Alluri Sitarama Raju
-
ప్రత్యామ్నాయం చూపాలి
ఆరిలోవ(విశాఖ): జీవీఎంసీ 13వ వార్డు పరిధి ముడసర్లోవ వద్ద రైల్వే జోన్ పనులను మంగళవారం శ్రీకృష్ణాపురానికి చెందిన గిరిజనులు అడ్డుకున్నారు. ముడసర్లోవ ప్రాంతంలో 52 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం రైల్వేజోన్ కోసం కేటాయించిన సంగతి తెలిసిందే.ఇక్కడ కాంట్రాక్ట్ సంస్థ భూసార పరీక్షలు చేస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. పొక్లెయిన్ ద్వా రా పనులు జరగనివ్వకపోవడంతో కాంట్రాక్టర్ పను లు నిలిపివేశారు. తమకు ప్రత్యామ్నాయం చూపకుండా ఈ భూములు రైల్వేకు కేటాయించారని, వెంటనే ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. 1976లో అప్పటి కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణాపురంలో 66 గిరిజన కుటుంబాలకు 66 ఎకరాల వ్యవసాయ భూమి కేటాయించిందని వారు తెలిపారు. ఆ భూమిని ఇప్పుడు రైల్వేకు కేటాయించడం అన్యాయమన్నారు. ఈ భూములు తీసుకున్నందుకు తమకు ప్రత్యామ్నాయం చూపాలని, అప్పటివరకు పనులు జరగనివ్వమని హెచ్చరించారు.రైల్వే జోన్ పనులు అడ్డుకుని, శ్రీకృష్ణాపురం గిరిజనుల ఆందోళన -
క్షణికావేశంతో వివాహిత ఆత్మహత్య
నాతవరం : భర్త మందలించాడన్న కారణంతో భార్య కిరోసిన్ పెట్రోల్ కలిపి పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలో నెలకొంది. నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ అందించిన వివరాల మేరకు మండలంలో ఎం.బి.పట్నం గ్రామానికి చెందిన పల్లి వెంకటలక్ష్మి (30) మంగళవారం ఉదయం తన కుమార్తె అల్లరి చేయడంతో కొట్టింది, అప్పటికే జ్వరంతో ఉన్న కుమార్తెను ఎందుకు కొట్టావంటూ భర్త పల్లి గోవింద్ భార్య వెంకటలక్ష్మి తీవ్రంగా మందలించడమే కాకుండా చెయ్యి చేసుకున్నాడు. దీంతో ఇరువురూ ఇంటి వద్ద ఘర్షణ పడ్డారు. కొంత సేపటి తర్వాత గోవింద్ తన జీడిమామిడి తోటలో పిక్కలు సేకరించడం కోసం వెళ్లిపోయాడు. జ్వరంతో ఉన్న పాపకు మధ్యాహ్నం వెంకటలక్ష్మి భోజనం పెట్టి ఇంటి వద్దే ఉంది. భర్త మండలించాడన్న కోపంతో వెంకటలక్ష్మి వ్యవసాయ ఇంజిన్ మోటారులో వేసేందుకు తీసుకువచ్చి ఇంట్లో ఉంచిన కిరోసిన్, పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్మ చేసుకుంది. కుమార్తె ఇంట్లో జ్వరంతో పడుకోని ఉండడంతో ఇంటి వెనుకకు వెళ్లి ఆత్మహత్య చేసుకుంది, మృతురాలికి బాబు, పాప ఉన్నారు. వెంకటలక్ష్మి, గోవింద్కు 15ఏళ్ల క్రితం వివాహం జరిగింది. క్షణికావేశంతో వెంకటలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబీకులు భోరున విలపించారు. సంఘటన స్థలానికి నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
విత్తనాల నమోదును బాధ్యతగా తీసుకోవాలి
చింతపల్లి: గిరిజన రైతాంగం సంప్రదాయంగా సాగు చేస్తున్న పంటల విత్తనాలను నమోదు చేయడాన్ని బాధ్యతగా తీసుకోవాలని హైదరాబాద్ అటారి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎ.వి.ఆర్. రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక వ్యవసాయ పరిశోధనా స్థానంలో బీసీటీ,కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మొక్కలు రకాలు, పరిరక్షణ, రైతులు హక్కుల చట్టం–2001 పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో పంటల వైవిధ్యం ఉన్పప్పటికీ పంటల రకాలు, విత్తన నమోదు చాలా తక్కువగా ఉందన్నారు. స్థానిక ఏడీఆర్ అప్పలస్వామి మాట్లాడుతూ విత్తనాలపై రైతులు హక్కులను కాపాడడమే కాకుండా అవసరమైతే రైతులు తరఫున పోరాడడానికి రైతుల చట్టం ఎంతోగానో ఉపయోగపడుతుందన్నారు. రైతు క్లబ్బుల ఏర్పాటుకు ఎంతో తోడ్పాటు నిస్తుందన్నారు.ఈ సందర్భంగా సంజీవని స్వచ్ఛంద సంస్థ సంచాలకులు దేముళ్లు,బీవీకే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శైలజ, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ బయ్యపురెడ్డి,డాక్టర్ బాలహుస్సేన్రెడ్డిలు పలు అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు బండి నాగేంద్ర ప్రసాద్,డాక్టర్ వాన ప్రసాదరావు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. -
సీహెచ్సీలో నిలిచిన అల్ట్రాసౌండ్ పరీక్షలు
ముంచంగిపుట్టు: స్థానిక సీహెచ్సీలో గత ఐదు నెలలుగా గర్భిణులకు అల్ట్రాసౌండ్ పరీక్షలు నిలిచిపోయాయి.దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ప్రతి మంగళ, గురు వారాల్లో సీహెచ్సీలో గర్భిణులకు ఉచితంగా అల్ట్రాసౌండ్ పరీక్షలు చేసి శిశువు ఆరోగ్య పరిస్థితి, హృదయ స్పందన తదితర వివరాలు తెలుసుకుంటారు. దీంతో గర్భిణులు ముందుగా జాగ్రత్త పడేందుకు ఆస్కారం ఉంటుంది. గతంలో పాడేరు జిల్లా ఆస్పత్రి నుంచి గైనికాలజిస్ట్ వచ్చి సీహెచ్సీలో అల్ట్రాసౌండ్ పరీక్షలు చేసేవారు. గైనికాలజిస్ట్ లేక నవంబర్ నెల పరీక్షలు చేయకపోవడంతో గర్భిణులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. వైద్యుల సూచనల మేరకు ప్రతి వారం 40 నుంచి 50మంది గర్భిణులు 52కిలో మీటర్ల దూరంలో ఉన్న పాడేరు జిల్లా ఆస్పత్రికి వెళ్లి అల్ట్రాసౌండ్ పరీక్షలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.అల్ట్రాసౌండ్ పరీక్షల నిర్వహణకు స్థానిక సీహెచ్సీలో అన్ని సౌకర్యాలు ఉన్నా గైనికాలజిస్ట్ లేక పోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తక్షణమే వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు స్పందించి గైనికాలజిస్ట్ను నియమించాలని మండల వాసులు కోరుతున్నారు.ఈ విషయంపై స్థానిక వైద్యాధికారి గీతాంజలిని వివరణ కోరగా గైనికాలజిస్ట్ లేకపోవడం వల్ల అల్ట్రాసౌండ్ పరీక్షలు ఐదు నెలల నుంచి నిలిచాయని చెప్పారు. ఉన్నతాధికాలకు సమస్యను తెలియజేసినట్టు ఆమె తెలిపారు. గైనికాలజిస్ట్ లేక ఇబ్బందులు పాడేరు వెళ్లేందుకు అవస్థలు పడుతున్న గర్భిణులు -
జాతీయ రహదారి పనుల అడ్డగింత
రాజవొమ్మంగి: జాతీయ రహదారి 516ఇ నిర్మాణ పనులను దూసరపాము గ్రామస్తులు మంగళవారం రాత్రి అడ్డుకున్నారు. జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా ఈ గ్రామ సరిహద్దులో ఉన్న మూడు ఇళ్లను తొలగించాలని అధికారులు గుర్తించారు. దాదాపు రూ.కోటి వరకు నష్టపరిహారం ఇస్తామని ఆరు నెలల కిందట హామీ ఇచ్చారు. అదే సమయంలో ఈ గ్రామానికి వచ్చిన సబ్కలెక్టర్ కల్పశ్రీ రహదారి పనులు ముందుకు సాగేందుకు సహకరించాలని నిర్వాసితులను కోరారు. ఒక నెలలోనే నష్టపరిహారం అందిస్తామని భరోసా ఇచ్చారు. నెలరోజుల కిందట ఆ మూడు ఇళ్లను తొలగించి, రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఇప్పటి వరకు నష్టపరిహారం అందకపోవడంతో ఇళ్లు కోల్పోయిన బాధితులు, గ్రామస్తులు రహదారి నిర్మాణపనులను, లారీలను అడ్డుకున్నారు. దీంతో స్థానిక ఎస్ఐ నరసింహమూర్తి, పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తులకు ఎస్ఐ సర్ది చెప్పారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళతామని సర్పంచ్ శివ, ఎంపీటీసీ సభ్యుడు సత్యనారాయణ గ్రామస్తులకు నచ్చజెప్పడంతో వారు శాంతించారు.రోడ్డుపై బైఠాయించిన నిర్వాసితులు, గ్రామస్తులు -
114 అంగన్వాడీపోస్టుల భర్తీకి చర్యలు
● నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ సాక్షి,పాడేరు: జిల్లా లోని పాడేరు, రంపచోడవరం, చింతూ రు ఐటీడీఏల పరిధిలో 114 అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ మంగళవారం తెలిపారు.అంగన్వాడీ కార్యకర్తలు 7, ఆయాలు 56, మినీ అంగన్వాడీ కార్యకర్తలు 27, పీఎం జనమన్ పథకంలో కొత్తగా మంజూరైన అంగన్వాడీ కేంద్రాలలో 24 ఆయాల పోస్టులను భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు.అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు బుధవారం నుంచి ఏప్రిల్ 10వతేదీ సాయంత్రం ఐదు గంటల లోగా సంబంధిత ఐసీడీఎస్ అధికారికి నేరుగా గాని, పోస్టు ద్వారాగాని దరఖాస్తులు అందజేయాలని చెప్పారు. పై పోస్టులకు దరఖాస్తు చేసే మహిళలంతా తప్పనిసరిగా పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని, వివాహితలైన, స్థానికంగా నివాసం ఉన్నవారు అర్హులని తెలిపారు. 2025 జులై 1నాటికి అభ్యర్థుల వయస్సు 21ఏళ్ల నుంచి 35సంవత్సరాల లోపు ఉండాలని పేర్కొన్నారు. ఈ వయ స్సు అభ్యర్థులు లేని పక్షంలో 18ఏళ్లు నిండిన అభ్యర్థు దరఖాస్తులను పరిశీలిస్తామని తెలిపారు. ఇది కేవలం ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు కేటాయించిన కేంద్రాలకే వర్తిస్తుందన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణతకు 50 మార్కులు, ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్, ప్రీ స్కూల్ మేనేజ్మెంట్, ఇంటర్మీడియట్ బోర్డు, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల ద్వారా పొందిన ధ్రువీకరణ పత్రాలకు 5 మార్కులు, వితంతువులకు 5 మార్కులు, మైనర్ పిల్లలు ఉన్న అభ్యర్థులకు 5 మార్కులు, పూర్తిగా అనాథ,క్రెచ్ హోమ్,ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తూ సత్ప్రవర్తన కలిగిన వారికి 10 మార్కులు,దివ్యాంగులకు 5 మార్కులు,మౌఖిక పరీక్షకు 20 మార్కులు కలిపి మొత్తం 100 ఉంటాయన్నారు.మార్కుల ఆధారంగా పూర్తి పారదర్శకతతో ఈ పోస్టుల భర్తీ చేయనున్న ట్టు చెప్పారు. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేదని కలెక్టర్ తెలిపారు.ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు మధ్యవర్తులు,దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. పోస్టుల వివరాలు,దరఖాస్తు ప్రక్రియకు అభ్యర్థులు సంబంధిత ఐసీడీఎస్ కార్యాలయాల్లో సంప్రదించాలని కలెక్టర్ తెలిపారు. -
ధ్రువీకరణ పత్రాలపైఅవగాహన కల్పించాలి
● డీఆర్వో పద్మాలత పాడేరు : ధ్రువీకరణ పత్రాల ఉపయోగం, పొందే విధానం, వినియోగంపై గిరిజనులకు అవగాహన కల్పించాలని డీఆర్వో పద్మాలత తెలిపారు. ఐటీడీఏ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా న్యాయసేవల సంస్థ ఆధ్వర్యంలో నెలవారీ అవగాహన సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సమా వేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో అత్యధికంగా గిరిజనులే ఉండటం, వారిలో నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండటంవల్ల అవగాహ న క్యాంపులు, సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. కుల,ఆదాయ,జనన, మరణ ధ్రువీ కరణ పత్రాలజారీలో నిర్లక్ష్యం, జాప్యం లేకుండా సేవలు అందించాలన్నారు.ధ్రువీకరణపత్రాల జారీలో ఏ విధమైన కోర్టు కేసులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపా రు. ఈ పత్రాల జారీ విషయంలో పంచాయ తీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లలకు, గ్రా మ రెవెన్యూ అధికారులకు మార్గదర్శకాలతో కూడిన సర్క్యులర్ జారీ చేయాలని జిల్లా పంచాయతీ, డివిజనల్ పంచాయతీ అధికారులను ఆదేశించారు. డీపీవో లవరాజు, డివిజనల్ పంచాయతీ అధికారి పి.ఎస్.కుమార్, డివిజనల్ అభివృద్ధి అధికారి తేజ్ రతన్, ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ కె.రమేష్ పాల్గొన్నారు. -
నైపుణ్యంతో కూడిన విద్య అవసరం
అడ్డతీగల: భవిత కేంద్రంలోని ప్రత్యేకావసరాల విద్యార్థులకు నైపుణ్యంతో కూడిన విద్యను అందించాల్సిన అవసరం ఉందని జిల్లా విద్యాశాఖ అకడమిక్ మోనిటరింగ్ ఆఫీసర్ కె.భాస్కరరావు చెప్పారు. మంగళవారం అడ్డతీగలలోని భవిత కేంద్రం, ఎమ్మార్సీ సెంటర్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిత విద్యార్థులకు ఆట, పాటలతో పాటు చిత్రలేఖనం, తదితర అంశాల్లో కూడా అవగాహన కల్పించాలన్నారు. ప్రతి రోజు ఐఈఆర్టీలు విధుల కు హాజరై విద్యార్థులకు తగిన రీతిలో తర్ఫీదు ఇవ్వాలన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేయాలని చెప్పారు. ఎమ్మార్సీ సిబ్బందితో సమావేశం నిర్వహించి విద్యా శాఖ కార్యక్రమాలతో పాటు ఉపాద్యాయుల విధులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు క్రోడీకరించుకుని అప్టుడేట్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో పి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
నూకాలమ్మ జాతర
పోదాం పదే యాతర భక్తులకు మూలవిరాట్ దర్శనం లేనట్టే.. అనకాపల్లి టౌన్: ఉత్తరాంధ్రలోనే ప్రఖ్యాతి గాంచిన అనకాపల్లి నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవం ఈ నెల 28, 29 తేదీల్లో అత్యంత వైభవంగా జరగనుంది. 28న జాతర, 29న కొత్త అమావాస్య పండగ, 30న ఉగాది వేడుకలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నెల రోజులపాటు జరగనున్న జాతర ఏప్రిల్ 27వ తేదీతో ముగుస్తుంది. అమ్మవారు కొలువై ఉన్న బాలాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వేసవి కావడంతో ఆలయ పరిసర ప్రాంతాల్లో చలువ పందిళ్లను సిద్ధం చేశారు. మంచినీటి కూలర్లను ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. జాతర ఏర్పాట్లను కలెక్టర్ విజయ కృష్ణన్ సమీక్షించి పలు సూచనలు చేశారు. ఆలయ ఈవో వెంపలి రాంబాబు, ఉత్సవ కమిటీ చైర్మన్ గొల్లబాబు, కమిటీ సభ్యులు ఏర్పాట్లను నిరంతరం పరిశీలిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర పండగగా ప్రకటించిన నేపథ్యంలో మరింత వైభవంగా నిర్వహించనున్నారు. ప్రతి ఏడాది ఆలయ పరిసరాల్లోనే ఈ పండగ వాతావరణం కనిపించేది. ఈసారి పట్టణం నడిబొడ్డున ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో కూడా ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాగణంలో భారీ వేదిక రూపొందించి భక్తులందరికీ కనిపించేలా అమ్మవారి విగ్రహాన్ని నెలకొల్పనున్నారు. ఈ అమ్మవారి విగ్రహానికి రెండు పూటలా ప్రత్యేక పూజలు చేయడానికి కూడా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే స్టేడియం పరిసరాలను పల్లెటూరి వాతావరణం ప్రతిబింబించేలా తీర్చిదిద్దుతున్నారు. జెయింట్వీల్, మూవింగ్ ట్రైన్, రన్నింగ్ షిప్, పిల్లలు ఆడుకొనే వివిధ రకాల వస్తువులు, తినుబండారాల స్టాల్స్ నెలకొల్పనున్నారు. ఆధ్యాత్మికత ప్రతిఫలించేలా సంకీర్తనలు, కోలాటం, జానపద నృత్యాలను నెల రోజులపాటు నిర్వహించనున్నారు. నెల రోజుల జాతర కోసం ఎన్టీఆర్ స్టేడియంలో నెలకొల్పే 12 అడుగుల అమ్మవారి విగ్రహాన్ని మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం గవరపాలెం పురవీధుల గుండా ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. నెల రోజులు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు రాష్ట్ర పండగగా ప్రకటించిన నేపథ్యంలో అధికారుల ప్రత్యేక పర్యవేక్షణ అమ్మవారి దేవస్థానం పునర్నిర్మాణ పనులు గడిచిన రెండేళ్లుగా నిర్విరామంగా చురుగ్గా సాగుతున్నాయి. మధురైలోఉన్న మీనాక్షి అమ్మవారి గుడి తరహాలో నిర్మాణం చేపడుతున్నారు. సుమారు రూ.10 కోట్ల నిధులతో ఆలయం ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. గతంలో ఒకవైపు ప్రధాన గోపురం ఉండేది. ఇప్పుడు మిగిలిన మూడు వైపులా రాజగోపురాలు, అంతరాలయం, అలివేటి మండపం నిర్మిస్తున్నారు. అన్ని హంగులు పూర్తయ్యాక దసరాకు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో గర్భాలయంలో అమ్మవారి మూలవిరాట్ దర్శనం ఈ ఏడాది కూడా లేనట్టయింది. ఈ నేపథ్యంలో భక్తులు బాలాలయంలోనే అమ్మవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. -
ఐదేళ్లలో చదివినఖైదీలను పరిశీలిస్తే..
ఇక్కడ ప్రతి సంవత్సరం చదువుకున్న ఖైదీల సంఖ్య మారుతూ ఉంటుంది. కొత్త వారు రావడం, శిక్ష పూర్తయిన వారు వెళ్లిపోవడం వల్ల ఈ సంఖ్యలో మార్పు ఉంటుంది. గడిచిన ఐదేళ్లలో మొత్తం 55 మంది ఖైదీలు ఓపెన్ పదో తరగతిలో చేరారు. 20 మంది ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు. డిగ్రీ స్థాయిలో బీఏ కోర్సును 29 మంది పూర్తి చేయగా, ఒకరు పీజీలో ఎంఏ పరీక్షలు రాశారు. ● 2020–21లో 80 మంది ప్రాథమిక విద్య, 26 మంది ఓపెన్ టెన్త్, 14 బీఏ చదువుకున్నారు. ● 2021–22లో 90 మంది ప్రాథమిక విద్య, 10 మంది ఓపెన్ టెన్త్, 9 మంది బీఏ విద్యనభ్యసించారు. ● 2022–23లో 82 మంది ప్రాథమిక విద్య, ఆరుగురు బీఏ, ఒకరు ఎంఏ చదివారు. ● 2023–24లో 80 మంది ప్రాథమిక విద్య, 9 మంది ఓపెన్ ఇంటర్మీడియట్ చదివారు. ● 2024–25 (ప్రస్తుతం)లో 90 మంది ప్రాథమిక విద్య కొనసాగిస్తుండగా, 19 మంది ఓపెన్ టెన్త్ పరీక్షలు రాస్తున్నారు. 11 మంది ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు. -
నాలుగేళ్ల బాలికౖపైలెంగిక దాడి
– పోలీసులకు ఆలస్యంగా ఫిర్యాదు ఎటపాక: మండలంలోని గౌరిదేవిపేట పంచాయతీ పరిధిలోని బాడిశవారి గుంపు గ్రామంలో నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడి జరిగింది. ఈఘటనపై ఆలస్యంగా మంగళవారం పోలీసులకు ఫిర్యాదు అందడంతో చింతూరు ఏఎస్పీ పంకజ్కుమార్ మీనా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, విచారణ జరిపారు. గ్రామంలోని నాలుగేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన మడకం చిట్టిబాబు(38) అనే వ్యక్తి ఈనెల 18న లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈఘటనపై బాధిత బాలిక కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలను ఆశ్రయించినా న్యాయం జరగక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ కన్నపరాజు చెప్పారు. -
వడగళ్ల వానతో జీడిమామిడికి నష్టం
రాజవొమ్మంగి: మండలంలోని లాగరాయి, లబ్బర్తి, కిండ్ర, కొత్త కిండ్ర గ్రామాల్లో సోమవారం రాత్రి కురిసిన వడగళ్లవానకు పది మందికి చెందిన దాదాపు మూడు వందల ఎకరాల్లోని జీడిమామిడి తోటల్లో పిందెలు రాలిపోయాయి. ఈదురు గాలులతో పాటు ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. వడగళ్లు పడడంతో పూత, పిందె రాలిపోయి కోలుకోలేని విధంగా దెబ్బతిన్నామని రైతులు గుమ్మిడి అచ్చమ్మ, పాము అప్పారావు, పొట్టబోయిన తాతబ్బాయి, యాదల రాజు తదితరులు కన్నీటి పర్యంతమయ్యారు. రెండు వారాల్లో పంట చేతికి వస్తుందన్న ధీమాతో అప్పులు చేశామని, వాటిని ఏ విధంగా తీర్చాలో తెలియడం లేదని వారు వాపోయారు. ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాలని కోరారు. -
రైలు నుంచి జారిపడి వలస కార్మికుడు మృతి
రాజవొమ్మంగి: పొట్టచేత పట్టుకొని వలస వెళ్లి, తిరిగి స్వగ్రామం వస్తున్న క్రమంలో మండలంలోని బడదనాంపల్లి గ్రామానికి చెందిన పాశిలి మురళీకృష్ణ(23) రైలు నుంచి జారి పడి సోమవారం మరణించాడు. మురళీకృష్ణ నెల్లూరు జిల్లా శివారు ప్రాంతాలకు కొంత మందితో కలసి ఉపాధి కోసం వెళ్లాడు. తిరిగి అక్కడ నుంచి స్వగ్రామం వస్తుండగా మార్గమధ్యలో గూడూరు వద్ద రైలు నుంచి జారి పడినట్టు తోటి కూలీలు తెలిపారు. మురళీకృష్ణ సంఘటన స్థలంలో మృతి చెందగా, మంగళవారం మృతదేహాన్ని స్వగ్రామం తరలించి అంత్యక్రియలు జరిపారు. చేతికి అందివచ్చిన కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు గంగరాజు, నారాయణమ్మలు భోరున విలపించారు. వీరికి ఇద్దరు కుమారులు. వీరు ఇంటర్మీడియెట్ వరకు చదివారు. చిన్న కుమారుడు మురళీకృష్ణ రైలు ప్రమాదంలో మరణించాడు. -
26న ఆర్ ఆండ్ ఆర్ గ్రామసభలు
కూనవరం: మండల పరిధి లోని వాల్ఫర్డ్పేట, కొండ్రాజుపేట, పంద్రాజుపల్లి, కూళ్లపాడు గ్రామాల్లో ఈ నెల 26వ తేదీ ఉదయం 11.00 గంటలకు ఆర్అండ్ఆర్ గ్రామసభలు నిర్వహించనున్నట్టు చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్ సోమవారం తెలిపారు. ఫేజ్ 1బీలో ముంపునకు గురవుతున్న 10 గ్రామాలకు గాను బుధవారం పైన పేర్కొన్న నాలుగు గ్రామాల్లో సభలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సభల్లో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వివరాలు, భూమికి భూమి, ఆర్అండ్ఆర్ కాలనీలకు భూమి కేటాయింపు తదితర అంశాలను వివరించనున్నట్టు పేర్కొన్నారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ పొందేందుకు అర్హుల, అనర్హుల వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే అదే గ్రామసభల్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్కు అర్జీ సమర్పించవచ్చన్నా రు. ఆయా గ్రామస్తులందరూ సభల్లో పాల్గొనాలని పీవో కోరారు. వచ్చే వారం మిగతా మండలాల్లో ముంపునకు గురవుతున్న గ్రామా ల్లో కూడా గ్రామసభలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు ఐటీడీఏ పీవో తెలిపారు. -
రైతు ఉత్పత్తిదారులసంఘాలకు చేయూత
● నాబార్డు డీడీఎం చక్రధర్ చింతపల్లి: గిరిజన ప్రాంతాల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు నాబార్డు ద్వారా ఆర్థిక సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు నాబార్డు జిల్లా మేనేజరు చక్రధర్ తెలిపారు. చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానంలో ఏడు రోజులపాటు తేనెటీగల పెంపకం, తేనె సేకరణపై ఇచ్చిన శిక్షణ సోమవారంతో ముగిసింది. ఈకార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న నాబార్డు డీడీఎం పలు సూచనలు చేశారు. అనంతరం శిక్షణపొందిన రైతులకు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. తేనెటీగల పెంపకాన్ని కుటీర పరిశ్రమగా అభివృద్ధి చేసుకుంటే రైతులకు మంచి లాభదాయకమని ఏడీఆర్ అప్పలస్వామి తెలిపారు. శాస్త్రవేత్తలు సందీప్నాయక్, వెంకటేష్బాబు తదితరులు పాల్గొన్నారు. -
కుటుంబ సభ్యుల చెంతకు మతిస్థిమితం లేని యువకుడు
ఎటపాక : మతిస్థిమితం లేని ఓ యువకుడు తిరుమలలో తప్పిపోయి నెల్లిపాకలో దొరికాడు. వివరాలు.. తిరుమల కొండపై ఓ దుకాణం నిర్వాహకురాలైన బద్రిముని అమ్ములు రాణికి ఇద్దరు కుమారులు. వీరిలో చిన్న కుమారుడు దిలీప్(21) ఈ నెల 17న తిరుమల కొండదిగి వచ్చి ఇంటికి తిరిగి వెళ్లలేదు. అప్పటి నుంచి ఆ యువకుడి ఆచూకీ కోసం చుట్టు పక్కల వెతికినా ప్రయోజనం లేకపోయింది. దిలీప్ వద్ద సెల్ఫోన్ ఉన్నప్పటికీ అతడు ఎక్కడ ఉన్నదీ సరిగా చెప్పలేకపోవడంతో వారు తీవ్ర ఆందోళన చెందారు. ఈనెల 23న ఎటపాక మండలం నెల్లిపాక శివారు ప్రాంతం జాతీయ రహదారిపై నడుచుకుంటూ అనుమానాస్పదంగా కనిపించిన యువకుడిని నెల్లిపాక గ్రామానికి చెందిన ముదిగొండ వినయ్కుమార్ ప్రశ్నించగా తనది తిరుమల అని భద్రాచలం వచ్చి తిరుగుతున్నట్టు చెప్పాడు. కాగా యువకుడికి మతిస్థిమితం లేదని గ్రహించి అతడి వద్ద స్విచ్ఆఫ్ అయిన సెల్ఫోన్కు చార్జింగ్ పెట్టి అందులోని మిస్డ్ కాల్కు ఫోన్ చేయగా అతడి తల్లి ఫోన్ లిఫ్ట్చేసి తన కుమారుడు ఎక్కడ ఉన్నదీ తెలుసుకుని, పరిస్థితిని వివరించింది. దీంతో ఆ యువకుడిని చేరదీసి రాత్రంతా ఉంచి ఉదయం భద్రాచలంలోని సిటీస్టైల్ జిమ్ నిర్వాహకుడు గొంగడి వెంకటరామిరెడ్డి వద్దకు చేర్చాడు. సోమవారం ఉదయం సదరు యువకుడి సోదరుడు ప్రసాద్.. తిరుమల నుంచి భద్రాచలం రావడంతో అతడికి దిలీప్ను అప్పగించడంతో వారు కృతజ్ఞత లు తెలిపారు. -
వాగులు, వంకల వద్ద వీరి నివాసం
కూలి పనులకు వచ్చిన వీరంతా గుంపులు గుంపులుగా వాగుల వద్ద,గోదావరి ఇసుక దిబ్బలపై నివాసం ఉంటారు. నీటి సౌకర్యం ఉన్న చోట గుడారాలు ఏర్పాటు చేసుకుని నివసిస్తారు. వారి వెంట తెచ్చుకున్న ఆహార పదార్థాలను వండుకుని, సూర్యుడు ఉదయించక ముందే వారి వెంట తీసుకుని మిర్చి తోటల్లో కాయలు కోసేందుకు వెళ్లిపోతారు. కొద్ది గంటలు పనులు చేశాక వారి వెంట తెచ్చుకున్న భోజనాన్ని సమానంగా పంచుకుని తోటల్లోనే తింటారు.ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే కొంత సమయం చెట్ల నీడనే సేదతీరి ఆ వెంటనే మళ్లీ పనులకు ఉపక్రమిస్తారు. మళ్లీ సూర్యుడు అస్తమించాక వీరి నివాస ప్రాంతాలకు వెళ్లిపోతారు. -
అదనపు డబ్బులివ్వలేదు..
రంపచోడవరం మండలం చెరువూరుకి చెందిన నాకు 2021–22 సంవత్సరంలో హౌసింగ్ స్కిమ్లో ఇల్లు మంజూరు చేశారు. ఇంటి నిర్మాణం కోసం కొండరెడ్డిలకు రూ.1.80 లక్షలు ఇచ్చారు. చాలా మంది ఇళ్ల నిర్మాణాలను మధ్యలో నిలిపివేశారు. అయితే నేను రూ.1.50 లక్షలు అప్పు చేసి ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నాను. మధ్యలో ఇళ్ల నిర్మాణం నిలిచిపోయిన వారికి ఇటీవల అదనంగా డబ్బులు మంజూరు చేశారు. నాకు మాత్రం ఇవ్వలేదు. స్పందనలో అర్జీ ఇస్తే ఇంటి నిర్మాణం పూర్తయింది కాబట్టి అదనపు డబ్బులు రావంటున్నారు. నేను అప్పుచేసి ఇల్లు నిర్మించడమే పాపమైందా... మాకు న్యాయం చేయాలి . – చోళ్ల చిలకరెడ్డి, చెరువూరు, రంపచోడవరం మండలం -
ఈదురు గాలులు..వడగళ్లు
కొయ్యూరు/రాజవొమ్మంగి: ఒక వైపు ఎండలు మండుతుంటే జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. రెండు గ్రామాల్లో వడగళ్లు పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం వరకూ చండప్రచండగా సూరీడు నిప్పులు చెరగగా, మరిన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమైంది. మధ్యాహ్నం తరువాత ఒక్కసారిగా వర్షం కురిసింది. దాదాపు గంటకు పైగా వాన పడింది. కొయ్యూరు మండలం మంప పంచాయతీ పైడిపనుకులలో సుమారు అరగంట పాటు వడగళ్ల వర్షం కురిసింది. మండలంలో కొన్నిచోట్ల భారీగా, మరికొన్నిచోట్ల ఒక మోస్తారు వర్షం పడింది. ఈదురు గాలులు వీచడంతో చాలా చోట్ల జీడి పిందెలు రాలిపోయాయి. దాదాపుగా ఏడు గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బలిఘట్టం నుంచి కృష్ణదేవిపేట మధ్యలో లైన్ పాడైపోవడంతో ప్రత్యామ్నాయంగా రాజవొమ్మంగి నుంచి విద్యుత్ సరఫరా చేశారు. రాజవొమ్మంగి మండలం కొత్త కిండ్రలో వడగళ్ల వర్షం కురిసింది. మరికొన్ని చోట్ల గంటకు పైగా వర్షం పడింది. ఈ వర్షం ప్రస్తుతం మండలవ్యాప్తంగా వేలాది ఎకరాల్లో సాగవుతున్న రబీ పొగాకు పంటకు మేలు చేస్తుందని రైతులు తెలిపారు. పాడేరు : పట్టణంలో కురిసిన వర్షంతో ప్రజలు ఉమశమనం పొందారు. కొన్ని రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల వరకూ నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. మధ్యాహ్నం 3గంటల సమయంలో అరగంట పాటు వర్షం కురవడంతో పట్టణవాసులు సేదతీరారు. గూడెంకొత్తవీధి: గూడెంకొత్తవీధి మండలంలో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకూ ఎండ కాసింది. సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడి పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. విద్యుత్ సరఫరా కొద్దిసేపు నిలచిపోయింది. ఈ వర్షాలు కాఫీ తోటలకు అనుకూలమని ఆర్వీనగర్ కాఫీ పరిశోధనాస్థానం శాస్త్రవేత్తలు తెలిపారు. జి.మాడుగుల(పాడేరు రూరల్): మండలంలోని పలు ప్రాంతాల్లో సోమవారం వర్షం పడింది.కొత్తపల్లి జలపాతం ప్రాంతంతో పాటు జి.మాడుగుల, బంధవీధి, సొలభం, గడుతురు తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షం రెండు ప్రాంతాల్లో వడగళ్ల వాన గాలులకు రాలిన జీడిమామిడి పిందెలు -
మావోయిస్టులకు వ్యతిరేకంగా ర్యాలీ
వై.రామవరం: స్థానిక వారపుసంతలో మండల లోతట్టు గ్రామాలనుంచి వచ్చిన ప్రజల ఆధ్వర్యంలో సోమవారం మావోయిస్టులకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. తమకు మావోయిజం వద్దని, అభివృద్ధే ముఖ్యమని నినాదాలు చేస్తూ ర్యాలీ జరిపారు. గతంలో మావోయిస్టులు అడ్డుకోవడంతో మారుమూల ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం, సెల్ టవర్ల నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయని తెలిపారు. మారుమూల ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకో వద్దని కోరారు. అనంతరం మానవహారం నిర్వహించారు. ఇకపై ఎవరూ మావోయిస్టు పార్టీలోకి వెళ్లమని ప్రతిజ్ఞ చేశారు. -
ఆహారపు అలవాట్లు
వలస కూలీలు వారి వెంట తెచ్చుకున్న దంపుడు,రేషన్ బియ్యాన్నే అన్నం వండేందుకు వాడతారు.అన్నంలో వేసుకునేందుకు చింత పండు పులుసునే నిత్యం తయారు చేసుకుంటారు. ఘాటుగా ఉండే పచ్చిమిరపకాయలను బండపై నూరి దానినే అన్నంలో కలుపుకొనిఎంతో ఇష్టంగా తింటారు.రైతులు దయతలచి వారానికోమారు ఇచ్చే జుట్టు కోళ్లను(లగ్గారం) కోసుకుని తింటారు. వీరికి నీటి గుంటలు,సెల యేళ్లు,సాగునీటి పైపుల వద్ద నీటితోనే స్నానాలు చేయడం అలవాటు. కొందరు ఆ నీటినే తాగుతుంటారు.రాత్రి భోజనాల అనంతరం వారి సంప్రదాయ నృత్యాలతో సందడిచేసి నిద్రకు ఉపక్రమించడం వీరి దినచర్య. ఇలా వారు పిల్లా పాపలతో కలిసి మిర్చి కోతలు పూర్తి అయిన తరువాత కూలి పనులకు వచ్చిన సొమ్ములు,మిర్చి కాయలను భద్రంగా దాచుకుని తిరిగి వారి స్వ గ్రామాలకు పయనమవుతారు.ఇలా వలస కూలీలనే నమ్ముకుని ఇక్కడి రైతులు మిర్చి,పొగాకు సాగు చేస్తుంటారు.వీరు ఇక్కడ కూలి పనులకు ఉన్నంత కాలం పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంటుంది. చిరు దుకాణాల వ్యాపారాలు మంచిగా సాగుతాయి. -
ఆర్థిక తగాదాలతో తమ్ముడిని హత్యచేసిన అన్న
మారేడుమిల్లి: ఆర్థికలాదాదేవీల్లో ఏర్పడిన తగాదాల కారణంగా సొంత తమ్ముడిని ఓ అన్న హత్యచేశాడు. ఎస్ఐ సాధిక్ తెలిపిన వివరాలు.. మారేడుమిల్లి మండలం తాడేపల్లి పంచాయతీ పరిధిలోని నీలవరం గ్రామానికి చెందిన తుమ్ముడు సుగ్గిరెడ్డి (40), తుమ్మడు లచ్చిరెడ్డి అన్నదమ్ములు. వీరు 2002 సంవత్సరంలో ఉమ్మడిగా ఓ వ్యాన్ను కొనుగోలు చేశారు. అప్పట్లో ఆ వ్యాన్ ప్రమాదానికి గురైంది. వ్యాన్ మరమ్మతులకు గురికావడంతో ఇద్దరికీ నష్టం వచ్చింది. నష్టాన్ని ఇద్దరూ సమానంగా భరించాలని ఒప్పంద కుదుర్చుకున్నారు. అయితే అప్పటి నుంచి ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలపై తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం సుగ్గిరెడ్డి, లచ్చిరెడ్డి గ్రామ సమీపంలోని జీలుగు కల్లు చెట్టు వద్దకు వెళ్లి కల్లు తాగారు. ఈ సమయంలో వారి మధ్య ఆర్థిక లావాదేవీలపై మళ్లీ గొడవ జరిగింది. అనంతరం ఇంటికి తిరిగి వెళ్లిపోయారు. కొంత సమయం తరువాత సుగ్గిరెడ్డిని అన్నయ్య లచ్చిరెడ్డి జీలుగు కల్లు చెట్టు వద్దకు తీసుకువెళ్లాడు. అక్కడ బాణంతో సుగ్గిరెడ్డిని కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో సుగ్గిరెడ్డి మృతి చెందాడు. ఈ విషయం సోమవారం పోలీసులకు తెలిసింది. సీఐ గోపాల్ కృష్ణ, మారేడుమిల్లి, గుర్తేడు ఎస్ఐలు సాధిక్, పార్ధసారథి సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించి, కేసు నమోదు చేసి, నిందితుడు లచ్చిరెడ్డిని అరెస్టు చేశారు. పోస్టుమార్టానికి సుగ్గిరెడ్డి మృతదేహాన్ని రంపచోడదవరం ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు ఎస్ఐ సాధిక్ తెలిపారు. -
వలస జీవన సౌందర్యం
విలక్షణం.. శ్రమలోనే ఉంది అసలైన జానపదం.. శ్రమలోనే ఉంది ఐకమత్యం.. శ్రమలోనే ఉంది అలుపెరగని జీవనపోరాటం.. శ్రమయేవ జయతే.. అదే వీరి నినాదం. అందుకే రాష్ట్రాలు దాటి వీరి ప్రయాణం..పని కోసం భారం, దూరం లెక్క చేయని నైజం.. పనిలోనే ఆనందాన్ని దర్శిస్తూ సాగుతుంది ఒడిశా ఆదివాసీల జీవనయానం.. ● రాష్ట్రాలు దాటి పనికోసం.. ఆదివాసీల ప్రయాణం ● వాగులు, వంకలు, ఇసుక తిన్నెల్లోనే నివాసాలు ● మూడు నెలలు ఇక్కడే పనులు ● తిరుగు ప్రయాణంలో కూలీలు ● సుమారు 10వేల మంది ప్రతి ఏటా రాక వలస కూలీల బతుకు చిత్రం ఎటపాక: కాయకష్టం వారికిష్టం..చిన్నా పెద్దా తేడాలుండవు..సమష్టిగా పనిచేయడం వచ్చిన దానినే అంతా సమానంగా పంచుకోవడం వీరి నైజం. కల్మషం లేని హృదయాలు వీరివి. వీరంతా వలస కూలీలు. పొరుగున ఉన్న ఛత్తీస్గఢ్,ఒడిశా రాష్ట్రాల నుంచి ఏటా కూలి పనుల కోసం ఇక్కడకి వలస వచ్చి, మూడునెలల పాటు ఇక్కడే జీవనం సాగిస్తారు. ఎటపాక,కూనవరం,వీఆర్పురం మండలాలతో పాటు తెలంగాణాలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల,వెంకటాపురం,వాజేడు మండలాలు,ఏలూరు జిల్లాలోని కుక్కునూరు,వెలేరుపాడు మండలాల్లో మిర్చి పంటను సుమారు10 వేల ఎకరాల్లో సాగుచేస్తారు. అయితే మిర్చి కోతలకు జనవరి నెల ప్రారంభంలోనే కుటుంబ సమేతంగా తిండిగింజలు పట్టుకుని పొరుగు రాష్ట్రాల నుంచి ఇక్కడకు వస్తారు. వీరిని ఇక్కడకు తీసుకొచ్చేందుకు రైతులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.ఎందుకంటే వీరొస్తేనే మిర్చి, పొగాకు పంటలు చేతికొచ్చేది. వేల మంది వలస కూలీలు ఈ నెలాఖరు వరకు ఇక్కడే ఉండి కూలి పనులు చేసుకుంటారు. -
మౌలిక వసతుల కోసం గిరిజనుల నిరసన
రావికమతం: కనీస మౌలిక వసతులు కల్పించాలంటూ మండలంలో చీమలపాడు పంచాయతీ సామాలమ్మ కొండపై జీలుగులోవ గ్రామంలో పీవీటీజీ తెగకు చెందిన 8 గిరిజన కుటుంబాలు ఆదివారం ఆందోళనకు దిగాయి. కనీస సౌకర్యాలు లేవని గతంలో వివిధ పత్రికల్లో ప్రచురితమైన కథనాలకు జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు గిరిజన గ్రామాన్ని సందర్శించి కొండ కిందకు వస్తే అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీనికి గిరిజనులు అంగీకరించారు. వీరికి చీమలపాడు రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 169లో 30 సెంట్ల స్థలాన్ని కేటాయించారు. అయితే ఇప్పటికీ పట్టాలు ఇవ్వలేదు. కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదు. దీంతో చాలా ఇబ్బందులకు గురై గతంలో సీదరి వెంకట్రావు(50), కొర్రా బాబూరావు(45)మృతి చెందారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కనీస సౌకర్యాలు కల్పించానలి డిమాండ్ చేస్తూ ఆదివారం గిరిజనులు రోడ్డెక్కారు. మంగళవారం రావికమతం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు గోవిందరావు, కొర్రా బాలరాజు, సీదరి బాలరాజు తెలిపారు. -
ఆఖరి నిమిషంలో.. హంగామా
ఎంవీపీకాలనీ: ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న సమయంలో జిల్లా బీసీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాలు మంజూరుకు దరఖాస్తులు ఆహ్వానించడం దుమారం రేపింది. 2024–2025 ఆర్థిక సంవత్సరానికి గానూ స్వయం ఉపాధి కోసం బీసీ, ఈబీసీ, కాపు, బ్రాహ్మణ, కమ్మ, ఆర్యవైశ్య ఇలా ఆ కార్పొరేషన్ పరిధిలోని అనేక అనుబంధ కార్పొరేషన్ల ద్వారా జిల్లాలోని వెనుకబడిన తరగతుల వారికి రుణాలు మంజూరు చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఈ నెల 11న నోటిఫికేషన్ విడుదల చేసి, తొలుత దరఖాస్తులకు 22వ తేదీని చివరి తేదీగా పేర్కొంది. అయితే, తాజాగా మరో మూడు రోజులు దరఖాస్తు గడువును పొడిగించింది. గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలను నిలిపివేసిన కూటమి ప్రభుత్వం, ఏడాది మొత్తం వదిలేసి ఆర్థిక సంవత్సరం ముగింపు సమయంలో రుణాల నోటిఫికేషన్ విడుదల చేయడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా, గడువును పొడిగించడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ రుణాలు లబ్ధిదారులకు అందుతాయా లేదా కేవలం ప్రచారం కోసమే కూటమి ప్రభుత్వం ఈ నోటిఫికేషన్తో హడావిడి చేస్తుందా అనే ప్రశ్నలు లబ్ధిదారుల నుంచి సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. 20,914 మంది దరఖాస్తులు స్వయం ఉపాధి, జనరిక్ ఫార్మసీలు, వివిధ కులవృత్తులకు ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో 2024–2025 ఆర్థిక సంవత్సరానికి గానూ బీసీ కార్పొరేషన్ ఈ నోటిఫికేషన్ను విడుదల చేసింది. నోటిఫికేషన్ విడుదలైన 11 రోజుల్లోనే జిల్లా వ్యాప్తంగా 20,914 ఆన్లైన్ దరఖాస్తులు(శనివారం సాయంత్రం 4 గంటల వరకు) వచ్చినట్లు బీసీ కార్పొరేషన్ కార్యాలయం తెలిపింది. ప్రభుత్వం కేవలం 6,032 యూనిట్ల మంజూరు లక్ష్యాన్ని నిర్దేశించగా, వచ్చిన దరఖాస్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. మరోవైపు ఆర్థిక సంవత్సరం ముగియడానికి వారం రోజులే ఉండటంతో, ఈ భారీ సంఖ్యలో వచ్చిన దరఖాస్తుల పరిశీలన, అర్హుల ఎంపిక ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి కార్పొరేషన్ ద్వారా మంజూరు చేసే రుణాల ప్రక్రియ ప్రతి సంవత్సరం మార్చి నాటికి పూర్తవుతుంది. ఆ తర్వాత కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కొత్త నోటిఫికేషన్లు విడుదల చేస్తారు. అయితే ఈసారి మాత్రం 2024–2025 సంవత్సరానికి సంబంధించిన రుణాల ప్రక్రియను మార్చి చివరిలో ప్రారంభించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. దీనికి తోడు, కేవలం 11 రోజుల వ్యవధిలో 20 వేలకు పైగా దరఖాస్తులు రావడం వెనుక కూటమి నాయకుల హస్తం ఉందనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ హడావుడి నోటిఫికేషన్ ద్వారా తమకు కావాల్సిన వారికే రుణాలు మంజూరు చేయించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ రుణాల మంజూరు ప్రక్రియలో పారదర్శకత లోపించే అవకాశం ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీసీ కార్పొరేషన్ రుణాల మంజూరులో గందరగోళం ఆర్థిక సంవత్సరం ముగింపు సమయంలో హడావుడిగా నోటిఫికేషన్ 2024–25 ఏడాది సబ్సిడీ రుణాలంటూ దరఖాస్తుల ఆహ్వానం ప్రభుత్వ తీరు, రుణాల మంజూరుపై సర్వత్రా అనుమానాలు షెడ్యూల్ ప్రకారం పూర్తిచేస్తాం ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం రుణాల మంజూరు ప్రక్రియను పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 27 నాటికి రుణాలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. మే 1 నాటికి మంజూరు ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలి. మే 11 నాటికి జియోట్యాగింగ్, మే 21 నాటికి వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలనే ఆదేశాలతో ముందుకు సాగుతున్నాం. ఆర్థిక సంవత్సరం ముగింపు సమయంలో నోటిఫికేషన్ విడుదలైన విషయం వాస్తవమే. అందుకే రెండు నెలల్లో మొత్తం ప్రక్రియ పూర్తి చేసేలా ప్రభుత్వం షెడ్యూల్ రూపొందించింది. – శ్రీదేవి, ఈడీ బీసీ కార్పోరేషన్ -
అప్పన్నకు ఘనంగా ఆర్జిత సేవలు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం ఆర్జిత సేవలు విశేషంగా జరిగాయి. ఉదయం 7 నుంచి స్వర్ణపుష్పార్చన ఘనంగా నిర్వహించారు. ఆలయ కల్యాణమండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం జరిపారు. 108 స్వర్ణ సంపెంగలతో అష్టోత్తర శతనామావళి పూజ నిర్వహించారు. ఉభయదాతలకు స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాలను అందించారు. ఆలయ ఏఈవో ఎన్.ఆనంద్కుమార్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. వైభవంగా నిత్యకల్యాణం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం నిత్యకల్యాణం వైభవంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను అధిష్టింపజేశారు. ఉదయం 9.30 నుంచి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని జరిపారు. ఉభయదాతలకు స్వామివారి అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రాలను అందించారు. -
గృహాల బిల్లుల మంజూరుకు అక్రమ వసూళ్లు తగదు
ముంచంగిపుట్టు: మండలంలోని కర్రిముఖిపుట్టు పంచాయతీ కంగువీధి, నందిమెట్ట గ్రామాల్లో సీపీఎం ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్రను ఆదివారం నిర్వహించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పీఎం జన్మన్ గృహాల బిల్లుల మంజూరుకు హౌసింగ్ ఇన్స్పెక్టర్ కృష్ణ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని గ్రామస్తులు సుందరావు, భగత్రాం, మంగన్న తదితరులు తమ సమస్యను నేతలకు విన్నవించారు. ఈ సందర్భంగా నాయకులు నారాయణ, జీనబంధు మాట్లాడుతూ గృహాల నిర్మాణాల కోసం గిరిజనులు అప్పులు చేస్తున్నారన్నారు. బిల్లుల మంజూరు పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న హౌసింగ్ ఇన్స్పెక్టర్ కృష్ణపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి నిరసన తెలిపారు. నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
ఇన్పుట్ ట్యాక్స్ స్వాహా!
సిబ్బంది చేతివాటం ? ఫేక్ ఇన్వాయిస్లు సృష్టిస్తున్న కొందరు నకిలీ వ్యాపారులకు కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ కార్యాలయాల్లోని కొందరు దిగువ స్థాయి సిబ్బంది సహకారం అందుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫేక్ ఇన్వాయిస్లను పక్కాగా ఎలా తయారు చేయాలి..? వాటిని ఏ సమయంలో సమర్పిస్తే.. ఎవరికీ అనుమానం రాకుండా పూర్తిస్థాయిలో వెరిఫికేషన్ జరగదు.. ఎలా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని సొంతం చేసుకోవచ్చు.. ఇలా.. సమగ్ర వివరాలతో స్కెచ్ వేస్తూ.. సక్రమంగా అమలయ్యేటట్లుగా ప్లాన్ చేస్తున్నారు. ఫైల్స్ తమ దగ్గర నుంచే వెళ్లేలా చూస్కోని ఎవరికీ అనుమానం రాకుండా ఇన్పుట్ని కొట్టేస్తూ.. చెరిసగం పంచేసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాక్షి, విశాఖపట్నం : నకిలీ ఇన్వాయిస్ల పేరుతో మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఫేక్ కంపెనీల పేరుతో పన్నుల చెల్లింపును ఎగవేసేలా వ్యూహాల్ని అమలు పరుస్తున్నారు. కొన్ని కంపెనీలు చిన్న చిన్న తప్పులతో దొరికిపోతుంటే.. చాలా మంది వ్యాపారులు మాత్రం దర్జాగా ఇన్పుట్ క్రెడిట్ని తమ ఖాతాల్లోకి జమ చేసుకుంటున్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటిలిజెన్స్(డీజీజీఐ) విశాఖపట్నం జోనల్ యూనిట్ పరిధిలో దాదాపు 380కి పైగా నకిలీ కంపెనీల గుట్టు రట్టు చేసి రూ.300 కోట్లుకు పైగానే రికవరీ చేశారు. అయినా ఫేక్ కంపెనీలు నకిలీ ఇన్వాయిస్లతో రెచ్చిపోతున్నాయి. ఖజానాకు చిల్లు! ముఖ్యంగా స్టేట్ ట్యాక్స్ కార్యాలయంలోని కొందరు సిబ్బందితో పాటు సూర్యాబాగ్, సిరిపురం, ద్వారకానగర్, డాబాగార్డెన్స్, కురుపాం మార్కెట్, గాజువాక, అనకాపల్లి, చినవాల్తేరు సర్కిల్స్ పరిధిలో ఈ తరహా నకిలీ ఇన్వాయిస్లు ఎక్కువగా సృష్టించి.. ఇన్పుట్ క్రెడిట్ కుంభకోణంతో ఖజానాకు చిల్లు పెడుతున్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కంపెనీల్ని గుర్తిస్తున్నా.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని మాత్రం.. ఏదో ఒక రూపంలో.. మోసం చేస్తూనే ఉన్నారు. కేవలం వ్యాపారుల వైపు నుంచి మాత్రమే ఉన్నతాధికారులు దృష్టిసారిస్తుండటంతో.. ఇంటిదొంగలెవరూ పూర్తిస్థాయిలో దృష్టి సారించకపోవడంతో.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఫేక్ కంపెనీలతో నకిలీ ఇన్వాయిస్ల సృష్టి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని సొంతం చేసుకునేందుకు వ్యాపారుల కుయుక్తులు విశాఖ డివిజన్ పరిధిలో రూ.కోట్లలో మోసాలు సహకరిస్తున్న కొందరు జీఎస్టీ సిబ్బంది ‘ఇన్పుట్’ను చెరో సగం పంచుకుంటున్న వైనం -
ప్రాణం తీసిన ఈత సరదా
పెందుర్తి: వారాంతంలో స్నేహితులతో సరదాగా గడుపుదామని పార్టీకి వెళ్లిన ఓ వ్యక్తి మేహాద్రి రిజర్వాయర్ కాలువలో అసువులు బాశాడు. స్నేహితులతో సరదాగా ఈతకు దిగిన డబ్బీరు సాయిక్రాంతి(28) అనే వ్యక్తిని మృత్యువు కబళించింది. సీఐ కె.వి.సతీష్కుమార్ తెలిపిన వివరాలివి. గోపాలపట్నం సమీపంలోని బుచ్చిరాజుపాలేనికి చెందిన 9 మంది స్నేహితులు కోటనరవ సమీపంలోని ఎంఈఎస్ పంపు హౌస్ సమీపంలో ఉన్న మేహాద్రి రిజర్వాయర్ కాలువ వద్దకు పిక్నిక్కు వెళ్లారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో అందరూ కలిసి స్నానాలకు కాలువలో దిగారు. అయితే డబ్బీరు సాయిక్రాంతి ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. ఆందోళనకు గురైన స్నేహితులు పెందుర్తి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తక్షణమే గజ ఈతగాళ్లను రప్పించి సాయిక్రాంతి కోసం గాలించారు. మృతదేహాన్ని నీటిలో నుంచి బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు. -
● విశాఖ తీరంలో మరో ఆకర్షణ
ఏయూక్యాంపస్: సాగరతీరంలో మరో పర్యాటక ప్రాజెక్ట్ సిద్ధమవుతోంది. బీచ్ రోడ్డులో ఇప్పటికే ఉన్న టీయూ–142 యుద్ధ విమాన మ్యూజియం పక్కనే యూహెచ్–3 హెచ్ హెలికాప్టర్ మ్యూజియం తుది మెరుగులు దిద్దుకుంటోంది. వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో దాదాపు రూ. 2.2 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. భారత నావికాదళంలో 17 ఏళ్లపాటు అవిరళంగా సేవలందించిన ఈ హెలికాప్టర్ను కొద్ది నెలల కిందట విశ్రాంతినిచ్చారు. విపత్తుల సమయంలోనూ, తీర ప్రాంత భద్రతలోనూ ఇది ఎంతో కీలక పాత్ర పోషించింది. దీని ప్రాముఖ్యాన్ని గుర్తించిన వీఎంఆర్డీఏ .. భారత నావికాదళ సత్తాను చాటి చెప్పేలా, పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచేలా ఈ మ్యూజియాన్ని తీర్చిదిద్దుతోంది. ప్రస్తుతం ఈ ప్రాంగణంలో సుందరీకరణ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. రానున్న రెండు వారాల్లో దీనిని ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. హెలికాప్టర్ చుట్టూ పచ్చని లాన్లు, ప్రత్యేకమైన మొక్కలు, ఆకర్షణీయమైన నీటి ఫౌంటెన్లను ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో విద్యుత్ కాంతుల్లో మరింత అందంగా కనిపించేలా దీని చుట్టూ అద్దాల నిర్మాణం చేపట్టారు. త్వరలోనే సందర్శన వేళలు, టికెట్ ధరల వివరాలను వీఎంఆర్డీఏ ప్రకటించే అవకాశం ఉంది. నేటి యువతరం సెల్ఫీలు, ఫొటోల పట్ల చూపిస్తున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని మ్యూజియం లోపలి భాగాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. తుది దశకు హెలికాప్టర్ మ్యూజియం పనులు -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
వై.రామవరం: మండలంలోని కె.యర్రగొండ గ్రామ శివారు అటవీప్రాంతంలో అదే గ్రామానికి చెందిన మిరియాల సంకురుదొర(44) అనే వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. ఎస్ఐ బి. రామకృష్ణ తెలిపిన వివరాలు... సంకురుదొర ఈనెల 20న కల్లు తాగడానికి చెట్టు వద్దకు వెళ్లాడు. ఈ నెల 22న శవమై కనిపించాడు. మృతుని భార్య భూమమ్మ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. సీఐ బి.నరసింహమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు శనివారం సాయంత్రం సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, మృతదేహాన్ని అడ్డతీగల తరలించి, సీహెచ్సీ సూపరింటెండెంటు డాక్టర్ రాహుల్ ఆధ్వర్యంలో పోస్టుమార్టం చేశారు. కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. -
కదం తొక్కిన ఉక్కు కాంట్రాక్టు కార్మికులు
గాజువాక : స్టీల్ప్లాంట్లో కాంట్రాక్టు కార్మికుల తొలగింపును నిరసిస్తూ ఆదివారం భారీ పాదయాత్ర నిర్వహించారు. ఉపాధి రక్షణ యాత్ర పేరుతో విశాఖ ఉక్కు అఖిలపక్ష కాంట్రాక్టు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పాదయాత్రలో కాంట్రాక్టు కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కొత్తగాజువాక జంక్షన్లో ప్రారంభమైన ఈ పాదయాత్ర గాజువాక మెయిన్రోడ్, పాతగాజువాక, శ్రీనగర్ మీదుగా కూర్మన్నపాలెంలోని ఉక్కు కార్మికుల దీక్షా శిబిరం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్రెడ్డి మాట్లాడుతూ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్సీపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. కాంట్రాక్టు కార్మికులను తొలగించడం దారుణమని, వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి పార్టీలను నమ్మి పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చిన కార్మికులకు కూటమి ప్రజాప్రతినిధులు మద్దతు నిలవకపోవడం సరికాదన్నారు. కష్టంలో ఉన్న కాంట్రాక్టు కార్మికులకు అండగా నిలవాలని సూచించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ మాట్లాడుతూ స్టీల్ప్లాంట్ను అమ్మడానికి, కార్మికులను తొలగించడానికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించిందన్నారు. స్టీల్ప్లాంట్లో పూర్తిస్థాయి ఉత్పత్తి సాధించడానికి ఆ ప్యాకేజీ వల్ల ఎలాంటి ఉపయోగంలేదన్నారు. స్టీల్ప్లాంట్ను కాపాడుతామని, నిర్వాసితులకు ఉపాధి ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన కూటమి నాయకులు ఎన్నికల్లో గెలిచిన తరువాత మొహం చాటేస్తున్నారన్నారు. ఉక్కు పరిరక్షణ కమిటీ కన్వీనర్ జె.అయోధ్యరామ్ మాట్లాడుతూ ప్లాంట్ కోసం కార్మికులు 1500 రోజుల నుంచి ఉద్యమం చేస్తే కేంద్ర ప్రభుత్వం రూ.11,400 కోట్లు ప్యాకేజీ ఇచ్చిందన్నారు. ఇప్పుడు ఐదు వేల మంది కాంట్రాక్టు కార్మికులను రోడ్డుపైకి నెట్టేయడం కోసం ప్రయత్నిస్తోందన్నారు. అందులోభాగంగా ఇప్పటికే వెయ్యి మందిని బయటకు పంపేసిందన్నారు. సెయిల్లో కలపడానికి గాని, సొంత గనులు కేటాయించడానికి గాని కేంద్ర ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదని, అయినప్పటికీ ప్రభుత్వం ఆ పని చేయకుండా ఉద్యోగులను తొలగిస్తోందన్నారు. కార్మికుల తొలగింపును ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, విశాఖ స్టీల్ప్లాంట్ అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. గాజువాక నుంచి కూర్మన్నపాలెం వరకు ఉపాధి రక్షణ పాదయాత్ర తొలగించిన కాంట్రాక్టు కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ -
విశాఖలో సినిమా నిర్మిస్తే హిట్టే..
అల్లిపురం: విశాఖలో ఏ చిత్రం నిర్మించినా విజయం సాధిస్తుందనే సెంటిమెంట్ తనకు ఉందని హీరో ప్రదీప్ మాచిరాజు అన్నారు. విశాఖ, అరకు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఆయన తాజా చిత్రం ‘అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి’ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆదివారం హీరోయిన్ దీపిక, యూనిట్ నగరంలో సందడి చేసింది. ఈ సందర్భంగా ఓ హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రదీప్ మాట్లాడారు. లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపుదిద్దుకుందన్నారు. ఉదిత్ నారాయణ్ ఆలపించిన ‘ఎవ్వడో ఈడి కొచ్చినాడు సూడు’ అనే సూపర్హిట్గా నిలిచిందన్నారు. ఏప్రిల్ 11న వేసవిలో విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ రాసిన సాహిత్యం అద్భుతంగా ఉందని, సిద్ శ్రీరామ్ తన గాత్రంతో ఓ పాటను మరింత శ్రావ్యంగా ఆలపించారని కొనియాడారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం నేరమని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. హీరోయిన్ దీపిక మాట్లాడుతూ ఈ సినిమా కథ తన పాత్ర చుట్టూ తిరుగుతుందని, ప్రేక్షకులందరూ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. -
చందనోత్సవం సీఎఫ్వోగా భ్రమరాంబ
సింహాచలం : సింహగిరిపై వచ్చే నెల 30న జరిగే చందనోత్సవానికి దేవదాయశాఖ తరపున చీఫ్ ఫెస్టివల్ అధికారిగా ఆ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ దర్భముళ్ల భ్రమరాంబ నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం దేవదాయశాఖ ప్రధానకార్యాలయం అడిషనల్ కమిషనర్ టి.చంద్రకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అమరావతిలో దేవదాయశాఖ ప్రధాన కార్యాలయంలో ఆర్జేసీగా విధుజీలు నిర్వర్తిస్తున్న భ్రమరాంబ మూడుసార్లు సింహాచలం దేవస్థానం ఇన్చార్జి ఈవోగాను, 2022 చందనోత్సవంలో చీఫ్ ఫెస్టివల్ అఽధికారిగా విధులు నిర్వర్తించారు. -
పనస కాయల లోడ్ వ్యాన్ బోల్తా గిరిజన మహిళ మృతి
ముంచంగిపుట్టు : మండలంలో రంగబయలు పంచాయతీ కోసంపుట్టు గ్రామ సమీపంలో గల ఘాట్రోడ్డులో పనసకాయల లోడుతో వెళుతున్న వ్యాన్ బ్రేకులు ఫెయిల్ అవడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా నందపూరు బ్లాక్ తుభ గ్రామానికి చెందిన కిల్లో కుమ్మి(42) అనే గిరిజన మహిళ మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రానికి చెందిన వ్యాపారులు ఆదివారం రంగబయలు పంచాయతీ కోసంపుట్టు, పట్నపడాల్పుట్టు, జోడిగుమ్మ గ్రామాల్లో పసనకాయలను కొనుగోలు చేసి, వ్యాన్లో లోడు చేసుకొని వస్తుండగా కోసంపుట్టు ఘాట్రోడ్డు ఎక్కుతుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వ్యాన్ వెనుక ఉన్న కిల్లో కుమ్మి కింద పడిపోయింది.ఆమె మీద వ్యాన్ బోల్తా పడింది. వాహనం కింద నలిగిపోయి ఆమె మృతి చెందింది. వ్యాన్ డ్రైవర్,పనసకాయల కొనుగోలుదారులు అక్కడ నుంచి పరారయ్యారు. స్థానికులు ఎంత ప్రయత్నించినా వ్యాన్ కింద నుంచి మహిళ మృతదేహాన్ని బయటకు తీయలేకపోయారు. స్థానిక ఎంపీటీసీ సిరగం భాగ్యవతి సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి,వివరాలు సేకరించారు. మృతురాలి కుటుంబ సభ్యులకు ఫోన్లో సమాచారం అందించారు. వాహనం ఎక్కడిది,పనసకాయల కొనుగోలుదారులు ఎక్కడివారు అనేది తెలియాల్సి ఉంది.ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, వివరాలు సేకరించి కేసు నమోదు చేస్తామని ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. గత రెండు నెలల వ్యవధిలో కోసంపుట్టు ఘాట్రోడ్డులో మూడు సార్లు వాహనాలు బోల్తా పడినట్టు స్థానికులు తెలిపారు.రంగబయలు పంచాయతీ కోసంపుట్టు ఘాట్రోడ్డులో ఘటన -
బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిసే కఠిన చర్యలు
అనంతగిరి(అరకులోయటౌన్): బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారితోపాటు వారికి సహకరించిన వారిపై కూడా కఠిన చర్యలు తప్పవని అరకులోయ ఇన్చార్జి జడ్జి ధర్మారావు అన్నారు. మండలంలోని కొత్తూరు కస్తూర్బా గాంధీ విద్యాలయం (కేజీబీవీ)లో మండలం న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్పై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. బాలికల పట్ల ఎవరైనా చెడుగా ప్రవర్తిస్తే టీచర్లకు గాని, తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు. పిల్లలు సోషల్ మీడియాకు, సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని సూచించారు. వేసవి సెలవుల్లో ఇళ్లకు వెళ్లే విద్యార్థులు తల్లిదండ్రులు చేసే పనుల్లో నిమగ్నమైతే కష్టసుఖాలు తెలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సుశీల పాల్గొన్నారు.ఇన్చార్జి జడ్జి ధర్మారావు -
తాటి పరిశోధనలతో గిరిజనులకు లబ్ధి
రంపచోడవరం: పందిరిమామిడి ఉద్యాన పరిశోధన స్థానంలో తాటి చెట్లు, వాటి ఉత్పత్తులపై చేపట్టిన పరిశోధనలు సత్ఫాలితాలను ఇవ్వడంతో గిరిజనులకు లబ్ధి చేకూరుతోందని అఖిల భారత తాటి పరిశోధన పథకం కోఆర్డినేటర్ డాక్టర్ అగస్టీన్జెరార్ట్ అన్నారు. రంపచోడవరం సమీపంలోని పందిరిమామిడి డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వన పరిశోధన స్థానాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా హెచ్ఆర్ఎస్లో పరిశోధనల కోసం నాటిన తాటి వనాలను పరిశీలించారు.అనంతరం హెచ్ఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త,అధిపతి డాక్టర్ పి.సి.వెంగయ్యతో సమావేశమై తాటి పరిశోధనలపై చర్చించారు. తరువాత ఇసుకపట్ల గ్రామాన్ని సందర్శించి నీరా సేకరణ, తాటి బెల్లం తయారీని పరిశీలించారు. గిరిజన ఉపప్రణాళికలో భాగంగా నీరా సేకరణ బాక్సులు,మొక్కలను గిరిజన యువలకు, మహిళలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాస్త్రవేత్త డాక్టర్ ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత తాటి పరిశోధన పథకం కోఆర్డినేటర్ అగస్టీన్ -
జల కళ తప్పుతున్న మత్స్యగెడ్డ
ముంచంగిపుట్టు: నిత్యం నిండుకుండలా ఉండే మత్స్యగెడ్డలో జలకళ తగ్గుతోంది. మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీరు అందించే జోలాపుట్టు జలాశయం మత్స్యగెడ్డ నీటి నిల్వపైనే ఆధారపడి ఉంటుంది. ఎండల కారణంగా మత్స్యగెడ్డలో నీటి ప్రవాహం తగ్గుతోంది. సుజనకోట, పెదగూడ, దార్రెల, పనసపుట్టు, దొడిపుట్టు పంచాయతీల గుండా ప్రవహించే మత్స్యగెడ్డలో నీటి పరిస్థితి మార్చి నెలలోనే ఇలా ఉందంటే రానున్న రోజుల్లో పూర్తిగా అడుగంటిపోయే పరిస్థితి ఏర్పడుతుందని స్థానికులు చెబుతున్నారు. మళ్లీ వర్షాలు కురిసే వరకు మత్స్యగెడ్డలో నీరు చేరే అవకాశం లేదు. మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి సైతం నీటి గండం ఉంటుందని మత్స్యగెడ్డ పరీవాహక ప్రజలు తెలిపారు. -
చింతపండుకు గిట్టుబాటు ధర రాకపోవడంతో గిరిజన రైతులు దిగాలు చెందుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది దిగుబడి తగ్గింది. దీంతో ధర పెరుగుతుందని ఆశించినా నిరాశే మిగిలింది. వ్యాపారులు సిండికేట్గా మారి రైతులను దోచుకుంటున్నారు. పలు ప్రాంతాల్లో జరిగే సంతలకు ఉదయా
సాక్షి,పాడేరు: చింతపండుకు గిట్టుబాటు ధర లేక జిల్లాలో గిరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గిరిజనులను ఆదుకోవాల్సిన గిరిజన సహకార సంస్థ తక్కువ (కిలో రూ.36) ధర ప్రకటించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.మైదాన ప్రాంతాల్లో కిలో రూ.60కి అమ్ముడవు తున్న చింతపండుకు కనీనం రూ.50 మద్దతు ధర ప్రకటించాలని గిరిజన రైతులు డిమాండ్ చేస్తున్నప్పటికీ జీసీసీ అధికారులు పట్టించుకోవడం లేదు. మరో వైపు ప్రైవేట్ వ్యాపారులు సిండికేట్గా మారి కిలో చింతపండును నాణ్యతను బట్టి రూ.35 నుంచి రూ.40కు కొనుగోలు చేస్తున్నారు.ప్రస్తుతం జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో చింతపండు వ్యాపారం జోరుగా జరుగుతున్నప్పటికీ గిరిజన రైతులకు మాత్రం గిట్టుబాటు ధర లభించడం లేదు. ఏటా రూ.50 కోట్ల వ్యాపారం : మన్యంలోని చింతపండుకు మైదాన ప్రాంతాల్లో అధిక డిమాండ్ ఉంది. దీంతో ప్రతి ఏడాది సుమారు రూ.50 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుంది. జీసీసీ గత ఏడాది 100 లారీల వరకు చింతపండును కొనుగోలు చేసింది.ప్రైవేట్ వ్యాపారులు కూడా భారీగా కొనుగోలు చేశారు. జిల్లాలో కొనుగోలు చేసిన చింతపండును తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు రవాణా చేస్తారు. మన్యంలో చింతపండు నాణ్యతలో నంబర్–1గా నిలుస్తుండడంతో డిమాండ్ ఉంది. అయితే రైతులకు మాత్రం గిట్టుబాటు ధర లభించడం లేదు. తగ్గిన దిగుబడి : ఈఏడాది మన్యంలో చింతపండు దిగుబడులు తగ్గడంతో ధర పెరుగుతుందని గిరిజన రైతులు ఆశించినప్పటికీ ఫలితం లేకపోయింది.ఒక చింతచెట్టుకు కనీసం 100 కిలోల వరకు చింతపండు దిగుబడి రావలసి ఉండగా ఈఏడాది 50 నుంచి 60కిలోలు మాత్రమే వచ్చింది. దిగుబడిన తగ్గినా మార్కెట్లో కొనుగోలు ధరలు మాత్రం పెరగకపోవడంతో గిరిజన రైతులు ఉసూరుమంటున్నారు.చింతచెట్ల నుంచి బొట్టలు రాల్చడం, బొట్టల నుంచి చింతపండు సేకరణ,వారపు సంతలకు తరలించడం వంటి పనులన్నీ కష్టంతో కూడుకున్నవే.అయితే మార్కెట్లో మాత్రం చింతపండు ధరలు పెరగకపోవడంతో గిరిజన రైతులు ఆవేదన చెందుతున్నారు.జీసీసీ కిలో రూ.50 ధరతో కొనుగోలు చేయాలని గిరిజన రైతులు డిమాండ్ చేస్తున్నారు. పాడేరు మార్కెట్లో చింతపండు విక్రయిస్తున్న మహిళచింత పండుకు గిట్టుబాటు ధర కరువు కిలో రూ.40తో ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలుదళారులు సిండికేట్గా మారి రేటు తగ్గించేస్తున్నారని రైతుల ఆవేదనజీసీసీ కిలోకు రూ.36 మద్దతు ధర ప్రకటన కష్టానికి తగ్గ ఆదాయం లేదు చింతపండు సేకరణ నుంచి అమ్మకాల వరకు అధికంగా కష్టపడాలి. మార్కెట్లో కొనుగోలు ధరలు మాత్రం పెరగకపోవడంతో కష్టానికి తగిన ఆదాయం రావడం లేదు.జీసీసీ కిలోకు రూ.50మద్దతు ధర ప్రకటిస్తే ప్రైవేట్ వ్యాపారుల్లోను పోటీ ఏర్పడి చింతపండు రైతులకు మంచి లాభాలు వస్తాయి. – పి.కోటిబాబు, గిరిజన రైతు, పెదకోడాపల్లి, పెదబయలు మండలం -
డీసీకి కలిసొచ్చేనా.?
● భారత్ జట్టుకు కలిసొచ్చిన వైఎస్సార్ స్టేడియం ● ఐపీఎల్లో చతికిలపడుతున్న ఆతిథ్య జట్లు ● రేపు ఎల్ఎస్జీ, డీసీ తొలి మ్యాచ్ విశాఖ స్పోర్ట్స్: పీఎంపాలెంలోని వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియం భారత్కు అచ్చివచ్చిన వేదికగా పేరుగాంచింది. 2009 తర్వాత వైఎస్సార్ స్టేడియంగా మారిన ఇక్కడ భారత్ అనేక అంతర్జాతీయ విజయాలు సాధించింది. 2016లో అయితే మూడు ఫార్మాట్లలోనూ(టెస్ట్, వన్డే, టీ20) ప్రత్యర్థులను 3–0తో ఓడించి రికార్డు సృష్టించింది. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) విషయానికి వస్తే ఈ స్టేడియం ఆతిథ్య జట్టుకు అంతగా కలిసిరావడం లేదు. ఇక్కడ జరిగిన పది ఐపీఎల్ మ్యాచ్ల్లో ఆరు మ్యాచ్ల్లో ఆహ్వాన జట్లే విజయం సాధించాయి. న్యూట్రల్ గ్రౌండ్గా ఇక్కడ రెండు మ్యాచ్లు జరిగాయి. రాష్ట్రానికి సొంత ఫ్రాంచైజీ లేకపోయినా.. ఈ స్టేడియం పలు జట్లకు హోం గ్రౌండ్గా వ్యవహరిస్తోంది. 2012లో తొలిసారిగా డెక్కన్ చార్జర్స్ జట్టు హోం గ్రౌండ్గా మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్లో చైన్నె సూపర్ కింగ్స్ విజయం సాధించింది. 2015లో డెక్కన్ చార్జర్స్ పేరు సన్రైజర్స్ హైదరాబాద్గా మారి ఇక్కడ మ్యాచ్ ఆడింది. ఈసారి రాజస్థాన్ రాయల్స్ చేతిలో పరాజయం పాలైంది. 2016లో ముంబై ఇండియన్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ జట్లు ఇక్కడ మూడేసి మ్యాచ్లు ఆడాయి. 2019లో ప్లేఆఫ్ మ్యాచ్లకు కూడా ఆతిథ్యం ఇచ్చింది. 2024లో ఢిల్లీ క్యాపిటల్స్(డీసీ) ఈ స్టేడియాన్ని తమ రెండో హోమ్ గ్రౌండ్గా ఎంచుకుంది. అయితే ఇక్కడ ఆడిన రెండు మ్యాచ్ల్లో ఒక విజయం, ఒక ఓటమిని చవిచూసింది. విశేషం ఏమిటంటే ఇక్కడ విజయం సాధించిన కోల్కతా నైట్రైడర్స్ గత సీజన్లో చాంపియన్గా నిలిచింది. డీసీ ప్రస్తుత సీజన్లో తమ తొలి రెండు మ్యాచ్లను ఇక్కడే ఆడనుంది. డీసీకి ఈ స్టేడియం హోమ్ గ్రౌండ్ కంటే ఆహ్వాన జట్టుగానే కలిసి వచ్చింది. గతంలో ఆహ్వాన జట్టుగా ఇక్కడ ముంబై ఇండియన్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్పై విజయాలు సాధించింది. 2019లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును ఓడించి క్వాలిఫైయిర్ ఆడింది. ఈ సీజన్లో డీసీ తమ తొలి మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్తో తలపడనుంది. ఈ రెండు జట్లు శనివారం నెట్స్లో ప్రాక్టీస్ చేయగా సోమవారం రాత్రి 7.30 గంటలకు సీజన్ తొలి బంతిని ఎదుర్కోనున్నాయి. -
యాగంలో వైభవంగా మహాపూర్ణాహుతి
ఎటపాక: ఉష్ణగుండాల వద్ద జరుగుతున్న 23వ శ్రీఅష్టలక్ష్మి యాగంలో శనివారం మహా పూర్ణాహుతి కార్యక్రమం వైభవంగా జరిగింది. ముందుగా శుక్రవారం రాత్రి శ్రీలక్ష్మీనారాయణ కల్యాణం కనుల పండువగా సాగింది. ఇష్టి, పూర్ణాహుతి కార్యక్రమంలో అష్టాక్షరి, బృందావనం జీయర్ స్వాములు పాల్గొని ప్రవచనాలు చేశారు. శ్రీపీతాంబరం రఘునాథాచార్యస్వామి ఆధ్వర్యంలో జరిగిన దీపోత్సవం పూజల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి రామాలయం స్థానాచార్య స్థల సాయి, వేద పండితులు మురళీకృష్ణమాచార్యులు యాగ నిర్వాహక కమిటీ, అష్టలక్ష్మి వైభవ దీపిక సభ్యులు పాల్గొన్నారు. -
వాగులు దాటి వెళ్లిపాఠశాలల తనిఖీ
జి.మాడుగుల: పాఠశాలల ఉపాధ్యాయులు సమయ పాలన పాటించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఎంఈవో చిట్టపులి బాబూరావు పడాల్ సూచించారు. మండలంలో మారుమూల గ్రామాలు కిల్లంకోట, సుర్తిపల్లి, బూరెలపనుకు, కె.బంధవీధి, చింతగొప్ప గ్రామాల్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను శనివారం ఆయన తనిఖీ చేశారు. వీటిలో పలు గ్రామాలకు రోడ్డు సదుపాయం లేక కొంత దూరం బైక్పైన, మరికొంత దూరం కాలినడన.. మార్గం మధ్యలో ప్రమాదకరమైన వాగులు దాటి వెళ్లి ఈ తనిఖీలు చేపట్టారు. పాఠశాలల రికార్డులను పరిశీలించారు. విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడు తూ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యా సామర్థ్యాలు మరింత మెరుగుపరచడానికి దృష్టి సారించాలన్నారు. మండల కేంద్రానికి 50 కిలోమీటర్ల పైగా దూరంలో ఈ గిరిజన గ్రామాలు ఉన్నాయి. ఆ యా గ్రామాలకు కొంత దూరం బైక్, 10 నుంచి 15 కిలోమీటర్ల కొండలు, గుట్టలు ఎక్కి దిగి, మార్గ మధ్య లో ప్రమదకరమైన గెడ్డలు దాటి ఆయన వెళ్లారు. -
రబీకి ఐదు వేలక్యూసెక్కుల నీరు
సీలేరు: సీలేరు కాంప్లెక్స్ డొంకరాయి జలాశయం నుంచి గోదావరి డెల్టాకు రబీ పంటలకు శనివారం నుంచి ఐదు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు జెన్కో అధికార వర్గాలు తెలిపాయి. ధవళేశ్వరం వద్ద నీటి మట్టాలు తగ్గు ముఖం పట్టడంతో ఫిబ్రవరి 10 వ తేదీ నుంచి డొంకరాయి జలాశయం నుంచి గోదావరి డెల్టాలో రబీ పంటలకు నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులు కోరారు. దీంతో డొంకరాయి జలాశయం నుంచి ఐదు వేల క్యూసెక్కులు, పొల్లూరు జలవిద్యుత్ కేంద్రం నుంచి 4,300 క్యూసెక్కులు కలసి 9,300 క్యూసెక్కులను విడుదల చేస్తున్నట్టు జెన్కో అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 10 నుంచి శనివారం వరకు డెల్టాకు 10.19 టీఎంసీలు నీటిని విడుదల చేశారు. మార్చి 31 వరకు నీటిని విడుదల చేయనున్నారు. -
అవగాహనతోనే క్షయ నివారణ
చింతపల్లి: క్షయ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని కోరుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు శివప్రసాద్, దినేష్కుమార్ అన్నారు. క్షయ వ్యాధిపై నివారణలో భాగంగా శనివారం కోరుకొండలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. డుంబ్రిగుడలో ర్యాలీ డుంబ్రిగుడ: మండల కేంద్రం డుంబ్రిగుడలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది టీబీ వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. వైద్యాధికారి రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి జాతీయ రహదారి వరకు సాగింది. క్షయ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని, రెండు వారాలకు మించి దగ్గు ఉంటే ఆస్పత్రిలో వైద్యుడ్ని సంప్రదించాలని ఆయన కోరారు. వైద్యాధికారిణి అంబికరమణి, సిబ్బంది స్వామి, రవింద్ర, సంజీవ్, ప్రభకార్, తదితరులు పాల్గొన్నారు. -
కంచెడు పూలు... అందంగా కనిపించే వీటిని గిరిజనులు లొట్టలేసుకుని మరీ తింటారు... వాటితో ఘుమఘుమలాడే కూరలు చేసుకుని ఇష్టంగా లాగించేస్తారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో లభించే వీటికి జిల్లాలో మంచి డిమాండ్ ఉంది. ఏజెన్సీ వాసులే కాకుండా ఇప్పుడు మైదాన ప్రాంతవాసులు కూడా
సాక్షి,పాడేరు: అడవుల్లోను, గ్రామాల సమీపంలోను కంచేడి చెట్లకు మార్చి, ఏప్రిల్ నెలల్లో పూలు పూస్తాయి. ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న వీటిని సర్వరోగ నివారిణిగా గిరిజనులు భావిస్తారు. ఈ పూలను ఈ సీజన్లో రోజువారీ కూరగా వండుకుని ఇంటిల్లాపాదీ తింటారు. మైదాన ప్రాంత ప్రజలు కూడా కంచేడి పూల కూర తినడానికి అలవాటుపడ్డారు. పలు వారపుసంతల్లో ఈ పూల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. శ్రీరాముడు వనవాసం చేసే సమయంలో వీటిని ఉడకబెట్టి తిన్నాడన్న పురాణగాథ కూడా ప్రచారంలో ఉంది. ఈ విరులు.. ఆరోగ్య సిరులు ఈ పూల కూర మంచి రుచికరంగా ఉండడంతో పాటు,ఔషధగుణాలు కలిగిఉండడంతో గిరిజనులు ఇష్టంగా తింటారు. రక్తహీనత,కీళ్ల సమస్య,నొప్పులు, అజీర్ణం,కంటిచూపు మందగించడం వంటి రుగ్మతలు ఉన్న వారు ఈ కూరను తింటే మంచిదని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. మహిళల్లో పలు శారీరక రుగ్మతలను నయం చేస్తుందని గిరిజనుల నమ్మకం. వీటితో వేపుడు, ఇగురు కూరలను వండుకుని తింటున్నారు. కొంతమంది ఎండుచేప,ఎండు రొయ్యలను కూడా కలిపి ఇగురు కూరగా తయారు చేస్తారు. మరి కొంతమంది గిరిజనులు ఈపూలను బాగా ఎండబెట్టి వరిగెలు తయారు చేసుకుని, భద్రపరుచుకుని ఏడాది పొడవునా వండుకుని తింటారు. బుట్ట కంచేడిపూలు రూ.600 నుంచి రూ.800 ధరతో అమ్ముతున్నారు. సంతల్లో చిన్న పోగులుగా వేసి వాటాను రూ.50తో అమ్మకాలు విక్రయిస్తున్నారు.మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ పూలు లభిస్తాయి. కంచేడి మొగ్గలు, పాడేరులో బుట్టలతో కంచేడిపూలు, మొగ్గలను అమ్ముతున్న గిరిజన మహిళ కంచేడిపూలతో వండిన ఇగురు కూర -
భక్తుల సహకారంతో ఘనంగా మోదమ్మ ఉత్సవాలు
ఉత్సవ కమిటీ అధ్యక్షుడు,ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు సాక్షి,పాడేరు: ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్యదైవం పాడేరులోని మోదకొండమ్మతల్లి ఉత్సవాలను భక్తుల సహకారంతో ఈఏడాది అత్యంత ఘనంగా నిర్వహిస్తామని,ఉత్సవ,ఆలయ కమిటీల అధ్యక్షుడు,పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు తెలిపారు. మే 11,12,13తేదీల్లో నిర్వహించే మోదకొండమ్మతల్లి ఉత్సవాలకు భక్తుల నుంచి చందాలు సేకరించేందుకు ముద్రించిన పుస్తకాలకు శనివారం మోదమ్మ విగ్రహం వద్ద పూజలు చేసిన, అనంతరం ఎమ్మెల్యే విడుదల చేశారు. పలువురు గ్రామపెద్దలు,ఉత్సవ కమిటీ ప్రతినిధులకు ఈపుస్తకాలను పంపిణీ చేశారు.అలాగే ఉత్సవాల నిర్వహణలో భాగస్వామ్యమవుతున్న ఉత్సవ కమిటీ,ఆలయ కమిటీ ప్రతినిధులకు ఐడీ కార్డులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్సవాల విజయవంతానికి అన్ని వర్గాల భక్తులు ఉత్సవ కమిటీకి సహకరించాలని కోరారు.ఉత్సవాలకు భక్తులంతా పెద్ద మొత్తంలో చందాలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బూరెడ్డి రామునాయుడు,ఆలయ కమిటీ,ఉత్సవ కమిటీ ప్రతినిధులు పలాసి కృష్ణారావు,కిల్లు కోటిబాబునాయుడు, కొణతాల ప్రశాంత్,సల్లా రామకృష్ణ,బోనంగి వెంకటరమణ, కొణతాల సతీష్, చిన్ని, కేజియారాణి, స్వరూప, కూడా కుమారి,మర్ల మణి, లక్ష్మి, కూడా సుబ్రహ్మణ్యం, కొంటా దుర్గారావు, కిల్లు రాధాకృష్ణ, బొజ్జా త్రినాధ్, నాయుడు, అబ్బాస్, నవీన్, కాళ్ల కిరణ్, కిల్లు చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
భగవద్గీత పోటీలు విజయవంతం
సాక్షి, పాడేరు: స్థానిక గిరి కై లాస క్షేత్రంలోని ఉమా నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో శనివారం రాత్రి విద్యార్థులకు నిర్వహించిన భగవద్గీత శ్లోక పఠన పోటీలు విజయవంతంగా సాగాయి. ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి సింహాచలంనాయుడు, ఇతర ఆధ్యాత్మిక కమిటీ ప్రతినిధుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలలో పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు భక్తిభావంతో భగవద్గీత శ్లోకాలను ఆలపించారు. న్యాయ నిర్ణేతలుగా ఆలయ గౌరవ అధ్యక్షులు తుడుము బాబూరావు, బొజ్జ త్రినాథ్, రవికుమార్, తమర్భ రమేష్కుమార్, ఎస్.సీతమ్మ వ్యవహరించారు. విజేతలకు ఉగాది పర్వదినం నాడు ఉత్తమ పురస్కారాలు అందజేయనున్నారు. ఆలయ కమిటీ ప్రతినిధులు కొట్టగుళ్లి రామారావు, దేశిది బాబూ రావు, రాజుబాబు, సోమరాజు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి
ఎమ్మెల్యే రేగం మత్స్యలింగండుంబ్రిగుడ: ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. మండలంలోని కించుమండ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలను ఆయన శనివారం సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి బోధనపై ఆరా తీశారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మెనూ అమలుపై సంతృప్తి వ్యక్తం చేశారు. కించుమండ పాఠశాల కాంప్లెక్స్ పరిధి ప్రాథ మిక పాఠశాల ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదన్న విషయం తనదృష్టికి వచ్చిందని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం గౌలి, వసబంద గ్రామాల నుంచి వచ్చి కించుమండల ఆశ్రమ పాఠశాలలో చదువుతున్నామని, ఆయా గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని విద్యా ర్థులు ఎమ్మెల్యేకు తెలపడంతో వెంటనే ట్రైబల్ వెల్ఫేర్ జేఈతో ఫోన్లో మాట్లాడారు. ఆ రోడ్డు మంజూరైందని, త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్టు తెలిపా రు. ఆశ్రమ పాఠశాలలో రోజు కూలీగా పనిచేస్తున్న చంద్రమ్మకు రెండు నెలల జీతాలు త్వరగా అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఏటీడబ్ల్యూవో మల్లికార్జునరావును ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం ఎం.గెన్ను, రాంబాబు, శెట్టి సూరిబాబు, కిల్లో అప్పలరాజు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. -
అటవీ ప్రాంతాల్లో డీఎఫ్వో పర్యటన
జి.మాడుగుల: మండలంలో భీరం పంచాయతీ వెంకటపాలెం గ్రామం సమీప రిజ్వర్వు ఫారెస్ట్ భూముల్లో శనివారం జిల్లా డీఎఫ్వో పి.సందీప్రెడ్డి పర్యటించారు. వి.కోడాపల్లి(వెంకటపాలెం)లో ఉపాధి హామీ పథకం కింద పెంపకం చేపడుతున్న నర్సరీ, ప్లాంటేషన్ పనులను ఆయన పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. భీరం గ్రామంలో కాంప పథకం ద్వారా ప్లాంటింగ్ అడ్వాన్స్ పనులను కూడా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో ఆర్.అప్పలనాయుడు, ఎఫ్ఎస్వోలు జి.శ్రీరాములు, వి.వి.నాయుడు, ఎఫ్బీవో మాధవి, సిబ్బంది సత్తిబాబు, ఎం.బాలన్న పాల్గొన్నారు. -
నవమి ఉత్సవాలకు పందిరి రాట
సాక్షి,పాడేరు: జిల్లా వ్యాప్తంగా వచ్చే నెల 5,6,7 తేదీల్లో జరిగే శ్రీరామనవమి ఉత్సవాల ఏర్పాట్లలో ఉత్సవ కమిటీలు నిమగ్నమాయ్యయి. పురాతన సుండ్రుపుట్టు రామాలయంలో ఉత్సవాల నిర్వహణకు గ్రామస్తులు శ్రీకారం చుట్టారు. పందిరిరాటను శనివారం వేశారు. రామాలయంలో సీతారాముల విగ్రహాలకు ప్రత్యేక పూజలు జరిపారు.ఈ ఏడాది కూడా శ్రీరామనవమి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఉత్సవ కమిటీ ఽఅధ్యక్షుడు ఒండ్రు శ్రీరాములు,ఉపాధ్యక్షుడు సాయికిరణ్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసా కమిటీ ఉపాధ్యక్షుడు డి.పి.రాంబాబు,గ్రామపెద్దలు డి.పి.సురేష్, లింగమూర్తి, గోపాలకృష్ణ,హరి, బాబురావు,ఉత్సవ కమిటీ ప్రతినిధులు డి.పి.శంకర్,కోడా కోటిబాబు,శివాజీ,బాబీ,సతీష్,సురేష్,శ్యామ్,శివ, మహిళలు పాల్గొన్నారు. -
ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి
రంపచోడవరం: ఉపాధి హామీ పథకం పనులను గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం అన్నారు. రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని ఏడు మండలాల్లో ఉపాధి హామీ పథకంలో 3 వేల ఫారం పాండ్లను మంజూరు చేసినట్టు ఆయన చెప్పారు. ప్రపంచ జలదినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని రంప పంచాయతీ పరిధిలోని పందిరిమామిడి గ్రామంలో ఫారం ఫాండ్ల నిర్మాణ పనులను పీవో శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీకి 25 ఫారం పాండ్లను మంజూరు చేసినట్టు చెప్పారు. రెండు వేల ఫారం పాండ్లను జూన్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలన్నారు. ఒక్కో రైతుకు రూ.50 వేల నుంచి రూ.3.50 లక్షల వరకు మంజూరు చేసి ఫారం పాండ్లను తవ్విస్తున్నట్టు చెప్పారు. ప్రతి ఉపాధి కూలీకి రూ.300 చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బందం శ్రీదేవి, జెడ్పీటీసీ పండా వెంకటలక్ష్మి, రంప సర్పంచ్ చెదల వెంకటలక్ష్మి, ఎంపీడీవో సుండం శ్రీనివాసరావుదొర, ఏపీవో బి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రంపచోడవరం ఐటీడీఏ పీవో సింహాచలం -
క్యాన్సర్పై పోరాటాన్ని వేగవంతం చేయాలి
మహారాణిపేట: క్యాన్సర్పై పోరాటాన్ని వేగవంతం చేసి.. అంతర్జాతీయ సహకారం, పరిశోధన, పురోగతికి బలమైన వేదికగా నిలబడాలని ఒమేగా క్యాన్సర్ ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బెల్లాల రవిశంకర్ ఆకాంక్షించారు. శనివారం విశాఖలోని ఓ హోటల్లో ఒమేగా క్యాన్సర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో జరిగిన మాలిక్యులర్ అంకాలజీ సొసైటీ కాన్ఫరెన్స్–2025ను ఆయన జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాలిక్యులర్ అంకాలజీ సొసైటీ అనేది క్యాన్సర్ బయాలజీని లోతుగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. కొత్త క్యాన్సర్ చికిత్సా విధానాలను అభివృద్ధి చేయడానికి అంతర్జాతీయ సంస్థ పరిశోధకులు, వైద్యులు, ఆరోగ్య సంరక్షణ నిపుణుల మధ్య సహకారాన్ని అందిస్తుందన్నారు. ఏఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యాదేవి మాట్లాడుతూ క్యాన్సర్ పరిశోధన, చికిత్సా విధానాల్లో నూతన ఆవిష్కరణలపై చర్చలు జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో డాక్టర్ శిల్పా, డాక్టర్ ఎన్.రామకోటీశ్వరరావు, డాక్టర్ బి.వి.మాధవి తదితరులు పాల్గొన్నారు. ఆదివారం కూడా ఈ సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో 100 మందికి పైగా ప్రముఖులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత మాలిక్యులర్ అంకాలజీ నిపుణులు, వైద్యులు, పరిశోధకులు పాల్గొంటున్నారు. ‘ప్రెసిషన్ మెడిసిన్ ద్వారా క్యాన్సర్ సంరక్షణలో విప్లవాత్మక మార్పులు‘ అనే ప్రధాన థీమ్తో ఈ ఏడాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. -
ఫుట్పాత్లపై వ్యాపారాలు చేస్తే చర్యలు
● జిల్లా పంచాయతీ అధికారి లవరాజు పాడేరు రూరల్: నిబంధనలు అతిక్రమించి ఫుట్పాత్లపై వ్యాపారాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) లవరాజు హెచ్చరించారు. జిల్లా కేంద్రం పాడేరులో ట్రాఫిక్ సమస్య పెరగడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం ఆయన పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫుట్పాత్లపై కూరగాయల వ్యాపారాలు చేస్తున్న వారందరూ రైతుబజార్లో దుకాణాలు ఏర్పాటు చేసుకునే లా చర్యలు తీసుకోవాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. ఫుట్పాత్లపై వ్యాపారా లు చేసి, ట్రాఫిక్కు అంతరాయం కల్పించవద్దన్నారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి తరలిస్తున్నకారు బోల్తా
● వాహనాన్ని వదిలేసి పరారైన నిందితులు ● సుమారు 280 కిలోల గంజాయి స్వాధీనం డుంబ్రిగుడ: మైదాన ప్రాంతానికి గంజాయి తరలిస్తున్న ఓ కారు మండలంలోని అరకు సంతబయలు జాతీయ రహదారి నుంచి అరకులోయ వెళ్లే డైవర్షన్ రోడ్డు మలుపు వద్ద శనివారం బోల్తా పడింది. స్థానికుల సమాచా రంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పొక్లెయిన్తో కారును సరిచేసి, అందులో ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోక ముందే కారులో ప్రయాణిస్తున్న నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. పట్టుబడిన గంజాయి 280 కిలోలు ఉంటుందని స్థానిక పోలీసు స్టేషన్ రైటర్ ధర్మేంద్ర తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చింతపల్లిలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
చింతపల్లి: చింతపల్లి ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా త్వరలో శాశ్వత పరిష్కారం లభించనుందని ఎంపీపీ కోరాబు అనూషాదేవి, జెడ్సీటీసీ బాలయ్య అన్నారు. గత ప్రభుత్వ హయాంలో చింతపల్లిలో తాగునీటి కోసం రూ.22 కోట్ల వ్యయంతో ప్రతిపాదనలు చేశామన్నారు. తాజాగా వాటికి ఆమోదం లభించిందన్నారు. దీనికి సంబంధించిన డీపీఆర్ను పరిశీలించారు. పథకం తీరుతెన్నులు. దాని నిర్మాణం వంటి విషయాలను తాగునీటి సరపరా విభాగం ఏఈ స్వర్ణలత వివరించారు. ఈ పథకం అమల్లోకి వస్తే త్వరలో తాగునీటికి ఇబ్బందులు తొలగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పుష్పలత, కోఆప్షన్ సభ్యుడు నాజర్వలి పాల్గొన్నారు. -
డీసీకి కలిసొచ్చేనా.?
