ఘనంగా రాజగోపుర ప్రతిష్ట | - | Sakshi
Sakshi News home page

ఘనంగా రాజగోపుర ప్రతిష్ట

Mar 15 2026 1:17 AM | Updated on Mar 15 2026 1:17 AM

అనంతగిరి (అరకులోయ టౌన్‌): మండలంలోని ఎన్‌ఆర్‌పురంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీనటడు సుమన్‌, అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం శనివారం దర్శించుకున్నారు. ఆలయ ద్వితీయ వార్షికోత్సవం పురస్కరించుకుని ప్రధాన రాజగోపుర ప్రతిష్ట కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని సత్కరించారు. అనంతరం స్వామివారి ప్రతిమలను ఆలయ అర్చకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తడబారికి మిథుల, మాజీ ఎంపీపీ శెట్టి నీలవేణి, మండల పార్టీ అధ్యక్షుడు కొర్రా సూర్యనారాయణ, పార్టీ మండల పరిశీలకుడు సెంబి సన్యాసిరావు, వాలసి సర్పంచ్‌ బాక గురుమూర్తి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement