విగ్రహనికి ఆమెతోపాటు పాడేరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జై జగన్ అంటూ పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు. కేక్ కట్ చేసి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జెడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో సంక్షేమం, అభివృద్ధి పధంలో గిరిజన గ్రామాలు దూసుకుపోయాయన్నారు.కూటమి ప్రభుత్వంలో సంక్షేమం గాడితప్పడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో కొంతమంది కూటమి నేతలే మహిళలను లైంగికంగా వేధించడం, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో మళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు పద్మారావు, ఎంపీపీ అరిసెల సీతమ్మ, వైస్ఎంపీపీ భాగ్యవతి, వైఎస్సార్సీపీ జిల్లా జేసీఎస్ కోఆర్డినేటర్ జగబంధు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొండలరావు, సర్పంచ్లు నీలకంఠం, గంగాధర్, ఎంపీటీసీలు సుబ్బలక్ష్మి, కమల, గణపతి, మండల వైఎస్సార్సీపీ నేతలు జయదేవ్, రాంప్రసాద్, మూర్తి, సన్యాసిరావు, అర్జున్, గాసిరావు, మత్స్యలింగం, అప్పారావు, దాసు, దేవ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర -
ముగిసిన ఆదివాసీ సత్యాగ్రహ యాత్ర
పెదబయలు: గిరిజనులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ జేఏసీ చేపట్టిన ఆదివాసీ సత్యాగ్రహ యాత్ర’ గురువారం పెదబయలులో ముగిసింది. 125 రోజుల పాటు సాగిన ఈ యాత్ర ముగింపు సందర్భంగా సీతగుంట నుంచి పెదబయలు వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ కూడలి వద్ద జరిగిన ముగింపు సభలో జేఏసీ జిల్లా చైర్మన్ రామారావుదొర మాట్లాడారు. గత ఏడాది ఆగస్టు 9న పాడేరులో సీఎం ఇచ్చిన హామీ ప్రకారం ప్రత్యేక చట్టం తీసుకురావాలని, నూరుశాతం ఉద్యోగాలు గిరిజనులకే కేటాయించాలని కోరారు. గత డీఎస్సీలో మైదాన ప్రాంత అభ్యర్థులను నియమించడం వల్ల గిరిజన నిరుద్యోగులు 95 శాతం ఉద్యోగాలు కోల్పోయారని మండిపడ్డారు.షెడ్యూల్డ్ ప్రాంతాల్లో స్టేట్ క్యాడర్లో 30 శాతం, జోనల్ క్యాడర్లో 50 శాతం, లోకల్ క్యాడర్లో నూరుశాతం పోస్టులను గిరిజనులతోనే భర్తీ చేసేలా చట్టం రూపొందించాలని డిమాండ్ చేశారు.గిరిజన హక్కులు, చట్టాల పరిరక్షణ కోసం గ్రామగ్రామాన ప్రజలను చైతన్యం చేస్తున్నామని, ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెదబయలు మండల గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షక్ష కార్యదర్శులు తలారి చక్రదర్, లకే అనిల్, ఉపాధ్యాయ సంఘాల నేతలు పలాసి తిరుపతిరావు, రెడ్డి కమలకుమారి, సూర్యకళ, చెండా బాలకృష్ణ, రామచంద్రశేఖర్, రూడ చిన్నయ్య, మాలంనాయుడు, హనుమంతు. ప్రసాదరావు, అప్పన్న, మత్స్యలింగం, భగవాన్, అప్పలస్వామి, రాధాకృష్ణ,జేఎస్సీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు బూడిదే మాధవరావు,మానుగూరు బాబుజీ, పార్థసారధి, స్వామి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు నిరుద్యోగులు పాల్గొన్నారు. -
కూటమి ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు
ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి సాక్షి,పాడేరు: ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గుణపాఠం చెప్పి వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డిని మళ్లీ సీఎంను చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆపార్టీ ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నో పోరాటాల నడుమ వైఎస్సార్సీపీ ఆవిర్భవించిందన్నారు. మళ్లీ ఏపీకి పూర్వ వైభవం వచ్చే దిశగా జగన్మోహన్రెడ్డిని సీఎం చేసేందుకు అన్నివర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆమె పేర్కొన్నారు. -
మత్స్యగెడ్డపై వంతెననిర్మించాలని నిరసన
ముంచంగిపుట్టు: మండలంలోని సుజనకోట పంచాయతీ కుమ్మరిపుట్టు సమీపంలో గల మత్స్యగెడ్డపై తక్షణమే వంతెన నిర్మించాలని గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె. త్రినాథ్ డిమాండ్ చేశారు. గురువారం మత్స్యగెడ్డ ఒడ్డున గిరిజన సంఘం, వివిధ రాజకీయ పార్టీల నేతలు, స్థానిక గిరిజనులు కలిసి నిరసన చేపట్టారు. వంతెన నిర్మించాలని కోరుతూ ప్రభుత్వంపై నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా త్రినాథ్ మాట్లాడుతూ కుమ్మరిపుట్టు మత్స్యగెడ్డపై ప్రతిరోజూ సుమారు 12 గ్రామాల గిరిజనులు నాటు పడవలపైనే ప్రయాణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. గతంలో జరిగిన నాటు పడవల ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు.వంతెనతో పాటుగా గిరిజన మత్స్యకారులకు ప్రభుత్వం తక్షణమే బోట్లు, వలలు పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుజనకోట సర్పంచ్ రమేష్, గిరిజన సంఘం మండల నేతలు, వివిధ పార్టీల నాయకులు శ్రీను, నరసింగరావు పడాల్, గాసిరాం దొర, నారాయణ, గురుమూర్తి పాల్గొన్నారు. -
42 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితి చూడలేదు
పార్వతీపురం మన్యం జిల్లా: పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు టీడీపీ ఎమ్మెల్యే, గిరజన శాఖామంత్రి గుమ్మిడి సంధ్యారాణి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్దేవ్ల మధ్య విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. మంత్రి సంధ్యారాణి పీఎస్ సతీష్ ఓ మహిళా ఉద్యోగినిపై ఆర్థిక, లైంగిక వేధింపుల కేసు విషయంలో పట్టణ, రూరల్ సీఐలు అప్పలనాయుడు, రామకృష్ణ బుధవారం భంజ్దేవ్ ఇంటికి వెళ్లి విచారణ జరిపారు. బాధితురాలి ఫోన్ నుంచి భంజ్దేవ్కు పలుమార్లు ఫోన్లు రావడం, భంజ్దేవ్ ఫోన్ నుంచి ఆమెకు ఫోన్ వెళ్లడంపై ప్రశ్నించారు. తనకు అన్యాయం జరిగిందని పలుమార్లు ఆమె ఫోన్లో తెలిపిందని, పార్టీకి చెడ్డపేరు వస్తుందన్న భావనతో మంత్రి సంధ్యారాణితో మాట్లాడి పరిష్కరించుకోవాలని సూచించినట్టు భంజ్దేవ్ తెలిపారు. వివాదం పెద్దదికావడంతో సీఎంవో కార్యాలయం నుంచి ఫోన్లు వచ్చాయని, టీడీపీ అరకు పార్లమెంట్ ఆఫీస్ ఇన్చార్జి నాగేశ్వరరావు సైతం ఫోన్ చేసి, ఆమెతో (ఫిర్యాదుదారురాలితో) ఫోన్లో మాట్లాడించాలని చెప్పడంతో ఆమెకు ఫోన్ చేసి ఇంటికి పిలిపించానని, నాగేశ్వరరావు వాట్సాప్కాల్లో తనఫోన్ నుంచి బాధితురాలితో మాట్లాడినట్టు వివరించారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఘటన తీరును వివరించానన్నారు. విచారణ జరిపించడం బాధాకరం పోలీసుల విచారణ తర్వాత భంజ్దేవ్ మీడియాతో మాట్లాడారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశానని, అధికార పార్టీలో ఉన్న మాజీ ప్రజాప్రతినిధినైన తనకు చాలా మంది బాధితులు ఫోన్ చేస్తారని పేర్కొన్నారు. 42 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న తనను ఇలాంటి విషయాలపై ఏ రోజు పోలీసులు విచారణ జరపడం తెలియదని, బాధాకరమంటూ వాపోయారు. మంత్రి పీఎస్ కేసులో తన కాల్డేటాను అనుమానించి పోలీసులతో విచారణ జరిపించడం బాధకలిగిస్తోందన్నారు. ఎవరి ప్రోద్బలంతో పోలీసులు విచారణకు వచ్చారో అందరికీ అర్థమవుతుందని, జరిగిన విషయాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని భంజ్దేవ్ స్పష్టం చేశారు. -
పాఠశాలల సమస్య పరిష్కారం
కొయ్యూరు: మండలంలోని బాలారం, గింజర్తి గ్రామాల్లోని పాఠశాలల్లో నెలకొన్న ప్రతిష్టంభనకు జిల్లా విద్యాశాఖాధికారి రామకృష్ణారావు బుధవారం తెరదించారు. స్థానిక తల్లిదండ్రుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ఆయన, వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులు తమ సొంత గ్రామాల పాఠశాలల్లోనే చదువుకునేలా చర్యలు చేపట్టారు. గింజర్తి పాఠశాల వివాదం.. గతంలో చింతలపూడి పాఠశాలను ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్ది, గింజర్తి విద్యార్థులను అక్కడికి పంపాలని అధికారులు ఆదేశించారు. అయితే, విద్యార్థులు ఎక్కువగా ఉన్న తమ పాఠశాలను వదిలి, తక్కువ మంది ఉన్న చోటికి పంపలేమని గింజర్తి గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కలెక్టర్కు విన్నవించారు. దీనిపై స్పందించిన డీఈవో బుధవారం గింజర్తి పాఠశాలను సందర్శించి తల్లిదండ్రులతో చర్చించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 3–5 తరగతుల విద్యార్థులు గింజర్తి పాఠశాలలోనే కొనసాగుతారని ఆయన స్పష్టం చేశారు. బాలారం పాఠశాలలో యథావిధిగా తరగతులు.. బాలారం ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం రెండో తరగతి చదువుతున్న వారు ఇద్దరే ఉండటంతో, 3–5 తరగతుల విద్యార్థులను జిల్లా పరిషత్ పాఠశాలకు పంపాలని గతంలో నిర్ణయించారు. దీనిపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో డీఈవో అక్కడ క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. వచ్చే ఏడాది నుంచి ప్రాథమిక పాఠశాల విద్యార్థులను ఎక్కడికీ పంపకుండా, యథావిధిగా బాలారంలోనే తరగతులు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. అంగన్వాడీలకూ ఆదేశాలు.. అనంతరం డీఈవో అంగన్వాడీ కార్యకర్తలతో మాట్లాడారు. పూర్వ ప్రాథమిక విద్య పూర్తి చేసుకున్న పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లోని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపవద్దని, ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యను అందించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. పదిలో మంచి ఫలితాలు సాధించాలి బాలారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను డీఈవో సందర్శించారు.పది విద్యార్థులకు సలహాలు చేశారు. త్వరలో ప్రారంభమయ్యే పరీక్షలలో మంచి ఫలితాలు సాధించాలని కోరారు.ఈ సందర్భంగా సబ్జక్ట్ల వారీగా సమీక్ష చేశారు. ఆయనను ఎంఈవో సింహాచలం సత్కరించారు. -
● తాడు సాయంతో పడవను లాక్కుంటూ.. వాగు దాటుతున్న గిరిజనులు● నాటు పడవల ప్రమాదాల్లో 91 మంది మృతి ● ప్రమాదం జరిగినప్పుడు పరామర్శలకే పరిమితం● ఎన్నికల వేళ నీటిమూటలుగా హామీలు ● పట్టించుకోని ప్రభుత్వం, అధికార యంత్రాంగం
ఆ ఊర్లన్నీ మత్స్యగెడ్డ చుట్టూనే.. కానీ ఆ గెడ్డే వారి పాలిట మృత్యుపాశం! ప్రాణం అరచేతిలో పెట్టుకుని నాటు పడవ ఎక్కితే కానీ.. పైసా రాదు, మెతుకు దొరకదు. చదువుకోవాలన్నా, రోగం వచ్చినా ఆ ప్రమాదకర ప్రయాణం తప్పదు. ఒకవైపు 91 మంది బలి తీసుకున్న మృత్యు గెడ్డ.. మరోవైపు అధికారుల, నేతల హామీల నీటి మూటలు.. ఇది ముంచంగిపుట్టు మండలంలోని 86 గ్రామాల గిరిజనుల నిత్య ఘోష. ప్రమాదం జరిగి ప్రాణాలు పోయినప్పుడు మాత్రమే ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు (కలెక్టర్లు, ఐటీడీఏ పీవో లు) ఘటనా స్థలానికి వస్తుంటారు. బాధిత కుటుంబాలకు భరోసా ఇస్తూ, వంతెనలు కట్టిస్తామంటూ గుప్పించే హామీలు.. వారు వెనుదిరగగానే గాలిలో కలిసిపోతున్నాయి. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చే నేతలు ఇచ్చే హామీలు, నీటిపై రాతలుగానే మిగిలిపోతున్నాయి తప్ప క్షేత్రస్థాయిలో మార్పు రావడం లేదు అని స్థానిక గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముంచంగిపుట్టు: మండలంలోని సుమారు 86 గ్రామాలకు చెందిన గిరిజనులకు మత్స్యగెడ్డ దాటనిదే రోజు గడవదు. నిత్యావసర సరకులు తెచ్చుకోవాలన్నా, వ్యాపార లావాదేవీలు జరపాలన్నా, చివరకు పిల్లలు చదువుకోవాలన్నా.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నాటు పడవలపై ప్రయాణించాల్సిందే. ఏళ్ల తరబడి సాగుతున్న ఈ జలకష్టాలు గిరిజన వాడల్లో కన్నీళ్లు మిగులుస్తున్నాయి. అడుగడుగునా ప్రమాదాలే.. పనసపుట్టు, సుజనకోట, పెదగూడ, దారెల, వనుగుమ్మ, జోలాపుట్టు, మాకవరం, రంగబయలు వంటి పంచాయితీల్లో మత్స్యగెడ్డ విస్తరించి ఉంది. చేపల వేట కోసం, పనుల నిమిత్తం రోజూ వందలాది మంది నాటు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో పడవలు మునిగి ఇప్పటివరకు ప్రభుత్వ లెక్కల ప్రకారమే 91 మంది గిరిజనులు మృత్యువాత పడ్డారు. ● సుజనకోట పంచాయతీ కుమ్మరిపుట్టు గ్రామం వద్ద పరిస్థితి మరీ ఘోరం. ఇక్కడ గిరిజనులు ఒక తాడు సాయంతో పడవను లాక్కుంటూ ప్రమాదకరంగా వాగు దాటుతున్నారు. స్వయంకృషితోనే జీవనం ప్రభుత్వ సాయం అందకపోయినా, గిరిజన మత్స్యకారులు సుమారు 30 నుంచి 40 వేలు సొంతంగా ఖర్చు పెట్టుకుని నాటు పడవలను తయారు చేసుకుంటున్నారు. వీటిపైనే చేపల వేట సాగిస్తూ, సంతల్లో అమ్ముకుని జీవనం గడుపుతున్నారు. కుమ్మరిపుట్టు వద్ద తక్షణమే పక్కా వంతెన నిర్మించి రవాణా సౌకర్యం కల్పించాలని వారు కోరుతున్నారు. రాయితీపై ఇంజిన్ బోట్లు, నాణ్యమైన వలలు పంపిణీ చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న వంతెన ప్రతిపాదనలను పక్కన పెట్టకుండా, గిరిజన ప్రాణాలకు రక్షణ కల్పించాలని పరిసర గ్రామాల గిరిజనులు కోరుతున్నారు. వంతెన నిర్మించాలి మత్స్యగెడ్డ ప్రమాదాల్లో మృతి చెందిన గిరిజనులను ప్రభుత్వం ఆదుకోవాలి. గిరిజన మత్స్యకారులకు బోట్లు, వలలు ఉచితంగా అందించాలి. కుమ్మరిపుట్టు వద్ద మత్స్యగెడ్డపై సైతం వంతెన నిర్మించాలి. – వెంగడ రమేష్, సర్పంచ్, సుజనకోట, ముంచంగిపుట్టు మండలం హామీలకే పరిమితం పడవ ప్రమాదాలు, గెడ్డలో మునిగి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. కలెక్టర్లు, ఐటీడీఏ పీవోలు, మంత్రులు వచ్చి కుమ్మరిపుట్టు మత్య్సగెడ్డపై వంతెన నిర్మాణానికి హామీ ఇస్తున్నా కార్యరూపం దాల్చలేదు. –గోవింద్, కుమ్మరిపుట్టు, ముంచంగిపుట్టు మండలం ప్రతిపాదనలు పంపాం బోట్లు, వలలు రాయితీపై అందించాలని ఆరు పంచాయతీల్లో మత్స్యగెడ్డ ప్రాంతాల గిరిజనులు ఇప్పటికే విన్నవించారు. వీటితోపాటు కుమ్మరిపుట్టు వద్ద మత్స్యగెడ్డపై వంతెన నిర్మించాలని వారు కోరారు. ఈ మేరకు ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరైన వెంటనే పనులు చేపట్టేలా తగు చర్యలు తీసుకుంటాం. – భాస్కర అప్పారావు, తహసీల్దార్, ముంచంగిపుట్టు -
మాచ్ఖండ్లో జాతీయ డ్యాం సేఫ్టీ బృందం
ముంచంగిపుట్టు: ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి చెందిన జోలాపుట్టు, డుడుమ జలాశయాలను జాతీయ డ్యాం సేఫ్టీ బృందం సందర్శించింది. ఈ జలాశయాలు అతి పురాతనమైనవి కావడంతో, వాటి ఆయువుపట్టు, ప్రస్తుత స్థితిగతులను పరిశీలించేందుకు ఢిల్లీకి చెందిన ముగ్గురు సభ్యుల బృందం సోమ, మంగళవారాల్లో రెండు రోజుల పాటు క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టింది. జలాశయాల గేట్లు, టర్బైన్లు, మరియు నీటి విడుదల ప్రక్రియను బృందం సభ్యులు నిశితంగా పరిశీలించారు. కాంప్రహెన్సివ్ డ్యాం సేఫ్టీ ఇవాల్యుయేషన్ చైర్మన్ కమలేష్ జైన్ మాట్లాడుతూ.. అత్యంత పురాతనమైన మాచ్ఖండ్ ప్రాజెక్టు నిర్వహణలో ఇంజనీర్ల కృషి బాగుందని కొనియాడారు.ఈ జలవిద్యుత్ కేంద్రాన్ని హెరిటేజ్ ప్రాజెక్టుగా పరిగణించాలని ఆయన అభిప్రాయపడ్డారు.జలాశయాల వద్ద విద్యుత్ దీపాలంకరణ మెరుగుపరచాలని, తద్వారా పర్యాటక శోభ పెరుగుతుందని సూచించారు. కొన్ని గేట్ల పనితీరుపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు వాటిని ప్రయోగాత్మకంగా ఆపరేట్ చేసి చూశారు. జలాశయాల్లో ప్రతి ఏడాది ఉండే నీటి నిల్వలు, చేపట్టాల్సిన మరమ్మతు పనులపై స్థానిక అధికారులతో చర్చించారు. ముఖ్యంగా జోలాపుట్టు జలాశయం వద్ద చేపట్టవలసిన పనులపై త్వరలోనే ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక పంపుతామని బృందం వెల్లడించింది. ఈ తనిఖీల్లో ఏపీజెన్కో ఎస్.ఈ శ్రీనివాసరెడ్డి, సివిల్ ఎస్ఈ (సీలేరు) షేక్ హుస్సేన్, ఈఈ కురుషు ప్రధాన్, ఏడీఈ వెంకటమధు, ఏఈలు పాల్గొన్నారు. జోలాపుట్టు, డుడుమ జలాశయాల పరిశీలన -
పెన్షనర్ల జేఏసీ జిల్లా కార్యదర్శిగా గిరి
చింతపల్లి: ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి (ఏపీ జేఏసీ) జిల్లా కార్యదర్శిగా యూవీ గిరి బుధవారం ఎంపికయ్యారు. 2002లో విద్యా వలంటర్ల నాయకునిగా ఆయన పనిచేశారు. తరువాత పీఆర్టీయూ మండల అధ్యక్షునిగా, జిల్లా అధ్యక్షునిగా,రాష్ట్ర కార్యదర్శిగా సేవలందించారు. ఈ సందర్బంగా గిరి మాట్లాడుతూ 12వ ఆర్థిక సంఘం ఏర్పాటు చేసి కొత్త వేతనాలు అమలు చేయాలని, పెన్షనర్లకు రావలసిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని, పాత పెన్షన్ విధానం కొనసాగించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే పర్మినెంట్ చేయాలని, ఉపాధ్యాయులకు బోధనేతర పనులు తగ్గించాలని, గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగాలను పూర్తిగా గిరిజనులకు కేటాయించాలని ఆయన కోరారు. -
వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవానికి తరలిరండి
ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు పాడేరు: జిల్లా కేంద్రమైన పాడేరు పట్టణంలోని పాత బస్టాండ్లోని వైఎస్ విగ్రహం వద్ద గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు తెలిపారు. ఉదయం 9గంటలకు దివంగత నేత వైఎస్ కాంస్య విగ్రహానికి పూలమామలు వేసి ఘన నివాళులు అర్పిస్తామన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించి ఆవిర్భా దినోత్సవ కేక్ను కట్ చేస్తామన్నారు. అనంతరం పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ మండల అధ్యక్షుడు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అన్ని విభాగాలకు చెందిన పార్టీ శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు. -
కార్యకర్త ప్రాణం కాపాడిన ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు
చింతపల్లి: పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. అనారోగ్యానికి గురైన పార్టీ కార్యకర్తను స్వయంగా తన వాహనంలో ఆసుపత్రికి తరలించి సకాలంలో చికిత్స అందేలా చూసి ప్రాణాపాయం తప్పించారు. బుధవారం ఎమ్మెల్యే అరగడపల్లి సందర్శనకు వెళ్లారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ కార్యకర్త ఎస్. రామ్మూర్తి కూడా ఉన్నారు. పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యాక, రామ్మూర్తికి అకస్మాత్తుగా తీవ్రమైన గుండెనొప్పి వచ్చింది. విషయాన్ని గమనించిన ఎమ్మెల్యే ఏమాత్రం ఆలస్యం చేయకుండా, బాధితుడిని తన సొంత వాహనంలోనే హుటాహుటిన చింతపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. రామ్మూర్తికి అత్యవసర చికిత్స అందించిన వైద్యులు, ఎలాంటి ప్రాణాపాయం లేదని వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాధితుడిని పరామర్శించారు.కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే ఆసుపత్రిలోని ఇతర వార్డులను సందర్శించి, చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శి లక్ష్మణ్, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి కృష్ణారావు, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కె. రామకృష్ణ, పార్టీ అధ్యక్షులు గిరి ప్రసా ద్, కార్యదర్శి వంతల చంటిబాబు పాల్గొన్నారు. -
నూకాంబిక ఆలయ హుండీ లెక్కింపు
అమ్మవారి హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్న ఆలయ ఉద్యోగులు అనకాపల్లి: స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి మార్చి 11వ తేదీ వరకూ అమ్మవారి హుండీ ఆదాయం రూ. 27లక్షల 11వేల 713 నగదు, 11 గ్రాముల బంగారం, 550 గ్రాములు వెండి వచ్చినట్టు దేవదాయశాఖ ఈవో యళ్ల శ్రీధర్, ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీనులు చెప్పారు. దేవదాయశాఖ జిల్లా సహాయ కమిషనర్ కె.ఎల్.సుధారాణి, దేవదాశాఖ ఇన్స్పెక్టర్ వసంత కుమార్ ఆధ్వర్యంలో అమ్మవారి నగదును యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవరపాలెం బ్రాంచ్ దేవదాయశాఖ బ్యాంక్ ఖాతాలో పట్టణ పోలీసుల సహకారంతో జమచేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు సూరే సతీష్, దాడి రవికుమార్, పొలిమేర స్వాతి ఆనంద్, మారిశెట్టి శంకరరావు, కాండ్రేగుల రాజారావు ,మజ్జి జానకి శ్రీనివాసరావు, కొడుకుల శ్రీకాంత్,వడ్డాది మంగ, కోనేటి సూర్యలక్ష్మి పైడ్రాజు, యరవ్రరపు సంతోషి కుమారి నాగేష్ పాల్గొన్నారు. -
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం
ఐటీడీఏ ఇన్చార్జి పీవో వెంకటేశ్వరరావు పాడేరు: బాల్య వివాహాల కారణంగా సామాజిక రుగ్మతలను పెంచడమే కాకుండా చట్టరీత్యా తీవ్ర నేరమని ఐటీడీఏ ఇన్చార్జి పీవో వెంకటేశ్వరరావు అన్నారు. మండలంలోని ఓనూరు, నందిగరువు గ్రామాల్లో బుదవారం బాల్య వివాహాల నిరోధక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 ఏళ్లు నిండకుండా చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం వల్ల ఆడపిల్లలకు శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతారన్నారు. ప్రధానంగా మాతా, శిశు మరణాలకు బాల్య వివాహాలే ప్రధాన కారణామన్నారు. ఆడ పిల్లలకు 18 ఏళ్లు, మగ పిల్లలకు 21 ఏళ్లు నిండిన తరువాతే వివాహం చేసుకోవాలని సూచించారు. బాల్య వివాహాలు చేసినా, ప్రోత్సహించినా చట్ట పరమైన శిక్షలు తప్పవన్నారు. ఆడ పిల్లలను ఉన్నత చదువులకు ప్రోత్సహించాలన్నారు. అనంతరం ఓనూరు, నందిగరువు గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, రేషన్ డిపోలను తనిఖీ చేశారు. గ్రామస్తులతో మాట్లాడి జన్మన్ పథకంలో చేపడుతున్న గృహ నిర్మాణాలు వేగవంతం చేసుకోవాలని సూచించారు. సిట్ ఆర్గనైజేషన్ ద్వారా బాల్య వివాహాల అవగాహన ప్రచార రథాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజారత్నం, ఈదులపాలెం పీహెచ్సీ వైద్యాధికారి మనీష్, డిప్యూటీ ఎంపీడీవో రమేష్, ఎంఈవో విశ్వనాథం. ఈపీఐయూ రవికుమార్, సీడీపీవో శారదాదేవి, ఐసీడీఎస్ సూపర్ వైజర్ కొండమ్మ, సీహెచ్వో చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. -
ప్రధాని మౌనం దేశానికే ప్రమాదం
పాడేరు రూరల్: కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న మౌనం దేశ ఆర్థిక వ్యవస్థకే ప్రమాదకరమని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వి. ఉమామహేశ్వరరావు విమర్శించారు. బుధవారం పాడేరు పట్టణ ప్రధాన రహదారిపై సీఐటీయూ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. ఇరాన్పై అమెరికా జరుపుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. అమెరికా తన స్వార్థం కోసం సామ్రాజ్యవాద యుద్ధాన్ని ప్రోత్సహిస్తోందని, దీనివల్ల ప్రపంచ శాంతికి విఘాతం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏకపక్ష నిర్ణయాల వల్ల ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని, దీని ప్రభావం వల్ల ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయి దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందని పేర్కొన్నారు. అంతర్జాతీయ పరిణామాల వల్ల దేశవ్యాప్తంగా గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు అమాంతం పెరిగి సామాన్యుడిపై భారంగా మారాయని ఆయన విమర్శించారు. ప్రపంచ దేశాలతో చర్చలు జరిపి శాంతిని నెలకొల్పడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. ఇప్పటికై నా కేంద్రం తన మౌనాన్ని వీడి అంతర్జాతీయ వేదికలపై శాంతి కోసం గళం ఎత్తాలని, లేనిపక్షంలో కేంద్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున తిరుగుబాటు ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు కార్తీక్, జీవన్, వరహాలు, సీఐటీయూ నాయకులు సూరిబాబు, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు -
ఖాళీ గ్యాస్ సిలిండర్లతో గిరి మహిళల నిరసన
మాడుగుల/రూరల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచి మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని సీపీఎం మండల కార్యదర్శి ఇరటా నర్సింహమూర్తి విమర్శించారు. వంట గ్యాస్ ధర పెంపును నిరసిస్తూ మండలంలోని శంకరం పంచాయతీ శివారు బొడ్డరేవు గ్రామంలో గిరి మహిళలతో కలిసి ఖాళీ గ్యాస్ సిలిండర్లు పట్టుకుని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంట గ్యాస్ సిలిండరుపై రూ. 60, వాణిజ్య సిలిండర్పై రూ.115 పెంచడం అన్యాయమన్నారు. వంట గ్యాస్ ధర పెంచి ప్రజలపై తీవ్రభారం మోపిందన్నారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ కలిపి చేస్తున్న యుద్ధం వల్ల ప్రజలపై భారం వేసిందన్నారు. తక్షణమే వంట గ్యాస్ ధర తగ్గించాలని చంద్రబాబు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు కె. భవానీ మాట్లాడుతూ చిన్న కుటుంబాలతో పోషణ గడవక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ముగ్గురు సంతానం కనాలని సీఎం చంద్రబాబు ప్రచారం చెయ్యడం తగదన్నారు. సీపీఎం దేవరాపలి మండల కార్యదర్శి బి.టి.దొర, నాయకులు కొర్రా దేవదాసు, బుసరి మల్లుదొర, కొర్రా నాగార్జున, మువ్వల బాలకృష్ణ, బచ్చల ఈశ్వరరావు, దిప్పల ఈశ్వరరావు, గిరిజన మహిళలు పాల్గొన్నారు. -
22న రాష్ట్ర స్థాయి చెస్ టోర్నమెంట్
టోర్నమెంట్ గోడపత్రికలను ఆవిష్కరిస్తున్న జీవన్రాయ తదితరులు మాకవరపాలెం: మండలంలోని తామరం ఇమ్మానుయేలు ఎడ్యుకేషన్ క్యాంపస్లో ఈ నెల 22న రాష్ట్ర స్థాయి ఓపెన్ చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్టు ప్రగతి చెస్ అకాడమీ నిర్వాహకుడు సుధీర్కుమార్ తెలిపారు. ఈ టోర్నమెంట్ గోడపత్రికలను మంగళవారం ఇమ్మానుయేలు సంస్థ డైరెక్టర్ బిషప్ కె.జీవన్రాయ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టోర్నమెంట్లో పాల్గొనేవారు ఈ నెల 20లోగా తమ పేర్లు నమోదు చేయించుకోవాలన్నారు. వయసుతో సంబంధం లేకుండా పాల్గొనవచ్చని, విజేతలుగా నిలిచిన 30 మందికి నగదు బహుమతులు అందజేస్తామన్నారు. వివరాలకు 9949048153, 9676514520 నంబర్లను సంప్రదించాలన్నారు. -
చైల్డ్ ఫ్రెండ్లీ విలేజ్గా డీఎల్పురం
నక్కపల్లి : గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పురస్కారానికి మండలంలో డీఎల్పురం ఎంపికై ంది. చైల్డ్ ఫ్రెండ్లీ విలేజ్గా ఈ గ్రామాన్ని ఎంపిక చేసినట్టు ఎంపీడీవో చైతన్య తెలిపారు. మంగళవారం కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్శాఖకు చెందిన అధికారుల బృందం గ్రామంలో పర్యటించింది. పంచాయతీ కార్యాలయం, అంగన్వాడీ కేంద్రం, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల సచివాలయంలో అందుతున్న సేవల గురించి ఆరా తీసింది. గ్రామస్తులతో గ్రామసభ ఏర్పాటు చేసింది. పురస్కారానికి ఎంపికయ్యేందుకు అవసరమైన ప్రమాణాలకు అనుగుణంగా ఇక్కడ ప్రభుత్వ సేవలు అందుతున్నాయా లేదా అనేది పరిశీలించింది. ప్రధానంగా గ్రామంలో పిల్లల అభివృద్ధి, విద్య, ఆరోగ్యం, సంక్షేమానికి తీసుకుంటున్న సేవలు, చర్యల గురించి తెలుసుకున్నారు. చైల్డ్ ఫ్రెండ్లీ విలేజ్ పురస్కారం కోసం ఈ గ్రామాన్ని ఎంపిక చేయడం జరిగిందని, దీనికనుగుణంగానే ఈ గ్రామంలో కార్యకలాపాలు జరుగుతున్నాయని బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ బృందంలో మలైపాల్, సిపిఆర్ ఓఎస్డీ శ్రీనాద్రెడ్డి, ఏపీఎన్ఐఆర్డీ నుంచి నాగరాజు, డీపీవో సందీప్, డీఎల్పీవో నారాయణ మూర్తి, డీడీవో నాగలక్ష్మి, ఎంపీడీవో చైతన్య, ఏవో సీతారామరాజు, డిప్యూటీ ఎంపీడీవో చలపతిరావు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
కురసాల ఆశీస్సులు తీసుకున్న బొడ్డేడ
మాజీ మంత్రి కన్నబాబును సత్కరిస్తున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ అనకాపల్లి/మునగపాక: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ విశాఖ, విజయనగరం జిల్లాల రీజనల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబును మంగళవారం కాకినాడలో పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ మర్యాద పూర్వకంగా కలిశారు. అనకాపల్లి జిల్లా అధ్యక్షునిగా నియమితులైన ప్రసాద్ ఈ సందర్భంగా మాజీ మంత్రి కన్నబాబు ఆశీస్సులను తీసుకొని సత్కరించారు. తనకు అవకాశం కల్పించడంలో కృషి చేసిన కన్నబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాలు మేరకు జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంలో విఫలమైందన్నారు. 22 మాసాలైనా వృద్ధులకు కొత్త పింఛన్లు, మహిళలకు నెలకు రూ.1500 ఇవ్వలేదని విమర్శించారు. వీటితో ఇతర సంక్షేమ పథకాల అమలులో విఫలమైందన్నారు. ఈ విషయాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ సీఈసీ సభ్యుడు బోదెపు గోవింద్, అనకాపల్లి 80, 81 వార్డు అధ్యక్షులు కె.ఎం. నాయుడు, బొడ్డేడ శివ, పార్టీ నాయకులు మొల్లేటి శంకర్, వెంకట్ పాల్గొన్నారు. -
ఎండల వేళ.. జాగ్రత్త సుమా!
చోడవరం: వేసవి ప్రారంభంలోనే రోజురోజుకూ ఎండలు ముదురుతున్నాయి. ఉదయం నుంచి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటంతో మధ్యాహ్నమయ్యే సరికి ఎండల తీవ్రత మరింతగా ఉంది. మధ్యాహ్న సమయంలో ప్రస్తుత ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్గా ఉందంటే, రానున్న రోజుల్లో ఎండలు ఏ మేరకు ఉంటాయో చెప్పనక్కర లేదు. ఈ పరిస్థితుల్లో సగటు మనిషి ఆరోగ్యం క్షీణించి, అనారోగ్యం బారినపడే ప్రమాదం ఉంది. ఈ స్పీడ్ యుగంలో వాతావరణంలో వచ్చే మార్పులను గమనించకుండా మనిషి ఉండటంతో అనేకమంది అనారోగ్యం, మృత్యువాత కూడా పడుతున్నారు. వేసవిలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ప్రధానంగా సున్నితంగా ఉండే మనిషి తన ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంది. వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు మనిషి శరీరంలో అవయవాలు అలసటకు గురై క్షీణించిపోయే ప్రమాదముంది. మనిషి శరీరంలో ఉండే ఉష్ణోగ్రతకు వాతావరణంలో పెరిగిన ఉష్ణోగ్రత తోడవ్వటం వల్ల శరీర లోపలి భాగాలు పని చేసేటప్పుడు కొంత ఒత్తిడికి గురవుతాయి. అందుకే ఎండలో తిరిగే సమయాల్లో సొమ్మసిల్లిపడిపోవడం, వడదెబ్బకు గురికావడం జరుగుతుంది. మండే ఎండలకు రాళ్లు సైతం బద్దలైపోతాయంటారు. అలాంటిది మనిషి ఆరోగ్యం ఎంత. అందుకే వేసవి వడదెబ్బ నుంచి రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వేసవి ఎండల తీవ్రత నుంచి రక్షించుకోవడానికి ముందస్తు జాగ్రత్తలు ఇలా తీసుకుంటే మంచిది. వేసవి ఎండల వల్ల ఉత్పన్నమయ్యే ఆరోగ్య సమస్యలు: ●ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల ఒంటిలో నీరు చెమట రూపంలో బయటికి పోతుంది. దీనివల్ల శరీరంలో లవణాలు తగ్గి అలసట, నీరసం వస్తుంది. ●మండుతున్న ఎండలో బయటకు తిరగడం వల్ల ఉష్ణం ఎక్కువగా శరీరంపై పడి కండరాలు, నరాలు, ఒత్తిడికి గురై బాడీ పెయిన్స్ వస్తాయి. ●తరచూ ఎండలో ఉండటం వల్ల మెదడు, కాలేయం, ఊపిరితిత్తులపై ఉష్ణోగ్రత ఎక్కువగా పడి అవి స్తబ్ధతకు గురవుతాయి. దీనివల్ల మనిషి వడదెబ్బకు గురయ్యే ప్రమాదముంది. ●ఉష్ణోగ్రత ఎక్కువగా తగిలినప్పుడు తలనొప్పి, ఫిట్స్ వంటి వ్యాధులు వస్తాయి. ●చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఎక్కువగా వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. ●వేసవిలో పరిసరాలు, తినే ఆహారం, తాగేనీరు పట్ల కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే డయేరియా సోకే ప్రమాదం ఉంది. ఎలాంటి ఆహారం, ద్రవపదార్థాలు తీసుకోవాలి : ●సాధారణ రోజుల్లో మనిషి 2–3 లీటర్ల నీరు తాగితే సరిపోతుంది. వేసవిలో 4 నుంచి 5 లీటర్ల నీరు రోజుకు తాగాలి. ●క్లోరినేషన్ చేసిన నీటిని మాత్రమే తాగాలి. బావుల్లోను, గుంటల్లోను, చెరువుల్లో నీరు కలుషితమై ఉంటుంది కాబట్టి తాగకూడదు. ●గ్లాసుడు చల్లని నీటిలో చిటికెడు ఉప్పు, పంచదార, నిమ్మరసం కలుపుకొని తాగాలి. ●మజ్జిగలో నిమ్మరసం, ఉప్పు తగిన మోతాదులో కలుపుకొని తాగాలి. ●క్యాంప్లకు వెళ్లేటప్పుడు ఇంటి దగ్గర క్లోరినేషన్ చేసిన నీటిని తీసుకెళ్తే మంచిది. ●గెంజి, పసరకడుగులో నిమ్మరసం, ఉప్పు కలుపుకొని తాగితే ఉష్ణాన్ని చల్లార్చుతాయి. ●శీతల పానీయాలు ఎక్కువగా తీసుకోవడం మంచిది. ఆహారం పదార్థాల్లో జాగ్రత్తలు : ●కూరగాయలు, మసాలా లేని వంటకాలు మాత్రమే తీసుకోవాలి. ●మాంసం, దుంపలు, మసాలాతో కూడిన ఆహార పదార్థాలను తీసుకోకూడదు. వేసవిలో తీసుకోవలసిన పండ్లు : ●పుచ్చకాయ, కర్బూజా, కమల, దానిమ్మ, ద్రాక్ష పండ్లు తీసుకోవాలి. వీటి జ్యూస్ కనీసం రోజుకొకసారైనా తాగితే మంచిది. కొబ్బరి బొండాలు తాగాలి. కూలీలు పనిచేసే సమయాలు : వేసవి ముదురుతుండటంతో వడదెబ్బకు గురికాకుండా, వేసవి తాపం తగలకుండా కూలీలు పనివేళల్లో వేసవికాలంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. విధిగా చేయాల్సిన ఎనిమిది గంటల పనిదినాలను ఉదయం, సాయంత్రం సగం సగంగా చేసుకోవాలి. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 3 నుంచి 6 గంటల సమయాల్లో పనిచేసుకోవడం వల్ల ఎండదెబ్బ తగలకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్యలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి బయట తిరక్కుండా ఉంటే మంచిది. వడగాడ్పుల నుంచి రక్షణ ఇలా : ●వడగాడ్పుల నుంచి రక్షణ కల్పించుకునేందుకు తగు జాగ్రత్తలు పాటించాలి. ●ఎండ ఎక్కువగా ఉన్న సమయాల్లో బయటకు వెళ్లేటప్పుడు, ద్విచక్ర వాహనాలపై వెళ్లేటప్పుడు విధిగా తలను కప్పుతూ చెవులకు కాటన్ క్లాత్ను కట్టుకోవాలి. హెల్మెట్ వాడితే మంచిది. ●వేసవికాలమంతా కాటన్ వస్త్రాలు, తేలికపాటి వస్త్రాలు ధరిస్తే ఎండకు శరీరం నుంచి వచ్చే చెమటను అవి పీల్చుకుని ఉపశమనమిస్తాయి. అంతేకాకుండా శరీరంపై ఎటువంటి వేడి బొబ్బులు రాకుండా చర్మానికి రక్షణ కల్పిస్తాయి. కొద్దిపాటి నీరసం వస్తే డాక్టర్ను సంప్రదించాలి వేసవిలో ఏమాత్రం ఆరోగ్యానికి ఇబ్బంది కలిగినట్లనిపించిన వెంటనే సమీపంలో వైద్యులను సంప్రదించాలి. కాటన్ దుస్తులూ ధరిస్తూ ఎండలో ఎక్కువగా తిరక్కుండా ఉంటే మంచిది. వడదెబ్బ తగిలిన వెంటనే ఆస్పత్రిలో చేర్పించాలి. ఆలస్యం చేస్తే ప్రాణాలకు ప్రమాదం కలుగుతుంది. పని చేసేటప్పుడు నీరసంగా ఉన్నట్లయితే వెంటనే చల్లటి ప్రదేశంలో సేద తీర్చుకుని నీళ్లు తాగితే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. – డాక్టర్ బండారు సత్యనారాయణ, వైద్యుడు, చోడవరం చలువ కోసం అమ్మకానికి ఉంచిన పుచ్చకాయల ముక్కలు రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఆరోగ్య రక్షణపై అశ్రద్ధ వద్దు వడదెబ్బకు తగలకుండా చూసుకోవాలి శీతలపానీయాలు తాగడం మేలు వైద్యాధికారుల సూచనలు -
వైభవంగా మోదకొండమ్మ తీర్థం
మాడుగుల: ఉత్తరాంధ్ర ఇలవేల్పు మాడుగుల మోదకొండమ్మ తీర్థాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ విద్యుత్ లైటింగ్ చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. అమ్మవారిని పూలు, నగలుతో ప్రత్యేకంగా అలంకరించారు. తెల్లవారుజాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి బారులు తీరారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు తీన్మార్, డీజే సౌండ్ల మధ్య అమ్మవారి తీర్థంగా వైభవంగా జరిగింది. ఆకట్టుకున్న ఎడ్ల పరుగు పందెంలు తీర్థం సందర్భంగా ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఎడ్ల పరుగు పందేలు ఆద్యంతం హుషారుగా సాగాయి. ఈ పోటీలను ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ పుప్పాల అప్పలరాజు, ఎంపీపీ తాళ్లపురెడ్డి వెంకటరాజారామ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ పోటీలను తిలకించడానికి చుట్టు పక్కల గ్రామాల నుంచి జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. -
నాటు తుపాకీ పేలిన ఘటనలో ఇద్దరు అరెస్ట్
యలమంచిలి రూరల్ : సంచలనం కలిగించిన నాటు తుపాకీ పేలుడు ఘటనపై ఎట్టకేలకు మూడు రోజుల తర్వాత పోలీసులు వివరాలు వెల్లడించారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు రెండు నాటు తుపాకులు, పేలుడుకు వినియోగించే గన్ పౌడర్, ఇతర సామగ్రిని స్వాధీనపర్చుకున్నారు. ఈ నెల 8వ తేదీన యలమంచిలి మండలం ఏటికొప్పాక శివారులో నాటు తుపాకీ పేలడంతో గ్రామానికి చెందిన 6వ తరగతి బాలుడు ఆడారి వెంకట కౌశిక్(12) దుర్మరణం పాలు కాగా మరొక విద్యార్థి గాయపడిన సంగతి తెల్సిందే. ఈ కేసుకు సంబంధించి పరవాడ ఇంఛార్జ్ డీఎస్పీ బి.మోహనరావు మంగళవారం సాయంత్రం యలమంచిలి సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 8వ తేదీ ఆదివారం ఏటికొప్పాక గ్రామానికి చెందిన 8 మంది విద్యార్థులు ఆడుకోవడానికి గ్రామ శివారులో వరహా నది సమీపంలో ఆనకట్ట వద్దకు వెళ్లారు. కొంతసేపు ఈత కొట్టిన తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మా ఇంట్లో ఉన్న తుపాకులు చూపిస్తానంటూ వారిలో ఓ విద్యార్థి మిగిలిన విద్యార్థులను పక్కనే కొండ దిగువన కశింకోట సూరిబాబు తాటాకు ఇంటికి తీసుకెళ్లాడు. రెండు నాటు తుపాకులను విద్యార్థులకు చూపిస్తుండగా ఒక తుపాకీలో అప్పటికే పేలుడు పదార్థాలు కూరి ఉంచడంతో అది ప్రమాదవశాత్తూ పేలి తూటాలు ఎదురుగా ఉన్న ఆడారి వెంకట కౌశిక్ (12) శరీరంలోకి దూసుకెళ్లాయి. కౌశిక్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు బాలురు కూడా స్వల్పంగా గాయపడ్డారు. ఘటన జరిగిన సమయంలో కశింకోట సూరిబాబు ఇంట్లో లేడు. సమాచారం తెలుసుకున్న వెంటనే ఇంటికి చేరుకున్న సూరిబాబు నాటు తుపాకులు కలిగి ఉన్నట్టు తెలిస్తే కేసు పెడతారన్న భయంతో తన ఇంటి ముందున్న ఆడారి వెంకట కౌశిక్ మృతదేహాన్ని సమీపంలో పోలవరం కాల్వ ఒడ్డుకు తరలించాడు. రక్తపు మరకలు తుడిచి కుమారుడిని తీసుకుని ఇంటి నుంచి పరారయ్యాడు. రెండు నాటు తుపాకులు స్వాధీనం కేసులో ప్రధాన నిందితుడు కశింకోట సూరిబాబు వద్ద లైసెన్సు లేకుండా రెండు నాటు తుపాకులు కలిగి ఉన్నందుకు బీఎన్ఎస్ 106(1), 238, ఆర్మ్స్ యాక్టు 1959 సెక్షన్ 25,27, ఎక్స్ప్లోసివ్స్ యాక్ట్ 1884 సెక్షన్9(బి) ప్రకారం యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్లో క్రైం నెంబరు 46/2026 నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా నిందితుడు సూరిబాబు దాచిపెట్టిన రెండు నాటు తుపాకులు, తూటాలు పేల్చడానికి ఉపయోగిస్తున్న గన్పౌడర్, ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనపర్చుకున్నారు పోలీసులు. గన్పౌడర్ విక్రయిస్తున్న కశింకోటకు చెందిన ముత్యాల అప్పల రమణలను అరెస్టు చేశామని, ప్రధాన నిందితుడు కశింకోట సూరిబాబును రిమాండ్కు పంపించామని డీఎస్పీ తెలిపారు. స్వాధీనపర్చుకున్న రెండు నాటు తుపాకుల్లో ఒకటి పాతది కాగా రెండోది కొత్తదిగా దర్యాప్తులో తేలింది. ఎవరైనా అక్రమంగా ఆయుధాలు కలిగి ఉంటే చట్టప్రకారం నేరమని, వారిపై కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ స్పష్టం చేశారు. ఇకపై సబ్డివిజన్ పరిధిలో అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపడతామన్నారు. ఎవరైనా అక్రమంగా అయుధాలు కలిగి ఉంటే పోలీసులకు స్వాధీనపర్చాలన్నారు. నిందితుడి వద్ద నుంచి పోలీసులు స్వాధీనపర్చుకున్న నాటు తుపాకులు, పేలుడు సామగ్రి వివరాలు వెల్లడిస్తున్న పరవాడ ఇంఛార్జ్ డీఎస్పీ బి మోహనరావు.చిత్రంలో వెనుక అరెస్టయిన ప్రధాన నిందితుడు కశింకోట సూరిబాబు -
17న నూకాంబిక కొత్త అమావాస్య జాతర
అనకాపల్లి : ఉత్తరాంద్ర ఇలవేల్పు స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారి దేవాలయంలో అమ్మవారి జాతర మహోత్సవం ఈనెల 17న రాత్రి నుంచి 18 వ తేదీ వరకూ నిర్వహించనున్నట్టు జిల్లా దేవదాయశాఖ అధికారి సుధారాణి, ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీను(గొల్లబాబు) తెలిపారు. అమ్మవారి ఆలయ ఆవరణలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్త అమావాస్య పండగను ఈనెల 18న నిర్వహించనున్నట్టు తెలిపా రు. 19వ తేదీన ఉగాది రోజున అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. అమ్మవారి నూతన ఆలయంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్టు చెప్పారు. ఏప్రిల్ 17వ తేదీ వరకూ అమ్మవారికి నెల పండగ వేడుకలు నిర్వహిస్తూ ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో అనకాపల్లి ఎన్టీఆర్ క్రీడామైదానంలో నెలరోజుల పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు గత ఏడాది మాదిరిగానే నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. అమ్మవారి ఉత్సవాన్ని రాష్ట్ర పండగగా ప్రభుత్వం గుర్తించడంతో అమ్మవారికి పట్టువస్త్రాలను ప్రభుత్వం తరఫున జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర, హోం మంత్రి వంగలపూడి అనిత అందజేస్తారని చెప్పారు. అమ్మవారి ఆలయ, రాజగోపురం పునఃప్రతిష్ట నిర్మాణానికి రూ.11కోట్ల 93 లక్షలు ఖర్చు అయిందని, భక్తుల అమ్మవారికి కానుకుల రూపంలో సమర్పించిన నగదుతో నిర్మాణం పూర్తి చేసినట్టు చెప్పారు. అమ్మవారి రాజగోపురం 100 అడుగులు ఉంటుందని, విజయవాడ కనకదుర్గ అమ్మవారి రాజగోపురం మాదిరిగానే నూకాంబిక అమ్మవారి రాజగోపురం నిర్మించినట్టు తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో అమ్మవారి ఆలయం పునఃనిర్మాణపనులు ప్రారంభిస్తే, టీడీపీ పాలనలో రాజగోపురం ప్రారంభించారని పూర్తి చేసినట్టు చెప్పారు. ఈ నెల 8న అమ్మ పునఃప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించి, భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తున్నట్టు వారు తెలిపారు. ప్రభుత్వం నుంచి త్వరలో రూ.7 కోట్ల నిధులు రానున్నాయని, ఈ నిధులతో మరికొన్ని అభివృద్ధి పనులు చేపడతామన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో యాళ్ల శ్రీధర్, కమిటీ ధర్మకర్తలు సూరే సతీష్కుమార్; దాడి రవికుమార్, మారిశెట్టి శంకరరావు, కొడుకుల శ్రీకాంత్, కాండ్రేగుల రాజారావు, వడ్డాది మంగ, పొలిమేర స్వాతి ఆనంద్కుమార్, మజ్జి జానకీ శ్రీనివాసరావు, యర్రవరపు సంతోషి కుమార్ నాగేష్, కోనేటి సూర్యలక్ష్మి పైడిరాజు పాల్గొన్నారు. -
సమస్యలపై స్పందించకపోతే ఉద్యమం ఉధృతం
● ఆదివాసీ జేఏసీ జిల్లా చైర్మన్ రామారావు దొర పెదబయలు: గిరిజనుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆదివాసీ జేఏసీ జిల్లా చైర్మన్ రామారావు దొర తెలిపారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆదివాసీ సత్యాగ్రహ యాత్ర మంగళవారం గిన్నెలకోట పంచాయతీ కేంద్రం మీదుగా చింతగరువు లండూలు, వంచుర్భ, దోసలబంద, బొంగరం, రాసగొంది, చిట్రకాయపుట్టు గ్రామాల్లో సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 123 రోజులుగా యాత్ర చేస్తున్నట్టు తెలిపారు. నూరుశాతం ఉద్యోగాలు గిరిజన అభ్యర్థులతో భర్తీ చేయాలని, గిరిజన చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు బూడిదే మాధవరావు,మానుగూరు బాబుజీ, పార్థసారథి, స్వామి, చిన్నారావు, కొండబాబు, లక్ష్మణ్,రాంబాబు పాల్గొన్నారు. -
బయో రిజర్వ్