● భారత్ జట్టుకు కలిసొచ్చిన వైఎస్సార్ స్టేడియం ● ఐపీఎల్లో చతికిలపడుతున్న ఆతిథ్య జట్లు ● రేపు ఎల్ఎస్జీ, డీసీ తొలి మ్యాచ్ విశాఖ స్పోర్ట్స్: పీఎంపాలెంలోని వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియం భారత్కు అచ్చివచ్చిన వేదికగా పేరుగాంచింది. 2009 తర్వాత వైఎస్సార్ స్టేడియంగా మారిన ఇక్కడ భారత్ అనేక అంతర్జాతీయ విజయాలు సాధించింది. 2016లో అయితే మూడు ఫార్మాట్లలోనూ(టెస్ట్, వన్డే, టీ20) ప్రత్యర్థులను 3–0తో ఓడించి రికార్డు సృష్టించింది. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) విషయానికి వస్తే ఈ స్టేడియం ఆతిథ్య జట్టుకు అంతగా కలిసిరావడం లేదు. ఇక్కడ జరిగిన పది ఐపీఎల్ మ్యాచ్ల్లో ఆరు మ్యాచ్ల్లో ఆహ్వాన జట్లే విజయం సాధించాయి. న్యూట్రల్ గ్రౌండ్గా ఇక్కడ రెండు మ్యాచ్లు జరిగాయి. రాష్ట్రానికి సొంత ఫ్రాంచైజీ లేకపోయినా.. ఈ స్టేడియం పలు జట్లకు హోం గ్రౌండ్గా వ్యవహరిస్తోంది. 2012లో తొలిసారిగా డెక్కన్ చార్జర్స్ జట్టు హోం గ్రౌండ్గా మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్లో చైన్నె సూపర్ కింగ్స్ విజయం సాధించింది. 2015లో డెక్కన్ చార్జర్స్ పేరు సన్రైజర్స్ హైదరాబాద్గా మారి ఇక్కడ మ్యాచ్ ఆడింది. ఈసారి రాజస్థాన్ రాయల్స్ చేతిలో పరాజయం పాలైంది. 2016లో ముంబై ఇండియన్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ జట్లు ఇక్కడ మూడేసి మ్యాచ్లు ఆడాయి. 2019లో ప్లేఆఫ్ మ్యాచ్లకు కూడా ఆతిథ్యం ఇచ్చింది. 2024లో ఢిల్లీ క్యాపిటల్స్(డీసీ) ఈ స్టేడియాన్ని తమ రెండో హోమ్ గ్రౌండ్గా ఎంచుకుంది. అయితే ఇక్కడ ఆడిన రెండు మ్యాచ్ల్లో ఒక విజయం, ఒక ఓటమిని చవిచూసింది. విశేషం ఏమిటంటే ఇక్కడ విజయం సాధించిన కోల్కతా నైట్రైడర్స్ గత సీజన్లో చాంపియన్గా నిలిచింది. డీసీ ప్రస్తుత సీజన్లో తమ తొలి రెండు మ్యాచ్లను ఇక్కడే ఆడనుంది. డీసీకి ఈ స్టేడియం హోమ్ గ్రౌండ్ కంటే ఆహ్వాన జట్టుగానే కలిసి వచ్చింది. గతంలో ఆహ్వాన జట్టుగా ఇక్కడ ముంబై ఇండియన్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్పై విజయాలు సాధించింది. 2019లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును ఓడించి క్వాలిఫైయిర్ ఆడింది. ఈ సీజన్లో డీసీ తమ తొలి మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్తో తలపడనుంది. ఈ రెండు జట్లు శనివారం నెట్స్లో ప్రాక్టీస్ చేయగా సోమవారం రాత్రి 7.30 గంటలకు సీజన్ తొలి బంతిని ఎదుర్కోనున్నాయి. -
పోషకాల పండు..లాభాలు మెండు 'అవకాడో'
చింతపల్లి: గిరిజన ప్రాంతానికి మేలైన, అనువైన రకాలను గుర్తించడానికి అల్లూరి జిల్లా చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తలు నిరంతరం ప్రయోగాలు చేస్తుంటారు. ఏజెన్సీలో లాభదాయకమైన పంటలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో గతంలో యాపిల్, డ్రాగన్ ఫ్రూట్, స్ట్రాబెర్రీ, లిచీ వంటి మొక్కలను ప్రభుత్వం సరాఫరా చేసింది. చింతపల్లి మండలంలో గిరిజన రైతులు వాటిని పండించి మంచి ఫలితాలను పొందుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి అవకాడో వచ్చి చేరింది. నిజానికి రెండు దశాబ్దాల క్రితమే కేంద్ర కాఫీ బోర్డు అధికారులు కాఫీ మొక్కలకు నీడ కోసమని అవకాడో మొక్కలను మండలంలో గొందిపాకలు పంచాయతీలోని పలు గ్రామాల్లో పంపిణీ చేశారు. ఈ మొక్కలపై రైతులకు అవగాహన లేకపోయినా కాఫీ చెట్లకు నీడనిస్తాయనే ఉద్దేశంతో పెంపకం సాగించారు. ఈ మొక్కలు పెరిగి క్రమేపీ పండ్ల దశకు చేరుకున్నాయి. అయితే ఈ అవకాడో పండ్లకు మార్కెట్లో విలువ తెలియక వాటిని రైతులు వృథాగా వదిలేశారు. కొన్నేళ్ల క్రితం ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి గ్రామానికి వచ్చి ఈ అవకాడో పండ్లను చూసి దాని విశిష్టత, ఆ పండ్లకు మార్కెట్లో ఉన్న విలువను రైతులకు వివరించారు. దాంతో రైతులు నాటి నుంచి మార్కెట్లో ఈ అవకాడో పండ్ల అమ్మకాన్ని ప్రారంభించారు. దాంతో వ్యాపారస్తులు సైతం గ్రామాలకు వచ్చి రైతుల నుంచి ఈ పండ్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానంలో ఆరు దేశ, విదేశీ రకాలను దిగు మతి చేసుకొని ఎకరం విస్తీర్ణంలో ప్రయోగాత్మకంగా సాగు చేపట్టారు. ప్రత్యేక శ్రద్ధతో గిరి రైతుల సాగు చింతపల్లి మండలంలో గొందిపాకలు, చిక్కుడుబట్టి, చినబరడý, పెదబరడ మొదలైన గ్రామాల్లో రైతులకు ఐటీడీఏ గతంలో వివిధ రకాల పండ్ల మొక్కలతోపాటు అవకాడో మొక్కలను పంపిణీ చేసింది. రైతులు ఈ మొక్కలను తమ పొలాల్లో వేసి పెంచుతున్నారు. ప్రస్తుతం అవి పెరిగి పెద్దవై దిగుబడులను ఇస్తున్నాయి. ఈ అవకాడో పండ్లకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ఔషధ గుణాలు, పోషకాలు అధికం అవకాడో పండు ఇతర పండ్ల మాదిరిగా కాకుండా అత్యధిక పోషకాలు, ఔషధ గుణాలు కలిగి ఉన్నట్లు శాస్త్రవేత్తలు, పోషకాల నిపుణులు గుర్తించారు. ప్రధానంగా ఈ పండు క్యాన్సర్ కారకాలను నిరోధించడంతోపాటు కంటి చూపు, మధుమేహం, స్థూలకాయం తగ్గుదలకు, సంతానోత్పత్తికి, జీవక్రియ మెరుగుదలకు ఎంతో ఉపయోగపడుతున్నట్లు పరిశోధనలో గుర్తించారు.» కాఫీ చెట్లకు నీడనిచ్చేందుకు తీసుకొచ్చిన విదేశీ మొక్క» పోషకవిలువలున్నఫలాలనూఇస్తోంది.. » చింతపల్లిఉద్యాన పరిశోధన స్థానంలో 6 దేశీ, విదేశీ రకాలపై పరిశోధనలు చింతపల్లిలో కొత్త రకాలపై పరిశోధనలు అవకాడో పండ్లకు దేశీయంగానే కాకుండా విదేశాల్లోను మంచి గిరాకీ ఉంది. దీనిని గుర్తించి చింతపల్లి ఉద్యానవన పరిశోధన స్థానంలో గత ఏడాది టకేడి–1, హోస్ మొక్కల సాగు చేపట్టగా ఈ ఏడాది కొత్తగా పింకిర్టన్, ప్యూర్డ్, రీడ్ వంటి కొత్త రకాలను ఇక్కడికి తీసుకువచ్చి పరిశోధనలు జరుపుతున్నాం. గిరిజన రైతాంగం పండించి ప్రస్తుతం మార్కెట్లో అమ్ముతున్న అవకాడోకు శాస్త్రీయ నామం లేదు. దాంతో పంటకు మంచి గిట్టుబాటు ధర లభించడంలేదు.ప్రస్తుతం మా క్షేత్రంలో గత ఏడాది మూడు వెరైటీలు, ఈ ఏడాది 3 రకాలపై పరిశోధనలు జరుపుతున్నాం. ఈ కొత్త రకాలను శాస్త్రీయ నామంతో మార్కెట్లో ప్రవేశపెట్టవచ్చు. దీంతో మంచి ధర వస్తుంది. ఏజెన్సీ ప్రాంతంలో కాఫీ, మిరియాలు పంటల వలే ఈ అవకాడో పంటను విస్తరించడానికి మేలైన రకాల కోసం ప్రయోగాలు చేపడుతున్నాం. – శెట్టి బిందు, ప్రధాన శాస్త్రవేత్త,ఉద్యాన పరిశోధన స్థానం, చింతపల్లివిదేశీ పంటలకు అల్లూరి జిల్లా ఆలవాలంగా మారింది. ఇప్పటికే ఏజెన్సీ పాంతంలో స్ట్రాబెర్రీ, లిచీ, డ్రాగన్ ఫ్రూట్ వంటి పంటలు మంచి ఫలితాలను ఇస్తుండగా తాజాగా ఈ కోవలోకి అవకాడో వచ్చి చేరింది. కాఫీ చెట్లకు నీడ కోసం పెంచుతున్న ఈ చెట్లు పోషక విలువలతో ఉన్న పళ్లను కూడాఇస్తున్నాయి. -
ఉదయం మంచు.. మధ్యాహ్నం మండే ఎండ
సాక్షి,పాడేరు: వేసవిలోను జిల్లాలో దట్టంగా పొగమంచు కురిసింది. పాడేరు, అరకులోయ, చింతపల్లి ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం 8గంటల వరకు పొగమంచు ఎక్కువగా కురిసింది. వాహనచోదకులు లైట్లు వేసుకుని వాహనాలు నడిపారు. అరకులోయలో 10.7 డిగ్రీలు, చింతపల్లిలో 15 డిగ్రీలు, పాడేరులో 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు వేకువజామున నమోదయ్యాయి. అయితే ఉదయం 9గంటల తరువాత భానుడు విజృంభించాడు. మధ్యాహ్నం సమయానికి ఎండ చుర్రుమంది. పాడేరు, అరకు సంతల్లో గిరిజనులు వ్యాపారులు అధిక ఎండతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాహార్తి తీర్చుకోడానికి శీతల పానీయాలను ఆశ్రయించారు. సాయంత్రం ఐదుగంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంది. దీంతో జిల్లా కేంద్రం పాడేరులోని అన్ని రోడ్లలో జనసంచారం తక్కువగా ఉంది. పాడేరులో జరిగిన సంత బోసిపోయింది. చిరువ్యాపారులు గొడుగులను ఆశ్రయించారు. పాడేరులో 36, రంపచోడవరంలో 35.7 డిగ్రీలు, అరకులోయలో 34.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
అందరి సహకారంతో వైభవంగా ముత్యాలమ్మ జాతర
చింతపల్లి: మండల కేంద్రం చింతపల్లిలో ముత్యాలమ్మతల్లి ఉత్సవాలను ఏప్రిల్ 24 నుంచి 27 వరకూ నిర్వహించడానికి ఉత్సవ కమిటీ నిర్ణయించినట్టు ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు తెలిపారు.ముత్యాలమ్మతల్లి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం ఉత్సవ కమిటీ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతరను నాలుగు రోజుల పాటు వైభవంగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరి సహకారం ఎంతో అవసరమన్నారు. పాడేరు మోదకొండమ్మ జాతర తరువాత ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ జాతర నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా హేమంత్, వినాయకరావు ముత్యాలమ్మతల్లి ఉత్సవ కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా దురియా హేమంత్కుమార్,పసుపులేటి వినాయకరావు, కార్యదర్శిగా పోతు రాజు బాలయ్యపడాల్(జెట్పీటీసీ),ఉపాధ్యక్షురాలిగా కోరాబు అనూషదేవి(ఎంపీపీ)లను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్టు ఎమ్మెల్యే ప్రకటించారు.గ్రామ పెద్దలు, అన్ని సంఘాల ప్రతినిధులతో కలిపి పూర్తి స్థాయి కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి,సర్పంచ్ దురియా పుష్పలత,ఉద్యోగ సంఘ నాయుకులు యు.వి. గిరి, శశికుమార్, వెంకటరమణ,పద్మనాభం వర్తక సంఘ నాయకులు బేతాళుడు,జోగేశ్వరరావు,రెహమాన్,ఆలయ ధర్మకర్త వంశస్థులు మాదల తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు -
మూడు సార్లు అర్జీలు ఇచ్చాం
గ్రామాల్లో ప్రధాన సమస్యలైన తాగునీరు, సీసీరోడ్లు, రహదారుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నచందంగా ఉన్నా యి. సమస్యల పరిష్కారం కోరుతూ ఇప్పటికి ఐటీడీఏలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మూడు సార్లు వినతులు అందించాం. దండబాబు నుంచి లింబగుడ వరకు ,దౌడగుడ నుంచి బెడ్డగుడ వరకు మంజురైన రహదారుల పనులు అటవీశాఖ అనుమతులు లేక నిలిచిపోయాయి. అధికారులు జోక్యం చేసుకుని పనులు ప్రాంభించేలా చర్యలు తీసుకోవాలి. – గెమ్మెలి చిన్నబాబు, సుంకరమెట్ట పంచాయతీ అరకులోయ మండలం -
పరీక్ష కేంద్రాల తనిఖీ
అడ్డతీగల: అడ్డతీగలలోని రెండు పదవ తరగతి పరీక్ష కేంద్రాలను ఏజెన్సీ డీఈవో వై.మల్లేశ్వరరావు శుక్రవారం తనిఖీ చేశారు. ముందుగా గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసి పరీక్షల నిర్వహణ తీరును పర్యవేక్షించారు.ఈ పరీక్ష కేంద్రంలో 187 మందికిగాను 186 మంది పరీక్షకు హాజరయ్యారని డీఈవో తెలిపారు.అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు.ఇక్కడ పూర్తి స్థాయిలో 177 మంది విద్యార్థులు హాజరైనట్టు చెప్పారు. ఎటువంటి మాల్ప్రాక్టీస్కు అవకాశం లేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని ఇన్విజిలేటర్లు, ఇతర పరీక్షల పర్యవేక్షకులకు సూచించారు.ఎంఈవో పి.శ్రీనివాసరావు తదితరులు డీఈవో వెంట ఉన్నారు. -
లక్ష్యాలు ఉన్నతంగా ఉండాలి
కొయ్యూరు: ప్రతి ఒక్కరూ గొప్పగా ఎదిగే లక్ష్యాలను పెట్టుకోవాలని, గిరిజన యువత అన్ని రంగాల్లో రాణించాలని రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్ అన్నారు. ఆయన ఆధ్వర్యంలో శుక్రవారం యూ.చీడిపాలెం పంచాయతీ పలకజీడిలో ఉచిత వైద్య శిబిరం, వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో డీఎస్పీ మాట్లాడుతూ యువత మత్తుకు దూరంగా ఉండాలని కోరారు. గిరిజనులు ఆరోగ్యంగా ఉండాలంటే చెడు అలవాట్లు దరి చేరనీయరాదని చెప్పారు. పోలీసులు నిర్వహించిన వాలీబాల్ పోటీల్లో 30 జట్లు పాల్గొనగా కొయ్యూరు మండలం యర్రగొండ జట్టు మొదటి స్థానంలో నిలిచింది. వీరికి రూ.8 వేల నగదు,ద్వితీయ స్థానంలో నిలిచిన వై.రామవరం మండలం కోట జట్టుకు రూ.5 వేలు,తృతీయస్థానంలో నిలిచిన వై.రామవరం మండలం మునసలపాలెం జట్టుకు రూ.3 వేల నగదు అందజేశారు. పాల్గొన్న అన్ని జట్లకు వాలీబాల్ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడ్డతీగల సీఐ బి.నరసింహమూర్తి,కొయ్యూరు సీఐ వెంకటరమణ, వై.రామవరం ఎస్ఐ రామకృష్ణ,మంప ఎస్ఐ శంకర్ రావు,సీఆర్పీఎఫ్ సహాయ కమాండెంట్ రాధ, పీఎస్ఐలు చక్రధర్, సత్యం,సురేష్,యూ.చీడిపాలెం సర్పంచ్ రమేష్ పాల్గొన్నారు.రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్ -
ఘనంగా కొట్నాల ఉత్సవం
ఎటపాక: ఉష్ణగుండాల వద్ద శ్రీఅష్టలక్ష్మి ఆశ్రమంలో జరుగుతున్న 23వ శ్రీఅష్టలక్ష్మి యాగంలో భాగంగా ఎనిమిదవ రోజు శుక్రవారం కొట్నాల ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. యాగశాలలో అమ్మవారికి అభిషేకాలు,తిరుప్పావై పాశురాల విన్నపం జరిపారు. అనంతరం అమ్మవారిని పెండ్లి కుమార్తెను చేశారు. పీతాంబరం రఘునాథాచార్యులు స్వామి ఆధ్వర్యంలో పసుపు దంచడం వేడుకను వైభవంగా నిర్వహించారు. రాత్రి దీపోత్సవం,మాతృదేవోభవ పురస్కా ర ఉత్సవం జరిగాయి.ఈకార్యక్రమాల్లో యాగ కమిటీ సభ్యులు గాదె మాదవరెడ్డి,నక్కా భాస్కరరావు,జి.వి. రామిరెడ్డి,రాజా,యడ్ల లక్ష్మణరావు పాల్గొన్నారు. -
దివ్యాంగుడిని.. కనికరించండి
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన వికలాంగ పింఛన్ ప్రభుత్వం మారడంతో ఆగిపోయింది. అప్పటి నుంచి నేటికీ ఫించన్ సొమ్ము పొందలేకపోతున్నాను. నాకు 60 శాతం వికలాంగ ధ్రువీకరణ పత్రం కూడా ఉంది. అధికారులకు పలుమార్లు అడిగితే పేరు ఉంది కానీ డబ్బులు మాత్రం రావడం లేదని అంటున్నారు. ఈ విషయంపై మూడుసార్లు అధికారులను వినతులు అందజేశాను. కానీ నేటికి సమస్యను పరిష్కారించలేదు. – కె బొంజినాయుడు, పింఛన్దారుడు, చిట్టంపుట్టు గ్రామం, పెదలువ్వసింగి పంచాయతీ,జి మాడుగుల మండలం -
సర్కేడియన్ వి యాప్ ద్వారా గుండె వ్యాధుల నిర్ధారణ
పాడేరు : సర్కేడియన్ వి యాప్ ద్వారా గుండె వ్యాధులను నిర్ధారించవచ్చని జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విశ్వమిత్ర తెలిపారు. ఎన్ఆర్ఐ విద్యార్థి నంద్యాల సిద్ధార్థ్ రూపొందించిన సర్కేడియన్ వి యాప్ ద్వారా జిల్లా ఆస్పత్రిలో 250 మంది రోగులకు పరీక్షలు నిర్వహించగా పదిమంది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్టు నిర్ధారించామని చెప్పారు. ఈ పదిమంది రోగులకు జనరల్ మెడిసిన్ నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ సర్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో 2డీ ఎకో, ఈసీజీ పరీక్షలు నిర్వహించామని వారంతా గుండె వ్యాధితో బాధపడుతున్నారని తేలిందని తెలిపారు. వెంటనే వారిని కార్డియాలజీ వైద్య నిపుణుల వద్దకు పంపినట్టు చెప్పారు. గుండె వ్యాధిగ్రస్తులకు శనివారం కూడా స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఎన్ఆర్ఐ విద్యార్థి సిద్ధార్థ్ రూపొందించిన యాప్ ఏఐ కేవలం ఏడు సెకెన్లలోనే గుండె జబ్బులను నిర్ధారిస్తుందన్నారు. కలెక్ట్ దినేష్కుమార్ ఆదేశాల మేరకు ఎన్ఆర్ఐ విద్యార్థి పాడేరు జిల్లా ఆస్పత్రికి వచ్చి పరీక్షలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి సిబ్బంది, ఎన్ఆర్ఐ విద్యార్థిమహేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విశ్వమిత్ర -
విరుగుడేది ?
ఈయన పేరు వంతాల సూరిబాబు, పెదబయలు మండలం మారుమూల కుంతుర్ల పంచాయతీ బర్రెమామిడి గ్రామం. మండల కేంద్రానికి 40 కిలోమీటర్లు, జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. ఈ గ్రామానికి నేటికీ పూర్తి స్థాయిలో రహదారి, రవాణా సౌకర్యం లేదు. పెదబయలు మండలం పెదకొడాపల్లి నుంచి బంట్రోత్పుట్టు వరకు రహదారి అధ్వానంగా ఉంది. రహదారి బాగు చేసి, రవాణా సౌకర్యం కల్పించాలని ఈ తొమ్మిది నెలల కాలంలో ఏకంగా పదిసార్లు ఐటీడీఏలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీలు అందజేశారు. కానీ నేటికీ అధికారుల నుంచి కనీస స్పందన లేదు. సమస్యలు పరిష్కారం కాని ప్రజా సమస్యల పరిష్కార వేదికలు ఎన్ని ఉన్నా ఉపయోగం లేదని సూరిబాబు వాపోతున్నారు. తిరుగుడే మిగిలింది..అర్జీలకు లభించని పరిష్కారం కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం శూన్యం ఒకే సమస్యపై పలుమార్లు విన్నవించవలసిన పరిస్థితి పీజీఆర్ఎస్పై సన్నగిల్లుతున్న నమ్మకం పాడేరు : ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా జిల్లా కేంద్రం పాడేరులో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీదారులకు నిరాశే మిగులుస్తోంది. గతంలో పాడేరు ఐటీడీఏలో 11 మండలాలకు చెందిన ప్రజల కోసం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించేవారు. జిల్లాల విభజన తర్వాత పాడేరు ఐటీడీఏ సమావేశ మందిరంలో ప్రతి శుక్రవారం జిల్లా ప్రజల కోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో అధికారుల పర్యటించిన సమయాల్లో సమస్యలపై ఫిర్యాదులు చేస్తున్నా... పరిష్కారం కాకపోవడంతో మండల స్థాయిలో ఫిర్యాదులు ఇస్తున్నారు. అక్కడ కూడా పరిష్కారం లభించకపోవడంతో ఐటీడీఏల స్థాయిలో, ఆ తర్వాత జిల్లా స్థాయిలో అధికారులకు అర్జీలు అందజేస్తున్నారు. కానీ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రజలకు నిరాశే మిగులుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు సుమారు తొమ్మిది నెలల కాలంలో 27,161 అర్జీలు అందాయి. జిల్లా కేంద్రమైన పాడేరులో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న 22 మండలాలకు చెందిన ప్రజలు ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి వచ్చి అర్జీలు అందజేస్తున్నారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్వో, ఐటీడీఏ పీవో, సబ్ కలెక్టర్ తదితర ఉన్నతాధికారులను నేరుగా కలిసి దరఖాస్తులు అందజేస్తున్నారు. కానీ సమస్యలు సకాలంలో పరిష్కారం కావడం లేదు. దీంతో కొంతమంది తమ సమస్యలపై అధికారులు స్పందించే వరకు ఫిర్యాదులు ఇస్తూనేన్నారు. ఎన్నిసార్లు కాళ్లు అరిగేలా తిరిగినా వాటి పరిష్కారానికి అధికారులు చొరవ చూపడం లేదనే విమర్శలు ఆర్జీదారుల నుంచి వినిపిస్తున్నాయి. గ్రామ సమస్యలపైనే... ప్రధానంగా గ్రామాల్లో ఉమ్మడిగా ఉన్న సమస్యలపైనే అధికంగా ఫిర్యాదులు అందుతున్నాయి. తాగునీరు, రహదారుల నిర్మాణం, రవాణా సౌకర్యాలు, పాఠశాలల ఏర్పాటు, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు, తదితర వాటిపై అధికంగా అర్జీలు అందుతున్నాయి. రెవెన్యూ సమస్యలే అధికం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో గ్రామ రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 22 మండలాల్లో 2,972 రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సుల్లో భూ సమస్యలపై ఏకంగా 20,941 అర్జీలు అందాయి. కానీ వాటిలో నేటి వరకు 25శాతం సమస్యలు కూడా పరిష్కారం కాలేదు. 129 అర్జీలు ఐటీడీఏ సమావేశ మందిరంలో ఈ శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ దినేష్కుమార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఏకంగా 129 ఫిర్యాదులు అందాయి. వీటిలో ప్రధానంగా తాగునీరు, రహదారులు, విద్యుత్, అటవీ హక్కుల పత్రాల మంజూరు, భూ సమస్యలపై అర్జీలు ఎక్కువగా అందాయి.తొమ్మిది నెలల్లో అందిన అర్జీల వివరాలు మొత్తం అర్జీలు 27,161 అప్లోడ్ చేసినవి 24,721 ప్రాసెసింగ్లో ఉన్నవి 1,810 రీ ఓపెన్ అయినవి 6,30 -
బస్సు కోసం ఐదు సార్లు అర్జీలు
పాడేరు నుంచి కిముడుపల్లి మీదుగా బంగారుమామిడి వరకు పక్కా రహదారి సౌకర్యం ఉంది. దశాబ్దాల తరబడి అధ్వానంగా ఉన్న రహదారిని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో కొత్తగా నిర్మించారు. దీంతో ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తారని ఆశ పడ్డాం. నిరాశే ఎదురైంది. దీంతో బస్సు సౌకర్యం కల్పించాలని తొలుత ఆర్టీసీ అధికారులను విన్నవించాను. వారు పట్టించుకోకపోవడంతో సుమారు ఐదు సార్లు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వినతులు అందజేశాను. కానీ అధికారుల నుంచి స్పందన కరువైంది. ఇప్పటికై న అధికారులు స్పందించి మా గ్రామలకు బస్సు సౌకర్యం కల్పించాలి. – వంతల అప్పారావు, కిముడుపల్లి, గ్రామం, పెదబయలు మండలం -
గేట్లో డుంబ్రిగుడయువకుడికి 738వ ర్యాంకు
డుంబ్రిగుడ: గేట్– 2025లో ఆల్ ఇండియా 738 ర్యాంక్ను సాధించి డుంబ్రిగుడ యువకుడు శెట్టి అనిల్కుమార్ సత్తాచాటాడు. బీఎస్ఎన్ఎల్లో సబ్ డివిజనల్ ఇంజినీరుగా చైన్నెలో ఐదు సంవత్సరాల పాటు పనిచేసి ప్రస్తుతం హైదరాబాదులో విధులు నిర్వహిస్తున్న అనిల్కుమార్ గతంలో గేట్లో ర్యాంక్ సాధించి, ఎం.టెక్ చేసిన తరువాత బీఎస్ఎన్ఎల్లో ఉద్యోగం పొందాడు. ఈఏడాది నిర్వహించిన గేట్లో మళ్లీ 738 ఆల్ ఇండియా ర్యాంక్ సాధించడంపై కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. తండ్రి శెట్టి కృష్ణారావు వెలుగు ఏపీఎంగా అరకులోయలో విధులు నిర్వహిస్తున్నారు. -
స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాల ఆవిష్కరణ
పెదబయలు: స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలు కొనసాగించాలని మాజీ సమితి అధ్యక్షుడు జర్సింగి బాలంనాయుడు, వైస్ ఎంపీపీ కొర్రా రాజుబాబు అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో వైస్ ఎంపీపీ కొర్రా రాజుబాబు సొంత నిధులతో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, మర్రి కామయ్య,డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహాలను సీనియర్ సిటిజన్స్,మండల ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం బాలంనాయుడు, రాజుబాబు మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల ప్రాణత్యాగం వల్ల మనం ఇప్పుడు స్వేచ్ఛను అనుభవిస్తున్నామన్నారు. మాజీ సమితి అధ్యక్షుడు జర్సింగి బాలంనాయుడు,సీనియర్ సిటిజన్స్ లొట్టి రామూర్తి,పోయిభ బుల్లిదొర,రెడ్డి సుబ్బారావు, పల్టాసింగి భీమన్న, మర్రి కామయ్య మనుమలను దుశ్శాలువాలతో సన్మానించారు.అనంతరం విగ్రహాల దాత కొర్రా రాజుబాబు, వారి కుటుంబ సభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎల్.పూర్ణయ్య,ఎంపీపీ బొండా వరహాలమ్మ,జెడ్పీటీసీ కూడ బొంజుబాబు, వైస్ ఎంపీపీ కొర్రా సోనే, ఏటీడబ్ల్యూవో వెంకటరమణ, మాజీ ఎంపీపీలు జర్సింగి సూర్యనారాయణ,వెచ్చంగి కొండయ్య,స్థానిక ఎంపీటీసీ కె.బొంజుబాబు,మాజీ సర్పంచ్ పాంగి సింహాచలం,రూడ లక్ష్మణరావు.వనల్భ సన్యాసిరావు. పుర్సకారి భాస్కర్రావు, కూడ రాధాకృష్ణ,ఉపాధి ఏపీవో అప్పలనాయుడు, ఏపీఎం దేవమంగ తదితరులు పాల్గొన్నారు. -
కంటి సమస్యలపై అప్రమత్తం
అరకులోయటౌన్: కంటి సమస్యలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. శుక్రవారం శంకర్ ఫౌండేషషన్ సౌజన్యంతో తేజ మెడికల్, జనరల్ స్టోర్ ఓనర్, వైఎస్సార్సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు గెడ్డం నర్సింగరావు సహకారంతో నిర్వహించిన శిబిరాన్ని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మత్స్యలింగం మాట్లాడుతూ కంటి చూపు లోపంతో ఇబ్బందులు పడుతున్న అవ్వా, తాతలకు, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, పోలీస్ శాఖలో పనిచేసేవారందరూ ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఆయన మాట్లాడుతూ వైద్య శిబిరం ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు. శిబిరంలో 210 మంది కంటి పరీక్షలు చేయించుకున్నట్టు నిర్వాహకులు తెలిపారు. 8 మందికి కంటి ఆపరేషన్ చేయాలని గుర్తించారు. మరో 30 మందికి కళ్లద్దాలు అందిస్తామన్నారు. ఓ చిన్నారికి సర్జరీ అవసరం అని, సర్జరీ చేస్తామని వైద్యులు తెలిపారు. శంకర్ ఫౌండేషన్ రిలేషన్షిఫ్ మేనేజర్ చంద్రశేఖర్, ,డాక్టర్ సమర్ధి దేశ్ముఖ్, కౌన్సిలర్లు జాన్షీ, తేజ, ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు కమిడి అశోక్, సర్పంచ్ ఉపేంద్ర, అనంతగిరి సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పాగి అప్పారావు, మయూరి రాజు, దామోదర్ గిరిజనులు పాల్గొన్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి ముంచంగిపుట్టు: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం,జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. స్థానిక సీహెచ్సీని శుక్రవారం వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు.వార్డులకు వెళ్లి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.అనంతరం వైద్యులు,సిబ్బందితో మాట్లాడి ప్రస్తుతం నమోదవుతున్న వ్యాధులు,మందుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఆస్పత్రిలో రికార్డులు తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మత్స్యలింగం,జెడ్పీ చైర్ పర్సన్ సుభద్ర మాట్లాడుతూ రోగులకు నిత్యం అందుబాటులో ఉంటూ వైద్య సేవలందించాలని సూచించారు. రోగుల పట్ల నిర్లక్ష్య ధోరణితో ఉంటే సహించేది లేదన్నారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూడాలని, గర్భిణులకు ఆస్పత్రిలోనే ప్రసవం జరిగిలే చర్యలు తీసుకోవాలని వైద్యులు సంతోష్,ధరణిలకు సూచించారు.ఈ కార్యక్రమంలో పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి,వైఎస్సార్సీపీ జిల్లా నేతలు జగబంధు,మూర్తి,బాలరాజు,సర్పంచులు బాబూరావు,నరసింగరావు,ఎంపీటీసీలు సుబ్బలక్ష్మి,కమల తదితరులు పాల్గొన్నారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర -
సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనే చట్టాలు అవసరం
విశాఖ విద్య: ఆధునిక సాంకేతికత విసిరే సవాళ్లకు సమాధానమిచ్చే పటిష్టమైన చట్టాలను రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాద్ రావు అభిప్రాయపడ్డారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ న్యాయ కళాశాలలో శుక్రవారం జాతీయస్థాయి మూట్ కోర్టు పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ దుర్గాప్రసాదరావు మాట్లాడుతూ సమాజ అవసరాలకు అనుగుణంగా చట్టాల్లో మార్పులు వస్తాయని తెలిపారు. శాసీ్త్రయ ఆవిష్కరణలు సమాజానికి ఎంతో మేలు చేస్తున్నాయని, అదే సమయంలో కొన్ని సవాళ్లను సైతం ఎదురవుతున్నాయని ఉదాహరణలతో వివరించారు. న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మార్పులను నిశితంగా గమనించాల్సిన అవసరం ఉందన్నారు. గత నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా రూ.13 వేల కోట్ల విలువైన మత్తుపదార్థాలను పట్టుకున్నారని చెప్పారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం గురించి వివరించి.. సైబర్ నేరాలు, శిక్షలు ఏ విధంగా విధిస్తారనే అంశాలను తెలియజేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను విరివిరిగా వినియోగిస్తున్నారని.. దీనితో మేధో హక్కులకు భంగం కలిగే అవకాశం ఏర్పడుతోందన్నారు. యూరోపియన్ దేశాలు హక్కులను రక్షించడానికి కఠినమైన చట్టాలను రూపకల్పన చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. భారత్లో ఈ రంగానికి సంబంధించి ప్రత్యేకమైన చట్టాలు ప్రస్తుతం లేవని, దీనిపై మేధో చర్చలు జరగాలని సూచించారు. ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ యువ న్యాయ విద్యార్థులకు అవగాహన కల్పించే విధంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం మంచి పరిణామమన్నారు. వివిధ కేసుల్లో వచ్చే తీర్పులపై సాధారణ ప్రజలకు సైతం అవగాహన కల్పించే సులభమైన విధానాలను రూపొందించాలని సూచించారు. న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె.సీతామాణిక్యం మాట్లాడుతూ న్యాయ విద్యార్థులకు అవసరమైన ప్రత్యక్ష శిక్షణ, నైపుణ్యాలను అందించే విధంగా ఈ పోటీలు ఉంటాయని చెప్పారు. ఈ పోటీలకు దేశవ్యాప్తంగా 24 విద్యాసంస్థల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా కళాశాల ప్రాంగణంలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహానికి అతిథులు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విశ్రాంత న్యాయమూర్తి యు.దుర్గా ప్రసాద్రావును సత్కరించారు. ఆచార్య వై. సత్యనారాయణ, ఆచార్య వి. కేశవరావు, ఆచార్య ఎస్. సుమిత్ర, ఆచార్య వి. రాజ్యలక్ష్మి, ఆచార్య వి. విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ దుర్గా ప్రసాదరావు ఏయూలో జాతీయస్థాయి మూట్ కోర్టు పోటీలు ప్రారంభం -
తేనె సేకరణ, నిల్వపై అవగాహన
చింతపల్లి: గిరిజన రైతులు పెట్టెతేనెను సమర్థవంతంగా నిర్వహించగలిగితే అదనంగా నికర ఆదాయం వస్తుందని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు సందీప్నాయక్, ప్లాంట్ పెథాలజిస్ట్ డాక్టర్ వెంకటేష్బాబు అన్నారు. చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో పెట్టెతేనె నిర్వహణపై రైతులకు శిక్షణ కార్యక్రమాలు చేపుడుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం రైతులను అంతర్ల గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ గిరిజన రైతు కోరాబు లింగన్నపడాల్ చేపడుతున్న పెట్టెతేనె నిర్వహణ పద్ధతులను చూపించారు. తేనె సేకరణ, నిల్వలపై పలు సూచనలిచ్చారు. ఏడాది పొడవునా వివిధ రకాల పూలు, పండ్ల సాగు చేపట్టడం ద్వారా తేనెటీగలకు ఆహారం సమృద్ధిగా లభిస్తుందని తద్వారా పెట్టెతేనె నిర్వహణకు అనువుగా ఉంటుందన్నారు.గాయపడిన క్వారీ కార్మికుడి మృతి అనకాపలి టౌన్: కుంచంగి క్వారీలో ఒడిశాకు చెందిన కె.జానీ అనే కార్మికుడు మృతి చెందాడని రూరల్ ఎస్ఐ రవికుమార్ తెలిపారు. శుక్రవారం ఉదయం క్వారీ పనులు చేస్తుండగా గాయపడిన జానీని చికిత్స నిమిత్తం ఎన్టీఆర్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన చికిత్స పొందుతూ మృతి చెందాడని, ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. -
రైలు ఢీకొని గాయపడిన వ్యక్తి మృతి
పాయకరావుపేట: రైలు ఢీకొని గాయపడిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తుని రైల్వే పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు. పట్టణంలోని రాజీవ్ కాలనీ ఎదురుగా ఉన్న రైల్వే గేట్ సమీపాన ఓ వ్యక్తి పట్టాలు దాటుతుండగా ఈనెల 17న రైలు బలంగా ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయమైంది. 108లో తుని ఏరియా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించగా.. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడు పసగడుగుల సత్యనారాయణ(55) పి.కొత్తపల్లి గ్రామంగా తెలిసిందన్నారు. డి.పోలవరం గ్రామం వెళ్లేందుకు పట్టాలు దాటుతున్నట్లు తెలిపారు. మృతుడు కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. -
గిరిజన మత్స్యకారులను విస్మరించిన ప్రభుత్వాలు
ముంచంగిపుట్టు: గిరిజన మత్స్యకారుల సంక్షేమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగాంజనేయులు అన్నారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మండలంలోని కొత్తసుజనకోటలో ఆంధ్రప్రదేశ్ మత్స్య కార్మిక సంఘం ఏఐటీయూసీ జిల్లా కో–కన్వీనర్ వి.అమర్ ఆధ్వర్యంలో శుక్రవారం మత్స్యగెడ్డ పరీవాహక ప్రాంత గిరిజన మత్స్యకారులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగాంజనేయులు మాట్లాడుతూ జిల్లాలో వేలాదిమంది గిరిజన మత్స్యకారులకు రాయితీలు,సౌకర్యాలు కల్పించడంలో జిల్లా మత్స్యశాఖ అధికార యంత్రాంగం, ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు.సుజనకోటలో ఏర్పాటు చేసిన కేజ్ కల్చర్ సంవత్సరాలు గడుస్తున్న వినియోగంలోకి రాలేదని చెప్పారు. మైదాన ప్రాంత మత్స్యకారులకు కల్పించే అన్ని సౌకర్యాలు గిరిజన మత్స్యకారులకు అందించాలని కోరారు. వలలు,బోట్లు అందించడంతో పాటు రాయితీలపై రుణాలు మంజూరు చేయాలని, 50 సంవత్సరాలు దాటిన మత్స్యకారులకు పింఛన్లు,ప్రమాదవశాత్తు చనిపోతే రూ.20లక్షలు ఎక్గ్రేషియా ప్రకటించాలని ఆయన కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా మత్స్య కార్మిక సంఘం నేత లక్ష్మణ్,మండల గిరిజన మత్స్య కార్మిక సంఘం నాయకులు నరేష్,లక్ష్మణరావు, భాస్కర్,సొమన్న,గణపతి తదితరులు పాల్గొన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగాంజనేయులు -
సూపర్ జెయింట్స్ వచ్చేశారు
విశాఖ స్పోర్ట్స్: ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో తమ తొలి మ్యాచ్ ఆడేందుకు లక్నో సూపర్ జెయింట్స్(ఎల్ఎస్జీ) జట్టు విశాఖపట్నం చేరుకుంది. శుక్రవారం ప్రత్యేక విమానంలో లక్నో నుంచి జట్టు విశాఖకు వచ్చింది. వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ఈ నెల 24వ తేదీ రాత్రి 7.30 గంటలకు ఎల్ఎస్జీ, ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్కు కెప్టెన్గా వ్యవహరించిన రిషబ్ పంత్ విశాఖ స్టేడియంలో రెండు మ్యాచ్లు ఆడాడు. ఈసారి ఎల్ఎస్జీ జట్టుకు రిషబ్ పంత్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. తమ తొలి మ్యాచ్లో విజయం సాధించాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్రాక్టీస్ ప్రారంభించగా, ఎల్ఎస్జీ జట్టు శనివారం రాత్రి ప్రాక్టీస్ చేయనుంది. ఎల్ఎస్జీ జట్టుకు మెంటర్గా జహీర్ ఖాన్, హెడ్ కోచ్గా లాంగర్, సహాయ కోచ్లుగా జాంటీ రోడ్స్, ప్రవీణ్ తంబే, లాన్స్ క్లుసెనర్ వంటి వారు ఉన్నారు. జట్టులో వికెట్ కీపర్లుగా ఆర్యన్, నికోలస్ అందుబాటులో ఉన్నారు. ఆల్రౌండర్లుగా మార్క్రమ్, మార్ష్, షాబాజ్ ఉండగా, బ్యాటింగ్లో ఆయుష్, డేవిడ్ మిల్లర్, సమద్ తమ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. బౌలింగ్లో రవి బిష్ణోయ్, ఆవేష్, ఆకాష్తో పాటు ఇంపాక్ట్ ప్లేయర్గా సిద్ధార్థ్ లేదా అర్షిన్ ఆడే అవకాశం ఉంది. అయితే మయాంక్, మోషిన్, ఆవేష్ గాయాల కారణంగా జట్టుకు అందుబాటులో ఉండటంపై సందేహాలు ఉన్నాయి. ప్రాక్టీస్ సెషన్ తర్వాత బౌలింగ్ విభాగంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇరు జట్లు గ్రూప్–2లో ఉన్నాయి. గత సీజన్లో ఇరు జట్లు కూడా లీగ్ దశలోనే నిష్క్రమించాయి. రాహుల్ రానట్టేనా? కాగా.. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఆటగాడు కె.ఎల్.రాహుల్ ఇంకా విశాఖ చేరుకోలేదు. దీంతో ఆయన విశాఖలో జరిగే రెండు మ్యాచ్లకు అందుబాటులో ఉండటం అనుమానమే.. దీంతో లక్నో సూపర్ జెయింట్స్తో జరిగే తొలి మ్యాచ్లో ఢిల్లీ తరపున ఫెరీరా వికెట్ కీపర్గా బరిలోకి దిగే అవకాశం ఉంది. గత సీజన్లో రాహుల్ లక్నో జట్టుకు కెప్టెన్గా ఉన్నాడు. -
ప్రకృతి వ్యవసాయంతో కాఫీలో అధిక దిగుబడులు
● కర్నాటక సీసీఆర్ఐ శాస్త్రవేత్త సౌందరరాజన్ సాక్షి,పాడేరు: జిల్లాలో కాఫీతోటలు సాగు చేస్తున్న గిరిజన రైతులంతా ప్రకృతి వ్యవసాయంతో అధిక దిగుబడులు సాధించవచ్చని కర్నాటక సీసీఆర్ఐ శాస్త్రవేత్త సౌందరరాజన్ తెలిపారు. కేంద్ర కాఫీబోర్డు ఆధ్వర్యంలో కాఫీ రైతులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు,ఆవుపేడ,మూత్రంతో ఎరువుల తయారీపై శుక్రవారం మినుములూరు కేంద్ర కాఫీబోర్డులో శిక్షణ ఇచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేంద్రియ ఎరువుల వినియోగం ద్వారా అధిక దిగుబడులతో పాటు ఆర్గానిక్ కాఫీని ఉత్పత్తి చేయవచ్చన్నారు. కాఫీతోటల్లో ఘన జీవామృతం,జీవామృతంలను వినియోగించడంతో మంచి ఫలితాలు ఉంటాయన్నారు.సేంద్రియ ఎరువులను ప్రతి కాఫీ రైతులు సొంతంగానే తయారు చేసుకుని కాఫీతోటలకు వినియోగించాలన్నారు.ఈ కార్యక్రమంలో మినుములూరు ఎస్ఎల్వో రమేష్,ఇతర అధికారులు పాల్గొన్నారు. -
తిరుగు ప్రయాణంలో వలస కూలీ మృతి
కూనవరం: బతుకు దెరువు కోసం వచ్చిన వలస కూలీ పనులు ముగించుకొని స్వగ్రామం తిరిగి వెళుతూ కోతులగుట్ట, పంద్రాజుపల్లి మధ్య రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఎస్సై లతశ్రీ కథనం ప్రకారం.. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బైనాపల్లి గ్రామానికి చెందిన వలస కూలీ ముచ్చిక యర్రా (38) సరిహద్దు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లా కూనవరం మండలం పోచవరం గ్రామంలో ఓ రైతు వద్దకు కూలి పనులకు వచ్చాడు. పనులు ముగియడంతో లెక్కలు చూసుకొని స్వగ్రామానికి గురువారం తిరుగు ప్రయాణం అయ్యాడు. ఏపీ సరిహద్దు గ్రామం చిడుమూరు వరకు ట్రాక్టర్పై వెళుతుండగా కోతులగుట్ట, పంద్రాజుపల్లి మధ్యలో ట్రాక్టర్ టైరు పేలింది. డ్రైవర్ పక్కనున్న యర్రా భయపడి కిందికి దూకేశాడు. ఆ క్రమంలో వెనుక వస్తున్న ట్రక్ కింద పడి మృతి చెందాడని ఎస్సై తెలిపారు. స్థానిక సీహెచ్సీలో పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని బంధువులకు అప్పగించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆమె తెలిపారు. -
ప్రకృతి సేద్యంతో ఆరోగ్యకర ఉత్పత్తులు
తుమ్మపాల : ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులు వినియోగం ద్వారా ఆరోగ్యకరమైన ఆహారం అందుతుందని జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగం ప్రాజెక్ట్ అధికారి సిహెచ్.లచ్చన్న అన్నారు. పట్టణంలో జీవీఎంసీ వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాచురల్ ఫార్మింగ్ వ్యవసాయ ఉత్పత్తులు, కూరగాయలు, ఆకుకూరలు స్టాల్ను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి ఉత్పత్తులను వినియోగించడం వల్ల ఎటువంటి అనారోగ్యాలకు గురికాకుండా, బీపీ షుగరు గుండుపాటి వంటి వ్యాధులు రాకుండా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి వర్మ, జిల్లా కోఆర్డినేటర్ గోవింద్, మార్కెటింగ్ మాస్టర్ ట్రైనర్ అప్పలరాజు, మోడల్ మేకర్స్, పకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. -
శ్రీరామగిరి ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
వి.ఆర్.పురం: శ్రీరామనవమి సమీపించిన నేపథ్యంలో శ్రీరామగిరి దేవాలయ నిర్వాహకులు గురువారం ఐటీడీఏ పీవో అపూర్వ భరత్ను కలసి ఏర్పాట్ల గురించి చర్చించారు. భక్తుల సౌకర్యార్థం అధికారులు తీసుకోవలసిన చర్యల గురించి వివిధ శాఖలకు ఆదేశాలు ఇస్తామని పీవో వారికి తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ముంపు వల్ల దేవాలయం కనుమరుగయ్యే పరిస్థితి నెలకొన్నందున శ్రీరామగిరిని ద్వీప దేవాలయం (ఐలెండ్ టెంపుల్)గా అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా నిర్వాహకులు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం శ్రీరామనవమి వేడుకల పోస్టర్ను పీవో ఆవిష్కరించారు. ఉత్సవ ఆహ్వాన పత్రికను నిర్వాహకులు ఆయనకు అందజేశారు. పీవోను కలిసిన వారిలో అర్చకులు సౌమిత్రి పురుషోత్తమాచార్యులు, వెంకన్నదొర, చైర్మన్ సుదర్శన్, సర్పంచ్ పులి సంతోష్ కుమార్, ఈవో సాయిబాబు, దేవదాయ ధర్మాదాయ శాఖ ఈఈ లక్ష్మీకుమార్, నాయకులు శ్రీనివాస్, లక్ష్మణరావు, రామారావు, రాజేంద్రప్రసాద్, అంజన్రావు, శ్రీరామ్మూరి తదితరులున్నారు. -
గిరిజన చట్టాలపై అవగాహన అవసరం
దేవీపట్నం (రంపచోడవరం): గిరిజనులకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు సమత స్వచ్ఛంద సంస్ధ పనిచేస్తుందని సంస్థ డైరెక్టర్ సుశాంత్ అన్నారు. దేవీపట్నం మండలం సీతారాం ఆర్అండ్ఆర్ కాలనీలో గురువారం సమత స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రంచోడవరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏఆర్ భగవాన్ గిరిజనులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పర్యావరణానికి నష్టం కలిగిస్తే వాటిని రక్షించేందుకు అనేక చట్టాలు ఉన్నాయన్నారు. వాటి ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చన్నారు. అలాగే ఏజెన్సీలో గిరిజనులకు రక్షణగా ఉన్న చట్టాలపై అవగాహన కల్పించారు. సమత స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ శుషాంత్, సతీష్కుమార్, ప్రకృతి సంస్థ డైరెక్టర్ సుబ్బరాజు, ఐటీడీఎస్ డైరెక్టర్ అనిల్కుమార్లు గిరిజనులు పాల్గొన్నారు. -
మావోయిస్టులకు వ్యతిరేకంగా ర్యాలీ
వై.రామవరం: మండలంలోని కోట గ్రామ ప్రజల ఆధ్వర్యంలో గురువారం మావోయిస్టులకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. తమకు మావోయిజం వద్దని, అబివృద్ధే ముఖ్యమని నినాదాలు చేస్తూ వీధుల్లో తిరిగారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గతంలో మావోయిస్టులు అడ్డుకోవడంతో మారుమూల ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం, సెల్ టవర్ల నిర్మాణం వంటి అబివృద్ధి కారక్రమాలు నిలిచిపోయాయని చెప్పారు. రవాణా సదుపాయం లేక రోగులను డోలీల్లో తరలించే పరిస్థితి ఉండేదన్నారు. ఇప్పుడిప్పుడే అబివృద్ధి చెందుతున్న మారుమూల ప్రాంత అభివృద్ధిని మావోయిస్టులు అడ్డుకోవద్దని కోరారు. అనంతరం మానవహారం నిర్వహించి, మావోయిజం జోలికి వెళ్లమని స్థానికులు ప్రతిజ్ఞ చేశారు. -
బైక్ చెట్టును ఢీకొని బాలిక దుర్మరణం
మారేడుమిల్లి: మండలంలోని దేవరపల్లి గ్రామం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బైకు చెట్టును ఢీకొని బాలిక మృతి చెందింది. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు.. రంపచోడవరం మండలం కాకవాడ పంచాయతీ రాకోట గ్రామానికి చెందిన నూకలేటి కామేశ్వర్రెడ్డి ఇద్దరు పిల్లలను, తన అక్కను బైక్పై ఎక్కించుకొని మారేడుమిల్లి మండలం జీఎం వలస గ్రామంలోని బంధువుల ఇంటికి వచ్చాడు. తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా మండలంలో దేవరపల్లి గ్రామం వద్ద బైక్ అదుపు తప్పి పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న నూకలేటి హంసగీత (4) అక్కడిక్కడే మృతి చెందింది. ఇంకొక బాలిక నిఖిత వర్షిణి కుడి చేయి విరిగింది. జయకుమారికి స్వల్ప గాయాలయ్యాయి. బైక్ నడుపుతున్న కామేశ్వర్రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కామేశ్వరరెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మారేడుమిల్లి పోలీసులు తెలిపారు. -
అరగంటలో గమ్యం చేరేలోగా..
పాడేరు: నాలుగు రోజులు సెలవు తీసుకొని కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుదామని ఎంతో ఆశతో ఇంటికి బయలుదేరిన యువకుడు ఇంకో అరగంటలో గమ్యం చేరుకుంటాడనగా మృత్యువు పాలయ్యాడు. ఈ సంఘటన గురువారం ఉదయం పాడేరు–చోడవరం ప్రధాన రహదారి మినుములూరు సమీపంలో మలుపు వద్ద జరిగింది. హుకుంపేట మండలం దొందిరాప గ్రామానికి చెందిన సొమెలి చిరంజీవి, గౌరమ్మ దంపతుల రెండో కుమారుడు సొమెలి వెంకటరమణ (22) విశాఖపట్నంలోని ఓ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం తన ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయలుదేరాడు. మరో అరగంటలో గ్రామానికి చేరుకునే సమయంలో పాడేరు–చోడవరం ప్రధాన రహదారి మినుములూరు సమీపంలో మలుపు వద్ద ఎదురుగా వస్తున్న వ్యాన్ బలంగా ఢీకొట్టింది. తలకు హెల్మెట్ లేకపోవడంతో తీవ్ర గాయాలపాలైన యువకుడు సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. స్థానికులు విషయాన్ని పోలీసులకు చేరవేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించి పోస్ట్మార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సంఘటనకు కారణమైన వ్యాన్ డ్రైవర్ వెంటనే అక్కడి నుండి పరారయ్యాడు. సంఘటనకు కారణమైన వ్యాన్ను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సూర్యనారాయణ విలేకరులకు తెలిపారు. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన వ్యాన్ స్వగ్రామానికి వస్తున్న యువకుడి మృతి మినుములూరు మలుపు వద్ద ప్రమాదం -
ఆల్ ఇండియా టోర్నమెంట్కు డిగ్రీ కాలేజీ విద్యార్ధి
విద్యార్థి సోమేశ్వరరావును అభినందిస్తున్నప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.రాజు, అధ్యాపకులు నర్సీపట్నం : ఆంధ్ర యూనివర్శిటీలో బుధవారం జరిగిన యూనివర్శిటీ బేస్బాల్ సెలక్షన్లో యూనివర్శిటీ జట్టుకు నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ థర్డ్ ఇయర్ చదువుతున్న రావుల సోమేశ్వరరావు సెలెక్ట్ అయ్యాడు. యూనివర్శిటీ టీం తరపున త్వరలో పంజాబ్లో జరగనున్న ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్శిటీ బేస్బాల్ టోర్నమెంట్లో అడనున్నాడు. ఈ సందర్భంగా విద్యార్థి సోమేశ్వరరావును కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.రాజు, అధ్యాపకులు అభినందించారు. క్రీడల్లో రాణించే విద్యార్థులకు కాలేజీ తరపున అన్ని విధాలా సహకారం అందిస్తామని తెలిపారు. -
వైఎస్సార్ పేరు తొలగింపులో కుట్ర
సాక్షి, విశాఖపట్నం: పీఎంపాలెంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వద్ద వైఎస్సార్ సీపీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కూటమి ప్రభుత్వం కుట్ర చేసి.. స్టేడియం ఆధునికీకరణ పనుల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రవేశ ద్వారం, ముఖభాగం(ఫసాడ్)పై వైఎస్సార్ పేరు తొలగించినందుకు వ్యతిరేకంగా గురువారం వైఎస్సార్ సీపీ శాంతియుతంగా నిరసన తెలిపింది. మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో మేయర్ గొలగాని హరివెంకటకుమారి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, అరకు మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి, మాజీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్పొరేటర్లు తొలుత స్టేడియం వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు నల్ల రిబ్బన్లతో ఆందోళన చేశారు. వైఎస్సార్ పేరును యథావిధిగా పెట్టాలని నినాదాలు చేశారు. 48 గంటల్లో సమాధానం చెప్పాలి : ఏసీఏకు అమర్నాథ్ డిమాండ్ విశాఖలో ఈ నెల 24, 30 తేదీల్లో ఐపీఎల్ మ్యాచ్లు ఉన్న నేపథ్యంలో.. విశాఖ బ్రాండ్ ఇమేజ్ను కాపాడాలనే ఉద్దేశంతో పాటు క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా శాంతియుతంగా నిరసన తెలిపినట్లు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. కూటమి పార్టీల ఎంపీలు ఏసీఏలో సభ్యులుగా ఉండడంతోనే కుట్రపూరితంగా స్టేడియం ప్రవేశ ద్వారం, ఫసాడ్పై వైఎస్సార్ పేరు తొలగించారని మండిపడ్డారు. 2009 సెప్టెంబర్ 14న అప్పటి ఏసీఏ అధ్యక్షుడు గోకరాజు గంగారాజు ఆధ్వర్యంలో ఏసీఏ–వీడీసీఏ స్టేడియాన్ని వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంగా మార్చినట్లు గుర్తు చేశారు. అప్పుడు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ మార్క్, బ్రాండ్ కనబడకూడదనే కుట్రతోనే మహానేత పేరును తొలగిస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అభివృద్ధి చేసిన సీతకొండ వ్యూ పాయింట్కు వైఎస్సార్ పేరు పెడితే దాన్ని తొలగించారని మండిపడ్డారు. విశాఖ ఫిలింనగర్ క్లబ్ లాన్కు వైఎస్సార్ పేరు తొలగించారని, ఇవే కాకుండా ఉమ్మడి విశాఖ జిల్లాలో అనేక చోట్ల వైఎస్సార్ విగ్రహాలు ధ్వంసం చేశారన్నారు. వైఎస్సార్ పేరును ఏసీఏ తొలగించిందా? లేదంటే కూటమి ప్రభుత్వం ఒత్తిడితో తొలగించారా? 48 గంటల్లో సమాధానం చెప్పాలని ఆంధ్ర క్రికెట్ అసోషియేషన్ను అమర్నాథ్ డిమాండ్ చేశారు. నిరసనలో మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, చింతలపూడి వెంకటరామయ్య, అన్నంరెడ్డి అదీప్రాజ్, కె.భాగ్యలక్ష్మి, శోభా హైమావతి, నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి, డిప్యూటీ మేయర్లు జియ్యాని శ్రీధర్, కటుమూరి సతీష్, పార్టీ కార్యాలయ పర్యవేక్షకుడు రవిరెడ్డి, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు బొల్లవరపు జాన్వెస్లీ, పేర్ల విజయచంద్ర, పార్టీ ముఖ్య నాయకులు రొంగలి జగన్నాఽథం, కొండా రాజీవ్గాంధీ, మొల్లి అప్పారావు, వుడా రవి, జహీర్ అహ్మద్, గండి రవి, శోభాస్వాతి రాణి, కార్పొరేటర్లు రెయ్యి వెంకట రమణ, అక్కరమాని పద్మరాము నాయుడు, డౌలపల్లి ఏడుకొండలరావు, కోరుకోడ వెంకట రత్న స్వాతి దాస్, పద్మా రెడ్డి, బిపిన్ కుమార్ జైన్, కె.వి.శశికళ, గుడివాడ అనూష, ఇమ్రాన్, జిల్లా కార్యవర్గం కమిటీ, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు బోని బంగారు నాయుడు, నడింపల్లి కృష్ణంరాజు, చెన్నా జానకీరామ్, మువ్వల సురేష్, ద్రోణంరాజు శ్రీవాస్తవ్, బింగి హరి కిరణ్ రెడ్డి, పల్లా దుర్గారావు, మనలత జాబ్దాస్ (చిన్ని), పేడాడ రమణి కుమారి, వంకాయల మారుతీ ప్రసాద్, పీలా కిరణ్ జగదీష్, రామారెడ్డి, రాయపు అనిల్ కుమార్, లావణ్య చిమట, శెట్టి రోహిణి, పిల్లి సుజాత, పిల్లా సుజాత, అల్లంపల్లి రాజబాబు, మాధవీవర్మ, మజ్జి వెంకట రావు, బంకు సత్య, పోలిరెడ్డి, శ్రీదేవి వర్మ, రాజేశ్వరి, సూరిబాబు పాల్గొన్నారు. క్రికెట్ స్టేడియం వద్ద వైఎస్సార్ సీపీ ధర్నా యథావిధిగా పేరు పెట్టాలని డిమాండ్ముఖ్య నాయకులకుబెదిరింపు ఫోన్లు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వద్ద వైఎస్సార్ సీపీ ఆందోళన చేపడుతుందని ఈ నెల 19న పిలుపునిచ్చిన మరుక్షణం నుంచి కూటమి ప్రభుత్వం కుట్రలకు తెరతీసింది. బుధవారం అర్ధరాత్రి నుంచే వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు, కార్పొరేటర్లకు పోలీసులు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. నిరసన కార్యక్రమానికి ఎవరినైనా తీసుకెళ్తే అరెస్ట్ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె.రాజును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పలువురు వైఎస్సార్ సీపీ ముఖ్య నేతల ఇళ్లకు వెళ్లి పోలీసులు వార్నింగ్లు ఇచ్చారు. -
‘స్పీకర్ అయ్యన్నపాత్రుడు క్షమాపణ చెప్పాలి’
పాడేరు : వైఎస్సార్సీపీకి చెందిన ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలపై శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమని, తక్షణమే వెనక్కి తీసుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు సీదరి రాంబాబు, జిల్లా అధికార ప్రతినిధి కూడా సురేష్కుమార్ డిమాండ్ చేశారు. పాడేరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం వారు విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తే మైకులు ఇవ్వలేని పరిస్థితుల్లో స్పీకర్ ఉన్నారని, అలాంటప్పుడు సమస్యలను లేవనెత్తుతారన్నారు. అసెంబ్లీను వాకౌట్ చేసి మీడియా సమక్షంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై తమ గొంతును వినిపిస్తున్నారన్నారు. నిత్యం ప్రజలతో ఉండి సమస్యలను అడిగి తెలుసుకొని అధికారుల దృష్టికి తెచ్చి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే అసెంబ్లీకి హాజరు కాలేదన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని స్పీకర్ అయ్యన్నపాత్రుడు దళిత ఎమ్మెల్యేలపై చాలా అవమానకరంగా మాట్లాడి కించపరిచారన్నారు. స్పీకర్ వాఖ్యలను గవర్నర్ సుమోటగా తీసుకొని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. పార్టీ ఎస్టీ సెల్ నియోజకవర్గ అద్యక్షుడు శరభ సూర్యనారాయణ, నాయకులు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
గేట్–2025లో దినేష్కు 23వ ర్యాంక్
సింహాచలం: గేట్–2025లో ఆలిండియా 23వ ర్యాంకును సాధించి సింహాచలం దరి శ్రీనివాస్నగర్కి చెందిన చింతా దినేష్ సత్తా చాటాడు. దినేష్ తాడేపల్లి గూడెంలోని ఎన్ఐటీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. తండ్రి హరిశివప్రసాద్ అనకాపల్లి జిల్లా తుమ్మపాల పీహెచ్సీలో సీనియర్ అసిస్టెంట్. తల్లి సుజాత గృహిణి. టెన్త్లో 10 జీపీఏ, ఇంటర్లో 980 మార్కులు సాధించాడు. గేట్–2025లో ఎలక్ట్రానిక్స్ అండ్ క మ్యూనికేషన్స్ విభాగంలో ఆలిండియా 23వ ర్యాంకు సాధించిన దినేష్ను కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, సన్నిహితులు అభినందించారు. -
బైక్ను ఢీకొన్న కారు–ఇద్దరికి గాయాలు
డుంబ్రిగుడ: మండలంలోని అరకు–పాడేరు జాతీయ రహదారి బురదగెడ్డ వద్ద గురువారం ద్విచక్ర వాహనాన్ని పర్యాటకుల కారు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం మండలంలోని కొర్రాయి పంచాయతీ జాకరవలస గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు అరకు నుంచి స్వగ్రామానికి వస్తుండగా, పాడేరు నుంచి అరకు వైపు వస్తున్న కారు బురదగెడ్డ మలుపు వద్ద ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను అరకులోయ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారు బలంగా ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనం నుజ్జనుజ్జయ్యిందని స్థానికులు తెలిపారు. -
ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
చింతూరు: విద్యార్థులు స్థానిక విద్యను అవకాశంగా మలుచుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్ సూచించారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం నిర్వహించిన వార్షికోత్సవంలో పాల్గొన్న పీవో మాట్లాడుతూ ప్రస్తుత దశలో విద్య ఎంతో ముఖ్యతమైనదన్నారు. అందరూ కష్టపడి ఇష్టంగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభచాటిన విద్యార్థులకు ఆయన బహుమతులను అందజేశారు. ప్రిన్సిపాల్ రత్నమాణిక్యం, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నాగుల్మీరా, అధ్యాపకులు హారతి, వెంకటరావు, శేఖర్, రమేష్ పాల్గొన్నారు. -
హామీలు గుప్పించి చేతులెత్తేశారు..
సీలేరు: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పరిపాలనను చూసి కూటమి ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలని శాసనసభ్యుడు విశ్వేశ్వరరాజు అన్నారు. గురువారం దారకొండ వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలో వచ్చి పథకాలు ఇవ్వడంలో చేతులు ఎత్తేశారని ఎద్దేవా చేశారు. మేనిఫెస్టోలో ఉన్న అన్ని పథకాలను ప్రజలకు నేరుగా ఇంటికి పంపిణీ చేసిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదేనని, అధికారంలోకి వచ్చి 9 నెలలు దాటినా సూపర్ 6 పథకాల్లో ఒకటీ అమలు చేయకపోగా, గత ప్రభుత్వం తప్పులు చేసింది అనడం మానుకోవాలని అన్నారు. ఈ ప్రభుత్వం పూర్తిగా గిరిజనులకు అన్యాయం చేస్తోందని, అభివృద్ధిని పక్కన పెట్టి నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. మళ్లీ రానున్నది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని కార్యకర్తలు, పార్టీ నాయకులు, కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. గంగవరం వంతెన పునరుద్ధరణ ఎప్పుడుః దారకొండ పంచాయతీలో వరదల్లో కొట్టుకుపోయిన గంగవరం వంతెనను నేటికీ నిర్మించకపోవడం వల్ల రాకపోకలకు ఇబ్బందిగా మారిందని ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు అన్నారు. వంతెన పరిశీలించిన ఆయన పనులు చేపట్టనందుకు అధికారులపై మండిపడ్డారు. తక్షణమే వంతెన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. దారకొండ, గుమ్మిరేవుల, దుప్పులవాడ పంచాయతీ మారుమూల ప్రాంతాలకు చెందిన పార్టీ నాయకులు ఆయనను కలిసి మంచినీరు, సీసీ రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పడంతో ఆయన వెంటనే సంబంధిత అదికారులతో మాట్లాడి బోర్లు వేసేలా చర్యలు తీసుకున్నారు. ఆయన వెంట ఎంపీపీ కుమారి, దామనాపల్లి సర్పంచ్, ఎంపీటీసీలు తదితరులు ఉన్నారు. కూటమి ప్రభుత్వం జగనన్నను చూసి సిగ్గు తెచ్చుకోవాలి గిరిజన గ్రామాల్లో అభివృద్ధి శూన్యం ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ధ్వజం -
తాగునీటి పంచ సూత్రాల పోస్టర్ ఆవిష్కరణ
సాక్షి, పాడేరు: ఉమ్మడి విశాఖ జిల్లా నవ నిర్మాణ సమితి రూపొందించిన తాగునీటి సంరక్షణ పంచసూత్రాల ప్రచార పోస్టర్ను కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ గురువారం తన చాంబర్లో ఆవిష్కరించారు. పంచసూత్రాలపై అన్ని గ్రామాల్లో ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత, తాగునీటి వనరుల సంరక్షణ, సురక్షిత తాగునీటి వినియోగం ద్వారా ఆరోగ్యకరమైన గిరిజన సమాజం సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో కె.పద్మలత, జిల్లా నవనిర్మాణ సంస్థ కార్యదర్శి ఎ.రఘురామ్, సీనియర్ మేనేజర్లు రవికుమార్, వి.వి.ఎస్.ఎస్.కుమార్ పాల్గొన్నారు. -
పడవరేవు వేలం పాట రూ.78.60 లక్షలకు ఖరారు
కూనవరం: స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో కూనవరం–రుద్రమకోట గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో గోదావరి రేవులో పడవ నడుపుకునేందుకు గురువారం బహిరంగ వేలం పాట నిర్వహించారు. పెచ్చు పాటదారుడైన వెలేరుపాడు మండలం రేపాకగొమ్ము గ్రామానికి చెందిన భీరబోయిన కోటేశ్వరరావుకు రూ.78.60 లక్షలకు ఖరారైంది. వెలేరుపాడు, వీఆర్పురం మండలాల నుంచి 9 మంది ఈ వేలం పాటలో పాల్గొన్నారు. రెండవ హెచ్చు పాటదారుడు సోందె ముత్తయ్య రూ.78.50 లక్షల వరకు చేరుకున్నాడు. అంతకంటే హెచ్చు పాడిన కోటేశ్వరరావు పాట దక్కించుకున్నాడు. గత సంవత్సరం రూ. 80 లక్షలు ఖరారైన వేలం పాట ఈఏడాది రూ.78.60 లక్షలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. కూనవరం, రుద్రమకోట సర్పంచ్లు నాగసత్య హేమంత్ గాంధీ, స్వర్ణలత, రంపచోడవరం డీఎల్పీవో కె.నరసింగరావు, ఎంపీడీవో రామాంజనేయ ప్రసాద్, తహసీల్దార్ కె.శ్రీనివాసరావు, వీఆర్పురం ఈవోపీఆర్డీ శ్రీకాంత్ రెడ్డి, కూనవరం, రుద్రమకోట పంచాయతీల కార్యదర్శులు సురేష్, దావీద్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
విదేశీ పంటలకు అల్లూరి జిల్లా ఆలవాలంగా మారింది. ఇప్పటికే ఏజెన్సీ పాంతంలో స్ట్రాబెర్రీ, లిచీ, డ్రాగనన్ ఫ్రూట్ వంటి పంటలు మంచి ఫలితాలను ఇస్తుండగా తాజాగా ఈ కోవలోకి అవకాడో వచ్చి చేరింది. కాఫీ చెట్లకు నీడ కోసం పెంచుతున్న ఈ చెట్లు పోషక విలువలతో ఉన్న పళ్లను కూడ
చింతపల్లి: గిరిజన ప్రాంతానికి మేలైన, అనువైన రకాలను గుర్తించడానికి చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తలు నిరంతరం ప్రయోగాలు చేస్తుంటారు. ఏజెన్సీలో లాభదాయకమైన పంటలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో గతంలో యాపిల్, డ్రాగన్ ఫ్రూట్, స్ట్రాబెర్రీ, లిచీ వంటి మొక్కలను ప్రభుత్వం సరాఫరా చేసింది. చింతపల్లి మండలంలో గిరిజన రైతులు వాటిని పండించి మంచి ఫలితాలను పొందుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి అవకాడో వచ్చి చేరింది. నిజానికి రెండు దశాబ్దాల క్రితమే కేంద్ర కాఫీ బోర్డు అధికారులు కాఫీ మొక్కలకు నీడ కోసమని అవకాడో మొక్కలను మండలంలో గొందిపాకలు పంచాయతీలోని పలు గ్రామాల్లో పంపిణీ చేశారు. ఈ మొక్కలపై రైతులకు అవగాహన లేకపోయినా కాఫీ చెట్లకు నీడనిస్తాయనే ఉద్దేశంతో పెంపకం సాగించారు. ఈ మొక్కలు పెరిగి క్రమేపీ పండ్ల దశకు చేరుకున్నాయి. అయితే ఈ అవకాడో పండ్లకు మార్కెట్లో విలువ తెలియక వాటిని రైతులు వృథాగా వదిలేశారు. కొన్నేళ్ల క్రితం ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి గ్రామానికి వచ్చి ఈ అవకాడో పండ్లను చూసి దాని విశిష్టత, ఆ పండ్లకు మార్కెట్లో ఉన్న విలువను రైతులకు వివరించారు. దాంతో రైతులు నాటి నుంచి మార్కెట్లో ఈ అవకాడో పండ్ల అమ్మకాన్ని ప్రారంభించారు. దాంతో వ్యాపారస్తులు సైతం గ్రామాలకు వచ్చి రైతుల నుంచి ఈ పండ్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానంలో ఆరు దేశ, విదేశీ రకాలను దిగు మతి చేసుకొని ఎకరం విస్తీర్ణంలో ప్రయోగాత్మకంగా సాగు చేపట్టారు. ప్రత్యేక శ్రద్ధతో గిరి రైతుల సాగు చింతపల్లి మండలంలో గొందిపాకలు, చిక్కుడుబట్టి, చినబరడ, పెదబరడ మొదలైన గ్రామాల్లో రైతులకు ఐటీడీఏ గతంలో వివిధ రకాల పండ్ల మొక్కలతోపాటు అవకాడో మొక్కలను పంపిణీ చేసింది. రైతులు ఈ మొక్కలను తమ పొలాల్లో వేసి పెంచుతున్నారు. ప్రస్తుతం అవి పెరిగి పెద్దవై దిగుబడులను ఇస్తున్నాయి. ఈ అవకాడో పండ్లకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ఔషధ గుణాలు, పోషకాలు అధికం అవకాడో పండు ఇతర పండ్ల మాదిరిగా కాకుండా అత్యధిక పోషకాలు, ఔషధ గుణాలు కలిగి ఉన్నట్లు శాస్త్రవేత్తలు, పోషకాల నిపుణులు గుర్తించారు. ప్రధానంగా ఈ పండు క్యాన్సర్ కారకాలను నిరోధించడంతోపాటు కంటి చూపు, మధుమేహం, స్థూలకాయం తగ్గుదలకు, సంతానోత్పత్తికి, జీవక్రియ మెరుగుదలకు ఎంతో ఉపయోగపడుతున్నట్లు పరిశోధనలో గుర్తించారు. చింతపల్లిలో కొత్త రకాలపై పరిశోధనలు అవకాడో పండ్లకు దేశీయంగానే కాకుండా విదేశాల్లోను మంచి గిరాకీ ఉంది. దీనిని గుర్తించి చింతపల్లి ఉద్యానవన పరిశోధన స్థానంలో గత ఏడాది టికేడి–1, హోస్ మొక్కల సాగు చేపట్టగా ఈ ఏడాది కొత్తగా పింకిర్టన్, ప్యూర్డ్, రీడ్ వంటి కొత్త రకాలను ఇక్కడికి తీసుకువచ్చి పరిశోధనలు జరుపుతున్నాం. గిరిజన రైతాంగం పండించి ప్రస్తుతం మార్కెట్లో అమ్ముతున్న అవకాడోకు శాసీ్త్రయ నామం లేదు. దాంతో పంటకు మంచి గిట్టుబాటు ధర లభించడంలేదు. ప్రస్తుతం మా క్షేత్రంలో గత ఏడాది మూడు వైరెటీలు, ఈ ఏడాది 3 రకాలపై పరిశోధనలు జరుపుతున్నాం. ఈ కొత్త రకాలను శాసీ్త్రయ నామంతో మార్కెట్లో ప్రవేశపెట్టవచ్చు. దీంతో మంచి ధర వస్తుంది. ఏజెన్సీ ప్రాంతంలో కాఫీ, మిరియాలు పంటల వలే ఈ అవకాడో పంటను విస్తరించడానికి మేలైన రకాల కోసం ప్రయోగాలు చేపడుతున్నాం. – శెట్టి బిందు, ప్రధాన శాస్త్రవేత్త, ఉద్యాన పరిశోధన స్థానం, చింతపల్లికాఫీ చెట్లకు నీడనిచ్చేందుకు తీసుకొచ్చిన విదేశీ మొక్కపోషక విలువలున్న ఫలాలనూ ఇస్తోంది.. చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానంలో 6 దేశీ, విదేశీ రకాలపై పరిశోధనలు -
నాటు సారా నిర్మూలనే లక్ష్యంగా నవోదయం 2.0
సాక్షి, పాడేరు: నాటుసారా నిర్మూలనే నవోదయం 2.0 లక్ష్యమని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో రెవెన్యూ, అటవీశాఖ, పోలీసు, ఎకై ్సజ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ నాటుసారా తయారీదారులు, బెల్లం సరఫరాదారులపై దాడులు నిర్వహించి, కేసులు నమోదు చేయాలన్నారు. నాటుసారా తయారు చేసే గ్రామాలకు ప్రభుత్వ పథకాలు నిలిచిపోతాయని ప్రజలకు వివరించాలన్నారు. సారా తయారీ, రవాణాపై 14405 టోల్ఫ్రీ నంబర్కు సమాచారం అందించాలన్నారు. ఎస్పీ అమిత్ బర్దర్ మాట్లాడుతూ గంజాయి మాదిరిగానే నాటుసారా నివారణకు పోలీసులు, ఎకై ్సజ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అనంతరం నవోదయం 2.0 ప్రచార రథాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సమావేశంలో ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ సుజిత్సింగ్, ఏఈఎస్ నాగరాహుల్, జేసీ అభిషేక్గౌడ, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ పీవోలు సింహాచలం, అపూర్వ భరత్, సబ్ కలెక్టర్లు కల్పశ్రీ, సౌర్యమన్ పటేల్, ఇన్చార్జి డీడీ రజనీ, డీపీవో లవరాజు తదితరులు పాల్గొన్నారు వచ్చే నెల 7న యోగాసనాల అభ్యసన : అరకులోయలో వచ్చే నెల 7వ తేదీన నిర్వహించనున్న విద్యార్థుల యోగాసనాల అభ్యసనకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ దినేష్కుమార్ అధికారులను ఆదేశించారు. దీనిపై అధికారులతో సమావేశం నిర్వహించారు. 20 వేల మంది విద్యార్థులు పాల్గొనేలా అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సిద్ధం చేయాలన్నారు. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలతో పాటు పాడేరు ఐటీడీఏ పరిధిలోని విద్యార్థులంతా పాల్గొంటారని, అవసరమైన బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. సెల్ టవర్లకు త్వరితగతిన కనెక్షన్ల ఏర్పాటు జిల్లాలోని సెల్ సిగ్నలింగ్ వ్యవస్థ మెరుగుపరచాలని, నిర్మాణాలు పూర్తయిన టవర్లకు కనెక్షన్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశించారు. గురువారం ఆయన పలు నెట్వర్క్ సంస్థలతో సమీక్షించారు. బీఎస్ఎన్ఎల్ 941 టవర్లకు 604 పూర్తయ్యాయని, వీటిలో కొన్ని పనిచేయడం లేదనే ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. జియోకు సంబంధించి 520 టవర్లు మంజూరు కాగా 437 పనిచేస్తున్నాయని, ఎయిర్టెల్కు 139 టవర్లు మంజూరు కాగా 130 పూర్తయ్యాయని వీటిలో 76 పనిచేస్తున్నాయన్నారు. అన్ని నెట్వర్క్లకు సంబంధించి పెండింగ్ పనులు పూర్తి చేసి వినియోగంలోకి తేవాలన్నారు. జిల్లాలోని 4500 గ్రామాలు సెల్ సిగ్నల్ పరిధిలోకి రావాలని ఆయన అధికారులకు సూచించారు.కలెక్టర్ దినేష్కుమార్ -
బలిమెల జలాశయంనీటి వినియోగంపై సమీక్ష
సీలేరు: బలిమెల జలాశయం నీటి వినియోగంపై గురువారం చిత్రకొండలో ఇరు రాష్ట్రాల అధికారులు సమావేశం నిర్వహించారు. 2024–2025 నీటి సంవత్సరంలో ఎంతెంత నీటిని వినియోగించుకున్నారో లెక్కలు కట్టారు. దీని ప్రకారం జూలై 2024 నుంచి ఫిబ్రవరి 2025 వరకు ఒడిశా తన వాటాగా 68.8672 టీఎంసీలు వినియోగించుకున్నట్లు, ఆంధ్రా 50.7564 టీఎంసీల నీటిని వినియోగించుకున్నట్లు లెక్కలు తేల్చారు. దీని ప్రకారం ఒడిశా ఆంధ్రా కంటే 18.1108 టీఎంసీలు అధికంగా వినియోగించుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం బలిమెల జలాశయాల్లో 57.9941 టీఎంసీల నీటి నిల్వలు ఉండగా ఇందులో ఏపీ వాటా 38.0525 టీఎంసీలుగా, ఒడిశా వాటా 19.9416 టీఎంసీలుగా ఇరు రాష్ట్రాల అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి, ఇరిగేషన్ అవసరాల నిమిత్తం 8500 క్యూసెక్కుల నీటిని ఏపీకి, 2000 క్యూసెక్కుల నీటిని ఒడిశాకు బలిమెల జలాశయం నుంచి విడుదల చేయడానికి ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమంలో జెన్కో సీలేరు కాంప్లెక్స్ సూపరింటెండింగ్ ఇంజినీర్ బి.చంద్రశేఖర్రెడ్డి, ఈఈలు ఎం.శ్రీనివాసరావు, వి.రాజేంద్రప్రసాద్. ఏడీఈ దుర్గా శ్రీనివాసరావు, ఏఈఈ సీహెచ్ సురేష్లు పాల్గొన్నారు. -
తాగునీటికి అత్యంత ప్రాధాన్యం
కొయ్యూరు: తాగునీటికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని జిల్లా పరిషత్ సీఈవో పి.నారాయణమూర్తి వెల్లడించారు. ఏటా ఉమ్మడి విశాఖ జిల్లాలో రూ.6 కోట్లు తాగునీటి ట్యాంకుల నిర్వహణ కోసం ఖర్చు చేస్తున్నామన్నారు. ఆయన గురువారం ఎంపీడీవో కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ జిల్లా పరిషత్ నుంచి మండల పరిషత్లకు ఇస్తున్న 15 శాతం నిధులు వచ్చే ఏడాది నుంచి ఐదు శాతం పెరిగి 20 శాతానికి చేరుతాయన్నారు. అదేవిధంగా జల్లా పరిషత్ నిధులు 15 నుంచి పది శాతానికి తగ్గుతాయన్నారు. పీ–4 సర్వే పూర్తి కావస్తుందన్నారు. దీనిలో పేదల్లో అత్యంత పేదలను గ్రామసభల ద్వారా ఎంపిక చేయాలన్నారు. కొయ్యూరు తాగునీటి ట్యాంకును పరిశీలించి, క్లోరినేషన్తో పాటు ఇతర అంశాలపై ఆయన ఆర్డబ్ల్యూఎస్ జేఈ సాయిరాం నుంచి వివరాలు తెలుసుకున్నారు. నాలుగు గ్రామాలకు తాగునీరు అందించే ట్యాంకు కొయ్యూరు పంచాయతీలో ఉన్నా కొయ్యూరుకు నీరు రావడం లేదని సర్పంచ్ మాకాడ బాలరాజు సీఈవో దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జేఈని ఆదేశించారు. దీనికి అవసరమైన నిధులు ఇస్తామన్నారు. ఎంపీపీ బడుగు రమేష్ సీఈవో దృష్టికి తాగునీటి సమస్యను తీసుకెళ్లారు. సంపద కేంద్రాలను వినియోగంలోకి తేవాలి చెత్త నుంచి సంపద కేంద్రాలను వినియోగంలోకి తీసుకురావాలని సీఈవో ఆదేశించారు. రాజేంద్రపాలెంలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడి సచివాలయాన్ని తనిఖీ చేశారు. సర్పంచ్ పి.సింహాచలం సచివాలయ భవనం పూర్తి కాని విషయం ఆయన దృష్టిలో ఉంచారు. జెడ్పీ అతిథిగృహం మరమ్మతులకు రూ.20 లక్షలు విడుదల చేస్తామని, నాణ్యమైన విధంగా పనులు చేపట్టాలని ఆయన జేఈని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో ప్రసాద్, కార్యదర్శులు సీఈవోను సన్మానించారు. జీకే వీధి మండలంలో పర్యటన గూడెంకొత్తవీధి: ఘన సంపద కేంద్రాలను అన్ని పంచాయతీల్లో వినియోగంలోకి తీసుకురావాలని జెడ్పీ సీఈవో నారాయణమూర్తి అన్నారు. గురువారం ఆయన గూడెంకొత్తవీధిలో పర్యటించారు. ముందుగా చింతపల్లి మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. పారిశుధ్యం మెరుగుపరచడంతోపాటు తాగునీటికి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతీలకు అదనంగా నిధులను మంజూరు చేయాలని ఎంపీపీ బోయినకుమారి సీఈఓను కోరారు. ఎంపీడీవో ఉమామహేశ్వరరావు, ఈవోపీఆర్డీ పాపారావు పీఆర్ జేఈ, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏటా రూ.6 కోట్ల వ్యయం గ్రామసభల ద్వారా పేదల్లో అత్యంత పేదల ఎంపిక జిల్లా పరిషత్ సీఈవో నారాయణమూర్తి -
ముంచంగిపుట్టులో త్వరలో సబ్ పోస్టాఫీసు సేవలు