అవగాహన కల్పిస్తాం చింతపల్లి నుంచి పాపికొండలను కలుపుతూ మొత్తం తొమ్మిది లక్షల హెక్టార్లలో విస్తిరించిన ప్రాంతన్ని బయో రిజర్వ్గా చేయా లని ఉన్నతాధికారులు నిర్ణయించారు.ముందుగా గిరిజనుల్లో నెలకొన్న అనుమానాలు,అపోహలను తొలగించేందుకు కరపత్రాల ద్వారా అవగాహన కల్పించాలని భావించాం.కలెక్టర్లు సైతం ఇదే సూచన చేశారు.ఈ ప్రాంతం బయో రిజర్వ్గా మారితే జంతువులకు,అడవికి రక్షణ లభిస్తుంది. – వై.వి. నర్సింగరావు, డీఎఫ్వో, చింతపల్లి ●కొయ్యూరు: మానవమనుగడ అడవులపై ఆధారపడి ఉంది. 33 శాతం అడవులు ఉంటేనే వాతావరణం సమతుల్యంగా ఉంటుంది. రాను రాను మానవ ఆవాసాలు పెరిగి అడవులు అంతరించిపోవడంతో ఉన్న అడవిని,జంతువులను కాపాడుకునేందుకు వీలుగా జీవ వైవిధ్య రక్షణ కోసం అటవీ శాఖ ముందడుగు వేసింది. మొదట లక్ష హెక్టార్లలో విస్తరించి ఉన్న మర్రిపాకల రేంజ్ నుంచి రంపచోడవరం, చింతూరు ప్రాంతాలను కలుపుతూ కనీసం నాలుగు లక్షల హెక్టార్లలో దీనిని ఏర్పాటు చేయాలని భావించారు. అయితే పరిధి పెంచితే అటు యునెస్కో, ఇటు కేంద్రం ప్రభుత్వం నుంచి అధికంగా నిధులు వచ్చే అవకాశం ఉండడంతో తొమ్మిది లక్షల హెక్టార్లలో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. కేంద్రానికి నివేదిక అల్లూరి, పోలవరం జిల్లాల అటవీశాఖ అధికారులు కలెక్టర్లతో కలిసి ప్రాజెక్ట్ నివేదికను తయారు చేసి రాష్ట్రప్రభుత్వం ద్వారా కేంద్రానికి నివేదిస్తారు. నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది.అటు యునెస్కో నుంచి కూడా నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతిపాదించిన ప్రాంతాన్ని బయో రిజర్వ్గా చేస్తే గ్రామాలను ఖాళీ చేయిస్తారన్న భయం గిరిజనుల్లో ఉంది.దీనిపై వారికి ఉన్న అపోహలను అటవీ అధికారులు తొలగించాల్సి ఉంది. వృక్ష, జంతువుల రక్షణే లక్ష్యం చెట్లను, జంతువులను సంరక్షించడంతో పాటు ఆర్థికాభివృద్ధికి కృషి చేయడం, అటవీ ప్రాంతంలో గల వివిధ రకాల వృక్షాలపై పరిశోధనలకు అవసరమైన అవకాశాలు కల్పించడమే బయో రిజర్వ్ ప్రధాన లక్ష్యం. దీనిలో మూడు రకాల జోన్లు ఉంటాయి. మొదటి జోన్లో రక్షిత అటవీ ప్రాంతం ఉంటుంది. దీనిలోకి ఎవరినీ అనుమతించరు. బఫర్గా రెండో జోన్ను ఏర్పాటు చేస్తారు. ఈ జోన్లో పరిశోధనలతో పాటు ఇతర అంశాలకు అనుమతులు ఇస్తారు. మూడో జోన్లో మానవాభివృద్ధిలో భాగంగా పరిశీలన చేసేందుకు అనుమతులు ఇస్తారు. 18 బయో రిజర్వ్లు మన దేశంలో ఇప్పటి వరకు 18 బయో రిజర్వ్లను ఏర్పాటు చేశారు. అల్లూరి జిల్లా మర్రిపాకల నుంచి పోలవరం జిల్లా పాపికొండల వరకు ఏర్పాటు చేయాలని భావిస్తున్న బయో రిజర్వ్కు అన్ని అనుమతులు వస్తే 19వ బయో రిజర్వ్ అవుతుంది. ప్రకటించేందుకు అటవీ శాఖ నిర్ణయం తొమ్మిది లక్షల హెక్టార్లలో విస్తరించిన అటవీ ప్రాంతం గిరిజనులకు అవగాహన కల్పించడంపై దృష్టి జీవ వైవిధ్య పరిరక్షణకు అటవీశాఖ నిర్ణయం ఆమోదం లభిస్తే యునెస్కో నుంచీ నిధులు -
వైఎస్సార్సీపీ ఆవిర్భావదినోత్సవం ఘనంగా జరపాలి
● ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అరకులోయటౌన్: వైఎస్సార్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించా లని అరకులోయ ఎమ్మె ల్యే రేగం మత్స్యలింగం పిలుపు నిచ్చారు. మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈనెల 12వ తేదీన వైఎస్సార్సీపీ ఆవిర్భావదినోత్సవం సందర్భంగా అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో పార్టీ జెండాలు ఎగురవేయాలని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించాలని సూచించారు. సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఎమ్మెల్యే పిలుపు నిచ్చారు. 2019లో అధికారం చేపట్టిన వైఎస్సార్సీపీ ఐదేళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందని తెలిపారు. రాష్ట్ర చరిత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెరగని ముద్ర వేసుకున్నారని చెప్పారు. -
మత్స్యగెడ్డలో గిరిజనుడు గల్లంతు
ముమ్మరంగా గాలింపుముంచంగిపుట్టు : మండలంలో సుజనకోట పంచాయతీ కుమ్మరిపుట్టు సమీపంలో మత్స్యగెడ్డలో స్నానానికి దిగి ఓ గిరిజనుడు గల్లంతయ్యా డు. అతని ఆచూకీ కోసం గ్రామస్తులు గాలిస్తున్నారు. స్థానికులు అందించిన వివరాలు.. కుమ్మరిపుట్టుకు చెందిన వంతాల గోపీనాథ్(72) సోమవారం మండల కేంద్రం ముంచంగిపుట్టుకు అరటిపండ్ల అమ్మకానికి వచ్చి, రాత్రి అయిన ఇంటికి చేరలేదు. దీంతో కుటుంబ సభ్యులు పరిసరాల గ్రామాల్లో, బంధువుల ఇళ్ల వద్ద ఆరా తీశారు. మంగళవారం ఉదయం గ్రామ సమీపంలోని మత్స్యగెడ్డ ఒడ్డున గోపీనాథ్కు చెందిన దుస్తులు, సంచీని గ్రామస్తులు గుర్తించారు. దీంతో స్నానం చేయడానికి గెడ్డలో దిగి గల్లంతై ఉంటాడని భావిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సుజనకోట సర్పంచ్ వెంగడ రమేష్, ఎంపీటీసీ సభ్యురాలు మజ్జి సుబ్బలక్ష్మి తదితరులు సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. స్థానికులతో రెండు నాటు పడవలపై మత్స్యగెడ్డలో గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడడంతో గాలింపు నిలిపివేశారు. గల్లంతైన విషయంపై కుటుంబ సభ్యులు ఎస్ఐ నానీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ఐ మత్స్యగెడ్డ వద్దకు చేరుకుని వివరాలు సేకరించారు. అధికారుల తీరుపై జెడ్పీ చైర్ పర్సన్ ఆగ్రహంకుమ్మరిపుట్టు వద్ద మత్స్యగెడ్డలో గిరిజనుడు గల్లంతైనా మండల స్థాయి అధికారుల్లో కనీస స్పందన లేకపోవడంపై జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జెడ్పీ చైర్పర్సన్ మంగళవారం కుమ్మరిపుట్టు వెళ్లి ప్రమాద వివరాలను గ్రామస్తులకు అడిగి తెలుసుకున్నారు. మండల స్థాయి అధికారి, పంచాయతీ,రెవెన్యూ అధికారులు రాలేదని, గ్రామస్తులమే గాలిస్తున్నామని చైర్ పర్సన్ వద్ద గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు.దీంతో స్పందించిన ఆమె ఫోన్లో జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు.జెడ్పీ చైర్పర్సన్ వచ్చిన విషయాని తెలుసుకున్న తహసీల్దార్ భాస్కరఅప్పారావు,రెవెన్యూ సిబ్బంది సాయంత్రం సంఘటన స్థలానికి చేరుకున్నారు.దీంతో వారిపై జెడ్పీ చైర్ పర్సన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టకపోవడంపై మండిపడ్డారు. తీరుమార్చు కోవాలని అధికారులకు ఆమె హెచ్చరించారు.కుమ్మరిపుట్టు వద్ద మత్స్యగెడ్డపై వంతెన నిర్మించాలని గ్రామస్తులు జెడ్పీ చైర్పర్సన్ను కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమేష్,ఎంపీటీసీ సుబ్బ లక్ష్మి,వైఎస్సార్సీపీ మండల నేతలు సన్యాసిరావు,జె.వి.వి.ఎన్.మూర్తి,తిరుపతి పాల్గొన్నారు. -
కేజీబీవీల్లో ప్రవేశాలకుదరఖాస్తుల స్వీకరణ
● సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు సాక్షి,పాడేరు: అల్లూరి, పోలవరం జిల్లాల పరిధిలోని 19 కేజీబీవీల్లో ప్రవేశాలకు ఈనెల 12వతేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంచనున్నట్టు సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ స్వామినాయుడు తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బడిబయట ఉన్న పిల్లలకు మొదటి ప్రాధాన్యత, తల్లిదండ్రులు లేని వారికి రెండో ప్రాధాన్యత, సింగిల్ పేరెంట్ పిల్లలకు 3వ ప్రాధాన్యత,విభిన్న ప్రతిభావంతులు,ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు 4వ ప్రాధాన్యత ఇస్తామన్నారు.ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ప్రతి కేజీబీవీలో 40 సీట్లు ఉంటాయన్నారు. కేజీబీవీల్లో టెన్త్ చదివి ఉత్తీర్ణులైన బాలికలకు తొలి ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. ఓసీ ఓపెన్ కేటగిరిలో 50శాతం, ఎస్సీలకు 15శాతం,ఎస్టీలకు 6 శాతం, బీసీ–ఎ 7శాతం,బీసీ–బి 10శాతం,బీసీ–సి 1శాతం, బీసీ–డి 7శాతం,బీసీ–ఈ 4 శాతం, అనాథలు,అంగవైకల్యం కలిగిన వారికి 10 శాతం చొప్పున 40 సీట్లను భర్తీ చేస్తామన్నారు. 6వ తరగతి నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం వరకు ప్రవేశాలకు గాను ఈనెల 12వతేదీ నుంచి ఏప్రిల్ 1వతేదీ వరకు https://apkgbv. apcfss. inలో ఆన్లైన్ ద్వారా సమగ్ర వివరాలతో దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు. రెండు జిల్లాల పరిధిలో 6వ తరగతిలో 760 సీట్లు,7వ తరగతిలో 25 సీట్లు.8వతరగతిలో 15సీట్లు, 9వ తరగతిలో 20 సీట్లు,ఇంటర్ మొదటి సంవత్సరంలో 760సీట్లు ఖాళీలు ఉన్నాయన్నారు.అర్హులైన బాలికలంతా దర ఖాస్తులు చేసుకోవాలని ఆయన తెలిపారు. -