ముంచంగిపుట్టు: ముంచంగిపుట్టు మండల వాసులకు త్వరలోనే సబ్ పోస్టాఫీసు సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్టు అనకాపల్లి డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు తెలిపారు. మండల కేంద్రంలో బుధవారం ఆయన సబ్ పోస్టాఫీసు ఏర్పాటుకు అనుకూలమైన ప్రభుత్వ భవనాలు, స్థలాలను పరిశీలించారు. స్థానిక ఎంపీడీవో సూర్యనారాయణమూర్తి, తహసీల్దార్ నర్సమ్మలను కలిసి సబ్ పోస్టాఫీసు ఏర్పాటుకు భవనం లేక స్థలం కేటాయించాలని కోరుతూ వినతిపత్రం అందించారు. ఇందుకు వారు సైతం సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు మాట్లాడుతూ పోస్టల్ సేవలు విస్తరణలో భాగంగా ముంచంగిపుట్టు మండల కేంద్రంలో సబ్ పోస్టాఫీసు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రసుత్తం డిజిటల్ యుగంలో ఆధునిక సాంకేతికతతో పోస్టల్ శాఖ పని చేస్తుందని, తపాలా జీవిత బీమా, గ్రామీణ జనాభాకు బ్యాంకింగ్ సేవలు, పాస్ పోర్టు వంటి సేవలు విస్తృతం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అరకు డివిజన్ పోస్టల్ ఐపీవో లక్ష్మికిషోర్, పెదబయలు ఎంవో శ్రీను పాల్గొన్నారు. అనకాపల్లి డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు -
రికార్డులు సక్రమంగా నిర్వహించాలి
● జెడ్పీ డిప్యూటీ సీఈవో రాజ్కుమార్ ముంచంగిపుట్టు: ఎంపీడీవో కార్యాలయంలో ప్రతి రికార్డు నిర్వహణ సక్రమంగా ఉండాలని జెడ్పీ డిప్యూటీ సీఈవో కె.రాజ్కుమార్ అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయాన్ని బుధవారం ఆయన సందర్శించి, 2023–24 సంవత్సరాలకు చెందిన కార్యాలయం సిబ్బంది హాజరు,ఇంటి పన్నులు,పారిశుధ్య వివరాల రికార్డులతో పాటు మొత్తం 32 రికార్డులను తనిఖీ చేశారు.పంచాయతీ తీర్మానాలు పరిశీలించారు.కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు.జెడ్పీ అతిథి గృహం ప్రస్తుత పరిిస్థితిపై ఆరా తీశారు. ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా శానిటేషన్ పనులు ఎప్పటికప్పుడు చేయించాలన్నారు.ఇంటి పన్నులు వసూలు చేయడంలో పంచాయతీ కార్యదర్శులు నిబంధనలు పాటించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జీ ఎంపీడీవో సూర్యనారాయణమూర్తి, ఆర్డబ్ల్యూస్ ఏఈ రాజేష్ పాల్గొన్నారు. -
మృత శిశువుతో ఆందోళన
శృంగవరపుకోట: శిశువు మృతికి వైద్యులే కారణమంటూ మృత శిశువుతో తల్లి, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగిన ఘటన ఎస్.కోట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం గుమ్మ గ్రామానికి చెందిన అరుణ్ భార్య శాంతి ప్రసవం కోసం ఎస్.కోట ఏరియా ఆస్పత్రిలో చేరింది. ఉదయం 10 గంటల సమయంలో ఆపరేషన్ కోసం ఆస్పత్రి థియేటర్లోకి గర్భిణిని తీసుకెళ్లారు. అప్పటివరకు తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని చెప్పిన వైద్యులు కొద్ది సేపటికి మాట మార్చి శిశువు మృతిచెందినట్టు చెప్పారు. దీనిపై అరుణ్తో పాటు బంధువులు ఆందోళనకు గురయ్యారు. సకాలంలో వైద్య సేవలు అందించకపోవడం వల్లే ఆడ శిశువు చనిపోయిందంటూ శాంతితో పాటు బంధువులు, మృతశిశువుతో కలిసి ఆస్పత్రి ఆవరణలో బైఠాయించారు. ఇదే విషయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీల స్పందిస్తూ ప్రైవేట్స్కాన్ సెంటర్లో చేయించిన స్కాన్ రిపోర్టులో బిడ్డ హార్ట్బీట్ బాగుంది. సాధారణ ప్రసవం కోసం ప్రయత్నించామని చెప్పారు. ప్రసవం అవుతున్నప్పుడు బిడ్డ మెడకు రెండు పేగులు చుట్టుకున్నట్టు వైద్యులు చూశారని, బిడ్డ బయటకు వస్తున్న కొద్దీ పేగులు మెడకు బిగిసుకోవడంతో ఊపిరి ఆడక శిశువు మరణించిందని తెలిపారు. ఇందులో వైద్యుల నిర్లక్ష్యం ఎంత మాత్రం లేదని చెప్పారు. -
‘పది’ విద్యార్థులకు రవాణా సదుపాయం
పెదబయలు: మండలంలో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు బుధవారం నుంచి రవాణా సదుపాయం కల్పించారు. ‘కాలి నడకన పరీక్ష కేంద్రాలకు’అనే శీర్షికన ఈ నెల 18న సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి జిల్లా విద్యాశాఖాధికారులు స్పందించారు. బుధవారం హిందీ పరీక్షకు సంబంధించి ఏపీ గురుకుల పాఠశాల, తురకలవలస గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు ఆటోల్లో తరలించారు. ఇలా ప్రతి రోజు వాహనాల్లో విద్యార్థులను కేంద్రాలకు తీసుకెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శంకరరావు, తురకలవలస హెచ్ఎం గంగాబాయ్ మాట్లాడుతూ పరీక్షలు జరిగేంత వరకు విద్యార్థులను ఆటోల్లో తరలిస్తామన్నారు. -
కిచ్ కిచ్..కిచ్..కిచ్..కిచ్కిచ్ ఈ శబ్ధాలతో ఒకప్పుడు పట్టణాలు, గ్రామాలల్లో తెల్లవారేది. పొద్దున్నే లేచే సరికి ఇళ్ల ముందు పిచ్చుకలు చప్పుడు చేసుకుంటూ ఇంటా బయటా తిరిగేవి. ఇలా ఎక్కడ చూసినా కాకులు, పిచ్చుకల కిలకిలరావాలు ప్రకృతికి నిలయాలుగా నిలిచేవి. కానీ
అనకాపల్లి టౌన్/రాజవొమ్మంగి : ఒకనాడు మనిషికి పిచ్చుక కూడా నేస్తమే. పిచ్చుకతో మనిషికి ఉన్న సంబంధం 10 వేల సంవత్సరాల నాటిది. మానవుడు వ్యవసాయం ప్రారంభించిన తొలి రోజులలో తమకు ఉపకరించే పశుపక్ష్యాదుల పట్ల శ్రద్ద వహించేవారు. ప్రధానంగా మన ఇంటి పిచ్చుకగా పిలువబడే ఈ పక్షి తాటాకు ఇళ్ల చూరుల్లో గూళ్ళు పెట్టుకొని తమ సంతతిని వృద్ది చేసుకొనేవి. అదే సమయంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే వారంతా తమ ఇళ్ల చూరుకు ధాన్యం కుంకుల గుత్తులు వేలాడదీసేవారు. దీంతో పిచ్చుకలు ఆహారం తీసుకొని ఆ ఇంటి చుట్టుపక్కల కిచుకిచు మంటూ తిరుగుతుండేవి. పిచ్చుకలు పంటను ఆశించే క్రిమికీటకాలను తినడంలో ప్రముఖపాత్ర పోషిస్తాయి. నేడు పొలాల్లో చల్లే రసాయిన క్రిమి సంహారక మందులు పిచ్చుకలను వాటి తిండికి దూరం చేశాయి. పిచ్చుకల సంరక్షణకు గ్రీన్ క్లబ్ సభ్యుల కృషి గ్రీన్క్లబ్ వ్యవస్థాపకుడైన కొణతాల ఫణిభూషణ్ శ్రీధర్ వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు. జంతు, వృక్ష ప్రేమికుడైన ఈయన పర్యావరణ పరిరక్షణలో ముందు ఉంటారు. గ్రీన్క్లబ్ అనే సంస్థ్ధను 2014 జూన్ ఐదున ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజు ప్రారంభించారు. చెట్లు పెంచాలని, పిచ్చుకలను రక్షించాలని గత 12 ఏళ్ల నుంచి పెద్ద ఉద్యమమే చేస్తున్నారు. కొంత నిధులు వెచ్చించి, సమీకరించి ఈ ప్రకియకు శ్రీకారం చుట్టారు. ప్రత్యేక కార్యక్రమాల ద్వారా వేసవి వచ్చిందంటే చాలు మట్టి పాత్రలకు బాటిళ్లను అమర్చి ఇంటి పరిసర ప్రాంతాలలోను, చెట్ల తొర్రలకు, వీటిని ఏర్పాటు చేస్తుంటారు. దేవాలయాల ఆవరణలో వరి కంకులను కడుతుంటారు. పక్షి జాతిని కాపాడుకుంటేనే మానవ మనుగడ బాగుంటుందని, మన పిచ్చుకను మనమే రక్షించుకుందాం అంటూ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. జీవ వైవిధ్యం కాపాడుకోవాలి.. కొన్ని పక్షి జాతులు అంతరించిపోతే జీవవైవిధ్యం సమతుల్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. మానవుడి ఆధునిక జీవన శైలి వల్ల, సౌండ్, ఎయిర్ పొల్యూషన్, సెల్టవర్స్ వల్ల పిచ్చుకలు కనుమరుగైపోయాయి. మానవ మనుగడకు పిచ్చుకల సంతతిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. –భవానీ, ప్రధాన శాస్త్రవేత్త, కీటక విభాగం, ఆర్ఏఆర్ఎస్ అనకాపల్లి కనుమరుగవుతున్న పిచ్చుకలుసడి లేని గిజిగాడు... చిన్ని పొట్టకు తిండి, గూడూ కరువే పచ్చదనం లేక నీడ కరువై... ఆధునికీకరణలో భాగంగా పచ్చని రావి, మర్రి చెట్లను నిర్ధాక్షణంగా తొలగించేశారు. పోనీ మానవుడు నిర్మిస్తున్న ఆకాశహర్మ్యాలలో కాస్తంత చోటు కూడా పక్షులకు లేకుండా పొయిది. వాటి గూడుకు కనీసం చెట్లు కూడా లేవు. చిన్ని పొట్టకు ఇంత తిండి కూడా దొరకని పరిస్థితి ఉంది. వాస్తవానికి పిచ్చుకలలో అనేక జాతులు ఉండేవి. పిచ్చుక జాతి అంతరించిపోవడానికి రేడియోధార్మికత విడుదల చేసే సెల్ టవర్లే ప్రధాన కారణంగా పర్యావరణవేత్తలు చెబుతున్నారు. దీనివల్ల పిచ్చుకలలో సంతానోత్పత్తి సామర్ధ్యం దెబ్బతింటుంది. పిచ్చుకలు సాధారణంగా చెట్లు, పూరిపాకల పైకప్పు కింద గూళ్లు ఏర్పాటు చేసుకుంటాయి. ఇవి కనుమరుగు అయిపోవడంతో వీటి ఆవాసం కరువైంది. -
బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత
● రంపచోడవరం సబ్కలెక్టర్కె.ఆర్. కల్పశ్రీ రంపచోడవరం: బాల్య వివాహాలు, టీనేజ్ ప్రెగ్నెన్సీలు నిర్మూలించే బాధ్యత అందరిపై ఉందని రంపచోడవరం సబ్ కలెక్టర్ కె.ఆర్.కల్పశ్రీ అన్నారు. వివిధ శాఖల అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి గ్రామంలో టీనేజ్ ప్రెగ్నెన్సీలు,బాల్య వివాహాలు నిర్మూలించే విధంగా గ్రామ పంచాయతీ, సచివాలయాల పరిధిలో అందరికీ అవగాహన కల్పించాలన్నారు. 18 సంవత్సరాల లోపు బడిబయట పిల్లలను గుర్తించి జాబితా తయారు చేయాలని ఆదేశించారు. 18 సంవత్సరాలు నిండిన బాలికలు ఎంత మంది ఉన్నారో జాబితా తయారుచేయాలని తెలిపారు. తహసీల్దార్లు శ్రీనివాసరావు, వేణుగోపాల్, కె.సూర్యనారాయణ, బాలాజీ, ఎంపీడీవో సుండం శ్రీనివాసదొర, ఎంఈవో వి.ముత్యాలరావు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
గోస తీరదు
గోడు పట్టదు..ఉద్యోగం కోసంతిరుగుతున్నా.. చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న ఆఫీసు సబార్డినేట్ పోస్టు ఇప్పించాలని దరఖాస్తు చేశాను. గతంలో ఓసారి గ్రీవెన్స్ సెల్లో అర్జీ ఇచ్చినా ఎలాంటి స్పందన లేకపోవడంతో మరోమారు దరఖాస్తు చేయాల్సివచ్చింది. ఈ సారైనా సమస్య పరిషారమవుతుందో లేదో చూడాలి – కారం సీతారామయ్య, గుర్రంపేట, వీఆర్పురం మండలం చట్టిని ప్రాధాన్యతాక్రమంలో చేర్చాలి చట్టి గ్రామం వరదముంపునకు గురవుతోంది. వరదల సమయంలో ఇళ్లను వదిలి కొండలపై నివాసముంటున్నాం. మాగ్రామాన్ని పోలవరం ముంపు జాబితాలో చేర్చి పరిహారం అందించాలి. దీనిపై పలుమార్లు విజ్ఞప్తి చేశాను. – తుర్రం చినముత్తయ్య, చట్టి, చింతూరు మండలం భూమికి పరిహారం ఇవ్వాలి వీఆర్పురం మండలం చొ ప్పల్లిలో ఉన్న 5.67 ఎకరా లభూమి పోలవరం ముంపునకు గురవుతోంది. నా భూమి పరిహారం జాబితాలో లేదని అధికా రులు చెబుతున్నారు. దీంతో పరిహారం రాదనే ఆందోళన నెలకొంది. నా భూమిని జాబితాలో చేర్చి పరిహారమివ్వాలి. దీనిపైఅర్జీ అందజేశాను. – సార్లంక రమణమ్మ, రామవరం, వీఆర్పురం మండలంచింతూరు: తమ సమస్యల పరిష్కారం కోసం గంపెడాశతో అధికారుల వద్దకు వస్తున్న ప్రజలకు ఎదురుచూపులు తప్పడంలేదు. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి సమస్యలు పరిష్కారించాల్సిన అధికారులు వాటిపై శ్రద్ధచూపడం లేదని ప్రజలు వాపోతున్నారు. చింతూరులో ప్రతి బుధవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుంది. డివిజన్లోని చింతూరు, కూనవరం, వీఆర్పురం, ఎటపాక మండలాలకు చెందిన ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎన్నో వ్యయప్రయాసలతో ఇక్కడకు వచ్చి ఐటీడీఏ పీవోకు తమ సమస్యలు విన్నవించుకుంటారు. వాటిని పరిశీలించిన పీవో సంబంధిత శాఖల అధికారులకు వాటిని అందించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశిస్తారు. అయితే ఆ సమస్యల్లో అత్యధికం పరిష్కారానికి నోచుకోవడం లేదు పోలవరం సమస్యలే అధికం చింతూరులో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రధానంగా పోలవరం నిర్వాసితులకు సంబంధించిన సమస్యలే అధికంగా వస్తున్నాయి. స్థానిక అధికారులతో పాటు పోలవరం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో చివరకు పీవోకు మొరపెట్టుకుంటున్నారు. గ్రామాలు ముంపునకు గురవుతున్నా పొలాలు ముంపులో లేవంటూ పరిహారం ఇవ్వడంలేదని కొందరు, పొలాలు ముంపునకు గురవుతున్నా గ్రామాలు మునగడం లేదంటూ పరిహారం నిరాకరిస్తున్నారని మరికొందరు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. గృహాల పరిహారంలో తమ పేర్లు నమోదు చేయలేదని, తమ ఇళ్లకు తక్కువగా విలువు కట్టారని, కుటుంబ ప్యాకేజీలో తమపేర్లు గల్లంతయ్యాయనే కారణాలతో వందలాది దరఖాస్తులు వస్తున్నాయి. పెండింగ్లో ఉన్న తమ పేర్లను సరిచేసుకునేందుకు సచివాలయంలో సంబంధిత డాక్యుమెంట్లు సమర్పిస్తున్నా సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా అవి సరిగా అప్లోడ్ కాకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోందంటూ నిర్వాసితులు వాపోతున్నారు. తమపేర్లు పూర్తిస్థాయిలో సక్రమంగా లేకుంటే పరిహారం రాదేమోనని నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. దీంతోపాటు తరచూ వరద ముంపునకు గురవుతున్న తమ గ్రామాలను ప్రాధాన్యతా క్రమంలో చేర్చి పరిహారం అందించాలంటూ పలు గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు. ఈ బుధవారం ఐటీడీఏలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 58 అర్జీలు రాగా వాటిలో పోలవరానికి సంబంధించి 18 దరఖాస్తులు, ఎటపాక మండలం బూరుగువాయి, రామగోపాలపురం రహదారి నిర్మాణం కారణంగా ఇళ్లు కోల్పోతున్న తమకు పరిహారం అందించాలంటూ 10 దరఖాస్తులు వచ్చాయి. గత ఏడాది సెప్టెంబరు నుంచి ఈనెల 12 వరకు మొత్తం 312 అర్జీలు రాగా వాటిలో 189 పరిష్కారమయ్యాయి. -
తేనె ఉత్పత్తులతో మంచి ఆదాయం
చింతపల్లి: ఏజెన్సీలో గిరిజనులు తేనె, అనుబంధ ఉత్పత్తులతో మంచి ఆదాయం పొందవచ్చని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం టీచింగ్ అసోసియేట్ బాపూజీ నాయుడు తెలిపారు. పరిశోధనా స్థానంలో తేనెటీగల పెంపకంపై నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల్లో మూడవ రోజు ఆయన మాట్లాడారు. తేనెటీగల పెంపకం వల్ల తేనెను పొందడంతో పాటు మరెన్నో ఉపయోగాలున్నాయన్నారు. తేనె మైనం, పుప్పొడి ద్వారా కూడా రైతులు ఆదాయం పొందవచ్చని చెప్పారు. తేనె పట్టులను వేరుచేసి ఉడికించడం వల్ల మైనం వస్తుందని,ఆ మైనం పాలిష్,కొవ్వొత్తుల తయారీలో ఉపమోగపడుతుందని తెలిపారు. వాటికి మంచి డిమాండ్ ఉందన్నారు.పెట్టెలో తెనెటీగలను భద్రపరిచి పుప్పొడిగా తయారు చేసుకోవచ్చని దానికి మంచి ధర ఉందన్నారు. తేనె టీగల పెంపకంలో మెలకువలు పాటిస్తే మంచి దిగుబడులతో అదనపు ఆదాయాన్ని పొందవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీచింగ్ అసిస్టెంట్ ఎస్.శ్వేత,ఆర్ఏ డాక్టర్ టి.సునీల్కుమార్, గిరిజన రైతులు పాల్గొన్నారు. -
పాలిసెట్–25కు దరఖాస్తుల స్వీకరణ
సాక్షి,పాడేరు: రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ,శిక్షణ మండలి ఆధ్వర్యంలో ఏప్రిల్ 30న జరిగే పాలిసెట్–2025కు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు పాడేరు జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్,జిల్లా సమన్వయకర్త డాక్టర్ కె.సుజాత తెలిపారు.బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ గతంలో టెన్త్ ఉత్తీర్ణులైన విద్యార్థులతో పాటు ప్రస్తుతం టెన్త్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు టెన్త్ పరీక్షల హాల్టికెట్టు,పాస్పోర్ట్ సైజు కలర్ ఫొటో,ఓటీపీ కోసం మొబైల్ ఫోన్ తీసుకురావాలన్నారు.పాడేరు పాలిటెక్నిక్ కళాశాలలోని ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ ద్వారా విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని,ఏప్రిల్ 15వతేదీ వరకు స్వీకరిస్తామని చెప్పారు. ఉచితంగా శిక్షణ : దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఏప్రిల్ 1 నుంచి పాడేరు పాలిటెక్నిక్ కళాశాలలో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. మెటీరియల్ కూడా ఉచితంగా అందజేస్తామని తెలిపారు.మూడేళ్ల కాలవ్యవధితో కూడిన పాలిటెక్నిక్ కోర్సులతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అపారంగా ఉన్నాయన్నారు. పాడేరు జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్–60,మెకానికల్–60,ఎలక్ట్రికల్ 60సీట్లు ఉన్నాయని ఆమె తెలిపారు. పదవ తరగతి సిలబస్ ఆధారంగా ప్రవేశ పరీక్ష ఉంటుందని, గణితం–50, ఫిజిక్స్–40,కెమిస్ట్రీ–30 కలిసి మొత్తం 120 మార్కులకు ప్రవేశ పరీక్ష జరుగుతుందని తెలిపారు. ఎస్సీ,ఎస్టీ విద్యార్థులు రూ.100,ఓసీ,బీసీ విద్యార్థులు రూ.400 చొప్పున పాలిసెట్–25కు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు.మరిన్ని వివరాలకు 9490491157, 9912340293, 8309656949, 9492347752 నంబర్లలో సంప్రదించాలని ప్రిన్సిపాల్ సుజాత కోరారు. ఏప్రిల్ 30న ప్రవేశ పరీక్ష పాడేరు జీఎంఆర్ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుజాత -
పార్చ్మెంట్ కాఫీతో మహిళా రైతులకు అధిక లబ్ధి
● 425 మంది కాఫీ రైతులకు రూ.4.99 కోట్ల రుణాలు ● కలెక్టర్ దినేష్కుమార్ సాక్షి,పాడేరు: మహిళా రైతులు కాఫీ పండ్లను పల్పింగ్ చేసి పార్చ్మెంట్ అమ్మకాల ద్వారా అత్యధిక లబ్ధి పొంది,లాక్పతి దీదీలుగా ఎదగాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ కోరారు. మండలంలోని మినుములూరు కేంద్ర కాఫీబోర్డులో కాఫీ మహిళ రైతులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాఫీ గింజల పల్పింగ్,ఆరబెట్టడం, పార్చ్మెంట్ గింజల తయారీపై కేంద్ర కాఫీబోర్డు ద్వారా శిక్షణ ఇవ్వాలన్నారు. మట్టి, పేడతో కూడిన నేలపై గింజలను ఆరబెట్టడం వల్ల కాఫీ నాణ్యత,ధరలు తగ్గుతాయన్నారు.డ్రైయింగ్ యార్డులలో ఆరబెట్టిన కాఫీ గింజలు నాణ్యతతో ఉంటాయని, మంచి ధరలు లభిస్తాయని ఆయన తెలిపారు. పల్పింగ్ యూనిట్లను వినియోగించి నాణ్యమైన పార్చుమెంట్ కాఫీ గింజలను ఉత్పత్తి చేయాలని ఆయన సూచించారు. అనంతరం పాడేరు డివిజన్లోని కొయ్యూరు మినహా 10 మండలాలకు చెందిన 425 మంది కాఫీ రైతులకు డ్రైయింగ్ యూనిట్లు, పల్పర్ యంత్రాలు, 30 అడుగుల నిచ్చెనలు,టార్పాలిన్ల కొనుగోలుకు యూనియన్ బ్యాంకు మంజూరు చేసి రూ.4,99,37,500 రుణాలను కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ రుణాల్లో కేంద్ర కాఫీ బోర్డు 50శాతం, పీఎంఎఫ్ఎంఎఫ్సీ 35శాతం సబ్సిడీ అందజేస్తాయని, ఈ రుణాలను మహిళా రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.ఈ కార్యక్రమంలో జేసీ,ఇన్చార్జి ఐటీడీఏ పీవో డాక్టర్ అభిషేక్గౌడ,కేంద్ర కాఫీబోర్డు డీడీ మురళీకృష్ణ,డైరెక్టర్ కురుసా ఉమామహేశ్వరరావు,డీఆర్డీఏ పీడీ మురళీ,పీఎంఎఫ్ఎంఎఫ్సీ ప్రతినిధి శ్రీనివాస్,యూనియన్ బ్యాంకు ఆర్ఎం నరేష్,మినుములూరు ఎస్ఎల్వో రమేష్,సర్పంచ్ లంకెల చిట్టమ్మ తదితరులు పాల్గొన్నారు, రెవెన్యూ సర్వీసెస్ డైరీ ఆవిష్కరణ ఏపీ రెవెన్యూ సర్వీసెస్ వార్షిక డైరీని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ బుధవారం తన చాంబర్లో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సర్వీసెస్కు సంబంధించిన ఉత్తర్వులు,నిబంధనలను సమగ్రంగా ఈ డైరీలో పొందుపరచడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో డీఆర్వో పద్మలత,ఏపీ రెవెన్యూ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వంజంగి త్రినాథరావునాయుడు, కార్యదర్శి బి.శ్రీనివాసరావు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. -
టెన్త్ పరీక్ష కేంద్రాల పరిశీలన
గంగవరం: మాస్కాపీయింగ్కు తావులేకుండా టెన్త్ పరీక్షలు జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం ఆదేశించారు. గంగవరంలోని రెండు పరీక్ష కేంద్రాలను బుధవారం పీవో ఆకస్మికంగా పరిశీలించారు. ముందుగా స్థానిక గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఆశ్రమ బాలికోన్నత పాఠశాలలో కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. పదో తరగతి పరీక్ష కేంద్రాలను ప్రత్యేకాఽఽధికారులు ఎంపీడీవో లక్ష్మణరావు, సీడీపీవో లక్ష్మి పరిశీలించారు. -
మృత శిశువుతో ఆందోళన
శృంగవరపుకోట: శిశువు మృతికి వైద్యులే కారణమంటూ మృత శిశువుతో తల్లి, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగిన ఘటన ఎస్.కోట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం గుమ్మ గ్రామానికి చెందిన అరుణ్ భార్య శాంతి ప్రసవం కోసం ఎస్.కోట ఏరియా ఆస్పత్రిలో చేరింది. ఉదయం 10 గంటల సమయంలో ఆపరేషన్ కోసం ఆస్పత్రి థియేటర్లోకి గర్భిణిని తీసుకెళ్లారు. అప్పటివరకు తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని చెప్పిన వైద్యులు కొద్ది సేపటికి మాట మార్చి శిశువు మృతిచెందినట్టు చెప్పారు. దీనిపై అరుణ్తో పాటు బంధువులు ఆందోళనకు గురయ్యారు. సకాలంలో వైద్య సేవలు అందించకపోవడం వల్లే ఆడ శిశువు చనిపోయిందంటూ శాంతితో పాటు బంధువులు, మృతశిశువుతో కలిసి ఆస్పత్రి ఆవరణలో బైఠాయించారు. ఇదే విషయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీల స్పందిస్తూ ప్రైవేట్స్కాన్ సెంటర్లో చేయించిన స్కాన్ రిపోర్టులో బిడ్డ హార్ట్బీట్ బాగుంది. సాధారణ ప్రసవం కోసం ప్రయత్నించామని చెప్పారు. ప్రసవం అవుతున్నప్పుడు బిడ్డ మెడకు రెండు పేగులు చుట్టుకున్నట్టు వైద్యులు చూశారని, బిడ్డ బయటకు వస్తున్న కొద్దీ పేగులు మెడకు బిగిసుకోవడంతో ఊపిరి ఆడక శిశువు మరణించిందని తెలిపారు. ఇందులో వైద్యుల నిర్లక్ష్యం ఎంత మాత్రం లేదని చెప్పారు. -
ఏకలవ్య పాఠశాల భవనాలు సిద్ధం
కొయ్యూరు: బాలారంలో తలపెట్టిన ఏకలవ్య పాఠశాల భవనాల నిర్మాణం పూర్తి కావస్తున్నాయి. ఈ ఏడాది జూన్ నుంచి చింతపల్లిలో కొనసాగుతోన్న కొయ్యూరు ఏకలవ్య పాఠశాలను బాలారానికి తరలించనున్నారు. ఇక్కడికి పాఠశాల మంజూరై ఐదు సంవత్సరాలు దాటింది. అయితే భవనాలు మాత్రం అలస్యంగా మంజూరయ్యాయి. ఇప్పుడు పూర్తి కానుండడంతో సొంత గూటికి పాఠశాల చేరనుంది. గత మూడు సంవత్సరాల నుంచి కొయ్యూరు ఏకలవ్య పాఠశాల తరగతులను చింతపల్లి యూత్ శిక్షణ కేంద్రంలో నిర్వహిస్తున్నారు. కొయ్యూరులో మొదట రెండు సంవత్సరాల పాటు ఇక్కడ గురుకుల పాఠశాలలో నిర్వహించారు. అనంతరం చింతపల్లికి తరలించారు. ఏడాదిన్నర కిందట పాఠశాల భవనాల నిర్మాణానికి రూ.32 కోట్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం నిర్మాణాలు తుది దశకు చేరాయి. ● 500 మంది విద్యార్థులకు బోధన చేసే భవనం ముందుగా పూర్తయింది. అదే విధంగా 250 మంది బాలురు, 250 మంది బాలికలకు అవసరమైన రెండు హాస్టల్ భవనాలను నిర్మించారు. అవి శ్లాబ్ ప్రక్రియ పూర్తయింది. కొద్ది రోజుల్లో వాటి పనులు కూడా పూర్తి కానున్నాయి. వీటితో పాటు 13 స్టాఫ్ క్వార్టర్లను నిర్మించారు. ప్రిన్సిపాల్, వార్డెన్లకు వేర్వేరుగా క్వార్టర్ల నిర్మాణం చేపట్టారు. పాఠశాలకు అవసరమైన విద్యుత్ సబ్స్టేషన్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఇంటర్ వరకు విద్యా బోధన జరగనుంది. వచ్చే విద్యా సంవత్సరానికి అన్ని భవనాలు అందుబాటులోకి రానున్నాయని అధికారులు తెలిపారు. రూ.32 కోట్లతో చురుగ్గా పనులు ఇప్పటికే పూర్తయిన బోధన భవనం 500 మంది విద్యార్థులకు రెండు వేర్వేరు భవనాలు చింతపల్లి నుంచి బాలారం రానున్న పాఠశాల -
పంట రుణ పరపతి పెంచాలి
కలెక్టర్ దినేష్కుమార్ సాక్షి,పాడేరు: రానున్న ఖరీఫ్లో రైతులకు ఇచ్చే పంట రుణ పరపతిని పెంచి, పెద్ద ఎత్తున మంజూరు చేయాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ ఆదేశించారు.కలెక్టరేట్లో బుధవారం వ్యవసాయానుబంధ శాఖలు,బ్యాంకుల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.672 కోట్ల రుణాలు మంజూరు చేయాలన్నది లక్ష్యం కాగా, గత డిసెంబర్ త్రైమాసానికి రూ.607 కోట్లు రుణాలు అందించారని, మిగిలిన రూ.90.43కోట్ల పంపిణీ పూర్తి చేయాలన్నారు.జిల్లాలో రెండు ప్రైవేటు,50 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయని,3,018మంది బిజినెస్ కరస్పాండెంట్లు పనిచేస్తున్నారని తెలిపారు.బ్యాంకు అధికారులు అంకిత భావంతో పనిచేసి నిర్ధేశించిన రుణ లక్ష్యాలు పూర్తి చేసి, జిల్లా అభివృద్ధితో పాటు 15శాతం వృద్ధి రేటు సాధించాలని ఆయన ఆదేశించారు.వచ్చే త్రైమాసికంలో 10వేల మంది ఎస్సీ,ఎస్టీలు,మహిళలకు రుణాలు అందించాలని సూచించారు. ఈ సమావేశంలో యూబీఐ ఆర్ఎం పి.నరేష్, ఎల్డీఎం మాతునాయుడు,నాబార్డు డీడీఎం చక్రధర్,ఏపీజీవీబీ ఆర్ఎం సతీష్చంద్ర,సీడ్బీ ప్రాజెక్టు మేనేజర్ శ్రీనివాసరావుతో పాటు వ్యవసాయ, ఉద్యానవనశాఖల అధికారులు పాల్గొన్నారు. గంజాయి ఫిర్యాదులకు టోల్ఫ్రీ నంబర్ జిల్లాలో గంజాయి సాగు, రవాణా,ఇతర ఫిర్యాదులకు ఈగిల్సెల్ 1972 టోల్ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తెచ్చామని, దీనిపై గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని కలెక్టర్ ఎ.ఎస్. దినేష్కుమార్ కోరారు. ఎస్పీ అమిత్బర్దర్తో కలిసి పలుశాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.పోలీసుశాఖ డ్రోన్ల సహాయంతో 82 ఎకరాల్లో గంజాయి సాగును గుర్తించినట్టు చెప్పారు. రైతులకు గంజాయి సాగు వల్ల జరిగే నష్టాలపై అవగాహన కల్పించి ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని వ్యవసాయ, ఉద్యానవనశాఖ అధికారులను ఆదేశించారు.గంజాయి కేసుల్లో పట్టుబడిన వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయాలన్నారు. ఎస్పీ అమిత్బర్దర్ మాట్లాడుతూ వంద రోజుల కార్యాచరణలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ విధానం ద్వారా గంజాయి సాగు ప్రాంతాలు,సాగుచేస్తున్న రైతుల వివరాలు సులభంగా గుర్తుపట్టడం జరుగుతుందన్నారు.పెదబయలు మండలం నుంచే గంజాయి రవాణా జరుగుతున్నట్టు గుర్తించామని చెప్పారు. ఈసమావేశంలో వ్యవసాయ,అనుబంధ విభాగాల జిల్లా అధికారుల ఎస్.బి.ఎస్.నందు,రమేష్కుమార్రావు,అప్పారావు,శ్రీనివాసరావు,డీఈవో పి.బ్రహ్మాజీరావు,డీఎంహెచ్వో డాక్టర్ జమాల్బాష,డీసీహెచ్ఎస్ డాక్టర్ లక్ష్మి,ఐసీడీఎస్ పీడీ సూర్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
● అధినేత జగన్తో జిల్లా నేతల భేటీ
సాక్షి, పాడేరు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని బుధవారం జిల్లా నేతలు అమరావతిలో మర్యాద పూర్వకంగా కలిశారు. అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి, మాజీ ఎమ్మెల్యేలు శోభా హైమావతి, కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి(పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు), జీసీసీ మాజీ చైర్పర్సన్ డాక్టర్ శోభా స్వాతిరాణి, అరకులోయ జెడ్పీటీసీ శెట్టి రోషిణి, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు మూర్తి, కమ్మిడి అశోక్, తదితరులు వైఎస్ జగన్ను కలిసిన వారిలో ఉన్నారు. -
ఆర్థికంగా ఆదుకుంటే.. కిలిమంజారో అధిరోహిస్తా..