అక్షరానికి ఫీజు ఉరి
అక్షరానికి అభయం ఎక్కడ? పేదోడి చదువుకు భరోసా ఏది? కూటమి సర్కార్ కొలువుదీరిన వేళ.. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల సెగ విద్యార్థుల భవిష్యత్తును దహించివేస్తోంది. అటు పాలకుల నిర్లక్ష్యం.. ఇటు యాజమాన్యాల మొండివైఖరి మధ్య సామాన్యుడి కలలు కల్లలవుతున్నాయి. సొంత పార్టీ ఎంపీ కాలేజీలోనే విద్యార్థులను గెంటేస్తుంటే, ‘మన ప్రభుత్వం’ అని నమ్మిన జనసేనాని అభిమానులే ఇప్పుడు సోషల్ మీడియా సాక్షిగా పాలకుల వైఫల్యాలను ఎండగడుతున్నారు. ’ముగ్గురు పిల్లల ముచ్చట పక్కన పెట్టండి.. ఉన్న ఇద్దరి చదువుల సంగతి చూడండి’ అంటూ ఒక తండ్రి వెళ్లగక్కిన ఆవేదన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా దావానలంలా మారుతోంది.విశాఖ సిటీ: చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తోంది. ఎన్నికల ముందు చదువుల తల్లికి అండగా ఉంటామని చెప్పిన పాలకులు, ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను గాలికి వదిలేయడంతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులపై ప్రతాపం చూపుతున్నాయి. తాజాగా విశాఖలోని దువ్వాడలో ఉన్న విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. సొంత పార్టీ ఎంపీ కాలేజీలోనే వేధింపులా? నరసరావుపేట టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు చెందిన ఈ కాలేజీలో, ప్రభుత్వం నుంచి రావాల్సిన మొదటి ఏడాది ఫీజు బకాయిలు రాలేదన్న సాకుతో విద్యార్థులను తరగతి గదుల నుంచి బయటకు పంపిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తన బిడ్డను క్లాసులో నుంచి పంపించేశారని, ఇది ఎంతవరకు ధర్మమని పాయకరావుపేటకు చెందిన ఒక సామాన్య కాపు సామాజికవర్గ నాయకుడు, పవన్ కల్యాణ్ అభిమాని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. పవన్ కల్యాణ్కు సూటి ప్రశ్న జనసేనాని పవన్ కల్యాణ్ను ఉద్దేశించి సదరు తండ్రి చేసిన వ్యాఖ్యలు బాణాల్లా తగులుతున్నాయి. ‘అయ్యా పవన్ కల్యాణ్ గారూ.. రెండేళ్లుగా టీడీపీతో సావాసం చేస్తున్నారు, కానీ క్షేత్రస్థాయిలో సామాన్యుల కష్టాలు మీకు పట్టడం లేదు. ఎంపీలకు చెందిన కాలేజీలే ఇలా విద్యార్థులను గెంటేస్తుంటే, ఇక మా పిల్లల చదువులకు భరోసా ఎక్కడ?‘ అని ఆయన నిలదీశారు. గాలి మాటలు చెప్పడం మానేసి, విద్యార్థుల జీవితాలు నాశనం కాకుండా చూడండి’ అని డిమాండ్ చేశారు. ‘మూడో బిడ్డ’ ముచ్చట దేనికి? ఉన్నవారికే దిక్కులేదు! : ప్రభుత్వం ప్రకటించిన ’మూడో బిడ్డకు రూ. 25 వేల ప్రోత్సాహం’ పథకంపై సదరు తండ్రి ఎద్దేవా చేశారు. ‘మొదటి దానికి మొగుడు లేడు.. కొసదానికి కల్యాణం అన్నట్లుంది మీ తీరు‘ అంటూ ఘాటుగా విమర్శించారు. ఉన్న ఇద్దరు పిల్లల చదువులకే దిక్కులేదని, మీ మాటలు నమ్మి మూడో బిడ్డను కంటే రోడ్డున పడటం ఖాయమని మండిపడ్డారు. రూ. 1750 కోట్లతో విగ్రహాలు పెట్టడం కంటే, ఆ నిధులను విద్యార్థుల ఫీజుల కోసం ఖర్చు చేస్తే ఎందరో పేదల భవిష్యత్తు నిలబడుతుందని ఆయన హితవు పలికారు. రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రుల ఆందోళన ఈ ఒక్క కాలేజీలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రైవేట్ విద్యాసంస్థలు పరీక్షా హాల్ టికెట్లు ఇవ్వకుండా, అటెండెన్స్ వేయకుండా విద్యార్థులను వేధిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం తక్షణమే స్పందించి బకాయిలు విడుదల చేయకపోతే, వేల సంఖ్యలో విద్యార్థులు చదువుకు దూరం కావాల్సి వస్తుందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒక అభిమానిగా ప్రారంభమైన ఈ పోస్ట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై ఒక ప్రజా నిరసనగా మారుతోంది. వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల్లో వైరల్గా అవుతోంది. -
గౌరీ పరమేశ్వరుల విగ్రహ ప్రతిష్టకు చురుగ్గా ఏర్పాట్లు
జి.మాడుగుల: మండలంలోని గాంధీనగరంలో హనుమాన్ ఆశ్రమం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న 20అడుగుల గౌరీ పరమేశ్వరు లు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని 19వ తేదీన నిర్వహించనున్నారు. ఈ మేరకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా హనుమా న్ ఆశ్రమంలో భీమిలి సద్గరు సేవాశ్రమం ప్రతినిధి సాయిరాం స్వామీజీ, కమిటీ సభ్యులు మంగళవారం కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం స్వామీజీ మాట్లాడుతూ సద్గురు సేవాశ్రమం ద్వారా 2017సంవత్సరం నుంచి ఇప్పటి వరకు అల్లూరి జిల్లాలో 999 విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేసినట్టు తెలిపారు. 19న ప్రతిష్టించనున్న విగ్రహం 1000వ విగ్రహమని చెప్పారు. ఆ రోజు అన్నసమారాధన, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో హనుమాన్ సేవాశ్రమ కమిటీ సభ్యులు మత్స్యరాస మత్స్యరాజు, రీమెలి అప్పలరాజు, సన్యాసిరావు పాల్గొన్నారు. -
అత్తారింటి వేధింపులు.. కొడుకుతో తల్లి ఆత్మహత్య
చెరువులో తేలియాడుతున్న మృతదేహాలు. తుని, కోటనందూరు: అత్తింటి వారి వేధింపులు తాళలేక కొడుకుతో సహా ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరాపల్లి గ్రామ శివారు తమ్మయ్య చెరువు వద్ద చోటు చేసుకుంది. సోమవారం మధ్యాహ్నం రెండు మృతదేహాలు ఆ చెరువులో తేలియాడుతూ ఉండడం కలకలం రేపింది. దీనిని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్సై రమేష్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీయించారు. ప్రాథమిక దర్యాప్తులో వారిది అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం పెద్ద బొడ్డేపల్లికి చెందిన నెల్లి భాగ్యలక్ష్మి (35), ఆమె కుమారుడు సాయి ఇషాన్ (3)గా గుర్తించినట్టు తెలిపారు. పెద్ద బొడ్డేపల్లికి చెందిన వడిశల దుర్గాప్రసాద్కు ధవళేశ్వరానికి చెందిన భాగ్యలక్ష్మికి కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి మూడేళ్లు కుమారుడు సాయి ఇషాన్ ఉన్నాడు. కొంత కాలంగా భర్త, అత్త, ఆడపడుచులు వేధింపులకు గురి చేస్తున్నారని, దీంతో మానసిక వేదనకు గురైన భాగ్యలక్ష్మి కుమారుడితో సహా ఆత్మహత్య చేసుకుందని ఆమె సోదరుడు నెల్లి ఉదయ్ సాగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాలను తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఏఎస్సై వివరించారు.