చింతూరు: మండలంలోని కొత్తపల్లికి చెందిన సర్పంచ్ సోడె తిరపతమ్మ, అప్పారావుల కుమారుడైన అభిరాం(14) పర్వాతారోహణపై మక్కువ పెంచుకున్నాడు. ఎవరెస్టు అధిరోహించిన వీఆర్పురం మండలం కుంజవారిగూడెంకు చెందిన కుంజా దుర్గారావు స్ఫూర్తి, సూచనలతో చింతూరులోని గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న అభిరాం కూడా కిలిమంజారో పర్వతం ఎక్కాలనుకున్నాడు. కుమారుడి ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ఈనెల 14 నుంచి 16 వరకు తెలంగాణలోని భువనగిరిలో ట్రెక్కింగ్లో శిక్షణ ఇప్పించారు. కిలిమంజారో అధిరోహణ ఆర్థికభారంతో కూడుకోవడంతో వారు బుధవారం ఐటీడీఏ పీవో అపూర్వభరత్ను ఆశ్రయించి తమ కుమారుడి ఆశ నెరవేర్చేందుకు ఐటీడీఏ నుంచి ఆర్థికసాయం చేయాలని కోరారు. దీనిపై స్పందించిన పీవో ముందుగా అభిరాంకు పాస్పోర్టు చేయించాలని, ఆర్థికసాయం అందించేందుకు చర్యలు తీసుకుంటానని హామీనిచ్చినట్లు బాలుడి తల్లిదండ్రులు తెలిపారు. భవిష్యత్తులో ఎవరెస్టు శిఖరం అధిరోహించాలనేదే తన లక్ష్యమని అభిరాం తెలిపాడు. పర్వతారోహణపై మక్కువతో శిక్షణ తీసుకుంటున్నానని, ఆర్థికసాయం అందితే కిలిమంజారో పర్వతాన్ని విజయవంతంగా అధిరోహిస్తానని అతను ధీమా వ్యక్తంచేశాడు.ఓ బాలుడి విజ్ఞిప్తి -
ముంచంగిపుట్టులో త్వరలో సబ్ పోస్టాఫీసు సేవలు
ముంచంగిపుట్టు: ముంచంగిపుట్టు మండల వాసులకు త్వరలోనే సబ్ పోస్టాఫీసు సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్టు అనకాపల్లి డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు తెలిపారు. మండల కేంద్రంలో బుధవారం ఆయన సబ్ పోస్టాఫీసు ఏర్పాటుకు అనుకూలమైన ప్రభుత్వ భవనాలు, స్థలాలను పరిశీలించారు. స్థానిక ఎంపీడీవో సూర్యనారాయణమూర్తి, తహసీల్దార్ నర్సమ్మలను కలిసి సబ్ పోస్టాఫీసు ఏర్పాటుకు భవనం లేక స్థలం కేటాయించాలని కోరుతూ వినతిపత్రం అందించారు. ఇందుకు వారు సైతం సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు మాట్లాడుతూ పోస్టల్ సేవలు విస్తరణలో భాగంగా ముంచంగిపుట్టు మండల కేంద్రంలో సబ్ పోస్టాఫీసు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రసుత్తం డిజిటల్ యుగంలో ఆధునిక సాంకేతికతతో పోస్టల్ శాఖ పని చేస్తుందని, తపాలా జీవిత బీమా, గ్రామీణ జనాభాకు బ్యాంకింగ్ సేవలు, పాస్ పోర్టు వంటి సేవలు విస్తృతం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అరకు డివిజన్ పోస్టల్ ఐపీవో లక్ష్మికిషోర్, పెదబయలు ఎంవో శ్రీను పాల్గొన్నారు. అనకాపల్లి డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు -
రికార్డులు సక్రమంగా నిర్వహించాలి
● జెడ్పీ డిప్యూటీ సీఈవో రాజ్కుమార్ ముంచంగిపుట్టు: ఎంపీడీవో కార్యాలయంలో ప్రతి రికార్డు నిర్వహణ సక్రమంగా ఉండాలని జెడ్పీ డిప్యూటీ సీఈవో కె.రాజ్కుమార్ అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయాన్ని బుధవారం ఆయన సందర్శించి, 2023–24 సంవత్సరాలకు చెందిన కార్యాలయం సిబ్బంది హాజరు,ఇంటి పన్నులు,పారిశుధ్య వివరాల రికార్డులతో పాటు మొత్తం 32 రికార్డులను తనిఖీ చేశారు.పంచాయతీ తీర్మానాలు పరిశీలించారు.కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు.జెడ్పీ అతిథి గృహం ప్రస్తుత పరిిస్థితిపై ఆరా తీశారు. ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా శానిటేషన్ పనులు ఎప్పటికప్పుడు చేయించాలన్నారు.ఇంటి పన్నులు వసూలు చేయడంలో పంచాయతీ కార్యదర్శులు నిబంధనలు పాటించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జీ ఎంపీడీవో సూర్యనారాయణమూర్తి, ఆర్డబ్ల్యూస్ ఏఈ రాజేష్ పాల్గొన్నారు. -
డైరీ నగర్లో సమస్యల పరిష్కారానికి కృషి
చింతపల్లి: మండలంలోని డైరీనగర్లో సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని సీఆర్పీఎఫ్ 234 బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ తెలిపారు.జిల్లా సీఆర్పీఎఫ్ కమాండెంట్ మనోజ్కుమార్ ఆదేశాల మేరకు చింతపల్లి మేజర్ పంచాయతీ పరిధిలో గల డైరీనగర్ గ్రామాన్ని ఆమె దత్తత తీసుకున్నారు. బుధవారం ఎంపీపీ కోరాబు అనూషదేవి,సర్పంచ్ దురియా పుష్పలతో కలిసి గ్రామాన్ని తొలి సారిగా సందర్శించారు.ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఆమె మాట్లాడుతూ యువతకు ఉపాధి,ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి తమ బృందం ప్రణాళిక రూపొందిస్తోందని చెప్పారు. ఉపాధి కోసం గ్రామాన్ని వదిలి వెళ్లినవారు, వ్యవసాయం చేస్తున్న వారి వివరాలను సేకరిస్తున్నామన్నారు.ఎవరికి ఏ విధంగా ఉపాధి కల్పించాలనే దానిపై ఒక ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు.యువతకు నచ్చిన వృత్తిలో నైపుణ్య శిక్షణ ఇప్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు.చెడు వ్యసనాలకు దూరంగా ఉన్న గ్రామం కావడంతోనే ప్రత్యేకించి ఈ డైరీనగర్ దత్తత తీసుకున్నట్టు ఆమె తెలిపారు.ఏ కార్యక్రమమైన స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి చేపడతామన్నారు. ఈ ప్రాంత గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపాలన్నది తమ లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా లవ్ అండ్ కేర్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు యేసుపాదం వితరణగా ఇచ్చిన రగ్గులను పంపిణీ చేశారు.అనంతరం గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యుడు నాజర్వల్లి, వైఎస్సార్సీపీ నాయకులు సింహాచలం,కరుణా నిధి,హేమంత్,శ్రీనివాసు,మధు పాల్గొన్నారు. గ్రామాన్ని దత్తత తీసుకున్న సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ వినీత ఎంపీపీ, సర్పంచ్తో కలిసి గ్రామ సందర్శన -
‘మధ్యాహ్న భోజన’ కార్మికుల వేతనాలు చెల్లించాలి
చింతపల్లి: మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు బకాయిపడిన గౌరవ వేతనాలను వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యధర్శి బోనంగి చిన్నయ్యపడాల్ డిమాండ్ చేశారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు మంగళవారం ఆందోళన చేశారు. చింతపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గడిచిన నవంబర్ నుంచి భోజన కార్మికులకు వేతనాలను చెల్లించక పోవడంతో వారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు.వారికి బకార ుు పడిన వేతనాలు వెంటనే చెల్లించకుంటే కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు.ఈ నిరసన కార్యక్రమంలో గిరిజన సంఘం మండల కార్యదర్శి చిరంజీవి,కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు పసుపులేటి లక్ష్మి,కార్యదర్శి కేసుబాబు,జ్యోతి,వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. -
నిరసనకు దిగిన డ్వాక్రా మహిళలు
రాజవొమ్మంగి: మండలంలోని వట్టిగెడ్డ గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళలు మంగళవారం వెలుగు కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. ఎటువంటి ప్రమేయం, తీర్మానం, సంతకాలు లేకుండా తమ సంఘాలకు స్థానిక యూనియన్ బ్యాంకు రూ. లక్షల్లో రుణాలు మంజూరు చేసి నగదు ఖాతాల్లోకి జమ చేస్తోందంటూ ఆందోళన చేశారు. ఈ మేరకు మంగళవారం సుమారు వంద మంది మహిళలు స్థానిక వెలుగు కార్యాలయం వద్దకు వచ్చి సమస్యను ఏపీఎం రామాంజనేయులు దృష్టికి తెచ్చారు. తమ గ్రామంలోని 15 సంఘాలకు బ్యాంకు లింకేజి రుణాలు మంజూరు చేసి, తిరిగి ఎటువంటి సమాచారం లేకుండానే ఆ సొమ్మును బ్యాంకు తిరిగి జమ చేసుకుందని వాపోయారు. రుణాలపై వడ్డీ తమ నుంచే రికవరీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము తీసుకోని రుణాలకు ఎందుకు వడ్డీ కట్టాలో చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై బుధవారం గ్రామానికి వచ్చి విచారణ చేపడతానని ఏపీఎం హామీ ఇవ్వడంతో వారంతా వెళ్లిపోయారు. -
పూడ్చి పెట్టిన మృతదేహానికి పోస్టుమార్టం
వై.రామవరం: మండలంలోని పెదఊలెంపాడు గ్రామంలో పూడ్చి పెట్టిన బాలుడి మృతదేహాన్ని వెలికితీసి మంగళవారం అధికారులు పోస్టుమార్టం నిర్వహించారు. ఎస్ఐ బి. రామకృష్ణ వివరాల ప్రకారం.. ఈ నెల 8వ తేదీన పెదఊలెంపాడులో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన కర్ర జాస్వికరెడ్డి (3) అనే బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ నెల 9న బాలుడి మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే గ్రామస్తుల సలహా మేరకు ఈ నెల 17వ తేదీ రాత్రి బాలుడి తల్లి కర్ర నాగదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా బాలుడి మృతదేహాన్ని పూడ్చి పెట్టిన ప్రదేశానికి వెళ్లి డాక్టర్ రాహుల్ ఆధ్వర్యంలో తహసీల్దార్ పి. వేణుగోపాల్, సీఐ బి నరసింహమూర్తి, ఎస్ఐ బి. రామకృష్ణ సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషన్కు తరలించారు. కార్యక్రమంలో స్థానిక ప్రొహిబిషన్ అదనపు ఎస్ఐ పి. చక్రధర్, సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. -
ఖాళీ బిందెలతో నిరసన
డుంబ్రిగుడ: మండలంలోని కితలంగి పంచాయతీ మారుమూల గ్రామమైన గాంధలో తాగునీటి సౌకర్యం కల్పించాలని మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా మంగళవారం గాంధ గ్రామంలో సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పి. అప్పలనర్స సందర్శించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ గ్రామంలో 70 కుటుంబాలు ఉండగా, 350 మంది జనాభాకు మంచినీరు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు. తాగునీరు కల్పించని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం, అధికారులు తక్షణమే జోక్యం చేసుకొని తాగునీరు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేవారు. ఆగిపోయిన రోడ్డు నిర్మాణ పనులు తక్షణమే ప్రారంభించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఎస్.బి పోతురాజు, నాయకులు, గిరిజనులు పాల్గొన్నారు.చింతపల్లి: స్థానిక సాయినగర్లో తాగునీటి సమస్య పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా చేశారు. ఖాళీ బిందెలతో సాయినగర్ వాసులు కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సీపీఎం నాయకులు మాట్లాడుతూ గడిచిన కొన్ని రోజులుగా సాయినగర్లో మంచినీరు అందుబాటులో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని, అయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నట్లు ఉత్తుత్తి ప్రకటనలు చేస్తున్నారని తెలిపారు. పూర్తిస్థాయిలో నీటి సౌకర్యం కల్పించకుంటే నిరసన కొనసాగిస్తామని చెప్పారు. ఎంపీడీవో శ్రీనివాసరావు,మంచినీటి విభాగం ఇంజినీరు స్వర్ణలత మాట్లాడుతూ సాయినగర్ వీధిలో వారం రోజుల్లో తాగునీటి సౌకర్యం కల్పించడానికి పూర్తి స్థాయిలో చర్యలు చేపడతామని తెలిపారు. ముందుగా ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్బులు బోనంగి చిన్నయ్యపడాల్,గిరిజన సంఘం మండల కార్యదర్శి సాగిన చిరంజీవిపడాల్ తదితరులు పాల్గొన్నారు. -
గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
పాడేరు: ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల్లో 2025–26 విద్య సంవత్సరంలో ప్రవేశాల కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావు తెలిపారు. పాడేరులోని డీఈవో కార్యాలయంలో ప్రవేశాలకు సంబంధించిన పోస్టర్లను మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6,7,8 తరగతుల్లో బ్యాక్ల్యాగ్ సీట్లు, జూనియర్ ఇంటర్మీడియెట్, డిగ్రీకళాశాల్లో సీట్లు భర్తీ చేస్తామన్నారు. అర్హులైన విద్యార్థులు http://apr.apcfss.in వెబ్ సైట్లో ఈనెల 31న తేదీలోగా దరఖాస్తు చేసు కోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏప్రిల్ 25న రాత పరీక్ష నిర్వహిస్తామన్నారు. అర్హత, ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో విజయనగరం జిల్లా తాటిపూడి గురుకుల విద్యాలయం ప్రిన్సిపాల్, జిల్లా కోఆర్డినేటర్ జె.ఎన్.సంధ్యాభార్గవి, ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ శశికుమార్, సిబ్బంది ప్రభావతి పాల్గొన్నారు. -
భవనాలను త్వరితగతిన పూర్తి చేయండి
ఐటీడీఏ ఇన్చార్జి పీవో, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడపాడేరు: ప్రధానమంత్రి జన్మన్ యోజన కింద రూ.1.20 కోట్లతో నిర్మిస్తున్న రెండు మల్టీపర్పస్ కేంద్రాల భవనాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఐటీడీఏ ఇన్చార్జి పీవో, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ ఆదేశించారు. మండలంలోని ముంతమామిడి, రణంబడి గ్రామాల్లో నిర్మిస్తున్న మల్టీపర్సప్ కేంద్రాలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు కేంద్రాల నిర్మాణాలను రెండు వారాల్లో పూర్తి చేయాలన్నారు. భవన నిర్మాణ పనుల్లో నాణ్యతాప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. ఒక్కో భవన నిర్మాణానికి రూ.60లక్షలు కేటాయించినట్టు చెప్పారు. మల్టీపర్పస్ కేంద్రాల్లో అంగన్వాడీ కేంద్రంతో పాటు హెల్త్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆయా గ్రామాల గిరిజనులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు ఆయనను కోరారు. ఇన్ఛార్జి పీవో వెంట గిరిజన సంక్షేమ శాఖ డీఈ రవికుమార్, ఏఈ దుర్గాప్రసాద్ తదితరులు ఉన్నారు. -
మోదకొండమ్మ జాతరకు సహకరించండి
పాడేరు: రాష్ట్ర గిరిజన జాతర పాడేరు మోదకొండమ్మ తల్లి ఉత్సవాలకు అన్ని విధాలా సహకరించి విజయవంతమయ్యేలా చొరవ తీసుకోవాలని పాడేరు ఎమ్మెల్యే, మోదకొండమ్మ ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ చైర్మన్ మత్స్యరాస విశ్వేశ్వరరాజు కోరారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ దినేష్కుమార్ను ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో ఉత్సవ, ఆలయ కమిటీల ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఉత్సవాల నిర్వహణపై చర్చించారు. ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసే సాంస్కృతిక కార్యక్రమాలను ఉదయం 4 గంటల వరకు నిర్వహించేలా పోలీస్, ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఏటా మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.కోటి నిధులు త్వరగా విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్కుమార్ మాట్లాడుతూ ఉత్సవాలకు సంబంధించి ఈ నెల 28న అధికారులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామన్నారు. అనంతరం కలెక్టర్ను శాలువాతో సన్మానించి వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబునాయుడు, ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శులు కూడా సురేష్కుమార్, ప్రశాంత్, ప్రతినిధులు కూడా సుబ్రహ్మణ్యం, ఎస్. రామకృష్ణ, దుర్గారావు, పీడీ చక్రవర్తి, మత్స్య కొండబాబు, గోపాలపాత్రుడు, మహిళా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ను కలిసిన పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు -
పోలవరం నిర్వాసితులకు న్యాయం చేస్తాం
వీఆర్పురం: పోలవరం నిర్వాసితులందరికీ న్యాయం చేస్తామని చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వ భరత్ తెలిపారు. వీఆర్పురం తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం వీఆర్పురం, కూనవరం ఫేజ్ –2 ముంపు గ్రామాల జాబితాలో పేర్లు రాని వారి వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వీఆర్పురం మండలం పీడీఎఫ్ఎస్ నుంచి 510 దరఖాస్తులు, కూనవరం మండలంలో పీడీఎఫ్ఎస్ నుంచి 503 దరఖాస్తులు స్వీకరించినట్టు ఆయన చెప్పారు. పోలవరం పరిహారం చెల్లింపులో న్యాయం జరుగుతుందని, నిర్వాసితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ సరస్వతి, ఎస్డీసీలు ఆంజనేయులు, లక్ష్మీపతి, రవి, వెంకటేశ్వర్లు, అంబేడ్కర్, నరసరయ్య, వీఆర్పురం, కూనవరం ఆర్ఐలు జల్లి సత్యనారాయణ, మడకం రామకృష్ణ పాల్గొన్నారు. చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్ -
నీటి తొట్టిలో పడిన ఏడాది పాప
సీలేరు: ఇంటిబయట ఉన్న నీటి తొట్టిలో పడి తీవ్ర అస్వస్థతకు గురైన ఏడాది వయస్సు గల చిన్నారిని సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయస్థితి నుంచి బయటపడింది. దుప్పులవాడ పంచాయతీ వలసపల్లి గ్రామానికి చెందిన పార్వతి,బలరాం దంపతుల కుమార్తె పూర్ణిమ(ఏడాది) మంగళవారం ఉదయం ఇంటి బయట ఆడుతూ నీటి తొట్టిలో ప్రమాదవశాస్తు పడిపోయింది. అరగంట పాటు తొట్టిలోనే ఉండిపోయింది. ఆ తరువాత గమనించిన తల్లిదండ్రులు సీలేరు పీహెచ్సీకి తీసుకొచ్చారు. వైద్యాధికారి మస్తాన్ వలీ వెంటనే ప్రధమ చికిత్స చేశారు. విషయం తెలిసిన ఏపీ జెన్కో ఏఈ సురేష్ స్పందించి జెన్కో అంబులెన్స్లో చింతూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం భద్రాచలం తీసుకెళ్లారు. అక్కడ పూర్తిస్థాయిలో చికిత్స అందించి పాప ప్రాణాన్ని కాపాడారు. అంబులెన్స్ డ్రైవర్లు గణేష్, సందీప్ కుమార్ సకాలంలో భద్రాచలం తీసుకెళ్లడం వల్లే మా పాప ప్రాణాలు నిలిచాయని తల్లిదండ్రులు తెలిపారు. సకాలంలో వైద్యం అందడంతో నిలిచిన ప్రాణాలు -
మామిడి రైతుల ఆశలు గల్లంతయ్యాయి. ఏ తోటకెళ్లి చూసినా.. మచ్చుకై నా పూత కనిపించడం లేదు. చెట్టు నిండా చిగురుటాకులే దర్శనమిస్తున్నాయి. పిందెలు ఆలస్యంగా వచ్చే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ ఏడాది దిగుబడి ఆశించినంత స్థాయిలో ఉండదని అంచనా వేస్తున్నారు. కనీసం పెట్టుబడ
హుకుంపేట మండలం గడుగుపల్లి ప్రాంతంలో పూత లేని మామిడిచెట్లుచింతపల్లి మండలం చెరుకుంపాకలు ప్రాంతంలో పూతలేని మామిడిచెట్లు సాక్షి,పాడేరు: జిల్లాలో ఆరు వేల ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. ఈ సమయానికి పూలతో సింగారించినట్టుగా కళకళలాడవలసిన మామిడి చెట్లు పూతలేక కళావిహీనంగా ఉన్నాయి. వాతావరణ పరిస్థిలు అనుకూలించకపోవడం మామిడి పూతపై తీవ్ర ప్రభావం చూపింది. కొన్ని చెట్లకు మాత్రమే మామిడి పూత రాగా, సుమారు 70 శాతం చెట్లకు పూత కన్నా చిగురుటాకులే అధికంగా కనిపిస్తున్నాయి. కొండమామిడి రకం అంటే పెద్ద చెట్లకు మాత్రం అక్కడక్కడా పూత ఏర్పడగా,గిరిజనుల ఆధీనంలోని సాగవుతున్న మామిడితోటలు మాత్రం పూత లేక కళతప్పాయి. అధిక వర్షాలే కొంపముంచాయి. గత ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవడంతో ఆ ప్రభావం మామిడి పూతపై పడింది. అధిక వర్షాల వల్లే మామిడి పంటకు నష్టం కలిగిందని ఉద్యానవనశాఖ అధికారులు చెబుతున్నారు. సాధారణ స్థాయిలో వర్షాలు కురిస్తే మామిడిపంటకు ఎంతో మేలు జరగడంతో పాటు జనవరి నెల నుంచే మామిడి పూత ఆశాజనకంగా ఉండి,మార్చి నెల నాటికే పిందెలు, కాయ దశతో తోటలు కళకళలాడేవి.అయితే సాధారణ స్థాయికి మించి వర్షాలు కురవడంతో మామిడిచెట్ల పూత రాకుండా పోయింది. భారీగా తగ్గనున్న దిగుబడులు జిల్లా వ్యాప్తంగా బంగినపల్లి,కలెక్టర్,రసాలు,సువర్ణరేఖ వంటి రకాల మామిడితోటలు ఆరు వేల ఎకరాల్లో ఉన్నాయి.ఎకరం తోటకు ప్రతి ఏడాది నాలుగు టన్నుల వరకు దిగుబడికి వస్తుండడంతో రైతులకు కనీసం రూ.30 వేల నుంచి రూ.40వేల వరకు ఆదాయం లభించేది. వాతావరణం బాగుంటే ఏటా మాదిరిగా 24 వేల టన్నుల దిగుబడి లభించేది. అయితే ఈసారి మామిడితోటల్లోని చెట్లకు పూత తక్కువుగా ఉండడం,కొన్ని చెట్లకు పూర్తిగా లేకపోవడంతో మామిడిపంట దిగుబడులు భారీగా తగ్గనున్నాయని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అలాగే పూత వచ్చిన చెట్లకు కూడా పిందెదశ ఆలస్యమవడంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు.కానరానిప్రతికూల వాతావరణంతో పిందెలు ఆలస్యం కొంప ముంచిన అధిక వర్షాలు జిల్లాలో 6వేల ఎకరాల్లో మామిడిపంటచిగురుటాకులే అధికం గత సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అధిక వర్షాలు మామిడి పంటకు ప్రతికూలంగా మారాయి. మామిడిచెట్లకు పూత కన్నా చిగురుటాకులు అధికంగా ఉండడాన్ని పరిశీలించాం.మామిడి దిగుబడులు కూడా పూర్తిగా తగ్గుతాయి.అయితే వచ్చే ఏడాది మాత్రం ముందస్తుగానే పూత ఏర్పడుతుంది. – రమేష్కుమార్ రావు,జిల్లా ఉద్యానవనశాఖ అధికారి, పాడేరుచెట్లకు తగ్గిన పూత అర ఎకరంలో మామిడి సాగు చేస్తున్నాను.నాతో పాటు మా గ్రామంలో చాలామందికి మామిడిచెట్లు ఉన్నాయి.అయితే ఈఏడాది చెట్లకు పూత పూర్తిస్థాయిలో రాలేదు. కొన్ని చెట్లకు చిగురుటాకులే అఽధికంగా ఉన్నాయి.ఈఏడాది మామిడి పంటకు పూత దశలోనే నష్టం ఏర్పడింది. కొన్ని చెట్లకు పిందె కూడా ఏర్పడలేదు. – కాకరి బుల్లిరాజు, రైతు, గడికించుమండ పంచాయతీ, హుకుంపేట మండలం -
ఎమ్మెల్యేలను కలిసినఏడీఎంహెచ్వో
పాడేరు : ఇటీవల జిల్లా అదనపు వైద్యారోగ్యశాఖ అధికారి (ఏడీఎంహెచ్వో)గా నియమితులైన డాక్టర్ టి.ఎన్.ప్రతాప్ మంగళవారం పాడేరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాడేరు, అరకు ఎమ్మెల్యేలు మత్స్యరాస విశ్వేశ్వరరాజు, రేగం మత్స్యలింగంలను మర్యాదపూర్వకంగా కలిశారు. పాడేరు, అరకు నియోజకవర్గాల్లోని గిరిజన గ్రామాల్లో సీజనల్గా వచ్చే వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది నిత్యం అప్రమత్తం చేయాలని, అవసరమైతే ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరాజు, మత్స్యలింగంలు ఏడీఎంహెచ్వోకు సూచించారు. ఉత్తమ సేవలు అందించి గిరిజనుల మన్ననలు పొందాలని తెలిపారు. -
‘సంపద’ కేంద్రాలను వినియోగంలోకి తేవాలి
సాక్షి,పాడేరు: జిల్లాలో 281 చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాలను వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.వారంలో రెండు రోజుల పాటు ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ చేయాలని, ప్రజలకు చెత్త సేకరణపై అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామాల్లో నీటి పథకాల ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి క్లోరినేషన్ జరపాలన్నారు.జిల్లాలోని 34 గ్రామ పంచాయతీలకు భవనాలు మంజూరయ్యాయని,రెవెన్యూ అధికారులు భూబదలాయింపు ప్రక్రియ త్వరగా చేపట్టాలని చెప్పారు. ప్రతి రైతుకు యూనిక్ ఐడీ కేటాయింపునకు ఫార్మర్ రిజిస్ట్రీని వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించాలన్నారు.కాఫీ పంటకు ఈ–క్రాప్ను నమోదు చేయాలని,124 హెక్టార్లలో బిందు,తుంపర సేద్యాన్ని ప్రోత్సహించాలని సూచించారు.అరకు మండలంలో విభిన్న ప్రతిభావంతులు 400మంది వరకు ఉన్నారని,జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అక్కడ ఉపాధి, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ సమావేశంలో వ్యవసాయ,ఉద్యానవనశాఖ జిల్లా అధికారులు ఎస్.బి.ఎస్.నందు, రమేష్కుమార్రావు,డ్వామా పీడీ విద్యాసాగర్ పాల్గొన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి చర్యలు రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన అర్జీలను పరిశీలించి ఆ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశించారు. రెవెన్యూ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ ఈనెలాఖరు నాటికి 508 గ్రామాల్లో భూముల రీసర్వేను పూర్తి చేయాలని చెప్పారు.మండలాల వారీగా ఉన్న ప్రభుత్వ భూములను సర్వే చేయడంతో పాటు వాటిని పరిరక్షించాలని తెలిపారు. పోరంబోకు భూములను ఆక్రమించిన వారికి నోటీసులు జారీ చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు.ఈ సమావేశంలో జేసీ అభిషేక్గౌడ,సబ్కలెక్టర్ సౌర్యమన్ పటేల్,డీఆర్వో పద్మలత,ఇతర అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశం -
ఉర్లాకులపాడులో పాడి ఆవుల మృత్యువాత
రాజవొమ్మంగి: మండలంలోని ఉర్లాకులపాడులో మూడు రోజుల్లో మూడు పాడి ఆవులు చనిపోయాయి. మేతకు వెళ్లి వచ్చి ఉన్నట్లుండి కింద పడి చొంగలు కక్కుతూ, కాళ్లాడిస్తూ మరణిస్తున్నాయని కాకూరి రాజుబాబు, తదితర రైతులు మంగళవారం వాపోయారు. గ్రామాల్లో పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేసి తమ పశు సంతతిని కా పాడాలని కోరుతున్నారు. ఈ విషయంపై స్థానిక పశువైద్యాధికారి తరుణ్కు వివరణ కోరగా, వేసవిలో పశువులను బయటకు వదిలి పెట్టవద్దని సూచించారు. వాటికి నిత్యం తాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. పొలాల్లో లభిస్తున్న పశుగ్రాసంలో రసాయన అవశేషాలు అధికంగా ఉంటున్నాయన్నారు. ఈ గ్రాసం తిన్న పశువులు సొమ్మసిల్లి పోతాయని, సకాలంలో తాగునీరు లభించకపోతే చనిపోతున్నాయని వివరించారు. ఈ అంశంపై గ్రామాల్లో త్వరలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. రైతులు వేసవిలో పశువుల పట్ల శ్రద్ధ చూపాలని కోరారు. -
ఆదివాసీలపై దమనకాండను ఆపాలి
సీతంపేట(విశాఖ): దేశంలో అభివృద్ధి నమూనా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని ప్రముఖ సామాజిక వేత్త, ఆచార్య జి.హరగోపాల్ అన్నారు. ‘ఆపరేషన్ కగార్’పేరుతో ఆదివాసీలపై జరుగుతున్న దమనకాండను నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మంగళవారం విశాఖ నగరంలోని ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో సదస్సు జరిగింది. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ సంపద కొందరి చేతుల్లోనే కేంద్రీకృతమవుతోందని, అభివృద్ధిలో సమానత్వం లేదన్నారు. ఛత్తీస్గఢ్లోని బస్తర్లో అభివృద్ధి పేరుతో అణచివేత జరుగుతోందని ఆరోపించారు. ఎవరు వ్యతిరేకించినా రాష్ట్రంలో ఖనిజాల తవ్వకాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తామని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ప్రకటించారని.. బస్తర్ ప్రాంతంలో పోలీస్ క్యాంపుల వెనుక అక్కడి ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే కుట్ర ఉందన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేక చట్టాలు ఉన్నాయని, ఆ మేరకు ఆదివాసీల వ్యతిరేకతతో వేదాంత కంపెనీ వెనక్కి వెళ్లిపోయిందని గుర్తు చేశారు. మావోయిస్టుల ఏరివేత వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడమేనన్నారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకుడు వి.ఎస్.కృష్ణ మాట్లాడుతూ మావోయిస్టు ఉద్యమాన్ని రాజకీయంగా పరిష్కరించే దృష్టి ప్రభుత్వాలకు లేదన్నారు. ప్రజల హక్కులకు లోబడి మావోయిస్టులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని, దీనికి విరుద్ధంగా బూటకపు ఎన్కౌంటర్లు, గ్రామాలను ధ్వంసం చేయడం, లైంగిక దాడులు, వ్యక్తుల అదృశ్యం వంటి చర్యలకు పాల్పడుతూ ఉద్యమాన్ని క్రిమినలైజ్ చేశారని విమర్శించారు. హక్కుల సంఘాల పోరాటంతో 2011లో కోర్టు సల్వాజుడుం రాజ్యాంగ విరుద్ధమని ఇచ్చిన తీర్పుతో దానిని రద్దు చేశారన్నారు. ఆ తర్వాత గ్రీన్హంట్, ప్రస్తుతం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఆదివాసీ ప్రాంతాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించకుండా, పెద్దఎత్తున రహదారులు నిర్మిస్తూ వనరుల దోపిడీకి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సదస్సులో పర్యావరణవేత్త గంజివరపు శ్రీనివాస్, ఆదివాసీ హక్కుల నేత రామారావు దొర, మాజీ ఎమ్మెల్యే మానం ఆంజనేయులు, న్యాయ వాది వృద్ధుల కల్యాణ రామారావు, వామపక్ష నేతలు ఎం.పైడిరాజు, వై.కొండయ్య, డి.లలిత, ఎ.విమల, పద్మ, ఎం.లక్ష్మి, ఎం.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.సామాజిక వేత్త ఆచార్య హరగోపాల్ -
కాలనీల ఎంపికపై అభిప్రాయ సేకరణ
చింతూరు: ఆర్అండ్ఆర్ కాలనీల ఎంపికకు సంబంధించి నిర్వాసితుల నుంచి అభిప్రాయ సేకరణ జరపాలని పోలవరం నిర్వాసితుల పీడీఎఫ్ కమిటీ నిర్ణయించింది. పోలవరం ప్రాజెక్టు ముంపులో భాగంగా ప్రాధాన్యతా క్రమంలో చేర్చిన చింతూరుకు చెందిన నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ కాలనీల నిర్మాణాలు చేపట్టేందుకు ఇటీవల పోలవరం అధికారులు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులు ఏలూరు జిల్లా తాడ్వాయి, పశ్చిమ గోదావరి జిల్లా యాదవోలు ప్రాంతాలను ఎంపిక చేసినట్టు నిర్వాసితులకు తెలిపారు. కాగా తమకు ఈ రెండు ప్రాంతాలతో పాటు తూర్పు గోదావరి జిల్లా గోకవరం సమీపంలోని కృష్ణునిపాలెంలో కాలనీలు నిర్మించేందుకు తీర్మానం చేయాలని కొంతమంది నిర్వాసితులు కోరడంతో ఆ మేరకు అధికారులు ఆ ప్రాంతాన్ని కూడా తీర్మానం నివేదికలో పొందుపరిచారు. దీంతో ఆ మూడు ప్రాంతాల్లో ఏ ప్రాంతం కావాలనే దానిపై అభిప్రాయ సేకరణ జరిపేందుకు గాను మంగళవారం పీడీఎఫ్ కమిటీ సభ్యులు స్థానిక సాపిడ్ సంస్థ కార్యాలయంలో సమావేశమయ్యారు. అభిప్రాయసేకరణ కోసం కమిటీసభ్యులతో పాటు నిర్వాసితులతో కలిపి క్లస్టర్ల వారీగా టీంలను ఏర్పాటుచేశారు. ప్రస్తుతం అందిస్తున్న ఆర్అండ్ఆర్ ప్యాకేజీ రూ 6.36 లక్షలు కాకుండా గతంలో ప్రభుత్వాల హామీమేరకు రూ.10 లక్షలు కావాలనే నిర్వాసితులకు అవసరమైన తోడ్పాటును పీడీఎఫ్ కమిటీ ద్వారా అందించాలని సమావేశంలో తీర్మానించారు. ఈ కార్యక్రమంలో పీడీఎఫ్ కమిటీ సభ్యులు బొజ్జా పోతురాజు, సయ్యద్ ఆసిఫ్, యాసీన్, అహ్మద్అలీ, చిన్నారెడ్డి, సాల్మన్రాజు, రంజాన్, శ్రీనివాసరావు, సత్యనారాయణ, నాగేశ్వరరావు, గంగాధర్ప్రసాద్ పాల్గొన్నారు. -
సబ్బవరంలో భారీగా గంజాయి పట్టివేత
సబ్బవరం: మండలంలోని ఆనందపురం–అనకాపల్లి జాతీయ రహదారిపై బాటజంగాలపాలెం టోల్గేట్ వద్ద కారులో పెద్ద ఎత్తున తరలిస్తున్న గంజాయిని సబ్బవరం పోలీసులు పట్టుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ పిన్నింటి రమణతో కలిసి డీఎస్పీ వళ్లెం విష్ణుస్వరూప్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆంధ్ర–ఒడిశా బోర్డర్లో ఏజెన్సీ ప్రాంతం నుంచి మహరాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న రూ.18.19 లక్షల విలువ చేసే 363.8 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు సీఐ పిన్నింటి రమణ ఆధ్వర్యంలో ఎస్ఐ సింహాచలం తన సిబ్బందితో కలిసి గంజాయి తరలిస్తున్న కారుతో పాటు పైలెట్ వాహనంగా వస్తున్న మరో కారును తనిఖీ చేసి, గంజాయిని పట్టుకున్నారు. రెండు కార్లను సీజ్ చేశారు. 7గురిని అదుపులోకి తీసుకోగా, మరో ముగ్గురు పరారయ్యారైనట్లు తెలిపారు. వారి నుంచి రూ.50 వేలు నగదు, 5 సెల్ఫోన్లతో కలిపి ఈ కేసులో మొత్తం రూ.57.10 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఏవోబీ బోర్డర్లో కోనుగోలుచేసి చింతపల్లిలో లోడ్చేసి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు తెలిసిందన్నారు. గంజాయి తరలింపులో వినియోగించిన వాహనాలు తప్పుడు రిజిస్ట్రేషన్ నంబర్లతో ఉన్నాయని, వీటిపై దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు. పట్టుబడిన వ్యక్తుల్లో ఏఎస్ఆర్ జిల్లాకు చెందిన వారు ఆరుగురు, ఒడిశాకు చెందిన వ్యక్తి ఒకరు ఉన్నారు. ఏ1గా సామిరెడ్డి విజయ్(31), ఏ2 వంతల హరీష్బాబు(30), ఏ3 మాడబత్తుల అరుణ్కుమార్(38), ఏ4 సాగర్ శివాజీ గోపనీ(32), ఏ5 కొర్రా మహేష్బాబు(32), ఏ6 ఎన్.రమణ(40), ఏ7గా సరమంద అనిల్కుమార్(25)లపై కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ పిన్నింటి రమణ, ఎస్ఐలు సింహాచలం, టి.దివ్య పాల్గొన్నారు. ఏవోబీ నుంచి మహారాష్ట్రకు కారులో తరలిస్తుండగా.. రూ.18.19 లక్షల విలువైన 363.8 కిలోల గంజాయి స్వాధీనం 2 కార్లు, ఐదు మొబైళ్లు, రూ.50 వేలు నగదు సీజ్ ఏడుగురి అరెస్ట్, ముగ్గురు పరార్ -
21 నుంచి రైతు కూలీ సంఘం మహాసభలు
రంపచోడవరం: అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ మూడో మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి కె. దూలయ్య కోరారు. ఈ నెల 21, 22, 23 తేదీల్లో మహారాష్ట్ర నాందేడ్లో జరుగుతాయన్నారు. మంగళవారం రంపచోడవరంలో మహాసభల పోస్టర్ను విడుదల చేశారు. కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి 2.51 శాతం మాత్రమే కేటాయించారని, రైతాంగ సబ్సిడీలకు కోత విధించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద రూ. 20 వేలు ఇవ్వకుండా రైతాంగాన్ని మోసం చేస్తుందన్నారు. సీలింగ్ భూములను దళితులకు, ఆదివాసీలకు పంపిణీ చేయాలన్నారు. కార్యక్రమంలో పీవోడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనసూయ బాలురెడ్డి, మురళీ పాల్గొన్నారు. -
ఘనంగా శ్రీనృసింహ హోమం
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని మంగళవారం సింహగిరిపై శ్రీ నృసింహ హోమం ఘనంగా జరిగింది. ఉదయం 7 నుంచి ఆలయ కల్యాణమండపంలో అర్చకులు హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేదికపై చక్రపెరుమాళ్లని కొలువుంచారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, షోడషోపచారపూజలు జరిపారు. పూజలో పాల్గొన్న భక్తులకు కంకణధారణ చేసి హోమగుండం వద్ద వేంజేపచేశారు. మండపారాధన, అగ్నిప్రతిష్ట, హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. కుంభప్రోక్షణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. ఉభయదాతలకు స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదం అందించారు. ఆలయ ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, అర్చకులు కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవస్థానం ఈవో కె.సుబ్బారావు దంపతులు పాల్గొన్నారు. -
ఈవీఎంల గోదాముల తనిఖీ
సాక్షి,పాడేరు: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనంలోని ఈవీఎంల గోదాములను కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ మంగళవారం తనిఖీ చేశారు. గోదాముల్లో భద్రపరిచిన పాడేరు, రంపచోడవరం, అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గం, అరకు పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన ఈవీఎంలను పరిశీలించేదుకు పలు రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో గోదాములను తెరిచారు. ఈవీఎంలు,వీవీ ప్యాట్,బ్యాలెట్లను పరిశీలించి కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకు ఒక సారి ఈవీఎంల గోదాములను తనిఖీ చేస్తున్నట్టు చెప్పారు. గోదాముల వద్ద పోలీసు భద్రత చర్యలపై అన్ని రాజకీయ పార్టీల నేతలు సంతృప్తి వ్యక్తం చేశారని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో డీఆర్వో కె.పద్మలత,తహసీల్దార్ వంజంగి త్రినాథరావునాయుడు,అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
14 మంది చిన్నారులు పాడేరు ఆస్పత్రికి తరలింపు
ముంచంగిపుట్టు: మండలంలో బాబుశాల పంచాయతీ బల్లుగూడ గ్రామానికి చెందిన చిన్నారుల ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. గ్రామానికి చెందని 21 మంది చిన్నారులు స్థానిక సీహెచ్సీలో వైద్య సేవలు పొందుతున్నారు.వీరిలో కొంత మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా మారుతుండడంతో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. మంగళవారం సాయంత్రం 14మంది చిన్నారులను అంబులెన్స్లో పంపారు. కిల్లో కావ్యశ్రీ, కిల్లో మన్మధ, కిల్లో మీరంజన, పాంగి రియారోషి, వంతాల ప్రసాద్,వంతాల మల్లేష్, వంతాల హరి, కొర్ర మరియా, కొర్ర మీన, వంతాల పల్లవి, కొర్ర మీనాక్షి, వంతాల రాజేష్, వంతాల రామదాసు, వంతాల శశిలకు జ్వరం, దగ్గు, జలుబు తగ్గకపోవడంతో జిల్లా ఆస్పత్రికి పంపినట్టు వైద్యులు గీతాంజలి, సంతోష్ తెలిపారు. అంతకుముందు సీహెచ్సీలో వైద్యసేవలు పొందుతున్న బల్లుగూడ చిన్నారులను తహసీల్దార్ నర్సమ్మ, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు పాంగి పద్మారావు, సీపీఎం మండల కార్యదర్శి కొర్ర త్రినాఽథ్లు పరామర్శించారు. అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. నాటువైద్యం,పసరమందుల జోలికి పోవ ద్దని చిన్నారుల తల్లిదండ్రులకు వారు సూచించారు. -
● నిజాయితీగా తిరిగి అప్పగించిన డ్రైవర్
ఆటోలో నగల బ్యాగ్మరిచిపోయిన మహిళ నక్కపల్లి : నక్కపల్లికి చెందిన ఓ మహిళ ఆటోలో మర్చిపోయిన బంగారం బ్యాగ్ను డ్రైవర్ నిజాయితీగా తిరిగి అప్పగించిన ఘటన మంగళవారం జరిగింది. సీఐ కుమారస్వామి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నక్కపల్లికి చెందిన శిరీష అనే మహిళ తుని వెళ్లేందుకు నక్కపల్లిలో ఆటో ఎక్కింది. తనతో తీసుకెళ్తున్న బ్యాగ్ను ఆటోలో మర్చిపోయింది. ఆందులో సుమారు రూ.7లక్షలు విలువైన ఎనిమిది తులాల బంగారు ఆభరణాలను ఉన్నాయి. దీంతో ఆమె నక్కపల్లి పోలీస్స్టేషన్నో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేసేలోపు తునికి చెందిన ఆటోడ్రైవర్ గెడ్డమూరి అంజి నిజాయితీగా నక్కపల్లి మహిళ తన ఆటోలో మర్చిపోయిన బ్యాగ్ను, అందులో ఉన్న బంగారాన్ని నక్కపల్లి పోలీస్స్టేషన్కు తీసుకు వచ్చాడు. పోలీసుల సమక్షంలో బాధితురాలి ఇంటి వద్దకు తీసుకెళ్లి అందజేశాడు. డ్రైవర్ నిజాయితీకి మెచ్చి అతనికి కొంత నగదును కానుకగా అందజేశారు. సీఐ కుమార స్వామి ఆటోడ్రైవర్ను ప్రత్యేకంగా అభినందించారు. -
ఘనంగా ముగిసినమల్లేశ్వరమ్మ తీర్థం
గూడెంకొత్తవీధి: మండలంలోని రంపుల గ్రామంలో మల్లేశ్వరమ్మ మహోత్సవాలు మంగళవారంతో ఘనంగా ముగిశాయి. మూడు రోజులపాటు జరిగిన ఈ ఉత్సవాల్లో పలు సాంస్కృతిక, వినోద కార్యక్రమాలను నిర్వహించారు. ఉత్సవ కమిటీ నిర్వాహకులు నరేష్, బాలరాజుల ఆధ్వర్యంలో మెగా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. విజేతలుగా నిలచిన ఏబులం, నల్లబిల్లి జట్లకు పీఆర్ జేఈ జ్యోతిబాబు ఉపాధ్యాయుడు బాలకృష్ణల చేతులమీదుగా బహుమతులు అందజేశారు. పంచాయతీ సర్పంచ్ వంశీకృష్ణ, వైఎస్సార్సీపీ నాయకులు కంకిపాటి గిరిప్రసాద్, గెమ్మెలి దొరబాబు, వీరోజి సత్తిబాబు, సిరిబాల రామారావు, కంకిపాటి రామారావు పాల్గొన్నారు. -
కూటమి ప్రభుత్వం ద్వంద్వ వైఖరి
అరకులోయ టౌన్(అనంతగిరి): ఆదివాసీ చట్టాల ను ధిక్కరించి కార్పొరేట్ కంపెనీలకు కేటాయించిన హైడ్రో పవర్ ప్రాజెక్టుల అనుమతులు తక్షణమే రద్దు చేయాలని సీపీఎం అల్లూరి జిల్లా కమిటీ కార్యదర్శి పి. అప్పలనర్స డిమాండ్ చేశారు. అనంతగిరి మండలంలో సోమవారం ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు. చిట్టెంపాడు హైడ్రో పవర్ ప్రాజెక్టు ప్రాంతం నుంచి అనంతగిరి వరకు ఐదు కిలోమీటర్ల వరకు మూడు గ్రామాలను కలుపుతూ యాత్ర ఉత్సాహంగా సాగింది. పెద్దబిడ్డ, టోకూరు పంచాయతీ నుంచి బాధిత ప్రజలు, పీసా కమిటీ సభ్యులు, గ్రామ వార్డు సభ్యులు, సర్పంచ్లతో కలిసి జెడ్పీటీసీ గంగరాజు నాయకత్వంలో పాదయాత్ర నిర్వహిస్తూ మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్దకు చేరుకుని తహసీల్దార్ వి.మాణిక్యం, ఎంపీడీవో ఎ.వి.వి. కుమార్లకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం సభకు సీపీఎం మండల కార్యదర్శి, టోకూరు పంచాయతీ సర్పంచ్ కిలో మోస్య అధ్యక్షత వహించగా, పార్టీ జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స మాట్లాడారు. అటవీ ప్రాంతాల్లో సహజ వనరులను దోచుకోవడానికి కార్పొరేట్ కంపెనీలకు అడ్డుగా ఉందని 1/70 చట్టాలను బలహీనం చేస్తున్నారని విమర్శించారు. అందుకే కొంత మంది ప్రజా ప్రతినిధులు ఆదివాసీలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. 1/70 చట్ట సవరణ లేదని ముఖ్యమంత్రి ప్రకటించి, మరో పక్క చట్టానికి వ్యతిరేకంగా కార్పొరేట్ కంపెనీలకు సహజ వనరులను అప్పగించడం సరికాదని విమర్శించారు. జెడ్పీటీసీ మాట్లాడుతూ హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మిస్తే నాలుగు వేల ఎకరాలు భూమి మునిగిపోయే అవకాశం ఉందని, 40 గ్రామాల గిరిజనులు నిర్వాసితులు కానున్నారని వాపోయారు. సీపీఎం నాయకులు సోమెల నాగులు, సీవేరి కొండలరావు, వంతల బుద్రయ్య, కాకర సింగులు, గెమ్మల భీమరాజు తదితరులు పాల్గొన్నారు. హైడ్రో పవర్ ప్రాజెక్టు అనుమతులు తక్షణమే రద్దు చేయాలి సీపీఎం జిల్లా కార్యదర్శి అప్పలపర్స, అనంతగిరి జెడ్పీటీసీ గంగరాజు డిమాండ్ -
సబ్ పోస్టాఫీసు ఏర్పాటు పనులు ముమ్మరం
ముంచంగిపుట్టు: స్థానిక సబ్ పోస్టాఫీసు ఏర్పాటు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని అరకు సబ్ డివిజనల్ పోస్టల్ ఐపీవో వి.లక్ష్మీకిశోర్ తెలిపారు. స్థానిక ఎంపీడీవో సూర్యనారాయణమూర్తిని ఆయన సోమవారం కలిశారు. సబ్ పోస్టాఫీసు ఏర్పాటుకు అనుకూలమైన భవనం మంజూరు చేయాలన్నారు. స్థానిక ఇంజినీరింగ్ కార్యాలయ భవనంతో పాటు నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భవనాలు చూపించాలని కోరారు. దీనికి ఎంపీడీవో సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఐపీవో మాట్లాడుతూ పాడేరు ఐటీడీఏ పీవోను సైతం కలిసి భవన సౌకర్యం కల్పించాలని కోరామన్నారు. కార్యక్రమంలో పెదబయలు ఎంవో ఎం.శ్రీను, పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రకృతి సేద్యం ప్రణాళికలో ప్రతి రైతు భాగస్వామి కావాలి
పాడేరు : ప్రకృతి వ్యవసాయ వార్షిక కార్యాచరణ ప్రణాళికలో ప్రతి రైతును భాగస్వామిని చేయాలని రైతు సాధికార సంస్థ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ లాలం భాస్కరరావు అన్నారు. పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో వ్యవసాయ శాఖ సిబ్బందికి ప్రకృతి వ్యవసాయంపై రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి రైతు సాధికార సంస్థ వైస్ చైర్మన్ టి. విజయ్కుమార్ వర్చువల్ విధానం ద్వారా హాజరై మాట్లాడారు. రసాయన వ్యవసాయం వల్ల పర్యావరణానికి నష్టం జరుగుతోందని చెప్పారు. ఖరీఫ్ వార్షిక ప్రణాళిక, సార్వత్రిక సూత్రాలు, పలు జిల్లాల్లో చేపడుతున్న ప్రకృతి వ్యవసాయ విధానాలు, రైతుల విజయగాధల గురించి సిబ్బందికి వివరించారు. కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ రీసోర్స్ పర్సన్ రమాప్రభ, మోడల్ మండల టీం లీడర్ శివలోకేష్, వాసన్ సంస్థ ప్రాజెక్టు మేనేజర్ నాయుడు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. -
పరీక్ష కేంద్రాల్లో ఐటీడీఏ పీవో, జేసీ తనిఖీ
రంపచోడవరం/గంగవరం: ఏజెన్సీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రశాంతమైన వాతావరణం కల్పించాలని స్థానిక ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం తెలిపారు. సోమవారం స్థానిక ప్రభుత్వ హైస్కూలులో పరీక్ష కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏజెన్సీలో అన్ని పరీక్ష కేంద్రాలలో ఫ్యాన్లు, తాగునీరు, తదితర సౌకర్యాలు ఉండాలన్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. సహాయక గిరిజన సంక్షేమ శాఖ అధికారిని రామ తులసి తదితరులు పాల్గొన్నారు. జి.మాడుగుల: స్థానిక గిరిజన సంక్షేమ బాలుర పాఠశాల, గాంధీనగరంలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో పరీక్ష కేంద్రాలను జిల్లా సంయుక్త కలెక్టర్ డాక్టర్ అభిషేక్ గౌడ సోమవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. పరీక్షల తీరును, మౌలిక సదుపాయాల కల్పనను ఆయన పరిశీలించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్, జెరాక్స్ షాపులు మూసివేత పరిశీలించారు. మాస్ కాపీయింగ్కు పాల్పడకుండా విద్యార్థులు స్వశక్తితో చదివి ఉత్తీర్ణులు కావాలని సూచించారు. -
అంతర్జాతీయ స్థాయి నగరంగా విశాఖ
విశాఖ సిటీ: విశాఖను అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తు న్నామని వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్గోపాల్ పేర్కొన్నారు. సోమవారం వీఎంఆర్డీఏలో ఆయన మాట్లాడుతూ ఆర్థిక రాజధాని విశాఖను పర్యాటక, వాణిజ్యపరంగా అభివృద్ధి చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి పారదర్శకంగా మాస్టర్ప్లాన్ను రూపొందిస్తామన్నారు. రూ.80 కోట్లతో సిరిపురంలో నిర్మించిన మల్టీ లెవెల్ కార్పార్కింగ్, కమర్షియల్ భవనం పనులు తుది దశకు చేరుకున్నాయని, సీఎంతో ప్రారంభిస్తామన్నారు. బీచ్ రోడ్డులో రూ.5 కోట్లతో నిర్మిస్తున్న యూహెచ్3హెచ్ హెలీకాఫ్టర్ మ్యూజియాన్ని త్వరలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. అనకాపల్లిలో 7 ఎకరాల్లో హెల్త్ సిటీ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. అనకాపల్లిలో కొత్తూరు చెరువును అభివృద్ధి చేసేందుకు డీపీఆర్ సిద్ధం చేసినట్లు తెలిపారు. మధ్య తరగతి ప్రజల కోసం పాలవలస, గంగసాని అగ్రహారం, అడ్డూరు, గరివిడి, రామవరం వంటి ప్రాంతాల్లో వేసిన లేఅవుట్లలో అందుబాటు ధరల్లో ఎంఐజీ ఇళ్ల స్థలాలు విక్రయిస్తున్నామన్నారు. త్వరలోనే మరిన్ని లేఅవుట్ల అభివృద్ధిపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఎటువంటి విమర్శలకు తావులేకుండా పారదర్శకంగా మాస్టర్ప్లాన్–2041ను రూపొందిస్తామని మెట్రోపాలిటన్ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్ స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా మాస్టర్ప్లాన్ వీఎంఆర్డీఏ చైర్పర్సన్ ప్రణవ్గోపాల్, కమిషనర్ విశ్వనాథన్ -
విశాఖకు ఆగ్నేయ దేశాల బౌద్ధ పర్యాటకులు
విశాఖ సిటీ: ఆగ్నేయ దేశాల నుంచి బౌద్ధ పర్యాటకుల తొలి బ్యాచ్ విశాఖకు చేరుకుంది. సోమవారం వీరిని కలెక్టర్ హరేందిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, వీఎంఆర్డీఏ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్లు స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ టూరిజం ఫోరం అధ్యక్షుడు విజయ్మోహన్ ఆధ్వర్యంలో ఈ పర్యాటక బృందం బావికొండ, తొట్లకొండ, పావురాలకొండ, బొజ్జన్నకొండలను సందర్శించింది. ఇక్కడి నుంచి థాయ్లాండ్, మలేషియా, సింగపూర్లకు విమాన సర్వీసులు ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆగ్నేయ దేశాల పర్యాటకులే లక్ష్యంగా ఇన్బౌండ్ టూరిజంకు శ్రీకారం చుట్టింది. -
విభిన్న రంగాల్లో గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ
చింతపల్లి: జిల్లాలో అర్హులైన గిరిజన యువతీ యువకులకు విభిన్న రంగాల్లో వారి అభిరుచి మేరకు అవసరమైన నైపుణ్య శిక్షణ అందించి పలు పరిశ్రమల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నట్టు జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి రోహిణి తెలిపారు. సోమవారం చింతపల్లి వచ్చిన ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడారు. పాడేరు, చింతూరు, రంపచోడవరం ఐటీడీఏల పరిధిలోని మూడు చోట్ల, ప్రత్యేకంగా ఎటపాకలో ప్రస్తుతం స్కిల్ హబ్లు పనిచేస్తున్నాయన్నారు. ఇక్కడ ఇప్పటికే 698 మందికి వివిధ కోర్సుల్లో శిక్షణ ఇవ్వడంతోపాటు ఉపాధి అవకాశాలు కల్పించినట్టు చెప్పారు. ప్రస్తుతం మరో 640మందికి శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. జిల్లాపరిధిలో ప్రతినెలా రెండు జాబ్మేళాలు నిర్వహిస్తున్నామన్నారు. నిరుద్యోగ యువతీయువకులు సెల్ఫోన్ల ద్వారా నే నెపుణ్యం యాప్లో తమ వివరాలను నమోదు చేసుకోవచ్చన్నారు. లొంగిపోయిన మావోయిస్టు కుటుంబాలకు సరళ్ కార్యక్రమంలో అవసరమైన ఉపాధి కల్పిస్తున్నట్టు చెప్పారు. -
బల్లుగూడలో ఆందోళనకరంగా చిన్నారుల పరిస్థితి
ముంచంగిపుట్టు: మండలంలోని బాబుశాల పంచాయతీ బల్లుగూడ గ్రామంలో చిన్నారుల ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు ఆందోళనకరంగా మారుతోంది.ఇప్పటికే ముగ్గురు చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే.ఏడుగురు చిన్నారులను ముంచంగిపుట్టు సీహెచ్సీకి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. సోమవారం బల్లుగూడలో మరికొంత మంది చిన్నారుల పరిస్థితి విషమంగా మారింది. జ్వరంతో పాటు దగ్గు,జలుబు,శ్వాస సమస్యలతో బాధపడుతున్నారు.వీరిని వైద్య సేవలు నిమిత్తం సీహెచ్సీకి తరలించేందుకు వైద్య సిబ్బంది గ్రామానికి వెళ్లగా వారిని చూసి కొంతమంది గ్రామస్తులు అటవీ ప్రాంతం వైపు చిన్నారులతో పారిపోయారు.మరికొంత మంది వైద్యసేవలు వద్దు అంటూ భీష్మించి కూర్చున్నారు. నాటు వైద్యం,పసర మందులు వాడతామని గ్రామ గిరిజనులు చెబుతూ ఉండడంతో వాటివల్ల కలిగే అనర్థాలను వివరించి, కొన్ని గంటల పాటు వైద్య సిబ్బంది చిన్నారుల తల్లిదండ్రులను ప్రాధేయపడి 12 మంది చిన్నారులను ముంచంగిపుట్టు సీహెచ్సీకి అతికష్టం మీద తరలించారు.ఇద్దరు చిన్నారుల తల్లిదండ్రులు ఆస్పత్రికి వచ్చేది లేదని వైద్య సిబ్బందితో గొడవపడడంతో సిబ్బంది ఈవిషయాన్ని ఫోన్లో ఎంపీడీవో సూర్య నారాయణమూర్తికి తెలియజేశారు. వైద్య సేవలు అందిస్తేనే మీ పిల్లల పరిస్థితి బాగు పడుతుందని ఆయన ఫోన్లో తల్లిదండ్రులతో చాలా మాట్లాడి నచ్చజెప్పడంతో అంబులెన్స్లో సాయంత్రం 7గంటలకు ముంచంగిపుట్టు సీహెచ్సీకి తీసుకువచ్చా రు. 21 మంది చిన్నారులకు సీహెచ్సీ వైద్యులు గీతాంజలి,సంతోష్లు వైద్య సేవలు అందిస్తున్నారు.వీరిలోకొంతమంది చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండడంతో గంట గంటకు పరీక్షలు చేస్తూ, వైద్యం అందిస్తున్నారు. సీహెచ్సీకి ఇప్పటి వరకు 21 మంది తరలింపు వైద్య సేవలకు ముందుకు రాని గ్రామస్తులు ప్రాధేయపడి సీహెచ్సీకి తరలించిన వైద్య సిబ్బంది -
హైవే నిర్వాసితులకు నష్టపరిహారం
గూడెంకొత్తవీధి: జాతీయ రహదారి (516–ఈ) నిర్మాణంలో భూములను కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలకు నష్టపరిహారం అందిస్తామని, ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని పాడేరు సబ్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ తెలిపారు. సోమవారం గూడెంకొత్తవీధి మండలంలో జాతీయ రహదారి నిర్మాణం జరిగే ప్రాంతాలను ఆయన పరిశీలించారు. పెదవలసలో గిరిజనులతో మాట్లాడారు. రహదారి విస్తరణలో భూములు కోల్పోయిన వారి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దారు రామకృష్ణ, ఆర్ఐ మహదేవ్, వీఆర్వో సత్యమణి, సర్వేయర్ నాగేశ్వరరావు, జాతీయ రహదారి విభాగం అధికారి లోకేష్ పాల్గొన్నారు. -
మా నమ్మకాన్ని గెలిపించిన ‘కోర్ట్’
● వైజాగ్లో చిత్రం బృందం సందడి డాబాగార్డెన్స్: నగరంలో కోర్ట్ చిత్ర యూనిట్ సోమవారం సందడి చేసింది. శివాజీ మంగపతిగా, ప్రియదర్శి పులికొండ లాయర్ పాత్రలో నటించగా, హీరో హర్ష రోషన్, హీరోయిన్లు శ్రీదేవి, విషిక, రైటర్ కమ్ డైరెక్టర్ రామ్ జగదీష్ నగరంలోని ఓ హాటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కోర్ట్ సినిమా మా అందర్నీ గెలిపించిందన్నారు. మంచి చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందని మరోసారి ప్రేక్షకులు నిరూపించారన్నారు. విశాఖ సీతమ్మపేట, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఇంజినీరింగ్ చదివిన రామ్ జగదీష్ రాసిన ఈ కథ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నాని సహ ప్రొడ్యూసర్గా వ్యవహరించిన ఈ సినిమా ఎంతో అద్భుతంగా తెరకెక్కిందన్నారు. విడుదలైన మూడు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.25 కోట్ల మేర కలెక్షన్స్ రావడం చిత్ర విజయానికి నిదర్శనమన్నారు. శ్రీవేంకటేశ్వర ఫిల్మ్ అధినేత విజయ్భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మాస్ కాపీయింగ్ లేకుండా ...
కలెక్టర్ దినేష్కుమార్ సాక్షి, పాడేరు: టెన్త్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులు,ఇన్విజిలేటర్లపై ఉందని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ తెలిపారు.సోమవారం ప్రారంభమైన టెన్త్ పరీక్షలను ఆయన పర్యవేక్షించారు. పాడేరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల,శ్రీకృష్ణాపురం,తలారిసింగి ఆశ్రమ పాఠశాలల్లోని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి, పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టెన్త్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులను పరీక్ష కేంద్రం ప్రవేశద్వారం వద్ద తనిఖీ చేసి, ఎలక్ట్రానిక్ డివైజెస్,స్లిప్లు లేవని నిర్ధారించిన తరువాతే లోపలికి పంపాలని ఆదేశించారు.తొలిరోజు పరీక్షకు 117మంది విద్యార్థులు,ఓపెన్ టెన్త్లో పాడేరుకు సంబంధించి 9మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని కలెక్టర్ తెలిపారు.ఎక్కడా మాస్ కాపీయింగ్ లేకుండా తొలి పరీక్ష ప్రశాంతంగా జరిగిందన్నారు. డీఈవో పి.బ్రహ్మజీరావు,ఎంఈవో–2 సరస్వతి,హెచ్ఎంలు పాల్గొన్నారు. -
మంచినీటి చేపల పెంపకంపై శిక్షణ
రంపచోడవరం/ గంగవరం: మంచినీటి చేపల పెంపకంలో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులపై కాకినాడ కేంద్రీయ మత్స్య శిక్షణ సంస్థ, పందరిమామిడి కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఆక్వా రైతులకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం హాజరై మాట్లాడారు. ముఖ్యంగా ఐటీడీఏ ద్వారా రైతులకు శిక్షణ నిర్వహించి చేప పిల్లలను, మేతను రాయితీ ద్వారా అందిస్తామన్నారు. నివేదికలు అందించాలన్నారు. కాకినాడ సీఏఎఫ్ఈ సంస్థ అధికారి మురళీధర్ సాంకేతిక నూతన పద్ధతులు, సంస్థ నిర్వహిస్తున్న పరిశోధనలను వివరించారు. సీనియర్ శాస్త్రవేత్త కె.శ్యామల, కేవీకే శాస్త్రవేత వీరాంజనేయులు, కేవీకే అధికారి రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మృతదేహాలను బంధువులకు అప్పగించండి
● అడ్డతీగల సీహెచ్సీని సందర్శించిన డీసీహెచ్ఎస్ లక్ష్మి అడ్డతీగల: గంగవరం రోడ్డు ప్రమాదానికి సంబంధించి మృతదేహాలను సత్వరమే బంధువులకు అప్పగించాలని డీసీహెచ్ఎస్ కె. లక్ష్మి ఆదేశించారు. సోమవారం స్థానిక సీహెచ్సీలో ఆమె పరిశీలించారు. వైద్యాధికారి పండా సతీష్ను రోడ్డు ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల బంధువులతో మాట్లాడారు. గాయపడిన వారికి కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో అక్కడ సూపరింటెండెంట్తో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలన్నారు. ప్రమాద బాధితులకు న్యాయం చేసే విధంగా చూస్తానని చెప్పారు.